AP Inter 2nd Year Civics Study Material Chapter 12 రాజకీయ పార్టీలు

Andhra Pradesh BIEAP AP Inter 2nd Year Civics Study Material 12th Lesson రాజకీయ పార్టీలు Textbook Questions and Answers.

AP Inter 2nd Year Civics Study Material 12th Lesson రాజకీయ పార్టీలు

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
భారతదేశంలోని జాతీయ పార్టీలపై ఒక వ్యాసం వ్రాయండి.
జవాబు:
జాతీయ పార్టీ: దేశంలో నాలుగు (లేదా) అంతకు మించిన రాష్ట్రాలలో జరిగే ఎన్నికలలో పాల్గొని, పోలైన ఓట్లలో ఆరు శాతం పొందటంతో పాటు నాలుగు లోక్సభ సీట్లను గెలుచుకొన్న పార్టీని జాతీయ (లేదా) అఖిల భారత పార్టీగా భారత ఎన్నికల సంఘం గుర్తిస్తుంది.
భారతదేశంలోని ప్రధాన జాతీయ పార్టీలను ఈ క్రింది విధంగా పేర్కొనవచ్చు. అవి:

  1. భారత జాతీయ కాంగ్రెస్
  2. భారతీయ జనతా పార్టీ
  3. భారత కమ్యూనిస్టు పార్టీ
  4. భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
  5. బహుజన సమాజ్ పార్టీ
  6. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ

1) భారత జాతీయ కాంగ్రెస్: భారత జాతీయ కాంగ్రెస్ మన దేశంలో అతి పురాతన పార్టీ. దీనిని 1885 డిశంబరు, 28వ తేదీన బ్రిటిష్ సివిల్ సర్వెంట్ (A. O) ఎ.ఒ హ్యూమ్ స్థాపించాడు. ఉమేష్ చంద్ర బెనర్జీ దీనికి ప్రధమ అధ్యక్షుడుగా వ్యవహరించాడు. స్వాతంత్య్ర ఉద్యమంలో ఈ పార్టీ చురుకైన పాత్ర పోషించి దేశానికి స్వాతంత్య్రాన్ని తీసుకోచ్చింది.

స్వాతంత్ర్యానంతరం జరిగిన 15 సాధారణ ఎన్నికల్లో, కాంగ్రెస్ పార్టీ ఆరుసార్లు ఎన్నికల్లో స్పష్టమైన మెజారిటి సాధించింది. నాలుగు సార్లు అధికార సంకీర్ణానికి నాయకత్వం వహించింది. మొత్తం దాదాపు 49 సంవత్సరాల పాటు కేంద్రప్రభుత్వానికి నాయకత్వం వహించింది. దీనిలో ప్రధాని జవహర్లాల్ నెహ్రూ మొదలుకొని (1947 – 64), ఇటీవలి మన్మోహన్ సింగ్ (2004-14) వరకు ఏడుగురు కాంగ్రెస్ ప్రధాన మంత్రులు దేశాన్ని పాలించారు. 2004 నుండి 2014 వరకు కాంగ్రెస్ నాయకత్వంలోని ఐక్య ప్రగతిశీల కూటమి (United Progressive Alliance – UPA) మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఎన్నో ప్రాంతీయ పార్టీల సంకీర్ణంగా ప్రభుత్వాన్ని ఏర్పరచింది. 2014లో జరిగిన పదహారవ సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్వాతంత్య్రానంతరం మొదటిసారిగా హీనమైన ఓటమిని చవిచూచి, 543 మంది గల లోక్సభలో 44 స్థానాలకు పరిమితమైంది.

AP Inter 2nd Year Civics Study Material Chapter 12 రాజకీయ పార్టీలు

2) భారతీయ జనతా పార్టీ: భారతీయ జనతా పార్టీ (బిజెపి) ని 1980లో స్థాపించారు. భారతీయ జనతా పార్టీ 1951 అక్టోబర్ 21న శ్యాంప్రసాద్ ముఖర్జీ అధ్యక్షతన స్థాపించిన భారతీయ జన సంఘ్క ఒక నూతన, సవరించిన స్వరూపంగా పేర్కొనవచ్చు. భారతీయ జనతా పార్టీ తన పూర్వపు జన సంఘ్్కు కొనసాగింపుగా క్రమశిక్షణ – చక్కని వ్యవస్థీకృత యంత్రాంగం, సంప్రదాయ హిందూ సాంఘిక – సాంస్కృతిక సంస్థలైన రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ (ఆర్. ఎస్. ఎస్), విశ్వహిందూ పరిషత్ (వి. హెచ్. పి) తదితర సంస్థలతో అనుబంధాన్ని కొనసాగిస్తూ వచ్చింది. ఏవో కొన్ని రాజకీయ దృక్పధాలు, పార్టీ స్థాపించిన తొలినాళ్ళలో 1984 సాధారణ ఎన్నికల్లో బిజెపి దేశ వ్యాప్తంగా రెండు సీట్లలో మాత్రమే విజయం సాధించింది. అయితే ఆ తరువాత కాలంలో రామజన్మ భూమి – బాబ్రీ మసీదు అంశం ఆధారంగా తన బలాన్ని బాగా పుంజుకుని గణనీయంగా పెంచుకోగలిగింది. ఎన్నో రాష్ట్రాలకు జరిగిన ఎన్నికలలో విజయాలు సాధించడం, జాతీయ స్థాయి ఎన్నికల్లో చక్కని ఫలితాలు సాధించడంతో 1996 కల్లా బిజెపి పార్లమెంటులో అతి పెద్ద పార్టీగా మారింది. అయితే పార్లమెంటులోని దిగువ సభలో సరైన మెజారిటీ లేకపోవడంతో ఆ పార్టీ ప్రభుత్వం కేవలం 13 రోజులు మాత్రమే అధికారంలో కొనసాగింది.

