SCERT AP Board 6th Class Telugu Textbook Solutions 4th Lesson సమయస్పూర్తి Questions and Answers.
AP State Syllabus 6th Class Telugu Solutions 4th Lesson సమయస్పూర్తి
6th Class Telugu 4th Lesson సమయస్పూర్తి Textbook Questions and Answers
వినడం – ఆలోచించి మాట్లాడడం
 
ప్రశ్న 1.
 చిత్రాలు చూడండి. కథను ఊహించి. చెప్పండి.
 జవాబు:
 అనగనగా ఒక నక్క కోడిని బుట్టలో పెట్టి తెచ్చింది. కొంచెంసేపు నిద్రపోయి లేచి, వండుకొని తినవచ్చు అనుకొంది. రక్షించాలనుకొంది, మెల్లిగా చెట్టు దిగింది. బుట్ట తెరిచింది. కోడి పారిపోయింది.
నక్క భార్య పొయ్యి వెలిగించింది. చలి కాచుకొంది. బుట్టలో చూసింది. కోడి లేదు. ఝల్లున ఏడ్చింది. ఎలా పారిపోయిందో తెలీక బుర్ర గోక్కుంది.
ప్రశ్న 2.
 కోతి లేకపోతే కోడి ఎలా తప్పించుకొనేదో ఊహించి చెప్పండి.
 జవాబు:
 నక్క బుట్ట తెరిచేటప్పటికి కోడి చనిపోయినట్టు నటిస్తుంది. నక్క ఆలోచిస్తుంది. సమయం చూసి కోడి చెట్టెక్కిస్తుంది.
అవగాహన – ప్రతిస్పందన,
ప్రశ్న 1.
 ఈ కథను మీ సొంత మాటల్లో చెప్పండి.
 జవాబు:
 అనగనగా ఒక అడవిలో 5 చెట్లు ఒక చోట ఉన్నాయి. అందులో ఒక చెట్టు తొర్రలో ఒక పిల్లి ఉంది. దాని పేరు రోమశుడు. ఆ చెట్టు కింద కన్నంలో ఎలుక ఉంది. దాని పేరు పలితుడు.
ఒకసారి ఒక వేటగాడి “వలలో పిల్లి చిక్కుకుంది. ఉదయమే తన శత్రువు వలలో చిక్కినందుకు పలితుడు సంతోషించింది. అంతలోనే ఒక గుడ్లగూబ ఎలుకను తినడానికి వచ్చింది. దాని పేరు చంద్రకుడు.
ఎలుక దానిని చూసి భయపడింది. పిల్లి దగ్గరకు వెళ్లి స్నేహం చేసింది. వల కొరికి రక్షిస్తానని, తనని . కాపాడమని కోరింది. రోమశుడు ఒప్పుకొంది. గుడ్లగూబ పారిపోయింది.
సరిగ్గా వేటగాడు సమీపిస్తుంటే పలితుడు వలను కోరికింది. పిల్లి చెట్టేక్కేసింది. పలితుడు కన్నంలో దూరేసింది. వేటగాడు నిరాశతో వెళ్ళిపోయాడు.
కొంత సేపటికి రోమశుడు చెట్టు దిగి, పలితునితో స్నేహం నటిస్తూ పిలిచింది. కానీ పలితుడు తెలివైంది, ఇందాకా ఇద్దరికీ అవసరం కనుక వలకొరికేను. నీకూ, నాకూ స్నేహం కుదరదని చెప్పింది.
నీతి : శత్రువుకైనా ఉపకారం చేసి ఆ శత్రువు ద్వారా మరో శత్రువు నుండి తెలివిగా తప్పించుకోవాలి.

