AP Inter 1st Year Zoology Study Material Chapter 7 పెరిప్లానెటా అమెరికానా (బొద్దింక)

Andhra Pradesh BIEAP AP Inter 1st Year Zoology Study Material 7th Lesson పెరిప్లానెటా అమెరికానా (బొద్దింక) Textbook Questions and Answers.

AP Inter 1st Year Zoology Study Material 7th Lesson పెరిప్లానెటా అమెరికానా (బొద్దింక)

అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
బొద్దింకను చీడపురుగు అని ఎందుకు అంటారు?
జవాబు:
బొద్దింకలు విసర్జన పదార్థాలతో ఆహార పదార్థాలను కలుషితం చేసే హానికర కీటకం. దీనివలన అనేక బాక్టీరియల్ వ్యాధులు సంక్రమిస్తాయి. కనుక దీనిని చీడపురుగు అంటారు.

ప్రశ్న 2.
బొద్దింక ఉరః ఖండింతంలో ఉన్న పృష్ఠఫలకాలను తెలపండి.
జవాబు:
బొద్దింక ఉరః ఖండితంలో ప్రాగ్వక్షంలో – పూర్వ పృష్టకం
అంత్య వక్షంలో – మధ్యపృష్ఠకం, అంత్యపృష్టకం అనే పృష్ఠ ఫలకాలుంటాయి.

ప్రశ్న 3.
బొద్దింక ఏయే నిర్మాణాలతో నునుపు, గరుకు తలాలపై నడుస్తుంది?
జవాబు:
బొద్దింక గరుకుతలంపై కాలి చివరన ఉండే నఖాలు, అరోలియమ్ సహాయంతో, ప్లాంటులాల సహాయంతో నునుపు తలపై గమనం చేస్తుంది.

ప్రశ్న 4.
బొద్దింక తల అమరికను హైపోగ్నాథస్ అని ఎందుకంటారు?
జవాబు:
బొద్దింక తల దేహానికి లంబకోణంలో వేలాడుతున్నట్లు ఉంటుంది. నోటి భాగాలు క్రిందికి వంగి ఉంటాయి. ఇటువంటి తల అమరికను హైపోగ్నాథస్ తల అంటారు.

ప్రశ్న 5.
బొద్దింక గమనంలో త్రిపాది ఏవిధంగా ఏర్పడుతుంది?
జవాబు:
బొద్దింక గమనంలో మూడు జత కాళ్ళను రెండు త్రిపాదులుగా ఏర్పరుచుకుంటుంది. ఒక్కో త్రిపాది ఒక వైపున ఉన్న పూర్వకాలు, పరకాలు మరోప్రక్క నున్న మధ్యకాలు ఏర్పడుతుంది. ఒక త్రిపాది మూడు కాళ్ళు నేలమీద ఉంటాయి. మరో త్రిపాది మూడుకాళ్ళు ముందుకు సాగుతాయి.

AP Inter 1st Year Zoology Study Material Chapter 7 పెరిప్లానెటా అమెరికానా (బొద్దింక)

ప్రశ్న 6.
బొద్దింకలో రెక్కలు లేపడానికీ, కిందికి దించడానికీ ఉపయోగపడే కండరాలు ఏవి?
జవాబు:
బొద్దింకలో రెక్కలు పృష్టోదర కండరాల సంకోచం వల్ల రెక్కలు పైకి లేస్తాయి. పృష్ఠ ఆయత కండరాల సంకోచంవల్ల రెక్కలు క్రిందికి దించబడతటాయి.

ప్రశ్న 7.
బొద్దింకలోని వివిధ రక్త కోటరాలను పేర్కొనండి.
జవాబు:
బొద్దింకలో మూడు రక్త కోటరాలుంటాయి. అవి.
1. హృదయావరణ రక్తకుహరం లేదా పృష్ఠకోటరం,
2. పర్వాంతరాంగ రక్తకుహరం లేదా మధ్యకోటరం,
3. ఉదరఫలక రక్తకుహరం లేదా ఉదరకోటరం లేదా పరినాడీ కోటరం.

ప్రశ్న 8.
కొవ్వు దేహాలు సకశేరుకాల కాలేయంతో ఏవిధంగా సమానం?
జవాబు:
బొద్దింకలోని కొవ్వు దేహాలను సకశేరుకాలలోని కాలేయంతో పోల్చవచ్చును. ఇవి కొన్ని విధులలో సకశేరుకాల కాలేయాన్ని పోలి ఉంటాయి. కొవ్వు దేహా కణాల విధులు.

  1. ట్రోఫోసైట్స్ – ఆహారాన్ని నిలువచేసే కణాలు.
  2. మైసిటోసైట్స్ – సహ జీవన బాక్టీరియాను కలిగి ఉంటాయి.
  3. ఈనోసైట్స్ – కొవ్వులను స్రవిస్తాయి.
  4. యూరేట్ కణాలు – యూరిక్ ఆమ్లాన్ని నిలువచేస్తాయి.

ప్రశ్న 9.
బొద్దింక ఆహార నాళంలో ఏ భాగం పెరిట్రాఫిక్ త్వచాన్ని స్రవిస్తుంది?
జవాబు:
బొద్దింక ఆహార నాళంలో పెరిట్రాఫిక్ త్వచాన్ని అంతర జఠరపు గరాటులాంటి ఆద్వముఖ కవాటం స్రవిస్తుంది.

ప్రశ్న 10.
బొద్దింక ఆహారనాళంలోని ఏ భాగం నీటిని పునఃశోషణ చేస్తుంది?
జవాబు:
బొద్దింక ఆహారనాళంలోని పురీషనాళంలోని పురీషనాళ సూక్ష్మాంకురాలు జీర్ణంకాని ఆహారంలోని నీటిని పునఃశోషణ జరుపుతాయి.

ప్రశ్న 11.
బొద్దింకలో ఆహారం కొరకడానికీ, రుచి తెలుసుకోడానికీ ఉపయోగపడే నోటి భాగాలను తెలపండి.
జవాబు:
బొద్దింకలో ఆహారాన్ని కొరకడానికి హనువులు, రుచి తెలుసుకోవడానికి అధరం ఉపయోగపడతాయి.

AP Inter 1st Year Zoology Study Material Chapter 7 పెరిప్లానెటా అమెరికానా (బొద్దింక)

ప్రశ్న 12.
పక్షాకార కండరాలు అంటే ఏవి?
జవాబు:
బొద్దింక దేహంలోని ప్రతికండితానికి పార్శ్వతలంలో ఒక జత త్రిభుజాకార కండరాలు ఒక శ్రేణిలో ఉంటాయి. వీటిని పక్షాకార కండరాలు అంటారు.

ప్రశ్న 13.
రక్తకుహరం అంటే ఏమిటి?
జవాబు:
బొద్దింకలో రక్తనాళాలలో ప్రవహించదు. దేహంకురం రక్తంలో నింపబడి ఉంటుంది. కనుక బొద్దింక శరీర కుహరాన్ని రక్త కుహరం అంటారు.

ప్రశ్న 14.
బొద్దింకలోని మూడు కోటరాలు పరిమాణంలో సమానంగా లేవు. ఎందుకు?
జవాబు:
బొద్దింకలోని మూడు కోటరాలు పరిమాణంలో సమానంగా ఉండవు. వీటిలో మధ్య కోటరం పెద్దది. ఎందుకంటే దీనిలో చాలా అంతరాంగ అవయవాలు ఉంటాయి. పృష్ఠ, ఉదర కోటరాలు చిన్నవి. వీటిలో గుండె, నాడీదండం మాత్రమే ఉంటాయి.

ప్రశ్న 15.
పెరిప్లానెటా రక్తాన్ని హీమోలింఫ్/రక్తశోషరసం అని ఎందుకంటారు?
జవాబు:
పెరిప్లానెటా (బొద్దింక) రక్తం వర్ణరహితం, కనుక దీనిని రక్తశోషరసం/హీమోలిఫ్ అంటారు. దీనిలో జీవ ద్రవ్యం, స్వేచ్ఛారక్త కణాలు లేదా హీమోసైట్లు ఉంటాయి.

ప్రశ్న 16.
పెరిప్లానెటా రక్తంలో ఉన్న హీమోసైట్ల విధి ఏమిటి?
జవాబు:
పెరిప్లానెటా రక్తంలోని హీమోసైట్లు భక్షక లక్షణాన్ని కలిగి ఉండి బాక్టీరియావంటి అన్య పదార్థాలను ‘అంతర్గ్రహణం’ చేస్తాయి.

AP Inter 1st Year Zoology Study Material Chapter 7 పెరిప్లానెటా అమెరికానా (బొద్దింక)

ప్రశ్న 17.
పెరిప్లానెటా రక్తం యొక్క ముఖ్య విధులను తెలపండి.
జవాబు:
పెరిప్లానెటా రక్తం :

  1. ఆహార నాళం నుండి జీర్ణమైన ఆహారపదార్థాలను దేహ అంగాలకు చేరవేస్తుంది.
  2. దేహ భాగాలనుండి నత్రజని సంబంధిత వ్యర్థాలను విసర్జిక అవయవాలకు చేరవేస్తుంది.
  3. రక్షక కణాలను వ్యాధి సాంక్రమిక ప్రదేశాలకు చేరవేస్తుంది.
  4. వినాళగ్రంథి స్రావకాలను వాటి లక్ష్య అవయవాలను రవాణా చేస్తుంది.

ప్రశ్న 18.
పెరిప్లానెటా రక్తం ఎరుపు రంగులో లేదు. దీనిలో ఏ వర్ణం లోపించిందని మీరు తలుస్తారు?
జవాబు:
పెరిప్లానెటా రక్తంలో హిమోగ్లోబిన్ (రక్త వర్ణకం) లేదు కనుక రక్తం ఎరుపురంగులో లేక తెల్లగా ఉంటుంది.

ప్రశ్న 19.
బొద్దింకలో ఎన్ని శ్వాసరంధ్రాలు ఉన్నాయి ? వాటి ప్రాంతాలను తెలపండి.
జవాబు:
బొద్దింకలో మొత్తం 10 జతల శ్వాసరంధ్రాలున్నాయి. మొదటి జత మధ్య వక్షంలోను, రెండవ జత అంత్య వక్షంలోను, మిగిలిన 8 జతల శ్వాస రంధ్రాలు ఉదరం మొదటి ఎనిమిది ఖండితాలలోను ఉంటాయి. ఈ రంధ్రాలు ఆయా ఖండితాల పార్శ్వ ఫలకాలపై తెరుచుకుంటాయి.

ప్రశ్న 20.
ట్రైకోమ్స్ అంటే ఏమిటి? వాటి విధులను తెలపండి.
జవాబు:
ధూళి రేణువులు శ్వాసరంధ్రాలలోకి ప్రవేశించకుండా ఉండేందుకు శ్వాసరంధ్రాలకు ఉండే చిన్న రోమాలను ట్రైకోమ్లు అంటారు.

ప్రశ్న 21.
బొద్దింక శ్వాసవ్యవస్థను పాలీన్యూస్టిక్, హోలోన్యూస్టిక్ వ్యవస్థ అని అంటారు ఎందుకు?
జవాబు:
కనీసం మూడు జతల శ్వాసరంధ్రాలు క్రియాత్మకంగా ఉంటే దాన్ని పాలీన్యూస్టిక్ శ్వాసవ్యవస్థ అని అంటారు. శ్వాసరంధ్రాలన్ని క్రియాత్మకంగా ఉంటే దానిని హోలోన్యూస్టిక్ రకం అంటారు. బొద్దింకలో అన్ని శ్వాసరంధ్రాలు క్రియాత్మకంగా ఉంటాయి. గనుక దీనిని హోలీన్యూస్టిక్, హోలోన్యూస్టిక్ శ్వాసవ్యవస్థ అంటారు.

ప్రశ్న 22.
ఇంటిమా అంటే ఏమిటి?
జవాబు:
బొద్దింకలో వాయునాళం లోపలి అవభాసినిస్తరాన్ని ఇంటిమా అంటారు.

ప్రశ్న 23.
బొద్దింక వాయునాళికను ఆవరించిన ప్రోటీన్ ను పేర్కొనండి.
జవాబు:
బొద్దింక వాయునాళికను ఆవరించి ఉండే ప్రోటీన్ ట్రేకిన్.

AP Inter 1st Year Zoology Study Material Chapter 7 పెరిప్లానెటా అమెరికానా (బొద్దింక)

ప్రశ్న 24.
ఉచ్ఛ్వాస సమయంలో ఏ శ్వాసరంధ్రాలు తెరుచుకుంటాయి? ఏ శ్వాసరంధ్రాలు మూసుకుంటాయి?
జవాబు:
ఉచ్ఛ్వాస సమయంలో వక్షంలోని శ్వాసరంధ్రాలు తెరుచుకుంటాయి. ఉదర భాగంలోని శ్వాసరంధ్రాలు మూసుకుంటాయి.

ప్రశ్న 25.
శ్వాసరంధ్రాలు తెరుచుకోవడాన్ని నియంత్రించగల కారకాలేవి?
జవాబు:
శ్వాసరంధ్రాలు తెరుచుకోవడం క్రియ పృష్టోదర కండరాలు ఆయుత కండరాలు సంకోచ, వ్యాకోచం వలన జరుగుతుంది.

ప్రశ్న 26.
బొద్దింకలో ఉచ్ఛ్వాస ప్రక్రియ నిష్క్రియాత్మకం, నిశ్వాస, సక్రియాత్మకం అని నిరూపించండి.
జవాబు:
బొద్దింకలో ఉచ్ఛ్వాస క్రియలో పృష్టోదర కండరాలు, ఆయుత కండరాలు సడలటంవలన గాలిలోనికి తీసుకోబడుతుంది. కనుక దీనిని నిష్క్రియాచర్య అంటారు. అంటారు.

నిశ్వాసంలో పృష్టోదర కండరాలు సంకోచం వలన శక్తిని వినియోగించుకుంటాయి. కనుక దీనిని సక్రియాత్మక చర్య అంటారు.

ప్రశ్న 27.
పెరిప్లానెటాలో ఆహారనాళం నత్రజని సంబంధ వ్యర్థాలను తొలగిస్తుంది. ఎందుకు?
జవాబు:
పెరిప్లానెటా ఆహార నాళం నత్రజని సంబంధిత వ్యర్థాలను తొలగించే ప్రక్రియ. వ్యర్థాలనుంచి నీటిని పునః శోషణ చేయడానికి అనార్థ యూరిక్ ఆమ్లం తయారవడానికి తోడ్పడుతుంది. ఇది దేహంలోని నీటిని సంరక్షించుకునే అనుకూలనం.

ప్రశ్న 28.
బొద్దింక అవభాసిని ఏ విధంగా విసర్జనక్రియలో తోడ్పడుతుంది?
జవాబు:
బొద్దింకలో కొన్ని నత్రజని సంబంధిత వ్యర్థ పదార్థాలు అవభాసినిపై నిక్షేపం చెంది నిర్మోచన సమయంలో విసర్జించబడతాయి.

ప్రశ్న 29.
విసర్జనక్రియలో కొవ్వు దేహాలు ఏవిధంగా తోడ్పడతాయి?
జవాబు:
బొద్దింలో కొవ్వు దేహంలోని యూరేట్ కణాలు యూరికామ్లాన్ని శోషణచేసి నిలువ చేస్తాయి.

AP Inter 1st Year Zoology Study Material Chapter 7 పెరిప్లానెటా అమెరికానా (బొద్దింక)

ప్రశ్న 30.
‘నిల్వ విసర్జనక్రియ’ అంటే ఏమిటి?
జవాబు:
బొద్దింకలోని కొవ్వు దేహాలలో యూరేట్ కణాలు జీవితాంత యూరిక్ ఆమ్లాన్ని శోషణ చేసి తమతో నిలువ చేస్తాయి. కొవ్వు దేహాలు లేదా వసాదేహాలు ఈ విధంగా యూరికామ్ల విసర్జనాలను నిలువ చేయడాన్ని ‘నిల్వ విసర్జన’ అంటారు.

ప్రశ్న 31.
బొద్దింకలో గల ఏ నిర్మాణం జ్ఞాన, వినాళ కేంద్రంగా పనిచేస్తుంది.
జవాబు:
బొద్దింకలోగల అధ్వాహారవాహికా నాడి సంధులు (మెదడు) జ్ఞాన, వినాళ కేంద్రంగా పనిచేస్తాయి.

ప్రశ్న 32.
స్కోలోపీడియా, సెన్సిల్లాలు మధ్య భేదాలు తెలపండి.
జవాబు:
సెన్సిల్లాల :
ఇది అవభాసిని గ్రాహక ప్రమాణాలు. ఇవి రసాయన గ్రాహకాలు. స్కాలోపీడియా. ఇవి అధ్యఅవభాసిని ఏర్పడిన కార్డోటోనల్ అంగంలోని యాంత్రిక గ్రాహకాలు.

ప్రశ్న 33.
బొద్దింక నేత్రాంశం, దివాచర కీటకం కంటే ఏ విధంగా భిన్నమైనది?
జవాబు:
బొద్దింక నిశాచర కీటకం, దివాచర కీటకాలలో నేత్రాంశంలోని ఉండే శంకుకణాల కింద ఉండే రెటిన్యూ స్థానం మరియు, ప్రతిబింబాలు ఏర్పడే విధానం భిన్నంగా ఉంటుంది. బొద్దింకలో ఏర్పడే ఎప్పొజిజేషన్ ప్రతిబింబం, సూపర్ పొజిషన్ ప్రతిబింబం ఏర్పడే విధానం కూడా భిన్నంగా ఉంటుంది.

ప్రశ్న 34.
ఏ ఉదర నాడీసంధి అతిపెద్దది? ఎందుకు?
జవాబు:
ఆరవ ఉదర నాడీ సంధి అతిపెద్దది. ఇది ఉదరానికి చెందిన 7, 8, 9, 10 ఖండితాలు నాడీ సంధులన్ని కలసిపోవడంవల్ల ఏర్పడుతుంది.

ప్రశ్న 35.
బొద్దింక సంయుక్త నేత్ర నిర్మాణాత్మక, క్రియాత్మక ప్రమాణం పేరు తెలపండి. ఒక సంయుక్త నేత్రంలో అలాంటి ప్రమాణాలు ఎన్ని?
జవాబు:
బొద్దింక సంయుక్త నేత్ర నిర్మాణాత్మక, క్రియాత్మక ప్రమాణం నేత్రాంశం. ఒక సంయుక్త నేత్రంలో ఇలాంటి నేత్రాంశాలు సుమారు 2,000 వరకు ఉంటాయి.

ప్రశ్న 36.
బొద్దింక మెదడును ప్రధాన జ్ఞానకేంద్రం అని ఎందుకంటారు?
జవాబు:
బొద్దింక మెదడు ప్రధానంగా నేత్రాలు, నోటి భాగాలు మిగిలిన అన్ని అవయవాలనుండి జ్ఞాన ప్రచోదనాలను గ్రహిస్తుంది. కనుక మెదడును ప్రధాన జ్ఞాన కేంద్రం అంటారు.

AP Inter 1st Year Zoology Study Material Chapter 7 పెరిప్లానెటా అమెరికానా (బొద్దింక)

ప్రశ్న 37.
ఎప్పొజిషన్, సూపర్ పొజిషన్ ప్రతిబింబాల మధ్య భేదం తెలపండి.
జవాబు:

ఎప్పొజిషన్సూపర్ పొజిషన్
1. ఈ రకమైన ప్రతిబింబ దివాచర, కీటకాలలో ఏర్పడతాయి.1. ఈ రకమైన ప్రతిబింబాలు నిశాచర కీటకాలలో ఏర్పడతాయి.
2. ఈ రకమైన దృష్టిలో ఏర్పడిన ప్రతిబింబం అనేక సూక్ష్మ ప్రతిబింబాల మెజాయిక్గా కనిపిస్తుంది.2. అనేక ప్రతిబింబాలు ఒకదాని పక్కన ఒకటి ఉంటాయి.
3. దీనిని మొజాయిక్ దృష్టి అంటారు.3. దీనిని అస్పష్ట దృష్టి అంటారు.

ప్రశ్న 38.
మగ, ఆడ బొద్దింకల మధ్య బేదాలను తెలిపే లక్షణాలను పేర్కొనండి.
జవాబు:

మగ బొద్దింకఆడ బొద్దింక
1. ఉదరం సన్నగా, పొడవుగా ఉంటుంది.1. ఉదరం పొట్టిగా, వెడల్పుగా ఉంటుంది.
2. పరాంతంలో ఒక జత పాయుశూకాలుంటాయి.2. పరాంతంలో అండనిక్షేపంకం ఉంది.
3. ఎనిమిదవ పృష్ఠ ఫలకం కనపడదు.3. ఎనిమిది, తొమ్మిదవ పృష్ఠ ఫలకాలు కనిపించవు.
4. తొమ్మిది ఉరః పలకాలు కనిపిస్తాయి.4. 7 ఉరః ఫలకాలు కనిపిస్తాయి.
5. పాయు కీలాలు ఉంటాయి.5. పాయు కీలాలు ఉండవు.

ప్రశ్న 39.
బొద్దింకలో గల మష్రూమ్ (పుట్ట గొడుగు) గ్రంథి విధి ఏమిటి?
జవాబు:
బొద్దింకలో 6, 7 ఉదర ఖండితాలలో ఒక పుట్ట గొడుగు ఆకారపు గ్రంధి ఉంటుంది. ఇది అదనపు ప్రత్యుత్పత్తి గ్రంథిలా పనిచేస్తుంది.

ప్రశ్న 40.
మష్రూమ్ గ్రంథి యొక్క యుట్రిక్యులై మేజోర్స్, యుట్రికులై బ్రివోర్స్ విధులను పోల్చండి.
జవాబు:
మష్రూమ్ గ్రంథియొక్క యుట్రిక్యులై మేజోర్స్ శుక్ర గుళిక లోపలి స్తరాన్ని ఏర్పరుస్తుంది. యుట్రిక్యులై బ్రివోర్స్ పోషణ ఇస్తుంది.

ప్రశ్న 41.
ఫెలోమియర్ అంటే ఏమిటి?
జవాబు:
మగ బొద్దింకలో సంపర్కానికి తోడ్పడే, బాష్పీ జనన నిర్మాణాలను ఫెలోమియర్ లేదా గొనాపోఫైసిస్లు లేదా ఫేలిక్ అవయవాలు అంటారు. ఇవి పురుష జననరంద్రం చుట్టూ ఉండే కైటిన్ నిర్మితాలు.

AP Inter 1st Year Zoology Study Material Chapter 7 పెరిప్లానెటా అమెరికానా (బొద్దింక)

ప్రశ్న 42.
గొనపోఫైసిస్ అంటే ఏమిటి?
జవాబు:
మగ బొద్దింక జనన రంద్రం చుట్టూ ఉండే కైటిన్ నిర్మాణాలను గోనాపోఫైసిస్, లేదా ఫెలోమియర్ అంటారు. ఇవి సంపర్కంలో తోడ్పడే బాహ్య జనన నిర్మాణాలు.

ప్రశ్న 43.
పెరిప్లానెటా ప్రత్యుత్పత్తిలో కొల్లాటీరియల్ గ్రంథి ఏ విధంగా తోడ్పడుతుంది?
జవాబు:
పెరిప్లానేటాలో స్త్రీ బీజకోశాల వెనుక ఒక జత కొల్లాటీరియ గ్రంథులుంటాయి. వీటి స్రావాలు గుడ్లచుట్టు ఒక దృడమైన పెట్టెను ఏర్పరుస్తాయి. ఈ పెట్టెను గుడ్ల పెట్టె అంటారు.

ప్రశ్న 44.
పారామెటాబోలస్ అభివృద్ధి అంటే ఏమిటి?
జవాబు:
బొద్దింక అభివృద్ధిలో గుడ్ల నుండి అపరిపక్వ పిల్ల బొద్దింకలు విడుదలవుతాయి. వీటిని సరూపశాభకాలు అంటారు. ఇలా ఏర్పడిన సరూపశాభకం ప్రౌఢ బొద్దింక ఏర్పడటాన్ని పారామెటాబోలస్ అంటారు.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
బొద్దింక నోటి భాగాలను చక్కని పటాన్ని గీసి భాగాలను గుర్తించండి. [Mar. ’14]
జవాబు:
AP Inter 1st Year Zoology Study Material Chapter 7 పెరిప్లానెటా అమెరికానా (బొద్దింక) 1

ప్రశ్న 2.
బొద్దింకలో జీర్ణక్రియా విధానాన్ని వివరించండి.
జవాబు:
బొద్దింక సర్వభక్షక కీటకం. దీని నోటి భాగాలు ఆహారాన్ని కొరికి నమిలే విధంగా ఉంటాయి.

కీటకం ఆహారాన్ని కొరికి ముక్కలుగా చేసి, నోటిలో నమిలే సమయంలో ఆహారం నోటిలోని లాలాజలంతో కలుస్తుంది.

జీర్ణక్రియ :
ఆహార సంగ్రణ తరువాత ఆహారం గ్రసని, ఆహారవాహికల ద్వారా అన్నాశయాన్ని చేరుతుంది. ఇక్కడ ఆహారం లాలాజలంతోను, అంతర జఠరం నిలువు గాడుల ద్వారా మధ్యాంత్రం నుండి వచ్చి చేరిన జీర్ణ రసాలతోను కలుస్తుంది. అందువలన చాలావరకు ఆహారం అన్నాశయంలోనే జీర్ణమవుతుంది. పాక్షికంగా జీర్ణమైన ఆహారం అంతర జఠరంలోని గండు రోమాల ద్వారా వడపోయబడి, ఆద్యముఖ కవాటం ద్వారా మధ్యాంత్రాన్ని చేరుతుంది.

నమిలే సమయంలో ఆహారం నోటిలోని లాలాజలంతో కలుస్తుంది.

  1. లాలాజల అమైలేస్ పిండి పదార్థాలను మొదట డైసాకరైడ్లుగా తరువాత సుక్రోజ్ మారుస్తుంది.
  2. ఇన్వర్టేస్ లేదా సుక్రేస్ ఎంజైమ్ సుక్రోస్ను గ్లూకోస్ మరియు ఫ్రక్టోస్ మారుస్తుంది.
  3. మాల్టేజ్ ఎంజైమ్ మాల్టోస్ ను గ్లూకోస్ గా మారుస్తుంది.
  4. లైపేస్ అనే ఎంజైమ్ కొవ్వులను కొవ్వు ఆమ్లాలు గాను, గ్లీసరాల్గా జలవిశ్లేషణ గావిస్తుంది.
  5. ప్రోటియేస్లు అనబడే ఎంజైములు మాంసకృత్తులను అమినో ఆమ్లాలుగా జీర్ణం చేస్తుంది.
  6. అంత్యాహార నాళంలో ఉండే సూక్ష్మజీవులు సెల్యులేస్ అనే ఎంజైమును స్రవించి సెల్యులోస్ న్ను గ్లూకోస్గా జీర్ణం చేస్తాయి.

జీర్ణమైన ఆహారం మధ్యాంత్రంలో శోషణం చెందుతుంది. జీర్ణం కాని ఆహార పదార్థాలు శేషాంత్రికం, పెద్దపేగు గుండా ప్రయాణించి పురుషనాళాన్ని చేరుతుంది. ఇక్కడ ఆహార పదార్థాలతో బాటుగా ఉన్న నీరు పునఃశోషణ గావించబడి జీర్ణంకాని ఆహార పదార్థాలు పొడిగా, ఘనరూపంలో ఉండే పెంటికలుగా విసర్జించబడతాయి.

ప్రశ్న 3.
బొద్దింక లాలాజల పరికరపు చక్కని పటాన్ని గీచి భాగాలను గుర్తించండి.
జవాబు:
AP Inter 1st Year Zoology Study Material Chapter 7 పెరిప్లానెటా అమెరికానా (బొద్దింక) 2

ప్రశ్న 4.
పెరిప్లానెటా హృదయ నిర్మాణం, విధిని వివరించండి.
జవాబు:
పెరిప్లానెటా హృదయం :
హృదయం హృదయావరణ రక్తకుహరంలో లేదా పృష్ఠకోటరంలో ఉంటుంది. ఇది పొడవాటి, కండరయుత, సంకోచశీల నాళం. ఇది పృష్ఠమధ్యాయుతంగా పక్షం, ఉదరంలోని పృష్ఠఫలకాల దిగువన ఉంటుంది. దీనిలో పదమూడు గదులుంటాయి. ప్రతీ గది దాని ముందరనున్న గదిలోకి తెరుచుకుంటుంది. పదమూడు గదుల్లో మూడు గదులు వక్షంలో, పది గదులు ఉదరంలో ఉంటాయి. దీని పరాంతం మూసుకొని ఉంటుంది. పూర్వాంతం, ముందుకు సాగి పూర్వ మహాధమనిగా కొనసాగుతుంది. చివరి గది తప్ప ప్రతీ గది పరాంతపు అంచులో ‘ఆస్టియా’ (Ostia) అనే ఒక జత చిన్న కవాటయుత రంధ్రాలుంటాయి. ఇవి రెండు వైపులా ఒక్కొక్కటి చొప్పున ఉంటాయి. కవాటాలు పృష్ఠ కోటరం నుంచి హృదయంలోకి మాత్రమే రక్తం ప్రసరించేలా అనుమతిస్తాయి.

AP Inter 1st Year Zoology Study Material Chapter 7 పెరిప్లానెటా అమెరికానా (బొద్దింక)

ప్రశ్న 5.
పెరిప్లానెటాలో రక్తప్రసరణ ప్రక్రియను వర్ణించండి.
జవాబు:
పెరిప్లానెటాలో రక్తం వర్ణరహితంగా ఉంటుంది. దీనిలో రక్త వర్ణకాలు ఉండవు. కనుక దీనిని రక్తశోషరసం అంటారు. దీనిలో జీవద్రవ్యం, స్వేచ్ఛా రక్తకణాలు ఉంటాయి.

బొద్దింక రక్తప్రసరణలో రక్తం రక్తనాళాలలో ప్రవహించదు. శరీర కుహరం రక్తంచే నింపబడి రక్త శరీర కుహరంగా పిలువబడుతుంది. రక్త ప్రసరణ వ్యవస్థలో ప్రధానంగా రక్తకుహరం, గుండె, రక్తం అనే భాగాలుంటాయి.

గుండె గదుల సంకోచం వల్ల గుండెలోని రక్తం ముందుకు ప్రవహిస్తుంది. ఈ రక్తం మహాధమనిలోకి ప్రవహించి, అక్కడి నుండి తలలోని కోటరానికి ప్రవహిస్తుంది. తల కోటరం నుంచి పర్యాంతరాగ కోటరాలకు, ఉదరఫలక కోటరాలకు ప్రవహిస్తుంది. పక్షాకార కండరాల సంకోచంతో హృదయావరణ విభాజకం కిందికి నెట్టబడుతుంది. ఈ చర్య హృదయావరణ కోటర ఘనపరిమాణాన్ని పెంచుతుంది. అందువల్ల రక్తం పర్యాంతరాంగ కోటరం నుంచి హృదయావరణ కోటరంలోకి హృదయావరణ విభాజకం రంధ్రాల ద్వారా ప్రవహిస్తుంది. పక్షాకార కండరాల సడలిక వల్ల, హృదయావరణ విభాజకం పైకి అంటే దాని అసలైన ప్రదేశంలోకి చేరుతుంది. ఇది రక్తాన్ని ఒత్తిడి చేసి హృదయావరణ కోటరం నుంచి ఆస్టియంల ద్వారా గుండె గదులకు చేరుతుంది.
AP Inter 1st Year Zoology Study Material Chapter 7 పెరిప్లానెటా అమెరికానా (బొద్దింక) 3

ప్రశ్న 6.
పక్షాకార కండరాల సంకోచ సడలికలు ఏ విధంగా రక్తప్రసరణలో తోడ్పడతాయి?
జవాబు:
రక్త ప్రసరణలో పక్షాకార కండరాల సంకోచ, వ్యాకోచాలు చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తాయి. రక్త, రక్తనాళాలలో కాక . కోటరాలలో ప్రవహిస్తుంది. పక్షాకార కండరాల సంకోచంతో హృదయావరణ విభాజకం క్రిందికి నెట్టబడుతుంది. ఈ చర్య హృదయావరణ కోటర ఘనపరిమాణాన్ని పెంచుతుంది. అందువలన పర్యాంతరాంగ కోటరం నుండి హృదయావరణ కోటరంలోకి రక్తం హృదయావరణ విభాజకం రంధ్రాల ద్వారా ప్రవహిస్తుంది.

పక్షాకార కండరాల సడలిక వలన హృదయావరణ విభాజకం పైకి అనగా దాని అసలు ప్రదేశానికి చేరుతుంది. దీనివలన హృదయావరణ కోటరంలోని రక్తంపై ఒత్తిడి కలుగజేయటం వలన రక్తం హృదయావరణ కోటరం నుండి ఆస్టియంల ద్వారా గుండె గదులకు చేరుతుంది.

ప్రశ్న 7.
పెరిప్లానెటాలో గల వివిధ విసర్జక అవయవాలు ఏవి ? విసర్జనక్రియను వివరంగా వర్ణించండి.
జవాబు:
బొద్దింక విసర్జక వ్యవస్థ నత్రజని సంబంధిత వ్యర్థాలను దేహం నుండి గ్రహించి యూరిక్ ఆమ్ల రూపంలో వెలుపలికి విసర్జించడానికి తోడ్పడుతుంది. అందువలన పెరిప్లానేటాను యూరికోటెలిక్ జీవి అంటారు. బొద్దింకలో విసర్జన క్రియను నిర్వర్తించే సంబంధింత అవయవాలు లేదా నిర్మాణాలు మాల్ఫీజియన్ నాళికలు, కొవ్వు దేహాలు, యూరికోజ్ గ్రంథులు, వృక్కకణాలు, అవభాసిని.

మాల్ఫీజియన్ నాళికలు :
మాల్ఫీజియన్ నాళికల గ్రంథి కణాలు నీటిని, CO2, లవణాలను నత్రజని వ్యర్థాలను రక్తం నుంచి శోషించి, నాళికా కుహరంలోకి స్రవిస్తాయి. నాళికల సమీపాగ్ర భాగ కణాలు నీటిని, కొన్ని ఉపయుక్త లవణాలను పునఃశోషణ చేస్తాయి. మిగిలిన విసర్జిత భాగం శేషాంత్రికంలోకి నెట్టబడుతుంది. ఇందులోని చాలా నీరు పునఃశోషణ చేయబడి, పురీష నాళాన్ని చేరినప్పుడు మరింత నీరు పునఃశోషణ జరిగి యూరిక్ ఆమ్లం దాదాపు ఘనరూపంలో మలంతోబాటు విసర్జించబడుతుంది.

కొవ్వు దేహాలు :
కొవ్వు దేహం అనేది తెల్లటి లంబికల నిర్మాణం. ఈ దేహంలోని యూరేట్ కణాలు విసర్జనలో తోడ్పడతాయి. ఈ కణాలు జీవితాంతం యూరిక్ ఆమ్లాన్ని శోషణం చేసి నిల్వ చేస్తాయి. వసాదేహం కణాలలో ఉన్న ఈ విధమైన నిల్వ పద్ధతిని ‘నిల్వవిసర్జన’ (Storage excretion) అంటారు.

యూరికోజ్ గ్రంథులు :
మగ బొద్దింక మష్రూమ్ గ్రంథిలో ఉన్న యూరికోజ్ గ్రంథి (Uricose gland) లేదా యుట్రిక్యులై మేజోర్స్ (Utriculi majores) లో యూరిక్ ఆమ్లం నిల్వ ఉంటుంది. అవి సంపర్క సమయంలో దీన్ని విసర్జిస్తాయి.

అవభాసిని :
కొన్ని నత్రజని సంబంధిత వ్యర్థపదార్థాలు అవభాసినిపై నిక్షేపం చెంది నిర్మోచన సమయంలో తొలగించబడతాయి.

ప్రశ్న 8.
పెరిప్లానెటా నీటిని ఏ విధంగా సంరక్షిస్తుంది? దీన్ని విసర్జనక్రియ ఆధారంగా తెలపండి.
జవాబు:
బొద్దింక మామూలుగా నీటిని తీసుకొని ఆహారంతో పాటుగా వచ్చే నీటిని ఇది దేహంలో కొన్ని పొదుపు చర్యలు పాటిస్తూ సంరక్షించుకుంటుంది.
1) దేహం మొత్తం కైటిన్ నిర్మిత ఫలకాలచే కప్పబడి ఉండుట వలన స్వేదం రూపంలో వ్యర్థం కానివ్వదు.

2) విసర్జన యూరికామ్ల రూపంలో విసర్జిస్తుంది కనుక నీరు వ్యర్థమవదు. నీటిని సంరక్షించుకోవడంలో బొద్దింకలో విసర్జన అవయావలు, మాల్ఫీజియన్ నాళికలు, పురీషనాళం, కొవ్వు దేహాలు, యూరికోస్ గ్రంథులు, అవభాసిని విసర్జన క్రియలో ముఖ్య పాత్ర వహిస్తాయి. మాల్ఫీజియన్ నాళికలు రక్తంలోని నత్రజని సంబంధిత వ్యర్థాలను, CO2 ను ఇతర విసర్జక పదార్థాలను, నీటిని శోషిస్తుంది. దీనిలో సమీపాగ్ర భాగం ఉపయుక్త పదార్థాలను, నీటిని పునఃశోషణ కావిస్తుంది. ఇప్పుడు విసర్జక పదార్థం శేషాత్రికంలోకి నెట్టబడుతుంది. ఇక్కడ చాలా వరకు నీరు పునఃశోషణ గావించబడుతుంది. తరువాత విసర్జక పదార్థం పురీషనాళం చేరుతుంది. ఇక్కడ మరింతగా నీరు పునఃశోషణ జరిగి యూరిక్ ఆమ్ల రూపంలో దాదాపు ఘన పదార్థ విసర్జింపబడుతుంది.

పై విధంగా ఆహార నాళం ద్వారా నత్రజని సంబంధ వ్యర్థాలను విసర్జిస్తూ, వ్యర్థ పదార్థాలలోని నీటిని పూర్తిగా పునఃశోషణ గావిస్తూ యూరికామ్ల రూపంలో విసర్జించడం నీటిని సంరక్షించుకునే అనుకూలనం.

ప్రశ్న 9.
నేత్రాంశాన్ని చక్కని పటం గీసి భాగాలతో వివరించండి.
జవాబు:
AP Inter 1st Year Zoology Study Material Chapter 7 పెరిప్లానెటా అమెరికానా (బొద్దింక) 4

ప్రశ్న 10.
మగ, ఆడ బొద్దింకలను ఏ విధంగా గుర్తిస్తారు ? వాటి బాహ్య, అంతర జననాంగాలను, లక్షణాలను వివరించండి.
జవాబు:
పెరిప్లానేటా ఏకలింగ జీవి. స్త్రీ, పురుష జీవుల్లో బాగా అభివృద్ధి చెందిన ప్రత్యుత్పత్తి అవయవాలుంటాయి. లైంగిక ద్విరూపకత బాహ్యంగాను, అంతర్గతంగాను స్పష్టంగా కనిపిస్తుంది. స్త్రీ జీవి ఉదరం పొట్టిగా, వెడల్పుగా ఉంటుంది. దాని పరాంతంలో అండ నిక్షేపం ఉంటుంది. పురుష జీవి ఉదరం సన్నగా, పొడవుగా ఉంటుంది. దీని పరాంతంలో ఒక జత పాయు శూకాలు ఉంటాయి.

జీవి ఉదరభాగాన్ని పరిశీలిస్తే పృష్ఠ ఫలకాలు 10 ఉంటాయి కాని ఉరఃఫలకాలు తొమ్మిది మాత్రమే ఉంటాయి. పదో ఉరః ఫలకం ఉండదు. మగజీవిలో ఎనిమిదో పృష్ఠఫలకం, స్త్రీ జీవులలో ఎనిమిదో, తొమ్మిదో పృష్ఠ ఫలకాలు కనపడవు. మగజీవిలో తొమ్మిది ఉరఃఫలకాలు, స్త్రీ జీవిలో ఏడు ఉరఃఫలకాలు కనబడతాయి. ఏడో, ఎనిమిదో, తొమ్మిదవ ఉరఃఫలకాలు కలిసి గుడ్ల సంచిని ఏర్పరుస్తాయి.

మగ జీవిలో ఉదరానికి పరభాగంలో ఒక జత పాయు ఉపాంగాలు, ఒక జత పాయుకీలాలు, గొనాపోఫైసిస్లు ఉంటాయి. పాయువాంగాలు అతుకుల సహితంగా ఉండి పదోషృష్ఠఫలకం పార్శ్వ భాగాల నుంచి ఏర్పడతాయి. ఇవి స్త్రీ, పురుష జీవులలోనూ ఉంటాయి. పాయుకీలాలు అతుకుల రహితంగా ఉండి తొమ్మిదో ఉరః ఫలకం నుండి ఏర్పడతాయి. ఇవి మగ జీవులలో మాత్రమే ఉంటాయి. ఐనాపోఫైసిస్లు మగ జీవులలో తొమ్మిదో ఉరఃఫలకం, స్త్రీ జీవులలో ఎనిమిదో, తొమ్మిదో ఉరః ఫలకాల నుండి వచ్చే చిన్న కైటిన్ నిర్మితాలు. ఇవి బాహ్య జననాంగాలు. ఉదరానికి పరభాగంలో పాయువు ఉంటుంది. మగ జీవులలో జనన రంధ్రం పాయువు కింద, ఒక గొనాపోఫైసిస్ పైన ఉంటుంది. స్త్రీ జీవుల్లో అది ఎనిమిదో ఉరఃఫలకంపై ఉంటుంది.

AP Inter 1st Year Zoology Study Material Chapter 7 పెరిప్లానెటా అమెరికానా (బొద్దింక)

ప్రశ్న 11.
బొద్దింక పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థను వర్ణించండి.
జవాబు:
AP Inter 1st Year Zoology Study Material Chapter 7 పెరిప్లానెటా అమెరికానా (బొద్దింక) 5
పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ :
పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఒక జత ముష్కాలు ఉంటాయి. ఇవి పొడవుగా ఉండే లంబికలు గల నిర్మాణాలు. ఇవి నాలుగు నుంచి ఆరు ఉదర ఖండితాలు పార్శ్వ భాగాలలో ఇరువైపులా కొవ్వు దేహాల్లో ఇమిడి ఉంటాయి. ఒక్కో ముష్కం పరభాగం నుంచి సన్నటి శుక్రవాహిక (Vas deferens) ఆరంభమవుతుంది. రెండు శుక్రవాహికలు వెనుకకు లోపలి వైపుగా ప్రయాణించి ఏడో ఖండితంలోని వెడల్పైన మధ్యస్థ స్కలననాళం (Ductus ejaculatus) లోకి తెరచుకుంటాయి. ఆ ఆరో ఏడో ఉదర ఖండితాల్లో ఒక పుట్టగొడుగు ఆకారపు గ్రంథి ఉంటుంది. ఇది అదనపు ప్రత్యుత్పత్తి గ్రంథిలాగా పనిచేస్తుంది. ఈ గ్రంథిలో రెండు రకాల నాళికలు ఉంటాయి. 1) పొడవైన సన్నటి నాళికలు యుట్రిక్యులై మేజోర్స్ (Utriculi majores) లేదా ‘పరిధీయ నాళికలు’, 2) పొట్టిగా ఉండే యుట్రిక్యులై బ్రివోర్స్ నాళికలు (Utriculi breviores) యుట్రిక్యులై మేజోర్స్ శుక్రగుళిక లోపలి స్తరాన్ని ఏర్పరచగా, యుట్రిక్యులై బ్రివోర్స్ శుక్రకణాలకు పోషణనిస్తాయి. ఈ నాళికలు స్కలననాళిక (Ejaculatory duct) పూర్వభాగంలో తెరుచుకుంటాయి.

శుక్రాశయాలు, స్కలన నాళిక ఉదరంలో ఉంటాయి. ఇవి శుక్రకణాలను కట్టలుగా చేసి నిల్వ ఉంచుతాయి. వీటిని శుక్రగుళికలు (Spermatophores) అంటారు. స్కలన నాళం కండరయుతమైంది. ఇది పరాంతం వరకు సాగి ‘పురుష జననరంధ్రం’ (Gonopore) లోకి తెరుచుకుంటుంది. బొద్దింక పురుష జననాంగాలతో పాటూ, ఒక ఫేలిక్ (Phallic) లేదా కాంగ్లోబేట్ (Conglobate) గ్రంథి ఉంటుంది. దీని నాళం జననరంధ్రం దగ్గర తెరుచుకుంటుంది. దీని విధి ఇంతవరకు తెలియదు. పురుష జననరంధ్రం చుట్టూ అసౌష్ఠవమైన కైటినస్ నిర్మాణాలు అంటే, ఫేలిక్ అవయవాలు లేదా గొనాపోఫైసిస్లు లేదా ఫెలోమియర్లు ఉంటాయి. ఇవి సంపర్కంలో తోడ్పడతాయి. ఇవి పురుషజీవి బాహ్య జననాంగాలు.

ప్రశ్న 12.
బొద్దింక స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థను వర్ణించండి.
జవాబు:
స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ :
స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఒక జత స్త్రీ బీజకోశాలు, ఒక జత స్త్రీ బీజవాహికలు, యోని, శుక్రగ్రాహికలు, శుక్రగ్రాహిక సూక్ష్మాంకురం మరియు కొల్లాటీరియల్ గ్రంథులు ఉంటాయి.

స్త్రీ బీజకోశాలు :
ఒక జత పెద్ద స్త్రీ బీజకోశాలు 2-6 ఉదర ఖండిత పార్శ్వ భాగాలలో ఉంటాయి. ఇవి లేత పసుపు రంగులో కొవ్వు దేహాలతో చుట్టబడి ఉంటాయి. ప్రతి స్త్రీ బీజకోశానికి ఎనిమిది స్త్రీ బీజకోశనాళికలు లేదా ఒవేరియోల్స్ (Ovarioles) ఉంటాయి. ఒక్కొక్క ఒవేరియోల్కు జర్మేరియమ్ (Germarium) అనే సాగి మొనదేలి ఉన్న పూర్వాంత పోగు, వెడల్పైన పరాంత విటలేరియం (Vitellarium) ఉంటాయి. జర్మేరియంలో అభివృద్ధి చెందుతున్న అనేక అండదశలు, విటలేరియంలో సొనతో పాటు పరిపక్వ అండాలు ఉంటాయి. ఒక్కొక్క స్త్రీ బీజకోశంలో ఉన్న ఒవేరియోల్ల సన్నగా సాగిన అంచులన్నీ కలిసి ఒక తాడుగా మారి పృష్ఠ దేహకుడ్యానికి అతుక్కొంటుంది. పరాంత అంచులు కలిసి కురచని వెడల్పైన స్త్రీ బీజవాహిక (Oviduct) గా ఏర్పడుతుంది. స్త్రీ బీజవాహికలు కలసిపోయి మధ్యలో అతి చిన్న యోని (Vagina) ఏర్పడుతుంది.
AP Inter 1st Year Zoology Study Material Chapter 7 పెరిప్లానెటా అమెరికానా (బొద్దింక) 6

యోని నిలువు రంధ్రాన్ని స్త్రీ జననరంధ్రం అంటారు. ఇది ఎనిమిదో ఉరఃఫలకంలో పెద్ద జననాశయం (Genital pouch) లోకి తెరుచుకుంటుంది., శుక్రగ్రాహిక లేదా శుక్రధానం (Seminal receptacle) ఎడమవైపున తిత్తితో, కుడివైపున పోగులాంటి అంధనాళంతో 6వ ఖండితంలో ఉంటుంది. ఇది 9వ ఉరః ఫలకంలోని జననాశయంలో ఒక మధ్యస్థ రంధ్రం ద్వారా తెరుచుకుంటుంది. ఫలవంతమైన స్త్రీ జీవిలో శుక్రగ్రాహికలు సంపర్కం ద్వారా గ్రహించిన శుక్రగుళికలను కలిగి ఉంటాయి.

స్త్రీ బీజకోశాల వెనక ఒక జత శాఖాయుతమైన కొల్లాటీరియల్ గ్రంథులు (Colleterial glands) ఉంటాయి. ఈ గ్రంథులు శుక్రగ్రాహిక రంధ్రం పైన వేర్వేరుగా జననాశయంలోకి తెరుచుకుంటాయి. ఈ రెండు కొల్లాటీరియల్ గ్రంథుల స్రావకాలు గుడ్ల చుట్టూ ఒక దృఢమైన పెట్టెను ఏర్పరుస్తాయి. దీన్నే గుడ్లుపెట్టె లేదా గుడ్లకోశం లేదా ఊథీకా (Ootheca) అంటారు. జననాశయం ఏడో, ఎనిమిదో, తొమ్మిదో ఉదర ఖండితాల ఉరఃఫలకాలతో ఏర్పడుతుంది. ఏడో ఖండిత ఉరః ఫలకం పడవ ఆకారంలో ఉంటుంది. ఇది జననాశయం అడుగు, పక్క భాగంలో గోడలను ఏర్పరుస్తుంది. ఎనిమిదో, తొమ్మిదో ఖండితాల ఉరఃఫలకాలు ఏడో ఖండితంలో చొచ్చుకొని వరుసగా జననాశయం పూర్వాంతపు గోడ, దాని పైకప్పుగా ఏర్పడతాయి. జననాశయానికి రెండు గదులు ఉంటాయి. అవి : పూర్వాంతపు గైనాట్రియం (Gynatrium) లేదా జననకోశం, పరాంతపు వెస్టిబ్యులమ్ (Vestibulum) లేదా గుడ్లకోశం.

స్త్రీ జననరంధ్రం చుట్టూ మూడు జతల కైటిన్ నిర్మిత ఫలకాలు ఉంటాయి. వీటిని గొనాపోఫైసిస్లు అంటారు. ఇవి అండ విక్షేపకం (Ovipositor) గా ఏర్పడి అండాలకు గుడ్లకోశంలోకి మార్గం చూపుతాయి. ఇవి స్త్రీ బాహ్య జననాంగాలు.

దీర్ఘ సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
బొద్దింక జీర్ణవ్యవస్థను భాగాలు గుర్తించిన చక్కని పటం సహాయంతో వర్ణించండి.
జవాబు:
బొద్దింక జీర్ణవ్యవస్థ :
బొద్దింక జీర్ణవ్యవస్థలో ఆహారనాళం, దానికి సంబంధించిన అనుబంధ గ్రంథులు ఉంటాయి. నోటి ముందు, నోటి భాగాలు చుట్టి ఉన్న పూర్వకుహరం ఉంటుంది. అధోగ్రసని ఈ కుహరాన్ని రెండు కక్ష్యలుగా విభజిస్తుంది. అవి సిబేరియమ్ (Cibarium) (పూర్వభాగం), సెలైవేరియమ్ (Salivarium) (పరభాగం).

AP Inter 1st Year Zoology Study Material Chapter 7 పెరిప్లానెటా అమెరికానా (బొద్దింక) 7
ఆహారనాళం :
బొద్దింక ఆహారనాళం అక్కడక్కడా మెలికలు పడి చాలా పొడవుగా ఉంటుంది. ఇది నోరు, పాయువుల మధ్య విస్తరించి ఉంటుంది. ఇది మూడు ప్రాంతాలుగా విభజించబడింది. లాలాజల గ్రంథులు
అవి – పూర్వాహారనాళం లేదా ఆద్యముఖం (Stomodaeum), మధ్యాహార నాళం లేదా మధ్యాంత్రం (Mesenteron), అంత్యాహార నాళం లేదా పాయుపథం (Proctodaeum), పూర్వాహారనాళం, అంత్యాహార నాళం లోపలివైపు బాహ్యస్త్వచంతో ఆవరించబడ్డాయి. మధ్యాహారనాళం అంతస్త్వచ కణాలతో ఆవరించి ఉంటుంది.

పూర్వాహారనాళం :
పూర్వాహారనాళంలో గ్రసని, ఆహార వాహిక, అన్నాశయం, అంతరజఠరం ఉంటాయి. దీని లోపలితలంలో కైటిన్ నిర్మిత అవభాసిని ఉంటుంది. నోరు గ్రసని (Pharynx) లోకి, మాల్ఫీజియన్ గ్రసని సన్నని గొట్టం లాంటి ఆహారవాహిక (Oesophagus) లోకి తెరుచు కుంటుంది. ఆహారవాహిక పరభాగంలోని సాగే గుణం గల సంచి లాంటి అన్నాశయం (crop) లోకి తెరచుకొంటుంది. అన్నాశయం ఆహారాన్ని నిల్వ ఉంచుతుంది. దీని వెలుపలి తలం వాయునాళాల జాలకంతో ఆవరించబడి ఉంటుంది.

అన్నాశయానికి పరభాగంలో కండరాలతో కూడిన మందమైన గోడలు గల పూర్వగ్రంథుల జఠరిక (Proventriculus) లేదా అంతర జఠరం (Gizzard) ఉంటుంది. దాని లోపలి కైటిన్ పొరకు గల ఆరు శక్తిమంతమైన దంతాలు ప్రభావవంతమైన నమిలే పరికరంగా ఏర్పడతాయి. ప్రతి దంతం వెనకగా రోమాలు కలిగిన మెత్త ఉంటుంది. వీటికి వెనకవైపు గండు రోమాలు ఉంటాయి. ఈ ఫలకాల మధ్య ఆహారం సన్నటి రేణువులుగా విసరబడుతుంది. గండు రోమాలు ఆహారాన్ని వడపోస్తాయి. అంతర జఠరం పిండిమరలాగా, జల్లెడగా పనిచేస్తుంది. అంతర జఠరం నుంచి ఏర్పడిన త్వచ నిర్మాణం ఒక గరాటు లాంటి ఆద్యముఖ కవాటంగా (Stomodeal valve) ఏర్పడుతుంది. మధ్యాంత్రం చేరిన ఆహారం తిరిగి అంతర జఠరంలోకి ప్రవేశించకుండా (వెనకకు మళ్లడం) ఈ కవాటం నివారిస్తుంది.

మధ్యాహారనాళం (మధ్యాంత్రం లేదా గ్రంథుల జఠరిక) :
మధ్యాహారనాళం లేదా మధ్యాంత్రం అంతర జఠరం వెనక ఒక సన్నటి కురచ గొట్టంలా ఉంటుంది. దీన్ని మధ్యాంత్ర (Mesenteron) లేదా గ్రంథుల జఠరిక (Ventriculus) అంటారు. మధ్యాంత్రానికి అంతర జఠరానికి మధ్యలో 6 నుంచి 8 వేళ్ళ లాంటి అంధ బాహువులు మధ్యాంత్రం నుంచి ఉత్పన్నమవుతాయి, వీటిని కాలేయాంధ నాళాలు (Hepatic caecae) అంటారు. ఆహారపదార్థాలను జీర్ణం చేయడం, శోషణ జరపడం కాలేయాంధనాళాల విధి. మధ్యాంత్రంలో రెండు భాగాలు ఉంటాయి. అవి – పూర్వ స్రావక భాగం, పర శోషణ భాగం.

మధ్యాంత్రంలోని స్రావక భాగంలో గ్రంథి కణాలుండి చాలా రకాల ఎంజైమ్లను స్రవిస్తాయి. మధ్యాంత్రాన్ని చేరిన ‘ఆహారపు ముద్ద’ చుట్టూ రంధ్రయుతమైన కైటిన్ నిర్మిత పొర, పెరిట్రాఫిక్ త్వచం (Peritrophic membrane) ఉంటుంది. ఈ త్వచాన్ని అంతరజఠరపు గరాటు లాంటి ఆద్యముఖ కవాటం స్రవిస్తుంది.

మధ్యాంత్రపు పరభాగంలో పెరిట్రాఫిక్ త్వచం ద్వారా జీర్ణమైన ఆహారం రక్తంలోకి శోషణ చెందుతుంది. గట్టిగా ఉన్న ఆహారరేణువుల వల్ల మధ్యాంత్రకుడ్యం దెబ్బతినకుండా పెరిట్రాఫిక్ త్వచం రక్షిస్తుంది. మధ్యాంత్రం అంత్యాహారనాళంలోకి తెరచుకొనే రంధ్రాన్ని సంవరణి కండరం (Sphincter muscle) నియంత్రిస్తుంది. ఇది జీర్ణం కాని ఆహారాన్ని, యూరిక్ ఆమ్లాన్ని అంత్యాహారనాళం నుంచి తిరిగి మధ్యాంత్రంలోకి ప్రవేశించకుండా నివారిస్తుంది.

AP Inter 1st Year Zoology Study Material Chapter 7 పెరిప్లానెటా అమెరికానా (బొద్దింక) 8
అంత్యాహారనాళం లేదా పాయుపథం :
అంత్యాహార నాళాన్ని పాయుపథం అని కూడా అంటారు. ఇది పొడవైన మెలికలు తిరిగిన నాళం. దీనిలో మూడు భాగాలు ఉంటాయి. అవి శేషాంత్రికం (lleum), పెద్దపేగు (Colon), పురీషనాళం (Rectum). అంత్యాహారనాళ లోపలి తలాన్ని ఆవరించి కైటినన్ అవభాసిని ఉంటుంది. మధ్యాంత్రానికి వెనకవైపున ఉన్న పొట్టి నాళాన్ని శేషాంత్రికం అంటారు. మధ్యాంత్రం శేషాంత్రికం కలిసేచోట ఆరు కట్టలుగా అమరిన లేత పసుపురంగు అంధనాళికలైన మాల్ఫీజియన్ నాళికలు (Malpighian tubules) ఉంటాయి. ఇవి విసర్జకావయవాలు. శేషాంత్రికం మధ్యాంత్రం నుంచి జీర్ణం కాని ఆహారపదార్థాన్ని, మాల్ఫీజియన్ నాళికల నుంచి యూరిక్ఆమ్లాన్ని గ్రహిస్తుంది. ఇది తరవాతి పొడవైన మెలికలు తిరిగిన కోలాన్ లేదా పెద్ద పేగులోకి తెరుచుకొంటుంది. పెద్దపేగు పొట్టిగా వెడల్పుగా ఉన్న పురీషనాళంలోకి తెరుచుకొంటుంది. ఇది పాయువు ద్వారా బయటికి తెరుచుకొంటుంది. దీని లోపలితలంలో ఆరు నిలువు మడతలు ఉంటాయి. వీటిని పురీషనాళసూక్ష్మాంకురాలు (Rectal papillae) అంటారు. ఇవి జీర్ణం కాని ఆహారపదార్థం నుంచి నీటిని పునఃశోషణ కావిస్తాయి.

బొద్దింక ఆహారనాళానికి అనుబంధంగా ఉండే జీర్ణగ్రంథులు – లాలాజల గ్రంథులు, కాలేయాంధనాళాలు, మధ్యాంత్రంలోని గ్రంథి కణాలు.

లాలాజల గ్రంథులు (Salivary glands) :
ఒక జత లాలాజలగ్రంథులు అన్నాశయానికి ఇరువైపులా ఒక్కొక్కటి చొప్పున ఉదర పార్శ్వతలంలో అంటిపెట్టుకొని ఉంటాయి. ఒక్కొక్క లాలాజల గ్రంథిలో రెండు లంబికలు ఉంటాయి. ఒక్కొక్క లంబికలో ఎసినై (Acini) అనబడే అనేక సూక్ష్మ లంబికలు ఉంటాయి.

ప్రతి ఎసినస్ సూక్ష్మనాళికను కలిగి ఉన్న స్రావక కణాలైన జైమోజన్ కణాలను (Zymogen cells) కలిగి ఉంటుంది. ఒక వైపున ఉన్న రెండు లంబికలకు చెందిన సూక్ష్మనాళికలన్నీ ఐక్యలాలాజలనాళాన్ని (Common salivary duct) ఏర్పరుస్తాయి. రెండు వైపుల నుంచి ఏర్పడిన ఈ ఐక్య లాలాజల నాళాలు కలిసి మధ్య లాలాజలనాళంగా (Median salivary duct) ఏర్పడతాయి. మధ్యభాగంలో ఒక్కొక్కవైపున ఉన్న రెండు లాలాజల లంబికల మధ్య తిత్తిలాంటి లాలాజలాశయం (salivary receptacle) ఉంటుంది. ఇది లాలాజలాన్ని నిలువ చేస్తుంది. ఇది లాలాజలాశయ నాళం లేదా ‘ఆశయనాళం’కు ఏర్పడుతుంది.

ఇరువైపుల నుంచి ఏర్పడిన లాలాజలాశయనాళాలు కలిసి ఐక్య లాలాజలాశయనాళం లేదా ‘ఐక్య ఆశయనాళం’ (Reservoir duct) ఏర్పడుతుంది. మధ్య లాలాజలనాళం ఐక్య లాలాజలనాళంలోకి తెరుచుకొంటుంది. తరువాత ఇవి రెండూ కలిసి అపవాహి లాలాజలనాళంగా (Efferent salivary duct) ఏర్పడతాయి. అపవాహి లాలాజలనాళం అధోగ్రసని పీఠభాగం వద్ద తెరుచుకొంటుంది. ఎసినార్ కణాలు లాలాజలాన్ని స్రవిస్తాయి. దీనిలో పిండిపదార్థాలను జీర్ణం చేసే అమైలేస్ (Amylase) లాంటి ఎంజైములు ఉంటాయి. కాలేయాంధనాళాలు (Hepatic Caecae).

వీటిని ‘మధ్యాంత్ర అంధనాళాల’ని కూడా అంటారు. వీటిలో స్రావక సంబంధమైన, శోషణం జరిపే కణాలు ఉంటాయి. మధ్యాంత్ర గ్రంథి కణాలు.

మధ్యాంత్ర గ్రంథికణాలు మాల్టేస్, ఇన్వర్టేస్, ప్రోటియేజెస్, లైపేన్ లాంటి ఎంజైములను స్రవిస్తాయి.

AP Inter 1st Year Zoology Study Material Chapter 7 పెరిప్లానెటా అమెరికానా (బొద్దింక)

ప్రశ్న 2.
పెరిప్లానెటా రక్తప్రసరణవ్యవస్థను వివరంగా వర్ణించి, చక్కని పటాన్ని గీసి భాగాలను గుర్తించండి. [Mar. ’14]
జవాబు:
పెరిప్లానెటా రక్తప్రసరణ వ్యవస్థ :
రక్తప్రసరణవ్యవస్థ జీర్ణమైన ఆహారాన్ని హార్మోనులను మొదలైనవాటిని దేహంలో ఒక భాగం నుంచి మరొక భాగానికి రవాణా చేయడంలో తోడ్పడుతుంది. పెరిప్లానెటా రక్తప్రసరణవ్యవస్థ వివృత రకం (Open type), ఎందుకంటే దీనిలో రక్తం, రక్తశోషరసం, శరీరకుహరంలో లేదా రక్తకుహరంలో స్వేచ్ఛగా ప్రవహిస్తాయి. రక్తనాళాలు అంతగా అభివృద్ధి చెందలేదు. అవి వివిధ కోఠరాల్లోకి తెరుచుకొంటాయి. రక్తకుహరంలో ఉన్న అంతరాంగ అవయవాలు రక్తంలో మునిగి ఉంటాయి. పెరిప్లానెటా రక్తప్రసరణవ్యవస్థలో మూడు ముఖ్యమైన అనుబంధిత భాగాలు – రక్తకుహరం, గుండె, రక్తం ఉంటాయి.

రక్తకుహరం :
బొద్దింక రక్తకుహరం రెండు కండరయుత అడ్డు త్వచాలలో అంటే పృష్ఠ విభాజక పటలం (Dorsal diaphragm) లేదా హృదయావరణ విభాజకం, ఉదర విభాజకం (Ventral diaphragm) తో మూడు కోటరాలుగా విభజించబడింది. రెండు విభాజక పటలాలకు రంధ్రాలు ఉంటాయి. దేహంలోని ప్రతీ ఖండితానికి పార్శ్వతలాల్లో ఒక జత త్రిభుజాకార పక్షాకార కండరాలు (Alary muscles) ఒక శ్రేణిలో ఉంటాయి. ఇవి వెడల్పైన ఆధారంతో హృదయావరణ విభాజకానికి మొనదేలిన అంచు లేదా అగ్రంతో పృష్ఠ ఫలకాలకు అతుక్కొని ఉంటాయి. రక్తకుహరంలో ఉన్న మూడు కోటరాలు – హృదయావరణ రక్తకుహరం (Pericardial haemocoel) లేదా ‘పృష్ఠకోటరం’ (Dorsal sinus) పర్యాంతరాంగ రక్తకుహరం లేదా ‘మధ్యకోటరం’, ఉదరఫలక రక్తకుహరం (Perivisceral haemocoel) లేదా ‘ఉదరకోటరం’ లేదా పరినాడీ కోటరం’ (Perineural sinus) . అన్నింటిలో మధ్యకోటరం చాలా పెద్దది. ఎందుకంటే దీనిలో చాలా అంతరాంగ అవయవాలు ఉంటా ఉంటాయి. పృష్ఠ, ఉదర కోటరాలు చిన్నవి. వీటిలో గుండె, నాడీదండం మాత్రమే ఉంటాయి.
AP Inter 1st Year Zoology Study Material Chapter 7 పెరిప్లానెటా అమెరికానా (బొద్దింక) 9

హృదయం :
హృదయం హృదయావరణ రక్తకుహరంలో లేదా పృష్ఠకోటరంలో ఉంటుంది. ఇది పొడవాటి, కండరయుత, సంకోచశీల నాళం. ఇది పృష్ఠమధ్యాయుతంగా వక్షం, ఉదరంలోని పృష్ఠఫలకాల దిగువన ఉంటుంది. దీనిలో పదమూడు గదులుంటాయి. ప్రతీ గది దాని ముందరనున్న గదిలోకి తెరుచుకొంటుంది. పదమూడు గదుల్లో మూడు గదులు వక్షంలో, పది గదులు ఉదరంలో ఉంటాయి. దీని పరాంతం మూసుకొని ఉంటుంది. పూర్వాంతం, ముందుకు సాగి పూర్వ మహాధమనిగా కొనసాగుతుంది. చివరి గది తప్ప ప్రతీ గది పరాంతపు అంచులో ‘ఆస్ట్రియా’ (Ostia) అనే ఒక జత చిన్న కవాటయుత రంధ్రాలుంటాయి. ఇవి రెండు వైపులా ఒక్కొక్కటి చొప్పున ఉంటాయి. కవాటాలు పృష్ఠ కోటరం నుంచి హృదయంలోకి మాత్రమే రక్తం ప్రసరించేలా అనుమతిస్తాయి.

ప్రశ్న 3.
బొద్దింకలో శ్వాసవ్యవస్థను భాగాలు గుర్తించిన చక్కని పటం సహాయంతో వర్ణించండి.
జవాబు:
బొద్దింక శ్వాసవ్యవస్థ :
బొద్దింక రక్తంలో ఆక్సిజన్ని గ్రహించి రవాణా చేసే శ్వాసవర్ణకం ఉండదు. అందువల్ల అది అవసరమైన ఆక్సిజన్ను కణజాలాలకు అందించలేదు. వాతావరణంలోని ఆక్సిజన్ను నేరుగా కణజాలాలకు అందించే విధంగా శ్వాసనాళ వ్యవస్థ అభివృద్ధి. చెందింది. బొద్దింక శ్వాసవ్యవస్థలో శ్వాసరంధ్రాలు, వాయునాళాలు, వాయునాళికలు అనే భాగాలు ఉంటాయి.

శ్వాసరంధ్రాలు :
10 జతల శ్వాసరంధ్రాల (Stigmata or spiracles) ద్వారా శ్వాసనాళ వ్యవస్థ పరిసరాలతో సంబంధాన్ని కలిగి ఉంటుంది. మొదటి రెండు జతల శ్వాసరంధ్రాలు వక్ష ఖండితాలలో ఉంటాయి. వీటిలో ఒక జత మధ్యవక్షంలోనూ, రెండో జత అంత్యవక్షంలోనూ ఉంటాయి. మిగిలిన ఎనిమిది జతలు ఉదరం మొదటి ఎనిమిది ఖండితాలలో ఉంటాయి. ఈ రంధ్రాలు ఆయా ఖండితాల పార్శ్వఫలకాలలో ఉంటాయి. శ్వాసరంధ్రాల సంఖ్య, వాటి స్వభావాన్ని బట్టి కీటకాల శ్వాసవ్యవస్థను వర్గీకరిస్తారు. కనీసం మూడు జతల క్రియాత్మక శ్వాసరంధ్రాలు ఉంటే దాన్ని పాలీన్యూస్టిక్ (Polyneustic type) రకం అంటారు. మొత్తం జతలూ క్రియాత్మక శ్వాసరంధ్రాలయితే దాన్ని హోలోన్యూస్టిక్ రకం (Holoneustic type) అంటారు. అన్ని శ్వాసరంధ్రాలు కవాటయుతంగా ఉంటాయి. ప్రతి రంధ్రాన్ని చుట్టి కైటిన్తో తయారైన పెరిట్రీమ్ (Peretreme) అనే వర్తులాకార ఫలకం ఉంటుంది. ధూళి రేణువులు లోపలికి ప్రవేశించకుండా నివారించేందుకు శ్వాసరంధ్రాలకు చిన్న రోమాలు ట్రైకోమ్లు (Trichomes) ఉంటాయి. ప్రతి శ్వాసరంధ్రం ఏట్రియమ్ (Atrium) అనే కక్ష్యలోకి తెరుచుకొంటుంది.
AP Inter 1st Year Zoology Study Material Chapter 7 పెరిప్లానెటా అమెరికానా (బొద్దింక) 10

వాయునాళాలు :
వక్ష భాగంలోని శ్వాసరంధ్రాల ఏట్రియమ్ నుంచి అనేక క్షితిజ సమాంతరనాళాలు లోపలికి వ్యాపించి ఒకదానితో మరొకటి కలుసుకొంటూ ముఖ్య పృష్ఠ శిరోనాళాలు ముఖ్య ఉదర శిరోనాళాలను, వాటి శాఖలను ఏర్పరుస్తాయి. ఈ శాఖలన్నీ తలలోని అవయవాలకు వ్యాపిస్తాయి. వక్ష భాగంలో ముఖ్య పార్శ్వఆయత శ్వాసనాళాలు ఉంటాయి. ఉదరభాగపు శ్వాసరంధ్రాలు ఏ ఏట్రియమ్లలోకి తెరుచుకొంటాయి. ప్రతి ఉదరశ్వాసరంధ్రం యొక్క ఏట్రియమ్ నుంచి మూడు వాయునాళాలు ఉత్పన్నమవుతాయి.

ఒకవైపు ఉన్న ఈ నాళాలన్నీ మూడు వేరు వేరు ముఖ్య ఆయతనాళాల్లోకి తెరుచుకొంటాయి. వీటిని పృష్ఠ ఉదర, పార్శ్వ ప్రధాన ఆయత నాళాలు అంటారు. వీటిలో పార్శ్వనాళాలు అన్నింటికంటే పొడవుగా ఉంటాయి. రెండువైపులా ఉన్న ప్రధాన ఆయత నాళాలను కలుపుతూ, వాటి మధ్య సంధాయక నాళాలు (Commissural tracheae) ఉంటాయి. అన్ని ప్రధాన వాయునాళాల నుంచి అనేక ఉపశాఖలు బయలుదేరి వివిధ అవయవాల్లోకి వ్యాపిస్తాయి. ఇవి ఒక్కొక్క అంగంలోకి ప్రవేశించి ప్రత్యేక వాయునాళికా కణాల్లో (Tracheole cells) అంతమవుతాయి.

వాయునాళ కుడ్యం మూడు పొరలతో ఏర్పడుతుంది. అవి వెలుపలి ఆధారత్వచం (Basement membrane), మధ్య ఒక కణ మందంతో ఏర్పడిన ఉపకళ (Epithelium), లోపలి ఇంటిమా (Intima) అనే అవభాసిని స్తరం. ఇంటిమా వాయునాళాల్లో టినీడియా (Taenidia) అనే సర్పిలాకార మందాలను ఏర్పరుస్తుంది. టినీడియా వల్ల వాయునాళాలు ముకుళించుకుపోకుండా ఎల్లప్పుడూ తెరుచుకొనే ఉంటాయి.

వాయునాళికలు :
వాయునాళం చివరి కణాన్ని ట్రాకియోబ్లాస్ట్ (Tracheoblast) లేదా వాయునాళ కణం అంటారు. దీనిలో చాలా కణాంతస్థ వాయునాళ అంత్యాలు ఉంటాయి. వీటిని వాయునాళికలు (Tracheoles) అంటారు. వాయునాళికలకు ఇంటిమా, టినీడియాలు ఉండవు. ఇవి ట్రేకిన్ (Trachein) అనే ప్రొటీన్ నిర్మితాలు. ఈ నాళికల్లో వాయునాళికాద్రవం ఉంటుంది. బొద్దింకలు శారీరకంగా, జీవక్రియాత్మకంగా చురుకుగా ఉన్నప్పుడు వాయునాళికల్లోని వాయునాళికాద్రవం కణజాలాల్లోకి పీల్చుకోబడి దాని స్థాయి తగ్గుతుంది. బొద్దింక విరామస్థితిలో నిస్తేజంగా ఉన్నప్పుడు నాళికాద్రవం స్థాయి పెరుగుతుంది. వాయునాళికలు కణంలోకి చొచ్చుకొనిపోయి మైటోకాండ్రియాకు సన్నిహితంగా ఉంటాయి (వాటికి ఆక్సిజన్ సరఫరా చేయడానికి).

AP Inter 1st Year Zoology Study Material Chapter 7 పెరిప్లానెటా అమెరికానా (బొద్దింక)

ప్రశ్న 4.
పెరిప్లానేటా ప్రత్యుత్పత్తి వ్యవస్థను వివరించి, చక్కని పటాన్ని గీసి భాగాలను గుర్తించండి.
జవాబు:
పెరిప్లానేటా ఏకలింగజీవి. స్త్రీ, పురుష జీవులు లైంగిక ద్విరూపకతను అంతర్గతంగా, బహిర్గతంగా కూడా ప్రదర్శిస్తాయి. స్త్రీ జీవి ఉదరం పొట్టిగా, వెడల్పుగా ఉంటుంది. పరాంతంలో అండ నిక్షేపం ఉంటుంది. పురుషజీవి ఉదరం సన్నగా, పొడవుగా ఉంటుంది. పరాంతంలో ఒక జత పాయు శూకాలుంటాయి.

పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ :
పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఒక జత ముష్కాలు ఉంటాయి. ఇవి పొడవుగా ఉండే లంబికలు గల నిర్మాణాలు. ఇవి నాలుగు నుంచి ఆరు ఉదర ఖండితాలు పార్శ్వ భాగాలలో ఇరువైపులా కొవ్వు దేహాల్లో ఇమిడి ఉంటాయి. ఒక్కో ముష్కం పరభాగం నుంచి సన్నటి శుక్రవాహిక (Vas deferens) ఆరంభమవుతుంది. రెండు శుక్రవాహికలు వెనుకకు లోపలి వైపుగా ప్రయాణించి ఏడో ఖండితంలోని వెడల్పైన మధ్యస్థ స్కలననాళం (Ductus ejaculatus) లోకి తెరచుకుంటాయి. ఆరో, ఏడో ఉదర ఖండితాల్లో ఒక పుట్టగొడుగు ఆకారపు గ్రంథి ఉంటుంది. ఇది అదనపు ప్రత్యుత్పత్తి గ్రంథిలాగా పనిచేస్తుంది. ఈ గ్రంథిలో రెండు రకాల నాళికలు ఉంటాయి. 1) పొడవైన సన్నటి నాళికలు యుట్రిక్యులై మేజోర్స్ (Utriculi majores) లేదా ‘పరిధీయ నాళికలు’, 2) పొట్టిగా ఉండే యుట్రిక్యులై బ్రివోర్స్ నాళికలు (Utriculi breviores), యుట్రిక్యులై మేజోర్స్ శుక్రగుళిక లోపలి స్తరాన్ని ఏర్పరచగా, యుట్రిక్యులై బ్రివోర్స్ శుక్రకణాలకు పోషణనిస్తాయి.

ఈ నాళికలు స్కలననాళిక (Ejaculatory duct) పూర్వభాగంలో తెరుచుకుంటాయి. శుక్రాశయాలు, స్కలన నాళిక ఉదరతంలో ఉంటాయి. ఇవి శుక్రకణాలను కట్టలుగా చేసి నిల్వ ఉంచుతాయి. వీటిని శుక్రగుళికలు (Spermatophores) అంటారు. స్కలన నాళం కండరయుతమైంది. ఇది పరాంతం వరకు సాగి ‘పురుష జననరంధ్రం’ (Gonopore) లోకి తెరుచుకుంటుంది. బొద్దింక పురుష జననాంగాలతో పాటూ, ఒక ఫేలిక్ (Phallic) లేదా కాంగ్లోబేట్ (Conglobate) గ్రంథి ఉంటుంది. దీని నాళం జననరంధ్రం దగ్గర తెరుచుకుంటుంది. దీని విధి ఇంతవరకు తెలియదు. పురుష జననరంధ్రం చుట్టూ అసౌష్ఠవమైన కైటినస్ నిర్మాణాలు అంటే, ఫేలిక్ అవయవాలు లేదా గొనాపోఫెసిస్లు లేదా ఫెలోమియర్లు ఉంటాయి. ఇవి సంపర్కంలో తోడ్పడతాయి. ఇవి పురుషజీవి బాహ్య జననాంగాలు.
AP Inter 1st Year Zoology Study Material Chapter 7 పెరిప్లానెటా అమెరికానా (బొద్దింక) 5

స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ :
స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఒక జత స్త్రీ బీజకోశాలు, ఒక జత స్త్రీ బీజవాహికలు, యోని, శుక్రగ్రాహికలు, శుక్రగ్రాహిక సూక్ష్మాంకురం మరియు కొల్లాటీరియల్ గ్రంథులు ఉంటాయి.

స్త్రీ బీజకోశాలు :
ఒక జత పెద్ద స్త్రీ బీజకోశాలు 2-6 ఉదర ఖండిత పార్శ్వ భాగాలలో ఉంటాయి. ఇవి లేత పసుపు రంగులో కొవ్వు దేహాలతో చుట్టబడి ఉంటాయి. ప్రతి స్త్రీ బీజకోశానికి ఎనిమిది స్త్రీ బీజకోశనాళికలు లేదా ఒవేరియోల్స్ (Ovarioles) ఉంటాయి. ఒక్కొక్క ఒవేరియోల్కు జర్మేరియమ్ (Germarium) అనే సాగి మొనదేలి ఉన్న పూర్వాంత పోగు, వెడల్పైన పరాంత విటలేరియం (Vitellarium) ఉంటాయి. జర్మేరియంలో అభివృద్ధి చెందుతున్న అనేక అండదశలు, విటలేరియంలో సొనతో పాటు పరిపక్వ అండాలు ఉంటాయి. ఒక్కొక్క స్త్రీ బీజకోశంలో ఉన్న ఒవేరియోల్ల సన్నగా సాగిన అంచులన్నీ కలిసి ఒక తాడుగా మారి పృష్ఠ దేహకుడ్యానికి అతుక్కొంటుంది. పరాంత అంచులు కలిసి కురచని వెడల్పైన స్త్రీ బీజవాహిక (Oviduct) గా ఏర్పడుతుంది. స్త్రీ బీజవాహికలు కలసిపోయి మధ్యలో అతి చిన్న యోని (Vagina) ఏర్పడుతుంది.
AP Inter 1st Year Zoology Study Material Chapter 7 పెరిప్లానెటా అమెరికానా (బొద్దింక) 6

యోని నిలువు రంధ్రాన్ని స్త్రీ జననరంధ్రం అంటారు. ఇది ఎనిమిదో ఉరఃఫలకంలో పెద్ద జననాశయం (Genital pouch) లోకి తెరుచుకుంటుంది. శుక్రగ్రాహిక లేదా శుక్రధానం (Seminal receptacle) ఎడమవైపున తిత్తితో, కుడివైపున పోగులాంటి అంధనాళంతో 6వ ఖండితంలో ఉంటుంది. ఇది 9వ ఉరః ఫలకంలోని జననాశయంలో ఒక మధ్యస్థ రంధ్రం ద్వారా తెరుచుకుంటుంది. ఫలవంతమైన స్త్రీ జీవిలో శుక్రగ్రాహికలు సంపర్కం ద్వారా గ్రహించిన శుక్రగుళికలను కలిగి ఉంటాయి.

స్త్రీ బీజకోశాల వెనక ఒక జత శాఖాయుతమైన కొల్లాటీరియల్ గ్రంథులు (Colleterial glands) ఉంటాయి. ఈ గ్రంథులు శుక్రగ్రాహిక రంధ్రం పైన వేర్వేరుగా జననాశయంలోకి తెరుచుకుంటాయి. ఈ రెండు కొల్లాటీరియల్ గ్రంథుల స్రావకాలు గుడ్ల చుట్టూ ఒక దృఢమైన పెట్టెను ఏర్పరుస్తాయి. దీన్నే గుడ్లుపెట్టె లేదా గుడ్లకోశం లేదా ఊథీకా (Ootheca) అంటారు. జననాశయం ఏడో, ఎనిమిదో, తొమ్మిదో ఉదర ఖండితాల ఉరఃఫలకాలతో ఏర్పడుతుంది. ఏడో ఖండిత ఉరః ఫలకం పడవ ఆకారంలో ఉంటుంది. ఇది జననాశయం అడుగు, పక్క భాగంలో గోడలను ఏర్పరుస్తుంది. ఎనిమిదో, తొమ్మిదో కండితాల ఉరఃఫలకాలు ఏడో ఖండితంలో చొచ్చుకొని వరుసగా జననాశయం పూర్వాంతపు గోడ, దాని పైకప్పుగా ఏర్పడతాయి. జననాశయానికి రెండు గదులుంటాయి. అవి : పూర్వాంతపు గైనాట్రియం (Gynatrium) లేదా జననకోశం, పరాంతపు వెస్టిబ్యులమ్ (Vestibulum) లేదా గుడ్లకోశం.

స్త్రీ జననరంధ్రం చుట్టూ మూడు జతల కైటిన్ నిర్మిత ఫలకాలు ఉంటాయి. వీటిని గొనాపోఫైసిస్లు అంటారు. ఇవి అండ విక్షేపకం (Ovipositor) గా ఏర్పడి అండాలకు గుడ్లకోశంలోకి మార్గం చూపుతాయి. ఇవి స్త్రీ బాహ్య జననాంగాలు.

AP Inter 1st Year Zoology Study Material Chapter 4 జంతు వైవిధ్యం-II: కార్డేటాల క్లుప్త చరిత్ర

Andhra Pradesh BIEAP AP Inter 1st Year Zoology Study Material 4th Lesson జంతు వైవిధ్యం-II: కార్డేటాల క్లుప్త చరిత్ర Textbook Questions and Answers.

AP Inter 1st Year Zoology Study Material 4th Lesson జంతు వైవిధ్యం-II: కార్డేటాల క్లుప్త చరిత్ర

అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
కార్డేట్లు, ఇకైనోడరు పంచుకొనే లక్షణాలను పేర్కొనండి.
జవాబు:
ఎంటిరోసీలోమ్, డ్యుటిరోస్టోములు మరియు ద్విపార్శ్వ సౌష్టవము చూపును.

ప్రశ్న 2.
సైక్లోస్టోముల నాలుగు ముఖ్య లక్షణాలు రాయండి.
జవాబు:
1) ఇవి దౌడలు లేని జలచర జీవులు.
2) శరీరము సన్నగా, పొడవుగా ఈకలాగా పొలుసులు లేకుండా ఉండును.
3) అంతరాస్థి పంజరము మృదులాస్థి నిర్మితము.
4) నోరు వలయాకారముగా ఉండి, చూషకము వలే పనిచేయును.

ప్రశ్న 3.
లాన్సిలెట్లు, ఎసీడియన్లలో ఎండోస్టైల్ ప్రాముఖ్యం ఏమిటి?
జవాబు:
ఎండో స్టైల్, ఇది శైలికాయుతమైన, గ్రంథులను కలిగి గ్రసని ఉదరకుడ్యంపై ఉంటుంది. ఇది ఆహార పోషణలో గాలన పద్ధతిగా ఉపయోగపడుతుంది.

ప్రశ్న 4.
షార్క్లు, కట్ల చేపలలో పుచ్ఛవాజం రకం, పొలుసుల పేర్లు తెలపండి.
జవాబు:
షార్కులలో పుచ్ఛవాజం విషమపాలి రకము, చర్మముపై ప్లాకాయిడ్ పొలుసులు ఉండును. కట్ల చేపలో పుచ్ఛవాజము సమపాల రకము, చర్మముపై సైక్లాయిడ్ పొలుసులు ఉండును.

ప్రశ్న 5.
చేపలలో వాయుకోశాల ప్రాముఖ్యం ఏమిటి?
జవాబు:
చేపలలోని వాయుకోశాలు వాయు మార్పిడికి లేదా నీటిలో తేలిక జీవి తేలియాడుటకు హైడ్రోస్టాటిక్ అవయవముగా ఉపయోగపడును.

AP Inter 1st Year Zoology Study Material Chapter 4 జంతు వైవిధ్యం-II: కార్డేటాల క్లుప్త చరిత్ర

ప్రశ్న 6.
‘చేపల హృదయం జలశ్వాస హృదయం’ ఈ వ్యాఖ్యను ఎలా సమర్థిస్తారు?
జవాబు:
రక్తప్రసరణ వ్యవస్థలో రక్తము మొప్పలకు మాత్రమే పంపుతుంది. ఇటువంటి హృదయమును జలశ్వాస హృదయము అని అందురు.

ప్రశ్న 7.
సంపర్క కంటకాలు అంటే ఏమిటి? ఇవి ఏ చేపల సమూహంలో ఉంటాయి?
జవాబు:
మగచేపలలో సంపర్క కంటకాలు ఉండును. శ్రోణవాజము మార్పుచెంది సంపర్క కంటకముగా మారును. ఇది సంపర్క సమయములో ఉపయోగపడును. కాండ్రాక్టిస్ లేదా ఇలాస్మోబ్రాంకి చేపలలో ఉండును.

ప్రశ్న 8.
ఉభయచరాల హృదయం సరీసృపాల హృదయంతో ఎలా విభేదిస్తుంది?
జవాబు:
ఉభయచరాల హృదయంలో రెండు కర్ణికలు, ఒక జఠరిక ఉండును. అనగా హృదయము మూడు గదులుగా విభజింపబడి ఉండును.

సరీసృప హృదయములో అసంపూర్తిగా విభజన చెందిన నాలుగు గదులు ఉండును.

ప్రశ్న 9.
పరిణామక్రమములో ఉభయచరాలలో మొట్టమొదటగా కనిపించిన నిర్మాణాల పేర్లు తెలపండి.
జవాబు:
రెండు జతల సమాన లేదా అసమాన పంచాంగుళీయక గమనాంగాలు ఏర్పడినవి.

ప్రశ్న 10.
స్త్రీ, పురుష కప్పలను ఎలా గుర్తిస్తారు?
జవాబు:
పురుష కప్పలలో శబ్దము చేయుటకు స్వరకోశాలను, పూర్వాంగాల వేలికి సంపర్కమెత్తను కలిగి ఉండును. స్త్రీ కప్పలలో ఇవి ఉండవు

ప్రశ్న 11.
కప్పలో శక్తియుత పంపు (Force Pump) అని దేన్ని అంటారు? దీనికి ఆ పేరు ఎందుకు పెట్టారు?
జవాబు:
పుపుస శ్వాసక్రియలో ఆస్యగ్రసని కుహరం ఒక బలమైన పంపులాగా పనిచేస్తుంది. ఆస్యగ్రసనీ కుహరం అడుగుభాగం పైకి లేచినప్పుడు గాలి ఒత్తిడికి కంఠబిలం తెరుచుకొని, గాలి ఊపిరితిత్తులను చేరుతుంది.

ప్రశ్న 12.
కార్పొరాబైజెమీనా అంటే ఏమిటి? వీటి ముఖ్యవిధి తెలపండి.
జవాబు:
దృష్టి లంబికలను అడ్డముగా విభజింపబడి ఉండే వాటిని కార్పొరాజైజెమీనా అందురు. ఇవి జీవిలో దృష్టి జ్ఞానమును కలుగజేయును.