అనంతరం 1998 సాధారణ ఎన్నికల్లో బిజెపి మాత్రమే నేతృత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి (National Democratic Alliance) అటల్ బీహారీ వాజ్పాయ్ ప్రధానమంత్రిగా ఒక సంవత్సరంపాటు అధికారంలోకి వచ్చింది. ఆ తరువాత మళ్ళీ తాజాగా ఎన్నికలు జరగడంతో ఎన్. డి. ఎ ప్రభుత్వం అటల్ బిహారీ వాజ్పాయ్ నాయకత్వంలో పూర్తి పదవీకాలం అధికారంలో కొనసాగింది. అందుచేత స్వాతంత్య్రానంతర చరిత్రలో కాంగ్రెసేతర ప్రభుత్వం అనేది పూర్తి పదవీకాలం కొనసాగడం ఇదే మొదటిసారిగా పేర్కొనవచ్చు. ఆ తరువాత 2004లో జరిగిన సాధారణ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి (NDA) అనూహ్యంగా పరాజయం పాలైంది. అలాగే 2009లో జరిగిన లోక్సభ సాధారణ ఎన్నికలలో కూడా ఇదే జరిగింది. ఫలితంగా దాదాపు 10 సంవత్సరాల పాటు భారతీయ జనతా పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా కొనసాగింది. ఆ తరువాత 2014 సాధారణ ఎన్నికలలో సుదీర్ఘ కాలం గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ ప్రధాన ప్రచారకునిగా, పార్టీలో జనాకర్షణ గల నాయకునిగా భారతీయ జనతాపార్టీని నడిపించి, పార్టీకి అద్భుతమైన విజయాన్ని అందించగలిగాడు. అప్పటి నుండి, నరేంద్ర మోడి ప్రధానమంత్రిగా భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఏర్పడిన 13 రాష్ట్రాలకు చెందిన రాజకీయ పార్టీల సంకీర్ణంగా జాతీయ ప్రజాస్వామ్య కూటమి (NDA) ప్రభుత్వం ఏర్పడి కొనసాగుతోంది.

3) భారత కమ్యూనిస్టు పార్టీ: భారతదేశంలోని రెండో అతి ప్రాచీన జాతీయ పార్టీయే భారత కమ్యూనిస్టు పార్టీ. |కమ్యూనిస్టు పార్టీ జాతీయోద్యమములో ప్రముఖపాత్ర వహించింది. భారతదేశంలో కమ్యూనిస్టు భావాలను వ్యాప్తి చేసే బాధ్యత ఎమ్. ఎన్. రాయ్కి అప్పజెప్పారు. 1925 డిశంబరు 26వ తేదీన మార్క్సిస్టు సిద్ధాంతములను విశ్వసించిన కొంతమంది కమ్యూనిస్టు పార్టీని స్థాపించారు. పశ్చిమ బెంగాల్, కేరళ, బీహార్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో దీని ప్రాబల్యము హెచ్చుగా వుంది.

4) భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు): 1964 సంవత్సరములో విజయవాడ సమావేశములో భారత కమ్యూనిస్టు పార్టీ రెండుగా చీలిపోయి పి. సుందరయ్య, జ్యోతిబసు, నంబూద్రిపాద్ మొదలగు నాయకుల ఆధ్వర్యంలో భారత కమ్యూనిస్టు పార్టీలోని అతివాదులు సి. పి. ఐ. (ఎమ్)గా ఏర్పడిరి. సి.పి.ఐ కి భిన్నముగా సి.పి.ఎమ్ నాయకులు (అతివాదులు) మావో సిద్ధాంతాలకు సన్నిహితులై చైనా కమ్యూనిజాన్ని అనుసరించిరి. పశ్చిమబంగ, త్రిపుర, కేరళలలో ఈ పార్టీకి చెప్పుకోదగ్గ మద్దతు ఉంది. ఈ పార్టీ పశ్చిమబంగలో 1977 నుండి 2012 వరకు అధికారంలో వుంది.

5) బహుజన సమాజ్ పార్టీ: బహుజన సమాజ్ పార్టీ దళితులు ఆధిపత్యం కలిగిన పార్టీ. ఈ పార్టీ ఉద్యోగుల సమాఖ్య. దళిత్ శోషిత్ సమాజ్ సమితిల విలీనం ఫలితంగా 1984లో ఏర్పండింది. కాన్షీరాం ఈ పార్టీ వ్యవస్థాపక నాయకుడు. మాయావతి ప్రస్తుతం ఈ పార్టీకి నాయకురాలుగా వ్యవహరిస్తున్నారు. ఈ పార్టీ భారత రాజకీయ వ్యవస్థలో జాతీయ పార్టీగా గుర్తింపు పొందింది. మాయావతి నాయకత్వంలో ఆ పార్టీ జనాకర్షణ క్రమేణా పెరుగుతూ వచ్చింది.

6) నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ: 1999, మే, 25 వ తేదీన కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ అయిన శరద్ పవార్, పి. ఎ. సంగ్మా, తారిక్ అన్వర్ తదితరులు స్థాపించిన పార్టీయే నేషనలిస్ట్ కాంగ్రెస్. ఈ పార్టీ స్థాపన సమయంలో ఇండియన్ కాంగ్రెస్ (సోషలిస్ట్) ను తనలో విలీనం చేసుకుంది. భారత ఎన్నికల సంఘం నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీని జాతీయ పార్టీగా గుర్తించింది. మహారాష్ట్ర, మణిపూర్, మేఘాలయ మొదలగు రాష్ట్రాలలో ఈ పార్టీకి చెప్పుకోదగ్గ

2. పార్టీలలోని వివిధ రకాలను తెలిపి, భారతదేశంలో ప్రాంతీయ పార్టీల పాత్రను అంచనా వేయండి. జవాబు: పార్టీలలోని వివిధ రకాలు: ఆధునిక ప్రజాస్వామ్య రాజ్యాల్లో నాలుగు రకాలైన రాజకీయ పార్టీలు ఉంటాయి.

  1. నిరోధకవాద (ప్రతిక్రియాత్మక) పార్టీలు,
  2. సాంప్రదాయకవాద పార్టీలు,
  3. ఉదారవాద పార్టీలు,
  4. విప్లవాత్మక (సమూల సంస్కరణవాద పార్టీలు.

నిరోధకవాద (ప్రతిక్రియాత్మక) పార్టీలు పూర్వపు సాంఘిక, ఆర్థిక, రాజకీయ సంస్థలను సర్థిస్తూ ఉంటాయి. సాంప్రదాయకవాద పార్టీలు యథాతథ స్థితిని విశ్వసిస్తాయి. ఉదారవాద పార్టీలు వర్తమాన సంస్థలో సంస్కరణలను ప్రవేశపెట్టే లక్ష్యంతో పనిచేస్తాయి. విప్లవాత్మకవాద (సమూల సంస్కరణవాద) పార్టీలు ప్రస్తుత సంస్థలను కూలద్రోసి వినూత్న వ్యవస్థ స్థాపన లక్ష్యంతో పనిచేస్తాయి.

