AP Inter 2nd Year Civics Study Material Chapter 13 ఆంధ్రప్రదేశ్, ఇండియాలలో ఇటీవలి పరిణామాలు

Andhra Pradesh BIEAP AP Inter 2nd Year Civics Study Material 13th Lesson ఆంధ్రప్రదేశ్, ఇండియాలలో ఇటీవలి పరిణామాలు Textbook Questions and Answers.

AP Inter 2nd Year Civics Study Material 13th Lesson ఆంధ్రప్రదేశ్, ఇండియాలలో ఇటీవలి పరిణామాలు

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆవిర్భావాన్ని వర్ణించండి.
జవాబు:
ఆంధ్రులంతా ఒక్క రాష్ట్రంగా ఏర్పడాలన్న భావన కొత్తదేమీ కాదు. 1938లో ఉస్మానియా విశ్వవిద్యాలయ స్నాతకోపన్యాసానికి ఆహ్వానితుడై వచ్చిన సర్ కట్టమంచి రామలింగారెడ్డి గారు తెలుగు మాట్లాడే ప్రజలంతా ఒక్క రాష్ట్రంలో మనుగడ సాగించే పరిస్థితులేర్పడితే బాగుంటుందని ప్రస్తావించారు. ఆ తరువాత ఆచార్య మామిడిపూడి వెంకటరంగయ్య గారు ఒక రచనలో మద్రాసు ఆంధ్రులూ, నిజాం ఆంధ్రులూ ఒక్కటై బాధ్యతాయుత పాలన ఏర్పరిస్తే బాగుంటుందని అభిప్రాయపడినారు.

1) కమ్యూనిస్టు పార్టీ పాత్ర: ఈ భావాలకు వ్యక్తరూపాన్నిచ్చిన ఘనత ఆంధ్ర కమ్యూనిస్టులది. 1946లోనే విశాలాంధ్ర వాదాన్ని పైకి తెచ్చింది ఆంధ్ర కమ్యూనిస్టు పార్టీయే. 1952లో జరిగిన సాధారణ ఎన్నికల్లో అటు ఆంధ్రలోనూ, ఇటు తెలంగాణలోనూ కమ్యూనిస్టులు ఘనవిజయం సాధించారు. వారి ఎన్నికల నినాదంలో విశాలాంధ్ర కూడా ఒక. అంశం వారు ప్రత్యేకంగా “విశాలాంధ్ర” పత్రికను నడిపి ప్రజల్లో ముమ్మరమైన ప్రచారం కూడా చేశారు. 1953లో అక్టోబర్ మొదటి తేదీనాడు ఆంధ్ర రాష్ట్ర అవతరణ జరగటంతో ఇటు ఆంధ్ర ప్రాంతంలోనూ, అటు తెలంగాణా ప్రాంతంలోనూ విశాలాంధ్ర స్థాపన దిశగా రాజకీయాలు నడిచాయి.

2) ప్రధమ విశాలాంధ్ర మహాసభ: 1949 నవంబరు, 26న శ్రీ అయ్యదేవర కాళేశ్వరరావు నాయకత్వంలో విజయవాడలో విశాలాంధ్ర మహాసభ జరిగెను.

3) రెండవ విశాలాంధ్ర మహాసభ: 1954 జూన్ 13, 14 తేదీలలో శ్రీశ్రీ అధ్యక్షతన రెండవ విశాలాంధ్ర మహాసభ హైదరాబాద్లో జరిగెను.

4) ఫజల్ అలీ కమీషన్: ప్రత్యేకాంధ్ర రాష్ట్రం ఏర్పాటు కావడంతో కేరళులు, కర్ణాటకులు ప్రత్యేక రాష్ట్రాలు కావాలని అందోళన చేయసాగారు. వారి జతకు మహారాష్ట్రులు కూడా కలిశారు. దక్షిణ భారతంలో కాంగ్రెస్ పార్టీ నిలబడాలంటే భాషా ప్రాతిపదికన రాష్ట్రాల నిర్మాణం అనివార్యమని ప్రధానమంత్రి నెహ్రూకు ఎన్.వి. గాద్గిల్ సలహా ఇచ్చారు. ఈ నేపధ్యంలో 22 డిసెంబర్ 1953 నాడు ఫజల్ ఆలీ నేతృత్వంలో రాష్ట్రాల పునర్నిర్మాణ సంఘాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ కమీషన్లో ఇతర సభ్యులు పండిట్ హృదయనాధ కుంజూ, సర్దార్ కె.ఎం.ఫణిక్కర్, కమిటీ తన నివేదికను 30 సెప్టెంబర్ 1955 నాడు కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది.

AP Inter 2nd Year Civics Study Material Chapter 13 ఆంధ్రప్రదేశ్, ఇండియాలలో ఇటీవలి పరిణామాలు

ఈ నివేదికలో విశాలాంధ్రను ఏర్పాటు చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను, ఆ విధంగానే ప్రత్యేక తెలంగాణా ఏర్పాటుకు అనుకూల వాదాలను కూడా కూలంకుషంగా పరిశీలించింది. సదరు అనుకూల ప్రతికూల వాదాలను ప్రస్తావించి పూర్వం ఆంధ్ర, రాయలసీమ నాయకుల మధ్య శ్రీ భాగ్ ఒప్పందం లాంటిది కుదుర్చుకొని, తెలంగాణ ప్రాంతం అభివృద్ధికి గానీ, ఉద్యోగావకాశాలకు హాని కలిగించని రీతిలో తగిన పరిరక్షణలను కల్పించి విశాలాంధ్రను ఏర్పాటు చేసుకోవచ్చని కమీషన్ సూచించింది. అలాగే ఆంధ్రరాష్ట్రంతో ఏకం కావడానికి 1952లో ఎన్నికైన తెలంగాణా రాష్ట్ర శాసన సభ్యులు 2/3 మెజారిటీతో ఆ మేరకు తీర్మానాన్ని ఆమోదిస్తే విశాలాంధ్రను ఏర్పాటు చేసుకోవచ్చు.

5) పెద్ద మనుషుల ఒప్పందం: ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు మూలంగా తెలంగాణా ప్రయోజనాలకు భంగం కలుగుతుందేమోననే అనుమాలను నివారించడానికి పెద్ద మనుషుల ఒప్పందం 1956 ఫిబ్రవరి 20న ఢిల్లీలో జరిగింది.

ఆంధ్రరాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ బెజవాడ గోపాలరెడ్డి, అతని మంత్రి మండలి సహచరులు సర్వ శ్రీ నీలం సంజీవరెడ్డి, గౌతు లచ్చన్న, ఎ.పి.సి.సి. అధ్యక్షుడు అలూరి సత్యనారాయణ రాజు సమావేశానికి హాజరైనవారు.

హైదరాబాదు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ బూర్గుల రామకృష్ణారావు, అతని మంత్రి మండలి సహచరులు. సర్వ శ్రీ కొండా వెంకటరంగారెడ్డి, డా॥ మర్రి చెన్నారెడ్డి, హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు జె.వి నర్సింగరావు వీరు ఒప్పందంపై సంతకాలు చేశారు.

ఒప్పందంలోని అంశాలు:
1) రాష్ట్రానికి సంబంధించిన కేంద్ర, సాధారణ పరిపాలన వ్యయం ఆంధ్ర తెలంగాణా నిష్పత్తి ప్రకారం భరించాలి. తెలంగాణాలో మిగులు, ఆ ప్రాంతపు అభివృద్ధికి కేటాయించాలి. అయిదేళ్ల దాకా ఈ ఏర్పాటు ఉండాలి. అటు తరువాత, తెలంగాణా శాసన సభ్యుల కోరికపై మరో అయిదేళ్లు పొడిగించవచ్చు.