ప్రశ్న 2.
 గుడ్లగూబను చూసి భయపడిన ఎలుక తన మనసులో ఏమనుకొంది?
 జవాబు:
 చంద్రకుడు అనే గుడ్లగూబను తన సమీపంలో చూసి, ఎలుక చాలా భయపడింది. తనకు దాని చేతిలో మరణం తప్పదనుకొంది. ఏం చేయాలో తెలియక మనసులో దేవుడిని తలచుకొని ఏడ్చింది. రోమశుడు వలలో పడినందుకు ఆనందపడడం తప్పని తెలుసుకొని బాధపడింది. ఐనా తెలివైన వారికి ప్రమాదం ఎదురైతే ఏడవరు. భయపడరు. ధైర్యం తెచ్చుకొంటారనుకొని తనకు తాను ధైర్యం చెప్పుకొంది. ఒకే చోట నివసిస్తున్నాం కనుక రోమశుని ప్రార్థించి ప్రాణాలు నిలబెట్టుకోవాలని నిర్ణయించుకొంది. రోమశుని దగ్గరకు వెళ్లింది.
ప్రశ్న 3.
 ఎలుక, పిల్లి నుండి ఎలా తప్పించుకొంది?
 జవాబు:
 చంద్రుకుడనే గుడ్లగూబ నుండి ప్రాణాలతో బయట పడడానికి ఎలుక (పలితుడు) పిల్లి (రోమశుడు)తో స్నేహం చేసింది. బయటపడింది.
అన్నమాట ప్రకారం వలను కొరికితే పిల్లి తనను తినేస్తుందని పలితుడికి తెలుసు. అందుకే వల కొరుకుతున్నట్లు నటించింది. వేటగాడు సమీపిస్తుంటే పిల్లికి ప్రాణభయం పెరిగిపోయింది. సరిగ్గా అప్పుడు వలతాడు కొరికింది. పిల్లి ప్రాణభయంతో ఎలుకను వదిలేసి చెట్టేక్కేసింది.
తర్వాత స్నేహం చేద్దామన్నా ఎలుక ఒప్పుకోకుండా తప్పించుకొంది. శత్రువును కూడా చక్కగా ఉపయోగించు కోగల నేర్పు ఎలుకకుంది.
ప్రశ్న 4.
 కింది పేరా చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి.
మనం మంచివారితో స్నేహం చేస్తే మంచి అలవాట్లు వస్తాయి. చెడ్డవారితో స్నేహం చేస్తే చెడు అలవాట్లు అబ్బుతాయి. అవి మన జీవితాన్ని మార్చేస్తాయి. అందుకనే స్నేహితులను ఎంచుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆచితూచి ఎంచుకోవాలి. చక్కగా చదువుకొని బుద్ధిగా ఉండే పిల్లలతో స్నేహం చేయడం వలన వారు కూడా జీవితంలో మంచి స్థానం సంపాదించుకుంటారు. చదువు మీద శ్రద్ధ లేని, బాధ్యత లేని పిల్లలతో స్నేహం చేయడం వల్ల చదువూ సంధ్యా లేకుండా సోమరుల్లా మిగిలిపోతూ ఉంటారు. మనం తిరిగే, మాట్లాడే స్నేహితుల వల్ల మన స్వభావం గుణగణాలు ఎదుటివారికి తెలుస్తాయి. కష్టసమయాల్లో మంచి స్నేహితులు మనకు తోడుగా ఉంటారు.
అ) మనం ఎటువంటి వారితో స్నేహం చేయాలి?
 జవాబు:
 మనం మంచివారితో స్నేహం చేయాలి. చక్కగా చదువుకొంటూ బుద్ధిగా ఉండే పిల్లలతో స్నేహం చేయాలి.
ఆ) మంచి స్నేహితులను ఎలా ఎంచుకోవాలి?
 జవాబు:
 మంచి అలవాట్లు ఉండి, చక్కగా చదువుకొంటూ బుద్ధిగా చదువుకొనే వారిని మంచి స్నేహితులుగా ఎంచుకోవాలి.

ఇ) బాధ్యత లేని పిల్లలతో స్నేహం చేయడం వలన ఏం జరుగుతుంది?
 జవాబు:
 బాధ్యత లేని పిల్లలతో స్నేహం చేయడం వలన చదువు సంధ్యలు ఉండవు, సోమరుల్లా తయారవుతాం.
ఈ) కష్ట సమయాలలో మనకు తోడుగా వచ్చేవారు ఎవరు?
 జవాబు:
 కష్ట సమయాలలో మంచి స్నేహితులు మనకు తోడుగా వస్తారు.
ఉ) పై రా దేని గురించి చెప్తుంది?
 జవాబు:
 పై పేరా స్నేహం గురించి చెబుతోంది.
వ్యక్తీకరణ – సృజనాత్మకత
అ) కింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో జవాబులు రాయండి.
ప్రశ్న 1.
 పిల్లి స్వభావం ఎలాంటిది?
 జవాబు:
 పిల్లిది మోసం చేసే స్వభావం. అవసరాన్ని బట్టి నటించే స్వభావం కలది. వలలో చిక్కుకున్నప్పుడు ఎలుక వలతాళ్లు కొరికి కాపాడతానంది. తను చివరి దశలో ఉన్నాను కనుక ఎలుకతో స్నేహంగా ఉంటానని అబద్దం చెప్పింది. వలతాళ్లు కొరికి ఎలుక కాపాడింది.
వేటగాడు వెళ్ళిన కొద్ది సేపటికే ఎలుక తనకు చేసిన ఉపకారం మరచిపోయింది. స్నేహం వంకతో ఎలుకను బైటకి రప్పించి, తినేయాలనుకొంది. ప్రాణభిక్ష పెట్టినవాడి ప్రాణం తీయడానికి కూడా వెనుకాడని దుష్ట స్వభావం పిల్లిది. కపటంతో దేనినైనా సాధించవచ్చు అనుకొనే స్వభావం పిల్లిది.

