AP Inter 2nd Year History Study Material Chapter 10 జర్మనీ, ఇటలీలలో విమోచన (ఏకీకరణ) ఉద్యమాలు మొదటి నెపోలియన్

Andhra Pradesh BIEAP AP Inter 2nd Year History Study Material 10th Lesson జర్మనీ, ఇటలీలలో విమోచన (ఏకీకరణ) ఉద్యమాలు మొదటి నెపోలియన్ Textbook Questions and Answers.

AP Inter 2nd Year History Study Material 10th Lesson జర్మనీ, ఇటలీలలో విమోచన (ఏకీకరణ) ఉద్యమాలు మొదటి నెపోలియన్

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
కౌంట్్కవూర్ జీవితం, ఇటలీ ఏకీకరణలో అతని పాత్ర ఎట్టిది ?
జవాబు:
ఇటలీ ఏకీకరణ కోసం పోరాడిన ముఖ్య నాయకుడు కౌంట్-కామిలో-డి-కవూర్’. ఇతడు 1810 సంవత్సరంలో పీడ్మాంట్లో భూస్వామ్య కుటుంబంలో జన్మించాడు. యుక్తవయస్సులో సార్టీనియా సైన్యంలో ఇంజనీర్గా పనిచేసాడు. ఇతడు ప్రజాస్వామ్య, పార్లమెంటరీ విధానాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేశాడు. పీడ్మాంట్ పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. 1850లో ఇతనిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. 1852లో సార్జీనియా ప్రధానమంత్రి అయ్యాడు. ఆంగ్ల రచయితల ప్రభావం వల్ల కవూర్ వివిధ రంగాలలో ఆరితేరాడు. ఇంగ్లాండ్, ఫ్రాన్స్ దేశాలకు వెళ్ళి సమగ్రమైన, విశాలమైన భావాలను అవగాహన చేసుకున్నాడు. పీడ్మాంట్ నాయకత్వంలో ఇటలీ ఏకీకరణ సాధ్యమవుతుందని బలంగా నమ్మి రాజ్యాంగబద్ద రాజరికం స్థాపించాలని ఆశించాడు.

క్రిమియా యుద్ధం – ఫ్రాన్స్లో సంధి: కవూర్ ఇటలీ ఏకీకరణ కోసం ఇంగ్లాండ్, ఫ్రాన్స్లతో సంధి కోసం ఎదురుచూస్తున్నాడు. ఇంగ్లాండు పెద్ద సైన్యం లేకపోయినా యుద్ధాలలో మునిగి ఉంది. కాని ఫ్రాన్స్కు మంచి సైన్యం ఉంది. 3వ నెపోలియన్ ఆశాపరుడు, సాహసికుడు. కవూర్ 3వ నెపోలియన్కు దగ్గరయ్యాడు. అప్పుడు క్రిమియా యుద్ధం కవూర్కు మంచి అవకాశం కలిగించింది. ఫ్రాన్స్, ఇంగ్లాండ్లతో పొత్తు కుదుర్చుకుని రష్యాతో యుద్ధానికి సిద్ధమయ్యాడు. రెండు సంవత్సరాల తర్వాత క్రిమియా యుద్ధంలో ఫ్రాన్స్, ఇంగ్లాండ్లకు ఇటలీ చేసిన సేవలకు గుర్తుగా మూడవ నెపోలియన్ కవూర్ను ప్లాంబియర్స్కు ఆహ్వానించి ఆస్ట్రియాతో యుద్ధానికి కుట్ర పన్ని ఇటలీ నుంచి తరిమివేయడానికి అంగీకరించాడు.

