AP SSC 10th Class Telugu Important Questions Chapter 8 సముద్ర‌లంఘ‌నం

AP State Board Syllabus AP SSC 10th Class Telugu Important Questions Chapter 8 సముద్ర‌లంఘ‌నం

AP State Syllabus SSC 10th Class Telugu Important Questions 8th Lesson సముద్ర‌లంఘ‌నం

10th Class Telugu 8th Lesson సముద్ర‌లంఘ‌నం 2 Marks Important Questions and Answers

ఈ క్రింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాల్లో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
సముద్రలంఘనం పాఠం నేపథ్యం రాయండి. (S.A. I – 2019-20)
జవాబు:
సీతను వెతుకుతూ రామలక్ష్మణులు కిష్కింధకు చేరుకుంటారు. రామలక్ష్మణులు, సుగ్రీవునితో స్నేహం చేస్తారు. సుగ్రీవుడు సీతను వెతకటానికి వానర సైన్యాన్ని నాలుగు దిశలకు పంపిస్తాడు. అంగదుని నాయకత్వంలో ఆంజనేయుని బృందం, దక్షిణ దిక్కుకు వెళ్తుంది. జాంబవంతుని ప్రోత్సాహంతో ఆంజనేయుడు మహేంద్రగిరి నుంచి సముద్ర లంఘనానికి సిద్ధమౌతాడు.

ప్రశ్న 2.
హనుమంతుడు సముద్రలంఘనానికి ముందు చేసిన చేష్టలను గురించి రాయండి. (June 2018)
జవాబు:

  1. సముద్ర లంఘనానికి ముందు హనుమంతుడు పెద్ద పెద్దగా అంగలు వేస్తూ బలంగా నడవడం, తోకను వేగంగా తిప్పడం, చేతిని జబ్బపై చరచడం, సింహనాదం చేయడం వంటి పనులను చేశాడు.
  2. ఈ పనులు అతని ఆత్మవిశ్వాసాన్ని, సమస్త శక్తులను కూడగట్టుకోవడాన్ని సూచిస్తున్నాయి.
  3. ఏ పనినైనా చేయడానికి పూనుకొనే ముందు శక్తులన్నింటినీ సమీకరించడం వీరులు చేసే ముఖ్యమైన పని.
  4. మహావీరుడైన రూనుమంతుడు కూడా తనలో అంతర్గతంగా ఉన్న శక్తులను బయటకు రప్పించడానికే అలా చేశాడని నేను భావిస్తున్నాను.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 8 సముద్ర‌లంఘ‌నం

ప్రశ్న 3.
అయ్యలరాజు రామభద్రుని గురించి రాయండి.
జవాబు:
‘సముద్రలంఘనం’ పాఠ్యభాగ రచయిత అయ్యలరాజు రామభద్రుడు. ఈయన 16వ శతాబ్దానికి చెందినవాడు శ్రీకృష్ణదేవరాయల అష్టదిగ్గజ కవులలో ఇతడు ప్రసిద్ధుడు. వీరి రచనల్లో రామాభ్యుదయం, సకల కథాసార సంగ్రహం వంటి రచనలు రచించాడు. రామాభ్యుదయంలో ఎనిమిది ఆశ్వాసాలు ఉంటాయి. ఉత్తరకాండను వదలివేశారు. వీరికి ‘చతురసాహిత్య లక్షణ చక్రవర్తి’, ‘ప్రతివాది మదగజ పంచానన’ అనే బిరుదులు ఉన్నాయి. వీరి శైలి కవితాసామర్థ్యంతో కూడి యుంటుంది. వీరి వర్ణన సహజ ధోరణిలో సాగుతుంది.

ప్రశ్న 4.
హనుమంతుని స్వభావాన్ని వివరించండి.
జవాబు:
హనుమంతుడు, సుగ్రీవునకు, మంత్రి, ఇతడు మహాబలశాలి. స్వామిభక్తి పరాయణుడు, శ్రీరామ భక్తుడు. సుగ్రీవునికి నమ్మిన బంటు. రామలక్ష్మణులకు, ఇతడే సుగ్రీవునితో స్నేహం కల్పించాడు. శ్రీరాముని సహాయంతో సుగ్రీవుడిని వానర రాజ్యాధిపతిని చేశాడు. సీతాన్వేషణలో హనుమంతుడు ప్రముఖ పాత్ర వహించాడు. నూరుయోజనాల సముద్రాన్ని దాటి వెళ్ళి పట్టుదలతో సీతాదేవి జాడను కనిపెట్టి, సీతమ్మకు రాముని ఉంగరాన్ని ఇచ్చి, ఆమెకు ధైర్యం చెప్పాడు. సీతమ్మ తనకు ఇచ్చిన చూడామణిని, శ్రీరామునకు తెచ్చి ఇచ్చి, సీత వృత్తాంతాన్ని రామునకు తెలియచెప్పాడు. ఇతడు ఒంటరిగా లంకకు వెళ్ళి, రాక్షస సైన్యాన్ని చంపి, లంకను దహనం చేసి, రావణునికి, రాముని సందేశం అందించిన రామదూత. ఇతడు రామరావణ యుద్ధంలో వీరోచితంగా పోరాడాడు. సంజీవిని తెచ్చి లక్ష్మణుని బ్రతికించాడు. ఆంజనేయుడు మహావీరుడు.

ప్రశ్న 5.
మీకు నచ్చిన ఒక సందర్భాన్ని వివరించండి.
జవాబు:
నేను, నా మిత్రులతో కలిసి విహారయాత్రకై మహానంది బయలుదేరాను. ఈ యాత్ర నాకు మధురానుభూతిని మిగిల్చింది. ముఖ్యంగా ఈ క్షేత్రం నల్లమల అడువుల్లో ఉంటుంది. గిద్దలూరు దగ్గరి నుండి నంద్యాల వరకు రైలు ప్రయాణం అరణ్యం గుండా జరిగింది. వంపుసొంపుల మార్గాలు, ఇరువైపులా ఆకాశాన్ని తాకుతున్న పర్వత శిఖరాలు, వాటిపై పొడవైన చెట్లు, ఆ చెట్టుకున్న ‘పూలు చూడముచ్చటగా ఉన్నాయి. మధ్యలో పొడవైన రెండు పెద్ద గుహలు. ఆ గుహల్లోకి రైలు వెళ్ళగానే అంతా దట్టమైన చీకటి. ఏమీ కనిపించదు. ఇది చూచి అనుభవించి తీరవలసిందే. ఎతైన కొండల నుండి కిందికి జాలువారే సెలయేళ్ళు, అక్కడక్కడా గిరిజనుల నివాసాలు సుమనోహరంగా ఉన్నాయి. ప్రకృతి అందాలకు నల్లమల పుట్టినిల్లు. భూదేవికి పచ్చని చీర కట్టినట్లుగా ఉంటుంది. పక్షుల కిలకిలారావాలు, కోయల విన్యాసాలు చూడముచ్చటగా ఉంటాయి.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 8 సముద్ర‌లంఘ‌నం

ప్రశ్న 6.
సముద్రలంఘనానికి ముందు హనుమంతుని ప్రవర్తనను బట్టి నీవేమి గ్రహించావు?
జవాబు:
సముద్రలంఘనానికి ముందు హనుమంతుడు గట్టిగా ఒత్తి అడుగులు వేసి, రాళ్ళను పగులకొట్టి, చెట్లను కూలగొట్టి, క్రూర జంతువులను సైతం పారిపోయేలా చేసి, గుహలు ప్రతిధ్వనించేలా సింహనాదం చేశాడు. ఆతని పాదాల ఒత్తిడికి పర్వత శిఖరాలు కంపించిపోయాయి.

హనుమంతుడు తన శక్తిని మిగిలిన వానరులకు, ఈ విధంగా చూపించాడు. తాను సీత జాడను తెలిసికొని రాగలనని తనవారికి ఆ విధంగా ధైర్యం కల్పించాడు. తాను మహాశక్తిమంతుడననీ, కొండల్ని పిండి చేయగలననీ నిరూపించాడు. తాను వాయుదేవుని అనుగ్రహం కలవాడినని, మిగిలిన వానరులకు తెలియపరచి, వారికి ధైర్యం కల్పించాడు. హనుమంతుడు తాను తప్పక సీత జాడను తెలిసికొని రాగలనని, ముందుగానే తన తోడి వానరులకు ఈ విధంగా భరోసా ఇచ్చాడు. అందుకే హనుమంతుడు ఆ చేష్టలు చేశాడు.

ప్రశ్న 7.
హనుమంతుడు ఆకాశంలోకి ఎగిరినపుడు సమీపంలోని వారికి ఎలా కనిపించాడు? ఎందుకో వివరించండి.
జవాబు:
హనుమంతుడు మహేందగిరిపై కాళ్ళు వేసి, దానిని క్రిందికి అణగదొక్కి ఆకాశంలోకి ఎగిరాడు. అప్పుడు హనుమంతుడు ఆకాశంలో ఎగురుతున్నట్లు కాకుండా ఒక పర్వతము ఆకాశంలో ఎగురుతున్నట్లు సమీపం నుండి చూసే వారికి కనబడింది.

కారణము : హనుమంతుడు సూరుయోజనాల సముద్రాన్ని దాటడానికి తన రూపాన్ని బాగా పర్వతం అంత ఆకారంలో పెంచి వేశాడు. అందుకే హనుమంతుడు అప్పుడు చూసేవారికి పర్వతం అంత పరిమాణంలో కనిపించాడు. అందుకే ఆకాశంలో పర్వతం ఎగురుతున్నట్లు దగ్గర నుండి చూసేవారికి కనిపించింది.

10th Class Telugu 8th Lesson సముద్ర‌లంఘ‌నం 4 Marks Important Questions and Answers

ఈ క్రింది ప్రశ్నలకు 10 లేక 12 వాక్యాల్లో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
సముద్రాన్ని దాటడానికి ప్రయత్నించిన హనుమంతుడిని కవి వర్ణించాడు కదా ! అయితే నీవు చూచిన ఒక అద్భుత ప్రకృతి దృశ్యాన్ని నీ సొంతమాటల్లో రాయండి.
జవాబు:
పవిత్రమైన భారతదేశంలో చూడదగిన ముఖ్యప్రదేశం కాశ్మీర్ ప్రాంతం. ఇక్కడి వాతావరణం సుమనోహరం. ప్రకృతి దృశ్యాలు నయనానందాన్ని కల్గిస్తాయి. ఒక్కమాటలో, చెప్పాలంటే కాశ్మీర్ ఒక భూతల స్వర్గం.

ఇక్కడ ఎటు చూసినా సమున్నత పర్వత శ్రేణి, వృక్షసంపద, సెలయేటి ధారలు యాత్రకులకు అలౌకికమైన అనందాన్ని కలిగిస్తాయి. పచ్చని పంటల శోభ, వాటి మధ్య ప్రవహించే కొండవాగుల అందం అన్నీ కలగలిపి భూదేవి హృదయాన ధరించిన ముత్యాలహారంలోని పచ్చలపతకంలా కాశ్మీరు లోయ ప్రకాశిస్తుంది.

పిర్ పంజల్ పర్వత శ్రేణిలో ‘బనిహాల్’కనుమ ఉంది. దాని చుట్టూ ఎత్తైన కొండలు. అక్కడ కొండల అంచుల్ని మంచు ముసుగు కప్పేస్తుంది. ఆ కొండల చివళ్ళనున్న మంచు పెళ్ళలుగా గట్టిగా పాలరాతి ముక్కల్లా మెరుస్తోంది. నల్లగా నిగనిగలాడే కొండ శరీరంపై అంచున తెల్లని పాలరాతి ముక్కలు ‘ఎమ్ బాస్’ చేసినట్లుగా ఉంది. అక్కడ కొండవాలుల్లో అన్నీ వరిపైర్లు, కొండవాగులోని నీరే ఆ పంటలకు ఆధారం. పచ్చని పైర్ల శోభ, వాటి మధ్య కొండవాగుల అందం అన్నీ కలగలిపి, భూదేవి హృదయాన ధరించిన ముత్యాలహారంలోని పచ్చల పతకంలా కాశ్మీరలోయ ప్రకాశిస్తోంది. అది అంత అందమైన లోయ కాబట్టే ప్రభుత్వం వారు కూడా అక్కడ ‘స్టాప్ అండ్ సీ బ్యూటిఫుల్ బనిహాల్’ (ఆగి బనిహాల్ సౌందర్యాన్ని దర్శించండి) అనే బోర్డు పెట్టి యాత్రికుల మనస్సులను సైతం అటువైపుకు తిప్పే ప్రయత్నం చేశారు.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 8 సముద్ర‌లంఘ‌నం

ప్రశ్న 2.
ప్రాచీన కావ్యాలకు సంబంధించిన వర్ణనాత్మక పాఠ్యాంశాలను చదవడం వల్ల కలిగే ప్రయోజనాలను రాయండి.
జవాబు:
సనాతనమైన భారతీయ సంస్కృతిలో సాహిత్య సంపదకు సమాన్నతమైన స్థానం ఉంది. మన సంస్కృతిలో కావ్య సంపద ఉన్నతమైంది. మన తెలుగు సాహిత్యంలో ఎన్నో వర్ణనాత్మక కావ్యాలు ఉన్నాయి. వాటికి సంబంధించిన పాఠ్యాంశాలు కూడా చెప్పుకోదగ్గ రీతిలో ఉన్నాయి. వర్ణనాత్మక పాఠ్యాంశాలను చదవడం వల్ల విద్యార్థులకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. వాటిలో కొన్ని.

  • మన ఇతిహాసాలకు సంబంధించిన కళాత్మక రూపాలను, సుందర ప్రదేశాల విశిష్ఠతను తెలుసుకొనవచ్చు.
  • వర్ణనల్లో ఉండే అందాలను, అనుభూతులను గ్రహించవచ్చు.
  • మనం చూడలేని ప్రకృతి దృశ్యాల అందాలను విద్యార్థులు తెలుసుకోవచ్చు.
  • వర్ణనల్లో ఉండే అలంకార మధురిమలను తెలుసుకోవచ్చు.
  • శైలి భేదాలను, రసాత్మకతను గ్రహింపవచ్చు.
  • ప్రాచీన కవుల అలంకారప్రయోగాలను, నుడికారాలను, యాసలను, సామెతలను తెలుసుకోవచ్చు.

ఈ రకంగా ప్రాచీన వర్ణనాత్మక పాఠంను చదవడం వల్ల మనకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. తరతరాల వారసత్వాన్ని తెలుసుకొని భావితరాలకు అందించవచ్చు.

ప్రశ్న 3.
హనుమంతుడు సముద్రలంఘనం చేసేటప్పటి పరిస్థితిని బట్టి అతని బలాన్ని ఊహించి రాయండి.
జవాబు:
సముద్రాన్ని దాటడానికి సిద్ధమైన హనుమంతుడు, మహేంద్ర పర్వతంపై అడుగులు నొక్కిపెట్టి వేసినపుడు, పిడుగులు పడ్డట్లుగా అక్కడ పెద్ద పెద్ద రాళ్ళు పగిలి పడిపోయాయి. దీనిని బట్టి హనుమంతుడు గొప్ప బరువు కలవాడని తెలుస్తోంది. హనుమంతుడు వేగంగా తోకను తిప్పినప్పుడు, ఆ వేగానికి పెద్ద పెద్ద అడవులు సైతం ఖాళీ ప్రదేశాలు అయ్యాయి. చెట్లు అన్నీ కూలిపోయాయి. దీనినిబట్టి హనుమంతుడు వాయుదేవుని మించిన వేగం గలవాడని తెలుస్తోంది.

హనుమంతుడు చేతితో చరిస్తే, కఱ్ఱతో కొట్టినట్లు ఏనుగులు, సింహాలు సైతం బెదరి పారిపోయాయి. దీనినిబట్టి హనుమంతుడి చేతిలో గొప్పబలం, శక్తి ఉందని తెలిసింది. హనుమంతుడు సింహనాదం చేస్తే, ఆ ధ్వనికి గుహలు సైతం ప్రతిధ్వనించాయి. దీనినిబట్టి హనుమంతుని సింహనాదం, కర్ణకఠోరంగా భయంకరంగా ఉంటుందని తెలిసింది.

హనుమంతుడు నడుస్తూంటే, కొండలు కంపించిపోయాయి. ఆ కంపనాలకు కొండలపై ఉన్న సెలయేటి కెరటాలు ఆకాశాన్ని అంటేటట్లు ఎగసిపడ్డాయి. దీనినిబట్టి హనుమంతుడు మహాబలవంతుడని అపారశక్తి సామర్థ్యాలు కలవాడని మనకు తెలుస్తోంది.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 8 సముద్ర‌లంఘ‌నం

ప్రశ్న 4.
అందరు వానర వీరుల్లో హనుమయే సముద్రలంఘనానికి సమర్థుడని ఎలా గుర్తించారు?
జవాబు:
ఈ ప్రశ్నకు జవాబు, మన పాఠంలో లేదు. అయినా రామాయణాన్ని బట్టి, దీనికి సమాధానం ఇలా ఉంటుంది.

సీతను అపహరించిన రావణుని గూర్చి, లంకా నగరాన్ని గూర్చి సంపాతి, వానరులకు చెప్పింది. దానితో వానరులు సముద్రాన్ని దాటడంలో వారి వారి శక్తి సామర్థ్యాలను గూర్చి చెప్పారు.

వానరులలో కొందరు తాము 50 యోజనాల దూరం’ దాటగలం అన్నారు. జాంబవంతుడు తాను 90 యోజనాల దూరం దాటగలనన్నాడు. యువరాజైన అంగదుడు తాను సూరుయోజనాల సముద్రాన్ని దాటగలను గాని, తిరిగి రాలేనేమో అన్నాడు.

అప్పుడు జాంబవంతుడు అంగదుడు యువరాజు కాబట్టి అతడు లంకకు వెళ్ళడం తగదని చెప్పాడు. జాంబవంతుడు హనుమంతుని దగ్గరకు వెళ్ళి, అతడు వాయుపుత్రుడని సముద్రాన్ని దాటగలడని చెప్పాడు. హనుమంతుడు చిన్నప్పుడే సూర్యుడిని చూసి పండు అనుకొని నూరు యోజనాలు ఎగిరాడని అతనికి గుర్తు చేశాడు. బ్రహ్మవరం వల్ల హనుమంతుడిని వజ్రం కూడా ఏమి చేయలేదన్నాడు.

దానితో హనుమంతుడు తన శక్తిని వెల్లడించాడు. వేలకొద్దీ యోజనాల దూరం తాను దాటగలనని ప్రకటించాడు. అందువల్ల హనుమయే సముద్రలంఘనానికి సమర్థుడని వానర వీరులు గుర్తించారు. హనుమంతుడిని మెచ్చుకొని సీతాన్వేషణకు అతడినే పంపారు.

ప్రశ్న 5.
మీ పాఠం ఆధారంగా హనుమంతుడి సమర్థతను వివరించండి.
జవాబు:
హనుమంతుడి సమర్దత :
హనుమంతుడు సముద్రం పైకి ఎగిరేటప్పుడు మహేంద్ర పర్వతం పై పాదాలు నొక్కివేస్తే పిడుగులు పడినట్లుగా పెద్దరాళ్ళు పగిలిపోయాయి. హనుమ తోకను త్రిప్పిన గాలివేగానికి అడవులు అన్నీ కూలి శూన్య ప్రదేశాలు ఏర్పడ్డాయి. హనుమ చేతితో చరిస్తే కల్టుతో కొట్టినట్లు ఏనుగులు, సింహాలు పారిపోయాయి. హనుమ సింహనాదం చేస్తే పోటీపడ్డట్లు గుహలు ప్రతిధ్వనించాయి. కొండలు కంపించాయి. ఆ కంపనాలకు కొండలపై సెలయేళ్ళు ఆకాశానికి ఎగసిపడ్డాయి.

హనుమంతుడు శరీరాన్ని ధరించిన వాయుదేవుడు వలె ఉన్నాడు. హనుమ తన శరీరాన్ని పెంచితే, పర్వత శిఖరాలు కదలిపోయాయి.

హనుమంతుడు మహేంద్రగిరిని అణగదొక్కి, ఆకాశంపైకి ఎగిరినప్పుడు పర్వతము ఎగిరినట్లు కనబడింది. దానిని బట్టి హనుమ, పర్వతం అంత ఆకారంలో ఉన్నాడని తెలుస్తుంది.

హనుమంతుడి కాలిపిక్కల నుండి పుట్టిన గాలివేగానికి సముద్రం లోతుగా చీలిపోయింది. హనుమంతుడి కాలిపిక్కల నుండి వచ్చే గాలి వేగానికి సముద్రము మధ్య చీలినట్లు కనబడింది.

ఆ విధంగా చీలిన సముద్రాన్ని చూసినవారికి, రాముడి క్రోధరసము లంకకు చేరడానికి కాలువ త్రవ్వారేమో అనిపించింది. రాబోయే కాలంలో కట్టబోయే సేతువుకు పునాది త్రవ్వారేమో అనిపించింది. హనుమంతుడిని చూడ్డానికి పాతాళంలోని ఆదిశేషువు వచ్చి తలుపులు తెరిచాడేమో అన్నట్లు కనబడింది. హనుమంతుడు భూదేవికి కీర్తి వస్త్రాలను అర్పించి, ఆమె ధరించిన నల్లని వస్త్రాలను చీల్చివేసినట్లు కనబడింది. హనుమంతుడు మహా సమర్థుడు.

ప్రశ్న 6.
సముద్రలంఘనానికి ముందు హనుమంతుని చేష్టలు సమర్థనీయమా? చర్చించండి.
జవాబు:
సముద్రమును దాటడానికి ముందు హనుమంతుడు మహేంద్రగిరిపై గట్టిగా ఒత్తి అడుగులు వేసి కొండ రాళ్ళను పగుల గొట్టాడు. తన తోకను త్రిప్పి ఆ గాలివేగంతో చెట్లను కూలగొట్టాడు. క్రూర జంతువులను సైతం బెదిరించి పారిపోయేటట్లు చేశాడు. గుహలు ప్రతిధ్వనించేలా సింహనాదం చేశాడు. పర్వత శిఖరాలు కంపించిపోయేలా చేసి, సెలయేరులోని నీళ్ళు ఆకాశానికి తగిలేలా చేశాడు.

ఈ పనుల వల్ల హనుమంతుడు తన శక్తిని, బలాన్ని మిగిలిన వానరులకు చూపించాడు. సముద్రమును దాటడం ఎలాగా అని, ఆందోళన పడుతున్న తనతోడి వానరులకూ, యువరాజు అంగదుడికీ, ధైర్యం చేకూర్చాడు. తాను సముద్రాన్ని దాటివెళ్ళి సీత జాడను తెలిసికొని రాగలనని, తనవారికి ధైర్యం కల్పించాడు. తాను మహాశక్తివంతుడననీ, కొండలను పిండి చేయగలనని నిరూపించాడు.

తాను వాయుదేవుని అనుగ్రహంతో ఎంతటి సాహసకార్యం అయినా చేయగలనని తనవారికి భరోసా కల్పించాడు. హనుమంతుడు మహాశక్తివంతుడని, బలవంతుడని ఈ చర్యల ద్వారా మిగిలిన వానరులకు అర్థమయ్యింది. వారి ఆరాటం శాంతించింది. కాబట్టి సముద్రమును దాటే ముందు హనుమంతుడు చేసిన చేష్టలు, సమంజసంగానే ఉన్నాయి.

ప్రశ్న 7.
మీ పాఠం ఆధారంగా హనుమంతుని స్వభావాన్ని విశ్లేషించండి.
జవాబు:
హనుమంతుడు మహాబలవంతుడు. ధైర్యశాలి. సాహసం కలవాడు. దృఢమైన దీక్ష కలవాడు. కార్యసాధకుడు. అందువల్లనే సముద్రలంఘనానికి తాను సిద్ధపడ్డాడు.

హనుమంతుడి శక్తి బలములు :
హనుమంతుడి బలము, శక్తి, ధైర్యము అసమానములైనవి. .సముద్రం దాటడానికి అతడు పర్వతంపై ఒత్తి అడుగులు వేస్తే కొండరాళ్ళన్నీ, పగిలిపోయాయి. అతడు తోకను త్రిప్పిన గాలి వేగానికి చెట్లన్నీ కూలిపోయాయి. అతడు చేతితో చరిస్తే క్రూర జంతువులు సైతం పారిపోయాయి. అతడు సింహనాదం చేస్తే, గుహలు ప్రతిధ్వనించాయి. హనుమంతుడి పాదాల ఒత్తిడికి పర్వతాలు కంపించి, ఏరులలోని జలాలు ఆకాశానికి ఎగసిపడ్డాయి.

పర్వతం అంత ఆకారము:
హనుమంతుడు తన శరీరాన్ని పెంచితే సాక్షాత్తు అతని తండ్రి వాయుదేవుడిలా కనిపించాడు. అతడు ఎగురుతూ ఉంటే, పర్వతం ఎగిరినట్లు కనిపించింది.

సోదర వానరులకు ధైర్యం :
హనుమంతుడు సముద్రంపై ఎగిరే ముందు, తన శక్తి సామర్థ్యాలను తోడి వానరులకు చూపించి తప్పక తాను సీత జాడ తెలిసేని రాగలనని వారికి ధైర్యం కల్పించాడు. హనుమంతుడు మహేంద్ర గిరిపై పాదాలు తొక్కిపెట్టి, పైకి లేవగా ఆ పర్వతమే భూమిలోకి దిగిపోయింది.

కాలిపిక్కల వేగం :
హనుమంతుడు ఎగిరేటప్పుడు అతడి కాలిపిక్కల నుండి వచ్చిన గాలి వేగానికి, సముద్రము చీలిపోయింది. అది రాముడి క్రోధరసం లంకకు చేరడానికి తవ్విన కాలువలా, సేతువు కట్టడానికి తవ్విన పునాదిలా, బలి చక్రవర్తి ఇంటి వాకిలిలా కన్పించింది.

దీనినిబట్టి హనుమంతుడు మహాబలవంతుడని, ధైర్యం కలవాడని, గొప్ప సాహసవంతుడని, కార్యసాధకుడని తెలుస్తోంది.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 8 సముద్ర‌లంఘ‌నం

ప్రశ్న 8.
సముద్రలంఘనం పాఠంలో కవి చాతుర్యాన్ని విశ్లేషించండి.
జవాబు:
సముద్రలంఘనం పాఠం అయ్యలరాజు రామభద్రుడు రచించిన ‘రామాభ్యుదయం’ ప్రబంధములోనిది. ఈ కవి గొప్ప – కవితాచాతుర్యం కలవాడు. గొప్ప భావకుడు, మంచి కవితాశక్తి కలవాడు. ఆలంకారిక సిద్ధహస్తుడు.

ఈ పద్యాలలో స్వభావోక్తి, ఉత్ప్రేక్షాలంకారాలు చక్కగా ఉన్నాయి. హనుమంతుడు ఎగరడానికి ముందు చేసిన చేష్టల వర్ణన, చక్కని స్వభావోక్తిలో ఉంది. హనుమంతుడి అడుగులకు కంపించి ఎగిరిన సెలయేళ్ళ జలాలు, ఆకాశం ఎత్తు ఎగిరి దావాగ్నులను, వానరుల మనస్సులలోని తాపాన్ని చల్లార్చాయని కవి చక్కగా చెప్పాడు.

హనుమంతుడు ఎగిరినప్పుడు వచ్చిన పిక్కలగాలికి సముద్రం రెండుగా లోతుగా చీలి పోయిందట. అప్పుడు అది ఆ రాముని క్రోధరసాన్ని లంకకు చేరడానికి తవ్విన కాలువలా, సేతు నిర్మాణానికి తవ్విన పునాదిలా, హనుమంతుడిని చూడ్డానికి శేషుడు వచ్చి తలుపు తెరిచిన బలిమందిరంలా ఉందని, అద్భుతమైన ఉత్ర్ఫేక్షలు ఇక్కడ కవి ప్రయోగించాడు.

రామభద్రకవి ఊహాశక్తికి జోహార్లు అర్పిద్దాం.

10th Class Telugu 8th Lesson సముద్ర‌లంఘ‌నం Important Questions and Answers

ప్రశ్న 1.
హనుమంతుడు సముద్రలంఘనం చేసేటప్పుడు ప్రకృతి ఎలా సహకరించింది?
జవాబు:
హనుమంతుడు సముద్రలంఘనం చేసేటప్పుడు ప్రకృతి అనేక విధాలుగా సహకరించింది. రామ కార్యానికి వెళ్తున్న హనుమంతుడికి సూర్యుడు తాపాన్ని కలిగించలేదు. వాయువు చల్లగా ప్రసరించాడు. దేవతలు, గంధర్వులు, మహర్షులు కీర్తించారు. హనుమంతునికి శ్రమ కలుగకూడదని సముద్రుడు భావించాడు. సముద్రుని ఆజ్ఞపై మైనాకుడు సముద్రం నుండి బయటికి వచ్చి హనుమంతుడ్ని కొంతసేపు తన బంగారు శిఖరాల మీద విశ్రాంతి తీసుకోమన్నాడు.

ప్రశ్న 2.
సముద్రలంఘనం పాఠం కథ రూపంలో రాయండి.
జవాబు:
హనుమంతుడు మహాబలవంతుడు. అతడు సముద్రాన్ని దాటేముందు శరీరాన్ని పెంచి మహేంద్రగిరిపై అడుగులు వేశాడు. అప్పుడు పిడుగులు పడ్డట్లు రాళ్ళు పగిలిపోయాయి. హనుమంతుడు తోకను త్రిప్పినప్పుడు వచ్చిన గాలి వేగానికి చెట్లు కూలిపోయాయి. అతడు చేతితో చరిస్తే భయపడి క్రూర జంతువులు పారిపోయాయి. అతడు చేసిన సింహనాదానికి గుహలు ప్రతిధ్వనించాయి. కొండలు కంపించాయి. కొండలపై సెలయేళ్ళ కెరటాలు ఎగసిపడి ఆకాశాన్ని తాకాయి. హనుమంతుడు పెరిగి మహేంద గిరిపై నిలిచాడు.

హనుమంతుడు సముద్రం వైపు చూసి, తన రెండు చెవులు రిక్కించి, వంగి, చేతులను నడుముకు ఆనించి, తోకను ఆకాశం మీదికి పెంచి, పాదాలు దగ్గరగా పెట్టి, గాలి గట్టిగా పీల్చి, తాను నిలబడ్డ కొండను అణగదొక్కి పైకి ఎగిరాడు.

హనుమంతుడు ఎగురుతూ ఉంటే, పర్వతము ఎగిరినట్లు అనిపించింది. హనుమంతుడు విల్లు నుండి విడిచిన బాణంలా పెద్ద ధ్వనితో లంకవైపు దూసుకుపోయాడు.

హనుమంతుడు తోకతో ఎగరడం చూసిన దేవతలు, సూర్యుడు మహా వేగంగా కాడి ఉన్న తన రథాన్ని అటువైపు తోలుకు వస్తున్నాడేమో అనుకొన్నారు. హనుమంతుని పిక్కల నుండి వచ్చిన గాలి వేగానికి, సముద్రం లోతుగా చీలింది. ఆ గాలి పాతాళంలో ఉన్న పాములకు, ఆహారం వచ్చిందేమో అనిపించింది.

హనుమంతుడి పిక్కల బలంతో వీచిన గాలి వేగానికి సముద్రం చీలినట్లు కాగా, రాముని క్రోధరసం లంకకు చేరడానికి తవ్విన కాలువలా, రాబోయే కాలంలో కట్టే సేతువుకు పునాదిలా, ఆదిశేషుడు తలుపులు తెరిచిన బలిమందిరం యొక్క వాకిలిలా కనిపించింది. హనుమ, త్రికూటాద్రి పై దిగాడు.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 8 సముద్ర‌లంఘ‌నం

ప్రశ్న 3.
‘సామాన్యులు కూడా అద్భుతాలు సాధించగలరు’ అనే అంశం దృష్టిలో పెట్టుకొని సామాన్య విద్యార్థులను ప్రోత్సహిస్తూ కరపత్రం తయారు చెయ్యండి.
జవాబు:

(కరపత్రం )

విద్యార్థినీ, విద్యార్థులారా ! ఒక్కసారి ఆలోచించండి. మనం మన దృష్టిని చదువు పైనే కేంద్రీకరిద్దాం. కొద్దిగా పరీక్షల్లో మార్కులు తక్కువ వచ్చాయని మనం నిరుత్సాహపడకూడదు. మనం ప్రభుత్వ స్కూళ్ళలో చదువుతున్నాం, కాన్వెంట్లకు వెళ్ళలేక పోతున్నాం అని బాధపడకండి.

కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు. కృషి చేస్తే సామాన్యులు సైతం, ఎంతో ఎత్తుకు ఎదుగుతారు. మొన్న ఐ.ఎ.యస్ పరీక్ష ఫలితాలు గమనించండి. ఒక కూలి వాని బిడ్డ, ఒక ఫ్యాక్టరీ గుమస్తా కుమార్తె, ఒక మత్స్యకారుని కుమారుడు, ఒక దర్జీ కొడుకులు, కూతుళ్ళు ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియంలో చదివి ఐ.ఎ.యస్ పరీక్షలలో మంచి ర్యాంకులు సాధించారు. సామాన్య విద్యార్థులు సైతం ఐ.ఐ.టీలలో సీట్లు సాధించి, లక్షలు, కోట్ల జీతాలపై నేడు ఉద్యోగాలు చేస్తున్నారు.

కొందరు స్వయంకృషితో మంచి వ్యాపారవేత్తలుగా, మంచి ప్రతిభావంతులైన ఉద్యోగులుగా, రాజకీయనాయకులుగా తయారవుతున్నారు. టీలు అమ్మిన మన మోదీ గారు నేడు మన ప్రధాని అయ్యారు. విదేశాలలో మంచి ప్రధానమంత్రిగా ఆయన రాణిస్తున్నాడు. ఎందరో చిన్న చిన్న పనివారల పిల్లలు, పెద్ద జీతాలు సాధిస్తున్నారు. MP లుగా, MLA లుగా పేరు సంపాదిస్తున్నారు.

అందుకే నేను సామాన్యుడనని మీరు అనుకోకండి. కృషి చేయండి. పట్టుదల పట్టండి. గొప్పవారు కావాలనే కలలు కనండని మన మాజీ రాష్ట్రపతి కలామ్ మనకు చెప్పిన మాటలు మరచి పోకండి. చిన్న చిల్లర కొట్టు యజమాని కొడుకు మన అబ్దుల్ కలామ్, గొప్ప శాస్త్రవేత్తగా, పరిపాలనా దక్షుడైన రాష్ట్రపతిగా ఆయన కీర్తిని సంపాదించాడు కదా !

అందరూ సంపన్నులుగా, తెలివి కలవారుగా, పెట్టి పుట్టిన వారుగా పుట్టరు. మనమే భవిష్యత్తును బంగారం చేసుకోవాలి. కాబట్టి ప్రయత్నించండి. గొప్పవారు కండి.

రాష్ట్ర విద్యార్థి యూనియన్,
విజయవాడ.

ప్రశ్న 4.
గ్రంథాలయాల ఆవశ్యకత, ప్రయోజనాలు, సంరక్షణ గురించి అవగాహన కల్పిస్తూ కరపత్రం తయారుచేయండి.
జవాబు:

(కరపత్రం )

మిత్రులారా !

“చిరిగిన చొక్కా అయినా తొడుక్కో – కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కో” అన్నది సూక్తి. ఇటువంటి సూక్తులెన్నో పుస్తకాల ప్రాముఖ్యాన్ని, ప్రాశస్త్యాన్ని వివరించేవి వున్నాయి. తరతరాల విజ్ఞాన సంపదను అందించేవి గ్రంథాలు. అటువంటి గ్రంథాలు గల నివాసాన్ని గ్రంథాలయం (Library) అంటారు.

ప్రపంచంలో గొప్ప గొప్ప గ్రంథాలయాలున్నాయి. ఆమెరికాలో గల ‘కాంగ్రెసు లైబ్రరీ’, రోము నగరంలోని ‘వాటికన్ లైబ్రరీ’, ‘బ్రిటిష్ లైబ్రరీ’ మొదలైనవి ప్రపంచంలో పేరొందాయి. మనదేశంలో చెన్నైలోని “కన్నెమరా” గ్రంథాలయం, తంజావూరులోని “సరస్వతీ మహలు”, వేటపాలెంలోని “సారస్వత నికేతనం”, హైదరాబాదులోగల “శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయం” మొదలైనవి చెప్పుకోదగ్గవి చాలా ఉన్నాయి. కడపలో సి.పి. బ్రౌన్ స్మారక గ్రంథాలయం కూడా నెలకొల్పబడింది.

గ్రంథాలయాలలో చాలా రకాలున్నాయి. ప్రభుత్వ గ్రంథాలయాలు, స్వచ్ఛంద సంస్థల గ్రంథాలయాలు వున్నాయి. గ్రంథాలయాల వల్ల చాలా లాభాలున్నాయి :

  1. గ్రంథాలయాలు మనిషిని మనీషిగా మారుస్తాయి.
  2. మహామేధావులు తరతరాలుగా సంపాదించిన అనుభవాలు, ఆలోచనలు గ్రంథాలలో భద్రపరచబడతాయి.
  3. దేశాభ్యుదయానికి, సమాజవికాసానికి మూలస్తంభాలు గ్రంథాలయాలు.
  4. గ్రంథపఠనమనే మంచి అలవాటు అలవడుతుంది.
  5. గ్రంథాలు తండ్రివలె ఆదేశిస్తాయి. తల్లివలె లాలిస్తాయి. మిత్రుని వలె ఆదుకుంటాయి. గురువువలె ప్రబోధిస్తాయి.

గ్రంథాలయాధికారులు పుస్తకాలు కొనేటప్పుడు అత్యంత శ్రద్ధ వహించాలి. డబ్బును దుర్వినియోగం చెయ్యకుండా మంచి పుస్తకాలనే కొనాలి. హాని కలిగించు పుస్తకాలను నిర్మొహమాటంగా తిరస్కరించాలి. పోటీ పరీక్షలకి, ఉద్యోగ పరీక్షలకి, చదువుకి కావలసిన పాఠ్య గ్రంథాలు, క్విజ్ పుస్తకాల వంటివాటికి ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రభుత్వం గ్రంథాలయోద్యమాన్ని నీరుకార్చకుండా తగిన శ్రద్ధవహిస్తే సమాజం అభ్యుదయ పథంలో పయనిస్తుంది.

ఇట్లు
గ్రంథాలయాల అభివృద్ధి మండలి

ప్రశ్న 5.
అయ్యలరాజు రామభద్రుని కవితా విశిష్టతను తెలుపుతూ మిత్రునికి లేఖ రాయండి.
జవాబు:

తిరుపతి,
x x x x

ప్రియమైన మిత్రుడు సతీష్ చంద్రకు,

నీ మిత్రుడు వ్రాయునది. నేను బాగా చదువుతున్నాను. నీవు కూడా బాగా చదువుతున్నావని ఆశిస్తున్నాను. ముఖ్యముగా వ్రాయునది మా తెలుగు పాఠ్యాంశాల్లో సముద్రలంఘనం పాఠం ఒకటి. ఇది వర్ణనాత్మక పాఠం. దీన్ని అయ్యలరాజు రామభద్రుడు అనే కవి రచించాడు. రామభక్తుని వర్ణనాత్మక రచన అందరిని ఆకట్టుకుంటుంది. ఈ మహాకవి వర్ణనలు సహజంగా ఉంటాయి. ప్రకృతి దృశ్యాలను కళ్ళకు కట్టినట్టుగా తెలియచేశారు. హనుమంతుని పరారకమాన్ని సుమనోహరంగా వర్ణించాడు. అందువల్లనే నాకు రామభద్రుని వర్ణనాత్మక రచన అంటే ఇష్టం. నీవు ఏ కవిని అభిమానిస్తావో నాకు తెలియజేయి. పెద్దలందరికి నమస్కారములు తెలుపగలవు.

ఇట్లు,
నీ ప్రియ మిత్రుడు,
x x x x x x

చిరునామా :
వి.సతీష్ చంద్ర, 10వ తరగతి,
జిల్లాపరిషత్ బాలుర ఉన్నత పాఠశాల,
మంగళగిరి, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్.

ప్రశ్న 6.
మీ ప్రాంతంలో ప్రవహించే నదిని వర్ణిస్తూ, ఒక కవితా గేయం రాయండి.
జవాబు:
మా ప్రాంతంలో గౌతమీ నది ప్రవహిస్తోంది.
కవితా గేయం :

“సప్తర్షి సంఘాన గౌతముడు పెద్ద
వనము పెంచెను ఋషి ఫలవృక్షములను
గోవొకటి దానిని భగ్నంబు చేసె
గౌతముడు కోపాన కనువిచ్చి చూసే
భస్మమయ్యెను గోవు మునికోపదృష్టి
ఋషిమండలంబంత నిందించె ఋషిని
గౌతముడు తాపమున తపము చేయంగ
పరమేశుడప్పుడు ప్రత్యక్షమయ్యె
గోవు స్వర్గతి చెంద శివు డంత కరుణ
గోదావరీనదిని సృష్టించి విడిచె
నాసిక్కు క్షేత్రాన గోదావరీ మాత
సన్నని పాయగా ప్రభవించెనంత
ప్రవహించి జలము గోభస్మమును ముంచె
గోవు స్వర్గతి చెంద మునియు హర్షించె
గోదావరీ పాయ గౌతమి నదియై
సాగు తాగునీరు జనులకు నందించె
మోక్షమ్ము తా నొసగె దేహమ్ము ముంప
స్వర్గమోక్షదమ్ము గోదావరమ్ము
వేద నాదం బొలుకు దాని కమ్ర రవమ్ము”

10th Class Telugu 8th Lesson సముద్ర‌లంఘ‌నం 1 Mark Bits

1. దనువు అనే స్త్రీ యందు పుట్టిన వాళ్ళు. వీరు దేవతలకు శత్రువులు – గీత గీసిన పదానికి వ్యుత్పత్యర్థ పదాన్ని గుర్తించండి. (June 2017)
A) దానవులు
B) ధర్మాత్ములు
C) దుర్జనులు
D) దుష్టులు
జవాబు:
A) దానవులు

2. అపారమైన తీరము గలది – (వ్యుత్పత్తిని చెప్పే పదం గుర్తించుము. ) (March 2017)
A) పారాశర్యుడు
B) పారావారం
C ) తాపసుడు
D) కార్ముకం
జవాబు:
B) పారావారం

AP SSC 10th Class Telugu Important Questions Chapter 8 సముద్ర‌లంఘ‌నం

3. యమకాలంకారానికి ఉదాహరణ గుర్తించుము. (March 2017)
A) రాజు కువలయానందకరుడు
B) మా పొలంలో బంగారం పండింది
C) లేమా ! దనుజుల గెలవగ లేమా !
D) శ్రీనాథు వర్ణించు జిహ్వజిహ్వ
జవాబు:
C) లేమా ! దనుజుల గెలవగ లేమా !

4. ‘హరి భజియించు హస్తములు హస్తములు’ ఇందులోని అలంకారం గుర్తించండి. (June 2018)
A) లాటానుప్రాసము
B) ఛేకానుప్రాసము
C) యమకము
D) ముక్తపదగ్రసము
జవాబు:
A) లాటానుప్రాసము

5. హనుమంతుడు పర్వతమెక్కాడు – (వ్యతిరేకార్థక వాక్యాన్ని గుర్తించండి) (S.I. I – 2018-19)
A) హనుమంతుడు పర్వతమెక్కుటలేదు.
B) హనుమంతుడు పర్వతమెక్కలేడు.
C) హనుమంతుడు పర్వతమెక్కుట కష్టం.
D) హనుమంతుడు పర్వతమెక్కలేదు.
జవాబు:
D) హనుమంతుడు పర్వతమెక్కలేదు.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 5 ధన్యుడు

AP State Board Syllabus AP SSC 10th Class Telugu Important Questions Chapter 5 ధన్యుడు

AP State Syllabus SSC 10th Class Telugu Important Questions 5th Lesson ధన్యుడు

10th Class Telugu 5th Lesson ధన్యుడు 2 Marks Important Questions and Answers

ఈ క్రింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాల్లో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
ధన్యుడు పాఠం నేపధ్యాన్ని వివరించండి.
జవాబు:
మంచి స్నేహితులను మనం కలిస్తే, ఆ కలయిక, మన జీవితాన్ని ఒక చక్కని దారివైపునకు తిప్పుతుంది. అందుకే మనము ఎప్పుడూ మంచి స్నేహితులను కలిగియుండాలని, మన పెద్దవాళ్లు మనకు చెపుతారు. మంచి స్నేహితులతో స్నేహం మనకు మేలు చేస్తుందనీ, సత్పురుషులతో కలయిక ఎప్పటికీ మంచిది అనీ, చెప్పడమే ఈ పాఠం నేపథ్యం.

ప్రశ్న 2.
ధన్యుడు పాఠంలో నిజమైన ధన్యుడు ఎవరు? ఎట్లు చెప్పగలవు? (March 2017)
(లేదా)
నిజంగా “ధన్యుడు” ఎవరో “ధన్యుడు” పాఠ్యభాగం ఆధారంగా తెల్పండి. (June 2019)
జవాబు:
ధన్యుడు పాఠంలో నిజంగా ధన్యుడు “హిరణ్యకుడు” అనే పేరు గల ఎలుక.

హిరణ్యకుడు అనే ఎలుక, మొదట ధనలోభంతో సంచరించింది. తరువాత తెలివి తెచ్చుకొని ధనలోభాన్ని విడిచి ఉన్నదానితో తృప్తి పడ్డవాడే ధన్యుడు అని నిశ్చయించి, నిర్జనారణ్యంలో నివసించింది.

అక్కడ హిరణ్యకుడికి లఘుపతనకం అనే కాకితో మైత్రి కల్గింది. లఘుపతనకం ద్వారా మంథరుడు అనే తాబేలుతో మైత్రి కల్గింది. మంథరుడి అమృతం వంటి మాటలు, హిరణ్యకుడి తాపాన్ని చల్లార్చి, అతణ్ణి మరింతగా ధన్యుణ్ణి చేశాయి.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 5 ధన్యుడు

ప్రశ్న 3.
ధన్యుడు పాఠం ఎవరు వ్రాశారు? ఆయన గురించి వ్రాయండి.
(లేదా)
“ధన్యుడు” పాఠ్యభాగ రచయితను గూర్చి రాయండి. (S.N. I – 2019-207)
జవాబు:
ధన్యుడు పాఠమును పరవస్తు చిన్నయసూరిగారు రచించారు. ఆయన 1809వ సంవత్సరంలో జన్మించారు. ఆయన తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లాలోని, పెరంబుదూరులో జన్మించాడు. చిన్నయసూరి తండ్రి వేంకట రంగ రామానుజా చార్యులుగారు. తల్లి శ్రీనివాసాంబ. ఆయన నీతిచంద్రిక, బాలవ్యాకరణం, సూత్రాంధ్ర వ్యాకరణం మొదలైన గ్రంథాలు రాశారు.

ప్రశ్న 4.
ధన్యుడు పాఠ్యభాగ రచయిత ఎవరు? ఆయన పాండిత్యం, రచనల గూర్చి వ్రాయండి.
జవాబు:
ధన్యుడు పాఠమును పరవస్తు చిన్నయసూరిగారు రచించారు. ‘సూరి’ అనగా పండితుడు. ఆయన తెలుగు, తమిళం, సంస్కృతం, ఆంగ్ల భాషలలో పండితుడు.

ఆయన అక్షరగుచ్ఛము, ఆంధ్ర కాదంబరి, పద్యాంధ్ర వ్యాకరణం, బాలవ్యాకరణం, నీతిచంద్రిక, సూత్రాంధ్ర వ్యాకరణం, శబ్దలక్షణసంగ్రహము మొదలైన గ్రంథాలు రాశారు.

చిన్నయసూరి రచనా శైలి పాఠకుడిని ఆకట్టుకొనేలా ఉంటుంది. ఆయన ప్రాచీన కావ్య భాషలో రచించారు.
ఆయన పచ్చయ్యప్పకళాశాలలో తెలుగు పండితునిగా పనిచేశారు.

ప్రశ్న 5.
చిన్నయసూరి గురించి, ఆయన విశిష్ట రచనల గురించి వివరింపుము.
జవాబు:

  1. పరవస్తు చిన్నయసూరి తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లాలో “శ్రీ పెరంబుదూర్”లో జన్మించాడు. ఈయన మద్రాసులోని పచ్చయ్యప్ప కళాశాలలో తెలుగు పండితుడుగా పనిచేశాడు.
  2. ఈయన తమిళం, సంస్కృతం, తెలుగు, ఇంగ్లీషు భాషలలో మంచి పండితుడు. ‘సూరి’ అనేది ఈయన బిరుదు.
  3. చిన్నయసూరి బాలవ్యాకరణం, నీతిచంద్రిక, సూత్రాంధ్ర వ్యాకరణం, శబ్దలక్షణసంగ్రహం వంటి గ్రంథాలు రాశాడు.

ఈయన రాసిన బాలవ్యాకరణం నేటికీ ప్రామాణిక గ్రంథం.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 5 ధన్యుడు

ప్రశ్న 6.
ధన్యుడు పాఠం ఆధారంగా ధనలోభం వల్ల ఎలాంటి నష్టాలు ఉంటాయో నాలుగైదు వాక్యాల్లో రాయండి.
జవాబు:
ధన లోభం అంటే ధనం సంపాదించాలనే దురాశ, అత్యాశ. ధనలోభం ఆపదలు అన్నింటికీ మూలం. ధనలోభాన్ని విడిచిపెట్టడం కంటె, గొప్ప సుఖం ఉండదు.

కడుపుకోసం ఇతరులను యాచించకుండా లభించిన దానితో తృప్తిపడేవాడు. లోకంలో ధన్యుడు. అటువంటి వాడే సుఖవంతుడు.

ధనలోభం వల్ల మోహం కలుగుతుంది. మోహం దుఃఖాన్ని కలిగిస్తుంది. దుఃఖం అగ్నిలా తన స్థానానికి నాశం – కల్గిస్తుంది. కాబట్టి ధనలోభం పనికి రాదు.

ప్రశ్న 7.
ఎక్కడి ఎలుక? ఎక్కడి చిలుక కొయ్య? అనడంలో అంతరార్థం ఏమిటి?
జవాబు:
సాధారణంగా అంతరం ఎక్కువ ఉండేవాటి పట్ల ఈ విధంగా ప్రయోగిస్తారు. ఎలుక నేలపైనా, రంధ్రాలలోనూ ఉంటుంది. గోడను నిలువుగా ఎక్కువ దూరం ఎలుక ప్రాకలేదు. చిలుకకొయ్య గోడకి మధ్యలో ఉంటుంది. అటువంటి , చిలుకకొయ్య పైకి ఎలుక చేరడం అసంభవం. అది సాధ్యం కానిది ఎలాగ సాధ్యమైంది అనేది దీనిలో అంతరార్థం. అలాగే ‘నక్క ఎక్కడ ? నాగ లోకము (స్వర్గం) ఎక్కడ?” అని కూడా అంటారు.

ప్రశ్న 8.
“ధనము సర్వశ్రేయములకు నిదానము” మీ అభిప్రాయం చెప్పండి.
జవాబు:
ఏ శుభకార్యం చేయాలన్నా ధనం కావాలి. ధనం లేకపోతే ఏ పనీ చేయలేము. అందుకే ప్రతి పుణ్యకార్యానికి అసలు కారణం ధనమే. అన్నదానం, భూదానం, గృహదానం మొదలైన ఏ దానం చేయాలన్నా ధనం కావాలి. చెరువు త్రవ్వించడం, దేవాలయాలు నిర్మించడం, పాఠశాల, ఆసుపత్రి మొదలైనవి నిర్మించడం ధర్మకార్యాలు. కాని ధనం లేకపోతే ఏ ధర్మకార్యాలు చేయలేము. అందుకే సర్వశ్రేయాలకు అసలు కారణం ధనం. మన ఉన్నతత్వానికి, గౌరవానికి, మర్యాదకు మన ధనమే అసలు కారణం.

ప్రశ్న 9.
‘దారిద్యము సర్వశూన్యము” అనే మాటను వ్యాఖ్యానించండి.
జవాబు:
దారిద్ర్యము అంటే బీదతనము: సర్వశూన్యము అంటే ఏమి లేనిది. అంటే ఇంటిలో పదార్థములు లేకుండా పోతాయి. అందువల్ల సుఖసంతోషాలు పోతాయి. దుఃఖము కలుగుతుంది. భార్యాబిడ్డలకు, కడుపునిండా తిండి పెట్టలేము. కాబట్టి దారిద్ర్యము అన్నింటినీ లేకుండా చేస్తుందని భావము.

ప్రశ్న 10.
‘ఆశ దిగనాడినవాడే సత్పురుషుడు’ – ఎట్లు?
జవాబు:
ఆశ అన్ని అనర్థాలకు మూలం. ఆశ పడినది దొరకకపోతే కోపం వస్తుంది. కోపంలో విచక్షణ కోల్పోతాము. పిసినిగొట్టుతనం పెరుగుతుంది. ఆశ మితిమీరితే అజ్ఞానం పెరుగుతుంది. అజ్ఞానం వలన గర్వం పెరుగుతుంది. గర్వం పెరిగితే ఎవ్వరితోటి స్నేహం చేయలేము. అందుచేత ఆశను విడిచిపెడితే సత్పురుషుడౌతాడు. మితిమీరిన ఆశ పనికి రాదు.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 5 ధన్యుడు

ప్రశ్న 11.
‘ధనహీనుడై నలుగురిలో ఉండరాదు. ఎందుకు?
జవాబు:
ధనహీనుడు అంటే ధనం లేనివాడు. ధనం ఉన్నప్పుడు సమాజంలో గౌరవం ఉంటుంది. హోదా ఉంటుంది. స్నేహితులు ఉంటారు. బంధువులు చేరతారు. అందరూ పలకరిస్తారు. నలుగురూ చేరతారు. కాని, ధనం లేకపోతే ఎవ్వరూ మాట్లాడరు. స్నేహితులు, బంధువులు కూడా పలకరించరు. గౌరవం, హోదా ఉండవు. ఇటువంటి అవహేళనలకు గురి అవుతూ నలుగురిలో ఉండకూడదు. ఎవరూ తెలియని ప్రదేశంలో ఉంటే ధనము లేనివాని ఆత్మాభిమానం దెబ్బ తినదు.

ప్రశ్న 12.
‘మనస్సు గట్టిపరచుకోవటం’ అంటే ఏమిటి?
జవాబు:
మనస్సు చంచలమైనది. అది ఇష్టం వచ్చినట్లు సంచరిస్తుంది. గట్టి పరచుకోవడం అంటే మనస్సును దృఢం చేసికోవడం, నిశ్చయం చేసుకోవడం అని అర్థం.

ప్రశ్న 13.
‘చచ్చిన తరి వెంట రాబోదు’ అనడంలో మీకేమి అర్థమయ్యింది?
జవాబు:
మనిషి చచ్చిపోయే సమయంలో అతడు సంపాదించిన ధనం వగైరా అతడి వెంట వెళ్ళదు. కాబట్టి తాను ధనాన్ని హాయిగా వెచ్చించి, కడుపు నిండా తినాలి. ఇతరులకు ఇంత పెట్టాలి. ఇతరులకు ఇవ్వక, తాను తినక, దాచిన డబ్బు చచ్చిపోయేటప్పుడు ఆ వ్యక్తి వెంట వెళ్ళదు అని నాకు తెలిసింది.

ప్రశ్న 14.
చూడాకర్ణుని స్వభావం గురించి వ్రాయండి.
జవాబు:
చూడాకర్ణుడు అమాయకపు సన్యాసి, చంపకవతి అనే పట్టణంలో నివసించేవాడు. తాను తినగా మిగిలిన భోజనం భిక్షాపాత్రలో పెట్టి చిలుకకొయ్యకు తగిలించేవాడు. దానిని ప్రతిరోజూ ఒక ఎలుక తినేసేది.

తన ఎదురుగానే ఎలుక చిలుకకొయ్యపైకి ఎగురుతుంటే, చప్పుడు చేస్తే బెదిరించాడు. అంతేకాని, ఆ ఎలుకకు అంత బలం, ధైర్యం కలగడానికి కారణం ఆలోచించలేదు. దాని బలాన్ని, బలగాన్ని కొల్లగొట్టాలని ఆలోచించలేదు. తన స్నేహితుని సలహాతో హిరణ్యకుని పీడ వదిలించుకొన్నాడు. సలహా చెబితే పాటించే స్వభావం కలవాడు చూడాకర్ణుడు.

