AP SSC 10th Class Telugu Solutions Chapter 1 మాతృభావన

AP State Board Syllabus AP SSC 10th Class Telugu Solutions 1st Lesson మాతృభావన Textbook Questions and Answers.

AP State Syllabus SSC 10th Class Telugu Solutions 1st Lesson మాతృభావన

10th Class Telugu 1st Lesson మాతృభావన Textbook Questions and Answers

ఉన్ముఖీకరణ : చదవండి – ఆలోచించి చెప్పండి

తే. సర్వతీర్ధాంబువులకంటె సమధికంబు
పావనంబైన జనయిత్రి పాదజలము
వరతనూజున కఖిలదేవతల కంటె
జనని యెక్కుడు సన్నుతాచారనిరత

ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న1.
“పావనంబైన జనయిత్రి పాదజలము” అంటే ఏమిటి?
జవాబు:
జనయిత్రి అంటే తల్లి. జన్మనిచ్చిన తల్లి సర్వదేవతల కంటే ఎక్కువ. అటువంటి తల్లి యొక్క పాదాలు కడిగిన నీరు చాలా పవిత్రమైనది. విష్ణువు పాదాల నుండి జన్మించింది గంగ. అది ఎంతో పవిత్రమైంది. అటువంటి పవిత్రత కలిగిందే తల్లి పాదాలు కడిగిన నీరు.

ప్రశ్న2.
తల్లి పాదజలం దేనికంటే గొప్పదని తెలుసుకొన్నారు? ఎందువల్ల?
జవాబు:
తల్లి పాదజలం అన్ని తీర్థాలలోని (పుణ్యనదులలోని) నీటి కంటే పవిత్రమైనదని తెలుసుకొన్నాం. ఆ నదులలోని నీరు ఆ నదీ తీరాలలోని దైవం లేదా దైవాల పాదాలకు తగలడం వల్ల అవి పవిత్రమై పుణ్యనదులుగా లెక్కింపబడతాయి. కానీ, తల్లి సమస్త దేవతల కంటే ఎక్కువ కనుక తల్లి పాదాలు కడిగిన నీరు పుణ్యనదీ జలం కంటే గొప్పది.

AP SSC 10th Class Telugu Solutions Chapter 1 మాతృభావన

ప్రశ్న3.
కుమారునికి అన్నింటికంటే ఎవరు మిన్న? ఎందుకు?
జవాబు:
కుమారునికి అంటే సంతానమందరికీ అన్నింటికంటే తల్లి యొక్క పాదాలు కడిగిన నీరు పరమ పవిత్రమైనది. ఎందుకంటే తన కడుపులో 9 నెలలు మోసి, కని, పెంచి, పోషిస్తూ, రక్షించే తల్లి దైవం కంటే గొప్పది. దైవం కనబడడు. తల్లి కనబడే దైవం. అటువంటి తల్లి యొక్క పాదాలు కడిగిన నీరు దేవుడికి అభిషేకం చేసిన నీటికంటే పవిత్రమైనది.

ప్రశ్న4.
ఈ పద్యం ద్వారా తల్లికి గల స్థానమేమిటని గ్రహించారు?
జవాబు:
మన సంప్రదాయం, మన సంస్కృతి తల్లికి అత్యున్నత స్థానమిచ్చింది. ఈ పద్యం కూడా తల్లి యొక్క మహోన్నత స్థానం గుర్తుచేసింది. ‘మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ…….’ అని ఉపనిషత్తులు కూడా తల్లికి మొదటిస్థానం ఇచ్చాయి. దైవం కంటే గొప్పదైన తల్లికి నమస్కరించాలి. ఆమె పాదజలం సంతానానికి శిరోధార్యం అని ఈ పద్యం ద్వారా గ్రహించాము.

ప్రశ్న5.
“ప్రతి స్త్రీమూర్తీ మనకు తల్లితో సమానం” అని ఎందుకంటారు?
జవాబు:
స్త్రీ లేకపోతే సృష్టి లేదు. భగవంతుడు అందరి వద్దా ఉండలేడు కనుక తనకు మారుగా తల్లిని సృష్టించాడు. ప్రతి స్త్రీలోనూ తన తల్లిని చూసుకోగలిగినవాడే మహాత్ముడు. రామకృష్ణ పరమహంస తన భార్య శారదాదేవిలో కూడా తన తల్లిని, జగన్మాతను సందర్శించి పూజించాడు. అందుచేత ప్రతి స్త్రీని తల్లిలాగా చూడాలి. గౌరవించాలి. ఆదరించాలి.

ఆలోచించి చెప్పండి

ప్రశ్న1.
‘విజయగర్వంతో నీవు చేసిన పని సరికాదని’ అనే మాటలనుబట్టి శివాజీ ఎలాంటివాడని భావిస్తున్నారు?
జవాబు:
గర్వం ప్రమాదకరం. విజయగర్వం మరీ ప్రమాదకరం. విజయం వచ్చినపుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఆ విజయగర్వంతో చాలా తప్పులు చేసే అవకాశం ఉంది. కనుక శివాజీది ఎదిగే కొద్దీ ఒదిగి ఉండే స్వభావం అని తెలిసింది. విజయం సాధించిన ప్రతిసారీ ఆత్మవిమర్శ చేసుకొనేవాడు. వినయం పెంచుకొనేవాడు. శివాజీ గర్వం లేని వీరుడు.

ప్రశ్న2.
స్త్రీలపట్ల మర్యాదగా ప్రవర్తించడం అంటే ఏమిటి?
జవాబు:
స్త్రీలు శారీరకంగా, మానసికంగా సున్నితంగా ఉంటారు. వారి మనసు బాధపడేలా మాట్లాడకూడదు. కించపరచ కూడదు. వెకిలిగా ప్రవర్తించకూడదు. వారికి చట్టపరంగా సంక్రమించవలసిన హక్కులను పొందేలా చూడడం, సహాయం చేయడం, మన తల్లి, సోదరి పట్ల ఎలా ప్రవర్తిస్తామో ప్రతి స్త్రీ పట్ల అలా ప్రవర్తించడం మర్యాద.

ప్రశ్న3.
శివాజీ కోపానికి కారణమేమిటి ? కోపంలో శివాజీ ఎలా ఉన్నాడు?
జవాబు:
ఓడిపోయిన వీరుని సో దేవుడు బంధించి తెచ్చాడు. అతనితో బాటు అతని రాణివాసాన్ని కూడా బంధించి తెచ్చాడు. రాణివాసాన్ని బంధించి తేవడమే శివాజీ కోపానికి కారణమైంది.

కోపంలో శివాజీకి కళ్లు ఎఱ్ఱబడ్డాయి. పెదవులు అదిరాయి. బొమముడి కదుల్తోంది. హుంకరిస్తున్నాడు. గర్జిస్తున్నాడు. శివాజీని చూడడానికి కూడా రాజసభ జంకింది. అంటే ప్రళయకాల రుద్రుడిలా ఉన్నాడు శివాజీ.

ప్రశ్న4.
“సరభసోత్సాహంబు కన్జప్పె” అంటే మీకేమర్థమైంది?
జవాబు:
సరభస ఉత్సాహము అంటే ఉవ్విళ్ళూరు ఉత్సాహం. అంటే ఒక విజయం సాధించినపుడు చాలా ఉత్సాహం వస్తుంది. కన్దప్పడము అంటే ఆ ఉత్సాహంలో సాధించిన విజయం తప్ప కళ్లకు ఏదీ కనబడదు. అంటే ఇతరుల బాధలు కానీ, తప్పులు కానీ, భయాలు కానీ, ఏవీ కళ్లకు కనబడవు- ఆ విజయం తప్ప.

ఆలోచించి చెప్పండి

ప్రశ్న1.
స్త్రీలను ఎవరితో పోల్చారు? ఎందుకు?
జవాబు:
స్త్రీలను సీత, సావిత్రి, అనసూయ, సుమతి మొదలైన పతివ్రతలతో పోల్చారు. స్త్రీలను దేవతావృక్షాలతో పోల్చారు. పతివ్రతా స్త్రీలు అగ్నిజ్వాలల వంటి వారన్నారు. ఎందుకంటే – రాముడు అగ్నిపరీక్ష చేశాడు. సీతాదేవి ఆ అగ్నిని పూలరాశిగా భావించింది. సీత యొక్క పవిత్రతకు అగ్ని కూడా చల్లబడింది. అంతటి మహాపతివ్రత సీత.

యమధర్మరాజును ప్రార్థించి, పోరాడి, మెప్పించి, తన భర్త సత్యవంతుని ప్రాణాలు తిరిగి తెచ్చింది సావిత్రి. యమధర్మాన్ని కూడా తన పాతివ్రత్య మహిమతో మార్చి తన భర్తను బ్రతికించుకొంది.

బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను పసిపిల్లలుగా మార్చి జోలపాడింది అనసూయ. ఈమె అత్రి మహాముని భార్య.

సూర్యోదయం అయితే భర్త మరణిస్తాడని, భర్తకు మరణం రాకుంటకు సూర్యోదయాన్ని ఆపిన మహా పతివ్రత సుమతి.

దేవతావృక్షాలు కోరిన కోరికలు తీరుస్తాయి. అవి ఉన్నచోట అశాంతి, అనారోగ్యం, ముసలితనం వంటి బాధలు ఉండవు. స్త్రీలు ఉన్న ఇల్లు కళకళలాడుతుంది. అశాంతికి అవకాశం లేదు.

AP SSC 10th Class Telugu Solutions Chapter 1 మాతృభావన

ప్రశ్న2.
స్త్రీల పట్ల సమాజంలో ఎలాంటి అభిప్రాయాలు ఉన్నాయి? దీనిపై మీ అభిప్రాయాలు తెల్పండి.
జవాబు:
స్త్రీల పట్ల సమాజంలో గౌరవ భావమే ఉన్నది. కానీ,
సమాజంలో కొంతమంది స్త్రీలను చులకనగా చూస్తారు. చదువుకోనివారు, వివేకం లేనివారు, గౌరవం లేనివారు మాత్రమే స్త్రీలను తక్కువగా చూసే ప్రయత్నం చేస్తారు. స్త్రీలు బలహీనులనే భావం కూడా కొంతమందికి ఉంది. అది తప్పు.

ప్రశ్న3.
స్త్రీల వల్ల భారత కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతున్నాయనడానికి ఉదాహరణలు తెల్పండి.
జవాబు:
స్త్రీల వలన ఏ దేశపు కీర్తి ప్రతిష్ఠలైనా పెరుగుతాయి. మన భారతదేశ స్త్రీలు అన్ని రంగాలలోనూ మగవారితో సమానంగా ఉన్నారు. యుద్ధరంగంలో రుద్రమదేవి, ఝాన్సీ లక్ష్మీబాయి, చాంద్ బీబీ మొదలైనవారు శత్రువులను గడగడలాడించారు.

రాజకీయ రంగంలో ఇందిరాగాంధీ, మీరాకుమార్, షీలాదీక్షిత్ మొదలైనవారు ధ్రువతారలు. రచనారంగంలో మొల్ల, రంగాజమ్మ మొదలైనవారు కావ్యాలు రాశారు.

మాలతీ చందూర్, యద్దనపూడి సులోచనారాణి, కోడూరి కౌసల్యాదేవి మొదలైనవారు నవలా రచయిత్రులుగా ఖ్యాతి గడించారు.

పి.టి. ఉష, అశ్వనీ నాచప్ప, కుంజరాణి, మిథాలీ రాజ్, కరణం మల్లీశ్వరి మొదలైనవారు క్రీడారంగంలో మణిపూసలు.

కస్తూరిబా గాంధీ, సరోజినీనాయుడు, దుర్గాబాయ్ దేశ్ ముఖ్ మొదలైనవారు స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నారు.

ప్రశ్న4.
“అనలజ్యోతుల………. సాగునే? ” అనే పద్యం ద్వారా మీకేమర్థమైంది?
జవాబు:
అగ్ని వంటి తేజస్సు కలవారు పతివ్రతలు, అంటే పుణ్యస్త్రీలు. తప్పుడు ఆలోచనలతో వారిని సమీపించడం కూడా తప్పు. అలా చేస్తే ఎంత గొప్పవారికైనా మరణం తప్పదు. నాశనం తప్పదు. వారి వంశం కూడా నిలబడదు.

రావణాసురుడు మహాభక్తుడు. గొప్ప పండితుడు. మహా బలవంతుడు, కానీ, సీతాదేవిని ఎత్తుకొని వచ్చాడు. తనను పెళ్ళి చేసుకోమని బాధించాడు. దాని ఫలితంగా రాముని చేతిలో మరణించాడు. యుద్ధంలో బంధువులు, స్నేహితులు అందరూ మరణించారు.

అంటే ఎంత గొప్పవారైనా స్త్రీని అవమానపరిస్తే నాశనం తప్పదని తెలిసింది.

ఆలోచించి చెప్పండి

ప్రశ్న1.
తల్లిగా గౌరవించడం అంటే ఏమిటి? ఆ ప్రవర్తన ఎలా ఉంటుంది?
జవాబు:
తల్లిని మించిన దైవం లేదు. తల్లి ప్రత్యక్ష దైవం. తొమ్మిది నెలలు కడుపులో పెట్టుకొని మోసి, కని, పెంచిన తల్లిని ఎంతగా గౌరవించినా తక్కువే. తల్లితో సమానంగా ప్రతి స్త్రీని గౌరవించాలి. ప్రతి స్త్రీలోనూ అమ్మను చూడాలి. అమ్మలోని కారుణ్యం చూడాలి. అదే, తల్లిగా గౌరవించడ
మంటే.

ప్రశ్న2.
సన్మార్గంలో నడవడం అంటే ఏమిటి? విద్యార్థులుగా మీరు చేయాల్సిన కొన్ని పనులను తెల్పండి.
జవాబు:
సన్మార్గం అంటే మంచి మార్గం. సన్మార్గంలో నడవడ మంటే చక్కని ప్రవర్తన కలిగి ఉండడం. “సాధించ వలసిన లక్ష్యమే కాదు. దానిని సాధించే మార్గం కూడా మంచిది కావాలి” అన్నాడు గాంధీజీ.. విద్యార్థులు మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. సంఘంలో చాలా చెడులు ఉన్నాయి. వాటిని సంస్కరించాలి. ప్రజలను చైతన్యపరచాలి.

చదువురాని వారికి చదవటం, రాయడం నేర్పాలి. సమాజంలో జరిగే అనేక మోసాలను గూర్చి చెప్పాలి. మన చట్టాలపై అవగాహన కల్గించాలి.

వరకట్నం ఇవ్వడం, తీసుకోవడం తప్పని చెప్పాలి. ఆరోగ్యకరమైన అలవాట్లు నేర్పాలి. పరిశుభ్రత నేర్పాలి. మన గ్రామ, రాష్ట్ర, దేశ, అంతర్జాతీయ సమస్యలపై
అవగాహన కల్గించాలి. ఓటుహక్కు వినియోగం చెప్పాలి.

AP SSC 10th Class Telugu Solutions Chapter 1 మాతృభావన

ప్రశ్న3.
“స్త్రీ రత్నముల్ పూజ్య, లేయవమానంబు ఘటింపరాదు,” అంటే ఏమిటి ?
జవాబు:
స్త్రీలు గౌరవింపదగినవారు. పూజింపతగినవారు. వారికి ఏ అవమానం జరగకూడదు. స్త్రీలను గౌరవించడం మన సంస్కారం. అది మన సంస్కృతి. అది మన విధి. వారిని మన మాటలతో గాని, ప్రవర్తనతో గాని బాధ పెట్టకూడదు.

ప్రశ్న4.
“హితసూక్తిన్ బల్కి” అంటే ఏమిటి?
జవాబు:
సు + ఉక్తి – సూక్తి అంటే మంచి మాట. హితసూక్తి అంటే ఇష్టాన్ని కలిగించే మంచి మాట. అంటే మంచి మాట అయినా ఇతరులు బాధ పడేలాగా చెప్పకూడదు. వినేవారికి సంతోషం కలగాలి. శివాజీ స్త్రీని గౌరవించాడు. సత్కరించాడు. తన వారు చేసిన తప్పును క్షమించ మన్నాడు. శత్రువీరుడిని విడిచిపెట్టాడు. అపుడు ‘హితసూక్తి’ చెప్పాడు.

I. అవగాహన – ప్రతిస్పందన

1. కింది అంశాల గురించి చర్చించండి.

అ) “ప్రస్తుతం స్త్రీలపై జరిగే దాడులకు కారణాలు – నివారణోపాయాలు”
జవాబు:
కారణాలు:
ప్రస్తుత సమాజంలో గురువుల పట్ల, పెద్దలపట్ల, తల్లిదండ్రుల పట్ల గౌరవ భావన తగ్గుతోంది. కారణాలు ఏమైనా కావచ్చును. నైతికత కూడా లోపించింది. దైవభక్తి తగ్గింది. ‘పాపం’ అనే భావన, భయం తగ్గింది. స్త్రీల పట్ల, బలహీనుల పట్ల, వృద్ధుల పట్ల బాధ్యత తగింది. దీనికి కారణం ప్రధానంగా సినిమాలు. సినిమాలలో, టి.వీ సీరియళ్ళలో స్త్రీలను అసభ్యకరంగా, కేవలం విలాసవస్తువుగా చూపిస్తున్నారు. ప్రేమికులు విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. చెడు వ్యసనాలు కూడా మితిమీరి పోయాయి. రెచ్చగొట్టే ప్రవర్తనలు కూడా కారణం. మానవుని ఆలోచనా విధానం మారిపోయింది. చట్టాలన్నా కొందరికి భయం లేదు. అందుచేతనే స్త్రీలపై దాడులు పెరుగుతున్నాయి.

నివారణోపాయాలు :
చలనచిత్రాలలో స్త్రీని ఉన్నతంగా చూపించాలి. సాహిత్యంలో కూడా స్త్రీలను అంగాంగ వర్ణన చేయకూడదు. స్త్రీల పట్ల గౌరవం పెరిగే పాఠ్యాంశాలు పెట్టాలి. ఎవరైనా స్త్రీని కించపరుస్తున్నా, అవమానిస్తున్నా చూసీ చూడనట్లు వదలకూడదు. పిల్లలకు చిన్నతనం నుంచీ మంచి మంచి కథలు చెప్పాలి. స్త్రీని మాతృమూర్తిగా చూసే భావన పెంపొందాలి. ప్రేమికులు బహిరంగ ప్రదర్శనలు మానాలి. దుర్వ్యసనాలు నిరోధించాలి. సమాజాన్ని చైతన్యపరచాలి. స్త్రీ విద్యను ప్రోత్సహించాలి. సమాజంలో సంస్కారం, నీతి పెంచాలి. స్త్రీలకు రక్షణ పెంచాలి. చట్టాలు కచ్చితంగా అమలుచేయాలి. విదేశీ విజ్ఞానం ఆర్జించాలి గాని విదేశీ సంస్కృతి, అలంకరణలు కాదు. స్త్రీలు కూడా తగిన జాగ్రత్తలు పాటించాలి. ధైర్యం పెంచుకోవాలి. ఒంటరిగా తిరగకూడదు.

AP SSC 10th Class Telugu Solutions Chapter 1 మాతృభావన

ఆ) “కుటుంబం – సమాజం అభివృద్ధిలో స్త్రీల పాత్ర”
జవాబు:
వ్యక్తులు లేనిదే కుటుంబం లేదు. కుటుంబాలు లేనిదే సమాజం లేదు. వ్యక్తిని బట్టి కుటుంబం అభివృద్ధి చెందుతుంది. కుటుంబాలను బట్టి సమాజం అభివృద్ధి చెందుతుంది.

కుటుంబమైనా, సమాజమైనా ఏర్పడాలన్నా, అభివృద్ధి చెందాలన్నా స్త్రీలది కీలకపాత్ర. “ఒక స్త్రీ విద్యావంతురాలైతే ఆ కుటుంబమంతా విద్యావంతమౌతుంది” అన్నారు జవహర్‌లాల్ నెహ్రూ. కుటుంబంలోని వ్యక్తుల ఆరోగ్యం, ఆలోచనలు, సంస్కారం అన్నీ స్త్రీల చేతిలోనే ఉంటాయి. – స్త్రీ విద్య దేశాభివృద్ధికి దిక్సూచి. దైవభక్తి, నైతికత, తెలివితేటలు, అంకిత భావన స్త్రీలకు ఎక్కువ. స్త్రీ తన కుటుంబం చల్లగా ఉండాలని, కుటుంబమంతా ఆరోగ్యంగా ఉండాలని దైవాన్ని రోజూ కోరుకుంటుంది. స్త్రీ తన ప్రాధాన్యతను కోరుకోకుండానే కుటుంబ అభివృద్ధికి కష్టపడుతుంది.

అటువంటి స్త్రీల వలన కుటుంబం, సమాజం అభివృద్ధి చెందుతుంది. ప్రతి మగవాడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుంది అని ఒక రచయిత అన్నమాట అక్షర సత్యం. “ముదితల్ నేర్వగ రాని విద్య కలదే ముద్దార నేర్పించినన్” అన్నారు. ఆధునిక కవిగారు.

‘స్త్రీలకు మగవారి కంటె తెలివి, సాహసం ఎక్కువ” అని ఆర్యోక్తి.

అందుచేత స్త్రీ నిరంతర చైతన్యానికి గుర్తు. క్లిష్ట పరిస్థితులలో కూడా తల్లిగా, సోదరిగా, భార్యగా, ……….. అనేక విధాల విశ్వరూపం ధరించి స్త్రీ కుటుంబాన్ని, సమాజాన్ని అభివృద్ధి చేస్తోంది.

2. * గుర్తుగల పద్యాలకు ప్రతిపదార్థాలు రాయండి.

పద్యం -1

శా॥ “ఆ-యేమీ ? ……….. మౌహిత్య మోర్వన్ జుమీ”
ప్రతిపదార్థం :
ఆ – యేమీ = (ఆశ్చర్యం, కోపం కలిపి) ఆ ఏమిటి ?
పుణ్య + ఆవాసమున్ = పుణ్యానికి నిలయమైన
ఒక = ఒక
రాణివాసమును = రాణివాసాన్ని
తెచ్చినావా = బందీగా తీసుకొచ్చావా?
ఏ హైందవుఁడు + ఐననూ = హైందవుడు ఎవడైనా
ఈ గతిన్ – = ఈ విధంగా
అమర్యాదన్ = మర్యాద తప్పి (మర్యాద లేకుండా)
ప్రవర్తించును + ఏ = ప్రవర్తిస్తాడా?
మా + ఆజ్ఞన్ = నా ఆజ్ఞను
గమనింపవు + ఓ = గమనించలేదా? (పట్టించుకోలేదా?)
మద + ఉన్మాదంబునన్ = గర్వం మత్తులో
రేఁగి = అతిశయించి
నీ = నీ యొక్క
ఆయుః + సూత్రములు = ప్రాణాలనే సూత్రాలు (దారాలు)
ఈవ = నీవే
త్రుంచుకొనెదు + ఓ : తెంచుకుంటావా?
ఔద్ధత్యము = ఈ తెగింపును (గర్వమును)
ఓర్వన్ + చుమీ = సహించను సుమా !

పద్యం -4

మ| శివరాజంతట …………….తప్పు సైరింపుమీ !
ప్రతిపదార్థం :
శివరాజు = శివాజీ మహారాజు
అంతటన్ = అప్పుడు
మేల్ముసుంగుఁదెరలోన్; మేల్ముసుంగు = సువాసినీ స్త్రీలు వేసుకొనే మేలు ముసుగు యొక్క (బురఖా)
జయ = (యుద్ధంలో) విజయం పొందిన
తెరలోన్ = తెరలోపల
స్నిగ్దాంబుదచ్ఛాయలోన్, (స్నిగ్ధ + అంబుద + ఛాయలోన్) = దట్టమైన
అంబుద = మేఘము యొక్క
ఛాయలోన్ = నీడలో (మాటున నున్న)
నవసౌదామినిన్ = కొత్త మెరుపు తీగను
పోలు = పోలినట్లు ఉన్న
ఆ, యవన కాంతారత్నమున్ = ఆ రత్నము వంటి యవనకాంతను (మహమ్మదీయ స్త్రీని)
భక్తి గౌరవముల్ = భక్తియునూ, గౌరవమునూ
పాఱగన్ + చూచి = స్ఫురించేటట్లు చూసి
పల్కెన్ = ఈ విధంగా అన్నాడు
వనితారత్నంబులు = రత్నముల వంటి స్త్రీలు (శ్రేష్ఠులైన స్త్రీలు)
ఈ = ఈ
భవ్య హైందవ భూ జంగమ పుణ్యదేవతలు; భవ్య = శుభప్రదమైన
హైందవ భూ = భారత భూమిపై
జంగమ = సంచరించే (తిరుగాడే)
పుణ్యదేవతలు = పుణ్యప్రదమైన దేవతల వంటివారు
మాతా! = అమ్మా
తప్పున్ = మా వారు చేసిన తప్పును
సైరింపుమీ = మన్నింపుము (క్షమింపుము)

పద్యం -6

మ|| అనలజ్యోతుల ………… దుశ్చారిత్రముల్ సాగునే?
ప్రతిపదార్థం :
అనల జ్యోతులన్ = అగ్ని జ్వా లల వంటి,
ఈ పతివ్రతలన్ – ఈ పతివ్రతలను
పాపాచారులై (పాప + ఆచారులు + ఐ) = అపచారం చేసేవారై
డాయు = కలిసే
భూజనులు + ఎల్లన్ = భూమి పైనున్న ప్రజలు అందరునూ
నిజ సంపదల్ = తమ సంపదలను
తొఱగి = వీడి (పోగొట్టుకొని)
అసద్వస్తులై (అసద్వస్తులు + ఐ) = సర్వ నాశనమైనవారై
పోరె = పోకుండా ఉంటారా?
విత్తనమే – విత్తనము (వారి వంశవృక్షం
యొక్క విత్తనం)
నిల్చునె = నిలుస్తుందా? (అనగా వంశం నిలుస్తుందా?)
మున్ను = పూర్వం
పులస్త్య బ్రహ్మ సంతానమున్ = పులస్త్య బ్రహ్మ యొక్క కుమారుడైన రావణుని గూర్చి
ఎఱుంగమై = మనకు తెలియదా?
హైందవ భూమిని – భారత భూమియందు
ఈ పగిది = ఇటువంటి
దుశ్చరిత్రముల్ = చెడు పనులు (దుశ్చర్యలు)
సాగునే = సాగుతాయా? (సాగవు)

పద్యం -8

శా॥ మా సర్దారుఁడు ………….. దాల్ని సారింపుమీ!
ప్రతిపదార్థం :
మా సర్దారుడు = మా సర్దార్ సోన్ దేవుడు బ
తొందరన్ బడి = తొందరపాటుపడి
అసన్మార్గంబునన్ (అసత్ + మార్గంబునన్) = తప్పుడు మార్గంలో
పోయెన్ = వెళ్ళాడు (పొరపాటున నిన్ను బంధించి తెచ్చాడు)
ఈ దోసంబున్ = ఈ దోషాన్ని
కని = చూచి
నొచ్చుకోకు = బాధపడకు
ఇప్పుడే = ఇప్పుడే
నినున్ = నిన్ను
నీ గృహంబున్ = నీ ఇంటిని (నీ ఇంటికి)
చేరున్ = చేరుస్తాను
నా సైన్యంబున్ = సైన్యాన్ని
తోడుగాన్ = నీకు సాయంగా
పనిచెదన్ = పంపిస్తాను
నా తల్లిగాన్ = నా యొక్క తల్లివలెనూ
తోడుగాన్ = నా తోడబుట్టిన సోదరిగానూ
దోసిళ్లన్ = (నా) అరచేతులపై
నడిపింతున్ = నడిపిస్తాను (నిన్ను కాలుక్రింద పెట్టకుండా నా అరచేతులపై సగౌరవంగా నడిపించి మీ ఇంటికి పంపిస్తాను)
నీ కనులయందున్ = నీ కళ్లల్లో
తాల్మిన్ = ఓర్పును
సారింపుమీ = ప్రసరింప చెయ్యి (చూపించుము)

3. పాఠం ఆధారంగా కింది ప్రశ్నలకు జవాబులు రాయండి.

అ) శివాజీ కొలువులోని వారంతా నిశ్చేష్టులవడానికి కారణం ఏమిటి?
జవాబు:
సో దేవుడు విజయోత్సాహంతో ఉన్నాడు. ఓడిపోయిన వీరుని, అతని రాణివాసాన్ని బంధించి తీసుకొని వచ్చాడు. పుణ్యవాసమైన రాణివాసాన్ని బంధించి తెచ్చినందుకు శివాజీకి చాలా కోపం వచ్చింది. ఏ హిందువుడూ ఆ విధంగా ప్రవర్తించడన్నాడు. తన ఆజ్ఞ పట్టించుకోలేదని ఆగ్రహించాడు. సో దేవుడు తన ప్రాణాలు తానే పోగొట్టుకొంటున్నాడని హెచ్చరించాడు. గర్వాన్ని సహించనన్నాడు.

శివాజీ కళ్లు ఎఱ్ఱబారాయి. పెదవులు కోపంతో వణికాయి. కనుబొమ్మలు కదిలాయి. ఆయన హుంకరించాడు. కోపంతో గర్జించాడు. ఈ పరిస్థితికి శివాజీ కొలువులోని వారంతా భయపడ్డారు. నిశ్చేష్టులయ్యారు.

AP SSC 10th Class Telugu Solutions Chapter 1 మాతృభావన

ఆ) సోన్ దేవుడు శివాజీని ఎలా శాంతపరిచాడు?
జవాబు:
సోన్ దేవుడు ఛత్రపతి శివాజీ ఆజ్ఞననుసరించి రాణివాసపు బంధనాలు తొలగించాడు. వారిని తీసుకొని వచ్చినందుకు తనను క్షమించమని కోరాడు. ఓడిపోయిన వీరుడిని తెచ్చే విజయోత్సాహం కళ్లకు క్రమ్మేసిందని అన్నాడు. చెడు ఆలోచన లేదన్నాడు. చక్రవర్తి పాదాల సాక్షిగా చక్రవర్తి ఆజ్ఞను ధిక్కరించే గర్వం లేదన్నాడు. ఈ మాటలు విన్న శివాజీ కొద్దిగా శాంతించాడు.

ఇ) భారతదేశ భాగ్య కల్పలతలని శివాజీ ఎవరిని, ఎలా కీర్తించాడు?
(లేదా)
భారతదేశ భాగ్య కల్పలతలుగా ఎవరెవరిని ఏ విధంగా శివాజీ ప్రస్తుతించాడో రాయండి.
జవాబు:
స్త్రీలను భారతదేశపు దేవతావృక్షాలని శివాజీ కీర్తించాడు. హరిహరబ్రహ్మలను చంటి పిల్లలుగా చేసిన అనసూయను కీర్తించాడు. యమధర్మరాజు పాశాన్ని తెంచి పతిప్రాణాలు కాపాడిన సావిత్రిని పావన చరిత్రగా నుతించాడు. అగ్నిని పూలరాశిగా భావించిన సీతామాతను సాధ్వీమతల్లిగా సన్నుతించాడు. భర్త ప్రాణాల కోసం సూర్యోదయాన్ని ఆపుచేసిన సుమతిని పుణ్యాలపంటగా ప్రశంసించాడు. పుట్టినింటికి, మెట్టినింటికి కీర్తి ప్రతిష్టలు పెంచే పుణ్యసతులను స్తుతించాడు.

ఈ) శివాజీ యవన కాంత పట్ల చూపిన ఆదరాభిమానాలు ఎటువంటివి?
జవాబు:
ఛత్రపతి శివాజీ మేలిముసుగులోని యవన కాంతను చూశాడు. భక్తి, గౌరవాలతో ఆమెతో మాట్లాడాడు. స్త్రీలు హిందూదేశ వాసులకు దేవతలు అన్నాడు. తల్లీ! తప్పు క్షమించు అని వేడుకొన్నాడు.

హరిహరబ్రహ్మలను పురిటి బిడ్డలుగా చేసిన అనసూయ మా భారతదేశపు గృహిణి అన్నాడు. యమధర్మరాజును ఎదిరించి పతి ప్రాణాలు సంపాదించిన సావిత్రి పావన చరిత్ర కలది అన్నాడు. అగ్నిని పూలరాశిగా భావించి నడయాడిన సీత మా సాధ్వీమతల్లి అన్నాడు. పతికోసం సూర్యోదయాన్ని ఆపిన సుమతి పుణ్యాలపంట అన్నాడు. పుట్టినింటికి, అత్తవారింటికి పేరు తెచ్చే స్త్రీలు దేవతావృక్షాల వంటివారన్నాడు.

స్త్రీలను బాధిస్తే మరణం, నాశనం తప్పదన్నాడు. రావణాసురుని ఉదాహరించాడు. నీవు నన్ను కనని తల్లినన్నాడు. ఇప్పుడే పుట్టింటి మర్యాదతో నీ ఇంటికి చేరుస్తానన్నాడు. బంధించబడిన ఆమె భర్తను కూడా విడిచిపెట్టాడు. ఇద్దరినీ సాదరంగా వారి ఇంటికి సాగనంపాడు.

II. వ్యక్తికరణ-సృజనాత్మకత

1. క్రింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో సమాధానాలు రాయండి.

అ) సో దేవుని మనస్తత్వాన్ని గురించి పాఠం ఆధారంగా సొంతమాటల్లో రాయండి.
జవాబు:
రాణివాసాన్ని సో దేవుడు బంధించి తెచ్చినందుకు శివాజీ ఆగ్రహించాడు. వెంటనే వారిని విడిపించి తీసుకొని రమ్మని శివాజీ ఆజ్ఞాపించాడు. శివాజీ ఆజ్ఞానుసారం సో దేవుడు రాణివాసాన్ని వెంటనే బంధనాలు తొలగించి తీసుకొని వచ్చాడు.

దీనిని బట్టి శివాజీ ఆజ్ఞను వెంటనే అమలు జరిపే నమ్మినబంటు సో దేవుడని తెలుస్తోంది. ముందు వెనుకలు ఆలోచించకుండా రాజభక్తితో రాజాజ్ఞను అమలు జరిపే మనస్తత్వం కలవాడు సో దేవుడు. సో దేవునకు స్వామిభక్తి ఎక్కువ.

“దేవా! నన్ను మన్నించు. ఈ వీరుడిని బంధించిన విజయం నా కళ్లకు కప్పింది. చెడు ఆలోచన లేదు. తమ ఆజ్ఞను ఉల్లంఘించే గర్వం లేదు. మీ పాదాల సాక్షిగా కావాలని తప్పుచేయలేదు” అన్నాడు సో దేవుడు శివాజీతో.

పై మాటలను బట్టి తను తప్పుచేస్తే సో దేవుడు క్షమార్పణ కోరతాడు. ఆత్మ విమర్శ చేసుకొని తన తప్పునకు కారణం తెలుసుకొంటాడు. సిగ్గుపడకుండా దానిని చెబుతాడు. అహంకారం లేదు. గర్వం లేదు. నిజాయితీ కలవాడు. నిర్భయంగా నిజం చెబుతాడు. మంచి స్వభావం గల సైన్యాధికారి. కొంచెం తొందరపాటు గలవాడు. తనను తాను సరిచేసుకుంటాడు.

ఆ) శివాజీ రాజై ఉండీ తన వద్దకు బందీగా తెచ్చిన యవన కాంతతో “మాతా! తప్పు సైరింపుమీ!” అన్నాడు. దీనిమీద మీ అభిప్రాయాలేమిటి?
జవాబు:
శివాజీకి స్త్రీలంటే గౌరవం ఎక్కువ. స్త్రీలకు అవమానం జరిగితే సహించలేడు. దీనికి కారణం శివాజీ చిన్నతనం నుండి వినిన మంచి కథలు కావచ్చును. వాళ్ల అమ్మగారు పురాణ కథలు చెప్పి ఉండవచ్చును. మన భారతీయ సాహిత్యం చదివి ఉండవచ్చును. అందుచేతనే ఆ యవన కాంతను ‘అమ్మా!’ అని సంబోధించాడు. తను చదివిన ఉత్తమమైన సాహిత్యం అతనికి ఆ సంస్కారం నేర్పింది. అందుకే తను రాజునని కూడా మరచిపోయాడు. అహంకారం ప్రదర్శించలేదు. తన వలన తప్పు జరిగిందని తెలుసుకొన్నాడు. అందుకే క్షమార్పణ కోరాడు. అది శివాజీ ఉత్తమ సంస్కారానికి నిదర్శనం.

ఇ) మీ తోటి బాలికలను మీరెలా గౌరవిస్తారు?
జవాబు:
మా తోటి బాలికలను మాతో సమానంగా గౌరవిస్తాం. కలసి ఆడుకొంటాం. చదువుకొంటాం. అల్లరి చేస్తాం. పాఠాలు వింటాం. ఆడపిల్లలను అగౌరవించం. సహాయం చేస్తాం. మా అక్కచెల్లెళ్లలా భావిస్తాం. ఏ అమ్మాయిలోనైనా మా అక్కనో, చెల్లినో చూస్తాం. ఎవరైనా అమ్మాయిల్ని అగౌరవపరిస్తే సహించం. కించపరిస్తే ఊరుకోం. ఆకతాయిలెవరైనా అల్లరి పెడితే, అందరం కలిసి బుద్ధి చెబుతాం. అమ్మాయిలు ధైర్యంగా ఉండేలాగా చేస్తాం. వారికి అన్నదమ్ములు లాగా తోడు నీడ ఔతాం.

2. క్రింది ప్రశ్నలకు పదేసి వాక్యాల్లో సమాధానాలు రాయండి.

అ) మీ పాఠం ఆధారంగా శివాజీ వ్యక్తిత్వాన్ని విశ్లేషించండి.
(లేదా)
మీ పాఠంలో శివాజీ ప్రవర్తనను బట్టి ఆయన వ్యక్తిత్వాన్ని విశ్లేషించండి.
(లేదా)
‘పరస్త్రీలను కన్నతల్లిలాగా చూడాలి’ అని సర్దారులను ఆదేశించిందెవరు? ఆ మహావీరుని యొక్క వ్యక్తిత్వాన్ని విశ్లేషించండి.
(లేదా)
పరస్త్రీని తల్లిగా భావించడమనేది మన సంప్రదాయం . ఆ సంప్రదాయాన్ని చక్రవర్తియైన శివాజీ కొనసాగించాడు కదా ! “మాతృభావన” పాఠం ఆధారంగా ఆయన వ్యక్తిత్వాన్ని విశ్లేషించండి.
జవాబు:
శివాజీ వ్యక్తిత్వము : వ్యక్తిత్వం అంటే, మాటలకూ చేతలకూ తేడా లేనితనం.
1) ధర్మమూర్తి :
శివాజీ ధర్మప్రభువు. ఇతడు శత్రు దుర్గాలపై దండయాత్రకు పోయినప్పుడు, అక్కడ స్త్రీలకు హాని చేయవద్దని తన సర్దారులను ఆజ్ఞాపించేవాడు.

2) తప్పు చేస్తే శిక్ష :
సో దేవుడు కళ్యాణి దుర్గాన్ని జయించినా, రాణివాస స్త్రీని బంధించాడని, అతడిపై కోపించి ప్రాణం తీస్తానని శివాజీ హెచ్చరించాడు.

3) పశ్చాత్తాపం కలవాడు :
యవనకాంతను విడిపించి, తన సర్దారు తప్పు చేశాడనీ, అందుకు తన్ను మన్నించమనీ కోరి, ఆమెను పూజించి మర్యాదగా ఆమెను ఇంటికి పంపాడు.

4) క్షమామూర్తి :
సో దేవుడు తాను కావాలని తప్పు చేయలేదనీ, కోటను జయించిన ఉత్సాహంతో తాను తప్పు చేశాననీ, తన్ను మన్నించమని కోరగా, శివాజీ అతడిని క్షమించి విడిచాడు.

5) స్త్రీలపై గౌరవం :
పతివ్రతలు భూలోకంలో తిరిగే పుణ్య దేవతలని శివాజీ భావన. పతివ్రతలు భారత భాగ్య కల్పలతలని శివాజీ మెచ్చుకున్నాడు. స్త్రీలు అగ్నిజ్వాలలవంటి వారని, అపచారం చేస్తే వారు నశిస్తారనీ శివాజీ నమ్మకం.

6) తప్పును సరిదిద్దడం :
ధర్మ ప్రభువైన శివాజీ, యవనకాంతను విడిపించి, ఆమెను గౌరవించి, తన సర్దారు చేసిన తప్పును సరిదిద్దాడు. శివాజీ ఈ విధంగా గొప్ప వ్యక్తిత్వం కలవాడు.

AP SSC 10th Class Telugu Solutions Chapter 1 మాతృభావన

ఆ) “స్త్రీ రత్నములు పూజ్యలు” అన్న శివాజీ మాటలను మీ సొంత అనుభవాల ఆధారంగా సమర్థించండి.
జవాబు:
స్త్రీ రత్నములు అంటే ఉత్తమ స్త్రీలు. వారు పూజింపదగినవారు అని శివాజీ చెప్పాడు. ఆ మాట సత్యమైనది.
నా సొంత అనుభవాలు :
1) ఒకసారి గోదావరిలో స్నానం చేస్తున్నాను. నా పక్కన కళాశాల ఆడపిల్లలు కూడా స్నానాలు చేస్తున్నారు. ఆడపిల్లలను ఆ తడి బట్టలలో చూసి, కొందరు ఆకతాయిలు వారిని ఆటపట్టిస్తున్నారు. నేను వెంటనే వారితో తగవు పెట్టుకున్నాను. గట్టున ఉన్న పోలీసును పిలిచాను. అల్లరి పిల్లలు వెంటనే పారిపోయారు. కాలేజీ బాలికలు నన్ను గౌరవంగా చూశారు.

2) మా గ్రామంలో ఒక వితంతువు ఉంది. ఆమె చాలా మంచిది. ఆమెను గ్రామంలో కొందరు దుషులు మాటలతో వేధిస్తున్నారు. ఆమె తన గోడును మా అమ్మగారి దగ్గర చెప్పుకొని ఏడ్చేది. నేనూ మా అమ్మగారూ, ఆ విషయాన్ని మా నాన్నగార్కి చెప్పాం. మా నాన్నగారు ఆ గ్రామ సర్పంచి. విషయము మా నాన్నగారి దృష్టికి రాగానే, ఆయన అల్లరిచేస్తున్న వారిని గట్టిగా హెచ్చరించారు.

స్త్రీ రత్నాలు పూజ్యలన్న శివాజీ అభిప్రాయాన్ని మగవారు 70దరూ గ్రహించి నడచుకోవాలి.

3. కింది అంశాల గురించి సృజనాత్మకంగా ప్రశంసిస్తూ రాయండి.

అ) పాఠ్యాంశాన్ని “ఏకాంకిక” లేదా శివాజీ ఏకపాత్ర రూపంలో రాసి ప్రదర్శించండి.
జవాబు:
(స్త్రీ మూర్తి (ఏకాంకిక)
పాత్రలు – శివాజీ, సో దేవుడు, భటులు, శత్రువీరుడు, అతని భార్య.
దృశ్యం -సభ. (శివాజీ ఒంటరిగా కూర్చొని ఉంటాడు.)

శివాజీ : (తనలో) ఆహా! ఈ ప్రకృతి ఎంత బాగుంది? ఈ పైరగాలి అమ్మ పాడే జోలపాటలా హాయిగా ఉంది. ఈ రోజెందుకో చాలా ఆనందంగా ఉంది.

భటుడు : (ప్రవేశిస్తూ) రాజాధిరాజ! రాజమార్తాండ! మహారాజా! సార్వభౌమా! ఛత్రపతి గారికి జయము! జయము!’

శివాజీ : ఏమది?

భటుడు : ఆ ప్రభూ!

శివాజీ : ఊ…..

భటుడు : తమ ఆజ్ఞానుసారం కళ్యాణి దుర్గం జయించారు. శ్రీ సో దేవుడు గారు తమ దర్శనానికి వేచి ఉన్నారు.

శివాజీ : (నవ్వుతూ) చాలా మంచి మాట చెప్పావు. వెంటనే ప్రవేశపెట్టు.

సోన్ దేవుడు : జయము ! జయము ! మహారాజా!

శివాజీ : మన పౌరుషం రుచి చూపించారు. యుద్ధ విశేషాలు చెప్పండి. దుర్గం లొంగదీసుకోవడం కష్టమైందా? తొందరగా చెప్పండి.

సోన్ దేవుడు : మన బలగాలను చూసేసరికి ఆ సర్దారు ఠారెత్తిపోయాడు. అయినా గట్టిగా ప్రతిఘటించాడు.

శివాజీ : చివరకు మరణించాడా? లొంగిపోయాడా?

సోన్ దేవుడు : లొంగిపోయాడు.

శివాజీ : (పకపక నవ్వుతూ) శభాష్, ఇది నా కల. (మీసాలు మెలివేస్తూ) ఇక మనకు ఎదురు లేదు. ఇదిగో ఈ వజ్రాలహారం స్వీకరించండి.

సోన్ దేవుడు : మహా ప్రసాదం. మహారాజా! బందీలను ప్రవేశపెట్టమంటారా?

శివాజీ : బందీలా? అంటే సైన్యాన్ని కూడా బంధించారా?

సోన్ దేవుడు : ఆ సర్దారను, రాణివాసాన్ని కూడా బంధించి తెచ్చాం మహారాజా!

శివాజీ : (కోపంగా) ఆ … ఏమిటీ పుణ్యావాసమైన రాణివాసాన్ని బంధించి తెచ్చావా? ఏ భారతీయుడైనా ఇలా చేస్తాడా? మా ఆజ్ఞ లెక్కలేదా? నీ ప్రాణాలు నీవే పోగొట్టుకొంటావా? గర్వాన్ని సహించను.

సోన్ దేవుడు : అదికాదు ప్రభూ! నేను చెప్పేది వినండి దేవా!

శివాజీ : (చాలా కోపంతో) చేసినది చాలు. ఇప్పటికైనా వాళ్లను బంధ విముక్తులను చేసి, ప్రవేశ పెట్టండి.

సోన్ దేవుడు : (రాణిని ప్రవేశపెట్టి) ప్రభూ! నన్ను క్షమించండి. విజయోత్సాహంతో తప్పు చేశాను. ‘నాకు చెడు ఆలోచన లేదు. తమ ఆజ్ఞను ఉల్లంఘించే గర్వం లేదు. మీ పాదాల సాక్షిగా తప్పు చేయలేదు.

శివాజీ : (శాంతించి, రాణి వైపు తిరిగి) : అమ్మా! మాకు స్త్రీలు ఈ భూమిపై తిరిగే దేవతలు. తల్లీ! మా తప్పును మన్నించు.

రాణి : మీ తప్పు లేదు. స్త్రీగా పుట్టడం నేను చేసిన తప్పు.

శివాజీ : అలా అనకమ్మా! హరిహరబ్రహ్మలను పురిటిబిడ్డలను చేసిన అనసూయ మహా పతివ్రత. యమధర్మరాజును ఎదిరించి తన భర్త ప్రాణాలు తెచ్చిన సావిత్రి పావన చరిత్ర కలది. అగ్నిరాశిని పూలరాశిగా భావించిన సీత మహాసాధ్వి. భర్త జీవించడం కోసం సూర్యోదయం ఆపిన సుమతి పుణ్యాల పంట.

రాణి : అది పురాణ కాలం.

శివాజీ : అలాంటి వారు ఎంతోమంది భరతమాత బిడ్డలు ఇప్పటికీ ఉన్నారు. ఇటువంటి పుణ్యసతులు ఎంతోమంది పుట్టినింటికి, మెట్టినింటికి పేరు తెస్తున్నారు.

రాణి : ఎంత పేరు తెచ్చినా మాకు అవమానాలు తప్పడంలేదు.

శివాజీ : లేదమ్మా! స్త్రీలను అవమానించిన వారెవరికీ వంశం నిలబడదు. నాశనం తప్పదు. రావణాసురుడు నాశనం కాలేదా? నీవు నా తల్లివమ్మా! నిన్నూ, నీ భర్తనూ సగౌరవంగా పంపుతాను.

సర్దారు : మీరు మంచివారని విన్నాం. కానీ, ఇంతమంచి వారనుకోలేదు.

శివాజీ : పుణ్యస్త్రీల ఆశీస్సులే మా అభివృద్ధికి కారణం.

ఆ) ఈ పాఠం ఆధారంగా స్త్రీల పట్ల మనం ఎలా ప్రవర్తించాలో, మన బాధ్యతలు ఏమిటో తెలిపేలా నినాదాలు /సూక్తులు రాయండి.
జవాబు:

నినాదాలు : సూక్తులు :
1) స్త్రీలకు రక్షణ కావాలి. స్త్రీలను బాధించే వారికి శిక్షలు పెరగాలి. 1) తల్లిని మించిన దైవం లేదు.
2) మీ అమ్మ కూడా స్త్రీయే. ప్రతి స్త్రీ మీ అమ్మవంటిదే! 2) తల్లి మొదటి గురువు.
3) అమ్మ లేకుంటే సృష్టిలేదు. అమ్మతనం లేకుంటే మనుగడ లేదు. 3) స్త్రీ ఓర్పులో భూమాత వంటిది.
4) స్త్రీలను గౌరవించు, గౌరవంగా జీవించు. 4) స్త్రీలకు జాలి ఎక్కువ.
5) స్త్రీల సంతోషం సంపదలకు స్వాగతం. 5) స్త్రీ విద్య ప్రగతికి సోపానం.

భాషా కార్యకలాపాలు ప్రాజెక్టు పని

* స్త్రీల అభ్యున్నతికి కృషి చేసిన సంస్కర్తల వివరాలు సేకరించి ప్రదర్శించండి.
జవాబు:
స్త్రీల అభ్యున్నతికి కృషి చేసిన సంస్కర్తల వివరాలు :
1) రాజారామమోహన్ రాయ్ :
AP SSC 10th Class Telugu Solutions Chapter 1 మాతృభావన 13
ఇతడు భారతదేశంలో బెంగాలు రాష్ట్రంలో జన్మించాడు. ‘సతీసహగమనము’ అనే దురాచార నిర్మూలనకు కృషిచేసి, విలియం బెంటింక్ ద్వారా నిషేధ చట్టాన్ని చేయించాడు.

2) వీరేశలింగం పంతులు :
AP SSC 10th Class Telugu Solutions Chapter 1 మాతృభావన 14
విధవా పునర్వివాహములను ప్రోత్సహించాడు. స్త్రీలకు పాఠశాలలు ఏర్పాటు చేశాడు. స్త్రీలకు విద్యాభివృద్ధికై ‘సతీహితబోధిని’ పత్రిక స్థాపించాడు.

3) జ్యోతిరావుఫూలే :
AP SSC 10th Class Telugu Solutions Chapter 1 మాతృభావన 15
ఈయన పునా(పూణె)లో జన్మించాడు. స్త్రీ చదువుకుంటేనే కుటుంబం బాగుపడుతుందని భార్య సావిత్రికి చదువు చెప్పి, ఆమెను మొదటి పంతులమ్మను చేశాడు. తన సొంత డబ్బుతో ఆడపిల్లల కోసం బడి పెట్టాడు.

4) గురజాడ వెంకట అప్పారావు :
AP SSC 10th Class Telugu Solutions Chapter 1 మాతృభావన 16
ఈయన ఆంధ్రదేశంలో విజయనగరం జిల్లావాడు. సమాజంలో ఉన్న ‘కన్యాశుల్కం’ అనే దురాచారాన్ని పోగొట్టడానికి “కన్యాశుల్కం” అనే నాటకాన్ని రచించాడు.

5) కనుపర్తి వరలక్ష్మమ్మ :
AP SSC 10th Class Telugu Solutions Chapter 1 మాతృభావన 17
ఈమె భర్త ప్రోత్సాహంతో “స్త్రీ హితైషిణీ మండలి”ని స్థాపించి, స్త్రీ విద్యను ప్రోత్సహించింది. స్త్రీలకు ఓటుహక్కు కోసం ప్రయత్నించింది.

6) దుర్గాబాయి దేశ్ ముఖ్ :
AP SSC 10th Class Telugu Solutions Chapter 1 మాతృభావన 18
ఈమె మద్రాసు, హైదరాబాదు నగరాలలో ఆంధ్ర మహిళాసభ ద్వారా స్త్రీలకు పాఠశాలలు, కళాశాలలు స్థాపించింది. స్త్రీలకు నర్సింగ్, కుట్టుపని వంటి వాటిలో శిక్షణ ఇప్పించింది.

(లేదా)

వివిధ రంగాలలో ప్రసిద్ధిగాంచిన స్త్రీల వివరాలను సేకరించి ప్రదర్శించండి.
జవాబు:
1) ఝాన్సీ లక్ష్మీబాయి : స్వాతంత్ర్య ఉద్యమంలో కత్తిపట్టి బ్రిటిష్ వారితో పోరాడి ప్రాణాలు కోల్పోయింది.

2) ఇందిరాగాంధీ : సుమారు 17 సంవత్సరాలు భారతదేశ ప్రధానమంత్రిగా పనిచేసింది.

3) సునీతా విలియమ్స్ : భారత సంతతికి చెందిన అమెరికా అంతరిక్ష పరిశోధకురాలు.

4) మార్గరెట్ థాచర్ : బ్రిటన్ ప్రధానమంత్రి.

5) శ్రీమతి భండారునాయకే : శ్రీలంక అధ్యక్షురాలు.

6) – సరోజినీ నాయుడు : స్వరాజ్య సమరంలో పాల్గొంది.

7) కల్పనా చావ్లా : అంతరిక్షంలో ఎగిరిన మహిళ

8) దుర్గాబాయి దేశ్ ముఖ్ : మహిళాభివృద్ధికి కృషి చేసింది.

9) సానియా మీర్జా గొప్ప టెన్నిస్ క్రీడాకారిణి.

10) సైనానెహ్వాల్ : బ్యాడ్మింటన్ క్రీడాకారిణి.

11) సావిత్రీబాయి ఫూలే : స్త్రీలకు విద్య నేర్పడం – సమాజ సేవ.

12) కరణం మల్లేశ్వరి . : సుప్రసిద్ధ వెయిట్ లిఫ్టర్ (ఒలింపిక్ పతక గ్రహీత)

III. భాషాంశాలు

పదజాలం

1. కింది పర్యాయపదాలకు సంబంధించిన పదాన్ని పాఠంలో గుర్తించి గడిలో రాయండి.

అ) …………… – ఆదేశము, ఆన, ఉత్తరువు, నిర్దేశము.
ఆ) …………… – అక్షి, చక్షువు, నేత్రము, నయనము.
ఇ) …………… – అగ్ని, వహ్ని, జ్వలనుడు.
ఈ) …………… – మగువ, కొమ్మ, ఇంతి, పడతి
జవాబు:
అ) ఆజ్ఞ
ఆ) కన్ను
ఇ) అనలము
ఈ) సతి

2. కింది ఆధారాలను బట్టి గళ్ళను పూరించండి.
AP SSC 10th Class Telugu Solutions Chapter 1 మాతృభావన 1

అడ్డం : నిలువు :
1. సీతకు అగ్నిగుండం కూడా ఇలా ఉంటుంది (4) 2. సోన్ దేవుడు దీన్ని బంధించాడనే శివాజీ కోపించింది (4)
4. ‘అంబుదం’ దీన్నే ఇలా కూడా అంటారు (2) 6. రావణుని తాత (4)
3. శివాజీ గౌరవించిన కాంత వంశం (3) 7. యవన కాంత స్వస్థలం (4)
5. సావిత్రి చరిత్ర విశేషణం (3) 8. సోన్ దేవుని మదోన్మాదానికి కారణం (2)
6. పాపం కాదు పుణ్యానికి నిలయం (4) 11. శివాజీని సో దేవుడు పిలిచినట్లు మీరూ పిలవండి (2)
9. కుడివైపు నుండి సీతకు మరో పేరు (3) 13. శీర్షాసనం వేసిన త్వరితం, వేగం (2)
10. కుడివైపు నుండి శివాజీ కోపించిన సేనాని (4)
12. ఈ పాఠం కవి ఇంటి పేరు (4)
14. పాఠంలో శివాజీ తొలిపలుకు (1)

AP SSC 10th Class Telugu Solutions Chapter 1 మాతృభావన 2

3. కింది ప్రకృతులకు సరైన వికృతులను జతపరచండి.
వికృతి

ప్రకృతి వికృతి
అ) రాజ్జి 1) ఆన
ఆ) ఆజ్ఞ 2) రతనము
ఇ) ఛాయ 3) బత్తి
ఈ) రత్నము 4) రాణి
ఉ) భక్తి 5) చాయ

జవాబు:

ప్రకృతి వికృతి
అ) రాజ్జి 4) రాణి
ఆ) ఆజ్ఞ 1) ఆన
ఇ) ఛాయ 5) చాయ
ఈ) రత్నము 2) రతనము
ఉ) భక్తి 3) బత్తి

4. ఈ కింది పదాలకు వ్యుత్పత్యర్థాలు రాయండి.
శివుడు : సాధువుల హృదయాన శయనించి ఉండువాడు, మంగళప్రదుడు (ఈశ్వరుడు)
పతివ్రత : పతిని సేవించుటయే వ్రతంగా కలిగినది (సాధ్వి)
పురంధి : గృహమును ధరించునది (గృహిణి)
అంగన : చక్కని అవయవముల అమరిక కలది (అందగత్తె)

AP SSC 10th Class Telugu Solutions Chapter 1 మాతృభావన

5. ఈ కింది పదాలకు నానార్థాలు రాయండి.
వాసము : ఇల్లు, వస్త్రం
సూత్రము : నూలిపోగు, తీగె, త్రాడు
చరణము : పాదము, కిరణము, పద్యపాదము
హరి : యముడు, సింహము, ఇంద్రుడు
రత్నము : మణి, స్త్రీ, ముంత

6. కింది పదాల్లోని ప్రకృతి – వికృతి పదాలను వేరుచేసి రాయండి.
AP SSC 10th Class Telugu Solutions Chapter 1 మాతృభావన 3

ప్రకృతి వికృతి
గౌరవము గారవము
పుణ్యము పున్నెం
రాశి రాసి
అంబ అమ్మ
దోషము దోసము
బ్రహ్మ బమ్మ
జ్యోతి జోతి
గృహము గీము
భాగ్యము బాగ్గెము

వ్యాకరణాంశాలు

1. కింది పదాలు పరిశీలించండి. వాటిలో సవర్ణదీర్ఘ గుణ, వృద్ధి సంధులున్నాయి. గుర్తించి, విడదీసి సూత్రాలు రాయండి.
అ) పుణ్యావాసము
ఆ) మదోన్మాదము
ఇ) స్నిగ్గాంబుద
ఈ) సరభసోత్సాహం
ఉ) గుణోద్ధత్యం
ఊ) రసైకస్థితి

అ) సవర్ణదీర్ఘ సంధి
సూత్రము ‘అ, ఇ, ఉ, ఋ లకు అవే (సవర్ణ) అచ్చులు పరములయినచో వానికి దీర్ఘములు వచ్చును.
అ) పుణ్యవాసము = పుణ్య + ఆవాసము – (అ + ఆ = ఆ)
ఇ) స్నిగ్లాంబుద = స్నిగ + అంబుద . (అ + అ = ఆ)

ఆ) గుణ సంధి –
సూత్రము ‘అకారమునకు ఇ, ఉ, ఋ లు పరమైన వానికి క్రమముగా ఏ, ఓ, అర్లు ఆదేశమగును.
ఆ) మదోన్మాదము – మద + ఉన్మాదము – (అ + ఉ = ఓ)
ఈ) సరభసోత్సాహం = సరభస + ఉత్సాహం – (అ + ఉ = ఓ)

ఇ) వృద్ధి సంధి
సూత్రము అకారమునకు ఏ, ఐ లు పరమైన ‘ఐ’ కారం, ఓ, ఔ లు పరమైన ‘జై’ కారం ఆదేశమగును.
ఉ) గుణోద్ధత్యం – గుణ + ఔద్దత్యం – (అ + ఔ – ఔ)
ఊ) రసైకస్థితి : రస + ఏకసితి – (అ + ఏ = ఐ)

AP SSC 10th Class Telugu Solutions Chapter 1 మాతృభావన

2. కింది పదాల్లో ఉత్వ, త్రిక, రుగాగమ, లులనల సంధులున్నాయి. పదాలు విడదీసి, సంధి జరిగిన తీరును చర్చించండి.
అ బంధమూడ్చి
ఆ) అవ్వారల
ఇ) భక్తురాలు
ఈ) బాలెంతరాలు
ఉ) గుణవంతురాలు
ఊ) దేశాల
ఋ) పుస్తకాలు
ఋా) సమయాన

ఉత్వ సంధి
సూత్రము :
ఉత్తునకచ్చు పరమగునపుడు సంధియగు.
అ) బంధమూడ్చి = బంధము + ఊడ్చి – (ఉ + ఊ – ఊ)

త్రిక సంధి
సూత్రము :

  1. ఆ, ఈ, ఏ లు త్రికమనబడును – (ఆ + వారల)
  2. త్రికము మీది అసంయుక్త హల్లునకు ద్విత్వంబు బహుళంబుగానగు – (ఆ + వ్వారల)
  3. ద్విరుక్తంబగు హల్లు పరమగునపుడు ఆచ్చికమగు దీర్ఘమునకు హ్రస్వంబగు – (అవ్వారల)

ఆ) అవ్వారల = ఆ + వారల – త్రిక సంధి

రుగాగమ సంధి
సూత్రము :కర్మధారయము నందు తత్సమంబులకు ‘ఆలు’ ‘శబ్దం పరమగునపుడు అత్వంబునకు ఉత్వమును, – రుగాగమంబును అగును.
ఇ) భక్తురాలు : భక్త + ఆలు – భక్తురు(క్) + ఆలు
ఉ) గుణవంతురాలు – గుణవంత + ఆలు – గుణవంతురు(క్) + ఆలు

సూత్రము :పేదాది శబ్దములకు ‘ఆలు’ శబ్దం పరమగునపుడు రుగాగమంబగు.
ఈ) బాలెంతరాలు : బాలెంత + ఆలు – రుగాగమ సంధి

లు ల న ల సంధి
సూత్రము : లు ల న లు పరంబగునపుడు ఒకానొకచోట ముగాగమంబునకు లోపంబును, దాని పూర్వస్వరమునకు దీర్ఘమును విభాషనగు.
ఊ) దేశాల = దేశము + ల – (‘ము’ లోపం – దాని పూర్వపు ‘శ’ కు దీరం వచ్చింది.)
ఋ) పుస్తకాలు : పుస్తకము + లు – (‘ము’ లోపం – దాని పూర్వపు ‘క’ కు దీర్ఘం వచ్చింది.)
ఋా) సమయాన = సమయము + న – (‘ము’ లోపం – దాని పూర్వపు ‘య’ కు దీర్ఘం వచ్చింది.)