ప్రశ్న 2.
 ఆపద కలిగినపుడు మనం ఎలా ఆలోచించాలి?
 జవాబు:
 ఆపద కలిగినపుడు ధైర్యంగా ఉండాలి. ప్రాణం పోతుందని భయపడకూడదు. ఏదో ఒక ఉపాయం ఆలోచించి, అపాయం నుండి గట్టెక్కే విధంగా చూచుకోవాలి.
ప్రశ్న 3
 ఈ కథలో నీవు తెలుసుకున్న నీతి ఏమిటి?
 జవాబు:
 ఈ కథలో అపాయం కలిగినప్పుడు ఏదయినా ఉపాయం ద్వారా ఆపదను పోగొట్టుకోవాలని తెలుసుకున్నాను. అపాయం నుండి తప్పించుకోవడానికి శత్రువు సహాయం తీసుకోవచ్చని, కాని శత్రువు నుండి రక్షించుకొనే ఉపాయం కూడా ఉండాలని తెలుసుకున్నాను. జాతి వైరం ఉన్న వారితో శాశ్వతంగా స్నేహం చేయకూడదని తెలుసుకున్నాను.
ఆ) కింది ప్రశ్నలకు 8 నుండి 10 వాక్యాలలో జవాబులు రాయండి.
ప్రశ్న 1.
 సమయస్ఫూర్తి కథను సొంతమాటలలో రాయండి.
 జవాబు:
 పంచవటం అనే ప్రాంతంలోని ఒక మర్రిచెట్టు తొర్రలో రోమశుడు అనే పిల్లి, ఆ చెట్టు కింద కన్నంలో పలితుడు అనే ఎలుక ఉండేవారు. ఒక రోజు రోమశుడు వేటగాడు పన్నిన వలలో చిక్కుకున్నాడు. పిల్లి వలలో పడినందుకు ఎలుక సంతోషించింది.
అదే సమయంలో చంద్రకుడు అనే గుడ్లగూబ ఎలుకను చూసి అక్కడికి వచ్చింది. గుడ్లగూబను చూచి ఎలుక భయపడింది. ప్రమాదం ఎదురైనప్పుడు భయపడకూడదు అనుకుంటూ పిల్లికి దగ్గరగా వెళ్ళాడు. “మనం శత్రువులమైనా ఇక్కడే ఉంటున్నాము. ఒకరికొకరు అపకారం చేసుకోలేదు. గుడ్లగూబ నుండి నువ్వు నన్ను కాపాడితే, నిన్ను వేటగాడి నుండి నేను కాపాడుతాను అని చెప్పింది. అందుకు సంతోషించిన పిల్లి సరేనంది.
పిల్లి, ఎలుక స్నేహంగా మాట్లాడుకోవడం చూసి గుడ్లగూబ భయపడి వెళ్ళిపోయింది. అంతలో వేటగాడు కుక్కలతో రావడం గమనించిన పిల్లి తనను తొందరగా రక్షించమని ఎలుకను అడిగింది. సరేనంటూ ఎలుక వలను కొరుకుతున్నట్లు నటించి, వేటగాడు దగ్గరకు వచ్చే వరకు ఆగి, అప్పుడు త్రాళ్ళు కొరికింది. పిల్లి చెట్టెక్కి వేటగాడి నుండి తప్పించుకుంది.
వేటగాడు వెళ్ళిన తరువాత పిల్లి ఎలుక కన్నం దగ్గరకు వచ్చి ఎలుకను పిలిచి స్నేహంగా ఉందామని కలిసిమెలిసి బతుకుదామని అంది. ఎలుక కొద్దిగా తల బయటకు పెట్టి “ఇందాక ఇద్దరికీ అవసరం ఉంది. నీ వలన నేను రక్షింపబడ్డాను. నేను నిన్ను కాపాడాను. ఇద్దరికీ లాభం జరిగింది. కాని మనది జాతి వైరం. నేను బయటకు వస్తే నన్ను నువ్వు చంపక మానవు. అది నాకు తెలుసు” అని కన్నంలో దూరింది. తన ఎత్తు పారకపోయేసరికి పిల్లి నిరాశపడింది.