AP Inter 2nd Year Civics Study Material Chapter 12 రాజకీయ పార్టీలు

భారతదేశంలో ప్రాంతీయ పార్టీల పాత్ర: భారత రాజకీయాల్లో ప్రాంతీయపార్టీల పాత్రను గురించి వ్యాఖ్యానిస్తూ డా॥ కె. ఆర్. బాంబువాల్ (Dr. K. R. Bambwal) కొన్ని విశిష్ట దృక్కోణాలను గుర్తించారు.
1) ప్రాంతీయ పార్టీలు భారతదేశంలోని ‘ఏకపార్టీ ఆధిపత్య వ్యవస్థ’ కు ఎంతో శక్తివంతమైన సవాలుగా నిలిచాయి.
2) ప్రాంతీయ పార్టీలు కేంద్ర, రాష్ట్ర సంబంధాల కూర్పుపైన, స్వభావంపైన ఒక బలమైన ప్రభావాన్ని చూపాయి. కేంద్ర ప్రభుత్వం వద్ద తమ వ్యవహారాల విషయంలో రాష్ట్ర నాయకులు మరింత హెచ్చుగా వ్యక్తీకరించుకోవడానికి ప్రయత్నించడం, కేంద్ర ప్రభుత్వం ప్రాంతీయ శక్తుల అవసరాలు, డిమాండ్లపై మరింతగా స్పందించడం మొదలైంది.
3) ప్రాంతీయ పార్టీలు రాజకీయాలను మరింత పోటీతత్త్వంతో ఉండే విధంగా మార్చాయి. అలాగే రాజకీయ ప్రక్రియలో ప్రజల భాగస్వామ్యం అట్టడుగు స్థాయిలో మరింత విస్తృతంగా ఉండేలా చేశాయి.
4) ప్రాంతీయ పార్టీలతో ఉండే మరో ప్రయోజనం ఏమంటే ప్రజలు నాయకులతో సాన్నిహిత్యాన్ని కలిగి ఉండడం. ప్రజలు తమ సమస్యల పరిష్కారానికి, జాతీయపార్టీకి చెందిన ఉన్నత పదవిలో ఉన్న వ్యక్తిని కలుసుకోవడం కంటే స్థానిక రాజకీయ పార్టీకి చెందిన నాయకుని కలుసుకోవడం తేలికగా భావిస్తారు.

భారతదేశంలో 1996 తరువాత అనేక ప్రాంతీయపార్టీలు జాతీయ రాజకీయాలలో కీలకంగా మారాయి. జాతీయ ప్రజాసామ్య కూటమి (NDA) లో భాగస్వామ్య పక్షాలుగా 23 ప్రాంతీయపార్టీలు 1999లో, 2004లో కేంద్ర ప్రభుత్వంలో అధికారాన్ని పంచుకున్నాయి. కొన్ని ప్రాంతీయపార్టీలు రాష్ట్రాల్లో అధికార పార్టీలుగా ఉన్నాయి. వీటిలో ఎఐఎడిఎంకె (AIADMK), టి.డి.పి (TDP), జె.డి.యు (JDU), బిజెడి (BJD), యుడిఎఫ్ (UDF), ఎస్.ఎ.డి (SAD) మొదలైనవి ఉన్నాయి. ఈ పరిణామం భారత రాజకీయాల్లో నిరంతరం పెరుగుత్ను, ప్రాముఖ్యంలో వృద్ధి కొనసాగుతున్న ప్రాంతీయపార్టీల ఉనికిని ప్రతిబింబిస్తుంది

ప్రశ్న 3.
భారతదేశంలో ఏకపార్టీ ఆధిపత్యంపై ఒక వ్యాసం వ్రాయండి.
జవాబు:
భారతదేశంలో స్వాతంత్య్ర పోరాటం సమర్థవంతమైన రాజకీయ పార్టీల వ్యవస్థ స్థాపనకు పిలుపునిచ్చింది. దేశంలోని బ్రిటిషు వ్యతిరేక శక్తులను – జాతీయవాద శక్తులను సమీకరించి ఒకే గొడుకు క్రిందకు తెచ్చిన సంస్థగా భారత జాతీయ కాంగ్రెస్ అవతరించింది. భారతదేశం స్వాతంత్ర్యం సాధించిన తరువాత జాతిపిత మహాత్మగాంధీ ఈ పార్టీని ఒక సాంఘిక సంస్థగా మాత్రమే కొనసాగించాలని కోరినప్పటికీ, అది ఒక రాజకీయ పార్టీగానే కొనసాగుతూ వచ్చింది. స్వాతంత్య్రానంతర దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ క్రియాశీల పాత్ర ఎంతఘనమైనదంటే, చాలా తరుచుగా భారతదేశాన్ని ఏక పార్టీ ఆధిపత్య వ్యవస్థగా అభివర్ణించడం జరిగింది. ఈ పార్టీ సర్వసమ్మత పార్టీగా, అందరి సమీకృత ప్రయోజనాలే తన వ్యూహంగా పేర్కొన్నది. భారతీయ సమాజానికి ప్రతిరూపంగా కాంగ్రెస్ పార్టీ జాతి ఆవశ్యక లక్షణాలన్నింటిని తనలో ప్రతిబింబించింది.

జాతీయోద్యమ స్థాయి నుండి ఒక రాజకీయ పార్టీగా మారడంతో, కాంగ్రెస్, పార్టీ బ్రహ్మాండమైన సంస్థగా ఉంటూ విభిన్న అభిప్రాయాలు గల పలు సమూహాలను తనలో ఇముడ్చుకోగలిగింది. స్వాతంత్య్రానంతరం జరిగిన 15 సాధారణ ఎన్నికల్లో, కాంగ్రెస్ పార్టీ ఆరుసార్లు ఎన్నికల్లో స్పష్టమైన మెజారిటీ సాధించింది. నాలుగు సార్లు అధికార సంకీర్ణానికి నాయకత్వం వహించింది. మొత్తం దాదాపు 49 సంవత్సరాల పాటు కేంద్రప్రభుత్వానికి నాయకత్వం వహించింది. దీనిలో ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ మొదలుకొని (1947 – 64), ఇటీవలి మన్మోహన్ సింగ్ |(2004-14) వరకు ఏడుగురు కాంగ్రెస్ ప్రధాన మంత్రులు దేశాన్ని పాలించారు. 2004 నుండి 2014 వరకు కాంగ్రెస్ నాయకత్వంలోని ఐక్య ప్రగతిశీల కూటమి (United Progressive Alliance – UPA) మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఎన్నో ప్రాంతీయ పార్టీల సంకీర్ణంగా ప్రభుత్వాన్ని ఏర్పరచింది. 2014లో జరిగిన పదహారవ సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్వాతంత్య్రానంతరం మొదటిసారిగా హీనమైన ఓటమిని చవిచూచి, 543 మంది గల లోక్సభలో 44 స్థానాలకు పరిమితమైంది.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
రాజకీయ పార్టీ అనగానేమి ? దాని లక్షణాలను, విధులను వివరించండి. [Mar. ’16]
జవాబు:
రాజకీయ పార్టీ అర్థం: రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్యం సజీవంగా ఉండడానికి రక్తప్రసరణవలే పనిచేస్తాయి. అవి ప్రజాభిప్రాయాన్ని తీర్చిదిద్ది, వ్యక్తిగత అభిప్రాయాల ఫలితంగా ఏర్పడే సందిగ్ధత నుండి ప్రజాభిప్రాయాన్ని ఏర్పరుస్తాయి. ప్రజాభిప్రాయాన్ని పటిష్టంగా రూపొందించడంలో, పెంపొందించడంలో రాజకీయపార్టీలు ప్రధాన సాధనాల వలే పనిచేస్తాయి. విధాన రూపకర్తలనకు, పౌరులకు మధ్య రాజకీయ పార్టీలు మధ్యవర్తుల వలే పనిచేస్తాయి.

