AP 7th Class Social Important Questions Chapter 13 ప్రపంచ పరివర్తనలో మహిళలు

These AP 7th Class Social Important Questions 13th Lesson ప్రపంచ పరివర్తనలో మహిళలు will help students prepare well for the exams.

AP Board 7th Class Social 13th Lesson Important Questions and Answers ప్రపంచ పరివర్తనలో మహిళలు

ప్రశ్న 1.
క్రింది మహిళామణుల గురించి నీకు తెలిసిన విషయాలు వివరించండి.
1) కాదంబరి గంగూలి – చంద్రముఖి బసు 2) జానకి అమ్మాళ్ ఎడవళత్ కక్కర్ 3) కల్పనా చావ్లా
జవాబు:
1) కాదంబరి గంగూలి – చంద్రముఖి బసు :
కాదంబరి గంగూలి (1861 నుండి 1923) మరియు చంద్రముఖి బసు (1860-1944) భారతదేశంలోని మొదటి ఇద్దరు మహిళా గ్రాడ్యుయేట్లు. బ్రిటిష్ వలస కాలంలో జరిగిన బెంగాల్ సాంస్కృతిక విప్లవంలో కూడా వారు పాల్గొన్నారు. భారతదేశంలో పాశ్చాత్య వైద్యంలో పట్టా పొందిన మొదటి దక్షిణాసియా మహిళా వైద్యురాలు కాదంబరి గంగూలీ. చంద్రముఖి బసు బెతున్ కళాశాలలో లెక్చరర్ గా మరియు ప్రిన్సిపాల్ గా పనిచేశారు. భారతదేశంలో మహిళల విద్యకు వీరిద్దరూ ఎంతో స్ఫూర్తినిచ్చారు.
AP 7th Class Social Important Questions Chapter 13 ప్రపంచ పరివర్తనలో మహిళలు 1

2) జానకి అమ్మాళ్ ఎడవళత్ కక్కర్ :
జానకి అమ్మాళ్ ఎడవళత్ కక్కర్ బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ గా పదవిని చేపట్టి ప్రసిద్ధి చెందారు. ఆమె 1921లో ప్రెసిడెన్సీ కళాశాల నుండి వృక్షశాస్త్రంలో ఆనర్స్ డిగ్రీని పొంది క్రోమోజోమ్ లు కణ ప్రవర్తన మరియు ఫైటోజియోగ్రఫీకి ఎలా సంబంధం కలిగి ఉంటాయనే దానితో సంబంధం ఉన్న జన్యుశాస్త్రం యొక్క విభాగం అయిన సైటోజెనెటిక్స్ లో శాస్త్రీయ పరిశోధనను కొనసాగించి చెరకు మరియు వంకాయపై విస్తృతంగా పరిశోధనలు చేశారు. ఆమె 1977వ సంవత్సరంలో పద్మశ్రీ అవార్డును పొందారు. పద్మశ్రీ అవార్డు అందుకున్న మొదటి భారతీయ మహిళా శాస్త్రవేత్త జానకి అమ్మాళ్ ఎడవళత్ కక్కర్.
AP 7th Class Social Important Questions Chapter 13 ప్రపంచ పరివర్తనలో మహిళలు 2

3) కల్పనా చావ్లా :
కల్పనా చావ్లా, ఒక భారతీయ – అమెరికన్ వ్యోమగామి, జూలై 1, 1961న హర్యానాలోని కర్నాల్ లో మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది. గ్రాడ్యుయేషన్ తర్వాత, ఆమె నాసా యొక్క అమెస్ రీసెర్చ్ సెంటర్ లో ఓవర్సీస్ మెథడకు, వైస్ ప్రెసిడెంట్ అయ్యారు. ఈమె అంతరిక్షంలోకి అడుగుపెట్టిన తొలి భారతీయ మహిళ. ఫిబ్రవరి 1,2003న వాతావరణంలో STS-107 మిషన్ వైఫల్యం కారణంగా ఆమె మరణించింది. ఆమె ప్రతిభకు గుర్తింపుగా అమెరికా ప్రభుత్వం ఆమెకు కాంగ్రెషనల్ స్పేస్ మెడల్ ఆఫ్ ఆనర్ మరియు నాసా విశిష్ట సేవా పతకాన్ని ప్రధానం చేసింది.
AP 7th Class Social Important Questions Chapter 13 ప్రపంచ పరివర్తనలో మహిళలు 3