2) తెలంగాణలో ఉన్న విద్యా సౌకర్యాలు తెలంగాణా వారికే లభింపజేసి ఇంకా అభివృద్ధి చేయాలి. లేకపోతే మొత్తం రాష్ట్రంలో సాంకేతిక విద్యతో సహా అన్ని విద్యాలయాల్లోను మూడోవంతు తెలంగాణా విద్యార్థులకు కేటాయించాలి.

3) ముందు రాబోయే ఉద్యోగాలు ఉభయ ప్రాంతాల జనాభా ప్రాతిపదిక మీద ఉండాలి.

4) తెలంగాణలో నిష్పత్తి ప్రకారం నిర్ణయించిన ఉద్యోగాల్లో ప్రవేశించడానికి అభ్యర్థులు ఆ ప్రాంతంలో 12 సంవత్సరాల నివాసం ఉండాలి.

5) తెలంగాణా సర్వతోముఖాభివృద్ధి సాధించడానికి ఒక ప్రాంతీయ మండలి ఉండాలి.

6) మంత్రివర్గంలో ఆంధ్ర ప్రాంతం నుంచి 60% తెలంగాణా ప్రాంతం నుంచి 40% ఉండాలి. తెలంగాణా భాగంలో ఒక ముస్లిం కూడా ఉండాలి.

7) ముఖ్యమంత్రి ఆంధ్ర ప్రాంతం వాడైతే ఉపముఖ్యమంత్రి తెలంగాణా వ్యక్తి అయి ఉండాలి. ముఖ్యమంత్రి తెలంగాణా ప్రాంతం వాడైతే ఉపముఖ్యమంత్రి ఆంధ్ర ప్రాంతంవాడై ఉండాలి. హోం, ఫైనాన్స్, రెవెన్యూ, ప్లానింగ్, డెవలప్మెంట్, వాణిజ్య పరిశ్రమల శాఖల్లో కనీసం రెండైనా తెలంగాణా వారికివ్వాలి.

పెద్ద మనుషుల ఒప్పందం కుదరడంతో విశాలాంధ్ర ఏర్పాటు సుగమమైంది. 1956 మార్చి 16వ తేదీన పార్లమెంటు ఉభయసభల్లో రాష్ట్రాల పునర్నిర్మాణ బిల్లును ప్రతిపాదించడమైంది.

  • 1956 ఏప్రిల్ 5న ఆంధ్ర శాసనసభలో సదరు బిల్లుపై తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. శాసనసభ కొన్ని సవరణలతో తీర్మానాన్ని ఆమోదించింది.
    1. రాష్ట్రం పేరు ఆంధ్రప్రదేశ్ అని వుండాలి.
    2. రాజధాని మరియు హైకోర్టు హైదరాబాద్లో నే వుండాలి.
    3. ఆంధ్రప్రదేశ్ అంతటికీ 1962లోనే సాధారణ ఎన్నికలు జరగాలి.
    4. 72 మంది సభ్యులతో కూడిన విధాన పరిషత్ ఏర్పాటుకావాలి.
  • 1956 ఏప్రిల్ 13న హైదరాబాదు రాష్ట్ర శాసనసభ రాష్ట్రాల పునర్నిర్మాణ బిల్లును ఆమోదించింది.
  • 1956 ఆగష్టు 25న రాజ్యసభ బిల్లును ఆమోదించింది. అటు తరువాత లోక్సభ కూడా ఆమోదించింది. + 1956 ఆగష్టు 31న బిల్లుపై రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు.
  • 1956 నవంబర్ 1న అక్షర క్రమంలో మొదటిది భాషా రాష్ట్రాల్లో కూడా మొదటిదై ఆంధ్రప్రదేశ్ దీపావళి పర్వదినాన అవతరించింది. నాటి గవర్నర్ సి.ఎం. త్రివేది, ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డిలు వ్యవహరించారు.

ప్రశ్న 2.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు దారి తీసిన కారణాలను పరిశీలించండి.
జవాబు:
2000 సంవత్సరంలో చత్తీస్ ఘడ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ఏర్పాటుతో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం మళ్ళీ తెరపైకి వచ్చింది. ఈ సారి తెలంగాణ రాష్ట్ర సమితి (Telangana Rastra Samithi – T.R.S) ఆధ్వర్యంలో రాజకీయ ఉద్యమం కొనసాగింది. ఆంధ్రప్రదేశ్ అనేది భారతదేశంలో మొట్టమొదటి భాషాప్రయుక్త రాష్ట్రమనే విషయాన్ని మనం ఈ సందర్భంలో గుర్తుంచుకోవాలి. ఐతే ఆంధ్రప్రదేశ్ ఏర్పడి 57 సంవత్సరాలు పూర్తి అయినప్పటికీ ఒకే భాష (తెలుగు) రాష్ట్ర ప్రజలందరినీ కలిపి ఉంచడంలో విఫలమైందని చెప్పవచ్చు.

తెలంగాణ ఉద్యమానికి ఒక్క ఆర్థికంగా వెనుకబాటుతనమే ప్రధాన ఇతివృత్తం కాదు. దాంతోబాటుగా నీటి వనరులు, ఆర్థిక వనరుల పంపిణీ, ఉపాధి అవకాశాలు, సాంస్కృతిక వికాసం మొదలైన అనేక అంశాలలో తెలంగాణ ప్రాంతం వివక్షకు గురి అయిందని ఆ ప్రాంత నాయకులు భావించడం జరిగింది. అయితే అటువంటి అంశాలు వాదోపవాదనలతో కూడినవిగా కొందరు పేర్కొన్నారు. అయితే ఒకసారి ప్రజానీకంలో కొన్ని వర్గాలలో అసౌకర్యం, అనుమానం ఏర్పడి అధికమైతే ఇతర ప్రాంతాల ప్రజలతో కలిసిమెలిసి జీవనం సాగించడం సాధ్యం కాదని చెప్పవచ్చు.

2009 డిసెంబర్లో తెలంగాణ ఉద్యమం తీవ్రం అయిన సమయంలో దేశీయ వ్యవహారాల శాఖమంత్రి చిదంబరం తెలంగాణ విషయంలో కేంద్రం ఎంతో శ్రద్ధను ప్రదర్శిస్తున్నట్లుగా ప్రకటించాడు. అందులో భాగంగా 2010 ఫిబ్రవరి మూడో తేదీన భారత ప్రభుత్వం న్యాయమూర్తి బి.ఎన్.శ్రీకృష్ణ ఆధ్వర్యంలో ఒక సంఘాన్ని నియమించి తెలంగాణ విషయంలోనూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ రాజకీయ పరిస్థితిని అధ్యయనం చేయాల్సిందిగా కోరింది. ఆ సంఘం రెండు ప్రధాన అంశాలను విస్తృతంగా పరిశీలించింది. అవి 1) తెలంగాణ ప్రాంతానికి ప్రత్యేక రాష్ట్ర హోదా కావాలని డిమాండ్ చేయడం. 2) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని యథావిధంగా కొనసాగించడం. శ్రీకృష్ణ సంఘం తన నివేదికను 2010 డిసెంబరు 30వ తేదీన దేశీయ వ్యవహారాల శాఖకు సమర్పించింది.