ఫ్రాన్స్లో సంధి, ఆస్ట్రియాతో యుద్ధం: ఆస్ట్రియాను ఇటలీ నుండి పారద్రోలుటకు కవూర్కు ఫ్రెంచి సహాయం అవసరం. దీనికోసం 1858 జూలైలో ఫ్రెంచి రాజు 3వ నెపోలియన్, కవూర్ల మధ్య ఒప్పందం కుదిరింది. ఆస్ట్రియాను లంబార్డీ, వెనీషియాల నుంచి పారద్రోలటానికి ఫ్రాన్స్ అంగీకరించింది. దీని ద్వారా సార్డీనియాతో అవి విలీనమౌతాయి. అందుకు ప్రతిఫలంగా పీడ్మాంట్ ఆధీనంలోని నైస్, సెవాయ్లను ఫ్రాన్స్ పొందుతుంది. ఆ తర్వాత 1859 ఏప్రిల్లో ఆస్ట్రియా సార్టీనియా సైన్యాన్ని తగ్గించమని హెచ్చరిక చేసింది. సార్డీనియా తిరస్కరించగా పార్టీనియా, ఆస్ట్రియా, ఫ్రాన్స్ల మధ్య యుద్ధం మొదలైంది.

AP Inter 2nd Year History Study Material Chapter 10 జర్మనీ, ఇటలీలలో విమోచన (ఏకీకరణ) ఉద్యమాలు మొదటి నెపోలియన్

యుద్ధం 1859 ఏప్రిల్ నుండి జూలై వరకు జరిగింది. మిత్రరాజ్యాలు మాజెంటా, సల్ఫరినోలలో విజయాన్ని సాధించాయి. అయితే యుద్ధం మధ్యలో ఫ్రెంచి రాజు హఠాత్తుగా యుద్ధం నుంచి విరమించుకొని ఆస్ట్రియాతో జూలై 11, 1859లో విల్లా ఫ్రాంకా సంధి చేసుకున్నాడు. ఆ సమయంలో లంబార్డ్ పీడ్మాంట్ ఆధీనంలోను, వెనీషియా ఆస్ట్రియా ఆధీనంలోను ఉన్నాయి.

ఈ సంఘటనతో కవూర్ అసంతృప్తి చెంది తన పదవికి రాజీనామా చేసాడు. అయితే రాజు రాజీనామాను అంగీకరించలేదు. తరువాత జరిగిన పరిణామాల వల్ల మొడీనా, ఫార్మా, టస్కనీ, పోప్ రాష్ట్రాల రాజులు కవూర్ ప్రోద్భలంతో సార్టీనియా, పీడ్మాంట్లతో కలిసిపోవుటకు ముందుకొచ్చారు. విక్టర్ ఇమ్మాన్యుయేల్, కవూర్లు ప్రజాభిప్రాయ సేకరణ జరిపి ఈ రాజ్యాలను సార్డీనియా, పీడ్మాంట్లలో 1860 మార్చి నెలలో ఏకం చేసారు. విక్టర్ ఇమ్మాన్యుయేల్ను ఇటలీ రాజుగా చేసి 2 ఏప్రియల్ 1860లో మొదటి పార్లమెంట్ సమావేశాన్ని ట్యురిన్లో ఏర్పాటు చేశారు. కవూర్ ప్రోద్భలం వల్ల చివరకు మూడవ నెపోలియన్ మనసు మార్చుకొని సెవాయ్, నైస్లను తీసుకొని ఇటలీ రిపబ్లికన్ను గుర్తించాడు.