AP 7th Class Social Important Questions Chapter 13 ప్రపంచ పరివర్తనలో మహిళలు

ప్రశ్న 2.
క్రింద ఇవ్వబడిన మహిళల వ్యక్తిత్వాలు ఏ విధంగా స్పూర్తిదాయకమో వివరించండి.
1) మిథాలీ రాజ్, 2) ప్రాంజల్ పాటిల్, 3) సీమా రావు
జవాబు:
1) మిథాలీ రాజ్ :
మిథాలీ రాజ్ తన రెండు దశాబ్దాల అంతర్జాతీయ కెరీర్లో అనేక మైలు రాళ్లను చేరుకున్న భారతదేశపు గొప్ప మహిళా బ్యాట్స్ ఉమెన్. మహిళల అంతర్జాతీయ క్రికెట్ లో అత్యధిక పరుగులు చేసిన క్రీడాకారిణి మిథాలీ. మహిళల వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్ లో 7,000 పరుగుల మార్కును అధిగమించిన మహిళా క్రికెటర్ ఆమె మాత్రమే. 1982వ సంవత్సరంలో డిసెంబర్ 3వ తేదిన రాజస్థాన్‌లోని జోధ్ పూర్లో జన్మించిన ఆమె చదువుకునే రోజుల్లోనే క్రికెట్ లో శిక్షణ తీసుకోవడం ప్రారంభించింది. మిథాలీ పదిహేడేళ్ల వయసులో భారత జట్టుకు ఎంపికైంది. ఆమె ప్రశంసనీయమైన ప్రదర్శనలు ఆమెకు “లేడీ సచిన్” అనే ట్యాగ్ ని సంపాదించి పెట్టాయి. ప్రస్తుతం మిథాలీ రాజ్ మహిళల అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన క్రీడాకారిణిగా ప్రసిద్ధి పొందింది. ఆమెకు ఖేల్ రత్న పురస్కారం లభించింది.
AP 7th Class Social Important Questions Chapter 13 ప్రపంచ పరివర్తనలో మహిళలు 4

2) ప్రాంజల్ పాటిల్ :
మహారాష్ట్రలోని ఉలాస్ నగర కు చెందిన ప్రాంజల్ పాటిల్ భారతదేశంలో మొదటి దృష్టి లోపం ఉన్న IAS అధికారిణి. 2019 అక్టోబర్ లో కేరళలోని తిరువనంతపురంలో సబ్ కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. చాలా చిన్న వయస్సు నుండి అంధత్వం.ఆటంకంగా ఉన్నప్పటికీ ప్రాంజల్ పాటిల్ తన కలలను కొనసాగించింది. ఆమె తన దయనీయ పరిస్థితికి భయపడలేదు. దేశానికి సేవ చేయాలనే ఆమె కోరికను ఆమె బలహీనత నిరోధించ లేకపోయినది. 2017లో UPSC నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్షలలో ఆమె కఠోర దీక్షతో 124వ ర్యాంకు సాధించి, సంకల్ప బలం ఉంటే అన్ని అవరోధాలను అధిగమించవచ్చని నిరూపించింది.
AP 7th Class Social Important Questions Chapter 13 ప్రపంచ పరివర్తనలో మహిళలు 5