AP Inter 2nd Year Civics Study Material Chapter 12 రాజకీయ పార్టీలు

రాజకీయ పార్టీ లక్షణాలు: రాజకీయ పార్టీకి ఈ దిగువ సూచించిన ముఖ్య లక్షణాలు ఉంటాయి.

  1. రాజకీయపార్టీ ఉమ్మడి ప్రయోజనాలు, ఒకేరకమైన విలువలు కలిగి ఉండే వ్యక్తుల సమూహంగా ఉంటుంది.
  2. రాజకీయపార్టీ తన స్వీయ రాజకీయ భావజాలాన్ని, కార్యక్రమాన్ని కలిగి ఉంటుంది.
  3. రాజ్యాంగపార్టీ సాధనాలతో ఎన్నికల ద్వారా మాత్రమే అధికారాన్ని చేజిక్కించుకోవడానికి ప్రయత్నిస్తుంది.
  4. జాతీయ ప్రయోజనాలను, జాతీయ, సంక్షేమాన్ని పెంపొందించడానికి రాజకీయ పార్టీ ప్రయత్నిస్తుంది.

రాజకీయపార్టీల విధులు:

  1. సామాజిక ప్రయోజనాల సమీకరణ, వ్యక్తీకరణ
  2. రాజకీయ భర్తీ
  3. ప్రజాభిప్రాయ సాధనాలు
  4. రాజకీయ సామాజికీకరణ, పౌరుల భాగస్వామ్యాన్ని పెంపొందించటం
  5. శాసనాల తయారీ
  6. ప్రతిపక్ష పాత్ర
  7. ప్రభుత్వ యంత్రాంగం, సంక్షేమ పథకాల అందుబాటు
  8. రాజకీయ వ్యవస్థకు న్యాయబద్ధతను చేకూర్చటం

ప్రశ్న 2.
పార్టీల వ్యవస్థ గురించి నీకేమి తెలియును ? పార్టీల వ్యవస్థ రకాలపై ఒక సంక్షిప్త సమాధానం వ్రాయండి.
జవాబు:
పార్టీల వ్యవస్థ అనేది సంక్లిష్ట సాంఘిక రాజకీయ ప్రక్రియలు, వ్యక్తిగత నాయకులు, సాంఘిక సంస్థలు, రాజకీయ సమూహాలు, సంస్థలు వాటిమధ్య పరస్పర చర్యలు, అంతర్గత సంబంధాలు మొదలైన వాటి సమాహారంగా పేర్కొనవచ్చు. ఈ చర్య – ప్రతిచర్యల రీతులు రాజ్యాంగాలు, శాసనాలు, నియమనిబంధనలు, సంస్థలు మొదలైన వాటి ఆధారంగా జరుగుతాయి. అలాగే ఒక సమాజంలో, రాజకీయ వ్యవస్థలో ఉండే రాజకీయ ఆలోచనలు, ప్రవర్తనలు కూడా వీటిని నిర్దేశిస్తాయి. ఈ విధమైన పరస్పర సంబంధాలు రాజకీయ భావజాలాల్లో, నాయకుల్లో, పార్టీ నిర్మాణంలో, పార్టీల్లో ఏర్పడే చీలికలలో, పార్టీ మద్దతు, నిరసన రీతుల్లో, ఓటర్ల సమీకరణలో, ఎన్నికల్లో జరిగే పోటీల్లో, ఇలా అనేక అంశాల్లో ప్రతిబింబిస్తుంది. భారతదేశం వంటి బహుళ సంస్కృతి సమాజంలో వివిధ స్థాయిల్లో అంటే జాతీయ, ప్రాంతీయ, ఉపప్రాంతీయ, గ్రామీణ – పట్టణ స్థాయిల్లో పార్టీల మధ్య సంకీర్ణాల నిర్మాణం జరుగుతుంది. పార్టీలు భారత రాజకీయాల్లో ఇతర ప్రధాన ప్రజాస్వామ్యాల్లో వలే కేంద్రస్థానాన్ని పొందుతాయి.

పార్టీల వ్యవస్థ – రకాలు: పార్టీల వ్యవస్థ మూడు రకాలు. అవి: 1) ఏక పార్టీ వ్యవస్థ 2) రెండు పార్టీల వ్యవస్థ 3) బహుళ పార్టీ వ్యవస్థ.
1) ఏక పార్టీ వ్యవస్థ: ఏక పార్టీ వ్యవస్థలో ఒకే ఒక రాజకీయపార్టీ మనుగడలో ఉంటుంది. ఇతర రాజకీయపార్టీలు పనిచేయడానికి అనుమతి ఉండదు. ఒకే రాజకీయపార్టీలో అసంతృప్తులు, వర్గాలు ఉండవచ్చు. ఉదాహరణకు జర్మనీలో నాజీ పార్టీ, ఇటలీలో ఫాసిస్టు పార్టీ, చైనాలో – పూర్వపు సోవియట్ యూనియన్ కమ్యూనిస్టు పార్టీలను ఏకపార్టీ వ్యవస్థగా పేర్కొనవచ్చు.

2) రెండు పార్టీల వ్యవస్థ: రెండు పార్టీల వ్యవస్థలో రాజకీయ వ్యవస్థ రెండు ప్రధాన రాజకీయ పార్టీలు ఆధారంగా పనిచేస్తుంది. వీటిలో ఒకటి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే, మరొకటి ప్రతిపక్ష పార్టీగా విధులు నిర్వహిస్తుంది. ఈ తరహా వ్యవస్థలో రాజకీయ అధికారం రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్య పరస్పర ప్రత్యామ్నాయంగా పనిచేస్తాయి. ఇంగ్లాండ్ (యు.కె)లోని లేబర్ పార్టీ, కన్సర్వేటివ్ పార్టీలు, అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని (USA) రిపబ్లికన్, డెమొక్రటిక్ పార్టీలు వీటికి ఉదాహరణలుగా చెప్పవచ్చు.