తెలంగాణ నాయకులు శ్రీకృష్ణ సంఘం నివేదికను తిరస్కరించారు. హైదరాబాద్ రాజధానిగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రాంతంలో సమ్మెలు, నిరాహార దీక్షలు, ఆత్మహత్యలు విజ్ఞప్తులను అందించడం, ప్రభుత్వ అధికారులకు గులాబీపూల బహుకరణ, ప్రభుత్వ ఉత్సవాల బహిష్కరణ వంటి చర్యలకు ఆందోళనకారులు పాల్పడ్డారు. దాంతో పరిస్థితి తీవ్రతను గమనించి భారత ప్రభుత్వం 2013 జూలై 30వ తేదీన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ప్రకటించింది. తదుపరి 2014 ఫిబ్రవరిలో పార్లమెంటు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ |బిల్లును తీవ్ర గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో ఆమోదించింది. దాంతో సీమాంధ్ర ప్రాంతం అట్టుడిగిపోయింది. పార్లమెంటు ఆమోదించిన పై బిల్లు రాష్ట్రపతి 2014 మార్చి ఒకటో తేదీన సంతకం చేశారు. తెలంగాణ భారతదేశంలో 29వ రాష్ట్రంగా 2014 జూన్ రెండో తేదీన ఆవిర్భవించింది.

AP Inter 2nd Year Civics Study Material Chapter 13 ఆంధ్రప్రదేశ్, ఇండియాలలో ఇటీవలి పరిణామాలు

ప్రశ్న 3.
మానవ హక్కులంటే ఏమిటో నిర్వచించి, భారతదేశంలో జాతీయ మానవ హక్కుల సంఘం నిర్మాణాన్ని వర్ణించండి.
జవాబు:
మానవ హక్కుల నిర్వచనం: మానవ హక్కుల పరిరక్షణ చట్టం, 1993, రెండో సెక్షన్ (d) మానవ హక్కులను క్రింది విధంగా నిర్వచించింది.

“మానవ హక్కులు అనేవి వ్యక్తి జీవనం, స్వేచ్ఛ, సమానత్వం, హోదాలకు సంబంధించినవి. రాజ్యాంగం చేత హామీ ఇవ్వబడిన అంతర్జాతీయ చట్టాలు, భారతదేశ న్యాయస్థానాల చర్యల ద్వారా అమలవుతాయి.”

జాతీయ మానవ హక్కుల సంఘం నిర్మాణం: జాతీయ మానవ హక్కుల సంఘం అనేది బహుళసభ్య సంస్థ. ఆ సంస్థ నియమావళి సభ్యుల అర్హతలు, నియామకం గురించి పేర్కొన్నది. ఆ సంస్థకు సంబంధించిన సెక్షన్ 3 ప్రకారం క్రింది పట్టికలో సూచించిన సభ్యులు ఉంటారు.
AP Inter 2nd Year Civics Study Material Chapter 13 ఆంధ్రప్రదేశ్, ఇండియాలలో ఇటీవలి పరిణామాలు 1

దీనిలో నలుగురు సభ్యులు ఉంటారు. దీనికి సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి అధ్యక్షత వహిస్తాడు. దీనిలో సభ్యులుగా సుప్రీం కోర్టు ప్రస్తుత లేదా మాజీ న్యాయమూర్తి, హైకోర్టు ప్రస్తుత న్యాయమూర్తి లేదా మాజీ ప్రధాన న్యాయమూర్తితో పాటుగా మానవ హక్కుల కార్యకలాపాలకు సంబంధించిన ఇద్దరు వ్యక్తులు సభ్యులుగా ఉంటారు. ఈ కమీషన్ ఛైర్మన్, సభ్యులను భారత రాష్ట్రపతి నియమిస్తారు. ఈ విషయంలో అతడు కేంద్ర హోంమంత్రి, లోక్సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్, పార్లమెంటు ఉభయసభలలోని ప్రతిపక్ష నేతలను సంప్రదిస్తారు. ఛైర్మన్, సభ్యులు ఐదేళ్ళ పాటు లేదా 70 ఏళ్ళు నిండేవరకు వారి పదవులలో కొనసాగుతారు. ఈ కమీషన్లో జాతీయ షెడ్యూల్డ్ కులాల, షెడ్యూల్డ్ తెగల, మైనారిటీల, మహిళల కమీషన్లకు సంబంధించిన ఛైర్మన్లు పదవిరీత్యా సభ్యులుగా ఉంటారు. ఈ కమీషన్ సాధారణ కార్యదర్శిగా కేంద్ర ప్రభుత్వంలో సెక్రటరీ జనరల్ హోదా గల అధికారి వ్యవహరిస్తాడు.

విధులు: జాతీయ మానవ హక్కుల కమీషన్ కింద పేర్కొన్న ముఖ్య విధులను నిర్వహిస్తోంది.

  1. ప్రభుత్వాధికారులు మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడినట్లు ఆరోపణలు వస్తే, వాటిపై జాతీయ మానవ హక్కుల కమీషన్ విచారణ జరిపిస్తుంది.
  2. న్యాయస్థానాలు అనుమతించినమేరకు మానవ హక్కుల ఉల్లంఘన ఉదంతాలపై విచారణ జరుపుతుంది.
  3. మానవ హక్కుల అమలుకు సంబంధించిన వివిధ చట్టబద్ధమైన చర్యలను సమీక్షిస్తుంది.
  4. మానవ హక్కులకు భంగం కలిగించే టెర్రరిస్టుల కార్యకలాపాలను నివారించేందుకై సలహాలు ఇస్తుంది.
  5. మానవ హక్కులకు సంబంధించిన విషయాలపై పరిశోధనలను కొనసాగిస్తుంది.
  6. మానవ హక్కుల పట్ల ప్రజలలో అవగాహనను పెంపొందించేందుకై తగిన చర్యలను తీసుకొంటుంది.
  7. మానవ హక్కులను పరిరక్షించే స్వచ్ఛంద సంస్థలకు తగిన ప్రోత్సాహకాలను అందిస్తుంది.

ప్రశ్న 4.
సమాచార హక్కు చట్టం గురించి వివరించండి.
జవాబు:
సమాచార హక్కు చట్టం 2005 పార్లమెంటు ద్వారా ఆమోదించబడి అమలులోకి వచ్చింది. ఈ చట్టం ద్వారా ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఏ సంస్థ నుండి అయినా సమాచారాన్ని కోరే హక్కు ప్రతి భారతీయుడికి కల్పించింది. ఈ చట్టం జమ్మూకాశ్మీర్ రాష్ట్రం మినహా యావత్ భారతదేశానికి వర్తిస్తుంది.

ఈ చట్టం ద్వారా పౌరులు ప్రభుత్వ డాక్యుమెంటులు, ఉత్తర్వులు, నివేదికలు, మెమోలు మొదలగు వాటికి సంబంధించిన సమాచారాన్ని పొందవచ్చు.

సమాచారం పొందగోరే వారు సంబంధిత సమాచార అధికారికి లిఖిత పూర్వకంగా ఆర్జీ పెట్టుకొని 10 రుసుము చెల్లించవలెను. దారిద్ర్య రేఖకు దిగువున ఉన్నవారు ఎట్టి రుసుము చెల్లించనవసరము లేదు. 30 రోజుల లోపు సమాధానము ఇవ్వాలి.

ప్రభుత్వ సమాచార అధికారులు: ప్రతి పాలనా విభాగంలో ఒక ప్రభుత్వ సమాచార అధికారిని ప్రభుత్వం నియమిస్తుంది. ఈ అధికారి పౌరులడిగిన సమాచారాన్ని అందించాలి. సాధారణ సమాచారం అయితే ముప్పది రోజుల లోపల సమాధానం ఇవ్వాలి. అదే వ్యక్తి ప్రాణానికి, స్వేచ్ఛకు సంబంధించిన సమాచారం అయితే 48 గంటల లోపు సమాధానం ఇవ్వాలి. సమాచారాన్ని తిరస్కరిస్తే దానికి తగు కారణాలను పేర్కొనాలి.