3) సీమా రావు :
ఇప్పటి వరకు ఏ భారతీయ మహిళ సాధించనిది సీమా రావు సాధించింది. సీమా రావు దేశంలోనే తొలి మహిళా కమాండో ట్రైనర్. ఆమె భర్త మేజర్ దీపక్ రావు భాగస్వామ్యంతో, ఆమె 15,000 మంది సైనికులకు క్లోజ్-క్వార్టర్ యుద్ధాల్లో శిక్షణ ఇచ్చింది. ప్రొఫెషనల్ మెడికల్ డాక్టర్ గా కూడా అర్హత పొందింది. ఆమె సంక్షోభ నిర్వహణలో MBA కలిగి ఉంది. బ్రూస్ లీ అభివృద్ధి చేసిన మార్షల్ ఆర్ట్స్ లో జీత్ కునే డోలో శిక్షణ పొందిన ప్రపంచంలోని 10 మంది మహిళలలో ఆమె ఒకరు.
AP 7th Class Social Important Questions Chapter 13 ప్రపంచ పరివర్తనలో మహిళలు 6

ప్రశ్న 3.
స్పూర్తిదాయకమైన ఈ క్రింది మహిళా రత్నాల గురించి వివరించండి.
1) రాజీకుమారి దేవి, 2) వందనా శివ, 3) లక్ష్మీ అగర్వాల్
జవాబు:
1) రాజ్ కుమారీ దేవి :
బీహార్‌కు చెందిన రాజ్ కుమారీ దేవి అనే రైతు అనేక గ్రామాలలో సైకిల్ పై తిరుగుతూ వంటగది వ్యవసాయంపై తన అనుభవాలను గ్రామీణ మహిళలతో పంచుకొని వారిలో వ్యవస్థాపకత స్ఫూర్తిని నింపింది. వ్యవసాయం మరియు చిన్న తరహా వ్యాపారాల ద్వారా మహిళలు ఆర్థికంగా ఎలా స్వతంత్రంగా మారగలరో చూపించడమే ఆమె లక్ష్యం. దీని కోసం రాజ కుమారి ఒక లాభాపేక్ష లేని ఆనంద్ పూర్ జ్యోతి అనే సెంటర్‌ను ప్రారంభించింది. ఇది వివిధ SHG – నడపబడుతున్న వ్యవసాయ క్షేత్రాల నుండి తాజా ఉత్పత్తులను సేకరించి, జెల్లీలు, జామ్లు మరియు ఊరగాయలు వంటి ప్రాసెస్ చేయబడిన ఉత్పత్తులను తయారుచేసే మహిళల సమూహం దగ్గరకు తీసుకువెళ్లింది. ఆమె సేవలకు గాను 2019లో పద్మశ్రీ అవార్డుతో సత్కరించారు.
AP 7th Class Social Important Questions Chapter 13 ప్రపంచ పరివర్తనలో మహిళలు 7

2) వందనా శివ :
వందనా శివ ఒక పర్యావరణ వేత్త మరియు పర్యావరణ హక్కుల కార్యకర్త, మరియు రీసెర్చ్ ఫౌండేషన్ ఫర్ సైన్స్, టెక్నాలజీ అండ్ ఎకాలజీ వ్యవస్థాపకురాలు. ఇది పర్యావరణ మరియు సామాజిక సమస్యలపై పరిశోధన చేసే స్వతంత్ర పరిశోధనా సంస్థ. వందన ప్రయత్నాలు జీవన వనరుల వైవిధ్యం మరియు సమగ్రతను, ముఖ్యంగా స్థానిక విత్తనాలను రక్షించడానికి నవధాన్య అనే జాతీయ ఉద్యమం ఏర్పడటానికి దారితీశాయి. ఆమె 1993లో రైట్ లైబ్లీహుడ్ అవార్డును మరియు 2010 సిడ్నీ శాంతి బహుమతిని అందుకుంది.
AP 7th Class Social Important Questions Chapter 13 ప్రపంచ పరివర్తనలో మహిళలు 8