3) బహుళ పార్టీ వ్యవస్థ: ఈ తరహా వ్యవస్థలో రెండు పార్టీల కంటే ఎక్కువ పార్టీలు ఉంటాయి. అయితే వాస్తవంలో అవి అధికార పార్టీకిగానీ, ప్రతిపక్ష పార్టీకి గానీ స్నేహబంధంతో ఉంటాయి. ఈ విధమైన బహుళ పార్టీ వ్యవస్థ భారతదేశం, ఫ్రాన్స్, స్వీడన్, నార్వే తదితర దేశాల్లో వాడుకలో ఉంది.

ప్రశ్న 3.
భారతీయ పార్టీ వ్యవస్థ లక్షణాలను సంక్షిప్తంగా వ్రాయండి.
జవాబు:
భారతదేశంలో పార్టీ వ్యవస్థ లక్షణాలు:

  1. బహుళ పార్టీ వ్యవస్థ: భారతదేశంలో బహుళ సంఖ్యలో పార్టీలున్నాయి. ప్రస్తుతం దేశంలో 6 జాతీయ పార్టీలు, 64 రాష్ట్రస్థాయి పార్టీలున్నాయి.
  2. ఏకపార్టీ ఆధిపత్య వ్యవస్థ భారతదేశ రాజకీయ రంగంలో సుదీర్ఘకాలంపాటు కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యంతో కొనసాగింది.
  3. స్పష్టమైన భావజాలం లేకపోవటం: BJP, CPI, CPI (M) మినహా మిగిలిన పార్టీలకు స్పష్టమైన సిద్ధాంత భావజాలం లేదు.
  4. వ్యక్తిపూజ: చాలా తరచుగా భారతదేశంలో రాజకీయ పార్టీలు గొప్ప నాయకుని చుట్టూ వ్యవస్థీకృతమై ఉంటాయి.
  5. సాంప్రదాయక అంశాలు: భారతదేశంలో అనేక పార్టీలు మతం, కులం, భాష, సంస్కృతి, తెగ తదితర |అంశాల ప్రాతిపదికగా ఏర్పడతాయి.
  6. ప్రాంతీయ పార్టీల అవతరణ: భారత రాజకీయ వ్యవస్థలో పెద్ద సంఖ్యలో ప్రాంతీయ పార్టీలు అవతరించటానికి ప్రధాన లక్షణంగా చెప్పవచ్చు..
  7. చీలికలు, ఫిరాయింపులు: వర్గపోరు, ఫిరాయింపులు, చీలికలు, విలీనాలు, విచ్ఛిన్నాలు, సమీకరణాలు భారతదేశ రాజకీయ పార్టీల కార్యాచరణలో ప్రధాన అంశాలుగా కొనసాగుతున్నాయి.
  8. సమర్థవంతమైన ప్రతిపక్షం లేకపోవటం: భారతదేశ రాజకీయ వ్యవస్థలో సమర్థవంతమైన ప్రతిపక్షం |లేకపోవటం ఒక ప్రధాన లోపంగా గోచరిస్తుంది.

AP Inter 2nd Year Civics Study Material Chapter 12 రాజకీయ పార్టీలు

ప్రశ్న 4.
భారతదేశంలో కాంగ్రెస్ పార్టీపై సంక్షిప్త సమాధానం వ్రాయండి.
జవాబు:
భారత జాతీయ కాంగ్రెస్ మన దేశంలో అతి ప్రాచీన పార్టీ. దీనిని 1885 డిశంబరు 28వ తేదీన బ్రిటిష్ సివిల్ సర్వెంట్. A.O. హ్యూమ్ స్థాపించాడు.

భారత జాతీయ కాంగ్రెస్ ఆసియా – ఆఫ్రికా ఖండాల్లో బాగా విజయవంతమైన జాతీయోద్యమాల్లో ఒక దానిని నిర్వహించింది. స్వాతంత్ర్యం సాధించిన తరువాత, దేశాన్ని పరిపాలించే బాధ్యతను కాంగ్రెస్ స్వీకరించింది. స్వతంత్ర భారతదేశంలో రెండు దశాబ్దాల పాటు పూర్తి స్థాయి రాజకీయ ఆధిపత్యాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రదర్శించింది. 1960వ దశకం చివరిభాగంలో కాంగ్రెస్ పార్టీ మొదటిసారిగా చీలిపోయింది. దాంతో కమ్యూనిస్టేతర పార్టీలు, కాంగ్రెస్ (ఒ)లు సంయుక్తంగా శ్రీమతి ఇందిరాగాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ (ఆర్)ను అధికారం నుండి తొలగించడానికి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. 1972లో జరిగిన ఎన్నికలలో శ్రీమతి ఇందిరాగాంధీ పూర్తి మెజారిటీ సాధించి తిరిగి అధికారంలోనికి వచ్చింది. అయితే కాంగ్రెస్ పార్టీ అనుసరించిన కొన్ని విధానాల వలన క్రమేణా దాని జనాకర్షణ తగ్గిపోయింది. దీంతో 1977లో పార్లమెంటుకు జరిగిన ఎన్నికల్లో చారిత్రాత్మక కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటిసారిగా ఓటమిని చవిచూచి, ప్రతిపక్షపార్టీ స్థాయికి దిగజారిపోయింది.

స్వాతంత్య్రానంతరం జరిగిన గత 15 సాధారణ ఎన్నికల్లో, కాంగ్రెస్ పార్టీ ఆరుసార్లు ఎన్నికల్లో స్పష్టమైన మెజారిటీ సాధించింది. నాలుగుసార్లు అధికార సంకీర్ణానికి నాయకత్వం వహించింది. మొత్తం దాదాపు 49 సంవత్సరాలపాటు కేంద్ర ప్రభుత్వానికి నాయకత్వం వహించింది. దీనిలో ప్రధాని జవహర్లాల్ నెహ్రూ మొదలుకొని (1947-64), ఇటీవలి మన్మోహన్ సింగ్ (2004-14) వరకు ఏడుగురు కాంగ్రెస్ ప్రధాన మంత్రులు దేశాన్ని పాలించారు. 2004 నుండి 2014 వరకు కాంగ్రెస్ నాయకత్వంలోని ఐక్య ప్రగతిశీల కూటమి (United Progres- sive Alliance – UPA) మన్మోహన్సంగ్ ప్రధానమంత్రిగా ఎన్నో ప్రాంతీయపార్టీలు సంకీర్ణంగా ప్రభుత్వాన్ని ఏర్పరచింది. 2014లో జరిగిన పదహారవ సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్వాతంత్య్రానంతరం మొదటిసారిగా హీనమైన ఓటమిని చివిచూచి, 543 మంది గల లోక్సభలో 44 స్థానాలకు పరిమితమైంది.