ప్రశ్న 2.
 ఎలుక తెలివితేటలను గురించి మీరేమనుకొంటున్నారో రాయండి.
 జవాబు:
 ఎలుక చాలా తెలివైంది. తనకు ప్రాణభయం ఏర్పడితే ఒక్కక్షణం భయపడింది. వెంటనే ఆలోచించింది. ప్రమాదం ఏర్పడినపుడు ఆలోచించి బైటపడే వారే నిజమైన తెలివైన వారని ఎలుక నిరూపించింది.
గుడ్లగూబ, పిల్లీ రెండూ తనకు శత్రువులే రెండూ తనను తినేసేవే. అయినా భయపడలేదు. ఒక శత్రువును తప్పించుకొనేందుకు మరొక శత్రువుతో స్నేహం చేసింది. గుడ్లగూబ వలన వెంటనే ప్రమాదం కానీ గుడ్లగూబకు పిల్లి అంటే భయం. పిల్లి వలలో ఉంది. నిజానికి పిల్లి గుడ్లగూబను కూడా ఏమీ చేయలేదు. కానీ గుడ్లగూబకు పగటివేళ కళ్ళు సరిగా కనిపించవు. అందుకే గుడ్లగూబను దివాంధము అంటారు. అది గమనించి పిల్లితో స్నేహపూర్వకమైన సంభాషణ దానికి వినపడేలా మాట్లాడింది. గుడ్లగూబ భయపడి పారిపోయింది.
వేటగాడు వస్తుంటే వలతాళ్లు కొరికింది. పిల్లి కూడా ప్రాణభయంతో పారిపోయింది. తర్వాత రమ్మన్నా – కలుగులోంచి రాలేదు. ఎలుక చాలా తెలివైనది కనుకనే రెండు ప్రమాదాల నుండీ అవలీలగా బైటపడింది.
ప్రశ్న 3.
 ఎలుక – పిల్లి మాటలను సంభాషణ రూపంలో రాయండి.
 జవాబు:
 ఎలుక : నమస్కారమండీ ! పిల్లిగారూ !
 పిల్లి : (గంభీరంగా) ఆ…… ఏంటీ?
 ఎలుక : ఒకే చెట్టు కింద బతుకుతున్నాం కదండీ !
 పిల్లి : ఔనౌను ! మనిద్దరం స్నేహితులం కదా !
 ఎలుక : మీరన్నా, మీ మీసాలన్నా నాకు చాలా ఇష్టం.
 పిల్లి : (నవ్వుతూ) నాకూ నువ్వుంటే చాలా ఇష్టం.
 ఎలుక : ఆ గుడ్లగూబ భయపెడుతోంది.
 పిల్లి : నీ జోలికి వస్తే, దాన్ని తినేస్తాను. నీకేం భయం లేదు.
 ఎలుక : ధన్యవాదాలు.
 పిల్లి : (మెల్లిగా) వలతాళ్ళు కొరికి కాపాడతావా? అదిగో ! వేటగాడు, కాపాడు ! కాపాడు !
 ఎలుక : హమ్మయ్య ! కొరికేశాను. ఇక ఇద్దరం క్షేమమే.
భాషాంశాలు
అ) గీతగీసిన పదాలకు అర్థాలు రాయండి.
 ఉదా : ఎలుక ఆహారం అన్వేషించడానికి బయలుదేరింది. = వెతకడానికి
 1. చిలుక ప్రాణభీతితో గిజగిజలాడింది. = ప్రాణభయం
 2. చిరకాల వైరం మంచిది కాదు = విరోధం
 3. మంచివారితో మైత్రి గొప్ప జీవితానికి మంచిమార్గం చూపుతుంది. = స్నేహం
 4. సదాలోచనలు చేయాలి. = మంచి ఆలోచనలు

