AP Inter 1st Year History Study Material Chapter 11 వలస పాలనలో భారతదేశం

Andhra Pradesh BIEAP AP Inter 1st Year History Study Material 11th Lesson వలస పాలనలో భారతదేశం Textbook Questions and Answers.

AP Inter 1st Year History Study Material 11th Lesson వలస పాలనలో భారతదేశం

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
బ్రిటిష్, ఫ్రెంచ్ వారి మధ్య జరిగిన విభేదాలు లేదా కర్ణాటక యుద్ధాలు వివరించండి.
జవాబు:
ఆధునిక యుగంలో యూరోపియన్లు వ్యాపారార్థం భారతదేశానికి వచ్చారు. కాలక్రమంలో దక్కన్లో వ్యాపార ఆధిపత్యానికై ఇంగ్లీషు, ఫ్రెంచ్వారి మధ్య పోరాటం జరిగింది. ఈ పోరాటం మూడు యుద్ధాలుగా జరిగింది. వీటినే కర్ణాటక యుద్ధాలు అంటారు. ఈ యుద్ధాల వల్ల భారతదేశంలో ఫ్రెంచ్వారి శక్తి పూర్తిగా దిగజారిపోయింది. అప్పటి నుండి ఆంగ్లేయుల విజృంభణకు అడ్డం లేకుండా పోయింది.

మొదటి కర్ణాటక యుద్ధం (1744-1748): 1742వ సంవత్సరంలో డూప్లే ఫ్రెంచ్ గవర్నర్గా నియమించబడ్డాడు. ఇతనికి విపరీతమైన రాజ్యకాంక్ష. ఈ పరిస్థితులలో ఐరోపాలో ఆస్ట్రియా వారసత్వ యుద్ధం ప్రారంభమైంది. ఈ యుద్ధం ప్రష్యా-ఆస్ట్రియాల మధ్య వారసత్వ యుద్ధంగా మారింది. ఫ్రాన్స్ ప్రష్యా వైపు, బ్రిటన్ ఆస్ట్రియా ప్రక్కన చేరాయి. దీని ప్రభావం భారతదేశంపై కూడా పడింది. భారతదేశంలో ఆంగ్లేయులు, ఫ్రెంచ్ ముఖ్య స్థావరమైన పుదుచ్చేరిని ఆక్రమించటానికి సిద్ధంగా ఉన్నారు. ఇట్టి పరిస్థితులలో డూప్లే కర్ణాటక నవాబైన అన్వరుద్దీన్ సహాయం కోరాడు. దీనిపై ఆంగ్లేయులు యుద్ధ ప్రయత్నాలు విరమించారు. ఇటువంటి పరిస్థితుల్లో ఫ్రెంచ్ సైన్యం లాబోర్డినాయి నాయకత్వంలో భారతదేశానికి వచ్చింది. ఆ ధైర్యముతో డూప్లే 1746వ సంవత్సరంలో ఫ్రెంచ్ సైన్యాలను ఆంగ్లేయుల పైకి పంపాడు. మద్రాసులోని ఆంగ్లేయుల సెయింట్ జార్జికోటను ఫ్రెంచ్వారు స్వాధీనపరచుకున్నారు. ఈలోగా ఆంగ్లేయులు అన్వరుద్దీన్ చేరారు. నవాబు ఫ్రెంచ్ వారిని హెచ్చరించి చివరకు వారితో యుద్ధాలు చేయాల్సివచ్చింది. 1746లో అన్వరుద్దీన్ సైన్యాలు ఫ్రెంచ్ వారి సైన్యాలు, శాంథోమ్ అనే ప్రదేశంలో యుద్ధానికి తలపడ్డాయి. శాంథోమ్ యుద్ధంలో ఫ్రెంచ్వారికి విజయం లభించింది. దీనితో కర్ణాటక రాజ్య బలహీనత బయల్పడింది. లాబోర్డినాయి తిరిగి వెనుకకు వెళ్ళటంతో సెయింట్ డేవిడ్ కోటను పట్టుకోదలచిన డూప్లే ఆశయాలు విఫలమైనాయి. ఈలోగా ఆస్ట్రియా వారసత్వ యుద్ధం ఐలాషఫల్ సంధితో ముగిసింది. దీనితో భారతదేశంలో కూడా యుద్ధం ముగిసింది. సంధి షరతుల ప్రకారం మద్రాసును ఫ్రెంచ్వారు ఆంగ్లేయులకు తిరిగి ఇచ్చివేశారు.

AP Inter 1st Year History Study Material Chapter 11 వలస పాలనలో భారతదేశం

రెండవ కర్ణాటక యుద్ధం (1749-1754): 1748లో హైదరాబాద్ నిజాం ఉల్ ముల్క్ మరణించటంతో హైదరాబాదు సింహాసనము కోసం అతని రెండవ కుమారుడైన నాజర్ంగ్కు, మనుమడైన ముజఫరంగు మధ్య అంతర్యుద్ధం మొదలైంది. కర్ణాటక సింహాసనం కోసం మహారాష్ట్రుల నుండి విడుదలైన చందాసాహెబ్కు, అన్వరుద్దీన్ కు మధ్య యుద్ధం ప్రారంభమైంది. చందాసాహెబ్ మరియు ముజఫర్ఆంగ్లు ఫ్రెంచ్ గవర్నరైన డూప్లే సహాయంతో సింహాసనమును అధిష్టించటానికి ప్రయత్నించారు. స్వదేశ రాజులలో గల బలహీనతలను ఆసరాగా తీసుకొని వారి తగాదాలలో జోక్యం చేసుకొని విజయం సాధించాలని డూప్లే ఆశయము. చందాసాహెబు సహాయము చేస్తే కర్ణాటకలోను, ముజఫరంగ్కు తోడ్పడితే హైదరాబాద్లోను తన పలుకుబడి పెరగగలదని డూప్లే భావించాడు. ముజఫరంగ్ మరియు చందాసాహెబ్లు 1749 ఆగస్టు 3న ‘అంబూర్’ యుద్ధంలో అన్వరుద్దీన్ ను వధించారు. అన్వరుద్దీన్ మరణానంతరం అతని కుమారుడైన మహమ్మదాలీ తిరుచినాపల్లికి పారిపోయి ఆంగ్లేయుల సహాయాన్ని కోరాడు. ఫ్రెంచ్వారి సహాయానికిగాను చందాసాహెబ్ మచిలీపట్నం, రెండు గ్రామాలను కృతజ్ఞతగా వారికి ఇచ్చాడు. ఆంగ్లేయుల సహాయంతో నాజర్ జంగ్, ముజఫరంగ్ను ఓడించాడు. కానీ ఫ్రెంచ్వారి చేతిలో హత్యకు గురయ్యాడు. ఫ్రెంచ్వారు ముజఫరంగ్ను హైదరాబాదు నవాబుగా చేశారు. అక్కడ బుస్సీ అనే ఫ్రెంచి సైన్యాధిపతి రక్షణగా ఉన్నాడు. కొంతకాలానికి ముజఫరంగ్ శత్రువుల చేతుల్లో మరణించగా ఫ్రెంచ్వారు అతని కుమారుడైన సలాబతంగ్ను నవాబుగా చేసి దక్కన్లో ఫ్రెంచి అధికారాన్ని సుస్థిరపరచారు.