ప్రశ్న 2.
జర్మనీ ఏకీకరణలో బిస్మార్క్ పాత్ర ఎటువంటిది ?
జవాబు:
బిస్మార్క్ 1815 సంవత్సరంలో బ్రాండెన్ బర్గ్ లోని ప్రభువుల కుటుంబంలో జన్మించాడు. ఇతడు గోటింజెన్, బెర్లిన్ విశ్వవిద్యాలయాలలో విద్యను అభ్యసించి సివిల్ సర్వీస్లోకి వచ్చాడు. అయితే క్రమశిక్షణా రహిత్యం వల్ల బర్తరఫ్ అయ్యాడు. 1849 99 విప్లవ కాలంలో ఉదారవాదుల నుండి ప్రష్యా రాష్ట్రాన్ని కాపాడాడు. 1851లో బిస్మార్క్ రాజకీయ తత్వవేత్తగా చేరాడు. 1851 నాటికి బిస్మార్క్ రాజీలేని పోరాట యోధుడుగా, నాయకత్వ ప్రతిభ కలిగిన వాడుగా గణుతికెక్కాడు. విలియం బిస్మార్క్ పట్ల విశ్వాసంతో అతని మనస్తత్వాన్ని ఫ్రాంక్ఫర్డ్ జర్మనీ డైట్ లో ప్రష్యా ప్రతినిధిగా నియమించాడు. 1862లో రాజు విలియం బిస్మార్క్న ప్రధానమంత్రిగా నియమించాడు. అదే రోజు బిస్మార్క్ చేసిన నిర్ణయాలను పార్లమెంట్ తిరస్కరించగా, బిస్మార్క్ ఖచ్చితంగా తన నిర్ణయాలను పార్లమెంట్ ఆమోదం ఉన్నా లేకున్నా అమలు చేస్తానని చెప్పాడు. బిస్మార్క్ ధైర్యం వల్ల మొదటి విలియం జర్మనీ ఏకీకరణకు పార్లమెంట్తో పోరాడటానికి సిద్ధమయ్యాడు.

రక్తపాత విధానం: బిస్మార్క్ ముఖ్య ధ్యేయం జర్మనీ ఏకీకరణ ప్రష్యా ఆధీనంలో జరగాలని భావించడం. యుద్ధాల వల్ల జర్మనీ ఏకీకరణ సాధ్యము కాదని అతని అభిప్రాయం. “సమస్యలు, ఉపన్యాసాల వల్ల కాని, చర్చలు, సమావేశాలు, పార్లమెంట్ తీర్మానాల వల్లగాని పరిష్కరింపబడజాలవు. కఠిన దండనీతే దీనికి పరిష్కారం” అని పేర్కొన్నాడు. దీనినే ‘రక్తపాత విధానం’ అంటారు. బిస్మార్క్ జర్మనీ ఏకీకరణకు ఈ ‘రక్తపాత విధానం’నే అనుసరించాడు. తరువాత జర్మనీ ఏకీకరణ కోసం ప్రష్యా డెన్మార్క్ ను, ఆస్ట్రియాతోను, ఫ్రాన్స్ ను మూడు యుద్ధాలు చేసింది.

డెన్మార్క్తో యుద్ధం 1864: ఆస్ట్రియాతో యుద్ధం కోసం ఎదురు చూస్తున్న బిస్మార్క్కు ఫ్లెష్వగ్, హాల్టిస్టీన్ సమస్య అవకాశం కలిగించింది. ఈ రెండు సంస్థానాలు డెన్మార్క్ రాజు ఆధీనంలో ఉండేవి. ఇవి రెండు డెన్మార్క్ రాజు ఆధీనంలో ఉన్న వాటిని కలుపుకునే హక్కు అతనికి లేదు. 1863లో 9వ క్రిష్టియన్ సింహాసనం అధిష్టించి డేనిష్ ప్రజలు కోరిక మేరకు రెండు సంస్థానాలను విలీనం చేయడంలో ఆ సంస్థానాల్లో ఉన్న జర్మన్లు ఈ చర్యను తీవ్రంగా వ్యతిరేకించి తిరుగుబాటు చేసారు.

ఆస్ట్రియాతో సంధి: బిస్మార్క్ ఫ్లెష్వగ్, హాల్టిన్ సమస్య పరిష్కరించుటకు ఆస్ట్రియాతో సంధి కుదుర్చుకున్నాడు. 1864లో ప్రష్యా, ఆస్ట్రియా దేశాలు డెన్మార్క్ మీద యుద్ధం ప్రకటించి డెన్మార్క్న ఓడించాయి. డెన్మార్క్ రాజు ఆ ప్రాంతాలను ఆస్ట్రియా, ప్రష్యాలకు అప్పగించాడు.