ప్రశ్న 15.
వీణాకర్లుని స్వభావం వ్రాయండి.
జవాబు:
వీణాకర్ణుడు ఒకసారి చూడాకర్ణుని దగ్గరకు వచ్చాడు. అతని ఆహారాన్ని ఎలుక దొంగిలిస్తున్న విధానం గమనించాడు. వీణాకర్ణుడు చాలా తెలివైనవాడు. కనుకనే ఎలుక బలానికి కారణాన్ని అన్వేషించాడు. తన స్నేహితునికి ఆ ఎలుక నివాసాన్ని కొల్లగొట్టమని చక్కని సలహా ఇచ్చాడు. స్నేహితునకు ఉపకారం చేసే స్వభావం కలవాడు. స్నేహితుల బాధలను తన బాధలుగా భావించి, నివారిస్తాడు. అతని సలహాతో చూడాకర్ణునికి ఎలుకబాధ పూర్తిగా తొలగిపోయింది.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 5 ధన్యుడు

ప్రశ్న 16.
హిరణ్యకుని స్వభావం వ్రాయండి.
జవాబు:
హిరణ్యకుడు, చూడాకర్ణుని భిక్షాన్నం దొంగిలించి బ్రతికేవాడు. కాని, చూడాకర్ణునిచేత సంపదంతా కొల్లగొట్టబడి తరమబడ్డాడు. ఇంకక్కడ ఉండకూడదనుకొన్నాడు. అడవికి వెళ్ళిపోయాడు. అడవికి వెళ్ళాక జ్ఞానోదయమయింది. సంపద ఉన్నపుడు తనకు ఎవరూ సాటి లేరనుకొని విర్రవీగాడు. సంపదపోగానే, పట్టుదల పెరిగింది. కాని, సన్న్యాసి విసిరిన కర్ర దెబ్బ నుండి తప్పించుకొన్నాక నిజమైన జ్ఞానం కలిగింది. అప్పుడే లోభం వలన కలిగే ప్రమాదం తెలుసుకొన్నాడు. లోభం విడిచి పెట్టాడు. అడవికి వెళ్ళాడు. ధన్యుడయ్యాడు.

ప్రశ్న 17.
మంథరుని స్వభావం వ్రాయండి.
జవాబు:
అన్నిటినీ కోల్పోయి ఒంటరిగా అడవికి వచ్చిన హిరణ్యకుని ఆదరించిన స్నేహశీలి మంథరుడు. తన స్నేహంతో అతనికి పునర్జన్మను ప్రసాదించాడు. తన మంచి మాటలతో జ్ఞానోదయం కల్గించాడు. అతి సంచయేచ్ఛ తగదని బోధించింది. మనోధైర్యాన్ని ప్రసాదించింది. లఘుపతనకునితో సమానంగా ఆదరించిన స్నేహశీలి.

ప్రశ్న 18.
వివేకహీనుడిని ఎందుకు సేవించకూడదు?
జవాబు:
వివేకహీనుడిని సేవించడం కంటే, వనవాసం ఉత్తమం అని హిరణ్యకుడు అనుకుంటాడు. వివేకము అంటే మంచి చెడులు సరిగా తెలిసికొనే జ్ఞానము. వివేకము లేనివాడిని అవివేకి అని, వివేకహీనుడని అంటారు.

మంచి చెడ్డలు తెలియని ప్రభువును సేవిస్తే అతడు తెలివితక్కువగా ప్రవర్తిస్తాడు. ప్రభువు మేలుకోరి పనిచేసేవాడిని కూడా వాడు నిందిస్తాడు. ఇతరుల చెప్పుడుమాటలు విని, తన దగ్గర పనిచేసే సేవకుడిని తప్పు పడతాడు. అకారణంగా శిక్షిస్తాడు. తన కోసం కష్టపడే సేవకుడి మంచితనాన్ని, కష్టాన్ని వివేకహీనుడయిన ప్రభువు గుర్తించలేడు. అకారణంగా, అన్యాయంగా తన తెలివితక్కువతనంతో తనవద్ద పనిచేసే సేవకుడి కష్టాన్ని గుర్తించడు. సేవకుడి మంచితనాన్ని పట్టించుకోడు. కాబట్టి వివేకహీనుడిని సేవించకూడదు.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 5 ధన్యుడు

ప్రశ్న 19.
బాలవ్యాకరణాన్ని గూర్చి రాయండి.
జవాబు:
బాలవ్యాకరణాన్ని చిన్నయసూరి రచించాడు. ఈయన బాలవ్యాకరణము, నీతిచంద్రిక, అక్షరగుచ్ఛము, ఆంధ్రకాదంబరి, సూత్రాంధ్ర వ్యాకరణము, పద్యాంధ్ర వ్యాకరణము అనే గ్రంథాలు రచించాడు. ఈయన రచించిన ‘బాలవ్యాకరణం’
కావ్యభాషకు మంచి ప్రామాణిక గ్రంథము. నీతిచంద్రిక – బాల వ్యాకరణాలు లక్ష్య – లక్షణ గ్రంథాలుగా ప్రసిద్ధిపొందాయి.

10th Class Telugu 5th Lesson ధన్యుడు 4 Marks Important Questions and Answers

ఈ క్రింది ప్రశ్నలకు 10 లేక 12 వాక్యాల్లో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
సంసార విషవృక్షమునకు అమృతతుల్యమైనవి ఏమిటో వివరించండి. (S.A.I – 2018-19 June 2016)
జవాబు:
‘సంసారం’ అంటే మనుషుల చావు పుట్టుకలు. ఈ సంసారం విషవృక్షము వంటిది. వృక్షమునకు పళ్ళు పుడతాయి. అలాగే సంసారం అనేది విషవృక్షం అనుకుంటే, ఆ సంసార విషవృక్షానికి రెండు అమృతము వంటి పళ్ళు పుడతాయని కవి చెప్పాడు.

అందులో ‘కావ్యామృత రసపానము’ మొదటి అమృత ఫలము, సత్పురుషులతో సహవాసము రెండవ అమృత ఫలము. అంటే మనుషులుగా పుట్టిన వారికి, రెండు ప్రయోజనాలు కలుగుతాయి. హాయిగా మహాకవులు రాసిన కావ్యాలలోని అమృతం వంటి రసాన్ని గ్రహించి ఆనందించవచ్చు. అలాగే సత్పురుషులతో స్నేహం చేసి దాని ద్వారా అమృతం వంటి ఆనందం పొందవచ్చునని కవి చెప్పాడు.

నిజంగానే రామాయణము, భారతము వంటి కావ్యాలలోని సారాన్ని గ్రహిస్తే, అది అమృతములా ఉంటుంది. అలాగే సత్పురుషులతో స్నేహం చేస్తే అందువల్ల అమృతం వంటి ఆనందం పొందవచ్చు. అందుకే రచయిత సంసారం చేస్తున్న మానవులకు, కావ్యాలను చదివి ఆనందం పొందే అదృష్టము, మంచివారితో సహవాసం చేసే అదృష్టమూ లభిస్తాయని చెప్పాడు.

ప్రశ్న 2.
హిరణ్యకుడు అడవులపాలు కావటానికి లోభమే ప్రధాన కారణమని తెల్పిన మంథరుని మాటలను సమర్థించండి. (Jure 2018)
జవాబు:
1) హిరణ్యకుడు లోభం కారణంగా అడవులపాలైన తన యొక్క పూర్వ వృత్తాంతాన్ని మిత్రుడైన మంథరునికి వినిపించాడు.
2) ఆ మాటలు విన్న మంథరుడు “సంపదలు శాశ్వతమైనవి కావని, యవ్వనం ప్రవాహవేగంలాంటిదని, జీవితం నీటి బుడగతో సమానమైనదని చెప్పాడు.
3) కావున బుద్ధిమంతుడు సత్వరమే (వెంటనే) ఈ నిజాన్ని గుర్తించి ధర్మకార్యాలు చక్కగా ఆచరించాలని, అలా ఆచరించని వారు పశ్చాత్తాపంతో దుఃఖమనే అగ్నిలో కాలిపోతారని చెప్పాడు.
4) “నీవు కావలసిన దానికన్నా ఎక్కువగా కూడబెట్టావు. నీ లోభ బుద్ధియే నిన్నిలా అడవుల పాలు చేసింది. ఎక్కువగా కూడబెట్టాలనే కోరిక తగదు. ఇతరులకిచ్చి మనం భుజించినదే మన సొత్తు. పరులకివ్వకుండా తాను తినకుండా దాచిన సొమ్ము చనిపోయినపుడు వెంటరాదు. బ్రతకడం కోసం ఇన్ని తిప్పలు పడనవసరం లేదు. ధర్మాలన్నీ తెల్సిన నీకు నేను వివరంగా చెప్పవలసిన పని లేదు.” అంటాడు.
5) ఈ అంశాలన్నీ సమర్థింపదగినవేనని నేను భావిస్తున్నాను. సంపదల స్వభావం గురించి యవ్వనం గురించి, జీవితం గురించి, ముఖ్యంగా లోభగుణం గురించి, ధర్మకార్యాలను ఆచరించవలసిన అవసరం గురించి మంథరుడు చెప్పిన మాటలు అందరూ అనుసరించదగినవని, ఆమోదించదగినవనీ నేను భావిస్తున్నాను.

ప్రశ్న 3.
ఈ క్రింది పాత్రల స్వభావాలను రాయండి.
జవాబు:
1. చూడాకర్ణుడు :
చంపకవతి అనే పట్టణంలోని సన్యాసి. తను భోజనము చేయగా మిగిలిన వంటకం చిలుక కొయ్య మీద దాచుకొనేవాడు. ఒక ఎలుక ప్రతిరోజూ దానిని తినేసేది. ఎలుకను బెదిరించాడు తప్ప దానిని భయపెట్టి తరిమేసే ప్రయత్నం చేయలేదు. ఒక సమస్యకు శాశ్వత పరిష్కారం ఆలోచించే స్వభావం కాదు. వీణాకర్ణుని సలహాతో హిరణ్యకుని పీడను వదిలించుకొన్నాడు. అతని మాటతీరును బట్టి చాలా గ్రంథాలు చదివిన వాడని తెలుస్తుంది. స్నేహితులు చెప్పే మంచి సలహాలను వింటాడు. ఆచరిస్తాడు. తెలివైనవాడు.

2. వీణాకర్ణుడు :
చూడాకర్ణుని స్నేహితుడు. ఒక సమస్య యొక్క మూలాలను వెతికి పట్టుకొంటాడు. పరిష్కారం సూచిస్తాడు. చూడాకర్ణునికి హిరణ్యకుని పీడ వదలడానికి కారణం వీణాకర్ణుని సలహాయే. ఆపదలో ఉన్న స్నేహితులకు మంచి సలహాలు చెప్పే స్వభావం కలవాడు.

3. హిరణ్యకుడు :
ఇతడు ఒక ఎలుక. అవకాశం ఉన్నంతకాలం చూడాకర్ణుని దోచుకొన్నాడు. అతని వలన ప్రమాదం ఏర్పడ్డాక జ్ఞానం కలిగింది. ధన వ్యామోహం తగ్గింది. అది తనకు తగిన ప్రదేశం కాదని గుర్తించాడు. భగవంతుని దయామయత్వం అవగాహన చేసుకొన్నాడు. అడవికి చేరాడు. ధన్యుడయ్యాడు. పరిపూర్ణమైన జ్ఞానం కలిగింది.

4. మంథరుడు :
మంథరుడు ఒక తాబేలు పేరు. స్నేహశీలము కలిగినవాడు. హిరణ్యకునికి ఆశ్రయం ఇచ్చాడు. ధనం అశాశ్వతమని, యౌవనం తొందరగా గడిచిపోతుందని తెలుసుకొన్న జ్ఞాని. ధర్మమును ఆచరించాలని చెప్పిన ధర్మాత్ముడు. జీవితం పట్ల పూర్తి అవగాహన కలిగి ఉన్నవాడు. తన స్నేహితులను కూడా మంచి మార్గంలో నడిపించే ఉత్తముడు మంథరుడు.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 5 ధన్యుడు

ప్రశ్న 4.
“యాచక వృత్తి సమస్త గౌరవాన్ని హరిస్తుంది”. విశ్లేషిస్తూ రాయండి.
జవాబు:
యాచక వృత్తి వలన సమస్త గౌరవం పోతుంది. ప్రపంచంలో అనేక రకాల వృత్తులున్నాయి. ఏ వృత్తిని చూసినా కొంతపని చేసి దానికి ప్రతిఫలం పొందడం కనిపిస్తుంది. పనిచేయకుండా ఫలితాన్ని ఆశించడం తప్పు. తప్పు చేస్తే గౌరవం తగ్గడం సహజం. యాచక వృత్తి అంటే ఇతరులకు ఏ మాత్రం ఉపయోగపడకుండా వారి నుంచి ధనం, వస్తువులు మొదలగునవి ఆశించడం. అలా ఎప్పుడైతే ఆశించామో అదే మన గౌరవానికి భంగం కలిగిస్తుంది. యాచక వృత్తిని చేసే వారిని తనవారు కానీ, పైవారు కానీ ఎవరూ గౌరవించరు. చిన్న పనైనా, పెద్ద పనైనా కష్టపడి పనిచేస్తూ సంపాదించుకుని బతుకుతుంటే గౌరవానికి భంగం కలుగదు.

ప్రశ్న 5.
‘ధన్యుడు’ అనే పేరు హిరణ్యకుని వృత్తాంతానికి ఎలా సరిపోయిందో సమర్థించండి.
జవాబు:
ఉదరముకయి పరులగోఁజక, ప్రాప్తి లాభానికి సంతోషించేవాడు ఒక్కడే లోకమందు ధన్యుడు అని హిరణ్యకుడు నిశ్చయించుకొని నిర్జనారణ్యంలో నివాసం చేశాడు.

పొట్టకోసం ఇతరులను పీడించకుండా, తనకు లభించిన దానితో తృప్తిపడి, సంతోషపడేవాడు ధన్యుడని హిరణ్యకుడి అభిప్రాయం. ఇది సరైన అభిప్రాయం. భగవంతుడే మనకు కావలసినవి ఇస్తాడు. అందుచేత పోషణ కోసం ఇతరుల కాళ్ళమీద పడి వారిని యాచించనక్కరలేదు.

రాతిలోని కప్పను దయామయుడైన భగవంతుడు రక్షిస్తున్నాడు. మనం చేసుకొన్న కర్మలను బట్టి మనకు దుఃఖాలు వచ్చినట్లే, కోరకుండానే సుఖాలు వస్తాయి.

హిరణక్యుడు అనే ఎలుక మొదట ధనలోభంతో సంచరించింది. చివరకు సన్యాసి కర్రదెబ్బ తగిలి, తెలివి తెచ్చుకొంది. మనుష్యులు లేని అడవిలో నివసించింది. చివరకు లఘుపతనకం సహాయంతో మంథరుడనే కూర్మరాజు మైత్రి పొందింది. తమకు దొరికిన దానితో ముగ్గురమూ కలసి సుఖంగా ఉందామని మంథరుడు హిరణ్యకునకు నచ్చ చెప్పాడు.

మంథరుడు అమృతం వంటి మాటల వలన తన తాపం పోయిందనీ, తాను ధన్యుడనయ్యానని హిరణ్యకుడు అనుకొన్నాడు. కనుక ధన్యుడు అనే పేరు హిరణ్యకుని వృత్తాంతానికి సరిపోయింది.

ప్రశ్న 6.
హిరణ్యకునిలో ఆలోచనను రేకెత్తించినదెవరు? ఎలా?
జవాబు:
చూడాకర్ణుడు తన స్నేహితుని సలహాతో హిరణ్యకుని కలుగును త్రవ్వాడు. దాని సంపదనంతా కొల్లగొట్టాడు. తర్వాత హిరణ్యకునికి బలం తగ్గింది. ఉత్సాహం కూడా తగ్గింది. ఆహారం కూడా సంపాదించుకొనలేనంతగా నీరసపడింది. నడకలో వేగం తగ్గింది. సంపద పోవడంతో ఆలోచించే అవకాశాన్ని చూడాకర్ణుడు తన చేష్టల ద్వారా కలిగించాడు. ధనము కలవాడే పండితుడు, అతడే బలవంతుడు. ధనమే అన్నింటికీ మూలమన్నాడు చూడాకర్ణుడు.

మూషికం తన సంపదతోపాటు బలాన్ని కూడా కోల్పోయిందని ఆక్షేపించాడు. ధనం లేనివాడికి ఎల్లప్పుడూ బాధగానే ఉంటుంది. నిరంతరం బాధపడడం వలన తెలివి మందగిస్తుంది. తెలివి తగ్గితే అన్ని పనులూ పాడవుతాయి అని దెప్పి పొడిచాడు.

ధనవంతుడికే పౌరుషం చెల్లుతుంది. మేథాసంపద, బంధుమిత్రులు ధనాన్ని బట్టే చేరతారు. భార్యాబిడ్డలు లేని ఇల్లు, మూర్ఖుడి మనసు శూన్యంగా ఉంటాయి. దరిద్రం వలన అంతా శూన్యంగా కనిపిస్తుంది. దరిద్రం కంటె మరణం మంచిది. మరణం చాలా బాధాకరం. జీవితమంతా దరిద్రం అనుభవించడం చాలా కష్టం. డబ్బు లేకుంటే సొంతవాళ్ళే పరాయివాళ్ళు అవుతారు. ఇలా అనేక విధాల తన మాటల ద్వారా హిరణ్యకుని చిత్రవధ చేశాడు.

చూడాకర్ణుని మాటలు, చేష్టలు హిరణ్యకునిలో ఆలోచనలను రేకెత్తించాయి. తనలో తాను ఆలోచించడం ప్రారంభించాడు. ఆ ఆత్మపరిశీలనే జ్ఞానోదయానికి కారణమయ్యింది.

ప్రశ్న 7.
హిరణ్యకుని ఆలోచనా ధోరణిని వివరించండి.
జవాబు:
చూడాకర్ణుడు హిరణ్యకుని సంపదనంతా కొల్లగొట్టాడు. ధనం యొక్క ప్రాధాన్యతని వివరిస్తూ హిరణ్యకుని చాలా కించపరిచాడు. అప్పుడు హిరణ్యకునిలో ఆలోచన మొదలైంది.

అక్కడింక నివసించకూడదనుకొన్నాడు. తనకు జరిగిన అవమానం ఇతరులకు చెప్పుకోవడం మంచిదికాదనే సుభాషితం గుర్తు చేసుకొన్నాడు. దైవం అనుకూలించనపుడు తన పౌరుషం వలన ప్రయోజనం లేదని గుర్తించాడు. వనవాసం మంచిదని తలపోసాడు.

యాచించి బ్రతకడం కంటె వనవాసం మేలనుకొన్నాడు. బ్రతికితే పువ్వులా బ్రతకాలనుకొన్నాడు. యాచన అవమానకరం అనుకొన్నాడు. ఎన్ని విధాల ఆలోచించినా లోభం వదలలేదు. అక్కడే ఉండి మళ్ళీ ధనార్జన చేయాలని సంకల్పించాడు.

కాని, లోభం వలన మోహం పుడుతుంది. మోహం వలన దుఃఖం కలుగుతుంది. దుఃఖం వలన ఆశ్రయం కోల్పోతారు. ఇవేవీ ఆలోచించలేదు. ఇంతలో చూడాకర్ణుడు హిరణ్యకుని పైకి కర్రను విసిరాడు. దైవికంగా ఆ కర్ర దెబ్బ నుండి తప్పించుకొన్నాడు.

అపుడు అతని ఆలోచనలో పరిణతి వచ్చింది. అన్ని ఆపదలకు ధనలోభమే మూలమని గ్రహించాడు. లోభమును విసర్జించినవాడే అన్నీ తెలిసినవాడని తెలుసుకొన్నాడు. వాడు మాత్రమే సుఖపడగలవాడని గ్రహించాడు.

అక్కడి నుండి హిరణ్యకుని ఆలోచనలో చాలా మార్పు వచ్చింది. అదేమి తన తాతముత్తాతల స్థలం కాదని గ్రహించాడు. అడవికిపోయి బ్రతకవచ్చనుకొన్నాడు.

ఈ విధంగా హిరణ్యకుని ఆలోచనా ధోరణిలో చాలా మార్పు వచ్చింది.

ప్రశ్న 8.
కావ్యామృత రసపానము, సజ్జ సంగతులను అమృతతుల్యములు అనడంలో రచయిత ఉద్దేశ్యం ఏమిటి?
జవాబు:
సంసారము అనే విషవృక్షమునకు, రెండు ఫలములు అమృతముతో సమానమైనవి ఉన్నాయి. అందులో ‘కావ్యామృత రసపానము’ ఒకటి. ‘సజ్జన సంగతి’ రెండవది అని, హిరణ్యకుడు అనే ఎలుక, మంథరుడు అనే తాబేలుతో చెప్పాడు.

సంసారము అంటే మానవుల చావు పుట్టుకలు. మనిషి పుడతాడు, తిరిగి చస్తాడు. తిరిగి పుడతాడు. దీన్నే ‘సంసారము’ అంటారు. ఈ సంసారం, విషవృక్షము వంటిది. వృక్షాలకు కాయలు, పళ్ళు కాస్తాయి. అలాగే సంసారం అనేది విషవృక్షము అనుకుంటే, దానికి రెండు పళ్ళు పుడతాయట. అందులో మొదటిది ‘కావ్యామృత రసపానము’. అనగా మహాకవులు రాసిన మంచి కావ్యాలను చదివి, దానిలోని అమృతం వంటి రసాన్ని ఆస్వాదించడం. రెండవది ‘సజ్జన సంగతి’ అంటే మంచివారితో స్నేహము.

మనిషి పుట్టడం, చావడం అనే సంసారం విషవృక్షము వంటిదయినా, ఆ పుట్టుక వల్ల మనిషికి రెండు ప్రయోజనాలు, అమృతము వంటివి సిద్ధిస్తాయట. అంటే మనిషిగా పుట్టినవాడు, చక్కగా అమృతం వంటి రసం గల మహా కావ్యాలు చదివి ఆనందం పొందవచ్చు. అలాగే మనిషిగా పుట్టి సంసారం చేసేవాడు, మంచివారితో స్నేహం చేసి, దానివల్ల అమృతం వంటి ఆనందం పొందవచ్చునని రచయిత ఉద్దేశ్యము.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 5 ధన్యుడు

ప్రశ్న 9.
‘అర్థములు నిత్యములు కావు. యౌవనము ఝరీవేగతుల్యము’. వీటిని గురించి మీరు ఏమి అర్థం చేసుకున్నారో సోదాహరణంగా రాయండి.
(లేదా)
అర్థములు నిత్యములు కావంటూ – మంధరుడు అన్న మాటలను మీరు ఏవిధంగా సమర్థిస్తారు? (S.A. I – 2019-20)
జవాబు:
‘అర్థములు నిత్యములు కావు’ అంటే ధనము శాశ్వతంగా ఉండదని అర్థము. డబ్బులు సంపాదించినా అది శాశ్వతంగా వాడి వద్ద ఉండవు. ఈ రోజు ధనవంతుడయినవాడు, మరునాటికి బీదవాడు కావచ్చు. పెద్ద పెట్టుబడి పెట్టి ఫ్యాక్టరీ పెట్టిన ధనవంతుడికి, పెద్ద నష్టం రావచ్చు. ఫ్యాక్టరీకి ప్రమాదం రావచ్చు.

బ్యాంకులో డబ్బు పెడితే, ఆ బ్యాంకు దివాలా తీయవచ్చు. లేదా అతడి ధనాన్ని దొంగలు అపహరింపవచ్చు. కాబట్టి అర్థములు నిత్యములు కావని రచయిత చెప్పాడు.

‘యౌవనము ఝరీవేగతుల్యము’ అంటే మంచి యౌవన వయస్సు, ప్రవాహవేగం వంటిది. ‘ఝరి’ అంటే సెలయేరు. సెలయేరు వర్షాలు వస్తే పొంగుతుంది. ఆ నీరు కొండ నుండి కిందికి దిగి పోగానే అది ఎండిపోతుంది. యౌవనము కూడా సెలయేరు వంటిది.

రోజు ఉన్న యౌవనం, శాశ్వతంగా ఉండదు. కొద్ది రోజుల్లో మనం అంతా ముసలివాళ్ళం అవుతాము. తరువాత మరణిస్తాము. వయస్సు వేగంగా వెళ్ళిపోతుంది. చూస్తూ ఉండగానే యువకులు వృద్ధులు అవుతారు. సెలయేరు ఎంత వేగంగా వెడుతుందో, వయస్సు కూడా అంతవేగంగా ముందుకుపోతుంది. కాబట్టి మనిషి ధనాన్ని, యౌవనాన్ని నమ్మి ఉండరాదు. అవి వేగంగా పోయేవని గ్రహించి డబ్బు, యౌవనము ఉన్నపుడే మంచిపనులు చేయాలని నేను గ్రహించాను.

ప్రశ్న 10.
చిత్రాంగుని హిరణ్యకుని జీవితచరిత్ర ఆధారంగా దాని వ్యక్తిత్వాన్ని విశ్లేషించండి.
గమనిక : చిత్రాంగుడి గూర్చి మనకు పాఠములో లేదు. హిరణ్యకుడి గురించి ఉంది (అందుకే హిరణ్యకుడి గురించి ఇవ్వడం జరిగింది.)
జవాబు:
హిరణ్యకుని లోభము :
హిరణ్యకుడు ఒక ఎలుక. అది చూడకర్ణుడనే సన్న్యాసి ఇంట్లో కన్నంలో ఉండి, అతడు దాచిన వంటకాన్ని దొంగిలించి బాగా సంపాదించింది. ఆ సన్న్యాసి, ఈ ఎలుక కన్నాన్ని తవ్వి, అది దాచిన సర్వస్వాన్నీ తీసుకున్నాడు. దానితో హిరణ్యకం దిగులుపడింది. కాని ధనలోభంతో ఆ చోటును విడిచిపెట్టలేదు.

జ్ఞానము – వివేకము :
హిరణ్యకం, అభిమానం కలవాడికి, వనవాసం మంచిదని గ్రహించింది. వివేకం లేనివాడిని సేవించరాదనుకొంది. యాచనా వృత్తి దోషం అనుకుంది. అడవికి వెళ్ళిపోదామని నిశ్చయించింది. కాని ధనలోభం వల్ల దానికి మోహం కలిగి, అక్కడే ఉండి తిరిగి సంపాదిద్దామనుకుంది.

వనవాసము – వైరాగ్యము :
ఒక రోజున హిరణ్యకుడిపై సన్న్యాసి కజ్జును విసిరాడు. దైవవశం వల్ల ఆ దెబ్బ నుండి హిరణ్యకం రక్షించబడింది. దానితో ధనలోభము వల్ల ఆపదలు వస్తాయని అది గ్రహించింది. దొరికిన దానితో సంతోషించేవాడే ధన్యుడని, సుఖవంతుడు అని హిరణ్యకం గుర్తించింది. కోరకుండానే ప్రాణికి దుఃఖాల వలె సుఖాలు కూడా వస్తాయని హిరణ్యకం గుర్తించి, నిర్జనారణ్యంలోకి వెళ్ళింది.

ఈ విధంగా హిరణ్యకుడు మొదట ధనలోభంతో సంచరించాడు. తరువాత తెలివి తెచ్చుకొని, లోభమోహాలను విడిచి, దొరికిన దానితో తృప్తి పడదామని నిర్జనారణ్యంలో నివసించాడు. కాబట్టి హిరణ్యకుడు ధన్యజీవి.

ప్రశ్న 11.
హిరణ్యకుడు మొదట ఎందుకు బలవంతుడు? తరువాత ఎందుకు బలహీనుడయ్యాడో విశ్లేషించండి.
జవాబు:
హిరణ్యకుడు అనే ఎలుక చూడాకర్ణుడు అనే సన్న్యాసి ఇంట్లో కన్నంలో ఉండేది. ఆ సన్న్యాసి తాను తినగా మిగిలిన వంటకాన్ని భిక్షాపాత్రలో పెట్టి చిలుకకొయ్యకు తగిలించేవాడు. హిరణ్యకుడు ఆ వంటకాన్ని భక్షించేవాడు. ఆ విధంగా హిరణ్యకుడు ఎంతో ఆహారాన్ని దాచాడు. దానితో మొదట్లో హిరణ్యకుడు బలవంతుడుగా ఉండేవాడు.

తరువాత ఒకరోజున చూడకర్ణుడు మిత్రుని సలహాపై హిరణ్యకుడి కన్నమును తవ్వి అతడు దాచుకున్న సర్వస్వాన్నీ గ్రహించాడు. దానితో హిరణ్యకుడు బలహీనుడయ్యాడు. అయినా హిరణ్యకుడు ఆ సన్న్యాసి ఇంట్లోనే తిరిగేవాడు. ఒక రోజున సన్న్యాసి హిరణ్యకుడి పై చేతి కణ్ణను విసిరాడు. దానితో హిరణ్యకుడు నిర్జనారణ్యంలోకి నివాసం మార్చాడు. ఈ విధంగా హిరణ్యకుడు బలహీనుడయ్యాడు.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 5 ధన్యుడు

ప్రశ్న 12.
సజ్జన సాంగత్యము లభించి ధన్యుడైన హిరణ్యకుని వృత్తాంతాన్ని మీ సొంతమాటల్లో వ్రాయండి. (March 2019)
జవాబు:
హిరణ్యకుడు ఒక ఎలుక. ఆ ఎలుక చూడాకర్ణుడు అనే సన్యాసి ఇంటిలో కన్నంలో నివాసము ఉండేది. ఆ సన్యాసి రోజూ తాను తినగా మిగిలిన అన్నాన్ని భిక్షాపాత్రలో పెట్టి దాన్ని చిలుక కొయ్యకు తగిలించేవాడు. ఎలుక చిలుక కొయ్య పైకి ఎగిరి, ఆ అన్నాన్ని తినివేసేది. ఆ ఎలుక ఈ విధంగా ఎంతో సంపాదించింది.

ఒకరోజు చూడాకర్ణుడి ఇంటికి వీణాకర్ణుడు అనే సన్యాసి వచ్చాడు. చూడాకర్ణుడు ఎలుకను తన కజ్జుతో బెదరిస్తున్నాడు. ఎలుక సంగతి చూడాకర్ణుడు, వీణాకర్ణుడికి చెప్పాడు. వీణాకర్ణుడి సలహాపై, చూడాకర్ణుడు ఎలుక కన్నాన్ని తవ్వి, ఎలుక దాచుకున్న దాన్ని తీసుకున్నాడు. దానితో ఎలుక ఆహారము లేక ఇంటిలో తిరుగుతోంది. సన్యాసి ఎలుకపై తన కజ్జను విసిరాడు. అదృష్టవశాత్తు ఎలుక తప్పించుకొని, ఆ ఇంటిపై విరక్తి పెంచుకొని, అడవిలోకి వెళ్ళిపోయింది. మనుష్యులు లేని ఆ అడవిలో ఆ ఎలుకకు కాకితో స్నేహము కుదిరింది. ఆ అడవిలో తినడానికి ఎలుకకు ఏమీ దొరకలేదు. దానితో ఎలుక, తన మిత్రుడైన కాకితోపాటు, కాకికి స్నేహితుడైన మంథరుడి వద్దకు వచ్చింది. కాకి, ఎలుక, మంథరుడు స్నేహితులయ్యారు.

10th Class Telugu 5th Lesson ధన్యుడు Important Questions and Answers

ప్రశ్న 1.
ధన్యుడు కథను చిన్ననాటికగా మలచండి.
జవాబు:
ఏకాంకిక : పాత్రలు 1) హిరణ్యకుడు 2) మంథరుడు

మంథరుడు : మనమంతా సుఖంగా కలసి ఉందాము. దొరికిన దాంతో కాలం గడిపేద్దాం. అది సరే కాని నీవు అడవిలో ఎందుకు ఉన్నావు హిరణ్యకా!

హిరణ్యకుడు : మిత్రమా! మంథరా ! నేను ఒకప్పుడు చూడాకర్ణుడు అనే సన్యాసి ఇంట్లో కన్నంలో ఉండి, అతడు చిలుక కొయ్యమీద దాచుకొన్న వంటకాన్ని తినేదాన్ని.

మంథరుడు : మరి ఏమైంది?

హిరణ్యకుడు : ఇక్కడ ఒకసారి ఆ సన్న్యాసి ఇంటికి వీణాళుడనే సన్న్యాసి వచ్చాడు. చూడాకర్ణుడిచే నా కన్నం త్రవ్వించాడు.

మంథరుడు : అప్పుడు నువ్వు అడవిలో మకాం పెట్టావా?

హిరణ్యకుడు : లేదు. నేను సన్న్యాసి ఇంట్లోనే తిరుగుతున్నా. ఒకరోజు సన్న్యాసి నాపై కర్ర విసిరాడు. అప్పుడు ఉన్న దానితో తృప్తి పడదామని అడవికి వచ్చా. అక్కడే మన మిత్రుడు లఘుపతనకుడితో స్నేహం అయ్యింది.

మంథరుడు : అడవిలో మీ ఇద్దరికీ ఆహారం సరిగ్గా దొరికిందా!

హిరణ్యకుడు : లేదు మిశ్రమా! అందుకే లఘుపతనకం నీ దగ్గరకు నన్ను కూడా తీసుకువచ్చింది.

మంథరుడు : మిత్రమా! హిరణ్యకా! డబ్బు శాశ్వతం కాదు. దాచిన డబ్బు మనతో రాదు. ప్రక్కవాడికి పెట్టి మనం హాయిగా తినాలి. మనం ముగ్గురమూ ఒకరికొకరు సాయం చేసికొంటూ బ్రతికేద్దాం.

హిరణ్యకుడు : మిత్రమా! నీ మాటలు విని నేను ధన్యుణ్ణి అయ్యాను.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 5 ధన్యుడు

ప్రశ్న 2.
చిన్నయసూరి కథను చెప్పే విధానాన్ని, రచయిత రచనా విధానాన్ని ప్రశంసిస్తూ మీ గ్రంథాలయంలో చిన్నయసూరి రచనలు పెట్టవలసిన అవసరాన్ని వివరిస్తూ మీ ప్రధానోపాధ్యాయునకు లేఖ వ్రాయండి.
జవాబు:

కర్నూలు,
x x x x x

గౌరవనీయులైన కర్నూలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుల వారికి,
తమ పాఠశాలలో 10వ తరగతి చదువుచున్న 8. వెంకట్ వ్రాయు లేఖ,

అయ్యా !

విషయము : పాఠశాల గ్రంథాలయంలో – చిన్నయసూరి రచనల గూర్చి – విజ్ఞప్తి.

మాకు పదవ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలో ‘ధన్యుడు’ పాఠం ఉన్నది. దానిని పరవస్తు చిన్నయసూరిగారు రచించారు.

అది కావ్యభాషలో ఉంది. చిన్నయసూరి రచనా శైలి చాలా బాగుంది. మమ్మల్ని ఆ శైలి ఆకట్టుకొంది. కథను చెప్పడంలో చక్కని వేగం ఉంది. ఆ వాక్య నిర్మాణం కూడా చాలా బాగుంది. పదాల ఎన్నికలో అర్థానికి తగినవి ఎన్నుకొన్నారు.

పరివ్రాజకుడు, కాణాచి, పాతకాపు, చెడగరపు బోడవంటి పాతపదాలు ఎక్కువగా ఉన్నాయి.

ఈ కథలోని పాత్రలు అన్నీ జంతువులు. జంతువుల ద్వారా నీతులు చెప్పించడం చిన్నయసూరి ప్రత్యేకత. సంభాషణలలో కూడా నాటకీయత ఉంది.

చిన్నయసూరి ఇలాంటి కథలు ఇంకా చాలా వ్రాశారని మా తెలుగు ఉపాధ్యాయులు చెప్పారు. ఆ కథలన్నీ చదవాలని మాకు చాలా కుతూహలంగా ఉంది.

కనుక మాయందు దయతో చిన్నయసూరి రచనలన్నింటినీ మన పాఠశాల గ్రంథాలయానికి కొనిపించండి.

నమస్కారములు.

ఇట్లు,
తమ విద్యార్థి,
కె. వెంకట్, 10వ తరగతి.

ప్రశ్న 3.
చిన్నయసూరి రచనలను చదవవలసిన అవసరాన్ని తెలియజేస్తూ, అవి చదవమని పాఠకులను కోరుతూ కరపత్రం రూపొందించండి.
జవాబు:

కరపత్రం

పాఠకులారా! తెలుగు పాఠకులారా! చదవండి.

ఈ రోజు టీ.వీ.లను చూడడానికి ఇచ్చిన ప్రాధాన్యం చదవడానికి ఇవ్వటల్లేదు. క్రమంగా పుస్తకాలు చదివే అలవాటుకు దూరమవుతున్నాం. కొన్ని పాత పదాలు మనకు తెలియటం లేదు.

చిలుకకొయ్య, నిదాఘ నదీపూరము, పరివ్రాజకుడు, ఝురీవేగతుల్యము మొదలైన ఎన్నో పాత పదాలు తెలియాలంటే ప్రాచీన రచనలు చదవాలి. చిన్నయసూరి రచనలు చదివితే ఇలాంటి పదాలు తెలుస్తాయి. కథాకథన విధానం తెలుస్తుంది. పాండిత్యం పెరుగుతుంది. మన సంభాషణా చాతుర్యం పెరుగుతుంది.

అందుకే చిన్నయ రచనలు చదవండి. చదివించండి.

ఇట్లు,
పాఠక సమాజం

ప్రశ్న 4.
పరవస్తు చిన్నయసూరి రచనల గురించి ఒక వ్యాసం వ్రాయండి.
జవాబు:
సూరి రచనల మాధుర్యం

‘చిన్నయ రచనలు పూర్తిగా చదివినవాడే తెలుగు భాషలో సూరి’ అని పెద్దల మాట. తెలుగు భాష సుష్టుగా నేర్చుకొన్నవాడు, సూరి రచనలను వదలలేడు.

పరవస్తు చిన్నయసూరి 1809వ సంవత్సరంలో పెరంబుదూరులో జన్మించాడు. శ్రీనివాసాంబ, వేంకట రంగ రామానుజాచార్యులు వారి తల్లిదండ్రులు.

తెలుగు, తమిళం, సంస్కృతం, ఆంగ్ల భాషలలో సూరి పండితుడు. అక్షర గుచ్ఛము, ఆంధ్రకాదంబరి, పద్యాంధ్ర వ్యాకరణం, నీతిచంద్రిక, సూత్రాంధ్ర వ్యాకరణం, శబ్ద లక్షణ సంగ్రహం మొదలైనవి ఆయన రచనలు.

పాఠకులను ఆకట్టుకొనే రీతిలో ఆయన రచనలు సాగుతాయి. ఆయన రచనలు ప్రాచీన కావ్య భాషలో ఉంటాయి. సూరి రచనల్లో చక్కటి నీతులు ఉంటాయి. లోకజ్ఞానం ఉంటుంది. మంచి పదబంధాలుంటాయి. వ్యాకరణ సూత్రాలకి అనుగుణమైన పదప్రయోగాలు మాత్రమే ఉంటాయి. జంతువులు, పక్షులు ప్రధాన పాత్రలుగా ఉంటాయి. చిన్నయసూరి రచించిన బాలవ్యాకరణం ఈనాటికే కాదు ఏనాటికైనా ప్రామాణిక వ్యాకరణ గ్రంథమే.

చిన్నయసూరి రచనలు చదివితే, ఇంక ఏ గ్రంథాలు చదవకపోయినా, అపారమైన జ్ఞానం కలుగుతుంది. తెలుగు భాషపై మంచి పట్టు సాధించవచ్చును. అందుకే కనీసం చిన్నయసూరిది ‘నీతిచంద్రిక’నైనా ప్రతి తెలుగువాడూ చదవాలి.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 5 ధన్యుడు

ప్రశ్న 5.
హిరణ్యకుడు – ఏకపాత్రాభినయం రాయండి.
జవాబు:
నేను హిరణ్యకుడిని. ఈ చూడకర్ణుడి ఇంట్లో వంటకము బాగా దొరుకుతోంది. బాగా సంపాదించా. నేను ఈ చోటును విడిచిపెట్టను. హాయిగా ఉంటాను.

అరే! ఈ సన్యాసి నా కన్నం తవ్వి నేను దాచినదంతా తీసుకున్నాడు. ఏమి చేయను ? నేను ఇంక ఇక్కడ ఉండడం మంచిది కాదు. అభిమానవంతుడు, ఉంటే ఉన్నతంగా బతకాలి లేదా అడవిలో నివాసం ఉండాలి. అడుక్కు తినడం కంటే చావడం మంచిది. అయినా మరికొంత కాలం ఇక్కడే ఉండి చూస్తా.

అబ్బా! ఎంత దెబ్బ కొట్టాడు ఈ సన్న్యాసి నన్ను. నేను ధనలోభం వల్ల ఈ స్థితి తెచ్చుకున్నా. ధనలోభమే అన్ని ఆపదలనూ తెస్తుంది. ప్రాణికి దుఃఖాలులాగే, సుఖాలు కూడా కోరకుండానే వస్తాయి. ఈ స్థలము నా తాతముత్తాతల కాణాచి కాదు. ఈ సన్న్యాసి దెబ్బలు తినడం కన్న, హాయిగా అడవిలో ఉండడం మంచిది. రాతిలో కప్పను పోషించే దేవుడు, నన్ను రక్షించకుండా ఉండడు.

సరే! నిర్జనారణ్యంలోకి పోతా ! వస్తా?

ప్రశ్న 6.
ధన్యుడు పాఠం ఆధారంగా సూక్తులు తయారుచేయండి.
జవాబు:

  1. ధనము కలవాడే బలవంతుడు – పండితుడు.
  2. ధనము సర్వశ్రేయములకు నిదానము.
  3. దారిద్ర్యము కంటే మరణము మేలు. దారిద్ర్యము సర్వశూన్యము.
  4. మానవంతునికి వనవాసము కంటె సుఖము లేదు.
  5. ఒక మ్రుక్కడిని యాచించుటకంటె, నిప్పులోపడి శరీరము విడుచుట మేలు.
  6. వివేకహీనుడయిన ప్రభువును సేవించుటకంటె, వనవాసము ఉత్తమము.
  7. యాచించుకొని బ్రతుకుటకంటే, మరణము శ్రేయము.
  8. సేవా వృత్తి మానమునువలె యాచనా వృత్తి సమస్త గౌరవమునూ హరిస్తుంది.
  9. ధనలోభము సర్వాపదలకూ మూలము.
  10. ఆశ దిగనాడినవాడే సత్పురుషుడు.
  11. అర్థములు నిత్యములు కావు. యౌవనము ఝరీవేగతుల్యము.
  12. జీవనము బుద్బుదప్రాయము.
  13. అతిసంచయేచ్ఛ తగదు.

10th Class Telugu 5th Lesson ధన్యుడు 1 Mark Bits

1. జ్వలనం అన్ని దిక్కులా వ్యాపించింది – గీత గీసిన పదానికి సరియైన అర్థాన్ని గుర్తించండి. (June 2017)
A) మంట
B) సువాసన
C) దుఃఖం
D) సంతోషం
జవాబు:
A) మంట

2. నా స్నేహితుడు ఉదయం వెళ్లి, సూర్యుడు అస్తమించేటప్పుడు ఇంటికి వచ్చాడు – గీత గీసిన పదాలకు నానార్థ పదాన్ని గుర్తించండి. (June 2017)
A) చంద్రుడు
B) మిత్రుడు
C) పగతుడు
D) ఫలం
జవాబు:
B) మిత్రుడు

3. దేవతలు, రాక్షసులు, పాల కడలి నుండి అమృతమును సాధించారు – గీత గీసిన పదానికి వ్యుత్పత్యర్థాన్ని గుర్తించండి. (June 2017)
A) జీవితాన్నిచ్చేది
B) మరణాన్నిచ్చేది
C) బలాన్నిచ్చేది
D) మరణం పొందింపనిది
జవాబు:
D) మరణం పొందింపనిది

AP SSC 10th Class Telugu Important Questions Chapter 5 ధన్యుడు

4. శివుని మూర్ఖమున గంగ కొలువైనది – (గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.) (March 2017)
A) తల, నెల
B) నెల, శిరస్సు
C) శిరస్సు, చేయి
D) శిరస్సు, తల
జవాబు:
D) శిరస్సు, తల

5. ధీరులు కర్ణము పూర్తి చేసేవరకు విశ్రమించరు – (గీత గీసిన పదమునకు ప్రకృతిని గుర్తించండి.) (March 2017)
A) కార్యము
B) కార్యక్రమం
C) కష్టం
D) కారణం
జవాబు:
A) కార్యము

6. శాస్త్రము అందరికీ సమ్మతమైనది. అందుకే మనం దానిని గౌరవించాలి – గీత గీసిన పదానికి వికృతి రూపం గుర్తించండి. (June 2018)
A) చుట్టము
B) నష్టము
C) చట్టము
D) కష్టము
జవాబు:
C) చట్టము

7. వివరములోని పాము ఆహారం కోసం బయటకు వచ్చింది – అర్థాన్ని గుర్తించండి. (S.A. I – 2018-19)
A) రంధ్రము
B) విషయము
C) పుట్ట
D) నీరు
జవాబు:
A) రంధ్రము

AP SSC 10th Class Telugu Important Questions Chapter 5 ధన్యుడు

8. అనృతమును పలుకుట కంటే మౌనము మేలు – పర్యాయ పదాలు గుర్తించండి. ( S.A. I – 2018-19)
A) అసత్యము, అబద్ధము
B) సత్యము, యథార్థము
C) నిజము, కారణము
D) అసత్యము, అకారణము
జవాబు:
A) అసత్యము, అబద్ధము

9. కింది వానిలో సంభావన పూర్వపద కర్మధారయ సమాసమునకు ఉదాహరణ గుర్తించుము. (S.A. I – 2018-19)
A) తల్లిదండ్రులు
B) ఏడు రోజులు
C) చంపకవతి పట్టణం
D) దైవ ప్రార్థన
జవాబు:
C) చంపకవతి పట్టణం

10. అందుఁ జూడా కర్ణుడను పరివ్రాజకుడు గలడు. (ఆధునిక వచన వాక్యాన్ని గుర్తించండి.) (June 2017)
A) అక్కడ చూడాకరుడు అనే సన్యాసి ఉన్నాడు.
B) అక్కడ చూడాకర్ణుడనే వ్యక్తి ఉన్నాడు.
C) అక్కడ చూడాకర్ణుడనే స్వామి గలడు.
D) అందు చూడాకర్ణుడనే సన్యాసి గలడు.
జవాబు:
A) అక్కడ చూడాకరుడు అనే సన్యాసి ఉన్నాడు.

11. ఆ పరివ్రాజకుడు చెప్పగా విని మిక్కిలి ఖిన్నుడనయితిని – ఈ వాక్యానికి ఆధునిక వచనాన్ని గుర్తించండి. (March 2017)
A) ఆ సన్యాసి చెప్పగా విని చాలా బాధపడ్డాను.
B) ఆ పరివ్రాజకుడు చెప్పగా విని ఖిన్నుడనయ్యానా?
C) ఆ పరివ్రాజకుడు చెప్పగా విని బాధపడలేదు.
D) ఆ సన్యాసి చెప్పగా విని ఖిన్నుడను కాలేదు.
జవాబు:
A) ఆ సన్యాసి చెప్పగా విని చాలా బాధపడ్డాను.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 5 ధన్యుడు

12. జీవనము బుద్బుద ప్రాయము – ఆధునిక వచన వాక్యాన్ని గుర్తించండి. – (June 2018)
A) జీవనము బుద్బుదంతో సమానం కాదు.
B) జీవనం బుద్బుద ప్రాయం.
C) బుద్బుద ప్రాయం జీవనమే.
D) జీవితం బుద్బుదప్రాయమే.
జవాబు:
B) జీవనం బుద్బుద ప్రాయం.

13. అనృతమాడుట కంటె మౌనము మేలు. (ఆధునిక వచన వాక్యాన్ని గుర్తించండి.) (S.A. I – 2018-19)
A) అనృతమాడుట కంటెను మౌనమ్ము మేలు.
B) అనృతం ఆడడం కంటే మౌనం మేలు.
C) అనృతంబాడుట కంటె మౌనము మేలు.
D) అనృతమ్మాడుట కంటె మౌనంబు మేలు.
జవాబు:
B) అనృతం ఆడడం కంటే మౌనం మేలు.

14. ప్రత్యక్ష ఫలం ప్రజాసముదాయం చేత కోరబడదు. (కర్తరి వాక్యం గుర్తించండి) (S.A. I – 2018-19)
A) ప్రజా సముదాయం ప్రత్యక్ష ఫలం కోరింది.
B) ప్రజా సముదాయం ప్రత్యక్ష ఫలమును కోరుతోంది.
C) ప్రజా సముదాయం ప్రత్యక్ష ఫలాన్ని కోరదు.
D) ప్రజా సముదాయం ప్రత్యక్ష ఫలం కోరగలదు.
జవాబు:
C) ప్రజా సముదాయం ప్రత్యక్ష ఫలాన్ని కోరదు.

15. “నాకు వసింప తగదు”, అని హిరణ్యకుడన్నాడు. (పరోక్ష కథనం గుర్తించండి) (S.I. I – 2018-19)
A) తను వసించనని హిరణ్యకుడన్నాడు.
B) తనకు వసింప తగదని హిరణ్యకుడన్నాడు.
C) తనకు వసించడం తగవని హిరణ్యకుడన్నాడు.
D) తనకు వసించుట ఇష్టం లేదని హిరణ్యకుడన్నాడు.
జవాబు:
B) తనకు వసింప తగదని హిరణ్యకుడన్నాడు.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 5 ధన్యుడు

16. చంపకవతి అను పట్టణము గలదు. (ఇది ఏ రకమైన వాక్యమో గుర్తించండి) (S.A. I – 2018-19)
A) సంయుక్త వాక్యం
B) చేదర్థక వాక్యం
C) సామాన్య వాక్యం
D) సామార్థ్యార్థక వాక్యం
జవాబు:
D) సామార్థ్యార్థక వాక్యం

చదవండి – తెలుసుకోండి

భారతదేశం కథా సాహిత్యానికి ప్రసిద్ధిపొందింది. ప్రాచీన కాలం నుండే భారతీయ సాహిత్యంలో ప్రాచుర్యం పొందిన కథలు ఎన్నో ఉన్నాయి. విష్ణుశర్మ అనే పండితుడు అమరశక్తి అనే రాజు కొడుకులను వివేకవంతులను చేయడానికి పంచతంత్ర కథలను బోధిస్తాడు. అవే కథా రూపంలో వ్యాప్తి చెందాయి. వీటిని దాదాపు 200 భాషల్లోకి అనువదించారు.

ఈ పంచతంత్ర కథలు మిత్రలాభం, మిత్రభేదం, కారోలూకీయం (సంధి, విగ్రహం), లబ్దప్రణాశం, అపరీక్షితకారకం (అసంప్రేక్షకారిత్వం) అనే భాగాలుగా ఉన్నాయి. వీటిని తెలుగులోకి అనువదించినవారిలో ముఖ్యులు చిన్నయసూరితో పాటు కందుకూరి వీరేశలింగం. వీరేశలింగం పంతులు సంధి, విగ్రహం అనే భాగాలను తెలుగులోకి అనువదించారు. ఈయన వీటితో పాటు రాజశేఖర చరిత్ర, ఆంధ్రకవుల చరిత్ర అభాగ్యోపాఖ్యానం మొదలైన గ్రంథాలను, శతకాలను, నాటకాలను రాసి గద్య తిక్కనగా ప్రసిద్ధికెక్కాడు. స్త్రీ విద్యావ్యాప్తికి కృషి చేశారు. సంఘసంస్కర్తగా పేరు పొందాడు.

AP SSC 10th Class Telugu Solutions Chapter 12 చిత్రగ్రీవం

AP State Board Syllabus AP SSC 10th Class Telugu Solutions 12th Lesson చిత్రగ్రీవం Textbook Questions and Answers.

AP State Syllabus SSC 10th Class Telugu Solutions 12th Lesson చిత్రగ్రీవం

10th Class Telugu 12th Lesson చిత్రగ్రీవం Textbook Questions and Answers

ఉన్ముఖీకరణ : చదవండి – ఆలోచించి చెప్పండి

రక్తాలు ఓడుతూన్న మా రాస్పెలదార్ గబగబా ఏదో రాసి ఆ కాగితాన్ని నా కాలికి కట్టారు. కట్టి నన్ను వంజరం లోంచి వదలిపెట్టారు. అతని కళ్లల్లో కనిపించిన ఆందోళనను బట్టి, వాళ్ళంతా తీవ్రమైన ఆపదలో ఉన్నారనీ, ముఖ్యస్థావరం నుంచి సత్వర సహాయం ఆశిస్తున్నారనీ అర్థమయింది. వెంటనే కాలికి కట్టిన సమాచార పత్రంతో సహాగాలిలోకి ఎగిరాను. ఎలాగైనా సరే ఘోండ్”వేచి ఉండే ప్రధాన స్థావరం దగ్గరకు చేరుకొని తీరాలన్న తవన. ‘చేరాలి. చేరి తరాలి’ అని మనసులో పదేవదే అనుకొన్నాను. పలికిన ప్రతీసారీ ఆ మాటలు విష్యమంత్రాల్లా నా మనసులో బాగా నాటుకొనిపోయి నాకు నూతన జవసత్త్వాలను అందించసాగాయి. అప్పటికే బాగా పైకి చేరుకొన్నాను. కాబట్టి ఒక్కసారి నాలుగు దిక్కులా కలయజూసి, పడమట దిశను గుర్తుపట్టి ఆ దిశగా ఎగర నారంభించాను. వంకర టింకర మార్గాల్లో పిచ్చిగా ఎగిరి, చిట్టచివరకు గమ్యంచేరి ఘోండ్ చేతిమీద వాలాను. రస్సెల్దార్ అందించిన ఆ సమాచారాన్ని ఘోండ్ గబగబా చదివి, సంతోషంతో దుక్కిటెద్దులా రంకె పెట్టారు. ప్రేమగా నా తల నిమిరారు.

ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
ఈ పేరాలోని మాటలు ఎవరు చెబుతున్నారు?
జవాబు:
ఈ పేరాలోని మాటలు, ఒక పక్షి చెపుతున్నది.

ప్రశ్న 2.
సమాచారాన్ని ఎవరి దగ్గర నుండి ఎవరికి ఆ పక్షి చేర్చింది.
జవాబు:
సమాచారాన్ని రాస్సెల్ దార్ నుండి ఊండకు చేర్చింది.

AP SSC 10th Class Telugu Solutions Chapter 12 చిత్రగ్రీవం

ప్రశ్న 3.
సమాచారాన్ని చేరవేయడానికి ఏ పక్షిని ఉపయోగించి ఉంటారు? ఎందుకు?
జవాబు:
సమాచారాన్ని చేరవేయడానికి పావురాన్ని ఉపయోగించి ఉంటారు. పావురానికి దిశాపరిజ్ఞానం ఉంది. అందువల్ల పావురాన్ని ఉపయోగించి ఉంటారు.

ప్రశ్న 4.
సమాచారాన్ని చేరవేసిన పక్షిలోని గొప్ప లక్షణాలు ఏవి?
జవాబు:
ఎలాగైనా సరే, ఘోండ్ వేచి ఉండే ప్రధాన స్థావరం దగ్గరకు చేరుకొని తీరాలన్న తపన ఆ పక్షిలో ఉంది. ఈ పక్షి రాస్సెల్ దార్ కళ్ళలోని ఆందోళనను గుర్తించింది.

ఇవి చేయండి

I. అవగాహన – ప్రతిస్పందన

ప్రశ్న 1.
“మనుషుల్లాగే పక్షులకు, జంతువులకు కూడా తమ పిల్లలను పెంచడం ఎలాగో తెలుసు” దీనిమీద మీ అభిప్రాయాన్ని తెల్పండి. కారణాలను వివరిస్తూ మాట్లాడండి.
జవాబు:
మనం చదివిన “చిత్రగ్రీవం” కథలో తల్లి పక్షి, తండ్రి పక్షి పిల్ల పక్షికి (చిత్రగ్రీవానికి) ఆహారాన్ని పెట్టాయి. తండ్రి పక్షి, దాని బద్ధకాన్ని పోగొట్టి, ఎగిరేలా చేసింది. ఎగిరేటప్పుడు చిత్రగ్రీవానికి తల్లి సాయపడింది. చిత్రగ్రీవానికి ఆయాసం వచ్చింది. అప్పుడు తల్లి పక్షి, దాన్ని దగ్గరకు తీసుకొని లాలించింది.

లోకంలో పక్షులు తమ పిల్లల రక్షణ కోసం గూళ్లను నిర్మిస్తున్నాయి. పిల్లలు ఎగిరి వాటి ఆహారం తెచ్చుకోనే వరకూ, అవే ఆహారాన్ని పిల్లలకు అందిస్తున్నాయి. జంతువులు తమ పిల్లలకు తాము పాలిచ్చి పెంచుతున్నాయి.

