AP 10th Class Social Notes Chapter 18 స్వతంత్ర భారతదేశం (మొదటి ముప్ఫై సంవత్సరాలు-1947-1977)

Students can go through AP Board 10th Class Social Notes 18th Lesson స్వతంత్ర భారతదేశం (మొదటి ముప్ఫై సంవత్సరాలు-1947-1977) to understand and remember the concept easily.

AP Board 10th Class Social Notes 18th Lesson స్వతంత్ర భారతదేశం (మొదటి ముప్ఫై సంవత్సరాలు-1947-1977)

→ రాజకీయాలలో ఒక వ్యక్తి – ఒక ఓటు – ఒకే విలువ అని అంబేద్కర్ అన్నారు.

→ మొదటి సాధారణ ఎన్నికలు నిరక్షరాస్యత మూలంగా సవాలుగా నిలిచాయి.

→ రోజువారీ జీవితం నుంచి కొన్ని గుర్తులను ఉపయోగించి మొదటి ఎన్నికలను నిర్వహించారు.

→ 1952, 1957, 1967లలో జరిగిన మొదటి మూడు సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ ఘన విజయం సాధించగా, ఇతర పార్టీలు కాంగ్రెస్ కి సమీపంలోకి కూడా రాలేదు.

→ అనేక రాష్ట్రాలలో వివిధ భాషలు మాట్లాడే ప్రజలు నివసించేవారు. అదే విధంగా ఒకే భాషను మాట్లాడేవారు వివిధ రాష్ట్రాలలో నివసించేవారు.

→ తెలుగు మాట్లాడే ప్రజలు అందరికంటే తీవ్ర ఉద్యమాన్ని చేపట్టారు.

→ బ్రిటిష్ పాలనలో ఆంధ్రమహాసభ క్రియాశీలంగా పనిచేసింది.

AP 10th Class Social Notes Chapter 18 స్వతంత్ర భారతదేశం (మొదటి ముప్ఫై సంవత్సరాలు-1947-1977)

→ 1953లో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సంఘాన్ని (SRC) వేశారు. దీనిలో ఫజల్ ఆలి, కె.ఎం. పణిక్కర్, హృదయనాథ్ కుంజులు సభ్యులుగా ఉన్నారు.

→ 1956లో పార్లమెంటు రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం ఆమోదించబడింది.

→ స్వాతంత్ర్యం వచ్చిన తరువాత భూసంస్కరణలను అమలు చేశారు. కానీ ఇవి దేశమంతా మనస్ఫూర్తిగా అమలు జరగలేదు.

→ ప్రణాళికాబద్ధ అభివృద్ధి ద్వారా కులం, మతం, ప్రాంతం వంటి విభజన ధోరణులు తగ్గి భారతదేశం బలమైన, ఆధునిక దేశంగా ఎదుగుతుందని నెహ్రూ ఆశించాడు.

→ భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ప్రచ్ఛన్న యుద్ధం మొదలై ప్రపంచమంతా రష్యా కూటమి (USSR) లేదా అమెరికా (USA) గా విడిపోయింది.

→ భారతదేశం, ఇండోనేషియా, ఈజిప్టు, యుగోస్లేవియా మొదలైన దేశాలు కలసి ‘అలీన విధానాన్ని నిర్మించారు.

→ పంచశీల సూత్రాలను నెహ్రూ రూపొందించాడు.

→ 1962 లో చైనాతో, 1965 లో పాకిస్థాన్, 1971లో మళ్ళీ పాకిస్థాన్‌తో భారతదేశం యుద్ధం చేయవలసి వచ్చింది.

→ 1964 లో నెహ్రూ చనిపోయిన తరువాత లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రి అయ్యాడు. 1965 లో శాస్త్రి అకాల మరణం తరువాత ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయ్యింది.

→ తమిళనాడులో హిందీ వ్యతిరేక ఉద్యమం తీవ్రంగా పరిణమించినపుడు శాస్త్రి గారు ఉద్యమాన్ని శాంతి పరచటానికి అనేక మినహాయింపులు ప్రకటించారు.

AP 10th Class Social Notes Chapter 18 స్వతంత్ర భారతదేశం (మొదటి ముప్ఫై సంవత్సరాలు-1947-1977)

→ 1967లో అనేక రాష్ట్రాలలో కాంగ్రెస్ ఓడిపోగా వివిధ ప్రతిపక్ష పార్టీలు అధికారంలోకి వచ్చాయి.

→ ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమం ప్రారంభమయ్యింది.

→ భారతదేశంలో జమ్ము-కాశ్మీరు ప్రత్యేక ప్రతిపత్తి ఉంది.

→ భారత్ 1971లో బంగ్లాదేశ్ కు సహకరిస్తూ పాక్ తో యుద్ధం చేసింది. బంగ్లాదేశ్ స్వాతంత్ర్యం సంపాదించుకుంది.

→ “గరీబీ హటావో” అనే నినాదంతో ఇందిరాగాంధీ 1971 సార్వత్రిక ఎన్నికలలో రికార్డుస్థాయిలో విజయం సాధించింది. ప్రతిపక్షమే లేకుండా పోయింది.

→ ఇందిరాగాంధీ అనేక ప్రైవేటు బ్యాంకులను జాతీయం చేసింది. రాజ భరణాలను రద్దు చేసింది. చమురు ధరలు, ద్రవ్యోల్బణం, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, ఆహార కొరత, నిరుద్యోగం వంటి సమస్యలను ఎదుర్కొంది.

