AP 9th Class Social Important Questions Chapter 23 విపత్తుల నిర్వహణ

These AP 9th Class Social Important Questions 23rd Lesson విపత్తుల నిర్వహణ will help students prepare well for the exams.

AP Board 9th Class Social 23rd Lesson Important Questions and Answers విపత్తుల నిర్వహణ

9th Class Social 23rd Lesson 1 Mark Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
వైపరీత్యా లేవి?
జవాబు:
మానవుల నిర్లక్ష్యం వల్ల లేదా కావాలని ఒక వ్యక్తి లేదా బృందం చేసే పనుల వల్ల ఏర్పడే వైపరీత్యాలను మానవ కారణంగా ఏర్పడే వైపరీత్యాలని చెప్పవచ్చు.

ప్రశ్న 2.
అధికశాతం రోడ్డు ప్రమాదాలు ఎలా జరుగుతున్నాయి?
జవాబు:
అధికశాతం ప్రమాదాలు నిర్లక్ష్యం, ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించడం, తాగి వాహనం నడపటం, వాహనాలు సరైన స్థితిలో ఉండకపోవటం, వాతావరణ పరిస్థితులు సరిగా లేకపోవటం వంటి కారణాల వల్ల జరుగుతున్నాయి.

ప్రశ్న 3.
రైలు ప్రమాదాలు ఎందుకు జరుగుతాయి?
జవాబు:
రైలు మార్గాల నిర్వహణ సరిగా లేకపోవటం, మానవ పొరపాటు, విద్రోహ చర్యలు వంటి వాటి కారణంగా ప్రమాదాలు జరుగుతుంటాయి.

ప్రశ్న 4.
విమాన ప్రమాదాలకు కారణాలేవి?
జవాబు:
విమానాల పెరుగుదల, సాంకేతిక సమస్యలు, అగ్ని, పైకి ఎగిరేటప్పుడు ఉండే. పరిస్థితులు, విమానం వెళ్ళే దారి, హైజాకింగ్, బాంబు దాడుల వంటి సమయాల్లో విమానాశ్రయాల్లో ఉండే భద్రత వంటి అనేక అంశాలు విమాన ప్రమాదాలకు కారణాలవుతున్నాయి.

AP 9th Class Social Important Questions Chapter 23 విపత్తుల నిర్వహణ

ప్రశ్న 5.
నిప్పును ఎలా ఆపవచ్చు?
జవాబు:
వేడిమి, ఇంధనం, ప్రాణవాయువు – ఈ మూడు కలిసినప్పుడు అగ్ని ప్రమాదం జరుగుతుంది. ఈ మూడింటిలో ఏదో ఒకటి అందకుండా చేయటం ద్వారా నిప్పును ఆపవచ్చు.

ప్రశ్న 6.
ప్రకృతి వైపరీత్యాలు అని వేటిని చెప్పవచ్చు?
జవాబు:
ప్రకృతి సిద్ధంగా మానవ ప్రమేయం లేకుండా సంభవించే తుపాన్లు, సునామీలు, వరదలు, భూకంపాలు, అగ్ని పర్వతాలు పేలడం, కొండచరియలు విరిగిపడటం మొ||నవి ప్రకృతి వైపరీత్యాలని చెప్పవచ్చు.

ప్రశ్న 7.
మానవుల కారణంగా ఏర్పడే విపత్తులకు ఉదాహరణలు ఇవ్వండి.
జవాబు:

  1. రోడ్డు, రైలు, విమాన ప్రమాదాలు.
  2. అగ్నిమాపక ప్రమాదాలు.
  3. ఉగ్రవాద చర్యలు మొదలైనవి.

9th Class Social 23rd Lesson 2 Marks Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
వాహనాలను ఏ వ్యక్తులు నడపరాదు?
జవాబు:

  1. మద్యం సేవించి ఉన్నవారు.
  2. జబ్బు పడినవారు, గాయాల పాలైనవారు.
  3. కోపంగా లేదా ఆందోళనగా ఉన్నవారు.
  4. అలసిపోయి ఉన్నవారు.
  5. ఏకాగ్రత లేనివారు.

ప్రశ్న 2.
ఘోర ఘటనల తరవాత తల్లిదండ్రులకు గల సూచనలు ఏవి?
జవాబు:

  1. ఘోర ఘటనల తరవాత పెద్దవాళ్ళు మొట్టమొదట తమ పిల్లలపై దృష్టి పెట్టాలి.
  2. వాస్తవాలను, పుకార్లను వేరు చేయటంలో పిల్లలకు ‘సహాయపడాలి.
  3. తెలిసిన వాస్తవాలను పిల్లలతో చర్చించి ఊహగానాలకు, అతిశయోక్తులకు తెరదించాలి.

AP 9th Class Social Important Questions Chapter 23 విపత్తుల నిర్వహణ

ప్రశ్న 3.
అగ్ని ప్రమాద సమయంలో చేయవలసిన పనులు మూడు రాయండి.
జవాబు:
అగ్ని ప్రమాద సమయంలో

  1. నిప్పు లేదా పొగ చూసినప్పుడు అలారం మ్రోగించాలి లేదా హెచ్చరిక జారీ చేయాలి.
  2. ఫోన్ ఎక్కడుందో తెలుసుకొని 101 కి ఫోన్ చేయండి. నిదానంగా, స్థిమితంగా మీ చిరునామా చెప్పి అగ్నిమాపక దళాన్ని పంపమని చెప్పండి.
  3. విద్యుత్ స్విచ్చులన్నీ తీసేసి ఉంచాలి. మెయిన్ స్విచ్ ను కట్టేయటం ఉత్తమం.

ప్రశ్న 4.
మన దేశంలో విమాన ప్రమాదాలకు గల కారణాలు ఏవి?
జవాబు:
విమాన ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. దీనికి అనేక కారణాలు ఉన్నాయి.

  • విమానాల పెరుగుదల
  • విమానాలలో తలెత్తే సాంకేతిక సమస్యలు .
  • విమానాలు దిగేటప్పుడు, పైకి ఎగిరేటప్పుడు ఉండే పరిస్థితులు
  • విమానం వెళ్ళే దారిలో పర్వతాలు ఉండడం లేదా తరచు తుపానులు సంభవించటం ఊ హైజాకింగ్
  • బాంబు దాడులు మొదలగునవి.

AP 9th Class Social Important Questions Chapter 22 మహిళా రక్షణ చట్టాలు

These AP 9th Class Social Important Questions 22nd Lesson మహిళా రక్షణ చట్టాలు will help students prepare well for the exams.

AP Board 9th Class Social 22nd Lesson Important Questions and Answers మహిళా రక్షణ చట్టాలు

9th Class Social 22nd Lesson 1 Mark Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
అక్రమ రవాణా రూపాలు ఏవి?
జవాబు:
లైంగిక దాడి, చట్ట వ్యతిరేక కార్యగ-2 వెస్ట్ – 30, ఇళ్లలో పని, వ్యవసాయకూలీ, నిర్మాణకూలీల చేత ఎక్కువ పని చేయించుకొని వారి శ్రమను దోచుకోవడం, పైశాచిక ఆనందం మొ||నవి అక్రమ రవాణా రూపాలు.

ప్రశ్న 2.
సెక్స్ వర్కర్స్ అనగా నారు?
జవాబు:
బలవంతంగా వ్యభిచారం చేయించడం నేరం. ఈ విధంగా వ్యభిచారం చేసే వారిని సెక్స్ వర్కర్స్ అంటారు. వీరి రక్షణకు సంబంధించిన ఎన్నో చట్టాలు అమల్లో ఉన్నాయి.
(లేదా)
బలషంతంగా వ్యభిచారం చేయించి, ఆ తదుపరి తప్పనిసరి పరిస్థితులలో వ్యభిచారం చేసే వారిని సెక్స్ వర్కర్స్ అంటారు.