కర్ణాటకలో ఫ్రెంచివారు మరియు చందాసాహెబ్ తిరుచినాపల్లిని జయించి మహమ్మదాలీని మరియు ఆంగ్లేయులను ఓడించటానికి ప్రయత్నించారు. ఆంగ్లేయులు మహమ్మదాలీని రక్షించటానికి క్లైవ్ సహాయంతో ఒక పథకాన్ని తయారుచేశారు. చందాసాహెబ్ మరియు ఫ్రెంచ్వారు 1751వ సంవత్సరంలో తిరుచినాపల్లిని ముట్టడించునప్పుడు క్లెవ్ మద్రాసు నుంచి కొంత సైన్యంతో ఆర్కాటును ముట్టడించాడు. తన రాజధానిని రక్షించుకొనుటకై చందాసాహెబ్ కొంత సైన్యంతో తిరుచినాపల్లి నుండి ఆర్కాటుకు వెనక్కి మరలాడు. దీనితో తిరుచినాపల్లి వద్దగల చందాసాహెబ్, ఫ్రెంచి సైన్యం ఆంగ్లేయుల చేతిలో ఓడింపబడ్డారు. కర్ణాటకలో రాబర్ట్ క్లైవ్ చందాసాహెబ్ను ఓడించి 1752వ సంవత్సరంలో వధించాడు. మహమ్మదాలీని కర్ణాటక నవాబుగా చేసి కర్ణాటకపై ఆంగ్లేయుల ఆధిపత్యాన్ని సంపాదించారు. దీనితో కర్ణాటకలో ఫ్రెంచ్వారు తమ ఆధిపత్యాన్ని కోల్పోయారు. ఇట్టి పరిస్థితులలో ఫ్రెంచ్వారు డూప్లేను తొలగించి గాడెహ్యూను గవర్నరుగా నియమించారు. ఇతడు ఆంగ్లేయులతో పాండిచ్చేరి సంధి కుదుర్చుకున్నాడు. రెండవ కర్ణాటక యుద్ధానంతరం దక్కన్లో ఫ్రెంచ్వారి ప్రాబల్యం, కర్ణాటకలో ఆంగ్లేయుల ప్రాబల్యం పెరిగింది.

మూడవ కర్ణాటక యుద్ధం (1756-1761): గాడెహ్యూ చేసుకున్న సంధి అమల్లోకి రాకమునుపే ప్రపంచాధిపత్యం కోసం ఐరోపాలో సప్తవర్ష సంగ్రామం ప్రారంభమైంది. దాని ప్రభావం వలన భారతదేశంలో ఫ్రెంచ్ ప్రభుత్వం, ఫ్రెంచ్ గవర్నర్గా కౌంట్ డీలాలీని నియమించింది. ఇతడు యుద్ధంలో ఆరితేరిన యోధుడైనా అహంభావం కలవాడు. ఇతడు సేనాధిపతులతో కలిసిమెలసి పనిచేయటం, వారి సలహాలను స్వీకరించటం ఇతనికి ఇష్టంలేదు. భారతదేశం చేరగానే కడలూర్లోని ఇంగ్లీషువారి సైనిక పెరేడ్ కోటను ఆక్రమించాడు. మద్రాసును ముట్టడించటానికి ప్రయత్నాలు చేశాడు, కానీ విఫలుడయ్యాడు. ఇట్టి పరిస్థితులలో సర్ ఐర్ కూట్ ఆంగ్ల సైన్యానికి నాయకత్వం వహించాడు.

ఆంగ్లేయులను ఎదుర్కోలేక కౌంట్ డీలాలీ హైదరాబాదు సంస్థానంలోని బుస్సీని రావలసిందిగా కోరాడు. తాను హైదరాబాదును వదిలిన వెంటనే అక్కడ ఫ్రెంచ్వారి ప్రాబల్యం అంతరించగలదని బుస్సీ తలచాడు. కానీ డీలాలీ బుస్సీ సలహాను లెక్కచేయక బుస్సీని హైదరాబాదు నుండి రమ్మని ఆజ్ఞాపించాడు. దీనితో ఆంగ్లేయులు నైజాం నవాబుతో సంధి చేసుకొని అతని సంస్థానంలో చేరారు. విజయనగర సంస్థానాధీశుడైన ఆనంద గజపతి బెంగాల్లో ఉన్న క్లైవ్ను దండెత్తి రావలసిందిగా ఆహ్వానించాడు. క్లైవ్, సర్ ఐర్ కూట్ను పంపించగా అతడు ‘1760లో వాండివాష్ లేక వందవాసి’ యుద్ధంలో ఫ్రెంచ్ సైన్యాన్ని ఓడించి, పుదుచ్చేరిని ఆక్రమించి, కౌంట్ డీలాలీని బంధించి ఇంగ్లండుకు పంపాడు. 1763లో పారిస్ సంధితో సప్తవర్ష సంగ్రామం ముగిసింది. దీనితో మూడవ కర్ణాటక యుద్ధం అంతమైంది.

ప్రశ్న 2.
రాబర్ట్ క్లైవ్ బెంగాల్న ఆక్రమించిన విధానం రాయండి.
జవాబు:
భారతదేశంలో ఆంగ్ల సామ్రాజ్యానికి పునాదులు వేసిన వారు రాబర్ట్ క్లైవ్. ఇతడు బ్రిటిష్ తూర్పు ఇండియా వర్తక సంఘంలో సామాన్య గుమాస్తాగా చేరి, తన స్వయం కృషితో, ధైర్య సాహసాలు ప్రదర్శించి, కర్ణాటక యుద్ధాలలో విజయం సాధించి భారతదేశంలో ఆంగ్లేయుల ప్రాబల్యానికి కారకుడయ్యాడు. ఆర్కాట్ ముట్టడి సమయంలో చందా సాహెబ్ను చంపి ఆంగ్లేయులకు విజయాన్ని సాధించాడు. ఈ విజయం వలన క్లైవ్ను “ఆర్కాటు వీరుడు” అని పిలిచారు. ఈ విజయం వలన క్లైవ్ను మద్రాసు కౌన్సిల్లో సభ్యుడిగా నియమించారు.

ప్లాసీ యుద్ధం (1757, జూన్ 25): బ్లాక్ హోల్ ట్రాజడీ లేక కలకత్తా చీకటిగది ఉదంతాన్ని విన్న మద్రాస్ కౌన్సిల్, ఫోర్ట్ విలియంను తిరిగి స్వాధీనం చేసుకొనే బాధ్యతను రాబర్ట్ క్లెన్క అడ్మిరల్ వాట్సనక్కు అప్పగించింది. వీరి నాయకత్వంలోని ఇంగ్లీషు సైన్యం 1757లో కలకత్తాను తిరిగి స్వాధీనం చేసుకుంది. ఈ పరిస్థితులలో బెంగాల్ నవాబు సిరాజుదౌలా, ఇంగ్లీషువారికి మధ్య ఒక ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం ఇంగ్లీషువారు తమ స్థావరాలన్నింటిని తిరిగి రాబట్టుకున్నారు. వారికి నష్టపరిహారం చెల్లించడానికి సిరాజ్ అంగీకరించాడు. కలకత్తాలో సైనిక స్థావరాలు ఏర్పాటు చేసుకోవటానికి, వాటిని పటిష్టం చేసుకోవటానికి, నాణాలను ముద్రించుకోవటానికి ఇంగ్లీషువారికి అనుమతినిచ్చాడు. అయినా సిరాజ్ను ఫ్రెంచ్వారి పట్ల అనుకూలంగా ఉన్నాడని క్లైవ్ భావించి అతడిని సింహాసనం నుంచి తొలగించాలని నిశ్చయించుకున్నాడు. క్లైవ్కు సిరాజ్ సైన్యాధిపతి మీరాఫర్, అమీన్ చంద్ అనే వ్యాపారి సహకరించారు. ఈ నేపథ్యంలో ఆంగ్లేయులకు, సిరాజ్ సైన్యాలకు ప్లాసీ వద్ద యుద్ధం జరిగింది. మీరాఫర్ ద్రోహం వల్ల సిరాజ్ ఓడిపోయి యుద్ధభూమిలో మరణించాడు. బీహార్, బెంగాల్, ఒరిస్సాలకు మీరాఫర్ నవాబు అయ్యాడు. 24 పరగణాల జమిందారీ ఇంగ్లీషు కంపెనీవారికి లభించింది. క్లైవ్కు 2,34,000 పౌన్లు బహుమానంగా లభించాయి.