→ జయప్రకాశ్ నారాయణ్ ఆధ్వర్యంలో అనేక ప్రతిపక్షాలు ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా ఉద్యమించాయి.

→ ఇందిరాగాంధీ అత్యవసర పరిస్థితి విధించి అనేక సమస్యలను ఎదుర్కొన్నది.

→ రాజ్యాంగానికి 42 వ సవరణ చేయుట జరిగింది.

→ మనం స్థిరమైన ప్రజాస్వామ్యాన్ని సాధించామని చెప్పవచ్చు. అయితే ఇప్పటికీ కుల వివక్ష, లింగ వివక్ష కొనసాగుతున్నాయి.

AP 10th Class Social Notes Chapter 18 స్వతంత్ర భారతదేశం (మొదటి ముప్ఫై సంవత్సరాలు-1947-1977)

→ రాష్ట్రాల పునఃవ్యవస్థీకరణ : రాష్ట్రాల పునఃవ్యవస్థీకరణ కంటే ముందు ప్రత్యేక తెలుగురాష్ట్రం కోరుతూ 58 రోజులు నిరాహారదీక్ష చేసిన పొట్టి శ్రీరాములు 1952 అక్టోబరులో చనిపోవడంతో 1953 ఆగష్టులో రాష్ట్రాల పునఃవ్యవస్థీకరణ సంఘాన్ని (ఎస్.ఆర్.సి) వేశారు. దీనిలో ఫజల్ ఆలి, కె.ఎం. పణిక్కర్, హృదయనాథ్ కుంజులు సభ్యులుగా ఉన్నారు. భాషా ప్రాతిపదికన రాష్ట్రాల ఏర్పాటును సిఫారసు చేసింది. ఈ సంఘ సిఫారసుల మేరకు భాషా ప్రాతిపదికన రాష్ట్రాల పునఃవ్యవస్థీకరణ జరిగింది.

→ ఒక పార్టీ ఆధిపత్యం : స్వాతంత్ర్యం వచ్చిన తరువాత 1952, 1957, 1962లలో జరిగిన మూడు సార్వత్రిక ఎన్నికలలో భారత జాతీయ కాంగ్రెస్ అఖండ విజయాలు సాధించింది. 70% పైగా స్థానాలను గెలుచుకుంది. కాంగ్రెస్ పార్టీ విభిన్న దృక్పథాలు, ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఇతర పార్టీలు ఉన్నాయి. ఎన్నికలలో పోటీ చేశాయి. కానీ కాంగ్రెస్ ని సవాలు చేయగలిగే సంఖ్యలో స్థానాలను గెలుచుకోలేక పోవడంతో ఒక పార్టీ ఆధిపత్యం ఏర్పడింది.

→ అత్యవసర పరిస్థితి :
అత్యవసర పరిస్థితులు మూడు రకాలు :

  1. జాతీయ అత్యవసర పరిస్థితి
  2. రాష్ట్రస్థాయిలో రాజ్యాంగ సంక్షోభం ఏర్పడినప్పుడు విధించే రాష్ట్రపతి పాలన
  3. ఆర్థిక అత్యవసర పరిస్థితి

అత్యవసర పరిస్థితి ప్రభావం :

  1. ప్రాథమిక హక్కులను నిలిపివేయవచ్చు.
  2. కేంద్ర కార్యనిర్వాహక వర్గం సలహామేరకు రాష్ట్ర కార్యనిర్వాహక వర్గం పాలనను కొనసాగించవలసి ఉంటుంది. పార్లమెంటు రాష్ట్ర జాబితాలోని అంశంపై అయినా శాసనం చేయవచ్చు. ఎటువంటి మార్పులనైనా రాష్ట్రపతి చేయవచ్చు.

AP 10th Class Social Notes Chapter 18 స్వతంత్ర భారతదేశం (మొదటి ముప్ఫై సంవత్సరాలు-1947-1977)

→ ప్రాంతీయ ఉద్యమాలు : ఇందిరాగాంధీ పరిపాలన కాలంలో దేశంలో వివిధ రాష్ట్రాలలో ప్రాంతీయ భావాలు తిరిగి ఊపందుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేక తెలంగాణ కొరకు ఉద్యమాలు చేయసాగారు. 1969 డిసెంబరులో అసోంలోని ఖాసి, జైంతియా, గారో గిరిజన ప్రాంతాలలో ఉద్యమ ఫలితంగా మేఘాలయ ఏర్పడింది. 1966లలో ఉమ్మడి రాజధాని అయిన చండీఘర్ తమకు ఇమ్మని పంజాబ్ కోరింది. మహారాష్ట్రలోని బొంబాయి మహారాష్ట్ర వాసులకే చెందాలని శివసేన ఉద్యమం ప్రారంభించింది. కాశ్మీరు, నాగాలాండులలో కూడా ఉద్యమాలు జరిగాయి.

→ జాతీయీకరణ : సామాజిక, ఆర్థిక మార్పు సాధించాలన్న లక్ష్యంతో అనేక ప్రైవేటు బ్యాంకులను జాతీయం చేస్తూ ఇందిరాగాంధీ ప్రకటన చేసింది. దీని మూలంగా సామాన్య ప్రజలందరూ ఈ || బ్యాంకుల సేవలను ఉపయోగించుకోవచ్చు.

AP 10th Class Social Notes Chapter 18 స్వతంత్ర భారతదేశం (మొదటి ముప్ఫై సంవత్సరాలు-1947-1977) 1
AP 10th Class Social Notes Chapter 18 స్వతంత్ర భారతదేశం (మొదటి ముప్ఫై సంవత్సరాలు-1947-1977) 2