సమాచార హక్కు చట్టం మినహాయింపులు: దేశ సమగ్రతకు, సార్వభౌమాధికారానికి సంబంధించిన అంశాలు (రక్షణ, అణుశాస్త్రీయ) సమాచార హక్కు చట్టం నుండి మినహాయింపబడినాయి. కేంద్ర, రాష్ట్రమంత్రి వర్గాల నిర్ణయాలు పార్లమెంటు, రాష్ట్ర శాసనసభల హక్కులకు భంగం కల్గించే అంశాలు కూడా మినహాయింపబడినాయి.
ఇదిగాక పెక్కు సంస్థలు చట్ట పరిధి నుండి మినహాయించబడ్డాయి. అవి ఏమనగా: IBR మరియు AW, Direc- torate of Revenue Intelligence, Aviation Research Centre, BSF, CRPF, Assam Riffles, Special Branch CID, మున్నగునవి. కాని ఈ సంస్థలు అవినీతి చర్యలకు పాల్పడ్డా, మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డా సమాచారం కోరే హక్కు ఉంది.

సమాచార కమీషన్లు: సంబంధిత సమాచార అధికార ఫిర్యాదుదారునికి సరియైన సమాచారాన్ని సకాలంలో ఇవ్వకపోయినా, ఎక్కువ రుసుము వసూలు చేసినా, మరే విధంగానైనా ఇబ్బంది కల్గచేసినా అప్పీలు చేసుకోవటానికి సమాచార హక్కు చట్టం కేంద్ర స్థాయిలో కేంద్ర సమాచార కమీషను, రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర సమాచార కమీషన్ న్ను ఏర్పాటు చేసింది.

కేంద్ర సమాచార కమీషన్: ఈ కమీషన్లో ఒక ముఖ్య సమాచార కమీషనర్, 10 మందికి మించని సమాచార కమీషనర్లు ఉంటారు. వీరిని రాష్ట్రపతి నియమిస్తాడు. వీరి పదవీకాలం 5 సం॥లు లేక 65 సం॥ వయోపరిమితి. రాష్ట్ర సమాచార కమీషన్: ఈ కమీషన్లో ఒక ముఖ్య సమాచార కమీషనర్ పది మంది మించని సమాచార కమీషనర్లు ఉంటారు. వీరిని గవర్నరు నియమిస్తారు. వీరి పదవీకాలం 5 సం॥లు లేక 68 సం॥లు వయోపరిమితి. కేంద్ర, రాష్ట్ర సమాచార కమీషన్ల నిర్ణయమేతుది తీర్పు, ఈ తీర్పులపై ఎవ్వరికి అప్పీలు చేసుకొనే అధికారం లేదు. కాని రాజ్యాంగం ద్వారా అధికారాలు కల్గిన హైకోర్టు ఈ కమీషన్ల తీర్పులపై రిట్ల ద్వారా ఫిర్యాదుదారునికి మేలు చేకూర్చవచ్చు.

AP Inter 2nd Year Civics Study Material Chapter 13 ఆంధ్రప్రదేశ్, ఇండియాలలో ఇటీవలి పరిణామాలు

కేంద్ర సమాచార కమీషన్ మరియు రాష్ట్ర సమాచార కమీషన్ ఇచ్చే తీర్పులు సాధారణ న్యాయస్థానాలతో సమానమైనవి.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ఆంధ్రరాష్ట్ర అవతరణ గురించి వర్ణించండి. [Mar. ’16]
జవాబు:
ప్రత్యేకాంధ్ర రాష్ట్ర వాంఛ: ఒకవైపు వందేమాతరం స్వదేశీ ఉద్యమం, దేశవ్యాప్తంగా పుంజుకొంటూ ఉండగా మచిలీపట్నంలో భోగరాజు పట్టాభి సీతారామయ్య పంతులుగారు, ముట్నూరి కృష్ణారావు పంతులుగారు, కొండా వెంకటప్పయ్య పంతులుగారు, టంగుటూరి ప్రకాశం పంతులుగారు సమావేశమై ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణా
ప్రాంతాలను ఏకం చేసి సంయుక్త ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటును గురించి ఆలోచించసాగారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో 58% తెలుగు ప్రాంతాలుండి 40% తెలుగు జనాభా ఉండి కూడా తెలుగు వారు వెనుకబడి ఉండడం వారిని రోషపూరితుల్ని చేసేది. ఆ తరువాత, 1912లో నిడదవోలులో గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల సంయుక్త సమావేశం ఒకటి జరిగింది. ఆ సమావేశానికి కీ.శే. వేమనరపు రామదాసు పంతులుగారు అధ్యక్షత వహించారు.

1. ప్రధమాంద్ర మహాసభ, బాపట్ల 1913: ఆంధ్రరాష్ట్ర నిర్మాణ సమస్యపై ప్రధమాంధ్ర మహాసభ 1913లో గుంటూరు జిల్లా, బాపట్లలో శ్రీ బి.ఎన్. శర్మగారి అధ్యక్షతన జరిగింది. ఆ మహాసభకు మొత్తం 800 మంది ప్రతినిధులు, 2000 మంది ప్రేక్షకులు హాజరయ్యారు.

2. ద్వితీయాంధ్ర మహాసభ, విజయవాడ 1914: రెండో ఆంధ్ర మహాసభ 1914లో విజయవాడలో ఏప్రిల్ 11న జరిగింది. ఈ సభకు న్యాపతి సుబ్బారావుగారు అధ్యక్షత వహించారు. ఈ సభకు విజయవాడకు చెందిన శ్రీ అయ్యదేవర కాళేశ్వరరావు గారు నిర్వహకులుగా వ్యవహరించారు. సుమారు 1600 మంది ప్రతినిధులు ఈ సభకు హజరయ్యారు.

3. తృతీయాంధ్ర మహాసభ, విశాఖపట్నం 1915: మూడో ఆంధ్ర మహాసభ విశాఖపట్నంలో 1915 మే నెలలో జరిగింది. ఈ సభకు పానగల్లు రాజారామారాయణింగారు అధ్యక్షత వహించారు. ఈ సభ రెండు తీర్మానాలు చేసింది.

  1. ప్రత్యేకాంధ్ర రాష్ట్రం అత్యవసరం.
  2. సెకండరీ స్కూలు స్థాయిలో మాతృభాషలోనే బోధన జరగాలి.

1920లో నాగపూర్లో జరిగిన కాంగ్రెస్ మహాసభ భాషా రాష్ట్రాల సిద్ధాంతాన్ని అంగీకరిస్తున్నట్లు అధికారికంగా ఒక ప్రకటన చేసింది. దానికి నాందిగా మొత్తం 21 భాషలను గుర్తించి, ఆ ప్రాతిపదికనే ప్రత్యేక ప్రదేశ్ కాంగ్రెస్లను ఏర్పాటుచేసింది.

మాంటేగ్ – ఛెమ్స్ఫర్డ్ నివేదిక ఆధారంగా భారత కౌన్సిల్ చట్టం 1919ని బ్రిటిష్ పార్లమెంటు ఆమోదించింది. చట్టంలోని 52 (ఎ) ప్రకరణం రాష్ట్ర శాసనసభల్లో అత్యధిక సంఖ్యాకులు ప్రత్యేక రాష్ట్ర నిర్మాణాన్ని అంగీకరిస్తూ తీర్మానించినట్లయితే ప్రభుత్వం అందుకు సమ్మతించవచ్చు అని పేర్కొన్నది.