ఆధునిక భారతదేశ చరిత్రలో ప్లాసీ యుద్ధానికి ప్రత్యేక స్థానం ఉంది. బెంగాల్లో ఇంగ్లీషు కంపెనీవారు మొగల్ సుబేదార్ను ఓడించగలిగారు. స్థానిక ప్రభువుల బలహీనతలు, వారి అసమర్థత బహిర్గతమయ్యాయి. ప్లాసీ యుద్ధంతో ఇండియాలో బ్రిటిష్ సామ్రాజ్యానికి పునాదులు పడ్డాయి.

ప్లాసీ యుద్ధానంతరం ఆంగ్ల ప్రభుత్వం క్లైవు బెంగాల్ గవర్నర్ గా నియమించింది. గవర్నర్ తన పదవీ కాలం (1758-1760) లో క్లైవ్ డచ్ వారిని ఓడించి వారి నుంచి నష్టపరిహారం కూడా రాబట్టుకున్నాడు. ఈ విజయంతో ఇంగ్లీషువారిని ఎదిరించగల శక్తి భారతదేశంలో లేకుండా పోయింది. 1760లో క్లైవ్ స్వదేశానికి తిరిగివెళ్లాడు.

బక్సార్ యుద్ధం (1764, అక్టోబరు 17): ఇండియా నుంచి రాబర్ట్ క్లైవ్ నిష్క్రమించిన తరువాత బెంగాల్ గందరగోళంలో పడింది. ఈస్ట్ ఇండియా కంపెనీ ఉద్యోగులు సొంత వ్యాపారాలలో మునిగి, కంపెనీ వ్యాపారాన్ని నిర్లక్ష్యం చేశారు. వాన్ సిటార్ట్ ఇంగ్లీషు గవర్నర్ అయ్యాడు. అతడు మీర్జాఫర్ను తొలగించి, మీర్ ఖాసింను నవాబ్ నియమించాడు. మీరసిం ఇంగ్లీష్ వారికి బరద్వాన్, మిడ్నాపూర్, చిటగాంగ్ జిల్లాలను దత్తత చేశాడు. మీరసిం సమర్థుడే. బెంగాల్ ఆర్థిక వనరులను మెరుగుపరచటానికి అతడు చర్యలు తీసుకున్నాడు. ఇంగ్లీషు కంపెనీ ఉద్యోగుల సొంత వ్యాపారాలను అరికట్టడానికి కూడా అతడు ప్రయత్నించాడు. అందువల్ల, ఇంగ్లీష్ ్వరిలో ద్వేషం రగిలింది. దానితో మీరసిం అయోధ్యకు పారిపోయి అక్కడ అయోధ్య నవాబు, మొగల్ చక్రవర్తి షా ఆలంల సహాయం అర్థించాడు. మీర్ ఖాసిం, అయోధ్య నవాబు, షా ఆలంలను 1764 అక్టోబరులో మేజర్ మన్రో బక్సార్ యుద్ధంలో ఓడించాడు.

AP Inter 1st Year History Study Material Chapter 11 వలస పాలనలో భారతదేశం

బక్సార్ యుద్ధం, ప్లాసీ యుద్ధం కన్నా చరిత్రలో ఎక్కువ ప్రాముఖ్యం సంతరించుకుంది. ఈ యుద్ధంలో ఇంగ్లీషువారు ఒక బెంగాల్ నవాబుపైనే కాకుండా మొగల్ చక్రవర్తిపైన కూడా విజయం సాధించారు. షా ఆలం లొంగిపోయి ఇంగ్లీషు వారి రక్షణ కిందకు వచ్చాడు. ఇంగ్లీషువారు మరో విజయాన్ని కారాలో సంపాదించుకున్నారు. ఈ విజయం వల్ల అయోధ్య నవాబు కూడా ఇంగ్లీష్వారి నియంత్రణ కిందకు వచ్చాడు.

క్లైవ్ బెంగాల్ గవర్నరుగా పునరాగమనం: బక్సార్ యుద్ధానంతరం బెంగాల్లో దుష్టపాలన నెలకొన్నది. అందువలన కంపెనీ డైరెక్టర్లు క్లైవ్ను బెంగాల్ గవర్నర్ తిరిగి నియమించారు. 1765 మేలో క్లైవ్ ఇండియా చేరుకుని అయోధ్య నవాబుతోను, మొగల్ చక్రవర్తితోను అలహాబాద్ సంధులను కుదుర్చుకున్నాడు.

అలహాబాద్ సంధులు (1765): అలహాబాద్ సంధుల ప్రకారం

  1. ఇంగ్లీషు వారికి బెంగాల్, బీహార్, ఒరిస్సాలలో భూమిశిస్తు వసూలు చేసుకొనే హక్కు లభించింది. దీన్ని దివానీ అంటారు. పరిపాలన బాధ్యత నవాబుకు అప్పగించడం జరిగింది. దీన్ని నిజామత్ అంటారు.
  2. ఉత్తర సర్కారులపై ఇంగ్లీషువారి అధికారాన్ని మొగల్ చక్రవర్తి గుర్తించాడు.
  3. ఆర్కాట్ నవాబు స్వతంత్రపాలకుడయ్యాడు.
  4. అయోధ్య నుంచి కారా, అలహాబాద్లను విడగొట్టి మొగల్ చక్రవర్తికి ఇచ్చారు.
  5. ఈస్టిండియా కంపెనీవారు మొగల్ చక్రవర్తికి 20 లక్షల రూపాయలు చెల్లించడానికి అంగీకరించారు.

ఘనత: భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని స్థాపించిన ఘనుడు రాబర్ట్ క్లైవ్ చిన్న గుమస్తాగా జీవితం ప్రారంభించి స్వయంకృషి వల్ల గవర్నర్ పదవికి ఎదిగాడు. ఈస్టిండియా కంపెనీ సామ్రాజ్య వ్యవస్థాపకుడిగా ఆధునిక భారతదేశ చరిత్రపుటలలో క్లెవ్ ప్రముఖ స్థానాన్ని పొందాడు.

ప్రశ్న 3.
ఆంగ్లో, మైసూర్ యుద్ధాలను క్లుప్తంగా వివరించండి.
జవాబు:
రాబర్ట్ క్లైవ్ పాలనా కాలం ముగిసే నాటికి మైసూర్ రాజ్యం ఒక ముఖ్యమైన స్వతంత్ర రాజ్యంగా ఉంది. ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారులు మైసూర్ని జయించాలని నిశ్చయించారు. వీరి కోరిక ఫలితంగా ఇంగ్లీష్వారు నాలుగు యుద్ధాల్ని చేయాల్సి వచ్చింది. వీటినే మైసూర్ యుద్ధాలని అంటారు. హైదర్ అలీ, అతడి కుమారుడు టిప్పు సుల్తాన్ వీరోచితంగా ఇంగ్లీష్ గవర్నర్లను ఎదుర్కొన్నారు. మొదటి మైసూర్ యుద్ధంలో (1767-69) హైదర్ అలీ, అతని మిత్రపక్షమైన ఫ్రెంచ్ సైన్యాలు టిక్రోమలై వద్ద ఘోరమైన ఓటమిని చవిచూశాయి. కాని తిరిగి తన సైన్యాన్ని కూడకట్టుకొని హైదర్ అలీ ఇంగ్లీష్ వారిని ఎదుర్కొన్నాడు. మద్రాసు సంధితో యుద్ధం ముగిసింది. యుద్ధ సమయంలో ఆక్రమించిన ప్రాంతాలు తిరిగి ఎవరిది వారికి ఇవ్వబడ్డాయి.