తల్లి కుక్క తన పిల్లలకు పరుగుపెట్టడం, కరవడం, వగైరా నేర్పుతుంది. తమ పిల్లల జోలికి ఇతరులు రాకుండా తల్లి జంతువులు కాపాడతాయి. తమ పిల్లల జోలికి వస్తే ఆవు, గేదె వగైరా జంతువులు తమ కొమ్ములతో పొడుస్తాయి. తమ దూడలు తమ దగ్గరకు రాగానే, అని పొదుగులను చేపి పాలిస్తాయి.

ఇందువల్ల పక్షులకూ, జంతువులకూ తమ పిల్లల్ని పెంచడం తెలుసునని నా అభిప్రాయం.

ప్రశ్న 2.
పాఠం ఆధారంగా కింది పట్టికను పూరించండి. పేరా సంఖ్య

పేరా సంఖ్య పేరాలో వివరించిన ముఖ్యమైన విషయాలు పేరాకు తగిన శీర్షిక
1వ పేరా :
2వ పేరా :
10వ పేరా:
15వ పేరా :
16వ పేరా :

జవాబు:

పేరా సంఖ్య పేరాలో వివరించిన ముఖ్యమైన విషయాలు పేరాకు తగిన శీర్షిక
1వ పేరా : 1) కోల్ కతా నగరంలో పిల్లలు పావురాలను బాగా పెంచుతారు.
2) ఎన్నో శతాబ్దాల నుంచి రాజులూ, రాజులూ పావురాలను పెంచుతున్నారు. సామాన్యులు సైతం రంగురంగుల పావురాలను పెంచుతున్నారు.
భారతదేశం – పావురాల పెంపకం
2వ పేరా : మన దేశంలో పావురాలు ఎగురుతూ, కనువిందు చేస్తూ ఉంటాయి. పావురాలు బృందాలుగా ఎగురుతూ ఉంటాయి. అవి ఎంతదూరం ఎగిరి వెళ్ళినా, తిరిగి తమ యజమాని ఇంటికి చేరతాయి. ఇది ఆశ్చర్యంగా ఉంటుంది.
పావురాలకు దిశా జ్ఞానం ఉంది. పావురాలు తమ యజమానులు అంటే ప్రాణం పెడతాయి. వాటికి ఉన్న అంతఃప్రేరణతో అవి యజమాని ఇంటికి చేరతాయి.
పావురాల దిశా పరిజ్ఞానం
10వ పేరా: తల్లి పక్షి గుడ్డులోని శబ్దం వింటుంది. తల్లి పక్షి శరీరంలో స్పందన కనిపిస్తుంది. తల్లి పక్షిలో దివ్యస్పందన కలిగి, రెండు ముక్కుపోట్లతో అది గుడ్డును పగులకొట్టింది. పిల్ల పక్షి బలహీనంగా ఉంటుంది. తల్లి పిల్లను తన రొమ్ములో దాచుకుంటుంది. పావురం గుడ్లను పొదగడం
15వ పేరా : చిత్రగ్రీవం గూటి అంచున కూర్చుంది. అది చీమను ముక్కుతో పొడిచి, దాన్ని రెండు ముక్కలు చేసింది. పావురం చీమను తినే వస్తువు అనుకుంది. నిజానికి చీమ పావురాలకు మిత్రుడు. అందుకే పావురం పశ్చాత్తాపపడింది. పావురం తిరిగి ఆ తప్పు చేయలేదు. పావురం చీమను చంపడం
16వ పేరా : చిత్రగ్రీవానికి వయస్సు ఐదు వారాలు. అది గూటి దగ్గర మూకుడు నుండి నీళ్ళు తాగడం నేర్చుకొంది. ఆహారం కోసం తల్లిదండ్రులమీదే ఆధారపడుతోంది. యాజమాని పెట్టే గింజల్ని గొంతులో పైకి, కిందికీ ఆడిస్తూ తినేది. తాను గొప్పగా తినగలుగుతున్నానని దానికి గర్వంగా ఉండేది. తన చురుకుదనాన్ని తన తల్లిదండ్రులకు చెప్పమన్నట్లు, అది యజమానివైపు చూచేది. కానీ చిత్రగ్రీవం మిగిలిన పావురాలన్నింటి కన్నా మందకొడి. చిత్రగ్రీవం చదువు

3. పాఠం ఆధారంగా కింది ప్రశ్నలకు జవాబులు రాయండి.

అ) చిత్రగ్రీవం ఏ వయస్సులో ఏమేం చేయగలిగిందో రాయండి.
జవాబు:

  1. చిత్రగ్రీవం పుట్టిన రెండో రోజు నుండే, దాని తల్లిదండ్రులు గూటి వద్దకు వచ్చినప్పుడల్లా అది తన ముక్కు తెరచి, తన గులాబీ రంగు శరీరాన్ని బంతివలె ఉబ్బించేది.
  2. చిత్రగ్రీవం, తన మూడు వారాల వయసులో దాని గూటిలోకి వచ్చిన చీమను చూసి తినే వస్తువు అనుకొని తన ముక్కుతో దానిని పొడిచి రెండు ముక్కలు చేసింది.
  3. ఐదోవారంలో చిత్రగ్రీవం తను పుట్టిన గూడు నుండి బయటకు గెంతి, పావురాళ్ల గూళ్ల దగ్గర పెట్టిన మట్టి మూకుడులో నీటిని, తాగగల్గింది.
  4. అదే వయసులో యజమాని ముంజేయి మీద కూర్చుని అరచేతిలో గింజల్ని పొడుచుకు తినేది. చిత్రగ్రీవం గింజలను తన గొంతులో పైకి కిందికి ఆడించి, తర్వాత టక్కున మింగేది.
  5. గాలిదుమారం వచ్చినపుడూ, సూర్యుని కిరణాలు కంటిలో పడినపుడూ, చిత్రగ్రీవం తన కళ్లమీదకు దాని కనురెప్పల పక్కనున్న చర్మపు పొరను సాగదీసి కప్పేది.
  6. చిత్రగ్రీవం ఏడవ వారంలో ఎగరడం నేర్చుకుంది.

ఆ) చిత్రగ్రీవానికి దాని తల్లిపక్షి, తండ్రిపక్షి నుండి ఏమేమి సంక్రమించాయి?
జవాబు:
చిత్రగ్రీవం తల్లి పక్షి నుండి తెలివితేటలు సంపాదించుకుంది. తండ్రి పక్షి నుండి వేగం, చురుకుదనం, సాహసం ‘ సంపాదించుకుంది. తండ్రి పక్షి చిత్రగ్రీవానికి ఎగరడం నేర్పింది. తల్లి పక్షి చిత్రగ్రీవానికి ఎగరడంలో సాయపడింది.

ఇ) చిత్రగ్రీవం గురించి వివరిస్తూ అది సుందరమైనదని, మందకొడిదని, ఏపుగా ఎదిగిందని రచయిత ఎందుకన్నాడు?
జవాబు:
చిత్రగ్రీవం తల్లిదండ్రులు చిత్రగ్రీవం దగ్గరనే ఉండి దాన్ని లాలిస్తూ, దాని బాగోగులు చూస్తూ ఉండడం వల్ల, ఆహారం అందించడంలో శ్రద్ధ తీసుకోవడం వల్ల చిత్రగ్రీవం మహా ఏపుగా పెరిగింది.

చిత్రగ్రీవానికి ఐదోవారం వచ్చింది. అయినా చిత్రగ్రీవం తన ఆహారం కోసం ఇంకా తల్లిదండ్రులమీదే ఆధారపడి ఉంది. అందువల్లే శక్తియుక్తులు పెంపొందించుకోడంలో పావురాలు అన్నింట్లోనూ చిత్రగ్రీవమే మందకొడి అని రచయిత అన్నాడు.

చిత్రగ్రీవం పుట్టిన తర్వాత వారాలు గడిచేకొద్దీ దానికి ఈకలు పెరిగాయి. దానికి ఒక్కసారిగా నిండుగా ఈకలు పెరిగాక, ఆ ఈకలు అతి సుందరమైన రంగులతో నిండాక, అందంలో చిత్రగ్రీవానికి సాటిరాగల పావురం లేదని స్పష్టమయ్యింది.

AP SSC 10th Class Telugu Solutions Chapter 12 చిత్రగ్రీవం

ఈ) చిత్రగ్రీవం గురించి మనకు వివరిస్తున్నది ఎవరు? తాను చేసిన పనికిమాలిన పని అని దేన్ని గురించి చెప్పాడు?
జవాబు:
చిత్రగ్రీవం గురించి మనకు ధనగోపాల్ ముఖర్జీ గారు వివరించారు. ధనగోపాల్ ముఖర్జీ గారు, పావురాల గూళ్లను శుభ్రం చేస్తూ, గూటిలో ఉన్న రెండు గుడ్లనూ పక్క గూట్లో పెట్టారు. మొదటి గూడు శుభ్రం చేయడం పూర్తి అయ్యాక తిరిగి ఒక గుడ్డును గూట్లో పెట్టారు. రెండవ గుడ్డును కూడా ఆ గూట్లో పెడుతుండగా, తండ్రి పావురం ధనగోపాల్ ముఖర్జీ గారి ముఖంపై దాడిచేసింది. ఆయన గుడ్లను దొంగిలిస్తున్నాడని తండ్రి పావురం అనుకుంది. అప్పుడు ముఖర్జీ గారు రెండవ గుడ్డును నేలపై జారవిడిచారు.

పావురం గూడును బాగుచేసేటప్పుడు పావురాలు తనపై దాడిచేస్తాయని ఊహించకపోవడమే ముఖర్జీగారు చేసిన ‘పనికిమాలిన పని’.

ముందే పక్షిదాడి గూర్చి ఊహించి ఉంటే, రెండవ గుడ్డు పగిలిపోయేది కాదు.

ఉ) పిల్లపక్షి నిస్సహాయంగా ఉన్నప్పుడు, గాభరాపడినప్పుడు తల్లిపక్షి ఏం చేసింది?
జవాబు:
తండ్రి పక్షి చిత్రగ్రీవానికి ఎగరడం నేర్పడం కోసం చిత్రగ్రీవాన్ని పిట్టగోడమీద నుండి కిందికి గెంటింది. అప్పుడు చిత్రగ్రీవం నిస్సహాయంగా, రెక్కలు విప్పి గాలిలో తేలింది. అది చూసిన తల్లి పక్షి, చిత్రగ్రీవానికి సాయంగా తానూ ఎగిరింది. ఆ రెండూ ఆకాశంలో పదినిమిషాలు ఎగిరి, గిరికీలు కొట్టి కిందికి వాలాయి. తల్లి పక్షి రెక్కలు ముడుచుకొని శుభ్రంగా కిందికి వాలింది. చిత్రగ్రీవం మాత్రం నేలను రాసుకుంటూ వెళ్లి, రెక్కల్ని టపటపలాడిస్తూ, బాలన్సు చేసుకుంటూ, ముందుకు సాగి ఆగింది.

అప్పుడు తల్లి పక్షి చిత్రగ్రీవం పక్కకు చేరి, దాన్ని ముక్కుతో నిమిరింది. చిత్రగ్రీవం రొమ్ముకు తన రొమ్ము తాకించింది. చిన్నపిల్లాడిని లాలించినట్లు చిత్రగ్రీవాన్ని అది లాలించింది.

ఊ) “ధనగోపాల్ ముఖర్జీ” చేసిన సాహితీసేవ ఏమిటి?
జవాబు:
ధనగోపాల్ ముఖర్జీ గారు జంతువులకు సంబంధించిన తొమ్మిది పిల్లల పుస్తకాలు రాశారు. వీటిలో 1922లో ఆయన రాసిన “కరి ది ఎలిఫెంట్”, 1924లో రాసిన “హరిశా ది జంగిల్ ల్యాడ్” 1928లో రాసిన “గోండ్ ది హంటర్”, పుస్తకాలు బాగా ప్రాచుర్యం పొందాయి.

ఈయన రాసిన చిత్రగ్రీవం పుస్తకం 1928లో న్యూ బెరీ మెడల్‌ను గెల్చుకుంది. బాలసాహిత్యంలో విశిష్ట కృషి చేసిన వారికి “అమెరికన్ లైబ్రరీ అసోసియేషన్” వారు ఇచ్చే విశిష్ట పురస్కారమే ఈ “న్యూ బెరీ మెడల్”. ఈ బహుమతిని గెల్చుకున్న ఏకైక భారతీయ రచయిత మన ముఖర్జీ గారే.

4. కింది పేరా చదవండి. సరైన వివరణతో ఖాళీలు పూరించండి.

చాతకపక్షుల ముక్కులు చాలా చిన్నవి. తాము ఎగురుతూనే గాలిలోని కీటకాలను పట్టుకోగలవు. నోరు బార్లా తెరచి తమవైపుకు వచ్చే చాతకపక్షుల బారి నుండి కీటకాలు తప్పించుకోవడం దాదాపు అసాధ్యం. చాతకపక్షులు పరిమాణంలో చాలా చిన్నవి. వాటికి బరువులెత్తే సామర్థ్యం కూడా తక్కువే! అందుకే అవి వాటి గూళ్ళ నిర్మాణంలో గడ్డీగాదం, పీచూపత్తి, సన్నపాటి చెట్టురెమ్మలు… వంటి తేలికపాటి వస్తువులనే వాడతాయి. వాటి కాళ్ళు పొట్టిగా ఉంటాయి. పొడవాటి కాళ్ళున్న పక్షుల్లో ఉండే చురుకుదనం వీటి కాళ్ళల్లో కనిపించదు. అందుకని ఇవి గెంతడం, దభీమని దూకడం వంటి పనులు చెయ్యలేవు. ఐతే వాటి కొక్కేల్లాంటి కాలివేళ్ళ పుణ్యమా అని అవి తమ గోళ్ళతో ఎలాంటి జారుడు ప్రదేశాల్లోనైనా అతుక్కుపోయి ఉండిపోగలవు. కాబట్టి అవి అనితరసాధ్యమైన నైపుణ్యంతో, కుశలతతో పాలరాతి వంటి నున్నటి గోడల్ని, ప్రదేశాలను పట్టుకొని వెళ్ళగలవు. తమ గూళ్ళను నిర్మించుకోవడానికి ఇళ్ళ చూరుల దిగువన గోడల్లోని తొర్రలను ఎన్నుకొంటాయి. రాలిన ఆకుల్నీ, గాలిలో ఎగిరే గడ్డిపోచల్ని ముక్కున కరచుకొని గూట్లోకి చేరుస్తాయి. వాటిని తమ లాలాజలాన్ని జిగురులా వాడి గూటి ఉపరితలం మీద అతికిస్తాయి. వాటి లాలాజలం ఓ అద్భుత పదార్థం. అది ఎండి గట్టిపడిందంటే మామూలుగా వాడే ఏ జిగురూ దానికి సాటిరాదు. ఇదీ చాతకపక్షుల వాస్తుకళానైపుణ్యం.

అ) చాతకపక్షులు తేలికపాటి వస్తువులతో గూళ్ళను నిర్మించుకుంటాయి. ఎందుకంటే …………………….
జవాబు:
చాతకపక్షులు తేలికపాటి వస్తువులతో గూళ్ళను నిర్మించుకుంటాయి. ఎందుకంటే వాటికి బరువులెత్తే సామర్థ్యం తక్కువ.

ఆ) చాతకపక్షులు దభీమని దూకడం, గెంతడం చెయ్యలేవు. ఎందుకంటే ……………………………
జవాబు:
చాతకపక్షులు దభీమని దూకడం, గెంతడం కూడా చెయ్యలేవు. ఎందుకంటే వాటి కాళ్ళు పొట్టిగా ఉంటాయి.

ఇ) నున్నటి గోడలు, ప్రదేశాల్లో కూడా చాతకపక్షులు జారకుండా ఉండడానికి కారణం ………………….
జవాబు:
నున్నటి గోడలు, ప్రదేశాల్లో కూడా చాతకపక్షులు జారకుండా ఉండడానికి కారణం వాటికి ఉన్న కొక్కేల్లాంటి కాలివేళ్ళు.

ఈ) చాతకపక్షుల లాలాజలం వాటి గూటి నిర్మాణంలో ఎంతో ముఖ్యమైంది. ఎందుకంటే ………………
జవాబు:
చాతకపక్షుల లాలాజలం, వాటి గూటి నిర్మాణంలో ఎంతో ముఖ్యమైనది. ఎందుకంటే వాటి లాలాజలం ఎండి గట్టిపడిందంటే మామూలుగా వాడే ఏ జిగురూ దానికి సాటిరాదు.

ఉ) వాస్తు కళా నైపుణ్యం అంటే …………..
జవాబు:
వాస్తు కళానైపుణ్యం అంటే ఇళ్ళను నిర్మించే విద్యలో నేర్పరిదనం.

II. వ్యక్తి కరణ-సృజనాత్మకత

1. కింది ప్రశ్నలకు ఆలోచించి ఐదేసి వాక్యాల్లో సమాధానాలు రాయండి.

అ) చిత్రగ్రీవాన్ని గురించి మీకు ఆశ్చర్యం కలిగించిన విషయాలు ఏవి?
జవాబు:
చిత్రగ్రీవం తనకు మూడు వారాల వయస్సు ఉన్నప్పుడు తన గూట్లోకి వచ్చిన నల్ల చీమను ముక్కుతో పొడిచి రెండు ముక్కలు చేసింది. అయితే ఆ చీమ దానికి తినడానికి పనికిరానిది. ఆ విషయం గ్రహించిన చిత్రగ్రీవం తన జీవితంలో మళ్ళీ ఎప్పుడూ మరో చీమను చంపలేదు.

తాను చేసిన పని పొరపాటు అని గ్రహించిన పావురం తిరిగి ఆ తప్పును తిరిగి చేయకపోవడం, నాకు ఆశ్చర్యం కల్గించింది.

ఆ) మానవులను పావురాలకు మిత్రులూ, సహచరులని రచయిత ఎందుకు అన్నాడు?
జవాబు:
“ఏనుగులు, పావురాలు తమ తమ యజమానుల పట్ల గొప్ప విశ్వాసాన్ని ప్రదర్శిస్తాయి. వీటిని మించి యజమాని పై విశ్వాసాన్ని ప్రదర్శించే ప్రాణిని తాను చూడలేదని రచయిత చెప్పాడు.

అడవులలోని ఏనుగులు, నగరాల్లోని పావురాలు తమ యజమానులంటే ప్రాణం ఇస్తాయి. అవి రోజంతా ఎక్కడెక్కడ తిరిగినా, ఏ ఆకాశ సీమలో ఎగిరినా, చివరకు అవి వాటికి ఉన్న అద్భుతమైన ‘అంతఃప్రేరణాబలం’తో తమ మిత్రుడూ, సహచరుడూ అయిన మానవుడి పంచకే చేరుతాయి”.

అందువల్లనే రచయిత, మానవులను పావురాలకు మిత్రులు, సహచరులు అని అన్నాడు.

AP SSC 10th Class Telugu Solutions Chapter 12 చిత్రగ్రీవం

2. కింది ప్రశ్నలకు ఆలోచించి పదేసి వాక్యాల్లో సమాధానాలు రాయండి.

అ) చిత్రగ్రీవాన్ని గురించి మీ సొంతమాటల్లో వర్ణించండి.
జవాబు:
‘చిత్రగ్రీవం’ అనేది ఒక పావురం. దానిని తల్లి పక్షి, తండ్రి పక్షి అనురాగంగా పెంచాయి. తల్లిదండ్రుల శ్రమ, శ్రద్ధ వల్ల చిత్రగ్రీవం మహా ఏపుగా పెరిగింది. దానికి గులాబీరంగు మారి తెలుపురంగు వచ్చింది. ముళ్ళపందిలాంటి ఈకలు వచ్చాయి. దాని కళ్లు దగ్గర, నోటి దగ్గర ఉన్న, పసుపు పచ్చని చర్మాలు రాలిపోయాయి. పొడవాటి, గట్టిపాటి సూదిలాంటి ముక్కు ఏర్పడింది.

పుట్టిన ఐదోవారానికి చిత్రగ్రీవం గూడు నుండి బైటికి గెంతి, మూకుళ్లలో నీళ్ళు త్రాగేది. చిత్రగ్రీవం మందకొడిగా ఉండేది.. మూడు నెలల వయస్సు రాగానే, దాని ఒళ్ళంతా సముద్రపు నీలిరంగు ఈకలు ధగధగా మెరిశాయి. దాని మెడ ప్రాంతం, సూర్యకాంతిలో ఇంద్రధనుస్సు వర్ణాల పూసల గొలుసులా శోభిల్లింది. తండ్రి పక్షి చిత్రగ్రీవానికి ఎగరడం బలవంతంగా నేర్పింది. ఎగరడంలో అలసిన చిత్రగ్రీవాన్ని తల్లి పక్షి లాలించింది.

చిత్రగ్రీవానికి నిండుగా ఈకలు పెరిగాయి. ఆ ఈకలు అతి సుందరమైన రంగులతో నిండాయి. అందుకే, చిత్రగ్రీవానికి సాటిరాగల పావురం లేదు.

ఆ) శిశువుల పెంపకంలో పక్షులకు, మానవులకు మధ్య ఉన్న సామ్యాలను రాయండి.
(లేదా)
పిల్లల పెంపకంలో పక్షులకు, మానవులకు మధ్యగల పోలికలను వివరంగా సొంతమాటలలో పాఠ్యభాగం ఆధారంగా రాయండి.
జవాబు:
చంటిపిల్లల నోటికి తల్లి తన పాలను అందించినట్లే, పక్షిపిల్లల నోటికి తల్లి పక్షి, తండ్రి పక్షి ఆహారాన్ని అందిస్తాయి. పిల్లలకు తల్లి మంచి పక్కను ఏర్పాటు చేసినట్లే, పక్షి పిల్లలకు, తల్లి పక్షి, తండ్రి పక్షి ఆచితూచి గూట్లో వస్తువులను ఉంచి, పిల్లపక్షికి సుఖసౌకర్యాలను కల్పిస్తాయి.

తల్లి పిల్లలకు పదార్థాలను ఉడకపెట్టి, మెత్తగా చేసి, నోట్లో పెడుతుంది. అలాగే తల్లి పక్షి, తండ్రి పక్షి గింజల్నీ, విత్తనాల్నీ కాసేపు తమ నోటిలో నాననిచ్చి, మెత్తపరచి ఆ తర్వాతనే పక్షిపిల్లల నోట్లో పెడతాయి.

తల్లిదండ్రులు పిల్లలకు పాకడం, లేచి నిలబడడం, నడవడం నేర్పుతారు. వారు పిల్లల చేతులను పట్టుకొని జాగ్రత్తగా వారికి నడపడం నేర్పుతారు. అప్పుడప్పుడు పిల్లలు నడుస్తూ పరుగు పెడుతూ పడిపోతారు. అప్పుడు తల్లిదండ్రులు పిల్లలను దగ్గరకు తీసుకొని లాలిస్తారు.

చిత్రగ్రీవానికి తండ్రి ఎగరడాన్ని అలాగే నేర్పింది. బలవంతంగా చిత్రగ్రీవాన్ని తండ్రి పక్షి, ఆకాశంలోకి తోసింది. దానితో అప్రయత్నంగా రెక్కలు విప్పి చిత్రగ్రీవం ఎగిరింది. ఎగరడంలో అది అలిసిపోగా, తల్లి పక్షి చిత్రగ్రీవాన్ని లాలించింది.

ఈ విధంగా చిత్రగ్రీవం పెంపకానికీ, పిల్లల పెంపకానికి పోలికలు ఉన్నాయి.

3. సృజనాత్మకంగా/ప్రశంసిస్తూ రాయండి.

అ) ‘చిత్రగ్రీవం’ అనే పావురంపిల్ల ఎలా పుట్టిందీ ఎలా ఎగరడం నేర్చుకొన్నదీ తెలుసుకున్నారు కదా! అట్లాగే మీకు తెలిసిన లేదా మీ పరిసరాల్లోని ఏదైనా పక్షి / జంతువు గురించి మీరు కూడా ఒక కథనాన్ని రాయండి. (ఈ పాఠంలాగా).
జవాబు:

“ధోనీ” (కుక్కపిల్ల)

మా పక్క ఇంటివాళ్ళకూ కుక్కపిల్లలంటే మహాప్రేమ’. తనను పెంచుకుంటున్న యజమానిపై విశ్వాసం చూపడంలో కుక్కను మించిన జంతువు కనబడదు. మా పక్కింటి అబ్బాయి ఒక కుక్కను పెంచుకోవాలని ఆశపడుతున్నాడు.

వాళ్ళింట్లో ఒక కుక్క గర్భవతిగా ఉంది. ఒక రోజున దానికి మూడు పిల్లలు పుట్టాయి. అందులో ఒక పిల్ల అందంగా. తెల్లగా పాలరంగులో ఉంది. దానికి మంచి బొచ్చు ఉంది. దాన్ని చూస్తే ముద్దుగా ఉంది. దానికి ధోనీ అని పేరు పెట్టాలని ఆ పిల్లవాడి ఆశ. ఆ పిల్లాడు ఇంజనీరింగ్ చదువుతున్నాడు. క్రికెట్ అంటే బాగా ఇష్టం. అందుకే ముద్దు వచ్చే ఆ కుక్క పిల్ల ధోనీగా మారింది.

ఆ ధోనీ అంటే దాని తల్లికి బాగా ఇష్టం. ధోనీకి తల్లి కుక్క కడుపునిండా పాలిచ్చేది. ధోనీ తోకను ఊపుతూ కులాసాగా మా వీధిలో తిరుగుతూ ఉంటుంది. ‘ధోనీ’ అంటే మా వీధి వాళ్ళంతా ఇష్టపడతారు. దానికి మా పక్కింటబ్బాయి స్నానం చేయించి పాలు, బిస్కెట్లు, కోడిగుడ్లు, మాంసం పెడతాడు. ధోనీ క్రమంగా టైగర్ లా పెరిగింది.

ఒక రోజున ‘ధోనీ’ వాళ్ళింట్లోకి అడుగుపెడుతూ ఉన్న దొంగపై దూకి అతని పిక్క పట్టుకొంది. అది చూసిన మా పక్కింటి అబ్బాయి ‘ధోనీ’ అని ప్రేమగా పిలిచాడు. అంతే! దొంగను వదలి తోక ఊపుకుంటూ, ఆ అబ్బాయి దగ్గరకు అది పరుగుపెట్టింది. ‘ధోనీ’ని పోలీసు కుక్కగా చేయాలని మా పక్కింటి అబ్బాయి చూస్తున్నాడు.

ఆ) ఈ మధ్యకాలంలో సెల్ ఫోన్ టవర్ల నుండి వచ్చే వేడిమికి కొన్ని పక్షిజాతులు అంతరించిపోతున్నాయి. అలాగే ఎండాకాలంలో తీవ్రమైన వేడికి తాళలేక, తాగడానికి నీరు అందక, మృత్యువాతపడుతున్నాయి. పక్షులు ఇందుకోసం తమను కాపాడడానికి తగిన చర్యలు చేపట్టమని తమ తోటకు వచ్చిన పిల్లలతో సంభాషించాయి అనుకోండి. ఆ పిల్లలకూ, పక్షులకూ మధ్య జరిగే సంభాషణను ఊహించి రాయండి.
జవాబు:
“తోటలో మిత్రులు – పక్షులతో సంభాషణ”
రాము : ఓరేయ్ గోపాల్! పూలమీద తూనీగలు ఎగిరేవి కదా! ఇప్పుడు కనబడడం లేదేం?

గోపాల్ : ఈ మధ్య పక్షి జాతులు అనేక రకాలుగా నశిస్తున్నాయని అంటున్నారు కదా!

పిచ్చుక : బాబుల్లారా! మీ దృష్టి మా మీద పడింది. సంతోషము. మా పక్షులు ఎలక్ట్రిక్ తీగల మీద వాలితే చచ్చిపోతున్నాయి. రోజూ ఎన్ని కాకులూ, చిలుకలూ, గోరింకలూ అలా చస్తున్నాయో ! మీకు తెలుసా?

రాము : నిజమే. పక్షులు అంతరిస్తే, మన పర్యావరణం దెబ్బ తింటుంది కదా! మరేం చేయాలి?

చిలుక : నాయనా ! మీ పెరళ్ళలో జామ చెట్లు లేవు. మామిడి చెట్లు, సపోటాలు, సీతాఫలాల చెట్లూ లేవు. మేము ఏమి తిని బ్రతకాలి?

గువ్వ : నాయనా! మాకు తాగడానికి నీళ్ళు దొరకడం లేదు. మీరు చెరువులు పూడ్చివేస్తున్నారు. నూతులు కప్పివేస్తున్నారు. గ్రామాలలో మేము బతికే దారే లేదు.

గోరింక : గాలిలో హాయిగా ఎగురుదామంటే, ఈ సెల్ ఫోను టవర్లు, టి.వి. టవర్లు అడ్డుగా ఉంటున్నాయి. ఆ తరంగాల ప్రభావంతో మేము చస్తున్నాము.

గోపాల్ : మీరు చెప్పే మాటలు వింటూంటే భయంగా ఉంది. ఇంక మేము మీ పక్షులను టి.వి.ల్లోనే చూడాలేమో!

పక్షులు : మేము హాయిగా తిరగడానికి మీ గ్రామాల్లో చెట్లు పాతండి. చెరువులు, కాలువలూ పూడ్చి వేయకండి. మీ మీ పెరళ్లలో పూలమొక్కలూ, పండ్ల మొక్కలు పెంచండి.

రాము, గోపాల్: సరే. మీరు మాకు ఎన్నో విషయాలు చెప్పారు. తప్పకుండా పక్షులను రక్షించే కేంద్రాలను గురించి మా పెద్దలతో మాట్లాడతాం.

పక్షులు : మంచిది. కృతజ్ఞతలు.

భాషా కార్యకలాపాలు ప్రాజెక్టు పని

1. “ధనగోపాల్ ముఖర్జీ” రాసిన “చిత్రగ్రీవం ఓ పావురం కథ” అనే పుస్తకాన్ని లేదా పక్షుల గురించి తెలిపే ఏదైనా ఒక పుస్తకాన్ని గ్రంథాలయం నుండి చదవండి. మీరు తెలుసుకున్న వివరాలు రాసి ప్రదర్శించండి.
(లేదా)
అంతర్జాలం ద్వారా ఏవైనా రెండు పక్షుల వివరాలు, వాటి చిత్రాలు సేకరించి, రాసి ప్రదర్శించండి.
జవాబు:
అ) చిలుక: ఇది అందంగా ఉంటుంది. దీనిని పెంచుకుంటారు. ఇవి రెండు రకాలు.
1) చిలుకలు
2) కాక్కటూ
చిలుకలకు బలమైన వంకీ తిరిగిన ముక్కు, బలమైన కాళ్ళు ఉంటాయి. కొన్ని పంచరంగుల చిలుకలు ఉంటాయి. ఇవి పరిమాణంలో 3.2 నుండి 10 అం|| పొడవు వరకూ ఉంటాయి. ఇవి గింజలు, పండ్లు మొగ్గలు, చిన్న మొక్కలను తింటాయి. కొన్ని జాతుల చిలుకలు పురుగుల్ని తింటాయి. చిలుకలు చెట్టు తొట్టెలలో గూళ్లు కట్టుకుంటాయి.

ఇవి తెలివైన పక్షులు. ఇవి మనుష్యుల గొంతును పోలి మాట్లాడతాయి. పెంపుడు జంతువుల వ్యాపారం, వేట, పోటీ, కారణాల వల్ల ఇవి తొందరగా అంతరించిపోతున్నాయి. జ్యోతిషంలో చిలుక ప్రధాన పాత్ర వహిస్తుంది. పల్లెలలో సైతం చిలుక జోస్యం చెప్పేవారు కనిపిస్తారు.

ఆ) పిచ్చుక :
ఇది చిన్న పక్షి. ఇవి చిన్నగా, బొద్దుగా గోధుమ – ఊదా రంగుల్లో ఉంటాయి. చిన్న తోకతో పొట్టిగా ఉండే బలమైన ముక్కు కలిగి ఉంటాయి. పిచ్చుకలలో పెద్దగా తేడాలుండవు. ఇవి గింజలను తింటాయి. కొన్ని చిన్న చిన్న క్రిమి కీటకాలను తింటాయి. కొండపిచ్చుకలు పట్టణాల్లో నివసించి ఏదైనా తింటాయి. ఇది 4.5′ నుండి 7′ వరకు పొడవు ఉంటుంది. పిచ్చుకలు శరీర నిర్మాణంలో గింజలను తినే పక్షులలాగే ఉంటాయి. నాలుకలో ఒక ఎముక అధికంగా ఉంటుంది.

ప్రాచీన పిచ్చుకలు యూరప్, ఆఫ్రికా, ఆసియాలో విస్తరించాయి. జీవనశైలిలో పెద్దవేగంగా వచ్చిన మార్పు, పిచ్చుకపై బ్రహ్మాస్త్రంగా పరిణమించింది. పచ్చదనం అంతరించిపోవడం, రసాయనాలతో పళ్ళు, ఆహారధాన్యాల ఉత్పత్తి వల్ల పిచ్చుకలు అంతరిస్తున్నాయి. సెల్యూలర్ టవర్ల నుండి వచ్చే అయస్కాంత కిరణాలు, ఆ జాతికి ముప్పుగా పరిణమించాయి.

AP SSC 10th Class Telugu Solutions Chapter 12 చిత్రగ్రీవం

2. “చిత్రగ్రీవం” అనే పక్షి పేరు పంచతంత్ర కథలో కూడా ఉంది. పంచతంత్రం కథల పుస్తకం చదవండి. మీరు చదివిన కథ రాసి ప్రదర్శించండి.
జవాబు:
పంచతంత్ర కథల్లో చిత్రగ్రీవుడి కథ
‘చిత్రగ్రీవుడు’ పావురాల రాజు, అతగాడు తన పావురాలతో ఆకాశంలో తిరుగుతున్నాడు. గోదావరీ తీరంలో ఒక మర్రిచెట్టు ఉంది. ఒక బోయవాడు వచ్చి ఆ చెట్టు దగ్గరలో నూకలు చల్లి దానిమీద వల వేశాడు. “పక్షులు నూకల కోసం వలమీద వాలతాయి. వాటిని పట్టుకొని అమ్ముకుందాం” అనుకున్నాడు.

ఆ చిత్రగ్రీవుడితో ఎగురుతున్న పావురాలు ఆ నూకలను చూశాయి. అవి నేలమీద వాలి, నూకలను తిందామనుకున్నాయి. “ఇది మనుష్యుల సంచారం లేని అడవి. ఈ నూకలు ఇక్కడకు ఎందుకు వస్తాయి ? కాబట్టి ఈ నూకలకు ఆశపడకండి” అని చిత్రగ్రీవుడు స్నేహితులకు చెప్పాడు. ఒక ముసలి పావురం చిత్రగ్రీవుడి మాటలు కాదంది. నూకలు తిందామంది. సరే అని పావురాలు కిందికి దిగాయి. వలలో చిక్కుకున్నాయి.

పావురాలు ముసలి పావురాన్ని తిట్టాయి. చిత్రగ్రీవుడు “తిట్టకండి. మనం అంతా కలసి ఎగిరిపోదాం. నాకో స్నేహితుడు ఉన్నాడు. మనల్ని రక్షిస్తాడు” అని చెప్పింది. పావురాలు అన్నీ కలసి వల ఎత్తుకొని, చిత్రగ్రీవుడి స్నేహితుడు హిరణ్యకుడు అనే ఎలుక ఉండే కన్నం దగ్గర వాలాయి. హిరణ్యకుణ్ణి చిత్రగ్రీవుడు గొంతెత్తి పిలిచాడు. హిరణ్యకుడు స్నేహితుని మాట విని పావురాల బంధాలన్నీ తన పళ్లతో కొరికివేశాడు. పావురాలు చిత్రగ్రీవుణ్ణి, హిరణ్యకుణ్ణి మెచ్చుకున్నాయి. అందుకే మనందరికీ మంచి స్నేహితులు ఉండాలి.

III. భాషాంశాలు

పదజాలం

1. కింది పదబంధాలను ఉపయోగించి సొంతవాక్యాలు రాయండి.

అ) శ్రద్ధాసక్తులు
జవాబు:
వాక్యం : విజయం సాధించాలంటే పనిలో శ్రద్ధాసక్తులు చూపించాలి.

ఆ) ప్రేమ ఆప్యాయతలు
జవాబు:
వాక్యం : తల్లిదండ్రులు తమ పిల్లలపై ప్రేమ, ఆప్యాయతలు కురిపించాలి.

ఇ) వన్నెచిన్నెలు
జవాబు:
వాక్యం : మా ఆవుదూడ వన్నెచిన్నెలు చూసి నేను మురిసిపోతాను.

ఈ) సమయసందర్భాలు :
జవాబు:
వాక్యం : సమయసందర్భాలు లేకుండా హాస్యంగా మాట్లాడడం నాకు నచ్చదు.

ఉ) హాయిసౌఖ్యాలు
జవాబు:
వాక్యం : తల్లిదండ్రులు, బిడ్డల హాయిసౌఖ్యాల గురించి శ్రద్ధ పెట్టాలి.

2. కింది పదాలను వివరించి రాయండి.

అ) విజయవంతం కావడం అంటే
జవాబు:
విజయవంతం కావడం అంటే తాను ప్రారంభించిన పని ఏ విఘ్నమూ లేకుండా పూర్తి అవడం.

ఆ) ఉలుకూ పలుకూ లేకపోవడం అంటే
ఉలుకూ పలుకూ లేకపోవడం అంటే ఎవరు ఏమి మాట్లాడినా, తన మనస్సులో ఏమి ఉన్నా, పైకి మాత్రం మాట్లాడకుండా, నోరు మూసుకు కూర్చోడం.

AP SSC 10th Class Telugu Solutions Chapter 12 చిత్రగ్రీవం

3. కింద తెలిపిన వాటిని గురించి పాఠంలో ఏఏ పదాలతో వర్ణించారు?
అ) గద్దింపులు : కువకువ కూయడం
ఆ) పావురాలు : రకరకాల రంగురంగుల పావురాలు
ఇ) గువ్వలు : నీలికళ్లతో కువకువలాడడం
ఈ) పావురాల గుంపు : పెనుమేఘాలు
ఉ) పావురం మెడ : హరివిల్లు
ఊ) పుట్టిన పిల్లపక్షి : బలహీనమైన, నిస్సహాయమైన, అర్భకమైన
ఋ) చిత్రగ్రీవం ముక్కు : పొడవాటి, గట్టిపాటి, సూదిలాంటి బలమైన
ఎ) చిత్రగ్రీవం ఒళ్ళు : సముద్రపు నీలిరంగు
ఏ) చిత్రగ్రీవం మెడ ప్రాంతం : ఇంద్రధనుస్సు వర్ణాల పూసల గొలుసులా

వ్యాకరణాంశాలు

1. కింది అలంకారాల లక్షణాలు రాయండి. అ) శ్లేష
జవాబు:
లక్షణం : అనేకమైన అర్థాలు గల శబ్దాలను ఉపయోగించి చెబితే ‘శ్లేష’ అనబడుతుంది.
ఉదా :
1) రాజు కువలయానందకరుడు
2) మానవ జీవనం సుకుమారం

ఆ) అర్ధాంతరన్యాసం :
జవాబు:
లక్షణం : విశేష విషయాన్ని, సామాన్య విషయంతో కాని, సామాన్య విషయాన్ని విశేష విషయంతో కాని సమర్థించి చెప్పడం. దీన్ని “అర్థాంతరన్యాసాలంకారం’ అంటారు.
ఉదా :
1) హనుమంతుడు సముద్రాన్ని దాటాడు. మహాత్ములకు సాధ్యం కానిది లేదు కదా!
2) మేఘుడు అంబుధికి పోయి జలం తెచ్చి ఇస్తాడు. లోకోపకర్తలకు ఇది సహజగుణం.

2. కింది ఛందోరీతుల లక్షణాలు రాయండి.
అ) సీసం
జవాబు:
సీసం – (లక్షణం ) :
1) సీసంలో నాల్గు పాదాలుంటాయి. ప్రతిపాదం 2 భాగాలుగా ఉంటుంది. పాదంలోని రెండు భాగాల్లోనూ, ఒక్కొక్క భాగంలో 4 గణాల చొప్పున ఉంటాయి. మొత్తం పాదంలోని 8 గణాల్లో, ఆరు ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు క్రమంగా ఉంటాయి.
2) యతి పాదంలోని రెండు భాగాల్లోనూ మూడవ గణం మొదటి అక్షరంతో సరిపోతుంది. యతిలేనిచోట ప్రాసయతి చెల్లుతుంది.
3) సీసంలోని నాల్గు పాదాల తరువాత, ఒక తేటగీతి కాని లేక ఆటవెలది గాని తప్పనిసరిగా ఉంటుంది.
ఉదా :
సీ|| “హరిహర బ్రహ్మలఁ బురిటి బిడ్డలఁజేసి జోలఁ బాడిన పురంద్రీలలామ”

గమనిక :
పై పద్యంలో రెండు చోట్ల ప్రాస యతులు.

ఆ) ఆటవెలది
జవాబు:
ఆటవెలది – (లక్షణం ) :

  1. ఇది ‘ఉపజాతి’ పద్యం.
  2. ఈ పద్యానికి నాలుగు పాదాలు ఉంటాయి.
  3. 1, 3 పాదాల్లో వరుసగా మూడు సూర్యగణాలు, రెండు ఇంద్రగణాలు ఉంటాయి. .
  4. 2, 4 పాదాల్లో వరుసగా ఐదు సూర్యగణాలు ఉంటాయి.
  5. ప్రతిపాదంలోనూ నాల్గవ గణంలోని మొదటి అక్షరంతో యతి. యతిలేని చోట “ప్రాసయతి” ఉంటుంది.
  6. ప్రాసనియమం పాటించనవసరంలేదు.
    ఉదా :
    ఆ||వె : “పొదలి పొదలి చదల బొంగారి పొంగారి
    మించి మించి దిశల ముంచి ముంచి”

ఇ) తేటగీతి
జవాబు:
తేటగీతి – (లక్షణం ) :
1) ఇది ‘ఉపజాతి’ పద్యం.
2) ఈ పద్యానికి నాలుగు పాదాలు ఉంటాయి.
3) ప్రతి పాదానికి వరుసగా 1 సూర్య, 2 ఇంద్ర, 2 సూర్య గణాలు ఉంటాయి.
4) నాలుగవ గణం మొదటి అక్షరం యతి. ప్రాస యతి కూడా వేయవచ్చు.
5) ప్రాసనియమం లేదు.
AP SSC 10th Class Telugu Solutions Chapter 12 చిత్రగ్రీవం 1

3. కింది వాక్యాలలోని అలంకారాన్ని గుర్తించండి.

అ) శ్రీమంత్ చొక్కా మల్లెపూవులా తెల్లగా ఉంది.
జవాబు:
ఈ వాక్యంలో ‘ఉపమాలంకారం’ ఉంది. ఈ

ఉపమాలంకార లక్షణం :
ఉపమాన, ఉపమేయాలకు చక్కని పోలిక చెప్పడం ‘ఉపమాలంకారం’.

సమన్వయం : ఇందులో 1) ఉపమానం, 2) ఉపమేయం, 3) ఉపమావాచకం, 4) సమానధర్యం ఉంటాయి.

పై ఉదాహరణలో
1) మల్లెపూవు (ఉపమానం)
2) చొక్కా (ఉపమేయం)
3) వలె (ఉపమావాచకం)
4) తెల్లగా ఉంది (సమానధర్మం )

4. కింది పద్యపాదాలు పరిశీలించండి.
AP SSC 10th Class Telugu Solutions Chapter 12 చిత్రగ్రీవం 2
గమనిక :
పై పద్యంలో గగ, భ, జ, స, అనే గణాలు వాడబడ్డాయి. ఒకటవ, మూడవ పాదాల్లో మూడేసి గణాలు ఉన్నాయి. రెండవ, నాల్గవ పాదాల్లో ఐదేసి గణాలున్నాయి.
ఒకటి, రెండు పాదాలు కలిసి మొత్తం 8 గణాలు (3 + 5 = 8)
రెండు, నాల్గు పాదాలు కలిసి మొత్తం 8 గణాలు (3 + 5 = 8)
ఒకటి, రెండు పాదాలు కలిపిన | రెండు, నాల్గు పాదాలు కలిపిన | గణాలలో,| 8 గణాలలో, ఆరవ గణం ‘జగణం’ ఉంది.
రెండు, నాల్గు పాదాల చివరి అక్షరం ‘గురువు’ ఉంది.
ఇలాంటి లక్షణాలు కల పద్యాన్ని “కందపద్యం” అంటారు.

కందము :
పద్య నియమాలు తెలిసికొందాం.

  1. ఈ పద్యంలో గగ, భ, జ, స, నల అనే గణాలు ఉంటాయి.
  2. మొదటి పాదం లఘువుతో మొదలయితే, అన్ని పాదాల్లో మొదటి అక్షరం లఘువు ఉండాలి. గురువుతో మొదటి పాదం మొదలయితే, అన్ని పాదాల మొదటి అక్షరం గురువు ఉండాలి.
  3. రెండు, నాల్గవ పాదాలలోని చివరి అక్షరం గురువుగానే ఉంటుంది.
  4. 1, 2 పాదాల్లో (3 + 5 = 8 గణాలు); 3, 4 పాదాల్లో (3 + 5 = 8) గణాలు ఉంటాయి. ఈ 8 గణాల్లో ఆరవ గణం తప్పక నలం కాని, జగణం కాని కావాలి.
  5. 2, 4 పాదాల్లో యతి ఉంటుంది. నాల్గవ గణం మొదటి అక్షరానికి, ఏడవ గణం మొదటి అక్షరానికి యతి ఉండాలి.
  6. ప్రాస నియమం ఉండాలి. (4 పాదాల్లో) 7) పద్యంలోని 1 + 2 పాదాలు కలిపిన 8 గణాల్లో బేసిగణం ‘జగణం’ ఉండరాదు.

అబ్యాసం
“వినదగు నెవ్వరు జెప్పిన” అనే పద్యానికి లక్షణ సమన్వయం చేయండి.
AP SSC 10th Class Telugu Solutions Chapter 12 చిత్రగ్రీవం 3

సమన్వయం :

  1. మొదటి పాదంలో 3 గణాలు, రెండవ పాదంలో 5 గణాలు, మొత్తం 8 గణాలు ఉన్నాయి. ఈ పాదాలలో గగ, భ, జ, స, నల అనే గణాలే ఉన్నాయి.
  2. మొత్తం (1 + 2) పాదాలకు ఉన్న 8 గణాలలో ఆరవ గణం ‘నలం’ ఉంది. రెండవ పాదం చివర గురువు ఉంది.
  3. యతి 4, 7 గణాల మొదటి అక్షరాలకు సరిపోయింది. (వి – వి)
  4. ప్రాస నియమం ఉంది.
  5. బేసి గణంగా ‘జగణం’ లేదు.
    కాబట్టి ఇవి కంద పద్యపాదాలు.

అదనపు సమాచారము

సంధులు

1) ప్రపంచపు వెలుగు = ప్రపంచము + వెలుగు – పుంప్వాదేశ సంధి
2) ధాన్యపు గింజలు = ధాన్యము + గింజలు – పుంప్వాదేశ సంధి
3) ఉత్తరపు గాలి = ఉత్తరము + గాలి – పుంప్వాదేశ సంధి
4) నీలివర్ణపు ఈకలు = నీలివర్ణము + ఈకలు – పుంప్వాదేశ సంధి
5) సముద్రపు నీలిరంగు = సముద్రము + నీలిరంగు – పుంప్వాదేశ సంధి
6) చర్మపు పొర = చర్మము + పొర – పుంప్వాదేశ సంధి
7) జ్ఞానపు పావురాలు = జ్ఞానము + పావురాలు – పుంప్వాదేశ సంధి
8) అమాయకపు నల్లచీమ = అమాయకము + నల్లచీమ – పుంప్వాదేశ సంధి
9) మందిరాలు = మందిరము + లు – లులనల సంధి
10) వర్షాలు = వర్షము + లు – లులనల సంధి
11) మండుటెండ = మండు + ఎండ – టుగాగమ సంధి
12) నీలాకాశము = నీల + ఆకాశము – సవర్ణదీర్ఘ సంధి
13) శ్రద్ధాసక్తులు = శ్రద్ధా + ఆసక్తులు – సవర్ణదీర్ఘ సంధి
14) బాగోగులు = బాగు + ఓగులు – ఉత్వ సంధి
15) నాలుగంతస్తులు = నాలుగు + అంతస్తులు – ఉత్వసంధి
16) జలకాలాడు = జలకాలు + ఆడు – ఉత్వసంధి
17) చిట్టచివర = చివర + చివర – ఆమ్రేడిత సంధి
18) మొట్టమొదలు = మొదలు + మొదలు – ఆమ్రేడిత సంధి
19) పూరిల్లు = పూరి + ఇల్లు – ఇత్వ సంధి
20) నిస్సహాయము = నిః + సహాయము – విసర్గ సంధి
21) మనోహరం = మనః + హరము – విసర్గ సంధి
22) ముంజేయి = ముందు + చేయి – ప్రాతాది సంధి
23) పూఁదోట = పూవు + తోట – ప్రాతాది సంధి
24) తల్లిదండ్రులు = తల్లి + తండ్రి – గసడదవాదేశ సంధి

సమాసాలు

సమాస పదం విగ్రహవాక్యం సమాసం పేరు
1) మూడు వారాలు మూడు సంఖ్యగల వారాలు ద్విగు సమాసం
2) మూడు గంటలు మూడు సంఖ్యగల గంటలు ద్విగు సమాసం
3) మూడు నెలలు మూడు సంఖ్యగల నెలలు ద్విగు సమాసం
4) నాలుగడుగులు నాలుగు సంఖ్యగల అడుగులు ద్విగు సమాసం
5) రెండు ముక్కలు రెండు సంఖ్యగల ముక్కులు ద్విగు సమాసం
6) రెండు గుడ్లు రెండు సంఖ్యగల గుడ్లు ద్విగు సమాసం
7) ఇరవై నిమిషాలు ఇరవై సంఖ్యగల నిమిషాలు ద్విగు సమాసం
8) ఇరవై లక్షలు ఇరవై సంఖ్యగల లక్షలు ద్విగు సమాసం
9) పది లక్షలు పది సంఖ్యగల లక్షలు ద్విగు సమాసం
10) శ్రద్ధాసక్తులు శ్రద్ధయు, ఆసక్తియు ద్వంద్వ సమాసం
11) వన్నెచిన్నెలు వన్నెయు, చిన్నెయు ద్వంద్వ సమాసం
12) శక్తియుక్తులు శక్తియు, యుక్తియు ద్వంద్వ సమాసం
13) సుఖసౌకర్యాలు సుఖమును, సౌకర్యమును ద్వంద్వ సమాసం
14) అసంఖ్యాకం సంఖ్యలేనిది నఞ్ తత్పురుష సమాసం
15) అసంకల్పితం సంకల్పితం కానిది నఞ్ తత్పురుష సమాసం
16) అసాధ్యం సాధ్యం కానిది నఞ్ తత్పురుష సమాసం
17) అప్రయత్నం ప్రయత్నం కానిది నఞ్ తత్పురుష సమాసం
18) మహానగరం గొప్పనగరం విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
19) యువరాజు యువకుడైన రాజు విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
20) యువరాణి యువతియైన రాణి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
21) పెంపుడు పావురాలు పెంచుకొంటున్న పావురాలు విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
22) తెల్లజెండాలు తెల్లవైన జెండాలు విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
23) నీలాకాశం నీలమైన ఆకాశం విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
24) చిన్ని బృందాలు చిన్నవైన బృందాలు విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
25) కులీన వంశము కులీనమైన వంశము విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
26) దివ్య సంకల్పం దివ్యమైన సంకల్పము విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
27) పెద్ద పక్షులు పెద్దవైన పక్షులు విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
28) మండుటెండ మండుతున్న ఎండ విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
29) యథాస్థానం స్థానమును అతిక్రమింపక అవ్యయీభావ సమాసం
30) అతిసుందరం మిక్కిలి సుందరం అవ్యయీభావ సమాసం
31) వెలుగు వెల్లువ వెలుగుల యొక్క వెల్లువ షష్ఠీ తత్పురుష సమాసం
32) పావురాల బృందాలు పావురాల యొక్క బృందాలు షష్ఠీ తత్పురుష సమాసం
33) హరివిల్లు హరియొక్క విల్లు షష్ఠీ తత్పురుష సమాసం
34) దిశాపరిజ్ఞానం దిశల యొక్క పరిజ్ఞానం షష్ఠీ తత్పురుష సమాసం
35) చిత్రగ్రీవం చిత్రమైన గ్రీవము కలది బహుహ్రీహి సమాసం
36) భారతదేశం భారతము అనే పేరుగల దేశం సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం
37) బాగోగులు బాగును, ఓగును ద్వంద్వ సమాసం

నానార్థాలు

1. మిత్రుడు : స్నేహితుడు, సూర్యుడు, శత్రుదేశపు రాజు
2. పుణ్యము : ధర్మము, నీరు, బంగారము

ప్రకృతి – వికృతులు

రాజ్ఞి – రాణి
విశ్వాసము – విసువాసము
ఆశ్చర్యం – అచ్చెరువు
ప్రాణం – పానం
దిశ – దెస
వంశము – వంగడము
పుణ్యము – పున్నెము
పక్షి – పక్కి
పిత్స – పిట్ట
కుడ్యం – గోడ
శక్తి – సత్తి
యుక్తి – ఉత్తి
సుఖం – సుకం
స్వతంత్రమ్ – సొంతము
ఆకాశము – ఆకసము
నిమేషము – నిముసము
ఆహారము – ఓగిరము
అద్భుతము – అబ్బురము
ముహూర్తము – మూర్తము
చిత్రం – చిత్తరువు

పర్యాయపదాలు

1. నగరము : పురము, పట్టణము, పురి, పత్తనము
2. ఏనుగు : కరి, హస్తి, వారణము, ఇభము
3. అద్భుతము : అబ్బురము, అచ్చెరువు, వింత
4. ఆకాశము : గగనము, అంబరము, నభము, మిన్ను
5. గింజ : బీజము, విత్తు, విత్తనము
6. ముఖము : మొహం, ఆస్యము, వక్రము, ఆననము, మోము
7. తల్లి : జనని, జనయిత్రి, మాత, అమ్మ
8. తండ్రి : జనకుడు, అయ్య, నాయన, పిత
9. కన్ను : అక్షి, నేత్రము, నయనం, చక్షువు

వ్యుత్పత్యర్థాలు

1. చిత్రగ్రీవము : చిత్రమైన వర్ణాలతో కూడిన కంఠం కలది (పావురం)
2. పక్షి : పక్షములు (తెక్కలు) కలిది (పిట్ట)

రచయిత పరిచయం

పాఠ్యం పేరు : ‘చిత్రగ్రీవం’
పాఠ్య రచయిత : ధనగోపాల్ ముఖర్జీ (మూలం)
దాసరి అమరేంద్ర (అనువాద రచయిత)

దేని నుండి గ్రహింపబడింది : “చిత్రగ్రీవం” పుస్తకం నుండి

న్యూబెరీ మెడల్ : 1928లో అమెరికన్ లైబ్రరీ అసోసియేషన్ వారు ‘న్యూ జెరీ మెడల్’ బహుమతిని ‘ధనగోపాల్ ముఖర్జీ’కి ఇచ్చారు.

న్యూ బెరీ మెడల్ బహుమతిని ఎవరికి ఇస్తారు? : అమెరికాలో బాలసాహిత్యంలో విశేష కృషి చేసినవారికి ఈ బహుమతిని ఇస్తారు.

ధనగోపాల్ ముఖర్జీ విశిష్టత : ఈయన ‘న్యూ జెరీ మెడల్’ బహుమతిని గెల్చుకున్న ఏకైక భారతీయ రచయిత.

ముఖర్జీ పుట్టుక : 1890లో కోల్ కతాలో

విద్యాభ్యాసం : ముఖర్జీ 19వ ఏటనే అమెరికా వెళ్ళి, కాలిఫోర్నియా’, ‘స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయాల్లో చదువుకున్నారు.

ముఖ్య వ్యాపకాలు : రచనలు చేయడం, ఉపన్యాసాలు ఇవ్వడం.

రచనలు : జంతువులకు సంబంధించి తొమ్మిది రచనలు చేశారు.