ఆ) కింది పదాలకు వ్యతిరేక పదాలు రాయండి.
 1. అదృష్టం × దురదృష్టం
 2. మంచి × చెడు
 3. వెలుగు × చీకటి
 4. అపకారం × ఉపకారం
 5. ధర్మం × అధర్మం
 6. సత్యం × అసత్యం
సూచన :
 ప్రకృతి – వికృతి అంటే ఏమిటో ఉపాధ్యాయులు పిల్లలకు చెప్పండి.
 ప్రకృతి : సంస్కృతంలో కొన్ని ప్రాకృత పదాలు తెలుగులోకి వచ్చాయి. వీటిని ప్రకృతులు అంటారు.
 వికృతులు : కొన్ని పదాలు వర్ణలోప, వర్ణాగమ, వర్ణాధిక్య వర్ణ వ్యత్యయాది మార్పులతో వికృతులుగా మారతాయి.
| ప్రకృతి | వికృతి | మార్పు | 
| రథం | అరదం | అకారం చేరింది. | 
| అంగుళీయకం | ఉంగరం | అక్షరాలు పూర్తిగా మారడం | 
| అప్సర | అచ్చర | ప, సలకు బదులు చకారం వచ్చింది | 
| చంద్రుడు | చందురుడు | అనే అక్షరాలు కొద్ది మార్పు | 
| హితం | ఇతం | హకార లోపం | 

ఇ) కింది ప్రకృతి వికృతులను జతచేయండి.
| 1. ఆహారము | అ) పానం | 
| 2. ధర్మము | ఆ) సంతసం | 
| 3. ప్రాణము | ఇ) కత | 
| 4. కథ | ఈ) దమ్మం | 
| 5. సంతోషము | ఉ) ఓగిరం | 
జవాబు:
| 1. ఆహారము | ఉ) ఓగిరం | 
| 2. ధర్మము | ఈ) దమ్మం | 
| 3. ప్రాణము | అ) పానం | 
| 4. కథ | ఇ) కత | 
| 5. సంతోషము | ఆ) సంతసం | 
వ్యాకరణాంశాలు
పిల్లలందరూ మైదానంలో ఆడుతున్నారు.
పై వాక్యంలో పిల్లలందరూ అనే పదం పిల్లలు + అందరూ అనే రెండు పదాల కలయిక వల్ల ఏర్పడింది. దీనినే సంధి అంటారు.
పిల్లలు అన్న పదం చివర ‘ఉ’ ఉంది. అందరూ అన్న పదం మొదట ‘అ’ ఉంది. రెండు పదాలూ కలిసినపుడు ఉ + అ అన్న రెండు అచ్చులకు బదులు ‘అ’ ఒక్కటే వచ్చింది.
ఇటువంటి మార్పును సంధి అంటారు. సంధి జరిగే సమయంలో మొదటి పదం చివరి అచ్చు పోతుంది. రెండవ పదంలో మొదటి అచ్చు మిగులుతుంది. – రెండు తెలుగు పదాల మధ్య జరిగే ఈ సంధులను తెలుగు సంధులు అంటారు.
 ఉదా :
 రాముడు + అతడు = రాముడతడు.
ఇందులో రాముడు మొదటి పదం అతడు రెండవ పదం. మొదటి పదమైన రాముడులోని చివరి ఉకారం పోయి రెండవ పదంలోని అకారం మిగిలింది.
 రాముడు + అతడు = రాముడతడు అనే రూపం ఏర్పడింది.
అ) కింది పదాలను విడదీయండి:
 1. వాడెక్కడ = వాడు + ఎక్కడ
 2. మనమందరం = మనము + అందరం
 3. ఎవరిక్కడ = ఎవరు + ఇక్కడ
 4. వారందరూ = వారు + అందరూ
 5. మహానీయులెందరో = ‘ మహనీయులు + ఎందరు + ఓ
ఆ) కింది పదాలను కలిపి రాయండి. మార్పును చర్చించండి.
 ఉదా : ముసలివాళ్లు + అందరు = (ళ్ల్+) ఉ + అ = ళ్ల – ముసలివాళ్ళందరు
 1. వీళ్లు + అందరూ = వీళ్లందరూ (ళ్ల్ + ఉ) + అ = ళ్ల
 2. ఇల్లు + ఉంది = ఇల్లుంది (ల్ల్+ ఉ) + ఉ = ల్లు
 3. ప్రజలు + అందరూ = ప్రజలందరూ (ల్ + ఉ) + అ = లు
 4. డొక్కలు + ఎండిపోయిన = డొక్కలెండిపోయిన (ల్ + ఉ)
 5. ముసలివారు + అంటే = ముసలివారుంటే (ర్ + ఉ) + ఉ = రు
 6. పాఠాలు + ఎన్ని = పాఠాలెన్ని (ల్ + ఉ) + ఎ = లె
ఉపాధ్యాయులకు గమనిక :
 వ్యాకరణ పరంగా ఉత్వసంధి రాని సందర్భాలు (ప్రథమేతర విభక్తి శత్రర్థక చువర్ణములందున్న ఉకారమునకు సంధి వైకల్పికముగా వస్తుంది) అక్కడక్కడ ఉన్నాయి. ఇవి గ్రాంథిక భాషకు పరిమితమైన విషయాలు కాబట్టి ఉపాధ్యాయునికి అవగాహన ఉంటే చాలు. పిల్లలకు ఈ స్థాయిలో వివరించాల్సిన అవసరం లేదు.