AP Inter 1st Year Zoology Study Material Chapter 4 జంతు వైవిధ్యం-II: కార్డేటాల క్లుప్త చరిత్ర

ప్రశ్న 13.
ముష్కయోజని, స్త్రీ బీజకోశ యోజని మధ్య భేదాన్ని గుర్తించండి.
జవాబు:
మూత్రపిండాలకు, పృష్ట శరీర కుడ్యానికి రెండు మడతల ఆంత్రవేష్టనంతో అతకబడి ఉంటాయి. ఆంత్రవేష్టనాన్ని ముష్క యోజని అని అందురు. స్త్రీబీజకోశాలు మూత్రపిండాలకు, పృష్ట శరీర కుడ్యానికి రెండు మడతల ఆంత్రవేష్టనంతో అతకబడి ఉంటాయి. ఈ ఆంత్రవేష్టనాన్ని స్త్రీబీజకోశ యోజని అని అందురు.

ప్రశ్న 14.
మిల్ట్, స్పాన్ మధ్య భేదాలను గుర్తించండి.
జవాబు:
ఆడకప్ప విడుదల చేసిన గుడ్లరాశిని “స్పాన్” అని, పురుష కప్పలు విడుదల చేసే శుక్రకణాల రాశిని “మిస్ట్” అని అందురు.

ప్రశ్న 15.
మొట్టమొదటి దవడల సకశేరుకాలు, మొదటి ఉల్బధారులు ‘సర్ణయుగాలను’ తెలపండి.
జవాబు:
“డివోనియన్” కాలాన్ని మొదటి దవడలను సకశేరుకాలు, మొదటి ఉల్బదారులు స్వర్ణయుగముగా పేర్కొనెదరు. చేపలు మొదటి దవడల సకశేరుకాలు.

ప్రశ్న 16.
దక్షిణ భారతదేశంలో గల రెండు విషయుత, విషరహిత సర్పాల పేర్లు తెలపండి.
జవాబు:
విషయుత సర్పములు :
1) నాజనాజ (నాగుపాము)
2) బుంగారస్ (కట్లపాము)

విషరహిత సర్పములు :
1) ట్యాప్ (రాట్ స్నేక్)
2) ట్రోపిడోనోటస్ (నీళ్ళపాము)

ప్రశ్న 17.
సరీసృప చర్మం కప్ప చర్మంతో ఏ లక్షణాలలో విభేదిస్తుంది?
జవాబు:
సరీసృప చర్మము గరుకుగా, పొడిగా ఉండును. బాహ్యస్థి పంజరములో కొమ్ము సంబంధిత బహిత్త్వచ పొలుసులు, ఫలకాలు, నఖాలు ఉంటాయి. కప్ప చర్మము పలచగా, పొలుసులు లేకుండా, తేమగా ఉండును.

ప్రశ్న 18.
పిల్లి, బల్లిని అవి విసర్జించే ముఖ్య నత్రజని వ్యర్థాల ఆధారంగా వివరించండి.
జవాబు:
బల్లులు యూరిక్ ఆమ్లమును విసర్జించును. అందువలన ఇవి యూరికోటెలిక్ ప్రాణులు.

పిల్లులు క్షీరదములు. అందువలన వీటి విసర్జక పదార్థము యూరియా రూపములో ఉండును. అందువలన వీటిని యూరియోటెలిక్ జీవులు అందురు.

AP Inter 1st Year Zoology Study Material Chapter 4 జంతు వైవిధ్యం-II: కార్డేటాల క్లుప్త చరిత్ర

ప్రశ్న 19.
నాలుగు పిండ బాహ్యత్వచాల పేర్లు తెలపండి.
జవాబు:
1) ఉల్బము 2) అళింద 3) పరాయువు 4) సొనసంచి.

ప్రశ్న 20.
జాకబ్సన్ అవయవాలు అంటే ఏమిటి? వాటి విధి ఏమి?
జవాబు:
ప్రత్యేక ఘ్రాణ నిర్మాణాలను జాకబ్సన్ అవయవములు అందురు. ఇవి వాసనను తెలుసుకొనుటకు ఉపయోగపడును.

ప్రశ్న 21.
వాతిలాస్థులు అంటే ఏమిటి? అవి పక్షులకు ఎలా తోడ్పడతాయి?
జవాబు:
పక్షులలో ఎముకలు బోలుగా ఉండి గాలికుహరాలను కలిగి ఉంటుంది. ఇది పక్షులు గాలిలో తేలికగా ఎగురుటకు తోడ్పడును.

ప్రశ్న 22.
విష్ బోన్ అంటే ఏమిటి? దీన్ని ఏర్పరచే అస్థిఘటకాలను తెలపండి.
జవాబు:
జత్రుకలు, అంతరజత్రుకతో కలిసి ‘V’ ఆకారపు అస్థిని ఏర్పరుస్తాయి. దాన్ని ఫర్కులా లేదా విష్్బన్ అందురు.

ప్రశ్న 23.
రక్తం నిరంతర ఆక్సిజినేషన్ (ఆక్సీకరణం) అంటే ఏమిటి? ఇది పక్షులలో ఎలా సాధ్యమవుతుంది?
జవాబు:
ఊపిరితిత్తులు కుదించినట్లు స్పంజికలాగా ఉంటాయి. వాయుకోశాలు ఉండవు. ఇవి వ్యాకోచించలేవు. వాయుగోణులు ఊపిరితిత్తులతో సంబంధాన్ని కలిగి ఉంటాయి. వాయుగోణులు నిరంతరం రక్తానికి ఆక్సిజన్ అందిస్తాయి.

ప్రశ్న 24.
పక్షులలో అన్నకోశం, అంతరజఠరం మధ్య భేదాలను తెలపండి.
జవాబు:
పక్షులలో అన్నకోశము ఆహారాన్ని నిల్వచేయును. అంతర జఠరము ఆహారమును మెత్తగాజేయు, విసిరే మరగా విభజింపబడి ఉండును.

ప్రశ్న 25.
ఆల్ట్రీషియల్, ప్రికోషియల్ పక్షిపిల్లల మధ్య తేడాలను తెలపండి.
జవాబు:
ఎగిరే పక్షులలో బాల్యజీవులు తల్లిదండ్రులపై ఆధారపడతాయి. అందువలన వీటిని ఆల్ట్రీషియల్ అందురు.
ఎగరని పక్షులలో బాల్యజీవులు తల్లిదండ్రులపై ఆధారపడవు. అందువలన వీటిని ప్రికోషియల్ అని అందురు.

ప్రశ్న 26.
ఏ సమూహ జంతువులలో ప్రతీ పార్శ్వంలో మూడు కర్ణాస్థికలు ఉంటాయి. వాటి పేర్లను లోపలి నుంచి వెలుపలికి వరస క్రమంలో తెలపండి.
జవాబు:
క్షీరదములలోని మధ్యచెవిలో ఉండే మూడు కర్ణాస్థి ఖండాలు కలవు. అవి 1) కూటకము, 2) దాగలి, 3) కర్ణాంతరాస్థి.

AP Inter 1st Year Zoology Study Material Chapter 4 జంతు వైవిధ్యం-II: కార్డేటాల క్లుప్త చరిత్ర

ప్రశ్న 27.
క్షీరదాల పరిపక్వ RBC, ఇతర సకశేరుకాల RBCతో ఎలా విభేదిస్తుంది?
జవాబు:
క్షీరదముల RBC ద్విపుటాకారముగా ఉండి, కేంద్రకమును కలిగి ఉండదు.

మిగిలిన సకశేరుకములలో RBC నందు కేంద్రకము ఉండును.

ప్రశ్న 28.
సరీసృపాలు, పక్షులు, క్షీరదాలలో ముఖ్య కశేరుకాల రకాల పేర్లను తెలపండి.
జవాబు:
1) సరీసృప కశేరుకములు – ప్రోసీలస్ లేదా పురోగర్తి రకమునకు చెందినవి.
2) పక్షుల కశేరుకములు – విషమగర్తి రకమునకు చెందినవి.
3) క్షీరద కశేరుకములు – ఉభయ సమతల రకానికి చెందినవి.

ప్రశ్న 29.
మూడు మెనింజెస్ పేర్లను తెలపండి. ఈ మూడూ ఏ సమూహ జంతువులలో కనిపిస్తాయి ?
జవాబు:
మూడు మెనెంజెస్లు :

  1. పరాశిక
  2. ఆర్కినాయిడ్ పొర
  3. మృద్వి. ఈ మూడు పొరలు క్షీరదముల మెదడును కప్పి ఉంచును.

ప్రశ్న 30.
వృక్క నిర్వాహకవ్యవస్థ లోపించిన సకశేరుక సమూహాల పేర్లు తెలపండి.
జవాబు:
క్షీరదములలో వృక్క నిర్వాహక వ్యవస్థ లోపించియుండును.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
సకశేరుకాలు, అకశేరుకాల మధ్య మూడు ముఖ్య తేడాలను తెలపండి. ఈ లక్షణాలను చూపే సకశేరుక శరీర పటాన్ని గీయండి.
జవాబు:
కార్దేట్లు, అకశేరుకాల మధ్య పోలికలు :

కార్దేట్లుఅకశేరుకాలు
1. పృష్ఠవంశం ఉంటుంది.పృష్ఠవంశం ఉండదు.
2. కేంద్రనాడీ వ్యవస్థ పృష్ఠభాగంలో బోలుగా, ఒకే ఒకటిగా, నాడీసంధిరహితంగా ఉంటుంది.కేంద్రనాడీవ్యవస్థ ఉదర భాగంలో, కడ్డీ లాగా, ద్వంద్వంగా, నాడీసంధిసహితంగా ఉంటుంది.
3. గ్రసని మొప్ప చీలికలతో ఉంటుంది.మొప్ప చీలికలు ఉండవు.
4. ఉదరభాగంలో హృదయం ఉంటుంది.పృష్ఠ హృదయం (ఉంటేనే).
5. పాయుపరపుచ్ఛం ఉంటుంది.పాయుపరపుచ్ఛం ఉండదు.

AP Inter 1st Year Zoology Study Material Chapter 4 జంతు వైవిధ్యం-II కార్డేటాల క్లుప్త చరిత్ర 1

ప్రశ్న 2.
కార్డేట్లలో నాలుగు ముఖ్య లక్షణాలు పేర్కొని ప్రతిదాని ముఖ్య విధిని తెలపండి.
జవాబు:
కార్డేటాల నాలుగు ముఖ్య లక్షణాలు :
1. పృష్ఠవంశం :
ఇది పృష్ఠమధ్యరేఖ మీదుగా ఆహారనాళానికీ, పృష్ఠ నాడీదందానికీ మధ్య ఉండే ఒక స్థితిస్థాపక కడ్డీలాంటి నిర్మాణం. పిండంలో కనిపించే మొట్టమొదటి అంతరాస్థిపంజర భాగం. ఇది పిండ పృష్ఠవంశ మధ్యత్వచం నుంచి ఏర్పడుతుంది. దీని అంతర్భాగంలో రిక్తికాయుత కణాలు ఉండి వాటిని ఆవరిస్తూ లోపలి మందమైన తంతుయుత సంయోజక కణజాలపు తొడుగు, వెలుపల పలచని స్థితిస్థాపక సంయోజక కణజాలపు తొడుగులు ఉంటాయి. ఇది లాన్స్లట్లు, సైక్లోస్టోమ్స్లో జీవితాంతం ఉంటుంది. ఎసిడియన్లలో టాడ్పోల్ డింభకపు తోకలో మాత్రమే ఉంటుంది. తిరోగామి రూపవిక్రియలో తోకను, పృష్ఠవంశాన్ని కోల్పోయి, ప్రౌఢ జీవిగా మారుతుంది. ఉన్నత సకశేరుకాలలో పృష్ఠవంశం పిండదశలో కనిపించి ప్రౌఢజీవులలో దీని స్థానంలో పాక్షికంగా గానీ, సంపూర్ణంగా గానీ వెన్నెముక ఏర్పడుతుంది. పృష్ఠవంశం అనశేషాలు పల్పోసి కేంద్రకాలుగా క్షీరదాల కశేరుకాంతర చక్రికలలో ఉంటాయి.

2. పృష్ఠనాళికాయుత నాడీదండం :
పృష్ఠవంశానికి పైన, పృష్ఠశరీర కుడ్యానికి కింద ఒకే ఒక నాడీదండం ఉంటుంది. ఇది బోలుగా, నాళం లాగా ఉండి, ద్రవంతో నిండి ఉంటుంది. ఇది అకశేరుకాలలో లాగా కాకుండా నాడీకణసంధి రహితంగా ఉంటుంది. పిండదశలో పృష్ఠవంశంపై గల బహిత్వచపు పొర పృష్ఠ మధ్యభాగం కిందికి కుంగి నాడీదండం ఏర్పడుతుంది. ఉన్నత కార్డేటాలలో దీని పూర్వభాగం పెద్దదై విస్తరించి మెదడుగా, మిగతా భాగం వెన్నుపాముగా విభేదనం చెందుతుంది.

3. గ్రసనీ మొప్ప చీలికలు లేదా రంధ్రాలు :
గ్రసనీ పార్శ్వ కుడ్యంలో వరసగా గ్రసనీ చీలికలు లేదా రంధ్రాలు ఉంటాయి. వీటి ద్వారా గ్రసనీ కుహరం నుంచి నీరు వెలుపలికి ప్రవహిస్తుంది. ఇవి బాహ్య-అంతస్త్వచం నుంచి ఏర్పడతాయి. ప్రాథమిక కార్డేట్లు, చేపలు మరియు కొన్ని ఉభయచరాలలో ఇవి జీవితాంతం ఉంటాయి. గ్రసనీ కుడ్యరంధ్రాలు ప్రసరణ పటలికల అభివృద్ధితో మొప్పలు (బ్రాంకి)గా మారి శ్వాస వాయువుల మార్పిడికి తోడ్పడతాయి. అనేక ఉభయచరాలలో ఇవి డింభకదశలో ఉండి ప్రౌఢజీవులలో కనిపించవు. ఉల్బధారులలో క్రియారహిత గ్రసనీకోశాలు పిండాభివృద్ధి ప్రారంభంలో ఏర్పడి ఆ తరవాత అదృశ్యమవుతాయి. ఉల్బధారుల పిండాభివృద్ధి ప్రారంభంలో ఇవి కనిపించడం వల్ల ఈ జీవుల పూర్వీకులు జలచరాలని తెలుస్తుంది.

4. పాయు పర పుచ్ఛం :
సకశేరుకాల పుచ్ఛం పాయువుకు పరభాగంలో పొడిగించబడి ఉంటుంది. చాలా జాతులలో ఇది పిండాభివృద్ధి చివరిదశలో అదృశ్యమవుతుంది. దీనిలో అస్థిపంజర మూలపదార్థాలు, కండరాలు ఉంటాయి. అయితే దీనిలో శరీరకుహరం, అంతరాంగ అవయవాలు ఉండవు.

AP Inter 1st Year Zoology Study Material Chapter 4 జంతు వైవిధ్యం-II: కార్డేటాల క్లుప్త చరిత్ర

ప్రశ్న 3.
కార్డేటా ఉనికిని తెలిపే ట్యునికేట్ లక్షణాలను వివరించండి.
జవాబు:
యూరోకార్డేటా లేదా ట్యునికేటా: (GR.oura – తోక ; L.chorda – పృష్ఠవంశం)
AP Inter 1st Year Zoology Study Material Chapter 4 జంతు వైవిధ్యం-II కార్డేటాల క్లుప్త చరిత్ర 2
యూరోకార్డేట్లన్నీ సముద్ర జీవులు. నీటి ఉపరితలం నుంచి అధిక లోతు వరకు కనిపిస్తాయి. ఇవి వృంతరహిత (ఎసీడియన్స్) లేదా నీటిపై తేలియాడే (సాల్ప, డోలియోలం), ఏకాంత (ఎసీడియా) లేదా సహనివేశ (పైరోసోమా) జంతువులు. శరీరం ఖండితరహితమై, సెల్యులోజ్ మిగతా జంతువులలో వలె కాకుండా నిర్మితమైన కంచుకంతో ఆవరించి ఉంటుంది. శరీరకుహరం లేదు. అయితే గ్రసని చుట్టూ బహిస్త్వచంతో ఆవరించి ఉన్న ఏట్రియల్ కుహరం ఉంటుంది. మొప్ప చీలికలు, పాయువు, జననేంద్రియ నాళాలు దీనిలోకి తెరచుకొంటాయి. గ్రసని ఉదరకుడ్యంపై ఉండే అంతర్ కీలితం మున్ముందు సకశేరుకాల థైరాయిడ్ గ్రంథి ఏర్పాటును సూచిస్తుంది. ఏట్రియమ్ పృష్ఠ లేదా పర ఏట్రియల్ రంధ్రం ద్వారా బయటికి తెరుచుకొంటుంది. సంపూర్ణ జీర్ణనాళం ఉంటుంది.

గ్రసనీ కుడ్యంలో రెండు లేదా లెక్కలేనన్ని మొప్ప చీలికలు ఉంటాయి. వివృత రక్త ప్రసరణ వ్యవస్థ ఉంటుంది. హృదయం నాళాకారంలో ఉదరభాగంలో ఉంటుంది. రక్త ప్రవాహాన్ని ఏకాంతరంగా వ్యతిరేక దిశలలో పంపడం దీని విశిష్టత. నాడీ వ్యవస్థ ప్రౌఢజీవులలో ఒక పృష్ఠ నాడీసంధిగా ఉంటుంది. ఇవి ద్విలింగ లేదా ఉభయలైంగిక జీవులు. జీవి అభివృద్ధిలో తోకతో స్వేచ్ఛగా ఈదే టాడ్పోల్ డింభకం ఉంటుంది. ఈ డింభకంలో తోక భాగాన, బోలుగా ఉన్న నాడీదండం, తోకకు పరిమితమైన పృష్ఠవంశం ఉంటాయి. అందువల్ల ఈ జీవులను యూరోకార్డేటాలు అంటారు.
ఉదా : ఎసీడియా, సాల్ప, డోలియోలం, పైరోసోమా, ఆయికోప్లూరా.

ప్రశ్న 4.
స్క్వీర్ట్లు, లాన్సిలెట్ల పోలికలు, భేదాలు చూపండి.
జవాబు:

స్క్వీర్ట్లాన్సిలెట్లు
1. ఇవి సముద్రములలో గాని, సముద్రతీరాలలో ఆధారము లను అంటిపెట్టుకొని జీవిస్తాయి.1. పృష్ఠవంశం పరాంతం నుంచి వాటి పూర్వాంతం వరకు వ్యాపించి ఉంటుంది.
2. దేహముపై ట్యునిసిన్తో చేయబడిన కవచముండుటచే ఈ సమూహమును ‘ట్యూనికేటా’ అని పిలుస్తారు.2. పృష్ఠ పార్శ్వ కండరాలు మందంగా ఉండి, కండర ఖండితాలు ఖండీభవనం చెంది ఉంటాయి.
3. ఈ జీవులకు ముఖరంధ్రం, ఏట్రియల్ రంధ్రం ఉంటాయి. నీరు ముఖరంధ్రం ద్వారా లోనికి ప్రవేశించి ఏట్రియల్ రంధ్రము ద్వారా బయటకు పోతుంది.3. గ్రసనిని ఆవరించి ఉండే ఏట్రియంలోకి మొప్ప చీలికలు, ప్రాథమిక వృక్కాలు, బీజకోశాలు తెరచుకొంటాయి.
4. ప్రౌఢజీవులు ఖండీభవనం చూపవు. రక్తప్రసరణ వివృతంగా ఉంటుంది.4. గ్రసని ఉదర కుడ్యంలో ఎండో స్టైల్ ఉంటుంది.
5. ఈ జీవులలో గల ఎండో స్టైల్ను సకశేరుకాల థైరాయిడ్ గ్రంథితో పోల్చవచ్చును.5. ప్రత్యేక శ్వాసాంగాలుండవు. శ్వాసవాయువుల వినిమయం వ్యాపన పద్ధతిలో జరుగుతుంది.
6. ప్రౌఢట్యునికేట్లలో పృష్ఠవంశం లోపిస్తుంది. కాని డింభక దశలో తోకలో ఉంటుంది. దీన్ని యూరోకార్డేటా అందురు.6. సొలినోసైట్లను కలిగిన ప్రాథమిక వృక్కాలు విసర్జక అవయవాలుగా పనిచేస్తాయి.
7. కొన్ని జీవులలోని రక్త కణాలలో వెనెడియంను కలిగి ఉండే వెనేడియం అనే వర్ణదము ఉండును.7. ఇవి ఏకలింగ జీవులు.
8. అభివృద్ధిలో తిరోగమన రూప విక్రియను చూపును.8. బాహ్యఫలదీకరణ జరుగుతుంది. మరియు డింభక దశ గల పరోక్ష అభివృద్ధి జరుగుతుంది.

ప్రశ్న 5.
చేపలను ఇతర సకశేరుకాల నుంచి వేరుచేసే ఎనిమిది లక్షణాలను రాయండి.
జవాబు:
సాధారణ లక్షణాలు :

  1. ఇవి శీతలరక్త సంపూర్ణ జలచర జంతువులు.
  2. వీటి శరీరం కండె ఆకారంలో తల, మొండెం, తోకగా విభేదనం చెంది ఉంది.
  3. అంతరాస్థి పంజరం మధ్యస్త్వచ పొలుసులు లేదా అస్థిఫలకాలతో ఏర్పడింది. కొన్ని చేపలలో పొలుసులు ఉండవు.
  4. మృదులాస్థి లేదా అస్థి నిర్మిత అంతరాస్థి పంజరం ఉంటుంది. పుర్రె ఒక అనుకపాలకందంతో ఉంటుంది. కశేరుకాలు ఉభయగర్తి రకం (కశేరుమధ్యం పూర్వ పర తలాలు పుటాకారంగా ఉంటాయి).
  5. చలనానికి అద్వంద్వ వాజాలు (మాధ్యమిక, పుచ్ఛవాజాలు, ద్వంద్వ వాజాలు (ఉరో, శ్రోణి వాజాలు) ఉంటాయి.
  6. నోరు ఉదరంగా లేదా పూర్వాంతంలో ఉంటుంది. దంతాలు అగ్రదంత, సమదంత మరియు బహువార దంత రకాలు.
  7. మొప్పలతో శ్వాసవాయువుల మార్పిడి జరుగుతుంది. హృదయం రెండు గదులతో మొప్పలకు రక్తాన్ని అందిస్తుంది. దీన్ని జలశ్వాస హృదయం అంటారు. చేపలలో ఏకప్రసరణ జరుగుతుంది. అంటే ప్రసరణలో రక్తం ఒకసారి మాత్రమే హృదయాన్ని చేరుతుంది. హృదయం ‘సిరా హృదయం’ (శరీర అవయవాల నుంచి సిరా రక్తం/ఆక్సిజన్ లేని రక్తం మాత్రమే హృదయానికి చేరుతుంది). మూత్రపిండాలు మధ్యవృక్క రకం. సాధారణంగా అమ్మోనోటెలిక్ మృదులాస్థి చేపలు మాత్రం యూరియోటెలిక్.
  8. కపాల నాడులు 10 జతలు. కేంద్రనాడీవ్యవస్థను కప్పి మెనింక్స్ ప్రిమిటివా మాత్రమే ఉంటుంది.
  9. లోపలి చెవిలో మూడు అర్థచంద్రాకార కుల్యలు ఉంటాయి. పార్శ్వరేఖ జ్ఞానాంగ వ్యవస్థ (నీటి కదలికలు, కంపనాలు గుర్తించడానికి) కనుగుడ్డును రక్షిస్తూ ఉంటుంది.
  10. స్త్రీ పురుష జీవులు వేరుగా ఉంటాయి. అంతర లేదా బాహ్య ఫలదీకరణం జరుగుతుంది. అభివృద్ధి ప్రత్యక్షం లేదా పరోక్షంగా జరుగుతుంది. చేపలలో ప్రస్తుతం రెండు విభాగాలున్నాయి. అవి : కాండ్రికిస్ (మృదులాస్థి చేపలు), ఆస్టిక్తిస్ (అస్థి చేపలు).

ప్రశ్న 6.
మృదులాస్థి, అస్థి చేపల పోలికలు, భేదాలు రాయండి. [Mar. ’14]
జవాబు:

కాండ్రిక్టిస్అస్టిక్టిస్
1. వీటిని సామాన్యంగా మృదులాస్థి చేపలు అందురు.1. వీటిని సామాన్యంగా అస్థి చేపలంటారు.
2. పుచ్చ వాజము విషమపాలి రకము.2. పుచ్ఛవాజము సమవిభక్త రకము.
3. చర్మాన్ని కప్పుతూ ప్లాకాయిడ్ పొలుసులు ఉంటాయి.3. చర్మాన్ని కప్పుతూ గానాయిడ్, సైక్లాయిడ్ లేదా టీనాయిడ్ పొలుసులుంటాయి.
4. నీటి అంతరాంగస్థిపంజరము మృదులాస్థితో నిర్మితమై ఉంటుంది.4. నీటి అంతరాంగస్థిపంజరము అస్థితో నిర్మితమై ఉంటుంది.
5. నోరు మరియు నాసికా రంధ్రాలు ఉదరతలంలో అమరి ఉంటాయి.5. నోరు ముట్టె అగ్రభాగంలో ఉంటుంది.
6. ఆహారనాళం అవస్కరంలోకి తెరచుకుంటుంది.6. ఆహారనాళం పాయువు ద్వారా వెలుపలికి తెరచుకుంటుంది.
7. మొప్పచీలికలు నగ్నంగా, ఉపరికుల లేకుండా ఉంటుంది.7. మొప్పచీలికలు ఉపరికులచే కప్పబడి ఉంటుది.
8. మొప్ప చీలికల ముందు శ్వాసరంధ్రాలుంటాయి.8. శ్వాసరంధ్రాలు ఉండవు.

AP Inter 1st Year Zoology Study Material Chapter 4 జంతు వైవిధ్యం-II: కార్డేటాల క్లుప్త చరిత్ర

ప్రశ్న 7.
కప్ప హృదయ నిర్మాణాన్ని వివరించండి.
జవాబు:
AP Inter 1st Year Zoology Study Material Chapter 4 జంతు వైవిధ్యం-II కార్డేటాల క్లుప్త చరిత్ర 3
రక్త ప్రసరణ వ్యవస్థ :
దీనిలో హృదయం, రక్తనాళాలు, రక్తం ఉంటాయి. శరీరకుహరం పైభాగంలో కండరయుత హృదయం ఉంటుంది. దీనిలో రెండు కర్ణికలు, ఒక జఠరిక ఉంటాయి. హృదయం రెండు స్తరాల హృదయావరణ త్వచంతో కప్పి ఉంటుంది. హృదయం పృష్ఠతలంలో కుడి కర్ణికను త్రికోణాకార సిరాసరణి కలుస్తుంది. ఇది మూడు మహాసిరల ద్వారా రక్తాన్ని గ్రహిస్తుంది. ఉదరతలంలో జఠరిక ధమనీ శంకువులోకి తెరుచుకొంటుంది. ధమనీ శంకువు రెండు శాఖలుగా, తిరిగి అవి ఒక్కొక్కటి మూడు ధమనీ చాపాలుగా ఏర్పడతాయి. అవి కరోట, దైహిక, పుప్పుస చర్మీయ చాపాలు. హృదయం నుంచి రక్తాన్ని శరీర భాగాలకు ధమనీ చాపాల శాఖలు సరఫరా చేస్తాయి. శరీర భాగాల నుంచి మూడు ముఖ్య సిరలు రక్తాన్ని గ్రహించి సిరాసరణికి చేరవేస్తాయి.

ప్రశ్న 8.
ఉభయచరాల విభాగం ఎనిమిది ముఖ్య లక్షణాలను తెలపండి.
జవాబు:
సాధారణ లక్షణాలు :

  1. ఇవి మొట్టమొదటి చతుష్పాదులు. రెండు ఆవాసాలలో జీవిస్తాయి. అంటే నేల మీద, మంచి నీటిలో జీవిస్తాయి.
  2. శరీరం తల, మొండెంగా స్పష్టంగా విభజించబడింది. తోక ఉండవచ్చు లేదా ఉండకపోవచ్చు.
  3. చర్మం నున్నగా, పొలుసులు లేకుండా (ఎపోడాకు చెందిన జీవులలో ఉంటాయి), తేమగా, గ్రంథులతో ఉంటుంది.
  4. రెండు జతల సమాన లేదా అసమాన పంచాంగుళీయక గమనాంగాలు (సిసీలియన్లలో గమనాంగాలు ఉండవు) ఉంటాయి.
  5. క్షీరదాలలోలాగా కపాలానుకందాలు డైకాండైలిక్ (ద్వికంద) రకానికి చెందుతాయి. కశేరుకాలు ఎన్యూరన్లలో పురోగర్తి (కశేరుమధ్యం పూర్వతలం మాత్రమే పుటాకారంగా ఉంటుంది). సిసీలియన్లలో ఉభయగర్తి, యూరోడీలాలో పరగర్తి – కశేరుమధ్యం పరతలం మాత్రమే (పుటాకారంగా ఉంటుంది) రకానికి చెందినవి. ఉరోస్థి మొదటిసారిగా ఉభయచరాల్లో కనిపిస్తుంది.
  6. నోరు పెద్దది. దంతాలు అగ్రదంత, సమదంత, బహువార రకానికి చెందినవి.
  7. శ్వాసవాయువుల వినిమయం ఎక్కువగా చర్మంతో జరుగుతుంది. పుప్పుస, ఆస్యగ్రసని శ్వాసక్రియలు కూడా జరుగుతాయి. జలశ్వాస (బ్రాంకియల్) శ్వాసక్రియ డింభకాలు, కొన్ని ప్రౌఢ యూరోడీలన్లలో కనిపిస్తుంది.
  8. మూడు గదుల హృదయం, సిరాసరణి, మూల మహాధమని ఉంటాయి. మూడు జతల ధమనీ చాపాలు, అభివృద్ధి చెందిన నిర్వాహక వ్యవస్థలు ఉంటాయి. ఎర్రరక్తకణాలు కేంద్రక సహితంగా ఉంటాయి.
  9. మూత్రపిండాలు మధ్యవృక్క రకానికి చెందినవి. ఇవి యూరియోటెలిక్ జీవులు.
  10. వెలుపలి పరాశిక, లోపలి మృద్వి అనే మెనింజెస్ ఉంటాయి. పది జతల కపాలనాడులు ఉంటాయి.
  11. మధ్య చెవిలో కర్ణస్తంభిక అనే ఒకేఒక శ్రవణార్థిక ఉంటుంది. ఇది చేపలలోని అధోహనువు రూపాంతరం. మొట్టమొదటిసారిగా ఉభయచరాలలో కర్ణభేరి, లాక్రిమల్, హల్దేరియన్ గ్రంథులు ఏర్పడ్డాయి.
  12. లైంగిక జీవులు వేరువేరు. సాధారణంగా బాహ్య ఫలదీకరణం జరుగుతుంది. అభివృద్ధి చాలావరకు పరోక్షంగా ఉంటుంది.
    ఉదా : బ్యూఫో (గోదురుకప్ప), రానా (కప్ప), హైలా (చెట్టుకప్ప), సాలమండ్రా (సాలమండర్), ఇక్తియోఫిస్ (ఉపాంగరహిత ఉభయచరం), రాకోఫోరస్ (ఎగిరేకప్ప).

ప్రశ్న 9.
చక్కని పటంతో కప్ప పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థను వివరించండి.
జవాబు:
AP Inter 1st Year Zoology Study Material Chapter 4 జంతు వైవిధ్యం-II కార్డేటాల క్లుప్త చరిత్ర 4
పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఒక జత పసుపురంగు అండాకార ముష్కాలు ఉంటాయి. ఇవి మూత్ర పిండాలకు, పృష్ఠ శరీర కుడ్యానికి రెండు మడతల ఆంత్రవేష్టనంతో అతకబడి ఉంటాయి. ఆంత్రవేష్టనాన్ని ముష్కయోజని అంటారు. ప్రతీ ముష్కంలో లెక్కలేనన్ని శుక్రోత్పాదక నాళికలు ఉంటాయి. ఇవి కలిసి 10-12 ఇరుకైన శుక్రనాళికలను ఏర్పరుస్తాయి. ఇవి మూత్రపిండంలోకి ప్రయాణించి బిడ్డర్ కాలువలోకి తెరుచుకొంటాయి. ఇది మూత్రనాళానికి మూత్రపిండ అడ్డుకుల్యల ద్వారా కలపబడి ఉంటుంది. ఇరువైపుల ఉన్న ‘మూత్ర జనన నాళాలు అవస్కరంలోకి తెరుచుకొంటాయి.

ప్రశ్న 10.
కప్ప ప్రత్యేక జ్ఞానాంగాల గురించి లఘుటీక రాయండి.
జవాబు:
ప్రత్యేక జ్ఞానాంగాలు :
కప్పలో స్పర్శ, రుచి, వాసన, దృష్టి, శ్రవణానికి జ్ఞానాంగాలు ఉన్నాయి. ఇందులో నేత్రాలు, లోపలి చెవి చక్కగా వ్యవస్థీకరణ చెందిన నిర్మాణాలు. మిగిలినవన్నీ నాడీ అంత్యాల చుట్టూ ఏర్పడిన కణ సమూహాలు, చర్మంలో స్పర్శకు సంబంధించిన గ్రాహకాలు ఉంటాయి. నాలుకపై ఉన్న చిన్న సూక్ష్మాంకురాలలో గల రుచిగుళికలు రుచికి తోడ్పడతాయి, ఒక జత నాసికా గదులు ఘ్రాణ అవయవాలుగా తోడ్పడతాయి.

దృష్టికి ఒక జత నేత్రాలు ఉంటాయి. ఇవి పుర్రె నేత్రకోటరంలో ఉంటాయి. నేత్రాలకు కనురెప్పలు ఉంటాయి. పై రెప్ప కదలదు. కింది రెప్ప పారదర్శక నిమేషక పటలం రూపంలో మడతపడి ఉంటుంది. ఈ పటలం కంటి ఉపరితలాన్ని పూర్తిగా కప్పే సామర్థ్యం కలిగి ఉంటుంది. కంటి నేత్రపటలంలో కడ్డీలు లేదా దండాలు, శంఖువులు ఉంటాయి. రంగుల దృశ్యానికి శంకువులు, మసక వెలుతురులో దృష్టికి కడ్డీలు తోడ్పడతాయి.

చెవులు వినికిడి, సమతుల్యతకు తోడ్పడతాయి. దీనిలో మధ్య చెవి ఉంటుంది. ఇది బాహ్యంగా పెద్ద కర్ణభేరిత్వచంతో కప్పబడి ఉంటుంది. ప్రకంపనాలను లోపలి చెవికి అందించడానికి స్తంభిక ఉంటుంది. లోపలి చెవిలోని పేటికలో మూడు అర్ధచంద్రాకార కుల్యలు ఒక చిన్న గోణిక ఉంటాయి.

AP Inter 1st Year Zoology Study Material Chapter 4 జంతు వైవిధ్యం-II: కార్డేటాల క్లుప్త చరిత్ర

ప్రశ్న 11.
సరీసృపాల బాహ్య, అంతరాస్థిపంజర ముఖ్య లక్షణాలను రాయండి.
జవాబు:
చర్మం గరుకుగా, పొడిగా ఉంటుంది. బాహ్యాస్థిపంజరంలో కొమ్ము సంబంధిత బహిస్త్వచ పొలుసులు, ఫలకాలు, నఖాలు (మొట్టమొదటగా సరీసృపాలలో ఏర్పడినవి) ఉంటాయి.

దంతవిన్యాసం అగ్రదంత, సమదంత, బహువార దంత రకాలు (మొసళ్ళలో క్షీరదాల మాదిరిగా థీకోడాంట్ దంతరకం ఉంటుంది). కిలోనియాలో దంతాలుండవు.

ఏకకంద కపాలం అనేక జీవులలో శంఖాఖాతాలు ఉంటాయి. కింది దవడ ప్రతి అర్థభాగంలో సాధారణంగా ఆరు ఎముకలు ఉంటాయి. కశేరుకాలు చాలావరకు పురోగర్తి రకానికి చెందినవి. మొదటి రెండు కశేరుకాలు శీర్షధరం, అక్ష కశేరుకంగా ప్రత్యేకత కలిగి ఉంటాయి. దీనివల్ల తల స్వతంత్రంగా మిగిలిన శరీరంతో సంబంధం లేకుండా కదలడానికి అవకాశం ఏర్పడుతుంది. రెండు త్రిక కశేరుకాలు ఉంటాయి.

ప్రశ్న 12.
సరీసృపాల విభాగంలో వర్తమాన క్రమాలను తెలపండి. ప్రతీ క్రమానికి రెండు ఉదాహరణలు ఇవ్వండి.
జవాబు:
వర్తమాన సరీసృపాలను నాలుగు క్రమాలుగా ఏర్పరచారు :
1. కిలోనియా :
కిలోన్ (సముద్ర ఆకుపచ్చ తాబేలు), టెస్టుడో (భౌమ్య తాబేలు), ట్రియోనిక్స్ (మంచినీటి తాబేలు).

2. రింకోసెఫాలియా :
స్ఫీనోడాన్ (సజీవ శిలాజం-న్యూజిలాండ్కి పరిమితమై ఉంటుంది)

3. క్రొకోడీలియ :
క్రొకోడైలస్ పాలుస్ట్రీస్ (భారతదేశం మొసలి లేదా మగర్), అలిగేటర్, గేవియాలిస్, గాంజిటికస్ (భారతదేశ గేవియాల్ లేదా ఘరియాల్)

4. స్వామేటా
ఎ) బల్లులు/తొండలు : హెమిడాక్టైలస్ (గోడబల్లి), కెమిలియాన్ (ఊసరవెల్లి), డ్రాకో (ఎగిరే బల్లి)
బి) పాములు (సర్పాలు)
1) విష సర్పాలు : నాజ నాజ (నాగుపాము), ఒఫియోఫాగస్ హన్న (రాచనాగు), బంగారస్ (కట్లపాము/క్రెయిట్), డబొయ/వైపరా రసెల్లి (గొలుసు రక్తపింజరి)
2) విషరహిత సర్పాలు : ట్యాస్ (రాట్ స్నేక్/జెర్రిగొడ్డు), ట్రోపిడోనోటస్ (నీటి పాము/నీరుకట్టె)

ప్రశ్న 13.
పక్షులలో ఎగరడానికి ఏర్పడిన అనుకూలనాలను పేర్కొనండి.
జవాబు:

  1. దేహం ఎగరటానికి అనువుగా కదురు ఆకారంలో ఉంటుంది.
  2. పూర్వాంగాలు రెక్కలుగా మార్పు చెంది ఉంటాయి.
  3. చరమాంగాలు పెద్దవిగా ఉండి దేహం బరువును మోస్తాయి. మరియు ఆహార సేకరణ, కొమ్మలను పట్టుకొనడంలో సహాయపడతాయి.
  4. దేహం ఈకలతో కప్పబడి ఉంటుంది.
  5. క్విల్ ఈకలు ఇంటర్ లాకింగ్ అమరికను కలిగి ఉంటాయి.
  6. క్విల్ ఈకలు తోక మీద ఉండి చుక్కాని వలె పనిచేస్తుంది.
  7. వీటిలో పొడవుగా ఉండే ఎముకలు వాతులాస్థులు.
  8. పరపుచ్ఛ కశేరుకాలు కలియడం వల్ల నాగలి ఆకారపు ఎముక లేదా హలాస్థి ఏర్పడుతుంది.
  9. ఉడ్డయక కండరాలు బాగా అభివృద్ధి చెంది ఉంటాయి.
  10. ఊపిరితిత్తులు స్పంజికాయుతంగా ఉంటాయి.
  11. వాయుకోశాల విస్తరణను కలిగి ఉండే వాతిలాస్థులు ఉంటాయి.

ప్రశ్న 14.
రాటిటే పక్షుల విలక్షణ లక్షణాలను తెలపండి. రెండు ఉదాహరణలు ఇవ్వండి.
జవాబు:
రాటిటే/పేలియోనేతె/ఎగరలేని పక్షులు :
ఇవి పరిగెత్తే, ఎగరలేని ఆధునిక పక్షులు. ఇవి డిప్నాయ్ (ఊపిరితిత్తి చేపలు), మార్సూపియల్స్ లాగా విచ్ఛిన్న విస్తరణను ప్రదర్శిస్తాయి. వీటిలో రెక్కలు క్షీణించి, ఉరోస్థి ద్రోణి లేకుండా తెప్పలాగా ఉంటుంది. మగ పక్షులలో మేహనం ఉంటుంది. వీటిలో శబ్దిని, జత్రుకలు మరియు ప్రీన్ గ్రంథి ఉండదు.
ఉదా : స్ట్రుతియో కామిలస్ (ఆఫ్రికన్ ఆస్ట్రిచ్), కివి (న్యూజిలాండ్ జాతీయపక్షి), రియా (అమెరికన్ ఆస్ట్రిచ్), డ్రోమియస్ (ఇము), కాసువారియస్.

ప్రశ్న 15.
క్షీరదాలలో నాడీ వ్యవస్థ, జ్ఞానాంగాల ముఖ్య లక్షణాలను పేర్కొనండి.
జవాబు:
• శరీర పరిమాణాన్ని అనుసరించి ఇతర జంతువులతో పోల్చినప్పుడు క్షీరదాలలో మెదడు పెద్దగా ఉంటుంది. నాలుగు దృష్టిలంబికలు కలిసి కార్పొరా క్వాడ్రిజెమీనాను ఏర్పరుస్తాయి. కార్పస్ కెలోసం రెండు మస్తిష్కార్ధ గోళాలను కలుపుతుంది. కేంద్రనాడీవ్యవస్థను ఆవరిస్తూ మూడు మెనింజెస్ ఉంటాయి. మధ్య మెనింజెస్ అరక్నాయిడ్ త్వచం కేవలం క్షీరదాలలో మాత్రం ఉంటుంది. 12 జతల కపాలనాడులు ఉంటాయి.

• నేత్రాలు కదిలే కనురెప్పలు, పక్ష్మాలతో ఉంటాయి. బాహ్య చెవి వెడల్పుగా, కండరయుతంగా మృదులాస్థితో ఉన్న తమ్మె లాగ ఉంటుంది. దీన్ని పిన్నా లేదా చెవిడొప్ప అంటారు. మధ్య చెవిలో మూడు కర్ణాస్థిఖండాలు ఉంటాయి. అవి కూటకం, దాగలి, కర్ణాంతరాస్థి. లోపలి చెవిలో కర్ణావర్తం మెలితిరిగి ఉంటుంది. దీనిలో శబ్ద గ్రాహకం, కోర్టి అవయవం ఉంటుంది.

AP Inter 1st Year Zoology Study Material Chapter 4 జంతు వైవిధ్యం-II: కార్డేటాల క్లుప్త చరిత్ర

ప్రశ్న 16.
యూథీరియన్ల కింది లక్షణాల గురించి క్లుప్తంగా రాయండి.
ఎ) దంత విన్యాసం బి) అంతరాస్థి పంజరం.
జవాబు:
ఎ) అంతరాస్థి పంజరము :
పుర్రె డైకాండైలిక్ (ద్వికంద) రకానికి చెందింది. ప్రతి కింది దవడ అర్ధభాగంలో దంతాస్థి (డెంటరీ) అనే ఒకే ఎముక ఉంటుంది. చాలావరకు క్షీరదాలలో ఏడు గ్రీవకశేరుకాలు ఉంటాయి. కొలియోపస్ (రెండు కాలివేళ్ల స్లాత్), ట్రెకికస్ (మనాటి) లలో ఆరు, బ్రాడిపస్ (మూడు కాలివేళ్ళ స్లాత్) లో తొమ్మిది గ్రీవ కశేరుకాలు ఉంటాయి. రెండు నుంచి ఐదు త్రికకశేరుకాలు ఉంటాయి. కశేరుకాలు ఉభయ సమతల రకానికి చెందినవి (కశేరుమధ్యం రెండు తలాలు చదునుగా ఉంటాయి). పర్శుకలు రెండు శీర్షాలతో ఉంటాయి.

బి) దంత విన్యాసము :
నాసికా కుహరం ఆస్యకుహరం నుంచి ద్వితీయ అంగిలిచే వేరు చేయబడుతుంది. దంతాలు ఢీకోడాంట్, విషమదంత, ద్వివారదంత రకాలు. ఆస్యకుహరంలో 4 జతల లాలాజల గ్రంథులు ఉంటాయి. (మానవులలో మూడు జతలు).

ప్రశ్న 17.
కింది వాటికి ఉదాహరణలు ఇవ్వండి.
ఎ) శిశూత్పాదక చేప
బి) విద్యుత్ అవయవాలు గల చేప
సి) విషపుకొండి గల చేప,
డి) చేప నీటిలో తేలియాడటాన్ని క్రమపరచడానికి దాని శరీరంలోని అవయవం
ఇ) క్షీరగ్రంథులు గల అండోత్పాదక జంతువు.
జవాబు:
ఎ) స్కోలియోడాన్ (సొరచేప)
బి) టార్పిడో (విద్యుత్ చేప)
సి) డాసియాటిస్/టైగాన్
డి) అద్వంద్వ వాజాలు చేప నీటిలో తేలియాడటానికి సహాయపడును (పృష్ఠవాజము, ఉదరవాజము)
ఇ) ఆర్నితోరింకస్ (బాతు ముక్కు ప్లాటిపస్)

ప్రశ్న 18.
కింది వాటిలో రెండు పోలికలు రాయండి.
ఎ) పక్షులు, క్షీరదాలు బి) కప్ప, మొసలి సి) బల్లి, పాము
జవాబు:
ఎ) 1. ఉష్ణ రక్తప్రాణులు
2. 12 జతల కపాలనాడులు

బి) 1. శీతల రక్తప్రాణులు
2. పూర్వాంగములు చర్మాంగములకంటే పొట్టిగా ఉండును
3. అండోత్పాదక జీవులు
4. వ్రేళ్ళు మధ్య అంతరాంగజాలము ఉండును.

సి) 1. ఒక జత హేమిపెనిస్ ఉండును.
2. జాకోబ్సన్ అవయవము ఉండును.

ప్రశ్న 19.
కింది జంతువుల పేర్లు రాయండి.
ఎ) అంగవిహీన ఉభయచరం,
బి) సజీవ జంతువులలో అతిపెద్ద జంతువు
సి) పొడి, కార్నిఫైడ్ చర్మం గల జంతువు,
డి) భారతదేశ జాతీయ జంతువు
జవాబు:
ఎ) ఇస్తియోపిస్,
బి) నీలి తిమింగలం (బెలనాప్టిరా మస్కులస్)
సి) పొడి, కార్నిపైడ్ చర్మంగల జంతువులు-సర్పములు, బల్లులు,
డి) పాంగెరా టైగ్రిస్ (పులి)

AP Inter 1st Year Zoology Study Material Chapter 4 జంతు వైవిధ్యం-II: కార్డేటాల క్లుప్త చరిత్ర

ప్రశ్న 20.
కింది జంతువుల ప్రజాతులను తెలపండి.
ఎ) అండోత్పాదక క్షీరదం,
బి) ఎగిరే నక్క,
సి) నీలి తిమింగలం,
డి) కంగారు.
జవాబు:
ఎ) ఆర్నితోరింకస్,
బి) టిరోపస్,
సి) బెలనాప్టెరా,
డి) మాక్రోఫస్

AP Inter 1st Year Botany Study Material Chapter 10 జీవ అణువులు

Andhra Pradesh BIEAP AP Inter 1st Year Botany Study Material 10th Lesson జీవ అణువులు Textbook Questions and Answers.

AP Inter 1st Year Botany Study Material 10th Lesson జీవ అణువులు

అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ఔషధాలు కృత్రిమంగాగానీ, మొక్కలు, బాక్టీరియా, జంతువులు మొదలైన వాటినుంచి గానీ (సహజసిద్ధమైన ఉత్పన్నాలు) తయారవుతాయి. కొన్ని సమయాల్లో సహజ ఉత్పన్నాల విషప్రభావాన్ని (side effects) తగ్గించటానికి రసాయనికంగా మార్పులు జరుపుతారు.
ఈ క్రిందివానిలో ఏవి సహజమైనవో, ఏవి కృత్రిమంగా తయారు చేయబడినవో తెల్పండి.
a) పెన్సిలిన్ …………….
b) సల్ఫోనమైడ్ …………….
c) విటమిన్ సి …………….
d) పెరుగుదల హార్మోన్లు …………….
జవాబు:
a) పెన్సిలిన్ – సహజ ఉత్పత్తి
b) సల్ఫోనమైడ్ – కృత్రిమ ఉత్పత్తి
c) విటమిన్ సి – సహజ ఉత్పత్తి
d) పెరుగుదల హార్మోన్లు – సహజ ఉత్పత్తి

ప్రశ్న 2.
దిగువనిచ్చిన పదార్థాలలో ఎస్టర్ బంధం, గ్లైకోసైడిక్ బంధం, పెప్టైడ్ బంధం, హైడ్రోజన్ బంధాలను గుర్తించండి.
a) పాలీశాఖరైడ్లు …………….
b) ప్రోటీనులు …………….
c) కొవ్వులు …………….
d) నీరు …………….
జవాబు:
a) పాలీశాఖరైడ్లు – గ్లైకోసైడిక్ బంధము
b) ప్రోటీనులు – పెప్టైడ్ బంధము
c) కొవ్వులు – ఎస్టర్ బందము
d) నీరు – హైడ్రోజన్ బందము

ప్రశ్న 3.
అమైనో ఆమ్లాలు, చక్కెరలు, న్యూక్లియోటైడ్లు, కొవ్వు ఆమ్లాలకు ఒక్కొక్క ఉదాహరణ నివ్వండి.
జవాబు:
a) అమైనో ఆమ్లాలు – గ్లైసిన్, అలనిన్
b) చక్కెరలు – గ్లూకోస్, రైబోస్
c) న్యూక్లియోటైడ్లు – ఎడినైలిక్ ఆమ్లము
d) కొవ్వు ఆమ్లాలు – గ్లిసరాల్, లెసిథిన్

ప్రశ్న 4.
అమైనో ఆమ్లం యొక్క జ్విట్టర్ అయాన్ రూపాన్ని వివరించండి. [Mar. ’14]
జవాబు:
ఒక నిర్దిష్ట PH వద్ద అమైనో ఆమ్లము ధనాత్మక ఋణాత్మక విలువలను సమాన సంఖ్యలో కలిగి ఉంటుంది. ఇది ద్విద్రువం వలె కనిపిస్తుంది. దీనిని జ్విట్టర్ అయాను రూపము అంటారు.
AP Inter 1st Year Botany Study Material Chapter 10 జీవ అణువులు 1

ప్రశ్న 5.
DNA లోని ఏ ఘటకాలు గ్లైకోసైడిక్ బంధాన్ని చూపిస్తాయి.
జవాబు:
ప్రక్కప్రక్కన ఉండే చక్కెర అణువులలోని కార్బన్ల మధ్య ఉండే బంధము – గ్లైకోసైడిక్ బంధము

AP Inter 1st Year Botany Study Material Chapter 10 జీవ అణువులు

ప్రశ్న 6.
గ్లెసిన్, అలానిన్లు వాటి (or) కార్బన్లోని ప్రతిక్షేపకాలననుసరించి వేర్వేరుగా ఉంటాయి. రెంటిలో ఉండే ప్రతిక్షేపక గ్రూపులేవి?
జవాబు:
హైడ్రోజన్, కార్బాక్సిల్ సముదాయము, అమైనో సముదాయము మరియు ‘R’ సమూహము.

ప్రశ్న 7.
స్టార్చ్, (పిండి పదార్థాలు), సెల్యూలోస్, గ్లైకోజన్, కైటిన్ అనే పాలిశాఖరైడ్లను ఈ కింది వాటితో జతపరచండి.
a) నూలుపోగు ………….
b) బొద్దింక ఎక్సోస్కెలిటిన్ ………….
c) కాలేయం ………….
d) తొక్కతీసిన బంగాళదుంప ………….
జవాబు:
a) నూలుపోగు – సెల్యూలోస్
b) బొద్దింక ఎక్సోస్కెలిటిన్ – కైటిన్
c) కాలేయం – గ్లైకోజన్
d) తొక్కతీసిన బంగాళదుంప – స్టార్చ్ (పిండి)

ప్రశ్న 8.
ప్రాథమికద్వితియ జీవ క్రియోత్పన్నాలు అంటే ఏమిటి? ఉదాహరణలు ఇవ్వండి.
జవాబు:
ప్రాథమిక జీవ క్రియోత్పన్నాలు: జీవులలో గుర్తించదగిన విధాలు కలిగి, శరీర ధర్మ శాస్త్ర విధానాల్లో పాత్ర కలిగిన జీవక్రియోత్పన్నాలును ప్రాథమిక జీవ క్రియోత్పన్నాలు అంటారు.
ఉదా : ఉదజని, కర్బనం, ఆక్సిజన్, నత్రజని మొదలగునవి.

ద్వితీయ జీవ క్రియోత్పన్నాలు : జీవులలో చెప్పుకోదగిన విధాలు లేని జీవ క్రియోత్పన్నాలను ద్వితియ జీవ క్రియోత్పన్నాలు అంటారు.
ఉదా : ఆల్కలాయిడ్లు, ఫావనాయిడ్లు, రబ్బర్లు, జిగురు పదార్థాలు.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
పాలిశాఖరైడ్ల గురించి క్లుప్తంగా వ్రాయండి.
జవాబు:
పాలిశాఖరైడ్లు చక్కెరలతో ఏర్పడిన పొడవైన గొలుసు లేదా శృంఖలాలు. ఉదా : పత్తిదారం, సెల్యులోస్ మొదలగునవి. సెల్యులోస్ ఒక సమజాతీయ బహ్వణువు. ఇది ఒకే రకమైన మోనోశాఖరైడు (గ్లూకోజ్) తో ఏర్పడతాయి. సెల్యులోజ్ రూపాంతరమైన స్టార్స్ మొక్కల కణజాలాల్లోకి శక్తి మూలాధారంగా ఉంటుంది. మొక్కల కణత్వచాలు సెల్యుజోజుతో నిర్మితమై ఉంటాయి. ప్రకృతిలో ఇంకా ఎక్కువ సంక్లిష్ట పాలిశాఖరైడ్లు కలవు. ఆర్థోపోడ్ ల బాహ్య అస్థిపంజరంలోనూ, శిలింధ్రాల కణత్వచాల్లోను కైటిన్ అనే సంక్లిష్ట విషమ బహ్వణువు పాలిశాఖరైడ్లుంటాయి. ఇన్యులిన్ అనేది ఫ్రక్టోజ్ యొక్క పాలిశాఖరైడు. బాక్టీరియా కణవచంలో పెప్టిడోగ్లైకాన్ అనే బహ్వణువు గ్లూకోజమైన్ N – సిటైల్గా లక్టోజమైన్లను కలిగి ఉంటుంది. ఇది అమైనో చక్కెరలు పాలిశాఖరైడుకు ఉదాహరణగా చెప్పవచ్చు.

ప్రశ్న 2.
ప్రోటీన్ని ఉదాహరణ చేసుకొని దాని పరికల్పనాత్మక (hypothetical) ప్రాథమిక, ద్వితీయ, తృతీయ నిర్మాణాలను పటాల ద్వారా సూచించండి.
జవాబు:
ప్రోటీన్లు సన్నని దారం రూపంలో అమరిన అమైనో ఆమ్లాలు కలిగిన విషమ పాలిమర్లు. ప్రోటీన్లులో ఏ అమైనో ఆమ్లము మొదటిది, ఏది రెండవది అనే సమాచారాన్ని ప్రోటీను ప్రాథమిక నిర్మాణము అంటారు. ఒక ప్రోటీనును ఒక గీతిగా ఊహిస్తే ఎడమ కొనను మొదటి అమైనోఆమ్లాన్ని కలిగినదిగాను, కుడికొనను అంత్య అమైనోఆమ్లాన్ని కలిగినదిగాను సూచిస్తారు. మొదటి అమైనోఆమ్లాన్ని N – కొన అని, ఆఖరి అమైనో ఆమ్లాన్ని C – కొన అంటారు. ప్రోటీన్లులలో కుడివైపు సర్పిలాలనే గమనించారు. ప్రోటీను పోగులోని మిగిలిన ప్రాంతాలలో వేర్వేరు విధాలుగా మడతలు పడి ఉంటుంది. దీని ద్వితీయ నిర్మాణం అంటారు. పొడవైన ప్రోటీను గొలుసు దాని మీద అదే మడతలు పడి ఒక డొల్లగా ఉన్న ఊలు బంతివలె ఉంటె దానిని తృతీయ నిర్మాణం అంటారు. దీని వల్ల ప్రోటీన్లుకు ఒక త్రిమితీయ రూపం వస్తుంది.

AP Inter 1st Year Botany Study Material Chapter 10 జీవ అణువులు 2
AP Inter 1st Year Botany Study Material Chapter 10 జీవ అణువులు 3

AP Inter 1st Year Botany Study Material Chapter 10 జీవ అణువులు

ప్రశ్న 3.
కేంద్రకామ్లం ద్వితీయ నిర్మాణాన్ని ప్రదర్శిస్తుంది. సోదాహరణంగా సమర్థించండి.
జవాబు:
కేంద్రకామ్లాలు ద్వితీయ నిర్మాణాన్ని ప్రదర్శిస్తాయి. ఉదా : వాట్సన్ – క్రిక్ నమూనా DNA ప్రదర్శించే ఒక ద్వితీయ నిర్మాణము. దీని ప్రకారం DNA ద్విసర్పిలాకారంలో ఉంటుంది. పాలిన్యూక్లియోటైడ్ లు కల ఈ రెండు పోచలు వ్యతిరేక దిశలలో సమాంతరంగా ఉంటాయి. చక్కెర – ఫాస్పేట్ – చక్కెర గొలుసు కేంద్ర కామ్లాలలో వెన్నెముక వలె ఉంటుంది. నత్రజని క్షారాలు వెన్నెముకకు లంబంగా లోపలి వైపుకు ప్రక్షేపించబడి ఉంటాయి. ఒకపోచలోని ఎడినిన్ (A) గ్వానిన్ (G) లు వరుసగా రెండవ పోచలోని థైమిన్ (T) సైటోసిన్ (C) తో బంధాలు కలిగి ఉంటాయి. A-T ల మధ్య రెండు ఉదజని బంధాలు, G – C ల మధ్య 3 ఉదజని బంధాలు ఉంటాయి. ప్రతి ఒక్కపోచ సర్పిలాకార మేడమెట్లును పోలి ఉంటుంది. ప్రతి ఆరోహణ మెట్టు ఒక జతనత్రజని క్షారాలను కలిగి 36° కోణాన్ని చూపుతుంది. ద్విసర్పిలంలోని ఒక పూర్తి మెలికకు పదిమెట్లు లేదా పదిజతల నత్రజని క్షారాలు ఉంటాయి. ఒక మెలిక నిడివి 34 A° నత్రజని క్షారాల జతల మధ్య దూరము 3.4 A° ఉంటుంది. ఈ రకమైన DNA ను B – DNA అంటారు.
AP Inter 1st Year Botany Study Material Chapter 10 జీవ అణువులు 4

దీర్ఘ సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ద్వితీయ జీవనక్రియోత్పన్నాలంటే ఏమిటి? అవి మానవునికి ఏవి ఏవిధంగా ఉపయోగపడతాయో తెలపండి.
జవాబు:
అతిథేయిలో చెప్పుకోదగ్గ విదులులేవి జీవక్రియ ఉత్పన్నాలను ద్వితీయ జీవక్రియోత్పన్నాలు అంటారు. ఉదా : ఆల్కలాయిడ్లు, ఫ్లావనాయిడ్లు, రబ్బరు, ఆవశ్యక నూనెలు, ఆంటిబయోటిక్స్, వర్ణద్రవ్యాలు, అత్తర్లు, జిగురులు, సుగంధ ద్రవ్యాలు.

1) ఆల్కలాయిడ్లు :
ఇవి సేంద్రియ నత్రజని సంయోగ పదార్థాలు. జీవన క్రియల ఫలితంగా అమైనో ఆమ్లాల నుండి ద్వితీయ పదార్థాలుగా ఏర్పడతాయి. వీటిని ద్రవరూప ఔషదాలు తయారీలోను, విష పదార్థాలలో వాడతారు. పురాతన కాలంలో మొక్కల నుండి లభించే ఆల్కలాయిడ్లను పాముకాటుకు విరుగుడుగా, జ్వరము నివారణకు వాడేవారు.

2) ప్లావనాయిడ్లు :
రెండు బెంజీన్ వలయాలు, పైరేన్ వలయంచే కలుపబడి ఉన్న ఫీనాలిక్ గ్లైకోసైడులను ప్లావనాయిడ్లు అంటారు. ఇవి మొక్కల ఆకులు, పుష్పాలు, ఫలాలలో ఉంటాయి. వీటిని కాన్సర్ నివారణలో, వైరస్ వ్యాధుల నివారణకు, వాపుల నివారణకు వాడతారు. వీటిని మానవ రక్త ఫలకికల సమూహం ఏర్పడకుండా వాడతారు.

3) రబ్బరు :
శుద్ధిచేయని రబ్బరును సిమెంట్ పరిశ్రమలలో ఇన్సులేటింగ్ టేపుల తయారీలోను వాడతారు. రబ్బరుకు సాగే గుణం, నమ్యత ఉండుట వల్ల వీటిని రబ్బరు పైపులు, టైరులు తయారీలో వాడతారు. దీని సాగే గుణమును వివిధ ఘాతశోషకాలలో ఉపయోగిస్తారు. ఇది వాయువులకు అపార గమ్యంగా ఉంటుంది. దీనిని రబ్బరు పైపులు, బెలూన్లు, బంతులు, కుషన్ల తయారీలో వాడతారు.

సుగంధతైలాలు :
జల విరోది ద్రావణీయత కల ఆవిరి అయ్యే నూనెలు. వీటిలో ముఖ్యమైనవి.
a) కొత్తిమీర నుండి తీసిన తైలమును నొప్పుల నివారణకు అజీర్ణ వ్యాధి నివారణకు వాడతారు.
b) మందారిన్ తైలమును కాలి పగుళ్ళు నివారణకు మచ్చల నివారణకు వాడతారు.
c) లావెండర్ తైలమును అస్మా నివారణలో, తలనొప్పి చెవినొప్పి నివారణలో వాడతారు.

సూక్ష్మజీవ నాశకాలు :
వ్యాధి జనక జీవులను నాశనం చేసే సహజ రసాయనాలు. అతిథేయిపై ఏవిధమైన ప్రభావం చూపకుండా వ్యాధిని కలుగచేయు బాక్టీరియా వంటి క్రిములను నాశనం చేస్తాయి. ఉదా : స్ట్రెప్టోమైసిన్ – స్ట్రెప్టోమైసిస్ గ్రీనియస్ నుండి లభిస్తుంది.

సుగంధద్రవ్యాలు :
ఇంగువ, యాలకులు, దాల్చినచెక్క ముఖ్యమైనవి. ఇంగువ దగ్గు నివారణకు, కడుపునొప్పి నివారణకు వాడతారు. యాలకులు నోటి దుర్వాసన పోగొట్టటానికి చక్కెరవ్యాధి నివారణలో వాడతారు. లవంగాలు పంటినొప్పి నివారణకు, జలుబు, దగ్గు నివారణకు వాడతారు.

AP Inter 1st Year Botany Study Material Chapter 10 జీవ అణువులు

ప్రశ్న 2.
మూలకాల సంఘటకాలను, జీవకణ సముదాయాల్లోని కర్బన అకర్బన ఘటకాలను ఏ విధమైన పద్ధతుల ద్వారా విశ్లేషిస్తారు? జీవ కణజాలాల్లో అత్యధిక సమృద్ధిగాగల ఘటకాల అనుమతి లేమిటి? సరైన దత్తాంశాలతో అనుమతులను సమర్థించండి.
జవాబు:
ఒక సజీవ కణజాలము (ఒక కూరగాయ లేదా కాలేయపు బాగము) తీసుకుని ట్రైక్లోరో ఎసిటిక్ ఆమ్లముతో, రోకలి, కల్వం సహాయంతో నూరినప్పుడు ఒక చిక్కని ద్రవం తయారవుతుంది. దీనిని వడగట్టే గుడ్డతో వడబోసినప్పుడు రెండు బాగాలు లభిస్తాయి.
1) వడబోసిన లేదా ఆమ్లం కరగ గల బాగము.
2) అవశేషము లేదా ఆమ్లంలో కరగని భాగము ఆమ్ల ద్రావణీయత భాగంలో వేలాది కర్బన సంయోగ పదార్థాలు కనుగొన్నారు. సజీవ కణజాలమునుంచి లభ్యమయ్యే అన్ని కర్బన సమ్మేళనాలను జీవాణువులు అంటారు.

ఒక జీవకణ సముదాయాన్ని (ఒక పత్రం లేదా కాలేయపు ముక్క) తీసుకొని, తూచి తడి బరువు తీసుకుని, దానిని నీరు ఆవిరి అయ్యేంతవరకు ఎండబెట్టాలి. ఈ మిగిలిన పదార్థపు బరువును పొడి బరువు అంటారు. ఈ కణజాలాన్ని కాల్చినప్పుడు అందులో ఉండే కర్బన సమ్మేళనాలన్ని (co, నీటిఆవిరి) ఆక్సీకరణం చెంది వాయురూపంలో తొలగిపోతాయి. ఈ రకంగా మిగిలిన దానిని బూడిద అంటారు. ఈ బూడిదలో అకర్బన మూలకాలైన సోడియం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం ఉంటాయి. ఆమ్లంలో కరిగే భాగంలో సల్ఫేట్, ఫాస్ఫేట్ వంటి సమ్మేళనాలు ఉంటాయి. కావున జీవ కణజాలాలు మూలక విశ్లేషణలో ఉదజని, ఆమ్లజని, కర్బనము క్లోరిన్ మొదలైన రూపాల్లో మూలకాల సంఘటన సమ్మేళనాల విశ్లేషణలో ఎటువంటి కర్బన, అకర్బన పదార్థాలు ఉన్నాయో తెల్సుకోవచ్చు జీవకణజాలాల్లో ఉదజని, కర్బనము అత్యధిక సమృద్ధిగా ఉంటాయి. 0.5, కర్బనము
ఉదా : ఉదజని = 0.5, = 18.5

ప్రశ్న 3.
కేంద్రకామ్లాలు ద్వితీయ నిర్మాణాన్ని ప్రదర్శిస్తాయి. వాట్సన్, క్రిక్ నమూనా ద్వారా వివరించండి.
జవాబు:
కేంద్రకామ్లాలు ద్వితీయ నిర్మాణాన్ని ప్రదర్శిస్తాయి. ఉదా : వాట్సన్ – క్రిక్ నమూనా DNA ప్రదర్శించే ఒక ద్వితీయ నిర్మాణము. దీని ప్రకారం DNA ద్విసర్పిలాకారంలో ఉంటుంది. పాలిన్యూక్లియోటైడ్ లు కల ఈ రెండు పోచలు వ్యతిరేక దిశలలో సమాంతరంగా ఉంటాయి. చక్కెర – ఫాస్పేట్ – చక్కెర గొలుసు కేంద్ర కామ్లాలలో వెన్నెముక వలె ఉంటుంది. నత్రజని క్షారాలు వెన్నెముకకు లంబంగా లోపలి వైపుకు ప్రక్షేపించబడి ఉంటాయి. ఒకపోచలోని ఎడినిన్ (A) గ్వానిన్ (G) లు వరుసగా రెండవ పోచలోని థైమిన్ (T) సైటోసిన్ (C) తో బంధాలు కలిగి ఉంటాయి. A-T ల మధ్య రెండు ఉదజని బంధాలు, G – C ల మధ్య 3 ఉదజని బంధాలు ఉంటాయి. ప్రతి ఒక్కపోచ సర్పిలాకార మేడమెట్లును పోలి ఉంటుంది. ప్రతి ఆరోహణ మెట్టు ఒక జతనత్రజని క్షారాలను కలిగి 36° కోణాన్ని చూపుతుంది. ద్విసర్పిలంలోని ఒక పూర్తి మెలికకు పదిమెట్లు లేదా పదిజతల నత్రజని క్షారాలు ఉంటాయి. ఒక మెలిక నిడివి 34 A° నత్రజని క్షారాల జతల మధ్య దూరము 3.4 A° ఉంటుంది. ఈ రకమైన DNA ను B – DNA అంటారు.
AP Inter 1st Year Botany Study Material Chapter 10 జీవ అణువులు 5

ప్రశ్న 4.
న్యూక్లియోటైడ్, న్యూక్లియోసైడ్కు గల భేదమేమి? రెండేసి ఉదాహరణలతో వాటి నిర్మాణాలను తెలపండి.
జవాబు:
AP Inter 1st Year Botany Study Material Chapter 10 జీవ అణువులు 6

ప్రశ్న 5.
వివిధ లిపిడ్ల రూపాలను సోదాహరణంగా వివరించండి.
జవాబు:
లిపిడ్లు సాదారణంగా నీటిలో కరగవు. ఇవి కొవ్వులు, కొవ్వు ఆమ్లాలు, నూనెలు, ట్రైగ్లిసరైడ్లు, ఫాస్ఫోలిపిడ్లు, స్టిరాయిడ్లు మరియు మైనం రూపాలలో ఉంటాయి.

ఒక ఫాటీ ఆమ్లంలో R సమూహాన్ని అతుక్కుని ఒక కార్బాక్సిల్ సమూహం ఉంటుంది. R సమూహం మిథైల్, ఇథైల్ లేదా అంతకంటే ఎక్కువ – CH2 సముదాయాలను కలిగి ఉండవచ్చు.
ఉదా : పామిటిక్ ఆమ్లములో కార్బోక్సిల్ కార్బను కలుపుకొని 16 కార్బన్లు ఉంటాయి. కొవ్వు ఆమ్లాలు సంతృప్తమైనవిగాను లేదా అసంతృప్తమైనవిగాను ఉంటాయి.

గ్లైకోలిపిడ్లు :
చాలా లిపిడ్లు కొవ్వు ఆమ్లాలను, గ్లిసరాల్ను కలిగి ఉంటాయి. కొవ్వు ఆమ్లాలు గ్లిసరాల్తో కలిసి ఎస్టర్ రూపంలో ఉంటాయి. ఆ రకంగా అవి మోనోగ్లిసరైడ్లు, డైగ్లిసరైడ్లు, ట్రైగ్లిసరైడ్లుగా ఉంటాయి.

ఫాస్ఫోలిపిడ్లు :
కొన్ని లిపిడ్లు ఫాస్పరస్ను, ఫాస్ఫారిలేటెడ్ కర్బన సమ్మేళనాన్ని గాని కలిగి ఉంటాయి. ఇవి కణత్వచంలో ఉంటాయి. నాడీకణజాలాలు ఎక్కువ సంక్లిష్టమైన నిర్మాణాలు గల లిపిడ్లను కలిగి ఉంటాయి.

Intext Question and Answers

ప్రశ్న 1.
బృహదణువులంటే ఏమిటి? ఉదాహరణలివ్వండి.
జవాబు:
ఆమ్ల అద్రావణీయ బాగాలలోని, ఎక్కువ అణుబారం కల స్థూల అణువులను బృహదణువులు అంటారు.
ఉదా : పోలీశాఖ రైడ్లు, కేంద్రకామ్లాలు

ప్రశ్న 2.
గ్లైకోసైడిక్, పెప్టైడ్, ఫాస్ఫోడైఎస్టర్ బంధాలను పటాలలో విశదీకరించండి.
జవాబు:
గ్లైకోసైడిక్ బంధము :
ప్రక్కప్రక్కన ఉండే చక్కెర అణువులలోని కార్బన్ల మధ్య ఉండే రసాయన బంధం.

పెప్టైడ్ బంధము :
ప్రోటీనులోని అమైనో ఆమ్లాల మధ్య ఉన్న బంధము

ఫాస్పోడై ఎస్టర్ బంధము :
ఫాస్ఫేట్ అణువు చక్కెరలోని హైడ్రాక్సిల్ గ్రూప్ మద్యకాల బంధమును ఎస్టర్ బంధం అంటారు. ఫాస్పేటి కిరువైపులా ఉన్న ఒక్కొక్కొ ఎస్టర్ బంధంను ఫాస్ఫోడై ఎస్టర్ బంధం అంటారు.

ప్రశ్న 3.
ప్రోటీన్ల తృతీయ నిర్మాణాన్ని తెలపండి.
జవాబు:
పొడవైన ప్రోటీను గొలుసు దానిమీద అదే ముడతలు పడి ఒక డొల్లగా ఉన్న ఊలు బంతిలాంటి తృతీయ నిర్మాణంగా ఏర్పడుతుంది. దీనివల్ల ప్రోటీనుకు ఒక త్రిమితీయ రూపం వస్తుంది. ఇది ఎన్నో జీవక్రియలకు అవసరము.

ప్రశ్న 4.
అల్ప అణుభారం కలిగిన 10 ఆసక్తికరమైన జీవాణువుల నిర్మాణాన్ని తెలపండి. వేరుచేసే పద్ధతుల ద్వారా వాటిని తయారు చేసే పరిశ్రమలుంటే తెలపండి. వాటిని కొనేదెవరో తెలుసుకోండి.
జవాబు:
అమైనో ఆమ్లాలు, మోనోశాఖరైడ్లు, డై శాఖరైడ్లు, చక్కెరలు, ఫాటీ ఆమ్లాలు, గ్లిసరాల్, న్యూక్లియోటైడ్లు, నత్రజని క్షారాలు.

ప్రశ్న 5.
ప్రోటీన్లకు ప్రాథమిక నిర్మాణం కలదు. మీకు ఏ అమైనో ఆమ్లం ఏ కొనలో ఉందో తెలిపితే, ఈ సమాచారంతో ప్రోటీను యొక్క శుద్ధత గాని సమ జాతీయతను గాని తెలుసుకోగలరా?
జవాబు:
ప్రోటీన్లు అమైనో ఆమ్లాలు కలిగిన విషమ పాలీమర్లు. ప్రోటీన్లలో ఏ అమైనోఆమ్లం మొదటిది, ఏది రెండవది అనే
సమాచారాన్ని ప్రాధమిక నిర్మాణం అంటారు. ఒక ప్రోటీనును ఒకే గీతిగా ఊహిస్తే ఎడమకొనను మొదటి అమైనో ఆమ్లం కలిగినదిగాను (N – కొన), కుడికొనను అంత్య అమైనో ఆమ్లము కలిగినదిగాను (C – కొన) సూచిస్తారు. ఈ సమాచారం ప్రకారం ప్రోటీను యొక్క శుద్ధతి గాని, సమజాతీయతకాని తెలుసుకోలేము.
ఉదా : అనేక ప్రోటీనులు మిథియోనైన్ అను అమైనో ఆమ్లంతో మొదలవుతాయి, కాని అవి ప్రోటీన్లుకు సమజాతీయంకాదు.

AP Inter 1st Year Botany Study Material Chapter 10 జీవ అణువులు

ప్రశ్న 6.
చికిత్సకుపకరించే ప్రోటీన్ల జాబితాను తయారుచేయండి. ప్రోటీన్ల (సౌందర్యసాధనాల) లాంటి ఉపయోగాలను తెలపండి.
జవాబు:
ఎరిథ్రో ప్రోటీన్లు, మోనోక్లోనల్ ఆంటీబాడీలు, ఇంటర్ఫెరాన్లు థ్రాంబిన్, ఫైబ్రినోజన్, ఆంటిజెన్, ఇన్సులిన్, రెనిన్, ప్రోటీనులను సౌందర్యపోషకాల తయారీలో, టాక్సిన్లు, జీవక్రియా బఫర్లు తయారీలో వాడతారు.

ప్రశ్న 7.
ట్రైగ్లిసరైడు సంఘటనాన్ని వివరించండి.
జవాబు:
ట్రైగ్లిసరైడ్లు మూడు మూలకాలతో ఏర్పడతాయి. అవి కార్బన్ ఉదజని, ఆమ్లజని, వీటిలో కార్బన్, ఉదజని ఎక్కువగాను ఆమ్లజని తక్కువగాను ఉంటాయి. ట్రైగ్లిసరైడ్లు 4 మూలభాగాలతో ఏర్పడతాయి. అవి 1) గ్లిసరాల్ అణువు, 2) కొవ్వు ఆమ్లాలు గ్లిసరాల్ 3 కర్బన పరమాణువులు 5 అణువు కొవ్వు ఆమ్లాలు కర్బన, ఉదజని గొలుసులు కలిగి, ఒక కొనలో 0, ను కలిగిఉంటాయి.

ప్రశ్న 8.
ప్రోటీన్ల అవగాహననుసరించి పాలు, పెరుగుగా మారేటప్పుడు ఏమి జరుగుతుందో తెలపండి.
జవాబు:
పాలలో ఉన్న ఎంజైమ్లు లాక్టోజెనన్ను లాక్టిక్ ఆమ్లముగా మారుస్తాయి. దీనివల్ల పాల PH విలువ తగ్గి పాలు-పెరుగుగా మారుతుంది.

ప్రశ్న 9.
అలనిన్ అనే అమైనోఆమ్ల నిర్మాణాన్ని చూపండి.
జవాబు:
AP Inter 1st Year Botany Study Material Chapter 10 జీవ అణువులు 7

ప్రశ్న 10.
జిగురు పదార్థాలు దేనినుంచి తయారవుతాయి? ఫెవికాల్ వేరుగా ఉంటుందా?
జవాబు:
జిగురులు, మొక్కల లేటెక్స్ నుండి లభిస్తాయి. ఇది రెసిన్లు హైడ్రోకార్బన్లతో ఉంటాయి. జిగురులు విషమ పాలీశాఖరైడ్లు. ఫెవికాల్ పాలీవినైల్ ఆల్కాహాలు. దీనిలో పాలీ శాఖరైడ్లు ఉండవు. కావున జిగురులు, ఫెవికాల్ వేర్వేరు పదార్థాలు.

AP Inter 1st Year Zoology Study Material Chapter 6 మానవ సంక్షేమంలో జీవశాస్త్రం

Andhra Pradesh BIEAP AP Inter 1st Year Zoology Study Material 6th Lesson మానవ సంక్షేమంలో జీవశాస్త్రం Textbook Questions and Answers.

AP Inter 1st Year Zoology Study Material 6th Lesson మానవ సంక్షేమంలో జీవశాస్త్రం

అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
పరాన్న జీవనాన్ని నిర్వచించి, వివరించండి.
జవాబు:
రెండు వేరువేరు జాతులకు చెందిన జీవుల మధ్య గల ఒక రకమైన సహవాసంలో ఒక జీవి రెండవ దానికి తీవ్రంగా నష్టం కలిగిస్తూ లేదా ఎటువంటి నష్టం లేకుండా తాను లాభం పొందుతూ జీవించడాన్ని పరాన్న జీవనం అంటారు.
ఉదా : మానవ దేహంలో నివసించే ఎంటమీబా హిస్టాలిటికా. చెదపురుగు జీర్ణవ్యవస్థలో నివసించే ట్రెకోనింఫా.

ప్రశ్న 2.
వాహకం, ఆశయ అతిథేయి మధ్యగల భేదాన్ని గుర్తించండి.
జవాబు:
వాహకం :
పరాన్నజీవుల సాంక్రమిక దశలను ముఖ్య అతిథేయి నుంచి వేరొక అతిథేయికి చేరవేసే జీవిని వాహకం (vector) అంటారు.
ఉదా : ఈగలు, బొద్దింకలు

ఆశయ అతిథేయి :
ముఖ్య అతిథేయి దొరకనప్పుడు పరాన్నజీవుల సంక్రమణ దశలకు ఆశ్రయం కల్పించే అతిథేయిలను ఆశ్రయాతిథేయి అంటారు. వీటిలో పరాన్నజీవులు అభివృద్ధి చెందవు, వ్యాధులను కలిగించవు. ఉదా : ప్లాస్మోడియంకు కోతి.

ప్రశ్న 3.
యాంత్రిక వాహనం, జీవసంబంధ వాహకం మధ్య ఉండే భేదాన్ని గుర్తించండి.
జవాబు:
యాంత్రిక వాహనం :
పరాన్నజీవి సాంక్రమిక దశలను ఒక అతిథేయి నుండి వేరొక అతిథేయికి రవాణా మాత్రమే చేసే జీవులను యాంత్రిక వాహనం అంటారు. ఈ విషయంలో వాహక జీవికి, పరాన్న జీవికి ఎటువంటి సంబంధం ఉండదు.
ఉదా : ఎంటమీబాకు ఈగలు.

జీవ సంబంధ వాహకం :
ఈ వాహకంలో పరాన్నజీవి సాంక్రమిక దశలు మనుగడ సాగించగలిగి, ఇంకొక జీవికి సంక్రమించేలోపు కొంతవరకు అభివృద్ధి చెందుతాయి.
ఉదా : ప్లాస్మోడియంకు ఆడ ఎనాఫిలిస్ దోమ.

ప్రశ్న 4.
అథి పరాన్నజీవి అంటే ఏమిటి? ఒకదాని పేరు రాయండి. [Mar. ’14]
జవాబు:
ఒక పరాన్నజీవిపై బాహ్యంగా గాని, అంతర్గతంగా గాని పరాన్న జీవనం సాగించే పరాన్నజీవిని అధి పరాన్నజీవి అంటారు.
ఉదా : టోడ్ చేప (అతిథేయి) – స్పీరోస్పోరా పాలిమార్పా (పరాన్నజీవి) – నోసిమా నొటాబిలిస్ (అధి పరాన్నజీవి)

ప్రశ్న 5.
పరాన్నజీవ కాస్ట్రేషన్ అంటే ఏమిటి ? ఉదాహరణ రాయండి.
జవాబు:
కొన్ని పరాన్న జీవులు వాటి అతిథేయి బీజకోశాలను నాశనం చేసి వాటిని వంధ్య జీవులుగా మారుస్తాయి. ఈ విషయాన్ని పరాన్నజీవ కాస్ట్రేషన్ అంటారు.
ఉదా : సాక్యులినా అనే పరాన్నజీవి తన అతిథేయి కార్సినస్ మీనాస్ అనే పీత బీజకోశాలను నాశనం చేస్తుంది. దీని వలన మగ పీతలోని లైంగిక హార్మోన్ల సమతుల్యత దెబ్బతిని మగపీత ఆడ లక్షణాలను సంతరించుకుంటుంది.

AP Inter 1st Year Zoology Study Material Chapter 6 మానవ సంక్షేమంలో జీవశాస్త్రం

ప్రశ్న 6.
ఫాసియోల హెపాటికాలో అంతర్ పరాన్నజీవ అనుకూలనాలను తెలపండి.
జవాబు:
ఫాసియోల హెపాటికా నత్తలో పరాన్న జీవనం సాగిస్తాయి. వీటి డింభకాలు నత్త దేహం విపరీతంగా పెరిగేలా ప్రభావితం చేస్తాయి. దీనిని అతికాయత (Gigantism) అంటారు.

ప్రశ్న 7.
నియోప్లాసియాను నిర్వచించండి. దీనికి ఒక ఉదాహరణ తెలపండి.
జవాబు:
కొన్ని పరాన్నజీవులు అతిథేయి కణజాలంలో కణాల సంఖ్యను విపరీతంగా పెరిగేలా ప్రభావితం చేసి కొత్త నిర్మాణాలను ఏర్పరుస్తాయి. దీనినే నియోప్లాసియా అంటారు. ఇది క్యాన్సర్కు దారితీస్తుంది.
ఉదా : కొన్ని వైరస్లు.

ప్రశ్న 8.
ఆరోగ్యాన్ని చక్కగా నిర్వచించి, ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే రెండు అంశాలను తెలపండి.
జవాబు:
ఆరోగ్యం అంటే పరిపూర్ణమైన భౌతిక, మానసిక, సామాజిక స్థితిని కలిగి ఉండటం. ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే ప్రధాన జన్యు రుగ్మతలు, సంక్రమణలు, వ్యక్తి జీవన విధానం. అంశాలు

ప్రశ్న 9.
సంక్రమణ, అసంక్రమణ వ్యాధుల మధ్య భేదాన్ని తెలపండి. ఒక్కొక్క దానికి రెండు ఉదాహరణలు తెలపండి.
జవాబు:
సంక్రమణ వ్యాధులు :
ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి సంక్రమించే వ్యాధులను సంక్రమణ వ్యాధులు అంటారు.
ఉదా : అమీబిక్ విరేచనాలు, మలేరియా జ్వరం, బోదకాలు వ్యాధి, సాధారణ జలుబులు, AIDS మొదలైనవి.

అసంక్రమణ వ్యాధులు :
ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి వ్యాపించని వ్యాధులను అసంక్రమణ వ్యాధులు అంటారు.
ఉదా : జన్యు సంబంధ వ్యాధులు, మూత్రపిండ వ్యాధులు, హృదయ సమస్యలు.

ప్రశ్న 10.
‘ఎంటమీబా హిస్టోలైటికా అవికల్పిక అవాయు పరాన్నజీవి’ అని ఎలా చెప్పగలవు?
జవాబు:
ఎంటమీబా హిస్టోలైటికా మానవ దేహంలో మాత్రమే జీవించగలదు. కనుక ఇది అవికల్పక పరాన్నజీవి. ఇది మానవ జీర్ణవ్యవస్థలో అవాయు శ్వాసక్రియ జరుపుకుంటుంది. కనుక ఇది ‘అవికల్పక అవాయు పరాన్నజీవి’ అని చెప్పవచ్చును.

ప్రశ్న 11.
ఎంటమీబా హిస్టోలైటికా పూర్వ కోశస్థ దశ మరియు కోశస్థ దశ మధ్య భేదాన్ని గుర్తించండి.
జవాబు:
పూర్వ కోశస్థ దశ :
జీవి చిన్నగా, గుండ్రంగా లేదా అండాకారంగా ఉంటుంది. జీవ పదార్థంలో గ్లైకోజన్ రేణువులు, కడ్డీల వంటి క్రొమాటిడ్ దేహాలు ఉంటాయి.

కోశస్థ దశ :
జీవి దేహం గుండ్రంగా ఉండి పలుచని, మృదువైన అధిక నిరోధక శక్తి కలిగి కోశకుడ్యాన్ని ఏర్పరచుకుంటుంది. జీవి దేహంలో నాలుగు పిల్ల కేంద్రకాలుంటాయి.

AP Inter 1st Year Zoology Study Material Chapter 6 మానవ సంక్షేమంలో జీవశాస్త్రం

ప్రశ్న 12.
ఎంటమీబా హిస్టోలైటికా పూర్వకోశస్థ దశ మరియు కోశస్థ ప్రారంభ (early) దశలో నిల్వ ఆహారమేది?
జవాబు:
ఎంటమీబా హిస్టోలైటికా పూర్వ కోశస్థ దశ మరియు కోశస్థ ప్రారంభ దశలో నిలువ ఆహారము గ్లైకోజన్ రేణువుల రూపంలో, క్రొమాటిడ్ దేహాల రూపం (రైబోన్యూక్లియో ప్రొటీన్)లో ఉంటుంది.

ప్రశ్న 13.
ఒక వ్యక్తి పేగులో క్రమరహితం, ఉదర నొప్పి, మలంలో రక్తం, శ్లేష్మం ఉన్నాయి. ఈ లక్షణాల ఆధారంగా జీవి పేరు, వ్యాధిని తెలపండి.
జవాబు:
మానవ పేగులో క్రమరహితం, ఉదర నొప్పి, మలంలో రక్తం, శ్లేష్మం మొదలైన లక్షణాలను ఎంటమీబా హిస్టోలైటికా పరాన్న జీవి కారణం. ఈ వ్యాధిని అమీబిక్ విరేచనాలు లేదా అమీబిక్ డిసెంట్రి లేదా అమీబియాసిస్ అంటారు.

ప్రశ్న 14.
ఒక వ్యక్తి డాక్టరు సలహాతో క్లినికల్ ప్రయోగశాలలో మల పరీక్షకు వెళ్లాడు. అందులోని టెక్నీషియన్ మలంను పరీక్షించి అమీబియాసిస్తో బాధపడుతున్నాడని గుర్తించాడు. టెక్నీషియన్ గుర్తించిన రెండు లక్షణాలను తెలపండి.
జవాబు:
అమీబియాసిస్తో బాధపడే వ్యక్తి మలంను పరీక్షించినట్లయితే మానవ మలంలో శ్లేష్మం, రక్తంతో బాటుగా చతుష్కేంద్రక దశలో ఉండే ఎంటమీబా హిస్టోలైటికా కోశస్థ దశలను గమనించవచ్చును.