3) లక్ష్మీ అగర్వాల్ :
లక్ష్మీ అగర్వాల్ యాసిడ్ దాడి బాధితురాలు. ఆమె యాసిడ్ దాడి బాధితుల హక్కుల కోసం పోరాడుతుంది. 2005వ సంవత్సరంలో, 15 ఏళ్ల వయస్సులో ఉన్న ఆమెపై 32 ఏళ్ల వ్యక్తి యాసిడ్తో దాడి చేశాడు. యాసిడ్ విక్రయాలను నియంత్రించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని, యాసిడ్ దాడులపై విచారణను సులభతరం చేసేలా పార్లమెంటును ఆదేశించాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆమె భారతదేశంలో యాసిడ్ దాడుల నుండి బయటపడిన వారికి సహాయం చేయడానికి అంకితమైన NGO ఛాన్స్ ఫౌండేషను డైరెక్టర్. లక్ష్మీ US ప్రథమ మహిళ మిచెల్ ఒబామాచే 2014 ఇంటర్నేషనల్ ఉమెన్ ఆఫ్ కరేజ్ అవార్డును అందుకుంది. ఆమె NDTV ఇండియన్ ఆఫ్ ది ఇయర్ గా కూడా ఎంపికైంది.
AP 7th Class Social Important Questions Chapter 13 ప్రపంచ పరివర్తనలో మహిళలు 9

ప్రశ్న 4.
‘నందిని హరినాథ్’ గురించిన ముఖ్య విశేషాలు తెలియజేయండి.
జవాబు:
నందిని హరినాథ్ బెంగుళూరులోని ఇస్రో (ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్) శాటిలైట్ సెంటర్ లో రాకెట్ శాస్త్రవేత్త, నందిని గత 20 సంవత్సరాలుగా ఇస్రోలో పనిచేస్తున్నారు. ఆమె మార్స్ ఆర్బిటర్ మిషన్ మంగళయానికి ప్రాజెక్ట్ మేనేజర్, మిషన్ డిజైనర్ మరియు డిప్యూటీ ఆపరేషన్స్ డైరెక్టర్ గా పనిచేశారు. ఆమె ఇస్రోలో 20 ఏళ్లుగా 14 మిషన్లలో పనిచేశారు.

ప్రశ్న 5.
‘అర్చనా సోరెంగ్’ యొక్క విజయగాథను క్లుప్తంగా వివరించండి.
జవాబు:
అర్చనా సోరెంగ్, ఒడిశాకు చెందిన గిరిజన యువతి. ఈమె పాట్నా మహిళా కళాశాల నుంచి పొలిటికల్ సైన్స్ లో డిగ్రీ, ముంబయిలోని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ నుంచి మాస్టర్స్ డిగ్రీ చేసింది. తర్వాత ఒడిశాలోని ‘వసుంధర’ అనే ఎన్జీఓలో చేరి అడవులు, పర్యావరణ పరిరక్షణపై చైతన్య కార్యక్రమాలు నిర్వహించింది. ఇందులో గిరిజన సాంప్రదాయాలు వారు పర్యావరణ పరిరక్షణకు చేపడుతున్న చర్యలు, అందులోని ఇబ్బందుల గురించి ఆమే రాసిన కథనాలు జాతీయ, అంతర్జాతీయ వెబ్ సైట్లలో ప్రచురితమయ్యాయి. ఫలితంగా ఈమె ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఎంపిక చేసిన వాతావరణ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి పరిష్కారాలను అందించే యువజన సలహా సంఘ సభ్యులు ‘యంగో’ లోని ఏడుగురు సభ్యులలో ఒకరిగా ఎంపికై తన సేవలను అంతర్జాతీయ స్థాయిలో అందిస్తున్నారు.