మద్రాసు సంధి షరతుల్ని ఇంగ్లీష్ వారు ఉల్లంఘించడం వల్ల రెండవ మైసూర్ యుద్ధం (1780-84) జరిగింది. ఈ తరుణంలో కల్నల్ బేయిలి ఆధ్వర్యంలోని బ్రిటిష్ సైన్యం 80 వేల మంది సైనికులతో జూలై 1780 లో హైదర్ అలీపై మెరుపుదాడి చేసింది. కాని యుద్ధం ముగియకముందే హైదర్ అలీ క్యాన్సర్ జబ్బుతో మరణించాడు. టిప్పు సుల్తాన్ ఇంగ్లీషు వారితో మంగళూరు సంధి చేసుకొని యుద్ధాన్ని విరమించాడు.

1784 తరువాత కూడా మైసూర్, బ్రిటిష్ వారి మధ్య శత్రుత్వం కొనసాగింది. మంగళూరు సంధి వల్ల కేవలం తాత్కాలికమైన శాంతి మాత్రమే ఏర్పడింది. గవర్నర్ జనరల్ అయిన కారన్ వాలీస్ టిప్పు సుల్తాన్ను అధికారం నుంచి తొలగించడానికి పావులు కదిపాడు. దీంతో ఇరువురి మధ్య యుద్ధం అనివార్యమయ్యింది. వీరోచితమైన టిప్పు సుల్తాన్ పోరాట పటిమ, ఆయన సైన్యం ఇంగ్లీషు సైన్యాన్ని ఓడించడంలో విఫలమయ్యింది. శ్రీరంగపట్టణం సంధి ద్వారా ఈ యుద్ధం ముగిసింది. ఈ సంధి షరతుల ప్రకారం కృష్ణా, పెన్నా నదుల మధ్య ఉన్న భూభాగాన్ని బ్రిటిష్ వారి స్వాధీనం చేయడానికి టిప్పు సుల్తాన్ అంగీకరించాడు. మూడవ మైసూర్ యుద్ధంలో ఓడిపోవడం టిప్పు సుల్తాన్ క్షీణిస్తున్న అధికారానికి గుర్తుగా భావించవచ్చు. చివరగా జరిగిన నాలుగవ మైసూరు యుద్ధంలో (1799) లార్డ్ వెల్లస్లీ టిప్పు సుల్తాన్ను ఓడించి హతమార్చాడు. టిప్పు సుల్తాన్ మరణంతో మైసూరు రాజ్యం ఇంగ్లీషువారి వశమైంది.

AP Inter 1st Year History Study Material Chapter 11 వలస పాలనలో భారతదేశం

ప్రశ్న 4.
కారన్ వాలీస్ సంస్కరణల ముఖ్యాంశాలు వివరించండి.
జవాబు:
సివిల్ పరిపాలనా సంస్కరణలు: ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారులు చాలా లంచగొండులయ్యారని, వారిలో సామర్థ్యం పూర్తిగా లోపించిందని కారన్ వాలీస్ గ్రహించాడు. వారికి కంపెనీ వ్యవహారాలకన్నా సొంత వ్యాపారమే ముఖ్యమైంది. వారు తరచు బహుమానాలను తీసుకునేవారు. అందువలన కంపెనీ ఉద్యోగులు లంచాలనుగాని, బహుమతులనుగాని తీసుకోరాదని కారన్ వాలీస్ హెచ్చరించాడు. ప్రైవేటు వ్యాపారం చేసుకొంటున్న కంపెనీ ఉద్యోగులు దండనలకు పాత్రులవుతారని ప్రకటించాడు. ఉద్యోగుల జీతాలు పెంచమని కంపెనీ డైరెక్టర్లకు సలహా ఇచ్చాడు. ఆ సలహా మేరకు కంపెనీ ఉద్యోగుల జీతాలు పెరిగాయి. కలెక్టరుకు నెలకు 1500 రూపాయల జీతం ముట్టింది. భారతీయుల శక్తి సామర్థ్యాల మీద, గుణగణాల మీద కారన్ వాలీస్ కు చాలా చులకన భావం ఉంది. భారతదేశానికి చెందిన ప్రతి ఉద్యోగి అమిత లంచగొండి అని అతడి అభిప్రాయం. అందువలన పరిపాలనా వ్యవస్థలోను, సైనిక వ్యవస్థలోను భారతీయులకు చోటు లేకుండా పోయింది. అందువలననే పరిపాలనలో ఐరోపీకరణ ప్రవేశపెట్టాడు. ఇది కారన్ వాలీస్ జాతి వివక్షతకు దర్పణం పట్టింది. అయినప్పటికీ పౌర, మిలటరీ ఉద్యోగాలలో లంచగొండితనం రూపుమాపి, కారన్ వాలీస్ నీతివంతమైన పరిపాలన అందించాడు.

న్యాయ సంస్కరణలు: కారన్ వాలీస్ 1787, 1790, 1793లో అనేక న్యాయసంస్కరణలు ప్రవేశపెట్టాడు. న్యాయశాఖలో ఖర్చును పూర్తిగా తగ్గించాడు. న్యాయశాఖను కార్యనిర్వాహక శాఖ నుంచి వేరుచేశాడు. జిల్లా కలెక్టర్లకు న్యాయాధికారాలు తొలగించి వారికి భూమిశిస్తు వసూళ్లను మాత్రమే అప్పగించాడు. జిల్లా కోర్టులకు జిల్లా జడ్జిలను నియమించాడు. సివిల్, క్రిమినల్ కేసులను విచారించడానికిగాను కారన్ వాలీస్ పై స్థాయి నుంచి క్రింది స్థాయి వరకు న్యాయస్థానాలను ఏర్పాటు చేశాడు. 50 రూపాయల లోపు ఆస్తి తగాదాలను మున్సిఫ్ కోర్టులు విచారించాయి. మున్సిఫ్ కోర్టులకు భారతీయులను న్యాయాధికారులుగా నియమించాడు. నాడు మొత్తం 23 జిల్లాలుండేవి. ప్రతి జిల్లాకు ఒక జిల్లా కోర్టును ఏర్పాటు చేశాడు. బెంగాల్, బీహార్, ఒరిస్సాలను నాలుగు డివిజనులుగా విభజించాడు. ప్రతి డివిజన్కు ఒక సర్క్యూట్ కోర్ట్ను ఏర్పరచాడు. క్రిమినల్ కేసులలో సదర్ నిజామత్ అదాలత్ అప్పీళ్లను స్వీకరించి విచారించింది. అదేవిధంగా సదర్ దివానీ అదాలత్ సివిల్ వ్యవహారాల విచారణను స్వీకరించింది. గవర్నర్ జనరల్-ఇన్-కౌన్సిల్ క్రిమినల్ కేసులలో తుది తీర్పును ఇచ్చేది. న్యాయశాఖకు సంబంధించిన అన్ని నియమాలను క్రోడీకరించారు. దీనికి ‘కారన్ వాలీస్ కోడ్’ అని పేరు వచ్చింది. సమన్యాయపాలన, స్వతంత్ర న్యాయశాఖలు ఈ కోడ్లో చోటుచేసుకున్నాయి. అంగవిచ్ఛేదంలాంటి క్రూరమైన శిక్షలు రద్దయ్యాయి.