ఆ రోజుల్లో ఆంధ్రులకు ముఖ్యంగా బ్రహ్మణేతర విద్యార్థులకు మద్రాసు విశ్వవిద్యాలయంలో ప్రవేశం దొరకడం చాలా కష్టంగా వుండేది. ఆనాటి విద్యామంత్రి అనెం పరశురామ పాత్రో కృషి ఫలితంగా 1926లో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఏర్పాటైంది.

1932లో మద్రాసులో శ్రీ కడప కోటిరెడ్డి గారు అధ్యక్షతన ప్రత్యేకాంధ్ర మహసభ జరిగింది. ఈ సభకు శ్రీ కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుగారితో పాటు ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు చెందిన ముఖ్య నాయకులు హాజరైనారు.

ప్రశ్న 4.
శ్రీ భాగ్ ఒప్పందం 1937 నవంబర్: 14, నవంబర్ 1937 నాడు మద్రాసులో శ్రీ కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుగారి స్వగృహమైన “శ్రీ భాగ్”లో ఆంధ్ర, రాయలసీమ నాయకుల సమావేశం జరిగింది. ఆంధ్ర ప్రాంతం నుంచి శ్రీయుతులు డా॥ భోగరాజు పట్టాభి సీతారామయ్య, కొండా వెంకటప్పయ్య, మహబూబ్ ఆలీబేగ్, దేశిరాజు
హనుమంతరావు, ముళ్ళపూడి పళ్లం రాజు, కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుగారు, రాయలసీమ నుంచి శ్రీయుతులు కడప కోటిరెడ్డి, సీతారామిరెడ్డి, దేశపాండ్యా సుబ్బరామిరెడ్డి, టి.ఎన్. రామకృష్ణా రెడ్డి, పప్పురి రామాచారి, వరదాచారి పాల్గొన్నారు.

1938 మార్చి, 30న ప్రత్యేకాంధ్ర రాష్ట్రాన్ని స్థాపించాలని కోరుతూ దేశభక్త కొండా వెంకటప్పయ్యగారు మద్రాసు శాసనసభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దాన్ని కడప కోటిరెడ్డిగారు బలపరిచారు. తీర్మానాన్ని బలపరుస్తూ ముఖ్యమంత్రి రాజగోపాలాచారి గంభీరోపన్యాసం చేశారు. తీర్మానం ఏకగ్రీవామోదం పొందింది.
1938లో ఆంధ్ర మహాసభ డా॥, సర్వేపల్లి రాధాకృష్ణన్ అధ్యక్షతన జరిగింది. ఆ సభలో రాజధాని గురించి చర్చించారు.

5. జె.వి.పి. నివేదిక: జైపూర్, కాంగ్రెస్ సభల్లో సభ్యులు సమస్యను పునఃపరిశీలించాలని అభిప్రాయపడ్డారు. దాన్ని పురస్కరించుకొని పార్టీ ఒక ఉపసంఘాన్ని నియమించింది. అందులో జవహర్లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్, పట్టాభిసీతారామయ్య గారు సభ్యులు ముద్దుగా మూడక్షరాల మాటగా దీన్ని జె.వి.పి. కమిటీ అని పిలిచారు. ఈ కమిటీ ||ఏప్రిల్ 1949లో తన నివేదికను ప్రకటించింది. చిరకాలంగా ఆంధ్రుల్లో నెలకొని వున్న అలజడి దృష్ట్యా ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయవచ్చు. అందుకోసం ఆంధ్రులు మద్రాసు నగరం కోరికను వదులుకోవాలని పేర్కొంది.

6. స్వామి సీతారం ఉపవాస దీక్ష: ఆంధ్ర రాష్ట్ర సిద్ధిని శుభం చేయాలనే సంకల్పంతో 15 ఆగష్టు 1952 నాడు శ్రీ స్వామి సీతారాం (శ్రీ గొల్లపూడి సీతారామశాస్త్రి గారు) ఆమరణ నిరాహార దీక్షను ప్రారంభించారు. ఈయన ఉపవాస దీక్ష గుంటూరు పట్టణంలో టౌన్ హాలులో జరిగింది. మొత్తం 36 రోజులు ఉపవాస దీక్ష సాగింది.

AP Inter 2nd Year Civics Study Material Chapter 13 ఆంధ్రప్రదేశ్, ఇండియాలలో ఇటీవలి పరిణామాలు

7. పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్ష: ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం 19 అక్టోబరు, 1952 నాడు పొట్టి శ్రీరాములు గారు మహర్షి బులుసు సాంబమూర్తి గారి ఇంట్లో దీక్ష ప్రారంభించారు. ఆ ఇంటికి “యజ్ఞశాల” అని నామకరణం చేశారు.

ఈ వాతావరణంలో డిశంబర్ 9, 1952 నాడు పార్లమెంటులో మద్రాసును వదులుకొని ఆంధ్ర రాష్ట్రానికి అంగీకరిస్తే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకాంధ్ర రాష్ట్రం ఏర్పాటును పరిశీలించగలదని ఒక ప్రకటన చేయడమైనది. ఈ ప్రకటన వెలువడే నాటికి శ్రీరాములు దీక్ష మొదలు పెట్టి 52 రోజులైంది. ఆ తరువాత 15 డిశంబరు, 1952 రాత్రి 11 గం॥ 39 ని॥లకు పొట్టి శ్రీరాములు అమరజీవి పొట్టి శ్రీరాములయ్యారు.

8. వాంఛూ కమిటీ 1953: 1953 జనవరిలో ప్రత్యేకాంధ్ర రాష్ట్ర నిర్మాణ విషయాలను పరిశీలించడానికి కేంద్ర ప్రభుత్వం రాజస్థాన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కె.ఎన్.వాంఛను నియమించింది. వాంఛూ నివేదిక అందటంతోనే ప్రధానమంత్రి నెహ్రూ ఒక ప్రకటన చేస్తూ, ఆంధ్ర రాష్ట్రం అక్టోబరు 1, 1953 నాడే ఏర్పాటవుతుందని, కాబట్టి రాజధాని నగరం ఆంధ్ర ప్రాంతంలో ఎక్కడ వుండాలో తేల్చుకోవాల్సిన బాధ్యత ఆంధ్ర శాసన సభ్యులదే అని తెలిపారు. అంతేకాని మద్రాసు నగర ప్రసక్తి మాత్రం లేదు అని ఆయన స్పష్టం చేశారు.

9) ఆంధ్ర రాష్ట్ర అవతరణ: నూతనంగా రాష్ట్ర నిర్మాణం చేయడానికి భారత ప్రభుత్వం సి.ఎం.త్రివేదీని ప్రత్యేకాధికారిగా నియమించింది. అనుకొన్న ప్రకారం 1 అక్టోబర్, 1953 నాడు కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం అధికారికంగా ఏర్పాటయింది. దీనిలో శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు 11 జిల్లాలు వున్నాయి.

4 జూలై, 1954న గుంటూరులో హైకోర్టును ఏర్పాటు చేశారు. హైకోర్టుకు మొదటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్. కోకా సుబ్బారావుగారు, ఆంధ్రరాష్ట్రానికి మొదట గవర్నర్ సి.ఎం. త్రివేది ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు గారు. భారత ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ రాష్ట్రానికి 1 అక్టోబర్, 1953 నాడు ఆంధ్ర రాష్ట్ర అవతరణకు ప్రారంభోత్సవం చేశాడు. ఆనాడు అశేషాంధ్ర ప్రజానీకం వాడవాడలా విందులు, వినోదాలు జరుపుకున్నారు.