ప్రశ్న 3.
అక్రమ రవాణాకు శిక్ష ఎలాంటిది?
జవాబు:
అక్రమ రవాణా ఒక పెద్ద నేరం. ఈ నేరానికి 7 సం||రాల కఠిన కారాగార శిక్ష నుండి జీవిత ఖైదు వరకు శిక్షతో పాటు జరిమానా కూడా విధించవచ్చు.

AP 9th Class Social Important Questions Chapter 22 మహిళా రక్షణ చట్టాలు

ప్రశ్న 4.
గృహ హింస రూపాలు ఏవి?
జవాబు:
గృహ హింస రూపాలు :
లైంగిక అత్యాచారం, భౌతిక అత్యాచారం, మానసిక క్షోభకు గురిచేయటం, మానసిక అత్యాచారం, ఆర్థిక అత్యాచారం.

ప్రశ్న 5.
న్యాయ సహాయం పొందటానికి అర్హులు ఎవరు?
జవాబు:
షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలవారు, మానవ అక్రమ రవాణా బాధితులు, యాచకులు, స్త్రీలు, పిల్లలు, మతిస్థిమితం లేని వారు, అవిటివారు, ప్రకృతి వైపరీత్యాల బాధితులు, వ్యవసాయ, పారిశ్రామిక కార్మికులు, హిరసాకాండ, కులవైషమ్యాల బాధితులు, రూ. 50,000 కంటే తక్కువ సాంవత్సరిక ఆదాయం కలవారు న్యాయసహాయం పొందటానికి అర్హులు.

ప్రశ్న 6.
ఉచిత న్యాయసహాయం కోరేవారు ఎవరికి దరఖాస్తు చేసుకోవాలి?
జవాబు:
ఉచిత న్యాయ సహాయం కోరువారు తమ తమ జిల్లాలకు చెందిన జిల్లా కోర్టులందు, రాష్ట్ర హైకోర్టునందు గల జిల్లా ఆ న్యాయసేవా అధికార సంస్థలకు గాని తమ కేసు వివరాలను తెలుపుతూ దరఖాస్తు చేసుకోవచ్చును.

ప్రశ్న 7.
న్యాయ సహాయ విధానాలు ఏవి?
జవాబు:
న్యాయ సహాయ విధానాలు – న్యాయవాదిచే ఉచితంగా న్యాయ సలహా ఇప్పించుట, కోర్టులో కేసులు చేపట్టడం, కోర్టు ఫీజు, కేసుకు సంబంధించిన కోర్టు ఖర్చులు భరించడం, కేసులలో తీర్పుల నకళ్లు ఉచితంగా ఇవ్వడం మొదలైన సహాయాలు అందించబడతాయి.

ప్రశ్న 8.
మహిళల మరియు బాలికల సంరక్షణకు భారత ప్రభుత్వం అనేక చట్టాలను చేసింది. భారత ప్రభుత్వం అమలు చేసిన .. అలాంటి ఏవైనా రెండు చట్టాలను పేర్కొనండి.
జవాబు:

  1. బాల్య వివాహాల నిషేధ చట్టం – 2006
  2. అక్రమ రవాణా నిరోధక చట్టం – 1956
  3. వరకట్న నిషేధ చట్టం – 1961
  4. అత్యాచారం, లైంగిక వేధింపుల చట్టం (నిర్భయ చట్టం) – 2013

9th Class Social 22nd Lesson 2 Marks Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
బాల్య వివాహ నిషేధ చట్టం అమలులో ఉన్నా అక్కడక్కడా బాల్య వివాహాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఈ దురాచారాన్ని ఆపడానికి కొన్ని చర్యలను సూచించండి. ,
జవాబు:

  1. మొదటగా తల్లిదండ్రులకు బాలికలకు విద్యను ఇవ్వడం వల్ల కలిగే లాభాలను వివరించడం.
  2. బాల్య వివాహం వలన కలిగే అనర్థాలను వివరించి వారిలో చైతన్యం తీసుకువచ్చి బాల్య వివాహాలను ఆపివేయించాలి.
  3. కొంతమంది తల్లిదండ్రులు మూర్బంగా వ్యవహరిస్తే అప్పుడు అధికారులకు సమాచారం అందించి వివాహాలను ఆపివేయించాలి.
  4. బాల్యవివాహాల వలన కలిగే అనర్థాలను టి.వి., షార్ట్ ఫిలిమ్ ల ద్వారా వారికి ప్రత్యక్ష సంఘటనలను మరియు పరోక్ష సంఘటనలను గురించి వివరించాలి.

AP 9th Class Social Important Questions Chapter 22 మహిళా రక్షణ చట్టాలు

ప్రశ్న 1.
అక్రమ రవాణా అంటే ఏమిటి?
జవాబు:
అక్రమ రవాణా అంటే వ్యక్తులను వారి ఇష్టానికి విరుద్దంగా తరలించడం, అధికారికంగా లొంగదీసుకోవటం, భయపెట్టి పని చేయించుట, జీవనోపాధి లేదా వివాహం లాంటి ఆశ చూపి తెలియని ప్రాంతాలకు తరలించి వెట్టిచాకిరి చేయించడం, లైంగిక దోపిడీ లాంటి కృత్యాలకు పాల్పడటం లేదా అమ్మకానికి పెట్టడం.

ప్రశ్న 2.
బాల్య వివాహం చేసుకుంటే పురుషుడికి విధించే శిక్ష?
జవాబు:
18 సం||లు నిండని బాలికను పురుషుడు వివాహం చేసుకుంటే 2 సంవత్సరాల జైలు శిక్ష లేదా లక్ష రూపాయల వరకు జరిమానా.

ప్రశ్న 3.
బాలల హక్కులు ఏవైనా నాలుగు వ్రాయుము.
జవాబు:
బాలల హక్కులు :

  1. జీవితం – జీవించే హక్కు
  2. సాధ్యమైనంతవరకూ బాలలు తల్లిదండ్రులతో కలసి ఉండడం.
  3. బాలల విద్యకు, ఆరోగ్యానికి హాని కలిగించే పని చేయకుండా ఉండడం.
  4. బాలలు సంపూర్ణ ఆరోగ్యం, వైద్య సౌకర్యం పొందే హక్కు,

ప్రశ్న 4.
బాల్య వివాహం అంటే ఏమిటి?
జవాబు:
పురుషునికి 21 సం||లు, స్త్రీకి 18 సం||లు నిండకుండా జరిపించే పెండ్లి.

ప్రశ్న 5.
పాఠ్య పుస్తకంలోని ఆప ‘బడి” న బాల్య వివాహం – ఒక విజయగాథ ఏ జిల్లాలో జరిగింది? ఆ బాలిక పేరేమి?
జవాబు:
మహబూబ్ నగర్ జిల్లా, అచ్చంపేట మండలం, బొమ్మనపల్లి గ్రామం. ఆ బాలిక పేరు ఎర్రమోని సరిత.