పోలీస్ సంస్కరణలు: పోలీస్ సంస్కరణలలో భాగంగా కారన్ వాలీస్ పోలీస్ అధికారాలను జమిందారుల నుంచి తీసివేశాడు. ప్రతి జిల్లాను ఠాణాలుగా విభజించారు. ప్రతి ఠాణాకు దరోగా అనే పోలీస్ అధికారిని నియమించాడు. ప్రతి జిల్లాకు సూపరింటిండెంట్ ఆఫ్ పోలీస్ అనే ఉద్యోగిని నియమించాడు. ఈ విధంగా ఆధునిక పోలీస్ వ్యవస్థకు కారన్ వాలీస్ పునాది వేశాడు.

జైలు సంస్కరణలు: కారన్ వాలీస్ జైలు సంస్కరణలను ప్రవేశపెట్టాడు. మేజిస్ట్రేట్లు తరచుగా జైళ్లను తనిఖీ చేయాలని, ఖైదీలకు తగిన సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ఆదేశాలిచ్చాడు. ఖైదీల ఆరోగ్య విషయంలో కూడా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంది. సివిల్, క్రిమినల్ నేరస్థులకు వేరువేరు వార్డ్లను కేటాయించారు. మహిళా ఖైదీలకు ప్రత్యేక బ్లాక్ లను ఏర్పాటు చేశాడు.

శాశ్వత భూమిశిస్తు నిర్ణయ విధానం: కారన్ వాలీస్ సంస్కరణలన్నింటిలో అతి ప్రధానమైనది శాశ్వత భూమిశిస్తు నిర్ణయ పద్ధతి. ఈ పద్ధతిలో భూమిశిస్తును వసూలు చేయటానికి ప్రతి 10 సంవత్సరాలకొకసారి వేలంపాటలు వేస్తారు. ఈ వేలం పాటలో ఎక్కువ మొత్తాన్ని చెల్లిస్తామని ఒప్పుకున్న జమిందారులకు శిస్తువసూలు అధికారాన్ని అప్పగిస్తారు. ఈ మొత్తాన్ని జమిందారులు ప్రతి సంవత్సరం కాక 10 సంవత్సరాల కాలానికి నిర్ణయిస్తారు. ఈ పద్ధతిననుసరించి జమిందారులకు భూములపై యాజమాన్యపు హక్కు ఏర్పడింది. పన్నులు చెల్లించనివారి భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని, వాటిని వేలం వేసి, తన బకాయిలను రాబట్టుకుంది. జమిందారుల నుంచి 89 శాతాన్ని శిస్తుగా వసూలుచేసి, మిగిలిన 11 శాతాన్ని వారికే వదిలివేసింది. ఇది అధికమైన భూమిశిస్తే, కాని ఈ నిర్ణయం శాశ్వతమైంది కాబట్టి భూమి నుంచి ఫలసాయం పెరిగినా అది కంపెనీకి చెందదు.

లాభాలు: శాశ్వత భూమిశిస్తు నిర్ణయ పద్ధతి వలన ప్రభుత్వానికి కొన్ని లాభాలు చేకూరాయి.
అవి:

  1. ప్రభుత్వానికి ఎంత ఆదాయం వస్తుందో ముందుగా ఖచ్చితంగా తెలిసింది.
  2. ప్రతి సంవత్సరం భూమిశిస్తు నిర్ణయం, దాని వసూలు బాధ్యతలు ప్రభుత్వాధికారులకు తప్పిపోయాయి.
  3. భూమిశిస్తు రేటు రెండింతలయింది.
  4. జమిందారులు కష్టించి తమ ఉత్పత్తులను పెంచుకొని ఆదాయాన్ని పెంచుకోగలిగారు.
  5. పెరిగిన ఆదాయాల వల్ల భూస్వాములు పరిశ్రమలలో పెట్టుబడి పెట్టగలిగారు.
  6. దీనివల్ల పారిశ్రామికీకరణ జరిగి ప్రజల జీవన ప్రమాణం పెరిగింది.
  7. జమిందారులతో మిత్రత్వం లభించి కంపెనీ పాలనకు భద్రత ఏర్పడింది.

నష్టాలు: శాశ్వత భూమిశిస్తు నిర్ణయ పద్ధతి వలన కొన్ని నష్టాలు కూడా వున్నాయి. అవి:

  1. కొందరు జమిందారులు పెరిగిన శిస్తులు చెల్లించలేకపోవటంతో వారి భూములు వేలానికి వచ్చాయి. కంపెనీ ప్రభుత్వం కూడా కొంతవరకు నష్టపోయింది.
  2. ఈ నిర్ణయం వల్ల సమాజం జమిందారులు, కౌలుదారులు అనే రెండు వర్గాలుగా విడిపోయింది.
  3. జమిందారుల ఆదాయం పెరిగినందువల్ల వారు నగరాలకు వలసవెళ్లి విలాసవంతమైన జీవితాలు గడపసాగారు.
  4. రైతుల స్థితి దిగజారింది. వారు జమిందారుల దయాదాక్షిణ్యాలమీద ఆధారపడవలసి వచ్చింది. రైతులకు యాజమాన్యపు హక్కు లేకపోవటంతో వారి జీవితం మరింత దుర్భరమైంది.

ముగింపు: కారన్ వాలీస్ పరిపాలనావేత్తగా పేరుపొందాడు. బ్రిటిష్ ఇండియా పరిపాలనలో అనేక సంస్కరణలు ప్రవేశపెట్టి అక్కడ చెరిగిపోని ముద్ర వేసుకున్నాడు. అతడి పరిపాలనకు కారన్వాలీస్ విధానమని పేరొచ్చింది. న్యాయ, పోలీస్ శాఖలలో ఇంగ్లీషువారి విధానాలను ప్రవేశపెట్టాడు. అతడి న్యాయసంస్కరణలలో ఇంగ్లీషు న్యాయ విధానం ప్రతిబింబించింది.

AP Inter 1st Year History Study Material Chapter 11 వలస పాలనలో భారతదేశం

ప్రశ్న 5.
1857 తిరుగుబాటుకు గల ముఖ్య కారణాలు తెలపండి.
జవాబు:
ఆధునిక భారతదేశ చరిత్రలో 1857 తిరుగుబాటు ఒక ముఖ్య చారిత్రక ఘట్టం. ఈ తిరుగుబాటుకు దారితీసిన పరిస్థితులను రాజకీయ, ఆర్థిక, సాంఘిక, మత, సైనిక కారణాలను ఐదు రకాలుగా విభజించవచ్చు.

1) రాజకీయ కారణాలు: భారతదేశంలో తన సామ్రాజ్యాన్ని విస్తరింపచేయటానికి ఆంగ్లేయులు అనేక పద్ధతులను అవలంబించారు. యుద్ధాలు చేయటం ద్వారా, సైన్యసహకారపద్ధతి ద్వారా, పరిపాలన సరిగాలేదనే నెపంతో సామ్రాజ్య విస్తరణ చేశారు. డల్హౌసీ మరో అడుగు ముందుకు వేసి రాజ్యసంక్రమణ సిద్ధాంతం ద్వారా అయోధ్య, సతారా, నాగ్పూర్, ఝాన్సీ మొదలైన సంస్థానాలను బ్రిటిష్ సామ్రాజ్యంలో విలీనం చేశాడు. పీష్వా దత్తకుమారుడైన నానాసాహెబ్కు భరణాన్ని నిరాకరించాడు. కర్ణాటక, తంజావూర్, తిరువాన్కూర్ రాజుల బిరుదులను రద్దుచేశాడు. మొగల్ చక్రవర్తి నివాసాన్ని ఎర్రకోట నుంచి కుతుబ్మనార్కు దగ్గరగా మార్చాలని, బహదూర్షి తరువాత మొగల్ చక్రవర్తి బిరుదును రద్దుచేయాలని ప్రతిపాదించాడు. అందువలన స్వదేశీరాజులు తమ భవిష్యత్తు గురించి ఆందోళన పడసాగారు. పైగా ఆంగ్లేయులు పాటించిన జాతి వివక్ష విధానం, వారు ప్రజల పట్ల చూపిన నిరాదరణ ప్రజల్లో అసంతృప్తి కలిగించింది. ఈ విధంగా అసంతృప్తికి లోనైనవారంతా 1857 తిరుగుబాటులో పాల్గొన్నారు.

