AP Board 8th Class Telugu లేఖలు

AP State Syllabus AP Board 8th Class Telugu Textbook Solutions 8th Class Telugu లేఖలు Notes, Questions and Answers.

AP State Syllabus 8th Class Telugu లేఖలు

1. విహార యాత్రను వివరిస్తూ తండ్రికి లేఖ :
జవాబు:

ఏలూరు,
x x x x x

పూజ్యులైన నాన్నగారికి నమస్కారములు.

నేను క్షేమంగానే ఉన్నాను. అక్కడ అందరూ క్షేమమని తలుస్తాను. ఇటీవల నేను నా మిత్రులతో కలిసి హైదరాబాదు విహారయాత్రకు వెళ్ళి వచ్చాను. ఆ విశేషాలు ఈ లేఖలో తెలియజేస్తున్నాను.

గడచిన బుధవారం సాయంకాలం ఏలూరులో రైలు ఎక్కి తెల్లవారేసరికి హైదరాబాదు చేరాం. అక్కడ కార్యక్రమాలన్నీ ముగించుకొని నగరదర్శనానికి బయలుదేరాం.

ఆ నగర శోభను చూస్తుంటే నాకెంతో ఆశ్చర్యం వేసింది. ఎక్కడ చూసినా ఫ్లెఓవర్ బ్రిడ్జీలు చూడముచ్చటగా ఉన్నాయి. ట్యాంక్ బండ్ పై గల విగ్రహాలు చూపరులను అట్టే ఆకర్షించేలా ఉన్నాయి.

ముఖ్యంగా సాలార్‌జంగ్ మ్యూజియం, నెహ్రూ జంతుప్రదర్శనశాల, చార్మినార్, బిర్లామందిర్, పబ్లిక్ గార్డెన్స్, రామోజీ ఫిల్మ్ సిటీ, గోలకొండ కోట వంటివి యాత్రికులను బాగా ఆకర్షిస్తాయి. రెండు రోజులపాటు అక్కడి దర్శనీయ స్థలాలను చూసి మరల రైలులో సరదాగా పాటలు పాడుకొంటూ జోక్స్ వేసుకొంటూ కాలం తెలియకుండా తిరుగు ప్రయాణం చేశాం. అమ్మగారికి నా నమస్కారాలు.

ఇట్లు,
తమ కుమారుడు,
రాళ్ళబండి సిద్ధార్థ.

చిరునామా :
శ్రీరాళ్ళభండి శ్రీనివాస్ గారు,
కానూరు,
పెనమలూరు మండలం, కృష్ణాజిల్లా.

2. వార్షికోత్సవమును గూర్చి మిత్రునకు లేఖ :
జవాబు:

అమలాపురం,
x x x x x

ప్రియ మిత్రుడు శ్రీరాంకుమార్‌కు,

ఇక్కడ మేమంతా కుశలంగా ఉన్నాం. అక్కడ అందరూ క్షేమంగా ఉన్నారని తలుస్తాను. గడచిన బుధవారం మా పాఠశాల వార్షికోత్సవం బ్రహ్మాండంగా జరిగింది. పాఠశాలంతా రంగురంగుల తోరణాలతో అలంకరించాం. సాయంత్రం 6 గం||లకు సభ ప్రారంభింపబడింది. ఆ సభకు మా ప్రాంత ఎం.ఎల్.ఏ. గారు ముఖ్య అతిథిగా వచ్చారు. ప్రధానోపాధ్యాయుడు పాఠశాల నివేదిక చదివి వినిపించారు. ముఖ్య అతిథిగారు విద్యార్థులంతా బాగా చదువుకోవాలని చక్కని సందేశం ఇచ్చారు. ఆటల పోటీలలోనూ, వ్యాసరచన, వక్తృత్వ పోటీలలోనూ గెలుపొందిన వారికి బహుమతులు పంచిపెట్టబడ్డాయి. ఆ తరువాత పిల్లలచే నాటికలు వేయబడ్డాయి.

మీ పాఠశాలలో జరిగిన వార్షికోత్సవం గూర్చి వ్రాయగలవు.

ఇట్లు,
నీ ప్రియ మిత్రుడు,
వి. దిలీప్ కుమార్.

చిరునామా :
గార్లపాటి శ్రీరాంకుమార్,
10వ తరగతి,
ఎస్.పి.వి.కె.ఆర్. హైస్కూలు,
దొమ్మేరు – ప.గో.జిల్లా, పిన్ : 534 351.

AP Board 8th Class Telugu లేఖలు

3. సందర్శించిన ఒక ప్రదేశాన్ని గూర్చి వివరిస్తూ మిత్రునికి లేఖ.
(లేదా)
చూసిన విజ్ఞానయాత్రా విశేషాలను వివరిస్తూ మిత్రునికి లేఖ.
జవాబు:

హైద్రాబాదు,
x x x x x

ప్రియ మిత్రుడు శంకరు,

నేను క్షేమంగా ఉన్నాను. మీరంతా క్షేమమని తలుస్తాను. నేను ఇటీవల ఆగ్రా వెళ్ళివచ్చాను. అక్కడి విశేషాలు నీకు వివరిస్తాను.

ఆలో ముఖ్యంగా చూడదగ్గది తాజ్ మహల్. షాజహాన్ దంపతుల పవిత్ర ప్రణయానికి శాశ్వత చిహ్నమే తాజమహల్. దాన్ని చూసి నేను పొందిన ఆనందం అంతా ఇంతా కాదు. అది ఒక ఎత్తైన వేదిక మీద ఉన్న చలువరాతి కట్టడం. దానికి నాలుగువైపులా నాలుగు చంద్రకాంత శిలా స్తంభాలున్నాయి. ప్రధాన భవనం లోపల గోడలు మణులతో చెక్కబడి ఉన్నాయి. యమునా నదీతీరంలో ఉన్న ఆ తాజ్ మహల్ సౌందర్యం చూసి ఆనందించవలసిందే గాని చెప్పడానికి వీలుకాదు. అందుకే ప్రపంచంలోని ఏడు వింతలలో తాజ్ మహల్ కూడా చోటు చేసుకుందని చెప్పవచ్చు. నీవు కూడా అవకాశం దొరికినప్పుడు తాజ్ మహల్ తప్పక చూడవలసిందిగా కోరుతున్నాను.

ఇట్లు,
నీ ప్రియమిత్రుడు,
ఆర్ శ్రీనివాస్.

చిరునామా :
కె. శంకరరావు,
S/O సత్యనారాయణరావు గారు,
ఆర్.ఆర్. నగర్,
విజయవాడ – 520 012.

4. మీ వీధిలో పారిశుధ్య పరిస్థితిని (అపరిశుభ్రతను) గూర్చి వివరించుచు సంబంధిత అధికారికి లేఖ వ్రాయుము.
జవాబు:

పామర్రు,
x x x x x

మున్సిపల్ ఆరోగ్యశాఖాధికారి గారికి నమస్కరించి మోహన్ వ్రాయు విన్నపము.

అయ్యా,
నేను కరణం గారి వీధిలో నివాసం ఉంటున్నాను. మా వీధిలో ఎక్కడ చూసినా చెత్త, దుమ్ము, మురికి ప్రత్యక్షమవుతాయి. చెత్త పారెయ్యడానికి చెత్త కుండీలు లేవు. మురికినీరు కాలువలు నిండిపోయి రోడ్డుమీదే ప్రవహిస్తుంది. ఇక దుర్గంధం చెప్పడానికి వీలులేదు. ఆ మురికి వల్ల దోమల బాధకూడా ఎక్కువైంది. దీనివల్ల మలేరియా సోకే ప్రమాదముంది. కాబట్టి మావీధి పారిశుధ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడవల్సిందిగా ప్రార్థిస్తున్నాను.

ఇట్లు,
తమ విధేయుడు,
వి.యస్. మోహన్.

చిరునామా :
ఆరోగ్యశాఖాధికారి గారు,
పురపాలక సంఘ కార్యాలయం,
పామర్రు, కృష్ణాజిల్లా.

AP Board 8th Class Telugu లేఖలు

5. నచ్చిన రాజకీయ నాయకుని గురించి మిత్రునికి లేఖ :
జవాబు:

నెల్లూరు,
x x x x x

ప్రియ స్నేహితురాలు పద్మకు,

నేను క్షేమముగా ఉన్నాను. నీ క్షేమసమాచారములు తెలుపగలవు. నీవు ఈ మధ్య నాకు వ్రాసిన ఉత్తరములో నాకు నచ్చిన రాజకీయ నాయకుని గురించి వ్రాయమన్నావు కదా ! అందుకే ఈ లేఖ వ్రాయుచున్నాను.

నాకు నచ్చిన రాజకీయ నాయకుడు భారత మాజీ ప్రధాని, ‘భారతరత్న’ అవార్డు గ్రహీత శ్రీ మొరార్జీ దేశాయ్. భారత స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొనిన మహోన్నత నాయకులలో ఆయన ఒకరు. గాంధీజీ ఆదర్శాలకోసం జీవితాంతము పాటుబడిన వ్యక్తి మొరార్జీ. ఉన్నతమైన విలువలు, ఆదర్శమైన విధానాలకు కట్టుబడిన వ్యక్తిగా మొరార్జీ ప్రపంచ ప్రఖ్యాతి పొందినారు. మొరార్జీ ఏనాడు పదవులను ఆశించలేదు, పదవులే ఆయనను జీవితాంతం ఆశించినాయి. నైతిక విలువలకు మొరార్జీ గొప్ప ఉదాహరణ. అందులకే ఆయన అంటే నాకు ఎంతో ఇష్టము.

ఇట్లు,
నీ స్నేహితురాలు,
పి. శశికళ.

చిరునామా :
వి. పద్మ,
10వ తరగతి, బాలికోన్నత పాఠశాల,
నరసరావుపేట, గుంటూరు జిల్లా.

6. మీ పాఠశాలలో జరిగిన జాతీయ పండుగను గూర్చి మీ మిత్రునకు లేఖ రాయండి.
జవాబు:

చెరుకూరు,
x x x x x

ప్రియ మిత్రుడు ప్రవీణ్ కుమార్‌కు,

ఇక్కడ మేమంతా కుశలంగా ఉన్నాం. అక్కడ అందరూ క్షేమంగా ఉన్నారని తలుస్తాను. ఇటీవల మా పాఠశాలలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ‘ఫిబ్రవరి 21 న బ్రహ్మాండంగా జరిగింది. పాఠశాలంతా చక్కనైన సూక్తులు రాసిన చార్టులు తగిలించి, అలంకరించాం. మన మాతృభాషను కాపాడిన, కాపాడుతున్న ఎందరో మహనీయులైన వారి చిత్రపటాలు సేకరించి, ప్రదర్శనగా ఉంచాం. ప్రక్కనే వారు మాతృభాష కోసం చేసిన కష్టాన్ని క్లుప్తంగా రాసి, ఉంచాం. గిడుగు, గురజాడ వంటి మహనీయులకు పెద్దపీట వేసాం. ఆ సభకు ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచన కర్త “ఆర్ష విద్యాసాగర్, మధురభారతి” శ్రీ మల్లా ప్రగడ శ్రీమన్నారాయణ మూర్తి గారిని ఆహ్వానించాం. వారి ఉపన్యాసం ఎలా సాగిందంటే బీడునేల మీద వాన చినుకులు పడిన విధంగా మమ్మల్ని ఉత్తేజితులను చేసింది. ఆ తర్వాత మాలో కొంతమంది మాతృభాష గొప్పదనాన్ని గురించి మాట్లాడారు. అలాగే మీ పాఠశాలలో జరిగిన విశేషాలను లేఖ వ్రాయి.

ఇట్లు,
నీ ప్రియమిత్రుడు,
కె. ఫణిరామ్.

చిరునామా :
డి. ప్రవీణ్ కుమార్,
8వ తరగతి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,
బాపట్ల, గుంటూరు జిల్లా.

7. ఇటీవల మీ పాఠశాలలో నిర్వహించబడిన ‘అమ్మకు వందనం’ కార్యక్రమంలోని విశేషాలను తెలుపుతూ మీ సోదరికి లేఖ రాయండి.
జవాబు:

లేఖ

చెరుకూరు,
x x x x x

ప్రియమైన పద్మావతి అక్కకు,

మేము ఇక్కడ క్షేమం. మీరు అక్కడ క్షేమమని తలుస్తాను. నేను బాగా చదువుతున్నాను. ఇటీవల మా పాఠశాలలో ‘అమ్మకు వందనం’ అనే కార్యక్రమం జరిగింది. దానిలో భాగంగా ప్రతి విద్యార్థి తల్లిని
పిలిపించారు. ఆ తల్లులకు వారి పిల్లల చేత కాళ్ళు కడిగించి, పాదాల మీద పూలు వేసి, నమస్కరించమన్నారు. మేమంతా అట్లా చేసి, అమ్మల ఆశీస్సులు తీసుకొన్నాము. నేను, మరికొంతమంది విద్యార్థులు అమ్మ గొప్పదనాన్ని గురించి మాట్లాడాము. అమ్మ కళ్ళలో ఏదో తెలియని ఆనందం కనిపించింది. దానిని ఎప్పుడూ పోకుండా చూసుకోవాలని అనుకున్నాను. బావగారు, పిల్లలు ఏం చేస్తున్నారు ? అందరినీ అడిగానని చెప్పు.

ఇట్లు,
నీ తమ్ముడు,
కె. ఫణిరామ్.

చిరునామా :
ఎస్. పద్మా వతి,
W/o ఎస్. పూర్ణచంద్ర,
ఒంగోలు, ప్రకాశం జిల్లా.

AP Board 8th Class Telugu లేఖలు

8. మామూలు వాక్యాలు కూడా సరైన పదాలు జోడించి అందంగా వివరిస్తూ రాస్తే వర్ణనాత్మక వాక్యాలు అవుతాయి కదా! అలాగే మీరు కూడా మంచి పదాలతో మీకు నచ్చిన ఒక కథను వర్ణిస్తూ రాయండి.
జవాబు:
వర్ణనాత్మక కథ :

ప్రేమే పరమాన్నం

ఆప్యాయతతో ఆదరించిన వారింట పచ్చడన్నం తిన్నా తృప్తిగా ఉంటుంది. అదే ప్రేమ నటిస్తూ పంచభక్ష్య పరమాన్నాలు పెట్టినా ఆ భోజనం రుచించదు. అంటే నిజమైన రుచి వంటకంలో లేదు. వండి వడ్డించిన వారి మనసులో ఉంది. దానికి ఉదాహరణే ఈ కథ.

పాండవులు పాచికల ఆటలో మోసపోయి 12 యేండ్లు అడవుల్లో, ఒక యేడాది మారువేషాల్లో బతికి అరణ్య, అజ్ఞాత వాసాలు పూర్తి చేసుకొన్నారు. తిరిగి రాజ్యాన్ని అప్పగించమంటూ కృష్ణుడి ద్వారా కౌరవులకు రాయబారం పంపారు పాండవులు. అప్పుడు కృష్ణుడు హస్తినాపురానికి వెళ్ళగా, దుర్యోధనుడు శ్రీకృష్ణుణ్ణి మచ్చిక చేసుకొని, తనవైపు తిప్పుకోవాలని ప్రయత్నించి, కపట ప్రేమను ఒలకబోస్తాడు. కానీ కృష్ణుడు తాను కౌరవుల అతిథిగా రాలేదని, పాండవుల రాయబారిగా వచ్చానని చెబుతాడు. ఆ రాత్రి బసకు ధృతరాష్ట్రుని మంత్రి విదురుని ఇంటికి వెళతాడు. ఆయన భోగభాగ్యాల లాలస లేక నిరాడంబర జీవితాన్ని గడుపుతుంటాడు. తన ఇంటి తలుపు తట్టిన కృష్ణుని చూసి నివ్వెరపోయాడు. అంతులేని ఆనందంతో చేతులు జోడించాడు. అపరిమితమైన ప్రేమతో స్వాగతం పలికాడు.

శ్రీకృష్ణునికి పాదపూజ చేస్తాడు. ఆకలిగా ఉందన్న ఆయనకు అరిటాకు వేసి, ఇంటిలో ఉన్న కొన్ని అరటిపళ్ళు పెడతాడు విదురుడు. శ్రీకృష్ణునికి భక్తిపూర్వక నైవేద్యంగా ప్రేమతో వడ్డించింది ఆ ఇంటి ఇల్లాలు. విదురుడు వింజామరతో విసురుతున్నాడు. వారి ఆదరాభిమానాలకు వాసుదేవుడు కరిగిపోయాడు. ఆ దంపతులు భక్తి పారవశ్యంలో కృష్ణుణ్ణి చూస్తూ అరటిపండ్లు ఒలిచి పండును పక్కన పెట్టి తొక్కను ఇస్తుంటే వాటినే ఆరగించాడు ఆ పరమాత్మ. తర్వాత గమనించిన దంపతులు తేరుకొని మన్నించమని ప్రార్థిస్తారు. భక్తులకు తాను దాసుణ్ణని, వారు మనసు పెట్టి సమర్పించింది ఏదైనా సరే స్వీకరిస్తానని చెప్తాడు.

ఎదుటి వారికి ఇచ్చేది ఏదైనా సరే అణకువతో ఇవ్వాలి. అహంకారం లేని సమర్షణను ఆనందంగా స్వీకరించడానికి భగవంతుడైనా నిరుపేద ముంగిటికి వస్తాడు. తన భక్తులు తనకేమిచ్చారో చూడకుండా ఎలా ఇచ్చారన్న దానికే పెద్దపీట వేస్తాడు.

AP Board 6th Class Hindi Solutions सन्नद्धता कार्यक्रम Chapter 9 मौखिक खेल

AP State Syllabus AP Board 6th Class Hindi Textbook Solutions सन्नद्धता कार्यक्रम Chapter 9 मौखिक खेल Textbook Questions and Answers.

AP State Syllabus 6th Class Hindi Solutions सन्नद्धता कार्यक्रम Chapter 9 मौखिक खेल

6th Class Hindi सन्नद्धता कार्यक्रम Chapter 9 मौखिक खेल Textbook Questions and Answers

AP Board 6th Class Hindi Solutions सन्नद्धता कार्यक्रम Chapter 9 मौखिक खेल 1
विधि :
छात्र गोलाकार में बैठते हैं। एक छात्र उठकर “मेरे पिताजी …… है।’ कहकर, बगलवाले छात्र से पूछता है कि ”तुम्हारे पिताजी क्या काम करते हैं?” बगलवाला छात्र भी “मेरे पिताजी …. है” बताकर उसके बगलवाला छात्र से पूछता है कि “तुम्हारे पिता क्या काम करते हैं?” इस प्रकार एक के बाद एक कक्षा के सभी छात्र इस खेल में भाग लेते हैं। इसी प्रकार के अन्य प्रश्न भी पूछे जा सकते हैं।

కార్యము :
విద్యార్థులు గోళాకారంలో కూర్చొని ఉన్నారు. ఒక విద్యార్థి లేచి నిలబడి “మా నాన్నగారు ……. అని చెప్పి ప్రక్కనున్న విద్యార్థిని “మీ నాన్నగారు ఏమి చేయుదురు?” అని అడిగెను. ప్రక్కనున్న విద్యార్థి కూడా “మా నాన్నగారు …….” అని చెప్పి తన ప్రక్కనున్న విద్యార్థిని “మీ నాన్నగారు ఏమి చేయుదురు?” అని ప్రశ్నించెను. ఈ విధంగా ఒకరి తర్వాత ఒకరు తరగతిలోని విద్యార్థులందరూ ఈ ఆటలో పాల్గొనెదరు. ఇదేవిధంగా ఇతర ప్రశ్నలు కూడా అడగవచ్చు.

मौखिक प्रश्न:

पहला बालक : मेरे पिताजी अध्यापक है। आपके पिताजी क्या काम करते हैं?

दूसरा बालक : मेरे पिताजी ए.पी.एस. आर.टी.सी में बस कंडक्टर हैं। आपके पिताजी क्या काम करते हैं?

तीसरा बालक : मेरे पिताजी डॉक्टर हैं। आपके पिताजी क्या काम करते हैं?

चौथा बालक : मेरे पिताजी प्रधान अध्यापक हैं। आपके पिताजी क्या काम करते हैं?

पाँचवा बालक : मेरे पिताजी सरपंच हैं।

AP Board 6th Class Hindi Solutions सन्नद्धता कार्यक्रम Chapter 9 मौखिक खेल

पहला बालक : मेरे चाचाजी किसान हैं। आपके चाचाजी क्या करते हैं?

दूसरा बालक : मेरे चाचाजी लायर हैं। आपके चाचाजी क्या करते हैं?

तीसरा बालक : मेरे चाचाजी दुकानदार हैं। आपके चाचाजी क्या करते हैं?

चौथा बालक : मेरे चाचाजी बढ़ई हैं। आपके चाचाजी क्या करते हैं?

पाँचवा बालक : मेरे चाचाजी जुलाहा हैं।

शब्दार्थ

मेरा (मैं + का) = నా యొక్క, mine, myself
तुम्हारा (तुम + का) = నీ యొక్క, your’s, your self
तुम्हारी (तुम + की) = నీ యొక్క, your’s, your self
तेरी (तु + री) = నీ యొక్క, your’s, your self
तेरा (तु + का) = నీ యొక్క, your’s, your self
उसका (वह + का) = అతని యొక్క, himself, that self, herself
उसकी (वह + की) = ఆమె యొక్క, herself, that’s that self
उनका (वे + का) = వారి యొక్క, their’s, theirself
हमारा (हम + का) = మా యొక్క, our’s, our self
आपका (आप + का) = తమరి యొక్క, your’s your self
क्या = ఏమి? ఏమిటి?, what
यहाँ = ఇక్కడ, here
वहाँ = అక్కడ, here
कहाँ = ఎక్కడ, where
कैसा = ఎలా, how
क्यों = ఎందుకు, why
कितना = ఎంత, how much
पिताजी = నాన్నగారు, father
अध्यापक = ఉపాధ్యాయుడు teacher
चाचाजी = పినతండ్రి, uncle
किसान = రైతు, farmer
विद्यार्थी = విద్యార్ధి, student
विद्यार्थिनी = విద్యార్ధిని, girl student
यह = ఇది, ఇతడు, ఈమె, it, this
वह = అది, అతడు, ఆమె, that
ये = ఇవి, వీరు, these
वे = అవి, వారు, those
मैं = నేను, I am
तुम = నీవు, you are

AP Board 6th Class Hindi Solutions सन्नद्धता कार्यक्रम Chapter 9 मौखिक खेल

वर्णमाला चार्ट
AP Board 6th Class Hindi Solutions सन्नद्धता कार्यक्रम Chapter 9 मौखिक खेल 2

मौखिक अभ्यासः

1. इन्हें पहचानो।
AP Board 6th Class Hindi Solutions सन्नद्धता कार्यक्रम Chapter 9 मौखिक खेल 3

2. समरूपी शब्दों को जोड़िए। किसान
AP Board 6th Class Hindi Solutions सन्नद्धता कार्यक्रम Chapter 9 मौखिक खेल 4
उत्तर:
AP Board 6th Class Hindi Solutions सन्नद्धता कार्यक्रम Chapter 9 मौखिक खेल 5

AP Board 6th Class Hindi Solutions Chapter 8 दो मित्र

AP State Syllabus AP Board 6th Class Hindi Textbook Solutions Chapter 8 दो मित्र Textbook Questions and Answers.

AP State Syllabus 6th Class Hindi Solutions Chapter 8 दो मित्र

6th Class Hindi Chapter 8 जन्म दिन Textbook Questions and Answers

Improve Your Learning

सुनिए-बोलिए
AP Board 6th Class Hindi Solutions Chapter 8 जन्म दिन 2

प्रश्न 1.
कहानी के बारे में बातचीत कीजिए। (కథ గురించి సంభాషించండి.)
उत्तर:
दो मित्र जंगल में जा रहे थे। अचानक एक भालू सामने आया। एक मित्र पेड़ पर चढ़कर छुप गया। दूसरा मित्र एक क्षण सोचकर ज़मीन पर लेट गया और अचल रह गया। भालू उसके पास आया। मुँह और कान सूंघा। मरा समझकर चला गया।

थोड़ी देर बाद पहला मित्र पेड़ से उतर आया। दूसरे से पूछा, “श्रीमान ! लगता है, भालू से आपको कुछ उपदेश मिला है। ज़रा हमें भी बताइए।” झट दूसरा कहने लगा, “भालू का कहना है कि मुसीबत में जो मित्र साथ छोड़कर भाग जाता है, उस पर भरोसा करना मूर्खता है।” यह बात सुनकर पहला मित्र पछताया। कुछ क्षण बाद मित्र से उसे क्षमा मिली । दोनों खुशी से घर लौटे।

नीतिः जो सच्चा मित्र है वह हमेशा मुसीबतों में हमारे साथ रहता है।

AP Board 6th Class Hindi Solutions Chapter 8 दो मित्र

प्रश्न 2.
मित्र कहाँ जा रहे थे? (మిత్రులు ఎక్కడికి వెళ్ళుచున్నారు?)
उत्तर:
मित्र जंगल में जा रहे थे।

प्रश्न 3.
सचे मित्र कैसे होते हैं? (నిజమైన మిత్రుడు ఎలా ఉంటాడు?)
उत्तर:

  • सच्चे मित्र मुसीबतों में हमारे साथ रहता है।
  • सच्चे मित्र हम पर भरोसा रखता है।

शिक्षण बिंदु – (क्ष, त्र, ज्ञ, श्र)
AP Board 6th Class Hindi Solutions Chapter 8 जन्म दिन 1

शब्दार्थ (అర్థములు) (Meanings)

दो = ఇద్దరు, two
जंगल = అడవి, forest
में = లో, లోపల in, into
मित्र = స్నేహితుడు, friends
जाना = వెళ్ళుట, to go
अचानक = అకస్మాత్తుగా, suddenly
भालू = ఎలుగు, bear
सामने = ముందుకు, infront of
पेड़ = చెట్టు, a tree
चढ़ना = ఎక్కుట, to climb
छुप जाना = దాగుకొనుట, hide
दूसरा = రెండవ, the second one
क्षण = క్షణం, second
सोचना = ఆలోచించుట, to think
जमीन = నేల, floor
लेटना = పడుకొనుట, recumbency
अचल = స్థిరముగా, కదలక ఉండుట, stable
के पास = దగ్గర, near
मुँह = ముఖము, face
कान = చెవి, ear
सूंघना = వాసన చూచుట, to smell
मरा = చనిపోయిన, dead
समझना = భావించుట, to expectation
चल गया = వెళ్లిపోయిన, to went away
थोडी देर = కొంచెం సమయం తర్వాత, after a little time
उतर आना = దిగి వచ్చుట, descend
पूछना = అడుగుట, to ask

AP Board 6th Class Hindi Solutions Chapter 8 दो मित्र

कुछ = కొంచెం, a little, a few
उपदेश = ఉపదేశం, preaching
मिलना = కలియుట, meet
ज़रा = కొంచెము, a little
हमें = మాకు, to us
बताना = చెప్పుట, to tell
झट = వెంటనే, at once
कहना = చెప్పుట, to tell
मुसीबत = కష్టము, difficulty
साथ = తో, with
छोडना = విడిచిపెట్టుట, to leave
भाग जाना = పారిపోవుట, to escape
उस = అది, ఆ, that
भरोसा = భరోసా, believe
मूर्खता = మూర్ఖత్వం, stupidity
बात = మాట, saying
सुनना = వినుట, to hear
पछताना = పశ్చాత్తాప పడుట, repent
बाद = తర్వాత, after
क्षमा = క్షమాపణ, forgiveness
माँगना = అడుగుట, solicit
खुशी = సంతోషం, happiness
घर = ఇల్లు, home
लौटना = తిరిగివెళ్ళుట, to returned

अन्य शब्द (అర్థములు) (Meanings)

कक्षा = తరగతి, class
पक्षी = పక్షి, a bird
यज्ञ = యజ్ఞం, yaga
छात्र = విద్యార్థి, student
पत्र = ఉత్తరం, letter
विज्ञान = విజ్ఞానము, science
ज्ञानी = తిలివిగలవాడు, ఋషి Sage
पुत्र = పుత్రుడు, కుమారుడు, son
शत्रु = శత్రువు, enemy
पक्ष = పక్షము, favour
मित्र = స్నేహితుడు, friend
साक्षी = సాక్షి, corroborator
कॉर = కారు, car
माँ = అమ్మ, mother
डॉक्टर = డాక్టర్, a doctor
लॉन = గడ్డితో ఉన్న మైదానం, lawn
कारवाँ = కాలినడకన వెళ్ళువారి సమూహం, గుంపు, caravan
माँगा = కోరిక, desire
आँख = కన్ను, eye
ऊँट = ఒంటె, a camel
मॉंडल = నమూనా, model
गाँव = గ్రామము, a village
चाँद = చంద్రుడు, the moon
कॉपी = ప్రతి, copy

इन्हें पढ़िए बोलिए पहचानिए (వీటిని చదవండి చెప్పండి గుర్తించండి)

क्ष (క్ష) त्र (త్ర) ज्ञ (జ్ఞ) श्र (శ్ర)

पढ़िए। अंतर पहचानिए (చదవండి తేడా గుర్తించండి)

कासा = గిన్నె, bowl ; काँसा = అందరికంటే చిన్న, youngest, smallest
चाक = చక్రం, wheel ; चॉक = సుద్దముక్క, chalk
मुह = ముఖము, face ; मुँह = నోరు, mouth
बाग = తోట, garden ; बाँग = శబ్దము, ధ్వని, barge
डाट = బాటిల్ మూత, stopper ; डाँट = తిట్టు, rebuke

इन्हें पढ़िए और समझिए (వీటిని చదవండి అర్థం చేసుకొనండి)

क् + ष = क्ष
त् + र = त्र
ज् + ञ = ज्ञ
श् + र = श्र

ऊपर दिये गये वर्ण दो वर्गों के मेल से बने हैं। ऐसे अक्षर संयुक्ताक्षर कहलाते हैं। इन्हें पढ़ो।

क्षण चित्र यज्ञ श्रम

पढ़ो – समझो।
क् + य = क्य,
ग् + व = ग्व,
म् + य = म्य

इन्हें पढ़ो।
क्या ग्वाला म्यान

AP Board 6th Class Hindi Solutions Chapter 8 दो मित्र

जान लीजिए। (తెలుసుకోండి)

का, के, की = యొక్క, ఈ ముడున్నా షష్ఠీ విభక్తి ప్రత్యయములు. వీటి వివరణ :
का – పుంలింగం, ఏక వచన శబ్దములకు ముందర వచ్చును.
के – పుంలింగ బహువచన శబ్దములకు ముందర వచ్చును.
की – స్త్రీలింగం ఉభయవచనములకు ముంద వచ్చును.

ఇవి సర్వనామ శబ్దములకు కలుపునపుడు रा, रे, री గా మారును.

उदा : मैं + का = मेरा = నాయొక్క పుంలింగం. my, mine
मैं + के = मेरे = నాయొక్క పుంలింగ బహువచన ముందు my, mine
मैं + की = मेरी = స్త్రీలింగ ఉభయ వచనములందు my, mine

हम + का = हमारा – మన యొక్క – ours, our
हम + के = हमारे – మన యొక్క – ours, our
हम + की = हमारी – మన యొక్క – ours, our
तू + का = तुम्हारा – నీ యొక్క మీ యొక్క – your, yours
तू + के = నీ యొక్క మీ యొక్క – your, yours
तू + की = तुम्हारी – నీ యొక్క మీ యొక్క – your, yours
तू + का = तेरा – నీ యొక్క – your, yours
तु + के = तेरे – నీ యొక్క – your, yours
तू + की = तेरी – నీ యొక్క – your, yours
आप + का . = आपका – తమ యొక్క – your, yours
आप + के . = आपके – తమ యొక్క – your, yours
आप + की = आपकी – తమ యొక్క – your, yours

ఈ విధంగానే
वह + का, के, की = उसका, उसके, उसकी
यह + का, के, की = इसका, इसके, इसकी
वे + का, के, की = उनका, उनके, उनकी
ये + का, के, की = इनका, इनके, इनकी
कौन + का, के, की = किनका, किसका, किनके, किसके, किनकी, किसकी

ఈ శబ్దమును ఉపయోగించి వ్రాయవలెను.
चाहिए = వలెను, కావలెను.

AP Board 6th Class Hindi Solutions Chapter 8 दो मित्र

हर एक शब्द से तीन – तीन वाक्य बनाइए। (ఒక్కొక్క శబ్దముతో మూడేసి వాక్యాలు వ్రాయవలెను.)

i) हमें : – మమ్ము, మాకు to us
1. हमें छाता चाहिए।
2. हमें रुपये चाहिए।
3. हमें कपड़े चाहिए।

ii) तुम्हें : – నిన్ను, నీకు, మీకు, to you
1. तुम्हें पढ़ना चाहिए।
2. तुम्हें काकिनाडा जाना चाहिए।
3. तुम्हें समय पर भोजन करना चाहिए।

iii) इनको :- వీరిని, వీరికి to these person
1. इनको क्या चाहिए?
2. इनको रुपये चाहिए।
3. इनको खाना चाहिए।

iv) इन्हें :- వీరికి, వీటిని to these person
1. इन्हें बाज़ार जाना चाहिए।
2. इन्हें खेलना चाहिए।
3. इन्हें पीने के लिए दूध चाहिए।

v) आपको : – తమరికి to you
1. आपको कल मद्रास जाना चाहिए।
2. आपको पाठ पढाना चाहिए।
3. आपको बोर्ड पर लिखना चाहिए।

vi) मुझे :- నన్ను, నాకు In to me
1. मूझे किताब चाहिए।
2. मुझे कलम चाहिए।
3. मुझे दूध चाहिए।

संबंध सूचक अव्यय

के ऊपर = పైన – up, on
के नीचे = క్రింద – under
बीच में మధ్య లో between
आगे ముందు before
पीछे = వెనుక behind
दाये = కుడివైపు right side
बाये = ఎడమవైపు left side

कहानी

दो मित्र जंगल में जा रहे थे। अचानक एक भालू सामने आया। एक मित्र पेड़ पर चढ़कर छुप गया। दूसरा मित्र एक क्षण सोचकर ज़मीन पर लेट गया और अचल रह गया। भालू उसके पास आया। मुँह और कान सूंघा। मरा समझकर चला गया।

थोड़ी देर बाद पहला मित्र पेड़ से उतर आया। दूसरे से पूछा, “श्रीमान ! लगता है, भालू से आपको कुछ उपदेश मिला है। ज़रा हमें भी बताइए।” झट दूसरा कहने लगा, “भालू का कहना है कि मुसीबत में जो मित्र साथ छोड़कर भाग जाता है, उस पर भरोसा करना मूर्खता है।” यह बात सुनकर पहला मित्र पछताया। कुछ क्षण ‘बाद मित्र से उसे क्षमा मिली । दोनों खुशी से घर लौटे।

కథాంశం!

ఇద్దరు మిత్రులు అడవిలో వెళుతూ ఉన్నారు. అకస్మాత్తుగా ఒక ఎలుగు వారికి ఎదురుగా వచ్చినది. ఒక స్నేహితుడు చెట్టు ఎక్కి దాక్కొనెను. రెండవ స్నేహితుడు ఒక క్షణం ఆలోచించి నేలపై పడుకొని కదలక స్థిరంగా ఉండెను. ఎలుగు అతని వద్దకు వచ్చెను. అది ముఖము మరియు చెవుల వాసన చూసెను. చనిపోయిన వ్యక్తి అని , భావించి అక్కడి నుండి వెళ్ళిపోయెను.

కొంచెం సేపటి తర్వాత మొదటి మిత్రుడు చెట్టు దిగి క్రిందకు వచ్చెను. మొదటి మిత్రుడు రెండవ వానితో “మహాశయా ! ఎలుగు ఏదో నీ చెవిలో ఉపదేశించినట్లు ఉన్నదే. కొంచే మాకు కూడా చెప్పండి” – అని అడిగెను. వెంటనే రెండవ మిత్రుడు “ఎలుగు ఏమన్నదంటే కష్టసమయంలో ఏ మిత్రుడైతే స్నేహితులను వదలి వెళ్ళి పోతాడో, అతనిపై భరోసా ఉంచడం మంచిది కాదు, మూర్ఖత్వం ” అని చెప్పెను. ఇది విన్న తర్వాత మొదటి స్నేహితుడు చాలా పశ్చాత్తాపపడెను. కొద్ది క్షణముల తర్వాత మొదటి మిత్రుడు తన మిత్రునకు క్షమాపణలు తెలిపెను. ఆ తదుపరి ఇద్దరూ సంతోషంగా ఇంటికి చేరిరి.

Story in English

Two friends were travelling through a forest. Suddenly they came across a bear. One of them climbed a nearby tree and hid himself. Second friend thought for a while and threw himself flat down unmoving, upon the ground. The bear came to him. It smelt his face and ears. It thought that he was dead and left the

Some time later the first friend climbed down the tree. He said to the second friend, “Oh dear! It seems the bear has whispered something in your ear. Friend,
“let me also know what it is.” At once, the second friend said, “What the bear told me is that it is foolish and not good to trust a friend who deserts his friends in times of need.” Listening to his words, the first friend repented a lot. After a while, he apologized to the second friend later, they both went back home happily.