ప్రశ్న 2.
జై ఆంధ్ర ఉద్యమానికి దారితీసిన అంశాలను పరిశీలించండి.
జవాబు:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆవిర్భావం తరువాత కూడా తెలంగాణ ప్రాంతంలో ముల్కీ నిబంధనలు అమలులో ఉన్నాయి. అటువంటి నిబంధనలు ఆంధ్రప్రాంత ప్రజలకు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో ఆటంకంగా ఉన్నాయనే భావన ఏర్పడింది. దాంతో ఆ నిబంధనలను రాష్ట్ర హైకోర్టులో కొందరు సవాల్ చేయడమైంది. అప్పుడు ఆ అంశంపై రాష్ట్ర హైకోర్టు సమగ్రంగా విచారించి ముల్కీ నిబంధనలు చెల్లుబాటు కావని ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైకోర్టు తీర్పుపై సమగ్ర వివరణ కోరుతూ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ ను దాఖలు చేసింది. సుప్రీంకోర్టు ఆ అంశాన్ని క్షుణ్ణంగా విచారించి ముల్కీ నిబంధనలు సక్రమమే అని తీర్పును ఇచ్చింది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెనురాజకీయ ప్రకంపనలను సృష్టించింది. ఆంధ్రప్రాంత ప్రజలు హైదరాబాద్ రాజధాని పట్టణంలోని ద్వితీయశ్రేణి పౌరులుగా దిగజారిపోయామనే భావన వ్యక్తీకరించారు. ఆంధ్రప్రదేశ్ నుండి ఆంధ్రప్రాంతం విడిపోయి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడాలనే డిమాండ్తో వారు జై ఆంధ్ర ఉద్యమాన్ని చేపట్టారు.

ప్రశ్న 3.
జాతీయ మానవ హక్కుల సంఘం అమలు చేసిన ప్రతిపాదనలు ఏవి ?
జవాబు:

  1. మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన అంశాల విచారణ.
  2. న్యాయస్థానం విచార క్రమంలో మానవ హక్కులకు సంబంధించిన అంశాలు ఉన్నట్లయితే జోక్యం చేసుకోవడం.
  3. కారాగారాలను సందర్శించి, అక్కడి పరిస్థితులను అధ్యయనం చేసి తగిన సూచనలు అందించడం.
  4. మానవ హక్కుల పరిరక్షణకు సంబంధించిన రాజ్యాంగ, చట్టపరమైన పరిరక్షణలను సమీక్షించడం.
  5. మానవ హక్కులను అనుభవించడంలో ఎదురయ్యే ఆటంకాలను సమీక్షించి, నివారణ చర్యలను సూచించడం.
  6. మానవ హక్కులకు సంబంధించిన అంతర్జాతీయ చట్టాలను అధ్యయనం చేసి, వాటిని సమర్థవంతంగా అమలులో ఉంచేందుకు సూచనలు అందించడం.
  7. మానవ హక్కులకు సంబంధించిన అంశాలపై పరిశోధనలు గావించడం.
  8. ప్రజలలో మానవ హక్కుల పట్ల అవగాహనను పెంపొందించి, మానవ హక్కుల పరిరక్షణకు సంబంధించిన సమాచారాన్ని అందించడం.
  9. మానవ హక్కుల విషయంలో ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థల కృషిని ప్రోత్సహించడం.
  10. మానవ హక్కులను కోల్పోయిన బాధితులకు నష్టపరిహారాన్ని అందించడంలో సంబంధిత అధికారులకు సూచనలు చేయడం.

ప్రశ్న 4.
జాతీయ, రాష్ట్రస్థాయిలలో మానవహక్కుల సంఘాలు ఎందుకు అవసరమో తెలపండి.
జవాబు:
జాతీయ మానవహక్కుల సంఘం (National Human Rights Commission – NHRC) అనేది చట్టబద్ధమైన సంస్థ. ఆ సంస్థ 1993 అక్టోబరు 12న ఏర్పాటయింది. దానికి సంబంధించిన అంశాలను 1993 నాటి మానవహక్కుల పరిరక్షణ చట్టం నుండి గ్రహించడమైంది. ఆ చట్టం 1991 అక్టోబరులో పారిస్ లో జరిగిన అంతర్జాతీయ అధ్యయన సదస్సులో ఆమోదించిన నియమాలకు అనుగుణంగా ఉంటుంది. అట్లాగే ఆ చట్టం మానవహక్కుల పరిరక్షణ, వికాసానికి దోహదపడుతుంది. ఆ నియమాలను 1993 డిసెంబర్ 20వ తేదీన ఐక్యరాజ్యసమితి సాధారణ సభ 48/134 వ తీర్మానం ద్వారా ఆమోదించింది. మానవహక్కుల పరిరక్షణ, వికాసంలో భారతదేశపు ఆసక్తికి జాతీయ మానవహక్కుల సంఘం ప్రతీకగా ఉంటుంది. జాతీయ మానవహక్కుల సంఘం ఆ చట్టాన్ని 2006లో సవరించండం జరిగింది.

AP Inter 2nd Year Civics Study Material Chapter 13 ఆంధ్రప్రదేశ్, ఇండియాలలో ఇటీవలి పరిణామాలు

మానవహక్కుల పరిరక్షణ చట్టం, 1993 జాతీయ మానవహక్కుల సంఘంతో బాటుగా రాష్ట్ర మానవహక్కుల సంఘాల ఏర్పాటుకు వీలు కల్పించింది. ప్రస్తుతం భారతదేశంలో 23 రాష్ట్రాలు మానవహక్కుల సంఘాలను ఏర్పాటుచేశాయి. వాటిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఉంది. భారత రాజ్యాంగం ఏడో షెడ్యూలులోని రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితాలలో పేర్కొన్న అంశాల విషయంలో, మానవ హక్కుల ఉల్లంఘనలపై విచారణ జరిపే ముఖ్య ఉద్దేశ్యంతో రాష్ట్ర మానవహక్కుల సంఘం ఏర్పాటయింది.

ప్రశ్న 5.
సమాచార సంఘాల అధికారాలు, విధులు ఏవి ?
జవాబు:
సమాచార సంఘాల అధికారాలు, విధులు: [Mar. ’17]
1. కేంద్ర సమాచార సంఘం / రాష్ట్ర సమాచార సంఘం ఏ వ్యక్తి వద్ద నుంచైనా ఫిర్యాదులను స్వీకరించవచ్చు. అటువంటి వ్యక్తులు

  • ప్రధాన సమాచార అధికారి నియామకం జరగకపోవడంతో సమాచారం పొందేందుకు అవకాశం లేనివారై ఉండాలి.
  • అడిగిన సమాచారాన్ని ఇచ్చేందుకు అధికారులు తిరస్కరించి ఉండాలి.

2. సహేతుక కారణాలపై విచారణ జరిపించే అధికారం.

3. కేంద్ర సమాచార సంఘం / రాష్ట్ర సమాచార సంఘాలకు పౌరన్యాయస్థానాలుగా నిర్వహించే అధికారాలు ఎ) వ్యక్తుల హాజరు, వారి ప్రమాణంపై మౌఖిక, రాతపూర్వక సాక్ష్యాలను తీసుకోవడం, రాతప్రతుల వస్తువులను సమకూర్చడం.
బి) రాతప్రతులను పరిశోధించి, తనిఖీ చేయడం.
సి) అఫిడవిట్ ఆధారంగా సాక్ష్యాన్ని తీసుకోవడం.

4. విచారణ సమయంలో ఈ చట్టం ప్రకారం అన్ని ప్రతులను కేంద్ర సమాచార సంఘం / రాష్ట్ర సమాచార సంఘాలకు అందించడం.