2) ఆర్థిక కారణాలు: రాజ్యసంక్రమణ సిద్ధాంతం వల్ల అనేక రాజ్యాలు బ్రిటిష్ సామ్రాజ్యంలో విలీనమై ఆయా రాజ్యాలలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు, గాయకులు, కవులు, విద్వాంసులు మొదలైన వారు నిరుద్యోగులై సిపాయిలుగా మారారు. వారు తమ కనీస జీవితావసరాలను కూడా గడుపుకోలేక తిరుగుబాటుకు సంసిద్ధులైనారు. కంపెనీ ప్రభుత్వం భారతదేశంలో వ్యవసాయాన్ని, పరిశ్రమలను ప్రోత్సహించలేదు. దేశంలో కుటీరపరిశ్రమలు క్షీణించాయి. కంపెనీ పాలనలో ప్రజలకు చేయటానికి పనిలేక, తినడానికి తిండిలేక అలమటించారు. ఆర్థిక పరిస్థితి క్షీణించి తిరుగుబాటు తప్ప వేరే మార్గం లేకపోయింది.

3) సాంఘిక కారణాలు: ఈస్టిండియా కంపెనీ లార్డ్ బెంటింక్ కాలం నుంచి లార్డ్ డల్హౌసీ కాలం వరకు అనేక సాంఘిక సంస్కరణలు ప్రవేశపెట్టింది. సతీసహగమన నిషేధ చట్టం, మతం మార్చుకొన్నప్పటికీ ఆస్తిలో హక్కు కలిగించే చట్టం, బాల్య వివాహాల నిషేధచట్టం, వితంతు పునర్వివాహ చట్టం వంటి సంస్కరణలు, తమ సనాతన ధర్మానికి విరుద్ధమని హిందువులు అభిప్రాయపడ్డారు. డల్హౌసీ కాలం నాటి ఆధునికీకరణ రైల్వే, తంతి తపాల ఏర్పాట్లు ప్రజల్లో సంచలనాన్ని సృష్టించాయి. ఈ మార్పులవల్ల తమ ఆచారబద్ధమైన ప్రాచీన సమాజం కూలిపోయిందని సనాతనులు ఆందోళనపడ్డారు. పాశ్చాత్యతరహా పరిపాలనా సంస్థలు, నూతన న్యాయస్థానాలు, ఇంగ్లీష్ విద్య, రైల్వే, టెలిగ్రాఫ్లు తమ సనాతన ధర్మాన్ని నాశనం చేయడానికి ప్రవేశపెట్టారని వారు భావించారు. ప్రభుత్వం ఈ విధంగా చట్టాల ద్వారా తమ మతధర్మాలను నాశనం చేస్తున్నదనే అపోహ ప్రజలలో వ్యాపించింది.

4) మత కారణాలు: క్రైస్తవులైన ఆంగ్లేయులు తమ పరిపాలన స్థాపించిన తరువాత, హిందువులనందరిని, క్రైస్తవులుగా మార్చివేస్తారనే భయం, అనుమానం ప్రజల్లో ఏర్పడింది. కంపెనీ ప్రభుత్వ కాలంలో, క్రైస్తవ మిషనరీలు తమ మత ప్రచారాన్ని ఉధృతం చేశారు. వారు హిందూ, ముస్లిం మత సంప్రదాయాలను అవహేళన చేస్తూ తమ మత ప్రచారాన్ని కొనసాగించేవారు. 1813 ఛార్టర్ చట్టంలో మిషనరీలకు సౌకర్యాలు కల్పించడం, ఇంగ్లీష్ విద్యావ్యాప్తికి ప్రత్యేక నిధిని కల్పించడం, మతం మార్చుకొన్నప్పటికీ ఆస్తిలో హక్కు కల్పించడం వంటి చర్యలు మత మార్పిడిని ప్రోత్సహించటం కోసమేనని ప్రజలు అనుమానపడ్డారు. క్రైస్తవ మిషనరీలు, పాఠశాలలు, వైద్యశాలలు స్థాపించి అక్కడ కూడా మత సిద్ధాంతాలను బోధించారు. సతీసహగమనాన్ని రద్దుచేయడం, బాల్య వివాహాలను నిషేధించడం, వితంతు వివాహాలను అనుమతించడం, హిందూమత ఆచారాలలో ప్రభుత్వం జోక్యం కలిగించుకొని, మత మార్పిడులను ప్రోత్సహించి, భారతదేశాన్ని క్రైస్తవరాజ్యంగా మార్చడానికి బ్రిటిష్వారు ఈ మార్పులు చేస్తున్నారనే భావం ప్రజల్లో ఏర్పడింది. ఇందుకు కొందరు కంపెనీ అధికారులు అవలంబించిన మత పక్షపాత ధోరణి కూడా దోహదం చేసింది.

5) సైనిక కారణాలు: కంపెనీలో రెండు రకాలైన సైనికులున్నారు. భారతీయులు బ్రతుకుతెరువు కోసం కంపెనీలో సైనికోద్యోగులుగా చేరారు. వారిని సిపాయిలు అంటారు. ఆంగ్లేయులను సైనికులంటారు. వీరిరువురి మధ్య హోదాలలోను, జీతభత్యాలలోను ఎంతో వ్యత్యాసముంది. 1856లో బ్రిటిష్ ప్రభుత్వం జనరల్ సర్వీసెస్ “ఎన్లిల్టిమెంట్” చట్టాన్ని ప్రవేశపెట్టింది. ఈ చట్టం ప్రకారం సిపాయిలు ఏ ప్రాంతానికైనా వెళ్లి యుద్ధం చేయాల్సి వుంది. హిందూ ధర్మశాస్త్ర ప్రకారం సముద్ర ప్రయాణం నిషేధం. ఇదిగాక కులం, మతాన్ని సూచించే చిహ్నాలను తీసివేయాలనే ఉత్తర్వులు వీరిని మరింత కలవరపెట్టాయి. కొన్ని సంవత్సరాలుగా తీవ్రమైన అసంతృప్తికి లోనైన సిపాయిలు 1849, 1850, 1852లలో తమ నిరసనలను తిరుగుబాట్ల రూపంలో ప్రదర్శించారు. 1857 నాటికి ఈ అసంతృప్తి తీవ్రమైన స్థాయికి చేరుకుంది. మొదటి ఆఫ్ఘన్ యుద్ధంలో, సిక్కు యుద్ధాలలో ఆంగ్లేయులకు సంభవించిన ఓటమివల్ల వారు అజేయులు అనే భావం పోయింది. కలిసి పోరాడితే ఆంగ్లేయులను ఓడించటం కష్టమేమీకాదని వారు విశ్వసించారు. అంతేగాక సిపాయిలకు, ఆంగ్ల సైనికులకు మధ్య సంఖ్యాబలంలో చాలా తేడా వుంది. ఆంగ్లేయులకంటే, సిపాయిల సంఖ్య చాలా ఎక్కువగా వుంది. అందువల్ల 1857లో సిపాయిలు తిరుగుబాటు మార్గాన్ని ఎంచుకున్నారు.