ప్రశ్న 6.
చట్ట వ్యతిరేక కార్యకలాపాలు ఏవి?
జవాబు:

  1. అక్రమ రవాణాకు గురైన వారిచే భిక్షాటన
  2. మానవ అవయవాల అమ్మకం
  3. మత్తు మందుల అక్రమ వ్యాపారం

ప్రశ్న 7.
కార్మికులు అంటే ఎవరు?
జవాబు:
వెట్టిచాకిరి చేసేవారు, ఇళ్ళలో పనిచేసేవారు, వ్యవసాయ కూలీ, నిర్మాణ కూలీలు మొ||వారు.

AP 9th Class Social Important Questions Chapter 22 మహిళా రక్షణ చట్టాలు

ప్రశ్న 8.
వరకట్న నిషేధ చట్టం పరిధిలోకి వచ్చే అంశాలు ఏవి?
జవాబు:
వివాహం అనంతరం అమ్మాయిని వేధించడం, తిట్టడం, కొట్టడం, ఒక్కోసారి చంపివేయటం, కొన్నిసార్లు బాధలు భరించలేక స్త్రీలు ఆత్మహత్యలు చేసుకోవడం మొదలైనవి ఈ చట్టం పరిధిలోకి వస్తాయి.

ప్రశ్న 9.
లైంగిక దాడి అంటే ఏమిటి?
జవాబు:
లైంగిక దాడి అంటే బలవంతపు వ్యభిచారం, సాంఘిక, మతపరమైన వ్యభిచారం (జోగిని, మాతాంగి, దేవదాసి మొ||నవి) పర్యాటక రంగంలో లైంగిక దోపిడి, అసభ్యత అశ్లీల రచనలు – చిత్రాలు ‘మొ||నవి.

ప్రశ్న 10.
వరకట్న నిషేధ చట్టం ఉల్లంఘించిన వారికి విధించే శిక్ష ఏమిటి?
జవాబు:
5 సం||ల వరకు జైలు శిక్ష, 15 వేలు వరకు జరిమానా లేదా కట్నం విలువ మొత్తంలలో ఏది ఎక్కువైతే ఆ మొత్తం జరిమానా విధించబడును.

ప్రశ్న 11.
గృహహింస అంటే ఏమిటి?
జవాబు:
కుటుంబ సంబంధాల్లో ఉన్న స్త్రీకి లేదా ఆమె సంతానానికి అదే కుటుంబంలోని వ్యక్తుల వల్ల హింసాపూరిత చర్యలు, ఇబ్బందులు కలిగినట్లయితే దానిని గృహహింసగా చెప్పవచ్చును.

ప్రశ్న 12.
సమాజంలో మహిళలు ఎదుర్కొను సమస్యలు ఏవి?
జవాబు:
మన సమాజంలో మహిళలు అనేక సమస్యలు, ఇంటా బయటా ఎదుర్కొంటున్నారు. ఆడ పిల్లలు బడికి వెళ్ళడానికి కూడా భయపడుతున్నారు. ముఖ్యంగా స్త్రీలను మాటలతో వేధించడం, బాధించడం, తక్కువ చేసి మాట్లాడటం, ఎగతాళి చేయడం, శారీరకంగా, మానసికంగా, లైంగికంగా హింసించడం.

ప్రశ్న 13.
అంతర్జాతీయ బాలల హక్కుల ఒడంబడిక ఎప్పుడు జరిగింది? ఎన్ని దేశాలు సంతకం చేశాయి?
జవాబు:
అంతర్జాతీయ బాలల హక్కుల ఒడంబడిక, 1989లో జరిగింది. 191 దేశాలు సంతకం చేశాయి.

AP 9th Class Social Important Questions Chapter 22 మహిళా రక్షణ చట్టాలు

ప్రశ్న 14.
ఉచిత న్యాయ సహాయం ఎవరికి అందించబడుతుంది?
జవాబు:
న్యాయ సహాయం పొందుటకు అర్హులు :

  1. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు చెందినవారు.
  2. మానవ అక్రమ రవాణా బాధితులు, యాచకులు, స్త్రీలు, పిల్లలు, మతి స్థిమితం లేనివారు, అవిటివారు.
  3. ప్రకృతి వైపరీత్యాల బాధితులు, వ్యవసాయ, పారిశ్రామిక కార్మికులు.
  4. రూ. 50,000 కంటే తక్కువ సాంవత్సరిక ఆదాయం కలవారు.

ప్రశ్న 15.
లోక్ అదాలత్ అంటే ఏమిటి?
జవాబు:
ఆర్థిక పరిస్థితులు, ఇతర బలహీనతలు కారణంగా న్యాయాన్ని పొందే అవకాశాలను కోల్పోకుండా ఉండటం కోసం ఉద్దేశించినదే ఉచిత న్యాయస్థానం. దీనినే లోక్ అదాలత్ అంటాం.

ప్రశ్న 16.
న్యాయ సహాయ విధానాలు తెలుపుము.
జవాబు:
న్యాయ సహాయ విధానాలు :

  1. న్యాయవాదిచే ఉచితంగా న్యాయ సలహా ఇప్పించుట.
  2. కేసులను పరిశీలించిన మీదట అవసరమైనచో దరఖాస్తుదారుని తరపున న్యాయవాదులను నియమించి ఆయా కోర్టులలో కేసులు చేపట్టడం.
  3. న్యాయ సహాయం పొందినవారికి కోర్టు ఫీజు, కేసుకు సంబంధించిన కోర్టు ఖర్చులు భరించడం.
  4. న్యాయ సహాయం పొందినవారికి కేసులలో తీర్పుల నకళ్ళు ఉచితంగా ఇవ్వడం మొ||లగు సహాయాలు అందించబడతాయి.

AP 9th Class Social Important Questions Chapter 21 మానవహక్కులు, ప్రాథమిక హక్కులు

These AP 9th Class Social Important Questions 21st Lesson మానవహక్కులు, ప్రాథమిక హక్కులు will help students prepare well for the exams.

AP Board 9th Class Social 21st Lesson Important Questions and Answers మానవహక్కులు, ప్రాథమిక హక్కులు

9th Class Social 21st Lesson 1 Mark Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
ప్రాథమిక హక్కులు అనగానేమి?
జవాబు:
వ్యక్తికి మౌలికమైన కొన్ని హక్కులు ఉన్నాయి, వీటికి రాజ్యాంగంలో ప్రత్యేక స్థానం ఇచ్చారు. ఈ హక్కులను ప్రాథమిక హక్కులంటారు.

ప్రశ్న 2.
రిట్ అనగానేమి?
జవాబు:
రాజ్యాంగ హక్కులను కాపాడటానికి, అమలు అయ్యేలా చూడటానికి ప్రభుత్వానికి న్యాయస్థానం ఆదేశాలు జారీచేసే అధికారాన్ని ‘రిట్’ అంటారు. ఇది న్యాయస్థానాలకు స్వతహాగా లభించే హక్కు.

ప్రశ్న 3.
సమన్యాయపాలన అనగానేమి?
జవాబు:
ప్రభుత్వం ఏ వ్యక్తికీ చట్టం ముందు సమానత్వాన్ని, చట్టాల రక్షణలో సమానత్వాన్ని తిరస్కరించగూడదు అని రాజ్యాంగం పేర్కొంటోంది. దీనిని ‘సమన్యాయపాలన’ అంటారు.

AP 9th Class Social Important Questions Chapter 21 మానవహక్కులు, ప్రాథమిక హక్కులు

ప్రశ్న 4.
వాక్ స్వాతంత్ర్యం, భావ ప్రకటన స్వేచ్ఛ ప్రయోజనాలు ఏవి?
జవాబు:
వాక్ స్వాతంత్ర్యం, భావ ప్రకటన స్వేచ్ఛ : దీనివల్ల వ్యక్తులకు ప్రజా కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం లభిస్తుంది. సమావేశాలు, ప్రచురణలు, నాటకాలు, చిత్రలేఖనం వంటి వివిధ రూపాల ద్వారా తమ అభిప్రాయాలను వ్యక్తపరచవచ్చు.