ఆస్ట్రియాతో యుద్ధం: తరువాత కాలంలో బిస్మార్క్ ఆస్ట్రియాపై యుద్ధం చేయడానికి పన్నాగం పన్నాడు. తన దౌత్యనీతితో యూరప్ దేశాలు ఆస్ట్రియాకు అండగా నిలబడకుండా చేసాడు. రష్యా, ఫ్రాన్స్, సార్డీనియాలతో, ఇతర దేశాలతో ప్రత్యేక సంధులను చేసుకున్నాడు. చివరకు 1866 లో ప్రష్యా, ఆస్ట్రియాల మధ్య యుద్ధం జరిగింది. దీనిని AP ఏడు వారాల యుద్ధం అన్నారు. యుద్ధంలో ఓడిన ఆస్ట్రియా ‘ప్రేగ్సంధి’కి ఒప్పుకుంది. దీని ప్రకారం ప్రష్యాకు ‘హాల్టిన్’ ను ఇచ్చింది. ఉత్తర జర్మన్ రాష్ట్రాలు ప్రష్యా ఆధీనంలోకి వచ్చాయి.

దక్షిణ జర్మన్ రాజ్యాలు ఉత్తర జర్మన్ సమాఖ్యలో చేరుట: దక్షిణ జర్మన్ రాష్ట్రాలైన బవేరియా, వర్టంబర్గ్, బెడెన్, హెస్పె ఉత్తర జర్మన్ సమాఖ్యకు వెలుపల ఉన్నాయి. బిస్మార్క్ వీటి ఐక్యత కొరకు జర్మన్లలో ఫ్రెంచివారి పట్ల విముఖత కలిగేటట్లు చేసాడు. ఫ్రాన్స్లో చివరకు 1870లో ప్రష్యాకు యుద్ధం జరిగింది. బిస్మార్క్ తన కుటిలనీతితో ఇరు దేశాల మధ్య యుద్ధం జరిగేలా చూసాడు. ఈ యుద్ధంలో ఫ్రాన్స్ ప్రష్యాకు లొంగిపోయింది.

ఫ్రాంకో-ప్రష్యా యుద్ధం తర్వాత జర్మనీ ఏకీకరణకు దక్షిణ జర్మన్ రాజ్యాలు ప్రష్యాలో విలీనానికి అంగీకరించాయి. జనవరి 18, 1871న మొదటి విలియం జర్మనీ చక్రవర్తిగా ‘వర్సే’ రాజప్రసాదంలో పట్టాభిషేకం జరుపుకున్నాడు. బెర్లిన్ జర్మనీ రాజధానిగా ప్రకటించబడింది.

తన యొక్క దండనీతి రక్తపాత విధానంతోపాటు సామ, దాన, దండ, భేదోప్రాయాలతో జర్మన్ ఏకీకరణ చేసి ‘ఐరన్ మ్యాన్’ అని కీర్తినిపొందాడు.

ప్రశ్న 3.
1866 ఆస్ట్రియా – ప్రష్యాల యుద్ధ వివరాలు తెలపండి.
జవాబు:
సమాఖ్య రాజ్యాల సేవలు ఆస్ట్రియాతో కలసి ప్రష్యామీద దాడి చేయడంతో ఆత్మరక్షణ కోసం తమకు యుద్ధం అనివార్యమైందని ప్రష్యా యుద్ధంలోకి దిగింది. కానీ యుద్ధానికి సిద్ధంగా లేని ఆస్ట్రియా ‘గాస్టిన్ ఒప్పందాన్ని’ 1865 ఆగస్ట్లో చేసుకుంది. దీని ప్రకారం ప్లేష్వగ్ ప్రష్యా ఆధీనంలోను, హాల్టిన్ ఆస్ట్రియా ఆధీనంలో ఉంటాయి. మరోవైపు ఆస్ట్రియాపై యుద్ధం ప్రకటించడానికి బిస్మార్క్ పన్నాగం పన్నాడు.