पढ़िए (क्ष, त्र, ज्ञ, श्र)

अ) चित्र देखिए। शब्द पढ़िए।
AP Board 6th Class Hindi Solutions Chapter 8 जन्म दिन 3

आ) पढ़िए – समझिए।

क् + ष = क्ष
त् + र = त्र
ज् + ञ = ज्ञ
श् + र = श्र
ऊपर दिये गये अभर दो वर्गों के मेल से बने हैं। ऐसे अक्षर संयुक्ताक्षर कहलाते हैं। इन्हें पढ़िए।
क्षण चित्र यज्ञ श्रम

AP Board 6th Class Hindi Solutions Chapter 8 दो मित्र

इ) पढ़िए। अंतर पहचानिए।

कासा – काँसा
चाक – चॉक
मुह – मुँह
बाग – बाँग
डाट – डाँट

कासा = గిన్నె, bowl ; काँसा = అందరికంటే చిన్న, youngest, smallest
चाक = చక్రం, wheel ; चॉक = సుద్దముక్క, chalk
मुह = ముఖము, face ; मुँह = నోరు, mouth
बाग = తోట, garden ; बाँग = శబ్దము, ధ్వని, barge
डाट = బాటిల్ మూత, stopper ; डाँट = తిట్టు, rebuke

ई) शब्द पढ़िए। अक्षर पढ़िए। इन अक्षरों को वर्णमाला में पहचानिए।
AP Board 6th Class Hindi Solutions Chapter 8 जन्म दिन 4

उ) इनको पढ़िए।
AP Board 6th Class Hindi Solutions Chapter 8 जन्म दिन 5

लिखिए

अ) सूचना के अनुसार लिखिए।
AP Board 6th Class Hindi Solutions Chapter 8 जन्म दिन 6

आ) लेखन अभ्यास
AP Board 6th Class Hindi Solutions Chapter 8 जन्म दिन 7

इ) खाली जगह भरिए।
AP Board 6th Class Hindi Solutions Chapter 8 जन्म दिन 8

ई) चित्र के आधार पर वर्तनी सही करके लिखिए।
AP Board 6th Class Hindi Solutions Chapter 8 जन्म दिन 9

उ) मिलाकर पढ़िए और लिखिए।
AP Board 6th Class Hindi Solutions Chapter 8 जन्म दिन 10

सृजनात्मकता

किसी जानवर का चित्र बनाइये। रंग भरिए। नाम लिखिए।
AP Board 6th Class Hindi Solutions Chapter 8 जन्म दिन 11

नीचे दिये गये अक्षरों से शब्दों को मिलाइए।
AP Board 6th Class Hindi Solutions Chapter 8 जन्म दिन 12

चित्र देखिए। चित्र में क्या – क्या है? पहचानिए।
AP Board 6th Class Hindi Solutions Chapter 8 जन्म दिन 2
उत्तर:
पेड, पौधे, फूल, दो लडके, भालू आदि। एक लडका पेड पर चढ़कर बैठा हुआ है और दूसरा जमीन पर लेटा हुआ है और भालू लेटा हुआ लडका को सुंघ रहा है।

नीचे दिये गये शब्दों को सही ढंग से लिखिए।
AP Board 6th Class Hindi Solutions Chapter 8 जन्म दिन 13

शुद्ध वर्तनीवाले शब्दों पर गोल लगाइए।
AP Board 6th Class Hindi Solutions Chapter 8 जन्म दिन 14

हिन्दी अक्षरों में लिखिए।

1) 36 – छत्तीस
2) 37 – सैंतीस
4) 39 – उनतालीस
5) 40 – चालीस

AP Board 6th Class Hindi Solutions Chapter 8 दो मित्र

शब्द के अंतिम अक्षर से एक और शब्द बनाइए।

1. पक्षी → क्षीर → रण
2. अश्रु → श्रम → मग
3. नश्रत्र → त्राण
4. पेड → डमरू → रूमाल
5. यज्ञ → ज्ञान → नाच
6. वृक्ष → क्षत्रप → पत्र

सही चित्र से जोडिए।
AP Board 6th Class Hindi Solutions Chapter 8 जन्म दिन 15

चित्रों को देखकर उचित शब्द से रिक्त स्थान भरिए।
AP Board 6th Class Hindi Solutions Chapter 8 जन्म दिन 16
AP Board 6th Class Hindi Solutions Chapter 8 जन्म दिन 17

निम्नलिखित प्रश्नों के उत्तर लिखिए।

प्रश्न 1.
कौन जंगल में जा रहे थे? (అడవిలో ఎవరు వెళ్ళుచున్నారు?)
उत्तर:
दो मित्र जंगल में जा रहे थे।

प्रश्न 2.
अचानक उन्हें क्या सामने आया? (అకస్మాత్తుగా వారికి ఎవరు ఎదురు వచ్చిరి?)
उत्तर:
अचानक एक भालू उनके सामने आया।

प्रश्न 3.
दूसरा मित्र क्या किया ? (రెండవ మిత్రుడు ఏమి చేసెను?)
उत्तर:
दूसरा मित्र जमीन पर लेट गया और अचल रह गया।

प्रश्न 4.
भालू ने क्या किया? (ఎలుగు ఏమి చేసినది?)
उत्तर:
भालू ने उसका मुँह और कान सूंघा| मरा समझकर चला गया।

AP Board 6th Class Hindi Solutions Chapter 8 दो मित्र

प्रश्न 5.
‘दो मित्र’ कहानी में अंत में कौन पछताया? (ఇద్దరు మిత్రులు కథలో చివరకు ఎవరు పశ్చాత్తపపడిరి?)
उत्तर:
‘दो मित्र’ कहानी में अंत में पहला मित्र पछताया।

प्रश्न 6.
“दो मित्र’ कहानी का सारांश अपने शब्दों में लिखिए। (‘ఇద్దరు మిత్రులు’ కథను సారాంశం మీ మాటలలో రాయండి.)
उत्तर:
दो मित्र जंगल में जा रहे थे। अचानक एक भालू सामने आया। एक मित्र पेड़ पर चढ़कर छुप गया। दूसरा मित्र एक क्षण सोचकर ज़मीन पर लेट गया और अचल रह गया। भालू उसके पास आया। मुँह और कान सूंघा। मरा समझकर चला गया।

थोड़ी देर बाद पहला मित्र पेड़ से उतर आया। दूसरे से पूछा, “श्रीमान ! लगता है, भालू से आपको कुछ उपदेश मिला है। ज़रा हमें भी बताइए।” झट दूसरा कहने लगा, “भालू का कहना है कि मुसीबत में जो मित्र साथ छोड़कर भाग जाता है, उस पर भरोसा करना मूर्खता है।” यह बात सुनकर पहला मित्र पछताया। कुछ क्षण बाद मित्र से उसे क्षमा मिली । दोनों खुशी से घर लौटे।

नीतिः
जो सच्चा मित्र है वह हमेशा मुसीबतों में हमारे साथ रहता है।

शब्दों को सही क्रम में रखकर वाक्य बनाइए।

1. जंगल में रहे थे जा दो मित्र
उत्तर:
दो मित्र जंगल में जा रहे थे।

2. बताइए जरा भी हमें
उत्तर:
हमें भी जरा बताइए।

3. एक भालू सामने आया अचानक
उत्तर:
अचानक एक भालू सामने आया।

AP Board 6th Class Hindi Solutions Chapter 8 दो मित्र

4. है नक्षत्र यह।
उत्तर:
यह नक्षत्र है।

5. खुशी से घर दोनों लौटे
उत्तर:
दोनों खुशी से घर लौटे।

6. सूंघा और मुँह कान।उत्तर:
मुँह और कान सुँघा।

निम्न लिखित गद्यांश पढ़कर दिये गये प्रश्नों के सही उत्तर विकल्पों में से चुनकर लिखिए।

दो मित्र जंगल में जा रहे थे। अचानक एक भालू सामने आया। एक मित्र पेड़ पर चढ़कर छुप गया। दूसरा मित्र एक क्षण सोचकर ज़मीन पर लेट गया और अचल रह गया। भालू उसके पास आया। मुँह और कान सूंघा। मरा समझकर चला गया।

प्रश्न:
1. दो मित्र इस में जा रहे थे?
A) जंगल
B) बस
C) कार
D) गाडी
उत्तर:
A) जंगल

2. अचानक यह सामने आया –
A) बाघ
B) शेर
C) हाथी
D) भालू
उत्तर:
D) भालू

AP Board 6th Class Hindi Solutions Chapter 8 दो मित्र

3. यह मित्र जमीन पर लेट गया –
A) पहला
B) दूसरा
C) तीसरा
D) चौथा
उत्तर:
B) दूसरा

4. एक मित्र इस पर चढ़कर छुप गया।
A) टापू
B) पहाड
C) पेड़
D) मंदिर
उत्तर:
C) पेड़

5. यह अनुच्छेद इस पाठ से दिया गया है।
A) दो मित्र
B) जन्मदिन
C) खिलौनेवाला
D) बारिश
उत्तर:
A) दो मित्र

उचित शब्दों से रिक्त स्थान भरिए।

1. ज़रा हमें भी ………… |
उत्तर:
बताइए

2. थोडी देर बाद ……. मित्र पेड से उतर आया।
उत्तर:
पहला

3. दोनों …….. से घर लौटे।
उत्तर:
खुशी

4. दो मित्र …….. में जा रहे थे।
उत्तर:
जंगल

AP Board 6th Class Hindi Solutions Chapter 8 दो मित्र

5. ……. उसके पास आया।
उत्तर:
भालू

6. मरा ……… कर चला गया।
उत्तर:
समझ

रेखांकित शब्दों के अर्थ अपनी मात्रुभाषा या अंग्रेज़ी में लिखिए।

1. उसे मित्र से क्षमा मिली।
उत्तर:
క్షమాపణ, forgiveness, pardon

2. वह जमीन पर लेट गया।
उत्तर:
నేల, the earth

3. उस पर भरोसा करना मूर्खता है।
उत्तर:
మూర్ఖత్వం, stupidity

AP Board 6th Class Hindi Solutions Chapter 8 दो मित्र

4. वन में कई वृक्ष हैं।
उत्तर:
వృక్షములు/చెట్లు, trees

5. आसमान में रात के समय नक्षत्र चमकते हैं।
उत्तर:
నక్షత్రములు, stars

6. अचानक एक भालू सामने आया।
उत्तर:
అకస్మాత్తుగా, suddenly

7. आप को कुछ उपदेश मिला है।
उत्तर:
ఉపదేశం, preaching

8. वे जंगल में जा रहे थे।
उत्तर:
అడవి, forest

विलोम शब्द लिखिए।

मित्र × शत्रु
छुप × प्रकट
पास × दूर
प्रश्न × उत्तर
मूर्ख × पंडित
सुख × दुख
मरना × जीना
जाना × आना
जमीन × आकाश
समझ × ना समझ
सुनना × बोलना
सामने × पीछे
चल × अचल
चढ़ना × उतरना
छोडना × पकडना
सुखी × दुखी

निम्न लिखित शब्दों को वाक्यों में प्रयोग कीजिए।

1. मित्र. : हम दोनों मित्र है।
2. जंगल : जंगल में कई प्रकार के जानवर रहते हैं।
3. उपदेश : हमें अध्यापक उपदेश देते हैं।
4. जमीन : वह जमीन पर लेटता है।
5. वृक्ष : जंगल में कई वृक्ष हैं।
6. खुशी : वह खुशी से घर लौटा।

नीचे दिये गये वाक्यों को घटना क्रम के आधार पर पहचानकर रिक्त स्थान में उचित संख्या लिखिए।

1. अचानक एक भालू सामने आया।
उत्तर: 2

2. दो मित्र जंगल में जा रहे थे।
उत्तर: 1

3. दूसरा मित्र जमीन पर लेट गया।
उत्तर: 4

4. एक मित्र पेड पर चढ़कर छुप गया।
उत्तर: 3

5. भालू उसके पास आया।
उत्तर: 5

नीचे दिये गये संकेतों के आधार पर चार वाक्य लिखिए।
AP Board 6th Class Hindi Solutions Chapter 8 जन्म दिन 18
उत्तर:

  1. दो मित्र जंगल में जा रहे थे।
  2. उसके सामने एक भालू आया।
  3. एक मित्र ने पेड़ पर चढ़ गया।
  4. दूसरे मित्र जमीन पर लेट गया।
  5. भालू सूंघकर मरा समझकर चला गया।

रेखांकित शब्दों के लिंग बदलकर वाक्य फिर से लिखिए।

1. माँ रसोई बनाती है।
उत्तर:
बाप रसोई बनाता है।

2. शिक्षक पाठ पढ़ाता है।
उत्तर:
शिक्षिका पाठ पढ़ाती है।

3. पंडित जा रहा है।
उत्तर:
पंडिताइन जा रही है।

4. गाय इधर – उधर घूमती है।
उत्तर:
बैल इधर – उधर घूमता है।

AP Board 6th Class Hindi Solutions Chapter 8 दो मित्र

5. छात्र नाचता है।
उत्तर:
छात्रा नाचती है।

6. मोर कूकती है।
उत्तर:
मोरनी कूकती है।

7. श्रीमान जा रहा है।
उत्तर:
श्रीमती जा रही है।

रेखांकित शब्दों के वचन बदलकर वाक्य फिर से लिखिए।

1. यहाँ एक पेड़ है।
उत्तर:
यहाँ अनेक पेड़ हैं।

2. बच्चा खेलता है।
उत्तर:
बच्चे खलते हैं।

3. डालियाँ सुंदर लगती हैं।
उत्तर:
डाली सुंदर लगती है।

4. वह जमीन पर लेट गया।
उत्तर:
वे जमीन पर लेट गये।

5. जरा हमें भी बताइए।
उत्तर:
जरा मुझे भी बताइए।

6. उस पर भरोसा करना मूर्खता है।
उत्तर:
उन पर भरोसा करना मूर्खता है।

7. वृक्ष हमें फ़ल देता है।
उत्तर:
वृक्ष हमें फ़ल देते हैं।

नीचे दिये गये वर्गों को लिखने का अभ्यास कीजिए। (క్రింద ఇచ్చిన అక్షరములను వ్రాసెడి సాధన చేయండి.)
AP Board 6th Class Hindi Solutions Chapter 8 जन्म दिन 19

समान उचारणवाले शब्दों को जोड़ी बनाइए।
AP Board 6th Class Hindi Solutions Chapter 8 जन्म दिन 20
उत्तर:
1. नाना – मामा
2. पीला – नीला
3. आम मामा
4. चाय – हाय
5. टरटर – चरचर

नीचे दिये गये वाक्यों में रेखांकित शब्द गलत है। सही शब्द को सामने लिखिए।

1. दो मित्र झंगल में जा रहे थे।
उत्तर:
जंगल

2. मुँह और कान सँगा
उत्तर:
सूंघा

3. मरा समजकर चला गया।
उत्तर:
समझकर

4. झरा हमें भी बताइए।
उत्तर:
जरा

5. यह सुनकर पहला मित्र पचताया
उत्तर:
पछताया

AP Board 6th Class Hindi Solutions Chapter 8 दो मित्र

सही शब्द से रिक्त स्थानों की पूर्ति कीजिए।
(उतर, मित्र, भालू, भरोसा, खुशी)

1. अचानक एक ………… सामने आया।
उत्तर:
भालू

2. पहला मित्र पेड़ से ………. आया।
उत्तर:
उतर

3. दोनों ……… से घर लौटे।
उत्तर:
खुशी

4. दो ……… जंगल में जा रहे थे।
उत्तर:
मित्र

5. उस पर ……… करना मूर्खता है।
उत्तर:
भरोसा

चित्र देखकर पाँच शब्द लिखिए।
AP Board 6th Class Hindi Solutions Chapter 8 जन्म दिन 2
उत्तर:
पेड, भालू, फूल, पौधे, लडके, घास

पढ़िए और सुंदर अक्षरों में लिखिए।
AP Board 6th Class Hindi Solutions Chapter 8 जन्म दिन 21

क्या मैं ये कर सकता हूँ?हाँ (✓)नहीं (✗)
1. चित्र के बारे में बातचीत कर सकता हूँ। कहानी समझ सकता हूँ।
2. ‘क्ष, त्र, ज्ञ, श्री अक्षरों से बने शब्द पढ़ सकता हूँ,
बिना देखे लिख सकता हूँ।

शरीर के अंग (శరీర భాగాలు)
Parts of the Body
AP Board 6th Class Hindi Solutions Chapter 8 जन्म दिन 22

AP Board 8th Class Telugu వ్యాసాలు

AP State Syllabus AP Board 8th Class Telugu Textbook Solutions 8th Class Telugu వ్యాసాలు Notes, Questions and Answers.

AP State Syllabus 8th Class Telugu వ్యాసాలు

1. వాతావరణ కాలుష్యం

‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అన్నారు పెద్దలు. వాతావరణం పరిశుభ్రంగా ఉండి, చక్కటి ఆరోగ్యకరంగా ఉంటే మానవుని జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. మానవునికి హానికరమైన పదార్థాలు వాతావరణంలో కలిసి ఉంటే దానిని వాతావరణ కాలుష్యం అంటారు.

వివిధ కర్మాగారాలు, పరిశ్రమలు, లెక్కలేనన్ని మోటారు వాహనాలు, మురికినీరు మొదలైనవి వాతావరణ కాలుష్యానికి కారణాలు. కర్మాగారాల వల్ల నదులన్నీ మురికినీటితో నిండిపోయి జలకాలుష్యం ఏర్పడుతోంది. పరిశ్రమలవల్ల గాలి కలుషితమవుతోంది. మోటారువాహనాల వల్ల నగరాలలోను, పట్టణాలలోను ధ్వని కాలుష్యం ఎక్కువవుతోంది.

వాతావరణ కాలుష్యం చాలా భయంకరంగా తయారయింది. పారిశ్రామికీకరణ వల్ల ఈ సమస్య మరీ ఘోరంగా తయారయింది. వాతావరణ కాలుష్యం మానవుని మనుగడకే పెద్ద సవాలుగా పరిణమించింది. దీనివల్ల ఉదరకోశవ్యాధులు, ఊపిరితిత్తుల వ్యాధులు, కేన్సర్, గుండెజబ్బుల వంటి వ్యాధులు పెరిగిపోతున్నాయి.

వాతావరణ కాలుష్య నివారణకు ప్రభుత్వం ప్రత్యేకమైన ప్రణాళికలు తయారుచేసి అమలు చేయాలి. పరిశ్రమలు, కర్మాగారాలు మానవుల నివాసాలకు దూరంగా నెలకొల్పాలి. ప్రతి వ్యక్తి తన ఇంటినీ, పరిసరాలనూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అవకాశం ఉన్నచోట మొక్కలను విరివిగా పెంచాలి. ఐక్యరాజ్యసమితి, ప్రపంచ ఆరోగ్య సంస్థలు పరిశోధనలు చేసి వాతావరణ కాలుష్య నివారణకు తగు సూచనలు చేయాలి.

2. బాల కార్మికులు

నిరక్షరాస్యత, కుటుంబ ఆర్థిక పరిస్థితులు, కరవు కాటకాల కారణంగా లక్షలాది పిల్లలు చిన్న వయస్సులోనే కార్మికులుగా చేరుతున్నారని అంతర్జాతీయ కార్మిక నిర్వహణ సంస్థ (ఐ.ఎల్.ఒ.) తన సర్వేలో వెల్లడించింది.

ప్రపంచంలో ఏ దేశంలోనూ లేనంతగా భారతదేశంలో బాలకార్మిక వ్యవస్థ ఉందని ఐ.ఎల్.ఒ. నిర్వహించిన సర్వేలో తెలియజేసింది. దేశంలో ఆంధ్రప్రదేశ్ లోనే అత్యధికంగా బాలకార్మికులు ఉన్నారని ఆ నివేదికలో పేర్కొన్నారు.

బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం పలు సందర్భాలలో చేస్తున్న ప్రకటనలు కేవలం ప్రకటనలుగానే మిగిలిపోతున్నాయి. కాబట్టి నిర్దిష్టమైన ప్రణాళికను ఏర్పాటు చేసి అది అమలు జరిగేటట్లు చూడాలి. ప్రభుత్వం రూపొందించిన బాలకార్మిక నియంత్రణ చట్టం సరిగా అమలు అయ్యేటట్లు చూడాలి.

భారతదేశంలో 8.7 కోట్ల మంది బాలలు పాఠశాలలకు వెళ్ళడం లేదని, వీరంతా ఇళ్ళలోను, కర్మాగారాల్లోను, పొలాల్లోను పని చేస్తున్నారని ‘గ్లోబల్ మార్చ్ ఎగనెస్ట్ చైల్డ్ లేబర్’ అనే అంతర్జాతీయ సంస్థ పేర్కొంది. కాబట్టి బాలకార్మికుల కోసం ప్రత్యేక పాఠశాలలు నెలకొల్పాలి. వాళ్ళు చదువుకొనే అవకాశం కల్పించాలి.

మన రాష్ట్రంలో 16 లక్షల మంది బాలకార్మికులు ఉన్నారు. బాలకార్మిక వ్యవస్థను పూర్తిగా రూపు మాపేందుకు ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటున్నది.

బాలకార్మికులను కూలివారుగానే చూస్తే వారు కార్మికులుగానే మిగిలిపోతారు. వారిలో ఉన్న యోగ్యతను, ప్రతిభను వెలికి తీసేందుకు సహకారం అందజేస్తే భవిష్యత్తులో ఒక మంచి నిపుణుడిని అందించేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలు కూడా బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు సహకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

AP Board 8th Class Telugu వ్యాసాలు

3. కరవు నివారణోపాయాలు

అనావృష్టి వల్ల కరవు వస్తుంది. కరవును క్షామం అని కూడా అంటారు. సామాన్య వర్షపాతంలో 75% కన్నా తక్కువ వర్షపాతం ఉండే స్థితిని ‘కరవు’గాను, 50% కన్నా తక్కువ వర్షపాతం ఉండే స్థితిని ‘తీవ్రమైన కరవు’ గాను భారత వాతావరణ శాఖ నిర్వచించింది.

ఋతుపవనాల నియమరహిత స్వభావం వల్ల దేశంలో ఏదో ఒకచోట ప్రతి సంవత్సరం తరచుగా కరవులు సంభవిస్తున్నాయి. ఎక్కువగా వాయవ్య భారతదేశం, ఆ తరువాత దక్షిణ మరియు మధ్య భారతదేశంలో తరచుగా కరవులు సంభవిస్తున్నాయి. రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, మధ్యప్రదేశ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, తమిళనాడులు అతిగా కరవులు సంభవించే రాష్ట్రాలు.

నివారణోపాయాలు :

  1. కరవు పీడిత ప్రాంతాలలో భూమిశిస్తు పూర్తిగా తొలగించడం గానీ, తగ్గించడం గానీ చేయాలి.
  2. క్షామపీడిత ప్రాంతాలలో ప్రజలు తిరిగి వ్యవసాయం చేసుకొనేందుకు వీలుగా ఆర్థిక సహాయం అందించడం, నీటి పారుదల సౌకర్యాలు కలిగించడం వంటివి చేయాలి.
  3. ఆయా ప్రాంతాలను బట్టి ఏయే పంటలు వేస్తే బాగా పండుతాయో వ్యవసాయదారులకు సూచనలివ్వాలి.
  4. పండిన పంటలకు మార్కెటింగ్ సౌకర్యం కలిగించాలి.
  5. తుపానులు వచ్చినపుడు తట్టుకొని, నిలబడి పంటనిచ్చే కొత్త రకాలను శాస్త్రజ్ఞులు కనిపెట్టాలి.
  6. వాతావరణ సమతౌల్యాన్ని కాపాడాలి.

కరవు నష్టాలను తగ్గించేందుకు భారత ప్రభుత్వం “కరవుకు గురయ్యే ప్రాంతాల ప్రణాళిక” (Drought prone area programme) ప్రవేశపెట్టింది. ఈ ప్రణాళికలో నీటిపారుదల, మృత్తికా పరిరక్షణ, వనీకరణ మొదలగు పథకాలున్నాయి. ప్రభుత్వమే కాకుండా ప్రజలు కూడా మానవతా దృష్టితో కరవుపీడిత ప్రాంతీయులను ఆదుకోవడం తమ కర్తవ్యంగా భావించాలి.

4. పర్యావరణ సంరక్షణ

భూమి, నీరు, గాలి మొదలైన వాటితో మనిషికి ఉండే అవినాభావ సంబంధమే పర్యావరణం. కాబట్టి పర్యావరణం అంటే పరిసరాల వాతావరణం అని అర్థం. పరిసరాల వాతావరణం కలుషితం కాకుండా కాపాడుకోవడమే పర్యావరణ సంరక్షణ అనబడుతుంది.

ప్రాణులు నివసించేది నేలపైన గదా ! ఆ నేలతల్లిని సరిగా చూసుకోవాలి. భూమిపై చెత్తా, చెదారమే కాదు ఓషధులుంటాయి. చెట్లుంటాయి. జంతువులుంటాయి. మనం జీవించటానికి ఆహారం లభించేది భూమి వల్లనే గదా ! రసాయనిక ఎరువుల వాడకం వల్ల భూమి నిస్సారమైపోతోంది. భూమిని ఆరోగ్యంగా ఉంచాలి. భూమి సమతౌల్యాన్ని పోషించాలి.

జలకాలుష్యం మిక్కిలి భయంకరమైనది. రసాయనిక పదార్థాలు, పరిశ్రమల వల్ల విడుదలయ్యే ద్రవపదార్థాలు సాగునీటిని, త్రాగేనీటిని కాలుష్యపరుస్తాయి. మురుగునీరు, త్రాగేనీరు అనే భేదం లేకుండా పోతోంది. డ్రైనేజీ వ్యవస్థ అరకొరగా ఉంది. దీనివల్ల కలరా, మలేరియా, ఫ్లోరోసిస్, విషజ్వరం, టైఫాయిడ్ వంటివేకాక వైద్యులకి అంతుపట్టని కొత్త రోగాలు కూడా బయలుదేరాయి.

ఇక వాయు కాలుష్యం, గాలివల్లనే మనం జీవిస్తున్నాం. అటువంటి గాలి స్వచ్ఛంగా ఉండాలి. కానీ ఆధునిక పారిశ్రామికత పేరుతో గాలి కూడా కలుషితమైపోతోంది. విషపూరితమైన గాలి పీల్చటం వలన ఊపిరితిత్తులు, జీర్ణకోశం, గుండెకాయ, కళ్ళు అనారోగ్యానికి గురై ప్రమాదాలు సంభవిస్తున్నాయి. జీవితం రోగాలమయం అవుతోంది.

యంత్రాలవల్ల, వాహనాల వల్ల ధ్వనికాలుష్యం వ్యాపిస్తోంది. అణుశక్తి పరీక్షల వల్ల కూడా వాతావరణ కాలుష్యం ఏర్పడుతోంది. 1970లో అమెరికాలో పర్యావరణ పరిరక్షణ ఉద్యమం బయలుదేరింది. వాటి నుంచి శాస్త్రజ్ఞులు పర్యావరణ కాలుష్య నివారణకు విశేషమైన కృషి చేస్తున్నారు. ప్రతి సంవత్సరం జూన్ 5వ తేదీని పర్యావరణ దినోత్సవంగా పాటిస్తున్నారు. పర్యావరణ వ్యవస్థలోని సమతౌల్యాన్ని కాపాడుకోవటానికి అందరూ కృషి చేయాలి.

AP Board 8th Class Telugu వ్యాసాలు

5. విద్యార్థులు – క్రమశిక్షణ

విద్యను అర్థించేవారు విద్యార్థులు. క్రమశిక్షణ అంటే సక్రమమైన ప్రవర్తనని కలిగి ఉండటం. నిజానికి క్రమశిక్షణ అన్ని వర్గాలవాళ్ళకీ, అన్ని వయస్సుల వాళ్ళకీ అవసరమే. అయితే విద్యార్థులు భావిభారత పౌరులు! జాతి భవిష్యత్తు వాళ్ళమీదే ఆధారపడి ఉంది. “మొక్కై వంగనిదే మానై వంగునా !” అన్నారు. చిన్నప్పుడే క్రమశిక్షణ అలవడటం సాధ్యం. పెద్దయిన తర్వాత మనిషి మారటం చాలా కష్టం. అందుకని విద్యార్థుల్లో క్రమశిక్షణ ఉండాలి.

అయితే విద్యార్థుల్లో క్రమశిక్షణ ఎందుకు లోపిస్తోంది? అనే అంశాన్ని లోతుగా పరిశీలించవలసి ఉంది. అందుకు కొన్ని కారణాలు :

  1. కావలసిన కోర్సులో సీటు దొరకకపోవడం – కావలసిన రంగంలో ఉద్యోగం దొరకకపోవడం.
  2. రాజకీయ పార్టీల, నాయకుల ప్రభావం, జోక్యం.
  3. విద్యాలయాల్లో అవినీతి, అవకతవకల పరంపరలు !
  4. ప్రభుత్వం విద్యను వ్యాపారంగా చెయ్యడం.
  5. తల్లిదండ్రుల అశ్రద్ధ, అలసత్వం.

ఇన్ని కారణాలతో పాటు పేర్కొనవలసిన మరొక రెండు ముఖ్యమైన అంశాలున్నాయి – ఒకటి సినిమా, రెండు టి.వి ! ఈ రెండూ మానసిక వికాసానికి,
జ్ఞానాభివృద్ధికి ఉద్దేశించబడ్డాయి. కానీ పాశ్చాత్య విషసంస్కృతి ప్రభావంచే ఈ రెండు ప్రసార సాధనాలూ యువకులపై, విద్యార్థుల పై “స్లోపాయిజన్” లా పని చేస్తున్నాయి.

విద్యార్థుల్లో క్రమశిక్షణ అలవడాలంటే ముందుగా –

  1. విద్యను వ్యాపారంగా మార్చే ధోరణులపై కఠిన వైఖరి అవలంబించాలి.
  2. విద్యారంగంలోని అవకతవకల్ని, అవినీతిని (లీకేజీ, మాస్ కాపీయింగ్ సంప్రదాయాల్ని) అరికట్టాలి.
  3. ఉపాధ్యాయులు చిత్తశుద్ధితో, ఆదర్శవంతంగా ప్రవర్తిస్తూ బోధనకి అంకితమవ్వాలి.
  4. రాజకీయ పార్టీల నీడ కూడా విద్యాలయాలపై పడకూడదు.
  5. విద్యాభ్యాసం తర్వాత ఉద్యోగం వస్తుందన్న గ్యారంటీ ఉండాలి.
  6. విద్యార్థుల్లో దేశభక్తి, సచ్ఛీలత, సహనం అలవడేలా తగిన చర్యలు తీసుకోవాలి.

క్రమశిక్షణ ఇతరులు బలవంతంగా రుద్దినట్లు ఉండకూడదు. ఆత్మగౌరవానికి సంబంధించినదిగా, ఆత్మశక్తికి సంబంధించినదిగా, జీవితధ్యేయంగా క్రమశిక్షణను అలవరచుకోవాలి. అప్పుడు విద్యార్థులతో పాటు దేశం కూడా అక్షరజ్యోతిగా వెలిగి అభివృద్ధి బాటలో పయనిస్తుంది.

AP Board 8th Class Telugu వ్యాసాలు

6. దూరదర్శన్

విజ్ఞానశాస్త్ర ప్రగతికి, మానవుడి ప్రతిభకి నిదర్శనం టెలివిజన్ దృశ్యతరంగాలను గాలిలో ప్రసారం చేయటం ద్వారా దృశ్యాలు చూడగలుగుతున్నాం. శబ్దతరంగాల ద్వారా శబ్దం వింటున్నాం. టెలివిజనను మానవుడి ప్రతిసృష్టిగా పేర్కొనాలి. ఇది బ్రిటన్లో 1936లో మొదట వ్యాప్తిలోకి వచ్చింది. దీనిని స్కాట్ దేశపు ఇంజనీర్ జాన్ లాగ్ బర్డ్ 1928లో కనిపెట్టాడు.

టెలివిజన్ ఈనాడు ప్రపంచమంతటా వ్యాప్తి చెందింది. టి.వి.లు లేని ఊరులేదు. ఇది కేవలం ప్రచార సాధనమో, వినోద సాధనమో కాదు. టి.వి.ల ద్వారా ప్రభుత్వం, వాణిజ్య సంస్థలు ప్రచారం చేసుకోవచ్చు. మన సంస్కృతిని, కళలను కాపాడుకోవచ్చు. మనం చూడలేని ప్రదేశాలు చూడవచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రపంచాన్ని మన ముందు నిలబెట్టేది టెలివిజన్. విద్యారంగంలో, వైద్యరంగంలో, వాణిజ్యరంగంలో, విజ్ఞానశాస్త్ర రంగంలో నేడు టెలివిజన్‌కు తిరుగులేని స్థానం ఉంది. “వీడియో” పరిజ్ఞానానికి టి.వి. మూలకారణం. నిరక్షరాస్యత నిర్మూలనలో టెలివిజన్ కీలకపాత్ర వహిస్తోంది. ప్రజల్ని అన్ని రంగాలలోనూ చైతన్యవంతం చేస్తున్న శక్తివంతమైన సాధనం టెలివిజన్.

విదేశీ చానల్స్ ప్రసారం వల్ల యువత నిర్వీర్యమవుతోంది. మన సంస్కృతిని విస్మరిస్తున్నారు. సినిమాల వ్యామోహం, సెక్స్ వ్యామోహం ఎక్కువై పెడదారి పడుతున్నారు. ఐక్యరాజ్య సమితి నివేదిక ప్రకారం పిల్లలపై టి.వీ.లు దుష్ప్రభావం చూపిస్తున్నాయని వెల్లడైంది. కాబట్టి టెలివిజన్ ని మంచికి ఉపయోగించుకొనేలా చూడవలసిన బాధ్యత ప్రభుత్వానిది. ప్రైవేట్ ఛానల్సను నియంత్రించి వాటిపై సెన్సారు అధికారాన్ని కలిగి ఉండాలి. అప్పుడే టి.వి. వల్ల సత్రయోజనాలుంటాయి.

7. వరకట్న సమస్య

వరునికిచ్చు కట్నం వరకట్నం. దాని వల్ల సమాజంలో ఏర్పడే సమస్యని వరకట్న సమస్య అంటారు. వరకట్నం కేవలం ఆడపిల్ల తల్లిదండ్రులకే కాదు కుటుంబం మొత్తానికి కూడా అదొక దుర్భర సమస్యగా తయారైంది. అసలు కట్నం అంటే కానుక. పెళ్ళి సందర్భంగా ఇచ్చే కానుక క్రమక్రమంగా కట్నమైంది. పూర్వకాలంలో కన్యాశుల్కం ఉండేది. డబ్బు ఇచ్చి కన్యల్ని కొనుక్కొనే వాళ్ళు. ఆధునిక కాలంలో దాని స్థానంలో వరకట్నం వచ్చింది. ఇప్పుడు పెళ్ళి సమయంలో పెళ్ళికూతురు తల్లిదండ్రులు పెళ్ళికొడుక్కి ఇచ్చే ధనం లేదా సంపదని వరకట్నం అంటున్నారు. కొందరు డబ్బు కట్నంగా ఇస్తే మరికొందరు భూములు ఇస్తారు.

వరకట్నం తీసుకోవడం గానీ, ఇవ్వడం గానీ నేరమని చట్టం ఉంది. కానీ ఆ చట్టాన్ని పాటిస్తున్నదెవరు ? చట్టాన్ని కాపాడవలసిన అధికారులే వరకట్నం ఇస్తున్నారు – తీసుకుంటున్నారు. కంచే చేను మేస్తోంది ! వరకట్నం ఇవ్వనని ఎవరైనా శపథం చేస్తే అమ్మాయికి పెళ్ళికాని పరిస్థితి కూడా ఏర్పడుతోంది ! ఆశ్చర్యం ఏమిటంటే అమ్మాయికి కట్నం ఇవ్వలేక నానా బాధలు పడ్డవారే, అబ్బాయి పెళ్ళి దగ్గరికి వచ్చేటప్పటికి కట్నం ఇవ్వాలని పట్టుబడతారు.

వరకట్న నిర్మూలనం సాధ్యమవ్వాలంటే ముందుగా పెద్దలలో మార్పు రావాలి. శాఖాంతర, కులాంతర, ప్రేమ వివాహాలను ప్రోత్సహించాలి. యువతీయువకులు ఆదర్శాలతో ఈ వరకట్నమనే దురాచారాన్ని రూపు మాపాలి. అమ్మాయికి ఇవ్వటం, అబ్బాయికి తీసుకోవటం రెండూ అక్రమమేనన్న ఆలోచన కలగాలి. కట్నం అనేది బానిసవ్యాపారమన్న ప్రచారం సాగాలి. రేడియోలు, టీ.వీ.లు, సాహిత్యం ద్వారా వరకట్న దురాచారం గురించి ప్రజలకి తెలియజెయ్యాలి. వరకట్న నిషేధ చట్టాన్ని ప్రజలు అమలుపరచాలి. అప్పుడే పెళ్ళి నూరేళ్ళ పంట అవుతుంది లేదా ‘తంటా’ అవుతుంది !

8. గ్రంథాలయాలు

“చిరిగిన చొక్కా అయినా తొడుక్కో – కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కో” అన్నది సూక్తి. ఇటువంటి సూక్తులెన్నో పుస్తకాల ప్రాముఖ్యాన్ని, ప్రాశస్త్యాన్ని వివరించేవి వున్నాయి. తరతరాల విజ్ఞాన సంపదను అందించేవి గ్రంథాలు. అటువంటి గ్రంథాలు గల నివాసాన్ని గ్రంథాలయం (Library) అంటారు.

అయ్యంకి వెంకట రమణయ్య, గాడిచర్ల హరిసర్వోత్తమరావు, నాళం కృష్ణారావు మొదలైన వాళ్ళు మన రాష్ట్రంలో గ్రంథాలయోద్యమాన్ని చేపట్టి గ్రంథాలయాలను స్థాపించారు. గ్రంథాలయ మహాసభలు నిర్వహించి పుస్తకాలను సేకరించి భద్రపరిచారు.

ప్రపంచంలో గొప్ప గొప్ప గ్రంథాలయాలున్నాయి. అమెరికాలో గల ‘కాంగ్రెసు లైబ్రరీ’, రోము నగరంలోని ‘వాటికన్ లైబ్రరీ’, ‘బ్రిటిష్ లైబ్రరీ’ మొదలైనవి ప్రపంచంలో పేరొందాయి. మన దేశంలో చెన్నైలోని “కన్నెమరా” గ్రంథాలయం, తంజావూరులోని “సరస్వతీ మహలు”, వేటపాలెంలోని “సారస్వత నికేతనం”, హైదరాబాదులోగల “శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయం” మొదలైనవి చెప్పుకోదగ్గవి చాలా ఉన్నాయి. కడపలో సి.పి. బ్రౌన్ స్మారక గ్రంథాలయం కూడా నెలకొల్పబడింది.

గ్రంథాలయాలలో చాలా రకాలున్నాయి. ప్రభుత్వ గ్రంథాలయాలు, స్వచ్ఛంద సంస్థల గ్రంథాలయాలు ఉన్నాయి.

గ్రంథాలయాల వల్ల చాలా లాభాలున్నాయి :

  1. గ్రంథాలయాలు మనిషిని మనిషిగా మారుస్తాయి.
  2. మహామేధావులు తరతరాలుగా సంపాదించిన అనుభవాలు, ఆలోచనలు గ్రంథాలలో భద్రపరచబడతాయి.
  3. దేశాభ్యుదయానికి, సమాజవికాసానికి మూలస్తంభాలు గ్రంథాలయాలు.
  4. గ్రంథపఠనమనే మంచి అలవాటు అలవడుతుంది.
  5. గ్రంథాలు తండ్రివలె ఆదేశిస్తాయి. తల్లివలె లాలిస్తాయి. మిత్రుని వలె ఆదుకుంటాయి. గురువువలె ప్రబోధిస్తాయి.

గ్రంథాలయాధికారులు పుస్తకాలు కొనేటప్పుడు అత్యంత శ్రద్ధ వహించాలి. డబ్బును దుర్వినియోగం చెయ్యకుండా మంచి పుస్తకాలనే కొనాలి. హాని కలిగించే పుస్తకాలను నిర్మొహమాటంగా తిరస్కరించాలి. పోటీ పరీక్షలకి, ఉద్యోగ పరీక్షలకి, చదువుకి కావలసిన పాఠ్య గ్రంథాలు, క్విజ్ పుస్తకాల వంటివాటికి ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రభుత్వం గ్రంథాలయోద్యమాన్ని నీరుకార్చకుండా తగిన శ్రద్ధవహిస్తే సమాజం అభ్యుదయ పథంలో పయనిస్తుంది.

AP Board 8th Class Telugu వ్యాసాలు

9. కంప్యూటర్

కంప్యూటర్ అనేది ఒక ఎలక్ట్రానిక్ పరికరం. కంప్యూటర్ లో ‘డేటా’ (Data) ను నిల్వచేయవచ్చు. దాన్ని మళ్ళీ ఎప్పుడైనా వెనక్కి తీసుకోవచ్చు. అంతేకాకుండా కంప్యూటర్ చాలా కచ్ఛితంగా, త్వరగా ఫలితాన్ని ఇస్తుంది. ఇటువంటి అద్భుత సాధనమైన కంప్యూటర్‌ను కనిపెట్టినవాడు ఛార్లెస్ బాబ్బేజి.

కంప్యూటర్ గురించి మాట్లాడినప్పుడు మనం తరచుగా హార్డువేర్, సాఫ్ట్వేర్ అనే పదాలను వింటూ ఉంటాం. హార్డువేర్ అంటే కంప్యూటర్ పరికరాలు. సాఫ్ట్ వేర్ అంటే కంప్యూటర్ పనిచేయడానికి కావలసిన పద్ధతిని తెలిపేది.

కంప్యూటర్లను ఉపయోగించి ప్రస్తుతం పరిశోధనలు చేస్తున్నారు. కూడికలు, తీసివేతలు, గుణకారాలు (హెచ్చవేతలు), భాగాహారాలు వంటి లెక్కలు చాలా వేగంగా చేయడానికి కంప్యూటర్ బాగా పనికివస్తుంది. కంప్యూటర్ల ద్వారా వాతావరణ పరిస్థితిని తెలుసుకోవచ్చు. విమానాలు, బస్సులు, రైళ్ళు మొదలైనవాటి టిక్కెట్ల రిజర్వేషన్లకు కంప్యూటర్లను ఉపయోగిస్తారు. పెద్ద పెద్ద కర్మాగారాల్లో, కార్యాలయాల్లో, బ్యాంకుల్లో ఇవి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. విద్య, వైద్య, వ్యాపార, వ్యవసాయ, సమాచార, శాస్త్ర సాంకేతిక రంగాలలో ఈ కంప్యూటర్లు ప్రముఖపాత్ర వహిస్తున్నాయి. కంప్యూటర్ ను ఉపయోగించి ఇంటర్నెట్ అనే సౌకర్యం ద్వారా ప్రపంచంలో జరుగుతున్న విషయాలన్నింటినీ మన ఇంట్లోని కంప్యూటర్ ముందు కూర్చొని తెలుసుకోవచ్చు.

అయితే కంప్యూటర్లని వాడటం వల్ల ఉద్యోగాలకు నష్టం వాటిల్లుతుందనీ, నిరుద్యోగ సమస్య పెరుగుతుందని కొందరి వాదన. ఇది కొంతవరకు నిజమే. ఆ మాత్రంచేతనే ఆధునిక విజ్ఞానాన్ని త్రోసిరాజనడం న్యాయం కాదు. కాబట్టి భావిభారత పౌరులైన విద్యార్థులు కంప్యూటర్ విద్య ఆవశ్యకతను గుర్తించి తప్పక దాన్ని అభ్యసించాలి.

10. జాతీయ సమైక్యత

ఒక దేశంలో పుట్టి పెరిగిన వారంతా ఒక జాతి వారని చెప్పవచ్చు. మనది భారతజాతి. భాష, మతం, సంస్కృతి, ఆచార వ్యవహారాలు ఒక్క టైనా, కాకున్నా ఒకే ప్రభుత్వం కిందనున్న ప్రజలంతా ఒకే జాతి అని చెప్పవచ్చు. మతాలు వేరయినా, భాషలు, రాష్ట్రాలు వేరయినా జాతి అంతా కలసి ఉండటమే జాతీయ సమైక్యత అంటారు.

మన భారతీయులలో కనిపించే దౌర్బల్యం అనైక్యత. మతం పేరిటనో, అధికారాన్ని ఆశించో మన రాజులొకరితో ఒకరు కయ్యాలాడుకొని విదేశీయుల పాలనలో దేశాన్ని పడవేశారు. నేటికీ మన దేశాన్నత్యాన్ని సహింపలేని విదేశాలున్నాయి. ఆ దేశాలతో మన జాతి సమైక్యతకు భంగం కలిగించే కొన్ని శక్తులు, మన దేశంలోనే ఉండి పొత్తు పెట్టుకొంటున్నవి. అట్టి అవాంఛనీయ శక్తులను తుదముట్టించి మన జాతినంతా ఒకే తాటిపై నిలపాలి. మనం ఏ రాష్ట్రం వారమైనా, ఏ భాషను మాట్లాడే వారమైనా మనమందరం భారతీయులమనే మాట మరువరాదు.

కొందరు మత కలహాలు పెంచి వారిలో భేదాలు రెచ్చగొట్టి హత్యలకు, లూటీలకు, గృహదహనాలకు సిద్ధపడుతున్నారు. దీనివల్ల ప్రజలలో ఇతర మతంవారిపై ద్వేషం పెరుగుతుంది. కొందరికి ప్రాంతీయ దురభిమానం, మరికొందరికి తమ భాషలపై ‘మోజు ఎక్కువ. స్వభాషాభిమానం ఉండటం మంచిదే. కానీ పరభాషపై ద్వేషం ఉండకూడదు. భాషా రాష్ట్రాలుగా విభజించిన తరువాత ప్రాంతీయ దురభిమానాలు పెరిగి నదీ జలాల కొరకు, తమ ప్రాంతాల అభివృద్ధి కొరకు పరస్పరం కలహించుకొంటున్నారు.

మన జాతిలో అనైక్యతను పోగొట్టి ఐక్యపరచటానికి ప్రభుత్వం జాతీయ సమైక్యతా మండలిని స్థాపించింది. భారత జాతి అంతా ఒక్కటే అని బోధిస్తున్నది. జాతీయ సమైక్యత వల్ల దేశం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుంది. అంతేకాకుండా విదేశాలలో భారత జాతి కీర్తిపతాకలు రెపరెపలాడతాయి.

11. మతసామరస్యం

భారతీయ సమాజంలోని వ్యక్తులకు మతం అనేది పుట్టుక నుండి సంక్రమిస్తుంది. అదే విధంగా మతము యొక్క ప్రభావం వ్యక్తిపై పుట్టుక నుండి మరణించే వరకు ఉంటుంది. ప్రపంచంలో అధిక ప్రభావం కలిగిన ముఖ్యమైన మతాలన్నీ భారతదేశంలో ఉన్నాయి. ఎవరికి వారు వారి మతం గొప్పదిగా భావించడం జరుగుతుంది. ఒకనాటి సమాజాన్ని క్రమబద్ధం చేయడానికి, ఆనాటి సమాజంలో శాంతిభద్రతలు కాపాడుకోవడానికి మతాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. భారతదేశంలో ఉన్న మతాలను ఏడు రకాలుగా విభజించవచ్చు.

1) హిందూమతం, 2) ముస్లింమతం, 3) క్రైస్తవమతం, 4) బౌద్ధమతం, 5) జైనమతం, 6) సిక్కుమతం, 7) పార్సీ, యూదుమతం. భారతీయ సమాజంలో హిందూమతం వారే ఎక్కువగా ఉన్నప్పటికీ అనేక కారణాలవల్ల మతాల మధ్య వ్యత్యాసాలు, సంఘర్షణలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ విధమైన మతతత్వానికి అనేక కారణాలున్నాయి. వాటిలో ముఖ్యమైనవి : 1) ప్రజలలో స్వార్థబుద్ధి 2) మహమ్మదీయులలో ఆర్థిక బలహీనతల కారణంగా మైనార్టీలకు ఎక్కువ సౌకర్యాలను కలిగించాలనే వారి వాదన 3) ప్రాంతీయతత్త్వం మొదలైన కారణాలవల్ల భారతీయ సమాజంలో మతతత్త్వం వెర్రితలలు వేస్తోంది. మతతత్వానికి మరొక ముఖ్యకారణం మతంతో రాజకీయాలు మిళితమై ఉండటం.