ప్రాచుర్యం పొందిన రచనలు :
1) 1922లో రాసిన “కరి ది ఎలిఫెంట్”
2) 1924లో రాసిన “హరిశా ది జంగిల్ ల్యాడ్” చాలా ప్రసిద్ధములు.
3) 1928లో రాసిన ‘గోండ్ ది హంటర్’

పుట్టుక

కోల్‌కతా = కలకత్తా (పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి రాజధాని.)
మహానగరం = పెద్ద పట్టణం
డజను = పన్నెండు
గిరిక్ ల పావురాలు = గిరికీలు కొట్టే పావురాలు
మచ్చిక చెయ్యడం = ప్రేమించడం (దగ్గరకు, తియ్యడం)
అలరించే = సంతోషపెట్టే
విశిష్టమైన = మిక్కిలి శ్రేష్ఠమైన
శతాబ్దాలు (శత + అజ్ఞాలు) = నూర్ల సంవత్సరాలు
నిరుపేదలు = మిక్కిలి బీదవారు
పూరిల్లు (పూరి + ఇళ్లు) = గడ్డితో నేసిన ఇళ్లు
ఆప్యాయత = ప్రీతి
ఆసక్తి = ఆపేక్ష
పూదోటలు (పూవు + తోటలు) = పూలతోటలు
ఫౌంటెన్లు = నీటిని పైకి వెదజల్లే యంత్రాలు
ఉండడం కద్దు = ఉండడం ఉంది
ఉల్లాసకరమైన = సంతోషాన్ని ఇచ్చే
గిరికీలు కొట్టు = గిరికీలు తిరిగే (గాలిలో చక్కర్లు కొట్టే)
సంకేతాలు = సంజ్ఞలు
అసంఖ్యాకమైన = లెక్కపెట్టలేనన్ని
నీలాకాశం (నీల + ఆకాశం) = నీలంరంగు ఆకాశం
పెనుమేఘాలు = పెద్ద మేఘాలు
బృందాలు = గుంపులు
చెక్కర్లు కొడతాయి = తిరుగుతాయి
బృహత్తర సమూహం = మిక్కిలి పెద్ద గుంపు
రూపొందుతాయి = రూపం సంతరించుకుంటాయి (తయారవుతాయి)
స్థూలంగా = దాదాపుగా
పరిమాణం = సైజు
ఆకృతి = ఆకారం
దిశా పరిజ్ఞానం = దిక్కుల యొక్క జ్ఞానం
విశ్వాసం = నమ్మకం
సన్నిహిత పరిచయం = దగ్గరి పరిచయం
వనసీమ = అరణ్యసీమ
గజరాజులు = శ్రేష్ఠమైన ఏనుగులు
ప్రాణం పెడతాయి = ప్రాణం ఇస్తాయి (బాగా ప్రేమిస్తాయి.)
అంతఃప్రేరణాబలం = మనస్సు కలిగించే ప్రేరణ యొక్క బలం
సహచరుడు = చెలికాడు
పంచకు = వసారాకు
చిత్రగ్రీవం = పావురం (చిత్రమైన కంఠం గలది)
విచిత్రవర్ణభరితం = విచిత్రమైన రంగులతో నిండినది
హరివిల్లు మెడగాడు = ఇంద్రధనుస్సు వంటి మెడ కలవాడు
ఉట్టిపడలేదు = స్పష్టంగా కనబడలేదు
వన్నెచిన్నెలు = విలాసాలు
ఆచూకీయే = జాడయే
అతిసుందరమైన = మిక్కిలి అందమైన

ఆలోచించండి – చెప్పండి

ప్రశ్న 1.
కోల్ కతా నగరంలోని పిల్లలు పక్షుల ప్రేమికులని ఎలా చెప్పగలరు?
జవాబు:
కలకత్తా నగరంలో ప్రతి మూడవ కుర్రాడి వద్ద కనీసం ఒక డజను వార్తలు మోసే పావురాలు, గిరిక్స్ పావురాలు, పిగిలిపిట్టలు, బంతి పావురాలూ ఉంటాయి. కాబట్టి కోల్ కతా నగరం పిల్లలు పక్షుల ప్రేమికులని చెప్పగలం.

ప్రశ్న 2.
మీ ప్రాంతంలో ఏఏ పక్షులు ఎక్కువగా ఉంటాయి? వాటి కోసం మీరేం చేస్తున్నారు?
జవాబు:
మా ప్రాంతంలో కాకులూ, చిలుకలూ ఎక్కువగా ఉంటాయి. రోజూ మధ్యాహ్నం నేను భోజనం తినే ముందు మా ఇంట్లో వండిన పదార్థాలు అన్నీ కలిపి ఒక ముద్ద చేసి, కాకికి పెట్టిన తరువాత నేను తింటాను. మా పెరడులోని జామచెట్టు కాయలు అన్నీ చిలుకలకే వదలి పెడతాను.

AP SSC 10th Class Telugu Solutions Chapter 12 చిత్రగ్రీవం

ప్రశ్న 3.
పావురాల గురించి ఆశ్చర్యం కలిగించే విషయాన్ని తెలుసుకున్నారు కదా! అట్లే మిగతా పక్షుల్లో ఆశ్చర్యం కలిగించే విషయాలు ఏమున్నాయి?
జవాబు:
కాకులకు మంచి స్నేహభావం ఉంటుంది. ఏదైనా ఒక కాకికి ప్రమాదం వస్తే మిగతా కాకులన్నీ అక్కడ చేరి, తమ బాధను అరుపుల ద్వారా తెలుపుతాయి. ఒక కాకికి ఆహారం దొరికితే, ఆ కాకి మిగతా వాటిని కూడా పిలుచుకు వచ్చి, ఆ ఆహారాన్ని తినేటట్లు చేస్తుంది.

ప్రశ్న 4.
విశ్వాసం ప్రదర్శించడం అంటే ఏమిటి?
జవాబు:
విశ్వాసం ప్రదర్శించడం అంటే యజమాని యందు ప్రేమను చూపించడం. యజమానికి ఏ కష్టమూ రాకుండా చూడడం. అవసరమైతే యజమాని కోసం తన ప్రాణాలను ఇవ్వడానికి కూడా సిద్ధం కావడం.

ప్రశ్న 5.
‘అంతః ప్రేరణాబలం’ అంటే ఏమిటి? దీనివల్ల మనం ఏం చేయగలం?
జవాబు:
‘అంతః ప్రేరణాబలం అంటే మనస్సు గట్టిగా ప్రేరేపించడం వల్ల చేసే కార్యం. ఒక్కొక్కప్పుడు మనకు అక్కడ పదిమందీ ఉన్నా, అందులో ఒక వ్యక్తిపైనే మక్కువ ఏర్పడుతుంది. అతడితోనే ప్రేమగా ఉంటాం. దానికి కారణం ఏమిటో తెలియదు. దానికి కారణం బహుశః అంతః ప్రేరణాబలం కావచ్చు. అంటే మన మనస్సు యొక్క ప్రేరణ.

AP SSC 10th Class Telugu Solutions Chapter 12 చిత్రగ్రీవం

మొదలెడతాను = ప్రారంభిస్తాను
కులీన వంశానికి = శ్రేష్ఠమైన వంశానికి
అమోఘంగా = ఫలవంతంగా
వార్తాహరి = వార్తలను మోసుకువెళ్ళేది
రూపొందింది = రూపాన్ని పొందింది (తయారయ్యింది)
సంతరించుకుంది = సంపాదించుకుంది
త్రుటిలో = కొద్ది సేపట్లో
దుర్ఘటన = చెడ్డ సంఘటన
ఆకూ అలములు = ఆకులూ, తీగలు
యథాస్థానం = ఉన్నచోటున
దృఢంగా = బలిష్టంగా
తాకింది = తగిలింది
దారుణం = భయంకరం
ఛిన్నాభిన్నము = ముక్కలు ముక్కలు
సంగ్రహించడానికి = అపహరించడానికి
సంఘటన = పరిస్థితి
అడపాదడపా = అప్పుడప్పుడు
నిర్వహించేది = నెరవేర్చేది
పరిజ్ఞానం = పూర్ణజ్ఞానం
రూపొంది = ఏర్పడి
క్షుణ్ణంగా = బాగా (సంపూర్తిగా)
ఆహ్వానించడం = పిలవడం
తారాడటం = కదలియాడడం (తిరగడం)
నెట్టేసేది = గెంటేసేది
మహా ఆత్రంగా = మిక్కిలి వేగిరపాటుగా (తొందరగా)
స్పందన = కదలిక
దివ్యసంకల్పం = గొప్ప సంకల్పం
తల నిక్కించి = తల పైకెత్తి
నిస్సహాయమైన = ఏ సహాయమూలేని
అర్భకమైన = బలంలేని
నిస్సహాయత = శక్తిహీనత
మరుక్షణం = తరువాతి క్షణం
పొదవుకుంది = దాచుకుంది (కప్పుకుంది)

ఆలోచించండి – చెప్పండి

ప్రశ్న 1.
మీరు ఎప్పటికీ మరచిపోలేని రోజు ఏది? ఎందుకు?
జవాబు:
మా నాన్నగారు నాకు చేతి గడియారం, సైకిలు కొని ఇచ్చిన రోజును నేను ఎప్పటికీ మరువలేను.

ప్రశ్న 2.
తెలివిమాలిన పనులు అంటే ఏమిటి?
జవాబు:
తెలివిలేని మూర్ఖులు చేసే పనులను, తెలివిమాలిన పనులు అంటారు.

AP SSC 10th Class Telugu Solutions Chapter 12 చిత్రగ్రీవం

ప్రశ్న 3.
మీ మీద మీకే ఎప్పుడైనా కోపం వచ్చిందా? ఎందుకు?
జవాబు:
మా అమ్మగారు నన్ను సినిమాకు వెళ్ళవద్దన్నారు. మరునాటి పరీక్షకు చదువుకొమ్మన్నారు. అన్నీ చదివాను కదా అని, నా అభిమాన హీరో సినిమా కదా అని, సినిమాకు వెళ్ళాను. మరునాడు పరీక్షలో బాగా రాయలేక పోయాను. అప్పుడు నా మీద నాకే కోపం వచ్చింది.

ప్రశ్న 4.
పావురం గూడు ఎలా ఉందో తెలుసుకొన్నారు కదా! మీకు తెలిసిన పక్షి గూళ్లు ఎలా ఉంటాయో చెప్పండి. పక్షి గూళ్లన్నీ ఒకేలా ఉంటాయా?
జవాబు:
మా పెరటిలో కరివేపచెట్టుకు పిచ్చుక గూడు పెట్టింది. అది సన్నటి దారాల వంటి పీచుతో గూడు కడుతుంది. ఎండిన బీరకాయలా వేలాడుతూ ఉంటుంది. కొన్ని పక్షులు పుల్లముక్కలతోనూ, కొన్ని ఈత, కొబ్బరి వగైరా ఆకులతోనూ గూళ్లు కడతాయి. కాబట్టి అన్ని పక్షిగూళ్లు ఒకేలా ఉండవు.

ప్రశ్న 5.
‘దివ్య సంకల్పం చోటు చేసుకోవడం’ అంటే ఏమిటి?
జవాబు:
ఒకప్పుడు ఎందుకు చేస్తామో తెలియకుండానే కొన్ని, పనులు మనం చేస్తాం. సరిగ్గా ఆ సమయానికి చేయడం వల్ల ఆ పని చక్కగా పూర్తి అవుతుంది. చేసిన పని జయప్రదం అవుతుంది.

ఏదో దేవతల సంకల్పం ఉండడం వల్లనే ఆ పనిని సరిగ్గా అదే సమయంలో మొదలు పెట్టి ఉంటాం. దానినే దివ్య సంకల్పం చోటు చేసుకోవడం అంటారు.

చిత్రగ్రీవం చదువు

దృశ్యాలు = కనబడే వస్తువులు
వెలుగు వెల్లువ = కాంతి ప్రవాహం
అనురాగం = ప్రేమ
లాలిస్తే = బుజ్జగిస్తే
మోతాదు = హెచ్చుతగ్గూకాని పదార్థం
అరకొరజ్ఞానం = మిడిమిడి జ్ఞానం
దోహదం చేస్తాయి = ప్రోత్సహిస్తాయి
ఉత్పత్తి చేసిన – = పుట్టించిన
బాగోగులు (బాగు + ఓగులు)= మంచి చెడ్డలు
ఆహార సేకరణ = ఆహారం సంపాదన
నిమగ్నము = మునిగినది
ఏపుగా = సమృద్ధిగా
బొడిపెలు = చెట్టునందలి బుడిపులు
ఏకఖండంగా = ఒకే ముక్కగా
తునకలు = ముక్కలు
ఘనకార్యం = గొప్పపని
సందేహం = అనుమానం
స్టూలంగా = సుమారుగా (దాదాపుగా)
మందకొడి = మెల్లగా నడవడం (చురుకు లేకపోవడం)
నిరాటంకంగా = ఆటంకం లేకుండా
మండుటెండ = మండే ఎండ
పిల్లగాళ్లకు = పిల్లలకు
సంకోచం = మోమాటం
నిమ్మకు నీరెత్తినట్లు = గుట్టుచప్పుడు కానట్లు

ఆలోచించండి – చెప్పండి

ప్రశ్న 1.
పిల్లపక్షిని దానితల్లి ఎలా పెంచిందో తెలుసుకున్నారు కదా! మరి మిమ్మల్ని ఎవరు, ఎలా పెంచారో చెప్పండి.
జవాబు:
నేను మా అమ్మగారికి ఆమె 16వ సంవత్సరంలో పుట్టానట. నా చెల్లికీ, నాకూ కేవలం ఒక సంవత్సరం మాత్రమే తేడా ఉంది. మా చెల్లిని మా అమ్మ పెంచితే, నన్ను మా అమ్మమ్మ గారు పెంచి పెద్ద చేశారు.

ప్రశ్న 2.
“ఘనకార్యం చేయడం” అనే వాక్యం నుండి మీరేం గ్రహించారు? ఇలా దీన్ని ఇంకా ఏ ఏ సందర్భాలలో వాడతారు?
జవాబు:
మనం ఒక పనిని చేస్తాం. ఆ పనివల్ల నష్టం వస్తుంది. అప్పుడు పక్కవారు ‘చేశావులే పెద్ద ఘనకార్యం’ అని మనల్ని పరిహాసం చేస్తారు. ఏదైనా చాలా మంచి పని చేసినపుడు కూడా వారు ఘనకార్యం చేశారు అని పొగిడే సందర్భాల్లో కూడా దీన్ని వాడతారు.

ప్రశ్న 3.
“ఏ మాటకామాటే” అని ఏయే సందర్భాలలో ఉపయోగిస్తారు?
జవాబు:
“ఏ మాటకామాటే చెప్పుకోవాలి అని నిజం చెప్పేటప్పుడు చెపుతారు. ఒక వ్యక్తిలోని మంచి చెడ్డలను ఉన్నవి ఉన్నట్లు పైకి చెప్పేటప్పుడు, “ఏ మాటకామాటే” అనుకోవాలి అంటూ ప్రారంభిస్తారు.
ఉదా : ఏ మాటకా మాటే చెప్పుకోవాలి, మా అమ్మాయికి “అంత తెలివి లేదు.

ప్రశ్న 4.
‘పావురం’ కంటిలోని ప్రత్యేకతను గుర్తించారు కదా! ఇంకా ఇతర జంతువుల పక్షులకు సంబంధించిన ప్రత్యేకతలు ఏమున్నాయి?
జవాబు:
చీమలు పదార్థాలను కూడబెడతాయి. తేనెటీగలు తేనెను జాగ్రత్త చేస్తాయి. కుక్కలు వాసనను బట్టి వస్తువును గ్రహిస్తాయి. అందుకే కుక్కల సాయంతో నేరగాళ్లను పోలీసులు పట్టుకుంటున్నారు.

AP SSC 10th Class Telugu Solutions Chapter 12 చిత్రగ్రీవం

పచార్లు చెయ్యడం = తిరగడం
నిరాశాభరితము = నిరాశతో నిండినది
చిట్టచివరకు (చివరకు + చివరకు) = ఆఖరుకు
సంకోచాన్ని = మిక్కిలి కలతను (మిక్కుటమైన సంతాపాన్ని)
అధిగమించి = దాటి
బాలెన్సు = సరితూగేలా చెయ్యడం
ప్రక్రియ = పని
అప్రయత్నంగా = ప్రయత్నం లేకుండా
శోభిల్లసాగింది = ప్రకాశింపసాగింది
మహత్తరమైన = మిక్కిలి గొప్పదైన
తతంగం = వ్యవహారం
పరిధిలో = పరిమితిలో
అసాధ్యం = సాధ్యం కానిది
మంద్రంగా = గంభీరంగా
నిర్మలంగా = ప్రశాంతంగా
బడుద్దాయ్ = బద్దకస్తుడు
ఉలుకూపలుకూ = మాటామంతీ
చిర్రెత్తుకొచ్చింది = కోపం వచ్చింది
ఫక్కీ = తీరు
గద్దించసాగింది = అదలించసాగింది (బెదరింప సాగింది)
స్వీయరక్షణ = తన రక్షణ
అసంకల్పితంగా = సంకల్పం లేకుండానే (అనుకోకుండా)
అవధులు = హద్దులు
జలకాలాడుతున్న = స్నానం చేస్తున్న
యథాలాపంగా = ఆకస్మికంగా
రొప్పసాగింది = అరవడం మొదలు పెట్టింది
ఉత్తేజంతో = గొప్ప తేజస్సుతో

ఆలోచించండి – చెప్పండి

ప్రశ్న 1.
‘నిమ్మకు నీరెత్తడం’ అని ఏ ఏ సందర్భాలలో వాడతారు?
జవాబు:
ఒక వ్యక్తి నవనవలాడుతూ ఉంటే నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నాడంటారు.

ఒక వ్యక్తి విషయాన్ని కప్పిపుచ్చి, ఎవరికీ తెలియకుండా, మాట్లాడకుండా ఉన్నప్పుడు, నిమ్మకు నీరెత్తినట్లు మాట్లాడకుండా ఉన్నాడంటారు.

తనలో లోపమున్నా, అది పైకి తెలియకుండా కప్పిపెట్టి ఉంచినపుడు, నిమ్మకు నీరెత్తినట్లు కూర్చున్నాడంటారు.

ప్రశ్న 2.
‘మహత్తర ఘట్టానికి చేరుకోడం’ అంటే ఏమిటి ? దీనికి కొన్ని ఉదాహరణలు తెల్పండి.
జవాబు:
ఏదైనా గొప్పపనిని చేయడానికి ప్రయత్నిస్తాం. అది చివరికి ఫలించి పూర్తికావడానికి సిద్ధంగా ఉంటుంది. అప్పుడు ఆ పని “మహత్తర ఘట్టానికి చేరుకొంది” అంటారు.

  1. గ్రామంలో దేవాలయం కట్టిద్దామని ప్రయత్నం చేస్తారు. విగ్రహ ప్రతిష్ఠ దానిలో జరుగుబోతూ ఉంటే “మహత్తర ఘట్టానికి చేరుకొంది” అంటారు.
  2. ప్రాజెక్టు నిర్మాణం జరిగి, ప్రారంభోత్సవానికి సిద్ధమైనపుడు మహత్తర ఘట్టానికి చేరుకొంది అంటారు.

AP SSC 10th Class Telugu Solutions Chapter 12 చిత్రగ్రీవం

ప్రశ్న 3.
మే నెల చివరి రోజుల్లో వాతావరణం ఎలా ఉందో తెలుసుకొన్నారు కదా! చలికాలంలో వాతావరణం ఎలా ఉంటుందో మీ మాటల్లో వర్ణించండి.
జవాబు:
అది డిసెంబరు నెల. సాయంత్రం అయ్యేటప్పటికి చలి ప్రారంభం అవుతుంది. పిల్లలు, పెద్దలూ స్వెట్టర్లు వేసుకుంటారు. మంచినీళ్ళు కూడా తాగబుద్ధి పుట్టదు. రగ్గు కప్పినా చలి ఆగదు. చెట్లమీది నుండి పొగమంచు బొట్లు బొట్లుగా పడుతుంది. వర్షం వచ్చిందేమో అనిపిస్తుంది. పొగమంచు మూసివేయడంతో రోడ్డుమీద ప్రయాణాలు చేసేవారికి దారి కనబడదు. నీళ్ళపొయ్యి దగ్గరకు చిన్నా పెద్దా అంతా చేరతారు.

ప్రశ్న 4.
చిత్రగ్రీవం ఎగరడానికి దాని తండ్రిపక్షి ఏం చేసింది? తల్లిపక్షి ఏం చేసింది ? అట్లాగే చిన్న పిల్లలు నడక నేర్చుకోవడం ఎలా జరుగుతుందో చెప్పండి.
జవాబు:
చిత్రగ్రీవాన్ని తండ్రి పక్షి గద్దించింది. ఆ గద్దింపుల నుండి తప్పించుకోడానికి చిత్రగ్రీవం పక్క పక్కకు జరిగింది. చిత్రగ్రీవం మీద తండ్రి పక్షి, తన భారాన్ని అంతా మోపింది. చిత్రగ్రీవం కాలుజారింది. చిత్రగ్రీవం తన రక్షణకోసం, అప్రయత్నంగా రెక్కలు విప్పి గాలిలో ఎగిరింది. తల్లి పక్షి చిత్రగ్రీవానికి సాయంగా తానూ ఎగిరింది. ఎగరడం వల్ల రొప్పుతున్న చిత్రగ్రీవాన్ని తల్లి పక్షి లాలించింది.

చిన్న పిల్లలు నడక నేర్చుకోడానికి వీలుగా పెద్దవారు చిన్న పిల్లల వేళ్లు పట్టుకొని దగ్గరుండి నడిపిస్తారు. గోడసాయం ఇచ్చి పిల్లల్ని నడిపిస్తారు. పిల్లలు పడిపోతే, వారిని దగ్గరకు తీసుకొని బుజ్జగిస్తారు.

AP SSC 10th Class Telugu లేఖలు

AP State Board Syllabus AP SSC 10th Class Telugu Solutions 10th Class Telugu లేఖలు Notes, Questions and Answers.

AP State Syllabus SSC 10th Class Telugu లేఖలు

ప్రశ్న 1.
మీ పాఠంలో హనుమంతుని శక్తి యుక్తులను వర్ణించిన కవిని ప్రశంసిస్తూ, అతని రచనలు చదవమని సలహా ఇస్తూ మిత్రునికి లేఖ రాయండి.
జవాబు:

మిత్రునికి లేఖ

విశాఖపట్టణం,
x x x x x.

మిత్రుడు ప్రసాద్ కు,

మిత్రమా ! నీవు మన పదవ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలో 8వ పాఠం ‘సముద్రలంఘనం’ చదివావని అనుకుంటున్నాను. మాకు ఈ మధ్యనే మా తెలుగు పండితులు ఈ పాఠం చెప్పారు. ఈ పాఠం ‘అయ్యలరాజు రామభద్రుడు’ అనే మహాకవి రచించిన “రామాభ్యుదయము” అనే గ్రంథంలోనిది. రామాభ్యుదయంలోని కథ, సీతారామ కథయే. మన పాఠంలో హనుమంతుడు సముద్రం దాటిన ఘట్టమును కవి “అద్భుతంగా” వర్ణించాడు.

రామభద్రుడు సాహితీసమరాంగణ సార్వభౌముడైన శ్రీకృష్ణదేవరాయల అష్టదిగ్గజ కవులలో ఒకడు. రామాయణము ఒక తియ్యని కావ్యము. ఈ రామాభ్యుదయంలో కవి హనుమంతుని శక్తిని, పరాక్రమాన్ని గొప్పగా వర్ణించాడు. ఈ కవి ‘సకల కథాసార సంగ్రహం’ అనే మరో గ్రంథం కూడా రచించాడట. నేను ఈ రోజే “రామాభ్యుదయం” కావ్యం కొన్నాను. నీవు కూడా రామభద్రుని రచనలు తప్పక చదువు. ఆ కవిని గూర్చి, నీ అభిప్రాయం నాకు రాయి. ఉంటా.

ఇట్లు,
నీ మిత్రుడు,
పి. రఘునాథ్ బాబు,
మునిసిపల్ ఉన్నత పాఠశాల.

చిరునామా :
టి. ప్రసాద్,
S/o టి. రామయ్యగారు,
ఇంటి నెం. 4-1-3/A, గాంధీపురం,
కాకినాడ, తూర్పుగోదావరి జిల్లా,

ప్రశ్న 2.
మీ పాఠశాలను గురించి మీ మిత్రునకు లేఖ రాయండి.
జవాబు:

తెనాలి,
x x x x x.

పి. రామచంద్ర,
10వ తరగతి, శారదా కాన్వెంట్,
రాజావీధి, తెనాలి,
గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్.

మిత్రుడు రవికాంత్ కు,

నేను కొత్తగా చేరిన శారదా కాన్వెంట్ అందాల బృందావనంలా ఉంది. మా కాన్వెంట్ 5 ఎకరాల స్థలంలో ఉంది. ఎత్తైన భవనాలు ఉన్నాయి. ప్రతి తరగతి గదిలోనూ ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు ఉన్నాయి. ముఖ్యంగా మా సైన్సు ప్రయోగశాలలు చక్కగా అన్ని పరికరాలతో అందంగా తీర్చిదిద్దినట్లుంటాయి.

నిత్యం అసెంబ్లీ జరిగేచోట సరస్వతీ దేవి విగ్రహం రంగురంగుల అలంకరణలతో అద్భుతంగా ఉంటుంది. మా కాన్వెంటు అందం అంతా క్రీడా మైదానంలో ఉంది. అన్ని ఆటలకూ కోర్సులు ఉన్నాయి. మైదానం అంతా శుభ్రంగా ఉంటుంది.

కాన్వెంటులో పూలతోట ఉంది. అక్కడ అన్ని రకాల పూల మొక్కలు ఉన్నాయి. కుళాయి నీరు 24 గంటలు వస్తుంది. బాలబాలికలకు వేరువేరుగా మరుగుదొడ్లు ఉన్నాయి.

మా ప్రధానోపాధ్యాయుల గది చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ కాన్వెంట్ లో చేరినందులకు సంతోషంగా ఉంది. ఉంటా.

ఇట్లు,
నీ మిత్రుడు,
పి.రామచంద్ర.

చిరునామా:
యస్. రవికాంత్,
C/O. యస్. వెంకట్రావుగారు,
తాశీల్దార్, అమలాపురం,
తూ. గో. జిల్లా, ఆంధ్రప్రదేశ్.

AP SSC 10th Class Telugu లేఖలు

ప్రశ్న 3.
‘స్వచ్ఛ భారత్’ కార్యక్రమం ఆవశ్యకతను వివరిస్తూ మిత్రునకు లేఖ రాయండి.
జవాబు:

అమలాపురం
ది. x x x x x.

 

ప్రియమైన మిత్రుడు అనంత్ కు,

నీకు శుభాక్షాంక్షలు – నేను బాగా చదువుతున్నాను. నీవు కూడా బాగా చదువుచున్నావని ఆశిస్తున్నాను. ముఖ్యముగా వ్రాయునది. మనం మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలనే భావనతో మన ప్రధాని స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టారు. పరిసరాలు బాగుంటేనే మనదేశం ఆదర్శంగాను, ఆరోగ్యవంతంగాను ఉంటుంది. దాని కోసం మనమంతా పచ్చని చెట్లను నాటాలి. ఇంటిని, గ్రామాలను, నగరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఈ కార్యక్రమం ద్వారానే మనం దేశాన్ని ముందుకు నడిపించగలుగుతాం. మన పాఠశాలల్లో ముందుగా ఈ కార్యక్రమాన్ని చేపడదాం. మనం దీని కోసం సంకల్పం తీసుకుందాం ! పెద్దలకు నమస్కారాలు తెలుపగలవు.

ఇట్లు,
నీ ప్రియమిత్రుడు,
x x x x x.

చిరునామా:
వి. అనంత్, 10వ తరగతి,
వివేకానంద బాలుర ఉన్నత పాఠశాల,
వినుకొండ, గుంటూరు జిల్లా.

ప్రశ్న 4.
పల్లెటూరులోని ప్రకృతి అందాలను, మానవ సంబంధాలను వివరిస్తూ మీ మిత్రుడు / మిత్రురాలికి ఒక లేఖ రాయండి.
జవాబు:

రాజమండ్రి,
x x x x x.

మిత్రుడు రంగారావుకు / మిత్రురాలు కవితకు,

నీ లేఖ అందింది. ఈ మధ్య నేను మా అన్న పెళ్ళికి ‘కొమరగిరి పట్టణం’ అనే తూర్పుగోదావరి జిల్లా అల్లవరం మండలంలోని ఒక పల్లెటూరికి వెళ్ళాను. ఆ పల్లెటూరిలో సుమారు 16 వేల మంది జనాభా ఉన్నారట. సుమారు 20 వేల ఎకరాలలో వరిపంట, ఐదు-ఆరు వేల ఎకరాలలో కొబ్బరి తోటలు ఆ ఊరిలో ఉన్నాయట.

ఊళ్ళో అన్ని కులాల వారూ, అన్ని వృత్తుల వారూ ఉన్నారు. ఆ పెళ్ళి చేయించే పురోహితుణ్ణి, ఆ ఊరి కాపుగారు “బాబయ్యగారూ” అని ప్రేమగా పిలిచేవాడు. ప్రజలు ఎక్కువగా పేర్లు పెట్టికాక, పెద్దమ్మ, పిన్నమ్మ, అక్క బావ, మొదలయిన వరుసలు పెట్టి ప్రేమగా పిలుచుకున్నారు. ఆ గ్రామస్తుల ఐక్యత చూస్తే ఆనందం వేసింది. రామేశ్వరం, లక్ష్మణేశ్వరంలలో అందమైన శివాలయాలు ఉన్నాయి.

ఆ పల్లెటూరిలో ప్రకృతి శోభ, మహాద్భుతం. ఊళ్ళో పంటకాలువలూ, చెరువులూ ఉన్నాయి. ఫంటచేలు గాలికి తలలాడిస్తూ, మనల్ని పిలుస్తున్నట్లుంటాయి. కొబ్బరి తోటల్లో చెట్లు, నిండుగా గెలలతో కలకలలాడుతుంటాయి. కొబ్బరిచెట్టు, కల్పవృక్షం లాంటిది. పెళ్ళిలో అతిథులందరికీ చల్లని కొబ్బరి బొండాలు ఇచ్చారు.

అదీగాక ఈ ఊరి ప్రక్కనే కౌశికీ నది, దాని పక్కగా బంగాళాఖాతం ఉంది. ఆ సముద్ర కెరటాల శోభ వర్ణించడం అసాధ్యం. సముద్రతీరాన సరుగుడు తోటలు, ఏవో పాటలు పాడుతూ తలలు ఊపుతూ మనలను రమ్మని పిలుస్తూ ఉంటాయి.

పల్లెలు, దేశ సౌభాగ్యానికి పుట్టిళ్ళు. ప్రశాంత జీవితానికి నట్టిళ్ళు. ఉంటాను. లేఖ రాయి.

ఇట్లు,
నీ మిత్రుడు, / మిత్రురాలు,
గోపాలరావు. / రాధ.

చిరునామా :
పి. రంగారావు, / పి. కవిత,
S/o/ D/o పి. వరప్రసాద్,
గాంధీరోడ్డు, వరంగల్లు (ఆంధ్రప్రదేశ్).
పామర్రు, కృష్ణా జిల్లా.

ప్రశ్న 5.
మీ పాఠశాలలో జరిగిన గురుపూజోత్సవం కార్యక్రమాన్ని వివరిస్తూ మిత్రునికి లేఖ రాయండి.
జవాబు:

గుంటూరు,
x x x x x.

ప్రియమిత్రుడు పుష్పరాజ్ కు,

గడచిన సెప్టెంబర్ 5న మా పాఠశాలలో గురుపూజోత్సవం బ్రహ్మాండంగా జరుపుకున్నాం. మా జిల్లా విద్యాశాఖాధికారిని ముఖ్య అతిథిగా ఆహ్వానించాం. ఆ రోజు మన మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి. ఆయన జయంతినే ప్రభుత్వం గురుపూజోత్సవం దినంగా ప్రకటించింది కదా ! ఆ రోజు ఉదయం 8 గంటలకు ముఖ్య అతిథిగారిచే జాతీయ పతాకావిష్కరణతో ఉత్సవాన్ని ప్రారంభించాం. మేము మా పాఠశాలలోని ఉపాధ్యాయులందరిని ప్రత్యేకంగా సన్మానించాం. వారి ఆశీర్వచనాలు పొందాం. మనకు విద్య నేర్పుతున్న గురువులను గౌరవించి సన్మానించడం నాకెంతో ఆనందాన్ని కలిగించింది.

ఇట్లు,
నీ మిత్రుడు,
జయరాజ్.

చిరునామా :
ఎస్. పుష్పరాజ్, 10వ తరగతి,
నవోదయ హైస్కూలు,
నాయుడుపేట,
నెల్లూరు.

ప్రశ్న 6.
మీ పాఠశాలలో గ్రంథాలయ వసతి కల్పించమని కోరుతూ సంబంధిత అధికారికి లేఖ రాయండి.
జవాబు:

ఏలూరు,
x x x x x

చింతా రవిశంకర్,
పదవ తరగతి, ‘ఏ’ సెక్షన్,
మునిసిపల్ హైస్కూలు,
పవర్ పేట, ఏలూరు.

ఆర్యా ,
విషయము : గ్రంథాలయ వసతి కల్పించమని వినతి.

నమస్కారములు. మా పాఠశాలలో సుమారు 2 వేలమంది విద్యార్థినీ విద్యార్థులు చదువుతున్నారు. మా పాఠశాలలో మంచి గ్రంథాలయము లేదు. ఈ సంవత్సరము పాఠ్యప్రణాళికలు బాగా మారిపోయాయి. గ్రంథాలయంలోని పుస్తకాలు – చదివితే కానీ, పరీక్షలలో సరయిన జవాబులు వ్రాయలేము. నిత్యమూ వచ్చే రోజువారీ పత్రికలు చదివితే, మాకు దేశకాల పరిస్థితులు అర్థం అవుతాయి.

కాబట్టి మీరు తప్పక మా మునిసిపల్ కమిషనర్ గారికి చెప్పి, మీరు కూడా మంచి గ్రాంటు ఇచ్చి, మా పాఠశాలలో మంచి గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయించవలసిందిగా మా విద్యార్థుల తరుపున ప్రార్థిస్తున్నాను.

నమస్కారాలతో,

ఇట్లు,
తమ విధేయుడు,
చింతా రవిశంకర్,
పదవ తరగతి, ఎ. సెక్షన్ నెంబర్ : 26.

చిరునామా :
జిల్లా విద్యాశాఖాధికారి గార్కి,
పశ్చిమగోదావరి జిల్లా,
ఏలూరు.

AP SSC 10th Class Telugu లేఖలు

ప్రశ్న 7.
‘ఎదుటి వారిలో తప్పులు వెతకటం కన్నా, వారి నుండి మంచిని స్వీకరించడం మేలు’ అని తెలియజేస్తూ మిత్రునికి లేఖ రాయండి.
జవాబు:

చిత్తూరు,
x x x x x

స్నేహితుడు రంగనాకు,
స్నేహితురాలు శారదకు,

నీ లేఖ చేరింది. మీ నగరంలోని “సాయీ సేవామండలి” వారు మీ పాఠశాల విద్యార్థులకు పెన్నులు, నోట్సు పుస్తకాలు, వగైరా ఉచితంగా పంచి పెట్టారని రాశావు. ఆ సంస్థవారు నగరంలో చందాలు బాగా వసూలు చేస్తున్నారనీ, వాటికి రశీదులు మాత్రం ఇవ్వడం లేదని రాశావు. నీవు సేవామండలి వారు చేస్తున్న సేవా కార్యక్రమాల్ని ప్రశంసించాలి. వారి తప్పులు వెదకరాదు.

ఆ సేవామండలి వారు దేవాలయాల వద్ద నిలబడి భక్తులను క్యూ లైన్లలో పంపడం, వారి చెప్పులను కాపాడి, తిరిగి వారికి అప్పగించడం, మజ్జిగ, మంచినీరు అందించడం వగైరాలు చేస్తున్నారు. దొంగతనాలు జరుగకుండా కాపాడుతున్నారు.

వారు బీదపిల్లలకు విద్యా సదుపాయాలు కల్పిస్తున్నారు. పండుగరోజుల్లో బీదలకు అన్నదానం, వస్త్రదానం చేస్తున్నారు. రోగులకు పాలు పండ్లు ఇస్తున్నారు.

నీవు ఆ సేవామండలి వారు చేస్తున్న పరోపకారం, మానవసేవ, ధర్మకార్యాలు మెచ్చుకోవాలి. వారిని అభినందించాలి. అంతేకాని వారు వసూలు చేసే చందాలకు రశీదులు ఇవ్వడం లేదని వారిని తప్పు పట్టరాదు. రశీదు పొరపాటున ఇచ్చి ఉండకపోవచ్చు గదా !

మనం ఎదుటివారి తప్పులను వెతికి చూపిస్తాము. దానికంటే వారు చేసే మంచిని గ్రహించి, వారిని అభినందించడం మంచిది. వారు చేసే పనిలోని లోపాలను వారి దృష్టికి తేవాలి.

మంచిపని చేసేవారిని ప్రశంసించడం, మన ధర్మం. ఉంటా.

ఇట్లు,
నీ ప్రియ స్నేహితుడు,
నీ స్నేహితురాలు,
కె. జయ / కె. జయరాజు.

చిరునామా :
కె. రంగనాధ్, / యస్. శారద,
గాంధీ మునిసిపల్ హైస్కూలు,
గుంటూరు, ఆంధ్రప్రదేశ్.

ప్రశ్న 8.
నాటితో పోలిస్తే నేటి వివాహ వేడుకల్లో వచ్చిన మార్పులను గురించి విమర్శనాత్మకంగా మిత్రులకు లేఖ రాయండి.
జవాబు:

తిరుపతి,
x x x x x

మిత్రుడు ప్రసాద్ కు,

శుభాభినందనలు. మీ అక్క పెళ్ళి శుభలేఖను నీవు నాకు పంపించావు. సంతోషం. ఈ మధ్య మా అన్నయ్య స్నేహితుడి పెళ్ళికి వెళ్ళాను. పూర్వపు పెళ్ళిళ్ళకూ, ఇప్పటి పెళ్ళిళ్ళకూ ఎన్నో తేడాలున్నాయి.

కోపం వల్ల చాలా అనర్దాలు వస్తాయి. కోపంతో మనకు వివేకం నశిస్తుంది. సీతారామ్ తో నీకు వచ్చిన తగవు విషయం, మీ పెద్దలతో చెప్పు. వారు మీ తగవును పరిష్కరిస్తారు. కోపం తగ్గించుకొని శాంతంగా ఉండమని నిన్ను కోరుతున్నాను. త్వరలో నీవూ, సీతారామ్ మిత్రులుగా మారుతారని ఆశిస్తున్నా.

ఇట్లు,
నీ ప్రియమిత్రుడు,
అవసరాల వెంకట్రావు,
10వ తరగతి,
మునిసిపల్ హైస్కూలు,
విజయవాడ.

చిరునామా:
కె. రఘునందన్,
S/O కె. రాజారావు గారు,
ఇంటి నెం. 4.1. 104,
మహారాణీ పేట,
విశాఖపట్టణం, ఆంధ్రప్రదేశ్.

ప్రశ్న 9.
నీ సైకిలు పోయిందని తెలుపుతూ,వెతికించమని కోరుతూ పోలీసు అధికారికి లేఖ రాయండి.
జవాబు:

కర్నూలు,
x x x x x x

కె. జవహర్ రెడ్డి,
పదవ తరగతి, సెక్షన్ ‘ఎ’
మునిసిపల్ హైస్కూల్,
గాంధీనగర్, కర్నూలు.
గాంధీనగర్ పోలీసు ఇన్ స్పెక్టర్ గారికి, కర్నూలు,

అయ్యా ,

విషయము : సైకిలు దొంగతనం – చర్య తీసుకోవలసిందిగా విజ్ఞప్తి.

నమస్కారములు,
నిన్న అనగా 9 – 4 – 2016 నాడు, నేను మిత్రులతో కలసి గవర్నమెంటు హాస్పిటల్ కు, నా మిత్రుని పలకరించుటకు వెళ్ళాను. మా మిత్రులము అందరమూ, మా సైకిళ్ళను గేటు వద్ద చెట్టు క్రింద తాళం వేసి ఉంచి లోపలకు వెళ్ళాము. తిరిగి వచ్చేటప్పటికి నా సైకిలు కనబడలేదు. మిగిలిన వారి సైకిళ్ళు మాత్రం ఉన్నాయి. నా సైకిలు వివరాలు క్రింద ఇస్తున్నాను.

హీరో కొత్త సైకిలు, 24, నెంబరు హెచ్ 26723. దయచేసి నా సైకిలు వెతికించవలసినదిగా మిమ్మల్ని కోరుతున్నాను.
నమస్కారాలతో,

ఇట్లు,
మీ విశ్వసనీయుడు,
కె. జవహర్ రెడ్డి,
10వ తరగతి, సెక్షన్ – ‘ఎ’.

ప్రశ్న 10.
తోటి స్త్రీలను సోదరీమణుల్లా, మాతృమూర్తుల్లా భావించాలని గుర్తు చేస్తూ మీ మిత్రునకు లేఖ రాయండి.
జవాబు:

రాజమండ్రి,
x x x x x

ప్రియమైన అభిలేష్ కు,

నేను బాగా చదువుతున్నాను. నీవు బాగా చదువుతున్నావని భావిస్తాను. ఈ మధ్య నేను చిన్న సాహసం చేశాను. మా పాఠశాలలో నాతో చదివే జలజను ఒక దుర్మార్గుడు నిత్యం తన్ను ప్రేమించమని ఏడిపిస్తూ ఉండేవాడు. నేను వాడితో తగువు పెట్టుకొని వాడిని తన్నాను. పోలీసులకు వాణ్ణి అప్పగించాను.

మనం మనతోటి స్త్రీలను మన అక్కా చెల్లెళ్ళలా, మన తల్లుల్లా భావించి వారికి రక్షణగా నిలబడాలి. నిజానికి స్త్రీలు ఈ భూమిమీద తిరిగే పుణ్యదేవతలు. స్త్రీలపట్ల అపచారం చేస్తే వారు నాశనం అవుతారు. సమూలంగా వారి వంశం నశిస్తుంది. స్త్రీలు పూజింపదగినవారు.

స్త్రీలకు ఎటువంటి అవమానం జరుగకుండా, మనం చూడాలి. తోటి స్త్రీలను కన్నతల్లుల్లా, మన సోదరీమణుల్లా చూడాలి. నేను చేసిన సాహసాన్ని నీవు తప్పక అభినందిస్తావని నమ్ముతున్నా.

ఇట్లు,
నీ ప్రియమిత్రుడు,
రాజేష్.

చిరునామా :
పి. అఖిలేష్,
10వ తరగతి , జె.పి. హైస్కూల్,
కుప్పం, చిత్తూరు జిల్లా,

ప్రశ్న 11.
మీ ఊరికి బస్సు సదుపాయం కల్పించమని కోరుతూ సంబంధిత రోడ్డు రవాణా సంస్థ అధికారికి లేఖ రాయండి.
జవాబు:

చామర్రు,
x x x x x

ఆర్.టి.సి. జనరల్ మేనేజర్ గారికి,
చామర్రు నివాసియైన అగ్గరాజు శ్రీరామమూర్తి వ్రాయు విన్నపము.

అయ్యా ,

మాది అచ్చంపేట మండలంలోని చామర్రు అనే గ్రామం. మా గ్రామ జనాభా ఎనిమిదివందలు. ఇచ్చటి ప్రజలు నిత్యావసర సరకులు అచ్చెంపేట వెళ్ళి తెచ్చుకోవాలి. అలాగే విద్యార్థులు హైస్కూలు చదువుకు అచ్చెంపేట, కాలేజి చదువుకు సత్తెనపల్లి వెళ్ళి రావలసియున్నది. పిల్లలు, పెద్దలు, విద్యార్థులు అందరూ కూడా మండల కేంద్రానికి వెళ్ళటానికి నానా బాధలు పడుతున్నారు. కారణం మా ఊరికి ఎటువంటి బస్సు సౌకర్యం లేకపోవడమే. ‘ప్రజా సేవయే కర్తవ్యం’గా భావించే మీరు మా గ్రామానికి బస్సు సౌకర్యాన్ని కలిగించి మా కష్టాలను గట్టెక్కించవలసిందిగా కోరుతున్నాను.

ఇట్లు,
తమ విధేయుడు,
ఎ.ఎస్.ఆర్. మూర్తి.

చిరునామా :
జనరల్ మేనేజర్,
ఆర్.టి.సి. ఆఫీసు,
గుంటూరు రేంజి, గుంటూరు.

ప్రశ్న 12.
ఉపకార వేతనాన్ని మంజూరు చేయమని కోరుతూ జిల్లా సంక్షేమశాఖాధికారికి లేఖ రాయండి.
జవాబు:

ఉపకార వేతనం కోరుతూ జిల్లా సంక్షేమశాఖాధికారికి లేఖ.

పటమట,
x x x x x

కృష్ణాజిల్లా సంక్షేమశాఖాధికారి గారి దివ్య సముఖమునకు,

ఆర్యా !
నేను పటమట జిల్లా పరిషత్ హైస్కూలులో పదవ తరగతి చదువుచున్నాను. నేను ఆర్థికముగా వెనుకబడిన కుటుంబమునకు చెందినవాడను. 9వ తరగతి పరీక్షలలో నాకు 600 మార్కులకు 530 మార్కులు వచ్చినవి. పై చదువులు చదువుటకు ఆర్థికశక్తి లేకపోవుటచే మధ్యలోనే చదువుకు స్వస్తి చెప్పవలసి వచ్చుచున్నది. కనుక తమరు నా యందు దయయుంచి ఉపకార వేతనమును మంజూరు చేయవలసినదిగా ప్రార్థించుచున్నాను.

జతపరచినవి :

  1. ఆదాయ ధృవీకరణ పత్రం,
  2. మార్కుల ధృవీకరణ పత్రం,
  3. కుల ధృవీకరణ పత్రం.

ఇట్లు,
తమ విధేయుడు,
అగ్గిరాజు శ్రీహర్ష,
10వ తరగతి, జిల్లా పరిషత్ హైస్కూలు,
పటమట, కృష్ణాజిల్లా.

చిరునామా :
జిల్లా సంక్షేమశాఖాధికారి గారికి,
జిల్లా సంక్షేమశాఖాధికారి కార్యాలయం,
మచిలీపట్నం, కృష్ణాజిల్లా.

AP SSC 10th Class Telugu లేఖలు

ప్రశ్న 13.
మీ పాఠశాలలో జరిగిన ఒక ఉత్సవాన్ని గూర్చి మిత్రునకు లేఖ రాయండి.
జవాబు:

శ్రీకాకుళం,
x x x x x

ప్రియ స్నేహితురాలు,
మధుప్రియకు శుభాకాంక్షలు,

గడచిన జనవరి 26న మా పాఠశాలలో రిపబ్లిక్ దినోత్సవ వేడుకలు బ్రహ్మాండంగా జరిగాయి. మా జిల్లా విద్యాశాఖాధికారిని ముఖ్య అతిథిగా ఆహ్వానించాం. ఆ రోజు ఉదయం గం. 8 – 00 లకు ముఖ్య అతిథిగారిచే జాతీయ పతాకావిష్కరణ కావించబడింది. రిపబ్లిక్ దినోత్సవ ప్రాముఖ్యాన్ని గురించి ముఖ్య అతిథిగారు చక్కని సందేశమిచ్చారు. కొందరు ఉపాధ్యాయులు, విద్యార్థులు కూడా ఆ రోజు గొప్పతనాన్ని గురించి ఉపన్యాసమిచ్చారు. రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు పంచిపెట్టబడ్డాయి. తరువాత విద్యార్థులకు స్వీట్సు పంచిపెట్టబడ్డాయి. ‘జనగణమన’ జాతీయ గీతంతో నాటి కార్యక్రమం ముగిసింది.

ఇట్లు,
నీ ప్రియ స్నేహితురాలు,
టి. హరిప్రియ.

చిరునామా :
కె. మధుప్రియ,
10వ తరగతి,
మున్సిపల్ గరల్స్ హైస్కూలు,
రాజమండ్రి, తూర్పు గోదావరి జిల్లా.

ప్రశ్న 14.
అమరావతిలో అద్భుత శిల్ప సంపదను సృష్టించిన శిల్పులను అభినందిస్తూ ఒక లేఖ రాయండి.
జవాబు:

మిత్రునకు శిల్పులను అభినందిస్తూ లేఖ

విజయవాడ,
x x x x x

మిత్రుడు శ్రీకాంత్ కు, / మిత్రురాలు రాధకు,

మిత్రమా ! శుభాకాంక్షలు. ఈ మధ్య నేను మన నవ్యాంధ్ర రాజధాని నగరం, అమరావతికి వెళ్ళి అక్కడి శిల్ప సంపదను చూసి, ఆ శిల్పాలను చెక్కిన కళా తపస్వులయిన శిల్పులకు జోహార్లు సమర్పించాను. అక్కడ బుద్ధ విగ్రహాలు, జైన మందిరము, అమరేశ్వరాలయము, స్తూపాలు అన్నీ చూశాను. ఆ శిల్పాలు చెక్కిన శిల్పులకు అభినందనలు అందించాను. ఆ శిల్పాలు ప్రపంచ శిల్ప సంపదలోనే అగ్రశ్రేణివని డా|| ఫెర్గూసన్ పొగిడాడు.

జాషువా మహాకవి చెప్పినట్లు శిల్పి చేతి సుత్తె నుండి ఎన్నో దేవాలయాలు వెలిశాయి. అర్థం లేని బండరాయికి శిల్పి జీవం పోస్తాడు. రాళ్ళను దేవుళ్ళుగా మార్చి, వాటికి మనచే పూజలు చేయిస్తాడు. శిల్పి శాశ్వతుడు. రాళ్ళలో నిద్రపోయే బొమ్మల్ని ఉలి తగిలించి అతడు లేపుతాడు. శిల్పి చిరంజీవి. పుణ్యాత్ముడు. ప్రపంచ ప్రఖ్యాతిని పొందిన మహాశిల్పులకు మనం అభినందనలు అందించాలి. నీవు కూడా అమరావతి వచ్చి, మత తెలుగు శిల్పుల కళానైపుణ్యానికి జోహార్లు అందిస్తావని విశ్వసిస్తున్నాను.

‘అమరావతీ నగర అపురూప శిల్పాలు’ అని మనం నిత్యం తెలుగుతల్లి పాటలో పాడుతున్నాము. ఆ శిల్పులకు జోహార్లు అందించడం మన విధి. ఉంటా.

ఇట్లు,
నీ మిత్రుడు, / మిత్రురాలు,
శ్రీహర్ష. / రజని.

చిరునామా :
పి.శ్రీకాంత్, / పి.రాధ,
S/o/ D/o పి.వరప్రసాద్,
విశాఖపట్టణం,
అక్కయ్యపాలెం, ఆంధ్రప్రదేశ్.

ప్రశ్న 15.
పేదలకు దానం చేయుట వలన మనం పొందే మేలును గురించి తెలియజేస్తూ మిత్రునికి లేఖ రాయండి.
జవాబు:

మిత్రుడికి లేఖ

తిరుపతి,
x x x x x

మిత్రుడు శశిభూషణకు, / మిత్రురాలు కమలకు,

ఉభయ కుశలోపరి. నీవు రాసిన లేఖ చేరింది. మనం నైతిక విలువలను పాటించాలని రాశావు. సంతోషము. మన ఇరుగు పొరుగువారిలో ఎందరో పేదలు ఉంటారు. భగవంతుడు మానవులు అందరిలోనూ ఉంటాడు. కాబట్టి మనుషులు అంతా దైవంతో సమానం.

ముఖ్యంగా పేదవారికి, మనకు ఉన్నంతలో దానం చేయాలి. మన తరగతిలోని పేదవారికి పుస్తకాలు, పెన్నులు, నోట్సులు దానం చెయ్యాలి. పరీక్ష ఫీజులు కట్టడానికి వారికి డబ్బు సాయం చెయ్యాలి. వైద్య సహాయం కోసం డబ్బులు అడిగే వారికి తప్పక ఇవ్వాలి.

పేదలకు దానం చేస్తే మరుసటి జన్మలో మనకు భగవంతుడు మరింతగా ఇస్తాడు. పేదల ముఖాల్లో ఆనందం కనబడేలా చేస్తే, మన జీవితాలు సుఖసంతోషాలకు నిలయం అవుతాయి. నేను నాకు ఉన్నంతలో పేదలకు దాన ధర్మాలు చేస్తున్నాను.

నీవు కూడా చెయ్యి.

ఇట్లు,
నీ ప్రియ మిత్రుడు, / మిత్రురాలు,
సాయికుమార్. / శశికళ.

చిరునామా:
కె. శశిభూషణ్, / కె. కమల,
S/o వెంకటేష్, | D/o వెంకటేష్,
ఆర్యాపురం, రాజమహేంద్రవరం,
తూర్పుగోదావరి జిల్లా.

AP SSC 10th Class Telugu లేఖలు

ప్రశ్న 16.
విద్వాన్ విశ్వం కవితను ప్రశంసిస్తూ మిత్రునికి లేఖ రాయండి.
జవాబు:

మిత్రునకు లేఖ

గుంటూరు,
x x x x x

మిత్రుడు రామారావునకు,

శుభాభినందనలు. నీ లేఖ అందింది. నేను ఈ మధ్య విద్వాన్ విశ్వంగారి ‘మాణిక్యవీణ’ వచన కవిత చదివాను. విశ్వంగారు గొప్ప కవి పండితుడు. ఆయన ‘విశ్వరూపి నా హృదయం’ అని ప్రకటించుకున్నాడు. ఈ కవితలో చక్కని అభ్యుదయ భావాలు వెలిబుచ్చాడు.

మానవులు కేన్సరుతో బాధపడుతూ ఉంటే, దానికి మందులు కనుక్కోకుండా, రోదసిలోకి ఉపగ్రహాలు పంపడం వల్ల ప్రయోజనం ఏముంటుందని శాస్త్రజ్ఞులను ప్రశ్నించాడు.

తంత్రాలతో సమాజ సమస్యలు దారికి రావని హెచ్చరించాడు. శాస్త్రజ్ఞులు నిప్పునూ, చక్రాన్ని కనిపెట్టినరోజు నిజంగా, మానవ చరిత్రలో పండుగరోజు అని గుర్తు చేశాడు.

మానవ జీవితాన్ని కళలూ, కవిత్వం, విజ్ఞానం నడిపిస్తాయన్న యథార్థాన్ని విశ్వంగారు చెప్పాడు.

వచన కవితా రచనలో ఆయన చిన్న చిన్న పదాలతో లోతైన భావాలను తేలికగా అందించాడు.

విశ్వంగారు మాణిక్యవీణను మీటి, మానవీయ రాగాల్ని పలికించాడు. చక్కని లలిత పదాలతో, అనుప్రాసలతో కవిత మనోహరంగా చెప్పాడు.

తప్పక నీవు ఈ కవిత చదువు. ఉంటా.

ఇట్లు,
నీ ప్రియమిత్రుడు,
యన్. శ్రీకాంత్.

చిరునామా :
యస్. రామారావు,
S/o యస్: కృష్ణారావుగారు,
రామారావు పేట,
కాకినాడ, తూర్పుగోదావరి జిల్లా.

ప్రశ్న 17.
వ్యక్తిత్వ బదిలీ ధృవీకరణ పత్రాలను ఇప్పించవలసినదిగా ప్రధానోపాధ్యాయులకు లేఖ రాయండి.
జవాబు:

ప్రధానోపాధ్యాయులకు లేఖ

విజయవాడ,
x x x x x

గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయులవారికి,
మహాత్మాగాంధీ మునిసిపల్ ఉన్నత పాఠశాల,
గాంధీనగరం, విజయవాడ.

ఆర్యా !
విషయం : వ్యక్తిత్వ విద్యా, దిలీ ధృవీకరణ పత్రాలకై విజ్ఞప్తి.

నేను మీ పాఠశాలలో 10వ తరగతి చదివి, మంచి మార్కులతో పరీక్షలో ఉత్తీర్ణుడను అయ్యాను. దయచేసి నేను ఇంటర్‌లో చేరేందుకు వీలుగా నా వ్యక్తిత్వ, విద్యా, బదిలీ ధృవీకరణ పత్రములు ఇప్పించవలసినదిగా ప్రార్ధన.
నమస్కారాలతో,

ఇట్లు,
మీ విశ్వసనీయుడు,
x x x
10వ తరగతి – 24వ నెంబరు.

ప్రశ్న 18.
కోపం తగ్గించుకోవడం మంచిదని తెలుపుతూ మిత్రునకు లేఖ రాయండి.
జవాబు:

విశాఖపట్టణం,
x x x x x

మిత్రుడు రఘునందన్ కు,

నీ లేఖ అందింది. నేనూ, మా తల్లిదండ్రులూ క్షేమంగా ఉన్నాము. నీ లేఖలో, నీకు ప్రియ మిత్రుడైన సీతారామ్ తో నీకు తగవు వచ్చిందనీ, మీరిద్దరూ దెబ్బలాడుకున్నారని రాశావు. మీ ఇద్దరికీ దెబ్బలు తగిలాయని కూడా రాశావు.