సంస్థానాల పంపకాన్ని నిరసించిన ఆస్ట్రియా ప్రాంక్ఫర్టోని జర్మనీ సమాఖ్య పార్లమెంట్కు ఫిర్యాదు చేసింది. ఆస్ట్రియా గాస్టిన్ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని బిస్మార్క్ ఆరోపించాడు. బిస్మార్క్ భవిష్యత్తులో జరిగే ఆస్ట్రియా ప్రష్యా యుద్ధంలో ఐరోపా రాజ్యాలు ఆస్ట్రియావైపు వెళ్ళకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. తన దౌత్యనీతితో ఐరోపా రాజ్యాలు జోక్యం చేసుకోకుండా ఆస్ట్రియాను ఏకాకిని చేసాడు. రష్యా ఫ్రాన్స్, సార్డీనియా ఇతర దేశాలతో ప్రత్యేక సంధులను చేసుకున్నాడు. చివరకు ప్రష్యా, ఆస్ట్రియాల మధ్య జూన్ 1866లో యుద్ధం మొదలైంది.

AP Inter 2nd Year History Study Material Chapter 10 జర్మనీ, ఇటలీలలో విమోచన (ఏకీకరణ) ఉద్యమాలు మొదటి నెపోలియన్

ప్రష్యా – ఆస్ట్రియాల మధ్య యుద్ధం ఏడువారాలు జరిగింది. అందువలన దీనిని ఏడువారాల యుద్ధమని కూడా అంటారు. సైనిక పాటవానికి పేరుగాంచిన ప్రష్యా సైన్యం ఆస్ట్రియాను సెడోవా వద్ద ఓడించింది. ఆస్ట్రియా సంధికై వేడుకొంది. ఫలితంగా ఇరువురికి మధ్య ప్రేగ్ సంధి జరిగింది.

ప్రేగ్ సంధి షరతులు: దీని ప్రకారం

  1. ఆస్ట్రియా, ప్రష్యాకు హాల్షన్ను, ఇటలీకి వెనీషియాను ఇచ్చింది.
  2. యుద్ధ నష్టపరిహారం చెల్లించటానికి ఒప్పుకున్నది.
  3. జర్మన్ రాష్ట్రాలతో ఉత్తర జర్మన్ సమాఖ్య ప్రష్యా నాయకత్వంలో ఏర్పడి ఫ్లెష్వగ్, హాల్టిన్, హోనోవర్, హెస్సే – కాస్సెల్, నాసా, ఫ్రాంక్ఫర్ట్లు ప్రష్యా ఆధీనంలో వచ్చాయి.
  4. జర్మన్ రాష్ట్రాలపై ప్రష్యా ఆధిపత్యాన్ని బిస్మార్క్ తొలగించాడు.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ఇటలీ ఏకీకరణకు గారిబాల్డి చేసిన సేవ ఎటువంటిది ?
జవాబు:
మాజినీ, కవుర్ వలె ఇటలీ ఏకీకరణకు పోరాడిన మరో నాయకుడు గారిబాల్డి. ఇతడు 1807లో ‘నైస్’లో జన్మించాడు. యంగ్ ఇటలీలో చేరాడు. 1834లో సెనాయ్ మాజనీ పన్నిన కుట్రలో పాల్గొని, విఫలమై మరణ శిక్షకు గురయ్యాడు తప్పించుకుని దక్షిణ అమెరికాకు పారిపోయి 14 సంవత్సరాలు ప్రవాస జీవితం గడిపాడు. తరువాతి కాలంలో గారిబాల్డి ‘రెడ్ షర్ట్స్’ అనే స్వచ్ఛంద సైనిక దళాన్ని నిర్మించి సిసిలీ ప్రజలకు అండగా నిలిచాడు.