ప్రశ్న 5.
భారతీయ జనతా పార్టీ గురించి సంక్షిప్తంగా వివరించండి.
జవాబు:
భారతీయ జనతా పార్టీ (బిజెపి) ని 1980లో స్థాపించారు. భారతీయ జనతా పార్టీ 1951 అక్టోబర్ 21న శ్యాంప్రసాద్ ముఖర్జీ అధ్యక్షతన స్థాపించిన భారతీయ జనసంఘక్కు ఒక నూతన, సవరించిన స్వరూపంగా పేర్కొనవచ్చు. భారతీయ జనతా పార్టీ తన పూర్వపు జనసంఘ్్కు కొనసాగింపుగా క్రమశిక్షణ – చక్కని వ్యవస్థీకృత యంత్రాంగం, సంప్రదాయ హిందూ సాంఘిక – సాంస్కృతిక సంస్థలైన రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ (ఆర్ ఎస్ ఎస్), విశ్వహిందూ పరిషత్(వి హెచ్ పి) తదితర సంస్థలతో అనుబంధాన్ని కొనసాగిస్తూ వచ్చింది. ఏవో కొన్ని రాజకీయ దృక్పథాలు, విధాన స్వభావాలలో వైవిధ్యాలు మినహా, బిజెపికి తన పూర్వపు జనసంఘ్ ఎంతో సామీప్య అనుబంధం ఉంది.

జనసంఘ్ తన అస్థిత్వాన్ని రద్దు చేసుకొని, 1977 మే ఒకటో తేదీన జనతా పార్టీలో విలీనమైంది. అయితే కొంతకాలం తరువాత జనతాపార్టీలో చీలిక రావడంతో, పూర్వపు జనసంఘ్ నాయకులు, సభ్యులు కొద్దిమందితో కలిసి జనతా పార్టీని విడిచిపెట్టి, భారతీయ జనతా పార్టీ పేరుతో కొనసాగుతున్నారు.

ప్రశ్న 6.
భారతదేశంలో ప్రాంతీయ పార్టీల ప్రాధాన్యతను అంచనా వేయండి. [Mar. 17]
జవాబు:
అనేక ప్రాంతీయ పార్టీలు గణనీయమైన ప్రజా ఎన్నికల మద్దతుతో ముఖ్య రాజకీయ సంస్థలుగా సుస్థిరంగా కొనసాగుతున్నాయి. భారతదేశ సమాఖ్య ప్రజాస్వామిక రాజకీయ వ్యవస్థలో ప్రాంతీయపార్టీలు, స్థానిక పార్టీలు ఎంతో ఆవశ్యకంగా కొనసాగుతున్నాయి. ప్రధానంగా కొన్ని ఆధిపత్య, సాంఘిక, ఆర్థిక ప్రయోజనాల కోసం ఇవి తప్పనిసరి అవుతాయి. రాజకీయపార్టీలలో విస్తృతస్థాయి పాత్ర విషయంలో చాలా పార్టీలకు ప్రయోజిత వర్గాలు, ప్రభావ వర్గాల వలె సమరూప లక్షణాలు ఉంటాయి. జాతీయపార్టీలు నడిపే విస్తృత పాత్ర నేపథ్యంలో ప్రాంతీయపార్టీల ప్రభావం కొన్నిసార్లు ప్రభావవంతంగా, మరికొన్నిసార్లు బలహీనంగా ఉంటుంది. అనేక ప్రాంతీయపార్టీలు రాష్ట్ర ప్రభుత్వాల ఏర్పాటులో జాతీయపార్టీలకు సంకీర్ణ భాగస్వాములయ్యాయి. కొన్ని ప్రాంతీయ పార్టీలు స్థిరంగా ఉండి, కొన్ని రాష్ట్రాల్లో ప్రధాన రాజకీయ సంస్థలుగా పనిచేస్తున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా, పెరుగుతున్న ప్రాంతీయ పార్టీల మనుగడ నిస్సందేహంగా, భారతదేశంలో ఒక విశిష్ట రాజకీయ పరిణామానికి చెందిన అంశంగా పేర్కొనవచ్చు.

ప్రశ్న 7.
ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీపై ఒక సంక్షిప్త సమాధానం వ్రాయండి.
జవాబు:
1983వ సంవత్సరములో ఆకస్మాత్తుగా రాష్ట్ర రాజకీయ చిత్రపటంలో గణనీయమైన మార్పు వచ్చింది.
ఎన్.టి.రామారావు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ నూతన ప్రాంతీయ రాజకీయపార్టీగా ఆవిర్భవించింది. అప్పటికే కలతలతో, ముఠాలతో విడిపోయి ఉన్న కాంగ్రెస్ పార్టీని ఎన్నికల్లో మట్టి కరిపించింది. ఎన్. టి. రామారావు తెలుగు చలనచిత్ర రంగంలో ప్రఖ్యాత కథానాయకునిగా ఎంతో పేరు ప్రతిష్టలు గడించాడు. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఒక వేగుచుక్కవలె దూసుకురావడానికి ఎన్నో అంశాలు తోడ్పడ్డాయి. కాంగ్రెస్ పార్టీ ఎంతోకాలం అధికారంలో ఉండి అసమర్థతతో వ్యవహరించడంతో సామాన్య ప్రజల విశ్వసనీయతను కోల్పోయింది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను సరిగా నిర్వహించలేకపోవడం, ద్రవ్యోల్బణం, పెరుగుతున్న నిరుద్యోగాన్ని పట్టించుకోకపోవడం, పరిపాలన వ్యవస్థలో అన్ని స్థాయిల్లో అవినీతి వంటి అంశాలు ఆ పార్టీ పతనానికి దారితీసాయి. దీనికితోడు, తరచుగా ముఖ్యమంత్రుల మార్పుతో రాష్ట్రంలో నాయకత్వ శూన్యత ఏర్పడింది. ముఖ్యమంత్రులు, రాష్ట్ర మంత్రిమండలి కాంగ్రెస్ అధినాయకత్వం చేతిలో ఆట బొమ్మలుగా మారారు. దాంతో జాతీయ స్థాయిలో రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించి, ప్రాతినిధ్యం వహించే సామర్థ్యం రాష్ట్ర కాంగ్రెస్ నాయకులలో లేదనే అభిప్రాయం ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. ఆంధ్రుల ఆత్మగౌరవం దెబ్బతిందనే విషయాన్ని తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారంలో చాటి చెప్పింది.