మతాన్ని రాజకీయాల్లో చేర్చటంవల్ల భారత్ నుండి పాకిస్థాన్ విడిపోయింది. నేడు సిక్కుమతం వారు భారత్ నుండి విడిపోయి స్వతంత్ర దేశంగా ఏర్పడతామని అనేక సంవత్సరాలుగా ఉద్యమిస్తూనే ఉన్నారు. మరో ప్రక్క ‘రామజన్మభూమి – బాబ్రీ మసీదు’ వివాదం మతసమస్యగా తయారయింది. భారతదేశంలో మతకలహాలు తరచూ సంభవిస్తూనే ఉన్నాయి. అల్ప సంఖ్యాకులకు, అధిక సంఖ్యాకులకు మధ్య పరస్పర విశ్వాసం, సామరస్యం లోపించడంతో ఈ భయానక వాతావరణం ఏర్పడి అల్లర్లు, అలజడులు, ఆస్తినష్టం, ప్రాణనష్టం తరచు ఏర్పడుతూనే ఉన్నాయి. వివిధ రాజకీయ పక్షాలు పాక్షిక ప్రయోజనాల సాధన కోసం మతకలహాలను ఒక ఆయుధంగా ఉపయోగించుకొంటున్నాయి.

ఈ విధమైన పరిస్థితులను చక్కదిద్దాలంటే ప్రజలు చైతన్యవంతులై రాజకీయ నాయకుల బూటకపు మాటలకు మోసపోక పరమత సహనం కలిగిఉండాలి. మత సామరస్యంతో అందరూ కలిసిమెలసి జీవించడం నేర్చుకోవాలి.

AP Board 8th Class Telugu వ్యాసాలు

12. జనాభా సమస్య (కుటుంబ నియంత్రణ)

జనాభా ఎక్కువగుట వలన సమస్య ఏర్పడటాన్ని జనాభా సమస్య అంటారు.
“అమెరికాలో డాలర్లు పండును
ఇండియాలో సంతానం పండును”

అని తెలుగులో బాలగంగాధరతిలక్ అనే కవి వ్యంగ్యంగా భారతీయులకి సంతానంపై గల మక్కువ తెలిపాడు. జనాభా సమస్య ఏర్పడటానికి ఈ క్రింది కారణాలు ముఖ్యం 1) సంతానం ఎక్కువగా ఉండటం గొప్పదనంగా భావించడం. 2) ఆడపిల్లలు లేదా మగపిల్లలు కావాలనే కోరికలు. 3) చిన్నప్పుడే వివాహాలు చెయ్యటం. 4) నిరక్షరాస్యత. 5) మత విశ్వాసాలు.

ఇన్ని కారణాల వల్ల రాను రాను జనాభా ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతోంది. జనాభా సమస్యను పరిష్కరించటానికి ప్రభుత్వం పటిష్టమైన ప్రణాళికా విధానం రూపొందించింది.
జనాభా సమస్య నిర్మూలనకు తీసుకోవలసిన చర్యలు :

  1. ‘కుటుంబ నియంత్రణ’ ను అన్ని మతాల ప్రజలు పాటించేలా చర్యలు తీసుకోవాలి.
  2. జనాభా సమస్య వల్ల ఏర్పడే నష్టాలను ప్రజలకు తేటతెల్లం చెయ్యాలి.
  3. స్త్రీల కంటే పురుషులు కుటుంబ నియంత్రణ చికిత్స చేసుకోవటం తేలిక. అని చెప్పాలి.
  4. కుటుంబ నియంత్రణకి ప్రోత్సాహం కలిగించే సదుపాయాలు, సౌకర్యాలు కల్పించాలి.
  5. ఆడయినా, మగయినా ఒకటేనన్న భావాన్ని కలిగించాలి.
  6. కుటుంబ నియంత్రణ పాటించడం పాపమనే భావనని తొలగించాలి.

అప్పుడు మాత్రమే జనాభా పెరుగుదలను అరికట్టడం సాధ్యమవుతుంది. జనాభా సమస్య వల్ల నష్టాలు ఇవి –

  1. జనాభా పెరుగుదల వల్ల ఆహార సమస్య, నిరుద్యోగ సమస్య, కాలుష్య సమస్యల వంటివి ఎక్కువవుతాయి.
  2. విద్యాలయాలలో సీట్లు లభించక విద్యావకాశాలు తగ్గిపోతాయి.
  3. దేశ ఆర్థిక పరిస్థితి ఛిన్నాభిన్నమవుతుంది.
  4. “అందరికీ ఆరోగ్యం ” అనేది సాధ్యం కానేరదు.
  5. సంతానం ఎక్కువగా వుంటే తల్లిదండ్రులపై భారం ఎక్కువై పిల్లల్ని సక్రమంగా పెంచి పోషించలేరు.
  6. జనాభా ఇదే విధంగా పెరుగుతూవుంటే బట్టకీ, ఇంటికీ కూడా కరవు తప్పదు.

అందువల్ల ప్రభుత్వం జనాభా సమస్య నిర్మూలనకే అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. ‘చిన్న కుటుంబమే చింతలు లేని కుటుంబం’ అని బోధించడమే కాదు. నాయకులు, అధికారులు తాము కూడా పాటించాలి. కుటుంబ నియంత్రణ పాటించని వారిని శిక్షించే చట్టం రూపొందించాలి. అప్పుడే దేశం ప్రగతి మార్గంలో పయనిస్తుంది.

13. విజ్ఞానయాత్రలు

విజ్ఞానయాత్రలు లోకజ్ఞానాన్ని కలిగించేవి. అయినా ఇవి వినోదయాత్రలుగా, విహారయాత్రలుగా వ్యవహారంలో ఉన్నాయి. అంటే కొన్ని ప్రత్యేక స్థలాలకి ప్రయాణం చేయటం వల్ల విజ్ఞానం సంపాదించవచ్చు. విజ్ఞానమే కాకుండా వినోదం కూడా లభిస్తుంది.

పుస్తక పఠనం వల్ల పుస్తక జ్ఞానం మాత్రమే లభిస్తుంది. లోకానుభవం, ప్రజల ఆచారవ్యవహారాలు, మన సంస్కృతి తెలుసుకోవాలంటే పర్యటనలు తప్పనిసరి. పుస్తకాలలో ఉన్న విషయాలను పూర్తిగా ఆకళింపు చేసుకోవాలంటే యాత్రలు చేయవలసి ఉంది. ఉదాహరణకు నీటి నుంచి విద్యుత్ ఎలా లభిస్తోందో పుస్తకాలలో వివరంగా ఉంటుంది. అది చదివితే కొంతమాత్రమే తెలుస్తుంది. అది కేవలం “Bookish knowledge”. జలవిద్యుత్ కేంద్రానికి వెళ్ళి, అది పనిచేసే విధానాన్ని పరిశీలించినప్పుడు సంపూర్ణ జ్ఞానం లభిస్తుంది. ముఖ్యంగా చరిత్ర, సైన్సు వంటి విషయాల అవగాహనకు యాత్రలు ఎంతో అవసరం.

విజ్ఞానయాత్రల వల్ల ముఖ్యమైన ప్రయోజనాలు – 1) లోకజ్ఞానం అలవడుతుంది. 2) మానసిక విశ్రాంతి లభిస్తుంది. 3) విభిన్న సంస్కృతుల్ని, భాషల్ని, జీవన విధానాల్ని తెలుసుకోవచ్చు. 4) పదిమందితో ఏవిధంగా మెలగాలో అనుభవం వస్తుంది. 5) స్నేహితులను పొందే అవకాశం లభిస్తుంది. 6) జాతి సమైక్యత, దేశ సమైక్యతకి దోహదం చేస్తాయి. 7) కవులకి, చిత్రకారులకి, మానసిక రోగులకి స్ఫూర్తిని, ఉల్లాసాన్ని కలిగిస్తాయి.

ఇటువంటి విజ్ఞాన యాత్రల్లో చాలా రకాలున్నాయి-1) ప్రకృతికి సంబంధించినవి – ఊటీ, హిమాలయాలు, జోగ్ జలపాతం మొదలగునవి. 2) చారిత్రక సంబంధమైనవి-ఎల్లోరా, రామప్పగుడి, చార్మినార్ మొదలగునవి. 3) శాస్త్ర సంబంధమైనవి-బిర్లా ప్లానిటోరియం, పరిశ్రమలు, అణుకేంద్రాలు మొదలగునవి. 4) మత సంబంధమైనవి-కాశీ, మక్కా, వాటికన్, తిరుపతి మొదలగునవి.

ఈ యాత్రల పట్ల విద్యార్థి దశనుండే ఉత్సాహం ఏర్పడేలా చూడాలి. విద్యార్థిగా ఉన్నప్పుడే లోకజ్ఞానం అలవడితే జీవితం సంపన్నమవుతుంది – అర్థవంతమవుతుంది. ఉపాధ్యాయుల, విద్యార్థుల మధ్య సత్సంబంధాలు ఏర్పడతాయి. ఉపాధ్యాయుల వల్ల ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. విద్యార్థులలో ఐకమత్యానికి కూడా ఈ యాత్రలు తోడ్పడతాయి.

విజ్ఞానయాత్రలు లేదా విహారయాత్రలు కేవలం యువకులకో లేదా విద్యార్థులకో, కళాకారులకో అనుకోవటం సరికాదు. అన్ని వయస్సులవాళ్ళకీ, అన్ని వృత్తులవాళ్ళకీ అవసరమే. కూపస్థ మండూకం లాగా జీవించటం మానవుడి నైజం కాదు కాబట్టి విజ్ఞానయాత్రలు అత్యంతావశ్యకాలు.

14. వార్తాపత్రికలు

వార్తలను అందించే పత్రికలను “వార్తా పత్రికలు” (News papers) అంటారు. వార్తలను ఇంగ్లీషులో NEWS అంటారు గదా! ఆ అక్షరాలను బట్టి కొందరు ఈ విధమైన వివరణ ఇస్తారు – N అంటే North, E అంటే East, W అంటే West, S అంటే South. కాబట్టి ప్రపంచం నలుమూలలా జరిగే సంఘటనలను అందించేవి వార్తా పత్రికలు అనే వివరణ సమంజసంగానే కనిపిస్తుంది.

ప్రాచీనకాలంలో వార్తలను చేరవేయటానికి మనుషుల్ని, జంతువుల్ని, పక్షుల్ని వాడేవారు. “వార్తాహరులు”, “రాయబారులు” ఉండేవారు. కానీ విజ్ఞాన శాస్త్రం అభివృద్ధి చెందిన తర్వాత ముద్రణాయంత్రాలు వెలువడ్డాయి. అప్పటి నుంచి ‘అచ్చు’కి ప్రాముఖ్యం లభించి వార్తా పత్రికల వ్యాప్తి జరిగింది.

ప్రపంచంలో మొట్టమొదటగా వెనిస్ నగరంలో వార్తాపత్రిక ప్రారంభించబడిందని చెప్తారు. సుమారు క్రీ.శ. 1620 నాటికి వార్తా పత్రికలు వచ్చినట్టు తెలుస్తోంది. భారతదేశంలో మొదటి వార్తాపత్రికగా “ఇండియా గెజిట్”అని కొందరు, “బెంగాల్ గెజిట్”అని మరికొందరు పేర్కొంటున్నారు. క్రీ.శ. 1850 నుంచి మన దేశంలో పత్రికల ప్రచురణ అధికమైంది. కాశీనాథుని నాగేశ్వరరావు, ముట్నూరి కృష్ణారావు, ఖాసా సుబ్బారావు, సి.వై. చింతామణి, గోరా, నార్ల వెంకటేశ్వరరావు, నండూరి రామమోహనరావు, పొత్తూరి వెంకటేశ్వరరావు, ఎ.బి.కె. ప్రసాద్ మొదలైనవారు సంపాదకులుగా తెలుగువార్తా పత్రికల ప్రాచుర్యానికి ‘ఎంతో కృషి చేశారు.

ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి, ఈనాడు, ఆంధ్రభూమి, వార్త అనే దినపత్రికలు తెలుగునాట విశేష ఆదరణ పొందాయి.

వార్తా పత్రికల వల్ల లాభాలు చాలా ఉన్నాయి. అవి :

  1. మానవుడి మేధ వికసిస్తుంది.
  2. ఆర్థిక, రాజకీయ, విద్య, క్రీడ, వ్యవసాయ, సాహిత్యాదిరంగాలలోని విషయాలు క్షుణ్ణంగా తెలుసుకోవచ్చు.
  3. సమాజంలో అట్టడుగున పడి కనిపించని వాస్తవాలెన్నో పత్రికల ద్వారా తెలుస్తాయి.
  4. రచయితలకు, యువతకు, కళాకారులకు, విద్యార్థులకు, నిరుద్యోగులకు, వ్యాపారవేత్తలకు, రైతులకు ఇంకా సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకూ వార్తా పత్రికలు కరదీపికలు.
  5. జాతీయాభివృద్ధికి, జాతి సమైక్యతకి దోహదపడతాయి.
  6. ప్రభుత్వానికీ, ప్రజలకీ మధ్య వారధి వలె తోడ్పడతాయి. అంటే ప్రభుత్వ పథకాలూ, లోపాలూ ప్రజలకి తెలియజేస్తాయి. ప్రజల కష్టనష్టాలూ, సమస్యలూ, అభిప్రాయాలూ ప్రభుత్వానికి తెలియజేస్తాయి.

కొన్ని పత్రికలు నిష్పాక్షికంగా ఉండి అధికారుల అవినీతిని, అక్రమాలని బహిరంగపరుస్తున్నాయి. మరికొన్ని అశ్లీలానికీ, నీతిబాహ్యమైన అంశాలకీ ప్రాధాన్యం ఇస్తున్నాయి. ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛని కాపాడాలి. సంపాదకులు, పత్రికా నిర్వాహకులు పత్రికా స్వేచ్ఛను దుర్వినియోగం చెయ్యకుండా నైతిక బాధ్యత కలిగి ఉండాలి.

AP Board 8th Class Telugu వ్యాసాలు

15. స్వచ్ఛభారత్

‘స్వచ్ఛభారత్’ అంటే భారతదేశం అంతా పరిశుద్ధంగా ఉండాలి అనే నినాదం. మనదేశ ప్రధాని నరేంద్రమోడీ గారు, దేశంలోని కాలుష్యమును గమనించి, నదీజలములు అన్నీ కలుషితం కావడం చూసి, ఈ ‘స్వచ్ఛభారత్’ అనే నినాదాన్ని ఇచ్చారు. ఈ కార్యక్రమ ప్రచారకులుగా దేశంలోని ప్రసిద్ధులయిన వ్యక్తులను మోడీ గారు నియమించారు. అమితాబ్ బచ్చన్, రామోజీరావు వంటి వారు, ఈ కార్యక్రమానికి చేయూతనిస్తున్నారు. మన విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, నగరాలలోని మురికి పేటలు, గంగ, గోదావరి వంటి నదుల జలాలు నేడు కాలుష్యంతో నిండిపోతున్నాయి. విద్యార్థులూ, ఆఫీసులలో ఉద్యోగులూ తమ పాఠశాలలనూ, కార్యాలయాలనూ “పరిశుభ్రంగా ఉంచుకోవాలి.” ప్రజలు తమ గృహాలనూ, పరిసరాలనూ శుభ్రంగా ఉంచుకోవాలి.

నదులు, చెరువులలోని నీటిని కలుషితం చేయరాదు. ఈ కాలుష్యం వల్ల రోగాలు పెరిగిపోతున్నాయి. దోమలు, క్రిములు పెరిగిపోతున్నాయి. ప్రజలందరూ స్వచ్చతను కాపాడితే, దేశం ఆరోగ్యవంతం అవుతుంది. ప్రజలకు కావలసిన మంచినీరు లభిస్తుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అని మన పెద్దలు ఏనాడో చెప్పారు.

స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని దేశం అంతా ప్రచారం చేయాలి. దీన్ని ప్రజల కార్యక్రమంగా తీర్చిదిద్దాలి. దేశంలోని పత్రికల వారు, దూరదర్శన్ వారు స్వచ్ఛభారత్ గురించి మంచి ప్రచారం చేయాలి. దానివల్ల దేశం సుభిక్షంగా, ఆరోగ్యంగా ఉంటుంది.

AP Board 6th Class Hindi Solutions सन्नद्धता कार्यक्रम Chapter 13 खट्टे अंगूर

AP State Syllabus AP Board 6th Class Hindi Textbook Solutions सन्नद्धता कार्यक्रम Chapter 13 खट्टे अंगूर Textbook Questions and Answers.

AP State Syllabus 6th Class Hindi Solutions सन्नद्धता कार्यक्रम Chapter 13 खट्टे अंगूर

6th Class Hindi सन्नद्धता कार्यक्रम Chapter 13 खट्टे अंगूर Textbook Questions and Answers

AP Board 6th Class Hindi Solutions सन्नद्धता कार्यक्रम Chapter 13 खट्टे अंगूर 1
अध्यापक “खट्टे – अंगूर” पाठ के चित्र से संबंधित चित्र दिखाकर कुछ प्रश्न पूछेगे। छात्र उनके उत्तर देंगे। (ఉపాధ్యాయులు “खट्टे – अंगूर” dow6 komopooh Searn చూపించి విద్యార్థులను కొన్ని ప్రశ్నలు అడిగెదరు. విద్యార్థులు వాటికి సమాధానములు చెప్పెదరు.)

मौखिक प्रश्न :

प्रश्न 1.
पहले चित्र में क्या – क्या दिखाई दे रहे हैं?
उत्तर:
पहले चित्र में कुछ पेड, एक सियार और अंगूर का बाग दिखाई दे रहे हैं।

प्रश्न 2.
दूसरे चित्र में क्या दिखायी दे रहा है?
उत्तर:
दूसरे चित्र में सियार अंगूर को देखकर उन्हें पाने के लिए सोच रहा है। अंगूर को देखकर उस के मुँह में पानी भर आया।

AP Board 6th Class Hindi Solutions सन्नद्धता कार्यक्रम Chapter 13 खट्टे अंगूर

प्रश्न 3.
तीसरे चित्र में तुझे क्या दिखाई दे रहा है?
उत्तर:
तीसरे चित्र में मुझे सियार और अंगूर दिखाई दे रहे हैं। सियार अंगूर खाने उन्हें पाने कूद रहा है।

प्रश्न 4.
चौथे चित्र में क्या दिखाई दे रहा है?
उत्तर:
चौथे चित्र में सियार अंगूर खाने के बिना ही लौट चले जा रहा है क्योंकि अंगूर बहुत ऊँचाई पर हैं।

प्रश्न 5.
अंगूर के बारे में सियार ने क्या कहा?
उत्तर:
अंगूर के बारे में सियार ने कहा कि “ये खट्टे अंगूर है।”

शब्दार्थ

जंगल= అడవి, a forest
में = లో, లోపల, in, into
एक = ఒక, one
सियार = నక్క, a fox
जाना = వెళ్ళుట, to go
अंगूर = ద్రాక్ష, grapes
बाग = తోట, garden
ऊँचाई = ఎత్తు, high
पर = మీద, పైన, on
पाना = పొందుట, to get
बार – बार = మళ్ళీ – మళ్ళీ, again and again
प्रयास = ప్రయాస, effort, try
हाथ = చెయ్యి, hand
खट्टा = పులుపు, sour
वहाँ से = అక్కడి నుండి, from that place
चल गया = వెళ్ళుపోయెను, went

AP Board 6th Class Hindi Solutions सन्नद्धता कार्यक्रम Chapter 13 खट्टे अंगूर

वर्णमाला चार्ट
AP Board 6th Class Hindi Solutions सन्नद्धता कार्यक्रम Chapter 13 खट्टे अंगूर 2

मौखिक अभ्यासः

1. चित्र देखो नाम बोलो।
AP Board 6th Class Hindi Solutions सन्नद्धता कार्यक्रम Chapter 13 खट्टे अंगूर 3

2. इन अक्षरों को बोलो, वर्णमाला चार्ट में गोला ‘O’ लगाओ।
भ, ध, ख, ठ, घ, झ, थ, छ
AP Board 6th Class Hindi Solutions सन्नद्धता कार्यक्रम Chapter 13 खट्टे अंगूर 4

3. समरूपी शब्दो को जोड़िए।
AP Board 6th Class Hindi Solutions सन्नद्धता कार्यक्रम Chapter 13 खट्टे अंगूर 5
उत्तर:
AP Board 6th Class Hindi Solutions सन्नद्धता कार्यक्रम Chapter 13 खट्टे अंगूर 6

4. चित्र देखकर नाम बोलो उसके अनेक अर्थ वाले चित्र से मिलाओ।
AP Board 6th Class Hindi Solutions सन्नद्धता कार्यक्रम Chapter 13 खट्टे अंगूर 7

AP Board 8th Class Telugu Solutions Chapter 1 అమ్మకోసం

AP State Syllabus AP Board 8th Class Telugu Textbook Solutions Chapter 1 అమ్మకోసం Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Telugu Solutions 1st Lesson అమ్మకోసం

8th Class Telugu 1st Lesson అమ్మకోసం Textbook Questions and Answers

చదవండి – ఆలోచించండి – చెప్పండి

ఆ.వె. తల్లి దండ్రి మీద దయలేని పుత్రుండు
పుట్టనేమి? వాడు గిట్టనేమి?
పుట్టలోన చెదలు పుట్టదా? గిట్టదా?
విశ్వదాభిరామ! వినురవేమ !

ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
కవి ఈ పద్యాన్ని ఎవరి గురించి చెప్పారు?
జవాబు:
కవి ఈ పద్యాన్ని తల్లిదండ్రులపై దయలేని కొడుకుల గురించి చెప్పారు.

ప్రశ్న 2.
చెదలతో ఎవరిని పోల్చారు?
జవాబు:
చెదలతో తల్లిదండ్రులపై దయలేని కొడుకులను పోల్చారు.

AP Board 8th Class Telugu Solutions Chapter 1 అమ్మకోసం

ప్రశ్న 3.
మన ప్రాచీన కథలలో తల్లిదండ్రులకు సేవచేసిన వారి గురించి మీకు తెలుసా?
జవాబు:
మన ప్రాచీన కథలలో తల్లిదండ్రులకు సేవచేసిన వారు యజ్ఞదత్తుడు, పాండురంగడు మొ||గువారు. రామాయణంలో ‘యజ్ఞదత్తుడు’ అనే మునికుమారుడు గుడ్డివారైన తన తల్లిదండ్రులకు సేవలు చేస్తూ ఉండేవాడు. వారిని కావడిలో పెట్టి మోసుకుంటూ తీర్థయాత్రలకు తీసుకొని వెళ్ళేవాడు. వారికి కందమూల ఫలాలు తెచ్చి ఇచ్చి వారి కడుపు నింపేవాడు. అతని తండ్రి వైశ్యుడు. తల్లి శూద్ర స్త్రీ. వారు ఋషిదంపతులు. వారికి ఒకసారి నదీజలాన్ని తెచ్చి వారి దాహాన్ని తీర్చడానికి, యజ్ఞదత్తుడు, సరయూ నదికి వెళ్ళి, కలశాన్ని నదిలో ముంచాడు. నదిలో కలశం ముంచిన చప్పుడు విని, ఏనుగు నీరు త్రాగడానికి వచ్చిందని భావించి దశరథుడు ‘శబ్దభేది’
బాణంతో కొట్టాడు. ఆ బాణం దెబ్బతిని, యజ్ఞదత్తుడు మరణించాడు. తల్లిదండ్రులకు సేవచేసిన వారిలో ఈ యజ్ఞదత్తుడు ప్రసిద్ధుడు.

ఇవి చేయండి

I. వినడం – మాట్లాడడం

ప్రశ్న 1.
తల్లిదండ్రులు కష్టాల్లో ఉన్నప్పుడు పిల్లలు ఏం చేయాలి? ఎందుకు?
జవాబు:
“మాతృదేవోభవ, పితృదేవోభవ” అన్నారు పెద్దలు. తల్లిదండ్రులు దైవ సమానులు. వారు మనకు జన్మనిచ్చినవారు. తల్లిదండ్రులు కష్టాల్లో ఉంటే పిల్లలు తమ సమస్తాన్ని సమర్పించి, వారిని ఆదుకోవాలి. వారికి సేవచేయాలి. వారు మనలను పెంచి పెద్దచేసి చదువు చెప్పిస్తారు. మన అభివృద్ధికై వారు ఎంతో కష్టపడ్డారు. మనకు కావలసినవి సమకూరుస్తారు. వారు వృద్ధులయినపుడు వారిని పిల్లలు చక్కగా సేవించాలి. తల్లిదండ్రులను ఆదరించడం, దైవ సేవచేయడం వంటిది అని గుర్తించాలి.

AP Board 8th Class Telugu Solutions Chapter 1 అమ్మకోసం

ప్రశ్న 2.
నేటికాలంలో తల్లిదండ్రులపట్ల పిల్లల వైఖరి ఎలా వుంది? దీనికి కారణాలు ఏమిటి?
జవాబు:
నేటి కాలంలో మానవ సంబంధాలు సరిగా ఉండడం లేదు. అందరిలోనూ స్వార్థం పెరిగిపోయింది. కని, పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు నేర్పించిన తల్లిదండ్రుల్ని కొంతమంది పిల్లలు ఆదరించడం లేదు. తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తిని మాత్రం అనుభవిస్తున్నారు. వారు కట్టించిన ఇళ్ళల్లో హాయిగా నివసిస్తున్నారు. కాని శక్తి ఉడిగి, మూలనపడిన తల్లిదండ్రులను ఆదరంగా చూడడంలేదు. తిండి పెట్టడం లేదు. వారి మాటకు గౌరవం ఇవ్వడం లేదు. కనీసం తమ పిల్లలను, తాతామామ్మల వద్దకు పంపడం లేదు. తాము తమ తల్లిదండ్రులను ఆదరించకపోతే, తిరిగి తమ పిల్లలు తమను అలాగే చూస్తారని వారు గ్రహించడం లేదు. . తల్లిదండ్రుల పట్ల, పిల్లల వైఖరికి వారి స్వార్థమే కారణం. తాము సంపాదించినదంతా, తమ భార్యాబిడ్డల సౌఖ్యానికే ఖర్చు చేయాలనే తాపత్రయమే, దీనికి ముఖ్య కారణం.

ప్రశ్న 3.
పాఠంలో ఏయే పద్యాలు మీకు నచ్చాయి? ఎందువల్ల?
జవాబు:
నాకు ఈ పాఠంలో మొదటి పద్యం, తొమ్మిదవ పద్యం, పదమూడవ పద్యం బాగా నచ్చాయి.

మొదటి పద్యంలో గరుత్మంతుడు తల్లితో తనకు గల బలాన్ని వివరించి చెప్పాడు. తాను దాస్యవృత్తిని ఎందుకు చేయవలసి వచ్చిందని తల్లిని అడిగాడు. తన దాస్యాన్ని వదిలించుకొని, స్వేచ్ఛగా జీవించాలనే గరుడుని కోరిక, నాకు నచ్చింది.

తొమ్మిదవ పద్యంలో, గరుత్మంతుడు నిప్పుల తోకచుక్కల సమూహంలా, తన రెక్కల గాలితో మేఘాల్ని చెదరగొట్టి, అమృతాన్ని రక్షించేవారు భయపడేటట్లు మనోవేగంతో వెళ్ళాడని, నన్నయ కవి చెప్పినది అక్షరరమ్యతతో చెవికి ఇంపుగా ఉంది. గరుత్మంతుని శక్తియుక్తులు నాకు ఆశ్చర్యం కల్గించాయి. దాస్యం నుండి స్వాతంత్ర్యం పొందాలనే కోరిక, నాకెంతగానో ఆనందాన్ని ఇచ్చింది.

అమృతాన్ని నాగులకు తెచ్చి ఇచ్చి, సూర్య, వాయు, చంద్రాగ్నుల సాక్షిగా, తల్లి దాస్యం తీరిందని చెప్పిన గరుడుని మాటను, తల్లి దాస్యం తొలగిపోవడంతో అతనికి కల్గిన ఆనందాన్ని పదమూడవ పద్యం ఎంతో చక్కగా తెలుపుతోంది.

II చదవడం, అవగాహన చేసుకోడం

ప్రశ్న 1.
అమృతం తేవడానికి వెళుతున్న గరుత్మంతుణ్ణి వర్ణించిన పద్యం ఏది? ఆ పద్యాన్ని, దాని భావాన్ని రాయండి.
పద్యం :
వితతోల్కాశనిపుంజ మొక్కొ యనఁగా విన్వీథి విక్షిప్త ప
క్షతి వాతాహతి దూలి, తూల శకలాకారంబులై వారిద
ప్రతతుల్ సాల్పడి నల్గడం ఖైదరఁగాఁ బాటెన్ మనోవేగుఁడై
పతగేంద్రుం డమృతాంతికంబునకుఁ దత్పాలుర్ భయం బందఁగన్.

భావం :
పక్షిరాజు మనో వేగంతో బయలుదేరాడు. అప్పుడతడు నిప్పుకణాలతో కూడిన తోకచుక్కలా ఉన్నాడు. ఆకాశంలో కదులుతూ ఉన్నప్పుడు అతని రెక్కల గాలివల్ల మేఘాలు దూదిపింజలై చెదరిపోతున్నాయి. అమృతాన్ని రక్షిస్తున్నవారు భయపడేటట్లుగా గరుత్మంతుడు మనోవేగంతో అమృతమున్న చోటుకు వెళ్ళాడు.

AP Board 8th Class Telugu Solutions Chapter 1 అమ్మకోసం

ప్రశ్న 2.
1, 9 పద్యాలకు ప్రతిపదార్థాలు రాయండి. ప్రతిపదార్థం అంటే పద్యంలోని ప్రతి ఒక్క పదానికి అర్థం రాయడం. ప్రతిపదార్థం రాయడంలో అన్వయక్రమం సాధించేందుకు పదాలవరస మార్చి రాయడం, పదాల మధ్య సంబంధం కోసం అక్కడక్కడా ప్రత్యయాలు చేర్చడం జరుగుతుంది.

ఉదాహరణ
చ. ‘అమితపరాక్రమంబును, రయంబును, లావును గల్గు ఖేచరో
త్తముఁడవు నీవు; నీదయిన దాస్యము వాపికొనంగ నీకుఁ జి
త్తము గలదేని, భూరిభుజదర్పము శక్తియు నేర్పడంగ మా
కమృతముఁ దెచ్చియి’ మ్మనిన నవ్విహగేంద్రుఁడు – సంతసంబునన్
ప్రతిపదార్థం :
నీవు = గరుత్మంతుడివైన నీవు
అమిత = అధికమైన
పరాక్రమంబును = శౌర్యమూ
రయంబును = వేగమూ,
లావును = బలమూ
కల్గు = ఉన్న
ఖేచర + ఉత్తముడవు = పక్షి శ్రేష్ఠుడివి;
నీది + అయిన = నీ (యొక్క)
దాస్యము = బానిసత్వాన్ని
పాపికొనంగ = పోగొట్టుకునేందుకు
నీకున్ = నీకు
చిత్తము = ఇష్టము (కోరిక)
కలదు + ఏని = ఉన్నట్లైతే
మాకున్ = ఉరగులమైన మాకు
భూరి = గొప్పదైన
భుజదర్పము = భుజగర్వము
శక్తియున్ = బలము
ఏర్పడంగ = ప్రకటితమయ్యేటట్లు
అమృతమున్ = అమృతాన్ని
తెచ్చి +ఇమ్ము = తెచ్చి ఇయ్యి
అనినన్ = అని పలుకగా,
ఆ+విహగ+ఇంద్రుడు = పక్షి శ్రేష్ఠుడైన ఆ గరుత్మంతుడు
సంతసంబునన్ = సంతోషంతో (ఇలా అన్నాడు……..)

1వ పద్యము

ఉ. ఆయతపక్షతుండహతి నక్కులశైలము లెల్ల నుగ్గుగాఁ
జేయు మహాబలంబును బ్రసిద్దియునుం గల నాకు నీపనిం
బాయక వీఁపునం దవడుఁబాముల మోవను, వారికిం బనుల్
సేయను నేమి కారణము సెప్పుము దీనిఁ బయోరుహాననా!
ప్రతిపదార్థం :
పయోరుహాననా (పయోరుహ + ఆననా) = పద్మము వంటి ముఖము కలదానా !
ఆయత క్షతుండహతిన్;
ఆయత = పెద్దవయిన
పక్ష = టెక్కలయొక్కయు
తుండ = ముక్కు యొక్కయు
హతిన్ = దెబ్బలచేత
అక్కులశైలము లెల్లన్;
ఆ + కులశైలములు + ఎల్లన్ = ఆ కులపర్వతాలు అన్నింటినీ
నుగ్గుగాన్ + చేయు = పొడిగా చేయగల
మహాబలంబును (మహత్ + బలంబును) = గొప్ప బలాన్నీ
ప్రసిద్ధియున్ = ప్రఖ్యాతియూ
కల, నాకున్ = పొందిన నాకు
ఈ పనిన్ = ఈ పనిని (ఈ దాస్యాన్ని)
పాయక = మానకుండా
వీపునందున్ = వీపు మీద
అవడు + పాములన్ = నీచములయిన పాములను
మోవను = మోయడానికిన్నీ
వారికిన్ = ఆ పాములకు
పనుల్ + చేయను = పనులు చేయడానికి (సేవలు చేయడానికిన్నీ)
ఏమి, కారణము = కారణము ఏమిటో
నాకున్ = నాకు
చెప్పుము = చెప్పుము

AP Board 8th Class Telugu Solutions Chapter 1 అమ్మకోసం

9వ పద్యము

మ. వితతోల్కాశనిపుంజ మొక్క యనఁగా విన్వీథి విక్షిప్త ప
క్షతి వాతాహతి దూలి, తూల శకలాకారంబులై వారిద
ప్రతతుల్ సాల్పడి నల్గడం జెదరఁగాఁ బాటెన్ మనోవేగుఁడై
పతగేంద్రుం డమృతాంతికంబునకుఁ దత్పాలుర్ భయం బందఁగన్.
ప్రతిపదార్థం :
వితతోల్కాశనిపుంజము + ఒక్కొ
వితత = విరివిగా గల
ఉల్క = మండే నిప్పుకణాల యొక్కయు,
అశని = పిడుగుల యొక్కయు
పుంజము + ఒక్కొ = సమూహమా
అనగా = అనేటట్లుగా
విన్వీథి (విన్ + వీథి) = ఆకాశమార్గంలో
విక్షిప్తపక్షతివాతాహతిన్; విక్షిప్త = విదల్చబడిన
పక్షతి = రెక్కల యొక్క
వాత = గాలి యొక్క
ఆహతిన్ = దెబ్బల చేత
తూలి = అటునిటు కదలి
పాఱెన్ = పరుగెత్తాడు.
వారిద, ప్రతతుల్ : మబ్బుల యొక్క సముదాయాలు
తూలశకలాకారంబులు + ఐ; తూల = దూది యొక్క
శకల = పింజల యొక్క
ఆకారంబులు + ఐ = రూపములు కలవై
చాల్పడి = వరుసకట్టి
నల్గడన్ (నల్ + కడన్) – = నాల్గువైపులా
చెదరగా = చెదరిపోగా
మనోవేగుడై (మనః + వేగుడు + ఐ) = మనస్సు యొక్క వేగం వంటి వేగం కలవాడై
పతగేంద్రుండు (పతగ + ఇంద్రుండు) – పక్షులకు ఇంద్రుడయిన గరుత్మంతుడు
అమృతాంతికంబునకున్ (అమృత + అంతికంబునకున్) = అమృతం దగ్గరకు
తత్ పాలుర్ = ఆ అమృత రక్షకులు
భయంబు + అందగన్ = భయపడగా

AP Board 8th Class Telugu Solutions Chapter 1 అమ్మకోసం

3. పాఠంలోని కింది పద్యపాదాలకు సమానార్థక వాక్యాంశాలను గుర్తించండి.
i) అనిమిషనాథ సుగుప్తమయిన యమృతము
అ) అనిమిషనాథునికి ఇష్టమైన అమృతం
ఆ) ఇంద్రుడు దాచిపెట్టిన అమృతం
ఇ) ఇంద్రునికి అయిష్టమైన అమృతం
ఈ) ఇంద్రుడు దాచి కాపాడుతూ ఉంచిన అమృతం
జవాబు:
ఈ) ఇంద్రుడు దాచి కాపాడుతూ ఉంచిన అమృతం

ii) ఆయత పక్షతుండ
అ) ఆయన పక్షి శ్రేష్ఠుడు
ఆ) ఆయన పక్షపాతి
ఇ) పెద్ద రెక్కలున్న వాణ్ణి
ఈ) పెద్ద పక్షిని నేను
జవాబు:
ఇ) పెద్ద రెక్కలున్న వాణ్ణి

iii) నీయట్టి సత్పుత్రుం బడసియు దాసినై యుండుదాననే?
అ) నీవంటి ఉత్తమకుమారుణ్ణి పొంది కూడా దాసిగానే ఉండనా?
ఆ) నీవంటి ఉత్తమకుమారుణ్ణి పొందాను కనుక ఇక దాసిగా ఉంటాను.
ఇ) నీవంటి గొప్పకుమారుణ్ణి పొంది కూడా దాసిగానే ఉన్నాను.
ఈ) నీ వంటి గొప్పకుమారుణ్ణి పొందినా దాసిగానే ఉంటాను.
జవాబు:
అ) నీవంటి ఉత్తమకుమారుణ్ణి పొంది కూడా దాసిగానే ఉండనా?

4. కింది మాటలు ఎవరు ఎవరితో అన్నారో ఏ సందర్భంలో అన్నారో రాయండి.
అ) మా యీ దాస్యము వాయు నుపాయము సేయుండు.
జవాబు:
ఈ మాటలు గరుడుడు కద్రువ పుత్రులతో అన్నాడు.

గరుత్మంతుడు తమ దాస్యమునకు కారణాన్ని తల్లి వల్ల తెలిసికొన్నాడు. తరువాత గరుత్మంతుడు కద్రువ పుత్రుల వద్దకు వచ్చి, వారికి ఏమి కావాలన్నా తెచ్చి యిస్తానని చెప్పి తమ దాస్యము పోయే ఉపాయం చెప్పమని వారిని అడిగిన సందర్భంలోనిది.

ఆ) నీ కతమున నా దాస్యము ప్రాకటముగఁ బాయునని
జవాబు:
ఈ మాటలు వినత తన కుమారుడు గరుత్మంతునితో అన్నది.

మనం ఎందుకు కద్రువకూ, ఆమె పుత్రులకూ దాస్యం చేయవలసి వచ్చిందని గరుత్మంతుడు తల్లి వినతను అగిగాడు. అప్పుడు వినత తాను కద్రువతో వేసిన పందెములో ఓడిపోవడం వల్ల దాసీత్వము వచ్చిందని చెప్పింది. ఆ దాసీత్వము గరుత్మంతుని కారణంగానే పోతుందని వినత గరుత్మంతుడికి చెప్పిన సందర్భంలోనిది.

ఇ) నీదయిన దాస్యము వాపికొనంగ నీకుఁ జిత్తము గలదేని
జవాబు:
ఈ మాటలు కద్రువ పుత్రులు గరుత్మంతునితో అన్నారు.

తనకూ తన తల్లికీ దాస్యం పోయే ఉపాయం చెప్పండని గరుత్మంతుడు కద్రువ పుత్రులను అడిగినప్పుడు, కద్రువ పుత్రులు గరుత్మంతునికి చెప్పిన మాటల సందర్భంలోనిది.

ఈ) దినకరపవనాగ్ని తుహినదీప్తుల కరిగాన్
జవాబు:
ఈ మాటలు గరుత్మంతుడు, కద్రువ పుత్రులతో అన్నాడు.

గరుత్మంతుడు దేవతలను జయించి, అమృతాన్ని తెచ్చి కద్రువ పుత్రులకు ఇచ్చాడు. ఆ తరువాత సూర్యుడు, వాయువు, అగ్ని, చంద్రుడు సాక్షిగా తమ దాస్యము పోయిందని, గరుత్మంతుడు కద్రువ పుత్రులతో చెప్పాడు.

AP Board 8th Class Telugu Solutions Chapter 1 అమ్మకోసం

5. కింది ప్రశ్నలకు పాఠం ఆధారంగా జవాబులు రాయండి.
అ) గరుడుడు తల్లిని ఏమని ప్రశ్నించాడు?
జవాబు:
ఓ తల్లీ ! విశాలమైన నా రెక్కలతో, వాడి అయిన ముక్కుతో కులపర్వతాలు అన్నింటిని పిండిగా చేయగలిగిన గొప్ప బలం, కీర్తి గలిగిన నేను, ఈ నీచులైన పాములను ఎప్పుడూ వీపు మీద మోయడానికి, వాటికి సేవలు చేయటానికి కారణము ఏమిటో చెప్పమని ప్రశ్నించాడు.

ఆ) కద్రువ కుమారులను గరుడుడు ఏమడిగాడు? దానికి వాళ్ళేమన్నారు?
జవాబు:
కద్రువ కుమారులను గరుడుడు నా తల్లికి, నాకు దాస్యం పోవడానికి ఆలోచన చేయండి, దీనికోసం మీకు ఇష్టమైనదేదో ఆజ్ఞాపించండి. దేవతలను లోబరుచుకొని అయినా దాన్ని సాధిస్తాను అని అడిగాడు.

“నీవు అంతులేని పరాక్రమం, వేగం, బలం కలిగిన పక్షి శ్రేష్ఠుడివి. నీకు దాస్యం పోగొట్టుకోవాలనే అభిప్రాయం ఉంటే, నీ భుజబలం సామర్థ్యమూ తెలిసేలా, మాకు అమృతాన్ని తెచ్చి ఇయ్యి” – అని కద్రువపుత్రులు, గరుత్మంతునితో చెప్పారు.

ఇ) అమృతాన్ని ఎవరు, ఎలా రక్షిస్తున్నారు?
జవాబు:
అమృతం దేవేంద్రుడి రక్షణలో ఉంది. కాపలాదార్లు అమృతాన్ని రక్షిస్తున్నారు. ఇంకా అమృతాన్ని భయంకరమైన రెండు సర్పాలు రక్షిస్తున్నాయి. ఆ పాములు ఆ సమీపానికి ఎవరినీ రానీయడం లేదు. వాటి ముఖాలు కోపాన్ని వెలిగ్రక్కుతున్నాయి. ఆ పాముల చూపులు విషము అనే అగ్నిని చిమ్ముతున్నాయి.

ఈ) అమృతం తెచ్చిన గరుడుడు కద్రువ కుమారులతో ఏమని చెప్పాడు?
జవాబు:
అమృతం తెచ్చిన గరుడుడు కద్రువ కుమారులతో “నేను దేవేంద్రుడి రక్షణలో ఉన్న అమృతాన్ని తెచ్చి మీకు ఇచ్చాను. దీనికి సూర్యుడు, గాలి, అగ్ని, చంద్రుడు, సాక్షులు. దీనితో నా తల్లి దాస్యం తొలగిపోయింది” అన్నాడు.