ప్రశ్న 5.
“బాల కార్మికుల నిర్మూలన” పై రెండు నినాదాలు రాయండి.
జవాబు:

  1. విద్య బాలల భవిష్యత్తు – వారిని చదువుకోనివ్వండి.
  2. బాలకార్మిక విధానం ప్రకృతి విరుద్ధం.

9th Class Social 21st Lesson 2 Marks Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
కింది సందర్భాలను పరిశీలించండి. ప్రతి సందర్భంలో ఏ ప్రాథమిక హక్కుకు భంగం కలిగింది మరియు ఏవిధంగా భంగం కలిగిందో వివరించండి.
అ) ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ డాక్యుమెంటరీ చిత్రాలు తీస్తున్న ఒక దర్శకున్ని అరెస్టు చేసి జైలుకు పంపడం జరిగింది.
ఆ) ఒక 10 సం||రాల బాలున్ని బడికి వెళ్ళనివ్వడం లేదు మరియు బలవంతంగా టపాసుల తయారీ పరిశ్రమలో పని చేయడానికి పంపిస్తున్నారు.
జవాబు:
అ) మొదటి కేసులో ప్రాథమిక హక్కైన ‘వాక్ స్వాతంత్ర్యం, భావ ప్రకటనా స్వేచ్ఛ’ ఉల్లంఘించబడింది. ఎందువలన అనగా ప్రతి వ్యక్తికి తన అభిప్రాయాలను శాంతియుతంగా వ్యక్తీకరించే స్వేచ్ఛ ఉంది. పౌరులు సమావేశాలు, ప్రచురణలు, నాటకాలు, చిత్రలేఖనం, వంటి వివిధ రూపాలలో తమ అభిప్రాయాలను వ్యక్తం చేయవచ్చు. అందువలన ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ డాక్యుమెంటరీ తీయడం తప్పు కాదు. కానీ ఈ స్వేచ్చపై పరిమితి ఉంటుంది. పరిమితికి మించి వ్యక్తిగత విమర్శలకు దిగితే ప్రభుత్వం చట్ట ప్రకారం శిక్ష విధిస్తుంది.)

ఆ) రెండవ కేసులో ప్రాథమిక హక్కు అయిన ‘పీడనాన్ని నిరోధించే హక్కు’ (కర్మాగారాలలో బాలలను పనిలో పెట్టుకోవడం నిషేధం) ఉల్లంఘించబడింది. “14 సంవత్సరాల లోపు బాలలను కర్మాగారాలు, గనులు, ఇతర ప్రమాదకరమైన పనులలో పెట్టుకోవడం నిషేధం” అని రాజ్యాంగం పేర్కొంటోంది. అందువలన ఆ .10 సంవత్సరాల బాలుడు కర్మాగారానికి కాక స్కూల్ కి పంపబడాలి.

ప్రశ్న 2.
ఇచ్చిన అంశాలను సంబంధిత ప్రాథమిక హక్కుల కింది పట్టికలో పొందుపరచండి.
• కర్మాగారాలలో బాలలను పనిలో పెట్టుకోవటం నిషేధం.
• అల్పసంఖ్యాక వర్గాలు తాము ఎంచుకున్న విద్యా సంబంధ సంస్థలు స్థాపించి, నిర్వహించుకునే హక్కు
• బిరుదులు రద్దు
• జీవించే హక్కు
AP 9th Class Social Important Questions Chapter 21 మానవహక్కులు, ప్రాథమిక హక్కులు 1
జవాబు:
AP 9th Class Social Important Questions Chapter 21 మానవహక్కులు, ప్రాథమిక హక్కులు 2

9th Class Social 21st Lesson 4 Marks Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
ప్రాథమిక హక్కులు ఏవి? మెరుగైన జీవనం కొరకు ఇవి మనకు ఏ విధంగా సాయపడుతున్నాయి?
జవాబు:
1) ప్రాథమిక హక్కులు ఆరు :

  1. సమానత్వపు హక్కు,
  2. స్వాతంత్ర్యపు హక్కు,
  3. మత స్వాతంత్ర్యపు హక్కు,
  4. పీడనాన్ని నిరోధించే హక్కు,
  5. సాంస్కృతిక విద్యా విషయపు హక్కు,
  6. రాజ్యాంగ పరిహారపు హక్కు,

2) ఈ పైన తెలుపబడిన హక్కులలో మొదటిది అయిన సమానత్వపు హక్కు ప్రజలందరూ సమానులే అని తెలియజేయడంతో పాటు మన అభివృద్ధికి దోహదపడుతుంది.

3) రెండవ హక్కు ప్రజలందరూ స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలతో తమకు నచ్చిన విధంగా జీవనాన్ని గడపటానికి అవకాశం ఇచ్చింది.

4) మూడవ హక్కు ప్రజలు వారికి నచ్చిన మతాన్ని అనుసరించే విధంగా అవకాశం కల్పించింది.

5) నాల్గవ హక్కు ఎవరూ ఇంకొకరి చేత బలవంతంగా పనిచేయించటం గాని, పని పేరిట హింసించరాదని తెలియచేస్తుంది.

6) ఐదవ హక్కు అల్పసంఖ్యాక వర్గాల వారు కూడా వారి భాష, మతం ఆధారంగా విద్యా సంస్థలను ఏర్పాటుచేసుకుని అభివృద్ధి చెందటానికి అవకాశం కల్పించింది.

7) చివరి హక్కు పై హక్కులలో ఏది ఉల్లంఘనకు గురి అయినా ప్రజలకు కోర్టుల నుండి రక్షణ కల్పించి మరల వారు
హక్కులను పొందేలాగా చేస్తుంది.

AP 9th Class Social Important Questions Chapter 21 మానవహక్కులు, ప్రాథమిక హక్కులు

ప్రశ్న 2.
ప్రాథమిక విధులేవి?
జవాబు:
హక్కులు ఉన్నట్లే మనకు కొన్ని విధులు, బాధ్యతలు ఉన్నాయి.

ప్రతి ఒక్క భారత పౌరుని విధులు :

  1. రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాలి. జాతీయ గీతాన్ని కాని, జాతీయ జెండాను కాని అవమానించకూడదు.
  2. స్వాతంత్ర్యానికి స్ఫూర్తినిచ్చిన జాతీయ ఉద్యమ ఉన్నత ఆదర్శాలను గౌరవించి, అనుసరించాలి.
  3. భారతదేశ సార్వభౌముకత, సమగ్రతలను కాపాడాలి.
  4. దేశ రక్షణకు బాధ్యత వహించాలి.
  5. వివిధ భాషలు, మతాల ప్రజల మధ్య శాంతి, సామరస్యాలను నెలకొల్పాలి. మహిళల గౌరవానికి భంగం కలిగించరాదు.
  6. దేశ పర్యావరణ క్షీణతను నివారించి, మెరుగుపరచాలి.
  7. మనదేశ ఉమ్మడి సంస్కృతి, మహోన్నత, వారసత్వ సంపదను గౌరవించి, కాపాడాలి.
  8. శాస్త్రీయ దృక్పథం, మానవతావాదం, అన్వేషణ, సంస్కరణల దృక్పథాన్ని అలవర్చుకోవాలి.
  9. ప్రజా ఆస్తులను కాపాడాలి.
  10. అన్ని రంగాలలో అత్యున్నత శ్రేణిని అందుకోటానికి కృషి చేయాలి.
  11. పిల్లలను విద్యావంతులుగా చేయాలి.