AP Inter 2nd Year Civics Study Material Chapter 12 రాజకీయ పార్టీలు

2014లో జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 14వ శాసనసభ ఎన్నికలలో ఆ పార్టీ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో 174 స్థానాలకు 102 స్థానాలు సాధించి ప్రభుత్వాన్ని ఏర్పరచింది. శ్రీనారా చంద్రబాబునాయుడు విభజించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి అయ్యాడు.

ప్రశ్న 8.
తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అవతరణకు తోడ్పడిన పరిస్థితులను అంచనా వేయండి.
జవాబు:
ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షలు ప్రజల్లో సజీవంగా ఉన్నప్పటికీ, వాటిని నెరవేర్చే రీతిలో తీవ్రస్థాయిలో పోరాటం చేసే వేదిక అవతరించడానికి ఎంతో సమయం పట్టింది. 1990 దశకం మధ్యభాగంలో అనేక ప్రజాసంఘాలు, సంస్థలు ప్రత్యేక రాష్ట్ర అంశంపై సమావేశాలు ఏర్పాటు చేయడం మొదలుపెట్టాయి.

ఇదే తరుణంలో తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడు, మాజీమంత్రి డిప్యూటీ స్పీకర్గా ఉన్న సిద్దిపేట శాసనసభ్యుడు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్రావు, ఆనాడు నారా చంద్రబాబునాయుడు పెంచిన విద్యుత్ బిల్లులకు వ్యతిరేకంగా ఒక బహిరంగ లేఖ రాసినాడు. దానిలో పెంచిన విద్యుత్ బిల్లుల వలన తెలంగాణా ప్రాంత ప్రజలు, రైతులకు 80% తీవ్ర అన్యాయం జరుగుతుందని ఎదురు తిరుగుబాటుచేసి తెలంగాణావాదులకు కేంద్ర బిందువుగా మారినాడు. తెలంగాణావాదులు మేధావులు అందరూ తెలంగాణాకు జరుగుతున్న వివక్ష గురించి వివరించటం జరిగింది. దీనితో తెలంగాణా బలం గ్రహించిన కె.సి.ఆర్, కొన్ని వందల గంటలపాటు వివిధ వర్గాల వారితో చర్చించి తెలంగాణా రాష్ట్రమే ఏకైక ఎజెండాగా T.R.S. పార్టీ ఆవిర్భావానికి పునాది వేసినాడు.

కల్వకుంట్ల చంద్రశేఖరరావు (KCR) తెలంగాణ రాష్ట్ర సాధన అంశంపై 2000 సంవత్సరం మొదట్లో తన ప్రయత్నాలను ప్రారంభించాడు. 2001 మే నెల 17వ తేదీన కె. చంద్రశేఖరరావు తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటుచేసుకున్నట్లు ప్రకటించాడు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ మద్ధతును కె. చంద్రశేఖరరావు పొందాడు. 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో టి.ఆర్.ఎస్ (TRS) పార్టీ భారత జాతీయ కాంగ్రెస్తో మైత్రి ఏర్పరచుకొని తెలంగాణలో 26 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించడమే కాక, జాతీయ స్థాయిలో 5 పార్లమెంటు స్థానాల్లో విజయం పొందింది. అలాగే రాష్ట్రస్థాయిలో, కేంద్రంలో టి.ఆర్.ఎస్. (TRS) పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వంతో చేరింది. 2006 సెప్టెంబర్ నెలలో టి.ఆర్.ఎస్ (TRS) పార్టీ కేంద్ర ప్రభుత్వం నుండి వైదొలిగింది. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు విషయంలో ఎన్నికల వాగ్దానానికి అనుగుణంగా కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకోలేకపోవడాన్ని కారణంగా చూపి కేంద్రప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంది.

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
రాజకీయ పార్టీ విధులు. [Mar. ’17]
జవాబు:
రాజకీయ పార్టీ విధులు:

  1. సామాజిక ప్రయోజనాల సమీకరణ, వ్యక్తీకరణ,
  2. రాజకీయ భర్తీ బాధ్యతలు,
  3. ప్రజాభిప్రాయ సాధనాలుగా పనిచేయడం,
  4. రాజకీయ సామాజికీకరణ, పౌరుల భాగస్వామ్యాన్ని పెంపొందించటం.
  5. శాసనాలను రూపొందించటం,
  6. ప్రతిపక్ష పాత్రను పోషించటం,
  7. ప్రభుత్వ యంత్రాంగం, సంక్షేమ పథకాలను అమలుచేయటం,
  8. రాజకీయ వ్యవస్థకు న్యాయబద్ధతను చేకూర్చటం మొదలగునవి.

ప్రశ్న 2.
పార్టీ వ్యవస్థ రకాలు.
జవాబు:
పార్టీ వ్యవస్థను ముడు రకాలుగా పేర్కొంటారు. అవి:
1) ఏకపార్టీ వ్యవస్థ: ఈ వ్యవస్థలో ఒకే రాజకీయ పార్టీ ఉంటుంది.
ఉదా: జర్మనీలో నాజీ పార్టీ, ఇటలీలో ఫాసిస్ట్ పార్టీ.

2) రెండు పార్టీల వ్యవస్థ: ఈ వ్యవస్థలో రెండు రాజకీయ పార్టీలుంటాయి. ఉదా: ఇంగ్లాండులో లేబర్ పార్టీ మరియు కన్సర్వేటివ్ పార్టీలు.

3) బహుళ పార్టీ వ్యవస్థ: ఈ వ్యవస్థలో ఎక్కువ పార్టీలు ఉంటాయి. ఉదా: భారతదేశం, ఫ్రాన్స్

AP Inter 2nd Year Civics Study Material Chapter 12 రాజకీయ పార్టీలు

ప్రశ్న 3.
జాతీయ పార్టీలు.
జవాబు:
జాతీయ స్థాయిలో దేశమంతటా విస్తరించి జాతీయ అజెండాను రూపొందించుకొని రాజ్యాంగ పద్ధతుల ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు నిరంతరం కృషిచేసే ప్రజల స్వచ్ఛంద సంస్థ లేదా సమూహాన్ని జాతీయ పార్టీగా పేర్కొంటారు.
ఉదా: భారతదేశంలో కాంగ్రెస్, జనతాపార్టీ, భారత కమ్యూనిస్టు పార్టీ, భారతీయ జనతా పార్టీ మొదలగునవి.