గారిబాల్డి ప్రజాస్వామిక వాది. అంతకుమించిన గొప్ప దేశభక్తిపరుడు. జాతీయ సమైక్యత కోసం తన స్వప్రయోజనాన్ని ప్రక్కన పెట్టి సిసిలీ రాజ్యాన్ని విక్టర్ ఇమ్మాన్యుయేల్కు అప్పగించాడు. ప్రజాభిప్రాయంలో గారిబాల్డి రెండవ ఫ్రాన్సిస్లు నేపుల్స్, సిసిలీలను సార్డీనియాలో విలీనం చేసాడు.

ప్రశ్న 2.
మొదట నెపోలియన్ జర్మనీ ఏకీకరణకు చేసిన సేవ ఎటువంటిది ?
జవాబు:
మొదటి నెపోలియన్ జర్మనీలో జాతీయతా భావం, ప్రజాస్వామ్యాలకు బీజం వేసాడు. జర్మనీలో పవిత్ర రోమన్ సామ్రాజ్యాన్ని రద్దుచేసాడు. క్రీ.శ. 1806లో ప్రష్యా, ఆస్ట్రియాలు లేకుండా జర్మనీ రాష్ట్రాలతో రైన్ కూటమిని లేక సమాఖ్యతను ఏర్పాటు చేసాడు. జర్మనీ ప్రజల్లో స్వేచ్ఛ, జాతీయతా భావం, దేశభక్తి, సౌభ్రాతృత్వాలను రగుల్కొలిపాడు. మరోవైపు ఆస్ట్రియా, మెటర్నిక్ తో తమ పెత్తనంతో జర్మనీ పరిపాలకులకు చక్రవర్తి వంటి బిరుదులు ఇవ్వలేదు. జర్మన్లకు ఒక జాతీయ పతాకం ఇవ్వలేదు. కనీసం వారిని జర్మనీ ప్రజలుగా గుర్తించలేదు. ఇంగ్లాండ్, లగ్జంబర్గ్, డెన్మార్క్, ఆస్ట్రియా, సార్జనీ, జర్మనీ రాష్ట్రాలపై పెత్తనం వహించేవి.

ప్రశ్న 3.
జోల్వెరిన్ ప్రాముఖ్యత తెలపండి.
జవాబు:
1819లో 12 జర్మన్ రాష్ట్రాలతో ప్రష్యా ఏర్పరిచిన వర్తక సుంకాల సంస్థ జోల్వెరిన్. అంతకు మునుపు ప్రష్యాలో ఆర్థికవ్యవస్థ సక్రమంగా లేక వ్యాపారస్థులను మరియు వినియోగదారులను అణచివేసేవారు. సుంకాల పద్ధతి, అధిక ధరలతో వారి దోపిడీ చేసేవారు. ప్రష్యా 28 మే, 1818 సంవత్సరంలో వ్యాపారస్థులకు మరియు వినియోగదారులకు అనుకూలంగా ఒకే విధమైన సుంకాల చట్టాలను తయారుచేసింది. ఈ చట్టం ప్రకారం ప్రష్యాలో దిగుమతి సుంకాలను తొలగించారు. తయారైన వస్తువులపై 10% మించి సుంకం విధించరాదు. దీని ఫలితంగా ప్రష్యా సరళ వాణిజ్య కేంద్రమైంది. ఈ సంస్థ చెకోపోస్ట్లు, ఆంతరంగిక సుంకాలను ఎత్తివేసి సరళవ్యాపార విధానాన్ని ఏర్పాటు చేసింది. దీని వలన జర్మన్ రాష్ట్రాల మధ్య వ్యాపార సంబంధాలు పటిష్టమయ్యాయి. 1834 నాటికి అన్ని జర్మన్ రాష్ట్రాలు ఇందులో సభ్యులయ్యారు. దీని ద్వారా జర్మన్లలో జాతీయతా భావం పెరిగి, రాజకీయ ఏకత్వానికి దారి ఏర్పడింది.