AP 9th Class Social Important Questions Chapter 20 ప్రజాస్వామ్యం – రూపుదిద్దుకుంటున్న భావన

These AP 9th Class Social Important Questions 20th Lesson ప్రజాస్వామ్యం – రూపుదిద్దుకుంటున్న భావన will help students prepare well for the exams.

AP Board 9th Class Social 20th Lesson Important Questions and Answers ప్రజాస్వామ్యం – రూపుదిద్దుకుంటున్న భావన

9th Class Social 20th Lesson 1 Mark Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
ప్రజాస్వామ్యం ఏ సూత్రంపై ఆధారపడి ఉంది?
జవాబు:
రాజకీయ సమానత్వం, అందరినీ కలుపుకోవటం అన్న మౌలిక సూత్రంపై ప్రజాస్వామ్యం ఆధారపడి ఉంది.

ప్రశ్న 2.
1980 నుండి జింబాబ్వే స్థితి ఏమిటి?
జవాబు:
అల్పసంఖ్యాక శ్వేత జాతీయుల పాలన నుంచి జింబాబ్వే 1980లో స్వాతంత్ర్యం పొందింది. అప్పటినుంచి దేశ స్వాతంత్ర్య .. ఉద్యమానికి నేతృత్వం వహించిన జాను-పీఎఫ్ అన్న పార్టీయే దేశాన్ని పాలిస్తోంది. ఈ పార్టీ నాయకుడు రాబర్ట్ ముగాబే స్వాతంత్ర్యం పొందినప్పటి నుంచి అధ్యక్షుడిగా ఉన్నాడు.

ప్రశ్న 3.
ఎన్నికలు ఎలా జరగాలి?
జవాబు:
ఒకదేశ ప్రజలు ప్రభుత్వంలో తమకు నిజంగా ప్రాతినిధ్యం వహించే సరైన వ్యక్తులను, లేదా పార్టీలను ఎంచుకోవాలంటే ఎన్నికలు స్వేచ్ఛగా, ఎటువంటి భయంలేని వాతావరణంలో నిర్వహించబడటం ఎంతో ముఖ్యం.

ప్రశ్న 4.
ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఎలా ఉండాలి?
జవాబు:
ప్రజాస్వామ్య ప్రభుత్వాలు చట్టాలను గౌరవించాలి. చట్టాలలో పేర్కొన్న న్యాయవ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ స్వతంత్రంగా పనిచేయటాన్ని అనుమతించాలి.

AP 9th Class Social Important Questions Chapter 20 ప్రజాస్వామ్యం – రూపుదిద్దుకుంటున్న భావన

ప్రశ్న 5.
బెల్జియంలో ప్రజలు ఏ భాషలు మాట్లాడతారు?
జవాబు:
యూరప్ ఖండంలో ఒక చిన్న దేశం ‘బెల్జియం’. ఆ దేశ జనాభాలో 59% మంది ఫ్లెమిస్ ప్రాంతానికి చెందిన ‘డచ్’ భాష మాట్లాడే ప్రజలు. మిగిలిన 40% మంది వలోనియా ప్రాంతానికి చెందిన ‘ఫ్రెంచ్’ మాట్లాడే ప్రజలు. మిగిలిన ఒక్కశాతం ‘జర్మన్’ భాష మాట్లాడే ప్రజలు.

ప్రశ్న 6.
బెల్జియం అనుసరించిన విధానాలు ఏవి?
జవాబు:
బెల్జియం అనుసరించిన విధానాలు – ఏ ఒక్క సమూహమూ (భాష) ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోలేదు, కేంద్ర ప్రభుత్వ అధీనంలో రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేయవు, బ్రస్సెల్స్ కి ప్రత్యేక ప్రభుత్వం (ఇందులో రెండు సమూహాలకు సమాన ప్రాతినిధ్యం) మొదలైనవి.

ప్రశ్న 7.
బెల్జియం నాయకులు ఏమి గుర్తించారు?
జవాబు:
వివిధ ప్రాంతాల ప్రజల ప్రయోజనాలు, భావనలను మన్నించినపుడే దేశం ఐక్యంగా ఉంటుందని ‘బెల్జియం’ నాయకులు గుర్తించారు.

9th Class Social 20th Lesson 2 Marks Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
ప్రజాస్వామ్యంలో ‘ఓటు వేయడం’ మరియు “ప్రతినిధులను ఎన్నుకోవడం” ఎందుకు అత్యంత ముఖ్యమైనవి?
జవాబు:
భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ఓటింగ్ ప్రక్రియపై పూర్తిగా ఆధారపడి ఉంది.

  1. ఓటు హక్కు పౌరులు తమకు నచ్చిన ప్రభుత్వాన్ని ఎన్నుకోవటానికి అవకాశం కల్పిస్తుంది.
  2. తమ ప్రాంత వివిధ ప్రజల ఆకాంక్షలను, సమస్యలను వ్యక్తం చేసే తమ ప్రతినిధిని ఎన్నుకోవటానికి ఓటు, వీలు కల్పిస్తుంది.
  3. ప్రజాస్వామ్యంలో ప్రజలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి ఒక మార్గం ఓటు.
  4. ప్రజాస్వామ్య విజయం ఆ దేశ ఓటర్లు క్రియాశీలకంగా పాల్గొనడం, చైతన్యవంతులుగా ఉండటంపై ఆధారపడి ఉంటుంది.

ప్రశ్న 1.
ప్రజాస్వామ్యం అంటే?
జవాబు:
ప్రజాస్వామ్యం అంటే బాధ్యతాయుతమైన ప్రభుత్వం ప్రజలతో ఎన్నుకోబడి, ప్రజలకు జవాబుదారిగా ఉండే ప్రభుత్వం.

ప్రశ్న 2.
లిబియాలో అంతిమ అధికారం ఎవరికి ఉంది?
జవాబు:
లిబియాలో అంతిమ అధికారం రివల్యూషనరీ కమాండ్ కౌన్సిల్ (ఆర్.సి.సి) కి ఉంది.

ప్రశ్న 3.
సార్వజనీన ఓటు హక్కు కల్పించిన తొలి పెద్ద దేశం ఏది?
జవాబు:
సార్వజనీన ఓటు హక్కు కల్పించిన తొలి పెద్ద దేశం సంయుక్త సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ (రష్యా).

AP 9th Class Social Important Questions Chapter 20 ప్రజాస్వామ్యం – రూపుదిద్దుకుంటున్న భావన

ప్రశ్న 4.
ప్రజాస్వామ్యం దేని మీద ఆధారపడి ఉంది?
జవాబు:
ప్రజాస్వామ్యం రాజకీయ సమానత్వం, అందరినీ కలుపుకోవడం అన్న మౌలిక సూత్రంపై ఆధారపడి ఉంది.

ప్రశ్న 5.
ప్రజాస్వామ్యంలో ప్రజల భాగస్వామ్యం ఎలా సాధ్యమవుతుంది?
జవాబు:
ప్రజలందరూ బహిరంగంగా పాల్గొని తమ అవసరాలు, అభిప్రాయాలు స్పష్టంగా పేర్కొనెలా బహిరంగ చర్చలు జరిపిన తరువాత చట్టాలు, విధానాలు రూపొందించినపుడు ఇది సాధ్యమవుతుంది.