5. ప్రభుత్వ అధికారుల నుంచి తన నిర్ణయాల అమలు గురించి సమాచారాన్ని రాబట్టడం.

  • నిర్ణీత ఫారంలో సమాచారాన్ని అందించే వీలుకల్పించడం.
  • ఎవరూ లేనిచో ప్రజాసమాచార అధికారి (PIO) / సహాయ ప్రజాసమాచార అధికారి (APIO) నియామకం గురించి ప్రభుత్వ అధికారులను ఆదేశించడం.

ప్రశ్న 6.
కేంద్ర సమాచార సంఘం ఏ విధంగా నిర్మితమైంది ?
జవాబు:
కేంద్ర సమాచార సంఘాన్ని ఒక ప్రత్యేక గెజిట్ ప్రకటన ద్వారా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఆ సంఘంలో ఒక ప్రధాన సమాచార కమీషనర్, పది మందికి మించకుండా సమాచార కమీషనర్లు ఉంటారు. వారందరినీ భారత రాష్ట్రపతి నియమిస్తారు. భారత రాష్ట్రపతి వారిచే ప్రమాణ స్వీకారం చేయిస్తాడు. ఆ సంఘం ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. కేంద్రప్రభుత్వం ఆ సంఘానికి సంబంధించిన కార్యాలయాలను దేశంలోని ఇతర ప్రాంతాలలో ఏర్పాటు చేయవచ్చు. ఆ సంఘం తన కార్యకలాపాలకు ఇతర అధికారులు / సంస్థల ఆదేశాలకు లోబడక స్వతంత్రంగా నిర్వహిస్తుంది.

AP Inter 2nd Year Civics Study Material Chapter 13 ఆంధ్రప్రదేశ్, ఇండియాలలో ఇటీవలి పరిణామాలు

ప్రశ్న 7.
సమాచారం పొందేందుకు గల సమయ పరిమితి ఏమిటి ?
జవాబు:
దరఖాస్తుదారుడు ప్రజాసమాచార అధికారి లేదా సహాయ ప్రజా సంబంధాల అధికారికి తదుపరి ఏ ఇతర అధీకృత అధికారికి గానీ తనకు కావాల్సిన సమాచారాన్ని ఒక దరఖాస్తు ద్వారా కోరతాడు. అందుకు అతడు కౌ 10లతో కూడిన డిమాండ్ డ్రాఫ్ట్, బ్యాంకు చెక్కు, ఇండియన్ పోస్టల్ ఆర్డర్ కోర్టు స్టాంపునుగానీ దరఖాస్తుతో జతపరచాలి. పేదరికం దిగువన నివసించే వారికి అటువంటి రుసుము చెల్లింపు నుంచి మినహాయంపు ఇవ్వబడింది. అయితే అందుకు సంబంధించిన నకలు పత్రాన్ని వారు దరఖాస్తుతో జతపరచాలి. సమాచారాన్ని ప్రజా సంబంధాల అధికారి, సహాయ ప్రజా సంబంధాల అధికారి దరఖాస్తుదారుడికి 30 రోజులలోగా అందించాలి. ఒకవేళ దరఖాస్తుదారుడి జీవనం, స్వేచ్ఛలకు సంబంధించిన అంశాలు ఇమిడి ఉంటే, సమాచారాన్ని అతడికి 48 గంటలలోగా అందించాలి. మూడో వ్యక్తి ఉన్నట్లయితే, అతడికి 40 రోజుల వ్యవధిలోగా సమాచారాన్ని అందించాలి. ఆ నిర్ణీత వ్యవధిలో సమాచారాన్ని అందించని యెడల, శాఖాధిపతికి దరఖాస్తుదారుడు మొదటిసారి అప్పీలు చేసుకోవచ్చు. కొంత నిర్ణీత వ్యవధి తరువాత దరఖాస్తుదారుడు సమాచార సంఘానికి అప్పీలు చేసుకోవచ్చు. ఒకవేళ సమాచారం అందించే విషయంలో నిర్హేతుకమైన జాప్యం ఏర్పడినచో లేదా తప్పుడు సమాచారం అందించినచో రోజుకు సంబంధిత, అధికారి 250ల మొత్తాన్ని దరఖాస్తుదారుడికి చెల్లించాలి. ఆ మొత్తం గరిష్ఠంగా 25000 వరకు ఉంటుంది. సంబంధిత అధికారిని విచారణ చేసేందుకు వీలుంటుంది.

ప్రశ్న 8.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోదా గురించి శ్రీకృష్ణ కమిటీ సూచించిన వివిధ ప్రతిపాదనలేవి ? [Mar. ’17, ’16]
జవాబు:
1. శ్రీకృష్ణ కమిటీ ఆరు ఐచ్ఛిక అంశాలతో కూడిన ప్రతిపాదనలను సూచించింది. అవి: 1. యథాతథస్థితిని కొనసాగించడం.

2. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సీమాంధ్ర, తెలంగాణ అనే రెండు రాష్ట్రాలుగా విభజించి, హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించడం.

3. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని (1) హైదరాబాద్ రాజధానిగా తెలంగాణ, రాయలసీమ ప్రాంతాలతో కూడిన రాయల తెలంగాణగా ఏర్పరచడం (2) కోస్తా ప్రాంతాన్ని అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉంచడం.

4. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సీమాంధ్ర, తెలంగాణలుగా విభజించి, హైదరాబాద్ మెట్రోపాలిటన్ ప్రాంతాన్ని ప్రత్యేక కేంద్రపాలిత ప్రాంతంగా ఉంచడం. దానిని భౌగోళికంగా కోస్తా ప్రాంతంలోని గుంటూరు జిల్లాతో అనుసంధానం గావించడం. అందులో భాగంగానే దక్షిణ ఆగ్నేయంలో ఉన్న నల్గొండ జిల్లాను దక్షిణాన ఉన్న మహబూబ్నగర్ జిల్లా మొదలుకొని రాయలసీమ ప్రాంతంలోని కర్నూలు జిల్లాతో అనుసంధానం గావించడం.

5. ప్రస్తుతం ఉన్న సరిహద్దుల ఆధారంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తెలంగాణ, సీమాంధ్రలుగా విభజించి, తెలంగాణకు హైదరాబాదు రాజధానిగా ఉంచడం, సీమాంధ్రకు నూతన రాజధాని నిర్మాణం గావించడం.

6. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచి, తెలంగాణ ప్రాంత సామాజిక – ఆర్థిక అభివృద్ధికి, రాజకీయ ప్రగతికి ఒక ప్రాంతీయ మండలిని ఏర్పాటు గావించడం.

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
పెద్ద మనుషుల ఒప్పందం.
జవాబు:
హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణ ప్రాంత విలీనాన్ని గట్టిగా వ్యతిరేకించాడు. కాని కాంగ్రెస్ అధిష్ఠానవర్గం ఆంధ్రప్రాంత నాయకుల ఒత్తిళ్ళుకు తలొగ్గి విశాలాంధ్ర ఏర్పాటును ఆమోదించింది. తెలంగాణ ప్రజానీకంలో ఉన్న భయాందోళనలను నివారించేందుకై ఆంధ్ర, తెలంగాణ ప్రాంత నాయకుల మధ్య కుదిరిన ఒప్పందాన్ని పెద్ద మనుషుల ఒప్పందం అని అంటారు. ఈ ఒప్పందంలోని ప్రధాన ఆంశం ప్రకారం తెలంగాణ సంపూర్ణ అభివృద్ధి కొరకై ప్రాంతీయ మండలి ఏర్పాటయింది.