ప్రశ్న 4.
ప్రాంతీయ పార్టీలు. [Mar. ’16]
జవాబు:
ప్రాంతీయ పార్టీలు భౌగోళిక, రాజకీయ, హేతుబద్ధమైన అంశాల ప్రాతిపదికగా అవతరిస్తాయి. సమాఖ్య వ్యవస్థలో జాతీయ పార్టీల నాయకుల ఆధిపత్య, సిరంకుశ ధోరణి, ప్రాంతీయ, రాష్ట్ర సమస్యలను నిర్లక్ష్యం చేయటం. రాష్ట్రస్థాయి నాయకశ్రేణిని అగౌరవపరచటం, అవమానించటం తదితర కారణాలు ప్రాంతీయ పార్టీల ఆవిర్భావానికి ముఖ్య కారణాలుగా చెప్పవచ్చు. ప్రాంతీయ పార్టీలు ఒక రాష్ట్రానికి పరిమితంగా తమ కార్యకలాపాలను కొనసాగిస్తాయి.
ఉదా: తెలుగుదేశం, తెలంగాణ రాష్ట్ర సమితి, ద్రవిడ మున్నేట్ర కజగం, ఆల్ ఇండియా అన్నా డి.ఎం.కె. మొదలగునవి.

ప్రశ్న 5.
డి.ఎం.కె.
జవాబు:
1949 వ సంవత్సరంలో సి. ఎస్. అన్నాదురై దాదాపు నాలుగింట మూడొంతులు అనుచర గణంతో ద్రవిడ కజగం నుండి వేరుపడి ద్రవిడ మున్నేట్ర కజగం (డి.ఎం.కె) అనే పార్టీని స్థాపించాడు. ఈ రాజకీయ పార్టీ తమిళుల గుర్తింపుపై దృష్టి నిలిపి, పార్టీ మౌళిక భావన అయిన బ్రాహ్మణ వ్యతిరేక వాదాన్ని చేపట్టింది. తరువాత ఎన్నికలలో క్రియాశీలంగా పాల్గొని తమిళనాడు రాష్ట్ర విధానసభలో బలీయమైన శక్తిగా అవతరించింది.

ప్రశ్న 6.
ఎ.ఐ.ఎ.డి.ఎం.కె.
జవాబు:
1972వ సంవత్సరంలో ఎం.జి. రామచంద్రన్ నాయకత్వంలో ఏర్పడిన అన్నా డి.ఎం.కె. పార్టీ తరువాత ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగంగా రూపాంతరం చెందింది. 1988వ సంవత్సరములో ఎం.జి. రామచంద్రన్ మరణం తరువాత ఎ.ఐ.ఎ.డి.ఎం.కె. పార్టీ జయలలిత నాయకత్వంలో బలపడి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పలుమార్లు ఘనవిజయం సాధించింది. నేడు ఆ పార్టీ నాయకురాలు కుమారి జయలలిత తమిళనాడు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు.

ప్రశ్న 7.
ఏకపార్టీ ఆధిపత్యం.
జవాబు:
స్వాతంత్ర్యానంతరం దేశరాజకీయాలలో కాంగ్రెస్ పార్టీ క్రియాశీల పాత్ర పోషించటంతో తరుచుగా భారతదేశాన్ని ఏకపార్టీ ఆధిపత్యం వ్యవస్థగా అభివర్ణించటం జరిగింది. ఈ పార్టీ సర్వసమ్మత పార్టీగా, అందరి సమీకృత ప్రయోజనాలే ముఖ్యంగా, భారతీయ సమాజానికి ప్రతిరూపంగా కాంగ్రెస్ పార్టీ జాతి ఆవశ్యక లక్షణాలన్నింటిని తనలో ప్రతిబింబించింది. అయితే కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం సంపూర్ణం కాదని కొద్దిమంది రాజకీయ విశ్లేషకులు పేర్కొంటారు.

ప్రశ్న 8.
బహుళ పార్టీ వ్యవస్థ. [Mar. ’16]
జవాబు:
దాదాపు ఒక భౌగోళిక ఖండం పరిమాణంలో విస్తరించిన దేశం. భిన్నభిన్న సంస్కృతుల స్వభావం, వయోజన ఓటుహక్కు విచిత్ర తరహా రాజకీయ ప్రక్రియ తదితర కారణాలు భారతదేశంలో బహుళ పార్టీ వ్యవస్థకు దారితీసినాయి. ప్రస్తుతం మన దేశంలో 6 జాతీయ పార్టీలు, 64 రాష్ట్రస్థాయి పార్టీలు, 1737 రిజిష్టర్ అయి గుర్తింపులేని పార్టీలు మన దేశంలో ఉన్నాయి.

AP Inter 2nd Year Civics Study Material Chapter 12 రాజకీయ పార్టీలు

ప్రశ్న 9.
బహుజన సమాజ్ పార్టీ.
జవాబు:
బహుజన సమాజ్ పార్టీ దళితులు ఆధిపత్యం కలిగిన పార్టీ. ఈ పార్టీ ఉద్యోగుల సమాఖ్య, దళిత్ శోషిత్ సమాజ్ సమితిల వీలినం ఫలితంగా ఏర్పడింది. కాన్షీరాం ఈ పార్టీ వ్యవస్థాపక నాయకుడు. మాయావతి ప్రస్తుతం ఈ పార్టీకి నాయకురాలుగా వ్యవహరిస్తున్నారు. ఈ పార్టీ భారత రాజకీయ వ్యవస్థలో జాతీయ పార్టీగా గుర్తింపు పొందింది. మాయావతి నాయకత్వంలో ఆ పార్టీ జనాకర్షణ క్రమేణా పెరుగుతూ వచ్చింది.

ప్రశ్న 10.
నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ.
జవాబు:
కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ అయిన శరద్ పవార్, పి.ఎ. సంగ్మా, తారిక్ అన్వర్ తదితరులు స్థాపించిన పార్టీయే నేషనలిస్ట్ కాంగ్రెస్. ఈ పార్టీ స్థాపన సమయంలో ఇండియన్ కాంగ్రెస్ (సోషలిస్ట్)ను తనలో విలీనం చేసుకుంది. భారత ఎన్నికల సంఘం నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీనీ జాతీయ పార్టీగా గుర్తించింది. మహారాష్ట్ర, మణిపూర్, మేఘాలయ మొదలగు రాష్ట్రాలలో ఈ పార్టీకి చెప్పుకోదగ్గ బలముంది.