* ఈ పాఠంలోని ఉత్వసంధికి సంబంధించిన సంధి పదాలను వెతికి రాయండి.
 జవాబు:
 కాపురముంటోంది = కాపురము + ఉంటుంది
 విహరిస్తున్న = విహరిస్తు + ఉన్న
 గిజగిజలాడాడు = గిజగిజలు + ఆడాడు
 ఏడుస్తున్నాడు = ఏడుస్తూ + ఉన్నాడు
 రాదన్నది = రాదు + అన్నది
 ఎదురైనప్పుడు = ఎదురు + ఐనప్పుడు
 ధైర్యమొందుతారు = ధైర్యము + ఒందుతారు
 బ్రతుకుతున్న = బ్రతుకుతు + ఉన్న
 వైరమున్నా = వైరము + ఉన్న
 మింగేస్తావేమో = మింగేస్తావు + ఏమో
 ఉందామని = ఉందాము + అని
 కాదంటే = కాదు + అంటే
 పోదామని = పోదాము + అని
 తహతహలాడుతూ = తహతహలు + ఆడుతూ
 పరవశుడయ్యాడు = పరవశుడు + అయ్యాడు
 నిన్నేమీ = నిన్ను + ఏమీ
 వారిద్దరూ = వారు + ఇద్దరూ
 పారదని = పారదు + అని
 చెట్టెక్కాడు = చెట్టు + ఎక్కాడు
 నిన్నాశ్రయించాను = నిన్ను + ఆశ్రయించాను
 సత్యమే = సత్యము + ఏ
 లాభమే = లాభము + ఏ
 కాదనలేని = కాదు + అనలేని
 వచ్చా ననుకో = వచ్చాను + అనుకో
 తప్పదని = తప్పదు + అని
 మాయమయ్యాడు = మాయము + అయ్యాడు
 నిరాశపాలయ్యాడు = నిరాశపాలు + అయ్యాడు
 అంతమయ్యింది = అంతము + అయ్యింది
ఇ) పారిభాషిక పదాల అభ్యాసాలు :
అడుగులో అడుగు వేశాము. – ఆటలు పాటలు పాడాము.
 ఇరుగు పొరుగు కలిశాము. – ఈలలు వేస్తూ గెంతాము.
 ఉరుకులు పరుగులు తీశాము. – ఊరిని శుభ్రం చేశాము.
పై గేయంలో అచ్చుల కింద గీత గీసి గుర్తించండి. హ్రస్వాచ్చులను దీర్ఘాచ్చులను విడివిడిగా రాయండి.
| హ్రస్వాచ్చులు | దీర్ఘాచ్చులు | 
| 1. అ | 1. ఆ | 
| 2. ఇ | 2. ఈ | 
| 3. ఉ | 4. ఊ | 
ఈ) కింది వాక్యాలలో పరుషాక్షరాలను గుర్తించండి, గీత గీయండి.
| వాక్యం | పరుషాక్షరాలు | 
| 1. కన్నవారిని కొలుద్దాం. | క, కొ | 
| 2. చదువులు బాగా చదువుదాం. | చ | 
| 3. చిటపట చినుకులు పడ్డాయి. | చి, ట, ప, కు | 
| 4. తపాలవాడు. వచ్చాడు, తనతో జాబులు తెచ్చాడు. | త, పా, చ్చా, తో, తె | 
| 5. పరిమళమంటే మాకిష్టం. | ప, టే, కి | 