AP Inter 2nd Year Civics Study Material Chapter 13 ఆంధ్రప్రదేశ్, ఇండియాలలో ఇటీవలి పరిణామాలు

ప్రశ్న 2.
జె.వి.పి కమిటీ. [Mar. ’16]
జవాబు:
దక్షిణ భారతదేశంలో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ జరగాలనే డిమాండ్ ఉదృతం కావడంతో, భారత జాతీయ కాంగ్రెస్ ఆ అంశాన్ని పరిశీలించేందుకై ఒక త్రిసభ్య సంఘాన్ని నియమించింది. ఆ సంఘంలో జవహర్లాల్నెహ్రూ, వల్లభబాయి పటేల్, పట్టాభి సీతారామయ్య సభ్యులు ఉన్నారు. ఈ సంఘాన్ని జె.వి.పి కమిటీ అంటారు. ఈ కమిటీ తన నివేదికను 1949 ఏప్రిల్ 1వ తేదిన సమర్పించింది.

ప్రశ్న 3.
శ్రీబాగ్ ఒడంబడిక.
జవాబు:
1953 అక్టోబర్ 1వ తేదిన ఆంధ్రరాష్ట్రం అవతరించింది. నూతన రాష్ట్రానికి కర్నూల్ పట్టణాన్ని రాజధానిగా ఎంపిక చేయటమైంది. ఈ సమయంలో రాయలసీమ ఆంధ్రప్రాంత నాయకుల మధ్య కుదిరిన ఒడంబడికనే శ్రీబాగ్ ఒడంబడిక అంటారు. ఆంధ్రరాష్ట్ర అవతరణ దినోత్సవానికి ప్రధాని నెహ్రూ ముఖ్య అతిధిగా విచ్చేయడమైంది. ఆంధ్రరాష్ట్ర మొదటి ముఖ్యమంత్రిగా టంగుటూరి ప్రకాశం పంతులు వ్యవహరించారు.

ప్రశ్న 4.
ఫజల్ ఆలీ సంఘం.
జవాబు:
1952 డిసెంబర్ 15వ తేదిన ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం కావాలని ఆమరణ దీక్ష చేపట్టిన పొట్టి శ్రీరాములు అశువులు బాశారు. దాని ఫలితంగా ఆంధ్ర ప్రాంతంలో శాంతి భద్రతలకు తీవ్ర విఘాతం కలగటంలో ప్రజాభిప్రాయానికి తలొగ్గి ఆనాటి ప్రధాని నెహ్రూ 1) ఫజల్ ఆలీ 2) కె.ఎమ్. ఫణిక్కర్ 3) హృదయేంద్ర నాథ్ కుంజ్రూలతో ఒక సంఘాన్ని నియమించటం జరిగింది. ఈ సంఘానికి ఫజల్ ఆలీ చైర్మన్ గా వ్యవహరించటంతో దీనిని ఫజల్ అలీ సంఘం అంటారు. ఈ సంఘం ప్రత్యేక రాష్ట్రాల డిమాండ్ను పరిశీలించి తన నివేదికను 1955 అక్టోబర్లో కేంద్రప్రభుత్వానికి సమర్పించింది.

ప్రశ్న 5.
జాతీయ మానవ హక్కుల సంఘం చైర్మన్ నియామకంలో అనుసరించాల్సిన నియమాలు.
జవాబు:
జాతీయ మానవ హక్కుల సంఘం చైర్మను భారత రాష్ట్రపతి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించిన తరువాత ఖరారు చేసి నియమించటం జరుగుతంది. ఈ సందర్భంలో రాష్ట్రపతి ఆరుగురు సభ్యులతో కూడిన నియామకపు సంఘం సూచనలను పాటిస్తాడు.

AP Inter 2nd Year Civics Study Material Chapter 13 ఆంధ్రప్రదేశ్, ఇండియాలలో ఇటీవలి పరిణామాలు

ప్రశ్న 6.
మానవ హక్కుల సంఘం చైర్మన్, సభ్యుల నియామకంలో అనుసరించాల్సిన ప్రక్రియ. [Mar. ’17]
జవాబు:
రాష్ట్ర మానవ హక్కుల సంఘం చైర్మన్, సభ్యులను సంబంధిత రాష్ట్ర గవర్నర్ నియమిస్తారు. ఈ సందర్భంలో గవర్నర్కు సలహా ఇచ్చేందుకు అత్యున్నత స్థాయి సలహామండలి ఉంటుంది. అందులో రాష్ట్రముఖ్యమంత్రి, రాష్ట్ర హోం మంత్రి విధానసభ స్పీకర్, విధాన సభలోని ప్రతిపక్ష పార్టీ నాయకుడు సభ్యులుగా ఉంటారు. ఆ సలహా మండలికి ముఖ్యమంత్రి కన్వీనర్ ఉంటాడు. రాష్ట్ర మానవహక్కుల సంఘం సభ్యుల నియామకంలో గవర్నర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సంప్రదిస్తాడు.

ప్రశ్న 7.
పౌర న్యాయస్థానంగా మానవ హక్కుల సంఘం.
జవాబు:
మానవ హక్కుల సంఘం పౌర న్యాయస్థానంగా పనిచేస్తుంది. పౌర శిక్షాస్మృతికి అనుగుణంగా పనిచేసే సివిల్ కోర్టుకు ఉండే అధికారాలు ఈ సంఘానికి ఉంటాయి. దానితో సాక్షులను పిలిచేందుకు, ఏదైనా రాత ప్రతిని సమర్పించాలని కోరేందుకు, అఫిడవిట్లపై అవసరమైన సాక్ష్యాన్ని రాబట్టేందుకు మానవ హక్కుల సంఘం సంపూర్ణ అధికారాన్ని కలిగి ఉంది.

ప్రశ్న 8.
సైనిక దళాలపై జాతీయ మానవ హక్కుల సంఘం పరిధి.
జవాబు:
సైనిక దళాల సిబ్బంది మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడిన ఉదంతాలపై విచారణ జరిపే విషయంలో జాతీయ మానవ హక్కుల సంఘానికి పరిమితమైన పాత్ర మాత్రమే ఉంటుంది. అయితే ప్రభుత్వం ఆ సంఘం చేసిన సిఫార్సులను విమర్శించటానికి వీలులేదు అని ఆ కమీషన్ లోని మాజీ సభ్యుడు ఒకరు వ్యాఖ్యానించారు.

ప్రశ్న 9.
ప్రజా సమాచార అధికారి (P.I.O).
జవాబు:
ప్రజా సమాచార అధికారిని సమాచార కమీషన్ ఆదేశాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తుంది. ఈ అధికారి |సమాచార కమీషన్కు తన అధికారాలు, విధులలో తన సహాయ సహకారాలను అందిస్తారు.

AP Inter 2nd Year Civics Study Material Chapter 13 ఆంధ్రప్రదేశ్, ఇండియాలలో ఇటీవలి పరిణామాలు

ప్రశ్న 10.
సమాచారం అంటే ఏమిటి ?
జవాబు:
సమాచారమంటే ఏదో ఒక భౌతికరూపంలో ఉండేదిగా పేర్కొనవచ్చు. రికార్డులు, డాక్యుమెంట్లు, మెమోలు, ఈ-మెయిళ్ళు, అభిప్రాయాలు, సలహాలు, పత్రికాప్రకటనలు, సర్క్యులర్లు. ఆదేశాలు, లాగ్ పుస్తకాలు, నివేదికలు, కాగితాలు, నమూనాలు, ఎలక్ట్రానిక్ రూపంలో ఉండే ఏమైనా మెటీరియల్ మొదలైనవి సమాచారం క్రిందకు వస్తాయి.