ప్రశ్న 4.
1870 – 71 ఫ్రాన్స్ – ప్రష్యా యుద్ధాన్ని గురించి వివరించండి.
జవాబు:
మూడవ నెపోలియన్ ప్రష్యారాజుతో ప్రష్యా వంశం వారెవ్వరూ కూడా స్పెయిన్ సింహాసనాన్ని అధిష్టించడానికి వీలులేదు అనే షరతు విధించాడు. ఈ సమస్యపై చర్చించడానికి ప్రష్యారాజు, ఫ్రాన్స్ రాయబారుల మధ్య ‘ఎమ్స్’ అనే చోట చర్చలు జరిగాయి. ప్రష్యారాజు మొదటి విలియం చర్చల సారాంశాన్ని ‘ఎమ్స్ టెలిగ్రామ్’ ద్వారా బిస్మార్క్క పంపాడు. బిస్మార్క్ దీనిని ఇరుదేశాలలో ఆగ్రహం కలిగేటట్లు చేసాడు. ఫలితంగా ప్రష్యారాజు తమ రాయబారిని అవమానవపరచాడని ఫ్రెంచి ప్రజలు భావించారు. దీనితో ఫ్రాన్స్ ప్రష్యాపై యుద్ధం ప్రకటించింది.

AP Inter 2nd Year History Study Material Chapter 10 జర్మనీ, ఇటలీలలో విమోచన (ఏకీకరణ) ఉద్యమాలు మొదటి నెపోలియన్

ఈ ఫ్రాంకో ప్రష్యన్ యుద్ధం 1870 నుండి 1871 వరకు జరిగింది. 1870లో జరిగిన సెడాన్ యుద్ధంలో ఫ్రాన్స్ ఘోరపరాజయం పొందింది. మూడవ నెపోలియన్ ప్రష్యాకు లొంగిపోయాడు. యుద్ధఖైదీగా పట్టుబడ్డాడు. తరువాత ఫ్రెంచి రిపబ్లిక్ యుద్ధాన్ని కొనసాగించింది. జర్మన్ సేవలు 1871లో పారిస్ను ముట్టడించాయి. చివరికి 1871లో పారిస్ ప్రష్యాకు లొంగిపోయింది. ఫ్రాంక్ఫర్ట్ సంధికి అంగీకరించింది. దీని ప్రకారం ఫ్రెంచి వారి ఆల్సెన్, లో రైన్లను వదులుకున్నారు. యుద్ధనష్టపరిహారం కింది ఐదువేల మిలియన్ ఫ్రాంకులు చెల్లించింది. ఈ యుద్ధం తర్వాత జర్మన్ రాజు వర్సైల్స్ రాజ ప్రాసాదంలో చక్రవర్తిగా పట్టాభిషేకం చేసుకున్నాడు.

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
యంగ్ ఇటలీ,
జవాబు:
జోసఫ్ మాజినీ 1831లో ‘యంగ్ ఇటలీ’ అనే సంస్థను స్థాపించాడు. దీనిలోని సభ్యులు చదువుకున్నవారై, నీతితో, వైజ్ఞానికంగా ఇటలీ ప్రజలను ప్రోత్సాహపరుస్తూ, ఆదర్శమైన జీవితం గడుపుతూ ఉండాలి. ప్రాణత్యాగానికైనా సంసిద్ధులను చేయడమే దీని ముఖ్య ఉద్దేశము. 40 సంవత్సరాలలోపు ఉన్నవారు దీనిలో సభ్యులు. యుద్ధం చేసి ఇటలీ నుంచి ఆస్ట్రియాను తొలగించడం, ఇటలీ స్వయం సమృద్ధిగా ఎదగడం, రిపబ్లిక్ గా ఏర్పడటం ఈ సంస్థ ప్రధాన
ఆశయాలు.