III. స్వీయరచన

1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ) ఎంతో కష్టమైనప్పటికీ, దాస్యవిముక్తి కోసం గరుడుడు అమృతం తెచ్చాడు కదా ! అయితే దాస్యవిముక్తికి లేదా స్వేచ్ఛకు ఉన్న గొప్పతనం ఏమిటో వివరించండి.
జవాబు:
బానిసత్వం నుండి విడిపించుకొని స్వేచ్ఛగా జీవించడమే దాస్యవిముక్తి. గరుత్మంతుడు తన తల్లికీ, తనకూ దాస్యం పోడానికి ఎంతో కష్టపడి, దేవేంద్రుని ఎదిరించి, అమృతం తెచ్చియిచ్చాడు. మన భారతమాత దాస్య బంధాన్ని విడిపించి, స్వతంత్రం పొందడానికి, మన దేశ నాయకులు ఎందరో ప్రాణాలు విడిచారు. జైళ్ళలో మగ్గిపోయారు. ఒకరికి సేవచేస్తూ, బానిసత్వంలో పడి ఉండడం, నరకంతో సమానం. స్వేచ్ఛా జీవితం అనుభవిస్తూ, తనకు లభ్యమయిన అన్న పానీయాలను తీసుకొని, కడుపునింపుకోవడం స్వర్గంతో సమానం.

ఆ) వినత తన విముక్తి కోసం కొడుకు మీద ఆశపెట్టుకుంది కదా ! నేటి కాలంలో తల్లిదండ్రులు తమ పిల్లల వల్ల ఏమి ఆశిస్తున్నారు?
జవాబు:
నేటి తల్లిదండ్రులు తమ పిల్లలు చక్కగా చదువుకొని మంచి ఉద్యోగం చేసుకుంటూ, బాగా సంపాదించాలని కోరుకుంటున్నారు. తమ పిల్లలకు చక్కని పెళ్ళి సంబంధాలు రావాలనీ మంచి కోడళ్ళూ, అల్లుళ్ళూ తమకు దొరకాలనీ కోరుకుంటున్నారు.

తమకు వృద్ధాప్యం వచ్చాక, తమ పిల్లలు తమను ప్రేమగా ఆదరంగా చూడాలని కోరుకుంటున్నారు. చివరి రోజులో పిల్లలు తమకు ఆసరాగా నిలిచి, తమకు దగ్గరగా ఉండి, కావలసిన సహాయాన్ని అందించాలని కోరుకుంటున్నారు.

ఇ) మీరు మీ తల్లిదండ్రులకు ఏ విధంగా సహాయపడుతున్నారు? ఇంకా వాళ్ళకు ఏ విధంగా సహకారం అందించాలని అనుకుంటున్నారు?
జవాబు:
నేను మా తల్లిదండ్రులకు సహాయం చేస్తున్నాను. నా సెలవు రోజుల్లో మా నాన్నగారితో పొలం పనులకు వెడతాను. సాయం చేస్తాను. మా అమ్మగారికి ఇంట్లో పనుల్లో సాయం చేస్తాను. కిరాణాకొట్టు నుండి సరకులు తెచ్చిపెడతాను. రేషను సరకులు తెస్తాను. విద్యుచ్ఛక్తి బిల్లులు కడతాను. వారం వారం, ఇల్లు శుభ్రం చేస్తాను.

నేను పెద్దయ్యాక మా తల్లిదండ్రులను మా ఇంటిలో మాతోనే ఉంచుకొని వారిని కంటికి రెప్పలా చూసుకుంటాను.

వృద్ధాప్యదశలో కలిగే కోరికలను నా శక్తిమేర తీర్చాలనుకుంటున్నాను. వారికి కావలసిన సదుపాయాలను అన్నింటిని సమకూరుస్తాను.

AP Board 8th Class Telugu Solutions Chapter 1 అమ్మకోసం

ఈ) యోగ్యులైన పిల్లల వల్ల తల్లిదండ్రులకు కలిగే ప్రయోజనాలు ఏమిటి?
(లేదా)
గరుత్మంతుడి లాంటి గొప్ప కొడుకులు ఉన్న తల్లిదండ్రుల పరిస్థితి ఎలా ఉంటుందో రాయండి. (S.A. III – 2016-17)
జవాబు:
గరుత్మంతుడి లాంటి గొప్ప కుమారులున్న తల్లిదండ్రులు అదృష్టవంతులు. సమర్థులైన కొడుకులు తల్లిదండ్రుల కష్టాలు తొలగిస్తారు. గరుత్మంతుడు సమర్థుడు. బలవంతుడు. కొండల్ని పిండి చేయగలడు. అందువల్లనే తమ దాస్య కారణాన్ని తల్లి నుండి అడిగి తెలుసుకొన్నాడు. అంతేకాక కద్రువ పుత్రుల వద్దకు వెళ్ళి తన తల్లి దాస్య విముక్తి కోసం వారడిగినది తెచ్చి ఇచ్చాడు.

పిల్లలు యోగ్యులైతే వారు తల్లిదండ్రులకు, అన్ని విధాలా సాయం చేస్తారు. తమ తల్లిదండ్రులకు వృద్ధాప్యంలో ఆసరాగా ఉండి, వారికి కావలసిన సమస్త సదుపాయాలు, తమ శక్తిమేరకు సమకూరుస్తారు. తల్లిదండ్రులకు వైద్యసదుపాయాలు ఏర్పాటు చేస్తారు. తమకు తీరిక దొరికినప్పుడు తల్లిదండ్రుల వద్ద కూర్చుండి, ఇష్టాగోష్టిగా మాట్లాడి, వారి కష్టసుఖాల్ని తెలుసుకుంటారు. తల్లిదండ్రులు హాయిగా మనవలతో కాలక్షేపం చేసేలా ఏర్పాటు చేస్తారు. తల్లిదండ్రుల సలహాలను తాము తీసుకొని, సంసారాన్ని చక్కగా నడుపుకుంటారు. యోగ్యులైన పిల్లల వలన తల్లిదండ్రులు సంతోషకరమైన, సంతృప్తికరమైన జీవనం గడుపుతారు.

2. కింది ప్రశ్నలకు పదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ) “సమర్థులైన కొడుకులు తల్లిదండ్రుల కష్టాలు తొలగిస్తారు”- ఈ వాక్యాన్ని సమర్థిస్తూ సొంతమాటలలో రాయండి.
(లేదా)
“సమర్ధులైన కొడుకులు తల్లిదండ్రుల కష్టాలను తొలగిస్తారు” ఈ మాటలను గరుత్మంతుడు ఎలా నిజం చేశాడో రాయండి. (S.A. I – 2019-207)
జవాబు:
కొన్ని పేద, మధ్య తరగతి కుటుంబాలలో తల్లిదండ్రులు తమకు ఆర్థికస్తోమత లేకపోయినా తమ బిడ్డల భవిష్యత్తు బంగారుమయం కావాలని ఆశిస్తారు. తామెన్ని వ్యయప్రయాసలు, కష్టనష్టాలకు అయినా ఓర్చి వారికి పెద్ద చదువులు చెప్పిస్తారు. అటువంటి కుటుంబాలకు చెందిన కొందరు సమర్థులైన పిల్లలు తమ శ్రేయస్సు కోసం తల్లిదండ్రులు పడుతున్న కష్టాన్ని, తాపత్రయాన్ని గుర్తించి, చక్కగా చదువుకొని ఉన్నత స్థానానికెదిగి, మంచి ఉద్యోగాలు పొందుతున్నారు. వారు తమ తల్లిదండ్రులకు ఆర్థికంగా ఆసరాగా నిలవడమే కాక, వారికి అన్ని విధాలా తోడ్పాటు నందిస్తూ, శ్రద్ధాసక్తులతో గౌరవిస్తూ, వారి సలహాలను పాటిస్తూ, వారి కోర్కెలను తీరుస్తూ ఉత్తమ జీవనం సాగిస్తారు. తమకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల ఋణం తీర్చుకోవడానికి వారు శాయశక్తులా కృషి చేస్తారు.

మన పాఠంలో గరుత్మంతుడు సమర్థుడు. బలవంతుడు. కొండల్ని పిండి చేయగలడు. అందువల్లనే తమ దాస్య కారణాన్ని తల్లి నుండి అడిగి తెలుసుకున్నాడు. అంతేకాదు. కద్రువ పుత్రుల వద్దకు వెళ్ళి “మీకు ఇష్టమైనదేదో చెప్పండి. దేవతలనైనా జయించి తెస్తాను’ అని అన్నాడు. అలా అనడానికి అతనికి గల సమర్థత, శక్తి సామర్థ్యాలు కారణం.

మాట అనడమేకాదు, తన రెక్కల గాలితో దుమ్మును రేపి అమృతాన్ని రక్షించే పాములకు కళ్ళు కనబడకుండా చేశాడు. వాటి తలలను తొక్కి అమృతాన్ని తీసుకొని ఆకాశానికి ఎగిరాడు. అమృతాన్ని కద్రూ పుత్రులకు తెచ్చి ఇచ్చి తమ దాస్యాన్ని పోగొట్టుకున్నాడు.

దీనిని బట్టి సమర్థులైన కొడుకులు, తల్లిదండ్రుల కష్టాలు తీరుస్తారని చెప్పగలం.

AP Board 8th Class Telugu Solutions Chapter 1 అమ్మకోసం

ఆ) ఈ పాఠం సారాంశాన్ని సొంతమాటల్లో రాయండి.
(లేదా)
గరుత్మంతుడు తన తల్లి దాస్యాన్ని ఏ విధంగా పోగొట్టాడో రాయండి. (S.A. I – 2018-19)
జవాబు:
కశ్యప ప్రజాపతికి కద్రువ, వినత అని ఇద్దరు భార్యలు ఉన్నారు. పెద్ద భార్య కద్రువకు కశ్యపుని వరం వలన వేయిమంది కుమారులు కలిగారు. వారే కర్కోటకాది సర్పాలు. వినతకు అనూరుడు, గరుత్మంతుడు పుట్టారు. అనూరుడు, సూర్యుని రథసారథి. వినత ఒక పందెంలో ఓడిపోయి కద్రువకు దాసి అయింది. తల్లితో పాటు గరుత్మంతుడు కద్రువ కుమారులకు సేవలు చేస్తూ ఉండేవాడు.

మహాశక్తిమంతుడైన గరుత్మంతుడు తమ దాస్యానికి కారణం తెలుసుకోవడానికి తల్లి దగ్గరకు వెళ్ళాడు. తన తల్లిని మనము ఎల్లపుడూ నీచమైన పాములను వీపు మీద మోయడానికి కారణం చెప్పమని అడిగాడు.

వినత తన సనతి అయిన కద్రువతో పందెంలో ఓడిపోయి దాసీతనం పొందిన విషయాన్ని కొడుకుతో స్పష్టంగా చెప్పింది. గరుడుని వంటి యోగ్యుడైన పుత్రుని పొంది దాసీగానే ఉండాలా అని ప్రశ్నించింది.

తల్లికి దాస్యవిముక్తి చేయటం కోసం గరుత్మంతుడు పాములతో ‘మీకు ఇష్టమైనది ఆజ్ఞాపించండి, దాన్ని సాధిస్తాను’ అని చెప్పాడు.

అప్పుడు కద్రువ కుమారులు జాలిపడి గరుత్మంతుడితో ‘నీ భుజబలం, సామర్థ్యం తెలిసేలా మాకు దేవేంద్రుని వద్ద వున్న అమృతాన్ని తెచ్చి ఇవ్వు” అన్నారు.

గరుడుడు తల్లి ఆశీస్సులతో అమృతం తేనటానికి వెళ్ళాడు. తన రాకతో అమృతాన్ని రక్షిస్తున్నవారు భయపడేటట్లుగా గరుత్మంతుడు మనోవేగంతో అమృతం ఉన్న చోటుకు వెళ్ళాడు.

అమృతాన్ని రక్షిస్తున్న భయంకరమైన రెండు సర్పాలు ఆ సమీపానికి ఎవరినీ రానీయడం లేదు. గరుడుడు తన రెక్కలవల్ల రేగిన దుమ్ముతో వాటి కళ్ళు కనబడకుండా చేశాడు. వాటి తలలను తొక్కిపట్టాడు. అమృతాన్ని తీసుకొని ఆకాశానికి ఎగిరాడు.

దాన్ని పాములకు చూపించి “దేవేంద్రుడి రక్షణలో ఉన్న అమృతాన్ని తెచ్చి మీకు ఇచ్చాను. దీనికి సూర్యుడు, గాలి, అగ్ని, చంద్రుడు సాక్షులు – దీనితో నా తల్లి దాస్యం తొలగిపోయింది” అన్నాడు.

IV. పదజాలం – వినియోగం

1. కింది పేరా చదవండి. పేరాలో గీత గీసిన పదాలకు ఒక్కొక్క దానికి మూడు సమానార్థక పదాలు పేరా కింద ఉన్నాయి. వాటిలో నుంచి సరైన పదాలను ఎంపిక చేసి రాయండి.

నభమున దట్టమైన వారిదములు విస్తరించాయి. ఉరుములు మెరుపులతో పాటు కులిశములు రాలాయి. దీనితో విపినంలో ఉండే వృక్షాలు కూలిపోయాయి. పన్నగాలన్నీ పుట్టలలోనికి దూరాయి. మబ్బులు వీడగానే పతంగుడు మళ్ళీ దర్శన మిచ్చాడు.

(ఆకాశం, పాము, పిడుగు, మేఘం, సూర్యుడు, అడవి, అరణ్యం, రవి, మబ్బు, అశని, ఫణి, గగనం, వనం, సర్పము, నిర్ఘాతము, అభ్రము, భానుడు, అంబరం.)
సమానార్థక పదాలు :
1. నభము = ఆకాశం, గగనం, అంబరం
2. వారిదము = మేఘం, మబ్బు, అభ్రము
3. కులిశము = పిడుగు, అశని, నిర్ఘాతం
4. వివినము = అడవి, అరణ్యం, వనం
5. పన్నగము = పాము, సర్పం, ఫణి
6. పతంగుడు = భానుడు, సూర్యుడు, రవి

2. కింది పదాలకు అర్థాలు రాయండి, సొంతవాక్యాల్లో ప్రయోగించండి.

అమితం, పరాక్రమం, దాస్యం, సత్పుత్రుడు, ప్రసిద్ధి, విముక్తి

1) అమితము = అంతులేని
సముద్రంలో అమితమైన జలరాశులు ఉన్నాయి.

2) పరాక్రమం = గొప్పశక్తి
అశోకుడు కళింగయుద్ధంలో గొప్ప పరాక్రమం చూపాడు.

3) దాస్యం = బానిసత్వం
ఆంగ్లేయుల పాలనలో భారతీయులు దాస్యంలో నలిగిపోయారు.

4) సత్పుత్రుడు = మంచి కుమారుడు
దశరథునికి శ్రీరాముడు సత్పుత్రుడు.

5) ప్రసిద్ధి = ఖ్యాతి
కొండపల్లి కొయ్యబొమ్మలకు ప్రసిద్ధిగాంచింది.

6) విముక్తి = స్వేచ్ఛ
భారతీయులకు ఆంగ్లేయుల నుంచి 1947లో విముక్తి లభించింది.

V. సృజనాత్మకత

* పాఠం ఆధారంగా గరుడునికీ, కద్రువ కుమారులకూ మధ్య జరిగిన చర్చను సంభాషణ రూపంలో రాయండి.
జవాబు:
గరుత్మంతుడు : అన్నలారా! మీరు నాకు ఒక ఉపకారం చేయండి.

కద్రువ కుమారులు : గరుత్మంతుడా! నీవు దాసీపుత్రుడవు. మాకు బానిసవు.

గరుత్మంతుడు : అవును. నా తల్లికీ, నాకూ దాస్యం పోవడానికి, ఏదైనా మీరు ఉపాయం చెప్పండి.

కద్రువ కుమారులు : మరి మాకు ఇష్టమైన పని చేస్తావా?

గరుత్మంతుడు : సరే! తప్పక చేస్తాను, మీకు ఇష్టమైన పని ఏమిటో ఆజ్ఞాపించండి.

కద్రువ కుమారులు : నీవు శక్తికలవాడవే, కాని, దేవతలను లొంగదీయగలవా?

గరుత్మంతుడు : లొంగదీసుకొని మీ కిష్టమైనది తప్పక తెస్తా!

కద్రువ కుమారులు : నీవు అంతులేని పరాక్రమం, వేగం కల పక్షి రాజువి. మరి మీ దాస్యం పోవాలంటే ఓ పని చేయాలి.

గరుత్మంతుడు : తప్పక చేస్తా. అదేమిటో చెప్పండి. నేను మాటతప్పను.

కద్రువ కుమారులు : అయితే నీ భుజబలం, సామర్థ్యం తెలిసేలా దేవతలను జయించి మాకు అమృతాన్ని తెచ్చి ఇవ్వు.

గరుత్మంతుడు : సరే, అన్నలారా! నేను తప్పక స్వర్గం నుంచి అమృతం తెచ్చి, మీ కిచ్చి దాస్య విముక్తి పొందుతా. (గరుడుడు అమృతం తెచ్చాడు.)

గరుత్మంతుడు : అన్నలారా! ఇదిగో అమృతం. దేవేంద్రుడి రక్షణలో ఉన్న అమృతాన్ని తెచ్చాను. సూర్యచంద్రాగ్నులు సాక్షిగా మా తల్లి దాస్యం పోయింది.

కద్రువ కుమారులు : సరే, నీవూ, నీతల్లి దాస్య విముక్తులయ్యారు. వెళ్ళండి.

AP Board 8th Class Telugu Solutions Chapter 1 అమ్మకోసం

VI. ప్రశంస

* పొరుగూరిలో మీకు మంచి స్నేహితుడున్నాడు. ఆ మిత్రుడు అనారోగ్యంతో ఉన్న తండ్రికి సేవలు చేస్తూ తల్లిదండ్రుల అభిమానం పొందాడని తెలుసుకున్నారు. అతణ్ణి ప్రశంసిస్తూ లేఖ రాయండి.
జవాబు:

విజయవాడ,
x x x x x x x

ప్రియమైన మిత్రుడు నిరంజన్‌కు,

నీ మిత్రుడు రాయు లేఖ ఏమనగా ఇక్కడ నేను క్షేమము. అక్కడ నీవు ఎలా ఉన్నావు ? నిన్న నీవు వ్రాసిన ఉత్తరం అందింది. అది చదివి నేను చాలా సంతోషించాను. మీ నాన్నగారికి ఆరోగ్యం సరిగా లేదని, నీవు మీ నాన్నగారికి ఇంటివద్ద సేవలు చేస్తున్నావని తెలిపావు. ఇది చాలా ఆనందించవలసిన విషయం. తల్లిదండ్రులు మనకు దైవ సమానులు. వారికి సేవచేయటం మన బాధ్యత. “తల్లిదండ్రుల మీద దయలేని కొడుకు పుట్టలోని చెదలు” వంటి వాడని, వేమన్న అన్నాడు. నీవంటి పుత్రుని కన్నందుకు మీ తల్లిదండ్రులు ధన్యులు. నీకు అభినందనలు.

ఇట్లు,
నీ మిత్రుడు,
ఎస్. శశికాంత్,
8వ తరగతి,
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,
విజయవాడ.

చిరునామా :
జి. నిరంజన్,
S/o జి.వెంకటేశ్వర్లు,
డోర్.నెం. 4/87,
రామాలయం వీధి,
గుంటూరు.

ప్రాజెక్టు పని

* “కష్టపెట్టబోకు కన్నతల్లి మనసు, నష్టపెట్టబోకు నాన్నపనులు” వంటి పద్యాలు “అమ్మను మించిన దైవం లేదు” వంటి సూక్తులు కొన్నింటిని సేకరించి తరగతిలో ప్రదర్శించండి.
జవాబు:
పద్యాలు :
1. పుత్రోత్సాహంబు తండ్రికి
పుత్రుడు జన్మించినపుడె పుట్టదు జను లా
పుత్రుని కనుగొని పొగడగ
పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ !

2. ఉన్నను లేకున్నను పై
కెన్నడు మర్మంబుఁ దెలుప నేరకుమీ నీ
కన్న తల్లిదండ్రుల యశం
బెన్నఁ బడెడు మాడ్కిఁ దిరుగు మేలమిఁ గుమారా!

3. తనయుడు చెడుగై యుండిన
జనకుని తప్పన్న మాట సత్యమెఱుఁగుం గా
వున నీ జననీ జనకుల
కు నపఖ్యాతి యగురీతి గొనకు కుమారా !

సూక్తులు :
1. తల్లిదండ్రులు ప్రత్యక్షదైవాలు.
2. అమ్మ ప్రేమకు మారుపేరు – అమ్మ మనసు పూలతేరు.
3. తల్లిదండ్రులను పూజింపుము.
4. తల్లిదండ్రులు తమ సంతానానికి అందించిన వాటికి ప్రతిఫలం ఈ సృష్టిలోనే లేదు. – వాల్మీకి

VII. భాషను గురించి తెలుసుకుందాం

1. సమాపక, అసమాపక క్రియలు

(అ) కింది క్రియాపదాలను చదవండి.
తిని, చూసి, వండి, విని, చూస్తే, చేస్తూ, వింటే, ఆడుతూ

పై క్రియలలో పని పూర్తికాలేదని తెలుస్తుంది. ఇలా పని పూర్తికాని క్రియలను అసమాపక క్రియలని అంటారు. అట్లే తిన్నాడు, చదివాడు, చూశాడు, వండింది, విన్నది, చేస్తాడు మొదలగు క్రియాపదాల వల్ల పని పూర్తి అయినట్లు తెలుస్తుంది. ఇలా పూర్తి అయిన క్రియలను సమాపక క్రియలు అంటారు.

(ఆ) కింది వాక్యాలు చదవండి. సమాపక, అసమాపక క్రియాపదాల కింద గీత గీయండి.
* రాజు అన్నం తిని బడికి వెళ్ళాడు.
* గీత వంట చేసి అందరికి వడ్డించి తాను తిని నిద్రపోయింది.
* రజని నిద్ర లేచి స్నానంచేసి పూజచేసి అన్నం తిని బడికి వచ్చింది.

సమాపక క్రియలుఅసమాపక క్రియలు
వెళ్ళాడుతిని
నిద్రపోయిందిచేసి
వచ్చిందివడ్డించి
లేచి

2. సామాన్య వాక్యాలు
అ) రాజు అన్నం తిన్నాడు.
ఆ) గోపి పరీక్ష రాశాడు.
ఇ) గీత బడికి వెళ్ళింది.

పై వాక్యాలు గమనించండి. ఆ వాక్యాల్లోని తిన్నాడు, రాశాడు, వెళ్ళింది అనే క్రియలు సమాపక క్రియలు.

ప్రతి వాక్యంలో ఒకే ఒక సమాపక క్రియ ఉంది. అలా ఒకే ఒక సమాపకక్రియ ఉంటే ఆ వాక్యాలను సామాన్య వాక్యాలు అని అంటారు. కొన్ని సామాన్య వాక్యాలు క్రియ లేకుండా కూడా ఉంటాయి.
ఉదా :
ఢిల్లీ దేశ రాజధాని

AP Board 8th Class Telugu Solutions Chapter 1 అమ్మకోసం

3. సంక్లిష్ట వాక్యాలు

గీత బజారుకు వెళ్ళింది. గీత కూరగాయలు కొన్నది.
పై వాక్యాలలో గీత నామవాచకం. గీత మొదటి వాక్యంలో ఉన్నందువల్ల రెండో వాక్యంలో పునరుక్తమైన నామవాచకం తొలగించి, మొదటి వాక్యంలోని క్రియ ‘వెళ్ళింది’ని ‘వెళ్ళి’ అనే అసమాపక క్రియగా మార్చి రాస్తే సంక్లిష్ట వాక్యం ఏర్పడుతుంది.

గీత బజారుకు వెళ్ళి, కూరగాయలు కొన్నది.
కింది సామాన్య వాక్యాల్ని సంక్లిష్ట వాక్యాలుగా మార్చి రాయండి.
అ) విమల వంట చేస్తుంది. విమల పాటలు వింటుంది.
జవాబు:
విమల వంట చేస్తూ, పాటలు వింటుంది.

ఆ) అమ్మ నిద్రలేచింది. అమ్మ ముఖం కడుక్కుంది.
జవాబు:
అమ్మ నిద్రలేచి, ముఖం కడుక్కుంది.

ఇ) రవి ఊరికి వెళ్ళాడు. రవి మామిడిపండ్లు తెచ్చాడు.
జవాబు:
రవి ఊరికి వెళ్ళి, మామిడిపండ్లు తెచ్చాడు.

కింది సంక్లిష్ట వాక్యాల్ని సామాన్య వాక్యాలుగా మార్చి రాయండి.
అ) తాత భారతం చదివి నిద్రపోయాడు.
జవాబు:
తాత భారతం చదివాడు. తాత నిద్రపోయాడు.

ఆ) చెట్లు పూతపూసి కాయలు కాస్తాయి.
జవాబు:
చెట్లు పూత పూసాయి. చెట్లు కాయలు కాస్తాయి.

ఇ) రాము నడుచుకుంటూ వెళ్ళి తన ఊరు చేరాడు.
జవాబు:
రాము నడుచుకుంటూ వెళ్ళాడు. రాము తన ఊరు చేరుకున్నాడు.

4. కింది పదాలను విడదీసి సంధి పేర్లను రాయండి.

అ) ఔరౌర = ఔర + ఔర – ఆమ్రేడిత సంధి
ఆ) దధ్యోదనము = దధి + ఓదనము – యణాదేశ సంధి
ఇ) ప్రథమైక – ప్రథమ + ఏక – వృద్ధి సంధి
ఈ) చిట్టచివర = చివర + చివర – ఆమ్రేడిత ద్విరుక్తటకారాదేశ సంధి
ఉ) అత్యుగము = అతి + ఉగ్రము – యణాదేశ సంధి

5. కింద పదాలను కలిపి సంధుల పేర్లను రాయండి. సంధి సూత్రాలు తెల్పండి.

అ) మొదట + మొదట = మొట్టమొదట = ఆమ్రేడిత ద్విరుక్తటకారాదేశ సంధి
సూత్రము :
ఆమ్రేడితం పరంగా ఉంటే, ‘కడ’ మొదలైన శబ్దాల మొదటి అచ్చు మీద అన్ని అక్షరాలకూ ‘ట్ట’ వస్తుంది.

ఆ) దేవ + ఐశ్వర్యం = దేవైశ్వర్యం = వృద్ధిసంధి
సూత్రము :
అకారమునకు ఏ, ఐలు పరమైనపుడు ఐ కారమూ, ఓ, ఔ లు పరమయితే ఔ కారమూ ఏకాదేశంగా వస్తాయి.

ఇ) దేశ + ఔన్నత్యం = దేశాన్నత్యం = వృద్ధి సంధి
సూత్రము :
అకారమునకు ఏ, ఐలు పరమైనపుడు ఐ కారమూ, ఓ, ఔ లు పరమయితే ఔఔ కారమూ ఏకాదేశంగా వస్తాయి.

ఈ) కడ + కడ . = కట్టకడ – ఆమ్రేడిత ద్విరుక్తటకారాదేశ సంధి
సూత్రము :
ఆమ్రేడితం పరంబగునపుడు కడాదుల తొలియచ్చు మీది వర్ణంబులకు ద్విరుక్తటకారంబగు.

ఉ) అతి + ఉగ్ర = అత్యుగ్ర = యణాదేశ సంధి
సూత్రము :
ఇ, ఉ, ఋ లకు అవసవర్ణమైన అచ్చులు పరమైతే, య, వ రలు ఆదేశంబగు.

6. ఆమ్రేడిత సంధి :
ఏడో తరగతిలో ఆమ్రేడిత సంధిని గురించి కొంత నేర్చుకొన్నాం గదా ! ఆమ్రేడిత సంధికి సంబంధించిన మరో సూత్రాన్ని తెలుసుకుందాం.
ఔర + ఔర = ఔరౌర (ఆమ్రేడిత సంధి)
ఆహా + ఆహా = ఆహాహా (ఆమ్రేడిత సంధి)
అచ్చుకు ఆమ్రేడితం పరమైతే తరచుగా సంధి అవుతుంది. అయితే –
1. పగలు + పగలు = పట్టపగలు
2. చివర + చివర = చిట్టచివర
3. కడ + కడ = కట్టకడ

పై పదాలు పరిశీలిస్తే ఇవీ ఆమ్రేడితమున్న రూపాలే. కాని పై సూత్రం ఇక్కడ వర్తించడం లేదు.

పగలు + పగలు = పట్టపగలు అవుతుంది. అంటే “ప” తర్వాత ఉన్న ‘గలు’ ఉన్న అక్షరాలకు బదులుగా ‘ట్ట” వచ్చింది. ‘మీ’ వచ్చి పట్టపగలు అయింది.

చివర + చివర అన్నప్పుడు ‘చి’ తర్వాత రెండక్షరాల మీద ‘ఋ’ వచ్చి చిట్టచివర అయింది.
కడ + కడ అన్నపుడు ‘డ’ స్థానంలో ‘మీ’ వచ్చి కట్టకడ అయింది.

ఇప్పుడు కింది వాటిని కలిపి రాయండి.
ఎదురు + ఎదురు = ఎట్టయెదురు
కొన + కొన = కొట్టకొన
మొదట + మొదట = మొట్టమొదట

ఆమ్రేడితం పరంగా ఉంటే కడ మొదలైన శబ్దాలు మొదటి అచ్చుమీద అన్ని అక్షరాలకు ‘మీ’ వస్తుండడం గమనించాం కదా ! అలానే మరిన్ని ఉదాహరణలను గమనించండి.
బయలు + బయలు = బట్టబయలు – మొదటి ‘యలు’ స్థానంలో ‘మీ’ వచ్చి, బట్టబయలు అయింది.
తుద + తుద = తుట్టతుద – మొదటి ‘ద’ స్థానంలో ‘ఓ’ వచ్చి, తుట్టతుద అయింది.
నడుమ + నడుమ = నట్టనడుమ – మొదటి ‘డుమ’ స్థానంలో ‘మీ’ వచ్చి, నట్టనడుమగా మారింది.

పై ఉదాహరణల ఆధారంగా సూత్రం తయారుచేద్దాం.

ఆమ్రేడితం పరంగా ఉంటే కడాదుల తొలి అచ్చు మీది అన్ని అక్షరాలకు అదంతమైన ద్విరుక్తటకారం వస్తుంది. కింది పదాలను కలిపి రాయండి. ఏం మార్పు జరిగిందో రాయండి.
పిడుగు + పిడుగు = పిట్టపిడుగు – మొదటి ‘డుగు’ స్థానంలో ‘ఋ’ వచ్చి, పిట్టపిడుగు అయింది.
బయలు + బయలు = బట్టబయలు – మొదటి ‘యలు’ స్థానంలో ‘మీ’ వచ్చి బట్టబయలుగా మారింది.

చదవండి – ఆనందించండి

AP Board 8th Class Telugu Solutions Chapter 1 అమ్మకోసం 1

వ్యాకరణంపై అదనపు సమాచారం

పర్యాయపదాలు

తల్లి : మాత, జనని, అంబ
కొడుకు : వస్త్రము, కుమారుడు, తనయుడు
అభీష్టం : కోరిక, వాంఛ, ఈప్సితం
గుప్తము : రహస్యం, గోప్యము, గుట్టుగ
అమరులు : దేవతలు, సురలు, నిర్దరులు
శైలం : పర్వతం, కొంగ, అద్రి, నగము
వృష్టి : వాన, వృద్ధి
ఖగము : పక్షి, పులుగు, విహంగము
పాము : పవనాశనము, పన్నగము, భుజంగము
అగ్ని : వహ్ని, జ్వలనము, చిచ్చు
అమృతం : పీయుషం, సుధ, కంజము
గగనం : ఆకాశం, నింగి, నభము
పవనాశం : పాము, సర్పం, ఫణి
దినకరుడు : సూర్యుడు, రవి, ఆదిత్యుడు

వ్యుత్పత్యరాలు

ఉరగము – పొట్టతో పాకేది (పాము)
ఇతిహాసం – ఇలా జరిగిందని చెప్పేది (చరిత్ర)
అనిమిషులు – రెప్పపాటు లేనివారు (దేవతలు)
అమృతం – మరణమును పొందిపనిది (సుధ)
దినకరుడు – దినాన్ని ఏర్పరిచేవాడు (సూర్యుడు)
నందనుడు – సంతోషమును కలిగించువాడు (పుత్రుడు)
పుత్రుడు – పున్నామ నరకం నుండి రక్షించువాడు (కుమారుడు)
వైనతేయుడు – వినత యొక్క కొడుకు (గరుత్మంతుడు)
అనిమిషనాథుడు – అనిమిషులకు నాథుడు (ఇంద్రుడు)
భేఛరము – ఆకాశమున సంచరించునది (పక్షి)

నానార్థాలు

పక్షము = రెక్క పదిహేను రోజులకాలం, ఒకభాగం, వరుస
తుండము = పక్షి ముక్కు, నోరు, ఖండం
ఖగము = పక్షి, బాణం, సూర్యుడు, గాలి
కుశ = తాడు, దర్భ, ఒక ద్వీపం
ఉల్క = నిప్పుకణం, బూడిద
లావు = బలము, సామర్థ్యము, శక్యము
అర్థం = ధనం, శబ్దార్థము సగభాగం
రయము = వేగము, వెల్లువ
అనలం = అగ్ని, కృత్తిక, నల్లకోడి, మూడు అంకె
అనిమిషం = చేప, దేవత
అరుణం = ఎరువు, కాంతి, కుష్ఠురోగం, బంగారం
అశని = వజ్రము, పిడుగు
గగనం = ఆకాశం, శస్త్రం, శూన్యము
వారి = నీరు, సరస్వతి, కుండ

AP Board 8th Class Telugu Solutions Chapter 1 అమ్మకోసం

ప్రకృతి – వికృతులు

పక్షి – పక్కి
అగ్ని – అగ్గి
శక్తి – సత్తి
దృష్ఠి – దిస్టి
ముక్తి – ముత్తి
హృదయం – ఎద
దాస్యము – దాసము
సంతోషం – సంతసం
దుఃఖము – దూకల
వీధి – వీది
పుత్రుడు – బొద్దె
పక్షం – పక్కం
కులము – కొలము
ముఖము – మొగము
కథ – కత

సంధులు

సవర్ణదీర్ఘ సంధి
సూత్రం : అ, ఇ, ఉ, ఋ లకు అవే (సవర్ణ) అచ్చులు పరమైనప్పుడు వానికి దీర్ఘములు ఏకదేశమగును.

అమృతాంశుడు = అమృత + అంశుడు – సవర్ణదీర్ఘ సంధి
అభీష్టములు = అభి = ఇష్టములు – సవర్ణదీర్ఘ సంధి
విషాగ్ని = విష + అగ్ని – సవర్ణదీర్ఘ సంధి
పవనాగ్ని = పవన + అగ్ని – సవర్ణదీర్ఘ సంధి
కుంశాభిరక్ష = కులశ – అభిరక్ష – సవర్ణదీర్ఘ సంధి
దారుణాక్షములు = దారుణ + అక్షములు – సవర్ణదీర్ఘ సంధి
అమృతాంతికము = అమృత + అంతికము – సవర్ణదీర్ఘ సంధి

గుణసంధి
సూత్రం : అకారమునకు ఇ, ఉ, ఋ లు పరమగునపుడు క్రమముగా ఏ, ఓ, అర్లు ఆదేశమగును.

ఖగేంద్ర = ఖగ + ఇంద్ర – గుణసంధి
ఖేచరోత్తమ = ఖేచర + ఉత్తమ – గుణసంధి
వితతోల్కాశ = వితత + ఉల్కాస – గుణసంధి
గగనోన్ముఖుడు = గగన + ఉన్ముఖుడు – గుణసంధి
పతాగేంద్రుడు = పతాగ + ఇంద్రుడు – గుణసంధి

ఉత్వసంధి
సూత్రం : ఉత్తునకు అచ్చు పరమగునపుడు సంధి.

పనులెల్ల = పనులు + ఎల్ల – ఉత్వసంధి
ముఖ్యులెల్ల = ముఖ్యులు + ఎల్ల – ఉత్వసంధి ఇట్లని
ఇట్లునియె = ఇట్లు + అనియె – ఉత్వసంధి
శైలములెల్ల = శైలములు + ఎల్ల – ఉత్వసంధి

యడాగమ సంధి
సూత్రం : సంధి లేనిచోట సర్వంబు కంటే పరంబైన స్వరంబునకు యడాగమంబగు.

అనియడిగిన = అని + అడిగిన – యడాగమ సంధి
నీయట్టి = నీ + అట్టి – యడాగమ సంధి
చేకొనియైన = చేకొని + ఐన – యడాగమ సంధి
ఏయది = ఏ + అది – యడాగమ సంధి
తెచ్చియిమ్ము = తెచ్చి + ఇమ్ము – యడాగమ సంధి

ఇత్వసంధి
సూత్రం : ఏమ్యాదులలోని, క్రియాపదాలలోని ఇత్తునకు సంధి వైకల్పికముగానగును.
తల్లికిట్లనియె = తల్లికి + ఇట్లనియె – ఇత్వసంధి

అత్వసంధి
సూత్రం : అత్తునకు సంధి బహుళంబుగానగు.
ఉన్నంత = ఉన్న + అంత – అత్వసంధి

త్రికసంధి
సూత్రం : 1. ఆ, ఈ, ఏ అను సర్వనామములు త్రికములనబడును.
2. త్రికంబు మీది అసంయుక్త హల్లునకు ద్విత్వంబు బహుళంబుగానగు.
3. ద్విరుక్తంబగు హల్లు పరంబగునపుడు ఆచ్ఛికంబగు దీర్ఘంబునకు హ్రస్వంబగు.

అవ్విహగేంద్రుడు = ఆ + విహగేంద్రుడు – త్రికసంధి
అమ్మారుండు = ఆ + మారుండు – త్రికసంధి

అత్మసంది
సూత్రం : అత్తునకు సంధి బహుళంబుగానగు.
ఉన్నంత = ఉన్న + అంత -అత్వసంధి

గసడదవాదేశ సంధి
సూత్రం : ప్రథమ మీది పరుషములకు గసడదవలు బహుళంబుగానగు.

కారణము సెప్పుడు = కారణము + చెప్పుము -గసడదవాదేశ సంధి
దాస్యమువాయు = దాస్యము + పాయు – గసడదవాదేశ సంధి
అమృతంబుదెచ్చి = అమృతంబు + తెచ్చి – గసడదవాదేశ సంధి
ఉపాయము సేయంగ = ఉపాయము + చేయంగ – గసడదవాదేశ సంధి

సరళాదేశ సంధి
సూత్రం :
1. ద్రుతప్రకృతికము మీది పరుషములకు, సరళములగు.
2. ఆదేశ సరళములకు ముందున్న ద్రుతమునకు బిందుసంశ్లేషలు విభాషనగు.
నుగ్గుగాఁజేయు = నుగ్గుగాన్ + చేయు – సరళాదేశ సంధి
గరుడునింబదరి = గరుడునిన్ + పదరి – సరళాదేశ సంధి

ఆమ్రేడిత సంధి
సూత్రం : 1) అచ్చునకు ఆమ్రేడితం పరమైతే తరచుగా సంధి అవుతుంది.
పట్టపగలు = పగలు + పగలు – ఆమ్రేడిత సంధి
చిట్టచివర = చివర + చివర – ఆమ్రేడిత సంధి
కట్టకడ = కడ + కడ . – ఆమ్రేడిత సంధి

2) ఆమ్రేడితం పరంగా ఉంటే కడాదుల తొలి అచ్చు మీది అన్ని వర్ణాలకు ద్విరుక్తటకారం వస్తుంది.
నట్టనడుమ = నడుమ + నడుమ – ఆమ్రేడిత సంధి
బట్టబయలు = బయలు + బయలు – ఆమ్రేడిత సంధి

AP Board 8th Class Telugu Solutions Chapter 1 అమ్మకోసం

సమాసాలు

సమాస పదంవిగ్రహవాక్యంసమాసం పేరు
వినతాసుతుడువినత యొక్క సుతుడుషష్ఠీ తత్పురుష సమాసం
పయోరుహాననపయోరుహము వంటి ఆననము కలదిబహుప్రీహి సమాసం
భుజదర్పముభుజముల యొక్క దర్పముషష్ఠీ తత్పురుష సమాసం
జననీదాస్యముజనని యొక్క దాస్యముషష్ఠీ తత్పురుష సమాసం
కులిశక్షతికులిశము యొక్క క్షతిషష్ఠీ తత్పురుష సమాసం
మారుతజవముమారుతము యొక్క జవముషష్ఠీ తత్పురుష సమాసం
ఖగేంద్రుడుఖగములలో ఇంద్రుడుషష్ఠీ తత్పురుష సమాసం
ఖేచరోత్తముడుఖేచరులలో ఉత్తముడుషష్ఠీ తత్పురుష సమాసం
విహగేంద్రుడువిహగములలో ఇంద్రుడుషష్ఠీ తత్పురుష సమాసం
అమృతహరణముఅమృతము యొక్క హరణముషష్ఠీ తత్పురుష సమాసం
పక్ష్మయుగ్మముపక్ష్మముల యొక్క యుగ్మముషష్ఠీ తత్పురుష సమాసం
గగనోన్ముఖుడుగగనమునకు ఉన్ముఖుడుషష్ఠీ తత్పురుష సమాసం
తల్లిదీవెనలుతల్లి యొక్క దీవెనలుషష్ఠీ తత్పురుష సమాసం
శోక స్థితిశోకము యొక్క స్థితిషష్ఠీ తత్పురుష సమాసం
అనిమిషనాథుడుఅనిమిషులకు నాథుడుషష్ఠీ తత్పురుష సమాసం
ఉగ్రభుంజగములుఉగ్రములైన భుజంగములువిశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
మహావృష్టిగొప్పదైన వృష్టివిశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
మహాబలముగొప్పదైన బలమువిశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
అమితపరాక్రమముఅమితమైన పరాక్రమమువిశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
అమృతాంశుడుఅమృతమయమైన కిరణములు కలవాడుబహుబ్లిహి సమాసం
గగనగదిగగనము నందు గదిసప్తమీ తత్పురుష సమాసం
తల్లిదండ్రులుతల్లియును, తండ్రియునుద్వంద్వ సమాసం
సత్పుత్రుడుఉత్తముడైన పుత్రుడువిశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
విషాగ్నివిషము అనెడి అగ్నిరూపక సమాసం
దాస్యవిముక్తులుదాస్యము నుందు విముక్తులుపంచమీ తత్పురుష సమాసం

8th Class Telugu 1st Lesson అమ్మకోసం కవి పరిచయం

కవి : నన్నయ.