6) తక్షణ కారణం: కంపెనీ ప్రభుత్వం 1856లో కొత్త “ఎన్ఫీల్డ్” తుపాకులను ప్రవేశపెట్టింది. వాటిలో ఉపయోగించే తూటాలను సైనికులు నోటితో చివరి భాగం కొరికి తుపాకీలో అమర్చి పేల్చవలసివుండేవి. కానీ ఆ తూటాలకు ఆవు కొవ్వు, పంది కొవ్వు పూతపూసినట్లు ఒక వదంతి వ్యాపించింది. ఆవు హిందువులకు పవిత్రమైనది. పందిని ముస్లింలు అపవిత్రంగా భావిస్తారు. ఆంగ్లేయులు తమ మతాలను బుద్ధిపూర్వకంగా కించపరచడానికే ఈ విధంగా చేశారని సిపాయిలు విశ్వసించారు. అప్పటికే ప్రబలంగా వున్న అసంతృప్తికి ఈ వదంతి ఆజ్యం పోసినట్లయింది.

సంక్షిప్త సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ఆల్బుకర్క్
జవాబు:
భారతదేశంలో పోర్చుగీసు ప్రాబల్యానికి గట్టి పునాదులు నిర్మించినవాడు ఆల్ఫాస్సో డి. ఆల్బూకర్క్, ఇతడు అత్యంత సమర్థుడు. గవర్నర్గా కొన్ని ప్రాంతాలలో పోర్చుగీసు వాణిజ్య గుత్తాధిపత్య స్థాపన ద్వారా మరియు పోర్చుగీసువారు స్థానికుల్ని వివాహం చేసుకోవడం ద్వారా, స్థానిక ప్రాంతాలను వలసలుగా మార్చుకోవాలనే విధానం ద్వారా, ముఖ్య ఓడరేవుల్లో కోటలు నిర్మించుకోవడం ద్వారా పోర్చుగీసువారు ఒక శక్తిగా రూపొందటానికి బాటలు వేసెను.

  1. క్రీ.శ. 1510లో శ్రీకృష్ణదేవరాయల సహకారంతో బీజాపూర్ సుల్తాన్ను ఓడించి, గోవా రేవు పట్టణాన్ని స్వాధీనం చేసుకొనెను. తదుపరి ఈ గోవా పోర్చుగీసువారి ప్రధాన వర్తక స్థావరమైంది.
  2. క్రీ.శ. 1511లో దూర ప్రాచ్యంలో మలక్కా సైతం ఆల్బూకర్క్ ఆధీనంలోకి వచ్చింది.
  3. వాణిజ్య విస్తరణలో ఆల్బూకర్క్ అరబ్బులను దారుణ హింసలకు గురిచేసెను.
  4. ఆల్బూకర్క్ తరువాత 1517 లో డయ్యూ, డామన్లు పోర్చుగీస్ హస్తగతమయ్యెను.
  5. అటులనే క్రమముగా పశ్చిమతీరంలో బేసిన్, సాల్సెట్టి, బేల్, బొంబాయిలలోనూ, తూర్పుతీరంలో శాన్ థోమ్, హుగ్లీలలోనూ స్థావరాలు స్థాపితమయ్యాయి.

AP Inter 1st Year History Study Material Chapter 11 వలస పాలనలో భారతదేశం

ప్రశ్న 2.
రాబర్ట్ క్లైవ్
జవాబు:
భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని స్థాపించిన ఘనుడు రాబర్ట్ క్లైవ్. క్లైవ్ చిన్న గుమాస్తాగా జీవితం ప్రారంభించి స్వయంకృషి వల్ల గవర్నర్ పదవికి ఎదిగాడు. ఈస్టిండియా కంపెనీ సామ్రాజ్య వ్యవస్థాపకుడుగా ఆధునిక భారతదేశ చరిత్రపుటల్లో రాబర్ట్ క్లైవ్ ప్రముఖ స్థానాన్ని పొందాడు.

ప్రశ్న 3.
సిరాజ్-ఉద్-దౌలా
జవాబు:
బెంగాల్ నవాబు సిరాజ్ ఉద్దేలా 1756లో ఫోర్టు విలియంను ముట్టడించి 146 మంది ఆంగ్లేయులను ఒక చిన్న గదిలో బంధించాడని, మరునాటి ఉదయానికి విపరీతమైన వేడి, ఉక్కవలన 23 మంది తప్ప మిగిలిన వారంతా మరణించారని ఒక కథనం ఉంది. దీనినే బ్లాక్ హోల్ ట్రాజడీ లేక కలకత్తా చీకటి గది విషాదాంతం అంటారు.

ప్రశ్న 4.
బక్సర్ తిరుగుబాటు
జవాబు:
1764 అక్టోబర్ 17న మీర్ ఖాసిం, అయోధ్య నవాబు, మొగల్ చక్రవర్తి షా ఆలంల కూటమికి, ఆంగ్లేయులకు బక్సార్ వద్ద జరిగిన యుద్ధాన్ని బక్సార్ యుద్ధం అంటారు. ఈ యుద్ధంలో ముగ్గురు పాలకుల కూటమి ఓడిపోయింది. ఈ యుద్ధం భారతదేశంలో ఆంగ్ల సామ్రాజ్య విస్తరణకు తోడ్పడింది.

ప్రశ్న 5.
ద్వంద ప్రభుత్వ విధానం
జవాబు:
1765 నాటి అలహాబాద్ సంధుల ప్రకారం ఇంగ్లీషువారికి, బెంగాల్, బీహార్, ఒరిస్సాలలో భూమిశిస్తు వసూలు చేసుకునే హక్కు లభించింది. దీన్ని దివాని అంటారు. పరిపాలన బాధ్యత నవాబు అప్పగించడం జరిగింది. దీన్ని నిజామత్ అంటారు. ఈ విధంగా పరిపాలనాధికారాలు విభజించబడినందువల్ల దీనికి ద్వంద ప్రభుత్వం అనే పేరు వచ్చింది.

ప్రశ్న 6.
వారన్ హేస్టింగ్
జవాబు:
భారతదేశంలో క్లెవ్ స్థాపించిన ఆంగ్లాధికారాన్ని సుస్థిరపరచి దాని విస్తరణకు కూడా పునాదులను నిర్మించినవాడు వారన్ హేస్టింగ్ (1772-1785).

వారన్ హేస్టింగ్ ఎదుర్కొన్న సమస్యలు: వారన్ హేస్టింగ్ మొదట బెంగాల్ గవర్నర్ గా వచ్చాడు. కానీ 1773 నాటి రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం గవర్నర్ జనరల్ అయ్యాడు. వారన్ హేస్టింగ్ బెంగాల్ గవర్నర్ అయ్యేనాటికి అతడికి ఎన్నో సమస్యలు ఎదురైనాయి. రాబర్ట్ క్లైవ్ ప్రవేశపెట్టిన ద్వంద ప్రభుత్వం గందరగోళానికి దారితీసింది. కంపెనీ ఆర్థిక వనరులలో అతి ముఖ్యమైన భూమిశిస్తు జమిందారుల చేతుల్లోకి పోయింది. కంపెనీ ఉద్యోగులు విపరీతంగా ధనార్జన చేశారు. కానీ, కంపెనీ ఖజానా మాత్రం వట్టిపోయింది. న్యాయపాలనలో కూడా విపరీతమైన గందరగోళం చోటుచేసుకుంది.

స్వదేశీ విధానం – సంస్కరణలు: పరిపాలనలో చోటుచేసుకున్న అస్తవ్యస్త పరిస్థితులను తొలగించటానికి వారన్ హేస్టింగ్ అనేక సంస్కరణలను చేపట్టాడు. అవి:
ద్వంద ప్రభుత్వం రద్దు: క్లైవ్ ప్రవేశపెట్టిన ద్వంద ప్రభుత్వం అన్ని విధాలా విఫలమైంది. అందువలన దానిని రద్దుచేసి, బెంగాల్ రాష్ట్ర పరిపాలనా బాధ్యతలన్నింటిని కంపెనీ నేతృత్వంలోకి తెచ్చాడు.