ప్రశ్న 2.
క్రిమియా యుద్ధం.
జవాబు:
కవూర్ ఇటలీ ఏకీకరణకు ఇంగ్లాండ్, ఫ్రాన్స్లతో సంధి కోసం ఎదురుచూస్తున్నాడు. ఇంగ్లాండుకు పెద్ద సైన్యం లేక యుద్ధాలలో మునిగి ఉంది. ఫ్రాన్స్కు మంచిసైన్యం ఉంది. కవూర్ మూడవ నెపోలియన్కు దగ్గరయ్యాడు. క్రిమియా యుద్ధం కవూర్కు మంచి అవకాశం కలిగించింది. ఫ్రాన్స్, ఇంగ్లాండ్లతో పొత్తు కుదుర్చుకుని రష్యాతో యుద్ధానికి సిద్ధమయ్యాడు. రెండు సంవత్సరాల తర్వాత క్రిమియా యుద్ధంలో ఫ్రాన్స్, ఇంగ్లాండ్లకు ఇటలీ చేసిన సేవలకు గుర్తుగా మూడవ నెపోలియన్ కపూర్ను ఆహ్వానించి అతనికి సహాయం చేయడానికి అంగీకరించాడు. ఈ విధంగా క్రిమియా యుద్ధాన్ని కవూర్ ఇటలీ ఏకీకరణకు అనుకూలంగా మలచుకున్నాడు.

ప్రశ్న 3.
కారలా బాడ్ ఉత్తర్వులు, 1819.
జవాబు:
మెటర్నిక్ ప్రష్యా రాజైన మూడవ విలియం సహాయంతో జర్మనీలో జాతీయతా భావాన్ని, విప్లవ భావాలను అణచివేయడానికి కారల్స్బాడ్ ఆజ్ఞలు 1819లో జారీచేసాడు. వీటి ప్రకారం

  1. ఉపాధ్యాయుల, విద్యార్థుల కార్యక్రమాలను గమనించడానికి యూనివర్సిటీ ప్రతినిధులు నియమించబడ్డారు.
  2. ఉపాధ్యాయులు మతవిస్తరణ, ప్రభుత్వ విరుద్ధ కార్యకలాపాలు చేయరాదు.
  3. ఏ ఉపాధ్యాయుడైన మెటర్నిక్ ఆదేశాలు పాటించని ఎడల అతనిని ఉద్యోగం నుండి తీసివేస్తారు. తిరిగి ఏ విశ్వవిద్యాలయంలో చేర్చుకోరు.
  4. విద్యార్థులను ఒక యూనివర్సిటీ నుంచి తొలగిస్తే తర్వాత ఏ యూనివర్సిటీ తీసుకోదు.
  5. పత్రికలపై ఆంక్షలు విధించారు. బుర్సెన్ షాఫ్ట్ అనే సంఘాన్ని రద్దుచేసారు.
  6. కారలా ్బడ్ ఆజ్ఞలను ప్రష్యాలో కఠినంగా అమలుచేసి ఉద్యమాన్ని జర్మనీలో అణచివేసారు.

AP Inter 2nd Year History Study Material Chapter 10 జర్మనీ, ఇటలీలలో విమోచన (ఏకీకరణ) ఉద్యమాలు మొదటి నెపోలియన్

ప్రశ్న 4.
ఆయుధము – రక్తపాత విధానము
జవాబు:
బిస్మార్క్ ముఖ్యధ్యేయము జర్మనీ ఏకీకరణ ప్రష్యా ఆధీనంలో జరగాలని భావించడం. యుద్ధాల వలన జర్మనీ ఏకీకరణ సాధ్యంకాదని అతని అభిప్రాయం. సమస్యలు, ఉపన్యాసాలవల్లకాని, చర్చలు, సమావేశాలు, పార్లమెంట్ తీర్మానాలతో పరిష్కరించబడదు” కఠిన దండనీతే Policy of Blood and Iron దీనికి పరిష్కారం అని పేర్కొన్నాడు. దీనినే ‘రక్తపాత విధానం’ అంటారు. బిస్మార్క్ జర్మనీ ఏకీకరణకు ఈ రక్తపాత విధానాన్ని అనుసరించాడు. ఆ తరువాత జర్మనీ ఏకీకరణ కోసం ప్రష్యా, డెన్మార్క్, ఆస్ట్రియా, ఫ్రాన్స్లో మూడు యుద్ధాలు చేసింది.