ఉ) కింది వాక్యాలలో సరళాక్షరాలు గుర్తించండి.
| వాక్యం | సరళాక్షరాలు | 
| 1. చలికి గజగజ వణికారు వారు. | గ, జ | 
| 2. ఆ అమ్మాయి జడ కుచ్చులు పెట్టుకుంది. | జ, డ, ది | 
| 3. డబ్బు పొదుపు చేయడం మంచిది. | డ, బ్బు, దు, డ, ది | 
| 4. దసరా పండుగ వచ్చింది; సరదాలెన్నో తెచ్చింది. | ద, గ, ది, దా | 
| 5. పలకా బలపం మా ఆస్తి. | బ | 
ఊ) కింది అక్షరాలు పరిశీలించండి. స్థిరాక్షరాల చుట్టూ ‘సున్న’ చుట్టండి.
 
 
ఎ) కింది వాక్యాలలోని స్పర్శాక్షరాలకు ‘సున్న’ చుట్టండి.
 ఈ సంవత్సరం మీరు సెలవులకు ఎక్కడికి వెళుతున్నారు?
 కిందటి సంవత్సరం సంపూర్ణ ప్రపంచయాత్ర చేశాం.
 ఈ ఏడాది ఇంకేటయినా వెళ్లాలి.
 జవాబు:
 
ఏ) కింది వాక్యాలు పరిశీలించండి. వర్గయుక్కులు గుర్తుపెట్టండి.
 ఆయనకు కరమునకు ఖరమునకు తేడా తెలీదుట.
 ఘనతకు మూలం వినయం.
 భయపడితే జీవితంలో ముందుకు పోలేం.
 జవాబు:
 
ఐ) కింది వాక్యంలో అనునాసికాక్షరాలు గుర్తించండి.
 కరుణ నమస్కారం పెట్టింది.
 జవాబు:
 
ఒ) కింది మాటలలో అంతస్థాలను గుర్తించండి.
 యమున, కారం, పాలు, వంకర, వేళ
 జవాబు:
 
ఓ) కింది వాక్యంలో ఊష్మాలను గుర్తించండి.
 భాషను మాట్లాడే సహజ శక్తి .మనుషులందరికీ ఉంటుంది.
 జవాబు:
 
ఔ) కింది వాక్యాలలో తాలవ్యాక్షరాలను గుర్తించండి.
 ఈ ఇలలో చక్కగా చదువుకున్నవారే సుఖపడతారు.
 జవాబు:
 
అం) కింది గడిలో మూర్ధన్యాక్షరాలను గుర్తించండి.
 
 జవాబు:
 
* తాతకు దగ్గులు నేర్పడం సతీష్ కు సాధ్యమా
 ఈ వాక్యంలో ఉన్న దంత్యాక్షరాల కింద గీత గీయండి.
 జవాబు:
 తాతకు దగ్గులు నేర్పడం సతీష్ కు సాధ్యమా
* మహాత్మాగాంధీ పోర్బందర్ లో జన్మించాడు.
 ఈ వాక్యంలో ఓష్ట్యాక్షరాలు గుర్తించండి.
 జవాబు:
 