ప్రశ్న 6.
సన్నివేశం -1
AP 7th Class Social Important Questions Chapter 13 ప్రపంచ పరివర్తనలో మహిళలు 10
దసరా సెలవులు వచ్చాయి. ధరణి వాళ్ళ అమ్మమ్మ గారి ఊరు వెళ్తానని వాళ్ళ అమ్మని అడిగింది “నాకు తెలియదు, నాన్నని అడుగు” అంది అమ్మ. ధరణి వాళ్ళ నాన్నని అడిగింది. “అమ్మాయి ఒంటరిగా వెళ్ళకూడదు. తమ్ముడితో వెళ్ళు” అన్నాడు నాన్న.
1) పై సన్నివేశం ఏమి తెలియజేస్తుంది?
జవాబు:
పై సన్నివేశంలో గృహ యజమానిగా తండ్రి ఉన్నాడు. (పితృస్వామిక కుటుంబం) తల్లికి నిర్ణయాలు తీసుకోవటంలో అంత స్వేచ్ఛ లేనట్లుంది.

2) బాలికలు ఒంటరిగా ప్రయాణించలేరనే భావన సమర్థనీయమేనా?
జవాబు:
బాలికలు ఒంటరిగా ప్రయాణించలేరనే భావన కొన్ని సందర్భాలలో, కొన్ని అవాంఛనీయ సంఘటనలు జరిగిన మీదట ఒక్కొక్కప్పుడు సమర్థనీయమే. కొన్ని సందర్భాలలో అభద్రతా భావం వల్ల బాలికలు, మహిళలు ఒంటరిగా ప్రయాణించలేకపోవుచున్నారు.

AP 7th Class Social Important Questions Chapter 13 ప్రపంచ పరివర్తనలో మహిళలు

ప్రశ్న 7.
సన్నివేశం -2
AP 7th Class Social Important Questions Chapter 13 ప్రపంచ పరివర్తనలో మహిళలు 11
రంగయ్య, రాజమ్మ భవన నిర్మాణ కార్మికులుగా పనిచేస్తున్నారు. రంగయ్యకు రోజుకు రూ. 500 ఇస్తున్నారు. రాజమ్మకు రూ. 300 మాత్రమే ఇస్తున్నారు.
1) సమాన పనికి పురుషుల కంటే స్త్రీలకు తక్కువ వేతనం ఇవ్వడం సమంజసమేనా? ఎందుకు?
జవాబు:

  1. సమాన పనికి పురుషుల కంటే స్త్రీలకు తక్కువ వేతనం ఇవ్వడం సమంజసం కాదు. కాని కొన్ని బలం/ శక్తితో కూడుకున్న పనుల్లో సమర్థనీయమే. కారణం :
  2. పురుషులు సిమెంటు బస్తాని ఒక్కరే మోయగలరు. అదే బస్తాను ఇద్దరు మహిళలు మోయాల్సి వస్తుంది. ఇలా అధిక శక్తితో కూడుకున్న పనుల్లో ఈ వ్యత్యాసం సాధారణమే.

ప్రశ్న 8.
సన్నివేశం -3
AP 7th Class Social Important Questions Chapter 13 ప్రపంచ పరివర్తనలో మహిళలు 12
వినయ్ పదవ తరగతిలో మంచి మార్కులతో పాసయ్యాడు. హెటల్ మేనేజ్ మెంట్ కోర్సులో చేరతానని తండ్రికి చెప్పాడు. “అది అమ్మాయిల చదువు. దానిని నువ్వు చదవడం ఏమిటి? ఇంజనీరు లేదా డాక్టర్ కావడానికి ఉపయోగపడే కోర్సులో చేరు” అని తండ్రి చెప్పాడు.
1) ఆడవారు చదివే కోర్సులు, మగవారు చదివే కోర్సులు అని విభజించడం సమంజసమేనా? చదువుల్లో వ్యత్యాసం ఉంటుందా?
జవాబు:

  1. ఆడవారు చదివే కోర్సులు, మగవారు చదివే కోర్సులు అని విభజించడం సమంజసం కాదు. చదువుల్లో వ్యత్యాసం ఉండదు.
  2. జ్ఞానం, నైపుణ్యం, అవగాహన శక్తి మొదలైన ‘IQ’ అంశాలు అందరికి సమానంగానే ఉంటాయి. ఆడవారికి, మగవారికి వేరువేరుగా ఉండవు, అవి జెండర్ ని బట్టి మారవు. సాధారణంగా భిన్నత్వాలు అందరిలో
    ఉంటాయి. ఆడవారిలోనే ఉండవు.