ప్రశ్న 6.
ప్రజాస్వామ్యానికి స్వేచ్ఛాయుత ఎన్నికలు ఎంత ముఖ్యం?
జవాబు:
ఒక దేశ ప్రజలు ప్రభుత్వంలో తమకు నిజంగా ప్రాతినిధ్యం వహించే సరైన వ్యక్తులను లేదా పార్టీలను ఎంచుకోవాలంటే ఎన్నికలు స్వేచ్చగా, ఎటువంటి భయంలేని వాతావరణంలో నిర్వహించడం ఎంతో ముఖ్యం. ఎన్నికలలో ఏ ఒక్క పార్టీకి ప్రత్యేక అవకాశాలు ఉండవు. ఏ పార్టీయైన ఏ వ్యక్తులైన అందులో పాల్గొనగలుగుతారు.

ప్రశ్న 7.
ప్రజాస్వామ్యాన్ని అంచనా వేయాలంటే దేనిని పరిశీలించుట ముఖ్యం?
జవాబు:
ప్రజాస్వామ్యాన్ని అంచనా వేయాలంటే ఎన్నికలను పరిశీలించుట ముఖ్యం.

ప్రశ్న 8.
ప్రజాస్వామ్యం దేనిని రక్షణగా ఉండాలి?
జవాబు:
ప్రజలలో అధిక శాతానికి భిన్నమైన అభిప్రాయాలు కలిగిన వ్యక్తులను ప్రజాస్వామ్యం రక్షణగా ఉండాలి.

ప్రశ్న 9.
ప్రజాస్వామ్యం దేనికి లోబడి పని చేయాలి?
జవాబు:
ప్రజాస్వామ్యం రాజ్యాంగ చట్టం, పౌరుల హక్కుల పరిమితులకు లోబడి పని చేయాలి.

AP 9th Class Social Important Questions Chapter 20 ప్రజాస్వామ్యం – రూపుదిద్దుకుంటున్న భావన

ప్రశ్న 10.
ప్రజాస్వామ్యంలో పౌరుల గౌరవం, స్వేచ్ఛ గూర్చి వ్రాయుము.
జవాబు:
వ్యక్తి గౌరవాన్ని, స్వేచ్ఛని కాపాడటంలో వివిధ రకాల ప్రభుత్వాలలో ప్రజాస్వామ్య ప్రభుత్వం మెరుగైనది. గౌరవం, స్వేచ్ఛలపట్ల నిబద్ధతే ప్రజాస్వామ్యానికి పునాది.

AP 9th Class Social Important Questions Chapter 19 విస్తరిస్తున్న ప్రజాస్వామ్యం

These AP 9th Class Social Important Questions 19th Lesson విస్తరిస్తున్న ప్రజాస్వామ్యం will help students prepare well for the exams.

AP Board 9th Class Social 19th Lesson Important Questions and Answers విస్తరిస్తున్న ప్రజాస్వామ్యం

9th Class Social 19th Lesson 1 Mark Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
లిబియాలో ఉద్యమం ఎవరి ఆధ్వర్యంలో నడిచింది?
జవాబు:
సైన్యంలోని 12 మంది సభ్యులతో కూడిన ‘రివల్యుషనరీ కమాండ్ కౌన్సిల్’ (RCC) నేతృత్వంలో ఈ ఉద్యమం నడిచింది.

ప్రశ్న 2.
లిబియాలో కొత్త ప్రభుత్వం చేపట్టిన పనులేవి?
జవాబు:
కొత్త ప్రభుత్వం, చమురు వనరులను జాతీయం చేసింది, సంచార జీవనాన్ని అంతం చేయటానికి పేద ప్రజలకు నీటివసతి ఉన్న భూములను ఇచ్చింది, సాగు విస్తీర్ణాన్ని పెంచే కార్యక్రమం చేపట్టింది.. మహిళలతో సహా అందరికీ ఉచిత విద్య, ఉచిత వైద్య సేవలు, చమురు నుంచి వచ్చిన లాభాలలో కొంత ప్రజలందరికీ పంచటం, గృహవసతి వంటివి చేపట్టింది.

ప్రశ్న 3.
అరబ్బు వసంతంగా ప్రఖ్యాతి గాంచినది ఏది?
జవాబు:
2010 డిసెంబరులో మొదలైన అరబ్బు ప్రపంచంలోని నిరసనలు, ప్రదర్శనలు, యుద్ధాల విప్లవ తరంగం ‘అరబ్బు వసంతం’గా ప్రఖ్యాతి గాంచింది.

ప్రశ్న 4.
బర్మాను పాలించిన సైన్యాధిపతులు ఎదుర్కొన్న ఆరోపణలు ఏవి?
జవాబు:
బర్మాని పాలించిన సైన్యాధిపతులు మానవ హక్కులను ఉల్లంవించారని, పౌరులను బలవంతంగా స్థానచలనానికి గురిచేశారని, పిల్లలతో సహా ప్రజలతో బలవంతంగా వెట్టిచాకిరి చేయించుకున్నారని అనేక తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్నారు.

AP 9th Class Social Important Questions Chapter 19 విస్తరిస్తున్న ప్రజాస్వామ్యం

ప్రశ్న 5.
NLD ని విస్తరించండి.
జవాబు:
నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసీ NLD.

ప్రశ్న 6.
కమ్యూని నమ్మకం ఏమిటి?
జవాబు:
‘శ్రామిక వర్గ నియంతృత్వాన్ని’ ఏర్పాటు చేయటం ద్వారా మాత్రమే. కార్మికుల ప్రయోజనాలను కాపాడగలమని , వాళ్లు (కమ్యూనిస్టు) నమ్మారు.

ప్రశ్న 7.
కమ్యూనిస్టుల విశ్వాసం ఏమిటి?
జవాబు:
ఇంగ్లాండులో మాదిరి పార్లమెంటరీ ప్రజాస్వామ్యం దేశాన్ని నియంత్రించటంలో ధనిక పెట్టుబడిదారులకు మాత్రమే ఉపయోగపడుతుందని, పేద శ్రామిక ప్రజల నిజమైన ప్రయోజనాలకు అది ప్రాతినిధ్యం వహించ లేదని కమ్యూనిస్టు విశ్వసించారు.

ప్రశ్న 8.
అంతర్యుద్ధం అనగానేమి
జవాబు:
వివిధ వర్గాలు లేదా ప్రాంతాల మధ్య ఒక దేశంలో చెలరేగే యుద్ధం.

ప్రశ్న 9.
స్వయం ప్రతిపత్తి అనగానేమి?
జవాబు:
ఒక దేశం లేదా ప్రాంతం లేదా సంస్థ తనను తాను స్వతంత్రంగా నిర్వహించుకునే స్వేచ్ఛనే ‘స్వయం ప్రతిపత్తి’ అంటారు.

ప్రశ్న 10.
పట్టణీకరణ అనగానేమి?
జవాబు:
గ్రామీణ ప్రాంత ప్రజలు వివిధ వృత్తులరీత్యా పట్టణాలకు వచ్చి స్థిరపడటాన్ని, పట్టణ జనాభా పెరగడాన్ని ‘పట్టణీకరణ’ అంటారు.

ప్రశ్న 11.
కింది పటంలో 1900 మరియు 1950 మధ్య కాలం నాటి ప్రజాస్వామ్య దేశాలను నలుపుచే గుర్తించడమైనది.
ప్రశ్న : పటంలో చూపిన ఏవేని రెండు ప్రజాస్వామ్య దేశాల పేర్లు రాయండి.
జవాబు:
అమెరికా సంయుక్త రాష్ట్రాలు, కెనడా, గ్రేట్ బ్రిటన్, చిలీ, పెరూ, అలస్కా మొదలైనవి.