భాషాభాగాలు
కింది భాషాభాగాలను జతపరచండి.
| అ) విశేషణం | 1. చదివాను | 
| ఆ) నామవాచకం | 2. కాని | 
| ఇ) క్రియ | 3. ఆమె | 
| ఈ) అవ్యయం | 4. ఎర్రని | 
| ఉ) సర్వనామం | 5. వనజ | 
జవాబు:
| అ) విశేషణం | 4. ఎర్రని | 
| ఆ) నామవాచకం | 5. వనజ | 
| ఇ) క్రియ | 1. చదివాను | 
| ఈ) అవ్యయం | 2. కాని | 
| ఉ) సర్వనామం | 3. ఆమె | 
ఖాళీలను పూరించండి.
1. నామవాచకానికి లేదా సర్వనామానికి ఉన్న గుణాన్ని తెలిపేది (విశేషణం)
 2. పేరుకు బదులుగా వాడేది ………… (సర్వనామం)
 3. పనిని తెలిపే మాట ……………… (క్రియ)
 4. లింగ వచన విభక్తులు లేనిది…………… (అవ్యయం)
 5. పేరును తెలిపే పదం ………………. (నామవాచకం)
చమత్కార పద్యం
“ఎలుకలు తమ కలుగులోనికి ఏనుగునీడ్చెను” అని కవికి ఒక సమస్యను ఇచ్చారు. కవి దానిని ఎలా పూరించాడో చూడండి.
 ఇలలో నిద్దరు రాజులు
 మలయుచుఁ జదరంగమాడి మాపటివేళన్
 బలమెత్తికట్ట మరచిన
 నెలుకలు తమ కలుగులోనికేనుగునీడ్చెన్.
భావం :
 ఇలలో ఇద్దరు రాజులు పట్టుదలతో చదరంగమాడుతున్నారు. రాత్రి అయింది చదరంగం మీద బలాన్ని (పావులను) ఎలా ఉన్నవి అలానే వదిలేసి వెళ్ళారు. రాత్రికి ఎలుకలు వచ్చి ఏనుగు (పావు)ను తమ రంధ్రంలోకి ఈడ్చుకొని పోయాయి.
సమయస్ఫూర్తి – కవి పరిచయం
జననం : 16-4-1848న రాజమండ్రిలో జన్మించారు.
తల్లిదండ్రులు : పున్నమ్మ, సుబ్బారాయుడుగార్లు.
భార్యపేరు : బాపమ్మ (రాజ్యలక్ష్మమ్మ)
రచనలు : రాజశేఖర చరిత్రము, సత్యరాజా పూర్వదేశ యాత్రలు, హాస్య సంజీవని, సతీహిత బోధిని, ఆంధ్రకవుల చరిత్ర మొదలైన 130 గ్రంథాలు రచించారు. అనేక ఆంగ్ల, సంస్కృత గ్రంథాలను తెలుగులోకి అనువదించారు.
ఉద్యోగం : రాజమండ్రిలోనూ, మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలోనూ తెలుగు పండితునిగా పనిచేశారు.
బిరుదులు : గద్యతిక్కన, రావు బహద్దూర్. ప్రత్యేకతలు : రచయిత, కవి, సంఘ సంస్కర్త, నవయుగ వైతాళికుడు, విద్యావేత్త, ఆధునికాంధ్ర సమాజ పితామహుడు.
మొట్టమొదటగా చేసినవి, రచించినవి : వితంతు వివాహం, సహవిద్యా పాఠశాల స్థాపన, నాటకకర్త, దర్శకత్వం, నాటక ప్రదర్శన, నవల, స్వీయచరిత్ర, ప్రహసనం. వీరు 27-5-1919న స్వర్గస్తులయ్యా రు.
అర్థాలు
వటము = మఱ్ఱిచెట్టు
 పంచవటం = ఐదు మఱ్ఱిచెట్లు
 అన్వేషణ = వెతుకులాట
 శత్రువు = విరోధి
 గుండె గుభేలు మనడం = చాలా భయపడడం
 భీతి = భయం
 చంకలు కొట్టుకోవడం = ఆనందించడం
 బుద్ధిమంతులు = తెలివైనవారు
 అర్థించి = అడిగి
 అడుగులు వేయడం = బయల్దేరడం
 పరస్పరం = ఒకరికొకరు
 ఆపద = ప్రమాదం
 తహతహలాడడం = ఆత్రుత పడడం
 సఖ్యంగా = స్నేహంగా
 మైత్రి = స్నేహం
 పథకం = పద్ధతి
 కాలయముడు = యమధర్మరాజు
 సంతోషం = ఆనందం
 ఆశ్రయించడం = పంచన చేరడం, ప్రార్థించడం
 కుట్ర = మోసం
 సత్యం = నిజం
 ఉభయులు = ఇద్దరూ
 లక్షణం = స్వభావం పీడ
 వైరం = విరోధం

ప్రాణగండం = ప్రాణానికి ప్రమాదం
 పరవశం = ఒళ్ళు తెలియని స్థితి
 చివరిదశ = ఆఖరిదశ
 నడుచుకోవడం = ప్రవర్తించడం
 త్యాగం = తను మానుకొని ఇతరులకుఇవ్వడం
 కృతజ్ఞత = చేసినమేలు మరువకపోవడం
 స్నేహం = చెలిమి
 అజ్ఞానం = తెలియనితనం
 పటాపంచలు = నాశనం
 సఖ్యం = స్నేహం
 సదాలోచన = మంచి ఆలోచన
 కన్నం = రంధ్రం
 విచారము = బాధ
 స్వజాతి = తన జాతి
 కపటం = మోసం