3. కింది పద్యపాదాల్లోని అలంకారాన్ని గుర్తించండి. లక్షణాలను సరిచూసుకోండి. అ) అనుచున్ జేవుఱుమీజు కన్నుఁగవతో నాస్పందితోష్ఠంబుతో ఘన హుంకారముతో నటద్ర్భుకుటితో గర్జిల్లు నా భోలే శునిఁ జూడన్ ………
జవాబు:
ఈ పద్యపాదాలలో స్వభావోక్తి అలంకారం ఉంది. భానసలేశుని కోపాన్ని ఉన్నదున్నట్లుగా వర్ణించారు కనుక ఇది స్వభావోక్తి అలంకారం.

4. కింది పద్యపాదాలకు గురులఘువులను గుర్తించి, గణవిభజనచేసి, అవి ఏ పద్యాలకు సంబంధించినవో నిర్ణయించండి. లక్షణాలను చర్చించండి.

అ) ఆ – యేమీ యొక రాణివాసమును బుణ్యవాసమున్ దెచ్చినా
జవాబు:
AP SSC 10th Class Telugu Solutions Chapter 1 మాతృభావన 4
లక్షణాలు :

  1. ఈ పద్యపాదం ‘శార్దూలం’ వృత్తానికి చెందింది.
  2. యతి 13వ అక్షరం – ‘ఆ’ కు 13వ అక్షరమైన ‘జ్యా’ లో ‘య’ తో యతి.
  3. ప్రాస నియమం కలదు.
  4. 4 పాదాలుంటాయి.

ఆ) అనలజ్యోతుల నీ పతివ్రతలఁ బాపాచారులై డాయు భూ
జవాబు:
AP SSC 10th Class Telugu Solutions Chapter 1 మాతృభావన 5
లక్షణాలు :

  1. ఈ పద్యపాదం ‘మత్తేభం’ వృత్తానికి చెందింది.
  2. యతి 14వ అక్షరం – ‘అ’ కు 14వ అక్షరమైన ‘పాప + ఆచారులు’ లోని పరపదమైన ‘ఆచారులు’ లోని ‘ఆ’ తో యతి చెల్లినది.
  3. ప్రాస నియమం కలదు.
  4. 4 పాదాలుంటాయి.

5. కింది పదాలను విడదీయండి.
అ) వాజ్మయం = వాక్ + మయం – ‘క్’ స్థానంలో ‘ఙ’ వచ్చింది.
ఆ) రాణ్మహేంద్రవరం = రాట్ + మహేంద్రవరం – ‘ట్’ కు బదులుగా ‘ణ’ వచ్చింది.
ఇ) జగన్నాథుడు = జగత్ + నాథుడు – ‘త్’ కు బదులుగా ‘న’ వచ్చింది.

అంటే మొదటి పదంలోని కారం పోయి క వర్గ అనునాసికమైన (క, ఖ, గ, ఘ, ), ట కారం పోయి ట వర్గ అనునాసికమైన ‘ణ’ (ట, ఠ, డ, ఢ, ), ‘త’ కారం పోయి త వర్గ అనునాసికమైన ‘న’ (త, థ, ద, ధ, ) వచ్చాయి కదా! అలాగే మొదటి పదం చివర ‘చ’ కారం ఉంటే చ వర్గ అనునాసికమైన ‘ఞ’ (చ, ఛ, జ, ఝ, ), ‘ప’ కారం ఉంటే పవర్గ అనునాసికమైన ‘మ’ (ప, ఫ, బ, భ, ) వస్తాయి.

దీనిని సూత్రీకరిస్తే : క, చ, ట, త, ప వరాక్షరాలకు న, మ లు పరమైతే వాని వాని అనునాసికాక్షరాలు వికల్పంగా వస్తాయి. దీనినే ‘అనునాసిక సంధి’ అంటారు.

కింది పదాలను విడదీసి, అనునాసిక సంధి సూత్రంతో అన్వయించి చూడండి.
అ) తన్మయము
ఆ) రాణ్మణి
ఇ) మరున్నందనుడు
జవాబు:
అ) తన్మయము = తత్ + మయము . ‘త్’ కు బదులుగా ‘మ’ వచ్చింది.
ఆ) రాణ్మణి = రాట్ + మణి – ‘ట్’ కు బదులుగా ‘ణ’ వచ్చింది.
ఇ) మరున్నందనుడు = మరుత్ + నందనుడు – ‘త్’ కు బదులుగా ‘న’ వచ్చింది.
అంటే క, చ, ట, త, ప వర్గాక్షరాలకు న, మ లు పరమైతే వాని అనునాసికాక్షరాలు వికల్పంగా వచ్చును.

6. ఉపజాతి పద్యాల్లో తేటగీతి, ఆటవెలది పద్యాల లక్షణాలను తెలుసుకున్నారు కదా ! ఇప్పుడు సీసపద్య లక్షణాలను పరిశీలిద్దాం.
తేటగీతి:

  1. ఇది ఉపజాతి పద్యం .
  2. దీనిలో 4 పాదాలు ఉంటాయి.
  3. ప్రతి పాదంలోను వరుసగా ఒక సూర్యగణం, 2 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు ఉంటాయి.
  4. 4వ గణం మొదటి అక్షరం యతి. ప్రాసయతి అయినా వేయవచ్చును.
  5. ప్రాస నియమం లేదు.

ఉదా :
AP SSC 10th Class Telugu Solutions Chapter 1 మాతృభావన 6

ఆటవెలది :

  1. ఇది ఉపజాతి పద్యం .
  2. దీనిలో 4 పాదాలు ఉంటాయి.
  3. 1వ పాదంలో వరుసగా 3 సూర్యగణాలు, 2 ఇంద్రగణాలు ఉంటాయి.
  4. 3వ పాదంలో కూడా ఇలానే ఉంటాయి.
  5. 2వ పాదంలోను, 4వ పాదంలోను వరుసగా 5 సూర్యగణాలు ఉంటాయి.
  6. ప్రతి పాదంలోను యతి 4వ గణం మొదటి అక్షరం.
  7. ప్రాసయతిని అయినా వేయవచ్చును.
  8. ప్రాస నియమం లేదు.

ఉదా :
AP SSC 10th Class Telugu Solutions Chapter 1 మాతృభావన 7

సీసపద్యం :

సీసపద్యంలో ప్రతిపాదం రెండు భాగాలుగా ఉంటుంది. ప్రతి భాగంలో నాల్గేసి గణాల చొప్పున ఒక్కొక్క పాదంలో ఎనిమిది గణాలుంటాయి. ఈ 8 గణాల్లో మొదటి ఆరు ఇంద్రగణాలు. చివరి రెండు సూర్యగణాలు. (పాదం మొదటి భాగంలో 4 ఇంద్రగణాలు, 2వ భాగంలో వరుసగా రెండు ఇంద్రగణాలు, రెండు సూర్యగణాలుంటాయి.)
ఉదా :
AP SSC 10th Class Telugu Solutions Chapter 1 మాతృభావన 8

లక్షణాలు :

  1. 4 పాదాలుంటాయి.
  2. ప్రతి పాదం 2 భాగాలుగా ఉంటుంది.
  3. మొదటి భాగంలో 4 గణాలుంటాయి. 2వ భాగంలో 4 గణాలుంటాయి.
  4. రెండు భాగాలలోను 3వ గణం మొదటి అక్షరం యతి. లేక ప్రాసయతి చెల్లుతుంది.
  5. మొదటి భాగంలో 4 ఇంద్రగణాలుంటాయి.
  6. 2వ భాగంలో 2 ఇంద్ర, 2 సూర్య గణాలుంటాయి.
  7. ప్రాస నియమం లేదు.
  8. 4 పాదాల (8 పాదభాగాలు) తర్వాత తేటగీతి గాని, ఆటవెలది గాని తప్పనిసరిగా ఉండాలి.

AP SSC 10th Class Telugu Solutions Chapter 1 మాతృభావన

ఈ కింది పద్య పాదాన్ని గణ విభజన చేసి లక్షణ సమన్వయం చేయండి.

ధగధగ ద్దహనమధ్యము పూలరాసిగా
విహరించియున్న సాధ్వీమతల్లి.
AP SSC 10th Class Telugu Solutions Chapter 1 మాతృభావన 9 AP SSC 10th Class Telugu Solutions Chapter 1 మాతృభావన 10

మీ పాఠంలోని 5వ పద్యం సీసం. ఆ పద్యం లక్షణాలు సరిచూడండి.
AP SSC 10th Class Telugu Solutions Chapter 1 మాతృభావన 10
AP SSC 10th Class Telugu Solutions Chapter 1 మాతృభావన 11

అదనపు సమాచారము

సంస్కృత సంధులు

1. సవర్ణదీర్ఘ సంధి:
1) భారతావని భారత + అవని – సవర్ణదీర్ఘ సంధి
2) దుశ్చరితాలోచన దుశ్చరిత + ఆలోచన – సవర్ణదీర్ఘ సంధి
3) పాపాచారులు = పాప + ఆచారులు – సవర్ణదీర్ఘ సంధి
4) భరతాంబ = భరత + అంబ – సవర్ణదీర్ఘ సంధి
5) మదీయాదర్శము = మదీయ + ఆదర్శము – సవర్ణదీర్ఘ సంధి
6) సూక్తి = సు + ఉక్తి – సవర్ణదీర్ఘ సంధి

2. గుణ సంధి :
7) బోన్ సలేశుడు = బోన్ సల + ఈశుడు – గుణసంధి
8) అజోల్లంఘన = ఆజ్ఞ + ఉల్లంఘన – గుణసంధి
9) ఉల్లంఘనోద్వృత్తి = ఉల్లంఘన + ఉద్వృతి – గుణసంధి

3. జశ్వ సంధి:
10) నటద్ర్భుకుటి = నటత్ + భ్రుకుటి – జత్త్వసంధి
11) భవదాజ్ఞ = భవత్ + ఆజ్ఞ – జత్త్వసంధి

AP SSC 10th Class Telugu Solutions Chapter 1 మాతృభావన

4. అనునాసిక సంధి :
12) అసన్మార్గంబు = అసత్ + మార్గంబు – అనునాసిక సంధి

5. శ్చుత్వ సంధి:
13) దుశ్చరితము = దుస్ +చరితము – శ్చుత్వసంధి
14) దుశ్చరిత్రము = దుస్ + చారిత్రము – శ్చుత్వసంధి
15) అస్మచ్ఛబ్దము = అస్మత్ + శబ్దము – శ్చుత్వసంధి

తెలుగు సంధులు

1. అత్వ సంధి:
1) పుట్టినిల్లు = పుట్టిన + ఇల్లు – అత్వసంధి
2) మెట్టినిల్లు = మెట్టిన + ఇల్లు – అత్వసంధి

2. ఉత్వ సంధి:
3) తోడంపు = తోడు + అంపు – ఉత్వసంధి
4) పుయిలోడు = పుయిలు + ఓడు – ఉత్వసంధి

3. గసడదవాదేశ సంధి :
5) భాగ్యములు వోసి = భాగ్యములు + పోసి – గసడదవాదేశ సంధి
6) భిక్షగొన్న = భిక్ష + కొన్న – గసడదవాదేశ సంధి

4. నుగాగమ సంధి :
7) భగవానునుదయము= భగవాను + ఉదయము – నుగాగమ సంధి
8) కన్నుఁగవ = కన్ను + కవ (కన్ను + న్ + కవ) – నుగాగమ సంధి
9) ముసుంగుఁదెర = ముసుంగు + తెర (ముసుంగు + న్ + తెర) – నుగాగమ సంధి

AP SSC 10th Class Telugu Solutions Chapter 1 మాతృభావన

5. యడాగమ సంధి:
10) మాయాజ్ఞ = మా + ఆజ్ఞ – యడాగమ సంధి
11) ఈ యాజ్ఞ = ఈ + ఆజ్ఞ – యడాగమ సంధి

సమాసాలు
AP SSC 10th Class Telugu Solutions Chapter 1 మాతృభావన 12

ప్రకృతి – వికృతి

జ్యోతి – జోతి
మర్యాద – మరియాద
రాట్టు – ఱేడు
ఈర్ష్య – ఈసు
రాశి – రాసి
బంధము – బందము
సూక్ష్మత – సుంత
బిక్ష – బిచ్చము, బికిరము
భక్తి – బత్తి
మణి – మిన్
భాగ్యము – బాగైం
రూపము – రూపు
ఛాయ – చాయ
భూమి – బూమి
పుత్రుడు – బొట్టె
రాజ్ఞి – రాణి
బ్రహ్మ – బమ్మ, బొమ్మ
దోషము – దోసము, దొసగు
పుణ్యము – పున్నెము
గృహము – గీము
భయము – పుయిలు
సూక్తి – సుద్ది
ద్వంద్వము – దొందము
ముఖము – మొగము
గౌరవము – గారవము
స్త్రీ – ఇంతి
రత్నము – రతనము
ఆజ్ఞ – ఆన
ఓష్ఠము – ఔడు

నానార్థాలు

1. బలము : సత్తువ, సేన, వాసన
2. తోడు : సహాయము, నీరువంటి వాటిని పైకి లాగడం, తోడబుట్టినవాడు
3. పాశము : తాడు, గుంపు, బాణము, ఆయుధము
4. పుణ్యము : ధర్మము, పవిత్రత, నీరు
5. సూత్రము : నూలిపోగు, తీగె, త్రాడు
6. బంధము : కట్ట, దారము, సంకెల, దేహము
7. రూపము : ఆకృతి, సౌందర్యము
8. చరణము : పాదము, కిరణము, పద్యపాదము
9. సంపద : ఐశ్వర్యము, సౌఖ్యము, లాభము, ధనము
10. ఛాయ : నీడ, పార్వతి, పోలిక
11. భిక్షము : బిచ్చము, కూలి, కొలువు
12. గౌరవము : బరువు, మన్నన, గొప్పతనము
18. సంతానము : బిడ్డ, కులము, వరుస
14. హరి : విష్ణువు, ఇంద్రుడు, సూర్యుడు, గుఱ్ఱము, కోతి
15. దోసము : పాపము, తప్పు, లోపము
16. మర్యా ద : కట్టుబాటు, పొలిమేర, నడత, నిష్ఠ

పర్యాయపదాలు

1. తల్లి : జనయిత్రి, మాత, అమ్మ, జనని
2. ఆజ్ఞ : ఆదేశము, ఆన, ఉత్తరువు, ఆనతి, ఆజ్ఞప్తి
3. కన్ను : చక్షువు, నేత్రము, నయనము, అక్షి
4. పతివ్రత : సాధ్వి, పురంధి, పతిదేవత, సతి
5. దోషము : దోసము, దొసగు, తప్పు, అపరాధము
6. దేవతలు : అమరులు, వేల్పులు, విబుధులు, నిర్జరులు
7. అంబుధి : ఉదధి, పారావారము, కడలి, సముద్రము
8. హరి : విష్ణువు, చక్రి, నారాయణుడు, వైకుంఠుడు
9. బ్రహ్మ : పద్మభవుడు, చతుర్ముఖుడు, నలువ
10. కాంత : స్త్రీ, వనిత, చెలువ, మహిళ, ఇంతి, ఆడుది, యువతి
11. బిడ్డ : కొడుకు, శిశువు, బాలుడు
12. అంబుదము : మేఘము, మొగులు, అంభోదము, జలదము, ఘనము
13. అనలము : అగ్ని, దహనము, శుచి, వహ్ని
14. ముఖము : మొగము, ఆననము, వదనము, మోము
15. భూమి : ధరణి, అవని, ధర, పృథివి

వ్యుత్పత్త్యర్థాలు

1. అంబుదము : నీటినిచ్చునది (మేఘము)
2. పురంధి : గృహమును ధరించునది (ఇల్లాలు)
3. పతివ్రత : పతిని సేవించుటయే వ్రతముగా గలది (సాధ్వి)
4. జనని : సంతానమును ఉత్పత్తి చేయునది (తల్లి)
5. దహనము : కాల్చుటకు సాధనమైనది (అగ్ని)

కవి పరిచయం

పేరు : డా|| గడియారం వేంకటశేష శాస్త్రి

తల్లితండ్రి : తల్లి నరసమాంబ, తండ్రి రామయ్య, కడప జిల్లా, జమ్మలమడుగు తాలుకా
నెమళ్ళ దిన్నె గ్రామంలో 1894లో జన్మించారు. కడప మండలం ప్రొద్దుటూరు మునిసిపల్ హైస్కూల్లో తెలుగు పండితులుగా
పనిచేశారు. వీరు శతావధాని.

రచనలు : రాజశేఖర శతావధాని గారితో కలిసి కొన్ని కావ్యాలు, నాటకాలు రచించారు. ‘శ్రీ శివభారతం’ వీరికి చాలా పేరు తెచ్చిన కావ్యం. పారతంత్ర్యాన్ని నిరసించి స్వాతంత్ర్యకాంక్షను అణువణువునా రగుల్కొల్పిన మహాకావ్యం ఇది. మురారి, పుష్పబాణ విలాసము, వాస్తు జంత్రి (అముద్రిత వచన రచన), మల్లికామారుతము, శ్రీనాథ కవితా సామ్రాజ్యము (విమర్శ), రఘునాథీయము అనే కావ్యాలు రచించారు.

బిరుదులు :
కవితావతంస, కవిసింహ, అవధాన పంచానన అనేవి వారి బిరుదులు.

పద్యాలు – ప్రతిపదార్థాలు – భావాలు

అవగాహన – ప్రతిస్పందన

పద్యం – 1 : కంఠస్థ పద్యం

శా॥ “ఆ యేమీ ? యొక రాణివాసమును బుణ్యవాసమున్ దెచ్చినా
వా? యే హైందవుఁడైన నీ గతి నమర్యాదన్ బ్రవర్తించునే?
మా యాజ్ఞన్ గమనింపవో ? జయ మదోన్మాదంబునన్ రేఁగి, నీ
యాయుస్సూత్రము లీవ క్రుంచుకొనేదో ? యౌధ్ధత్య మోర్వన్ జుమీ”
ప్రతిపదార్థం :
ఆ – యేమీ? = ఆ, ఏమిటీ? (ఆశ్చర్యం, కోపంతో)
పుణ్యవాసముల్ (పుణ్య + ఆవాసమున్) = పుణ్యానికి నిలయమైన
ఒక = ఒక
రాణివాసమును = అంతఃపురమును (మహారాణిని)
తెచ్చినావా? = బందీగా తీసుకొని వచ్చావా?
ఏ, హైందవుడు + ఐనన్ = ఏ హిందువైనా (భారతీయుడెవరైనా)
ఈ గతిన్ = ఈ విధంగా
అమర్యాదన్ ప్రవర్తించునే = గౌరవం లేకుండా
ప్రవర్తించును + ఏ = ప్రవర్తిస్తాడా? (ప్రవర్తించడు)
మా + ఆజ్ఞన్ = మా ఆజ్ఞను (రాజాజ్ఞను)
గమనింపవు + ఓ = పట్టించుకోవా?
జయ = జయం వలన
మద = గర్వంతో
ఉన్నాదంబునన్ = మితిమీరిన పిచ్చితనముతో
రేఁగి = విజృంభించి
నీ = నీ యొక్క
ఆయుస్సూత్రములు = ఆయుర్దాయపు నూలిపోగులు (ప్రాణాలు)
ఈవ త్రుంచుకొనెదు + ఓ = త్రెంచుకొంటావా?
ఔద్ధత్యము = గర్వంతో చేసే పనులను
ఓర్వన్ = సహించను
చుమీ = సుమా!

భావం :
“ఆ-ఏమిటీ? పుణ్యానికి నిలయమైన ఒక రాణి వాసాన్ని బంధించి తీసుకొనివచ్చావా? ఏ భారతీయుడైనా ఈ విధంగా గౌరవం లేకుండా ప్రవర్తిస్తాడా? రాజాజ్ఞను కూడా పట్టించుకోవా? జయం వలన గర్వంతో, మితిమీరిన పిచ్చితనంతో విజృంభిస్తావా? నీ ప్రాణాలు నీవే తెంచుకొంటావా? గర్వాన్ని సహించను సుమా !” అని శివాజీ, సో దేవునితో ఆగ్రహంగా అన్నాడు.

పద్యం – 2

మ|| | అనుచున్ జేవుజు మీ జు కన్నుఁగవతో నాస్పందితోష్ణంబుతో
ఘన హుంకారముతో నటద్భుకుటితో గర్జిల్లు నా భోసలే
శునిఁ జూదన్ బుయిలోడెఁ గొల్వు శివుఁడీసున్ గుత్తుకన్ మ్రింగి, బో
రన నవ్వారల బంధ మూడ్చి గొని తేరన్ బంచె సోన్ దేవునిన్
ప్రతిపదార్థం :
అనుచున్ = శివాజీ అలా హెచ్చరిస్తూ (ఆ విధంగా చెపుతూ)
జేవుఱుమీటు = జేగురు రంగును (ఎరుపు రంగును) అతిశయించే (జేగురు రంగు కంటే ఎఱ్ఱగా నున్న)
కన్నుఁగవతోన్ = కనుల జంటతో
ఆస్పందదోష్ఠంబుతోన్; ఆస్పందత్ = కొలదిగా కదులుతున్న
ఓష్ఠంబుతోన్ = పెదవితో
ఘనహుంకారముతోన్ = గొప్ప హుంకార ధ్వనితో
నటద్ర్భుకుటితోన్; నటత్ = నాట్యము చేయుచున్న (బాగా కదలి ఆడుచున్న)
భ్రుకుటీతోన్ = కనుబొమల ముడితో
గర్జీల్లు = గర్జిస్తున్న
ఆ ఫోన్సలేశునిన్ (ఆ ఫోన్సల + ఈశునిన్) = ఆభోంసల వంశ ప్రభువైన శివాజీని
చూడన్ = చూడ్డానికి
కొల్వు = రాజసభ
పుయిలోడెన్ = జంకింది (భయపడింది.) (నిశ్చేష్టులయ్యారు)
శివుడు = శివాజీ
ఈసున్ = (తన) కోపాన్ని
కుత్తుకన్ = గొంతుకలో
మ్రింగి = అణచుకొని
బోరనన్ = శీఘ్రముగా (ఇది ‘బోరునన్’) అని ఉండాలి.)
అవ్వారల = వారి యొక్క (కళ్యాణి సర్దారు యొక్క ఆతని అంతఃపురకాంత యొక్క
బంధమూడ్చి (బంధము + ఊడ్చి) – సంకెలలు తొలగించి,
కొనితేరన్ = తీసికొనిరావడానికి (సభలోకి తీసుకురావడానికి)
సోన్ దేవునిన్ = (తన సైన్యాధిపతియైన, వారిని బంధించి తెచ్చిన) సోన్ దేవుడిని
పంచెన్ = ఆజ్ఞాపించెను.

భావం:
అంటూ ఎర్రబడిన కన్నులతో, అదిరిపడే పై పెదవితో, గొప్ప హుంకారముతో, కదలియాడే కనుబొమ్మల ముడితో, గర్జిస్తున్న ఆ ఫోన్సలేశుడైన శివాజీని చూడ్డానికి సభలోనివారు భయపడ్డారు. తరువాత శివాజీ తన కోపాన్ని గొంతుకలో అణచుకొని, వెంటనే వారి సంకెళ్లను తొలగించి, తీసుకొని రమ్మని, సో దేవుడిని ఆజ్ఞాపించాడు.

పద్యం – 3

మ|| | త్వరితుండై యతఁ డట్టులే నలిపి “దేవా! నన్ను మన్నింపు; మీ
సరదారున్ గొని తెచ్చుచో సరభసోత్సాహంబు కగ్గప్పె; దు
శృరితాలోచన లేదు, లేదు భవదాజా లంఘనోద్వృత్తి; మీ
చరణద్వంద్వమునాన” యంచు వినిపించన్, సుంత శాంతించుచున్
ప్రతిపదార్థం :
త్వరితుండు + ఐ = తొందర కలవాడై
అతడు = ఆసోన్ దేవుడు
అట్టులే = ఆ విధంగానే (శివాజీ చెప్పినట్లుగానే)
సలిపి = చెసి
దేవా = దేవా (శివాజీని దైవమా ! అని సంబోధించి)
నన్ను = నన్ను (సోన్ దేవుని)
మన్నింపుము = అపరాధమును క్షమింపుము
ఈ సరదారున్ = (ఓడిపోయిన) ఈ వీరుడిని
కొని తెచ్చుచో = తీసుకొని వచ్చేటపుడు
సరభస + ఉత్సాహంబు = ఉవ్విళ్ళూరు ఉత్సాహము
కన్దప్పె = కళ్లకు కమ్మేసింది
దుస్+చరిత + ఆలోచన = చెడు చేయాలనే తలంపు
లేదు = లేదు
మీ = తమ యొక్క
చరణద్వంద్వంబులు = పాదాలు
ఆన = సాక్షి (ఒట్టు)గా
భవత్ = తమ యొక్క
ఆజ్ఞ = ఆజ్ఞను
ఉల్లంఘన = అతిక్రమించాలనే
ఉద్వృత్తి = గర్వము
లేదు = లేదు
అంచు = అనుచు
వినిపించన్ = నివేదించగా
సుంత = కొద్దిగా
శాంతించుచున్ – శాంతిని పొందినవాడై (కోపం తగ్గినవాడై)

భావం :
శివాజీ ఆజ్ఞాపించిన పనిని సోదేవుడు తొందరగా చేశాడు. “దేవా! నన్ను మన్నించండి. ఓడిపోయిన ఈ వీరుడిని బంధించి తెచ్చేటప్పుడు ఉవ్విళ్ళూరు ఉత్సాహం కళ్లకు కమ్మేసింది. మీ పాదాల సాక్షిగా నాకు చెడు చేయాలనే ఆలోచన లేదు. తమ ఆజ్ఞను అతిక్రమించాలనే గర్వంలేదు.” అని నివేదించగా శివాజీ కొద్దిగా శాంతించాడు.

పద్యం – 4 : కంఠస్థ పద్యం

*మ|| శివరాజంతట మేల్ముసుంగుఁ దెరలో – స్నిగ్జాంబుదద్ఛాయలో
నవసౌదామినిఁ బోలు నా యవనకాంతారత్నమున్ భక్తి గా
రవముల్ వాజఁగఁ జూచి వల్కె “వనితారత్నంబు లీ భవ్యహైం
దవభూజంగమ పుణ్యదేవతలు; మాతా! తప్పు సైరింపుమీ !”
ప్రతిపదార్థం :
శివరాజు = శివాజీ మహారాజు
అంతటన = అప్పుడు
మేల్ముసుంగుఁదెరలోన్; మేల్ముసుంగు = సువాసినీ స్త్రీలు వేసుకొనే మేలు ముసుగు యొక్క (బురఖా)
తెరలోన్ = తెరలోపల
స్నిగ్దాంబుదచ్ఛాయలోస్, (స్నిగ్ధ+ అంబుద + ఛాయలోన్) స్నిగ్ధ = దట్టమైన
అంబుద = మేఘము యొక్క
ఛాయలోన్ = నీడలో (మాటున నున్న)
నవసౌదామినిన్ = కొత్త మెరుపు తీగను
పోలు = పోలినట్లు ఉన్న
ఆ, యవన కాంతారత్నమున్ = ఆ రత్నము వంటి యవనకాంతను (మహమ్మదీయ స్త్రీని)
భక్తి గౌరవముల్ = భక్తియునూ, గౌరవమునూ
పాఱగన్ + చూచి = స్ఫురించేటట్లు చూసి
పల్కెన్ = ఈ విధంగా అన్నాడు
వనితారత్నంబులు = రత్నముల వంటి స్త్రీలు (శ్రేష్ఠులైన స్త్రీలు)
ఈ = ఈ
భవ్య హైందవ భూ జంగమ పుణ్యదేవతలు; భవ్య = శుభప్రదమైన
హైందవ భూ = భారత భూమిపై
జంగమ = సంచరించే (తిరుగాడే)
పుణ్యదేవతలు = పుణ్యప్రదమైన దేవతల వంటివారు
మాతా! = అమ్మా
తప్పున్ = మా వారు చేసిన తప్పును
సైరింపుమీ = మన్నింపుము (క్షమింపుము)

భావం :
శివాజీ మహారాజు అప్పుడు మేలు ముసుగు తెరలో దట్టమైన నీలి మేఘం వెనుక ఉన్న మెరుపు తీగవంటి యవన కాంతను భక్తి గౌరవాలతో చూస్తూ ఇలా అన్నాడు. “స్త్రీలు శుభప్రదమైన ఈ హైందవ భూమిపై సంచరించే పుణ్యదేవతలు. అమ్మా ! మా తప్పును మన్నింపుము.”

చారిత్రక విశేషం :
అబ్బాజీసో దేవుడు అనే శివాజీ యొక్క సైన్యాధిపతి ‘కళ్యాణి’ కోటను పట్టుకొన్నాడు. అక్కడ అతడు ఒక అందమైన అమ్మాయిని బందీగా పట్టుకొన్నాడు. ఆ అమ్మాయి కళ్యాణి కోటకు గవర్నరు (సర్దారు) అయిన మౌలానా అహమ్మదుకు కోడలు. ఆ అమ్మాయిని సో దేవుడు శివాజీకి బహుమతిగా ఇచ్చాడు. అప్పుడు శివాజీ ఆ అమ్మాయితో “అమ్మా! నా తల్లి నీ అంత అందగత్తె అయి ఉన్నట్లయితే, నేను కూడా నీ అంత అందంగా కనబడేవాడిని” అని అన్నాడు. శివాజీ ఆ యవన కాంతను తన కూతురుగా ఆదరించాడు. ఆమెకు వస్త్రాలు ఇచ్చి, ఆమెను ఆమె ఇంటికి – బీజాపూరుకు పంపాడు. (ఇది చరిత్రలలో చెప్పబడింది)

పద్యం – 5

సీ॥ హరి హర బ్రహ్మలం బురిటిబిడ్డలం జేసి
జోలంబాడిన పురంద్రీలలామ,
యమధర్మరాజు పాశముం ద్రుంచి యదలించి
పతిభిక్ష గొన్న పావనచరిత్ర,
ధగధగ దహనమధ్యము పూలరాసిగా
విహరించియున్న సాధ్వీమతల్లి,
పతి నిమిత్తము సూర్యభగవానును దయంబు
నరికట్టి నిలుపు పుణ్యములవంట,
తే|| అట్టి యెందతో భరతాంబ యాఁదుబిద్ద
లమల పతిదేవతాత్వ భాగ్యములు వోసి
పుట్టినిలు మెట్టినిలుఁ బెంచు పుణ్యసతులు
గలరు, భారతావని భాగ్యకల్పలతలు
ప్రతిపదార్థం :
హరి హర బ్రహ్మలన్ = విష్ణువును, శివుని, బ్రహ్మను
పురిటి బిడ్డలన్ + చేసి = పసిపిల్లలుగా చేసి
జోలన్ = జోలపాటను
పాడిన = పాడినటువంటి
పురంధీలలామ = శ్రేష్ఠురాలైన గృహిణి (అనసూయ)
యమధర్మరాజు = మృత్యుదేవత యొక్క
పాశమున్ = త్రాడును
త్రుంచి = తెంచి
అదలించి = గద్దించి
పతిభిక్షన్ = భర్తను భిక్షగా
కొన్న = సంపాదించిన
పావన చరిత్ర = పవిత్రమైన చరిత్ర గలది; (సావిత్రి)
ధగధగత్ = ధగధగ మండుచున్న
దహన మధ్యము = చితి మధ్యభాగము
పూలరాసిగా = పూలకుప్ప వలె
విహరించియున్న = సంచరించి ఉన్నటువంటి
సాధ్వీమ తల్లి = శ్రేష్ఠురాలైన స్త్రీ (సీత)
పతి నిమిత్తము = పతి కొరకు
సూర్యభగవానుని = సూర్యదేవుని యొక్క
ఉదయంబును = ఉదయమును
అరికట్టి = నిరోధించి
నిలుపు = నిలిపిన
రతాంబ
పుణ్యముల పంట = తల్లిదండ్రుల పుణ్యఫలము (సుమతి)
అట్టి = అటువంటి
ఎందఱో = ఎంతోమంది
భరతాంబ = భరతమాత యొక్క
ఆఁడుబిడ్డలు = స్త్రీ సంతానం
అమల = స్వచ్చమైన
తిదేవతాత్వ = పతివ్రతా ధర్మమనెడు
భాగ్యములు + పోసి = సంపదలను ఇచ్చి
అట్టిన + ఇలున్ = పుట్టినింటిని
పెట్టిన + ఇలున్ = అత్తవారింటిని
పెంచు = అభివృద్ధి చేయు
భరత + అవని = భారతదేశము యొక్క
భాగ్య కల్పలతలు = సంపద అనెడు దేవతావృక్షాల వంటి
అణ్యసతులు = పుణ్యాత్ములైన స్త్రీలు
కలరు = ఉన్నారు

భావం :
బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను పసిపిల్లలుగా చేసి ద్రపుచ్చినది అనసూయ అను పేరు గల ఒక గృహిణి. దుమధర్మరాజు పాశమును కూడా ట్రెంచి, గద్దించి, పతి పాణాలు సాధించిన పవిత్రమైన చరిత్ర కలది సావిత్రి. నిప్పుల రాశి మధ్యను పూలరాశిగా సంచరించిన శ్రేష్ఠురాలైన స్త్రీ సీత. -తిప్రాణాలు కాపాడడానికి సూర్యోదయాన్ని నిలిపిన అణ్యాత్మురాలు సుమతి. అటువంటి భరతమాత సంతానమైన స్త్రీలు స్వచ్ఛమైన పతివ్రతలు. వారి పాతివ్రత్య మహిమతో అట్టింటిని, అత్తవారింటిని అభివృద్ధి చేస్తున్నారు. వారు ఈ కారతదేశపు సంపదలనెడు దేవతావృక్షాలు. అటువంటి అణ్యస్త్రీలు ఉన్నారు.

ఇవి తెలుసుకోండి

1. అనసూయ :
అత్రి మహాముని భార్య. ఈమెను పరీక్షించ డానికి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ప్రయత్నించారు. వారిని ముగ్గురినీ పసిపిల్లలుగా మార్చింది. వారు కోరినట్లే లాలించింది. ఆమె పాతివ్రత్యానికి దేవతలు సంతోషించారు.

2. సావిత్రి :
సత్యవంతుని భార్య, ‘సత్యవంతుడు మరణిస్తాడు. యమధర్మరాజుని ప్రార్థించి, మెప్పించి, వరాలు పొంది, తన భర్త ప్రాణాలు తిరిగి తెచ్చి, భర్తను బ్రతికించిన మహా పతివ్రత సావిత్రి.

3. సుమతి :
కౌశికుడనే బ్రాహ్మణుని భార్య. అతడు కుష్టురోగి. అతని కోరికపై ఒకచోటుకు తీసుకొని వెడుతోంది. తట్టలో కూర్చోబెట్టుకొని, తలపై పెట్టుకొని, మోసుకొని వెడుతోంది. చీకటిలో అతని కాలు మాండవ్య మహామునికి తగిలింది. సూర్యోదయానికి మరణించాలని శపించాడు. సూర్యోదయం కాకూడదని ఆమె అంది. సూర్యోదయం ఆగిపోయింది.

4. దేవతావృక్షాలు :
కోరిన వస్తువులిచ్చెడు దేవతామ్మకాలు అయిదు. అవి :
1. మందారము,
2. పారిజాతము,
3.సంతానము,
4. కల్పవృక్షము,
5.హరిచందనము.

పద్యం – 6 : కంఠస్థ పద్యం

*మ | అనలజ్యోతుల నీ పతివ్రతలఁ బాపాచారులై దాయు భూ
జనులెల్లన్ నిజసంపదల్ దొలుంగి యస్తద్వసులై పోరి? వి
శనమే నిల్చునా ? మున్నెఱుంగమె పులస్త బ్రహ్మసంతాన? మో
జననీ! హైందవ భూమి నీ పగిది దుశ్చరిత్రముల్ సాగునే?
ప్రతిపదార్థం :
అనల జ్యోతులన్ – అగ్ని జ్వా లల వంటి
ఈ పతివ్రతలన్ = ఈ పతివ్రతలను
పాపాచారులై (పాప + ఆచారులు + ఐ) = అపచారం చేసేవారై
డాయు = కలిసే
భూజనులు + ఎల్లన్ = భూమిపైనున్న ప్రజలు అందరునూ
నిజ సంపదల్ = తమ సంపదలను
తొఱగి = వీడి (పోగొట్టుకొని)
అసద్వస్తులై (అసద్వస్తులు + ఐ) = సర్వ నాశనమైనవారై
పోరె = పోకుండా ఉంటారా?
విత్తనమే = విత్తనము (వారి వంశవృక్షం యొక్క విత్తనం)
నిల్చునె = నిలుస్తుందా ? (అనగా వంశం నిలుస్తుందా?)
మున్ను = పూర్వం
పులస్త్రబ్రహ్మ సంతానమున్ = పులస్త్య బ్రహ్మ యొక్క కుమారుడైన రావణుని గూర్చి
ఎఱుంగమై = మనకు తెలియదా?
హైందవ భూమిని = భారత భూమియందు
ఈ పగిది = ఇటువంటి
దుశ్చారిత్రముల్ = చెడు పనులు (దుశ్చర్యలు)
సాగునే = సాగుతాయా? (సాగవు)

భావం :
ఓ తల్లీ ! అగ్ని జ్వా లల వంటి పతివ్రతల పట్ల అపచారం చేసేవారు, తమ సంపదలు పోగొట్టుకొని, సర్వ నాశనం కారా? అసలు వారి వంశం నిలుస్తుందా? (విత్తనంతో సైతంగా నశించదా?) పులస్తబ్రహ్న సంతానమైన రావణాసురుని పతనం గురించి మనకు తెలియదా? భారతభూమిపై ఇటువంటి దుశ్చర్యలు సాగుతాయా? (సాగవు)

పద్యం -7

తే|| యవన పుణ్యాంగనామణి వగుదుగాక
హైందవులపూజ తల్లియట్లందరాదె?
నీదురూపము నాయందు లేద యైనం
గనని తల్లివిగా నిన్ను గారవింతు
ప్రతిపదార్థం :
యవన = యవన జాతికి చెందిన
పుణ్య + అంగనా మణివి = శ్రేష్ఠమైన పుణ్యస్త్రీవి
అగుదుగాక = అయిన దానివి
తల్లి + అట్లు = మా యొక్క తల్లివలె
హైందవుల = హిందూదేశ వాసుల యొక్క
పూజ = పూజను
అందరాదె = స్వీకరించరాదా ! (స్వీకరించు)
నీదు రూపము = నీ పోలిక
నా + అందు = నాలో
లేదు + ఆ = లేదు
ఐనన్ = ఐనప్పటికీ
కనని = నాకు జన్మనీయని
తల్లివిగా = నా తల్లిగా
నిన్ను = నిన్ను
గారవింతు = గౌరవిస్తాను

భావం:
యవన జాతికి చెందిన పుణ్యస్త్రీవి. అయినా హిందువుల పూజలను మా తల్లివలె స్వీకరించు. నీ పోలిక నాలో లేదు. అయినా నాకు జన్మనివ్వని తల్లిగా నిన్ను గౌరవిస్తాను.

పద్యం – 8: కంఠస్థ పద్యం

*శా॥ మా సర్దారుడు తొందరన్ బడి యసన్మార్గంబునన్ బోయి, నీ
దోసంబున్ గని నొచ్చుకోకు, నినుఁ జేరున్ నీ గృహం బిప్పుడే,
నా సైన్యంబును దోడుగాఁ బనిచెదన్, నాతల్లిగాఁ దోడుగా
దోసిళ్లన్ నడిపింతు; నీ కనులయందున్ దాల్ని సారింపుమీ!
ప్రతిపదార్థం :
మా సర్దారుడు = మా సర్దార్ సో దేవుడు
తొందరన్ బడి = తొందరపాటుపడి
అసన్మార్గంబునన్ = తప్పుడు మార్గంలో
(అసత్ + మార్గంబునన్) పోయెన్ = వెళ్ళాడు. (పొరపాటున నిన్ను బంధించి తెచ్చాడు)
ఈ దోసంబున్ = ఈ దోషాన్ని
కని = చూచి
నొచ్చుకోకు = బాధపడకు
ఇప్పుడే = ఇప్పుడే
నినున్ = నిన్ను
నీ గృహంబున్ = నీ ఇంటిని (నీ ఇంటికి)
చేరున్ = చేరుస్తాను
నా సైన్యంబున్ = నా సైన్యాన్ని
తోడుగాస్ = నీకు సాయంగా
పనిచెదన్ = పంపిస్తాను
నా తల్లిగాన్ = నా యొక్క తల్లివలెనూ
తోడుగాన్ = నా తోడబుట్టిన సోదరిగానూ
దోసిళ్లన్ = (నా) అరచేతులపై
నడిపింతున్ = నడిపిస్తాను (నిన్ను కాలుక్రింద పెట్టకుండా నా అరచేతులపై సగౌరవంగా నడిపించి మీ ఇంటికి పంపిస్తాను)
నీ కనులయందున్ = నీ కళ్లల్లో
తాల్మిన్ = ఓర్పును
సారింపుమా = ప్రసరింప చేయుము. (చూపించుము)

భావం :
మా సర్దారు తొందరపడి తప్పు మార్గంలో నడిచాడు. ఈ దోషాన్ని చూచి బాధపడకు. నిన్ను నీ ఇంటికి ఇప్పుడే చేరుస్తాను. నా సైన్యాన్ని నీకు తోడుగా పంపిస్తాను. నిన్ను నా కన్నులలో ఓరిమిని చూపు. నన్ను సహించి క్షమించు.

పద్యం – 9

మ|| అని కొందాడి, పతివ్రతా హిత సపర్యాధుర్యుందాతండు యా
వన కాంతామణి కరసత్కృతు లొనర్పన్ వేసి, చేసేతఁ జి
క్కిన సర్దారుని గారవించి హితసూక్తిన్ బల్కి బీజాపురం
బునకున్ బోవిదే – వారితోఁ దనబలంబుల్ కొన్ని వాదంపుచున్.
ప్రతిపదార్ధం :
అని = పై విధంగా పలికి
కొండాడి = స్తుతించి
పతివ్రతా = పతివ్రతల యొక్క
హిత = ఇష్టమునకు
సపర్యా = పూజ అనెడు
ధుర్యుడు = భారము వహించువాడు
ఆతండు = ఆ శివాజీ
యావన = యవన సంబంధమైన
కాంతామణికి = శ్రేష్ఠురాలైన ఆ స్త్రీకి
అర్హ = తగినటువంటి
సత్కృతులు = గౌరవాదరాలు
ఒనర్పన్ = అతిశయించునట్లు
చేసి = చేసి
చేత + చేత = చేతులారా
చిక్కిన = తనకు బందీ అయిన
సర్దారుని గారవించి = గౌరవించి
హిత = మంచిని కల్గించే
సు + ఉక్తిన్ – మంచి మాటను
పల్కి = చెప్పి
తన బలంబుల్ = తన సైన్యము
కొన్ని = కొంత
వారితో = ఆ యవన దంపతులతో
తోడు + అంపుచున్ – సహాయంగా పంపుతూ
బీజాపురంబునకున్ = బీజాపూర్‌కు
పోన్ + విడా : పోవుటకు విడిచిపెట్టెను.

భావం :
శివాజీ పై విధంగా ఆ యవనకాంతను స్తుతించాడు. పతివ్రతల ఇష్టానికి తగినట్లు పూజించాడు. ఆ యవనకాంతకు తగిన గౌరవ మర్యాదలు చేశాడు. తనకు చిక్కిన వీరుడైన ఆమె భర్తను గౌరవించాడు. మంచి మాటలు చెప్పాడు. వారికి సహాయంగా తన సైన్యం కొంత పంపాడు. వారిని బీజాపూర్ వెళ్ళడానికి విడిచి పెట్టాడు.

పద్యం – 10

శివరా అంతట సోనదేవుమొగమై సీరత్నముల్ పూజ్య, లే
యవమానంబు ఘటింపరా, దిది మదీయాదర్శ మస్మచ్చమూ
ధవు లీయాజ్ఞ నవశ్య మోమవలె; నీతాత్పర్యమున్ జూచి, లో
కువ చేకూరమి నెంచి, నీయెద దొసంగు బ్లేమి భావించితిన్”
(అని వాక్రుచ్చెను.)
ప్రతిపదార్ధం :
అంతట = అంతలో
శివరాజు = ఛత్రపతి శివాజీ
సోనదేవు మొగమై = సో దేవును వైపు తిరిగి
స్త్రీ రత్నముల్ = శ్రేష్ఠులైన స్త్రీలు
పూజ్యులు = పూజింప తగినవారు
ఏ అవమానంబు = ఏ విధమైన అవమానమును
ఘటింపరాదు = జరుగరాదు
ఇది = ఈ పద్దతి
మదీయ = నా యొక్క
ఆదర్శము = ఆశయము
అస్మ త్ = నా యొక్క
చమూధవులు = సైన్యాధికారులు
ఈ + ఆజ్ఞను = ఈ ఉత్తర్వును
అవశ్యము = తప్పనిసరిగా
ఓమవలె = రక్షించాలి
నీ తాత్పర్యమున్ = నీ భావమును
చూచి = పరిశీలించి
లోకువ = తక్కువ
చేకూరమిన్ = కలుగపోవుటను
ఎంచి = పరిశీలించి
నీ + ఎడ = నీ పట్ల
దొసంగుల్ + లేమి = తప్పులు లేకపోవుటను
భావించితిన్ = గ్రహించితిని

భావం :
అపుడు ఛత్రపతి శివాజీ సో దేవుని వైపు తిరిగి, “స్త్రీలు పూజ్యనీయులు. వారికి ఏ అవమానం జరగకూడదు. ఇది నా ఆశయం. మన సైన్యాధికారులందరూ ఈ ఆజ్ఞను రక్షించాలి. నీ భావం గ్రహించాను. మమ్ము తక్కువ చేయక పోవుటను తెలుసుకొన్నాను. నీ తప్పు లేదని గ్రహించాను” అన్నాడు.

AP SSC 10th Class Telugu Solutions Chapter 3 జానపదుని జాబు

AP State Board Syllabus AP SSC 10th Class Telugu Solutions 3rd Lesson జానపదుని జాబు Textbook Questions and Answers.

AP State Syllabus SSC 10th Class Telugu Solutions 3rd Lesson జానపదుని జాబు

10th Class Telugu 3rd Lesson జానపదుని జాబు Textbook Questions and Answers

ఉన్ముఖీకరణ : చదవండి – ఆలోచించి చెప్పండి

ప్రియసఖా!
నీ లేఖ అందింది. పట్నం జీవితం ఎలా ఉంటుందో అందులో వర్ణించావు. పల్లెటూరి జీవితాన్ని చిత్రిస్తూ ఉత్తరం రాయమన్నావు. నీది ఉత్తమమైన వాంఛ. ఒకచోటి జీవిత విధానంలో మరొకచోటి జీవిత విధానాన్ని నిత్యమూ పోల్చి తెలుసుకొంటూ ఉండాలి. మంచి చెడ్డలు, హెచ్చుతగ్గులు ఏమైనా ఉంటే సరి చేసుకోవాలి. ఈ వాంఛ నీకు కలిగినందుకు అభినందిస్తున్నాను. నీ పట్న జీవితం నా పల్లెటూరి జీవితంతో పోలిస్తే పరస్పర విరుద్ధంగా ఉంటుంది. నా జీవిత విధానాన్ని గురించి రాయడమంటే పల్లెటూళ్ళ జీవిత విధానాన్ని గురించి రాయడమన్నమాట. పల్లెటూళ్ళు, అక్కడి వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయో నీకు తెలుసా? విద్యుద్దీపాలతో, పంఖాలు ఉన్న మేడలలో హాయిగా సుఖించే నీకు ఏమి తెలుస్తుంది? నీకుమా గ్రామ జీవితం అర్థం కావాలంటే, మా ఇంటికి ఒకసారి రా! ఈ పూరి గుడిసెలో ఒక్కరోజు ఉండు.

ఇటు,
నీ మిత్రుడు.

ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
ఉత్తరాన్ని ఎవరు, ఎవరికి రాసి ఉంటారు?
జవాబు:
పల్లెటూరులో నివసించే వ్యక్తి పట్నంలో నివసించే తన మిత్రునికి ఉత్తరం రాసి ఉంటాడు.

ప్రశ్న 2.
దేని గురించి రాశాడు?
జవాబు:
పట్నవాసపు జీవితాన్ని, పల్లెటూరి జీవితంతో పోల్చి రాశాడు. పల్లెటూరి జీవితంలోని బాధలు రాశాడు.

AP SSC 10th Class Telugu Solutions Chapter 3 జానపదుని జాబు

ప్రశ్న 3.
లేఖను చదివారు కదా? మీరు ఏం గ్రహించారు?
జవాబు:
లేఖా రచయిత పల్లెటూరి వాడు. పేదవాడు. పట్నవాసంలో సుఖం ఉందని అతని భావన. పల్లెటూరి జీవితం, పట్నవాసపు జీవితం పరస్పర విరుద్ధమైనవని అతని భావం.

ప్రశ్న 4.
పల్లెటూళ్ళ, పట్టణాల జీవితాలు పరస్పర విరుద్ధంగా ఉంటాయని ఎందుకన్నారు?
జవాబు:
పల్లెటూరి జీవితంలో సుఖం తక్కువ. ఆధునిక సౌఖ్యాలు తక్కువగా ఉంటాయి. కానీ, మనుషుల మధ్య స్నేహం ఎక్కువ. కలిసిమెలిసి ఉంటారు. ఒకరి కష్టసుఖాలలో అందరూ పాలు పంచుకొంటారు. ఆడుతూ పాడుతూ పనిపాటలు చేసుకొంటారు. హాయిగా కబుర్లు చెప్పుకొంటారు. విశాలమైన ఇళ్ళు ఉంటాయి. అరుగులు ఉంటాయి. ఆ అరుగులపై కూర్చొని కబుర్లు చెప్పుకొంటారు. స్వార్థం తక్కువ. చాలామంది వ్యవసాయంపైన జీవిస్తారు. పగలంతా శ్రమ పడతారు. రాత్రంతా హాయిగా నిద్రపోతారు. వాతావరణ కాలుష్యం ఉండదు. ప్రకృతిలో లీనమై జీవిస్తారు.

పట్టణాలలో జీవితాలు సుఖంగా ఉంటాయి. ఆధునిక సౌఖ్యాలు ఎక్కువ. కాని, ఎవరి స్వార్థం వారిది. ఎవరూ ఎవరినీ పట్టించుకోరు. మాట్లాడుకోరు. సహాయ సహకారాలు ఉండవు. ఇరుకు గదులలో నివాసాలు. చాలామంది ఉద్యోగులే. మితిమీరిన కాలుష్యం అన్ని రకాల కాలుష్యాలకు నిలయం. ప్రకృతితో సంబంధంలేని జీవితాలు. అంతా . తొందరే. విపరీతమైన రద్దీ, కంగారు, హడావుడి పరుగులు.

ప్రశ్న 5.
పల్లెటూళ్ళ గురించి మీకు తెల్సింది చెప్పండి.
జవాబు:
అమ్మ ఒడిలోని కమ్మదనం పల్లెటూర్లలో ఉంది. తెలుగు భాషలోని తీయదనం అక్కడే ఉంది. పక్షుల కిలకిలారావాలతో మెలుకువ వస్తుంది. చెట్ల సందులలోంచి సూర్యోదయం చూడముచ్చటగా ఉంటుంది. లేగదూడల గంతులు బాగుంటాయి. కబుర్లు చెప్పుకొంటూ పొలాలకు వెళ్ళే రైతులతో సందడిగా ఉంటుంది. పిల్లలు చదువుల కోసం స్కూళ్ళకు వెడతారు. ఒకటే అల్లరి, అరుపులు, గోలగోలగా ఉంటుంది.

సాయంత్రం అందరూ ఇళ్ళకు చేరతారు, స్నానాలు చేసి, భోజనాలు చేస్తారు. పిల్లల ఆటలు, పాటలు. పెద్దల కబుర్లు, వేళాకోళాలు, వెక్కిరింతలు, నవ్వులు. నిద్రకుపక్రమిస్తారు. కల్మషం లేని మనుషులు. కాలుష్యం లేని వాతావరణం. దొరికిన దానితో తృప్తి పడతారు. పెడతారు. తింటారు.

ఇవి చేయండి

I. అవగాహన – ప్రతిస్పందన

ప్రశ్న 1.
పల్లె గొప్పదా? పట్నం గొప్పదా? మీరైతే దేన్ని సమర్థిస్తూ మాట్లాడతారు? ఎందుకు?
జవాబు:
పల్లె గొప్పది :
స్నేహం ఎక్కువ. మనుషుల మధ్య చక్కటి అనుబంధాలు ఉంటాయి. ఒకరికొకరు సహాయం చేసుకుంటారు. కలసిమెలసి ఉంటారు. కష్టసుఖాలలో పాలుపంచుకొంటారు. కల్మషం ఉండదు. వాతావరణం కాలుష్యం ఉండదు. ప్రశాంతంగా ఉంటుంది. రణగొణ ధ్వనులు ఉండవు. ట్రాఫిక్ సమస్యలు ఉండవు. కమ్మటి గేదె పెరుగుతో అన్నం తినవచ్చు. తాజాకూరలు దొరుకుతాయి. ఎవర్ని పలకరించినా నవ్వుతూ మాట్లాడతారు. పల్లె తల్లిలాంటిది. తల్లి దగ్గర ఉంటే ఎంత భద్రతగా ఉంటుందో, ఎంత హాయిగా ఉంటుందో అంత హాయిగా ఉంటుంది. పల్లెను నమ్మినవాడే తెలివైనవాడు. పల్లెటూరే భూలోకస్వర్గం.

పట్నం గొప్పది :
చదువుకు బాగుంటుంది. చాలా కాలేజీలు, స్కూళ్ళు, లైబ్రరీలు ఉంటాయి. చదువుకొనేందుకు చాలా అవకాశాలు ఉంటాయి.. సేద తీరడానికి పార్కులు ఉంటాయి. సినిమాహాళ్ళు ఉంటాయి. అప్పుడప్పుడు సర్కర్లు కూడా ఉంటాయి.

చదువుకొన్నాక మంచి ఉద్యోగానికి కూడా అవకాశం ఉంటుంది. ప్రతిభ చూపిస్తే ఉద్యోగంలో మంచి ప్రమోషన్ కూడా వస్తుంది. హాయిగా, సుఖంగా జీవించవచ్చు. చక్కటి నివాసాలు ఉంటాయి. రోడ్లు కూడా బాగుంటాయి. 24 గంటలూ జనంతో కలకలలాడుతూ ఉంటుంది. ఏ వస్తువైనా దొరుకుతుంది. ఎక్కడ నుండి ఎక్కడకు వెళ్ళాలన్నా వాహనాలు దొరుకుతాయి. భయం ఉండదు. పెళ్ళివారిల్లులా సందడిగా ఉంటుంది.

(సూచన : విద్యార్థులలో ఎవరికి ఏది ఇష్టమైతే దానిని గొప్పదిగా చెప్పవచ్చు. )

AP SSC 10th Class Telugu Solutions Chapter 3 జానపదుని జాబు

ప్రశ్న 2.
గతంతో పోలిస్తే నేడు వ్యవసాయం చేసేవారి సంఖ్య క్రమేణా తగ్గుతోంది. దీనికి కారణాలు ఏమై ఉంటాయి? తెల్సుకొని చర్చలో పాల్గొనండి.
జవాబు:
వ్యవసాయం చేయాలంటే ఓర్పు కావాలి. శారీరకంగా కష్టపడాలి. రాత్రనక, పగలనక కష్టపడాలి. చాలా బాధలుపడాలి.

కాని, ఇప్పటివారికి ఓర్పు తక్కువ. కష్టపడే తత్వం తగ్గింది. నిరంతరం శ్రమపడే స్వభావం లేదు. సుఖవాంఛ పెరిగింది. సులువుగా డబ్బు సంపాదించాలనే కోరిక పెరిగిపోయింది. పట్నవాసపు మోజు పెరిగింది. చదువుకొని, ఉద్యోగం చేయాలనే కోరిక పెరిగిపోయింది. వ్యవసాయంలో నష్టాలు కూడా కారణం. సరైన ధర రాదు. అప్పులతో బాధపడాలి. కూలిరేట్లు పెరిగిపోయాయి. ఖర్చులు పెరిగిపోయాయి. సౌఖ్యం తక్కువ. కష్టం ఎక్కువ. అందుకే వ్యవసాయం చేయడానికి నేడు ఇష్టం చూపించటం లేదు.