నీ ఉత్తరం చూసి నేను చాలా బాధపడ్డాను. సహజంగా నీవు శాంత స్వభావుడవు. నీకు కోపం ఎందుకు వచ్చిందో రాశావు. అయినా దెబ్బలు తగిలే వరకూ మీరు తగవు లాడడం బాగోలేదు. ‘తన కోపమె, తన శత్రువు’ అని సుమతీ శతకకర్త రాశాడు. క్రోధం మనకు శత్రువని భర్తృహరి కూడా చెప్పాడు. అయినా నీకు అన్ని విషయాలు తెలుసు.

కోపం వల్ల చాలా అనర్థాలు వస్తాయి. కోపంతో మనకు వివేకం నశిస్తుంది.. సీతారామ్ తో నీకు వచ్చిన తగవు విషయం, మీ పెద్దలతో చెప్పు. వారు మీ తగవును పరిష్కరిస్తారు. కోపం తగ్గించుకొని శాంతంగా ఉండమని నిన్ను కోరుతున్నాను. త్వరలో నీవూ, సీతారామ్ మిత్రులుగా మారుతారని ఆశిస్తున్నా.

ఇట్లు,
నీ ప్రియమిత్రుడు,
అవసరాల వెంకట్రావు,
10వ తరగతి,
మునిసిపల్ హైస్కూలు,
విజయవాడ.

చిరునామా:
కె. రఘునందన్,
S/O కె. రాజారావు గారు,
ఇంటి నెం. 4.1.104,
మహారాణీ పేట,
విశాఖపట్టణం, ఆంధ్రప్రదేశ్.

AP SSC 10th Class Telugu వ్యాసాలు

AP State Board Syllabus AP SSC 10th Class Telugu Solutions 10th Class Telugu వ్యాసాలు Notes, Questions and Answers.

AP State Syllabus SSC 10th Class Telugu వ్యాసాలు

ప్రశ్న 1.
‘ఆరుబయట మలవిసర్జన’ ఎంతటి ప్రమాదకరమో వివరిస్తూ వ్యాసం రాయండి.
జవాబు:
అత్యంత ప్రమాదం

మలవిసర్జన అంటే మన శరీరంలోని మలినాలను బయటకు వదలడం.

మలవిసర్జన వలన వచ్చే మలినాలు చాలా దుర్వాసనతో కూడుకొని ఉంటాయి. అంతేకాకుండా వాటిపై అత్యంత ప్రమాదకరమయిన సూక్ష్మజీవులు ఉంటాయి. ఈ సూక్ష్మజీవులు వ్యాపించినట్లయితే కలరా వంటి వ్యాధులు వ్యాపిస్తాయి. ఇవి వృద్ధులకు, బలహీనులకు, చిన్న పిల్లలకు, అనారోగ్యవంతులకు, గర్భిణీలకు, బాలింతలు మొదలైన వారికి తొందరగా వ్యాపిస్తాయి.

బహిరంగ మలవిసర్జన చేసినపుడు దానిపై ఈగలు, దోమలు వాలతాయి. వాటిపైకి అక్కడి సూక్ష్మజీవులు చేరతాయి. ఆ ఈగలు, దోమలు మనం తినే ఆహారంపై వాలతాయి. ఈ సూక్ష్మజీవులు ఆహారంతోబాటు మనలోపలికి ప్రవేశిస్తాయి. ఆరోగ్యాన్ని పాడుచేస్తాయి.

అందుకే బహిరంగ మలవిసర్జన వద్దని ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు పేర్కొంటున్నాయి. ప్రజలను చైతన్యపరుస్తున్నాయి. మరుగుదొడ్లు నిర్మించుకొందుకు ప్రభుత్వం కూడా మినహాయింపుతో కూడిన ఋణం మంజూరు చేస్తోంది.
బహిరంగ మలవిసర్జన మానేద్దాం – నాగరికతను చాటుదాం.
మరుగుదొడ్డి వాడదాం – రోగాలు నివారిద్దాం.
పరిశుభ్రత పాటిద్దాం – పదికాలాలు చల్లగా ఉందాం.

AP SSC 10th Class Telugu వ్యాసాలు

ప్రశ్న 2.
‘స్వచ్ఛభారత్’ కార్యక్రమం గురించి ఒక వ్యాసం రాయండి.
జవాబు:
‘స్వచ్ఛభారత్’ అంటే భారతదేశం అంతా పరిశుద్ధంగా ఉండాలి అనే నినాదం. మనదేశ ప్రధాని నరేంద్రమోడీ గారు, దేశంలోని కాలుష్యమును గమనించి, నదీజలములు అన్నీ కలుషితం కావడం చూసి, ఈ ‘స్వచ్ఛభారత్’ అనే నినాదాన్ని ఇచ్చారు. ఈ కార్యక్రమ ప్రచారకులుగా దేశంలోని ప్రసిద్ధులయిన వ్యక్తులను మోడీ గారు నియమించారు. అమితాబ్ బచ్చన్, రామోజీరావు వంటి వారు, ఈ కార్యక్రమానికి చేయూత నిస్తున్నారు. మన విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, నగరాలలోని మురికిపేటలు, గంగ, గోదావరి వంటి నదుల జలాలు నేడు కాలుష్యంతో నిండిపోతున్నాయి. విద్యార్థులూ, ఆఫీసులలో ఉద్యోగులూ తమ పాఠశాలలనూ, కార్యాలయాలనూ “పరిశుభ్రంగా ఉంచుకోవాలి.” ప్రజలు తమ గృహాలనూ, పరిసరాలనూ శుభ్రంగా ఉంచుకోవాలి.

నదులు, చెరువులలోని నీటిని కలుషితం చేయరాదు. ఈ కాలుష్యం వల్ల రోగాలు పెరిగిపోతున్నాయి. దోమలు, క్రిములు పెరిగిపోతున్నాయి. ప్రజలందరూ స్వచ్ఛతను కాపాడితే, దేశం ఆరోగ్యవంతం అవుతుంది. ప్రజలకు కావలసిన మంచినీరు లభిస్తుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అని మన పెద్దలు ఏనాడో చెప్పారు.

స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని దేశం అంతా ప్రచారం చేయాలి. దీన్ని ప్రజల కార్యక్రమంగా తీర్చిదిద్దాలి. దేశంలోని పత్రికల వారు, దూరదర్శనా వారు స్వచ్ఛభారత్ గురించి మంచి ప్రచారం చేయాలి. దానివల్ల దేశం సుభిక్షంగా, ఆరోగ్యంగా ఉంటుంది.

ప్రశ్న 3.
అధిక జనాభా వల్ల మన పర్యావరణం దెబ్బ తింటోంది. పర్యావరణాన్ని ఎలా కాపాడుకోవాలో తెలియజేస్తూ వ్యాసం రాయండి.
జవాబు:
భూమి, నీరు, గాలి మొదలైన వాటితో మనిషికి ఉండే అవినాభావ సంబంధమే పర్యావరణం. కాబట్టి పర్యావరణం అంటే పరిసరాల వాతావరణం అని అర్థం. పరిసరాల వాతావరణం కలుషితం కాకుండా కాపాడుకోవడమే పర్యావరణ సంరక్షణ అనబడుతుంది.

ప్రాణులు నివసించేది నేలపైన గదా ! ఆ నేలతల్లిని సరిగా చూసుకోవాలి. భూమిపై చెత్త, చెదారమేకాదు ఓషధులుంటాయి. చెట్లుంటాయి. జంతువులుంటాయి. మనం జీవించటానికి ఆహారం లభించేది భూమి వల్లనే గదా ! రసాయనిక ఎరువుల వాడకం వల్ల భూమి నిస్సారమైపోతోంది. భూమిని ఆరోగ్యంగా ఉంచాలి. భూమి సమతౌల్యాన్ని పోషించాలి.

జలకాలుష్యం మిక్కిలి భయంకరమైనది. రసాయనిక పదార్థాలు, పరిశ్రమల వల్ల విడుదలయ్యే ద్రవపదార్థాలు సాగునీటిని, త్రాగేనీటిని కాలుష్యపరుస్తాయి. మురుగునీరు, త్రాగేనీరు అనే భేదం లేకుండా పోతోంది. డ్రైనేజి వ్యవస్థ అరొకరగా వుంది. దీనివల్ల కలరా, మలేరియా, ఫ్లోరోసిస్, విషజ్వరం, టైఫాయిడ్ వంటివేకాక వైద్యులకి అంతుపట్టని కొత్త రోగాలు కూడా బయలుదేరాయి.

ఇక వాయు కాలుష్యం, గాలివల్లనే మనం జీవిస్తున్నాం. అటువంటి గాలి స్వచ్ఛంగా వుండాలి. కాని ఆధునిక పారిశ్రామికత పేరుతో గాలి కూడా కలుషితమైపోతోంది. విషపూరితమైన గాలి పీల్చటం వలన ఊపిరితిత్తులు, జీర్ణకోశం, గుండెకాయ, కళ్ళు అనారోగ్యానికి గురై ప్రమాదాలు సంభవిస్తున్నాయి. జీవితం రోగాలమయం అవుతోంది.

యంత్రాలవల్ల, వాహనాలవల్ల ధ్వనికాలుష్యం వ్యాపిస్తోంది. అణుశక్తి పరీక్షల వల్ల కూడా వాతావరణ కాలుష్యం ఏర్పడుతోంది.

1970లో అమెరికాలో పర్యావరణ పరిరక్షణ ఉద్యమం బయలుదేరింది. వాటి నుంచి శాస్త్రజ్ఞులు పర్యావరణ కాలుష్యనివారణకు విశేషమైన కృషి చేస్తున్నారు. ప్రతి సంవత్సరం జూన్ 5వ తేదీని పర్యావరణ దినోత్సవంగా పాటిస్తున్నారు. పర్యావరణ వ్యవస్థలోని సమతౌల్యాన్ని కాపాడుకోవటానికి అందరూ కృషి చేయాలి.

ప్రశ్న 4.
నేటి సమాజంలో స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యలను విశ్లేషిస్తూ “వ్యాసం” రాయండి.
జవాబు:
పవిత్ర భారతదేశంలో స్త్రీలకు సమున్నతమైన గౌరవం ఉంది. స్త్రీలు భూమిపై కదిలే దేవతామూర్తులుగా భావిస్తాము. స్త్రీలు ఎక్కడ ఉంటే అక్కడ దేవతలు ఆనందిస్తారని మనం భావిస్తాము. కాని వర్తమాన సమాజంలో పరిస్థితులు పూర్తిగా మారాయి. స్త్రీల ప్రగతి నానాటికి దిగజారుతున్నది. స్త్రీలు ఎన్నో సమస్యలను, కష్టాలను ఎదుర్కొంటున్నారు.

స్త్రీలు ఇప్పటికీ స్వేచ్ఛగా జీవించలేకపోతున్నారు. కొందరు స్త్రీలను పైకి రానీయకుండా అడ్డుపడుతున్నారు. రాజకీయాల్లో రిజర్వేషన్ కోసం జరుగుతున్న ప్రయత్నాలు ఒక కొలిక్కి రాలేదు. చట్టసభల్లో మహిళా సభ్యులను చులకనగా చూస్తున్నారు.

ప్రేమ పేరుతో స్త్రీలపై దాడులు జరుగుతున్నాయి. అకృత్యాలు జరుగుతున్నాయి. కులాంతర వివాహాలు చేసుకున్న మహిళలపై వివక్షను చూపిస్తున్నారు. పరువు కోసం తండ్రులు కన్న కూతుర్లనే చంపడం మనం చూస్తున్నాం. దీన్ని నాగరిక సమాజం హర్షించదు. దీన్ని అధిగమించే ప్రయత్నం చేయాలి.

గ్రామీణ ప్రాంతాల్లో స్త్రీలు అక్షరాస్యతకు దూరంగా ఉంటున్నారు. కొందరు కట్నాల పేరుతో మహిళలను వేధిస్తున్నారు. ఆరోగ్యపరంగా స్త్రీలు సమస్యలను ఎదుర్కొంటున్నారు. బాలింతలకు తగిన పౌష్టికాహారం దొరకడం లేదు. ఈ రకంగా స్త్రీలు సమాజంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. వాటిని మన ప్రభుత్వాలు పరిష్కరించాలి. స్త్రీల జీవితాల్లో వెలుగులను నింపాలి.

AP SSC 10th Class Telugu వ్యాసాలు

ప్రశ్న 5.
మీకు నచ్చిన సన్నివేశాన్ని లేదా ప్రకృతి దృశ్యాన్ని వర్ణిస్తూ వ్యాసం రాయండి.
జవాబు:
సూర్యోదయం
తూర్పువైపు ఆకాశంలోకి ఉదయమే చూస్తే ఎర్రగా కనిపిస్తుంది. అప్పటి వరకూ కోళ్ళు కూస్తూ ఉంటాయి. నక్షత్రాలు ఆకాశంలో వెలవెలపోతాయి. అప్పుడు పక్షులు తమ గూళ్ళ నుండి బయలుదేరి ఆహారం కోసం బారులు కట్టి ప్రయాణం చేస్తూ ఉంటాయి. పక్షులు రెక్కలు ఆడిస్తూ నేరుగా దూసుకుపోతూ ఉంటే, ఆ దృశ్యం చూడ్డానికి కళ్ళకు పండుగలా కనిపిస్తుంది.

అదే సమయానికి సూర్యకిరణాలు నేరుగా వచ్చి నేలకు తాకుతాయి. మా ఇంటి పక్క గుళ్ళో గంటలు మోగుతూ ఉంటాయి. గుడి పక్క చెరువులో సూర్యకిరణాలు పడి, తామర పూలు విచ్చుకుంటాయి. తుమ్మెదలు ఆ పద్మాలపై ఏదో రొద చేస్తూ తిరుగుతూ ఉంటాయి.. సూర్యుడు మనకు కనిపించే ప్రత్యక్ష దైవం. సూర్యోదయం కాగానే ప్రకృతి అంతా మేలుకొని తమ తమ పనుల్లో మునిగిపోతుంది.

ప్రశ్న 6.
‘నవ సమాజంలో విద్యార్థుల పాత్ర అనే అంశం మీద వ్యాసము వ్రాయండి.
జవాబు:
విద్యార్థులు అంటే విద్యను కోరి వచ్చినవారు. విద్యార్థుల ముఖ్య కర్తవ్యం, శ్రద్ధగా చదివి, మంచి మార్కులు సాధించడం. ఈనాడు మన చుట్టూ ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల పరిష్కారానికి దేశ నాయకులతో పాటు, ప్రజలు కూడా బాబాధ్యత వహించాలి. విద్యార్థులు చదువుకుంటున్న దేశ పౌరులు. కాబట్టే భావి భారత పౌరులయిన విద్యార్థులు కూడా, నవ సమాజంలో పెరిగిపోతున్న అవినీతి, అపరిశుభ్రత, దురాగతాలు, రాజకీయ నాయకుల వాగ్దాన భంగాలు వంటి వాటిపై తప్పక తిరుగబడాలి.

విద్యార్థులు ‘స్వచ్ఛభారత్’ వంటి కార్యక్రమాలు చేపట్టాలి. అంటువ్యాధుల నిర్మూలనకు దీక్ష చేపట్టాలి. అవినీతి ఎక్కడ కనబడినా, సామూహికంగా. ఎదిరించాలి. విద్యార్థులు నీతినియమాలు పాటించాలి. వృద్ధులను గౌరవించాలి. తోడి వారికి సాయం చేయాలి.

విద్యార్థినీ విద్యార్థులు, క్రమశిక్షణను పాటించాలి. దేశభక్తిని కలిగియుండాలి. మంచి అలవాట్లను అలవరచుకోవాలి. గురువులనూ, తల్లిదండ్రులనూ గౌరవించాలి. బాగా ఆటలు ఆడి, వ్యాయామం చేసి ఆరోగ్యం కాపాడుకోవాలి. ఆరోగ్యమే మహాభాగ్యమని ప్రచారం చేయాలి.

విద్యార్థులు రాజకీయాలలో ప్రత్యక్షంగా పాల్గొనరాదు. కాని దేశం కోసం తమ శక్తియుక్తులనన్నింటినీ ధారపొయ్యాలి.

ప్రశ్న 7.
కాలుష్యంతో నిండిపోతున్న నేటి నగర వాతావరణాన్ని గురించి వ్యాసం రాయండి.
జవాబు:
కవి అలిశెట్టి ప్రభాకర్ “నగరం అర్థంకాని రసాయనశాల” అన్నమాట యదార్థము. నేడు పల్లెలను వీడి ప్రజలంతా పట్టణాలకు వలస పోతున్నారు. నగరాలు అన్నీ మురికివాడలుగా మారి పోయాయి.

నగరాల్లో జనాభా పెరిగిపోతోంది. ప్లాస్టిక్ సంచుల వాడకం పెరిగింది. ప్రజలు పారవేసే చెత్త, వాడి పారవేసిన ఇంజక్షను సూదులు, ఫ్యాక్టరీలవారు విడిచిపెట్టే రసాయనిక వ్యర్థాలు , పందులు, కుక్కలు వంటి జంతువుల మాలిన్యాలు, నగరంలో పోగుపడుతున్నాయి.

నగరాలలో ప్రజలకు త్రాగడానికి సరిపడ మంచినీరు దొరకడం లేదు. నగరాన్ని శుభ్రంగా ఉంచాలన్న దీక్ష, ప్రజలకు ఉండడం లేదు. నగరంలో తిరిగే వాహనాలు ఎంతో కాలుష్యాన్ని గాలిలోకి విడిచిపెడుతున్నాయి. నదులలో కాలువలలో, చెరువులలో మురికినీరు వదలుతున్నారు. జలాశయాల్లో బట్టలు ఉతుకుతున్నారు. చెత్త దూరంగా పారవేసేందుకు నగరాల్లో చోటు దొరకడం లేదు. అందువల్ల నగరాలు కాలుష్య నిలయాలుగా, రోగాలకు పుట్టుక స్థలాలుగా మారుతున్నాయి.

నివారణ :
ప్రతి నగర పౌరుడు తమ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచాలి. మొక్కలు నాటాలి. జలాశయాల్లోకి మురికినీరు విడువరాదు. పరిశుభ్రతకూ, మంచి నీటికి మంచి వాతావరణానికి నగరాధికారులతో పాటు అందరూ కృషి చేయాలి.

AP SSC 10th Class Telugu వ్యాసాలు

ప్రశ్న 8.
నగర జీవనంలోని అనుకూల అంశాలపై ఒక వ్యాసం రాయండి.
జవాబు:
నగర జీవనం – అనుకూల అంశాలు :
‘నగరం’ అంటే పట్టణము. పల్లెలలో కన్న నగరాలలో ప్రజలకు అవసరమయ్యే సదుపాయాలు ఎక్కువగా లభ్యమవుతున్నాయి. అందువల్ల ప్రజలు గ్రామాల నుండి నగరాలకు వలసపోతున్నారు.

నగరాలలో ప్రజలకు విద్యా, వైద్య, ప్రయాణ సౌకర్యాలు హెచ్చుగా దొరుకుతాయి. ప్రజలకు మంచి విద్య నగరాల్లో లభిస్తుంది. కార్పొరేట్ కళాశాలలు, వైద్యశాలలు నగరాల్లో ఉంటాయి. నగరాల్లో పరిశ్రమలు ఉంటాయి. అందువల్ల ప్రజలకు ఉద్యోగ వసతి లభిస్తుంది. నగరాల్లో ప్రయాణాలకు సిటీ బస్సులు, రైళ్ళు, ఆటోలు, టాక్సీలు దొరుకుతాయి.

చేతి వృత్తుల వారికి సైతము, నగరాల్లో వారికి తగ్గ పని లభిస్తుంది. ప్రజలు ఏదోరకంగా నగరాల్లో బ్రతుకగలరు. వారికి కావలసిన పాలు, కూరగాయలు, నిత్యావసర వస్తువులు నగరాల్లో దొరుకుతాయి. కుళాయిల ద్వారా మంచి నీరు దొరుకుతుంది. రైతు బజార్లలో చౌకగా కావలసిన వస్తువులు దొరుకుతాయి. రోగం వస్తే, చిన్న పెద్ద వైద్యశాలలు నగరంలో ఉంటాయి. నగరాల్లో 24 గంటలు విద్యుచ్ఛక్తి సరఫరా అవుతుంది.

ఈ విధమైన అనుకూలములు ఉన్నందు వల్లే ప్రజలు పల్లెలను వదలి నగరాలకు వలసపోతున్నారు.

ప్రశ్న 9.
మాతృభాషా ప్రాముఖ్యాన్ని గూర్చి ఒక వ్యాసం రాయండి.
జవాబు:
మాతృభాష అంటే తల్లి భాష అని అర్థం. మనం పుట్టిన చోట జనవ్యవహారంలో ఉండే భాష మాతృభాష. మానవుడు పుట్టింది మొదలు గిట్టేవరకు మాతృభాషలోనే ఎక్కువగా మాట్లాడటం జరుగుతుంది. మనం ఏ భాషలో మాట్లాడతామో, ఏ భాషలో కలలు కంటామో ఆ భాషలోనే విద్యను నేర్చుకోవడం ఎంతైనా అవసరం.

పరాయి భాషలో విద్యాభ్యాసం చేస్తే చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముందుగా పరాయి భాషను అర్థం చేసుకోవడానికే చాలా ప్రయాస పడాల్సివస్తుంది. అందులో తగినంత పరిజ్ఞానం అలవడనిదే విషయ గ్రహణంగానీ, విషయ వ్యక్తీకరణగానీ సాధ్యపడదు. మాతృభాషలో విద్యాభ్యాసం వల్ల విద్యార్థి ఉపాధ్యాయులు చెప్పిన విషయాన్ని సులభంగా అర్థం చేసుకోవచ్చు. గుర్తుంచుకొని పరీక్షలు బాగా వ్రాయవచ్చు. తక్కువ సమయంలో ఎక్కువ విజ్ఞానాన్ని పొందవచ్చు.

మాతృభాషలో విద్యను నేర్చుకోవడం తల్లిపాలు త్రాగి పెరగడం వంటిది. పరభాషలో విద్యను నేర్చుకోవడం దాది పాలు త్రాగడం వంటిది. ఆంగ్లం వంటి పరాయిభాషలో విద్యార్థికి సరైన పరిజ్ఞానం లేనందువల్ల విద్యార్థికి ఆ భాషరాక బట్టీపట్టి ఏదోవిధంగా కృతార్థుడవుతున్నాడు. ఉపాధ్యాయులు చెప్పేది అర్థం కాక గైడ్సు (Guides) వెంట పడుతున్నాడు. కాబట్టి కనీసం సెకండరీ విద్యాస్థాయి వరకు మాతృభాషలోనే విద్యను బోధించడం, విద్యను నేర్చుకోవడం అవసరం.

ప్రశ్న 10.
‘వాతావరణ కాలుష్యం’ లేదా ‘పర్యావరణ పరిరక్షణ’ అన్న విషయంపై వ్యాసం రాయండి.
జవాబు:
ఆరోగ్యమే మహాభాగ్యం. వాతావరణం పరిశుభ్రంగా ఉంటే, మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. అతడి జీవితం, ఆనందంగా సాగుతుంది. మానవుల ఆరోగ్యానికి హానిని కల్గించే హానికారక పదార్థాలు వాతావరణంలో కలిసిపోతే, దానిని వాతావరణ కాలుష్యం అంటారు.

మన చుట్టూ ఉండే గాలి, నీరు, భూమి వంటి వాటిని పర్యావరణం అంటారు. పర్యావరణాన్ని పరిశుభ్రంగా ఉంచాలి.

వివిధ కర్మాగారాలు, పరిశ్రమలు, లెక్కలేనన్ని మోటారు వాహనాలు, మురికి నీరు, మొ||నవి. వాతావరణ కాలుష్యాన్ని కల్గిస్తున్నాయి. కర్మాగారాలు వదిలే వ్యర్థ పదార్థాల వల్ల, నదుల జలాలు కలుషితం అవుతున్నాయి. దానితో జలకాలుష్యం ఏర్పడుతోంది. మోటారు వాహనాల ధ్వనులతో ధ్వని కాలుష్యం ఏర్పడుతోంది.

వాతావరణ కాలుష్యం వల్ల, మానవుని మనుగడకు ప్రమాదం ఏర్పడుతోంది. దీనివల్ల ఉదరకోశ వ్యాధులు, ఊపిరితిత్తుల వ్యాధులు, కేన్సర్ రోగాలు, గుండె జబ్బులు వస్తున్నాయి.

వాతావరణ కాలుష్య నివారణకూ, పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు తయారు చేసి అమలు పరచాలి. కర్మాగారములు పరిశుభ్రము చేసిన తరువాతే వ్యర్థాలను విడిచి పెట్టాలి. ఫ్యాక్టరీల వారు మొక్కలు బాగా పెంచాలి. అవకాశం ఉన్న చోట ప్రజలు మొక్కలను బాగా పెంచాలి. ఐక్యరాజ్య సమితి, ప్రపంచ ఆరోగ్య సంస్థలు, పరిశోధనలు చేసి, వాతావరణ కాలుష్య నివారణకు తగు సూచనలు అందించాలి.

AP SSC 10th Class Telugu వ్యాసాలు

ప్రశ్న 11.
నీకు నచ్చిన మహిళ గుణగణాలు (శ్రీమతి ఇందిరాగాంధీ) గురించి వ్యాసం రాయండి.
జవాబు:
నాకు నచ్చిన మహిళ (శ్రీమతి ఇందిరా గాంధీ) :
భరత మాత ముద్దుబిడ్డలలో, ఇందిరాగాంధీ ఒకరు. ప్రపంచ ప్రఖ్యాతి పొందిన మహిళామణులలో, ఇందిర సుప్రసిద్ధురాలు. ఈమె 1917వ సంవత్సరము నవంబరు 19వ తేదీన ఆమె అలహాబాదులో జవహర్ లాల్ నెహ్రూ – కమలా నెహ్రూ దంపతులకు జన్మించింది.

ఇందిర శాంతినికేతన్లో రవీంద్రుని వద్ద చదివింది. ఈమె గొప్ప దేశ భక్తురాలు.. ఈమె భర్త ఫిరోజ్ గాంధీ, మహమ్మదీయుడు. ఆ వివాహం ఈమెకు మత సహనాన్ని నేర్పింది. ఈమె తండ్రితో పాటు దేశ విదేశాలు పర్యటించి, రాజనీతి చతురజ్ఞ అయ్యింది.

ఈమె భారతదేశ ప్రధానమంత్రిగా 15 సంవత్సరాలు పనిచేసింది. ఆ కాలంలో ఈమె బ్యాంకులను జాతీయం చేసింది. రాజభరణాలను రద్దు చేసింది. భూ సంస్కరణలను చేపట్టింది. ‘గరీబీ హఠావో’ అని ఈమె ఇచ్చిన నినాదం భారతదేశం అంతటా మారుమ్రోగింది.

ఈమె బడుగువర్గాల ఆశాజ్యోతిగా, దళిత వర్గాల కన్నతల్లిగా పేరు తెచ్చుకొంది. ఈమె గొప్ప సాహసురాలు. గొప్ప రాజనీతిజ్ఞురాలు.

ప్రశ్న 12.
నీకు నచ్చిన జాతీయ నాయకుని గూర్చి వ్యాసం రాయండి.
జవాబు:
మహాత్మాగాంధీ అసలు పేరు మోహన్ దాస్ కరంచంద్ గాంధీ. కానీ భారత ప్రజలు ఆత్మీయంగా ‘బాపూజీ’ అని పిలిచేవారు. ‘మహాత్మా’ అని గౌరవించేవారు. భారత జాతి మహాత్మాగాంధీని ‘జాతిపిత’ గా గౌరవించి కృతజ్ఞత ప్రకటించుకుంది.

గాంధీజీ దక్షిణాఫ్రికా వెళ్ళినప్పుడు అక్కడున్న భారతీయుల దాస్య వృత్తిని చూసి చలించిపోయాడు. ఆంగ్లేయుల ప్రవర్తన సహించలేక ఎదురుతిరిగాడు. ఎన్నో కష్టాలకు లోనయ్యాడు.

స్వదేశానికి తిరిగి వచ్చిన గాంధీజీ భారతీయుల బానిస బ్రతుకుల్ని చూసి సహించలేకపోయాడు. భారతమాత పరాయి పాలకుల సంకెళ్ళలో బందీగా ఉన్నందుకు గాంధీ తల్లడిల్లాడు. ఆంగ్లేయులపై స్వాతంత్ర్య సమరం ప్రకటించాడు. శాంతి, సత్యం, అహింస అనే ఆయుధాలతో స్వాతంత్ర్య సమరం చేపట్టాడు. స్వరాజ్య ఉద్యమానికి కాంగ్రెసు సంఘం స్థాపించాడు.

ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా, విదేశీ వస్తు బహిష్కరణ, సహాయ నిరాకరణ, ఖద్దరు ఉద్యమాలను చేపట్టి ఆంగ్లేయులను గుక్క తిప్పుకోనీకుండా గడగడలాడించాడు. సత్యాగ్రహం, నిరాహారదీక్షల ద్వారా భారత జాతిని జాగృతం చేసి ఆంగ్లేయుల గుండెలు దద్దరిల్లజేశాడు.

అనేక జాతులు, కులాలు, మతాలు, భాషలు గల దేశ ప్రజల్ని ఒకే త్రాటి మీద నడిపించి, సమైక్యంగా పోరాటం సాగించాడు. గాంధీ నడిపించిన ఉద్యమం వల్ల 1947, ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్ర్యం లభించింది. దుడ్డు కర్ర, అంగవస్త్రం, కిర్రు చెప్పులు గల గాంధీ ప్రపంచ దేశాల చేత జేజేలు అందుకున్నాడు.

ప్రశ్న 13.
ప్రశాంతతకు, పచ్చదనానికి నిలయమైన పల్లెల గొప్పదనాన్ని వర్ణిస్తూ వ్యాసం రాయండి.
జవాబు:
గ్రామాలు దేశ సౌభాగ్యానికి మూలకందములు. పల్లెలలో జీవితం ప్రశాంతంగా, హాయిగా ఉంటుంది. చక్కని ఎండ, గాలి, ప్రతి ఒక్కరికీ పల్లెలలో లభిస్తుంది. పల్లెలు ప్రకృతి రమణీయతకు నిలయాలు. పల్లెలలో పచ్చని చెట్లు, పొలాలు, ఆ చెట్టుపై పక్షుల కలకూజితాలు మనోహరంగా ఉంటాయి. చెట్లు చల్లని గాలిని ఇస్తూ, గ్రామ ప్రజలను సుఖసంతోషాలతో ముంచెత్తుతాయి.

ప్రజలందరికీ పల్లెలలో పాడిపంటలు ఉంటాయి. తాజా కూరగాయలు, పళ్ళు, పూలు వారికి దొరుకుతాయి. గ్రామాలలో ప్రజలందరూ ఒకరితో నొకరు అన్నదమ్ముల్లాగా మెలగుతారు. వారు “అక్కా! బావా” అంటూ ఆప్యాయంగా పలకరించుకుంటారు. కష్టసుఖాల్లో అందరూ కలిసి పాలుపంచుకుంటారు. గ్రామాలలో తీర్థాలు, సంబరాలు మహావేడుకగా జరుగుతాయి.

పల్లెలలో ఒకరింట్లో పెండ్లి అంటే, గ్రామంలో అందరికీ వేడుకే. పల్లెలలో సంక్రాంతికి ముగ్గులు, పూలతోరణాలు, గొబ్బిళ్ళు, భోగిమంటలు, సంక్రాంతి ప్రభలు మహావైభవంగా ఉంటాయి. హరిదాసులు, గంగిరెద్దులు, పగటి వేషధారులు, వారి చక్కని పాటలు ఆనందంగా ఉంటాయి. గ్రామాల్లో పంటలు పండి ఇంటికి వస్తే, ఇళ్ళు కలకలలాడుతాయి. అందమైన పాడి పశువులు, దుక్కిటెడ్లు, ఎడ్ల బళ్ళు మహావైభవంగా ఉంటాయి.

అందుకే పల్లెలు ప్రకృతి రమణీయతకు నట్టిళ్ళు. ప్రశాంత జీవిత సౌఖ్యానికి పుట్టిళ్ళు అని చెప్పగలము.

ప్రశ్న 14.
అవినీతి నిర్మూలనమునకు మీరిచ్చే సలహాలేమిటి?
జవాబు:
మనదేశానికి స్వాతంత్ర్యం వచ్చాక అనేక రంగాలలో దేశం ముందంజ వేసింది. దురదృష్టవశాత్తూ మనదేశంలో అవినీతి కూడ పెచ్చుపెరిగింది. అక్రమ సంపాదన ప్రజల లక్ష్యమయిపోయింది. ఏదోరకంగా తప్పుచేసి అయినా డబ్బు సంపాదించడం, తన పని పూర్తిచేసుకోవడం, ఆశ్రితులకు మేలు చేయడం, నీతికి సమాధి కట్టడం జరుగుతోంది. ముఖ్యంగా దేశ రాజకీయ నాయకులలో ఈ అవినీతి జాడ్యము విస్తరించిపోతోంది. చిన్న పంచాయతీ మెంబరు నుండి దేశ ప్రధాని వరకు అందరూ అవినీతి ఆరోపణలకు గురియగుచున్నారు. ఇది దేశానికి పట్టిన దౌర్భాగ్యం. దీనిని అరికట్టడంలో భావిభారత పౌరులైన యువతీయువకులు ముఖ్యంగా విద్యార్థినీ విద్యార్థులు ముందడుగు వేయాలి.

ముందుగా దేశంలో జరిగే అవినీతి కార్యాలను గూర్చి చూద్దాము. వర్తకులు సరకులలో కలీ చేయడం, ప్రభుత్వము పంపిణీ చేసిన నిత్యావసర వస్తువులను దాచి, బ్లాక్ మార్కెట్లో అమ్మడం, ధరలు పెంచివేయడం, ప్రభుత్వానికి పన్నులు ఎగవేయడం వంటి పనులు చేస్తున్నారు. ప్రభుత్వోద్యోగులు ప్రభుత్వము ప్రజలకు ఇచ్చే సదుపాయాలు ప్రజలకు లభించేలా చూడ్డానికి భారీగా లంచాలు మింగుతున్నారు. రేషన్ కార్డులు ఇవ్వడానికి, ఇళ్ళ స్థలాలు మొదలైనవి పంచడానికి లంచాలు తీసికొంటూ అర్హులయిన వారికి అన్యాయం చేసి వారికి ఇష్టమైన వారికి ఇస్తున్నారు. చౌకధరల దుకాణంలో సరుకులను దాచివేసి అక్రమ లాభాలు ఆర్జిస్తున్నారు. బ్యాంకుల అప్పులకు లంచాలు తీసికొంటున్నారు. విద్యాలయాలలో సీట్లకు లంచాలు, పాస్ చేయించడానికి లంచాలు ముట్టచెప్పవలసివస్తోంది. ఇట్లా దేశంలో అవినీతి అన్ని రంగాలలో తాండవిస్తోంది.

ఈ అవినీతిని అరికట్టడానికి యువతీయువకులు ముందుకు రావాలి. పత్రికలకు లేఖలు వ్రాసి లంచగొండుల గూర్చి అవినీతి శాఖ వారికి తెలియజేయాలి. అవినీతి శాఖ ఉద్యోగులు కూడా మరింత చురుకుగా పనిచేసి లంచగొండులను నిర్బంధించాలి.

రోజుకొక లంచగొండిని, కలీ వ్యాపారిని, దుష్ట రాజకీయవేత్తను ప్రభుత్వానికి యువత అప్పగిస్తే, కొద్దిరోజులలో దేశములో అవినీతి దానంతట అదే అంతరిస్తుంది. అవినీతిపరులకు ప్రభుత్వం కూడ గట్టి శిక్షలు విధించాలి. వారి ఉద్యోగాలు తీసివేయాలి. కలీ వ్యాపారులకు జరిమానాలు, జైలు శిక్షలు వేయాలి.

అవినీతి నిర్మూలన ప్రజలందరి లక్ష్యం కావాలి. లేనిచో ఈ అవినీతి చెదపురుగు దేశాన్నే కొరికి తినివేస్తుంది.

AP SSC 10th Class Telugu వ్యాసాలు

ప్రశ్న 15.
‘స్వచ్ఛభారత్’ గురించి ఒక వ్యాసం వ్రాయండి.
జవాబు:
‘స్వచ్ఛభారత్’ అంటే భారతదేశం అంతా పరిశుద్ధంగా ఉండాలి అనే నినాదం. మనదేశ ప్రధాని నరేంద్రమోడీ గారు, దేశంలోని కాలుష్యమును గమనించి, నదీజలములు అన్నీ కలుషితం కావడం చూసి, ఈ ‘స్వచ్ఛభారత్’ అనే నినాదాన్ని ఇచ్చారు. ఈ కార్యక్రమ ప్రచారకులుగా దేశంలోని ప్రసిద్ధులయిన వ్యక్తులను మోడీ గారు నియమించారు. అమితాబ్ బచ్చన్, రామోజీరావు వంటి వారు, ఈ కార్యక్రమానికి చేయూత నిస్తున్నారు. మన విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, నగరాలలోని మురికి పేటలు, గంగా, గోదావరి వంటి నదులజలాలు నేడు కాలుష్యంతో నిండిపోతున్నాయి. విద్యార్థులూ, ఆఫీసులలో ఉద్యోగులూ తమ పాఠశాలలనూ, కార్యాలయాలనూ “పరిశుభ్రంగా ఉంచుకోవాలి.” ప్రజలు తమ గృహాలనూ, పరిసరాలనూ శుభ్రంగా ఉంచుకోవాలి.

నదులు, చెరువులలోని నీటిని కలుషితం చేయరాదు. ఈ కాలుష్యం వల్ల రోగాలు పెరిగిపోతున్నాయి. దోమలు, క్రిములు పెరిగిపోతున్నాయి. ప్రజలందరూ స్వచ్ఛతను కాపాడితే, దేశం ఆరోగ్యవంతం అవుతుంది. ప్రజలకు కావలసిన మంచినీరు లభిస్తుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అని మన పెద్దలు ఏనాడో చెప్పారు.

స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని దేశం అంతా ప్రచారం చేయాలి. దీన్ని ప్రజల కార్యక్రమంగా తీర్చిదిద్దాలి. దేశంలోని పత్రికల వారు, దూరదర్శన్ వారు స్వచ్ఛభారత్ గురించి మంచి ప్రచారం చేయాలి. దానివల్ల దేశం సుభిక్షంగా, ఆరోగ్యంగా ఉంటుంది.

ప్రశ్న 16.
నీ చుట్టూ ఉన్న పరిసరాలలో కనిపించే బాలకార్మిక వ్యవస్థపై ఒక వ్యాసం రాయండి.
జవాబు:
నిరక్షరాస్యత, కుటుంబ ఆర్థిక పరిస్థితులు, కరవు కాటకాల కారణంగా లక్షలాది పిల్లలు చిన్న వయస్సులోనే కార్మికులుగా చేరుతున్నారని అంతర్జాతీయ కార్మిక నిర్వహణ సంస్థ (ఐ.ఎల్.ఒ) తన సర్వేలో వెల్లడించింది.

ప్రపంచంలో ఏ దేశంలోనూ లేనంతగా భారతదేశంలో బాలకార్మిక వ్యవస్థ ఉందని ఐ.ఎల్.ఒ. నిర్వహించిన సర్వేలో తెలియజేసింది. దేశంలో ఆంధ్రప్రదేశ్ లోనే అత్యధికంగా బాల కార్మికులు ఉన్నారని ఆ నివేదికలో పేర్కొన్నారు.

బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం పలు సందర్భాలలో చేస్తున్న ప్రకటనలు కేవలం ప్రకటనలుగానే మిగిలిపోతున్నాయి. కాబట్టి నిర్దిష్టమైన ప్రణాళికను ఏర్పాటు చేసి అది అమలు జరిగేటట్లు చూడాలి. ప్రభుత్వం రూపొందించిన బాల కార్మిక నియంత్రణ చట్టం సరిగా అమలు అయ్యేట్లు చూడాలి. .

భారతదేశంలో 8.7 కోట్ల మంది బాలలు పాఠశాలలకు వెళ్ళడం లేదని, వీరంతా ఇళ్ళలోను, కర్మాగారాల్లోను, పొలాల్లోను పని చేస్తున్నారని ‘గ్లోబల్ మార్చ్ ఎగనెస్ట్ చైల్డ్ లేబర్’ అనే అంతర్జాతీయ సంస్థ పేర్కొంది. కాబట్టి బాల కార్మికుల కోసం ప్రత్యేక పాఠశాలలు నెలకొల్పాలి. వాళ్ళు చదువుకొనే అవకాశం కల్పించాలి.

బాల కార్మికులను కూలివారుగానే చూస్తే వారు కార్మికులుగానే మిగిలిపోతారు. వారిలో ఉన్న యోగ్యతను, ప్రతిభను వెలికి తీసేందుకు సహకారం అందజేస్తే భవిష్యత్తులో ఒక మంచి నిపుణుడిని అందించేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలు కూడా బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు సహకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 6 యుద్ధకాండ

AP State Board Syllabus AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం 6th Lesson యుద్ధకాండ Textbook Questions and Answers.

AP State Syllabus SSC 10th Class Telugu Solutions ఉపవాచకం 6th Lesson యుద్ధకాండ

10th Class Telugu ఉపవాచకం 6th Lesson యుద్ధకాండ Textbook Questions and Answers

I. అవగాహన – ప్రతిస్పందన

సంఘటనా క్రమం

సంఘటనల ఆధారంగా వరుస క్రమంలో వాక్యాలను అమర్చడం

1. అ) వంద యోజనాల పొడవు, పది యోజనాల వెడల్పు గల సేతువును కట్టడం ఐదు రోజుల్లో పూర్తయింది.
ఆ) శ్రీరాముడు యుద్ధనీతిని అనుసరించి సైన్యాన్ని వివిధ భాగాలుగా విభజించాడు.
ఇ) విశ్వకర్మ కుమారుడైన ‘నలుడు’ శిల్పకళా నిపుణుడు, ఉత్సాహం, శక్తి ఉన్నవాడు. సేతువు నిర్మించడానికి అతడే యోగ్యుడని సముద్రుడు తెలిపాడు.
ఈ) శ్రీరాముడు సముద్రతీరంలో దర్భాసనం మీద కూర్చుని సముద్రుణ్ణి ఉపాసించాడు.
జవాబులు
ఈ) శ్రీరాముడు సముద్రతీరంలో దర్భాసనం మీద కూర్చుని సముద్రుణ్ణి ఉపాసించాడు.
ఇ) విశ్వకర్త కుమారుడైన ‘నలుడు’ శిల్పకళా నిపుణుడు. ఉత్సాహం, శక్తి ఉన్నవాడు. సేతువు నిర్మించడానికి అతడే యోగ్యుడని సముద్రుడు తెలిపాడు.
అ) వందయోజనాల పొడవు, పది యోజనాల వెడల్పు గల సేతువును కట్టడం ఐదు రోజుల్లో పూర్తయింది.
ఆ) శ్రీరాముడు యుద్ధనీతిని అనుసరించి సైన్యాన్ని వివిధ భాగాలుగా విభజించాడు.

2. అ) లంకను నాలుగువైపుల నుండీ సైన్యంతో ముట్టడించాడు శ్రీరాముడు.
ఆ) సీతను అప్పగించకపోతే శ్రీరాముడి చేతిలో మరణం తథ్యమని, లంకకు విభీషణుడు రాజు కాగలడని శ్రీరాముని వాక్యంగా రావణునికి వినిపించాడు అంగదుడు.
ఇ) అంగదుని చేతిలో రావణ కుమారుడు ఇంద్రజిత్తు ఓడిపోయాడు.
ఈ) రామలక్ష్మణులను మూర్ఛపోయేటట్టు చేసి నాగాస్త్రంతో బంధించాడు.
జవాబులు
ఆ) సీతను అప్పగించకపోతే శ్రీరాముడి చేతిలో మరణం తథ్యమని, లంకకు విభీషణుడు రాజు కాగలడని శ్రీరాముని వాక్యంగా రావణునికి వినిపించాడు అంగదుడు.
అ) లంకను నాలుగువైపుల నుండీ సైన్యంతో ముట్టడించాడు శ్రీరాముడు.
ఇ) అంగదుని చేతిలో రావణకుమారుడు ఇంద్రజిత్తు ఓడిపోయాడు.
ఈ) రామలక్ష్మణులను మూర్చపోయేటట్టు చేసి నాగాస్త్రంతో బంధించాడు.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 6 యుద్ధకాండ

3. అ) సుషేణుని సూచన మేరకు హనుమంతుడు ఓషధులు తేవడానికి వేగంగా వెళ్లాడు.
ఆ) ఆకాశానికి ఆకాశం, సముద్రానికి సముద్రమే సమానమైనట్లు రామరావణ యుద్దానికి రామరావణ యుద్ధమే సమానమన్నట్లు సాగుతున్నది.
ఇ) ఐంద్రాస్త్రంతో కుంభకర్ణుని శిరస్సును ఖండించి శాశ్వత నిద్రలోకి పంపాడు శ్రీరాముడు.
ఈ) ఐంద్రాస్త్రమును ప్రయోగించి ఇంద్రజిత్తు తలను నేలరాల్చాడు లక్ష్మణుడు.
జవాబులు
ఇ) ఐంద్రాస్త్రంతో కుంభకర్ణుని శిరస్సును ఖండించి శాశ్వత నిద్రలోకి పంపాడు శ్రీరాముడు.
ఈ) ఐంద్రాస్త్రమును ప్రయోగించి ఇంద్రజిత్తు తలను నేలరాల్చాడు లక్ష్మణుడు.
అ) సుషేణుని సూచన మేరకు హనుమంతుడు ఓషధులు తేవడానికి వేగంగా వెళ్లాడు.
ఆ) ఆకాశానికి ఆకాశం, సముద్రానికి సముద్రమే సమానమైనట్లు రామరావణ యుద్ధానికి రామరావణ యుద్ధమే సమానమన్నట్లు సాగుతున్నది.

4. అ) ఆమె శీలం యొక్క గొప్పదనాన్ని ముల్లోకాలకు చాటడానికే అగ్నిప్రవేశం చేస్తున్నా ఊరుకున్నానన్నాడు.
ఆ) అగ్నిదేవుడు స్వయంగా సీతాదేవిని తీసుకువచ్చి ఆమె గొప్పదనాన్ని వెల్లడించాడు.
ఇ) ‘నా వంశ ప్రతిష్ఠ నిలుపుకోడానికి దుష్ట రావణుని చెరనుండి నిన్ను విడిపించాను. ఇంతకాలం పరుడి పంచన ఉన్నందువల్ల నీ ప్రవర్తన గురించి నాకు సందేహముంది. కనుక నువ్వు నీ ఇష్టం వచ్చిన చోటికి వెళ్లవచ్చునని’ శ్రీరాముడు అన్నాడు.
ఈ) శ్రీరామునికి విశ్వాసం కలిగించడానికి ‘అగ్నిప్రవేశం’ ఒక్కటే శరణ్యమని భావించింది.
జవాబులు
ఇ) ‘నా వంశ ప్రతిష్ఠ నిలుపుకోవడానికి దుష్ట రావణుని చెరనుండి నిన్ను విడిపించాను. ఇంతకాలం పరుడి పంచన . ఉన్నందువల్ల నీ ప్రవర్తన గురించి నాకు సందేహముంది. కనుక నువ్వు నీ ఇష్టం వచ్చిన చోటికి వెళ్లవచ్చు’నని శ్రీరాముడు అన్నాడు.
ఈ) శ్రీరామునికి విశ్వాసం కలిగించడానికి ‘అగ్నిప్రవేశం’ ఒక్కటే శరణ్యమని భావించింది.
ఆ) అగ్నిదేవుడు స్వయంగా సీతాదేవిని తీసుకువచ్చి ఆమె గొప్పదనాన్ని వెల్లడించాడు.
అ) ఆమె శీలం యొక్క గొప్పదనాన్ని ముల్లోకాలకు చాటడానికే అగ్నిప్రవేశం చేస్తున్నా ఊరుకున్నానన్నాడు.

5. అ) అంగరంగ వైభవంగా శ్రీరామపట్టాభిషేక మహోత్సవం జరిగింది.
ఆ) పరమశివుడు శ్రీరాముణ్ణి ప్రశంసించాడు.
ఇ) పుష్పక విమానంలో నందిగ్రామం చేరుకున్న సీతారామలక్ష్మణులకు భరతుడు, ప్రముఖులు ఘనంగా స్వాగతం పలికారు.
ఈ) శ్రీరాముడి కోరిక మేరకు ఇంద్రుడు మృతులైపడి ఉన్న వానరులను మళ్లీ బతికించాడు.
జవాబులు
ఆ) పరమశివుడు శ్రీరాముణ్ణి ప్రశంసించాడు.
ఈ) శ్రీరాముడి కోరిక మేరకు ఇంద్రుడు మృతులైపడి ఉన్న వానరులను మళ్లీ బతికించాడు.
ఇ) పుష్పక విమానంలో నందిగ్రామం చేరుకున్న సీతారామలక్ష్మణులకు భరతుడు, ప్రముఖులు ఘనంగా స్వాగతం పలికారు.
అ) అంగరంగ వైభవంగా శ్రీరామపట్టాభిషేక మహోత్సవం జరిగింది.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 6 యుద్ధకాండ

6. అ) రావణుడు ప్రయోగించిన శక్తి అనే ఆయుధం లక్ష్మణుడి గుండెలో నాటుకుంది.
ఆ) అంగదుని చేతిలో రావణుని కుమారుడు ఇంద్రజిత్తు ఓడిపోయాడు.
ఇ) సముద్రుడిని ప్రార్థించడం వల్ల అది సాధ్యపడదన్నాడు విభీషణుడు.
ఈ) రావణుడి బాణ శక్తికి సుగ్రీవుడు మూర్ఛపోయాడు.
జవాబులు
ఇ) సముద్రుడిని ప్రార్థించడం వల్ల అది సాధ్యపడదన్నాడు విభీషణుడు.
ఆ) అంగదుని చేతిలో రావణుని కుమారుడు ఇంద్రజిత్తు ఓడిపోయాడు.
ఈ) రావణుడి బాణ శక్తికి సుగ్రీవుడు మూర్చపోయాడు.
అ) రావణుడు ప్రయోగించిన శక్తి అనే ఆయుధం లక్ష్మణుడి గుండెలో నాటుకుంది.

7. అ) యజ్ఞయాగాది క్రతువులను శ్రీరాముడు నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నాడు.
ఆ) విభీషణుడు రావణునికి ఉత్తర క్రియలను నిర్వర్తించాడు.
ఇ) అతికాయుడు లక్ష్మణుని బ్రహ్మాస్తానికి బలైనాడు.
ఈ) విభీషణుని లంకారాజుగా లక్ష్మణుడు పట్టాభిషిక్తుణ్ణి చేశాడు.
జవాబులు
ఇ) అతికాయుడు లక్ష్మణుని బ్రహ్మాస్త్రానికి బలైనాడు.
ఆ) విభీషణుడు రావణునికి ఉత్తర క్రియలను నిర్వర్తించాడు.
ఈ) విభీషణుని లంకారాజుగా లక్ష్మణుడు పట్టాభిషిక్తుణ్ణి చేశాడు.
అ) యజ్ఞయాగాది క్రతువులను శ్రీరాముడు నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నాడు.

8. అ) కుంభకర్ణుడు యుద్ధంలో వానరులను చావుదెబ్బ తీస్తున్నాడు.
ఆ) శ్రీరామచంద్రాదులు వానర సైన్యంతో సువేల పర్వతానికి చేరుకున్నారు.
ఇ) రావణుని వద్దకు అంగదుడిని రాయబారిగా పంపాడు రాముడు.
ఈ) శ్రీరాముడు యుద్ధనీతిని అనుసరించి సైన్యాన్ని వివిధ భాగాలుగా విభజించాడు.
జవాబులు
ఈ) శ్రీరాముడు యుద్ధనీతిని అనుసరించి సైన్యాన్ని వివిధ భాగాలుగా విభజించాడు.
ఆ) శ్రీరామచంద్రాదులు వానర సైన్యంతో సువేల పర్వతానికి చేరుకున్నారు.
ఇ) రావణుని వద్దకు అంగదుడిని రాయబారిగా పంపాడు రాముడు.
అ) కుంభకర్ణుడు యుద్ధంలో వానరులను చావుదెబ్బ తీస్తున్నాడు.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 6 యుద్ధకాండ

9. అ) శ్రీరాముడు సముద్రతీరంలో దర్భాసనం మీద కూర్చొని సముద్రుడిని ఉపాసించాడు.
ఆ) సుషేణుని చేతిలో విద్యున్మాలి మరణించాడు.
ఇ) వందయోజనాల పొడవు పది యోజనాల వెడల్పు గల సేతువును కట్టడం ఐదురోజుల్లో పూర్తి అయింది.
ఈ) ఉత్సాహం ఉరకలు వేస్తుంటే అందరు సముద్రతీరాన్ని చేరుకున్నారు.
జవాబులు
ఈ) ఉత్సాహం ఉరకలు వేస్తుంటే అందరు సముద్రతీరాన్ని చేరుకున్నారు.
అ) శ్రీరాముడు సముద్రతీరంలో దర్భాసనం మీద కూర్చొని సముద్రుడిని ఉపాసించాడు.
ఇ) వందయోజనాల పొడవు పది యోజనాల వెడల్పు గల సేతువును కట్టడం ఐదురోజుల్లో పూర్తి అయింది.
ఆ) సుషేణుని చేతిలో విద్యున్మాలి మరణించాడు.

10. అ) పుష్పక విమానంలో సీతా రామలక్ష్మణులు నందిగ్రామం చేరుకున్నారు.
ఆ) అగ్నిదేవుడు స్వయంగా సీతను తీసుకొని వచ్చి ఆమె గొప్పతనాన్ని కొనియాడాడు.
ఇ) శ్రీరాముడు హనుమంతుని సాహసాన్ని ప్రశంసించాడు.
ఈ) లంకలో రావణుడు మంత్రులతో సమావేశమయ్యాడు.
జవాబులు
ఇ) శ్రీరాముడు హనుమంతుని సాహసాన్ని ప్రశంసించాడు.
ఈ) లంకలో రావణుడు మంత్రులతో సమావేశమయ్యాడు.
ఆ) అగ్నిదేవుడు స్వయంగా సీతను తీసుకొనివచ్చి ఆమె గొప్పతనాన్ని కొనియాడాడు.
అ) పుష్పక విమానంలో సీతా రామలక్ష్మణులు నందిగ్రామం చేరుకున్నారు.

పాత్ర స్వభావాలు

1. రావణుడు :
కైకసీ విశ్రవసుల కుమారుడు. లంకా నగరానికి అధిపతి. వేదాధ్యాయనం చేసినవాడు. శివభక్తుడు. కోపం ఎక్కువ. మూర్ఖత్వం ఎక్కువ. మంచి చెబితే వినడు. చెప్పిన వారిపై కక్ష కడతాడు. సీతాపహరణ చేశాడు. స్త్రీ వ్యా మోహం ఎక్కువ. శ్రీరాముని ఆగ్రహానికి గురి అయ్యాడు. తన వంశ నాశనానికి కారకుడయ్యాడు.

2. విభీషణుడు :
రావణుని తమ్ముడు. రావణుడు పరాయి స్త్రీలను తీసుకుని వచ్చినపుడు అది తప్పని చెప్పేవాడు. సీతాదేవిని అపహరించడం తప్పని చెప్పిన ధర్మాత్ముడు. అనేక ధర్మసూక్ష్మాలు తెలిసినవాడు. రావణునిచేత అనేక అవమానాలు పడ్డాడు. ధర్మ రక్షణకోసం శ్రీరాముని పక్షంలో చేరాడు. రాక్షస నాశనానికి కారకుడయ్యాడు. రావణ సంహారం తర్వాత లంకా నగరానికి రాజయ్యాడు.

3. ఇంద్రజిత్తు :
రావణుని పెద్ద కుమారుడు. ఇతని అసలు పేరు మేఘనాథుడు. ఇంద్రుని ఓడించడం వల్ల ఇంద్రజిత్తు అని పేరు వచ్చింది.

రావణుడు తన తమ్ముడైన కుంభకర్ణుణ్ణి, కొడుకైన అతికేయుని పోగొట్టుకొని తల్లడిల్లుతుంటే ఇంద్రజిత్తు ఆయనను ఓదార్చాడు. తాను యుద్ధ రంగానికి వచ్చి రామలక్ష్మణుల మీద బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. వాళ్ళు స్పృహ కోల్పోయినట్లు నటిస్తే మరణించారని భావించి ఆ వార్తను తన తండ్రికి తెలియచేశాడు. శత్రుపక్షాన్ని మానసికంగా దెబ్బతీయాలనే ఆలోచన కలవాడు ఇంద్రజిత్తు. అందుకే మాయ సీతను సృష్టించి ఆమెను సంహరించాడు. చివరికి లక్ష్మణుని చేతిలో ఇంద్రజిత్తు మరణించాడు.