కాలం : 11వ శతాబ్దం

బిరుదులు : ఆదికవి, వాగనుశాసనుడు

నన్నయ కవితాలక్షణాలు : అక్షరరమ్యత, ప్రసన్నకథా కలితార్థయుక్తి, నానారుచిరార్థ సూక్తినిధిత్వం నన్నయ కవిత్వంలోని ప్రధాన లక్షణాలు.

ఎవరి ఆస్థాన కవి : తూర్పు చాళుక్యరాజు రాజరాజనరేంద్రుని ఆస్థానకవి.

కవిత్రయకవి : సంస్కృతంలో వేదవ్యాసుడు రచించిన మహాభారతాన్ని తెనిగించిన ముగ్గురు కవులనూ ‘కవిత్రయము’ అంటారు. వారిలో ‘నన్నయ’ మొదటివాడు.

వ్యాకరణ రచన ఆ: నన్నయ, ‘ఆంధ్రశబ్దచింతామణి’ అనే తెలుగు వ్యాకరణ గ్రంథం రచించాడు.

భారత రచన : నన్నయ, ఆంధ్రమహాభారతంలో ఆదిపర్వము, సభాపర్వము, అరణ్యపర్వము 4వ ఆశ్వాసంలోని 142 వ పద్యం వరకు ఆంద్రీకరించాడు.

ఇతర రచనలు : చాముండికా విలాసము, ఇంద్ర విజయము.

పద్యాలు – ప్రతిపదార్థాలు-భావాలు

1వ పద్యము – (కంఠస్థ పద్యం)

*ఉ. ఆయతపక్షతుండహతి నక్కులశైలము లెల్ల నుగ్గుగాఁ
జేయు మహాబలంబును బ్రసిద్ధియునుం గల నాకు నీపనిం
బాయక వీఁపునం దవడుఁబాముల మోవను, వారికిం బనుల్
సేయను నేమి కారణము సెప్పుము దీనిఁ బయోరుహాననా!
ప్రతిపదార్థాలు:
పయోరుహాననా (పయోరుహ + ఆననా) = పద్మము వంటి ముఖము కలదానా !
ఆయత పక్షతుండతుండహతిన్; ఆయత = పెద్దవయిన
పక్ష = ఱెక్కల యొక్కయు
తుండ = ముక్కు యొక్కయు
హతిన్ = దెబ్బలచేత
అక్కులశైలము లెల్లన్, ఆ + కులశైలములు + ఎల్లన్ = ఆ కులపర్వతాలు అన్నింటినీ,
నుగ్గుగాన్ + చేయు = పొడిగా చేయగల
మహాబలంబును (మహత్ + బలంబును) = గొప్ప బలాన్నీ
ప్రసిద్ధియున్ = ప్రఖ్యాతియూ
కల నాకున్ = పొందిన నాకు
ఈ పనిన్ = ఈ పనిని (ఈ దాస్యాన్ని)
పాయక = మానకుండా
వీపునందున్ = వీపు మీద
అవడు + పాములన్ = నీచములయిన పాములను
మోవను = మోయడానికిన్నీ
వారికిన్ = ఆ పాములకు
పనుల్ + చేయను = పనులు చేయడానికి (సేవలు చేయడానికిన్నీ)
ఏమి, కారణము = కారణము ఏమిటో
నాకున్ = నాకు
చెప్పుము = చెప్పుము

భావం :
పద్మము వంటి ముఖము కల ఓ తల్లీ ! కులపర్వతాలను అన్నింటినీ నా విశాలమైన టెక్కలతోనూ వాడియైన ముక్కుతోనూ దెబ్బతీసి వాటిని పొడిగా చేయగల గొప్పబలమూ, ప్రసిద్ధి నాకు ఉన్నాయి. అటువంటి నాకు మానకుండా దాస్యము చేస్తూ, ఈ నీచమైన పాములను నా వీపుపై మోస్తూ వీటికి సేవలు చేయడానికి గల కారణము ఏమిటో చెప్పు.

విశేషాంశాలు :
కులపర్వతాలు ఏడు –
1) మహేంద్రం
2) మలయం
3) సహ్యం
4) శుక్తిమంతం
5) గంధమాదనం
6) వింధ్యం
7) పారియాత్రం

AP Board 8th Class Telugu Solutions Chapter 1 అమ్మకోసం

2 వచనము

వ. అని యడిగిన వినత తనకుం గద్రువతోడి పన్నిదంబున నైన
దాసీత్వంబును, జెప్పి యిట్లనియె.
ప్రతిపదార్థాలు :
అని = అనిన
అడిగిన = గరుత్మంతుడు అడుగగ
వినత = గరుత్మంతుని తల్లి వినత
తనకున్ = తనకు
కద్రువతోడ = తన సవితియైన కద్రువతో
పన్నిదంబునన్ = పందెమువల్ల
ఐన = ఏర్పడిన
దాసీత్వంబును = దాసీతనాన్ని గూర్చి
చెప్పి = కుమారుడైన గరుత్మంతు నకు చెప్పి
ఇట్లు + అనియె = ఇలా అన్నది

భావం :
అని గరుడుడు అడుగగా, వినత తన సవతియైన కద్రువతో పందెంలో తాను ఓడిపోయినందువల్ల కలిగిన దాసీతనాన్ని గురించి కొడుకుతో చెప్పి ఇలా అంది.

3వ పద్యము

కం. నీ కతమున నా దాస్యము
ప్రాకటముగఁ బాయు ననిన పలు కెడలోనం
జేకొని, యూఐడి నిర్గత
శోక స్థితి నున్నదానఁ జూనె ఖగేంద్రా !
ప్రతిపదార్థాలు :
ఖగేంద్రా (ఖగ + ఇంద్రా!) = ఓ పక్షిరాజా ! (గరుత్మంతుడా !)
నీ కతమునన్ = నీ కారణంగా
నా దాస్యము = నా దాసీతనము
ప్రాకటముగన్ = ప్రసిద్ధముగా (అందరికీ తెలిసేటట్లుగా)
పాయున్ = పోతుంది
అనిన = అని అనూరుడు చెప్పిన
పలుకు = మాట
ఎదలోనన్ = (నా) మనస్సులో
చేకొని = గ్రహించి (ఉంచుకొని)
ఊఱడి = ఓదార్పును పొంది
నిర్గతశోక స్థితిన్ = పోయిన దుఃఖముగల స్థితిలో (దుఃఖం లేకుండా)
ఉన్నదానన్ + చూవె = ఉన్నాను సుమా !

భావం :
ఓ పక్షి శ్రేష్ఠుడా ! కుమారా ! నీ కారణంగా నా దాసీతనము పోతుందని అనూరుడు చెప్పిన మాటను మనస్సులో ఉంచుకొని, బాధను విడచి, దుఃఖము లేనిదాననై ఉన్నాను సుమా !

4 వచనము

వ. ‘కొడుకులు సమర్థులైనం దల్లిదండ్రుల యిడుములు వాయుట యెందునుం గలయది గావున నీయట్టి సత్పుత్రుం బడసియు దాసినై యుండుదాననే,’ యనిన విని వైనతేయుండు దద్దయు దుఃఖితుండై, యొక్కనాఁడు కాద్రవేయుల కిట్లనియె.
ప్రతిపదార్థాలు:
కొడుకులు = కుమారులు
సమర్థులు + ఐనన్ = శక్తి కలవారయితే
తల్లిదండ్రుల = తల్లిదండ్రుల యొక్క
ఇడుములు = కష్టాలు
పాయుట = పోవటం
ఎందునున్ + కల + అది = ఎక్కడనైనా ఉన్నదే
కావునన్ = అందువల్ల
నీయట్టి (నీ + అట్టి) = నీవంటి
సత్పుత్రున్ (సత్ + పుత్రన్) = మంచి కుమారుణ్ణి
పడసియున్ = పొందికూడా
దాసినై (దాసిని + ఐ) = దాస్యము చేసే దానినై
ఉండుదానను + ఏ = ఉంటానా?
అనినన్ = అని వినత చెప్పగా
విని = విని
వైనతేయుండు = వినత కుమారుడైన గరుత్మంతుడు
తద్దయున్ = మిక్కిలి (ఎక్కువగా)
దుఃఖితుండు + ఐ = దుఃఖం పొందినవాడై
కాద్రవేయులకున్ = కద్రువ కుమారులయిన పాములకు
ఇట్లు + అనియె = ఇలా చెప్పాడు

భావం :
“కొడుకులు శక్తిమంతులైతే తల్లిదండ్రుల కష్టాలు తొలగిపోవడం సహజమే. కాబట్టి నీవంటి యోగ్యుడైన కుమారుణ్ణి పొంది, నేను ఇంకా దాసీగానే ఉండలా?” అనగానే గరుడుడు దుఃఖించి, కద్రువ పుత్రులైన పాములతో ఇలా అన్నాడు.

AP Board 8th Class Telugu Solutions Chapter 1 అమ్మకోసం

5వ పద్యము

కం. మా యీ దాస్యము వాయు ను
పాయము సేయుండు, నన్నుఁ బనుపుం డిష్టం
బేయది దానిన తెత్తు న
జేయుఁడనై యమరవరులఁ జేకొనియైనన్.
ప్రతిపదార్థాలు:
మా + ఈ, దాస్యము = మా తల్లియైన వినతకూ, నాకూ గల ఈ బానిసతనము
పాయు + ఉపాయము = పోయే ఆలోచనను (ఉపాయాన్ని)
చేయుండు = చెయ్యండి; (చెప్పండి)
నన్నున్ = నన్ను
పనుపుండు = ఆజ్ఞాపించండి (పంపించండి)
ఇష్టంబు + ఏ + అది = మీరు ఏది కోరుకుంటారో
దానిన్ + అ = దాన్నే
అమరవరులన్ = శ్రేష్ఠులయిన దేవతలను
చేకొని + ఐనన్ = లోబరచుకొనియైనా
అజేయుడనై = జయింపబడనివాడనై (ఓడింపబడనివాడనై)
తెత్తున్ = తెస్తాను (తెచ్చి ఇస్తాను)

భావం :
నా తల్లి యొక్క, నా యొక్క దాస్యము పోవటానికి ఉపాయము చెప్పండి. నన్ను ఆజ్ఞాపించండి. శ్రేష్ఠులయిన దేవతలను లోబరచుకొని అయినా మీకు ఇష్టమైన దానిని అజేయుడనై తెస్తాను.

6 వచనము

వ. అనిన నయ్యురగులు కరుణించి గరుడుని కిట్లనిరి.
ప్రతిపదార్థాలు:
అనినన్ = అట్లు గరుత్మంతుడు చెప్పగా
అయ్యురగులు; (ఆ + ఉరగులు) = ఆ పాములు
కరుణించి = జాలిపడి
గరుడునకున్ + ఇట్లు + అనిరి = గరుత్మంతునితో ఇలా చెప్పారు.

భావం :
అని గరుడుడు అడుగగా, ఆ నాగులు జాలిపడి గరుత్మంతునితో ఇలా చెప్పారు.

7వ పద్యము (కంఠస్థ పద్యం)

*చ. ‘అమితపరాక్రమంబును, రయంబును, లావును గల్గు ఖేచరో
త్తముఁడవు నీవు; నీదయిన దాస్యము వాపికొనంగ నీకుఁ జి
త్తము గలదేని, భూరిభుజదర్పము శక్తియు నేర్పడంగ మా
కమృతముఁ దెచ్చియి’ మ్మనిన నవ్విహగేంద్రుఁడు సంతసంబునన్
ప్రతిపదార్థాలు :
నీవు = నీవు
అమిత పరాక్రమంబును = అంతులేని విక్రమాన్ని
రయంబును = వేగాన్నీ
లావునూ = బలాన్నీ
కల్గు = కలిగిన (ఉన్న)
ఖేచరోత్తముడవు (ఖేచర + ఉత్తముడవు) = పక్షులలో గొప్పవాడవు (పక్షి శ్రేష్ఠుడవు)
నీదయిన (నీది + అయిన) = నీకు కలిగిన
దాస్యమున్ = బానిసత్వమును
పాపికొనంగన్ = పోగొట్టుకొనటానికి
నీకున్ = నీకు
చిత్తము = మనస్సు (అభిప్రాయము)
కలదు + ఏనిన్ = ఉన్నట్లయితే
భూరి = అధికమైన
భుజదర్పము = నీ భుజాల యొక్క గర్వమున్నూ
శక్తియున్ = నీ సామర్థ్యమునూ
ఏర్పడంగన్ = స్పష్టమయ్యేటట్లు
మాకున్ = మాకు
అమృతమున్ = అమృతమును
తెచ్చి, ఇమ్ము + అనినన్ = తీసుకొనివచ్చి ఇమ్మని పాములు చెప్పగా
అవ్విహ గేంద్రుడు (ఆ + విహగ + ఇంద్రుడు) = ఆ పక్షిశ్రేష్ఠుడైన గరుత్మంతుడు
సంతసంబునన్ = సంతోషముతో (తెలిసేటట్లు)

భావం :
“నీవు అంతులేని పరాక్రమాన్నీ, వేగాన్నీ, బలాన్ని కలిగిన పక్షి శ్రేష్ఠుడవు. నీకు కలిగిన దాస్యము పొగొట్టుకొనాలనే అభిప్రాయము నీకు ఉన్నట్లయితే, నీ యొక్క గొప్ప భుజబలగర్వమునూ, శక్తియూ తెలిసేటట్లు
మాకు అమృతాన్ని తెచ్చి ఇమ్ము” అని పాములు చెప్పగా, ఆ పక్షి శ్రేష్ఠుడు సంతోషించాడు.

AP Board 8th Class Telugu Solutions Chapter 1 అమ్మకోసం

8 వచనము

వ. ‘అట్ల చేయుదు, నమృతంబు దెచ్చి మీ కిచ్చి, యేనునుం,
దల్లియు దాస్యంబువలన విముక్తుల మగువార’ మని నొడివి,
తద్వృత్తాంతం బంతయుం దల్లికిం జెప్పి ‘యమృతహరణార్థం బరిగెద
నని మ్రొక్కి, తల్లి దీవనలు గైకొని గమనోన్ముఖుండై ….
ప్రతిపదార్థాలు:
అట్ల (అట్ల + అ) = ఆ విధంగానే
చేయుదన్ = చేస్తాను
తెచ్చి = తీసుకొని వచ్చి
మీకిచ్చి (మీకున్ + ఇచ్చి) = నాకు ఇచ్చి
ఏనునున్ = నేనూ
తల్లియున్ = మా అమ్మ వినతయూ
దాస్యమువలనన్ = బానిసత్వము నుండి
విముక్తులము + అగువారము = విడువబడిన వారము అవుతాము
అని, నొడివి = అని చెప్పి
తద్వృత్తాంతము (తత్ + వృత్తాంతము) = ఆ విషయం
అంతయున్ = అంతయు
తల్లికిన్ = తల్లియైన వినతకు
చెప్పి = చెప్పి
అమృతహరణ + అర్థంబు = అమృతాన్ని హరించే నిమిత్తం
అరిగెదన్ = వెడలుతాను
అని = అని
మ్రొక్కి = నమస్కరించి
తల్లి దీవనలు = తల్లి ఆశీస్సులు
కైకొని = స్వీకరించి
అమృతంబు = అమృతము
గమనోన్ముఖుండై గమన = వెళ్ళడానికి
ఉన్ముఖుండు + ఐ = సిద్ధమైనవాడై

భావం :
“అలాగే చేస్తాను. స్వర్గం నుంచి అమృతం తెచ్చి, మీకు ఇచ్చి, నేనూ, మా తల్లి వినతా, దాస్యం నుంచి విముక్తి పొందుతాం” అని పలికి, ఆ విషయమంతా తల్లికి చెప్పి, “అమృతం తేవడానికి వెడుతున్నాను” అని చెప్పి నమస్కరించి, తల్లి ఆశీస్సులు పొంది, వెళ్ళడానికి సిద్ధమై……

9వ పద్యము (కంఠస్థ పద్యం)

*మ. వితతోల్కాశనిపుంజ మొక్క యనఁగా విన్వీథి విక్షిప్త ప
క్షతి వాతాహతిఁదూలి, తూల శకలాకారంబుఁ లై వారిద
ప్రతతుల్ సాల్పడి నల్గడం జెదరఁగాఁ బాటెన్ మనోవేగుఁడై
పతగేంద్రుం డమృతాంతికంబునకుఁ దత్పాలుర్ భయం బందఁగన్.
ప్రతిపదార్థాలు :
వితతోల్కాశనిపుంజము + ఒక్కొ వితత = విరివిగా గల
ఉల్క = మండే నిప్పుకణాల యొక్కయు
అశని = పిడుగుల యొక్కయు
పుంజము + ఒక్కొ = సమూహమా
అనగా = అనేటట్లుగా
విన్వీథి (విన్ + వీథి) = ఆకాశమార్గంలో
విక్షిప్తపక్షతివాతాహతిన్; విక్షిప్త = విదల్చబడిన
పక్షతి = రెక్కలయొక్క
వాత = గాలియొక్క
ఆహతిన్ = దెబ్బల చేత
తూలి = అటునిటు కదలి
వారిద, ప్రతతుల్ = మబ్బుల యొక్క సముదాయాలు
తూలశకలాకారంబులు + ఐ; తూల = దూదియొక్క
శకల = పింజల యొక్క
ఆకారంబులు + ఐ = రూపములు కలవై
చాల్పడి = వరుసకట్టి
నల్గడన్ (నల్ + కడన్) = నాల్గువైపులా
చెదరగా = చెదరిపోగా
మనోవేగుడై (మనః + వేగుడు + ఐ) = మనస్సు యొక్క వేగం వంటి వేగం కలవాడై
పతగేంద్రుండు (పతగ + ఇంద్రుండు) = పక్షులకు ఇంద్రుడయిన గరుత్మంతుడు
అమృతాంతికంబునకున్ (అమృత + అంతికంబునకున్) = అమృతం దగ్గరకు
తత్ పాలుర్ = ఆ అమృత రక్షకులు
భయంబు + అందగన్ = భయపడగా
పాఱెన్ = పరుగెత్తాడు

భావం :
పక్షి రాజు మనోవేగంతో బయలుదేరాడు. అప్పుడతడు నిప్పు కణాలతో కూడిన తోక చుక్కలా ఉన్నాడు. ఆకాశంలో కదలుతూ ఉన్నప్పుడు, అతని రెక్కల గాలి వల్ల మేఘాలు దూది పింజలై చెదరిపోతున్నాయి. అమృతాన్ని రక్షిస్తున్నవారు భయపడేటట్లుగా, గరుత్మంతుడు మనోవేగంతో అమృతం ఉన్నచోటికి వెళ్ళాడు.

AP Board 8th Class Telugu Solutions Chapter 1 అమ్మకోసం

10వచనము
వ. అంత,
అప్పుడు

11వ పద్యము

ఉ. ఘోరవికార సన్నిహిత కోపముఖంబులు, దీప్తవిద్యుదు
ల్కారుణ దారుణాక్షములునై, నిజదృష్టి విషాగ్ని నన్యులం
జేరఁగనీక యేర్చుచుఁ బ్రసిద్ధముగా నమృతంబు చుట్టు ర
క్షారతి నున్న యుగభుజగంబుల రెంటిని గాంచి చెచ్చెరన్.
ప్రతిపదార్థాలు:
ఘోర, వికార, సన్నిహిత, కోపముఖంబులు; ఘోర = భయంకరాలయి
వికార = వికారంతో
సన్నిహిత = కూడిన
కోప = కోపము కల
ముఖంబులు = నోళ్ళు కలవీ
దీప్త విద్యుదుల్కారుణ దారుణాక్షములునై; దీప్త = వెలుగుతున్న
విద్యుత్ = మెఱపులవలె
ఉల్క = నిప్పులవలె
అరుణ = ఎఱ్ఱనైన
దారుణ = భయంకరాలయిన
అక్షములును + ఐ = కన్నులు కలవై
నిజదృష్టి విషాగ్నిన్; నిజ = తనయొక్క
దృష్ఠి = చూపుల నుండి ప్రసరించే
విష = విషము అనే
అగ్నిన్ = అగ్నితో
అన్యులన్ = ఇతరులను
చేరగన్ + ఈక = దగ్గరకు రానీయకుండా
ఏర్చుచున్ = దహిస్తూ (మండిస్తూ)
ప్రసిద్ధముగాన్ = ప్రకటమయ్యేటట్లు
అమృతంబు = అమృతము యొక్క
చుట్టు = చుట్టునూ
రక్షారతిన్; రక్షా = రక్షించడంలోని
రతిన్ = ఆసక్తితో
ఉన్న = ఉన్నటువంటి
ఉగ్ర భుజగంబులన్; ఉగ్ర = భయంకరమైన
భుజగంబులన్ = పాములను
రెంటిని = రెండింటిని
కాంచి = చూచి
చెచ్చెరన్ = వెంటనే

భావం :
అమృతాన్ని రక్షిస్తున్న భయంకరమైన రెండు పాములను గరుత్మంతుడు చూశాడు. అవి ఆ సమీపానికి ఎవరినీ రానీయడం లేదు. ఆ పాముల ముఖాలు కోపాన్ని వెలిగ్రక్కు తున్నాయి. వాటి చూపులు విషము అనే అగ్నిని చిమ్ముతున్నాయి.

AP Board 8th Class Telugu Solutions Chapter 1 అమ్మకోసం

12 వచనము

వ. అయ్యురగంబులం దనపక్షరజోవృష్టి నంధంబులం జేసి, వాని శిరంబులు దొక్కి, పరాక్రమం బెసంగ నమృతంబు గొని, గరుడుండు గగనంబున కెగసి…. యురగుల యొద్దకు వచ్చి, మరకతహరితం బైన కుశాస్తరణంబున నమృతకలశంబు నిలిపి, యురగులకుం జూపి యిట్లనియె.
ప్రతిపదార్థాలు:
అయ్యురగంబులన్ (ఆ + ఉరగంబులన్) = ఆ అమృతాన్ని రక్షిస్తున్న పాములు రెంటినీ
తన = తన యొక్క
పక్షరజోవృష్టిన్; పక్ష = రెక్కల వలన ఏర్పడిన
రజః + వృష్టిన్ = దుమ్ము యొక్క వర్షంతో
అంధంబులన్ = గ్రుడ్డివాటినిగ చేసి
వాని = ఆ పాముల
శిరంబులు = తలలు
తొక్కి = తొక్కి
పరాక్రమంబు = పరాక్రమం
ఎసంగన్ = ఎక్కువకాగా
అమృతంబు = అమృతం
కొని = తీసుకొని
గరుడుండు = గరుత్మంతుడు
గగనంబునకున్ = ఆకాశానికి
ఎగసి = ఎగిరి
ఉరగుల + యొద్దకున్ = పాముల వద్దకు
వచ్చి = వచ్చి
మరకతహరితంబు + ఐన మరకత = మరకత మణులవలె
హరితంబు + ఐన = ఆకుపచ్చనైన
కుశాస్తరణంబునన్ (కుశ + ఆస్తరణంబునన్) – దర్భల పరుపు మీద
అమృతకలశంబు = అమృత కలశపాత్రను
నిలిపి = ఉంచి
ఉరగులకున్ = పాములకు
చూపి = చూపించి
ఇట్లు + అనియెన్ = ఇలా అన్నాడు

భావం :
గరుడుడు తన రెక్కల వల్ల రేగిన దుమ్ముతో వాటి కళ్ళు కనబడకుండా చేశాడు. వాటి తలలను తొక్కి పట్టాడు. అమృతాన్ని తీసుకొని ఆకాశానికి ఎగిరాడు. కద్రువ కుమారుల దగ్గరకు వచ్చాడు. మరకత మణుల వలె పచ్చగా ఉన్న దర్భల పరుపుపై అమృతం ఉన్న పాత్రను పెట్టాడు. దాన్ని పాములకు చూపించి ఇట్లా పలికాడు.

AP Board 8th Class Telugu Solutions Chapter 1 అమ్మకోసం

13వ పద్యము

కం. అనిమిషనాథ సుగుప్త మ
యిన యమృతము దెచ్చి మీకు నిచ్చితి, నస్మ
జ్జననీదాస్యము వాసెను,
దినకరపవనాగ్నితుహినదీప్తుల కరిగాన్
ప్రతిపదార్థాలు:
అనిమిషనాథసుగుప్తము + అయిన; అనిమిష = దేవతలకు
నాథ = రాజయిన ఇంద్రుడిచేత
సుగుప్తము + ఐన = బాగుగా రక్షింపబడిన
అమృతము = అమృతము
తెచ్చి = తీసుకువచ్చి
మీకున్ = మీకు
ఇచ్చితిన్ = ఇచ్చాను
అస్మజ్జననీ దాస్యము అస్మత్ = నా యొక్క
జననీ = తల్లి అయిన వినత యొక్క
దాస్యము = దాసితనం
దినకరపవనాగ్ని తుహినదీప్తులు + అ; దినకర = సూర్యుడు
పవన = వాయువు
అగ్ని = అగ్నిదేవుడు
తుహిన దీప్తులు + అ = మంచు కిరణాలు గల చంద్రుడు అనే వారు
కరిగాన్ (కరి + కాన్) = సాక్షిగా
పాసెన్ = తొలగింది (పోయింది)

భావం :
దేవేంద్రుడి చేత బాగా రక్షింపబడిన అమృతాన్ని తెచ్చి, మీకు ఇచ్చివేశాను. సూర్యుడు, గాలి, అగ్ని, చంద్రుడు అనే వాళ్ళు సాక్షులుగా, నా తల్లి అయిన వినత యొక్క దాసీతనం పోయింది.

AP Board 6th Class Hindi Solutions सन्नद्धता कार्यक्रम Chapter 2 चल मेरे घोडे

AP State Syllabus AP Board 6th Class Hindi Textbook Solutions सन्नद्धता कार्यक्रम Chapter 2 चल मेरे घोडे Textbook Questions and Answers.

AP State Syllabus 6th Class Hindi Solutions सन्नद्धता कार्यक्रम Chapter 2 चल मेरे घोडे

6th Class Hindi सन्नद्धता कार्यक्रम Chapter 2 चल मेरे घोडे Textbook Questions and Answers

बालगीत బాలగీతం

चल मेरे घोड़े चल चल चला
हिन हिनाते चल चल चल॥
ताँगा खींचते चल चल चला।
ताकत दिखाते चल चल चल।

పద నా గుఱ్ఱమా పద పద పద
సకిలిస్తూ పద పద పద
బండి (జట్కా) లాగుతూ పద పద పద
నీ శక్తిని చూపిస్తూ పద పద పద
AP Board 6th Class Hindi Solutions Chapter 2 चल मेरे घोडे 1

अध्यापक ‘चल मेरे घोडे’ पाठ का चित्र दिखाकर कुछ प्रश्न पूछेगे। छात्र उन प्रश्नों के उत्तर देंगे।
(ఉపాధ్యాయులు ‘चल मेरे घोडे’ పాఠం చిత్రాన్ని చూపించి కొన్ని ప్రశ్నలు అడిగెదరు. విద్యార్థులు వాటికి సమాధానాలు చెప్పెదరు.)

मौखिक प्रश्न:

प्रश्न 1.
इस चित्र में लड़का किस पर बैठा है?
उत्तर:
इस चित्र में लड़का घोड़े पर बैठा है।

AP Board 6th Class Hindi Solutions सन्नद्धता कार्यक्रम Chapter 2 चल मेरे घोडे

प्रश्न 2.
लड़का किस रास्ते से जा रहा है?
उत्तर:
लड़का जंगल के रास्ते से जा रहा है।

प्रश्न 3.
घोड़ा कैसे दौड़ रहा है?
उत्तर:
घोड़ा तेज़ दौड़ रहा है।

प्रश्न 4.
घोड़ा कैसी आवाजें निकाल रहा है?
उत्तर:
घोडा हिन – हिनाते हुए जा रहा है।

प्रश्न 5.
घोड़ा गाड़ी को क्या कहते हैं?
उत्तर:
घोड़ा गाड़ी को ताँगा कहते हैं।

प्रश्न 6.
घोड़ा कैसा जानवर /पशु है?
उत्तर:
घोड़ा एक पालतू और फुर्तिलिा/ताकतवर जानवर है।

प्रश्न 7.
चल – चल चल – चल किस प्रकार का शब्द है?
उत्तर:
चल – चल – चल – चल पुनरुक्ति शब्द हैं।

प्रश्न 8.
चित्र में कितने पक्षी हैं?
उत्तर:
चित्र में तीन पक्षी है।

प्रश्न 9.
पक्षी क्या कर रहे हैं?
उत्तर:
पक्षी उड़ रहे हैं।

AP Board 6th Class Hindi Solutions सन्नद्धता कार्यक्रम Chapter 2 चल मेरे घोडे

प्रश्न 10.
जंगल दिखने में कैसा है?
उत्तर:
जंगल दिखने में हरा भरा है।

शब्दार्थ

चल = పద, go
घोडा = గుర్రం, horse
ताँगा = గుర్రపు బండి, horse cart
ताकत = శక్తి, power
मेरा = నాయొక్క, mine, myself
हिन हिनाना = సకిలించుట (గుర్రపు అరుపు), neigh
खींचना = లాగుట, pull
दिखाना = చూపుట, to show

वर्णमाला चार्ट
AP Board 6th Class Hindi Solutions Chapter 2 चल मेरे घोडे 2

मौखिक अभ्यासः

1. पशु – पक्षी अवाजें

घोडा – हिन – हिनाना
पक्षी – चह – चहाना
बाघ, शेर – दहाड़ना
ऊँट – बल बलाना
बैल – डकारना
कुत्ता – भोंकना
हाथी – चिंघाडना
गाय – राँभाती
गधा – रेंगना

AP Board 6th Class Hindi Solutions सन्नद्धता कार्यक्रम Chapter 2 चल मेरे घोडे

2. वस्तु – ध्वनियाँ

घंटी – टन – टन
घड़ी – टिक – टिक
ढोल – ढम – ढम
चूड़ियाँ – खन – खन
दरवाजा – खट – खट
झंड़ा – फर – फर
नदी – कल – कल

3. तुक वाले शब्दों को रेखा से मिलाओ।
AP Board 6th Class Hindi Solutions Chapter 2 चल मेरे घोडे 3
उत्तर:
AP Board 6th Class Hindi Solutions Chapter 2 चल मेरे घोडे 4

4. बालगीत देखकर सही क्रम संख्या को कोष्टक में लिखिए।

1. हिन – हिनाते चल – चल – चल (2)
2. ताकत दिखाते चल.- चल – चल (4)
3. चल मेरे घोड़े चल – चल – चल (1)
4. ताँगा खींचते चल – चल – चल (3)

5. जोड़ी बनाओ।
AP Board 6th Class Hindi Solutions Chapter 2 चल मेरे घोडे 5
उत्तर:
AP Board 6th Class Hindi Solutions Chapter 2 चल मेरे घोडे 6

6. बेमेल अक्षर पर गोला O लगाइए।
AP Board 6th Class Hindi Solutions Chapter 2 चल मेरे घोडे 7

AP Board 6th Class Hindi Solutions सन्नद्धता कार्यक्रम Chapter 2 चल मेरे घोडे

7. समझो – बोलो

मेरा – मेरे
हिनाता – हिनाते
घोड़ा – घोड़े
खींचता – खींचते
ताँगा – ताँगे
दिखाता – दिखाते

AP Board 8th Class Telugu Important Questions Chapter 9 సందేశం

AP State Syllabus AP Board 8th Class Telugu Important Questions Chapter 9 సందేశం.

AP State Syllabus 8th Class Telugu Important Questions 9th Lesson సందేశం

8th Class Telugu 9th Lesson సందేశం Important Questions and Answers

I. అవగాహన – ప్రతిస్పందన

అ) కింది చుక్క గుర్తు గల పద్యాలకు భావాలను రాయండి.

1) చం. పరమ తపోనివేశనము బంగరుపంటలకు న్నివాస మ
బ్బురమగుశాంతిచంద్రికల భూమి ప్రపంచచరిత్రలోన బం
ధురతరకీర్తిగొన్న భరతోర్వర నాజనయిత్రియంచు పా
డర! శిరమెత్తరా! విజయఢంకను గొట్టుమురా! సహోదరా!

భావం :
ఓ సోదరా ! మనదేశం, తపోభూమి. ఇది బంగారు పంటలకు నిలయం. శాంతి వెన్నెలలు కురిసే పుణ్యభూమి. ప్రపంచంలో మనోహరమైన కీర్తిని పొందిన ఈ భరతభూమి, నా తల్లి అని గర్వంగా తల ఎత్తుకొని తిరుగుతూ, విజయఢంకాను మ్రోగిస్తూ నీ దేశం గురించి కీర్తించు.

2) ఉ. జాతి శిరస్సు నెత్తికొని క్ష్మాతలవీధిని గౌరవాన హుం
దాతన మొప్పగాఁ దిరిగినన్ గలుగున్ గడుకీర్తి భారత
క్ష్మాతలి కట్టి భాగ్యమును గల్గగ శాంతి సముద్ధరింప లే
రా! తరుణమ్మిదే మరలరాదు సుమీ! గతకాల మెన్నడున్

భావం :
భారత జాతి తల ఎత్తుకొని ప్రపంచ వీధిలో సగౌరవంగా, హుందాగా తిరిగినప్పుడే, గొప్ప కీరి కలుగుతుంది. మనదేశానికి అటువంటి సౌభాగ్యం కలిగే విధంగా, శాంతిని పెంపొందించడానికి, ఇదే సరైన సమయము. అందుకు సిద్ధంకండి. ఎందు కంటే, పోయిన కాలం తిరిగి రాదు కదా !

AP Board 8th Class Telugu Important Questions Chapter 9 సందేశం

3) శా. ఈ గంగానది బ్రహ్మపుత్రయును నీ కృష్ణమ్మ కావేరియున్
ఈ గోదావరి సింధు నర్మదలు నీ యీదేశ సౌభాగ్య ధా
న్యాగారాలకు పట్టుగొమ్మలు నఖండంబైన నీ ధారుణీ
భాగ్యమ్మీ సకల ప్రపంచమునకున్ స్వామిత్వముం బూనెడిన్

భావం :
గంగ, బ్రహ్మపుత్ర, కృష్ణ, సింధు నర్మద అనే జీవనదులు, ఈ దేశ సౌభాగ్యమైన ధాన్యాగారాలకు ముఖ్యమైన ఆధారం. అఖండమైన సౌభాగ్య సంపదలు గలిగిన ఈ దేశం, ప్రపంచానికే ఆధిపత్యం వహిస్తుంది.

ఆ) కింది అపరిచిత పద్యాలను చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.

1. మొదలు జూచినఁ గడు గొప్ప పిదపఁ గుఱుచ,
యాదిఁ గొంచెము తర్వాత నధిక మగుచుఁ
దనరు, దిన పూర్వ పరభాగ జనితమైన
ఛాయపోలిక గుజన సజ్జనుల మైత్రి
ప్రశ్నలు :
1. కుజనుల మైత్రి ఎటువంటిది?
జవాబు:
కుజనుల మైత్రి ఉదయకాలపు నీడవలె మొదట ఎక్కువగా ఉండి తరువాత తగ్గిపోతూ ఉంటుంది.

2. సజ్జనుల మైత్రి ఎటువంటిది?
జవాబు:
సజ్జనుల మైత్రి సాయంకాలపు నీడవలె మొదట తక్కువగా ఉండి తరువాత పెరుగుతూ ఉంటుంది.

3. కుజన, సజ్జనుల మైత్రిని కవి దేనితో పోల్చి చెప్పాడు?
జవాబు:
కవి కుజనుల మైత్రిని ఉదయకాలపు నీడతోను, సజ్జనుల మైత్రిని సాయంకాలపు నీడతోను పోల్చి చెప్పాడు.

4. ఈ పద్యం వల్ల మనకు ఏం తెలుస్తోంది?
జవాబు:
ఈ పదం వల్ల మనకు సజ్జనుల మైత్రి మంచిదని తెలుస్తోంది.

2. అఘము వలన మరల్చు, హితార్థ కలితుఁ
జేయుఁ గోష్యంబు దాచుఁ, బోషించుగుణము,
విడువ డాపన్ను, లేవడివేళ నిచ్చు,
మిత్రు డీలక్షణమ్ముల మెలగుచుండు

ప్రశ్నలు :
1. మిత్రుడు దేని నుండి మరలిస్తాడు?
జవాబు:
మిత్రుడు పాపం నుండి మరలిస్తాడు.

2. మిత్రుడు ఎట్టివారిని విడిచిపెట్టడు?
జవాబు:
మిత్రుడు ఆపదలో నున్నవారిని విడిచి పెట్టడు.

3. మిత్రుడు పోషించేది ఏది?
జవాబు:
మిత్రుడు సద్గుణాన్ని పోషిస్తాడు.

4. ఈ పద్యానికి శీర్షికను సూచించండి.
జవాబు:
ఈ పద్యానికి శీర్షిక ‘మిత్ర లక్షణం’.

AP Board 8th Class Telugu Important Questions Chapter 9 సందేశం

3. తివిరి యిసుమునఁ దైలంబుఁ దీయవచ్చు
దవిలి మృగతృష్ణలో నీరు ద్రావవచ్చుఁ
దిరిగి కుందేటి కొమ్ము సాధింపవచ్చుఁ
జేరి మూర్ఖుల మనసు రంజింపరాదు
ప్రశ్నలు :
1. ఎవరి మనసు రంజింపచేయలేము?
జవాబు:
మూర్ఖుని మనసు రంజింపచేయలేము.

2. ఇసుక నుండి ఏమి తీయవచ్చును?
జవాబు:
ఇసుక నుండి తైలము తీయవచ్చు.

3. మృగతృష్ణలో ఏమి త్రాగవచ్చు?
జవాబు:
మృగతృష్ణలో నీరు త్రాగవచ్చు.

4. ఈ పద్యానికి శీర్షికను సూచించండి.
జవాబు:
ఈ పద్యానికి శీర్షిక “మూర్ఖుని స్వభావం”.

4. కమలములు నీటఁ బాసినఁ
కమలాప్తుని రశ్మి సోఁకి కమలిన భంగిన్
తమ తమ నెలవులు తప్పినఁ
దమ మిత్రులు శత్రులౌట తథ్యము సుమతీ!
ప్రశ్నలు :
1. కమలములు నీటిని విడిచిపెట్టి బయటికి వస్తే ఏం జరుగుతుంది ?
జవాబు:
కమలములు నీటిని విడిచి పెట్టి బయటికి వస్తే సూర్యరశ్మి సోకి వాడిపోతాయి.

2. ఎప్పుడు మిత్రులు శత్రువులౌతారు?
జవాబు:
తమ తమ స్థానాలను విడిచిపెడితే మిత్రులు శత్రువు లౌతారు.

3. తామరలకు మిత్రుడెవరు?
జవాబు:
తామరలకు మిత్రుడు సూర్యుడు.

4. ఈ పద్యానికి శీర్షికను సూచించండి.
జవాబు:
ఈ పద్యానికి శీర్షిక ‘స్థానబలం’.

AP Board 8th Class Telugu Important Questions Chapter 9 సందేశం

5. ఎఱుక గలవారి చరితలు
గఱచుచు సజ్జనుల గోష్ఠి గదలక ధర్మం
బెఱుగుచు నెఱిగినదానిని
మఱువ కనుష్ఠించునది సమంజసబుద్ధిన్
ప్రశ్నలు :
1. ఎవరి చరిత్ర తెలుసుకోవాలి?
జవాబు:
జ్ఞానవంతుల చరిత్ర తెలుసుకోవాలి.

2. ధర్మాన్ని ఎక్కడి నుంచి తెలుసుకోవాలి?
జవాబు:
ధర్మాన్ని సజ్జనుల సమావేశం నుంచి తెలుసుకోవాలి.

3. దేనిని అనుష్ఠించాలి?
జవాబు:
ధర్మాన్ని అనుష్ఠించాలి.

4. ఈ పద్యానికి శీర్షికను సూచించండి.
జవాబు:
ఈ పద్యా నికి శీర్షిక ‘నీతిబోధ’.

II. వ్యక్తీకరణ – సృజనాత్మకత

అ) కింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాల్లో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
‘సందేశం’ పాఠ్యభాగ రచయితను గురించి రాయండి.
(లేదా)
దేశం కోసం “సందేశం” ఇచ్చిన పాఠ్య రచయిత గురించి రాయండి. (S.A. II – 2018-19)
జవాబు:
‘సందేశం’ పాఠ్యభాగ : వయిత జ్ఞానానందకవి. ఈయన పూర్తి పేరు సురగాలి తిమోతి జ్ఞానానందకవి. బొబ్బిలి తాలూకా పెద పెంకి గ్రామంలో జన్మించారు. తెలుగు పండితులుగా పని చేశారు. ప్రాథమిక విద్యార్థి దశలోనే ఆశువుగా సీస పద్యాలు చెబుతూ ‘దీనబంధు శతకాన్ని’ రాశారు. ఆమ్రపాలి, పాంచజన్యం, క్రీస్తు శతకం, నాజీవిత గాథ, కూలీ నుండి కళాప్రపూర్ణ వరకు, పర్జన్యం, గోల్కొండ మొ||లగు వీరి రచనలు. 1975లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి అవార్డును పొందారు. రాష్ట్ర ప్రభుత్వంచే ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకున్నారు. భారత ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది. సరళమైన శైలితో సామాజిక చైతన్యాన్ని అందించారు.

ప్రశ్న 2.
భారతమాత గొప్పదనాన్ని వివరించండి.
జవాబు:
మనది విశాలమైన భారతదేశం. ఇది హిమాలయాలకు పుట్టినిల్లు. ఇలాంటి భారతదేశంలో ప్రజలందరూ విశాల దృక్పథంతో మెలగాలి. మన మతాలు, భాషలు వేరైనప్పటికీ మనమంతా భారతీయులం. మన భారతదేశం ఎంతో సుందరమైనది. ఎదుటివారిపై పగ, కోపం విడనాడి ప్రేమ, స్నేహభావాలతో జీవించాలి. బుద్ధుడు, గాంధీ చేసిన బోధనలు మనకు శాంతిని చేకూరుస్తాయి.

ప్రేమ అనే జెండాను చేతపట్టుకొని ఐకమత్యంతో పయనిద్దాం. త్యాగమనే శక్తిని ఆయుధంగా చేసుకొని శత్రువుల నెదిరిద్దాం. కూలీలు, రైతులు, మేధావులు కలిసిమెలిసి పనిచేసినపుడే పల్లెలు, పట్నాలు అభివృద్ధి చెందుతాయి. మనమంతా కలిసి అనారోగ్యం, అవిద్య, అసమానతలను తొలగించటానికి పాటుపడాలి. ప్రజాస్వామ్యం కాపాడుకుంటూ సామ్యవాదం సాధించుకోవాలి.