AP 9th Class Social Important Questions Chapter 19 విస్తరిస్తున్న ప్రజాస్వామ్యం

ప్రశ్న 12.
క్రింది పటంలో “A” తో గుర్తించబడిన దేశం ఏది?
జవాబు:
రష్యా

9th Class Social 19th Lesson 4 Marks Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
19వ శతాబ్దం నాటి ఇటలీ ఏకీకరణ ప్రక్రియను వివరించండి.
జవాబు:
19వ శతాబ్దం నాటి ఇటలీ ఏకీకరణ ప్రక్రియ :

  1. 19వ శతాబ్దం మధ్య కాలానికి ఇటలీ అనేక చిన్న చిన్న రాజ్యాలుగా విభజించబడింది.
  2. 1830 లలో మాజినీ ఇటలీ ఏకీకరణకు ఒక ప్రణాళికను రూపొందించాడు.
  3. తన భావాలను ప్రచారం చేయుటకు, ఇటలీ ఏకీకరణ దిశగా ప్రయాణానికి యంగ్ ఇటలీ అనే రహస్య సంస్థను స్థాపించాడు.
  4. తరువాత 1831, 1848లలో జరిగిన తిరుగుబాట్లు విఫలం కావడంతో యుద్ధాల ద్వారా అయినా ఇటలీ ఏకీకరణను సాధించవలసిన బాధ్యత రాజు విక్టర్ ఇమ్మాన్యుయెల్ – II మీద పడింది.
  5. అధికారంలో ఉన్న ఇతర రాజ కుటుంబీకులు కూడా ఏకీకరణ ద్వారానే ఇటలీ ఆర్థిక ప్రగతి సాధ్యం అని భావించారు.
  6. ఫ్రాన్స్ తో కవూర్ నడిపిన దౌత్యం ఫలితంగా సార్డీనియా – పీడ్మంబు ఆస్ట్రియా సేనలను ఓడించగలిగాయి.
  7. 1860 లో సైన్యంతో పాటు గారిబార్లీ నాయకత్వంలో సాయుధ సేనలు సిసిలీ లోనికి ప్రవేశించి అక్కడ ఉన్న స్పెయిన్ పాలకులను తరిమివేశాయి. దానితో అన్ని దేశాలూ రాజు పాలన క్రిందకి వచ్చి ఇటలీ ఏకీకరణ ముగిసింది.
  8. 1871 లో, విక్టర్ ఇమ్మాన్యుయెల్ – II ఏకీకృత ఇటలీకి రాజుగా ప్రకటించబడ్డాడు.

ప్రశ్న 2.
“సమకాలీన ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న సంక్లిష్ట సమస్యల పరిష్కారానికి మరియు ప్రజలందరికి స్వేచ్ఛను మరియు హక్కులను గౌరవించేందుకు ప్రజాస్వామ్యమే ఉత్తమ పరిష్కారం”. – ఈ విషయంతో మీరు ఏకీభవిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని సమర్థించుకొనండి.
(లేదా)
“అత్యంత పేద ప్రజలు, బలహీనవర్గాలు కూడా తమ గొంతుక వినిపించి, ప్రభుత్వ విధానాలను ప్రభావితం చేయగల, అందరికీ న్యాయం, శాంతిని అందించగల నూతన ప్రజాస్వామిక విధానాన్ని రూపొందించటానికి ప్రపంచ వ్యాప్తంగా ప్రయత్నం జరుగుతోంది.”
“ప్రజాస్వామ్యమే అత్యుత్తమ పరిపాలన విధానం” వ్యాఖ్యానించండి.
జవాబు:
ప్రస్తుతం ప్రపంచ సమస్యలకు ఒక పరిస్కారం ప్రజాస్వామ్యం అనడాన్ని నేను అంగీకరిస్తాను. ఎందుకంటే ప్రజాస్వామ్యం లేని దేశాల ప్రజలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఉదాహరణ : తమ పాలకులను ఎన్నుకునే స్వేచ్ఛ లేకపోవడం, ప్రజలు సంఘాలను, సంస్థలను ఏర్పాటుచెయడానికి స్వేచ్ఛ లేకపోవడం, పాలకులకు వ్యతిరేకంగా నిరసన తెలియజేయడానికి అవకాశం లేకపోవడం, ఆయా దేశాలలో పౌర హక్కులకు, మానవ హక్కులకు రక్షణ లేకపోవడం వంటివి.

మరోవైపు ప్రజాస్వామ్యంలో ప్రజలు తమకు నచ్చిన ప్రతినిధులను, తమ పాలకులను ఎన్నుకునే స్వేచ్ఛను కలిగి ఉన్నారు. వాక్ స్వాతంత్ర్యాన్ని, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను, ప్రభుత్వ నిర్ణయాల పట్ల నిరసనను తెలియచేసే అవకాశాన్ని, ప్రజలు పార్టీలను, సంస్థలను ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛను కలిగి ఉన్నారు.

ప్రజాస్వామ్యం పౌరులందరి మానవ హక్కులను రక్షిస్తుంది. సమన్యాయ పాలనలో భాగంగా చట్టం ముందు అందరూ సమానులే. చట్టాలు అందరికీ సమానంగా వర్తిస్తాయి.

ప్రజాస్వామ్యంలో పాలకులు ప్రజల అవసరాలకు అనుగుణంగా స్పందించాలి. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీతనం కలిగి ఉంటుంది.

ప్రజాస్వామ్యం రాజకీయ సమానత్వం అనే సూత్రంపై ఆధారపడి ఉంది. ఇక్కడ పేదలు, నిరక్షరాస్యులు సైతం ధనికులు, అత్యంత విద్యావంతులతో సమానమైన హోదాను పొందుతారు. భిన్నత్వాలు గల సమాజంలో వివిధ వ్యక్తులు వివిధ ఆలోచనలు, ఆసక్తులు కలిగి ఉంటారు. అందరి అభిప్రాయాలకు, ఆలోచనలకు విలువనివ్వడం ప్రజాస్వామ్య లక్షణం.

ప్రజాస్వామ్యాన్ని అత్యంత ఉత్తమమైన ప్రభుత్వ వ్యవస్థ అనడంలో సందేహం లేదు.

ప్రశ్న 1.
లిబియా ఏ దేశ వలస పాలనలో ఉండేది?
జవాబు:
ఇటలీ

ప్రశ్న 2.
లిబియాకు ఎప్పుడు స్వాతంత్ర్యం లభించింది?
జవాబు:
లిబియాకు 1951లో స్వాతంత్ర్యం లభించింది.

AP 9th Class Social Important Questions Chapter 19 విస్తరిస్తున్న ప్రజాస్వామ్యం

ప్రశ్న 3.
లిబియా ప్రజల జీవనాధారం ఏమిటి?
జవాబు:
లిబియా ప్రజలు వ్యవసాయం, ఎడారులలో పశువుల పాలన పై ఆధారపడి జీవనం సాగించేవారు.

ప్రశ్న 4.
లిబియా అతి తక్కువ కాలంలో సంపన్నదేశమవ్వడానికి గల కారణం?
జవాబు:
1959 సంవత్సరంలో లిబియాలో విస్తారమైన ముడిచమురు నిధులను కనుగొన్నారు.. చమురు అమ్మకంతో దేశంలోకి సంపద ప్రవహింపసాగింది. సంపన్నదేశమైంది.