ప్రశ్న 3.
కింది వాక్యాలు చదవండి. వీటిని ఏ సందర్భంలో ఎవరు అన్నారు?
అ) అన్నాయ్! ఈ లెక్క చెప్పి పడుకోకూడదా !
జవాబు:
పరిచయం : ఈ వాక్యం డా|| బోయి భీమన్న రచించిన “ జానపదుని జాబు” అనే పాఠంలోనిది.
సందర్భం : రచయితను నిద్రపొమ్మని వాళ్ళ అమ్మగారు చెప్పినప్పుడు, ఆయన చెల్లెలు రచయితతో పలికిన వాక్యమిది.
భావం : రచయిత చెల్లెలు తనకు లెక్క చెప్పమని అడిగింది.

ఆ) “అయితే యీ రూపాయిని గుణించి అణాలు చేయి.”
జవాబు:
పరిచయం : ఈ వాక్యం డా|| బోయి భీమన్న రచించిన “జానపదుని జాబు” అనే పాఠంలోనిది.
సందర్భం : రచయిత తన చెల్లికి లెక్క చెప్పే సందర్భంలో, రచయిత తల్లి, ఆయన చెల్లితో పలికిన వాక్యమిది.
భావం : రూపాయిని అణాలుగా చేయాలంటే పుస్తకాలు, తెలివి. అక్కర్లేదు. దుకాణం వద్దకు వెడితే వస్తుంది. ఆచరణలో ఉపయోగించే చదువు కావాలని భావం.

ఇ) “వరిచేలో నీరుపడ్డది, నీవు రావాలి.”
జవాబు:
పరిచయం : ఈ వాక్యం డా|| బోయి భీమన్న రచించిన “జానపదుని జాబు” అనే పాఠంలోనిది.
సందర్భం : నిజజీవితానికి, చదువులకూ గల సంబంధం రచయిత ఆలోచిస్తున్న సందర్భంలో కోటయ్య రచయితతో పలికిన వాక్యమిది.
భావం : కోటయ్య వరిచేలో నీరు పడింది. రచయిత సహాయం కోరి వచ్చాడు.

4. (బోయి భీమన్న రాసిన “ధర్మం కోసం పోరాటం” లోని) కింది పేరా చదవండి. పేరాలోని కీలకమైన ఐదు పదాలను గుర్తించండి.

పనిచేస్తూ ఉంటే అనుభవం కలుగుతూ ఉంటుంది. అనుభవాన్ని మళ్ళీ ఆచరణలో పెడితే, పని మరింత చక్కగా సాగుతుంది. అప్పుడు అనుభవానికి మరింత పదునూ, కాంతి లభిస్తుంది. వాస్తవ జ్ఞాన సముపార్జన పద్ధతి ఇది. వాస్తవ జ్ఞానమే సరియైన జ్ఞానం. వాస్తవ జ్ఞానం ఎడతెగని పని ద్వారా, పరిశీలన ద్వారా లభిస్తుంది. వాస్తవ జ్ఞానం దేశకాల ప్రాంతానుగుణమై ఉంటుంది. దేశకాల ప్రాంతానుగుణంగా మారుతుంది. మన వస్త్రధారణ, వివాహాలు, పరిపాలన విధానాలు, ఈ విధంగా విభిన్న విషయాన్ని తీసుకొని మనం పరిశీలించినా, ఈ సత్యం కనిపిస్తుంది. మంచి చెడ్డలు, ఆచార వ్యవహారాలు, విధి విధానాలు అన్నీ దేశకాల ప్రాంతానుగుణంగా ఎలా మారిపోతున్నాయో స్పష్టమవుతుంది. మార్పుకు అతీతమైంది ఏదీ ఈ లోకంలో లేదు.
జవాబు:
కీలకపదాలు :
కీలకపదాలు అంటే ఆ పేరాకు ప్రాణం వంటి పదాలు. ఆ పదాలకు వ్యాఖ్యానము, విశ్లేషణ పేరాలో కనబడుతుంది. అంటే ఆ పదాలు లేకపోతే ఆ పేరాకు సమగ్రమైన విలువ ఉండదు. ఈ పేరాలోని కీలక పదాలు కింద ఉన్నాయి గమనించండి.
1) పని
2) అనుభవం
3) జ్ఞానం
4) పరిశీలన
5) మార్పు

పై పేరా ఆధారంగా కింది వాక్యాలలో ఏవి సరైనవో (✓) ద్వారా గుర్తించండి.

అ) అనుభవం వల్ల మన పనితీరు మెరుగుపడుతుంది. ( ✓ )
ఆ) ‘జ్ఞానం’ అనేది చదివితే, వింటే లభించేది. ( ✗ )
ఇ) వాస్తవ జ్ఞానం స్థిరంగా ఉండదు. అది కాలానుగుణంగా మారుతుంటుంది. ( ✓ )
ఈ) అనుభవం, పరిశీలన వల్ల వాస్తవ జ్ఞానం సిద్ధిస్తుంది. ( ✓ )
ఉ) మన ఆచార వ్యవహారాలు, విధి విధానాలు ఎప్పుడూ స్థిరంగా ఉంటాయి. ( ✗ )

AP SSC 10th Class Telugu Solutions Chapter 3 జానపదుని జాబు

5. పాఠం ఆధారంగా కింది ప్రశ్నలకు జవాబులు రాయండి.

అ) జానపదుని లేఖలో కవి ఏ ఏ విషయాలను గురించి రాశారు?
జవాబు:
పల్లెటూరి చమత్కారాలు వివరించాడు. సరదాగా జరిగే వాదప్రతివాదనలు వివరించాడు. మానవ మనస్తత్వం, చదువులను విశ్లేషించాడు. పొలం పనులలో సాధక బాధకాలు కళ్ళకు కట్టినట్లు వర్ణించాడు.

ఆ) వ్యవసాయదారుల కష్టాన్ని కవి ఏమని వివరించారు?
జవాబు:
వ్యవసాయ కూలీలు, రైతులు అనేక కష్టాలుపడతారు. ముందు దుక్కి దున్నుతారు. విత్తనాలు చల్లుతారు. నీటి కొరకు పోటీపడతారు. కూలి గురించి పోటీపడతారు. ఆకుమడికి కాపలా కాస్తారు. రాత్రీ, పగలూ చేలోనే ఉంటారు. జెర్రులూ, తేళ్ళూ కుడతాయి. పాములు కరుస్తాయి. వానా, బురదా లెక్కచేయకుండా చేస్తారు. ఎరువులు వేస్తారు. కలుపు తీస్తారు. అన్ని జాగ్రత్తలతో పంట పండిస్తారు. పంటను ఎలుకలు, చిలుకలు తినేయకుండా కాపాడతారు. చివరకు ఆ పండిన ధాన్యం భూస్వామికి కొలిచి అప్పగిస్తారు. తమ కడుపులు కాల్చుకొంటారు. తమ కన్నీళ్ళు అలాగే ఉంటాయి. ఎంత రాతి గుండెనైనా కరిగించే కష్టాలు వారివి అని రచయిత తన లేఖలో వ్యవసాయదారుల జీవితాలను కళ్ళకు కట్టినట్లు వర్ణించాడు.

ఇ) చదువుకొన్న వాళ్ళ గురించి, పట్టణవాసుల గురించి కవి ఏమని ప్రస్తావించారు?
జవాబు:
పట్టణంలో కాలం కచ్చితంగా పాటిస్తారు. పట్నం వాళ్ళు, పల్లెటూరి వాళ్ళు కష్టపడి సంపాదించిన దానిని తింటారు. ఎన్నో సుఖాలు అనుభవిస్తారు. ఆ సుఖాలన్నీ పల్లెటూరి వారు కష్టపడి సమకూర్చినవే.

ఈ) జానపదుడు తన పట్టణం మిత్రుణ్ణి పల్లెటూరుకు ఎందుకు రమ్మని ఆహ్వానించాడు?
జవాబు:
పల్లెటూరి వాళ్ళు పడే కష్టాన్ని చూడడానికి రమ్మన్నాడు. ఆ కష్టాలు తొలగిపోతే పల్లెటూళ్ళు, మానవ సంఘానికి ఇచ్చే ఆనందాన్ని అవగాహన చేసుకొనేందుకు రమ్మన్నాడు. పల్లెటూళ్లో దొరికే నారింజపళ్ళూ, వెలపళ్ళూ, కొబ్బరి కురిడీలూ మొదలైనవి తినడానికి రమ్మన్నాడు.

ఉ) బోయి భీమన్న గురించి సొంతమాటల్లో రాయండి.
(లేదా )
‘జానపదుని జాబు’ పాఠ్యభాగ రచయిత గురించి రాయండి.
జవాబు:
బోయి భీమన్న 19 సెప్టెంబర్, 1911లో తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు గ్రామంలో జన్మించారు. తన రచనల ద్వారా సమాజంలో మార్పు కోసం ప్రయత్నించారు.

క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. కొంతకాలం జర్నలిస్టుగా పనిచేశారు. ఉపాధ్యాయుడిగా పనిచేశారు. డా|| బోయి భీమన్న గుడిసెలు కాలిపోతున్నాయి, పాలేరు,

జానపదుని జాబులు, రాగవైశాఖి, పిల్లీశతకం, ధర్మం కోసం పోరాటం మొదలైనవి 70కి పైగా రచనలు చేశారు. పాలేరు నాటకం చాలామంది జీవితాలను మార్చింది.

‘గుడిసెలు కాలిపోతున్నాయ్’ రచనకు 1975లో ఆంధ్ర సాహిత్య అకాడమీ అవార్డు వరించింది. 1973లో పద్మశ్రీ, 2001లో పద్మభూషణ్ వరించాయి. ఆంధ్ర విశ్వవిద్యాలయం ‘కళాప్రపూర్ణ’, ‘గౌరవ డాక్టరేట్’ను ప్రదానం చేసింది. 1991లో రాజ్యలక్ష్మీ అవార్డు వచ్చింది.

II. వ్యక్తీకరణ సృజనాత్మకత

1. కింది ప్రశ్నలకు ఆలోచించి ఐదేసి వాక్యాల్లో సమాధానాలు రాయండి.

అ) “ఏమీ పని లేకపోవడమే బద్దకానికి కారణం” దీనిపై మీ అభిప్రాయం తెల్పండి.
జవాబు:
పని ఉంటే తిండి పైనా, నిద్రపైనా ధ్యాస ఉండదు. పని లేకపోతే ఏదైనా తినాలనిపిస్తుంది. తిండి ఎక్కువైతే నిద్ర వస్తుంది. నిద్ర ఎక్కువైతే మత్తుగా ఉంటుంది. ఆ మత్తునే బద్దకం అంటారు. బద్దకం అలవాటైతే, పని ఉన్నా చేయలేం. అందుచేత బద్దకం అలవాటు చేసుకోకూడదు. పని లేకపోతే ఏదైనా పని కల్పించుకొని చేయాలి.

ఆ) “కాలం చాలా విలువైంది” ఎందుకు?
జవాబు:
ధనం పోయినా తిరిగి సంపాదించుకోవచ్చును. ఆస్తి పోతే మళ్ళీ సంపాదించవచ్చును. పరువు పోయినా, ప్రవర్తన మార్చుకొని, మంచి పనులు చేసి తిరిగి సంపాదించవచ్చును. కాని, కాలం గడిచిపోతే తిరిగి సంపాదించలేం. గడిచిపోయిన ఒక్క సెకను కూడా తిరిగిరాదు. బాల్యంలో సంపాదించవలసిన జ్ఞానం అప్పుడే సంపాదించాలి. చదువు, ఆటలు, పాటలు, ధనం, కీర్తి ఏదైనా సరే సకాలంలో సంపాదించాలి. కాలం గడిచిపోయాక బాధపడినా ప్రయోజనం లేదు. అందుకే కాలాన్ని వృథా చేయకూడదు. సక్రమంగా వినియోగించుకోవాలి.

AP SSC 10th Class Telugu Solutions Chapter 3 జానపదుని జాబు

ఇ) చదువుకున్నవాళ్ళంతా తమ కష్టఫలాన్ని తింటూ పట్నాలలో సౌఖ్యాలు అనుభవిస్తున్నారన్న రచయిత అభిప్రాయంతో మీరు ఏకీభవిస్తారా? ఎందుకు?
సూచన : రచయిత అభిప్రాయంతో కీభవించవచ్చు. వికీభవించక పోవచ్చును. అందుచేత రెండు అభిప్రాయాలు ఇవ్వబడ్డాయి. మీకు నచ్చిన ఒక అభిప్రాయాన్నే గ్రహించండి.
జవాబు:
i) రచయిత అభిప్రాయంతో ఏకీభవిస్తాను. ఎందుకంటే విద్యార్థులు కళాశాలలో, పాఠశాలలో, ఉన్నత విద్యలోనూ అనేక సదుపాయాలు పొందుతున్నారు. ఆ విద్యార్థులకు ఆ సదుపాయాలన్నీ ప్రభుత్వం కల్పిస్తోంది. దానికి ఖర్చయ్యేది ప్రభుత్వ ధనం. అంటే పన్నుల రూపంలో ప్రజలు కట్టిన డబ్బు కదా ! మరి, పేద ప్రజల డబ్బుతో సదుపాయాలు పొంది, చదువుకొన్నవాళ్ళు పట్నాలకు వెడుతున్నారు. అక్కడ హాయిగా సుఖపడుతున్నారు. పల్లెటూర్ల వైపు కన్నెత్తి చూడరు. తమ అభివృద్ధికి కారకులైన సామాన్యులను పట్టించుకోరు. ధన సంపాదనలో మునిగిపోతారు.

ఉదాహరణకు ఒక డాక్టరు తయారవ్వాలంటే కనీసం 50 లక్షల రూపాయలు ఖర్చవుతుంది. ఆ డబ్బంతా ప్రజాధనమే. కాని, చదువు పూర్తయ్యాక పల్లెటూర్లో ఉండడానికి ఎవ్వరూ అంగీకరించరు. వైద్యశాలల్లో డాక్టర్లు లేక, మందులు లేక పల్లెటూరి రోగులు అనేక బాధలు పడుతున్నారు కదా ! చాలా వృత్తులు ఇలాగే ఉన్నాయి. అందుచేత రచయిత అభిప్రాయం నూటికి నూరుపాళ్ళూ సమర్థించతగినది.

ii) “చదువుకొన్న వాళ్ళంతా తమ కష్టఫలాన్ని తింటూ, పట్నాలలో సౌఖ్యాలు అనుభవిస్తున్నారు” అన్న రచయిత అభిప్రాయంతో ఏకీభవించను. ఎందుకంటే చదువుకొన్న వాళ్ళు కూడా వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. పేదలు ఉంటారు. దళితులు ఉంటారు. కూలిపని చేసుకొనే వారి కుటుంబాల నుండి వచ్చిన వారుంటారు. లేఖా రచయిత కూడా పేద దళిత వ్యవసాయ కుటుంబానికి చెందినవాడు. చదువుకొన్నవాడు.

అన్ని ఉద్యోగాలూ పట్నాలలోనే లేవు. ఉపాధ్యాయులు, రెవెన్యూ, పోలీసు మొదలైన ఉద్యోగాలు పల్లెటూళ్ళలోనివే. పోలీసు వంటి ఉద్యోగం ప్రాణాలతో చెలగాటం కూడా. నిరంతరం ప్రమాదపుటంచున వారి జీవితాలు ఉంటాయి. అందర్నీ రక్షిస్తారు. కాని, వారికి రక్షణ లేదు.

చదువుకొన్న వాళ్ళందరికీ ఉద్యోగాలు లేవు. ఉద్యోగులు అందరూ పట్నాలలోనే లేరు. పల్లెటూళ్ళలోనూ ఉన్నారు. భయంకరమైన అడవులలో, కొండలలో కూడా ఉద్యోగులు ఉన్నారు. కనుక రచయిత అభిప్రాయంతో నేను ఎట్టి పరిస్థితులలోనూ ఏకీభవించను.

ఈ) “కష్టం ఒకళ్ళది ఫలితం మరొకళ్ళది” అని అనడంలో రచయిత ఉద్దేశం ఏమై ఉంటుంది?
(లేదా)
‘కష్టం ఒకళ్ళది ఫలితం మాత్రం మరొకళ్ళది’ అని రచయిత అనడంలో ఉద్దేశం ఏమై ఉంటుందో “ జానపదుని జాబు” అనే పాఠం ఆధారంగా రాయండి. .
జవాబు:
పల్లెటూరి వాళ్ళు ఎంతో కష్టపడతారు. కూలిపని చేస్తారు. పస్తులు ఉంటారు. రెక్కలు ముక్కలు చేసుకొని వ్యవసాయం చేస్తారు. రాత్రనక, పగలనక అనేక కష్ట నష్టాల కోర్చి పంటను పండిస్తారు. కంటికి రెప్పలా కాపాడతారు. కాని, పండించిన దానిలో ఎక్కువ భాగం ఆ పొలం సొంతదారునకు ఇవ్వాలి. వాళ్ళు కష్టపడకుండా తీసుకొంటారు. హాయిగా అనుభవిస్తారు.

ఈ విధానం మారాలని రచయిత ఉద్దేశం. దున్నేవానిదే భూమి కావాలనేది రచయిత ఉద్దేశం. పేదరికం పోవాలంటే, పేదలకు భూమిపై హక్కు ఉండాలనేది రచయిత ఉద్దేశం.

ఉ) “పల్లెటూళ్ళు కన్నీళ్ళు పెడుతున్నవి” దీన్ని వివరిస్తూ రాయండి.
జవాబు:
“దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్” అన్నారు మహాకవి గుఱజాడ అప్పారావు అలాగే పల్లెటూళ్ళు అంటే, పల్లెటూళ్ళలోని మనుషులు అని అర్థం. పల్లెటూరిలో చాలామంది రైతులే ఉంటారు. వారు ఎండనక వాననక, పగలనక రాత్రనక చేలల్లో కష్టపడతారు. దుక్కి దున్నుతారు. నీరు పెడతారు. విత్తనాలు చల్లుతారు. చీడపీడల నివారణకు ఎరువులు వేస్తారు. కలుపుతీస్తారు. పంట పండిస్తారు. కుప్ప నూర్చుతారు. ఆ పండిన పంటంతా భూస్వామికి ఇస్తారు. తాము మాత్రం పస్తులుంటారు. వారికి కన్నీళ్ళే మిగులుతున్నాయి.

AP SSC 10th Class Telugu Solutions Chapter 3 జానపదుని జాబు

2. కింది ప్రశ్నలకు ఆలోచించి పదేసి వాక్యాల్లో సమాధానాలు రాయండి.

అ) పల్లెటూళ్ళు సుభిక్షంగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుంది. అలాంటి పల్లెటూళ్ళు రోజు రోజుకూ తమ ఉనికిని, సంస్కృతిని, ఆత్మను కోల్పోతున్నాయి. ఇందుకు గల కారణాలు ఏమై ఉంటాయి? ఇవి కలకలలాడాలంటే మనం ఏం చేయాలి?
జవాబు:
పల్లెటూళ్ళు సుభిక్షంగా ఉండాలంటే, వ్యవసాయం లాభసాటిగా ఉండాలి. ‘దున్నేవాడిదే భూమి’ కావాలి. పండించిన పంటకు సరైన ధర రావాలి. ఎరువులు, పురుగుమందులు ప్రభుత్వం ఉచితంగా ఇవ్వాలి. నీటి సదుపాయం ఉండాలి. రైతులకు జీవితబీమా ఉండాలి. అప్పుడు వ్యవసాయంపై జనానికి మక్కువ పెరుగుతుంది. పట్నపు వలసలు ఆగుతాయి. పల్లెలు కళకళలాడతాయి. పల్లెలు కళకళలాడితే ప్రభుత్వ ఖజానాలో కాసులు గలగలలాడతాయి. దేశం సుభిక్షంగా ఉంటుంది.

ఉనికి :
పల్లెటూళ్ళలో బ్రతుకు తెరువు లేక జనం పట్నాలకు వలసపోతున్నారు. జనం లేక పల్లెటూళ్ళు వెలవెలబోతున్నాయి. ఉన్న కొద్దిపాటి జనానికి పనులు లేవు. వ్యవసాయం చేసినా నష్టాలు తప్పడం లేదు. వారు కూడా పట్నాలకో, ఇతర దేశాలకో ‘పనికోసం’ వెళ్ళిపోవడానికి చూస్తున్నారు. అందుకే ఉనికి కోల్పోతున్నాయి.

సంస్కృతి :
పల్లెటూరిలో చాలామంది వ్యవసాయదారులు ఉంటారు. ధాన్యపుగింజలకు లోటుండదు. తిండికి లోటు ఉండదు. అందుచేత ఎవరికైనా క్రొత్తవారికి కడుపునిండా తిండి పెట్టేవారు. ఆదరించేవారు, ఆప్యాయంగా పలకరించేవారు. పాడి పశువులుంటాయి. కనుక పాలు, పెరుగు, నెయ్యి సమృద్ధిగా ఉండేవి. ప్రతి ఇంటా ఇవి సమృద్ధిగా ఉండేవి. క్రొత్తవారికి ఉచితంగా ఇచ్చేవారు. ఇది పల్లెటూరి సంస్కృతి.

కాని వ్యవసాయంలో కన్నీరే మిగులుతోంది. పశుపోషణ తలకు మించిన భారమౌతోంది. అందుచేత పల్లెటూళ్ళు తమ సంస్కృతిని కోల్పోతున్నాయి. అసలే జనాలు లేరు. ఉన్నవారికి బాధలు. ఇక సంస్కృతి ఎలా నిలబెట్టుకొంటారు.

ఆత్మ :
పల్లెటూరికి ఆత్మ ఆత్మీయత. ఎవరినైనా ఆత్మీయంగా పలకరించడం పల్లెటూరి లక్షణం. కేవలం పలకరించడమే కాదు, వారి కష్ట సుఖాలలో పాల్గొనడం, పదిమందికీ పెట్టడం, గలగలా నవ్వడం, చకచకా పనులు చేయడం. కల్మషం, మోసం తెలియకపోవడం, ఇవన్నీ పల్లెటూరి లక్షణాలు.

కాని, పట్నవాసపు పోకడలు నేడు బాగా పెరిగిపోయాయి. అందుచేత ‘అమాయకత్వం’ స్థానంలో ‘మాయకత్వం’ వచ్చింది. మాయకత్వం ఉన్నచోట పై పేరాలో లక్షణాలేవీ ఉండవు. అందుచేతనే పల్లెటూరికి ‘ఆత్మ’ కూడా తొందరగా కనుమరుగవుతోంది.

పల్లెటూళ్ళు కళకళలాడాలంటే వాటి ఉనికి, సంస్కృతి, ఆత్మలను కాపాడాలి. కేవలం ఉపన్యాసాల వల్ల ఇవి సాధ్యం కావు. పట్టుదలతో కృషి చేయాలి. సమాజాన్ని పూర్తిగా సంస్కరించాలి.

ఆ) ‘పల్లెటూళ్ళు ప్రశాంత జీవిత సౌఖ్యానికి పుట్టిళ్ళు’ దీన్ని సమర్థిస్తూ సమాధానం రాయండి.
(లేదా)
“పల్లెటూరి జీవితం ప్రశాంతంగా ఉంటుంది.” మీ అభిప్రాయం తెల్పండి.
(లేదా)
పల్లె జీవితంలోని అనుకూల అంశాలను వివరిస్తూ పది వాక్యాలలో ఒక వ్యాసం రాయండి.
జవాబు:
పల్లెటూళ్ళలో ట్రాఫిక్ సమస్యలు ఉండవు. రణగొణ ధ్వనులు ఉండవు. అందుచేత ప్రశాంతంగా ఉంటుంది. పెద్ద పెద్ద కర్మాగారాలుండవు. వాహనాల పొగ ఉండదు. అందుచేత కాలుష్యం ఉండదు. కాలుష్యం లేని నివాసమే స్వర్గం కదా ! జనాభా తక్కువ కనుక సమస్యలుండవు. ఇరుకు ఉండదు. చక్కగా పచ్చటి ప్రకృతి, ఎటుచూసినా వరిచేలు, జొన్నచేలు, మొక్కలు, చెట్లతో కళకళలాడుతూ ఉంటుంది. హాయిగా అమ్మ ఒడిలోని కమ్మదనం అంతా పల్లెటూరి జీవితంలో అనుభవించవచ్చును.

ఎవర్ని పలకరించినా ఆప్యాయంగా మాట్లాడతారు. కష్ట సుఖాలలో చేదోడు వాదోడుగా ఉంటారు. దొంగల భయం ఉండదు. పక్షుల కిలకిలలతో రోజు ప్రారంభమౌతుంది. వెన్నెలలో ఆటలతో, కబుర్లతో, కథలతో, నవ్వులతో, నిద్రమంచం పైకి చేరతాం.

ఇంతకంటే సౌఖ్యవంతమైన జీవితం ఎక్కడా ఉండదు. అందుకే పల్లెటూర్లు ప్రశాంత జీవిత సౌఖ్యానికి పుట్టిళ్ళు అని కచ్చితంగా చెప్పవచ్చును.

AP SSC 10th Class Telugu Solutions Chapter 3 జానపదుని జాబు

3. కింది అంశాల గురించి సృజనాత్మకంగా ప్రశంసిస్తూ రాయండి.

అ) మీరు చూసిన పల్లెటూరులోని మనుష్యుల మధ్య సంబంధాలు, అక్కడి ప్రకృతి దృశ్యాలను వర్ణిస్తూ మీ మిత్రుడికి లేఖ రాయండి.
జవాబు:

మసకపల్లి,
X X X XX

ప్రియమైన రాంబాబుకు,
సూరిబాబు వ్రాయునది.
ఇక్కడంతా క్షేమం. అక్కడ మీరంతా క్షేమమని తలుస్తాను. మొన్న వేసవి సెలవులలో నేను కోనసీమలోని ఆదుర్రు వెళ్లాను. అక్కడ చాలా బాగుంది. ఆ విశేషాలు రాస్తాను.

అమలాపురం డివిజన్లో మామిడికుదురు మండలంలోని గ్రామం ఆదుర్రు. ఊరంతా పచ్చటి పంటపొలాలు. ఎటుచూసినా తివాచీ పరచినట్లుగా కనిపిస్తాయి. అంతేకాకుండా కొబ్బరిచెట్లు చాలా ఉన్నాయి. బారులు తీరి నిలబడిన సైనికుల్లా ఉంటాయి. ఇంకా రకరకాల పూలమొక్కలు, చెట్లు ఉన్నాయి. అవి అన్నీ చూస్తుంటే అస్సలు సమయం తెలియదు. ఆ ఊర్లో నది ఉంది. దాని పేరు వైనతేయ నది. ఆ నది ఒడ్డున బౌద్ధస్థూపం ఉంది. ఎత్తుగా ఉంది. అక్కడ బుద్ధునికి సంబంధించినవి ఉన్నాయట. చాలా పెద్ద పెద్ద ఇటుకలున్నాయి. పెద్ద మట్టి చెట్టు ఉంది. దాని ఊడలతో ఉయ్యాల ఊగాము. భలే సరదాగా ఉంది. ఆ చెట్లపై ఎన్నో పక్షులున్నాయి. అవి చేసే గోల భలే తమాషాగా ఉంది.

అక్కడ ఎవరిని పలకరించినా ఎంతో ఆప్యాయంగా మాట్లాడారు. ఉపాధ్యాయులు నరసింహంగారు అనే పెద్దాయన ఆ ఊరు మొదట నిర్మింపబడిందని చెప్పారు. ‘ఆది ఊరు’ కనుక ఆదుర్రు అయింది అన్నారు. రెండు నెలల సెలవులు ఇట్టే అయిపోయాయి.

ఈసారి సెలవులకి మనిద్దరం కలసి వెళదాం. నువ్వెక్కడికైనా వెళ్ళావా? లేదా? రిప్లై రాయి. మీ అమ్మగారికి, నాన్నగారికి నా నమస్కారములని చెప్పు. ఇక ఉంటాను మరి. టా…టా…

ఇట్లు
నీ స్నేహితుడు,
సూరిబాబు.

చిరునామా:
మంత్రి ప్రగడ రాంబాబు, 10వ తరగతి నెం. 12,
ఎస్.డి.వి.ఆర్.ఆర్. హైస్కూలు,
కోలంక, తాళ్ళరేవు (మండలం), తూ! గో|| జిల్లా,

ఆ) ఈ పాఠం ఆధారంగా కొన్ని నినాదాలు, సూక్తులు రాయండి.
జవాబు:

1. నినాదాలు : 2. సూక్తులు:
1) వలసలు మానండి, పల్లెలు నిలపండి. 1) రైతు దేశానికి వెన్నెముక.
2) వ్యవసాయం చేద్దాం, ఆత్మగౌరవంతో జీవిద్దాం. 2) పల్లెటూర్లే దేశానికి పట్టుగొమ్మలు.
3) అప్పుకు భయపడకు, ఆశను పెంచుకో. 3) పల్లెను, తల్లిని కాపాడాలి.
4) పల్లెటూర్లే మనదేశ ధాన్యాగారాలు. 4) అన్నం పెట్టే తల్లివంటిదే పల్లె,
5) పల్లెటూరిని, తల్లిని విడిచిపెట్టకు. 5) పల్లెటూరులో జీవితం ప్రశాంతం.
6) పల్లెలు పచ్చగా ఉంటేనే మన బతుకులు పచ్చగా ఉంటాయి.
7) రణగొణ ధ్వనులు లేని పల్లెటూర్లు ప్రశాంతమైన పడకటిళ్ళు.

భాషా కార్యకలాపాలు ప్రాజెక్టు పని

అందమైన పల్లెటూరు ఎలా ఉంటుందో ఊహించండి. ప్రకృతి శోభలతో అలరారే అలాంటి గ్రామసీమ చిత్రాన్ని సేకరించండి. దాన్ని వర్ణిస్తూ, వివరాలను రాసి ప్రదర్శించండి. మీ మిత్రులు కూడా ఇలాగే రాస్తారు కదా! వీటితో “అందమైన గ్రామ సీమలు” అనే పుస్తక సంకలనం చేయండి. దానికి ముఖచిత్రం కూడా గీయండి. విషయసూచిక, ముందు మాట రాసి ప్రదర్శించండి.
జవాబు:
( అందమైన గ్రామాలు (సంకలన గ్రంథం) )
ముఖచిత్రం :
ప్రతి వర్ణనలోని విషయం వచ్చేలా ఉండాలి. (అట్ట)

అట్టపైన :
గుబురుగా ఉన్న చెట్ల సందులలోంచి సూర్యోదయం. ఆకాశంలో ఎగురుతున్న పక్షులు. పెంకుటిళ్ళు, పాకలు చిత్రించాలి. పొలం పనులకు వెళ్ళే స్త్రీ, పురుషులను చిత్రించాలి. గంతులేస్తున్న లేగదూడలను చిత్రించాలి.
AP SSC 10th Class Telugu Solutions Chapter 3 జానపదుని జాబు 4

III. భాషాంశాలు :

పదజాలం

1. కింది పదాలు చూడండి. వాటికి సంబంధించిన పదాలతో కలపండి.
ఉదా : రైల్వేస్టేషను, …………., ……….., చేరుకోడం.
జవాబు:
రైల్వే స్టేషను, టిక్కెట్టు, ప్రయాణం, చేరుకోడం.

అ) వర్షాకాలం, ………….., ………………… ధాన్యం.
జవాబు:
వర్షాకాలం, విత్తడం, నూర్చడం, ధాన్యం.

ఆ) మడిదున్నడం, …………., …………., పంట.
జవాబు:
మడిదున్నడం, నీరు పెట్టడం, వరినాటడం, పంట.

ఇ) పాఠశాల, …………, ………… జీవితంలో స్థిరపడడం.
జవాబు:
పాఠశాల, చదువు, ఉద్యోగం, జీవితంలో స్థిరపడడం.

ఈ) లేఖ, ………….., ……………, చేరడం.
జవాబు:
లేఖ, విషయం , చిరునామా, చేరడం.

ఉ) పనిచేయడం, …….., ……., ఆనందంగా జీవించడం.
జవాబు:
పనిచేయడం, సంపాదించడం, ఖర్చు పెట్టడం, ఆనందంగా జీవించడం.

AP SSC 10th Class Telugu Solutions Chapter 3 జానపదుని జాబు

2. కింది పదాలను ఉపయోగించి సొంతవాక్యాలు రాయండి.
అ) పొద్దస్తమానం
ఆ) చమత్కారం
ఇ) సాన్నిధ్యం
ఈ) కష్టఫలం
ఉ) కడుపులు మాడ్చుకొను
ఊ) అడుగున పడిపోవు

అ) పొద్దస్తమానం : పొద్దస్తమానం పనిచేస్తే, ‘రాత్రి బాగా నిద్ర పడుతుంది.
ఆ) చమత్కారం : చమత్కారంగా మాట్లాడే వారంటే నాకిష్టం.
ఇ) సాన్నిధ్యం : భక్తులు దేవుని సాన్నిధ్యంలో ఆనందపడతారు.
ఈ) కష్టఫలం ” : ఎవరి కష్టఫలం వారికి మధురంగా ఉంటుంది.
ఉ) కడుపులు మాడ్చుకొను : కొంతమంది కడుపులు మాడ్చుకొని పిల్లలను చదివిస్తారు.
ఊ) అడుగున పడిపోవు : జ్ఞానం విషయంలో అడుగున పడిపోవడం పనికిరాదు.

3. కింది పదాలు/ వాక్యాలను వివరించి రాయండి.

అ) పురిటిలోనే సంధి కొట్టడం :
సాధారణంగా ‘సంధి’ అనే వ్యాధి వచ్చినవారు బ్రతకరు. ఇది వృద్ధాప్యంలో వస్తుంది. ‘సంధి’ అంటే ‘మతి చలించడం’ అని చెప్పవచ్చును. ‘సంధి’ వచ్చినవారు సంబంధంలేని మాటలు మాట్లాడతారు. ఇది కూడా ఒకరకపు వాతరోగంగా ఆయుర్వేద శాస్త్రం పేర్కొంది.

పురిటిలో ఏ రకమైన వాతరోగమైనా రావచ్చును. కాని, ‘సంధి వాతరోగం’ రాదు. అటువంటిది పురిటి శిశువుకు ‘సంధి వాతం’ రావడం జరిగితే ఆ శిశువు బ్రతకదు.

అదే విధంగా ప్రారంభంలోనే పాడైపోయిన పని గురించి వివరించేటపుడు ఈ జాతీయం ఉపయోగిస్తారు.

సొంతవాక్యం :
చదువుదామని పుస్తకం తీయగానే కరెంటు పోవడంతో పురిటిలోనే సంధి కొట్టినట్లయింది ఈ రోజు చదువు.

ఆ) కలుపుతీయడం :
చేలలో వేసిన పంటతో బాటు అనవసరమైన మొక్కలు కూడా పెరుగుతాయి. ఈ అనవసరమైన మొక్కలను ‘కలుపు మొక్కలు’ అంటారు. చేనుకు వేసిన ఎరువును ఈ కలుపు మొక్కలు కూడా తీసుకొంటాయి. బాగా పెరుగుతాయి. వీటి వలన చేనుకు బలం తగ్గుతుంది. అందుచేత అనవసరమైన మొక్కలను (కలుపు మొక్కలను) పీకి, పారవేస్తారు. దీనినే కలుపు తీయడం అంటారు.

అలాగే సమాజంలో ఉంటూనే, సమాజాన్ని పాడుచేసేవారిని కూడా కలుపు మొక్కలు అంటారు.

సొంతవాక్యం :
1) చేలో కలుపు తీయడానికి నలుగురు కూలీలు కావాలి.
2) లంచగొండులైన కలుపు మొక్కలను ఏరిపారేస్తేనే సమాజం బాగుపడుతుంది.

ఇ) గ్రామోద్ధరణం :
గ్రామానికి ఉన్న సమస్యలను పరిష్కరించడాన్నే గ్రామోద్దరణం అంటారు. ఉదాహరణకు మురుగునీటి సమస్యను నివారించడం, విద్యుత్తు, ఆసుపత్రి, మంచినీరు మొదలైనవి కల్పించడం.

సొంతవాక్యం :
“గ్రామోద్ధరణమే దేశోద్ధరణం” అన్నారు గాంధీజీ.

ఈ) ఉన్నదంతా ఊడ్చుకపోవడం :
ఊడ్చుకపోవడం అంటే పూర్తిగా నాశనం కావడం. అధిక వర్షాలు, గాలివాన వంటి ఉపద్రవాలతో పంటలు నష్టపోగా, ఇంతలో వరదలు, ఉప్పెనలు వంటివి వచ్చి, పూర్తిగా పంటలు కొట్టుకుపోవడం వంటివి జరిగితే “ఉన్నదంతా ఊడ్చుకుపోయిందని” అంటారు. పూర్తిగా నష్టం కలిగించిందని భావం.

వ్యాకరణాంశాలు

1. కింది. వాక్యాల్లోని సంధులను విడదీసి, సంధి సూత్రంతో సమన్వయం చేయండి.
అ) ఆహాహా! ఎంత వైపరీత్యము !
ఆ) జంతు ప్రదర్శనశాలలో ఏమేమి చూశావు ?
ఇ) అక్కడక్కడ కొన్ని సమస్యలు తలెత్తవచ్చు.
ఈ) వెన్నెల పట్టపగలును తలపిస్తున్నది.

సంధి పదాలు :
ఆహాహా, ఏమేమి, అక్కడక్కడ, వెన్నెల, పట్టపగలు, తలెత్తవచ్చు, తలపిస్తున్నది.
వివరణ :

ఆమ్రేడిత సంధి
సూత్రము : అచ్చునకు ఆమ్రేడితము పరమగునపుడు సంధి తఱచుగానగు.

సూచన : ఒక పదం రెండుసార్లు ఉచ్చరిస్తే, రెండవదానిని ఆమ్రేడితం అంటారు. ఇక్కడ అత్వ, ఇత్వ, ఉత్వ సంధులు చెప్పకూడదు. ఆమ్రేడిత సంధి మాత్రమే చెప్పాలి.
ఆహా + ఆహా ఆహాహా (ఆ + ఆ = ఆ)
ఏమి + ఏమి = ఏమేమి (ఇ + ఏ = ఏ)
అక్కడ + అక్కడ = అక్కడక్కడ (అ + అ = అ)

ఆమేడిత సంధి

సూత్రము :
ఆమ్రేడితము పరమగునపుడు కడాదుల తొలియచ్చు మీది వర్ణంబుల కెల్ల అదంతంబగు ద్విరుక్తటకారంబగు. కడ, చివర, తుద, మొదలైనవి కణాదులు.
పగలు + పగలు = పట్టపగలు

ప్రాతాది సంధి
సూత్రము :
అన్యంబులకు సహిత మిక్కార్యంబులు కొండొకచో గానంబడియెడి.

వివరణ :
ప్రాతాదుల తొలియచ్చుమీది వర్ణంబులకెల్ల లోపంబు బహుళంబుగానగు – ఈ సూత్రం ద్వారా ప్రాతాదులలో . ‘వెల్ల’ అనే పదం లేకపోయినా పైన వ్రాసిన సూత్రం వలన ‘ల్ల’ కు లోపం వస్తుంది. వెల్ల + నైల = వెన్నెల

అత్వ సంధి
సూత్రము :
అత్తునకు సంధి బహుళంబుగానగు.
తల + ఎత్తవచ్చు . – తలెత్తవచ్చు (అ + ఎ = ఎ)

ఉత్వ సంధి
సూత్రము :
ఉత్తునకచ్చు పరమగునపుడు సంధియగు.
తలపు + ఇస్తు + ఉన్నది = తలపిస్తున్నది – (ఉ + ఇ = ఇ, ఉ + ఉ = ఉ)

AP SSC 10th Class Telugu Solutions Chapter 3 జానపదుని జాబు

2. కింది వాక్యాలను సంక్లిష్ట వాక్యాలుగా మార్చండి.

అ) రాము పాఠం చదివాడు. రాము పాఠం అర్థం చేసుకున్నాడు.
జవాబు:
రాము పాఠం చదివి, అర్థం చేసుకున్నాడు.

ఆ) వైద్యుడు ప్రథమ చికిత్స చేస్తాడు. వైద్యుడు మందులు ఇస్తాడు.
జవాబు:
వైద్యుడు ప్రథమ చికిత్స చేసి, మందులు ఇస్తాడు.

ఇ) అక్క టీవీ చూస్తున్నది. అక్క నృత్యం చేస్తున్నది.
జవాబు:
అక్క టీవీ చూస్తూ, నృత్యం చేస్తున్నది.

3. కింది వాక్యాలను సంయుక్త వాక్యాలుగా మార్చండి.
అ) రామకృష్ణుడు గురువు. వివేకానందుడు శిష్యుడు.
జవాబు:
రామకృష్ణుడు మరియు వివేకానందుడు గురుశిష్యులు.

ఆ) సీత సంగీతం నేర్చుకుంటున్నది. సీత నృత్యం నేర్చుకుంటున్నది.
జవాబు:
సీత సంగీతం మరియు నృత్యం నేర్చుకుంటున్నది.

ఇ) రంగారావుకు పాడటమంటే ఆసక్తి. రంగారావుకు వినడమంటే విరక్తి.
జవాబు:
రంగారావుకు పాడటమంటే ఆసక్తి మరియు వినడమంటే విరక్తి.

ఈ) శ్రీను బడికి వచ్చాడు. జాన్ రెడ్డి బడికి వచ్చాడు. హస్మత్ బడికి వచ్చాడు.
జవాబు:
శ్రీను, జాన్‌ రెడ్డి మరియు హస్మతలు బడికి వచ్చారు.

ఉ) ఆయన కవి. ఆయన గాయకుడు. ఆయన విద్యావేత్త.
జవాబు:
ఆయన కవి, గాయకుడు మరియు విద్యావేత్త. ప్రాతాది సంధి

4. కింద గీత గీసిన పదాలను విడదీయండి. మార్పులు గమనించండి.
అ) పూరెమ్మ అందంగా ఉన్నది.
ఆ) గురుశిష్యులు పూదోటకు వెళ్ళారు.
ఇ) రవికి పాల మీఁగడ అంటే చాలా ఇష్టం.
ఈ) కొలనులో కెందామరలు కొత్త శోభను వెదజల్లుతున్నాయి.

AP SSC 10th Class Telugu Solutions Chapter 3 జానపదుని జాబు

సంధి జరిగిన తీరును గమనించండి.
AP SSC 10th Class Telugu Solutions Chapter 3 జానపదుని జాబు 1

అదనపు సమాచారము

సంధులు

1) నెచ్చెలి = నెఱ + చెలి – ప్రాతాది సంధి
2) మాయమ్మ = మా + అమ్మ – యడాగమ సంధి
3) మామయ్య = మామ + అయ్య – అత్వ సంధి
4) స్వార్థాన్ని = స్వ + అర్థాన్ని – సవర్ణదీర్ఘ సంధి
5) సంవత్సరాది = సంవత్సర + ఆది – సవర్ణదీర్ఘ సంధి
6) చైత్రారంభం = చైత్ర + ఆరంభం – సవర్ణదీర్ఘ సంధి
7) గ్రామోద్ధరణము = గ్రామ + ఉద్ధరణము – గుణసంధి
8) పట్నాలు = పట్నము + లు – లలనల సంధి
9) సౌఖ్యాలు = సౌఖ్యము + లు – లులనల సంధి
10) మనోహరము = మనః + హరము – విసర్గ సంధి
11) పల్లెటూరు = పల్లె + ఊరు – టుగాగమ సంధి

గమనిక : ‘పల్లె’ అన్నచోట ఉత్వం లేదు. ఎత్వం ఉంది. అయినా టుగాగమం వచ్చింది.

ప్రకృతి – వికృతి

ఆశ్చర్యము – అక్కజము, అచ్చెరువు
స్నేహము – నేస్తము, నెయ్యము
ఆలస్యము – ఆలసము
రాశులు – రాసులు
నిద్ర – నిద్దుర
నిత్యము – నిచ్చలు
సఖా – సకుడు
పక్షము – పక్క
హృదయము – ఎద, ఎడద
గర్భము – కడుపు

సమాసాలు 
AP SSC 10th Class Telugu Solutions Chapter 3 జానపదుని జాబు 2
AP SSC 10th Class Telugu Solutions Chapter 3 జానపదుని జాబు 3

రచయిత పరిచయం

AP SSC 10th Class Telugu Solutions Chapter 3 జానపదుని జాబు 5
నివాసం :
డా॥ బోయి భీమన్న తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు గ్రామవాసి. 19 సెప్టెంబర్, 1911లో నిరుపేద దళిత కుటుంబంలో జన్మించారు.

భీమన్న మాట :
“ప్రతిభను తలెత్తనివ్వరు పండితులు – పాండిత్యాన్ని తలెత్తనివ్వరు పామరులు”, “ఈనాడు సాహిత్యమంటే కులం, మతం, వర్గం, ముఠా” అని తన కలం ద్వారా, గళం ద్వారా అనేకమార్లు వెలిబుచ్చారు.

భీమన్న బాట :
ఒకవైపు జాషువా, మరోవైపు శ్రీశ్రీ. ఇద్దరూ సాహిత్య చక్రవర్తులే, వారిద్దరి శైలి సాహితీ లోకాన్ని ఉర్రూతలూగిస్తోంది. అయినా భీమన్న తన శైలితో ప్రకంపనలు పుట్టించారు. అనేక సాహితీ ప్రక్రియలతో బడుగుల, దళితుల జీవితాలు చిత్రించారు. చైతన్యం కలిగించారు.

భీమన్న పట్టు :
అస్పృశ్యత రాజ్యమేలుతున్న రోజులవి. ఎన్నో కష్టాలు, మరెన్నో అడ్డంకులు. అన్నీ అధిగమించాడు. విద్యనభ్యసించాడు. మహాత్మాగాంధీ, అంబేద్కర్ బోధనలతో ప్రభావితుడయ్యాడు. తన కలం ద్వారా అస్పృశ్యతను రూపుమాపాలి అని ఆలోచించాడు. క్విట్ ఇండియా ఉద్యమంలో కూడా పాల్గొన్నాడు. జర్నలిస్టుగా పనిచేశాడు. 1940-45 మధ్యకాలంలో ఉపాధ్యాయ వృత్తిని చేపట్టాడు.

రచనలు :
తన 11వ ఏట రచనలు ప్రారంభించారు. గుడిసెలు కాలిపోతున్నాయ్, పాలేరు, జానపదుని జాబులు, రాగవైశాఖి, పిల్లీశతకం, ధర్మంకోసం పోరాటం మొ||నవి 70కి పైగా రచనలు చేశారు. ఈయన రచించిన ‘పాలేరు’ ఎంతోమంది పేదలు, దళితుల కుటుంబాలలో వెలుగులు నింపింది. ఎంతోమంది తమ పిల్లలను పాలేరు వృత్తి మాన్పించారు. పాఠశాలల్లో చేర్పించారు. ‘పాలేరు’ నాటక స్ఫూర్తితో విద్యనభ్యసించిన వారెందరో ఉన్నత స్థానాలను అధిష్ఠించారు.

అవార్డులు – రివార్డులు :
డా|| బోయి భీమన్నగారు రచించిన “గుడిసెలు కాలిపోతున్నాయ్” రచనకు 1975లో సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. 1973లో పద్మశ్రీ, 2001లో పద్మభూషణ్ ఇచ్చి భారత ప్రభుత్వం సత్కరించింది. ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ బిరుదును, గౌరవ డాక్టరేట్ ను ప్రదానం చేసింది. 1991లో చెన్నైలోని ‘రాజ్యలక్ష్మీ ఫౌండేషన్’ వారు ‘రాజ్యలక్ష్మి’ అవార్డుతో సత్కరించారు. 1978 నుండి 1984 వరకు రాష్ట్ర శాసనమండలి సభ్యునిగా ఉన్నారు.

ఆస్తమయం :
విద్యావేత్త, సాహితీవేత్త, జర్నలిస్టు మొ॥ అనేకవిధాల బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించారు. సమసమాజ నిర్మాణం కోసం పాటుపడ్డారు. అటువంటి మహామనీషి అనారోగ్యంతో డిశంబర్ 16, 2005న స్వర్గస్తులయ్యారు.

కఠిన పదాలకు అర్థాలు

కరకట్టు = కరెక్ట్ (correct) – సరియైనది
నిరుద్యోగం = ఉద్యోగం లేకపోవడం దీపం బుడ్డి – చిన్నమూతి గల వెడల్పైన (దీపం) పాత్ర
అణా = 6 పైసలు (పాతకాలపు నాణెం)
దుకాణం = పచారీ కొట్టు
పక్షం = తరపు
సాన్నిధ్యం = దగ్గరగా ఉండడం
తర్కం = వాదన
మినపకుడుం = వాసెనపోలు (మినప పిండి, వరినూకతో కలిపి ఆవిరిపై ఉడికించే ఇడ్లీ వంటిది)
అయ్య = తండ్రి
అంతరం = తేడా
తట్టింది = తోచింది
గుణించి = లెక్కించి
దమ్మిడీ = 5 కాసుల నాణెము (లేక) రెండు కాసుల నాణెము (లేక) 4 పైసా
దేవుళ్ళాడటం = ప్రాధేయపడడం
కాళ్ళు పట్టుకోవడం = దీనంగా బ్రతిమాలడం
సఖా = స్నేహితుడా !
త్రిప్పలు = బాధలు
కట్టడి = ఆంక్ష
అధోగతి = హీనమైన స్థితి
చందం = విధం
చీమకుట్టిన చందం = కొద్దిపాటి బాధ కలిగినట్లు
తొలకరించడం = తొలిసారి వర్షం పడడం (ఆషాఢమాసంలోని జల్లులు)
జైలు = ధాన్యం కొలత
ఇనాందారు = భూమి కలవాడు
నానుట = బాగా తడిసిపోవడం
ఏడు = సంవత్సరం
పురిటిలోనే సంధి కొట్టడం = ప్రారంభంలోనే పని పాడవ్వడం
అర్థ హృదయుడు = దయగల మనస్సు కలవాడు
బోదె = చిన్నకాలువ
అంతర్వేది వెళ్ళగానే = మాఘశుద్ధ ఏకాదశికి అంతర్వేదిలో లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం, అది పూర్తవ్వగానే

ఇవి తెలుసుకోండి

1 దమ్మిడీ = ½ పైసా
3 దమ్మిడీలు = 1 కాని (లేదా) 1 డబ్బు
2 కానులు = 1 ఏగాని (లేదా) అర్ధణా
2 అర్ధణాలు = అణా (6 పైసలు)
2 అణాలు = బేడ
2 బేడలు= 1 పావలా
2 పావలాలు = అర్ధ రూపాయి
2 అర్ధ రూపాయిలు = 1 రూపాయి

ఆలోచించండి – చెప్పండి

ప్రశ్న 1.
లేఖలు ఎప్పుడెప్పుడు రాస్తారు? ఎందుకు?
జవాబు:
సమాచారాన్ని ఇతరులకు తెలియజేయడానికి లేఖలు రాస్తారు. అనేక సందర్భాలలో లేఖలు రాస్తాం. పెండ్లి సమాచారాన్ని తెలియజేయడానికి శుభలేఖలు రాస్తాం. ఇళ్ళల్లో జరిగే శుభ, అశుభకార్యాల సమాచారం బంధుమిత్రులకు తెలియజేయడానికి లేఖలు రాస్తాం. మన ఇళ్ళలో జరిగే కార్యక్రమాలకు ఆహ్వానించడానికి లేఖలు రాస్తాం.

వస్తువులు కొనడానికి, దూర ప్రాంతాలలోని దుకాణాలకు, కంపెనీలకు లేఖలు రాస్తాం. మనకు రావలసిన బాకీల వసూళ్ళకు కూడా లేఖలు రాస్తాం. కార్యాలయాలలో సమాచారం తెలుసుకునేందుకు లేఖలు రాస్తాం. కార్యాలయం నుండి మనకు కావలసిన కాగితాలు తీసుకునేందుకు లేఖలు రాస్తాం.

ప్రశ్న 2.
“అస్థిర భావం” అంటే మీకేమి అర్థమైంది?
జవాబు:
భావం అంటే మన ఆలోచనల ద్వారా ఏర్పడిన అభిప్రాయం. స్థిరభావం అంటే శాశ్వతమైన, కచ్చితమైన అభిప్రాయం. అస్థిర భావం అంటే శాశ్వతం కాని, కచ్చితం కాని అభిప్రాయం.
ప్రస్తుతం పాఠ్యాంశాన్ని బట్టి ఒక కచ్చితమైన ప్రణాళికతో కూడిన అభిప్రాయం లేనిదే అస్థిర భావం.

AP SSC 10th Class Telugu Solutions Chapter 3 జానపదుని జాబు

ప్రశ్న 3.
మన చదువులు దైనందిన జీవితంలో ఉపయోగ పడతాయని భావిస్తున్నారా? ఎలా?
జవాబు:
మన చదువులు దైనందిన జీవితంలో ఉపయోగ పడతాయి. ఎందుకంటే పాఠ్యాంశంలోని ప్రతి అంశంపైనా సొంతంగా ఆలోచిస్తున్నాం. సొంత మాటలతో చెబుతున్నాం. విశ్లేషిస్తున్నాం. వ్యాఖ్యా నిస్తున్నాం. చర్చిస్తున్నాం. వాదప్రతివాదనలు చేస్తున్నాం. సొంతమాటలలోనే రాస్తున్నాం. ప్రతి సబ్జెక్టులోను ఇదే విధానం కొనసాగుతోంది. అందుచేత ఇప్పుడు మా తరగతి గది ఒక ప్రపంచపు నమూనా.

ఇదే విధానం డిగ్రీ వరకు కొనసాగితే మంచిది. అపుడు నిజజీవితంలో ఎదురయ్యే ఏ సమస్యకూ భయపడం. మేమే ఆలోచించి పరిష్కరిస్తాం. పిల్లల అభిప్రాయాలకు, మాటలకు, విశ్లేషణలకు, వ్యాఖ్యానాలకు, చర్చలకు అవకాశం కల్పించే చదువులే దైనందిన జీవితంలో ఉపయోగపడతాయి.

ఉదాహరణకు ఈ పాఠంలో గ్రామాలలోని ‘పేదరికం’ గురించి తెలుసుకున్నాం. దాని నివారణా పాయాలు తరగతి గదిలో చర్చించాం. మా అభిప్రాయాలు, చర్చ మా పెద్దలకు చెప్పాం . గ్రామాలలో పేదలను కలుసుకొని వారి పేదరికానికి కారణాలు తెలుసు కొన్నాం. పరిష్కార మార్గాలు సూచించాం. అవి ఎంత వరకు సఫలం అయ్యాయో కొన్నాళ్ళు గడిచాక తెలుసు
కొంటాం. లోపాలుంటే సవరించుకొంటాం.

ప్రశ్న 4.
మీరు చదువు పూర్తయిన తరువాత ఏం చేస్తారు? ఏం కావాలనుకుంటున్నారు?
జవాబు:
(సూచన : పిల్లలందరూ వారి వారి అభిలాషలు చెప్పాలి. వారు ఎన్నుకొనే రంగాలు చెప్పనివ్వాలి.)
ఏ వృత్తి చేపట్టినా సమాజానికి ఉపయోగపడాలి. నీతిగా ఉండాలి. నిజాయితీగా ఉండాలి. లంచగొండితనం పనికిరాదు. సమర్థంగా పనిచేయాలి. ఆదర్శవంతంగా ఉండాలి.

ప్రశ్న 5.
ఈ రోజుల్లో మనుషుల్లో స్వార్థం ఎందుకు పెరుగుతోంది?
జవాబు:
ప్రక్కవారిని పట్టించుకొనే తీరిక లేదు. స్నేహం చేయరు. ఆటలు లేవు. సామూహిక కార్యక్రమాలు లేవు. ఒకరి కష్ట సుఖాలలో వేరొకరు పాల్గొనడం లేదు.

నేను, నా కుటుంబం అనే భావం పెరిగింది. అందుచేతనే స్వార్థం పెరుగుతోంది. సుఖాలు అనుభవించాలనే కోరిక కూడా కారణం. ఒంటరిగా ఉంటే ఎక్కువ సుఖాలు అనుభవించవచ్చును అనే ఆలోచన. పైవన్నీ స్వార్థం పెరగడానికి కారణాలు.

ప్రశ్న 6.
“పల్లెటూరి జీవితం ఎంతో మనోహరమైంది.” దీనిపై మీ అభిప్రాయాలు తెల్పండి.
జవాబు:
పల్లెటూరి జీవితం చాలా బాగుంటుంది. పక్షుల కిలకిలలతో మెలుకువ వస్తుంది. ఎటుచూసినా పచ్చని చెట్లు, వరి పొలాలు కన్పిస్తాయి. పిల్ల కాలువలలో చేపల మిలమిలలూ, ఉదయకాలపు లేత ఎండలో నీటి తళతళలూ, లేగదూడల గంతులు, పొలాలకు వెళ్ళే వారి హడావుడి, పిల్లల అల్లరి, నీటి బిందెలతో స్త్రీలు, చక్కటి వాతావరణం. కలుషితం కాని వాతావరణం. కల్మషం తెలియని మనుషుల పలకరింపులతో పల్లెటూరి జీవితం చక్కగా ఉంటుంది. ఎవరిని పలకరించినా నవ్వుతూ మాట్లాడతారు. చక్కటి కథలు చెబుతారు.

ప్రశ్న 7.
‘కష్టం ఒకళ్ళది, ఫలితం మరొకళ్ళది’ అంటే మీకేమి అర్థమైంది ? దీన్ని ఏ ఏ సందర్భాల్లో ఉపయోగిస్తారు?
జవాబు:
పగలనక, రాత్రనక చేనులో కష్టపడేవాడు రైతు. అతను అనేక కష్టనష్టాలకోర్చి పంటను పండిస్తాడు. రెక్కలు ముక్కలయ్యేలాగా పనిచేస్తాడు. చలిలో, మంచులో తడుస్తాడు. పంటను కంటికి రెప్పలాగా కాపాడతాడు. ప్రాణం కంటే ఎక్కువగా చూసుకొంటాడు. ఇంటిని, కుటుంబాన్ని పట్టించుకోడు. అంత కష్టపడి సంపాదించిన పంటనూ భూస్వామికి అప్పగించేస్తాడు. తను, తన కుటుంబం పస్తులుంటారు.

ఇల్లు కట్టే కూలీలు కూడా అంతే. ఎంతో కష్టపడి ఇల్లు కడతారు. చక్కటి మేడ కడతారు. వాళ్ళు మాత్రం పూరిగుడిసెల్లో ఉంటారు. చిన్న చిన్న ఉద్యోగాలు, కూలిపనులు చేసేవారి జీవితాలు అన్నీ ఇంతే, కష్టం వాళ్ళది, ఫలితం యజమానులది.

AP SSC 10th Class Telugu Solutions Chapter 3 జానపదుని జాబు

ప్రశ్న 8.
చలిమంటలు వేసుకుంటూ, రైతులు కబుర్లు చెప్పు కొంటారు కదా! వాళ్ళు ఏఏ విషయాల గురించి కబుర్లు చెప్పుకుంటారు? ఊహించండి.
జవాబు:
వ్యవసాయం గురించి చెప్పుకొంటారు. పొలం గట్ల గురించి చెప్పుకొంటారు. కూలిరేట్ల గురించి చెప్పు కొంటారు. దుక్కి టెద్దుల గురించి, వాటి అనారోగ్య సమస్యల గురించి చెప్పుకొంటారు. పాడి పశువుల గురించి చెప్పుకొంటారు. పశుగ్రాసం, దాణా గురించి చెప్పుకొంటారు. పంట పండించడంలో పాట్లు, చీడ పీడలు, చేలగట్ల గురించి చెప్పుకొంటారు. పంటరేట్లు గురించి బాధపడతారు. అప్పుల గురించి వేదన పడతారు. అప్పులు తీరే మార్గాలు అన్వేషిస్తారు. అప్పులు ఇచ్చిన వాళ్ళు పెట్టే బాధల గురించి చెప్పుకొంటారు. రాజకీయాలు, లోకాభిరామాయణం మాట్లాడుకొంటారు. అక్కడ అన్ని విషయాలు చెప్పుకొంటారు.