ప్రశ్న 15.
ఎంటమీబా హిస్టోలైటికాను ఉద్దేశించి ఎసింప్టమాటిక్ సిస్ట్ పాసర్స్ను నిర్వచించండి.
జవాబు:
కొందరి వ్యక్తులలో ఎంటమీబా హిస్టోలైటికా పరాన్నజీవి ఉన్నప్పటికి వీరిలో అమీబియాసిస్ లక్షణాలు కనపడవు. కాని వీరి మలాన్ని పరిశీలించినట్లయితే చతుష్కేంద్రక కోశాలుంటాయి. ఇటువంటి వారిని ‘ఎసింప్టమాటిక్ సిస్టాపాసర్స్’ అంటారు.

ప్రశ్న 16.
మానవునిలో హిపాటోసైట్స్ను సంక్రమించే ప్లాస్మోడియం వైవాక్స్ దశలను తెలపండి.
జవాబు:
ప్లాస్మోడియం యొక్క స్పోరోజాయిట్ దశలు మానవ కాలేయ కణాలను (హిపాటోసైట్స్) సంక్రమణ దశలు.

AP Inter 1st Year Zoology Study Material Chapter 6 మానవ సంక్షేమంలో జీవశాస్త్రం

ప్రశ్న 17.
ప్రీపేటెంట్ కాలంను నిర్వచించండి. ప్లాస్మోడియం వైవాక్స్ జీవితచక్రంలో దీనికి ఎంత కాలం ఉంటుంది?
జవాబు:
ప్లాస్మోడియం ప్రప్రథమంగా స్పోరోజాయిట్ రూపంలో మానవ రక్తంలోకి ప్రవేశించినప్పటి నుండి, రెండవసారి క్రిప్టోజాయిట్లు రక్తంలోకి విడుదలయ్యే వరకు పట్టే కాలాన్ని ప్రీపేటెంట్ కాలం అంటారు. దీనికి ఎనిమిది రోజుల కాలం పడుతుంది.

ప్రశ్న 18.
పొదిగే కాలంను నిర్వచించండి. ప్లాస్మోడియం వైవాక్స్ జీవితచక్రంలో ఇది ఎంతకాలం ఉంటుంది?
జవాబు:
ప్లాస్మోడియం స్పోరోజాయిట్ దశలో మొదట మానవ దేహంలో ప్రవేశించిన నాటినుండి, మొదటిసారి మలేరియా జ్వరం వచ్చే వరకు పట్టే కాలాన్ని పొదిగే కాలం అంటారు. ఇది 10 నుండి 14 రోజులు పడుతుంది.

ప్రశ్న 19.
షఫ్నర్ చుక్కలు అంటే ఏమిటి? వీటి ప్రాముఖ్యం తెలపండి.
జవాబు:
ప్లాస్మోడియం పరాన్నజీవి RBC లోని హిమోగ్లోబిన్లోని హిమ్ను జీర్ణం చేసుకొని, జీర్ణం కాని హిమోజాయిను కణికలుగా ఏర్పరుస్తుంది. ఈ దశలో చిన్న ఎర్రని మచ్చలు ఎర్ర రక్తకణాల జీవపదార్థంలో ఏర్పడతాయి. వీటినే షఫ్నర్ చుక్కలు అంటారు.

ప్రశ్న 20.
హీమోజాయిన్ రేణువులు అంటే ఏమిటి ? వీటి ప్రాముఖ్యం తెలపండి.
జవాబు:
ప్లాస్మోడియం RBC లోని హిమోగ్లోబిన్ లోని గ్లోబిన్ భాగాన్ని గ్రహించిన తరువాత మిగిలిన జీర్ణంకాని హిమటిన్ భాగం హిమోజాయిన్ కణికలుగా ఏర్పడుతుంది. ఇది మలేరియా జ్వరాన్ని కలుగజేసే విష పదార్థం. ఇది రక్తంలోని ప్లాస్మాతో కలిసినప్పుడు మలేరియా జ్వరం వస్తుంది.

ప్రశ్న 21.
కశాభ నిర్మోచనం అంటే ఏమిటి? దీనివల్ల ఏర్పడినవి ఏవి?
జవాబు:
ప్లాస్మోడియం దోమలలో జరుపుకునే లైంగిక ప్రత్యుత్పత్తిలో పురుష లేదా సూక్ష్మ సంయోగ బీజాలు కొరడా మాదిరి కదలికలను చూపుతూ జీవ పదార్థం నుండి విడుదలవుతాయి. ఈ విధంగా ఏర్పడిన పురుష సంయోగ బీజాలు విడుదల కావడాన్ని ‘కశాభ నిర్మోచనం’ అంటారు.

ప్రశ్న 22.
ప్లాస్మోడియంలో బీజకణాల కలయికను అసమసంయోగం అని ఎందుకంటారు?
జవాబు:
ప్లాస్మోడియంలో సంయోగ బీజాలు పరిమాణ రీత్యా అసమానంగా ఉంటాయి. కనుక వీటి మధ్య జరిగే సంయోగం లేదా కలయికను అసమసంయోగం అంటారు.

ప్రశ్న 23.
గమన సంయుక్తబీజం అంటే ఏమిటి ? క్రోమోసోముల స్థితిని (sets) అనుసరించి దీన్ని ఎలా వివరిస్తావు?
జవాబు:
ప్లాస్మోడియంలో లైంగిక ప్రత్యుత్పత్తిలో ఏర్పడే సంయుక్త బీజం సన్నగా, పొడవుగా, కదలిక చూపే క్రిమి రూపాన్ని పొందుతుంది. దీనిని గమన సంయుక్త బీజం అంటారు. దీని క్రోమోసోముల స్థితి ద్వయస్థితికం.

ప్రశ్న 24.
ఒక వ్యక్తి చలి, వణుకుడు, అధిక ఉష్ణోగ్రతతో బాధపడుతున్నాడు. విపరీతమైన చెమటలతో ఉష్ణోగ్రత సాధారణ స్థాయికి చేరింది. ఈ లక్షణాల ఆధారంగా వ్యాధిని, కారక జీవిని తెలపండి.
జవాబు:
రోగి చలి, వణుకుడు, అధిక ఉష్ణోగ్రతతో బాధపడుతూ, విపరీతమైన చెమటతో ఉష్ణోగ్రత సాధారణ స్థాయికి చేరే లక్షణం ఉన్నట్లయితే అతడు మలేరియా జ్వరంతో బాధపడుతున్నాడు. దీనికి ప్లాస్మోడియం వైవాక్స్ అనే పరాన్నజీవి కారణం.

AP Inter 1st Year Zoology Study Material Chapter 6 మానవ సంక్షేమంలో జీవశాస్త్రం

ప్రశ్న 25.
దోమలను అరికట్టడానికి జీవసంబంధమైన నియంత్రణ తెలపండి.
జవాబు:
దోమలను అరికట్టడానికి జీవసంబంధమైన నియంత్రణ : దోమ డింభకాలను తినే గంబూసియా చేపలను, కీటకాహార మొక్కలైన ముట్రిక్యులేరియాలను దోమలు వృద్ధిచెందే ప్రాంతాలలో పెంచాలి.

ప్రశ్న 26.
ఆస్కారిస్ గుడ్లను ‘మామ్మిల్లేటిడ్ గుడ్లు’ అని ఎందుకు అంటారు?
జవాబు:
ఆస్కారిస్ అండము ఉపరితలంలో బుడిపెలుగా ఏర్పడిన ప్రొటీన్ పొరచే కప్పబడి ఉంటుంది. అందువలన ఆస్కారిస్ గుడ్లను మామిల్లేటిడ్ గుడ్లు అంటారు.

ప్రశ్న 27.
మీరు చదివిన నిమటోడా పరాన్నజీవి జీవితచక్రంలో నిశా కాలగమనం అంటే ఏమిటి?
జవాబు:
నిమటోడా పరాన్నజీవి ఉకరేరియా యొక్క మైక్రోఫైలేరియా డింభకాలు వేరొక అతిథేయిని చేరడానికి అనువుగా రాత్రి సమయంలో 10 నుండి ఉదయం 4 వరకు రోగి పరిధీయ రక్త ప్రసరణలో ఉంటాయి. ఇటువంటి రాత్రి సమయంలో చూపే గమనాన్ని ‘నిశా కాల అంటారు.

ప్రశ్న 28.
లింఫాడినైటిస్ మరియు లింఫాంజైటిస్ మధ్య భేదాన్ని తెలపండి.
జవాబు:
లింఫాంజైటిస్ :
సాధారణంగా ఫైలేరియా సంక్రమణతో శోషరస నాళాలు, వాపు కనిపిస్తుంది. దీనిని లింఫాంజైటిస్ అంటారు.

లింఫాడినైటిస్ :
శోషరస గ్రంథులలో కలిగే వాపును లింఫాడినైటిస్ అంటారు.

ప్రశ్న 29.
ఫైలేరియాసిస్ వ్యాధి చివరి ఘట్టం బోదకాలు / ఎలిఫెంటియాసిస్ నిరూపించండి.
జవాబు:
ఫైలేరియాసిస్ వ్యాధి తీవ్రత వలన వాపు చెందిన భాగాలలో ఫైబ్రోబ్లాస్ట్లు అభివృద్ధి చెంది తంతుయుత కణజాలంగా మారతాయి. ప్రభావిత భాగాలలో స్వేదగ్రంథులు క్షీణించి, అక్కడి చర్మం పొడిగాను, గరుకుగాను అవుతుంది. ఈ చివరి స్థితిని బోదకాలు లేదా ఎలిఫెంటియాసిస్ వ్యాధి అంటారు.

ప్రశ్న 30.
పొగాకు ఏ విధంగా శ్వాసక్రియను ప్రభావితం చేస్తుంది? దీనిలో గల ఆల్కలాయిడ్ ఏది?
జవాబు:
పొగాకులో నికోటిన్ అనే ఆల్కలాయిడ్ ఉంటుంది. పొగాకు పీల్చడం వలన పొగలలో ఉండే కార్బన్ మోనాక్సైడ్ ఎర్ర రక్తకణాలలోని హిమోగ్లోబిన్ లో కలిసి, Hb యొక్క ఆక్సిజన్ రవాణా సామర్థ్యాన్ని తగ్గించడం ద్వారా శ్వాసక్రియపై దుష్ప్రభావాన్ని చూపిస్తుంది.

ప్రశ్న 31.
మందుల దుర్వినియోగాన్ని నిర్వచించండి.
జవాబు:
వ్యాధులను నివారించి తద్వారా శారీరక, మానసిక సుఖశాంతులు పొందడానికి మనం మందులు వాడుతున్నాం. వీటిని వైద్యపరంగా కాకుండా వేరే విధంగా వినియోగించడం వల్ల శారీరక లేదా మానసిక రుగ్మతలకు గురవుతున్నాం. దీనినే మందుల దుర్వినియోగం అంటారు. ఉదా : హోలీ రోజున వాడే బంగ్, డాక్టర్ సలహాపై మత్తుకు వాడే వివిధ మందులు – డాక్టరు ద్వారా కాకుండా విపరీతంగా తీసుకోవడం.

ప్రశ్న 32.
కోక్, స్మాక్ దేని నుంచి లభిస్తాయి?
జవాబు:
కోక్ :
దీనిని ఎరిత్రోజైలం కొకా అనే మొక్క ఆకుల నుండి తయారుచేస్తారు.

స్మాక్ :
హెరాయిన్ను స్మాక్ అంటారు. దీనిని ఓపియం పాపి, పపావర్ సోమ్నిఫెరం (నల్లమందు మొక్క) అనే మొక్కల నుండి తయారు చేస్తారు.

ప్రశ్న 33.
మొక్కలలో చాలా ద్వితీయ జీవాణువులకు ఔషధ ధర్మాలు ఉన్నాయి. వీటి దుర్వినియోగం వల్ల సమస్యలు ఏర్పడుతున్నాయా? సరైన ఉదాహరణలతో నిరూపించండి.
జవాబు:
చాలా మొక్కల ద్వితీయ జీవాణువులకు ఔషధ ధర్మాలున్నాయి. ఇవి ఓపియోడ్స్, కనభినాయిడ్స్, కొకా ఆల్కలాయిడ్స్. వీటిని మందు రూపంలో కాక అతిగా మాదక ద్రవ్యాలుగా వినియోగిస్తూ దుర్వినియోగం చేయడం వలన అనేక ఆరోగ్య, సామాజిక సమస్యలు ఏర్పడుతున్నాయి.

ప్రశ్న 34.
ఆటలు, క్రీడలలో నిషేధించిన కనబినాయిడ్స్, అనబాలిక్ స్టీరాయిడ్స్ ఏవి?
జవాబు:
కొందరు క్రీడాకారులు ఆటలలో అలసత్వం రాకుండా ఉత్తేజాన్నిచ్చే స్థాయిలో కనబినాయిడ్స్, అనబాలిక్ స్టిరాయిడ్ను ఉపయోగిస్తున్నారు. ఇలా స్టిరాయిడ్ను ఉపయోగించడం చట్టరీత్యా నేరం కనుక వీటిని నిషేధించారు.

AP Inter 1st Year Zoology Study Material Chapter 6 మానవ సంక్షేమంలో జీవశాస్త్రం

ప్రశ్న 35.
కుంగిపోవడం, నిద్రలేమి మొదలైన మానసిక జబ్బులకు వాడే తరచుగా దుర్వినియోగం అయ్యే నాలుగు మందులను తెలపండి.
జవాబు:
కుంగిపోవడం, నిద్రలేమి మొదలైన మానసిక జబ్బులకు వాడే మందులు తరచుగా దుర్వినియోగమయ్యేవి.

  1. బార్బిటురేట్ – నిద్రమాత్రలు
  2. ఆంఫిటమైన్స్ – నిద్రహరిణి మాత్రలు
  3. బెంజోడయాజిపైన్స్ – ప్రశాంతకాలు
  4. లైసర్జిక్ ఆమ్ల డైఈథైల్ అమైడ్స్ – ప్రశాంతకాలు

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
పరాన్నజీవులలో ప్రత్యేక అనుకూలనాల అభివృద్ధి అవసరమేమిటి? పరాన్నజీవులలో ఏర్పడిన కొన్ని ప్రత్యేక అనుకూలనాలను తెలపండి.
జవాబు:
అతిథేయిలో విజయవంతమైన జీవనం కొనసాగించడానికి అనువుగా పరాన్నజీవులు ప్రత్యేక అనుకూలనాలను ఏర్పర్చుకుంటాయి.

  1. ఆస్కారిస్ వంటి ఆంత్ర పరాన్నజీవులైన గుండ్రటి పురుగులు వాటి అతిథేయిలు స్రవించే జీర్ణక్రియా ఎంజైముల నుంచి రక్షించుకోవడానికి అవభాసినిని ఏర్పరుచుకుంటాయి.
  2. బద్దె పురుగువంటి జీవులు వాటి అతిథేయి పేగు గోడలకు అంటి పెట్టుకోవడానికి చూషకాలు, కొక్కేలు వంటి అంగాలను ఏర్పరచుకుంటాయి.
  3. ఎంటమీబా హిస్టోలైటికా వంటి పరాన్న జీవులు తమ జీవిత చరిత్రలో కోశస్థ దశను ఏర్పరచుకుంటాయి. ఈవిధంగా ఇవి కొత్త అతిథేయిలోకి ప్రవేశిస్తాయి.
  4. పరాన్న జీవుల్లో ప్రత్యుత్పత్తి వ్యవస్థ బాగా అభివృద్ధిచెంది ఉంటుంది. వీటి స్త్రీ జీవులు అధిక సంఖ్యలో అండాలను విడుదల చేస్తాయి.
  5. ద్వంద్వ అతిథేయి వంటి లివరూక్ పరాన్నజీవులలో బహుపిండత్వాన్ని వ్యక్తంచేస్తూ క్లిష్టమైన జీవిత చరిత్రను కలిగి ఉంటుంది.
  6. ప్లాస్మోడియంవంటి పరాన్న జీవులు అవి ఉత్పత్తిచేసే ప్రతిజనకాలను తరచుగా మారుస్తాయి.

ప్రశ్న 2.
హైపర్ ట్రోఫీ మరియు హైపర్ ప్లాసియాల మధ్య భేదాలను ఒక్కొక్క ఉదాహరణతో వివరించండి.
జవాబు:
హైపర్ ట్రోఫీ :
ప్లాస్మాడియం వైవాక్స్ మానవ ఎర్ర రక్తకణంలోకి ప్రవేశించి రక్తకణంలోని జీవ పదార్థాన్ని, వర్ణకాన్ని తిన్న తరువాత తన ఆకృతిని పెంచుకుంటుంది. దీని ప్రభావం వలన RBC పరిమాణం కూడా పెరుగుతుంది. ఇలా పరాన్నజీవి ప్రభావంవలన అతిథేయి కణాకృతి పెరగడాన్ని హైపర్ ట్రోఫీ అంటారు.

హైపర్ ప్లాసియా :
ప్లాటి హెల్మింథస్ వర్గానికి చెందిన ఫాసియోలా హెపాటికా పరాన్నజీవి గొర్రెలలో పరాన్నజీవనం సాగిస్తుంది. దీని ప్రభావం వలన ఈ పరాన్నజీవి ఉండే గొర్రెలలో పైత్యరసనాళాలలో కణాలసంఖ్య పెరిగి పైత్యరస నాళాలు మందంగా మారతాయి. ఇలా పరాన్నజీవి ప్రభావం వలన అతిథేయి దేహంలో కణాల సంఖ్య పెరగడాన్ని హైపర్ ప్లాసియా అంటారు.

ప్రశ్న 3.
ఎంటమీబా హిస్టోలైటికా పోషకజీవి నిర్మాణాన్ని వివరించండి.
జవాబు:
AP Inter 1st Year Zoology Study Material Chapter 6 మానవ సంక్షేమంలో జీవశాస్త్రం 1
ఎంటమీబా హిస్టోలైటికా మానవుడి పెద్దపేగు, అంధనాళాలలో ఉండే ఆంత్ర పరాన్నజీవి. ఇది 20 నుంచి 30 మైక్రానుల లోతైన కణజాలాల్లో ఉంటుంది. పోషకజీవిని ఆవరించి ఉన్న పొరను ప్లాస్మాలెమ్మా అంటారు. జీవ పదార్థం వెలుపలి కణికారహితమైన బాహ్యజీవద్రవ్యంగాను, లోపలి కణికాయుతమైన అంతర్జీవ ద్రవ్యంగాను విభజించబడి ఉంటుంది. పోషక జీవి కదిలే వైపు పొట్టిగా, మొండిగా ఉండే మిథ్యాపాదం ఉంటుంది. ఎంటమీబా హిస్టోలైటికా అంతర్జీవ ద్రవ్యం మధ్యలో తిత్తి వంటి కేంద్రకం ఉంటుంది. కేంద్రక త్వచం లోపలి తలాన్ని అంటిపెట్టుకొని పూసలలాగా ‘క్రొమోటిన్ పదార్థముంటుంది. కేంద్రకం మధ్యలో ఎండోసోమ్ ఉంటుంది. సన్నని క్రొమాటిన్ తంతువులు, పూసల వంటి నిర్మాణాల నుంచి ఎండోసోమ్ వైపుకు చక్రంలోని చువ్వల మాదిరిగా ప్రసరించి ఉంటాయి. ఈ స్థితి కేంద్రకానికి బండి చక్రం రూపాన్నిస్తుంది. దీని ఆహారరిక్తికలలో ఎర్రరక్త కణాలుంటాయి.

AP Inter 1st Year Zoology Study Material Chapter 6 మానవ సంక్షేమంలో జీవశాస్త్రం

ప్రశ్న 4.
ఎంటమీబా హిస్టోలైటికా జీవిత చక్రంను తెలపండి.
జవాబు:
ఎంటమీబా హిస్టోలైటికా మానవ పెద్దపేగులో నివసించే పరాన్నజీవి. దీనివలన మానవులలో అమీబియాసిస్ లేదా అమీబిక్ డిసెంట్రీ (బంక విరేచనాలు) అనే వ్యాధి వస్తుంది. ఇది కలుషిత ఆహారం, నీరు వలన మానవ జీర్ణ వ్యవస్థలో ప్రవేశిస్తుంది.

జీవిత చక్రం :
పెద్దపేగు కుడ్యంలో ఎంటమీబా పోషక జీవులు ద్విధా విచ్ఛిత్తి జరిపి అనేక ఎంటమీబాలను ఏర్పరుస్తాయి. ఇవి బాక్టీరియా, అతిథేయి కణజాల భాగాలను పెరిగి మళ్ళీ విభజనచెంది, అనేకసార్లు జరిగిన ద్విధావిచ్ఛిత్తి వలన అనేక పోషకజీవులు ఏర్పడతాయి. వీటిలో కొన్ని పెద్ద పేగును చేరి పూర్వ కోశస్థ దశలుగా మారతాయి. తిరిగి ఈ దశలు కోశస్థ దశలుగా మారి చివరికి చతుష్కేంద్రక కోశాలుగా ఏర్పడతాయి. ఈ ప్రక్రియ మొత్తం కొన్ని గంటలలో జరుగుతుంది. చతుష్కేంద్రక దశలు మలంతోబాటు బయటకు విడుదలై సుమారు 10 రోజులు జీవంతో ఉంటాయి. ఈ కోశాలు కలుషితమైన నీరు, ఆహారంతోబాటు కొత్త అతిథేయిని చేరతాయి. ఇవి మానవ చిన్నపేగును చేరిన తరవాత ట్రిప్సిన్ ఎంజైమ్ చర్యవలన కోశం జీర్ణమై చతుష్కేంద్రక అమీబాలు విడుదలవుతాయి. వికోశీకరణం చెందిన చతుష్కేంద్రక అమీబాలను మెటాసిస్ట్ అంటారు.

మెటాసిస్ట్లోని నాలుగు కేంద్రకాలు సమవిభజనలో ఎనిమిది కేంద్రకాలుగా విభజన చెందుతాయి. ప్రతి కేంద్రకం కొంత జీవ పదార్థంతో ఎనిమిది పిల్ల ఎంటమీబాలు లేదా మెటాసిస్టిక్ పోషక జీవులు ఏర్పడతాయి. ఇవి పెద్దపేగు శ్లేష్మపొరలోకి ప్రవేశించి పరిపక్వ పోషక జీవులుగా పెరుగుతాయి.
AP Inter 1st Year Zoology Study Material Chapter 6 మానవ సంక్షేమంలో జీవశాస్త్రం 2

ప్రశ్న 5.
ఎంటమీబా హిస్టోలైటికా వ్యాధికారకతపై లఘుటీక రాయండి.
జవాబు:
ఎంటమీబా హిస్టోలైటికా పరాన్నజీవి మానవ పెద్దపేగులో ఉండే పరాన్నజీవి. ఇది కలుషిత ఆహారం, నీరు నుండి మరొకరికి వ్యాప్తి చెందుతుంది.

ఎంటమీబా పోషకజీవులు హిస్టోలైసిన్ అనే ఎంజైము స్రవించి అతిథేయి శ్లేష్మ స్థరాన్ని కరిగించిలోనికి ప్రవేశించి పెద్దపేగు కుడ్యంలో పుండ్లను ఏర్పరుస్తాయి. పుండ్లలో కణశిథిలాలు, లింఫోసైట్, ఎర్రరక్తకణాలు, బాక్టీరియాలు ఉంటాయి. పెద్దపేగు కుడ్యంలో చీముగడ్డలు ఏర్పడటానికి దారితీస్తాయి. చివరగా మలంలో రక్తం, శ్లేష్మం కనిపిస్తాయి. ఈ స్థితిని అమీబిక్ విరేచనాలు లేదా ఆంత్ర అమీబియాసిస్ లేదా ఉష్ణ అమీబియాసిస్ అంటారు. కొందరిలో ఎటువంటి వ్యాధి లక్షణాలు కనిపించవు. వీరిని వాహకులు లేదా ఎసింప్టోమాటిక్ సిస్ట్ పాసర్స్ అంటారు. వీరి మలంలో చతుష్కేంద్రక కోశాలు ఉంటాయి. ఇవి పరాన్నజీవి వ్యాప్తికి తోడ్పడతాయి.

ప్రశ్న 6.
ప్లాస్మోడియమ్ వైవాక్స్ స్పోరోజాయిట్ నిర్మాణాన్ని వివరించండి.
జవాబు:
ప్లాస్మోడియమ్ వైవాక్స్ స్పోరోజాయిట్ నిర్మాణం :
AP Inter 1st Year Zoology Study Material Chapter 6 మానవ సంక్షేమంలో జీవశాస్త్రం 3

  1. ప్లాస్మోడియమ్ వైవాక్స్ స్పోరోజాయిట్ యొక్క సూక్ష్మ నిర్మాణాన్ని గారోమ్ అధ్యయనం చేశాడు.
  2. ఇది కొడవలి ఆకారంలో ఒకవైపు వంగి ఉంటుంది. కణ దేహం కండె ఆకారంలో ఉంటుంది. మధ్యలో బొద్దుగా, కొన భాగాలు మొనదేలి ఉంటాయి. ఇది 15 మైక్రానుల పొడవు, 1 మైక్రాను వెడల్పు ఉంటుంది.
  3. స్పోరోజాయిట్ దేహాన్ని ఆవరించి సాగే గుణం కలిగిన పెలికల్ ఉంటుంది.
  4. పెలికిల్ మూడు పొరలలో ఏర్పడి ఉంటుంది. దీనిలో సూక్ష్మ నాళికలు లేదా పరిధీయ తంతువులు నిలువుగా అమరి ఉంటాయి. వీటి సంకోచాలు పరాన్నజీవి దేహంలో జరిగే క్రిమి చలనానికి తోడ్పడతాయి.
  5. కణ పూర్వభాగంలో ఒక “అగ్రచూషకం” లేదా “ఎపికల్ కప్” ఉంటుంది. ఒక జత పొడవైన స్రావక సూక్ష్మాంగాలు దీనిలోకి తెరుచుకుంటాయి. ఇవి కణవిచ్ఛిన్న ఎంజైములను స్రవిస్తూ, స్పోరోజాయిట్ కాలేయ కణాల్లోకి ప్రవేశించడానికి సహాయపడతాయి.
  6. కణదేహంలో అనేక సంవళిత నాళికలుంటాయి. వాటి నిర్దిష్టమైన విధి ఏమిటో తెలియదు.

AP Inter 1st Year Zoology Study Material Chapter 6 మానవ సంక్షేమంలో జీవశాస్త్రం

ప్రశ్న 7.
ప్లాస్మాడియం వైవాక్స్ జీవితచక్రంలో గాల్జి చక్రాన్ని వివరించండి.
జవాబు:
కాలేయ కణాలలో రక్తకణ పూర్వ, రక్తకణ బాహ్య జీవిత చక్రాలను పూర్తి చేసుకున్న పిదప ప్లాస్మోడియం పూర్వ తరంలోని క్రిప్టోజాయిట్స్ రూపంలోగాని, రక్తకణ బాహ్య చక్రంలోని సూక్ష్మ మెటాక్రిప్టోజాయిట్ల రూపంలోగాని రక్తంలోని RBC ని చేరి రక్తకణ జీవిత చక్రాన్ని ప్రారంభిస్తాయి. ఈ రక్తకణ జీవిత చక్రాన్ని మొదటగా కామిల్లోగాల్జి అనే శాస్త్రవేత్త వివరించాడు. కనుక ఈ చక్రాన్ని గాల్జిచక్రం అంటారు..

గాల్జి చక్రం :
ఇది పూర్వ తరంలోని క్రిప్టోజాయిట్లతో గాని లేదా రక్తకణబాహ్య జీవితచక్రంలోని సూక్ష్మ మెటాక్రిప్టోజాయిట్లతో గాని ప్రారంభమవుతుంది. ఎర్రరక్తకణాల్లోకి ప్రవేశించగానే మీరోజాయిట్లు గోళాకార ట్రోఫోజాయిట్లుగా మారతాయి. వీటిలో ఒక చిన్న రిక్తిక ఏర్పడి పరిమాణంలో పెరుగుతూ పోషకజీవిలోని జీవపదార్థాన్ని, కేంద్రకాన్ని అంచువైపుకు నెట్టడం వల్ల ఉంగరం మాదిరిగా కనిపిస్తుంది. ఈ దశను అంగుళీక దశ అంటారు. తరవాత రిక్తిక అదృశ్యమవుతుంది. పరాన్నజీవి మిథ్యాపాదాలను అభివృద్ధి చేసుకొని అమీబాయిడ్ దశగా మారుతుంది. ఇది RBC లోని పదార్థాలను మిథ్యాపాదాలతో గ్రహించి పోషణతో పరిమాణాన్ని పెంచుకొంటుంది. దీనివల్ల ఎర్రరక్తకణాల పరిమాణం రెండింతలు పెరుగుతుంది. ఈ స్థితిని అతివృద్ధి అంటారు. ఈ చక్రంలో ఎర్ర రక్తకణాల్లోని హీమోగ్లోబిన్ను పరాన్నజీవి ఆహారంగా తీసుకుంటుంది.

పరాన్నజీవి హీమోగ్లోబిన్లోని హీమ్ను జీర్ణం చేసుకొని మరియు కరిగే హీము కరగని హీమోజాయిన్ కణికలుగా ఏర్పరుస్తుంది. దీన్నే మలేరియా వర్ణకం అంటారు. ఈ దశలో చిన్న ఎర్రని మచ్చలు షఫ్నర్ చుక్కలు ఎర్రరక్తకణాల జీవపదార్థంలో ఏర్పడతాయి. ఇవి పరాన్నజీవి విడుదల చేసే ప్రతిజనకాలు. ప్లాస్మోడియం,మిథ్యాపాదాలను కోల్పోయి బాగా పెరిగి RBC ని మొత్తంగా ఆక్రమించి విఖండంగా మారుతుంది. ఇది రక్తకణపూర్వ చక్రంలో మాదిరిగా విఖండ జననం చెంది 12-24 ఎర్రరక్తకణ మీరోజాయిట్లను ఏర్పరుస్తుంది. ఇవన్నీ RBC లో గులాబీ రేకులా అమరి రోజెట్టిశగా మారుతుంది. చివరిగా ఎర్రరక్తకణం పగిలి హీమోజాయినను, మీరోజాయిట్లను రక్తంలో విడుదల చేస్తుంది. ఈ చక్రం దాదాపు 48 గంటలలో పూర్తవుతుంది.

స్పోరోజాయిట్లు దేహంలో ప్రవేశించిన నాటి నుంచి మొట్టమొదటిగా, మలేరియా లక్షణాలు జ్వరం వచ్చేవరకు పట్టే కాలాన్ని పొదిగే కాలం అంటారు. ఇది దాదాపు 10-14 రోజులలో పూర్తవుతుంది.

ప్రశ్న 8.
ఉకరేరియా బాంక్రాఫ్టి వల్ల మానవునిలో కలిగే వ్యాధి కారకతను తెలపండి.
జవాబు:
ఉకరేరియా బాంక్రాఫ్టి అనే నిమటొడా పరాన్నజీవి కారణంగా మానవులలో బోదకాలు వ్యాధి సంక్రమిస్తుంది. ఇది ఫైలేరిఫాం డింభక దశలో దోమకాటు ద్వారా మానవులకు సంక్రమిస్తుంది.

వ్యాధి కారకత :
సంక్రమణ స్వల్పంగా ఉంటే ఫైలేరియా జ్వరం, తలనొప్పి, మానసిక ఆందోళన, శరీర ఉష్ణోగ్రత పెరగడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. సాధారణంగా ఫైలేరియా సంక్రమణతో శోషరస నాళాలు, శోషగ్రంథులలో వాపు (infalmation) కలుగుతుంది. శోషనాళాలలో కలిగే వాపును లింఫాంజైటిస్ (Lymphangitis) ( Gr. angeos – నాళాలు, itis – మంట) అనీ, శోషరస గ్రంథులలో కలిగే వాపును లింఫాడెంటిస్ (Lymphadenitis) (Gr. adenos – గ్రంథి, itis – మంట) అని అంటారు. పరాన్న జీవుల సంక్రమణ అధికంగా ఉంటే, చనిపోయి పేరుకుపోయిన పురుగులు శోషరస నాళాలలోనూ, శోషరస గ్రంథులలోనూ శోషరస ప్రవాహాన్ని ఆటంకపరుస్తాయి.

ఫలితంగా అధిక వాపు ఏర్పడుతుంది. దీన్ని లింఫోఎడిమా (Lymphoedema)(Gr. oiedema – వాపు) అంటారు. ఈ వాపు గమనాంగాల చివరి భాగాలు, పురుషుల్లో ముష్కగోణులు, స్త్రీల స్తనాలలో అనూహ్యంగా కనిపిస్తుంది. ఈ వాపు చెందిన భాగాలలో ఫైబ్రోబ్లాస్ట్లు అభివృద్ధి చెంది తంతుయుత కణజాలంగా మారతాయి. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ప్రభావిత భాగాలలో స్వేదగ్రంథులు క్షీణించి, అక్కడ చర్మం పొడిగాను, గరుకుగాను అవుతుంది. ఈ చివరి స్థితిని ఎలిఫెంటియాసిస్ (Elephantiasis) లేదా బోదకాలు అంటారు.

ప్రశ్న 9.
టైఫాయిడ్ జ్వరం మరియు రోగనిరోధకతపై లఘుటీక రాయండి.
జవాబు:
టైఫాయిడ్ జ్వరం :
ఈ వ్యాధి సాల్మొనెల్ల టైఫీ అనే గ్రామ్ నెగిటివ్ బాక్టీరియా వల్ల వస్తుంది. ఇది ముఖ్యంగా మానవుడి చిన్నపేగులో నివసిస్తూ రక్తం ద్వారా ఇతర అవయవాలలోకి ప్రవేశిస్తుంది. ఈ వ్యాధిని వైడాల్ పరీక్ష చేసి నిర్ధారిస్తారు. సంక్రమణ విధానం : ఈ వ్యాధి కలుషితమైన ఆహారం, నీరు ద్వారా వ్యాప్తి చెందుతుంది.

వ్యాధి లక్షణాలు :
ఈ వ్యాధి సోకిన రోగికి 104°F వరకు పెరిగే ఉష్ణోగ్రతతో స్థిరంగా ఉండే జ్వరం, నీరసం, కడుపునొప్పి, మలబద్దకం, తలనొప్పి, ఆకలి మందగించడం మొదలైన లక్షణాలు కనిపిస్తాయి. వ్యాధి తీవ్రతలో పేగుకు రంధ్రాలు ఏర్పడటం, తీవ్రమైన స్థాయిలో మరణం సంభవించడం జరుగుతుంది.

ప్రశ్న 10.
న్యుమోనియా మరియు రోగనిరోధకతపై లఘుటీక రాయండి.
జవాబు:
న్యుమోనియా వ్యాధి శ్వాస వ్యవస్థలో బాధలు గురిచేసే వ్యాధి. ఇది స్ట్రెప్టోకోకస్ న్యుమోనియే, హీమోఫిలస్ ఇన్ఫ్లుయోంజాల వంటి గ్రామ్ పాజిటివ్ బాక్టీరియాల వల్ల వస్తుంది. ఈ బాక్టీరియా మానవ వాయుకోశాలపై దాడి చేస్తాయి.

సంక్రమణ :
వ్యాధి సోకిన వ్యక్తి నోటి తుంపర్లు (గాలిద్వారా వ్యాప్తి) పీల్చడం వలన లేదా వ్యాధిగ్రస్తుని యొక్క వంట పాత్రలు, వారు వాడిన తువాలు (టవల్స్) వాడటం వలన ఇతరులు ఈ వ్యాధి బారిన పడతారు.

వ్యాధి లక్షణాలు :
ఈ వ్యాధిగ్రస్తుల వాయుకోశాలు ద్రవంతో పూర్తిగా నిండి శ్వాసక్రియలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. వాయుకోశాల శ్వాస వాయువుల మార్పిడి ఆటంకం ఏర్పడుతుంది. వ్యాధి తీవ్రతలో దేహంలో ఆక్సిజన్ శాతం తగ్గి, కార్బన్ డైఆక్సైడ్ శాతం పెరగడం వలన పెదవులు, వేలిగోర్లు బూడిద లేదా నీలిరంగుకు మారతాయి.

AP Inter 1st Year Zoology Study Material Chapter 6 మానవ సంక్షేమంలో జీవశాస్త్రం

ప్రశ్న 11.
సాధారణ జలుబు మరియు రోగనిరోధకతపై లఘుటీక రాయండి.
జవాబు:
సాధారణ జలుబు :
ఈ వ్యాధి రైనోవైరస్ సమూహానికి చెందిన వైరస్ల వలన వస్తుంది. ఇది ముక్కు, వాయు మార్గానికి మాత్రమే సంక్రమిస్తుంది. ఊపిరితిత్తులపై ప్రభావం చూపదు. దీనికారణంగా ముక్కులో, వాయునాళంలో శ్లేష్మం స్రవించి శ్వాసలో ఇబ్బందులు (ముక్కు దిబ్బడ) ఎదురవుతాయి.

సంక్రమణ :
వ్యాధి సోకిన వ్యక్తి తుమ్ములు, దగ్గు వలన వెలువడిన నీటి తుంపరలను పీల్చడం ద్వారా (గాలి ద్వారా వ్యాప్తి) నేరుగాను, కలుషితమైన వస్తువులు అనగా రోగి వినియోగించే వస్తువు ద్వారా కర్చీఫ్, పెన్నులు, పుస్తకాలు, కప్పులు, డోర్ హాండిల్స్, కంప్యూటర్ కీబోర్డు, మౌస్ మొదలైన వాటిని శుభ్రపరచకుండా ఇతరులు వినియోగించడం వలన ఇతరులకు వ్యాప్తి చెందుతుంది.

వ్యాధి లక్షణాలు :
ముక్కు మూసుకుపోవడం (ముక్కు దిబ్బడ, ముక్కు కారడం, తుమ్ములు, దగ్గడం, గొంతునొప్పి, బొంగురు గొంతు, తలనొప్పి, అలసట మొదలైన లక్షణాలు కనిపిస్తాయి. సాధారణంగా 3 నుంచి 7 రోజులు ఉంటాయి.

ఈ వ్యాధి సోకినవారు ముఖ్యంగా విశ్రాంతి తీసుకొనవలెను. దుమ్ము, పొగ పీల్చకూడదు. గాటైన వాసనలు పీల్చరాదు. వేడి నీటి ఆవిరి పట్టినట్లయితే త్వరగా ఉపశమనం లభిస్తుంది.

ప్రశ్న 12.
తామర మరియు రోగనిరోధకతపై లఘుటీక రాయండి.
జవాబు:
తామర మానవులలో కలిగే సాధారణమైన, శిలీంధ్రాలవల్ల సంక్రమించే సంక్రమణ వ్యాధి. ఇది మైక్రోస్పోరం, ట్రైకోఫైటాన్, ఎఫిడెర్మోఫైటాన్ అనే ప్రజాతుల శిలీంధ్రాల వలన సంక్రమిస్తుంది. వేడిమి, తేమ ఈ శిలీంధ్రాల పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. ఇది సాధారణంగా చర్మపు ముడుతలలో అంటే గజ్జలు, కాలివేళ్ళు, చంకలు మొదలైన భాగాలలో పెరుగుతాయి.

సంక్రమణ :
వ్యాధి సోకిన వ్యక్తి వాడిన వస్తువులు అనగా తువ్వాలు, దుస్తులు, దువ్వెన మొదలైన వస్తువుల వలన మరియు మట్టి ద్వారా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది.

వ్యాధి లక్షణాలు :
పొడిగా, పొలుసులు గల గుండ్రటి పుండ్లు లేదా దద్దురులు ఏర్పడతాయి. దీని వలన తీవ్రమైన దురద ఉంటుంది. ఇవి చర్మం, గోరు, తలపై కూడా ఏర్పడతాయి.

ఈ వ్యాధి నివారణకు పరిశుభ్రత ప్రధానమైన మార్గం.

ప్రశ్న 13.
పొగాకు వల్ల జరిగే దుష్పరిణామాలను తెలపండి. [Mar. ’14]
జవాబు:
పొగాకును మానవుడు వివిధ రూపాలలో 400 సం॥రాలుగా వినియోగిస్తున్నాడు. దీనిలో వివిధ రసాయన పదార్థాలతోబాటుగా నికోటిన్ అనే ఆల్కలాయిడ్ ఉంటుంది. పొగాకును గుట్కా రూపంలో, పొగత్రాగడం (చుట్ట, బీడి, సిగరెట్), నమలడం లేదా నశ్యం రూపంలో పీల్చడం మొదలైన రూపాలలో వినియోగిస్తారు.

పొగాకును పొగరూపంలో (చుట్ట, బీడి, సిగరెట్) వినియోగించడం వలన పొగలో ఉండే కార్బన్మౌనాక్సైడ్ ఎర్రరక్త కణాలలోని హిమోగ్లోబిన్తో కలిసి, Hb యొక్క ఆక్సిజన్ రవాణా సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. దీనిలోని నికోటిన్ ఎడ్రినల్ గ్రంథిని ప్రేరేపించి ఎడ్రినాలిన్, నార్ – ఎడ్రినాలిన్ను రక్తంలోకి విడుదల చేస్తుంది. ఈ హార్మోన్లు రక్త పీడనాన్ని, గుండె కొట్టుకునే వేగాన్ని పెంచుతాయి. పొగతాగడం వల్ల బ్రాంకైటిస్, ఎంఫిసిమా, కరోనరీ గుండె వ్యాధి, జఠరంలో పుండ్లు, గొంతు, ఊపిరితిత్తులు, మూత్రాశయం మొదలైన వాటిలో కాన్సర్ వచ్చే అవకాశాలున్నాయి.

పొగతాగే అలవాటు తీవ్రమైన మత్తుమందులు – మార్ఫిన్, హెరాయిన్, కొకైన్ను కూడా తీసుకునే అలవాటుకు దారితీస్తుంది. పొగాకును నమలడం వలన, గుట్కా రూపంలో నమలడం వలన నోటి కాన్సర్కు అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇటువంటి పరిణామాలు చూస్తున్నా ఇంకా యువతలో, ముసలివారిలో పొగత్రాగడం, పొగాకు ఉత్పత్తుల వినియోగం ఇంకా మాన్పించలేకపోతున్నాము.

ప్రశ్న 14.
ఓపియోడ్స్పై లఘుటీక రాయండి.
జవాబు:
ఓపియోడ్స్ :
ఓపియోడ్స్ అనునవి మాదకద్రవ్యాలు. మందులను ఓపియం పాపి, పపావర్ సోమ్నిఫెరం (దీన్ని వాడుకలో నల్లమందు మొక్క అంటారు) నుంచి సేకరిస్తారు. ఈ మందులు మన కేంద్రనాడీ వ్యవస్థ, జీర్ణనాళంలోని ప్రత్యేక ఓపియోడ్ గ్రాహకాలతో బంధనం (bind) చెంది తమ ప్రభావాన్ని ప్రదర్శిస్తాయి. వీటిలో మార్ఫిన్, హెరాయిన్ మొదలైనవి ఉన్నాయి.

i) మార్ఫిన్ :
దీన్ని పాపి మొక్క అపరిపక్వ విత్తన గుళిక (capsule pad) యొక్క ఎండిన లేటెక్స్ (latex) నుంచి సేకరిస్తారు. ఇది రంగులేని స్ఫటికం (crystal) లేదా తెలుపు పటికపొడి రూపంలో లభిస్తుంది.

దుర్వినియోగ విధానం :
సాధారణంగా నీరు లేదా సూది (injection) ద్వారా తీసుకొంటారు.

ప్రభావం :
ఇది చాలా సమర్థమైన మత్తుమందు నొప్పి/బాధ నుంచి (pain killer) ఉపశమనం కలిగిస్తుంది. శస్త్ర చికిత్స చేసుకున్న రోగులకు ఈ మందు చాలా ఉపయోగపడుతుంది.

ii) హెరాయిన్ :
ఇది తెల్లని, వాసన రహిత, ఘాటుగా ఉండే స్ఫటిక సంయోగ పదార్థం. మార్ఫిన్ ను ఎసిటైలేషన్ చేయడం వల్ల ఇది ఏర్పడుతుంది. రసాయనికంగా దీన్ని డైఎసిటైల్ మార్ఫిన్ (diacetyl morphine) అంటారు. దీన్ని స్మాక్ (smack) అని కూడా అంటారు.

దుర్వినియోగ విధానం :
బలవంతంగా పీల్చుకోవడం (స్నార్టింగ్ – snorting) లేదా సూది ద్వారా తీసుకోవడం.

ప్రభావం :
ఇది ఉపశమనం కలిగించే మందు (anti depressant). ఇది శరీర చర్యలను నెమ్మదిస్తుంది.

AP Inter 1st Year Zoology Study Material Chapter 6 మానవ సంక్షేమంలో జీవశాస్త్రం

ప్రశ్న 15.
కనబినాయిడ్స్పై లఘుటీక రాయండి.
జవాబు:
కనాబినాయిడ్స్ :
కనాబినాయిడ్స్ అనునవి మాదకద్రవ్యాలు. ఇవి సమూహ రసాయనాలు. వీటిని భారత హెంప్ మొక్క కనాబిస్ సటైవా (Indian hemp plant – Cannabis sativa) (దీన్ని వాడుకలో గంజాయి మొక్క అంటారు) నుంచి సంగ్రహిస్తారు. ఇవి మెదడులోని కనబినాయిడ్ గ్రాహకాలకు బంధించబడతాయి. మొక్క పుష్పాల చివరలు, పత్రాలు, రెసిన్ ను వివిధ పాళ్లలో వినియోగించి మరిజువాన, హాషిష్, చరస్, గంజా (marijuana, hashish, charas, ganja) ను ఉత్పత్తి చేస్తారు. ఈ మధ్యకాలంలో కనబినాయిడ్స్ను క్రీడాకారులు (డోపింగ్ -doping ) కూడా దుర్వినియోగం చేస్తున్నారు.

దుర్వినియోగ విధానం :
ముక్కుతో పీల్చడం లేదా నోటితో మింగడం.

ప్రభావం :
ఇది హృదయ ప్రసరణవ్యవస్థపై ప్రభావాన్ని చూపిస్తుంది.

ప్రశ్న 16.
కొకైన్పై లఘుటీక రాయండి.
జవాబు:
కోకా ఆల్కలాయిడ్ లేదా కొకైన్ :
దక్షిణ అమెరికాలో పెరిగే కోకా యొక్క ఎరిత్రోజైలం కోకా (Erythroxylum coca) ఆకుల నుంచి తెల్లటి ఆల్కలాయిడ్ పటికను తీస్తారు. దీన్ని సాధారణంగా కోక్ లేదా క్రాక్ (crack) అంటారు.

దుర్వినియోగ విధానం :
బలవంతంగా పీల్చడం (snorting).

ప్రభావం :
ఇది కేంద్ర నాడీవ్యవస్థను శక్తివంతంగా ప్రేరేపిస్తుంది. డోపమైన్ అనే నాడీ అభివాహకం (neurotransmitter) రవాణాలో జోక్యం చేసుకొంటుంది. దీనివల్ల ఉల్లాసస్థితి (euphoria), శక్తి పెరుగుదల కలుగుతుంది. అధిక మోతాదులు భ్రాంతికి (hallucinations) కారణమవుతాయి.

బాగా ప్రాచుర్యం గల హాల్లుసినోజెనిక్ ధర్మాలు గల మొక్కలలో అట్రోపా బెల్లడొనా, దతూరా ఉన్నాయి. బార్బిటురేట్ (barbiturates – నిద్రమాత్రలు), ఆంఫీటమైన్స్ (నిద్రహారిణి మాత్రలు),

బెంజోడయాజిపైన్స్ (Benzodiazepines : ప్రశాంతకాలు – tranquilizers), లైసర్జిక్ ఆమ్ల డైఈథైల్ అమైడ్స్ (LSD), ఇతర మందులను సాధారణంగా మానసిక వ్యాధిగ్రస్తులకు అంటే వ్యాకులత/కుంగిపోవడం(depression), నిద్రలేమి (insomnia) మొదలైన వాటిలో బాధపడే రోగుల చికిత్సలో వినియోగించే మందులను దుర్వినియోగం చేస్తున్నారు.

ప్రశ్న 17.
కౌమారదశను భేద్యమైన దశగా ఎందుకంటారు?
జవాబు:
కౌమార దశ :
దీన్ని యవ్వనారంభ దశ (Puberty) కు ప్రౌఢ దశకు మధ్యకాలం అంటారు. ఈ దశ చిన్నతనానికి (childhood), ప్రౌఢ దశకు వారధి. 12-18 సం|| వయస్సు మధ్యకాలాన్ని కౌమారదశ అంటారు. ఈ కాలంలో పిల్లలు పరిపక్వత చెందుతారు. దీనితో అనేక జీవసంబంధ, ప్రవర్తనా మార్పులు ముడిపడి ఉంటాయి. ఒక వ్యక్తి మానసిక, మనోవిజ్ఞాన అభివృద్ధిలో కౌమారదశను హానిపొందే (vulnerable) దశగా పరిగణిస్తారు. కనుక ఈ దశను భేద్యమైన దశగా వర్ణిస్తారు. ఈ వయస్సులో యువత జిజ్ఞాస (curiosity), కోరిక (desire)తో సాహసం (adventure) మరియు ప్రకోపం/రెచ్చగొట్టుట (excitement) వల్ల చేసే ప్రయోగాలు (experiments) యువతను పొగాకు, మందులు, ఆల్కహాలు వినియోగానికి ప్రేరేపించే (motivate) కారణాలు. కానీ మొట్టమొదటసారిగా మందులు లేదా ఆల్కహాల్ వినియోగం కేవలం జిజ్ఞాస, ప్రయోగాలతోనే ప్రారంభమవుతుంది.

ఆ తరవాత ఇబ్బందులనుంచి తప్పించుకోవడానికి వీటిని వినియోగిస్తారు. ఈ మధ్యకాలంలో యువత పరీక్షలు లేదా విద్యా విషయాలలో(academics) ప్రగతి సాధించే క్రమంలో ఒత్తిడి (stress) వల్ల మత్తుమందుల వైపు మొగ్గుతున్నారు. దీనికి తోడుగా టెలివిజన్, సినిమాలు, వార్తాపత్రికలు, ఇంటర్నెట్లు దోహదపడుతున్నాయి. వీటితో పాటు ఆసరా ఇవ్వని లేదా చపలచిత్త (unstable) కుటుంబం, తోటివారి వల్ల ఒత్తిడి (peer pressure) అనే అంశాలు కూడా యువతలో పొగాకు, మందులు, ఆల్కహాల్ దుర్వినియోగానికి ప్రేరేపిస్తాయి.

ప్రశ్న 18.
వ్యసనం, ఆధారం మధ్య భేదాలను తెలపండి.
జవాబు:
వ్యసనం (addiction) మరియు ఆధారపడటం (dependence) :
పొగాకు, మందులు, ఆల్కహాలు దుర్వినియోగం వ్యసనానికి, ఇతరులపై ఆధారపడటానికి దారితీస్తుంది.

వ్యసనం :
ఇది మానసిక ఉల్లాసస్థితితో కూడిన బంధం. ఇది పొగాకు, మందులు, ఆల్కహాలు వినియోగానికి తనలో గల వ్యసన ప్రవృత్తే (addictive nature) ముఖ్యమైందని ఎవ్వరూ గుర్తించరు. TDA లను తరచుగా వినియోగించడం వల్ల శరీరంలో గ్రాహకాల సహనస్థాయి (tolerance level) పెరుగుతుంది. దీనివల్ల గ్రాహకాలు ఎక్కువ మోతాదు (dose) కు స్పందిస్తాయి. దీనితో TDAలను ఎక్కువ తీసుకోవడం వల్ల వ్యసనపరులవుతారు. TDAలను ఒక్కసారి తీసుకొన్నా అది వ్యసనానికి దారి తీయవచ్చు అనే విషయాన్ని బాగా గుర్తుంచుకోవాలి. వ్యసనశక్తి (addictive potential) గల పొగాకు, మందులు, ఆల్కహాల్స్ (TDAలు), వ్యసన స్వభావంగల (vicious circle) గుంపులోకి లాగేస్తాయి. దీనితో మందుల దుర్వినియోగం క్రమం తప్పకుండా మొదలై అందులోనుంచి బయటకు రాలేని స్థితికి త్వరగా దారితీస్తుంది. ఈ స్థితిలో సరైన సలహా లేదా కౌన్సిలింగ్ లేనప్పుడు ప్రజలు పూర్తిగా వ్యసనపరులై దానిపైనే ఆధారపడతారు.

ఆధారపడటం :
ఇది క్రమం తప్పని మోతాదులో మత్తుమందులు లేదా ఆల్కహాల్ వినియోగాన్ని ఒకేసారి మానివేయడం వల్ల శరీరంలో కనిపించే అసంతృప్తి లక్షణం లేదా ఉపసంహరణ సిండ్రోమ్ (withdrawl syndrome) . ఈ సిండ్రోమ్లో ఆందోళన(anxiety), వణకడం (tremors), వికారం(nausia), చెమట పట్టడం మొదలైన లక్షణాలు కనిపిస్తాయి. TDAలను వాడటం మళ్ళీ మొదలెడితే ఇవి కనిపించవు. ఆధారం అనేది అన్ని సామాజిక కట్టుబాట్లను వదిలే స్థితికి దారితీస్తుంది.

AP Inter 1st Year Zoology Study Material Chapter 6 మానవ సంక్షేమంలో జీవశాస్త్రం

ప్రశ్న 19.
TDA దుర్వినియోగాన్ని దృష్టిలో ఉంచుకుని “వ్యాధి చికిత్స కంటే నివారణ మంచిది” నిరూపించండి.
జవాబు:
TDA అనగా పొగాకు (Tobacco), మత్తుమందులు – మాదకద్రవ్యాలు (Drugs), సారాయి (Alcohol)లు. వీటి వినియోగం యువతపై చాలా చెడు ప్రభావాన్ని చూపిస్తున్నాయి. పొగాకు వినియోగం ఊపిరితిత్తులలో, నోటిలో కాన్సర్కు దారితీసే అవకాశం ఉంది. ఇంకా దీని ప్రభావం జీర్ణవ్యవస్థ, గుండె, రక్తప్రసరణ, శ్వాసవ్యవస్థపై విపరీత పరిణామాలు చోటు చేసుకుంటాయి.

మత్తుమందులు – మాదకద్రవ్యాలు – వీటి వినియోగాల మానసిక, శారీరక రుగ్మతలకు దారి తీస్తుంది.

ఆల్కహాల్ వినియోగం మానసిక దౌర్బల్యానికి దారితీసి వ్యక్తి వికాసాన్ని నాశనం చేస్తుంది. ఆరోగ్యాన్ని క్షీణింపజేస్తుంది. TDA కు అలవాటు పడిన వ్యక్తులు మానసికంగా, శారీరకంగా, సామాజికంగా పతనానికి గురి అవుతారు. చికిత్స కంటే నివారణ మంచిది కనుక TDA కి అలవాటు పడిన వారిని క్రింది జాగ్రత్తలు పాటించినట్లయితే మంచి పౌరులుగా మార్చవచ్చును.

  1. తల్లిదండ్రులు తమ పిల్లలపై ఇతరులతో పోల్చి వత్తిడి తేకూడదు.
  2. తల్లిదండ్రులు, ఉపాధ్యాయ యువతకు వారి ప్రవర్తనను గుర్తించి హితబోధ చేయాలి.
  3. మత్తుమందులు, పొగతాగడం, ఆల్కహాల్ త్రాగడం వంటి వాటి వలన సంభవించే అనారోగ్యాలను వారికి తెలియజేయాలి. వాటి పీడితులను గూర్చి వారికి తెలియజేయాలి.
  4. యువతకు విద్యావిషయాలు, మానసిక వత్తిడి, సామాజిక సమస్యలు, వయస్సుతోపాటు వచ్చే మార్పులు జీవితంలో ఒక భాగం అని, ప్రత్యేకత ఏమీ కాదని, వాటిని అధిగమించే విధంగా హితబోధ చేయాలి.
  5. మనోవిజ్ఞాన వేత్తలు, మానసిక వైద్యులు, రిహాబిలిటేషన్ ప్రోగ్రామ్స్, డీఅడిక్షన్ సలహాలు, వైద్యుల సూచనలు వారికి అందుబాటులో తీసుకురావాలి.

పై విధంగా వివిధ కార్యక్రమాల ద్వారా యువతను దుర్వినియోగం నుండి దూరంగా ఉంచి మంచి పౌరులుగా తీర్చిదిద్దవచ్చును.

దీర్ఘ సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ఎంటమీబా హిస్టోలైటికా నిర్మాణాన్ని, జీవిత చక్రాన్ని వివరించండి. పటం గీసి భాగాలను గుర్తించండి.
జవాబు:
ఎంటమీబా హిస్టోలైటికా మానవుడి పెద్దపేగు, అంధనాళంలో ఉండే అంతర పరాన్న జీవి. దీని వలన మానవుడికి అమీబిక్ డిసెంటరీ లేదా అమీబియాసిస్ అనే వ్యాధి కలుగుతుంది. ఇది తన జీవిత చక్రంను ఒకే అతిథేయిలో పూర్తి చేసుకొనును. కనుక దీనిని “మోనోజెనిటిక్” పరాన్న జీవి అందురు. దీని జీవిత చక్రములో రెండు దశలుంటాయి.

  1. మాగ్నదశ లేక పోషకజీవి.
  2. మైన్యూట దశ లేక కోశస్థ పూర్వ దశ

1. మాగ్నదశ లేక పోషకజీవి :
పోషకజీవి పెద్ద ప్రేగు గోడలలో వుంటుంది. దీనిని ఆవరించి ప్లాస్మాలెమ్మా అనే పొర ఉంటుంది. దీనిలో బాహ్య జీవ ద్రవ్యం మందంగా పారదర్శకంగా కణికారహితంగావుంటుంది. అంతర్జీవ ద్రవ్యం కణికాయుతంగా ఉంటుంది. అంతరజీవ ద్రవ్యంలో తిత్తివంటి కేంద్రకంవుంటుంది. కేంద్రకం మధ్యలో ఎండోసోమ్ అనే నిర్మాణమువుంటుంది. కేంద్రక త్వచం యొక్క లోపలి తలాన్ని అంటి పెట్టుకొని పూసలవంటి క్రొమాటిన్ పదార్థం వుంటుంది. దీని నుండి సన్నని క్రొమాటిన్ తంతువులు, కేంద్రక బిందువు వైపుకు చక్రంలోని చువ్వల మాదిరిగా ప్రసరించి ఉంటాయి. దీని వలన కేంద్రకం బండి చక్రం రూపంలో కనిపిస్తుంది. పోషకజీవి ఒక వేలు వంటి మిధ్యాపాదాన్ని కలిగి ఉంటుంది. దీని ఆహార రక్తికల్లో ఎర్రరక్త కణాలుంటాయి. పోషక జీవి ద్విదావిచ్ఛిత్తి ద్వారా తన సంఖ్యను పెంచుకుంటుంది. వీటిలో కొన్ని పిల్ల జీవులు ప్రేగు కుహరంలోకి ప్రవేశించి కోశస్థ పూర్వదశగా మారతాయి.

2. కోశస్థ పూర్వదశ :
ఈ దశలో ఎంటమీబా ఆహార రక్తికలను, మిథ్యాపాదాన్ని కోల్పోతుంది, గోళాకారంగా మారుతుంది. పరిమాణం తగ్గుతుంది. గ్లైకోజన్ కణికలను, ఒకటి లేదా రెండు క్రొమాటాయిడ్ దేహాలను కణ ద్రవ్యంలో నిల్వచేసుకుంటుంది. క్రొమాటాయిడ్ దేహాలు రైబోన్యూక్లియో ప్రోటీను తత్వాన్ని కలిగి ఉంటాయి.
AP Inter 1st Year Zoology Study Material Chapter 6 మానవ సంక్షేమంలో జీవశాస్త్రం 1

కోశస్థ దశ :
కోశస్థ పూర్వదశ తన చుట్టూ సున్నితమైన కోశాన్ని తయారుచేసుకొని కోశస్థ దశను చేరుతుంది. కోశికరణం జరగగానే పరాన్న జీవిలోని కేంద్రకం రెండు సమవిభజనలను జరుపుకొని చతుష్కేంద్రక కోశంగా రూపొందుతుంది. ఈ దశ ఏర్పడటం ఎంటమీబా హిస్టోలైటికా యొక్క ప్రత్యేక లక్షణం.

సంక్రమణం :
చతుష్కేంద్రక దశలు మానవునికి సంక్రమణ దశలు. ఇవి మలముతో పాటు బయటకి విసర్జింపబడతాయి. ఈ కోశాలు కాయగూరకు అంటుకొని గాని, ఆహారపదార్థాలతో కలిసిగాని నీటిలో తేలుతూ గాని ఉంటాయి. ఈ విధంగా కలుషితమైన నీటిని లేదా ఆహారాన్ని మానవుడు స్వీకరించుట వలన పరాన్నజీవి అతిథేయిని చేరుతుంది. ఈ దశలను అతిథేయికి చేరవేయటంలో, బొద్దింకలు, ఈగలు కూడ ఏజెంట్లుగా పనిచేస్తాయి.

వికోశీకరణ :
చతుష్కేంద్రక కోశాలు కొత్త అతిథేయి పేగులోకి ప్రవేశించిన తరువాత అక్కడి ఎంజైముల చర్య వలన కోశము కరుగుతుంది. నాలుగు కేంద్రకములు గల జీవులు బయటకు వస్తాయి. ఈవిధంగా కోశం నుండి పరాన్నజీవి బయటకు రావడాన్ని వికోశికరణము అంటారు. వికోశీకరణ చెంది విడుదలైన నాలుగు కేంద్రకాలు గల పరాన్నజీవి “మెటాసిస్టిక్” దశ అంటారు.

మెటాసిస్టిక్ దశ :
మెటాసిస్టిక్ రూపములోని నాలుగు కేంద్రకాలు విభజన చెంది, ఎనిమిది కేంద్రకాలుగా ఏర్పడతాయి. జీవ ద్రవ్యం కూడా విభజన చెంది కేంద్రకాల చుట్టు చేరుతుంది. దీనివలన మొత్తం 8 పిల్ల ఎంటమీబాలు ఏర్పడి, పెద్దపేగు గోడను చేరి పోషక జీవులుగా మారతాయి.
AP Inter 1st Year Zoology Study Material Chapter 6 మానవ సంక్షేమంలో జీవశాస్త్రం 2

ప్రశ్న 2.
మానవుడిలో ప్లాస్మోడియం వైవాక్స్ జీవితచక్రాన్ని వివరించండి. దాని పటం గీసి భాగాలు గుర్తించండి.
జవాబు:
మానవునిలో (మాధ్యమిక అతిథేయి) ప్లాస్మాడియం’ జీవిత చక్రం :
మాధ్యమిక అతిథేయి అయిన మానవుడిలో ప్లాస్మాడియం విఖండ జననం అనే అలైంగిక పద్ధతిలో తన జీవిత చక్రాన్ని పూర్తి చేస్తుంది. ఇది రెండు భాగాలుగా ఉంటుంది. కాలేయంలో జరిగే దానిని కాలేయ విఖండ జననం అని, ఎర్ర రక్తకణాలలో జరిగేదానిని రక్తకణ విఖండ జననం అని అంటారు.

కాలేయ విఖండ జననం :
ఇది రెండు రకాలుగా ఉంటుంది. రక్తకణపూర్వ, రక్తకణ బాహ్య జీవిత చక్రం.

రక్తకణ పూర్వ జీవితచక్రం :
స్పోరోజాయిట్ దశలున్న దోమ మానవుడిని కుట్టినప్పుడు దోమ లాగా జలంతో బాటుగా స్పోరోజాయిట్లు మానవ రక్తంలో ప్రవేశిస్తాయి. రక్తంలోకి ప్రవేశించిన స్పోరోజాయిట్లు అర్థగంటలోపులోనే కాలేయకణాలలోకి చేరి, కాలేయకణ పదార్థాన్ని ఆహారంగా తీసుకుంటు తమ ఆకృతిని గోళాకారంగా మార్చుకుంటాయి. వీటిని షైజాంట్ అంటారు. వీటిలోని కేంద్రకం బహుధావిచ్ఛిత్తి చెంది అనేక పిల్ల కేంద్రకాలను ఏర్పరుస్తుంది. ఈ కేంద్రకాల చుట్టూ కణద్రవ్యం చేరి అనేక పిల్లజీవులు ఏర్పడతాయి. ఇప్పుడు షైజాంట్ పగిలి అనేక పిల్ల క్రిప్టోజాయిట్స్ కాలేయ కణాలలోకి విడుదలవుతాయి. వీటిలో కొన్ని ఎర్ర రక్తకణాలలో ప్రవేశిస్తాయి. కొన్ని తిరిగి కొత్తగా కాలేయ కణాలలోకి ప్రవేశిస్తాయి. ఈ ప్రక్రియ 8 రోజులు పడుతుంది.

రక్తకణ బాహ్య జీవిత చక్రం :
క్రిప్టోజాయిట్స్ తిరిగి కాలేయ కణాలను చేరి రక్తకణ పూర్వ చక్రంలో మాదిరిగా అనేక మార్పులు చెంది రెండోదశ మీరోజాయిట్లను మెటాక్రిప్టోజాయిట్లను విడుదల చేస్తాయి. వీటిలో రెండు రకాలుంటాయి. చిన్నవిగా ఉండే సూక్ష్మమెటాక్రిప్టోజాయిట్లు, పెద్దవిగా ఉండే స్థూల మెటాక్రిప్టోజాయిట్లు. ఈ ప్రక్రియ దాదాపు 2 రోజులలో పూర్తి అవుతుంది. వీటిలో స్థూల మెటాక్రిప్టోజాయిట్లు తిరిగి కొత్త కాలేయకణాలను చేరి రక్తకణ బాహ్యిజీవితచక్రాన్ని ప్రారంభిస్తాయి. సూక్షక్రిప్టోజాయిట్లు ఎర్రరక్తకణాలను చేరి రక్తకణ జీవిత చక్రాన్ని ప్రారంభిస్తాయి.

ప్లాస్మోడియం స్పోరోజాయిట్ రూపంలో మానవ రక్తంలో ప్రవేశించినప్పుడినుండి తిరిగి రెండవసారి క్రిప్టోజాయిట్లు ఎర్రరక్తకణాలోకి ప్రవేశించడానికి పట్టేకాలాన్ని ప్రీపేటెంట్ కాలం అంటారు. ఈ సమయంలో ఎలాంటి రోగలక్షణాలు కనిపించవు.

రక్తకణ జీవిత చక్రం :
ప్లాస్మోడియం జీవితచక్రంలో ఈ భాగాన్ని కామిల్లోగాల్జి అనే శాస్త్రవేత్త వివరించాడు. కనుక దీనిని గాల్జిచక్రం అని కూడా అంటారు. ఇది రక్తకణ పూర్వ లోని క్రిప్టోజాయిట్లతోగాని, రక్తకణ బాహ్యజీవితచక్రంలోని సూక్ష్మమెటాక్రిప్టోజాయిట్స్ లాగా ప్రారంభమవుతుంది.

ఎర్రరక్తకణాలోకి ప్రవేశించగానే మీరోజాయిట్లు గోళాకార పోషక జీవులుగా మారతాయి. ఇవి RBC లోని హిమోగ్లోబిన్ను ఆహారంగా తీసుకోవడం ప్రారంభమవుతుంది. వీటిలో ఒక చిన్న రిక్తిక ఏర్పడి, పరిమాణంలో పెరుగుతూ పోషకజీవిలోని జీవపదార్థాన్ని కేంద్రకాన్ని అంచువైపు నెట్టడం వలన ఉంగరం మాదిరిగా కనిపిస్తుంది. ఈ దశను అంగూళీక దశ అంటారు. తరువాత రిక్తిక అదృశ్యమవుతుంది. పరాన్నజీవి మిథ్యాపాదాలను ఏర్పరుచుకుంటుంది. ఈ దశను అమీబాయిడ్ దశ అంటారు. ఎర్రరక్తకణ జీవ పదార్థాన్ని తింటు పోషకజీవి పరిమాణం పెరుగుతుంది, దీనివలన RBC పరిమాణం పెరుగుతుంది. పరాన్నజీవి హిమోగ్లోబిన్ లోని గ్లోబిన్ ప్రోటీన్ ను జీర్ణం చేసుకొని జీర్ణం కాని హిమ్ బాగాని హిమోజాయిన్ అనే కణికలుగా ఏర్పరుస్తుంది.

ఇది మలేరియా జ్వరాన్ని కలుగుజేసే విష పదార్థం. ఇది చిన్న ఎర్రని మచ్చలుగా RBC జీవ పదార్థంతో ఏర్పడతాయి. వీటిని షఫ్నర్ చుక్కలు అంటారు. ప్లాస్మోడియం మిథ్యాపాదాలను కోల్పోయి బాగా పెరిగి RBC ని మొత్తంగా ఆక్రమించి షైజాంట్గా మారుతుంది. దీనిలోని కేంద్రకం విఖండజనన జరుపుట 12 నుండి 24 ఎర్రరక్తకణ మీరోజాయిట్స్ను ఏర్పరుస్తుంది. ఇవి RBC తో గులాబిరేకులాగా మారి రోజెట్ దశగా మారుతుంది. చివరిగా ఎర్రరక్తకణం పగిలి మీరోజాయిట్స్, హీమోజాయిన్ రక్తంలోకి విడుదలవుతాయి.

రక్తంలోకి విడుదలైన మీరోజాయిట్స్ తిరిగి కొత్త RBC లలోకి ప్రవేశిస్తాయి. హీమోజాయి విషపదార్థం ప్రభావం వలన మలేరియా జ్వరం వస్తుంది. స్పోరోజాయిట్ మొదట మానవుడిలో ప్రవేశించింది మొదలు మలేరియా జ్వర లక్షణాలు వచ్చే వరకు పట్టేకాలాన్ని పొదిగేకాలం అంటారు. ఇది దాదాపు 10 నుండి 14 రోజులు పడుతుంది.

సంయోగ బీజమాతృకలు ఏర్పడటం :
అనేక పర్యాయాలు రక్తకణ జీవితచక్రం పూర్తిచేసుకున్న ప్లాస్మోడియం మీరోజాయిట్స్ కొన్ని సంయోగబీజ మాతృకలుగా మారతాయి. వీటిలో రెండురకాలుగా ఉంటాయి. సూక్ష్మంగా ఉన్న వాటిని సూక్ష్మ లేదా పురుష సంయోగబీజమాతృకలు అని, పెద్దవిగా ఉన్న వాటిని స్థూల లేదా స్త్రీ సంయోగ బీజమాతృకలు అంటారు. ఈ దశలు తదుపరి దోమలో ప్రవేశించి మాత్రమే అభివృద్ధి చెందుతాయి.
AP Inter 1st Year Zoology Study Material Chapter 6 మానవ సంక్షేమంలో జీవశాస్త్రం 4

ప్రశ్న 3.
దోమలో ప్లాస్మోడియం వైవాక్స్ జీవితచక్రాన్ని పటం సహాయంతో వివరించండి. [Mar. ’14]
జవాబు:
ప్లాస్మోడియం వైవాక్స్ దోమలో జరుపుకునే జీవిత చక్రాన్ని సర్ రోనాల్డ్స్ వివరించడం వలన దీనిని రాస్ చక్రం అని కూడా అంటారు.

ఈ ఎనాఫిలిస్ దోమ వ్యాధిగ్రస్తుడైన మానవుణ్ని కుట్టి రక్తాన్ని పీల్చినప్పుడు రక్తం సంయోగబీజ మాతృకలు, ఇతర దశలు దోమ అన్నాశయాన్ని చేరతాయి. దోమ జీర్ణ వ్యవస్థలో సంయోగబీజ మాతృకలు మాత్రమే జీవించి ఉంటాయి. మిగతా దశలు జీర్ణమవుతాయి.

ప్లాస్మోడియం తన జీవిత చక్రంలో లైంగిక ప్రత్యుత్పత్తి దోమలో పూర్తి అవుతుంది. దీనిలో క్రింది దశలుంటాయి.

  1. బీజకణోత్పత్తి (Gametogony)
  2. ఫలదీకరణం (Fertilization)
  3. గమనసంయుక్తబీజం, సంయుక్త బీజకోశాలు ఏర్పడటం (Formation of ookinite and oocysts)
  4. సిద్ధబీజోత్పత్తి (sporogony)

i) బీజకణోత్పత్తి (Gametogony) :
సంయోగబీజ మాతృకణాల నుంచి పురుష, స్త్రీ బీజకణాలు ఏర్పడటాన్ని బీజకణోత్పత్తి అంటారు. దోమ అన్నాశయకుహరంలో బీజకణాలు ఏర్పడతాయి.

పురుష సంయోగబీజకణాలు ఏర్పడటం :
ఈ ప్రక్రియలో సూక్ష్మ సంయోగబీజమాతృక యొక్క కేంద్రకం విభజనతో ఎనిమిది పిల్ల కేంద్రకాలను ఏర్పరుస్తాయి. వీటిని ప్రాక్కేంద్రాలు (Pronuclei) అంటారు. ఈ కేంద్రకాలు అంచులను చేరతాయి. జీవపదార్థం ఎనిమిది కశాభాలను పోలిన కీలితాలను ఏర్పరుస్తుంది. ఒక్కొక్క కేంద్రక భాగం ఒక్కొక్క జీవపదార్థ కీలితంలోకి ప్రవేశించి కశాభం లాంటి సూక్ష్మ సంయోగబీజాలు లేదా పురుష సంయోగబీజాలను ఏర్పరుస్తుంది. ఈ సూక్ష్మ సంయోగబీజాలు విసిరిన కొరడా మాదిరి కదలికలను (lashing movements) చూపుతూ జీవపదార్థం నుంచి విడుదలవుతాయి. ఈ విధంగా పురుష సంయోగబీజాలు విడుదల కావడాన్ని కశాభ నిర్మోచనం (exflagellation) అంటారు.

స్త్రీ సంయోగబీజకణాలు ఏర్పడటం :
స్త్రీ సంయోగబీజ మాతృకణాలు కొద్ది మార్పులతో స్త్రీ సంయోగ బీజకణంగా ఏర్పడుతుంది. దీన్ని పరిపక్వత (maturation) అంటారు. స్త్రీ సంయోగ బీజకణాల కేంద్రకం పరిధి వైపు కదులుతుంది. ఆ ప్రాంతంలో జీవపదార్థం ఉబ్బుతుంది. ఉబ్బిన ఈ భాగాన్ని ఫలదీకరణ శంకువు (fertilization cone) అంటారు.

ii) ఫలదీకరణం :
స్త్రీ, పురుష బీజకణాలు కలవడాన్ని ఫలదీకరణ అంటారు. ఇది దోమ అన్నాశయ కుహరంలో జరుగుతుంది. సూక్ష్మ సంయోగబీజాలు చురుకుగా కదులుతూ స్థూల సంయోగబీజం యొక్క ఫలదీకరణ శంకువును తాకగానే, దానిలోకి ప్రవేశిస్తుంది. రెండు బీజకణాల ప్రాక్కేంద్రకాలు, జీవపదార్థం కలిసి సంయుక్త కేంద్రకం (synkaryon) ఏర్పడుతుంది. ఈ కలయికలో సంయోగబీజాలు పరిమాణరీత్యా అసమానంగా ఉంటాయి.

కాబట్టి దీన్ని అసమసంయోగం (anisogamy) అంటారు. సంయుక్త కేంద్రకాన్ని కలిగిన స్త్రీ సంయోగ బీజాన్ని సంయుక్త బీజం (zygote) అంటారు. ఇది గుండ్రంగా ఉండి కదలలేదు.
AP Inter 1st Year Zoology Study Material Chapter 6 మానవ సంక్షేమంలో జీవశాస్త్రం 5

i) గమన సంయుక్తబీజం, సంయుక్త బీజకోశం ఏర్పడటం :
సంయుక్త బీజం కొంతకాలం చైతన్యరహితంగా ఉంటుంది. 18-24 గంటలలో ఇవి ఊకినైట్ / గమనసంయుక్తబీజం అనే పొడవైన, సన్నటి, కదలిక చూపే క్రిమి రూపాన్ని పొందుతుంది. ఇది అన్నాశయ కుడ్యాన్ని తొలుచుకొని, ఆధారత్వచం కింద చేరుతుంది. ఇది గుండ్రంగా మారి తన చుట్టూ ఒక కోశాన్ని స్రవిస్తుంది. ఈ కోశస్థ దశను ఊసిస్ట్ (Oocyst) అంటారు. అన్నాశయ కుడ్యంపై 50-500 ఊసిస్ట్లు ఏర్పడి చిన్నచిన్న బుడిపెలుగా కనిపిస్తాయి. (ఈ ఊసిస్ట్లను సర్ రొనాల్డ్ రాస్ మొట్టమొదటగా గుర్తించాడు).

AP Inter 1st Year Zoology Study Material Chapter 6 మానవ సంక్షేమంలో జీవశాస్త్రం 6
iv) సిద్ధబీజోత్పత్తి :
ఊసిస్ట్ స్పోరోజాయిట్లు ఏర్పడటాన్ని సిద్ధబీజోత్పత్తి అంటారు. బానో (Bano) అనే శాస్త్రజ్ఞుడు చెప్పిన ప్రకారం కేంద్రకం మొదట క్షయకరణ విభజన జరుపుకుంటుంది. ఆ తరువాత అనేకసార్లు సమవిభజనలను కొనసాగిస్తూ 1000 వరకు పిల్ల కేంద్రకాలను ఏర్పరుస్తుంది. ప్రతీ కేంద్రకం చుట్టూ కొంత జీవపదార్థం చేరి కొడవలి ఆకారం స్పోరోజాయిట్స్ ఏర్పడతాయి. స్పోరోజాయిట్స్ గల ఊసిస్ట్ను సిద్ధబీజకోశం (sporocyst) అంటారు. సిద్ధబీజకోశం పగిలినప్పుడు స్పోరోజాయిట్లు దోమ రక్తకుహరం (haemocoel) లోకి విడుదలవుతాయి. ఇవి అక్కడి నుంచి లాలాజలగ్రంథులలోనికి చేరి సంక్రమణకు సిద్ధంగా ఉంటాయి. దోమలో ప్లాస్మోడియం జీవితచక్రం పూర్తికావడానికి దాదాపుగా 10-24 రోజులు పడుతుంది.

AP Inter 1st Year Zoology Study Material Chapter 6 మానవ సంక్షేమంలో జీవశాస్త్రం

ప్రశ్న 4.
ఆస్కారిస్ లుంబ్రికాయిడిస్ నిర్మాణాన్ని, జీవితచక్ర పటాలతో వివరించండి.
జవాబు:
AP Inter 1st Year Zoology Study Material Chapter 6 మానవ సంక్షేమంలో జీవశాస్త్రం 7
నిమటోడా వర్గానికి చెందిన ఆస్కారిస్ లుంబ్రికాయిడిస్ మాన ఆంత్రంలో నివశించే అతి సాధారణ పరాన్నజీవి. ఇది కలుషిత నీరు, ఆహారం ద్వారా వ్యాప్తి చెందుతుంది. దీని పిండసహిత అండాలు మానవులకు సాంక్రమిక దశలు.

నిర్మాణం :
స్త్రీ, పురుష జీవులు వేరువేరుగా ఉంటాయి. స్పష్టమైన లైంగిక ద్విరూపకత ఉంటుంది. రెండు జీవులు స్తూపాకారంలో, సన్నగా ఉంటాయి. పూర్వాంతంలో నోరు మూడు కైటిన్ పెదవులతో ఆవరించి ఉంటుంది. నోటికి దగ్గరగా ఉదర మధ్యంగా చిన్న విసర్జక రంధ్రం ఉంటుంది.

పురుషజీవి :
దీని తోక వంపు తిరిగి ఉంటుంది. పరాంతంలో అవస్కర రంధ్రం, ఒక జత కైటిన్ నిర్మిత పీనియల్ కంటకాలు (pineal spicules) లేదా పీనియల్ శూకాలు (pineal saetae) ఉంటాయి. ఇది సంపర్కంలో శుక్రకణాలను ప్రవేశపె ట్టడానికి తోడ్పడుతుంది.

స్త్రీ జీవి :
దీని తోక నిటారుగా ఉంటుంది. జనన రంధ్రం లేదా యోనిరంధ్రం ఉదరతలంలో నోటి కింద 1/3 వంతుల దూరంలో ఉంటుంది. తోకకు కొంచెం పైగా పాయువు ఉంటుంది.

AP Inter 1st Year Zoology Study Material Chapter 6 మానవ సంక్షేమంలో జీవశాస్త్రం 8
జీవిత చక్రం :
మానవుడి చిన్నపేగులో సంపర్కం జరుగుతుంది. సంపర్కం తరువాత స్త్రీ జీవి రోజుకు దాదాపుగా రెండు లక్షల గుడ్లను విడుదల చేస్తుంది. ప్రతి గుడ్డుకూ ఉపరితంలో బుడిపెలుగా ఏర్పడిన ప్రోటీన్ పొర ఉంటుంది. అందువల్ల ఆస్కారిస్ గుడ్లను మామ్మిల్లేటెడ్ గుడ్లు (mammilated eggs) అంటారు. ప్రోటీన్ పొరకు లోపల కైటిన్ కర్పరం, లిపిడ్ పొరలు ఉంటాయి. మలంతో పాటు గుడ్లు విడుదలవుతాయి. తేమ నేలలో గుడ్డులో పిండాభివృద్ధి జరిగి మొదటి దశ రాబ్దిటిఫార్మ్ డింభకం ఏర్పడుతుంది. ఇది మొదటి నిర్మోచనంతో రెండో దశ రాబ్దిటిఫార్మ్ డింభకంగా మారుతుంది. ఇది మానవుడికి వ్యాధిని కలిగించే సాంక్రమికదశ. కలుషిత ఆహారం, నోటితో ఈ దశలు మానవుడి ఆహారనాళాన్ని చేరతాయి.
AP Inter 1st Year Zoology Study Material Chapter 6 మానవ సంక్షేమంలో జీవశాస్త్రం 9

చిన్నపేగులో కర్పరం కరిగి రెండోదశ డింభకం విడుదల అవుతుంది. ఇది బాహ్యాంత్రవలస (extra intestinal migration) చేస్తుంది. కాలేయ నిర్వాహక సిర ద్వారా మొదట కాలేయాన్ని చేరుతుంది. అక్కడి నుండి పరమహాసిర ద్వారా హృదయాన్ని చేరుతుంది. అక్కడి నుండి పుపుస ధమని ద్వారా ఊపిరితిత్తులను చేరి వాయుకోశాలలో రెండో నిర్మోచనం చెంది మూడోదశ డింభకంగా మారుతుంది. ఆ తరువాత మూడో నిర్మోచనాన్ని కూడా వాయుకోశాలలో పూర్తిచేసి నాలుగోదశ డింభకంగా మారుతుంది. చివరగా ఈ డింభకం శ్వాసనాళికలు (bronchi), వాయునాళం (trachea) స్వరపేటిక (larynx), కంఠబిలం (glottis), గ్రసని, (pharynx) ఆహారవాహిక, జీర్ణాశయ మార్గంలో ప్రయాణించి చిన్నపేగు చేరుతుంది. చిన్నపేగులో నాల్గవ, చివరి నిర్మోచనం చెంది పిల్లజీవిగా మారుతుంది. ఇది 8-10 వారాలలో లైంగిక పరిపక్వతను పొందుతుంది.

వ్యాధి కారకత :
ఆస్కారిస్ లుంబ్రికాయిడిస్ వల్ల ఆస్కారియాసిస్ వ్యాధి వస్తుంది. వీటి సంఖ్య తక్కువైనప్పుడు వ్యాధి లక్షణాలు కనిపించవు. అధిక సంక్రమణ వల్ల పోషణ లోపాలు, ఉదరంలో తీవ్రమైన నొప్పి కలుగుతుంది. దీనివల్ల పిల్లలలో పెరుగుదల నిరోధించబడుతుంది.

నివారణ చర్యలు :
ఎంటమీబాకు వివరించిన అంశాలే వర్తిస్తాయి.

AP Inter 1st Year Zoology Study Material Chapter 6 మానవ సంక్షేమంలో జీవశాస్త్రం

ప్రశ్న 5.
ఉకరేరియా బాంక్రాఫ్టి జీవితచక్రాన్ని వివరించండి.
జవాబు:
ఉకరేరియా బాంక్రాఫ్టి తన జీవితచక్రాన్ని రెండు అతిథేయిలలో పూర్తి చేసుకుంటుంది.

  1. మానవుడు – ప్రాథమిక అతిథేయి,
  2. ఆడ క్యులెక్స్ దోమ – ద్వితీయ అతిథేయి.

మానవునిలో జీవితచక్రం :
ఉచరేరియా బాంక్రాఫ్టి యొక్క ఆడ, మగ జీవులు మానవుడి శోషరస వ్యవస్థలో నివాసముంటాయి. ఇక్కడే సంపర్కం జరుపుతాయి. స్త్రీ జీవులు అందశిశూత్పాదకాలు. ఇవి మైక్రోఫైలేరియా అనే డింభకాలను విడుదల చేస్తాయి. మైక్రోఫైలేరియాలు 0.2-0.3 మి.మీ. పొడవు ఉంటాయి. దీనిని ఆవరించి వదులుగా ఉండే అవభాసిని తొడుగు ఉంటుంది. డింభకం బాహ్య కేంద్రక స్థితిలో ఉంటుంది. డింభక పూర్వాంతంలో ఒక శూకిక ఉంటుంది. దీనిలో నాడీవలయం, వృక్కరంధ్రం, పాయురంధ్రం, లీనెటి కణం, నాలుగు పెద్ద జనన కణాలు, అధికంగా వర్ణకాలను గ్రహించిన కణ సముదాయం. అవశిష్ట ఆహార వాహిక ఉంటాయి.

శోషరస నాళికలోకి విడుదల చేయబడిన మైక్రొఫైలేరియాలు రక్తప్రసరణను చేరతాయి. మైక్రోఫైలేరియాలు అంతరాంగ అవయవాలలో లోతుగా ఉన్న రక్తనాళాలలో నివసిస్తూ రాత్రిపూట 10 గం. నుండి 4 గం.ల మధ్య పరిధీయ రక్తనాళాలోకి వస్తాయి. ఈ గమనాన్ని ‘నిశాకాల గమనం’ అంటారు. ఈ గమనానికి కారణం మాధ్యమిక అతిథేయి అయిన క్యూలెక్స్ దోమ మానవుని రక్తాన్ని రాత్రి సమయంలో పీల్చడమేనని తెలుస్తుంది. రోగగ్రస్తుని దోమ కుట్టి రక్తాన్ని పీల్చినపుడు రక్తంతో పాటుగా మైక్రోఫైలేరియా డింభకాలు క్యూలెక్స్ దోమలోకి చేరతాయి. 70 రోజుల లోపల దోమను చేరకపోతే మైక్రోఫైలేరియా డింభకాలు చనిపోతాయి. మైక్రోఫైలేరియా దోమకు సాంక్రమిక దశలు.

దోమలో జీవిత చరిత్ర :
దోమ ఆహారనాళంలో 2-6 గం.లలో డింభకం తొడుగు కరిగిపోతుంది. ఈ డింభకం దోమ ఆహార కుడ్యాన్ని తొలుచుకొని దోమ రక్త కుహరాన్ని చేరుతుంది. ఇక్కడి నుండి ఉరఃకండరాలను చేరి రెండు రోజులలో సాసేజ్ ఆకార డింభకంగా మారుతుంది. దీన్ని మొదటి డింభకదశ లేదా మొదటిదశ మైక్రోఫైలేరియా అంటారు. ఇది 10-20 రోజులలో రెండు నిర్మోచనాలు పూర్తి చేసుకొని పొడవైన సాంక్రమిక మూడోదశ మైక్రోఫైలేరియాగా మారుతుంది. ఇది దోమ అధరాన్ని చేరుతుంది.

మూడోదశ మైక్రొఫైలేరియా డింభకాలు కలిగిన దోమ మానవుని కుట్టినప్పుడు డింభకాలు మానవ రక్త ప్రవాహాన్ని చేరి అక్కడి నుండి శోషరస నాళాలు చేరతాయి. ఇక్కడ డింభకాలు మూడో, నాలుగో నిర్మోచనాలు జరుపుకొని ప్రౌఢజీవులుగా మారతాయి. ఇవి 5 నుండి 18 నెలల కాలంలో లైంగిక పరిపక్వతను పొందుతాయి.
AP Inter 1st Year Zoology Study Material Chapter 6 మానవ సంక్షేమంలో జీవశాస్త్రం 10

వ్యాధి కారకత :
ఉకరేయా సంక్రమణ వలన ఫైలేరియా జ్వరం, తలనొప్పి, మానసిక ఆందోళన, శరీర ఉష్ణోగ్రత పెరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. శోషరస నాళాలలో శోషరస గ్రంథులలో వాపు కనిపిస్తుంది. శోషరస నాళాలలో కలిగే వాపును లింఫాంజైటిస్ అంటారు. శోషరస గ్రంథులలో వాపును లింఫాడెంటిస్ అంటారు. శోషరస నాళాలలో ఆటంకం వలన శోషరసం సంచిత మవడం వలన అవయవాలలో వాపు ఏర్పడుతుంది. దీనిని లింఫొఎడిమా అంటారు.

వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ప్రభావిత భాగాలు (గమనాంగాలు, ముష్కగోణులు, స్తనాలు) అనూహ్యంగా వాపు కనిపిస్తుంది. ఈ భాగాలలో స్వేదగ్రంథులు క్షీణించి చర్మం పొడిబారి, గరుకుగా అవుతుంది. ఈ స్థితిని ఎలిఫెంటియాసిస్ లేదా బోదకాలు వ్యాధి అంటారు.

AP Inter 1st Year Botany Study Material Chapter 9 కణం: జీవప్రమాణం

Andhra Pradesh BIEAP AP Inter 1st Year Botany Study Material 9th Lesson కణం: జీవప్రమాణం Textbook Questions and Answers.

AP Inter 1st Year Botany Study Material 9th Lesson కణం: జీవప్రమాణం

అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
వృక్షకణంలో రిక్తిక ప్రాముఖ్యం ఏమిటి?
జవాబు:
రిక్తికలో ప్రధానంగా నీరు, జీవక్రియా ఉపఉత్పన్నాలు, విసర్జక పదార్థాలు, వ్యర్థపదార్థాలతో కూడిన రసం ఉంటుంది. ఇది కణద్రవాభిసరణచర్యల నియంత్రణలో ముఖ్యపాత్ర వహిస్తాయి.

ప్రశ్న 2.
705, 805 రైబోసోమ్లో ‘S’ అంటే అర్థం ఏమిటి?
జవాబు:
705, 805 రకపు రైబోసోమ్లలో ‘S’ అనగా స్వెడ ్బర్గ్ ప్రమాణంలో చెప్పబడే అవసాధన గుణకము, ఇది పరోక్షంగా సాంద్రత, పరిమాణమును తెలిపే అంశము.

ప్రశ్న 3.
హైడ్రోలైటిక్ ఎంజైమ్ల (జలవిశ్లేషణ) తో నిండి ఉన్న త్వచయుత కణాంగాన్ని పేర్కొనండి.
జవాబు:
లైసోసోమ్.

ప్రశ్న 4.
వాయురిక్తికలు అంటే ఏమిటి? వాటి విధులు ఏమిటి?
జవాబు:
సైనో బ్యాక్టీరియా కణాలలోని రిక్తికలు నిజకేంద్రక కణాలలోవలె టోన్స్ట్ పొర వుండదు, దీనిలో వాయువు వుంటుంది. అందుచే దీనిని వాయురిక్తికలు అంటారు.

విధులు :

  1. ఈ రిక్తికలు జీవ రసాయన చర్యలవలన కణాలలో ఏర్పడిన వాయువులను నిల్వచేయబడి వుంటాయి.,
  2. అధిక కాంతి తీక్షతనలో ఇవి బద్ధలై అదృశ్యమవుతాయి. అలాగే కాంతి తీక్షతనుపట్టి రిక్తికల సాయంతో ఇవి తమ స్థానాన్ని మార్చుతాయి.

ప్రశ్న 5.
పాలీసోమ్ల విధులు ఏమిటి?
జవాబు:
అనేక రైబోసోమ్లు ఒకే రాయబారి RNA పోచకు అతుక్కుని గొలుసు వలె కనిపిస్తాయి. వీటిని పాలిరైబోసోమ్లు లేదా పాలిసోమ్లు అంటారు. వీటిలోని రైబోసోమ్లు రాయబారి RNA లోని సమాచారాన్ని ప్రోటీన్లుగా అనువదిస్తాయి.

AP Inter 1st Year Botany Study Material Chapter 9 కణం: జీవప్రమాణం

ప్రశ్న 6.
మోటాసెంట్రిక్ క్రోమోసోమ్ యొక్క లక్షణం ఏమిటి?
జవాబు:
మెటాసెంట్రిక్ క్రోమోసోమ్లో మధ్యలో సెంట్రోమియర్ ఉంటుంది. దీనివల్ల 2 బాహువులు సమానంగా ఉంటాయి. చలనదశలో ఇవి ‘V’ ఆకారంలో కనిపిస్తాయి.

ప్రశ్న 7.
శాటిలైట్ క్రోమోసోమ్ అంటే ఏమిటి?
జవాబు:
కొన్ని క్రోమోసోమ్లు అభిరంజకాన్ని గ్రహించని ద్వితీయ కుంచనాలను సుస్థిర స్థానాలలో చూపిస్తాయి. దీనివల్ల క్రోమోసోమ్లో ఒక చిన్న ఖండికలాంటి భాగం కనిపిస్తుంది. దీన్ని శాటిలైట్ అంటారు. శాటిలైట్ ఉన్న క్రోమోసోమ్ను శాటిలైట్ క్రోమోసోమ్ అంటారు.

ప్రశ్న 8.
సూక్ష్మదేహాలంటే ఏవి? వాటిలో ఉన్న పదార్థాలేమిటి?
జవాబు:
పెరాక్సీసోమ్లు మరియు గ్లైఆక్సీసోమ్లను సూక్ష్మదేహాలు అంటారు. పెరాక్సీసోమ్లు ఫాస్ఫోలిపిడ్ల సంశ్లేషణలోను, కాంతి శ్వాసక్రియలోను పాల్గొంటాయి. గ్లె ఆక్సీసోమ్లు క్రొవ్వు సంమృద్ధిగా గల అంకురించే విత్తనాలలో ఉంటాయి. వీటిలో ఉన్న లిపిడ్లను కార్భోహైడ్రేటులుగా మార్చే గ్లైఆక్సీలేట్ వలయానికి చెందిన ఎంజైమ్లు ఉంటాయి.

ప్రశ్న 9.
మధ్యపటలిక దేనితో ఏర్పడి ఉంటుంది ? దాని విధులు ఏ విధంగా ముఖ్యమైనవి?
జవాబు:
మధ్యపటలిక ముఖ్యంగా కాల్షియం పెక్టేట్తో నిర్మితమై, ప్రక్కనున్న కణాలను బంధించి ఉంచుతుంది. ఇది కణవిభజన సమయంలో ఏర్పడిన కణఫలకం నుంచి తయారవుతుంది. కణకవచం, మధ్యపటలిక ద్వారా కణద్రవ్య బంధాలు కణకణానికి వ్యాపించి పొరుగున ఉన్న కణాల కణద్రవ్య పదార్థాలతో సంబంధాన్ని ఏర్పరుస్తాయి.

ప్రశ్న 10.
ద్రవాభిసరణ అంటే ఏమిటి?
జవాబు:
అయానులు లేక నీటి అణువులు అల్పగాఢతకల ప్రదేశం నుండి అధిక గాఢత కల ప్రదేశంలోనికి పారగమ్య త్వచం ద్వారా చలించుటను ద్రవాభిసరణ అంటారు.

ప్రశ్న 11.
గ్రామ్ అభిరంజన పద్ధతికి బాక్టీరియమ్ కణంలోని ఏ భాగం గురి అవుతుంది? [Mar. ’14]
జవాబు:
కణ ఆచ్ఛాదనలోని రసాయన నిర్మాణంలో గల భిన్నత్వం.

AP Inter 1st Year Botany Study Material Chapter 9 కణం: జీవప్రమాణం

ప్రశ్న 12.
ఈ కింది వాటిలో ఏవి సరైనవి కావు?
a) రాబర్ట్ బ్రౌన్ కణాన్ని కనుక్కొన్నారు,
b) ప్లీడన్, ష్వాన్ కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు,
c) కొత్త కణాలు అంతకుముందు ఉన్న కణాల నుంచి ఏర్పడతాయని నిర్షా వివరించారు.
d) ఏకకణజీవి జీవ చర్యలన్నింటిని కణంలోపలే నిర్వహిస్తుంది.
జవాబు:
a) కాదు. కణమును కనుగొన్న వారు రాబర్ట్ హుక్.
b) సరైనది
c) సరైనది
d) సరైనది

ప్రశ్న 13.
కొత్త కణాలు దీని నుంచి ఉత్పత్తి అవుతాయి.
a) బాక్టీరియల్ కిణ్వనం
b) పాత కణాల పునరుత్పత్తి
c) అంతకుముందు ఉన్న కణాలు (pre-existing cells) d) నిర్జీవ పదార్థాలు.
జవాబు:
c) సరి అయినది.

ప్రశ్న 14.
కింది వాటిని జతపరచండి.
a) క్రిస్టే i) ఆవర్ణికలోని చదునైన త్వచయుత కోశాలు
b) సిస్టిర్నే ii) మైటోకాండ్రియాలోని అతర్వలనాలు
c) థైలకాయిడ్లు iii) గాల్జీ పరికరంలోని బిళ్లల వంటి కోశాలు
జవాబు:
a) క్రిస్టే – మైటో కాండ్రియాలోని అంతర్వలనాలు
b) సిస్టర్నే – గాల్జి పరికరంలోని బిళ్ళల వంటి కోశాలు
c) థైలకాయిడ్లు – అవర్ణికలోని చదునైన త్వచయుతాకేశాలు.

ప్రశ్న 15.
ఈ కింది వానిలో సరియైనది
a) జీవరాశుల కణాలన్నింటిలో కేంద్రకం ఉంటుంది.
b) వృక్ష, జంతు కణాలు రెండింటిలో స్పష్టమైన కణకవచం ఉంటుంది.
c) కేంద్రక పూర్వ జీవులలో త్వచంతో ఆవరించబడిన కణాంగాలు ఉండవు.
d) నిర్జీవ పదార్థాల నుంచి (denovo) నవజాతంగా కణాలు ఏర్పడతాయి.
జవాబు:
c సరిఅయినది.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
పత్రహరితాన్ని కలిగిన కణాంగాన్ని వర్ణించండి.
జవాబు:
పత్రహరితాన్ని కలిగిన కణాంగము హరితరేణువు. హరితరేణువులు అత్యధిక సంఖ్యలో పత్రం యొక్క పత్రాంతర కణజాలంలో కనిపిస్తాయి. ఇవి కటకాకారం లేదా అండాకారంలో ఉంటాయి. వీటి పరిమాణం 5-10 µm పొడవు, 2-4 µm వెడల్పు ఉంటుంది.
AP Inter 1st Year Botany Study Material Chapter 9 కణం జీవప్రమాణం 1

హరితరేణువులు రెండు పొరలచే ఆవరింపబడి ఉంటాయి. లోపలి పొరచేత ఆవరింపబడి ఉన్న అంతరప్రదేశాన్ని ఆవర్ణిక అంటారు. అనేక చదునైన త్వచయుత కోశాలు ఆవర్ణికలో కలిగి ఉంటాయి. వీటిని థైలకాయిడ్లు అంటారు. థైలకాయిడ్లు నాళాల రూపంలో ఒకదానిపై మరొకటి దొంతరలవలే అమరి ఉంటాయి. వీటిని (గానా) థైలకాయిడ్లు అంటారు. వీటితోపాటు అనేక చదునైన త్వచయుత నాళికలు ఆవర్ణికలో ఉన్న పటలికారాశులను కలుపుతూ ఉంటాయి. వీటిని పటలికలు అంటారు. థైలకాయిడ్లు లోపలి ప్రదేశాన్ని అవకాశిక అంటారు. హరితరేణువు ఆవర్ణికలో కార్బొహైడ్రేట్లు, ప్రోటీన్ల సంశ్లేషణకు కావలిసిన ఎంజైమ్లు ఉంటాయి. థైలకాయిడ్లలో కిరణ జన్య సంశ్లేషణ వర్ణ ద్రవ్యాలు ఉంటాయి.

AP Inter 1st Year Botany Study Material Chapter 9 కణం: జీవప్రమాణం

ప్రశ్న 2.
కణ శక్త్యాగారాల నిర్మాణం, విధులను వివరించండి.
జవాబు:
AP Inter 1st Year Botany Study Material Chapter 9 కణం జీవప్రమాణం 2
మైటోకాండ్రియాను కణశక్త్యాగారాల కణాంగముగా పేర్కొంటారు. మైటోకాండ్రియా దండాకారంలో, 0-2-1.0 µm వ్యాసం, 1.0-4.1 µm పొడవుగల చిన్న గొట్టాలుగా లేక స్థూపాలుగా కనిపిస్తాయి. ప్రతి మైటోకాండ్రియా చుట్టూ రెండు పొరలు ఆవరించి ఉంటాయి. లోపలిపొర లోపలికి ముడతలును ఏర్పరుస్తుంది. వీటిని క్రిస్టే అంటారు. లోపలిపొరలోపల ప్రదేశాన్ని మాత్రిక అంటారు. మాత్రికలో శ్వాసక్రియకు సంబంధించిన ఎంజైమ్లు ఉంటాయి. క్రిస్టేలో శ్వాసక్రియ ఎలక్ట్రాన్ రవాణా సంక్లిష్టాలు ఉంటాయి. మైటోకాండ్రియాలు వాయు సహితి శ్వాసక్రియ జరిపి ATP రూపంలో కణశక్తి ఉత్పత్తి చేస్తాయి. కావున వీటిని కణశాక్త్యాగారాలు అంటారు. మాత్రికలు ఒక వృత్తాకార DNA అణువు, 70 S రైబోసోమ్లు ఉంటాయి.

విధులు :

  1. మైటోకాండ్రియాలో కణ వాయు సహితి శ్వాసక్రియ జరుగుతుంది. కావున దీనిని కణశక్తిగారాలుగా పేర్కొంటారు.
  2. మైటోకాండ్రియాలో వృత్తాకార DNA అణువు 70S రైబోసోమ్లు ఉండటంవల్ల వాటికి కావలిసిన ప్రొటీన్లను స్వయంగా సంశ్లేషణ చేసుకుంటాయి. కావున దీనిని స్వయం ప్రతిపత్తి కలిగిన కణాంగముగా పేర్కొంటారు.

ప్రశ్న 3.
సెంట్రియోల్ యొక్క బండిచక్రం నిర్మాణంపై వ్యాఖ్యానించండి.
జవాబు:
సెంట్రోసోమ్ అనే కణాంగము సాధారణంగా సెంట్రియోల్లు అనే రెండు స్థూపాకార నిర్మాణాలను చూపిస్తుంది. ఇవి రూపరహిత పెరిసెంట్రియోలార్ పదార్థాలతో ఆవరించి ఉంటాయి. సెంట్రోసోమ్లోని సెంట్రియోల్లు ఒకదానికి మరొకటి లంబంగా అమర్చబడి ప్రతిదానిలో బండి చక్రంలాంటి నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. సెంట్రియోల్లో తొమ్మిది సమదూరంకల ట్యూబ్యులిన్చే నిర్మించబడిన పరిధీయ పోచలు ఉంటాయి. ప్రతి పరిధీయ పోచలో 3 సూక్ష్మ నాళికలు ఉంటాయి. ప్రక్క ప్రక్కనున్న పరిధీయ పోచలు త్రికాలు కలుపబడి ఉంటాయి. సెంట్రియోల్ కేంద్రభాగము ప్రోటీను పదార్థం నిర్మితమై హబ్ (Hub) గా పిలవబడుతుంది. హబ్ భాగము ప్రోటీనాయుతమైన వ్యాసార్ధ పోచలతో పరిధీయంగా ఉన్న ట్రిప్లెట్ పోచలకు కలపబడి ఉంటుంది. సెంట్రియోల్లు శైలికలు లేదా కశాభాలను, కండెపోగులను ఉత్పత్తి చేసే ఆధారకణికలుగా పనిచేస్తాయి. కణవిభజన సమయంలో జంతుకణాలు కండెపోగుల నుంచి కండె పరికరమును ఉత్పత్తి చేస్తాయి.

AP Inter 1st Year Botany Study Material Chapter 9 కణం: జీవప్రమాణం

ప్రశ్న 4.
కణసిద్ధాంతంను సంగ్రహంగా వర్ణించండి.
జవాబు:
వృక్ష, జంతు శరీరాలు కణాలు, కణ ఉత్పత్తులతో ఏర్పడి ఉంటాయనే పరికల్పనని ష్వాన్ ప్రతిపాదించారు. ప్లీడన్ అను జర్మన్ శాస్త్రవేత్త పెద్ద సంఖ్యలో మొక్కలను పరిశీలించి, మొక్కలన్ని వివిధ రకాల కణాలతో ఏర్పడి ఉన్న కణజాలాలతో నిర్మింపబడి ఉంటాయని గుర్తించారు. ప్లీడన్, ష్వాన్లు సంయుక్తంగా కణ సిద్ధాంతంను ప్రతిపాదించారు. కాని ఈ సిద్ధాంతము కొత్త కణాలు ఎలా పుడతాయనే అంశాన్ని వివరించలేదు. 1855లో రుడాల్ఫ్ విర్షా కొత్త కణాలు అంతకు పూర్వము ఉన్న కణాల నుంచి విభజనవల్ల ఏర్పడతాయని వివరించారు. దీనిని ‘ఆమ్నిస్ సెల్లులా-ఇ-సెల్లులా’ అంటారు. ఈయన ప్లీడన్, ష్వాన్ల పరికల్పనకి రూపాంతరం చేసి కణసిద్ధాంతానికి పరిపూర్ణతను కల్పించారు. ప్రస్తుతం కణసిద్ధాంతము అనగా జీవులన్నీ కణాలు, కణ ఉత్పత్తులతో ఏర్పడి ఉంటాయి. అన్ని కణాలు పూర్వమున్న కణాల నుంచి పుడతాయి.

ప్రశ్న 5.
గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం (RER) నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం (SER) ల మధ్యగల భేదాల్ని తెలపండి.
జవాబు:

గరుకు అంతర్జీవ ద్రవ్య జాలమునునుపు అంతర్జీవ ద్రవ్య జాలము
1) అంతర్జీవ ద్రవ్యజాలం ఉపరితలంపై రైబోసోమ్లు ఉంటాయి.1) అంతర్జీవ ద్రవ్యజాలం ఉపరితలంపై రైబోసోమ్లు ఉండవు.
2) ఇది సిస్టర్నేలను కల్గి ఉంటుంది.2) ఇది నాళికలను కల్గి ఉంటుంది.
3) ఇది కేంద్రక త్వచంను అంటిపెట్టుకొని ఉంటుంది.3) ఇది ప్లాస్మా పొరను అంటి పెట్టుకొని ఉంటుంది.
4) ఇది ప్రోటీనుల సంశ్లేషణలో పాల్గొంటుంది.4) ఇది లిపిడ్ సంశ్లేషణలో పాల్గొంటుంది.

ప్రశ్న 6.
ప్లాస్మాపొర జీవ రసాయనిక నిర్మాణాన్ని తెలపండి. పొర లోపల లిపిడ్ అణువుల అమరిక ఎలా ఉంటుంది?
జవాబు:
ప్లాస్మా పొర రెండు వరుసల లిపిడ్ అణువులతో ఏర్పడి ఉంటుంది. పొరలోపలి లిపిడ్ అణువుల ధృవ శీర్షాలు వెలుపలి వైపునకు, అధృవ తోకలు లోపలివైపునకు అమర్చబడి ఉంటాయి. ఈ అమరిక వల్ల సంతృప్త హైడ్రోకార్బన్ తోకలు జల వాతావరణం నుంచి రక్షింపబడతాయి. పొరలోని లిపిడ్ పదార్థము ముఖ్యంగా ఫాస్ఫోలిపిడ్లను కలిగి ఉంటుంది. తరువాత జరిగిన జీవరసాయన పరిశోధనలు కణపొరలో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు కూడా ఉంటాయని స్పష్టంగా తెలిపాయి. త్వచప్రోటీన్లను, వాటి స్థానంను బట్టి అంతర్గత ప్రోటీనులు, పరిధీయ ప్రోటీన్లుగా వర్గీకరిస్తారు. పరిధీయ ప్రోటీన్లు త్వచ ఉపరితల భాగాలలో ఉంటే, అంతర్గత ప్రోటీన్లు త్వచంలో పాక్షికంగా లేక సంపూర్ణంగా దిగబడి ఉంటాయి.

కణత్వచ నమూనాను 1972లో సింగర్ మరియు నికల్సన్లు ప్రతిపాదించారు. దీనిని ఫ్లూయిడ్, మొజాయిక్ నమూనా అంటారు. దీని ప్రకారం అర్ధద్రవస్థితిలో ఉన్న లిపిడ్ పొర ప్రోటీను అణువుల పార్శ్వ కదలికలకు వీలు కల్పిస్తుంది.

ప్రశ్న 7.
కేంద్రకం నిర్మాణాన్ని వివరించండి.
జవాబు:
AP Inter 1st Year Botany Study Material Chapter 9 కణం జీవప్రమాణం 3
కేంద్రకం :
దీనిని ప్రధాన కణాంగము / కణమేధస్సు అంటారు. దీనిని రాబర్ట్ బ్రౌన్ కనుగొన్నారు. అంతర్థశ కేంద్రకంలో క్రోమాటిన్ అనే న్యూక్లియో ప్రోటీనులు, కేంద్రకమాత్రిక, గోళాకారంలో ఉన్న కేంద్రకాంశాలు ఉంటాయి. కేంద్రకంలోని పదార్థాలను కణద్రవ్యం నుంచి వేరుచేస్తూ రెండు పొరలు ఆచ్ఛాదనగా ఉంటాయి. ఈ పొరల మధ్య ప్రదేశాన్ని పరిన్యూక్లియార్ ప్రదేశము అంటారు. వెలుపలి పొర అంతర్జీవ ద్రవ్యజాలంతో అనుసంధానం చెంది, ఉపరితలంపై రైబోసోమ్లను గల్గి’ ఉంటుంది. కేంద్రక తొడుగులో రెండు పొరలు కలుసుకోవడం వల్ల సూక్ష్మరంధ్రాలు ఏర్పడతాయి. వీటిద్వారా RNA మరియు ప్రోటీను అణువులు కేంద్రకం మరియు కణద్రవ్యాల మధ్య ద్విదిశాపధంలో చలనం చెందుతాయి.

కేంద్రకంలోని ద్రవపదార్థంలో కేంద్రకాంశం, క్రోమాటిన్ ఉంటాయి. కేంద్రకాంశం కేంద్రకరసంలో కలిసిపోయి ఉంటుంది. కేంద్రకాంశం రైజోసోమల్ RNA చురుకుగా సంశ్లేషణ జరిపే ప్రదేశాలు. అంతర్ధశ కేంద్రకంలో క్రోమాటిన్ అనే వదులైన అస్పష్టంగా కనిపించే న్యూక్లియో ప్రోటీను పొగులతో ఏర్పడిన వలవంటి నిర్మాణం ఉంటుంది. కాని కణ విభజన సమయంలో క్రోమాటిన్ అనేది క్రోమోసోమ్లుగా మారతాయి. క్రోమాటిన్ DNA హిస్టోనులు, కొన్ని నాన్ హిస్టోన్లు, RNA లను కలిగి ఉంటాయి.

ప్రశ్న 8.
సెంట్రోమియర్ స్థానాన్ని ఆధారంగా క్రోమోసోమ్ల రకాలను గురించి క్లుప్తంగా వ్రాయండి.
జవాబు:
ప్రతి క్రోమోసోమ్లో సంట్రోమియర్ ఉంటుంది. క్రోమోసోమ్లో గుర్తించారు. అవి. సెంట్రోమియర్ స్థానాన్ని 4 రకాల క్రోమోసోమ్లను

1) మెటాసెంట్రిక్ :
సెంట్రోమియర్ / క్రోమోసోమ్ మధ్యస్థానంలో ఉండి రెండు వైపులా బాహువులు సమానంగా ఉంటాయి. చలన దశలో ఈ క్రోమోసోమ్లు ‘V’ ఆకారంలో కనిపిస్తాయి.

2) సబ్ మెటాసెంట్రిక్ :
సెంట్రోమియర్ / క్రోమోసోమ్ మధ్య స్థానంలో కాకుండా కొంచెం పక్కగా ఉంటుంది. బాహువులు అసమానంగా ఉంటాయి. చలనదశలో ఈ క్రోమోసోమ్లు ‘L’ ఆకారంలో కనిపిస్తాయి.

3) ఎక్రోసెంట్రిక్ :
సెంట్రోమియర్ ఒక వైపుగా ఏర్పడి ఉంటుంది. ఒక బాహువు పొడవుగా, మరొకటి పొట్టిగా ఉంటాయి. చలనదశలో ఈ క్రోమోసోమ్లు ” ఆకారంలో కనిపిస్తాయి.

4) టిలోసెంట్రిక్ :
సెంట్రోమియర్ క్రోమోసోమ్ బాహువు కోనలో ఉంటుంది. దీనివల్ల ఒకే బహువు ఉంటుంది. ఈ క్రోమోసోమ్లు చలనదశలో ‘” (పుడక) ఆకారంలో కనిపిస్తాయి.
AP Inter 1st Year Botany Study Material Chapter 9 కణం జీవప్రమాణం 4

ప్రశ్న 9.
కణ అస్థిపంజరం అనగానేమి? అది చేసే పనులేమిటి?
జవాబు:
కణద్రవ్యంలో ప్రోటీనులతో నిర్మితమైన, తంతురూప, విస్తారమైన వలలాంటి ఆకారాలను సమిష్టిగా కణఅస్థి పంజరము అంటారు. ఇది నిజకేంద్రక జీవులలో మూడు ప్రధాన అంశాలను చూపుతుంది. అవి సూక్ష్మ తంతువులు, మధ్యస్థ తంతువులు, సూక్ష్మనాళికలు. ఇది యాంత్రిక ఆధారము, కణరూపాన్ని నిలపటం, కణచలనము, కణాంతర్గత రవాణా, కణం వెలుపలికి సంకేతాలు పంపడం, కేంద్రక విభజన వంటి విధులలో పాల్గొంటుంది.

AP Inter 1st Year Botany Study Material Chapter 9 కణం: జీవప్రమాణం

ప్రశ్న 10.
అంతరత్వచ వ్యవస్థ అనగానేమి? ఏ కణాంగాలు దీనిలో భాగం కాదు? ఎందుకు?
జవాబు:
కణంలో కనిపించే వివిధ త్వచయుత కణాంగాలు నిర్మాణంలో విధులలో విస్పష్టంగా ఉన్నప్పటికీ వాటిలో జరిగే జీవక్రియల మధ్య అనుసంధానం కనిపిస్తుంది. కావున వీటిని అన్నింటిని కలిపి అంతరత్వచ వ్యవస్థగా గుర్తిస్తారు.

మైటోకాండ్రియా, హరితరేణువు, పెరాక్సిసోమ్లు, వీటిలో భాగము కావు. ఇవి అంతర్జీవద్రవ్యజాలం, గాల్జి సంక్లిష్టం, లైసోజోమ్లతో సంబంధం చూపవు.

ప్రశ్న 11.
సక్రియ రవాణా మరియు నిష్క్రియా రవాణాల మధ్య తేడాను గుర్తించండి.
జవాబు:

సక్రియ రవాణానిష్క్రియా రవాణా
1) అయానులు లేదా అణువులు ప్లాస్మాపొర ద్వారా జీవక్రియా శక్తిని ఉపయోగించుకుని రవాణా అగు ప్రక్రియ.1) అయానులు లేదా అణువులు ప్లాస్మాపొర ద్వారా జీవక్రియా శక్తి ప్రమేయం లేకుండా రవాణా అగు ప్రక్రియ.
2) ఇది గాఢతా ప్రవణతకు వ్యతిరేకంగా జరుగుతుంది.
ఉదా : సోడియం పంప్ ద్వారా కణాలు లవణాలను గ్రహిస్తాయి.
2) ఇది గాఢతా ప్రవణతకు అనుకూలంగా జరుగుతుంది.
ఉదా : కణాలలోనికి నీరు విసరణ ప్రక్రియ ద్వారా చేరుట.

ప్రశ్న 12.
న్యూక్లియోసోమ్లు అంటే ఏమిటి ? అవి దేనితో చేయబడతాయి? [Mar. ’14]
జవాబు:
ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శినిలో చూసినపుడు క్రొమాటిన్ పూసలు గుచ్చిన దారపు పోగువలె కనిపిస్తాయి. ఈ పూసలవంటి భాగాలను న్యూక్లియోసోమ్లు అంటారు. న్యూక్లియోసోమ్లో 200 క్షార జతల పొడవున్న ద్విసర్పిల DNA అణువు కోర్ను చుట్టి ఉంటుంది. కోర్ భాగము 8 హిస్టోన్ అణువులతో ఏర్పడి ఉంటుంది. అవి H2A, H2B, H3, H4. ఇవి ఒక్కొక్కటి రెండు నకళ్ళుగా ఉంటాయి. H1 హిస్టోన్ అణువు న్యూక్లియోసోమ్ కోర్ వెలుపల, DNA కోర్లోనికి ప్రవేశించేచోట, నిష్క్రమించే చోట DNA రెండు చుట్లను కోర్కు అతికిస్తుంది. రెండు అనుక్రామిక న్యూక్లియోసోమ్ల మధ్యన కొనసాగివున్న
DNA ను లింకర్ DNA అంటారు.

ప్రశ్న 13.
రెండు త్వచాలతో ఆవరించబడి ఉన్న రెండు కణాంగాలను తెలపండి. వీటి లక్షణాలు ఏమి? వాటి విధులను తెలిపి వాటి పటాలను గీసి భాగాల్ని గుర్తించండి.
జవాబు:
మైటోకాండ్రియా, హరితరేణువు :
మైటోకాండ్రియాలు దండాకారంలో లేక స్థూపాలులాగా ఉంటాయి. ఇవి 0.2 – 1.0 µm వ్యాసం, 1.0 – 4.1 µm పొడవులో ఉంటాయి. దీనికి ఉన్న రెండు పొరలలో వెలుపలి పొరను నునుపుగాను, లోపలిపొర లోపలి వైపుకు ముడతలను ఏర్పరుస్తుంది. వీటిని క్రిస్టే అంటారు. మైటోకాండ్రియాలు వాయు సహిత శ్వాసక్రియ జరిగే ప్రదేశాలు. వీటిని కణశక్త్యాగారాలు అంటారు.
AP Inter 1st Year Botany Study Material Chapter 9 కణం జీవప్రమాణం 5

హరితరేణువులు అండాకారం, గోళాకారం లేక రిబ్బన్ ఆకారంలో ఉంటాయి. ఇది 5 – 10 µm పొడవు, 2- 4 µm వెడల్పు కలిగి ఉంటాయి. హరితరేణువు యొక్క అవర్ణికలో కార్బోహైడ్రేటులు, ప్రోటీనులు సంశ్లేషణకు అవసరమయిన అనేక ఎంజైమ్లు ఉంటాయి.

ప్రశ్న 14.
కేంద్రక పూర్వకణం యొక్క లక్షణాలు తెలపండి.
జవాబు:

  1. కేంద్రక త్వచము ఉండదు. కణం మధ్యలో ఒకే ఒక వలయాకార, నగ్న DNA ఉంటుంది. దీనిని న్యూక్లియాయిడ్ అంటారు.
  2. కేంద్రకాంశం ఉండదు.
  3. అంతర త్వచ వ్యవస్థ ఉండదు.
  4. మైటోకాండ్రియా, ప్లాస్టిడ్లు, లైసోజోమ్లు, పెరాక్సిజోమ్లు, కణ అస్థిపంజరము ఉండవు.
  5. 70 S రకానికి చెందిన రైబోజోమ్లు ఉంటాయి.
  6. కణ కవచము పాలీశాఖరైడ్లు, లిపిడ్లు, ప్రోటీనులతో నిర్మితమై ఉంటుంది.
  7. శ్వాసక్రియా ఎంజైమ్లు కణత్వచంలో ఉంటాయి.
  8. కణాలు ద్విధావిచ్చిత్తి ద్వారా సాధారణ అలైంగిక ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయి.

ప్రశ్న 15.
కణసిద్ధాంతాన్ని ప్రతిపాదించడంలో ఈ కింది శాస్త్రజ్ఞుల పాత్ర గురించి సంగ్రహంగా వివరించండి.
a) రుడాల్ఫ్ విర్షా b) ప్లీడన్, ష్వాన్
జవాబు:
a) రుడాల్ఫ్ విర్షా :
1855 లో ఈయన కొత్త కణాలు అంతకు పూర్వము ఉన్న కణాల నుంచి విభజన వల్ల ఏర్పడతాయని వివరించారు. దీనిని “ఆమ్నిస్ సెల్లులా -ఇ-సెల్లులా” అంటారు. ఈయన ప్లీడన్ మరియు ష్వాన్ల పరికల్పనకు రూపాంతరం చేసి కణ సిద్ధాంతానికి పరిపూర్ణత కల్పించారు. దీని ప్రకారము జీవులన్ని కణాలు, కణ ఉత్పత్తులతో ఏర్పడి ఉంటాయి. అన్ని కణాలు పూర్వమున్న కణాల నుంచి పుడతాయి.

b) ప్లీడన్ మరియు ష్వాన్ :
1838 లో ప్లీడన్ అను జర్మన్ వృక్షశాస్త్రవేత్త ఎక్కువ సంఖ్యలో మొక్కలను పరిశీలించి మొక్కలన్ని వివిధ రకాల కణాలతో ఏర్పడి వున్న కణజాలాలతో నిర్మింపబడి ఉంటాయని గుర్తించారు. థియోడార్ ష్వాన్ అను బ్రిటిష్ జంతుశాస్త్రవేత్త వివిధ రకాల జంతుకణాలను అధ్యయనంచేసి, కణాలు పలుచని పొరతో కప్పబడి ఉంటాయని కనుగొన్నారు. దానిని ఇప్పుడు ప్లాస్మాపొర అని అంటున్నారు. ఆయన వృక్షకణాలపై చేసిన పరిశోధనల ఆధారంగా కణకవచం ఉండుట.

వృక్ష కణాల ప్రత్యేక లక్షణంగా నిర్ధారించారు. ఈ పరిజ్ఞానం ఆధారంగా, ష్వాన్ వృక్ష, జంతు శరీర కణాలు, కణ ఉత్పత్తులతో ఏర్పడి ఉంటాయి అనే పరికల్పనను ప్రతిపాదించారు.

దీర్ఘ సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ఒక కణం సజీవకణంగా పిలువబడడానికి దానిలో ఏ నిర్మాణాత్మక, క్రియాత్మక గుణాలు ఉండాలి?
జవాబు:
అన్ని వృక్ష, జంతు శరీరాలు కణాలు, వాటి ఉత్పత్తులతో తయారయి ఉంటాయి. కణము జీవి యొక్క మౌళికమైన నిర్మాణాత్మక మరియు క్రియాత్మక ప్రమాణము ప్రతి కణంలో వివిధ రకాల కణాంగాలు వివిధ రకాల చర్యలను జరుపుతుంటాయి.

  1. కణాలు శక్తి సూత్రాలు అనుసరిస్తాయి అనగా శక్తిని రవాణా చేస్తాయి.
  2. కణాలు బహిర్గత లక్షణాలు కల నిర్మాణాలు.
  3. కణాలు పరిణామ క్రమ ఉత్పత్తిని కల్గి ఉంటాయి.
  4. కణాలులో జీవక్రియా మార్గాలు, పోషకాల వినిమయము, వాతావరణానికి అనువుగా మారడంవంటి లక్షణాలు ఉంటాయి.
  5. కణాలు స్వయం ప్రతికృతి చెందే కేంద్రకామ్లాలను కల్గిఉంటాయి.
  6. కణద్రవాభిసరణక్రమ చర్యలను నియంత్రించే రిక్తికలను కల్గిఉంటాయి.
  7. కణములు వార్తా ప్రసార వ్యవస్థను కల్గి ఉంటాయి.
  8. కణాలు కదలికలు చూపుతాయి.
  9. కణాలు పెరుగుతాయి. విభజన చెందుతాయి.
  10. కణాలు చనిపోతాయి.

AP Inter 1st Year Botany Study Material Chapter 9 కణం: జీవప్రమాణం

ప్రశ్న 2.
నిజకేంద్రక కణాలలోని కణాంగాలు
a) త్వచంలో చుట్టబడి ఉండవు
c) రెండు త్వచాలతో చుట్టబడి ఉంటాయి.
b) ఒకే త్వచంతో చుట్టబడి ఉంటాయి
కణంలోని విభిన్న కణాంగాలను పై మూడు వర్గములలో చేర్చండి.
జవాబు:
a) కేంద్రకాంశము
b) లైసోజోమ్లు, రిక్తికలు
c) మైటోకాండ్రియా, హరితరేణువు, కేంద్రకము

ప్రశ్న 3.
కేంద్రకం లోపలి జన్యు పదార్థం ప్రతి ఒక జాతికి స్థిరంగా ఉంటుంది. కాని, క్రోమోసోమేతర DNA జనాభాలోని విభిన్న జీవుల మధ్య వైవిధ్యంగా ఉంటుంది. వివరించండి.
జవాబు:
కేంద్రక పూర్వజీవులలో జీనోమిక్ DNA తో పాటు, కణద్రవ్యంలో జీనోమేతర DNA ముక్కలు ఉంటాయి. వాటిని ప్లాస్మిడ్లు అంటారు. ఇవి బాక్టీరియమ్లకు కొన్ని ప్రత్యేక దృశ్య రూపలక్షణాలను (సూక్ష్మజీవ నాశకాలకు నిరోదకత) ఆపాదిస్తాయి. ఇదీ బాక్టీరియంలలో బయటినుంచి వచ్చే DNA తో జన్యు పరివర్తన చర్యను కలుగచేయుటలో తోడ్పడతాయి.

నిజకేంద్రక కణాలలో జీనోమేతర DNA లు హరితరేణువు అవర్ణికలోను, మైటోకాండ్రియా మాత్రికలోనూ ఉంటాయి. వీటివలన ఇవి పాక్షిక స్వయం ప్రతిపత్తికల కణాంగాలు అని అంటారు.

ప్రశ్న 4.
“మైటోకాండ్రియాలు కణశక్త్యాగారాలు” దీన్ని సమర్ధించండి?
జవాబు:
AP Inter 1st Year Botany Study Material Chapter 9 కణం జీవప్రమాణం 2
మైటోకాండ్రియాలు దండాకారంలో, 0.2 – 1.0 µm వ్యాసం, 1.0 – 4.1 µm పొడవుగల చిన్న గొట్టాలుగా లేక స్థూపాలుగా కనిపిస్తాయి. ప్రతిమైటోకాండ్రియా చుట్టూ రెండు పొరలు ఉంటాయి. బాహ్యపొర ఈ కణాంగానికి హద్దుగా ఉంటుంది. లోపలి పొర లోపలికి ముడతలను ఏర్పరుస్తుంది. వీటిని క్రిస్టే అంటారు. లోపలి పొరలోపల మాత్రిక ఉంటుంది. ఈ రెండు పొరలలో విశిష్ట ఎంజైమ్లు మైటోకాండ్రియాలో జరిగే ప్రత్యేక విధులకు సంబంధించి ఉంటాయి. మైటో కాండ్రియాలు వాయు సహిత శ్వాసక్రియ జరిపి ATP రూపంలో కణశక్తి ఉత్పత్తి చేస్తాయి. కావున వీటిని కణశక్త్యాగారాలు అంటారు. మాత్రికలో ఒక వృత్తాకార DNA అణువు, కొన్ని RNA అణువులు 70 S రైబోసోమ్లు, ప్రోటీనుల సంశ్లేషణకు కావలసిన అంశాలు ఉంటాయి.

ప్రశ్న 5.
జాతి విశిష్టమైన లేదా ప్రాంత విశిష్టమైన ప్లాస్టిడ్ రకాలున్నాయా? వీటిలో, ఒక దానిని మరొకదాని నుంచి గుర్తించడమెలా?
జవాబు:
ప్లాస్టిడ్లు జాతి విశిష్టము. ఇవి వృక్షజాతులన్నింటిలో యూగ్లినాయిడ్లలో ఉంటాయి. వీటిలో వున్న విశిష్ట వర్ణద్రవ్యాలవల్ల అవి ఉన్న వృక్ష భాగాలకు విశిష్టరంగులనిస్తాయి. లోపల ఉన్న వర్ణద్రవ్యాల ఆధారంగా ప్లాస్టిడ్లు 3 రకాలు. అవి శ్వేతరేణువులు, వర్ణ రేణువులు, హరిత రేణువులు.

1) శ్వేతరేణువులు :
ఇవి వర్ణ రహిత ప్లాస్టిడ్లు. ఇవి పోషకాలను నిల్వచేస్తాయి. నిల్వచేయు పోషకంను బట్టి 3 రకాలు. అవి “కార్బోహైడ్రేట్లను నిల్వచేస్తే అమైలోప్లాస్ట్లు అని, ప్రొటీనులను నిల్వచేస్తే అల్యురోప్లాస్ట్లు అని, నూనెలు, కొవ్వులను నిల్వచేస్తే ఇలియోప్లాస్ట్లు అని అంటారు. ఇవి మొక్క భూగర్భ భాగాలలో ఉంటాయి.

2) వర్ణరేణువులు :
కెరోటిన్, జాంథోఫిల్లు, కెరోటినాయిడ్ వర్ల ద్రవ్యాలను కలిగి ఉంటాయి. ఇవి మొక్కల బాగాలకు పసుపు, నారింజ లేదా ఎరుపు వర్ణంను కలుగచేస్తాయి.

3) హరితరేణువులు :
కిరణజన్య సంయోగ క్రియకు సంబంధించిన పత్రహరితం, కెరోటినాయిడ్ వర్ల ద్రవ్యాలు కాంతి వికిరణ శక్తిని గ్రహిస్తాయి. ప్రతి హరితరేణువు రెండు పొరలచే ఆవరించబడి ఉంటుంది. పొరల లోపల ఆవర్ణిక ఉంటుంది. దీనిలో చదునైన త్వచయుత కోశాలు ఉంటాయి. వీటిని థైలకాయిడ్లు అంటారు. ఇవి ఒక దానిపై మరొకటి నాణాల రూపంలో అమరి ఉంటాయి. వీటిని పటలికా రాశులు అంటారు. వీటితోపాటు ఆవర్ణికా పటలికలు ఉంటాయి. ఆవర్ణిక్లో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు సంశ్లేషణకు కావలసిన ఎంజైమ్లు ఉంటాయి.

ప్రశ్న 6.
ఈ క్రింది వాని విధులను వివరించండి.
a) సెంట్రోమియర్ b) కణకవచం c) నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం d) గాల్జీ పరికరం e) సెంట్రియోల్లు
జవాబు:
a) సెంట్రోమియర్ :
క్రోమోజోమ్ లోని వర్ణరహిత భాగంను సెంట్రోమియర్ అంటారు. క్రొమోసోంల విభజనకు అవసరము, సోదర క్రొమాటిడ్లను కలుపుతూ ఉంటుంది. సెంట్రోమియర్ ఇరువైపులా రెండు బిళ్ళల వంటి నిర్మాణాలు ఉంటాయి. వీటిని కైనిటోకోర్లు అంటారు. కణ విభజన సమయంలో కైనిటోకోర్లకు కండెతంతువులు అతుక్కుంటాయి.

b) కణకవచము :
కణం నకు ఒక నిర్దిష్ట ఆకారాన్ని ఇస్తుంది. కణంను మాత్రిక హని నుండి వ్యాధికారక సూక్ష్మ జీవుల నుండి రక్షిస్తుంది. ఇది ప్రక్క ప్రక్క కణాలను కలుపుతూ, అవాంఛనీయ అణువులకు అడ్డుగోడవలె పనిచేస్తుంది.

c) నునుపు అంతర్జీవ ద్రవ్యజాలము :
రైబోసోమ్లు లేని అంతర్జీవ ద్రవ్యజాలము. ఇది లిపిడ్ల సంశ్లేషణలోను, కార్బోహైడ్రేట్ల జీవ క్రియలోను, కాల్షియం గాఢతను సమతుల్యత చేయుటలో పాల్గొంటుంది. దీనిలో గ్లోకోసన్ను గ్లూకోస్ – 6 ఫాస్పేట్గా మార్చి గ్లూకోజ్ 6-ఫాస్పోట్రాన్స్ఫరేజ్ అను ఎంజైం ఉంటుంది.

d) గాల్జి సంక్లిష్టము :
గ్లైకోప్రోటీన్లు, గ్లైకోలిపిడ్లను ఉత్పత్తిచేసే ముఖ్య కేంద్రంగా ఉంటుంది. కవచ పదార్థాల తయారీకి, కణ విభజన సమయంలో కణఫలకం ఏర్పాటులోను పాల్గొంటుంది.

e) సెంట్రియోల్ :
శైలికలు లేదా కశాభాలను, కండె పోగులను ఉత్పత్తి చేసే ఆధారకణికలుగా పనిచేస్తాయి. కణవిభజన సమయంలో జంతుకణాలు కండెపోగుల నుంచి కండె పరికరంను ఉత్పత్తి చేస్తాయి.

ప్రశ్న 7.
విభిన్న రకాల ప్లాస్టిడ్లు ఒక రూపం నుంచి వేరొక రూపంలోకి మార్పు చెందగలవా? అయితే ఉదాహరణలతో వివరించండి.
జవాబు:
ప్లాస్టిడ్లు ఒకరూపం నుంచి వేరొక రూపానికి మార్పు చెందగలవు. మొక్కలలో సాధారణంగా శ్వేతరేణువులు, వర్ణరేణువులు, హరితరేణువులు అను మూడు ప్లాస్టిడ్లు ఉంటాయి. శ్వేత రేణువులు నిల్వకు, వర్ణరేణువులు ఆయా మొక్కల బాగాలకు రంగును ఇవ్వడానికి, హరితరేణువులు కిరణజన్యసంయోగ క్రియకు తోడ్పడతాయి. టమాటో ఎరుపులో ఉండుట అనేది లైకోపిన్ అను వర్ణద్రవ్యం వల్ల వస్తుంది. ఎరుపు శైవలాలలో ఫైకోసమనిన్, ఫైకోఎరిథ్రిన్ అను వర్ణద్రవ్యాలు ఉంటాయి. గోధుమ శైవలాల్లో ప్యూకోజాంథిన్ ఉంటుంది.

పరిస్థితులను బట్టి ఒక ప్లాస్టిడ్ వేరొకరకంగా మారుతుంది. ఉదా : 1) బంగాళదుంపలోని శ్వేత రేణువులను కాంతికి గురిచేసిన హరిత రేణువులుగా మారతాయి.

2) మిరపలో అండాశయంలోని కణాలు శ్వేతరేణువులను కల్గి ఉంటాయి. అండాశయం, ఫలంగా మారేటప్పుడు అవి హరితరేణువులు, వర్ణరేణువులుగా మారతాయి.

ప్రశ్న 8.
ఈ క్రిందివాటిని భాగాలు గుర్తించబడిన పటాల సహాయంతో వివరించండి?
1) కేంద్రకం 2) సెంట్రోసోమ్
జవాబు:
AP Inter 1st Year Botany Study Material Chapter 9 కణం జీవప్రమాణం 3
1) కేంద్రకం :
దీనిని ప్రధాన కణాంగము / కణ మేధస్సు అంటారు.

దీనిని రాబర్ట్ బ్రౌన్ కనుగొన్నారు. అంతర్థశ కేంద్రకంలో క్రొమాటిన్ అనే న్యూక్లియోప్రొటీనులు, కేంద్రకమాత్రిక, గోళాకారంలో ఉన్న కేంద్రకాంశాలు ఉంటాయి. కేంద్రకంలోని పదార్ధాలను కణద్రవ్యం నుంచి వేరుచేస్తూ రెండుపొరలు ఆచ్ఛాదనగా ఉంటాయి. ఈ పొరల మధ్య పరిన్యూక్లియార్ ప్రదేశము ఉంటుంది. వెలుపలిపొర అంతర్జీవ ద్రవ్యజాలంతో అనుసంధానం చెంది, ఉపరితలంపై రైబోసోమ్లను గల్గి ఉంటుంది. కేంద్రక తొడుగులో రెండు పొరలు కలుసుకోవడం వల్ల ఏర్పడిన సూక్ష్మరంధ్రాలు ఉంటాయి. వీటి ద్వారా RNA మరియు ప్రోటీను అణువులు కేంద్రకము మరియు కణద్రవ్యాల మధ్య ద్విదిశాపధంలో చలనం చెందుతాయి. కేంద్రక ద్రవ్యంలో కేంద్రకాంశం, క్రొమాటిన్ ఉంటాయి. కేంద్రకాంశాల చుట్టూ పొర ఉండదు. దీనిలోని పదార్ధము కేంద్రకంసంలో కలిసిపోయి ఉంటుంది. ఇవి రైబోసోమల్ RNA చురుకుగా సంశ్లేషణ జరిపే ప్రదేశాలు అంతర్ధశ కేంద్రకంలో క్రొమాటిన్ అనే వదులైన అస్పష్టంగా కనిపించే న్యూక్లియో ప్రోటీను పోగులతో ఏర్పడిన వల వంటి నిర్మాణం ఉంటాయి. కాని కణ విభజన సమయంలో క్రోమోసోమ్లుగా మారతాయి. క్రొమాటిన్లో DNA హిస్టోనులు, కొన్ని నాన్ హిస్టోన్లు, RNA ఉంటాయి.

2) సెంట్రోసోమ్ :
AP Inter 1st Year Botany Study Material Chapter 9 కణం జీవప్రమాణం 6
సెంట్రిసోమ్ అనే కణాంగము సాధారణంగా -సెంట్రియోల్లు అనే రెండు స్థూపాకార నిర్మాణాలను చూపిస్తుంది. ఇవి రూపరహిత పెరియోసెంట్రియోలార్ పదార్థాలతో ఆవరించి ఉంటాయి. సెంట్రోసోమ్లోని సెంట్రియోలు ఒకదానికి మరొకటి లంబంగా అమర్చబడి ప్రతిదానిలో బండిచక్రం లాంటి నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. సెంట్రియోల్లో తొమ్మిది సమదూరంకల ట్యూబ్యులిన్చే నిర్మించబడిన పరిధీయ పోచలు ఉంటాయి. ప్రతి పరిధీయ పోచలో 3 సూక్ష్మ నాళికలు ఉంటాయి. ప్రక్క ప్రక్క నున్న పరిధీయ పోచలు త్రికాలు కలుపబడి ఉంటాయి. సెంట్రియోల్ కేంద్రభాగము ప్రోటీను పదార్థంచే నిర్మితమై హబ్ (Hub) గా పిలవబడుతుంది. హబ్ భాగము ప్రోటీనుయుతమైన వ్యాసార్ధ పోచలతో పరిధీయంగా ఉన్న ట్రిప్లెట్ పోచలకు కలపబడి ఉంటుంది. సెంట్రియోల్లు శైలికలు లేదా కశాభాలను, కండెపోగులను ఉత్పత్తి చేసే ఆధారకణికలుగా పనిచేస్తాయి. కణవిభజన సమయంలో జంతుకణాలు కండెపోగుల నుంచి కండె పరికరమును ఉత్పత్తి చేస్తాయి.

AP Inter 1st Year Botany Study Material Chapter 9 కణం: జీవప్రమాణం

ప్రశ్న 9.
సెంట్రోమియర్ అనగా నేమి? క్రోమోజోమ్ల వర్గీకరణలో సెంట్రోమియర్ స్థానం ఎలాంటి ప్రాధాన్యతను కలిగి ఉంటుంది. విభిన్న రకాల క్రోమోసోమ్లలో సెంట్రోమియర్ స్థానాలను చూపే పటం గీసి వివరించండి.
జవాబు:
ప్రతి క్రోమోసోమ్లో ప్రాథమిక కుంచనం లేక సెంట్రోమియర్ ఉంటుంది. దీనికి ఇరువైపులా రెండు బిళ్లల వంటి నిర్మాణాలు ఉంటాయి. వీటిని కైనిటోకోర్లు అంటారు. వీటికి కండెతంతువులు అతుక్కుని క్రొమోసోమ్ల విభజనకు సహాయపడతాయి. క్రోమోసోంలో సెంట్రోమియర్ స్థానాన్ని బట్టి 4 రకాల క్రోమోసోంలు గుర్తించారు. అవి :
1) మెటాసెంట్రిక్ :
సెంట్రోమియర్ క్రోమోసోమ్ మధ్యస్థానంలో ఉండి రెండు వైపులా బాహువులు సమానంగా ఉంటాయి. చలన దశలో ఈ క్రోమోసోమ్లు ‘V’ ఆకారంలో కనిపిస్తాయి.

2) సబ్మెటా సెంట్రిక్ :
సెంట్రోమియర్ క్రోమోసోమ్ మధ్య స్థానంలో కాకుండా కొంచెం పక్కగా ఉంటుంది. బాహువులు అసమానంగా ఉంటాయి. చలనదశలో ఈ క్రోమోసోమ్లు ‘L’ ఆకారంలో కనిపిస్తాయి.
AP Inter 1st Year Botany Study Material Chapter 9 కణం జీవప్రమాణం 4

3) ఎక్రోసెంట్రిక్ :
సెంట్రోమియర్ ఒక వైపుగా ఏర్పడి ఉంటుంది. ఒక బాహువు పొడవుగా, మరొకటి పొట్టిగా ఉంటాయి. చలనదశలో ఈ క్రోమోసోమ్లు ” ఆకారంలో కనిపిస్తాయి.

4) టీలోసెంట్రిక్ :
సెంట్రోమియర్ క్రోమోసోమ్ బాహువు కొనలో ఉంటుంది. దీనివల్ల ఒకే బాహువు ఉంటుంది. ఈ క్రోమోసోమ్లు చలనదశలో ” (పుడక) ఆకారంలో కనిపిస్తాయి.

Intext Question and Answers

ప్రశ్న 1.
కేంద్రక పూర్వకణంలోని మీసోసోమ్ అంటే ఏమిటి? అది నిర్వహించే విధులు ఏవి?
జవాబు:
ప్లాస్మా పొర కణంలోనికి అనేక చోట్ల వ్యాపనం చెందడం వల్ల కనిపించే త్వచయుత ఆకారాలను మీసోసోమ్లు అంటారు. ఇవి కోశికలు, నాళికలు, పటలికలు వలె కనిపిస్తాయి. అవి కణ కవచం ఏర్పడటానికి, DNA ప్రతికృతి చెందడానికి, పిల్ల కణాలకు DNA వితరణ చెందడానికి తోడ్పడతాయి. ఇవి శ్వాసక్రియలో, స్రావక క్రియలో ప్లాస్మాపొర ఉపరితల వైశాల్యాన్ని పెంచడం ద్వారా పోషకాల శోషణ క్రియలో, ఎంజైమ్ల పరిమాణం పెంచడంలో తోడ్పడతాయి.

ప్రశ్న 2.
తటస్థ అణువులు ప్లాస్మాత్వచం ద్వారా ఎలా చలిస్తాయి ? ధృవ అణువులు కూడా వాటివలెనే చలిస్తాయా? కానిచో అవి త్వచంలో ఏ పద్ధతిలో రవాణా చెందుతాయి?
జవాబు:
తటస్థ ద్రావితాలు కణ పొర ద్వారా సామాన్య విసరణ పద్ధతిలో గాఢతా ప్రవణతను అనుసరించి అంటే అధిక గాఢత నుంచి అల్ప గాఢత దిశలో ప్రయాణిస్తాయి. ధృవ ధర్మంగల అణువులు అధృవ స్వభావం ఉన్న ద్విపటలికాయుత లిపిడ్ పొర ద్వారా ప్రయాణించలేవు. కనుక వాటికి త్వచం గుండా రవాణా చెయ్యటానికి వాహక ప్రోటీన్ల సాయం కావాలి. కొద్ది అయానులు లేదా అణువులు వాహక ప్రోటీన్ల సహాయంతో వాటి గాఢతా ప్రవణతకు వ్యతిరేకదిశలో అంటే అల్పగాఢతనుంచి అధికగాఢతలవైపు త్వచం గుండా రవాణా చెందుతాయి.

ప్రశ్న 3.
రెండు త్వచాలచే ఆవరించబడిఉన్న రెండు కణాంగాలను తెలపండి. వాటి లక్షణాలు ఏవి? వాటి విధులను తెలిపి, వాటి భాగాలు గుర్తించిన పటాలు గీయండి.
జవాబు:
AP Inter 1st Year Botany Study Material Chapter 9 కణం జీవప్రమాణం 5
మైటోకాండ్రియా, హరితరేణువు :
మైటోకాండ్రియాలు దండాకారంలో లేక స్థూపాలులాగా ఉంటాయి. ఇవి 0.2 – 1.0 µm వ్యాసం, 1.0 – 4.1 µm పొడవులో ఉంటాయి. దీనికి ఉన్న రెండు పొరలలో వెలుపలి పొరను నునుపుగాను, లోపలిపొర లోపలి వైపుకు ముడతలను ఏర్పరుస్తుంది. వీటిని క్రిస్టే అంటారు. మైటోకాండ్రియాలు వాయు సహిత శ్వాసక్రియ జరిగే ప్రదేశాలు. వీటిని కణశక్త్యాగారాలు అంటారు.

హరితరేణువులు అండాకారం, గోళాకారం లేక రిబ్బన్ ఆకారంలో ఉంటాయి. ఇది 5 10 µm పొడవు, 2.4 µm వెడల్పు కలిగి ఉంటాయి. హరితరేణువు యొక్క ఆవర్ణికలో కార్బోహైడ్రేటులు, ప్రోటీనుల సంశ్లేషణకు అవసరమయిన అనేక ఎంజైమ్లు ఉంటాయి.

ప్రశ్న 4.
కేంద్రక పూర్వజీవుల కణాల లక్షణాలు ఏమిటి?
జవాబు:

  1. కేంద్రక త్వచము ఉండదు. కణం మధ్యలో ఒకే ఒక వలయాకార, నగ్న DNA ఉంటుంది. దీనిని న్యూక్లియాయిడ్ అంటారు.
  2. కేంద్రకాంశం ఉండదు.
  3. అంతర త్వచ వ్యవస్థ ఉండదు.
  4. మైటోకాండ్రియా, ప్లాస్టిడ్లు, లైసోజోమ్లు, పెరాక్సిజోమ్లు, కణ అస్థిపంజరము ఉండవు.
  5. 70 S రకానికి చెందిన రైబోజోమ్లు ఉంటాయి.
  6. కణ కవచము పాలీశాఖరైడ్లు, లిపిడ్లు, ప్రోటీనులతో నిర్మితమై ఉంటుంది.
  7. శ్వాసక్రియా ఎంజైమ్లు కణత్వచంలో ఉంటాయి.
  8. కణాలు ద్విధావిచ్చిత్తి ద్వారా సాధారణ అలైంగిక ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయి.

ప్రశ్న 5.
బహుకణయుత జీవులలో శ్రమవిభజన ఉంటుంది. వివరించండి.
జవాబు:
బహుకణజీవులు మిలియన్, ట్రిలియన్ కణాలతో నిర్మితమై ఉంటాయి. ఈ కణాలు అన్ని వేరు వేరు పనులు నిర్వర్తిస్తాయి. ఒకేరకమైన విధులు నిర్వర్తించే కణాల సముదాయమును కణజాలము అంటారు. కావున జీవి దేహంలో, ప్రత్యేక విధిని ప్రత్యేకకణజాలం ఒక ప్రదేశంలో నిర్వహిస్తుంది.

అదేవిధంగా వివిధ రకాల కణాలు వివిధ రకాల విధులను నిర్వహిస్తాయి. ఈ విధమైన శ్రమ విభజన వల్ల బహుకణయుత జీవులు, సంక్లిష్ట పరిస్థితులను కూడా ఎదుర్కొనగలుగుతాయి.

AP Inter 1st Year Botany Study Material Chapter 9 కణం: జీవప్రమాణం

ప్రశ్న 6.
కణం జీవానికి మౌళిక ప్రమాణము. సంగ్రహంగా చర్చించండి.
జవాబు:
ప్లీడన్ అను జర్మన్ వృక్షశాస్త్రవేత్త అనేక మొక్కలను పరిశీలించి మొక్కలన్నీ వివిధ రకాల కణాలతో ఏర్పడి వున్న కణజాలాలతో నిర్మితమై ఉంటాయని గుర్తించారు. దీని ఆధారంగా వృక్ష, జంతు శరీరాలు కణాలు, కణ ఉత్పత్తులతో ఏర్పడి ఉంటాయనే పరికల్పనను ప్రతిపాదించారు. ప్లీడన్ మరియు ష్వాన్లు కణ సిద్ధాంతంను ప్రతిపాదించారు. రుడాల్ఫ్ విర్షా, కొత్త కణజాలాలు అంతకు పూర్వమున్న కణాల నుంచి విభజన వల్ల ఏర్పడ్డాయని వివరించారు. దీనిని ‘ఆమ్నిస్ సెల్యులా సెల్యులా’ అంటారు. కణం ఒక జీవ భౌతికాధారము. కణము జీవులన్నింటిలో మౌళికమైన నిర్మాణాత్మక మరియు క్రియాత్మక ప్రమాణము. – కణంను సజీవస్థితిలో ఉంచడానికి కావలసిన వివిధ రసాయన చర్యలు కణద్రవ్యంలోనే జరుగుతాయి. కొన్ని నిర్మాణాలు (కణాలు) రవాణాలోను, కొన్ని ఆహారపదార్థాల తయారీలోను మరికొన్ని శక్తిని విడుదల చేస్తాయి.

ఒక ఆకుపచ్చని మొక్కను పరిశీలించిన దానిలో పత్రహరితము ఉండి, సూర్యరశ్మిని గ్రహించి, కావలసిన శక్తి పూరిత ఆహార పదార్ధములను తయారుచేసుకుంటుంది. ఇది కణంలోని భాగము, దీనిని హరితరేణువు అంటారు. మొక్కల జంతువులోని కణాలలో కేంద్రకము ప్రధాన కణాంగంగా పనిచేసి, కణచర్యలను నియంత్రిస్తుంది. కణ ద్రవ్యంలో వివిధ కణాంగాలు వివిధ రకాల జీవక్రియలను నియంత్రిస్తూ ఉంటాయి.

ప్రశ్న 7.
కేంద్రక త్వచ రంధ్రాలు అంటే ఏమిటి? వాటి విధులను తెలియజేయండి.
జవాబు:
కేంద్రక త్వచంలో అనేక ప్రదేశాలలో సూక్ష్మరంధ్రాలను కలిగి ఉంటుంది. ఇవి తొడుగులోని రెండు పొరలు కలుసుకోవడంవల్ల ఏర్పడతాయి. వీటిని కేంద్రక రంధ్రాలు అంటారు. వీటి ద్వారా RNA మరియు ప్రోటీను అణువులు కేంద్రకం మరియు కణ ద్రవ్యాల మధ్య ద్విదిశాపథంలో చలనం చెందుతాయి. నిజకేంద్రక కణాలలో కేంద్రకము, కణద్రవ్యం నుండి కేంద్రక త్వచంచే వేరు చేయబడి ఉంటుంది. ఇది కేంద్రకంలోని DNA కు రక్షణగా పనిచేస్తుంది. ఈ వారధితోపాటు కేంద్రక రంధ్రాల ద్వారా కేంద్రక ద్రవ్యానికి, కణద్రవ్యానికి మధ్య సంబంధం ఉంటుంది.

ప్రతి కేంద్రక రంధ్రము ప్రోటీను సంక్లిష్టంతో నిర్మితమై, చిన్న అణువులు, అయానులను స్వేచ్ఛగా కేంద్రకం నుండి విసరణ చెయ్యడానికి తోడ్పడుతుంది మరియు కణద్రవ్యం నుండి అవసరమైన ప్రోటీనులను కేంద్రకంలోనికి అనుమతిస్తుంది. కేంద్రకంలో తయారయిన RNA మరియు ప్రోటీనులను కణ ద్రవ్యంలోనికి పంపడానికి కూడా కేంద్రక రంధ్రాలు తోడ్పడతాయి.

ప్రశ్న 8.
లైసోసోమ్లు, రిక్తికలు రెండు అంతరత్వచ వ్యవస్థకు చెందినవే అయినా వాటి విధులు భిన్నంగా ఉంటాయి. వ్యాఖ్యానించండి.
జవాబు:
హైడోలైటిక్, ఎంజైములను సమృద్ధిగా కలిగి కార్బోహైడ్రేట్లు, ప్రోటీనులు, లిపిడ్లు, కేంద్రకామ్లములను జీర్ణంచేసే త్వచయుత కణాంగాలను లైసోసోమ్లు అంటారు. ఈ ఎంజైమ్లు ఆమ్ల PH ల వద్ద యుక్తతమంగా పనిచేస్తాయి. కరువు పరిస్థితులలో లైసోసోమ్లు కణంలోని అంశాలను ఎంజైమ్ల ద్వారా జీర్ణింపచేసి కణం మృతికి కారణం అవుతాయి. ఈ చర్యను స్వయంవిచ్ఛిత్తి అంటారు.

కణంలో, కణద్రవ్యంలో కనిపించే త్వచయుత ఆచ్ఛాదన కల ప్రదేశాలును రిక్తికలు అంటారు. వీటిలో ప్రధానంగా నీరు, జీవక్రియా ఉపఉత్పన్నాలు విసర్జక పదార్థాలు, వ్యర్థ పదార్థాలతో కూడిన రసం ఉంటుంది. దీనిని రిక్తికరసం అంటారు. దీనిలో మొక్క భాగాలకు రంగు నిచ్చే ఆంథోసయనిన్ లాంటి వర్ణద్రవ్యాలు ఉంటాయి. రిక్తిక చుట్టూ ఏకపొర త్వచం ఉంటుంది. దీనిని రిక్తిక పొర (Tonoplast) అంటారు. ఇది అనేక అయాన్లు వాటి గాఢతా ప్రవణతకు వ్యతిరేకంగా రిక్తికలోనికి రవాణా చెందడానికి తోడ్పడుతుంది. రిక్తికలు కణ ద్రవాభిసరణ చర్యల నియంత్రణలో ముఖ్యపాత్ర వహిస్తాయి.

ప్రశ్న 9.
ఈ క్రింది వానిని భాగాలు గుర్తించిన పటాలతో వర్ణించండి.
1) కేంద్రకము
2) సెంట్రోసోమ్
జవాబు:
AP Inter 1st Year Botany Study Material Chapter 9 కణం జీవప్రమాణం 3
1) కేంద్రకం :
దీనిని ప్రధాన కణాంగము / కణ మేధస్సు అంటారు. దీనిని రాబర్ట్ బ్రౌన్ కనుగొన్నారు. అంతర్థశ కేంద్రకంలో క్రొమాటిన్ అనే న్యూక్లియోప్రొటీనులు, కేంద్రకమాత్రిక, గోళాకారంలో ఉన్న కేంద్రకాంశాలు ఉంటాయి. కేంద్రకంలోని పదార్థాలను కణద్రవ్యం నుంచి వేరుచేస్తూ రెండుపొరలు ఆచ్ఛాదనగా ఉంటాయి. ఈ పొరల మధ్య పరిన్యూక్లియార్ ప్రదేశము ఉంటుంది. వెలుపలిపొర అంతర్జీవ ద్రవ్యజాలంతో అనుసంధానం చెంది, ఉపరితలంపై రైబోసోమ్లను గల్గి ఉంటుంది. కేంద్రక తొడుగులో రెండు పొరలు కలుసుకోవడం వల్ల ఏర్పడిన సూక్ష్మరంద్రాలు ఉంటాయి. వీటి ద్వారా RNA మరియు ప్రోటీను అణువులు కేంద్రకము మరియు కణద్రవ్యాల మధ్య ద్విదిశాపధంలో చలనం చెందుతాయి. కేంద్రక ద్రవ్యంలో కేంద్రకాంశం, క్రొమాటిన్ ఉంటాయి. కేంద్రకాంశాల చుట్టూ పొర ఉండదు. దీనిలోని పదార్ధము కేంద్రకంసంలో కలిసిపోయి ఉంటుంది. ఇవి రైబోసోమల్ RNA చురుకుగా సంశ్లేషణ జరిపే ప్రదేశాలు అంతర్దశ కేంద్రకంలో క్రొమాటిన్ అనే వదులైన అస్పష్టంగా కనిపించే న్యూక్లియో ప్రోటీను పోగులతో ఏర్పడిన వల వంటి నిర్మాణం ఉంటాయి. కాని కణ విభజన సమయంలో క్రోమోసోమ్లుగా మారతాయి. క్రొమాటిన్లో DNA హిస్టోనులు, కొన్ని నాన్ హిస్టోన్లు, RNA ఉంటాయి.

AP Inter 1st Year Botany Study Material Chapter 9 కణం జీవప్రమాణం 6
2) సెంట్రోసోమ్ :
సెంట్రిసోమ్ అనే కణాంగము సాధారణంగా పరిధీయ సూక్ష్మ నాళికల జతలు సెంట్రయోల్లు అనే రెండు స్థూపాకార నిర్మాణాలను చూపిస్తుంది. కేంద్రస్థ తొడుగు ఇవి రూపరహిత పెరిసెంట్రియోలార్ పదార్థాలతో ఆవరించి ఉంటాయి. సెంట్రోసోమ్లోని సెంట్రియోల్లు ఒకదానికి మరొకటి లంబంగా అమర్చబడి ప్రతిదానిలో బండిచక్రం లాంటి నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. సెంట్రియోల్లో తొమ్మిది సమదూరంకల ట్యూబ్యులిన్చే నిర్మించబడిన పరిధియ పోచలు ఉంటాయి. ప్రతి పరిధియ పోచలో 3 సూక్ష్మ నాళికలు ఉంటాయి. ప్రక్క ప్రక్క నున్న పరిధియ పోచలు త్రికాలు కలుపబడి ఉంటాయి. సెంట్రియోల్ కేంద్రభాగము ప్రోటీను పదార్థంచే నిర్మితమై హబ్ (Hub) గా పిలవబడుతుంది. హబ్ భాగము ప్రోటీనుయుతమైన వ్యాసార్ధ పోచలతో పరిధేయంగా ఉన్న ట్రిప్లెట్ పోచలకు కలపబడి ఉంటుంది. సెంట్రియోల్లు శైలికలు లేదా కశాభాలను, కండెపోగులను ఉత్పత్తి చేసే ఆధారకణికలుగా పనిచేస్తాయి. కణవిభజన సమయంలో జంతుకణాలు కండెపోగుల నుంచి కండె పరికరమును ఉత్పత్తి చేస్తాయి.

ప్రశ్న 10.
సెంట్రోమియర్ అనగానేమి? క్రోమోసోమ్ల వర్గీకరణకు సెంట్రోమినం ఏ రకంగా ఆధారమౌతుంది. వివిధ రకాల క్రోమోసోమ్లలోని సెంట్రోమియర్ స్థానాన్ని చూపే పటంతో మీ సమాధానాన్ని బలపరచండి.
జవాబు:
ప్రతి క్రోమోసోమ్లో ప్రాథమిక కుంచనం లేక సెంట్రోమియర్ ఉంటుంది. దీనికి ఇరువైపులా రెండు బిళ్లల వంటి నిర్మాణాలు ఉంటాయి. వీటిని కైనిటోకోర్లు అంటారు. వీటికి కండెతంతువులు అతుక్కుని క్రొమోసోమ్ల విభజనకు సహాయపడతాయి. క్రోమోసోంలో సెంట్రోమియర్ స్థానాన్ని బట్టి 4 రకాల క్రోమోసోంలు గుర్తించారు. అవి :
1) మెటాసెంట్రిక్ :
సెంట్రోమియర్ క్రోమోసోమ్ మధ్యస్థానంలో ఉండి రెండు వైపులా బాహువులు సమానంగా ఉంటాయి. చలన దశలో ఈ క్రోమోసోమ్లు ‘V’ ఆకారంలో కనిపిస్తాయి.

2) సబ్మెటా సెంట్రిక్ :
సెంట్రోమియర్ క్రోమోసోమ్ మధ్య స్థానంలో కాకుండా కొంచెం పక్కగా ఉంటుంది. బాహువులు అసమానంగా ఉంటాయి. చలనదశలో ఈ క్రోమోసోమ్లు ‘L’ ఆకారంలో కనిపిస్తాయి.
AP Inter 1st Year Botany Study Material Chapter 9 కణం జీవప్రమాణం 7

3) ఎక్రోసెంట్రిక్ :
సెంట్రోమియర్ ఒక వైపుగా ఏర్పడి ఉంటుంది. ఒక బాహువు పొడవుగా, మరొకటి పొట్టిగా ఉంటాయి. చలనదశలో ఈ క్రోమోసోమ్లు ” ఆకారంలో కనిపిస్తాయి.

4) టీలోసెంట్రిక్ :
సెంట్రోమియర్ క్రోమోసోమ్ బాహువు కొనలో ఉంటుంది. దీనివల్ల ఒకే బాహువు ఉంటుంది. ఈ క్రోమోసోమ్లు చలనదశలో ” (పుడక) ఆకారంలో కనిపిస్తాయి.

AP Inter 1st Year Zoology Study Material Chapter 1 జీవ ప్రపంచ వైవిధ్యం

Andhra Pradesh BIEAP AP Inter 1st Year Zoology Study Material 1st Lesson జీవ ప్రపంచ వైవిధ్యం Textbook Questions and Answers.

AP Inter 1st Year Zoology Study Material 1st Lesson జీవ ప్రపంచ వైవిధ్యం

అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
జీవన చర్యలను నిర్వచించి ఒక ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
జీవుల దేహములో జరిగే అన్ని రకాల రసాయన చర్యలనే సంక్షిప్తంగా జీవన క్రియలు అంటారు.
ఉదా : కిరణజన్య క్రియ జీవనచర్యకు ఉదాహరణగా పేర్కొనవచ్చు.

ప్రశ్న 2.
నిర్జీవుల, సజీవుల పెరుగుదలలో భేదాలను ఎలా గుర్తిస్తారు?
జవాబు:
పెరుగుదల సజీవులలో ఒక ముఖ్య లక్షణముగా పేర్కొనవచ్చు. ఈ జీవులలో పెరుగుదల అంతర్గతముగా జరుగును. నిర్జీవులలో పెరుగుదల ఉండదు. కాని కొన్ని నిర్జీవులు బాహ్యముగా పదార్థము సమకూరటం వల్ల పెరుగుదల చూపును.

ప్రశ్న 3.
బయోజెనిసిస్ అంటే ఏమిటి?
జవాబు:
జీవులు, జీవుల నుండి ఉద్భవించినాయని తెలుపుటయే బయోజెనిసిస్. ప్రాణులు వాటిని పోలిన పిల్లలను ఉత్పత్తి చేస్తాయి. జన్యు అణువులను ఉపయోగించుకొని వాటి సంతానమును వృద్ధి చేయును.

ప్రశ్న 4.
కణజాల శాస్త్రాన్ని నిర్వచించండి. దీనికి గల మరొక పేరు ఏమిటి?
జవాబు:
వివిధ అంగాలలో ఉండే కణజాలాల సూక్ష్మ నిర్మాణము, వాటి అమరికను గురించి తెలిపే శాస్త్రము. దీనినే సూక్ష్మ అంతర నిర్మాణశాస్త్రము అని కూడా అందురు.

ప్రశ్న 5.
పిండోత్పత్తి శాస్త్రానికీ, ప్రవర్తనా శాస్త్రానికీ (ఇథాలజీ) మధ్య భేదమేమిటి?
జవాబు:
జీవులలో జరిగే ఫలదీకరణం, సంయుక్త బీజములో జరిగే విదళనాలు, వివిధ పిండాభివృద్ధి దశలను అధ్యయనం చేయు శాస్త్రము.

జంతువు ప్రవర్తన గురించి తెలియజేసే శాస్త్రము. దీనినే ప్రవర్తనా జీవశాస్త్రము అని కూడా అంటారు.

AP Inter 1st Year Zoology Study Material Chapter 1 జీవ ప్రపంచ వైవిధ్యం

ప్రశ్న 6.
ప్రాచీన కాలములో నివసించిన జీవి అవశేషాలను ఒక (నిర్దిష్ట) ప్రదేశములో తవ్వి తీయటము జరిగింది. ఇలాంటి అధ్యయనాన్ని జరిపే జీవశాస్త్ర శాఖను ఏమంటారు?
జవాబు:
ప్రాచీన కాలములో నివసించిన జీవుల అవశేషాలయిన శిలాజాలను గురించి అధ్యయనాన్ని పురాజీవశాస్త్రము అంటారు.

ప్రశ్న 7.
‘జంతు ప్రదర్శనశాలలు వర్గీకరణకు ఉపకరణాలు’ వివరించండి.
జవాబు:
జంతువుల బాహ్య లక్షణాలు, ఆహారపు అలవాట్లు, ప్రవర్తన మొదలయిన వాటిని పరిశీలించడానికి వాటి ఆధారముగా జంతువులను వర్గీకరించడానికి జంతు ప్రదర్శనశాలలు అవకాశం కలిగిస్తాయి.

ప్రశ్న 8.
పొడి నమూనాలు (Dry specimens) అస్థిపంజరాలను ఎక్కడ, ఎట్లా పరిరక్షిస్తారు?
జవాబు:
పక్షులు, క్షీరదాల వంటి పెద్ద జంతువుల లోపలి అవయవాలను తీసివేసి, వాటి స్థానములో పొట్టు, ఊకలాంటి పదార్థములను దట్టించి ప్రదర్శనశాలలో భద్రపరుస్తారు. వివిధ అస్థి పంజరాలను కూడా భద్రపరిచేదరు.

ప్రశ్న 9.
త్రినామ నామీకరణ అంటే ఏమిటి? ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
ఒక శాస్త్రీయ నామములో ప్రజాతి, జాతి, ఉపజాతులను పేర్కొనుటను త్రినామ నామీకరణ అంటారు.
ఉదా : హోమో సెపియన్స్ సెపియన్స్
ప్రజాతి జాతి ఉపజాతి

ప్రశ్న 10.
టాటోనిమీ అంటే ఏమిటి ? రెండు ఉదాహరణలు ఇవ్వండి. [Mar. ’14]
జవాబు:
ఒక శాస్త్రీయ నామములో జాతిపేరు, ప్రజాతి పేరు ఒకటే అయినట్లయితే అలాంటి శాస్త్రీయ నామాన్ని టాటోనిమీ అంటారు.
AP Inter 1st Year Zoology Study Material Chapter 1 జీవ ప్రపంచ వైవిధ్యం 1

ప్రశ్న 11.
ప్రోటోస్టోమియా, డ్యుటిరోస్టోమియాలను విభేదీకరించండి.
జవాబు:
జీవులలో అది అంత్ర రంధ్రము నోరుగా అభివృద్ధి చెందే యుమెటాజోవన్లను ప్రొటోస్టోమియా జీవులు అందురు. జీవులలో అది అంత్ర రంధ్రము పాయువుగా అభివృద్ధి చెందే యుమెటాజోవన్లను డ్యుటిరోస్టోమియా అందురు.

ప్రశ్న 12.
ఇకైనోడెర్మేటా జీవులు ఎంటిరోసీలోమేట్లు” వ్యాఖ్యానించండి.
జవాబు:
ఇకైనోడెర్మేటా జీవులలో ఎంటిరోసీలోమ్ అనే నిజ శరీర కుహరం ఉంటుంది. ఇది ఆది ఆంత్రం నుంచి పార్శ్వ సంచుల రూపములో ఏర్పడుతుంది.

ప్రశ్న 13.
ICZN ను విపులీకరించండి.
జవాబు:
ఇంటర్నేషనల్ కోడ్ ఆఫ్ జులాజికల్ నామెన్ క్లేచర్.

ప్రశ్న 14.
ప్రొటోస్టోమియాకు చెందిన నాలుగు వర్గాలను తెలపండి.
జవాబు:
వర్గము : నిమటోడా, అనెలిడా, ఆర్థ్రోపొడా, మొలస్కా

AP Inter 1st Year Zoology Study Material Chapter 1 జీవ ప్రపంచ వైవిధ్యం

ప్రశ్న 15.
నిమటోడా ప్రొటోస్టోమియా సమూహానికి చెందింది కానీ యూసీలోమేట్ కాదు. ఈ వ్యాఖ్యానాన్ని సమర్థించండి.
జవాబు:
నిమటోడా జీవులు యుసీలోమేటా జీవులు కాకపోవుటకు కారణము వీటి శరీర కుహరము మధ్యస్త్వచ ఉపకళా స్తరములతో ఆవరింపబడి ఉండదు. కాబట్టి దీనిని నిజశరీర కుహరముగా పేర్కొనరు. అందువలన దీనిని మిధ్యా శరీర కుహరముగా గుర్తించెదరు.

ప్రశ్న 16.
జీవావరణ వైవిధ్యం అంటే ఏమిటి? వివిధ రకాల జీవావరణ వైవిధ్యాలను పేర్కొనండి.
జవాబు:
జీవావరణ వ్యవస్థ లాంటి ఉన్నతస్థాయి వ్యవస్థలలో ఉండే వైవిధ్యాన్ని “జీవావరణ వైవిధ్యం” అని అందురు. జీవావరణ వైవిధ్యాలు మూడు రకాలు.

  1. ఆల్ఫా వైవిధ్యము
  2. బీటా వైవిధ్యము
  3. గామా వైవిధ్యము.

ప్రశ్న 17.
జాతి సమృద్దతను నిర్వచించండి.
జవాబు:
ఒక నిర్ణీత విస్తీర్ణత గల ప్రాంతములో నివసించే జాతుల సంఖ్యను జాతి సమృద్ధత అని అందురు.

ప్రశ్న 18.
ప్రకృతి నుంచి లభించే ఏవైనా రెండు ఔషధాలను పేర్కొనండి.
జవాబు:

  1. విల్లాస్టిన్ అనే యాంటి క్యాన్సర్ ఔషధాన్ని వింకారోజియా అనే మొక్క నుంచి తయారుచేస్తారు.
  2. ‘డిజిటాలిన్’ అనే మందును ‘ఫాక్స్ వ్’ అనే ‘డిజిటాలిస్ పర్పూరియా’ అనే మొక్కల నుండి తయారుచేస్తారు. దీనిని హృద్రోగ సమస్యలను నివారించుటకు ఉపయోగిస్తారు.

ప్రశ్న 19.
స్థానికేతర జాతుల చొరబాటు (invasion) స్థానిక జాతుల విలుప్తతకు కారణమవుతుంది. రెండు ఉదాహరణలతో ఈ వాక్యాన్ని నిరూపించండి.
జవాబు:

  1. “నైల్పెర్చ్” అనే చేపను తూర్పు ఆఫ్రికాలోని “లేక్ విక్టోరియా” సరస్సులోకి ప్రవేశపెట్టడం వల్ల ఆ సరస్సులో 200 జాతుల స్థానిక సిక్లిడ్ చేపలు క్షీణించినవి.
  2. “క్లారియస్ గారీపైనస్” అనే ఆఫ్రికన్ పిల్లిచేపను జల సంవర్థనం కోసం ప్రవేశపెట్టడం వల్ల స్థానిక పిల్లిచేపల జీవనానికి హానికరంగా మారింది.

ప్రశ్న 20.
భారతదేశంలోని ఏవైనా నాలుగు పావన వనాలను పేర్కొనండి.
జవాబు:

  1. ఖాసీ, జైంటియా కొండలు – మేఘాలయ
  2. ఆరావళి పర్వతాలు – రాజస్థాన్, గుజరాత్
  3. పశ్చిమ కనుమల ప్రాంతం – కర్ణాటక, మహారాష్ట్ర
  4. సద్గుజ, బస్తర్ – చత్తీస్ ఘడ్
  5. చందా – మధ్యప్రదేశ్

AP Inter 1st Year Zoology Study Material Chapter 1 జీవ ప్రపంచ వైవిధ్యం

ప్రశ్న 21.
IUCN ను విపులీకరించండి. అంతరించిపోతున్న జాతుల పట్టికను ఏ పుస్తకంలో ఇచ్చారు?
జవాబు:
“ఇంటర్ నేషనల్ యూనియన్ ఫర్ ది కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ నేచురల్ రిస్సోర్సెస్”.

అంతరించిపోతున్న జాతులను IUCN ప్రచురించే “రెడ్ డేటా” పుస్తకంలోని పట్టికలో పేర్కొంటారు.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
వర్గవికాస జీవవర్గీకరణను వివరించండి.
జవాబు:
వర్గవికాస వర్గీకరణ :
ఉమ్మడి వంశపారంపర్యంను ఆధారంగా చేసుకొన్న వర్గీకరణను వర్గవికాస వర్గీకరణ అంటారు. ఈ వర్గీకరణలో జాతుల మధ్యగల ‘జన్యుఅంతరాన్ని’ లెక్కించడం ద్వారా ‘వర్గవికాస వృక్షాన్ని’ తయారుచేస్తారు. జీవుల క్రియాసామ్య లక్షణాలు, నిర్మాణసామ్య లక్షణాల ఆధారంగా చేసేదే వర్గవికాస వర్గీకరణ. అభిసారి పరిణామం వల్ల ఏర్పడిన ఒక జత జీవులు పంచుకొనే లక్షణాలను క్రియాసామ్య లక్షణాలు అంటారు. ఉదాహరణకు పిచ్చుక రెక్క; ఎగిరే ఉడుత, గబ్బిలంలోని పెటాజియం అనే రెక్కలాంటి చర్మ విస్తరణ నిర్మాణం. ఒకే ఉమ్మడి వంశకర్త నుంచి అనువంశికత ద్వారా ఒక జత జీవులు పంచుకొనే లక్షణాలను నిర్మాణసామ్య లక్షణాలు అంటారు. ఉదాహరణకు పిచ్చుక రెక్క (ఫించ్) కాకిరెక్క, వర్గ వికాస చరిత్రను వృక్షరూప చిత్రంగా గానీ లేదా శాఖీయుత రేఖాచిత్రం గానీ సూచించే పద్ధతిని ఎర్నెస్ట్ హెకెల్ ప్రవేశపెట్టాడు.

ప్రశ్న 2.
వర్గీకరణలో వివిధ అంతస్తులను వివరించండి.
జవాబు:
వర్గీకరణలో ఏడు అవికల్ప అంతస్తులు ఉంటాయి. అవి రాజ్యం, వర్గం, విభాగం, క్రమం, కుటుంబము, ప్రజాతి, జాతి.
1) రాజ్యము :
అన్ని విషమపోషక బహుకణ జీవులను ఏనిమేలియా అనే రాజ్యములో చేర్చినారు.

2) వర్గము :
ఒకటి లేదా ఎక్కువ విభాగములు కలిసి ఒక వర్గము ఏర్పడును. ఉదాహరణకు ఉభయచరాలు, సరీసృపాలు, పక్షులు, క్షీరదములు మొదలగు విభాగములను కార్డేటా వర్గములో చేర్చినారు.

3) విభాగము :
సన్నిహిత సంబంధం గల ఒకటి లేదా ఎక్కువ క్రమాలను కలిసి ఒక విభాగము ఏర్పడును. ఉదాహరణకు రోడెన్షియా, కైరాఫ్టెరా, సిటేసియా, కార్నివోరా మొదలగు క్రమములను క్షీరద విభాగములో చేర్చిరి.

4) క్రమము :
ఒకటి లేదా దగ్గర సంబంధము గల కొన్ని కుటుంబాలను కలిసి ఒక క్రమము ఏర్పడుతుంది. ఉదాహరణకు ఫెరిడే, కానిడే, ఉర్సిడే కుటుంబాలను కార్నివోరా అనే క్రమములో చేర్చిరి.

5) కుటుంబము :
సన్నిహిత సంబంధము గల కొన్ని ప్రజాతులను ఒక కుటుంబముగా పేర్కొనెదరు. ఉదాహరణకు ఫెరిడే కుటుంబములో పిర్లి ప్రజాతి అయిన ఫెకిస్, చిరుత ప్రజాతి అయిన ఫాంథెరాను చేర్చిరి.

6) ప్రజాతి :
దగ్గర సంబంధము కలిగి, కొన్ని లక్షణములలో పోలికలున్న జాతులు కలిపి ప్రజాతి ఏర్పడును. ఉదాహరణకు పాంథీరాలియో (సింహము), పాంథీర టైగ్రిస్ (పులి) మొదలగునవి పాంథీరా ప్రజాతికి చెందును.

7) జాతి :
వర్గీకరణ వ్యవస్థలో జాతి ఒక ప్రాథమిక ప్రమాణము. ఉమ్మడి జన్యు సముదాయాన్ని పంచుకొంటూ స్వేచ్ఛగా అంతర ప్రజననం జరుపుకొని “ఫలవంతమైన” సంతానాన్ని ఉత్పత్తి చేసి ఒకే రకమైన జంతు సమూహాన్ని జాతి అందురు.

ప్రశ్న 3.
వర్గీకరణ అంటే ఏమిటి? వర్గీకరణ ఆవశ్యకతను తెలియజేయండి.
జవాబు:
ప్రపంచంలోని అన్ని సజీవుల గురించి అధ్యయనం చేయడం అసాధ్యం. కానీ ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేయడానికి జీవులను వర్గీకరిస్తారు. జీవులను వాటి గుర్తింపు లక్షణాల ఆధారంగా అనుకూలమైన సమూహాలుగా విభజించే పద్ధతిని వర్గీకరణ అంటారు. ఈ అనుకూలమైన సమూహాలనే శాస్త్రీయ పరిభాషలో టాక్సా (ఏకవచనం : టాక్సాన్) అంటారు. టాక్సా వర్గీకరణలోని వివిధ స్థాయిలను సూచిస్తుంది. ఉదాహరణకు రాజ్యస్థాయి టాక్సాన్ – ఏనిమేలియా, వర్గస్థాయి టాక్సాన్ – కార్డేటా, విభాగస్థాయి టాక్సాన్ – మమ్మేలియ మొదలైనవి.

జీవులను వర్గీకరించే పద్ధతినే వర్గీకరణ శాస్త్రం అంటారు. జీవుల ఆధునిక వర్గీకరణ వాటి బాహ్య, అంతర నిర్మాణాలు, కణాల నిర్మాణం, అభివృద్ధి ప్రక్రియలు పరిసరాలతో సంబంధం మొదలైన అంశాలు ఆధారం. జీవుల లక్షణీకరణం, గుర్తింపు, నామీకరణ, వర్గీకరణ అనే ప్రక్రియలు జీవ వర్గీకరణలోని ప్రధాన అంశాలు.

వర్గీకరణ సాధనాలుగా జంతు ప్రదర్శనశాలలు :
వన్య జంతువులను వాటి సహజ ఆవాసాల నుంచి సేకరించి మానవ సంరక్షణలో పెంచే ప్రదేశాలను జంతు ప్రదర్శనశాలలు అంటారు. (స్థల బాహ్య సంరక్షణ) ఆ జంతువుల బాహ్య లక్షణాలు, ఆహారపు అలవాట్లు, ప్రవర్తన (ఇథాలజీ) మొదలైన వాటిని పరిశీలించడానికి వాటి ఆధారంగా జంతువులను వర్గీకరించడానికి జంతు ప్రదర్శనశాలలు అవకాశం కలిగిస్తాయి.

ప్రదర్శనశాలలు :
మరణించిన జీవుల నమూనాలను గాజుపాత్రలు, గాజు జాడీలలో వాటి శరీరాలు పాడవకుండా తగిన సంరక్షణ ద్రావణాలలో ఉంచే ప్రదేశాలే ప్రదర్శనశాలలు. వీటిలో కొన్ని జంతువులను పొడినమూనాలుగా చేసి భద్రపరుస్తారు. కీటకాలను సేకరించి చంపి, కాగితపు షీట్లపై గుచ్చి గాజుపెట్టెలలో భద్రపరుస్తారు. పక్షులు, క్షీరదాలు లాంటి పెద్ద జంతువుల లోపలి అవయవాలను తీసివేసి వాటి స్థానంలో రంపపు పొట్టు, ఉనక / ఊక లాంటి పదార్థాలను దట్టించి భద్రపరిచి ప్రదర్శిస్తారు. వివిధ జంతువుల అస్థిపంజరాలను కూడా సేకరించి ప్రదర్శిస్తారు. వీటి ఆధారంగా కూడా జంతువులను వర్గీకరించవచ్చు.

AP Inter 1st Year Zoology Study Material Chapter 1 జీవ ప్రపంచ వైవిధ్యం

ప్రశ్న 4.
జాతిని నిర్వచించండి. ‘జాతి’ అనే భావనలను వివరించండి.
జవాబు:
జాతి భావన :
జాతి అనేది వర్గీకరణ యొక్క ప్రాథమిక ప్రమాణం. లాటిన్ భాషలో ‘స్పీసీస్’ (జాతి) అంటే ‘రకం’ లేదా ‘దృశ్యరూపం’ అని అర్థం. జాన్ రే, తన గ్రంథమైన ‘హిస్టోరియా జెనరాలిస్ ప్లాంటేరమ్’ లో ‘స్పీసీస్’ అనే పదాన్ని ‘ఉమ్మడి వంశపారంపర్యం’ లేదా ఉమ్మడి వంశకర్తలను కలిగి స్వరూపరీత్యా ఒకే విధంగా ఉండే జీవుల సముదాయంగా వర్ణించాడు. లిన్నేయస్, తన గ్రంథం ‘సిస్టమా నేచురే’ లో జాతిని, వర్గీకరణ ప్రమాణంగా పరిగణించాడు. బ్యూఫోన్ తన గ్రంథమైన ‘నేచురల్ హిస్టరీ’ లో జాతి పరిణామ భావనను వివరించాడు. డార్విన్ రచించిన “జాతుల ఉత్పత్తి” ప్రచురణతో జీవశాస్త్రీయ “జాతిభావన” (జాతి గతిక స్వభావం) ప్రాముఖ్యం సంతరించుకొన్నది.

ఈ భావనే బ్యూఫోన్ – జీవజాతి భావన అంటారు. దీని ప్రకారం, ఒకే విధమైన లక్షణాలు కలిగి ఉమ్మడి జన్యు సముదాయాన్ని పంచుకొని, అంతర ప్రజననం జరుపుకొని ఫలవంతమైన సంతానాన్ని ఉత్పత్తి చేయగల జీవుల సముదాయాన్ని జాతి అంటారు.

జాతిని నిర్వచించేందుకు డబీజాన్స్కీ ‘మెండీలియన్ జనాభా’ అనే భావనను ప్రవేశపెట్టాడు. ఉమ్మడి జన్యు సముదాయంను పంచుకొంటూ వరణాత్మక కలయిక ద్వారా లైంగిక ప్రత్యుత్పత్తి జరుపుకొనే ఒకే సమూహానికి చెందిన జీవులను మెండీలియన్ జనాభా అంటారు. భిన్న భౌగోళిక ప్రాంతాలలో నివసించే, ఒక జాతికి చెందిన జీవులు, వాటి పరిసరాలకు అనుగుణంగా నిరంతరం అనుకూలనాలను పొందుతూ ఉంటాయి. దీనివల్ల కాలక్రమేణా, కొత్తజాతి పరిణామం చెందుతుంది. కాబట్టి జాతి అనేది గతిశీల ప్రమాణం.

ఒక జాతికి చెందిన జీవులు :

  1. ఇతర జాతికి చెందిన జీవులతో ప్రత్యుత్పత్తి వివిక్తత ప్రదర్శిస్తాయి – కాబట్టి ఒక జాతి ఒక ప్రజనన ప్రమాణం.
  2. ఒకే ‘జీవావరణ స్థానాన్ని (నిచే) పంచుకొంటాయి. కాబట్టి జాతి ఒక జీవావరణ ప్రమాణం.
  3. ఒకే రకమయిన క్రోమోజోముల పటంను చూపిస్తాయి. కాబట్టి జాతి ఒక జన్యు ప్రమాణం.
  4. నిర్మాణాత్మక, క్రియాత్మక లక్షణాలలో సారూప్యతను కలిగి ఉంటాయి. కాబట్టి జాతి ఒక పరిణామ ప్రమాణం.

ప్రశ్న 5.
జన్యు వైవిధ్యం అంటే ఏమిటి ? వివిధ జన్యు వైవిధ్యాలను తెలపండి.
జవాబు:
జన్యు వైవిధ్యం :
ఒక జాతిలోని జన్యువుల వైవిధ్యాన్ని జన్యు వైవిధ్యం అంటారు. వాటి విస్తరణా పరిధిని అనుసరించి ఒక జాతి జీవులు అధిక జన్యు వైవిధ్యాన్ని ప్రదర్శించవచ్చు. ఉదాహరణకు రావుల్ఫియ వోమిటోరియా అనే ఔషధ మొక్క హిమాలయాల్లో వ్యాప్తి చెందింది. దానినుంచి లభించే క్రియాశీల రసాయనం (రెసర్పిన్ – అధిక రక్తపోటు చికిత్సలో ఉపయోగపడుతుంది) యొక్క సామర్థ్యం, గాఢత ఆధారంగా అధిక జన్యు వైవిధ్యాన్ని ప్రదర్శిస్తుంది. అదే విధంగా భారతదేశంలో 50,000 కంటే ఎక్కువ రకాల వరి, 1000 రకాల మామిడి మొక్కలు ఉన్నాయి. జన్యు వైవిధ్యం వాతావరణ మార్పులకు అనుగుణంగా అధికమవుతూ జీవుల మనుగడకు లాభదాయకమవుతుంది.

ప్రశ్న 6.
ఉష్ణమండలాల్లో అధిక బయోడైవర్సిటీకి గల కారణాలు తెలపండి.
జవాబు:
ఉష్ణమండలాల్లో అధిక జీవవైవిధ్యానికి కారణాలు :
కారణం 1 :
ఇతర మండలాలతో పోలిస్తే ఉష్ణమండల అక్షాంశాలు దీర్ఘకాలంగా ప్రకృతి అలజడులకు గురికాకపోవడం వల్ల ఆ ప్రాంతాలలో జీవపరిణామం జరగడానికి అవసరమైన సుదీర్ఘ కాలవ్యవధి లభించింది. ఇలాంటి ‘దీర్ఘ పరిణామ కాలం’ జాతుల ఉత్పత్తికీ, తద్వారా జాతుల భిన్నత్వానికి దారితీసింది (గమనిక : సమశీతల మండలాలు గతంలో తరచూ మంచుతో కప్పబడటం జరిగింది.

కారణం 2 :
సమశీతల మండలాలతో పోలిస్తే ఉష్ణ మండల వాతావరణ పరిస్థితులు ఎక్కువ స్థిరత్వాన్ని కలిగి భవిష్యత్ మార్పులను అంచనావేసే విధంగా ఉంటాయి. ఇటువంటి స్థిర వాతావరణం గల పరిసరాలలో నివసించే జీవులు వాటి వృత్తిరీత్యా ప్రత్యేక లక్షణాలను సంతరించుకోవడం వల్ల వాటిలో అ వివిధ్యత మరింతగా విస్తరించింది.

కారణం 3 :
ఈ ఉష్ణమండలాల్లో గల అపరిమిత సౌరశక్తి, నీరు మొదలైన వనరుల లభ్యత వల్ల ఆహారోత్పత్తి అధికంగా జరిగి జీవ వైవిధ్యతకు కారణమయింది.

ప్రశ్న 7.
“అరిష్ట చతుష్టయం” అంటే ఏమిటి?
జవాబు:
కింద పేర్కొన్న నాలుగు ప్రధాన కారణాలు (అరిష్ట చతుష్టయం) జాతుల విలుప్తత త్వరితంగా జరగడానికి దోహదపడతాయి.

1) ఆవాస క్షీణత – శకలీకరణం (లేదా) ముక్కలవడం :
ఇవి జీవవైవిధ్య క్షీణతకు ముఖ్య కారణాలు.
ఎ) అడవుల నరికివేత జాతుల విలుప్తతకు దారితీస్తుంది. ఉదా : భూమండలాన్ని 14 శాతం ఆక్రమిస్తూ ఉండే ఉష్ణ ప్రాంత వర్షాధార అడవులు క్షీణించి ప్రస్తుతం 4 శాతానికి పరిమితమయ్యాయి.

బి) అటవీ భూములను సాగుభూములుగా మార్చివేయడం. ఉదా : భూగోళానికి ఊపిరితిత్తులుగా పేరొందిన అమెజాన్ వర్షాధార అడవులు ఒకప్పుడు అసంఖ్యాక జాతులకు ఆవాసంగా ఉండేవి. ఇటీవల వీటి వృక్ష సంపదను నాశనం చేసి, ఆ ప్రాంతాన్ని సోయాబీన్ మొక్కల సాగుకు లేదా మాంసంగా ఉపయోగపడే పశువుల ఆహారం కోసం గడ్డిభూములుగా మార్చివేశారు.

సి) వాతావరణ కాలుష్యం జీవుల ఆవాస నాశనాన్ని ఉధృతం చేస్తుంది. అంతేకాకుండా కాలుష్య కారకాలు వాతావరణ నాణ్యతను మార్చడం వల్ల జాతుల జీవనానికి ముప్పు వాటిల్లుతుంది.

డి) ఆవాసం శకలీకరణం దానిలోని జనాభా క్షీణతకు దారిస్తుంది. ఉదా : విశాల ఆవరణాలలో నివసించే పక్షులు, క్షీరదాలు వలస ధర్మాన్ని ప్రదర్శించే జీవులు దీని ద్వారా అధికంగా ప్రభావితమవుతాయి.

2) వనరుల అతి వినియోగం :
అవసరం, అంతులేని ఆశకు దారితీస్తున్నప్పుడు అది వనరుల అతి వినియోగానికి కారణమవుతుంది. ఉదా : స్టాలర్ సముద్ర ఆవు (స్టాలర్ అనే ప్రకృతి శాస్త్రవేత్త గౌరవార్ధం నామకరణం చేయబడిన సముద్రపు ఆవు), ఉత్తర అమెరికాలో నివసించే పాసింజర్ పావురం మానవుల దుర్వినియోగం అధికమవడం కారణంగా విలుప్తం అయ్యాయి. మితిమీరిన చేపల వేట కారణంగా అనేక ఆర్థిక ప్రాముఖ్యం గల సముద్ర చేపలు అంతరించిపోయే అవకాశం ఉంది.

3) స్థానికేతర జాతుల చొరబాటు :
స్థానికేతర (విదేశీ) జాతులను స్థానిక ఆవాసాలలో ప్రవేశపెట్టినప్పుడు అవి చొరబడేవిగా మారి, స్థానిక జాతుల మీద పైచేయి సాధించి, స్థిరపడి, స్వయం సమృద్ధమైన జనాభాలుగా ఎదుగుతాయి. (సహజసిద్ధంగా ఒక నిర్దిష్ట ప్రాంతంలో ఉండే జాతిని స్థానిక జాతి అంటారు).
ఉదా 1:
నైల్ పెర్చ్ అనే చేపను తూర్పు ఆఫ్రికాలోని లేక్ విక్టోరియా సరస్సులోకి ప్రవేశపెట్టడం వల్ల, ఆ సరస్సులోని 200 జాతుల స్థానిక సిక్లిడ్ చేపలు క్షీణించాయి.

ఉదా 2 :
కార్లియస్ గారీపైనస్ అనే ఆఫ్రికన్ పిల్లిచేపను చట్టవిరుద్ధంగా జలజీవ సంవర్ధన కోసం ప్రవేశపెట్టడం అనేది స్థానిక పిల్లిచేపల జీవనానికి హానికరంగా మారింది.

4) సహ విలుప్తతలు :
పరాన్నజీవి ఆతిథేయిల అవికల్ప సహజీవనంలో ఆతిథేయి విలుప్తత పరాన్నజీవ విలుప్తతకు దారితీస్తుంది. అలాగే మొక్కలు – జంతువుల మధ్యగల అవికల్ప (విడదీయలేని) సహజీవనంలో మొక్క విలుప్తత జంతువు విలుప్తతకు కారణమవుతుంది. మొక్కలు – పరాగ సంపర్కకారుల సహజీవనం కూడా సహ విలుప్తతలకు ఉదాహరణ. దీనిలో కూడా ఒక జీవి విలుప్తత మరొక జీవి విలుప్తతకు దారితీస్తుంది. ఇలాంటి వాటిని సహవిలుప్తతలు అంటారు.

AP Inter 1st Year Zoology Study Material Chapter 1 జీవ ప్రపంచ వైవిధ్యం

ప్రశ్న 8.
‘బయోడైవర్సిటీ హాట్స్పాట్స్’ గురించి లఘుటీక రాయండి.
జవాబు:
ముప్పు వాటిల్లుతున్న జంతుజాతులను వాటి సహజ ఆవాసాల్లోనే సంరక్షించడం ఈ ప్రక్రియ ముఖ్య ఉద్దేశ్యం. ఈ సంరక్షణ వల్ల కోలుకొంటున్న జనాభాలు అవి ప్రత్యేక లక్షణాలు పొందిన వాటి సహజ ఆవాసాలలోనే రక్షించబడతాయి. అత్యధిక జాతి సమృద్ధత, అధిక స్థానిక జాతులు గల ప్రదేశాలకు గరిష్ఠ సంరక్షణను కల్పించేందుకు ఆ ప్రాంతాలను ‘బయోడైవర్సిటీ హాట్ స్పాట్’ లుగా పర్యావరణ సంరక్షణకారులు గుర్తించారు. మానవుడి కారణంగా విలుప్తతకు గురయ్యే జీవవైవిధ్యానికి సంరక్షణ కేంద్రాలుగా ఉండే జీవభౌగోళిక ప్రదేశాలను బయోడైవర్సిటీ హాట్స్పాట్గా పిలుస్తారు. జీవజాతుల పరంగా వీటిని ‘అత్యంత ముప్పు ఎదుర్కొంటున్న’ జీవ సమృద్ధి కలిగిన భౌమ్య పర్యావరణ ప్రాంతాలుగా గుర్తిస్తారు.

బయోడైవర్సిటీకి హాట్స్పాట్లు :
ప్రపంచంలో సుమారు 34 బయోడైవర్సిటీ హాట్స్పాట్లు ఉన్నాయి. ఈ ప్రాంతాలు నాశనానికి గురికావడం వల్ల ఆ ఆవాసాలు అతి త్వరితంగా కుచించుకొని పోతున్నాయి. ఉదా : 1. భారతదేశంలోని పశ్చిమకనుమలు, శ్రీలంక భూభాగం, 2. ఇండో బర్మా ప్రాంతం, 3. ప్రస్తుతం హిమాలయ ప్రాంతం. మనదేశంలో ఉండే 17 జీవగోళపు సురక్షిత కేంద్రాలు 14 జీవగోళపు సురక్షిత కేంద్రాలు, 90 జాతీయపార్కులు; 448 అభయారణ్యాలు చట్టపరంగా జీవ వైవిధ్య కేంద్రాలుగా రక్షించబడుతున్నాయి.

ప్రశ్న 9.
“రివెట్ పాపర్” దృగ్విషయాన్ని వివరించండి.
జవాబు:
కొన్ని జాతులు నశించడం వల్ల ఫలితం ఎలా ఉంటుంది? అది మానవ జీవితాన్ని ప్రభావితం చేయగలదా? పాల్ ఎన్రిచ్ ప్రతిపాదించిన రివెట్ పాపర్ దృగ్విషయం ఒక ఆవరణ వ్యవస్థ పనితీరులో జాతి ప్రాముఖ్యాన్ని తెలియజేస్తుంది. ఇతడు పర్యావరణాన్ని విమానంతోనూ, ఆ పర్యావరణ జాతులను ఆ విమాన రివెట్లతోనూ పోల్చి ఒక్కొక్క రివెట్ తొలగించడం వల్ల ఆ విమానానికి కలిగే దీర్ఘకాలిక ప్రమాదాన్ని తెలియజేశాడు. విమానంలోని కుర్చీ లేదా ఇతర అప్రాధాన్య వస్తువుల రివెట్లను తొలగించడం వల్ల విమానానికి ఎటువంటి ప్రమాదం జరగకపోవచ్చు. కానీ విమానం రెక్కకు, విమాన దేహానికి మధ్య గల రివెట్ తొలగిస్తే విమానం కూలిపోతుంది. అలాగే జీవసమాజం నుంచి కొన్ని సందిగ్ధ జాతులను తొలగించడం వల్ల ఆ జీవావరణ వ్యవస్థ నాశనమవుతుంది.

AP Inter 1st Year Zoology Study Material Chapter 1 జీవ ప్రపంచ వైవిధ్యం

ప్రశ్న 10.
‘సహజస్థానంలో సంరక్షణ’ పై లఘుటీక రాయండి.
జవాబు:
జీవగోళపు సురక్షిత కేంద్రాలు :
జీవగోళ వనరుల సంరక్షణార్థం కనిష్ఠ అలజడి కలిగి ప్రత్యేకంగా వేరుచేయబడిన ప్రదేశాలను జీవగోళపు సురక్షిత కేంద్రాలు అంటారు. భారతదేశంలోని జీవగోళపు సురక్షిత కేంద్రాలలో 17వదిగా శేషాచల కొండలని ఇటీవల ప్రకటించారు.

జాతీయ పార్కులు :
ప్రత్యేకంగా వన్యజీవుల మనుగడకు నిర్దేశించబడిన సురక్షిత సహజసిద్ధమైన ఆవాసాన్ని జాతీయ పార్కు అంటారు. వీటిలో మనదేశంలోని వృక్షసంపద, జంతుసంపదల ఆకర్షణీయ వైవిధ్యాన్ని ఈ జాతీయ పార్కులలో దర్శించవచ్చు. భారతదేశంలోని ముఖ్యమైన జాతీయపార్కులు – జిమ్ కార్బెట్ జాతీయ పార్కు (ఉత్తరాఖండ్ రాష్ట్రంలో నెలకొల్పిన భారతదేశపు మొట్టమొదటి జాతీయపార్కు, కజిరంగా జాతీయ పార్కు (అసోం), కాసు బ్రహ్మానందరెడ్డి జాతీయ పార్కు, మహావీర్ హరిణ వనస్థలి జాతీయ పార్కు (ఆంధ్రప్రదేశ్), కియోలాడియో ఘనా జాతీయ పార్కు (రాజస్థాన్) మొదలగునవి.

అభయారణ్యాలు :
అంతరించిపోతున్న నిర్దిష్ట జంతుజాతుల్ని సంరక్షించే ప్రాంతాలను వన్యప్రాణి అభయారణ్యాలు అంటారు. జీవజాతుల జీవనానికి అడ్డురానంతవరకూ వీటిలోకి పర్యాటకులను అనుమతిస్తారు. భారతదేశంలోని (ఆంధ్రప్రదేశ్) కొన్ని ముఖ్యమైన అభయారణ్యాలు – కోరింగా అభయారణ్యం, ఏటూరునాగారం అభయారణ్యం, పాపికొండలు అభయారణ్యం.

పావన వనాలు :

  1. అటవీ ప్రాంతాల కంటే తక్కువ సంఖ్యలో వృక్షాలు గల ప్రాంతాన్ని వనం అంటారు.
  2. మత ప్రాముఖ్యత గల వృక్ష సమూహాన్ని పావన వనాలు అంటారు. ఇవి ఏ ప్రత్యేక సంస్కృతీ, సంప్రదాయానికైనా చెందవచ్చు.
  3. ఈ ప్రాంతాల వన్యజాతుల వృక్షాలన్నిటికీ తగిన గౌరవం, సంపూర్ణ సంరక్షణ కల్పించడం జరుగుతుంది.

AP Inter 1st Year Zoology Study Material Chapter 3 జంతు వైవిధ్యం-I: అకశేరుక వర్గాలు

Andhra Pradesh BIEAP AP Inter 1st Year Zoology Study Material 3rd Lesson జంతు వైవిధ్యం-I: అకశేరుక వర్గాలు Textbook Questions and Answers.

AP Inter 1st Year Zoology Study Material 3rd Lesson జంతు వైవిధ్యం-I: అకశేరుక వర్గాలు

అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
మీరు గమనించిన స్పంజికల దేహంలో ఏ భౌతిక లక్షణం ఆధారంగా అవి నివసించే మాధ్యమాన్ని బట్టి స్పంజికలను మొక్కలుగా కాక జంతువులుగా గుర్తిస్తారు ? మీరు గమనించిన ఆ లక్షణాల ఆధారంగా స్పంజిక దేహంలోని ఆ భాగాన్ని ఏమంటారు?
జవాబు:
వీటిలో కుల్యావ్యవస్థ ఉండి నీరు నిరంతరము ఆస్టియా ద్వారా శరీరములోకి పంపబడి ఆస్కులమ్ ద్వారా బయటకు పంపబడును. ఈ నీటి ప్రసరణ ఆహార సముపార్జనలోను, శ్వాస వాయువుల వినిమయములోను తోడ్పడును.

ప్రశ్న 2.
స్పంజికలో అంతరాస్థిపంజరాన్ని ఏర్పరచే వివిధ నిర్మాణాలు ఏవి? ఈ నిర్మాణాల ఏర్పాటుకు ఏ రసాయనాలు అవసరమో తెలపండి.
జవాబు:
స్పంజికల అంతరాస్థి పంజరము కంటకములతోను మరియు స్పంజికా తంతువులు నిర్మితమై ఉండును. ఈ కంటకాలు కాల్షియం కార్బొనేట్ ను లేదా సిలికాన్ ను నిర్మితమగును. స్పంజికా తంతువులు ప్రోటీన్లతో తయారుచేయబడును.

ప్రశ్న 3.
స్పంజికల కుల్యావ్యవస్థ విధులేవి?
జవాబు:
కుల్యావ్యవస్థ విధులు ఏమనగా పోషణ, శ్వాసక్రియ మరియు విసర్జన క్రియకు తోడ్పడును.

ప్రశ్న 4.
నిడేరియన్లలోని రెండు ముఖ్యమైన దేహరూపాలు ఏవి ? వాటి ప్రధాన విధులు తెలపండి.
జవాబు:
పాలిప్ రూపము మరియు మెడ్యుసా రూపము. పాలిప్ రూపము పోషణకు మరియు మెడ్యుసా రూపము ప్రత్యుత్పత్తికి తోడ్పడును.

ప్రశ్న 5.
మెటాజెనిసిస్ అంటే ఏమిటి? ఏ వర్గానికి చెందిన జంతువులు దీన్ని ప్రదర్శిస్తాయి?
జవాబు:
లైంగిక, అలైంగిక దశలు ఒక జీవి జీవిత చక్రములో ఒకదాని తరువాత ఒకటి ఏర్పడిన యెడల దానిని మెటాజెనిసిస్ అంటారు. వర్గము నిడేరియా జీవులు మెటాజెనిసిస్ ను చూపును.

AP Inter 1st Year Zoology Study Material Chapter 3 జంతు వైవిధ్యం-I: అకశేరుక వర్గాలు

ప్రశ్న 6.
ఏ సముదాయానికి చెందిన నిడేరియన్లలో మీసోగ్లియా పరిమాణం సాపేక్షరీత్యా ఎక్కువగా ఉంటుంది? నిడేరియన్ల జలజీవనానికి సంబంధించి బాగా అభివృద్ధి చెందిన మీసోగ్లియా ప్రాముఖ్యం ఏమిటి?
జవాబు:
స్కైఫోజోవా జీవులలో మీసోగ్లియా పరిమాణం సాపేక్షరీత్యా ఎక్కువగా ఉంటుంది. మీసోగ్లియా జీవి దేహము తేలికగా నీటిపై తేలియాడుటకు తోడ్పడును.

ప్రశ్న 7.
రక్షకకణాలు లేదా రక్షకనిర్మాణాలు కలిగిన జననస్తరానికి సంబంధించి హైడ్రోజోవన్స్, ఇతర నిడేరియన్లకు గల ప్రధాన భేదమేమిటి?
జవాబు:
రక్షకకణాలు లేదా రక్షక నిర్మాణాలు అయిన దంశ కణములు బాహ్య త్వచము నుండి ఏర్పడును. మిగిలిన నిడేరియా జీవులలో బాహ్యత్వచము నుండి అంతస్త్వచం నుండి ఏర్పడును.

ప్రశ్న 8.
బల్లపరుపు పురుగుల విసర్జక కణాలేవి? ఈ ప్రత్యేక కణాల మరొక ముఖ్యవిధి ఏమిటి?
జవాబు:
బల్లపరుపు పురుగుల విసర్జక కణాలను జ్వాలా కణములు లేదా సొలెనోసైట్స్ అందురు. వీటి యొక్క మరొక విధి ద్రవాభిసరణ క్రమత.

ప్రశ్న 9.
ఆంఫిడ్లు, ఫాస్మిడ్ల మధ్య భేదాన్ని తెలపండి.
జవాబు:
నిమటోడా జీవులలో ముఖ భాగము చుట్టూ క్యూటికిల్తో నిర్మితమైన పల్లపు నిర్మాణాలను ఆంఫిడ్లు అని అందురు. ఇవి రసాయనిక గ్రాహకాలు. ప్లాస్మిడ్లు పరాంతరములో ఉండే గ్రంథి జ్ఞాన నిర్మాణాలు.

ప్రశ్న 10.
దేహ పర్యాంతరంగ స్థలానికి సంబంధించి బల్లపరుపు పురుగులు, గుండ్రటి పురుగులకు మధ్య ఉండే ప్రధాన భేదం ఏమిటి?
జవాబు:
బల్లపరుపు పురుగులు శరీర కుహరరహిత లక్షణములను అవయవస్థాయి వ్యవస్థీకరణను ప్రదర్శించును. దేహంలో నిజ ఖండీభవనము ఉండదు.

గుండ్రటి పురుగులు అవయవ వ్యవస్థ స్థాయి వ్యవస్థీకరణను ప్రదర్శించును. ఇవి ద్విపార్శ్వ, మిథ్యా శరీరకుహర, త్రిస్తరిత జీవులు. దేహం ఖండరహితం.

ప్రశ్న 11.
నిమటోడా, అనెలిడా దేహంలోని పర్యాంతరాంగ స్థలం పుట్టుక గురించి మీరు ఏవిధంగా వివరిస్తారు?
జవాబు:
గుండ్రటి పురుగుల స్థాయి నిమటోడాలో అవయవ వ్యవస్థ స్థాయి వ్యవస్థీకరణను ప్రదర్శించును. ఇవి ద్విపార్శ్వ, సౌష్టవ, మిథ్యా శరీరకుహర త్రిస్తరిత జీవులు. దేహం ఖండితరహితం. అనెలిడా జీవులలో శరీర నిర్మాణం అవయవ వ్యవస్థ స్థాయిని కలిగి ఉంటుంది. ఇది త్రిస్తరిత, సమఖండ విన్యాసాన్ని ప్రదర్శించే నిజ శరీరకుహర జీవులు.

ప్రశ్న 12.
దేహ సమఖండీభవనం అంటే ఏమిటి? బద్దెపురుగు, వానపాములలో స్వరూప పరంగా దేహ ఖండితాలు ఏర్పడే పద్ధతిలో ప్రధాన భేదం ఏమిటి?
జవాబు:
అనెలిడా జీవులలో శరీర కుహరము అడ్డు విభాజకాలతో ఖండితాలుగా విభజింపబడి ఉంటుంది. దీనిని సమఖండ విన్యాసము అందురు. బద్దె పురుగులో అడ్డు విభాజకములు ఉండవు. అందువలన ఇవి నిజఖండీభవనమును చూపవు. అందువలన దీనిని మిథ్యాఖండీభవనము అందురు.

ప్రశ్న 13.
దేహ సమఖండీభవనానికి సంబంధించిన స్వరూప లక్షణాల ఆధారంగా ఒక హైరుడినీయన్ ను ఇతర అనెలిడ్ నుంచి ఎలా గుర్తిస్తారు? శరీర కుహర అంశాలకు సంబంధించి జలగ శరీర కుహరం వానపాము శరీరకుహరం నుంచి ఏ రకంగా భిన్నమైంది?
జవాబు:
దేహం పృష్టోదర తలాలలో అణచబడి, నిర్దిష్ట సంఖ్యలో ఖండితాలు కలిగి ఉంటుంది. ఖండితాలు బాహ్యంగా ఉపఖండితాలుగా విభజింపబడి ఉంటాయి.

జలగ శరీర కుహరము బొట్రాయిడల్ కణములతో నిండి ఉంటుంది. వానపాము శరీర కుహరం శరీర కుహర ద్రవముతో నింపబడి ఉండును.

AP Inter 1st Year Zoology Study Material Chapter 3 జంతు వైవిధ్యం-I: అకశేరుక వర్గాలు

ప్రశ్న 14.
నీరిస్లోని చలనానికి తోడ్పడే నిర్మాణాలను ఏమంటారు ? నీరిస్ ను పాలికీట్ అని ఎందుకు అంటారు?
జవాబు:
నీరిస్లోని చలనాలకు తోడ్పడే నిర్మాణాలను పారాపోడియా లేదా పార్శ్వ పాదాలు అందురు. ఇది అనేక శూకాలను కలిగి ఉండును. కాబట్టి వీటిని పాలికీట్ అని అందురు.

ప్రశ్న 15.
బొట్రాయిడల్ కణజాలం అంటే ఏమిటి?
జవాబు:
జలగవంటి జీవులలో శరీర కుహరం ప్రత్యేకమైన బొట్రాయిడల్ కణజాలముతో నిండి ఉండును. ఇవి ద్రాక్ష గుత్తులను పోలియుండును. ఇవి విసర్జన క్రియకు, ఇనుము, కాల్షియం నిల్వ, గాయం తగిలిన ప్రాంతములో రక్తనాళాల పునర్నిర్మాణములో ముఖ్యపాత్ర వహించును.

ప్రశ్న 16.
నిమటోడా, అనెలిడా బాహ్యచర్మాల మధ్య భేదమేమిటి ? శరీరకుడ్యంలోని కండరాలకు సంబంధించి నిమటోడ్ అనెలిడ్ ఏవిధంగా విభేదిస్తుంది?
జవాబు:
నిమటోడా జీవులలో సిన్సీషియల్ లేదా బహుకేంద్రక బాహ్యచర్మము ఉంటుంది. అనెలిడా జీవులలో బాహ్యచర్మము ఒక కణ మందములో ఉండే ఉపకళా కణములతో ఏర్పడును. అనెలిడా జీవులలో దేహ కుడ్యములో వర్తుల, ఆయత కండరాలు ఉండును. ఈ కండరాలు గమనమునకు ఉపయోగపడును.

ప్రశ్న 17.
తేళ్ళలోని మొదటి, రెండవ జత శిరో ఉపాంగాలను ఏమంటారు?
జవాబు:
తేళ్ళలోని మొదటి, రెండవ జత శిరో ఉపాంగాలను తెలిసెరాలు మరియు పెడిపాలు అందురు.

ప్రశ్న 18.
క్రస్టేషియాలోని మొదటి రెండు జతల శిరో ఉపాంగాలు, ఇతర సజీవ ఆర్థ్రోపోడ్ జీవులతో పోల్చినప్పుడు కనిపించే ప్రత్యేకత ఏమిటి ?
జవాబు:
శిరో భాగములో రెండు జతల స్పర్శశృంగాలు అనగా స్పర్శశృంగికలు, స్పర్శశృంగాలు ఉండుట ఒక విశిష్ట లక్షణముగా పేర్కొనవచ్చు.

ప్రశ్న 19.
టిక్ లు, మైట్లను చేర్చిన ఉపవర్గం ఏది? నడిచే కాళ్ళ ఆధారంగా వీటిని కీటకాల నుంచి ఏ విధంగా గుర్తిస్తారు?
జవాబు:
టిక్లను, మైట్లను ఉపవర్గము కెలిసిరేటా క్రింద చేర్చినారు. ప్రోసోమా ఆరు జతల ఉపాంగాలను కలిగి ఉండును.

ప్రశ్న 20.
లిమ్యులస్, పేలామ్నియన్లలో వాటి శ్వాస నిర్మాణాలను పేర్కొనండి.
జవాబు:
లిమ్యులస్ నందు శ్వాస నిర్మాణాలు పుస్తకాకార మొప్పలు మరియు తేలునందు పుస్తకాకార ఊపిరితిత్తులు ఉండును.

AP Inter 1st Year Zoology Study Material Chapter 3 జంతు వైవిధ్యం-I: అకశేరుక వర్గాలు

ప్రశ్న 21.
స్పర్శశృంగాలు అంటే ఏమిటి? స్పర్శశృంగాలు లేని ఆర్థ్రోపోడ్ సముదాయం ఏది?
జవాబు:
స్పర్శశృంగాలు జ్ఞానాంగములు. స్పర్శను, వాసనను తెలుసుకొనుటకు ఉపయోగపడును. మాండిబ్యులేటా జీవులు వీటిని కలిగి ఉండును.

ప్రశ్న 22.
ఒక ఆర్థ్రోపోడ్లోని పర్యాంతరాంగకుహరాన్ని ఏమంటారు? అది పిండాభివృద్ధిలో ఎక్కడ నుంచి ఏర్పడుతుంది?
జవాబు:
పర్యాంతరాంగ కుహరమును హీమోసోల్ లేదా రక్తకుహరము అని అందురు. ఇది పిండాభివృద్ధి దశలలో పిండ బ్లాస్టోసోల్ నుంచి ఏర్పడును.

ప్రశ్న 23.
మీరు చదివిన ఏ ఆర్థ్రోపోడ్ను సజీవశిలాజం అంటారు? దాని శ్వాసాంగాలను పేర్కొనండి.
జవాబు:
“లిమ్యులస్” ను సజీవ శిలాజముగా పేర్కొనెదరు. వీటి శ్వాస అవయవములు పుస్తకాకార మొప్పలు.

ప్రశ్న 24.
బాహ్యరూపం ఆధారంగా కైటాన్ ను ఏ విధంగా గుర్తించగలవు? కైటాన్ లో ఎన్ని జతల మొప్పలు శ్వాసక్రియలో సహాయపడతాయి?
జవాబు:
కైటాన్ కర్పరము ఎనిమిది అడ్డు ఫలకాలు (కవాటాలను) కలిగి ఉండును. అందువలన దీనిని గుర్తించవచ్చును. మొప్పలు 6 నుంచి 88 జతల వరకు ఉంటాయి. ఇవి శ్వాసక్రియకు తోడ్పడును.

ప్రశ్న 25.
రాడ్యులా విధి ఏమిటి? రాడ్యులా లేని మలస్కా జీవుల సముదాయం పేరు తెలపండి. [Mar. ’14]
జవాబు:
మలస్కా జీవుల ఆస్య కుహరములో ఆకురాయిలాంటి నికషణ అవయవము ఉండును. దీనిని రాడ్యులా అని అందురు. పెలిసిపొడా విభాగపు జీవులలో రాడ్యులా ఉండదు.

ప్రశ్న 26.
మలస్కా జీవుల మొప్పకు వేరొక పేరేమిటి ? ఓస్ఫేడియం విధి ఏమిటి?
జవాబు:
మొప్పలకు మరియొక పేరు టినీడియా. ఓస్ఫేడియం ముఖ్య విధి నీటి స్వచ్ఛతను తెలియజేయును.

ప్రశ్న 27.
అరిస్టాటిల్ లాంతరు అంటే ఏమిటి? దీన్ని కలిగి ఉండే ఒక జంతువు ఉదాహరణను పేర్కొనండి.
జవాబు:
నోటిలో ఐదు దవడలు కలిగి ఆహారాన్ని నమలటానికి ఉపయోగపడే నిర్మాణమును అరిస్టాటిల్ లాంతరు అని అందురు. ఉదా : సీ అర్చిన్.

AP Inter 1st Year Zoology Study Material Chapter 3 జంతు వైవిధ్యం-I: అకశేరుక వర్గాలు

ప్రశ్న 28.
సౌష్ఠవపరంగా ఇకైనోడర్మ్ జువెనైల్, ప్రౌఢజీవుల మధ్య ప్రధాన భేదం ఏమిటి?
జవాబు:
సౌష్ఠవపరంగా ఇకైనోడర్మ్ డింభకాలు ద్విపార్శ్వ సౌష్ఠవమును కలిగి ఉంటాయి. ఇకైనోడర్మేటాలోని ప్రౌఢజీవులు పంచభాగ వ్యాసార్థ సౌష్ఠవాన్ని కలిగి ఉండును.

ప్రశ్న 29.
ఫెరిటిమాలో రక్తగ్రంథులు అంటే ఏమిటి?
జవాబు:
ఫెరిటిమా దేహంలో 4, 5, 6వ ఖండితాలలో రక్తగ్రంథులు అనే నిర్మాణాలుంటాయి. ఇవి రక్తకణాలను, ప్లాస్మాలో కరిగి ఉండే హీమోగ్లోబిన్ ను ఉత్పత్తి చేస్తాయి.

ప్రశ్న 30.
ఫెరిటిమాలోని శుక్రగ్రాహికలు అంటే ఏమిటి? అవి ఏ ఖండితాలలో ఉంటాయి?
జవాబు:
ఫెరిటిమాలో 6, 7, 8, 9 ఖండితాలలో పూర్వ విభాజకమునకు అంటుకొని ఖండితానికి ఒక జత చొప్పున శుక్రగ్రాహికలు అనబడే నిర్మాణాలుంటాయి. ఇవి సంపర్క సమయంలో శుక్ర కణాలను (శుక్ర గుళికలు) గ్రహించి నిల్వ చేస్తాయి.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ఆంథోజోవన్ల ముఖ్య లక్షణాలపై లఘుటీక రాయండి. [Mar. 14]
జవాబు:
ఆంథోజోవా :
ఈ జీవులను సాధారణంగా సీ అనిమోన్లు అంటారు. ఇవి స్థానబద్ధ జీవులు, పాలిప్ రూపాలను మాత్రమే కలిగి ఉంటాయి. సీలెంటిరాన్ అనేక గదులుగా ఆయత విభాజకాలతో విభక్తమై ఉంటుంది. ఈ విభాజకాలను మీసెంటరీలు అంటారు. మధ్యశ్లేష్మస్తరం సంయోజక కణజాలాన్ని కలిగి ఉంటుంది. దంశకణాలు బహ్మచర్మం, అంతఃచర్మంలో ఉంటాయి. బీజకణాలు అంతఃచర్మం నుంచి ఏర్పడతాయి. ఉదా : ఎడామ్సియా (సీ అనిమోన్), కొరాలియమ్ రుబ్రమ్ (ప్రశస్తమైన ఎరుపు శిలా ప్రవాళం), గార్గోనియా (సముద్ర విసనకర్ర), పెన్నాట్యులా (సముద్ర కలం).

AP Inter 1st Year Zoology Study Material Chapter 3 జంతు వైవిధ్యం-I: అకశేరుక వర్గాలు

ప్రశ్న 2.
ఫ్లూక్ ను ఏ విభాగంలో చేర్చారు? ఆ సముదాయం ప్రధాన లక్షణాలపై లఘుటీక రాయండి.
జవాబు:
ట్రెమటోడా :
ట్రెమటోడా విభాగములోని జీవులను సాధారణంగా ఫ్లూక్స్ అంటారు. ఇవి ఇతర జంతువులలో పరాన్న జీవులుగా ఉంటాయి. దేహాన్ని కప్పి మందమైన అవభాసిని (టెగ్యుమెంట్) ఉంటుంది. ముఖ చూషకం, ఉదర చూషకం (ఉదూఖలం) అనే రెండు చూషకాలు ఉంటాయి. పూర్వాంతంలో నోరు, ద్విశాఖీయుత పేగు ఉంటుంది. ఇవి ద్విలింగ జీవులు (Monoecious), అనేక అతిథేయిలతో వివిధ రకాల డింభక దశలతో (మిరాసీడియం, స్పోరోసిస్ట్, రీడియా, సర్కేరియా మొదలైనవి) జీవితచరిత్ర క్లిష్టంగా ఉంటుంది. ఉదా : ఫాసియోలా (లివర్హెక్), షిస్టోసోమా లేదా బిల్హార్జియా (బ్లడ్రూక్).

ప్రశ్న 3.
పాలికీట్లు ప్రదర్శించే ముఖ్య లక్షణాలు ఏమిటి?
జవాబు:
పాలికీటా (Gr : Poly = అనేక; Chaetae శూకాలు) : పాలికీటా జీవులు సముద్రపు నీటిలో నివసిస్తాయి. వీటిని సాధారణంగా బ్రిసిల్ పురుగులు అంటారు. వీటిలో కొన్ని స్వేచ్ఛగా కదులుతాయి. మిగతావి బొరియలలో లేదా నాళాలలో జీవిస్తాయి. తల నిర్దిష్టంగా ఉంటుంది. దానిపై నేత్రాలు, స్పర్శకాలు, స్పర్శాంగాల లాంటి జ్ఞానావయవాలు ఉంటాయి. పార్శ్వ పాదాలు అనేక శూకాలను కలిగి (కాబట్టి పాలికీటా) గమనం, శ్వాసక్రియలో సహాయపడతాయి. క్లైటెల్లం ఉండదు. ఈ జీవులు ఏకలైంగికాలు, బీజవాహికలుండవు. సంయోగబీజాలు శరీరకుహరంలోకి విడుదల చేయబడి వృక్క రంధ్రాల ద్వారా వెలుపలికి విడుదలవుతాయి. బాహ్య ఫలదీకరణం జరుగుతుంది. అభివృద్ధిలో ట్రోకోఫోర్ డింభకం ఉంటుంది.
ఉదా : నీరిస్ (ఇసుకపురుగు లేదా రాగ్వర్మ్ లేదా క్లాప్వార్మ్), ఎఫ్రోడైట్ (సముద్ర చుంచెలుక), ఆరెనికోలా (లగ్ వర్క్).

ప్రశ్న 4.
హిరుడీనియన్లు, పాలికీట్లు, ఒలిగోకీట్ల నుంచి ఏ విధంగా భిన్నంగా ఉంటాయి?
జవాబు:
AP Inter 1st Year Zoology Study Material Chapter 3 జంతు వైవిధ్యం-I అకశేరుక వర్గాలు 1

ప్రశ్న 5.
క్రస్టేషియన్ల ప్రధాన లక్షణాలు ఏవి?
జవాబు:
క్రస్టేషియా :
ఇవి జలచరజీవులు, తల, ఉరం కలిసి శిరోవక్షం ఏర్పడుతుంది. (కైటిన్ నిర్మితమైన పృష్ఠకవచంతో కప్పబడి ఉంటుంది). కొన్నింటిలో బాహ్య కవచం కాల్షియం కార్బొనేట్తో దృఢపరచబడి ఉంటుంది. (పీతలు, లాబస్టర్లు). శిరోభాగంలో రెండు జతల స్పర్శశృంగాలు (స్పర్శ శృంగికలు, స్పర్శశృంగాలు – విశిష్ట లక్షణం), ఒక జత హనువులు, రెండు జతల జంభికలు ఉంటాయి. ఉరం, ఉదర ఉపాంగాలు ద్విశాఖీయంగా ఉంటాయి. శ్వాసాంగాలు మొప్పలు (బ్రాంకియే), విసర్జకాంగాలు హరిత గ్రంథులు లేదా స్పర్శశృంగ గ్రంథులు. వీటి దేహంలో స్పర్శశృంగాలు, సంయుక్తనేత్రాలు, సంతులన కోశాల వంటి జ్ఞానాంగాలుంటాయి. పరోక్ష పిండాభివృద్ధి జరిగి వివిధ రకాల డింభకాలు ఏర్పడతాయి.
ఉదా : పాలిమాన్ (మంచినీటి రొయ్య), కాన్సర్ (పీత), బలానస్ (రాక్ బార్నకిల్), సాక్యులైనా (రూట్ హెడెడ్ బార్నకిల్), ఆస్టాకస్ (క్రే చేప), డాఫ్నియా (వాటర్).

ప్రశ్న 6.
అరాక్నిడా సాధారణ లక్షణాలను రాయండి.
జవాబు:
ఎరాక్నిడా :
ఇవి భూచరాలు. ప్రోసోమాలో ఒక జత కలిసెరాలు, ఒక జత పెడిపాలు, నాలుగు జతల నడిచే కాళ్ళు ఉంటాయి. మీసోసోమాలోని ఉపాంగాలు పుస్తకాకార ఊపిరితిత్తులుగా రూపాంతరం చెంది ఉంటాయి. సాలీళ్లలో నాలుగు జతల పరాంత ఉదర ఉపాంగాలు స్పిన్నరెట్లుగా రూపాంతరం చెందాయి. శ్వాసాంగాలు పుస్తకాకార ఊపిరితిత్తులు (తేళ్ళు, కొన్ని సాలీళ్ళు), వాయునాళాలు (కొన్ని సాలీళ్ళు) లేదా పుస్తకాకార ఊపిరితిత్తులు, వాయునాళాలు రెండూ (కొన్ని సాలీళ్ళు). రాగి కలిగిన ‘హీమోసయనిన్” అనే శ్వాసవర్ణకం ఉంటుంది. మాల్ఫీజియన్ నాళికలు, కోక్సల్ గ్రంథులు వీటి విసర్జకాంగాలు. ప్రత్యక్ష పిండాభివృద్ధి జరుగుతుంది. తేళ్ళు శిశూత్పాదకాలు.
ఉదా : పేలామ్నియస్ (తేలు), ఎరానియ (సాలీడు), సార్కొప్టెస్ (దురదమైట్).

AP Inter 1st Year Zoology Study Material Chapter 3 జంతు వైవిధ్యం-I: అకశేరుక వర్గాలు

ప్రశ్న 7.
శతపాదులను, సహస్రపాదులతో సంక్షిప్తంగా పోల్చండి.
జవాబు:
శతపాదులు – కైలోపోడ విభాగానికి చెందినవి.
సహస్రపాదులు – డిప్లోపోడా విభాగానికి చెందినవి.

లక్షణంశతపాదులు (కైలోపోడ)సహస్రపాదులు (డిప్లోపోడా)
ఉనికిభూచరభూచర
శరీర విభజనలుతల, మొండెముతల, వక్షం ఉదరం
స్పర్శ శృంగాలుకలవుకలవు
నోటి భాగాలుహనువులు, జంభికలు కలవుహనువులు, జంభికలు కలవు
ఉపాంగాలుమొండెం ప్రత ఖండితానికి ఒక జత నఖాలు గల ఉపాంగాలు (ఏకశాఖీయుత)ప్రతి ఖండితానికి రెండు జతల కాళ్ళుంటాయి. (ఏకశాఖీయత)
శ్వాసాంగాలువాయునాళాలువాయునాళాలు
రక్తంశ్వాసవర్ణకం లేదుశ్వాసవర్ణకం లేదు
విసర్జన అవయవాలుమాల్ఫీజియన్ నాళికలుమాల్ఫీజియన్ నాళికలు
అభివృద్ధిప్రత్యక్ష
ఉదా : స్కోలో పెండ్రా (కాళ్ళ జెర్రి)
స్కూటిజెరా (శతపాది)
ప్రత్యక్ష
ఉదా : స్పైరోస్ట్రెప్టస్ జూలస్ (సహస్రపాది)

ప్రశ్న 8.
ఇతర మలస్కా జీవులతో పోలిస్తే సెఫలోపోడ్లు అనేక ప్రత్యేక లేదా పురోగతి చెందిన లక్షణాలను ప్రదర్శిస్తాయి. సంక్షిప్తంగా చర్చించండి.
జవాబు:
సెఫలోపొడా లేదా సైఫనోపొడా (Gr. Cephalo – తల; Podos – పాదం) :
ఈ విభాగంలో కటిల్ చేపలు, స్క్విడ్లు, ఆక్టోపస్లు, నాటిస్లను చేర్చారు. తల స్పష్టంగా ఉండి సుస్పష్టమైన సకశేరుకాలను పోలిన కళ్ళు, ఒక జత కొమ్ము స్వభావం కలిగిన ముక్కులాంటి దవడలు, ఆస్యకుహరంలో రాడ్యులా ఉంటాయి. కొన్నిటిలో అనేక గదులు కలిగిన బాహ్యకర్పరం (నాటిలిస్) లేదా అంతర కర్పరం (సెపియా, లాలిగో) గానీ ఉంటుంది. కొన్నిటిలో కర్పరం ఉండదు (ఆక్టోపస్), సెపియా కర్పరాన్ని సాధారణంగా కటిల్ ఎముక అంటారు. లాలిగోలోని కర్పరాన్ని కలం అంటారు. పాదం రూపాంతరం చెంది నోటి చుట్టూ చూషకాలతో 8 (ఆక్టోపస్) నుంచి 10 (సెపియా, లాలిగో) భుజాలు కలిగి ఉంటుంది. పాదంలోని కొంత భాగం రూపాంతరం చెంది అంకుశనాళంగా మార్పు చెందుతుంది. ఇది ఆకస్మిక కదలికలు కలిగించడానికి ఉపయోగపడుతుంది). కొన్ని జీవులలో సిరా గ్రంథి ఉంటుంది.

దీనిలోని సిరను మేఘాల లాగా విడుదల చేసి పరభక్షక జీవి నుంచి తప్పించుకుంటాయి. (రక్షణ అనుకూలత). కంకాభాంగాలు ఏట్రియమ్లు, వృక్కాలు రెండు చొప్పున డైబ్రాంకియేట్లలోనూ (సెపియా) నాలుగు చొప్పున టెట్రాబ్రాంకియేట్లలోనూ (నాటిలస్) ఉంటాయి. ప్రసరణ వ్యవస్థ సంవృత రకం (సెఫలోపొడా విశిష్ఠ లక్షణం), హృదయంలో రెండు నుంచి నాలుగు కర్ణికలు, ఒక జఠరిక ఉంటాయి. నాడీవ్యవస్థ బాగా అభివృద్ధి చెందింది. మెదడు బాగా అభివృద్ధి చెంది మృదులాస్థి నిర్మితమైన కపాలం (మస్తిష్క పేటిక లో ఉంటుంది. ఇవి ఏకలింగ జీవులు. ప్రత్యక్ష అభివృద్ధి జరుగుతుంది.
ఉదా : సెపియా (కటిల్ చేప), ఆర్కిట్యూథిస్ (బృహత్ స్క్విడ్ – అతిపెద్ద సజీవ అకశేరుక జీవి), నాటిలస్, ఆక్టోపస్ (దెయ్యపు చేప).

ప్రశ్న 9.
మలస్కాలోని ఏ విభాగంలో పురాతన జీవులు ప్రాతినిధ్యం వహిస్తాయి? వాటి ముఖ్య లక్షణాలను వివరించండి.
జవాబు:
మోనోప్లాకోఫోరా (Gr. Mono – ఒకే; Placos – ఫలకం; Pherein కలిగి ఉండు) :
ఈ విభాగంలోని జీవులు మిలియన్ సంవత్సరాల పూర్వం విలుప్తమైనవని భావించారు. అయితే నియోపిలైనా అనే ఈ విభాగపు జీవి ఒకటి 1952లో బయల్పడింది. దీనిని కోస్టారికా పసిఫిక్ తీరం దగ్గర లోతైన సముద్రం నుంచి గలాతియా అనే సాగర పరిశోధన నౌకలోని శాస్త్రజ్ఞులు సేకరించారు. ఇవి ద్విపార్శ్వ సౌష్ఠవాన్ని కలిగి ఉంటాయి. వీటి దేహంలో వృక్కాలు, మొప్పలు వరుస క్రమంలో పునరావృతి ప్రదర్శిస్తాయి. (కొందరు దీన్ని అంతర్గత ఖండీభవనం అంటారు). వీటిలో ఫలకం లాగా ఉండే ఏక కవాట కర్పరం ఉంటుంది. హృదయం విలక్షణమైంది. దీనిలో రెండు జతల ఏట్రియమ్లు రెండు జఠరికలలోకి తెరుచుకుంటాయి.
ఉదా : నియోపిలైనా గలాతియా.

AP Inter 1st Year Zoology Study Material Chapter 3 జంతు వైవిధ్యం-I: అకశేరుక వర్గాలు

ప్రశ్న 10.
ఎకినాయిడ్ల ప్రధాన లక్షణాలను పేర్కొనండి.
జవాబు:
ఎకినాయిడియా (Gr. echinos – ముళ్ళ పంది; eidos – రూపం) :
ఈ విభాగంలో సీ అర్చిన్లు, హార్ట్ అర్చిన్లు, సాండ్ డాలర్లు, సీ బిస్కట్లు మొదలైన వాటిని చేర్చారు. దేహం అండాకారంగా (సీ అర్చిన్) లేదా చక్రిక ఆకారంలో (సాండ్ డాలర్) ఉంటుంది.” దేహాన్ని కప్పి కదిలే కంటకాలు ఉంటాయి. బాహువులు ఉండవు. నాళికా పాదాలకు చూషకాలుంటాయి. దేహంలోని కాల్కేరియస్ అస్థిఖండాలు ఒకదానితో ఒకటి కలిసిపోయి ఒక దృఢమైన కవచం లేదా కరోనా పెట్టెను ఏర్పరుస్తాయి. రంధ్ర ఫలకం, పాయువు ప్రతిముఖ తలంలో ఉంటాయి. అంబులేక్రల్ గాడులు మూసుకొని ఉంటాయి. పెడిసిల్లేరియాలకు మూడు దవడలుంటాయి. సీఅర్చిన్ నోటిలో ఉన్న ఒక సంక్లిష్టమైన ఐదు దవడల నమిలే యంత్రాంగాన్ని అరిస్టాటిల్ లాంతరు అంటారు. (హార్ట్ అర్చిన్లో ఉండదు). అభివృద్ధిలో ఎకైనోప్లూటియస్ డింభకం ఉంటుంది.
ఉదా : ఎకైనస్ (సీ అర్బిన్), ఎకైనోకార్డియం (హార్ట్ అర్చిన్), ఎకైనోడిస్కస్ (సాండ్ డాలర్).

ప్రశ్న 11.
హో లో థురాయిడియా ప్రధాన లక్షణాలను వివరించండి.
జవాబు:
హోలోథురాయిడియా (Gr. Holothurion – నీటి, పాలిప్ లేదా సముద్ర దోసకాయ; eidos – రూపం) :
ఈ విభాగంలో సముద్ర దోసకాయలను చేర్చారు. దేహం ముఖ -ప్రతిముఖ అక్షం వెంబడి పొడవుగా సాగి ఉంటుంది. చర్మం తోలులాగా ఉంటుంది. అంతశ్చర్మంలో వదులైన కంటకాలు ఉంటాయి. బాహువులు, ముళ్ళు, పెడిసిల్లేరియాలు ఉండవు. నోటి చుట్టూ ముకుళించుకోగల స్పర్శకాలు ఉంటాయి. (రూపాంతరం చెందిన నాళికాపాదాలు ఆహార సేకరణకు ఉపయోగపడతాయి). అంబులేక్రల్ గాడులు మూసుకొని ఉంటాయి. నాళికాపాదాలకు చూషకాలు ఉంటాయి. రంధ్ర ఫలకం అంతర్గతంగా (శరీర కుహరంలో) ఉంటుంది. శ్వాసాంగాలు ఒక జత అవస్కర శ్వాస వృక్షాలు. పిండాభివృద్ధి పరోక్షంగా జరిగి ఆరిక్యులేరియా డింభకం ఏర్పడుతుంది.
ఉదా : హోలోతూరియా, సినాప్టా, థయోన్.

ప్రశ్న 12.
వృక్కాల విధులను తెలపండి.
జవాబు:
ఫెరిటిమాలో విసర్జక వ్యవస్థలో అంత్య వృక్కాలు రకానికి చెందిన వృక్కాలు కనిపిస్తాయి. ఇవి బాహ్య చర్మం నుండి ఉద్భవిస్తాయి.

  • ఫెరిటిమాలోని వివిధ వృక్కాలు ప్రాథమికంగా ఒకే నిర్మాణం కలిగి ఉంటాయి.
  • వీటిలో వృక్క ముఖాలు కలిగి వాటిని వివృత వృక్కాలు అంటారు. ఉదా : విభాజకాయుత వృక్కాలు.
  • వృక్క ముఖాలు లేని వాటిని సంవృత వృక్కాలు అంటారు. ఉదా : గ్రసనీ వృక్కాలు, త్వచ వృక్కాలు.
  • వృక్క రంధ్రాల ద్వారా దేహం వెలుపలికి తెరుచుకునే వాటిని బాహ్య వృక్కాలు అంటారు.
  • ఆంత్రంలోకి తెరుచుకునే వాటిని ఆంత్ర వృక్కాలు అంటారు.
  • ఆంత్ర వృక్కాలు ద్రవాభిసరణ క్రమత క్రియలో కీలకపాత్ర పోషిస్తాయి,
  • వానపాములు యూరియోటెలిక్ జీవులు. విసర్జక పదార్థంగా ప్రధానంగా యూరియాను విసర్జిస్తాయి.

ప్రశ్న 13.
ఫెరిటిమాలో ఎన్ని రకాల వృక్కాలు కలవు ? వాటిని వివరించండి.
జవాబు:
ఫెరిటిమాలో మెలికలు తిరిగిన నాళికల లాంటి వృక్కాలు విసర్జక అవయవాలు. ఇవి ఖండిత విన్యాసాన్ని ప్రదర్శిస్తాయి.
ఇవి మూడు రకాలు.
1) విభాజకాయుత వృక్కాలు :
ఇవి ఖండితాంతర విభాజక పటలానికి ఇరువైపులా 15/16 ఖండితాల నుంచి చివరి వరకు ఉంటాయి. ఇవి పేగులోకి తెరుచుకుంటాయి.

2) త్వచ వృక్కాలు :
ఇవి మూడో ఖండితం నుంచి చివరి ఖండితం వరకు శరీర కుడ్యం లోపలి తలంలో అతుక్కొని ఉంటాయి. ఇవి వృక్క రంధ్రాల ద్వారా శరీర ఉపరితలం మీద వెలుపలికి తెరుచుకుంటాయి.

3) గ్రసని వృక్కాలు :
ఇవి 4, 5, 6 ఖండితాలలో మూడు జతల గుచ్ఛాలు ఉంటాయి. ఇవి ఆంత్రంలోకి తెరుచుకుంటాయి.

AP Inter 1st Year Zoology Study Material Chapter 3 జంతు వైవిధ్యం-I: అకశేరుక వర్గాలు

ప్రశ్న 14.
ఫెరిటిమాలోని హృదయాలను వర్ణించండి.
జవాబు:
హృదయాలు :
పృష్ఠ, ఉదర రక్తనాళాలను కలుపుతూ లయబద్దంగా సంకోచ వ్యాకోచాలు జరిపే నాలుగు జతల హృదయాలు 7, 9, 12, 13 ఖండితాలలో ఒక్కొక్క జత చొప్పున ఉంటాయి. వీటిలో మొదటి రెండు జతలూ పృష్ఠ, ఉదర రక్త నాళాలను మాత్రమే కలుపుతాయి. కాబట్టి వీటిని పార్శ్వ హృదయాలు అంటారు. పరభాగపు రెండు జతలు పృష్ఠ, ఉదర రక్త నాళాలను కలపటమే కాక, ఆధ్యాహార వాహికా రక్తనాళాన్ని ఉదర రక్తనాళంతో కలుపుతాయి. కాబట్టి వీటిని పార్శ్వ ఆహార వాహికా హృదయాలు అంటారు.

ఈ రెండు రకాల హృదయాలకు కవాటాల సంఖ్యలోనూ భేదం ఉంటుంది. పార్శ్వ హృదయాల లోపల నాలుగు జతల కవాటాలు ఉంటాయి. పార్శ్వాహార వాహికా హృదయంలో మూడు జతల కవాటాలే ఉంటాయి. హృదయాల ద్వారా రక్తం ఉదర రక్తనాళంలోకి ప్రవహిస్తుంది.
AP Inter 1st Year Zoology Study Material Chapter 3 జంతు వైవిధ్యం-I అకశేరుక వర్గాలు 2

దీర్ఘ సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ఫెరిటిమాలోని ప్రత్యుత్పత్తి వ్యవస్థ పటం గీచి, భాగాలు గుర్తించండి.
జవాబు:
AP Inter 1st Year Zoology Study Material Chapter 3 జంతు వైవిధ్యం-I అకశేరుక వర్గాలు 3
ప్రత్యుత్పత్తి వ్యవస్థ :
వానపాము ఉభయ లైంగిక జీవి. 10, 11వ ఖండితాలలో ఖండితానికి ఒక జత చొప్పున రెండు జతల ముష్కాలు ఉంటాయి. వీటి శుక్రవాహికలు 18వ ఖండితం వరకు వ్యాపించి పౌరుష నాళంలో కలుస్తాయి. ఐక్య పౌరుష, శుక్రవాహికలు 18వ ఖండితం ఉదర పార్శ్వ తలంలో ఒకే జత పురుష జనన రంధ్రాల ద్వారా వెలుపలికి తెరుచుకొంటాయి. రెండు జతల “అనుబంధ గ్రంథులు” ఖండితానికి ఒక జత చొప్పున 17వ, 19వ ఖండితాలలో ఉంటాయి. నాలుగు జతల శుక్రగ్రాహికలు 6 నుంచి 9 ఖండితాలలో (ఖండితానికి ఒక జత చొప్పున) ఉంటాయి. ఇవి సంపర్క సమయంలో శుక్రకణాలను (శుక్రగుళిక) గ్రహించి నిల్వ చేస్తాయి.

ఒక జత స్త్రీ బీజకోశాలు 12వ, 13వ ఖండితాలలో ఖండితాంతర విభాజక పరముఖానికి అతికి ఉంటాయి. బీజకోశాల కింద ఉండే స్త్రీ బీజవాహికా సురంగాలు, స్త్రీ బీజవాహికలు (14వ ఖండితం) గా కొనసాగి, కలిసిపోయి 14వ ఖండితం ఉదరతలం మధ్యన ఒక స్త్రీ జనన రంధ్రం ద్వారా వెలుపలికి తెరుచుకొంటాయి.

AP Inter 1st Year Zoology Study Material Chapter 3 జంతు వైవిధ్యం-I: అకశేరుక వర్గాలు

ప్రశ్న 2.
ఫెరిటిమాలోని జీర్ణ వ్యవస్థను వర్ణించి, జీర్ణక్రియా విధానాన్ని వివరించండి.
జవాబు:
AP Inter 1st Year Zoology Study Material Chapter 3 జంతు వైవిధ్యం-I అకశేరుక వర్గాలు 4
జీర్ణవ్యవస్థ :
ఆహారనాళం తిన్నగా ఉండే నాళం. ఇది దేహం మొదటి ఖండితం నుంచి చివరి ఖండితం వరకు ఉంటుంది. పూర్వభాగం చివరగల నోరు ఆస్యకుహరం (1-3 ఖండితాలు) లోకి తెరుచుకొంటుంది. ఆహారవాహిక (5-7 ఖండితాలు) పొట్టిగా, సన్నగా ఉండే నాళం, ఈ నాళం కండర యుతమైన అంతర జఠరం (8-9 ఖండితాలు) గా కొనసాగుతుంది. ఇది ఇసుక రేణువులు, కుళ్ళిపోయిన ఆకులు మొదలైన వాటిని మెత్తగా నూరడానికి దోహద పడుతుంది.

(పిండిమర) జీర్ణాశయం 9 నుంచి 14వ ఖండితం వరకు విస్తరించి ఉంటుంది. వానపాము ఆహారం కుళ్ళిన ఆకులు, మట్టితో కలిసిన ఇతర సేంద్రియ పదార్థాలు. జీర్ణాశయ కుడ్యంలో కాల్సిఫెరస్ గ్రంథులు ఉంటాయి. వీటి స్రావం మట్టి యొక్క హ్యూమస్ లోని హ్యూమిక్ ఆమ్లాన్ని తటస్థీకరిస్తుంది. పేగు 15వ ఖండితం నుంచి మొదలై చివరి ఖండితం వరకు ఉంటుంది. ఒక జత కురుచ శంకు ఆకారా తలు 26వ ఖండితంలోని పేగు నుంచి ఆంత్రాంధ నాళాలు 26వ ఏర్పడతాయి. పేగు పృష్ఠకుడ్యం మధ్యస్థంగా లోపలి వైపుకు ఒక మడత వలె ఏర్పడుతుంది. దీనిని ఆంత్రావళి (Typhlosole) అంటారు. ఆంత్రావళి శోషించే తలాన్ని పెంచుతుంది. ఇది ఫెరిటిమాలో తక్కువగా వృద్ధిచెంది, దేహంలోని 26వ ఖండితం నుంచి చివరి 24 లేదా 25 ఖండితాలు మినహా, మిగిలిన అన్ని ఖండితాలలో ఉంటుంది. ఆహారనాళం చిన్నని, గుండ్రని రంధ్రం ద్వారా తెరుచుకుంటుంది. దీన్ని పాయువు అంటారు. వానపాము గ్రహించిన మట్టిలో కర్బన సంబంధ పదార్థాలు అధికంగా ఉంటాయి. ఇవి ఆహారనాళంలో ప్రయాణించేటప్పుడు జీర్ణ ఎంజైమ్లు క్లిష్టమైన బృహదణువుల రూపంలో ఉన్న ఆహార పదార్థాలను సరళమైన, శోషణ యోగ్యమైన చిన్న అణువులుగా విచ్ఛిన్నం చేస్తాయి. ఈ సరళ అణువులు ఆంత్రత్వచం ద్వారా శోషణ చెంది వివిధ జీవక్రియలకు వినియోగింపబడతాయి.

జీర్ణక్రియా విధానం :
వానపాములో కణ బాహ్య జీర్ణక్రియ జరుగుతుంది. నేలలో ఉండే కర్బన సంబంధ పదార్థాలతో వానపాములు పోషణ జరుపుకొంటాయి. కాబట్టి వానపాము ఒక డెట్రీవోర్, మట్టితో కలిసి ఉన్న ఈ ఆహార పదార్థాలను నోరు ఆస్య కక్ష్య ద్వారా వానపాము గ్రసనిలోకి తీసుకుంటుంది. రేడియల్ డైలేటర్ (radial dilator) కండరాలతో గ్రసని ఆహార సేకరణలో సక్షన్ పంపు (suction pump) వలె పనిచేస్తుంది. గ్రసనిలో ఆహారం శ్లేష్మం, లాలాజలంతో కలిసి ముద్దగా (బోలస్) ఏర్పడుతుంది. ఆహారం సులభంగా జారిపోయేందుకు గ్రసని లోపలి తలపై కందెన లాగా జిగటి పూతను లాలాజలం ఏర్పాటు చేస్తుంది. అంతేకాక బోలస్ ఏర్పడటంలో తోడ్పడుతుంది. ఆ లాలాజలంలోని ప్రోటియోలైటిక్ ఎంజైమ్ మాంసకృత్తులను పాక్షికంగా జీర్ణం చేస్తుంది. తరువాత ఆహార వాహిక ద్వారా ఆహారం అంతర జఠరాన్ని చేరుతుంది. ఇక్కడున్న పటిష్టమైన కండరాలు, దట్టమైన అవభాసిని ఆహారాన్ని మెత్తగా నూరతాయి. ఈ స్థితిలో జీర్ణాశయం, పేగులో ఉన్న ఎంజైములు ఆహారాన్ని సులువుగా జీర్ణం చేయగలవు. పేగులోని ఆంత్రగ్రంథుల స్రావాలు ఉన్నతశ్రేణి సకశేరుకాల క్లోమరసాన్ని పోలి ఉంటాయి. రేణువుల రూపంలో ఉన్న ఆహారాన్ని ప్రొటియేజులు, ఎమైలేజు, లైపేజు రేణువుల రూపంలో ఉన్న ఆహారాన్ని సులువుగా జీర్ణం చేస్తాయి. ప్రొటియేజులు మాంసకృత్తులను అమినో ఆమ్లాలుగాను, ఎమైలేజులు పిండి పదార్థాలను గ్లూకోజుగాను, లైపేజు క్రొవ్వు ఆమ్లాలు, గ్లిజరాలుగాను మారుస్తాయి.

జీర్ణమైన ఆహారంలో ఆంత్రంలోని ఉపకళ ద్వారా శోషణం చెంది ఆ తరువాత రక్తాన్ని చేరుతుంది. పేగు గోడలోని రక్తకేశనాళికల వల శోషణలో ముఖ్యపాత్ర వహిస్తుంది. ఆంత్రావళి శోషణ తలాన్ని పెంచటంలో తోడ్పడుతుంది.

జీర్ణం కాని ఆహారం, ఆ తరువాత పురీషనాళాన్ని చేరుతుంది. పురీషనాళంలోని జీర్ణంకాని పదార్థాలు పాయువు ద్వారా క్రిమి విసర్జనాల రూపంలో బయటకు విస్తరించబడతాయి.

AP Inter 1st Year Zoology Study Material Chapter 2 జంతుదేహ నిర్మాణం

Andhra Pradesh BIEAP AP Inter 1st Year Zoology Study Material 2nd Lesson జంతుదేహ నిర్మాణం Textbook Questions and Answers.

AP Inter 1st Year Zoology Study Material 2nd Lesson జంతుదేహ నిర్మాణం

అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
స్పంజికలలో అనేక వేల కణాలున్నప్పటికీ కణజాల స్థాయి వ్యవస్థీకరణ లేదు. వ్యాఖ్యానించండి.
జవాబు:
కణస్థాయి వ్యవస్థీకరణ అతి నిమ్న స్థాయి వ్యవస్థీకరణ. ఈ వ్యవస్థలో వివిధ రకాల కణాలు క్రియాత్మకంగా వివిక్తత చెంది ఉంటాయి. ఎందుకంటే వీటిలో నాడీ కణాలు, జ్ఞానకణాలు ఉండవు. వీటిలో కణాలు వదులైన కణ సమూహాలుగా ఉండును.

ప్రశ్న 2.
జంతువులలో కణజాల స్థాయి వ్యవస్థీకరణ అంటే ఏమిటి ? ఏ మెటాజోవన్లలలో ఈ వ్యవస్థీకరణ కనిపిస్తుంది ?
జవాబు:
ఇది యూమెటాజోవన్లలో అతి తక్కువ స్థాయి వ్యవస్థ. నిడేరియా వర్గానికి చెందిన జీవులు కణజాల స్థాయిని ప్రదర్శిస్తాయి. ఈ జీవులలో ఒకే రకమైన విధి నిర్వహించే కణాలు ఒకే కణజాలముగా ఏర్పడును.

ప్రశ్న 3.
సమర్థమైన జీవన విధానానికి జీవులలో ఏ స్థాయి వ్యవస్థీకరణ (ఇతర వ్యవస్థీకరణతో పోల్చినప్పుడు) తోడ్పడుతుంది?
జవాబు:
అవయవ వ్యవస్థ స్థాయి వ్యవస్థీకరణ త్రిస్తరిత జీవులలో కనిపించును. ఇది అతి సమర్థవంతమైన అవయవ వ్యవస్థ స్థాయి. జ్ఞాన, నాడీ కణాలు వీటి చర్యలను సమన్వయం చేస్తాయి.

ప్రశ్న 4.
ఏకాక్ష విషమధృవ (monaxial heteropolar) సౌష్ఠవము అంటే ఏమిటి ? ఇది ఏ జంతువులలో ప్రధాన సౌష్ఠవంగా ఉంటుందో తెలపండి?
జవాబు:
జంతువు మధ్య అక్షము ద్వారా పోయే ఏ తలమునుంచైనా ఛేదించినపుడు రెండు సమాన అర్థ భాగాలేర్పడితే దానిని ఏకాక్ష విషమ ధృవ సౌష్ఠవము అందురు. నిడేరియా మరియు టీనోఫోరా జీవులలో ఇది ప్రధాన సౌష్ఠవముగా ఉండును.

ప్రశ్న 5.
నెమ్మదిగా చలించే జీవులకు లేదా వృంతరహిత జీవులకు వ్యాసార్థ సౌష్ఠవం అనుకూలనం నిరూపించండి.
జవాబు:
వ్యాసార్థ సౌష్ఠవ జంతువులు నీటిలో నివసిస్తూ అన్ని దిశల నుండి వచ్చే ప్రేరణలకు ప్రతిస్పందిస్తాయి. కాబట్టి వ్యాసార్థం సౌష్ఠవము నేలకు అంటుకొని లేదా నెమ్మదిగా కదిలే జంతువులకు చాలా అనుకూలము.

AP Inter 1st Year Zoology Study Material Chapter 2 జంతుదేహ నిర్మాణం

ప్రశ్న 6.
శీర్షత అంటే ఏమిటి? అది జీవులకు ఎట్లా ఉపయోగపడుతుంది?
జవాబు:
కొన్ని జీవులలో పూర్వాంతంలో నాడీ, జ్ఞాన కణాలు కేంద్రీకృతం చెందటంవల్ల ఆ జీవులలో శీర్షిత ఏర్పడును. ఈ జంతువులు ఆహార సముపార్జనలో, సంగమ జీవిని వెతుక్కోవటంలో, భక్షక జీవులనుండి తప్పించుకోవటంలో ఎక్కువ సమర్థవంతముగా ఉంటాయి.

ప్రశ్న 7.
నాళంలో నాళం వ్యవస్థీకరణ మొట్టమొదట ఏ జంతువులలో కనిపించింది? వాటి శరీరకుహరం పేరు తెలపండి.
జవాబు:
సూడోసీలోమేట్ జీవులలో అనగా నిమటోడా వర్గ జీవులలో నాళములో నాళము వ్యవస్థీకరణ కనిపిస్తుంది. ఈ శరీర కుహరంను మిథ్యా శరీర కుహరం అందురు.

ప్రశ్న 8.
నిజశరీరకుహరాన్ని ఎందుకు ద్వితీయశరీర కుహరంగా భావిస్తారు?
జవాబు:
యూసీలోమేట్ల పిండాభివృద్ధిలో మధ్యత్వచం నుండి ఏర్పడిన నిజశరీరకుహరం సంయుక్త బీజ కుహర స్థానాన్ని ఆక్రమిస్తుంది. కాబట్టి నిజ శరీర కుహరాన్ని ద్వితీయ శరీర కుహరం అందురు.

ప్రశ్న 9.
తిరోగమన ఆంత్రవేష్టన అవయవాలను తెలపండి.
జవాబు:
సకశేరుకాలలో మూత్రపిండములాంటి కొన్ని అవయవాలు ఉదరభాగంలో మాత్రమే, దైహిక వేష్ఠనంతో కప్పబడి ఉంటాయి. అలాంటి ఆంత్ర వేష్ఠనాన్ని తిరోవేష్ఠనము అని, ఆ అవయవాలను తిరోవేష్ఠన అవయవములు అందురు.

ప్రశ్న 10.
ప్రోటోస్టోమ్ల తొలి పిండాభివృద్ధిలో మీ సెంటోబ్లాస్ట్ కణాలను తొలగించినపుడు, ఆ జంతువుల భవిష్యత్తు ఎట్లా ఉంటుంది?
జవాబు:
ప్రోటోస్టోమ్ జీవులలో మీసెంటోబ్లాస్ట్ కణాలు విభజన చెంది మధ్యత్వచ దిమ్మెలను ఏర్పరచి వాటితో చీలికా కుహరం అనగా షైజోసీలోమ్ ఏర్పడును. ఈ కణాలను తొలగించుటవల్ల ప్రోటోస్టోమ్ జీవులు సీలోమ్ను ఏర్పరచలేవు.

ప్రశ్న 11.
ఎంటిరోసీలోమ్/ఆంత్రశరీర కుహరం అంటే ఏమిటి ? జంతురాజ్యంలో ఎంటిరోసీలోమ్ వర్గాలను పేర్కొనండి. [Mar. ’14]
జవాబు:
ఆదిఆంత్ర మధ్యత్వచ కోశాలనుండి ఏర్పడిన శరీర కుహరాన్ని ఆంత్ర శరీర కుహరం అందురు. వర్గము ఇకైనోడర్మేటా, హెమికార్డేటా, కార్డేటాలు ఎంటిరోసీలోమేటా వర్గములు.

ప్రశ్న 12.
స్తరీకరణ చెందిన ఉపకళా కణాలు స్రవించే క్రియలో తక్కువ పాత్ర వహిస్తాయి. మన చర్మంపై వీటి పాత్రను నిరూపించండి.
జవాబు:
స్తరిత ఉపకళా కణాల ముఖ్య విధి రసాయనిక మరియు యాంత్రిక ఒత్తిడి నుండి రక్షిస్తుంది. ఇది పొడిగా ఉండే చర్మం ఉపరితలాన్ని కప్పి ఉంచి స్రవించే ప్రక్రియలో తక్కువ పాత్ర వహిస్తుంది.

ప్రశ్న 13.
అంతస్రావక, బహిస్రావక గ్రంథుల తేడాలను ఉదాహరణలతో తెలపండి. [Mar. ’14]
జవాబు:
నాళసహితమైన గ్రంథులను బహిస్రావిక గ్రంథులు అందురు. ఉదా : లాలాజల గ్రంథులు.
నాళరహితమైన గ్రంథులను అంతస్రావక గ్రంథులు అందురు. ఉదా : పిట్యూటరీ గ్రంథి.

AP Inter 1st Year Zoology Study Material Chapter 2 జంతుదేహ నిర్మాణం

ప్రశ్న 14.
హోలోక్రైన్, ఎపోక్రైన్ గ్రంథుల మధ్య తేడాలను గుర్తించండి.
జవాబు:

హోలోక్రైన్ గ్రంథులుఎపోక్రైన్ గ్రంథులు
కణ మొత్తము విచ్ఛిన్నం చెంది దానిలోని స్రావకాలను వెలుపలికి విడుదల చేస్తాయి.
ఉదా : చర్మస్రావ గ్రంథులు
కణ అగ్రభాగము స్రావక పదార్థముతో సహా కణం నుండి తెగి విడిపోతుంది.
ఉదా : క్షీర గ్రంథులు

ప్రశ్న 15.
మాస్ట్ కణాలు స్రవించే రెండు పదార్థాలను, వాటి విధులను తెలపండి.
జవాబు:

  1. హెపారిన్ : ఇది రక్త స్కంధన నిరోధకముగా పనిచేయును.
  2. హిస్టమీన్ : ఇది రక్తనాళ విస్ఫారముగా పనిచేయును.

ప్రశ్న 16.
స్నాయువు, స్నాయు బంధనం మధ్య తేడాలను తెలపండి. [Mar. ’14]
జవాబు:
కండరాలను ఎముకతో అతికించే సంయోజక కణజాలమును స్నాయు బంధనము అందురు. ఎముకను ఇతర ఎముకలతో అతికించే సంయోజక కణజాలమును బంధకం లేదా స్నాయువు అని అందురు.

ప్రశ్న 17.
గోధుమకొవ్వు, తెలుపుకొవ్వుల మధ్య తేడాలను తెలపండి.
జవాబు:
గోధుమ కొవ్వు గర్భస్థ పిండాలలోను, శిశువులలోను ఎక్కువగా ఉంటుంది. దీని ఎడిపోసైట్ కణాలలో అనేక చిన్న కొవ్వు బిందువులు ఉంటాయి. ఇది శిశువులలో ఉష్ణాన్ని ఉత్పత్తిచేసి దేహ ఉష్ణోగ్రతను కాపాడుతుంది.

తెలుపు కొవ్వు పౌఢ జీవులలో అధికముగా ఉండి ఎడిపోసైట్ కణములో ఒక పెద్ద కొవ్వు బిందువు ఉంటుంది.

ప్రశ్న 18.
అత్యంత బలమైన మృదులాస్థి ఏది ? మానవుని శరీరంలో ఏ భాగాలలో ఇది కనిపిస్తుంది?
జవాబు:
తంతుయుత మృదులాస్థి అతి బలమైన మృదులాస్థి. కారణము వీటిలో కట్టలుగా కొల్లాజన్ తంతువులు ఉంటాయి. ఇది మానవునిలో అంతర్కశేరుక చక్రికలలోను, శ్రోణిమేఖల జఘన సంధాయకంలోను ఉంటుంది.

ప్రశ్న 19.
ఆస్టియోబ్లాస్ట్లు, ఆస్టియోక్లాస్ట్ల మధ్య తేడాలను తెలపండి.
జవాబు:

ఆస్టియోబ్లాస్ట్ఆస్టియోక్లాస్ట్లు
ఆస్టియోబ్లాస్ట్లు మాత్రికలోని సేంద్రియ పదార్థములను స్రవిస్తాయి. అంతేకాకుండా ఎముకను ఖనిజీకృతం చేయటానికి ముఖ్యపాత్ర వహించును.భక్షక కణాలుగా ఎముకను పునఃశోషణము చేసే విధిని కలిగి ఉంటాయి.

ప్రశ్న 20.
ఆస్టియాన్ ను నిర్వచించండి.
జవాబు:
హెవర్షియన్ కుల్య, దానిచుట్టూ ఉన్న పటలికలు, లిక్విణులు అన్నింటినీ కలిపి ఆస్టియాన్ అందురు.

ప్రశ్న 21.
వోక్మన్ కుల్యలు అంటే ఏమిటి? వాటి పాత్రను తెలపండి.
జవాబు:
హేవర్షియన్ కుల్యలు అడ్డుగా లేదా ఏటవాలుగా ఉండే వోక్మాన్ కుల్యలు ద్వారా ఇతర హేవర్షియన్ కుల్యలతో, పర్యస్తికతో, మజ్జాకుహరంతో కలుపబడి ఉంటాయి. హేవర్షియన్ కుల్యల రక్తనాళములనుంచి పోషకాలు, వాయువులు సూక్ష్మ కుల్యల ద్వారా అస్థికణజాలమంతా వ్యాపనం చెందుతాయి.

ప్రశ్న 22.
సెసమాయిడ్ ఎముక అంటే ఏమిటి? ఉదాహరణ తెలపండి.
జవాబు:
ఈ ఎముక స్నాయుబంధకాలు అర్థభవనము చెందటంవల్ల ఏర్పడుతుంది. ఉదా : పటెల (మోకాలి చిప్ప), క్షీరదాల మణికట్టులో పిసిఫామ్ ఎముక.

ప్రశ్న 23.
మైక్రోగ్లియాలు అంటే ఏమిటి? వాటి పుట్టుక గురించి తెలిపి, విధులను పేర్కొనండి.
జవాబు:
మైక్రోగ్లియల్ కణాలు భక్షక కణాలు. ఇవి న్యూరోగ్లియా కణముల నుంచి ఏర్పడి మధ్యత్వచమునుంచి ఉద్భవిస్తాయి.

ప్రశ్న 24.
మిథ్యా ఏక ధృవ న్యూరాన్లు అంటే ఏమిటి? ఇవి ఎక్కడ కనిపిస్తాయి?
జవాబు:
ఇది ఏక ధృవ నాడీ కణము యొక్క నాడీ దేహము నాడీ సంధి యొక్క పృష్ఠ శాఖలో కనిపిస్తుంది. అటువంటి ఏకధృవ నాడీ కణాలను మిథ్యా ఏక ధృవ నాడీ కణాలు అందురు.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
మెటాజోవాలో నాలుగు వివిధ అంతస్థుల వ్యవస్థీకరణను వివరించండి.
జవాబు:
1. కణస్థాయి వ్యవస్థీకరణ :
ఇది మెటాజోవన్లలోని అతి నిమ్న స్థాయి వ్యవస్థీకరణ. దీన్ని స్పంజికలు (పారాజోవన్లు) ప్రదర్శిస్తాయి. వీటిలో వివిధ రకాల కణాలు క్రియాత్మకంగా వివిక్తత చెంది ఉంటాయి. ఎందుకంటే వీటిలో నాడీకణాలు, జ్ఞానకణాలు ఉండవు. కణాలు వదులైన కణసమూహాలుగా అమరి ఉంటాయి.. కానీ కణజాలాన్ని ఏర్పరచవు. కణాలు శ్రమ విభజనను ప్రదర్శిస్తాయి. శరీరకుడ్యం వెలుపలి స్తరంలో పినాకోసైట్లు, పోరోసైట్లు (ఇవి నీటిని వెలుపలి నుంచి స్పంజికా కుహరంలోకి పంపుతాయి) లోపలి స్తరంలో (స్పంజికా కుహరాన్ని ఆవరించిన కొయానోసైట్లు ఉంటాయి. ఈ రెండు పొరల మధ్య కణరహిత మీసోగ్లియా లేదా మీసోహైల్ ఉంటుంది.

2. కణజాల స్థాయి వ్యవస్థీకరణ :
ఇది యూమెటాజోవన్లలో అతి తక్కువస్థాయి వ్యవస్థ. నిడేరియా వర్గానికి చెందిన జంతువులు కణజాలస్థాయిని ప్రదర్శిస్తాయి. ఈ జీవులలో ఒకే రకమైన విధి నిర్వహించే కణాలు ఒకే కణజాలంగా ఏర్పడ్డాయి. ఈ విధంగా ఏర్పడిన కణజాలాల మధ్య నాడీకణాలు, జ్ఞాన కణాలు సమన్వయం చేకూరుస్తాయి. జంతువుల శరీర నిర్మాణంలో కణజాలాలు ఏర్పడటం మొదటి ముఖ్యమైన పరిణామ దశ.

3. అవయవ స్థాయి వ్యవస్థీకరణ :
వివిధ రకాల కణజాలాలు సంఘటితమై ఒక ప్రత్యేక విధిని నిర్వహించడానికి ఏర్పడే నిర్మాణాన్ని అవయవం అంటారు. కణజాల స్థాయి కంటే అవయవ వ్యవస్థ స్థాయి ఉన్నత పరిణామ దశను సూచిస్తుంది. అవయవ వ్యవస్థ మొట్టమొదటిగా ప్లాటి హెల్మింథిస్ వర్గంలో ఏర్పడింది.

4. అవయవ-వ్యవస్థ స్థాయి వ్యవస్థీకరణ :
జంతువుల దేహనిర్మాణంలో ఇది అత్యున్నతస్థాయి వ్యవస్థీకరణ. ఇది బల్లపరుపు పురుగులు, విమటోడ్లు, అనెలిడన్లు, ఆర్థ్రోపొడా, మలస్క, ఇకైనోడర్మేటా, కార్డేట్ త్రిస్తరిత జీవులలో కనిపిస్తుంది. మధ్యత్వం ఏర్పడటం వల్ల త్రి స్తరిత జీవులలో కణజాలాలు సంఘటితమై అవయవాలు, అవయవ వ్యవస్థలు ఏర్పడ్డాయి. జ్ఞాన, నాడీకణాలు వీటి చర్యలను సమన్వయం చేస్తాయి. త్రిస్తరిత జీవుల పరిణామక్రమంలో ఈ స్థాయి క్లిష్టత పెరుగుతూ వచ్చింది. ఉదాహరణకు కొన్ని ప్లాటి హెల్మెంథిస్ జీవుల జీర్ణనాళంలో ఒకే రంధ్రం ఉంటుంది. ఈ విధమైన అసంపూర్ణ ఆహారనాళం ఏర్పడటంవల్ల క్రమంగా నోరు, పాయువులుగా మారింది. ఈ రకం ఆహారనాళం నిమటోడా నుంచి కార్డేటా వరకు గల జంతువులలో కనిపిస్తుంది. ఇదే విధంగా ప్రసరణ వ్యవస్థ కూడా వివృత రకం నుంచి ఆవృత రకంగా మారింది.

AP Inter 1st Year Zoology Study Material Chapter 2 జంతుదేహ నిర్మాణం

ప్రశ్న 2.
ఏ సమూహ బైలెటేరియన్లలో ఘన బాప్లాన్ కనిపిస్తుంది. దాన్ని ఎందుకలా పేర్కొన్నారు?
జవాబు:
AP Inter 1st Year Zoology Study Material Chapter 2 జంతుదేహ నిర్మాణం 1
ఈ సమూహ జంతువులలో శరీరకుహరం ఉండదు కాబట్టి వీటిని శరీరకుహర రహిత జీవులు లేదా ఎసీలోమేట్లు అంటారు. ఉదా : ప్లాటి హెల్మింథిస్ (నిమ్నస్థాయి బైలెటేరియన్లు). వీటి దేహంలో సంయుక్త బీజకుహరిక మధ్యత్వచం నుంచి ఏర్పడిన మధ్యభ్రూణ కణజాలంతో నిండి ఉంటుంది. ఈ విధంగా ఇది ఘనశరీరరచనను చూపుతాయి. ఎసీలోమేట్లలో శరీరకుహరం లోపించడం వల్ల అనేక సమస్యలున్నాయి. శరీర అవయవాలు మీసెన్్కమాలో అంతస్థగితమై స్వేచ్ఛగా కదలలేవు. అంతేకాకుండా ఆహారనాళం నుంచి శరీర కుడ్యానికి పదార్థాల వ్యాపనం చాలా నెమ్మదిగా, తక్కువ సామర్థ్యంతో కొనసాగుతాయి.

ప్రశ్న 3.
మిథ్యాశరీరకుహరంపై శరీరకుహరానికిగల అనుకూలనాలను తెలపండి.
జవాబు:
మిథ్యాశరీరకుహరం కంటే నిజశరీరకుహరంవల్ల కలిగే లాభాలు :

  1. యూసీలోమేట్ల అంతరాంగాలు కండరసహితంగా ఉంటాయి. (ఎందుకంటే అవి మధ్యత్వచంలో కలిసి ఉంటాయి). దీనివల్ల అంతరాంగాలు శరీరకుహరంలో శరీరకుడ్యంతో సంబంధం లేకుండా స్వేచ్ఛగా సంకోచ సడలికలు జరుపుతాయి. ఉదా : ఆహారనాళపు పెరిస్టాల్టిక్ కదలికలు.
  2. బీజవాహికలు లేని అకశేరుకాలలోనూ, స్త్రీ సకశేరుకాలలోనూ బీజకణాలు శరీరకుహరంలోకి విడుదలవుతాయి.
  3. శరీరకుహరద్రవం విసర్జక పదార్థాలను గ్రహించి తాత్కాలికంగా నిల్వచేసి బయటికి పంపుతుంది.
  4. యూసీలోమేట్లలో మధ్యత్వచం ఆహారనాళ అంతస్త్వచంతో సంబంధం ఏర్పరచుకొని లోనికి నొక్కడం వల్ల ఆహారనాళంలో అంతర జఠరం, జీర్ణాశయం మొదలైన భాగాలు అభివృద్ధి చెందుతాయి. దీన్ని ప్రాథమిక ప్రేరేపణ అంటారు. సూడోసీలోమేట్లలో మధ్యత్వచం, ఆహారనాళం మధ్య ఇటువంటి సంబంధం ఉండదు. అందువల్ల వీటిలో ఆహారనాళం సరళంగా, సన్నటి పొడవైన నాళం రూపంలో ఉంటుంది.

ప్రశ్న 4.
షైజోసీలోమ్, ఎంటిరోసీలోమ్ ఏర్పడే విధానాన్ని వివరించండి.
జవాబు:
1. విభక్త శరీర కుహర జీవులు :
మధ్యత్వచం చీలి శరీరకుహరం ఏర్పడిన జంతువులను షైజోసీలోమేట్లు అంటారు. అనెలిడ్లు, ఆర్థ్రోపోడ్లు, మలస్కా జీవులు షైజోసీలోమేట్లు, అన్ని షైజోసీలోమేట్లు ప్రాథమిక ముఖదారులు. ఈ జీవులు ‘పూర్ణభంజిత’ సర్పిల, నిర్ధారిత విదళనాలను ప్రదర్శిస్తాయి. తొలి పిండంలోని 4d బ్లాస్టోమియర్ లేదా మీసెంటోబ్లాస్ట్ కణం విభజన చెంది బహిస్త్వచం, అంతస్త్వచం మధ్య మధ్యత్వచ దిమ్మెలు ఏర్పరచి సంయుక్తబీజకుహరికను భర్తీ చేస్తుంది. ప్రతీ మధ్యత్వచ దిమ్మెలో ఏర్పడిన చీలిక షైజోసీలోమ్ (చీలికకుహరం) ఏర్పడటానికి దారితీస్తుంది. అనెలిడాలో షైజెసీలోమ్ క్రియాత్మక శరీరకుహరం
AP Inter 1st Year Zoology Study Material Chapter 2 జంతుదేహ నిర్మాణం 2

(పర్యాంతరాంగ కుహరం). అనెలిడా జీవులలో శరీరకుహరం వరసగా గదులు కలిగి ఉండగా, ఆర్థ్రోపొడా, మలస్కా జీవులలో క్రియాత్మక శరీరకుహరం) అంతరాంగ అవయవాల చుట్టూ ఉండి రక్తం (హీమోలింఫ్) తో నిండి రక్తకుహరంగా పిలవబడుతుంది. ఇది పిండానికి చెందిన సంయుక్తబీజకుహరం శరీరకుహర గదులతో కలియడం వల్ల ఏర్పడింది. దీనివల్ల కణజాలాలు నేరుగా రక్తంలో (హీమోలింఫ్) తడిసి ఉంటాయి.

2. ఆంత్రశరీర కుహర జీవులు :
ఆదిఆంత్ర మధ్యత్వచ కోశాల నుంచి ఏర్పడిన శరీరకుహరాన్ని ఆంత్రశరీర కుహరం అంటారు. ఇకైనోడర్మ్లు, హెమికార్డట్లు, కార్డట్లు ఎంటిరోసీలోమేట్లు. ఈ జంతువులలో మధ్యత్వచ ఎంటిరోసీలోమ్ ఏర్పడుతుంది. అన్ని ఎంటిరోసీలోమేట్లు ద్వితీయ ముఖదారులు. ఇవి వ్యాసార్థ లేదా చక్రాభ, అనిర్ధారిత విదళనాన్ని ప్రదర్శిస్తాయి.
AP Inter 1st Year Zoology Study Material Chapter 2 జంతుదేహ నిర్మాణం 3

ప్రశ్న 5.
ఉపకళా కణజాలాల్లో మూడు రకాల కణ మధ్యాంతర కూడళ్ల గురించి వివరించండి.
జవాబు:
కణమధ్యాంతర కూడళ్ళు :
ఇవి మూడు రకాలు – బిగువు సంధులు, డెస్మోజోమ్లు, అంతర సంధులు. ఇది ఆ కణజాలాల ప్రత్యేక అవసరాలను తీర్చడానికి ఏర్పడ్డాయి.

ఎ) బిగువు సంధులు :
ఈ రకమైన సంధులు ఉపకళాకణాల్లో శరీర ద్రవాలు కారకుండా నిరోధిస్తాయి. ఉదాహరణకు ఇవి స్వేద గ్రంథుల (మన చర్మాన్ని నీరు పట్టిఉండేలా తయారుచేస్తుంది) లో కణాల నుంచి నీరు చుట్టూ గల కణాలకు చేరనివ్వవు. పక్కపక్కన గల కణాల ప్లాస్మాత్వచం ఒకదానికొకటి గట్టిగా ఒత్తుకొని ప్రత్యేక ప్రోటీన్లతో బంధించబడి ఉంటాయి.

బి) డెస్మోజోమ్లు :
ఇవి గుండీ వంటి ప్రోటీన్ నిర్మాణాలు కణాల మధ్య బంధన సంధులుగా పనిచేస్తాయి. దృఢమైన పలకలను బంధించే రివిట్లలాగా ఇవి కణత్వచాలను బంధిస్తాయి. వీటి కణాంతరావకాశంలో కెడరిన్లు అనే సంసజక త్వచ ప్రోటీన్లు ఉంటాయి. ఇవి జీవపదార్థంలో ఫలకాలు కలిగి ఉండి మాధ్యమిక తంతువులతో అతికి ఉంటాయి. ఈ తంతువులు కెరటిన్ (ఉపకళా కణాలు) లేదా డెస్మిన్ (హృదయకండరం) లాంటి ప్రోటీన్లతో ఏర్పడతాయి.

సి) అంతర సంధులు (సమాచార సంధులు)
ఇవి నిరంతరంగా పక్కన గల కణాల మధ్య జీవపదార్థ కాల్వలను ఏర్పరుస్తాయి. ఈ లక్షణం మొక్కలలో ప్లాస్మోడెస్మాటాలతో పోల్చదగినవి. ఈ సంధుల గుండా వివిధ రకాల అయాన్లు, చక్కెర అణువులు, అమైనో ఆమ్లాలు నిరంతరంగా ఒక కణం నుంచి ఇంకొకదానికి ప్రయాణిస్తాయి. ఇవి హృదయ కండరాలతో సహా చాలా రకాల కణజాలాల్లో ఉంటాయి. కొన్ని నాడీ కణాల మద్య ఇవి విద్యుత్ నాడీ సంధులుగా పనిచేస్తూ నాడీ ప్రచోదనాలను వేగంగా పంపిస్తాయి.
AP Inter 1st Year Zoology Study Material Chapter 2 జంతుదేహ నిర్మాణం 4

ప్రశ్న 6.
గ్రంథి ఉపకళ గురించి రాయండి.
జవాబు:
AP Inter 1st Year Zoology Study Material Chapter 2 జంతుదేహ నిర్మాణం 5
గ్రంథి ఉపకళ :
కొన్ని స్తంభాకార లేదా ఘనాకార కణాలు ప్రత్యేకతను సంతరించుకొని స్రావకాలను ఉత్పత్తి చేస్తాయి. ఇలాంటి ఉపకళను గ్రంథి ఉపకళ అంటారు. దీనిలోని గ్రంథికణాలు | రెండు రకాలు. అవి
(i) ఏకకణ గ్రంథులు :
ఇవి ఉపకళాత్వచంలో విడివిడిగా ఉంటాయి. ఉదాహరణ : ఆహారనాళంలోని గాబ్లెట్ కణాలు.

(ii) బహుకణ గ్రంథులు :
ఇవి ఉపకళాత్వచంలో గుంపులు గుంపులుగా ఏర్పడతాయి. ఉదాహరణ : లాలాజల గ్రంథులలో గుచ్ఛాలుగా ఉన్న గ్రంథి కణాలు. స్రావాలు విడుదల చేసే పద్ధతిని అనుసరించి గ్రంథులు రెండు రకాలు. అవి బహిస్రావక, అంతస్రావక గ్రంథులు. బహిస్రావ గ్రంథులు నాళ సహితమై శ్లేష్మం, లాలాజలం, చెవి గులిమీ (సిరుమిన్), నూనె, పాలు, జీర్ణరసాలు, ఇతర కణ ఉత్పత్తులను స్రవిస్తాయి.

స్రావక పద్ధతి ఆధారంగా బహిస్సావ గ్రంథులు మూడు రకాలు :
(i) మీరోక్రైన్ గ్రంథులు (ఉదా : క్లోమం) స్రావక కణికలను ఇతర కణపదార్థాలు నష్టపోకుండా వెలుపలికి విడుదలచేస్తాయి.
(ii) ఎపోక్రైన్ గ్రంథులు (ఉదా : క్షీరగ్రంథులు) కణ అగ్రభాగం స్రావక పదార్థంతో సహా కణం నుంచి తెగి విడిపోతుంది.
(iii) హోలోక్రైన్ గ్రంథులు (ఉదా : చర్మస్రావ గ్రంథులు) కణం మొత్తం విచ్ఛిన్నం చెంది దానిలోని స్రావకాలను వెలుపలికి విడుదల చేస్తాయి. అంతస్రావ గ్రంథులు నాళరహితమైనవి. వీటి స్రావాలను హార్మోన్లు అంటారు. హార్మోన్లు నాళాల ద్వారా కాకుండా నిర్దేశిత భాగాలకు రక్తం ద్వారా రవాణా చేయబడతాయి.
AP Inter 1st Year Zoology Study Material Chapter 2 జంతుదేహ నిర్మాణం 6

ప్రశ్న 7.
ఏరియోలార్ కణజాల కణాల గురించి క్లుప్తంగా రాయండి.
జవాబు:
ఎరియోలార్ కణజాలం : ఇది దేహంలో ఎక్కువగా విస్తరించి ఉండే సంయోజక కణజాలాల్లో ఒకటి. అన్ని అవయవాలలో ఇది దట్టించబడి ఉంటుంది. ఇది చర్మంలో అధశ్చర్మ స్తరాన్ని ఏర్పరుస్తుంది. ఎరియోలార్ కణజాలంలో ఫైబ్రోబ్లాస్ట్లు, మాస్ట్ కణాలు, స్థూలభక్షక కణాలు, ఎడిపోసైట్స్, ఫ్లాస్మాకణాలు, తంతువులు ఉంటాయి.

1. ఫైబ్రోబ్లాస్ట్లు :
ఇవి తంతువులను స్రవించే అత్యంత సాధారణ కణాలు. అచేతన కణాలను ఫైబ్రోసైట్లు అంటారు.

2. మాస్ట్ కణాలు :
ఇవి హెపారిన్ (రక్తస్కందన నిరోధకం), హిస్టమిన్, బ్రాడికైనిన్-రక్తనాళ విస్ఫారకాలు), సెరటోనిన్ (రక్తనాళ సంకోచకాలు) లను స్రవిస్తాయి. గాయాలు, సంక్రమణకు అనుక్రియగా వాసోడయలేటర్లు వాపు లేదా ఉజ్వలనాన్ని కలిగిస్తాయి.

3. స్థూలభక్షకకణాలు :
ఇవి అమీబా రూపంలో ఉండే భక్షక కణాలు. ఇవి రక్తంలోని మోనోసైట్ల నుంచి ఉద్భవిస్తాయి. ఇవి దేహంలోని చనిపోయిన కణాలను, కణచెత్తను భక్షణ చర్య ద్వారా తీసివేసి శుభ్రం చేస్తాయి. అందువల్ల వీటిని అంతర సఫాయికారులు అంటారు. కణజాలానికి అతికి ఉండే స్థూల భక్షకకణాలను హిస్టియోసైట్స్ అనీ, స్వేచ్ఛగా తిరుగాడే స్థూలభక్షకకణాలనీ అంటారు.

4. ప్లాస్మాకణాలు :
ఇవి B-లింఫోసైట్ల నుంచి ఉద్భవిస్తాయి. ప్రతిరక్షకాలను ఉత్పత్తి చేస్తాయి.

5. ఎడిపోసైట్స్ :
కొవ్వును నిల్వజేసే ప్రత్యేక కణాలు.
AP Inter 1st Year Zoology Study Material Chapter 2 జంతుదేహ నిర్మాణం 7

ప్రశ్న 8.
మూడు రకాల మృదులాస్థులను వివరించండి.
జవాబు:
మృదులాస్థి మాత్రిక రచన ఆధారంగా మృదులాస్థి మూడు రకాలు. అవి, కాచాభ, స్థితిస్థాపక, తంతుయుత మృదులాస్థులు.

1. కాచాభ మృదులాస్థి :
ఇది నీలి-తెలుపు వర్ణంలో పాక్షిక పారదర్శకంగా, గాజు లాగా ఉంటుంది. ఇది సర్వ సాధారణ మృదులాస్థి. దీని మాత్రిక సమజాతీయంగా ఉండి, సున్నితమైన కొల్లాజన్ సూక్ష్మతంతువులను కలిగి ఉంటుంది. ఇది అన్ని మృదులాస్థులలో అతి బలహీనమైంది. సంధితల మృదులాస్థిలో తప్ప అన్నిటిలోనూ పరిమృదులాస్థి ఉంటుంది. ఇది అస్థిసకశేరుకాల పిండాలలోనూ సైక్లోస్టోమ్లలోనూ, మృదులాస్థి చేపలలోనూ అంతరాస్థిపంజరాన్ని ఏర్పరుస్తుంది. దీని నుంచి సంధితల మృదులాస్థి (సంధిని ఏర్పరచే పొడవు ఎముకల స్వేచ్ఛాతలం), పర్శుక మృదులాస్థి పర్శుకల ఉరోస్థి భాగాలు, ఎపిఫైసియల్ ఫలకాలు, నాసికాపుట మృదులాస్థి, శ్వాసనాళ మృదులాస్థి వలయాలు, స్వరపేటిక మృదులాస్థి మొదలైనవి ఏర్పడతాయి.
AP Inter 1st Year Zoology Study Material Chapter 2 జంతుదేహ నిర్మాణం 8

2. స్థితిస్థాపక మృదులాస్థి :
స్థితిస్థాపక తంతువులు ఉండటంవల్ల ఇది పసుపురంగులో ఉంటుంది. దీని మాత్రికలో కొల్లాజన్ తంతువులతో బాటు అధిక సంఖ్యలో పసుపు స్థితిస్థాపక తంతువులు ఉంటాయి. ఇది బలాన్ని, స్థితిస్థాపకతను ఇస్తుంది. పరిమృదులాస్థి ఉంటుంది. ఈ మృదులాస్థి వెలుపలి చెవి గొప్ప శ్రోతఃనాళాలు, ఉపజిహ్వికలో ఉంటుంది.

3. తంతుయుత మృదులాస్థి :
మాత్రికలో కట్టలుగా కొల్లాజన్ తంతువులు ఉంటాయి. పరిమృదులాస్థి ఉండదు. అన్ని మృదులాస్థులలో కెల్లా ఈ మృదులాస్థి చాలా ధృడమైంది. ఇది అంతర్ కశేరుక చక్రికలలోనూ, శ్రోణిమేఖల జఘన సంధాయకంలోను ఉంటుంది.

AP Inter 1st Year Zoology Study Material Chapter 2 జంతుదేహ నిర్మాణం

ప్రశ్న 9.
హేవర్షియన్ వ్యవస్థను విపులీకరించండి. [Mar. 14]
జవాబు:
AP Inter 1st Year Zoology Study Material Chapter 2 జంతుదేహ నిర్మాణం 9
పొడవాటి ఎముకలో రెండు విస్తరించిన అంత్యాల (ఎపిఫైసిస్) మధ్య కాడ లేదా డయాఫైసిస్ ఉంటుంది. పెరిగే ఎముకలో డయాఫైసిస్ ఎపిఫైసిస్ మధ్య మెటాఫైసిస్ ఉంటుంది. మెటాఫైసిస్లో మృదులాస్థితో ఏర్పడిన ఎపిఫైసియల్ ఫలకం (ఇది కాచాభ మృదులాస్థితో ఏర్పడుతుంది) ఉంటుంది. ఇది ఎముక పొడవుగా పెరగడానికి తోడ్పడుతుంది. ప్రౌఢజీవులలో దీన్ని సూచిస్తూ ఒక ఎపిఫైసియల్ రేఖ ఏర్పడుతుంది. డయాఫైసిస్ను ఆవరించి సాంద్ర సంయోజక తంతుకణజాలం, పర్యార్థిక ఉంటుంది. పొడవాటి ఎముకల డయాఫైసిస్లో మజ్జాకుహరం అనే బోలైన కుహరంతో ఉంటుంది. దీన్ని ఆవరించి అంతరాస్థిక ఉంటుంది.

పెరి ఆస్టియం, అంతరాస్థిక మధ్య ఎముక మాత్రికలో అనేక వరసలలో పటలికలు ఉంటాయి. పర్యార్థిక కింద ఉండే పటలికలను వెలుపలి పరిధీయ పటలికలు అనీ, అంతరాస్థిక చుట్టూ ఉండే వాటిని అంతర ఆవర్తిత పటలికలు అంటారు. ఈ రెండు పటలికల మధ్య అనేక హేవర్షియన్ వ్యవస్థలు (ఆస్టియాన్-ఎముక ప్రమాణాలు) ఉంటాయి. ప్రతి హేవర్షియన్ వ్యవస్థ ఏక కేంద్రక వలయం లాగా ఏర్పడుతుంది. దీని మధ్యలో హేవర్షియన్ కుల్య, దానిలో రక్త, శోషనాళాలు ఉంటాయి. హేవర్షియన్ నాళం చుట్టూ అనేక లిక్విణులు వలయాకార పటలికలుగా అమరి ఉంటాయి. వీటిలో ఆస్టియోసైట్లు ఉంటాయి. మాత్రికలోని లిక్విణులు ద్రవంతో నిండి, ఇతర లిక్విణులతో సూక్ష్మకుల్య ద్వారా కలిసి ఉంటాయి. హేవర్షియన్ నాళం చుట్టూ ఉండే లిక్విణులు వాటి సూక్ష్మకుల్యల ద్వారా హేవర్షియన్ నాళంతో కలుస్తాయి.

ప్రతీ లిక్విణిలో ఒక ఆస్టియోసైట్ ఉంటుంది. ఇది ఆస్టియోబ్లాస్ట్ క్రియారహిత రూపం. ఆస్టియోసైట్ల జీవపదార్థ కీలితాలు సూక్ష్మకుల్యల ద్వారా విస్తరిస్తాయి. హేవర్షియన్ కుల్య, దాని చుట్టూ ఉన్న పటలికలు, లిక్విణులు అన్నింటిని కలిపి హేవర్షియన్ వ్యవస్థ లేదా ఆస్టియాన్ అంటారు. ఇది అస్థికణజాలంలో నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం. హేవర్షియన్ కుల్యలు అడ్డుగా లేదా ఏటవాలుగా ఉండే వోల్క్ మన్ కుల్యల ద్వారా ఇతర హేవర్షియన్ కుల్యలతో, పర్యస్థికతో, మజ్జాకుహరంతో కలపబడి ఉంటాయి. హేవర్షియన్ కుల్యల రక్తనాళాలనుంచి పోషకాలు, వాయువులు సూక్ష్మకుల్యల ద్వారా అస్థికణజాలం అంతటా వ్యాపనం చెందుతాయి.

ప్రశ్న 10.
లింఫ్/శోషరసంపై స్వల్ప సమాధానం రాయండి.
జవాబు:
శోషరసం :
ఇది రంగులేని ద్రవం. ఇందులో RBC, రక్త ఫలకికలు, పెద్ద ప్లాస్మాప్రోటీన్లు ఉండవు. అయితే ఎక్కువగా ల్యూకోసైట్లు ఉంటాయి. ఇది ప్లాస్మా, లింఫోసైట్స్లో ఏర్పడింది. ఇతర కణజాల ద్రవాలతో పోల్చినప్పుడు వీటిలో అతి కొద్దిపాళ్లలో పోషకాలు, ఆక్సిజన్, ఎక్కువ పరిమాణంలో CO2,ఇతర జీవపోషకాలు ఉంటాయి. శోషరసం కణ మధ్యాంతరస్థలంలో రక్తం నుంచి ఏర్పడుతుంది. రక్తం రక్త కేశనాళికల ద్వారా ప్రవహించేటప్పుడు, ధమనికలలో అధిక జలస్థితిక పీడనంవల్ల రక్తం నుంచి నీరు, ద్రావితాలు, తక్కువ అణుభారంగల ప్రోటీన్లు రక్తకేశనాళికల కుడ్యం నుంచి మధ్యాంతర స్థలంలోకి విడుదలవుతాయి. దీన్ని మధ్యాంతర ద్రవం లేదా కణజాల ద్రవం అంటారు. సిరికల చివరలలో తక్కువ ద్రవాభిసరణ పీడనంవల్ల చాలావరకు మధ్యాంతర ద్రవం నేరుగా రక్తకేశనాళికలను చేరుతుంది. కొద్ది కణజాలద్రవం మాత్రం శోషరస నాళాల ద్వారా ప్రయాణించి అధోజత్రుకాసిర ద్వారా తుదకు రక్తాన్ని చేరుతుంది. శోషరసనాళాలలో ప్రవహించే మధ్యాంతర ద్రవాన్ని శోషరసం అంటారు.

ప్రశ్న 11.
అస్థిపంజర కండరనిర్మాణాన్ని వివరించండి.
జవాబు:
అస్థిపంజర (రేఖిత, నియంత్రిత – కండరం :
ఇవి సాధారణంగా ఎముకలకు స్నాయుబంధనంతో అతుక్కొని ఉంటాయి. ద్విశిరస్థ కండరం లాంటి నమూనా అకండరంలో కండరతంతువులు పలచని ఎండోమైసియం అనే సంయోజక కణజాల తొడుగుతో ఉంటాయి. కండర తంతువులు కట్టను ఫాసికిల్ అంటారు. దీన్ని ఆవరించిన సంయోజక కణజాలపు పొరను పెరిమైసియం అంటారు. ఒక ఫాసికిల్స్ సమూహం ఒక కండరాన్ని ఏర్పరుస్తుంది. ఇలాంటి కండరాన్ని కప్పి ఉండే సంయోజక కణజాలపు పొరను ఎపిమైసియం (వెలుపలి సంయోజక కణజాలం తొడుగు) అంటారు. కండరాన్ని దాటి పొడిగించబడిన ఈ సంయోజక కణజాలస్తరాలు రజ్జువులాంటి స్నాయుబంధనాన్ని లేదా పలకలాంటి ఎపోన్యూరోసిస్ ఏర్పరుస్తాయి.
AP Inter 1st Year Zoology Study Material Chapter 2 జంతుదేహ నిర్మాణం 10

అస్థిపంజర కండరతంతువు పొడవైన, స్తూపాకార, శాఖారహిత కణం. కణ జీవపదార్థంలో పరిధీయంగా (కణాలు కలిసిపోయిన సినీ షియం స్థితి ఏర్పడుతుంది) అండాకార బహుకేంద్రకాలు ఉంటాయి. సార్కోప్లాజంలో ఉన్న అనేక సూక్ష్మకండర తంతువులు ఏకాంతరంగా నిష్కాంతి, కాంతి పట్టీలను ప్రదర్శిస్తాయి. అందువల్ల దీన్ని రేఖిత లేదా చారల కండరం అంటారు. అస్థిపంజర కండరం జీవి నియంత్రణలో (నియంత్రిత కండరం) పనిచేస్తుంది. అస్థిపంజర కండరం త్వరగా సంకోచం జరుపుతుంది. త్వరగా గ్లానికి గురవుతుంది. దీన్ని దైహిక నాడీవ్యవస్థ క్రమబద్దీకరిస్తుంది. శాటిలైట్ కణాలు చలనంలేని (చర్యారహిత), ఏకకేంద్రక, మయోజెనిక్ కణాలు. ఈ కణాలు నియమితంగా కండర పునరుత్పత్తిలో సహాయపడతాయి.

ప్రశ్న 12.
హృదయ కండర నిర్మాణాన్ని వివరించండి.
జవాబు:
AP Inter 1st Year Zoology Study Material Chapter 2 జంతుదేహ నిర్మాణం 11
హృదయ కండర (రేఖిత, అనియంత్రిత) :
ఇది అస్థిపంజర కండరంలాగా రేఖిత కండరం (సార్కోమియర్లు ఉంటాయి) హృదయ కండరాలు సకశేరుకాల హృదయంలోని మయోకార్డియంలో ఉంటాయి. హృదయ కండరకణాలు లేదా మయోకార్డియల్ కణాలు పొట్టిగా, స్తూపాకారంగా ఒకటి లేదా రెండు కేంద్రకాలతో ఉంటాయి. ఇవి ఒకదానితో ఒకటి కలిసి ఉంటాయి. వీటి మధ్య రిక్తసంధులు ఏర్పడి ఉంటాయి. వీటి ద్వారా విద్యుత్ ప్రచోదనాలు హృదయకండరం అంతా వ్యాప్తి చెందుతాయి. హృదయకండరంలో అంతర సంధాయక చక్రికలు ఉంటాయి. ఈ చక్రికలు హృదయ కండరాల ప్రత్యేకత. వీటిలోని రక్తసంధులు ఏర్పడతాయి.

సకశేరుకాల హృదయ కండరాల సంకోచానికి ఎలాంటి నాడీ ఉద్దీపన అవసరం లేదు. వీటిలో ప్రత్యేకమయిన స్వయంలయ బద్ధక నిర్మాణమయిన లయారంభకం వల్ల ప్రేరణ ఉత్పత్తి అవుతుంది. హృదయ కండరం అనియంత్రితమైంది. అయితే హృదయ స్పందన రేటును స్వయంచోదిత నాడులు ఎపినెఫ్రిన్/ఎడ్రినాలిన్ అనే హార్మోన్ల ద్వారా క్రమపరుస్తాయి. ఉత్తేజవంతమైన హృదయ కణం వేగంగా ఇతర అన్ని హృదయకణాలను ఉత్తేజపరిచి మొత్తం హృదయ సంకోచాన్ని కలిగిస్తుంది. దీనివల్ల ఒకే రీతిగా మొత్తం కండరసంకోచం జరుగుతుంది. కాబట్టి హృదయ కండరాన్ని క్రియాత్మక సినీ షియం అంటారు. హృదయ కండరంగా గ్లానికి లోను కాదు. ఎందుకంటే దీనిలో లెక్కలేనన్ని సార్కోసోమ్స్, మయోగ్లోబిన్ అణువులు (ఆక్సిజన్ను నిల్వచేసే వర్ణకం), అధిక రక్త సరఫరా ఉండటం వల్ల ఇది నిరంతర వాయు శ్వాసక్రియ జరుపుతూ ఉంటుంది.

AP Inter 1st Year Zoology Study Material Chapter 2 జంతుదేహ నిర్మాణం

ప్రశ్న 13.
నాడీకణజాలంలో ఊతకణాల గురించి రాయండి.
జవాబు:
న్యూరోగ్లియా (ఊత కణాలు) :
నాడీచర్యలకు కావలసిన అనుకూల సూక్ష్మ వాతావరణాన్ని, ఊతను ప్రసారరహిత కణాలైన న్యూరోగ్లియా కణాలు కల్పిస్తాయి. న్యూరాన్స్ లాగా కాకుండా, ఇవి జీవిత పర్యంతం విభజన చెందుతాయి. కేంద్రనాడీవ్యవస్థ లోని న్యూరోగ్లియా కణాలలో ఆలిగోడెండ్రోసైట్స్ (మయలిన్ ఆచ్ఛాదం ఏర్పరచేది), ఆస్ట్రోసైట్స్-నక్షత్రఆకార కణాలు) అంతర సంధాయకమైన జాలకాన్ని ఏర్పరచి నాడీకణాలను రక్తకేశనాళికలతో బంధిస్తాయి. (రక్తం-మెదడు అవరోధాన్ని ఏర్పరచడంలో తోడ్పడతాయి, ఎపెండిమల్ కణాలు శైలికలతో ఉంటాయి. ఇవి మెదడు, నాడీదండం కుహరాన్ని ఆవరించి మస్తిష్కమేరుద్రవం కదలికలకు తోడ్పడతాయి. మైక్రోగ్లియల్ కణాలు భక్షక కణాలుగా కూడా పిలవబడతాయి. ఇవి మధ్యత్వచం నుంచి ఉద్భవిస్తాయి. పరిధీయ నాడీవ్యవస్థలోని న్యూరోగ్లియల్ కణాలలో ఉపగ్రహకణాలు ష్వాన్ కణాలు ఉంటాయి. నాడీసంధిలో కణదేహాలను ఆవరించి ఉపగ్రహకణాలు ఉంటాయి. ష్వాన్ కణాలు తంత్రికాక్షం చుట్టూ న్యూరిలెమ్మాను ఏర్పరుస్తాయి.

ప్రశ్న 14.
బహుధ్రువ న్యూరాన్ నిర్మాణం వివరించండి.
జవాబు:
AP Inter 1st Year Zoology Study Material Chapter 2 జంతుదేహ నిర్మాణం 12
బహుధ్రువ నాడీకణ నిర్మాణము :
నాడీ కణజాలంలో ఈ కణాలు క్రియాత్మక ప్రమాణాలు. ఈ కణాలు విద్యుత్ ఉత్తేజితమై ప్రేరణలను గ్రహించడం, ప్రారంభించడం, ప్రసారం/నిర్వహణ మొదలైనవి చేస్తాయి. న్యూరాన్ ఉద్దీపన చెందినప్పుడు విద్యుత్ అలజడి (క్రియాశక్మం) జనించి తంత్రికాక్షం పొడవునా వేగంగా ప్రయాణిస్తుంది. న్యూరాన్లో కణదేహం, ఒకటి లేదా ఎక్కువ డెండ్రైట్లు, ఒక తంత్రికాక్షం ఉంటాయి.

కణదేహం :
దీన్ని పెరికేరియాన్, సైటాన్ లేదా దేహం అంటారు. జీవ పదార్థంలో అధికరేణువులు, పెద్ద గుండ్రని కేంద్రకం ఉంటాయి. జీవపదార్థంలో నిస్సిల్ నిర్మాణాలు లేదా నిస్సిల్ రేణువులు (ఇవి ప్రోటీన్ సంశ్లేషణస్థలమైన గరుకు ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్ను సూచిస్తాయి), నాడీ సూక్ష్మతంతువులు, లైపోఫ్యూసిన్ రేణువులు (వయస్సుతో పాటు లైసోజోమ్లలో పేరుకొన్న కణవ్యర్థాలు) ఉంటాయి. కేంద్రనాడీవ్యవస్థలో ఉన్న కణదేహ సమూహాలను కేంద్రకం అనీ, పరిధీయ నాడీవ్యవస్థలో ఉన్న సమూహాని నాడీ సంధి అంటారు.

డెండైట్స్ :
కణదేహం నుంచి ఏర్పడిన అనేక పొట్టి శాఖలు గల నిర్మాణాలను డెండ్రైట్స్ అంటారు. వీటిలో నిస్సిల్ నిర్మాణాలు నాడీ తంతువులు ఉంటాయి. ఇవి కణదేహం దిశగా నాడీ ప్రచోదనాలు (అభివాహిచర్య) అందిస్తాయి.

తంత్రికాక్షం :
తంత్రికాక్షం ఒకే ఒక, పొడవైన, స్తూపాకార నిర్మాణం. ఇది కణదేహంలోని ఒక ప్రాంతమైన తంత్రికాక్షపు మిట్ట నుంచి ఉద్భవిస్తుంది. తంత్రికాక్షం యొక్క ప్లాస్మాలెమ్మాను ఆగ్జోలెమ్మా అనీ జీవపదార్థాన్ని ఆర్థోప్లాసం అనీ అంటారు. వీటిలో నాడీతంతువులు ఉంటాయి. నిస్సిల్ నిర్మాణాలు ఉండవు. తంత్రికాక్షం సహపార్శ్వశాఖలను ఏర్పరుస్తాయి. తంత్రికాక్ష పరాంతంలో అనేక చిన్నచిన్న తంతువులు టెలోడెండ్రియా (తంత్రికాక్ష అంత్యాలు) నాడీకణ సంధీయ బుడిపెలు లేదా అంత్య బొత్తాలు లేదాగా అంతమవుతాయి. అంత్య బొత్తాలలో నాడీకణసంధీయతిత్తులు ఉంటాయి. వీటిలో నాడీ అభివాహకాలు అనే రసాయనాలు ఉంటాయి. తంత్రికాక్షం నాడీ ప్రచోదనాలను ఇతర నాడీకణాలకు కండర కణాలకు ప్రసరింపచేస్తుంది. కేంద్రనాడీవ్యవస్థలోని తంత్రికాక్షాల సమూహాలను నాడీ మార్గాలు అనీ, పరిధీయ నాడీవస్థలో వాటిని నాడులు అనీ అంటారు.

ప్రశ్న 15.
రక్త ఫలకికలు, నాడీకణసంధి గురించి లఘుటీక రాయండి.
జవాబు:
AP Inter 1st Year Zoology Study Material Chapter 2 జంతుదేహ నిర్మాణం 13
1. రక్త ఫలకికలు :
ఇవి కేంద్రక రహితంగా, గుండ్రంగా, అండాకారంగా, ద్వికుంభాకార చక్రిక లాంటి నిర్మాణాలు ప్రతి ఘన మిల్లీమీటర్ రక్తంలో సుమారుగా 2,50,000-4,50,000 రక్త ఫలికికలు ఉంటాయి. అస్థి మజ్జలోని బృహత్కేంద్రక కణాలు శకలీకరణం చెందడం వల్ల రక్త ఫలకికలు ఏర్పడతాయి. రక్త ఫలకికల జీవితకాలం దాదాపు 5-9 రోజులు. ఇవి థ్రాంబోప్లాస్టిన్ు స్రవించి రక్త స్కందనంలో ముఖ్యపాత్ర వహిస్తాయి. ఇవి గాయమైన రక్తకేశనాళికల ఎండోథీలియల్ తలాలకు అతుక్కొని వాటిలోని చిన్న ప్రసరణ రంధ్రాలను మూసివేస్తాయి.

2. నాడీకణసంధి :
తంత్రికాక్ష పరాంతంలో అనేక చిన్న చిన్న తంతువులు టెలోడెండ్రియా నాడీకణ సంధీయ బుడిపెలు లేదా అంత్య బొత్తాలుగా అంతమవుతాయి. అంత్యబొత్తాలలో నాడీకణసంధీయతిత్తులు ఉంటాయి. వాటిలో నాడీ అభివాహకాలు అనే రసాయనాలు ఉంటాయి. తంత్రికాక్షం నాడీ ప్రచోదనాలను ఇ ఇతర నాడీకణాలను కండర కణాలను ప్రసరింపజేస్తుంది.

దీర్ఘ సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
శరీరకుహరం అంటే ఏమిటి? వివిధ రకాల శరీరకుహరాలను ఉదాహరణలు, పటాలతో వివరించండి.
జవాబు:
AP Inter 1st Year Zoology Study Material Chapter 2 జంతుదేహ నిర్మాణం 1
1) శరీరకుహర రహిత ద్విపార్శ్వ సౌష్ఠవ జీవులు :
ఈ సమూహ జంతువులలో శరీరకుహరం ఉండదు కాబట్టి వీటిని శరీరకుహర రహిత జీవులు లేదా ఎసీలోమేట్లు అంటారు. ఉదా : ప్లాటి హెల్మింథిస్ (నిమ్మస్థాయి బైలెటేరియన్లు). వీటి దేహంలో సంయుక్త బీజకుహరిక మధ్యత్వచం నుంచి ఏర్పడిన మధ్యభ్రూణ కణజాలంతో నిండి ఉంటుంది. ఈ విధంగా ఇవి ఘనశరీరరచనను చూపుతాయి. ఎసీలోమేట్లలో శరీరకుహరం లోపించడం వల్ల అనేక సమస్యలున్నాయి. శరీర అవయవాలు మీసెన్సైమాలో అంతస్థగితమై స్వేచ్ఛగా కదలలేవు. అంతేకాకుండా ఆహారనాళం నుంచి శరీరకుడ్యానికి పదార్థాల వ్యాపనం చాలా నెమ్మదిగా, తక్కువ సామర్థ్యంతో కొనసాగుతాయి.

2) మిథ్యా శరీరకుహర ద్విపార్శ్వ సౌష్ఠవ జీవులు :
కొన్ని జంతువులలో శరీరకుహరాన్ని మధ్యత్వచ ఉపకళ ఆవరించి ఉండదు. వీటిని సూడోసీలోమేట్లు అంటారు ఇందులో ఆస్క్ హెల్మింథిస్ వర్గజీవులు (నిమటోడా, రోటిఫెరా, కొన్ని మైనర్ వర్గాలు) ఉన్నాయి. వీటి పిండాభివృద్ధిలో మధ్య భ్రూణ కణజాలం బహిస్త్వచానికి దగ్గరగా ఉండే సంయుక్త బీజకుహరికలోని ఒక భాగంలో మాత్రమే ఉంటుంది. సంయుక్త బీజకుహరికలో మిగిలిని భాగం మిథ్యశరీరకుహరంగా మిగిలిపోతుంది. ఇది మిథ్యాశరీరకుహరద్రవంతో నిండి ఉంటుంది. నాళంలో మరొక నాళం అమరిక మొదటిసారిగా సూడోసీలోమేట్లలో కనిపిస్తుంది.

AP Inter 1st Year Zoology Study Material Chapter 2 జంతుదేహ నిర్మాణం 14
ఆహారనాళకుడ్యం కేవలం అంతస్త్వచ ఉపకళతో మాత్రమే ఏర్పడుతుంది. కాబట్టి ఆహారనాళకుడ్యంతో శోషించబడే పోషకాలు వెలుపల గల మిథ్యా శరీరకుహరద్రవం లోకి సులభంగా వ్యాపనం చెందుతాయి. ఈ క్రియ ప్రసరణవ్యవస్థ లేని లోటును పూరిస్తుంది. మిథ్యాశరీరకుహరం దాదాపుగా నిజశరీరకుహరం నిర్వహించే పనులన్నీ సమర్థవంతంగా నిర్వహిస్తుంది. మిథ్యాశరీరకుహరం, మిథ్యాశరీరకుహర జంతువులలో జలస్థితిక అస్థిపంజరం లాగా పనిచేసి కుదుపు నియంత్రణకు తోడ్పడుతుంది. అంతేకాకుండా అంతరాంగ అవయవాల స్వేచ్ఛా కదలికలకు, పోషకాల ప్రసరణకు, నత్రజని వ్యర్థ పదార్థాల నిల్వకు తోడ్పడుతుంది.

3) విభక్త శరీర కుహర జీవులు :
మధ్యత్వచం చీలి శరీరకుహరం ఏర్పడిన జంతువులను షైజోసీలోమేట్లు అంటారు. అనెలిడ్లు, ఆర్థ్రోపోడ్లు, మలస్కా జీవులు షైజోసీలోమేట్లు. అన్ని షైజోసీలోమేట్లు ప్రాథమిక ముఖధారులు. ఈ జీవులు ‘పూర్ణభంజిత’, సర్పిల, నిర్ధారిత విదళనాలను ప్రదర్శిస్తాయి. తొలి పిండంలోని 4d బ్లాస్టోమియర్ లేదా మీసెంటోబ్లాస్ట్ కణం విభజన చెంది బహిస్త్వచం, అంతస్త్వచం మధ్య మధ్యత్వచ దిమ్మెలు ఏర్పరచి సంయుక్తబీజకుహరికను భర్తీ చేస్తుంది. ప్రతీ మధ్యత్వచ దిమ్మెలో ఏర్పడిన చీలిక షైజోసీలోమ్ (చీలికకుహరం) ఏర్పడటానికి దారితీస్తుంది. అనెలిడాలో షైజెసీలోమ్ క్రియాత్మక శరీరకుహరం (పర్యాంతరాంగ కుహరం). అనెలిడా జీవులలో శరీరకుహరం వరసగా గదులు కలిగి ఉండగా, ఆర్థ్రోపొడా, మలస్కా జీవులలో క్రియాత్మక శరీరకుహరం అంతరాంగ అవయవాల చుట్టూ ఉండి రక్తం (హీమోలింఫ్)తో నిండి రక్తకుహరంగా పిలవబడుతుంది. ఇది పిండానికి చెందిన సంయుక్తబీజకుహరం శరీరకుహర గదులతో కలియడం వల్ల ఏర్పడింది. దీనివల్ల కణజాలాలు నేరుగా రక్తంలో (హీమోలింఫ్) తడిసి ఉంటాయి.
AP Inter 1st Year Zoology Study Material Chapter 2 జంతుదేహ నిర్మాణం 2

4) ఆంత్రశరీర కుహర జీవులు :
ఆదిఆంత్ర మధ్యత్వచ కోశాల నుంచి ఏర్పడిన శరీరకుహరాన్ని ఆంత్రశరీర కుహరం అంటారు. ఇకైనోడర్మ్లు, హెమికార్డట్లు, కార్డట్లు ఎంటిరోసీలోమేట్లు. ఈ జంతువులలో మధ్యత్వచ కోశాలు ఆది ఆంత్రకుడ్యం నుంచి సంయుక్త బీజకుహరికలోకి బహిర్వర్తనం చెందుతాయి. ఇవి ఒకదానితో ఒకటి కలిసి ఎంటిరోసీలోమ్ ఏర్పడుతుంది. అన్ని ఎంటిరోసీలోమేట్లు ద్వితీయ ముఖధారులు. ఇవి వ్యాసార్ధ లేదా చక్రాభ, అనిర్ధారిత విదళనాన్ని ప్రదర్శిస్తాయి.
AP Inter 1st Year Zoology Study Material Chapter 2 జంతుదేహ నిర్మాణం 3

ప్రశ్న 2.
సౌష్ఠవం అంటే ఏమిటి? జంతు సామ్రాజ్యంలో గల వివిధ రకాల సౌష్ఠవాలను ఉదాహరణలతో వివరించండి.
జవాబు:
సౌష్ఠవం :
దేహభాగాలు దేహ అక్షానికి సాపేక్షంగా జ్యామితీయ స్థితిలో అమరి ఉండటాన్ని సౌష్ఠవం అంటారు. ఒక జంతువు ప్రధాన అక్షం ద్వారా పోయే ఒకటి లేదా ఎక్కువ తలాలనుంచి ఛేదించినప్పుడు రెండు సమాన అర్ధభాగాలు లేదా యాంటీమియర్లు ఏర్పడతాయి. ఇలాంటి జంతువులను, సౌష్ఠవయుత జంతువులంటారు. వీటిలో ప్రధాన అక్షం ద్వారా పోయే తలానికి ఇరువైపులా జంట దేహభాగాలు సమదూరంలో ఉంటాయి. జతలుగా లేని అవయవాలు చాలావరకు ప్రధాన అక్షతలం పైనే ఉంటాయి. సాధారణంగా జంతువుల సౌష్ఠవం రెండు రకాలుగా ఉంటుంది.
(i) వ్యాసార్ధ సౌష్ఠవం
(ii) ద్విపార్శ్వ సౌష్ఠవం

(i) వ్యాసార్ధ/వలయ సౌష్ఠవం లేదా ఏకాక్ష విషమధ్రువ సౌష్ఠవం (ఏక అక్షం భిన్నధ్రువాలు) :
జంతువు మధ్య అక్షం (ముఖ ప్రతిముఖ అక్షం/ప్రధాన అక్షం) ద్వారా పోయే ఏ తలం నుంచి అయినా ఛేదించినప్పుడు రెండు సమాన అర్ధభాగాలేర్పడితే దాన్ని వ్యాసార్ధ సౌష్ఠవం అంటారు. ఈ సమూహ జంతువులు వృంత రహితంగా (sessile) నేలకు అంటుకొని లేదా ప్లవకాల లాగా లేదా సోమరిగా ఉంటాయి. నిడేరియన్లు, టీనోఫోరా జీవులలో (కొందరు రచయితలు వీటిని ద్వివ్యాసార్ధ జంతువులుగా తెలిపారు) వ్యాసార్థ సౌష్ఠవం ఉంటుంది. వ్యాసార్ధ సౌష్ఠవ జంతువులు నీటిలో నివసిస్తూ అన్ని దిశల నుంచి వచ్చే ప్రేరణలకు ప్రతిస్పందిస్తాయి. కాబట్టి వ్యాసార్ధ సౌష్ఠవం నేలకు అంటుకొని లేదా నెమ్మదిగా కదిలే జంతువులకు చాలా అనుకూలం. ఇకైనోడర్మ్ లాంటి త్రిస్తరిత జీవులలో వ్యాసార్ధ సౌష్ఠవం రూపాంతరం చెంది పంచ వికిరణ సౌష్ఠవంగా మారింది. వ్యాసార్ధ సౌష్ఠవం జంతువులలో సౌష్ఠవం అన్ని తలాల్లోనూ సమానంగా ఉండగా పంచ వికిరణ సౌష్ఠవం జంతువులలో మాత్రం ఇది దేహంలోని ఐదు తలాలకు పరిమితంగా ఉంటుంది.

(ii) ద్విపార్శ్వ సౌష్ఠవం :
జంతువు దేహ మధ్య అక్షం నుంచి పోయే (పూర్వ పర అక్షం) ఒకే ఒక తలం (మధ్య సమాయత తలం నుంచి ఛేదించినప్పుడు మాత్రమే రెండు సమాన అర్ధభాగాలు ఏర్పడితే, దీన్ని ద్విపార్శ్వ సౌష్ఠవం అంటారు. ఇది ప్రధానంగా త్రిస్తరిత జంతువులలో ఉంటుంది. అయితే మొలస్కా వర్గానికి చెందిన కొన్ని గాస్ట్రోపాడ్ జీవితచరిత్రలో ద్విపార్శ్వ సౌష్ఠవం డింభకాలు ఏర్పడి చివరికి అవి అసౌష్ఠవంగా మారతాయి.

ద్విపార్శ్వ సౌష్ఠవ జంతువులు ఆహార సముపార్జనలో, సంగమజీవిని వెతుక్కోవడంలో, భక్షక జీవులనుంచి తప్పించుకోవడంలో ఎక్కువ సమర్థవంతంగా ఉంటాయి. ఈ సమర్థత ఆ జీవులలో శీర్షత (పూర్వాంతంలో నాడీ, జ్ఞానకణాలు కేంద్రీకృతం) వృద్ధి చెందడం వల్ల ఏర్పడింది.

AP Inter 1st Year Zoology Study Material Chapter 2 జంతుదేహ నిర్మాణం

ప్రశ్న 3.
కణాల్లో నిర్మాణాత్మక మార్పుల ఆధారంగా ఉపకళా కణజాలాలను ఉదాహరణలతో వివరించి, వర్గీకరించండి.
జవాబు:
ఉపకళాకణాలు రెండు రకాలు. అవి సరళ ఉపకళ, సంయుక్త ఉపకళ. ఈ వర్గీకరణను స్తరాల సంఖ్య ఆధారంగా చేశారు. శరీరంలో ఉన్న గ్రంథులు ఉపకళా కణజాలంతో (గ్రంథి ఉపకళ) ఏర్పడ్డాయి.

(A) సరళ ఉపకళ
ఇది ఒకే కణస్తరంతో ఏర్పడి శరీరకుహరం, నాళాలు, నాళికలను ఆవరించి ఉంటుంది. ఇది పదార్థాల వ్యాపనం, శోషణ, గాలనం, స్రావకానికి తోడ్పడుతుంది. వీటి ఆకారం ఆధారంగా మూడు రకాలున్నాయి.

(i) సరల శల్కల ఉపకళ (పేవ్మెంట్ ఉపకళ) :
AP Inter 1st Year Zoology Study Material Chapter 2 జంతుదేహ నిర్మాణం 15
దీనిలో ఒకే కణస్తరం ఉంటుంది. దీనిలో బల్లపరుపుగా ఉన్న టైల్ లేదా గూన పెంకు లాంటి కణాలుంటాయి. కణం మధ్యలో అండాకార కేంద్రకం ఉంటుంది. ఈ కణాలు రక్తనాళాల అంతరస్తరంలో, శరీరకుహరంలోని మీసోథీలియమ్ (ప్లూరా, ఆంత్రవేష్టనం, హృదయావరణ త్వచం), నెఫ్రాన్లోని బౌమన్ గుళిక కుడ్యం, ఊపిరితిత్తులలోని వాయుకోశాలలోనూ ఆవరించి ఉంటాయి.

(ii) సరళ ఘనాకార ఉపకళ :
AP Inter 1st Year Zoology Study Material Chapter 2 జంతుదేహ నిర్మాణం 16
ఇది ఒకే కణస్తరంతో ఏర్పడి ఉంటుంది. దీనిలోని కణాలు ఘనాకారంలో ఉండి, వాటిమధ్యలో గోళాకార కేంద్రకం కలిగి ఉంటాయి. ఇవి జనన ఉపకళ, నెఫ్రాస్ లోని సమీపస్థ, దూరస్థ సంవళితనాళికలలో ఉంటాయి. నెఫ్రాన్లోని సమీపస్థ సంవళితనాళంలోని ఘనాకార ఉపకళ సూక్ష్మచూషకాలను కలిగి ఉంటుంది.

(iii) సరళ స్తంభాకార ఉపకళ :
AP Inter 1st Year Zoology Study Material Chapter 2 జంతుదేహ నిర్మాణం 17
దీనిలో కణాలు పొడవుగా, సన్నగా ఒకే వరసలో అమరి ఉంటాయి. కేంద్రకం అండాకారంగా ఉండి కణ ఆధారానికి దగ్గరగా ఉంటుంది. ఈ కణాల మధ్యలో అక్కడక్కడ శ్లేష్మాన్ని స్రవించే గాబ్లెట్ కణాలు ఉంటాయి. ఈ ఉపకళ రెండు రకాలు.

(ఎ) శైలికామయ స్తంభాకార ఉపకళ :
AP Inter 1st Year Zoology Study Material Chapter 2 జంతుదేహ నిర్మాణం 18
ఇందులో స్వేచ్ఛాగ్ర తలంలో శైలికలను కలిగి ఉండే స్తంభాకార కణాలుంటాయి. ఇవి ఫాలోపియన్ నాళాలు, మెదడు కోష్ఠకాలు, నాడీదండ కేంద్రకుల్య, బ్రాంకియోల్స్ మొదలైన వాటి కుహర లోపలి తలాల్లో ఉంటాయి.

(బి) శైలికారహిత స్తంభాకార ఉపకళ :
ఈ కణాలపై శైలికలుండవు. ఇవి జీర్ణాశయం, పేగు కుహర లోపలి తలంలో ఉంటాయి. పేగులో ఉండే ఉపకళా కణాల ఉపరితలంపై సూక్ష్మ చూషకాలు ఉంటాయి. ఇవి శోషణ ఉపరితల వైశాల్యాన్ని పెంచుతాయి.

(B) సంయుక్త ఉపకళ/స్తరిత ఉపకళ :
AP Inter 1st Year Zoology Study Material Chapter 2 జంతుదేహ నిర్మాణం 19
దీనిలో ఒకటికంటే ఎక్కువ స్తరాలుంటాయి. ఈ ఉపకళ రసాయనిక, యాంత్రిక ఒత్తిడి నుంచి రక్షిస్తుంది. ఇది పొడిగా ఉండే చర్మం ఉపరితలాన్ని కప్పి ఉంటుంది. దీన్ని స్తరిత, కెరటిన్ సహిత శల్కల ఉపకళ అంటారు. అంతేకాకుండా ఇది తేమ గల ఆస్యకుహరం, గ్రసని, ఆహారవాహిక, యోని లోపలి తలాలను ఆవరిస్తుంది. దీన్ని కెరటిన్ రహిత శల్కల ఉపకళ అంటారు. ఈ ఉపకళ లాలాజలగ్రంథులు, స్వేదగ్రంథులు, క్లోమగ్రంథుల ముఖ్య నాళాల లోపలి తలాలలో కూడా ఉంటుంది. అయితే కణాలు ఘనాకారంలో ఉండటం వల్ల బహుస్తరాల కణాలు మధ్యాంతర కణాలు దీన్ని స్తరిత ఘనాకార ఉపకళ అంటారు. మూత్రాశయ కుడ్యం కూడా సంయుక్త ఉపకళతో ఏర్పడుతుంది. మూత్రాశయంలో మూత్రం పరిమాణాన్ని బట్టి ఇది పలుచగా గానీ, మందంగా గానీ మారుతూ ఉంటుంది. అందువల్ల దీన్ని పరివర్తన ఉపకళ లేదా మధ్యాంతర ఉపకళ అంటారు.

(C) గ్రంథి ఉపకళ :
AP Inter 1st Year Zoology Study Material Chapter 2 జంతుదేహ నిర్మాణం 20
కొన్ని స్తంభాకార లేదా ఘనాకార కణాలు ప్రత్యేకతను సంతరించుకొని స్రావకాలను ఉత్పత్తి చేస్తాయి. ఇలాంటి ఉపకళను గ్రంథి ఉపకళ అంటారు. దీనిలోని గ్రంథికణాలు రెండు రకాలు. అవి (i) ఏకకణ గ్రంథులు : ఇవి ఉపకళాత్వచంలో విడివిడిగా ఉంటాయి. ఉదాహరణ : ఆహారనాళంలోని గాబ్లెట్ కణాలు (ii) బహుకణ గ్రంథులు : ఇవి ఉపకళా త్వచంలో గుంపులు గుంపులుగా ఏర్పడతాయి. ఉదాహరణ : లాలాజల గ్రంథులలో గుచ్ఛాలుగా ఉన్న గ్రంథి కణాలు. స్రావాలు విడుదల చేసే పద్ధతిని అనుసరించి గ్రంథులు రెండు రకాలు. అవి బహిస్రావక, అంతస్రావక గ్రంథులు. బహిస్రావ గ్రంథులు నాళ సహితమై శ్లేష్మం, లాలాజలం, చెవి గులిమి (సిరుమిన్, నూనె, పాలు, జీర్ణరసాలు, ఇతర కణ ఉత్పత్తులను స్రవిస్తాయి. స్రావక పద్ధతి ఆధారంగా బహిస్రావ గ్రంథులు మూడు రకాలు : (i) మీరోక్రైన్ గ్రంథులు (ఉదా: క్లోమం) స్రావక కణికలను ఇతర కణపదార్థాలు నష్టపోకుండా వె వెలుపలికి విడుదల చేస్తాయి. (i) ఎపోక్రైన్ గ్రంథులు (ఉదా: క్షీరగ్రంథులు) కణ అగ్రభాగం స్రావక పదార్థంలో సహా కణ నుంచి తెగి విడిపోతుంది. (iii) హోలోక్రైన్ గ్రంథులు (ఉదా: చర్మస్రావ గ్రంథులు) కణం మొత్తం విచ్ఛిన్నం చెంది దానిలోని స్రావకాలను వెలుపలికి విడుదల చేస్తాయి. అంతస్రావ గ్రంథులు నాళరహితమైనవి. వీటి స్రావాలను హార్మోన్లు అంటారు. హార్మోన్లు నాళాల ద్వారా కాకుండా నిర్దేశిత భాగాలకు రక్తం ద్వారా రవాణా చేయబడతాయి.
AP Inter 1st Year Zoology Study Material Chapter 2 జంతుదేహ నిర్మాణం 6

ప్రశ్న 4.
వివిధరకాల సంయోజక కణజాలాలను ఉదాహరణలతో వివరించండి.
జవాబు:
కణబాహ్య మాత్రిక, దానిలోని కణాల స్వభావాన్ని బట్టి సంయోజక కణజాలాన్ని మూడు సమూహాలుగా విభజన చేశారు. అవాస్తవిక సంయోజక కణజాలం, అస్థిపంజర కణజాలం, ద్రవరూప సంయోజక కణజాలం.

1. వాస్తవిక సంయోజక కణజాలం :
ఇది దేహంలోని అవయవాల మధ్య విస్తరించి ఉండే ప్రధాన సంయోజక కణజాలం. ఇది రెండు రకాలు.
ఎ) వదులు సంయోజక కణజాలం :
పాక్షిక ద్రవరూప మాత్రికలో కణాలు, తంతువులు వదులుగా అమరి ఉంటే దాన్ని వదులు సంయోజక కణజాలం అంటారు. ఇది మూడు రకాలు – ఎరియోలార్ కణజాలం, ఎడిపోజ్ కణజాలం, జాలక కణజాలం.

(i) ఎరియోలార్ కణజాలం :
ఇది దేహంలో ఎక్కువగా విస్తరించి ఉండే సంయోజక కణజాలాల్లో ఒకటి. అన్ని అవయవాలలో ఇది దట్టించబడి (packed) ఉంటుంది. ఇది చర్మంలో అధశ్చర్మస్తరాన్ని ఏర్పరుస్తుంది. ఎరియోలార్ కణజాలంలో ఫైబ్రోబ్లాస్ట్లు, మాస్ట్ కణాలు, స్థూలభక్షక కణాలు, ఎడిపోసైట్స్, ప్లాస్మాకణాలు, తంతువులు ఉంటాయి.

(1) ఫైబ్రోబ్లాస్ట్లు :
ఇవి తంతువులను స్రవించే అత్యంత సాధారణ కణాలు. అచేతన కణాలను ఫైబ్రోసైట్లు అంటారు.

(2) మాస్ట్ కణాలు :
ఇవి హెపారిన్ (రక్తస్కందన నిరోధకం), హిస్టమిన్, బ్రాడికైనిన్ – రక్తనాళ విస్ఫారకాలు), సెరటోనిస్ (రక్తనాళ సంకోచకాలు) లను స్రవిస్తాయి. గాయాలు, సంక్రమణకు అనుక్రియగా వాసోడయలేటర్లు వాపు లేదా ఉజ్వలనాన్ని కలిగిస్తాయి.

(3) స్థూలభక్షకకణాలను :
ఇవి అమీబా రూపంలో ఉండే భక్షక కణాలు. ఇవి రక్తంలోని మోనోసైట్ల నుంచి ఉద్భవిస్తాయి. ఇవి దేహంలోని చనిపోయిన కణాలను, కణచెత్తను భక్షణ చర్య ద్వారా తీసివేసి శుభ్రం చేస్తాయి. అందువల్ల వీటిని అంతర సఫాయికారులు అంటారు. కణజాలానికి అతికి ఉండే స్థూల భక్షకకణాలను హిస్టియోసైట్స్ అనీ, స్వేచ్ఛగా తిరుగాడే స్థూలభక్షకకణాలనీ అంటారు.

(4) ప్లాస్మాకణాలు :
ఇవి B-లింఫోసైట్ల నుంచి ఉద్భవిస్తాయి. ప్రతిరక్షకాలను ఉత్పత్తి చేస్తాయి.

(5) ఎడిపోసైట్స్ :
కొవ్వును నిల్వజేసే ప్రత్యేక కణాలు.
AP Inter 1st Year Zoology Study Material Chapter 2 జంతుదేహ నిర్మాణం 7

(ii) ఎడిపోజ్ కణజాలం :
ఇది కొవ్వును నిల్వ ఉండే ప్రత్యేక కణజాలం. ఇందులో అధికసంఖ్యలో ఎడిపోసైట్స్, కొన్ని తంతువులుంటాయి. చర్మం కింద ఉండే ఎడిపోజ్ కణజాలం ఉష్ణనిరోధకంగా పనిచేస్తుంది. ఇది తిమింగలాలు, సముద్ర ఆవుల లాంటి సముద్ర క్షీరదాలలో బ్లబ్బరు, ఒంటెలో మూపురాన్ని ఏర్పరుస్తుంది. ఇది అరచేతులు, అరికాళ్ళలో కుదుపునివారిణిగా పనిచేస్తుంది. అదనపు పోషకాలను ఈ కణజాలం కొవ్వులుగా మార్చి నిల్వ ఉంచుతుంది. ఎడిపోజ్ కణజాలం రెండు రకాలు. అవి తెలుపు ఎడిపోజ్ కణజాలం, గోధుమ ఎడిపోజ్ కణజాలం.

తెలుపు ఎడిపోజ్ కణజాలం :
ఇది ప్రౌఢ జీవులలో అధికంగా ఉంటుంది. ఎడిపోసైట్ కణంలో ఒక పెద్ద కొవ్వు బిందువు (మెనోలాక్యులార్) ఉంటుంది. తెల్లకొవ్వు జీవనచర్యలలో క్రియాశీలంగా ఉండదు.

గోధుమ ఎడిపోజ్ కణజాలం :
ఇది గర్భస్థ పిండాలలోనూ, శిశువులలోనూ ఎక్కువగా ఉంటుంది. దీని ఎడిపోసైట్ కణంలో అనేక చిన్న కొవ్వు బిందువులు (మల్టిలాక్యులర్), అనేక మైటోకాండ్రియాలు ఉంటాయి. గోధుమకొవ్వు జీవనక్రియలో క్రియాశీలంగా ఉండి ఉష్ణాన్ని ఉత్పత్తి చేసి శిశువులో దేహ ఉష్ణోగ్రతను కాపాడుతుంది.

(iii) జాలక కణజాలం :
ఈ కణజాలంలో రెటిక్యులార్ కణాలుగా పిలువబడే ప్రత్యేకమైన ఫైబ్రోబ్లాస్ట్లుంటాయి. ఇవి జాలకతంతువులను స్రవిస్తాయి. ఇవి మాత్రికలో అంతర్సంధాన జాలకంగా ఏర్పడుతాయి. శోషాభాంగాలు (అస్థిమజ్జ, ప్లీహం)కు శోషాభకణుపులకు, ఆధారత్వచ జాలక పటలికకు ఊతాన్నిచ్చే చట్రంగా ఏర్పడుతుంది.

(B) సాంద్రీయ సంయోజక కణజాలం :
ఈ కణజాలంలో తక్కువ కణాలు, ఎక్కువ తంతువులు ఉంటాయి. వీటిలో తక్కువ అథస్థ పదార్థం ఉంటుంది.
AP Inter 1st Year Zoology Study Material Chapter 2 జంతుదేహ నిర్మాణం 21

తంతువుల అమరిక ఆధారంగా సాంద్రీయ సంయోజక కణజాలం మూడు రకాలు :
(i) సాంద్రీయ క్రమయుత సంయోజక కణజాలం :
ఈ కణజాలంలో కొల్లాజెన్ తంతువుల కట్టలు ఒకదానికొకటి సమాంతరంగా అమరి ఉంటాయి. కండరాలను ఎముకతో అతికించే స్నాయుబంధనం, ఎముకలను ఇతర ఎముకలతో అతికించే బంధకం ఈ కణజాలానికి ఉదాహరణ

AP Inter 1st Year Zoology Study Material Chapter 2 జంతుదేహ నిర్మాణం 22
(ii) సాంద్రీయ క్రమరహిత సంయోజక కణజాలం :
ఈ కణజాలంలో కొల్లాజన్ తంతువుల కట్టలు క్రమరహితంగా అమరి ఉంటాయి. ఇది పర్యస్థిక, ఎండాస్టియమ్, హృదయావరణ పొర, గుండె కవాటాలు, కీళ్ల గుళిక, చర్మంలోని అంతశ్చర్యంలో లోతైన ప్రాంతాలలో ఉంటుంది.

(iii) స్థితిస్థాపక సంయోజక కణజాలం :
దీనిలో పసుపు స్థితిస్థాపక తంతువులుంటాయి. సాగదీసి వదిలివేసిన తరవాత పూర్వ ఆకారానికి ఈ కణజాలం చేరుతుంది. ఇది ధమనులు, స్వరతంత్రులు, వాయునాళాలు, శ్వాసనాళాలు, స్థితిస్థాపక బంధనాల (కశేరుకాల మధ్యలో ఉంటాయి) కుడ్యంలో ఉంటుంది.

పైన తెలిపిన వాటికి అదనంగా భ్రూణం లేదా పిండం కణజాలాలలో శ్లేష్మ సంయోజక కణజాలం ఉంటుంది. ఇది నాభిరుజ్జువు లో వార్టన్ జెల్లిగా ఏర్పడి ఉంటుంది.

AP Inter 1st Year Zoology Study Material Chapter 2 జంతుదేహ నిర్మాణం

ప్రశ్న 5.
అస్థిపంజర కణజాలాలను అంటే ఏమిటి? వివిధ రకాల అస్థిపంజర కణజాలాలను వివరించండి.
జవాబు:
అస్థిపంజర కణజాలం :
సకవేరుకాలలో ఇది అంతరాస్థిపంజరాన్ని ఏర్పరుస్తుంది. ఇది శరీరానికి అండగా, అవయవాల రక్షణకు, కండరాలు అతికి ఉండటానికి, చలనానికి తోడ్పడుతుంది. ఇది రెండు రకాలు.
AP Inter 1st Year Zoology Study Material Chapter 2 జంతుదేహ నిర్మాణం 23

(ఎ) మృదులాస్థి లేదా గ్రిసిల్ :
ఇది మృదువైన అస్థి లాంటి సంయోజక కణజాలం. దీనిలోని మాత్రకను కాండ్రిన్ అనీ, కణాలను మృదులాస్థి కణాలు లేదా కాండ్రోసైటులు అంటారు. కాండ్రిన్ స్థితిస్థాపకతను, వంగే లక్షణాన్ని కలిగి ఉంటుంది. దీనిలో కొల్లాజన్ తంతువులు, స్థితిస్థాపక తంతువులు ఉంటాయి. మృదులాస్థి ఉపరితలాన్ని ఆవరించి పరిమృదులాస్థి ఉంటుంది. దీనిలో కాండ్రోబ్లాస్టులు అనే పూర్వమృదులాస్థి కణాలు ఉంటాయి. ఇవి మృదులాస్థి మాత్రికను స్రవిస్తాయి. కొంతకాలం తరవాత కాండ్రోబ్లాస్టులు పరిణతి చెంది కాండ్రోసైటులుగా మారి మాత్రికలో ఉండే లిక్విణులు అనే ఖాళీ ప్రదేశాలలోకి చేరి అచేతనంగా ఉండి పోతాయి.

పరిమృదులాస్థిలోకి రక్తనాళాలు విస్తరించబడి వాటి ద్వారా పోషక పదార్థాలు అందించబడతాయి. కాని మృదులాస్థి అంతర్భాగ మాత్రికలోకి రక్తప్రసరణ ఉండదు. పరిమృదులాస్థిలోని పోషక పదార్థాలు వ్యాపనం దావఆ కాండ్రిన్లోకి వ్యాప్తి చెందుతాయి. మృదులాస్థి పెరుగుదల, పునరుత్పత్తి మరమత్తులు పరిమృదులాస్థిలో జరుగుతాయి.

మృదులాస్థి మాత్రిక రచన ఆధారంగా మృదులాస్థి మూడు రకాలు . అవి, కాచాభ, స్థితిస్థాపక, తంతుయుత మృదులాస్థులు.
1. కాచాభ మృదులాస్థి :
ఇది నీలి-తెలుపు వర్ణంలో పాక్షిక పారదర్శకంగా, గాజు లాగా ఉంటుంది. ఇది సర్వసాధారణ మృదులాస్థి. దీని మాత్రక సమజాతీయంగా ఉండి, సున్నితమైన కొల్లాజన్ సూక్ష్మతంతువులను కలిగి ఉంటుంది. ఇది అన్ని మృదులాస్థులలో అతి బలహీనమైంది. సంధితల మృదులాస్థిలో తప్ప అన్నిటిలోనూ పరిమృదులాస్థి ఉంటుంది. ఇది అస్థిసకశేరుకాల పిండాలలోనూ సైక్లోస్టోమ్లలోనూ, మృదులాస్థి చేపలలోనూ అంతరాస్థిపంజరాన్ని ఏర్పరుస్తుంది. దీని నుంచి సంధితల మృదులాస్థి (సంధిని ఏర్పరచే పొడవు ఎముకల స్వేచ్ఛాతలం), పర్శుక మృదులాస్థి పర్శుకల ఉరోస్థి భాగాలు, ఎపిఫైసియల్ ఫలకాలు, నాసికాపుట మృదులాస్థి, శ్వాసనాళ మృదులాస్థి వలయాలు, స్వరపేటిక మృదులాస్థి మొదలైనవి ఏర్పడతాయి.

2. స్థితిస్థాపక మృదులాస్థి :
స్థితిస్థాపక తంతువులు ఉండటం వల్ల ఇది పసుపురంగులో ఉంటుంది. దీని మాత్రికలో కొల్లాజన్ తంతువులతో బాటు అధికసంఖ్యలో పసుపు స్థితిస్థాపక తంతువులు ఉంటాయి. ఇది బలాన్ని, స్థితిస్థాపకతను ఇస్తుంది. పరిమృదులాస్థి ఉంటుంది. ఈ మృదులాస్థి వెలుపలి చెవి దొప్ప, శ్రోతఃనాళాలు, ఉపజిహ్వికలో ఉంటుంది.

3. తంతుయుత మృదులాస్థి :
మాత్రికలో కట్టలుగా కొల్లాజన్ తంతువులు ఉంటాయి. పరిమృదులాస్థి ఉండదు. అన్ని మృదులాస్థులలో కెల్లా ఈ మృదులాస్థి చాలా ధృడమైంది. ఇది అంతర్కశేరుక చక్రికలలోనూ, శ్రోణిమేఖల జఘన సంధాయకంలోను ఉంటుంది.

(బి) అస్థి కణజాలం :
ఎముక అధిక ఖటికీకృతమైన దృఢమైన సంయోజక కణజాలం. ప్రౌఢ సకశేరుకాలలో ఇది అంతరాస్థిపంజరంగా ఉంటుంది. శరీరంలో నిర్మాణాత్మక చట్రాన్ని ఏర్పరుస్తుంది, మృదు కణజాలానికి ఆధారాన్నిస్తుంది, సున్నిత అవయవాలను రక్షిస్తుంది. ఎముకలు వాటికి అతికి ఉన్న కండరాలతో కలిసి కదలికలకు తోడ్పడతాయి. ఎముకలో దృఢమైన, వంగని మాత్రిక ఉంటుంది. ఇందులో అధికంగా కాల్షియం లవణాలు, కొల్లాజన్ తంతువులు ఉంటాయి. వయస్సు పెరుగుతున్న కొద్దీ అకర్బన పదార్థాలు పేరుకుపోవడం వల్ల ఎముకలు పెళుసుగా మారతాయి. ఎముకలు కాల్షియం, మెగ్నీషియం, భాస్వరం మొదలైన వాటికి హోమియోస్టాటిక్ రిజర్వాయర్ ఉంటుంది. ఎముక విరివిగా రక్తనాళాలను కలిగి ఉంటుంది.

ఎముక వెలుపలి తలంలో తంతుయుత పర్యార్థిక, లోపలి తలంలో అంటే ఎముక మజ్జకుహరాన్ని ఆవరించి అంతరాస్థిక అనే సంయోజక కణతొడుగులుంటాయి. ఈ రెండింటి మధ్య కణబాహ్యమాత్రిక, అస్థి కణాలు ఉంటాయి. అస్థి కణాలలో ఆస్టియోబ్లాస్ట్లు, ఆస్టియోసైట్స్, ఆస్టియోక్లాస్ట్లు అనే మూడు రకాల కణాలు ఉంటాయి. ఆస్టియోబ్లాస్టులు (అపరిపక్వ అస్థికణాలు) మాత్రికలోని సేంద్రియ పదార్థాలను (కొల్లాజన్ తంతువులు) స్రవిస్తాయి. అంతేకాకుండా ఎముకను ఖనిజీకృతం చేయడానికి ముఖ్యపాత్ర వహిస్తాయి. ఈ కణాలు పరిపక్వత చెంది ఆస్టియోసైట్గా మారతాయి. ఆస్టియోసైట్స్ ద్రవం నిండిన లిక్విణులలో ఇమిడి ఉంటాయి. ఆస్టియోక్లాస్ట్లు భక్షకకణాలుగా ఎముకను పునఃశోషణం చేసే విధిని కలిగి ఉంటాయి.

ఘనాస్థి నిర్మాణం :
పొడవాటి ఎముకలో రెండు విస్తరించిన అంత్యాల (ఎపిఫైసిన్) మధ్య కాడ లేదా డయాఫైసిన్ ఉంటుంది. పెరిగే ఎముకలో డయాఫైసిన్, ఎపిఫైసిన్ మధ్య మెటాఫైసిస్ ఉంటుంది. మెటాఫైసిస్ లో మృదులాస్థితో ఏర్పడిన ఎపిఫైసియల్ ఫలకం (ఇది కాచాభ మృదులాస్థితో ఏర్పడుతుంది) ఉంటుంది. ఇది ఎముక పొడవుగా పెరగడానికి తోడ్పడుతుంది. ప్రౌఢజీవులలో దీన్ని సూచిస్తూ ఒక ఎపిఫైసియల్ రేఖ ఏర్పడుతుంది. డయాఫైసిస్ను ఆవరించి సాంద్ర సంయోజక తంతుకణజాలం, పర్యార్థిక ఉంటుంది. పొడవాటి ఎముకల డయాఫైసిస్లో మజ్జాకుహరం అనే బోలైన కుహరంతో ఉంటుంది. దీన్ని ఆవరించి అంతరాస్థిక ఉంటుంది. పెరి ఆస్టియం, అంతరాస్థిక మధ్య ఎముక మాత్రకలో అనేక వరసలలో పటలికలు ఉంటాయి. పర్యార్థిక కింద ఉండే పటలికలను వెలుపలి పరిధీయ పటలికలు అంటారు. అంతరాస్థిక చుట్టూ ఉండే వాటిని అంతర ఆవర్తిత పటలికలు అంటారు. ఈ రెండు పటలికల మధ్య అనేక హేవర్షియన్ వ్యవస్థలు (ఆస్టియాన్ – ఎముక ప్రమాణాలు) ఉంటాయి. ప్రతి హేవర్షియన్ వ్యవస్థ ఏక కేంద్రక వలయంలాగా ఏర్పడుతుంది. దీని మధ్యలో హేవర్షియన్ కుల్య, దానిలో రక్త, శోషనాళాలు ఉంటాయి.

హేవర్షియన్ నాళం చుట్టూ అనేక లిక్విణులు వలయాకార పటలికలుగా అమరి ఉంటాయి. వీటిలో ఆస్టియోసైట్లు ఉంటాయి. మాత్రికలోని లిక్విణులు ద్రవంతో నిండి, ఇతర లిక్విణులతో సూక్ష్మకుల్య ద్వారా కలిసి ఉంటాయి. హేవర్షియన్ నాళం చుట్టూ ఉండే లిక్విణులు వాటి సూక్ష్మకుల్యల ద్వారా హేవర్షియన్ నాళంతో కలుస్తాయి. ప్రతీ లిక్విణిలో ఒక ఆస్టియోసైట్ ఉంటుంది. ఇది ఆస్టియోబ్లాస్ట్ క్రియారహిత రూపం, ఆస్టియోసైట్ల జీవపదార్థ కీలితాలు సూక్ష్మకుల్యల ద్వారా విస్తరిస్తాయి. హేవర్షియన్ కుల్య, దాని చుట్టూ ఉన్న పటలికలు, లిక్విణులు అన్నిటిని కలిపి హేవర్షియన్ వ్యవస్థ లేదా ఆస్టియాన్ అంటారు. ఇది అస్థికణజాలంలో నిర్మానాత్మక క్రియాత్మక ప్రమాణం. హేవర్షియన్ కుల్యలు అడ్డుగా లేదా ఏటవాలుగా ఉండే వోల్క్మన్ కుల్యల ద్వారా ఇతర హేవర్షియన్ కుల్యలతో, పర్యస్థికతో, మజ్జాకుహరంతో కలపబడి ఉంటాయి. హేవర్షియన్ కుల్యల రక్తనాళాల నుంచి పోషకాలు, వాయువులు సూక్ష్మకుల్యల ద్వారా అస్థికణజాలం అంతటా వ్యాపనం చెందుతాయి.
AP Inter 1st Year Zoology Study Material Chapter 2 జంతుదేహ నిర్మాణం 24

ప్రశ్న 6.
రక్తంలో రూపనిష్పాదితాల పదార్థాలను గురించి రాయండి.
జవాబు:
(i) రక్త కణాలు :
రక్త కణాలు మూడు రకాలు. అవి, ఎరిత్రోసైట్లు (ఎర్రరక్తకణాలు), ల్యూకోసైట్లు (తెల్లరక్తకణాలు), రక్త ఫలకికలు. రక్తకణాలు ఏర్పడటాన్ని హీమోపోయిసిస్ లేదా హిమాటోపోయిసిస్ అంటారు. పిండజనన తొలిదశల్లో రక్తకణాలు సొనసంచి మధ్యత్వచం నుంచి ఏర్పడతాయి. ఆ తరవాత కాలేయం, ప్లీహం తాత్కాలిక రక్త కణోత్పాదక కణజాలాలుగా పనిచేస్తాయి. పిండాభివృద్ధి తుది దశల్లో, జననాంతర ఎరుపు అస్థిమజ్జ రక్తకణోత్పాదనకు ప్రధాన స్థానంగా పనిచేస్తుంది.
AP Inter 1st Year Zoology Study Material Chapter 2 జంతుదేహ నిర్మాణం 25

(ii) ఎర్రరక్తకణాలు :
క్షీరదాల ఎర్రరక్తకణాలు వర్తులంగా (ఒంటెలు, లామాస్లో దీర్ఘవృత్తీయంగా ఉంటాయి), ద్విపుటాకారంగా, కేంద్రకరహితంగా ఉంటాయి. ద్విపుటాకార ఆకారం ఎక్కువ ఉపరితల ఘనపరిమాణ నిష్పత్తిని కలగజేస్తుంది. ఇది వాయువుల వినిమయానికి ఎక్కువ ప్రదేశాన్ని అందిస్తుంది. ఇవి 7.8µm వ్యాసంతో ఉంటాయి. ప్రతీ ఘన మిల్లీమీటర్ రక్తంలో, పురుషుడిలో 5 మిలియన్లు, స్త్రీలో 4.5 మిలియన్ల ఎర్రరక్తకణాలుంటాయి. ఎర్రరక్తకణాల సంఖ్యలో తగ్గుదలను ఎరిత్రోసైటోపీనియా అంటారు. ఇది రక్తహీనత కు దారితీస్తుంది. ఎర్రరక్తకణాల సంఖ్యలో అసాధారణ, పెరుగుదలను పాలిసైథీమియా అంటారు. రక్తంలో ఆక్సిజన్ కొరత ఎరిత్రోపాయిటిన్ హార్మోన్ విడుదలకు మూత్రపిండాలను ప్రేరేపిస్తుంది. ఎరిత్రోపాయిటిన్ RBC అధిక ఉత్పత్తికి ఎముక మజ్జను ప్రేరేపిస్తుంది. RBC పరిపక్వతకు విటమిన్ B12, ఫోలిక్ ఆమ్లాలు అవసరం.

క్షీరదాల RBC ని ఆవరించి ప్లాస్మాత్వచం ఉంటుంది. అభివృద్ధి చెందేటప్పుడు రెటిక్యులోసైట్ దశలో కేంద్రకాన్ని, ఇతర కణాంగాలను కోల్పోతాయి. RBC ల జీవపదార్థంలో ‘హీమోగ్లోబిన్’ అనే క్రోమోప్రోటీన్ ఉంటుంది. ప్రతీ హీమోగ్లోబిన్ అణువులో 4 పాలిపెప్టైడ్ గొలుసులు (2α మరియు 2β) మరియు 4 హీమ్ అణువులు ఉంటాయి. ప్రతీ హీమ్ వర్గం మధ్యలో ఒక Fe2+ ఉంటుంది. ఇది ఒక O2 అణువుతో కలవగలుగుతుంది. మానవుల్లో ఎర్రరక్తకణాల జీవితకాలం సుమారు 120 రోజులు వయసుడిగిన ఎర్రరక్తకణాలను ప్లీహం, కాలేయం నాశనం చేస్తాయి.

(iii) తెల్లరక్తకణాలు :
ఇవి కేంద్రకసహిత, రంగులేని పూర్తి కణాలు. ఇవి గోళాకార లేదా క్రమరహిత ఆకారంతో ఉంటాయి. అమీబాయిడ్ కదలికలతో రక్త కేశనాళికల ద్వారా బాహ్య ప్రాంతాలకు డయాపెడిసిస్ ద్వారా చేరతాయి. తెల్లరక్తకణాలు RBC కంటే పరిమాణంలో పెద్దగా, సంఖ్యలో తక్కువగా ఉంటాయి. సాధారణ స్థితిలో ప్రతీ ఘన మిల్లీమీటర్కు 6000-10000 వరకు తెల్లరక్తకణాలు ఉంటాయి. తెల్లరక్తకణాలు ఏర్పడే విధానాన్ని ల్యూకోపాయిసిస్ అంటారు. సంక్రమణ, అలర్జీలో కొద్దిగా పెరిగిన తెల్లరక్తకణాల సంఖ్యను ల్యూకోసైటోసిస్ (Leucocytosis) అంటారు. అసాధారణ సంఖ్యలో పెరిగిన తెల్లరక్తకణాలు ల్యుకేమియా అనే ఒక రకమైన కాన్సర్ను తెలియజేస్తుంది. WBC సంఖ్య క్షీణించడాన్ని ల్యూకోసైటోపీనియా అంటారు. WBC లలో రెండు ముఖ్యరకాలు. కణికాభ కణాలు (గ్రాన్యులోసైట్లు), కణికారహిత కణాలు (ఎగ్రాన్యులోసైట్లు).

కణికాభ కణాలు :
ఇవి జీవపదార్థంలో కణికలు లేదా రేణువులు ఉండే తెల్లరక్తకణాలు. ఈ కణాల కేంద్రకం వివిధ ఆకారాలలో ఉంటుంది. వీటిని బహురూప కేంద్రక తెల్ల రక్తకణాలు అంటారు. వీటి జీవపదార్థం ఆమ్ల లేదా క్షార లేదా తటస్థ రంజకాలను గ్రహిస్తుంది. రంజక లక్షణం ఆధారంగా ఇవి మూడు రకాలు.

AP Inter 1st Year Zoology Study Material Chapter 2 జంతుదేహ నిర్మాణం 26
బేసోఫిల్స్ :
ఇవి మొత్తం తెల్లరక్తకణాలలో 0.4% ఉంటాయి. వీటి కేంద్రకం క్రమరహిత లంబికలుగా విభజించబడి ఉంటుంది. జీవపదార్ధ రేణువులు కొద్దిసంఖ్యలో క్రమరహిత ఆకారంలో ఉంటాయి. ఇవి క్షార రంజకాలను గ్రహిస్తాయి. ఇవి హెపారిన్, హిస్టమస్ మొదలైన వాటిని ఉత్పత్తి చేస్తాయి. అవసరమైనప్పుడు మాస్ట్ కణాలకు అనుబంధంగా విధులను నిర్వహిస్తాయి.

AP Inter 1st Year Zoology Study Material Chapter 2 జంతుదేహ నిర్మాణం 27
ఇస్నోఫిల్స్/ఎసిడోఫిల్స్ :
ఇవి మొత్తం ల్యూకోసైట్లలో 2.3% ఉంటాయి. వీటి కేంద్రకం రెండు లంబికలను కలిగి ఉంటుంది. ఆమ్ల రంజకాలైన ఇయోసిస్ ను గ్రహించే పెద్ద రేణువులు కణజీవద్రవ్యంలో ఉంటాయి (పటం 2.25). ఇవి అలర్జిక్ ప్రతిచర్యలలో ముఖ్యపాత్ర వహిస్తాయి. హెల్మింథిక్ పురుగుల సాంక్రమణ, అలర్జిక్ ప్రతిచర్యలలో వీటి సంఖ్య పెరుగుతుంది. ఇవి ప్రతిజనక – ప్రతిరక్షక సంక్లిష్టాలను తొలగిస్తాయి.

AP Inter 1st Year Zoology Study Material Chapter 2 జంతుదేహ నిర్మాణం 28
న్యూట్రోఫిల్స్ (Neutrophils) :
మొత్తం ల్యూకోసైట్లలో న్యూట్రోఫిల్స్ సుమారు 62% ఉంటాయి. కేంద్రకం మూడు లేదా ఎక్కువ లంబికలతో (2.5) ఉంటుంది. ప్రత్యేకమైన జీవపదార్థ రేణువులు చిన్నగా, విరివిగా ఉంటాయి. ఇవి తటస్థ రంజకాలను పీల్చుకొంటాయి. న్యూట్రోఫిల్స్ చురుకైన భక్షకకణాలు. వీటిని సాధారణంగా సూక్ష్మరూప రక్షకభటులు అంటారు. స్త్రీ క్షీరదాలలో కొన్ని న్యూట్రోఫిల్స్లో లైంగిక క్రొమాటిన్ లేదా డ్రమ్హక్ రూపంలో (ఇది కుదించబడ్డ X – క్రోమోసోమ్) కేంద్రకానికి ఒకవైపు అతికి ఉంటుంది.

కణికారహిత కణాలు :
వీటిలో జీవపదార్థ రేణువులు ఉండవు. వీటి కేంద్రకం లంబికలుగా విభజన చెంది ఉండదు. ఇవి రెండు రకాలు.

AP Inter 1st Year Zoology Study Material Chapter 2 జంతుదేహ నిర్మాణం 29
(ఎ) లింఫోసైట్లు :
ఇవి మొత్తం ల్యూకోసైట్లలో 30% ఉంటాయి. ఇవి చిన్నగా వర్తులాకారంలో ఉంటాయి. వీటి కేంద్రకం పెద్దగా ఉండి కణంలో ఎక్కువ భాగాన్ని ఆక్రమిస్తుంది. కొద్దిగా పరిధీయ జీవపదార్థంతో కూడి ఉంటాయి. క్రియాత్మకంగా రెండు రకాల లింఫోసైట్లున్నాయి. ప్రతిదేహాలను ఉత్పత్తి చేసే B-లింఫోసైట్స్, శరీర వ్యాధినిరోధక ప్రతిచర్యలలో ముఖ్యపాత్ర వహించే T-లింఫోసైట్స్. కొన్ని లింఫోసైట్స్ కొద్దిరోజులు మాత్రమే జీవిస్తాయి. ఇంకొన్ని చాలా సంవత్సరాలు జీవిస్తాయి.

AP Inter 1st Year Zoology Study Material Chapter 2 జంతుదేహ నిర్మాణం 30
(బి) మోనోసైట్లు :
ఇవి మొత్తం తెల్లరక్తకణాలలో సుమారు 5.3% ఉంటాయి. కేంద్రకం మూత్రపిండ (రెనిఫామ్) ఆకారంలో ఉంటుంది. ఇవి అతిపెద్ద గమన భక్షక కణాలు. ఇవి బాక్టీరియా, కణశిథిలాలను మింగివేస్తాయి. ఇవి సంయోజక కణజాలంలోకి ప్రవేశించినప్పుడు స్థూలభక్షక కణాలుగా విభేదనం చెందుతాయి.

AP Inter 1st Year Zoology Study Material Chapter 2 జంతుదేహ నిర్మాణం 31
(iv) రక్తఫలకికలు :
ఇవి కేంద్రక రహితంగా, గుండ్రంగా, అండాకారంగా ద్వికుంభాకార చక్రికలాంటి నిర్మాణాలు. ప్రతి ఘన మిల్లీమీటర్ రక్తంలో సుమారు 2,50,000 – 4,50,000 రక్తఫలకికలు ఉంటాయి. అస్థిమజ్జలో బృహత్కేంద్రక కణాలు శకలీకరణం చెందడం వల్ల రక్త ఫలకికలు ఏర్పడతాయి. రక్తఫలకికల జీవితకాలం దాదాపు 5-9 రోజులు. ఇవి థ్రాంబోప్లాస్టిన్ను స్రవించి రక్త స్కంధనంలో ముఖ్యపాత్ర వహిస్తాయి. ఇవి గాయమైన రక్తకేశినాళికల ఎండోథీలియల్ తలాలకు అతుక్కొని వాటిలోని చిన్న ప్రసరణ రంధ్రాలను మూసివేస్తాయి.

AP Inter 1st Year Zoology Study Material Chapter 2 జంతుదేహ నిర్మాణం

ప్రశ్న 7.
మూడు రకాల కండర కణజాలాలను పోల్చి బేధాలను తెలపండి.
జవాబు:
కండరాలు మూడు రకాలు. అవి అస్థిపంజర, నునుపు, హృదయ కండరాలు. ఎముక పెరిమైసియం
AP Inter 1st Year Zoology Study Material Chapter 2 జంతుదేహ నిర్మాణం 32

అస్థిపంజర (రేఖిత, నియంత్రిత) కండరం :
ఇవి సాధారణంగా ఎముకలకు స్నాయుబంధనంతో అతుక్కొని ఉంటాయి. ద్విశిరస్థ కండరంలాంటి నమూనా అస్థికండరంలో కండర తంతువులు పలచని ఎండోమైసియం అనే సంయోజక కణజాల తొడుగుతో ఉంటాయి. కండరతంతువుల కట్టను ఫాసికిల్ అంటారు. దీన్ని ఆవరించిన సంయోజక కణజాలపు పొరను పెరిమైసియం అంటారు. ఒక ఫాసికిల్స్ సమూహం ఒక కండరాన్ని ఏర్పరుస్తుంది. ఇలాంటి కండరాన్ని కప్పి ఉండే సంయోజక కణజాలపు పొరను ఎపిమైసియం (వెలుపలి సంయోజక కణజాలం తొడుగు) అంటారు. కండరాన్ని దాటి పొడిగించ బడిన ఈ సంయోజక కణజాలస్తరాలు రజ్జువులాంటి స్నాయు బంధనాన్ని లేదా పలకలాంటి ఎపోన్యూరోసిస్ ని ఏర్పరుస్తాయి. అస్థిపంజర కండరతంతువు పొడవైన, స్తూపాకార, శాఖారహిత కణం. కణ సార్కొలెమ్మా జీవపదార్థంలో పరిధీయంగా (కణాలు కలిసిపోయిన సిన్పీషియం స్థితి ఏర్పడుతుంది) అండాకార బహుకేంద్రకాలు ఉంటాయి.
AP Inter 1st Year Zoology Study Material Chapter 2 జంతుదేహ నిర్మాణం 10

సార్కోప్లాజంలో ఉన్న అనేక సూక్ష్మకండర తంతువులు ఏకాంతరంగా నిష్కాంతి, కాంతి పట్టీలను ప్రదర్శిస్తాయి. అందువల్ల దీన్ని రేఖిత లేదా చారల కండరం అంటారు. రేఖిత కండర తంతువు అస్థిపంజర కండరం జీవి నియంత్రణలో (నియంత్రిత కండరం) పనిచేస్తుంది. అస్థిపంజర కండరం త్వరగా సంకోచం జరుపుతుంది. త్వరగా గ్లానికి గురవుతుంది. దీన్ని దైహిక నాడీవ్యవస్థ క్రమబద్దీకరిస్తుంది. శాటిలైట్ కణాలు చలనంలేని (చర్యారహిత), ఏకకేంద్రక, మయోజెనిక్ కణాలు. ఈ కణాలు నియమితంగా కండర పునరుత్పత్తిలో సహాయపడతాయి.

AP Inter 1st Year Zoology Study Material Chapter 2 జంతుదేహ నిర్మాణం 33
నునుపు (అరేఖిత, అనియంత్రిత) కండరం :
ఈ కండరం రక్తనాళాలు, వాయునాళాలు, శ్వాసనాళాలు, జీర్ణాశయం, పేగు, విసర్జకనాళాలు, జనననాళాలు మొదలైన అంతరాంగ అవయవాలలో ఉంటుంది. అందువల్ల అంతరంగ కండరం అంటారు. వీటిలో అడ్డుపట్టీలు ఉండవు కాబట్టి నునుపు కండరం అంటారు. ఇవి కంటిలోని తారక (iris), శైలికాదేహం, చర్మంలో రోమపుటికలకు అతికి ఉండే ఎరక్టార్ పిలి కండరాలలో ఉంటాయి.

సాధారణంగా నునుపు కండరాలు స్తరాలు/పలకల (పత్రాల) మాదిరి అమరి ఉంటాయి. నునుపు కండరతంతువు, కండె ఆకారంలో (తర్కురూపం) ఉండే ఏకకేంద్రక కణం. సూక్ష్మ కండరతంతువులు నిష్కాంతి, కాంతి పట్టీలను ఏకాంతర పద్ధతిలో కలిగి ఉండవు. ఎందుకంటే ఏక్టిన్, మయోసిన్ పోగులు క్రమపద్ధతిలో అమరి ఉండవు. నునుపు కండరాలు నియంత్రణలో పనిచేయవు. కాబట్టి వీటిని అనియంత్రిత కండరాలు అంటారు. నునుపు కండరం, దీర్ఘకాల సంకోచాలను చూపించే కండరం. ఇవి ఎలాంటి అలసటకులోనుకాకుండా దీర్ఘకాలం సంకోచస్థితిలో ఉండగలుగుతాయి. నునుపు కండర సంకోచం స్వయంచోదిత నాడీవ్యవస్థ ఆధీనంలో ఉంటుంది.

హృదయ కండరం (రేఖిత, అనియంత్రిత) :
ఇది అస్థిపంజర కండరం లాగా రేఖిత కండరం (సార్కోమియర్లు ఉంటాయి)హృదయ కండరాలు సకశేరుకాల హృదయంలోని మయోకార్డియంలో ఉంటాయి. హృదయ కండరకణాలు లేదా మయోకార్డియల్ కణాలు పొట్టిగా, స్తూపాకారంగా ఒకటి లేదా రెండు కేంద్రకాలతో ఉంటాయి. ఇవి ఒకదానితో ఒకటి కలిసి ఉంటాయి. వీటి మధ్య రిక్తసంధులు ఏర్పడి ఉంటాయి. వీటి ద్వారా విద్యుత్ ప్రచోదనాలు హృదయకండరం అంతా వ్యాప్తి చెందుతాయి. హృదయకండరంలో అంతర సంధాయక చక్రికలు ఉంటాయి. ఈ చక్రికలు హృదయ కండరాల ప్రత్యేకత. వీటిలోని రక్తసంధులు ఏర్పడతాయి.
AP Inter 1st Year Zoology Study Material Chapter 2 జంతుదేహ నిర్మాణం 11

సకశేరుకాల హృదయ కండరాల సంకోచానికి ఎలాంటి నాడీ ఉద్దీపన అవసరం లేదు. వీటిలో ప్రత్యేకమయిన స్వయంలయబద్ధక నిర్మాణమయిన లయారంభకం వల్ల ప్రేరణ ఉత్పత్తి అవుతుంది. హృదయ కండరం అనియంత్రితమైంది. అయితే హృదయస్పందన రేటును స్వయంచోదిత నాడులు, ఎపినెఫ్రిన్/ఎడ్రినాలిన్ అనే హార్మోన్ల ద్వారా క్రమపరుస్తాయి. ఉత్తేజవంతమైన హృదయ కణం వేగంగా ఇతర అన్ని హృదయకణాలను ఉత్తేజపరిచి మొత్తం హృదయసంకోచాన్ని కలిగిస్తుంది. దీనివల్ల ఒకే రీతిగా మొత్తం కండరసంకోచం జరుగుతుంది. కాబట్టి హృదయ కండరాన్ని క్రియాత్మక సిన్షీషియం అంటారు. హృదయ కండరంగా గ్లానికి లోను కాదు. ఎందుకంటే దీనిలో లెక్కలేనన్ని సార్కోసోమ్స్, మయోగ్లోబిన్ అణువులు (ఆక్సిజన్ను నిల్వచేసే వర్ణకం), అధిక రక్త సరఫరా ఉండటం వల్ల ఇది నిరంతర వాయు శ్వాసక్రియ జరుపుతూ ఉంటుంది.

AP Inter 1st Year Botany Study Material Chapter 13 ఆవరణ సంబంధ అనుకూలనాలు, అనుక్రమం, ఆవరణ సంబంధ సేవలు

Andhra Pradesh BIEAP AP Inter 1st Year Botany Study Material 13th Lesson ఆవరణ సంబంధ అనుకూలనాలు, అనుక్రమం, ఆవరణ సంబంధ సేవలు Textbook Questions and Answers.

AP Inter 1st Year Botany Study Material 13th Lesson ఆవరణ సంబంధ అనుకూలనాలు, అనుక్రమం, ఆవరణ సంబంధ సేవలు

అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ద్వితీయ అనుక్రమంలో ప్రాథమిక అనుక్రమంలో కంటే చరమదశ త్వరగా ఏర్పడుతుంది, ఎందువల్ల?
జవాబు:
ఒక ప్రదేశంలో మొదట ఉన్న జీవ సముదాయాలు నాశనం చేయబడిన తర్వాత మొదలవుతుంది. ఆ ప్రదేశములో కొంత మృత్తిక ఉండుట వల్ల, ప్రాథమిక అనుక్రమం కంటే ద్వితీయ అనుక్రమం వేగవంతంగా ఉంటుంది.

ప్రశ్న 2.
బ్రయోఫైట్లు, లైకెన్లు, ఫెర్న్ మొక్కలలో వేటిని జలాభావ క్రమకంలో ప్రారంభపు మొక్కలుగా పేర్కొంటారు?
జవాబు:
లైకెనులను జలాభావ క్రమకంలో ప్రారంభపు మొక్కలు అంటారు.

ప్రశ్న 3.
జలాభావ క్రమకంకు సంబంధించి ఏవైనా రెండు ఉదాహరణలను పేర్కొనండి.
జవాబు:
క్రిస్టోజ్ లైకెనులు : రైజో కార్బన్, లెకనోరు
ఫోలియోజ్ లైకెనులు : ఫార్మీలియా, డెర్మటోకార్పన్
మాస్లు : ఫ్యునరియా

ప్రశ్న 4.
సముద్ర లవణీయత అధికంగా గల ప్రాంతాలలో ఏ రకం మొక్కలు పెరుగుతాయి. [Mar. ’14]
జవాబు:
హాలోఫైట్లు. ఉదా : రైజోఫొరా

ప్రశ్న 5.
ఎండ మొక్కలు (Heliophytes), నీడ మొక్కల (Sciophytes) ను నిర్వచించండి. మీ ప్రాంతంలోని మొక్కలలో ఒక దానిని ఎండ మొక్కకు కాని నీడ మొక్కకు గాని ఉదాహరణగా పేర్కొనండి.
జవాబు:
ప్రత్యక్షంగా ఎండలో పెరిగే మొక్కలను “హీలియోఫైట్లు” అంటారు. ఉదా : గడ్డి చామంతి, గడ్డి జాతులు.
నీడ ఉన్న ప్రాంతాలలో పెరిగే మొక్కలను “సియోఫైట్లు” అంటారు. ఉదా : ఫెర్న్లు, మాస్లు.

AP Inter 1st Year Botany Study Material Chapter 13 ఆవరణ సంబంధ అనుకూలనాలు, అనుక్రమం, ఆవరణ సంబంధ సేవలు

ప్రశ్న 6.
జనాభా, సముదాయాలను నిర్వచించండి?
జవాబు:

  1. ఒక ప్రాంతంలో నివసించే ఒకే జాతికి చెందిన జీవుల సమూహాన్ని జనాభా అంటారు.
  2. ఒక ప్రాంతంలో నివసించే వివిధ జాతులకు చెందిన అనేక జనాభాల సమూహాన్ని సముదాయము అంటారు.

ప్రశ్న 7.
సంఘాలను నిర్వచించండి? మొక్కల సంఘాలను నీటి మొక్కలు, సమోద్బీజాలు, ఎడారి మొక్కలుగా వర్గీకరించింది ఎవరు?
జవాబు:
ఒక ప్రాంతంలో నివసించే వివిధ జాతులకు చెందిన అనేక జనాభాలా సమూహాన్ని సముదాయము లేక సంఘము అంటారు. వార్మింగ్ అనువారు వృక్షసంఘాలను 3 రకాలుగా వర్గీకరించారు.

ప్రశ్న 8.
నీటి మొక్కలలో కృశించిన దారువు ఉంటుంది. ఎందుకు?
జవాబు:
నీటి మొక్కలలో అన్నిభాగాలు నీటిని శోషించగల్గిఉంటాయి. కావున దారువు కృశించి ఉంటుంది.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
నీటి మొక్కలు అంటే ఏమిటి? వివిధ రకాల నీటి మొక్కలను ఉదాహరణలతో చర్చించండి?
జవాబు:
పూర్తిగా నీటిలోకాని, తడినేలలో కాని పెరిగే మొక్కలను నీటిమొక్కలు అంటారు. నీటిలో పెరిగే విధానాన్ని బట్టి ఐదు రకాలుగా గుర్తించవచ్చును.
1) నీటిపై స్వేచ్ఛగా తేలే మొక్కలు :
ఈ మొక్కలు మృత్తికతో సంబంధం లేకుండా, నీటి ఉపరితలంపై స్వేచ్ఛగా తేలుతూ ఉంటాయి. ఉదా : పిస్టియా, ఐకార్నియా, ఉల్ఫియా, సాల్వీనియా.

2) లగ్నీకరణ చెంది, నీటిపై తేలే పత్రాలుగల మొక్కలు :
ఈ రకం మొక్కలు వేరువ్యవస్థ సహాయంతో మృత్తికలో స్థాపితమై, పొడవైన పత్ర వృంతాలు ఉండటం వల్ల పత్రదళాలు నీటి ఉపరితలంపై తేలుతూ ఉంటాయి.
ఉదా : నిలంబో, నింఫియా, విక్టోరియా రిజియా.
AP Inter 1st Year Botany Study Material Chapter 13 ఆవరణ సంబంధ అనుకూలనాలు, అనుక్రమం, ఆవరణ సంబంధ సేవలు 1

3) పూర్తిగా నీటిలో మునిగి, అవలంబితంగా ఉండే మొక్కలు :
ఈ మొక్కలు నీటితో మాత్రమే సంబంధం కలిగి, పూర్తిగా నీటిలో మునిగి, మృత్తికలో నాటుకొని ఉండకుండా అవలంబితంగా ఉంటాయి. ఉదా : సెరటోఫిల్లమ్, యుట్రిక్యులేరియా, హైడ్రిల్లా.

4) నీటిలో మునిగి ఉండి, లగ్నీకరణ చెందిన మొక్కలు :
ఈ మొక్కలు పూర్తిగా నీటిలో మునిగి ఉండి, వేరు వ్యవస్థ సహాయంతో కొలను అడుగున మృత్తికలో నాటుకొని ఉంటాయి. ఉదా : పాటమోజిటాన్, వాలిస్ నేరియా.

5) ఉభయచర మొక్కలు :
ఇవి పాక్షికంగా నీటిలోనూ, పాక్షికంగా వాయుగతంగాను పెరుగుతాయి. ఉదా : సాజిటేరియా, లిమ్నెఫిలా కొన్ని రకాల మొక్కలు జలాశయాల చుట్టూ పెరుగుతాయి. ఉదా : సైపరస్, టైఫా

AP Inter 1st Year Botany Study Material Chapter 13 ఆవరణ సంబంధ అనుకూలనాలు, అనుక్రమం, ఆవరణ సంబంధ సేవలు

ప్రశ్న 2.
నీటి మొక్కల స్వరూపాత్మక సంబంధమైన అనుకూలనాలను వివరించండి.
జవాబు:

  1. వేర్లు ఉండవు లేదా వేర్లు కృశించి ఉంటాయి. నీటిలో మునిగి ఉన్న పత్రాలు వేర్లులాగా పనిచేస్తాయి.
  2. వేరుతొడుగులు ఉండవు. బురదలో పెరిగే ఉభయచర మొక్కలలో వేర్లు బాగా అభివృద్ధి చెందుతాయి. వీటిలో వేరు తొడుగులు ఉంటాయి.
  3. కొన్ని మొక్కలలో వేరుతొడుగుకు బదులు వేరు సంచులు ఉంటాయి.
  4. వేర్లు ఉంటే పీచువలె, తక్కువ శాఖలను కల్గి ఉంటాయి.
  5. కాండము పొడవుగా, సున్నితంగా ఉంటుంది.
  6. పత్రాలు పలుచగా, పొడవుగా, రిబ్బన్ ఆకృతిలో లేక సన్నగా పొడవుగా లేదా చీలి ఉంటాయి. నీటిపై తేలే పత్రాలు పెద్దవిగా బల్లపరుపుగా, ప్రనమైనపుపూతతో ఉంటాయి.

ప్రశ్న 3.
నీటి మొక్కల అంతర్నిర్మాణ సంబంధమైన అనుకూలనాలను తెలపండి. [Mar. ’14]
జవాబు:

  1. నీటిలో మునిగి ఉండు మొక్కలలో అవభాసిని ఉండదు. వాయుగతభాగాల ఉపరితలంపై పలుచగా ఉంటుంది.
  2. బాహ్యచర్మకణాలు పలుచని కణకవచాన్ని కలిగి, శోషణ చేస్తాయి. మరియు హరితరేణువులను కలిగి కిరణజన్య సంయోగక్రియ జరుపుతాయి.
  3. నీటిలో మునిగి ఉండే మొక్కలలో పత్ర రంధ్రాలు ఉండవు. నీటిపై తేలే పత్రాలున్న మొక్కలలో ఊర్ధ్వతలంలో పత్రరంద్రాలు ఉంటాయి.
  4. వాయుపూరిత మృదుకణజాలము ఎక్కువగా ఉంటుంది. ఇది వాయు మార్పిడికి, మొక్క నీటిపై తేలటానికి ఉపయోగపడుతుంది.
  5. దృడకణజాలాలు, దారువు తక్కువగా ఉంటాయి.

AP Inter 1st Year Botany Study Material Chapter 13 ఆవరణ సంబంధ అనుకూలనాలు, అనుక్రమం, ఆవరణ సంబంధ సేవలు

ప్రశ్న 4.
ఎడారి మొక్కల వర్గీకరణ గురించి క్లుప్తంగా రాయండి.
జవాబు:
బాహ్య స్వరూపం, శరీర ధర్మ లక్షణాలు, జీవితచక్ర విధానాన్ని బట్టి ఎడారి మొక్కలను మూడు విభాగాలుగా వర్గీకరించారు.

1) అల్పకాలిక మొక్కలు :
ఇవి ఏక వార్షిక మొక్కలు. ఇవి శుష్క ప్రాంతాలలో పెరుగుతాయి. ఈ మొక్కలు తక్కువకాలములో జీవిత చరిత్రను ముగించుకుంటాయి. ఉదా : ట్రిబ్యులస్

2) రసభరితమైన మొక్కలు :
ఈ మొక్కలు వర్షాకాలంలో చాలా నీటిని శోషించి, ఆ నీటిని జిగురు పదార్థ రూపంలో మొక్క భాగాలలో నిలవ చేస్తాయి. దీని ఫలితంగా వీటి కాండం, పత్రాలు, వేర్లు కండయుతంగా, రసభరితంగా ఉంటాయి. ఈ విధంగా నిలువ చేసిన నీటిని, నీరు దొరకని సమయంలో చాలా పొదుపుగా వినియోగిస్తాయి.
ఉదా : ఎ) రసభరిత కాండము గల మొక్కలు : ఒపన్షియా
బి) రసభరిత పత్రాలు గల మొక్కలు : అలో
సి) రసభరిత వేళ్ళు గల మొక్కలు : ఆస్పరాగస్
AP Inter 1st Year Botany Study Material Chapter 13 ఆవరణ సంబంధ అనుకూలనాలు, అనుక్రమం, ఆవరణ సంబంధ సేవలు 2

3) రసభరితం కాని మొక్కలు :
ఇవి నిజమైన ఎడారి మొక్కలు. ఇవి దీర్ఘకాలిక జలాభావ పరిస్థితులను తట్టుకోగల బహూవార్షిక మొక్కలు.
ఉదా : కాజురైనా

ప్రశ్న 5.
ఎడారి మొక్కల స్వరూపాత్మక సంబంధమైన అనుకూలనాలను తెలపండి.
జవాబు:

  1. వేర్లు బాగా విస్తరించి అనేక శాఖలతో విస్తరించి ఉంటాయి.
  2. మూల కేశాలు, వేరు తొడుగులు అభివృద్ధి చెంది ఉంటాయి.
  3. కాండాలు పొట్టిగా, దృఢంగా చేవదేరి మందమైన బెరడుతో ఉంటాయి.
  4. కాండంపై కేశాలు మైనపు పొర ఉంటాయి.
  5. పత్రాలు క్షీణించి పొలుసాకులుగా, లేక కంటకాలుగా మారి భాష్పోత్సేకాన్ని తగ్గిస్తాయి.

ప్రశ్న 6.
ఎడారి మొక్కల అంతర్నిర్మాణ సంబంధమైన అనుకూలనాలను తెలపండి.
జవాబు:

  1. బాహ్యచర్మంపై మందమైన అవభాసిని ఉంటుంది.
  2. బాహ్యచర్మ కణాలలో సిలికా స్ఫటికాలు ఉండవచ్చు.
  3. బహుళ బాహ్య చర్మము ఉంటుంది.
  4. పత్రరంద్రాలు పత్ర అధోఃబాహ్యచర్మంలో ఉంటాయి. లేక దిగబడిన పత్రరంద్రాలు ఉంటాయి.
  5. యాంత్రిక కణజాలాలు బాగా అభివృద్ధి చెంది ఉంటాయి.
  6. నాళికా కణజాలాలు బాగా అభివృద్ధి చెంది ఉంటాయి.

ప్రశ్న 7.
మొక్కల అనుక్రమంను నిర్వచించండి. ప్రాథమిక అనుక్రమం, ద్వితీయ అనుక్రమం మధ్య తేడాలు ఏమిటి?
జవాబు:
ఒక ప్రదేశంలో క్రమానుగతంగా జాతుల సంఘటనలో ఊహించగల మార్పులు జరగడాన్ని అనుక్రమం అంటారు.

ప్రాథమిక అనుక్రమంద్వితీయ అనుక్రమం
1) ఎలాంటి జీవ జాతులు లేని చోట జరుగు ప్రక్రియ1) ఒక ప్రదేశంలో మొదటవున్న జీవరాశులు నాశనం చేయబడిన తర్వాత అనగా పాడుపడిన వ్యవసాయ భూములు, నిప్పువల్ల కాలిన అరణ్యాలలో జరిగే ప్రక్రియ.
2) జీవక్రియాపరంగా, ఫలవంతం కాని ప్రదేశంలో (రాతిశిలలపై) జరుగుతుంది.2) జీవక్రియా పరంగా సారవంతమైన ప్రదేశంలో జరుగుతుంది.
3) చరమదశ రావటానికి ఎక్కువ సమయం పడుతుంది.3) చరమదశ రావటానికి తక్కువ సమయం పడుతుంది.

ప్రశ్న 8.
ఆవరణ వ్యవస్థ లేదా ఆవరణ సంబంధ సేవలను నిర్వచించండి. ఆవరణ సంబంధ సేవలు, పరాగ సంపర్కాన్ని గురించి క్లుప్తంగా వివరించండి.
జవాబు:
వాతావరణంలో వివిధ ప్రక్రియల వల్ల ఉత్పత్తి అయ్యే వనరులు, నీటిశుద్ధి, కలప, చేపల ఆవాసం, పంట మొక్కలు పరాగ సంపర్కము మొదలైన వాటిని ఆవరణ సంబంధత్సేవులు అంటారు.

పుష్పంలోని అండాశయాల ఫలధీకరణకు అవసరమైన పరాగ రేణుల మార్పిడిని పరాగ సంపర్కం అంటారు. ఇది ఆరోగ్యవంతమైన ఆవరణ వ్యవస్థలోని భాగము. చాలా పుష్పించే మొక్కల ఫలాలు, విత్తనాలు ఉత్పత్తికి, పరాగసంపర్క సహకారులపై ఆధార పడతాయి. ఈ పరాగ సంపర్క సహకారులు ప్రపంచంలో ఆహార ధాన్యాల ఉత్పత్తిలో ప్రధాన పాత్ర పోషిస్తాయి.

వ్యవసాయ ఉత్పత్తులలో తేనెటీగ ప్రధాన పాత్ర పోషిస్తుంది. పరాగ సంపర్క సహకారులు క్రియాశీలత తగ్గించే ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం జరుగుతుంది. ప్రపంచ వ్యాప్తంగా తేనెటీగలు, సీతాకోక చిలుకలు, ఈగలు వంటి 1,00,000 పైగా అకసేరుక జాతులు, 1,035 జాతుల పక్షులు క్షీరదాలు, సరీసృపాలు కూడా పరాగ సంపర్కం జరుపుతాయి.

ప్రశ్న 9.
ఆవరణ సంబంధ విధులను కొనసాగించడం కోసం తీసుకోవలసిన చర్యలను గురించి రాయండి.
జవాబు:

  1. వాతావరణానికి ఎలాంటి నష్టం కలిగించకుండా, వ్యర్ధ పదార్థ వనరులను తగ్గించే, వనరుల సంరక్షణను దృష్టిలో పెట్టుకునే తయారీ పద్ధతుల ద్వారా తయారయ్యే ఉత్పత్తులను ఎంచుకోవాలి.
  2. కృత్రిమ ఎరువుల, కీటకనాశకాల వినియోగం లేని పద్ధతులలో తయారయిన ఉత్పత్తులను ఎన్నుకోవాలి.
  3. వినియోగాన్ని, వ్యర్ధపదార్థాల ఉత్పత్తిని తగించాలి.
  4. పునర్వినియోగానికి సంబంధించిన ఇందన వనరులు ఉపయోగాన్ని బలపరచాలి.
  5. సైకిల్ లేదా నడక ప్రజారవాణా వ్యవస్థను వాడటం ద్వారా సహజ వనరులను రక్షించడం, కాలుష్యాన్ని తగ్గించడం, ఆరోగ్య సంబంధ లాభాలను ఆస్వాదించుట.
  6. సామూహిక ఉద్యానవనాల ఏర్పాటు, మొక్కనాటే కార్యక్రమములో పాల్గొనుట.
  7. కీటక నాశకాల ఉపయోగం తగ్గించి, సహజకీటక నాశకాలను వాడటం.
  8. ఉద్యాన వనాలలో స్థానిక మొక్కలను పెంచడం, వన్య ప్రాణులకు ఆవాసాన్ని ఏర్పరచడం.

ప్రశ్న 10.
పరాగసంపర్క సహకారకాలను రక్షించడానికి తీసుకోవలసిన జాగత్రలు ఏమిటి?
జవాబు:

  1. పుష్పించు మొక్కలతో సొంతంగా పూదోటలను ఏర్పరచుకోవడం, ఖాళీ ప్రదేశాలలోను, పెద్ద భవనాల బయట పుష్పించు మొక్కలు నాటడం.
  2. ఇళ్ళలోను, పరిసరాలలోను వాడే కీటకనాశక పదార్థాల స్థాయిని తగ్గించడం.
  3. స్థానిక సంస్థలలో, పాఠశాలల్లో తేనెటీగల పెంపకం కోసం ఉపయోగించే ఫలకాలు పెట్టెల వాడకాన్ని ప్రోత్సహించడం.
  4. కీటకనాశక పదార్థాలను వినియోగించని వ్యవసాయ సంస్థలను బలపరచడం.
  5. వ్యవసాయ పంటల పరాగ సంపర్క విషయంలో స్థానికంగా ఉండే పరాగ సంపర్క కారకాలను ఉపయోగించుకునే పద్ధతులు అవసరాన్ని వివరించుట.

దీర్ఘ సమాధాన ప్రశ్న

ప్రశ్న 1.
ఆవరణ వ్యవస్థ సంబంధ సేవలు – కర్బన స్థాపన, ఆక్సిజన్ విడుదల గురించి వివరించండి?
జవాబు:
ఆవరణ వ్యవస్థ సంబంధ సేవలు- కర్బన స్థాపన :
ఎక్కువ కార్బన్ వాతావరణంలోనికి విడుదల కాకుండా ఉండటానికి మొక్కలు అవసరం. అడవులకు, వాతావరణానికి మధ్య నిరంతరం CO2-O2 ల రసాయన ప్రవాహం జరుగుతుంది. అడవులు CO2 యొక్క ప్రధాన బ్యాంకులు కొయ్యరూపంలో పెద్ద పరిమాణంలో CO2 దాచబడుతుంది. ఇది వాతావరణంలోని CO2 గాఢతను తగ్గించి, వాతావరణంలో CO2-O2 ల గతిక సమతుల్యంగా ఉంచడంలో ప్రధాన పాత్ర వహిస్తాయి. కిరణజన్య సంయోగ క్రియ ప్రకారము 180gm గ్లూకోజ్ 193 గ్రాముల 02 ఉత్పత్తికి 264 గ్రాముల CO2, 108 గ్రాముల నీరు యొక్క వినియోగించుకుని 677.2 కిలో కాలరీల సౌరశక్తిని గ్రహిస్తుంది. ఈ 180 గ్రాముల గ్లూకోజ్ క్రమంగా 162 గ్రాముల పాలీశాఖరైడ్గా మొక్కలో మారుతుంది. అనగా ప్రతి 1 గ్రామ్ పొడి సేంద్రియ పదార్థం కోసం 1.63 గ్రాముల CO2 స్థాపన అవసరం. అభయారణ్యాలు ఉత్పత్తి చేసే పొడిసేంద్రియ పదార్థాల మొత్తాన్ని వివిధ నిర్ణీత ఎత్తులో ఉన్న అడవుల వార్షిక నికర ఉత్పత్తి ద్వారా మొత్తాన్ని, లెక్కకట్టవచ్చు. దీనినిబట్టి CO2 ఎంత స్థాపన జరుగునో తెల్చుకోవచ్చు.

శీతోష్ణస్థితి, పరిస్థితులను స్థిరంగా ఉంచడానికి, భూమి అధిక ఉష్ణోగ్రతకులోను కాకుండా, ఎక్కువ గ్రీన్ హౌస్ వాయువును వాతావరణం నుంచి తొలగించుటలో ఆవరణ వ్యవస్థలు సహాయపడతాయి. చాలా దేశాలు కార్బన్ పన్ను విధానంను ప్రవేశపెట్టాయి. దీనివల్ల గ్రీన్ హౌస్ వాయువును ముఖ్యంగా CO2 CO లు వాతావరణంలోనికి విడుదలవటాన్ని తగ్గించవచ్చు.

ఆవరణ వ్యవస్థ సేవలు – ఆక్సిజన్ విడుదల :
వాతావరణంలోకి ఆక్సిజన్ను విడుదల చేయడానికి ప్లవకాలు, వృక్షాలు ముఖ్యపాత్ర వహిస్తున్నాయి. ఇది ఆ మొక్క జాతి రకము, దాని వయస్సు ఆ మొక్క పరిసరాలపై ఆధారపడి ఉంటుంది.

ఒక సంవత్సర కాలంలో 10 మంది. వ్యక్తులు పీల్చడానికి కావలసిన ఆక్సిజన్ ను ఒక పత్రాయుతా ప్రౌఢమొక్క ఒక ఋతువులో విడుదల చేస్తుంది. ఒక పూర్తిగా ఎదిగిన మొక్క 48 lbs CO2 ను ఒక సంవత్సరకాలంలో శోషించి, విడుదల చేసే O2 ఇద్దరు మనుషులకు సరిపోతుంది.

ఒక కారు 26,000 మైల్స్ ప్రయాణంలో విడుదల చేసే CO2 ఒక ఎకరం భూమిలోని వృక్షాలు సంవత్సర కాలంలో వినియోగించుకునే CO2 విలువకు సమానము. ఒక ఎకరం భూమిలోని వృక్షాలు 18 మంది సంవత్సరం పాటు శ్వాసించడానికి కావలసిన O2 ను అందిస్తాయి. మొక్కలను, వృక్షప్లవకాలను “ప్రపంచం యొక్క ఊపిరితిత్తులు” అంటారు. కొన్ని సూక్ష్మజీవులు, సయనో బాక్టీరియాలు ఆక్సిజన్ను ప్రత్యక్షంగా విడుదల చేస్తాయి. అడవులలో పడిపోయిన మానులు విచ్ఛిన్నం వల్ల జరిగే ఖనిజల లవణాల వలయాలు, బాక్టీరియాలు, లైకెన్ల ద్వారా మృత్తిక ఏర్పడటం జరుగుతుంది.

Intext Question and Answers

ప్రశ్న 1.
ఈ కింది మొక్కలను నీటి మొక్కలు (హైడ్రోఫైట్లు), ఉప్పునీటి మొక్కలు (హాలోఫైట్లు), సమోద్బీజాలు, ఎడారి మొక్కలుగా వర్గీకరించండి.
a) సాల్వీనియా
b) ఒపన్షియా
c) రైజోఫొరా
d) మాంజిఫెరా
జవాబు:
a) సాల్వీనియా – నీటి మొక్క (హైడ్రోఫైట్)
b) ఒపన్షియా – ఎడారి మొక్క
c) రైజోఫోరా – ఉప్పునీటి మొక్క
d) మాజిఫెరా – సమోద్బీజ మొక్క

AP Inter 1st Year Botany Study Material Chapter 13 ఆవరణ సంబంధ అనుకూలనాలు, అనుక్రమం, ఆవరణ సంబంధ సేవలు

ప్రశ్న 2.
ఒక కొలనులో మనం నీటిపై స్వేచ్ఛగా తేలేమొక్కలు, నీటిలో మునిగి ఉండే లగ్నీకరణ చెందిన మొక్కలు, లగ్నీకరణ చెంది నీటి బయట ఉండే మొక్కలు, లగ్నీకరణ చెంది, నీటిపై తేలే పత్రాలు గల మొక్కలు అనే వివిధ రకాల నీటి మొక్కలను చూస్తాం. ఈ కింది మొక్కలను వాటి రకం ఆధారంగా పేర్కొనండి?
మొక్కపేరు – రకం
a) హైడ్రిల్లా – _ _ _ _ _ _ _ _ _ _
b) టైఫా – _ _ _ _ _ _ _ _ _ _
c) నింఫియా – _ _ _ _ _ _ _ _ _ _
d) లెమ్నా – _ _ _ _ _ _ _ _ _ _
e) వాలిస్ నేరియా – _ _ _ _ _ _ _ _ _ _
జవాబు:
a) హైడ్రిల్లా – నీటిలో మునిగి అవలంబితంగా ఉండే మొక్క
b) టైఫా – లగ్నీ కరణం చెంది నీటి బయట ఉండే మొక్క
c) నింఫియా – లగ్నీ కరణం చెంది నీటిపై తేలే పత్రాలు కల మొక్క
d) లెమ్నా – నీటి పై స్వేచ్ఛగా తేలే మొక్క
e) వాలిస్ నేరియా – నీటిలో మునిగి లగ్నీకరణం చెందిన మొక్క

ప్రశ్న 3.
అభ్యాసన ప్రక్రియలో భాగంగా ఈ కింది వాటిని వివరించండి.
a) మీ పరిసర ప్రాంతాలలో ఉన్న ఆవరణ సంబంధ సేవలను గుర్తించి నిర్ణయించండి?
b) ఆ ఆవరణ సంబంధ సేవలను కొనసాగించే పద్ధతులు, విధానాలను గురించి ఆలోచించండి?
c) మీ ప్రాంతంలో పెరిగే మొక్కలు లేదా పంటల రకాలను పరిశీలించండి?
d) మీ ప్రాంతంలోని ఆవరణ సంబంధ సేవలను వివరించండి?
e) మీ ప్రాంతంలోని సహజసిద్ధ అరణ్యాల నుంచి సమకూరే వనరులు లేదా వస్తువులను పేర్కొనండి?
f) మీ ప్రాంతంలోని పుష్పించే అలంకర ప్రాయ మొక్కలు, వ్యవసాయ పంటల పరాగసంపర్కరంలో పాల్గొనే జీవ కారకాలను పరిశీలించండి?
జవాబు:
a) వాతావరణంలో వివిధ క్రియల వల్ల ఉత్పత్తి అయ్యే వనరులు నీటిశుద్ధి, కలప, చేపల ఆహారం, పంటమొక్కల పరాగ సంపర్కం వంటివి ఆవరణ సంబంధ సేవలు.
b) 1) వినియోగాన్ని, వ్యర్ధ పదార్థాల ఉత్పత్తిని తగ్గించుట.
2) జీవ కీటకనాశకాల ఉపయోగం తగ్గించి, సహజ కీటక నాశకాలను వాడుట.
3) సామూహిక ఉద్యానవనాలు ఏర్పాటు.
c) వరి, మొక్కజొన్న, మినుములు, పెసలు, జనుము, కూరగాయలు
d) 1) నీటి పరిశుద్ధత
2) వరదల నివారణ
3) వ్యర్ధ పదార్థాల నిర్మూలన
4) ఆక్సిజన్ ఉత్పాదకత
e) పరిశుద్ధ గాలి, మంచినీరు, ఆహారము, నారలు, కలప, ఔషధాలు
f) కీటకాలు, పక్షులు, జంతువులు (గబ్బిలాలు, నత్తలు, పాములు)

AP Inter 1st Year Civics Study Material Chapter 2 రాజ్యం

Andhra Pradesh BIEAP AP Inter 1st Year Civics Study Material 2nd Lesson రాజ్యం Textbook Questions and Answers.

AP Inter 1st Year Civics Study Material 2nd Lesson రాజ్యం

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
రాజ్యాన్ని నిర్వచించి, దాని ముఖ్య లక్షణాలను తెలపండి. [Mar. ’16]
జవాబు:
మానవుడు నిర్మించుకొన్న వివిధ సంస్థల్లో రాజ్యం అత్యంత ప్రధానమైనది, శక్తివంతమైనది కూడా. ఇది సాంఘిక జీవనాన్ని నియంత్రించి, క్రమబద్ధం చేస్తుంది.
క్రీ.శ. 16వ శతాబ్దంలో ఇటలీ దేశస్తుడైన మాఖియవెల్లి, తన గ్రంథమైన “ది ప్రిన్స్”లో మొదటిసారిగా ‘రాజ్యం’ అనే పదాన్ని ఉపయోగించారు. అప్పటి నుండి ఈ పదం బాగా వాడుకలోకి వచ్చింది.

అర్థం: రాజ్యాన్ని ఆంగ్లంలో ‘స్టేట్’ అంటారు. ఈ మాట ‘స్టేటస్’ అనే ట్యుటానిక్ పదం నుండి గ్రహించారు. దీనికి తెలుగులో సరైన అర్థం లేదు. కొందరు ‘స్టేట్’ అంటే ‘ప్రభుత్వం’ అని, ‘జాతి’ అని, ‘సమాజం’ అని భావిస్తున్నారు. కానీ రాజనీతి శాస్త్ర అధ్యయనం ప్రకారం స్టేట్ అంటే ‘రాజ్యం’ అనే అర్థంలో ఉపయోగిస్తున్నారు.
నిర్వచనాలు: రాజ్యాన్ని అనేకమంది రాజనీతి శాస్త్రజ్ఞులు నిర్వచించారు.
ఎ) “మానవునికి సుఖమైన, గౌరవమైన జీవనం ప్రసాదించడం లక్ష్యంగా కలిగిన కుటుంబాల, గ్రామాల సముదాయమే రాజ్యం’. – అరిస్టాటిల్
బి) ‘ఒక నిర్దిష్ట భూభాగంలో శాసనబద్ద ప్రభుత్వం గల ప్రజాసముదాయమే రాజ్యం’. – ఉడ్రోవిల్సన్
సి) “ఒక నిర్ణీత భూభాగంలో రాజకీయంగా వ్యవస్థాపితమైన ప్రజలే రాజ్యం”. – బ్లంటి షిలీ
డి) “ఒక నిర్దిష్ట భూభాగంలో నివసించే పౌరులు, ప్రభుత్వం ఉన్న రాజకీయ వ్యవస్థే రాజ్యం”. – రాబర్ట్ ఎ.డాల్

AP Inter 1st Year Civics Study Material Chapter 2 రాజ్యం

లక్షణాలు: పై నిర్వచనాలననుసరించి రాజ్యానికి నాలుగు ప్రధాన లక్షణాలున్నాయి. అవి 1. ప్రజలు 2. ప్రదేశం 3. ప్రభుత్వం 4. సార్వభౌమాధికారం. వీటితోపాటు ఆధునిక కాలంలో అంతర్జాతీయ గుర్తింపు రాజ్యలక్షణంగా ‘గుర్తించబడింది.

1) ప్రజలు: రాజ్యము ఒక మానవసంస్థ. ప్రజలు లేనిదే రాజ్యం లేదు. అయితే ఒక రాజ్యంలో ప్రజలు ఎంతమంది ఉండవలెననే అంశంపై రాజనీతి తత్త్వవేత్తలు ఒకే అభిప్రాయాన్ని కల్గిలేరు. ప్లేటో దృష్టిలో ఆదర్శ రాజ్య జనాభా 5,040. రూసో అభిప్రాయంలో ఆదర్శ రాజ్యానికి జనాభా 10,000 మంది. అరిస్టాటిల్ అభిప్రాయంలో ఆదర్శ రాజ్య జనాభా మరీ ఎక్కువగానూ, మరీ తక్కువగానూ ఉండరాదు. ప్రస్తుత కాలంలో ఆధునిక రాజ్యాలు కొన్ని తక్కువ జనాభాతోను (అండోరా, శాన్మారినో, వాటికన్ సిటీ), మరికొన్ని ఎక్కువ జనాభాతోను (చైనా, ఇండియా) ఉన్నాయి. ప్రజలు కష్టించి పనిచేసే తత్వాన్ని కల్గి ఉంటే జనాభా తక్కువగా ఉన్నా రాజ్యం అభివృద్ధి చెందుతుంది.

2) ప్రదేశము: నిర్ణీత ప్రదేశం రాజ్యానికి అవసరం. ప్రదేశము అనగా భూమి, ప్రాదేశిక వియత్తలము (ఆకాశము) మరియు ప్రాదేశిక జలాలు (సముద్రజలాలు 12 నాటికల్ మైళ్ళ వరకు) అయితే నాల్గువైపుల భూమినే సరిహద్దుగా కల్గిన, నేపాల్, భూటాన్ వంటి రాజ్యాలకు ప్రాదేశిక జలాలు ఉండవు. వాటికి ప్రదేశము అంటే భూమి, ప్రాదేశిక వియత్తలము మాత్రమే. తక్కువ ప్రదేశం ఉన్న రాజ్యాలు ఉత్తమమైనవిగా ప్లేటో, రూసో అభిప్రాయపడ్డారు. లార్డ్ ఆక్టన్, ట్రయష్కీలు పెద్ద ప్రదేశం కల్గిన రాజ్యాలు గొప్పవని విశ్వసించారు. అరిస్టాటిల్ రాజ్య ప్రదేశం మరీ ఎక్కువగాను, మరీ తక్కువగాను ఉండకూడదని తెల్పెను.

రాజ్యానికి ప్రదేశం ఎక్కువగా ఉంటే సహజవనరులు ఎక్కువగా దొరికే అవకాశం ఉంటుంది. ప్రపంచంలో నేడు ఎక్కువ భూభాగం కలిగిన రష్యా, అమెరికా, ఆస్ట్రేలియా లాంటి రాజ్యాలు, తక్కువ భూభాగం కలిగిన బ్రూనాయి, అండోరా, శాన్ మారినో వంటి రాజ్యాలు ఉన్నాయి.

3) ప్రభుత్వము: రాజ్యము యొక్క ఏజెంట్ ప్రభుత్వం. ఇది రాజ్యం యొక్క అభీష్టాన్ని నెరవేరుస్తుంది. రాజ్యం |తరపున సార్వభౌమాధికారాన్ని వినియోగిస్తుంది. ప్రభుత్వమునకు శాసన నిర్మాణ సభ, కార్యనిర్వాహక వర్గం, న్యాయశాఖ అను మూడు అంగములు కలవు. ప్రభుత్వం రాజ్యం కంటే ముందే ఆవిర్భవించింది. అందువలననే రాజ్య లేకుండా ప్రభుత్వం ఉంటుంది. ప్రభుత్వం శాశ్వతమైన సంస్థ కాదు. ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి. ప్రభుత్వాలు అనేక రకాలు. ప్రజాస్వామ్య, నియంతృత్వ, పార్లమెంటరీ, అధ్యక్షతరహా ఏకకేంద్ర, సమాఖ్య మొదలగునవి.

4) సార్వభౌమాధికారము: రాజ్యం మౌలిక లక్షణాలలో అత్యంత ముఖ్యమైనది సార్వభౌమాధికారము. లాటిన్ పదమైన ‘సుప్రానస్’ నుండి స్వార్నిటీ అను ఆంగ్లపదం ఉద్భవించినది. సార్వభౌమాధికారము వలననే రాజ్యం విశిష్టమైన, అత్యున్నతమైన రాజకీయ సంస్థగా పరిగణించబడుతోంది. సార్వభౌమాధికారము వలన రాజ్యంలో నివసించే ప్రజలు పనిచేసే సంస్థలు రాజ్యానికి విధేయులై ఉండటం జరుగుతుంది. అలా విధేయత చూపించని వ్యక్తులను, సంస్థలను రాజ్యం దండిస్తుంది. సార్వభౌమాధికారము అంతిమ అధికారం. దీనిని మించిన మరొక అధికారం రాజ్యంలో ఉండదు. ఇది విభజించుటకు, బదిలీ చేయుటకు వీలులేని అధికారము.

ప్రశ్న 2.
రాజ్యం, ప్రభుత్వం ఏ విధంగా వ్యత్యాసాలను కలిగి ఉన్నాయి ?
జవాబు:
రాజ్యము, ప్రభుత్వము అనే మాటలు సాధారణంగా ఒకే అర్థాన్నిచ్చేవిగా వాడబడుతుంటాయి. కానీ రాజనీతి శాస్త్రంలో ఈ రెండు పదాలు ప్రత్యేక అర్థాలు కలిగి ఉన్నాయి. హాబ్స్ అనే రచయిత రాజ్యము, ప్రభుత్వాల మధ్య భేదము చూపలేదు. లాస్కీ అభిప్రాయము ప్రకారము “రాజ్యము అంటే ఆచరణలో ప్రభుత్వం”. ప్రభుత్వం రాజ్యం పేరు మీద పనిచేస్తుంది. జి.డి. హెచ్. కోల్ “ఒక సమాజంలోని ప్రభుత్వ రాజకీయ యంత్రాంగమే రాజ్యము” అని అభిప్రాయపడ్డాడు. ఈ విధంగా కొందరు రచయితలు రాజ్యము, ప్రభుత్వము ఒక్కటే అని చెప్పారు. ఇంగ్లాండ్లో స్టువర్ట్ వంశరాజులు రాజ్యాన్ని, ప్రభుత్వాన్ని ఒకటిగా భావించారు. ఫ్రాన్స్లో 14వ లూయీ రాజు “నేనే రాజ్యము” అని వాదించి, రాజ్యానికి, ప్రభుత్వానికి భేదం లేకుండా చేశాడు.

కానీ ప్రభుత్వం రాజ్యానికి ఒక లక్షణము. రాజ్య ఆశయాలు ప్రభుత్వం ద్వారా తీర్చబడతాయి. రాజ్యంలో ప్రజలంతా భాగం. ప్రభుత్వంలో కొందరు ప్రజలే పనిచేస్తారు. మెకైవర్ అభిప్రాయం ప్రకారం ప్రభుత్వం రాజ్య ప్రతినిధి. ఈ విధంగా రాజ్యం, ప్రభుత్వాల మధ్య భేదాలున్నాయి.

AP Inter 1st Year Civics Study Material Chapter 2 రాజ్యం

భేదాలు:
రాజ్యం

  1. రాజ్యం శాశ్వతమైన రాజకీయ సంస్థ. మానవ సమాజం ఉన్నంతకాలం అది ఉంటుంది.
  2. రాజ్యమునకు 5 లక్షణాలుంటాయి. ప్రజలు, ప్రదేశం, ప్రభుత్వం, సార్వభౌమాధికారం, అంతర్జాతీయ గుర్తింపు దాని లక్షణాలు.
  3. రాజ్యము యజమాని వంటిది.
  4. రాజ్యానికి సార్వభౌమాధికారం సహజంగానే ఉంటుంది. అది ఉన్నతాధికారాలు చెలాయిస్తుంది.
  5. ప్రపంచంలోని అన్ని రాజ్యాలకు ముఖ్య లక్షణాలు ఒక్కటే.
  6. పౌరులంతా రాజ్యంలో సభ్యులే. రాజ్యంలో. ప్రజలకు సభ్యత్వం, తప్పనిసరిగా ఉంటుంది.
  7. రాజ్యానికి స్వతసిద్ధమైన రూపం లేదు. అది ప్రభుత్వ రూపంలోనే కనిపిస్తుంది.
  8. రాజ్యానికి ప్రదేశము ఒక ముఖ్య లక్షణము. ప్రదేశంలేని రాజ్యం ఉండదు.
  9. ప్రజలకు రాజ్యాన్ని వ్యతిరేకించే హక్కు లేదు.
  10. రాజ్యానికి మౌలికమైన అధికారాలున్నాయి.
    ఉదా: పార్లమెంటరీ, అధ్యక్షతరహా యూనిటరీ, సమాఖ్య మొదలగు ప్రభుత్వాలు.

ప్రభుత్వం

  1. ప్రభుత్వం ఎన్నికల వలనగానీ, విప్లవాల వలనగానీ మారవచ్చు. అందువలన అది శాశ్వతమైనది కాదు.
  2. ప్రభుత్వం రాజ్య లక్షణాలలో ఒకటి మాత్రమే. అది రాజ్య ప్రతినిధి, ఒక భాగము.
  3. ప్రభుత్వం రాజ్యానికి సేవకుని వంటిది. రాజ్యం పనులను ప్రభుత్వం చేస్తుంది.
  4. ప్రభుత్వం రాజ్యం తరపున సార్వభౌమాధికారాన్ని చెలాయిస్తుంది.
  5. ప్రపంచంలో ప్రభుత్వాలన్నీ ఒకే విధమైనవి కావు.
  6. ప్రభుత్వంలో కొద్దిమంది మాత్రమే సభ్యులు. సభ్యత్వం తప్పనిసరి కాదు.
  7. ప్రభుత్వము ఒక స్పష్టమైన రూపంలో కనిపిస్తుంది.
  8. ప్రభుత్వం నిర్దిష్ట ప్రదేశం లేకుండా పనిచేస్తుంది. అది ఎక్కడినుండైనా పనిచేస్తుంది.
  9. ప్రజలు తమకు నచ్చని ప్రభుత్వాన్ని ప్రతిఘటించ గలరు. న్యాయస్థానాల ద్వారా కూడా వ్యతిరేకించగలరు.
  10. ప్రభుత్వానికి రాజ్యాంగము ఇచ్చే అధికారాలే ఉంటాయి.

ప్రశ్న 3.
రాజ్యం, సమాజం మధ్యగల సంబంధం, వ్యత్యాసాలను వివరించండి.
జవాబు:
పరిచయం: రాజ్యం, సమాజం అనేవి ప్రముఖమైన మానవసంస్థలు. మేకైవర్ అభిప్రాయంలో రక్త సంబంధం సమాజ అవతరణకు దారితీస్తే, సమాజం రాజ్య ఆవిర్భావానికి నాంది పలికింది.

రాజ్యం: “ఒక నిర్ణీత భూభాగంలో రాజకీయంగా వ్యవస్థాపితమైన ప్రజలే రాజ్యం” – బ్లంటి సమాజం: “కొన్ని ఉమ్మడి లక్ష్యాలను సాధించేందుకై సమైక్యం చెందిన వ్యక్తుల సమూహం”.

రాజ్యానికి, సమాజానికి మధ్యగల సంబంధం (Relationship between State and Society):
1) ఒకే రకమైన లక్షణాలు (Common features): రాజ్యం, సమాజం రెండింటికి ఒకే తరహా లక్షణాలు ఉంటాయి. సాధారణంగా రాజ్యం, సమాజాలలో ప్రజలే ఉంటారు. సమాజంలోని సభ్యులే రాజ్యంలో సభ్యులుగా కొనసాగుతారు.

2) పరస్పర పూరకాలు (Complementary): రాజ్యం, సమాజం రెండూ పరస్పర పూరకాలు. ఒకదానికొకటి సహకరించుకొంటాయి. సమాజ ప్రగతి రాజ్య ప్రగతిపై ఆధారపడి ఉంటుంది. రాజ్య కార్యకలాపాలు లేదా పనితీరు సమాజంలోని ఆచారాలు, సంప్రదాయాలపై ఆధారపడి ఉంటాయి.

3) పర్యాయపదాలు (Synonymous terms): రాజ్యం, సమాజం అనే పదాలను అనేక సందర్భాలలో పర్యాయపదాలుగా వినియోగించడమైంది. గ్రీకు రాజనీతితత్త్వవేత్తలైన ప్లేటో, అరిస్టాటిల్లు, తరువాతి కాలంలో హెగెల్, బొసాంకేలు రాజ్యం, సమాజం రెండూ ఒకటే అని భావించారు. గ్రీకు రాజనీతి పండితులు నగర రాజ్యాలను, సమాజాన్ని పర్యాయపదాలుగా ఉపయోగించడం జరిగింది.

4) పరస్పర సంబంధం (Inter-relation): రాజ్యం, సమాజం మధ్యగల సంబంధాన్ని ఎవ్వరూ విస్మరించలేరు. రాజ్యం తాను రూపొందించిన చట్టాల ద్వారా సమాజంలో వ్యక్తుల బాహ్య ప్రవర్తనను నియంత్రిస్తుంది. సామాజిక వ్యవస్థకు విస్తృత పునాదిని ఏర్పరుస్తుంది. అందుచేత రాజ్యం సమాజాలను రెండు విభిన్న వ్యవస్థలలో విడదీయలేం. సమాజ ఆర్థిక, సాంస్కృతిక, మత, మానవతాపరమైన కార్యకలాపాల ద్వారా రాజ్యాన్ని పరిపుష్టంగావిస్తుంది.

రాజ్యం, సమాజం మధ్య వ్యత్యాసాలు (Differences between State and Society): రాజ్యం, సమాజాల మధ్య సన్నిహిత సంబంధం ఉన్నప్పటికీ, ఈ రెండూ ఒకదానికొకటి వ్యత్యాసాలను కలిగి ఉన్నాయి. వాటిని కింది పట్టిక ద్వారా తెలపవచ్చు.

రాజ్యం (State)

  1. రాజ్యం అనేది రాజకీయ సంస్థ.
  2. రాజ్యం వ్యక్తుల బాహ్య ప్రవర్తనను మాత్రమే నియంత్రిస్తుంది. ఈ విషయంలో అది కొన్ని నిబంధనలను రూపొందిస్తుంది.
  3. రాజ్యానికి దండనాధికారం ఉంది. రాజ్యశాసనాన్ని అతిక్రమించినవారు శిక్షార్హులుగా పరిగణించ బడతారు.
  4. రాజ్యం చేసే చట్టాలు రాజ్యానికి బలం చేకూరుస్తాయి.
  5. రాజ్యం అనేది ప్రాదేశిక సంస్థ. దానికి స్వీయ నిర్దిష్ట భూభాగం ఉంటుంది. ప్రాదేశికత అనేది రాజ్యానికి చెందిన ప్రధాన లక్షణంగా పేర్కొనవచ్చు.
  6. రాజ్యం ఒక్కటే సార్వభౌమాధికారాన్ని కలిగి ఉంటుంది. తన సార్వభౌమాధికారాన్ని వినియోగించి ప్రజల సంబంధాలను నిర్దేశించే అనేక చట్టాలను రూపొందించి, అమలు పరుస్తుంది.
  7. రాజ్యం సహజంగా ఏర్పడిన సంస్థ కాదు. అది మానవనిర్మితమైంది. దానిలో సభ్యత్వం వ్యక్తులకు నిర్బంధమైంది.
  8. రాజ్యం సమాజంలోని అతి ముఖ్యభాగం. సమాజంలోని రాజకీయంగా వ్యవస్థీకృతమైన భాగాన్ని అది సూచిస్తుంది.
  9. సాంఘిక వ్యవస్థ అభివృద్ధి చెందిన రూపమే రాజ్యం. అది సమాజం నుంచి ఆవిర్భవించింది.
  10. రాజ్యం శాశ్వతమైంది కాకపోవచ్చు. అది అంతరించి పోయే అవకాశం ఉంది. వేరొక రాజ్యం దానిని బలవంతంగా ఆక్రమించుకోవచ్చు.
  11. రాజ్య చట్టాలు, విధి, విధానాలు ఖచ్చితంగాను, స్పష్టంగాను ఉంటాయి.
  12. రాజ్యంలోని చట్టాలు ఒకే విధంగా ఉంటాయి. ఒకే చట్టాన్ని అతిక్రమించిన వ్యక్తులందరూ తారతమ్యం లేకుండా శిక్షకు గురవుతారు.
  13. రాజ్యానికి ప్రభుత్వం అనే రాజకీయ వ్యవస్థ ఉంటుంది. అది రాజ్యం తరపున చట్టాలను రూపొందించి, అమలుచేస్తుంది.

AP Inter 1st Year Civics Study Material Chapter 2 రాజ్యం

సమాజం (Society)

  1. సమాజం అనేది సాంఘిక వ్యవస్థ.
  2. సమాజం మానవుల బాహ్య, అంతర్గత ప్రవర్తనలు రెండింటిని నియంత్రిస్తుంది. వ్యక్తుల సామాజిక జీవనాన్ని ఇది క్రమబద్దం చేస్తుంది.
  3. సమాజానికి దండనాధికారం లేదు. సాంఘిక ఆచారాలను అతిక్రమిస్తే వారిని సమాజం శిక్షించ లేదు.
  4. సమాజంలోని ఆచారాలు, సంప్రదాయాలు, కట్టుబాట్లు సమాజానికి బలం చేకూరుస్తాయి.
  5. సమాజానికి నిర్దిష్టమైన భౌగోళిక హద్దులు లేవు. అది రాజ్యం కంటే విశాలమైంది కావచ్చు లేదా చిన్నదైనా కావచ్చు. సమాజం విశ్వమంతా విస్తరించి ఉంటుంది.
  6. సమాజానికి నిర్బంధ అధికారాలు అంటూ ఏవీ లేవు. సమాజం మానవ సామాజిక ప్రవర్తనను క్రమబద్దం చేసే నియమాలను రూపొందించి నప్పటికీ వాటికి చట్టబద్ధత ఉండదు.
  7. సమాజం సహజంగా, స్వతఃసిద్ధంగా ఏర్పడిన సంస్థ. వ్యక్తులు తమ విచక్షణను అనుసరించి దీనిలో సభ్యులుగా కొనసాగుతారు.
  8. రాజ్యం కంటే సమాజం విస్తృతమైంది. అనేక సంఘాలు, సంస్థలు, వ్యవస్థల ద్వారా అది ఏర్పడి అభివృద్ధి చెందుతుంది.
  9. సమాజం పెద్దది. రాజ్యం దానిలో అంతర్భాగం మాత్రమే. సమాజం రాజ్యం కంటే ముందు అవతరించింది. మానవుడు స్వభావరీత్యా సంఘ జీవి.
  10. సమాజం శాశ్వతమయింది. ఇది నిరంతరం కొనసాగుతుంది.
  11. సమాజ సూత్రాలు అస్పష్టమైనవి. అవి సాధారణంగా అనిర్దిష్టంగా ఉంటాయి. అవి సంప్రదాయాలు, కట్టుబాట్లపై ఆధారపడి ఉంటాయి.
  12. సమాజం నియమాలు ఒకే విధంగా ఉండవు. ఒక వర్గ నియమాలకు, వేరొక వర్గ నియమాలకు మధ్య వ్యత్యాసం ఉంటుంది. వివిధ సామాజిక వర్గాలు ఒకే రకమైన నేరానికి పాల్పడితే విధించే శిక్షలు వేరువేరుగా ఉంటాయి.
  13. సమాజ నియమాలను అమలుపరచడానికి ఒక ప్రత్యేకమైన యంత్రాంగమంటూ ఏదీ లేదు. ఆచారాలు, సంప్రదాయాలు, కట్టుబాట్ల ద్వారా అది మానవ ప్రవర్తనను నియంత్రిస్తుంది.

ప్రశ్న 4.
రాజ్యం, సంస్థల మధ్యగల సంబంధం, వ్యత్యాసాలను వర్ణించండి.
జవాబు:
పరిచయం: మానవుని సామాజిక స్వభావం, అతడి విభిన్న అవసరాలను తీర్చే అనేక సంఘాల, సముదాయాల ద్వారా వెల్లడవుతుంది. మానవుడు ఒంటరి జీవితాన్ని గడపలేడు. తన అభివృద్ధికి ఇతరుల సహాయ సహకారాలను కోరతాడు. కొన్ని నిర్దిష్ట ప్రయోజనాలను సాధించుకొనేందుకు సన్నిహిత సామాజిక సంబంధాలనేవి సంఘాల ఏర్పాటుకు దారితీస్తాయి.

రాజ్యం: “ఒక నిర్ణీత భూభాగంలో రాజకీయంగా వ్యవస్థాపితమైన ప్రజలే రాజ్యం” – బ్లంట్ల

సంఘం: మేకైవర్ నిర్వచనం ప్రకారం ‘సాధారణమైన లేదా ఉమ్మడి ప్రయోజనాలను నెరవేర్చుకొనేందుకు మానవుడు తన ప్రయోజనాన్ని ఆశించి ఏర్పాటు చేసుకున్నదే సంఘం.”

రాజ్యం-సంఘాల మధ్య సంబంధం (Relationship between State and Association): రాజ్యం, సంఘం రెండూ కూడా వ్యక్తులతో కూడుకొన్న వ్వవస్థలే. రాజ్యం, సంఘంలో వ్యక్తులే సభ్యులు. ఈ రెండూ కూడా వ్యక్తుల అనేక అవసరాలను తీర్చేందుకు ఏర్పాటైనాయి. సమిష్టి ప్రయోజనాలను సాధించుకొనే లక్ష్యంతో రాజ్యం, సంఘాలు ఏర్పాటవుతాయి. రాజ్యం, సంఘంల మధ్యగల సంబంధాన్ని కింది విధంగా వివరించవచ్చు.

  1. ఒకేరకమైన సభ్యత్వం (Same membership): రాజ్యం, సంఘాలు రెండూ కూడా మానవ సమూహాలే. వ్యక్తులందరూ ఆ రెండింటిలో సభ్యులుగా ఉంటారు.
  2. ఉమ్మడి ప్రయోజనాలు (Common Interests): వ్యక్తులు తమ సమిష్టి ప్రయోజనాలను సాధించుకోవడానికి రాజ్యాన్ని, సంఘాలను ఏర్పాటు చేసుకున్నారు.
  3. వ్యవస్థాపరమైనవి (Organisation): రాజ్యం, సంఘాలు రెండూ కూడా తమ ప్రయోజనాలను సాధించుకోవడానికి వ్యక్తులు ఏర్పాటు చేసుకున్న వ్యవస్థలే.
  4. ప్రవర్తనా నియమావళి (Code of conduct): రాజ్యం, సంఘాలు రెండూ తమ సభ్యులను నియంత్రించేందుకుగాను ప్రవర్తనా నియమావళిని కలిగి ఉన్నాయి. అటువంటి నియమావళి సభ్యులను ఒకతాటిపైన ఉంచుతాయి. అంతేకాకుండా అది వ్యవస్థకు స్థిరత్వాన్ని కలిగిస్తుంది.
  5. కార్యనిర్వహణశాఖ (Executive): ప్రతి రాజ్యానికి కార్యనిర్వాహకశాఖ ఉంటుంది. దీనినే ప్రభుత్వంగా పిలువబడుతుంది. ప్రతి సంఘానికి కూడా కార్యనిర్వాహక మండలి ఉండి, తమ విధివిధానాలను అమలుపరుస్తుంది.

రాజ్యం, సంఘాల మధ్యగల వ్యత్యాసాలు (Differences between State and Association):
రాజ్యం (State)

  1. రాజ్యం సభ్యత్వం నిర్బంధమైంది.
  2. రాజ్యం శాశ్వతమైంది.
  3. రాజ్యం ప్రజలందరి శ్రేయస్సు, ప్రగతి కోసం కృషి చేస్తుంది.
  4. రాజ్యం అనేది భౌగోళిక సంస్థ. దానికి నిర్దిష్టమైన సరిహద్దులు ఉంటాయి.
  5. రాజ్యం సార్వభౌమాధికారం గల సంస్థ.
  6. ఒక పౌరుడికి ఒకే సమయంలో ఒక రాజ్యంలో మాత్రమే సభ్యత్వం ఉంటుంది. తనకు సభ్యత్వం ఉన్న రాజ్యం పట్ల మాత్రమే విధేయత కనబరుస్తాడు.
  7. రాజ్య పరిధి విస్తృతమైనది.
  8. సంఘం కార్యకలాపాలలో రాజ్యం జోక్యం చేసుకోవచ్చు.
  9. రాజ్యం సంఘాల కంటే ఉన్నతమైంది.
  10. రాజ్యానికి పౌరులందరూ తప్పనిసరిగా విధేయులై ఉంటారు.
  11. ప్రపంచంలోని రాజ్యాలన్నింటికి ఒకే తరహా లక్షణాలు ఉంటాయి.
  12. రాజ్యం తనకున్న అధికారాన్ని చెలాయిస్తూ, రాజ్య చట్టాలను నిర్బంధంగా అమలుపరుస్తుంది.
  13. శాంతి భద్రతల నిర్వహణలో రాజ్యం బల ప్రయోగానికి పాల్పడవచ్చు.

AP Inter 1st Year Civics Study Material Chapter 2 రాజ్యం

సంఘాలు (Associations)

  1. సంఘంలో సభ్యత్వం ఐచ్ఛికమైంది.
  2. సంఘాలు శాశ్వతమైనవిగానూ, తాత్కాలికంగానూ ఉంటాయి.
  3. సంఘాలు తమ సభ్యుల ప్రయోజనాలను నెరవేర్చేం దుకు ప్రయత్నిస్తాయి.
  4. సంఘాలకు ఖచ్చితమైన సరిహద్దులు ఉండవు.
  5. సంఘాలకు సార్వభౌమాధికారం ఉండదు.
  6. ఒక వ్యక్తికి ఒకేసారి అనేక సంఘాలలో సభ్యత్వం ఉండవచ్చు.
  7. సంఘాల పరిధి పరిమితమైంది.
  8. రాజ్య కార్యకలాపాలలో సంఘం జోక్యం చేసుకో రాదు.
  9. సంఘాలు రాజ్యం కంటే ఉన్నతమైనవి కావు.
  10. సంఘాల నియమ నిబంధనలను సభ్యులు సమయం సందర్భాలను బట్టి ఆమోదించేందుకు లేదా అతిక్రమించేందుకు వీలుంటుంది.
  11. సంఘాలకు నిర్మాణం, స్వభావం, లక్ష్యాలు లేదా ఉద్దేశ్యాలలో వ్యత్యాసం ఉంటుంది.
  12. సంఘాలు తమ నియమ నిబంధనలను బలవంతంగా సభ్యులపైన రుద్దలేవు. సభ్యుల సహకారం పైన సంస్థల నియమావళి అమలు జరుపబడుతుంది.
  13. సభ్యుల అంగీకారంపై ఆధారపడి సంఘాలు తమ కార్యకలాపాలను నిర్వహిస్తాయి.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
రాజ్యానికి గల ఏవైనా రెండు ముఖ్య లక్షణాలను వివరించండి. [Mar. ’18, ’17]
జవాబు:
లక్షణాలు: రాజ్యానికి నాలుగు ప్రధాన లక్షణాలున్నాయి. అవి 1. ప్రజలు 2. ప్రదేశం 3. ప్రభుత్వం 4. సార్వభౌమాధికారం. వీటితోపాటు ఆధునిక కాలంలో అంతర్జాతీయ గుర్తింపు రాజ్యలక్షణంగా గుర్తించబడింది.

1) ప్రజలు: రాజ్యము ఒక మానవసంస్థ. ప్రజలు లేనిదే రాజ్యం లేదు. అయితే ఒక రాజ్యంలో ప్రజలు ఎంతమంది ఉండవలెననే అంశంపై రాజనీతి తత్త్వవేత్తలు ఒకే అభిప్రాయాన్ని కల్గిలేరు. ప్లేటో దృష్టిలో ఆదర్శ రాజ్య జనాభా 5,040. రూసో అభిప్రాయంలో ఆదర్శ రాజ్యానికి జనాభా 10,000 మంది. అరిస్టాటిల్ అభిప్రాయంలో ఆదర్శ రాజ్య జనాభా మరీ ఎక్కువగానూ, మరీ తక్కువగానూ ఉండరాదు. ప్రస్తుత కాలంలో ఆధునిక రాజ్యాలు కొన్ని తక్కువ జనాభాతోను (అండోరా, శాన్ మారినో, వాటికన్ సిటీ), మరికొన్ని ఎక్కువ జనాభాతోను (చైనా, ఇండియా) ఉన్నాయి. ప్రజలు కష్టించి పనిచేసే తత్వాన్ని కల్గి ఉంటే జనాభా తక్కువగా ఉన్నా రాజ్యం అభివృద్ధి చెందుతుంది.

2) ప్రదేశము: నిర్ణీత ప్రదేశం రాజ్యానికి అవసరం. ప్రదేశము అనగా భూమి, ప్రాదేశిక వియత్తలము (ఆకాశము) మరియు ప్రాదేశిక జలాలు (సముద్రజలాలు 12 నాటికల్ మైళ్ళ వరకు) అయితే నాల్గువైపుల భూమినే సరిహద్దుగా కల్గిన, నేపాల్, భూటాన్ వంటి రాజ్యాలకు ప్రాదేశిక జలాలు ఉండవు. వాటికి ప్రదేశము అంటే భూమి, ప్రాదేశిక వియత్తలము మాత్రమే. తక్కువ ప్రదేశం ఉన్న రాజ్యాలు ఉత్తమమైనవిగా ప్లేటో, రూసో అభిప్రాయపడ్డారు. లార్డ్ ఆక్టన్, ట్రయమ్మీలు పెద్ద ప్రదేశం కల్గిన రాజ్యాలు గొప్పవని విశ్వసించారు. అరిస్టాటిల్ రాజ్య ప్రదేశం మరీ ఎక్కువగాను, మరీ తక్కువగాను ఉండకూడదని తెల్పెను.

AP Inter 1st Year Civics Study Material Chapter 2 రాజ్యం

ప్రశ్న 2.
రాజ్యానికి గల ఇతర లక్షణాలు ఏవి ?
జవాబు:
ప్రజలు, ప్రదేశం, ప్రభుత్వం, సార్వభౌమాధికారంతో పాటు రాజ్యం కొన్ని ఇతర లక్షణాలను కూడా కలిగి ఉంటుంది. అవి:
1) అంతర్జాతీయ గుర్తింపు (International Recognition): అంతర్జాతీయ గుర్తింపు అంటే ఒక రాజ్య ఉనికిని, ప్రభుత్వాన్ని ప్రపంచంలోని ఇతర రాజ్యాలు గుర్తించడం. ఆధునిక యుగంలో ప్రపంచ రాజ్యాల మధ్య సంబంధాలు పెరగడంతో అనేక అంతర్జాతీయ సంస్థలు ఏర్పడ్డాయి. కొంతమంది రాజనీతి పండితుల అభిప్రాయంలో అంతర్జాతీయ గుర్తింపు కూడా రాజ్య మౌలిక లక్షణంగా పరిగణించడమైంది.

ప్రపంచంలోని ప్రతి రాజ్యం ఇతర సార్వభౌమ రాజ్యాల చేత గుర్తింపు పొందాలి. ఐక్యరాజ్యసమితి వంటి కొన్ని అంతర్జాతీయ సంస్థలు ఆ రకమైన గుర్తింపును ఇస్తున్నాయి. ఐక్యరాజ్యసమితిలో సభ్యత్వమున్నదంటే ఆ రాజ్యానికి చెందిన సార్వభౌమాధికారం గుర్తించబడినట్లుగా భావించవచ్చు. ఒక కొత్త రాజ్యం ఆవిర్భవించినప్పుడు, అది మిగతా ప్రపంచ రాజ్యాలతో పాటు ఐక్యరాజ్యసమితి చేత గుర్తించబడటం అత్యంత ఆవశ్యకం.

అంతర్జాతీయ గుర్తింపు అనే లక్షణం రాజకీయ దృక్కోణంతో కూడుకొని ఉంది. 1945 లో ఐక్యరాజ్యసమితి ఏర్పడక ముందునుంచే చైనా ఒక సమగ్రమైన రాజ్యం. 1949 నాటికి చైనా కమ్యూనిస్టుల వశమైంది. ప్రచ్ఛన్న యుద్ధ ప్రభావం వల్ల చైనా ఒక సార్వభౌమ రాజ్యంగా అమెరికా సంయుక్త రాష్ట్రాల చేత గుర్తించబడలేదు. చైనా-అమెరికాల మధ్య ప్రచ్ఛన్నయుద్ధ ఛాయలు తొలగిన తరువాత 1970వ దశకంలో ఐక్యరాజ్యసమితి చైనాను ఒక సార్వభౌమ రాజ్యంగా గుర్తించింది.

2) శాశ్వతత్వం (Permanence): రాజ్యం శాశ్వతమైన సంస్థ. ప్రాచీన కాలం నుంచి పరిశీలిస్తే ప్రజలు ఏదో ఒక రాజ్యంలో ప్రజాజీవనం సాగించడంతో పాటు తమ కార్యకలాపాలను నిర్వర్తించారు. రాజ్యానికున్న శాశ్వతత్వమనే లక్షణాన్ని రూపుమాపలేం. దురాక్రమణల ద్వారా ఒక రాజ్యం మరొక రాజ్యపరమైనప్పటికీ, దాని శాశ్వతత్వం అంతరించదు. ఒక రాజ్యం మరొక రాజ్యంలో విలీనమై కొత్త రాజ్యమేర్పడితే సార్వభౌమాధికారం బదిలీ అవుతుందే తప్ప రాజ్యం అంతరించదు. ఉదాహరణకు 1990వ దశకంలో సోవియటయూనియన్ విడిపోయి 15 స్వతంత్ర రాజ్యాలు ఆవిర్భవించాయి.

3) సాధారణ విధేయత (General Obediance): రాజ్య భౌగోళిక సరిహద్దులలో నివసించే ప్రజలందరి మీద రాజ్యాధికారం చెల్లుబాటవుతుంది. రాజ్యం ప్రజల నుండి, వారు ఏర్పాటుచేసుకున్న సంస్థల నుంచి విధేయతను కోరుకుంటుంది. రాజ్యంలోని ప్రజలు, వర్గాలన్నింటికీ విధేయత సూత్రం వర్తిస్తుంది. రాజ్యంలోని ప్రజలుగాని, సంస్థలు గాని రాజ్యాధికారానికి అతీతులమని భావించడానికి వీలులేదు. ప్రజలకు ప్రభుత్వ విధానాలు, కార్యక్రమాలను విమర్శించే హక్కు ఉంటుందే తప్ప, రాజ్యాన్ని విమర్శించే అధికారం వారికి ఉండదు. రాజ్యాధికారానికి లోబడిఉండటం ప్రజలకు తప్పనిసరి.

4) ప్రజాభీష్టం (Popular Will): విల్లోభి ప్రకారం ప్రజాభీష్టం రాజ్యానికి గల అత్యంత ముఖ్యమైన లక్షణం. ప్రజాసమ్మతి ఉన్నంతకాలం రాజ్య మనుగడకు ప్రమాదం ఉండదు. దురాక్రమణదారుల నుంచి రాజ్యాన్ని రక్షించుకోవాలన్నా, అంతర్గతవిప్లవాల నుంచి రాజ్యాన్ని తప్పించాలన్నా పటిష్టమైన ప్రజాభీష్టం అవసరం.

3. రాజ్య ముఖ్య లక్షణాలైన ప్రభుత్వం, సార్వభౌమాధికారం గురించి మీకు తెలిసింది రాయండి. జవాబు: ప్రభుత్వము: రాజ్యము యొక్క ఏజెంట్ ప్రభుత్వం. ఇది రాజ్యం యొక్క అభీష్టాన్ని నెరవేరుస్తుంది. రాజ్యం తరపున సార్వభౌమాధికారాన్ని వినియోగిస్తుంది. ప్రభుత్వమునకు శాసన నిర్మాణ సభ, కార్యనిర్వాహక వర్గం, న్యాయశాఖ అను మూడు అంగములు కలవు. ప్రభుత్వం రాజ్యం కంటే ముందే ఆవిర్భవించింది. అందువలననే రాజ్యం లేకుండా ప్రభుత్వం ఉంటుంది. ప్రభుత్వం శాశ్వతమైన సంస్థ కాదు. ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి. ప్రభుత్వాలు అనేక రకాలు. ప్రజాస్వామ్య, నియంతృత్వ, పార్లమెంటరీ, అధ్యక్షతరహా ఏకకేంద్ర, సమాఖ్య మొదలగునవి.

సార్వభౌమాధికారము: రాజ్యం మౌలిక లక్షణాలలో అత్యంత ముఖ్యమైనది సార్వభౌమాధికారము. లాటిన్ పదమైన ‘సుప్రానస్’ నుండి సావిర్నిటీ అను ఆంగ్లపదం ఉద్భవించినది. సార్వభౌమాధికారము వలననే రాజ్యం విశిష్టమైన, అత్యున్నతమైన రాజకీయ సంస్థగా పరిగణించబడుతోంది. సార్వభౌమాధికారము వలన రాజ్యంలో నివసించే ప్రజలు పనిచేసే సంస్థలు రాజ్యానికి విధేయులై ఉండటం జరుగుతుంది. అలా విధేయత చూపించని వ్యక్తులకు, సంస్థలను రాజ్యం దండిస్తుంది. సార్వభౌమాధికారము అంతిమ అధికారం. దీనిని మించిన మరొక అధికారం రాజ్యంలో ఉండదు. ఇది విభజించుటకు, బదిలీ చేయుటకు వీలులేని అధికారము.

ప్రశ్న 4.
రాజ్యం, సమాజం మధ్యగల సంబంధాన్ని వర్ణించండి.
జవాబు:
రాజ్యానికి, సమాజానికి మధ్యగల సంబంధం (Relationship between State and Society):
1) ఒకే రకమైన లక్షణాలు (Common features): రాజ్యం, సమాజం రెండింటికి ఒకే తరహా లక్షణాలు ఉంటాయి. సాధారణంగా రాజ్యం, సమాజాలలో ప్రజలే ఉంటారు. సమాజంలోని సభ్యులే రాజ్యంలో సభ్యులుగా కొనసాగుతారు.

2) పరస్పర పూరకాలు (Complementary): రాజ్యం, సమాజం రెండూ పరస్పర పూరకాలు. ఒకదాని కొకటి సహకరించుకొంటాయి. సమాజ ప్రగతి రాజ్య ప్రగతిపై ఆధారపడి ఉంటుంది. రాజ్య కార్యకలాపాలు లేదా పనితీరు సమాజంలోని ఆచారాలు, సంప్రదాయాలపై ఆధారపడి ఉంటాయి.

3) పర్యాయపదాలు (Synonymous terms): రాజ్యం, సమాజం అనే పదాలను అనేక సందర్భాలలో పర్యాయపదాలుగా వినియోగించడమైంది. గ్రీకు రాజనీతి తత్త్వవేత్తలైన ప్లేటో, అరిస్టాటిల్లు, తరువాతి కాలంలో హెగెల్, బొసాంకేలు రాజ్యం, సమాజం రెండూ ఒకటే అని భావించారు. గ్రీకు రాజనీతి పండితులు నగర రాజ్యాలను, | సమాజాన్ని పర్యాయపదాలుగా ఉపయోగించడం జరిగింది.

AP Inter 1st Year Civics Study Material Chapter 2 రాజ్యం

4) పరస్పర సంబంధం (Inter-relation): రాజ్యం, సమాజం మధ్యగల సంబంధాన్ని ఎవ్వరూ విస్మరించలేరు. రాజ్యం తాను రూపొందించిన చట్టాల ద్వారా సమాజంలో వ్యక్తుల బాహ్య ప్రవర్తనను నియంత్రిస్తుంది. సామాజిక వ్యవస్థకు విస్తృత పునాదిని ఏర్పరుస్తుంది. అందుచేత రాజ్యం సమాజాలను రెండు విభిన్న వ్యవస్థలలో విడదీయలేం. సమాజ ఆర్థిక, సాంస్కృతిక, మత, మానవతాపరమైన కార్యకలాపాల ద్వారా రాజ్యాన్ని పరిపుష్టంగావిస్తుంది.

ప్రశ్న 5.
రాజ్యం, సమాజం మధ్యగల వ్యత్యాసాలను పేర్కొనండి.
జవాబు:
రాజ్యం, సమాజం మధ్య వ్యత్యాసాలు (Differences between State and Society): రాజ్యం, సమాజాల మధ్య సన్నిహిత సంబంధం ఉన్నప్పటికీ, ఈ రెండూ ఒకదానికొకటి వ్యత్యాసాలను కలిగి ఉన్నాయి. వాటిని కింది పట్టిక ద్వారా తెలపవచ్చు.

రాజ్యం (State)

  1. రాజ్యం అనేది రాజకీయ సంస్థ.
  2. రాజ్యం వ్యక్తుల బాహ్య ప్రవర్తనను మాత్రమే నియంత్రిస్తుంది. ఈ విషయంలో అది కొన్ని నిబంధనలను రూపొందిస్తుంది.
  3. రాజ్యానికి దండనాధికారం ఉంది. రాజ్యశాసనాన్ని అతిక్రమించినవారు శిక్షార్హులుగా పరిగణించ బడతారు.
  4. రాజ్యం చేసే చట్టాలు రాజ్యానికి బలం చేకూరుస్తాయి.
  5. రాజ్యం అనేది ప్రాదేశిక సంస్థ. దానికి స్వీయ నిర్దిష్ట భూభాగం ఉంటుంది. ప్రాదేశికత అనేది రాజ్యానికి చెందిన ప్రధాన లక్షణంగా పేర్కొనవచ్చు.
  6. రాజ్యం ఒక్కటే సార్వభౌమాధికారాన్ని కలిగి ఉంటుంది. తన సార్వభౌమాధికారాన్ని వినియోగించి ప్రజల సంబంధాలను నిర్దేశించే అనేక చట్టాలను రూపొందించి, అమలు పరుస్తుంది.
  7. రాజ్యం సహజంగా ఏర్పడిన సంస్థ కాదు. అది మానవనిర్మితమైంది. దానిలో సభ్యత్వం వ్యక్తులకు నిర్బంధమైంది.
  8. రాజ్యం సమాజంలోని అతి ముఖ్యభాగం. సమాజంలోని రాజకీయంగా వ్యవస్థీకృతమైన భాగాన్ని అది సూచిస్తుంది.
  9. సాంఘిక వ్యవస్థ అభివృద్ధి చెందిన రూపమే రాజ్యం. అది సమాజం నుంచి ఆవిర్భవించింది.
  10. రాజ్యం శాశ్వతమైంది కాకపోవచ్చు. అది అంతరించి పోయే అవకాశం ఉంది. వేరొక దానిని బలవంతంగా ఆక్రమించుకోవచ్చు.
  11. రాజ్య చట్టాలు, విధి, విధానాలు ఖచ్చితంగాను, స్పష్టంగాను ఉంటాయి.
  12. రాజ్యంలోని చట్టాలు ఒకే విధంగా ఉంటాయి. చట్టాన్ని అతిక్రమించిన వ్యక్తులందరూ తారతమ్యం లేకుండా శిక్షకు గురవుతారు.
  13. రాజ్యానికి ప్రభుత్వం అనే రాజకీయ వ్యవస్థ ఉంటుంది. అది రాజ్యం తరపున చట్టాలను రూపొం దించి, అమలుచేస్తుంది.

సమాజం (Society)

  1. సమాజం అనేది సాంఘిక వ్యవస్థ.
  2. సమాజం మానవుల బాహ్య, అంతర్గత ప్రవర్తనలు రెండింటిని నియంత్రిస్తుంది. వ్యక్తుల సామాజిక జీవనాన్ని ఇది క్రమబద్ధం చేస్తుంది.
  3. సమాజానికి దండనాధికారం లేదు. సాంఘిక ఆచారాలను అతిక్రమిస్తే వారిని సమాజం శిక్షించ లేదు.
  4. సమాజంలోని ఆచారాలు, సంప్రదాయాలు, కట్టుబాట్లు సమాజానికి బలం చేకూరుస్తాయి.
  5. సమాజానికి నిర్దిష్టమైన భౌగోళిక హద్దులు లేవు. అది రాజ్యం కంటే విశాలమైంది కావచ్చు లేదా చిన్నదైనా కావచ్చు. సమాజం విశ్వమంతా విస్తరించి ఉంటుంది.
  6. సమాజానికి నిర్బంధ అధికారాలు అంటూ ఏవీ లేవు. సమాజం మానవ సామాజిక ప్రవర్తనను క్రమబద్దం చేసే నియమాలను రూపొందించి నప్పటికీ వాటికి చట్టబద్ధత ఉండదు.
  7. సమాజం సహజంగా, స్వతఃసిద్ధంగా ఏర్పడిన సంస్థ. వ్యక్తులు తమ విచక్షణను అనుసరించి దీనిలో సభ్యులుగా కొనసాగుతారు.
  8. రాజ్యం కంటే సమాజం విస్తృతమైంది. అనేక సంఘాలు, సంస్థలు, వ్యవస్థల ద్వారా అది ఏర్పడి అభివృద్ధి చెందుతుంది.
  9. సమాజం పెద్దది. రాజ్యం దానిలో అంతర్భాగం మాత్రమే. సమాజం రాజ్యం కంటే ముందు అవతరించింది. మానవుడు స్వభావరీత్యా సంఘజీవి.
  10. సమాజం శాశ్వతమయంది. ఇది నిరంతరం కొనసాగుతుంది.
  11. సమాజ సూత్రాలు అస్పష్టమైనవి. అవి సాధారణంగా అనిర్దిష్టంగా ఉంటాయి. అవి సంప్రదాయాలు, కట్టుబాట్లపై ఆధారపడి ఉంటాయి.
  12. సమాజం నియమాలు ఒకే విధంగా ఉండవు. ఒకే ఒక వర్గ నియమాలకు, వేరొక వర్గ నియమాలకు మధ్య వ్యత్యాసం ఉంటుంది. వివిధ సామాజిక వర్గాలు ఒకే రకమైన నేరానికి పాల్పడితే విధించే శిక్షలు వేరువేరుగా ఉంటాయి
  13. సమాజ నియమాలను అమలు పరచడానికి ఒక ప్రత్యేకమైన యంత్రాంగమంటూ ఏదీ లేదు. ఆచారాలు, సంప్రదాయాలు, కట్టుబాట్ల ద్వారా అది మానవ ప్రవర్తనను నియంత్రిస్తుంది.

ప్రశ్న 6.
రాజ్యం, సంస్థల మధ్య సంబంధం ఏమిటో తెలపండి.
జవాబు:
రాజ్యం-సంఘాల మధ్య సంబంధం (Relationship between State and Association): రాజ్యం, సంఘం రెండూ కూడా వ్యక్తులతో కూడుకొన్న వ్వవస్థలే. రాజ్యం, సంఘంలో వ్యక్తులే సభ్యులు. ఈ రెండూ కూడా వ్యక్తుల అనేక అవసరాలను తీర్చేందుకు ఏర్పాటైనాయి. సమిష్టి ప్రయోజనాలను సాధించుకొనే లక్ష్యంతో రాజ్యం, సంఘాలు ఏర్పాటవుతాయి. రాజ్యం, సంఘంల మధ్యగల సంబంధాన్ని కింది విధంగా వివరించవచ్చు.

1) ఒకేరకమైన సభ్యత్వం (Same membership): రాజ్యం, సంఘాలు రెండూ కూడా మానవ సమూహాలే. వ్యక్తులందరూ ఆ రెండింటిలో సభ్యులుగా ఉంటారు.

2) ఉమ్మడి ప్రయోజనాలు (Common Interests): వ్యక్తులు తమ సమిష్టి ప్రయోజనాలను సాధించుకోవడానికి రాజ్యాన్ని, సంఘాలను ఏర్పాటు చేసుకున్నారు.

3) వ్యవస్థాపరమైనవి. (Organisation): రాజ్యం, సంఘాలు రెండూ కూడా తమ ప్రయోజనాలను సాధించుకోవడానికి వ్యక్తులు ఏర్పాటు చేసుకున్న వ్యవస్థలే.

AP Inter 1st Year Civics Study Material Chapter 2 రాజ్యం

4) ప్రవర్తనా నియమావళి (Code of conduct): రాజ్యం, సంఘాలు రెండూ తమ సభ్యులను నియంత్రించేందుకుగాను ప్రవర్తనా నియమావళిని కలిగి ఉన్నాయి. అటువంటి నియమావళి సభ్యులను ఒకతాటిపైన ఉంచుతాయి. అంతేకాకుండా అది వ్యవస్థకు స్థిరత్వాన్ని కలిగిస్తుంది.

5) కార్యనిర్వహణ శాఖ (Executive): ప్రతి రాజ్యానికి కార్యనిర్వాహకశాఖ ఉంటుంది. దీనినే ప్రభుత్వంగా పిలువబడుతుంది. ప్రతి సంఘానికి కూడా కార్యనిర్వాహక మండలి ఉండి, తమ విధివిధానాలను అమలు పరుస్తుంది.

ప్రశ్న 7.
రాజ్యం, సంస్థ మధ్యగల వ్యత్యాసాలను పేర్కొనండి.
జవాబు:
రాజ్యం, సంఘాల మధ్యగల వ్యత్యాసాలు (Differences between State and Association):
రాజ్యం (State)

  1. రాజ్యం సభ్యత్వం నిర్బంధమైంది.
  2. రాజ్యం శాశ్వతమైంది.
  3. రాజ్యం ప్రజలందరి శ్రేయస్సు, ప్రగతి కోసం కృషి చేస్తుంది.
  4. రాజ్యం అనేది భౌగోళిక సంస్థ. దానికి నిర్దిష్టమైన సరిహద్దులు ఉంటాయి.
  5. రాజ్యం సార్వభౌమాధికారం గల సంస్థ.
  6. ఒక పౌరుడికి ఒకే సమయంలో ఒక రాజ్యంలో మాత్రమే సభ్యత్వం ఉంటుంది. తనకు సభ్యత్వం ఉన్న రాజ్యం పట్ల మాత్రమే విధేయత కనబరుస్తారు.
  7. రాజ్య పరిధి విస్తృతమైనది.
  8. సంఘం కార్యకలాపాలలో రాజ్యం జోక్యం చేసు కోవచ్చు.
  9. రాజ్యం సంఘాల కంటే ఉన్నతమైంది.
  10. రాజ్యానికి పౌరులందరూ తప్పనిసరిగా విధేయులై ఉంటారు.
  11. ప్రపంచంలోని రాజ్యాలన్నింటికి ఒకే తరహా లక్షణాలు ఉంటాయి.
  12. రాజ్యం తనకున్న అధికారాన్ని చెలాయిస్తూ, రాజ్య చట్టాలను నిర్బంధంగా అమలుపరుస్తుంది.
  13. శాంతి భద్రతల నిర్వహణలో రాజ్యం బల ప్రయోగానికి పాల్పడవచ్చు.

సంఘాలు (Associations)

  1. సంఘంలో సభ్యత్వం ఐచ్ఛికమైంది.
  2. సంఘాలు శాశ్వతమైనవిగానూ, తాత్కాలికంగానూ ఉంటాయి.
  3. సంఘాలు తమ సభ్యుల ప్రయోజనాలను నెరవేర్చేందుకు ప్రయత్నిస్తాయి.
  4. సంఘాలకు ఖచ్చితమైన సరిహద్దులు ఉండవు.
  5. సంఘాలకు సార్వభౌమాధికారం ఉండదు.
  6. ఒక వ్యక్తికి ఒకేసారి అనేక సంఘాలలో సభ్యత్వం ఉండవచ్చు.
  7. సంఘాల పరిధి పరిమితమైంది.
  8. రాజ్య కార్యకలాపాలలో సంఘం జోక్యం చేసుకోరాదు.
  9. సంఘాలు రాజ కంటే ఉన్నతమైనవి కావు.
  10. సంఘాల నియమ నిబంధనలను సభ్యులు సమయం సందర్భాలను బట్టి ఆమోదించేందుకు లేదా అతిక్రమించేందుకు వీలుంటుంది.
  11. సంఘాలకు నిర్మాణం, స్వభావం, లక్ష్యాలు లేదా ఉద్దేశ్యాలలో వ్యత్యాసం ఉంటుంది.
  12. సంఘాలు తమ నియమ నిబంధనలను బలవంతంగా సభ్యులపైన రుద్దలేవు. సభ్యుల సహకారం పైన సంస్థల నియమావళి అమలు జరుపబడుతుంది.
  13. సభ్యుల అంగీకారంపై ఆధారపడి సంఘాలు తమ కార్యకలాపాలను నిర్వహిస్తాయి.

ప్రశ్న 8.
రాజ్యం, ప్రభుత్వం మధ్య ఏ విధమైన సంబంధం ఉందో తెలపండి.
జవాబు:
రాజ్యం, ప్రభుత్వం అనే పదాలను సామాన్య పరిభాషలో పర్యాయపదాలుగా ఉపయోగించడమైంది. సామాన్య ప్రజలు ఈ రెండింటిని ఒకేరకంగా పరిగణిస్తారు. అట్లాగే అనేకమంది పాలకులు రాజ్యానికి, ప్రభుత్వానికి మధ్య వ్యత్యాసాన్ని విస్మరించారు. ఉదాహరణకు ఫ్రాన్స్ చక్రవర్తి 14వ లూయీ ప్రకారం “నేనే రాజు, నేనే రాజ్యం” అని ప్రకటించాడు. రాజ్యాధికారాన్ని ప్రభుత్వం తరపున నిర్వహిస్తున్న అతడు ఈ విధంగా పరిగణించాడని చెప్పవచ్చు. రాజనీతి శాస్త్రజ్ఞులు రాజ్యం, ప్రభుత్వం మధ్య స్పష్టమైన వ్యత్యాసాన్ని చూపారు. తద్వారా అనేక క్లిష్టసమస్యలకు పరిష్కారం తెలిపారు.

రాజ్యం – ప్రభుత్వం మధ్య సంబంధం (Relationship between State and Government): రాజ్యం, ప్రభుత్వం మధ్య సంబంధాన్ని కింద చర్చించడమైంది.
1) వ్యక్తులచే ఏర్పాటు (Established by Individuals): రాజ్యం – ప్రభుత్వం రెండూ వ్యక్తులచే ఏర్పాటయినాయి. ఈ రెండు ప్రజలను రక్షించేందుకై, ప్రజల మధ్య సంబంధాలను క్రమబద్దం చేసేందుకై కృషి చేస్తాయి. వివిధ రంగాలలో ప్రజాప్రయోజనాలను పెంపొందించేందుకు అవి ఏర్పాటై, కొనసాగుతున్నాయి.

AP Inter 1st Year Civics Study Material Chapter 2 రాజ్యం

2) పరస్పర పోషకాలు (Complementary): రాజ్యాన్ని అన్ని రకాలుగా ఆచరణలో ప్రభుత్వంగా పరిగణించ డమైంది. ప్రభుత్వ కార్యకలాపాలు అన్నింటిని రాజ్యం పేరుతో నిర్వహిస్తారు. ఇంగ్లాండ్కు చెందిన స్టూవర్ట్ రాజులు, ఫ్రాన్స్కు చెందిన 14వ లూయీ చక్రవర్తి రాజ్యం, ప్రభుత్వాలను పరస్పర పోషకాలుగా భావించారు.

3) రాజ్య అభీష్టం ప్రభుత్వంచే వెల్లడవటం (Will of State expressed by the Government): ప్రభుత్వమనేది రాజ్యానికి సంబంధించిన అతి ముఖ్య లక్షణం. అది రాజ్య లక్ష్యాలు, ఆశయాలను వెల్లడించి అమలు చేస్తుంది. రాజ్య లక్షణాలను సాధించడంలో ప్రభుత్వం కీలకమైన పాత్రను నిర్వహిస్తుంది. అందువలన ‘ప్రభుత్వాన్ని రాజ్యానికి చెందిన మెదడు’ గా భావిస్తారు. రాజ్యం లక్ష్యాలను ప్రతిబింబించే చట్టాలను ప్రభుత్వం రూపొందించి, అమలుచేస్తుంది.

రాజ్యానికి చెందిన ప్రతిచర్య ప్రభుత్వచర్యగా భావించాల్సి ఉంటుందని లాస్కీ ప్రకటించాడు. రాజ్యాభిష్టం చట్టాల రూపంలో ఉంటుంది. అయితే అటువంటి చట్టాలకు జవసత్వాలు, ప్రయోజనాలను ప్రభుత్వం చేకూర్చుతుంది.

ప్రశ్న 9.
రాజ్యం, ప్రభుత్వం మధ్యగల వ్యత్యాసాలను గుర్తించండి. [Mar. ’18, ’17, ’16]
జవాబు:
రాజ్యం:

  1. రాజ్యం శాశ్వతమైన రాజకీయ సంస్థ. మానవ సమాజం ఉన్నంతకాలం అది ఉంటుంది.
  2. రాజ్యమునకు 5 లక్షణాలుంటాయి. ప్రజలు, ప్రదేశం, ప్రభుత్వం, సార్వభౌమాధికారం, అంతర్జాతీయ గుర్తింపు దాని లక్షణాలు.
  3. రాజ్యము యజమాని వంటిది.
  4. రాజ్యానికి సార్వభౌమాధికారం సహజంగానే ఉంటుంది. అది ఉన్నతాధికారాలు చెలాయిస్తుంది.
  5. ప్రపంచంలోని అన్ని రాజ్యాలకు ముఖ్య లక్షణాలు ఒక్కటే.
  6. పౌరులంతా రాజ్యంలో సభ్యులే. రాజ్యంలో ప్రజలకు సభ్యత్వం, తప్పనిసరిగా ఉంటుంది.
  7. రాజ్యానికి స్వతసిద్ధమైన రూపం లేదు. అది ప్రభుత్వ రూపంలోనే కనిపిస్తుంది.
  8. రాజ్యానికి ప్రదేశము ఒక ముఖ్య లక్షణము. ప్రదేశంలేని రాజ్యం ఉండదు.
  9. ప్రజలకు రాజ్యాన్ని వ్యతిరేకించే హక్కు లేదు.
  10. రాజ్యానికి మౌలికమైన అధికారాలున్నాయి.

ప్రభుత్వం:

  1. ప్రభుత్వం ఎన్నికల వలనగానీ, విప్లవాల వలనగానీ మారవచ్చు. అందువలన అది శాశ్వతమైనది కాదు.
  2. ప్రభుత్వం, రాజ్య లక్షణాలలో ఒకటి మాత్రమే. అది రాజ్య ప్రతినిధి, ఒక భాగము.
  3. ప్రభుత్వం రాజ్యానికి సేవకుని వంటిది. రాజ్యం పనులను ప్రభుత్వం చేస్తుంది.
  4. ప్రభుత్వం రాజ్యం తరపున సార్వభౌమాధికారాన్ని చెలాయిస్తుంది.
  5. ప్రపంచంలో ప్రభుత్వాలన్నీ ఒకే విధమైనవి కావు. ఉదా: పార్లమెంటరీ, అధ్యక్ష తరహా యూనిటరీ, సమాఖ్య మొదలగు ప్రభుత్వాలు.
  6. ప్రభుత్వంలో కొద్దిమంది మాత్రమే సభ్యులు. సభ్యత్వం తప్పనిసరి కాదు.
  7. ప్రభుత్వము ఒక స్పష్టమైన రూపంలో కనిపిస్తుంది.
  8. ప్రభుత్వం నిర్దిష్ట ప్రదేశం లేకుండా పనిచేస్తుంది. అది ఎక్కడినుండైనా పనిచేస్తుంది.
  9. ప్రజలు తమకు నచ్చని ప్రభుత్వాన్ని ప్రతిఘటించ గలరు. న్యాయస్థానాల ద్వారా కూడా వ్యతిరేకించగలరు.
  10. ప్రభుత్వానికి రాజ్యాంగము ఇచ్చే అధికారాలే ఉంటాయి.

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
రాజ్యానికి గల ఏవైనా రెండు నిర్వచనాలను ఉదహరించండి.
జవాబు:
‘రాజ్యం’ అనే పదాన్ని అనేకమంది రాజనీతిశాస్త్ర పండితులు అనేక రకాలుగా నిర్వచించారు. వారిలో కొందరు ఇచ్చిన నిర్వచనాలను కింది విధంగా పేర్కొనడమైంది.

  1. అరిస్టాటిల్: “మానవునికి సుఖప్రదమైన, గౌరవప్రదమైన జీవనాన్ని ప్రసాదించడమే లక్ష్యంగా కలిగిన కుటుంబాలు, గ్రామాల సముదాయమే రాజ్యం”.
  2. బ్లంటి: “ఒక నిర్ణీత ప్రదేశంలో నివసిస్తూ రాజకీయంగా వ్యవస్థీకృతమైన ప్రజల సముదాయమే రాజ్యం”.

AP Inter 1st Year Civics Study Material Chapter 2 రాజ్యం

ప్రశ్న 2.
రాజ్యానికి ఎన్ని మౌలిక లక్షణాలుంటాయి? అవి ఏవి?
జవాబు:
రాజ్యానికి నాలుగు మౌలిక లక్షణాలుంటాయి. అవి:

  1. ప్రజలు
  2. ప్రదేశం
  3. ప్రభుత్వం
  4. సార్వభౌమాధికారం.

ప్రశ్న 3.
ప్రభుత్వం అంటే ‘ఏమిటి ?
జవాబు:
రాజ్యం యొక్క ఆశయాలను, లక్ష్యాలను నెరవేర్చే సాధనమే ప్రభుత్వం. ప్రభుత్వం మూడు అంగాలను కలిగి ఉంటుంది. అవి: 1) శాసనశాఖ 2) కార్యనిర్వాహక శాఖ 3) న్యాయ శాఖ.

ప్రశ్న 4.
రాజ్యానికి గల ఇతర లక్షణాలు ఎన్ని? వాటిని తెలపండి.
జవాబు:
ప్రజలు, ప్రదేశం, ప్రభుత్వం, సార్వభౌమాధికారంతోపాటు రాజ్యానికి నాలుగు ఇతర లక్షణాలు కూడా ఉంటాయి. అవి:

  1. అంతర్జాతీయ గుర్తింపు,
  2. శాశ్వతత్వం,
  3. సాధారణ విధేయత,
  4. ప్రజాభీష్టం.

ప్రశ్న 5.
“సమాజం” అంటే ఏమిటి ?
జవాబు:
సమాజం ప్రాచీనమైనది. రాజ్యం కంటే ముందు ఏర్పడినది. మానవుడు సంఘజీవి. సమాజంలో మాత్రమే వ్యక్తి సంపూర్ణ వికాసాన్ని, సుఖవంతమైన జీవితాన్ని గడపగలడు. “సమిష్టి జీవనాన్ని గడుపుతున్న మానవ సముదాయమే” సమాజము. సమాజంలో సభ్యత్వం లేని మానవుడిని ఊహించలేము. వలలాగా అల్లబడిన వివిధ రకాల మానవ సంబంధాలను ‘సమాజం’ అని చెప్పవచ్చు. అయితే రాజ్యంలాగా సార్వభౌమాధికారము, దండనాధికారం ఉండదు. సాంఘిక ఆచార సంప్రదాయాల ఆధారముగా శిక్షలు ఉంటాయి.

ప్రశ్న 6.
“సంస్థ” అంటే ఏమిటి ? [Mar. 2017]
జవాబు:
“ఒక లక్ష్యసిద్ధికి గాని, కొన్ని ఆశయాల సాధనకు గాని నిర్ణీత పద్ధతిలో ఐక్యతతో కృషి చేయుటకు ఏర్పడిన వ్యక్తుల సముదాయమే సంస్థ. మానవుడు కొన్ని ప్రత్యేక ప్రయోజనాలు నెరవేర్చుకోవడానికి వివిధ రకాలైన సంస్థలను నిర్మించుకొన్నాడు. ఉదా: మత సంస్థలు, రాజకీయ సంస్థలు, ఆర్థిక సంస్థలు, సాంఘిక సంస్థలు, సాంస్కృతిక సంస్థలు మొ||నవి.

ప్రశ్న 7.
రాజ్యంలోని జనాభా గుణాత్మక ధృక్పధాన్ని వ్రాయండి.
జవాబు:
రాజ్యం జనాభా గుణాత్మకంగా ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకొంది. ఒక రాజ్యం ఎటువంటి స్వభావంగల ప్రజలను కలిగి ఉంటుంది ? అక్కడి ప్రజలు విద్యావంతులు, అక్షరాస్యులు సాంస్కృతికంగా పురోగతి సాధించినవారై ఉంటారా ? అనే అంశాలకు ప్రాముఖ్యత ఏర్పడింది. ఈ సందర్భంలో ఉత్తమ పౌరులు, ఉత్తమ రాజ్య రూపకల్పనకు దోహదకారిగా ఉంటారని అరిస్టాటిల్ చెప్పాడు. అందుచేత రాజ్యానికి సంబంధించిన ప్రజల స్వభావం, సంస్కృతి, అంకిత భావాలు ప్రాధాన్యతను సంతరించుకొన్నాయి. అట్లాగే ప్రజల క్రమశిక్షణ, కష్టించి పనిచేసే గుణం, నిజాయితీ, వివేకం వంటి గుణాలను కలిగి ఉన్నట్లయితే, ఆ రాజ్యం శీఘ్రగతిన ప్రగతిని సాధించగలుగుతుంది.

AP Inter 1st Year Civics Study Material Chapter 2 రాజ్యం

ప్రశ్న 8.
రాజ్యానికి అంతర్జాతీయ గుర్తింపు అవసరమా ?
జవాబు:
అంతర్జాతీయ గుర్తింపు (International Recognition): అంతర్జాతీయ గుర్తింపు అంటే ఒక రాజ్య ఉనికిని, ప్రభుత్వాన్ని ప్రపంచంలోని ఇతర రాజ్యాలు గుర్తించడం. ఆధునిక యుగంలో ప్రపంచ రాజ్యాల మధ్య సంబంధాలు పెరగడంతో అనేక అంతర్జాతీయ సంస్థలు ఏర్పడ్డాయి. కొంతమంది రాజనీతి పండితుల అభిప్రాయంలో అంతర్జాతీయ గుర్తింపు కూడా రాజ్య మౌలిక లక్షణంగా పరిగణించడమైంది.

ప్రపంచంలోని ప్రతి రాజ్యం ఇతర సార్వభౌమ రాజ్యాల చేత గుర్తింపు పొందాలి. ఐక్యరాజ్యసమితి వంటి కొన్ని అంతర్జాతీయ సంస్థలు ఆ రకమైన గుర్తింపును ఇస్తున్నాయి. ఐక్యరాజ్యసమితిలో సభ్యత్వమున్నదంటే ఆ రాజ్యానికి చెందిన సార్వభౌమాధికారం గుర్తించబడినట్లుగా భావించవచ్చు. ఒక కొత్త రాజ్యం ఆవిర్భవించినప్పుడు, అది మిగతా ప్రపంచ రాజ్యాలతో పాటు ఐక్యరాజ్యసమితి చేత గుర్తించబడటం అత్యంత ఆవశ్యకం.

అంతర్జాతీయ గుర్తింపు అనే లక్షణం రాజకీయ దృక్కోణంతో కూడుకొని ఉంది. 1945లో ఐక్యరాజ్యసమితి ఏర్పడకముందు నుంచే చైనా ఒక సమగ్రమైన రాజ్యం. 1949 నాటికి చైనా కమ్యూనిస్టుల వశమైంది. ప్రచ్ఛన్న యుద్ధ ప్రభావం వల్ల చైనా ఒక సార్వభౌమ రాజ్యంగా అమెరికా సంయుక్త రాష్ట్రాల చేత గుర్తించబడలేదు. చైనా-అమెరికాల మధ్య ప్రచ్ఛన్నయుద్ధ ఛాయలు తొలగిన తరువాత 1970వ దశకంలో ఐక్యరాజ్యసమితి చైనాను ఒక సార్వభౌమరాజ్యంగా గుర్తించింది.

ప్రశ్న 9.
రాజ్యానికి గల నాలుగు ఇతర లక్షణాల పేర్లను రాయండి.
జవాబు:

  1. ప్రజలు
  2. ప్రదేశ
  3. ప్రభుత్వం
  4. సార్వభౌమాధికారం.

ప్రశ్న 10.
రాజ్యం, సమాజం మధ్యగల ఏవైనా రెండు వ్యత్యాసాలను పేర్కొనండి. [Mar. ’16]
జవాబు:
రాజ్యం (State)

  1. రాజ్యం అనేది రాజకీయ సంస్థ.
  2. రాజ్యం వ్యక్తుల బాహ్య ప్రవర్తనను మాత్రమే నియంత్రిస్తుంది. ఈ విషయంలో అది కొన్ని నిబంధనలను రూపొందిస్తుంది.

సమాజం (Society)

  1. సమాజం అనేది సాంఘిక వ్యవస్థ.
  2. సమాజం మానవుల బాహ్య, అంతర్గత ప్రవర్తనలు రెండింటిని నియంత్రిస్తుంది. వ్యక్తుల సామాజిక జీవనాన్ని ఇది క్రమబద్ధం చేస్తుంది.

ప్రశ్న 11.
రాజ్యం, ప్రభుత్వం మధ్యగల ఏవైనా రెండు వ్యత్యాసాలను వ్రాయండి.
జవాబు:
రాజ్యం

  1. రాజ్యం శాశ్వతమైన రాజకీయ సంస్థ. మానవ సమాజం ఉన్నంతకాలం అది ఉంటుంది.
  2. రాజ్యమునకు 5 లక్షణాలుంటాయి. ప్రజలు, ప్రదేశం, ప్రభుత్వం, సార్వభౌమాధికారం, అంతర్జాతీయ గుర్తింపు దాని లక్షణాలు.

ప్రభుత్వం

  1. ప్రభుత్వం ఎన్నికల వలన గానీ, విప్లవాల వలన గానీ మారవచ్చు.’ అందువలన అది శాశ్వత మైనది కాదు.
  2. ప్రభుత్వం, రాజ్య లక్షణాలలో ఒకటి మాత్రమే. అది రాజ్య ప్రతినిధి, ఒక భాగము.

ప్రశ్న 12.
ప్రభుత్వ అంగాలు ఎన్ని ? వాటి విధులను క్లుప్తంగా వివరించండి.
జవాబు:
ప్రభుత్వంలో మూడు అంగాలుంటాయి. అవి:

  1. శాసనశాఖ: ఇది పరిపాలనకు కావలసిన శాసనాలను రూపొందిస్తుంది.
  2. కార్యనిర్వాహకశాఖ: ఇది శాసనాలను అమలుచేస్తుంది.
  3. న్యాయశాఖ: ఇది శాసనాలను వ్యాఖ్యానించి అవి న్యాయబద్ధంగా ఉన్నాయో లేదో చెబుతుంది. ప్రజలకు న్యాయం చేస్తుంది.

AP Inter 1st Year Civics Study Material Chapter 2 రాజ్యం

ప్రశ్న 13.
రాజ్యం, సంస్థల మధ్యగల ఏవైనా రెండు వ్యత్యాసాలను పేర్కొనండి. [Mar. ’18]
జవాబు:
రాజ్యం (State)

  1. రాజ్యం సభ్యత్వం నిర్బంధమైంది.
  2. రాజ్యం శాశ్వతమైంది.

సంఘాలు (Associations)

  1. సంఘంలో సభ్యత్వం ఐచ్ఛికమైంది.
  2. సంఘాలు శాశ్వతమైనవిగానూ, తాత్కాలికం గానూ ఉంటాయి.

AP Inter 1st Year Botany Study Material Chapter 12 పుష్పించే మొక్కల కణజాలశాస్త్రం, అంతర్నిర్మాణ శాస్త్రం

Andhra Pradesh BIEAP AP Inter 1st Year Botany Study Material 12th Lesson పుష్పించే మొక్కల కణజాలశాస్త్రం, అంతర్నిర్మాణ శాస్త్రం Textbook Questions and Answers.

AP Inter 1st Year Botany Study Material 12th Lesson పుష్పించే మొక్కల కణజాలశాస్త్రం, అంతర్నిర్మాణ శాస్త్రం

అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ఒక మొక్క మెటీరియల్ అడ్డుకోత ఈ క్రింది అంతర్నిర్మాణ ముఖ్యాంశాలను చూపిస్తుంది. (i),నాళికాపుంజాలు సంయుక్తంగా చెల్లాచెదురుగా ఉంటాయి. వీటిని ఆవరించి దృఢ కణజాలయుత పుంజపు ఒర ఉంటుంది. (ii) పోషకకణజాల మృదుకణజాలం లోపిస్తుంది. మీరు దీన్ని ఏవిధంగా గుర్తిస్తారు?
జవాబు:
ఏక దళ బీజ కాండము

ప్రశ్న 2.
దారువు, పోషకకణజాలాలను సంక్లిష్ట కణజాలాలు అని ఎందుకు అంటారు?
జవాబు:
ఒకటి కంటే ఎక్కువ రకాలైన కణాలతో ఏర్పడి, కలసి పనిచేస్తాయి. కావున దారువు, పోషణ కణజాలను సంక్లిష్ట కణజాలాలు అంటారు.

ప్రశ్న 3.
మొక్కల అంతర్నిర్మాణ అధ్యయనం మనకు ఏ విధంగా ఉపయోగకరంగా ఉంటుంది?
జవాబు:
అంతర్నిర్మాణ శాస్త్రం ద్వారా, మొక్క విధులు, సాధారణ ప్రక్రియలు అయిన భాష్పోత్సేకము, కిరణజన్య సంయోగక్రియ, పెరుగుదల ఎలా జరుపుకుంటుంది. అనే విషయాలు తెల్సుకోవచ్చు, తర్వాత వృక్షశాస్త్రవేత్తలకు, వ్యవసాయ శాస్త్రవేత్తలకు, మొక్కలకు సంబంధించిన వ్యాధులు, వాటి నివారణ గూర్చి తెలియచేస్తుంది.

ప్రశ్న 4.
ప్రథమ దారువు మొదటగా ఏర్పడ్డ దారువు. ప్రథమ దారువు, పోషక కణజాలం పక్కన వ్యాసార్ధంగా అమరి ఉంటే ఆ దారువు అమరికను మీరు ఏవిధంగా పిలుస్తారు? ఇది మీకు దేనిలో కనిపిస్తుంది?
జవాబు:
వ్యాసార్థపు నాళికా పుంజము ఇది వేళ్లలోకనిపిస్తుంది.

ప్రశ్న 5.
పోషకకణజాల మృదుకణజాలం విధి ఏమిటి?
జవాబు:
పోషణ కణజాల మృదు కణజాలం పొడవైన స్థూపాకార కణాలలో, ఎక్కువ కణ ద్రవ్యంను కేంద్రకంను కల్గి ఉంటుంది. ఇది ఆహార పదార్థాలతో పాటు రెసిన్స్, లేటెక్స్, జిగురు వంటి పదార్థాలను నిల్వచేస్తుంది.

ప్రశ్న 6.
ఎ) వేరులో లోపించి, పత్రాల ఉపరితలాన ఉండి నీటి నష్టాన్ని నిరోధించేది ఏమిటి?
బి)మొక్కలలో నీటి నష్టాన్ని నిరోధించే బాహ్యచర్మకణ రూపాంతరం ఏది?
జవాబు:
ఎ) అవభాసిని
బి) ట్రైకోమ్

AP Inter 1st Year Botany Study Material Chapter 12 పుష్పించే మొక్కల కణజాలశాస్త్రం, అంతర్నిర్మాణ శాస్త్రం

ప్రశ్న 7.
మొక్కలో ఏ భాగం ఈ కింది వాటిని చూపిస్తుంది?
ఎ) వ్యాసార్ధ నాళిక పుంజం
బి) బహుప్రథమ దారుకమైన దారువు
సి) బాగా అభివృద్ధి చెందిన దవ్వ
డి) బాహ్యప్రథమ దారుకమైన దారువు
జవాబు:
ఎ) వేరు, బి) ఏకదళ బీజ వేరు సి) ఏకదళ బీజ వేరు డి) వేరు

ప్రశ్న 8.
నీటి ప్రతిబలంసమయంలో మొక్కలలో పత్రాలు చుట్టుకొనేటట్లు చేసే కణాలు ఏవి?
జవాబు:
బుల్లి ఫార్మా కణాలు ఇవి ఏకదళబీజ పత్ర ఊర్ధ్వ బాహ్య చర్మంలో ఉంటాయి.

ప్రశ్న 9.
నాళికా విభాజ్య కణావళి వలయంలో ఉండేవి ఏమిటి?
జవాబు:
పుంజాంతస్థ విభాజ్య కణావళి, పుంజాంతర విభాజ్య కణావళి కలసి నాళిక విభాజ్య కణావళి వలయంను ఏర్పరుస్తాయి.

ప్రశ్న 10.
ఫెల్లోజన్, ఫెల్లోడర్మ్ మధ్యన ఉండే ఒక క్రియాత్మక మూల భేదాన్ని తెలపండి.
జవాబు:

ఫెల్లోజన్ఫెల్లోడర్మ్
1. దీనిని బెండు విభాజ్య కణజాలము అని అంటారు. ఇది ఫెల్లమ్, పెల్లోడర్ ను ఏర్పరుస్తుంది.1. బెండు విభాజ్య కణజాలము నుండి లోపలి వైపుకు ఏర్పడిన ద్వితీయ వల్కల కణాలు.
2. కణాలు పలుచని కవచాలతో దీర్ఘచతుర స్రాకారంలో ఉంటాయి.2. కణాలు మృదుకణాలు.

ప్రశ్న 11.
ఒక వృక్షం బెరడును ఎవరైనా తొలగిస్తే, మొక్కలో ఏ భాగాలు తొలగించబడతాయి?
జవాబు:
పరిచర్మం, ద్వితీయ పోషక కణజాలము

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
వివిధ రకాల విభాజ్య కణజాలాల స్థానాల్ని, విధుల్ని తెలపండి.
జవాబు:
AP Inter 1st Year Botany Study Material Chapter 12 పుష్పించే మొక్కల కణజాలశాస్త్రం, అంతర్నిర్మాణ శాస్త్రం 1
ఎ) అగ్ర విభాజ్య కణజాలం :
ఇవి వేరు, కాండం, శాఖల కొనభాగాల్లో కనిపిస్తాయి. మొక్క పొడవు పెరగడంలో ఇవి ప్రధానపాత్ర వహిస్తాయి.

బి) మధ్యస్థ విభాజ్య కణజాలం :
ఇవి మొక్క ముదిరిన భాగాల్లో, శాశ్వత కణజాలాల మధ్యన కనిపిస్తాయి. కణపు మాధ్యమాల పీఠభాగాల్లో, గడ్డి జాతులు పత్రపీఠాల్లో ఈ కణజాలాలుంటాయి. ఇవి కొద్దికాలమే క్రియాత్మకంగా ఉండి క్రమంగా శాశ్వత కణాలుగా మారతాయి. వీటివల్ల మొక్కల భాగాలు పొడవుగా పెరుగుతాయి.

సి) పార్శ్వ విభాజ్య కణజాలం :
ఇవి మొక్క దేహం యొక్క పార్శ్వఅంచుల వద్ద ఉంటాయి. ఈ కణాలు విభజన చెంది కాండం, వేరు వంటి అంగాలు చుట్టుకొలతలో పెరగడానికి తోడ్పడతాయి. నాళికాపుంజంలో ఉండే విభాజ్య కణావళి ఈ రకానికి చెందినదే. ఇది మొక్కల్లో ద్వితీయ దారువును, ద్వితీయ పోషక కణజాలాన్ని ఉత్పత్తి చేస్తుంది. వల్కల విభాజ్యకణావళి కూడా ఈ కోవకే చెందినది. దీనిచర్య వల్ల పరిచర్మము ఏర్పడుతుంది.

AP Inter 1st Year Botany Study Material Chapter 12 పుష్పించే మొక్కల కణజాలశాస్త్రం, అంతర్నిర్మాణ శాస్త్రం

ప్రశ్న 2.
మీతోట నుంచి తీసుకొన్న ఒక మొక్క లేత కాండం అడ్డుకోత తీసుకొని సూక్ష్మదర్శిని కింద పరిశీలించండి. దీన్ని ఏకదళబీజ కాండమా లేదా ద్విదళబీజ కాండమా అని ఏ విధంగా తెలసుకోగలుగుతారు? కారణాలు తెలపండి.
జవాబు:
ఒక మొక్కలేత కాండంను అడ్డుకోత తీసి సూక్ష్మదర్శినిలో పరిశీలించిన, కొన్ని లక్షణాలను బట్టి అది ద్విదళ బీజ కాండము, ఏకదళబీజ కాండమని చెప్పవచ్చు.

ద్విదళబీజ కాండముఏకదళబీజకాండము
1) బాహ్య చర్మంపై ట్రైకోమ్లు ఉంటాయి.1) ట్రైకోమ్లు ఉండవు.
2) అంతశ్చర్మం స్థూల కణజాల నిర్మితము.2) అధశ్చర్మం దృఢకణజాలం నిర్మితం.
3) సాధారణ వల్కలం అంతశ్చర్మము ఉంటాయి.3) సాధారణ వల్కలం అంతశ్చర్మం ఉండవు.
4) సంధాయక కణజాలం ఉండదు.4) సంధాయ కణజాలం ఉంటుంది.
5) నాళికా పుంజాలు ఉలి లేక బొంగరం ఆకారం.5) నాళికాపుంజాలు అండాకారము.
6) నాళికా పుంజాలు 15-20 వరకు, ఒక వలయంలా అమరి ఉంటాయి. (యూస్టీల్).6) నాళికాపుంజాలు ఎక్కువ సంఖ్యలో సంధాయక కణజాలంతో చెల్లాచెదురుగా ఉంటాయి. (అటాక్టోస్టీల్)
7) నాళికాపుంజాలు సాధారణము.7) నాళికాపుంజాలు తంతుయుతము.
8) నాళికాపుంజాలు సహపార్శ్వ, సంయుక్త వివృతాలు8) నాళికాపుంజాలు సహపార్శ్వ, సంయుక్త సంవృతము
9) ప్రథమదారు అవకాశిక ఉండదు.9) ప్రథమదారు అవకాశిక ఉంటుంది.
10) దారునాళాలు ఎక్కువ సంఖ్యలో వరుసగా ఉంటాయి.10) దారునాళాలు తక్కువ సంఖ్యలో ‘Y’ ఆకారంలో ఉంటాయి.
11) పోషక కణజాల మృదుకణజాలము ఉంటుంది.11) పోషక కణజాల మృదుకణజాలం ఉండదు.
12) దవ్వ, దవ్వ రేఖలు ఉంటాయి.12) దవ్వ, దవ్వ రేఖలు ఉండవు.

పైభేదాలను బట్టి ఇచ్చిన కాండమును సూక్ష్మ దర్శినిలో పరిశీలించి చెప్పవచ్చు.

ప్రశ్న 3.
పరిచర్మం అంటే ఏమిటి? ద్విదళబీజ కాండంలో పరిచర్మం ఏ విధంగా ఏర్పడుతుంది?
జవాబు:
ఫెల్లోజన్, ఫెల్లమ్, ఫెల్లోడర్ ను కలిపి పరిచర్మము అంటారు. విభాజ్యకణావళి వలయచర్య వలన కాండము వ్యాసంలో పెరుగుతుంది. ఫలితంగా వల్కల, బాహ్యచర్మ కణాలు చితికిపోయి, కొత్తరక్షణ పొరలను ఏర్పరుచుకుంటాయి. వల్కల ప్రాంతంలో విభాజ్య కణజాలం ఏర్పడుతుంది. దీనిని ఫెల్లోజన్ అంటారు. ఇది విభజన చెంది లోపలివైపుకు ఏర్పరిచిన కణాలు ద్వితీయ వల్కలము (ఫెల్లోడర్మ్) గాను, వెలుపలి వైపుకు ఏర్పరిచిన కణాలు బెండు (ఫెల్లమ్) గాను మార్పుచెందుతాయి. బెండు కణజాలము సూబరిన్ లో నిర్మితమై ఉండుట వల్ల నీటికి అపారగమ్యంగా ఉంటుంది. ద్వితీయ వల్కల కణాలు మృదుకణజాలయుతమై ఉంటాయి. ఈ విధంగా ఏర్పడిన ఫెల్లోజన్, ఫెల్లమ్, ఫెల్లోడర్మ్ ను కలిపి పరిచర్మం (పెరీడర్మ్) అంటారు.

ప్రశ్న 4.
వార్షిక వలయాలు అనే ఏక కేంద్రక వలయాలను ఒక వృక్షం మాను అడ్డుకోత చూపిస్తుంది. ఈ వలయాలు ఏ విధంగా ఏర్పడతాయి? ఈ వలయాల ప్రాముఖ్యం ఏమిటి? [‘Mar. ’14]
జవాబు:
వార్షిక వలయాలు :
సమశీతోష్ణ మండలాలు, శీతల మండలాల్లో పెరుగుతున్న వృక్షాల్లో విభాజ్య కణావళి క్రియాశీలత రుతువుల్లో కలిగే మార్పుల మీద ఆధారపడి ఉంటుంది. వసంత రుతువులో ఎక్కువ పత్రాలు, పుష్పాలు ఏర్పడడం వల్ల మొక్కకు ఎక్కువ నీరు, లవణాలు అవసరం ఉంటుంది. అందువల్ల ద్వితీయ దారువులో పెద్ద పెద్ద దారునాళాలు అధిక సంఖ్యలో ఏర్పడతాయి. దీనిని వసంతదారువు (తొలిదారువు) అంటారు. ఇది తేలిక వర్ణంలో కనిపిస్తుంది.

శరదృతువులో మొక్కలో క్రియాత్మకత తగ్గి నీరు, లవణాల అవసరం ఎక్కువగా ఉండదు. అందువల్ల ఈ ఋతువులో ఏర్పడే ద్వితీయ దారువులో సన్నని దారునాళాలు తక్కువ సంఖ్యలో ఏర్పడతాయి. దీనిని శరద్దారువు (మలిదారువు) అంటారు. ఇది గాఢ వర్ణంలో కనిపిస్తుంది. ఈ విధంగా ఒక సంవత్సరంలో రెండు రకాల దారువులు ఏర్పడతాయి. ఇవి ఏకాంతరంగా ఉన్న వలయాలుగా కనిపిస్తాయి. వీటిని వార్షిక వలయాలు (వృద్ధి వలయాలు) అంటారు. వార్షిక వలయాలను లెక్కించి ఒక వృక్షం వయస్సును సుమారుగా అంచనావేయవచ్చు. ఈ అధ్యయన్నాన్ని ‘డెండ్రోక్రోనాలజీ’ అంటారు.

మనదేశంలాంటి ఉష్ణమండలాల్లో వార్షిక వలయాలు స్పష్టంగా ఏర్పడవు. దీనికి కారణం రుతువుల్లో తీవ్రమైన మార్పులు లేకపోవడమే. ఈ ప్రాంతాలలోని వృక్షాల్లో కనిపించే వలయాలను “పెరుగుదల గుర్తులు” అంటారు.

ప్రశ్న 5.
వాయు రంధ్రాలు, పత్రరంధ్రాల మధ్య ఉండే భేదాలు ఏమిటి?
జవాబు:

వాయురధ్రాలుపత్రరంధ్రాలు
1. దారుయుత వృక్షాలు బెరడులో ఉండే కటకాకార రంధ్రాలను వాయురంధ్రాలు అంటారు.1. లేత కాండాలు, పత్రాల బాహ్య చర్మంలో ఉన్న చిన్న రంధ్రాలను పత్ర రంధ్రాలు అంటారు.
2. వీటితోపాటు సన్నిహితంగా మృదు కణజాలము ఉంటుంది. రక్షక కణాలు ఉండవు.2. వీటిని ఆవరించి చిక్కుడు గింజ/ ముద్దరాకారంలో ఉన్న రక్షక కణాలు ఉంటాయి.
3. ఇవి కిరణజన్య సంయోగ క్రియ జరపవు.3. రక్షక కణాలలో ఉన్న హరితరేణువులు కిరణజన్య సంయోగ క్రియను చూపుతాయి.
4. దగ్గరగా అమరి ఉన్న బెండు కణాల ద్వారా వాయువుల వినిమయం జరుపుకుంటాయి.4. ఇవి బాష్పోత్సేకమును నియంత్రిస్తూ, వాయువుల వినిమయానికి తోడ్పడతాయి.

ప్రశ్న 6.
వీటి సరియైన విధిని వ్రాయండి.
ఎ) చాలనీ నాళం బి) పుంజంతర విభాజ్య కణావళి సి) స్థూలకోణ కణజాలం డి) దృఢకణజాలం
జవాబు:
ఎ) చాలనీ నాళం :
ఇవి పొడవైనా గొట్టంలాగా సహ కణాలతో కలిసి ఉంటాయి. వీటి అంతిమ గోడలు జల్లెడలాగా రంధ్రయుతంగా ఉండి చాలనీ ఫలకాలను ఏర్పరుస్తాయి. పరికక్వచాలనీ నాళములో పరిధీయ కణద్రవ్యం, పెద్దరిక్తిక ఉంటాయి. ఇవి ఆహార పదార్థాల రవాణాలో తోడ్పడతాయి.

బి) పుంజాంతర విభాజ్య కణావళి :
పుంజాంతస్థ విభాజ్య కణావళి ప్రక్కన ఉన్న దవ్వరేఖలలోని కణాలు విభజన శక్తిని సంపాదించుకుని పుంజాంతర విభాజ్య కణావళిని ఏర్పరుస్తాయి.

సి) స్థూల కోణ కణజాలము :

  1. ఇది సజీవ యాంత్రిక కణజాలము.
  2. దీనిలోని కణాలు కవచాలు సెల్యులోస్, పెక్టిన్లతో నిర్మితమై ఉంటాయి.
  3. హరితరేణువులను కలిగి కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఆహార పదార్థాల్ని తయారుచేస్తాయి.
  4. లేత కాండం, పత్రవృంతంలాంటి పెరుగుదల చూపే భాగాలను యాంత్రిక శక్తినిస్తాయి.

డి) దృఢ కణజాలము :

  1. ఇది నిర్జీవ యాంత్రిక కణజాలము.
  2. వీటి కణకవచాలు లిగ్నిన్లో నిర్మితమై మందంగా ఉంటాయి.
  3. నారలు వస్త్ర, జోళి పరిశ్రమలలో ఉపయోగపడతాయి.
  4. దృఢ కణాలు మొక్కల భాగాలను యాంత్రిక శక్తినిస్తాయి.

AP Inter 1st Year Botany Study Material Chapter 12 పుష్పించే మొక్కల కణజాలశాస్త్రం, అంతర్నిర్మాణ శాస్త్రం

ప్రశ్న 7.
పత్రరంధ్రాన్ని రక్షిస్తూ మూత్రపిండాకార రక్షక కణాలు ఉంటాయి. రక్షక కణాలను ఆవరించి ఉండే బాహ్యచర్మ కణాల పేరు తెలపండి. రక్షక కణం ఏ విధంగా బాహ్యచర్మ కణంతో విభేదాన్ని చూపిస్తుంది? మీ జవాబును పటం సహాయంతో విశదీకరించండి.
జవాబు:
లేత కాండాలు, పత్రాలు బాహ్యచర్మంలో ఉన్న రంధ్రాలను పత్ర రంధ్రాలు అంటారు. వీటి చుట్టూ రెండు చిక్కుడు గింజ లేక మూత్రపిండాకారంలో ఉన్న రెండు రక్షక కణాలు ఉంటాయి. రక్షక కణాల చుట్టూ ఉన్న కొన్ని బాహ్యచర్మ కణాలు ఆకారంగా ప్రత్యేకంగా ఉంటాయి. వాటిని అనుబంధ కణాలు అంటారు.

రక్షక కణాలుఅనుబంధ కణాలు
1. చిక్కుడు గింజ/ మూత్రపిండాకారంలో ఉంటాయి.1. పీపాకారంలో ఉంటాయి.
2. హరితరేణువులు ఉంటాయి.2. హరితరేణువులు ఉండవు.

AP Inter 1st Year Botany Study Material Chapter 12 పుష్పించే మొక్కల కణజాలశాస్త్రం, అంతర్నిర్మాణ శాస్త్రం 2

ప్రశ్న 8.
రావి (ఫైకస్ రిలిజియోసా), మొక్కజొన్న (జియామేస్) పత్రాలు అంతర్నిర్మాణంలోని భేదాలను సూచించండి. పటాలు గీసి, భేదాలను గుర్తించండి.
జవాబు:

ద్విదళ బీజపత్రంఏకదళ బీజపత్రం
1. ఉర్ధ్వబాహ్య చర్మం కంటే అధోబాహ్యచర్మంలో పత్రరంధ్రాల సంఖ్య ఎక్కువగా ఉంటుంది.1. పత్ర రంధ్రాల సంఖ్య రెండు బాహ్య చర్మాలలో దాదాపు సమానంగా ఉంటుంది.
2. బుల్లిఫారమ్ కణాలుండవు.2. ఊర్ధ్వ బాహ్యచర్మంలో బుల్లిఫారమ్ కణాలుంటాయి.
3. పత్రాంతరంలో స్తంభకణజాలం, స్పంజి వంటి కణజాలం ఉంటాయి.3. పత్రాంతరంలో ఒకే రకమైన కణజాలం ఉంటుంది.
4. పుంజపు తొడుగు వ్యాపనాలు సాధారణంగా మృదు కణజాలయుతం.4. పుంజపు తొడుగు వ్యాపనాలు సాధారణంగా దృఢ కణజాలయుతం.

AP Inter 1st Year Botany Study Material Chapter 12 పుష్పించే మొక్కల కణజాలశాస్త్రం, అంతర్నిర్మాణ శాస్త్రం 3
AP Inter 1st Year Botany Study Material Chapter 12 పుష్పించే మొక్కల కణజాలశాస్త్రం, అంతర్నిర్మాణ శాస్త్రం 4

ప్రశ్న 9.
బెండు విభాజ్య కణావళి బెండును ఏర్పరచే కణజాలాలను ఏర్పరుస్తుంది. ఈ వ్యాఖ్యను మీరు అంగీకరిస్తారా? వివరించండి.
జవాబు:
అవును. బెండు విభాజ్య కణజాలము/ ఫెల్లోజన్ ద్విదళ బీజ కాండం ద్వితీయ వృద్ధిలో ఏర్పడి, విభజన చెంది లోపలి వైపుకు ద్వితియ వల్కలము/ ఫెల్లోడెర్ను వెలుపలి వైపుకు బెండు / ఫెల్లోయ్ను ఏర్పరుస్తుంది. బెండు కణజాలంలోని కణాల కవచంలో సూబరిన్ చేరి ఉండటం వల్ల ఈ కణజాలం నీటికి అపారగమ్యంగా ఉంటుంది. నాళికావిభాజ్య కణావళికి వెలుపల ఉన్న కణజాలన్నింటిని కలిపి బెరడు అంటారు. దీనిలో పరిచర్మం, ద్వితీయ పోషక కణజాలము ఉంటాయి.

AP Inter 1st Year Botany Study Material Chapter 12 పుష్పించే మొక్కల కణజాలశాస్త్రం, అంతర్నిర్మాణ శాస్త్రం

ప్రశ్న 10.
పుష్పించే మొక్కలలోని మూడు మూల కణజాల వ్యవస్థల పేర్లను తెలపండి. ప్రతి కణజాల వ్యవస్థకు చెందిన కణజాలాల పేర్లను తెలపండి.
జవాబు:
పుషించు మొక్కలలో మూడు మూలకణజాల వ్యవస్థలు ఉంటాయి. అవి.

  1. బాహ్య చర్మ కణజాల వ్యవస్థ
  2. సంధాయక కణజాల వ్యవస్థ
  3. నాళిక కణజాల వ్యవస్థ

1. బాహ్య చర్మ కణజాల వ్యవస్థ :
దీనిలో బాహ్య చర్మము అవభాసిని, పత్రరంధ్రాలు, కేశాలు (వేర్లు), ట్రైకోమ్లు (కాండము) ఉంటాయి.

2. సంధాయక కణజాల వ్యవస్థ :
దీనిలో సరళకణజాలాలు అయిన మృదుకణజాలము, స్థూలకోణ కణజాలము, దృఢ కణజాలము ఉంటాయి. ఇవి వేర్లు, కాండాల వల్కలం పరిచక్రం, దవ్వ, దవ్వ రేఖలలో ఉంటాయి. పత్రాలలో సంధాయక కణాల హరిత రేణువులను కలిగి పలుచని కవచాలతో ఉంటాయి.

3. నాళికా కణ జాల వ్యవస్థ :
దీనిలో ప్రసరణ కణజాలాలు అయిన, దారువు, పోషక కణజాలము ఉంటాయి.

దీర్ఘ సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
పటాల సహాయంతో దారుయుత ఆవృతబీజాల కాండాలలో జరిగే ద్వితీయ వృద్ధి పద్ధతిని వివరించండి. దీని ప్రాముఖ్యం ఏమిటి?
జవాబు:
I. ప్రసరణ స్తంభం లోపల జరిగే ద్వితీయవృద్ధి :
1. నాళికా విభాజ్య కణావళి వలయం ఏర్పడటం :
ద్విదళ బీజకాండం ప్రాథమిక నిర్మాణంలో నాళికాపుంజాలు వలయంలాగా అమరి ఉంటాయి. ప్రతి నాళికాపుంజంలో దారువు, పోషక కణజాలాల మధ్య విభాజ్యకళావళి ఉంటుంది. దీనిని ‘పుంజాంతర విభాజ్యకణావళి’ అంటారు. నాళికాపుంజాల మధ్య దవ్వరేఖలుంటాయి. ద్వితీయవృద్ధి మొదలైనపుడు దవ్వరేఖల నుంచి విభాజ్యకణావళి ఏర్పడుతుంది. దీనిని పుంజాల మధ్య విభాజ్య కణావళి అంటారు. ఈ రెండు కణాల విభాజ్యకణావళులు ఒకదానితో మరొకటి కలిసిపోయి ఒక సంపూర్ణ విభాజ్యకణావళి వలయం రూపొందుతుంది. దీనినే నాళికా విభాజ్యకణావళి ఉంది అంటారు.

2. విభాజ్యకణావళి వలయం క్రియాశీలత :
విభాజ్యకణావళి వలయంలోని కణాలు పరివేష్టిత విభజనలు జరిపి రెండువైపులా కొత్తకణాలను ఉత్పత్తి చేస్తాయి. ఈ కణాలు ద్వితీయ ప్రసరణ కణజాలాలుగా విభేదనం చెందుతాయి. వెలుపలివైపుకు ఏర్పడ్డ కణజాలం ద్వితీయ పోషకకణజాలంగా మారుతుంది. లోపలివైపుకు ఏర్పడిన కణజాలము ద్వితీయ దారువుగా రూపొందుతుంది. ద్వితీయ దారువులో దారునాళాలు, దారుకణాలు, దారు నారలు, దారు మృదుకణజాలం ఉంటాయి. ద్వితీయ పోషక కణజాలంలో చాలనే నాళాలు, సహయక కణాలు, పోషక కణజాల నారలు, పోషక మృదు కణజాలము ఉంటాయి. ద్వితీయ దారువు నిరంతరంగా తయారయ్యి సంచయనం చెందుట వల్ల ప్రాథమిక, ద్వితీయ పోషక కణజాలాలు క్రమేపి చేతికి పోతాయి. కొన్ని ప్రదేశాలలో విభాజ్యకణావళి మృదుకణాలను సన్నసి వరసల రూపంలో ఉత్పత్తి చేస్తుంది. ద్వితీయ దారువు, ద్వితీయ పోషక కణజాలం గుండా వ్యాపించి ఉంటాయి. వీటిని ద్వితీయ దవ్వరేఖలు అంటారు.

వార్షిక వలయాలు :
సమశీతోష్ణ మండలాలు, శీతల మండలాల్లో పెరుగుతున్న వృక్షాల్లో విభాజ్య కణావళి క్రియాశీలత రుతువుల్లో కలిగే మార్పుల మీద ఆధారపడి ఉంటుంది. వసంత రుతువులో ఎక్కువ పత్రాలు, పుష్పాలు ఏర్పడడం వల్ల మొక్కకు ఎక్కువ నీరు, లవణాలు అవసరం ఉంటుంది. అందువల్ల ద్వితీయ దారువులో పెద్ద పెద్ద దారునాళాలు అధిక సంఖ్యలో ఏర్పడతాయి. దీనిని వసంతదారువు (తొలిదారువు) అంటారు. ఇది తేలిక వర్ణంలో కనిపిస్తుంది.

శరదృతువులో మొక్కలో క్రియాత్మకత తగ్గి నీరు, లవణాల అవసరం ఎక్కువగా ఉండదు. అందువల్ల ఈ ఋతువులో ఏర్పడే ద్వితీయ దారువులో సన్నని దారునాళాలు తక్కువ సంఖ్యలో ఏర్పడతాయి. దీనిని శరద్దారువు (మతిదారువు) అంటారు. ఇది గాఢ వర్ణంలో కనిపిస్తుంది. ఈ విధంగా ఒక సంవత్సరంలో రెండు రకాల దారువులు ఏర్పడతాయి. ఇవి ఏకాంతరంగా ఉన్న వలయాలుగా కనిపిస్తాయి. వీటిని వార్షిక వలయాలు (వృద్ధి వలయాలు) అంటారు. వార్షిక వలయాలను లెక్కించి ఒక వృక్షం వయస్సును సుమారుగా అంచనావేయవచ్చు. ఈ అధ్యయనాన్ని ‘డెండ్రోక్రోనాలజి’ అంటారు. మనదేశంలాంటి ఉష్ణమండలాల్లో వార్షిక వలయాలు స్పష్టంగా ఏర్పడవు. దీనికి కారణం రుతువుల్లో తీవ్రమైన మార్పులు లేకపోవడమే. ఈ ప్రాంతాలలోని వృక్షాల్లో కనిపించే వలయాలను “పెరుగుదల గుర్తులు” అంటారు.

అంతర్దారువు, రసదారువు :
చేవదేరిన కాండంలోని ద్వితీయదారువు రెండు రకాలుగా ఉంటుంది. మధ్యభాగం ముదురువర్ణంలో కనిపిస్తుంది. దీనిని అంతర్దారువు (డ్యూరమెన్) అంటారు. టానిన్లు, రెసిన్లు, నూనెలు, జిగుర్లు, రంగుపదార్థాలు, సువాసన పదార్థాలు మొదలైన వాటితో అంతర్దారువు పూర్తిగా నిండి ఉంటుంది. దారునాళాల్లోకి అనేక ‘టైలోసిస్లు’ కూడా పెరిగి ఉంటాయి. దారువులోని మృదుకణాల కవచాలు లిగ్నిన్ పూరితమై ఉంటాయి. అంతర్దారువుకి ఎక్కువ మన్నిక ఉంటుంది. ఇది నీటి ప్రసరణలో ఉపయోగపడదు. కేవలం మొక్కలకు యాంత్రిక ఆధారాన్నిస్తుంది. అంతర్దారువు గట్టిగాను, శ్రేష్ఠంగాను ఉంటుంది. వాణిజ్యపరంగా దీనికి ఎక్కువ విలువ ఉంటుంది.. దీనిని గృహోపకరణాల తయారీకి వాడతారు.

కాండంలో అంతర్దారువు చుట్టూ కనిపించే తేలిక వర్ణంగల దారువును రసదారువు (ఆల్బర్నమ్) అంటారు. ఇది కొత్తగా ఏర్పడ్డ దారువు. ఇది మాత్రమే నీరు, లవణాల ప్రసరణలో పాల్గొంటుంది. రసదారువులోని గట్టిదనం అంతగా ఉండకపోవడం వల్ల వాణిజ్యపరంగా అంతర్దారువంత విలువైంది కాదు. వృక్షం వయస్సు పెరుగుతున్న కొద్దీ రసదారువు క్రమంగా అంతర్దారువుగా మారుతుంది. అందువల్ల రసదారువు మందం ఎప్పుడూ ఒకే విధంగా ఉంటుంది.

ప్రసరణ స్తంభం వెలుపల ద్వితీయవృద్ధి వల్కలంలో జరుగుతుంది. ప్రసరణ స్తంభంలో విభాజ్యకణావళి క్రియాశీలత వల్ల ద్వితీయదారువు, ద్వితీయపోషకకణజాలం ఏర్పడి ప్రసరణ స్తంభం పరిమాణం పెరుగుతుంది. ఫలితంగా బాహ్యచర్మంపై ఒత్తిడి అధికం కావడం వల్ల అది పగిలిపోయి లోపలి సున్నితమైన వల్కల కణాలు బహిర్గతమవుతాయి. వాటి రక్షణకోసం వల్కలంలో ద్వితీయ రక్షణకవచం నిర్మితమవుతుంది. దీనిని ‘పరిచర్మం’ అంటారు. వల్కలం మధ్య వరుసల నుంచి గాని, లోపలి వరుసల నుంచి గాని ఏర్పడే విభాజ్య కణావళిలో వల్కలంలో జరిగే ద్వితీయవృద్ధి ప్రారంభం అవుతుంది. ఈ విభాజ్యకళావళిని ‘బెండు విభాజ్యకణావళి’ (ఫెల్లోజన్) అంటారు.

దీనిలోని కణాలు పరివేష్టిత విభజనలు జరిపి రెండు వైపులా క్రొత్త కణాలను ఏర్పరుస్తాయి. వెలుపలి వైపు ఏర్పడ్డ కణాలు ‘బెండు కణజాలం’ (ఫెల్లమ్)గా రూపొందుతాయి. లోపలివైపు ఏర్పడ్డ మృదుకణాలు ద్వితీయవల్కలంగా (ఫెల్లోడెర్మ్) రూపొందుతాయి. లోపలివైపుకంటే వెలుపలివైపు ఎక్కువ కణాలు ఏర్పడతాయి. బెండు, బెండు విభాజ్యకణావళి, ద్వితీయవల్కలాలను కలిపి పరిచర్మం అంటారు. బెండుకణాలు ఘనచతురస్రాకారంగా, అడ్డు వరుసల్లో ఉంటాయి. ఇవి నిర్జీవకణాలు. ద్వితీయ వల్కలంలో సజీవకణాలుంటాయి. వీటి మధ్య కణాంతరావకాశాలు కనిపిస్తాయి. ఈ కణాల్లో హరితరేణువులుంటాయి. దీనిలో పిండి పదార్థాల సంశ్లేషణ జరుగుతుంది.

నాళికా విభాజ్య కణావళి వెలుపలి కణజాలాలన్నింటిని కలిపి బెరడు అంటారు. దీనిలో పరిచర్మము, ద్వితీయ పోషక కణజాలము ఉంటాయి. ఒక ఋతువులో మొదట ఏర్పడే బెరడును మృదు బెరడు అని, ఋతువు చివర్లో ఏర్పడే వానిని దృఢ బెరడు అని అంటారు.
AP Inter 1st Year Botany Study Material Chapter 12 పుష్పించే మొక్కల కణజాలశాస్త్రం, అంతర్నిర్మాణ శాస్త్రం 5

కొన్ని ప్రదేశాలలో ఫెల్లోజన్ వెలుపలి వైపు బెండు కణాల బదులు దగ్గరగా అమరి ఉన్న మృదు కణాలను (సంపూరక కణాలు) ఏర్పరుస్తుంది. ఇవి క్రమేపి బాహ్యచర్మాన్ని పగలగొట్టి కలుకార రంధ్రాలను ఏర్పరుస్తాయి. వీటిని వాయురంధ్రాలు అంటారు. వీటి ద్వారా కాండంలోపలి కణజాలం వెలుపలి వాతావరణం మధ్య వాయువుల వినిమయం జరుగుతుంది.

ప్రశ్న 2.
వీటి మధ్యన ఉండే అంతర్నిర్మాణ భేదాలను తెలిపే పటాలను చిత్రీకరించండి.
జవాబు:

ఏకదళ బీజవేరుద్విదళ బీజవేరు
1) వల్కలము పెద్దదిగా ఉంటుంది.1) వల్కలము చిన్నదిగా ఉంటుంది.
2) పరిచక్రం నుంచి పార్శ్వవేర్లు మాత్రమే ఏర్పడతాయి.2) పరిచక్రం నుంచి పార్శ్వ వేర్లు, ద్వితీయ వృద్ధి సమయంలో విభాజ్య కణావళి ఏర్పడతాయి.
3) దారువు బహు ప్రథమదారుకము.3) దారువు చతుః ప్రథమదారుకము.
4) దవ్వ ఎక్కువగా ఉంటుంది.4) దవ్వ తక్కువగా ఉంటుంది.
5) ద్వితీయ వృద్ధి జరుగదు.5) ద్వితీయ వృద్ధి జరుగుతుంది.
ఏకదళ బీజకాండముద్విదళ బీజకాండము
1) బాహ్య చర్మంపై ట్రైకోమ్లు ఉంటాయి.1) ట్రైకోమ్లు ఉండవు.
2) అదృశ్చర్మం స్థూల కణజాల నిర్మితము2) అదఃశ్చర్యం దృఢకణజాలం నిర్మితం.
3) సాధారణ వల్కలం అంతఃశ్చర్మము ఉంటాయి.3) సాధారణ వల్కలం అంతశ్చర్మం ఉండవు.
4) సంధాయక కణజాలం ఉండదు.4) సంధీయకణజాలం ఉంటుంది.
5) నాళికా పుంజాలు ఉలి లేక బొంగరం ఆకారం.5) నాళికాపుంజాలు అండాకారము.
6) నాళికా పుంజాలు 15-20 వరకు, ఒక వలయంలా -అమరి ఉంటాయి. (యూస్టీల్).6) నాళికాపుంజాలు ఎక్కువ సంఖ్యలో సంధాయక కణజాలంతో చెల్లాచెదురుగా ఉంటాయి. (అటాక్టోస్టీల్)
7) నాళికాపుంజాలు సాధారణము.7) నాళికాపుంజాలు తంతుయుతము.
8) నాళికాపుంజాలు సహపార్శ్వ, సంయుక్త వివృతాలు8) నాళికాపుంజాలు సహపార్శ్వ, సంయుక్త సంవృతము
9) ప్రథమదారు అవకాశిక ఉండదు.9) ప్రథమదారు అవకాశిక ఉంటుంది.
10) దారునాళాలు ఎక్కువ సంఖ్యలో వరుసగా ఉంటాయి.10) దారునాళాలు తక్కువ సంఖ్యలో ‘Y’ ఆకారంలో ఉంటాయి.
11) పోషక కణజాల మృదుకణజాలము ఉంటుంది.11) పోషక కణజాల మృదుకణజాలం ఉండదు.
12) దవ్వ, దవ్వ రేఖలు ఉంటాయి. ఉంటాయి.12) దవ్వ, దవ్వ రేఖలు ఉండవు.

AP Inter 1st Year Botany Study Material Chapter 12 పుష్పించే మొక్కల కణజాలశాస్త్రం, అంతర్నిర్మాణ శాస్త్రం

ప్రశ్న 3.
సరళ కణజాలాలు అంటే ఏమిటి ? వివిధ రకాల సరళ కణజాలాలను వర్ణించండి.
జవాబు:
నిర్మాణంలోను, విదిలోను ఒకే రకంగా ఉండే కణాలను కలిగిన శాశ్వత కణజాలను సరళ కణజాలాలు అంటారు. ఇవి మూడు రకాలు : అవి

  1. మృదు కణజాలము
  2. స్థూలకోణ కణజాలము,
  3. దృఢ కణజాలము.

1) మృదు కణజాలము :
మొక్కలలో అధిక భాగము దీనితో తయారయి ఉంటుంది. కణాలు సమవ్యాసంలో, గోళాకారంగా అండాకారంగా, బహుభుజితాకారంగా లేదా పొడవుగా ఉంటాయి. వీటి కణ కవచాలు పలుచగా, సెల్యులోస్తో నిర్మితమై ఉంటాయి. ఇట్టి కిరణజన్య సంయోగక్రియకు ఆహారపదార్థాల నిల్వకు, స్రావాలను స్రవించడంలోను పాల్గొంటాయి.

2) స్థూలకోణ కణజాలము :
ఇది సజీవ యాంత్రిక కణజాలము. ఇది బాహ్య చర్మం దిగువన ఒకే రకమైన పొరగా లేక మాసికలుగా ఉంటుంది. ఈ కణాల మూలాల వద్ద సెల్యూలోస్ హెమీ సెల్యూలోస్, పెక్టిన్లు ఉంటాయి. కణాలు అండాకారం, గోళాకారం లేదా బహుభుజి ఆకారంలో ఉండి తరచుగా హరిత రేణువులను కల్గి ఉంటాయి. ఇవి ఆహార పదార్థాల తయారీలోను, లేత కాండం, పత్రవృంతంలాంటి పెరుగుదల చూపే భాగాలకు యాంత్రిక శక్తినివ్వడంలో తోడ్పడతాయి.

3) దృఢకణజాలము :
ఇవి నిర్జీవ యాంత్రిక కణజాలము వీటి కణ కవచాలు లిగ్నిన్తో నిర్మితమై, మందంగా ఉంటాయి. కణాలలో జీవ పదార్థం ఉండదు. రూపం, నిర్మాణం ఆధారంగా ఇది రెండు రకాలుగా ఉంటుంది.

a) నారలు :
సన్నగా, పొడవుగా మొనదేలిన కొనలతో మందమైన కవచాలతో ఉంటాయి. ఇవి యాంత్రిక శక్తినిస్తాయి. వస్త్ర పరిశ్రమలలో ఉపయోగపడతాయి.
AP Inter 1st Year Botany Study Material Chapter 12 పుష్పించే మొక్కల కణజాలశాస్త్రం, అంతర్నిర్మాణ శాస్త్రం 6

b) దృఢ కణాలు గోళాకారం, అండాకారం లేదా స్థూపాకారంగా ఉంటాయి. వీటి కవచాలు మందంగా ఉండి, సన్నని అవకాశిక కల్గి ఉంటాయి. ఇవి నట్స్ ఫలకవచాలలో, జామ, సపోటా వంటి ఫలాల గుజ్జులలో, లెగ్యూమ్ల బీజకవచాలలో ఉంటాయి.

ప్రశ్న 4.
సంక్లిష్ట కణజాలాలు అంటే ఏమిటి? వివిధ రకాల సంక్లిష్ట కణజాలాలను వర్ణించండి.
జవాబు:
ఒకటి కంటే ఎక్కువ రకాలైన కణాలతో తయారయిన కణజాలంను సంక్లిష్ట కణజాలాలు అంటారు. ఇవి అన్ని కలసి ఒకే ప్రమాణంగా పనిచేస్తాయి. ఇవి 2 రకములు అవి దారువు, పోషక కణజాలము.
AP Inter 1st Year Botany Study Material Chapter 12 పుష్పించే మొక్కల కణజాలశాస్త్రం, అంతర్నిర్మాణ శాస్త్రం 7

1. దారువు :
వేరు నుంచి కాండానికి, పత్రానికి నీరు, ఖనిజాలను సరఫరా చేస్తూ, మొక్క భాగాలకు యాంత్రిక బలాన్ని సమకూరుస్తుంది. ఇది నాలుగు రకాల మూలకాల్ని కలిగి ఉంటుంది. అవి దారుకణాలు, దారునాళాలు, దారు నారలు, దారు మృదుకణజాలము. దారుకణాలు. పొడవుగా, గొట్టంలాగా, కొనలు సన్నగా, వాడిగా ఉంటాయి. కవచాలు లిగ్నిన్ పూరితమై మందంగా ఉంటాయి.

ఇవి నిర్జీవ కణాలు. దారుకణాలు పొడవుగా, స్థూపాకార గొట్టంలాంటి నిర్మాణాలు వాటి కవచం లిగ్నిన్ పూరితమై, లోపల పెద్ద అవకాశిక కల్గి ఉంటుంది. ఇవి వాటి ఉమ్మడి కవచాలలో ఉన్న రంధ్రాల ద్వారా ఒక దానితో ఒకటి సంబంధం కలిగి ఉంటాయి. దారు నారలు సన్నగా, పొడవుగా, మందమైన కవచంతో ఉంటాయి. అవకాశికలు సన్నగా, ఇరుకుగా ఉంటాయి. దారువులోని సజీవ కణాలు దారు మృదుకణజాలము వీటి కణకవచాలు సెల్యులోస్తో తయారై పలుచగా ఉంటాయి. ఇవి పిండిపదార్థము, కొవ్వులాంటి ఆహార పదార్థాలను టానిన్స్న నిల్వ చేస్తాయి.

AP Inter 1st Year Botany Study Material Chapter 12 పుష్పించే మొక్కల కణజాలశాస్త్రం, అంతర్నిర్మాణ శాస్త్రం 8
పోషక కణజాలము :
పత్రాల నుంచి మొక్క ఇతర భాగాలకు ఆహారపదార్థాలను రవాణా చేస్తుంది. దీనిలో చాలనీనాళ మూలకాలు, సహ కణాలు, పోషక మృదుకణజాలము, పోషక కణజాల నారలను కలిగి ఉంటుంది. చాలనీ నాళ మూలకాలు పొడవుగా గొట్టంలాగా ఉండే నిర్మాణాలు. ఇవి నిలువు వరసలలో అమరి, సహకణాలతో కలిసి ఉంటాయి. వీటి అంతిమ కుడ్యాలు జల్లెడలాగా రంధ్రయుతంగా ఉండే చాలనీ మూలకంలో పరిధీయ కణద్రవ్యం, పెద్దరికిక ఉంటాయి. కాని కేంద్రకం ఉండదు. సహకణాలు, చాలనీ నాళమూలకాలలో అతి దగ్గరగా కలిసి, ఉమ్మడి అనుదీర్ఘాక్ష కవచాలలోని గర్త క్షేత్రాల ద్వారా సంబంధాన్ని కలిగి ఉంటాయి.

పోషక మృదుకణజాలము పొడవైన స్థూపాకార కణాలతో తయారు చేయబడి ఉంటుంది. వీటి కవచాలు పలుచగా సెల్యులోస్తో నిర్మితమై ఉంటాయి. కణాలు ఆహార పదార్థాల నిల్వకు, రెసిన్లు, లేటెక్స్, జిగురు లాంటి పదార్థాలను నిల్వచేయుటకు తోడ్పడతాయి. పోషక కణజాల నారలు, దృఢకణజాల కణాలతో తయారవుతాయి. ఇవి పొడవుగా, శాఖారహితంగా ఉండే కణాలు. వీటి కొనలు సన్నగా మొనదేలి ఉంటాయి. వీటి కవచాలు మందంగా లిగ్నిన్తో ఉంటాయి. పరిపక్వ దశలో నారలు నిర్జీవమవుతాయి.

AP Inter 1st Year Botany Study Material Chapter 12 పుష్పించే మొక్కల కణజాలశాస్త్రం, అంతర్నిర్మాణ శాస్త్రం

ప్రశ్న 5.
భాగాలను గుర్తించిన పటం సహాయంతో పృష్టోదర పత్రం అంతర్నిర్మాణాన్ని వర్ణించండి. [Mar. ’14]
జవాబు:
పృష్టోదర పత్రం (ద్విదళ బీజపత్రం) అడ్డుకోతలో 1) బాహ్యచర్మం, 2) పత్రాంతరం, 3) నాళికాపుంజాలు అనే మూడు నిర్దిష్టమయిన భాగాలు కన్పిస్తాయి.

1) బాహ్యచర్మం :
బాహ్యచర్మం ఒకే కణ మందంలో ఉంటుంది. పత్రంపై భాగాన ఉన్న బాహ్యచర్మాన్ని ఊర్ధ్వ బాహ్య చర్మమనీ, క్రింది భాగాన ఉన్న బాహ్యచర్మాన్ని అధోబాహ్యచర్మమని అంటారు. బాహ్యచర్మంలో కణాలు పీపాకారంలో ఉండి ఒత్తుగా కణాంతరావకాశాలు లేకుండా అమరి ఉంటాయి. కణాలు సజీవకణాలు, కణాల్లో రిక్తికాయుత కణద్రవ్యం, ఒక కేంద్రకం ఉంటాయి. బాహ్యచర్మంలో పత్రరంధ్రాలుంటాయి. పత్రరంధ్రాలు ఊర్ధ్వ బాహ్యచర్మంలో కన్న అధోబాహ్య చర్మంలో ఎక్కువగా ఉంటాయి. పత్ర రంధ్రానికి ఇరువైపులా రక్షక కణాలు, మూత్రపిండాకారంలో కనిపిస్తాయి. ఇవి పత్రరంధ్రం తెరుచుకోవడాన్ని, మూసుకోవడాన్ని నియంత్రిస్తాయి. బాహ్యచర్మంపై అవభాసిని ఉంటుంది. బాహ్యచర్మం రక్షణనిస్తుంది. వాయువినిమయాన్ని, బాష్పోత్సేకాన్ని నియంత్రణ చేయడానికి సహకరిస్తుంది. బాహ్యచర్మంపైన బహుకణయుత, ఏకశ్రేణియుత కేశాలు ఉంటాయి. ఇవి క్యూటిన్తో నిర్మితమై ఉంటాయి. వీటిలో నీరు నిల్వ ఉంటుంది. ఇవి సూర్యరశ్మిలోని వేడిని పీల్చుకుని, లోపలి కణజాలాలకు రక్షణ ఇస్తాయి మరియు పత్రం నుండి నీరు ఆవిరికాకుండా కాపాడతాయి.

2) పత్రాంతరం :
ఊర్థ్వ అధోబాహ్యచర్మాల మధ్యగల భాగాన్ని పత్రాంతరం అంటారు. దీనిలో ఎ) స్తంభమృదుకణజాలం, బి) స్పంజిమృదుకణజాలం అనే భాగాలు ఉంటాయి.

ఎ) స్తంభమృదుకణజాలం :
ఇది ఊర్థ్వ బాహ్యచర్మం క్రింద 1 · 3 నిలువు వరుసలలో స్తంభ మృదు కణజాలం ఉంటుంది. దీనిలో కణాలు పొడవుగా, స్తంభాకారంగా ఉంటాయి. ఆ స్తంభాకార కణాలు ఊర్ధ్వ బాహ్యచర్మానికి సమకోణంలో అమరి ఉంటాయి. ఈ కణాలలో హరితరేణువులు ఎక్కువగా ఉంటాయి. ఈ కణాలు కిరణజన్య సంయోగక్రియ ద్వారా పిండి పదార్థాన్ని తయారుచేస్తాయి.

బి) స్పంజిమృదుకణజాలం :
స్తంభమృదుకణజాలము కిందనుండి అధోబాహ్యచర్మం వరకు అమరిఉన్న మృదుకణజాలాన్ని స్పంజిమృదుకణజాలం అంటారు. ఈ కణాలు అపక్రమంగా, 3-5 వరుసల్లో, వదులుగా అమరి ఉంటాయి. కణాల మధ్య కణాంతరావకాశాలు పెద్దవిగా ఉంటాయి. పత్రరంధ్రాల దిగువన ఉన్న కణాంతరావకాశాలు గాలి గదులుగా ఏర్పడి ఉంటాయి. కణాలలో తక్కువ సంఖ్యలో హరితరేణువులుంటాయి. కణజాలం ప్రధానంగా వాయువుల ప్రసరణలో పాల్గొంటుంది. కొంతవరకు కిరణజన్యసంయోగక్రియను జరుపుతుంది.

సి) నాళికాపుంజాలు :
ఇవి పత్రాంతరంలో ఈనెలుగా విస్తరించి ఉంటాయి. ఈనెలు పత్రానికి తన్యతా బలాన్ని కల్పిస్తాయి. పత్రం అన్ని వైపులకు నీరు, ఖనిజ లవణాలను సరఫరా చేస్తాయి.

నాళికా పుంజము గుండ్రంగా ఉంటుంది. దీనిలో దారువు, పోషక కణజాలాలు ఒకే వ్యాసార్థంపైన అమరి ఉంటాయి. దారువు ఊర్ధ్వ బాహ్య చర్మంవైపు, పోషక కణజాలము అధోబాహ్య చర్మంవైపు ఉంటాయి. వీటి మధ్య విభాజ్య కణావళి ఉండదు. కావున వీటిని సహపార్శ్వ, సంయుక్త, సంవృత నాళికాపుంజాలు అంటారు. నాళికాపుంజాల చుట్టూ మృదుకణాల నిర్మిత తొడుగు ఉంటుంది. దీనిని పుంజపు తొడుగులేక సరిహద్దు మృదుకణజాలము అంటారు. పుంజపు తొడుగు నుండి నాళికాపుంజము పైవైపు క్రిందవైపు బాహ్య చర్మాలను కలుపుతూ పుంజపు తొడుగు వ్యాపనాలు ఉంటాయి. ఇవి పత్రాంతరం నుండి నాళికాపుంజాలకు ఆహార పదార్థాలను సరఫరా చేయుటకు తోడ్పడతాయి.
AP Inter 1st Year Botany Study Material Chapter 12 పుష్పించే మొక్కల కణజాలశాస్త్రం, అంతర్నిర్మాణ శాస్త్రం 9

ప్రశ్న 6.
భాగాలను గుర్తించిన పటం సహాయంతో సమద్విపార్శ్వ పత్రం అంతర్నిర్మాణాన్ని వివరించండి.
జవాబు:
ఏకదళ బీజపత్రం అడ్డుకోతలో బాహ్యచర్మము, పత్రాంతరము, నాళికాపుంజాలు అను మూడు భాగాలు కనిపిస్తాయి.

i) బాహ్యచర్మం :
పత్రానికి అభ్యక్షతలంలో ఊర్థ్వబాహ్యచర్మము మరియు ఉపాక్షతలంలో అథోఃబాహ్య చర్మము ఉంటాయి. బాహ్యచర్మ కణాలు పీపా ఆకారంలో దట్టంగా, ఒక వరుసలో అమరి ఉంటాయి. కణాలలో రిక్తికాయుత కణద్రవ్య కేంద్రకము ఉంటాయి. హరిత రేణువులు ఉండవు. బాహ్యచర్మం వెలుపలివైపు క్యూటిన్ తో నిర్మితమైన అవభాసిని ఉంటుంది. పత్రరంధ్రాలు ఊర్ధ్వ, అథోఃబాహ్య చర్మాలలో సమానంగా ఉంటాయి. పత్రరంధ్రానికి ఇరువైపులా ఉన్న రక్షక కణాలు ముద్గరాకారంలో ఉంటాయి. బాహ్యచర్మంపై కేశాలు ఉండవు. ఊర్ధ్వబాహ్య చర్మంలో (గడ్డి జాతులలో ) అక్కడక్కడ పెద్ద కణాలు గుంపులుగా కనిపిస్తాయి. వీటిని బుల్లిఫార్మ్ కణాలు లేక మోటారు కణాలు అంటారు. ఇవి నీటితో నిండి ఉంటాయి. నీటి లభ్యతను బట్టి పత్రం ముడుచుకొనడానికి, విప్పారుటకు తోడ్పడతాయి. బాహ్యచర్మం రక్షణకు, బాష్పోత్సేకానికి, వాయువుల వినిమయానికి తోడ్పడుతుంది.

ii) పత్రాంతరము :
ఊర్ధ్వ, అధో బాహ్యచర్మాల మధ్యన స్పాంజికణజాలం మాత్రమే ఉంటుంది. దీనిలోని కణాలు వదులుగా కణాంతరావకాశాలతో ఉంటాయి. వీటిలో హరితరేణువులు సమాన సంఖ్యలో ఉంటాయి. కావున వీటిని సమద్విపార్శ్వ పత్రాలు అంటారు. పత్రాంతరం పిండి పదార్థ సంశ్లేషణలో పాల్గొంటుంంది.
AP Inter 1st Year Botany Study Material Chapter 12 పుష్పించే మొక్కల కణజాలశాస్త్రం, అంతర్నిర్మాణ శాస్త్రం 10

3) నాళికా పుంజాలు :
అనేక నాళికాపుంజాలు ఒకదానికొకటి పత్రాంతరంలో ఈనెలుగా వ్యాపించి ఉంటాయి. నాళికాపుంజాలు సంయుక్తంగా, సహపార్శ్వంగా, సంవృతంగా ఉంటాయి. దారువు ఊర్ధ్వబాహ్యచర్మం వైపు, పోషక కణజాలం అధోబాహ్యచర్మం వైపు ఉంటాయి. నాళికాపుంజాల చుట్టూ నాళికాపుంజపు తొడుగు, సరిహద్దు మృదుకణజాలం ఉంటుంది. ఇది మృదుకణజాలంతో గాని, దృఢకణజాలంతోగాని నిర్మితమై ఉంటుంది. నాళికాపుంజంపైన, కింద పుంజపు తొడుగు వ్యాపనాలు ఉంటాయి. ఇవి నాళికాపుంజాన్ని ఊర్ధ్వ, అధో బాహ్యచర్మాలతో కలుపుతాయి. ఇవి ఆహారపదార్థాల ప్రసరణలోనే కాకుండా యాంత్రిక ఆధారాన్నివ్వడంలో కూడా తోడ్పడతాయి. ఏకదళ పత్రాలలో ఇవి నిర్జీవ దృఢ కణజాలంతో ఏర్పడి ఉంటాయి. ఇవి ఈనెలకు యాంత్రిక బలాన్ని కల్పిస్తాయి.

ప్రశ్న 7.
ఈ కింది వాటి మధ్యగల భేదాలను తెలియజేయండి.
ఎ) ప్రథమదారువులోని బాహ్య ప్రథమ దారుక, అంతర ప్రథమ దారుక స్థితి
బి) ప్రసరణస్థంభం, నాళికా పుంజం
సి) ప్రథమదారువు, అంతరదారువు
డి)పుంజాంతర విభాజ్యకణావళి, పుంజాంతస్థ విభాజ్యకణావళి
ఇ) వివృత, సంవృత నాళికాపుంజాలు
ఎఫ్) కాండకేశం, మూలకేశం
జి)అంతర్దారువు, రసదారువు
హెచ్) వసంతదారువు, శరద్దారువు
జవాబు:

a) బహుప్రథమ దారుక స్థితి
– ప్రథమ దారువు పరిధివైపున అంత్యదారువు లోపలికి అమరి ఉండుట.
ఉదా : వేర్లు
అంతర ప్రథమ దారుక స్థితి
– ప్రథమ దారువు లోపలికి, అంత్యదారువు వెలుపలి వైపున అమరి ఉండుట.
ఉదా : కాండాలు
b) ప్రసరణ స్థంభం

– పరిచక్రము, నాళికా పుంజాలు దవ్వ, దవ్వ రేఖలు కలిపి ప్రసరణ స్థంభం అంటారు.
– వేరు కాండంలలో మధ్య భాగము