సంఘటన ద్వారా గ్రహించుట

ప్రశ్న 1.
“ఏ దేశంలోనైనా భార్య దొరకవచ్చు, బంధువులు దొరకవచ్చు, కాని లక్ష్మణుని వంటి తమ్ముడు దొరకడు.” అన్న శ్రీరాముని మాటలను బట్టి మీరేం గ్రహించారు?
జవాబు:
రావణుడు ప్రయోగించిన “శక్తి” అనే ఆయుధం కారణంగా నేలకూలిన లక్ష్మణుడిని చూసి విలవిలలాడిపోతూ శ్రీరాముడు అన్న మాటలివి.

ఈ మాటలు రామలక్ష్మణులకు గల అనుబంధాన్ని సోదరప్రేమను చాటుతున్నాయి. అన్నకోసం అన్ని సుఖాలు . వదులుకొని అడవులకు వచ్చినవాడు లక్ష్మణుడు. అతడు లేనిచో తాను జీవించలేనని భావించినందున రాముడు ఈ మాటలు అన్నాడు. ఇవి రాముడికి లక్ష్మణునిపై గల ప్రేమాభిమానాలను సూచిస్తున్నాయి. శ్రీరామునికి లక్ష్మణుడు తలలోని నాలుకలాంటివాడని, ఆరోప్రాణమని ఈ మాటల ద్వారా నేను గ్రహించాను. లక్ష్మణుడి వంటి సోదరుడు ఎవరికీ దొరకడని గ్రహించాను.

ప్రశ్న 2.
“వ్యక్తులు జీవించి వున్నంత వరకే వైరముండాలి. తరువాత దానిని వదలి వేయాలి” అని విభీషణుడితో శ్రీరాముడు పలికిన మాటలను బట్టి మీరేం గ్రహించారు?
జవాబు:
1. వ్యక్తులు జీవించి ఉన్నంత వరకే వైరముండాలి, తరువాత దానిని వదిలివేయాలి అని విభీషణునితో శ్రీరాముడు పలికిన మాటలను బట్టి రాముడు గొప్ప వ్యక్తిత్వం కలవాడని నేను గ్రహించాను.
2. ఏ వ్యక్తి అయినా మరణించిన తర్వాత అతనితో పూర్వము ఉన్న వైరము మరచిపోవాలని, మరణముతోనే వైరము పోవాలని గ్రహించాను.
3. రావణుని మరణానంతరము శ్రీరాముడు విభీషణునితో “రావణుడు నీకు ఎటువంటి వాడో నాకు కూడా అటువంటివాడే” అని చెప్పి తన విశాల హృదయాన్ని చాటుకొన్నాడని గ్రహించాను.
4. రాముడు దుష్టశిక్షణ, శిష్టరక్షణ, మరణించిన శత్రువు పట్ల గౌరవ భావం కలవాడని గ్రహించాను.

ప్రశ్న 3.
“నీవు యుద్ధంలో అలసిపోయావు. సేద దీర్చుకొనిరా” అని రాముడు రావణాసురునితో చెప్పిన మాటలను బట్టి, మీరు ఏమి గ్రహించారు?
జవాబు:
రామరావణుల యుద్ధం మహాఘోరంగా సాగుతోంది. శ్రీరాముని పరాక్రమం ముందు రావణుని ధనుస్సు ముక్కలయ్యింది. రావణుని కిరీటం నేలపై పడింది. అప్పుడు కావాలంటే రాముడు రావణుని సంహరింపవచ్చు. కాని ధర్మాత్ముడయిన, కరుణా సముద్రుడయిన రాముడు రావణుడు తనకు శత్రువయినా అతనిపై దయతలచాడు. రావణునితో రాముడు “నీవు యుద్ధంలో అలసిపోయావు, విశ్రాంతి తీసుకొని మరునాడు యుద్దానికి రా” అని చెప్పి రావణుని దయతలచి విడిచిపెట్టాడు.

దీనిని బట్టి రాముడు శత్రువుపట్ల కూడా దయచూపే కరుణాంతరంగుడని గ్రహించాను. ధనుస్సు చేతపట్టిన ఆయుధం చేతిలో ఉన్న వీరునితోనే రాముడు యుద్ధం చేసేవాడని, రాముడు మహావీరుడని గ్రహించాను.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 6 యుద్ధకాండ

ప్రశ్న 4.
“వానరా! భళా, నాకు శత్రువువే అయినా, నీ శక్తిని మెచ్చుకుంటున్నాను” అని రావణుడు హనుమంతునితో అన్న – మాటలను బట్టి, మీరేమి గ్రహించారో తెల్పండి.
జవాబు:
యుద్ధంలో హనుమంతుడిని రావణుడు తన అరచేతితో చరచాడు. హనుమంతుడు తిరిగి కోపంతో రావణుడిని తన అరచేతితో ఒక్క దెబ్బ వేశాడు. ఆ దెబ్బకు రావణుడు కంపించి పోయి, హనుమంతుడి దెబ్బ వేశాడు. ఆ దెబ్బకు రావణుడు కంపించి పోయి, హనుమంతుడి బలపరాక్రమాలనూ, శక్తినీ, మెచ్చుకుంటూ పై విధంగా మాట్లాడాడు.

ఈ రావణుని మాటలను బట్టి, హనుమంతుడు మహాబలశాలి, ధైర్యశాలి, శక్తివంతుడు అనీ, రావణుడంతటి వీరునిచే ప్రశంసలు పొందిన గొప్ప బలపరాక్రమ సంపన్నుడనీ, నేను గ్రహించాను. శత్రువుచే మెచ్చుకోబడిన హనుమంతుడే నిజమైన వీరుడని నేను అభిప్రాయపడ్డాను.

ప్రశ్న 5.
“సీతను శ్రీరామునికి అప్పగించడమే, అన్ని విధాలా మంచిది. అనవసరంగా కలహం తెచ్చుకోవడం దేనికి? శ్రీరాముని పంటి మహావీరునితో యుద్ధం తగదు” అని విభీషణుడు అన్న రావణునకు చెప్పిన మాటలను బట్టి, మీరేమి గ్రహించారు?
జవాబు:
విభీషణుడు రావణాసురునికి తమ్ముడయినా, రాక్షసుడయినా, అతడు ధర్మాత్ముడనీ, విభీషణునికి రావణుడు చేసిన సీతాపహరణం ఇష్టం లేదనీ, సీతమ్మను రామునికి తిరిగి అప్పగించడం శ్రేయస్కరమని విభీషణుడు భావించాడనీ గ్రహించాను. శ్రీరాముడు మహావీరుడని గ్రహించాను. పరస్త్రీహరణం పాపకార్యం అనీ, అది ఎంత బలవంతునికైనా చేటు తెస్తుందనీ గ్రహించాను. విభీషణుడు రాక్షస జాతిలో పుట్టిన రత్నమాణిక్యం వంటివాడని, బుద్ధిమంతుడనీ గ్రహించాను. విభీషణుడు ధైర్యవంతుడనీ, అందుకే అన్నకు ఇష్టం లేకపోయినా, అన్నకు హితమైన మాటను ధైర్యం చేసి చెప్పాడనీ గ్రహించాను.

ప్రశ్న 6.
“సీతను అప్పగించకపోతే శ్రీరాముని చేతిలో మరణం తథ్యం” అని అంగదుడు పలికిన తీరును బట్టి మీరేమి గ్రహించారు?
జవాబు:
శ్రీరాముడు వానర సైన్యంతో కలిసి లంకను చేరాడు. అంగదుడిని రావణుని వద్దకు రాయబారిగా పంపించాడు. అంగదుడు రావణుని సమీపించి హితోపదేశం చేశాడు. సీతను శ్రీరామునికి అప్పగించకపోతే మరణం తప్పదని రావణుని హెచ్చరించాడు.

అంగదుని మాటల వల్ల శ్రీరాముడి పరాక్రమం, ధైర్యం, సాహసం అసమానమైనదని గ్రహించాను. అంగదుడిని రాయబారిగా రాముడు పంపించడం వల్ల శ్రీరాముడు రాజనీతిజ్ఞుడని గ్రహించాడు. శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకోవాలనే ఆలోచన శ్రీరామునికి ఉందని గ్రహించాను. అంతేగాదు శ్రీరాముని యుద్ధనీతిని కూడా గ్రహించాను.

ప్రశ్న 7.
యుద్ధరంగంలో అగస్త్యుడు శ్రీరామునికి ఆదిత్య హృదయాన్ని బోధించడం ద్వారా మీరేమి గ్రహించారు?
జవాబు:
రామరావణ యుద్ధం భీకరంగా సాగుతున్నది. ఆ సమయంలో అగస్త్యుడు శ్రీరాముడిని సమీపించాడు. ఆ మహర్షి శ్రీరామునికి ఆదిత్య హృదయాన్ని బోధించాడు. రామునిలో విజయకాంక్షను పెంచాడు. చక్కని విజయాన్ని అందించాడు. అగస్త్యుడు చేసిన ఉపదేశం ద్వారా ఆదిత్య హృదయం సర్వ విజయప్రదమని, శత్రువులను జయించు సామర్థ్యాన్ని అందించగలదని, యుద్ధరంగంలో శక్తిని సమకూర్చగలదని గ్రహించాను. ఆదిత్య హృదయాన్ని చదివితే ఆరోగ్యం కూడా కలుగుతుందని, అందువల్లనే శ్రీరాముడు రావణుని జయించగలిగాడని గ్రహించాను.

విషయాత్మక ప్రశ్నలు

ఈ క్రింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
సముద్రానికి వారధిని ఎవరు కట్టారు? ఎలా?
జవాబు:
విశ్వకర్మ కుమారుడు నలుడు. శిల్పకళా నిపుణుడు. ఉత్సాహవంతుడు. శక్తియుక్తులున్నవాడు. సేతువును భరిస్తానని శ్రీరామునకు సముద్రుడు మాట ఇచ్చాడు. నలుడు నిర్మిస్తానన్నాడు. వానరుల సహకారంతో నలుడి సూచనలననుసరించి సేతువు నిర్మాణం 5 రోజులలో పూర్తయింది. అది వంద యోజనాల పొడవు. పది యోజనాల వెడల్పు కలది.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 6 యుద్ధకాండ

ప్రశ్న 2.
రావణ మరణాన్ని వర్ణించండి.
జవాబు:
ఇంద్రుడు పంపిన రథాన్ని శ్రీరాముడు అధిరోహించాడు. రాముడు యుద్ధ నైపుణ్యం ముందు రావణుడు ఆగలేకపోతున్నాడు. అగస్త్యుడు రామునికి ‘ఆదిత్య హృదయం’ ఉపదేశించాడు. రామబాణ ధాటికి రావణ శిరస్సులు నేలరాలుతున్నాయి. మళ్ళీ మొలుస్తున్నాయి. మాతలి సూచనతో బ్రహ్మాస్త్రం ప్రయోగించాడు శ్రీరాముడు. రావణుడు అంతమయ్యాడు.

ప్రశ్న 3.
శ్రీరామ పట్టాభిషేకాన్ని వివరించండి.
జవాబు:
రావణ మరణానంతరం శ్రీరామ విజయం సీతకు హనుమ చెప్పాడు. అగ్ని ప్రవేశానంతరం సీతాదేవి శ్రీరాముని చేరింది. పుష్పక విమానంలో అయోధ్యకు చేరారు. పౌరులు ఘనస్వాగతం పలికారు. గురువులకు, పెద్దలకు నమస్కరించారు. శ్రీరామ పట్టాభిషేకం అంగరంగ వైభవంగా జరిగింది. భరతుణ్ణి యువరాజుగా పట్టాభిషిక్తుడిని చేశాడు. రామరాజ్యం ఏర్పడింది. ప్రజలకు శ్రీరామరక్ష కలిగింది.

ప్రశ్న 4.
శ్రీరాముడు శరణుకోరిన విభీషణుని ఆదరించిన విధానాన్ని వివరించండి.
జవాబు:
శ్రీరాముడు శరణుకోరిన విభీషణునితో “నేను రావణుణ్ణి బంధుమిత్ర సమేతంగా హతమారుస్తాను. నిన్ను రాజును చేస్తా” నని తమ్ముల మీద ఒట్టేసి చెప్పాడు. ఈ పనిలో తాను యథాశక్తి సహాయపడగలనని విభీషణుడు మాట ఇచ్చాడు. రాముడు విభీషణుణ్ణి ఆలింగనం చేసుకున్నాడు. రాముని ఆజ్ఞపై లక్ష్మణుడు సముద్రజలం తెచ్చి లంకారాజుగా విభీషణుణ్ణి పట్టాభిషిక్తుణ్ణి చేయటం జరిగింది. అందరూ ఆనందాన్ని ప్రకటించారు.

వ్యాసరూప ప్రశ్నలు

ఈ క్రింది ప్రశ్నలకు 10 లేక 12 వాక్యాల్లో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
శ్రీరాముడు సముద్రునిపై అస్త్ర ప్రయోగానికి సిద్ధపడటానికి కారణం ఏమిటి? దాని పర్యవసానమేమిటి?
జవాబు:
లంకకు వెళ్ళాలంటే రాముడు సముద్రం దాటాలి. సముద్రాన్ని దాటే ఉపాయం ఏమిటని సుగ్రీవుడిని రాముడు అడిగాడు. సముద్రుడిని ప్రార్థించమని విభీషణుడు సలహా చెప్పాడు. శ్రీరాముడు సముద్రతీరంలో దర్భాసనం మీద కూర్చుని సముద్రుడిని ప్రార్థించాడు. మూడు రాత్రులు గడచినా సముద్రుడు ఎదుట కనబడలేదు.

కోపముతో శ్రీరాముడి కళ్ళు ఎరుపు ఎక్కాయి. సముద్రుడి అహంకారాన్ని పోగొట్టాలనీ, సముద్రంలో నీటిని ఇంకిపోయేటట్లు చేయాలనీ రాముడు అనుకున్నాడు. అప్పుడు శ్రీరాముడు బ్రహ్మాస్తమును స్మరించాడు.

దానితో ప్రకృతి అంతా అల్లకల్లోలమయ్యింది. సముద్రుడు భయపడి పారిపోతున్నాడు. పరుగెత్తేవాడిపై బాణం ప్రయోగించరాదని, శ్రీరాముడు ఆగాడు. సముద్రుడు దారికి వచ్చాడు. లంకకు వెళ్ళడానికి తాను దారి ఇస్తానన్నాడు.

ఎక్కుపెట్టిన బాణం వృథాకారాదని, రాముడు సముద్రుడి మాటపై పాపాత్ములు ఉండే ద్రుమకుల్యంపై దాన్ని ప్రయోగించాడు. సేతువు నిర్మించడానికి నలుడు సమర్థుడనీ, సేతువును తాను భరిస్తాననీ, సముద్రుడు రామునికి చెప్పాడు. సేతు నిర్మాణం జరిగింది.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 6 యుద్ధకాండ

ప్రశ్న 2.
అంగద రాయబారాన్ని వివరించండి.
జవాబు:
అంగదుడు వాలి కుమారుడు. మహాశక్తిమంతుడు. రావణుడితో యుద్ధానికి దిగేముందు, రాముడు రావణుని దగ్గరకు అంగదుని రాయబారిగా పంపాడు. అంగదుడు రావణుడి దగ్గరకు వెళ్ళి, సీతను రామునికి అప్పగించకపోతే, శ్రీరాముడి చేతిలో రావణుడి మరణం తథ్యమనీ, లంకకు విభీషణుడు రాజు కాగలడనీ, రావణుడిని హెచ్చరించాడు.

దానితో రావణుని సభ అంతా అట్టుడికిపోయింది. నలుగురు రాక్షసులు అంగదుడి మీద విరుచుకుపడ్డారు. అంగదుడు ఆ రాక్షసులను తన చంకలో ఇరికించుకొని, మేడపైకి ఎగిరాడు. అంగదుడు మేడపై నుండి ఆ రాక్షసులను నేలపైకి విసిరాడు.

తరువాత అంగదుడు సింహనాదం చేసి, ఆకాశమార్గంలో శ్రీరాముడిని చేరాడు. ఈ విధంగా శ్రీరాముడు రావణుని భావాన్ని గ్రహించాడు. ఇక రావణుడితో యుద్ధం చేయక తప్పదని రాముడు నిశ్చయించాడు.

ప్రశ్న 3.
రావణుని శక్తి ఆయుధ ప్రయోగం వలన కలిగిన పరిణామాలను వివరించండి.
జవాబు:
రావణుడు తనతో యుద్ధం చేస్తున్న లక్ష్మణుడి పై ‘శక్తి’ అనే ఆయుధాన్ని ప్రయోగించాడు. ఆ శక్తి ఆయుధం, లక్ష్మణుడి హృదయంలో గుచ్చుకుంది. దానితో లక్ష్మణుడు స్పృహ తప్పాడు. రావణుడు లక్ష్మణుడిని ఎత్తుకొని వెళ్ళాలని అనేక విధాల ప్రయత్నించాడు. కాని రావణుడు లక్ష్మణుడిని పైకి ఎత్తలేకపోయాడు.

అప్పుడు ఆంజనేయుడు రావణుడి మీద దాడి చేశాడు. హనుమంతుడు రావణుడి వక్షఃస్థలం మీద తన పిడికిలితో గట్టిగా గుద్దాడు. దానితో రావణుడు కూలిపోయాడు. హనుమంతుడు లక్ష్మణుడిని శ్రీరాముడి వద్దకు చేర్చాడు. శ్రీరాముడు హనుమంతుడి భుజాలపై కూర్చుండి, రావణునితో యుద్ధం చేశాడు. రాముడి పరాక్రమం ముందు, రావణుడి ధనుస్సు ముక్కలయ్యింది. రావణుని కిరీటం నేలకూలింది.

శ్రీరాముడు రావణునిపై దయతలచి “రావణా ! నీవు యుద్ధంలో అలసిపోయావు.. విశ్రాంతి తీసుకొనిరా” అని చెప్పాడు. రావణుడు యుద్ధం నుండి తిరుగుముఖం పట్టాడు.

ప్రశ్న 4.
రామరావణ సంగ్రామాన్ని వివరించండి.
జవాబు:
రాముడు హనుమంతుడి భుజాలపై కూర్చుండి, రావణునితో యుద్ధం చేశాడు. రాముని పరాక్రమంతో రావణుని ధనుస్సు ముక్కలయ్యింది. రావణుడి కిరీటం నేలకూలింది. రాముడు రావణునిపై దయతలచి అప్పటికి విడిచి పెట్టాడు.

తరువాత రామలక్ష్మణులతో రావణుడు భయంకరంగా యుద్ధం చేశాడు. రావణుడు శక్తి అనే ఆయుధాన్ని లక్ష్మణుడిపై వేశాడు. రాముడు శక్తిని వేడుకున్నాడు. శక్తి తన ప్రాణశక్తిని కోల్పోయింది. శక్తి లక్ష్మణుడికి తగిలింది. రాముడు శక్తిని విరిచివేశాడు. రాముడు విజృంభించాడు. దానితో రావణుడు పరుగుపెట్టాడు.

హనుమ తెచ్చిన ఓషధీ ప్రభావంతో లక్ష్మణుడు లేచాడు. ఇంద్రుడు తన సారధి మాతలిని, తన దివ్యరథాన్ని, రాముని కోసం పంపాడు. రాముడు ఇంద్ర రథం ఎక్కి రావణుడితో యుద్ధం చేశాడు. రామరావణులు సమానంగా పోరాడారు.

రాముడు విజృంభించడంతో, రావణుడి రథసారధి రావణుని రథాన్ని ప్రక్కకు మరలించాడు. రావణుడు తన సారధిని మందలించాడు. తిరిగి రావణ రథం, రాముని ముందు నిలిచింది. అగస్త్య మహర్షి దేవతలతో వచ్చి, రామునికి ఆదిత్యహృదయ మంత్రం ఉపదేశించాడు.

రాముని బాణానికి రావణుడి తలలు నేలపై రాలి తిరిగి మొలుస్తున్నాయి. అప్పుడు మాతలి రావణునికై బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించమని రామునికి చెప్పాడు. రాముని బ్రహ్మాస్త్రంతో, రావణ సంహారం జరిగింది.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 6 యుద్ధకాండ

ప్రశ్న 5.
శ్రీరాముడు సైన్యంతో లంకానగరాన్ని చేరిన వృత్తాంతాన్ని తెలపండి.
జవాబు:
సీతాదేవిని చూసి వచ్చి కుశల వార్తను అందించిన హనుమను శ్రీరాముడు ఆలింగనం చేసికొన్నాడు. మహోపకారం చేసిన హనుమకు తాను ఇయ్యగల సత్కారం అదే అన్నాడు. రాముడికి దుఃఖం వచ్చింది. సుగ్రీవుడు రాముడిని ఓదార్చాడు. క్రోధం చూపించాలి అని రామునికి సుగ్రీవుడు సలహా ఇచ్చాడు. సముద్రానికి సేతువు కడితేకాని, లంకను జయించలేము అన్నాడు. హనుమ లంకానగర రక్షణ వ్యవస్థను గూర్చి తెలిపాడు.

విజయ ముహూర్తంలో లంకకు బయలుదేరాలని రాముడు అన్నాడు. నీలుడు సైన్యానికి మార్గం చూపించాలని, రాముడు హనుమంతుని భుజం మీద, లక్ష్మణుడు అంగదుని భుజం మీద కూర్చొని వెళ్ళాలని, సుగ్రీవుడు పల్లకిపై రావాలని, రాముడు నిర్ణయించాడు. అందరూ సముద్రతీరాన్ని చేరుకున్నారు.

విభీషణుడు ధర్మం విడిచిన రావణుని విడిచి పెట్టి, తన నలుగురు అనుచరులతో రామలక్ష్మణులు ఉన్న చోటికు చేరాడు. విభీషణుడు రాముని శరణు కోరగా, రాముడు అంగీకరించాడు. రాముడు రావణుని చంపి విభీషణుణ్ణి రాజును చేస్తానని ప్రమాణం చేశాడు. ఆ పనిలో రామునికి తాను సహాయం చేస్తానని విభీషణుడన్నాడు. రాముడు విభీషణుణ్ణి లంకకు పట్టాభిషిక్తుణ్ణి చేయమని లక్ష్మణుడికి చెప్పాడు. లక్ష్మణుడు ఆ పని చేశాడు. సముద్రుణ్ణి ప్రార్థిస్తే సముద్రాన్ని దాటగలవని విభీషణుడు రామునికు చెప్పాడు. శ్రీరాముడు సముద్రుణ్ణి ఉపాసించాడు. మూడు రోజులు అయినా, సముద్రుడు ప్రసన్నుడు కాలేదు. రాముడు బ్రహ్మాస్త్రాన్ని స్మరించాడు. సముద్రుడు పరుగుపెట్టాడు. లంకకు వెళ్ళడానికి దారి ఇస్తానని సముద్రుడు చెప్పాడు. రాముడు ఎక్కుపెట్టి అస్త్రం వ్యర్థం కాకుండా, పాపాత్ములు ఉండే “ద్రుమకుల్యం” పై ప్రయోగించాడు. నలుడు సేతువు నిర్మించడానికి తగినవాడని సముద్రుడు చెప్పాడు. సేతువును భరిస్తానని సముద్రుడు మాట ఇచ్చాడు.

రాముడు సేతువు నిర్మాణానికి శ్రీకారం చుట్టాడు. వానరులు వృక్షాలు తెచ్చి సముద్రంలో పడవేశారు. 100 యోజనాల పొడవు, 10 యోజనాల వెడల్పు గల సేతువు 5 రోజుల్లో కట్టబడింది. రామలక్ష్మణ సుగ్రీవులు ముందు నడుస్తున్నారు. సైన్యం వారి వెంట నడిచింది. వానరులు కొందరు సముద్రంలో దూకి ఈదుతూ వచ్చారు.

ఈ విధంగా శ్రీరాముడు, సుగ్రీవుడు మొదలయిన వానర నాయకులతో లంకా నగరానికి చేరాడు.

ప్రశ్న 6.
వానర సైన్యానికీ, రాక్షసులకు మధ్య జరిగిన యుద్ధం వివరాలను తెలపండి.
జవాబు:
రాముడు సైన్యాన్ని విభాగించి, ఎవరి బాధ్యతలు వారికి అప్పగించాడు. రావణుని మంత్రులైన శుకసారణులు రాముని బలం తెలిసికోడానికి గూఢచారులుగా వచ్చి వానరులలో చేరారు. విభీషణుడు వారిని గుర్తించి, రాముని ముందు పెట్టాడు. రాముడు వారిని క్షమించి, సీతను అప్పగించకపోతే రావణుడి మరణం తప్పదని హెచ్చరించాడు. శుకసారణులు రావణునికి ఆ విషయం తెలిపారు.

రావణుడు అశోకవనం వెళ్ళి రాముడు తన చేతిలో మరణించాడని సీతకు అబద్దం చెప్పాడు. విద్యుజిహ్వుడిచే రామునివి అనిపించే మాయా శిరస్సునూ, ధనుర్భాణాలనూ తెప్పించి, సీతకు చూపించాడు. సీతను తన్ను ఆశ్రయించమని కోరాడు. సీత విచారించింది. విభీషణుడి భార్య “సరమ” సీతను ఊరడించి రాముడు క్షేమంగా ఉన్నాడనీ, అదంతా రాక్షసమాయ అనీ సీతకు తెలిపింది.

శ్రీరామ చంద్రాదులు సువేల పర్వతానికి చేరారు. లంకానగర శోభను చూశారు. రావణుడు ఠీవిగా మేడపై ఉన్నాడు. సుగ్రీవుడు రావణునిపై కోపంతో ఎగిరి రావణ భవనంపై వాలాడు. తన నుండి రావణుడు తప్పించుకోలేడని, రావణుడి కిరీటాన్ని తీసి నేలపై కొట్టాడు. రావణుడు రెచ్చిపోయాడు. ఇద్దరికీ బాహాబాహీ యుద్ధం జరిగింది. సుగ్రీవుడు రావణుడిని ముప్పుతిప్పలు పెట్టి, తిరిగి సువేల పర్వతం చేరాడు. శ్రీరాముడు సుగ్రీవుణ్ణి మందలించాడు.

అంగదుడిని రాముడు రావణుడి దగ్గరకు రాయబారిగా పంపాడు. రాముడి చేతిలో రావణుడు మరణిస్తాడని, విభీషణుడు రాజు అవుతాడని రాముని వాక్యంగా, అంగదుడు రావణునికి తెలిపాడు. అంగదుడిని నలుగురు రాక్షసులు చంపబోయారు. అంగదుడు వారిని చంపి వచ్చాడు. రాముడు యుద్ధానికి సిద్ధం అయ్యాడు.

లంకపై దండయాత్ర :
వానరసైన్యం లంకను నాల్గువైపుల నుండి ముట్టడించింది. ఆంజనేయుడి చేతిలో జంబుమాలి, సుషేణుడి చేతిలో విద్యున్మాలి మరణించారు. అంగదుడి చేతిలో ఇంద్రజిత్తు ఓడిపోయాడు. దానితో ఇంద్రజిత్తు కపట యుద్దానికి దిగాడు. ఇంద్రజిత్తు నాగాస్త్రంతో రామలక్ష్మణులను బంధించాడు. రామలక్ష్మణులు మరణించారని ఇంద్రజిత్తు రావణుడితో చెప్పాడు. రావణుడు ఆజ్ఞాపించగా “త్రిజట మొదలయిన రాక్షస స్త్రీలు సీతను పుష్పక విమానంలో యుద్ధభూమికి తీసుకువచ్చి, నేలపై ఉన్న రామలక్ష్మణులను చూపించారు. సీత ఏడ్చింది. త్రిజట సీతను ఓదార్చింది. రామలక్షణులు బతికి ఉన్నారని ఆమె సీతకు ఆధారాలు చూపింది. సీత మనస్సు కుదుట పడింది.

గరుత్మంతుడి రాకతో నాగాస్త్ర ప్రభావం నుండి రామలక్ష్మణులు విముక్తి పొందారు. హనుమంతుడు అకంపనుణ్ణి, ధూమ్రాక్షుణ్ణి చంపాడు. అంగదుడు వజ్రదంష్ట్రుడిని, నీలుడు ప్రహస్తుడిని చంపాడు. రావణుడి చేతిలో సుగ్రీవుడు మూర్ఛపోయాడు. లక్ష్మణుడు రావణుడిని ఎదిరించాడు. రావణుడు బాణవర్షం కురిపించాడు. హనుమ అడ్డుకున్నాడు. రావణుడి అరచేతి దెబ్బకు హనుమ చలించి, తిరిగి తేరుకొని, రావణుడిని అరచేతితో కొట్టాడు. దశగ్రీవుడు కంపించిపోయి, ‘భళా! వానరా’ అని హనుమశక్తిని మెచ్చుకున్నాడు.

రావణుడు ‘శక్తి’ అనే ఆయుధాన్ని లక్ష్మణుడి పై వేశాడు. లక్ష్మణుడు స్పృహ కోల్పోయాడు. రావణుడు లక్ష్మణుడిని ఎత్తుకొని పోవడానికి విఫలయత్నం చేశాడు. ఆంజనేయుడు పిడికిలితో పొడిచి రావణుడిని కూలగొట్టి, లక్ష్మణుడిని రాముని దగ్గరకు చేర్చాడు. శ్రీరాముడు హనుమంతుని భుజాలపై కూర్చుండి రావణునితో యుద్ధం చేశాడు. రావణుని కిరీటం, ధనుస్సు నేలపై పడ్డాయి. రాముడు కరుణించి, అలసిపోయిన రావణుడిని విశ్రాంతి తీసుకొని తిరిగి యుద్ధానికి రమ్మన్నాడు.

ప్రశ్న 7.
రామరావణ యుద్ధాన్ని గురించి రాయండి.
జవాబు:
హనుమంతుని భుజాలపై కూర్చుండి, రాముడు రావణునితో యుద్ధం చేశాడు. రాముని పరాక్రమం ముందు, రావణుని ధనుస్సు, కిరీటం దాసోహం అన్నాయి. రాముడు రావణునిపై దయతలచి, “నీవు యుద్ధంలో అలసిపోయావు. విశ్రాంతి తీసుకొని రేపురా, నా బలం తెలుస్తుంది” అన్నాడు.

రావణుడు అంతఃపురానికి వెళ్ళి తమ్ముడు కుంభకర్ణుని నిద్ర నుండి లేపించాడు. కుంభకర్ణుడు ఆరునెలలు నిద్రపోయి, ఒకరోజు భోజనం చేస్తూ ఉంటాడు. రావణుడు కుంభకర్ణుడికి విషయం వివరించాడు. కుంభకర్ణుడు యుద్ధానికి సిద్ధమయి, వానరులను చావగొడుతున్నాడు. వానరులు తలో దారి పట్టారు. రాముడు కుంభకర్ణుని ఐంద్రాస్త్రంతో సంహరించాడు. కుంభకర్ణుని తల, లంకలో పడి రాజవీధులలోని భవనాల, ఇంటి కప్పులు, ప్రాకారాలు కూలిపోయాయి. కుంభకర్ణుని మరణవార్త విని రావణుడు విచారించాడు.

రావణ పుత్రుడైన “అతికాయుడు” లక్ష్మణుని బ్రహ్మాస్త్రానికి బలయ్యాడు. ఇంద్రజిత్తు తండ్రిని ఓదార్చాడు. ఇంద్రజిత్తు యుద్ధరంగానికి వచ్చి, రామలక్ష్మణులపై బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. రామలక్ష్మణులు స్పృహ కోల్పోయినట్లు పడియున్నారు. అదిచూసి రామలక్ష్మణులు మరణించారని ఇంద్రజిత్తు తండ్రికి చెప్పాడు.

వానరులు అలజడి చెందడంతో, విభీషణుడు వారికి ధైర్యం చెప్పాడు. రామలక్ష్మణులు బ్రహ్మపై గౌరవంతో అస్త్ర బాధను అనుభవించారని విభీషణుడు వానరులకు చెప్పాడు. బ్రహ్మాస్త ప్రభావంతో 67 కోట్ల మంది మరణించారు. హనుమ, విభీషణుడు జాంబవంతుడి కోసం వెతుకుతున్నారు. జాంబవంతుడు ధ్వనిని బట్టి విభీషణుడిని గుర్తించాడు. హనుమ క్షేమమా ? అని జాంబవంతుడు విభీషణుడిని అడిగాడు. హనుమ జీవిస్తే వానరులంతా జీవించినట్లే అన్నాడు. హనుమ సర్వౌషధి పర్వతాన్ని పెల్లగించి తెచ్చాడు. ఓషధుల వాసనకు రామలక్ష్మణుల గాయాలు మాయం అయ్యాయి. వానరులు లేచి కూర్చున్నారు. వానరులు లంకకు నిప్పు పెట్టారు.

ఇంద్రజిత్తు మాయా. సీతను సంహరించాడు. అందరూ చనిపోయింది నిజం సీత అనుకున్నారు. ఈ వార్త తెలిసి రాముడు విచారించాడు. అది ఇంద్రజిత్తు మాయ అని విభీషణుడు తెలిపాడు. శత్రువుల సంహారానికి ఇంద్రజిత్తు నికుంభిలా అభిచార హోమాన్ని తలపెట్టాడు. ఇంద్రజిత్తు యజ్ఞాన్ని భంగం చేయడానికి లక్ష్మణుడు వెళ్ళాడు. లక్ష్మణ ఇంద్రజిత్తులు ఘోరయుద్ధం చేశారు. లక్ష్మణుడు ఇంద్రజిత్తు తలను ఐంద్రాస్త్రంతో నేల రాల్చాడు.

రావణుని యుద్ధం :
రావణుడు ప్రళయకాల రుద్రుడిలా విజృంభించాడు. వానరులు పారిపోతున్నారు. సుగ్రీవుడు విరూపాక్షుడిని, మహోదరుడిని సంహరించాడు. రామలక్ష్మణులతో రావణుడి యుద్ధం భయంకరంగా సాగుతోంది. రావణుడు విభీషణుడిని చంపడానికి బల్లెము ఎత్తాడు. అప్పుడు లక్ష్మణుడు రావణునిపై బాణాలను వేశాడు. రావణుడు లక్ష్మణునిపై ‘శక్తి’ అనే ఆయుధాన్ని ప్రయోగించాడు. శ్రీరాముడు ‘శక్తి’ని వేడుకొన్నాడు. శక్తి తన ప్రాణశక్తిని కోల్పోయింది. శక్తి లక్ష్మణుని మాత్రం తాకింది. అతడు నేలపై పడ్డాడు. రాముడు ఆ శక్తిని లాగి విరచివేశాడు. రాముడు విజృంభించాడు. దానితో రావణుడు పరుగుపెట్టాడు.

పడిపోయిన లక్ష్మణుడిని చూసి, రాముడు విలవిలలాడాడు. సుషేణుడు లక్ష్మణుడు చనిపోలేదని చెప్పాడు. సుషేణుడి సూచన ప్రకారంగా హనుమ ఓషధులు తెచ్చాడు. ఓషధీ ప్రభావంతో లక్ష్మణుడు లేచాడు. ఇంద్రుడు మాతలితో పాటు తన దివ్య రథాన్ని రాముని కోసం పంపాడు. రాముడు రథం ఎక్కాడు. రామరావణులు సమంగా యుద్ధం చేశారు. రాముడు విజృంభించాడు. దానితో రావణుడి రథసారథి రావణుడి రథాన్ని పక్కకు మరలించాడు. రావణుడు సారథిని మందలించాడు. తిరిగి రావణరథం రాముని ముందు నిలిచింది. అగస్త్యుడు దేవతలతో అక్కడకు వచ్చి, రాముడికి ‘ఆదిత్య హృదయ మంత్రం’ ఉపదేశించాడు.

రాముని బాణానికి రావణుడి తలలు నేలరాలి తిరిగి మొలుస్తున్నాయి. రావణునిపై బ్రహ్మాస్త్రాన్ని వేయమని మాతలి రామునికి చెప్పాడు. రాముడి బ్రహ్మాస్త్రంతో రావణ సంహారం జరిగింది.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 6 యుద్ధకాండ

ప్రశ్న 8.
రావణుని చంపి శ్రీరాముడు పట్టాభిషిక్తుడై రాజ్యాన్ని పాలించిన విధానాన్ని తెలపండి.
జవాబు:
మాతలి సూచనతో శ్రీరాముడు రావణునిపై బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. రావణ సంహారం జరిగింది. రాముడి ఆదేశం మేరకు విభీషణుడు తన అన్న రావణునికి ఉత్తర క్రియలను నిర్వహించాడు. రాముని ఆజ్ఞ ప్రకారం, లక్ష్మణుడు విభీషణుడిని లంకారాజుగా పట్టాభిషేకం చేశాడు. హనుమ సీతమ్మకు రావణసంహారం గురించి చెప్పాడు. సీతను బాధించిన స్త్రీలను చంపుతానన్న హనుమను, సీతమ్మ వారించింది.

విభీషణుడు సీతను పల్లకిలో రాముని వద్దకు తీసుకువచ్చాడు. సీత భర్తను చేరుకుంది. రాముడు సీతతో తన వంశ ప్రతిష్ఠను నిలుపుకోడానికి రావణుడి చెర నుండి సీతను విడిపించాననీ, సీత పరుల పంచన ఉన్నందువల్ల తనకు ఆమెపై సందేహం ఉందనీ, ఆమె ఇష్టం వచ్చినచోటుకు వెళ్ళవచ్చునని అన్నాడు. శ్రీరాముడి మాటలు సీతకు బాణాల్లా గుచ్చుకున్నాయి. రాముడికి తనపై విశ్వాసం కల్గించడానికి ‘అగ్నిప్రవేశం’ ఒక్కటే దిక్కని సీత భావించింది. లక్ష్మణుడు చితిని సిద్ధం చేశాడు. సీత అగ్నిప్రవేశం చేసింది. అగ్నిదేవుడు సీతను స్వయంగా తీసుకువచ్చి ఆమెను స్వీకరించమని రాముని కోరాడు.

సీత శీలాన్ని ముల్లోకాలకూ చాటడానికే, సీత అగ్ని ప్రవేశం చేస్తున్నప్పటికీ, తాను ఊరుకున్నానన్నాడు. సీతను రాముడు స్వీకరించాడు. శివుడు రాముని ప్రశంసించాడు. ఇంద్రుడు చనిపోయిన వానరులను బ్రతికించాడు. విభీషణుడు రాముడిని మరికొంతకాలం లంకలో ఉండమన్నాడు. కాని భరతుని కోసం రాముడు పుష్పకవిమానంలో అయోధ్యకు బయలుదేరాడు. రాముడు తాను తిరిగి వస్తున్న విషయాన్ని భరతుడికి హనుమ ద్వారా కబురంపాడు.

పుష్పకవిమానంలో నందిగ్రామం చేరుకున్న సీతారామలక్ష్మణులకు, భరతాదులు స్వాగతం చెప్పారు. సీతారాములు తల్లులకూ, వశిష్ఠుడికి నమస్కరించారు. భరతుణ్ణి రాముడు దగ్గరకు తీసుకొన్నాడు. శ్రీరామ పట్టాభిషేకం మహా వైభవంగా జరిగింది. రాముడు లక్ష్మణుడిని యువరాజుగా ఉండమన్నాడు. లక్ష్మణుడు అంగీకరించలేదు. భరతుణ్ణి యువరాజుగా చేశాడు.

రాముడు ప్రజలను కన్నబిడ్డలవలె చూశాడు. ప్రజలు ధర్మబద్ధంగా నడచుకున్నారు. రాముడు 11 వేల సంవత్సరాలు పాలించాడు. ప్రజలకు ఈతిబాధలు లేవు. అందుకే రామరాజ్యం ‘ అనేమాట ప్రసిద్ధం అయ్యింది.

ప్రశ్న 9.
సేతువు నిర్మాణం గురించి రాయండి.
జవాబు:
శ్రీరాముడు సముద్రాన్ని దాటే ఉపాయమేమిటని సుగ్రీవుణ్ణి ప్రశ్నించాడు. సముద్రుణ్ణి ప్రార్థించడం వల్ల ఇది సాధ్యపడుతుందని విభీషణుడు చెప్పాడు. శ్రీరాముడు సముద్రతీరంలో దర్భాసనం మీద కూర్చొని సముద్రుణ్ణి ఉపాసించాడు. మూడు రాత్రులు గడిచాయి. సముద్రుడు ఎదుట నిలువలేదు. శ్రీరాముడికి కోపం వచ్చింది. సముద్రుడి అహంకారాన్ని అణగదొక్కాలనుకున్నాడు. బ్రహ్మాస్త్రాన్ని స్మరించాడు. సముద్రుడు పరుగెత్తాడు. లంకకు వెళ్ళడానికి దారి ఇస్తానన్నాడు.

విశ్వకర్మ కుమారుడైన ‘నలుడు’ శిల్పకళా నిపుణుడు. సేతువు (వంతెన)ను నిర్మించడానికి అతడే యోగ్యుడని సముద్రుడు తెలిపాడు. ఆ సేతువును తాను భరిస్తానని మాట ఇచ్చాడు. సేతువు నిర్మాణానికి వానర నాయకులకు ఆజ్ఞ ఇచ్చాడు శ్రీరాముడు. అందరూ మహారణ్యం దారి పట్టారు. పెద్ద పెద్ద చెట్లను బండరాళ్ళను మోసుకువచ్చారు. సముద్రంలో పడేశారు. వాటి దెబ్బకు సముద్రంలోని నీరు ఆకాశానికి ఎగిసిపడింది. నీలుని సూచనలను అనుసరించి కొలతల ప్రకారం సేతువు నిర్మాణం జరిగింది. వంద యోజనాల పొడవు, పది యోజనాల వెడల్పు గల సేతువును కట్టడం ఐదురోజుల్లో పూర్తయింది.

అదనపు ప్రశ్నలు

ప్రశ్న 1.
‘రామాయణం” ఆధారంగా అన్నదమ్ముల అనుబంధం ఎలా ఉండాలో వివరించండి. –
జవాబు:
రామాయణం ఆధారంగా అన్నదమ్ముల అనుబంధం ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో తెలుసుకొనే అవకాశం ఉంది.

  1. రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల మధ్య ఉండే అనుబంధం ఆదర్శప్రాయమైనది. ఆప్యాయతానురాగాలకు నిలయమైనది.
  2. వనవాసంలో అన్న సేవకు అడ్డు కాకూడదని ఊర్మిళను అయోధ్యలోనే విడిచి వచ్చిన లక్ష్మణుడు సోదరప్రేమకు, త్యాగానికి నిదర్శనంగా నిలిచాడు. శ్రీరామ సేవాభాగ్యము ముందు “త్రిలోకాధిపత్యం” కూడా చిన్నదేనని భావించి, వనవాసంలో సకలోపచారాలు చేసే అవకాశం తన కిమ్మని శ్రీరాముణ్ణి కోరిన ఆదర్శమూర్తి లక్ష్మణుడు.
  3. లక్ష్మణుడు రామునికి ఆరోప్రాణం. యుద్ధరంగంలో నేలమీద పడిపోయిన లక్ష్మణుడిని చూచి శ్రీరాముడు విలవిల లాడిపోవటం అతనికి తమ్మునిపై గల ప్రేమానురాగాలను చాటుతోంది.
  4. భరతుడు కూడా ఆదర్శ సోదరుడే. రామునివలే తానూ వనవాస నియమాలు పాటించి 14 ఏళ్ళు శ్రీరామ పాదుకలపై పాలనాభారం ఉంచి, రాజభోగాలకు దూరంగా నగరం వెలుపల గడిపిన ఆదర్శమూర్తి.
  5. వాలి సుగ్రీవుల అనుబంధం ఆదర్శవంతమైనది కాదు. అపోహలకు, అపార్థాలకు, అధర్మానికి నిలయమైనట్టిది.
  6. రావణ కుంభకర్ణ విభీషణుల అనుబంధం కూడ ఆదర్శనీయమైనది కాదు. రావణుని అధర్మమును పూర్తిగా తెలిసికొని కూడ సహాయపడిన వ్యక్తి కుంభకర్ణుడు. ధర్మం వీడిన రావణుని, వీడినవాడు విభీషణుడు.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 6 యుద్ధకాండ

ప్రశ్న 2.
రామ లక్ష్మణులు సిద్ధాశ్రమం చేరుకొన్న ప్రయాణ విశేషాలు వివరించండి.
జవాబు:
దశరథ పుత్రులు రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు, వేదశాస్త్రాలు, ధనుర్విద్య నేర్చారు. లక్ష్మణుడు రాముడికి బహిః ప్రాణం. తన కుమారులను దశరథుడు వివాహం చేద్దామనుకుంటున్నాడు. ఆ సమయంలో విశ్వామిత్రుడు దశరథుని దగ్గరకు వచ్చాడు. ఆ ఋషి చెప్పిన కార్యాన్ని చేస్తానన్నాడు దశరథుడు.

విశ్వామిత్రుడు తన యజ్ఞానికి రాక్షసులు విఘ్నం కలుగజేస్తున్నారనీ, యజ్ఞం చేసేటప్పుడు తాను శపించకూడదనీ, యజ్ఞరక్షణకు శ్రీరాముణ్ణి తనతో 10 రోజులు పంపమనీ దశరథుని కోరాడు. దశరథుడు మహర్షితో రాముడికి ఇంకా 16 ఏళ్ళు నిండలేదనీ రాముడికి యుద్ధం తెలియదనీ, రాముణ్ణి విడిచి తాను ఉండలేననీ, తానే యజ్ఞరక్షణకు వస్తానని చెప్పాడు.

తన యజ్ఞానికి రావణుని ఆజ్ఞపై మారీచ సుబాహులు విఘ్నాలు కల్గిస్తున్నారని విశ్వామిత్రుడు చెప్పాడు. అప్పుడు దశరథుడు రాముణ్ణి పంపనని చెప్పగా, విశ్వామిత్రునకు కోపం వచ్చింది. ‘వశిష్ట మహర్షి దశరథునికి నచ్చచెప్పి, రామలక్ష్మణుల్ని విశ్వామిత్రుని వెంట పంపాడు.

విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు ‘బల’, ‘అతిబల’ అనే విద్యలు ఉపదేశించాడు. ఆ విద్యల మహిమవల్ల అలసట, ఆకలిదప్పులు ఉండవు. రాముడు విశ్వామిత్రునికి గురుసేవ చేశాడు. రామలక్ష్మణులు మహర్షితో ‘మలద’ , ‘కరూశ’ గ్రామాలకు చేరారు. అక్కడ తాటక అనే యక్షిణి విధ్వంసం చేసేది. ఆమె కొడుకు మారీచుడు జనపదాలను అతలాకుతలం చేసేవాడు. తాటకను చంపమని విశ్వామిత్రుడు రామునికి చెప్పాడు. రాముడు వాడి బాణాలతో తాటక బాహువులను ఖండించాడు. లక్ష్మణుడు తాటక ముక్కు చెవులు కోశాడు. రాముడు శబ్దవేధి విద్యతో, బాణం వేసి తాటకను చంపాడు. విశ్వామిత్ర మహర్షి సంతోషించి, అనేక దివ్యాస్త్రాలను రాముడికి అనుగ్రహించాడు.

విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో తన సిద్ధాశ్రమం చేరి, యజ్ఞదీక్ష చేపట్టాడు. ఆ యజ్ఞం, ఆరురోజులు. రామలక్ష్మణులు యజ్ఞాన్ని జాగ్రత్తగా రక్షిస్తున్నారు. ఇంతలో మారీచ సుబాహులు అనే రాక్షసులు, యజ్ఞకుండంలో రక్తం కురిపించారు. మారీచుడి పై రాముడు ‘శీతేషువు’ అనే మానవాస్త్రాన్ని వేసాడు. మారీచుడు సముద్రంలో పడ్డాడు. రాముడు ఆగ్నేయాస్త్రంతో సుబాహుణ్ణి చంపాడు. మిగిలిన వారిని, ‘వాయవ్యాస్త్రం’తో రామలక్ష్మణులు తరిమారు. మహర్షి యజ్ఞం పూర్తయ్యింది.

ప్రశ్న 3.
రామాయణం ఎందుకు చదవాలి?
(లేదా)
‘రామాయణం వంటి ఆదర్శకావ్యం న భూతో న భవిష్యతి” దీనిని సమర్థిస్తూ రామాయణం గొప్పదనాన్ని రాయండి.
జవాబు:
మానవ జీవన మూలాలకు రామాయణం మణిదర్పణం. అందువల్లనే కొండలు, సముద్రాలు ఉన్నంతవరకూ రామాయణము లోకంలో ఉంటుందని బ్రహ్మగారు చెప్పారు. రామాయణం శాశ్వతత్వాన్ని సంపాదించుకున్న కావ్యము.

రామాయణం’ అంటే రాముని మార్గము. శ్రీరాముడు సత్యవాక్య పరిపాలకుడై ధర్మమార్గంలో ప్రజారంజకంగా పరిపాలించాడు. శ్రీరాముడు నడచిన నడత ధర్మబద్దం.

మానవ జీవితాన్ని సంస్కరించగల కావ్యం రామాయణం. మానవ హృదయాల నుండి ఎన్నటికీ చెరగని కథ రామాయణం. , ఇందులో అమ్మానాన్నల అనురాగం, పుత్రుల అభిమానం, అన్నదమ్ముల అనుబంధం, భార్యాభర్తల సంబంధం, గురువుపై భక్తి, శిష్యులపై ప్రేమ, స్నేహఫలం, ధర్మబలం వంటి జీవిత సంబంధాలను రామాయణం పట్టి చూపిస్తుంది.

వినయంతో ఒదగడం, వివేకంతో ఎదగడం, జీవనకారుణ్య భావం, ప్రకృతి లాలన వంటి జీవిత పార్శ్వాలకు రామాయణం మణిదర్పణం.

రామాయణం ఆచరణ ప్రధానమైన కావ్యం. సీతారాముల వంటి ఆదర్శనాయికానాయకుల చరిత్ర ఇది. “రామో విగ్రహవాన్ ధర్మః” అనే గొప్పమాట మారీచుని వంటి దుష్ట రాక్షసుని నోటి నుండి మహర్షి వాల్మీకి పలికించాడు. రామాయణం ఆదికావ్యం. ఇటువంటి కావ్యం ప్రపంచ సాహిత్యంలో “నభూతో నభవిష్యతి”.

ప్రశ్న 4.
రామాయణములోని స్నేహాల గురించి రాయండి.
జవాబు:
రామాయణంలో రామసుగ్రీవుల స్నేహం, రామవిభీషణుల స్నేహాలు, సుప్రసిద్ధమైనవి. సుగ్రీవుడు రామునితో స్నేహం చేశాడు. సుగ్రీవుడికీ అతని అన్న వాలికీ విరోధం ఉంది. వాలి, కిష్కింధకు రాజు. సుగ్రీవుడు రామునితో స్నేహం చేసి, రామునిచేత తన అన్న వాలిని చంపించి, తాను కిష్కింధకు రాజు అయ్యాడు. రాముడే సుగ్రీవుడిని కిష్కింధకు రాజును చేశాడు. రావణుని చంపి, సీతను తిరిగి తెచ్చుకోడానికి సుగ్రీవుడు తన వానర సైన్యంతో రామునికి సాయపడ్డాడు. ఈ విధంగా రామసుగ్రీవుల స్నేహం వల్ల వారిద్దరికీ మేలు జరిగింది.

రామాయణంలో రామవిభీషణుల స్నేహం కూడా ప్రసిద్ధమైనది. విభీషణుడు. లంకా నగరాధిపతి, రావణుడికి తమ్ముడు. రావణుడు సీతను అపహరించి తీసుకురావడం, విభీషణుడికి ఇష్టం లేదు. అందుకే విభీషణుడు తన అన్న రావణుని విడిచి, రాముని స్నేహాన్ని ఆశ్రయించాడు. రాముడు విభీషణుని ఆదరించాడు. రామ విభీషణుల స్నేహం గొప్పది.

విభీషణుని మాట సాయంతో రాముడు రావణుని జయించాడు. విభీషణుని లంకా నగరానికి రాజును చేశాడు. విభీషణుడు సీతను రామునకు అప్పగించాడు. ఈ విధంగా రామవిభీషణులు స్నేహం వల్ల ఒకరికి ఒకరు మేలు చేసుకున్నారు. రామవిభీషణుల స్నేహం వల్ల వారిద్దరికీ మేలు జరిగింది.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 6 యుద్ధకాండ

ప్రశ్న 5.
రామాయణంలో సీత – కైకల పాత్రల భేదాలను విశ్లేషించండి.
జవాబు:
సీత, శ్రీరామచంద్రునికి ధర్మపత్ని. ఈమె మహాపతివ్రత. మహా సౌందర్యవతి. ఈమె జనకమహారాజు కుమార్తె. రామునితో పాటు సీత కూడా వనవాసానికి వెళ్ళి ఎన్నో బాధలు పడింది. రావణుడు ఈమెను అపహరించి లంకకు తీసుకువెళ్ళాడు. రాముడు సీతాదేవి జాడను తెలిసికోడానికి హనుమంతుడిని దూతగా పంపాడు. హనుమ సీతను కలిసి, రాముని ఉంగరాన్ని ఆమెకు ఇచ్చాడు. సీత ఇచ్చిన చూడామణిని తెచ్చి రామునకు ఇచ్చాడు.

రాముడు సీత కోసం సముద్రానికి వారధిని కట్టి యుద్ధంలో రావణుని సంహరించి సీతను తీసుకువచ్చాడు. రామాయణంలోని పాత్రలలో రాముని తరువాత సీత పాత్ర ప్రధానమైనది.

కైక దశరథ మహారాజునకు ముద్దుల భార్య. ఈమెకు రాముడంటే మంచి ప్రేమ. మంథర చెప్పిన చెప్పుడు మాటలు విని, కైక తన మనస్సును మార్చుకొని దుష్టురాలయ్యింది. పుత్ర ప్రేమతో భరతుడిని రాజును చేయ్యమనీ, రాముడిని అడవులకు పంపమనీ ఈమె పట్టుపట్టింది. దశరథుడు బ్రతిమాలి చెప్పినా ఈమె వినలేదు. కైక మొండిది.

కైక పట్టుదల వల్లనే దశరథుడు రాముడిని వనవాసానికి పంపవలసి వచ్చింది. రామునిపై బెంగతో దశరథుడు మరణించాడు. రాముని వనవాసానికి, దశరథుని మరణానికి కైక యొక్క మూర్ఖపు పట్టుదలయే కారణము.

‘సీత’ భర్త రామునికి తోడుగా ఉండి అరణ్యానికి వెళ్ళింది. కైక, భర్త దశరథుని మరణానికి కారణం అయ్యింది. సీత మహాపతివ్రత కాగా, కైక గయ్యాళి భార్య. కైక భర్త మాటను లెక్కచేయలేదు. సీత రాముని కోసం, తన ప్రాణాలను కూడా ఇవ్వగల ఉత్తమ సతి.

రామాయణ కావ్యంలో సీత – కైక పాత్రలు రెండూ ప్రధానమైనవే. రామాయణ కథ, ఈ రెండు పాత్రల వల్లనే సాగింది. సీత మహాసాధ్వి. కైక గయ్యాళి గంప.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 5 సుందరకాండ

AP State Board Syllabus AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం 5th Lesson సుందరకాండ Textbook Questions and Answers.

AP State Syllabus SSC 10th Class Telugu Solutions ఉపవాచకం 5th Lesson సుందరకాండ

10th Class Telugu ఉపవాచకం 5th Lesson సుందరకాండ Textbook Questions and Answers

I. అవగాహన – ప్రతిస్పందన

సంఘటనా క్రమం

సంఘటనల ఆధారంగా వరుస క్రమంలో వాక్యాలను అమర్చడం

1. అ) సీతాన్వేషణను సఫలం చేయగల సమర్థుడు హనుమంతుడేనని సుగ్రీవుడి నమ్మకం. హనుమంతుడు అదే విశ్వాసంతో ఉన్నాడు. శ్రీరాముడి భావన కూడా అదే.
ఆ) హనుమంతుడు (రెట్టించిన ఉత్సాహంతో బలాన్ని పుంజుకున్నాడు.
ఇ) సంపాతి తన సోదరుడి మరణానికి ఎంతో విలపించాడు. లంకలో సీత ఉన్న పరిస్థితులను దివ్యదృష్టితో చూసి కళ్లకు కట్టినట్లు వివరించాడు.
ఈ) అందుకే తనపేరు చెక్కబడిన ఉంగరాన్ని హనుమంతుడికి ఇచ్చాడు శ్రీరాముడు. సీత దీన్ని చూస్తే హనుమను రామదూతగా నమ్ముతుందన్నాడు.
జవాబులు
అ) సీతాన్వేషణను సఫలం చేయగల సమర్ధుడు హనుమంతుడేనని సుగ్రీవుని నమ్మకం. హనుమంతుడూ అంతే విశ్వాసంతో ఉన్నాడు. శ్రీరాముడి భావన కూడా అదే.
ఈ) అందుకే తన పేరు చెక్కబడిన ఉంగరాన్ని హనుమంతుడికి ఇచ్చాడు శ్రీరాముడు. సీత దీన్ని చూస్తే హనుమను రామదూతగా నమ్ముతుందన్నాడు.
ఇ) సంపాతి తన సోదరుడి మరణానికి ఎంతో విలపించాడు. లంకలో సీత ఉన్న పరిస్థితులను దివ్యదృష్టితో చూసి కళ్లకు కట్టినట్లు వివరించాడు.
ఆ) హనుమంతుడు రెట్టించిన ఉత్సాహంతో బలాన్ని పుంజుకున్నాడు.