ప్రశ్న 9.
పల్లెటూళ్ళకు వెళితే మనం ఏ ఏ విషయాలు తెలుసు కోవచ్చు?
జవాబు:
మానవత్వం తెలుస్తుంది. స్నేహం విలువ తెలుస్తుంది. కలసిమెలసి ఉండడమెలాగో తెలుస్తుంది. పక్షుల కిలకిలలు, జంతువుల కలకలలు తెలుస్తాయి. పచ్చటి ప్రకృతికి దగ్గరగా ఉండవచ్చు. హాయిగా ఉండవచ్చు. కలుషితం కాని స్వచ్చమైన వాతావరణంలో జీవించ వచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే, అమ్మ చేతి గోరు ముద్దలు తిన్నట్లు ఉంటుంది. అమ్మ జోలపాట వింటున్నట్లుంటుంది. తాత చెప్పే కథల మాధుర్యం తెలుస్తుంది. నాన్న తోడులోని భరోసా తెలుస్తుంది.

AP SSC 10th Class Telugu Solutions Chapter 2 అమరావతి

AP State Board Syllabus AP SSC 10th Class Telugu Solutions 2nd Lesson అమరావతి Textbook Questions and Answers.

AP State Syllabus SSC 10th Class Telugu Solutions 2nd Lesson అమరావతి

10th Class Telugu 2nd Lesson అమరావతి Textbook Questions and Answers

ఉన్ముఖీకరణ : చదవండి – ఆలోచించి చెప్పండి

సీ॥ సూర్యాది గ్రహరాశి సుప్రభాతము పల్కి
కరముల స్పృశియించు పురము నిలను
కృష్ణాతరంగిణీ కృతశుద్ధ పావన
గంభీరత నలరు కనక నగరి
బుద్ధాది మౌనీంద్ర పుణ్యపాదములతో
పరమపావనమైన పురము భువిని
రాజాధిరాజుల రాజధానిగ వెల్గి
యాంధ్ర జాతికి వన్నె యమరపురము

తే॥గీ॥ తెలుగు వెలుగుల జిలుగులు చిలకరించి
కలుములవెలది నిలయమై బలిమిబెంచి
సకలసురల యాశీస్సుల సారమౌచు
విశ్వయవనికపై వెల్లు వీటిఁగనుడు

ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
పై పద్యములోని నగరం ఏ నది ఒడ్డున ఉంది?
జవాబు:
పై పద్యంలోని నగరం కృష్ణానది ఒడ్డున ఉంది.

ప్రశ్న 2.
పద్యంలో ఏ పట్టణం గురించి చెప్పారు?
జవాబు:
పద్యంలో అమరావతి పట్టణం గురించి చెప్పారు.

AP SSC 10th Class Telugu Solutions Chapter 2 అమరావతి

ప్రశ్న 3.
పద్యంలోని పట్టణం ఏ భాషాప్రాంతంలో ఉండి ఉంటుంది?
జవాబు:
పద్యంలోని పట్టణం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిగా కృష్ణానదీ తీరంలో “ఆంధ్ర” భాషా ప్రాంతంలో ఉంది.

ఇవి చేయండి

I. అవగాహన – ప్రతిస్పందన

1. ఈ కింది అంశాలను గురించి చర్చించండి.

అ) ఇప్పటివరకు మీరు ఏఏ నగరాలు చూశారు? మీరు చూసిన నగరాలలో మీకు నచ్చిన అంశాలను, నచ్చని అంశాలను తెలుపండి.
జవాబు:
నేను మా తాతగారితో మార్చి 2వ తేదీన విశాఖపట్నం వెళ్ళాను. విశాఖపట్నం చాలా అందమైన నగరం. నాకు చాలా నచ్చింది. మరునాడు మార్చి 3వ తేదీన కళాభారతికి వెళ్ళాము. అక్కడ సంగీత కచేరీ జరుగుతోంది.

కళాభారతిని 1991 మార్చి 3వ తేదీన స్థాపించారని మా తాతగారు చెప్పారు. సుప్రసిద్ధ సంగీత విద్వాంసులు సుసర్ల శంకర శాస్త్రిగారి కలలకు ప్రతీకగా కళాభారతి 11 మే, 1991న ప్రారంభించబడిందని కూడా మా తాతగారు చెప్పారు. ఇంకా కైలాసగిరి, రామకృష్ణా బీచ్, షిప్ యార్డు మొ||వి చూశాను. అన్నీ బాగున్నాయి.

కాని, రోడ్లన్నీ గతకులమయంగా ఉన్నాయి. మురికికాలువ కంపు కూడా ఎక్కువ. ట్రాఫిక్ చాలా ఎక్కువ. అది నాకు నచ్చలేదు.

నేను మా మావయ్యతో మేలో చెన్నై వెళ్ళాను.
చెన్నైలో మెరీనా బీచ్, గాంధీ బీచ్, ప్లానిటోరియం, జంతు ప్రదర్శన శాల, క్వీర్లాండ్, మహాబలిపురం మొదలైనవి చూశాను. చాలా బాగున్నాయి. కాని, ఎండ వేడి ఎక్కువ. ఆటోరేట్లు ఎక్కువ. అదే నాకు నచ్చలేదు.

నేను మా బావతో ఏప్రిల్ లో ఒకసారి విజయవాడ వెళ్ళాను.
అక్కడ కృష్ణానది, ప్రకాశం బ్యారేజి చాలా బాగున్నాయి. అక్కడ కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు నివసించిన ప్రాంతం చూశాను, చాలా పొంగిపోయేను.

కాని, జనాభా చాలా పెరిగి పోతున్నారు. కులాల పట్టింపు కొందరిలో కన్పించింది. అది నాకు నచ్చలేదు.

ముందు సంవత్సరం జూన్లో బెంగళూరు వెళ్ళాను. బెంగళూరులో ఎటుచూసినా పచ్చదనం, ఉద్యానవనాలు కనిపిస్తాయి. అందుకే దానిని భారతదేశపు ఉద్యానవనాల, నగరం అంటారట. లాల్ బాగ్, కబ్బన్ పాలు చాలా బాగున్నాయి. బెంగళూరులో వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంది.

కాని, రోడ్లపై రద్దీ ఎక్కువ. జీవన వ్యయం కూడా చాలా ఎక్కువ. సిటీ బస్సులు, ఎ.సి. బస్సులు కూడా ఎక్కువగా కనిపించాయి. వాటి చార్జీలు కూడా మామూలు బస్సుల కంటే ఎక్కువగా ఉన్నాయి. ఇది నాకు నచ్చలేదు.

AP SSC 10th Class Telugu Solutions Chapter 2 అమరావతి

ఆ) నగర నిర్మాణంలో ఏఏ మౌళిక వసతులు ఏర్పాటు చెయ్యాలి?
జవాబు:
నగర నిర్మాణంలో అధునాతన సౌకర్యాలను ఏర్పాటుచేయాలి. మంచినీటి వసతి కల్పించాలి. భూగర్భ మురుగునీటి పారుదల సౌకర్యం కలిగించాలి. జనాభాకు తగిన ఆసుపత్రులు నిర్మించాలి. విద్యా సదుపాయం కలిగించాలి. భద్రతకు తగిన ఏర్పాట్లు చేయాలి. మార్కెట్ యార్డులు నిర్మించాలి. పటిష్టమైన రోడ్లు ఉండాలి. రవాణా వ్యవస్థ ఉండాలి. నివసించడానికి, కార్యాలయాలకు ప్రమాణాలననుసరించి భవంతులు నిర్మించాలి. పార్కులు ఏర్పాటు చేయాలి. ప్రకృతి వైపరీత్యాలు తట్టుకు నిలబడే విధంగా నగర నిర్మాణం జరగాలి.

2. ఈ పాఠం ఆధారంగా కింది విషయాలను వివరించండి.
అ) శాతవాహనులు,
అ) భిక్షువు,
ఇ) చైత్యం,
ఈ) శిల్పకళ,
ఉ) ఆరామం
జవాబు:
అ) శాతవాహనులు :
క్రీ.పూ. 230 ప్రాంతంలో శాతవాహనులు స్వతంత్ర రాజులయ్యారు. శాతవాహన వంశస్థాపకుని సోదరుడు కన్హు (కృష్ణ) క్రీ.పూ. 207 నుండి క్రీ.పూ. 189 వరకు పాలించాడు.

కన్షుని వారసుడైన మొదటి శాతకర్ణి అశ్వమేధంతోబాటు అనేక యజ్ఞయాగాదులు జరిపించాడు. శాతవాహన వంశానికి చెందిన 30 మంది పాలకుల జాబితా పురాణాలలో ఉంది.

గౌతమీపుత్ర శాతకర్ణినే శాలివాహనుడు అంటారు. ఇతను శాతవాహనుల ప్రతిష్ఠను బాగా పెంచాడు. ఈయన గొప్ప హిందూ మతాభిమాని. 78లో విక్రమాదిత్యుని ఓడించి శాలివాహనయుగం లేదా శకయుగానికి నాంది పలికాడు. ఇప్పటికీ మారాఠీ ప్రజలు శాలివాహన యుగాన్నే అనుసరిస్తున్నారు. శాతవాహన చక్రవర్తులలో హాలుడు గాథా సప్తశతిని రచించి ప్రసిద్ధిపొందాడు.

శాతవాహనులు కట్టించిన కట్టడాలు, స్తూపాలు నేటికీ కృష్ణానదీ పరీవాహక ప్రాంతాలలో ఉన్నాయి. అమరావతిలోని బౌద్ధస్తూపం చాలా ప్రసిద్ధిచెందింది. మహాయాన బౌద్ధం, ఆంధ్ర శిల్పకళ శాతవాహనుల వర్తక వాణిజ్యాల వలన ఆగ్నేయాసియాకు వ్యాపించాయి.

ఆ) భిక్షువు :
భిక్షువు అంటే యాచకుడు అని అర్థం. అంటే యాచన చేసి జీవించు సన్యాసి. భిక్షువుకు ఇల్లు, సంసారం మొదలైనవేమీ ఉండవు. కేవలం దైవ ధ్యానంతో సమయాన్ని గడుపుతాడు. తక్కువగా భుజిస్తాడు.

ఇ) చైత్యం :
చైత్యం అంటే బౌద్ధాలయం. ఈ బౌద్ధాలయంలో బౌద్ధ భిక్షువులు బుద్ధుని బోధనలను గూర్చి ఉపన్యాసాలు ఇస్తారు. ధ్యానం చేసుకొంటారు. బుద్ధుని ధర్మబోధనలను, జీవితాన్ని తెలియజేసే కీర్తనలు పాడతారు.

ఈ) శిల్పకళ :
శిల్పము అంటే రాతితో కాని, కర్రతో కాని, లోహాలతో కాని తయారుచేసే బొమ్మలు. ఆ బొమ్మలను తయారుచేయడంలో ప్రదర్శించే నైపుణ్యాన్ని శిల్పకళ అంటారు. శిల్పాలను రకరకాల ఆకారాలలో తయారుచేస్తారు. రకరకాల భంగిమలలో కూడా శిల్పాలను తయారుచేస్తారు.

ఉ) ఆరామం :
ఆరామం అంటే తోట, విహరించే ప్రాంతం లేదా విశ్రాంతి తీసుకొనే ప్రాంతం. బౌద్ధారామాలంటే బౌద్ధులు విశ్రాంతి తీసుకొనే ప్రాంతాలు.

3. కింది పేరాను చదివి, ఐదు ప్రశ్నలు తయారుచేయండి.

మా గ్రామానికి ప్రభుత్వం రవాణా సౌకర్యాలు, విద్యుత్ సౌకర్యం, తపాలా, టెలిఫోన్ సౌకర్యం కలిగించింది. ఒక గ్రంథాలయం కూడా ఉంది. సామూహిక టెలివిజన్ కార్యక్రమాలు చూసే అవకాశముంది. రక్షిత మంచినీటి సరఫరా వ్యవస్థ కూడా ఉంది. మా గ్రామంలో ప్రతి ఇంట్లో చెట్లున్నాయి. మా గ్రామ మహిళామండలి, యువజన సంఘాలు గ్రామాభివృద్ధికి తోడ్పడుతున్నాయి. మా ఊరిలోని వేణుగోపాలస్వామి ఆలయంలో శ్రావణమాసంలో గొప్ప ఉత్సవం జరుగుతుంది. ఈ ఉత్సవాల్లో అన్ని మతాలవాళ్ళూ కలిసి పాల్గొంటారు.
జవాబు:
ప్రశ్నలు:

  1. గ్రామానికి ఏయే సౌకర్యాలున్నాయి?
  2. గ్రామాభివృద్ధికి తోడ్పడుతున్న సంస్థలేవి?
  3. గ్రామంలోని దేవుడు పేరేమిటి?
  4. ఆ గ్రామంలో టెలివిజన్ ఉందా?
  5. పై పేరాకు తగిన శీర్షికను పెట్టండి.

II. వ్యక్తీకరణ సృజనాత్మకత

1. ఈ కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాలలో సమాధానాలు రాయండి.
అ) రాజధాని నగరమంటే ఏమిటి? రాజధాని నగరానికి, మామూలు నగరాలకు గల తేడా ఊహించి రాయండి.
(లేదా )
రాజధాని నగరానికి, మామూలు నగరాలకు తేడాలుంటాయి’ – సమర్థిస్తూ వివరించండి.
జవాబు:
ఒక రాష్ట్రాన్ని కానీ, దేశాన్ని కానీ పరిపాలించే పాలక వ్యవస్థ కేంద్రీకృతమై ఉండే నగరాన్ని రాజధాని నగరం అంటారు.

రాజధాని నగరం మామూలు నగరం
1) అత్యున్నత స్థాయి పరిపాలకులు, అధికారులు నివాసం ఉంటారు. 1) పాలకుల ప్రతినిధులు, క్రిందిస్థాయి అధికారులు ఉంటారు.
2) పరిపాలనా కార్యాలయాలు ఉంటాయి. 2) చిన్న కార్యాలయాలు ఉంటాయి.
3) జనాభా చాలా ఎక్కువ ఉంటుంది. 3) జనాభా కొంత తక్కువ ఉంటుంది.
4) సందర్శకుల సంఖ్య ఎక్కువ. 4) సందర్శకుల సంఖ్య తక్కువ.
5) రాష్ట్రం లేదా దేశానికి నడిబొడ్డున అందరికీ అందుబాటులో ఉంటుంది. 5) ఎక్కడైనా ఉంటుంది.
6) భద్రత ఎక్కువ. 6) సామాన్యమైన భద్రత కలిగి ఉంటుంది.
7) విద్యా, వైద్య మొదలైన సదుపాయాలు ఆధునికంగా ఉంటాయి. 7) సామాన్యమైన విద్యా, వైద్య సదుపాయాలుంటాయి.
8) రహదారులు పటిష్టంగా ఉంటాయి. 8) రహదారులు సామాన్యంగా ఉంటాయి.

ఆ) వివిధ పరిపాలకుల ఆశయాలూ, వాళ్ళ సంస్కృతి సంప్రదాయాలు అమరావతి మీద ఎలా ప్రభావం చూపాయి?
జవాబు:
అమరావతిని మొదట పాలించిన వారు శాతవాహనులు. వీరి ప్రభావం వల్ల హిందూ సంస్కృతి పరిఢవిల్లింది. క్రీ.పూ. 230 ప్రాంతంలో శాతవాహనులు స్వతంత్ర రాజులయ్యారు. మొదటి శాతకర్ణి యజ్ఞయాగాదులకు చాలా ధనం ఖర్చు పెట్టాడు. అశ్వమేధంతో పాటు అనేక యజ్ఞయాగాదులు జరిపించాడు. ఈ విధంగా శాతవాహనుల వైదిక సంస్కృతి అమరావతిపై ప్రభావం చూపింది.

ఇక్ష్వాకులు, పల్లవులు, చాళుక్యులు, విష్ణుకుండినుల హిందూమత సంస్కృతి సంప్రదాయాలు అమరావతిపై ప్రభావాన్ని చూపాయి. అమరేశ్వరాలయ ప్రతిష్ఠ అమరారామంగా విఖ్యాతి కలగడం జరిగింది.

కోట బేతరాజు పాలనలో ఓరుగల్లుతో కూడా సంబంధ బాంధవ్యాలేర్పడ్డాయి. ఢిల్లీ సుల్తానులు, బహమనీ సుల్తానులు, వంటి అనేక మంది పాలనలో ముస్లిం సంస్కృతి కూడా వేళ్ళూనుకొంది.

గౌతమబుద్ధుని సందర్శనతో బౌద్ధమతం, తర్వాతి కాలంలో జైనమత సంస్కృతి సంప్రదాయాలు అమరావతిలో ప్రస్ఫుటంగా కనిపిస్తాయి.

AP SSC 10th Class Telugu Solutions Chapter 2 అమరావతి

ఇ) ఆచార్య నాగార్జునుని గురించి మీకు తెలిసిన విషయాలను రాయండి.
జవాబు:
నాగార్జునుడు బౌద్ధ మతాచార్యుడు. శాతవాహన రాజైన యజ్ఞశ్రీ శాతకర్ణికి మంచి మిత్రుడు. సుహృల్లేఖ, రత్నావళి అనే గ్రంథాలు వారి స్నేహబంధానికి గుర్తులు. ఆ గ్రంథాలలో ప్రకటించిన. భావాలు వారి ఆత్మీయతను తెలియజేస్తాయి. నాగార్జునుడు ధరణికోటలోనూ, నందికొండ ప్రాంతంలో గల బౌద్దారామాల్లో నివసించేవాడు. ఆయన విజయపురిలో శ్రీ పర్వత విద్యాపీఠం స్థాపించాడు. అక్కడ దేశ విదేశాల విద్యార్థులు విద్యార్జన చేసేవారు. ఆ విశ్వవిద్యాలయంలో 7700 మంది బౌద్ధ భిక్షువులుండేవారట. అక్కడ ఆచార్య బుద్ధ ఘోషుడు, ఆర్యదేవుడు, ధర్మకీర్తి మొదలైన తత్వవేత్తలు ధర్మశాస్త్రం, రాజనీతి, సాహిత్యం మొదలైనవి బోధించేవారు.

ఈ) అమరావతిలోని శిల్పాల గొప్పతనమేమిటి?
జవాబు:
శరీరధర్మ శాస్త్రాన్ని అనుసరించి, శిల్పాలు, చిత్రాలు రూపొందించడం అనేది, ప్రపంచంలో ఇతర ప్రాంతాలలో 14వ శతాబ్దంలో ప్రారంభం అయ్యింది. కాగా అమరావతిలో క్రీ.శ. మొదటి శతాబ్దిలోనే, శరీర ధర్మ శాస్త్రాన్ని అనుసరించి తయారైన అత్యద్భుత శిల్ప సంపద రూపొందింది. చిత్రకళలో మాత్రమే సాధ్యమైన హావభావ ప్రకటనలు, శిల్పకళలోనూ ప్రదర్శింపబడడం, అమరావతి శిల్పాల విశిష్టత.

అజంతా, ఎల్లోరా శిల్పాలు కూడా అమరావతి శైలిలోనే ఉన్నాయని పురావస్తు శాఖవారు గుర్తించారు. శిల్పకళా పరిశోధనలో మంచి నైపుణ్యం ఉన్న ఫెర్గూసన్ ప్రపంచ శిల్ప సంపదలో అమరావతి శిల్పాలు, గొప్పగా ఉన్నాయని ఋజువు చేశాడు. అమరావతి శిల్పంలో ఆనందం, క్రోధం, విషాదం, కరుణ, దయ, ప్రేమ, వీరత్వం, ఆరాధన వంటి
భావాలు స్పష్టంగా కన్పిస్తాయి. గాంధార, మధుర, శిల్పకళ రీతులతో సమానంగా, అమరావతి శిల్పకళ ప్రాచుర్యం పొందింది.

2. ఈ కింది ప్రశ్నలకు పదేసి వాక్యాలలో సమాధానం రాయండి.

అ) అమరావతి సాంస్కృతిక వైభవాన్ని వివరించండి.
జవాబు:
అమరావతిని అనేక మంది పరిపాలించారు. వారి విధానాలు, మతాచారాలు, సంస్కృతి సంప్రదాయాలు అమరావతి మీద ప్రభావం చూపాయి. అందువల్లనే అమరావతిని ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక రాజధాని అంటారు.

అమరావతిలో బౌద్ధ, జైన, శైవ, వైష్ణవ, ముస్లిం, క్రైస్తవ మత సంప్రదాయాలు, సంస్కృతుల ప్రభావాలు కనిపిస్తాయి.

అమరావతిని శాతవాహనులు తొలిసారిగా పాలించారు. వారు వైదిక సంప్రదాయాన్ని అనుసరించారు. యజ్ఞయాగాదులు చేశారు. దానితో అమరావతిలో వైదిక సంస్కృతి వెల్లివిరిసింది.

క్రీస్తు పూర్వం గౌతమబుద్ధుడు అమరావతిని సందర్శించాడు, దానితో అమరావతి పరమ పవిత్రమైంది. బౌద్ధమత సంస్కృతీ సంప్రదాయాలు కూడా అమరావతిలో నెలకొన్నాయి. తర్వాతి కాలంలో శైవమతం వ్యాపించింది. ఆ కాలంలోనే పంచారామాలలో ఒకటైన ‘అమరారామం ‘లో ‘అమరలింగేశ్వరాలయం’ ఏర్పడింది. శైవమత సంస్కృతి కూడా కలిసింది.

రాజా వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు అమరావతి దగ్గరలో వైకుంఠపురంలో వేంకటేశ్వరాలయం నిర్మించాడు. అది వైష్ణవ మత సంస్కృతికి సంకేతం.

ఇదే విధంగా జైన, ముస్లిం, క్రైస్తవ మత సంస్కృతులు కూడా అమరావతి సాంస్కృతిక వైభవంలో పాలుపంచుకొన్నాయి.

AP SSC 10th Class Telugu Solutions Chapter 2 అమరావతి

ఆ) రాజధానిగా వెలుగొందిన అమరావతి గొప్పతనాన్ని విశ్లేషించండి.
జవాబు:
శాతవాహనుల రాజధానిగా క్రీస్తు పూర్వమే అద్భుతంగా అభివృద్ధి చెందిన మహానగరం అమరావతి. అశోకునికి పూర్వమే అమరావతిలో బౌద్ధస్తూపం ఉంది. మెగస్తనీసు తన ‘ఇండికా’ గ్రంథంలో అమరావతి గురించి ప్రస్తావించాడు.

ఇక్ష్వాకులు, పల్లవులు, చాళుక్యులు, విష్ణుకుండినులు మొదలైన వారి పరిపాలనలో అమరావతి దినదినాభివృద్ధి చెందింది. 1798లో స్థానిక జమీందారు రాజా వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడుగారు కూడా అమరావతిని అత్యంత వైభవోపేతంగా తీర్చిదిద్దారు. అంటే సుమారు 1800 సంవత్సరాలు రాజధానిగా విరాజిల్లింది అమరావతి.

అమరావతిని రాజధానిగా చేసుకొని చాలామంది పరిపాలన సాగించారు. ఆయా ప్రభువుల పాలనలలో కాలానుగుణంగా అనేక మార్పులు పొందింది. అనేక మంది పరిపాలనా విధానాలు, మతాచారాలు, సంస్కృతి సంప్రదాయాలు అమరావతి మీద ప్రభావం చూపాయి. అందుచేత అమరావతి ఆంధ్రప్రదేశ్ కు సాంస్కృతిక రాజధాని అయ్యింది. హిందూ, ముస్లిం, బౌద్ధ, జైన, క్రైస్తవ మత సంప్రదాయాలతో సర్వమత సమ్మిళిత నగరంగా అమరావతి రాజధానిగా వెలుగొందింది.

ఇ) “అమరావతీ నగర అపురూప శిల్పాలు …….” అనడంలోని ఔచిత్యాన్ని వివరించండి.
(లేదా)
“అమరావతీ నగర అపురూప శిల్పాలు” గురించి వ్యాసం రాయండి.
జవాబు:
అమరావతిలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన శిల్ప సంపద సృష్టించబడింది. అమరావతిలోని శిల్పకళా నైపుణ్యాన్ని చూసి, ‘ఫెర్గూసన్’ ఆశ్చర్యపడ్డాడు. ఫెర్గూసన్ శిల్పకళా నిపుణుడు. ప్రపంచంలోని అనేక రకాల శిల్పాలను పరిశోధించాడు. ప్రపంచంలోనే అత్యున్నత శ్రేణికి చెందిన శిల్పాలుగా అమరావతీ శిల్పాలను ఋజువులతో నిరూపించాడు.

శరీరధర్మశాస్త్రాన్ననుసరించి శిల్పాలు రూపొందించడం ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలో 14వ శతాబ్దిలో ప్రారంభమయింది. కాని, అమరావతిలో ఒకటవ శతాబ్దిలోనే ప్రదర్శించారు. చిత్రకళలో మాత్రమే సాధ్యమైన హావభావ ప్రకటనలు అమరావతి శిల్పాలలో కనిపిస్తాయి.

ఆనందం, విషాదం, క్రోధం, కరుణ, దయ, ప్రేమ, వీరత్వం, ఆరాధన వంటి భావాలు అమరావతీ శిల్పాలలో ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. అమరావతీ శిల్పాలు గాంథార, మధుర శిల్పాలతో సమానంగా ప్రసిద్ధిచెందాయి.

అంతటి మహోన్నతమైన శిల్పాలు అమరావతిలో ఉన్నందువల్లనే ఒక సినీ కవి “అమరావతీ నగర అపురూప శిల్పాలు” అన్నారు.

AP SSC 10th Class Telugu Solutions Chapter 2 అమరావతి

3. ఈకింది అంశాల గురించి సృజనాతకంగా/ప్రశంసిస్తూ రాయండి.
అ) అమరావతిలో అద్భుత శిల్పసంపదను సృష్టించిన శిల్పులను అభినందిస్తూ ఒక లేఖ రాయండి.
జవాబు:

(లేఖ )

అమలాపురం,
x x x x x

గౌరవనీయులైన శిల్పిగారికి,
10వ తరగతి విద్యార్థిని సరళ నమస్కరించి వ్రాయు లేఖ.

అమరావతికి వేసవి సెలవులలో వెళ్ళాను. అక్కడ శిల్పాలు చూశాను. అద్భుతమైన మీ శిల్పకళా నైపుణ్యాన్ని అక్కడి సందర్శకులందరూ వేనోళ్ళ పొగుడుతున్నారు.

కోపం, ప్రేమ, ఆరాధన మొదలైన హావభావాలన్నీ ఆ శిల్పాలలో స్పష్టంగా కన్పించాయి. ఫెర్గూసన్ వంటి , గొప్ప పరిశోధకుని ప్రశంసలు అందుకొన్న మీరు చాలా గొప్పవారు.

మీ వంటి గొప్ప శిల్పులను కన్న ఆంధ్రమాత ధన్యురాలు. మళ్ళీ దసరా సెలవులలో మా స్నేహితులతో వస్తాను. మా పాఠ్యపుస్తకంలోని ‘అమరావతి’ పాఠంలో మీ శిల్ప నైపుణ్యం తెల్పారు. మీరు తయారుచేసిన శిల్పాల గొప్పతనాన్ని కూడా తెలుసుకొన్నాం.

నమస్కారాలతో,
కె. సరళ వ్రాలు.

చిరునామా :
శ్రీ. సి. రాజు, శిల్పి
అమరావతి,
నవ్యాంధ్ర రాజధాని, ఆంధ్రప్రదేశ్.

(లేదా)
అమరావతి పాఠం చదివినప్పుడు మీకు కలిగిన అనుభూతిని వివరిస్తూ ఒక కవిత రాయండి.
జవాబు:
కవిత :
మన అమరావతి
తరతరాల వైభవాల చిరునామా !
నవ్యాంధ్ర జాతి కలల సిరుల పంట
భావితరాల సౌభాగ్యాల ఖరారు నామా !
పెట్టుబడుల ప్రవాహాల నిలయమంట
అపురూప శిల్పకళా స్వరూపాల ఖజానా !
అదే మన అమరావతి
కృష్ణా తరంగిణీ పావన జమానా !
అదే అదే మన అజరామరమైన అమరావతి.

భాషా కార్యకలాపాలు ప్రాజెక్టు పని

అమరావతీ శిల్పాల చిత్రాలను సేకరించండి, ప్రదర్శించండి.
AP SSC 10th Class Telugu Solutions Chapter 2 అమరావతి 1

III. భాషాంశాలు

పదజాలం

1. ఈ కింది పదాలకు అర్ధాలు గ్రహించండి. వాటితో సొంతవాక్యాలు రాయండి.
ఉదా : చేరువ = దగ్గర
సొంతవాక్యం : ఉపాధ్యాయుని చేరువలో ఉంటే విజ్ఞానం పెరుగుతుంది.

అ) జగజేగీయమానం : లోకముచే మిక్కిలి కొనియాడబడినది.
సొంతవాక్యం : ఆగ్రాలోని తాజ్ మహల్ సౌందర్యము జగజేగీయమానమైనది.

ఆ) వైభవోపేతం = వైభవంతో కూడినది
సొంతవాక్యం : రాణివారి వైభవోపేతమైన క్రొత్త బంగళా, ప్రజలను బాగా ఆకర్షిస్తోంది.

ఇ) పునీతం = పవిత్రం
సొంతవాక్యం : గంగానదీ స్నానంతో, మా శరీరం పునీతం అయ్యింది.

ఈ) ముగ్గులు = మురిసిపోయినవారు
సొంతవాక్యం : తాజ్ సౌందర్యాన్ని చూసి యాత్రికులు నేటికీ ముగ్గులు అవుతున్నారు.

2. ఈ కింది పదాలకు పర్యాయపదాలు రాసి వాటితో వాక్యాలు రాయండి.
ఉదా : కీర్తి : యశస్సు, ఖ్యాతి
1) మన ఆంధ్రప్రదేశ్ కీర్తిపతాకం వినువీథులలో రెపరెపలాడాలి.
2) ఎంతోమంది ఖ్యాతి గడించినవారు ఆంధ్రప్రదేశ్ యశస్సును పెంచినారు.

అ) కాణాచి : 1) నివాసం, 2) స్థావరం, 3) నెలవు, 4) బస

1) కాణాచి : ఆంధ్రప్రదేశ్ కళలకు కాణాచి.
2) నివాసం : మేరు పర్వతం దేవతల నివాసం.
3) స్థావరం : గిర్ అడవులు సింహాలకు స్థావరం.
4) నెలవు : వ్యవసాయం కష్టాలకు నెలవు.
5) బస : కైలాసం శివునికి బస.

AP SSC 10th Class Telugu Solutions Chapter 2 అమరావతి

ఆ) శ్రేణి : 1) పరంపర, 2) పంక్తి, 3) వరుస

1) శ్రేణి : శ్రీరాముడు అత్యుత్తమ శ్రేణిలోని పరిపాలకుడు.
2) పరంపర : కవుల పరంపరలో మొదట లెక్కింపదగినవారు నన్నయగారు.
3) పంక్తి : భోజనాలకు పంక్తిలో కూర్చున్నారు.
4) వరుస : ప్రార్థనా సమావేశంలో విద్యార్థులు వరుసలలో నిలుచున్నారు.

ఇ) రాజు : 1) భూపాలుడు 2) జనపాలుడు 3) ప్రభువు 4) నృపాలుడు 5) ఏలిక

1. రాజు : అయోధ్య దేశానికి రాజు దశరథుడు.
2. భూపాలుడు : ప్రజల కష్టాలను భూపాలుడు తీర్చాలి.
3. జనపాలుడు : కరవు కాటకాలు రాకుండా జనపాలుడు నదులకు ఆనకట్టలు కట్టించాలి.
4. ప్రభువు : ప్రజలు ప్రభువులను గౌరవించాలి.
5. నృపాలుడు : మథిలా నగరానికి నృపాలుడు జనక మహారాజు.
6. ఏలిక : ఈ దేశానికి ఏలిక ధర్మాత్ముడు.

ఈ) పురము : 1) పురి 2) పట్టణము 3) నగరము

1. పురము : మీ పురములో కాయకూరలు చౌకగా దొరుకుతున్నాయి.
2. పురి : అయోధ్యాపురిలో ప్రజలు సుఖసంతోషాల్లో తేలిపోయేవారు.
3. పట్టణము : మీ పట్టణములో అన్ని వస్తువులూ కొరతగా ఉన్నాయి.
4. నగరము : మీ నగరములో పాడిపంటలకు లోటు లేదు.

AP SSC 10th Class Telugu Solutions Chapter 2 అమరావతి

ఉ) సందేహం : 1) సంశయము 2) శంక 3) అనుమానము

1. సందేహం : నీకు సందేహాలు ఎక్కువగా వస్తున్నాయి.
2. సంశయము : ఈ సంశయములను మీ గురువులనడిగి తీర్చుకో.
3. శంక : ఈ విషయంలో నీకు శంక ఏమిటో చెప్పు.
4. అనుమానము : దేవుడు ఉన్నాడనే విషయంలో అనుమానము లేదు.

వ్యాకరణాంశాలు

1. కింది వాక్యాల్లో ఉన్న ‘అనునాసిక’, ‘పడ్వాది’ సంధుల పదాలను గుర్తించి విడదీయండి. సూత్రం రాయండి.

అ) ఎక్కడ కూర్చున్నది మరచిపోయి తన్మయులమై చూసేవాళ్ళం.
జవాబు:
తన్మయులమై : తత్ + మయులమై = అనునాసిక సంధి
సూత్రము :
వర్గ ప్రథమాక్షరాలకు ‘న’ గాని, ‘మ’ గాని, పరమైనపుడు, వాని అనునాసికములు ఆదేశంగా వస్తాయి.

ఆ) నీవు సందేహపడనవసరం లేదు.
జవాబు:
సందేహపడవలసిన = సందేహము + పడవలసిన = పడ్వాది సంధి
సూత్రము :
పడ్వాదులు పరమైనప్పుడు మువర్ణానికి లోపపూర్ణ బిందువులు విభాషగా వస్తాయి.

ఇ) పురాణ వాజ్మయం చూసి భయపడకు. చదివి ఆనందపడు.
జవాబు:
1. వాజ్మమం = వాక్ + మయం (అనునాసిక సంధి)
సూత్రము :
వర్గ ప్రథమాక్షరాలకు, ‘న’గాని, ‘మ’గాని పరమైనపుడు వానికి అనునాసికములు ఆదేశంగా వస్తాయి.

2. భయపడక = భయము + పడక (పడ్వాది సంధి) (మువర్ణలోప సంధి)
సూత్రము :
పడ్వాదులు పరమైనపుడు మువర్ణానికి లోపపూర్ణ బంధువులు విభాషగా వస్తాయి.

3. ఆనందపడు = ఆనందము + పడు = పడ్వాది సంధి
సూత్రము :
పడ్వాదులు పరమైనపుడు మువర్ణానికి లోపపూర్ణ బిందువులు విభాషగా వస్తాయి.

AP SSC 10th Class Telugu Solutions Chapter 2 అమరావతి

ఈ) సన్నుతి చేయి.
జవాబు:
సన్నుతి = సత్ + నుతి = అనునాసిక సంధి
సూత్రము :
వర్గ ప్రమాక్షరాలకు, ‘న’గాని, ‘మ’గాని, పరమైనపుడు వాని అనునాసికములు ఆదేశంగా వస్తాయి.

ఉ) రాణ్మణి యుద్ధంలో భంగపడడు.
జవాబు:
రాణ్మణి = రాట్ + మణి = అనునాసిక సంధి
సూత్రము :
వర్గ ప్రథమాక్షరాలకు ‘న’గాని, ‘మ’గాని, పరమైనపుడు వాని అనునాసికములు ఆదేశంగా వస్తాయి.

2. కింది వాక్యాలను ప్రత్యక్ష, పరోక్ష కథనంలోకి మార్చండి.
అ) ‘నేను నేటి సినిమాలను చూడలేకపోతున్నాను’, అని అమ్మతో అన్నాను.
జవాబు:
నేను నేటి సినిమాలను చూడలేకపోతున్నానని అమ్మతో అన్నాను. (పరోక్ష కథనం)

ఆ) ‘నీకివ్వాల్సింది ఏమీలేదు’, అని నాతో అతడన్నాడు.
జవాబు:
నాకివ్వాల్సింది ఏమీలేదని నాతో అతడన్నాడు. (పరోక్ష కథనం)

ఇ) సుందరకాండ చదవమని నాకు ఉపాధ్యాయుడు చెప్పాడు.
జవాబు:
“సుందరకాండ చదువు” అని నాకు ఉపాధ్యాయుడు చెప్పాడు. (ప్రత్యక్ష కథనం)

ఈ) వాళ్ళమ్మ చెప్పింది భానుప్రకాశ్ ఊరికెళ్ళాడని.
జవాబు:
వాళ్ళమ్మ చెప్పింది “భానుప్రకాశ్ ఊరికెళ్ళాడు” అని (ప్రత్యక్ష కథనం)

ఉ) ప్రజ్ఞ పద్యాలు బాగా పాడిందని అందరనుకుంటున్నారు.
జవాబు:
అందరనుకుంటున్నారు “ప్రజ్ఞ పద్యాలు బాగా పాడింది” అని (ప్రత్యక్ష కథనం)

3. అర్థాలంకారాల్లోని మరొక అలంకారాన్ని తెలుసుకుందాం.
ఉదా :
i) వాడు తాటిచెట్టంత పొడవు ఉన్నాడు.
ii) దేవాలయ గోపురాలు ఆకాశానికంటుతున్నాయి

పై వాక్యాల్లో వాడి ఎత్తును, గోపురాల ఎత్తులను ఉన్న ఎత్తు కంటే ఎక్కువ చేసి చెప్పడం జరిగింది కదా ! అంటే అతిశయంగా చెప్పడం అన్నమాట. ఇలా చెప్పటాన్ని అతిశయోక్తి అంటారు.

అతిశయోక్తి అలంకార లక్షణం : విషయాన్ని ఉన్నదానికంటే ఎక్కువ చేసి చెప్పడం.

కింది లక్ష్యాలను పరిశీలించండి. అలంకారం గుర్తించండి.
(కింది పద్యం సీత అశోకవనంలో హనుమంతుని విరాడ్రూపం చూసిన సందర్భంలోనిది.)

అ) కం. చుక్కలు తల పూవులుగా ,
నక్కజముగ మేనుబెంచి యంబర వీధిన్
వెక్కసమై చూపట్టిన
నక్కోమలి ముదము నొందె నత్మస్థితిలోన్

భావము :
నక్షత్రాలు, తన తలలో ధరించిన పువ్వుల వలె కనబడే విధంగా ఆశ్చర్యం కలిగేటట్లు హనుమంతుడు తన శరీరాన్ని పెంచి ఆకాశవీధిలో గొప్పగా కనబడ్డాడు. అప్పుడు సీత చూచి ఆనందాన్ని పొందింది.

గమనిక :
హనుమంతుడు ఆకాశాన్ని తాకేలా, ఆకాశంలో నక్షత్రాలు ఆయన తలలోని పువ్వుల వలె కనబడ్డాయి అని అతిశయంగా చెప్పడం వల్ల ఇది “అతిశయోక్తి” అలంకారం.

ఆ) మా పొలంలో బంగారం పండింది.
గమనిక :
మంచి పంట పండింది అని చెప్పడానికి బదులు, బంగారం పండిందని అతిశయోక్తిగా చెప్పడం జరిగింది. అందువల్ల “అతిశయోక్తి అలంకారం”.

అదనపు సమాచారము

సంధులు

1. సవర్ణదీర్ఘ సంధి:

1. విద్యాలయములు = విద్యా + ఆలయములు = సవర్ణదీర్ఘ సంధి
2. మహితాభిమానము = మహిత + అభిమానము = సవర్ణదీర్ఘ సంధి
3. మహావేశము = మహా + ఆవేశము = సవర్ణదీర్ఘ సంధి
4. నవ్యాంధ్ర = నవ్య + ఆంధ్ర = సవర్ణదీర్ఘ సంధి
5. శతాబ్ది = శత + అబ్ది = సవర్ణదీర్ఘ సంధి
6. శతాబ్దం = శత + అబ్దము = సవర్ణదీర్ఘ సంధి
7. కాలానుగుణంగా = కాల + అనుగుణంగా = సవర్ణదీర్ఘ సంధి
8. మతాచారాలు = మత + ఆచారాలు = సవర్ణదీర్ఘ సంధి
9. అమరారామం = అమర + ఆరామం = సవర్ణదీర్ఘ సంధి
10. మతాచార్యుడు = మత + ఆచార్యుడు = సవర్ణదీర్ఘ సంధి
11. బౌద్దారామాలు = బౌద్ధ + ఆరామాలు = సవర్ణదీర్ఘ సంధి
12. విద్యాలయం = విద్యా + ఆలయం = సవర్ణదీర్ఘ సంధి
13. విద్యార్థులు = విద్యా + అర్థులు = సవర్ణదీర్ఘ సంధి
14. విద్యార్జన = విద్య + ఆర్జన = సవర్ణదీర్ఘ సంధి
15. బోధనాంశములు = బోధన + అంశములు = సవర్ణదీర్ఘ సంధి
16. మతానుయాయులు = మత + అనుయాయులు = సవర్ణదీర్ఘ సంధి
17. జ్ఞానార్జన = జ్ఞాన + ఆర్జన = సవర్ణదీర్ఘ సంధి
18. పంచారామాలు = పంచ + ఆరామం = సవర్ణదీర్ఘ సంధి
19. పట్టాభిషేకము = పట్ట + అభిషేకము = సవర్ణదీర్ఘ సంధి
20. చిరాయువు = చిర + ఆయువు = సవర్ణదీర్ఘ సంధి
21. అజరామరత్వము = అజర + అమరత్వము = సవర్ణదీర్ఘ సంధి
22. పరమావధి = పరమ + అవధి = సవర్ణదీర్ఘ సంధి
23. అశేషాంధ్రులు = అశేష + ఆంధ్రులు = సవర్ణదీర్ఘ సంధి

2. గుణ సంధి :

24. అమరలింగేశ్వరస్వామి = అమరలింగ + ఈశ్వరస్వామి = గుణసంధి
25. వైభవోపేతము = వైభవ + ఉపేతము = గుణసంధి
26. మహోజ్జ్వలము = మహా + ఉజ్జ్వలము = గుణసంధి

3. యణాదేశ సంధి:

27. అత్యాధునికము = అతి + ఆధునికము = యణాదేశ సంధి
28. అత్యద్భుతము = అతి + అద్భుతము = యణాదేశ సంధి
29. అత్యున్నతశ్రేణి = అతి + ఉన్నత శ్రేణి = యణాదేశ సంధి

4. పుంప్వాదేశ సంధి :

30. రాష్ట్రపు రాజధాని = రాష్ట్రము + రాజధాని = పుంప్వాదేశ సంధి
31. సున్నపురాయి = సున్నము + రాయి = పుంప్వాదేశ సంధి

5. పడ్వాది సంధి:

32. భద్రపఱచిన = భద్రము + పఱచిన = పడ్వాదిసంధి (మువర్ణలోప సంధి)

6. జశ్వ సంధి :

33. తదనంతరము = తత్ + అనంతరము = జత్త్వసంధి

7. ఆమ్రేడిత సంధి :

34. చెల్లాచెదరు = చెదరు + చెదరు = ఆమ్రేడిత సంధి

సమాసాలు
AP SSC 10th Class Telugu Solutions Chapter 2 అమరావతి 2

వ్యుత్పత్యర్థాలు

1. హర్మ్యము : మనోహరముగా ఉండేది (మేడ)
2. చైత్యం : పాషాణాదులచే కట్టబడేది (బౌద్ధస్తూపం)
3. ఆరామం : ఇందులో క్రీడిస్తారు (ఉపవనము)
4. కవి : చాతుర్యంగా వర్ణించేవాడు (కవి)
5. అక్షతలు : క్షతము లేనివి (అక్షింతలు)
6. సాక్షి : ఏదేని ఒక కార్యాన్ని స్వయంగా చూసినవాడు
7. శరీరము : రోగాదులచే హింసింపబడి శిధిలమయ్యేది (దేహము)
8. విద్యార్థులు : విద్యలను కోరి వచ్చేవారు (శిష్యులు)

AP SSC 10th Class Telugu Solutions Chapter 2 అమరావతి

ప్రకృతి – వికృతి

పట్టణము – పట్నము
అక్షతలు – అక్షింతలు
కవి – కయి
కీర్తి – కీరితి
యాత్ర – జాతర
భక్తులు – బత్తులు
ఫలక – పలక
విద్య – విద్దె
ద్వీపము – దిబ్బ
సాక్షి – సాకిరి
స్వామి – సామి
పర్వము – పబ్బము
ప్రాంతము – పొంత
రూపము – రూపు
విశ్వాసము – విసువాసము
వక్రము – వంపు
హృదయాలు – ఎడదలు
చిత్రము – చిత్తరువు

పర్యాయపదాలు

1. పట్టణము : నగరము, నగరి, పత్తనము, పురము, పురి, ప్రోలు
2. సన్న్యా సి : భిక్షువు, యతి, ముని, మౌని, పరివ్రాజకుడు
3. హృదయము : ఎడ, ఎడద, డెందము
4. పేరు : నామధేయము, ఆఖ్య, సంజ్ఞ, అభిధానము
5. గురువు : ఉపాధ్యాయుడు, అధ్యాపకుడు, ఒజ్జ, ఆచార్యుడు
6. దీపము : దివియ, దివ్వె, దివిటీ, తిల్లిక, దీపిక
7. రాజు : ఏవిక, ప్రభువు, రాయలు, టేడు, జనపాలుడు
8. కీర్తి : యశస్సు, యశము, పేరు, సమాఖ్య
9. కానుక : కానిక, బహుమతి, ఉపద, బహుమానము
10. యవనిక : తెర, పరదా, తిరస్కరిణి
11. గాథ : కథ, కథానిక, ఆఖ్యాయిక
12. ప్రభువు : . రాజు, ఏలిక, జేడు, భూపాలుడు
13. సంపద : సిరి, లచ్చి, విభూతి, ఐశ్వర్యము
14. శరీరము : కళేబరము, గాత్రము, తనువు, మెయి

నానార్థాలు

1. అవధి : హద్దు, కాలము, ఏకాగ్రత
2. ఇంద్రుడు : దేవేంద్రుడు, శ్రేష్ఠుడు, ప్రభువు, ఈశ్వరుడు
3. ఈశ్వరుండు : ప్రభువు, శివుడు, పరమాత్మ, భర్త
4. కవి : కావ్య కర్త, శుక్రుడు, వాల్మీకి, ఋషి, నీటికాకి
5. కళ : శిల్పము, అందము, వడ్డీ, చంద్రుడిలో 16వ భాగము, చదువు
6. గురువు : ఉపాధ్యాయుడు, తండ్రి, బృహస్పతి, తాత
7. చైత్యము : గుడి, భవనము, సభ, బౌద్ధాలయము, శిశువు
8. తీర్థము : పుణ్యోదకము, పుణ్యనది, ఘట్టము, పుణ్యక్షేత్రం
9. పేరు : నామము, ప్రసిద్ధి, భూషణము, పెద్దది
10. రాజు : ప్రభువు, క్షత్రియుడు, చంద్రుడు, ఇంద్రుడు
11. యాత్ర : జాతర, ముట్టడి, ఉత్సవము, పోవుట
12. శాసనము : రాజు దానము చేసిన భూమికి, వ్రాసియిచ్చే కవులు, ఆజ్ఞ, శాస్త్రము, అధికారము

AP SSC 10th Class Telugu Solutions Chapter 2 అమరావతి

కఠిన పదాలకు అర్థాలు

సంతతి = సంతానము
మహిత = గొప్పదైన
అభిమానము = ఆత్మగౌరవము
దివ్యము = శ్రేష్ఠమైనది
ఆముఖము = ప్రారంభము
స్ఫూర్తి = పరిపూర్ణత
తీవరించు = త్వరితపరచు
నవ్యము = క్రొత్తది
వైభవం = గొప్పతనము
ప్రబలం = ప్రసిద్ధి
వంశజులు = వంశములో జన్మించినవారు
వైభవ + ఉపేతము = వైభవోపేతము గొప్పతనముతో కూడినది

ఆలోచించండి – చెప్పండి

ప్రశ్న 1.
శాతవాహనులకంటే పూర్వమే అమరావతిని పరిపాలించిన రాజవంశాలేవి?
జవాబు:
శాతవాహనుల కంటే పూర్వమే ఆంధ్రదేశాన్ని కొన్ని రాజవంశాలు పరిపాలించాయి. వారిలో సమగోప, గోబధ, నరన, కంవాయల రాజవంశాలు ప్రముఖమైనవి.

ప్రశ్న 2.
అమరావతిని అభివృద్ధిపరచిన రాజవంశాలేవి?
జవాబు:
శాతవాహనులు, ఇక్ష్వాకులు, పల్లవులు, చాళుక్యులు, విష్ణుకుండినులు, కోటబేతరాజ వంశాలు అమరావతిని అభివృద్ధి పరిచారు.

ప్రశ్న 3.
అమరావతిపై ఏయే మత సంప్రదాయ సంస్కృతుల ప్రభావాలు కనిపిస్తాయి?
జవాబు:
బౌద్ధ, జైన, శైవ, వైష్ణవ, ముస్లిం, క్రైస్తవ మత సంప్రదాయ సంస్కృతుల ప్రభావాలు అమరావతిపై కనిపిస్తాయి.

AP SSC 10th Class Telugu Solutions Chapter 2 అమరావతి

స్పర్శ = తాకిడి
పునీతం = పవిత్రం
ధాతువు = వాతము మొదలైనవి. ఇవి 7 విధాలు : శుక్లము, శోణితము, మాంసము, ఎముక, చర్మము, చీము, మెదడు.
చైత్యం = బౌద్ధాలయము
ఆరామం = తోట (విశ్రాంతి కొరకు నిర్మించే కట్టడం)
ఆర్జన = సంపాదన
తీర్థంకరులు = జైనులు
అలరారడం = ప్రకాశించడం
పంచారామాలు = ఐదు శైవ క్షేత్రాలు –

  1. ద్రాక్షారామము
  2. భీమారామము
  3. సోమారామము
  4. అమరారామము
  5. కొమరారామము

ఆలోచించండి – చెప్పండి

ప్రశ్న 1.
బుద్ధుడి ధాతువుల మీద ఎలాంటి నిర్మాణం కట్టారు?
జవాబు:
బుద్ధుడి ధాతువుల మీద మహాచైత్యం నిర్మించారు. దాని చుట్టూ అద్భుతమైన కళాఖండాలున్నాయి. బుద్ధుని జీవిత గాథను చెక్కారు.

ప్రశ్న 2.
ఆచార్య నాగార్జునుణ్ణి గురించి చెప్పండి.
జవాబు:
నాగార్జునుడు బౌద్ధమతాచార్యుడు. శాతవాహనుల కుల గురువు. ఆయన ధరణికోట, నందికొండ ప్రాంతాలలో ఉన్న బౌద్ధారామాలలో నివసించేవాడు.

ప్రశ్న 3.
అమరావతి దగ్గరలోని వైకుంఠపురంలో ఏ ఆలయం ఉంది?
జవాబు:
వైకుంఠపురంలో రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు, వేంకటేశ్వరస్వామి ఆలయం నిర్మించాడు.

ప్రశ్న 4.
అమరావతిని సందర్శించిన విదేశీ యాత్రికులు ఎవరెవరు?
జవాబు:
క్రీ.శ. 640లో చైనా యాత్రికుడు హ్యూయత్సాంగ్ అమరావతి సందర్శించాడు. క్రీస్తు పూర్వంలో గ్రీకు రాయబారి మెగస్తనీసు అమరావతిని సందర్శించాడు.

AP SSC 10th Class Telugu Solutions Chapter 2 అమరావతి

కాణాచి = ఆటపట్టు, నిలయం
స్తూపం = మట్టి మొదలగు వాని దిబ్బ
సమున్నతం = గొప్పదైన (ఎత్తైన)
కాలగర్భంలో కలిసిపోవడం = నశించిపోవడం
ప్రస్ఫుటం = వికసించునది (స్పష్టం)

ఆలోచించండి – చెప్పండి

ప్రశ్న 1.
దీపాల దిన్నె గురించి చెప్పండి.
జవాబు:
అమరావతి స్తూపం సమున్నత దశలో ఉన్నపుడు అక్కడి బౌద్ధ భిక్షువులు ప్రతిరోజూ అక్కడ వేలాదిగా దీపాలను వెలిగించేవారట. అందువలన ఆ ప్రదేశానికి దీపాల దిన్నె అనే పేరు వచ్చింది. ఇది అమరావతి శివారు ప్రాంతంలో ఉంది. ఒక చర్మకారుడు పూర్ణకుంభ శిల్పాన్ని దీపాల దిన్నెపై చెక్కించాడు. ఈ విధంగా అనేకమంది శిల్పాలను చెక్కడానికి వితరణ ఇచ్చారు – వారి పేర్లు కూడా దీపాల దిన్నె వద్ద శాసనాలలో చెక్కారు.

ప్రశ్న 2.
అమరావతి శిల్పకళకు సంబంధించిన శిల్పాలు ఎక్కడెక్కడ లభించాయి?
జవాబు:
కొన్ని శిల్పాలు అమరావతి శివారు ప్రాంతంలో దీపాల దిన్నె వద్ద మెకంజీకి లభించాయి. కృష్ణానదీ పరీవాహక ప్రాంతంలోని నాగార్జున కొండ, దంతగిరి, నేల కొండపల్లి, ధూళికట్ట, భట్టిప్రోలు మొదలైన ప్రదేశాలలో కొన్ని శిల్పాలు లభించాయి.

ప్రశ్న 3.
అమరావతి శిల్పాలలోని గొప్పతనం ఏమిటి?
జవాబు:
అమరావతిలో క్రీ.శ. మొదటి శతాబ్దిలోనే శరీర ధర్మ శాస్త్రాన్ని అనుసరించి తయారైన అత్యద్భుత శిల్ప సంపద రూపొందింది. కేవలమూ చిత్రకళలో మాత్రమే సాధ్యమైన హావభావ ప్రకటనలు, శిల్పకళలోనూ చూపించడం, అమరావతి శిల్పాల విశిష్టత. శిల్పకళా పరిశోధనలో గొప్ప నైపుణ్యం కల ‘ఫెర్గూసన్’ ప్రపంచ శిల్ప సంపదలో అమరావతి శిల్పాలు, అత్యున్నత శ్రేణిలో ఉన్నాయని ఋజువు చేశాడు. అమరావతి శిల్పంలో ఆనందము, క్రోధము, విషాదము, కరుణ, దయ, ప్రేమ, వీరత్వం, ఆరాధన వంటి భావాలు సుస్పష్టంగా కనిపిస్తాయి.

AP SSC 10th Class Telugu Solutions Chapter 2 అమరావతి

చిరాయువు = దీర్ఘాయుర్దాయము కలది
అజరామరం = శాశ్వతం (ముసలితనం, మరణం లేని)
సంప్రోక్షణ = పరిశుద్ది చేయుట
అహర్నిశలు = పగలూ, రాత్రీ (ఎల్లప్పుడూ)
అశేషాంధ్రులు = మొత్తం ఆంధ్రులంతా
భాసిల్లు = ప్రకాశించు
ఆకాంక్ష = కోరిక

ఆలోచించండి – చెప్పండి

ప్రశ్న 1.
అమరావతి పేరులో చిరాయువును ఎలా నింపుకుంది?
జవాబు:
అమరావతి అంటే ‘చావు లేనిది’ అని అర్ధము. అమరులు అంటే దేవతలు. వారు చిరాయువు కలవారు. అమరావతి అనే పేరులో అమర శబ్దము చిరాయువు అనే అర్థాన్ని తెలుపుతుంది.

2. నవ్యాంధ్ర రాజధానిగా అమరావతిని ఎంపిక చేసుకోవడానికి కారణమేమిటి?
జవాబు:
‘అమరావతి పేరులో చిరాయువును నింపుకొంది. వ్యవసాయ, వాణిజ్య, సాంస్కృతిక, ఆధ్యాత్మిక నగరంగా విలసిల్లింది. నవ్యాంధ్రకు కేంద్ర బిందువు అమరావతి. అనేక మతాల సామరస్యం గల ప్రాంతం అమరావతి. పవిత్రమైన కృష్ణానదీ తీరంలో ఉన్న పరమపావనమైనది కనుకనే అమరావతిని నవ్యాంధ్రకు రాజధానిగా ఎంపిక చేసుకోవడం జరిగింది.

3. నవనగరాలు ఏవి?
జవాబు:
1. పర్యాటక నగరంగా ‘ఉండవల్లి’
2. ఆరోగ్య నగరంగా ‘కృష్ణయ్య పాలెం’
3. ఎలక్ట్రానిక్ నగరంగా ‘బేతపూడి’
4. విజ్ఞాన నగరంగా ‘శాఖమూరు’
5. విద్యానగరంగా ‘అయినవోలు’
6. పరిపాలనా నగరంగా ‘రాయపూడి’
7. న్యాయ నగరంగా ‘నేలపాడు’
8. క్రీడా నగరంగా ‘అబ్బరాజుపాలెం’
9. ఆర్థిక నగరంగా ‘ఉద్దండరాయపాలెం’
10. ఆధ్యాత్మిక నగరంగా “అనంతవరం పరిసరాలు”

కొత్త హంగులతో అభివృద్ధి చెందబోతున్నాయి. వీటినే నవనగరాలు అంటారు.

AP SSC 10th Class Hindi शब्दकोश

AP State Board Syllabus AP SSC 10th Class Hindi Textbook Solutions शब्दकोश Questions and Answers.

AP State Syllabus SSC 10th Class Hindi शब्दकोश

अजीब = విచిత్రమైన, amazing (संसार में अजीब घटनाएँ घटती हैं।)
अमोलक = అమూల్య మైన, priceless (प्रकृति एक अमोलक धन है।)
उन्मूलन = నిర్మూలన, abolishment (कुरीतियों का उन्मूलन करना चाहिए।)
उलझन = సమస్య, trouble (साहसी व्यक्ति उलझन से नहीं घबराता |)
ओजस्वी = ఉత్సాహపరిచేలా, energetic (दिनकर जी की कविताएँ ओजस्वी होती हैं।)
क्रंदन = ఏడ్చుట, weaping (अकाल के कारण किसान क्रंदन करने लगे।)
कचोट = బాధ, pinch (गरीबों के प्रति गाँधीजी के हृदय में कचोट रही।)
क्लेश = కష్టములు, problems (हमें हँसते हुए क्लेश का सामना करना चाहिए।)
कारगर = ప్రయోజనకరమైన, useful (देश में प्रौढ़ शिक्षा कारगर सिद्ध हुई।)
कुहासा = మంచు, fog (‘सरदी के दिनों में चारों ओर कुहासा छा जाता है।)
घन = మబ్బులు, cloud (मोर घन को देखकर नाचने लगे।)
जिज्ञासा = తెలుసుకోవాలనే కోరిక, curiosity (बालकों में जानने की जिज्ञासा होती है।)
टापू = చిన్న దీది, Island (दिविसीमा कृष्णा नदी में स्थित एक टापू है।)
तम = చీకటి, darkness (दीपक की रोशनी रात के तम को दूर करती है।)
तबाही = ధ్వంసం, destruction (सुनामी के कारण राज्य में तबाही मच गयी।)
तथ्य = సరియైన, accurate (गाँधीजी आजीवन तथ्य के मार्ग पर चले।)
दादुर = కప్ప, frog (वर्षा ऋतु में दादुर की टर्र – टर्र सुनायी देती है।)
धवल = తెల్లని, milky (बर्फ से ढके हिमालय धवल दिखायी देते हैं।)

AP SSC 10th Class Hindi शब्दकोश

नफ़रत = అసహ్యము, hate (हमें किसी से नफ़रत नहीं करनी चाहिए।)
नींव = పునాది, foundation (नेहरूजी ने नागार्जुन सागर बाँध की नींव डाली।)
न्यस्त = వ్యాపించిన, spread (प्रकृति सुंदरता से न्यस्त है।)
पावन-धाम = పవిత్ర దేశము, holy place (विद्यालय एक पावन धाम है।)
बास = సువాసన, fragrance (फूलों में बास होती है।)
भ्रष्टाचार = అవినీతి, corruption (भ्रष्टाचार को जड़ से मिटाना चाहिए।)
भिश्ती = మేస్త్రీ, mason (भिश्ती दीवार बनाता है।)
भेंट = కానుక, gift (जन्मदिन के अवसर पर भेंट दिये जाते हैं।)

AP SSC 10th Class Hindi शब्दकोश

मटमैला = వెలసిపోయినట్లుగా, fade (कपड़ा मटमैला हो गया है।)
मूक = మౌనము, silent (हमें अन्याय के समय मूक नहीं रहना चाहिए।)
रज = మట్టి, dust (वर्षा का पानी रज को बहा ले जाता है।)
रौनक़ = మెరుపు, charm (ईद के दिन चारों ओर रौनक़ छा जाती है।)
वारि = నీరు, water (वारि ही जीवन का आधार है।)
विनीत = వినయము, humble (सज्जन विनीत होते हैं।)
संचित = సమకూర్చుట, collect (हमें विद्या धन संचित करना चाहिए।)
संशोधन = సవరణ, amendment (समय – समय पर क़ानून में संशोधन हो रहे हैं।)
सरित्पति = సముద్రము, sea (नदियाँ सरित्पति में जाकर मिलती हैं।)
साक्षात्कार = పరిచయ కార్యక్రమము, interview (छात्रों ने राष्ट्रपति का साक्षात्कार लिया।)
ह्रास = పతనము, destroy (युद्धों से ह्रास होता है।)

AP SSC 10th Class Hindi निबंध लेखन

AP State Board Syllabus AP SSC 10th Class Hindi Textbook Solutions निबंध लेखन Questions and Answers.