ప్రశ్న 7.
సైన్య సహకార విధానం
జవాబు:
సైన్య సహకార పద్ధతిని చాలా స్వదేశీ రాజ్యాలలో అమలుచేసినవాడు వెల్లస్లీ. దీనిననుసరించి స్వదేశీ రాజ్యం తమ విదేశాంగ సంబంధాలన్నింటిని ఇంగ్లీషు కంపెనీకి అప్పగించాలి. ఆ సంస్థానాన్ని విదేశీ శత్రువుల నుంచి ఇంగ్లీషువారు కాపాడతారు. అయితే స్వదేశీ సంస్థానాల ఆంతరంగిక విషయాలలో ఇంగ్లీషు కంపెనీ జోక్యం చేసుకోదు. ఈ పద్ధతి వలన ఇండియాలో ఇంగ్లీషువారి శక్తి గణనీయంగా పెరిగింది.

AP Inter 1st Year History Study Material Chapter 11 వలస పాలనలో భారతదేశం

ప్రశ్న 8.
విలియం బెంటింక్
జవాబు:
భారతీయుల మన్ననలను పొందిన గవర్నర్ జనరల్ విలియం బెంటింక్ ఒకడు. తన పాలనా కాలంలో విలియం బెంటింక్ ఆర్థిక విధానంలో, విద్యా రంగంలో కొత్త సంస్కరణలను ప్రవేశపెట్టాడు. నాడు సమాజంలో వున్న సాంఘిక దురాచారాలను రూపుమాపటానికి అనేక సాంఘిక సంస్కరణలను కూడా చేపట్టాడు. ఈ సాంఘిక సంస్కరణలలో బెంటింక్ పేరును చిరస్మరణీయం చేసిన సాంఘిక సంస్కరణలు హిందువులలో ప్రబలంగా వున్న సతీసహగమన దురాచారాన్ని మాన్పించడంలో బెంటింక్ చాలావరకు కృతకృత్యుడయ్యాడు. 1829లో రాజారామ్ మోహన్రాయ్ సహకారంతో ఒక శాసనము జారీ చేశాడు.

ప్రశ్న 9.
డల్హౌసీ
జవాబు:
డల్హౌసీ తన 8 సంవత్సరాల పాలనా కాలంలో (1848-1856) బ్రిటీషు సామ్రాజ్య విస్తరణయే తన ప్రధాన లక్ష్యంగా ఎంచుకొన్నాడు. వారన్ హేస్టింగ్ ప్రారంభించిన కంపెనీ సామ్రాజ్యాన్ని తన విజయాల ద్వారా విస్తరింపచేశాడు. కంపెనీ రాజ్య విస్తరణ కోసం డల్హౌసీ నాలుగు మార్గాలను అనుసరించాడు. అవి:

  1. యుద్ధాలు
  2. రాజ్య సంక్రమణ సిద్ధాంతం
  3. బిరుదులు, భరణాల రద్దు
  4. దుష్పరిపాలన నెపం.

ప్రశ్న 10.
రాజ్య సంక్రమణ సిద్ధాంతం
జవాబు:
రాజ్య సంక్రమణ సిద్ధాంతం అనగా నిస్సంతులుగా మరణించిన స్వదేశీరాజుల సంస్థానాలు ఆంగ్లేయులకు సంక్రమిస్తాయి. ఈ విధానాన్ని అమలుచేసినవాడు డల్హౌసీ, ఈ సిద్దాంతాన్ననుసరించి బ్రిటీషు రాజ్యంలో విలీనమైన మొదటి స్వదేశీ సంస్థానం సతారా. ఈ సిద్ధాంతం 1857 నాటి సిపాయిల తిరుగుబాటుకు ఒక కారణమైంది.

ప్రశ్న 11.
రాణి లక్ష్మీబాయి
జవాబు:
1857 తిరుగుబాటులో పాల్గొన్న ప్రముఖులలో ఝాన్సీలక్ష్మీబాయి ఒకరు. ఈమె మహారాష్ట్రకు చెందిన తాంతియాతోపేతో కలిసి బ్రిటీషు వారిని గడగడలాడించింది. తన దత్తకుమారుని తన వారసునిగా గుర్తించటానికి ఆంగ్లేయులు నిరాకరించటంతో ఈమె తిరుగుబాటులో పాల్గొంది. 1858లో సర్ హ్యూరోస్ సేనాని ఝాన్సీని ఆక్రమించినపుడు లక్ష్మీబాయి కోట నుండి తన దత్త కుమారునితో బయటపడి తాంతియాతోపేతో కలిసి గ్వాలియర్ కోటను ఆక్రమించి, బ్రిటిష్ వారితో యుద్ధాన్ని కొనసాగించింది. 1857 జూన్ 17న యుద్ధంలో వీరమరణం పొందింది.

ప్రశ్న 12.
రైత్వారి విధానం
జవాబు:
ఈ విధానంలో శిస్తును రైతులు నేరుగా ప్రభుత్వమునకు అనగా ప్రభుత్వ ఖజానాకు గాని, ప్రభుత్వోద్యోగులకు చెల్లించెదరు. ఇట్లు శిస్తు వసూలునందు ప్రభుత్వమునకు, రైతులకు మధ్య ఎట్టి మధ్యవర్తులు అనగా దళారులు లేకుండుట వలన ఈ విధానమును రైత్వారీ విధానముగా ప్రసిద్ధికెక్కెను. ఇంకనూ రైతులకు పట్టాలిచ్చి వారి వద్ద నుండి కబూలియత్లు (శిస్తు చెల్లింపు ఒడంబడికలు) తీసుకొనెడి సంప్రదాయము కూడా కలదు.

AP Inter 1st Year History Study Material Chapter 11 వలస పాలనలో భారతదేశం

ప్రశ్న 13.
రెండవ బహదూర్షా
జవాబు:
భారతదేశాన్ని పాలించిన మొగల్ చక్రవర్తులలో రెండో బహదూర్ చివరివాడు. 1857 మే లో మీరట్లో తిరుగుబాటు చేసిన సిపాయిలు ఢిల్లీ చేరి, రెండో బహదూర్షాను భారతదేశ చక్రవర్తిగా ప్రకటించారు. 1857 సెప్టెంబరులో ఢిల్లీని వశపరచుకొన్న బ్రిటిష్వారు బహదూరాను బందీగాచేసి, విచారణ జరిపి, ఖైదీగా రంగూన్ పంపించారు. అతని కుమారులను, మనుమల్ని పరాభవించి, చంపేశారు. 1862లో బహదూర్గా రంగూన్ జైలులో మరణించాడు. దీనితో మొగల్ వంశం అంతరించింది.

ప్రశ్న 14.
టిప్పు సుల్తాన్
జవాబు:
మైసూరు పాలించిన హైదర్ అలీ కుమారుడు టిప్పు సుల్తాన్. ఇతడు తన తండ్రితోపాటు మొదటి రెండు మైసూర్ యుద్ధాలలో పాల్గొన్నాడు. రెండో మైసూర్ యుద్ధ కాలంలో హైదర్ అలీ మరణించిన వెంటనే టిప్పు సుల్తాన్ తండ్రి వారసత్వాన్ని స్వీకరించాడు. మూడో మైసూర్ యుద్ధంలో ఆంగ్లేయుల చేతిలో ఓడిపోయి శ్రీరంగపట్టణం సంధిని కుదుర్చుకొని తన రాజ్యంలో చాలా భాగం కోల్పోయాడు. 1799లో జరిగిన నాలుగో మైసూర్ యుద్ధంలో ఓడిపోయి మరణించాడు.