2. అ) సీతాదేవిని చూడగానే హనుమంతుని కన్నుల నుండి ఆనందాశ్రువులు జారాయి. శ్రీరాముని స్మరించుకుని నమస్కరించాడు.
ఆ) హనుమంతుడు మహానాదం చేస్తూ ఎడమచేతితో లంకిణి పై ఒకదెబ్బవేశాడు.
ఇ) హనుమంతుని పరీక్షించడానికి వచ్చిన ‘సురస’ అనే నాగమాత అతని సూక్ష్మబుద్ధిని, సమయస్ఫూర్తిని చూసి ఆనందించి ఆశీర్వదించింది.
ఈ) శ్రీరామ కార్యమునకు వెళుతున్న హనుమంతునికి సూర్యుడు తాపాన్ని కలిగించలేదు.
జవాబులు
ఈ) శ్రీరామ కార్యమునకు వెళుతున్న హనుమంతునికి సూర్యుడు తాపాన్ని కలిగించలేదు.
ఇ) హనుమంతుణ్ణి పరీక్షించడానికి వచ్చిన ‘సురస’ అనే నాగమాత అతని సూక్ష్మబుద్ధిని, సమయస్ఫూర్తిని చూసి ఆనందించి ఆశీర్వదించింది.
ఆ) హనుమంతుడు. మహనాదం చేస్తూ ఎడమ చేతితో లంకిణిపై ఒక్కదెబ్బవేశాడు.
అ) ఒక వానరుడు వచ్చి లంకిణిని జయించినప్పుడు రాక్షసులకు కీడుమూడుతుందని బ్రహ్మ చెప్పాడు.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 4 కిష్కింధ కాండ

3. అ) శ్రీరాముడి నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదని హెచ్చరించింది.
ఆ) రావణునిలో ఆవేశం పెల్లుబికింది. రెండు నెలల గడువు విధించాడు.
ఇ) రావణుని తేజస్సు చూసి ఆశ్చర్యచకితుడయ్యాడు హనుమంతుడు.
ఈ) సీత దగ్గరికి వచ్చి రావణుడు నయానా భయాన సీత మనసుమార్చే ప్రయత్నం చేశాడు.
జవాబులు
ఇ) రావణుని తేజస్సు చూసి ఆశ్చర్యచకితుడయ్యాడు హనుమంతుడు.
ఈ) సీత దగ్గరకి వచ్చి రావణుడు నయానా భయాన సీత మనసుమార్చే ప్రయత్నం చేశాడు.
అ) శ్రీరాముడి నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదని హెచ్చరించింది.
ఆ) రావణునిలో ఆవేశం పెల్లుబికింది. రెండు నెలలు గడువు విధించాడు.

4. అ) శ్రీరాముడు రావణుణ్ణి సంహరించి తనను తీసుకుపోవడమే ఆయన స్థాయికి తగినదన్నది.
ఆ) సీతాదేవికి వినబడేటట్లు రామకథను వర్ణించాడు.
ఇ) హనుమంతుడు శ్రీరాముడి రూపగుణాలను వివరించాడు. శ్రీరాముడి ముద్రికను సమర్పించాడు.
ఈ) కొంగుముడి విప్పి అందులోని దివ్యచూడామణిని హనుమంతునికిచ్చింది.
జవాబులు
ఆ) సీతాదేవికి వినబడేటట్లు రామకథను వర్ణించాడు.
ఇ) హనుమంతుడు శ్రీరాముడి రూపగుణాలను వివరించాడు. శ్రీరాముడి ముద్రికను సమర్పించాడు.
ఈ) కొంగుముడి విప్పి అందులోని దివ్య చూడామణిని హనుమంతునికిచ్చింది.
అ) శ్రీరాముడు రావణుణ్ణి సంహరించి తనను తీసుకుపోవడమే ఆయన స్థాయికి తగినదన్నది.

5. అ) ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి హనుమంతుణ్ణి బంధించాడు.
ఆ) విభీషణుని భవనం తప్ప లంకంతా నిప్పుపెట్టాడు.
ఇ) హనుమంతుని తోకకు నిప్పంటించి లంకంతా కలియదిప్పమన్నాడు రావణుడు.
ఈ) మహేంద్రగిరికి చేరుకోబోతుండగా మహానాదం చేశాడు. జాంబవంతుడు దానిని విని పొంగిపోయాడు. హనుమంతుడు విజయుడై తిరిగివస్తున్నాడని ప్రకటించాడు.
జవాబులు
అ) ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి హనుమంతుణ్ణి బంధించాడు.
ఇ) హనుమంతుణి తోకకు నిప్పంటించి లంకంతా కలియదిప్పమన్నాడు రావణుడు.
ఆ) విభీషణుని భవనం తప్ప లంకంతా నిప్పు పెట్టాడు.
ఈ) మహేంద్రగిరికి చేరుకోబోతుండగా మహానాదం చేశాడు. జాంబవతుడు దానిని విని పొంగిపోయాడు. హనుమంతుడు విజయుడై తిరిగి వస్తున్నాడని ప్రకటించాడు.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 4 కిష్కింధ కాండ

6. అ) అంగద హనుమదాదాలు శ్రీరాముడు సుగ్రీవుడున్న చోటుకు చేరారు.
ఆ) ప్రాణత్యాగానికి సిద్ధపడ్డ సీతకు శుభశకునాలు తోచాయి.
ఇ) రాత్రి కాగానే పిల్లి ప్రమాణంలోకి తన శరీరాన్ని కుదించుకొని లంకలోకి ప్రవేశించాడు.
ఈ) సముద్రంపై సాగిపోతున్న హనుమంతుని చూసి సాగరుడు సహాయపడదలచాడు.
జవాబులు
ఈ) సముద్రం పై సాగిపోతున్న హనుమంతుని చూసి సాగరుడు సహాయపడదలచాడు.
ఇ) రాత్రి కాగానే పిల్లి ప్రమాణంలోకి తన శరీరాన్ని కుదించుకొని లంకలోకి ప్రవేశించాడు.
ఆ) ప్రాణత్యాగానికి సిద్ధపడ్డ సీతకు శుభశకునాలు తోచాయి.
అ) అంగద హనుమదాదాలు శ్రీరాముడు సుగ్రీవుడున్న చోటుకు చేరారు.

7. అ) వానరులు మధువనాన్ని ధ్వంసం చేశారు.
ఆ) శ్రీరాముడికి దూరమై బతకడం కన్నా శరీరాన్ని విడవడమే మేలన్నది సీత.
ఇ) సీత కోరికపైన హనుమంతుడు రాముడి గుణరూపాలను వివరించాడు.
ఈ) ప్రాణ త్యాగానికి సిద్ధపడ్డ సీతకు శుభశకునాలు తోచాయి.
జవాబులు
ఆ) శ్రీరాముడికి దూరమై బతకడం కన్నా శరీరాన్ని విడవడమే మేలన్నది.
ఈ) ప్రాణ త్యాగానికి సిద్ధపడ్డ సీతకు శుభశకునాలు తోచాయి.
ఇ) సీత కోరికపైన హనుమంతుడు రాముడి గుణరూపాలను వివరించాడు.
అ) వానరులు మధువనాన్ని ధ్వంసం చేశారు.

8. అ) రావణుని తేజస్సును చూచి హనుమంతుడు ఆశ్చర్యపోయాడు.
ఆ) శ్రీరామునికి దూరమై బ్రతకడం కన్నా శరీరాన్ని విడవడం మంచిదని సీత తలచింది.
ఇ) హనుమంతుడు సీతతో తాను శ్రీరామదూతనని చెప్పుకున్నాడు.
ఈ) అంతఃపురంలో ఎందరో స్త్రీలు చెల్లాచెదురుగా నిద్రపోవడం హనుమంతుడు చూశాడు.
జవాబులు
ఈ) అంతఃపురంలో ఎందరో స్త్రీలు చెల్లాచెదురుగా నిద్రపోవడం హనుమంతుడు చూశాడు.
అ) రావణుని తేజస్సును చూచి హనుమంతుడు ఆశ్చర్యపోయాడు.
ఆ) శ్రీరామునికి దూరమై బ్రతకడం కన్నా శరీరాన్ని విడవడం మంచిదని సీత తలచింది.
ఇ) హనుమంతుడు సీతతో తాను శ్రీరామదూతనని చెప్పుకున్నాడు.

9. అ) లంకను కాల్చాక హనుమంతుడు సముద్రంలో చల్లార్చుకున్నాడు.
ఆ) హనుమంతుడు మహేంద్రగిరి శిఖరం మీద అడుగుపెట్టాడు.
ఇ) హనుమంతుడు తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు.
ఈ) హనుమంతుని తోకకు నిప్పు అంటించి లంకంతా కలయదిప్పమన్నాడు రావణుడు.
జవాబులు
ఇ) హనుమంతుడు తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు.
ఈ) హనుమంతుని తోకకు నిప్పు అంటించి లంకంతా కలయదిప్పమన్నాడు రావణుడు.
అ) లంకను కాల్చాక హనుమంతుడు సముద్రంలో చల్లార్చుకున్నాడు.
ఆ) హనుమంతుడు మహేంద్రగిరి శిఖరం మీద అడుగుపెట్టాడు.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 4 కిష్కింధ కాండ

10. అ) హనుమంతుడు లంకలో చిత్రవిచిత్రమైన ఇళ్ళను చూశాడు.
ఆ) అంతవరకు వెతకని అశోకవనాన్ని వెతకాలనుకున్నాడు హనుమంతుడు.
ఇ) సీత హనుమంతునితో వెళ్ళడానికి నిరాకరించింది.
ఈ) హనుమ లంకిణిని చంపి లంకలో ప్రవేశించాడు.
జవాబులు
ఈ) హనుమ లంకిణిని చంపి లంకలో ప్రవేశించాడు.
అ) హనుమంతుడు లంకలో చిత్రవిచిత్రమైన ఇళ్ళను చూశాడు.
ఆ) అంతవరకు వెతకని అశోకవనాన్ని వెతకాలనుకున్నాడు హనుమంతుడు.
ఇ) సీత హనుమంతునితో వెళ్ళడానికి నిరాకరించింది.

11. అ) హనుమంతుడు మందహాసం చేస్తూ లంకిణిపై బలంగా కొట్టాడు.
ఆ) హనుమంతుడు అశోకవనంలో ప్రవేశించాడు.
ఇ) హనుమంతుడు ముఖద్వారం గుండా లంకలోకి వెళ్ళలేదు.
ఈ) త్రికూట పర్వతంపై ఉన్న లంకను చేరాడు హనుమంతుడు.
జవాబులు
ఈ) త్రికూట పర్వతంపై ఉన్న లంకను చేరాడు హనుమంతుడు.
అ) హనుమంతుడు మందహాసం చేస్తూ లంకిణిపై బలంగా కొట్టాడు.
ఇ) హనుమంతుడు ముఖద్వారం గుండా లంకలోకి వెళ్ళలేదు.
ఆ) హనుమంతుడు అశోకవనంలో ప్రవేశించాడు.

12. అ) నిద్రలేచిన రావణుడు అశోకవనం వైపు అడుగులు వేస్తున్నాడు.
ఆ) ప్రాణత్యాగానికి సిద్ధపడిన సీతకు శుభశకునాలు తోచాయి.
ఇ) సీతాదేవిని చూడగానే హనుమంతుని కళ్ళల్లో ఆనందాశ్రువులు వచ్చాయి.
ఈ) రాక్షస స్త్రీలు ఎన్నో రకాలుగా సీతకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.
జవాబులు
ఇ) సీతాదేవిని చూడగానే హనుమంతుని కళ్ళల్లో ఆనందాశ్రువులు వచ్చాయి.
అ) నిద్రలేచిన రావణుడు అశోకవనం వైపు అడుగులు వేస్తున్నాడు.
ఈ) రాక్షస స్త్రీలు ఎన్నో రకాలుగా సీతకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.
ఆ) ప్రాణత్యాగానికి సిద్ధపడిన సీతకు శుభశకునాలు తోచాయి.

పాత్ర స్వభావాలు

1. త్రిజట :
త్రిజట విభీషణుని కూతురు. రాక్షస స్త్రీలను అదలించింది. తనకు వచ్చిన కలను చెప్పింది. ‘వేయి హంసలతో కూడిన పల్లకిమీద లక్ష్మణుడితో శ్రీరాముడు కూర్చునట్లు చూశాను. సముద్రం మధ్య ఒక తెల్లని పర్వతంమీద సీత కూర్చోవడం చూశాను. నూనెపూసిన శరీరంతో రావణుడు నేలమీద పడి ఉండటం చూశాను. ఒక నల్లని స్త్రీ శరీరమంతా బురద పూసుకొని ఎర్రని వస్త్రములు కట్టి, రావణుని మెడకు తాడుకట్టి దక్షిణంవైపుగా ఈడ్చుకువెళ్ళడం చూశాను. వరాహం మీద రావణుడు, మొసలిమీద ఇంద్రజిత్తూ, ఒంటిమీద కుంభకర్ణుడు దక్షిణదిశగా వెళ్ళడం చూశాను. లంక చిన్నాభిన్నం కావడం చూశాను’ అన్నది. స్వప్నంలో విమానదర్శనం కావడాన్ని బట్టి సీత సిద్ధిస్తుందని, రావణునికి వినాశం తప్పదని, శ్రీరాముడికి జయం కలుగుతుందనీ చెప్పింది.

సంఘటన ద్వారా గ్రహించుట

ప్రశ్న 1.
‘దూతను చంపడం రాజనీతి కాదు’ అని పలికిన విభీషణుని మాటలను బట్టి మీరేమి గ్రహించారు?
జవాబు:
హనుమంతుడు రావణునికి హితోపదేశం చేశాడు. అది రావణునికి నచ్చలేదు. హనుమంతుడిని సంహరించమని ఆదేశించాడు. అది విని విభీషణుడు దూతను చంపడం రాజనీతి కాదని, రావణునికి సూచించాడు.

ఈ విభీషణుని మాటల ద్వారా విభీషణుడు రాక్షస వంశంలో జన్మించినా గొప్ప రాజనీతి కలవాడని గ్రహించాను. ఆవేశంతో కాకుండా ఆలోచనతో మంచి నిర్ణయాలు తీసుకోవాలని గ్రహించాను. రాజు ఎల్లప్పుడు రాజనీతిని అనుసరించి పాలించాలని, మంచి మాటలు చెప్పే మంత్రులు రాజుకు అవసరమని గ్రహించాను.

ప్రశ్న 2.
త్రిజట సీతను ఓదార్చిన విధానం ద్వారా మీరేమి గ్రహించారు?
జవాబు:
రావణుడు అశోకవనంలో ఉన్న సీతను సమీపించాడు. అనేక రకాలుగా ప్రలోభ పెట్టాడు. తీవ్రంగా భయపెట్టాడు. చంపుతానని బెదిరించాడు. ఆ సమయంలో దుఃఖిస్తున్న సీతను విభీషణుని కుమార్తె అయిన త్రిజట ఓదార్చింది. ఆమెలో ధైర్యాన్ని నింపింది.

త్రిజట సీతను ఓదార్చడం ద్వారా ఎన్నో విషయాలను గ్రహించాను. త్రిజట రాక్షస వంశంలో జన్మించినా ఉత్తమ గుణములు కల మహిళగా గుర్తించాను. ఆపదల్లోను, దుఃఖంలో ఉన్నవారిని ఆదుకోవాలని, వారిలో ధైర్యం నింపాలనిగ్రహించాను. త్రిజట మాటల వల్లనే సీత ధైర్యంగా జీవించగలిగిందని గ్రహించాను.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 4 కిష్కింధ కాండ

ప్రశ్న 3.
మైనాకుడు హనుమంతుడిని విశ్రాంతి తీసుకొనమని ప్రార్థించిన తీరును బట్టి మీరేమి గ్రహించారు?
జవాబు:
మైనాకుడు వాయుదేవుని అనుగ్రహం వల్ల సముద్రంలో దాగియున్నాడు. హనుమంతుడు సముద్రాన్ని దాటడానికి ప్రయత్నించాడు. మార్గమధ్యలో మైనాకుడు హనుమంతునికి ఆతిథ్యం ఇవ్వడానికి ప్రయత్నించాడు. హనుమంతుడు మైనాకుడిని స్పృశించి ముందుకు వెళ్ళాడు.

ఈ సన్నివేశం ద్వారా చేసిన ఉపకారాన్ని మరువకూడదని, దూరప్రయాణం చేసేవారికి విశ్రాంతిని ఇచ్చి, అతిథి మర్యాదలతో సత్కరించాలని గ్రహించాను. అంతేగాక కార్యరంగంలో దిగినవాడు అవిశ్రాంతంగా పనిచేయాలని, మార్గమధ్యలో కలిగే అంతరాలకు లోనుకాకూడదని కూడా గ్రహించాను.

ప్రశ్న 4.
ఆత్మహత్య కన్నా బతికి యుండటమే ఎన్నో విధాల మంచిదని, బాధల్లో నిరుత్సాహ పడకూడదనే విషయం ద్వారా మీరేమి గ్రహించారు?
జవాబు:
హనుమంతుడు లంకలో సీతను అన్వేషించాడు. ఎక్కడా కనిపించలేదు. నిరాశతో హనుమంతుడు ఆత్మహత్య చేసుకోవాలని ముందుగా అనుకొని తరువాత మనసు మార్చుకున్నాడు. ఆత్మహత్య కన్నా బతికి యుండటమే మంచిదని హనుమంతుడు నిశ్చయించుకున్నాడు.

ఈ సన్నివేశం ద్వారా ఆత్మహత్య ఎన్నటికీ మంచిదికాదనీ గ్రహించాను. మానవుడు ఆలోచనాపరుడు, వివేకవంతుడు. కష్టాలు వచ్చినప్పుడు ధైర్యంతో ఎదుర్కోవాలని, సమస్యలకు పరిష్కారాలను అన్వేషించాలని గ్రహించాను. కష్టాలకు, దుఃఖాలకు ఆత్మహత్యలు పరిష్కారం కాదని గ్రహించాను.

ప్రశ్న 5.
హనుమంతుడుపిల్లి ప్రమాణంలో తన శరీరాన్ని కుదించుకుని ఎడమకాలును పెట్టి లంకలో ప్రవేశించిన హనుమంతుని ప్రవర్తన ద్వారా మీరేమి గ్రహించారు?
జవాబు:
హనుమంతుడు సముద్రాన్ని దాటి లంకకు చేరాడు. పిల్లి ప్రమాణంలోకి తన శరీరాన్ని కుదించుకొని లంకలో ప్రవేశించాడు. ఎడమకాలిని ముందుగా లంకలో పెట్టి ప్రవేశించాడు.

దీని ద్వారా హనుమంతుని సమయస్ఫూర్తిని గుర్తించాను. పిల్లి అపశకునానికి ప్రతీక అని, ఎడమకాలు ముందుగా పెడితే ఆ ప్రాంతానికి అనర్థం కలుగుతుందని గ్రహించాను. హనుమంతుని రాక లంకా నగర వినాశనానికి కారణమైందని గ్రహించాను. శత్రువుల ప్రాంతంలోనికి వెళ్ళేముందు ఎడమకాలు ముందుగా పెట్టడం శ్రేష్ఠమని కూడా గ్రహించాను.

ప్రశ్న 6.
హనుమంతుడు రావణునితో “ఓయీ ! సీతను రామునికి అప్పగించు లేనిచో అనర్ధం తప్పదు” అని హెచ్చరించాడు. దీని ద్వారా మీరేమి గ్రహించారు?
జవాబు:
హనుమంతుడు అశోకవనాన్ని ధ్వంసం చేశాడు. చివరకు హనుమంతుడు రావణుని సమీపానికి వచ్చాడు. సీతను రామునికి అప్పగించి క్షేమంగా ఉండమని హెచ్చరించాడు. లేకపోతే అనర్హం కలుగుతుందని హెచ్చరించాడు.

ఈ హనుమంతుని మాటలనుబట్టి శ్రీరాముడు అమిత పరాక్రమవంతుడని, శ్రీరామునితో వైరం అన్ని విధాలుగా అనర్ధం కలుగుతుందని గ్రహించాను. రామదూతగా చక్కగా వ్యవహరించాడని కూడా గ్రహించాను. శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకుంటే యుద్ధాలు తప్పుతాయని కూడా గ్రహించాను.

విషయాత్మక ప్రశ్నలు

ఈ క్రింది ప్రశ్నకు నాలుగైదు వాక్యాలలో సమాధానం రాయండి.

ప్రశ్న 1.
హనుమంతుడు మొట్టమొదట చూసినప్పుడు సీతాదేవి ఎలా ఉంది?
జవాబు:
హనుమంతుడు లంకంతా వెదికాడు. సీత కనబడలేదు. శింశుపావృక్షం ఎక్కాడు. దానికింద మలినమైన వస్త్రాలతో సీత ఉంది. ఆమె కృశించి ఉంది. దీనావస్థలో ఉంది. ఆమె ఆభరణాలను బట్టి హనుమ ఆమెను సీతగా నిర్ధారించుకొన్నాడు.

వ్యాసరూప ప్రశ్నలు

ఈ క్రింది ప్రశ్నలకు 10 లేక 12 వాక్యాల్లో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
శ్రీరామ కార్యం నిమిత్తం హనుమంతుడు లంకకు యే విధంగా చేరాడు?
జవాబు:

  1. సుగ్రీవుని ఆజ్ఞమేరకు హనుమంతుడు మిగిలిన వానర వీరులతో దక్షిణ దిక్కుకు శ్రీరామ కార్యం నిమిత్తం బయలుదేరి సముద్రపు ఒడ్డుకు చేరాడు.
  2. జాంబవంతుడు, అంగదుడు మొదలగు వానర ప్రముఖుల ప్రోత్సాహంతో హనుమంతుడు సముద్ర లంఘనానికి పూనుకున్నాడు.
  3. హనుమంతుడు దేవతలందరికి నమస్కరించి తన శరీరాన్ని పెంచి, తోకను ఆకాశము పైకి రిక్కించి నడుం మీద చేతులు ఆనించి, గట్టిగా గర్జించి, పాదాలతో పర్వతాన్ని తొక్కి పైకి లంఘించాడు.
  4. హనుమంతుడు ఆ విధంగా సముద్రం మీద ఎగురుతుండగా సముద్ర గర్భంలోనున్న మైనాకుడు హనుమకు సాయం చేయాలన్న కోరికతో పైకి వచ్చి హనుమంతుని మార్గానికి అడ్డము వచ్చాడు.
  5. హనుమంతుడు మైనాకుణ్ణి చేతితో తాకి తన ప్రయాణాన్ని ముందుకు కొనసాగించాడు.
  6. హనుమంతుణ్ణి పరీక్షించాలని “సురస” అనే నాగమాత ప్రయత్నించి అతని సూక్ష్మబుద్ధిని మెచ్చుకుంది.
  7. “సింహిక” అనే రాక్షసి హనుమంతుణ్ణి మింగాలని చూసి అతని చేతిలో మరణించింది.
  8. హనుమంతుడు సముద్రాన్ని లంఘించి, లంకలో కాలుపెట్టాడు.
  9. రాత్రివేళ అన్వేషణకు అనువయిన సమయమని చీకటి పడేదాకా వేచియున్నాడు.
  10. చీకటి పడగానే లంకలో ప్రవేశించబోగా లంకిణి అడ్డగించింది.
  11. లంకిణిని ఒక దెబ్బతో నేలకూల్చాడు.
  12. లంకిణి హనుమంతుని చేతిలో ఓడింపబడి అతనికి దారి వదిలింది.
  13. ఈ విధంగా హనుమంతుడు సీత కొరకు అన్వేషించాలని లంకకు చేరాడు.

ప్రశ్న 2.
హనుమ సముద్రలంఘనం చేసిన విధానం వివరించండి.
జవాబు:
మహాబలవంతుడైన హనుమ, సముద్రం దాటడానికి ముందు దేవతలు అందరికీ నమస్కరించాడు. తన శరీరాన్ని పెంచాడు. పెద్దగా గర్జించాడు. చేతులు నడుముపై పెట్టాడు. అంగదాది వీరులతో తాను రామబాణంలా లంకకు వెడతానన్నాడు.

సముద్రం పై నుండి వెడుతున్న హనుమంతుడికి సాయం చేద్దామని సముద్రుడు అనుకున్నాడు. రామకార్యం మీద వెడుతున్న హనుమకు శ్రమ కలుగకూడదని, సముద్రంలోని మైనాకుణ్ణి సముద్రుడు బయటకు రమ్మన్నాడు. మైనాకుడి శిఖరాలపై హనుమ కొంచెం విశ్రాంతి తీసికొంటాడని సముద్రుడు అనుకున్నాడు.

మైనాకుడు పైకి లేచాడు. మైనాకుడు తనకు అడ్డు వస్తున్నాడని హనుమ అనుకొని, తన వక్షంతో అతడిని గెంటివేశాడు. మైనాకుడు మానవరూపంతో పర్వత శిఖరంపై నిలబడి, సముద్రుడి కోరికను హనుమకు చెప్పాడు. హనుమ, సంతోషించాడు. తనకు సమయం లేదని, చేతితో మైనాకుణ్ణి హనుమ తాకి వెళ్ళాడు.

తరువాత హనుమంతుడిని పరీక్షించడానికి సురస అనే నాగమాత వచ్చి, హనుమ సూక్ష్మబుద్ధిని మెచ్చుకొని, అతడిని ఆశీర్వదించింది. సింహిక అనే రాక్షసి, హనుమను మ్రింగాలని చూసింది. కాని హనుమంతుడు గోళ్ళతో సింహికను చీల్చివేశాడు.

ఇలా హనుమ నూరు యోజనాల సముద్రాన్ని దాటి లంకకు చేరాడు.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 4 కిష్కింధ కాండ

ప్రశ్న 3.
సీతాదేవిని హనుమంతుడు తొలిసారి సందర్శించినపుడు అతడు పొందిన ఆనందాన్ని విశ్లేషించండి.
జవాబు:
హనుమంతుడు సీతను వెతుకుతూ, రావణుడి అంతఃపురంలోకి వెళ్ళాడు. అక్కడ గొప్ప అందంతో ఉన్న రావణుడి భార్య మండోదరిని చూసి, సీత అని భ్రాంతిపడ్డాడు. తాను సీతను చూశానని హనుమ ఆనందంతో గంతులు వేశాడు. కొద్దిసేపటికే తన ఆలోచన తప్పు అనుకున్నాడు.

తరువాత హనుమ అశోకవనం అంతా, సీతకోసం వెతికాడు. శింశుపా వృక్షం ఎక్కాడు. ఆ చెట్టు క్రింద మాసిన బట్టలు కట్టుకొన్న ఒక స్త్రీని హనుమ చూశాడు. ఆమె చుట్టూ రాక్షస స్త్రీలు ఉన్నారు. ఆమె దీనావస్థలో ఉంది. ఆమె సీతయే అని, హనుమ అనుకున్నాడు.

అతడు ఆమె ధరించిన ఆభరణాలు చూశాడు. రాముడు చెప్పిన వాటితో అవి సరిపోయాయి. దానితో ఆమె సీతయే అని హనుమంతుడు గట్టిగా నిశ్చయించాడు.

సీతాదేవిని చూడగానే హనుమంతుడి కళ్ళ నుండి ఆనందభాష్పాలు జారాయి. శ్రీరాముడిని మనస్సులో స్మరించుకొని, హనుమంతుడు నమస్కరించాడు.

ప్రశ్న 4.
త్రిజటా స్వప్నం గురించి రాయండి.
జవాబు:
‘త్రిజట’ విభీషణుని కూతురు. రావణుడు సీతను అశోకవనంలో ఉంచి, రాక్షస స్త్రీలను ఆమెకు కాపలాగ పెట్టాడు. వారిలో ‘త్రిజట’ కూడ ఉంది. రావణుని భర్తగా అంగీకరించడానికి సీతను ఒప్పించమని రావణుడు రాక్షస స్త్రీలకు చెప్పాడు. రాక్షస స్త్రీలు సీతకు నచ్చచెప్పడానికి ప్రయత్నించారు. లేకపోతే చంపుతామని వారు సీతను బెదిరించారు. సీత ఎంతో ఏడ్చింది.

అంత వరకూ నిద్రపోతున్న త్రిజట లేచి తనకు కల వచ్చిందని అక్కడున్న రాక్షస స్త్రీలకు చెప్పింది. కలలో వేయి హంసల పల్లకిపై రామలక్ష్మణులు కనబడ్డారని, సీత తెల్లని పర్వతం మీద కూర్చుందనీ వారికి చెప్పింది. రావణుడు నూనె పూసిన శరీరంతో నేలపై పడి ఉన్నాడని, ఒక నల్లని స్త్రీ రావణుని మెడకు తాడు కట్టి దక్షిణం వైపు ఈడ్చుకువెడుతోందని కూడా చెప్పింది. రావణుడు పందిమీద దక్షిణ దిశగా వెళ్ళడం తాను కలలో చూశానని, లంకానగరం చిన్నాభిన్నం కావడం తాను చూశానని త్రిజట తోడి రాక్షస స్త్రీలకు చెప్పింది.

తనకు కలలో విమానం కనబడింది. కాబట్టి సీత కోరిక సిద్ధిస్తుందనీ, రావణుడికి వినాశం, రాముడికి జయం కలుగుతుందనీ త్రిజట చెప్పింది. త్రిజట ఉత్తమురాలు.

ప్రశ్న 5.
లంక దహనానికి అసలు కారకులెవరు? ఎలా? విశ్లేషించండి.
జవాబు:
హనుమంతుడు సీత జాడను తెలుసుకున్నాక, రావణుడి శక్తి సామర్థ్యాలు తెలుసుకోవాలనుకున్నాడు. అశోకవనాన్ని ధ్వంసం చేశాడు. రావణుడు పంపిన రాక్షస వీరులను అందరినీ హనుమ చంపాడు. చివరకు ఇంద్రజిత్తు హనుమను బ్రహ్మాస్త్రంతో బంధించి, రావణుడి వద్దకు తీసుకువెళ్ళాడు.

రావణుడు హనుమంతుడిని చంపమని ఆజ్ఞాపించాడు. దూతను చంపడం భావ్యం కాదని, ఇతర పద్ధతులలో దండింపవచ్చునని విభీషణుడు అన్న రావణునికి చెప్పాడు.

హనుమంతుడి తోకకు నిప్పు అంటించి, లంక అంతా తిప్పమని రాక్షసులకు రావణుడు చెప్పాడు. వారు బట్టలు హనుమంతుడి తోకకు చుట్టారు. దానిని నూనెతో తడిపారు. హనుమ తోకకు నిప్పు అంటించి, వారు లంక అంతా ఊరేగిస్తున్నారు. హనుమంతుడు ఒక్కసారిగా ఆకాశంలోకి ఎగిరాడు. విభీషణుడి భవనం తప్ప, లంకనంతా కాల్చాడు. ఈ విధంగా రాముడు సీతను చూసి రమ్మని హనుమంతుడిని పంపితే, హనుమ లంకను కాల్చి వచ్చాడు.

దీనినిబట్టి లంకను కాల్చడానికి అసలు కారకుడు రావణుడు అని మనకు తెలుస్తుంది. హనుమంతుడు రాముడి పరాక్రమాన్ని గుర్తుచేసి, సీతను రాముడి వద్దకు పంపమని రావణుడికి చెప్పడానికే వెళ్ళాడు. కాని రావణుడు, తెలివి తక్కువగా హనుమ తోకకు నిప్పు పెట్టించాడు. కాబట్టి లంకా దహనానికి రావణుడే అసలు కారకుడు.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 4 కిష్కింధ కాండ

ప్రశ్న 6.
హనుమంతుడు లంకలో ప్రవేశించి సీతను చూసి మాట్లాడిన వృత్తాంతాన్ని తెలపండి.
జవాబు:
హనుమంతుడు దేవతలకు నమస్కరించాడు. తన శరీరాన్ని పెంచాడు. పెద్ద ధ్వని చేస్తూ, చేతులను నడుం మీద ఉంచి, తోకను విదల్చాడు. సీతను చూసి వస్తానని, అంతరిక్షంలోకి ఎగిరాడు. హనుమ సముద్రంపై వెడుతుండగా, సముద్రుడు హనుమకు సాయం చేద్దామని తనలో దాగిన మైనాకుణ్ణి పైకి రమ్మన్నాడు. హనుమ ఆ గిరిశిఖరాలపై విశ్రాంతి తీసికొంటాడని సాగరుడు అనుకున్నాడు. పైకి లేచిన మైనాకుణ్ణి చూసి తనకు అడ్డంగా ఉన్నాడని, హనుమ తన వక్షస్థలంతో నెట్టివేశాడు. మైనాకుడు మనిషి రూపంలో గిరి శిఖరంపై నిలిచి, సముద్రుడి కోరికను హనుమకు తెలిపాడు. హనుమ తనకు మధ్యలో ఆగడం కుదరదని, మైనాకుని చేతితో తాకి ముందుకు సాగాడు.

హనుమను పరీక్షించాలని ‘సురస’ అనే నాగమాత యత్నించి హనుమ సూక్ష్మబుద్దిని మెచ్చుకుంది. ‘సింహిక’ అనే రాక్షసి హనుమను మింగాలని చూసి, తానే హనుమ చేతిలో మరణించింది. హనుమ లంకను చూశాడు. రాత్రి కాగానే పిల్లి ప్రమాణంలో తన శరీరాన్ని తగ్గించుకొని, లంకలో ప్రవేశించాడు. లంకాధిదేవత (లంకిణి) లంకలోకి వెళ్ళడానికి హనుమంతుని అడ్డగించింది. హనుమ లంకను చూసి వస్తానన్నాడు. లంకిణి హనుమను అరచేతితో కొట్టింది. హనుమ లంకిణిని ఒక్క దెబ్బ వేశాడు. లంకిణి కూలిపోయింది. వానరుడు వచ్చి లంకిణిని జయించినపుడు రాక్షసులకు కీడు కల్గుతుందని బ్రహ్మ చెప్పాడని హనుమకు లంకిణి చెప్పింది. హనుమను లంకలోకి వెళ్ళమంది.

హనుమ ప్రాకారం నుండి లంకలోకి దూకాడు. లంకలో ఎడమపాదం పెట్టాడు. హనుమ లంకలో రాక్షస భవనాలన్నీ వెదికాడు. రావణుని భార్య మండోదరిని చూసి సీత అని భ్రమపడ్డాడు. తరువాత ఆమె సీత కాదని నిశ్చయించాడు. చివరకు సీత చనిపోయి ఉంటుందని అనుకున్నాడు. హనుమ తాను కూడా మరణిద్దాం అనుకున్నాడు. చివరకు బతికి ఉంటే శుభాలు పొందవచ్చుననుకున్నాడు.

హనుమ అశోకవనంలోకి వెళ్ళాడు. సీతారాములకు నమస్కరించాడు. హనుమ ఆ వనంలో శింశుపావృక్షం ఎక్కాడు. దానికింద మలిన వస్త్రాలు ధరించిన ఒక స్త్రీని చూశాడు. ఆమె సీత అయి ఉంటుందని నిశ్చయించాడు. హనుమ చెట్టుమీదే ఉన్నాడు. తెల్లవారుతోంది. రావణుడు వచ్చి, సీత మనస్సును మార్చబోయాడు. సీత లొంగలేదు. రావణుడు సీతకు రెండు నెలలు గడువు ఇచ్చి, సీతను తన దారికి తెమ్మని రాక్షస స్త్రీలకు చెప్పాడు. రావణుడు వెళ్ళిపోయాక, రాక్షస స్త్రీలు సీత మనస్సు మార్చడానికి యత్నించారు. సీత రాముడిని విడిచి ఉండలేక చనిపోదామనుకుంది.

విభీషణుడి కూతురు త్రిజట నిద్ర నుండి లేచింది. త్రిజట తనకు కల వచ్చిందనీ ఆ కలలో వేయి హంసల పల్లకిలో రాముడూ, తెల్లని పర్వతంపై సీత కనబడ్డారని, రావణుడు నూనె పూసిన శరీరంతో నేలపై పడి ఉన్నాడని లంక చిన్నాభిన్నం అయ్యిందని, రాముడికి జయం కల్గుతుందని చెప్పింది.

సీతకు శుభశకునాలు కనబడ్డాయి. హనుమంతుడు రామకథను గానం చేశాడు. సీత చెట్టు మీద హనుమను చూసి ఆశ్చర్యపడింది. హనుమ చెట్టుదిగి, ఆ స్త్రీని “నీ వెవరవు ? నీవు సీతవైతే నీకు శుభం అవుతుంది” అన్నాడు. తన పేరు సీత అని, ఆ స్త్రీ చెప్పింది. హనుమ తాను శ్రీరామ దూతనని చెప్పాడు. హనుమను చూసి సీత మొదట రాక్షసుడు అనుకుంది. రామదూతవయితే రాముణ్ణి గురించి చెప్పు అన్నది. హనుమ రాముని రూపాన్ని వర్ణించాడు. రాముడిచ్చిన అంగుళీయకాన్ని సీత గుర్తుగా ఇచ్చాడు.

రాముణ్ణి త్వరగా లంకకు తీసుకురమ్మని హనుమకు సీతమ్మ చెప్పింది. వెంటనే సీతను రాముని వద్దకు తీసుకు వెడతాననీ, తన వీపుపై కూర్చోమనీ, హనుమ చెప్పాడు. అందుకు సీత నిరాకరించింది. తాను పరపురుషుడిని తాకననీ, రాముడు రావణుని చంపి నన్ను తీసుకువెళ్ళడం ధర్మం అనీ చెప్పింది. హనుమంతుడు రాముడు గుర్తించే ఆనవాలును ఇమ్మని సీతను అడిగాడు. సీత కాకాసురుని కథ చెప్పింది. ఆమె తన దివ్య చూడామణిని హనుమకు ఇచ్చింది. ఈ విధంగా హనుమ లంకలో సీతను కలిసి వెళ్ళాడు.

ప్రశ్న 7.
సీతాన్వేషణ వృత్తాంతం రాయండి.
(లేదా)
హనుమ లంకను కాల్చి వచ్చి, సీత జాడను రామునికి నివేదించిన వృత్తాంతాన్ని వివరించండి.
జవాబు:
సీతాదేవిని దర్శించడంతో హనుమకు ఒక ముఖ్యకార్యం పూర్తి అయ్యింది. రావణుడి శక్తిసామర్థ్యాలు హనుమ తెలుసుకుందామనుకున్నాడు. అశోకవనాన్ని ధ్వంసం చేశాడు. అశోక వన ధ్వంసం గురించి రాక్షస స్త్రీలు, రావణునకు చెప్పారు. రావణుడు ఎనభైవేల మంది రాక్షసులను పంపాడు. హనుమ వాళ్ళను చంపాడు. రావణుడు పంపిన జంబుమాలిని, ఏడుగురు మంత్రి పుత్రులను, ఐదుగురు సేనాపతులను, అక్షకుమారుణ్ణి హనుమ చంపాడు. చివరకు రావణుడు తన కుమారుణ్ణి ఇంద్రజిత్తును పంపాడు. ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రంతో హనుమను బంధించాడు. అది హనుమపై స్వల్పకాలమే పని చేసింది.

రాక్షసులు హనుమను రావణుని ముందు ప్రవేశపెట్టారు. హనుమ తాను రామదూతనని చెప్పి, రాముని పరాక్రమాన్ని చాటాడు. దూతను చంపడం తగదని రావణుని తమ్ముడు విభీషణుడు చెప్పడంతో, రావణుడు హనుమంతుని తోకకు నిప్పంటించి లంకలో తిప్పమన్నాడు. రాక్షసులు రావణుని తోకకు బట్టలు చుట్టి, నూనెతో తడిపి, నిప్పు ముట్టించి ” లంకానగరంలో ఊరేగించారు. హనుమ ఆకాశంలోకి ఎగిరి, విభీషణుని భవనం తప్పించి, మిగిలిన లంకంతా తగులబెట్టాడు.

తరువాత హనుమ లంకను అంటించి తాను తప్పు చేశానని, సీతామాత ఆ మంటలలో కాలిపోయిందేమో అని, సందేహించాడు. తన తోకను కాల్చని అగ్ని, సీతను దహింపదని చివరకు ధైర్యం తెచ్చుకున్నాడు. సీత క్షేమంగా ఉందని చారణుల ద్వారా తెలుసుకొని సంతోషించాడు. హనుమ సీత వద్దకు వెళ్ళి ఆమెను నమస్కరించి తిరుగు ప్రయాణం అయ్యాడు.

హనుమ ‘అరిష్టం’ అనే పర్వతాన్నుండి ఆకాశంలోకి ఎగిరాడు. మహేంద్రగిరికి చేరుతూ మహానాదం చేశాడు. జాంబవంతుడు ఆ ధ్వనిని విని హనుమ విజయం సాధించి వస్తున్నాడని వానరులకు చెప్పాడు.

హనుమ మహేంద్రగిరి చేరాడు. పెద్దలకు నమస్కరించాడు. ‘చూశాను సీతమ్మను’ అని చెప్పాడు. ప్రయాణ విషయాలు వారికి చెప్పాడు. అంగదుడు లంకకు వెళ్ళి, రావణుని చంపి సీతను తీసుకొని వచ్చి రాముని వద్దకు వెడదాం అన్నాడు. జాంబవంతుడు, అది సరికాదన్నాడు. రామసుగ్రీవులు సీతమ్మను చూసి రమ్మన్నారు. రాముడు రావణుని సంహరిస్తానని ప్రతిజ్ఞ చేశాడు. రామునికి విషయం తెలుపుదాం అన్నాడు.

దారిలో మధువనాన్ని వానరులు ధ్వంసం చేశారు. మధువనాన్ని రక్షిస్తున్న దధిముఖుడు, వానరుల చేతిలో దెబ్బతిని, ఆ విషయం సుగ్రీవుడికి చెప్పాడు. సుగ్రీవుడు ఇదంతా శుభసూచకంగా భావించాడు. అంగద హనుమదాదులు సుగ్రీవుల దగ్గరకు వెళ్ళారు. హనుమ, రాముడికి నమస్కరించి ‘చూశాను సీతమ్మను’ అని చెప్పి, సీత ఇచ్చిన చూడామణిని రాముడికి ఇచ్చి సీతాన్వేషణ వృత్తాంతాన్ని రామునకు వివరించాడు.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 4 కిష్కింధ కాండ

ప్రశ్న 8.
లంకా దహనం వర్ణించండి.
జవాబు:
సీతాదేవి దర్శనంతో ప్రధాన కార్యం ముగిసింది హనుమంతునికి. రావణుడు, అతని సైన్యపు. శక్తి సామర్థ్యాలను కూడా తెలుసుకోవాలనిపించింది. అందుకు అశోకవనాన్ని ధ్వంసం చేయడమే మార్గంగా భావించాడు. అనుకున్నంతా చేశాడు. ఆ కపివీరుడు. రాక్షస స్త్రీలు పరుగుపరుగున వెళ్ళి లంకేశునికీ విషయం చెప్పారు. రావణుడు ఎనభై వేల మంది రాక్షసులను ఈ పంపాడు. హనుమంతుడు వాళ్ళను మట్టుపెట్టాడు. తనపైకి వచ్చిన జంబుమాలిని, మంత్రిపుత్రులేడుగురిని రావణుడి సేనాపతులైదుగురిని, అక్షకుమారుణ్ణి అంతమొందించాడు. చివరకు ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి హనుమంతుణ్ణి బంధించాడు. బ్రహ్మవరంచేత అది హనుమంతునిమీద క్షణకాలమే పనిచేస్తుంది. అయినా తాను దానికి కట్టుబడి ఉన్నట్లు నటించాడు హనుమంతుడు. రావణుని ముందు ప్రవేశపెట్టారతన్ని. రావణుడడుగగా తాను రామదూతనని చెప్పాడు. శ్రీరాముని పరాక్రమమెలాంటిదో సభాముఖంగా చాటాడు. సహించలేని రావణుడు హనుమంతుణ్ణి చంపమని ఆజ్ఞ ఇచ్చాడు. దూతను చంపడం భావ్యం కాదన్నాడు విభీషణుడు. ఇతర పద్ధతుల్లో దూతను దండించవచ్చునన్నాడు.

హనుమంతుని తోకకు నిప్పంటించి లంకంతా కలయ దిప్పమన్నాడు రావణుడు. బట్టలతో హనుమంతుని తోకను చుట్టారు. నూనెతో తడిపారు. తోకకు నిప్పు పెట్టి ఊరంతా ఊరేగిస్తున్నారు. హనుమంతుడు ఒక్కసారిగా ఆకాశంలోకి ఎగిరాడు. విభీషణుని భవనం తప్ప లంకంతా నిప్పుపెట్టాడు. అందుకే ‘(సీతను) చూసిరమ్మంటే (లంకను) కాల్చివచ్చాడని’ సామెత
పుట్టింది. లంకలో హాహాకారాలు మిన్నుముట్టాయి.

AP Board 5th Class EVS Solutions 2nd Lesson Climate Change

Andhra Pradesh AP Board 5th Class EVS Solutions 2nd Lesson Climate Change Textbook Exercise Questions and Answers.

AP State Syllabus 5th Class EVS Solutions Chapter 2 Climate Change

I. Conceptual Understanding:

Question 1.
What is climate?
Answer:
The weather conditions such as temperature, rainfall etc., prevailing in an area is called climate.

Question 2.
What are the effects we face due to climate change?
Answer:
Effects of climate change:-

  1. Due to climatic changes we do not get timely rainfall which leads to drought.
  2. Heavy cyclones, Tsunamis may occur.
  3. Melting of ice in the polar region leads to rise in ocean level and place near the seashore may be sub merged.
  4. The waters in the sea is getting warmer which leads to the death of aquatic plants and animals.

AP Board 5th Class EVS Solutions 2nd Lesson Climate Change

Question 3.
What are the reasons for climate change?
Answer:
Reasons for climate change:-

  1. Deforestation (cutting trees) for buildings
  2. Usage of large no. of vehicles leads to air pollution.
  3. Release of harmful chemicals, sewage in water.
  4. Usage of plastic in large quantity which do not degrade.
  5. Indiscriminate use of the natural resources such as water, coal, petrol are the main reasons for climate change.

II. Questioning and Hypothesis:

Question 4.
In your village, people are suffering from drought can you guess the reasons?
Answer:
In our village, people are suffering from drought: I feel that the following may be the reasons for drought.

  1. Due to not getting timely rainfall because of climatic changes.
  2. Climatic changes arise due to human activities like deforestation, releasing harmful gases into the atmosphere, usage of plastic etc. Which leads to soil, water and air pollution.

AP Board 5th Class EVS Solutions 2nd Lesson Climate Change

III. Experiments and field observations:

Question 5.
Observe the process used for disposing of garbage at your home and make a report?
Answer:

  1. We will keep seperate containers for wet and dry wastes in the kitchen.
  2. Keep two bags for dry waste collection i.e for paper and plastic etc., and for rest of the house hold waste.
  3. Send wet waste out of the home daily

IV. Information Skills & Project Work:

Question 6.
Collect information about families who are using steel glass instead of plastic water bottles.
Answer:
Students activity .

V. Drawing Pictures and Model Making:

Question 7.
Make a pen stand, flowervase etc by using a plastic water bottle.
Answer:
Student activity.

AP Board 5th Class EVS Solutions 2nd Lesson Climate Change

VI. Appreciation, values, application to dialy life, biodiversity:

Question 8.
Prepare some slogans on ‘Save Environment’.
Answer:
Slogans:

  1. Save nature – Save future
  2. Save trees – Save life
  3. Save the earth – Save ourselves
  4. Do your share for cleaner air
  5. Conserve what our children deserve.

Additional Questions:

I. Conceptual Understanding:

Question 1.
What is our role in saving the plants?
Answer:

  1. We should not cut the trees.
  2. We should grow plants in the place available in our house,street, school etc.,
  3. We must use tree guards to save the trees.

Question 2.
What is global warming? Which causes global warming?
Answer:
Global warming :- It is the rise of the average temperature of the earth’s climate system.
Causes:-

  1. Indiscriminate usage of natural gases such as water, coal petrol etc.
  2. Human activites like emission of green house gases like carbon dioxide and methane from factories and vehicles.
  3. Deforestation (cutting trees).

AP Board 5th Class EVS Solutions 2nd Lesson Climate Change

II. Appreciation:

Question 3.
What is eco-friendly? What do you do to encourage eco friendly ?
Answer:
Eco-friendly means not harmful to the envirounment:
My contribution towards eco-friendly is:

  1. I use carry bags made up of paper, jute or cloth.
  2. I use seperate garbage into dry waste and wet waste.
  3. I use stainless steel glasses or bottles instead of plastic bottles.
  4. I use kitchen wastes as manure.
  5. I do not waste paper.
  6. I will plant trees.
  7. During festivals I use only eco-friendly idols,colours and all other materials.

Question 4.
What is ” chipko” movement? Who initiated it?
Answer:
In 1970’s an orgaized resistance to the destruction of forest spread throught out India by the villagers in such a way ” Villagers hugged the trees, and pre vented the contractors from cutting them’. This is known as chipko movement. Sundarlal Bahuguna, an environmentalist initiated the ‘Chipko Movement’.

AP Board 5th Class EVS Solutions 2nd Lesson Climate Change

Multiple Choice Questions:

Choose the correct answer:

Question 1.
The weather conditions prevailing in an area is called _______.
A) rain
B) drought
C) climate
D)none
Answer:
C) climate

Question 2.
Which of the following are the effects of climate change.
A) floods
B) melting of ice
C) forest fires
D) all
Answer:
D) all

Question 3.
The weather of a place depends on which of the following factors.
A) humidity
B) temperture
C) air pressure
D) rainfall
E) All
Answer:
E) All

AP Board 5th Class EVS Solutions 2nd Lesson Climate Change

Question 4.
_______ are the lungs of the earth.
A) forest
B) climate
C) rains
D) none
Answer:
A) forest

Question 5.
_______ maintain ecological balance and prevent soil erosion.
A) rivers
B) trees
C) atmosphere
D) none
Answer:
B) trees

Question 6.
_______ is a Swedish environmental activitst. Who created awareness on climate change in UNCCC.
A) Greta Thumberg
B) Sundarlal Bahuguna
C) Both
D) None
Answer:
A) Greta Thumberg

AP Board 5th Class EVS Solutions 2nd Lesson Climate Change

Question 7.
_______ initiated the ‘Chipko movement’.
A) Greta thumberg
B) Sundarlal Bahuguna
C) Both
D) None
Answer:
B) Sundarlal Bahuguna

Question 8.
Paper is made up of _______.
A) leaves
B) tree pulp
C) flour
D) none
Answer:
B) tree pulp

Question 9.
‘Chipko movement’ name comes from the word _______.
A) chip
B) embrace
C) both
D) none
Answer:
B) embrace

AP Board 5th Class EVS Solutions 2nd Lesson Climate Change

Question 10.
Say no to _______ which do not degrade.
A) trees
B) paper
C) plastic
D)none
Answer:
C) plastic

AP Board 5th Class EVS Solutions 6th Lesson నీరు ఎంతో విలువైనది

Andhra Pradesh AP Board 5th Class EVS Solutions 6th Lesson నీరు ఎంతో విలువైనది Textbook Exercise Questions and Answers.

AP State Syllabus 5th Class EVS Solutions Lesson 6 నీరు ఎంతో విలువైనది

I. విషయావగాహన:

ప్రశ్న 1.
నదుల వలన ఉపయోగాలలేవి ?
జవాబు:
నదుల వలన ఉపయోగాలు :

  1. వ్యవసాయానికి కావలసిన నీటి సరఫరాకు.
  2. త్రాగునీరుకు గాను
  3. రవాణా మార్గము గాను
  4. జలవిద్యుత్ను ఉత్పత్తి చేస్తుంది.
  5.  జల విహారం మరియు ఈత కొట్టుటకు ఉపయోగపడును.

ప్రశ్న 2.
కృష్ణానది ఉపనదులేవి?
జవాబు:
భీమ, గాయత్రి, ఘటప్రభ, కోయన, మలప్రభ, మున్నేరు, నిరపాలెం, పంచగంగ, తుంగభద్ర, వేమన, వ్యర నదులు కృష్ణానదికి ఉపనదులు.

ప్రశ్న 3.
నీటి కాలుష్యం గురించి క్లుప్తంగా రాయండి.
జవాబు:
మానవులు చేసే వివిధ పనులవల్ల నీటి కాలుష్యం ఔతుంది. పరిశ్రమల వ్యర్థాలు, పాల పరిశ్రమలు, వ్యవసాయ వ్యర్ధాలు, బొగ్గు విద్యుత్ కేంద్రం నుంచి వచ్చే వ్యర్ధాలన్నీ నదులలోకి నేరుగా విడుదల చేయటం వల్ల నది నీరు కలుషితమగును. అట్టి నీరు త్రాగటానికి పనికిరాదు. ఆ నీటి వల్ల జలచరాలు జీవాన్ని కోల్పోతాయి. కలరా, టైఫాయిడ్, కామెర్లు, మలేరియా వంటి వ్యాధులు ప్రబలుతాయి.

AP Board 5th Class EVS Solutions 6th Lesson నీరు ఎంతో విలువైనది

II. ప్రశ్నించడం – పరికల్పనలు చేయడం:

ప్రశ్న 4.
నదులు ఎండిపోవటానికి కారణాలేంటి?
జవాబు:

  1. ప్రధానంగా వాతావరణ మార్పులు నదులు ఎండిపోవటానికి కారణం.
  2. డామ్ నిర్మాణం
  3. నదులలో నీటిని వ్యవసాయానికి వాడటం వల్ల నదులు ఎండిపోతాయి. .

III. ప్రయోగాలు – క్షేత్ర పరిశీలనలు:

ప్రశ్న 5.
వివిధ నీటి వనరులు నుంచి నీటిని సేకరించి ఏ నీరు త్రాగటానికి అనుకూలంగా ఉందో చర్చించండి.
జవాబు:
విద్యార్థి కృత్యము.

IV. సమాచార నైపుణ్యాలు – ప్రాజెక్టుల పని:

ప్రశ్న 6.
కరువులు, వరదలకు ప్రజలు ఏవిధంగా ప్రభావితమయ్యారో పెద్దవాళ్ళ నుంచి పమాచారాన్ని సేకరించండి.
జవాబు:

  1. పంట పొలాలు పంటలు పండుటకు పనికి రాకుండాపోతాయి.
  2. పశువులు త్రాగటానికి, వ్యవసాయానికి నీరు లభ్యమవదు.
  3. అది కరువుకు, పశునష్టానికి దారితీస్తుంది.
  4. చాలా వ్యవసాయాధార కుటుంబాలు జీవనాధారం లేక వలసపోతారు.

V. బొమ్మలు గీయడం – నమునాలు తయారు చేయడం:

ప్రశ్న 7.
నీటిని ఎలా పొదుపు చేస్తామో పోస్టర్‌ను తయారు చేసి మీ తరగతి గదిలో ప్రదర్శించండి.
జవాబు:
విద్యార్థి కృత్యము.

AP Board 5th Class EVS Solutions 6th Lesson నీరు ఎంతో విలువైనది

VI. ప్రశంస:

ప్రశ్న 8.
నదుల కాలుష్యం నివారణపై కొన్ని నినాదాలు రాయండి.
జవాబు:

  1. ” నిర్మలంగా ఆలోచించండి – పచ్చదనం వైపు పయనించండి”.
  2. ” మీ నీటిని మార్చండి – జీవితాన్ని మార్చుకోండి”.
  3. ” మీరు. కాలుష్యం చేసే నీరు తిరిగి మీపై ప్రభావం చూపుతుంది”.