AP State Syllabus SSC 10th Class Hindi निबंध लेखन

1. समाचार पत्र

क) प्रस्तावना :
समाचार पत्र आधुनिक जीवन का अंग बन गया है। एक दिन भी समाचार पत्र न आए तो जीवन नीरस लगने लग जाता है। एक समाचार पत्र विविध विषयों पर ढेर सारी रोचक, ज्ञानवर्धक तथा लाभदायक सामग्री उपलब्ध करवाता है।

ख) समाचार पत्रों का प्रकाशन :
समाचार पत्र भी अपने आप में आश्चर्य की चीज़ है। देश विदेश की सारी खबरें कागज़ के कुछ पत्रों में सिमटकर सुबह होते ही आपके घर पहुँच जाएँ, यह कोई कम हैरानी की बात नहीं है। भारत में छपने वाली एक अंग्रेजी अखबार में साठ से लेकर सौ पन्नों वाली पुस्तक के बराबर सामग्री होती है। इतनी सारी सामग्री का एक दिन में ठीक और साफ़-सुथरा प्रकाशन कोई सरल कार्य नहीं है। यदि समाचार पत्रों के प्रकाशन का कार्य नियमित और सचारु न हो तो समाचार पत्रों का एक दिन की छोटी-सी अवधि में प्रकाशन असंभव हो जाए। सामग्री तो तैयार होती नहीं। उसे बाहर से प्राप्त करके संपादित और संकलित किया जाता है।

ग) विविध प्रकार के समाचार :
आप यह जानना चाहते हैं कि देश-विदेश में क्या घटा है तो आप समाचारों के संबंधित समाचार पत्र का पहला पृष्ठ पढ़ लीजिये। आपको राजनीति, युद्ध, व्यापार तथा खेलों से संबंधित खबरें सविस्तार मिल जाएँगी। खूबसूरत बात यह है कि ये समाचार पूर्ण ईमानदारी से प्रस्तुत किये जाते हैं। इन समाचारों को बढ़ा-चढ़ाकर प्रस्तुत नहीं किया जाता। आप राजनीति तथा अन्य सामाजिक विषयों पर संपादक अथवा दूसरे प्रसिद्ध पत्रकारों के विचार जानना चाहते हैं तो इनमें लेखों से संबंधित समाचार पत्र का पृष्ठ पढ़िए। कई लोग सुबह उठते ही अपनी राशि देखना चाहते हैं। लोगों की इस ज़रूरत को ध्यान में रखते हुए समाचार पत्र में राशिफल छापते हैं। कुछ लोग इसे अंधविश्वास मानते हैं और इसमें विश्वास नहीं करते।

घ) समाचार पत्र और विज्ञापन :
समाचार पत्र लोगों की एक आवश्यकता बन गयी है। अब अधिकतर शादी-विवाह समाचार पत्र के माध्यम से हो रहे हैं। दोनों कहीं न कहीं विद्यामान तो हैं किन्तु उनका परस्पर संपर्क नहीं हो रहा। समाचार पत्र उनमें मेल कराने की महत्वपूर्ण भूमिका निभाता है। आप मकान बेचना चाहते हैं अथवा खरीदना या फिर किराये पर लेना चाहते हैं तो समाचार पत्र की सहायता लीजिए। यही, नहीं, समाचार पत्रों में शिक्षा, नौकरी और व्यापार से संबन्धित ढेर सारे विज्ञापन छपते हैं, जिन्हें देखकर बड़ी संख्या में लोग लाभान्वित होते हैं।

ङ) विशेष अतिरिक्त समाचार :
लगभग सभी समाचार पत्रों में रविवार वाले दिन अतिरिक्त सामग्री छपती है। इसे रविवारीय परिशिष्ट कहते हैं। इसमें कविता, कहानी, पहेली तथा अन्य रोचक सामग्री छपती है। इनमें बच्चों तथा स्त्रियों के लिए भी अलग से सामग्री होती है। गर्मियाँ शुरू हो गई हैं। आप तय नहीं कर पाये कि इस बार कौन-से पर्वत स्थल पर जाया जाए। आप को पता नहीं कि कौनसा स्थल अच्छा है और कहाँ-कहाँ पर्याटकों के लिए कौन – सी सुविधाएँ उपलब्ध हैं। इन सबकी जानकारी उन दिनों के समाचार पत्रों में अनिवार्य रूप से मिलेगी ही। आपको आध्यात्मिक सत्संग पर जाना है अथवा आपको फ़िल्म देखनी है अथवा कोई दूसरा मनोरंजन चाहिए, विस्तृतः जानकारी के लिए आप समाचार पत्र देखिए। समाचार पत्र दैनिक, मासिक, पाक्षिक तथा साप्ताहिक होते हैं। महानगरों में समाचार पत्र सायंकाल को भी निकलते हैं। इतनी ढेर सारी रोचक और उपयोगी सामग्री की कीमत पाँच से दस रुपये तक होती है। समाचार पत्र आधुनिक युग का वरदान है।

AP SSC 10th Class Hindi निबंध लेखन

2. पशु सुरक्षा का महत्व

प्रस्तावना :
भगवान की सृष्टि में पशुओं का विशेष महत्व है। पशु – पक्षी ही प्रकृति की शोभा बढानेवाले हैं। समृद्धिदायक होते हैं। पशु के द्वारा ही मानव जीवन सुखी होता है। इस कारण पशु – सुरक्षा के महत्व पर अधिक ध्यान देना चाहिए।

प्राचीन काल में गोधन या गायों का अत्यंत महत्व है। जिसके पास अधिक गायें होती हैं, वही अधिक धनवान या महान कहलाता है। तब घोडे, बैल, हाथी आदि जानवर सवारी का काम आते थे। अब ये काम यंत्रों की सहायता से संपन्न हो रहे हैं।

विषय विश्लेषण :
गाय, बकरी आदि कई पशु दूध देते हैं। दूध से मानव जीवन का पोषण होता है। दूध का मानव जीवन में सर्वश्रेष्ठ स्थान है। इससे कई प्रकार के पदार्थ बनाते हैं। खासकर बचपन में सभी शिशुओं के लिए दूध की अत्यंत आवश्यकता है। दूसरा इनके गोबर से खाद बनती है। पैदावर अधिक होती है। अब भी बैल खेत जोतते हैं। मज़बूत बैलों से अच्छी खेती होती है। बैल गाडी खींचते हैं। किसानों का अनाज घर और बाज़ार पहुँचाते हैं। घोडे भी खेती के काम में आते हैं। घोडा गाडी खींचता है। उस पर सवारी करते हैं। बहुत से लोग कई पशुओं का मांस खाते हैं। चमडे से चप्पल और जूते बनाते हैं। कुछ जानवरों से ऊन मिलता है।

उपसंहार :
हमारे देश में गाय, बैल, बकरी, भेड, भैंस, घोडा, सुअर आदि पशुओं को पालते हैं। लेकिन उनके पालन – पोषण में अधिक श्रद्धा नहीं दिखाते हैं। उनको चाहिए कि पशु सुरक्षा के महत्व पर अधिक ध्यान दें। उनको पौष्टिक आहार दें। उनके रोगों की चिकित्सा करवाएँ। रहने, खाने – पीने आदि विषय में सफ़ाई का ध्यान दें। पहले से ही पशुओं की संतान पर अधिक ध्यान देने से मानव को बहुत लाभ होता है। इनसे खूब व्यापार होता है। सभी पशु मानव जीवन में अत्यंत उपयोगी हैं। वे मानव के मित्र कहलाते हैं।

3. प्रिय नेता

प्रधानमंत्री इन्दिरा गाँधी विश्व की महानतम महिला थीं। इनका जन्म इलाहाबाद आनन्द भवन में 19 नवंबर सन् 1917 में हुआ था। उस समय इनके पिता पं. जवाहरलाल नेहरू महात्मा गाँधी के साथ देश के स्वतंत्रता संग्राम में संलग्न थे। आनंद भवन उन दिनों स्वतंत्रता सेनानियों का गढ़ बना हुआ था।

इन्दिरा जब नन्हीं सी थी तो देश के महान नेताओं की गोद में खेलने का अवसर उसे मिला। जब यह नन्हीं बालिका केवल चार वर्ष की थी तभी मेज़ पर खडे होकर अंग्रेजों के खिलाफ़ भाषण दी थी। जिसे भारत के बड़े -बड़े नेता सुन और हँसकर उस पर स्नेह की वर्षा बरसाई । इंदिरा का जन्म जब आनंद भवन में हुआ तो भारत कोकिल सरोजिनी नायुडू ने पं. जवहारलाल को एक बधाई संदेश भेजकर कहा था – “कमला की कोख से भारत की नयी आत्मा उत्पन्न हुई है।”

महात्मा गाँधी तथा देश के बड़े – बड़े नेताओं के सम्पर्क में आने से इंदिरा की राजनीति में गहरी पैठ होने लगी थी। स्वतंत्रता के समय इलाहाबाद में बच्चों की एक स्वयं सेवी संस्था बनी थी जिसका नाम वानर सेना रखा गया था। इस सेना के लगभग साठ हज़ार सदस्य थे। इंदिरा जब सात वर्ष की थी तभी वानर सेना की सदस्य बनी और बारह वर्ष की आयु में उसकी नेता चुनी गयी।

वानर सेना ने अंग्रेज़ सरकार की नाक में दम कर रखा था। इस सेना का काम जुलूस निकालना, इन्कलाब के नारे लगाना, काँग्रेस के नेताओं के संदेश जनता तक पहुँचाना और पोस्टर चिपकाना होता था।

स्वतंत्रता आंदोलन में नेहरू परिवार व्यस्त रहने के कारण इंदिरा की प्रारम्भिक शिक्षा की व्यवस्था घर पर ही होती रही। बाद में उन्हें स्विटजरलैंड तथा भारत में शान्तिनिकेतन में शिक्षा पाने का अवसर मिला। इंदिरा को आक्सफोर्ड युनिवर्सिटी में भी प्रवेश मिला था। किन्तु अस्वस्थता एवं दूसरा महायुद्ध शुरू हो जाने के कारण वहाँ की शिक्षा पूरी न हो सकी।

सन् 1942 में इंदिरा गाँधी का विवाह फिरोज़ गाँधी से हुआ। स्वतंत्रता आंदोलन में भाग लेने के कारण इन दोनों को गिरफ्तार कर लिया गया और तेरह मास जेल की सज़ा हुई।

सन् 1947 में भारत स्वतंत्र हुआ और काँग्रेस की सरकार बनी। पं. जवाहरलाल नेहरू प्रथम प्रधानमंत्री बने। सन् 1955 में आप काँग्रेस कार्यसमिति की सदस्य बनी और सन् 1959 में काँग्रेस की अध्यक्ष चुनी गयी। 14 जनवरी 1966 को इंदिरा गाँधी ने भारत के प्रधानमंत्री का पद भार सँभाला। उसके बाद उन्होंने राष्ट्र की प्रगति के लिए अनेक महत्वपूर्ण कदम उठाये। जैसे – बैंकों का राष्ट्रीयकरण, रूस से संधि, पाकिस्तान से युद्ध, राजाओं के प्रिवीपर्स की समाप्ति, बीस सूत्री कार्यक्रम आदि। भारत की प्रगति के लिए इंदिरा गाँधी ने रात – दिन कार्य किया।

भारत को प्रधानमंत्री इंदिरा गाँधी से भारी आशाएँ थीं। परन्तु 31 अक्तूबर 1984 को प्रातः 9 बजकर 15 मिनट पर इनके ही दो सुरक्षाकर्मचारियों ने इनको गोलियों से छलनी कर दिया। उस दिन विश्वशांति और भारत की प्रगति के लिए सर्वस्व निछावर करनेवाली प्रधानमंत्री इदिरा गाँधी के निधन पर सारा संसार शोकमग्न हो गया।

4. हरियाली और सफ़ाई

प्रस्तावना :
मानव को जीने के लिये हरियाली और सफ़ाई की अत्यंत आवश्यकता है। हरियाली और सफ़ाई की उपेक्षा करने से मानव का जीवन दुःखमय तथा अस्वस्थ बन सकता है। मानव को स्वस्थ तथा आनंदमय जीवन बिताने के लिए इन दोनों की ओर ध्यान देना चहिए।

विषय विश्लेषण – हरियाली :
हरियाली मन को तथा आँखों को सुख पहुँचाती है। हरे-भरे खेत देखने से या हरेभरे पेड देखने से हम अपने आपको भूल जाते हैं। यह हरियाली देखने के लिए हमको कहीं भी जाना पडता है। मगर कुछ मेहनत करके हम यह हरियाली अपने आसपास भी पा सकते हैं। हम अपने चारों ओर कुछ पेड-पौधे लगाकर हरियाली बढा सकते हैं। पहले ही जो पेड-पौधे लग चुके हैं, उनको न काटना चाहिये। धरती को हमेशा हरा-भरा रखना है। यह हरियाली बढाने से हमको आक्सिजन मिलता है। हरियाली बढ़ाने का अर्थ होता है कि पेड-पौधों को बढाना। इससे इतने लाभ हैं कि हम बता नहीं सकते।

सफाई :
सफ़ाई का अर्थ होता है कि स्वच्छता।

सफ़ाई के बारे में सोचते वक्त हमको तन की सफ़ाई के बारे में, घर की सफ़ाई के बारे में तथा आसपास की सफ़ाई के बारे में भी सोचना चाहिए।

तन की सफ़ाई तो हमारे हाथों में है। घर की तथा आसपास की सफ़ाई का प्रभाव हमारे ऊपर पड़ता है। इसलिये हमें हमेशा घर की तथा आसपास के प्रदेशों को साफ़ रखना है। सफ़ाई का पालन करने के उपाय ये हैं

  • सबसे पहले गन्दगी न फैलाएँ।
  • फैली हुई गन्दगी को साफ़ करें।
  • कूडा-कचरा जहाँ-तहाँ न फेंकें।

हमारे बुजुर्ग यह बताते हैं कि जहाँ सफ़ाई रहती है वहाँ लक्ष्मी का आगमन होता है।

उपसंहार :
इस प्रकार हम इन नियमों का पालन करने से अपनी आयु को बढ़ा सकते हैं।
एक नारा हमको मालूम ही है –
“वृक्षो रक्षति रक्षितः”
“घर की सफ़ाई, सबकी भलाई”।

5. आधुनिक विज्ञान की प्रगति

प्रस्तावना :
आज का युग विज्ञान का है। विज्ञान ने प्रकृति को जीत लिया है। मानव जीवन में क्रांतिकारी परिवर्तन लाया है। दिन-ब-दिन विज्ञान में नये-नये आविष्कार हो रहे हैं। इनका सदुपयोग करने से मानव कल्याण होगा। दुर्विनियोग करने से बहुत नष्ट यानी मानव विनाश होगा।

विज्ञान से ये लाभ हैं –

  • मोटर, रेल, जहाज़, हवाई जहाज़ मोबईल, फ़ोन, कम्प्यूटर आदि विज्ञान के वरदान हैं। इनकी सहायता से कुछ ही घंटों में सुदूर प्रांतों को जा सकते हैं।
  • समाचार पत्र, रेडियो, टेलिविज़न आदि विज्ञान के आविष्कार हैं। ये लोगों को मनोरंजन के साथ-साथ ज्ञान प्रदान करते हैं।
  • बिजली हमारे दैनिक जीवन के लिए अत्यंत आवश्यक है। बिजली के बिना जीवन की कल्पना भी नहीं की जा सकती।
  • बढ़ती हुई जनसंख्या के लिए आवश्यक आहार पदार्थों की उत्पत्ति में सहायक है।
  • नित्य जीवन की आवश्यकताओं की पूर्ति में सहायकारी है। लोगों के जीवन को सरल तथा सुगम बनाया है।
  • रोगों को दूर करने के लिए कई प्रकार की दवाओं और अनेक प्रकार के उपकरणों का आविष्कार किया है।
  • विज्ञान ने अंधों को आँख, बधिरों को कान और गूगों को ज़बान भी दी है।

विज्ञान से कई नष्ट भी हैं –

  • विज्ञान ने अणुबम, उदजन बम, मेगटन बम आदि अणु अस्त्रों का आविष्कार किया। इनके कारण विश्व में युद्ध और अशांति का वातावरण है।
  • मनुष्य आलसी, तार्किक और स्वार्थी बन गया है।

उपसंहार :
उसका सदुपयोग करेंगे तो वह कल्याणकारी ही होगा। आज दिन-ब-दिन, नये-नये आविष्कार हो रहे हैं। इनसे हमें अत्यंत लाभ है।

AP SSC 10th Class Hindi निबंध लेखन

6. वृक्षारोपण

हमारी संस्कृति वन – प्रधान है। ऋवेद, जो हमारी सनातन शक्ति का मूल है, वन – देवियों की अर्चना करता है। मनुस्मृति में वृक्ष विच्छेदक को बड़ा पापी माना गया है। – “जो आदमी वृक्षों को नष्ट करता है, उसे दण्ड दिया जायें।” तालाबों, सड़कों या सीमा के पास के वृक्षों का काटना, गुरुतर अपराध था। उसके लिए दण्ड भी बड़ा कड़ा रहता था। उसमें कहा गया है कि जो वृक्षारोपण करता है, वह तीस हज़ार पितरों का उद्धार करता है। अग्निपुराण भी वृक्ष – पूजा पर ज़ोर देता है। वृक्षों का रोपण स्नेहपूर्वक और उनका पालन – पुत्रवत करना चाहिए।

पुत्र और तरु में भी भेद है, क्योंकि पुत्र को हम स्वार्थ के कारण जन्म देते हैं। परन्तु तरु – पुत्र को तो हम परमार्थ के लिए ही बनाते हैं। ऋषि – मुनियों की तरह हमें वृनों की पूजा करनी चाहिए, क्योंकि वृक्ष तो द्वेषवर्जित हैं। जो छेदन करते हैं, उन्हें भी वृक्ष छाया, पुष्प और फल देते हैं। इसीलिए जो विद्वान पुरुष हैं, उनको वृक्षों का रोपण करना चाहिए और उन्हें जल से सींचना चाहिए।

हम स्वर्ग की बातें क्या करें। हम वृक्षारोपण करके यहाँ ही स्वर्ग क्यों न बनायें। इतिहास में महान सम्राट अशोक ने कहा है – “रास्ते पर मैने वट – वृक्ष रोप दिये हैं, जिनसे मानवों और पशुओं को छाया मिल सकती है। आम्र वृक्षों के समूह भी लगा दिये।” आज प्रभुत्व सम्पन्न भारत ने इस महाराजर्षि के राज्य – चिह्न ले लिये हैं। 23 सौ वर्ष पूर्व उन्होंने देश में जैसी एकता स्थापित की थी, वैसी ही हमने भी प्राप्त कर ली है। क्या हम उनके इस सन्देश को नहीं सुनेंगे? हम सन्देश को सुनकर निश्चय ही ऐसा प्रबन्ध करेंगे, जिससे भारत के भावी प्रजा जन कह सकें कि हमने भी हर रास्ते पर वृक्ष लगाये थे, जो मानवों और पशुओं को छाया देते हैं।

हमारी संस्कृति में जो सुन्दरतम और सर्वश्रेष्ठ है, उसका उद्भव सरस्वती के तट के वनों में हुआ। नैमिषारण्य के वन में शौनक मुनि ने हमको महाभारत की कथा सुनायी – “महाभारत जो भारतीय आत्मशक्ति का स्रोत है। हमारे अनेक तपोवना में ही ऋषि – मुनि वास करते थे, आजीवन अपने संस्कार, आत्म – संयम और भावनाओं को सुदृढ बनाते थे।

हमारे जीवन का उत्साह वृन्दावन के साथ लिपटा हुआ है। वृन्दावन को हम कैसे भुला सकते हैं? वहीं कृष्ण भगवान ने यमुना – तट पर नर्तन करते हुए डालियों और पुष्पों के ताल के साथ अपनी वेणु बजायी। उनकी ध्वनि आज भी हमारे कानों में सुनायी देती है।

हमें पूर्वजों की ज्वलन्त संस्कृति मिली है, लेकिन हम उसके योग्य नहीं रहे। हम अपने वनों को काट डालते हैं। हम वृक्षों का आरोपण करना भूल गये। वृक्ष – पूजा का हमारे जीवन में स्थान नहीं रहा। हमारी स्त्रियों में से शकुन्तला की आत्मा चली गयी है। शकुन्तला वृक्षों को पानी दिये बिना आप पानी ग्रहण नहीं करती थी। आभूषण प्रिय होते हुए भी वह यह सोचकर पल्लवों को नहीं तोड़ती थीं कि इससे वृक्षों को दुःख होगा।

पार्वती ने देवदारु को पुत्र के समान समझकर, माँ के दूध के समान पानी पिलाकर बडा किया।

मंजरित वृक्षों का सौंदर्य हम नहीं भूल सकते। हम नहीं भूल सकते भव्य वृक्षों का अद्भुत गौरव, वृद्ध ऋषियों के समान जगत – कल्याण में ही जीवन – साफल्य समझने वाले बनों को। यदि प्रत्येक पुरुष और स्त्री वृक्षों के महत्व को समझे और पुत्रवत उनका परिपालन करे तो भारत का हर नगर हर गाँव जीवनोल्लास से ओत – प्रोत हो जाएगा।

7. स्वतंत्रता दिवस

प्रस्तावना :
भारत सैकड़ों वर्ष अंग्रेजों के अधीन में रहा। गाँधीजी, नेहरूजी, नेताजी, वल्लभ भाई पटेल आदि नेता अंग्रेजों के विरुद्ध लड़े। उनके अथक परिश्रम से ता. 15 – 08 – 1947 को भारत आज़ाद हो गया। उस दिन सारे देश में प्रथम स्वतंत्रता दिवस मनाया गया।

विषय विश्लेषण :
नेहरूजी ने दिल्ली में लाल किले पर ता. 15-08-1947 को राष्ट्रीय झंडा फहराया। उन्होंने जाति को संदेश दिया। स्वतंत्रता समर में मरे हुए लोगों को श्रद्धांजलि अर्पित की। उस दिन देश के सरकारी कार्यालयों, शिक्षा संस्थाओं और अन्य प्रमुख स्थानों में हमारा राष्ट्रीय झंडा फहराया गया। वंदेमातरम और जनगणमन गीत गाये। सभाओं का आयोजन किया गया । प्रमुख लोगों से भाषण दिये गये। इस तरह के कार्यक्रम आज तक हम मनाते आ रहे हैं। यह राष्ट्रीय त्यौहार है, क्योंकि इसमें पूरे देश के लोग अपने धर्म, अपनी जाति आदि को भूलकर आनंद के साथ भाग लेते हैं। हर साल अगस्त 15 को स्वतंत्रता दिवस मनाया जाता है। उपसंहार : हमारे स्कूल में स्वतंत्रता दिवस बडी धूमधाम से मनाया जाता है। हमारा स्कूल रंग – बिरंगे कागज़ों से सजाया जाता है। सुबह आठ बजे राष्ट्रीय झंडे की वंदना की जाती है। राष्ट्रीय गीत गाये जाते हैं। हमारे प्रधानाध्यापक स्वतंत्रता दिवस का महत्व बताते हैं। हम अपने नेताओं के त्याग की याद करते हैं। हम अपने राष्ट्रीय झंडे के गौरव की रक्षा के लिए अपना सर्वस्व त्याग करने की प्रतिज्ञा लेते हैं।

8. कृत्रिम उपग्रह

प्रस्तावना (भूमिका) :
ग्रहों की परिक्रमा करने वाले आकाशीय पिंडों को उपग्रह कहते हैं। कृत्रिम उपग्रह तो मानव द्वारा बनाये गये ऐसे यंत्र हैं, जो धरती के चारों ओर निरंतर घूमते रहते हैं।

विषय विश्लेषण :
अंतरिक्ष के रहस्यों का अध्ययन करने के लिए सर्वप्रथम रूस ने 1957 में स्पुतनिक -1 कृत्रिम उपग्रह को अंतरिक्ष में छोडा था। भारत ने अपना पहला उपग्रह “आर्यभट्ट’ को 1975 में अंतरिक्ष में छोड़ा था। दूसरा भास्कर – 1 को 1979 को छोड़ा था। इसके बाद भारत ने रोहिणी, एप्पल और भास्कर – 2 को भी छोडा था। उन उपग्रहों को अंतरिक्ष में रॉकेटों की सहायता से भेजा जाता है। ये धरती की परिक्रमा करने लगते हैं। परिक्रमा करनेवाले मार्ग को उपग्रह की कक्षा कहते हैं। इन कृत्रिम उपग्रहों से हमें बहुत कुछ प्रगति करने का अवसर मिला। धरती एवं अंतरिक्ष के बारे में जानकारी प्राप्त हुई है।

निष्कर्ष :
अनेक प्रकार की वैज्ञानिक खोजों के लिए कृत्रिम उपग्रहों का निर्माण किया गया। ये कई प्रकार के होते हैं। वैज्ञानिक उपग्रह, मौसमी उपग्रह, भू – प्रेक्षण उपग्रह, संचार उपग्रह आदि। वैज्ञानिक उपग्रह, वैज्ञानिक प्रयोगों के लिए और रक्षा उपग्रह सैनिकों की रक्षा के लिए काम आते हैं। मौसम उपग्रह से मौसमी जानकारी प्राप्त करते हैं। भू – प्रेक्षण से भू संपदा, खनिज संपदा, वन, फसल, जल आदि की खोज होती है। संचार उपग्रहों से टेलिफ़ोन और टेलिविज़न संदेश भेजे जाते हैं और पाये जाते हैं। आजकल के सभी वैज्ञानिक विषय कृत्रिम – उपग्रहों पर आधारित होकर चल रहे हैं।

9. संस्कृति का महत्व

प्रस्तावना :
संस्कृति का अर्थ है नागरिकता या संस्कार किसी भी देश के आचार-विचार, रीति-रिवाज़, वेशभूषा, ललितकलाएँ, सामाजिक, धार्मिक, नैतिक विषयों का सम्मिलित रूप ही संस्कृति कहलाती है। संस्कृति का संबंध भूत, वर्तमान और भविष्य से होता है।

विषय विश्लेषण :
हर एक देश के लिए संस्कृति का अत्यंत महत्वपूर्ण स्थान होता है। भारतीय संस्कृति केवल आर्य या हिन्दू संस्कृति ही नहीं। वह महान संस्कृति है। हमारे भारत में अनेक धर्म और अनेक भाषाएँ हैं। अनेक देशों से आकर बसे हुए लोग हैं। वे अनेक प्रकार के लोग हैं। किन्तु भारतीय संस्कृति में एक बहुत बडी चीज़ है, जो अन्य देशों में बहुत कम पायी जाती है। भारतीय संस्कृति समन्वयात्मक है। वह सारे भारत की एक ही है। अखंड है। अविभाज्य है। इसमें विशाल धर्म-कुटुंब बनाने की क्षमता है। सूफ़ीमत, कबीर पंथ, ब्रह्मसमाज तथा आगरबानी संप्रदाय में भारत की संस्कृति का समन्वयात्मक रूप देख सकते हैं। अनेक संस्कृतियों को आत्मसात करने से भारतीय संस्कृति सबसे आगे है। यह बडी उदार संस्कृति है। अनेक संस्कृतियों को अपने में मिला लिया। मानवता का अन्तिम कल्याण ही भारतीय संस्कृति का आदर्श है। भिन्नत्व में एकत्व भारतीय संस्कृति की सबसे बड़ी विशेषता है।

उपसंहार :
भारतीय संस्कृति महान है। इससे ही दुनिया में शांति की स्थापना हो सकती है।

AP SSC 10th Class Hindi निबंध लेखन

10.बकारा का समस्या

प्रस्तावना :
जब काम करनेवालों की अधिकता और काम की कमी होती है तब बेकारी की समस्या पैदा होती है। भारत पर सदियों तक विदेशी शासन के कारण यह समस्या बढ़ती गयी है।

विषय विश्लेषण :
शिक्षित व्यक्ति बेकारी में नाम लिख पाता है। उसे काम नहीं मिलता तो मन को बडा दुख होता है। उसे विरक्त होकर आत्महत्या करलेने का निर्णय लेने की नौबत आती है। काम-दिखाऊ कार्यालय में नाम लिखाने के बाद भी उसको कभी कोई रास्ता नहीं मिल रहा है। इस कारण बेकारी की समस्या बढती चा रही है।

समस्याएँ :
अंग्रेज़ी शिक्षाप्रणाली में पढकर निकलनेवालों को नौकरी नहीं मिलती तो बेकार रह जाते हैं। शिक्षितों के लिए नौकरी के सिवा कोई दूसरा काम न आने के कारण ही यह बेकारी बढ़ती जाती है। इस प्रकार हम जान सकते हैं कि वर्तमान शिक्षा प्रणाली और बेकारी के बीच गहरा संबंध है। ग्रामीण भी किसी कला-कुशलता के अभाव में नौकरी के लिए दौडने लगते हैं। इस तरह बेकारी बढ़ रही है और दूसरी ओर खेतों में काम करनेवालों की संख्या भी कम हो रही है। वैज्ञानिक प्रगति और मशीनों के प्रयोग की वृद्धि ने भी इस समस्या को बढादिया है। इन कारणों से अमीर करोडपति और सामान्य लोग गरीब बन रहे हैं।

कर्तव्य :
सरकार को कुटीर उद्योगों को प्रोत्साहन देकर बेकारी को दूर करने का प्रयत्न करना चाहिए। कृषि कार्य में स्पर्धा उत्पन्न करनी चाहिए। शिक्षा प्रणाली में सरलता, व्यावहारिकता और आध्यात्मिकता को स्थान देना चाहिए।

उपसंहार :
सरकार का कर्तव्य है कि ऊपर के सभी उपायों को काम में लायेंगे तो बेकारी की समस्या हल हो सकती है। समाज में सुख-शांति बढ़ सकती हैं।

11. रक्तदान का महत्व

भूमिका :
रक्त का अर्थ है खून या लहू। दान का अर्थ है दूसरों को देना। इसलिए रक्तदान का अर्थ हुआ खून को देना। दान कई तरह के होते हैं – जैसे अन्नदान, कन्यादान, श्रमदान, नेत्रदान आदि। इनमें रक्तदान सर्वश्रेष्ठ माना जाता है। कारण यह है कि दिये हुए रक्त से एक घायल या रक्तहीन बीमार व्यक्ति को नया जीवन मिलता है। रक्तहीन आदमी का जीवन भाररूप होता है। इसलिए हम रक्तदान को सर्वश्रेष्ठ दान मानते हैं।

रक्तदान की आवश्यकता :
रक्तदान का महान उद्देश्य रक्तहीन आदमी को रक्त देकर उसे जिलाना है। आदमी को रक्त की ज़रूरत तब होती है जब वह किसी दुर्घटना में घायल होता है या उसे रक्तहीनता की बीमारी हो, जिसे ‘एनीमिया’ कहते हैं।

रक्तदान की प्रक्रिया :
रक्त देने का इच्छुक (Blood Donor) पहले किसी ‘रक्त बैंक में जाकर एक आवेदन – पत्र भरता है। उसमें यह अपने रक्त के वर्ग के बारे में बताता है और अपने परिवार का पूरा इतिहास भी देता है। यदि रक्त देनेवाला किसी रोग का रोगी हो या उसके परिवार में कोई भयंकर रोगी हो तो उसका रक्त नहीं लिया जाता। आजकल एइड्स (AIDS) की जाँच भी करते हैं। इन सभी जाँचों के बाद रक्त बैंकवाले उसे एक निश्चित तारीख पर उपस्थित होने को कहते हैं।

रक्तदान की प्रेरणा :
रक्तदान की आवश्यकता पर समाचार-पत्र, आकाशवाणी, दूरदर्शन आदि माध्यमों के द्वारा खूब प्रचार किया जाता है। आजकल स्कूल-कॉलेज के युवक-युवतियाँ, लायन्स क्लब के सदस्य और राजनैतिक दलों के सदस्य रक्तदान के लिए “कैंपों” का संगठन करते हैं। इनमें हज़ारों की संख्या में लोग रक्तदान करते हैं।

उपसंहार :
रक्तदान सभी दानों में श्रेष्ठ है। रक्त दान न करने वाला आदमी देश के लिए भारस्वरूप होता है। उसका जीना और मरना दोनों बराबर है। इसलिए हम हज़ारों की संख्या में रक्तदान करें और ज़रूरत मंद रोगियों को मरण से बचायें।

12. ऐतिहासिक स्थलों की सुरक्षा

प्रस्तावना :
इतिहास से संबद्ध प्राचीन इमारतें, भवन, किला, महल आदि को ऐतिहासिक स्थल कहते हैं। भारत एक सुविशाल और प्राचीन देश है। यहाँ कई ऐतिहासिक स्थल हैं। दिल्ली, आग्रा, जयपुर, हैदराबाद, बुद्ध गया आदि कई सैकड़ों स्थल भारत में हैं।

विषय :
ये सब हमारे देश के इतिहास के जीवंत प्रमाण हैं। इनके द्वारा उस समय के लोगों के भवन निर्माण कला का परिचय हमें होता है। प्राचीन काल के लोगों के औजार, वस्त्र और घर की सामग्री आदि के द्वारा हमारी संस्कृति का परिचय प्राप्त होता है। विजयवाडे के मोगलराजपुरम की गुहाएँ, अजंता, एलोरा की गुहाएँ आदि भी ऐसे ऐतिहासिक स्थल हैं।

विश्लेषण :
कुछ लोग ऐसे स्थलों से कीमती चीजें चुराकर अधिक पैसा कमाना चाहते हैं। इससे हमें नुकसान होता है। कुछ लोग इन जगहों को अनैतिक कार्य करने के लिए केन्द्र बनाते हैं। इससे वे नष्ट हो जायेंगे। इसलिए इनकी सुरक्षा करना चाहिए। हर नागरिक का कर्तव्य यह है कि – “इनकी सुरक्षा अपनी संपत्ति के जैसा करना चाहिए।” ये भूत और वर्तमान के लिए प्रमाण होंगे। भविष्य के लोग इनसे इतिहास का जानकारी रखते हैं।

AP SSC 10th Class Hindi निबंध लेखन

13. सत्तर वर्षों के भारत स्वातंत्र्य स्वर्णोत्सव

भूमिका :
हमारा भारत सैकडों वर्ष अंग्रेज़ों के अधीन में रहने के बाद गाँधी, नेहरू, नेताजी, पटेल आदि नेताओं के त्याग फल से 15 – 8-1947 को आज़ाद हुआ।

विषय विश्लेषण :
अंक 15-08-1947 को आजादी प्राप्त होकर सत्तर वर्ष पूरा हो गया। इसके उपलक्ष्य में सारा भारत पुलकित होकर प्रजातंत्र पालन में सत्तरवाँ स्वातंत्र्य स्वर्ण महोत्सव मना रहा है। अगस्त 2019 को तिरहत्तर वर्ष बीत जायेंगे। इस कारण अगस्त 2018 से अगस्त 2019 तक ये उत्सव मनाये गये।

सारे भारत में ये स्वर्णोत्सव बड़े धूमधाम से मनाये गये। सभी तरह के लोगों ने, जातियों ने आपस में मिल – जुलकर मनाये हैं, सरकारी और सभी प्रकार के संस्थाओं ने, विद्यालय और सभी कार्यालयों ने उत्सव खूब मनाये हैं। अनेक कार्यक्रम का निर्वाह किया गया है। तिरहत्तर वर्षों में भारत ने जो प्रगति पायी है, सबका विवरण बताया गया है। सांस्कृतिक कार्यक्रमों के साथ सभी विद्यालयों और महाविद्यालयों में विद्यार्थियों के बीच निबंध रचना और भाषण संबंधी सभाओं (होड) का निर्वाह करके प्रचार किया गया है। इस विषय में सभी जिलाओं ने और मंडलों ने प्रत्येक रूप से व्यवहार करके कार्यक्रमों को सफल बनाया है।

उपसंहार :
देश की अखंडता और स्वतंत्रता बनाये रखने की प्रतिज्ञा और कर्तव्य पालन यह उत्सव याद दिलाता है।

14. हम सब एक हैं।

प्रस्तावना :
भगवान ने सब प्राणियों को समान रूप से सृष्टि की है। कर्म के अनुसार जन्म प्राप्त होते रहते हैं। लेकिन सब प्राणियों में मानव जन्म सर्वोत्तम है। इसको बार – बार प्राप्त करना मुश्किल है। इसलिए इस जन्म में हमें जानना चाहिए कि हस सब एक है। सभी में परमात्मा है।

विषय विश्लेषण :
भूमंडल में अनेक देश हैं। अनेक प्रान्त हैं। अनेक लोग हैं। अनेक जातियाँ हैं। अनेक भाषाएँ हैं। संस्कृति, कलाएँ, सामाजिक, धार्मिक, नैतिक विषयों में भी फरक है। आचार – व्यवहार और रंग – बिरंगों में फरक है, फिर भी हम सब लोग एक है। भगवान ने सभी को समान रूप से सब कुछ दिया है। उसके पाने में हम में मत – भेद होते हैं, सभी मनुष्यों के तन, मन, खून और अंग एक ही प्रकार के हैं। लेकिन हमारी आदतों के कारण विविध रूप में दिखाई देते हैं। जिसमें परोपकार की भावना होती है, उसे सभी में परमात्मा दिखाई पडता है। वह सभी को एक ही मानता है, संपत्ति, शक्ति, बुद्धि, उदारता सभी भावनाओंवाले और सभी मत, सभी जाति के लोग एक ही है। जीवन मार्ग, धार्मिक मार्ग, अध्यात्मिक मार्ग और राजनैतिक मार्ग अनेक हैं। भाषाएँ अनेक हैं। रीतियाँ अनेक हैं। आकार अनेक हैं। लेकिन हम सब एक है।

उपसंहार :
सभी में एकता की भावना होती तो देश में सुख – शांति बढ़जाती है। हिंसा भाव छोड देते हैं।

15. पुस्तकालय

प्रस्तावना :
पढ़ने के लिए जिस स्थान पर पुस्तकों का संग्रह होता है, उसे पुस्तकालय कहते हैं। भारत में मुम्बई, कलकत्ता , चेन्नै, दिल्ली, हैदाराबाद आदि शहरों में अच्छे पुस्तकालय हैं। तंजाऊर का सरस्वती ग्रंथालय अत्यंत महत्व का है। मानव जीवन में पुस्तकालय का अत्यंत महत्वपूर्ण स्थान है।

विषय विश्लेषण : पुस्तकालय चार प्रकार के हैं।

  1. व्यक्तिगत पुस्तकालय
  2. सार्वजनिक पुस्तकालय
  3. शिक्षा – संस्थाओं के पुस्तकालय
  4. चलते – फिरते पुस्तकालय

पुस्तकों को पढ़ने की रुचि तथा खरीदने की शक्ति रखनेवाले व्यक्तिगत पुस्तकालयों का संचालन करते हैं। इतिहास, पुराण, नाटक, कहानी, उपन्यास, जीवनचरित्र आदि सभी तरह के ग्रंथ सार्वजनिक पुस्तकालयों में मिलते हैं। इनमें सभी लोग अपनी पसंद की पुस्तकें पढ़ सकते हैं। नियत शुल्क देकर सदस्य होने पर पुस्तकें घर ले जा सकते हैं। शिक्षा संस्थाओं के पुस्तकालयों से केवल तत्संबंधी विद्यार्थी ही लाभ पा सकते हैं। देहातों तथा शहरों के विभिन्न प्रांतों के लोगों को पुस्तकें पहुँचाने में चलते – फिरते पुस्तकालय बहुत सहायक हैं। इनके नियमित रूप से पढ़ने से मनोरंजन के साथ – साथ ज्ञान – विज्ञान की भी वृद्धि होती है।

पुस्तकें पढ़ने से ये लाभ हैं :
इनके नियमित रूप से पढ़ने से मनोरंजन के साथ – साथ ज्ञान – विज्ञान की भी वृद्धि होती है।

  1. अशिक्षा दूर होती है।
  2. बुद्धि का विकास होता है।
  3. कुभावनाएँ दूर होती हैं।

विभिन्न देशों की सामाजिक, राजनीतिक, धार्मिक और आर्थिक परिस्थितियों का परिचय मिलता है।

उपसंहार :
पुस्तकालय हमारा सच्चा मित्र है। इसकी रक्षा करना हमारा कर्तव्य है। इसलिए पुस्तकों को गंदा करना, पन्ने फाडना नहीं चाहिए। अच्छी पुस्तकें सच्चे मित्र के समान हमारे जीवन भर काम आती है। ये सच्चे गुरु की तरह ज्ञान और मोक्ष दायक भी हैं।

16. विद्यार्थी जीवन

प्रस्तावना :
विद्यार्थी का अर्थ है विद्या सीखनेवाला। इसलिए विद्यार्थी अवस्था में विद्या सीखते जीवन बिताना या । ज्ञानार्जन करना उसका परम कर्तव्य है। उत्तम विद्यार्थी ही आदर्श विद्यार्थी कहलाता है।

विषय विश्लेषण :
जो बालक विद्या का आर्जन करता है उसे विद्यार्थी कहते हैं। हर विद्यार्थी को महान व्यक्तियों से अच्छी बातों को सीखना चाहिये। तब वह आदर्श विद्यार्थी बन सकता है। आदर्श विद्यार्थी को अपने हृदय में सेवा का भाव रखना चाहिए। उसको अच्छे गुणों को लेना चाहिए। उसको विनम्र और आज्ञाकारी बनना चाहिये। उसे शांत चित्त से अपने गुरु के उपदेशों को सुनना चाहिये। उसको स्वावलंबी बनना चाहिये। उसको अपने कर्तव्य को निभाना चाहिये। उसको समाज और देश का उपकार करना चाहिये। उसको महापुरुषों की जीवनियों से प्रेरणा लेनी चाहिये। उसको समय का सदुपयोग करना चाहिये। आदर्श विद्यार्थी को सदाचारी बनना चाहिये।

उपसंहार :
विद्यार्थी दुष्ट लोगों को पकड़ने में सरकार की सहायता कर सकते हैं। भारत स्काउट, जूनियर रेडक्रास आदि संस्थाओं में वे भाग ले सकते हैं। उनका धर्म है कि वे हमेशा मानव की सेवा करते रहे। अपने देश की सच्ची सेवा भी करनी है। मानव जीवन में विद्यार्थी जीवन ही अत्यंत महत्तर और आनंददायक जीवन है। अच्छी पुस्तकें पढनी चाहिए, जिससे चरित्रवान बन सकते हैं। आज का आदर्श विद्यार्थी ही कल का आदर्श नेता, अच्छा नागरिक बन जाता है। इस कारण देश और समाज के लिए आदर्श विद्यार्थियों की अत्यंत आवश्यकता है। हर एक विद्यार्थी को आदर्श विद्यार्थी बनने की आवश्यकता है।

17. संक्रांति (पोंगल)

प्रस्तावना :
संक्रांति भारत का एक प्रसिद्ध त्यौहार है। संक्रांति को ही दक्षिण भारत के लोग “पोंगल” कहते हैं। इस त्यौहार का संबंध सूर्य भगवान से है। सूर्य भगवान इस दिन दक्षिणायन से उत्तरायन को चलता है। इस कारण इसको ‘उत्तरायन’ भी कहते हैं। यह त्यौहार हर साल जनवरी 13, 14, तारीखों में आता है।

विषय :
सूर्य भगवान की कृपा से खूब फसलें होती हैं। इसलिए कृतज्ञ किसान नयी फसल से सूर्य भगवान को पोंगल बनाकर पोंगल के दिन भेंट चढ़ाते हैं। बन्धु मित्रों से मिलकर खुशी मनाते हैं।

यह त्यौहार तीन दिन मनाया जाता है। पहले दिन को भोगी कहते हैं। दूसरे दिन को संक्रांति मनाते हैं और तीसरे दिन को कनुमा कहते हैं। त्यौहार के सिलसिले में सभी रिश्तेदार अपने घर आते हैं। सिर स्नान करके नये कपडे पहनते हैं। तरह – तरह के पकवान बनाकर खाते हैं। मिष्ठान्न खाते हैं। आंध्र के लोगों के विशेष पकवान जैसे हल्दी भात, दही भात, बोब्बट्लू, आवडा आदि बनाते और खाते हैं।

इस त्यौहार की तैयारी एक महीने के पहले से ही होती है। घर और मकान साफ़ किये जाते हैं। दीवार पर चूना पोता जाता है।

उपसंहार :
त्यौहार के समय किसान लोग बैलों की, गायों की पूजा करते हैं। गाँव – गाँव में कोलाहल मच जाता है। मुर्गों की होड, भेडों की भिडाई आदि होते हैं। सब लोग आनंद – प्रमोद के साथ त्यौहार मनाते हैं। इसे ‘पेद्द पंडुगा” भी कहते हैं। आंध्रा के लोगों के लिए यह एक खास त्यौहार है।

AP SSC 10th Class Hindi निबंध लेखन

18. जनसंख्या की समस्या

भारतवर्ष की सबसे बड़ी समस्या है – जनसंख्या -वृद्धि | भारत की आबादी 120 करोड़ का आंकड़ा पार कर चुकी है। तेजी से बढ़ती जनसंख्या का पहला कारण है – अनपढ़ता | दूसरा कारण है – अंधविश्वास। अधिकतर लोग बच्चों को भगवान की देन मानते हैं। इसलिए वे परिवार नियोजन को अपनाना नहीं चाहते। लड़का- लड़की में भेदभाव करने से भी जनसंख्या बढ़ती है। तेजी से बढ़ती जनसंख्या के कारण पर्यावरण – प्रदूषण की गंभीर समस्या आज हमारे सामने खड़ी है। कृषि-योग्य भूमि का क्षम हो रहा है। वनों की अंधाधुंध कटाई हो रही हैं। बेकारी बढ़ रही है। परिणाम स्वरूप लूट, हत्या, अपहरण जैसी वारदातें बढ़ रही हैं। लोगों को बेहतर स्वास्थ्य सेवाओं का लाभ नहीं मिल रहा। जनसंख्या- नियंत्रण के लिए सरकार को चाहिए कि वह परिवार – नियोजन कार्यक्रम को गति दे । सरकार को चाहिए कि इस दिशा में कठोरता से नियम लागू करे अन्यथा आने वाली पीढ़ी को भारी संकट का सामना करना पड़ सकता है।

19. नदियों से लाभ

भूमिका :
सब प्राणियों के लिए पानी की अत्यंत आवश्यकता है। बिना पानी के कोई जीवित नहीं रह सकता। केवल पीने के लिए ही नहीं मानव के हर एक काम के लिए पानी की अत्यंत आवश्यकता है। इसलिए पानी का अत्यंत महत्व है।

विषय विश्लेषण :
खूब वर्षा होने पर बाढ़ आती है। साधारणतः नदियाँ पहाडों से निकलकर समुद्र में मिल जाती हैं। नदियों से कई प्रयोजन हैं। नदी जहाँ ऊँचे प्रदेश से गिरती है, वहाँ जल प्राप्त का निर्माण होता है। बाँध बनाकर पानी को इकट्ठा करके खेतों की सिंचाई करते हैं। वहाँ बिजली उत्पन्न की जाती है। नहरों के द्वारा सभी प्रांतों को पानी पहुँचाया जाता है। नदियों में नावें चलती हैं, जिससे व्यापार होता है। इनमें मछलियाँ मिलती हैं। इनको बहुत लोग खाते हैं। नदी का पानी सब लोग पीते हैं। इसमें स्नान करते हैं। कपडे धोते हैं। गंगा, यमुना, गोदावरी, कृष्णा, कावेरी आदि भारत की प्रमुख और पवित्र नदियाँ हैं। सभी नदियों पर बाँध बनवाकर करोडों एकड ज़मीन खेती के काम में लायी गयी है। भारतीय लोग नदियों की पूजा करते हैं। नदियाँ ही सृष्टि में प्रमुख स्थान रखती हैं। सभी प्राणियों और जड – चेतन के लिए आधार – मात्र है।

उपसंहार :
नदियाँ केवल मानव के लिए ही उपयोग नहीं, सृष्टि के सभी प्राणियों के लिए जीवनाधार है।

20. हिन्दी दिवस

प्रस्तावना :
भारत हमारा एक विशाल और महान देश है। यहाँ अनेक भाषाएँ बोली जाती हैं। ऐसी हालत में जन साधारण को आपस में कार्य करने और एक दूसरे को समझने एक शक्तिशाली भाषा की आवश्यकता है। देश । के अधिकांश लोगों से बोली जानेवाली और समृद्ध साहित्यवाली आसान भाषा ही राष्ट्र भाषा बन सकती है। हिन्दी में ये सभी गुण विद्यमान हैं। ख़ासकर हिन्दी साहित्य का करीब एक हज़ार वर्ष का इतिहास है। सूरदास, तुलसी, भारतेन्दु हरिश्चंद्र, महावीर प्रसाद द्विवेदी आदि महान साहित्यकारों ने अपनी रचनाओं से हिन्दी को समृद्ध किया है।

महत्व :
स्वतंत्र भारत की राष्ट्र भाषा बनने का सौभाग्य हिन्दी को मिला है। यह जनता की सेविका है। सारी जनता को एक सूत्र में बांधने की शक्ति रखती है। सन् 14 सितंबर 1949 हिन्दी को राष्ट्रभाषा का पद दिया गया हैं। तब से हिन्दी प्रचार के विषय में केंद्रीय और प्रांतीय सरकार दोनों अधिक कार्यरत हैं। हिन्दी एक सजीव भाषा है। इस पर अन्य कई भाषाओं का गहरा प्रभाव है। खासकर स्वतंत्रता संग्राम के वक्त समूल भारत जाति को एकत्रित करने में हिन्दी का सशक्त योगदान प्रशंसनीय रहा ।

भारत में हर साल सितंबर 14 को हिन्दी दिवस मनाया जाता है। विद्यालयों में हिन्दी दिवस के सिलसिले में गीत, नाटक, निबंध आदि भाषा संबंधी प्रतियोगिताएँ संपन्न की जाती हैं। प्रतियोगिताओं में प्रतिभा दिखानेवाले छात्रों को पुरस्कार दिये जाते हैं। खासकर हिन्दी भाषा की मधुरता का आनंद लेते हैं। हम प्रण करते हैं कि शक्ति भर राष्ट्र भाषा के प्रचार व प्रसार में अपना हाथ बँटाएँगे।

उपसंहार :
सभी भारतीय भाषाओं में हिन्दी का महत्व अधिक है। ऐसी महान भाषा की उन्नति और प्रचार में सबको अपना कर्तव्य निभाना चाहिए।

21. अगर मैं पंछी होता, तो …..

प्रस्तावना :
ईश्वर की बनायी इस अद्वितीय सृष्टि में पंछी भी एक उत्तम प्राणी है। पंछी को ही हम पक्षी, विहंग कहते हैं। पंछी परमात्मा का प्रतीक है। पंछी आत्मा का स्वरूप भी माना जाता है। उपनिषदों में आत्मा और परमात्मा दोनों को भी पक्षी के स्वरूप माना गया।

विषय विश्लेषण :
पंछी (पक्षी) स्वेच्छा से उड़नेवाला निर्बाध प्राणी है। आत्मनिर्भरता का यह सच्चा प्रतीक है। यह सदा उपकारी ही रहा है। प्रकृति में अनेक प्रकार के पंछी पाये जाते हैं। हर पंछी अपना विशेष महत्व रखता है। चाहे कितना भी कष्ट या नष्ट का सामना करना पडे वह कभी विचलित नहीं होता। धैर्य के साथ जीवन यापन करता रहता है। सदा संतुष्ट रहनेवाला आदर्श प्राणी है।

महत्व :
आत्मनिर्भर पंछी का जीवन मेरे लिए आदर्शमय है। अगर मैं पंछी होता तो उसी की तरह अपना एक मकान (घोंसला) खुद बना लेता और परिवार की रक्षा करते जी जान लगाकर पालन – पोषण करता। परिवार के सदस्यों से प्रेमपूर्ण व्यवहार करते उनमें उत्तम गुणों को पनपने का सफल प्रयत्न करता। किसी अत्याचारी या दुराचारी को मैं अपने या अपने परिवारवालों की ओर ताकने नहीं देता। मानव समाज की तरह धान्य, संपत्ति आदि छिपाने की ज़रूरत नहीं होती। झूठ बोलने की, स्वार्थ से किसी को धोखा देने की, हानि करने की बात ही न उठती। अपने और अपने परिवार के सदस्यों के पेट भरने दूर – दूर प्रांतों में जाकर दाना – दान ले आता। सदा सब की सहायता करने में तन मन लगा देता। ऐसा करके अपना जीवन सार्थक बना लेता।

उपसंहार :
अगर मैं पंछी होता तो मेरे परिवार को रक्षा करूँगा। फंसल उगाने में किसनों को मदद करूँगा।

22. “मानव सभ्यता के विकास में कम्प्यूटर का महत्त्व”..

प्रस्तावना :
यह विज्ञान का युग है। कुछ वर्ष पहले संसार के सामने एक नया आविष्कार आया उसे अंग्रेज़ी में कम्प्यूटर और हिन्दी में संगणक कहते हैं।

भूमिका (लाभ) :
आज के युग को हम कम्प्यूटर युग कह सकते हैं। आजकल हर क्षेत्र में इसका ज़ोरदार उपयोग और प्रयोग हो रहा है। चाहे व्यापारिक क्षेत्र हो, राजनैतिक क्षेत्र हो, यहाँ तक कि विद्या, वैद्य और संशोधन के क्षेत्र में भी ये बडे सहायकारी हो गये हैं। इसे हिन्दी में “संगणक” कहते हैं। गणना, गुणना आदि यह आसानी से कर सकता है। मनुष्य की बौद्धिक शक्ति की बचत के लिए इसका निर्माण हुआ है। आधुनिक कम्प्यूटर के निर्माण में चार्लस बाबेज और डॉ. होवर्ड एकन का नाम मशहूर हैं।

विषय प्रवेश :
परीक्षा पत्र तैयार करना, उनकी जाँच करना – इसके सहारे आजकल पूरा किया जा रहा है। जिस काम के लिए सैकड़ों लोग काम करते हैं, उस काम को यह अकेला कर सकता है। हम जिस समस्या का परिष्कार नहीं कर पाते हैं, उसे यह आसानी से सुलझा सकता है।

विश्लेषण :
चिकित्सा के क्षेत्र में भी इसका उपयोग बड़े पैमाने पर हो रहा है। इसके द्वारा यह सिद्ध हो गया कि – ” सब तरह के काम यह कर सकता है।”

उपसंहार :
इसकी प्रगति दिन – ब – दिन हो रही है। रॉकेटों के प्रयोग, खगोल के अनुसंधान में इसके ज़रिये कई प्रयोग हो रहे हैं। यह वैज्ञानिकों के लिए एक वरदान है। हर छात्र को इसका प्रयोग करना सीखना है। इसके द्वारा देश की अभिवृद्धि अवश्य हो सकती है। लेकिन बेरोज़गारी बढ़ने की संभावना है।

AP SSC 10th Class Hindi निबंध लेखन

23. किसी त्यौहार का वर्णन

भूमिका :
दीवाली हिन्दुओं का प्रमुख त्यौहार है। मेरा प्रिय त्यौहार दीवाली है। बच्चे-बूढ़े, स्त्री-पुरुष, धनिकगरीब सबके लिए यह प्रिय त्यौहार है। यह पर्व आश्विन अमावस्या को मनाया जाता है।

दीवाली का अर्थ होता है दीपों की पंक्ति। यह वास्तव में पाँच त्यौहारों का समूह – रूप है।

विषय :
नरक चतुर्दशी के बारे में एक कथा प्रचलित है। प्राचीन काल में नरकासुर नामक एक राक्षस रहता था। वह बडा दुष्ट था। वह लोगों को बहुत सताता था। लोगों में त्राहि-त्राहि मच गयी। लोगों की प्रार्थना सुनकर भगवान श्री कृष्ण ने सत्यभामा के साथ नरकासुर पर आक्रमण किया। सत्यभामा ने नरकासुर को मार डाला। इस पर लोगों ने दीप जलाकर अपनी खुशियाँ प्रकट की।

विश्लेषण :
दीवाली के संबंध में अनेक कथाएँ हैं। एक कथा इस प्रकार है – “रावण-वध के बाद जब राम अयोध्या लौटे तो पुरजनों ने उनके स्वागत में दीवाली का आयोजन किया”। यह बड़ा आनंददायक पर्व है। दीवाली के दिन लोग तडकें उठते हैं। अभ्यंगन स्नान करके नये कपडे पहनते हैं। शाम को दीपों की पूजा और लक्ष्मी की पूजा करते हैं। बच्चे पटाखें, फुलझडियाँ आदि जलाते हैं। लोग मिठाइयाँ खाते हैं। मारवाडी लोग इस दिन से नये साल का आरंभ मानते हैं। हिन्दु लोग लक्ष्मी की पूजा करते हैं। सभी मंदिर जाते हैं। खासकर व्यापारी लोग अपने पुराने हिसाब ठीक करके नये हिसाब शुरू करते हैं। यह खासकर हिन्दुओं का त्यौहार है। सफ़ाई का त्यौहार है। अन्धकार पर प्रकाश और पाप पर पुण्य की विजय साधना का त्यौहार है।

उपसंहार :
यह त्यौहार भारत भर में मनाया जाता है। खासकर यह बच्चों का त्यौहार है। बच्चों के आनंद का ठिकाना नहीं होता है। दीवाली के दिन सर्वत्र प्रसन्नता ही प्रसन्नता दिखाई देती है।

24. स्वास्थ्य के लिए स्वच्छता की ज़रूरत है

क) भूमिका
ख) सफ़ाई का महत्व
ग) सार्वजनिक स्थलों की सफाई
घ) उपसंहार

क) भूमिका :
मैं एक दिन टहलने निकला था, मैंने देखा कि एक सज्जन रास्ते पर पान थूक रहे थे। एक अन्य सज्जन ने अपनी आधी सिगरेट बुझाकर रास्ते पर फेंक दी थी। कुछ ऐसे लोग भी देखे जो भेल, चाट, चुडवा, आदि खाकर जूठे दाने और गंदे कागज़ इधर-उधर फेंक रहे थे। इससे मुझे काफ़ी खेद हुआ, और मेरा मन भी काफ़ी दुखी हुआ। मैं सोचने लगा कि लोगों की यह आदत पता नहीं कब जायेगी।

ख) सफ़ाई का महत्व :
हमारा अनुभव है कि, अपने कपडे साफ़ हो और शरीर स्वच्छ हो तो मन अत्यंत प्रसन्न रहता है। स्वच्छता से ही पवित्रता रखी जा सकती है। अतः प्रत्येक व्यक्ति को यथा संभव हर जगह स्वच्छता रखनी चाहिए। इससे हमारा स्वास्थ्य बना रहता है। घर का कचरा और सडकों तथा गलियों की गंदगी देखकर मन खराब हो जाता है। साफ़ मकान में रहने और साफ़ – सुथरी सडकों पर चलने से हमारा स्वास्थ्य अच्छा बना रहता है और मन भी प्रफुल्लित रहता है। सचमुच स्वच्छता से ही जीवन सुखी बन सकता है।

ग) सार्वजनिक स्थलों की सफाई :
प्रायः घर का कचरा बाहर फेंककर लोग निश्चिन्त हो जाते हैं। यह बहुत अनुचित बात है। सडक बगीचे समुद्र तट, प्राणी – संग्रहालय, रेलवे स्टेशन आदि प्रत्येक सार्वजनिक स्थल पर स्वच्छता रखना अनिवार्य है। इससे जल और वायु दोनों प्रदूषित नहीं होते हैं। अपने गाँव और शहर को स्वच्छ रखने में हर व्यक्ति को अपना सहयोग देना चाहिए।

घ) उपसंहार :
इधर- उधर कचरा फेंकने वाले लोग भले नागरिक नहीं कहे जा सकते। कचरा फेंकने के लिए जगह-जगह पर डिब्बे रखे जायें तो लोग डिब्बों में ही कचरा फेंकने की आदत डालेंगे। सफ़ाई का जितना महत्व है, उतनी ही सफ़ाई रखने के तरीकों की शिक्षा भी ज़रूरी है। बच्चों को बचपन से ही सफ़ाई के पाठ सिखाने चाहिए। इससे पानी से, वायु से फैलने वाली बीमारियाँ नहीं फैलेंगी।

25. यदि मैं प्रधानमंत्री होता तो …..