AP 7th Class Social Important Questions Chapter 13 ప్రపంచ పరివర్తనలో మహిళలు

ప్రశ్న 9.
సన్నివేశం -4
AP 7th Class Social Important Questions Chapter 13 ప్రపంచ పరివర్తనలో మహిళలు 13
భావన, శైలజ 10వ తరగతి ఉత్తీర్ణులైనారు. బాగా చదివి కలెక్టర్ అవుతానని భావన తన తల్లిదండ్రులకు చెప్పింది. వారు భావనను ఓ ప్రముఖ కళాశాలలో చేర్చారు. శైలజ కూడా అలాగే తల్లిదండ్రులతో చెప్పింది. అయితే ఆడపిల్లలకు ఉన్నత చదువులు అనవసరమని, ఆమెకు పెళ్లి చేస్తామని ఆమె తల్లిదండ్రులు చెప్పారు.
1) తల్లిదండ్రులు ఆలోచించే విధానాలలో గల వ్యత్యాసమునకు కారణమేమిటని మీరు అనుకుంటున్నారు?
జవాబు:
తల్లిదండ్రులు ఆలోచించే విధానాలలో గల వ్యత్యాసమునకు గల కారణాలు :

  1. తల్లిదండ్రుల నిరక్షరాస్యత,
  2. తల్లిదండ్రుల మూఢనమ్మకాలు, విశ్వాసాలు,
  3. తల్లిదండ్రుల ఆర్థిక స్థోమత,
  4. తల్లిదండ్రుల కుల, మత సంప్రదాయాలు,
  5. తల్లిదండ్రుల కుటుంబ నేపథ్యము,
  6. అభద్రతా భావము,
  7. పిల్లల ప్రవర్తనా రీతులు,
  8. తల్లిదండ్రుల ఆసక్తులు, అభీష్టాలు,
  9. తల్లిదండ్రుల లక్ష్యాలు.

2) బాలిక చదవును కొనసాగించడానికి ఎందుకు మద్దతు లభించలేదు?
జవాబు:
బాలిక చదవును కొనసాగించడానికి ఎందుకు మద్దతు లభించలేదంటే :

  1. ప్రధానంగా అభద్రతా భావం,
  2. పేదరికం,
  3. సమాజంలోని కట్టుబాట్లు, మూఢ నమ్మకాలు,
  4. బాల్య వివాహాలు,
  5. ఆడపిల్ల చదువుకొని ఏం చేస్తుంది, పెళ్ళి చేసుకొని వెళ్ళిపోవాల్సిందే కదా అనే భావన,
  6. తనంత చదువుకున్న వారినే భర్తగా తేవాలంటే కట్నం ఎక్కువవుతుందని మొదలైన అంశాలు కలవు.

మీకు తెలుసా?

7th Class Social Textbook Page No. 173

భారతదేశంలో 83.6 శాతం మంది శ్రామిక మహిళలు వ్యవసాయ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. వారు నాట్లు వేయడం, కలుపు తీయడం, పంట కోయడం మరియు నూర్పిడి చేయడం వంటి పనులు చేస్తారు. అయితే, వ్యవసాయం గురించి ఆలోచించినప్పుడు మనం మగవారిని మాత్రమే గుర్తుకు తెచ్చుకుంటాం.

మూలం : NSS 61వ రౌండ్ (2004-05)

AP 7th Class Social Important Questions Chapter 13 ప్రపంచ పరివర్తనలో మహిళలు

7th Class Social Textbook Page No. 179

  1. జ్యోతిబాపూలే మరియు సావిత్రీబాయి పూలే
  2. మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటాము.