AP Board 10th Class Social Solutions Chapter 16 భారతదేశ జాతీయోద్యమం-దేశ విభజన, స్వాతంత్య్రం: 1939-1947

SCERT AP 10th Class Social Study Material Pdf 16th Lesson భారతదేశ జాతీయోద్యమం-దేశ విభజన, స్వాతంత్య్రం: 1939-1947 Textbook Questions and Answers.

AP State Syllabus 10th Class Social Solutions 16th Lesson భారతదేశ జాతీయోద్యమం-దేశ విభజన, స్వాతంత్య్రం: 1939-1947

10th Class Social Studies 16th Lesson భారతదేశ జాతీయోద్యమం-దేశ విభజన, స్వాతంత్య్రం: 1939-1947 Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
భారతదేశంలో వివిధ బృందాలు, వ్యక్తులు రెండవ ప్రపంచ యుద్ధం పట్ల స్పందించిన విధానాన్ని పోల్చటానికి ఒక పట్టిక తయారు చెయ్యండి. ఈ బృందాలు ఎటువంటి సందిగ్ధతకు లోనయ్యాయి? (AS1)
జవాబు:
రెండవ ప్రపంచయుద్ధం పట్ల వివిధ బృందాలు, వ్యక్తులు స్పందించిన విషయాలు :

కాంగ్రెస్ :
అనేకమంది కాంగ్రెస్ నాయకులు, హిట్లర్ ని, ముస్సోలినిని, ఫాసిజాన్ని వ్యతిరేకించారు. కాని భారతీయుల అభిప్రాయం కనుక్కోకుండా, రాష్ట్రాలలో భారతీయులచే పరిపాలన జరుగుచుండగా వారి అనుమతి లేకుండా, నిర్బంధంగా భారతీయులు యుద్ధానికి సహాయం చేయవలెనని ఆంగ్లేయులు చెప్పడం భారతీయులను అవమానించడమే అని కాంగ్రెస్ అన్నది.

ముస్లిం లీగు (జిన్నా) :
జిన్నా నాయకత్వంలోని ముస్లిం లీగు కూడా తమ పార్టీని ఆంగ్లేయులు ఆమోదించి, లీగు అనుమతితోనే పరిపాలనా విధానాన్ని రూపొందిస్తామని ఒప్పుకుంటే తమ పక్షం ఆంగ్లేయులకు సహాయం చేస్తుందని హామీ ఇచ్చాడు. అయితే ‘క్రిప్స్” రాయబారం విఫలం అవడంతో ముస్లిం లీగు కూడా తిరస్కరించింది.

గాంధీజీ :
గాంధీజీ యుద్ధానికి విముఖుడే. అహింసయే పరమధర్మం అని నమ్మిన గాంధీజీ ఎన్నడూ యుద్ధానికి సుముఖుడు కాడు. అయినను ఇంగ్లాండు క్లిష్ట పరిస్థితులలో ఉండగా యుద్ధంలో పాల్గొనలేకపోయినా, దానికెటువంటి నష్టం కలిగించకూడదని తలచినాడు.

ఫార్వర్డ్ బ్లాక్ సుభాష్ చంద్రబోస్ :
బోసు, భారతీయులు ఆంగ్లేయులకు ఎటువంటి సహాయం చేయరాదన్నాడు. ఆ దేశానికి సహాయం చేసినట్లయితే, భారతీయులకు ఎన్నటికి స్వతంత్రం రాదని వారందరూ శాసనోల్లంఘనం చేయవలెనని ఉపన్యాసాలు ఇచ్చినాడు.
1) సంస్థానాధీశులు
2) హిందూమహాసభ
3) జస్టీస్ పార్టీ
4) అంబేద్కర్ నాయకత్వంలోని హరిజనులు
5) భారత కమ్యూనిస్టు పార్టీలు యుద్ధంలో ఇంగ్లాండుకు సహాయం చేయాలని నిర్ణయించినాయి. కాంగ్రెస్ కు ఇతర బృందాలు, వ్యక్తులకు ఇతర స్వతంత్ర దేశాలను జయించటానికి ప్రయత్నిస్తున్న నాజీ, ఫాసిస్టు శక్తులను ఎదుర్కోవాలని ఉన్నా తమకు స్వాతంత్ర్యం ఇస్తామని కనీసం మాట కూడా ఇవ్వని బ్రిటిష్ వారికి ఎందుకు సహాయం చేయాలనే సందిగ్ధతకు లోనయ్యాయి.

AP Board 10th Class Social Solutions Chapter 16 భారతదేశ జాతీయోద్యమం-దేశ విభజన, స్వాతంత్య్రం: 1939-1947

ప్రశ్న 2.
యూదులు, ఇతర సమూహాల పట్ల జర్మనీ దారుణంగా వ్యవహరించిన నేపథ్యంలో జర్మనీకి గాని, జపానుకి గాని మద్దతు ఇవ్వడం నైతికంగా సరైనదేనా? (AS1)
జవాబు:
సరైనది కాదు. ఎందుకనగా :

  1. జర్మనీ అనేకమంది యూదులను చీకటి గదుల్లో, నేలమాలిగళ్ళో బంధించి చంపింది.
  2. జర్మనీలోని “నాజీ” జాతి ప్రపంచంలోనే గొప్పజాతి అనే జాత్యాహంకారంతో జర్మనీ ఇతర దేశాలను చిన్నచూపు చూసింది.
  3. సామ్రాజ్య కాంక్షతో ఇతర స్వతంత్ర దేశాలను ఆక్రమించుకోవాలని చూసింది.
  4. జపాన్ ఆసియా ఖండానికి చెందిన చిన్నదేశం అయిన, యూరోపియన్ దేశాలతో పోటీపడుతూ దూరప్రాచ్యంలో వలసలను ఏర్పాటు చేసుకోవడానికి అనేక ప్రయత్నాలు చేసింది.
  5. సామాజ్య కాంకకు లోనయి ఇతర పెద్ద దేశాలను కవ్విస్తూ అనేక దేశాల మీద దాడులు జరిపింది.

ఇటువంటి నేపథ్యంలో జర్మనీ, జపాన్లకు మద్దతు ఇవ్వడం సరైనది కాదని చెప్పవచ్చు.

ప్రశ్న 3.
భారతదేశ విభజనకు దారితీసిన వివిధ కారణాల జాబితా తయారుచేయండి. (AS1)
జవాబు:
భారతదేశ విభజనకు దారి తీసిన వివిధ కారణాలు :

  1. ముస్లింలకు ప్రత్యేక దేశం అనే భావనకు తొలి ఆధారం కవి “మహ్మద్ ఇక్బాల్” చేసిన ప్రసంగంలో కనిపిస్తుంది.
  2. 1930లో ముస్లిం లీగ్ అధ్యక్షోపన్యాసంలో ఇక్బాల్ వాయవ్య “భారత ముస్లిం దేశాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని సూచించాడు.
  3. వాస్తవానికి కేంబ్రిడ్జిలో చదువుతున్న పంజాబ్ ముస్లిం విద్యార్థి “చౌదరి రెహ్మత్ ఆలీ” వర్గం దేశ విభజన భావనకు ఊపిరిపోసిందని చెప్పవచ్చు. 1933లో ప్రచురించిన ఒక కర పత్రంలో ” రెహ్మత్ ఆలీ” ముస్లిం వర్గానికి ప్రత్యేక జాతీయ ప్రతిపత్తి కల్పించాలనే అభిప్రాయంతో “పాకిస్తాన్” అనే పదానికి రూపకల్పన చేసాడు. (పంజాబ్, ఆఫ్ఘన్, కాశ్మీర్, సింద్, బెలూచిస్తాన్స్ ఇంగ్లీష్ అక్షరాల నుంచి పాకిస్తాన్ ఏర్పరచారు.)
  4. 1937 నుంచి ముస్లింలకు ప్రత్యేక దేశం అవసరం అనే భావనపై లీగ్ వైఖరిలో స్పష్టమైన మార్పు వచ్చింది. దీనికి ప్రధానంగా రెండు కారణాలున్నాయి.
    ఎ) 1935 చట్టపు ఫెడరల్ క్లాజులు అమల్లోకి వస్తాయన్న నమ్మకం వారికి సన్నగిల్లింది. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వంలో తాము హిందూ ఆధిక్యతకు తలవంచక తప్పదనే అభిప్రాయం కూడా వారికి కలిగింది.
    బి) రాష్ట్రాలలో ముస్లిం లీగ్ తో కలిసి సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలనే లీగ్ ప్రతిపాదనకు కాంగ్రెస్ వారు నిరాకరించడం జిన్నాకు, ముస్లిం లీగ్ కు అవమానంగా తోచింది. కాంగ్రెస్ మౌలికంగా హిందువుల పార్టీ అని లీగు సృష్టించగలిగింది.
  5. విద్యావంతులైన ముస్లింలు పాకిస్తాన్ ఏర్పాటు కావాలని భావించసాగారు. మొదట విద్యార్థుల పగటి కలగా కొట్టివేసిన “ముస్లింలకు ప్రత్యేక దేశం” అనే భావన చివరికి ముస్లిం లీగ్ ప్రధాన డిమాండ్ గా రూపొందింది.
  6. రెండవ ప్రపంచయుద్ధం తరువాత బ్రిటన్లో లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చింది. లేబర్ పార్టీ నాయకులలో అనేకమంది భారతీయులు స్వాతంత్ర్యం పొందడానికి సుముఖంగా ఉన్నారు.
  7. బ్రిటన్ “విభజించి – పాలించు” అనే విధానాన్ని పాటిస్తూ కాంగ్రెస్ ప్రాముఖ్యాన్ని తగ్గిస్తూ, ముస్లిం లీగు ప్రణాళికలకు మద్దతు ఇచ్చి, ముస్లిం లీగు బలపడేలా చేసింది.
  8. హిందూ మహాసభ, ఆర్.ఎస్.ఎస్, భారతదేశం అధిక సంఖ్యలో ఉన్న హిందువుల భూమి అన్న అభిప్రాయాన్ని కలుగచేసారు.
  9. రెండవ ప్రపంచయుద్ధం తరువాత అగ్రరాజ్యాలుగా రూపొందిన అమెరికా, సోవియట్ యూనియన్లకు భారతదేశ స్వాతంత్ర్య డిమాండ్ ను సమర్ధించాయి.
  10. ముస్లింలు అధిక సంఖ్యలో ఉండే ప్రాంతాలలో ప్రజల ప్రతిపాదన, ప్రత్యేక పాకిస్తాన్ దేశం కావాలని, ఇది కూడా పాకిస్తాన్ ఏర్పాటుకు ఒక కారణం.
  11. 1946లో రాష్ట్ర ప్రభుత్వాలకు జరిగిన ఎన్నికలలో 569 స్థానాలలో 442 స్థానాలకు కేంద్రంలో 30 స్థానాలను గెలుచుకుంది. అంటే 1946 చివరినాటికి ముస్లిం ఓటర్లలో ప్రధానపార్టీగా ముస్లిం లీగు ఆవిర్భవించి, భారతీయ ముస్లింల “ఏకైక ప్రతినిధి” అన్న తన వాదనను నిజం చేసుకుంది.
  12. చర్చలతో స్వాతంత్ర్యం రాదని లీగు భావించి, ప్రజలను వీధులలోకి రమ్మని పిలుపునిస్తూ ‘ప్రత్యక్ష కార్యాచరణ”కు దిగటానికి నిర్ణయించుకొని 1946 ఆగస్టు 16ను ప్రత్యక్ష కార్యాచరణ దినంగా ప్రకటించింది. ఇది అనేక అల్లర్లు, హింసకు కారణమైంది.

1947లో “వావెల్” స్థానంలో మౌంట్ బాటెన్ వచ్చి ఆఖరి దఫా చర్చలకు ఆహ్వానించాడు. ఇవి కూడా విఫలం అవడంతో ఆగస్టు 14, 1947న పాకిస్తాన్‌కు, ఆగస్టు 15, 1947న భారత్ కు స్వాతంత్ర్యం ఇస్తామని ప్రకటన చేశాడు. ఈ విధంగా భారత్, పాక్లు విభజింపబడినాయి.

ప్రశ్న 4.
దేశ విభజనకు ముందు వివిధ సమూహాల మధ్య అధికారాన్ని పంచుకోటానికి ఏ ఏ విధానాలను అవలంభించారు? (AS1)
జవాబు:
దేశ విభజనకు ముందు ముస్లిం లీగు, కాంగ్రెస్ మధ్య అధికారాలను పంచుకున్నారు.

1945లో పూర్తి స్వాతంత్ర్యం ఇవ్వడానికి ముందుగా వైస్రాయ్, సైనికా దళాల కమాండర్ – ఇన్ – చీఫ్ మినహా కేంద్ర కార్యనిర్వాహక వర్గాన్ని భారతీయులతోనే ఏర్పరచటానికి బ్రిటన్ సిద్ధం అయ్యింది. ఈ కార్యనిర్వాహక వర్గంలో ముస్లిం సభ్యులను ఎంపిక చెయ్యటానికి ముస్లిం లీగుకి సంపూర్ణ అధికారం ఉండాలని జిన్నా పట్టుబట్టడంతో అధికార బదిలీకి సంబంధించిన చర్చలు విఫలమయ్యాయి. జాతీయవాద ముస్లిములలో పలువురి మద్దతు కాంగ్రెస్ కు ఉంది. పంజాబ్ లోని యూనియనిస్టు పార్టీలో పలువురు ముస్లింలు సభ్యులుగా ఉన్నారు. ఈ రెండు పార్టీలు ముస్లిం లీగు కోరికను సమర్థించలేదు. 1946 చివరినాటికి ముస్లిం ఓటర్లలో ప్రధాన పార్టీగా ముస్లిం లీగు ఆవిర్భవించి భారతీయ ముస్లిముల ఏకైక ప్రతినిధి’ని అన్న తన వాదనను నిజం చేసుకుంది. ముస్లిం ఓట్లలో 86 శాతానికి పైగా ఆ పార్టీకి వచ్చాయి. 1946లో సాధారణ నియోజక వర్గాలలో కాంగ్రెస్ పార్టీ ముస్లిమేతర ఓట్లలో 91 శాతంతో అఖండ విజయం సాధించింది.

ప్రశ్న 5.
బ్రిటిష్ వలస పాలకులు తమ విభజించి, పాలించు అన్న విధానాన్ని భారతదేశంలో ఏ విధంగా అమలు చేశారు? నైజీరియాలో అవలంబించిన విధానానికీ, దీనికీ మధ్య పోలికలు, తేడాలు ఏమిటి? (AS1)
జవాబు:
బ్రిటిష్ వలస పాలకులు భారతదేశంలో “విభజించి – పాలించు” అన్న విధానాన్ని ఈ క్రింది విధంగా అమలు చేసారు.

  1. హిందూ-ముస్లిం మత వైరుధ్యాన్ని పోషించారు.
  2. కమ్యూనల్ ఎలక్టోరేట్లను ప్రవేశపెట్టడం ద్వారా మొదట విద్యావంతులయిన భారతీయులలోనూ తరువాత సాధారణ ప్రజానీకంలోను ఈ శత్రుత్వాన్ని పెంచి పోషించారు.
  3. హిందీ, ఉర్దూ భాషల విషయంలో ఏర్పడ్డ వివాదాన్ని గోసంరక్షణ ఉద్యమాన్ని సైతం వీరు ఉపయోగించుకున్నారు.
  4. మితవాదులను ప్రోత్సహిస్తూ జాతీయవాదులలో చీలిక తీసుకువచ్చారు. దాదాబాయ్ నౌరోజీ వంటి వారి నుండి ‘జసిస్ రనడే’ వంటి విప్లవనాయకులను వేరు చేయడానికి ప్రయత్నించారు.
  5. అతివాదులకు వ్యతిరేకంగా మితవాదులను ప్రోత్సహించారు.
  6. శీఘ్రంగా పెరిగిపోతున్న జాతీయోద్యమాన్ని ఎదుర్కోవడానికి, దాన్ని నిలువరించడానికి బ్రిటిష్ ప్రభుత్వం విభిన్న విధానాలను అనుసరించింది. కాంగ్రెస్ వ్యతిరేక ఉద్యమాలను ప్రోత్సహించింది.
భారతదేశంనైజీరియా
1) హిందూ-ముస్లిం మత వైరుధ్యాన్ని పోషించారు.1) బ్రిటిష్ వలసపాలకుల విధానాల వల్ల ప్రాంతీయ అసమానతలు పెరిగాయి.
2) కమ్యూనల్ ఎలక్టోరేట్లను ప్రవేశపెట్టడం ద్వారా మొదట విద్యావంతులయిన భారతీయులలోనూ తరువాత సాధారణ ప్రజానీకంలోను ఈ శత్రుత్వాన్ని, పెంచి పోషించారు.2) బ్రిటిష్ వలసపాలకులు పశ్చిమ, తూర్పు నైజీరియా ప్రాంతాలను ఏర్పరచి, మొరుబా, ఈబు తెగల మధ్య విభజనలు సృష్టించారు.
3) హిందీ, ఉర్దూ భాషల విషయంలో ఏర్పడ్డ వివాదాన్ని గోసంరక్షణ ఉద్యమాన్ని సైతం వీరు ఉపయోగించు కున్నారు.3) విద్యావంతులైన ఆఫ్రికావాసులను సివిల్ సేవలకు అనుమతించకపోవడం, ఆఫ్రికా వ్యాపారవేత్తల పట్ల వివక్షత చూపడం జరిగింది.
4) మితవాదులను ప్రోత్సహిస్తూ జాతీయవాదులలో చీలిక తీసుకువచ్చారు. దాదాబాయ్ నౌరోజీ వంటి వారి నుండి “జస్టిస్ రనడే’ వంటి విప్లవనాయకులను వేరు చేయడానికి ప్రయత్నించారు. అతివాదులకు వ్యతిరేకంగా మితవాదులను ప్రోత్సహించారు.4) ప్రజలపై మరింత నియంత్రణను సాధించటానికి వీలుగా గిరిజన తెగ నాయకులు, సంపన్నులతో సంబంధాలు నెరిపింది.
5) శీఘ్రంగా పెరిగిపోతున్న జాతీయోద్యమాన్ని ఎదుర్కోవడానికి, దాన్ని నిలువరించడానికి బ్రిటిష్ ప్రభుత్వం విభిన్న విధానాలను అనుసరించింది. కాంగ్రెస్ వ్యతిరేక ఉద్యమాలను ప్రోత్సహించింది.5) జాతీయ ఉద్యమ తీవ్రతకు లోబడి, మూడు ప్రధాన ప్రాంతాల స్వయం ప్రతిపత్తిని గుర్తిస్తూ సంక్లిష్ట సమాఖ్య వ్యవస్థను నెలకొల్పి నైజీరియాన్లకు అధికారాన్ని అప్పగించింది.

ప్రశ్న 6.
దేశ విభజనకు ముందు రాజకీయాలలో మతాన్ని ఏ ఏ విధంగా ఉపయోగించుకున్నారు? (AS1)
జవాబు:
దేశ విభజనకు ముందు రాజకీయాలలో మతం కీలకపాత్ర వహించి, చివరికి దేశ విభజనకు దారి తీసింది.

  1. వర్తకం, పరిశ్రమ, ప్రభుత్వ సర్వీసు, విద్య, వృత్తుల వంటి రంగాలలో హిందువుల ప్రాబల్యం కారణంగా అధిక సంఖ్యాకులయిన హిందూ సముదాయం పట్ల అల్పసంఖ్యాకులయిన ముస్లిం సముదాయం పెంచుకొన్న భేదభావాలే దేశ విభజనకు దారి తీసాయని చెప్పవచ్చు.
  2. 1857 సిపాయిల తిరుగుబాటు కేవలం మహమ్మదీయులు రాజకీయంగా అసంతృప్తి చెంది తెచ్చిన విప్లవమని భావించి బ్రిటిష్ వారు ముస్లింలను ఆ విధంగా వ్యతిరేకభావంతోనే చూశారు.
  3. ‘విభజించి – పాలించు’ విధానాన్ని అనుసరించి బ్రిటిష్ వారు హిందువులను-ముస్లింలను మతాలవారీగా విడదీయటానికి పరోక్షంగా పథకాలు వేశారు.
  4. ముస్లింలలో పాశ్చాత్య విద్యావ్యాప్తి మందకొడిగా సాగిన కారణంగా వారిని ఏదో విధంగా స్వాతంత్ర్యోద్యమానికి దూరంగా ఉంచడానికి ప్రభుత్వం కృషి చేసింది.
  5. సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ప్రారంభించిన విద్యాపరమైన అలిఘర్ ఉద్యమం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. రాజకీయ అధికారుల కోసం ముస్లీమ్ మతతత్వాన్ని ప్రోత్సహించారు. ఈయన తన చివరి రోజులలో ముస్లింలను జాతీయోద్యమం నుంచి వైదొలగడమే కాక హిందువులు, మహమ్మదీయులు పరస్పర విరుద్ధ రాజకీయ ప్రయోజనాలున్న వర్గాలని ప్రకటించాడు.
  6. సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ కృషి వల్ల ‘బిద్రుద్దీన్ త్యాబ్ది’ లాంటివారు విద్యాధికులయ్యారు. వీరు అల్పసంఖ్యాకులైన తమకు ఉద్యోగాలు రావాలంటే బ్రిటిష్ వారికి విధేయులై ఉండాలని ఉద్భోదించారు.
  7. తిలక్, అరబిందు వంటివారు ప్రాచీన హిందూ సంస్కృతికి ప్రాధాన్యమిచ్చి, హిందూమత ప్రాతిపదికకు పిలుపునిచ్చారు.
  8. తిలక్ గణపతి పూజ, శివాజీ ఉత్సవాలకు ప్రాధాన్యమిచ్చి, హిందువులను ఐక్యం చేయడానికి ప్రయత్నించాడు.
  9. ముస్లింలను ప్రోత్సహించడానికి బ్రిటిష్ వారు 1906 లో ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలను వేర్పాటు చేసి, ఏర్పాటు వాదాన్ని పెంచినారు.
  10. హిందువులు కూడా మతతత్వంను పెంచుతూ అనేకమంది హిందూ నాయకులు హిందూ జాతీయతను గురించి చెప్పడం, వారి హక్కుల పరిరక్షణ కొరకు “హిందూ మహాసభ”, ఆర్.ఎస్.ఎస్. వంటి సంస్థలను ఏర్పాటు చేసుకొన్నారు. భారతదేశం హిందువుల మాతృదేశమని, ముస్లింలు విదేశీయులని ప్రచారం చేసారు.

ప్రశ్న 7.
స్వాతంత్ర్య పోరాటం చివరి సంవత్సరాలలో కార్మికులను, రైతాంగాన్ని ఏ విధంగా సమీకరించారు? (AS1)
జవాబు:
భారతీయ కార్మిక వర్గానికి అక్షరాస్యత తక్కువే కాకుండా సాంస్కృతికంగా కూడా వెనుకబడి ఉంది. అందుకే మేధావులు, బూర్జువా వర్గాల కన్నా, వీరిలో జాతీయ, వర్గ చైతన్యం ఆలస్యంగా ప్రారంభమయిందని చెప్పవచ్చు. 1917లో రష్యన్ విప్లవం మూలంగా భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించి కార్మికసంఘ ఉద్యమాలకు కారణం అయ్యాయి. కార్మికుల యొక్క పని గంటలు, వేతనాలలో సంస్కరణలు తీసుకురావడం కొరకు అనేక కార్మికసంఘాలు, మద్రాస్ కార్మికసంఘం, ఇండియన్ ట్రేడ్ యూనియన్ ఫెడరేషన్ (ఐ.టి.యు.ఎఫ్), ఎ.ఐ.టి.యు.సి., నేషనల్ ట్రేడ్ యూనియన్ ఫెడరేషన్ల వంటివి ఆవిర్భవించాయి. 1935-39లో కార్మిక కార్యకలాపాలను పునరుద్ధరించడంలో సమ్మెలు కూడా తగ్గినాయి. 1935 చట్టం కార్మిక నియోజకవర్గాలను ఏర్పాటుచేసింది. 1946లో దేశంలో పలు ప్రాంతాలలో మిల్లులు, కర్మాగారాలలో పని ఆపేశారు. సమ్మెలు చేశారు. భారత కమ్యూనిస్ట్, సోషలిస్ట్ పార్టీలు ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నాయి. వివిధ దశల్లో చేసిన వివిధ చట్టాల వల్ల కార్మికుల పని పరిస్థితులు గణనీయంగా మెరుగుపడ్డాయి. కార్మికులు తమ • నాయకుల ఆధ్వర్యంలో స్వాతంత్ర్య పోరాటంలో జాతీయ నాయకులకు పూర్తి మద్దతు ఇచ్చారు.

“చంపారన్” సత్యాగ్రహం బీహార్ రైతులలో చైతన్యాన్ని కలిగించింది. “ఖేరా’ కరవు విషయంలో గాంధీజీ సత్యాగ్రహం చేయడం రైతులకు రక్షణ కలిగించింది. రైతులు తమ కోర్కెల సాధన కొరకు సత్యాగ్రహాన్ని ఉపయోగించుకోవచ్చని రైతులు భావించసాగారు. ఇటువంటి సమయంలో రైతులను రాజకీయాలవైపు ఆకర్షిస్తూ, లక్షలాది రైతులను సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొనేటట్టు చేయగలిగింది. దశాబ్దాల నుంచి రాజకీయ అంధకారంలో మగ్గుతున్న రైతులను రాజకీయ సుడిగుండంలోకి తీసుకురాగలిగింది. 1917 నుంచి గాంధీజీ ఆయన అనుచరులు భారత జాతీయ కాంగ్రెస్ ద్వారా రైతుల జీవితంలో జాతీయ రాజకీయాలను ప్రవేశపెట్టడంలో విజయం సాధించారు. 1923 లో ప్రముఖ రైతు నాయకుడు “యన్. జి. రంగా” “రైతుల సమాఖ్య”ను ఏర్పాటుచేశాడు. గుంటూరు జిల్లాలో రైతులు ఈయనకు పెద్ద ఎత్తున మద్దతు తెలిపారు. ఈ రైతు సమాఖ్యలు పశ్చిమగోదావరి, కృష్ణాలకు విస్తరించినాయి. 1929 లో “ఆంధ్రరైతుల ప్రొవిన్షియల్ సమాఖ్య” యన్.జి.రంగా అధ్యక్షతన సమావేశమై రాజకీయాలకు సంబంధించి కాంగ్రెస్ అనుసరిస్తున్న విధానాలను సమర్ధించింది. 1942లో భారత రైతులు ‘శాసనోల్లంఘన’ ఉద్యమం పిలుపుకు వీరోచితంగా స్పందించినారు. బెంగాల్ లోని మిడ్నపూర్‌లో రైతుల తిరుగుబాటు కారణంగా కొన్ని సంవత్సరాలపాటు బ్రిటిష్ వారు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకోలేకపోయారు.

ఈ విధంగా భారతదేశంలోని రైతు ఉద్యమాలకు చైనాలోని ‘మావో’ లాగ సరైన నాయకత్వం గనుక లభించి ఉంటే భారతదేశ చరిత్ర మరోలా ఉండేదనడం నిర్వివాదాంశం. హైదరాబాద్లో కమ్యూనిస్టు పార్టీ తెలంగాణా ప్రాంత రైతుల ఉద్యమానికి నాయకత్వం వహించింది.

ప్రశ్న 8.
సాధారణ ప్రజల జీవితాలను దేశ విభజన ఏ విధంగా ప్రభావితం చేసింది ? విభజన తరువాత జరిగిన వలసలకు రాజకీయ ప్రతిస్పందన ఏమిటి? (AS1)
జవాబు:
ముస్లిం మత పాకిస్తాన్ ఏర్పాటు కావటంతో చాలామంది ప్రజల ముందు ఊహించని బాధాకరమైన పరిస్థితి ఎదురయ్యింది. కొత్తగా గీసిన సరిహద్దు రేఖకి ఒకవైపున ఉన్న హిందువులలో అభద్రతా భావం ఏర్పడి వలస వెళ్లడం తప్పనిసరి అయ్యింది. ఈ కొత్త సరిహద్దు రేఖకు ఆవలివైపున ఉన్న ముస్లిములలో కూడా ఇదే పరిస్థితి. అందరూ దీనిని కోరుకుని ఉండకపోవచ్చు. ఇది ఎందుకు జరుగుతోందో అందరికీ అర్థం అయి ఉండకపోవచ్చు. తమ ఇళ్లు, ఊళ్లు, పట్టణాలను విడిచి వెళ్లవలసి రావటంతో ఒకరిపట్ల ఒకరికి కోపం, విద్వేషాలు చెలరేగాయి. మొత్తంగా 1.5 కోట్ల హిందువులు, ముస్లిములు నిర్వాసితులయ్యారు. హత్యలు, దోపిడి, దహనాలు యధేచ్ఛగా కొనసాగాయి. హిందువులు, ముస్లిములు కలిపి రెండు నుంచి అయిదు లక్షలమంది చంపబడ్డారు. వాళ్లు కాందిశీకులుగా మారారు, పునరావాస శిబిరాలలో గడిపారు. రైళ్లల్లో కొత్త ఇళ్ల అన్వేషణలో బయలుదేరారు. శాంతి, సౌభ్రాతృత్వ సందేశాలను పంచుతూ గాంధీజీ అల్లర్లకు గురైన ప్రజల శిబిరాల మధ్య, ఆసుపత్రులలో గడిపాడు. తను ఇంతగా కష్టపడింది ఇటువంటి స్వేచ్ఛ, స్వరాజ్యాల కోసం కాదు. జాతిపిత మొదటి స్వాతంత్ర్య దినోత్సవంనాడు సంబరాలు చేసుకోకుండా నిరాహారదీక్ష చేశాడు.

గాంధీజీ చొరవతో “అల్పసంఖ్యాక వర్గాల హక్కుల’ పై నెహ్రూ, కాంగ్రెస్ ఒక తీర్మానాన్ని చేశాయి. ఆ పార్టీ “రెండు దేశాల సిద్ధాంతాన్ని” ఎప్పుడూ అంగీకరించలేదు. తన ఇష్టానికి వ్యతిరేకంగా దేశవిభజనకు బలవంతంగా ఒప్పుకోవలసి వచ్చినప్పటికీ ‘భారతదేశం అనేక మతాల, జాతుల దేశమనీ, అలాగే కొనసాగాలని’ విశ్వసించింది. పాకిస్తాన్ ఎలా ఉన్నప్పటికీ భారతదేశం ‘ప్రజాస్వామిక లౌకికరాజ్యం ‘ గా ఉంటుంది. మతంతో సంబంధం లేకుండా పౌరులందరికీ రాజ్యం నుండి రక్షణ లభిస్తుంది. సమాన హక్కులు ఉంటాయి.

ప్రశ్న 9.
కొత్తగా ఏర్పడిన భారతదేశంలోకి వివిధ సంస్థానాలను విలీనం చేసే ప్రక్రియ ఒక సవాలుగా పరిణమించింది. చర్చించండి. (AS1)
జవాబు:
బ్రిటిష్ అధికారం కింద వివిధ స్థాయిలలో సర్వసత్తాక పాలనతో సుమారుగా 550 సంస్థానాలు ఉండేవి. 1947 భారత స్వాతంత్ర్య చట్టం ప్రకారం సంస్థానాధీశులు తమ ఇష్ట ప్రకారం తమ భవిష్యత్తును నిర్ణయించుకొనే అధికారం పొందారు. దీని మూలంగా కొంతమంది రాజులు స్వతంత్రంగా ఉంటామని ప్రకటించినారు. భోపాల్ నవాబు కాంగ్రెస్ ప్రభావం ఉన్న భారతదేశం చేరడానికి సుముఖంగా లేక, అతడు భారత ప్రభుత్వ రాజకీయ శాఖతోనూ, ముస్లింలీగుతోను రహస్యంగా కుమ్మక్కవుతున్నాడని తెలిసి, దేశీయాంగ మంత్రి సర్దార్ వల్లభబాయి పటేల్ భోపాల్ పాకిస్తాన్లో కాని చేరినట్లయితే దేశ సమగ్రతకు భంగం కలిగే ప్రమాదం ఉండటంతో పటేల్, భోపాల్ ను భారతదేశంలో కలిపివేసినారు.

1947 ఆగష్టు 15 నుండి బ్రిటిష్ ఆధిపత్యం తొలగుతుందని సంస్థానాధీశులు ఇండియా, పాక్లో దేనిలో అయినా చేరనూవచ్చు లేదా స్వతంత్రంగా ఉండనూవచ్చు అని మౌంట్ బాటెన్ ప్రకటించాడు.

ఎంతో కష్టపడి సంపాదించుకున్న స్వాతంత్ర్యం, సంస్థానాధీశుల మూలంగా చిన్నాభిన్నం కావడం ఇష్టంలేని పటేల్ స్వతంత్ర రాజులను ఒప్పించడానికి ఒక ప్రణాళికను రూపొందించాడు. దాని ప్రకారం సంస్థానాధీశుల అధికారం బ్రిటిష్ ఆధీనంలో ఉన్నప్పటిలాగానే విదేశీ వ్యవహారాలు, రక్షణ, ప్రయాణ సౌకర్యాలు తప్ప మిగిలిన అధికారాలన్నీ రాజులకు కల్పించబడతాయి అని పటేల్ ప్రకటించగానే బరోడా, బికనీర్, కొచ్చిన్, జైపూర్, జోధ్ పూర్, పాటియాల, రేవా వంటి అనేక సంస్థానాలు భారత్ లో కలిసాయి.

1947 ఆగష్టు 15 నాటికి హైదరాబాద్, కాశ్మీర్, జునాగఢ్ తప్ప తక్కిన సంస్థానాధీశులందరూ భారత్ లో చేరతామని ప్రకటించినారు. ఒక్క రక్తం చుక్క కూడా చిందించకుండా అనేక సంస్థానాలను భారతదేశంలో విలీనం చేసి భారతదేశ ఐక్యతకు తోడ్పడినాడు.

జునాగఢ్ :
ఈ సంస్థానంలో 75% ప్రజలు హిందువులు. కాని నవాబు జిన్నాకు అనుకూలుడు. అనేకమంది హిందువులను తరిమికొట్టాడు. జునాగఢ్ పాకిస్తాన్లో కలుస్తుందని ప్రకటించాడు. ప్రజలు తీవ్ర ఆందోళన లేవదీశారు. అందువల్ల సర్దార్ పటేల్ జునాగఢ్ మీదకి సైన్యాలను పంపాడు. ప్రజాభిప్రాయ సేకరణ చేశాడు. ప్రజాభిప్రాయం ప్రకారం జునాగఢ్ భారతదేశంలో విలీనమైంది. నవాబు పాకిస్తాన్ పారిపోయాడు.

హైదరాబాద్ :
నిజాంను ప్రభుత్వం సమానస్థాయి ఉన్న రాజ్యాధినేతగా పరిగణించింది. కాని సంతృప్తి చెందని నిజాం తన రాజ్యానికి సముద్రతీరం ఉండాలని ‘గోవా’ ను పోర్చుగీసు వారి నుండి కొనడానికి సన్నద్ధమయి, పాకిస్తాన్ నుండి సైన్యాన్ని, ఆయుధాలను చేరవేయడం జరిగింది. హైదరాబాదులోని భూస్వాములు, అధికారుల దురాగతాలకు వ్యతిరేకంగా రైతుల ఉద్యమం బయలుదేరింది. ఇది సాయుధ పోరాటంగా మారింది. దీన్ని ఆసరాగా తీసుకొని కాసిం రజ్వీ’ నాయకత్వంలో రజాకార్లు బయలుదేరి పౌర జీవనాన్ని స్తంభింపచేశారు. జిన్నా, ప్రపంచ ముస్లింలందరూ దీనికి సానుభూతి చూపి భారతను ఎదిరించాలని ప్రకటించాడు. ఈ చర్యల మూలంగా దేశ ఐక్యతకు ముప్పు వాటిల్లుతుందని పటేల్ భావించి 1948 సెప్టెంబరు 13న భారత సైన్యాలను హైదరాబాద్ మీదకి పంపినాడు. కాసీం రజ్వీ, అతని అనుచరులు పారిపోయారు. నిజాం 1948 సెప్టెంబరు 17వ తేదీన భారత ప్రభుత్వానికి లొంగిపోయాడు. భారత ప్రభుత్వం హైదరాబాదును భారతదేశంలో విలీనం చేసి, ఈ చర్యను “పోలీసు చర్య”గా ప్రకటించింది.

కాశ్మీర్ :
కాశ్మీర్ లో ముస్లిం జనాభా ఎక్కువ. కాని రాజు హిందువు. పాకిస్తాన్ సేనలు కాశ్మీర్ లోకి చొచ్చుకొని వచ్చాయి. దీని మూలంగా రాజు, కాశ్మీర్ భారత్ లో చేరిపోతుందని ప్రకటించి, భారత్ సహాయాన్ని కోరినాడు. భారత్, పాకు దాదాపు ఒక సంవత్సరం పోరాటం చేసారు. చివరికి ఐక్యరాజ్యసమితి ఏర్పరచిన కమిషను మూలంగా పోరాటం ఆగింది. కాని కాశ్మీర్ లో కొంత భాగం పాక్ ఆక్రమణలో ఉండిపోయింది.

దేశ సమైక్యతకు భంగం కలిగించే ఈ సంస్థానాధీశులను చాలా చాకచక్యంగా ఎదుర్కొన్నవారు సర్దార్ పటేల్. భారతదేశపు ఉక్కు మనిషిగా పేరు పొందినాడు.

10th Class Social Studies 16th Lesson భారతదేశ జాతీయోద్యమం-దేశ విభజన, స్వాతంత్య్రం: 1939-1947 InText Questions and Answers

10th Class Social Textbook Page No.219

ప్రశ్న 1.
ప్రభుత్వాలు రాజీనామా చేస్తే రోజు వారీ వ్యవహారాలను ఎవరు నిర్వర్తిస్తారు?
జవాబు:
ప్రభుత్వాలు రాజీనామా చేసినప్పటికి ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు. కాబట్టి రోజువారీ కార్యక్రమాలను వారు నిర్వర్తిస్తారు. దైనందిన వ్యవహారాలు స్పందించకుండా ఉద్యోగులు తమ విధులను నిర్వర్తిస్తారు.

10th Class Social Textbook Page No.218

ప్రశ్న 2.
భారతీయులు తమ స్వాతంత్ర్య పోరాటాన్ని పక్కన పెట్టి స్వేచ్ఛాయుత ప్రపంచంపై దృష్టి కేంద్రీకరించాల్సినంతగా హిట్లర్ బలం పుంజుకుని మానవాళి స్వేచ్ఛకు ముప్పు కలిగించేవాదా?
జవాబు:
మొదటి ప్రపంచయుద్ధం తరువాత ఆమోదించిన రెహ్మత్ ఆలివర్సయిల్స్ సంధి షరతులు జర్మనీకి అవమానకరంగా ఉన్నాయని హిట్లర్ భావించాడు. ఇతర దేశాల ఆధీనంలో ఉన్న జర్మన్ భూభాగాలను ఏకం చేయాలని ఆశించాడు. సంధి షరతులను ఉల్లంఘించినాడు. పెద్ద దేశాలను ఎదిరించి, దూర ప్రాచ్యంలో తమకు కూడా వలసలు కావాలని ఆశించాడు. జర్మనీని చూసి అగ్రరాజ్యలు భయపడేలా చేసాడు. అయితే మన స్వాతంత్ర్య పోరాటం వదిలి స్వేచ్ఛాయుత ప్రపంచం కొరకు దృష్టి పెట్టవలసినంత అవసరం లేదు. జర్మనీకి భారత జాతీయ పోరాటం మీద సానుభూతి కూడా ఉంది.

10th Class Social Textbook Page No.218

ప్రశ్న 3.
రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటన్ ని సమర్ధించటానికి, సమర్థించకపోవటానికి మీ కారణాలను పేర్కొనండి.
జవాబు:

  1. బ్రిటనను సమర్థిస్తాను. ఎందుకనగా జాత్యాహంకారంతో, సామ్రాజ్యకాంక్షతో ఇతర స్వతంత్రదేశాలను ఆక్రమించు కుంటున్న జర్మనీ, జపాన్ వంటి దేశాల ఆటకట్టించడానికి బ్రిటన్ యొక్క ప్రయత్నాన్ని నేను సమర్ధిస్తాను.
  2. భారతీయులను సంప్రదించకుండా, వారితో ప్రమేయం లేకుండా, యుద్ధం తరువాత స్వాతంత్ర్యం ఇస్తామని కనీసం మాట కూడా ఇవ్వకుండా, భారత్ యుద్ధంలో పాల్గొనాలని బ్రిటిష్ ప్రకటించడాన్ని నేను సమర్థించను.

10th Class Social Textbook Page No.219

ప్రశ్న 4.
బ్రిటన్ దృక్పథం పట్ల నిరసన వ్యక్తపరచటానికి కాంగ్రెస్ ఏ చర్య చేపడితే బాగుండేది?
జవాబు:
రెండవ ప్రపంచయుద్ధంలో బ్రిటన్ దృక్పథం పట్ల నిరసన వ్యక్తపరచటానికి, భారతీయులు 1937లో జరిగిన ఎన్నికలలో 8 రాష్ట్రాలలో అధికారంలోనికి వచ్చిన ప్రభుత్వాలు రాజీనామా చేయకుండా, అధికారంలోనే ఉండి, బ్రిటిష్ వారికి సహకరించకుండా నిరసన తెలిపితే బాగుండేది.

10th Class Social Textbook Page No.219

ప్రశ్న 5.
బ్రిటన్ మాట ఇచ్చి భారతీయుల మద్దతు ఎందుకు పొందలేదు? 1939లో భారతీయులు అడిగింది మాటే కదా ! తరగతిలో అందరూ చర్చించండి.
జవాబు:

  1. బ్రిటిష్ వారికి, తాము భారతదేశంలో నిర్మించిన సామ్రాజ్యాన్ని వదులుకోవటం ఇష్టం లేదు.
  2. 2వ ప్రపంచయుద్ధం తరువాత భారత్ కు డొమీనియన్ ప్రతిపత్తి ఇస్తామని చెప్పారు. కాని జాతీయవాదులు సంపూర్ణ స్వరాజ్యం కావాలని కోరినారు. ఇది బ్రిటిష్ కు ఇష్టం లేదు.
  3. కాంగ్రెస్ భారతదేశంలో అన్ని వర్గాల ప్రజలకు ప్రాతినిధ్యం వహించడం లేదని (ఉదా : ముస్లిం ప్రజలకు) బ్రిటిష్ భావించింది. అనేకమంది భారతీయుల ప్రయోజనాలను కాంగ్రెస్ పట్టించుకోవటం లేదని వాటిని కాపాడాల్సిన బాధ్యత ‘తమపైన ఉన్నదని బ్రిటన్ భావించి, భారతీయులకు 1939లో స్వాతంత్ర్యం ఇస్తామని బ్రిటన్ మాట ఇవ్వలేదని అర్థం అవుతుంది.

10th Class Social Textbook Page No.221

ప్రశ్న 6.
అల్పసంఖ్యాక వర్గాల ప్రయోజనాలను కాపాడటానికి ప్రత్యేక నియోజకవర్గాలు ఒక విధానం. ఈ ఉద్దేశం నెరవేర్చటంలో సహాయపడగల -విధానాలు ఇంకేమైనా ఉన్నాయా? ఉదాహరణకు ముస్లింలకు సంబంధించిన అంశం మీద ఓటు వేయటానికి ముందు ముస్లిమేతర సభ్యులు తమ నియోజక వర్గంలోని ముస్లింలను సంప్రదించాలన్న షరతు పెడితే ఎలా ఉంటుంది? ఇటువంటి పద్ధతి ఎప్పుడు పని , చేస్తుంది? ఎటువంటి పరిస్థితులలో ఇది విఫలం అవుతుంది?
జవాబు:

  1. అల్ప సంఖ్యాక వర్గాల ప్రయోజనాలు కాపాడటానికి ప్రత్యేక నియోజకవర్గాలతో పాటు చట్ట సభల్లో వారికి రిజర్వేషన్లు కూడా కల్పించవచ్చు.
  2. ముస్లిమేతర సభ్యులు తమ నియోజకవర్గంలోని ముస్లింలను సంప్రదించాలన్న షరతు పెడితే బాగుంటుంది. కాని ఈ ఈ పద్ధతి, ముస్లింలు చాలా తక్కువ సంఖ్యలో ఉండి, తమ హక్కులకు రక్షణ లభించగలదని నమ్మే పరిస్థితిలో పనిచేస్తుంది. ముస్లింలకు ఇతర వర్గాల మీద నమ్మకం లేనపుడు, వారి సంఖ్య అధికంగా ఉన్నప్పుడు ముస్లింలు, వారి వర్గ సభ్యులకే ఓటు వేసుకోవాలనుకుంటారు, కాని ఇతరులకు వేయాలనుకోరు.

10th Class Social Textbook Page No.229

ప్రశ్న 7.
తాము బందీలుగా పట్టుకున్న సైనికులను బోస్ తన సైన్యంలోకి తీసుకోవటాన్ని జపనీయులు ఎందుకు అనుమతించారు?
జవాబు:
జపాన్ ఆధ్వర్యంలో ‘గ్రేటర్ ఆసియా’ను స్థాపించడం కోసం స్థానికంగా సంబంధాలు ఏర్పరచుకోవాలనే, స్వార్ధ ప్రయోజనంతోనే జపాన్ వారు ‘భారత జాతీయ సేన’ ఏర్పాటును ప్రోత్సహించారు. తాము బందీలుగా పట్టుకున్న సైనికులతో జాతీయ సేనను ఏర్పాటుచేయుటకు ప్రోత్సహించారు.

10th Class Social Textbook Page No.224

ప్రశ్న 8.
భారత సైనికులు భారత జాతీయ సైన్యంలో ఎందుకు చేరారు?
జవాబు:
బ్రిటిష్ ఇండియా సైన్యంలో భారతీయ సైనికులు కూడా ఉన్నారు. జపాన్ వారు బర్మా, మలయాపై దాడి చేసి అక్కడి, బ్రిటిష్ సైన్యాన్ని ఓడించారు. మలయా కూడా బ్రిటన్ వలస దేశమే. బ్రిటిష్ సైన్యంలోని కెప్టెన్ ‘మోహన్ సింగ్’ తన జట్టు సైనికులతో జపనీయులకు లొంగిపోయాడు. ఈ లొంగిపోయిన యుద్ధ ఖైదీలతో ‘భారత జాతీయ సైన్యం’ ఏర్పడింది.

10th Class Social Textbook Page No.224

ప్రశ్న 9.
యుద్ధంలో ఓడిపోతే బ్రిటిష్ వాళ్ల చేతుల్లో చిక్కుతామన్న భయం భారతీయ సైనికులకు ఎందుకు లేకపోయింది? బ్రిటిష్ వాళ్లు వీరిని ఏమి చేసి ఉండేవాళ్లు?
జవాబు:
భారత జాతీయ సైన్యానికి, యుద్ధంలో ఓడిపోతే బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో చిక్కుతామన్న భయం లేదు. వారిలో దేశభక్తి మెండుగా ఉంది. తాము చేసే యుద్ధంలో ఇంగ్లాండు ఓడిపోయినట్లయితే భారతదేశానికి స్వాతంత్ర్యం వస్తుందని ఆశించారు. భారత సైనికులు కేవలం కిరాయి హంతకులు కాదని, తమ ప్రాణాలను స్వదేశం కోసం పణంగా పెట్టగల దేశభక్తులని నిర్ధారణ అయింది. భారత సైన్యం ప్రదర్శించిన ధైర్యసాహసాలు భారతీయులందరిలో జాతీయవాద భావనలను పురికొల్పాయి. భారతదేశాన్ని దాని సైన్యంతోనే లొంగదీసుకోవడం ఇకపై సాధ్యంకాదని బ్రిటిష్ వారు గ్రహించారు.

10th Class Social Textbook Page No.225

ప్రశ్న 10.
ఘటనలు ఈ విధమైన మలుపు తీసుకోవటం వల్ల ప్రజల జీవితాలు ఏ విధంగా ప్రభావితమై ఉంటాయి?
జవాబు:
భారత జాతీయ సైన్యానికి చెందిన సైనికులు, రెండవ ప్రపంచయుద్ధంలో బ్రిటన్ చేతిలో జపాన్ ఓడిపోవుట వలన ఓడిపోయారు. అయితే ఈ సైనికులను జైలుపాలు జేసి వారిని శిక్షించాలని బ్రిటిష్ పాలకులు నిర్ణయించినారు. విద్రోహ చర్య క్రింద వారిని విచారించి ఉరిశిక్ష విధించాలని నిర్ణయించాయి. సైనికులపై విచారణ కొనసాగుతుండగా దేశంలోని పలు ప్రాంతాలలో అశాంతి, అసంతృప్తి చెలరేగసాగాయి.

10th Class Social Textbook Page No.225

ప్రశ్న 11.
నాయకులుగా ఆరాధించిన భారత జాతీయ సైనికులను బ్రిటిష్ వాళ్లు, విద్రోహులుగా పరిగణించి, విచారించి, ఉరి తీయటం ఇతర భారతీయులను ఎలా ప్రభావితం చేసి ఉంటుంది?
జవాబు:
జాతీయ సైనికులను అరెస్టు చేసి, విచారణ సాగుతుండగా చాలా ప్రాంతాలలో గొడవలు, అశాంతి, అసంతృప్తి చెలరేగసాగాయి. జాతీయ చైతన్యంతో చెలరేగిన ఈ ప్రజా తిరుగుబాటులో హిందువులు, ముస్లింల గుర్తింపు, విభజన రాజకీయాలు వంటివి ప్రాముఖ్యత కోల్పోయాయి. ఉదా : భారత జాతీయ సైనికులలో విచారింపబడుతున్న వాళ్ళలో చాలామంది ముస్లింలు, అయితే వాళ్ళ పట్ల ప్రజలలో సానుభూతి వెల్లివిరిసి వాళ్ళ మతం గురించి ఎవరూ ఆలోచించలేదు.

10th Class Social Textbook Page No.226

ప్రశ్న 12.
పైన పేర్కొన్న పలు ప్రజా ఉద్యమాలలో మతపర తేడాలను పట్టించుకోలేదని గమనించాం. ఈ ఉద్యమాలలో ప్రజల ఐకమత్యానికి కారణం ఏమిటి?
జవాబు:
రైతు, కార్మిక, ఉద్యోగస్తుల, నౌకాదళంలోని భారత సైనికుల తిరుగుబాటు, జాతీయ సేనను బ్రిటిష్ వారు విచారించి శిక్షించాలనుకున్నపుడు, ఇటువంటి సందర్భాలలో భారత ప్రజలందరూ తామంతా ఒక్కటే అని కలిసికట్టుగా సమస్యల సాధనకొరకు కృషి చేసారు. వారిలో దేశభక్తి ఉప్పొంగింది. తామందరికీ శత్రువైన బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు చేశారు.

10th Class Social Textbook Page No.218

ప్రశ్న 13.
1935 చట్టం ఇచ్చిన అధికారాలకు భారతీయులు బ్రిటిష్ ప్రభుత్వం పట్ల కృతజ్ఞతాభావం కలిగి ఉండాలా?
జవాబు:
1935 చట్టంలోని అంశాలు :

  1. ఈ చట్టం భారతదేశంలో ఫెడరల్ విధానాన్ని ఏర్పాటు చేయాలి.
  2. కేంద్రంలో రెండు సభలతో కూడిన శాసనసభ ఏర్పడింది.
  3. రాష్ట్రాల్లో ద్వంద్వ పాలన రద్దు అయ్యింది. మంత్రులకు అన్ని శాఖలు అప్పగించడం జరిగింది.

అయినప్పటికి 1935 చట్టం జాతీయవాదులను తృప్తి పరచలేదు. ఎందుకనగా :

  1. ఫెడరల్ విధానాన్ని అమలు జరపలేదు.
  2. గవర్నర్ లకు శాసనసభ తీర్మానాలను తోసిపుచ్చే అధికారం ఉండేది.
  3. చాలా తక్కువమంది ప్రజలకు ఓటుహక్కును కల్పించారు. భారతీయులు ఈ చట్టాన్ని ఎదిరించారు. కావున బ్రిటిష్ ప్రభుత్వం పట్ల కృతజ్ఞత భావం కలిగి ఉండనవసరం లేదు.

10th Class Social Textbook Page No.220

ప్రశ్న 14.
ఆ సమయంలో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలను కాంగ్రెస్ తీవ్రతరం చేసి ఉన్నట్లయితే ఏం జరిగి ఉండేది? ఇది స్వాతంత్ర్య పోరాటానికి బలం చేకూర్చి ఉండేదా?
జవాబు:

  1. 1939లో కాంగ్రెస్ ప్రభుత్వాలన్నీ రాజీనామా చేసాయి. కాబట్టి అధికారం నాయకుల చేతుల్లో లేదు. బ్రిటిష్ వారి చర్యలను ఎదిరించలేరు.
  2. యుద్ధ సమయంలో శాంతి భద్రతలను కాపాడటానికి బ్రిటిష్ ప్రభుత్వం ప్రత్యేక అధికారాలను పొందింది.
  3. ప్రభుత్వాన్ని వ్యతిరేకించిన ఎవరినైనా వెంటనే జైలుకి పంపించి, కోర్టుకి వెళ్ళకుండా కావలసినంత కాలం బందీగా ఉంచవచ్చు.
  4. వాక్ స్వాతంత్ర్యాన్ని కూడా పరిమితం చేశారు. ఇటువంటి గడ్డు పరిస్థితిలో కాంగ్రెస్ నిరసనలను తీవ్రతరం చేసినట్లయితే బ్రిటిష్ ప్రభుత్వం నాయకులను అరెస్టు చేసి జైలుకి పంపించి ఉండేది. జైలులో ఎంతకాలమైన ఉంచే చట్టాలను చేసింది. కాబట్టి అరెస్టు అయిన జాతీయ నాయకులు ఎప్పుడు విడుదల అవుతారో తెలీదు కావున స్వాతంత్ర్య పోరాటం చేయడానికి నాయకులు లేక పోరాటానికి బలం తగ్గిపోయేదని చెప్పవచ్చు.

10th Class Social Textbook Page No.220

ప్రశ్న 15.
అల్ప సంఖ్యాక వర్గాల భయాలు, సమస్యలను పరిష్కరించాల్సిన ఆవశ్యకతను గురించి చర్చించండి. అధిక ఓట్లతో గెలిచే ఎన్నికలు అల్పసంఖ్యాక వర్గాలకు సహాయపడలేవని ఎందుకు భావించారు?
జవాబు:
భారతదేశంలో అధిక జనాభా హిందువులే. దీని మూలంగా భారతదేశంలో ఉన్న ముస్లింలకు తాము అల్ప సంఖ్యాక వర్గం అనే భావం వచ్చింది. మతరీత్యా కూడా వేరు అగుట మూలంగా కూడా తాము వేరు, హిందువులు వేరు అనే భావం ముస్లింలలో కలిగింది. అదే విధంగా కాంగ్రెస్ అధికారంలో తమకు న్యాయం జరగదని, తమ సమస్యలు పరిష్కరించబడవనే అపోహలకు ముస్లింలు లోనయ్యారని తెలుస్తుంది. అయితే భారతదేశంలో ఉన్న ప్రజలందరూ – సమానమే అనే భావాన్ని కాంగ్రెస్ వారు ముస్లింలకు కల్పించాలి. వారు భయపడవలసిన అవసరం లేదని వారికి నమ్మకం కలిగించాలి. హిందూ మహాసభ, ఆర్.ఎస్.ఎస్. వంటి సంస్థల మూలంగా ముస్లింల భయాలు ఎక్కువయ్యాయి. అధిక మెజారిటీతో గెలిచే కాంగ్రెస్ నాయకత్వం ముస్లింలకు సహాయం చేయలేదని ముస్లింలు భావించారు.

10th Class Social Textbook Page No.223

ప్రశ్న 16.
ముస్లిం లీగు రాజకీయాల వల్ల ఒనగూరే ప్రయోజనాలను ప్రజలు ఏ విధంగా అంచనా వేసుకున్నారు? వాళ్లకి ఏమైనా ఆ ప్రశ్నలు తలెత్తాయా? ఏమైనా సందేహాలు ఉన్నాయా? చర్చించండి.
జవాబు:
ముస్లిం లీగ్ రాజకీయాల వల్ల జరిగే ప్రయోజనాలను ప్రజలు ఈ క్రింది విధంగా అంచనా వేసుకున్నారు.
1) హిందూ జమీందార్లు, వడ్డీ వ్యాపారస్తులు తమను దోచుకోని పరిస్థితి గురించి కలలు కన్నారు. వ్యాపారస్థులు, ఉద్యోగార్థులు హిందువుల నుంచి పోటీ ఉండదని ఆశించారు. మరింత మత స్వాతంత్ర్యం ఉంటుందని భావించారు.

2) హిందువుల ఆధిపత్యం గురించి ముస్లిం లీగుకు అనేక భయాలున్నాయని చెప్పవచ్చు. ముస్లింల పట్ల కాంగ్రెస్ సున్నితత్వంతో స్పందించటం లేదని అనేక అంశాల పట్ల ముస్లిం లీగుకు సందేహాలున్నాయి.
ఉదా : యునైటెడ్ ప్రావిన్స్ లో ఎక్కువ సీట్లనే గెలుచుకున్న ముస్లిం లీగుతో కలిపి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుచేయటాన్ని కాంగ్రెస్ తిరస్కరించడం తమ సభ్యులు ముస్లిం లీగులో సభ్యత్వం తీసుకోవడాన్ని కాంగ్రెస్ నిషేధించింది. ఈ వ్యవహారాల పట్ల ముస్లిం లీగులో అనేక సందేహాలున్నాయని చెప్పవచ్చు.

10th Class Social Textbook Page No.224

ప్రశ్న 17.
1942-45 మధ్య కాలాన్ని సమీక్షించండి. అంతకుముందు కంటే ఇప్పుడు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా భారతీయుల ప్రతిఘటన బలం పుంజుకుందా? వివరించండి.
జవాబు:
1942 – 45 మధ్యకాలాన్ని పరిశీలించినట్లయితే అంతకుముందు కంటే బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా భారతీయుల ప్రతిఘటన బలం పుంజుకుందని చెప్పవచ్చు.

  1. రెండవ ప్రపంచయుద్ధంలో భారతీయుల సహకారం కోసం పంపిన క్రిప్స్ రాయబారాన్ని కాంగ్రెస్, లీగులు తిరస్కరించినాయి.
  2. క్రిప్స్ రాయబారాన్ని తిరస్కరించిన తరువాత కాంగ్రెస్ కమిటీ సమావేశమై అనుసరించవలసిన విధానాన్ని ప్రకటించింది. 1942లో గాంధీజీ ‘క్విట్ ఇండియా’ ఉద్యమాన్ని ప్రారంభించాడు. స్వాతంత్ర్య పోరాటాన్ని తీవ్రతరం చేశారు. గాంధీజీ ఉద్యమకారులతో ప్రాణత్యాగాన్నెనా చేసి, స్వరాజ్యాన్ని సంపాదించవలెనని చెప్పినాడు. దానిని ‘Do or die’ అంటారు.
  3. 1942లో భారత జాతీయ సైన్యం ఏర్పడింది. ఇది సుభాష్ చంద్రబోసు నాయకత్వంలో దాదాపు 3 సంవత్సరాలు బ్రిటిష్ యుద్ధం చేసింది. భారత స్వాతంత్ర్య పోరాటాన్ని అంతర్జాతీయంగా గుర్తింపు పొందేలా చేసింది.
  4. 1946 భారత జాతీయ సైన్యానికి చెందిన సైనికులను బ్రిటిష్ వారు శిక్షించాలని నిర్ణయించినారు. వారి మీద విచారణ జరుగుతుండగా దేశంలోని పలు ప్రాంతాలలో అశాంతి, అసంతృప్తి చెలరేగసాగాయి. జాతీయ చైతన్యంతో చెలరేగిన ఈ ప్రజా తిరుగుబాటులో హిందువు – ముస్లింల గుర్తింపు, విభజన రాజకీయాలు వంటివి ప్రాముఖ్యత కోల్పోయాయి. పై సంఘటనలన్నింటితో జాతీయోద్యమం బలాన్ని పుంజుకుందని చెప్పవచ్చు.

10th Class Social Textbook Page No.226

ప్రశ్న 18.
దేశంలోని సాధారణ ప్రజల చర్యలను సమీక్షించండి. వాళ్ల కోరికలు ఏమిటి?
జవాబు:
1) దేశంలోని సాధారణ ప్రజలు కొందరు జీవనాధారం కొరకు మిల్లులు, కర్మాగారాలలో పనిచేసేవారు. మరికొంతమంది వ్యవసాయం చేసేవారు. మొదటి కర్మాగారాలలో పని గంటలు అధికంగా ఉండేవి. పని పరిస్థితులు సరిగ్గా ఉండేవి కావు. వేతనాలు తక్కువ. కార్మికులు ఈ సమస్యల పరిష్కారానికి ప్రయత్నించేవారు. అనేక కార్మిక సంఘాలు ఆవిర్భవించాయి. భారతీయ కమ్యూనిస్ట్, సోషలిస్ట్ పార్టీలు ఆవిర్భవించి కార్మికుల సమస్యల సాధన కొరకు సమ్మెలలో మద్దతు ఇచ్చారు. 1946లో దేశంలో పలు ప్రాంతాలలో మిల్లులు, కర్మాగారాలలో పని ఆపేశారు.

2) దేశంలోని చిన్న, పేద రైతులు ఆందోళన చేయసాగారు. కౌలు వ్యవసాయం చేస్తున్న వారు తమ వాటాని పెంచాలని, తెలంగాణా రైతులు భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడుతూ రైతుల రుణాలను మాఫీ చేయాలని, వెట్టిచాకిరిని నిర్మూలించాలని, దున్నే వాడికే భూమి ఇవ్వాలని కోరినారు. రైతాంగం సాయుధ పోరాటం చేపట్టింది. ఉద్యోగస్తులు, వేతనాల పెంపు కొరకు సమ్మెలు చేసారు. ట్రావెన్ కోర్, కాశ్మీరు లాంటి సంస్థానాలలో పెద్ద ఎత్తున సమ్మెలు జరిగినాయి.

10th Class Social Textbook Page No.227

ప్రశ్న 19.
కాంగ్రెస్ కి ఆమోదయోగ్యం కాని ముస్లిం లీగు కోరికలు ఏమిటి ? కాంగ్రెస్ పేర్కొన్న కారణాలతో మీరు ఏకీభవిస్తారా?
జవాబు:
1944 లో సి. రాజగోపాలాచారి హిందూ-ముస్లింల మధ్య పరిష్కారం కొరకు ఒక ఫార్ములాను రూపొందించాడు. – అయితే దీనిని కాంగ్రెస్, ముస్లిం లీగులు రెండూ తిరస్కరించాయి.

1945 ‘వావెల్’ పథకంను అప్పటి గవర్నర్ జనరల్ లార్డ్ వావెల్ రాజ్యాంగబద్ధమైన ప్రతిష్ఠంభనను అంతమొందించడానికి ఒక కొత్త పథకం రూపొందించాడు. దాని ప్రకారం “కమాండర్-ఇన్-చీఫ్ విషయంలో తప్ప కార్యనిర్వాహక మండలిని పూర్తిగా భారతీయులకే వదిలి పెట్టాలని, మండలిలో ముస్లింలకు, హిందువులకు సమాన ప్రాతినిధ్యం ఉండాలని ప్రతిపాదించడమైంది.

అయితే, జిన్నా నాయకత్వంలోని ముస్లిం లీగ్, కార్యనిర్వాహక మండలిలోని ముస్లిం సభ్యులను లీగ్ మాత్రమే ఎన్నుకోవాలని కోరాడు, ఈ పద్ధతిని కాంగ్రెస్ ఆమోదించలేదు. ఇది జిన్నా యొక్క అనుచిత వైఖరి అని, ఇవి ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదనే అభిప్రాయంతో ఏకీభవిస్తాను.

10th Class Social Textbook Page No.227

ప్రశ్న 20.
ప్రజల అభిప్రాయాలను 1946 ఎన్నికలు ఏ విధంగా సూచించాయి? మీ అభిప్రాయాలను పేర్కొనండి.
జవాబు:
1946లో రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్నికలు జరిగాయి. కేంద్రంలో రిజర్వు చేసిన 30 స్థానాలనూ, రాష్ట్రంలోని 569 స్థానాలలో 442 స్థానాలనూ ముస్లిం లీగు గెలుచుకుంది. అంటే 1946 చివరినాటికి ముస్లిం ఓటర్లలో ప్రధాన పార్టీగా ముస్లింలీగు ఆవిర్భవించి భారతీయ ముస్లిముల ఏకైక ప్రతినిధి’ ని అన్న తన వాదనను నిజం చేసుకుంది. ముస్లిం ఓట్లలో 86 శాతానికి పైగా ఆ పార్టీకి వచ్చాయి. 1946లో సాధారణ నియోజక వర్గాలలో కాంగ్రెస్ పార్టీ ముస్లిమేతర ఓట్లలో 91 శాతంతో అఖండ విజయం సాధించింది.

నా అభిప్రాయాలు :

  1. 1946 ఎన్నికల ద్వారా ముస్లిం నియోజక వర్గాలలో వచ్చిన మెజారిటీని చూసినట్లయితే ముస్లింలు అధికంగా ఉన్న ప్రాంతాలలో ముస్లింలీగ్ అధిక స్థానాలను గెలుచుకుంది.
  2. సాధారణ నియోజక వర్గాలలో కాంగ్రెస్ ముస్లిమేతర ఓట్లలో 91% ఓట్లతో విజయం సాధించింది. దీని మూలంగా కొన్ని ప్రాంతాలలో ముస్లింలకు ఆధిక్యత ఉందని తెలుస్తుంది. లీగు ఏకైక ప్రతినిధి అని తెలుస్తుంది.

10th Class Social Textbook Page No.228

ప్రశ్న 21.
భారతదేశ స్వాతంత్ర్యంపై దినపత్రిక నివేదిక. దీంట్లో ఏ ఏ అంశాలను గుర్తించారు? చర్చించండి.
AP Board 10th Class Social Solutions Chapter 16 భారతదేశ జాతీయోద్యమం-దేశ విభజన, స్వాతంత్య్రం 1939-1947 1
జవాబు:
ఈ క్రింది విషయాలు గమనించాను.

  1. రెండు సార్వ భౌమాధికారం గల దేశాలు ఆవిర్భవించాయి.
  2. బ్రిటతో స్నేహ పూర్వకంగా సంబంధాలు కలిగి ఉంటామని నెహ్రూ, బ్రిటన్ ప్రధాని అట్లికి సమాధానం ఇచ్చారు.
  3. కలకత్తాలోని హిందూ, ముస్లింలు ఆనందంగా ఉన్న సంఘటనలు అని కనిపిస్తుంది.
  4. భారత మొదటి కాబినెట్ జరుపుకొంటున్న ఫంక్షను.
  5. పశ్చిమ బెంగాలకు మొదటి గవర్నర్ గా సి. ఆర్. ప్రమాణ స్వీకారం.
  6. కలకత్తాలో ఎటువంటి అంతరాయాలు, ఇబ్బందులు లేవు.
  7. గాంధీజీ, అంతరాయం లేకుండా మీటింగ్ ను ఆలకిస్తున్నారు.
  8. రాజ్యాంగ సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు.
  9. ప్రక్కన “ఒమెగా” గడియారం ప్రకటన కనిపిస్తుంది – మొదలైన విషయాలు “ది స్టేట్స్మన్” అనే పత్రికలో కనిపిస్తున్నాయి.

AP Board 10th Class Social Solutions Chapter 15 వలస పాలిత ప్రాంతాలలో జాతి విముక్తి ఉద్యమాలు

SCERT AP 10th Class Social Study Material Pdf 15th Lesson వలస పాలిత ప్రాంతాలలో జాతి విముక్తి ఉద్యమాలు Textbook Questions and Answers.

AP State Syllabus 10th Class Social Solutions 15th Lesson వలస పాలిత ప్రాంతాలలో జాతి విముక్తి ఉద్యమాలు

10th Class Social Studies 15th Lesson వలస పాలిత ప్రాంతాలలో జాతి విముక్తి ఉద్యమాలు Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
కింది వాటిని జతపరచండి. (AS1)
సన్ యెట్-సెన్ దేశాన్ని సైనిక దేశం చేశాడు
చియాంగ్ కై షేక్ పర్యావరణ ఉద్యమం
మావో జెడాంగ్ జాతీయతావాదం, ప్రజాస్వామ్యం, సామ్యవాదం
కెన్ సారో వివా రైతాంగ విప్లవం
జవాబు:
సన్ యెట్-సెన్ – జాతీయతావాదం, ప్రజాస్వామ్యం, సామ్యవాదం
చియాంగ్ కై షేక్ – దేశాన్ని సైనిక దేశం చేసాడు
మావో జెడాంగ్ – రైతాంగ విప్లవం
కెన్ సారో వివా – పర్యావరణ ఉద్యమం

AP Board 10th Class Social Solutions Chapter 15 వలస పాలిత ప్రాంతాలలో జాతి విముక్తి ఉద్యమాలు

ప్రశ్న 2.
దశాబ్దాల కాలంలో చైనాలో మహిళల పాత్రలో వచ్చిన మార్పులను గుర్తించండి. రష్యా, జర్మనీలో సంభవించిన మార్పులకూ, వీటికీ తేడాలు, పోలికలు ఏమిటి? (AS1)
జవాబు:
దశాబ్దాల కాలంలో చైనాలో మహిళల పాత్రలో అనేక మార్పులు సంభవించాయి. ఈ గుయోమిండాంగ్ పార్టీ నాయకుడిగా ఉన్న చియాంగ్ కై షేక్ కాలంలో మహిళల పరిస్థితులు మరీ దారుణంగా ఉండేవి. మహిళలకు తక్కువ వేతనాలు లభించేవి. పనిగంటలు అధికంగా ఉండేవి. చియాంగ్ మహిళల హక్కుల గురించి, సమానత్వం పునాదిపై కుటుంబాలను నిర్మించటం, ప్రేమ వంటి భావనను గూర్చి ఆలోచించడం, చర్చించడం చేసారు. పాతివ్రత్యం, రూపం, మాట, పని అన్న నాలుగు సుగుణాలపై వాళ్ళు శ్రద్ధ పెట్టాలని అతడు భావించాడు. ఆ తదుపరి మావో గ్రామీణ మహిళా సంఘాల ఏర్పాటును ప్రోత్సహించాడు. విడాకుల విధానాన్ని సరళీకృతం చేస్తూ కొత్త వివాహ చట్టాన్ని చేశాడు.

తేడాలు :

చైనారష్యాజర్మని
1) కార్మిక సంఘాలలో మహిళలు సంఘటితం అయ్యేవారు. పనిగంటలు ఎక్కువ, దారుణమైన పరిస్థితులు.మహిళా కార్మికులు తరచు తమ తోటి పురుష కార్మికులకు స్ఫూర్తిని ఇచ్చేవారు.మహిళలకు ప్రాధాన్యం లేదు.
2) మహిళల పాత్ర ఇంటికే పరిమితమై ఉండేది.మహిళా దినోత్సవం వంటి సందర్భాలలో ఉత్సవాలు నిర్వహించి, పురుషులకు ఎర్ర మెడ పట్టీలను బహుమతిగా ఇస్తుండేవారు.పురుషుల ప్రపంచంలో మహిళలకు ప్రాధాన్యత లేదు.
3) గ్రామీణ మహిళా సంఘాలు ఏర్పడ్డాయి.ఉద్యమాలకు ముందుండేవారు.పురుషుల రంగాల్లో మహిళలు జోక్యం చేసుకోకూడదు. మహిళ ఇచ్చే ప్రతీ సంతానం యుద్ధం కోసమే అన్నట్లు ఉండేది.

పోలికలు:

చైనారష్యాజర్మని
1) చైనాలో అణగదొక్కబడిన మహిళలకు ప్రాధాన్యమిచ్చారు.మహిళలలో వచ్చిన మార్పువల్ల ప్రాధాన్యం పొందారు.రెండో ప్రపంచయుద్ధం తరువాత మహిళలలో చాలా మార్పు కనబడింది.
2) మహిళా సంఘాలుగా ఏర్పడి అభివృద్ధి పథంలో నడిచారు.టెలిఫోన్ భవనం వంటి కర్మాగారాలలో ఉద్యమాల ద్వారా అభివృద్ధి సాధించారు.ఒక జాతిని కాపాడటంలో అన్నిటికంటే స్థిరమైన అంశం మహిళలేనని తెలుసుకుని అభివృద్ధి సాధించారు.
3) పాలకులు ప్రోత్సహించారు.ఫిబ్రవరి విప్లవం ద్వారా మార్పు కనబడింది.నాజీ పార్టీ ప్రోత్సహించింది.

ప్రశ్న 3.
రాచరిక పాలనను పడదోసిన తరువాత చైనాలో రెండు రకాల పాలనలు ఏర్పడ్డాయి. వీటి మధ్య పోలికలు, తేడాలు ఏమిటి? (AS1)
జవాబు:
రాచరిక పాలనను ప్రజలు తిరస్కరించారు. పాలనాధికారులు, ప్రజలు రాచరిక పాలనపై అసంతృప్తితో ఉన్నారు. ఇటువంటి పరిస్థితులలో, అస్తవ్యస్థమైన చైనాలో రెండు రకాల పాలనలు ఏర్పడ్డాయి. వీటి మధ్య పోలికలు, తేడాలు ఉన్నాయి. వీటిలో ఒకటి సయెట్-సెన్ ఆధ్వర్యంలో గల గణతంత్ర రాజ్యం , రెండవది నూతన ప్రజాస్వామ్యం చైనా కమ్యూనిస్టు పార్టీ.

పోలికలు:

గణతంత్ర రాజ్యంచైనా కమ్యూనిస్టు పార్టీ
1) సయెట్-సెన్ ఆధ్వర్యంలో అనేక సంస్కరణలు అమలు.1) మావో జెడాంగ్ ఆధ్వర్యంలో చైనాలో అనేక విప్లవాత్మక చర్యలు అమలు.
2) మహిళలకు రక్షణ నిచ్చి, ప్రాధాన్యతనందించారు. పురుషులతో పాటు సమాన హోదా.2) మహిళలకు రక్షణ నిచ్చి, హక్కులపై అవగాహన కల్పించి, అభివృద్ధి పథంలో నడిపించారు.
3) భూమిలేని రైతాంగానికి భూమిని పంచి, భూసంస్కరణలు, సమర్థంగా అమలుచేసారు.3) భూస్వాముల భూములను జపు చేసి, పేదలకు పంచి, భూసంస్కరణలు వినూత్న రీతిలో అమలుచేశారు.

తేడాలు :

గణతంత్ర రాజ్యంచైనా కమ్యూనిస్టు పార్టీ
1) సామ్యవాదం, జాతీయతావాదం, ప్రజాస్వామ్యం పునాదిగా ఏర్పాటు.1) భూస్వామ్య విధానం, సామ్రాజ్యవాదం వ్యతిరేకతతో ఏర్పాటు.
2) ప్రజలు కలిసి పనిచేసే సహజాత అలవాటు పెంపొందించుకోవాలని ఆశించారు.2) శ్రామికవర్గం ద్వారా విప్లవం వస్తుందని భావించారు.
3) పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు విస్తరించారు.3) రాజకీయ విద్య, అక్షరాస్యతను వ్యాపింపచేయటానికి వయోజన రైతాంగ పాఠశాలలు ఏర్పరచారు.
4) సామాజిక మూలాలు పట్టణాలలో ఉన్నాయి.4) సామాజికాభివృద్ధి ఛాయలు గ్రామీణ ప్రాంతాలలో ఉన్నాయి.
5) సైనిక దేశాన్ని నిర్మించారు.5) స్వతంత్రంగా ఉండే ప్రభుత్వం, సైన్యాలను ఏర్పరచారు.

ప్రశ్న 4.
ఈ అధ్యాయంలో చర్చించిన దేశాలన్నీ ప్రధానంగా వ్యవసాయం పైన ఆధారపడినవే. అందులోని పద్ధతులు మార్చటానికి , – ఈ దేశాలలో ఎటువంటి ప్రయత్నాలు జరిగాయి? (AS1)
జవాబు:
చైనా దేశంలో సయెట్-సెన్ వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేశాడు. రైతాంగాన్ని పట్టించుకోలేదు. దీనివల్ల నేలలు నిస్సారం కావడం, అడవులను నరికివెయ్యటం, వరదల వలన జీవావరణం దెబ్బతినడం వంటివి జరిగాయి. ఆ తదుపరి మావో జెడాంగ్ వ్యవసాయానికి ప్రాధాన్యతనిస్తూ, రైతాంగాన్ని సంఘటితం చేస్తూ రైతాంగ సైన్యాన్ని నిర్మించాడు. భూసంస్కరణలు అమలుచేసి, “పనిబృందాలు” ఏర్పరచి వ్యవసాయరంగాన్ని ప్రోత్సహించాడు.

అదే విధంగా వియత్నాంలో ఫ్రెంచివారి పాలనలో ఈ దేశాన్ని వరిని ఎగుమతి చేసే దేశంగా చేయడానికి గాను, సాగునీటి సదుపాయాల్ని మెరుగుపరచి, వరి, రబ్బరు వంటి వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కి సహకరించారు. నీటి పారుదల వసతులు వ్యవసాయానికి అందించి, అంతర్జాతీయ మార్కెట్లో వరి ఉత్పత్తి ఎగుమతిని పెంచారు. ఈ పద్దతుల వలన వియత్నాం ప్రపంచంలో 3వ అతి పెద్ద బియ్యం ఎగుమతిదారుగా మారింది.

అదే విధంగా నైజీరియాలో కూడా బానిసల వ్యాపారాన్ని నిషేధించిన పిదప, వ్యవసాయరంగానికి ప్రాధాన్యమిచ్చి, ఉత్పత్తులు పెంచడానికి కృషి చేసి అనేక పద్ధతుల ద్వారా “కోకో”, “పామాయిల్” వంటి వ్యవసాయ పంటలకు ప్రాధాన్యత ఇచ్చారు.

చమురు నిల్వల కోసం తవ్వకాల వలన పర్యావరణ జీవావరణం పాడైపోతుందని, కెన్ సారో వివా వంటివారు పర్యావరణ పరిరక్షణకు కృషి చేశారు.

AP Board 10th Class Social Solutions Chapter 15 వలస పాలిత ప్రాంతాలలో జాతి విముక్తి ఉద్యమాలు

ప్రశ్న 5.
పైన చర్చించిన దేశాలలో పరిశ్రమలు ఎవరి అధీనంలో ఉన్నాయి? ఈ పద్ధతులను మార్చటానికి ఎటువంటి ప్రయత్నాలు జరిగాయి? పోల్చటానికి ఒక పట్టికను తయారు చేయండి. (AS1)
జవాబు:
పరిశ్రమల మూలాలు ప్రధానంగా పట్టణ ప్రాంతాలలో ఉండేవి. పారిశ్రామిక ప్రగతి పరిమితం గానూ, నిదానం గానూ ఉంది. ఆధునిక ప్రగతికి కేంద్రాలుగా మారిన షాంఘై వంటి నగరాలలో 1919 నాటికి 5 లక్షల పారిశ్రామిక కార్మిక వర్గం ఏర్పడింది. ఈ పరిశ్రమలన్నీ శ్రామిక వర్గం ఆధీనంలో నడిచి, అభివృద్ధికి బాటలు వేశాయి. వీరిలో అధిక శాతం “మధ్యతరగతి పట్టణవాసులు”. వీరిలో వ్యాపారస్తులు, దుకాణదారులు ఉండేవారు.

చియాంగ్ కాలంలో ఫ్యాక్టరీ యజమానులను ప్రోత్సహించడానికి, కార్మిక సంఘాలను అణిచివెయ్యడానికి కూడా పూనుకున్నాడు.

వియత్నాంలో పండించిన పంటలు, వాణిజ్య సరుకుల రవాణా కోసం, పారిశ్రామిక ప్రగతి కల్పించడానికి గాను రోడ్డు, రైలు మార్గాలను అభివృద్ధి చేశారు.

నైజీరియాలో చమురు ముఖ్యమైన వనరు. చమురును ఎగుమతి చేసి ఆర్ధికంగా లాభపడింది. అయితే జీవావరణ వ్యవస్థపై పెను ప్రభావం చూపింది. దీనివల్ల తాగునీళ్ళు కలుషితమై ఆరోగ్య సమస్యలు ఏర్పడ్డాయి. దీనికిగాను గిరిజన ప్రజలు తిరుగుబాటు చేసి తమకు నష్టపరిహారం కావాలని కెన్ సారో వివా ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు.

ప్రశ్న 6.
భారతదేశం, నైజీరియాలలోని జాతీయ ఉద్యమాలను పోల్చండి. భారతదేశంలో ఇది ఎందుకు బలంగా ఉండింది? (AS1)
జవాబు:
భారతదేశ జాతీయ ఉగ్యమాలు ప్రపంచాన్ని ఆకర్షించాయి. 1600 సం|| నుండి బ్రిటిష్ వలస పాలనలో మ్రగ్గిన దేశాన్ని రక్షించడానికి భారతీయుల ప్రతిఘటన, 1857 తిరుగుబాటు, భారతీయ పునరుజ్జీవనం, భారతీయులలో జాతీయ చైతన్యం తదితర భావాలతో అన్ని వర్గాల ప్రజలు ఏకమైనారు. ఆంగ్లేయులు భారతదేశంలో ఆంగ్ల విద్యను ప్రవేశ పెట్టారు. ఆంగ్లభాష ద్వారా భారతీయులు స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, సమానత్వం వంటి అంశాలకు సంబంధించిన పాశ్చాత్యభావాలను తెలుసుకోగలిగారు. పాశ్చాత్య విద్యనభ్యసించిన ఈ భారతీయుల వల్లనే జాతీయవాద స్ఫూర్తి పెంపొందింది.

పాశ్చాత్య భావాల వల్ల, విలువల వల్ల ప్రభావితులైన ఆనాటి విద్యావంతులయిన భారతీయులు ప్రారంభించిన అనేక ఉద్యమాలలో బ్రహ్మ సమాజం, ఆర్య సమాజం, రామకృష్ణ మిషన్, దివ్యజ్ఞాన సమాజం, ఆలీఘడ్ ఉద్యమం ముఖ్యమైనవి. ఈ సంస్కరణ ఉద్యమాలు – భారతదేశానికి మత మౌఢ్యాల నుంచి, మూఢ విశ్వాసాల నుంచి భారతదేశానికి విముక్తి , కలిగించడానికి ప్రయత్నించాయి. భారతదేశంలో బ్రిటిష్ వారు విభజించు-పాలించు విధానం అమలుచేయడం ద్వారా భారతీయులలో బ్రిటిష్ వారి పట్ల ద్వేషం పెరిగింది. భారతదేశంలో ముడి పదార్థాలు, సుగంధ ద్రవ్యాల కొరకు పలసలను స్థాపించారు.

నైజర్ నదీ వ్యవస్థ కింద వివిధ తెగలు ఉంటున్న వేరువేరు ప్రాంతాలను ఒకటిగా చెయ్యటం ద్వారా బ్రిటిష్ వారు నైజీరియాను ఏర్పరచారు. ఈ దేశంలో ముస్లింలు అధికం. ఈబో, యెరుబా గిరిజన తెగలు ఉండేవి. నైజీరియాలో దేశ సహజ వనరులపై ప్రత్యేకించి చమురుపై ఆధిపత్య వలసలను స్థాపించారు. భారతదేశంలో (కలకత్తా) పశ్చిమబెంగాల్‌లో లాగోస్ వలస పాలనపై వ్యతిరేకతకు, నైజీరియా జాతీయతావాదానికి ఖండాంతర ఆఫ్రికా వాదానికి కేంద్రంగా ఉంది. మన దేశంలో లాగా ఆధునిక విద్యకు, పరిపాలన ఆధునీకరణకు ప్రోత్సాహం లభించింది. నైజీరియాలో కూడా విభజించు, పాలించు విధానం ద్వారా తమ దోపిడీ విధానాన్ని కొనసాగించారు. భారతదేశంలో జాతీయ కాంగ్రెస్, నైజీరియాలో మొదటి రాజకీయ పార్టీయైన నైజీరియా జాతీయ ప్రజాస్వామిక పార్టీ (NNDP) ని 1923లో హెర్బెర్ట్ మకాలే స్థాపించాడు. మీరు తీవ్రవాద దాడులకు కూడా మన దేశ అతివాదుల మాదిరిగా మారారు. గాంధీజీలా అక్కడ ఎన్ నంది అజికివె జాతీయ నాయకుడుగా మారారు. భారతదేశంలో లాగా నైజీరియా జాతీయవాదం ముందు రెండు కర్తవ్యాలు ఉన్నాయి. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం , వివిధ తెగల మధ్య ఐకమత్యం.

మన దేశానికి 1947లో స్వాతంత్ర్యం రాగా నైజీరియాకు 1963 అక్టోబర్ 1న స్వాతంత్ర్యం లభించింది. భారతదేశంలో జాతీయ ఉద్యమాలు బలంగా ఉండడానికి కారణం ప్రపంచం మెచ్చే మేధావులైన రాజకీయ నాయకులు, ప్రపంచంలోని మేధావులతో సంబంధాలు గలవారు ఉద్యమాలను నడిపించారు. ఉద్యమాలు 3 దశలుగా ఒక ప్రణాళికాబద్ధంగా నడిచాయి. అంతేకాకుండా అహింసా పద్ధతిలో ప్రజాస్వామ్యం, గణతంత్రం, లౌకిక విధానాలు రూపుదిద్దుకున్నాయి.

ప్రశ్న 7.
స్వతంత్ర నైజీరియా దేశం ఎదుర్కొన్న సవాళ్లు ఏమిటి? స్వతంత్ర భారతదేశం ఎదుర్కొన్న వాళ్లతో పోలికలు, తేడాలు ఏమిటి? (AS1)
జవాబు:
1963 అక్టోబర్ 1న నైజీరియా స్వాతంత్ర్యం పొందింది. దురదృష్టవశాత్తు ప్రస్వామిక న్యాయపూరిత సమతుల్యం సాధించలేకపోవడం వలన అనతి కాలంలోనే నైజీరియాలో పౌరయుద్ధం చెలరేగింది. ఫలితంగా సైనిక పాలన ఏర్పడింది. పౌర, ప్రజాస్వామిక ప్రభుత్వాలను ఏర్పాటు చెయ్యటానికి ఎన్నో ప్రయత్నాలు జరిగినా విఫలమైనాయి. సైనిక పాలనలో అవినీతి, మానవహక్కుల ఉల్లంఘన కొనసాగాయి. అవినీతి పాలకులకు మద్దతు ఇచ్చే బహుళజాతి చమురు కంపెనీలు, సైనిక ప్రభుత్వాలు ఇందులో భాగస్వామ్యం అయ్యాయి. చమురును వెలికితీయడం వలన వాతావరణ, జల కాలుష్యం పెరిగి ఈ దేశ ప్రజల అనేక నిరసనలకు, ఉద్యమాలకు నైజీరియా కారణమైంది.

పోలికలు

స్వతంత్ర భారతదేశంస్వతంత్ర నైజీరియా
1) 1950 నుండి ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా, లౌకిక రాజ్యంగా రూపొందింది.1) 1999 నుండి ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఎన్నుకుంది.
2) హత్యలు, దోపిడీ, దహనాలు యథేచ్ఛగా కొనసాగాయి.2) సైనికపాలన ఏర్పడి పౌరయుద్ధం కొనసాగింది.
3) స్వాతంత్ర్య సంపాదన అనంతరం మత ఘర్షణలు ఎక్కువయ్యాయి.3) ఇక్కడ కూడా బై ఫారియన్ వంటి యుద్ధాలు కొనసాగాయి.
4) పర్యావరణ సమస్యలు ఏర్పడ్డాయి.4) ఇక్కడ కూడా చమురు వల్ల సమస్యలు ఎక్కువయ్యాయి.

తేడాలు

స్వతంత్ర భారతదేశంస్వతంత్ర నైజీరియా
1) స్వాతంత్ర్యానంతరం దేశ అభివృద్ధి కొరకు మేధావులు రాజ్యాంగ రచనకు శ్రీకారం చుట్టారు.1) సైనిక పాలన వలన రాజ్యాంగ రచన జరగలేదు.
2) స్వాతంత్ర్యం సిద్ధింపచేసిన గాంధీజీ లాంటి జాతిపితను పొట్టన పెట్టుకున్నారు.2) హింసాకాండ జరిగినా జాతీయ నాయకుల మరణాలు లేవు.
3) స్వదేశీ సంస్థానాలను విలీనం చేయడం వలన విపరీత పరిణామాలు జరిగాయి.3) స్వదేశీ సంస్థానాలు లేవు.
4) 1947లో స్వాతంత్ర్యం సిద్ధించింది.4) 1999 నాటికి 50 సం||ల తర్వాత స్వాతంత్ర్యం సిద్ధించింది.
5) కోటి, 50 లక్షల మంది, హిందూ – ముస్లింలు నిర్వాసితులయ్యారు.5) ఇంత పెద్ద సంఖ్యలో జరగలేదు.

AP Board 10th Class Social Solutions Chapter 15 వలస పాలిత ప్రాంతాలలో జాతి విముక్తి ఉద్యమాలు

ప్రశ్న 8.
భారతదేశం, వియత్నాంల లాగా స్వాతంత్ర్యం కోసం నైజీరియా మరీ అంత కష్టపడాల్సి రాలేదు. దీనికి కొన్ని కారణాలను పేర్కొనండి. (AS1)
జవాబు:
పాశ్చాత్య విద్య సొందిన కొంతమంది మేధావులైన నైజీరియన్లు ఉమ్మడి నైజీరియా దేశం అన్న భావనను కలిగించి బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాడారు. నైజీరియా మొదటి రాజకీయ పార్టీ “నైజీరియా జాతీయ ప్రజాస్వామిక పార్టీ (NNDP) ని మకాలే స్థాపించిన పిదప, (1923లో) అది, 1923, 1928, 1933లో అన్ని స్థానాలను గెలుచుకుని బ్రిటిష్ వారికి పెను సవాళ్ళు విసిరింది. మకాలే బ్రిటిష్ వలస ప్రభుత్వంపై తీవ్రవాద దాడులను కూడా ప్రోత్సహించాడు. ఖండాంతర ఆఫ్రికా వాదం, ఖండాంతర నైజీరియా వాదం జాతీయ ఉద్యమానికి ప్రేరణ అయింది. దీంతో బ్రిటిష్ వారికి కనువిప్పు కలిగింది. 1945 నుండి సమ్మెలు, ఉద్యమాలతో జాతీయవాద కార్మికుల ఆధ్వర్యంలో ముందుకు నడిచారు.

రెండు లక్ష్యాలతో నైజీరియన్లు ఉద్యమాన్ని నడిపించారు. ఒకటి “బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాటం”. రెండు “వివిధ తెగల మధ్య ఐకమత్యం”. ఈ క్రమంలో ఉద్యమాన్ని ఉధృతం చేశారు.

1950 నాటికి నైజీరియాలోని 3 ప్రాంతాలలో 3 ప్రాంతీయ పార్టీలు ఏర్పడ్డాయి. ఉత్తర ప్రాంతంలో “సాంప్రదాయ భావాలతో కూడిన “ఉత్తర ప్రజల కాంగ్రెస్”, తూర్పు ప్రాంతంలో “నైజీరియా కెమరూన్ల జాతీయ సంఘం, పశ్చిమ ప్రాంతంలో యాక్షన్ గ్రూపు. వీటి ద్వారా నైజీరియా మరీ అంత కష్టపడాల్సి రాకుండా స్వాతంత్ర్యం పొందింది.

ప్రశ్న 9.
పైన చర్చించిన దేశాలలోని జాతీయ ఉద్యమాలలో పాఠశాల విద్య పాత్ర ఏమిటి? (AS6)
జవాబు:
జాతీయ ఉద్యమాలలో పాఠశాల విద్య ప్రముఖ పాత్ర వహించింది. చైనాలో సామాజిక, సాంస్కృతిక మార్పులకు సంధానంగా పాఠశాల విద్యకు అధిక ప్రాధాన్యం కల్పించారు. భూసంస్కరణలు సమర్థంగా అమలు చెయ్యడానికి, ఆర్ధిక సంస్కరణ కార్యక్రమంలో యువతకు అవగాహన కలిగించేందుకు గాను రాజకీయ విద్య, అక్షరాస్యతను వ్యాపింపజేయటానికి గాను పాఠశాల విద్యకు ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది. చైనా నవ చైతన్యానికి సాధించిన అద్భుత విజయాలకు చైనా భవిష్యత్తు ప్రగతికి బలమైన పునాదిగా నిలవడానికి అందరికీ పాఠశాల విద్య ప్రముఖపాత్ర వహించిందని మేధావులందరూ తమ అభిప్రాయాలను వ్యక్తీకరించారు.

వియత్నాంలో స్థానికులను నాగరికులుగా చెయ్యటానికి విద్య ఒక మార్గంగా భావించారు. విద్యావంతులైన ‘వియత్నామీయుల వలన ఫ్రెంచి పాలకుల ఆధిపత్యాన్ని ప్రశ్నించడానికి, టీచర్లు, దుకాణదారులు, పోలీసులు వంటి ఉద్యోగాలు పొందడానికి ప్రాథమిక విద్య, పాఠశాల విద్య కీలకమని ఆలోచించారు. ఈ విధంగా కొద్దిమంది మాత్రమే పాఠశాల విద్య పూర్తి చేసి అభివృద్ధి సాధించారు. వియత్నాం నుంచి ఫ్రెంచివాళ్ళను తరిమివేయడానికి, ఉన్నతులుగా వియత్నామీయులు మారడానికి గాను ఉన్నత పాఠశాల విద్య కొరకు జపాన్ వెళ్ళేవారు.

వలస పాలనతో దోపిడీకి గురై విభజించు – పాలించు విధానం ద్వారా, అవినీతి, అక్రమాలు ఎదిరించే క్రమంలో నైజీరియాలో ఆధునిక విద్యకు మరీ ముఖ్యంగా పాఠశాల విద్యకు ప్రాధాన్యమిచ్చారు. సమానత్వం, సామాజిక న్యాయం, మానవ గౌరవం వంటి సూత్రాలను పెంపొందించడానికి గాను పాఠశాల విద్య ప్రధాన భూమిక పోషిస్తుందని తలంచి, నైజీరియాలో ఈ విద్యకు ప్రముఖస్థానం కల్పించారు.

ప్రశ్న 10.
ఈ దేశాల స్వాతంత్ర్య పోరాటాలలో పాలకులపై యుద్ధాలు చేశారు. వాటి ప్రభావాన్ని క్లుప్తంగా వివరించండి. (AS1)
జవాబు:
చైనా గణతంత్ర, నూతన ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏర్పడి అగ్రదేశంగా మారినప్పటికీ, వలస పాలకుల చర్యల వలన , అనేక ఇబ్బందులకు గురైంది. 1937 – 1945 మధ్యకాలంలో చైనాపై జపాన్ దండెత్తి చాలా భూభాగాన్ని ఆక్రమించింది. క్రూర, వలస, సైనిక పాలనను జపాను అమలు చెయ్యటంతో చైనా సమాజం, ఆర్థిక పరిస్థితి దారుణంగా ప్రభావితమయ్యాయి. జపాన్ ఆక్రమణలను ప్రతిఘటించడానికి గుయోమిండాంగ్, సిసిపి చేతులు కలిపాయి.

వియత్నాంలో దేశభక్తి భావంతో సమాజ ప్రయోజనం కోసం పోరాడారు. వియత్నామీయులు తమ స్థానానికి ముప్పు వాటిల్లుతుందని భయపడే ఫ్రెంచి పాలకులతోను, స్థానిక సంపన్నులతోను పోరాడారు.

ఆగ్నేయ ఆసియాపై తన ఆధిపత్యం సాధించాలన్న సామ్రాజ్యవాద కాంక్షలో భాగంగా జపాను 1940లో వియత్నాంను ఆక్రమించింది. దాంతో జాతీయవాదులు ఫ్రెంచి వాళ్ళనే కాకుండా, జపనీయులతో కూడా తలపడవలసి వచ్చింది.

అప్పటికే రెండవ ప్రపంచయుద్ధంలో హిట్లర్ ఫ్రాన్స్ మొత్తాన్ని ఆక్రమించటం వలన ఫ్రెంచివారు బలహీనపడ్డారు. వియత్నాం స్వాతంత్ర్య సమితి జపనీయుల ఆక్రమణకు వ్యతిరేకంగా పోరాడి 1946 సెప్టెంబర్ లో హనాయ్ ని తిరిగి స్వాధీనం చేసుకుంది. తదుపరి అమెరికా యుద్ధంలో జోక్యం చేసుకోవడం వల్ల వియత్నామీయులకే కాకుండా, అమెరికాకు కూడా తీవ్ర నష్టం వాటిల్లింది.

రెండవ ప్రపంచయుద్ధం తరువాత నైజీరియా ఆర్థిక పరిస్థితి కష్టాలకు లోనవటంతో నైజీరియా ప్రజలు జాతీయతావాదం తీవ్రవాద భావాలకు గురయ్యారు. బ్రిటన్ తరపున పోరాడి సైనికులు, కార్మిక సంఘ నాయకులు నైజీరియా స్వాతంత్ర్యం కొరకు కృషి చేశారు.

10th Class Social Studies 15th Lesson వలస పాలిత ప్రాంతాలలో జాతి విముక్తి ఉద్యమాలు 1900-1950 : భాగం-II InText Questions and Answers

10th Class Social Textbook Page No.203

ప్రశ్న 1.
ఆయా దేశాల సాంప్రదాయ పాలకులు స్వాతంత్ర్యం కోసం పోరాడి ఉంటే ఎటువంటి రాజకీయ వ్యవస్థలు ఏర్పడి ఉండేవి?
జవాబు:
వలసపాలిత దేశాల సాంప్రదాయ పాలకులుగా ఉన్న రాజులు, చక్రవర్తులు స్వాతంత్ర్యం కోసం పోరాడి ఉంటే ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ వంటి రాజకీయ వ్యవస్థలు ఏర్పడి ఉండేవి.

10th Class Social Textbook Page No.210

ప్రశ్న 2.
బియ్యం ధరలు పడిపోవటంతో గ్రామీణ ఋణభారం ఎందుకు పెరిగింది?
జవాబు:
1930 ల నాటి ఆర్థికమాంద్యం వియత్నాంపై తీవ్ర ప్రభావాన్ని చూపించింది. బియ్యం ధరలు పడిపోయి, గ్రామీణ ఋణభారం పెరిగింది.

AP Board 10th Class Social Solutions Chapter 15 వలస పాలిత ప్రాంతాలలో జాతి విముక్తి ఉద్యమాలు

10th Class Social Textbook Page No.203

ప్రశ్న 3.
జాతీయతాభావం అంటే ఏమిటో, అది ఎలా రూపుదిద్దుకుందో అర్థం చేసుకోటానికి 9వ తరగతి పాఠ్యపుస్తకాన్ని మరొకసారి చదవండి.
జవాబు:
తమ దేశ సంస్కృతి, చరిత్ర, ఆర్థిక ప్రయోజనాలను కాపాడుతూ దేశ ఐక్యతకు పాటుపడడాన్ని జాతీయతాభావం అంటాం. జనాదరణ పొందిన కుటుంబ సంప్రదాయాలు, బానిసత్వాల రద్దు వంటి వాటివల్ల కూడా జాతీయతాభావం పెరిగింది. కళలు, కవిత్వం, కథలు, సంగీతం వంటివి జాతీయతాభావాన్ని మలచటంలో సహాయపడ్డాయి.

10th Class Social Textbook Page No.203

ప్రశ్న 4.
వలసపాలిత ప్రాంతాలలో ఏ సామాజిక వర్గాలు స్వాతంత్ర్యం కోసం పోరాడాయి ? సమానత్వం, ప్రజాస్వామ్యం అన్న భావనలు వాళ్ళకు ఎందుకు ముఖ్యం అయ్యాయి?
జవాబు:
వలసపాలిత ప్రాంతాలలో మధ్యతరగతివారు, కార్మికవర్గం, యువకులు, మహిళలు, మేధావులు, ఆయా దేశాల సాంప్రదాయ పాలకులు స్వాతంత్ర్యం కోసం పోరాడారు. కొన్ని దేశాలలోని అనుభవాలను, వలసపాలిత ప్రాంతాల లక్షలాది ప్రజల జీవితాలలో మార్పును అర్థం చేసుకోటానికి సమానత్వం, ప్రజాస్వామ్యం అన్న భావనలు వాళ్లకు చాలా ముఖ్యం అయ్యాయి.

10th Class Social Textbook Page No.204

ప్రశ్న 5.
యువ చైనీయులు పాత సాంప్రదాయాలను, విదేశీ శక్తులను ఎందుకు వ్యతిరేకించసాగారు?
జవాబు:
1919 మే 4న యువ చైనీయులు నిరసన ఉద్యమంగా చేపట్టి, పాత సాంప్రదాయాలను తిరస్కరించి, ఆధునిక విజ్ఞానశాస్త్రం, ప్రజాస్వామ్యం, జాతీయతావాదం ద్వారా చైనా ముందుకు వెళ్ళాలని యువత సంకల్పించింది. దేశ వనరులను నియంత్రిస్తున్న విదేశీయులను తరిమివెయ్యాలని, పేదరికాన్ని తగ్గించి, అసమానతలను తగ్గించాలని, సాధారణ భాష, లిపులను
అనుసరించడం, వివాహాలలో సమానత్వం, పేదరికాన్ని అంతం చేయటం వంటి వాటి కొరకు ఉద్యమించారు.

10th Class Social Textbook Page No.204

ప్రశ్న 6.
ఇటువంటిది ఏమైనా భారతదేశంలో జరిగిందా?
జవాబు:
భారతదేశంలో కూడా బ్రిటిష్ వాళ్ళ దోపిడీ విధానాన్ని నిరంకుశ పాలనకు, భారతీయుల దౌర్భాగ్యస్థితిని దూరం చేయడానికి అతివాదులుగా పేరొంది హింసామార్గంలో పయనించిన భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్, మరెందరో యువకులు వీరోచితంగా పోరాడారు. క్విట్ ఇండియా ఉద్యమకాలం (1942) లో గాంధీజీని అరెస్టు చేయగా, యువకులు, విద్యార్థులు, విశ్వవిద్యాలయాల విద్యార్థులు ఏకమై, వివిధ ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు మూసివేయించి, సహాయనిరాకరణ, విధ్వంసం వంటి అనేక పద్ధతుల ద్వారా స్వాతంత్ర్యం కోసం పోరాటం చేపట్టారు.

AP Board 10th Class Social Solutions Chapter 15 వలస పాలిత ప్రాంతాలలో జాతి విముక్తి ఉద్యమాలు

10th Class Social Textbook Page No.205

ప్రశ్న 7.
ఈ కాలంలో ఆవిర్భవించిన ముఖ్యమైన రాజకీయ పార్టీలు ఏవి?
జవాబు:
ఈ కాలంలో ఆవిర్భవించిన ముఖ్యమైన రాజకీయ పార్టీలు – “గుయోమిండాంగ్” (జాతీయ ప్రజాపార్టీ, దీనినే కె.ఎం.టి అనే వాళ్ళు) మరియు చైనా కమ్యూనిస్టు పార్టీ (సిసిపి). ఇవి దేశ ఐక్యత, సుస్థిరత సాధన అనే లక్ష్యాలతో ఏర్పడ్డాయి.

10th Class Social Textbook Page No.205

ప్రశ్న 8.
ఇటువంటి సమీకరణల్లో సభ్యులు ఎవరు?
జవాబు:
ఆధునిక ప్రగతికి కేంద్రాలుగా మారిన షాంఘై వంటి నగరాలలో 1919 నాటికి 5 లక్షల పారిశ్రామిక కార్మిక వర్గం ఏర్పడింది. వీరిలో అధికశాతం మధ్యతరగతి పట్టణవాసులు (సియావో షిమిన్) గా పరిగణింపబడే వ్యాపారస్తులు దుకాణదారులు ఉన్నారు.

10th Class Social Textbook Page No.205

ప్రశ్న 9.
వాళ్ళు ఆశించిన సామాజిక, ఆర్థిక మార్పుల స్వరూపం ఏమిటి?
జవాబు:
వాళ్ళు కూడు, గుడ్డ, ఇల్లు, రవాణా అన్నవి 4 ప్రధాన అవసరాలుగా గుర్తించారు. స్వేచ్చాభావనలు ఆదరణ పొందటంతో మహిళల హక్కుల గురించి, సమానత్వం పునాదిపై కుటుంబాలను నిర్మించటం, ప్రేమ వంటి వాటి గురించి ఆలోచించడం, చర్చించటం మొదలు పెట్టారు. ఫ్యాక్టరీ యజమానులకు ప్రోత్సాహకంగా కార్మిక సంఘాలను అణగదొక్కారు. పెట్టుబడిని నియంత్రించి, భూమి సమాన పంపిణీకి ప్రాధాన్యం ఇచ్చారు.

10th Class Social Textbook Page No.207

ప్రశ్న 10.
దేశ అభివృద్ధికి, స్వాతంత్ర్యానికి స్త్రీ, పురుషులకు, సమాన అవకాశాలు, వాళ్ల సమాన భాగస్వామ్యం అవసరమన్న దృక్పథంతో మీరు ఏకీభవిస్తారా?
జవాబు:
దేశ అభివృద్ధికి, స్వాతంత్ర్యానికి స్త్రీ, పురుషులకు సమాన అవకాశాలు, వాళ్ళ సమాన భాగస్వామ్యం అవసరమన్న దృక్పథంతో నేను అంగీకరిస్తాను. ప్రస్తుతం, శాస్త్ర సాంకేతిక రంగాలలో పురుషులతో పాటు స్త్రీలు ప్రధానభూమిక పోషిస్తున్నారు.

దేశ అభివృద్ధిలో స్త్రీలు తమ మేధాశక్తి, యుక్తులతో అపూర్వ సేవ చేస్తున్నారు. కాబట్టి ఈ దృక్పథంతో నేను ఏకీభవిస్తున్నాను.

10th Class Social Textbook Page No.209

ప్రశ్న 11.
భూమి లేని రైతాంగానికీ, భూమి లేని కార్మికునికీ మధ్య తేడా ఏమిటి?
జవాబు:
కొంతమంది రైతులు తమకు భూమి లేకపోయినా, భూస్వాముల నుంచి భూమి తీసుకొని కౌలు చేసేవారు. వాస్తవానికి భూమి వాళ్ళది కాదు. దీనివలన వారు కౌలు చెల్లించడమే కాకుండా, భూస్వాముల ఇళ్ళల్లోనూ, పొలాల్లోనూ పనిచేసి దుర్భర జీవనం గడిపేవారు.
అదే విధంగా కార్మికులు, యంత్రాలలో వివిధ పరిశ్రమలలో, శ్రమ ద్వారా జీవనం సాగిస్తుంటారు. వాస్తవంగా వాళ్ళ ఆధీనంలో భూమి ఉండదు. వ్యవసాయానికి సంబంధించి అవగాహన తక్కువ.

AP Board 10th Class Social Solutions Chapter 15 వలస పాలిత ప్రాంతాలలో జాతి విముక్తి ఉద్యమాలు

10th Class Social Textbook Page No.210

ప్రశ్న 12.
స్వతంత్ర వియత్నాం ప్రభుత్వం తీసుకున్న మొదటి చర్యలలో భూమి కౌలు తగ్గించటం ఒకటి. ఈ చర్య ఎందుకు చేపట్టారు?
జవాబు:
గ్రామీణ ప్రాంతాల్లో భూస్వామ్యం పెరిగి పెద్ద పెద్ద భూస్వాములు చిన్న రైతుల భూములను చేజిక్కించుకుని వారితో కౌలు రైతులుగా పనిచేయించుకునే వాళ్ళు. ఫలితంగా రైతాంగ జీవన ప్రమాణం పడిపోయింది. కౌలు రైతులు అప్పుల విషవలయంలో చిక్కుకుపోయి బయటపడలేకపోయేవారు. అన్నాం అనే ప్రాంతంలో సుమారు 53% కుటుంబాలకు అసలు ఏమాత్రం భూమి లేదు. ఈ కారణాలతో వియత్నాం ప్రభుత్వంవారు అధికంగా ఉన్న కౌలు భూములు మిగతావారికి పంచడానికి కృషి చేశారు. వారి దుర్భర జీవితాలను దూరం చేయ్యడానికి గాను భూమి కౌలు తగ్గించారు.

10th Class Social Textbook Page No.211

ప్రశ్న 13.
ఇటువంటి భూసంస్కరణలు వియత్నాం సమాజంపై ఎటువంటి ప్రభావాన్ని చూపి ఉంటాయి ? గ్రామీణ ప్రాంతాలలోని వివిధ సామాజిక వర్గాల దృష్ట్యా దీనిని చర్చించండి.
జవాబు:
ఇటువంటి భూసంస్కరణల వలన భూస్వాముల చేతుల్లో ఉన్న వేల ఎకరాలను సేకరించి, పేద, మధ్యతరగతి రైతాంగానికి పునఃపంపిణీ చేయడం జరిగింది. రైతాంగ సంఘాలు ఏర్పడి, గ్రామీణ ప్రాంతాలలో వారు నాయకులుగా మారి మంచి – పాలన అందించడానికి ప్రయత్నం చేశారు. వెట్టిచాకిరి, వెట్టి కార్మికులు పోయి, అప్పుల బాధ తొలగి రైతాంగం ఆనందకర జీవనం కొనసాగించారు. ఏమాత్రం అసలు భూమి లేని 79% ప్రజలు ఈ సంస్కరణల వలన లబ్ధి పొందారు.

10th Class Social Textbook Page No.219

ప్రశ్న 14.
అమెరికా అంతటి బలమైన దేశాన్ని వియత్నాం వంటి చిన్నదేశం ఎలా ఎదిరించగలిగింది?
జవాబు:
ప్రతిఘటనకి, ఇల్లు, కుటుంబాలను త్యాగం చెయ్యటానికి, దారుణ పరిస్థితులలో జీవించటానికి, స్వాతంత్ర్యం కోసం పోరాడడానికి వీలుగా ప్రజలకు జాతీయతాభావం ఇచ్చిన ప్రేరణ వల్లే అమెరికాను వియత్నాం ఢీకొంది. భూస్వాముల చేతులలో తరాలపాటు దోపిడీకి గురయి, అప్పుడే కొంత భూమిని పొందిన లక్షలాది పేద రైతాంగం నిబద్ధతతో అమెరికాను , ఎదిరించింది. జాతీయతాభావంతో ప్రేరణ భూసంస్కరణలతో ఉత్సాహం పొందిన ఈ పేద రైతాంగం ప్రపంచంలో కెల్లా – మేటి సైన్యాన్ని ఓడించడంలో కీలకపాత్ర పోషించింది.

10th Class Social Textbook Page No.217

ప్రశ్న 15.
నైజీరియాలోని చమురు వనరులలో అధికభాగం ఆగ్నేయ భాగంలో ఉన్నాయి. చమురు లాభాలలోని అధిక భాగం తమకు చెందాలని ఈ బూలు భావిస్తారు. చమురు సంపదతో ఉత్తర ప్రాంతాన్ని అభివృద్ధి చెయ్యటాన్ని వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. ఈ సమస్యకు సరైన, న్యాయపూరితమైన పరిష్కారం ఏమిటి?
జవాబు:
నైజీరియాలోని చమురు నిల్వలలో అధిక వనరులు ఈబూలకే చెందాలి. ఎందుకంటే ఇక్కడ ఈ తెగవారే అధికులు. మరియు వెనుకబడిన అవిద్యావంతులు, నిరుద్యోగులు, ఉత్తర ప్రాంతంలో ఇంతకు ముందే ముస్లింలు అధికంగా ఉండి, ఉపాధి అవకాశాలు కలిగి ఉన్నారు. కాబట్టి అధికభాగం చమురు లాభాలు ఈబూలకే చెందాలి.

10th Class Social Textbook Page No.202

ప్రశ్న 16.
క్రింది పటాన్ని పరిశీలించి ప్రశ్నలకు జవాబులు వ్రాయండి.
AP Board 10tha Class Social Solutions Chapter 15 వలస పాలిత ప్రాంతాలలో జాతి విముక్తి ఉద్యమాలు 1
1) బ్రిటన్‌కి చెందిన వలసలలో ఆసియాలో ఒక ప్రాంతాన్ని, ఆఫ్రికాలో మరొక ప్రాంతాన్ని గుర్తించండి.
జవాబు:
భారతదేశం, దక్షిణాఫ్రికా

2) హాలెండ్ కి చెందిన ఒక ఆసియా, ఒక ఆఫ్రికా వలస ప్రాంతాన్ని గుర్తించండి.
జవాబు:
ఇండోనేషియా, పశ్చిమ సహారా

3) ఫ్రాన్స్ కి చెందిన ఒక ఆసియా, ఒక ఆఫ్రికా వలస ప్రాంతాన్ని గుర్తించండి.
జవాబు:
కాంబోడియా, మొరాకో.

4) ఏ దేశానికి వలసపాలిత ప్రాంతంగా లేని ఆసియాలో రెండు దేశాలను, ఆఫ్రికాలో ఒక దేశాన్ని గుర్తించండి.
జవాబు:
చైనా, రష్యా, ఇథియోపియా

5) ఆస్ట్రేలియా ఏ దేశానికి వలసపాలిత ప్రాంతంగా ఉంది?
జవాబు:
ఇంగ్లాండ్

10th Class Social Textbook Page No.207

ప్రశ్న 17.
యుద్ధంలో గెలవటానికి సిసిపికి భూసంస్కరణలు ఎలా దోహదపడ్డాయి?
జవాబు:
విదేశీ సామ్రాజ్యవాదంపై పోరాడటానికి, భూస్వాముల భూమిని స్వాధీనం చేసుకొని పునఃపంపిణీ చెయ్యటం ద్వారా బలమైన రైతాంగ సంఘాలను సిసిపి నిర్మించింది. గ్రామాలలో ఉంటున్న అందరి వర్గాలను గుర్తించడం, తరువాత భూస్వాముల భూమి, ఇతర ఉత్పాదక ఆస్తులను స్వాధీనం చేసుకుని తిరిగి పంచటం వంటివి దీంట్లో ముఖ్యమైన దశలు. దీనికై “భూసంస్కరణల సంఘాన్ని ఏర్పరచారు. దీని ద్వారా స్థానిక నాయకత్వ స్థానాలకు వాటి నుంచి క్రియాశీలక సభ్యులను ఎంపిక చెయ్యటం వాటి ముఖ్య విధుల్లో భాగంగా ఉండేవి. ఇది ప్రధానంగా పేద, మధ్య తరగతి రైతాంగం నుంచి ఏర్పడింది. ఈ విధంగా భూసంస్కరణల కారణంగా అత్యధికుల మన్ననలు పొందడంతో, యుద్ధంలో గెలవటానికి అవకాశం ఏర్పడింది.

AP Board 10th Class Social Solutions Chapter 15 వలస పాలిత ప్రాంతాలలో జాతి విముక్తి ఉద్యమాలు

10th Class Social Textbook Page No.207

ప్రశ్న 18.
భారతదేశంలో అమలు అయిన భూసంస్కరణలను చైనాలో జరిగిన వాటితో పోల్చండి. వాటి మధ్య పోలికలు, తేడాలను పేర్కొనండి.
జవాబు:
భారతదేశంలో అమలు జరిగిన భూసంస్కరణలు లోపభూయిష్టంగా ఉండేవి. జమీందారుల ఆధీనంలో సాగుచేస్తున్న కౌలుదారులను ప్రభుత్వం భూయజమానులుగా గుర్తించింది. కానీ జమీందారులకు పెద్ద మొత్తంలో వెల చెల్లించాల్సి ఉన్నందున దానిని వారు కట్టలేక వారు కౌలుదారులుగా, వ్యవసాయ కూలీలుగానే ఉండిపోయారు. చైనాలో అలా కాకుండా భూస్వాముల భూమి నంతటినీ స్వాధీనం చేసుకొని పునఃపంపిణీ చేశారు.

భారతదేశంలో జమీందారుల ఆధీనంలో ఉన్న మిగులు భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. అందువలన చాలామంది జమీందారులు తమ బంధువులు, దూరపు బంధువుల పేరున రాయించుకున్నారు. అటవీ, బంజరు భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని తెలిసి, అటవీ భూములలో గల చెట్లు నరికి, అమ్మి అధికాదాయం జమీందారులు పొందగలిగారు.

చైనాలో అలా కాకుండా పేద, మధ్యతరగతి ప్రజలనే భూసంస్కరణ సంఘాలు ఏర్పరచి, వారినే నాయకులుగా గుర్తించి, ‘పని బృందాలు’ ఏర్పరచి, “రైతాంగ సంఘాల” నిర్మాణం ద్వారా ప్రణాళికా బద్ధంగా భూసంస్కరణలు అమలుచేసి ఆ దేశం అద్భుత విజయాలకు నిలయమైంది.

10th Class Social Textbook Page No.209

ప్రశ్న 19.
వియత్నాంలో రైలు మార్గాలను, కాలవలను ఫ్రెంచివాళ్ళు ఎందుకు అభివృద్ధి చేశారు?
జవాబు:
వియత్నాంని వరిని ఎగుమతి చేసే దేశంగా అభివృద్ధి చెయ్యాలని ఫ్రెంచి చాలా ఆసక్తి చూపించింది. ఇందులకై సాగునీటి సదుపాయాల్ని మెరుగుపరచాలని, మెకాంగ్ డెల్టా ప్రాంతంలో సాగు విస్తీర్ణాన్ని పెంచటానికి ఫ్రెంచివాళ్ళు బీడు భూముల నుంచి నీటిని తోడి కాలువల నిర్మాణం చేపట్టారు. తద్వారా వరి ఉత్పత్తి అంతర్జాతీయ మార్కెట్లో ఎగుమతి చెయ్యడం సాధ్యమైంది.

అదే విధంగా 1931 నాటికి వియత్నాం ప్రపంచంలో మూడవ అతి పెద్ద బియ్యం ఎగుమతిదారుగా ఎదిగింది. దీనితోపాటు వాణిజ్య సరుకుల రవాణా కోసం, సైనిక కేంద్రాలను తరలించటానికి, మొత్తం ప్రాంతాన్ని తమ అదుపులో పెట్టుకోడానికి గాను మౌలిక సదుపాయాలు అనగా రోడ్డు, రైలుమార్గాలను అభివృద్ధి చేశారు.

10th Class Social Textbook Page No.209

ప్రశ్న 20.
బ్రిటిష్ పాలనలోని భారతదేశ రైతాంగ పరిస్థితి గురించి మీరు చదివారు. వియత్నాం రైతాంగ స్థితికీ, దీనికీ పోలికలు ఏమిటి?
జవాబు:
బ్రిటిష్ పాలనలోని భారతదేశ రైతాంగ పరిస్థితి దారుణంగా ఉండేది. వియత్నాంలో కూడా రైతాంగ స్థితిలో అటువంటి ‘ దుర్భర పరిస్థితులే ఉన్నాయి. కాబట్టి వీటి మధ్య పోలికలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి.

పోలికలు: భారతదేశంలో బ్రిటిష్ వారి కాలంలో భూస్వాములు, జమీందారులు సన్నకారు రైతుల భూములను చేజిక్కించుకొనడం, లేదా నామమాత్రం భూములు ఇచ్చి, దానికి అధికంగా శిస్తులు విధించడంతో వాటిని ఆ చిన్న రైతులు కట్టలేక, పంట ఫలాలు అందక దుర్భర పరిస్థితులు అనుభవించారు.

వియత్నాంలో కూడా పెద్ద భూస్వాములు చిన్న రైతుల భూములను చేజిక్కించుకుని కౌలు రైతులుగా మార్చి జీవనం దిగజార్చారు.

భారతదేశంలో బలవంతపు వ్యవసాయం బ్రిటిష్ వాళ్ళు అమలుచేశారు. ఆహారపంటలకు బదులు వాణిజ్య పంటలు వేసి ఇబ్బందులకు గురి చేయించారు. వియత్నాంలో కూడా బలవంతంగా వరి, రబ్బరు వంటి పంటలను తమ స్వలాభం కోసం వేయించారు.

భారతదేశంలో వ్యవసాయం చేయలేక, అప్పులకు వడ్డీ చెల్లించలేక రైతులు ఆత్మహత్యలు చేసుకోగా, మరికొందరు వెట్టి కార్మికులుగా, వ్యవసాయ కూలీలుగా మారారు, వియత్నాం రైతుల్లో కూడా వ్యవసాయం చేయలేక చనిపోయినవారు, నలిగిపోయినవారు, తిండి లేక అలమటించినవారున్నారు.

AP Board 10th Class Social Solutions Chapter 15 వలస పాలిత ప్రాంతాలలో జాతి విముక్తి ఉద్యమాలు

10th Class Social Textbook Page No.209

ప్రశ్న 21.
భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు అనుసరించిన విధానాన్ని గుర్తుచేసుకోడానికి ప్రయత్నించండి. భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు, వియత్నాంలో ఫ్రెంచివాళ్ళు అనుసరించిన వలసపాలన విధానాలను పోల్చండి. వాటి మధ్య పోలికలు, తేడాలు ఏమిటి?
జవాబు:
భారతదేశంలో బ్రిటిష్ వారు, వియత్నాంలో ఫ్రెంచివారు అనుసరించిన వలసపాలనలో పోలికలు తేడాలు ఉన్నాయి. ముందుగా పోలికలు చూద్దాం.

పోలికలు:

బ్రిటిష్ వారు (భారత్)ఫ్రెంచివారు (వియత్నాం)
1) వీరు భారతదేశ రాజులను, చక్రవర్తులను కీలు బొమ్మలుగా మార్చి వ్యాపార రీత్యా వచ్చి స్థిరపడ్డారు.1) వీరు కూడా వియత్నాం చక్రవర్తిని లోబరుచుకొని తమ దోపిడీ విధానాన్ని అనుసరించారు.
2) భారత్ లో రోడ్డు, రైలు, జల మార్గాలను తమ ఉత్పత్తుల మార్కెట్ కొరకు, వాణిజ్య పంటలకు ఎగుమతుల కొరకు అభివృద్ధి చేశారు.2) ఫ్రెంచివారు కూడా వరి, రబ్బరు ఉత్పత్తులను ప్రపంచానికి ఎగుమతి చేసి ధనాన్ని కూడబెట్టాలని ఆశించారు.
3) వీరు విభజించు – పాలించు విధానం అమలుచేశారు.3) ఫ్రెంచివారు కూడా ఈ విధానాన్నే అనుసరించారు.
4) ఇక్కడ భూస్వాములు, చిన్న రైతుల భూములను ఆక్రమించి వారిని వ్యవసాయ కూలీలుగా మార్చారు.4) వియత్నాంలో కూడా ఫ్రెంచివారు రైతుల భూములను ఆక్రమించి వారిని పెట్టి కార్మికులుగా మార్చారు.
5) భారతీయులు అనాగరికులని వీరు భావించారు. మూఢనమ్మకాలు, సంప్రదాయ పద్ధతులకు దూరంగా ఉంచడానికి ప్రయత్నించారు.5) ఫ్రెంచివారు కూడా వియత్నాం వాసులకు అనాగరికులుగా భావించి, ఆధునిక నాగరికత ఫలాలు అందించడానికి కృషి చేశారు.

తేడాలు :

బ్రిటిష్ వారు (భారత్)ఫ్రెంచివారు (వియత్నాం)
1) సుదీర్ఘకాలం దోపిడీకి గురైంది.1) ఎక్కువకాలం కొనసాగలేదు.
2) అనేక రాజకీయ, సంస్కరణ ఉద్యమాలు, అనేక సమాజాలు, సంస్థలు ఏర్పడి బ్రిటిష్ వారి దోపిడీకి వ్యతిరేకంగా పోరాడాయి.2) ఇన్ని సంస్థలు, ఇంత స్థాయిలో జరగలేదు.
3) మహిళలు, యువకులు, విద్యావంతులు, మేధావులు అధిక సంఖ్యలో పాల్గొని బ్రిటిష్ వారిని ఎదిరించారు.3) మహిళల పాత్ర తక్కువ.
4) ఒక ప్రణాళికాబద్ధంగా 30 దశలుగా ఉద్యమాన్ని నడిపించారు.4) ఫ్రెంచ్లో అలా జరగలేదు.
5) ఇక్కడ అన్ని వర్గాల ప్రజలు ఆంగ్ల విద్యను అభ్యసించారు.5) ఇక్కడ సంపన్న వియత్నామీయుల పిల్లలే ఫ్రెంచి బడిలో చదివారు.

10th Class Social Textbook Page No.210

ప్రశ్న 22.
వియత్నాం, చైనాలలో జాతీయతావాదం ఏర్పడటంతో యువత, విద్యార్థులు ముఖ్యపాత్ర పోషించారు. వీటి మధ్య పోలికలు, తేడాలను చర్చించండి.
జవాబు:
చైనా యువత, విద్యార్థులు :
చైనాలో యువత 1919 మే 4న వర్సయిల్స్ శాంతి సమావేశం నిర్ణయాలను నిరసిస్తూ నిరసన ప్రదర్శనలు చేపట్టారు. బ్రిటన్, పక్షాన చైనా ఉన్నప్పటికి జపాన్ ఆధీనంలో ఉన్న ప్రాంతాలు చైనాకు రాలేదు.

పాత సంప్రదాయాలను తిరస్కరించి, ఆధునిక విజ్ఞానం, ప్రజాస్వామ్యం, జాతీయతావాదం ద్వారా చైనా ముందుకు వెళ్ళాలని, దేశ వనరులను నియంత్రిస్తున్న విదేశీయులను తరిమెయ్యాలని, పేదరికాన్ని తగ్గించి, అసమానతలను తగ్గించాలని యువత కోరుకుంది. సాధారణ భాష, లిపిలను అనుసరించడం, మహిళలపై ఉన్న దురాచారాలను దూరం చెయ్యాలని యువత, విద్యార్థులు సంకల్పించారు. పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు విస్తరించడంతో సామాజిక సాంస్కృతిక మార్పులకు ఊతం ఇచ్చింది.

వియత్నాం విద్యార్థులు, యువత :

కార్యాలయాలలో ఉద్యోగాలకు వియత్నామీయులను అనర్హుల్ని చేసేలా ఉన్న వలస ప్రభుత్వ ప్రయత్నాలను విద్యార్థులు ప్రతిఘటించసాగారు. “దేశభక్తి భావంతో సమాజ ప్రయోజనం కోసం పోరాడటం విద్యావంతుల విధి” అన్న నమ్మకంతో వారు ప్రేరణ పొందారు. కనుకనే వారు సంపన్నులతోను, ఫ్రెంచి పాలకులతోను ఘర్షణ పడ్డారు. 1920 ల నాటికి విద్యార్థులు “యువ అన్నాం” పార్టీ వంటి రాజకీయ పార్టీలను ఏర్పాటుచేసి, “అన్నామీస్ స్టూడెంట్” వంటి పత్రికలను ప్రచురించారు. వియత్నాం దేశంలో యువత, విద్యార్థుల ప్రధాన ఉద్దేశం- “వియత్నాం నుండి ఫ్రెంచి వాళ్ళను తరిమివెయ్యడం”. కీలుబొమ్మ చక్రవర్తిని తొలగించి, అంతకుముందు ఫ్రెంచివాళ్ళు పడదోసిన “ఎ గుయెన్” వంశాన్ని తిరిగి అధికారంలోనికి తీసుకురావడం.

AP Board 10th Class Social Solutions Chapter 15 వలస పాలిత ప్రాంతాలలో జాతి విముక్తి ఉద్యమాలు

10th Class Social Textbook Page No.211

ప్రశ్న 23.
చైనా, వియత్నాం , భారతదేశాలలోని భూసంస్కరణల తీరును పోల్చండి.
జవాబు:
1) చైనాలో భూసంస్కరణలు :
చైనాలోని భూసంస్కరణలలో ప్రధానాంశం ఏమనగా …….. గ్రామాలలోని ప్రజలందరి వర్గాలను ముందుగా గుర్తించటం, మరియు భూస్వాముల యొక్క భూమి, ఇతర ఆస్తులను జప్తు చేయుట ద్వారా కాని మరే విధంగానైనా ప్రభుత్వం స్వాధీనం చేసుకొని తిరిగి వాటిని ప్రజలకు పంచటం అనేది ముఖ్యమైనది.

2) వియత్నాంలో భూసంస్కరణలు :
భూమి కౌలును 25 శాతానికి తగ్గించారు. భూమిని తిరిగి మళ్లీ (మారు) కౌలుకు ఇవ్వటాన్ని నిషేధించారు. 1945 ఆగష్టు నాటికి ఉన్న కౌలుదార్లు కౌలు బకాయిలన్నింటిని మాఫీ చేశారు. మరియు కౌలుదార్లు భూ యజమానులు అయ్యారు.

3) భారతదేశంలో భూసంస్కరణలు :
చైనా, వియత్నాంలలో అమలైనటువంటి భూసంస్కరణలేవి భారతదేశములో అమలు జరగలేదు. భూ ఒడంబడిక విధానంలో కొన్ని మార్పులు మాత్రమే జరిగాయి.

10th Class Social Textbook Page No.213

ప్రశ్న 24.
పౌరులపైన, అడవుల మీద నాపాలం, ఏజెంట్ ఆరెంజ్ వంటి రసాయనిక ఆయుధాలను అమెరికా ఉపయోగించటం సరైనదేనా?
జవాబు:
పౌరులపైన, అడవుల మీద నాపాలం, ఏజెంట్ ఆరెంజ్ వంటి రసాయనిక ఆయుధాలను అమెరికా ఉపయోగించడం అమెరికా వంటి అగ్రదేశాలకు తగదు. కమ్యూనిస్టుల ప్రాబల్యం పెరుగుతుందన్న ఆందోళనతో అమెరికా ప్రవర్తించిన తీరు దారుణమైంది. అత్యంత శక్తిమంతమైన వైమానిక బాంబర్లు అయిన బి52 విమానం రసాయనిక ఆయుధాల వినియోగంతో – నాపాలం (మనుషులకు తీవ్ర నష్టం కలిగించే ప్రమాదకరమైన బాంబు), ఏజెంట్ ఆరెంజ్ (చెట్లు, మొక్కలను చంపేసి భూమిని చాలా సం॥లు బీడుగా మార్చివేశాయి), భాస్వరం బాంబులతో అనేక గ్రామాలు ధ్వంసమయ్యాయి. అడవులు నాశనమైనాయి. వేల సంఖ్యలో పౌరులు చనిపోయారు. మానవాళి మనుగడకు తీవ్ర విపత్తులు సంభవించే విధంగా ఉన్నా అమెరికా దుశ్చర్యను ప్రపంచం యావత్తు విమర్శించింది. అమెరికా చర్యలను ఎండగట్టింది.

10th Class Social Textbook Page No.213

ప్రశ్న 25.
వియత్నాం నుంచి అమెరికా ప్రభుత్వం విరమించుకోవటంలో ఆ దేశంలోని శాంతి ఉద్యమం పాత్ర ఏమిటి?
జవాబు:
వియత్నాం నుంచి అమెరికా ప్రభుత్వం విరమించుకోవటంలో ఆ దేశంలోని శాంతి ఉద్యమం ప్రముఖ పాత్ర వహించింది. యుద్ధంలో అమెరికా జోక్యం చేసుకోవడం వల్ల వియత్నామీయులకే కాకుండా అమెరికాకు కూడా చాలా భారంగా పరిణమించింది. తనకు సంబంధం లేని యుద్ధంలో అమెరికా జోక్యం చేసుకున్నందుకు ప్రభుత్వాన్ని విమర్శించారు. యుద్ధం కోసం యువతను సైన్యంలోకి తీసుకురావడంతో అక్కడ వ్యతిరేకత ఇంకా పెరిగింది. యుద్ధం దీర్ఘకాలం కొనసాగడంతో అమెరికాలో దాని పట్ల బలమైన నిరసనలు వెల్లువెత్తసాగాయి. ప్రభుత్వ విధానాన్ని సర్వత్రా ప్రశ్నించటంతో అంతిమంగా యుద్ధ ముగింపు సంప్రదింపులు చేపట్టేలా చేసింది.

10th Class Social Textbook Page No.215

ప్రశ్న 26.
జాతీయతావాదానికీ, ఖండాంతర ఆఫ్రికా భావానికి మధ్య తేడాలు ఏమిటో చర్చించండి. జాతీయతావాదం అన్నది పరిమితమైన భావమా?
జవాబు:
తమ దేశ సంస్కృతి, చరిత్ర, ఆర్థిక ప్రయోజనాలను కాపాడుతూ దేశ ఐక్యతకు పాటుపడడాన్ని “జాతీయతావాదం” అంటారు.

దేశ, తెగ తేడాలు లేకుండా ఆఫ్రికా ప్రజలందరినీ ఒకటిగా చెయ్యటానికి ఖండాంతర ఆఫ్రికా వాదం ప్రయత్నిస్తుంది.

ఆఫ్రికా భావం ముందు జాతీయతావాదం అన్నది పరిమితమైన భావం. ఎందుకంటే ఐకమత్యంతో వలసపాలనను, జాతి వివక్షతను వ్యతిరేకించటమే కాకుండా సమానత్వం, సామాజిక న్యాయం, మానవ గౌరవం అన్న సూత్రాల ఆధారంగా ఆఫ్రికా ఖండంలోని అన్ని తెగలు, ప్రజల సమూహాల మధ్య ఐకమత్యం సాధించటానికి ఆఫ్రికా భావం ప్రయత్నిస్తుంది.

AP Board 10th Class Social Solutions Chapter 15 వలస పాలిత ప్రాంతాలలో జాతి విముక్తి ఉద్యమాలు

10th Class Social Textbook Page No.215

ప్రశ్న 27.
ఒక శతాబ్దకాల వలసపాలన వల్ల ప్రాంతాల మధ్య అసమానతలు నెలకొన్నాయి. భారతదేశంలో కూడా బ్రిటిష్ పాలనలో కోస్తా ప్రాంతాలైన బెంగాలు, మద్రాసు, బొంబాయి వంటివి వేగంగా అభివృద్ధి చెందాయి. అభివృద్ధిలో ఇలా అసమానతలు ఎందుకు చోటు చేసుకుంటాయి?
జవాబు:
శతాబ్ద కాల వలసపాలన వల్ల ప్రాంతాల మధ్య అసమానతలు నెలకొన్నాయి. ఎందుకంటే వలస పాలకులు తమ వ్యాపార అభివృద్ధికి, తమ దోపిడీ విధానాన్ని కొనసాగించడానికి తగ్గట్లు పాలించారు. భారతదేశంలో కూడా బెంగాలు, మద్రాసు, బొంబాయి వంటివి వేగంగా అభివృద్ధి చెందాయి. ఎందుకంటే ఈ నగరాలు, రవాణా, రోడ్డు మార్గాలకు అనుకూలంగా ఉండడం వల్ల తమ పరిపాలన కేంద్రాలుగా ఈ నగరాలను అభివృద్ధి చేశారు. ఇటువంటి నగరాలలో విద్యావంతులైన మేధావులు, వివిధ సంస్థలు, సమాజాలు కూడా వలస పాలితులను ఎదిరించడం వలన అభివృద్ధి పథంలో నడిపించక తప్పలేదు.

AP Board 10th Class Social Solutions Chapter 14 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-II

SCERT AP 10th Class Social Study Material Pdf 14th Lesson ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-II Textbook Questions and Answers.

AP State Syllabus 10th Class Social Solutions 14th Lesson ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-II

10th Class Social Studies 14th Lesson ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-II Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
రష్యన్ విప్లవం ఆ సమాజంలో ఎన్నో మార్పులను తెచ్చింది. అవి ఏమిటి ? వాళ్ళు ఎదుర్కొన్న సవాళ్ళు ఏమిటి? (AS1)
జవాబు:
రష్యన్ విప్లవం సమాజంలో ఎన్నో మార్పులను తెచ్చింది. 1917లో ప్రారంభమైన రష్యన్ విప్లవం ఫలితంగా 1920 నాటికి అనేక మార్పులు జరిగాయి.

  1. జార్ చక్రవర్తుల పాలన దూరమై ఉదారవాదులు, రాచరిక కుటుంబాల వాళ్ళు పరిపాలన చేపట్టారు.
  2. రష్యాలో “బోల్షివిక్”లు లెనిన్ నాయకత్వంలో అనేక విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు.
  3. షరతులు లేని శాంతిని నెలకొల్పి, భూమినంతటినీ జాతీయం చేసి దానిని రైతులందరికీ పంచిపెట్టడం జరిగింది.
  4. ధరలను నియంత్రించి కర్మాగారాలు, బ్యాంకులను జాతీయం చేశారు.
  5. స్టాలిన్ ఆధ్వర్యంలో రష్యాను బలమైన శక్తిగా మార్చి, పంచవర్ష ప్రణాళికలతో ప్రణాళికాబద్ధ ఆర్థిక వ్యవస్థను చేపట్టారు.

ఎదుర్కొనే సవాళ్ళు :

  1. భూముల ఏకీకరణ సందర్భంగా పెద్ద రైతులు వ్యతిరేకించగా హింస, మరణశిక్షలు అమలుచేశారు.
  2. 1929-30 లో తీవ్ర కరవు ఎదురై, చాలా పెద్ద సంఖ్యలో ప్రజలు చనిపోయారు.
  3. స్వేచ్ఛా మార్కెట్ కి అనుమతి లేకుండాపోయింది.
  4. ప్రపంచ ఆర్థిక మాంద్యం సమయంలో కర్మాగారాలు మూతబడి, వేలాదిమంది నిరుద్యోగులుగా మారారు.
  5. సాధారణ ప్రజాస్వామిక స్వేచ్ఛ లేదు.

AP Board 10th Class Social Solutions Chapter 14 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-II

ప్రశ్న 2.
తీవ్ర మాంద్యానికి కారణాల గురించి భిన్న వాదనలను పోల్చండి. వాటిల్లో దేనితో మీరు ఏకీభవిస్తారు ? కారణాలు పేర్కొనండి. (AS1)
జవాబు:
1929 చివరలో మొదలైన తీవ్ర ఆర్థికమాంద్యం 1939 వరకు కొనసాగింది.

  1. మొదటి ప్రపంచయుద్ధం అనంతరం ప్రపంచవ్యాప్తంగా ఆర్థికవ్యవస్థ ఛిన్నాభిన్నం అయింది.
  2. అమెరికాలో స్టాక్ మార్కెట్ కుప్పకూలడం వలన దాని పరిణామాలు అనతికాలంలోనే అన్ని దేశాలను ప్రభావితం చేశాయి.
  3. నిరుద్యోగం పెరిగి ఆదాయాలు తగ్గి ప్రపంచవ్యాప్తంగా సాధారణ ప్రజలు, ప్రభుత్వాలు కూడా ప్రభావితం అయ్యాయి.
  4. గిరాకీ తగ్గడంతో కర్మాగారాలు మూతబడి, ప్రజల కొనుగోలు శక్తి క్షీణించింది.

ప్రశ్న 3.
నాజీ జర్మనీల చేతిలో యూదులు ఏ విధమైన వేధింపులకు గురయ్యారు? ప్రతి దేశంలోనూ కొంతమంది తమ ప్రత్యేక గుర్తింపు కారణంగా వేరుగా చూడబడుతున్నారా? (AS4)
జవాబు:
నాజీ జర్మనీల చేతిలో యూదులు అనేక వేధింపులకు గురయ్యారు.

  1. అల్పసంఖ్యాక వర్గ ప్రజలైన యూదులను అరెస్టు చేసి హింసించేవాళ్ళు.
  2. అంతకు ముందెన్నడు లేనంతగా దారుణాలకు ఒడిగట్టారు.
  3. నిర్బంధ శిబిరాలకు తరలించి, వారిని దేశం నుంచి బహిష్కరించారు.
  4. రెండవ ప్రపంచయుద్ధం నీడలో అమాయకులైన ఆరు కోట్ల మంది యూదులను నిర్దాక్షిణ్యంగా చంపించారు.
  5. ఆష్విట్జ్ వంటి హత్యాకేంద్రాలలో యూదులను గదులలోకి పంపి, దాంట్లోకి గ్యాసు పంపించడం ద్వారా చంపేసేవాళ్ళు.

ప్రతి దేశంలోనూ కొంతమంది తమ ప్రత్యేక గుర్తింపు కారణంగా వేరుగా చూడబడుతూ వివక్షతకు, అన్యాయాలకు, బలవంతపు చావులకు బలౌతున్నారు.

ప్రశ్న 4.
తీవ్ర మాంద్య పరిస్థితులలో సంక్షేమ రాజ్యం అన్న భావన కింద చేపట్టిన వివిధ చర్యలను పేర్కొనండి. రష్యాలో చేపట్టిన సంస్కరణలకూ, వీటికీ ఉన్న పోలికలు, తేడాలను పేర్కొనండి. (AS1)
జవాబు:
తీవ్ర మాంద్య పరిస్థితులలో సంక్షేమ రాజ్యం అనే భావన కింద చేపట్టిన చర్యలు :

  1. సామాజిక భద్రతా విధానాన్ని అమలుచేశారు.
  2. అందరికీ వర్తించే పదవీ విరమణ, పింఛను, నిరుద్యోగ బీమా, వికలాంగులకు సంక్షేమ ప్రయోజనాలు సమకూర్చాయి.
  3. తండ్రిలేని కుటుంబాలలో అవసరమున్న పిల్లలకు ప్రయోజనం చేకూర్చే పనులు చేపట్టారు.
  4. కనీస జీవనస్థాయి, ఆహారం, గృహవసతి, ఆరోగ్యం , విద్య, శిశు, వృద్ధాప్య సంరక్షణ వంటి మౌలిక అంశాలకు హామీ ఇచ్చింది.

పోలికలు :
రష్యాలో కూడా రష్యన్ విప్లవం తరువాత

  1. ధరలను నియంత్రించి, కర్మాగారాలు, బ్యాంకులను జాతీయం చేశారు.
  2. భూమిని పునః పంపిణీ చేసి
  3. అసమానతలు, పుట్టుక, లింగం, భాష వంటి ప్రాతిపదికన వివక్షతలేని సమాజాన్ని ఏర్పాటు చేయడానికి రష్యా ప్రయత్నించింది.

తేడాలు:

  1. రష్యాలో దీర్ఘ కాలికంగా లాభం చేకూర్చి పథకాలు అమలు చేయగా, సంక్షేమ రాజ్యంలో తక్షణం లబ్ధి చేకూర్చే పథకాలు అమలుచేసారు.
  2. ఫ్యూడల్ భూస్వాములు, రాజులు, పెట్టుబడిదారులు వంటి దోపిడీదారులు లేని దేశాన్ని నిర్మించడానికి రష్యా ఒక బృహత్ ప్రయోగం చేపట్టగా, సంక్షేమ రాజ్యంలో భాగంగా ప్రజలందరికీ కనీస జీవనస్థాయి, మౌళిక అంశాలకు ప్రాధాన్యత.

AP Board 10th Class Social Solutions Chapter 14 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-II

ప్రశ్న 5.
తీవ్ర మాంద్యంతో జర్మనీ ఎదుర్కొన్న సవాళ్ళు ఏమిటి? నాజీ పాలకులు, హిట్లర్ వాటిని ఎలా ఉపయోగించుకున్నారు? (AS1)
(లేదా)
జర్మనీలో నాజీజం ప్రాబల్యం పెరగడానికి దారితీసిన పరిస్థితులేవి?
జవాబు:
తీవ్ర మాంద్యంతో జర్మనీ అన్నిటికంటే ఎక్కువగా ప్రభావితం అయింది.

  1. పారిశ్రామిక ఉత్పత్తి 40% పడిపోయింది.
  2. నిరుద్యోగుల సంఖ్య ముందెన్నడూ లేని విధంగా 60 లక్షలకు చేరింది.
  3. పురుషులు “ఏ పని చేయడానికైనా సిద్ధం” అనే బోర్డులు మెడలో వేసుకొని తిరిగేవాళ్ళు.
  4. తమ పిల్లల కడుపులు నింపలేని మహిళలు తీవ్ర నిస్పృహకు లోనయ్యారు.
  5. ప్రభుత్వం కుప్పకూలి స్థిరమైన పాలన లేకుండాపోయింది.

పై పరిస్థితులను, నాజీ పాలకులు, హిట్లర్ తమకు అనుకూలంగా మలచుకున్నారు. తీవ్ర నిరాశ, నిస్పృహలతో . ఉన్న దేశ ప్రజలను నాజీలు, హిట్లర్ ఉద్వేగ ప్రసంగాలతో అందరినీ ఆకర్షించారు.

  1. కుదేలైన ఆర్థికవ్యవస్థను పునరుద్ధరించి తిరిగి యథాస్థితికి తెస్తామని మాట ఇచ్చారు.
  2. పని కావాలి అనుకుంటున్న వాళ్ళకి పని, యువతకు బంగారు భవిష్యత్తు కల్పిస్తామని వాగ్దానం చేశారు.
  3. ప్రజల మధ్య ఐకమత్యం పెంచడానికి, సభలు, సమావేశాలు, బహిరంగ సభలు, ప్రదర్శనల ద్వారా ప్రజలను మంత్రముగ్ధుల్ని చేశారు.

ఈ విధంగా జర్మనీలో నాజీజం ప్రాబల్యం పెరిగింది.

ప్రశ్న 6.
నాజీ పాలనలో తీసుకొచ్చిన రాజకీయ మార్పులు ఏమిటి? ఒక బలమైన నాయకుడు ఉంటే చాలు దేశ సమస్యలు తీరిపోతాయని తరచు ప్రజలు వాదిస్తూ ఉంటారు. నాజీ జర్మనీలో ఎదురైన అనుభవాల నేపథ్యంలో ఈ వాదనకు ఎలా స్పందిస్తారు? (AS4)
జవాబు:
నాజీ, పాలనలో, హిట్లర్ నాయకత్వంలో రాజకీయంగా అనేక మార్పులు తీసుకొచ్చారు.

  1. రాజకీయాలలో నాజీలు ఒక కొత్త శైలిని ప్రవేశపెట్టారు.
  2. పెద్ద ఎత్తున జన సమీకరణ చెయ్యటంలో ఆచారాలు, అద్భుత దృశ్యాల ప్రాముఖ్యతను వివరించారు.
  3. స్వస్తిక్ గుర్తుతో ఎర్ర జెండాలు, నాజీ వందనం, ఉపన్యాసాల తరువాత చప్పట్లు కొట్టడం వంటివెన్నో పెనుమార్పులు చేశారు.
  4. ప్రపంచంపై జర్మనీ ఆర్యజాతి ఆధిపత్యాన్ని నెలకొల్పుతామన్న వాగ్దానంతో ఆకర్షించారు. బలమైన నాయకుడు ఉంటే దేశ సమస్యలు తీరుతాయి అనే ప్రజల వాదనలో వాస్తవముంది.

హిట్లర్ నాయకత్వం పట్ల ప్రజలకు నమ్మకం కలిగి మెరుగైన భవిష్యత్తునాశిస్తూ ఆ పార్టీకి తిరుగులేని నాయకుడిగా అతడిని నిలబెట్టారు. అయితే 1928 లో జర్మనీ పార్లమెంటు రీచ్ స్టాగ్ లో నాజీ పార్టీకి 2.6 శాతం ఓట్లు కూడా రాలేదు. కాని హిట్లర్ ను బలమైన నాయకుడిగా ప్రజలు గుర్తించిన పిదప 1937 నాటికి 37 శాతం ఓట్లతో నాజీ పార్టీ అతి పెద్ద పార్టీగా అవతరించింది.

10th Class Social Studies 14th Lesson ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-II InText Questions and Answers

10th Class Social Textbook Page No.192

ప్రశ్న 1.
సమానత్వం, స్వేచ్ఛ, సంపదలతో కూడిన ప్రపంచాన్ని నిర్మించటంలో సోవియట్ ప్రయోగం ఏ మేరకు విజయం సాధించిందో అంచనా వేయండి.
జవాబు:
సమానత్వం, స్వేచ్ఛ, సంపదలతో కూడిన ప్రపంచాన్ని నిర్మించటంలో సోవియట్ చాలా వరకు విజయం సాధించి బలమైన శక్తిగా ఎదిగింది. భూమినంతటినీ జాతీయం చేసి, దానిని రైతులందరికీ పంచిపెట్టి, బ్యాంకులను జాతీయం చేసి, ఫ్యూడల్ భూస్వాములు, రాజులు, పెట్టుబడిదారులు వంటి దోపిడీదారులు లేని దేశాన్ని నిర్మించటానికి ఒక బృహత్తర ప్రయోగం అమలుచేశారు.

AP Board 10th Class Social Solutions Chapter 14 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-II

ప్రశ్న 2.
ఇటువంటి ప్రయోగాల కోసం వేలాదిమందిని చంపటం సమర్థనీయమేనా?
జవాబు:
సమర్ధనీయం కాదు. జార్జ్ ఆర్వెల్ అన్న రచయిత “యానిమల్ ఫాం” అన్న తన ప్రఖ్యాత వ్యంగ్య నవలలో రష్యన్ విప్లవంలోని ఆదర్శాలను USSR ఎలా నీరు కార్చిందో వివరించాడు. ప్రతిపక్షాన్ని హింసాత్మకంగా నిర్మూలించడం. ఎదురు తిరిగిన వారిని నిర్దాక్షిణ్యంగా చంపడం హేతుబద్ధం కాదు. ప్రజలలో మార్పు తెచ్చి, ప్రజలకు విశ్వాసపాత్రులుగా వ్యవహరించాలి.

ప్రశ్న 3.
కమ్యూనిస్టు విధానాలపై వచ్చిన విమర్శలు ఏమిటి?
జవాబు:
సమానత, జాతి స్వేచ్ఛ వంటి ఆదర్శాల పట్ల నిబద్ధత గల ప్రపంచవ్యాప్త ప్రజలందరిలో కమ్యూనిస్టు విధానాలు కొంతకాలం ఆమోదం పొందినప్పటికీ కమ్యూనిస్టులు విప్లవాల కోసం కృషి చేశారు. ప్రతిపక్ష రాజకీయ పార్టీలను అణచివెయ్యడం, హింసాత్మకంగా నిర్మూలించడం, బహుళపార్టీ ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ లేకపోవడం వంటి దారుణమైన కమ్యూనిస్టు విధానాలు విమర్శలపాలైనాయి. భూముల ఏకీకరణను వ్యతిరేకించిన పెద్ద రైతులను జైలుపాలు చేసి, విదేశాలకు పంపించడమే కాకుండా, మరణశిక్షలు కూడా వేసి విమర్శలపాలైనారు.

ప్రశ్న 4.
భారతదేశంలో ఈనాడు సంక్షేమ రాజ్యంలోని ఏ ఏ అంశాలు అమలులో ఉన్నాయి?
జవాబు:
భారతదేశంలో ఈనాడు సంక్షేమ రాజ్యంలోని అనేక అంశాలు అమలులో ఉన్నాయి.

  1. అందరికీ వర్తించే పదవీ విరమణ పింఛను.
  2. వికలాంగులకు, వృద్ధులకు, వితంతువులకు నెలసరి పింఛను.
  3. వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర
  4. ఆరోగ్య పథకాలు
  5. శిశుసంరక్షణ పథకాలు
  6. ఆహారం, గృహవసతి, విద్య, వైద్య సహాయాలు
  7. ప్రజలందరికీ కనీస జీవనస్థాయి

10th Class Social Textbook Page No.197

ప్రశ్న 5.
నాజీ సిద్ధాంతం అధికస్వామ్య సూత్రాలపై ఆధారపడి ఉంది. జర్మనీ జనాభాలో యూదులు 0.75 శాతం మాత్రమే. యూదులనే కాకుండా నాజీలను వ్యతిరేకించే వాళ్ళను కూడా శిక్షించే వాళ్ళు. పాస్టర్ నీ మొల్లర్ తన కవితలో దీనిని ఎలా చూపించాడు?
జవాబు:
నాజీ సామ్రాజ్యంలో పాలకశక్తులు సాధారణ ప్రజలపై, యూదులపై దారుణమైన హింసను, దమనకాండను సాగించాయి. అందుకనే కవితలో పాస్టర్ నీ మొల్లర్ ఇలా చెప్పాడు. “కమ్యూనిస్టులు, సోషల్ డెమోక్రాట్లు, కార్మిక సంఘాలు, యూదులు కోసం వచ్చి, వెతికి చివరకు పైవారెవరు కాని నన్ను కూడా తీసుకెళ్ళారు. పై వారి కోసం వచ్చినపుడు నేను నిరసన తెలియజేశాను. కానీ నా కోసం నాజీలు వచ్చినపుడు నాకు నిరసన తెలిపేవారు మిగలలేదని” రాసుకొచ్చాడు.

AP Board 10th Class Social Solutions Chapter 14 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-II

10th Class Social Textbook Page No.199

ప్రశ్న 6.
జర్మను ప్రజల శత్రువులుగా హిట్లర్ యూదులను ఎందుకు ఎంపిక చేసుకున్నాడు?
జవాబు:
మొదటి ప్రపంచయుద్ధం, ఆర్ధికమాంద్యం వలన జర్మనీ ఆర్థికంగా, సామాజికంగా అణగదొక్కబడింది. జర్మనీలో ఎదురైన అన్ని సమస్యలకు మూలం యూదులని హిట్లర్ ప్రగాఢ నమ్మకం. కమ్యూనిజం, పెట్టుబడిదారీ విధానం రెండింటినీ యూదుల కుట్రగా పేర్కొంటూ, ఆ రెండింటినీ తిప్పికొట్టే క్రమంలో యూదులను తుదముట్టించడానికి హిట్లర్ పూనుకొన్నాడు.

ప్రశ్న 7.
హెలోకాస్ట్ గురించి, ఆష్విల్ట్ తరహా శిబిరాల గురించి మరింత తెలుసుకుని వాటి ఆధారంగా ఒక నివేదిక తయారు చేయండి.
జవాబు:
రెండవ ప్రపంచయుద్ధం నీడలో జర్మనీ మానవ మారణహోమాన్ని చేపట్టింది. దీని ఫలితంగా అమాయకులైన ఎంపిక చేయబడ్డ పౌరులు పెద్ద సంఖ్యలో చంపివేయబడ్డారు. ప్రజలను చంపటానికి నాజీలు అంతకు ముందెన్నడూ లేని విధానాలను కనుగొన్నారు. ఉదాహరణకు “ఆష్విట్జ్” వంటి హత్యాకేంద్రాలలో ప్రజలను గదులలోనికి పంపి దాంట్లోకి గ్యాస్ పంపించడం ద్వారా చంపేసే వాళ్ళు.

10th Class Social Textbook Page No.200

ప్రశ్న 8.
యుద్ధం, తీవ్రమాంద్యం తరువాత జాతీయ అభివృద్ధికి అనేక నమూనాలు ముందుకు వచ్చాయి. వాటిని పేర్కొని, వాటి పరిమితులను కూడా పేర్కొనండి.
జవాబు:
నమూనాలు :
యుద్ధం, తీవ్ర మాంద్యం తరువాత జాతీయ అభివృద్ధికి అనేక కొత్త నమూనాలు ముందుకు వచ్చాయి.

అవి:

  1. రాజ్యం, ప్రజలందరూ గౌరవంగా బ్రతకడానికి అవసరం అయిన కనీస మౌలిక అవసారాలను కల్పించాలి.
  2. రాజ్యం, ప్రజల ప్రాథమిక అవసరాలైన ఆహారం, నివాసం, ఆరోగ్యం, పిల్లలు, వృద్ధుల పరిరక్షణ, విద్య వంటి వాటికి ప్రాధాన్యతను ఇవ్వాలి.
  3. రాజ్యం విశాలమైనది. సమర్థులైన పౌరులందరికి ఉద్యోగాలు కల్పించవలసిన బాధ్యత రాజ్యానిదే.

పరిమితులు :
ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా సాధారణ పరిస్థితులలో మాత్రమే అమలు చేయుటకు వీలవుతాయి.

AP Board 10th Class Social Solutions Chapter 14 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-II

10th Class Social Textbook Page No.190

ప్రశ్న 9.
విప్లవం గురించి గ్రామీణ ప్రాంతంలో రెండు పక్షాలను పాఠ్యాంశంలోనిది చదవండి. ఆ ఘటనలకు మీరు కూడా సాక్షిగా ఊహించుకోండి. 1) ఎస్టేట్ యజమాని 2) చిన్న రైతు 3) పత్రికా విలేఖరిగా ఆనాటి ఘటనల గురించి క్లుప్తంగా రాయండి.
జవాబు:
1) ఎస్టేట్ యజమాని :
గ్రామాలలో ఉద్రిక్త పరిస్థితులు కానవస్తున్నాయి. ఏ నిమిషానికి ఏం జరుగుతుందో తెలియదు. ఈ ఆస్తి, భూములు మాకు చెందుతాయో, కోల్పోతామో తెలియడం లేదు. కాని ప్రజల అంతరాత్మ సజీవంగా ఉందని మాకు సంతోషంగా ఉంది.

2) చిన్న రైతు :
నిశ్శబ్దంగా, శాంతియుతంగా ఎటువంటి బాధ లేకుండా తిరుగుబాటు జరిగిపోయింది. మాకు రెండు ఆవులు, రెండు గుర్రాలను ఉంచారు. పనివాళ్ళను ప్రశాంతంగా బ్రతకనివ్వమని, మానవత్వంతో చూడమని వేడుకున్నారు.

3) పత్రికా విలేఖరి :
1917 అక్టోబర్ 25 విప్లవం గ్రామీణ ప్రాంతాలలో పెనుమార్పులకు నాంది పలికింది. ప్రజలు ఉత్సాహంతో స్వాగతించారు. ఉచితంగా భూమి లభించి, ఆనందంగా బ్రతకవచ్చని తలచారు. జార్ భవనాలను కూలగొట్టి శిథిలాలుగా వదిలేశారు.

10th Class Social Textbook Page No.194

ప్రశ్న 10.
ప్రపంచాన్ని జయించాలన్న భావనను హిట్లర్ ఇక్కడ ప్రతిపాదిస్తున్నాడా? బలం, శక్తి ఉన్న వాళ్ళకే ఈ ప్రపంచం చెందాలని మీరు అనుకుంటున్నారా?
జవాబు:
బలం, శక్తి ఉన్న వాళ్ళకే ఈ ప్రపంచం చెందాలని నేను అనుకోవడం లేదు. ప్రపంచాన్ని జయించాలన్న ఆలోచన హిట్లర్కు బలీయంగా ఉంది. ఆనాటి పరిస్థితులు, వర్సయిల్స్ సంధి షరతులతో పాటు అన్నిటికంటే బలమైన జాతికి ప్రపంచాన్ని ఓడించే హక్కు ఉందని ఈ సందర్భంగా హిట్లర్ అభిప్రాయం. తన ఉపన్యాసాలతో, నాజీ పార్టీ సిద్ధాంతాలతో పాటు దురహంకారపూరిత జాతీయతావాదం ద్వారా, సైనికవాదం అమలుచేయడం ద్వారా సిద్ధాంత బోధనతో ప్రజలను మైమరపించి, ప్రపంచంలో గల దేశాలను భయపెట్టి ప్రపంచాన్ని జయించాలన్న భావన ఈ సందర్భంగా హిట్లర్ ప్రతిపాదిస్తున్నాడు.

ప్రశ్న 11.
ఉన్నట్టుండి ఉద్యోగం కోల్పోయి, కొన్ని సంవత్సరాలపాటు ఉద్యోగం దొరకని కార్మికులుగా మిమ్మల్ని మీరు ఊహించుకోండి. మీ జీవితంలోని ఒక రోజు గురించి రాయండి.
జవాబు:
ఉద్యోగం కోల్పోయి కొన్ని సంవత్సరాలపాటు ఉద్యోగం దొరకని కార్మికుల జీవనం దుర్భరం. మాటల్లో వర్ణించలేము.

ఒక రోజు :
ఆ రోజు ఉదయం నుండి వెతలే. మంచాన పడిన తండ్రి, నా వంక దీనంగా చూసి, వైద్యం’ చేయించమనే మాటతో నా కళ్ళు చెమర్చాయి. నాన్నా ! స్కూల్ కు ఫీజు కట్టడానికి ఈ రోజు ఆఖరు, అన్న 10 సం||రాల రేవతి ఏడుపు ఓదార్చలేనిది. ఏమండీ ! ఈ రోజు వంటకి దినుసులు లేవన్న భార్య మాటలు ఇంకా చెప్పనలవి కాదు. ఉద్యోగ ప్రయత్నం చేయడానికి బయటకు వెళ్ళడానికి కూడా చార్జీలు లేని స్థితిని నేను చెప్పలేను.

ప్రశ్న 12.
పండించిన పంట ధర సగానికంటే తక్కువకు పడిపోయిన రైతుగా మిమ్మల్ని ఊహించుకోండి. మీ స్పందనను మూడు వందల పదాలలో రాయండి.
జవాబు:
పంట చేతికి రాగానే మార్కెట్లో అప్పటివరకు ఉన్న ధర అమాంతం సగానికి పడిపోగా నా కళ్ళు చెమర్చాయి. అప్పుచేసి వ్యవసాయం చేసి, వడ్డీలకు ఎరువులు, పురుగుమందులు కొన్న నాకు ఈ ధరతో చేసిన రుణం ఎలా తీర్చగలను ? వారికి ఎలా సమాధానం చెప్పగలను? పండిన పంట ధరతో వచ్చిన డబ్బుతో పండగకి పిల్లలకు బట్టలు తీసి, ఆనందంగా జీవితం గడుపుదామనుకుంటే, ఎందుకీ దుస్థితి దాపురించింది ? నేనెవరికి ద్రోహం చేశాను అని మదనపడుతున్నాను. ” వ్యవసాయం జూదంలా పరిణమించడం ఈ పరిస్థితికి కారణం.

10th Class Social Textbook Page No.195

ప్రశ్న 13.
పిల్లల్ని పెంచే శ్రమ, బాధలకే మహిళలు పరిమితం కావాలన్న దృక్పథంతో మీరు ఏకీభవిస్తారా?
జవాబు:
నేను ఏకీభవించను. సమాజంలో కుటుంబానికి గుర్తింపు, పిల్లల భవిష్యత్తుకై మార్గదర్శకత్వం చేసి వీటికోసం తన శక్తి నంతటినీ ఒడి, భర్తకు చేదోడువాదోడుగా ఉండి, అనునిత్యం కుటుంబ పురోభివృద్ధికి ఆధారంగా ఉండేది మహిళలు. ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు తన కుటుంబ అభివృద్ధికి దిక్సూచి వంటివారు మహిళలు.

AP Board 10th Class Social Solutions Chapter 14 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-II

ప్రశ్న 14.
పిల్లల పెంపకం, కర్మాగారాలు, కార్యాలయాలు, పొలాల్లో పనిచెయ్యటం వంటి జీవితానికి సంబంధించిన అంశాలలో స్త్రీ, పురుషులు సమానంగా భాగస్వాములు కాగలరని మీరు అనుకుంటున్నారా?
జవాబు:
పిల్లల పెంపకం, కర్మాగారాలు, కార్యాలయాలు, పొలాల్లో పనిచెయ్యటం వంటి జీవితానికి సంబంధించిన అంశాలలో సీ, పురుషులు సమాన భాగస్వాములు. ఎందుకంటే పిల్లల పెంపకం, అమ్మ ప్రేమ, నాన్న లాలన పిల్లలకు ఎంతో అవసరం. పిల్లల పెంపకంలోనూ, పిల్లలను సన్మార్గంలో నడిపించుటలోను ఇరువురూ బాధ్యులే. కార్యాలయాల్లో స్త్రీ, పురుషులు ఇరువురు తమ మేధాశక్తితో సమానంగా పనిచేయగలరు. కర్మాగారాలు, పొలాల్లో తమతమ శక్తి మేరకు ఇరువురు కూడా పనిచేసి ఆయా పనులకు న్యాయం చేస్తారు.

10th Class Social Textbook Page No.199

ప్రశ్న 15.
హిట్లర్ సిద్ధాంతం, ఆర్థిక విధానాల ఫలితంగా రెండవ ప్రపంచ యుద్ధం సంభవించిందని ఎలా చెప్పవచ్చు?
జవాబు:
హిట్లర్ అద్భుతమైన వక్త. తన పదునైన ప్రసంగాలతో ప్రజలను ఉత్తేజితులను చేశాడు. మొదటి ప్రపంచయుద్ధం తరువాత యుద్ధ నష్టాల చెల్లింపులు వంటి వాటి భారం వల్ల జర్మనీ ఆర్థిక పరిస్థితి సంక్షోభంలో పడింది. కార్మికులు ఉపాధి కోల్పోయారు. వేతనాలు తగ్గాయి. జర్మనీ వీధులలో పురుషులు “ఏ పని చేయడానికైనా సిద్ధం” అని రాసి ఉన్న కారులు మెడలో తగిలించుకొనేవారంటే ఆనాటి పరిస్థితిని అంచనా వేయవచ్చు.

ఇటువంటి పరిస్థితులలో హిట్లర్ తన సిద్ధాంతం ద్వారా ఇటు ప్రజలలో ఆత్మవిశ్వాసం పెంచి, మరో ప్రక్క ప్రపంచ దేశాలలో అభద్రతాభావం, సైనికవాదాలు, జాత్యహంకారాలతో ప్రపంచం భయపడేటట్టు చేసి, పోలెండ్ పై నిర్దాక్షిణ్యంగా దాడి చేసి రెండవ ప్రపంచ యుద్ధానికి కారకుడయ్యాడు.

AP Board 10th Class Social Solutions Chapter 14 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-II

10th Class Social Textbook Page No.200

ప్రశ్న 16.
మొదటి ప్రపంచ యుద్ధం తరువాత రష్యా, జర్మనీల అనుభవాలను పోల్చండి. వాటిల్లో పోలికలు, తేడాలు ఏమిటి?
జవాబు:
పోలికలు :

  1. మొదటి ప్రపంచయుద్ధం తరువాత జర్మనీ, రష్యా రెండు దేశాలు ఆర్థికంగా దెబ్బతిన్నాయి.
  2. రష్యాలో లెనిన్, స్టాలిన్ ఆధ్వర్యంలో అనేక సంక్షేమ రాజ్య కార్యక్రమాలు అమలు జరుగగా, జర్మనీలో కూడా ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని అనేక ప్రజారంజక కార్యక్రమాలు రూపొందించారు.
  3. ప్రపంచంలో అగ్రదేశాలుగా ఉండడానికి జర్మనీ, రష్యా దేశాలు ప్రయత్నించాయి.

తేడాలు :

  1. మొదటి ప్రపంచ యుద్ధంలో ఈ రెండు దేశాలలో జర్మనీ ఆర్థికంగా మరియు బలీయమైన ప్రాంతాలను రష్యా కంటే – ఎక్కువగా పోగొట్టుకుంది.
  2. రష్యాలో భూముల ఏకీకరణ ద్వారా సామూహిక క్షేత్రాలకు, వ్యవసాయానికి ప్రాధాన్యతనీయగా, జర్మనీ వ్యవసాయ రంగాన్ని విస్మరించింది.
  3. రష్యా ప్రపంచంలో కార్మికులకు అధిక ప్రాధాన్యం ఇవ్వగా, సౌజీ పార్టీ సిద్ధాంతాలకు జర్మనీ ప్రాధాన్యం ఇచ్చింది.
  4. ఆర్ధికమాంద్యం సమయంలో జర్మనీ కంటే రష్యా బాగా చితికిపోయింది.
  5. జర్మనీ ప్రతీకార చర్యలతో సౌగగా, రష్యాదేశం అభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చింది.
  6. మొదటి ప్రపంచయుద్ధం తర్వాత రష్యా అగ్రదేశం కాగా, జర్మనీ కుదేలైంది.

AP Board 10th Class Social Solutions Chapter 13 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-I

SCERT AP 10th Class Social Study Material Pdf 13th Lesson ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-I Textbook Questions and Answers.

AP State Syllabus 10th Class Social Solutions 13th Lesson ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-I

10th Class Social Studies 13th Lesson ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-I Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
తప్పు వాక్యాలను సరిచేయండి. (AS1)
1) 20వ శతాబ్ది ఆరంభంలో ప్రపంచదేశాల మధ్య తేడాలు పాశ్చాత్య దేశాలు, మిగిలిన దేశాలుగా వ్యక్తమయ్యాయి.
2) ప్రజాస్వామ్యం పుంజుకోవటంతో పాటు కొన్ని నియంతృత్వ ధోరణులను, కొత్త సామ్రాజ్యాలు ఏర్పడటాన్ని 20వ శతాబ్దం చూసింది.
3) సమానత్వం, సౌభ్రాతృత్వం అన్న సిద్ధాంతాల పునాదిపై సోషలిస్టు సమాజాలు ఏర్పడ్డాయి.
4) యుద్ధంలో పాల్గొన్న దేశాల సైనికులే కాకుండా వివిధ దేశాల సైనికులు పోరాటాలలో ఉన్నారు.
5) మొదటి ప్రపంచయుద్ధ కాలంలో, లేదా ఆ తరువాత అనేక దేశాలు రాచరిక పాలన నుంచి ప్రజాస్వామ్య దేశాలుగా మారాయి.
జవాబు:

  1. 20వ శతాబ్ద ఆరంభంలో ప్రపంచంలోని దేశాలు పాశ్చాత్య దేశాలుగాను, వీటి వలన దోపిడీలతో మరింత వెనుకబడిన దేశాలుగా విభజింపబడ్డాయి.
  2. ప్రజాస్వామ్యం పుంజుకోవటంతోపాటు అందరికీ అక్షరాస్యతాస్థాయి, సగటు జీవితకాలం అపారంగా పెరిగాయి.
  3. సమానత్వం, సౌభ్రాతృత్వ సిద్ధాంతాలతో, రాజకీయ స్వేచ్ఛ, ఉగ్రవాద, సామ్యవాద, పెట్టుబడిదారీ సమాజాలు ఏర్పడ్డాయి.
  4. యుద్ధంలో పాల్గొన్న దేశాల సైనికులే కాకుండా వివిధ దేశాల సైనికులు పోరాడి వీరమరణం పొందారు.
  5. మొదటి ప్రపంచయుద్దాల అనంతరం అనేక దేశాలు రాచరిక, వలస పాలన నుండి విముక్తి పొంది ప్రజాస్వామ్య దేశాలుగా మారాయి.

ప్రశ్న 2.
ప్రపంచ యుద్ధాలలో మిత్ర రాజ్యాల, అక్ష రాజ్యాల, కేంద్ర రాజ్యాల కూటములలో భాగస్వాములైన దేశాలతో కూడిన “పట్టికను తయారుచేయడం : ఆస్ట్రేలియా, యు.ఎస్.ఎస్.ఆర్ (రష్యా), జర్మనీ, బ్రిటన్, జపాన్, ఫ్రాన్స్, ఇటలీ, యు.ఎస్.ఎ. (AS3)
జవాబు:

మిత్రదేశాలుఅక్ష/ కేంద్రరాజ్యాల కూటమి
రష్యాజపాన్
ఫ్రాన్స్జర్మనీ
బ్రిటన్ఇటలీ
అమెరికాఆస్ట్రియా
చైనా
సెర్బియా
పోలెండ్

AP Board 10th Class Social Solutions Chapter 13 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-I

ప్రశ్న 3.
ప్రపంచ యుద్ధాలలో జాతీయ రాజ్యాలు, జాతీయతా భావం యుద్ధకాంక్షను ఎలా ప్రభావితం చేశాయి? (AS1)
జవాబు:
జాతీయ రాజ్యాలలో జాతీయతా భావం ఒక ప్రముఖ ప్రేరేపణ. నూతన శక్తికి అంకురార్పణ. ఆధునిక రాజ్యాలు ఏర్పడడానికి, జర్మనీ, ఇటలీ వంటి దేశాలు ఏకీకరణ సాధించడానికి ఇది మూలమైంది. జాతీయతా భావం ఆయా దేశాల అహంకారానికి, గర్వానికి పరాకాష్ఠ. అంతేకాకుండా ఇతరుల పట్ల ద్వేషాన్ని కలిగించడానికి కూడా ఈ దేశస్థులు జాతీయభావాన్ని ఉపయోగించుకున్నారు. ఈ ద్వేషం, అహంకారం యూరపులోని దేశాల మధ్య వైరం పెరగడానికి, అభద్రతాభావం ఏర్పడడానికి మూలమైంది.

మరో ప్రక్క ఇటలీలో ఫాసిజం, జర్మనీలో నాజీయిజం రెండూ కూడా విధ్వంసకర రూపంలో దురహంకారపూరిత జాతీయవాదాన్ని రెచ్చగొట్టి, జర్మనీయే ప్రపంచానికి మార్గదర్శకత్వం వహిస్తుందని, విజేతయై ప్రపంచాన్ని పాలిస్తుందని, పుకార్లు షికార్లు చేయించి, ప్రపంచంలోని దేశాల మధ్య ద్వేషాలు, అభద్రతాభావం పెంచి యుద్ధకాంక్షను పురిగొల్పడానికి కారణమైంది.

ప్రశ్న 4.
రెండు ప్రపంచయుద్ధాల కారణాల మీద క్లుప్తంగా రాయండి. ప్రపంచంలో ఏదైనా దేశాలలో ఈనాటికీ ఈ అంశాలు ఏమైనా ఉన్నాయా? ఏ రూపంలో? (AS4)
జవాబు:
రవి అస్తమించని సామ్రాజ్యం బ్రిటన్ పారిశ్రామికంగా అగ్రగామిగా ఉండడమే కాకుండా ప్రపంచమంతటా విశాల వలస సామ్రాజ్యాలు విస్తరింపచేసింది. ముడిపదార్థాల కొరకు, నూతన మార్కెట్ల అన్వేషణ కొరకు, పాశ్చాత్య దేశాలు దోపిడీ పాలనతో వెనుకబడిన దేశాలను తన ఆధీనంలోనికి తెచ్చుకున్నాయి. ఏకీకరణ భావనతో ఫాసిజం, నాజీయిజం అనుచరులు అహంకారాన్ని ప్రేరేపించడమే కాకుండా ప్రపంచాన్నంత ద్వేషభావంతో చూశారు. పారిశ్రామిక అభివృద్ధి దేశాలుగా బ్రిటన్, అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, జపాన్ వలసపాలిత దేశాలపై ఆధిపత్యం చెలాయించాయి. రానురాను వలసపాలిత దేశాలు స్వాతంత్ర్యం కొరకు పోరాటాలు మొదలు పెట్టాయి. ప్రపంచ ఆధిపత్యం కొరకు పారిశ్రామిక దేశాలు కూడా గొడవలు పడటం ప్రారంభించాయి. దురహంకారపూరిత జాతీయతావాదం, సామ్రాజ్యవాదం, రహస్య ఒప్పందాలు, సైనికవాదం వంటి కారణాలు మొదటి ప్రపంచయుద్ధానికి కారణమవ్వగా, రెండవ ప్రపంచయుద్ధానికి కారణం వర్సయిల్స్ సంధిలో ఉన్న అవమానకర చర్యలు జర్మనీలో ద్వేషాలు పెరగడానికి కారణమయ్యాయి. అభద్రతాభావం విద్వేషాలు, అనుమానాలు యుద్దాలు సంభవించడానికి దోహదం చేశాయి. అయితే ఈ నాటికీ పై అంశాలు ప్రపంచంలో చాలా తక్కువగా కనిపిస్తుండగా పాకిస్థాన్, ఇరాన్, ఇరాక్ వంటి దేశాలలో పై లక్షణాలు, కారణాలు అప్పుడప్పుడూ ప్రస్ఫుటమవుతున్నాయి.

AP Board 10th Class Social Solutions Chapter 13 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-I

ప్రశ్న 5.
20వ శతాబ్దపు ప్రథమ అర్ధభాగంలో యుద్ధాల యొక్క వివిధ ప్రభావాలు ఏమిటి? (AS1)
(లేదా)
20 శతాబ్దపు మొదటి సగంలో సంభవించిన ముఖ్యమైన పరిణామాలను పేర్కొని ఏవేని రెండింటిని వివరించండి.
జవాబు:
చరిత్రకారుడైన “ఎరిక్ హాబ్స్ బామ్” పేర్కొన్నట్లు 20వ శతాబ్దం “తీవ్ర సంచలనాల యుగం”. జాతీయతాభావంతో ప్రపంచంలోని ఇతర ప్రజల పట్ల ద్వేషం, అవధులు లేని అధికారంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.

1914-18 సం||రాల మధ్య జరిగిన మొదటి ప్రపంచయుద్ధం తదుపరి నాజీ, ఫాసిజం పార్టీలు భావజాలంతో ప్రపంచదేశాలను తక్కువగా చూడనారంభించారు. 1929-30 సం||రాల మధ్య తీవ్ర ఆర్థికమాంద్యం సంభవించి, ఆర్థికవ్యవస్థ చిన్నాభిన్నం అయింది. రెండు ప్రపంచయుద్ధాలు సంభవించి, లక్షలాదిమంది చనిపోయారు. ఇంకా ఎన్నో లక్షలమంది నిర్వాసితులయ్యారు. ఎన్నో ఆశలు, ప్రయోగాలు, ప్రమాదకర పరిణామాలు సంభవించాయి. ప్రపంచంలో చాలాదేశాలు చిన్నాభిన్నం కాగా, జర్మనీ, జపాన్ దేశాలు తుడిచిపెట్టుకుపోయాయి. ప్రథమార్ధంలో సంభవించిన యుద్ధాల వల్ల ల్యుకేమియా, క్యాన్సర్ వంటి సమస్యలు దశాబ్దాలపాటు కొనసాగాయి. మాయామర్మం తెలియని 60 లక్షల యూదులు, ఒక్క నాగసాకి, హిరోషిమాలపై అమెరికా వేసిన అణుబాంబు వల్ల 1,50,000 నుంచి 2,46,000 మంది పౌరులు చనిపోయారు. మిత్రదేశాలు, కేంద్ర దేశాలుగా విడివడి ఒక దేశం మరో దేశం మీద ద్వేషాలు పెంచుకొనే స్థితికి చేరుకున్నాయి. యుద్ధంలో పాల్గొన్న దేశాలతో పాటు యుద్ధ ప్రభావం ఆర్ధిక సామాజిక రంగాలపై పడింది.

10th Class Social Studies 13th Lesson ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-I InText Questions and Answers

10th Class Social Textbook Page No.181

ప్రశ్న 1.
దురహంకారపూరిత జాతీయతావాదం, సామ్రాజ్యవాదం, అధికార కేంద్రాలు, మిలటరీవాదం ఇప్పుడు కూడా ఉన్నాయా ? ఉదాహరణలతో తరగతిలో చర్చించండి.
జవాబు:
పై లక్షణాలు అప్పుడప్పుడూ అగ్రదేశాలలో కనిపిస్తాయి. అమెరికా, ఇంగ్లండ్, రష్యా వంటి దేశాలలో అప్పుడప్పుడూ ప్రస్ఫుటమవుతుంది.

10th Class Social Textbook Page No.181

ప్రశ్న 2.
గత పది సంవత్సరాలలో జరిగిన కొన్ని యుద్దాల గురించి తెలుసుకొని వాటికి పై నాలుగు కారణాలు ఎంతవరకు దోహదం చేశాయో చూడండి.
జవాబు:
గత 10 సం||లలో యుద్ధాలు సంభవించలేదు.

10th Class Social Textbook Page No.176&177

ప్రశ్న 3.
ఇక్కడ కొన్ని బొమ్మలు ఉన్నాయి. వీటికీ పైన పేర్కొన్న అంశాలకీ సంబంధం గుర్తించి వాటి మీద చిన్న వ్యాసం రాయండి.
అ) నర్స్ బెర్గ్ వద్ద 1934లో హిట్లర్ నాజీ పార్టీ ప్రదర్శన. మీరు చూసిన రాజకీయపార్టీల ప్రదర్శనలతో దీనిని పోల్చండి.
AP Board 10th Class Social Solutions Chapter 13 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 భాగం-I 1
జవాబు:
మొదటి ప్రపంచయుద్ధం తర్వాత జరిగిన అవమానకర ఒప్పందాలతో కృంగిపోయి, ప్రతీకార కాంక్షతో రగిలిపోయే నాజీపార్టీ స్థాపకుడు హిట్లర్, ప్రపంచానికి తమ అవధులు లేని భావజాలం ప్రదర్శిస్తూ నిర్వహించిన ర్యాలీ. ప్రస్తుతం రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో ఓట్లడిగే క్రమంలో ఇలా ర్యాలీగా వెళ్ళడం చూస్తుంటాం.

ఆ) మాంద్య కాలంలో పోలిష్ వలస కార్మికురాలు ఫ్లోరెన్స్ ఓవెన్స్ ఫోటో, దారితియా లాంజ్ తీసిన ఈ ఫోటో ఎంతో ప్రఖ్యాతి గాంచింది. 1936 మార్చి సమయంలో కాలిఫోర్నియాలో బఠానీ కోసేవాళ్ళ తీవ్ర పరిస్థితిని ఇది సూచిస్తుంది. ఆమె ఏమి ఆలోచిస్తూ ఉంటుంది?
AP Board 10th Class Social Solutions Chapter 13 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 భాగం-I 2
జవాబు:
20వ శతాబ్దంలో ప్రపంచంలో పెనుమార్పులు సంభవించాయి. గొప్ప ప్రయోగాలు కూడా చోటు చేసుకున్నాయి. 1929-30 సం||లో తీవ్ర ఆర్థికమాంద్యం సంభవించి ఆర్థికవ్యవస్థ చిన్నాభిన్నం అయింది. ఫోటోలో కనిపిస్తున్న “ఫ్లోరెన్స్ ఓవెన్స్” ఆలోచిస్తూ నిరుద్యోగం పెరిగి, ఆర్థిక అవకాశాలు లేక, ఆకలితో అలమటించే పిల్లలకు ఆహారం తినిపించే మార్గం ఏదీ లేదా ? పిల్లల రోదనలను ఆపే మార్గం ఎలా ? అని ఆలోచిస్తుంది.

ఇ) నాగసాకి మీద ‘అణుబాంబు : ఈ బాంబు ప్రభావాన్ని తెలియజేసే ఫోటోలు ఈ అధ్యాయం చివరలో ఉన్నాయి.
AP Board 10th Class Social Solutions Chapter 13 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 భాగం-I 3
జవాబు:
రెండవ ప్రపంచయుద్ధంలో దూసుకుపోతున్న జపానను అడ్డుకట్ట వేసి, యుద్ధాన్ని ముగించే క్రమంలో అమెరికా జపాన్లోని శక్తివంతమైన, పురోభివృద్ధిలో ముందున్న నాగసాకి, హిరోషిమాపై అణుబాంబులు ప్రయోగించి తునాతునకలు చేయగా, ఆ సందర్భంగా వెలువడు విధ్వంస దృశ్యాలు అవి.

ఈ) రష్యాలో బోల్షివిక్ విప్లవాన్ని సూచిస్తూ 1920 లో కుస్తోదీప్ వేసిన చిత్రం. చిత్రకారుడు ఏం చెప్పటానికి ప్రయత్నిస్తున్నాడు? పెద్ద ఆకారంలో ఉన్న వ్యక్తి ఎవరు?
AP Board 10th Class Social Solutions Chapter 13 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 భాగం-I 4
జవాబు:
రష్యాలో నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా రష్యా విప్లవంలో భాగంగా జార్ చక్రవర్తులను, వారి కోటల నివాసాలను తుదముట్టించే క్రమంలో “పెట్రోగ్రాడ్” నగరంలో లెనిన్ నాయకత్వం వహిస్తూ విప్లవంలో పాల్గొన్న దృశ్యం చూడవచ్చు.

ఉ) 1929లో జర్మనీలో వెలువడిన వ్యంగ్య చిత్రం. దాని కింద ‘యూదుల నుంచి కొనండి, మీ ప్రజలకు ద్రోహం చెయ్యండి’ అనే వ్యాఖ్యానం ఉంది. ఇది ఏ వివక్షతా ధోరణిని చూపిస్తోంది?
AP Board 10th Class Social Solutions Chapter 13 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 భాగం-I 5
జవాబు:

  1. యూదుల వద్ద నుండి ఏ రకమైన వస్తువులనైనా, జర్మనీ ప్రజలు కొనుగోలు చేయకూడదనే వివక్షత ధోరణిని ఈ వ్యంగ్య చిత్రం చూపిస్తుంది.
  2. యూదుల నండి ఏ వస్తువునైనా కొన్నట్లయితే అది జర్మనీకి ద్రోహం చేసినట్లుగా భావించబడుతుంది అని ఆ చిత్రం తెలుపుతుంది.
  3. హిట్లర్ కాలంలో జర్మనీ ప్రజల ‘సోర్డిక్ జాతి’ ఆధిక్యతను తెలుపుతుంది.
  4. యూదుల మీద అపరిమితమైన ద్వేషమును పెంచుకున్నారు.
  5. ఆ తరువాత రోజులలో హిట్లరు అనుచరులచే దాదాపు 60 లక్షల యూదులు చంపబడినారు.

10th Class Social Textbook Page No.179

ప్రశ్న 4.
తెలుసుకోండి : భారతదేశం-పాకిస్తాన్ల మధ్య 1971లో యుద్ధం ఎంతకాలం కొనసాగింది? ఈ యుద్ధంలో ఎంతమంది చనిపోయారు?
జవాబు:

  1. 1971లో బంగ్లాదేశ్ స్వాతంత్ర్య పోరాటంలో ఇండియా – పాకిస్థాన్లు ప్రత్యక్ష సైనిక యుద్ధానికి దిగినాయి.
  2. ఈ యుద్ధం 3-12-1971న ప్రారంభమై 16-12-1971న ముగిసినది.
  3. ఈ యుద్ధం మొత్తం 13 రోజులలో ముగిసినది. ఇది చరిత్రలోని చిన్న యుద్ధాలలో ఒకటిగా భావించబడుతుంది.
  4. ఈ యుద్ధంలో 3,843 భారత సైనికులు, 9,000 పాకిస్థానీ సైనికులు ప్రాణాలు కోల్పోయారు.
  5. 9,861 మంది భారత సైనికులు, 4,350 పాకిస్తానీ సైనికులు గాయాలపాలైనారు.
  6. 97,368 పాకిస్థానీ సైనికులు ఈ యుద్ధంలో ఖైదు చేయబడినారు.

AP Board 10th Class Social Solutions Chapter 13 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-I

10th Class Social Textbook Page No.181

ప్రశ్న 5.
పారిశ్రామికీకరణ ఆధునిక యుద్ధాలకు ఎలా దారి తీసింది?
జవాబు:
ప్రపంచం పాశ్చాత్య పారిశ్రామిక అభివృద్ధి దేశాలుగా కీర్తింపబడి, గుర్తింపబడిన బ్రిటన్, రష్యా, ఫ్రాన్స్, అమెరికా, జపాన్, జర్మనీలు పారిశ్రామికీకరణ వలన ముడిపదార్థాల కొరకు, నూతన మార్కెట్ల కొరకు అన్వేషణ చేసి చాలా దేశాలను వలసపాలిత ప్రాంతాలుగా చేసుకొనే క్రమంలో తీవ్ర పోటీ ఏర్పడింది. ఒక దేశం మరో దేశం మీద ఆధిపత్యం చెలాయిస్తూ ఉండటం వలన తరచు గొడవలు జరుగుచుండేవి. తద్వారా అభద్రతాభావం, జాత్యహంకారం, సామ్రాజ్యవాద రూపాలు అత్యున్నత దశకు చేరుకోవడంతో ఆధునిక యుద్ధాలకు దారితీసింది.

10th Class Social Textbook Page No.181

ప్రశ్న 6.
తమ దేశం పట్ల ప్రజలకు ఉన్న ప్రేమ ఇతర దేశాలతో యుద్ధానికి దారి తీస్తుందా?
జవాబు:
ప్రపంచ ఆధిపత్య క్రమంలో ప్రజలలో తమ దేశం పట్ల ప్రేమ. మితిమీరింది. అభివృద్ధి క్రమంలో, ఆర్ధిక పురోభివృద్ధిలో ముందుండాలనే ఆశతో పాటు, ఇతర దేశాల పట్ల, ప్రజల పట్ల ద్వేషాన్ని రగిల్చింది. తమ దేశం పట్ల ఉన్న ప్రేమ, ఇతర దేశ ప్రజలను రెచ్చగొట్టే విధానంలో ఆలోచనలు ఎక్కువయ్యాయి. తమ దేశమే విశ్వనాయకత్వం వహిస్తుందనే అహంకార పూరిత ప్రేమ యుద్ధాలకు దారితీస్తుంది.

10th Class Social Textbook Page No.183

ప్రశ్న 7.
నానాజాతి సమితిలో ఏర్పడిన అంతర్జాతీయ కార్మిక సంఘం (ILO), ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వంటివి ఈ నాటికీ పనిచేస్తున్నాయి. వాటి కార్యక్రమాల గురించి తెలుసుకొని వాటిల్లో ఒకదాని గురించి ఒక నివేదిక తయారుచేయండి.
జవాబు:
మొదటి ప్రపంచయుద్ధం అనంతరం, మరో ప్రపంచయుద్ధం జరగకుండా, ప్రపంచ శాంతిని నెలకొల్పే క్రమంలో అమెరికా అధ్యక్షుడు ఉడ్రోవిల్సన్ 1920లో నానాజాతి సమితిని ఏర్పాటుచేసి, అందులో అనుబంధ సంస్థలుగా అంతర్జాతీయ కార్మికసంఘం (ILO), ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) లను ఏర్పాటు చేయగా అవి ఈనాటికీ అద్భుతంగా పనిచేస్తున్నాయి.

అంతర్జాతీయ కార్మిక సంఘం గూర్చి ఒక నివేదిక : అంతర్జాతీయ కార్మిక సంఘం ఈనాటికీ దిగ్విజయంగా పనిచేస్తుంది. నానాజాతి సమితిలోని సభ్యదేశాలలోని కార్మికుల స్థితిగతులు, జీవన విధానాన్ని మెరుగుపరచింది. చైనా, ఇంగ్లాండ్ దేశాల మధ్య యుద్ధాలకు కారణమైన నల్లమందు రవాణాను ఆపి, స్నేహపూర్వక వాతావరణాన్ని నెలకొల్పింది. కార్మికుల, స్త్రీల స్థితిగతులలో మార్పుచేసి, విదేశాలకు స్త్రీలను ఎగుమతి చేయడాన్ని నిషేధించింది. బానిసత్వాన్ని, వెట్టిచాకిరీని నిషేధించి, సమానత్వాన్ని అందించి, కార్మికులలో ఆత్మస్టెర్యాన్ని పెంచింది.

10th Class Social Textbook Page No.181

ప్రశ్న 8.
ఒక దేశం రెండవ దేశంతో దురహంకారపూరితంగా ప్రవర్తిస్తే, రెండవ దేశం కూడా అదే విధంగా స్పందించాలా ? సమస్య పరిష్కారానికి ఇతర మార్గాలు ఏమున్నాయి?
జవాబు:
దురహంకారంతో కూడిన జాతీయతావాదం ప్రమాదకరం. ప్రతీకారేచ్ఛతో రగిలిపోయే దేశాలు అదనుకోసం ఎదురుచూస్తుంటే మరో ప్రక్క విద్వేషాలు పెరిగి, యుద్ధ వాతావరణాన్ని తలపించే ఏర్పాట్లు దేశాల మధ్య అంతరాన్ని సృష్టించాయి. ప్రతీ దేశం కూడా మేమే ప్రపంచ విజేత కాబోతున్నాం, ఇతరుల మీద ఆధిపత్యం చెలాయించబోతున్నామంటూ ప్రకటించుకున్నాయి. గర్వం, ఇతరుల పట్ల ద్వేషం వీటివల్ల ప్రపంచం యావత్తు అభద్రతాభావంతో మునిగిపోయింది. తద్వారా ప్రతీ దేశం కూడా ఆ దేశం కంటే మేమేం తక్కువ కాదు అన్నట్లు దురహంకారపూరిత చర్యలకు పూనుకున్నాయి.

వేరే పరిష్కార మార్గాలున్నప్పటికీ “ప్రతీకారం” ఒక్కటే సరైన మార్గంగా దేశాలు భావించాయి. నానాజాతి సమితి వంటి అంతర్జాతీయ శాంతి సంస్థ ఉండి కూడా ప్రతీకారాన్ని ఆపి, మరో ప్రపంచయుద్ధాన్ని నివారించలేకపోయింది.

AP Board 10th Class Social Solutions Chapter 13 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-I

10th Class Social Textbook Page No.183

ప్రశ్న 9.
1919లో గెలిచిన దేశాలు జర్మనీ పట్ల అంత నిర్దాక్షిణ్యంగా వ్యవహరించి ఉండకపోతే రెండవ ప్రపంచ యుద్ధం వచ్చి ఉండేదా?
జవాబు:
1919లో గెలిచిన దేశాలు జర్మనీ పట్ల అంత నిర్దాక్షిణ్యంగా వ్యవహరించి ఉండకపోతే రెండవ ప్రపంచయుద్ధం వచ్చి ఉండేది కాదు. బ్రిటన్, ఫ్రాన్లు గెలిచిన పిదప వర్సయిల్స్ శాంతి సమావేశంలో పెట్టిన అవమానకర షరతులు జర్మనీని అథఃపాతాళానికి నెట్టాయి. వర్సయిల్స్ శాంతి సంధికి కూడా విజేతలైన అమెరికా, బ్రిటన్లు, ఫ్రాన్స్, ఇటలీ, జపానులను ఆహ్వానించాయి. కానీ, జర్మనీని ఆహ్వానించలేదు. ప్రపంచ భవిష్యత్తుపై చర్చలు జరుపుతున్న వాళ్ళు జర్మనీ సలహాలు, భావాలను పరిగణనలోకి తీసుకోలేదు. దీనివల్ల వర్సయిల్స్ ఒప్పందం తమపై బలవంతంగా రుద్దబడిందని జర్మనీ భావించింది. జర్మనీ భూభాగాలను ఆక్రమించడమే కాకుండా సైనిక బలగాన్ని తగ్గించి ఆల్వాస్, లోరైన్ వంటి ఐరోపా, ప్రాంతాలను జర్మనీ నుండి ఆక్రమించుకున్నాయి. ఈ విధంగా నిర్దాక్షిణ్యంగా వ్యవహరించడం వలన రెండవ ప్రపంచయుద్ధం రావడానికి మూలమైంది.

AP Board 10th Class Social Solutions Chapter 12 సమానత – సుస్థిర అభివృద్ధి

SCERT AP 10th Class Social Study Material Pdf 12th Lesson సమానత – సుస్థిర అభివృద్ధి Textbook Questions and Answers.

AP State Syllabus 10th Class Social Solutions 12th Lesson సమానత – సుస్థిర అభివృద్ధి

10th Class Social Studies 12th Lesson సమానత – సుస్థిర అభివృద్ధి Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
మీరు తినే ఆహార పదార్థాలలో పదింటిని తీసుకొని, మీ వద్దకు చేరటానికి ఉత్పత్తి అయిన స్థలం నుంచి ఎంతదూరం ప్రయాణించాయో తెలుసుకోండి. (AS3)

ఆహారపదార్థంప్రయాణించిన దూరం
1. బియ్యం
2. వంటనూనె
3. అరటిపళ్ళు

చాలామంది ఆహారం దూర ప్రాంతాలు రవాణా చెయ్యటం కాకుండా స్థానికంగా ఉత్పత్తి చెయ్యాలని అంటారు. స్థానికంగా ఆహారం ఉత్పత్తి చెయ్యటానికీ, పర్యావరణానికీ సంబంధం ఏమిటి? స్థానికంగా ఆహారాన్ని పండించి, వినియోగించాలన్న ఉద్యమం గురించి మరింత తెలుసుకుని తరగతి గదిలో చర్చా కార్యక్రమాన్ని నిర్వహించండి. (మీకు ఇంటర్నెట్ అందుబాటులో ఉంటే యుట్యూబ్ లో కింద లింకులో ఉన్న హెలెనా నార్బెర్గ్ – హాడ్జ్ ఉపన్యాసాన్ని వినండి. https:/www.youtube.comwatch?v=4r06_F2FIRM
జవాబు:

ఆహారపదార్థంప్రయాణించిన దూరం
1. బియ్యం50 కి.మీ.
2. వంటనూనె100 కి.మీ.
3. అరటిపళ్ళు5 కి.మీ.
4. గోధుమలు10 కి.మీ.
5. రాగులు20 కి.మీ.
6. జామపళ్ళు10 కి.మీ.
7. జొన్నలు15 కి.మీ.
8. బొప్పాయి5 కి.మీ.
9. దానిమ్మ60 కి.మీ.
10. పెసలు20 కి.మీ.

సానికంగా ఆహారపదారాలను ఉత్పత్తి చేయడం వలన తాజా, నాణ్యమైన పదార్థాలు లభిస్తాయి. అంతేకాకుండా మనం పండించడం వలన పర్యావరణపరంగా సమస్యలు అధిగమించి, సేంద్రియ ఎరువులతో ఆరోగ్యవంతమైన • ఆహారపదార్థాలను పొందవచ్చు.

ప్రశ్న 2.
జలసింధి గ్రామ ప్రజలు తమ ఊరి నుంచి తరలి వెళ్ళటాన్ని ఎందుకు తిరస్కరించారు? (AS1)
జవాబు:
సర్దార్ సరోవర్ ఆనకట్ట వల్ల మధ్యప్రదేశ్ లో ముంపునకు గురయ్యే మొదటి గ్రామం జలసింధి గ్రామం. తద్వారా ఆ గ్రామ ప్రజలంతా మునిగిపోతారని తెలిసికూడా తరలివెళ్ళడానికి వారు ఇష్టపడలేదు. మైదాన ప్రాంతాలకు వెళితే అభివృద్ధి చెందుతారని, జీవితాలు సుఖపడతాయని చెప్పి వాళ్ళమీద దౌర్జన్యాలు చేసినా వారు అంగీకరించలేదు. ఎందుకంటే వాళ్ళ పూర్వీకులు అడవులను నరికారు. దేవతలను పూజించారు. నేలను మెరుగుపరచారు. జంతువులను మచ్చిక చేసుకున్నారు. అక్కడ వ్యవసాయం ఖర్చు లేకుండా, లాభసాటి ఫలసాయాన్ని అందిస్తుంది. మొక్కజొన్న వాళ్ళకు తల్లిలా ఆహారాన్ని అందిస్తుంది. సజ్జలు, జొన్నలు, శనగలు, మినుములు, నువ్వులు వారికి ఆధారంగా లభిస్తున్నాయి. అడవి వలన వాళ్ళకు ప్రవహించే నీళ్ళు, చక్కటి మేత ఉన్నాయి. పశుసంపద ఎక్కువ. రకరకాల జబ్బులకు అడవి నుండి లభించే వనమూలికలే మందులుగా ఉపయోగపడతాయి. నిర్మలమైన సంస్కృతి, సంప్రదాయాలు, సామాజిక సంబంధాలతో
సుఖంగా జీవిస్తున్నవాళ్ళు వేరే ప్రాంతానికి వెళ్ళడానికి తిరస్కరించారు.

AP Board 10th Class Social Solutions Chapter 12 సమానత – సుస్థిర అభివృద్ధి

ప్రశ్న 3.
“ఇది మా పూర్వీకుల భూమి. దీనిపై మాకు హక్కు ఉంది. దీనిని కోల్పోతే మా చేతికి పారలు, గడ్డపారలు వస్తాయి తప్ప ఇంకేమీ మిగలదు…….” అన్న బావా మహాలియా మాటలను వివరించండి. (AS1)
జవాబు:
అనాదిగా బావా మహాలియా పూర్వీకులు అడవులను నరికి పోడు వ్యవసాయం ద్వారా చదును చేసి, కష్టించి, అటవీ భూములు తామే సాగుచేస్తున్నందున ఆ భూముల యజమానులుగా తలంచి, దర్జాగా అడవి మీద, వ్యవసాయం మీద ఆధిపత్యం పొందారు. అభివృద్ధి పేరుతో, పునరావాసం పేరుతో అక్కడ నుండి ఖాళీ చేయిస్తే, వ్యవసాయ భూములపై యజమానులుగా ఉన్న వాళ్లు వ్యవసాయ కూలీలుగా మారి, చేతికి పారలు, పలుగులు వచ్చి పేదరికంలో కూరుకుపోతారని, సంతోషం లేని జీవితాలవుతాయని మహాలియా భావన.

ప్రశ్న 4.
“చివరిగా (అంతమాత్రాన దీని ప్రాముఖ్యత తక్కువేమీ కాదు) వ్యర్థ పదార్థాలు, కాలుష్యం తక్కువగా ఉండేలా మన జీవన సరళిని మార్చుకోవటంపైన పర్యావరణ సమస్యల పరిష్కారం ఆధారపడి ఉంది.” (AS4)
ఎ) మన జీవనశైలి పర్యావరణాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? మీ నేపథ్యం నుంచి కొన్ని ఉదాహరణలు తీసుకొని దీనిని వివరించండి.
జవాబు:
మన ఆలోచనా విధానంలో మార్పు రావాలి. మనిషి ప్రకృతి మీద ఆధారపడి జీవిస్తున్నాడు కాని, ప్రకృతి మనిషి మీద ఆధారపడి జీవించటం లేదు. చెట్లను నరకకుండా, ప్రతీ పుట్టిన రోజున ఒక మొక్క నాటి పెంచే విధంగా మన జీవన విధానం ఉండాలి. వ్యవసాయంలో రసాయనిక పురుగుమందుల వాడకం తగ్గించడం ద్వారా ఆరోగ్యవంతమైన పంట ఫలాలను పొందవచ్చు. పారిశ్రామిక వ్యర్థాలు, మరల మరల ఉపయోగించడం వలన, కాలుష్యరహిత విధానం వలన పర్యావరణ సమస్యలు తగ్గుతాయి.

బి) ప్రపంచంలో, వివిధ ప్రాంతాలలో చెత్త, కాలుష్య విడుదల సమస్యలను అధిగమిస్తున్న వివిధ పద్ధతులను పేర్కొనండి.
జవాబు:
పర్యావరణంలో సంభవించు పెనుమార్పుల వలన ప్రపంచదేశాలు ఉలిక్కిపడ్డాయి. అభివృద్ధి మాటున, అనర్థాలు అధికమవ్వడంతో ఆర్థిక, సామాజిక, శీతోష్ణస్థితులలో చెడు పరిణామాలు సంభవించాయి. దీనికి అనుగుణంగా వివిధ పరిశ్రమలు విడుదల చేసే వ్యర్థాలను రీసైక్లింగ్ పద్ధతులు, అదే విధంగా వాటి నుండి మరికొన్ని కొత్త ఆవిష్కరణలు కనుగొనడం జరిగింది. కాలుష్యం అధికంగా విడుదల చేసే పరిశ్రమలకు అనుమతులు రద్దు చేయడమే కాకుండా, జల కాలుష్యం జరగకుండా అనేక కొత్త పద్ధతులు అనుసరించడం జరుగుతోంది. వేస్ట్ మేనేజ్ మెంట్ ద్వారా గ్రామాలు, పట్టణాలు, నగరాలలో ప్రజలను చైతన్యపరుస్తూ, మీడియా ద్వారా ప్రజలలో మార్పు తీసుకురావడానికి ప్రపంచం యావత్తు కృషి చేస్తోంది.

ప్రశ్న 5.
ఖనిజాలు, ఇతర సహజ వనరులను వేగంగా సంగ్రహించడం వల్ల భవిష్యత్తులో అభివృద్ధి అవకాశాలు దెబ్బతింటాయి. మీరు ఏకీభవిస్తారా? (AS4)
జవాబు:
నీరు, ఖనిజాలు, చెట్ల నుంచి వచ్చే ఉత్పత్తులు, పశువులు వంటి సహజ వనరులు, అధికంగా గ్రహించడం వలన భవిష్యత్తులో అభివృద్ధి అవకాశాలు దెబ్బతింటాయని నేను ఏకీభవిస్తాను. అదేపనిగా భూగర్భజలాల్ని, ఖనిజాలను వినియోగించడం వలన తరువాత లభించడం దుర్లభం. అడవులను, చెట్లను విచక్షణారహితంగా నరికివేయడం వలన, జీవావరణం, జీవవైవిధ్యం దెబ్బతిని, భవిష్యత్తు తరాలు అంధకారంలోకి నెట్టబడతాయి. ఆర్థికవ్యవస్థలోని ఇతర రంగాలు కూడా ఖనిజాలు, ఇతర సహజవనరుల మీద ఆధారపడి ఉండడం వలన పర్యావరణ సమతుల్యం దెబ్బతింటుంది.

AP Board 10th Class Social Solutions Chapter 12 సమానత – సుస్థిర అభివృద్ధి

ప్రశ్న 6.
వాతావరణ మార్పు ప్రభావం అన్ని దేశాలపై ఉంటుందని ఎందుకనుకుంటున్నారు? (AS1)
జవాబు:
ప్రపంచంలోని దేశాల శాస్త్రజ్ఞులు ఎంతోకాలంగా వాతావరణంలోని మార్పుల గురించి వివరాలు సేకరిస్తూనే ఉన్నారు. వాతావరణం అంటే మనచుట్టూ ఉండే తేమ, గాలిపీడనం, ఉష్ణోగ్రత మొదలైన వాటిలో రోజువారీ వచ్చే మార్పులు. వాతావరణం గంట గంటకీ, రోజు రోజుకీ, ఋతువు, ఋతువుకీ మారిపోవచ్చు. వాతావరణ మార్పు ప్రభావం అన్ని దేశాలపై ఉంటుంది. ఈ కారణంగానే ముందుగా టీవీ, రేడియో, వార్తాపత్రికలు మొ||నవి వాతావరణ వివరాలను ప్రతిరోజూ ప్రసారం చేస్తాయి. వాతావరణ మార్పు ప్రభావం గురించి తెలుసుకుంటున్నదానిని బట్టి రాబోయే కాలంలో వాతావరణంలో ఎటువంటి మార్పులు వస్తాయో అన్ని దేశాలు అంచనావేస్తాయి.

ప్రశ్న 7.
భూమి సగటు ఉష్ణోగ్రతలను ప్రజలందరికీ సహజ వనరుగా పరిగణించాలా? (AS1)
జవాబు:
భూమి సగటు ఉష్ణోగ్రతలను ప్రజలందరికీ సహజ వనరుగానే పరిగణించాలి. 1992 సంవత్సరంలో రియోడిజెనీర్ లో ధరిత్రి సదస్సు జరిగింది. అందులో 154 దేశాలు సంతకం చేశాయి. గత 100 సం||లలో భూమి సగటు ఉష్ణోగ్రత 0. 5 డిగ్రీ సెల్సియస్ పెరిగింది. భూమి సగటు ఉష్ణోగ్రత పర్యావరణ పరంగా జీవవైవిధ్య పరిరక్షణలో ముఖ్యపాత్ర పోషిస్తుంది.

ప్రశ్న 8.
తెలంగాణలోని జహీరాబాద్ మండలంలోని ప్రత్యామ్నాయ ప్రజాపంపిణీ వ్యవస్థ నుంచి ఏ గుణపాఠాలు నేర్చుకోవచ్చు? (AS4)
జవాబు:
తెలంగాణలోని జహీరాబాద్ మండలంలోని ప్రత్యామ్నాయ ప్రజాపంపిణీ వ్యవస్థ నుంచి మనం అనేక గుణపాఠాలు నేర్చుకోవచ్చు.

స్థానిక ఆహారపు అలవాట్లు, సంస్కృతి, సంప్రదాయాలకు ప్రాధాన్యమిస్తూ, సుదూర ప్రాంతంలో రసాయనిక పురుగుమందులు, సారవంతం లేని వరి, గోధుమల స్థానంలో అధిక పౌష్టికాహార విలువలు గల చిరుధాన్యాలు ప్రధాన ఆహారంగా అక్కడ ఉండేది. (చిరుధాన్యాలు జొన్న, సజ్జ, రాగి వంటివి) పోషకాహారాన్ని అందించే చిరుధాన్యాలు పండించాక భూముల బీడు పోవడమే కాకుండా, నియంత్రణ కూడా సాధించారు.

ప్రత్యామ్నాయ ప్రజాపంపిణీ విధానం ద్వారా వారు పర్యావరణానికి ప్రాధాన్యం ఇస్తూ స్థానిక అవసరాలు, కట్టుబాట్లు కొనసాగిస్తూ ఇంకొకరి మీద ఆధారపడకుండా, స్వశక్తితో వారిలో వారే అభివృద్ధి చెందాలని కోరుకున్నారు. గ్రామాలు స్వయం సంపూర్ణ గ్రామాలుగా మారడానికి ఐక్యత, సామాజిక చైతన్యం, సమష్టి కృషి, విశిష్ట లక్షణాలు అందరికీ ఆదర్శవంతమయ్యాయి.

AP Board 10th Class Social Solutions Chapter 12 సమానత – సుస్థిర అభివృద్ధి

ప్రశ్న 9.
“స్థానిక జన జీవనానికి, జీవనోపాధులకు, పరిసరాలతో సహజీవనం చేసే జీవన విధానానికి పర్యావరణం చాలా ముఖ్యమైనది.” వివరించండి. (AS6)
జవాబు:
“నరుని అడుగు సోకని అడవి రమణీయంగా ఉందని” వాల్మీకి అన్నట్లు రామాయణంలో ఒక శ్లోకం ఉందంటారు. వ్యవసాయం కోసమైనా, పశువుల కోసమైనా, కలప కోసమైనా, కారణం ఏదైనా ఫలితం క్షణక్షణం అడవి తల్లిని బుగ్గిపాలు చేయడం జరుగుతోంది. అడవిని ఆధారంగా చేసుకొని ఆదివాసీలు, వివిధ జంతువులు, ఇతర జీవరాసులు జీవన సమరం సాగిస్తున్నాయి. తమ చుట్టూ ఉండే చెట్టు, పు, కొండా, కోన, వ్యవసాయం, మేత ఇలా అణువణువు వారికి ఆధారమే. పర్యావరణాన్ని పాడుచేయడం వలన మానవుడు తాను ఎక్కిన కొమ్మను తానే నరుక్కున్నట్లుంది. ఒకటి గుర్తుంచుకోవాలి. ఈ పరిసరాల్లోనే, ఈ పర్యావరణంలోనే, ఈ ప్రకృతిలోనే మన శరీరం ఉంది. పర్యావరణంలోనే మనుగడ సాగుతుంది. పర్యావరణాన్ని నాశనం చేశామంటే మన ఆరోగ్యాన్ని మనమే నాశనం చేసుకున్నట్లు. “మనం పర్యావరణాన్ని కలుషితం చేస్తే – పర్యావరణం మనల్ని కలుషితం చేస్తుంది.”

10th Class Social Studies 12th Lesson సమానత – సుస్థిర అభివృద్ధి InText Questions and Answers

10th Class Social Textbook Page No.160

ప్రశ్న 1.
పర్యావరణ సమస్యల ద్వారా అభివృద్ధి అనే భావనను ఎలా ప్రశ్నించారో గుర్తించండి.
జవాబు:
అభివృద్ధి పేరుతో, పారిశ్రామికాభివృద్ధి ముసుగులో పర్యావరణం – ప్రజల మధ్య సంబంధాలు అతలాకుతలం అయినాయి. ఆర్థిక కార్యకలాపాల విస్తరణ ద్వారా అడవులను నరికి, నేలను కోతకు గురిచేసి, కాలుష్యం పెంచి, విచ్చలవిడిగా రసాయనిక పురుగుమందుల వాడకం చేపట్టి, శీతోష్ణస్థితిలో పెనుమార్పునకు పర్యావరణ సమస్యలు మూలమయ్యాయి. అభివృద్ధి జరిగినా సహజ వనరులు అంతరించి, మానవ మనుగడయే దుర్లభమయ్యే రోజులు దాపురించాయి.

10th Class Social Textbook Page No.162

ప్రశ్న 2.
భూగర్భజలాలను ఎక్కువగా తోడటం సుస్థిర పద్దతి ఎందుకు కాదు?
జవాబు:
సంప్రదాయ వ్యవసాయంలో వర్షపు నీటి ద్వారా భూగర్భజలాలు పెరిగే విధంగా చర్యలు తీసుకొనేవారు. 10-15 అడుగులలో నీళ్ళు ఉండేవి. ఆ తర్వాతి కాలంలో విద్యుత్, డీజిలు మోటార్లతో భూగర్భజలాలను తోడటం మొదలైన తర్వాత భూగర్భజలం కొన్ని వందల అడుగుల లోపలకు వెళ్ళిపోయింది. లోపలికి ఇంకే నీటి కంటే తోడే నీళ్ళు ఎక్కువవడం వలన భవిష్యత్తు తరాలు నీటి కోసం యుద్ధాలు చేసే పరిస్థితులు కానవస్తున్నాయి. కాబట్టి భూగర్భజలాలను ఎక్కువగా తోడటం సుస్థిర పద్ధతి కాదు.

AP Board 10th Class Social Solutions Chapter 12 సమానత – సుస్థిర అభివృద్ధి

10th Class Social Textbook Page No.164

ప్రశ్న 3.
పర్యావరణాన్ని ‘సహజ పెట్టుబడి’ అని కూడా అంటారు. 9వ అధ్యాయంలో పెట్టుబడి నిర్వచనాన్ని మరొకసారి చూడండి. పర్యావరణాన్ని సహజ పెట్టుబడి అని ఎందుకు అంటారు?
జవాబు:
పర్యావరణాన్ని ఆధారం చేసుకొని, ఈ భూమి మీద 5 కోట్ల వేర్వేరు జాతులు ఉన్నాయి. మనం వాడుతున్న నీళ్ళు, మనచుట్టూ ఉన్న అడవి, అడవి ఆధారంగా సహజంగా లభించే సహజ అటవీ ఉత్పత్తులు, సెలయేళ్ళు, సహజ వనరులు, (ఇంధన వనరులు, ఖనిజ వనరులు) ఆధారం చేసుకొని మానవజీవితం కొనసాగుతుంది. మానవుడు తనచుట్టూ ఉండే పరిసరాల్ని ఆధారం చేసుకొని జీవనం సాగిస్తున్నాడు. కాబట్టి పర్యావరణాన్ని సహజ పెట్టుబడిగా వర్ణించవచ్చు.

10th Class Social Textbook Page No.164

ప్రశ్న 4.
నీటిని ఉమ్మడి ఆస్తిగా ఎందుకు పరిగణించాలి?
జవాబు:
నీరే జీవాధారం. ప్రాణాధారం, నీరు లేకుండా ఏ జీవీ జీవనం సాగించడం దుర్లభం. ప్రకృతిలో కురిసే వానల వలన, పారే నీరు భూగర్భజలంలోకి చేరుతుంది. అంతేకాకుండా సహజవనరులైన సెలయేళ్ళు, నదులు, కాలువలు, జలాశయాలు, ఆనకట్టల ద్వారా ఆయా ప్రాంతాలకు చెందిన వారందరికీ నీరు ఉమ్మడి ఆస్తిగా చెందుతుంది.

10th Class Social Textbook Page No.164

ప్రశ్న 5.
ఎండోసల్ఫాన్ వినియోగాన్ని నిలిపివెయ్యటానికి న్యాయస్థానానికి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది?
జవాబు:
ఎండోసల్ఫాన్ అనేది రసాయనిక పురుగులమందు. ఈ పురుగులమందు అనేక రకాలుగా హానికారక ప్రభావాల్ని చూపించింది. గాలి, నీళ్ళు మొత్తం పర్యావరణం ఎండోసల్ఫాతో కలుషితమయ్యాయి. దానిని పిచికారి చేయడం వలన ప్రజలలో ముఖ్యంగా వ్యవసాయ కూలీలలో తీవ్ర ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. దీనివల్ల కనీసం 5000 మంది చనిపోయారు. అంతకంటే ఎక్కువమంది అవయవ లోపాల వల్ల, క్యాన్సర్ వల్ల మరణం కంటే దారుణమైన జీవితాన్ని గడపగా ఆ పరిస్థితుల నుండి రక్షణ పొందేందుకు న్యాయస్థానానికి వెళ్ళవలసి వచ్చింది.

10th Class Social Textbook Page No.164

ప్రశ్న 6.
ఎండోసల్ఫాన్ వాడకాన్ని నిషేధిస్తూ న్యాయస్థానం జారీ చేసిన ఆదేశాలలో ఆ పురుగుమందు వాడకం జీవించే హక్కుకు (రాజ్యాంగంలోని 21వ అధికరణానికి) భంగం కలిగించిందని పేర్కొంది. జీవించే హక్కుకు, ఎండోసల్ఫాన్ ఎలా భంగం కలిగించిందో వివరించండి.
జవాబు:
ప్రాథమిక హక్కు అయిన జీవించే హక్కులో భాగంగా ఆరోగ్యకరమైన పర్యావరణం కలిగి ఉండే హక్కు కూడా ఉంటుందని న్యాయస్థానాలు అనేక తీర్పులు చెప్పడం జరిగింది. 1991లో రాజ్యాంగంలోని 21వ అధికరణం ద్వారా జీవించే హక్కు ద్వారా జీవితాన్ని పూర్తిగా ఆనందించటానికి, కాలుష్యరహిత నీటిని, గాలిని పొందే హక్కుంటుందని అత్యున్నత న్యాయస్థానం చెప్పింది. కానీ ఎండోసల్ఫాన్ పురుగుమందు వాడకం వలన, పరిసరాలు, పర్యావరణం, నీరు, గాలి కలుషితమై, ప్రజలలో అనేక మరణాలు సంభవించాయి. కాబట్టి, కోర్టు తీర్పునకు అనుగుణంగా-ఎండోసల్ఫాన్ విఘాతం కలిగించింది కాబట్టి దానిని నిషేధించడం జరిగింది.

AP Board 10th Class Social Solutions Chapter 12 సమానత – సుస్థిర అభివృద్ధి

10th Class Social Textbook Page No.167

ప్రశ్న 7.
గిరిజనులకు వేరే రాష్ట్రంలో పునరావాసం కల్పిస్తే దిగువ పేర్కొన్న విషయాల్లో ప్రస్తుత అలవాట్లలో ఏమి మారతాయో చూపించటానికి ఒక పట్టిక తయారుచేయండి. ఆహార అలవాట్లు, వ్యవసాయం, ఆర్థిక అంశాలు, అడవితో సంబంధం, మత ఆచారాలు, ఇల్లు కట్టుకోవడం, సామాజిక సంబంధాలు.
జవాబు:
AP Board 10th Class Social Solutions Chapter 12 సమానత – సుస్థిర అభివృద్ధి 1

10th Class Social Textbook Page No.167

ప్రశ్న 8.
జీవవైవిధ్యత కోల్పోటాన్ని ఉత్తరంలో ఎతా పేర్కొన్నారు?
జవాబు:
మా చుట్టూ అనేక పక్షులు, జంతువులు, చెట్లు, పువ్వులు, పండ్లు, కీటకాలు రకరకాలైనవి ఉన్నాయి. వాటితో మా బంధం పెనవేసుకుంది. ఆవులు, గేదెలు, గొర్రెలు వంటి పశుసంపద మాకు ఆరోగ్యసంపద, ధన సంపద. ఈ అడవిలో తిరిగే ప్రతి పక్షి, జంతువు, ఇతర జీవరాసుల అరుపులు, వాటి జీవన విధానం మాకు తెలుసు. ప్రతీ జీవి కూడా పూజింపదగినదే. ఏ ప్రాణినీ తక్కువగా అంచనావేయం. అన్ని ప్రాణులపట్ల సమాన ప్రాధాన్యతతో, ప్రేమతో, కృతజ్ఞతతో మెలగుతాం.

ప్రశ్న 9.
జలసింధి గ్రామంలోని ప్రజలకు ప్రస్తుతం ఆహారభద్రత ఉందా?
జవాబు:
జలసింధి గ్రామంలోని ప్రజలకు ప్రస్తుతం ఆహారభద్రత ఉంది. వ్యవసాయాన్ని అనువుగా మార్చుకొని, తక్కువ వర్షాలతో కావలసినంత ఆహారాన్ని పొందుతున్నారు. జలసింధి గ్రామంలో గిరిజనులకు కడుపునింపేది మొక్కజొన్న. వీటితో పాటు, సజ్జలు, జొన్నలు, శనగలు, మిటికెలు, మినుములు, నువ్వులు పండించి ఆహారభద్రత పొందుతున్నారు.

AP Board 10th Class Social Solutions Chapter 12 సమానత – సుస్థిర అభివృద్ధి

ప్రశ్న 10.
పైన పేర్కొన్న పరిస్థితులలో మీరు నివసిస్తుంటే పునరావాసం పొందాలన్నప్పుడు ఎలా స్పందిస్తారు?
జవాబు:
అడవితో అనురాగం పెంచుకొని, పరిసరాలపై ప్రేమలో మునిగి, నేలతల్లిని ఆరాధించే మేము వేరే పునరావాస ప్రాంతంలో నివసించటానికి ఇష్టపడం. అభివృద్ధి ముసుగులో మా జీవన గమనాన్ని దెబ్బతీస్తే ఊరుకోం. ప్రాణాలైనా అర్పించడానికి సిద్ధపడతాం. కొండా కోన, వాగు-వంకలతో అడవిలోనే నివసిస్తాం. ఐక్యమవుతాం. ఎదిరిస్తాం. అనుకున్నది సాధిస్తాం.

10th Class Social Textbook Page No.169

ప్రశ్న 11.
భారతదేశ ఆర్థిక విధానంలో సరళీకరణ, ప్రపంచీకరణ చోటు చేసుకున్న తరువాత స్థానిక అవసరాలకు, ఎగుమతులకు ఖనిజాల తవ్వకం వేగంగా పెరిగింది. ఈ కింద ఇచ్చిన పట్టికలోని గణాంకాల ఆధారంగా ఈ వ్యాఖ్యానాన్ని వివరించండి.
పట్టిక : భారతదేశంలో కొన్ని కీలక ఖనిజాల తవ్వకం (వేల టన్నులలో)

ఖనిజం1997 – 982008 – 09
బాక్సెట్6,10815,250
బొగ్గు2,97,0004,93,000
ఇనుప ఖనిజం75,7232,23,544
క్రోమైట్1,5153,976

జవాబు:
బ్రిటిష్ వారి పరిపాలనా కాలంలో ఆర్థికంగా ఛిన్నాభిన్నమైన మనదేశంలో స్థానిక అవసరాలు, ప్రపంచంలో మన స్థానాన్ని పదిలపరచుకోడానికిగాను, ఖనిజాలను ఎగుమతులు చేయడం జరిగింది. విరివిగా లభించే ఖనిజాలను వెలికితీసి సరళీకరణ ద్వారా, ప్రపంచ పోటీని నిలదొక్కుకోడానికి గాను విలువైన బాక్సెట్, బొగ్గు, ఇనుము, క్రోమైట్లను సగాని కంటే ఎక్కువగా వెలికితీయడం జరిగింది. 1997-98 కి, 2008-2009 కి మధ్య 10 సం||లలో అధికంగా ఖనిజాలను వెలికితీసి ఆదాయాలను పెంచి ఆర్థిక పరిపుష్టి సాధించడం జరిగింది.

ప్రశ్న 12.
గనుల తవ్వకం వేగంగా వృద్ధి చెందటం వల్ల పర్యావరణానికి, మనుషులకి ఏ విధమైన నష్టాలు జరుగుతాయి?
జవాబు:
గనుల తవ్వకం విచ్చలవిడిగా పెంచడం వలన, అటు పర్యావరణానికి, ఇటు మనుష్యులకు తీవ్ర ప్రమాదాలు దాపురిస్తున్నాయి. అటవీ ప్రాంతాలు, వివిధ జంతువులు, పక్షులు, వివిధ రకాల జీవరాసులు నశించి, పర్యావరణం పాడైపోతుంది. అదేవిధంగా గనులను విరివిగా తవ్వడం వలన ఆయా ప్రాంతాలలో నివసించే ప్రజలు అనేక కాలుష్య సమస్యలతో సతమతమవుతున్నారు. . నీటి, వాయు కాలుష్యం వలన ఆరోగ్య సంబంధ సమస్యలు పెరుగుతున్నాయి.

10th Class Social Textbook Page No.159

ప్రశ్న 13.
ఇక్కడ ఇచ్చిన గ్రాఫ్ ఆధారంగా భారతదేశంలోని అంతరాల గురించి క్లుప్తంగా రాయండి.
గ్రాఫ్ 1 : భారతదేశంలో వార్షిక ఆదాయం ఆధారంగా కుటుంబాల పంపిణీ (లక్షలలో) (2010 సర్వే)
AP Board 10th Class Social Solutions Chapter 12 సమానత – సుస్థిర అభివృద్ధి 2 AP Board 10th Class Social Solutions Chapter 12 సమానత – సుస్థిర అభివృద్ధి 3
జవాబు:
గ్రాఫ్ 1 ఆధారంగా 17 లక్షల పైన వార్షిక ఆదాయం కలిగిన వారు 30 లక్షల కుటుంబాలు ఉండగా, లక్షా యాభైవేల కంటే తక్కువ వార్షిక ఆదాయం కలిగిన వారు 13 కోట్ల 50 లక్షల కుటుంబాలు ఉన్నాయి. రెండవ స్థానంలో తక్కువ వార్షిక ఆదాయం కలిగిన వారు అంటే లక్షా యాభైవేల నుండి 3 లక్షల 40 వేల మధ్య ఆదాయం కలిగిన వారు 7 కోట్ల 10 లక్షల కుటుంబాలు ఉన్నాయి. దీనినిబట్టి తక్కువ ఆదాయంతో పేదరికంతో బాధపడుతున్న వారు మన దేశంలో ఎక్కువ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

గ్రాఫ్ 2 ప్రకారం భారతదేశంలో శత కోటీశ్వరులకు ఉన్న మొత్తం సంపద -1996లో 212 బిలియన్ రూపాయలు, 2004 లో 1,157 బిలియన్ రూపాయలు కాగా, 2011లో 11,000 బిలియన్ రూపాయలకు చేరింది.

గ్రాఫ్ 3 ప్రకారం భారతదేశంలో శతకోటీశ్వరులు 1996లో ముగ్గురు ఉండగా 2004లో ఆ సంఖ్య 9 గా ఉంది. 2011లో శత కోటీశ్వరుల సంఖ్య 55కి చేరింది.

పై గ్రా ద్వారా తేలిందేమిటంటే, కొంతమంది ప్రపంచస్థాయి భోగభాగ్యాలతో తులతూగుతూ ఉండగా అధికశాతం ప్రజలు సరైన ఉద్యోగం లేక, చాలినంత ఆదాయాలు లేక గౌరవప్రదంగా జీవించడానికి అవసరమయ్యే కనీస అవసరాలు కూడా అందని పరిస్థితిలో ఉన్నారు. ప్రజల ఆదాయాలు, అవకాశాలలో ఇంత అంతరం ఉండటం సమసమాజానికి ఆధారం కాబోదు.

10th Class Social Textbook Page No.161

ప్రశ్న 14.
భారతీయ వ్యవసాయం, పరిశ్రమలకు సంబంధించి 9వ తరగతి పాఠాలను మరొకసారి చూడండి.
ఈ రెండు సందర్భాలలోనూ వనరుల పంపిణీ, అందుబాటుకు సంబంధించి అసమానతలను అవి ఎలా చర్చించాయి?
జవాబు:
భారతదేశంలో పెరిగే జనాభాకు అనుగుణంగా ఆహార ఉత్పత్తులను పెంచి పేదరికాన్ని దూరం చేయడానికి గాను, నూతన వ్యవసాయ పరిజ్ఞానంతోపాటు అధిక విత్తనాల దిగుబడికి రసాయనిక ఎరువులే కీలకం. సకాలంలో నీరు, రసాయనిక ఎరువులు అందించి, తక్కువ కాలంలో, పొట్టి కాడలతో ఎక్కువ దిగుబడిని అందించే వంగడాలను అందుబాటులోకి తెచ్చారు. హరితవిప్లవం ద్వారా ఆధునిక పద్ధతులతో వరి, గోధుమలలో అధికోత్పత్తి సాధించడం జరిగింది.

అదేవిధంగా పరిశ్రమలను నెలకొల్పే క్రమంలో ఉన్న అనేక పరిమితులు దూరం చేసి, లైసెన్సింగ్ విధానంలో ఉన్న సమస్యలను అధిగమించి, నూతన పారిశ్రామిక విధానం ద్వారా అనేక పారిశ్రామిక కేంద్రాలను నెలకొల్పి, అత్యంత సమర్థవంతమైన ఉత్పత్తులు పెంపొందింపజేశారు.

AP Board 10th Class Social Solutions Chapter 12 సమానత – సుస్థిర అభివృద్ధి

10th Class Social Textbook Page No.161

ప్రశ్న 15.
‘హరిత విప్లవం’ విస్తరించడం వల్ల ఎటువంటి పర్యావరణ సమస్యలు ఏర్పడ్డాయి? దీని నుంచి భవిష్యత్తుకు మనం ‘ ఎటువంటి గుణపాఠాలు నేర్చుకోవాలి?
జవాబు:
హరితవిప్లవం వ్యవసాయరంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చి, కొత్త రకం విత్తనాలు సృష్టించడంతో, ఆహారధాన్యాల విషయంలో దేశం స్వయం సమృద్ధి సాధించగా అనేక పర్యావరణ సమస్యలు ఏర్పడ్డాయి. అవి

  1. హరిత విప్లవంలో అధిక ప్రాధాన్యం ఇచ్చిన వరి, గోధుమపంటల అధిక దిగుబడికిగాను పుష్కలంగా నీరు అవసరం. అందులకై అధిక సంఖ్యలో మోటార్లు, ఇంజన్లు ఉపయోగించి భారీగా భూగర్భజలాలను వెలికితీయడంతో, భూగర్భజలాలు పడిపోయాయి. దీనితో భవిష్యత్తులో ఉపయోగించుకోవడానికి భూగర్భజలాలు లేవు.
  2. సేంద్రియ ఎరువులు, పెంటపోగు గత్తం వంటి వాటి ఎరువులకు బదులుగా రసాయనిక పురుగుమందులు, క్రిమి సంహారక రసాయనాలు వాడడం వలన భూముల సారం తగ్గి, రైతుల ఖర్చు పెరిగింది.
  3. చిరుధాన్యాలు, పప్పు ధాన్యాలు వంటి వాటికి ప్రాధాన్యం లేకపోవడం, ఇవి సుమారు 80% ప్రాంతాలలో పండించేవిగా ఉండడం వలన చాలా ప్రాంతాలలో సంప్రదాయ పంటలు దూరమయ్యాయి.

కాబట్టి మనం సంప్రదాయ పద్ధతులు అనుసరిస్తూ, ఆరోగ్యాన్ని పాడుచేసే విధానాలకు స్వస్తి చెప్పి, మన పూర్వీకుల పద్ధతులు పాటిస్తూ, భూసారాన్ని రక్షించుకుంటూ పర్యావరణ సమస్యలు లేకుండా చూసుకోవాలి.

10th Class Social Textbook Page No.167

ప్రశ్న 16.
అభివృద్ధి భావనలు అన్న అధ్యాయంలో ఒకరికి అభివృద్ధి అయినది మరొకరికి అభివృద్ధి కాకపోవచ్చని చదివాం. దీనిని వివరించటానికి బావా మహాలియా ఉత్తరాన్ని ఉపయోగించండి.
జవాబు:
ప్రజల అవసరాలు, సంక్షేమం, ఉద్యోగ భద్రత, ఆహార ఉత్పత్తి, పారిశ్రామికీకరణ వలన అటవీ ప్రాంతంలో, నదీ పరిసర ప్రాంతాలలో పరిశ్రమలు, అభివృద్ధి పేరుతో ఖాళీ చేయించి, అక్కడ నివసిస్తున్న ప్రజలను పట్టణ ప్రాంతాలకు, మైదాన ప్రాంతాలకు తరలించడం జరిగింది. దీని ద్వారా కొంతమంది ప్రజలకు భద్రత, ఉద్యోగ అవకాశాలు, ఉత్పత్తి పెరిగినప్పటికీ, ఎంతోమందికి మాత్రం అది పెను ప్రమాదంగా మారింది. అడవిని నమ్ముకొని, అటవీ ఉత్పత్తుల మీద ఆధారపడి, ఫలసాయాల ద్వారా బ్రతుకుతున్న వారికి, కొండా కోన, పరిసరాలు తమకు అనుకూలమైనవి కావడం వలన వేరే ప్రాంతాలలో జీవించడం కష్టం. తమకు అలవాట్లు, పూర్వీకుల ఆచారాలకు అనుగుణంగా తమ తమ ప్రాంతాలలో నివసించటానికి ప్రాధాన్యత ఇవ్వటం జరుగుతుంది.

10th Class Social Textbook Page No.167

ప్రశ్న 17.
గిరిజనులలో జీవనోపాధి, సంస్కృతి, సామాజిక సంబంధాలు అడవితో విడదీయరాని సంబంధం కలిగి ఉన్నాయి. దీనిని వివరించండి.
జవాబు:
అడవిలో నివసించే గిరిజనులకు అడవే జీవనాధారం. గిరిజనులు వారి శ్రమతో రకరకాలైన సంప్రదాయ పంటలు పండిస్తారు. డబ్బుతో పని లేకుండా, నాణ్యమైన విత్తనాలు, పశువుల నుండి వచ్చే ఎరువును వాడి, మంచి ఫలసాయాల్ని పొందుతారు. పంటలు పండని సమయంలో అడవిలో దొరికే అనేక ఫలాలు, దుంపలు, కాయలు, పండ్లు గిరిజనుల ఆకలిని తీరుస్తాయి.

సంస్కృతి, సంప్రదాయాలకు గిరిజనులు ప్రాధాన్యం ఇస్తారు. క్రమం తప్పకుండా చెట్టు తల్లిని, అగ్నిని, అమ్మతల్లిని పూజిస్తారు. సంతలలో కలిసి ఒకరికొకరు ఇష్టపడి వివాహాలు జరుపుకుంటారు. సామాజిక సంబంధాలకు విలువనిస్తారు. కష్టసుఖాలలో ఒకటిగా జీవిస్తారు. అడవిలో దొరికే జంతువుల మాంసాలను సమంగా పంచుకొని, కలిసి తింటారు. సమూహాలుగా ఏర్పడి వేటకు బయలుదేరతారు.

10th Class Social Textbook Page No.169

ప్రశ్న 18.
‘అభివృద్ధి భావనలు’ అన్న అధ్యాయంలో మీరు కుడంకుళం అణువిద్యుత్తు కర్మాగారానికి నిరసనల గురించి చదివారు. ఇక్కడ తెలుసుకున్న వాటి ఆధారంగా ఆ నిరసనలను వివరించండి.
జవాబు:

  1. ‘కుడంకుళం’ తమిళనాడులోని ఒక ప్రశాంతమైన గ్రామం.
  2. అక్కడి ప్రజల జీవనోపాధి చేపలు పట్టడం.
  3. ‘కుడంకుళం’ అణువిద్యుత్ కర్మాగారాన్ని అక్కడ స్థాపించటంవలన, వారు ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయవలసి వస్తుంది.
  4. అందువలన వారికి జీవనోపాధి పోతుంది.
  5. అంతేకాకుండా అణువిద్యుత్ కర్మాగారాలలో జరిగే విధ్వంసాల వలన కూడా వారు భయపడుతున్నారు.
  6. వారి మనస్సులలో గత కొద్దికాలం క్రిందట జపాన్ అణుకర్మాగారంలో జరిగిన విధ్వంసం మెదలుతూ ఉంది.
  7. అందువలన అక్కడ దీర్ఘకాలంగా పోరాటం జరుగుతోంది.
  8. కనుక ఆధునిక అభివృద్ధి పథకాల వలన వీరి అతి ముఖ్యమైన వనరైన సముద్రము అందుబాటులో లేకుండాపోతుంది.

10th Class Social Textbook Page No.169

ప్రశ్న 19.
పర్యావరణ పరిరక్షణ ప్రత్యక్షంగా ప్రభావితులయ్యే సమూహాలకే కాక మనందరికీ కూడా ఎంతో కీలకమైనది. కొన్ని ఉదాహరణలతో దీనిని వివరించండి.
(లేదా)
క్రింది పేరాను చదివి, మీ అభిప్రాయం రాయండి.

“వేగమైన ఆర్థిక అభివృద్ధి వల్ల అనేక రంగాలలో ఇప్పటికే మనం వ్యతిరేక పరిణామాలను చవి చూస్తున్నాం. భూగర్భ జలాలు, రసాయనిక పురుగు మందుల సమస్యలు ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణలు. పర్యావరణంపై ఆధారపడి అనేక వేల సమూహాలు నివసిస్తున్నాయి. పర్యావరణాన్ని విధ్వంసం చెయ్యటమంటే ఈ సమూహాలను మట్టుపెట్టడమే.
జవాబు:
పర్యావరణ పరిరక్షణ మనందరి ముందున్న తక్షణ కర్తవ్యం. మన చుట్టూ ఉండే గాలి, నీరు, చెట్లు, వాతావరణం, శీతోషసితిలో అనేక మార్పుల వలన మానవ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ఉదాహరణకు అభివృద్ధి పేరుతో పరిశ్రమల స్థాపన ఆశయంతో చుట్టూ ఉండే అడవులు, జంతువులు, మిగతా జీవరాసులు నశిస్తాయి. మరీ ముఖ్యంగా ఈ పర్యావరణంలో ప్రకృతిలో ఒక జీవి ఇంకొక జీవి మీద ఆధారపడి జీవిస్తున్నాయి.

అదే విధంగా వ్యవసాయరంగంలో సాంకేతికత పేరుతో సంప్రదాయ పద్ధతులు కాకుండా సంకరజాతి వంగడాలు, రసాయనిక పురుగుమందులు వాడడం వలన వాటి ప్రభావం మనష్యులందరి మీద పరోక్షంగా పడుతుంది. కాబట్టి పర్యావరణ పరిరక్షణ ఎంతో కీలకమైనది.

AP Board 10th Class Social Solutions Chapter 12 సమానత – సుస్థిర అభివృద్ధి

10th Class Social Textbook Page No.169

ప్రశ్న 20.
ఎనిమిదవ తరగతిలోని ఆంధ్రప్రదేశ్ లోని ఖనిజాలకు సంబంధించిన అధ్యాయాలను మరొకసారి చూడండి. పారిశ్రామిక వేత్తలకు, ఖనిజాలు ఉన్న ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలకు మధ్య ఎటువంటి వైరుధ్యాలు చోటు చేసుకుంటాయి?
జవాబు:
వెనుకబడిన దేశమైన భారతదేశం ఆర్థికంగా బలం పుంజుకోవడానికిగాను పరిశ్రమలను నెలకొల్పదలచి, సరళీకృత ఆర్థిక విధానాల ద్వారా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించి, అధిక ఆదాయం పొందగా ఆర్థిక ప్రగతి సాధించింది. అయితే పారిశ్రామికవేత్తలకు కేటాయించిన ప్రదేశాలలో నివసించే ప్రజలకు అనేక విషయాలలో వైరుధ్యాలు ఉన్నాయి. ఖనిజ వనరులు లభ్యమయ్యే ప్రదేశాలలో అడవులను విచక్షణారహితంగా నరికివేయటం, ఖనిజాలను కడగడానికి పెద్ద మొత్తంలో నీళ్ళు కావాలి. తద్వారా దగ్గరలోని నదులు, నీటి వనరులు కలుషితమవుతాయి. గనులలో పనిచేసే కార్మికులు అనేక ప్రమాదాలు ఎదుర్కొంటారు. ఇలాంటివే మరెన్నో వైరుధ్యాలు చోటుచేసుకుంటాయి.

AP Board 10th Class Social Solutions Chapter 11 ఆహార భద్రత

SCERT AP 10th Class Social Study Material Pdf 11th Lesson ఆహార భద్రత Textbook Questions and Answers.

AP State Syllabus 10th Class Social Solutions 11th Lesson ఆహార భద్రత

10th Class Social Studies 11th Lesson ఆహార భద్రత Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
తప్పు వాక్యాలను సరి చేయండి. (AS1)
* ఆహార భద్రత సాధించటానికి ఆహార ఉత్పత్తిని మాత్రమే పెంచితే సరిపోతుంది.
* ఆహార భద్రత సాధించటానికి ఒకే పంటసాగును ప్రోత్సహించాలి.
* తక్కువ ఆదాయం ఉన్న ప్రజలలో తక్కువ కాలరీల వినియోగం ఎక్కువగా ఉంటుంది.
* ఆహార భద్రతను సాధించటంలో చట్ట సభల ప్రాధాన్యత ఎక్కువ.
* పిల్లల్లో పోషకాహార లోపాన్ని సరిచెయ్యటానికి ప్రజా పంపిణీ వ్యవస్థను ఉపయోగించవచ్చు.
జవాబు:

  • ఆహార భద్రత సాధించటానికి ఆహార ఉత్పత్తి ఒక్కటే పెంచితే సరిపోదు; ఉత్పత్తితో పాటు ఆహార ధాన్యాల లభ్యతా, ఆహార అందుబాటు కూడా ముఖ్యం.
  • ఆహార భద్రత సాధించటానికి ఒకే పంటసాగును కాక ఇతర పంటల దిగుబడి కూడా పెంచేలా ప్రోత్సహించాలి. ఉదాహరణకు వరి, గోధుమలతో పాటు జొన్న, నూనెగింజల దిగుబడులు కూడా పెరుగుతున్నాయి.
  • తక్కువ ఆదాయం ఉన్న ప్రజలలో ‘తక్కువ కాలరీల వినియోగం’ ఉంటుంది. తక్కువ ఆదాయం ఉన్న (పేద) ప్రజలకు కొనుగోలు శక్తి తక్కువ ఉంటుంది. ఆహార ధాన్యాల కొనుగోలు, వినియోగం తక్కువ ఉంటుంది. ఆ ఆహారం వల్ల వారు పొందే కాలరీలు కూడా సహజంగా తక్కువగానే ఉంటాయి.
  • ఆహార భద్రతను సాధించటంలో చట్ట సభలతో పాటు న్యాయస్థానాల ప్రాధాన్యత కూడా ఎక్కువగానే ఉంది. ఉదాహరణకు మధ్యాహ్న భోజన పథకం అమలుపై న్యాయ వ్యవస్థ ఆదేశాలు.
  • పిల్లల్లో పోషకాహార లోపాన్ని సరిచెయ్యటానికి ప్రజాపంపిణీ వ్యవస్థ కంటే ఎక్కువగా అంగన్‌వాడీలు (ICDS), మధ్యాహ్న భోజన పథకమును ఉపయోగిస్తున్నారు.

ప్రశ్న 2.
గ్రామీణ ప్రాంతాలలో కాలరీల వినియోగం గత కొద్ది కాలంగా ……. 2004-05 లో తలసరి సగటు కాలరీల వినియోగం అవసరమైన దానికంటే ….. ఉంది. పట్టణ ప్రాంతంలో ఉంటున్న వ్యక్తికి రోజుకు కనీసం 2100 కాలరీలు అవసరం. పటణ ప్రాంతంలో 2004-05 లో కాలరీల అవసరం, వినియోగం మధ్య అంతరం ……… (AS1)
జవాబు:
తగ్గుతోంది. తక్కువగా, పెరిగింది.

AP Board 10th Class Social Solutions Chapter 11 ఆహార భద్రత

ప్రశ్న 3.
ప్రకృతి వైపరీత్యం వల్ల ఒక సంవత్సరం ఆహార ధాన్యాల ఉత్పత్తి తగ్గిందని అనుకుందాం. ఆ సంవత్సరంలో ఆహార ధాన్యాల లభ్యత పెరగటానికి ప్రభుత్వం ఏ చర్యలు తీసుకోవాలి? (AS4)
(లేదా)
ఆహార ధాన్యాల ఉత్పత్తి తగ్గినపుడు, ఆహార ధాన్యాల లభ్యత పెరగడానికి ప్రభుత్వం ఏ చర్యలు తీసుకోవాలని నీవు అనుకుంటున్నావు?
జవాబు:
ఆహార ధాన్యాల లభ్యత పెరగటానికి ప్రభుత్వం తీసుకోవలసిన చర్యలు :

  1. ఆహార ధాన్యాల లభ్యత పెంచటానికి ‘దిగుమతులు’ ఒక ముఖ్య మార్గం.
  2. ఆహార లభ్యతను పెంచటానికి ప్రభుత్వ నిల్వల (బఫర్ నిల్వలు)’ ను ఉపయోగించుకోవటం మరో ముఖ్యమైన మార్గం. (FCI ధాన్యాగారాలలోని నిల్వలను ఉపయోగించుకోవాలి.)
  3. ఇతర ప్రత్యామ్నాయ ఆహార పదార్థాల లభ్యతను అందుబాటులోకి తేవాలి.
  4. నల్ల బజారు (Black Market), అక్రమ నిల్వలను అరికట్టాలి.
  5. ఎగుమతులను నిషేధించుట మరియు అవసరమైన ఆంక్షలు విధించుట. (ధరలను అదుపులో ఉంచాలి.)
  6. తర్వాతి సంవత్సరంలో మంచి దిగుబడులు సాధించటానికి అవసరమైన చర్యలు చేపట్టడం చేయాలి.
    ఉదా : హరిత విప్లవం

ప్రశ్న 4.
బరువు తక్కువగా ఉండటానికి, ఆహార అందుబాటుకు మధ్య గల సంబంధాన్ని తెలియజేయటానికి మీ ప్రాంతం నుంచి ఒక ఊహాజనిత ఉదాహరణను ఇవ్వండి. జ. సరిపడా ఆహారం ఉంటే ఎవరూ ఉండవలసిన దానికంటే తక్కువ బరువు కానీ, తక్కువ ఎత్తుగానీ ఉండరు. దీనికి ఉదాహరణ, మా గ్రామం ప్రాంతంలోని సంఘటన. (AS4)
జవాబు:

  1. మా ప్రాంతంలోని ప్రజా వైద్యశాలకు తక్కువ బరువు ఉన్న రోగులు ప్రతిరోజు పెద్ద సంఖ్యలో వస్తారు.
  2. అక్కడి డాక్టరు ఈ పరిస్థితిని వివరించారు.
  3. కుటుంబానికి నెలకు రేషను దుకాణం ద్వారా లభించే ఆహార ధాన్యాలు అయిదుగురు ఉన్న కుటుంబంలో 11 రోజులకు సరిపోతాయి.
  4. మిగిలిన రోజులకు వాళ్లు తాము పండించిన ఆహారంపైన లేదా మార్కెట్లో కొన్న దానిపైన ఆధారపడాలి.
  5. వ్యవసాయ కూలీల, ఆదాయంలో ఎక్కువ భాగం ఇంటి అద్దె, కరెంటు ఇతరత్రా అవసరాలకు ఖర్చు అయిపోతుంది. కాబట్టి వీరు రిటైల్ మార్కెట్లో ఆహారధాన్యాల కొనుగోలు చేయలేకపోతున్నారు.
  6. ఈ విధంగా సరిపడినంత ఆహారం తీసుకోలేకపోతున్నారు, కనుక వీరు తీవ్ర శక్తి లోపం (BMI-18.5) కలిగి ఉన్నారు. (తక్కువ బరువు సమస్య తీవ్రంగా ఉంది.)
  7. అధిక శాతం ప్రజలు వారికి కావల్సిన దానికంటే తక్కువ కాలరీలు తీసుకుంటున్నారు, కారణం పేదరికం వల్ల ఆహారం అందుబాటులో లేకపోవడమేనని నేను గుర్తించాను.

AP Board 10th Class Social Solutions Chapter 11 ఆహార భద్రత

ప్రశ్న 5.
వారం రోజుల మీ కుటుంబ ఆహార అలవాట్లను విశ్లేషించండి. దాంట్లోని పోషకాలను వివరించటానికి ఒక పట్టిక తయారుచెయ్యండి.
జవాబు:
విద్యార్థులు స్వయంగా చేయగలరు.
ఆధారం:
AP Board 10th Class Social Solutions Chapter 11 ఆహార భద్రత 1

ప్రశ్న 6.
ఆహార ఉత్పత్తి పెరగటానికి, ఆహార భద్రతకు మధ్యగల సంబంధాన్ని వివరించండి. (AS1)
(లేదా)
ఆహార ఉత్పత్తి, ఆహార భద్రతల మధ్య సంబంధాన్ని వివరించుము.
జవాబు:
ఆహార ఉత్పత్తి పెరగటానికి, ఆహార భద్రతకు మధ్య అవినాభావ సంబంధముందని చెప్పవచ్చు.

  1. రోజువారీ కనీస ఆహార అవసరాలు తీర్చటానికి సరిపడేటంత ఆహార పదార్థాల ఉత్పత్తి కచ్చితంగా ఉండటం ఆహార భద్రతకు ముఖ్యమైన అవసరం.
  2. ఆహార ఉత్పత్తి పెరిగినట్లయితే దేశంలో తలసరి సగటు ఆహార ధాన్యాల లభ్యత పెరుగుతుంది.
  3. ఆహార లభ్యత పెరిగినట్లయితే ప్రజలకు ఆహారం అందుబాటులో ఉంటుంది.
  4. ఆహారం అందుబాటులో ఉంటే ఆహార భద్రత సాధించినట్లే.
  5. ఆహార ఉత్పత్తి పెరిగితే బఫర్ నిల్వలు పెరుగుతాయి; ప్రజాపంపిణీ వ్యవస్థ సమర్థంగా పని చేస్తుంది, కొనుగోలు శక్తి తద్వారా వినియోగించే స్థితి పెరుగుతుంది. పోషకాహార స్థాయి పెరుగుతుంది. ఈ విధంగా ఆహార భద్రత సమర్ధవంతంగా కల్పించవచ్చు.

ప్రశ్న 7.
“ప్రజాపంపిణీ వ్యవస్థ ప్రజలకు ఆహార భద్రత ఉండేలా చూడగలదు.” ఈ వ్యాఖ్యానానికి మద్దతుగా వాదనలు పేర్కొనండి. (AS1)
(లేదా)
“ప్రజా పంపిణీ వ్యవస్థ ప్రజలకు ఆహార భద్రత ఉండేలా చూడగలదనే” వాక్యాన్ని ఎలా సమర్థించగలవు?
జవాబు:

  1. ప్రజాపంపిణీ వ్యవస్థలో చౌక ధరల దుకాణాలు ప్రధానమయినవి. నిత్యావసర వస్తువులను తక్కువ ధరకు అందించేవి చౌకధరల దుకాణాలు.
  2. భారతదేశంలో ఆహారధాన్యాలు అందుబాటులో ఉండటానికి, ప్రజలకు చౌకధరల దుకాణాలు ఎంతో ముఖ్యమైనవి.
  3. చౌకధరల దుకాణాల నుంచి కొనుగోలు చేసే ఆహారధాన్యాలు, వాళ్ళ మొత్తం ఆహార ధాన్యాల వినియోగంలో ఎక్కువ శాతమే ఉంది.
  4. అన్ని వర్గాల ప్రజలకు, అన్ని రకాల నిత్యావసర వస్తువులను కొనుగోలు చేసే శక్తి పెంచుటకుగాను (ధరల యంత్రాంగం ద్వారా) ధరలను అదుపులో ఉంచుతుంది. తద్వారా ఆహార పదార్థాల అందుబాటు గుణాత్మకంగాను, పరిమాణాత్మకం గాను పెరుగుతుంది.
  5. పేదలకు, అత్యంత పేదలకు సబ్సిడీ ధరకు ఆహార ధాన్యాలను సరఫరా చేస్తూ (PDS ద్వారా) వారికి ఆహార భద్రత కల్పిస్తుంది.
  6. గ్రామీణ ప్రాంతాల్లో అత్యధికంగా 75 శాతానికి, పట్టణ జనాభాలో 50 శాతానికి ప్రజాపంపిణీ వ్యవస్థ నుంచి ఆహార ధాన్యాలను కొనుగోలు చేసే హక్కు ఉంది.

ప్రశ్న 8.
AP Board 10th Class Social Solutions Chapter 11 ఆహార భద్రత 2
ఆహార భద్రత గురించి పై పోస్టరు ఏమి తెలియజేస్తున్నది? (AS1)
జవాబు:
ఆహార భద్రత గురించి పై పోస్టరు మనలో ప్రతి ఏడుగురిలో ఒకరు ఆకలితో నిద్రపోతున్నారని, ఇంక ఇలా ఉండాల్సిన అవసరం లేదని తెలియచేస్తోంది. ఆ ఒక్కరూ కూడా ఆహారాన్ని తీసుకొని హాయిగా నిద్రిస్తారని తెలియచేస్తోంది.

ప్రశ్న 9.
ఆహార భద్రత గురించి ఇటువంటిదే ఒక పోస్టరు తయారుచెయ్యండి. (AS6)
జవాబు:
ఆధారం:
AP Board 10th Class Social Solutions Chapter 11 ఆహార భద్రత 3 AP Board 10th Class Social Solutions Chapter 11 ఆహార భద్రత 4

10th Class Social Studies 11th Lesson ఆహార భద్రత InText Questions and Answers

10th Class Social Textbook Page No.147

ప్రశ్న 1.
కింది వాక్యాలను చదివి హెక్టారుకు వరి, గోధుమల దిగుబడులు ఎలా ఉన్నాయో వివరించండి.
…………….., ……….. పంటల దిగుబడులు వరి, గోధుమలతో పోలిస్తే ఎప్పుడూ తక్కువగానే ఉన్నాయి. అయితే ఇటీవల కాలంలో ఈ పంటల దిగుబడులు మెల్లగా పెరుగుతున్నాయి.
జవాబు:
జొన్న, నూనెగింజలు.

10th Class Social Textbook Page No.147

ప్రశ్న 2.
దీర్ఘకాలం పాటు వరి, గోధుమ దిగుబడులు గణనీయంగా పెరగటానికి ఏ అంశాలు దోహదం చేశాయి?
జవాబు:
దీర్ఘకాలం పాటు వరి, గోధుమ దిగుబడులు గణనీయంగా పెరగటానికి దోహదం చేసిన అంశాలు

  • మేలు జాతి, సంకర జాతి విత్తనాలు వాడటం (ఉదా : ‘SRI’ వరి)
  • నాణ్యమైన పురుగు మందులు వాడుట ద్వారా సస్యరక్షణ చేపట్టడం.
  • విస్తృతంగా రసాయన ఎరువులను వాడటం. (ఉదా : పొటాషియం, నైట్రోజన్ ఎరువులు)
  • సాగునీటి వసతులను విస్తరించటం. (ఉదా : కాలువలు, గొట్టపు బావుల తవ్వకం)
  • విత్తుటకు, దున్నుటకు, పంట కోత మొ||న వాటికి యంత్రాల వాడకం. (ఉదా : ట్రాక్టర్, కంబైన్డ్ హార్వెస్టర్)

AP Board 10th Class Social Solutions Chapter 11 ఆహార భద్రత

10th Class Social Textbook Page No.152

ప్రశ్న 3.
దేశంలో అధిక శాతం ప్రజలకు ఆహార ధాన్యాలు అందుబాటులో లేని నేపథ్యంలో స్వల్ప ఆదాయం కోసం ఆహార ధాన్యాలను ఎగుమతి చెయ్యటం సరైనదేనా?
జవాబు:
సరియైన విధానం కాదు, దేశంలో అధిక ప్రజలకు ఆహార ధాన్యాలు అందుబాటులో లేని నేపథ్యంలో స్వల్ప ఆదాయం కోసం ఆహార ధాన్యాలను ఎగుమతి చెయ్యడం సరికాదు.

  • ఎగుమతులు పెరిగినట్లయితే ఆహార ధాన్యాల ధరలు పెరిగి, పేదలకు ఆహార అందుబాటు ఇంకా దూరమవుతుంది.
  • ఆహార ధాన్యాల నిల్వలు పెంచకుండా, ఎగుమతులు చేసినట్లయితే PDS ద్వారా పంపిణీకి ధాన్యాల కొరత ఏర్పడుతుంది.
  • కరవుకాటకాలు, ఇతర ప్రకృతి విపత్తులు సంభవించినట్లయితే ఆహార ధాన్యాల దిగుబడి తగ్గుతుంది, లభ్యత, అందుబాటు కూడా తక్కువగా ఉంటుంది. ఇలాంటి సమయాల్లో అవసరమైతే ఆహార ధాన్యాలను దిగుమతి చేసుకోవాలి.

10th Class Social Textbook Page No.152

ప్రశ్న 4.
క్రింది రేఖాచిత్రపటాన్ని పరిశీలించండి.
రేఖాచిత్రపటం : 2009-10 లో బియ్యం, గోధుమల కొనుగోళ్ళలో రేషను దుకాణాల నుంచి కొన్న శాతం
AP Board 10th Class Social Solutions Chapter 11 ఆహార భద్రత 5
ఖాళీలను పూరించండి :
అఖిల భారతానికి ప్రజల మొత్తం వినియోగంలో …….. (1)……… శాతం బియ్యం , ……… (2)…….. శాతం గోధుమ చౌక ధరల దుకాణాల నుంచి కొనుగోలు చేస్తారు. దీని అర్థం ప్రజలు తమ ఆహార ధాన్యాల అవసరంలో అధిక భాగం …. (3)…… నుంచి కొనుక్కోవాలి. అయితే …… (4)…………….. (5)…….. రాష్ట్రాలలో పరిస్థితి బాగుంది. …… (6)…….. ……(7)……… …. (8)……. రాష్ట్రాలలో ప్రజాపంపిణీ వ్యవస్థ ప్రజల ఆహార ధాన్యాల అవసరాలను నామమాత్రంగా తీరుస్తోంది.
జవాబు:

  1. 39,
  2. 28,
  3. రిటైల్ మార్కెట్,
  4. తమిళనాడు,
  5. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్
  6. బీహార్,
  7. రాజస్థాన్,
  8. పంజాబ్.

AP Board 10th Class Social Solutions Chapter 11 ఆహార భద్రత

10th Class Social Textbook Page No.155

ప్రశ్న 5.
బడిలో చేరే వయస్సు రాని పిల్లలకు పోషకాహార శాస్త్రజ్ఞులు మూడు చార్జులను ఉపయోగిస్తారు. ఈ మూడు వేరు వేరు సూచికలు మనకు పిల్లల పోషకాహార స్థాయికి సంబంధించి పూర్తి వివరాలను అందిస్తాయి. వాటిని కింద ఇచ్చాం.
AP Board 10th Class Social Solutions Chapter 11 ఆహార భద్రత 6
జవాబు:
AP Board 10th Class Social Solutions Chapter 11 ఆహార భద్రత 7

10th Class Social Textbook Page No.155

ప్రశ్న 6.
ఈ గణాంకాల నుంచి ఎటువంటి నిర్ధారణలకు వస్తారు ? ఒక పేరా రాయండి.
జవాబు:
ఈ గణాంకాల నుంచి నిర్ధారణలకు వచ్చిన అంశాలు :

  • 45% మంది పిల్లలు వయస్సుకు తగ్గ బరువు ఉండటం లేదు.
  • 41% మంది పిల్లలు వయస్సుకు తగ్గ ఎత్తు లేరు.
  • 21% మంది పిల్లలు ఎత్తుకు తగ్గ బరువు లేరు. అంటే సరైన BMI కలిగి లేరు.
  • ఎక్కువ మంది పిల్లలు పోషకాహార లోపం కలిగి ఉన్నారు.
  • చాలా మంది పిల్లల్లో వ్యాధినిరోధక శక్తి తక్కువగా ఉంది.
  • అంగన్‌వాడీ (ICDS) లాంటి పథకాలు సమర్థంగా అమలు అయ్యేలా చూడాలి.

AP Board 10th Class Social Solutions Chapter 11 ఆహార భద్రత

10th Class Social Textbook Page No.146

ప్రశ్న 7.
పాఠం 9 (రాంపురం : గ్రామ ఆర్థిక వ్యవస్థ) లోని “భూమి, ఇతర సహజ వనరులు” అనే భాగాన్ని మళ్ళీ చదవండి. భూమి నుంచి పంట ఉత్పత్తి పెంచటానికి ఏ ఏ విధానాలు ఉన్నాయి?
జవాబు:
గత కొద్ది దశాబ్దాలుగా సాగు కింద ఉన్న భూమి ఇంచుమించు స్థిరంగా ఉందని మనకు తెలుసు, కాబట్టి భూమి నుంచి పంట ఉత్పత్తి పెంచటం ముఖ్యం.

  • హెక్టారుకు లభించే పంట దిగుబడిని పెంచటానికి అవసరమైన ఉత్పాదకాలను (ఉదా : HYV విత్తనాలు) సక్రమంగా వినియోగించుకోవాలి.
  • సాగునీటి వసతులను (సక్రమ జల నిర్వహణ ద్వారా) పెంచటం. అయితే ఈ కీలక వనరు. అందరికీ అందేలా పంచుకునే పద్ధతిలో వినియోగించాలి. (ఉదా : గొట్టపు బావులు త్రవ్వడం).
  • వర్షాభావ పంట రకాలను స్థానిక పరిస్థితులకు అనుగుణంగా విత్తటం, వర్షపు నీటిని నిల్వ చేయటం, పంట మార్పిడి వంటి పద్ధతుల ద్వారా దిగుబడులు పెంచాలి.
  • సరియైన ‘సస్య రక్షణ’ చర్యలు చేపట్టాలి. ఉదా : నాణ్యమైన పురుగు మందులు వాడుట.
  • అవసరమైన మేర ‘ఎరువుల వాడకం చేపట్టడం. ఉదా : రసాయన, సేంద్రియ ఎరువులను వాడుట.
  • నేల సారాన్ని పెంచి, దిగుబడులను పెంచే బహుళ పంటల నమూనాను అనుసరించాలి. అంటే ఒకే పంట పొలంలో – గోధుమ, సజ్జ, బంగాళదుంప మొ||న పంటలను ఒకేసారి పండించటం.
  • కంబైన్డ్ హార్వెస్టర్ లాంటి ఆధునిక యంత్రాలను వాడుట ద్వారా పంటకాలము ఆదా అవుతుంది. నూర్పిడి సమయంలో జరిగే ధాన్యాల వృథాను తగ్గిస్తుంది.

10th Class Social Textbook Page No.146

ప్రశ్న 8.
ఇవ్వబడిన రేఖాచిత్ర పటమును పరిశీలించి ఖాళీలను పూరించండి (ప్రతి బిందువు దగ్గర కచ్చితమైన విలువను తెలుసుకోటానికి ‘వై’ అక్షం మీది స్కేలుని ఉపయోగించండి).
AP Board 10th Class Social Solutions Chapter 11 ఆహార భద్రత 8

ఆహారధాన్యాల ఉత్పత్తి 1970-71 నుండి ……(1)…… కు పెరిగింది. వరి ఉత్పత్తి 1970-71 నాటి 40 మిలియన్ టన్నుల నుండి 2010-11 నాటికి ….. (2)…… మిలియన్ టన్నులకు పెరిగింది. ఈ 40 ఏళ్ల కాలంలో ఉత్పత్తి వేగంగా పెరిగిన మరొక ముఖ్యమైన ఆహారపంట …. (3)…… . వరి, గోధుమలతో పోలిస్తే 1970-2011 కాలంలో …..(4)……. ఉత్పత్తి పెరగలేదు. దీనికి కారణం …. (5)……. అయి ఉండవచ్చు.
జవాబు:
1) 2010-11 వరకు
2) 95 3 ) గోధుమ
4) జొన్న, నూనె గింజలు
5) i) ప్రాధాన్యతనివ్వకపోవడం,
ii) వర్షాధార పంటలు కావడం,

10th Class Social Textbook Page No.147

ప్రశ్న 9.
జొన్న దిగుబడులను పెంచటంపై దృష్టి ఎందుకు పెట్టాలి? చర్చించండి.
జవాబు:
జొన్న దిగుబడులను పెంచటంపై దృష్టి ఎందుకు పెట్టాలంటే –

  • జొన్నను మంచి పోషక ధాన్యంగా వ్యవహరిస్తున్నారు.
  • జొన్న పంటను వర్షాధార ప్రాంతాలలో కూడా సాగుచేయవచ్చు.
  • నేల, ఇతర సహజ వనరులు అంతరించిపోకుండా, క్షీణతకు గురికాకుండా చూడటానికి.
  • ఆహార భద్రత, ఆహారధాన్యాల అందుబాటు పెంచుటకు.
  • పురుగు మందులు, రసాయన ఎరువులు ఎక్కువగా వాడనవసరం లేదు.
  • సాగునీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాలలో కూడా జొన్న పంటను పండించవచ్చు.
  • జొన్నలకు మార్కెట్ కూడా బాగా ఉంది. లక్షలాది ప్రజల ప్రధాన ఆహారం జొన్న.

10th Class Social Textbook Page No.148

ప్రశ్న 10.
1971కి చూపించిన విధంగా, 1991, 2011 సంవత్సరాలకు తలసరి సగటు ఆహార ధాన్యాల అందుబాటును లెక్కగట్టండి.
AP Board 10th Class Social Solutions Chapter 11 ఆహార భద్రత 9
గమనిక : 1 టన్ను = 1000 కిలోలు; 1 కిలో = 1000 గ్రాములు; # = మిలియన్ టన్నులు

* మీరు లెక్కించిన దాని ఆధారంగా ఖాళీలను పూరించండి : 1971 నుంచి 1991 నాటికి తలసరి ఆహారధాన్యాల లభ్యత ………….. (పెరిగింది/తగ్గింది), కానీ 2011లో ఇది ……………. (ఎక్కువ | తక్కువగా) ఉంది. ఇటీవల దశాబ్దాలలో జనాభావృద్ధిలో తగ్గుదల ఉన్నప్పటికీ ఇలా జరిగింది. భవిష్యత్తులో ఆహారధాన్యాల లభ్యత పెరగటానికి ప్రభుత్వం. ………………. చర్యలు చేపట్టాలి.
జవాబు:
AP Board 10th Class Social Solutions Chapter 11 ఆహార భద్రత 10
గమనిక : 1 టన్ను = 1000 కిలోలు; 1 కిలో = 1000 గ్రాములు; # = మిలియన్ టన్నులు.

మీరు లెక్కించిన దాని ఆధారంగా ఖాళీలను పూరించండి : 1971 నుంచి 1991 నాటికి తలసరి ఆహారధాన్యాల లభ్యత పెరిగింది (పెరిగింది/తగ్గింది), కానీ 2011లో ఇది తక్కువగా (ఎక్కువ తక్కువగా) ఉంది. ఇటీవల దశాబ్దాలలో జనాభావృద్ధిలో తగ్గుదల ఉన్నప్పటికీ ఇలా జరిగింది. భవిష్యత్తులో ఆహారధాన్యాల లభ్యత పెరగటానికి ప్రభుత్వం ఉత్పత్తి పెంచటం, , దిగుమతులు పెంచటం లాంటి చర్యలు చేపట్టాలి.

10th Class Social Textbook Page No.150

ప్రశ్న 11.
వ్యవసాయ వైవిధ్యీకరణకు సంబంధించిన పదాలు, వాక్యాల కింద గీత గీసి భారతీయ రైతులకు ఇది ఎందుకు అవసరమో వివరించండి.
జవాబు:
భారతీయ రైతులకు వ్యవసాయ వైవిధ్యీకరణ అవసరం; ఎందుకంటే,

  • భారతీయ రైతులు ఎక్కువ శాతం మంది చిన్న, సన్నకారు రైతులే.
  • ఎక్కువ మంది పేద రైతులే, వారి ఆదాయం పెరగాలంటే ఇది అవసరం.
  • అధిక దిగుబడులు పొందడానికి,
  • భారతదేశంలో వ్యవసాయం ఋతుపవనాలపై ఆధారపడి ఉంది కనుక వర్షాభావ కాలంలో, వర్షాభావ ప్రాంతంలో ఈ విధమైన వ్యవసాయం ఎంతో అవసరం.
  • అల్ప ఉపాధి, ప్రచ్ఛన్న నిరుద్యోగిత నివారణకు కూడా ఇది ఎంతో అవసరం.
  • అల్ప ఆదాయ సన్న, చిన్నకారు రైతులకు ఆహార భద్రత కల్పించుటకు.

AP Board 10th Class Social Solutions Chapter 11 ఆహార భద్రత

10th Class Social Textbook Page No.150

ప్రశ్న 12.
మీ గ్రామంలో లేదా మీకు తెలిసిన గ్రామంలో వ్యవసాయ వైవిధ్యీకరణను వివరించండి.
జవాబు:
నాకు తెలిసిన ‘బేతపూడి’ గ్రామంలోని వ్యవసాయ వైవిధ్యీకరణ గురించి వివరిస్తాను.

  • ఈ గ్రామంలోని అన్ని భూములకు సాగునీటి వసతులు (కాలువలు లేదా బోరుబావులు) ఉన్నాయి.
  • ఈ గ్రామంలో వ్యవసాయ పెట్టుబడులకుగాను ఋణసౌకర్యం అందించుటకు బ్యాంక్ సౌకర్యం కలదు.
  • ఆధునిక వ్యవసాయ పద్ధతులను ఉపయోగిస్తున్నారు. సాంకేతిక విజ్ఞానం చాలా బాగుంది.
  • వరి, జొన్న, మొక్కజొన్న, మినుము, పెసర వంటి ఆహార ధాన్యాలతోపాటు ప్రత్తి, మిరప వంటి వాణిజ్య పంటలు సాగుచేస్తున్నారు.
  • పంటల మధ్య కాలంలో కూరగాయలు పండిస్తున్నారు. బెండ, వంగ, దోస, టమోట పండిస్తున్నారు.
  • అంతర్ పంటలుగా ‘కందులు’ (కందిపప్పు) ను పండిస్తున్నారు.
  • దాదాపుగా అందరికి 2-3 గేదెలు ఉన్నాయి. పాడి పరిశ్రమ బాగా అభివృద్ధి చెందింది.
  • గ్రామంలో 4 కంబైన్డ్ హార్వెస్టర్లు, దాదాపు 16 ట్రాక్టర్లు ఉన్నాయి. వ్యవసాయ యాంత్రీకరణ జరిగింది.
  • వివిధ మార్కెట్ల సమాచారం అందుబాటులో ఉంటుంది. మెరుగైన రవాణా సౌకర్యాలు కలిగి ఉన్నది.
    సూచన : విద్యార్థులు తాము చూసిన గ్రామం గురించి స్వయంగా రాయగలరు.

10th Class Social Textbook Page No.150

ప్రశ్న 13.
ఎనిమిదవ తరగతిలోని ప్రజా పంపిణీ వ్యవస్థపై చర్చను గుర్తుకు తెచ్చుకోండి. ప్రజాపంపిణీ వ్యవస్థకు, ప్రజల ఆహార భద్రతకు గల సంబంధం ఏమిటి?
(లేదా)
భారతదేశ దక్షిణాది రాష్ట్రాలలో ప్రజా పంపిణీ వ్యవస్థ బాగుందని అధ్యయనాలు వెల్లడి చేస్తున్నాయి. ఇది ప్రజా పంపిణి వ్యవస్థను అందరికి వర్తింపచేసిన రాష్ట్రాలు కావటము గమనించవలసిన విషయం. ఇవి అందరికి తక్కువ ధరలలో ఆహార ధాన్యాలను అందించాయి. ఇందుకు విరుద్ధంగా ఇతర రాష్ట్రాలు పేదవాళ్ళను గుర్తించి ఆహార ధాన్యాలను పేదలకు, పేదలు కాని వాళ్ళకు వేరు వేరు ధరలకు అమ్మాయి. పేదలలో కూడ అత్యంత పేదలకు కూడ వేరే హక్కులు ఉన్నాయి. వాళ్ళకు అందించే మోతాదు వేరు.
ప్రజాపంపిణీ వ్యవస్థకు, ప్రజల ఆహార భద్రతకు మధ్య గల సంబంధాన్ని వివరించండి.
జవాబు:
ప్రజాపంపిణీ వ్యవస్థ (PDS)కు, ప్రజల ఆహార భద్రతకు ఎంతో దగ్గరి సంబంధముంది.

  • ప్రజాపంపిణీ వ్యవస్థలో చౌకధరల దుకాణాలు ఎంతో ముఖ్యమైనవి.
  • పేదలకు, అత్యంత పేదలకు సబ్సిడి ధరకు నిత్యావసర వస్తువులను సరఫరా చేస్తూ ఆహార పదార్థాల అందుబాటుకు తద్వారా ఆహారభద్రతకు PDS ఎంతో తోడ్పడుతుంది.
  • వివిధ పథకాలు (మధ్యాహ్న భోజన పథకం, MNREP, FFW, AAY, ICDS మొ||నవి) ద్వారా పేద ప్రజలకు ఆహార ధాన్యాలను పంపిణీ చేస్తూ ఆహారం అందుబాటులోకి తెస్తుంది.
  • ధరలను అదుపులో ఉంచుట ద్వారా అల్ప ఆదాయ వర్గాల కొనుగోలు శక్తి పెరుగుతుంది. తద్వారా ఆహార ధాన్యాల అందుబాటు పరిమాణాత్మకంగా, గుణాత్మకంగా పెరుగుతుంది.

AP Board 10th Class Social Solutions Chapter 11 ఆహార భద్రత

10th Class Social Textbook Page No.153

ప్రశ్న 14.
సమర్థంగా పనిచేసే అంగన్‌వాడీ కేంద్రం ఈ పరిస్థితిని ఎలా సరిదిద్దగలదు ? చర్చించండి.
జవాబు:
మన దేశంలో మొత్తం మీద 16% పిల్లల్లో బరువు చాలా తక్కువగా ఉన్న తీవ్ర పరిస్థితి ఉంది. మొత్తంగా 45% పిల్లలు తక్కువ బరువు ఉన్నారు. 1-3 సం||రాల పిల్లలతో పోలిస్తే, 3-5 సం||రాల పిల్లల్లో ఇది చాలా ఎక్కువగా ఉంది. సమరంగా పనిచేసే అంగన్‌వాడీ కేంద్రం ఈ పరిస్తితిని చాలా వరకు సరిదిద్దగలదు.

  • అంగన్‌వాడీల్లో 1-5 సం||రాల పిల్లలు ఎక్కువగా ఉంటారు, వీరు శిక్షణ పొందిన ఆయాల సంరక్షణలో ఉంటారు.
  • ప్రభుత్వం పౌష్టికాహారం (పోషకాహారం)ను అంగన్‌వాడీల ద్వారానే సరఫరా చేస్తుంది.
  • పిల్లల యొక్క ఎత్తు, బరువులను ఎప్పటికప్పుడు పరీక్షించి, తగుచర్యలు తీసుకుంటారు.
  • పిల్లలకు అవసరమైన వైద్య, ఆరోగ్య సూచనలు అందించబడతాయి, వ్యాక్సినేషన్ ఉంటుంది.
  • ఆహ్లాదకరమైన, పరిశుభ్రమైన వాతావరణం ఉండటం వలన పిల్లల ఎదుగుదల చక్కగా ఉంటుంది.
  • అంగన్‌వాడీ కేంద్రంలో సరఫరా చేయు గ్రుడ్లు, ప్రోటీన్స్ (సోయాబీన్స్ పొడి), సమతౌల్య ఆహారం పొడి మొ||నవి పిల్లల ఎదుగుదలకు, అభివృద్ధికి ఎంతో తోడ్పడతాయి.

AP Board 10th Class Social Solutions Chapter 10 ప్రపంచీకరణ

SCERT AP 10th Class Social Study Material Pdf 10th Lesson ప్రపంచీకరణ Textbook Questions and Answers.

AP State Syllabus 10th Class Social Solutions 10th Lesson ప్రపంచీకరణ

10th Class Social Studies 10th Lesson ప్రపంచీకరణ Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
విదేశీ పెట్టుబడి, వాణిజ్యాలపై భారత ప్రభుత్వం అవరోధాలు కల్పించటానికి గల కారణాలు ఏమిటి ? ఈ అవరోధాలను తొలగించాలని అది ఎందుకు అనుకుంది? (AS1)
జవాబు:
దేశంలోని ఉత్పత్తిదారులకు విదేశీ పోటీ నుండి రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని భావించిన భారత ప్రభుత్వం విదేశీ వాణిజ్యం, విదేశీ పెట్టుబడులపై అవరోధాలు కల్పించింది. అయితే 1991 నుండి భారత ఉత్పత్తిదారులు ప్రపంచవ్యాప్త ఉత్పత్తిదారులతో పోటీపడాల్సిన అవసరం ఉందని నిర్ణయించి ఈ అవరోధాలను తొలగించాలని నిర్ణయించింది.

ప్రశ్న 2.
కార్మిక చట్టాల సడలింపు కంపెనీలకు ఏ విధంగా సహాయపడుతుంది? (AS1)
జవాబు:
కార్మిక చట్టాల సడలింపు వలన కంపెనీకి కార్మీకుల పైన అయ్యే ఖర్చు తగ్గుతుంది. దీని మూలంగా కార్మికులను దీర్ఘకాలిక ప్రాతిపదికన కాకుండా పని ఒత్తిడిని బట్టి తక్కువ కాలవ్యవధికి నియమించుకొనే అవకాశం ఉంది.

AP Board 10th Class Social Solutions Chapter 10 ప్రపంచీకరణ

ప్రశ్న 3.
ఉత్పత్తిని చేపట్టటానికి, దానిని నియంత్రించటానికి, లేదా ఇతర దేశాలలో స్థిరపడటానికి బహుళజాతి సంస్థలు అవలంబించే విధానాలు ఏమిటి? (AS1)
జవాబు:
బహుళజాతి సంస్థలు ఉత్పత్తి ప్రక్రియను చిన్న భాగాలుగా చేసి ప్రపంచంలో పలుచోట్ల చేబడతాయి. వాటిని చౌకగా ఉత్పత్తి చేయగల ప్రాంతాన్ని దీనికై ఎన్నుకుంటాయి. మార్కెటింగ్ కు సమీపంలోని దేశాలను ఎంపిక చేసుకొని అచ్చట అసెంబ్లింగ్ యూనిట్లనేర్పాటు చేస్తారు. ఇంగ్లీషు మాట్లాడగలిగే జనాభా గల భారతదేశం లాంటి దేశాలలో కస్టమర్ కేర్ సేవలనేర్పాటు చేస్తాయి. వీరు ఆయా దేశాలలోని కొన్ని కంపెనీలతో కలసి తమ సంస్థలనేర్పాటు చేయడం ద్వారా ఆయా దేశాలలో నిలదొక్కుకుంటాయి.

ప్రశ్న 4.
అభివృద్ధి చెందుతున్న దేశాలు వాణిజ్యం, పెట్టుబడులలో సరళీకృత విధానాలను అవలంబించాలని అభివృద్ధి చెందిన దేశాలు ఎందుకు కోరుకుంటున్నాయి? దీనికి ప్రతిగా అభివృద్ధి చెందుతున్న దేశాలు ఏ షరతులను కోరాలి? (AS4)
జవాబు:
అభివృద్ధి చెందుతున్న దేశాలు వాణిజ్యం, పెట్టుబడులలో సరళీకృత విధానాలను అవలంబించాలని అభివృద్ధి చెందిన దేశాలు కోరుకొంటాయి. ఎందుకంటే బహుళజాతి సంస్థలు అధికంగా అభివృద్ధి చెందిన దేశాలకు చెందినవి మరియు ముడి సరుకులు, మార్కెట్లు గల అభివృద్ధి చెందుతున్న దేశాలలోకి బహుళజాతి సంస్థలు ప్రవేశించాలంటే ఆ దేశాలు సరళీకృత విధానాలను అవలంబించాల్సి ఉంటుంది. అయితే అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఎటువంటి అవరోధాలు లేకుండా న్యాయపూరిత విధానాలు అవలంబించాలని అభివృద్ధి చెందుతున్న దేశాలు షరతులు విధించాలి.

ప్రశ్న 5.
“ప్రపంచీకరణ ప్రభావం ఒకేరకంగా లేదు.” ఈ వాక్యాన్ని వివరించండి. (AS1)
జవాబు:
ప్రపంచీకరణ వల్ల అందరూ ప్రయోజనం పొందలేదని తెలుస్తోంది. విద్య, నైపుణ్యం, సంపద ఉన్న వాళ్లు కొత్త అవకాశాల వల్ల బాగా లాభపడ్డారు. ఇంకొకవైపున ఎటువంటి ప్రయోజనం పొందని ప్రజలు అధిక సంఖ్యలో ఉన్నారు. ప్రపంచీకరణ ఇప్పుడు ఎవరూ కాదనలేని వాస్తవం. ప్రపంచీకరణ వల్ల అందరికీ న్యాయం జరిగేటట్లు ఎలా చెయ్యాలి అనేది మన ముందున్న ప్రశ్న. న్యాయమైన ప్రపంచీకరణ అందరికీ అవకాశాలు సృష్టిస్తుంది. దాని ప్రయోజనాలు మరింత బాగా పంచుకోబడతాయి.

AP Board 10th Class Social Solutions Chapter 10 ప్రపంచీకరణ

ప్రశ్న 6.
వాణిజ్య, పెట్టుబడి విధానాలను సరళీకరించటం వల్ల ప్రపంచీకరణ ప్రక్రియకు మేలు ఎలా జరిగింది? (AS1)
జవాబు:
వాణిజ్య, పెట్టుబడి విధానాలను సరళీకరించడం వలన సాంకేతిక పరిజ్ఞానం శరవేగంతో విస్తరించి ప్రపంచీకరణకు దోహదం చేసాయి. టెలికమ్యూనికేషన్ రంగం గణనీయంగా అభివృద్ధి చెందడంలో ప్రపంచమే ఓ కుగ్రామంగా మారిపోయింది. వాయిస్ మెయిల్, ఎలక్ట్రానిక్ మెయిల్స్ తో నామమాత్రపు ఖర్చుతో సమాచారం ప్రపంచంలో ఎక్కడికైనా క్షణాల్లో చేరవేయవచ్చు.

ప్రశ్న 7.
దేశాల మధ్య మార్కెట్ల అనుసంధానానికి విదేశీ వాణిజ్యం ఎలా దోహదం చేస్తుంది? ఇక్కడ ఇచ్చినవి కాకుండా కొత్త ఉదాహరణలతో దీనిని వివరించండి. (AS1)
జవాబు:
దేశాల మధ్య అనుసంధానంగా చాలా కాలంగా వాణిజ్యం ఉంటుంది. భారతదేశం ప్రాచీన కాలం నుండి నూలు వస్త్రాలను అనేక దేశాలకు ఎగుమతి చేసింది. చైనా పట్టు వస్త్రాలను ఆసియా ఖండంలోని అనేక దేశాలకు ఎగుమతి చేసేది. భారతదేశం, ఇండోనేషియాలు సుగంధ ద్రవ్యాలతో వాణిజ్యం చేసినట్లు ఆధారాలున్నాయి.

ప్రశ్న 8.
ప్రపంచీకరణ భవిష్యత్తులో కూడా కొనసాగుతుంది. ఇప్పటి నుంచి ఇరవై ఏళ్లలో ప్రపంచం ఎలా ఉంటుందో ఊహించండి. మీ ఊహలకు కారణాలను పేర్కొనండి. (AS4)
జవాబు:
ప్రపంచీకరణ భవిష్యత్తులో కూడా కొనసాగుతుంది. 20 సంవత్సరాల తరువాత దేశీయ కంపెనీలు బహుళజాతి కంపెనీలను తట్టుకోలేక మూతపడవచ్చు. ప్రజలు సేవలు, వస్తువులనే దృష్టిలో పెట్టుకొని స్వదేశీ వస్తువులపై మోజును పూర్తిగా కోల్పోతారు. వైద్యం, విద్యా రంగాలలో కూడా బహుళజాతి సంస్థలు ప్రాచుర్యం పొందుతాయి. భారతీయ రైల్వేలలో కూడా బహుళజాతి సంస్థలు ప్రవేశిస్తాయి. ప్రధానంగా భారతీయ సంస్కృతిపై కూడా వీటి ప్రభావం పడుతుంది. మానవ సంబంధాలు దెబ్బతింటాయి.

ప్రశ్న 9.
ఇద్దరు వ్యక్తులు వాదించుకోవటం మీరు వింటున్నారు : ఒకరు ప్రపంచీకరణ మన దేశ అభివృద్ధిని కుంటుపరిచిందని అంటున్నారు. మరొకరు భారతదేశం అభివృద్ధి చెందటానికి ప్రపంచీకరణ సహాయపడుతోందని అంటున్నారు. ఈ వాదనలకు మీరు ఎలా స్పందిస్తారు? (AS2)
జవాబు:
ఇరువురి వాదనలలో కూడా ఎంతో కొంత నిజం ఉంది. ఎందుకంటే ప్రపంచీకరణ ప్రయోజనాలు సమానంగా పంపిణీ కాలేదు. సంపన్న వినియోగదారులకు, నైపుణ్యం, విద్య, అపార సంపద ఉన్న ఉత్పత్తిదారులకు అది ప్రయోజనకరంగా ఉంది. సాంకేతిక పరిజ్ఞానంతో కూడుకున్న కొన్ని సేవలు విస్తరించాయి. ఇంకొకవైపున వేలాదిమంది చిన్న ఉత్పత్తిదారులకు, కార్మికులకు వాళ్ల ఉపాధికి, హక్కులకు భంగం కలుగుతోంది. రెండు పార్శ్వాలున్న ఈ ప్రపంచీకరణను అర్థం చేసుకోవటం ముఖ్యం.

AP Board 10th Class Social Solutions Chapter 10 ప్రపంచీకరణ

ప్రశ్న 10.
ఖాళీలను పూరించండి : (AS1)
భారతీయ కొనుగోలుదారులకు రెండు దశాబ్దాల క్రితంతో పోలిస్తే ఇప్పుడు సరుకుల ఎంపికకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. …………………. ప్రక్రియ వల్ల ఇది సాధ్యమయ్యింది. అనేక ఇతర దేశాలలో ఉత్పత్తి అయిన సరుకులను భారతదేశ మార్కెట్లలో అమ్ముతున్నారు. దీని అర్థం ఇతర దేశాలతో …………………… పెరుగుతోంది. అంతేకాకుండా మనం మార్కెట్లో చూస్తున్న అనేక బ్రాండ్లను బహుళజాతి సంస్థలు భారతదేశంలోనే ఉత్పత్తి చేసి ఉండవచ్చు. బహుళజాతి సంస్థలు ……………………………., ……………………… కారణంగా భారతదేశంలో పెట్టుబడులు పెడుతున్నాయి. మార్కెట్లో వినియోగదారుల ఎంపికకు అవకాశాలు పెరిగాయి కానీ………………., వల్ల ఉత్పత్తిదారుల మధ్య ………………………. తీవ్రతరం అయ్యింది.
జవాబు:
భారతీయ కొనుగోలుదారులకు రెండు దశాబ్దాల క్రితంతో పోలిస్తే ఇప్పుడు సరుకుల ఎంపికకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ప్రపంచీకరణ ప్రక్రియ వల్ల ఇది సాధ్యమయ్యింది. అనేక ఇతర దేశాలలో ఉత్పత్తి అయిన సరుకులను భారతదేశ మార్కెట్లలో అమ్ముతున్నారు. దీని అర్థం ఇతర దేశాలతో విదేశీ వాణిజ్యం పెరుగుతోంది. అంతేకాకుండా మనం మార్కెట్లో చూస్తున్న అనేక బ్రాండ్లను బహుళజాతి సంస్థలు భారతదేశంలోనే ఉత్పత్తి చేసి ఉండవచ్చు. బహుళజాతి సంస్థలు సరళీకృత ఆర్థిక విధానాలు, సెట్ల ఏర్పాటు కారణంగా భారతదేశంలో పెట్టుబడులు పెడుతున్నాయి. మార్కెట్లో వినియోగదారుల ఎంపికకు అవకాశాలు పెరిగాయి కానీ కొత్త సాంకేతిక విజ్ఞానం, ఉత్పత్తి పద్ధతులు వల్ల ఉత్పత్తిదారుల మధ్య పోటీ తీవ్రతరం అయ్యింది.

ప్రశ్న 11.
క్రింది వాటిని జతపరచండి.

i) బహుళజాతి సంస్థలు తక్కువ ధరకు చిన్న ఉత్పత్తిదారుల నుంచి కొంటాయి.(అ) వాహనాలు
ii) వస్తువుల వాణిజ్యాన్ని నియంత్రించటానికి కోటాలు, పన్నులు ఉపయోగిస్తారు.(ఆ) దుస్తులు, పాదరక్షలు, క్రీడాపరికరాలు
iii) విదేశాలలో పెట్టుబడులు పెట్టిన భారతీయ కంపెనీలు.(ఇ) కాల్ సెంటర్లు
iv) సేవల ఉత్పత్తి విస్తరించటానికి సమాచార సాంకేతిక రంగం (IT) దోహదపడింది.(ఈ) టాటా మోటర్స్, ఇన్ఫోసిస్, రానా బాక్సీ
v) భారతదేశంలో ఉత్పత్తి చెయ్యటానికి అనేక బహుళజాతి సంస్థలు కర్మాగారాల ఏర్పాటుకు పెట్టుబడులు పెట్టాయి.(ఉ) వాణిజ్య అవరోధాలు

జవాబు:

i) బహుళజాతి సంస్థలు తక్కువ ధరకు చిన్న ఉత్పత్తిదారుల నుంచి కొంటాయి.(ఆ) దుస్తులు, పాదరక్షలు, క్రీడాపరికరాలు
ii) వస్తువుల వాణిజ్యాన్ని నియంత్రించటానికి కోటాలు, పన్నులు ఉపయోగిస్తారు.(ఉ) వాణిజ్య అవరోధాలు
iii) విదేశాలలో పెట్టుబడులు పెట్టిన భారతీయ కంపెనీలు.(ఈ) టాటా మోటర్స్, ఇన్ఫోసిస్, రానా బాక్సీ
iv) సేవల ఉత్పత్తి విస్తరించటానికి సమాచార సాంకేతిక రంగం (IT) దోహదపడింది.(ఇ) కాల్ సెంటర్లు
v) భారతదేశంలో ఉత్పత్తి చెయ్యటానికి అనేక బహుళజాతి సంస్థలు కర్మాగారాల ఏర్పాటుకు పెట్టుబడులు పెట్టాయి.(అ) వాహనాలు

10th Class Social Studies 10th Lesson ప్రపంచీకరణ InText Questions and Answers

10th Class Social Textbook Page No.133

ప్రశ్న 1.
ఫోర్డ్ మోటర్స్ బహుళజాతి కంపెనీయా? ఎందుకు?
జవాబు:
ఫోర్డ్ మోటర్స్ బహుళజాతి కంపెనీ. ఫోర్డ్ మోటర్స్ అనేక దేశాలకు కార్లను ఎగుమతి చేస్తుంది. అందుచే ఫోర్డ్ మోటర్స్ బహుళజాతి కంపెనీ.

AP Board 10th Class Social Solutions Chapter 10 ప్రపంచీకరణ

ప్రశ్న 2.
విదేశీ పెట్టుబడి అంటే ఏమిటి ? ఫోర్డ్ మోటర్స్ భారతదేశంలో ఎంత పెట్టుబడి పెట్టింది?
జవాబు:
ఒక దేశంలో ఇతర దేశాలు పెట్టుబడి పెట్టి కంపెనీలు నిర్వహించడాన్ని విదేశీ పెట్టుబడి అంటాం. ఫోర్డ్ మోటర్స్ భారతదేశంలో 1700 కోట్ల రూపాయిలు పెట్టుబడి పెట్టింది.

10th Class Social Textbook Page No.134

ప్రశ్న 3.
భారతదేశంలో ఫోర్డ్ మోటర్స్ కార్ల ఉత్పత్తిని చేపట్టటం వల్ల ఉత్పత్తి కార్యకలాపాలలో ఎటువంటి అనుసంధానం జరుగుతోంది?
జవాబు:
భారతదేశంలో ఫోర్డ్ మోటర్స్ కార్ల ఉత్పత్తిని చేపట్టడం వలన ఉత్పత్తి కార్యక్రమాలలో స్థానిక కంపెనీలతో అనుసంధానం చేసుకోవటం, ఇతర దేశాలలో మార్కెట్లు ఏర్పాటు చేసుకోవడం జరిగింది.

10th Class Social Textbook Page No.136

ప్రశ్న 4.
ప్రపంచీకరణ ప్రక్రియలో బహుళజాతి సంస్థల పాత్ర ఏమిటి?
జవాబు:
బహుళ జాతి కంపెనీల పెట్టుబడి ప్రజలు, సాంకేతిక పరిజ్ఞానం ప్రవాహం వలన సరిహద్దులు లేని ప్రపంచం ఏర్పడి ప్రపంచీకరణకు దారితీసింది.

ప్రశ్న 5.
దేశాలను అనుసంధానపరిచే వివిధ మార్గాలేవి?
జవాబు:
అధిక దేశీయ పెట్టుబడులు, విదేశీ వాణిజ్యం వలన వివిధ దేశాల ఉత్పత్తి, మార్కెట్ల మధ్య అనుసంధానం పెరిగి ఈ దేశాల మధ్య అనుసంధానం ఏర్పడింది.

AP Board 10th Class Social Solutions Chapter 10 ప్రపంచీకరణ

ప్రశ్న 6.
సరైన సమాధానాన్ని ఎంచుకోండి.
ప్రపంచీకరణ దేశాలను అనుసంధానం చేయటం వల్ల
అ) ఉత్పత్తిదారుల మధ్య పోటీని తగ్గిస్తుంది.
ఆ) ఉత్పత్తిదారుల మధ్య పోటీని పెంచుతుంది.
ఇ) ఉత్పత్తిదారుల మధ్య పోటీలో తేడా ఉండదు.
జవాబు:
ఆ) ఉత్పత్తిదారుల మధ్య పోటీని పెంచుతుంది.

10th Class Social Textbook Page No.137

ప్రశ్న 7.
ప్రపంచీకరణకు, సమాచార సాంకేతిక పరిజ్ఞానానికి మధ్యగల సంబంధం ఏమిటి? సమాచార సాంకేతిక పరిజ్ఞానం (IT) విస్తరించకుండా ప్రపంచీకరణ సాధ్యమై ఉండేదా?
జవాబు:
సమాచార పరిజ్ఞానం విస్తరించడంవలననే ప్రపంచీకరణ జరిగింది. సాంకేతిక పరిజ్ఞానం విస్తరించకుండా ప్రపంచీకరణ సాధ్యమయ్యేది కాదు.

10th Class Social Textbook Page No.138

ప్రశ్న 8.
విదేశీ వాణిజ్య సరళీకరణ అంటే ఏమి అర్థం చేసుకున్నారు?
జవాబు:
విదేశీ వాణిజ్యం, విదేశీ పెట్టుబడులకు గల అవరోధాలను తొలగించటం, విదేశీ కంపెనీలు మనదేశంలో కార్యాలయాలు,కంపెనీలు స్థాపించుటకు అనుమతించడం వంటి చర్యలను విదేశీ వాణిజ్య సరళీకరణ అంటాం.

10th Class Social Textbook Page No.139

ప్రశ్న 9.
దేశాల మధ్య వాణిజ్యం మరింత న్యాయపూరితంగా ఉండటానికి ఏం చేయవచ్చు?
జవాబు:
అన్ని దేశాలు అవరోధాలు తొలగించాలి. అభివృద్ధి చెందిన దేశాలు దీనికి మినహాయింపు కారాదు.

AP Board 10th Class Social Solutions Chapter 10 ప్రపంచీకరణ

10th Class Social Textbook Page No.141

ప్రశ్న 10.
పెరుగుతున్న పోటీవల్ల రవి చిన్న ఉత్పత్తి కేంద్రం ఏ విధంగా ప్రభావితం అయ్యింది?
జవాబు:
పెరుగుతున్న పోటీవల రవి చిన్న ఉత్పత్తి కేంద్రంలో నేడు ఉత్పత్తి సగం పడిపోయింది. 35 శాతం మంది కార్మికులకు మాత్రమే నేడు పని కల్పించగలుగుతున్నాడు.

10th Class Social Textbook Page No.140

ప్రశ్న 11.
ఈ సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చూడటంలో ప్రభుత్వ పాత్ర ఉందనుకుంటున్నారా? ఎందుకు?
జవాబు:
అవును. ఈ రంగాలలో సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే.

10th Class Social Textbook Page No.130

ప్రశ్న 12.
మొబైల్ ఫోన్లు లేదా వాహనాలు వంటి ఏదో ఒక దానిని తీసుకోండి. మార్కెట్లో అందుబాటులో ఉన్న బ్రాండ్లను గుర్తించండి. వాటి యజమానులు ఎవరు? అవి భారతదేశంలో తయారవుతున్నాయా? మీ తల్లిదండ్రులతో లేదా ఇతర పెదవాళ్లతో చర్చించి 30 సంవత్సరాల క్రితం ఎన్ని బ్రాండ్లు అందుబాటులో ఉన్నాయో తెలుసుకోండి.
జవాబు:
సెల్ ఫోన్లు ఉదాహరణగా తీసుకుంటే జపాన్ దేశానికి చెందిన నోకియా వంటి కంపెనీలు భారతదేశ మార్కెట్ను పాలిస్తున్నాయి. జపాన్ మాత్రమే కాక అనేక బహుళజాతి కంపెనీలు వివిధ వస్తువులను భారతీయ మార్కెట్లో అమ్ముతున్నారు. 30 సంవత్సరాల క్రితం భారతదేశంలో ప్రధానమంత్రి వంటి ప్రముఖుల వద్దనే ఇలాంటి బ్రాండ్లు ఉండేవి. జపాన్, స్విట్జర్లాండ్ వంటి దేశాలు చేతి గడియారాలను భారతదేశంలో మార్కెట్ చేశాయి.

10th Class Social Textbook Page No.134

ప్రశ్న 13.
ఫోర్డ్ మోటర్స్ వంటి బహుళజాతి కంపెనీలు భారతదేశంలో ఉత్పత్తి చేసే కర్మాగారాలను నెలకొల్పటం వల్ల ఇటువంటి దేశాలు అందించే పెద్ద మార్కెట్టునే కాకుండా తక్కువ ఉత్పత్తి ఖర్చు వల్ల కూడా లాభపడతాయి. ఈ వాక్యాన్ని వివరించండి.
జవాబు:
ఫోర్డ్ మోటర్స్ వంటి బహుళజాతి కంపెనీలు భారతదేశంలో తమ కంపెనీలు నెలకొల్పడం ద్వారా అత్యధిక జనాభా గల ఈ దేశంలో తమ మార్కెట్ ను సులభంగా విస్తరించగలుగుతారు. అదే సమయంలో భారత ప్రభుత్వం పారిశ్రామిక రంగానికి యిస్తున్న వివిధ రాయితీలు, సరళీకృత ఆర్థిక విధానాలు ద్వారా సులభంగా అనుమతులను పొందడం, శ్రమ , శక్తి, నైపుణ్యం గల కార్మికులు చౌకగా లభించడం వంటి అనుకూల అంశాలతో ఉత్పత్తి ఖర్చు కూడా వీరికి తగ్గుతుంది.

10th Class Social Textbook Page No.139

ప్రశ్న 14.
ప్రపంచవ్యాప్త కార్ల ఉత్పత్తికి భారతదేశం విడి భాగాలను అందించేలా అభివృద్ధి చెయ్యాలని కంపెనీ ఎందుకు అనుకుంటోంది? కింది అంశాలను చర్చించండి.
అ) భారతదేశంలో కార్మికులు, ఇతర వనరుల ఖర్చు.
ఆ) ఫోర్డ్ మోటరకు వివిధ విడి భాగాలను అందించే పలు స్థానిక ఉత్పత్తిదారులు ఉండటం,
ఇ) భారతదేశం, చైనాలలోని అధిక సంఖ్యాక కొనుగోలుదారులకు దగ్గరగా ఉండటం.
జవాబు:
ప్రపంచ వ్యాప్తంగా కార్ల ఉత్పత్తికి భారతదేశం విడి భాగాలను అందించేలా అభివృద్ధి చేయాలని కంపెనీ భావిస్తుంది.
దీనికి కారణం :
అ) భారతదేశంలో కార్మికులు, ఇతర వనరుల ఖర్చులు తక్కువగా ఉండుట.
ఆ) ఫోర్డ్ మోటరు వివిధ విడి భాగాలను ఇతర దేశాలలోని ఉత్పత్తి కేంద్రాలకు అందుబాటులోకి తేవాలనుకుంటుంది.
ఇ) భారతదేశం, చైనా వేగంగా ప్రపంచంలోని ముఖ్య మార్కెట్లకు విస్తరించడం.

AP Board 10th Class Social Solutions Chapter 10 ప్రపంచీకరణ

10th Class Social Textbook Page No.134

ప్రశ్న 15.
నైక్, కోకాకోలా, పెప్సి, హోండా, నోకియా వంటి బహుళజాతి కంపెనీలు దాదాపుగా అమెరికా, జపాను, లేదా ఐరోపా దేశాలకు చెందినవే. ఎందుకో ఊహించగలరా?
జవాబు:
అమెరికా, జపాన్, ఐరోపా దేశాలు శాస్త్ర, సాంకేతిక రంగాలలో ముందంజలో ఉండటం, సరళీకృత ఆర్థిక విధానాలు పెట్టుబడిదారి వ్యవస్థ చాలాకాలం నుండి అమలులో ఉండటం వలన నైక్, కోకాకోలా, పెప్సి, హోండా, నోకియా వంటి బహుళజాతి సంస్థలు ఈ దేశాలలోనే ఉద్భవించాయి.

10th Class Social Textbook Page No.134

ప్రశ్న 16.
గతంలో దేశాలను కలిపిన ప్రధాన అంశం ఏమిటి? గతానికి, ప్రస్తుత పరిస్థితికి తేడా ఏమిటి?
జవాబు:
గతంలో దేశాలను కలిపిన ప్రధాన అంశం వాణిజ్యం . ప్రస్తుతం కూడా పరిస్థితులు ఏమంతగా మారలేదు. గతంలో యూరోపియన్ దేశాలు భారతదేశంతోను, ఇతర దక్షిణాసియా దేశాలతోను సముద్ర మార్గాలు ద్వారా వాణిజ్యం నిర్వహించేవారు. ప్రజలు స్థానికంగా తయారయిన వస్తువుల కంటే స్థానికేతర వస్తువుల పట్లనే ఆసక్తి కనబరచేవారు. కాని ప్రస్తుతం మన భారతీయ కంపెనీలు చౌక ధరలకే అవే వస్తువులను ఉత్పత్తి చేస్తున్నాయి మరియు ఆ వస్తువులు స్థానిక మార్కెట్లలో అందుబాటులో ఉంటున్నాయి. మన దేశ వాణిజ్యంలో బహుళజాతి సంస్థల ఆగమనం కూడా మరొక అంశం.

10th Class Social Textbook Page No.134

ప్రశ్న 17.
విదేశీ వాణిజ్యం, విదేశీ పెట్టుబడులకు మధ్య తేడా ఏమిటి?
జవాబు:

విదేశీ వాణిజ్యంవిదేశీ పెట్టుబడి
1) ఒక కంపెనీ ఇతర దేశాలతో నిర్వహించే వాణిజ్యం.1) ఇది బహుళజాతి సంస్థలు భూములు, భవనాలు, యంత్రాలు మరియు ఇతర సామగ్రి కొనేందుకు ఖర్చు చేసే ధనం.
2) వస్తువుల ఉత్పత్తి ఒక దేశంలో జరుగుతుంది మరియు అవి ఇతర దేశాలలో విక్రయించబడతాయి.2) ఒక దేశంలో ఇతర దేశాల వ్యాపారులు పెట్టుబడి పెట్టడం జరుగుతుంది మరియు వస్తువులు అధిక ధరలకు ఎగుమతి అవుతాయి.

10th Class Social Textbook Page No.134

ప్రశ్న 18.
చైనాలోకి భారత ఉక్కును దిగుమతి చేసుకోవటం వల్ల రెండు దేశాల ఉక్కు మార్కెట్లు ఎలా అనుసంధానమౌతాయి?
జవాబు:
చైనాకు భారతదేశంలో సమృద్ధిగా ఉన్న ఉక్కు మరియు ఇతర ముడి సరకుల ఆవశ్యకత చాలా ఉంది. భారతదేశం నుండి కొనుగోలు చేసిన ఉక్కు మరియు ఇతర ముడి సరుకుల సహాయంతో చైనా అనేక వస్తువులను ఉత్పత్తి చేస్తోంది మరియు భారతదేశానికి వాటిని ఎగుమతి చేస్తోంది. ఇది ఈ రెండు దేశాల మధ్య బలమైన వాణిజ్య బంధాన్ని ఏర్పరచింది.

AP Board 10th Class Social Solutions Chapter 10 ప్రపంచీకరణ

10th Class Social Textbook Page No.137

ప్రశ్న 19.
ఈ ఉదాహరణలో ఉత్పత్తిలో సాంకేతిక విజ్ఞాన ఉపయోగాన్ని తెలియజేసే పదాల కింద గీత గీయండి.
జవాబు:
2వ లైన్ డిజైన్
3వ లైన్ ఇంటర్నెట్
4వ లైన్ టెలికమ్యూనికేషన్
5వ లైన్ డిజైన్
6వ లైన్ డిజైనింగ్
7వ లైన్ కంప్యూటర్, ముద్రించిన
8వ లైన్ డిజైనింగ్
9వ లైన్ ముద్రణకు
10వ లైన్ ఇంటర్నెట్ (e- Banking)

10th Class Social Textbook Page No.138

ప్రశ్న 20.
దిగుమతులపై పన్ను వాణిజ్య అవరోధానికి ఒక ఉదాహరణ. దిగుమతి చేసుకునే సరుకుల సంఖ్య మోతాదుపై కూడా ప్రభుత్వం పరిమితి విధించవచ్చు. దీనిని కోటాలు అంటారు. చైనా బొమ్మల ఉదాహరణలో కోటాలను ఉపయోగించి వాణిజ్య అవరోధాన్ని ఎలా విధించవచ్చో వివరించండి. ఈ విధానాన్ని ఉపయోగించుకోవాలా? చర్చించండి.
జవాబు:
భారతదేశంలో చైనా బొమ్మల దిగుమతి ఉదాహరణకు మరొకసారి వద్దాం – బొమ్మల దిగుమతిపై భారతీయ ప్రభుత్వం పన్ను విధించిందనుకుందాం. పన్ను కారణంగా కొనుగోలుదారులు దిగుమతి చేసుకున్న బొమ్మలకు అధిక ధరలు చెల్లించాల్సివస్తుంది. అప్పుడు భారతీయ మార్కెట్లో చైనా బొమ్మలు మరీ అంత చవకగా ఉండవు, దాంతో చైనా నుంచి దిగుమతులు తగ్గిపోతాయి. భారతదేశ ఉత్పత్తిదారులు పుంజుకుంటారు.

10th Class Social Textbook Page No.139

ప్రశ్న 21.
ఖాళీలను పూరించండి.
…………. దేశాల చొరవతో ప్రపంచ వాణిజ్య సంస్థ మొదలయ్యింది. ఈ సంస్థ ఉద్దేశం ………. . ప్రపంచ వాణిజ్య సంస్థ ………….. కు సంబంధించి నియమాలు రూపొందించి ……….. చూస్తుంది. అయితే, ఆచరణలో దేశాల మధ్య వాణిజ్యం ………… లేదు. భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు ………… . కానీ అనేక సందర్భాలలో అభివృద్ధి చెందిన దేశాలు తమ ఉత్పత్తిదారులకు మద్దతు కొనసాగిస్తున్నాయి.
జవాబు:
అభివృద్ధి చెందిన దేశాల చొరవతో ప్రపంచ వాణిజ్య సంస్థ మొదలయ్యింది. ఈ సంస్థ ఉద్దేశం అంతర్జాతీయ వాణిజ్యంలో సరళీకృత విధానాలు ఏర్పాటు. ప్రపంచ వాణిజ్య సంస్థ అంతర్జాతీయ వాణిజ్యాలకు సంబంధించి నియమాలు రూపొందించి అవి పాటింపబడేలా చూస్తుంది. అయితే ఆచరణలో దేశాల మధ్య వాణిజ్యం న్యాయపూరితంగా లేదు. భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు అవరోధాలను కలిగిస్తున్నాయి. కానీ అనేక సందర్భాలలో అభివృద్ధి చెందిన దేశాలు తమ ఉత్పత్తిదారులకు మద్దతు కొనసాగిస్తున్నాయి.

10th Class Social Textbook Page No.139

ప్రశ్న 22.
పై ఉదాహరణలో అమెరికా ప్రభుత్వం ఉత్పత్తి చెయ్యటానికి రైతులకు పెద్ద మొత్తంలో డబ్బులు ఇస్తుందని చూశాం. కొన్నిసార్లు ప్రభుత్వాలు కొన్ని రకాల వస్తువుల, ఉదాహరణకు పర్యావరణ అనుకూలమైన వాటి ఉత్పత్తికి మద్దతు ఇస్తాయి. ఇది న్యాయమైనదో కాదో చర్చించండి.
జవాబు:
ఈ ఉదాహరణలో అమెరికా ప్రభుత్వం పంటలకు పెద్ద మొత్తంలో డబ్బులు యిచ్చినంతవరకు ఎవరికీ అభ్యంతరముండదు. తద్వారా వారు ఆహార ఉత్పత్తులను పెంచుకోవచ్చు. కానీ వాటిని చౌకగా విదేశాలలో అమ్మటం న్యాయసముచితం కాదు. దీనిమూలంగా యితర దేశాల రైతులు యిబ్బంది పడుతున్నారు. పర్యావరణమైన అనుకూల ఉత్పత్తికి మద్దతు యివ్వడం న్యాయసమ్మతమైనదే. మనదేశంలో కూడా వంట చెఱకు కోసం అడవులను నరకకుండా ఉండేందుకు గ్యాస్ వినియోగం ప్రోత్సహించటానికి గ్యాస్ కు సబ్సిడీలు యిస్తున్నాం.

AP Board 10th Class Social Solutions Chapter 10 ప్రపంచీకరణ

10th Class Social Textbook Page No.140

ప్రశ్న 23.
భారతదేశ ప్రజలు పోటీవల్ల ఏ విధంగా లాభపడ్డారు?
జవాబు:
భారతదేశ అతి పెద్ద కంపెనీలలో అనేకం పెరిగిన పోటీవల్ల ప్రయోజనం పొందాయి. వాళ్లు కొత్త సాంకేతిక విజ్ఞానంలోనూ, ఉత్పత్తి పద్ధతులలోనూ పెట్టుబడులు పెట్టి ఉత్పత్తి ప్రమాణాలను పెంచారు. విదేశీ కంపెనీలతో కలిసి పనిచెయ్యటం ద్వారా కొన్ని కంపెనీలు లాభపడ్డాయి.

10th Class Social Textbook Page No.140

ప్రశ్న 24.
మరిన్ని భారతీయ కంపెనీలు బహుళజాతి కంపెనీలుగా ఎదగాలా ? దేశంలోని ప్రజలకు దానివల్ల ప్రయోజనాలు ఏమిటి?
జవాబు:
ప్రపంచీకరణ వల్ల కొన్ని పెద్ద భారతీయ కంపెనీలు స్వయంగా ‘బహుళజాతి సంస్థలుగా ఎదిగాయి. టాటా మోటర్స్ (వాహనాలు), ఇన్ఫోసిస్ (IT), రానాలాక్సీ (మందులు), ఏషియన్ పెయింట్స్ (రంగులు), సుందరం ఫాసెనర్స్ (నటులు, బోల్టులు) వంటి భారతీయ కంపెనీలు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా లావాదేవీలు కలిగి ఉన్నాయి.

10th Class Social Textbook Page No.140

ప్రశ్న 25.
మరిన్ని విదేశీ పెట్టుబడులను ఆకర్షించటానికి ప్రభుత్వాలు ఎందుకు ప్రయత్నిస్తున్నాయి?
జవాబు:
పన్నుల రూపంలో ప్రభుత్వాదాయం పెరుగుతుంది. తద్వారా ప్రజలకు మరిన్ని సేవలనందజేయవచ్చు.
భారతీయులకు ఉద్యోగావకాశాలు పెరుగుతాయి. తద్వారా తలసరి, జాతీయాదాయాలు పెరుగుతాయి.
దేశ, విదేశీ వాణిజ్యం పెరుగుతుంది. విదేశీ మారక ద్రవ్యం ఆర్జించవచ్చు.

10th Class Social Textbook Page No.141

ప్రశ్న 26.
ఇతర దేశాలతో పోలిస్తే తమ ఉత్పత్తి ఖర్చు ఎక్కువ కాబట్టి రవిలాంటి వాళ్ళు ఉత్పత్తిని నిలిపివెయ్యాలా? మీ అభిప్రాయం ఏమిటి?
జవాబు:
ఇతర దేశాలతో పోల్చితే మనదేశంలో ఉత్పత్తి ఖర్చు ఎక్కువేమీ కాదు. అయితే బహుళజాతి సంస్థలు అధునాతన , సాంకేతిక పరిజ్ఞానంతో పెద్ద మొత్తంలో ఉత్పత్తి చేసిన వస్తువులను మనం స్థానిక సాంకేతిక పరిజ్ఞానంతో చిన్న యూనిట్లలో ఉత్పత్తి చేస్తే ప్రామాణికం గానీ, ధరలోగానీ పోటీపడలేం. ఈ వాస్తవాన్ని రవిలాంటివారు గుర్తించాలి.

AP Board 10th Class Social Solutions Chapter 10 ప్రపంచీకరణ

10th Class Social Textbook Page No.141

ప్రశ్న 27.
వీటిల్లో పెట్టుబడులు పెట్టటానికి బహుళజాతి సంస్థలు ఆసక్తి చూపిస్తాయా? ఎందుకు?
జవాబు:
ఆధునికీకరణ, సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి స్వంతంగా విద్యుత్ ఉత్పత్తి, రవాణా మార్గాల ఏర్పాటు వంటి అంశాలలో బహుళ జాతి సంస్థలు తమ పరిశ్రమల వరకు మాత్రమే పరిమితమవుతాయి. విద్యుత్, రవాణా మార్గాలు వంటివి ప్రఖ్యాత రంగంలో ఉన్నాయి.

10th Class Social Textbook Page No.134

ప్రశ్న 28.
ఇతర కంపెనీలకు, బహుళజాతి సంస్థలకు మధ్య తేడాలు ఏమిటి?
జవాబు:

కంపెనీలుబహుళ జాతి సంస్థలు
1. 20వ శతాబ్దం మధ్య భాగం వరకు జరిగిన పారిశ్రామికీకరణ, వాణిజ్యం, ఉత్పత్తి.1. 20వ శతాబ్దం రెండో అర్ధభాగం నుండి జరిగిన పారిశ్రామికీకరణ, వాణిజ్యం, ఉత్పత్తి.
2. మనదేశంలో పరిశ్రమలను నెలకొల్పి ఉత్పత్తి చేసేవారు.2. ఒకటి కంటే ఎక్కువ దేశాలలో కంపెనీలు స్థాపించి ఉత్పత్తి చేయటం.
3. విడిభాగాల తయారీ నుండి ఉత్పత్తి తుదిరూపం వరకు ఒకే చోట జరిగేది.3. విడిభాగాలు ఒక దేశంలో, అసెంబ్లింగ్ మరో దేశంలో, మార్కెటింగ్ వేరు వేరు దేశాలలో నిర్వహిస్తున్నారు.
4. శ్రామికులు నుండి సమ్మెలు, ఆందోళనలు వంటి సమస్యలు ఎదుర్కొనే వారు.4. అవసరమైతే సమస్యాత్మక ప్రాంతంలో యూనిట్ మూసివేసి ఈ వేరే ప్రాంతానికి తరలిస్తారు.
5. మార్కెట్ పరిధి తక్కువ.5. మార్కెట్ కు పరిధిలేదు. విశ్వవ్యాప్తం.
6. ఉద్యోగావకాశాలు తక్కువ.6. బహువిధ ఉద్యోగావకాశాలు లభిస్తాయి.

10th Class Social Textbook Page No.134

ప్రశ్న 29.
ఇటీవలి కాలంలో భారతదేశం నుంచి చైనా ఉక్కును దిగుమతి చేసుకుంటోంది. ఈ దిగుమతులు వీటిని ఎలా ప్రభావితం చేస్తాయో చెప్పండి :
అ) చైనాలోని ఉక్కు కర్మాగారాలు,
ఆ) భారతదేశంలోని ఉక్కు కర్మాగారాలు,
ఇ) చైనాలో ఇతర పారిశ్రామిక వస్తువులు తయారుచేయటానికి ఉక్కును కొనుగోలు చేసే పరిశ్రమలు
జవాబు:
భారతదేశ ఉక్కు తయారీదారులు చైనాకు, ఉక్కు మరియు ముడి సరకులను ఎగుమతి చేయడం ప్రారంభించారు. చైనాలోని కొనుగోలుదారులు ఇప్పుడు చైనా ఉక్కు మరియు భారతదేశ ఉక్కులలో ఏదో ఒకదానిని ఎంపిక చేసుకోవలసి వచ్చింది. చౌకధరల కారణంగా భారతదేశ ఉక్కు చైనాలో బాగా ప్రాచుర్యం పొందింది. అందువలన చైనా ఉక్కు -స్థానంలో భారతదేశ ఉక్కును వాడటం జరుగుతోంది. ఇది భారతీయ ఉక్కు తయారీదారులకు తమ వాణిజ్యం విస్తరింపచేసుకొనేందుకు అవకాశం కల్పించింది. అయితే చైనా ఉక్కు తయారీదారులు అందుకు వ్యతిరేక పరిస్థితులను ఎదుర్కొన్నారు. పోటీ కారణంగా కొందరు ఉక్కు తయారీదారులు సృజనాత్మకతతో అభివృద్ధి సాధించగా మరికొందరు చతికిలపడ్డారు.

AP Board 10th Class Social Solutions Chapter 10 ప్రపంచీకరణ

10th Class Social Textbook Page No.140

ప్రశ్న 30.
ఒకరికి అభివృద్ధి అయినది మరొకరికి విధ్వంసం కావచ్చని మనం ఇదివరకే చదివాం. ఆర్థిక మండళ్లను నెలకొల్పటాన్ని భారతదేశంలోని కొంతమంది ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. వీళ్లు ఎవరో, ఎందుకు వాటిని వ్యతిరేకిస్తున్నారో తెల్పండి.
జవాబు:
ప్రత్యేక ఆర్థిక మండలుల ఏర్పాటును అనేక వర్గాల వారు వ్యతిరేకిస్తున్నారు.

కారణాలు:

  1. ఇది పెట్టుబడి వ్యవస్థను సమర్ధిస్తుంది. అందుచే సామ్యవాదులు దీనిని వ్యతిరేకిస్తున్నారు.
  2. దేశీయ కంపెనీలను దెబ్బతీస్తుంది. కాబట్టి స్థానిక వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు వ్యతిరేకిస్తున్నారు.
  3. విదేశీ సంస్కృతులను ప్రోత్సహిస్తుంది. అందుచే సంప్రదాయవాదులు వ్యతిరేకిస్తున్నారు.
  4. కార్మికుల హక్కులను కాలరాస్తున్నాయి. అందుచే కార్మికులు వ్యతిరేకిస్తున్నారు.
  5. స్థానికులకు ఉద్యోగావకాశాలు నామమాత్రం. అందుచే స్థానికులు వ్యతిరేకిస్తున్నారు.
  6. వీటికి కేటాయించి భూములు సాధారణ రైతులు, బడుగువర్గాలకు చెందినవి కావటంతో ఈ వర్గాలు భూమిలేని వారై కూలీలుగా మారిపోతున్నారు. అందుచే వీరు వ్యతిరేకిస్తున్నారు.
  7. ప్రధానంగా వీరు పెట్టే పరిశ్రమలు పర్యావరణ నాశనం చేస్తున్నాయి. అందుచే ఆ ప్రాంత ప్రజలు వ్యతిరేకిస్తున్నారు.

10th Class Social Textbook Page No.140

ప్రశ్న 31.
భారతదేశ చిన్న ఉత్పత్తిదారులు మార్కెట్లో పోటీకి తట్టుకోవాలంటే మూడు అవసరాలు ఉన్నాయని ఇటీవలి అధ్యయనాలు పేర్కొన్నాయి :
అ) మెరుగైన రోడ్లు, విద్యుత్తు, నీళ్లు, ముడిసరుకులు, మార్కెటింగ్, ఇన్ఫమేషన్ నెట్వర్క్
ఆ) సాంకేతిక పరిజ్ఞానంలో అభివృద్ధి, ఆధునికీకరణ,
ఇ) తక్కువ వడ్డీకి సకాలంలో రుణాల అందుబాటు. ఈ మూడు అంశాలు భారతీయ ఉత్పత్తిదారులకు ఎలా సహాయపడతాయో వివరించండి.
జవాబు:
భారతదేశ చిన్న ఉత్పత్తిదారులు మార్కెట్లో పోటీని తట్టుకోవాలంటే వారికి కొన్ని కనీస సదుపాయాలు కల్పించాలి. ముడి సరుకులు వినియోగానికి గల అవరోధాలను తొలగించి అందుబాటులోకి తేవాలి. వీటిని తమ పరిశ్రమలోకి తేవడానికి, ఉత్పత్తులను సమీప ప్రధాన నగరాలు, ఓడరేవులు, రైల్వేస్టేషన్లకు చేర్చడానికి రోడ్డు మార్గాలను విస్తరించాలి. ఉత్పత్తికి కావలసిన నిరంతర నీరు, విద్యుత్ సౌకర్యాలను కల్పించాలి. మార్కెటింగ్ చేయడానికి కావలసిన ప్రోత్సాహకాలు అందజేయాలి. అన్ని రంగాలకు చెందిన ఇన్ఫర్మేషన్ నెట్ వర్క్ సదుపాయాలు అందుబాటులోకి తేవాలి. సాంకేతిక రంగంలో వస్తున్న మార్పులు, ఇవి తమ పరిశ్రమ ఆధునికీకరణకు ఏ విధంగా తోడ్పడగలవో సూచననివ్వగల సాంకేతిక నిపుణుల సహకారం అందివ్వాలి. బహుళ జాతి సంస్థల పోటీని తట్టుకొనే విధంగా పరిశ్రమలను ఆధునికీకరించే వీలుగా తక్కువ వడ్డీకి సకాలంలో రుణాలను అందజేయాలి.

AP Board 10th Class Social Solutions Chapter 10 ప్రపంచీకరణ

10th Class Social Textbook Page No.141

ప్రశ్న 32.
ప్రభుత్వం తీసుకోగల ఇతర చర్యల గురించి ఆలోచించండి. తరగతిలో చర్చించండి.
జవాబు:
ప్రభుత్వ విధానాలు ధనికులు, అధికారం ఉన్న వాళ్ళవే కాక దేశంలోని ప్రజలందరి ప్రయోజనాలను కాపాడేలా ఉండాలి. ప్రభుత్వం చేపట్టగలిగిన కొన్ని చర్యల గురించి మీరు తెలుసుకున్నారు. ఉదాహరణకు కార్మిక చట్టాలు సరిగా అమలు అయ్యేలా చూసి కార్మికులకు తమ హక్కులు లభించేలా చూడాలి. చిన్న ఉత్పత్తిదారులు తమ సామర్థ్యాన్ని పెంచుకుని పోటీపడగల శక్తి వచ్చేంతవరకు వాళ్లకు సహాయపడాలి. అవసరమైతే ప్రభుత్వం వాణిజ్య, పెట్టుబడి అవరోధాలను ఉపయోగించుకోవచ్చు. మరింత న్యాయపూరిత నియమాల కోసం ప్రపంచ వాణిజ్య సంస్థతో సంప్రదింపులు జరుపవచ్చు. ఇవే ఆసక్తులు ఉన్న ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలతో ‘కలసి, ప్రపంచ వాణిజ్య సంస్థలో అభివృద్ధి చెందిన దేశాల పెత్తనానికి వ్యతిరేకంగా పోరాడవచ్చు.

AP Board 10th Class Social Solutions Chapter 9 రాంపురం : గ్రామ ఆర్థిక వ్యవస్థ

SCERT AP 10th Class Social Study Material Pdf 9th Lesson రాంపురం : గ్రామ ఆర్థిక వ్యవస్థ Textbook Questions and Answers.

AP State Syllabus 10th Class Social Solutions 9th Lesson రాంపురం : గ్రామ ఆర్థిక వ్యవస్థ

10th Class Social Studies 9th Lesson రాంపురం : గ్రామ ఆర్థిక వ్యవస్థ Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
భారతదేశంలోని ప్రతి గ్రామాన్ని ప్రతి పదేళ్ళకు ఒకసారి జనాభా గణనలో సర్వేచేసి కింద ఇచ్చిన విధంగా వివరాలను పొందుపరుస్తారు. రాంపురానికి సంబంధించిన సమాచారం ఆధారంగా కింది వివరాలను నింపండి. (AS3)
అ. ఎక్కడ ఉంది (ఉనికి) :
ఆ. గ్రామ మొత్తం విస్తీర్ణం :
ఇ. భూ వినియోగం హెక్టార్లలో :
AP Board 10th Class Social Solutions Chapter 9 రాంపురం గ్రామ ఆర్థిక వ్యవస్థ 1
జవాబు:
అ. ఎక్కడ ఉంది (ఉనికి) :
పశ్చిమ ఉత్తరప్రదేశ్ లోని సారవంతమైన గంగా మైదానపు ఒండ్రునేలల్లో రాంపురం, ఉంది.

ఆ. గ్రామ మొత్తం విస్తీర్ణం : 290 హెక్టార్లు

ఇ. భూ వినియోగం హెక్టార్లలో : సాగులో ఉన్న భూమి.

ప్రశ్న 2.
రాంపురంలోని వ్యవసాయ కూలీలకు కనీస కూలీ కంటే తక్కువ కూలీ ఎందుకు లభిస్తోంది? (AS1)
జవాబు:
రాంపురంలో పనికోసం వ్యవసాయ కూలీల మధ్య తీవ్ర పోటీ ఉంది, కాబట్టి తక్కువ కూలీకైనా పనిచేయ్యటానికి ప్రజలు సిద్ధపడతారు. పెద్దరైతులు ట్రాక్టర్లు, నూర్పిడి యంత్రాలు, పంటకోత యంత్రాలపై ఆధారపడటం పెరగటంతో గ్రామీణ “ప్రాంతాలలో కూలీలకు లభించే పని దినాలు తగ్గిపోతున్నాయి. అందుచే రాంపురంలోని వ్యవసాయ కూలీలకు కనీస కూలీ కంటే తక్కువ కూలీ లభిస్తుంది.

AP Board 10th Class Social Solutions Chapter 9 రాంపురం : గ్రామ ఆర్థిక వ్యవస్థ

ప్రశ్న 3.
మీ ప్రాంతంలోని ఇద్దరు కూలీలతో మాట్లాడండి. ఇందుకు వ్యవసాయ కూలీలనుగానీ, భవన నిర్మాణంలో పని చేసేవాళ్ళనుగానీ ఎంచుకోండి. వాళ్ళకు ఎంత కూలీ లభిస్తోంది? వాళ్ళకు నగదు రూపంలో చెల్లిస్తారా, వస్తు రూపంలోనా? వాళ్ళకు క్రమం తప్పకుండా పని దొరుకుతుందా? వాళ్ళు అప్పుల్లో ఉన్నారా? (AS3)
జవాబు:
మా ప్రాంతంలో భవన నిర్మాణ కూలీలకు రోజుకు రూ. 300/- లభిస్తుంది. దీనిని నగదు రూపంలో చెల్లిస్తారు. వీరికి సుమారుగా క్రమం తప్పకుండా పని దొరుకుతుంది. మా ప్రాంతంలో కూలీ పనిచేసే ప్రతివారికి అప్పు ఉంటుంది.

ప్రశ్న 4.
ఒకే విస్తీర్ణం ఉన్న భూమి నుంచి ఉత్పత్తిని పెంచటానికి ఉన్న వివిధ పద్ధతులు ఏమిటి ? కొన్ని ఉదాహరణలతో వివరించండి. (AS1)
జవాబు:
ఒకే విస్తీర్ణంలో ఉన్న భూమి నుంచి ఉత్పత్తిని పెంచడానికి ఉన్న వివిధ పద్ధతులు :

  1. బహుల పంటల సాగు విధానంలో నిరంతరం పంటలు పండించడం.
  2. ఎల్లప్పుడూ నీరు అందుబాటులో ఉండేటట్లు సాగునీటి సదుపాయాలను మెరుగుపరచడం.
  3. భూమి సారాన్ని పోగొట్టకుండా ఉండేందుకు పంట మార్పిడి విధానం అమలు చేయటం.
  4. అధిక దిగుబడినిచ్చే వంగడాలు వినియోగం, సస్యరక్షణ చర్యలు చేపట్టడం.
  5. అనువైన చోట అంతర్ పంట సాగు చేయటం.

ప్రశ్న 5.
మధ్యతరగతి, పెద్ద రైతులకు వ్యవసాయానికి అవసరమైన పెట్టుబడి ఎలా సమకూరుతుంది? చిన్న రైతులకూ, వీళ్ళకు మధ్య ఉన్న తేడా ఏమిటి? (AS1)
జవాబు:
మధ్య తరగతి, పెద్ద రైతులకు వ్యవసాయంలో మిగులు ఉంటుంది. దీనిని తదుపరి పంటలకు, ఆధునిక వ్యవసాయ పనిముట్లు, యంత్రాలు కొనుగోలుకు ఖర్చు చేస్తారు. వీరు చిన్న రైతులకు వడ్డీకి అప్పులు యివ్వడం, ట్రాక్టర్లు అద్దెకు యివ్వడం, వ్యాపారాలు చేస్తూ అదనపు ఆదాయాన్ని పొందుతారు. అందుచే వీరికి పెట్టుబడి ఓ సమస్య కాదు. చిన్న రైతులు పండించే పంట తమ కుటుంబ అవసరాలకే సరిపోతుంది. అందుచే వీరు పెట్టుబడి కోసం అప్పులు చేస్తుంటారు.

ప్రశ్న 6.
ఏ షరతుల మీద తేజ్ పాల్ నుండి సవిత అప్పు పొందింది? తక్కువ వడ్డీకి బ్యాంకు నుంచి రుణం లభిస్తే సవిత పరిస్థితి . భిన్నంగా ఉండేదా? (AS1)
జవాబు:
సవిత అనే చిన్న రైతు గోధుమ పంట పండించడానికి పెట్టుబడికై తేజ్ పాల్ అనే రైతు వద్ద నాలుగు నెలల్లో తిరిగి యివ్వాలన్న షరతు మీద 36% వడ్డీకి 6000 రూపాయలు అప్పు తీసుకుంది. కోత సమయంలో రోజుకు వంద రూపాయల కూలీకి తేజ్ పాల్ పొలంలో పనిచేయడానికి కూడా ఈమె అంగీకరించింది. తక్కువ వడ్డీకి రుణం లభిస్తే సవిత తన మిగులు పంట నుండి అప్పు తీర్చేది. తాను చేసిన పనికి న్యాయమైన కూలీ లభించేది.

AP Board 10th Class Social Solutions Chapter 9 రాంపురం : గ్రామ ఆర్థిక వ్యవస్థ

ప్రశ్న 7.
మీ ప్రాంతంలోని పెద్దవాళ్ళతో మాట్లాడి గత 30 సంవత్సరాలలో సాగునీటి విధానాలలోనూ, వ్యవసాయ పద్ధతులలోనూ వచ్చిన మార్పుల గురించి ఒక నివేదిక రాయండి. (AS3)
జవాబు:
గత 30 సంవత్సరాలుగా సాగునీటి విధానంలో కొత్తగా కాలువలు, చెరువులు సమకూరలేదు. అనేక వ్యవసాయ చెరువులు ఆక్రమణలకు గురై, మరమ్మతులు లేక నిరుపయోగంగా మారాయి. చెరువులలోకి రావలసిన వర్షపు నీరు రావలసిన మార్గాలు గృహ నిర్మాణాలు, రహదారుల నిర్మాణం మూలంగా మూతపడ్డాయి. భూగర్భ జలాలు తగ్గడంతో బోరుబావులు లోతుగా తీయవలసి వస్తోంది. దగ్గర దగ్గరగా బోరుబావులు త్రవ్యడంతో నీరు అందుబాటులోకి రావటం లేదు. నిరంతర విద్యుత్ కోతల మూలంగా సాగునీరు సరిగ్గా అందటంలేదు. అంతరాష్ట్ర జల వివాదాల కారణంగా వర్షాభావ స్థితిలో ఆనకట్టలు నిండక కాలువలు’ ప్రవహింపక కాలువ చివరి భూములకు సాగునీరు అందడం లేదు.

కొత్త రకం వంగడాలు, క్రిమి సంహారక మందులు రావటంతో ఉత్పత్తి పెరిగింది. కానీ వ్యవసాయం గిట్టుబాటు కాకపోవటం, వ్యవసాయేతర పనులలో ఆదాయం బాగుండటంతో చిన్న చిన్న రైతులు వ్యవసాయంపై శ్రద్ధ తగ్గించారు.

ప్రశ్న 8.
మీ ప్రాంతంలోని ప్రధాన వ్యవసాయేతర పనులు ఏమిటి? ఏదైనా ఒక కార్యక్రమాన్ని ఎంచుకుని ఒక చిన్న నివేదిక తయారు చేయండి. (AS3)
జవాబు:
మా ప్రాంతం పట్టణానికి సమీపంలో ఉన్నందున నిర్మాణ కార్యక్రమాలలో ఎక్కువ మంది శ్రామికులు పనిచేస్తున్నారు. చద్దన్నం తిని మధ్యాహ్న భోజనం కేరేజిలో పట్టుకొని కూలీలందరూ ఆటోలలో బయలుదేరి గుత్తేదారు సూచించిన స్థలానికి ఉదయం 9 గంటల భోజన విరామం తరువాత 3 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పనిచేస్తారు. ఇంటికి కావలసిన సరుకులను కొనుగోలుచేసి తిరిగి శ్రామికులందరూ ఆటోలో ఇంటికి చేరుతారు. రోజు కూలీ రూ. 300/- చెల్లిస్తున్నారు. ఈ కార్మికులు ఇందిరమ్మ ఇల్లు వంటి పథకాల లబ్ధిదారులుగా స్వగృహాన్ని ఏర్పరచుకొని పిల్లలను తమ గ్రామంలోని ప్రభుత్వ/ప్రైవేటు పాఠశాలలో చదివిస్తున్నారు. ఈ శ్రామికులలో చాలా మంది అక్షరాస్యులు. మహిళలు కూడా పురుషులతో సమానంగానే పనిచేస్తారు.

ప్రశ్న 9.
ఉత్పత్తికి భూమి కాకుండా శ్రమ కొరతగా ఉండే పరిస్థితిని ఊహించుకోండి. అప్పుడు రాంపురం కథ ఇందుకు భిన్నంగా ఉండేదా? ఎలా? తరగతిలో చర్చించండి. (AS1)
జవాబు:
ఉత్పత్తికి భూమి కాకుండా శ్రమ కొరతగా ఉంటే రాంపురం కథ ఇందుకు భిన్నంగా ఉండేది. వ్యవసాయ కూలీలకు ఇప్పటికంటే ఎక్కువ కూలీ లభించేది. చిన్న రైతులు తమ మిగులు కాలంలో వ్యవసాయకూలీ ద్వారా ఎక్కువ ఆదాయం పొంది దానిని తమ వ్యవసాయానికి పెట్టుబడిగా పెట్టేవారు. దీంతో పెద్దరైతుల నుండి అధిక వడ్డీలకు అప్పులు తేవడం, వారు చెప్పిన రేటుకు పనిచేయడం లాంటి సమస్యల నుండి బయటపడేవారు.

AP Board 10th Class Social Solutions Chapter 9 రాంపురం : గ్రామ ఆర్థిక వ్యవస్థ

ప్రశ్న 10.
గోసాయిపూర్, మణాలి అనేవి ఉత్తర బీహార్‌లోని రెండు గ్రామాలు. రెండు గ్రామాలలోని 860 కుటుంబాల నుంచి 250 కంటే ఎక్కువ మగవాళ్ళు పంజాబ్ లేదా హర్యానా గ్రామీణ ప్రాంతాలలో, లేదా ఢిల్లీ, ముంబయి, సూరత్, హైదరాబాదు, నాగపూర్ వంటి నగరాలలో పనిచేస్తున్నారు. ఇలా వలస వెళ్ళటం భారతదేశమంతటా గ్రామాలలో సాధారణమే. ప్రజలు ఎందుకు వలస వెళతారు? (గత అధ్యాయానికి మీ ఊహను జోడించి) గోసాయిపుర్, మజాలి గ్రామల నుంచి వలస వెళ్ళినవాళ్లు ఆయా ప్రాంతాలలో ఏ పని చేస్తారో రాయండి. (AS4)
జవాబు:
ఉత్తర బీహార్‌లోని గోసాయిపూర్, మజాలి గ్రామాల నుండి వలసలు వెళ్ళుటకు బహుశా క్రింది కారణాలు కావచ్చును.

  1. ఆ గ్రామాలలో తగినంత పని దొరకపోవడం.
  2. పని దొరికినా తగినంత కూలీ లభించక పోవటం.
  3. సంవత్సరంలో ఎక్కువ భాగం పనిలేకుండా ఉండటం.
  4. గ్రామీణ ఉపాధి హామీ పథకం వంటి ప్రభుత్వ పథకాలు సక్రమంగా అమలుకాకపోవటం.
  5. ప్రజలు అధిక ఆదాయాలు పొందాలనుకోవటం తద్వారా జీవన ప్రమాణాలను పెంచుకోవాలని ఆశించండం.
  6. సమీప పట్టణాలలో ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు లేకపోవటం.

ఢిల్లీ, ముంబయి, సూరత్, హైదరాబాదు, నాగపూర్ వంటి నగరాల్లో వలస వెళ్లేవారు చేయుపనులు.

రవాణా, నిర్మాణరంగం, పెయింటింగ్స్, వాచ్ మెన్ వంటి ఉద్యోగాలు, తోపుడు బండ్లపై కూరగాయలు, పండ్లు, గృహోపకరణాలు అమ్మటం, కర్మాగారాలలో పనిచేయడం, కార్పెంటరీ, బొంతలు కుట్టడం వంటివి.

ప్రశ్న 11.
పట్టణ ప్రాంతాలలో వస్తువుల ఉత్పత్తికి కూడా భూమి అవసరం. గ్రామీణ ప్రాంతంలో భూ వినియోగానికీ, పట్టణ ప్రాంతాలలో భూ వినియోగానికి మధ్య గల తేడా ఏమిటి? (AS1)
జవాబు:

పట్టణ ప్రాంతంలో భూ వినియోగంగ్రామీణ ప్రాంతంలో భూ వినియోగం
1) పట్టణ ప్రాంతాలలో వస్తువుల ఉత్పత్తికి వినియోగించే భూమి రేట్లు అత్యధికం.1) గ్రామీణ ప్రాంతాలలో భూముల రేట్లు సాధారణంగా ఉంటాయి.
2) పట్టణ ప్రాంతాలలో స్వంత భూమి లేకున్న అద్దెకు/లీజుకు భూమి తీసుకొని వస్తు ఉత్పత్తి చేస్తారు.2) గ్రామీణ ప్రాంతాలలో సాధారణంగా భూమి కొనుగోలు చేసి వినియోగిస్తారు.
3) పరిమిత స్థలంలో ప్రణాళికాబద్ధంగా వస్తూత్పత్తి జరుపుకోవాలి.3) అవసరమైన స్థలం లభిస్తుంది.
4) పట్టణ ప్రాంతాల్లో భూమి గృహ నిర్మాణాలకు, వ్యాపార సంబంధ నిర్మాణాలకు వినియోగిస్తారు.4) గ్రామీణ ప్రాంతాలల్లో భూమి పంటలు పండించడానికి, తోటల పెంపకానికి వినియోగిస్తారు.

ప్రశ్న 12.
ఉత్పత్తి ప్రక్రియలో “భూమి” అన్న దాని అర్థం మరొకసారి చదవండి. వ్యవసాయం కాకుండా ఇతర ఉత్పత్తి ప్రక్రియలో భూమి ముఖ్యమైన అవసరంగా ఉన్న మరొక మూడు ఉదాహరణలు ఇవ్వండి. (AS1)
జవాబు:
వ్యవసాయం కాకుండా ఇతర ఉత్పత్తి ప్రక్రియలో భూమి ముఖ్యమైన అవసరం ఉన్న వాటికి ఉదాహరణలు.

  1. పౌల్టీల ఏర్పాటు నిర్వహణ.
  2. ఇటుక బట్టీల ఏర్పాటు, విక్రయం.
  3. ఈమూ పక్షుల పెంపక కేంద్రం ఏర్పాటు.
  4. ఐస్ ఫ్యాక్టరీ ఏర్పాటు.
  5. కుండీల తయారీ.

AP Board 10th Class Social Solutions Chapter 9 రాంపురం : గ్రామ ఆర్థిక వ్యవస్థ

ప్రశ్న 13.
ఉత్పత్తికి, ప్రత్యేకించి వ్యవసాయానికి అవసరమైన నీరు ఒక సహజ వనరు. ఇప్పుడు నీటిని పొందటానికి దీని వినియోగానికి , ఎక్కువ పెట్టుబడి అవసరం అవుతోంది. ఈ వాక్యాలను వివరించండి. (AS2)
జవాబు:
ఉత్పత్తికి, ప్రత్యేకించి వ్యవసాయానికి అవసరమైన నీరు ఒక సహజ వనరు. ఇప్పుడు నీటిని పొందడానికి, దీని వినియోగానికి ఎక్కువ పెట్టుబడి అవసరం అవుతోంది. నీరు సహజ వర్షం నుండి లభిస్తుంది. అయితే కొండలులో చెట్లు నరికివేయటం, గ్రానైట్, క్వారీలకై వాటి రూపాలే లేకుండా చేయడంతో సహజంగా పడాల్సిన వర్షాలు తుఫానులు వస్తే కానీ రావటం లేదు. వర్షాలు సకాలంలో కురవకపోవటంతో విత్తులు నాటిన నుండి పంటకోసే వరకు సాగు నీటిపైన ఆధారపడాల్సి ఉంటుంది. వర్షాలు సరిగా కురవకపోవటంతో సహజ నీటివనరులైన నదీ కాలువలు, చెరువులు, బావుల నుండి సకాలంలో సాగునీరు లభించటం లేదు. దీంతో విద్యుత్ మోటర్లుతో నడిచే బోరుబావుల ద్వారా సాగునీరు పొందవలసి వస్తోంది. భూగర్భ జలాలు లోలోతుకు పోతుండటంతో వాటి త్రవ్వకం, నిర్వహణ ఖర్చుతో కూడినదైపోయింది.

10th Class Social Studies 9th Lesson రాంపురం : గ్రామ ఆర్థిక వ్యవస్థ InText Questions and Answers

10th Class Social Textbook Page No.117

ప్రశ్న 1.
రాష్ట్ర లేక జిల్లా భౌగోళిక పటాలను చూసి బాగా సాగునీటి సదుపాయం ఉన్న ప్రాంతాలను గుర్తించండి. మీరు ఉంటున్న ప్రాంతం దీని కిందికి వస్తుందా?
జవాబు:
అట్లాసు చూసి సాగునీటి సదుపాయం గల ప్రాంతాలను గుర్తించగా, మేము నివాసం ఉంటున్న ప్రాంతం కూడా దీని కిందకే వచ్చింది. అనగా మా ప్రాంతం కూడా సాగునీటి సదుపాయం కలిగి ఉంది.

10th Class Social Textbook Page No.126

ప్రశ్న 2.
ఈ పనికి మిశ్రిలాలకు ఏ భౌతిక పెట్టుబడులు అవసరం అయ్యాయి?
జవాబు:
చెరకు తయారీకి మిశ్రిలాలకు బెల్లం తయారీ యూనిట్ (చెరకు రసం తీసే యంత్రం, చెరకు రసం వేడిచేసే పెద్ద పెనం, మట్టి కుండలు, షెడ్ మొదలైనవి)కు అయ్యే ఖర్చును భౌతిక పెట్టుబడిగా పేర్కొనవచ్చు.

ప్రశ్న 3.
దీనికి శ్రమ ఎవరిద్వారా అందుతోంది?
జవాబు:
దీనికి శ్రమ కూలీల ద్వారా అందుతుంది. విద్యుత్ తో యంత్రం నడుస్తుంది.

AP Board 10th Class Social Solutions Chapter 9 రాంపురం : గ్రామ ఆర్థిక వ్యవస్థ

ప్రశ్న 4.
బెల్లాన్ని మిశ్రిలాల్ తన ఊళ్లో కాకుండా జహంగీరాబాదులోని వ్యాపారస్తులకు ఎందుకు అమ్ముతున్నాడు?
జవాబు:
మిశ్రిలాల్ గ్రామంలో బెల్లం పెద్ద మొత్తంలో ఒకేసారి కొనేవారుండరు. అందుచే ఆయన జహంగీరాబాదులోని వ్యాపారులకు బెల్లం అమ్ముతున్నాడు.

ప్రశ్న 5.
ఎవరి స్థలంలో దుకాణాలను నెలకొల్పుతారు?
జవాబు:
బస్టాండుకు దగ్గరగా ఉన్న ఇళ్లల్లో కొన్ని కుటుంబాల వారు తమకున్న స్థలంలో కొంత భాగాన్ని దుకాణాలు తెరవడానికి ఉపయోగిస్తారు.

ప్రశ్న 6.
తినే వస్తువులు అమ్మే ఈ దుకాణాలలో శ్రమ ఎవరిది?
జవాబు:
కుటుంబంలోని మహిళలు, పిల్లలు.

ప్రశ్న 7.
ఇటువంటి దుకాణాలకు ఎలాంటి నిర్వహణ పెట్టుబడి అవసరం అవుతుంది?
జవాబు:
ఇలాంటి దుకాణాలు సాధారణంగా స్వయం ఉపాధితో పెట్టినవే.

ప్రశ్న 8.
భౌతిక పెట్టుబడి కిందికి వచ్చే వాటిని పేర్కొనండి.
జవాబు:
భౌతిక పెట్టుబడి కింద వచ్చేవి – పిండిమర మొదలైనవి.

ప్రశ్న 9.
మీ ప్రాంతంలో బజారులో తిరుగుతూ సరుకులు అమ్మేవాళ్లల్లో ఒకరి నుంచి వాళ్ల రోజువారీ అమ్మకాలు ఎంతో తెలుసుకోండి. ఏమైనా పొదుపు చేస్తున్నారో, లేదో ఎలా తెలుస్తుంది ? టీచరుతో చర్చించండి.
జవాబు:
మా ప్రాంతంలో బజారులో తిరుగుతూ సరుకులు అమ్మేవారు తమ ఆదాయంలో కొంత మేరకు స్వయంశక్తి సంఘాల పొదుపుల్లోనో, గ్రామాల్లో వేసే చీటీ (చిట్స్)లోనో పొదుపు చేస్తున్నారు.

10th Class Social Textbook Page No.127

ప్రశ్న 10.
కిశోర్ స్థిర పెట్టుబడి ఏమిటి ? అతడి నిర్వహణ పెట్టుబడి ఏమై ఉంటుంది?
జవాబు:
గేదె, బండి – కిశోర్ యొక్క స్థిర పెట్టుబడి. గేదె దానా, బండి మరమ్మతులు, కందెన వంటివి నిర్వహణ పెట్టుబడి.

AP Board 10th Class Social Solutions Chapter 9 రాంపురం : గ్రామ ఆర్థిక వ్యవస్థ

ప్రశ్న 11.
కిశోర్ ఎన్ని ఉత్పత్తి కార్యకలాపాలలో పాల్గొంటూ ఉన్నాడు?
జవాబు:
కిశోర్ పాల ఉత్పత్తి, రవాణా అనే రెండు రకాల ఉత్పత్తి కార్యకలాపాలలలో పాల్గొన్నాడు.

ప్రశ్న 12.
రాంపురంలో మెరుగైన రోడ్ల వల్ల కిశోర్ లాభపడ్డాడా?
జవాబు:
కిశోర్ తన గేదెతో నడిచే బండి సులువుగా నడపడానికి రాంపురంలోని మెరుగైన రోడ్లు ఉపయోగపడ్డాయి.

10th Class Social Textbook Page No.115

ప్రశ్న 13.
వ్యవసాయం గురించి మీకు ఏం తెలుసు ? వివిధ కాలాల్లో పంటలు ఎలా మారుతూ ఉంటాయి? వ్యవసాయం మీద ఆధారపడిన అధిక శాతం ప్రజలకు భూమి ఉందా, లేక వాళ్లు వ్యవసాయ కూలీలా?
జవాబు:
భూమి సాగుచేసి పంటలు పండించడాన్ని వ్యవసాయం అంటారు.. పంటలు కాలము, సాగునీటి సదుపాయం వంటి సౌకర్యాల ఆధారంగా పండుతాయి. ఉదా : వరి పంటకు 25°C ఉష్ణోగ్రత, మొదలలో నీరు నిలువ ఉండాలి. గోధుమ పంటకు తక్కువ ఉష్ణోగ్రత ఉండాలి. కాబట్టి కాలాన్ని, ప్రాంతాన్ని బట్టి పంటలు మారుతుంటాయి. వ్యవసాయం మీద ఆధారపడిన వారిలో అధిక శాతం మందికి భూమిలేదు. వారంతా వ్యవసాయ కూలీలు.

10th Class Social Textbook Page No.117

ప్రశ్న 14.
కింది పట్టిక భారతదేశంలో సాగుకింద ఉన్న భూమిని మిలియన్ హెక్టార్లలో చూపిస్తుంది. పక్కన ఉన్న గ్రాఫ్ లో వీటిని పొందుపరచండి. గ్రాఫ్ ఏం తెలియచేస్తోంది? తరగతి గదిలో చర్చించండి.
AP Board 10th Class Social Solutions Chapter 9 రాంపురం గ్రామ ఆర్థిక వ్యవస్థ 3
జవాబు:
గ్రాఫ్ ను పరిశీలించగా 1950లో భారతదేశంలో గల సాగుభూమి 120 మిలియన్ హెక్టార్లు, 1960లో 130, 1970లో 110 మిలియన్ హెక్టార్లకు పెరిగింది. అయితే గత 4 దశాబ్దాలుగా సాగుభూమి స్థిరంగా ఉండిపోయింది. ఏ మాత్రము పెరగలేదు. జనాభా మాత్రం దశాబ్దానికి దశాబ్దానికి పెరుగుతూనే ఉంది. కాబట్టి భవిష్యత్తులో తిండి గింజలు (ఆహార) కొరత ఏర్పడవచ్చు. కావునా, అందుబాటులో గల సాగుభూమికి సాగునీరందివ్వడానికి ప్రాజెక్టులను నిర్మించి బహుళ పంటల పద్ధతి అమలు చేయటం, పంట దిగుబడికి నూతన విధానాలు అమలు చేయటం వంటివి చేయాలి.
AP Board 10th Class Social Solutions Chapter 9 రాంపురం గ్రామ ఆర్థిక వ్యవస్థ 4

ప్రశ్న 15.
‘రాంపురంలో పండించిన పంటల గురించి తెలుసుకున్నారు. మీ ప్రాంతంలో పండించే పంటల ఆధారంగా కింది పట్టికను నింపండి.
AP Board 10th Class Social Solutions Chapter 9 రాంపురం గ్రామ ఆర్థిక వ్యవస్థ 5
జవాబు:
AP Board 10th Class Social Solutions Chapter 9 రాంపురం గ్రామ ఆర్థిక వ్యవస్థ 6

ప్రశ్న 16.
గ్రామీణ ప్రాంతాలలో ‘బహుళ పంటలు’ సాగు చెయ్యటానికి దోహదపడే కారణాలు ఏమిటి?
జవాబు:
గ్రామీణ ప్రాంతాలలో బహుళ పంటలు సాగుచేయుటకు దోహదపడే అంశాలు :

  1. వ్యవసాయ కూలీల అందుబాటు
  2. సాగునీరు లభ్యత
  3. సారవంతమైన నేల
  4. కాలానుగుణంగా పంటలు మార్చే నేర్పుగల అనుభవనీయులైన రైతులు.

AP Board 10th Class Social Solutions Chapter 9 రాంపురం : గ్రామ ఆర్థిక వ్యవస్థ

10th Class Social Textbook Page No.119

ప్రశ్న 17.
ఈ క్రింది పటంలో చిన్న రైతులు సాగుచేసే భూమిని గుర్తించి రంగులు నింపండి.
AP Board 10th Class Social Solutions Chapter 9 రాంపురం గ్రామ ఆర్థిక వ్యవస్థ 7
పటం : ఆంధ్రప్రదేశ్ లోని ఒక గ్రామంలో సాగుభూమి పంపిణీ

ప్రశ్న 18.
అనేక మంది రైతులు ఇంత చిన్న కమతాలను ఎందుకు సాగుచేస్తున్నారు?
జవాబు:
అనేక మంది చిన్న చిన్న కమతాలను సాగుచేయుటకు గల కారణాలు.

  1. రైతుగా సామాజిక హోదా.
  2. తన పొలంలో పండే పంట తింటున్నాననే తృప్తి.
  3. ఈ భూమి రైతుకు పరపతినేర్పాటు చేస్తుంది.
  4. ఈ చిన్న కమతాలలో రెండు, మూడవ పంటలుగా వాణిజ్య పంటలు వేసి ఆర్థికంగా అవసరాలు తీర్చుకుంటాడు.
  5. చిన్న కమతాలలో వ్యవసాయం చేసుకుంటూ, మిగతా సమయాలలో ఇతరుల పనికి కూలీకి వెళ్లటం, వ్యాపారాలు చేయటం వంటివి చేస్తారు.

10th Class Social Textbook Page No.119

ప్రశ్న 19.
భారతదేశంలో రైతులు, వాళ్లు సాగుచేసే భూముల వివరాలు కింద ఇచ్చిన పట్టికలోనూ, ‘పై’ చార్టులోనూ ఉన్నాయి.
AP Board 10th Class Social Solutions Chapter 9 రాంపురం గ్రామ ఆర్థిక వ్యవస్థ 8
గమనిక : ఈ గణాంకాలు రైతులు సాగుచేస్తున్న భూమి వివరాలను తెలియజేస్తున్నాయి. ఈ భూమి సొంతం కావచ్చు లేదా కౌలుకు తీసుకున్నది కావచ్చు.
1) బాణం గుర్తులు ఏమి సూచిస్తున్నాయి?
2) భారతదేశంలో సాగుభూమి పంపిణీలో అసమానతలు ఉన్నాయని మీరు అంగీకరిస్తారా?
AP Board 10th Class Social Solutions Chapter 9 రాంపురం గ్రామ ఆర్థిక వ్యవస్థ 9
జవాబు:

  1. భారతదేశంలో సాగుభూమి పంపిణీలో అసమానతలను బాణం గుర్తులు సూచిస్తున్నాయి.
  2. రైతు జనాభాలో కేవలం 13% గల మధ్య తరగతి, భూస్వాముల చేతిలో మొత్తం భూమిలో సగం కంటే ఎక్కువ అనగా 52% భూమి ఉంది. 87%, చిన్న రైతుల వద్ద కేవలం 48% భూమి మాత్రమే ఉంది. అనగా దేశంలోని అత్యధిక సాగుభూమి కొద్ది మంది రైతుల చేతులలోనే ఉంది.

10th Class Social Textbook Page No.120

ప్రశ్న 20.
దళ లాంటి వ్యవసాయ కూలీలు పేదవారుగా ఎందుకు ఉన్నారు?
జవాబు:
దళ లాంటి వ్యవసాయ కూలీలు పేదవారుగా ఉండుటకు కారణాలు :
రాంపురంలో పనికోసం వ్యవసాయ కూలీల మధ్య తీవ్ర పోటీ ఉంది. కాబట్టి తక్కువ కూలీకైనా పని చేయుటకు ప్రజలు సిద్ధపడుతున్నారు. అందుచే దళ లాంటి వ్యవసాయ కూలీలు పేదవారుగా మిగిలిపోతున్నారు.

AP Board 10th Class Social Solutions Chapter 9 రాంపురం : గ్రామ ఆర్థిక వ్యవస్థ

10th Class Social Textbook Page No.121

ప్రశ్న 21.
తమ కోసం వ్యవసాయ కూలీలు పనిచెయ్యటానికి రాంపురంలోని మధ్యతరగతి, పెద్ద రైతులు ఏం చేస్తారు? మీ ప్రాంతంలోని పరిస్థితిని దీనితో పోల్చండి.
జవాబు:
తమ కోసం వ్యవసాయ కూలీలు పనిచెయ్యటానికి రాంపురంలో మధ్యతరగతి పెద్ద రైతులు పేదవారికి, చిన్న రైతులకు అప్పులిచ్చి తామిచ్చే కూలీకి తమ పొలాల్లో తప్పనిసరిగా పనిచేయాలనే నిబంధన విధిస్తారు. మా ప్రాంతంలో అటువంటి పరిస్థితులు లేవు. వ్యవసాయేతర పనులు లభించడంతో వ్యవసాయ పనులపైనే ఆధారపడవలసిన అవసరం లేదు.

10th Class Social Textbook Page No.121

ప్రశ్న 22.
కింది పట్టికను నింపండి :

ఉత్పత్తి ప్రక్రియలో శ్రమఒక్కొక్కదానికి మూడు భిన్నమైన ఉదాహరణలు ఇవ్వండి.
యజమాని / కుటుంబం కూడా అవసరమైన పని చేస్తారు.
పని చెయ్యటానికి యజమాని కూలీలను నియమిస్తాడు.

జవాబు:

ఉత్పత్తి ప్రక్రియలో శ్రమఒక్కొక్కదానికి మూడు భిన్నమైన ఉదాహరణలు ఇవ్వండి.
యజమాని / కుటుంబం కూడా అవసరమైన పని చేస్తారు.తమ స్వంత పొలంలో వ్యవసాయ పనులు. ఇంటి మైనర్ రిపేర్లు, పంటలేని సమయంలో పొలాన్ని సిద్ధం చేయటం.
పని చెయ్యటానికి యజమాని కూలీలను నియమిస్తాడు.పొలానికి ఎరువు వేయించటం, పంట కాలంలో పనులు – ఉడుపు, కలుపుతీత, గొప్పు, కోత వంటివి. పొలానికి సాగునీరు రావలసిన కాలువలు త్రవ్వించుట మొదలైనవి.

ప్రశ్న 23.
మీ ప్రాంతంలో వస్తువుల, సేవల ఉత్పత్తిలో ఏ ఏ రకాలుగా శ్రమను పొందుతారు?
జవాబు:
మా ప్రాంతంలో వస్తువుల, సేవల ఉత్పత్తిలో శ్రమను పొందు రకాలు:

  1. పనిచేసే కూలీలు
  2. పంటను సమీప మార్కెట్ కు తరలించే వాహనాల డ్రైవర్లుగా
  3. వాహనాలు నుంచి సరుకు దించే కూలీలుగా
  4. విత్తనాలు, ఎరువులు అమ్మే వ్యాపారులు
  5. పేపరు మిల్లుల ఏజంట్లుగా

10th Class Social Textbook Page No.122

ప్రశ్న 24.
క్రింది పట్టికను పరిశీలించండి.
AP Board 10th Class Social Solutions Chapter 9 రాంపురం గ్రామ ఆర్థిక వ్యవస్థ 10

1) పైన ఇచ్చిన కూలిరేట్లతో మీ ప్రాంతంలో ఏదైనా పనికి అమలులో ఉన్న కూలిరేట్లను పోల్చండి.
జవాబు:
మా ప్రాంతంలో రోజువారీ కూలీలు పైన పేర్కొన్న విధంగానే ఉన్నాయి. పురుషులకు కనీస కూలీ రూ. 200 కాగా, స్త్రీలకు రూ. 150. దత్తాంశంలో చాలా వ్యత్యాసాలున్నాయి.

2) కనీస కూలీరేట్ల గురించి తెలుసుకొని వాటితో పోల్చండి.
జవాబు:
1) నూర్పిడి చేసినందుకు స్త్రీలకు (పైన పేర్కొన్న విధంగా) కనీస కూలీ రూ. 118 లభిస్తుంది.
2) కాగా మా ప్రాంతంలో నూర్పిడి చేసినందుకు స్త్రీలకు రూ. 200ల కనీస కూలీ ఇస్తున్నారు.

3) ఒక పనికి ఆడవాళ్ల కంటే మగవాళ్లకు ఎక్కువ కూలీ ఎందుకు లభిస్తోంది? చర్చించండి.
జవాబు:
ఆడవారికంటే మగవారు ఎక్కువ పనిచేయగలరనే భావన వలన ఒక పనికి ఆడవారికంటే మగవారికి ఎక్కువ కూలి ఇస్తున్నారు.

AP Board 10th Class Social Solutions Chapter 9 రాంపురం : గ్రామ ఆర్థిక వ్యవస్థ

10th Class Social Textbook Page No.126

ప్రశ్న 25.
మిశ్రిలాల్ తన లాభాన్ని ఎందుకు పెంచుకోలేకపోతున్నాడు? అతడికి నష్టాలు వచ్చే సందర్భాలు ఏమిటో ఆలోచించండి.
జవాబు:
మిశ్రిలాల్ బెల్లం తయారీని కుటీర పరిశ్రమగా నిర్వహిస్తున్నాడు. పెద్ద ఎత్తున చెరుకు కొని యంత్రాల సంఖ్య పెంచడం, శ్రామికులను వినియోగించడం ద్వారా ఆయన బెల్లం ఉత్పత్తిని పెంచి అధిక లాభాలను ఆర్జించగలడు. అయితే వ్యాపారంలో పోటీ, మార్కెట్ రిల మూలంగా నష్టాలు కూడా రావచ్చు.

10th Class Social Textbook Page No.124

ప్రశ్న 26.
ముగ్గురు రైతులను తీసుకోండి. ముగ్గురూ గోధుమలు పండించారు. అయితే వాళ్ళు ఉత్పత్తి చేసిన దానిలో తేడా ఉంది (రెండవ నిలువు వరుస). వివిధ రైతులు ఎదుర్కొనే పరిస్థితిని విశ్లేషించటానికి కొన్ని అంశాలు అందరికీ సమానమని అనుకోవాలి. తేలికగా లెక్క కట్టటానికి ఈ అంశాలను అనుకుందాం :
1) ప్రతి రైతు కుటుంబం వినియోగించే గోధుమల మొత్తం సమానం (మూడవ నిలువు వరుస).
2) ఈ సంవత్సరంలో మిగిలిన గోధుమనంతా వచ్చే సంవత్సరం విత్తనంగా రైతులందరూ ఉపయోగించుకుంటారు. అందుకు వాళ్లకు తగినంత భూమి ఉంది.
3) అందరికి ఉపయోగించిన విత్తనం కంటే రెట్టింపు దిగుబడి వస్తుందనుకుందాం. ఉత్పత్తిలో ఎటువంటి అకస్మాత్తు నష్టాలు లేవు.
పట్టికను పూర్తి చేయండి.
AP Board 10th Class Social Solutions Chapter 9 రాంపురం గ్రామ ఆర్థిక వ్యవస్థ 11

• మూడు సంవత్సరాలలో ముగ్గురు రైతుల గోధుమ ఉత్పత్తిని పోల్చండి.
• 3వ రైతు పరిస్థితి 3వ సంవత్సరంలో ఏమవుతుంది ? అతడు ఉత్పత్తిని కొనసాగించగలడా ? ఉత్పత్తిని కొనసాగించటానికి అతడు ఏం చెయ్యాలి?
జవాబు:
1వ రైతు
AP Board 10th Class Social Solutions Chapter 9 రాంపురం గ్రామ ఆర్థిక వ్యవస్థ 12 AP Board 10th Class Social Solutions Chapter 9 రాంపురం గ్రామ ఆర్థిక వ్యవస్థ 13

వినియోగం కంటే ఉత్పత్తి రెట్టింపుతో ప్రారంభించిన 2వ రైతు మిగులునే వచ్చే సంవత్సరానికి పెట్టుబడిగా పెట్టి పంట కొనసాగిస్తున్నాడు.

వినియోగానికి రెట్టింపు కంటే ఎక్కువ ఉత్పత్తితో ప్రారంభించిన 1వ రైతు పెట్టుబడిని పెంచుకుంటూ మిగులును పెంచుకుంటున్నాడు.

3వ రైతుకు 2వ సంవత్సరానికే మిగులు లేకపోవడంతో 3వ సంవత్సరం ఉత్పత్తి సాధ్యంకాని స్థితి నెలకొంది. కాబట్టి 3వ రైతు సాగుభూమిని పెంచి ఉత్పత్తిని పెంచుకోవలసి ఉంది.

AP Board 10th Class Social Solutions Chapter 8 ప్రజలు – వలసలు

SCERT AP 10th Class Social Study Material Pdf 8th Lesson ప్రజలు – వలసలు Textbook Questions and Answers.

AP State Syllabus 10th Class Social Solutions 8th Lesson ప్రజలు – వలసలు

10th Class Social Studies 8th Lesson ప్రజలు – వలసలు Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
కింది వాటితో ఒక పట్టిక తయారుచేసి వలస కార్మికుల వివిధ ఉదాహరణలను క్రోడీకరించండి. (AS3)
1) వలస కార్మికులు
2) వలసల కారణాలు
3) వలస వెళ్లిన వాళ్ల జీవన ప్రమాణాలు
4) వాళ్ల జీవితాల ఆర్థిక స్థితిపై ప్రభావం
5) వాళ్లు వలస వచ్చిన ప్రాంత ప్రజల జీవితాల ఆర్థిక స్థితిపై ప్రభావం.
జవాబు:
AP Board 10th Class Social Solutions Chapter 8 ప్రజలు – వలసలు 1

ప్రశ్న 2.
గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు, గ్రామీణ ప్రాంతాల నుంచి గ్రామీణ ప్రాంతాలకు వలసల మధ్య పోలికలు, తేడాలు రాయండి. (AS1)
జవాబు:

గ్రామీణ ప్రాంతం నుండి గ్రామీణ ప్రాంతానికి వలసలుగ్రామీణ ప్రాంతం నుండి పట్టణ ప్రాంతానికి వలసలు
1) భౌగోళికంగా పెద్దగా తేడా ఉండదు. అందుచే కనీస సదుపాయాలతో సర్దుకుపోతారు.1) మురికివాడలు, త్రాగునీరు, విద్యుత్ సదుపాయాలు లేని ప్రాంతాలలో నివసించవలసి ఉంటుంది.
2) సంవత్సరంలో కొంతకాలం మాత్రమే ఉపాధి లభిస్తుంది.2) వేర్వేరు ఉపాధి అవకాశాలుండటంతో ఎక్కువ కాలం పట్టణాలలో ఉపాధి పొందవచ్చు.
3) పిల్లల చదువులకు ఆటంకం కలుగవచ్చు.3) పిల్లలను చదివించుకొనేందుకు పాఠశాలలు అందు బాటులో ఉంటాయి.
4) అవ్యవస్థీకృత రంగానికే పరిమితం.4) నైపుణ్యం, కృషి ఉంటే వ్యవస్థీకృత రంగంలో అవకాశాలు లభిస్తాయి.
5) కార్మికులు అసంఘటితంగా ఉన్నందున పనిగంటలు, సెలవులు, బీమా, సరియైన వేతనాలు లభించవు.5) పట్టణ వాతావరణంలో కార్మికులు సంఘటితమై పరిమిత పనిగంటలు, కనీస సెలవులు, మెరుగైన వేతనాలు (కూలీ) వంటివి పొందుతారు.
6) సామాజిక స్థాయిలో మార్పుండదు.6) సామాజిక స్థాయి పెరుగుతుంది.
7) జీవనం గడపడానికే ప్రాధాన్యత.7) కొత్త నైపుణ్యాలను నేర్చుకొని జీవనాన్ని మెరుగు పరచుకోవచ్చు.

AP Board 10th Class Social Solutions Chapter 8 ప్రజలు – వలసలు

ప్రశ్న 3.
వీటిల్లో దేనిని కాలానుగుణ వలసగా పరిగణించవచ్చు? ఎందుకు? (AS1)
అ) వివాహం కారణంగా తల్లిదండ్రుల ఇంటినుంచి భర్త ఇంటికి స్త్రీ వెళ్లటం.
ఆ) తమిళనాడులో పసుపుదుంప తీయటానికి ఒక జిల్లా నుంచి మరొక జిల్లాకి మూడు నెలలపాటు వెళ్లటం.
ఇ) సంవత్సరంలో ఆరునెలల కోసం ఢిల్లీలో రిక్షా తోలటానికి బీహారు గ్రామీణ ప్రాంతాల నుంచి వెళ్లటం.
ఈ) హైదరాబాదులో ఇళ్లల్లో పనిచెయ్యటానికి నల్గొండ జిల్లా నుంచి ఆడవాళ్లు రావటం.
జవాబు:
(ఆ) దీనిని మనం కాలానుగుణమైన వలసగా పరిగణించవచ్చు. ఎందువలననగా వీరి వలస కాలం ఆరు నెలలలోపు ఉండుటే.

ప్రశ్న 4.
వలస వెళ్లిన వాళ్లు ఆ ప్రాంతంలో సమస్యలు సృష్టిస్తారా / సమస్యలకు కారణం అవుతారా? మీ, సమాధానానికి కారణాలు ఇవ్వండి. (AS4)
జవాబు:
వలస వెళ్లిన వారు ఆ ప్రాంతాలలో సమస్యలు సృష్టించరు. సమస్యలకు కారణం అవ్వరు. ఎందువలననగా వీరు కేవలం ఉపాధి కోసం వలస వెళ్లిన వారు. అయితే శాశ్వత వలసలు వెళ్లి వ్యవస్థీకృత రంగంలో స్థిరపడిన కార్మికులు తమ హక్కుల కోసం పోరాటాలు చేస్తారు. కొన్నిసార్లు ఈ పోరాటాలు ఆయా పరిశ్రమలు లాకౌట్లకు కూడా దారితీస్తాయి.

ప్రశ్న 5.
కింద వివిధ రకాల వలన ఉదాహరణలు ఉన్నాయి. వాటిని అంతర్గత, అంతర్జాతీయ వలసలుగా వర్గీకరించండి.
అ) సాంకేతిక పనివాళ్లుగా పనిచెయ్యటానికి భారతదేశం నుంచి సౌదీ అరేబియాకి వెళ్లటం.
ఆ) బీహారు నుంచి పంజాబ్ కి వెళ్లే వ్యవసాయ కూలీలు.
ఇ) ఒడిశా నుంచి ఆంధ్రప్రదేశ్ కి ఇటుక బట్టీలలో పనిచెయ్యటానికి వెళ్లటం.
ఈ) భారతీయ పిల్లలకు చైనీస్ భాష నేర్పటానికి చైనా నుంచి వచ్చే టీచర్లు.
జవాబు:
అ) అంతర్జాతీయ వలస
ఆ) అంతర్గత వలస
ఇ) అంతర్గత వలస
ఈ) అంతర్జాతీయ వలస

AP Board 10th Class Social Solutions Chapter 8 ప్రజలు – వలసలు

ప్రశ్న 6.
వలస కుటుంబాలలోని అధికశాతం పిల్లలు బడి మధ్యలోనే మానేస్తారు. దీనితో మీరు ఏకీభవిస్తారా? మీ సమాధానానికి కారణాలు పేర్కొనండి. (AS2)
జవాబు:
వలస కుటుంబాలలోని అధికశాతం మంది పిల్లలు బడి మధ్యలోనే మానేస్తారు. దీనితో నేను ఏకీభవిస్తున్నాను. ఎందుకంటే – వలస వెళ్లినప్పుడు తల్లిదండ్రులతో పాటు వెళ్లే చిన్నపిల్లలకు శిశు సంరక్షణ కేంద్రాలు ఉండవు. పెద్ద పిల్లలు కొత్త ప్రదేశంలో చదువు కొనసాగించే వీలు ఉండదు. వాళ్లు స్వగ్రామాలకు తిరిగి వెళ్లినప్పుడు అక్కడి పాఠశాలలు కూడా వాళ్లని మళ్లీ చేర్చుకోవు. చివరికి వాళ్లు బడికి వెళ్లటం మానేస్తారు. కుటుంబంలో కేవలం మగవాళ్లే వలసకి వెళ్లినప్పుడు కుటుంబ బాధ్యతలు, వృద్ధుల సంరక్షణ భారం అంతా ఆడవాళ్ల మీద పడుతుంది. ఇటువంటి కుటుంబాలలోని ఆడపిల్లల మీద తమ్ముళ్లు, చెల్లెళ్లను, చూసుకోవాల్సిన భారం ఉండి చివరికి చాలామంది బడి మానేస్తారు.

ప్రశ్న 7.
గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు వలస వెళ్లటం వల్ల గ్రామీణ ప్రాంతాల ప్రజల కొనుగోలు శక్తి ఎలా పెరుగుతుంది? (AS1)
జవాబు:
భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో మూడింట ఒక వంతు కుటుంబాలు వలస సభ్యులు పంపించే డబ్బుపై ఆధారపడి ఉన్నాయి. కాలానుగుణంగా వలస వెళ్లే వాళ్లల్లో చాలామంది ఇంటికి డబ్బు పంపిస్తారు, లేదా మిగుల్చుకున్న డబ్బు తమతో తీసుకెళతారు. వలస వెళ్లటం వల్ల ఆస్తులు అమ్ముకోకుండా అప్పులు తీర్చటానికి, ఇతర కార్యక్రమాలకు డబ్బు సమకూరుతుంది. వలస వెళ్లిన కుటుంబాలు ఇల్లు, భూమి, వ్యవసాయ పరికరాలు, వినియోగ వస్తువులు కొనటం సాధారణంగా చూస్తూ ఉంటాం.

ప్రశ్న 8.
వృత్తి నైపుణ్యం ఉన్నవాళ్లే అభివృద్ధి చెందిన దేశాలకు ఎందుకు వలస వెళ్లగలుగుతున్నారు? నైపుణ్యం లేని కార్మికులు ఈ దేశాలకు ఎందుకు వెళ్లలేరు? (AS1)
జవాబు:
అభివృద్ధి చెందిన దేశాలకు సాంకేతిక నైపుణ్యం, వృత్తి అనుభవం ఉన్న వ్యక్తుల కొరత ఎక్కువగా ఉంది. అందువలనే భారతదేశం నుండి ఐ.టి. నిపుణులు, డాక్టర్లు, మేనేజ్మెంట్ నిపుణులు అమెరికా, కెనడా, ఇంగ్లాండు, ఆస్ట్రేలియా వంటి దేశాలకు వలస వెళుతున్నారు.

ప్రశ్న 9.
పశ్చిమ ఆసియా దేశాలలో భారతదేశం నుంచి నైపుణ్యం లేని కార్మికులనే ఎందుకు కోరుకుంటున్నారు? (AS1)
జవాబు:
పశ్చిమ ఆసియా దేశాలైన సౌదీ అరేబియా, యు.ఏ.ఇ వంటి దేశాలలో భవన నిర్మాణం, మరమ్మతుల నిర్వహణ, సేవలు, రవాణా టెలికమ్యూనికేషన్ రంగాలలో కార్మికుల కొరత ఎక్కువగా ఉంది. అందుచే వీరు భారతదేశం నుండి నైపుణ్యంలేని కార్మికులనే కోరుకుంటున్నారు.

AP Board 10th Class Social Solutions Chapter 8 ప్రజలు – వలసలు

ప్రశ్న 10.
మూడు రాష్ట్రాల ప్రజలు చాలా దూరంలోని పశ్చిమ ఆసియాకు ఎలా వెళ్లగలుగుతున్నారు? (AS1)
జవాబు:
పశ్చిమ ఆసియా దేశాలకు భారతదేశంలోని కేరళ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల నుండి ప్రతి ఏడాది 3 లక్షల మంది కార్మికులు తాత్కాలిక వలసలు వెళ్లి తిరిగి వస్తుంటారు. నైపుణ్యంలేని కార్మికులు మధ్యవర్తుల సహకారంతో , సుదూర ప్రాంతాలకు వెళ్ళగలుగుతున్నారు.

ప్రశ్న 11.
అంతర్గత, అంతర్జాతీయ వలసల ప్రభావాల మధ్య పోలికలను, తేడాలను పేర్కొనండి. (AS1)
జవాబు:
అంతర్గత వలసలు అంతర్జాతీయ వలసలు పోలికలు : రెండింటిలోను శాశ్వత, తాత్కాలిక వలసలుంటాయి. విద్య, ఉపాధి, వివాహం, మంచి ఆదాయం కొరకే రెండింటిలోను వలసలుంటాయి.
తేడాలు :

అంతర్గత వలసలుఅంతర్జాతీయ వలసలు
1) మన దేశంలో ఒక రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు లేదా ఇతర రాష్ట్రాలకు జరిగే వలసలు.1) భారతదేశం నుండి ఇతర దేశాలకు జరిగే వలసలు.
2) ఆర్థిక లాభం తక్కువ. సాధారణంగా జీవనోపాధికై జరిగే వలసలు.2) ఆర్ధికలాభం ప్రధాన లక్ష్యంగా సాగే వలసలు.
3) సాంస్కృతిక మార్పుకు అవకాశాలు తక్కువ.3) సాంస్కృతిక మార్పుకు అవకాశాలున్నాయి.
4) కుటుంబం కొంతమేరకు ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది.4) వలస వెళ్లిన వారి ప్రాంతం, రాష్ట్రం కూడా వారు పంపిన ధనంతో ముందంజ వేయవచ్చు. కేరళ రాష్ట్రంలో తలసరి సగటు వినియోగం దేశ సగటు కంటే 40 శాతం ఎక్కువ కావటానికి కారణం వీరు ఇతర దేశాలు వలసలు పోయి ధనార్జన చేసి రాష్ట్రంలో వాటిని మదుపు పెట్టడమే.
5) తమ వృత్తి నైపుణ్యాలను దేశంలోని ఇతర ప్రాంతాలకు విస్తరింపజేస్తారు.5) విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించి పెడతారు.
6) తమ ప్రాంత విశిష్టతను, సాంప్రదాయాలను గౌరవాన్ని ఇతర ప్రాంతాలలో విస్తరిస్తారు.6) తమ వృత్తి నైపుణ్యాలను ఇతర దేశాలకు వ్యాపింపజేస్తారు. సాంప్రదాయాలను, దేశ గౌరవాన్ని విదేశాలలో విస్తరిస్తారు.

10th Class Social Studies 8th Lesson ప్రజలు – వలసలు InText Questions and Answers

10th Class Social Textbook Page No.108

ప్రశ్న 1.
గ్రామీణ ప్రాంతాల నుంచి వలస వచ్చిన వాళ్లు పట్టణ ప్రాంతంలో ఉపాధి పొందే ఆర్థిక రంగాలు ఏవి ? దీనికి కొన్ని – కారణాలను పేర్కొనండి.
జవాబు:
గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణ ప్రాంతాలకు ఎక్కువగా నైపుణ్యం లేని కార్మికులు తాత్కాలిక వలసలకు వెళుతుంటారు. వీరు ఉపాధి పొందే ఆర్థిక రంగాలు – గృహనిర్మాణ రంగం, పరిశ్రమలు, మెకానిక్ షాపులు మొదలగునవి.

10th Class Social Textbook Page No.102

ప్రశ్న 2.
ఇక్కడ కొంతమంది జాబితా ఉంది. వాళ్లని వలస వెళ్లిన వాళ్లు, వెళ్లని వాళ్లుగా వర్గీకరించండి. వలస తీరుని పేర్కొని, వలసకు కారణం ఏమై ఉంటుందో చెప్పండి.
AP Board 10th Class Social Solutions Chapter 8 ప్రజలు – వలసలు 2
జవాబు:
AP Board 10th Class Social Solutions Chapter 8 ప్రజలు – వలసలు 3

10th Class Social Textbook Page No.103

ప్రశ్న 3.
కింది పటం పరిశీలించి ఢిల్లీకి ఏ ఏ రాష్ట్రాల నుండి వలసలు వస్తున్నారు?
జవాబు:
1) బీహార్, ఉత్తరప్రదేశ్ నుండి ఢిల్లీకి వలసలు వస్తున్నారు.
AP Board 10th Class Social Solutions Chapter 8 ప్రజలు – వలసలు 5-1

10th Class Social Textbook Page No.105

ప్రశ్న 4.
కింది పటం పరిశీలించి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు ఏ ఏ రాష్ట్రాల నుండి ప్రజలు వలస వస్తున్నారు?
జవాబు:
AP Board 10th Class Social Solutions Chapter 8 ప్రజలు – వలసలు 6-1
ఆంధ్రప్రదేశ్ కు కర్ణాటక నుండి వలస వస్తున్నారు. కర్ణాటకకు ఆంధ్రప్రదేశ్ నుండి వలసలు లేవు.

10th Class Social Textbook Page No.105

ప్రశ్న 5.
కింది పటం పరిశీలించి తమిళనాడు రాషంలో. పటం : ప్రధాన అంతర రాష్ట్ర వలస మార్గాల అంచనా, 2001-2011 అంతర, బాహ్య వలసలకు కారణాలు కనుగొనండి.
AP Board 10th Class Social Solutions Chapter 8 ప్రజలు – వలసలు 4
జవాబు:

  1. కొత్త నైపుణ్యాలు సాధించటానికి, కొత్త ఉద్యోగాలు, చలనచిత్ర పరిశ్రమలో ఉపాధి అవకాశాలు మరియు మెరుగైన వేతనాలు పొందటానికి ప్రజలు తమిళనాడుకు ‘వలస వెళ్ళారు.
  2. పర్యాటక పరిశ్రమ (టూరిజం ఇండస్ట్రీ) లో ఉపాధి అమలుచేసిన స్థానం – వన గమ్యస్థానం అవకాశాల కోసం ప్రజలు తమిళనాడు నుండి కేరళకు వలస వెళ్ళారు.

10th Class Social Textbook Page No.106

ప్రశ్న 6.
పట్టణంలో అసంఘటిత రంగంలో రోజుకూలీగా లేదా ఇంటి పనులు చేసే మహిళగా పట్టణానికి వలస వచ్చిన ఒక వ్యక్తిని ఇంటర్వ్యూ చేసి ఆమె కథ రాయండి. (పైన ఇచ్చిన రామయ్య కథనాన్ని చూడండి).
జవాబు:
శ్రీమతి బూరా సరోజిని హైదరాబాదులో ఒక ఆఫీసర్ గారి ఇంట్లో పని చేయడానికి వచ్చింది. ఆమె భూపాలపల్లి (మండలం) వరంగల్ లో జన్మించింది. అక్కడ 8వ తరగతి వరకు చదివిన తరువాత ప|గోదావరికి నర్సాపురానికి చెందిన రంగాజీతో వివాహం జరిగింది. తరువాత 25 సం||రాలకి ఆమె భర్త చనిపోయారు. ఆమె ఇద్దరి కుమార్తెలకు వివాహం చేసి, ఆ అప్పులు తీర్చే నిమిత్తం పనికి చేరింది. ఆమె సంపాదించిన దానిలో ఖర్చులు పోగా మిగిలినవి. తన సోదరునికి పంపి అతని ద్వారా అప్పు తీర్చింది. ఆమె తన స్వంత ఊరును 6 నెలల కొకసారి దర్శిస్తుంది.

AP Board 10th Class Social Solutions Chapter 8 ప్రజలు – వలసలు

10th Class Social Textbook Page No.106

ప్రశ్న 7.
మీరు గ్రామీణ ప్రాంతంలో ఉంటుంటే పట్టణంలో అసంఘటిత రంగంలో పనిచేస్తూ పండగకు ఊరొచ్చిన ఒక వ్యక్తిని ఇంటర్వ్యూ చేసి అతడి కథ రాయండి. (పైన ఇచ్చిన రామయ్య కథనాన్ని చూడండి).
జవాబు:
చోరగుడి పద్మనాభం (20 సం||రాలు) భిలాయ్ ఛత్తీషుడు తాపీ పని చేస్తున్నాడు. అతను మా ఊరు నందమూరు టంగుటూరు మండలానికి వచ్చాడు. పద్మనాభం మా జిల్లాలోనే గుడివాడలో జన్మించాడు. అతను సెలవులకి తన నాయనమ్మ యింటికి వచ్చాడు. అతని తల్లి ఆరోగ్యానికి చెల్లెలి వివాహానికి చాలా అప్పు చేశాడు. ఆ అప్పులన్నీ పద్మనాభమే తీర్చాలి. అందుకే అతను భిలాయ్ వెళ్ళాడు. అతనికి రోజుకి రూ. 300/- ఉచిత వసతి, భోజన సౌకర్యాలు కల్పించారు. ఆరోగ్య భీమా కూడా కల్పించారు. కాబట్టి అతను ఆనందంగానే కొంత భాగాన్ని సాగిస్తున్నాడు. తన సంపాదనలో కొంత భాగాన్ని తన తండ్రికి పంపి అప్పులు తీరుస్తున్నాడు. అతను తన కుటుంబానికి దూరంగా ఉండటానికి దిగులు పడుతున్నాడు.

10th Class Social Textbook Page No.106

ప్రశ్న 8.
పైన పేర్కొన్న రెండు పరిస్థితుల మధ్య పోలికలు, తేడాలు పేర్కొనండి.
జవాబు:
పోలికలు, తేడాలు :
వీరిరువురూ వేర్వేరు ప్రాంతాలకి వలసకి వెళ్ళారు. ఇద్దరు అవ్యవస్థీకృత రంగంలోనే పని చేస్తున్నారు. ఇద్దరూ వారి జీవనానికి, అప్పులు తీర్చడానికి పని చేస్తున్నారు.

శ్రీమతి బి. సరోజినిచాట్రగడ్డ పద్మనాభం
1. ఈమె స్వంత రాష్ట్రంలోనే వలసకి వెళ్ళింది.1. ఇతను వేరే రాష్ట్రానికి వలస వెళ్ళాడు.
2. ఆమె కొద్ది పాటి వసతులను మాత్రమే పొందుతోంది.2. ఇతను చాలా లాభాలను పొందుతున్నాడు.
3. ఆమె ఒంటరి జీవితాన్ని అనుభవిస్తోంది.3. ఇతను బ్రహ్మచారి జీవితాన్ని గడుపుతున్నాడు.

10th Class Social Textbook Page No.107

ప్రశ్న 9.
పట్టణ ప్రాంతాల్లో ఉద్యోగాలు దొరకటానికి పరిచయాలు, సంబంధాలు ఎందుకు అవసరం?
జవాబు:
పట్టణాలలో ఉద్యోగాలు దొరకటానికి పరిచయాలు, సంబంధాలు చాలా కీలకమైనవి. ఒక్కొక్కసారి తమ పరిచయాలు, సంబంధాల ద్వారా ముందుగా ఉద్యోగం దొరకబుచ్చుకున్న తరువాతే గ్రామీణ ప్రాంతాల ప్రజలు పట్టణాలకు వస్తారు. అనేక కారణాల వల్ల వాళ్లు తమ గ్రామీణ ప్రాంతాలతో సన్నిహిత సంబంధాలు పెట్టుకుంటారు.

10th Class Social Textbook Page No.108

ప్రశ్న 10.
1961-2011 మధ్యకాలంలో వలసల ప్రభావాన్ని చూపటానికి ఒక పట్టిక తయారుచేయండి.
జవాబు:
AP Board 10th Class Social Solutions Chapter 8 ప్రజలు – వలసలు 7

10th Class Social Textbook Page No.108

ప్రశ్న 11.
గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రజలు వలస వెళ్లినప్పుడు గ్రామీణ రంగంలోని ఏ ఆర్థిక రంగం ఎక్కువ మందిని కోల్పోతుంది? ఎందుకని?
జవాబు:
గ్రామీణ ప్రాంతం నుంచి ప్రజలు వలస వెళ్లినప్పుడు గ్రామీణ రంగంలోని వ్యవసాయరంగం ఎక్కువ మందిని కోల్పోతుంది. ఎందుకనగా వ్యవసాయం నుండి వచ్చే ఆదాయం కన్నా పట్టణ ప్రాంతంలో పనిచేయడం వలన వచ్చే ఆదాయం ఎక్కువ. కాబట్టి పట్టణ ప్రాంతాలలో పనిచేయుటకు గ్రామీణులు వలసలు పోతున్నారు.

AP Board 10th Class Social Solutions Chapter 8 ప్రజలు – వలసలు

10th Class Social Textbook Page No.109

ప్రశ్న 12.
పశ్చిమ మహారాష్ట్రలో చెరకు కొట్టేవాళ్ల కొరత ఎందుకుంది?
జవాబు:

  1. భారతదేశానికి స్వతంత్ర్యం వచ్చిన తరువాత పంచవర్ష ప్రణాళికల ద్వారా మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందినది.
  2. వ్యవసాయ రంగంలో సరియైన ప్రణాళికలు అమలు కాకపోవటం మూలంగా వ్యక్తుల కూలీల వలసలు ఎక్కువయ్యాయి.
  3. మహారాష్ట్రలో ప్రాంతీయ అసమానతలు అనేవి రాజకీయ ఆర్థిక, సాంఘిక పరమైనవి. రాజకీయంగా ఉన్నతిని సాధించిన
  4. పశ్చిమ మహారాష్ట్ర ప్రాంతంలో నీటి పారుదల వసతులు, పరపతి అవకాశాలు ఇతర వ్యవసాయానూకూల అంశాలు అభివృద్ధి చెందినవి. కాని ఇతర ప్రాంతాలు ఈ అంశాలలో చాలా వెనుకబడి ఉన్నాయి.
  5. కాబట్టి ప్రతి సం||రం కొన్ని వేల మంది వ్యక్తులు ఈ ప్రాంతానికి పని కొరకు వలస పోవుచున్నారు.

10th Class Social Textbook Page No.109

ప్రశ్న 13.
తల్లిదండ్రులతో పాటు వలస వచ్చిన వాళ్ల పరిస్థితి ఏమిటి ? వీళ్లను బడిలో చేర్పించవచ్చా? ఇటువంటి పిల్లలకు చదువు చెప్పటానికి ప్రభుత్వ చట్టాలలో ఏమైనా అంశాలు ఉన్నాయా?
జవాబు:
తల్లిదండ్రులు వలస వచ్చినపుడు సాధారణంగా బడి ఈడు గల వీరి పిల్లలను కూడా తమతో తీసికొని వస్తారు. అయితే తాత్కాలిక వలసల కారణంగా వీరు తమ పిల్లలను పాఠశాలల్లో చేర్పించక బాల కార్మికులుగా ఆదాయం వచ్చే మార్గాల వైపు మళ్ళిస్తారు. కానీ విద్యాహక్కు చట్టం 2009 ప్రకారం 14 సం||లోపు పిల్లలు తప్పనిసరిగా పాఠశాలలో ఉండాలి. వలస ప్రాంతాల్లోని విద్యార్థులు తమకు దగ్గరలోని పాఠశాలలో చేరాలి. లేదా ఆడపిల్లలైతే కస్తూరిబా గాంధీ విద్యాలయాల్లో చేరవచ్చు. వీటిలో విద్యాబోధనతో పాటు వసతి, భోజన సదుపాయాలుంటాయి. భాషా సమస్య ఏర్పడితే వీరి కోసం విద్యాశాఖాధికారులు తాత్కాలిక రెసిడెన్షియల్ బ్రిడ్జి కోర్సులను ఏర్పాటు చేస్తారు.

10th Class Social Textbook Page No.109

ప్రశ్న 14.
చెరకు నరికే వాళ్లకు ఆ పనిలో ఆరు నెలలు మాత్రమే ఎందుకు ఉపాధి లభిస్తుంది ? మిగిలిన ఆరునెలల్లో వాళ్లు ఏ పనులు చేస్తూ ఉంటారు?
జవాబు:
చెరకు సంవత్సరకాల పంట. మహారాష్ట్రలో చెరుకు విస్తారంగా పండటం వలన చెరుకు నరికే కాలం సుమారుగా ఆరు నెలలు మాత్రమే ఉంటుంది. పంచదార మిల్లులు, బెల్లం క్రషర్లు ఈ సీజన్లోనే పనిచేస్తాయి. అందుకే వలస కూలీలకు ఈ ప్రాంతంలో 6 నెలలు మాత్రమే పని లభిస్తుంది. మిగతా ఆరు నెలలు వీరు తమ స్వగ్రామాలకు పోయి ఉపాధి పొందుతారు.

AP Board 10th Class Social Solutions Chapter 8 ప్రజలు – వలసలు

10th Class Social Textbook Page No.109

ప్రశ్న 15.
ఇటువంటి కూలీల జీవన పరిస్థితులను ఏ విధంగా మెరుగుపరచవచ్చు?
జవాబు:
ఆరు నెలలు మాత్రమే కూలీ లభించే చెరుకు వలస కూలీల జీవనస్థితి మెరుగుపరచడానికి ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, విద్యాశాఖవారు అనేక కార్యక్రమాలు అమలుచేయాలి. వీరు పనిచేసే చోట నివసించేందుకు గృహ సముదాయాలను ఏర్పాటు చేసి విద్యుత్, త్రాగునీటి సదుపాయాలు కల్పించాలి. వీరి పిల్లల కోసం పాఠశాలలను ఏర్పాటు చేయాలి. మిగతా 6 నెలలు వీరికి ఉపాధి పథకాలను అమలుచేయాలి. వైద్య సదుపాయాలను కల్పించాలి.

10th Class Social Textbook Page No.111

ప్రశ్న 16.
వలస వెళ్లిన వాళ్లకు ఆహారం, వైద్య కుటుంబ సంరక్షణ కార్యక్రమాలు అందటానికి ఏం చెయ్యాలి?
జవాబు:
వలస వెళిన వారు కొత ప్రాంతంలో, కొత వాతావరణంలో పనిచేయవలసి ఉంటుంది. మరోవైపు వృదులైన తల్లిదండ్రులు చదువుకొనే పిల్లలకు దూరంగా వీరు సంపాదనకోసం, జీవన భృతి కోసం వలస వచ్చినవారు. వీరికి యజమానులు, గుత్తేదారులు కొన్ని మౌలిక సదుపాయాలను కల్పించాలి. ఉదయం, మధ్యాహ్నం పనిచేసే చోటనే పౌష్టికాహారం కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీరి నివాసాల సమీపంలో వైద్య సదుపాయం కల్పించాలి. పని గంటలు నిర్ణయం వారంలో కనీసం ఒక రోజు సెలవు, వైద్య ఖర్చులు యజమానులే భరించడం, వీరి పిల్లలకు పాఠశాల ఏర్పాటు వంటి చర్యలు తీసుకోవాలి.

10th Class Social Textbook Page No.102

ప్రశ్న 17.
నంద్యాల పట్టణంతో కర్నూలు జిల్లాను చూపించే పటం గీయండి. ఈ ఉదాహరణలలో పేర్కొన్న గ్రామాలను కలుపుతూ బాణం గుర్తులు గీయండి.
జవాబు:
AP Board 10th Class Social Solutions Chapter 8 ప్రజలు – వలసలు 8

10th Class Social Textbook Page No.103

ప్రశ్న 18.
క్రింది పట్టికను పరిశీలించండి. భారతదేశంలో వలస (2001 జనాభా లెక్కలు)
AP Board 10th Class Social Solutions Chapter 8 ప్రజలు – వలసలు 9-1
జవాబు:
AP Board 10th Class Social Solutions Chapter 8 ప్రజలు – వలసలు 10

10th Class Social Textbook Page No.109

ప్రశ్న 19.
పశ్చిమ మహారాష్ట్రలోని ఏడు జిల్లాలయిన నాసిక్, అహ్మద్ నగర్, పూనా, సతారా, సాంగ్లి, కొల్హాపూర్, షోలాపూర్లు “పంచదార పట్టి”గా పిలవబడతాయి. ఈ పట్టీ ఉత్తరాన సూరత్ (గుజరాత్)లోకి, దక్షిణాన బెల్గాం (కర్నాటక)లోకి విస్తరిస్తుంది. వర్షాధార మెట్ట భూములున్న మరట్వాడాలోని అయిదు జిల్లాలయిన బీడ్, జల్గావ్, అహ్మద్ నగర్, నాసిక్, జల్నాలు చెరకు నరకటానికి సంవత్సరంలో ఆరు నెలలపాటు వలస కార్మికులను పంపిస్తాయి.
ఒక పటంలో వలస మొదలయిన జిల్లాలు, వలస చేరుకునే జిల్లాలను చూపిస్తూ బాణం గుర్తులు గీయండి.
జవాబు:
AP Board 10th Class Social Solutions Chapter 8 ప్రజలు – వలసలు 11
కార్మికుల వలస ప్రాంతాలు
1) బీడ్
2) జల్గావ్
3) అహ్మద్నగర్
4) నాసిక్
5) జల్నా

కార్మికులు వలస వెళ్లిన ప్రాంతాలు
1) నాసిక్
2) అహ్మద్ నగర్
3) పూనా
4) సతారా
5) సాంగ్లి
6) కొల్హాపూర్
7) షోలాపూర్

10th Class Social Textbook Page No.110

ప్రశ్న 20.
మీ ప్రాంతంలో కాలానుగుణ వలస వెళ్లే వాళ్ల పరిస్థితిని వివరించండి.
జవాబు:
సాధారణంగా మా ప్రాంతంలో వ్యవసాయ పనులు లేని కాలంలో బహుళ పంటలు వేసే ప్రాంతాలకు లేదా పట్టణాలకు వలసలు పోతుంటారు. మా ప్రాంతంలోని కొందరు గుత్తేదార్లు వలస వెళ్ల వలసిన ప్రాంతంలోని పెద్ద రైతులు, గుత్తేదార్లుతో ముందుగా ఒప్పందం కుదుర్చుకుంటారు. గుత్తేదారులు చెప్పిన నిబంధనలు నచ్చితే వారితో పాటు వలసలు పోతారు. సాధారణంగా వీరు వృద్ధులైన తల్లిదండ్రుల వద్ద చదువుకుంటున్న తమ పిల్లలను వదిలి వెళతారు. గుత్తేదారు నుండి తీసుకున్న ముందస్తు సొమ్మును కొంత తల్లిదండ్రులకు ఇస్తారు. ప్రధానమైన పండుగలు, గ్రామంలో బంధువుల వివాహాలు వంటి శుభకార్యాలకు వీరు వచ్చి పోతుంటారు. మా ప్రాంతంలో వ్యవసాయ పనులు ప్రారంభం కాగానే తిరిగి వీరు మా గ్రామానికి వస్తారు.

10th Class Social Textbook Page No.111

ప్రశ్న 21.
కింది చిత్రాలలో చూపిన విధంగా వలస వ్యక్తులు రాకుండా జాతీయ సరిహద్దులను కాపాడుతుంటారు. ఇక్కడ కొన్ని ఉదాహరణలు చూద్దాం :
1) మెక్సికో సరిహద్దు వెంట అమెరికాలో,
2) ఉత్తర కొరియా సరిహద్దు వెంట దక్షిణ కొరియాలో
3) బంగ్లాదేశ్ సరిహద్దు వెంట భారతదేశంలో ఇలా దేశ సరిహద్దులను దాటేవాళ్ల గురించి మీ అభిప్రాయం ఏమిటి?
AP Board 10th Class Social Solutions Chapter 8 ప్రజలు – వలసలు 12
జవాబు:
ఈ చిత్రాలలో మెక్సికో – అమెరికా, ఉత్తర కొరియా – దక్షిణ కొరియా, బంగ్లాదేశ్ – భారతదేశం సరిహద్దులు చూపబడ్డాయి. అంతర్జాతీయ రేఖ వెంబడి ఇరు దేశాల మధ్య కంచె వేయడం, ఇరు దేశాల సైనికులు వారి సరిహదులలో నిరంతరం పహారా కాయడం జరుగుతుంటుంది. అయితే అనేక కారణాల వలన విభిన్న రకాల వ్యక్తులు సరిహద్దులు దాటి ప్రక్క దేశాలు వెళ్ళడానికి ప్రయత్నిస్తుంటారు. వీరిలో కొందరు ఆయా దేశాల ప్రేరణతో శత్రు దేశాలలో హింసాకాండ నిర్వహించడానికి సరిహద్దులు దాటే ఉగ్రవాదులు. వీరిని స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిస్టులంటాం.

మెక్సికో కంటే అమెరికా ఉపాధి, సదుపాయాలు పరంగా ఆకర్షణీయమైన దేశం. అందుకనే కొందరు దొడ్డి దారిలో ఆ దేశంలో ప్రవేశిస్తుంటారు. దక్షిణ, ఉత్తర కొరియాలు భిన్న సైద్ధాంతికతలను కలిగిన ప్రభుత్వాలు. ఒకటి కమ్యూనిస్టు అయితే, మరొకటి కేపటలిస్ట్ ఆయా దేశాలతో సిద్ధాంతాలు నచ్చనివారు, గూఢచర్య నిమిత్తం కొందరు ఒక దేశం నుండి మరో దేశానికి దొంగతనంగా సరిహద్దులు దాటుతుంటారు.

బంగ్లాదేశ్ లో సుదీర్ఘకాలం నియంతృత్వ పాలన సాగుతుండటంతో, ప్రజలు దుర్భర జీవనం సాగిస్తుండటంతో ప్రజాస్వామ్య దేశమైన భారతదేశానికి సరిహద్దులు దాటి వస్తుంటారు. పశ్చిమ బెంగాల్, అస్సాం వంటి రాష్ట్రాలలో బంగ్లా వలస జీవుల సమస్య అధికంగా ఉంది.

ఈ రకంగా అనధికారంగా సరిహద్దులు దాటి వెళ్ళటం చట్టరీత్యా నేరం. మరియు వీరు చేరిన దేశానికి సమస్యగా మారుతున్నారు.

AP Board 10th Class Social Solutions Chapter 8 ప్రజలు – వలసలు

10th Class Social Textbook Page No.112

ప్రశ్న 22.
పై పేరాలలో పేర్కొన్న భారతదేశం నుంచి ఇతర దేశాలకు వెళుతున్న వలసలను చూపిస్తూ ప్రపంచ పటంలో బాణం గుర్తులు గీయండి.
జవాబు:
AP Board 10th Class Social Solutions Chapter 8 ప్రజలు – వలసలు 13

AP Board 10th Class Social Solutions Chapter 7 ప్రజలు – నివాస ప్రాంతాలు

SCERT AP 10th Class Social Study Material Pdf 7th Lesson ప్రజలు – నివాస ప్రాంతాలు Textbook Questions and Answers.

AP State Syllabus 10th Class Social Solutions 7th Lesson ప్రజలు – నివాస ప్రాంతాలు

10th Class Social Studies 7th Lesson ప్రజలు – నివాస ప్రాంతాలు Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
నివాసప్రాంతం అంటే ఏమిటి? (AS1)
జవాబు:
ఒక ప్రదేశంలో మన నివాస స్థలాన్ని, మన జీవితాలను ఏర్పరచుకున్న పద్దతినే నివాసప్రాంతం అంటాం. ఇది మనం నివసించే, పనిచేసే భౌగోళిక ప్రదేశం. నివాస ప్రాంతంలో విద్య, మతపర, వాణిజ్యం వంటి విభిన్న కార్యకలాపాలు ఉంటాయి.

ప్రశ్న 2.
స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవటంతో మానవ జీవనశైలి ఎలా మారింది? (AS1)
(లేదా)
స్థిర జీవనం వల్ల మానవ జీవనశైలిలో వచ్చిన మార్పులను వివరించండి.
జవాబు:
స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవటంతో మానవ జీవనశైలిలో అనేక మార్పులు వచ్చాయి. ఆహారం సంపాదించుకోడానికి వాళ్లు చాలాదూరం తిరగాల్సిన పని తప్పింది. ఇప్పుడు ఎక్కువ కాలం ఉండడానికి వీలు కావడంతో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. వీరు ఆహార ఉత్పత్తికి, వ్యవసాయానికి పూనుకున్నారు. ప్రకృతి రీతులను బాగా అర్థం చేసుకోగలిగారు. ఆకాశంలో గ్రహాల కదలికలు వంటివి గమనించడానికి వీరికి తీరిక దొరికింది. జనాభా కూడా పెరిగింది. రవాణా సౌకర్యాలు విస్తరించాయి.

AP Board 10th Class Social Solutions Chapter 7 ప్రజలు – నివాస ప్రాంతాలు

ప్రశ్న 3.
ప్రదేశం, పరిస్థితి అంశాలను నిర్వచించండి. మీరు ఉంటున్న ప్రాంతం నుంచి ఒక్కొక్క ఉదాహరణ ఇవ్వండి. (AS1)
జవాబు:
ప్రదేశం ఒక ప్రాంత లక్షణాలను తెలియజేస్తుంది. మెట్టపల్లాలు, సముద్రానికి ఎంత ఎత్తులో ఉందో, నీటి వనరులు, నేల రకాలు, భద్రత, ప్రకృతి శక్తుల నుండి రక్షణ వంటివి ప్రదేశం కిందకి వస్తాయి. విశాఖపట్టణాన్ని ఉదాహరణగా తీసుకుంటే ఇది బంగాళాఖాతం తీరంలో ఉంది. సహజ ఓడరేవు, విమానాశ్రయం, రైల్వేస్టేషన్, బస్ స్టేషన్ వంటి అన్ని సదుపాయాలు ఉన్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో ఉన్నత విద్య, వైద్య సదుపాయాలున్నాయి. పరిస్థితి : ప్రాంతాలు ఒంటరిగా ఉండవు. ఏదో ఒక విధంగా ఇతర ప్రాంతాలతో సంబంధం ఉంటుంది. పరిస్థితి ఇతర ప్రాంతాలతో గల సంబంధాలను తెలియజేస్తుంది.

విశాఖపట్నం నుండి అన్ని ప్రాంతాలకు బస్సు, రైలు, విమాన, నౌకా సదుపాయాలున్నాయి.

ప్రశ్న 4.
వివిధ ప్రాంతాలను భారతదేశ జనాభా గణన విభాగం ఎలా నిర్వచిస్తోంది ? పరిమాణం, ఇతర అంశాల రీత్యా వాటిని ఎలా వ్యవస్థీకరిస్తోంది? (AS1)
జవాబు:
భారత జనాభా గణన విభాగం కొన్ని ప్రామాణికాల ఆధారంగా నివాసప్రాంతాలను వర్గీకరిస్తుంది.

నివాస ప్రాంత రకంఉపయోగించిన ప్రామాణికాలుఉదాహరణలు
మహానగరాలుకోటి జనాభాకి మించి ఉన్న నగరాలు* ముంబై మహానగర ప్రాంతం (1.84 కోట్లు)
* ఢిల్లీ మహానగరం (1.63 కోట్లు)
* కోల్‌కతా మహానగరం (1.41 కోట్లు)
మెట్రోపాలిటన్ నగరాలు/పదిలక్షలు దాటిన నగరాలుపది లక్షలు – కోటి మధ్య జనాభా ఉన్న నగరాలు* చెన్నై (86 లక్షలు) నగరాలు/పదిలక్షలు .
* హైదరాబాదు (78 లక్షలు) దాటిన నగరాలు
* అహ్మదాబాదు (62 లక్షలు)
క్లాసు 1 నగరాలుఒక లక్ష – పది లక్షల మధ్య పట్టణ ప్రాంతాలు* విశాఖపట్టణం (2.03 మిలియన్లు) ఉన్న
* తిరుపతి (0.46 మిలియన్లు)
* వరంగల్ (0.76 మిలియన్లు)
పట్టణాలు5000 నుంచి ఒక లక్ష మధ్య గల* ప్రొద్దుటూరు (1,50,309)
* తెనాలి (1,53,756)
* సిద్దిపేట (61,809)
రెవెన్యూ గ్రామాలునిర్దిష్ట సరిహద్దులు ఉన్న గ్రామం* పెదకాకాని (18,947)
* కొల్లూరు (16,025)
* బండారుపల్లి (4,863)
ఆవాస ప్రాంతాలురెవెన్యూ గ్రామం (హామ్లెట్) లోపల కొన్ని ఇళ్ల సముదాయం* గోసాలపురం తండా (1570)

AP Board 10th Class Social Solutions Chapter 7 ప్రజలు – నివాస ప్రాంతాలు

ప్రశ్న 5.
విమానాశ్రయ నగరం అంటే ఏమిటి ? దాని నిర్మాణ స్వరూపం ఏమిటి? (AS1)
జవాబు:
భారతదేశంతో సహా అనేక దేశాలలో కొత్త రకపు నివాస ప్రాంతాలు ఏర్పడుతున్నాయి. ఈ నివాస ప్రాంతాలు పెద్ద పెద్ద విమానాశ్రయాల చుట్టూ ఏర్పడుతున్నాయి. అందుకనే వీటిని విమానాశ్రయ నగరాలు (లేదా ఏరోట్రిపోలిస్) అంటున్నారు.

విమానాశ్రయ నగరాలలో విమానాశ్రయమే ఒక నగరంగా పనిచేస్తుంది. అనేక సదుపాయాలు (హోటళ్లు, దుకాణాలు, వినోదం, ఆహారం, వ్యాపార సమావేశ సదుపాయాల వంటివి) అక్కడ కల్పిస్తారు. ఇతర ప్రాంతాల నుంచి ప్రజలు విమానాలలో వచ్చి తమకు అవసరమైన వాళ్లతో అక్కడే వ్యవహారాలు పూర్తి చేసుకుని తిరిగి విమానాల్లో వెళ్లిపోతారు. ట్రాఫిక్ వంటి సమస్యలు ఏమీ లేకుండా నగరంలోని సదుపాయాలన్నింటినీ పొందుతారు.
AP Board 10th Class Social Solutions Chapter 7 ప్రజలు – నివాస ప్రాంతాలు 1

10th Class Social Studies 7th Lesson ప్రజలు – నివాస ప్రాంతాలు InText Questions and Answers

10th Class Social Textbook Page No.98

ప్రశ్న 1.
విమానాశ్రయ నగర కేంద్రం ఏమిటి?
జవాబు:
పెద్ద పెద్ద విమానాశ్రయాల చుట్టూ కొత్తగా ఏర్పడే నగరాన్ని విమానాశ్రయ నగర కేంద్రం అంటారు.

10th Class Social Textbook Page No.98

ప్రశ్న 2.
విమానాశ్రయ నగర కేంద్రంలో, లేదా దాని దగ్గర ఉండే రెండు సదుపాయాలను పేర్కొనండి.
జవాబు:
విమానాశ్రయ నగర కేంద్రంలో ఉండే సదుపాయాలు :

  1. హోటళ్లు
  2. వ్యాపార సమావేశ సదుపాయాలు

10th Class Social Textbook Page No.100

ప్రశ్న 3.
మొహుదా గ్రామ ప్రజలు ఏ విషయం పట్ల ఆందోళన చెందుతున్నారు?
జవాబు:
తమ గ్రామం వద్ద చెత్త శుద్ధి కార్మాగారాన్ని ఏర్పాటు చేయడం వల్ల మొహుదా గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు.

AP Board 10th Class Social Solutions Chapter 7 ప్రజలు – నివాస ప్రాంతాలు

10th Class Social Textbook Page No.100

ప్రశ్న 4.
చెత్త శుద్ధి కర్మాగారం వల్ల ఎంత మంది ప్రజలు, పశువులు ప్రభావితం కానున్నారు?
జవాబు:
మొహుదా గ్రామం వద్ద చెత్త శుద్ధి కర్మాగారాన్ని ఏర్పాటుచేస్తే ఆ ప్రాంతంలోని 30,000 మంది ప్రజలే కాకుండా 10,000 పశువులు కూడా ప్రభావితం అవుతాయి.

10th Class Social Textbook Page No.100

ప్రశ్న 5.
సర్వే నివేదిక ప్రకారం బరంపురం ఎంత ఘన వ్యర్థ పదార్థాలను ఉత్పత్తి చేసింది?
జవాబు:
2009 లో నిర్వహించిన ఒక సర్వే ప్రకారం బరంపురంలో ప్రతిరోజు 150 టన్నుల ఘన వ్యర్థపదార్థాలు ఉత్పన్నం అవుతాయి.

10th Class Social Textbook Page No.100

ప్రశ్న 6.
బరంపురం నగరపాలక సంస్థ అధికారులు “గత మూడు సంవత్సరాలలో ఉత్పత్తి అవుతున్న చెత్త పెరిగి ఉండవచ్చని” అంటున్నారు. వీళ్ల అభిప్రాయంతో మీరు ఏకీభవిస్తున్నారా, లేదా ? మీ కారణాలు పేర్కొనండి.
జవాబు:
అవును, బరంపురం నగరపాలక సంస్థ అధికారులతో ఏకీభవిస్తున్నాను. నగర ప్రజల జీవనశైలి మారుతూ ఉండటంతో ఘన వ్యర్థ పదార్థాలు కూడా పెరగవచ్చు.

AP Board 10th Class Social Solutions Chapter 7 ప్రజలు – నివాస ప్రాంతాలు

10th Class Social Textbook Page No.94

ప్రశ్న 7.
నిలువు వరుస ‘అ’లో ఒక ప్రదేశం యొక్క అంశాలు ఉన్నాయి. ‘ఆ’ నిలువు వరసలో అది ప్రదేశానికి సంబంధించిన అంశమో, పరిస్థితికి సంబంధించిన అంశమో రాయండి. అది పరిస్థితికి సంబంధించిన అంశమైతే ‘ఇ’ నిలువు వరసలో దీని ప్రభావం ఎలా ఉంటుందో రాయండి.

1. బంకమట్టి నేల
2. వర్షపాతం చాలా ఎక్కువ.
3. దాని ప్రధానమైన మార్కెట్టు తీరానికి 45 కిలోమీటర్ల దూరంలో ఉంది.
4. నేల చాలా తక్కువ వాలు కలిగి ఉంటుంది.
5. అది ప్రధాన రైలు మార్గంలో ఉంది.
6. ఆసుపత్రి లేదు.
7. వ్యవసాయ భూములు ఎక్కువ.
8. మొబైల్ టవర్లతో అన్ని ప్రదేశాలతో
సంబంధం కలిగి ఉంది.
9. నది నుండి పది నిమిషాలు నడవాలి.
10. ఒక వడ్ల మిల్లు ఉంది.

జవాబు:

1. బంకమట్టి నేలప్రదేశంఇటుక, కుండల తయారీకి అనుకూలం.
2. వర్షపాతం చాలా ఎక్కువ.ప్రదేశంప్రదేశం పంటలు పండవు, నీటి సమస్య ఉండును.
3. దాని ప్రధానమైన మార్కెట్టు తీరానికి 45 కిలోమీటర్ల దూరంలో ఉంది.పరిస్థితి
4. నేల చాలా తక్కువ వాలు కలిగి ఉంటుంది.ప్రదేశంపంటలకు అనుకూలం. ఇండ్ల నిర్మాణానికి అనుకూలం.
5. అది ప్రధాన రైలు మార్గంలో ఉంది.పరిస్థితిఅనుకూలమైనది.
6. ఆసుపత్రి లేదు.ప్రదేశంఅనుకూలం కాదు.
7. వ్యవసాయ భూములు ఎక్కువ.ప్రదేశంజనాభా ఎక్కువగా ఉంటారు.
8. మొబైల్ టవర్లతో అన్ని ప్రదేశాలతో
సంబంధం కలిగి ఉంది.
పరిస్థితిఅనుకూలమైనది.
9. నది నుండి పది నిమిషాలు నడవాలి.పరిస్థితిఅనుకూలమైనది.
10. ఒక వడ్ల మిల్లు ఉంది.ప్రదేశంఅనుకూలమైనది.

10th Class Social Textbook Page No.94

క్షేత్ర పరిశీలన :

ప్రశ్న 8.
మీరు గీసిన పటంలో గుర్తించిన ఉత్పత్తి ప్రదేశాలలో (వ్యవసాయ క్షేత్రాలు, కర్మాగారాలు, కార్యాలయాలు, దుకాణాలు, గనులు వంటివి) ఒకటి, రెండింటిని సందర్శించండి. వాళ్లకి కావలసిన ముడిసరుకులు/ఉత్పాదకాలు ఎక్కడి నుంచి వస్తాయో, ఉత్పత్తి చేసిన సరుకులు ఎక్కడ అమ్ముతారో తెలుసుకోండి. ఏ ముడిసరుకులు మీ నివాస ప్రాంతం నుంచి , వస్తాయి ? అదే విధంగా ఉత్పత్తి చేసిన సరుకులను మీ నివాస ప్రాంతంలోనే అమ్ముతున్నారో లేక ఇతర ప్రాంతాలకు పంపిస్తున్నారో (ఇతర ప్రాంతాలకు పంపిస్తున్నట్లయితే, ఎక్కడికి పంపిస్తున్నారో) తెలుసుకోండి. ఇక్కడ ఉత్పత్తి ఎందుకు చేపట్టారు?
1) ఈ ప్రాంతంలో ఉత్పత్తిని ప్రభావితం చేసిన ఆ ప్రదేశం అంశాలకు ఉదాహరణలు ఇవ్వండి.
జవాబు:
ఇచ్చట వ్యవసాయ క్షేత్రాలు సారవంతమైనవి. నదీ ప్రవాహంతో వచ్చి ఒండ్రుమట్టితో చక్కని వరి, పెసర, జనుము, నువ్వులు పండుతాయి. నదీ తీర ప్రాంతం కావడంతో కాలువల ద్వారా సాగునీరు అందుతుంది. నదిలో నీరు లేనపుడు తక్కువ లోతులోనే బోరుబావులకు నీరు లభ్యమౌతుంది.

2) ఈ ప్రాంతంలో ఉత్పత్తిని ప్రభావితం చేసిన పరిస్థితి అంశాలకు ఉదాహరణలు ఇవ్వండి.
జవాబు:
గ్రామంలో వ్యవసాయేతర వృత్తులవారు, సమీప పట్టణ వ్యాపారులు వచ్చి పంటలను కొనుగోలు చేస్తారు. సమీప పట్టణానికి రహదారి సౌకర్యం ఉండటంతో రైతులే స్వయంగా పంటలను తీసుకొనిపోయి అమ్ముకొనే సదుపాయం కలదు. వేసవికాలంలో పండే కూరగాయలకు మార్కెట్ సౌకర్యం కలదు.

3) ఉత్పత్తిని ఆ ప్రాంత చరిత్ర ఎలా ప్రభావితం చేసింది?
జవాబు:
వ్యవసాయ క్షేత్రాలు, మార్కెట్ ఒకే జిల్లాలోనివి కావడం.

AP Board 10th Class Social Solutions Chapter 7 ప్రజలు – నివాస ప్రాంతాలు

10th Class Social Textbook Page No.95

ప్రశ్న 9.
మీ ప్రాంతాన్ని పరిగణనలోకి తీసుకోండి…….

ఒక ప్రాంతం ఎంత పెద్దగా ఉంటే అక్కడ అన్ని ఎక్కువ సేవలు లభ్యం అవుతాయి. ఉదాహరణకు విద్య సదుపాయాలను తీసుకోండి. దీని ద్వారా పెద్ద ప్రదేశాలలో (అంటే పై స్థాయిలో ఉన్న ప్రాంతాలలో) ప్రత్యేక సేవలు విరివిగా లభ్యమవడాన్ని గమనించవచ్చు.
1) మీ ప్రాంతంలో ఏ స్థాయి వరకు విద్యా సదుపాయం ఉంది ? ఉదా : ప్రాథమిక, ఉన్నత, ఇంటర్మీడియట్, కళాశాల విద్య (డిగ్రీ, పీజి).
జవాబు:
ఉన్నత పాఠశాల విద్య

2) మీ ఊరిలో ఉన్న సదుపాయానికి మించి మీరు చదువు కొనసాగించదలుచుకుంటే మీరు ఎక్కడికి వెళ్లవలసి వస్తుంది?
జవాబు:
సమీప పట్టణానికి,

3) మీ ప్రాంతంలో ఎటువంటి వృత్తి విద్యా కోర్సులు ఉన్నాయి? ఉదా : ఇంజినీరింగ్, మెడిసిన్, కామర్స్, సాంకేతిక డిప్లామా వంటివి.
జవాబు:
మా గ్రామానికి 10 కి.మీ. పరిధిలో ఇంజనీరింగ్, మెడిసిన్, పాలిటెక్నిక్, కామర్స్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.

4) మీకు వేరే వృత్తి విద్యలో ఆసక్తి ఉంటే మీరు ఎక్కడికి వెళ్లవలసి ఉంటుంది?
జవాబు:
సమీప పట్టణానికి.

10th Class Social Textbook Page No.98

ప్రశ్న 10.
ఈ అధ్యాయం కోసం మీరు అధ్యయనం చేసిన ప్రదేశానికి దగ్గరలో విమానాశ్రయ నగరం ఏర్పడిందని ఊహించుకోండి. అప్పుడు ఆ ప్రాంత స్థలంలో వచ్చే మూడు మార్పులను పేర్కొనండి. అదే విధంగా ఆ ప్రాంత పరిస్థితులలో వచ్చే మూడు మార్పులను పేర్కొనండి.
జవాబు:
విమానాశ్రయ నగరం ఏర్పడితే వచ్చే మార్పులు :
ఎ) ఆ ప్రాంత స్థలంలో :

  1. గదులు అద్దెకిచ్చే హోటళ్లు, టాక్సీలు వెలుస్తాయి.
  2. వ్యాపారవేత్తలు, అధికారులు సమావేశాలు నిర్వహించేందుకు సమావేశ మందిరాలు నిర్మితమవుతాయి.
  3. అంతర్జాలం (Internet) వంటి సదుపాయాలతో కేస్లు కూడా వెలుస్తాయి.

బి) ఆ ప్రాంత పరిస్థితిలో మార్పులు :

  1. సమీప నగరానికి చక్కని రహదారులు వేస్తారు.
  2. రవాణా సౌకర్యం సమకూర్చుతారు.
  3. కమ్యూనికేషన్ వ్యవస్థ మెరుగుపడుతుంది.

AP Board 10th Class Social Solutions Chapter 7 ప్రజలు – నివాస ప్రాంతాలు

10th Class Social Textbook Page No.100

ప్రశ్న 11.
చెత్త శుద్ధి కర్మాగారాన్ని నెలకొల్పటానికి గుర్తించిన ఇతర ప్రదేశం ఏది ? దానిని ఎందుకు ఉపయోగించుకోలేదు?
జవాబు:
అంతకు ముందు ఈ చెత్త శుద్ధి కర్మాగారాన్ని నగర శివార్లలోని చందానియా కొండపైన ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. అయితే ఈ ప్రాంతం అటవీ భూమి కిందకి వస్తుందని గుర్తించారు. దీనిని ముందుగా రెవెన్యూశాఖకు, ఆ తరువాత బరంపురం నగరపాలక సంస్థకు బదిలీ చేయవలసి రావటంతో ఈ ప్రతిపాదన విరమించారు.

10th Class Social Textbook Page No.88

క్షేత్ర పని

ప్రశ్న 12.
మీ ఊరు, పట్టణం లేదా నగరాన్ని పరిశీలించండి. ఇంతకుముందు నేర్చుకున్న పద్ధతుల ఆధారంగా ఎంపిక చేసిన ఒక చిన్న ప్రాంతం పటం గీయండి. మీ పటంలో ఈ కింద సూచించినవి ఉండాలి.
రోడ్లు, ఇళ్లు, బజారు, దుకాణాలు, వాగులు, మురికి కాలవలు, ఆసుపత్రి, పాఠశాల, బస్టాండ్, రైల్వే స్టేషన్ వంటి కొన్ని ప్రదేశాలు.
AP Board 10th Class Social Solutions Chapter 7 ప్రజలు – నివాస ప్రాంతాలు 2

1) ప్రజా సౌకర్య ప్రదేశాలు అధికశాతం ప్రజలకు వీలుగా ఉండే ప్రదేశంలో ఉన్నాయా?
జవాబు:
ప్రజా సౌకర్యాలు అధికశాతం ప్రజలకు వీలుగా ఉండే ప్రదేశంలో లేవు. గ్రామాలు, పట్టణాలు విస్తరించడంతో ప్రభుత్వ భూమి లభ్యమైన చోట ముఖ్యంగా గ్రామం చివరిలో లేదా ప్రారంభంలో వీటిని నిర్మిస్తున్నారు. ప్రధానంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆసుపత్రులు, విద్యాలయాలు ప్రజలు చేరుకోలేనంత దూరంలో నిర్మిస్తున్నారు.

2) స్థానిక బజారులను కనుగొనడంలో ఏమైనా పద్దతి ఉందా?
జవాబు:
స్థానిక బజారులను గుర్తించడంలో ప్రత్యేక పద్ధతులు ఏమీ లేవు. ఇవి స్థానికులకు, పరిసర గ్రామస్థులకు సుపరిచయమైనవి అయినందున వీటి ఉనికిని చాటే నామ ఫలకాలు (Name Boards) లేవు. మార్కెట్ల స్థలంలో మాత్రం వాటి పేర్లుంటాయి.
ఉదా : రైతు బజారు, పొట్టి శ్రీరాములు మార్కెట్, పూర్ణా మార్కెట్.

3) ఇళ్లు గుంపులుగా ఉన్నాయా? వాటికి, ప్రధాన రహదారులకు మధ్య అనుసంధానం ఉందా?
జవాబు:
ఇళ్లు గుంపులుగా కాక వరుసలలోనే ఉన్నాయి. వీటికి, ప్రధాన రహదారులకు మధ్య అనుసంధానం కలదు.

4) ఎంపిక చేసిన ప్రాంతంలోని ప్రజలతో మాట్లాడి గత 20 సంవత్సరాలలో చోటుచేసుకున్న మార్పులు, వాటికి గల కారణాలు తెలుసుకోండి.
జవాబు:
గత 20 సంవత్సరాలలో మార్పులు – కారణాలు :
గత 20 సంవత్సరాలలో గ్రామాలు, పట్టణాలు బాగా విస్తరించాయి. గ్రామ, పట్టణ శివారులలో కాలనీలు, వాంబే గృహసముదాయాలు, ఇందిరమ్మ ఇండ్ల కాలనీలు, హౌసింగ్ బోర్డు కాలనీలు విపరీతంగా పెరిగాయి. పట్టణ ప్రాంతాలలో సమీప గ్రామాలు కలసిపోయేంతగా విస్తరించాయి. పంచాయతీలకు నేరుగా కేంద్రప్రభుత్వ నిధులు రావడంతో బురదమయమైన రహదారులన్నీ సిమెంటు రోడ్లుగా మారాయి. గ్రామీణ ప్రాంతంలో కూడా కాలువల నిర్మాణం చేయడంతో రోడ్లపై నీరు నిలువ ఉండకపోవటం వల్ల శుభ్రంగా కనిపిస్తున్నాయి. అనేక గ్రామాలను పట్టణాలతో కలుపుతూ తారు రోడ్లు నిర్మించడంతో గ్రామాలు పట్టణాలతో అనుసంధానించబడ్డాయి.

5) ఉండవలసిన సదుపాయాలు ఏవి లేవు?
జవాబు:
గ్రామీణ ప్రాంతాలలో రక్షిత మంచినీటి పథకాలు నెలకొల్పినా, పలు గ్రామాల్లో అవి అనేక కారణాలతో పనిచేయడం లేదు. వీధి కొళాయిలనేర్పాటు చేసి ఇంటింటికి శుభ్రమైన తాగునీటి సదుపాయం కల్పించాలి.

పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలు, అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ కార్యాలయాల వద్ద మరుగుదొడ్లు నిర్మించి వాటిని ఉపయోగించే స్థితిలో ఉంచాలి. గ్రామీణ ప్రాంతంలో ఇండ్లలో ప్రభుత్వ సహాయంతో నిర్మించిన మరుగుదొడ్లు అత్యధిక నిరుపయోగంగా ఉన్నందున బహిరంగ మలవిసర్జన కొనసాగుతుంది.

నిర్మించిన రహదారులు సకాలంలో మరమ్మతులు లేక పాడైపోతున్నాయి. ఆరోగ్య కేంద్రాలు, ఆసుపత్రులలో డాక్టర్ల సంఖ్య పెంచాలి. మందులు అందుబాటులోకి తేవాలి.

AP Board 10th Class Social Solutions Chapter 7 ప్రజలు – నివాస ప్రాంతాలు

10th Class Social Textbook Page No.89

ప్రశ్న 13.
పోలికలు, తేడాలు పేర్కొనండి. పై సమాచారం ఆధారంగా సంచార, స్థిర జీవన శైలులలోని పోలికలు, తేడాలు పేర్కొనండి. మీరు ఎన్ని అంశాలు గుర్తించగలిగారో చూడండి. (ఇక్కడ పట్టిక సరిపోకపోతే మరొక పట్టిక తయారుచేయండి).
AP Board 10th Class Social Solutions Chapter 7 ప్రజలు – నివాస ప్రాంతాలు 3
జవాబు:

సంచార జీవన విధానంస్థిర జీవన విధానం
1) తొలి మానవులు వేట, సేకరణ ద్వారా ఆహారాన్ని సమకూర్చుకొనేవారు.1) వ్యవసాయం, పశుపోషణ ద్వారా ఆహారాన్ని సమకూర్చుకుంటున్నారు.
2) ఆహార సేకరణకు, వేటకు సంచార జీవనం సాగించేవారు.2) స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని జీవనం సాగిస్తున్నారు.
3) మొదట రాళ్లను ఆయుధాలుగా చేసుకొని వేటాడేవారు.3) వేట అవసరం తక్కువ. అవసరమైతే ఆధునిక ఆయుధాలు వాడుతున్నారు.
4) వారికి వ్యవసాయం తెలియదు.4) వ్యవసాయమే అధిక జనాభాకు జీవనాధారం.
5) గుహలలో, చెట్టు తొర్రలలో నివసించేవారు.5) ఇండ్లు నిర్మించుకొని వాటిల్లో నివసిస్తున్నారు.
6) జంతు చర్మాలను, చెట్ల బెరడులను ధరించేవారు.6) వస్త్రాలు ధరిస్తున్నారు.
7) కుటుంబ వ్యవస్థ లేదు.7) కుటుంబ వ్యవస్థీ ప్రధానమైనది.
8) మానవుడు ఎక్కువ సమయం ఆహార సేకరణ, వేటలో గడిపేవాడు.8) శాస్త్ర, సాంకేతిక అభివృద్ధి వైపు దృష్టి పెట్టే విశ్రాంతి లభించింది.
9) వీరు ఎటువంటి కళాత్మకమైన అంశాలను నేర్వలేదు.9) వీరు కళాత్మక దృష్టితో గృహాలు, దేవాలయాలు మొ||నవి నిర్మించారు.
10) వీరికి రాతరాయటం తెలియకపోయినా భాష నేర్చా రు.10) వీరు రాతని నేర్చారు. పన్ను విధానాలు వ్యాపారం మొ||నవి నేర్చారు.

10th Class Social Textbook Page No.92

ప్రశ్న 14.
మీరు నివసించే ప్రాంతాన్ని గత 10 సంవత్సరాల నుండి ఏ ఏ కారకాలు ప్రభావితం చేశాయో కనుక్కోండి.
జవాబు:

  1. జనాభా పెరగడంతో కుటుంబాల సంఖ్య, ఇండ్ల సంఖ్య పెరిగాయి.
  2. దీంతో గ్రామాలు, పట్టణాలు విస్తరించాయి.
  3. బీదవారు ప్రభుత్వ స్థలాలు, చెరువు గర్భాలు, నదీ తీరాలలో ఇండ్ల నిర్మాణం చేయడంతో అధిక వర్షాలు, వరదల సమయాల్లో ముంపునకు గురవుతున్నాయి.
  4. కాలనీలు విస్తరించడంతో మౌలిక సదుపాయాల కల్పనలో పాలకవర్గాలు విఫలమవుతున్నాయి.
  5. పాఠశాలలు, ఆసుపత్రులను గ్రామాలకు దూరంగా నిర్మిస్తున్నారు.
  6. బోరుబావులు, నందనూతులు పెరగడంతో భూగర్భజలాలు త్వరితంగా అంతరించిపోతున్నాయి.
  7. ప్లాస్టిక్ వాడకం విపరీతంగా పెరిగిపోయి, ఇవి భూమి పై పొరలను ఆక్రమించడం వల్ల నీరు భూమిలో ఇంకడం లేదు.
  8. ఉపాధి కోసం గ్రామాల నుండి పట్టణాలకు, బహుళ పంటలు పండే ప్రాంతాలకు వలసలు ఎక్కువైపోయాయి.

AP Board 10th Class Social Solutions Chapter 7 ప్రజలు – నివాస ప్రాంతాలు

10th Class Social Textbook Page No.93

ప్రశ్న 15.
క్రింది పట్టికను పరిశీలించండి.
విశాఖపట్టణం జనాభా

సంవత్సరంజనాభామార్పు శాతంలో
190140,892
191143,414+6.2%
192144,711+3.0%
193157,303+28.2%
194170,243+22.6%
19511,08,042+53.8%
19612,11,190+95.5%
19713,63,467+72.1%
19816,03,630+66.1%
19917,52,031+24.6%
200113,45,938+78.97%
201120,35,690+51.2%

విశాఖపట్టణ జనాభా మార్పు :
1) పైన ఇచ్చిన జనాభా వివరాలలో అన్ని దశకాల గణాంకాలు ఉన్నాయా ? ఒకవేళ లేకపోతే ఏ దశకం గణాంకాలు ఇక్కడ లేవు?
జవాబు:
విశాఖపట్టణం జనాభా వివరాలలో 1901 నుండి 2011 వరకు అన్ని దశాబ్దాల గణాంకాలు ఉన్నాయి.

2) ఏ దశకం నుంచి ఏ దశకానికి జనాభా పెరుగుదల (శాతంలో) అత్యధికంగా ఉంది?
జవాబు:
1951-1961 దశకంలో విశాఖపట్టణం జనాభా 95.5% అత్యధిక శాతం పెరిగింది.
(సూచన : 93వ పేజీలో పట్టిక 2 లో 1991 – 2001 మధ్య 123% పెరిగినట్లు తప్పుగా ముద్రించారు. వాస్తవంగా ఇది 78.97% మాత్రమే.)

3) ఏ దశకం నుంచి ఏ దశకానికి జనాభా పెరుగుదల (శాతంలో) అతి తక్కువగా ఉంది?
జవాబు:
1911-1921 దశకానికి జనాభా పెరుగుదల (3 శాతం) అతి తక్కువగా ఉంది.

4) 1901-2011 విశాఖపట్టణం జనాభాకి లైన్ గ్రాఫ్ తయారుచేయండి. జనాభా సంఖ్యలో ఏ మార్పులను మీరు పరిశీలించారు?
జవాబు:
AP Board 10th Class Social Solutions Chapter 7 ప్రజలు – నివాస ప్రాంతాలు 4
గ్రాఫ్ విశ్లేషణ : 1961 వరకు క్రమేపీ పెరుగుతున్న విశాఖపట్నం జనాభా 1991 వరకు పెరుగుదల శాతం తగ్గుతూ వచ్చింది. అయితే 1991-2001 మధ్యకాలంలో జనాభా పెరుగుదల శాతం పెరిగినా 2001-2011లో పెరుగుదల శాతం తగ్గింది. పెరుగుదల శాతాలను పక్కకు పెడితే గత దశాబ్దంలో జనాభా అత్యధికంగా 6.89, 752 మంది పెరిగారు. దీనికి ఇతర ప్రాంతాల నుండి వలసలు ఎక్కువ కావడమే ప్రధాన కారణం.

10th Class Social Textbook Page No.95

• అట్లాస్ పని :
ప్రశ్న 16.
మీ అట్లాస్ లో భారతదేశ పటాన్ని చూడండి. వివిధ ప్రదేశాలను వివిధ ఆకృతులు, పరిమాణాలు ఉన్న గుర్తులతో సూచించటాన్ని గమనించండి. ఉదా : దేశ రాజధాని, రాష్ట్ర రాజధాని, ఇతర నగరాలు మొదలైనవి. వివిధ సంకేతాలను ఉపయోగించి ఎన్ని స్థాయిలను చూపించారు ? చిన్న చిన్న గ్రామాలను అట్లాస్లో చూపించారా ? మీరు సొంతంగా ఒక పట్టిక తయారు చేసి ప్రదేశాలను స్థాయిని బట్టి పై నుంచి కిందికి (అవరోహణ) క్రమంలో పేర్కొనండి. ఇక్కడ ఒక పట్టిక ఉదాహరణగా ఇచ్చాం. అందులో రెండు ప్రదేశాలు ఉన్నాయి. ఇతర ప్రదేశాలు ఇచ్చి వివరాలను నింపండి.
AP Board 10th Class Social Solutions Chapter 7 ప్రజలు – నివాస ప్రాంతాలు 5
జవాబు:
AP Board 10th Class Social Solutions Chapter 7 ప్రజలు – నివాస ప్రాంతాలు 6

10th Class Social Textbook Page No.96

ప్రశ్న 17.
పాఠ్యపుస్తకం 97వ పేజీలో ఇవ్వబడిన పిరమిడ్ లోని కింది భాగం భారతదేశ జనాభా గణన ప్రకారం అతిచిన్న నివాసప్రాంతాలను సూచిస్తుంది. పైభాగం అతి పెద్ద నివాసప్రాంతాలను సూచిస్తుంది. క్రింది ఉన్న ఖాళీలను నింపండి.
1) ఒక ప్రత్యేక నివాసప్రాంత స్థాయికి ఇచ్చిన పేరు (రెండు ఉదాహరణలు ఉన్నాయి).
2) వివిధ నివాస ప్రాంతాలకు ఒక ఉదాహరణను ఆంధ్రప్రదేశ్ నుంచి పేర్కొనండి. (మహా నగరాలవి కాకుండా. ఎందుకు?)
AP Board 10th Class Social Solutions Chapter 7 ప్రజలు – నివాస ప్రాంతాలు 7

4) నివాస ప్రాంతాలను కేవలం జనాభా ఆధారంగానే వర్గీకరించాలా? ఆలోచించండి. ఇతర విధానాలు ఏమైనా ఉన్నాయా? మీ టీచరుతో చర్చించి అటువంటి వర్గీకరణకు ప్రామాణికాలను గుర్తించంది.
జవాబు:
1)
AP Board 10th Class Social Solutions Chapter 7 ప్రజలు – నివాస ప్రాంతాలు 8
2) ఆంధ్రప్రదేశ్ నుండి విజయవాడ ఒక నివాస ప్రాంతం. కారణం, ఆంధ్రప్రదేశ్ లో మహానగరము లేనందున.
3) నేను కలిసిపూడిలో నివసిస్తున్నాను. ఆకివీడు జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాను. కలిసిపూడి మా స్వగ్రామము. నాకు తెలిసిన వాటిలో ఆకివీడులోని జిల్లాపరిషత్ పాఠశాల మంచిది.
4) నివాస ప్రాంతాల వర్గీకరణ జనాభా ప్రాతిపదికన జరుగుతుంది. మరియు ఈ వర్గీకరణ సౌలభ్యాలు, చారిత్రక విషయాలపై ఆధారపడుతుంది.

10th Class Social Textbook Page No.98

ప్రశ్న 18.
ప్రపంచ పటంలో పక్కన ఉదాహరణగా ఇచ్చిన నగరాలను గుర్తించండి. విమానాశ్రయాలు, దేశాల పేర్లను కూడా పటంలో వేరు వేరుగా రాయండి. దీనివల్ల ఏవి దేశాలో, ఏవి నగరాలో, ఏవి విమానాశ్రయాలో గుర్తించటం తేలిక అవుతుంది.
జవాబు:

  1. బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం
  2. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఢిల్లీ)
  3. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (హైదరాబాదు)
  4. సువర్ణభూమి అంతర్జాతీయ విమానాశ్రయం (బ్యాంకాక్, థాయ్ లాండ్)
  5. దుబాయి అంతర్జాతీయ విమానాశ్రయం (దుబాయి, యుఎఇ)
  6. కైరో అంతర్జాతీయ విమానాశ్రయం (కైరో, ఈజిప్టు )
  7. లండన్ హీఛీ అంతర్జాతీయ విమానాశ్రయం (లండన్, యుకె)

AP Board 10th Class Social Solutions Chapter 7 ప్రజలు – నివాస ప్రాంతాలు 9

10th Class Social Textbook Page No.100

ప్రశ్న 19.
మీ అట్లాసు ఉపయోగించి బరంపురాన్ని గుర్తించండి.
జవాబు:
AP Board 10th Class Social Solutions Chapter 7 ప్రజలు – నివాస ప్రాంతాలు 10

AP Board 10th Class Social Solutions Chapter 6 ప్రజలు

SCERT AP 10th Class Social Study Material Pdf 6th Lesson ప్రజలు Textbook Questions and Answers.

AP State Syllabus 10th Class Social Solutions 6th Lesson ప్రజలు

10th Class Social Studies 6th Lesson ప్రజలు Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
తప్పు వాక్యాలను గుర్తించి వాటిని సరిచేయండి. (AS1)
అ) ప్రతి పది సంవత్సరాలకు జనాభా గణన చేపడతారు.
ఆ) జనాభాలోని పెద్దవాళ్లలో ఆడవాళ్ల సంఖ్యను లింగ నిష్పత్తి తెలియజేస్తుంది.
ఇ) వయస్సును బట్టి జనాభా విస్తరణను వయస్సు సమూహం తెలియజేస్తుంది.
ఈ) కొండ ప్రాంతాలలోని వాతావరణాన్ని ప్రజలు ఇష్టపడతారు కాబట్టి అక్కడ జనాభా సాంద్రత ఎక్కువ.
జవాబు:
అ) ఒప్పు
ఆ) జనాభాలోని ఆడవాళ్ల సంఖ్యను లింగ నిష్పత్తి తెలియజేస్తుంది. ఇ) ఒప్పు
ఈ) కొండ ప్రాంతాలలోని వాతావరణాన్ని ప్రజలు ఇష్టపడరు కాబట్టి అక్కడ జనసాంద్రత తక్కువ.

ప్రశ్న 2.
దిగువ పట్టిక ఆధారంగా కింద ఉన్న ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వండి. (AS3)
AP Board 10th Class Social Solutions Chapter 6 ప్రజలు
ఎ) ప్రపంచ జనాభా మొదటిసారి రెట్టింపు కావటానికి సుమారుగా ఎన్ని శతాబ్దాలు పట్టిందో తెలుసుకోండి.
జవాబు:
ప్రపంచ జనాభా రెట్టింపు కావడానికి సుమారు మూడు శతాబ్దాలు పట్టింది.

బి) ఇంతకు ముందు తరగతులలో మీరు వలస పాలన గురించి చదివారు. పట్టిక చూసి 1800 నాటికి ఏ ఖండాలలో జనాభా తగ్గిందో తెలుసుకోండి.
జవాబు:
1800 సం|| నాటికి ఓషియానియాలో జనాభా తగ్గింది.

సి) ఏ ఖండంలో ఎక్కువ కాలంపాటు అధిక జనాభా ఉంది?
జవాబు:
ఆసియా ఖండంలో ఎక్కువ కాలంపాటు అధిక జనాభా ఉంది.

డి) భవిష్యత్తులో జనాభా గణనీయంగా తగ్గనున్న ఖండం ఏదైనా ఉందా?
జవాబు:
భవిష్యత్తులో ఉత్తర అమెరికా ఖండంలో జనాభా గణనీయంగా తగ్గనుంది.

AP Board 10th Class Social Solutions Chapter 6 ప్రజలు

ప్రశ్న 3.
లింగ నిష్పత్తి చాలా ఎక్కువగాని, లేదా చాలా తక్కువగాని ఉంటే సమాజంపై పడే ప్రభావాలను పేర్కొనండి. (AS4)
జవాబు:

  1. లింగ నిష్పత్తి చాలా ఎక్కువగాని, తక్కువగాని ఉంటే సామాజికంగా చాలా తేడా వస్తుంది.
    ఉదా : కాలేజీల విద్యార్థుల సంఖ్య.
  2. ఈ నిష్పత్తి సంపద పంపిణీని, అధికార హోదాలను, ఎగ్జిక్యూటివ్ స్థాయిని, ప్రభుత్వ పని గంటలను అన్నింటినీ ప్రభావితం చేస్తుంది.
  3. ఈ నిష్పత్తి నేర రేటును కూడా ప్రభావితం చేస్తుంది.
  4. స్త్రీల సంఖ్య మరీ తక్కువగా ఉంటే సాధారణ పురుషులకు వివాహం జరగటం కష్టమవుతుంది. అన్ని రకాలుగా ముందున్న వారినే స్త్రీలు భర్తలుగా ఎంచుకునే అవకాశం ఉంటుంది.
  5. లింగ నిష్పత్తిలో అసమానతలు జనన రేటును ప్రభావితం చేస్తాయి.

ప్రశ్న 4.
భారతదేశ అక్షరాస్యతను ఇతర దేశాలతో పోల్చండి : (AS1)
బ్రెజిల్, శ్రీలంక, దక్షిణ ఆఫ్రికా, నేపాల్, బంగ్లాదేశ్, నార్వే, చిలి, ఇండోనేషియా.
ఎటువంటి సారూప్యాలు, తేడాలు మీరు గమనించారు?
జవాబు:

  1. భారతదేశ అక్షరాస్యత శాతం : 74.04% (82.1% – 65.5%)
  2. బ్రెజిల్ : 90.04% (90.1% – 90.7%)
  3. చిలీ : 98.6% (98.6% – 98.5%)
  4. బంగ్లాదేశ్ : 57.7% (62% – 53.4%)
  5. ఇండోనేషియా : 90.4% (94% – 86.8%)
  6. నార్వే : 100% (100% – 100%)
  7. నేపాల్ : 66% (75.1% – 57.4%)
  8. శ్రీలంక : 91.2% (92.6% – 90%)
  9. దక్షిణ ఆఫ్రికా : 93% . (93.9% – 92.2%)

పోలికలు మరియు భేదాలు :

  1. దాదాపు అన్ని ఆసియా దేశాలు సమాన అక్షరాస్యతా రేటును కలిగి ఉన్నాయి. ఒకటి రెండు దేశాలలో మాత్రము యివి తక్కువగా ఉన్నాయి.
  2. పురుషుల అక్షరాస్యత శాతం బ్రెజిల్, నార్వేలలో తప్ప మిగతా దేశాలలో అధికంగానే ఉంది.
  3. స్త్రీ, పురుషుల అక్షరాస్యత శాతం మధ్య తేడా భారతదేశం, నేపాల్ లో అధికంగా ఉంది.
  4. ఒక్క నార్వే మాత్రం 100% అక్షరాస్యతను సాధించింది.

ప్రశ్న 5.
ఆంధ్రప్రదేశ్ లోని ఏ ప్రాంతాలలో జన సాంద్రత ఎక్కువగా ఉంది, దానికి కారణాలు ఏమిటి? (AS1)
జవాబు:
ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణాజిల్లా 519, పశ్చిమ గోదావరి 508, తూర్పు గోదావరి 477, గుంటూరు 429 జనసాంద్రతలతో మొదటి నాలుగు స్థానాలలో ఉన్నాయి.

కృష్ణా, ఉభయగోదావరి, గుంటూరు జిల్లాలలో అధిక జనసాంద్రతకు గల కారణాలు :
ఎ) కృష్ణా, గోదావరి నదీ పరీవాహక ప్రాంతంలో ఉండటం వలన వ్యవసాయానికి అనుకూలత.
బి) వ్యవసాయాధారిత పరిశ్రమలు వృద్ధి.
సి) వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు.

AP Board 10th Class Social Solutions Chapter 6 ప్రజలు

ప్రశ్న 6.
జనాభా పెరుగుదల, జనాభా మార్పు మధ్య తేడాలను పేర్కొనండి. (AS1)
జవాబు:

  1. జనాభా పెరుగుదల జననాల, మరణాల రేటుపై ఆధారపడి ఉంటుంది. జనగణన కాలంనాటి జనాభా మరియు దశాబ్దం క్రిందటి జనగణన కాలంనాటి జనాభాల తేడానే “జనాభా పెరుగుదల” అంటాం.
  2. జనాభా మార్పు అనేది వలసల ప్రాధాన్యత గల అంశం.
  3. జనాభా మార్పు = (జననాల సంఖ్య + ఆ ప్రాంతం / దేశంలోని వలస వచ్చిన వారి సంఖ్య) – (మరణాల సంఖ్య + ఆ ప్రాంతం / దేశం నుండి బయటకు వలస వెళ్ళిన వారి సంఖ్య)
  4. జనాభా పెరుగుదల దేశం మొత్తానికి దశాబ్దానికోసారి లెక్కిస్తాం.
  5. జనాభా మార్పు నిరంతర ప్రక్రియ. . ఉదాహరణకు కోస్తాంధ్రలోని కొన్ని ప్రాంతాలలో వర్షాధార భూములు గల ప్రాంత కూలీలు వ్యవసాయ పనులు లేనపుడు బహుళపంటలు వేసే ప్రాంతాలకు వలసపోతారు.
  6. సాగర తీరప్రాంత మత్స్యకారులు చేపలవేట నిషేధకాలంలో వీరావల్ వంటి ప్రాంతాలకు వలసపోతారు.
  7. ఇవి కాలానుగుణ వలసలు. కాగా ఉపాధి కోసం శాశ్వతంగా పట్టణాలకు వలసలు పోయే కుటుంబాలెన్నో !
  8. ఈ రకంగా వలసల వలన ఓ ప్రాంతంలో జనసాంద్రత తగ్గి, మరో ప్రాంతంలో జనసాంద్రత పెరుగుతుంది. అయితే ఈ జనాభా మార్పు జనాభా పెరుగుదలను ప్రభావితం చేయలేదు.
  9. అంతర్జాతీయ శాశ్వత వలసలు మాత్రమే జనాభా పెరుగుదలపై ప్రభావితం చూపుతాయి.

ప్రశ్న 7.
క్రింద ఇచ్చిన స్వీడన్, కెన్యా, మెక్సికో దేశాల వయస్సు సమూహాన్ని పోల్చండి. (AS3)
AP Board 10th Class Social Solutions Chapter 6 ప్రజలు 2 AP Board 10th Class Social Solutions Chapter 6 ప్రజలు 3
జవాబు:
AP Board 10th Class Social Solutions Chapter 6 ప్రజలు 4
ఎ) ఈ దేశాల్లో జనాభా పెరుగుదల ఎలా ఉంటుంది?
బి) ఏ దేశాల జనాభా ఇంకా తగ్గవచ్చు?
సి) అన్ని దేశాలలో లింగ నిష్పత్తి సమతుల్యంగా ఉందా?
డి) ఈ దేశాల కుటుంబ సంక్షేమ పథకాలు ఏమై ఉండవచ్చు?
జవాబు:
ఎ) స్వీడన్లో జనాభా పెరుగుదల అధిక హెచ్చు తగ్గులతో ఉంది.
కెన్యా, మెక్సికోలలో జనాభా పెరుగుదల నిదానంగా ఒక పద్ధతిలో ఉన్నది.

బి) స్వీడన్

సి) స్వీడన్లో లింగ నిష్పత్తి – 980 పురుషులు 1000 స్త్రీలు
కెన్యాలో లింగ నిష్పత్తి – 1000 పురుషులు/1000 స్త్రీలు
మెక్సికోలో లింగ నిష్పత్తి – 960 పురుషులు 1000 స్త్రీలు

డి) ఈ 3 దేశాలలోకెల్లా కెన్యాలో కుటుంబ సంక్షేమ పథకాలు చక్కగా నిర్వహించబడుతున్నాయి.

AP Board 10th Class Social Solutions Chapter 6 ప్రజలు

ప్రశ్న 8.
పటం పని (AS5)
అ) రాష్ట్రాలను సూచించే భారతదేశ పటంలో 2011 జనాభా గణాంకాల ఆధారంగా అయిదు స్థాయిలలో జనాభా సాంద్రతను సూచించండి.

స్థాయి – I:
1) ఉత్తరప్రదేశ్ – 199,581,477 (16.49%)
2) మహారాష్ట్ర – 112,372,972 (9.28%) 12 (9.28%)
3) బీహార్ – 103,804,637 (8.58%)
4) పశ్చిమబెంగాల్ – 91,374,736 (7.55%)
5) ఆంధ్రప్రదేశ్ – 49,368,776 (4.07%)
6) తెలంగాణ – 35,286,757 (2.91%)
7) మధ్య ప్రదేశ్ – 72,597,565 (6.00%)
8) తమిళనాడు – 72,138,958 (5.96%)

స్థాయి – II :
9) రాజస్థాన్ – 68,621,012 (5.67%)
10) కర్ణాటక – 61,130,704 (5.05%)
11) గుజరాత్ – 60,383,628 (5.00%)
12) ఒడిశా – 41,947,358 (3.47%)
13) కేరళ – 33,387,677 (2.76%)
14) జార్ఖండ్ – 32,966,238 (2.72%)
15) అసోం – 31,169,272 (2.58%)
16) పంజాబు – 27,704,236 (2.30%)
17) ఛత్తీస్ గఢ్ – 25,540,196 (2.11%)
18) హర్యా నా – 25,353,081 (2.09%)

స్థాయి – III :
19) జమ్ము , కాశ్మీర్ – 12,548, 926 (1.04%)
20) ఉత్తరాఖండ్ – 10,116,752 (0.84%)
21) హిమాచల్ ప్రదేశ్ – 6,856,509 (0.57%)

స్థాయి – IV:
22) త్రిపుర – 3,671,032 (0.30%)
23) మేఘాలయ – 2,964,007 (0.24%)
24) మణిపూర్ – 2,721,756 (0.22%)
25) నాగాలాండ్ – 1,980,602 (0.16%)
26) గోవా – 1,457,723 (0.12%)
27) అరుణాచల్ ప్రదేశ్ – 1,382,611 (0.11%)
28) మిజోరాం – 1,091,014 (0.09%)

స్థాయి – V:
29), సిక్కిం – 607, 6881 (0.05%)
30) ఢిల్లీ – 16,753,235 (1.38%) (NCT)
31) పుదుచ్చేరి – 1,244,464 (0.10%)(UTI)
32) చండీఘర్ – 1,054,686 (0.09%) (UTI)
33) అండమాన్,నికోబార్ దీవులు – 379,944 (0.03%)(UTI)
34) దా ద్రా నగర్ హవేలి – 342,853 (0.03%)(UTI)
35) డామన్, డయ్యు – 242,911 (0.02%)(UTI)
36) లక్షద్వీప్ – 64,429 (0.01%)(UTI)
AP Board 10th Class Social Solutions Chapter 6 ప్రజలు 5

ఆ) జిల్లాలను సూచించే ఆంధ్రప్రదేశ్ పటంలో చుక్కల పద్ధతిని ఉపయోగించి (ఒక చుక్క పదివేల జనాభాను సూచిస్తుంది) జనాభా విస్తరణను చూపించండి.
జవాబు:

  1. చిత్తూరు – 4,170, 468 = [417]
  2. అనంతపురం : 4,083,315 = [408]
  3. కడప – 2,884,524 = [288]
  4. కర్నూలు – 4,046,601 = [405]
  5. నెల్లూరు – 2,966,082 = [297]
  6. ప్రకాశం – 3,392,764 = [339]
  7. గుంటూరు : 4,889,230 = [489]
  8. కృష్ణ – 4,529,009 = [453]
  9. తూర్పు గోదావరి – 5,151,549 = [515]
  10. పశిమ గోదావరి – 3,934,782 = [393]
  11. విశాఖపట్నం – 4,288,113 = [429]
  12. శ్రీకాకుళం – 2,699,471 = [270]
  13. విజయనగరం – 2,342,868 = [234]

AP Board 10th Class Social Solutions Chapter 6 ప్రజలు 6
గమనిక : విద్యార్ధులు పట్టికలోని బ్రాకెట్లలో చూపిన విధంగా చుక్కలను ఆయా జిల్లాలలో పెట్టవలయును.

10th Class Social Studies 6th Lesson ప్రజలు InText Questions and Answers

10th Class Social Textbook Page No.71

ప్రశ్న 1.
మీ చుట్టుప్రక్కల గల వేరు వేరు జీవనోపాధులు, ఆదాయాలు ఉన్న వ్యక్తులతో మాట్లాడండి. ఎంతమంది పిల్లలు ఉండటం సరైనదో వాళ్లని అడగండి.
జవాబు:
మా చుట్టుప్రక్కల గల వేరు వేరు జీవనోపాధులు, ఆదాయాలు ఉండే వ్యక్తులతో మాట్లాడగా ఒకరు లేదా ఇద్దరు సంతానం సరియైనదని అభిప్రాయపడ్డారు.

10th Class Social Textbook Page No.76

ప్రశ్న 2.
పై చదువులకు మగపిల్లలతో సమానంగా ఆడపిల్లలకు అవకాశాలు లభిస్తున్నాయా?
జవాబు:
పై చదువులకు మగపిల్లలతో సమానంగా ఆడపిల్లలకు అవకాశాలు లభిస్తున్నాయి. కానీ తల్లిదండ్రుల వైఖరి కారణంగా కొద్దిమంది ఆడపిల్లలు మాత్రమే ఉన్నతవిద్య నభ్యసించగలుగుతున్నారు.

AP Board 10th Class Social Solutions Chapter 6 ప్రజలు

10th Class Social Textbook Page No.76

ప్రశ్న 3.
పెళ్లిన మహిళలకు ఇంటి బయట పని చేయటానికి, ప్రయాణాలు చేయటానికి అవకాశాలు ఉన్నాయా?
జవాబు:
పెళైన మహిళలకు ఇంటి, బయట పనిచేయడానికి, ప్రయాణాలు చేయడానికి అవకాశాలున్నాయి. అయితే సరియైన రక్షణ లేకపోవడం, పనిచేసే ప్రదేశాలలో మరుగుదొడ్లు వంటి కనీస సదుపాయాలు లేకపోవటం వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు.

10th Class Social Textbook Page No.76

ప్రశ్న 4.
మహిళలు వారి పుట్టింటితో సంబంధాలు పెట్టుకోకూడదా? వాళ్లకు ఆస్తులపై హక్కు ఉండకూడదా? భద్రత ఉండకూడదా?
జవాబు:
మహిళలు వారి పుట్టింటితో సంబంధాలు పెట్టుకోవచ్చు. వారికి ఆస్తులపై చట్టపరంగా హక్కులున్నాయి. భద్రత తప్పనిసరిగా ఉండాలి.

10th Class Social Textbook Page No.76

ప్రశ్న 5.
మీ ప్రాంతంలో మగ పిల్లలను ఎక్కువగా కోరుకుంటారా?
జవాబు:
మా ప్రాంతంలో మగ పిల్లలను, ఆడపిల్లలను ఇద్దరినీ కోరుకుంటారు. అయితే మగసంతానం తప్పనిసరి అని భావిస్తారు. అయితే క్రమేపీ ఈ అభిప్రాయాల్లో మార్పు వస్తుంది. ఆడైనా, మగైనా ఇద్దరు చాలు అనే భావన ఎక్కువ మందిలో ఉంది.

10th Class Social Textbook Page No.77

ప్రశ్న 6.
మీ ఊళ్ళో, పట్టణంలో నిరక్షరాస్యులు ఉన్నారేమో తెలుసుకోండి. మీ సర్వే ఏం చెపుతోంది?
జవాబు:
మా గ్రామంలో నిరక్షరాస్యులున్నారు. మేం చేసిన సర్వే కూడా ఈ విషయాన్నే తెలిపింది. విద్యాహక్కు చట్టం వచ్చిన తరువాత శతశాతం నమోదు, నిలకడను చూడవచ్చు. అయితే వయోజనులైన నిరక్షరాస్యులు వారికి ఏర్పాటుచేసిన అక్షరభారత కేంద్రాలను పూర్తిగా సద్వినియోగపరచుకోవడం లేదు.

10th Class Social Textbook Page No.81

ప్రశ్న 7.
ఫెర్టిలిటీ శాతం 2 కి దగ్గరగా ఉంటే ఏమిటి అర్థం ? చర్చించండి.
జవాబు:
ఫెర్టిలిటీ శాతం 2 కి దగ్గరగా ఉంటే జంటలు ఇద్దరు పిల్లలను కనాలని కోరుకుంటున్నారని అర్ధం.

10th Class Social Textbook Page No.81

ప్రశ్న 8.
మీరు బృందాలలో చేసిన సర్వేలో 45 సంవత్సరాలు పైబడిన మొత్తం మహిళల సంఖ్య, వారి పిల్లల సంఖ్య తెలుసుకోండి. మీ సర్వేలో సగటున ప్రతి మహిళకు ఎంత మంది పిల్లలు ఉన్నారు?
జవాబు:
ఇద్దరు

AP Board 10th Class Social Solutions Chapter 6 ప్రజలు

10th Class Social Textbook Page No.81

ప్రశ్న 9.
పిల్లల విషయంలో ఉమేర్ సింగ్ ని ఏ అంశాలు ప్రభావితం చేశాయి ? అతని కూతురు కూడా అలాగే ఆలోచిస్తోందా?
జవాబు:
ఉమేర్ సింగ్ కు అబ్బాయి కావాలనే కోరిక వలన సంతానం ఆరుకు చేరింది. అతని కూతురు తండ్రిలా కాకుండా ముగ్గురు పిల్లలను మాత్రమే కావాలనుకుంది.

10th Class Social Textbook Page No.82

ప్రశ్న 10.
ఏ సంవత్సరం నాటికి ఊరిలోని భూమి అంతా సాగులోకి వచ్చింది?
జవాబు:
1950 నాటికి ఊరిలోని భూమి అంతా సాగులోకి వచ్చింది.

10th Class Social Textbook Page No.71

ప్రశ్న 11.
మీ ప్రాంతంలో, ఊరిలో, దేశమంతటిలో ఉంటున్న ప్రజలకు సంబంధించిన సమాచారాన్ని ఎలా సేకరిస్తారో, నమోదు చేస్తారో మీరు ఎప్పుడైనా ఆలోచించారా ? జనగణనలో తమ అనుభవాలను చెప్పమని మీ టీచరుని అడగండి.
జవాబు:
భారతదేశంలో ప్రతి పది సంవత్సరాలకోసారి జనాభాను సేకరిస్తారు. జనాభా సేకరణకు ఒక ఏడాది ముందు మే నెలలో ఆవాస ప్రాంతాల గుర్తింపు, నివాసాలు, కుటుంబాలు గుర్తించటం వాటి వివరాలు నమోదుచేస్తారు. వీటి చిత్తుపటాలను రూపొందిస్తారు. ఇంటింటికి వెళ్ళి ప్రతి వ్యక్తి పూర్తి వివరాలు మరుసటి సంవత్సరం ఫిబ్రవరిలో వివరంగా సేకరించి నమోదుచేస్తారు.

10th Class Social Textbook Page No.73

ప్రశ్న 12.
కుటుంబాన్ని ఎలా నిర్వచిస్తారు ? ఎవరెవరిని కుటుంబం కింద పరిగణిస్తారు?
జవాబు:
కుటుంబాలు 2 రకాలు :

1) సాధారణ కుటుంబాలు :
ఒకే ప్రాంగణంలో నివసిస్తూ ఉమ్మడిగా వంట చేసుకొనే సభ్యులను కుటుంబంగా పేర్కొంటాం. కుటుంబంలోని వారు అనగా తల్లి, తండ్రి, కుమారులు, కుమార్తెలు, తాత, నాన్నమ్మతో పాటు కుటుంబంలోని వారందరినీ కుటుంబ సభ్యులుగానే పరిగణిస్తారు.

2) సంస్థాగత కుటుంబాలు :
బంధుత్వాలు లేకపోయినా ఉమ్మడిగా వండిన వంటను తినేవారు, ఒకే ప్రాంగణంలో నివసించేవారిని “సంస్థాగత కుటుంబాలు” అంటాం.
ఉదా :
వసతి గృహాలు, జైలు మొ||నవి.

10th Class Social Textbook Page No.73

ప్రశ్న 13.
విద్యకు ఎటువంటి వర్గీకరణను ఉపయోగిస్తారు? ఉదాహరణకు : 6 సంవత్సరాలలోపు పిల్లలు, పాఠశాల/కళాశాలలో చదువుతున్నారు, తరగతి…..; బడిలో ఉండాలి కాని పేరు నమోదు కాలేదు. ……. తరగతి వరకు చదివారు; బడికి అసలు వెళ్లలేదు.
జవాబు:
విద్య – వర్గీకరణ : 6-14 సం||ల పిల్లల వర్గీకరణ :

  1. పేరు
  2. వయస్సు
  3. పాఠశాల పేరు
  4. తరగతి
  5. పాఠశాలలో నమోదు కాకపోతే కారణం
  6. బడిలో చేరి మానివేస్తే కారణం ఏడో తరగతిలో మానివేశాడు
  7. ప్రత్యామ్నాయ పాఠశాలల్లో చేరుటకు (ఉదా : RBC/ KG స్కూల్సు) సిద్ధమా?

AP Board 10th Class Social Solutions Chapter 6 ప్రజలు

10th Class Social Textbook Page No.73

ప్రశ్న 14.
వృత్తికి ఎటువంటి వర్గీకరణను ఉపయోగిస్తారు?
ఉదాహరణలు : గృహిణి, విద్యార్థి, ……….. స్వయం ఉపాధి, ఉద్యోగం, నిరుద్యోగి, పదవీ విరమణ, వృద్ధులు.
జవాబు:
వృత్తి – వర్గీకరణ : గృహిణి | వ్యవసాయం / విద్యార్థి / శ్రామికుడు / వ్యవసాయ కూలీ / ఉద్యోగి / నిరుద్యోగి / వ్యాపారం / స్వయం ఉపాధి / ఆస్తిపై వచ్చే అద్దెలు / వడ్డీలతో పోషణ ………….

సర్వే తరువాత :
ఎ) సర్వే చేసిన కుటుంబాలలోని మనుషుల లెక్కను చూపించటానికి ప్రతి బృందమూ కింద చూపిన విధంగా పట్టిక తయారుచేయాలి:

పురుషులుస్త్రీలుమొత్తం జనాభా

జవాబు:

పురుషులుస్త్రీలుమొత్తం జనాభా
330315645

బి) మీ బృందంలో స్త్రీ : పురుషుల నిష్పత్తి ఏమిటి? వివిధ బృందాలలో ఈ నిష్పత్తిలో తేడా ఉందా? చర్చించండి.
6 – 14 సంవత్సరాల పిల్లలకు :
AP Board 10th Class Social Solutions Chapter 6 ప్రజలు 7
జవాబు:
6 – 14 సంవత్సరాల పిల్లలకు : (156 మంది)
AP Board 10th Class Social Solutions Chapter 6 ప్రజలు 8

సి) అన్ని బృందాలకు కలిపి మొత్తం పిల్లల్లో అసలు బడిలో చేరనివాళ్లు, బడి మానేసినవాళ్ల శాతం ఎంత? దీనికి కారణాలు ఏమిటి?
జవాబు:
అన్ని బృందాలకు కలిపి మొత్తం పిల్లల్లో అసలు బడిలో చేరనివాళ్లు, బడి మానేసినవాళ్ల శాతం = 8%

కారణాలు:

  1. తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి
  2. వారి మూఢ నమ్మకాలు
  3. బోధనా పద్ధతులు మరియు
  4. ఆంగ్లం, గణితం వంటి సబ్జెక్టులు మొదలగునవి.

డి) 20 సంవత్సరాలు పైబడిన వాళ్ళల్లో బడిలో గడిపిన సగటు సంవత్సరాలు ఎంత? వివరాలు తెలుసుకోండి. ఈ సమాచారం ఉపయోగకరంగా ఉందా?
జవాబు:
20 సంవత్సరాలు పైబడినవాళ్ళల్లో బడిలో గడిపిన సగటు సంవత్సరాలు 12 సంవత్సరాలు.
ఈ సమాచారం ప్రతి వ్యక్తి పాఠశాల, కళాశాల విద్య గురించి అంచనా వేయడానికి ఉపకరిస్తుంది.

ఇ) 15-59 సంవత్సరాల వాళ్లకు :

వృత్తిసంఖ్యశాతం
స్వయం ఉపాధి
గృహిణి
ఉద్యో గి
నిరుద్యో గి
విద్యార్థి
మొత్తం

మీ నమూనా గణనలో ‘పనిచేస్తున్న వారు’, ‘ఇతరులపై ఆధారపడేవారు’ అనే అంశాలను ఏ విధంగా వర్గీకరిస్తారు?
జవాబు:

వృత్తిసంఖ్యశాతం
స్వయం ఉపాధి9219%
గృహిణి19640%
ఉద్యో గి84617%
నిరుద్యో గి388%
విద్యార్థి8116%
మొత్తం491100%

10th Class Social Textbook Page No.74

ప్రశ్న 15.
క్రింది గ్రాఫ్ ను పరిశీలించండి.
AP Board 10th Class Social Solutions Chapter 6 ప్రజలు 9-1
భారతదేశ జనాభా పిరమిడ్, 2011
పైన ఇచ్చిన జనాభా పిరమిడ్ ఆధారంగా జనాభాలో పిల్లల శాతం ఎంతో ఉజ్జాయింపుగా లెక్కగట్టండి.
జవాబు:
పిల్లల శాతం – 31%
పురుషులు – 190,075,426
స్త్రీలు – 172,799,553

10th Class Social Textbook Page No.74

ప్రశ్న 16.
మీరు చేసిన సర్వే ఆధారంగా ప్రతి బృందం పట్టికలో కింది వివరాలను పొందుపరచాలి. వయస్సు, ప్రజల సంఖ్య, పిల్లలు, పనిచేస్తున్నవాళ్లు, వృద్ధులు.
జవాబు:

పిల్లలు (0-6)12
బడి ఈడు పిల్లలు (6-14)15
పనిచేస్తున్నవారు20
వృద్ధులు25

AP Board 10th Class Social Solutions Chapter 6 ప్రజలు

10th Class Social Textbook Page No.77

ప్రశ్న 17.
మీ సర్వేలో కనుగొన్న శ్రామికులను, జనాభా గణనలో నమోదైన వివిధ పనుల వారితో పోల్చండి.
జవాబు:
సర్వేలో కనుగొన్న శ్రామికులు ఒక ప్రాంతంలో గల పరిమిత రంగాలకు చెందినవారు ఉంటారు. జనాభా గణనలో నమోదైన శ్రామికులు దేశంలోని అన్ని రంగాలకు చెందినవారు ఉంటారు.

10th Class Social Textbook Page No.79

ప్రశ్న 18.
కింది విదేశాలకు సంబంధించిన రెండు పోస్టర్లు ఇవ్వబడ్డాయి. వాటిలో ఇవ్వబడిన సందేశాన్ని ఊహించగలరా? ఇటువంటి పోస్టర్లను భారతదేశంలో ఎప్పుడైనా చూశారా? చర్చించండి.
AP Board 10th Class Social Solutions Chapter 6 ప్రజలు 10
జవాబు:
మొదటి పోస్టర్ :
బిడ్డ ఆడైనా, మగైనా సమానమే అనే భావనను చెబుతుంది.

రెండో పోస్టర్ :
మొదటి అపరిమిత సంతానం వల్ల పడే ఇబ్బందులను, కొరతను తెలియజేస్తున్నది. రెండవది పరిమిత సంతానం ద్వారా పిల్లల భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దవచ్చు. దుస్తులు, విద్య వైద్య సదుపాయాలు కల్పించవచ్చు అనేది తెలుస్తున్నది.

10th Class Social Textbook Page No.81

ప్రశ్న 19.
ఇటీవల పెళ్లి జరిగి ఇంకా పిల్లలు లేని దంపతులతో మాట్లాడండి. వాళ్లు ఎంత మంది పిల్లల్ని కనాలనుకుంటున్నారు? దానికి కారణాలు ఏమిటి?
జవాబు:
ఇటీవల పెళ్లి జరిగి ఇంకా పిల్లలు లేని దంపతులలో ఎక్కువ మంది ఒకరు లేదా ఇద్దరు పిల్లలను మాత్రమే కనాలను కుంటున్నారు. పరిమిత సంతానమైతే వారిని చక్కగా పెంచి మంచి భవిష్యత్తు అందివ్వవచ్చును అని భావిస్తున్నారు.

10th Class Social Textbook Page No.82

ప్రశ్న 20.
పెరుగుతున్న కుటుంబ పరిమాణానికి భూమి ఉన్నవాళ్లు ఎలా స్పందించారు?
జవాబు:
వర్షాధారమైన తన భూమిలో మరిన్ని పంటలు (బహుళ పంటలు) పండించటానికి బోరుబావులు త్రవ్వించి ఉత్పత్తిని పెంచారు. వ్యవసాయం లేని రోజులలో ఇతర పనులకు కూడా వెళ్లేవారు.

10th Class Social Textbook Page No.82

ప్రశ్న 21.
కుటుంబ పరిమాణం పెరిగినప్పుడు గోవిందులాంటి చిన్న రైతులు ఎలా స్పందించారు? బోరుబావిలో సాగునీరు ఎంతవరకు ఉపయోగపడింది?
జవాబు:
కుటుంబ పరిమాణం పెరిగినపుడు గోవిందు లాంటి చిన్నరైతులు ప్రత్యామ్నాయాలు ఆలోచించారు. వర్షాధార భూములలో బోరుబావులు త్రవ్వడం ద్వారా సాగునీటి సౌకర్యం పొందారు. బహుళ పంటలను పండించి ఆదాయాన్ని పెంచుకున్నారు. ఖాళీ సమయాల్లో ఇతర పనులకు వెళ్లి ఆదాయం పెంచుకున్నారు.

AP Board 10th Class Social Solutions Chapter 6 ప్రజలు

10th Class Social Textbook Page No.71

ప్రశ్న 22.
నమూనా సేకరణ, జన గణన ద్వారా సమాచారం సేకరించటంలో తేడాలు ఏమిటి ? కొన్ని ఉదాహరణలతో చర్చించండి.
జవాబు:
నమూనా సేకరణ, జన గణన ద్వారా సమాచారం సేకరించటంలో తేడాలు :

నమూనా సేకరణ ద్వారాజన గణన ద్వారా
1) సేకరించిన సమాచారం ఎంపికచేసిన ప్రాంతానికే పరిమితం.1) దేశం మొత్తానికి సంబంధించింది.
2) ఒక ప్రాంతానికి చెందిన నమూనా సేకరణ సులభం.2) జన గణన ద్వారా సమాచార సేకరణ సంక్లిష్టమైనది.
3) నమూనా సేకరణలో సమాచార సేకరణ కొన్ని అంశాలకే పరిమితం. ఉదా : ఆ ప్రాంతంలోని వారందరూ వ్యవసాయ కూలీలే కావచ్చు.3) అన్ని అంశాలపై సమాచార సేకరణకు వీలుంటుంది. అన్ని వర్గాల ప్రజలకు సంబంధించిన సమాచారం సేకరిస్తాం.
4) దీనికి కొద్దిమంది సిబ్బంది చాలును.4) లక్షల సంఖ్యలో సిబ్బంది అవసరం అవుతారు.
5) ఆర్థిక ఖర్చు పరిమితం.5) జనగణనకు కోట్లాది రూపాయలు ఖర్చవుతాయి.

సర్వే నిర్వహణ

10th Class Social Textbook Page No.72

ప్రశ్న 23.
ఇద్దరు లేదా ముగ్గురు విద్యార్థులు గల సర్వే నిర్వహణ బృందం తమ ప్రాంతంలోని 10 కుటుంబాల నుంచి సమాచారాన్ని సేకరించాలి. సర్వేకు ఉపయోగించాల్సిన పత్రం కింద ఉంది.
• ప్రతి బృందం కింద ఇచ్చిన పట్టికను పూరించాలి.
• అన్ని బృందాల పట్టికల ఆధారంగా ప్రశ్నలను తరగతి గదిలో చర్చించాలి.
AP Board 10th Class Social Solutions Chapter 6 ప్రజలు 11
జవాబు:
విద్యార్థి ఈ కృత్యాన్ని స్వయంగా నిర్వహించాలి.

సర్వే చేయటానికి ముందు:
• సర్వే ఫారంలో ఉపయోగించిన పదాలన్నింటిని అందరూ ఒకే రకంగా అర్థం చేసుకోటానికి తరగతి గదిలో చర్చించాలి. లేకపోతే సర్వే చేసేటప్పుడు గందరగోళం ఏర్పడి ఒక బృందం ఫలితాలను మరొక బృందంతో పోల్చటం కష్టమౌతుంది. మీ ఉపాధ్యాయుని సహాయంతో ఈ కింది పదాల గురించి చర్చించండి.

10th Class Social Textbook Page No.77

ప్రశ్న 24.
అభివృద్ధిని అక్షరాస్యత ఎలా ప్రభావితం చేస్తుంది? చర్చించండి.
జవాబు:
అభివృద్ధిని అక్షరాస్యత ప్రభావితం చేసే అంశాలు.

  1. అక్షరాస్యులు మూఢ నమ్మకాలను వదలి శాస్త్రీయంగా ఆలోచిస్తారు.
  2. వ్యవసాయ/వస్తూత్పత్తిలో నూతన విధానాలను అవలంబించి జాతీయ ఉత్పత్తిని పెంచెదరు.
  3. అధిక ఆదాయాన్ని పొంది జాతీయ ఆదాయాన్ని పెంచుతారు.
  4. ఉత్తమ పౌరులుగా బాధ్యతలను నిర్వర్తించగలరు.
  5. ఉత్తమ సమాజ రూపకల్పనకు కృషి చేస్తారు.
  6. తమ పిల్లలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతారు.
  7. వృత్తిని దైవంగా భావించి ఇతరులకు ఆదర్శంగా ఉంటారు.
  8. నూతన పరికరాలు / విధానాలు కనుగొనేందుకు దోహదపడతారు.

AP Board 10th Class Social Solutions Chapter 6 ప్రజలు

10th Class Social Textbook Page No.77

ప్రశ్న 25.
వ్యవసాయ భూమిని సాగుచేసే వ్యక్తికి, వ్యవసాయ కూలీకి మధ్య గల తేడాలేమిటి?
జవాబు:

వ్యవసాయ భూమి సాగుచేసే వ్యక్తివ్యవసాయ కూలీ
1) తాను పండించే పంటపై ఆధారపడతాడు.1) లభించే కూలీపై ఆధారపడతాడు.
2) సమాజంలో గౌరవం ఉంటుంది.2) సాధారణ వ్యక్తిగా జీవిస్తాడు.
3) ఆదాయం ఎక్కువ.3) ఆదాయం పరిమితం.
4) ఆదాయంలో కొంత మిగులు ఉంటుంది.4) పరిమిత ఆదాయంతో కుటుంబ పోషణ అంతంత మాత్రంగా ఉంటుంది.
5) ఆదాయానికి కొంత మేర హోదా / పరపతి ఉంటాయి.5) పని దొరుకుతుందో లేదో అనే చింతన ఉంటుంది.
6) పంట పండుతుందో లేదో అనే భయం ఉంటుంది.6) రిస్కు ఉండదు.
7) వ్యవసాయభూమి సాగుచేస్తూనే విరామకాలంలో ఏదైనా వృత్తి, వ్యాపారం చేయవచ్చు.7) వ్యవసాయపనులు లేనప్పుడు ఇతర పనులకు వెళతారు.

10th Class Social Textbook Page No.78

ప్రశ్న 26.
క్రింది (ను పరిశీలించండి.
AP Board 10th Class Social Solutions Chapter 6 ప్రజలు 12
i) పైన ఇచ్చిన ను పరిశీలించి ఏ దశాబ్ద కాలంలో జనాభా తగ్గిందో చెప్పండి.
జవాబు:
1911-1921 దశాబ్దంలో జనాభా తగ్గింది.

ii) ఏ సంవత్సరం నుంచి జనాభా నిరంతరంగా పెరుగుతోంది?
జవాబు:
1921 సంవత్సరం నుండి జనాభా నిరంతరంగా పెరుగుతోంది.

iii) భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత జనాభా వేగంగా పెరగటానికి కారణాలు ఏమై ఉండవచ్చు?
జవాబు:
భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత కరవు, సహాయం, ఆహారధాన్యాల తరలింపు, చౌకధరల దుకాణాలు, ప్రజాస్వామ్యంలో ప్రజలు చురుకుగా పాల్గొనడం వంటి వాటి వల్ల కరవుల ప్రభావం తగ్గిపోయింది. అదే విధంగా కర, ప్లేగు, కొంతవరకు మలేరియా వంటి అంటురోగాలను నియంత్రించగలిగారు. అనేక రోగాలకు కలుషిత నీరు, ఇరుకు ఇళ్లల్లో ఉండటం, పారిశుద్ధ్య లోపం వంటివి ప్రధాన కారణాలు. ఈ రోగాలను ఎదుర్కోవాలంటే మెరుగైన పారిశుద్ధ్యం, శుభ్రమైన నీళ్లు, పోషకాహారం అందించాలని అందరూ గుర్తించసాగి ఆ దిశగా అనేక చర్యలు చేపట్టారు. ఆ తరువాత వైద్యరంగంలో పురోగమనం వల్ల ప్రత్యేకించి టీకాలు, యాంటిబయాటిక్స్ వల్ల మెరుగైన ఆరోగ్యం సాధ్యమయ్యింది. 1900తో పోలిస్తే మరణాల శాతం గణనీయంగా తగ్గింది. జననాల శాతం ఎక్కువగా ఉండటానికి తగ్గుతున్న మరణాల శాతం తోడై జనాభా వేగంగా పెరగసాగింది.

10th Class Social Textbook Page No.80

ప్రశ్న 27.
భారతదేశ జనాభా పెరుగుదల స్వరూపం, శాతం, ఖాళీలను పూరించండి.
AP Board 10th Class Social Solutions Chapter 6 ప్రజలు 13
జవాబు:
AP Board 10th Class Social Solutions Chapter 6 ప్రజలు 14

10th Class Social Textbook Page No.81

ప్రశ్న 28.
మీ కుటుంబంలో మూడు తరాలపాటు ప్రతి మహిళకు ఎంతమంది సంతానమో తెలుసుకోండి. మీకు ఎటువంటి మార్పులు కనపడ్డాయి?
జవాబు:
AP Board 10th Class Social Solutions Chapter 6 ప్రజలు 15
రెండవ తరంలోనే కుటుంబ నియంత్రణ పాటించడం నేను గమనించాను. కనుక ప్రస్తుతం పెరుగుదల శాతం తగ్గుతోంది.

10th Class Social Textbook Page No.82

ప్రశ్న 29.
కింద ఉన్న భారతీయ పటాన్ని చూడండి. భారతదేశ భౌగోళిక స్వరూపానికి, జనాభా సాంద్రతకు మధ్య ఏమైనా సంబంధం ఉందేమో చూడండి. దేశంలోని ప్రధాన నగరాలను గుర్తించగలరా? నగరాలలోని అధిక జనాభా సాంద్రతను ఎలా వివరిస్తారు?
AP Board 10th Class Social Solutions Chapter 6 ప్రజలు 16
జవాబు:
దేశంలోని ప్రధాన నగరాలను గుర్తించగలం.
సూచికలో చూపిన సూచనల ఆధారంగా నగరాలలోని అధిక జనసాంద్రతను వివరించగలం.

  1. భూమి సహజ స్వరూపాన్ని భౌగోళిక స్వరూపం అంటాం. చదరపు కిలోమీటరుకు సగటున నివసించే ప్రజలను జనసాంద్రత అంటాం.
  2. బాగా పంటలు పండే ప్రాంతాలు, పారిశ్రామికవాడలైన ‘గంగా-సింధు మైదానం’ లో జనసాంద్రత ఎక్కువ.
  3. థార్ ఎడారి ప్రాంతం ప్రజల జీవనానికి ఏమాత్రం అనుకూలంగా లేనందున అచ్చట జనసాంద్రత అత్యల్పం.
  4. తూర్పు, పశ్చిమ తీరప్రాంతాలలో వర్షపాతం ఎక్కువ. పంటలు బాగుగా పండును. అందుచే ఈ ప్రాంతాలలో జనసాంద్రత ఎక్కువ.
  5. హిమాలయ పర్వత ప్రాంతం సుందరమైనదైనప్పటికీ ఈ ప్రాంతం ఎప్పుడూ మంచుచే కప్పబడియుండుటచే జన జీవనానికి అనుకూలంగా ఉండదు. అందుచే ఇచ్చట జనసాంద్రత తక్కువ.
  6. ఈశాన్య భారతదేశం కొండలతో నిండియున్నందున జనసాంద్రత తక్కువ.

10th Class Social Textbook Page No.83

ప్రశ్న 30.
ఈ క్రింది పటమును పరిశీలించండి.
AP Board 10th Class Social Solutions Chapter 6 ప్రజలు 17
ఇక్కడ 2011కి ఆంధ్రప్రదేశ్ జన సాంద్రత గణాంకాలు ఉన్నాయి. జిల్లాలు ఉన్న ఆంధ్రప్రదేశ్ పటంలో వివిధ జన సాంద్రత స్థాయిలను సూచించండి.
అధిక జన సాంద్రత ఉన్న ఒక జిల్లాను తక్కువ సాంద్రత ఉన్న మరొక జిల్లాతో కింది అంశాలలో పోల్చండి.

అ) భూ ఉపరితలం, వ్యవసాయ అభివృద్ధికి అవకాశాలు.
ఆ) ఆ ప్రాంతంలో వ్యవసాయ చరిత్ర – భూమి, నీరు, ఇతర సహజ వనరుల వినియోగం.
ఇ) ఆ ప్రాంతం నుంచి, ఆ ప్రాంతంలోకి వలసలు, దీనికి కారణాలు.
జవాబు:
అ) అధికం – కృష్ణా
అల్పం – వై.యస్.ఆర్. కడప

అ)
AP Board 10th Class Social Solutions Chapter 6 ప్రజలు 18

ఇ) 1) వై.యస్.ఆర్. కడప జిల్లాకు వలసలు దాదాపు శూన్యం .
2) విద్య ఉద్యోగాల నిమిత్తం వై.యస్. ఆర్. కడప నుండి వలస వెళుతున్నారు.
3) విద్య, ఉద్యోగాల నిమిత్తం కృష్ణాజిల్లా నుండి మరియు కృష్ణాజిల్లాకు వలస వెళుతున్నారు.
AP Board 10th Class Social Solutions Chapter 6 ప్రజలు 19

AP Board 10th Class Social Solutions Chapter 5 భారతదేశ నదులు, నీటి వనరులు

SCERT AP 10th Class Social Study Material Pdf 5th Lesson భారతదేశ నదులు, నీటి వనరులు Textbook Questions and Answers.

AP State Syllabus 10th Class Social Solutions 5th Lesson భారతదేశ నదులు, నీటి వనరులు

10th Class Social Studies 5th Lesson భారతదేశ నదులు, నీటి వనరులు Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
భారతదేశంలోని ప్రధాన నదీవ్యవస్థలను వివరించటానికి కింది అంశాల ఆధారంగా ఒక పట్టిక తయారుచేయండి. నది ప్రవహించే దిశ, అవి ఏ రాష్ట్రాలు లేదా దేశాల గుండా ప్రవహిస్తున్నాయి, ఆ ప్రాంత భౌగోళిక పరిస్థితులు. (AS3)
(లేదా)
భారతదేశంలోని ఏవేని నాలుగు ప్రధాన నదీ వ్యవస్థలను పట్టిక రూపంలో వివరించండి.
AP Board 10th Class Social Solutions Chapter 5 భారతదేశ నదులు, నీటి వనరులు 1
జవాబు:
AP Board 10th Class Social Solutions Chapter 5 భారతదేశ నదులు, నీటి వనరులు 2 AP Board 10th Class Social Solutions Chapter 5 భారతదేశ నదులు, నీటి వనరులు 3

ప్రశ్న 2.
వ్యవసాయం, పరిశ్రమలు వంటి వివిధ సందర్భాలలో భూగర్భజలాల వినియోగాన్ని సమర్థించే, వ్యతిరేకించే వాదనలను పేర్కొనండి. (AS2)
జవాబు:

  1. పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో ప్రధాన నీటివనరు భూగర్భజలమే.
  2. వ్యవసాయం, పరిశ్రమలు మరియు ఇతర అవసరాలకు కూడా ఈ నీరే ప్రధాన వనరు.

భూగర్భజల వినియోగాన్ని సమర్థించే వాదనలు :

  1. అధిక ఉత్పత్తికి, అన్ని రకాల రైతులకు సమానస్థాయిలో నీరు అందడానికి, కరవు పరిస్థితులను అధిగమించడానికి, వ్యవసాయ ఉత్పత్తిని క్రమబద్ధం చేయడానికి మరియు ఉద్యోగాల కల్పనకు భూగర్భజల వినియోగం అవసరం.
  2. యంత్రాలను చల్లబరచడానికి, ఇతర పారిశ్రామిక అవసరాలకి కూడా ఇది అవసరం.
  3. భారతదేశ ఆర్థిక ప్రగతికి ఈ నీరే అధిక అవసరం.

భూగర్భ జల వినియోగాన్ని వ్యతిరేకించే వాదనలు :

  1. భారతదేశం భూగర్భజల వినియోగంలో ప్రపంచంలోనే మొదటిస్థానంలో ఉన్నది.
  2. ఈ వినియోగం భూగర్భ జలాలను తగ్గించివేస్తుంది. సముద్రపు నీరు తీరప్రాంతాలలోనికి చొచ్చుకుని వచ్చేలా చేస్తుంది.
  3. పరిశ్రమలలో ఉపయోగించిన నీరు భూగర్భజలాలను కలుషితం చేస్తుంది.

ప్రశ్న 3.
నీటి వనరుల విషయంలో అంతర్గత, బాహ్య ప్రవాహాల ప్రక్రియలను వివరించండి. (AS1)
జవాబు:
అంతర్గత ప్రవాహాలు : ఏ ప్రాంతానికైనా. అంతర్గత ప్రవాహాలు = అవపాతం + ఉపరితల ప్రవాహం + భూగర్భ ప్రవాహం. ఉపరితల ప్రవాహం అంటే భూమి మీద వాగులు, కాలువలు, నదులు వంటి వాటిల్లోని నీటి ప్రవాహం. భూగర్భ జల ప్రవాహాన్ని అంచనా వేయవచ్చు కానీ అది కొంచెం కష్టమైన పని. అవపాతం అంటే వాన ఒక్కటే కాకుండా వడగళ్లు, హిమము, పొగమంచు కూడా ఉంటాయి. అవపాతం అన్ని సంవత్సరాలు ఒకేలాగా కాకుండా ప్రతీ సంవత్సరం మారుతూ ఉంటుంది. అందువలన అవపాతాన్ని లెక్కించడానికి కొన్ని సంవత్సరాల అవపాతం యొక్క సగటును పరిగణలోనికి తీసుకుంటారు.

ఉపరితల, భూగర్భ నీటి ప్రవాహాలు :
మీ ప్రాంతానికి, అది చిన్న గ్రామమైనా, పట్టణమైనా నదులు, సాగునీటి పథకాల కాలువలు వంటి వాటి ద్వారా దిగువకు వచ్చే నీటి ప్రవాహాల జాబితా తయారుచేయండి.

ఒక గ్రామంలాంటి ఒక చిన్న ప్రాంతానికి కాలువలు, పైపులు వంటి వాటి ద్వారా నీళ్లు రావచ్చు – ఇటువంటి బయటి వనరులన్నింటినీ పేర్కొనండి. అవపాతానికి దీనిని జోడిస్తే ఆ ప్రాంతం లోపలికి మొత్తం ఎంత నీళ్లు వస్తాయో తెలుసుకోవచ్చు. భూగర్బం ద్వారా లోపలికి వచ్చే నీటిని అంచనా వేయటం కొంచెం కష్టం. అయితే నేల వాలుని బట్టి భూగర్భ జలం ఎటు ప్రవహిస్తుందో కొంత ఊహించవచ్చు.

బాహ్య ప్రవాహాలు :

బాష్పోత్సేకం :
అన్ని నీటి మడుగుల నుంచి నీరు ఆవిరిగా మారుతుంటుంది. చెరువులు, నదులు, సముద్రాలు వంటి అన్ని ఉపరితల నీటి వనరుల నుంచి నీరు ఆవిరి అవుతుంది. అన్ని జీవులు శ్వాస ప్రక్రియ ద్వారా గాలిలోకి నీటిని విడుదల చేస్తాయి.

ఉపరితల ప్రవాహాల ద్వారా, భూగర్భ ప్రవాహాల ద్వారా బయటకుపోయే నీళ్లు :
ఒక గ్రామంలాంటి ప్రాంతాన్ని ఊహించుకోండి. కొంత నీళ్లు వాగులగుండా ఉపరితల ప్రవాహం ద్వారా బయటకు ప్రవహిస్తాయి. వానాకాలంలో ఈ ఉపరితల ప్రవాహం గణనీయంగా పెరుగుతుంది. వర్షపాతంలో కొంత నేలలోకి, భూమి లోపలి పొరల్లోకి ఇంకి భూగర్భ జలాలను’ తిరిగి నింపుతాయి. దీంట్లో కొంత బావులు, బోరు బావులలోకి ప్రవహించి తిరిగి వినియోగానికి వస్తుంది, కొంత చాలా లోతైన నీటి ఊటలను చేరి మళ్లీ అందుబాటులోకి రాదు. భూగర్భ జలంలో కొంత భూగర్భ ప్రవాహాలను చేరి తిరిగి బయటకు వచ్చి వాగులు, నదులలో కలుస్తుంది.

వ్యవసాయానికి నీళ్లు :
పంటల వేళ్లు ఉండే ప్రాంతంలోకి నీళ్లు వర్షపాతం ద్వారాగానీ, సాగునీటి ద్వారాగానీ చేరుతుంది. నేలకి తేమని నిల్వ చేసుకునే సామర్థ్యం ఉంటుంది. వరద వంటి పరిస్థితుల్లో ఎక్కువ నీళ్లు ఉండి, అది నేల లోపలి పొరల్లోకి ఇంకకపోతే మొక్కల వేళ్లు దెబ్బతింటాయి. ఇంకొకవైపు కరవు పరిస్థితులలో వేళ్ల ప్రాంతంలో తగినంత తేమ లేకపోతే పంటలు వడిలిపోతాయి.

గృహ అవసరాలకు, పశువులకు నీటి వినియోగం :
తాగునీటికి, వంటకి, స్నానానికి, శుభ్రపరచడానికి, పశువులకు ఉపయోగించే నీరు చాలా ముఖ్యమైనది. ఆదాయాలతో సంబంధం లేకుండా అందరికీ ఈ అవసరాల కోసం తగినంత నీళ్లు అందేలా చూడటానికి ప్రణాళికలు తయారుచేయాలి.

పారిశ్రామిక అవసరాలకు నీటి వినియోగం :
ఉత్పత్తి ప్రక్రియలకు కూడా నీళ్లు అవసరమవుతాయి. అయితే దీనికీ వ్యవసాయ, గృహ వసతి అవసరాలకూ మధ్య వైరుధ్యం ఉంది. ఈ వైరుధ్యం పెరుగుతోంది, కాబట్టి దీనిని పరిగణనలోకి తీసుకోవాలి. పారిశ్రామిక అవసరాల కోసం నీటి వినియోగంలో కాలుష్య నివారణ, నీటిని తిరిగి వినియోగించుకోవడం అన్నవి ముఖ్యమైన సవాళ్లు.

AP Board 10th Class Social Solutions Chapter 5 భారతదేశ నదులు, నీటి వనరులు

ప్రశ్న 4.
భూగర్భ జల వనరులను అంతర్గత, బాహ్య ప్రవాహాలలో ఏ ప్రక్రియ ఎక్కువగా ప్రభావితం చేస్తుంది? (AS1)
జవాబు:
భూగర్భ జల వనరులను వర్షపాతం ఎక్కువగా ప్రభావితం చేస్తుంది.

ప్రశ్న 5.
తుంగభద్ర నదీ పరీవాహక ప్రాంతంలో నీటి వనరులకు సంబంధించి ఎదుర్కొంటున్న సవాళ్ల జాబితా తయారుచేయండి. ఈ అధ్యాయంలో కానీ, లేదా ఇతర తరగతులలో కానీ ఈ సమస్యలకు సంబంధించి చర్చించిన పరిష్కారాలను పేర్కొనండి. (AS4)
జవాబు:
ద్వీపకల్ప నదులలో ఒకటైన కృష్ణానదికి ఉపనది తుంగభద్ర.

తుంగభద్ర నదీ పరీవాహక ప్రాంతంలో నీటి వనరులకు సంబంధించి ఎదుర్కొంటున్న సవాళ్ళ జాబితా :

  1. పట్టణీకరణ, పెరుగుతున్న నీటి అవసరాలు : ఈ నదీ పరీవాహక ప్రాంతంలో జనాభా పెరుగుదల, పారిశ్రామిక అవసరాలు పెరగడం మొదలైన వాటి వలన నీటి అవసరం పెరిగింది.
  2. తక్కువగా లభించే తాగునీటిని సరిగా వినియోగించుకోలేకపోవడం.
  3. పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్యం.
  4. అన్ని వర్గాల వారికి పారిశుద్ధ్యం, తాగునీరు అందించడం.
  5. అంతరాష్ట్ర వివాదాలు.
  6. జలాశయాలు పూడికకు గురి అవడం.
  7. నీటి వనరుల పంపకానికి సరైన ప్రణాళికలు లేకపోవడం మొదలగునవి.

ప్రశ్న 6.
నీటి వనరులలో అనేక రకాల మార్పులు సంభవించాయి. ఈ అధ్యాయంలో చర్చించిన సానుకూల, ప్రతికూల మార్పులను వివరించండి. (AS1)
జవాబు:

సానుకూల మార్పులువ్యతిరేక మార్పులు
1) వ్యవసాయ రంగంలో సాంకేతిక అభివృద్ధి.1) పట్టణీకరణ
2) పారిశ్రామిక వ్యర్థాలను తిరిగి ఉపయోగించేలా చేయడం.2) జనాభా పెరుగుదల
3) ఆనకట్టల నిర్మాణం.3) పరిశ్రమల పెరుగుదల
4) వ్యవసాయ భూమి పెరుగుదల.4) నీటి తగాదాలు
5) జల విద్యుచ్ఛక్తి ప్రాజెక్టులను నిర్మించడం.5) నీటి కాలుష్యం

ప్రశ్న 7.
నీటి సంరక్షణను మెరుగుపరచటానికి హి బజారులో వ్యవసాయంలో ఏ పద్ధతులపై నియంత్రణలు విధించారు? (AS1)
జవాబు:
గ్రామ పరీవాహక, సమగ్రాభివృద్ధికి ‘ఆదర్శ గ్రామ పథకం’ కింద హివారే బజారుని మహారాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లాలో హివారే బజార్ ఉంది. మహారాష్ట్ర నుంచి కోస్తా కొంకణ తీర ప్రాంతాన్ని వేరు చేస్తూ ఉత్తర-దక్షిణంగా ఉన్న సహ్యాద్రి పర్వత శ్రేణికి (వర్షచ్ఛాయ ప్రాంతంలో) తూర్పువైపున గల వర్షచ్ఛాయా ప్రాంతంలో ఈ జిల్లా ఉంది. అందుకే అహ్మద్ నగర్ జిల్లా 400 మి.మీ వర్షపాతంతో కరువు పీడిత ప్రాంతంగా ఉంది. అందువల్ల ఆ గ్రామంలో కొన్ని నిషేధాలు విధించారు. అవి : సాగునీటికి బోరు బావులు తవ్వటం, చెరకు, అరటి సాగు చేయటం, బయటి వాళ్లకు భూమి అమ్మటం మొదలగునవి.

ప్రశ్న 8.
నీటి వనరుల విషయంలో ప్రజల కార్యాచరణ, చట్టాల ప్రాముఖ్యత ఏమిటి ? ఈ అధ్యాయంలోని చివరి రెండు భాగాలలో చర్చించిన అంశాలను క్లుప్తంగా రాయండి. (AS1)
జవాబు:

  1. నీటి వనరులకు సంబంధించి ప్రస్తుతం ఉన్న చట్టాలన్నీ అసంబద్ధమైనవి, చెల్లనివి అని చెప్పుకోవచ్చు.
  2. భూమిపై యాజమాన్యానికి ఆ నేలలో లభ్యమయ్యే నీటి వనరులకు మధ్య సరియైన సంబంధం లేదు. భూమి యజమాని నీరు తోడటంపై ఎటువంటి నియంత్రణ లేదు.
  3. నీరు అందరికీ చెందిన వనరుగా గుర్తించబడాలి.
  4. ఇలా గుర్తించి నియంత్రించడానికి సరియైన చట్టాలు, నియమాలు రూపొందించాలి.
  5. నీటి వనరుల వినియోగ నియంత్రణకు స్థానిక స్థాయిలోనూ, జాతీయ స్థాయిలోనూ చట్టాలను చేయాలి.

AP Board 10th Class Social Solutions Chapter 5 భారతదేశ నదులు, నీటి వనరులు

ప్రశ్న 9.
మీకు ఇంటర్నెట్ అందుబాటులో ఉంటే www.aponline.gov.in కి వెళ్లి ఆంధ్రప్రదేశ్ నీళ్లు, భూమి, చెట్ల సంరక్షణ (Andhra Pradesh WALTA Act.) చట్టం గురించి మరింత తెలుసుకోండి. (AS3)
జవాబు:
ఆంధ్రప్రదేశ్ నీళ్ళు, భూమి, చెట్ల సంరక్షణ చట్టం 2002 :
ఇది ఒక సమగ్రమైన చట్టం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలుచేస్తోంది. ఈ చట్టం 19.04.2002 నుండి అమలులోనికి వచ్చింది. ఈ చట్టంలో 6 చాప్టర్లు, 47 సెక్షన్లు, 30 నియమాలు ఉన్నాయి.

లక్ష్యాలు :

  1. నీటి సాగును, చెట్లున్న ప్రాంతాన్ని పెంచడం.
  2. నీటి వనరుల సాగును అభివృద్ధిపరిచి, రక్షించడానికి భూమికి సంబంధించిన విషయాలను సరిచూచుట,
  3. భూగర్భ, భూ ఉపరితల నీటి వినియోగాన్ని క్రమబద్దీకరించుట.

ప్రశ్న 10.
మీ ప్రాంతంలో ఏ ఏ అవసరాలకు నీటి కొనుగోలు, అమ్మకం జరుగుతోంది? దీనిపై ఏమైనా నియంత్రణలు ఉండాలా? చర్చించండి. (AS1)
జవాబు:

  1. మా ప్రాంతంలో నీరు ఎక్కువగా మా కార్పొరేషన్ చే సరఫరా చేయబడుతుంది. వారు నీటిని పంపుల ద్వారా సరఫరా చేస్తారు. ఈ నీరు త్రాగడానికి, ఇతర గృహ వినియోగాలకు ఉపయోగపడుతుంది.
  2. శుభ్రపరచబడిన త్రాగునీరు ఇతర ప్రైవేటు కంపెనీలచే బాటిల్ నీరును (2లీ.) రూ. 15/-ల నుండి రూ. 30/-ల వరకు తీసుకుని సరఫరా చేస్తారు.

వీటి మీద కొన్ని నియంత్రణలు ఉండాలని నేను భావిస్తున్నాను. కార్పొరేషను ట్యాంకులు తరుచూ శుభ్రం చేయాలి. నీటిని వివిధ మార్గాల ద్వారా శుద్ధి చేయాలి. సరఫరా చేయబడే సీసాలను శుభ్రపరచాలి. వారి యూనిట్ తరచూ సందర్శించి శుభ్రపరిచే విధానాన్ని పరిశీలించాలి.

10th Class Social Studies 5th Lesson భారతదేశ నదులు, నీటి వనరులు InText Questions and Answers

10th Class Social Textbook Page No.61

ప్రశ్న 1.
వాటర్ షెడ్ అన్న పదాన్ని చర్చించండి.
జవాబు:
ఒక ఎత్తైన ప్రాంతంలో ఒక వైపు నీటి ప్రవాహాలు ఒక నదిలోనూ, మరో వైపు నీటి ప్రవాహాలు మరో నదిలోనూ కలిస్తే . దానిని “వాటర్ షెడ్” అని అంటారు. ఈ నీటిని భూమిలోకి ఇంకేలా చేయడానికి చెట్లు నాటవచ్చు లేదా చెరువులు లాంటివి త్రవ్వించవచ్చు. ఇలా చేయడాన్ని “వాటర్ షెడ్ అభివృద్ధి పథకం” అని అంటారు.

AP Board 10th Class Social Solutions Chapter 5 భారతదేశ నదులు, నీటి వనరులు

10th Class Social Textbook Page No.61

ప్రశ్న 2.
మొక్కలు వేళ్లనుంచి తీసుకున్న నీరు ఏమవుతుందో విజ్ఞానశాస్త్ర పాఠాలలో తెలుసుకుని ఉంటారు. అది మరొకసారి గుర్తుకు తెచ్చుకోండి.
జవాబు:
చెట్ల వేర్లు నీటిని సమతుల్యం చేసే లక్షణాన్ని కలిగి ఉంటాయి. అవి అవసరమైనపుడు మాత్రమే నీటిని తీసుకుంటాయి. అవసరం లేనపుడు వాటిని తీసుకోవు.

10th Class Social Textbook Page No.69

ప్రశ్న 3.
హివారే బజారులాగానే భూగర్భజలాల నియంత్రణ ప్రధానంగా ప్రజలే చేయాలా?
జవాబు:
హివారే బజారులలో భూగర్భజలాల నియంత్రణ చాలా విజయవంతం అయింది. దీనికి కారణం ప్రజల సహకారమే కాబట్టి ప్రజలు పూనుకొని భూగర్భజలాల నియంత్రణ చేయటమే సరియైన పని.

10th Class Social Textbook Page No.69

ప్రశ్న 4.
‘భూగర్భజలాల చట్టాలు పాతబడిపోయాయి మరియు ప్రస్తుత కాలానికి తగవు’. వివరించండి.
జవాబు:
ప్రస్తుతం నీటి వినియోగంపై ఉన్న చట్టాలు బ్రిటీషు వారి కాలంనాటివి. అవి ఈ కాలానికి సరిపోయేవి కావు. పైగా అసంబద్ధమైనవి కూడా, అవి భూగర్భజలాలను అన్ని వనరులతో కలిపి వాడుకున్నపుడు తయారుచేసినవి. అవి ఇప్పటి వాడకానికి సరిపోవు. కాబట్టి అవి పాతపడిపోయాయి అని చెప్పవచ్చు.

10th Class Social Textbook Page No.58

ప్రశ్న 6.
భారతదేశంలో 40 మిలియన్ల ఎకరాల భూమి వరదకు గురయ్యే ప్రమాదం ఉంది. అంతే విస్తీర్ణం కరవుకి గురయ్యే అవకాశం ఉంది. దీనికి కారణాలు ఏమిటి?
జవాబు:

  1. భారతదేశంలో అత్యధిక వర్షపాతం నైఋతి ఋతుపవనాల మూలంగా వస్తుంది.
  2. ఈ ఋతుపవనాలలోని అనిశ్చితే వరదలకు, కరవుకు ప్రధాన కారణం.
  3. వరదలు అధిక వర్షం మూలంగా సంభవిస్తే, కరవులు వర్షాలు లేకపోవడం వలన సంభవిస్తాయి.
  4. అడవుల నిర్మూలన, నేలకోత మొదలైనవి ఈ విపత్తులకు మూల కారణాలు.

AP Board 10th Class Social Solutions Chapter 5 భారతదేశ నదులు, నీటి వనరులు

10th Class Social Textbook Page No.60

ప్రశ్న 7.
ఇక్కడ ఇచ్చిన పటం, అట్లాన్ల సహాయంతో ఈ కిందివి వివరించండి.
1) గోదావరి …………….. వద్ద పుడుతుంది.
2) తూర్పుకి ప్రవహించే ద్వీపకల్ప నదులలో కృష్ణానదికి రెండవ స్థానం. ఇది ………….. వద్ద పుడుతుంది.
3) మహానది ఛత్తీస్ గఢ్ లోని నిహావా దగ్గర పుట్టి …………… గుండా ప్రవహిస్తుంది.
4) నర్మదానది మధ్యప్రదేశ్ లోని …………… వద్ద పుడుతుంది.
5) తపతీనది …………… వద్ద పుట్టి ………… దిశగా పయనిస్తుంది.
జవాబు:
1) నాసిక్, త్రయంబకం
2) మహాబలేశ్వరం
3) ఒడిశా
4) అమరకంటక్
5) ముల్తాయ్, పశ్చిమ

10th Class Social Textbook Page No.61

ప్రశ్న 8.
మీ సమీప మండల కార్యాలయం నుంచి గత 5 సంవత్సరాలకు మొత్తం వార్షిక వర్షపాతం ఎంతో తెలుసుకోండి.
జవాబు:
నేను కృష్ణాజిల్లా పెనమలూరు గ్రామంలో నివసిస్తున్నాను. మా ఊరిలో సరాసరి వర్షపాతం ఈ క్రింది విధంగా ఉన్నది.
2013 – 107 సెం.మీ.
2014 . 103 సెం.మీ.
2015 – 100 సెం.మీ.
2016 – 98 సెం.మీ.
2017 – 104 సెం.మీ.

AP Board 10th Class Social Solutions Chapter 5 భారతదేశ నదులు, నీటి వనరులు

10th Class Social Textbook Page No.65

ప్రశ్న 9.
నీటి వినియోగ ప్రణాళికల కోసం ప్రభుత్వ నదీ పరీవాహక ప్రాధికార సంస్థ ఉంటే ఎలా ఉపయోగకరంగా ఉంటుంది?
జవాబు:

  1. నదీ పరీవాహక ప్రాధికార సంస్థ గనక ఉన్నట్లయితే ఆ సంస్థ ఆ నది నీటి వినియోగదారులందరికీ న్యాయం చేస్తుంది.
  2. నీటి వనరుల అభివృద్ధికి, పర్యవేక్షణకు అన్ని స్థాయిల్లోనూ సహకరిస్తుంది.
  3. కమ్యూనిటీ సహకారాన్ని కూడా పెంపొందిస్తుంది.
  4. నీటి వనరుల కొరత వలన రాబోయే రోజుల్లో ఏర్పడే ఇబ్బందులను అధిగమించేలా చూస్తుంది.
  5. నీటి సాగును, నిర్వహణను సాంప్రదాయక పద్ధతులలో జరిగేలా చూస్తుంది. నీరు అందరికి చెందినదని గ్రహించేలా చేస్తుంది.

10th Class Social Textbook Page No.65

ప్రశ్న 10.
తుంగభద్ర నదీ పరీవాహక ప్రాంతంలో నీటికి పరస్పర విరుద్ధ వినియోగాలు ఏమిటి?
జవాబు:

  1. గత కొన్ని దశాబ్దాల నుండి నీటి నిల్వ సామర్థ్యం తగ్గుతోంది.
  2. ఈ నదీ పరీవాహక ప్రాంతంలో నేలకోత ఎక్కువయ్యి సాంప్రదాయ చెరువులు, చిన్న జలాశయాలు, తుంగభద్ర జలాశయాలు పూడికకు గురి అవుతున్నాయి.
  3. అంతరాష్ట్ర జల వివాదాలు కూడా వీటిని ప్రభావితం చేస్తున్నాయి.
  4. జనాభా పెరుగుదల వలన, పారిశ్రామికీకరణ వలన కాలుష్యం పెరిగింది. వీటి మూలంగా ప్రజల జీవన ప్రమాణాలు, కొన్ని కమ్యూనిటీల జీవితాలు దెబ్బతింటున్నాయి.

10th Class Social Textbook Page No.67

ప్రశ్న 11.
నీటి అందుబాటును బట్టి వ్యవసాయ ప్రణాళిక తయారు చేయటానికి ఎటువంటి ప్రయత్నం జరిగింది?
జవాబు:

  1. భారతదేశం లాంటి దేశాలలో దాదాపు 70% నీటి వినియోగం వ్యవసాయ రంగంలోనే జరుగుతోంది. ఇది అధిక వినియోగం అని చెప్పుకోవచ్చు.
  2. ఆనకట్టలు, చెక్ డ్యామ్ లు మొదలైనవి నీటిని సద్వినియోగం చేయడానికి రైతులకు సహకరిస్తాయి. పంట దిగుబడులను అధికం చేస్తాయి.
  3. బిందు సేద్యము లాంటి ఆధునిక పద్ధతులు నీటిని మరింత సమర్థవంతంగా ఉపయోగించుకోవడానికి ఉపయోగపడతాయి.

10th Class Social Textbook Page No.58

ప్రశ్న 12.
గృహ అవసరాలకు 5% నీటిని ఉపయోగిస్తున్నారు. అయినా కానీ జనాభాలో ఎక్కువ మందికి నీళ్లు అందటం లేదు. దీని గురించి చర్చించండి.
జవాబు:

  1. నీటిని సరఫరా చేయడం అనేది ప్రభుత్వ బాధ్యత.
  2. భారతదేశంలో ప్రభుత్వం దీనికి సంబంధించి ఎన్నో ప్రయత్నాలు చేసింది.
  3. భూగర్భజల వనరులు తగ్గిపోవడం, వాటి నాణ్యత క్షీణించిపోవడం మొదలగునవి గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో నీటి సరఫరాను దెబ్బతీస్తున్నది.
  4. భూ ఉపరితల నీటి వనరులను కాలుష్యం వలన, కొరత వలన, జల వివాదాల వలన సరిగా సరఫరా చేయలేకపోతున్నారు.
  5. తీర ప్రాంతాలలో సముద్రపు నీరును ఉప్పును తొలగించి మంచినీరుగా మార్చుటకు అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి.
  6. భారతదేశంలో జనాభా పెరుగుదల, పరిశ్రమల పెరుగుదల మూలంగా నీటి అవసరాలు పెరిగాయి. దీని మూలంగా నీటి సరఫరా అనేక యిబ్బందులను ఎదుర్కొంటుంది.
  7. వీటన్నింటి రీత్యా భారతదేశంలో నదుల అనుసంధానం అత్యంత ఆవశ్యకం.

AP Board 10th Class Social Solutions Chapter 5 భారతదేశ నదులు, నీటి వనరులు

10th Class Social Textbook Page No.58

ప్రశ్న 13.
ఉపరితల నీటి వనరులలో 70% కలుషితం అయ్యా యి. కారణాలు ఏమిటి?
జవాబు:
అనేక వ్యర్థాలను నీటిలోనికి వదలడం వలన నీటి వనరులు కాలుష్యం అవుతున్నాయి. ఈ కాలుష్యం నీటిలోని మొక్కలను, జంతువులనే కాక, వాటిని ఉపయోగించే మానవులను కూడా నష్టపరుస్తోంది. ఈ కాలుష్యం పర్యావరణాన్ని దెబ్బ తీస్తున్నది.

నీటి కాలుష్యానికి కారణాలు :

  1. మురికినీరు, వ్యర్థ పదార్థాలు, చెత్త, చెదారం నీటిలో కలవటం మూలంగా నీరు విషతుల్యమవుతుంది.
  2. నీటి వనరులున్న ప్రాంతాలలో మలవిసర్జన చేయటం నీటిని కలుషితం చేస్తోంది.
  3. పారిశ్రామిక వ్యర్థాలు నీళ్ళలోకి వదలడం మూలంగా నీరు అధికస్థాయిలో కలుషితమవుతుంది.
  4. సముద్రంలో ప్రయాణం చేసే ఓడలు, ట్యాంకర్లు చమురును వదిలి ఆ నీటిని కలుషితం చేస్తున్నాయి.
  5. ఆమ్ల వర్షాల మూలంగా ఉపరితల నీరు కలుషితమవుతుంది.

10th Class Social Textbook Page No.58

ప్రశ్న 14.
భారతదేశ పటంలో హిమాలయాలను, పశ్చిమ కనుమలను గుర్తించండి.
జవాబు:
AP Board 10th Class Social Solutions Chapter 5 భారతదేశ నదులు, నీటి వనరులు 4

10th Class Social Textbook Page No.58

ప్రశ్న 15.
పటంలోని రంగుల సూచికను బట్టి నదులు పుట్టిన పర్వతాలు ఎంత ఎత్తులో ఉన్నాయో తెలుసుకోండి. అట్లాస్, ఉబ్బెత్తు భౌగోళిక పటం సహాయంతో నదీ గమనాన్ని అనుసరిస్తూ వాటి ప్రవాహ దిశను గుర్తించండి.
జవాబు:
AP Board 10th Class Social Solutions Chapter 5 భారతదేశ నదులు, నీటి వనరులు 5

10th Class Social Textbook Page No.59

ప్రశ్న 16.
అట్లాస్ సహాయంతో భారతదేశం, పాకిస్తాన్ లో సింధూనది ప్రవాహ మార్గాన్ని గుర్తించండి.
జవాబు:
AP Board 10th Class Social Solutions Chapter 5 భారతదేశ నదులు, నీటి వనరులు 6

10th Class Social Textbook Page No.59

ప్రశ్న 17.
గంగానది పటాన్ని (5.2) చూసి అది ఏ ఏ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుందో చెప్పండి.
AP Board 10th Class Social Solutions Chapter 5 భారతదేశ నదులు, నీటి వనరులు 7
గంగా, బ్రహ్మపుత్రల సంగమం
జవాబు:
గంగానది ప్రవహించే రాష్ట్రాలు :

  1. ఉత్తరాఖండ్
  2. ఉత్తరప్రదేశ్
  3. బీహార్
  4. జార్ఖండ్
  5. పశ్చిమబెంగాల్

AP Board 10th Class Social Solutions Chapter 5 భారతదేశ నదులు, నీటి వనరులు

10th Class Social Textbook Page No.59

ప్రశ్న 18.
పై పటం చూసి గంగానది ఉపనదులలో ఉత్తర దిశగా ప్రవహించేవి ఏవో, దక్షిణ దిశగా ప్రవహించేవి ఏవో చెప్పండి.
జవాబు:
ఉత్తరంగా ప్రవహించే ఉపనదులు : కోసి, గండక్, గాగ్రా, గోమతి, శారద, యమున, రామ్ గంగా నదులు.

దక్షిణంగా ప్రవహించే ఉపనదులు : సన్, రిహార్డ్, కెన్, బెట్వా, తన్నా నదులు.

10th Class Social Textbook Page No.63

ప్రశ్న 19.
భారతదేశ పటంలో తుంగభద్ర నది ప్రవాహ మార్గాన్ని గుర్తించండి.
జవాబు:
AP Board 10th Class Social Solutions Chapter 5 భారతదేశ నదులు, నీటి వనరులు 8

10th Class Social Textbook Page No.67

ప్రశ్న 20.
సవారే బజారులో నీటి సంరక్షణకు చేపట్టిన పనులను సూచించే వాక్యాల కింద గీత గీయండి.
జవాబు:
స్వయం కృత్యం.

10th Class Social Textbook Page No.67

ప్రశ్న 21.
మీకు ఇంటర్నెట్ అందుబాటులో ఉంటే హివారే బజారుకు సంబంధించిన వీడియో చిత్రాన్ని ఈ లింకులో చూడండి. http://bit.ly/koth LI
జవాబు:
స్వయం కృత్యం.

AP Board 10th Class Social Solutions Chapter 5 భారతదేశ నదులు, నీటి వనరులు

10th Class Social Textbook Page No.69

ప్రశ్న 22.
భూగర్భజలాలు అందరికీ చెందిన వనరులు – మీ అభిప్రాయాన్ని వివరించండి.
జవాబు:
భూమిమీద హక్కుకి, భూగర్భ జలాలమీద హక్కుకి సంబంధం ఉన్నప్పుడు నీటిని సక్రమంగా వినియోగించటంపై వ్యక్తిగత భూ యజమానులపై ఎటువంటి ఒత్తిడి ఉండదు. అదే విధంగా పర్యావరణానికి, విస్తృత ప్రజానీకానికి ప్రయోజనం కలిగించేలా విధానాలను అమలు చేసే మార్గమేమీ లేదు. దాదాపుగా ఎటువంటి నియంత్రణలేని ఈ వ్యవస్థలో ఒక ప్రాంతంలో ఎన్ని చేతి పంపులు, బావులు, బోరుబావులు ఉండవచ్చో నిర్ణయించే అధికారం ఎవరికీ లేదు. కాబట్టి నీటిని ప్రజలందరికీ ఉద్దేశించిన ఉమ్మడి వనరుగా పరిగణించాలి. రోడ్లు, నదులు, ఉద్యానవనాలు, అంతర్భూజలం అందరికీ చెందే ‘ప్రజా ఆస్తి’ గా భావించాలి. దీనిని ప్రస్తుతం కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తిస్తున్నాయి, కాని అంతగా విస్తృతం కాలేదు.