प्रस्तावना :
प्रधानमंत्री का पद एक साधारण पद नहीं है। यह देश का शासन चलाने का प्रधान और मुख्य पद है। लोकसभा में बहुमत प्राप्त पार्टी का नेता हमारे देश का प्रधानमंत्री बनता है।

उद्देश्य :
यदि मैं प्रधानमंत्री होता तो उस पद के द्वारा देश और समाज का काया पलट देना चाहूँगा। मेरे सामने कई सपने हैं। उनके लिए एक प्रणाली तैयार करके, उसके अनुसार काम करते हुए, समाज में उन्नति लाऊँगा। विषय : आज हमारे देश में भाषा भेद, जाति भेद, वर्ग भेद, प्रान्त भेद आदि फैल रहे हैं। पहले इनको दूर करके सबके दिलों में “भारत एक है” – इस भावना को जगाने की कोशिश करूँगा। देश को आर्थिक और सांस्कृतिक रूप से आगे ले जाने की कोशिश करूँगा।

किसानों को साक्षर बनाऊँगा। उन्हें सस्ते दामों में बीज, उपकरण आदि पहुँचाऊँगा। सहकारी समितियाँ बनाकर, उनसे कम सूद में ऋण प्राप्त करने की व्यवस्था करूँगा। अनेक मिल, कारखानों का निर्माण करके, जो बेरोज़गारी हैं, उसे दूर करने का प्रयत्न करूँगा।

स्कूलों, कॉलेजों और विश्व विद्यालयों की संख्या बढ़ाकर, देश के सब लडके – लडकियों को साक्षर बनाऊँगा। गाँवों को जोड़ने के लिए पक्की सडकें बनाऊँगा। गाँव की उन्नति के लिए आवश्यक योजनाएँ बनाकर, उनको अमल करूँगा। गाँवों की उन्नति में ही देश की उन्नति निर्भर है।

नदियों पर बाँध बनाकर, उनका पानी पूरी तरह उपयोग में लाऊँगा। समाज में जो भेद भाव हैं, उनको दूर करूँगा। आसपास के देशों से मित्रता भाव बढाऊँगा। विश्व के प्रमुख देशों की कतार में भारत को भी बिठाने की कोशिश करूँगा। मैं अपने तन, मन, धन से देश को प्रगति के पथ पर ले जाने की कोशिश करूँगा, लोगों ने मुझ पर जो ज़िम्मेदारी रखी है, उसको सुचारू रूप से निभाऊँगा। उपसंहार : प्रधानमंत्री बनना सामान्य विषय नहीं है, अगर मैं प्रधानमंत्री बना तो ये सभी कार्य करूँगा।

26. आदर्श विद्यार्थी

जो विद्या (प्राप्त करता है) का आर्जन करता है, चाहता है, वह विद्यार्थी है जो विद्यार्थी उत्तम गुणों का पालन करता है, उसे आदर्श विद्यार्थी कहते हैं। अध्ययनकाल विद्यार्थी के भावी जीवन के लिए महत्वपूर्ण होता है। विद्यार्थी इस जीवनकाल में उत्तम गुणों को अपनायेगा तो उसका भविष्य उज्ज्वल होगा।

सबसे पहले आदर्श विद्यार्थी को नम्र होना चाहिए। नम्रता ही विद्यार्थी का आभूषण है। अपने माता-पिता के प्रति और अपने अध्यापकों के प्रति उसका आचरण सदैव विनम्र होना चाहिए। कहा गया है ‘विद्या ददाति विनयम्’ अर्थात् विद्या विनय प्रदान करती है विद्यार्थी को आज्ञाकारी होना चाहिए। बड़ों की आज्ञा का पालन करना, विद्यार्थी का प्रथम कर्तव्य है। वास्तव में जो आज्ञा का पालन करता है। यही अनुशासन है। विद्यार्थी को अनुशासन प्रिय होना चाहिए। अनुशासन से विद्यार्थी में शिष्टता तथा शालीनता के गुण आते हैं।

आदर्श विद्यार्थी को समय का सदुपयोग करना चाहिए। समय की महत्ता जानकर विद्यार्थी को अपने जीवन में लक्ष्य की ओर बढ़ना चाहिए। विद्यार्थी के जीवन का प्रमुख लक्ष्य विद्याध्ययन है। इस कारण इसे अपना सारा … समय अध्ययन में लगाना चाहिए। वर्ग में पढ़ाये गये विषयों को ध्यानपूर्वक सुनकर उन्हें स्मरण तथा मनन करने का प्रयत्न करना चाहिए। विद्यार्थी को अपने व्यक्तिगत स्वार्थों को त्यागकर सदैव परिश्रम करना चाहिए। उसे जिज्ञासु होना चाहिए। नये विषयों की जानकारी के लिए प्रयत्नशील होना चाहिए।

आज विद्यार्थियों की स्थिति ठीक नहीं है। वे अपने कर्तव्य को भूलते जा रहे हैं और आये दिन बुरे गुणों का शिकार बनते जा रहे हैं। अनुशासन तो उनके जीवन में नहीं के बराबर है। नम्रता उनसे कोसों दूर है। वे अपने अध्यापक की हँसी उड़ाते हैं और परीक्षा के समय उन्हें पीटने को प्रस्तुत होते हैं। गुरु के प्रति आदर जताना वे अपना अपमान समझने लगे हैं। अपना बहुमूल्य समय वे सिनेमा देखने में सैर-सपाटे में मजाक में और व्यर्थ की बातों में बरबाद करते हैं। हर बात के लिए आज के विद्यार्थी आन्दोलन मचाने तथा तोड़फोड़ की बात करते हैं। विद्या सीखने की ओर उनका ध्यान कम रहता है। अपने शारीरिक सुखों के लिए अनैतिक कार्यों को करने के लिए वे पीछे भी नहीं हटते।

विद्यार्थी अपने भावी जीवन को उज्ज्वल बनाना चाहें तो उनमें नम्रता अनुशासन की भावना, समय के सदुपयोग का ज्ञान और अध्ययन के प्रति रुचि आदि का होना आवश्यक है, तभी वह आदर्श विद्यार्थी कहलाता है। आदर्श विद्यार्थी ही देश का सच्चा नागरिक सिद्ध होगा। उन्हीं के कंधों पर देश का भविष्य निर्भर है।

AP SSC 10th Class Hindi निबंध लेखन

27. पर्यावरण और प्रदूषण …

प्रस्तावना :
पर्यावरण का अर्थ है वातावरण। पर्यावरण हर प्राणी का रक्षाकवच है। पर्यावरण के संतुलन से . मानव का स्वास्थ्य अच्छा रहता है। विश्व भर की प्राणियों के जीवन पर्यावरण की स्थिति पर निर्भर रहते हैं। आजकल ऐसा महत्वपूर्ण पर्यावरण बिगडता जा रहा है। पर्यावरण में भूमि, वायु, जल, ध्वनि नामक चार प्रकार । के प्रदूषण फैल रहे हैं। इन प्रदूषणों के कारण पर्यावरण का संतुलन बिगडता जा रहा है।

विषय विश्लेषण :
भूमि पर रहनेवाली हर प्राणी को जीने प्राणवायु (आक्सिजन) की आवश्यकता होती है। यह प्राणवायु हमें पेड – पौधों के हरे – भरे पत्तों से ही मिलता है। इन दिनों पेड – पौधों को बेफ़िक्र काट रहे हैं। वास्तव में पेड – पौधे ही पर्यावरण को संतुलन रखने में काम आते हैं। ऐसे पेड – पौधों को काटने से पर्यावरण का संतुलन तेज़ी से बिगडता जा रहा है । हमारे चारों ओर के कल – कारखानों से धुआँ निकलता है। इससे वायु प्रदूषण बढ़ रहा है। कूडे – कचरे को नदी – नालों में बहा देने से जल प्रदूषण हो रहा है। वायु – जल प्रदूषणों के कारण कई बीमारियाँ फैल रही हैं।

नष्ट :
पर्यावरण के असंतुलन से मौसम समय पर नहीं आता। इससे वर्षा भी ठीक समय पर नहीं होती। वर्षा के न होने के कारण अकाल पडता है। कहीं अतिवृष्टि और कहीं अनावृष्टि की हालत भी आती है।

ऐसे प्रदूषण को यथा शक्ति दूर करना हम सबका कर्तव्य है। इसके लिए हम सब यह वचन लें और प्रयत्न करें – गंदगी न फैलाएँ, कूडा – कचरा नदी नालों में न बहायें, उनको सदा साफ़ रखें , पेड़ों को न काटें। साथ ही नये पेड – पौधे लगाकर पृथ्वी की हरियाली बढायें। वाहनों का धुआँ कम करें। ऐसा करने से ही पर्यावरण को प्रदूषित होने से बचा सकते हैं।

28. व्यायाम या किस रत) का महत्व

प्रस्तावना :
महाकवि कालिदास का कथन है – “शरीर माद्य खलु धर्म साधतम्”। इसका अर्थ है – धर्म साधन शरीर के द्वारा ही होता है। मानव अनेक सत्कार्य करता रहता है। अतः धार्मिक कार्यक्रमों के लिए सामाजिक सेवा के लिए तथा आत्मोद्धार के लिए शरीर की आवश्यकता बहुत है। अतः हर एक को स्वस्थ रहने व्यायाम की बडी आवश्यकता है।

उद्देश्य :
शरीर के दृढ और स्वस्थ होने पर ही कोई काम कर सकते हैं। शारीरिक स्वास्थ्य के कारण मानसिक उल्लास के साथ आत्मीय आनंद भी प्राप्त होता है। अतः हर एक को स्वस्थ रहने का प्रयत्न करना चाहिए। इसके लिए व्यायाम की बडी ज़रूरत है। व्यायाम के अनेक भेद हैं। विभिन्न प्रकार के योगासन, बैठक, दौडना, घूमना, प्राणायाम, कुश्ती, तैरना आदि सभी व्यायाम के अंतर्गत ही आते हैं। विद्यार्थी जीवन में ही व्यायाम करना बहुत आवश्यक है।

लाभ :
व्यायाम से शरीर सदा सक्रिय बना रहता है। रक्त संचार खूब होता है। रक्त के मलिन पदार्थ बाहर चले जाते हैं। पाचन शक्ति बढ़ती है। सारे इंद्रिय अपने – अपने काम ठीक करते रहते हैं। व्यायामशील आदमी आत्मविश्वासी और निडर होकर स्वावलंबी होता है।

नष्ट : व्यायाम तो अनिवार्य रूप से करना है। लेकिन व्यायाम करते समय अपनी आयु का ध्यान रखना चाहिए। व्यक्ति और व्यक्ति में व्यायाम का स्तर बदलता रहता है। इसका ध्यान नहीं है तो लाभ की अपेक्षा नष्ट ही अधिक होगा। उपसंहार : सब लोगों को व्यायाम प्रिय होना चाहिए। व्यायाम से व्यक्ति स्वस्थ बनकर अपना आयु प्रमाण बढा सकता है। अतः व्यायामशील व्यक्ति का जीवन सदा अच्छा और सुखमय होता है।

29. स्वच्छ भारत आभयान

भूमिका :
स्वच्छ भारत अभियान को स्वच्छ भारत मिशन और स्वच्छता अभियान भी कहा जाता है। यह एक राष्ट्रीय स्तर का अभियान है। यह भारत सरकार द्वारा 2 अक्तूबर, 2014 को महात्मा गाँधी जी की 145 वें जन्म दिवस के अवसर पर शुरू किया गया था। प्रधानमंत्री नरेंद्र मोदी द्वारा भारत में सफाई के उद्देश्य को पूरा करने के लिए अमल में लाया गया है। यह एक राजनीति मुक्त और देश भक्ति से प्रेरित अभियान है। राष्ट्रपिता महात्मा गाँधीजी के सपने को साकार करनेवाला यह अभियान है।

उद्देश्य :
इस अभियान का उद्देश्य भारत के सभी ग्रामीण और शहरी क्षेत्रों को साफ़ -सुथरा, स्वच्छ रखना है। खुले में शौच समाप्त करना, अस्वास्थ्यकर शौचालयों को फ्लश शौचालयों में परिवर्तित करना, ठोस और तरल कचरे का पुनः उपयोग, लोगों को सफाई के प्रति जागरूक करना, अच्छी आदतों के लिए प्रेरित करना, शहरी और ग्रामीण क्षेत्रों में सफाई व्यवस्था को अनुकूल बनाना, भारत में निवेश के लिए रुचि रखनेवाले सभी निजी क्षेत्रों के लिए अनुकूल वातावरण प्रदान करना आदि हैं।

प्रभाव :
स्वच्छ भारत बहुत प्रभावशाली और फलप्रद अभियान है। प्रधानमंत्री मोदी जी की प्रेरणा से इस के आरंभ पर लगभग 30 लाख स्कूलों और कॉलेजों के छात्रों और सरकारी कर्मचारियों ने भाग लिया। प्रधानमंत्री जी ने नौ हस्तियों के नामों की घोषणा की । उनसे अपने क्षेत्र में सफाई अभियान को बढाने और आम जनता को उससे जुडने के लिए प्रेरित करने को कहा। हम भारतीय इसे एक चुनौती के रूप में लें और इसे सफल बनाने अपना पूरा प्रयास जारी रखें। स्वच्छ भारत प्राप्त होने तक इस मिशन की कार्यवाही निरंतर चलती रहनी चाहिए। भौतिक, मानसिक, सामाजिक और बौद्धिक कल्याण के लिए भारतीय लोगों में इसका एहसास होना अत्यंत आवश्यक है।

उपसंहार :
स्वच्छ भारत यह शक्तिशाली अभियान है। इसे बापू जी की 150 वीं पुण्यतिथि (2 अक्तूबर 2019) तक पूरा करने का लक्ष्य है। अपने अथक प्रयत्नों से “स्वच्छता भगवान की ओर अगला कदम है’ कहावत को साकार करके दिखायेंगे। तभी विश्व में भारत का अपना महत्वपूर्ण स्थान अक्षुण्ण रह सकेगा।

30. राष्ट्रभाषा हिन्दी

प्रस्तावना :
भारत एक विशाल देश है। इसमें अनेक राज्य हैं। प्रत्येक राज्य की अपनी प्रादेशिक भाषा होती है। राज्य के अंदर प्रादेशिक भाषा में काम चलता है। परंतु राज्यों के बीच व्यवहार के लिए एक संपर्क भाषा की आवश्यकता है। सारे देश के काम जिस भाषा में चलाये जाते हैं, उसे राष्ट्रभाषा कहते हैं। राष्ट्रभाषा के ये गुण होते हैं।

  1. वह देश के अधिकांश लोगों से बोली और समझी जाती है।
  2. उसमें प्राचीन साहित्य होता है।
  3. उसमें देश की सभ्यता और संस्कृति झलकती है।

हमारे देश में अनेक प्रादेशिक भाषाएँ हैं। जैसे – हिन्दी, बंगाली, उडिया, मराठी, तेलुगु, तमिल, कन्नड आदि। इनमें अकेली हिन्दी राष्ट्रभाषा बनने योग्य है। उसे देश के अधिकांश लोग बोलते और समझते हैं। उसमें प्राचीन साहित्य है। तुलसी, सूरदास, जयशंकर प्रसाद जैसे श्रेष्ठ कवियों की रचनाएँ मिलती हैं। उसमें हमारे देश की सभ्यता और संस्कृति झलकती है। यह संस्कृत गर्भित भाषा है। इसी कारण हमारे संविधान में हिन्दी . राष्ट्रभाषा बनायी गयी। सरकारी काम – काज हिन्दी में हो रहे हैं। हिन्दी भाषा की लिपि देवनागरी लिपि है। इस लिपि की यह सुलभ विशेषता है कि – इसमें जो लिखा जाता है वही पढ़ा जाता है।

उपसंहार :
भारतीय अखंडता और एकता के लिए हिन्दी का प्रचार और प्रसार अत्यंत अनिवार्य है। हर एक भारतीय को हिन्दी सीखने की अत्यंत आवश्यकता है। इसके द्वारा ही सभी प्रान्तों में एकता बढ़ सकती है। और आपस में मित्रता भी बढ़ सकती है।

AP SSC 10th Class Hindi निबंध लेखन

31. शिक्षक दिवस (अध्यापक दिवस)

“गुल गोविंद दोऊँ खडे, काके लागौं पाँय।
बलिहारी गुल आपने, गोविंद दियो बताय”।

प्रस्तावना :
कबीर के इस दोहे से गुरु की महानता का परिचय हमें मिलता है। गुरु का दूसरा नाम ही शिक्षक और अध्यापक है। गुरु तो अज्ञान को मिटाकर ज्ञान प्रदान करनेवाले हैं। आज विद्यार्थी जगत में शिक्षक दिवस का अत्यंत महत्वपूर्ण स्थान है।

उद्देश्य (महत्व) :
हमारी परंपरा के अनुसार माता – पिता के बाद गुरु का नाम आदर के साथ लिया जाता है। “मातृ देवोभव, पितृ देवोभव, आचार्य देवोभव” इसका अर्थ है गरु का स्थान ईश्वर से भी बड़ा होता है। गुरु ही हमारे भविष्य के निर्माता और हमें ज्ञानी बनाकर अच्छा जीवन जीने के योग्य बनाते हैं। अनुशासनयुक्त, उत्तम नागरिक बनने की सहायता करते हैं। ऐसे महान गुरु (शिक्षक) को ध्यान में रखते शिक्षक दिवस भारत में 5 सितंबर को मना रहे हैं। शिक्षा के क्षेत्र में यह महत्वपूर्ण दिवस है। ऐसे महत्वपूर्ण दिवस हमारे भारत के राष्ट्रपति डॉ. सर्वेपल्लि राधाकृष्णन के जन्म दिन के शुभ अवसर पर मना रहे हैं।

डॉ. राधाकृष्णन बचपन से बहुत परिश्रम करके उन्नत शिखर पहुँच गये हैं। गरीब ब्राह्मण परिवार में पैदा होकर अपनी बौद्धिक शक्ति स्मरण शक्ति और विद्वत्ता से वे इतने महान बन सके। वे सफल अध्यापक थे। , अध्यापक पद के वे एक आभूषण हैं। ऐसे महान व्यक्ति की जन्म तिथि को शिक्षक दिवस के रूप में मनाकर हम सब उनको याद कर लेते हैं। शिक्षा प्रणाली में राधाकृष्णन ने नये-नये सिद्धांत प्रस्तुत किये हैं। वे ही आजकल शिक्षा प्रणाली के नियम बन गये हैं।

उस दिन कई कार्यक्रम आयोजित किये जाते हैं। विद्यार्थी अपने शिक्षकों को आदर के साथ सम्मानित करते हैं। गुरुजनों के प्रति अपनी श्रद्धा दिखाते हैं। इसी दिन राष्ट्र सरकार भी उत्तम शिक्षकों को सम्मानित करती है।

32. यदि मैं मुख्यमंत्री होता ….

प्रस्तावना :
मुख्यमंत्री का पद एक साधारण पद नहीं है। यह राष्ट्र का शासन चलाने का प्रधान और मुख्य पद है।

उद्देश्य :
यदि मैं मुख्यमंत्री होता तो उस पद के द्वारा राष्ट्र और समाज का काया पलट देना चाहूँगा। मेरे सामने कई सपने हैं। उनके लिए एक प्रणाली तैयारी करके, उसके अनुसार काम करते हुए, समाज में उन्नति लाऊँगा।

विषय :
सबके दिलों में “हम सब एक हैं” – इस भावना को जगाने की कोशिश करूँगा। राष्ट्र को आर्थिक और सांस्कृतिक रूप से आगे ले जाने की कोशिश करूँगा। किसानों को साक्षर बनाऊँगा। उन्हें सस्ते दामों में बीज, उपकरण आदि पहुँचाऊँगा। सहकारी समितियाँ बनाकर, उनसे कम सूद में ऋण प्राप्त करने की व्यवस्था करूँगा। अनेक मिल, कारखानों का निर्माण करके, जो बेरोज़गारी हैं, उसे दूर करने का प्रयत्न करूँगा।

स्कूलों, कॉलेजों और विश्व विद्यालयों की संख्या बढ़ाकर, राष्ट्र के सब लडके – लडकियों को साक्षर बनाऊँगा।

गाँवों को जोड़ने के लिए पक्की सडकें बनाऊँगा। गाँव की उन्नति के लिए आवश्यक योजनाएँ बनाकर, उनको अमल करूँगा। गाँवों की उन्नति में ही राष्ट्र की और देश की उन्नति निर्भर है।

नदियों पर बाँध बनाकर, उनका पानी पूरी तरह उपयोग में लाऊँगा। समाज में जो भेद भाव हैं, उनको दूर करूँगा। आसपास के देशों से मित्रता भाव बढाऊँगा। विश्व के प्रमुख राष्ट्र की कतार में भारत को भी बिठाने की कोशिश करूँगा। मैं अपने तन, मन, धन से देश को प्रगति के पथ पर ले जाने की कोशिश करूँगा, लोगों ने मुझ पर जो ज़िम्मेदारी रखी है, उसको सुचारू रूप से निभाऊँगा।

उपसंहार :
मुख्यमंत्री बनना सामान्य विषय नहीं है, अगर मैं मुख्यमंत्री बना तो ये सभी कार्य करूँगा।

33. दूरदर्शन

प्रस्तावना :
मानव को मनोरंजन की भी ज़रूरत होती है। मानव शारीरिक काम या मानसिक काम करके थक जाने के बाद कुछ आराम पाना चाहता है। आराम पाने वाले साधनों में खेलना, गाना, कहानी सुनना, सिनेमा या नाटक देखना, मित्रों से मिलकर खुशी मनाना कुछ प्रमुख साधन हैं। आजकल मानव को मनोरंजन देनेवाले साधनों में दूरदर्शन का प्रमुख स्थान है।

विषय विश्लेषण :
दूरदर्शन ग्रीक भाषा का शब्द है। दूरदर्शन को टी.वी. भी कहते हैं। टी.वी. यानी टेलीविज़न है। टेली का अर्थ है दूर तथा विज़न का अर्थ होता है प्रतिबिंब। दूरदर्शन का अर्थ होता है कि दूर के दृश्यों को हम जहाँ चाहे वहाँ एक वैज्ञानिक साधन के द्वारा देख सकना। दूरदर्शन की भी अपनी कहानी है। पहले-पहले इसको बनाने के लिये जॉन एल. बेयर्ड ने सोचा है। उसके बाद जर्मन के वैज्ञानिक पाल निपकौ ने बेयर्ड के प्रयोगों को आगे बढाया। क्यांबेल, स्विंटन आदि कई वैज्ञानिकों के लगातार परिश्रम से दूरदर्शन को 1927 में एक अच्छा रूप मिला।

लाभ :
इस दूरदर्शन से कई लाभ हैं। मानसिक उत्साह बढानेवाले साधनों में आजकल इसका प्रमुख स्थान है। आजकल हमारे देश में सौ प्रतिशत जनता दूरदर्शन की प्रसारण सीमा में है। आजकल इसके द्वारा हर एक विषय का प्रसार हो रहा है। विद्यार्थियों के लिए उपयोगी शिक्षा कार्यक्रम भी प्रसारित किये जा रहे हैं। इसके द्वारा हम समाचार, सिनेमा, नाटक आदि मनोरंजन कार्यक्रम भी सुन और देख सकते हैं।

नष्ट :
इसे लगातार देखने से आँखों की ज्योति भी मंद पडती है। दैनिक कामकाज छोडके इसमें लीन न होना चाहिए। छात्रों को पढाई छोडकर ज्यादा समय इसके सामने बिताना नहीं चाहिये। दूरदर्शन के प्रसारणों का सदुपयोग करके नियमित रूप से देखने से मानव-जीवन सुखमय होता है।

34. मानव जीवन में जल का महत्वपूर्ण स्थान है

जल हमारे लिए अत्यंत आवश्यक घटक है। यह प्रकृति का अनमोल उपहार है। जल के बिना हमारा जीवन संभव नहीं है। ऐसा माना जाता है कि जल ही जीवन है। यह अमृत समान है।

मनुष्य के साथ – साथ पशु – पक्षी, पेड – पौधे सभी के लिए अत्यंत आवश्यक है। सब का जीवन जल पर निर्भर है। दैनिक जीवन के लिए बहुत आवश्यक हैं। पानी, पीना, नहाना, भोजन करना, कपडे धोना, फसलें पैदा करना आदि के लिए जल बहुत महत्वपूर्ण है। जल के बिना हमारे जीवन की कल्पना करना कठिन है।

जल समुद्र, नदी, तालाब, पोखर, कुआँ, नहर इत्यादि में पाया जाता है। आजकल हर जगह पानी की बर्बादी हो रही है। जल प्रदूषित हो रहा है। जल की कमी के कारण हमें फसलों की उपज कम होती है। अनाज के दाम बढ जाते हैं। पर्यावरण को काफी नुकसान होता है। पीने का पानी महंगा बन जायेगा। इसलिए हम सब को –

  • जल को दूषित नहीं करना चाहिए।
  • ज़मीन में जल का स्तर बनाये रखना चाहिए।
  • पानी को बचाये रखना है।
  • जल संरक्षण करना चाहिए।
  • बरसात के पानी को इकट्टा करना चाहिए।
  • पानी के रख – रखाव के लिए तालाब आदि बनाना चाहिए।
  • पानी का इस्तेमाल कम से कम मात्रा में करना चाहिए।
  • स्वच्छ पानी का महत्व जानना चाहिए।
  • पानी को पानी की तरह नहीं बहाना चाहिए।

AP SSC 10th Class Hindi निबंध लेखन

35. पुस्तकें ज्ञान के भंडार हैं

प्रस्तावना :
पढ़ने के लिए जिस स्थान पर पुस्तकों का संग्रह होता है, उसे पुस्तकालय कहते हैं। भारत में मुम्बई, कलकत्ता , चेन्नै, दिल्ली, हैदाराबाद आदि शहरों में अच्छे पुस्तकालय हैं। तंजाऊर का सरस्वती ग्रंथालय अत्यंत महत्व का है। मानव जीवन में पुस्तकालय का अत्यंत महत्वपूर्ण स्थान है।

विषय विश्लेषण : पुस्तकालय चार प्रकार के हैं।

  1. व्यक्तिगत पुस्तकालय
  2. सार्वजनिक पुस्तकालय
  3. शिक्षा – संस्थाओं के पुस्तकालय
  4. चलते – फिरते पुस्तकालय

पुस्तकों को पढ़ने की रुचि तथा खरीदने की शक्ति रखनेवाले व्यक्तिगत पुस्तकालयों का संचालन करते हैं। इतिहास, पुराण, नाटक, कहानी, उपन्यास, जीवनचरित्र आदि सभी तरह के ग्रंथ सार्वजनिक पुस्तकालयों में मिलते हैं। इनमें सभी लोग अपनी पसंद की पुस्तकें पढ़ सकते हैं। नियत शुल्क देकर सदस्य होने पर पुस्तकें घर ले जा सकते हैं। शिक्षा संस्थाओं के पुस्तकालयों से केवल तत्संबंधी विद्यार्थी ही लाभ पा सकते हैं। देहातों तथा शहरों के विभिन्न प्रांतों के लोगों को पुस्तकें पहुँचाने में चलते – फिरते पुस्तकालय बहुत सहायक हैं। इनके नियमित रूप से पढ़ने से मनोरंजन के साथ – साथ ज्ञान – विज्ञान की भी वृद्धि होती है।

पुस्तकें पढ़ने से ये लाभ हैं :
इनके नियमित रूप से पढ़ने से मनोरंजन के साथ – साथ ज्ञान – विज्ञान की भी वृद्धि होती है।

  1. अशिक्षा दूर होती है।
  2. बुद्धि का विकास होता है।
  3. कुभावनाएँ दूर होती हैं।

विभिन्न देशों की सामाजिक, राजनीतिक, धार्मिक और आर्थिक परिस्थितियों का परिचय मिलता है।

उपसंहार :
पुस्तकालय हमारा सच्चा मित्र है। इसकी रक्षा करना हमारा कर्तव्य है। इसलिए पुस्तकों को गंदा करना, पन्ने फाडना नहीं चाहिए। अच्छी पुस्तकें सच्चे मित्र के समान हमारे जीवन भर काम आती है। ये सच्चे गुरु की तरह ज्ञान और मोक्ष दायक भी हैं।

36. विद्यार्थी जीवन में नैतिक शिक्षा

आजकल समाज में जहाँ देखो वहाँ नैतिक मूल्यों का पतन हो रहा है। देश के हर क्षेत्र में अर्थात् राजनीतिक, धार्मिक, सामाजिक क्षेत्र में भ्रष्टाचार, रिश्वतखोरी, अन्याय, अत्याचार, आदि दिखायी दे रहे हैं। इन सबका एक मात्र कारण है नैतिक मूल्यों का पतन एवं ह्रास।

प्राचीन ज़माने में पाठशाला शिक्षा में विद्यार्थियों के लिए नैतिक शिक्षा प्रदान की जाती थी, लेकिन आजकल विद्यार्थियों के लिए नैतिक शिक्षा का अभाव है। केवल यांत्रिक रूप से शिक्षा दी जा रही है। आजकल शिक्षा का उद्देश्य केवल अंक प्राप्त करना ही है।

नैतिक शिक्षा के कारण ही समाज में परोपकार की भावना, भाईचारे की भावना, आपसी सद्भावना, सहृदयता, उदारता, प्रेम, दया, ममता, समता, त्याग, इन्सानियत आदि भावनाएँ जागृत होंगे।

इसलिए विद्यार्थी जीवन में ही हर विद्यार्थी नैतिक शिक्षा को अपनाना चाहिए। सरकार को भी पाठशालाओं में नैतिक शिक्षा की प्रधानता देनी चाहिए। नैतिक शिक्षा से संबंधित पाठ्य प्रणाली बनानी चाहिए। हर सप्ताह में एक कालांश देकर नीति कहानियाँ और अनेक नैतिक विषयों को बनाना चाहिए। जिनसे विद्यार्थी उन्हें ग्रहण करके निज जीवन में भी नैतिक मूल्यों का पालन करेंगे। माँ – बाप की सेवा करेंगे। अतिथियों और गुरुजनों का आदर करेंगे।

37. आदर्श नेता

प्रस्तावना :
गाँधीजी भारत के सभी लोगों के लिए भी आदर्श नेता थे। उन्होंने लोगों को सादगी जीवन बिताने का उपदेश दिया। स्वयं आचरण में रखकर, हर कार्य उन्होंने दूसरों को मार्गदर्शन किया। नेहरू, पटेल आदि महान नेता उनके आदर्श पर ही चले हैं। महात्मा गाँधीजी मेरे अत्यंत प्रिय नेता हैं।

जीवन परिचय :
गाँधीजी का जन्म गुजरात के पोरबन्दर में हुआ। बैरिस्टर पढकर उन्होंने वकालत शुरू की। दक्षिण अफ्रीका में उनको जिन मुसीबतों का सामना करना पड़ा। उनके कारण वे आज़ादी की लड़ाई में कूद पडे। असहयोग आन्दोलन, नमक सत्याग्रह, भारत छोडो आदि आन्दोलनों के ज़रिए लोगों में जागरूकता लायी। अंग्रेजों के विरुद्ध लडने के लिए लोगों को तैयार किया। वे अहिंसावादी थे। समय का पालन करनेवाले महान पुरुषों में प्रमुख थे। उनके महान सत्याग्रहों से प्रभावित होकर अंग्रेज़ भारत छोडकर चले गये। अगस्त 15,1947 को भारत आज़ाद हुआ। महात्मा गाँधीजी के सतत प्रयत्न से यह संपन्न हुआ।

उपसंहार :
गाँधीजी की मृत्यु नाथुरां गाड्से के द्वारा 30 – 1 – 1948 को बिरला भवन में हुई। गाँधीजी का जीवन, चरित्र आदि का प्रभाव मेरे ऊपर पड़ा है। वे हमारे लिए आदर्श नेता ही नहीं, महान प्रिय नेता भी हैं।

38. मोबाइल फ़ोन

आजकल के यान्त्रिक युग में मानव को सुख – सुविधा प्रदान करनेवाले अनेक साधनों में ‘मोबाइल फ़ोन’ प्रमुख है। इसे सेलफ़ोन और हाथ फ़ोन भी बुलाया जाता है। यह बिना तारों के लंबी दूरी का इलेक्ट्रानिक उपकरण है। इसके ज़रिये विश्व के जिस देश में या प्रांत में स्थित लोगों से जब चाहे तब बोलने की सुविधा है। इसे विशेष स्टेशनों के नेटवर्क के आधार पर मोबाइलविशेष आवाज़ या डेटा संचार के लिए उपयोग करते हैं। वर्तमान मोबाइल फ़ोन में एस.एम.एस. इंटरनेट, रोमिंग, ब्लूटूथ, कैमरा, तस्वीरें, वीडियो भेजने और प्राप्त करने की अनेक सुविधाएँ हैं। हमारे भारत देश में सन् 1985 में दिल्ली में मोबाइल सेवाएँ आरंभ हुई हैं। मोबाइल फ़ोन के आविष्कार से देश और विदेशों की दूरी कम हुयी। यह सभी वर्गों के लिए बहुत उपयोगी सिद्ध हुआ है। इससे हमें समय, धन, तथा श्रम की बचत होती है। आपात् स्थिति में यह बहुत काम आनेवाला होता है।

इससे मिलनेवाली सुविधाएँ

  • हम इसे अपने साथ जहाँ चाहे वहाँ ले जा सकते हैं। सब आवश्यक खबरें प्राप्त कर सकते हैं।
  • दुर्घटनाओं के होने पर पुलिस व आंबुलेन्स को तुरंत बुला सकते हैं।
  • इसके ज़रिए मनोविनोद के लिए संगीत, गीत सुन सकते हैं और अनेक खेल खेल सकते हैं।
  • इसमें संगणक और फ़ोन बुक भी होते हैं।
  • सारे विश्व के लोगों से इंटरनेट द्वारा संबन्ध रख सकते हैं और बातचीत कर सकते हैं।
  • वीडियो कान्फरेन्स कर सकते हैं।
  • दोस्त और परिवारवालों से संपर्क कर सकते हैं।
  • बहुत काम कर सकते हैं। आये ई मेइल्स देख सकते हैं।
  • अपने पॉकेट में रखकर कहीं भी जा सकते हैं।
  • फ़ोन में स्थित कैमरा से चित्र निकाल सकते हैं। और उन्हें तुरंत भेज सकते हैं।

असुविधाएँ :
अनेक सुविधाओं के होने के बावजूद मोबाइल फ़ोन संबंधी अनेक असुविधाएँ भी हैं, वे हैं

  • मोबाइल फ़ोन कीमती होते हैं। अधिक समय सुनते रहने से सुनने की शक्ति घटती जाती है।
  • गाडी या मोटर कार आदि चलाते समय इसके उपयोग करने से अनेक दुर्घटनाएं हो सकती हैं।
  • बूढे और बड़े लोगों के लिए इस्तेमाल करने में धिक्कत हो सकती है।
  • मित्रों व परिवार के सदस्यों के साथ बातें करते ही रहने से अनेक आवश्यक काम बिगड सकते हैं।
  • कुर्ते और पतलून के पॉकेटों में रखने से रोगों के शिकार बनने की संभावना है।

इस तरह हम देखते हैं कि मोबाइल फ़ोन से अनेक सुविधाओं के मिलने पर भी कुछ असुविधाएँ भी हैं। अतः उसका इस्तेमाल सही रूप से करके अपने आवश्यक मुख्य कार्यों को संपन्न करना हमारा मुख्य कर्तव्य है।

AP SSC 10th Class Hindi निबंध लेखन

39. इंटरनेट से लाभ अथवा हानि

भूमिका :
आज का युग विज्ञान का युग है। वैज्ञानिक उपलब्धियों ने मानव जीवन को एक नयी दिशा प्रदान की है। इंटरनेट संचार का सबसे सरल, तेज़ और सस्ता माध्यम है। कम्प्यूटर के आविष्कार के कारण ही इंटरनेट अस्तित्व में आया। इसका प्रयोग साफ्टवेर माध्यम से किया जाता है। इसका जन्म दाता अमेरिका माना जाता है। इंटरनेट टेलीफोन की लाइनों, उपग्रहों और प्रकाशकीय केबुल द्वारा कम्प्यूटर से जुडा होता है। इसके द्वारा विश्व का समस्त जानकारी एक जगह से दूसरी पढी जा सकती है। इसकी विशेषताओं के कारण ही इसका प्रयोग दिन प्रतिदिन बढ रहा है।

विशेषताः
इंटरनेट तो ज्ञान का अतुलनीय भंडार है। इंटरनेट में संदेश ई – मेल के माध्यम से भेजा जाता है। इसमें विभिन्न लिखित पत्र, चित्र आदि होते हैं। सूचनाएँ एकत्र करने के लिए भी इसका इस्तेमाल किया जाता है। आज हम “इंटरनेट के माध्यम से हज़ारों वेब साईट देख सकते हैं।

लाभ :
इंटरनेट पर बहुत संभावनाएँ उपलब्ध हैं। खासकर छात्रों के लिए यह बहुत आवश्यक है। किसी भी क्षेत्र से जुडी आवश्यक जानकारी यहाँ से प्राप्त होती है। विभिन्न देशों में फैले अपने कार्यालयों का संज्ञालन एक ही जगह पर इंटरनेट के माध्यम से किया जा सकता है। इंटरनेट असीम सूचनाओं का भंडार, सस्ता, शीघ्रता से पहुँचनेवाला है और मनोरंजन से भरपूर है। नौकरियों की भी बहुत अच्छी संभावनाएँ इसमें मौजूद हैं।

हानि :
कुछ असमाजिक तत्वों द्वारा इंटरनेट का दुरूपयोग किया जा रहा है। कुछ लोग वायरस के द्वारा महत्वपूर्ण वेबसाइटों को नुकसान पहुँचाने का प्रयास कर रहे हैं। कम्प्यूटर को हैक करके महत्वपूर्ण जानकारियाँ प्राप्त करते हैं। कई हेकरों द्वारा बैंकों में सेंघ लगाई जाती है। यह देश की अर्थ व्यवस्था और उसकी सुरक्षा के लिए घातक सिद्ध हो सकती है। इस तरह के अपराधिक मामलों को निबटाने विभिन्न देश कार्यरत हैं।

उपसंहार :
कुछ साइबर क्रमों के होने पर भी इंटरनेट का महत्व घटता नहीं जा सकता है। आज के युग की । सबसे महत्वपूर्ण आवश्यकता है यह भारत में इसका प्रचार – प्रसार तीव्र गति से बढ रहा है।

40. बटा बचाआ – बटा पढाआ

बेटी बचाओ – बेटी पढ़ाओ एक नई योजना है। जो देश की बेटियों के लिए चलायी गयी है। बेटी बचाओ – बेटी पढ़ाओ योजना का उद्घोष स्वयं प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने 22 जनवरी 2015 को पानीपत हरियाणा में किया।

भारत देश में जन संख्या तो बड़ी तादात में फैल रही है। लेकिन दुर्भाग्य की बात है कि इस बढ़ती हुई जनसंख्या में लडकियों का अनुपात कम होता जा रहा है। वर्ष 2001 में की गयी गणना के अनुसार प्रति 1000 लडकों में 927 लडकियाँ थी जो आंकडागिरकर 2011 में 918 हो गया।

आधुनिकीकरण के साथ – साथ जहाँ विचारों में भी आधुनिकता आनी चाहिए वहाँ इस तरह के अपराध बढ़ रहे हैं। आगर इसी तरह वर्ष दर वर्ष लडकियों की संख्या होती रही तो एक दिन देश अपने आप ही नष्ट होने की स्थिति में होगा।

कन्या भ्रूण हत्या को रोकना, बेटियों की सुरक्षा के लिए इस योजना को शुरू किया गया है। आये दिन छेड़-छाड बलात्कार जैसे घिनौने अपराध बढ़ रहे हैं। इनको भी नियंत्रित करने हेतु इस योजना को शुरु किया गया है।

41. राष्ट्रीय एकता

प्रस्तावना :
किसी भी देश की उन्नति के लिए देश में बसे रहे नागरिकों में राष्ट्रीय एकता की भावना कूट कूटकर भरी होनी चाहिए। राष्ट्रीय एकता का मतलब यह है कि भारत के अलग – अलग जगहों में रहनेवाले और अलग – अलग धर्मों का अनुसरण करनेवाले लोग आपस में मिलजुलकर रहना।

विषय विस्तार :
किसी देश में या वहाँ के लोगों में राष्ट्रीय एकता की कमी होगी तो लोगों के बीच सहयोग की भावना नहीं रहेगी। सभी लोग एक-दूसरे से लडेंगे, भ्रष्टाचार करेंगे और एक-दूसरे का नुकसान करने में लगे रहेंगे। इससे लोगों को ही नहीं। देश को भी नुकसान होगा। जब लोगों के बीच राष्ट्रीय एकता की भावना होगी तो वह एक-दूसरे का सम्मान करेंगे और लोग मिलकर काम करेंगे और एक-दूसरे की मदद भी करेंगे।

राष्ट्रीय एकता से लाभ :
राष्ट्रीय एकता की वजह से ही गरीब लोगों को अच्छी शिक्षा और विभिन्न तरह का मदद मिल सकता है। इसके कारण पूरे समाज का विकास हो सकता है। राष्ट्रीय एकता के कारण देश के हर क्षेत्र में विकास संभव है। अगर राष्ट्रीय एकता मज़बूत हो तो देश के सारे संसाधन राष्ट्रीय विकास की ओर लगेगा। लोगों के बीच सम्मान की भावना बढ़ेगी और एक-दूसरे के प्रति प्रेम और सहयोग की भावना बढ़ेगी। हमारे देश में भारत की लोह पुरुष कहे जानेवाले सरदार वल्लभ भाई पटेल के जन्म दिवस के उपलक्ष्य में राष्ट्रीय एकता दिवस मनाया जाता है।

सरदार वल्लभ भाई पटेल द्वारा देश को हमेशा एकजुट करने के लिए अनेक प्रयास किये गये। इन्हीं के कार्यों को याद करते हुये उन्हें श्रद्धांजलि अर्पित करने के लिए इस दिन को राष्ट्रीय एकता दिवस के रूप में मनाने का फैसला किया गया।

उपसंहार :
अनेकता में एकता यही भारत की विशेषता है। “अमरावती हो या अमृतसर सारा देश अपना घर’ मानकर “भिन्न भाषा, भिन्न वेश-भारत हमारा एक देश” कहते हुये देश की एकता के लिए हम सब को मिलकर काम करना जरूरी है।

AP SSC 10th Class Hindi निबंध लेखन

42. राष्ट्रभाषा हिंदी का महत्व

राष्ट्रभाषा हिंदी का महत्व :
यह हम सभी जानते हैं कि अनुच्छेद 343 (1) के तहत हिन्दी को 14 सितंबर, 1949 को राजभाषा के रूप में गौरवान्वित किया है। तब से हम हर वर्ष से 14 सितंबर को हिन्दी दिवस मनाते हैं।

भारत के अलग – अलग प्रांतों में अलग – अलग भाषाएँ बोली जाती हैं। हमें भारत के सभी प्रांतों से जुडने के लिए एक भाषा की आवश्यकता होती है। सारे भारतवासी जानते हैं कि वैसी भाषा हिन्दी है जो सारे भारतीयों को एकता के सूत्र में बाँधती है। आज केवल न भारत में बल्कि भारत के अलावा बंग्लादेश, नेपाल, म्यांमार, भूटान, फिज़ी, गुयाना, सूरीनाम, त्रिनिडाड एवं टुबेगो, दक्षिण अफ्रिका, बहरीन, कुवैत, ओमान, कत्तर, सौदी अरब गणराज्य, श्रीलंका, अमेरिका, इंग्लैंड, जर्मनी, जापान मॉरिशस, ऑस्ट्रेलिया आदि देशों में हिन्दी की माँग बढती ही जा रही है। विदेशों में भी हिन्दी की रचनाएँ लिखी जा रही है। जिसमें वहाँ के साहित्यकारों का भी विशेष योगदान है। विदेशों में भारतीयों से आपसी व्यवहार का भी विशेष योगदान है। विदेश भारतीयों से आपसी व्यवहार करने के लिए वहाँ के लोग भी हिन्दी सीख रहे हैं। इस तरह हिन्दी की माँग विश्व भर में बढती जा रही है। इसलिए विदेशी संस्थाएँ भी हिन्दी के प्रचार- प्रसार में जुट गई है।

पाँच नारे :

  • हिंदी है देश की भाषा, हिंदी सबसे उत्तम भाषा।
  • हिंदी का सम्मान , राष्ट्र का सम्मान।
  • हिंदी जोड़ने वाली भाषा है, तोड़ने वाली नहीं।
  • हिंदी हमारी शान है, देश का मान है।
  • हिंदी हैं हम, हिंदुस्तान हैं हमारा।

43. खेलों का महत्व

भूमिका :
स्वस्थ शरीर में स्वस्थ मस्तिष्क का निवास होता है। स्वस्थ शरीर के लिए खेलकूद की ज़रूरत है। हमारे गाँवों में बच्चे कबड्डी खेलते हैं। इस खेल के लिए पैसों का खर्चा नहीं होता। इसके अतिरिक्त इसे खेलने से अच्छा व्यायाम होता है। आजकल क्रिकेट लोकप्रिय खेल है। इसी प्रकार हॉकी, फुटबॉल, वालीबॉल आदि खेले जाते हैं। ये खर्चीले हैं। हाईजम्प, लान्ग जम्प, दौड़ना आदि से भी अच्छा व्यायाम होता है।
खेलकूद से अनेक लाभ हैं :

  • सहयोग की भावना बढ़ती है।
  • आत्मनिर्भरता बढ़ती है।
  • अनुशासन की वृद्धि होती है।
  • कर्तव्य-भावना बढ़ती है।
  • स्वास्थ्य लाभ होता है।
  • मनोरंजन होता है।

इसलिए विद्यार्थियों को खेलकूद में भाग लेना चाहिए। खासकर पाठशाला में खेलों का अधिक महत्व होता है।

उपसंहार :
खेल सारी दुनियाँ में व्याप्त हो गये हैं। इनसे तन्दुरुस्ती के साथ सुख जीवन संभव है। बच्चों को इसका महत्व जानकर तरह-तरह के खेल खेलने चाहिए। आज कल अच्छे खिलाडियों को इज्ज़त के साथ धन भी प्राप्त हो रहा है। इन सभी कारणों से हमारे जीवन में खेलकूद का अत्यंत महत्व होता है।

AP SSC 10th Class Hindi पत्र लेखन

AP State Board Syllabus AP SSC 10th Class Hindi Textbook Solutions पत्र लेखन Questions and Answers.

AP State Syllabus SSC 10th Class Hindi पत्र लेखन

1. चार दिन की छुट्टी माँगते हुए कक्षाध्यापक के नाम पत्र लिखिए।
उत्तर:

स्थान : ……….
दि. xxxxx

सेवा में
कक्षाध्यापक जी,
सरकारी उन्नत पाठशाला,
स्थान : …………
महोदय,

मैं दसवीं कक्षा, अ – कक्ष्य में पढनेवाला छात्र हूँ। मेरी क्रम संख्या : ……. है। मेरे बडे भाई का विवाह …… दिनांक को होनेवाला है। घर पर सगे – संबंधी आए हुए हैं। मुझे पिताजी की सहायता करनी है। इसलिए कृपया मुझे चार दिन ……….. से ……… तक छुट्टी देने की कृपा कीजिए।
धन्यवाद।

आपका विनम्र छात्र,
x x x x x

2. जिला शिक्षा अधिकारी को पत्र लिखकर बताइए कि विद्यालय आरंभ में सारे पुस्तकें पाठशाला को पहुँच गई है। इस पर बधाई और प्रशंसा करते हुए पत्र लिखिए ।
उत्तर:

प्रशंसा पत्र

विजयवाडा,
दि. xxxxx

प्रेषक :
नाम : xxxxx
कक्षा : xxxxx
पाठशाला का नाम : xxxxx
सेवा में,
पिला शिक्षा अधिकारी,
कृष्णा जिला,
मान्य महोदय,
आप से विनम्र निवेदन है – कि गत वर्ष कि तुलना में इस वर्ष हमारे पाठशाला को पाठ्य पुस्तकें मार्च के महीने में ही आगये हैं । इससे हम सब छात्र – छात्राएँ बेहद खुश हैं । आपको बधाई देना चाहते हैं कि – आप हम बच्चों के लिए अधिक श्रम करके, कठिनाईयों को सहकर भी हमारे लिए पाठ्य पुस्तकों का प्रबंध सही समय पर किये हैं।
इस श्रेष्ठ कार्य के लिए हम सब आपके आभारी व्यक्त करते हैं ।

आपका विश्वास भाजन
नाम : xxxxx
कक्षा : xxxxx
पाठशाला का नाम : xxxxx

AP SSC 10th Class Hindi पत्र लेखन

3. तुम अपने साथियों के साथ उल्लास यात्रा पर जाना चाहते हो। अपने पिताजी को पत्र लिखकर पाँच सौ रुपये मँगाओ और अनुमति माँगो।
उत्तर:

विजयवाडा,
दि. xxxxx

पूज्य पिताजी,
सादर प्रणाम,

मैं यहाँ कुशल हूँ। आशा है कि वहाँ आप कुशल हैं। मैं अच्छी तरह पढ़ रहा हूँ।

अगले सप्ताह हमारी कक्षा के सभी विद्यार्थी तिरुपति की विहार यात्रा करनेवाले हैं। हमारे दो अध्यापक भी साथ आ रहे हैं। हम बालाजी के दर्शन करने के बाद मद्रास भी जाना चाहते हैं। मैं भी आपकी अनुमति पाकर उनके साथ जाना चाहता हूँ। इसलिए पाँच सौ रुपये एम.ओ. करने की कृपा कीजिए। माताजी को मेरे प्रणाम। जल्दी अनुमति प्रदान करें।

आपका प्रिय पुत्र,
xxxxx

पता:
ए. रामाराव,
डो. नं. 9-1 – 132,
जगन्नाथपुरम,
काकिनाडा, पू.गो. जिला

4. मित्र के कक्षा में प्रथम स्थान प्राप्त करने पर उसे बधाई – पत्र लिखिए।
उत्तर:

तेनाली,
दि: x x x x x

प्रिय मित्र दिनेश,
सप्रेम नमस्ते।

कल तुम्हारा पत्र मिला। पढ़कर मन खुशी से उछल पड़ा। मुझे तुम पर पूर्ण विश्वास था कि तुम कक्षा में प्रथम आओगे लेकिन तुमने पूरे विद्यालय में प्रथम स्थान प्राप्त कर मेरी प्रसन्नता चौगुनी बढ़ा दी है। मेरे हर्ष की कोई सीमा नहीं है। मेरी हार्दिक बधाई स्वीकार करो। तुम्हारी इस उपलब्धि ने मेरा सिर गौरव से ऊँचा कर दिया है। ईश्वर करे तुम्हे इसी तरह जीवन की प्रत्येक परीक्षा में प्रथम स्थान प्राप्त करने का सौभाग्य मिलता रहे। एक बार फिर हार्दिक बधाई स्वीकार करो। अपने माता – पिता को मेरा सादर प्रण कहना न भूलना।

तुम्हारा प्रिय मित्र
x x x x

5. आपके यहाँ दशहरे का उत्सव धूमधाम से मनाया जाता है। मित्र को अपने यहाँ आने का निमंत्रण देते हुए पत्र लिखिए।
उत्तर:

विजयवाडा,
दि. x x x x x

प्रिय मित्र प्रसाद,

मैं यहाँ कुशल हूँ। एक हफ्ते के पहले मैं दशहरे की छुट्टियाँ बिताने यहाँ आया। यहाँ दशहरा त्यौहार बड़े धूमधाम से मनाया जाता है। यहाँ का कनकदुर्गा मंदिर प्रसिद्ध है। हर रोज़ माँ कनकदुर्गा के नये – नये अलंकरण किये जाते हैं। दशहरे के समय दूर – दूर से कई श्रद्धालु भक्त आते हैं। वे कृष्णा नदी में स्नान करते हैं। दुर्गा माता के दर्शन करते हैं। रात के समय मंदिर बत्तियों से सजाया जाता है। उस समय की शोभा देखने लायक होती है।

विजयवाडे में गाँधी पहाड पर प्लॉनेटोरियम भी है। तुम दशहरे की छुट्टियों में यहाँ आओ। हम दोनों बड़े आनंद के साथ, समय बिता सकेंगे।

तुम्हारा,
x x x x x

पता:
पी. प्रसादराव,
दसवीं कक्षा (बी),
जिला परिषद हाई स्कूल,
गाँधीनगर, श्रीकाकुलमा

AP SSC 10th Class Hindi पत्र लेखन

6. अपने मित्र को पत्र लिखकर आपके देखे हुए किसी भी मैच का वर्णन कीजिए।
उत्तर:

विजयवाडा,
दि. x x x x x

प्रिय मित्र श्रीनु।

मैं यहाँ कुशल हूँ। तुम भी कुशल होंगे। वार्षिक परीक्षा के लिए अच्छी तैयारी कर रहा हूँ। तुम्हारी पढाई कैसी चल रही है? मैं ने कल ही यहाँ एक क्रिकेट मैच देखा था। उसका वर्णन कर रहा हूँ।

इंदिरा गाँधी स्टेडियम में एक दिन का अंतर्राष्ट्रीय क्रिकेट मैच चला। उसे देखने हज़ारों लोग आये थे। मैं अपने मित्रों के साथ मैच देखने गया।

ऑस्ट्रेलिया और इंडिया के बीच खेल चला। भोजन विराम तक खेल बहुत अच्छा था। खिलाडी एक से बढकर एक निपुण थे। विराट कोह्ली हमारे देश के कप्तान थे। उन्होंने सिक्का उछालकर खेल शुरू किया। उन्होंने दो ओवर में बारह रन करके लोगों को चकित कर दिया। पचास रन के बाद वे आऊट हो गये।। दिनेश कार्तिक पूरे चार सिक्सर मारकर आगे बढे। पैंसठ रन करके आऊट हो गये। इंडिया ने तीन विकेट खोकर 216 रन बनाए। भोजन विराम के बाद ऑस्ट्रेलिया ने खेल शुरू किया। शाम के साढे पाँच बजे तक सबके सब खिलाडी आऊट हो गये। वे केवल दो सौ रन कर सकें। इस तरह भारत की जीत हुई। मैं खुशी से घर वापस आया।

तुम भी अपने देखे किसी खेल का वर्णन करते हुए पत्र लिखना। माता – पिता को मेरा नमस्कार कहना। पत्र की प्रतीक्षा में।

तुम्हारा प्रिय मित्र,
x x x x x x

पता :
आर. सुदर्शन,
दसवीं कक्षा,
जि.प. हाई स्कूल, काकिनाडा।

7. बीमार मित्र से मिलने जाने के लिए विद्यालय से एक दिन की छुट्टी चाहिए। वर्ग – अध्यापक को पत्र लिखकर प्रार्थना कीजिए।
उत्तर:

तेनालि,
दि. x x x x x

सेवा में,
श्री वर्ग – अध्यापक,
दसवीं कक्षा ‘ए’
श्री सिद्धार्था हाईस्कूल,
तेनालि, (पू.गो. जिला)
पूज्य अध्यापक महोदय,

सादर प्रणाम,

सेवा में निवेदन है कि मेरे मित्र सुधाकर कल दोपहर से बहुत बीमार है। मुझे ज्ञात हुआ कि अस्पताल में भर्ती किया गया है। उसे मिलने अमलापुरम जाना है। अतः दि. x x x x x को एक दिन की छुट्टी देने की कृपा करें। आशा करता हूँ कि ज़रूर मंजूर करेंगे।
सधन्यवाद।

आपका विनम्र छात्र,
x x x xx
दसवीं कक्षा ‘ए’

8. अपने मित्र को पत्र लिखिए। अपने देखे हुए प्रदर्शिनी का वर्णन कीजिए।
उत्तर:

विजयवाडा,
दि. x x x x x

प्रिय मित्र रमेश,

मैं यहाँ कुशल हूँ। तुम भी वहाँ कुशल होगे। मैं अच्छी तरह पढ़ रहा हूँ। मैं ने विजयवाडे में एक बडी प्रदर्शिनी देखी है। इसमें केन्द्र और राज्य सरकार संबंधी औद्योगिक उन्नति दिखाने के लिए प्रदर्शिनी चली है। लोग हज़ारों की संख्या में देखने आये हैं। मैं भी देखने गया। रात के समय बिजली की बत्तियाँ चकाचौंध करती हैं। यहाँ मनोरंजन के कई साधन हैं। बडा झूला, बच्चों की रेल गाडी, मोटर कार, ऊँट की सवारी, घुडसवार, चक्कर काटनेवाला हवाई – जहाज़ आदि हैं। कपडे की दूकानें और खिलौनौ की दूकानें भी हैं। लोग यहाँ से तरह – तरह की चीजें खरीदकर ले जा रहे हैं। कभी तुम भी पत्र लिखा करो। माता – पिता को मेरे प्रणाम।

तुम्हारा प्रिय मित्र,
xxxxx

पता:
जे. रमेश,
दसवीं कक्षा,
जि.प्र.प. हाई स्कूल,
विजयनगरम।

9. अपने मित्र को पत्र लिखकर अपनी भावी योजनाओं के बारे में लिखिए।
उत्तर:

अमलापुरम,
दि. x x x x x

प्यारी लक्ष्मी,

मैं यहाँ कुशल हूँ। आशा है तुम भी वहाँ सकुशल हो। मैं यहाँ अच्छी तरह पढ़ रही हूँ। आशा करती हूँ कि प्रथम श्रेणी आएगी। बाद में कॉलेज में भर्ती होकर पढ़ना चाहती हूँ। अध्यापिका बनकर पाठ पढ़ाने की मेरी इच्छा है। अध्यापन कार्य भी एक सेवा कार्य है। इसके द्वारा समाज अवश्य सुधर सकता है। तुम्हारे पत्र की प्रतीक्षा में।