AP Board 8th Class Telugu Important Questions Chapter 9 సందేశం

ప్రశ్న 3.
మనదేశం ఒకప్పటి పరిస్థితి, ఇప్పటి పరిస్థితి మధ్య తేడాను చర్చించండి.
జవాబు:
ఒకప్పుడు మన దేశం స్వతంత్ర రాజుల అధికారంలో ఉండేది. ఎక్కువమంది ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవించేవారు. కేవలం వర్షాధారంగా పంటలు పండించేవారు. బ్రిటిష్ వారు దేశాన్ని తమ అధికారంలోకి తెచ్చుకున్నప్పుడు, వారు కొన్ని సదుపాయాలు చేశారు. కాని దేశం బానిసత్వం అనుభవించింది. విద్యా, ఆరోగ్య సదుపాయాలు విస్తరించలేదు.

స్వాతంత్ర్యం వచ్చిన తరువాత దేశం పంచవర్ష ప్రణాళికల ద్వారా ఎంతో అభివృద్ధి చెందింది. విద్యా, ఆరోగ్య, రవాణా వసతులు పెరిగాయి. దేశంలో పేదరికం తగ్గింది. పల్లెల్లో సహితం విద్యా సదుపాయాలు, రోడ్లు, పాడి పంటలు పెరిగాయి. పరిశ్రమలు పెరిగాయి. రోదసీ విజ్ఞానరంగంలో మనం ప్రపంచంలోనే ఉన్నత స్థితిలో ఉన్నాం.

కానీ దేశంలో నాయకుల్లోనూ, ప్రజల్లోనూ అవినీతి, లంచగొండితనం పెరిగిపోయాయి. మోసాలు, అక్రమాలు, అన్యాయాలు అధికమయ్యాయి. ధరలు చుక్కలనంటుతున్నాయి. దేశసంపద కేవలం కొంతమంది గుప్పెటలో బందీ అయ్యింది. దేశం అనుకున్నంత వేగంగా ముందుకు పోవడం లేదు.

ఆ) కింది ప్రశ్నకు 10 లేక 12 వాక్యాల్లో సమాధానం రాయండి.

ప్రశ్న 1.
‘సందేశం’ పాఠం ద్వారా నీవేమి గ్రహించావో తెలుపుము.
జవాబు:
జ్ఞానానంద కవి ‘సందేశం’ అనే పాఠ్యభాగాన్ని రచించాడు. ఈ పాఠ్యభాగం ద్వారా మన భారతదేశము యొక్క గొప్పతనాన్ని, సంస్కృతీ వైభవాన్ని చక్కగా తెలియజేశాడు. ప్రపంచమంతా భారతదేశాన్ని గౌరవిస్తుంది. భారతీయులంతా శాంతిని కోరుతారు. అన్ని మతాలవారు అన్యోన్యంగా ఉంటారు. పరమత సహనాన్ని పాటిస్తారు.

భారతదేశంలో అసూయలు, దౌర్జన్యాలు, కులమత హింసలు లేవు. నానాటికీ పెరిగిపోతున్న దౌర్జన్యాలు తొలగిపోవాలి. లంచగొండితనాన్ని నిర్మూలించాలి. ప్రతినిధులు ప్రజల మధ్య విద్వేషాలు సృష్టిస్తున్నారు. ఇది మంచిది కాదు. ప్రజలంతా అన్నదమ్ముల్లా ఉండాలి. ఆనాడే భారతదేశ సమైక్యత వర్ధిల్లుతుంది.

మనదేశంలో గంగ, కృష్ణా, గోదావరి వంటి మహానదులు ప్రవహిస్తున్నాయి. దేశాన్ని సస్యశ్యామలం చేస్తున్నాయి. మహాత్ముల నీతి మార్గంతో పునీతమైన పుణ్యభూమి మనది. ఈ అహింసా సిద్ధాంతాన్ని అందరూ పాటించాలి. దేశ సమగ్రతకు అందరూ కృషి చేయాలి.

ఇ) కింది అంశం గురించి సృజనాత్మకంగా / ప్రశంసిస్తూ రాయండి.

ప్రశ్న 1.
భారతమాత తన ఆత్మకథను ఎలా చెప్పుకుందో ఊహించి రాయండి.
జవాబు:
నేను భారతమాతను. నేను సిరిసంపదలు, పాడి పంటలు గలదానను. నా నేలపైననే, వేద వేదాంగాలు, రామాయణం వెలిశాయి. వ్యాసాది ఋషులు ఇక్కడే పుట్టారు. నాపై పెద్ద అరణ్యాలు ఏర్పడ్డాయి. ఉపనిషత్తులు నా నేలపైననే పుట్టాయి.

నన్ను పాలించిన రాజుల పరాక్రమ చరిత్రలు, నా ప్రజల బానిసత్వం వల్ల అంతరించాయి. నా ప్రజలు కిన్నెర మీటుతూ రాగాన్ని ఆలపిస్తూ నా భావిభాగ్యాన్ని గూర్చి పాడాలి. నవరసాలతో తేట తెలుగు పదాలతో వీనుల విందుగా కవితలు చెప్పిన కవులు నా నేలపై పుట్టారు. నన్ను కాపాడిన వీరులను గూర్చి గానం చేయాలి. నాపై పాండవేయులు చేసిన యుద్ధాన్ని గూర్చి పాడుకోవాలి. నన్ను పాలించిన కాకతీయుల యుద్ధనైపుణ్యాన్ని కీర్తించాలి. తుంగభద్రా తీరాన నన్ను పాలించిన తెలుగు రాజుల చరిత్రలను గానం చేయాలి.

ప్రశ్న 2.
మనదేశంలాగే మనం పుట్టిన ఊరు కన్నతల్లి వంటిది. మీ ఊరిని గురించి పొగుడుతూ ఒక గేయం రాయండి.
జవాబు:
మా ఊరు గురించి గేయం

“సిరులు పొంగిన సీమరాయది
పాడిపంటల భాగ్యసీమది
కన్నతల్లిర “కడియమూ”
“జామతోటలు జాజిపూవులు
వంగతోటలు పండ్ల తరువులు
మల్లెపూవులు మొల్ల తోటలు
నిండియున్నవి దండిగా”
“గలగలలతో కాల్వ జలములు
గాలి కూగే కలమ సస్యము
విందు చేసే ప్రేమ పాటలు
కలసి యుండెడి కడియమూ”
కూరగాయలు కోరినన్నియు
పాడిపంటలు వలసినంతయు
వర్త కమ్మున భాగ్యసంపద
మరపురానిది “మా పురం”.

AP Board 8th Class Telugu Important Questions Chapter 9 సందేశం

ప్రశ్న 3.
మహాత్మాగాంధీ వ్యక్తిత్వాన్ని తెలియజేస్తూ వ్యాసం రాయండి.
జవాబు:
మహాత్మాగాంధీ అసలు పేరు మోహన్ దాస్ కరంచంద్ గాంధీ. కానీ భారత ప్రజలు ఆత్మీయంగా ‘బాపూజీ’ అని పిలిచేవారు. ‘మహాత్మా’ అని గౌరవించేవారు. భారతజాతి మహాత్మాగాంధీని ‘జాతిపిత’ గా గౌరవించి కృతజ్ఞత ప్రకటించుకుంది.

గాంధీజీ దక్షిణాఫ్రికా వెళ్ళినప్పుడు అక్కడున్న భారతీయుల దాస్య వృత్తిని చూసి చలించిపోయాడు. ఆంగ్లేయుల ప్రవర్తన సహించలేక ఎదురుతిరిగాడు. ఎన్నో కష్టాలకు లోనయ్యాడు.

స్వదేశానికి తిరిగి వచ్చిన గాంధీజీ భారతీయుల బానిస బ్రతుకుల్ని చూసి సహించలేకపోయాడు. భారతమాత పరాయి పాలకుల సంకెళ్ళలో బందీగా ఉన్నందుకు గాంధీ తల్లడిల్లాడు. ఆంగ్లేయులపై స్వాతంత్ర్య సమరం ప్రకటించాడు. శాంతి, సత్యం, అహింస అనే ఆయుధాలతో స్వాతంత్ర్య సమరం చేపట్టాడు. స్వరాజ్య ఉద్యమానికి కాంగ్రెసు సంఘం స్థాపించాడు.

ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా, విదేశీ వస్తు బహిష్కరణ, సహాయ నిరాకరణ, ఖద్దరు ఉద్యమాలను చేపట్టి ఆంగ్లేయులను గుక్క తిప్పుకోనీకుండా గడగడలాడించాడు. సత్యాగ్రహం, నిరాహారదీక్షల ద్వారా భారత జాతిని జాగృతం చేసి ఆంగ్లేయుల గుండెలు దద్దరిల్లజేశాడు.

అనేక జాతులు, కులాలు, మతాలు, భాషలు గల దేశ ప్రజల్ని ఒకే తాటి మీద నడిపించి, సమైక్యంగా పోరాటం సాగించాడు. గాంధీ నడిపించిన ఉద్యమం వల్ల 1947, ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్ర్యం లభించింది. దుడ్డు కర్ర, అంగవస్త్రం, కిర్రు చెప్పులు గల గాంధీ ప్రపంచ దేశాలచేత జేజేలు అందుకున్నాడు.

8th Class Telugu 9th Lesson సందేశం 1 Mark Bits

1. నీ తనువు నిండా దేశభక్తి ఉండాలి. (అర్ధాన్ని గుర్తించండి) (S.A. II – 2018-19)
ఎ) శరీరము
బి) అవయవము
సి) శరము
డి) మనసు
జవాబు:
ఎ) శరీరము

2. దేశ గౌరవమును పెంపొందించాలి (వికృతి గుర్తించండి.) (S.A.II – 2018-19)
ఎ) గౌవరము
బి) గవరం
సి) గారవము
డి) గౌవరం
జవాబు:
సి) గారవము

3. నా యీ దేశ సౌభాగ్య సంపద లీ విశ్వమునందు నెలకొల్పుదున్ (ఏ విభక్తి) (S.A.II – 2018-19)
ఎ) తృతీయ
బి) చతుర్థి
సి) సప్తమీ
డి) షష్టీ
జవాబు:
సి) సప్తమీ

4. భారతదేశం సకల సంపదలకు నిలయము (గురు లఘువులు గుర్తించండి) (S.A. II – 2017-18)
ఎ) UII
బి) UIU
సి) IIU
డి) III
జవాబు:
డి) III

AP Board 8th Class Telugu Important Questions Chapter 9 సందేశం

5. గాంధీజీ శాంతికి మారుపేరు. ఉగ్రవాదులు దేనికి మారుపేరు? (వ్యతిరేకపదం రాయండి) (S.A.II – 2017-18)
ఎ) ప్రేమ
బి) అశాంతి
సి) సహనం
డి) ఆప్యాయత
జవాబు:
బి) అశాంతి

6. వనముల్ – ఈ పదంలో ఉన్న గణం ఏది? (S.A.III – 2016-17)
ఎ) న గణం
బి) స గణం
సి) య గణం
డి) మ గణం
జవాబు:
బి) స గణం

భాషాంశాలు – పదజాలం

అర్థాలు :

1. కేతనం ఎగరాలి – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) జెండా
బి) బాబిల్లి
సి) జాతర
డి) రథం
జవాబు:
ఎ) జెండా

2. వసుధ పై శాంతి నిలవాలి – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) ధిషణ
బి) వారిధి
సి) వారంగి
డి) భూమి
జవాబు:
డి) భూమి

3. శిరంపై కేశాలు ఉన్నాయి – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) యశం,ఖ్యాతి
బి) విరించి, వివరణ
సి) ఖ్యాతి, ఖననం
డి) కిరీటం, కరుణ
జవాబు:
బి) విరించి, వివరణ

4. నవ్వ జీవనం కావాలి – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) అనురాగం
బి) కొత్త
సి) పాత
డి) మధురం
జవాబు:
బి) కొత్త

AP Board 8th Class Telugu Important Questions Chapter 9 సందేశం

5. మంచి తరుణంలో రావాలి – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) సమయంలో
బి) సాధనలో
సి) యోధలో
డి) పోరాటంలో
జవాబు:
ఎ) సమయంలో

6. భగవంతుడు నిఖిలం అంతా ఉన్నాడు – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) సంగరం
బి) సమస్తం
సి) సంజాతం
డి) సముద్భూతం
జవాబు:
బి) సమస్తం

7. జనయిత్రి ఉన్నది – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) ఆడపడుచు
బి) తల్లి
సి) చెల్లి
డి) అక్క
జవాబు:
బి) తల్లి

పర్యాయపదాలు :

8. కీర్తి పొందాలి – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
ఎ) అధరం
బి) తల
సి) నాశిక
డి) జిహ్వ
జవాబు:
ఎ) అధరం

9. కాను పాలించాలి – గీత గీసిన పదానికి పర్యాయ పదాలు గుర్తించండి.
ఎ) కీరితి, కిరీటి
బి) ధ్వజం, కేతనం
సి) భూమి, అవని
డి) ధాత్రి, జనని
జవాబు:
సి) భూమి, అవని

10. సౌభాగ్యం వృద్ధి చెందాలి – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
ఎ) కిరీటం,మకుటం
బి) సమృద్ధి, వైభవం
సి) విశదం, వైభవం
డి) జనని, ధరణి
జవాబు:
బి) సమృద్ధి, వైభవం

11. కేతనం ఎగరాలి – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
ఎ) ఝరి, స్యందనం
బి) పతాకం, జెండా
సి) కీలు, కెరటం
డి) జలధి, వారిధి
జవాబు:
బి) పతాకం, జెండా

12. జనయిత్రి – దీనికి పర్యాయపదాలు గుర్తించండి.
ఎ) వారుణి, వసుధ
బి) తల్లి, మాత
సి) అవని, వసుధ
డి) జనక, జామాత
జవాబు:
బి) తల్లి, మాత

AP Board 8th Class Telugu Important Questions Chapter 9 సందేశం

13. ప్రగతి సాధించాలి – గీత గీసిన పదానికి పర్యాయ పదాలు గుర్తించండి.
ఎ) పురోగతి, అభివృద్ధి
బి) జనని, జామాత
సి) పరిశీలన, పరిశోధన
డి) ఆరాటం, చైతన్యం
జవాబు:
ఎ) పురోగతి, అభివృద్ధి

ప్రకృతి – వికృతులు :

14. భృంగారం ధర పెరిగింది – గీత గీసిన పదానికి వికృతి పూరించండి.
ఎ) బండారం
బి) బంగారం
సి) శృంగారం
డి) భంగారం
జవాబు:
బి) బంగారం

15. విసయం తెలిసింది – గీత గీసిన పదానికి ప్రకృతి పదం గుర్తించండి.
ఎ) వివరం
బి) వివేసం
సి) విషయం
డి) విశయం
జవాబు:
బి) వివేసం

16. సహజంగా ఉంది – గీత గీసిన పదానికి వికృతి పదం ఏది?
ఎ) సాజం
బి) సామ్యం
సి) సాధారణం
డి) సాధేయం
జవాబు:
ఎ) సాజం

17. గృహంలో ఉన్నారు – గీత గీసిన పదానికి వికృతి పదం ఏది?
ఎ) గేహం
బి) గోహం
సి) గహం
డి) గోహము
జవాబు:
ఎ) గేహం

18. అచ్చెరువు పొందాలి – గీత గీసిన పదానికి ప్రకృతి పదం ఏది?
ఎ) ఆదరువు
బి) ఆశ్చర్యం
సి) అక్కరువు
డి) ఆచరువు
జవాబు:
బి) ఆశ్చర్యం

19. ఎదలో ఏమున్నది – గీత గీసిన పదానికి ప్రకృతి పదం పదం గుర్తించండి.
ఎ) జలధి
బి) అగ్రణి
సి) హవం
డి) ఆరుణి
జవాబు:
సి) హవం

20. కీర్తి పొందాలి – గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.
ఎ) కృతి
బి) కీరితి
సి) కేరితి
డి) కారితి
జవాబు:
బి) కీరితి

21. యజ్ఞము చేయాలి – గీత గీసిన పదానికి వికృతి పదం ఏది?
ఎ) జైనము
బి) జన్నము
సి) జెన్నము
డి) జొన్నము
జవాబు:
బి) జన్నము

AP Board 8th Class Telugu Important Questions Chapter 9 సందేశం

22. రూపు మనోహరం – గీత గీసిన పదానికి ప్రకృతి పదం ఏది?
ఎ) రూపం
బి) రోగం
సి) రౌపం
డి) రైపం
జవాబు:
ఎ) రూపం

నానార్థాలు :

23. తనువును రక్షించాలి – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
ఎ) పుట్టుక, ప్రగతి
బి) నాడి, నాగరం
సి) ప్రజ, సంతానం
డి) శరీరం, పన్నము
జవాబు:
డి) శరీరం, పన్నము

24. నాడులు ఉన్నాయి – గీత గీసిన పదానికి నానార్థాలు పదం ఏది?
ఎ) నాశికలు, కర్ణములు
బి) నరములు, ఈనెలు
సి) ఈటెలు, ఈగలు
డి) ఆక్షితలు, మనుషులు
జవాబు:
బి) నరములు, ఈనెలు

25. ప్రజ వర్ధిల్లాలి – గీత గీసిన పదానికి నానార్థాలు ఏది?
ఎ) సంతానం, జనము
బి) జనని, జామాత
సి) జనక, జయం
డి) జనిత, వసుధ
జవాబు:
ఎ) సంతానం, జనము

వ్యుత్పత్త్యర్థాలు :

26. భారమును ఓర్చునది – అనే వ్యుత్పత్త్యర్థం గల పదాన్ని గుర్తించండి.
ఎ) వారిదం
బి) క్ష్మా
సి) జలధి
డి) వారుణి
జవాబు:
బి) క్ష్మా

AP Board 8th Class Telugu Important Questions Chapter 9 సందేశం

27. వసుధ – దీనికి వ్యుత్పత్తిని గుర్తించండి.
ఎ) ఐశ్వర్యం ఇచ్చునది
బి) జనులను కాపాడునది
సి) ధనమును ధరించునది
డి) విశ్వాన్ని పొందునది
జవాబు:
సి) ధనమును ధరించునది

28. ముందుండి నడిపించేవాడు – అనే వ్యుత్పత్త్యర్థం గల గుర్తించండి.
ఎ) హేయం
బి) హారం
సి) అరుణ
డి) హృదయం
జవాబు:
బి) హారం

వ్యాకరణాంశాలు

సంధులు :

39. గుణసంధికి ఉదాహరణను గుర్తించండి.
ఎ) ప్రత్యయం
బి) సహోదర
సి) మనోరధం
డి) తపోధనుడు
జవాబు:
బి) సహోదర

40. పట్టుగొమ్మ – ఇది ఏ సంధి?
ఎ) విసర్గ సంధి
బి) గసడదవాదేశ సంధి
సి) త్రికసంధి
డి) గుణసంధి
జవాబు:
బి) గసడదవాదేశ సంధి

41. కింది వానిలో యడాగమ సంధికి ఉదాహరణను గుర్తించండి.
ఎ) కన్నయది
బి) ఆత్మానందం
సి) పంచకావ్యం
డి) నవ్యోదయం
జవాబు:
ఎ) కన్నయది

42. శివమెత్తరా – ఇది ఏ సంధి?
ఎ) త్రికసంధి
బి) ఉత్వసంధి
సి) అత్వసంధి
డి) గుణసంధి
జవాబు:
బి) ఉత్వసంధి

43. మొలకెతు – దీనిని విడదీయడం గుర్తించండి.
ఎ) మెలక + ఎత్తు
బి) మొలకి + ఎత్తు
సి) మొలకు + ఎత్తు
డి) మొలక + ఎత్తు
జవాబు:
డి) మొలక + ఎత్తు

AP Board 8th Class Telugu Important Questions Chapter 9 సందేశం

44. నీయాదేశము – ఇది ఏ సంధి?
ఎ) ఉత్వసంధి
బి) యడాగమ సంధి
సి) త్రికసంధి
డి) అత్వసంధి
జవాబు:
బి) యడాగమ సంధి

45. కింది వానిలో వికల్ప సంధి ఏది?
ఎ) ఉత్వసంధి
బి) గుణసంధి
సి) ఇత్వసంధి
డి) అత్వసంధి
జవాబు:
సి) ఇంద్ర గణం

46. కింది వానిలో పొసగని సంధి ఏది?
ఎ) గుణసంధి
బి) అత్వసంధి
సి) ఇత్వసంధి
డి) త్రికసంధి
జవాబు:
ఎ) గుణసంధి

సమాసాలు :

47. ఉభయ పదార్థ ప్రాధాన్యం గల సమాసం ఏది?
ఎ) రూపక సమాసం
బి) ద్వంద్వ సమాసం
సి) బహు బ్రీహి సమాసం
డి) కర్మధారాయ సమాసం
జవాబు:
బి) ద్వంద్వ సమాసం

48. దేశభక్తి ఉండాలి – గీత గీసిన పదానికి విగ్రహవాక్యం గుర్తించండి.
ఎ) దేశమును భక్తి
బి) దేశము నందు భక్తి
సి) దేశమునకు భక్తి
డి) దేశము చేత భక్తి
జవాబు:
బి) దేశము నందు భక్తి

49. దేశ సమగ్రత పాటించాలి – గీత గీసిన పదానికి విగ్రహవాక్యం ఏది?
ఎ) దేశము చేత సమగ్రత
బి) దేశము వలన సమగ్రత
సి) దేశము తెలుపు సమగ్రత
డి) దేశమందు సమగ్రత
జవాబు:
బి) దేశము వలన సమగ్రత

AP Board 8th Class Telugu Important Questions Chapter 9 సందేశం

50. అన్యపదార్థ ప్రాధాన్యం గల సమాసం ఏది?
ఎ) బహువ్రీహి
బి) ద్వంద్వ
సి) కర్మధారయ
డి) తత్పురుష
జవాబు:
ఎ) బహువ్రీహి

51. వంచకుల యొక్క ఆవశి – దీనికి సమాస పదం ఏది?
ఎ) వంచకావశి
బి) వచికశ్రేణి
సి) వంచికాశ్రేణి
డి) అగ్రవంచక
జవాబు:
ఎ) వంచకావశి

52. అన్నదమ్ములు – ఇది ఏ సమాసం?
ఎ) ద్వంద్వ సమాసం
బి) కర్మధారయ సమాసం
సి) ద్విగు సమాసం
డి) రూపక సమాసం
జవాబు:
ఎ) ద్వంద్వ సమాసం

గణవిభజన:

53. న, జ, భ, జ, జ, జ, ర – ఇవి ఏ పద్య గణాలు (S.A. III – 2015-16)
ఎ) ఆటవెలది
బి) చంపకమాల
సి) ఉత్పలమాల
డి) మత్తేభం
జవాబు:
బి) చంపకమాల

54. IIIU – ఇది ఏ గణము?
ఎ) సూర్య గణం
బి) న గణం
సి) ఇంద్ర గణం
డి) హ గణం
జవాబు:
సి) ఇంద్ర గణం

55. రాతరు – ఇది ఏ గణము?
ఎ) త గణం
బి) భ గణం
సి) య గణం
డి) న గణం
జవాబు:
బి) భ గణం

AP Board 8th Class Telugu Important Questions Chapter 9 సందేశం

56. ఉత్పలమాలలో పాదానికి అక్షరాలు గుర్తించండి.
ఎ) 20
బి) 23
సి) 24
డి) 21
జవాబు:
ఎ) 20

వాక్యాలు :

57. రవి ఇంటికి వెళ్ళి అన్నం తిన్నాడు – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) హేత్వర్థక వాక్యం
బి) తుమున్నర్థక వాక్యం
సి) సందేహార్థక వాక్యం
డి) ప్రశ్నార్థక వాక్యం
జవాబు:
సి) సందేహార్థక వాక్యం

58. నీవు ఇంటికి వెళ్ళు – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) నిశ్చయాత్మక వాక్యం
బి) కర్తరి వాక్యం
సి) విధ్యర్థక వాక్యం
డి) కర్మణి వాక్యం
జవాబు:
సి) విధ్యర్థక వాక్యం

59. మీరు భోజనం చేయవచ్చు – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) అనుమత్యర్థక వాక్యం
బి) కర్తరి వాక్యం
సి) కర్మణి వాక్యం
డి) వ్యతిరేకార్థక వాక్యం
జవాబు:
ఎ) అనుమత్యర్థక వాక్యం

60. వంట చేసి వెళ్ళాను – గీత గీసిన పదం ఏ క్రియా పదం?
ఎ) క్వార్ధకం
బి) చేదర్థకం
సి) శత్రర్థకం
డి) ఆత్మార్థకం
జవాబు:
ఎ) క్వార్ధకం

61. వారు నడుస్తూ వెళ్తున్నారు – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) ఆత్మార్థక వాక్యం
బి) శత్రర్థక వాక్యం
సి) కర్తరి వాక్యం
డి) ధాత్వర్థక వాక్యం
జవాబు:
బి) శత్రర్థక వాక్యం

62. వాల్మీకి చేత రామాయణం రచింపబడింది – ఇది ఏ రకమైన వాక్యం? (S.A.III – 2015-16)
ఎ) కర్తరి వాక్యం
బి) సామాన్య వాక్యం
సి) హేత్వర్థక వాక్యం
డి) కర్మణి వాక్యం
జవాబు:
డి) కర్మణి వాక్యం

AP Board 8th Class Telugu Important Questions Chapter 9 సందేశం

63. వర్షాలు కురవడం వల్ల చెరువులు నిండాయి – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) హేత్వర్థక వాక్యం
బి) భావార్థక వాక్యం
సి) తుమున్నర్ధక వాక్యం
డి) కర్తరి వాక్యం
జవాబు:
ఎ) హేత్వర్థక వాక్యం

64. వాడు వస్తాడో? రాడో? – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) నిశ్చయార్థక వాక్యం
బి) ఆత్మార్థక వాక్యం
సి) సంక్లిష్ట వాక్యం
డి) సంయుక్త వాక్యం
జవాబు:
సి) సంక్లిష్ట వాక్యం

అలంకారాలు :

65. ఇందు వదన కుంద రదన మంద గమన మధుర వచన ఇది ఏ అలంకారం?
ఎ) వృత్త్యనుప్రాస
బి) ఛేకానుప్రాస
సి) యమకం
డి) ముక్తపదగ్రస్తం
జవాబు:
ఎ) వృత్త్యనుప్రాస

66. కింది వానిలో పొసగని సంధిని గుర్తించండి.
ఎ) ఉపమ
బి) యమకం
సి) లాటానుప్రాస
డి) అంత్యానుప్రాస
జవాబు:
ఎ) ఉపమ

67. బింబ ప్రతిబింబ భావం గల అలంకారం గుర్తించండి.
ఎ) దృష్టాంతం
బి) ఉత్ప్రేక్ష
సి) అతిశయోక్తి
డి) లాటానుప్రాస
జవాబు:
ఎ) దృష్టాంతం

AP Board 8th Class Telugu Important Questions Chapter 9 సందేశం

68. మానవా ! నీ ప్రయత్నం మానవా ! – ఇందలి అలంకారం గుర్తించండి.
ఎ) యమకం
బి) వృత్త్యనుప్రాన్
సి) లాటానుప్రాస
డి) అంత్యానుప్రాస
జవాబు:
ఎ) యమకం

సొంతవాక్యాలు :

29. కేతనము : అర్జునుని కేతనంపై కపీశ్వరుడుంటాడు.

30. నిఖిలం : నిఖిలమంతా దైవం నిండియున్నాడు.

31. అభ్యుదయం : ప్రజలు అభ్యుదయ మార్గంలో పయనించాలి.

32. సౌభాగ్యం : దేశ సౌభాగ్యం వర్ధిల్లాలి.

33. చంద్రిక : చంద్రుని చంద్రికలు ఆహ్లాదం కలిగిస్తాయి.

34. వసుధ : వసుధపై ప్రజలంతా సుఖంగా జీవించాలి.

35. వర్థిల్లు : జగతిపై శాంతి వర్థిల్లునట్లుగా కృషి చేయాలి.

36. ఉద్ధరించు : పేదలను ఉద్ధరించు కార్యక్రమాలు చేయాలి.

37. ధాన్యాగారం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ధాన్యాగారంగా కీర్తి పొందింది.

38. నిలబెట్టుట : వంశ ప్రతిష్ఠలను అందరు నిలబెట్టాలి.

AP Board 6th Class Hindi Solutions Chapter 2 तितली

AP State Syllabus AP Board 6th Class Hindi Textbook Solutions Chapter 2 तितली Textbook Questions and Answers.

AP State Syllabus 6th Class Hindi Solutions Chapter 2 तितली

6th Class Hindi Chapter 2 तितली Textbook Questions and Answers

Improve Your Learning

सुनिए-बोलिए
AP Board 6th Class Hindi Solutions Chapter 2 तितली 2

प्रश्न 1.
गीत के बारे में बातचीत कीजिए। (గీతమును గూర్చి సంభాషించండి.)
उतर:
रंग बिरंगी तितली आती है। उसे देखकर बच्चे चिल्लाते हैं कि मीना और रीना जल्दी आइए कि नीली पीली तितली आयी है। तितली नील गगन से उडती आयी। वह फूलों का रस पीने आयी।

प्रश्न 2.
पाठ के चित्र में क्या – क्या दिखायी दे रहे हैं? (పాఠం చిత్రంలో ఏమేమి కన్పించుచున్నవి?)
उतर:
पाठ के चित्र में दो लडकें और एक लडकी, कुछ पक्षी, कुछ तितलियाँ, बगीचे में रंग बिरंगे फूल, पौधे आदि दिखाई दे रहे हैं।

AP Board 6th Class Hindi Solutions Chapter 2 तितली

प्रश्न 3.
लड़के क्या कर रहे हैं? (బాలురు ఏమి చేయుచున్నారు?)
उतर:
लड़के तितलियों को देखकर बहुत खुशी से चिल्ला रहे हैं और उन्हें पकडने की कोशिश कर रहे हैं।

शिक्षण बिंदु (क, ख, ल, स, ‘इ – ि’ ‘ई- ी’)
AP Board 6th Class Hindi Solutions Chapter 2 तितली 1

शब्दार्थ (అర్థములు) (Meanings)

तितली = సీతాకోక చిలుక, butterfly
आना = వచ్చెను, to come
आयी = వచ్చెను, came
रंग बिरंगी = రంగురంగుల, multy colours
नीली = నీలిరంగు, blue
पीली = పచ్చనిరంగు, yellow colour
गगन = ఆకాశం, the sky
उडना = ఎగురుట, fly
फूल = పూలు, flowers
फूलों का रस = పులా మకరందం, nectar
पीना = త్రాగుట, to drink
नील = సిరా రంగు, blue colour

पहचानिए और बोलिए। (గుర్తించండి, చెప్పండి.)

किसान = రైతు, farmer
कीला = సీల / మేకు, nail
ईख = చెరకు, sugarcane
इमली = చింతకాయ, tamarind
नीम = వేప, neem
मीन = చేప, fish
सिर = తల, head
कमल = కమలము, Lotus

AP Board 6th Class Hindi Solutions Chapter 2 तितली

बालगीत

तितली आयी, तितली आयी
रंग बिरंगी तितली आयी।
मीना आ जा, रीना आ जा
नीली पीली तितली आयी।

नील गगन से उड़ती आयी
फूलों का रस पीने आयी।
तितली आयी, तितली आयी
रंग बिरंगी तितली आयी।

బాలగీతం

సీతాకోకచిలుక వచ్చింది, సీతాకోకచిలుక వచ్చింది
రంగురంగుల సీతాకోకచిలుక వచ్చింది
మీనా రా, రీనా రా

నీలిరంగు పచ్చని రంగు సీతాకోకచిలుక వచ్చింది
నీలి ఆకాశం నుండి ఎగురుతూ వచ్చింది.
పూలమకరందం త్రాగ వచ్చింది
సీతాకోకచిలుక వచ్చింది, సీతాకోకచిలుక వచ్చింది
రంగురంగుల సీతాకోకచిలుక వచ్చింది

Rhyme in English

Arrived a butterfly, arrived a butterfly
Arrived a colourful butterfly
Come Meena, Come Reena
Arrived a bluish green butterfly

Arrived flying from the blue sky
Arrived to have flower’s nectar
Arrived a butterfly, arrived a butterfly
Arrived a colourful butterfly;

पढ़िए (क ख ल स ‘इ – ि’ ‘ई- ी’)

अ) गीत पढ़िए। ‘इ – ि’ ‘ई- ी’ मात्रावाले अक्षरों पर ‘( )’ लगाइए।
उतर:
AP Board 6th Class Hindi Solutions Chapter 2 तितली 3

आ) चित्र देखिए। शब्द पढ़िए। इनके अक्षर वर्णमाला में पहचानिए। ‘( )’ लगाइए।
AP Board 6th Class Hindi Solutions Chapter 2 तितली 4
AP Board 6th Class Hindi Solutions Chapter 2 तितली 5

इ) चित्र देखिए। पढ़िए।
AP Board 6th Class Hindi Solutions Chapter 2 तितली 6

ई) पढ़िए। अंतर समझिए।

सिर – सिरा
सीख – सिख
मिल – मील
किला – कीला

सिर = తల, head
सिख = సిక్కు, sikh
मिल = మిల్లు, a mill, factory
किला = కోట, fort
सिरा = అంచు, కొన, Tag, end Poogsikh
सीख = విద్య, పాఠము, broach, lesson
मील = మైలు, a mile
कीला = సిల/మేకు, a nail

लिरिवए

अ) सूचना के अनुसार लिखिए।
AP Board 6th Class Hindi Solutions Chapter 2 तितली 7

आ) लेखन अभ्यास
AP Board 6th Class Hindi Solutions Chapter 2 तितली 8

इ) मात्राएँ जोडकर पढ़िए। लिखिए।
AP Board 6th Class Hindi Solutions Chapter 2 तितली 9

ई) खाली जगह भरिए।
AP Board 6th Class Hindi Solutions Chapter 2 तितली 10

उ) चित्र देखकर अक्षर सही क्रम में लिखिए।
AP Board 6th Class Hindi Solutions Chapter 2 तितली 11

ऊ) अक्षर और मात्राओं से शब्द बनाइए।
AP Board 6th Class Hindi Solutions Chapter 2 तितली 12
उतर:
1. किला
2. खर
3. खीर
4. कलम
5. नर
6. रख
7. आम
8. सलाम
9. मिल
10. इनाम
11. कीर
12. मील
13. नीम
14. ईख
15. सामान

सृजनात्मकता

रंग भरिए। नाम लिखिए।
AP Board 6th Class Hindi Solutions Chapter 2 तितली 13

सुनिए-बोलिए
AP Board 6th Class Hindi Solutions Chapter 2 तितली 2

निम्न लिखत प्रश्नों के उत्तर लिखिए।

प्रश्न 1.
तितली कैसी है?
उतर:
तितली रंग-बिरंगी है।

प्रश्न 2.
तितली कितने रंगों में हैं?
उतर:
तितली नीली, पीली, काली रंगों में है।

AP Board 6th Class Hindi Solutions Chapter 2 तितली

प्रश्न 3.
लड़कों के दोस्तों के नाम क्या है?
उतर:
लड़कों के दोस्तों के नाम रीना, मीना है।

प्रश्न 4.
मीना और रीना क्या देखने दौड़े हैं?
उतर:
मीना और रीना रंग – बिरंगे तितली देखने दौड़े हैं।

प्रश्न 5.
बगीचे में क्या आयीं?
उतर:
बगीचे में रंग – बिरंगी तितलियाँ आयी।

प्रश्न 6.
नील गगन में क्या उड रही हैं?
उतर:
नील गगन में तितलियाँ उड़ रही हैं।

प्रश्न 7.
तितली बगीचे में क्यों आयी?
उतर:
तितली बगीचे में फूलों का रस पीने आयी।

प्रश्न 8.
बच्चे किसे देखकर खुश होते हैं?
उतर:
बच्चे रंग – बिरंगी तितली और फूलों को देखकर खुश होते है।

प्रश्न 9.
आसमान में रंग-बिरंगी तितलियों की ही तरह और क्या उडते हैं?
उतर:
आसमान में रंग-बिरंगी तितलियों की ही तरह रंगीन पतंगे उडती हैं।

प्रश्न 10.
बगीचे में किन पौधों को देख सकते हैं?
उतर:
बगीचे में मोगरा, गुलाब, चमेली, गेंदा आदि सुंदर फूलों को और पौधो को देख सकते हैं।

प्रश्न 11.
आप के घर में कौन – कौन से फूलों के पौधे हैं?
उतर:
गुलाब, चमेली, जुही, गुड़हल, गेंदा और पारिजात।

प्रश्न 12.
कौन – कौन से फूल खुशबूदार होते हैं?
उतर:
गुलाब, मोगरा, चमेली, केवड़ा खुशबूदार होते हैं।

AP Board 6th Class Hindi Solutions Chapter 2 तितली

प्रश्न 13.
आकाश में रंग-बिरंगे उड़ने वाले क्या- क्या देखे हैं?
उतर:
मैं आकाश में रंग – बिरंगे पक्षी, तितली, व्याध पतंग या ड्रगन फ्लाई और कागज़ के पतंग उड़ते देखा हूँ।

प्रश्न 14.
कुछ रंगों के नाम बताओ।’
उतर:
मैं हूरा, नीला, पीला, काला, सफेद, नारंगी, सुनहरा, गुलाबी, बैंगनी, केसलिया, भूरा आदि रंग जानता हूँ।

प्रश्न 15.
चित्र में बच्चे किस प्रकार हैं?
उतर:
चित्र में बच्चे खुश हैं।

प्रश्न 16.
लड़के क्या कर रहे हैं?
उतर:
लड़के तितली को पकड़ने का प्रयत्न कर रहे हैं। तितली, फूल, चिड़िया को देखकर खुश हो रहे हैं।

प्रश्न 17.
इस पाठ से आप क्या सीखते हैं?
उतर:
इस पाठ से प्राकृतिक सुंदरता को देखकर आनंदित होना, प्रकृति का रक्षा करना सीखते हैं।

प्रश्न 18.
बगीचे में जाना आपको कैसा लगता है?
उतर:
मैं बगीचे में जाकर बहुत खुश हो जाता हूँ। वहाँ स्वच्छ हवा और रंग – बिरंगे फूल, चिड़िया, पेड़- पौधे आदि को देखकर मन खुश होता है।

प्रश्न 19.
फूलों के रस कौन – कौन पीते हैं?
उतर:
तितली, भौरा, पक्षी आदि फूलों के रस पीते हैं।

प्रश्न 20.
आप ने कितने रंगों के पक्षी देखे हैं?
उतर:
मैं अनेक रंगों के पक्षी देखा हूँ जैसे – सफेद, काले, नीले, हरे, ताल, पीले, भूरे आदि।

प्रश्न 21.
आप खुश कब रहते हैं?
उतर:
मैं तितली, पशु – पक्षी, दोस्तों को देखकर, माता – पिता भाई – बहन, चाचा – चाची, नाना – नानी दादा – दादी, त्यौहारों के समय नये कपड़े पहनकर, खेलते समय, मिठाइयाँ, फल खाकर खुश होता हूँ।

प्रश्न 22.
चित्र में कितनी तितलियाँ हैं? गिनती करके बोलिए।
उतर:
चित्र में नौ (9) तितलियाँ हैं।

पढ़िए

इन्हें पढ़ो
(क ख ल स इ – ि अ आ – ा न म र)

कल कलम कलर कलमा कला
कई कइन ककना कमाल कमानी
कमी कनक कनन कन कनारा
कनारी कनसार कनका कनी कर
करक कलकल कलन कलवार कलाकार
कलिका कसार कसर कसीस कसना

AP Board 6th Class Hindi Solutions Chapter 2 तितली


खई खखरा खनक खन खनिक
खनी खर खरक खरकना खरखरा
खरका खरल खरली खरा खरस
खराई खरी खलना खलखल खलाई
खलान खली खलासी खसखस खसकना
खाना खाम खारा खिलखिल खिलना


लकीर लकरी लकार लखलखा लखन
लखी लिखन लनी लरका लरकाना
ललक ललन ललरी ललना लाला
लाल लरम ललाई लसम ललनिका
लसना लसीला लसिका लसा लसलसाना
लाइ लाइक लाई लाइन लीख


सई सइ सक सकना सकरना
सकर सकल सकाम सख सकसकाना
सखा सखी सखरी सखर सनसन
सन सनसनी सनई सनक सनकना
सनना सनमान सनिकार सनि सम
समअ समकर समकाल समरा समल


इकइस इक इकराम इकरारी इकार
इन इनाम इकली इमाम इमारत
इनसान इरा इराक़ इल इलाका
इलिका इस इसरार इसलामी इलाम
इला इखलास इकसर इकरार इकाई


ईख ईखना ईकार ईमा ईमान
ईरानी ईसन ईसाई ईसान ईसार

ि
अनिल अनिमा अनिमक अनिस अमिख
अमिली अरि अलि अलिक अखिला
अखिल अनिआई अनिलसख अमिख
आसिक आकिल आख़िर आख़िरी आमिर
आमिल आरि आसिख इटिका किलना
किलकी किलकिला किसान किसी किसका

AP Board 6th Class Hindi Solutions Chapter 2 तितली


अखीरी अनी अनीक अनीकिनी अमी
अमीकर अमीन अमीर अमीरी अरी
अली अलीक अलीकी अलीन अख़ीर
अखीरी अनीस असीर असीम असीरी
असील असीस आमीन आमी आरी
आसीन आसीस कीला कीर कील

वर्ग पहेली बनाओ।
1.
AP Board 6th Class Hindi Solutions Chapter 2 तितली 14
उतर:
कमाल, लकीर, रख, खरस, सखा, खाई, ईख, खनक, कनक, कलम

2.
AP Board 6th Class Hindi Solutions Chapter 2 तितली 15
उतर:
खरक, कसीस, सखी, खीर, रस, समल, लसिका, काली, लीख

नीचे लिखे शब्दों में नाम (संज्ञा) वाले शब्दों रेखांकित कीजिए।

ईखं पीना इमली उड़ना कीला आना सिर

तितली लड़का माला मिलना कमरा लिखना पढ़ना

लिखिए

नीचे लिखे शब्दों को आ – ा या इ- ि, ई – ी की मात्रा से जोड़कर लिखो।
1. माल ……
2. म ….. न
3. इमल ……
4. कमर ……
5. …… मलन
उतर:
1. माला
2. मीन
3. इमली
4. कमरा
5. मिलन

AP Board 6th Class Hindi Solutions Chapter 2 तितली

चित्र देखकर दिए गए नाम (संज्ञा) से खाली स्थान भरिए।
(किसान कमल नीम ईख मछली/मीना)
AP Board 6th Class Hindi Solutions Chapter 2 तितली 16

शब्द को चित्र से जोड़ी बनाइए।
AP Board 6th Class Hindi Solutions Chapter 2 तितली 17

वर्णों को जोडकर शब्द लिखिए।

1. ि + क + स + ा + न = किसान
2. ि + स + र = सिर
3. क + ी + ल + ा = कीला
4. ि + म + ल + न = मिलन
5. स + ी + ख = सीख

चित्र पहचानकर सही शब्द पर गोला ‘O’ लगाओ।
AP Board 6th Class Hindi Solutions Chapter 2 तितली 18

चित्र देखकर खाली जगह भरिए।
AP Board 6th Class Hindi Solutions Chapter 2 तितली 19

दिए गए वर्ण को सही स्थान में लिखिए।
म ल सा र ख
AP Board 6th Class Hindi Solutions Chapter 2 तितली 20

नीचे लिखे अक्षरों में आ – ा तथा इ- ि, ई- ी मात्रा जोड़कर लिखो और पढ़ो।
AP Board 6th Class Hindi Solutions Chapter 2 तितली 21

संकेत के अनुसार लिखिए।
AP Board 6th Class Hindi Solutions Chapter 2 तितली 22
उतर:
1. लकार
2. ललाई
3. लकीर
4. लखन
5. ललन
6. लड़का

इन्हें जोड़कर नए शब्द बनाओ।
AP Board 6th Class Hindi Solutions Chapter 2 तितली 23
उतर:
AP Board 6th Class Hindi Solutions Chapter 2 तितली 24

निम्न लिखित प्रश्नों के उत्तर विकल्पों में से चुनकर लिखिए।

1. जो पानी में रहता है
A) मीन
B) बैल
C) ईख
D) किसान
उतर:
A) मीन

2. दीवार में मारने / टोकने के काम में आता है
A) किला
B) कीला
C) सिर
D) मिला
उतर:
B) कीला

AP Board 6th Class Hindi Solutions Chapter 2 तितली

3. जिसमें रह नहीं सकते
A) किला
B) कमरा
C) मकान
D) कीला
उतर:
D) कीला

4. जिसे पीते नहीं है
A) नीर
B) रस
C) समीर
D) सलील
उतर:
C) समीर

5. जिसमें ‘ख’ नहीं है, उस शब्द को पहचानो।
A) लिखना
B) सिखाना
C) खिलाना
D) मिलाना
उतर:
D) मिलाना

सही अक्षरों से रिक्त स्थान भरिये।
AP Board 6th Class Hindi Solutions Chapter 2 तितली 25

गोले में दिए गए वर्ण को शब्दों से जोड़कर लिखिए।
AP Board 6th Class Hindi Solutions Chapter 2 तितली 26

भाषा की बात

पर्यायवाची शब्द

गगन – आसमान, आकाश, नभ
फूल – पुष्प, सुमन, कुसुम
रस – शहद, मकरंद, मधु
अब – अभी, आज, इस वक्त

AP Board 6th Class Hindi Solutions Chapter 2 तितली

वचन बदलिए।

तितली – तितलियाँ
किला – किले
नाला – नीले
माला – मालाएँ
पीला – पीले
कीला – कीले

इन्हें पढ़िए।
AP Board 6th Class Hindi Solutions Chapter 2 तितली 27

शब्द पढ़िए और सुंदर अक्षरों में लिखिए।
AP Board 6th Class Hindi Solutions Chapter 2 तितली 28

क्या मैं ये कर सकता हूँ?हाँ (✓)नहीं (✗)
1. गीत गा सकता हूँ। चित्र के बारे में बातचीत कर सकता हूँ।
2. क, ख, ल, स, इ, ई’ अक्षरों से बने शब्द पढ़ सकता हूँ और लिख सकता हूँ।
3. सूचना के अनुसार चित्र में रंग भर सकता हूँ।

AP Board 8th Class Telugu Solutions ఉపవాచకం Chapter 6 స్ఫూర్తి ప్రదాతలు

AP State Syllabus AP Board 8th Class Telugu Textbook Solutions ఉపవాచకం Chapter 6 స్ఫూర్తి ప్రదాతలు Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Telugu Solutions ఉపవాచకం 6th Lesson స్ఫూర్తి ప్రదాతలు

8th Class Telugu ఉపవాచకం 6th Lesson స్ఫూర్తి ప్రదాతలు Textbook Questions and Answers

I. అవగాహన – ప్రతిస్పందన

కింది పరిచిత గద్యాలను చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

1. నెల్లూరు జిల్లా సంగం మండలంలో గాంధీ జనసంఘం ఒక మారుమూల గిరిజన గ్రామం. యానాదులు, ఎరుకల సంక్షేమం కోసం అహర్నిశలూ కృషి చేసిన పద్మశ్రీ వెన్నెలకంటి రాఘవయ్యగారు గిరిజనులకోసం నిర్మించిన | గ్రామం ఇది. రెక్కాడితేగాని డొక్కాడని వీరు ఊరిపక్కనే ఉన్న కాలువలో చేపలు పట్టి అమ్ముకుంటూ, వ్యవసాయం, కూలిపనులు చేసుకుంటూ జీవనం సాగిస్తారు. ఆ కుగ్రామంలో మల్లి మస్తానయ్య కుటుంబానికి ఒక ప్రత్యేకత ఉంది. వాళ్ళ గురించి గ్రామంలోనే కాదు, చుట్టుపక్కల ఊళ్లలో కూడా చెప్పుకుంటారు. కారణం ఏమిటంటే పూటగడవడం కూడా కష్టంగా ఉండే ఆ కుటుంబంలోంచి ఆడపిల్లతో సహా నలుగుర్నీ బడికి పంపి చదివిస్తుండడమే. మస్తానయ్య కాస్త అక్షరజ్ఞానం ఉన్నవాడు. చదువు విలువ తెలిసినవాడు. ఉన్న కొద్దిపాటి పొలంలో వ్యవసాయం చేసేవాడు. ఇంట్లో తిండికి, బట్టకు లేకపోయినా పిల్లల పుస్తకాలకు మాత్రం కొరత రాకూడదనుకునేవాడు. అలాంటి నిరుపేద కుటుంబంలో 1974 సెప్టెంబరు 3వ తేదీన మస్తాన్ బాబు జన్మించాడు.
ప్రశ్నలు :
1. గాంధీ జనసంఘం ఏ జిల్లాలోని ఏ మండలంలో ఉంది?
జవాబు:
గాంధీ జనసంఘం నెల్లూరు జిల్లా సంగం మండలంలో ఉంది.