అదనపు ప్రశ్నలు:

I. విషయావగాహన:

ప్రశ్న 1.
ఆనకట్టలు అనగానేమి? వాటి ప్రయోజనాలేవి?
జవాబు:
జలాశయాలలో నీటిమట్టం పెంచటానికి నదీ వాలుకి అడ్డుగా నీటిని నిల్వ ‘చేయుటకు నిర్మించబడిన అడ్డుకట్టను “ఆనకట్ట” అంటారు. ప్రయోజనాలు : –

  1. త్రాగటానికి, నీటి పారుదలకు, విద్యుత్ ఉత్పత్తి మొదలైన వాటికి , ఉపయోగపడతాయి.
  2. వరదల నియంత్రణ, వ్యర్థాల నిర్వహణ, అనేక జంతువులకు ఆవాసంగా జల విహారంకు, ఈత కొట్టుటకు ఉపయోగపడతాయి.

ప్రశ్న 2.
కృష్ణానది గురించి వ్రాయండి?
జవాబు:

  1. భారతదేశంలోని పొడవైన నదులలో కృష్ణానదిది నాల్గవ స్థానం.
  2. ఇది మహారాష్ట్ర పశ్చిమ కనుమల్లో మహాబలేశ్వరంలో జన్మించింది.
  3. దీని పొడవు 1400 కిలోమీటర్లు.
  4. ఇది మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గుండా ప్రవహించి చివరగా కృష్ణాజిల్లా హంసల దీవి వద్ద సముద్రంలో (బంగాళాఖాతం) లో కలుస్తుంది.
  5. దీని ఉపనదులు భీమ, గాయత్రి, ఘటప్రభ, మలప్రభ, మున్నేరు పంచగంగ, తుంగభద్ర మొ||వి.

AP Board 5th Class EVS Solutions 6th Lesson నీరు ఎంతో విలువైనది

II. మాపింగ్ నైపుణ్యం:

ప్రశ్న 3.
ఆంధ్రప్రదేశ్ పటం చూసి క్రింది పట్టికను పూరించండి.

AP Board 5th Class EVS Solutions 6th Lesson నీరు ఎంతో విలువైనది 1

జవాబు:
విద్యార్థి కృత్యము.

III. ప్రయోగాలు – క్షేత్ర పరిశీలనలు:

ప్రశ్న 4.
మునగటం – తేలడం ప్రయోగం. ఇది చేసి కనుక్కొందాం.
జవాబు:

  • ఒక కుండ లేదా ‘బకెట్’ కొంత నీటితో నింపండి.
  • కింద ఇచ్చిన జాబితా. ప్రకారం వస్తువులు సేకరించండి.
  • నీటిలో ఒక్కొక్కటి వేసి గమనించండి.
  • నీటిలో వేసే ముందు వస్తువు నీటిలో మునుగుతుందో తేలుతుందో ఊహించండి. కింది పట్టికలో రాయండి.

జవాబు:
విద్యార్థి కృత్యము.

AP Board 5th Class EVS Solutions 6th Lesson నీరు ఎంతో విలువైనది 2

AP Board 5th Class EVS Solutions 6th Lesson నీరు ఎంతో విలువైనది

బహుళైచ్ఛిక ప్రశ్నలు:

సరియైన సమాధానాలను గుర్తించండి:

ప్రశ్న 1.
నీటిని నిల్వ చేయుటకు …………………… ను నిర్మిస్తారు.
(A) ఆనకట్ట
(B) రిజర్వా యర్
(C) A మరియు B
(D) ఏదీకాదు
జవాబు:
(C) A మరియు B

ప్రశ్న 2.
కృష్ణానది జన్మస్థానం మహారాష్ట్రలోని ……………………
(A) బోంబే
(B) పూసే
(C) మహాబలేశ్వరం
(D) షిరిడీ
జవాబు:
(C) మహాబలేశ్వరం

ప్రశ్న 3.
ఈ క్రింది వాటిలో మానవ జీవితంపై దుష్ప్రభావాన్ని చూ పే ……………………
(A) కరువు
(B) క్షామం
(C) వరదలు
(D) పైవన్నీ
జవాబు:
(D) పైవన్నీ

AP Board 5th Class EVS Solutions 6th Lesson నీరు ఎంతో విలువైనది

ప్రశ్న 4.
నీటి వనరులకు ముఖ్య మైన జలవనరు ……………………
(A) వర్షం
(B) నది
(C) కొలను
(D) టాంక్
జవాబు:
(A) వర్షం

ప్రశ్న 5.
సఆర్థర్ కాటన్ బారేజ్ ఏ నదిపై, ఎచ్చట నిర్మించారు.
(A) గోదావరి, విజయవాడ
(B) గోదావరి, ధవళేశ్వరం
(C) క్రిష్ణా, ధవళేశ్వరం
(D) క్రిష్ణా, విజయవాడ
జవాబు:
(B) గోదావరి, ధవళేశ్వరం

ప్రశ్న 6.
…………………… ఒక పెద్ద బహుళార్థ సాధక ప్రాజెక్టు.
(A) నాగార్జున సాగర్ డామ్
(B) ప్రకాశం బారేజ్
(C) ధవళేశ్వరం
(D) ఏదీకాదు
జవాబు:
(A) నాగార్జున సాగర్ డామ్

AP Board 5th Class EVS Solutions 6th Lesson నీరు ఎంతో విలువైనది

ప్రశ్న 7.
…………………… సం||లో నాగార్జున సాగర్ డ్యాం నిర్మించారు.
(A) 1962
(B) 1967
(C) 1954
(D) ఏదీకాదు
జవాబు:
(B) 1967

ప్రశ్న 8.
నాగార్జునసాగర్ కుడి కాలువ, ఎడమ కాలువ పేర్లు వరుసగా ……………………
(A) జవహార్ కాలువ, లాల్ బహదూర్ కాలువ
(B) లాల్ బహదూర్ కాలువ, జవహార్ కాలువ
(C) కుడి కాలువ, జవహార్ కాలువ
(D) ఏదీకాదు
జవాబు:
(A) జవహార్ కాలువ, లాల్ బహదూర్ కాలువ

ప్రశ్న 9.
ప్రకాశం బ్యా రేజ్ ఏ నదిపై నిర్మించిరి ……………………
(A) గోదావరి
(B) పెన్నా
(C) కృష్ణా
(D) ఏదీకాదు
జవాబు:
(C) కృష్ణా

AP Board 5th Class EVS Solutions 6th Lesson నీరు ఎంతో విలువైనది

ప్రశ్న 10.
ఉమ్మడి ఆంధ్రరాష్ట్ర ముఖ్యమంత్రి ……………………
(A) కందుకూరి వీరేశలింగం
(B) టంగుటూరి ప్రకాశం
(C) గాంధీ
(D) ఎవరూకాదు
జవాబు:
(B) టంగుటూరి ప్రకాశం

AP Board 5th Class EVS Solutions 5th Lesson Agriculture

Andhra Pradesh AP Board 5th Class EVS Solutions 5th Lesson Agriculture Textbook Exercise Questions and Answers.

AP State Syllabus 5th Class EVS Solutions Lesson 5 Agriculture

I. Conceptual Understanding:

Question 1.
What is cultivation?
Answer:
Cultivation is the process of caring for or raising plants. It is an agriculture practice, involving the production of food by preparing the land to grow crops on a large scale.

Question 2.
Is it good to use chemical fertilizers and pesticides? Why?
Answer:
It is not good to use chemical fertilizers and pesticides. Indiscriminate use of chemical fertilizers and pesticides causes diseases like cancer. It is also harmful to the environment.

Question 3.
What are the advantages of preserving food grains?
Answer:

  1. By preserving food grains we can use them throughout the year.
  2. We can use these grains as a surplus to earn money.
  3. We can use them when there is scarcity in future.

AP Board 5th Class EVS Solutions 5th Lesson Agriculture

II. Questioning and Hypothesis:

Question 4.
What questions would you ask a farmer in our village to know about paddy cultivation?
Answer:

  1. What are the steps involved in cultivation?
  2. Do the process of cultivation same for different crops like paddy, cotton, mango?
  3. Which tools are used by farmers in cultivation?
  4. What precautions we should take to get good yield?

III. Experiments and field observations:

Question 5.
Sow the seeds of coriander or fenugreek nut in your garden at home. Observe the growth of the plants for two weeks. Measure and record the height of the plant in your note book.
Answer:
Student activity.

IV. Information Skills & Project Work:

Question 6.
Meet some farmers in your locality and collect the following information and fill the table?

AP Board 5th Class EVS Solutions 5th Lesson Agriculture 1

Answer:
Student activity.

V. Drawing Pictures and Model Making:

Question 7.
Draw and label life cycle of butterfly and frog.
Answer:

AP Board 5th Class EVS Solutions 5th Lesson Agriculture 2

AP Board 5th Class EVS Solutions 5th Lesson Agriculture 3

AP Board 5th Class EVS Solutions 5th Lesson Agriculture

VI. Appreciation:

Question 8.
Grow micro greens of green gram, mustard, black gram, millets, sesame etc., in paper cups and prepare delicious food items with the help of your mother.
Answer:
Students activity.

Question 9.
Persons and institutions behind the rice we eat in the given format.

AP Board 5th Class EVS Solutions 5th Lesson Agriculture 4

Answer:

AP Board 5th Class EVS Solutions 5th Lesson Agriculture 5

Students activity.

AP Board 5th Class EVS Solutions 5th Lesson Agriculture

Additional Questions:

Question 1.
What are the steps involved in cultivation of paddy?
Answer:
Steps involved in cultivation of paddy :

  1. Prepare field for cultivation by ploughing.
  2. Watering & leveling the field.
  3. Planting seedlings.
  4. Water frequently.
  5. Supply nutrients through compost and fertilizers .
  6. Preventing crops from diseases by using pesticides.
  7. Harvesting paddy.
  8. Paddy dried, grains are separated from the straw by threshing.
  9. Separation of husk by winnowing.
  10. Paddy packed in gunny bags and stored in godowns.

Question 2.
What are the methods used for supply of water to the fields?
Answer:
The supply of water to the fields for cultivation are four types.

  1. Field irrigation : Supply of water to the field when rainfall is not enough.
  2. Furrow irrigation : Furrows and trenches are dug in the field and water is supplied through channels.
  3. Srinkler irrigation: Supply water in a controlled manner in a way similar to rainfall.
  4. Drip irrigation : Water pipes have holes throw which water drips in the soil.

AP Board 5th Class EVS Solutions 5th Lesson Agriculture

Question 3.
Name some tools used in agriculture?
Answer:
Plough, Grape hoe, Rake. Sickle, are the tools used for agriculture.

Question 4.
What is orgainc farming and what are its advantages?
Answer:
Organic farming is a method of crop and livestock production that involves natural and conventional ways of farming. In this process organic manures such as cattle waste, vermicompost, oil cakes and biological wastes are used.

Advantages:-
Reduce pollution, conserve water, reduce soil erosion, increase soil fertility and use less energy.

Question 5.
Draw the life cycle of rice plant?
Answer:

AP Board 5th Class EVS Solutions 5th Lesson Agriculture 6

Question 6.
Arrange the stages of cultivation in a sequential order?

AP Board 5th Class EVS Solutions 5th Lesson Agriculture 7

Answer:
Students activity.

AP Board 5th Class EVS Solutions 5th Lesson Agriculture

Choose the correct answer:

Question 1.
We should eat ________ food.
A) healthy
B) ill-healthy
C) a & b
D) none
Answer:
A) healthy

Question 2.
________ gives us energy & health.
A) Field
B) Work
C) Food
D) None
Answer:
C) Food

Question 3.
Baby frog is ________.
A) frog
B) tadpole
C) caterpiller
D) none
Answer:
B) tadpole

Question 4.
Orgainc fanning is called ________.
A) artifical farming
B) zero budget natural farming
C) fanning
D)none
Answer:
B) zero budget natural farming

Question 5.
Usage of pesticides is harmful to the ________.
A) plants
B) crops
C) pollution
D)none
Answer:
C) pollution

AP Board 5th Class EVS Solutions 5th Lesson Agriculture

Question 6.
________ is the major food crop in Andhra pradesh.
A) Rice
B) Wheat
C) Maize
D) Pulses
Answer:
A) Rice

Question 7.
________ % of people main occupation is agriculture.
A) 60%
B) 62%
C) 70%
D) 40%
Answer:
B) 62%

Question 8.
India is the ________ largest producer of rice wheat.
A) first
B) second
C) third
D) none
Answer:
B) second

Question 9.
________ gives us energy.
A) Carbohydrates
B) Proteins
C) Minerals
D) None
Answer:
A) Carbohydrates

AP Board 5th Class EVS Solutions 5th Lesson Agriculture

Question 10.
The food contains all nutrients in correct proportion is called ________.
A) Balanced diet
B) diet
C) food
D)none
Answer:
A) Balanced diet

AP Board 5th Class Maths Solutions 9th Lesson Measurements

Andhra Pradesh AP Board 5th Class Maths Solutions 9th Lesson Measurements Textbook Exercise Questions and Answers.

AP State Syllabus 5th Class Maths Solutions Chapter 9 Measurements

Do these: (TextBook page No.147)

Question 1.
Guess the distance between any two dots. Repeat for other dots also. Check by measuring the same with scale.
Answer:

AP Board 5th Class Maths Solutions 9th Lesson Measurements 1

\(\overline{\mathrm{AB}}\) = 3 cm ; \(\overline{\mathrm{PQ}}\) = 4 cm.

Question 2.
Identify and write farthest two dots. Identify nearest to each other.

AP Board 5th Class Maths Solutions 9th Lesson Measurements 2

Answer:
Points A and B are nearest to each other.
Points D and J are farthest to each other.

AP Board 5th Class Maths Solutions 9th Lesson Measurements

Question 3.
Draw another pencil longer by one cm than the given one.

AP Board 5th Class Maths Solutions 9th Lesson Measurements 3

Answer:

AP Board 5th Class Maths Solutions 9th Lesson Measurements 4

Question 4.
Draw a water bottle 1 cm shorter to this.

AP Board 5th Class Maths Solutions 9th Lesson Measurements 5

Answer:

AP Board 5th Class Maths Solutions 9th Lesson Measurements 6

AP Board 5th Class Maths Solutions 9th Lesson Measurements

Do this: (TextBook Page No.149)

Give some examples which we have to measure only in millimetres.
Answer:
1. Peanut
2. Baby potatoes
3. Diameter of water pipe etc.

Try this: (TextBook Page No.149)

Find the thickness of your writing pad.
Answer:
Thickness of my writing pad is 3 mm.

Exercise 1:

A) Find the sum of the following.

Question 1.
7 cm + 5 mm + 9 cm 6 mm
Answer:
1) 7 cm 5 mm + 9 cm 6 mm
= 7 × 10 mm + 5 mm + 9 × 10 mm + 6 mm
= 70 + 5 + 90 + 6 = 171 mm

Question 2.
82 cm 8 mm + 92 cm 2mm
Answer:
82 cm 8 mm + 92 cm 2 mm
= 82 × 10 mm + 8 mm + 92 × 10 mm + 2 mm
= 820 + 8 + 920 + 2
= 828 + 922 = 1750 mm

B) Subtract the following.

Question 1.
26 cm 4 mm from 43 cm 3 mm

Answer:

AP Board 5th Class Maths Solutions 9th Lesson Measurements 7

Question 2.
87 cm 6 mm from 91 cm 9 mm
Answer:

AP Board 5th Class Maths Solutions 9th Lesson Measurements 8

AP Board 5th Class Maths Solutions 9th Lesson Measurements

C) Multiply the following.

Question 1.
18 cm 6 mm × 5
Answer:
1) 18 cm 6 mm × 5 = 180 + 6
= 186 × 5 = 930 mm

Question 2.
54 cm 3 mm × 23
Answer:
54 cm 3 mm × 23 = 540 + 3
= 543 × 23 = 12,489 mm

D. Solve the following problems.

Question 1.
Rad said “the length of my finger nail is 5 cm and the length of my finger is 7mm”. Is he correct ? Give reasons.
Answer:
No, Rafi was wrong.
Reason : Finger is longer than nail.

Question 2.
Gouse measured the length of his compass box as 12 cm 5 mm. Babu said that the length of his box is 2 cm 5 mm more than that. Find Babu’s box length.
Answer:
Length of Gouse compass box = 12 cm 5 mm
Babu said that the length of his box is 2 cm 5 mm more than that.
Length of Babu’s box = 12 cm 5 mm + 2 cm 5 mm
= 14 cm + 10 mm = 15 cm.

Question 3.
Madhavi made a garland with a length of 80 cm. Later she added to 60 cm garland piece to that. Find Babu’s box length.
Answer:
Length of garland at first time = 80 cm
Length of garland at second time = 60 cm
Total length of garland at Madhavi = 140 cm

AP Board 5th Class Maths Solutions 9th Lesson Measurements 9

AP Board 5th Class Maths Solutions 9th Lesson Measurements

Question 4.
Mythili broke a pencil with a length of 18 cm into tw o pieces. If the length of one piece is 8 cm 5mm, find the length of the other piece.
Answer:
Actual length of pencil = 18 cm – 00 mm
Length of one piece of pencil = 8 cm – 50 mm

AP Board 5th Class Maths Solutions 9th Lesson Measurements 10

Remaining length of pencil = 9 cm – 5 mm.

Question 5.
While drawing a line segment with a length of 12 cm, Seenu has drawn upto 8 cm 7 mm. Find the remaining part to be drawn has to be extend ?
Answer:
Required length of line segment = 12 cm – 00 mm
Drawn length of line segment = 8 cm – 07 mm

AP Board 5th Class Maths Solutions 9th Lesson Measurements 11

Remaining part to be drawn = 3 cm – 3 mm.

Question 6.
Kodanda solved the problem like this. Which process has he adopted to solved ?

AP Board 5th Class Maths Solutions 9th Lesson Measurements 12

Answer:
Kodanda followed a subtraction process which is in cm and mm.

Question 7.
Sunitha estimated the length of one seed as 6 mm. Ramija said if one seed length is 6 mm then the length of 4 seeds is 24 mm. How did Ramija say that ?
Answer:
Length of one seed = 6 mm
Length of 4 seeds = 24 mm
Ramija followed multiplication process = 6 × 4 = 24 mm

Question 8.
Suraj observed 12 caterpillars moving in a row. He estimated the length of one caterpillar as 3.5 cm. What will be the length of the row ? (Estimate)
Answer: Length of one caterpillar = 3.5 cm
Number of caterpillars in a row = 12
Length of the row = 12 × 3.5 = 42 cm (approximately)

Question 9.
The length of a safety pin is 2 cm. Mary wants to measure 18 cm length by using the safety pin. How many times should she count by moving it in a straight line ?
Answer:
Length of a safety pin = 2 cm
Want to measure the length = 18 cm
Number of times she wants to move the pin = 18 ÷ 2 = 9 times.

AP Board 5th Class Maths Solutions 9th Lesson Measurements

Exercise 2:

A) Add the following:

Question 1.
10 m 75 cm and 6 m 65 cm
Answer:

AP Board 5th Class Maths Solutions 9th Lesson Measurements 13

Question 2.
85 m 23 cm and 68 m 79 cm
Answer;

AP Board 5th Class Maths Solutions 9th Lesson Measurements 14

B) Subtract the following.

Question 1.
10 m 15 cm from 25 m 25 cm
Answer:

AP Board 5th Class Maths Solutions 9th Lesson Measurements 15

Question 2.
64m 45 cm from 100 m
Answer:

AP Board 5th Class Maths Solutions 9th Lesson Measurements 16

AP Board 5th Class Maths Solutions 9th Lesson Measurements

C) Multiply the following:

AP Board 5th Class Maths Solutions 9th Lesson Measurements 17

D) Divide the following:

Question 1.
40 m 8 cm ÷ 16
Answer:
4080 ÷ 16

AP Board 5th Class Maths Solutions 9th Lesson Measurements 18

∴ 2 m – 55 cm.

Question 2.
100 m 75 cm ÷ 25
Answer:
10075 ÷ 12

AP Board 5th Class Maths Solutions 9th Lesson Measurements 19

∴ 4 m – 03 cm.

Question 3.
337 m 5 cm ÷ 5
Answer:
33705 ÷ 5

AP Board 5th Class Maths Solutions 9th Lesson Measurements 20

∴ 6 m – 75 cm.

AP Board 5th Class Maths Solutions 9th Lesson Measurements

E) Solve the following problems.

Question 1.
Bash a tied two stick with the lengths of 2m 50cm and 1m 75cm to pluck a mango from a tree. Find the approximate length of the stick he made?
Answer:
Length of first stick = 2m 50cm
Length of second stick = 1m 75cm
Length of total stick = 4m 25cm

AP Board 5th Class Maths Solutions 9th Lesson Measurements 21

Approximately length is 4 m.

Question 2.
Class 5 students joined two ropes with the lengths of 2 m 75 cm and 3m 75 cm to play tug of war. What is the approximate length of rope they prepared?
Answer:
Length of one rope = 2 m 75 cm
Length of second rope = 3 m 75 cm
Length of two ropes = 6 m 50 cm

AP Board 5th Class Maths Solutions 9th Lesson Measurements 22

Approximately length = 7 m.

Question 3.
Class 5 children purchased 45 m colour paper roll to decorate their school on Independence day. They used 43 m 50 cm roll. How much length of roll was remaining?
Answer:
Actual length of paper roll = 45m
Length of used paper roll = 43 m 50 cm
Remaining paper roll = 1 m 50 cm

AP Board 5th Class Maths Solutions 9th Lesson Measurements 23

Question 4.
Kiran, an electrician used 45 m 70 cm length of electric wire from 50 metre roll for wiring a house. How much length of wire is left with him ?
Answer:
Length of electric wire roll = 50 m
Used length of electic wire roll = 45 m 70 cm
Length of left eletric wire = 4 m 30 cm

AP Board 5th Class Maths Solutions 9th Lesson Measurements 24

AP Board 5th Class Maths Solutions 9th Lesson Measurements

Question 5.
Kumar wants to stich a saree fall to a 6 m long saree. She has 5 m 50 cm length saree fall. What should be the length of the sareee left without saree fall ?
Answer:
Length of Saree = 6 m
Length of saree fall at Kumar = 5 m 50 cm
Length of saree without saree fall = 0 m 50 cm

AP Board 5th Class Maths Solutions 9th Lesson Measurements 25

Question 6.
David used 90 cm cloth to stitch a blouse. To stich 5 such blouses, how much length of cloth does she need ?
Answer:
Required length of cloth to stich a blouse = 90 cm
Required blouses = 5
Required length of cloth to stick 5 blouses = 5 × 90 = 450 cm

Question 7.
A Caterpillar covers 100 cm distance in a minute. How much distance does it cover in 15 minutes ?
Answer:
Distance covered by a caterpillar in a minute = 100 cm
In 15 mts it covers a distance = 15 × 100 = 1500 cm

Question 8.
Swamy shared 20 cm of chocolate bar to 4 members equally. How long will each piece be ?
Answer:
Length of chocolate bar = 20 cm
Sharing members = 4
Length of chocolate each one get = 20 ÷ 4 = 5 cm.

AP Board 5th Class Maths Solutions 9th Lesson Measurements

Question 9.
Aparna wants to cut 2m length of cloth pieces to make door curtains from 10 metre cloth. How many curtains can she make ?
Answer:
Length of cloth piece required to make one door curtain = 2 m
Total length of cloth = 10 m
Number of curtains she make by using total cloth = 10 ÷ 2 = 5

Exercise 3:

A) Do the following.

a) Convert 15 km 500 m into metres.
Answer:
15 km = 15 × 1000m = 15,000 m
15 km 500 m = 15,000 + 500 = 15,500 m

b) Convert 128 km to metres.
Answer:
128 km = 128 × 1000m = 1,28,000 m

c) Convert 12690 metres into kilometres.
Answer:
12690 metres = \(\frac{12690}{1000}\) = 12.690 km

d) Convert 18000 metres into kilometres.
Answer:
18000 meters = \(\frac{18,000}{1000}\) = 18 km.

B) Solve the following.

Question 1.
A boy comes to school on foot. He has to walk along the path of 400m beside a pond 350m green field and 450 metres road. How much distance has he covered to reach the school ? Is it more than 1 km ?
Answer:
Distance covered along the path of beside of pond = 400 m
Distance covered along the green field = 350 m
Distance covered along the road = 450 m
Distance covered totally = 1,200 m
Yes, it is more than 1 km.

AP Board 5th Class Maths Solutions 9th Lesson Measurements 26

Question 2.
Sitamma used 2.50 m bamboo piece to make a sieve and 1.5 m to make a vase. How much length of bamboo stick has she used to make the articles ?

AP Board 5th Class Maths Solutions 9th Lesson Measurements 27

Answer:
Length of bamboo price used to make a sieve = 2.50 m
Length of bamboo price to make a vase = 1 .50 m
Lngth of bamboo piece to make these articles = 4.00 m

AP Board 5th Class Maths Solutions 9th Lesson Measurements 28

AP Board 5th Class Maths Solutions 9th Lesson Measurements

Question 3.
Roshan travelled 540 km from Anantapur to Vijayawada via Kurnool. Rakesh travelled 520 km from Anantapur to Vijayawada via Nandyal. Who travelled more? By how many kilometres?
Answer:
Roshan travelled distance = 540 km
Rakesh travelled distance = 520 km
Difference = 20km

AP Board 5th Class Maths Solutions 9th Lesson Measurements 29

Roshan travelled more than by 20 km.

Question 4.
Andhra Pradesh Government sanctioned 5.650 km road to a village. The contractor covered 1.250 km. What distance is yet to be covered?
Answer:
Distance of sanctioned road = 5.650 km
Distance of contractor covered road = 1250 km

AP Board 5th Class Maths Solutions 9th Lesson Measurements 30

Distance yet to be covered 4.400 km.

Question 5.
Banu bought 5 metres of shirting cloth. She used 1.5 m for her elder son Raheem and 1.2 m for her younger son Kabeer. What is the length of shirting cloth left over?
Answer:
Bhanu used length of shirt cloth for Raheem 1.5 m
Bhanu used length of shirt cloth for Kabeer = 1.2 m
Bhanu used length of shirt cloth for both = 2.7 m

AP Board 5th Class Maths Solutions 9th Lesson Measurements 31

Lengthof shirt cloth bought by Bhanu = 5.00 m
Length of shirt cloth used by Bhanu = 2.70 m

AP Board 5th Class Maths Solutions 9th Lesson Measurements 32

Length of shirt cloth left over 2.30 m.

AP Board 5th Class Maths Solutions 9th Lesson Measurements

Question 6.
Three benches are arranged in a row. The length of each bench is 1m 15 cm. What is the length of the row?
Answer:
Length of each bench is = 1m – 15 cm
Number of benches for row = 3
Length of row = 3 × (1 m – 15 cm) = 3m – 45 cm

Question 7.
A train covers 50 km distance in an hour. How much distance does it cover in 12 hours if ¡t continues the same speed.

AP Board 5th Class Maths Solutions 9th Lesson Measurements 33

Answer:
Distance covered by train in an hour = 50 km
Total time = 12 hrs
Distance covered by train in 12 hrs = 50 × 12 = 600 km

Question 8.
Rangaiah wants to fence his field around 1500m. How many kilo metrres he has to fence?

AP Board 5th Class Maths Solutions 9th Lesson Measurements 34

Answer:
We know that required distance of fencing = 1500 m
1000 m = 1 km
∴ Number of km he has to fence = \(\frac{1500}{1000}\) = 1.5 km.

AP Board 5th Class Maths Solutions 9th Lesson Measurements

Question 9.
The diameter of Earth (distance from one side to the other side passing through the centre point) is 12742 km. Find its radius (radius is half of the diametre).
Answer:
Diameter of Earth = 12,742 km
Radius of Earth half of diameter
∴ Radius of Earth = 12742 ÷ 2 = 6,371 km.

Think & Discuss:

Question 1.
How long is the thread in a reel?
Answer:
The length of the thread in a reel depends on its size. It may be 50m, 100m, 200m, 500 m etc.

Question 2.
Can a kite reel be more than 1 km long?
Answer:
The length of the string of a kite reel depends upon its size. It may be 500 metres, 1000 metres etc.

Question 3.
Which height can a plane fly?
Answer:
A plane can fly approximately 35,000 mts.

AP Board 5th Class Maths Solutions 9th Lesson Measurements

Do this: (TextBook Page No.160)

Fill in the blanks with kilos or grams, (One ¡s done for you).

Question 1.
My friend weight is 38 ______.
Answer:
Kg.

Question 2.
A packet of rice weighs 50 ______.
Answer:
Kg

Question 3.
My pen weighs 20 ______.
Answer:
grams.

Question 4.
My school bag weighs 3.5 ______
Answer:
Kg

Question 5.
A tube of gum weighs 100 ______.
Answer:
gms

Question 6.
My empty water bottle weighs 7 ______
Answer:
grams

AP Board 5th Class Maths Solutions 9th Lesson Measurements

Do these: (TextBook Page No.161)

Question 1.
Convert the kilograms into grams.
(Note: 1 kilogram = 1000 grams)
1) 3 kilograms
2) 34 kilos
3) 17 kg 600 g
4) 38 kg 720 g
5) 89 kg 540 g
Answer:
1) 3 kg = 3 × 1000 = 3000 gms

2) 34 kilos = 34 × 1000 = 34,000 gms

3) 17 kg 600 g = 17 × 1000 + 600 = 17,600 gms

4) 38 kg 720 g = 38 × 1000 + 720 = 38,720 gms

5) 89 kg 540 g = 89 × 1000 + 540 = 89,540 gms.

Question 2.
Convert grams into kilograms.
1) 6000 g
2) 7090 g
3) 8069 g
4) 12405 g
5) 2418 g
Answer:
1) 6000 gms = \(\frac{6000}{1000}\) = 6 kgs

2) 7090 gms = \(\frac{7090}{1000}\) = 7.09 kgs

3) 8069 gms = \(\frac{8069}{1000}\) = 8.069 kgs

4)12405 gms = \(\frac{12405}{1000}\) = 12.405 kgs

5) 2418 gms = \(\frac{2418}{1000}\) = 2.418 kgs

Exercise 4:

Question 1.
Add the following:

a) 13 kg 420 g and 24 kg 600 g
b) 79 kg 969 g and 98 kg 327 g
Answer:
a) AP Board 5th Class Maths Solutions 9th Lesson Measurements 35

b) AP Board 5th Class Maths Solutions 9th Lesson Measurements 36

AP Board 5th Class Maths Solutions 9th Lesson Measurements

Question 2.
Subtract the following:
a) 235 kg 250 g from 355 kg 450 g
b) 21 kg 62 g from 160 kg 330 g
Answer:
a) AP Board 5th Class Maths Solutions 9th Lesson Measurements 37

b) AP Board 5th Class Maths Solutions 9th Lesson Measurements 38

Question 3.
Multiply the following:
a) 8 kg 750 g × 12
b) 475 kg × 16
c) 9850 g × 25
Answer:

AP Board 5th Class Maths Solutions 9th Lesson Measurements 39

Question 4.
Make the divisions.
a) 7500 kg ÷ 20
b) 6600 g ÷ 15
c) 150 kg 30 g ÷ 30
Answer:

AP Board 5th Class Maths Solutions 9th Lesson Measurements 40

AP Board 5th Class Maths Solutions 9th Lesson Measurements

Question 5.
Subbaiah harvested 120 kg ladiesfingers, 520 kg ridge gourds and 150 kg tomatoes. How much weight of vegetables has he yielded?
Answer:
Weight of ladies fingers = 120
Weight of Ridge gourds = 520
Weight of Tomatoes = 150

AP Board 5th Class Maths Solutions 9th Lesson Measurements 41

Weight of vegetables he yielded = 790 kgs.

Question 6.
Farhana purchased 2 kg 500 g laddoos 1 kg honey cake, 750 g jamoon and 500g jilebi. Ho much weight of sweets has she purchased?
Answer:
Weight of laddoos = 2 kg 500 g
Weight of honey = 1 kg
Weight of jamoon = 750 g
Weight of jilebi = 500 g

AP Board 5th Class Maths Solutions 9th Lesson Measurements 42

Weight of total sweets she purchased = 4 kg 750 g.

Question 7.
Helen buys a school bag that weighs 700 g. After keeping the class books ¡n her bag it weighs 3 kgs. Find the weight of the books.
Answer:
Weight of school bag along books = 3 kg
Weight of school bag without books = 700 g

AP Board 5th Class Maths Solutions 9th Lesson Measurements 43

∴ Weight of the books 2 kg 300 g.

AP Board 5th Class Maths Solutions 9th Lesson Measurements

Question 8.
Shafi purchases 22 kg idly ravva for his canteen. If he used 18 kg 500 g ravva in one day, how much ravva will be left with him ?
Answer:
Answer:
Weight of idli ravva purchase = 22 kg
Weight of idli ravva used = 18 kg 500 g

AP Board 5th Class Maths Solutions 9th Lesson Measurements 44

Weight of idli ravva left = 3 kg 500 g

Question 9.
Samson lifted 150 kg weight and Somi Reddy lifted 2 quintals. Who lifted heavier weights ? By much more weight ?
Answer:
Weight lified by Somi Reddy = 2 quintals = 2 × 100 = 200 kgs.
Weight lified by Samson = 150 kgs
Difference = 50kgs

AP Board 5th Class Maths Solutions 9th Lesson Measurements 45

Somi reddy lified 50 kgs heavier than Samson.

Question 10.
A worker in a biscuit factory has to pack 25.500 kg biscuits ¡n a carton. What will be the weight of 15 cartons of biscuits?
Answer:
Weight of biscuits in a carton = 25.500 kg
Number of cartons = 15
Total weight of 15 cartons = 15 × 25.500 = 382.50 kgs.

AP Board 5th Class Maths Solutions 9th Lesson Measurements

Question 11.
Sarala uses 50 g coffee powder in a week for household. How much coffee powder should Sarala buy for one month (approximately)
Answer:
Sarala uses coffee powder in a week = 50 g
Number of weeks in a month = 4
Total use ofcofïee per month = 4 × 50 g = 200 g.

Question 12.
Sarma packs food packets 550 g each. If he packs 20 such food packets. How much food has be packed?
Answer:
Weight of each food packet = 550 g
Number of food packets 20
Total food packed by Sarma = 550 × 20 = 11,000 g

Question 13.
A piece of wood weighs 24 kg. The wood cutter wants three equal pieces from it. How much weight each piece would it be?
Answer:
Weight of wood = 24 kg
Number of wood pieces = 3
Weight of each piece = 24 ÷ 3 = 8 kg

AP Board 5th Class Maths Solutions 9th Lesson Measurements

Question 14.
I have 10 packets of rice that weigh 500 kgs. What is the weight of one packet?
Answer:
Total weight of packets = 500 kgs
Number of packets = 10
Weight of one packet = 500 ÷ 10 = 50 kgs

Question 15.
A vegetable seller sells 3 kilos of brinjals for 60. What is the cost of one kilo brinjals?
Answer:
Cost of 3 kilos of brinjals = ₹ 60
Cost of 1 kilo of brinjals = 60 ÷ 3 = ₹ 20.

Think & Discuss: (TextBook Page No.162)

Question 1.
In how many ways cati a vegetable vendor weigh 1 kilo beans by using the weights 500 g, 200 g, 100 g and 50 g? (Use the weights second time if needed)
Answer:
Total weight of beans = 1 kg
By using 500 g weight he uses two ways.
By using 200 g weight he uses 5 ways.
By using 100 g weight he uses 10 ways.
By using 50 g weight he uses 20 ways.
By using 500 g + 200 g + 200 g + 100 g he uses in one way.
By using 500 g + 100 g + 100 g + 200 g + 50 g + 50 g he uses in one way.

AP Board 5th Class Maths Solutions 9th Lesson Measurements

Exercise 5:

Question 1.
Convert the following into millilitres:
1) 5 L
2) 15 L
3) 38.5 L
4) 82.7 L
Answer:
1) 5 L = 5 × 1000 ml = 500 ml
2) 15 L = 15 × 1000 ml = 15000 ml
3) 38.5 L = 38.5 × 1000 ml = 38,500 ml
4) 82.7 L = 82.7 × 1000 ml = 82,700 ml.

Question 2.
Comparing the given measurements by using <, > and = symbols.

1. 200 ml ______ 100 ml + 100 ml + 100 ml
Answer:
<

2. 3 L ______ 500 ml + 500 ml + 500 ml – 500 ml + 500 ml + 500 ml
Answer:
=

3. 100 L ______ 20 L + 20 L + 10 L + 50 L
Answer:
=

4. 150 ml ______ 50 ml + 60 ml + 20 ml
Answer:
>

5. 20 ml ______ 5 ml + 2 ml + 15 ml
Answer:
<

Question 3.
Calculate the capacity.

1. AP Board 5th Class Maths Solutions 9th Lesson Measurements 46

Capacity of each cup is ______
Answer:
50 ml

2. AP Board 5th Class Maths Solutions 9th Lesson Measurements 47

Capacity of each small bottle is ______
Answer:
250 ml

3. AP Board 5th Class Maths Solutions 9th Lesson Measurements 48

capacity of each can is ______
Answer:
100 ml

4. AP Board 5th Class Maths Solutions 9th Lesson Measurements 49

Capacity of each tumbler is ______
Answer:
150 ml

AP Board 5th Class Maths Solutions 9th Lesson Measurements

Question 4.
Add the following:
1) 12 L 100 ml and 8 L 725 ml
Answer:

AP Board 5th Class Maths Solutions 9th Lesson Measurements 50

2) 93 L 450 ml and 675 ml
Answer:

AP Board 5th Class Maths Solutions 9th Lesson Measurements 51

3) 33 L 823 ml and 45 L 202 ml
Answer:

AP Board 5th Class Maths Solutions 9th Lesson Measurements 52

4) 15 L and 500 ml
Answer:

AP Board 5th Class Maths Solutions 9th Lesson Measurements 53

AP Board 5th Class Maths Solutions 9th Lesson Measurements

Question 5.
Subtraction:
1) 83 L 103 ml from 98 L 208 ml
Answer:

AP Board 5th Class Maths Solutions 9th Lesson Measurements 54

2) 16 L 540 ml from 75 L 725 ml
Answer:

AP Board 5th Class Maths Solutions 9th Lesson Measurements 55

3) 2 L 208 ml from 10 L 425 ml
Answer:

AP Board 5th Class Maths Solutions 9th Lesson Measurements 56

4) 33 L 98 ml from 42 L 250 ml
Answer:

AP Board 5th Class Maths Solutions 9th Lesson Measurements 57

Question 6.
Nagaraju used 2 L 220 ml blue paint, 3 L 500 ml white paint and 750 ml red paint to paint a house. How much paint did he use ?

AP Board 5th Class Maths Solutions 9th Lesson Measurements 58

Answer:
Nagaraju used blue paint = 2 L 220 ml
Nagaraju used white paint = 3 L 500 ml
Nagaraju used red paint = 750 ml

AP Board 5th Class Maths Solutions 9th Lesson Measurements 59

Nagaraju used total paint = 6 L 470 ml

AP Board 5th Class Maths Solutions 9th Lesson Measurements

Question 7.
Samson has a cow and a buffalo. Cow gives 3 L 500 ml of milk and the buffalo gives 5 L 680 ml of milk per day.
How much milk did Samson get from both of them?

AP Board 5th Class Maths Solutions 9th Lesson Measurements 61

Answer:
Milk given by cow per day = 3 L 500 ml
Milk given by buffalo per day = 5 L 680 ml
Total milk get from both = 9 L 180 ml

AP Board 5th Class Maths Solutions 9th Lesson Measurements 60

Question 8.
A milkman sells 20 litres of milk to a tea stall. Tea seller uses 15 L 125 ml milk to make tea. How much milk is left in the can ?

AP Board 5th Class Maths Solutions 9th Lesson Measurements 62

Answer:
Milk taken from milkman = 20 L
Milk used by seller = 15 L 125 ml

AP Board 5th Class Maths Solutions 9th Lesson Measurements 63

Milk left in the can = 4 L 875 ml

AP Board 5th Class Maths Solutions 9th Lesson Measurements

Question 9.
An old model toilet flushes 8 litres of water. Modern toilet flushes 3.5 L of water. How many litres of water we can save for each flush with modern toilet?

AP Board 5th Class Maths Solutions 9th Lesson Measurements 64

Answer:
Old model toilet flushes of water = 8.0 L
New model toilet flushes of water = 3.5 L

AP Board 5th Class Maths Solutions 9th Lesson Measurements 65

Saving of water from new model toilet = 4.5 L

Question 10.
An elephant drinks 190 litres of water per day. How many litres does ¡t drink in one month? (31 days)

AP Board 5th Class Maths Solutions 9th Lesson Measurements 66

Answer:
An elephant drinks water per day = 190 L
No. of days in a month = 31
Total amount of water an elephant drinks in a month = 190 × 31 = 5,890 L

AP Board 5th Class Maths Solutions 9th Lesson Measurements

Question 11.
John sells one ice cream cup containing 150 ml ice cream. If he sells 18 such ice cream cups, find the total capacity of ice cream?

AP Board 5th Class Maths Solutions 9th Lesson Measurements 67

Answer:
Quantity of ice cream cup = 150 ml
Total ice cream cups = 18
Total capacity of ice cream = 150 × 18 = 2700 ml

Question 12.
A juice bottle contains 2.2 L of juice. How many 200 ml glasses are needed to pour it completely ?

AP Board 5th Class Maths Solutions 9th Lesson Measurements 68

Answer:
Quantity of juice bottle = 2.2 L
= 2.2 × 1000 = 2200 ml
Quantity of glass = 200 ml
Number of glasses needed = 2200 ÷ 200 ml = 11.

Question 13.
Reshma observed that one shampoo sachet contains 5 ml shampoo. To fill 400 ml bottle how many sachets are needed?

AP Board 5th Class Maths Solutions 9th Lesson Measurements 69

Answer:
Quantity of shampoo sachet = 5 ml
Quantity of shampoo bottle = 400 ml
Number of sachets required = 400 ÷ 5 = 80 sachets

AP 6th Class Telugu Important Questions Chapter 5 మన మహనీయులు

These AP 6th Class Telugu Important Questions 5th Lesson మన మహనీయులు will help students prepare well for the exams.

AP State Syllabus 6th Class Telugu 5th Lesson Important Questions and Answers మన మహనీయులు

6th Class Telugu 5th Lesson మన మహనీయులు Important Questions and Answers

I. అవగాహన – ప్రతిస్పందన

పరిచిత గద్యాలు

1. కింది పేరా చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.

పొట్టి శ్రీరాములు పూర్వీకులు ఒకప్పటి నెల్లూరు జిల్లా కనిగిరి (ప్రస్తుతం ప్రకాశంజిల్లా) ప్రాంతీయులు. వ్యాపారరీత్యా మద్రాసు (చెన్నై) లో స్థిరపడ్డారు. శ్రీరాములుగారు గురవయ్య, మహాలక్ష్మమ్మ దంపతులకు మద్రాసులో 16. 3. 1901 న జన్మించారు. మద్రాసు, బొంబాయి నగరాలలో విద్యాభ్యాసం చేసారు. తన మేనమామ కుమార్తె సీతమ్మను వివాహం చేసుకొన్నారు. బొంబాయిలో అసిస్టెంటు ప్లంబర్ గా ఉద్యోగంలో చేరి అక్కడే నివాసం ఉన్నారు. విశ్రాంతివేళల్లో అక్కడ పనిచేస్తున్న కార్మికుల యోగక్షేమాలు విచారించేవారు. పేదవారి కష్టాల్లో పాలుపంచుకొనేవారు. ఇతరుల కోసం ఏదో ఒకటి చేయాలని తపించేవారు. గాంధీజీ బోధనలకు శ్రీరాములు ఆకర్షితుడయ్యారు. ఆ బోధనలే వీరిని భారత స్వాతంత్ర్యోద్యమం వైపు నడిపించాయి.
ప్రశ్నలు – జవాబులు:
అ) పొట్టి శ్రీరాములు గారి పూర్వీకులు ఎక్కడ ఉండేవారు?
జవాబు:
పొట్టి శ్రీరాములుగారి పూర్వీకులు ఒకప్పటి నెల్లూరు జిల్లా (ప్రస్తుతం ప్రకాశం జిల్లా), కనిగిరి ప్రాంతంలో ఉండేవారు.

ఆ) శ్రీరాములు గారి తల్లిదండ్రులు ఎవరు?
జవాబు:
శ్రీరాములు గారి తల్లి మహాలక్ష్మమ్మ, తండ్రి గురవయ్య.

ఇ) శ్రీరాములు గారు ఎక్కడ, ఏ ఉద్యోగం చేశారు?
జవాబు:
శ్రీరాములు గారు బొంబాయిలో అసిస్టెంట్ ప్లంబర్ గా ఉద్యోగం చేశారు.

ఈ) శ్రీరాములు గారు స్వాతంత్ర్యోద్యమం వైపు ఎందుకు నడిచారు?
జవాబు:
గాంధీజీ బోధనలకు ఆకర్షితులై శ్రీరాములుగారు స్వాతంత్ర్యోద్యమం వైపు నడిచారు.

AP 6th Class Telugu Important Questions Chapter 5 మన మహనీయులు

2. కింది పేరా చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.

1921వ సంవత్సరంలో విజయవాడలో జరిగిన అఖిల భారతీయ కాంగ్రెస్ సమావేశంలో గాంధీజీ పింగళి వెంకయ్యను జాతీయ పతాకం చిత్రించి ఇవ్వమని అడిగారు. మూడుగంటల వ్యవధిలో జెండాను రూపొందించి ఇచ్చారు. జెండాలో కాషాయం రంగు త్యాగానికి, దేశభక్తికి ప్రతీకగా, తెలుపురంగు శాంతికి, సత్యానికి చిహ్నంగా, ఆకుపచ్చ రంగు సమృద్ధికి, నమ్మకానికి గుర్తుగా వీరు త్రివర్ణ పతాకాన్ని రూపొందించారు. ఈ పతాకం మధ్యలో మొదట రాట్నం ఉండేది. తరువాత దాని స్థానంలో అశోక ధర్మచక్రం చేర్చారు.
ప్రశ్నలు – జవాబులు:
అ) 1921వ సంవత్సరం అఖిల భారతీయ కాంగ్రెస్ మహాసభలు ఎక్కడ జరిగాయి?
జవాబు:
1921లో అఖిల భారతీయ కాంగ్రెస్ మహాసభలు విజయవాడలో జరిగాయి.

ఆ) జాతీయ జెండాలో కాషాయం రంగు దేనికి గుర్తు?
జవాబు:
జాతీయ జెండాలో కాషాయం రంగు త్యాగానికి, దేశభక్తికి గుర్తు.

ఇ) జాతీయ జెండాలో తెలుపురంగు దేనికి గుర్తు?
జవాబు:
జాతీయ జెండాలో తెలుపు రంగు శాంతికి, సత్యానికి గుర్తు.

ఈ) పతాకం మధ్య రాట్నం స్థానంలో తరువాత దేనిని చేర్చారు?
జవాబు:
పతాకం మధ్య రాట్నం స్థానంలో తరువాత అశోక చక్రం చేర్చారు.

3. కింది పేరా చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.

పైడిమర్రి వెంకట సుబ్బారావు నల్గొండ జిల్లాలో అన్నెపర్తి గ్రామంలో 1916 జూన్ 10వ తేదీన వెంకటరామయ్య, రాంబాయమ్మలకు జన్మించారు. బాల్యంలోనే తన తల్లి రామాయణ, మహాభారతాలు చెప్పేది. బాల్యంలోనే దేశభక్తి బీజాలు పడ్డాయి. 1962లో విశాఖపట్టణంలో ట్రెజరి అధికారిగా పనిచేశారు. పుస్తక సేకరణ, పఠనం, కవితా వ్యాసంగం, వేద అధ్యయనం చేసేవారు. ఆయన భూస్వామ్య పద్ధతిలోని వెట్టిచాకిరిని నిరసిస్తూ ఎన్నో కథలు రాశారు. దేవదత్తుడు, తులసీదాసు, త్యాగరాజు మొదలైన పద్య కావ్యాలు రాసారు. గృహస్థ జీవితం, స్త్రీ ధర్మము, తార, శ్రీమతి అనే నాటకాలు రాసారు. బాలరామాయణం, వెంకటేశ స్తుతులు మొదలైన రచనలు చేశారు.
ప్రశ్నలు – జవాబులు:
అ) వెంకట సుబ్బారావు ఎక్కడ జన్మించారు?
జవాబు:
వెంకట సుబ్బారావు నల్గొండ జిల్లా అన్నెపర్తి గ్రామంలో జన్మించారు.

ఆ) సుబ్బారావు గారి తల్లిదండ్రులు ఎవరు?
జవాబు:
సుబ్బారావు గారి తల్లి రాంబాయమ్మ, తండ్రి వెంకటరామయ్య.

ఇ) సుబ్బారావు గారు వ్రాసిన పద్య కావ్యాలు ఏవి?
జవాబు:
సుబ్బారావు గారు దేవదత్తుడు, తులసీదాసు, త్యాగరాజు మొదలైన పద్యకావ్యాలు రాశారు.

ఈ) సుబ్బారావు గారు రాసిన నాటకాలు ఏవి?
జవాబు:
సుబ్బారావు గారు గృహస్త జీవితం, స్త్రీ ధర్మం, తార, శ్రీమతి అనే నాటకాలు రాశారు.

AP 6th Class Telugu Important Questions Chapter 5 మన మహనీయులు

4. కింది పేరా చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.

సుందరాచారి చిత్తూరు జిల్లా, తిరుపతిలో 1914 ఆగష్టు 10న జన్మించారు. తిరుపతి దేవస్థానం పాఠశాలలో, మదనపల్లి బీసెంట్ థియోసాఫికల్ సొసైటీలో విద్యాభ్యాసం చేసారు. ఉపాధ్యాయునిగా, ఆంధ్రపత్రికకు సంపాదకుడిగా, పాఠశాలల పర్యవేక్షకునిగా పనిచేశారు. సుందర రామాయణం, సుందర భాగవతం, బలిదానం, అపవాదు, పేదకవి, నాస్వామి, నేటికవిత్వం, కావేటి నగరరాజ నీరాజనం, శ్రీనివాస శతకం, బుద్ధగీత వంటి ఎన్నో రచనలు చేసారు. సినిమా పాటలు రాసారు.
ప్రశ్నలు – జవాబులు:
అ) సుందరాచారి ఎప్పుడు, ఎక్కడ జన్మించారు?
జవాబు:
సుందరాచారి చిత్తూరు జిల్లా తిరుపతిలో 1914 ఆగష్టు 10వ తేదీన జన్మించారు.

ఆ) సుందరాచారి ఎక్కడ చదువుకున్నారు?
జవాబు:
సుందరాచారి తిరుపతి దేవస్థానం పాఠశాలలో, మదనపల్లి బీసెంట్ థియోసాఫికల్ సొసైటీలోను చదువుకున్నారు.

ఇ) సుందరాచారి చేసిన ఉద్యోగాలేవి?
జవాబు:
సుందరాచారి ఉపాధ్యాయునిగా, ఆంధ్రపత్రికకు సంపాదకునిగా, పాఠశాలల పర్యవేక్షకునిగా ఉద్యోగాలు చేశారు.

ఈ) సుందరాచారి రచనలు నాల్గింటిని తెల్పండి.
జవాబు:
సుందరాచారి సుందర రామాయణం, సుందర భాగవతం, బలిదానం, అపవాదు మొదలైన రచనలు చేశారు.

II. వ్యక్తీకరణ – సృజనాత్మకత

ప్రశ్న 1.
పొట్టి శ్రీరాములుగారి గురించి వ్రాయండి.
జవాబు:
పొట్టి శ్రీరాములుగారి పూర్వీకులు ఒకప్పటి నెల్లూరు జిల్లా కనిగిరి (ప్రస్తుతం ప్రకాశం జిల్లా) ప్రాంతీయులు. వ్యాపార రీత్యా మద్రాసులో స్థిరపడ్డారు. శ్రీరాములుగారి తల్లిదండ్రులు మహాలక్ష్మమ్మ, గురవయ్య దంపతులు. ఆయన మద్రాసులో 16-03-1901న జన్మించారు. మద్రాసు, బొంబాయి నగరాలలో చదువుకొన్నారు. తన మేనమామ కుమార్తె సీతమ్మను వివాహం చేసుకున్నారు. బొంబాయిలో అసిస్టెంటు ప్లంబరుగా ఉద్యోగంలో చేరారు. అక్కడే నివాసం ఉన్నారు. ఇతరుల కోసం ఏదోఒకటి చేయాలని తపించేవారు.

AP 6th Class Telugu Important Questions Chapter 5 మన మహనీయులు

ప్రశ్న 2.
పొట్టి శ్రీరాములుగారు ఉద్యోగం ఎందుకు వదిలేసారు? తరువాత ఏమి చేసారో వివరించండి.
జవాబు:
పొట్టి శ్రీరాములుగారు గాంధీజీ బోధనలకు ఆకర్షితులయ్యారు. ఆ బోధనలే ఆయనను భారత స్వాతంత్ర్యోద్యమం వైపు నడిపించాయి. ఆయన చేస్తున్న ఉద్యోగం వదిలి సబర్మతీ ఆశ్రమంలో చేరారు. సత్యాగ్రహంలో చేరారు. జైలుశిక్ష అనుభవించారు. ఉద్యమంలో భాగంగా ఖాదీ ప్రచారం, మద్యపాన నిషేధ ప్రచారం, నిమ్న జాతులకు దేవాలయ ప్రవేశం వంటి సాంఘిక సేవా కార్యక్రమాలలో పాల్గొన్నారు. ప్రత్యేక ఆంధ్రరాష్ట్రం కోసం 1911 నుండి ఎన్నో సభలూ, సమావేశాలూ, తీర్మానాలూ జరగడాన్ని గమనించారు. ఆంధ్రరాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేయాలని నిర్ణయించుకున్నారు.

ప్రశ్న 3.
జాతీయ జెండా రూపశిల్పి పింగళి వెంకయ్య అని ఎలా చెప్పగలవు?
జవాబు:
1906లో కలకత్తాలో భారత జాతీయ కాంగ్రెస్ మహాసభలు జరిగాయి. అక్కడ బ్రిటిష్ జెండా ఎగురవేసారు. అది పింగళి వెంకయ్యగారికి నచ్చలేదు. 1921 లో విజయవాడలో అఖిల భారత కాంగ్రెస్ సమావేశంలో పింగళి వెంకయ్యను జాతీయ పతాకం చిత్రించి ఇవ్వమని మహాత్మాగాంధీ అడిగారు. మూడు గంటలలో జాతీయ జెండాను వెంకయ్యగారు రూపొందించారు. అదే మన త్రివర్ణ పతాకం. పతాకం మధ్యలో మొదట రాట్నం ఉండేది. తరువాత దాని స్థానంలో అశోకుని ధర్మచక్రం చేర్చారు. ఈ విధంగా మన జాతీయ జెండా రూపకర్త మన ఆంధ్రుడు కావడం మన అందరికీ గర్వకారణం.

ప్రశ్న 4.
జాతీయ ప్రతిజ్ఞను ఎవరు తయారు చేసారు? ఆయన గురించి వ్రాయండి.
జవాబు:
ప్రతీ పాఠశాలలోను భారతదేశము నా మాతృభూమి అనే ప్రతిజ్ఞ విద్యార్థులందరిచేత చెప్పిస్తారు. దీనిని పైడిమర్రి వెంకట సుబ్బారావుగారు రచించారు. 1962లో భారత్-చైనా యుద్ధం ముగిసిన తరువాత దీనిని రచించారు. 1965 జనవరి 26 నుంచి భారతదేశం అంతా అన్ని భాషల పాఠ్యపుస్తకాలలో ప్రతిజ్ఞను చేర్చారు. పైడిమర్రి వెంకట సుబ్బారావుగారు నల్గొండ జిల్లాలో అన్నెపర్తి గ్రామంలో 1916 జూన్ 10న జన్మించారు. రాంబాయమ్మ, వెంకటరామయ్యలు వీరి తల్లిదండ్రులు. 1962లో విశాఖ పట్టణంలో ట్రెజరీ అధికారిగా పనిచేసారు. అనేక పద్యకావ్యాలు, కథలు, నాటకాలు రచించారు.

AP 6th Class Telugu Important Questions Chapter 5 మన మహనీయులు

ప్రశ్న 5.
శంకరంబాడి సుందరాచారిగారి గురించి వ్రాయండి.
జవాబు:
శంకరంబాడి సుందరాచారిగారు తిరుపతిలో జన్మించారు. 1914 ఆగష్టు 10న ఆయన జన్మించారు. తిరుపతి దేవస్థానం పాఠశాలలో మదనపల్లిలో విద్యాభ్యాసం చేసారు. ఉపాధ్యాయుడుగా పాఠశాలల పర్యవేక్షకునిగా పనిచేసారు. ఆంధ్రపత్రికకు సంపాదకుడిగా పనిచేసారు. సుందర రామాయణం, సుందర భాగవతం మొదలైనవి రచించారు. మా తెలుగు తల్లికి మల్లెపూదండ పాటను బెనారస్ విశ్వవిద్యాలయంలో తెలుగు విద్యార్థుల కోసం తొలిసారిగా పాడారు. ఆయన సినిమా పాటలు కూడా రచించారు.