तुम्हारी सहेली,
x x x x x

पता :
के. लक्ष्मी,
गाँधी नगर,
विजयवाडा – 3

10. अपने मित्र को पोंगल की छुट्टियों में आने का आमंत्रण देते हुए पत्र लिखिए।
उत्तर:

चेन्नई,
दि. x x x x x

प्रिय मित्र,

मैं यहाँ कुशल हूँ। आशा करता हूँ कि तुम भी वहाँ कुशल हो। अगले हफ्ते से हमारी पोंगल की छुट्टियाँ शुरू हो जायेंगी। मैं इस पत्र के द्वारा मुख्य रूप से तुम्हें आमंत्रित कर रहा हूँ। हमारे नगर में पोंगल का उत्सव बडे धूमधाम से मनाया जायेगा। यहाँ विशेष मेला और सांस्कृतिक कार्यक्रमों का आयोजन होगा। यहाँ नहीं हमारे नगर में देखने लायक स्थान अनेक हैं। इसलिए तुम ज़रूर आना।

तुम्हारे माँ – बाप से मेरे प्रणाम कहो। तुम्हारे भाई को मेरे आशीर्वाद कहना । तेरे आगमन की प्रतीक्षा करता हूँ।

तुम्हारा प्रिय मित्र,
x x x x x

पता :
आर. सुरेश कुमार,
दसवीं कक्षा ‘डी’,
नलन्दा विद्यालय,
एन. आर. पेटा, गूडूरु।

11. अपने मित्र को पत्र लिखकर आपने ग्रीष्मकाल की छुट्टियाँ कैसे बितायीं इसके संबन्ध में बताइए।
उत्तर:

भीमवरम,
दि. x x x x x

प्रिय मित्र मोहन,

मैं यहाँ कुशल हूँ। गर्मी की छुट्टियाँ मैं ने कैसे बितायीं? अब तुम को बता रहा हूँ।

परीक्षाओं के बाद मैं ने विजयवाडे में ही एक सप्ताह तक आराम किया। गुंटूर और एलूरु में हमारे रिश्तेदार हैं। उनके यहाँ मैं ने दस दिन बिताये। मेरे भाई हैदराबाद में सचिवालय में काम करते हैं। मैं उनके यहाँ गया। बाकी छुट्टियाँ मैं ने वहीं बितायीं। हैदराबाद एक बडा नगर है। वह शिक्षा, संस्कृति तथा वाणिज्य का बडा केंद्र है। यहाँ अनेक विश्वविद्यालय हैं। मैं ने सालारजंग म्यूज़ियम्, बिरला मंदिर, नेहरू जुआलाजिकल पार्क, गोलकोंडा किला आदि देखें।

यहाँ मैं ने बडे आनंद के साथ समय बिताया। इसे मैं कभी नहीं भूल सकता। तुमने छुट्टियाँ कैसे बितायीं? तुरंत पत्र लिखो।

तुम्हारा प्रिय मित्र,
x x x x

पता :
यन. मोहन राव,
एन. अप्पाराव का पुत्र,
ट्राक्टर मेकानिक,
सत्तेनपल्लि।

AP SSC 10th Class Hindi पत्र लेखन

12. “दशहरे’ का महत्व बताते हुए छोटे भाई को पत्र लिखिए।
उत्तर:

विजयवाडा,
दि. x x x x x

प्रिय भाई श्रीकर,
आशिष

मैं यहाँ कुशल हूँ। आशा है कि आप सब सकुशल हैं। एक हफ्ते के पहले मैं दशहरे की छुट्टियाँ बिताने यहाँ आया। यहाँ ‘दशहरा’ बडे धूमधाम से मनाया जाता है। यहाँ का कनकदुर्गा मंदिर प्रसिद्ध है। हर रोज़ कनकदुर्गा के नये – नये अलंकार किये जाते हैं। दशहरे के समय दूर – दूर से कई यात्री आते हैं। वे कृष्णा नदी में स्नान करते हैं। दुर्गा माता का दर्शन करते हैं। रात के समय मंदिर रंग बिरंगे विद्युत दीपों से सजाया जाता है। उस समय की शोभा निराली होती है।

विजयवाडे में गाँधी पहाड पर नक्षत्रशाला भी है। तुम दशहरे की छुट्टियों में यहाँ आओ। हम दोनों बडे आनंद के साथ समय बिता सकेंगे। माता – पिता को मेरे प्रणाम कहना | पत्र की प्रतीक्षा में।

तुम्हारा बड़ा भाई,
x x x x x

पता :
चिरंजीवि श्रीकर,
दसवीं कक्षा,
एस.एस. हाई स्कूल,
आलमूरु, पू.गो. जिला।

13. बीमार बहन को धीरज बंधाते हुए पत्र लिखिए।
उत्तर:

अमलापुरम,
दि. xxxxx

प्यारी बहन सुशी को,

आशीर्वाद।

मैं यहाँ अच्छी तरह पढ़ रहा हूँ। आज ही घर से पत्र आया है कि तुम्हारी तबीयत ठीक नहीं है। अस्पताल में पाँच दिन रहकर घर आयी हो। इस समाचार से मैं दुखी हूँ! लेकिन क्या करेंगे? जीवन में सुख – दुख को समान रूप से भोगना पडता है। तुम समय पर दवा लेने से और डॉक्टर साहब के कहने के अनुसार नियम पालन करने से जल्दी ही चंगी हो जाओगी। स्वस्थ होकर जल्दी स्कूल जाओगी। इसकी चिंता न करना। खुशी से रहो। तुम्हारी बीमारी दूर हो जोएगी। माँ – बाप को प्रणाम। छोटे बाई को प्यार।

तुम्हारा बड़ा भाई,
x x x x x

पता :
श्री. सुशी,
पिता. पि. रामय्या जी,
गाँधीनगर,
काकिनाडा।

14. संक्रांति का महत्व बताते हुए छोटी बहन को पत्र लिखिए।
उत्तर:

राजमहेंद्रवरम,
दि. x x x x x

प्यारी छोटी बहन सरिता,

आशीर्वाद।

कल तुम्हारा पत्र मिला। मुझे बडी खुशी हुई। वहाँ सब कुशल समझता हूँ। तुमने संक्रांति के बारे में जानने की इच्छा प्रकट की है। मैं यहाँ उसका महत्व तुम्हें समझाती हूँ।

संक्रांति हमारा एक बडा त्यौहार है। यह तीन दिनों का त्यौहार है। पहले दिन को भोगी कहते हैं। दूसरे दिन संक्रांति और तीसरे दिन को कनुमा कहते हैं। यह त्यौहार हर जनवरी महीने में आता है। इस सिलसिले में सभी बन्धु लोग अपने घर आते हैं। पकवान बनाते हैं। नये कपडे पहनते हैं। किसान लोग अनाज घर लाते हैं। गायों, बैलों और हलों की पूजा करते हैं। सारे गाँव में कोलाहल सा बना रहता है। मुर्गों की होड, भेडियों की भिडाई आदि होते हैं। सब लोग आनंद – प्रमोद के साथ त्यौहार मनाते हैं।

माता – पिता से मेरे प्रणाम कहना। उत्तर की प्रतीक्षा में –

तुम्हारी बड़ी बहन,
x x x x

पता:
के. सरिता,
पिता – रामाराव,
2-3/127, बंदर रोड,
गुडिवाडा।

15. अपनी पाठशाला के वार्षिकोत्सव का वर्णन करते हुए अपने मित्र के नाम पर पत्र लिखो।
उत्तर:

मानेपल्ली,
x x x x

प्रिय मित्र रामु,

मैं यहाँ कुशल हूँ! समझता हूँ तुम वहाँ कुशल रहे हो। तुम्हारे यहाँ से पत्र पाकर कई दिन हो गये हैं। इस पत्र के मिलते ही जवाब लिखना।

हमारी पाठशाला में दि. x x x x और दि. x x x x को वार्षिकोत्सव मनाया गया है। उसके बारे में पत्र में लिख रहा हूँ।

वार्षिकोत्सव के पहले दिन शाम को सार्वजनिक सभा हुई। उसमें हमारे नगर के नगर पालिका के मेयर और अन्य गण्यमान्य लोग पधारे हैं। हमारे प्रधानाध्यापक जी ने उनका स्वागत और सम्मान किया । मेयर ने अपने भाषण में छात्रों को अच्छी तरह पढ़कर, सुनागरिक बनने का संदेश दिया। प्रधानाध्यापक जी ने छात्रों को पुरस्कार दिलवा दिये। सभा के विसर्जित होने के बाद छात्रों ने नाटक नाटिकाओं का प्रदर्शन दिया। गीत और संगीत का आयोजन हुआ। रात दस बजे सभा का समापन राष्ट्रगान के साथ हुआ।

दूसरे दिन शाम को शारीरिक विन्यासों का प्रदर्शन हुआ। स्थानीय MLA यम यल ए महोदय जी ने अध्यक्ष का आसन ग्रहण किया। वन्देमातरम गीत से सभा का आरंभ हुआ। मुख्य अतिथि महोदय ने छात्रों से अनुशासन का पालन करने का, उसके ज़रिए जीवन में उन्नति पाने का संदेश दिया। रात नौ बजे सभा की समाप्ति हुयी।

तुम भी अपनी पाठशाला में मनाये गये वार्षिकोत्सव का वर्णन करते हुए पत्र ज़रूर लिखो। तुम्हारे माता – पिता से मेरे प्रणाम कहना।

तुम्हारा प्यारा दोस्त,
x x x x

पता :
आर. रामु,
दसवीं कक्षा,
कार्पोरेशन हाई स्कूल,
गुन्टूरु।

AP SSC 10th Class Hindi पत्र लेखन

16. अपने भाई की शादी में शामिल होने के लिए अनुमति माँगते हुए अपने कक्षाध्यापक के नाम पत्र लिखिए।
उत्तर:

विजयवाडा,
दि. x x x x x

प्रेषक :
क्र. सं. xxxx
दसवीं कक्षा,
शारदा हाई स्कूल,
विजयवाडा।

पूज्य महोदय,

सादर प्रणाम। सेवा में निवेदन है कि मेरे भाई की शादी कल तिरुमला में होनेवाली है। मैं भी उस शादी में शामिल होना चाहता हूँ। इसलिए आपसे विनती है कि मुझे शादी में जाने की अनुमति दीजिए।

सधन्यवाद,

आपका आज्ञाकारी छात्र,
क्र.सं. x x x.
दसवीं बी.

17. नौकरी के लिए आवेदन – पत्र
उत्तर:

गुंटूर
दि: x x x x x

प्रेषक
आलोक कुमार गुप्ता,
18/16 जेम्स स्ट्रीट,
गुंटूर।
सेवा में,
प्रधानाचार्य जी,
डि.ए.वी हाई स्कूल,
गुंटूर।

महोदय,

विषय : आपके द्वारा ‘स्वतंत्र वार्ता’ में प्रकाशित विज्ञापन के प्रत्युत्तर में हिंदी अध्यापक के पद हेतु अपना आवेदन – पत्र भेज रहा हूँ। मेरा व्यक्तिगत विवरण निम्नलिखित है ।
नाम : ……………
पिता का नाम : …………
जन्म तिथि : ……………….
शैक्षणिक योग्यता : ………..

  1. मैंने माध्यमिक शिक्षा बोर्ड से दसवीं की परीक्षा में 72% अंक प्राप्तकर उत्तीर्ण की है।
  2. माध्यमिक शिक्षा बोर्ड से बारहवीं की परीक्षा में 76% अंक प्राप्तकर उत्तीर्ण की है।
  3. उस्मानिया विश्वविद्यालय से बी.ए. की परीक्षा में 72% अंक प्राप्त कर उत्तीर्ण की है।
  4. आइ.ए.एस.ई (IASE) से बी.एड की परीक्षा में 75% अंक प्राप्त कर उत्तीर्ण की है।

मैं आपको विश्वास दिलाता हूँ कि यदि आपकी चयन समिति ने मुझे यह अवसर प्रदान किया तो निश्चित ही मैं आपकी उम्मीदों पर खरा उतरूँगा और अपनी पूरी निष्ठा व लगन के साथ काम करूँगा।

धन्यवाद सहित।

भवदीय
आलोक कुमार गुप्ता
पता : x x x x

18. तुम्हारी साइकिल चोरी हो गयी। थानेदार के नाम शिकायती पत्र लिखिए।
उत्तर:

विजयवाडा,
दि. x x x x x

प्रेषक :
दसवीं कक्षा,
सी.वी. आर. जी. एम. हैस्कूल,
विजयवाडा।
सेवा में,
श्री सब इन्स्पेक्टर साहब | श्री थानेदार जी,
टू टाउन पुलिस थाना,
विजयवाडा।

पूज्य महोदय,

निवेदन है कि कल शाम मैं अपनी साइकिल “नवोदया बुक स्टाल” के सामने रखकर, किताब खरीदने अंदर गया। मैं उसे ताला लगाना भूल गया। किताब खरीदकर बाहर आकर देखा तो वहाँ मेरी साइकिल नहीं थी। मैं ने इधर -उधर पूछताछ की। लेकिन उसका पता नहीं चला। मैं ने उसे पिछले महीने में ही खरीदी है। वह काले रंग की और हीरो कंपनी की है। उसका नंबर 2114623 है।

मैं एक गरीब छात्र हूँ। इसलिए आप उसका पता लगाकर मुझे दिलवाने की कृपा करें।

धन्यवाद,

आपका विश्वसनीय,
दसवीं कक्षा,
x x x x x,

पता :
श्री सब इन्स्पेक्टर साहब /श्री थानेदार जी,
टू टाउन पुलिस थाना,
विजयवाडा।

AP SSC 10th Class Hindi पत्र लेखन

19. जन्मदिन मनाने के लिये पैसे माँगते हुए अपने पिता के नाम पर एक पत्र लिखिए|
उत्तर:

विजयवाडा,
x x x x x

पूज्य पिताजी,

सादर नमस्कार। मैं यहाँ कुशल हूँ और आशा करता हूँ कि आप सब वहाँ सकुशल हैं।

मेरी पढाई अच्छी चल रही है। सारी परीक्षाओं में मुझे ही प्रथम स्थान मिल रहा है। मेरी तबीयत भी ठीक है। इस महीने में (15 तारीख) मेरा जन्म दिन है। मित्रों से मिलकर जन्म दिन मनाना चाहता हूँ। अतः ₹ 500 मुझे यथाशीघ्र भेजने की कृपा करें।

माताजी को मेरे प्रणाम और बहन गीतिका को मेरे आशीश कहना।

आपना आज्ञाकारी पुत्र,
x x x x

पता :
जी. मोहन राव,
घ.न. 1-3-16/4,
मासिसपेट,
तेनालि।

20. पुस्तकें खरीदने के लिए रुपये माँगते हुए अपने पिताजी के नाम पत्र लिखिए।
(या)
परीक्षा शुल्क चुकाकर, कुछ पुस्तकें खरीदने के लिए पैसे माँगते हुए पिताजी को पत्र लिखिए।
उत्तर:

विजयवाडा,
x x x x x

पूज्य पिताजी, सादर प्रणाम,

मैं यहाँ कुशल हूँ। आशा करता हूँ कि आप सब वहाँ सकुशल हो। मैं अच्छी तरह पढ रहा हूँ। परीक्षाएँ अच्छी तरह लिख रहा हूँ। अच्छे अंक भी मिलेंगे। मुझे यहाँ कुछ आवश्यक किताबें खरीदनी है। इसलिए पत्र पाते ही ₹ 500 एम.ओ. करने की कृपा कीजिए। माताजी को मेरे प्रणाम कहना। भाई राजेश को आशीशा

आपका आज्ञाकारी पुत्र,
x x x x

पता :
वी. माधवराव,
घ.नं. 3-18-74/6,
मंदिरवीधि, तिरुपति।

21. हिन्दी सीखने की आवश्यकता के बारे में छोटे भाई के नाम पर पत्र लिखिए|
उत्तर:

विजयवाडा,
दि. x x x x x

प्रिय छोटा भाई सुरेश कुमार,

तुम्हारा पत्र पाकर मैं बहुत खुश हुआ। मैं अगली फरवरी में हिन्दी विशारद परीक्षा देने की तैयारी कर रहा हूँ। हिन्दी भाषा सीखने में बहुत आसान है। यह भारत की राष्ट्रभाषा है। देश भर में असंख्य लोग यह भाषा समझते और बोलते हैं। इसलिए तुमसे मेरा अनुरोध है कि तुम भी हिन्दी सीख लो, क्योंकि हिन्दी हमारी राष्ट्रभाषा और राजभाषा है। हिन्दी भाषा के सीखने से भारत के सभी लोगों से अच्छी तरह बातचीत कर सकते हैं।

तुम्हारा भाई
x x x x

पता :
सुरेश कुमार, पी.
पी. नारायण का पुत्र,
घ.न. 4-12-8
ब्राडीपेट, गुंटूरु।

22. बीमारी (बुखार) के कारण पाँच दिन की छुट्टी माँगते हुए कक्षाध्यापक के नाम पत्र लिखिए।
उत्तर:

आर्मूर,
दि : xxxx

सेवा में,
श्री कक्षाध्यापक जी,
दसवीं कक्षा,
यस. यस. हाईस्कूल,आर्मूर।
महोदय,
सादर प्रणाम ।

सेवा में निवेदन है कि मेरी तबीयत ठीक नहीं है। बहुत तेज़ बुखार है। इसलिए मैं पाठशाला में नहीं आ सकती । कृपया आप मुझे दि : xxx से x x x तक पाँच दिन की छुट्टी देने की कृपा करें।

आपकी आज्ञाकारी छात्रा,
x x x x,
दसवीं कक्षा,
क्रम संख्या x x x x

23. किसी कॉलेज में प्रवेश हेतु प्राचार्य के नाम पत्र लिखिए।
उत्तर:

अमलापुरम,
दि. x x x x x

प्रेषक :
x x x x
पिता – रामय्या,
पो. अग्रहारम,
अलमापुरम।
सेवा में,
प्राचार्य महोदय,
एस .के.बी.आर. कॉलेज, अमलापुरम।

महोदय,

सेवा में निवेदन है कि “मैं ने मार्च 2018 में एस.एस.सी. परीक्षा पहली श्रेणी में उत्तीर्ण की है। मुझे 75% प्रतिशत अंक मिले हैं। मैं विनम्र तथा अच्छा विद्यार्थी हूँ। मुझे मन लगाकर पढने की इच्छा है। मुझे बाई.पी.सी. से बडी लगन है। आपकी कॉलेज में पढाई अच्छी की जाती है। प्रतिष्ठित संस्थान है। अतः मैं आपके कॉलेज में बाई. पी.सी.ग्रूप लेकर इंटरमीडियट पढना चाहता हूँ। कृपया मुझे प्रवेश दिलवा दीजिए।

आपका विनम्र छात्र,
x x x x

24. किसी पुस्तक – विक्रेता के नाम पर एक पत्र लिखिए। आवश्यक पुस्तकें माँगते हुए किसी पुस्तक विक्रेता के नाम पर एक पत्र लिखिए।
उत्तर:

विजयवाडा,
दि. x x x xx

प्रेषक :
नंबर,
दसवीं कक्षा,
गाँधीजी मुनिसिपल हाई स्कूल,
विजयवाडा।

सेवा में :
व्यवस्थापक,
द.भा.हिं. प्रचार सभा,
अमलापुरम |

प्रिय महोदय,

निम्नलिखित पुस्तकें ऊपर दिये गये मेरे पते पर वी.पी.पी.के ज़रिए शीघ्र भेजने की कृपा करें आपके नियमानुसार ₹. 150 अग्रिम भेज रहा हूँ। यथा नियम उचित कमीशन भी दीजिए। सभी किताबें जल्दी भेजिये। निम्नलिखित सूचना के अनुसार सभी किताबें भेज सकते हैं।

आवश्यक किताबें :
AP SSC 10th Class Hindi पत्र लेखन 1

आपका,
x x x x

AP SSC 10th Class Hindi पत्र लेखन

25. तुम्हारी साइकिल चोरी हो गयी। थानेदार के नाम शिकायती पत्र लिखिए।
उत्तर:

विजयवाडा,
दि. x x x x x

प्रेषक :
दसवीं कक्षा,
सी.वी. आर. जी. एम. हैस्कूल,
विजयवाडा।
सेवा में,
श्री सब इन्स्पेक्टर साहब | श्री थानेदार जी,
टू टाउन पुलिस थाना,
विजयवाडा।

पूज्य महोदय,

निवेदन है कि कल शाम मैं अपनी साइकिल “नवोदया बुक स्टाल” के सामने रखकर, किताब खरीदने अंदर गया। मैं उसे ताला लगाना भूल गया। किताब खरीदकर बाहर आकर देखा तो वहाँ मेरी साइकिल नहीं थी। मैं ने इधर -उधर पूछताछ की। लेकिन उसका पता नहीं चला। मैं ने उसे पिछले महीने में ही खरीदी है। वह काले रंग की और हीरो कंपनी की है। उसका नंबर 2114623 है। मैं एक गरीब छात्र हूँ। इसलिए आप उसका पता लगाकर मुझे दिलवाने की कृपा करें।

धन्यवाद,

आपका विश्वसनीय,
दसवीं कक्षा,
x x x x x.

पता:
श्री सब इन्स्पेक्टर साहब /श्री थानेदार जी,
टू टाउन पुलिस थाना,
विजयवाडा।

26. पाठशाला में बालदिवस मनाया गया है। इसका वर्णन करते हुए मित्र के नाम पत्र लिखिए।
उत्तर:

अमलापुरम,
दि. x x x x x.

प्रिय मित्र प्रशांत,

सप्रेम नमस्कार,

मैं यहाँ कुशल हूँ। आशा है कि तुम भी वहाँ कुशलपूर्वक हो । मेरी पढाई खूब चल रही है। हर साल 14 नवंबर को चाचा नेहरू का जन्म दिन बाल दिवस के रूप में मनाया जाता है। हमारी पाठशाला में उस दिन बाल दिवस बडे वैभव से मनाया गया है। उस दिन सेबेरे ही पाठशाला के सब विद्यार्थी और अध्यापक हाज़िर हुए हैं। प्रार्थना के बाद प्रधान अध्यापक जी ने नेहरू जी के महान गुणों पर प्रकाश डाला।

कुछ अध्यापक और छात्र नेहरूजी के व्यक्तित्व का परिचय दिया। अनेक नृत्य – गान हुए। विभिन्न प्रतियोगिताओं में प्रतिभा दिखाये। छात्रों को पुरस्कार दिये गये। सबने भारत के सच्चे नागरिक बनने की प्रतिज्ञा की | सब में मिठाइयाँ बाँटी गयीं। राष्ट्रीय गान के साथ सभा समाप्त हुयी। तुम्हारे माँ – बाप को मेरे प्रणाम कहना।

तुम्हारा प्रिय मित्र,
x x x x x.

पता :
जी. साइप्रशांत,
कक्षा दसवीं
केंद्रीय विद्यालय,
विजयवाडा।

27. अपनी पाठशाला में मनाये गये ‘वनम् – मनम्’ कार्यक्रम का वर्णन करते हुए मित्र के नाम पत्र लिखिए।
उत्तर:

गुंटूर,
दि. x x x x

प्रिय मित्र,

मैं यहाँ कुशल हूँ। आशा करता हूँ कि तुम भी वहाँ कुशल हो। मैं इस पत्र में हमारी पाठशाला में मनाये गये ‘वनम् – मनम्’ कार्यक्रम के बारे में लिख रहा हूँ।

‘वनम् – मनम्’ राज्य स्तरीय कार्यक्रम है। इसे आंध्रप्रदेश राज्य सरकार में जुलाई 1, 2017 को आरंभ किया । यह एक करोड पौधे लगाने का बृहद कार्यक्रम है। अधिक से अधिक वृक्षारोपण और पानी का सदुपयोग इसका उद्देश्य है।

हम लोग भी अपनी पाठशाला के फाटक के दोनों ओर, खेल मैदान के चारों ओर पेय जल स्थान आदि पर पौधों को लगाया। वर्षा का पानी पूर्ण रूप से उपयोगी बनें और व्यर्थ न हों।

इस कार्यक्रम में हमारे स्थानीय विधायक भी शामिल हुए थे। उन्होंने पानी का सदुपयोग और पेड लगाने की आवश्यकता का संदेश दिया।

तुम भी अपनी पाठशाला में मनाये गये ‘वनम् – मनम्’ कार्यक्रम का वर्णन करते हुए पत्र लिखो। तुम्हारे माता – पिता को मेरे नमस्कार।

तुम्हारा मित्र
x x x x

पता :
वी. श्रीरमण
दसवीं कक्षा,
जड.पी. हाईस्कूल,
नुन्ना, विजयवाडा।

28. विश्व पुस्तक प्रदर्शनी में जाने के लिए दो दिन की अनुमति माँगते हुए प्रधानाध्यापक के नाम पत्र लिखिए।
उत्तर:

रामचंद्रापुरम,
दि. x x x x

सेवा में,
प्रधानाध्यापक जी,
नगर पालिका हाईस्कूल,
कोत्तपेट, गुंटुर।

महोदय,

सादर प्रणाम । मैं दसवीं कक्षा अंग्रेजी माध्यम का छात्र हूँ। मेरी क्रम संख्या 18 है।

हमारे शहर से अस्सी किलोमीटर दूरी पर स्थित नगर में विश्व पुस्तक प्रदर्शनी लगी हुई है। मुझे पता चला कि उस प्रदर्शनी में सभी प्रकार की पुस्तकें उपलब्ध हैं। यह प्रदर्शनी केवल दस दिन के लिए
आयोजित है। मैं उसे देखना चाहता हूँ। अपनी मनपसंद पुस्तकें खरीदना चाहता हूँ। कल हमारे परिवार के सभी सदस्य उस प्रदर्शनी को देखने जा रहे हैं।

कृपया मुझे उस प्रदर्शनी में जाने के लिए दो दिन की अनुमति / छुट्टी देने की कृपा करें।

धन्यवाद

आपका आज्ञाकारी छात्र,
x x x x

29. अपने मुहल्ले में सफ़ाई का ठीक प्रबंध नहीं है। शिकायत करते हुए नगर – निगम के प्रधान के नाम पर पत्र लिखिए।
उत्तर:

विजयवाडा,
दि. x x x x x

प्रेषक :
x x x x
पिता – विनय कुमार,
मैनेजर,
स्टेट बैंक आफ़ इंडिया,
बैंक कॉलनी,
विजयवाडा।
सेवा में
स्वास्थ्य अधिकारी,
विजयवाडा नगर निगम कार्यालय, विजयवाडा।
मान्य महोदय,

सादर प्रणाम।

आपकी सेवा में नम्र निवेदन है कि “कुछ महीनों से हमारे कॉलनी में सफ़ाई ठीक ढंग से नहीं हो रही है। सड़कों पर कूडा – करकट जमा हुआ है। नालों का पानी सडकों पर बहता है। सफ़ाई की व्यवस्था नहीं है। इसलिए मच्छर खूब बढ गये हैं। कई लोग मलेरिया के शिकार बनते जा रहे हैं। इसलिए मैं आपसे प्रार्थना करता हूँ कि सफ़ाई कराने के आवश्यक कदम उठाएँ।

भवदीय,
x x x x

AP SSC 10th Class Hindi पत्र लेखन

30. किसी एक शैक्षणिक यात्रा का वर्णन करते हुए अपने मित्र के नाम पत्र लिखिए|
(या)
आप अपनी पाठशाला की ओर से विहार – यात्रा पर गए हैं। इसका वर्णन करते हुए मित्र के नाम पत्र लिखिए।
उत्तर:

विजयवाडा,
दि. x x x x x

प्यारे मित्र वेणु,

मैं यहाँ कुशल हूँ। आशा करता हूँ कि तुम भी वहाँ सकुशल हो। कुछ दिनों के पहले हमारी पाठशाला के दसवीं कक्षा के छात्र शैक्षणिक यात्रा के लिए वरंगल गये। उनके साथ मैं भी गया। हम कुल मिलाकर साठ छात्र इस शैक्षणिक यात्रा पर गये। हमारे समाज शास्त्र के अध्यापक और प्रधानाध्यापक भी हमारे साथ आये। हम वरंगल में दस दिन ठहरे।

वरंगल देखने लायक नगर है। यह तेलंगाणा राज्य का एक जिला है। जिला केंद्र है वरंगल। वरंगल बहुत देखने लायक नगर है। वरंगल के पास ही हनुमकोंडा है। हम यहाँ हज़ार स्तंभ देवालय, जुलाजिकल पार्क, अंबेड्कर की मूर्ति, पद्माक्षी मंदिर, सिद्धेश्वर मंदिर, काकतीय जू पार्क, मल्लिकार्जुनस्वामी मंदिर, श्री विद्या सरस्वती शनि मंदिर, गोविंदराजुलु गुट्टा, इस्कान मंदिर, काकतीय विश्व विद्यालय, नेशनल इन्स्टिट्यूट आफ़ टेकनालजी, अरोरा डिग्री कॉलेज, भद्रकाली मंदिर, रामप्पा मंदिर, वरंगल किला, पाकाला लेक (झील), एकशिला वॉटर फ़ाल और एकशिला बाल पार्क, एटूरु नागारम, खूनख्वार जंतुशाला, काकतीय रॉक गार्डेन, वरंगल विमान केंद्र, रामगुंडम विमान केंद्र, हकिपेट एयर फ़ोर्स स्टेशन, इन्स्टिट्यूट काकतीय म्यूजिकल गार्डेन, ऐनवोल मल्लन्ना मंदिर, रामन्न पेट, वरंगल, कोमटिपल्लि, काजीपेट नगर रेल्वे स्टेश्न, काजीपेट जंक्शन आदि रेल्वे स्टेशन भी हम ने देखें।

मैं आशा करता हूँ कि तुम भी आगामी छुट्टियों में वरंगल अवश्य देखते हो।
तुम्हारे माँ – बाप को मेरा नमस्कार |

तुम्हारे प्यारे मित्र,
x x x x x
विजयवाडा

पता:
के. के. माधव
पिता. के. वेणुगोपाल,
घर.न. 10-3-48
श्रीकृष्ण मंदिर वीथि,
विनुकोंडा।

31. छात्रवृत्ति के लिए प्रधानाध्यापक को प्रार्थना पत्र लिखिए।
उत्तर:

विजयवाड़ा,
ता. x x x x x

प्रेषक :
x x x x
पिता रामय्या,
वन टौन,
विजयावाडा।
सेवा में,
प्रचार्य महोदय
यस.के.बी.आर कॉलज,
आदरणीय महोदय,

सविनय निवेदन यह है कि मैं दसवीं कक्षा का विधार्थी हूँ। मुझे 92% प्रतिशत अंक मिले हैं। मैं एक गरीब परिवार का सदस्य हूँ। ऐसे में आगे शिक्षा जारी रखन मेरे लिए कठिन हैं। मैं आपके विध्यालय में ही पढ़ाई जारी रखना चाहता हूँ।

मैं न केवल एक अच्छा विद्यार्थी हूँ बल्कि जूनियर फुटबॉल टीम का कैप्ठन भी हूँ। मैं आपका सदा आभारी रहुँगा। मुझे उम्मीद है आप मुझे निराशा नहीं करेगे और मुझे छात्रवृत्ति प्रदान करेंगे।
धन्यवाद सहति

आपका विनम्र छात्र,
नं. x x x x x

पता :
प्राचार्य जी
एस.के.बी. आर. कॉलेज,
आर.के.पुरम,
विशाखपट्टणमा

32. भारी वर्षा के कारण नगर की सफाई सुचारु रूप से नहीं हो पा रही है। इसकी शिकायत करते हुए कमीशनर के नाम पत्र लिखिए।
उत्तर:

पोन्नुरू,
x x x x x

प्रेषक
x x x x
x x x x
जीबी.सी. रोड
पोन्नुरु।
सेवा में
क्षीमन कमीशनर,
नगर निगम कार्यालय,
पोन्नूरु।
महोदय,

निवेदन है कि भारी वर्षा के कारण कई दिनों से नगर की सफाई ठीक तरह से नहीं हो रही . है। इसलिए सभी सड़कें गंदगी से भरी पड़ी है। नगर की बस्तियाँ भी चलने – फिरने लायक नहीं रह गयी हैं। मच्छरों की संख्या भी बढ़ गयी है। गलियों से बदबू निकल रही है। इस कारण अनेक प्रकार की बीमारियाँ फैलने की आशांका है। अतः आपसे प्रार्थना है कि शीघ्र ही नगर की रक्षा करने के लिए आवश्यक कदम उठएँ।
पूर्ण सहयोग की आशा में।

सधन्यवाद।

आपका,
x x x x

पता :
आर. सुरेश कुमार,
दसवीं कक्षा ‘डी’,
नलन्दा विद्यालय,
मकंम्मा तोटा, करीमनगर।

33. अपने सहपाठियों के साथ आप ऐतिहासिक नगर गये। उसका वर्णन करते हुए अपने छोटे भाई/मित्र को पत्र लिखिए। (प्रेक्षणीय स्थान की यात्रा का वर्णन)
उत्तर:

भद्राचलं,
ता. x x x x x

प्रिय भाई चैतन्य प्रिय मित्र

आशीश,

गर्मी की छुट्टियों में मैं अपने सहपाठियों के साथ हैदराबाद देखने गया था। हम सब बस में गये थे। यात्रा की विशेषताएँ लिख रहा हूँ। हैदराबाद एक सुन्दर नगर है। यहाँ चारमीनार, गोलकोंडा किला, म्यूज़ियम, बिर्ला मंदिर आदि दर्शनीय स्थान हैं। यह व्यापार का बडा केन्द्र है। यह हमारी राजधानी है। इसको भाग्य नगर भी कहते हैं। अब यह भारत का एक महानगर बन गया है। यहाँ के सालारजंग म्यूज़ियम, नक्षत्रशाला, नेहरू प्राणी संग्रहालय आदि भी देखने लायक हैं। विधान सभा भवन, पब्लिक गार्डेन्स, फ़िल्मी स्टूडियोस आदि भी हमने देखे हैं। हमारी यात्रा आनंददायक और विज्ञानदायक होकर सफल रही। तुम भी अवश्य हैदराबाद देखने जाओ। माता-पिता को प्रणाम कह देना।

तुम्हारा बडा भाई/प्रिय मित्र,
x x x x x

पता :
चैतन्य,
घर का नंबर 9/269,
नकरेकल, नलगोंडा।

34. अपने भाई के जन्मदिन पर अपने मित्र को आमंत्रित करते हुए निमंत्रण पत्र लिखिए।
उत्तर:

चेन्नई,
x x x x x

प्रिय मित्र,

मैं यहाँ कुशल हूँ। आशा करता हूँ कि तुम भी वहाँ कुशल हो। अगले हफ्ते x x x x x को मेरे भाई का जन्मदिन है। मैं इस पत्र के द्वारा मुख्य रूप से तुम्हे आमंत्रित कर रहा हूँ। जन्मदिन का उत्सव बडे धूम – धाम से मनाया जायेगा। आप सबके आगमन से, विशेष रूप से तुम्हारे आने से मुझे बहुत खुशी होगी।

तुम्हारे माँ – बाप से मेरे प्रणाम कहो। तुम्हारे भाई को मेरे आशीर्वाद कहना । तेरे आगमन की प्रतीक्षा करता हूँ।

तुम्हारा प्रिय मित्र,
x x x x

पता:
आर. सुरेश कुमार,
दसवीं कक्षा ‘डी’,
नलन्दा विद्यालय,
मकंम्मा तोटा,
करीमनगर।

AP SSC 10th Class Hindi पत्र लेखन

35. किसी ऐतिहासिक स्थान का वर्णन करते हुए मित्र के नाम पत्र लिखिए।
(या)
अपने यहाँ मनाये गये किसी पर्व का वर्णन करते हुए मित्र के नाम पत्र लिखिए।
उत्तर:

विजयवाडा,
x x x x x

प्रिय मित्र हरि,

मैं यहाँ कुशल हूँ। समझता हूँ कि तुम भी कुशल हो। मैं ऐतिहासिक स्थल हैदराबाद की यात्रा कर के कल ही वापस आया। अपनी यात्रा के बारे में कुछ बातें लिख रहा हूँ। ध्यान से पढो। हम रेल से हैदराबाद गये, एक होटल में ठहरे। हैदराबाद एक सुन्दर नगर है। यहाँ चारमीनार, गोलकोंडा किला, म्यूज़ियम, बिर्लामंदिर आदि दर्शनीय स्थान देखे हैं। यहाँ के सालारजंग म्यूज़ियम, नक्षत्रशाला, नेहरू प्राणी संग्रहालय आदि भी देखने लायक हैं। विधान सभा भवन, पब्लिक गार्डेन्स, फ़िल्मी स्टूडियोस आदि भी हमने देखे हैं। हाईकोर्ट और अनेक सरकारी कार्यलय भी हमने देखे हैं। हमारी यात्रा आनंद और विज्ञानदायक होकर सफल रही। तुम भी एक बार जाकर देखो, माँ – बाप को प्रणाम।

तुम्हारा प्यारा मित्र,
नं. 56972.

पता :
वि. हरि,
दसवीं कक्षा,
जि.प. हाईस्कूल,
करिमनगर।

36. अपनी पाठशाला में मनाये गये स्वतंत्रता दिवस (राष्ट्रीय पर्व) का वर्णन करते हुए अपने मित्र के नाम पत्र लिखिए।
उत्तर:

करीमनगर,
ता. x x x x x

प्रिय मित्र साई,

मैं यहाँ कुशल हूँ। आशा है कि वहाँ तुम भी कुशल हो। यहाँ मैं हमारे स्कूल में मनाये गये स्वतंत्रता दिवस का वर्णन कर रहा हूँ।

पंद्रह अगस्त को हमारे स्कूल में स्वतंत्रता दिवस मनाया गया। उस दिन स्कूल और सभा मंडप रंग – बिरंगे कागज़ों से सजाये गये। उस दिन सबेरे तिरंगा झंडा फहराया गया। मेयर साहब ने भाषण दिया। सबको मिठाइयाँ बाँटी गयीं। शाम को विद्यार्थियों से सांस्कृतिक कार्यक्रम संपन्न हुये। खेलकूद में विजयी विद्यार्थियों को पुरस्कार दिये गये। राष्ट्रीय गीत के साथ सभा समाप्त हुई। तुम्हारे माँ – बाप को मेरे नमस्कार तुम्हारे छोटे भाई को मेरा आशीर्वाद।

तुम्हारा प्रिय मित्र,
x x x x

पता :
यस. यस. साई,
जि.प. हाईस्कूल,
मेदक, मेदक ज़िला।

37. नगर निगम अधिकारी को अपने मोहल्ले की सफ़ाई के लिए पत्र लिखिए।
उत्तर:

चौटुप्पल,
x x x x x

प्रेषक
x x x x
1-5-214, श्री नगर,
वरंगल।
सेवा में
श्री कमीशनर,
वरंगल नगर निगम,
वरंगल ।

महोदय,

नमस्कार

मैं वरंगल के हनुमान पेट मोहल्ले का वासी हूँ। आपकी सेवा में नम्र निवेदन है कि कुछ महीनों से हमारे नगर में सफाई ठीक ढंग से नहीं हो रही है । सडकों पर कूडा – करकट जमा हुआ है । नालों का पानी सडकों पर बहता है । उनको साफ़ करने की ठीक व्यवस्था नहीं है । इसलिए मच्छर खूब बढ़ गये हैं । कई लोग मलेरिया के शिकार बन गये हैं । इसलिए मैं आपसे प्रार्थना करता हूँ कि हर रोज़ सफ़ाई करने के आवश्यक कदम उठाएँ । मैं पूर्ण सहयोग की आशा में …………

आपका,
x x x x

38. अधिक वर्षा के कारण राज्य के किसानों की फसल नष्ट हो गयी है। मुख्य – मंत्री को पत्र लिखकर किसानों की आर्थिक सहायता करने की प्रार्थना कीजिये।
उत्तर:

करीमनगर,
ता. x x x x x

सेवा में
माननीय मुख्यमंत्री जी,
तेलंगाणा राज्यविभाग,
हेदराबाद।

निवेदन है कि पिछले हफ्ते से हो रही बारिश से राज्य भर के कई इलाकों में किसानों पर आफ़त आ गई। बेमौसमी बारिश से फसलों को भारी नुक्सान हुआ। फसल काटने का वक्त होने से किसान काटने की तैयारी में थे। लेकिन बारिश ने किसानों की सारी मेहनत पर पानी फेर दिया। आज धरती पुत्र अपना माथा पकडकर रो रहा है। तेलंगाणा कृषि विभाग से मैं प्रार्थना करता हूँ कि जल्दि से जल्दि सरकारी स्तर पर इसका आकलन तैयारकर उनकी दशा सुधारने की दिशा में आर्थिक सहायता करें।
धन्यवाद,

आपका विनम्र
तेलंगाणा राज्य नागरिक
हैदराबाद।

39. रास्ता चलने वाली अकेली महिला को देखकर सोने के आभूषण छीनने वालों से सुरक्षा करने की प्रार्थना करते हुए पुलिस अधिकारी को पत्र लिखिए।
उत्तर:

वरंगल,
x x x x

प्रेषकः
के. मोहनराव,
दसवीं, कक्षा,
मोडल हाईस्कूल,
वरंगल।
सेवा में,
श्री पुलीस अधिकारी
(सब इन्स्पेक्टर साहब)
टू तउन पुलीस थाना,
वरंगल।
पूज्य महोदय,

मैं अंबेडकर कॉलनी का निवासी हूँ। पिछले कुछ दिनों से हमारी कॉलनी में रास्ता चलने वाली , अकेली महिला को देख कर सोने के आभूषण छीन कर भाग जाने वाले चोर अधिक हो गये हैं। इसलिए मैं आप से सविनय पूर्वक निवेदन करता हूँ कि आप तुरंत पुलीस पेट्रोलिंग की व्यवस्था करें तथा चोरों से अकेले चलनेवाली महिलाओं की सुरक्षा करें।
तुरंत उचित करवाई के लिए प्रार्थना।
धन्यवाद सहित,

आपका,
विश्वसनीय,
के. मोहनराव,
वरंगल।

AP SSC 10th Class Hindi पत्र लेखन

40. नगर में बढ़ती हुई चोरी की घटनाओं पर चिंता व्यक्त करते हुए पुलिस कमिश्नर को पत्र लिखकर . पुलिस व्यवस्था बढ़ाने की माँग कीजिए।
उत्तर:

खाजीपेट,
x x x x

प्रेषकः
जी. साई प्रशाँत,
दसवीं कक्षा,
शारदा हाई स्कूल, खाजीपेट।
सेवा में,
श्री पुलीस कमीशनर जी, खाजीपेट।

मान्य महोदय,
सादर प्रणाम,

मैं अंबेड्कर कॉलनी का निवासी हूँ। पिछले कुछ दिनों से हमारी कॉलनी में चोरियाँ बढ़ गयी हैं। रात के समय बंद घरों में घुसकर धन, आभूषण लूट रहे हैं। पुलिस चौकसी है। पर नहीं के बराबर है। इन चोरियों से लोग हैरान हैं। इसलिए मैं आप से सविनय पूर्वक निवेदन करता हूँ कि आप इस विषय पर ध्यान देकर पुलिस व्यवस्था बढाने की कृपा करें। ताकि चोरियों से लोगों की संपत्ति की रक्षा होगी।

यथाशीघ्र आवश्यक कार्रवाई के लिए प्रार्थना ।

धन्यवाद सहित,

आपका,
विश्वसनीय,
जी. साई प्रशांत
खाजीपेट

41. मामा की शादी में जाने के लिए तीन दिन की छुट्टी माँगते हुए प्रधानाध्यापक के नाम पत्र लिखिए।
उत्तर:

विजयवाडा,
ता. x x x x x

सेवा में
श्री प्रधानाध्यापक जी,
हिंदु हाईस्कूल, विजयवाडा।
सादर प्रणाम,

मैं आप की पाठशाला में दसवीं कक्षा पढ़ रहा हूँ। ता. ………. को मेरे मामा की शादी तिरुपति में होनेवाली है। इसलिए कृपया मुझे तीन दिन ता. ……… से …………. तक मैं भी शादी में भाग लेने के लिए छुट्टी देने की प्रार्थना!
धन्यवाद सहित,

आपका
आज्ञाकारी छात्र,
भुवनेश,
दसवीं कक्षा।

AP SSC 10th Class Telugu Important Questions Chapter 1 మాతృభావన

AP State Board Syllabus AP SSC 10th Class Telugu Important Questions Chapter 1 మాతృభావన.

AP State Syllabus SSC 10th Class Telugu Important Questions 1st Lesson మాతృభావన

10th Class Telugu 1st Lesson మాతృభావన 2 Marks Important Questions and Answers

ఈ క్రింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాల్లో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
స్త్రీలను గౌరవించాలనే ఉదాత్త సందేశాన్నిచ్చిన ‘మాతృభావన’ పాఠ్యభాగ కవి పరిచయం రాయండి. (March 2015)
జవాబు:
1. కవి, కాలము : కీ.శే. గడియారం వెంకట శేషశాస్త్రిగారు, (1894-1980) ఆధునిక కాలము, కడపజిల్లా, జమ్మల మడుగు తాలూకా, “నెమళ్ళ దిన్నె” గ్రామ వాస్తవ్యులు.
2. రచనలు : మురారి, పుష్పబాణ విలాసము మొ||నవి.
3. బిరుదు : కవితా వతంస / కవిసింహ | అవధాన పంచానన
4. ఆధునిక తెలుగు కవులలో ప్రముఖులు, శతావధాని, బానిసత్వాన్ని నిరసించారు.

ప్రశ్న 2.
మాతృభావన నేపథ్యం వ్రాయండి.
జవాబు:
కళ్యాణి దుర్గంపై దండయాత్ర చేసి అబ్బాజీసో దేవుడు విజయం సాధించాడు. విజయోత్సాహంతో శివాజీ వద్దకు వచ్చాడు. శివాజీ ఆజ్ఞతో దుర్గం జయించి దాని సర్దారు ‘మౌలానా అహ్మద్’ను పట్టి బంధించాడు. అతని రాణివాసాన్ని కూడా బంధించి తెచ్చినట్లు శివాజీకి చెప్పాడు. అది విన్న శివాజీకి చాలా కోపం వచ్చింది. తరువాత పాఠ్యభాగం మొదలవుతుంది.

ప్రశ్న 3.
మాతృభావన రచయిత గూర్చి వ్రాయండి.
జవాబు:
మాతృభావన పాఠం గడియారం వేంకటశేషశాస్త్రి గారు రచించారు. ఆయన రచించిన శ్రీ శివభారతంలోని తృతీయాశ్వాసంలోనిది ప్రస్తుత పాఠ్యాంశం.

శాస్త్రిగారు కడప జిల్లాలోని జమ్మలమడుగు తాలూకాలోని నెమళ్ళ దిన్నె గ్రామానికి చెందిన వారు. వారి తల్లిదండ్రులు నరసమాంబ, రామయ్యగార్లు, శాస్త్రిగారు ప్రొద్దుటూరు మునిసిపల్ హైస్కూలులో తెలుగు పండితులుగా పనిచేశారు. శాస్త్రిగారు శతావధాని. వీరు మరొక శతావధానియైన రాజశేఖర శతావధాని గారితో కలిసి, కావ్యనాటకాలు రచించారు.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 1 మాతృభావన

ప్రశ్న 4.
మాతృభావన రచయిత ఎవరు? ఆయన రచనల గూర్చి వ్రాయండి.
జవాబు:
మాతృభావన పాఠం గడియారం వేంకటశేషశాస్త్రి గారు రచించారు. ఆయన రచించిన శివభారతంలోని తృతీయాశ్వాసం నుండి ప్రస్తుత పాఠ్యాంశం గ్రహించబడింది.

గడియారం వారి పేరు చెప్పగానే “శ్రీ శివభారతం” గుర్తుకు వస్తుంది. బానిసత్వాన్ని నిరసించి, స్వాతంత్ర్య కాంక్షను రగుల్కొల్పిన మహాకావ్యం శ్రీ శివభారతం.

మురారి, పుష్పబాణ విలాసం, మల్లికామారుతం, శ్రీనాథ కవితా సామ్రాజ్యం, రఘునాథీయం మొదలైన అనేక గ్రంథాలు శాస్త్రిగారు రచించారు.

శాస్త్రిగారికి కవితావతంస, కవిసింహ, అవధాన పంచానన అనే బిరుదులను సాహితీ విమర్శకులు ఇచ్చారు.

ప్రశ్న 5.
‘స్త్రీలు భారతావని భాగ్యకల్పలతలు’ అనడంలో కవి ఉద్దేశం ఏమిటి?
జవాబు:
గడియారము వేంకటశేషశాస్త్రి కవిగారు ‘మాతృభావన’ అనే పాఠంలో, భారతదేశంలో అనసూయ, సావిత్రి, సీత, సుమతి వంటి పతివ్రతలున్నారని వారు పుట్టింటిని, మెట్టింటిని తమ పాతివ్రత్యంతో రక్షించారని చెప్పారు.

‘కల్పలత అంటే కల్పవృక్షం. కల్పవృక్షం కోరిన కోరికలను ఇచ్చే దేవతల వృక్షం. స్త్రీలు భారతదేశానికి భాగ్యాన్ని ప్రసాదించే కల్పవృక్షాల వంటి వారని కవి ఉద్దేశ్యం.

స్త్రీలను గౌరవిస్తే భారతదేశం సౌభాగ్యముగా సర్వసంపదలతో సుఖంగా ఉంటుందని కవి ఉద్దేశ్యం.

ప్రశ్న 6.
శివాజీ స్త్రీలపట్ల చూపిన గౌరవభావం నీకు తెలిసిన వారిలో ఎవరికైనా ఉంటే వారిని గురించి నాలుగు వాక్యాలు రాయండి.
జవాబు:
శివాజీ స్త్రీల పట్ల గౌరవభావం చూపినట్లే, మా గ్రామ సర్పంచి కూడా స్త్రీలను ఎంతో గౌరవంగా చూసేవాడు. వారు ఎదురు పడితే మాతృభావంతో మెలిగేవాడు. గ్రామంలోని స్త్రీలను ఎవరైనా ఏమన్నా వేధించడానికి చూస్తే ఊరుకొనేవాడుకాదు. వాళ్ళకు తగినబుద్ధి చెప్పేవాడు. ఇతర స్త్రీలను మన తల్లిలాగా, సోదరిలాగా భావించి గౌరవించాలని బోధించేవాడు.

ప్రశ్న 7.
“స్త్రీలు పూజ్యనీయులు” అన్న శివాజీ మాటల వెనుక ఆంతర్యమును సొంత మాటల్లో వివరించండి.
జవాబు:
సో దేవుడు కళ్యాణి దుర్గాన్ని జయించి, ఆ దుర్గంలోని రాణివాస స్త్రీని కూడా, ఆ సర్దారుతో పాటు బంధించి తెచ్చాడు. అది చూసి శివాజీ కోపంతో ఉగ్రుడైనాడు. స్త్రీలను తల్లులలాగా, తోబుట్టువుల్లాగా గౌరవించాలనేది శివాజీ అభిప్రాయం.

స్త్రీలు భూమి మీద తిరిగే పుణ్యదేవతలు. అనసూయ, సావిత్రి, సీత, సుమతి వంటి పతివ్రతలు ఈ భరతమాత కన్నబిడ్డలు. అగ్నిజ్వాలల వంటి స్త్రీలకు అపచారం చేసేవారు ధ్వంసమైపోతారు. సమూలంగా వారి వంశం నశిస్తుంది. స్త్రీలు పూజింపదగినవారు. వారికి ఎటువంటి అవమానమూ చేయకూడదనేది శివాజీ మాటల వెనుక ఆంతర్యం.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 1 మాతృభావన

ప్రశ్న 8.
క్రింది పాత్రల స్వభావాలను రాయండి.
జవాబు:
1. శివాజీ :
శివాజీ మరాఠా వీరుడు. ఆదర్శవాది. మహాబల పరాక్రమవంతుడు. పరస్త్రీని తన తల్లిగా భావిస్తాడు. స్త్రీలకు అవమానం జరిగితే సహించడు. స్త్రీలకు కష్టాన్ని కల్గించే వారెవరినైనా శిక్షిస్తాడు. స్త్రీలను అవమానించే వారిని సహించడు.

2. సోన్ దేవుడు :
శివాజీ సేనాని. బలగర్వం ఎక్కువ. మితిమీరిన ఉత్సాహం, శివాజీ పట్ల భయభక్తులు కలవాడు. ‘కళ్యాణి’ దుర్గం జయించాడు. రాణివాసాన్ని కూడా బంధించి తెచ్చాడు. శివాజీ కోప్పడ్డాడు. క్షమార్పణ చెప్పి శాంతింపజేశాడు. తన తప్పును తాను తెలుసుకొని పశ్చాత్తాపపడే స్వభావం కలవాడు.

ప్రశ్న 9.
మీ తోడి బాలికల పట్ల ఏ విధమైన గౌరవభావాన్ని వ్యక్తపరుస్తావు?
జవాబు:
మేము మా తోడి బాలికలను అక్కలుగా, చెల్లెళ్ళుగా భావించి, వారిని ప్రేమాదరాలతో గౌరవిస్తాము. వారికి ఏ సహాయం కావలసినా, మేము మాతోడి బాలురతో కలిసి సాయం చేస్తాము. మా తోడి బాలికలు బడికి వచ్చేటప్పుడు లేక వారు ఇంటికి తిరిగి వెళ్ళేటప్పుడు, వారికి ఏ విధమైన కష్టం కలుగకుండా చూస్తాము. ఎవరైనా ఆకతాయి, అల్లరి పిల్లలు, వారిని అల్లరి పెడితే, మేము ఆ పిల్లలను బెదరించి వారిని తరిమి వేస్తాము. అవసరం అయినప్పుడు మా నోట్సులు వారికి ఇస్తాము. మా తోడి బాలికలకు స్వంత అన్నదమ్ములవలె మేము చేదోడు వాదోడుగా నిలబడతాము.

అవసరం అయితే వారి కోసం మేము మా ప్రాణాలు కూడా ఇచ్చి సాయం చేస్తాము. వారికి రక్షణ సైన్యంగా నిలబడతాము .

ప్రశ్న 10.
పుట్టినిల్లు, మెట్టినిల్లు గౌరవాన్ని నిలబెట్టిన కొందరు స్త్రీలను గురించి వివరించండి.
జవాబు:
అత్రి మహర్షి భార్య అయిన అనసూయాదేవి తన పాతివ్రత్యంతో, త్రిమూర్తులను చంటిబిడ్డలుగా చేసి, వారికి జోలపాట పాడింది. సావిత్రి అనే ఇల్లాలు యమధర్మరాజు పాశాన్ని ఎదిరించి తన భర్త ప్రాణాన్ని రక్షించుకొంది. సీతా మహాదేవి, భగభగమండే అగ్ని గుండంలో దూకి, పూలరాశిలో తిరిగినట్లు బయటకు సురక్షితంగా వచ్చింది. సుమతి అనే పతివ్రత తన భర్త ప్రాణాలను రక్షించడం కోసం, సూర్యుడు ఉదయించకుండా సూర్యోదయాన్ని నిలిపి వేసింది. ఈ ఇలా ఎందరో భారతీయ స్త్రీలు, తమ పాతివ్రత్య భాగ్యంతో, తమ పుట్టింటికీ, అత్తవారింటికీ కీర్తిని తెచ్చి,
గౌరవాన్ని నిలబెట్టారు. ఈ క్రింది ప్రశ్నలకు 10 లేక 12 వాక్యాల్లో జవాబులు రాయండి.

10th Class Telugu 1st Lesson మాతృభావన 4 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
“స్త్రీలు పూజింపదగినవారు వారికి ఏ అవమానం చేయకూడదు” అని చాటి చెప్పిన శివాజీ వ్యక్తిత్వాన్ని “మాతృభావన” పాఠం ద్వారా విశ్లేషించండి. (S.A. I – 2018-19)
జవాబు:
వ్యక్తిత్వం అంటే మాటకూ, చేతకూ తేడా లేనితనం. శివాజీ పరస్త్రీలను సైతం కన్నతల్లులవలె, సోదరీమణులవలె చూసి గౌరవించేవాడు. శివాజీ ధర్మప్రభువు. శత్రు దుర్గాలపై దండెత్తినపుడు అక్కడ ఉండే స్త్రీలకూ, బ్రాహ్మణులకూ అపకారం తల పెట్టవద్దని, తన సర్దారులను హెచ్చరించేవాడు.

తన సర్దారు సో దేవుడు కళ్యాణి దుర్గాన్ని జయించినా, అతడు యవనకాంతను బంధించి తెచ్చినందుకు అతడిపై శివాజీ కోపపడ్డాడు. వెంటనే ఆ యవనకాంతను విడిపించి, తన సర్దారు తొందరలో తప్పు చేశాడనీ, తనను క్షమించమనీ ఆమెను కోరాడు. ఆమెను సత్కరించి తనవారిని తోడిచ్చి, ఆమెను ఆమె ఇంటికి తిరిగి పంపాడు.

శివాజీ క్షమామూర్తి, తప్పు చేశానని అంగీకరించిన సో దేవుడిని క్షమించాడు. శివాజీ స్త్రీలపై అత్యధిక గౌరవం కలవాడు. పతివ్రతలు భారత భాగ్య కల్పలతలని, వారు అగ్నిజ్వాలల వంటివారని, స్త్రీలకు అపచారం చేస్తే నశిస్తారనీ, వారి సంపదలు నశిస్తాయనీ శివాజీ తలంచేవాడు. శివాజీ శత్రువులను సైతం అవమానించని ధర్మమూర్తి. శివాజీది మహోన్నత వ్యక్తిత్వం.

ప్రశ్న 2.
‘మాతృభావన’ పాఠ్యాంశం ఆధారంగా దానిని రచించిన కవి వ్యక్తిత్వాన్ని విశ్లేషించండి.
జవాబు:
మాతృభావన పాఠం ‘శివభారతము’ అనే కావ్యంలోనిది. ఈ కావ్యాన్ని గడియారం వేంకటశేషశాస్త్రి గారు రాశారు. శివభారతము బానిసత్వాన్ని నిరసించి, భారతీయులలో స్వాతంత్ర్య కాంక్షను రగుల్కొల్పిన కావ్యం.

శివాజీ హిందూమత ధర్మంపై గొప్పభక్తి గౌరవాలు కలవాడు. స్త్రీలందరినీ, కన్నతల్లుల వలె శివాజీ గౌరవించాడు.

గడియారంవారు కూడా, గొప్ప దేశభక్తులు. శివాజీ వంటి దేశభక్తులైన చారిత్రక పురుషులపై గొప్ప భక్తి విశ్వాసాలు కలవారు. గడియారంవారు శివభారతము రచించే రోజుల్లో మన దేశానికి స్వాతంత్ర్యము రాలేదు. అందుకే మన భారతీయులలో స్వాతంత్ర్యంపై కోరికను ఉద్దీపింపజేయడానికి శివభారతాన్ని గడియారం వారు వ్రాశారు.

ఈ పాఠాన్ని బట్టి గడియారంవారు, గొప్ప దేశభక్తులని, హిందూమతంపై భక్తి గౌరవాలు కలవారని, గొప్ప స్వాతంత్ర్య వీరులనీ, మహాకవులనీ మనం గ్రహించగలము. వీరు స్త్రీల పై గౌరవం కలవారు.