2. గాంధీ జనసంఘం గిరిజన గ్రామాన్ని ఎవరు నిర్మించారు?
జవాబు:
గాంధీ జనసంఘం గిరిజన గ్రామాన్ని వెన్నెలకంటి రాఘవయ్య నిర్మించాడు.

3. కాస్త అక్షరజ్ఞానం కలవాడు ఎవరు?
జవాబు:
కాస్త అక్షరజ్ఞానం కలవాడు మస్తానయ్య.

4. మస్తాన్ బాబు ఏ తేదీన జన్మించాడు?
జవాబు:
మస్తాన్ బాబు 3.9. 1974వ తేదీన జన్మించాడు.

AP Board 8th Class Telugu Solutions ఉపవాచకం Chapter 6 స్ఫూర్తి ప్రదాతలు

2. ఒకరోజు స్నేహితులతో కలిసి గుట్టలు ఎక్కడానికి వెళ్ళాడు. అదే అతడి పర్వతారోహణకు బీజం పడినరోజు. రాళ్ళు, ముళ్ళు దాటుకుంటూ కొండనెక్కడం అతనికి తెలియని ఆనందాన్నిచ్చింది. స్నేహితులంతా వంటచెరకు సేకరిస్తుంటే పొదల మధ్య కాలిబాట చేసుకుంటూ ముందుకు వెళ్ళసాగాడు. చేతిలో ఉన్న కత్తితో నాగజెముడు పొదలు నరుకుతుంటే ఆ చెట్లకుండే తెల్లని పాలు చింది కళ్ళలో పడ్డాయి. అంతే కళ్ళు మండిపోతుంటే ఏడుస్తూ బాధ తట్టుకోలేక కిందపడి దొర్లసాగాడు. ఇంతలో స్నేహితులు వచ్చారు. అందరూ కలిసి వైద్యశాలకు తీసుకుపోయారు. ఈ వార్త తండ్రికి చేరింది. కుటుంబ సభ్యులంతా హుటాహుటిన ఆసుపత్రికి చేరారు. డాక్టరు మందులిచ్చి | భయపడాల్సిందేమీ లేదని చెప్పి ఇంటికి పంపాడు.

ప్రశ్నలు:
1. మస్తాన్ గుట్టలు ఎక్కడానికి ఎవరితో వెళ్ళాడు?
జవాబు:
మస్తాన్ గుట్టలు ఎక్కడానికి స్నేహితులతో వెళ్ళాడు.

2. స్నేహితులందరూ మస్తాన్ ను ఎక్కడికి తీసుకొని వెళ్ళారు?
జవాబు:
స్నేహితులందరు మస్తాన్ ను వైద్యశాలకు తీసుకొని వెళ్ళారు.

3. ఏ పొదలను నరుకుతుంటే తెల్లని పాలు చిందాయి?
జవాబు:
నాగజెముడు పొదలను నరుకుతుంటే తెల్లని పాలు చిందాయి.

4. హూటాహుటిన ఆసుపత్రికి చేరుకున్నది ఎవరు?
జవాబు:
హుటాహుటిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరుకున్నారు.

3. 1962వ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ నుండి ఐ.ఎ.యస్.కు ఎంపికయిన నాదెళ్ళ యుగంధర్ నాయుడిది అనంతపురం జిల్లా, ఎల్లనూరు మండలం, బుక్కాపురం గ్రామం. వీరి శ్రీమతి ప్రభావతి. ఈ దంపతులకు 1967లో సత్య నాదెళ్ళ జన్మించారు. కలెక్టరుగా, ప్రధానమంత్రి నేతృత్వంలోని కేంద్ర ప్రణాళికాసంఘ సభ్యునిగా, ప్రధానమంత్రి కార్యదర్శిగా పనిచేసిన యుగంధర్ మంచి అధికారిగా మన్ననలు అందుకున్నారు. విద్యావంతుల కుటుంబంలో పుట్టిన సత్య బాల్యం నుంచే తెలివితేటలు ప్రదర్శించేవాడు. తండ్రికున్న కార్యదీక్షా లక్షణాల్ని పుణికిపుచ్చుకొని పెరిగాడు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ విద్యార్థిగా అందరితో కలవిడిగా ఉండడం, అందర్నీ కలుపుకొనిపోవడం, నిజాయితీగా వ్యవహరించడం, ఆత్మవిశ్వాసంతో అడుగులు వేయటం, అవసరాల్లో ఉన్నవారిని ఆదరించటం, చేయూతనివ్వడం లాంటి సర్వోన్నత లక్షణాలను అలవరుచుకున్నాడు. సత్యకు క్రికెట్ అంటే ఎంతో మక్కువ. క్రికెట్ జట్టులో సభ్యుడిగా, తన ప్రతిభను నిరూపించుకొని కెప్టెన్ గా కొనసాగాడు. క్రికెట్ బృందాన్ని సమన్వయపరిచే క్రమంలోనే నాయకత్వ లక్షణాలు నేర్చుకున్నానని ఆటలు ఆడటం ద్వారా మాత్రమే ఒత్తిడిని అధిగమించడం, విజయం కోసం పోరాడడం వంటి గుణాలు అలవడతాయనీ తాను నమ్ముతానని ఒక ఇంటర్వ్యూలో సత్య నాదెళ్ళ చెప్పారు. పాఠశాల విద్య పూర్తయిన తరువాత మణిపాల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చదివి 1988లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ లో బి.ఇ డిగ్రీ పొందారు. ఆ తరువాత అమెరికాలోని విస్కాన్సిన్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్సులో మాస్టర్స్ డిగ్రీ, షికాగో యూనివర్సిటీ నుంచి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో మాస్టర్ డిగ్రీ పొందారు.
ప్రశ్నలు :
1. సత్య నాదెళ్ళ ఏ జిల్లాలో జన్మించాడు?
జవాబు:
సత్య నాదేళ్ళ అనంతపురంలో జన్మించాడు.

2. సత్య నాదెళ్ళ ఏ సంవత్సరంలో జన్మించాడు?
జవాబు:
సత్య నాదేళ్ళ 1967లో జన్మించాడు.

3. సత్య నాదెళ్ళకు ఏ ఆట అంటే ఇష్టం?
జవాబు:
సత్య నాదేళ్ళకు క్రికెట్ అంటే చాలా ఇష్టం.

4. షికాగో యూనివర్సిటీ నుండి ఏ డిగ్రీ పొందాడు?
జవాబు:
చికాగో యూనివర్సిటీ నుండి బిజినెస్ అడ్మిని స్టేషన్లో మాస్టర్ డిగ్రీ పొందారు.

AP Board 8th Class Telugu Solutions ఉపవాచకం Chapter 6 స్ఫూర్తి ప్రదాతలు

4. మైక్రోసాఫ్ట్ ముందు అపార అవకాశాలున్నాయని, వాటిని అందిపుచ్చుకునేందుకు మరింత వేగంగా స్పందించటంతోపాటు మరింత కష్టపడవలసి ఉందని ఈ సందర్భంగా ‘సత్య’ వ్యాఖ్యానించాడు. టెక్నాలజీ ప్రపంచాన్నే మార్చేసిన అరుదైన సంస్థలలో ఒకటైన మైక్రోసాఫ్ట్ కి సి.ఇ.వో బాధ్యతలు చేపట్టడం తనకెంతో గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. ఏడాదికి 112 కోట్ల వేతనం తీసుకునే ఉద్యోగిగా తమ సంస్థలో నవకల్పనలకే పెద్దపీట వేస్తామని చెప్పారు. సత్య నాదెళ్ళ జీవితభాగస్వామి శ్రీమతి అనుపమ. వీరికి ఇద్దరమ్మాయిలు, ఒక అబ్బాయి. కుమారుడికి బుద్ధిమాంద్యం ఉండటం వల్ల అలాంటి పిల్లల కొరకు హైదరాబాద్ లో ఒక పాఠశాలను స్థాపించారు. ‘నేను నిర్మించటాన్ని, నిరంతరం నేర్చుకోవడాన్ని ఇష్టపడతాను. పట్టుదల, కార్యదక్షత, నిజాయితి, నాయకత్వం, సేవాభావం అనే లక్షణాలను సాధించినపుడే ఎంతటి క్లిష్టమైన విజయశిఖరాలనైనా అధిరోహించగలుగుతాం” అంటూ ఆ చరిత్రని నిరూపించిన సత్య నాదెళ్ళ నేటి యువతరానికి చక్కని రోల్ మోడల్.
ప్రశ్నలు :
1. సత్య నాదెళ్ళ జీవిత భాగస్వామి పేరు ఏది?
జవాబు:
సత్య నాదేళ్ళ జీవిత భాగస్వామి పేరు శ్రీమతి అనుపమ.

2. సత్య నాదెళ్ళ ఎవరి కోసం హైదరాబాద్ లో పాఠశాలను ప్రారంభించాడు?
జవాబు:
సత్య నాదేళ్ళ బుద్ధిమాంద్యం గల పిల్లల కోసం ఒక పాఠశాలను స్థాపించాడు.

3. సత్య నాదెళ్ళకు ఏడాదికి జీతం ఎంత?
జవాబు:
సత్య నాదేళ్ళకు ఏడాదికి జీతం 112 కోట్లు.

4. టెక్నాలజీ ప్రపంచాన్నే మార్చివేసిన అరుదైన సంస్థలలో అగ్రగామి సంస్థ ఏది?
జవాబు:
టెక్నాలజీ ప్రపంచాన్నే మార్చివేసిన అరుదైన సంస్థలలో అగ్రగామి సంస్థ మైక్రోసాఫ్ట్.

5. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం, తుమ్మపూడి గ్రామంలో కీ.శే. సూర్యదేవర రామదేవరాయలు, వెంకాయమ్మ దంపతులకు 1914వ సంవత్సరం జూలై నెల 3వ తేదీన సంజీవ్ దేవ్ జన్మించాడు. నాలుగేళ్ళ వయస్సులోనే అతని తల్లి మరణించింది. కొంతకాలం వారి చిన్నాన్న సూర్యదేవర వెంకటకృష్ణయ్యగారివద్ద పెరిగాడు. ఆ తరువాత కృష్ణాజిల్లాలోని కోనాయపాలెంలో అమ్మమ్మ సంరక్షణలో మేనమామ ఇంట పెరిగాడు. విద్యాభ్యాసమంతా ఇంటి దగ్గరే కొనసాగింది. కొత్త విషయాలను తెలుసుకోవడానికి ఎంతో ఆసక్తిని చూపేవాడు. తెలుగు, హిందీ, ఇంగ్లీషు భాషలలో చక్కని ప్రావీణ్యం సంపాదించాడు. అయితే 13 సంవత్సరాల వయస్సు వచ్చేటప్పటికి తనను గారాబంగా పెంచుతున్న ” అమ్మమ్మ కూడా చనిపోయింది. మరికొంతకాలానికి తాను అమితంగా ప్రేమించే తన గారాల చెల్లి కూడా చనిపోవడంతో జీవితంలో విషాదం తప్ప మరేమీ మిగలలేదని తల్లడిల్లిపోయాడు. అక్కున చేర్చుకుని అదరించేవారు లేక ఒంటరితనాన్ని భరించలేక 18 సంవత్సరాల వయస్సులో హిమాలయాలకు వెళ్ళిపోయాడు.
ప్రశ్నలు:
1. సంజీవ్ దేవ్ ఎక్కడ జన్మించాడు?
జవాబు:
సంజీవ్ దేవ్ గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం తుమ్మకూరు గ్రామంలో జన్మించాడు.

2. సంజీవ్ తల్లిదండ్రుల పేర్లు ఏమి?
జవాబు:
సంజీవ్ తల్లిదండ్రుల పేర్లు సూర్యదేవర రామ దేవరాయలు, వెంకాయమ్మ.

3. సంజీవ్ కు ఏ భాషల్లో ప్రావీణ్యం ఉంది?
జవాబు:
సంజీవ్ కు తెలుగు, హిందీ, ఇంగ్లీషు భాషల్లో ప్రావీణ్యం ఉంది.

4. సంజీవ్ ఎందుకు హిమాలయాలకు వెళ్ళాడు?
జవాబు:
సంజీవ్ ఒంటరితనాన్ని భరించలేక తన 18వ సంవత్సరంలో హిమాలయాలకు వెళ్ళాడు.

AP Board 8th Class Telugu Solutions ఉపవాచకం Chapter 6 స్ఫూర్తి ప్రదాతలు

6. అనేక భాషలను సొంతంగా నేర్చుకుని బహుభాషావేత్తగా రూపొందినట్లుగానే చిత్రకళను కూడా సొంతంగా అభ్యసించి చిత్రకారుడయ్యాడు. రవీంద్రనాథ్ ఠాగూర్ లాగా ముందు చిత్రకళా విమర్శకుడై యాభై సంవత్సరాల వయస్సు దాటాక కుంచె చేతపట్టి అద్భుతమైన వర్ణచిత్రాలను రూపొందించాడు. సాహిత్యాన్ని, చిత్రలేఖనాన్ని, సంగీతాన్ని, శిల్పాన్ని గురించి విడివిడిగా వివరించడమేకాక లలితకళలన్నింటిలోను అంతర్లీనంగా ఉన్న సంబంధ బాంధవ్యాలను, తాత్వికతలను తులనాత్మకంగా విశ్లేషించారు. ఆయన ప్రతిభను గుర్తించి ఆంధ్ర విశ్వవిద్యాలయం డి.లిట్ తో సత్కరించింది. కళలు, సాహిత్యం , సమాజ అభ్యున్నతికి దోహదపడేవిగా ఉండాలని కాంక్షించి జీవితాంతం దానికోసమే కృషిచేసిన కళాతత్వవేత్త సంజీవ్ దేవ్ 25-8-1999న ఇహలోక యాత్రను ముగించాడు. చిన్నతనంలోనే ఎన్నో కష్టాలను ఎదుర్కొని స్వయంకృషితో అద్భుత ప్రతిభను ప్రదర్శించిన సంజీవ్ దేవ్ జీవనవిధానం మనందరికీ ఆనంద దాయకం
ప్రశ్నలు :
1. సంజీవ్ చిత్రకళను ఎలా అభ్యసించాడు?
జవాబు:
సంజీవ్ చిత్రకళను సొంతంగా అభ్యసించి చిత్రకళా కారుడయ్యాడు.

2. దేనిని చేతబట్టి అద్భుతమైన వర్ణచిత్రాలను రూపొందించాడు?
జవాబు:
కుంచె చేతబట్టి అద్భుతమైన వర్ణచిత్రాలను రూపొందించాడు.

3. సంజీవ్ ను సత్కరించిన విశ్వవిద్యాలయం ఏది?
జవాబు:
సంజీవ్ ను సత్కరించిన విశ్వవిద్యాలయం ఆంధ్ర విశ్వవిద్యాలయం.

4. సంజీవ్ ఏ తేదీన మరణించాడు?
జవాబు:
సంజీవ్ 25-8-1999న మరణించాడు.

7. ఈ కింది అపరిచిత గద్యాన్ని చదివి ఇవ్వబడిన ప్రశ్నలకు జవాబులు రాయండి.

సీతారామరాజు 1897లో పశ్చిమగోదావరి జిల్లా మోగల్లులో క్షత్రియ కుటుంబంలో జన్మించారు. గుర్రపుస్వారీ, మూలికావైద్యం, జ్యోతిష్యంలో పట్టు సంపాదించాడు. ఆంగ్లేయుల విధానాలకు వ్యతిరేకంగా విశాఖ ఏజెన్సీ ప్రాంతాలలో 1922 నుంచి 1924 మే వరకు తెగువతో పోరాడిన వీరుడు సీతారామరాజు. అన్నవరం, శంఖవరం, రంపచోడవరం పోలీస్ రాణాలపై దాడిచేసి ఆంగ్లేయులకు చెమటలు పట్టించాడు. ఈ మన్యం వీరుని కుతంత్రంతో చుట్టుముట్టి రూథర్‌ఫోర్డ్ నేతృత్వంలోని సేనలు కాల్చి చంపాయి.
ప్రశ్నలు :
1. సీతారామరాజు జన్మస్థలం ఏది?
జవాబు:
పశ్చిమ గోదావరి జిల్లా ‘మోగల్లు’.

2. సీతారామరాజుకు ఏ విషయాలలో పట్టు ఉంది?
జవాబు:
గుర్రపుస్వారీ, మూలికా వైద్యం, జ్యోతిష్యంలో

3. ఆంగ్లేయులకు ఏ కారణంతో ఆగ్రహం కలిగింది?
జవాబు:
వీరి విధానాలకు వ్యతిరేకంగా పోరాడి, వారి పోలీస్ ఠాణాలపై దాడి చేయడం వల్ల.

4. పై పేరా ఆధారంగా ఒక ప్రశ్న తయారుచేయండి.
జవాబు:
సీతారామరాజును ఎవరి నేతృత్వంలోని సేనలు కాల్చాయి?

8. కింది సంభాషణ చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.

పద్మావతి : మిత్రులారా ! బాగున్నారా !
పూజిత : బాగున్నాము. మీ పాఠశాలలో జూలై 4న ఏదో ఉత్సవం జరిపినట్లున్నారు. ఏమిటది?
పద్మావతి : అవును. విప్లవజ్యోతి అల్లూరి సీతారామరాజు జయంతి నిర్వహించాము.
పూజిత : మీ పాఠశాలలో ఆయన జయంతిని ఎలా నిర్వహించారు?
పద్మావతి : ఆ రోజు ఉదయం పాఠశాల ప్రార్థనా సమావేశంలో అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించాం.
హరిత : మా ప్రధానోపాధ్యాయుల వారు అల్లూరి వారిని గురించి చెప్పి రంప విప్లవాన్ని వారు నడిపిన తీరు, ధైర్యాన్ని గురించి వివరించారు.
పూజిత : అలాగా ! ఆ మహావీరుని గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే ఏం చెయ్యాలి?
పద్మావతి : పాఠశాల గ్రంథాలయాలలో ఆ వీరుని జీవితచరిత్ర గురించి శ్రీ ఎం.వి.ఆర్. శాస్త్రి, శ్రీ ఎం. చలపతిరావు వంటివారు రాసిన పుస్తకాలున్నాయి చదువు.
పూజిత : అలాగే !
హరిత : నా దగ్గర పుస్తకం ఉంది ఇమ్మంటారా?
పూజిత : ఇవ్వు. చదివి మళ్ళీ ఇచ్చేస్తాను. ఉంటాను.
ప్రశ్నలు :
1. పై సంభాషణలో ‘పుట్టిన రోజు’ అనే అర్థం వచ్చే పదం ఉంది. వెతికి రాయండి.
జవాబు:
జయంతి.

2. అల్లూరి సీతారామరాజు నడిపిన విప్లవోద్యమం ఏది?
జవాబు:
రంప విప్లవోద్యమం.

3. పై సంభాషణ ఎవరెవరి మధ్య జరిగింది?
జవాబు:
పద్మావతి, పూజిత, హరితల మధ్య సంభాషణ జరిగింది.

4. చనిపోయిన ప్రముఖుల పట్ల గౌరవం, అభిమానం ప్రకటిస్తూ మాట్లాడే మాటలను ఏమంటారు?
జవాబు:
నివాళులు అర్పించడం.

II వ్యక్తీకరణ – సృజనాత్మకత

క్రింది ప్రశ్నలకు జవాబులను రాయండి.

ప్రశ్న 1.
సాహసవీరుడు మస్తాన్ బాబు జీవితచరిత్ర నుండి మీరేమి నేర్చుకున్నారు?
జవాబు:
మన రాష్ట్రంలో ఎందరో సాహసవీరులు ఉన్నారు. వారిలో మస్తాన్‌బాబు ప్రసిద్ధుడు. ఈయన జీవిత చరిత్ర అందరికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. మస్తాన్‌బాబు నెల్లూరు జిల్లాలోని ఒక కుగ్రామంలో 3-9-1974వ తేదీన జన్మించారు. వీరిది నిరుపేద కుటుంబం. తండ్రి అక్షర జ్ఞానం కలవాడు. చదువు విలువ తెలిసినవాడు. అందువల్లనే మస్తాన్ బాబు చదువుకోసం ఎంతో కష్టపడ్డారు.

మస్తాన్ బాబు మాత్రం చదువుపట్ల ఆసక్తి చూపేవాడు కాదు. తండ్రి మందలించినా వినిపించుకోలేదు. అల్లరిచిల్లరగా తిరిగేవాడు. తండ్రి ఆందోళన చెంది మస్తాన్ బాబును కోరుకొండ సైనిక స్కూలులో చేర్పించాడు. మస్తాన్ బాబు స్కూల్ లోని ఉదయ్ భాస్కర్ విగ్రహాన్ని తదేకంగా చూశాడు. ఉదయ్ భాస్కర్ ఆ పాఠశాల పూర్వ విద్యార్థి. ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన మహనీయుడు.

మస్తాన్ ఐ.ఐ.టిలో బి.టెక్ లో చేరాడు. తండ్రి ఎన్నో ఇబ్బందులు పడి కుమారుడిని చదివించాడు. చదువు పూర్తికాగానే సాఫ్ట్ వేర్ ఉద్యోగంలో చేరాడు. ఇంతలోనే తండ్రి మరణం మస్తాన్ ని బాగా కుంగదీసింది. లక్షలాది జీతాన్ని కూడా వదులుకొని తన లక్ష్యాన్ని చేరుకోవాలనుకున్నాడు. అందుకోసం గంధోతిలోయను చేరాడు. దాని కోసం కొత్త సాధన చేశాడు. శారీరకంగా శ్రమ చేశాడు. హిమాలయాల్లోని కాంచనగంగ కనుమలను చేరుకున్నాడు. శ్రమించి ఎవరెస్టు శిఖరంపై కాలుమోపాడు. జాతీయ పతాకాన్ని ఎగురవేశాడు. గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించాడు. నాలుగు శిఖరాలను దాటి తిరిగివస్తుండగా 600 కి.మీ. దిగువన మంచు తుపాను భయంకరంగా వచ్చింది. మస్తాన్ తలదాచుకున్న గుడారాన్ని కబళించి వేసింది. ఏ పర్వతాలను ప్రాణప్రదంగా భావించాడో ఆ పర్వాతాలలోనే తనువు చాలించాడు. దేశమంతా ఆ సాహసవీరునికి నివాళులను అర్పించింది.

ఈ విధంగా మస్తాన్ ఎన్నో కష్టాలను అనుభవించి చివరకు లక్ష్యం చేరుకున్నాడు. లక్షల రూపాయల ఉద్యోగాన్ని వదులుకున్నాడు. తాను కలలుకన్న లక్ష్యాన్ని చేరుకున్నాడు. వీరమరణం పొందాడు. ఆ మహనీయుని కార్యదక్షత, దృఢసంకల్పం ప్రతి విద్యార్థికి స్ఫూర్తిదాయకం కావాలి. తింటానికి తిండి లేకపోయినా, ఆర్థిక పరిస్థితులు బాగులేకపోయినా అందరితో కలిసిమెలిసి నవ్వుతూ ఉండడం మనం తప్పక నేర్చుకోవాలి.

AP Board 8th Class Telugu Solutions ఉపవాచకం Chapter 6 స్ఫూర్తి ప్రదాతలు

ప్రశ్న 2.
కార్యదక్షత, దృఢసంకల్పం మనకు మార్గదర్శనం చేస్తాయి. చర్చించండి.
జవాబు:
కార్యదక్షత, దృఢసంకల్పం మనకు మార్గదర్శనం చేస్తాయి. ఎందుకంటే ఒక పనిని సాధించాలంటే ఎన్నో అడ్డంకులు, ఇబ్బందులు ఎదురవుతాయి. అలాంటిది లక్ష్యం సాధించాలంటే ఎంతో శ్రమచేయవలసి ఉంటుంది. అన్ని పరిస్థితులు, సదుపాయాలు, అవకాశాలు సరిగ్గా ఉంటే లక్ష్యసాధన సులభం అవుతుంది. లక్ష్యం అనేది ఉన్నతంగా ఉంటే, దాన్ని సాధించడానికి ఎన్నో ఆటంకాలు, సమస్యలు ఎదురవుతాయి. వాటిని చాకచక్యంగా ఎదుర్కొని విజయాన్ని వరించాలి. కార్యదీక్ష, పట్టుదల ఉంటే ఎంతటి అసాధ్యాలను అయినా సుసాధ్యం చేయగలమని నమ్మాలి.

ఇలాంటి కార్యదక్షత, దృఢసంకల్పం గల వారిలో పర్వతారోహకుడు మస్తాన్‌వలి ప్రముఖుడు. కుటుంబ పరిస్థితులు బాగులేకపోయిన, ఆర్థిక పరిస్థితులు అడ్డంకులుగా నిలిచినా వాటిని లెక్కచేయలేదు. లక్షలాది రూపాయల ఉద్యోగాన్ని కూడా తృణప్రాయంగా భావించాడు. తాను కలలుగన్న పర్వతారోహణను చేయాలనుకున్నాడు. ఉద్యోగాన్ని వదులుకున్నాడు. శారీరకంగా కృషి చేశాడు. ఎన్నో ఇబ్బందులను పడి చివరకు లక్ష్యాన్ని చేరుకున్నాడు. అందరికి స్ఫూర్తి ప్రదాతగా నిలిచాడు.

ఆయన కార్యదీక్ష, దృఢసంకల్పం అందరికి ఆదర్శంగా నిలిచింది. లక్ష్యాన్ని సాధించి తిరుగుప్రయాణంలో తన ప్రాణాలను కోల్పోయాడు. తాను బాగా ప్రేమించిన శిఖరాలపైనే వీరమరణం పొందారు. మస్తాన్‌బాబు నుంచి విద్యార్థులందరు స్ఫూర్తి పొందాలి. కార్యదీక్షపై శ్రద్ధ వహించాలి. కష్టాలను అధిగమించే మనస్సును పెంపొందించుకోవాలి. అందరికి ఆదర్శంగా నిలవాలి. ఇదే మన ముందు తరాలకు అందించే గొప్ప కానుక.

ప్రశ్న 3.
సత్య నాదెళ్ళ వ్యాపారదిగ్గజంగా మారడానికి తోడ్పడిన అంశాలేమిటి?
జవాబు:
ఆంధ్రప్రదేశ్ లో ఎంతోమంది మేధావులు ఉన్నారు. వారు ప్రపంచంలోని వివిధ రంగాల్లో రాణిస్తున్నారు. తెలుగువారి మేధాసంపత్తిని దశదిశలా విస్తరింపజేశారు. వారిలో సత్య నాదెళ్ళ సుప్రసిద్ధులు. ఈయన వైఫల్యాలను ఎదుర్కొనడమేగాదు, వైఫల్యాల నుండి ఏమి నేర్చుకున్నామనేది అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు. ఉన్నత శిఖరాలకు చేరుకున్నాడు.

సత్య నాదెళ్ళ 1967లో అనంతపురంలో విద్యావంతుల కుటుంబంలో జన్మించాడు. అందువలనే చిన్నతనం నుండే అన్ని విషయాలలోనూ అసమాన ప్రతిభను కనబరిచేవాడు. తండ్రి నుండి కార్యదక్షను పుణికిపుచ్చుకున్నాడు. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయడం, అవసరాల్లో ఆదుకోవడం మొదలైన ఉత్తమ లక్షణాలు ఇతనిలో ఉన్నాయి. ఒత్తిడిని అధిగమించగలిగే నాయకత్వ లక్షణాలను పెంపొందించుకున్నాడు. దేశవిదేశాల్లో విద్యను పూర్తి చేశాడు. వ్యాపార రంగంలో మాస్టర్ డిగ్రీ పొందారు.

వీరి ప్రతిభను గుర్తించి ఎన్నో సంస్థలు ఉద్యోగంలో చేరమని ఆహ్వానించాయి. 1992లో మైక్రోసాఫ్ట్ వ్యాపార సేవల రంగంలో కీలకపాత్ర పోషించాడు. ఐదేళ్ళలో కంపెనీ వ్యాపారాన్ని 6 వేల కోట్ల నుండి 31 వేల కోట్లకు దాటించాడు. కొంత కాలం బిల్ గేట్సకు టెక్నాలజీ సలహాదారుగా ఉన్నాడు. ఆధునాతన సాఫ్ట్ వేర్ నిర్మాణంలో కీలకపాత్ర పోషించాడు. ప్రస్తుతం ఈయన కోట్లాది రూపాయల వ్యాపార సామ్రాజ్యానికి అధిపతి అయ్యాడు. అకుంఠితమైన సత్య నాదెళ్ళ కార్యదీక్ష అందరికి స్ఫూర్తిదాయకంగా ఉంటుంది.

ఈయనకు గల అత్యుత్తమ ఇంజనీరింగ్ నైపుణ్యాలు, వ్యాపార దృక్పథం, నిరంతర దీక్ష, నాయకత్వ ధోరణి ఇవన్నీ అందరినీ ఆకర్షించాయి. ఏడాదికి 112 కోట్ల వేతనం తీసుకునే ఉద్యోగిగా ఎంతో గర్వించారు. ఈయన సేవల వల్ల సాఫ్ట్ వేర్ ఎంతో ఘనత సాధించింది. కరెంటు బిల్లు నుండి క్రయోజనిక్ రాకెట్ ఇంజన్ దాకా ప్రతిచోటా సాంకేతిక పరిజ్ఞానం విస్తరించింది. కంప్యూటర్ అక్షరాస్యత అవసరంగా మారిన కాలం ఇది. ఈయనకు గల పట్టుదల, కార్యదక్షత, నిజాయితి, నాయకత్వం, సేవాభావం అనే లక్షణాలే ఈయనకు విజయశిఖరాలు అధిరోహించేలా చేశాయి.

ప్రశ్న 4.
డా|| సంజీవ్ దేవ్ తమ రచనలు, చిత్రాల ద్వారా సమాజానికి ఏమి తెలియజేస్తున్నారని మీరు భావిస్తున్నారు?
జవాబు:
ప్రకృతే మనకు గురువు, దైవం, ఆప్తమిత్రుడు. మనకు ఎదురయ్యే సమస్యలన్నింటికీ ప్రకృతి నుండే పరిష్కారం లభిస్తుంది. ప్రకృతిని ప్రేమించగలిగితే ప్రజాజీవితం సాధ్యమవుతుందని విశ్వసించే వారిలో ముఖ్యుడు డా|| సంజీవ్ దేవ్. వీరు 3. 7.1914వ తేదిన గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం – తుమ్మకూరు గ్రామంలో జన్మించాడు. వీరు నూతన విషయాలను తెలుసుకోవడానికి ఆసక్తి చూపేవారు. తెలుగు, హిందీ, ఇంగ్లీషు భాషల్లో మంచి ప్రావీణ్యం సంపాదించారు.

18 సంవత్సరాల వయసులో హిమాలయాలకు వెళ్ళాడు. అక్కడ స్వామి పవిత్రానంద దగ్గర శిష్యరికం చేస్తూ పాశ్చాత్య తర్కశాస్త్రాన్ని అధ్యయనం చేశాడు. మానవ జీవితం గురించి, ప్రకృతి గురించి పరిశోధన చేశాడు.

డా|| సంజీవ్ దేవ్ ఈ ప్రయాణంలో ఎందరో ప్రముఖులను కలిశాడు. ఈయన గొప్ప ప్రకృతి ప్రేమికుడు కావడంతో కవిగానే కాకుండా చిత్రకళా విమర్శకునిగా కూడా పేరు పొందాడు. కొంతకాలం తర్వాత తన స్వగ్రామానికి తిరిగి వచ్చి సొంత ఊరిని మించిన స్వర్గం లేదని భావించాడు. తనకు సన్నిహితులైన చిత్రకారుడు ఎస్.వి. రామారావు, భావకవి కృష్ణశాస్త్రి, నవలారచయిత చలం, కథారచయిత బుచ్చిబాబు మొదలగువారితో కవిత్వ చర్చలు చేసేవారు.

ఈయన గొప్ప మానవతావాది. దేశవిదేశాల నుండి ఎంతోమంది భిన్న అంశాలపై ఆయనకు ఉత్తరాలు రాసేవారు. గొప్ప లేఖా రచయిత కావడంతో వారందరికీ ఓపికగా ప్రత్యుత్తరాలిస్తూ సందేహ నివృత్తి చేసేవారు. ఈయన మనం ఆనందంగా జీవించడంతోపాటు ఇతరులను కూడా సంతోషపెట్టడమే సర్వమతాలసారం అని ప్రకటించారు. ఈయన కవి, చిత్రకారుడు మాత్రమే కాదు గొప్ప మనోవిజ్ఞాన శాస్త్రవేత్త కూడా.

డా|| దేవ్ గారు ఎన్నో భాషలను నేర్చుకున్నారు. బహుభాషావేత్తగా, విమర్శకుడిగా గుర్తింపు పొందారు. కుంచె చేతబట్టి అద్భుతమైన వర్ణచిత్రాలను రూపొందించాడు. సాహిత్యాన్ని, చిత్రలేఖనాన్ని, సంగీతాన్ని, శిల్పాన్ని గురించి విడివిడిగా వివరించడమే కాకుండా లలితకళలన్నింటిలోను అంతర్లీనంగా ఉన్న సంబంధ బాంధవ్యాలను తాత్వికతలను తులనాత్మకంగా విశ్లేషించు వీరు 25.8.1999న పరమపదించారు. వీరు స్వయంకృషితో, ఉన్నత శిఖరాలను అధిరోహించారు. వీరి జీవనవిధానం అందరికి ఆదర్శంగా నిలుస్తుంది. ఈ మహామనీషి మరణించినా వీరి రచనలు, చిత్రాలు, ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోతాయి.

AP Board 8th Class Telugu Solutions ఉపవాచకం Chapter 6 స్ఫూర్తి ప్రదాతలు

ప్రశ్న 5.
మన జీవితానికి స్ఫూర్తినిచ్చేవారు చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో ఒకరి గురించి రాయండి.
జవాబు:
మన జీవితానికి స్ఫూర్తినిచ్చేవారు ఎందరో ఉన్నారు. అలనాటి రాముడు మొదలుకొని గాంధీ, అంబేద్కర్ వంటి ప్రముఖులే కాక వెలుగులోకి రాని మహనీయులు ఎందరో ఉన్నారు. ఎందరు ఉన్నా నా తొలి ప్రాధాన్యం మాత్రం అమ్మానాన్నలే. వారే లేకపోతే మనం ఎక్కడున్నాం, ఎవరో ఒకరి పేరు పెట్టి ఏదో ఒకటి రాయవచ్చు. కానీ అమ్మనాన్నల గొప్పదనాన్ని గుర్తించి కూడా వేరొకర్ని కీర్తించడం సబబేనా ? కాదు కదా ! అందుకే మరి మా అమ్మా నాన్నల గురించి చెబితే స్వార్థం అంటారుగా. అందుకే వారిని మనసులో తలుచుకొంటూ వారి స్థానాన్ని, వారి ప్రేమను మీ ముందుంచుతాను.

ప్రపంచానికి నిన్ను పరిచయం చేసేది అమ్మ అయితే, ప్రపంచాన్ని నీకు పరిచయం చేస్తాడు నాన్న. కన్ను మూసే వరకు ప్రేమించేది అమ్మ. కళ్ళల్లో ప్రేమ కనబడకుండా ప్రేమించేది నాన్న. జీవితం అమ్మది. జీవనం నాన్నది. ఆకలి తెలీయకుండా అమ్మ చూస్తుంది. ఆకలి విలువ తెలిసేలా నాన్న చేస్తాడు. అమ్మ భద్రత. నాన్న బాధ్యత. పడిపోకుండా పట్టుకోవాలని అమ్మ చూస్తుంది. పడినా పైకి లేవాలని నాన్న చెప్తాడు. నడక అమ్మది. నడవడిక నాన్నది. తన అనుభవాలను విద్యలా అమ్మ బోధిస్తే, నీ అనుభవమే విద్య అని తెలిసేలా చేస్తాడు నాన్న. అమ్మ ఆలోచనైతే, నాన్న ఆచరణ.

అమ్మ ప్రేమను నీ పసిప్రాయం నుండే తెలుసుకోగలవు. కానీ నాన్న ప్రేమను నువ్వు నాన్నవు అయ్యాకే తెలుసుకోగలవు మిత్రమా !

AP Board 6th Class Hindi Solutions सन्नद्धता कार्यक्रम Chapter 8 दोहे

AP State Syllabus AP Board 6th Class Hindi Textbook Solutions सन्नद्धता कार्यक्रम Chapter 8 दोहे Textbook Questions and Answers.