అనసూయ, సావిత్రి, సీత, సుమతి వంటి పతివ్రతలపై గొప్ప భక్తి విశ్వాసాలు కలవారు గడియారం వారు.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 1 మాతృభావన

ప్రశ్న 3.
సోన్ దేవుని రాజభక్తిని విశ్లేషించండి.
జవాబు:
అబ్బాజీసో దేవుడు, శివాజీ మహారాజు వద్ద పనిచేసే ఒక సైన్యాధిపతి. సో దేవుడు, శివాజీ ఆజ్ఞలను తు.చ. తప్పకుండా పాటిస్తాడు. శివాజీ, సో దేవుడిని కళ్యాణి దుర్గముపై దండయాత్రకు పంపాడు. మహావీరుడైన సో దేవుడు, శివాజీ ఆజ్ఞ ప్రకారం కల్యాణి దుర్గాన్ని జయించి, దాని సర్దారులను పట్టి బంధించి తెచ్చాడు. అంతేకాకుండా ఆ దుర్గంలోని రాణివాస స్త్రీలను కూడా బంధించి వెంట తెచ్చాడు. రాణివాస స్త్రీలను బంధించి తెచ్చాడని విని, శివాజీ కోపంతో సోన్ దేవునిపై మండిపడ్డాడు.

వెంటనే రాణివాస స్త్రీల బంధాన్ని తొలగించి సభలోకి తీసుకొని రమ్మని శివాజీ సో దేవుడిని ఆజ్ఞాపించాడు. రాజభక్తి గల సో దేవుడు, వెంటనే రాణివాస స్త్రీల బంధాలు తొలగించి వారిని సభలోకి తీసుకువచ్చాడు. తనను మన్నింపుమని సో దేవుడు, శివాజీ మహారాజును కోరాడు. కోటను జయించిన ఉత్సాహంతో, అలా స్త్రీలను బంధించి తెచ్చాననీ, తనకు చెడు ఆలోచన లేదనీ, శివాజీ మహారాజును బ్రతిమాలాడు. శివాజీ సోన్ దేవుడి రాజభక్తిని గుర్తించి అతడిని మన్నించాడు. సోన్ దేవుడు గొప్ప రాజభక్తి కల సర్దారు.

ప్రశ్న 4.
సోన్ దేవుడు తప్పు చేసినా సరిదిద్దుకొనే స్వభావం కలవాడు అని నిరూపించండి.
జవాబు:
సోన్ దేవుడు శివాజీ మహారాజు యొక్క సైన్యాధిపతి. శివాజీ సోన్ దేవుడిని కళ్యాణి దుర్గంపై దండయాత్రకు పంపాడు. సోన్ దేవుడు కల్యాణి దుర్గాన్ని జయించి, దాని సర్దారును పట్టి బంధించి, ఆ దుర్గంలోని రాణివాస స్త్రీలను కూడా బంధించి శివాజీ వద్దకు తీసుకువచ్చాడు.

పుణ్యానికి నిలయమైన అంతఃపురకాంతను బందీగా తీసుకురావడం తప్పని, తన ఆజ్ఞను అతడు అతిక్రమించాడనీ శివాజీ మహారాజు సోన్ దేవునిపై ఉగ్రుడయ్యాడు. వెంటనే రాణివాస స్త్రీలను బంధవిముక్తుల్ని చేసి తీసుకురమ్మని శివాజీ సోన్ దేవుడిని ఆజ్ఞాపించాడు.

సోన్ దేవుడు తాను చేసిన తప్పును దిద్దుకొనే స్వభావం కలవాడు. అందువల్లనే సోన్ దేవుడు మరో మాట మాట్లాడకుండా, తాను బంధించి తెచ్చిన అంతఃపుర స్త్రీల బంధాలు విడిపించి, రాజు వద్దకు వారిని తెచ్చి, తనను క్షమించమని శివాజీని బ్రతిమాలాడు. విజయోత్సాహంతో తాను తప్పు చేశాననీ, తనలో చెడు ఆలోచన లేదనీ, శివాజీకి విన్నవించాడు. దీనిని బట్టి సోన్ దేవుడు తప్పుచేసినా, సరిదిద్దుకొనే స్వభావం కలవాడని తెలుస్తోంది.

ప్రశ్న 5.
శివాజీకి స్త్రీల పట్ల ఉండే గౌరవభావాన్ని మీ సొంతమాటల్లో వివరించండి.
జవాబు:
శివాజీ మహారాజుకు స్త్రీల పట్ల గొప్ప గౌరవం ఉంది. అంతఃపురకాంతలు పుణ్యమునకు నిలయమైనవారనీ, వారిని బంధించడం కానీ, అవమానించడం కానీ, ఏ భారతీయుడు చేయరాదనీ, శివాజీ అభిప్రాయము. అందుకే కళ్యాణి దుర్గంలోని అంతఃపురకాంతను బంధించి తెచ్చిన తన సైన్యాధిపతి సో దేవుడి పై శివాజీ మండిపడ్డాడు. వెంటనే ఆమెను విడిపించి, ఆమెను గౌరవించి తన సైన్యాన్ని తోడిచ్చి ఆమెను వారి కోటకు పంపాడు. ఆమెను శివాజీ తన తల్లిగా గౌరవిస్తానన్నాడు.

స్త్రీలు భారతభూమిపై తిరిగే పుణ్యదేవతలని, శివాజీ చెప్పాడు. మనదేశంలో పుట్టిన అనసూయ, సావిత్రి, సీత, సుమతి వంటి పతివ్రతలు, తమ పాతివ్రత్యంతో తమ పుట్టింటికీ, అత్తవారింటికీ కీర్తిని తెచ్చారని, శివాజీ మెచ్చుకున్నాడు.

పతివ్రతల పట్ల అపచారం చేసేవారు నశిస్తారనీ, వారి వంశం నిలవదనీ, రావణాసురుడు అలాగే నశించాడనీ శివాజీ చెప్పాడు. స్త్రీలు రత్నముల వంటివారనీ, వారు పూజింపదగినవారనీ, శివాజీ అభిప్రాయపడ్డాడు.

ప్రశ్న 6.
శివాజీ యవనకాంతను ఎందుకు క్షమాపణ కోరాడో వివరించండి.
జవాబు:
శివాజీ, సో దేవుడు అనే సైన్యాధిపతిని కల్యాణి దుర్గంపై దండయాత్రకు పంపాడు. శివాజీ దండయాత్రకు తన సైన్యాన్ని పంపేటప్పుడు, పతివ్రతలయిన స్త్రీలకు ఎటువంటి అపచారము చేయవద్దని వారిని హెచ్చరించేవాడు.

కాని సో దేవుడు కళ్యాణి దుర్గాన్ని జయించిన ఉత్సాహంతో, దాని సర్దారునూ, అచటి అంతఃపురకాంతలనూ బంధించి తెచ్చాడు. అంతఃపుర స్త్రీలను బంధించి తీసుకురావడం తప్పని శివాజీ అభిప్రాయము.

పతివ్రతలయిన స్త్రీలు అగ్నిజ్వాలల వంటివారని, వారిపట్ల అపచారం చేసేవారు, సంపదలు పోగొట్టుకొని సర్వనాశనం అవుతారనీ, వారి వంశం కూడా నిలువదనీ, శివాజీ అభిప్రాయము. పతివ్రతలు భారతదేశపు భాగ్య కల్పలతలని శివాజీ, నమ్మకము.

అందుకే శివాజీ తన సర్దారు తొందరపడి తప్పు చేశాడనీ, ఆ దోషానికి బాధపడవద్దనీ, తన తప్పును క్షమించమనీ యవనకాంతను కోరాడు. ఆమెను తన తల్లిగా, చెల్లెలుగా భావించి, తన చేతులపై ఆమెను నడిపిస్తాననీ, ఓర్పు చూపించి, తనను సహించి క్షమించమనీ శివాజీ ఆమెను కోరాడు.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 1 మాతృభావన

ప్రశ్న 7.
సమాజంలో స్త్రీలను ఎలా గౌరవించాలి?
జవాబు:
సమాజంలో స్త్రీలను తన కన్న తల్లులుగా, తన సోదరీమణులయిన అక్కాచెల్లెండ్రుగా గౌరవించాలి. స్త్రీలను కామ ప్రవృత్తితో చూడకూడదు. తన ఇంటిలో తన తల్లినీ, చెల్లినీ, అక్కనూ ఎలా ప్రేమాదరములతో చూస్తారో, అలాగే పరస్త్రీలను కూడా గౌరవంగా చూడాలి.

ముఖ్యంగా మనతో చదువుకొనే తోడి బాలికలను, మన స్వంత సోదరీమణులుగా చూడాలి. వారికి ఏ విధమైన కీడు . చేయరాదు. స్త్రీల పట్ల అనుచితంగా ప్రవర్తించేవారిని చూసి సహించరాదు. మన శక్తికొద్దీ స్త్రీలకు జరిగే అన్యాయాలను ఎదిరించి, పోరాడాలి. అవసరం అయితే పోలీసులకు తెలియజేయాలి.

స్త్రీలు అందరూ మనకు తల్లులవంటివారు. స్త్రీలు, పుట్టింటికీ, అత్తింటికీ గౌరవాన్ని తీసుకువస్తారు. స్త్రీ, ఒక వ్యక్తికి భార్యగా, ఇంకొకరికి కన్నబిడ్డగా, మరొకరికి కన్నతల్లిగా ఉండి, సమాజానికి ఎంతో సేవ చేస్తోంది. స్త్రీలు భారతదేశపు భాగ్య కల్పలతలు. వారు అనల జ్యోతుల వంటివారు. స్త్రీల పట్ల పాపం చేస్తే, వారి వంశమూ, సంపదలూ నశిస్తాయి. కాబట్టి స్త్రీలను దేవతామూర్తులవలె, మాతృమూర్తులవలె గౌరవించాలి.

ప్రశ్న 8.
నిజ జీవితంలో స్త్రీలను ఎప్పుడు ఎలా గౌరవించాలో వివరించుము.
జవాబు:
స్త్రీలు భారతదేశపు భాగ్య కల్పలతలు. స్త్రీలలో చిన్న పిల్లలను మనం ప్రేమగా చూడాలి. బాలికలను మనం కన్నబిడ్డల వలె ఆదరించాలి. తోడి బాలికలను మన స్వంత అక్కాచెల్లెళ్ళ వలె ప్రేమతో ఆదరంగా చూడాలి. మనకంటే పెద్దవారైన ఆడవారిని, మన కన్నతల్లులుగా చూసి గౌరవించాలి..

సంఘంలో మంచి పేరు తెచ్చుకున్న స్త్రీలను దేవతా మూర్తులుగా గౌరవించాలి. ప్రహ్లాదుడు పరస్త్రీలను మాతృమూర్తులుగా భావించి గౌరవించేవాడు. స్త్రీలు ఆపదలో ఉంటే, మన శక్తియుక్తులను అన్నింటినీ ధారపోసి, వారికి మనం సహాయం చెయ్యాలి. మన బడిలో మనతో చదువుకొనే బాలికలను, మన చెల్లెళ్ళవలె వాత్సల్య భావంతో చూడాలి. వారికి కావలసిన సహాయం చేయాలి. స్త్రీలు లక్ష్మీ స్వరూపిణులు. స్త్రీలు శక్తి స్వరూపిణులు. స్త్రీల పట్ల సర్వకాల సర్వావస్థలలోనూ గౌరవమూ, ప్రేమ, వాత్సల్యమూ, ఆదరమూ కలిగి ఉండాలి. స్త్రీలను గౌరవిస్తే సకల సంపదలను లక్ష్మీదేవి ఇస్తుంది. అన్ని విద్యలను సరస్వతి ఇస్తుంది.

10th Class Telugu 1st Lesson మాతృభావన Important Questions and Answers

ప్రశ్న 1.
స్త్రీల పట్ల మనం ఎలా ప్రవర్తించాలో, మన బాధ్యతలు ఏమిటో, వివరిస్తూ మీ మిత్రునకు లేఖ రాయండి.
జవాబు:

మిత్రునకు లేఖ

రాజమహేంద్రవరం,
x x x x x

ప్రియ మిత్రుడు అఖిలేష్ కు,

నేను బాగా చదువుతున్నాను. నీ లేఖ అందింది. సమాజంలోని స్త్రీల పట్ల మనం ఎలా నడచుకోవాలో ఈ లేఖలో నీకు రాస్తున్నా.

స్త్రీలు దేశ సౌభాగ్యానికి కల్పలతల వంటివారు. స్త్రీలు, కన్నబిడ్డలు, కన్నతల్లులుగా, సోదరీమణులుగా మనకు ప్రేమాదరములను పంచిపెడుతున్నారు. నేడు సంఘంలో స్త్రీల పట్ల అపచారాలు పెరుగుతున్నాయి. స్త్రీలపట్ల అపచారం చేసేవారిని నిర్భయ చట్టంతో శిక్షించాలి.

మనము తోటి స్త్రీలను మన అక్కాచెల్లెళ్ళుగా చూడాలి. మన తోటి చిన్నవారైన బాలికలను ప్రేమగా లాలనగా చూడాలి. పెద్దవారైన స్త్రీలను మన తల్లులవలె చూసి వారిని గౌరవించాలి. స్త్రీలను గౌరవిద్దాం. సంఘాన్ని కాపాడుదాం.

ఇట్లు,
నీ మిత్రుడు,
రాజేష్.

చిరునామా :
పి. అఖిలేష్,
10వ తరగతి, మునిసిపల్ హైస్కూలు,
కుప్పం, చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్.

ప్రశ్న 2.
స్త్రీలకు ధైర్యాన్ని పురికొల్పుతూ, ఒక కరపత్రాన్ని తయారుచేయండి.
జవాబు:
సోదరీమణులారా ! ఈ రోజుల్లో మీ పై జరుగుతున్న అత్యాచారాలను చూస్తే అసహ్యం వేస్తోంది. ఈ అరాచకాలను చూసి మీలో కొందరు పాఠశాలలు, కళాశాలలు మాని, ఇళ్ళల్లోనే ఉండిపోతున్నారు. సంఘంలో స్త్రీలు కూడా పురుషులతో అన్ని విధాల సమం. దేశంలో మీరు ఇంచుమించుగా 50% మంది ఉన్నారు. మీరు నిర్భయంగా ముందుకు వచ్చి మీ స్నేహహస్తాన్ని అందించకపోతే, సంఘాభివృద్ధి కుంటుపడుతుంది.

మీరు నిర్భయంగా ముందుకు రండి. మీకు మేము తోడుగా ఉంటాం. పోలీసులు తోడుగా ఉంటారు. నిర్భయ చట్టం వచ్చింది. ఆకతాయి వారిని నిర్దాక్షిణ్యంగా ప్రభుత్వం శిక్షిస్తుంది. ఫోటో కెమేరాలు వచ్చాయి. దుండగులు ఎంతటి వారైనా దొరుకుతారు. శిక్ష పడుతుంది. మీరు శక్తి స్వరూపిణులు. ధైర్యమే మీ ఆయుధం.

మేము మీకు రామదండులా తోడు ఉంటాము. నేరస్తులను పట్టుకొని ప్రభుత్వానికి అప్పచెపుతాము. మేము అంతా మీ అన్నదమ్ముల్లా మీకు సాయం చేస్తాము. నిర్భయంగా మీరు సంఘంలో తిరిగి హాయిగా మీ చదువులు సాగించండి. దేశాభివృద్ధికి మీ చేయూత నివ్వండి. రండి. సాహసించండి.

ఇట్లు,
గాంధీ ‘యువజన సంఘం,
కాకినాడ.

ప్రశ్న 3.
స్త్రీల వలన సమాజానికి కలుగు ప్రయోజనాలను వివరిస్తూ వ్యాసం రాయండి.
జవాబు:
స్త్రీలు, సమాజాభివృద్ధిలో ప్రధానపాత్ర వహిస్తారు. స్త్రీ, ఒక పురుషునికి భార్యగా బిడ్డలను కని, వారిని చక్కగా పెంచి, విద్యాబుద్ధులు నేర్పిస్తుంది. ఆమె భర్తకు తోడు నీడగా ఉండి, వంటా వార్పూ చేసి, భర్తకూ, పిల్లలకూ కడుపు నింపుతుంది. బిడ్డలను కని వారికి పాలిచ్చి పెంచుతుంది. భర్తకూ, బిడ్డలకూ, తన ప్రేమామృతాన్ని పంచి పెడుతుంది. కుటుంబంలో ఒడిదుడుకులు లేకుండా దాని సమత్వాన్ని కాపాడుతుంది.

దేశంలో స్త్రీలు, పురుషులతో అన్ని విధాలా సమానులు. అంతేకాదు, పురుషుల కంటే స్త్రీలే దేశ సౌభాగ్యానికీ, కుటుంబ రక్షణకూ ఎక్కువగా తోడ్పడుతున్నారు. స్త్రీ, భర్త సంపాదించి తెచ్చిన దానిని పొదుపుచేసి, కుటుంబాన్ని అభివృద్ధిలోకి తెస్తుంది. అంతేకాదు. నేటి స్త్రీలు, తాము కూడా తమ భర్తలతో పాటు సంపాదించి కుటుంబాన్ని చక్కగా పోషిస్తున్నారు. నేడు పురుషుల కంటే స్త్రీలు ఎక్కువగా కష్టపడుతున్నారు. స్త్రీలను పురుషులు కన్నతల్లులుగా, అక్కాచెల్లెళ్ళుగా గౌరవించాలి.

స్త్రీలు పిల్లలను కని, వారికి పాలిచ్చి పెంచి, వారికి మంచిబుద్ధులు నేర్పిస్తారు. పిల్లలకు, కన్నతల్లులే మొదటి గురువులు. స్త్రీలు విద్యావంతులయితే, దేశం పురోగతి చెందుతుంది. నేడు స్త్రీలు విద్యావంతులై డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, MLA లుగా, MP లుగా ముఖ్యమంత్రులుగా దేశ సేవ చేస్తున్నారు.

స్త్రీలు డ్వా క్రా సంఘాలలో చేరి తమ తెలివితేటలతో సంపాదిస్తున్నారు. దేశాభివృద్ధికి అన్ని రంగాల్లో స్త్రీలు చేయూత నిస్తున్నారు. స్త్రీలు ఏ దేశాభివృద్ధికైనా మూలస్తంభాల వంటివారు. స్త్రీలు లక్ష్మీ స్వరూపులు. శక్తి స్వరూపిణులు. మహిళలు మంచి కళాకారిణులు. వారు దేనినైనా అందంగా మలచి మంచి రూపాన్ని ఇవ్వగలరు.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 1 మాతృభావన

ప్రశ్న 4.
‘స్త్రీ గౌరవం’ అనే అంశంపై ఒక వ్యాసం వ్రాయండి.
జవాబు:
స్త్రీ గౌరవం,

‘యత్ర నార్యస్తు పూజ్యంతే, రమంతే తత్ర దేవతాః’ అన్నారు పెద్దలు. అంటే స్త్రీలు ఎక్కడ పూజించబడతారో అక్కడ దేవతలు ఆనందంతో నాట్యం చేస్తారని అర్థం. కాబట్టి స్త్రీలను గౌరవించే చోట దేవతలు కొలువై ఉంటారు. దేవతలు అంటే లక్ష్మి, సరస్వతి, గాయత్రి, శివుడు, విష్ణువు మొదలైనవారు. వారంతా కొలువై ఉంటే డబ్బుకు, చదువుకు, ఆనందానికి, ఆరోగ్యానికి లోటుండదు.

మనకు జన్మనిచ్చిన స్త్రీని తల్లిలా పూజించాలి. గౌరవించాలి. తల్లి ఆలన పాలన చూడకపోతే శ్రీ రామచంద్రుడైనా లేడు కదా! 9 నెలలు తన కడుపులో మోసి, కని, పాలిచ్చి పెంచిన తల్లిఋణం తీర్చుకోవటం మగజన్మకు సాధ్యంకాదు. కాని సమాజంలోని ప్రతి స్త్రీలోను తల్లిని దర్శించడం ద్వారా కొంత ఋణం తీరుతుంది.

‘స్త్రీలను గౌరవించాలి. వారి మనసుకు బాధ కలిగేలా ప్రవర్తించకూడదు. స్త్రీల మనసు సుకుమారమైనది. స్త్రీకి కోపం కలిగేలా ప్రవర్తిస్తే నాశనం తప్పదు. రావణుడు, దుర్యోధనుడు మొదలైనవారు అలాగే నశించారు.

‘కలకంఠి కంట కన్నీరొలికిన సిరి ఇంటనుండనొల్లదు’ అన్నారు పెద్దలు. ఎక్కడైతే స్త్రీ కన్నీరు పెడుతుందో అక్కడ కరవు, కాటకాలు, దరిద్రం వస్తాయి.

అందుకే శివాజీ వంటి గొప్పవారు స్త్రీలను గౌరవించారు. పురాణాలు, కావ్యాలు, ఇతిహాసాలు, ధర్మశాస్త్రాలు చదివిన వారెవ్వరూ స్త్రీని బాధపెట్టే సాహసం చేయరు. ఇది భారతీయతత్వం.

ఇవేవీ నమ్మని వారు కూడా గుర్తుపెట్టుకోవలసినది మన చట్టాలు. చట్ట ప్రకారం స్త్రీని బాధిస్తే చాలా కఠిన శిక్షలకు గురి అవుతారు. సమాజంలో వెలివేయబడతారు. అందుచేత స్త్రీలను గౌరవించడమంటే మనను మనం గౌరవించుకోవడం అని గుర్తుపెట్టుకోవాలి.

ప్రశ్న 5.
స్త్రీల చైతన్యంపై 10 నినాదాలు తయారుచేయండి.
జవాబు:

  1. అబలలన్నది పాతమాట – సబలలన్నది నేటిమాట
  2. స్త్రీలను గౌరవించు – శ్రీదేవిని ఇంటికి రప్పించు
  3. స్త్రీలు లక్ష్మీ స్వరూపిణులు – స్త్రీలు పూజ్యార్హలు
  4. ఆడది చదువుకుంటే – ఆ ఇంట్లో సంస్కారం ఉంటుంది
  5. స్త్రీలను గౌరవిస్తే – మీ అమ్మను గౌరవించినట్లే
  6. స్త్రీలను అవమానిస్తే – శ్రీదేవిని కాలదన్నినట్లే
  7. చదివిస్తే స్త్రీలు – నేర్వలేని విద్యలేదు
  8. ఆడవాళ్ళను – అగ్రస్థానంలో ఉంచండి
  9. మహిళలు – మన జాతి మాణిక్యాలు
  10. వనితలన్న – నీవు ఎపుడు తల్లి చెల్లిలాగ చూడు

ప్రశ్న 6.
“మహిళల రక్షణ మన కర్తవ్యం” అనే అంశంపై కరపత్రం రాయండి.
జవాబు:
(“మహిళల రక్షణ మన కర్తవ్యం “)

సోదర సోదరీ మణులారా ! చెప్పడానికి, సిగ్గువేస్తోంది. దేశంలో ఎక్కడో అక్కడ మన మహిళలకు అవమానం నిత్యం జరుగుతూనే ఉంది. పసిపాపలపై, యువతులపై, ముసలి స్త్రీలపై అత్యాచారాలు జరుగుతున్నాయి. యాసిడ్, దాడులు, ఈవ్ టీజింగ్లు, హింసాకృత్యాలు జరుగుతూనే ఉన్నాయి.

మన ఇంట్లో మన తల్లిని, అక్క చెల్లెళ్ళను మనం కాపాడుకుంటున్నాము. అలాగే మన ప్రక్క మహిళలను సైతం, మనమే రక్షించుకోవాలి. మహిళలకు అన్యాయం జరిగితే, లోకం సహించదు అనే విషయం దుర్మార్గులకు తెలియాలి.

మహిళకు అన్యాయం జరుగుతూ ఉంటే, మీరు సహించకండి. ఉగ్రనరసింహరూపం ఎత్తి అన్యాయాన్ని అరికట్టండి. అవసరం అనుకుంటే ప్రక్కవారి సాయం తీసుకోండి. పోలీసుల సాయం కోరండి. మన మహిళలను మనమే రక్షించుకుందాం.

మనం అంతా ఉద్యమిస్తేనే, మన మహిళకు రక్షణ దొరుకుతుంది. మనం మహిళలను గౌరవించి, మన పవిత్ర భారతమాత ఖ్యాతిని నిలుపుకుందాం. మన మహిళలను మనమే రక్షించుకుందాం.

జైహింద్

AP SSC 10th Class Telugu Important Questions Chapter 1 మాతృభావన

ప్రశ్న 7.
మానవ జీవితాన్ని గురించిన విశ్లేషణను 8, 10 పంక్తులకు తగ్గని కవిత ద్వారా తెల్పండి.
జవాబు:
(“మనిషి మాయం అయ్యాడు” (కవిత) ,

“మాయమవుతున్నాడు మనిషన్నవాడు
మానవత్వమ్ము మరి మచ్చుకైనా లేదు
నూటికో కోటికో ఒక్కడున్నాడేమో
కంటికీ కనరాని కమలాక్షుడతడు” ||మాయ ||

“నిలువెత్తు స్వార్థమ్ము నిజాయితీ శూన్యమ్ము
అన్నదమ్ముల బంధ మావిరయ్యిందమ్మ
ఇరుగు పొరుగుల మైత్రి ఇగిరిపోయిందమ్మ
అవినీతి బంధాలు అతికించుకున్నాడు.
రూపాయి చుట్టునా ప్రదక్షిణం చేస్తాడు” ||మాయ ||

“చీమలకు పాములకు పంచదారా పాలు
తోడబుట్టిన వార్కి గంజైన పోయడు
మతము పేరున లోకహితము గుర్తుకు రాదు
ముసలి తల్లీతండ్రి విషము అయిపోతారు.
పెళ్ళాము బెల్లమ్ము అత్తమామలు ముద్దు
చెల్లితల్లీ లేదు చెడునడత వనీతన్న
మాయమయి పోయాడు మనిషన్నవాడు” ||మాయ ||

ప్రశ్న 8.
శివాజీకి, సోన్ దేవుడికి మధ్య జరిగిన సంభాషణను సంభాషణ రూపంలో రాయండి.
జవాబు:
శివాజీ : సోన్ దేవా ! ఏంటీ ! రాణివాసాన్ని బంధించి తెచ్చావా? హిందువు అన్నవాడు ఎవడైనా ఇలా చేస్తాడా? నా ఆజ్ఞ నీకు గుర్తులేదా? అర్థం కాలేదా? చావాలని అనుకుంటున్నావా? నీ గర్వాన్ని ఎంతమాత్రం
సహించను. తక్షణం వెళ్ళి వారి బంధాలు విడిపించి తీసుకురా! వెళ్ళు.

సోన్ దేవుడు : చిత్తం మహారాజా !

శివాజీ : వెంటనే వెళ్ళు

సోన్ దేవుడు : (అంతఃపుర కాంతను తీసుకువచ్చి) అయ్యా (ప్రభూ!) నన్ను క్షమించండి. విజయోత్సాహంతో నా కళ్ళు మూసుకుపోయాయి. చెడ్డ చేయాలనే ఆలోచన నాకులేదు. మీ ఆజ్ఞ అతిక్రమించాలనే సాహసం లేదు. మీ పాదాలపై ఒట్టు.

శివాజీ : సోన్ దేవా! తప్పు చేశావు. స్త్రీలను పూజించాలి. వారిని అవమానించకూడదు. నా సైన్యాధిపతులు ఈ విషయాన్ని బాగా గమనించాలి. సరేలే నీ మనస్సు నేను గ్రహించాను. నీలో తప్పులేదు. ఇక ముందు జాగ్రత్త. వెళ్ళు.

ప్రశ్న 9.
స్త్రీలను దేవతలుగా భావించి పూజించాలి’ అనే మాటలను సమర్ధించండి.
జవాబు:
గడియారం వేంకటశేష శాస్త్రిగారు చెప్పినట్లు స్త్రీలు భారతావని భాగ్యకల్పలతలు. అనసూయ పాతివ్రత్యంతో త్రిమూర్తులను పురుటి బిడ్డలుగా చేసి వారికి జోలపాడింది. సావిత్రి యమధర్మరాజుతో పోరాడి భర్త ప్రాణాలను తిరిగి తెచ్చుకుంది. సీతాదేవి పూలరాశిలో దూకినట్లు అగ్నిగుండంలో దూకింది. సుమతి తన భర్తను బ్రతికించుకోడం కోసం సూర్యోదయాన్ని నిలిపివేసింది.

స్త్రీలు అందరూ దేవతామూర్తులే. స్త్రీలను గౌరవించిన చోటనే దేవతలు విహరిస్తారని పెద్దలంటారు. స్త్రీలు మనకు జన్మనిచ్చే మాతృమూర్తులు. మనకు పాలిచ్చి పెంచే సహనమూర్తులు. వంటవండి మనకు కడుపు నిండా ఆహారాన్ని పెట్టే దేవతలు. ఆ దేవతల వంటి స్త్రీలపై దౌర్జన్యాలు, మానభంగాలు చేయడం మహాపాపం.

స్త్రీలను గుడిలో దేవతామూర్తుల వలె పూజించాలి. గౌరవించాలి. స్త్రీలను తల్లులుగా, సోదరీమణులుగా, మాతృమూర్తులుగా గౌరవించాలి.

మనదేశంలో అరుంధతి, అనసూయ వంటి పతివ్రతలు ఎందరో ఉన్నారు. నేటి కాలంలో కూడా ఇందిర, దుర్గాబాయి, మీరాకుమారి, మహాజన్, సరోజినీనాయుడు, మాంటిసోరీ వంటి దేవతాస్వరూపిణులు ఎందరినో మనం చూస్తున్నాం.

ప్రశ్న 10.
స్త్రీలపై జరుగుతున్న అత్యాచారాలను ఖండిస్తూ వారిని గౌరవించాలని తెలుపుతూ, ఒక కరపత్రం తయారు చేయండి.
జవాబు:
స్త్రీలపై అత్యాచారాలను అరికట్టండి’ సోదరులారా ! మీకు ఒక విన్నపం. ఈ రోజుల్లో మనం చూస్తున్నాం. పేపరు తెరిస్తే, టివి పెడితే, ఎక్కడో ఒకచోట మన కన్నతల్లులకు, మనకు పాలిచ్చి పెంచిన స్త్రీ మూర్తులకు అవమానం జరిగిందని వార్త చూస్తాం. మనం మానవులం. రాక్షసులం కాదు.

పసిపాపలపై అత్యాచారాలు, వృద్ధ స్త్రీలపై అత్యాచారాలు, తోటి విద్యార్థినులపై, పొరుగున ఉన్న ఇల్లాలిపై అత్యాచారాలు. వెంటనే అత్యాచారాలను అరికట్టండి.

దేవతలవంటి స్త్రీలపై అత్యాచారం చేయడం రాక్షసత్వం. స్త్రీలందరూ నీకు కన్నతల్లుల వంటివారు, అక్కచెల్లెళ్ళవంటి వారు. స్త్రీలను గౌరవించాలి, పూజించాలి.

నిర్భయ చట్టం వచ్చింది. జాగ్రత్త. స్త్రీలను అగౌరవపరిస్తే నడిరోడ్డుపైననే మిమ్మల్ని కాల్చి చంపుతారు. చట్టం పదును ఎక్కింది. జాగ్రత్త.

స్త్రీమూర్తులను పవిత్రభావంతో చూడండి. వారిని గౌరవించండి. వారికి సాయపడండి. అన్యాయం మీ కంట పడితే ఉగ్రనరసింహునిలా భయంకరంగా శిక్షించండి.
మీరు తోటి స్త్రీలను గౌరవిస్తే, దుర్గాదేవికి లక్ష కుంకుమపూజ చేసినట్లే. లలితాసహస్రం పారాయణ చేసినట్లే. గుర్తుంచుకోండి. స్త్రీలు భారత భాగ్య కల్పలతలు.
ఇట్లు,
x x x x.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 1 మాతృభావన

ప్రశ్న 11.
తోటి స్త్రీలను సోదరీమణుల్లా, మాతృమూర్తుల్లా భావించాలని గుర్తు చేస్తూ నీ మిత్రునికి లేఖ రాయండి.
జవాబు:

రాజమండ్రి,
x x x x x

ప్రియ మిత్రుడు అఖిలేష్ కు,

నేను బాగా చదువుతున్నాను. నీవు కూడా బాగా చదువుతున్నావని భావిస్తాను. ఈ లేఖలో తోటి స్త్రీలను సోదరీమణుల్లా, మాతృమూర్తుల్లా భావించాలని గుర్తు చేస్తూ రాస్తున్నాను.

స్త్రీలు భూమి మీద తిరిగే పుణ్యదేవతలు. వారికి అపచారం చేసే వారు ధ్వంసమైపోతారు. సమూలంగా వారి వంశం నశిస్తుంది. స్త్రీలు పూజింపదగినవారు. వారికి ఎటువంటి అవమానం జరుగకుండా చూడాలి. తోటి స్త్రీలను సోదరీమణుల్లా, మాతృమూర్తుల్లా భావించి వారికి తగిన గౌరవం ఇవ్వాలని తెలియజేస్తున్నాను.

ఇట్లు,
నీ ప్రియమిత్రుడు,
రాజేష్.

చిరునామా :
పి. అఖిలేష్,
10వ తరగతి, యం.వి.ఆర్. హైస్కూలు,
కుప్పం, చిత్తూరు జిల్లా.

ప్రశ్న 12.
స్త్రీలను గౌరవించడాన్ని ప్రోత్సహిస్తూ పది సూక్తులు రాయండి.
జవాబు:

  1. స్త్రీలు అబలలు కాదు – సబలలు
  2. మహిళలు – మనజాతి మాణిక్యాలు
  3. స్త్రీలను గౌరవించు – శ్రీదేవిని ఇంటికి రప్పించు
  4. స్త్రీలే జాతిరత్నాలు – స్త్రీలే ఆణిముత్యాలు
  5. స్త్రీలను గౌరవిస్తే – మీ అమ్మను గౌరవించినట్లే
  6. స్త్రీలను అవమానపరిస్తే – జాతిని అవమానపరిచినట్లే
  7. స్త్రీలను గౌరవిస్తే – దేవతలు ఆనందిస్తారు
  8. వనితలేని ఇల్లు – వనంతో సమానం
  9. స్త్రీ లక్ష్మీ స్వరూపిణి – స్త్రీ పూజ్యురాలు
  10. స్త్రీని గౌరవించు – మాతృమూర్తిగా ఆదరించు

10th Class Telugu 1st Lesson మాతృభావన 1 Mark Bits

1. వారు మదోన్మాదముతో ప్రవర్తించారు – గీత గీసిన పదంలో గల సంధి ఏది? (S.A. I – 2018-19, June – 17)
A) గుణసంధి
B) యణాదేశ సంధి
C) సవర్ణదీర్ఘ సంధి
D) వృద్ధి సంధి
జవాబు:
A) గుణసంధి

2. చిత్తశుద్ధితో జేసెడి సేవ సేవ – ఇందులోని అలంకారాన్ని గుర్తించండి. (June 2017)
A) లాటానుప్రాసం
B) యమకం
C) ఛేకానుప్రాసం
D) వృత్యానుప్రాసం
జవాబు:
A) లాటానుప్రాసం

3. ధర్మసామ్యము చేత ఉపమేయమును ఉపమానంగా ఊహించుట – ఈ లక్షణం గల అలంకారాన్ని గుర్తించండి. (June 2017)
A) ఉపమ
B) ఉత్ప్రేక్ష
C) రూపకం
D) శ్లేష
జవాబు:
B) ఉత్ప్రేక్ష

4. అనసూయ పతివ్రతలలో శిరోమణి – గీత గీసిన పదానికి వ్యుత్పత్త్యర్థం గుర్తించుము. (March 2017)
A) మంచి అవయవములు గలది.
B) చిత్రమైన వర్ణములు గల మెడ గలది.
C) నీటియందు పుట్టినది.
D) పతిని సేవించుటయే వ్రతముగా గలది.
జవాబు:
D) పతిని సేవించుటయే వ్రతముగా గలది.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 1 మాతృభావన

5. పురాణ వాజ్మయమును చదివి అవగాహన చేసుకోవాలి – గీత గీసిన పదానికి సంధి పేరు గుర్తించండి. (March 2017)
A) యణాదేశ సంధి
B) వృద్ధి సంధి
C) జశ్వసంధి
D) అనునాసిక సంధి
జవాబు:
D) అనునాసిక సంధి

6. ‘స, భ, ర, న, మ, య, వ’ ఏ పద్యానికి చెందిన గణాలు? (March 2017)
A) శార్దూలం
B) మత్తేభం
C) చంపకమాల
D) ఉత్పలమాల
జవాబు:
B) మత్తేభం

7. జననికి, జన్మభూమికి గౌరవమివ్వడం ఉత్తముల లక్షణం – గీత గీసిన పదానికి సరియైన అర్థాన్ని గుర్తించుము. (March 2018)
A) చెల్లి
B) తల్లి
C) నల్లి
D) వల్లి
జవాబు:
B) తల్లి

8. రాజులు యుద్ధములందు ఏనుగులను ఎక్కువగా ఉపయోగించేవారు – గీత గీసిన పదానికి వికృతి రూపం గుర్తించండి. (March 2018)
A) ఏడు
B) రోజు
C) టేడు
D) రాట్టు
జవాబు:
C) టేడు

9. వాన బాగా పడేసరికి ఇల్లు తడిసిన వస్త్రములతో నిండింది – గీత గీసిన పదాలకు నానార్థపదమును గుర్తించుము. (S.A. I – 2018-19, June – ’18)
A) వాసం
B) మోసం
C) సహవాసం
D) వేషం
జవాబు:
A) వాసం

AP SSC 10th Class Telugu Important Questions Chapter 1 మాతృభావన

10. ఆ యేమీ యొక రాణివాసమును …….. అనే పద్యపాదంలో గీత గీసిన పదం ఏ గణమో గుర్తించండి. (June 2018)
A) మ గణం
B) త గణం
C) భ గణం
D) న గణం
జవాబు:
A) మ గణం

11. జాతి, గుణ, క్రియాదులను ఉన్నది ఉన్నట్లు వర్ణించినచో అది ఏ అలంకారమో గుర్తించండి. (S.A. I – 2018-19)
A) సమాసోక్తి
B) స్వభావోక్తి
C) శ్లేష
D) రూపకము
జవాబు:
B) స్వభావోక్తి

12. ఎప్పుడూ అమ్మను కష్టపెట్టకూడదు. (ప్రకృతి గుర్తించండి) (S.A. I – 2018-19)
A) అంభ
B) అంబ
C) అమ్మమ్మ
D) అమ్మవారు
జవాబు:
B) అంబ

13. “అనల జ్యోతుల నీ పతివ్రతల బాపాచారులైడా యంభూ” ఏ పద్యపాదమో గుర్తించండి. (S.I. I – 2018-19)
A) ఉత్పలమాల
B) చంపకమాల
C) శార్దూలము
D) మత్తేభము
జవాబు:
D) మత్తేభము

14. చంపకమాల పద్యపాదంలో యతి స్థానం (S.A. I – 2018-19)
A) 10
B) 11
C) 13
D) 14
జవాబు:
B) 11

15. మాతా ! తప్పు సైరింపుమీ – ఆధునిక వచన వాక్యాన్ని గుర్తించండి. (June 2018)
A) తల్లీ ! తప్పును సైరింపకుము.
B) తల్లీ ! తప్పును క్షమించుమమ్మా !
C) తల్లీ ! ఈ దోషమును సైరింపుము.
D) తల్లీ ! అందరి దోషంబులు సైరింపుము.
జవాబు:
B) తల్లీ ! తప్పును క్షమించుమమ్మా !

AP SSC 10th Class Telugu Important Questions Chapter 1 మాతృభావన

16. వనితా రత్నంబులీ భవ్య హైందవ భూజంగమ పుణ్యదేవతలు – ఈ వాక్యానికి ఆధునిక వచనాన్ని గుర్తించండి. (March 2018)
A) స్త్రీ రత్నాలు ఈ గొప్ప హైందవ భూమిపై తిరిగే పుణ్యదేవతలు.
B) స్త్రీలు ఈ హిందూ భూమిపై సంచరించే పుణ్యదేవతలు కారు.
C) స్త్రీ రత్నాలు హైందవ భూమిపై తిరిగే జంగమదేవతలా?
D) హిందూ భూమిపై తిరిగే స్త్రీలు పుణ్యదేవతలు కావచ్చును.
జవాబు:
A) స్త్రీ రత్నాలు ఈ గొప్ప హైందవ భూమిపై తిరిగే పుణ్యదేవతలు.

17. శివాజీ యవనదేశ స్త్రీని తల్లిగా భావించాడు – దీనికి కర్మణి వాక్యం గుర్తించండి. (March 2011)
A) శివాజీ యవన స్త్రీని తల్లిగా భావించలేదు.
B) శివాజీచే యవన దేశ స్త్రీ తల్లిగా భావించబడలేదు.
C) శివాజీచే యవన దేశ స్త్రీ తల్లిగా భావించబడింది.
D) యవన దేశ స్త్రీ శివాజీ తల్లిగా భావించబడింది.
జవాబు:
C) శివాజీచే యవన దేశ స్త్రీ తల్లిగా భావించబడింది.

18. మా యాజ్ఞన్ గమనింపవో? (ఆధునిక వచన వాక్యాన్ని గుర్తించండి) (S.I. I – 2018-19)
A) మా ఆజ్ఞని గమనింపవా?
B) మా యాజ్ఞ గమనింపవే?
C) మా యాజ్ఞను గమనింపుమా !
D) మా యాజ్ఞ గమనింపుడు !
జవాబు:
A) మా ఆజ్ఞని గమనింపవా?

19. క్రింది వానిలో ‘శత్రర్థకం’ గుర్తించండి.
A) విని
B) వినగలడు
C) వింటూ
D) వినక
జవాబు:
C) వింటూ

AP SSC 10th Class Maths Notes Chapter 14 Statistics

Students can go through AP SSC 10th Class Maths Notes Chapter 14 Statistics to understand and remember the concepts easily.

AP State Syllabus SSC 10th Class Maths Notes Chapter 14 Statistics

→ Statistics is a branch of mathematics which deals with collection, organisation, presentation, analysis and interpretation of numerical data.

→ Data is a collection of actual information which is used to make logical inferences.

→ Arithmetic Mean of raw data:
The Arithmetic Mean (A.M.) of a raw data viz. x1, x2, x3, ……., xn is the sum of values of all observations divided by the number of observations.
Arithmetic Mean (A.M.) = AP SSC 10th Class Maths Notes Chapter 14 Statistics 1
Eg.: Sita secured 23, 24, 24, 22 and 20 marks in a test. Her mean marks are
A.M. = \(\frac{23+24+24+22+20}{5}\) = \(\frac{113}{5}\) = 22.6

AP SSC 10th Class Maths Notes Chapter 14 Statistics

→ A.M. by direct method:
Let x1, x2, x3, ……., xn be observations with respective frequencies f1, f2, ……, fn
i.e., x1 occurs for f1 times, x2 occurs for f2 times, ….., xn occurs for fn times.
AP SSC 10th Class Maths Notes Chapter 14 Statistics 2

→ For a grouped data, it is assumed that the frequency of each class interval is centered around its mid-point and the A.M. is given by A.M. = \(\frac{\Sigma \mathrm{f}_{\mathrm{i}} \mathrm{x}_{\mathrm{i}}}{\Sigma \mathrm{f}_{\mathrm{i}}}\)

→ A.M. by deviation method, \(\overline{\mathbf{x}}=\mathbf{a}+\frac{\Sigma \mathbf{f}_{\mathbf{i}} \mathbf{d}_{\mathbf{i}}}{\Sigma \mathbf{f}_{\mathbf{i}}}\)
where, a – assumed mean
di – deviation = xi – a.
Step – 1: Choose ‘a’ from the central values.
Step – 2: Obtain di by subtracting a from xi.
Step – 3: Multiply fi and di.
Step – 4: Find ∑fidi and ∑fi .
Step – 5: Find \(\overline{\mathbf{x}}=\mathbf{a}+\frac{\Sigma \mathbf{f}_{\mathbf{i}} \mathbf{d}_{\mathbf{i}}}{\Sigma \mathbf{f}_{\mathbf{i}}}\)

→ A.M. by step-deviation method:
AP SSC 10th Class Maths Notes Chapter 14 Statistics 5
Step – 1: Choose ‘a’ from mid values.
Step – 2: Obtain ui = \(\frac{x_{i}-a}{h}\).
Step – 3: Multiply fi and ui.
Step – 4: Find Efiui and Sfi.
Step – 5: Find \(\overline{\mathrm{x}}=\mathrm{a}+\left(\frac{\Sigma \mathrm{f}_{\mathrm{i}} \mathrm{u}_{\mathrm{i}}}{\Sigma \mathrm{f}_{\mathrm{i}}}\right) \times \mathrm{h}\)

AP SSC 10th Class Maths Notes Chapter 14 Statistics

→ Mode : Mode is the size of variable which occurs most frequently.

→ Mode of a grouped data:
AP SSC 10th Class Maths Notes Chapter 14 Statistics 3
Where, l – lower boundary of the modal class,
h – size of the modal class interval,
f1 – frequency of modal class.
f0 – frequency of the class preceding the modal class.
f2 – frequency of the class succeeding the modal class.

→ Median: Median is defined as the measure of the central items when they are in descending or ascending order of magnitude.

→ Median for a grouped data:
AP SSC 10th Class Maths Notes Chapter 14 Statistics 4
where,
l – lower boundary of median class,
n – number of observations.
cf – cumulative frequency of class preceding the median class.
f – frequency of median class.
h – size of the median class.

→ Cumulative frequency curve or an ogive:
First we prepare the cumulative frequency table, then the cumulative frequencies are plotted against the upper or lower limits of the corresponding class intervals. By joining the points the curve so obtained is called a cumulative frequency or ogive.
Ogives are of two types.

  1. Less than ogive: Plot the points with the upper limits of the classes as abscissa and the corresponding less than cumulative frequencies as ordinates. The points are joined by free hand smooth curve to give less than cumulative frequency curve or the less than ogive. It is a rising curve.
  2. Greater than ogive: Plot the points with the lower limits of the classes as abscissa and the corresponding greater than cumulative frequencies as ordinates. Join the points by a free hand smooth curve to get the greater than ogive. It is a falling curve.

When the points are joined by straight lines, the figure obtained is called cumulative frequency polygon.

AP SSC 10th Class Maths Notes Chapter 14 Statistics

→ Median can be obtained from cumulative frequency curve: From \(\frac{n}{2}\) frequency draw a line parallel to X-axis cutting the curve at a point. From this point draw a perpendicular to the axis. The point at which the perpendicular meets the X – axis determines the median.

Less than type and greater than type curves intersects at a point. From this point of intersection if we draw a perpendicular on the X-axis then this cuts X-axis at some point. This point gives the median.

AP SSC 10th Class Maths Notes Chapter 13 Probability

Students can go through AP SSC 10th Class Maths Notes Chapter 13 Probability to understand and remember the concepts easily.

AP State Syllabus SSC 10th Class Maths Notes Chapter 13 Probability

→ Theory of probability has its origin date back to 16th century.

→ J. Cardan, an Italian physician and mathematician wrote the first book on probability named “The Book of Games of Chance”.

AP SSC 10th Class Maths Notes Chapter 13 Probability

→ James Bernoulli (1654 – 1705), A.De Moivre (1667 – 1754) and Pierre Simon Laplace (1749 – 1827) made significant contribution to the theory of probability.

→ Experimental or empirical probability : The probability estimated on the basis of results of an actual experiment is called experimental probability of empirical probability.
Eg : An unbiased coin is tossed for 1000 times, head turned up for 455 times and tail turned up 545 times, then the probability or likelyhood of getting a head is = \(\frac{455}{1000}\) = 0.455.

Thus experimental probability = \(\frac{\text { No. of trials in which the event happened }}{\text { Total no. of trials }}\)

→ Classical or Theoretical probability: Classical probability of an event (E) is defined Number as

P(E) = \(\frac{\text { Number of outcomes favourable to E }}{\text { No. of all possible outcomes of the experiment }}\)

This definition was given by ‘Pierre Simon Laplace’.
Eg: The probability of getting a head when a coin is tossed is given by Number of outcomes favourable to this event getting a head = 1 Number of all possible outcomes of this experiment = 2 (Head, Tail)

∴ P(E) = \(\frac{\text { No. of favourable outcomes }}{\text { Total events }}\) = \(\frac{1}{2}\)

Note: If an experiment is conducted for many number of times, then the experimental probability may become closer and closer to theoretical probability.
AP SSC 10th Class Maths Notes Chapter 13 Probability 1

AP SSC 10th Class Maths Notes Chapter 13 Probability

→ The probability of a sure event is 1.

→ The probability of an impossible event is zero.

→ The probability of an event E is a number P(E) such that 0 ≤ P(E) ≤ 1.

→ An event having only one outcome is called an elementary event. The sum of the probabilities of all the elementary events of an experiment is 1.

→ For any event E, P(E) + P(\(\overline{\mathrm{E}}\)) = 1, where E and \(\overline{\mathrm{E}}\) are complementary events.

→ Playing cards and their probability : A deck of playing cards consists of 52 cards which are divided into four suits of 13 cards each.
They are:
AP SSC 10th Class Maths Notes Chapter 13 Probability 2

→ The cards in each suit are:
AP SSC 10th Class Maths Notes Chapter 13 Probability 3
Eg : When a card is drawn at random from a deck of cards then

  • Getting a black or red card – equally likely exhaustive events.
  • Getting an ace or king – mutually exclusive.
    AP SSC 10th Class Maths Notes Chapter 13 Probability 4
  • Getting an ace or a hearts – not mutually exclusive since the hearts contain an ace.
    AP SSC 10th Class Maths Notes Chapter 13 Probability 5

AP SSC 10th Class Maths Notes Chapter 13 Probability

→ When a coin is tossed, the outcomes are H, T (Head, Tail).

→ When a dice is thrown the outcomes are 1, 2, 3, 4, 5 and 6.

→ When two dice are thrown, the outcomes are
AP SSC 10th Class Maths Notes Chapter 13 Probability 6

→ If a coin is tossed n-times or n – coins are tossed simultaneously, then the number of total outcomes = 2n.

→ If a dice is thrown for n – times or n – dice are thrown simultaneously then the number of total outcomes = 6n.

AP SSC 10th Class Maths Notes Chapter 12 Applications of Trigonometry

Students can go through AP SSC 10th Class Maths Notes Chapter 12 Applications of Trigonometry to understand and remember the concepts easily.

AP State Syllabus SSC 10th Class Maths Notes Chapter 12 Applications of Trigonometry

→ If a person is looking at an object then the imaginary line joining the object and the eye of the observer is called the line of sight or ray of view.
AP SSC 10th Class Maths Notes Chapter 12 Applications of Trigonometry 1

→ An imaginary line parallel to earth surface and passing through the point of observation is called the horizontal.

→ If the line of sight is above the horizontal then the angle between them is called “angle of elevation”.
AP SSC 10th Class Maths Notes Chapter 12 Applications of Trigonometry 2

→ If the line of sight is below the horizontal then the angle between them is called the angle of depression.
AP SSC 10th Class Maths Notes Chapter 12 Applications of Trigonometry 3

→ Useful hints to solve the problems:

  1. Draw a neat diagram of a right triangle or a combination of right triangles if necessary.
  2. Represent the data given on the triangle.
  3. Find the relation between known values and unknown values.
  4. Choose appropriate trigonometric ratio and solve for the unknown.

→ The height or length of an object or the distance between two distant objects can be determined with the help of trigonometric ratios.

→ To use this application of trigonometry, we should know the following terms.

→ The terms are Horizontal line, Line of Sight, Angle of Elevation and Angle of Depression.

→ Horizontal line: A line which is parallel to earth from observation point to object is called “horizontal line”.
AP SSC 10th Class Maths Notes Chapter 12 Applications of Trigonometry 4

→ Line of Sight (or) Ray of Vision: The line of sight is the line drawn from the eye of an observer to the point in the object viewed by the observer.

→ Angle of Elevation: The line of sight is above the horizontal line then angle between the line of sight and the horizontal line is called “angle of elevation”.
AP SSC 10th Class Maths Notes Chapter 12 Applications of Trigonometry 5
Note:

  1. If the angle of observer moves towards the perpendicular line (pole/tree/ building), then angle of elevation increases and if the observer moves away from the perpendicular line (pole/tree/building), then angle of elevation decreases.
  2. If height of tower is doubled and the distance between the observer and foot of the tower is also doubled, then the angle of elevation remains same.
  3. If the angle of elevation of sun above a tower decreases, then the length of shadow of a tower increases.

→ Angle of Depression: The line of sight is below the horizontal line then angle between the line of sight and the horizontal line is called angle of depression.
AP SSC 10th Class Maths Notes Chapter 12 Applications of Trigonometry 6
Note:

  1. The angle of elevation and depression are always acute angles.
  2. The angle of elevation of a point P as seen from a point ‘O’ is always equal to the angle of depression of ‘O’ as seen from P.

→ Points to be kept in mind:
I. Trigonometric ratios in a right triangle:
AP SSC 10th Class Maths Notes Chapter 12 Applications of Trigonometry 7
AP SSC 10th Class Maths Notes Chapter 12 Applications of Trigonometry 8

II. Trigonometric ratios of some specific angles:
AP SSC 10th Class Maths Notes Chapter 12 Applications of Trigonometry 9

→ Solving Procedure:
When we want to solve the problems of height and distances, we should consider the following :

  1. All the objects such as tower, trees, buildings, ships, mountains, etc. shall be considered as linear for mathematical convenience.
  2. The angle of elevation or angle of depression is considered with reference to the horizontal line.
  3. The height of the observer is neglected, if it is not given in the problem.
  4. To find heights and distances, we need to draw figures and with the help of these figures we can solve the problems.

AP SSC 10th Class Maths Notes Chapter 11 Trigonometry

Students can go through AP SSC 10th Class Maths Notes Chapter 11 Trigonometry to understand and remember the concepts easily.

AP State Syllabus SSC 10th Class Maths Notes Chapter 11 Trigonometry

→ In our daily life, we can measure the heights, distances and slopes by using some mathematical techniques.

→ The mathematical techniques which come under a branch of mathematics is called ‘trigonometry’.

→ “Trigonometry” is the study of relationships between the sides and angles of a triangle.

AP SSC 10th Class Maths Notes Chapter 11 Trigonometry

→ Early astronomers used to find out the distances of the stars and planets from the Earth. Even today, most of the technologically advanced methods used in engineering and physical sciences are based on trigonometrical concepts.

→ Naming the sides in a right triangle:
Let’s take a right triangle ABC as shown in the figure.
AP SSC 10th Class Maths Notes Chapter 11 Trigonometry 1
Consider ∠CAB as A where angle ‘A’ is acute.
Since AC is the longest side, it is called “Hypotenuse”.

→ Now observe the position of side BC with respect to angle A. It is opposite to angle ‘A’ and we can call it as “Opposite side of angle A”.

→ And the remaining side AB can be called as “Adjacent side of angle A”.

→ Trigonometric Ratios:
The ratios of the sides of a right angled triangle with respect to its acute angles, are called Trigonometric ratios.

→ Consider a right angled triangle ABC having right angle at B as shown in the given figure.
AP SSC 10th Class Maths Notes Chapter 11 Trigonometry 2
Then, trigonometric ratios of the angle A in right angled triangle ABC are defined as follows:
AP SSC 10th Class Maths Notes Chapter 11 Trigonometry 3

→ There are three more ratios defined in trigonometry which are considered as multiplicative inverse of the above three ratios.

AP SSC 10th Class Maths Notes Chapter 11 Trigonometry

→ Multiplicative inverse of “sine A” is “cosecant A”.
i.e., cosec A = \(\frac{1}{\sin A}\) = \(\frac{\text { Hypotenuse }}{\text { Opposite side of the angle } A}\)

→ Multiplicative inverse of “cosine A” is “secant A”.
i.e., sec A = \(\frac{1}{\cos A}\) = \(\frac{\text { Hypotenuse }}{\text { Adjacent side of the angle } A}\)

→ Multiplicative inverse of “tangent A” is “cot A”.
i.e., cot A = \(\frac{1}{\tan A}\) = \(\frac{\text { Adjacent side of the angle } A}{\text { Opposite side of the angle } A}\)

Note:
i) The values of the trigonometric ratios of an angle do not vary with the lengths of the sides of the triangles, if the angle remains the same.
ii) Each trigonometric ratio is a real number and has no unit.
iii) “sin θ” is one symbol and sin, cos, tan etc., cannot be separated from θ.
iv) If one of the trigonometric ratios of an acute angle is known, the remaining trigonometric ratios of angle can be easily determined.
v)
AP SSC 10th Class Maths Notes Chapter 11 Trigonometry 4

→ Trigonometric ratios of some specific angles:
The values of various trigonometric ratios of 0°, 30°, 45°, 60° and 90°.
AP SSC 10th Class Maths Notes Chapter 11 Trigonometry 5
Note:
i) The values of “sin θ” and “cos θ” always lie between ‘0’ and ‘1’.
ii) In the case of tan θ, the values increase from 0 to ∞ (not determinate).
iii) In the case of cot θ, the values decrease from ∞ to 0.
iv) In the case of cosec θ, the values decrease from ∞ to 1.
v) In the case of sec θ, the values increase from 1 to ∞.

AP SSC 10th Class Maths Notes Chapter 11 Trigonometry

→ Trigonometric ratios of complementary angles:
Two angles are said to be complementary, if their sum is equal to 90°.
In a right angled triangle, if ∠B = 90°, then ∠A + ∠C = 90° i.e., ∠A and ∠C form a pair of complementary angles.
If ‘θ’ is an acute angle, then we can prove that
sin (90 – θ) = cos θ
cos (90 – θ) = sin θ
tan (90 – θ) = cot θ
cot (90 – θ) = tan θ
sec (90 – θ) = cosec θ
cosec (90 – θ) = sec θ

→ Trigonometric Identity: An identity equation having trigonometric ratios of an angle is called trigonometric identity. It is true for all the values of the angles involved in it.
We have three major trigonometric identities. They are
i) sin2 A + cos2 A = 1
ii) sec2 A – tan2 A = 1
iii) cosec2 A – cot2 A = 1
Note: sin2 θ = (sin θ)2 but sin θ2 ≠ (sin θ)2

AP SSC 10th Class Maths Notes Chapter 10 Mensuration

Students can go through AP SSC 10th Class Maths Notes Chapter 10 Mensuration to understand and remember the concepts easily.

AP State Syllabus SSC 10th Class Maths Notes Chapter 10 Mensuration

→ A solid is a geometrical shape with three dimensions namely length, breadth and height.
Eg:
AP SSC 10th Class Maths Notes Chapter 10 Mensuration 1

AP SSC 10th Class Maths Notes Chapter 10 Mensuration

→ A solid has two types of area namely,
a) Lateral Surface Area (L.S.A.)
b) Total Surface Area (T.S.A,)

→ In general, L.S.A. of a solid is the product of its base perimeter and height.
Eg : L.S.A. of a cuboid = 2h(l + b)
L.S.A. of a cylinder = 2πrh

→ The T.S.A. of a solid is the sum of L.S.A. and the areas of its top and base.
Eg : T.S.A. of a cylinder = 2πrh + 2πr2
= 2πr(r + h)

→ In general, the volume of a solid is the product of its base area and height.
V = A. h
Eg: Volume of a cube = a2 . a = a3
Volume of a cylinder = πr2 . h = πr2h

AP SSC 10th Class Maths Notes Chapter 10 Mensuration

→ The volume of solid formed by joining two basic solids is the sum of volumes of the constituents.

→ Surface area of the combination of solids: In calculating the surface area of the solid which is a combination of two or more solids, we can’t add the surface areas of all its constituents, because some part of the surface area disappears in the process of joining them.

→ Surface areas and volume of different solid shapes:
AP SSC 10th Class Maths Notes Chapter 10 Mensuration 2
AP SSC 10th Class Maths Notes Chapter 10 Mensuration 3

AP SSC 10th Class Maths Notes Chapter 10 Mensuration

→ Some solid figures and their combination shapes:
AP SSC 10th Class Maths Notes Chapter 10 Mensuration 4
AP SSC 10th Class Maths Notes Chapter 10 Mensuration 5