AP State Syllabus 6th Class Hindi Solutions सन्नद्धता कार्यक्रम Chapter 8 दोहे

6th Class Hindi सन्नद्धता कार्यक्रम Chapter 8 दोहे Textbook Questions and Answers

कबीरदास
AP Board 6th Class Hindi Solutions सन्नद्धता कार्यक्रम Chapter 8 दोहे 1
साधु ऐसा चाहिए, जैसा सूप सुभाय।
सार – सार को गहि रहै, थोथा देई उड़ाया।

शब्दार्थः
साधु = సాధువు, saint, sage
ऐसा = ఇలా, ఈ విధంగా, thus, so
सूप = జల్లెడి, చేట, sieve
सुभाय = స్వభావము, nature
सार = సారం, essence
थोथा = నిస్సారం, worthless

भावार्थ :
कबीरदास जी कहते हैं कि हमें अपने जीवन में ऐसे सज्जन की आवश्यकता होती है, जिसका स्वभाव अनाज को साफ करने वाले सूप जैसा हो। जिस प्रकार सूप अनाज को साफ करते हुए दानों को अलग रख लेता है तथा कचरे को उड़ा देता है। ठीक उसी प्रकार सज्जन पुरुष हमारे साथ होता तो वह हमारे सद्गुणों को तराशते हुए हमें सार्थक बना देगा तथा हमारे अवगुणों को अनाज के कचरे की भाँति समाप्त कर देगा।

तुलसीदास
AP Board 6th Class Hindi Solutions सन्नद्धता कार्यक्रम Chapter 8 दोहे 2
तुलसी मीठे वचन ते, सुख उपजत चहुँ ओर।
वसीकरन एक मंत्र है, परिहरु वचन कठोर ॥

शब्दार्थः
मीठा = తీయని, sweety
वचन = వచనములు, మాటలు, words
सुख = సుఖము, joy fulness
उपजना = ఉత్పన్నమగుట, produce
चहुँ = నాలుగు, four
ओर = దిక్కు, side
वसीकरण = వసీకారణం, mesmerism
मंत्र = మంత్రం, mantra spell
परिहरु = వదిలేయుట, to left
कठोर = కఠినమైన, harsh, rigid

भावार्थ :
तुलसीदास जी कहते हैं कि मीठे वचन सब ओर सुख फैलाते हैं। किसी को भी वश में करने का यह एक मंत्र होता है, इसलिए मानव कठोर वचन छोड़कर मीठा बोलने का प्रयास करें।

मौखिक प्रश्न:

प्रश्न 1.
साधु का स्वभाव कैसे रहना चाहिए?
उत्तर:
साधु का स्वभाव सूप के जैसा रहना चाहिए।

प्रश्न 2.
क्या आपके घर में सूप है?
उत्तर:
हाँ, हमारे घर में सूप है।

AP Board 6th Class Hindi Solutions सन्नद्धता कार्यक्रम Chapter 8 दोहे

प्रश्न 3.
सूप से आपके घर में कौन से काम करते हैं?
उत्तर:
सूप से चावल, दाल, धान आदि फटकने का काम करते हैं।

प्रश्न 4.
अच्छे मित्र हमारे साथ होंगे तो क्या होगा?
उत्तर:
अच्छे मित्र हमारे साथ होने पर हम अच्छी बाते, व्यवहार सीखेंगे।

प्रश्न 5.
सच्चे दोस्त कैसे होते हैं?
उत्तर:
सच्चे दोस्त हमारी मुसीबतों में हमारे साथ रहकर हमारा आत्मविश्वास बढ़ाते हैं।

प्रश्न 6.
आपको आदर्शवान बनने के लिए क्या करना चाहिए?
उत्तर:
हमें आदर्शवान व्यक्ति बनने के लिए महापुरुषों के नीति वचन और उनकी कहानियाँ, जीवनी पढ़नी चाहिए।

प्रश्न 7.
मीठे वचन से क्या होता है?
उत्तर:
मीठे वचनों से हमारे चारों ओर सुख उत्पन्न होता है।

प्रश्न 8.
आपको क्या त्याग करना चाहिए?
उत्तर:
हमें कठोर वचन त्याग देना चाहिए।

प्रश्न 9.
आप अपने दोस्तों से किस प्रकार बातचीत करते हैं?
उत्तर:
मैं अपने दोस्तों से मीठे वचन (स्नेहपूर्वक) बातचीत करता हूँ।

प्रश्न 10.
सब लोगों से मिलकर रहने से क्या होता है?
उत्तर:
सब लोगों से मिलकर रहने से चारों ओर सुख उत्पन्न होता है।

प्रश्न 11.
कंठोर वचन (बातें) करने से क्या होता है?
उत्तर:
कठोर वचन (बातें) करने से हमारे सच्चे मित्र हमें छोड़कर चले जाते हैं।

AP Board 6th Class Hindi Solutions सन्नद्धता कार्यक्रम Chapter 8 दोहे

प्रश्न 12.
दो कवियों के नाम बोलिए।
उत्तर:
कबीरदास, तुलसीदास।

प्रश्न 13.
हमें किनके संगत में रहना चाहिए?
उत्तर:
हमें सज्जनों के संगत में रहना चाहिए।

प्रश्न 14.
किसी का दिल दुखाना अच्छी बात है?
उत्तर:
नहीं, कभी भी किसी को दुख नहीं देना चाहिए।

प्रश्न 15.
नीति दोहों से हम क्या सीखते हैं?
उत्तर:
नीति दोहों से हम जीवन में सद्व्यवहार करना सीखते हैं।

AP Board 6th Class Hindi Solutions सन्नद्धता कार्यक्रम Chapter 8 दोहे

वर्णमाला चार्ट
AP Board 6th Class Hindi Solutions सन्नद्धता कार्यक्रम Chapter 8 दोहे 3

मौखिक अभ्यासः

1. इन्हें पहचानो।
AP Board 6th Class Hindi Solutions सन्नद्धता कार्यक्रम Chapter 8 दोहे 4

2. समरूपी शब्दों को जोड़िए। मीठा
AP Board 6th Class Hindi Solutions सन्नद्धता कार्यक्रम Chapter 8 दोहे 5
उत्तर:
AP Board 6th Class Hindi Solutions सन्नद्धता कार्यक्रम Chapter 8 दोहे 6

3. इन वर्गों को शब्दों में ढूँढकर गोला लगाइए।
स, क, व, प, त्र, ल, र, त, न, फ, ट, आ, अ, ई
AP Board 6th Class Hindi Solutions सन्नद्धता कार्यक्रम Chapter 8 दोहे 7

4. इन अक्षरों में स्वर O और व्यंजन पर [ ] लगाइए.
AP Board 6th Class Hindi Solutions सन्नद्धता कार्यक्रम Chapter 8 दोहे 8

5. समझो – बोलो (वचन)

मीठा – मीठे
बात – बातें
आवाज – आवाजें
दाना – दाने

AP Board 8th Class Telugu Important Questions Chapter 6 ప్రకృతి ఒడిలో

AP State Syllabus AP Board 8th Class Telugu Important Questions Chapter 6 ప్రకృతి ఒడిలో.

AP State Syllabus 8th Class Telugu Important Questions 6th Lesson ప్రకృతి ఒడిలో

8th Class Telugu 6th Lesson ప్రకృతి ఒడిలో Important Questions and Answers

I. అవగాహన-ప్రతిస్పందన

అ) కింది అపరిచిత గద్యాలకు అడిగిన విధంగా జవాబులు ఇవ్వండి.

1. కింది పేరా చదివి, అర్థవంతమైన నాలుగు ప్రశ్నలు రూపొందించండి.

నిరుద్యోగ సమస్య నిజమునకు నిరక్షరాస్యుల వలన నేర్పడినది కాదు. విద్యావంతుల విషయముననే ఇది తీరని | సమస్యగా పరిణమించినది. ఈ విద్యావంతులు కుర్చీలలో కూర్చుండి గుమాస్తా పని చేయుటకే కుతూహలపడుచున్నారు. చదివిన చదువు కూడ అందుకే ఉపకరించుచున్నది. కావున మన విద్యావిధానము కొంత మారవలయును. విద్యావంతులు వృత్తి విద్యల నభ్యసించుట మేలు. ప్రభుత్వమువారి ప్రోత్సాహముతో వారు కుటీర పరిశ్రమలను నెలకొల్పుటయే ఈ సమస్యకు తగిన పరిష్కారము. వృత్తి విద్యల నభ్యసించినవారికి ప్రభుత్వమువారి తోడ్పాటు తప్పక లభించి తీరును.
ప్రశ్నలు :
1. నిరుద్యోగ సమస్య ఎవరి వలన ఏర్పడినది?
2. చదివిన చదువు ఎందుకుపయోగపడుచున్నది?
3. నేటి విద్యావిధానములో ఎట్టి మార్పు రావలెను?
4. ప్రభుత్వమువారు ఎవరికి తోడ్పడుచున్నారు?

2. కింది పేరా చదివి, అర్థవంతమైన నాలుగు ప్రశ్నలు రూపొందించండి.

పరిణయవేళ పుట్టినింటి వారు ధూతాంబకు వెలలేని రత్నాలహారమును బహుకరించిరి. దానిని ఆమె వ్రతదానమను నెపమున మైత్రేయునకిచ్చెను. తన భర్తకే దానిని ఆతడిచ్చుననియు, పోయిన సువర్ణభాండమునకు బదులు దానికంటే పదిమడుంగులు ఎక్కువ వెలగల తన రత్నాలహారమును తన భర్త వసంత సేనకు పంపుననియు ధూతాంబ తలచెను. తాను స్వయముగనే తన భర్తకిచ్చుచో అది స్త్రీ ధనమని యెంచి అతడు గ్రహించకపోవచ్చును. కావున ఆమె మైత్రేయుని ద్వారా దానిని పంపుటకు ఉపాయమును పన్నెను.

సుగుణవతియగు ధూతాంబ యొక్క పవిత్రాశయము నెరింగిన మైత్రేయు డాహారమును తీసికొనిపోయి చారుదత్తునకిచ్చెను. అనుకూలవతియగు భార్య వల్ల భర్త యొక్క కీర్తి ప్రతిష్ఠలు అభివృద్ధి నొందునని పల్కి అతడు తనకు స్త్రీ విమునకు ఆశపడవలసిన దుర్గతి పట్టెనని మిక్కిలి సిగ్గుచెందెను.
ప్రశ్నలు :
1. ధూతాంబ ఎవరికేమి ఇచ్చెను?
2. ధూతాంబ భర్త పేరేమి?
3. తన భర్త దేనికి బదులు ఏమి ఇచ్చునని ధూతాంబ తలచెను?
4. తాను స్వయముగా ఇచ్చుటకు ధూతాంబ ఏల సంశయించెను?

AP Board 8th Class Telugu Important Questions Chapter 6 ప్రకృతి ఒడిలో

3. కింది పేరా ఆధారంగా కింది వాక్యములు సరైనవో కాదో (✓), (✗) గుర్తుల ద్వారా గుర్తించండి.

ఆ ముందుగా వ్యక్తి బాగుపడవలెను. ఆ వెనుక సంఘము బాగుండును. ముందుగా సంఘమును సంస్కరించవలెననుట వెట్టిమాట. మాటలో, చేతలో, తుదకు భావనలో సంస్కారముట్టిపడవలెను. అట్టి వ్యక్తులు పెక్కుమంది ఉన్నచో తనంతట తానే సంఘము ఉద్ధరింపబడును. వ్యక్తిని, తుదకు జాతిని తీర్చిదిద్దుకునే ఈ సంస్కారములు వాని ప్రణాళికను గమనించినచో తన పొట్టకు శ్రీరామరక్ష అనురీతిలో ఉండక వ్యక్తి శ్రేయస్సు, సమాజ కళ్యాణము పరస్పరము ముడివడియున్నవని విడివిడిగా లేవని తెలియచేయును. ఉదాహరణకు ప్రతి గృహస్థు విధిగా చేయవలసిన పంచమహాయజ్ఞములను చూడుడు. దేవయజ్ఞము నందు దేవతలను, ఋషి యజ్ఞమునందు ఋషులను, వారందించిన విజ్ఞానమును, పితృ యజ్ఞము నందు పితృదేవతలను కొలుచుచున్నాడు కదా! భూత యజ్ఞము నందు కుక్కలకు, కాకులకు బలివేయుచున్నాడు కదా! పొరుగువానిని ప్రేమింపమని ఇతర మతములన్నచో, పొరుగు ప్రాణిని కూడా ప్రేమింపమని ఈ సనాతన ధర్మము చాటుచున్నది. తనకుతాను వండుకొని తినువాడు కేవలము పాపమునే తినుచున్నాడని వేదము భాషించుట లేదా? ఇట్టి సూత్రములు సంస్కారములతో ముడివడియున్నవి.
ప్రశ్నలు :
1. వ్యక్తి బాగుపడినప్పుడే సంఘము బాగుపడుతుంది. (✓)
2. మాటలు, చేతలు, భావనలతో సంస్కారముట్టిపడదు. (✗)
3. ప్రతిగృహస్థు విధిగా పంచమహాయజ్ఞములను చేయవలెను. (✓)
4. పొరుగు వానిని ప్రేమించమని, పొరుగు ప్రాణిని ద్వేషించమని సనాతన ధర్మము చెప్పుచున్నది. (✗)

4. కింది పేరా చదివి, ఖాళీలు పూరించండి.

వ్యవసాయ భూముల్ని ఎలా ఉపయోగించుకుంటామో, జీవనోపాధి కోసం బీడు భూముల్ని కూడా ఒక పద్ధతి ప్రకారం ఉపయోగించుకోవచ్చు. అనేక సంక్షేమ కార్యక్రమాలు, ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలూ ఉన్నాయి. గుజరాత్ లో అముల్ ప్రయోగం మన రాష్ట్రంలోనూ చేయవచ్చు. వృత్తికులాల వాళ్ళు అనేక మంది పరిస్థితులను బట్టి వృత్తులు మార్చుకుంటారు. చిత్రమేమంటే పేదవాళ్ళు ఎప్పుడూ విద్యా, వైద్య సౌకర్యాల గురించి అడగరు. భూములు లీజుకు ఇస్తే పెత్తందారులకు, దళారులకు, కుల పెద్దలకూ లాభం వస్తుంది. ఈ విషయంలో పేదలను చైతన్యపరచవలసిన ప్రభుత్వాలు కూడా చురుకైన పాత్ర నిర్వహించకపోవడం దురదృష్టకరం!
ఖాళీలు :
1. బీడు భూములంటే ……………
2. జీవనోపాధి కోసం రైతులు ఆధారపడేది ………..
3. విద్యా, వైద్య సౌకర్యాల గురించి అడగని వాళ్ళు ……………….
4. దళారులు చేసేపని ………..
జవాబులు:
1. పంటలు పండని భూములు
2. వ్యవసాయంపై
3. పేదవాళ్ళు
4. భూములను లీజుకు తీసుకోవడం

5. కింది పేరా చదివి, అర్థవంతమైన నాలుగు ప్రశ్నలు రూపొందించండి.

20వ శతాబ్దపు తొలి రోజులలో కుటుంబ నియంత్రణను బూతు మాట క్రింద జమకట్టేవారు. అటువంటి సమయంలో నర్స్ గా పనిచేసే మార్గరేట్ సాంగర్ అనేక కష్టాలకోర్చి కుటుంబనియంత్రణను గూర్చి ప్రచారం చేశారు. 1914లో “ఉమన్ రెబల్” అన్న వ్యాసంలో ఆమె కుటుంబ నియంత్రణ కోసం తిరగబడమని పిలుపునిచ్చారు. అమెరికా ప్రభుత్వ ఒత్తిడి తట్టుకోలేక ఆమె యూరప్ కు వలసవెళ్ళి 1916లో తిరిగి వచ్చి అదే ప్రచారాన్ని మళ్ళీ మొదలు పెట్టారు. పోలీసులు ఆమె ప్రారంభించిన ఆస్పత్రి పై దాడి చేశారు. అయినా ఆమె చలించకుండా 1923లో కుటుంబ నియంత్రణ పరిశోధనాశాలను నెలకొల్పారు.
ప్రశ్నలు :
1. కుటుంబ నియంత్రణ కోసం ప్రచారం చేసిన నర్స్
2. ఏ సంవత్సరంలో, ఏ వ్యాసంలో ఆమె కుటుంబ నియంత్రణ కోసం తిరగబడమని పిలుపునిచ్చారు?
3. మార్గరేట్ సాంగర్ ఎప్పుడు, ఎక్కడికి వలస వెళ్ళినది?
4. 1923లో సాంగర్ దేనిని నెలకొల్పినది?

AP Board 8th Class Telugu Important Questions Chapter 6 ప్రకృతి ఒడిలో

6. కింది పేరా చదివి, అర్థవంతమైన నాలుగు ప్రశ్నలు రూపొందించండి.

బ్రౌనును ఒక వ్యక్తిగా గాక, పెద్ద సాహిత్య సంస్థగా భావించడం అవసరం. యుగసంధిలో నిలిచిన ఈ వ్యక్తి అనేకానేక తాళపత్ర లిఖిత ప్రతులను సేకరించి, అవి ఎక్కడున్నాసరే, ఎంత ధనవ్యయమైనా సరే, లెక్క పెట్టకుండా, తన ఉద్యోగుల ద్వారా సంపాదించాడు. కొందరు పండితులను సమీకరించి, వారికి జీతభత్యాలిచ్చి, శుప్రతులు వ్రాయించి, కొన్నిటికి అర్థతాత్పర్యాలు సిద్ధం చేయించాడు. ‘విశ్వదాభిరామ వినురవేమ’ పద్యం తెలియని తెలుగువాడు లేడు. అయితే ఈ పద్యాలను మొదట తెలుగువాళ్ళకు పరిచయం చేసినది విదేశీయుడైన బ్రౌను. బ్రౌను పేరు స్మరించగానే మనకు ముందు స్ఫురించేది బ్రౌనుకు నిఘంటువు. ఈ కృషి 1832లో ఆరంభించబడి, 1853లో పూర్తి అయి ప్రథమ ముద్రణ అయింది. ఈ కృషిలో బ్రౌనుకు ఏనుగుల వీరాస్వామి సహాయం పొందాడు. వీరాస్వామి రచించిన కాశీయాత్ర | గురించిన పుస్తకం చారిత్రక దృష్ట్యా విలువైనది.
ప్రశ్నలు:
1. తెలుగు సాహిత్యానికి సంబంధించినంతవరకు బ్రౌనును ఎట్లా పరిగణించడం భావ్యం?
2. బ్రౌను సంపాదించిన పుస్తకాలను ఏమంటారు?
3. పండితులతో బ్రౌను చేయించిన పనులేమిటి?
4. నిఘంటువు ప్రథమ ముద్రణ ఎప్పుడు వచ్చింది?

II. వ్యక్తీకరణ – సృజనాత్మకత

అ) కింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాల్లో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
“ప్రకృతి ఒడిలో” అనే పాఠ్యభాగ రచయితను గురించి రాయండి.
జవాబు:
‘ప్రకృతి ఒడిలో’ అనే పాఠ్యభాగ రచయిత కొడవటిగంటి కుటుంబరావు. ఈయన 1909 – 1980 మధ్యకాలంలో జీవించారు. వీరు ప్రముఖ కథారచయిత, గల్పికలను ఎన్నో రాశారు. వారి కథలో సహజత్వం గోచరిస్తుంది. వీరి రచనల్లో చదువు, అద్దెకొంప, షావుకారు సుబ్బయ్య మొదలైనవి ప్రసిద్ధి చెందాయి. వీరి రచన సరళంగాను, మనోహరంగాను ఉంటుంది.

AP Board 8th Class Telugu Important Questions Chapter 6 ప్రకృతి ఒడిలో

ప్రశ్న 2.
శాస్త్రజ్ఞులకూ (శాస్త్రవేత్తలకూ), శాస్త్రజ్ఞానానికి గల సంబంధాన్ని వివరిస్తూ రాయండి.
జవాబు:
ప్రకృతిలో జరిగే ప్రతి సంఘటనకూ వెనుక ఒక భౌతిక కారణం ఉంటుందనీ, దాన్ని తెలుసుకోడానికి వీలు అవుతుందనీ శాస్త్రజ్ఞుడు నమ్ముతాడు. శాస్త్రజ్ఞుడు రుజువయ్యే అవకాశం ఉంటే ప్రతి సిద్ధాంతాన్ని పరిశోధిస్తాడు. శాస్త్రజ్ఞులు సత్యాన్వేషణకూ, విషయజ్ఞానానికి ప్రయత్నిస్తారు. శాస్త్రజ్ఞానం వల్ల మనకు ప్రకృతి రహస్యాలు తెలుస్తాయి. శాస్త్రజ్ఞుని శాస్త్రజ్ఞానం వల్ల, మన లౌకిక జీవితాలు పై అంతస్తుకు చేరతాయి.

ఆ) కింది ప్రశ్నకు 10 లేక 12 వాక్యాల్లో సమాధానం రాయండి.

ప్రశ్న 1.
ప్రకృతి అందాలను సొంతమాటల్లో రాయండి.
జవాబు:
ప్రకృతి ఎంతో అందమైనది. ప్రకృతి భూమాతకు ఎన్నో అందాలను తెచ్చి పెడుతుంది. ప్రకృతిలో రకరకాల చెట్లు ఉంటాయి. కొన్ని పూలమొక్కలు, కొన్ని ఔషధపు మొక్కలు ఉంటాయి. అట్లే ఎన్నో రకాల పక్షులు సంచరిస్తాయి. అవన్నీ తమ అందాలతో కనువిందు చేస్తాయి. కోయిలల కిలకిలారావాలు మనసున్న మనుషులను అలరిస్తాయి. కొన్ని రకాల పక్షులు పంటలను రక్షిస్తాయి. కొన్ని ప్రాణులు పర్యావరణాన్ని రక్షిస్తాయి. నదులు జీవకోటికి జీవనాధారం. నదులు అందరికీ నీటిని అందిస్తాయి. వాటిని మనం కలుషితం కాకుండా చెయ్యాలి.

ప్రకృతిలో లభించే కొన్ని వస్తువులను మానవుడు తన స్వార్థం కోసం వినియోగించుకుంటున్నాడు. అడవులను నరికివేస్తున్నాడు. పక్షులను వేటాడుతున్నాడు. ఇది మంచిది కాదు. మనమంతా పర్యావరణాన్ని రక్షించాలి. ఇది మన కర్తవ్యం.

ఇ) కింది అంశం గురించి సృజనాత్మకంగా / ప్రశంసిస్తూ రాయండి.

ప్రశ్న 1.
నీవు చూసిన ఒక ప్రకృతి దృశ్యాన్ని వివరిస్తూ మిత్రునికి లేఖ రాయండి.
జవాబు:

విజయనగరం,
x x x x x

ప్రియమైన మిత్రుడు నరసింహారావుకు,

నీ మిత్రుడు రాయునది. నేను బాగా చదువుతున్నాను. నీవు కూడా బాగా చదువుతున్నావని ఆశిస్తున్నాను. ముఖ్యముగా రాయునది నేను ఇటీవల కర్నూలు జిల్లాలోని మహానంది క్షేత్రానికి వెళ్ళాను. గిద్దలూరు దాటిన తరువాత నల్లమల అడవి వస్తుంది. అంతా లోయలు, చుట్టూ పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. పచ్చని చెట్లు అలరించాయి. లోయలు కనువిందు చేశాయి. మధ్యలో సొరంగమార్గం మరువలేనిది. పక్షుల కిలకిలారావాలు అలౌకిక ఆనందాన్ని పొందేలా చేశాయి. నీవు కూడా చూచిన ఒక ప్రకృతి దృశ్యాన్ని వివరిస్తూ లేఖ రాయి.. పెద్దలకు నమస్కారాలు తెలుపుతున్నాను.

ఇట్లు,
నీ ప్రియ మిత్రుడు,
x x x x x x x

చిరునామా :
జి. నరసింహారావు,
8వ తరగతి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,
వినుకొండ, ప్రకాశం జిల్లా,
ఆంధ్రప్రదేశ్.

8th Class Telugu 6th Lesson ప్రకృతి ఒడిలో 1 Mark Bits

1. ప్రథమా విభక్తి మీది ప్రత్యయాలకు కచటతపలు పరమైతే వాటి స్థానంలో గసడదవలు ఆదేశంగా వస్తాయి. (ఇది ఏ సంధి సూత్రం) (S.A. III – 2016-17)
ఎ) సరళాదేశసంధి
బి) ద్రుతప్రకృతికసంధి
సి) గసడదవాదేశసంధి
డి) ఆమ్రేడిత సంధి
జవాబు:
సి) గసడదవాదేశసంధి

2. జయ ఇంటికి వెళ్లింది. విజయ బడికి వెళ్లింది. (పై వాక్యాలను సంయుక్త వాక్యంగా మార్చండి.) (S.A. III – 2016-17)
ఎ) జయ, విజయ ఇంటికి వెళ్లారు.
బి) జయ ఇంటికి, విజయ బడికి వెళ్లారు.
సి) విజయ, జయ బడికి వెళ్లారు.
డి) జయ, విజయలు ఇళ్లకు వెళ్లారు.
జవాబు:
బి) జయ ఇంటికి, విజయ బడికి వెళ్లారు.

భాషాంశాలు – పదజాలం

అర్థాలు :

3. అభినందన తెలపాలి – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) పొగడ్త
బి) అగడ్త
సి) అంజన
డి) విషయం
జవాబు:
ఎ) పొగడ్త

4. ఇంటి ఆకృతి బాగుంది – గీత గీసిన పదానికి అరం గుర్తించండి.
ఎ) ఆకారం
బి) వికారం
సి) సకారం
డి) యకారం
జవాబు:
ఎ) ఆకారం

5. మనుష్యుల మధ్య సామ్యం ఉండాలి – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) ఆకృతి
బి) పోలిక
సి) చూపు
డి) తెలివి
జవాబు:
బి) పోలిక

AP Board 8th Class Telugu Important Questions Chapter 6 ప్రకృతి ఒడిలో

6. రుజువు కావాలి – గీత గీసిన పదానికి అర్థం పదాలు గుర్తించండి.
ఎ) నిదర్శనం
బి) ఆకాంక్ష
సి) ఆకారం
డి) సంప్రదాయం
జవాబు:
ఎ) నిదర్శనం

7. పాలు పేరుకొనుట జరిగింది – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) వారిధి, భూరుహం
బి) గగనం, నాశం
సి) నభం, నాకం
డి) నింగి, నభం
జవాబు:
డి) నింగి, నభం

8. పసిగట్టుట జరిగింది – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) గుర్తించడం
బి) పరిశీలించడం
సి) ఆదరించడం
డి) తిరస్కరించడం
జవాబు:
బి) పరిశీలించడం

9. విధిగా రావాలి – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) ఆకృతిగా
బి) తప్పనిసరిగా
సి) అప్పుడప్పుడు
డి) అనుకూలంగా
జవాబు:
బి) తప్పనిసరిగా

10. సాధనం అవసరం – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) ఉపకారం
బి) ఉపకరణం
సి) ఉపన్యాసం
డి) ఉపయోగం
జవాబు:
బి) ఉపకరణం

పర్యాయపదాలు :

11. కన్ను జ్ఞానేంద్రియం – గీత గీసిన పదానికి పర్యాయ పదాలు గుర్తించండి.
ఎ) పక్షి, నయనం
బి) చక్షువు, నయనం
సి) నాశిక, నయనం
డి) అక్షి, కుక్షి
జవాబు:
బి) చక్షువు, నయనం

AP Board 8th Class Telugu Important Questions Chapter 6 ప్రకృతి ఒడిలో

12. నీరు ఉంది – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
ఎ) జలం, వారి
బి) జారి, క్షీరం
సి) దుగ్ధం, దధి
డి) ఘృతం, క్షీరం
జవాబు:
ఎ) జలం, వారి

13. సముద్రం భీకరం – గీత గీసిన పదానికి పర్యాయ పదాలు గుర్తించండి.
ఎ) క్షీరం, ధరణి
బి) జలధి, అవని
సి) అంబుధి, అంబరం
డి) సాగరం, జలధి
జవాబు:
డి) సాగరం, జలధి

14. తరంగం ఉరికింది – గీత గీసిన పదానికి పర్యాయ గుర్తించండి.
ఎ) అల, వీచిక
బి) అంతరంగం, అవని
సి) దానం, దారి
డి) పధం, తపన
జవాబు:
ఎ) అల, వీచిక

15. ఆకాశం నిర్మలంగా ఉంది – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
ఎ) వాసన చూచుట
బి) చీల్చుట
సి) నానబెట్టుట
డి) గడ్డకట్టుట
జవాబు:
డి) గడ్డకట్టుట

16. గాలి వీచింది – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
ఎ) తరువు, తరుణి
బి) వాయువు, పవనం
సి) నాశిక, అనంతం
డి) ఆకారం, ఆకృతి
జవాబు:
బి) వాయువు, పవనం

ప్రకృతి – వికృతులు :

17. ఆశ్చర్యం పొందాను – అనే పదానికి వికృతి పదం ఏది?
ఎ) అచ్చెరువు
బి) ఆకారం
సి) ఆచెరం
డి) అచ్చెరం
జవాబు:
బి) ఆకారం

AP Board 8th Class Telugu Important Questions Chapter 6 ప్రకృతి ఒడిలో

18. బుద్ధి ఉండాలి – గీత గీసిన పదానికి వికృతి పదం ఏది?
ఎ) బుద్ధి
బి) బిద్దు
సి) బౌద్ధ
డి) బౌద్ధ
జవాబు:
ఎ) బుద్ధి

19. ఆకసంలో రవి ఉన్నాడు – గీత గీసిన పదానికి ప్రకృతి పదం ఏది?
ఎ) అనంతం
బి) అబ్బురం
సి) ఆకాశం
డి) ఆకారం
జవాబు:
సి) ఆకాశం

20. చట్టం గౌరవించాలి – గీత గీసిన పదానికి ప్రకృతి పదం ఏది?
ఎ) శర్మ
బి) శాస్త్రం
సి) శాసనం
డి) శాస్త్రి
జవాబు:
బి) శాస్త్రం

21. ధర్మం ఆచరించాలి – గీత గీసిన పదానికి వికృతి పదం
ఎ) దమ్మం
బి) దరమ
సి) గరమ
డి) మరద
జవాబు:
ఎ) దమ్మం

నానార్థాలు :

22. మిత్రుడు ప్రకాశించాడు – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
ఎ) సూర్యుడు, స్నేహితుడు
బి) వైరి, విరోధి
సి) పగతుడు, చిరంజీవి
డి) చినుకు, చింత
జవాబు:
ఎ) సూర్యుడు, స్నేహితుడు

AP Board 8th Class Telugu Important Questions Chapter 6 ప్రకృతి ఒడిలో

23. వర్షం వచ్చింది – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
ఎ) వాన, సంవత్సరం
బి) వాకిలి, వారుణి
సి) వారుణం, వారిధి
డి) కల్పం, కాంతం
జవాబు:
ఎ) వాన, సంవత్సరం

24. చరణం బాగుంది – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
ఎ) పాదం, పద్యపాదం
బి) వేదభావం, విరించి
సి) అనంతం, అనం
డి) విస్మయం, విరామం
జవాబు:
ఎ) పాదం, పద్యపాదం

25. ధర్మం పాటించాలి – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
ఎ) పుణ్యం, న్యాయం
బి) అధర్మం, అపకారి
సి) నృతం, అనృతం
డి) విదతి, వింజారం
జవాబు:
ఎ) పుణ్యం, న్యాయం

26. కరంతో పని చెయ్యాలి – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
ఎ) చేయి, తొండము
బి) కిరణము, కాంతి
సి) కలవ, కానుగ
డి) విధి, విధానం
జవాబు:
ఎ) చేయి, తొండము

27. కాలం చెల్లాడు – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
ఎ) కానుగ, కాటుక
బి) సమయం, మరణం
సి) మంచు, హిమం
డి) హేమం, కాంతి
జవాబు:
బి) సమయం, మరణం

28. దేవుడే దిక్కు – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
ఎ) దిశ, శరణు
బి) ధర, ధరణి
సి) దాన, విరిగి
డి) నిశ, నిద్ర
జవాబు:
ఎ) దిశ, శరణు

వ్యుత్పత్తర్థాలు :

29. పర్వత రాజు కుమార్తె – అనే వ్యుత్పత్త్యర్థం గల పదం ఏది?
ఎ) పార్వతి
బి) ఊర్వశి
సి) జలధి
డి) వైదేహి
జవాబు:
ఎ) పార్వతి

AP Board 8th Class Telugu Important Questions Chapter 6 ప్రకృతి ఒడిలో

30. నీటిని ధరించునది – అనే వ్యుత్పత్త్యర్థం గల పదం ఏది?
ఎ) వాసవి
బి) కాసారం
సి) వారిధి
డి) కౌముది
జవాబు:
సి) వారిధి

31. భూజము – అనే పదానికి వ్యుత్పత్తి ఏది?
ఎ) ఆకృతి లేనిది
బి) అనంతమైనది
సి) భూమి నుండి పుట్టినది
డి) భూమిలో దొరికినది
జవాబు:
సి) భూమి నుండి పుట్టినది

32. ఉర్వి – అనే పదానికి వ్యుత్పత్తి ఏది?
ఎ) మధురమైది
బి) ఫలవంతమైనది
సి) విశాలమైనది
డి) ఆకృతిలేనిది
జవాబు:
సి) విశాలమైనది

33. అగ్ని – అనే పదానికి వ్యుత్పత్తి ఏది?
ఎ) మండెడి స్వభావం కలది
బి) మంచుతో కూడినది
సి) మారాము చేయునది
డి) ఆకలి తీర్చునది
జవాబు:
ఎ) మండెడి స్వభావం కలది

వ్యాకరణాంశాలు

సంధులు:

34. అత్తటి – ఇది ఏ సంధి?
ఎ) త్రికసంధి
బి) అత్వసంధి
సి) ఉత్వసంధి
డి) గుణసంధి
జవాబు:
ఎ) త్రికసంధి

35. సవర్ణదీర్ఘ సంధికి ఉదాహరణను గుర్తించండి.
ఎ) రాజర్షి
బి) జ్ఞానాభివృద్ధి
సి) జ్ఞానోదయం
డి) ప్రాప్రోదయం
జవాబు:
బి) జ్ఞానాభివృద్ధి

36. అప్పుడప్పుడు – ఇది ఏ సంధి?
ఎ) ఆమ్రేడిత సంధి
బి) త్రికసంధి
సి) అత్వసంధి
డి) ఉత్వసంధి
జవాబు:
బి) త్రికసంధి

37. ద్విరుక్తము యొక్క పరరూపం గుర్తించండి.
ఎ) ఆమ్రేడితం
బి) త్రికం
సి) శబ్దపల్లవం
డి) సాధువు
జవాబు:
ఎ) ఆమ్రేడితం

AP Board 8th Class Telugu Important Questions Chapter 6 ప్రకృతి ఒడిలో

38. ఉష్ణోగ్రత పెరిగింది – ఇది ఏ సంధి?
ఎ) త్రికసంధి
బి) అత్వసంధి
సి) యణాదేశ సంధి
డి) గుణసంధి
జవాబు:
డి) గుణసంధి

39. విద్యుచ్ఛక్తి – ఇది ఏ సంధి?
ఎ) అత్వసంధి
బి) శ్చుత్వసంధి
సి) షుత్వసంధి
డి) టుగాగమ సంధి
జవాబు:
బి) శ్చుత్వసంధి

40. ప్రత్యామ్నాయం – దీనిని విడదీయండి.
ఎ) ప్రతో + ఆమ్నాయం
బి) ప్రతి + ఆమ్నాయం
సి) ప్రతె + ఆమ్నాయం
డి) ప్రత + ఆమ్నాయం
జవాబు:
బి) ప్రతి + ఆమ్నాయం

41. విద్యార్జన – ఇది ఏ సంధి?
ఎ) ఇత్వసంధి
బి) సవర్ణదీర్ఘ సంధి
సి) గుణసంధి
డి) అత్వసంధి
జవాబు:
బి) సవర్ణదీర్ఘ సంధి

సమాసాలు :

42. కళాదృష్టి – దీనికి విగ్రహవాక్యం ఏది?
ఎ) కళ యందు దృష్టి
బి) కళ చేత దృష్టి
సి) కళ కొరకు దృష్టి
డి) కళ వలన దృష్టి
జవాబు:
ఎ) కళ యందు దృష్టి

AP Board 8th Class Telugu Important Questions Chapter 6 ప్రకృతి ఒడిలో

43. ప్రార్థనా సమావేశం – దీనికి విగ్రహవాక్యం ఏది?
ఎ) ప్రార్ధన కొరకు సమావేశం
బి) ప్రార్ధన యందు సమావేశం
సి) ప్రార్థన చేత సమావేశం
డి) ప్రార్ధనతో సమావేశం
జవాబు:
ఎ) ప్రార్ధన కొరకు సమావేశం

44. షష్ఠీ తత్పురుషకు ఉదాహరణను గుర్తించండి.
ఎ) గ్రామగతుడు
బి) ప్రకృతి ధర్మం
సి) విద్యాహీనుడు
డి) కళాతృష్ణ
జవాబు:
బి) ప్రకృతి ధర్మం

45. ద్విగు సమాసానికి ఉదాహరణను గుర్తించండి.
ఎ) మంచిమాట
బి) వంద సంవత్సరాలు
సి) సాగరసంగమం
డి) కళారాధన
జవాబు:
బి) వంద సంవత్సరాలు

46. సంఖ్యా శబ్దం పూర్వంగా కలిగిన సమాసం
ఎ) ద్విగు సమాసం
బి) ద్వంద్వ సమాసం
సి) అవ్యయీభావ సమాసం
డి) తత్పురుష సమాసం
జవాబు:
ఎ) ద్విగు సమాసం

47. సంసార సాగరం – ఇది ఏ సమాసం?
ఎ) రూపక సమాసం
బి) అవ్యయీభావ సమాసం
సి) కర్మధారయ సమాసం
డి) సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం
జవాబు:
ఎ) రూపక సమాసం

గణ విభజన:

48. IUI- ఇది ఏ గణము?
ఎ) జ గణం
బి) త గణం
సి) స గణం
డి) య గణం
జవాబు:
ఎ) జ గణం

49. త గణం – దీనికి గణాలు ఏవి?
ఎ) IUI
బి) UUU
సి) UUI
డి) UII
జవాబు:
సి) UUI

AP Board 8th Class Telugu Important Questions Chapter 6 ప్రకృతి ఒడిలో

50. సూర్య గణాలు ఎన్ని?
ఎ) నాలుగు
బి) రెండు
సి) ఆరు
డి) ఎనిమిది
జవాబు:
బి) రెండు

51. IIUI- ఇది ఏ గణము?
ఎ) నగము
బి) సలము
సి) నలము
డి) యలము
జవాబు:
బి) సలము

52. అవ్విధం – ఇది ఏ గణము?
ఎ) IUI
బి) UIU
సి) III
డి) IIU
జవాబు:
బి) UIU

వాక్యాలు :

53. దయతో అనుమతించండి – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) హేత్వర్థక వాక్యం
బి) కర్తరి వాక్యం
సి) పాక్షికార్థక వాక్యం
డి) తమున్నర్థక వాక్యం
జవాబు:
సి) పాక్షికార్థక వాక్యం

54. రవి పాఠం చదువగలడు – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) కర్తరి వాక్యం
బి) హేత్వర్థక వాక్యం
సి) సామర్థార్థక వాక్యం
డి) కర్మణి వాక్యం
జవాబు:
సి) సామర్థార్థక వాక్యం

55. తప్పక పాఠం వింటాను – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) అనుకరణ వాక్యం
బి) నిశ్చయార్థక వాక్యం
సి) తద్ధర్మార్థక వాక్యం
డి) హేత్వర్థక వాక్యం
జవాబు:
బి) నిశ్చయార్థక వాక్యం

56. అందరు వెళ్ళండి – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) కరణి వాక్యం
బి) కరరి వాక్యం
సి) ఆత్మార్థక వాక్యం
డి) విధ్యర్థక వాక్యం
జవాబు:
డి) విధ్యర్థక వాక్యం

అలంకారాలు :

57. ఉపమానోపమేయాలకు అభేదం చెప్పండి.
ఎ) ఛేకానుప్రాసాలంకారం
బి) రూపకాలంకారం
సి) యమకాలంకారం
డి) వృత్త్యనుప్రాసాలంకారం
జవాబు:
బి) రూపకాలంకారం

AP Board 8th Class Telugu Important Questions Chapter 6 ప్రకృతి ఒడిలో

58. ఈ రాజు సాక్షాత్తు శంకరుడే – ఇందులోని అలంకారం గుర్తించండి.
ఎ) అనన్వయ
బి) రూపక
సి) అతిశయోక్తి
డి) అర్థాంతరన్యాస
జవాబు:
బి) రూపక

సొంతవాక్యాలు :

59. అభినందనలు : పరీక్షలో మంచి ర్యాంకు సాధించడం వల్ల నాకు అభినందనలు అందాయి.

60. పసిగట్టు : పాములు మనిషి జాడను పసిగడతాయి.

61. వైపరీత్యము : సముద్ర తీరాన ఉన్నవారికి ప్రకృతి వైపరీత్యాలు ఎక్కువ.

62. ప్రకంపన : ఈ మధ్య చైనాలో భూ ప్రకంపనలు తరచుగా వస్తున్నాయి.

63. ప్రతిపాదించు : మా గురువులు ప్రతిపాదించిన విషయాల్ని మేము తప్పక అంగీకరిస్తాము.

64. హడావిడిగా : నేను ఈ రోజు బడికి హడావిడిగా వచ్చాను.

65. రుజువు చేయు : శాస్త్రజ్ఞులు విషయాన్ని రుజువు చేసి చూపిస్తారు.

66. అంచనా వేయు : నా మిత్రునికి రాబోయే విషయాల్ని అంచనావేయు శక్తి ఉంది.

67. నిరూపించు : శాస్త్రజ్ఞులు విషయాన్ని నిరూపిస్తారు.

విశేషాంశాలు

1. ప్రకృతి వైపరీత్యాలు అంటే : ప్రకృతిలో ఏర్పడే విపరీత పరిస్థితులు భూకంపము, సునామీ, వరదలు, తుపానులు మొదలైనవి.

2. విశ్లేషణ శక్తి అంటే : విషయాన్ని విభజించి పరిశీలించే శక్తి.

3. శాస్త్ర దృష్టి అంటే : ప్రతి సంఘటనకూ వెనుక ఉన్న భౌతిక కారణాన్ని పరిశోధించి తెలిసికొనే దృష్టి.

4. కళాదృష్టి అంటే : సౌందర్య రసాస్వాదన దృష్టి.

5. భ్రమలు అంటే : లేనిదానిని ఉన్నట్లుగా భ్రాంతి చెందే దృష్టి.

6. ఇంద్రియ జ్ఞానం అంటే : మన ఇంద్రియాలు గ్రహించే జ్ఞానం.

7. జ్ఞానమంటే : సమాచారాన్ని జ్ఞాపకం పెట్టుకోవడం కాదు. జ్ఞానం అంటే ఆ జ్ఞానం కల్గించిన విచక్షణాశక్తితో గ్రహించడం.