ప్రశ్న 5.
లిబియా అభివృద్ధి కొరకు, సంక్షేమం కొరకు ఏయే కార్యక్రమాలు అమలుచేయాలని యువత కోరింది?
జవాబు:

  1. ప్రజాసంక్షేమం కోసం పనిచేసే ఆధునిక ప్రభుత్వాలు ఏర్పాటుచేయాలని యువత కోరింది.
  2. మహిళలపై అణచివేతను అంతం చేయాలని, వివిధ జాతుల మధ్య నిరంతర యుద్ధాలకు స్వస్తి పలకాలని, ఐక్యత, శాంతిని స్థాపించాలని యువత రాజు ఇద్రిస్ ని కోరింది.

ప్రశ్న 6.
మువమ్మర్ గఢాఫి లిబియా అధికారం ఎప్పుడు చేజిక్కించుకున్నాడు?
జవాబు:
మువమ్మర్ గఢాఫి 70 యువ సైనిక అధికారుల బృందం, తమను తాము స్వేచ్ఛ అధికారుల ఉద్యమంగా పేర్కొని 1969లో లిబియా అధికారాన్ని కైవసం చేసుకున్నాడు.

ప్రశ్న 7.
లిబియాలో అధిక ప్రజల మతమేది?
జవాబు:
లిబియాలో అధిక ప్రజల మతం ఇస్లాం.

ప్రశ్న 8.
లిబియా దేశం ఎదుర్కొను సమస్యలేవి?
జవాబు:
లిబియాలో అధికశాతం ప్రజలు పేదవారు. పశుపాలనలో సంచార జీవనం గడుపుతుండేవాళ్ళు. నిరక్షరాస్యత అధికం. మహిళలకు పరదా పద్ధతి అమలులో ఉండేది.

ప్రశ్న 9.
గఫి నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం ఏయే సంస్కరణలు అమలుచేసింది?
జవాబు:
కొత్త ప్రభుత్వం అనేక కొత్త సంస్కరణలు అమలుచేసి లిబియాను ప్రగతిపథంలో నిలిపింది.

  1. చమురు వనరులను జాతీయం చేసింది.
  2. సంచార జీవనం నాశనం చేయ తలంచింది.
  3. పేద ప్రజలకు నీటి వసతి ఉన్న భూములను ఉచితంగా అందజేసింది.
  4. సాగు విస్తీర్ణ పద్ధతులు అమలుచేసింది.
  5. అందరికీ విద్య, అందరికీ వైద్యం ఉచితంగా అందజేసింది.
  6. మహిళలకు, స్వేచ్ఛ, సమాన సదా.
  7. చమురు నుండి వచ్చే ఆదాయంలో కొంత ప్రజలకు పంచడం వంటి సంస్కరణలతో లిబియా సామాజిక సంక్షేమంలో అత్యున్నత స్థానం పొందింది.

ప్రశ్న 10.
ప్రజాస్వామిక ప్రభుత్వాలను ఏర్పాటు చేయడానికి అరబ్ ప్రపంచంలో 2010లో ఏయే దేశాలలో ఉద్యమాలు జరిగాయి?
జవాబు:
ట్యునీసియా, ఈజిప్టు, లిబియా, ఎమెన్, బబ్రాన్, సిరియా వంటి దేశాలలో ఉద్యమం మొదలైంది.

AP 9th Class Social Important Questions Chapter 19 విస్తరిస్తున్న ప్రజాస్వామ్యం

ప్రశ్న 11.
లిబియా తిరుగుబాటులో ఏయే వర్గాలు వారు ప్రాతినిధ్యం వహించారు?
జవాబు:
తిరుగుబాటు బృందాలలో సైన్యం నుంచి బయటకు వచ్చిన కొంతమంది సైనికులు. అధికశాతం మంది న్యాయవాదులు, కార్మికులు, ఇంజనీర్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు సామాన్య ప్రజలు.

ప్రశ్న 12.
లిబియా తిరుగుబాటుదారులకు ప్రపంచంలోని చాలా దేశాలు ఎందుకు మద్దతు ఇచ్చాయి?
జవాబు:
ప్రపంచంలోని అమెరికా వంటి దేశాల నుండి లిబియాలోని తిరుగుబాటుదారులకు మద్దతు లభించింది. ఎందుకంటే దీని వెనుక లిబియాలోని అపార చమురు నిల్వలను చేజిక్కించుకోవాలన్న కోరిక ఉంది. ఐక్యరాజ్యసమితి సైతం తిరుగుబాటుదారులకు మద్దతు పలికి లిబియాని విమానాలు ఎగరగూడని ప్రాంతంగా ప్రకటించింది.

ప్రశ్న 13.
బర్మా ప్రపంచదేశాలకు ఏయే వస్తువులకు, ఆహారపదార్థాలకు సరఫరాదారుగా ఉండేది?
జవాబు:
టేకు, కలప, బియ్యం వంటి ఆహారధాన్యాలు, తగరం వంటి ఖనిజాలు, కెంపులు, నీలాలు వంటి విలువైన రాళ్ళకు బర్మా ప్రధాన సరఫరాదారుగా ఉండేది.

ప్రశ్న 14.
వివిధ రాజకీయ పార్టీలు పోటీ చేసిన ఎన్నికలు బర్మాలో ఏయే సంవత్సరాలలో జరిగాయి?
జవాబు:
1951, 1956, 1960లలో ఎన్నికలు జరిగాయి.

ప్రశ్న 15.
1947లో బర్మాకి స్వాతంత్ర్యం సాధించి తెచ్చినవాడు?
జవాబు:
బర్మాకి స్వాతంత్ర్యం తెచ్చినవాడు టర్మన్ జాతి నాయకుడు ఆంగ్ సాన్ (ప్రస్తుత ప్రతిపక్షనేత ఆంగ్ సాన్ సూకీకి తండ్రి).

AP 9th Class Social Important Questions Chapter 19 విస్తరిస్తున్న ప్రజాస్వామ్యం

ప్రశ్న 16.
బర్మాలో సైన్యాధిపతుల పాలకులు ఎటువంటి ఆరోపణలు ఎదుర్కొన్నారు?
జవాబు:

  1. బర్మా సైన్యాధిపతుల పాలనలో పేద దేశంగానే ఉండిపోయింది.
  2. దేశ వనరులన్నీ సైన్యాధిపతుల అధీనంలోకి వెళ్ళాయి.
  3. రైతాంగం తమ పిల్లలను సైన్యానికి అమ్ముకోవలసి వచ్చింది.
  4. పేద ప్రజలు బానిసల మాదిరి గనులలో పనిచేయవలసి వచ్చేది.
  5. బర్మాని పాలించిన సైన్యాధిపతులు మానవహక్కులను ఉల్లంఘించారు.
  6. పిల్లలతో సహ ప్రజలతో బలవంతంగా వెట్టిచాకిరి చేయించుకున్నారని తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్నారు.

ప్రశ్న 17.
బర్మాలో ప్రజాస్వామ్యం నెలకొల్పటానికి జరుగుతున్న పోరాటాలు, నిరసనలకు ఆనాటి నుంచి నేటి వరకు కేంద్ర బిందువు ఎవరు?
జవాబు:
ఆంగ్ సాన్ సూకి.

ప్రశ్న 18.
ఆంగ్ సాన్ సూకి ఆధ్వర్యంలో గల కూటమి పేరేమి?
జవాబు:
జాతీయ ప్రజాస్వామ్య కూటమి (నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసి) (NLD)

ప్రశ్న 19.
“ఆర్థిక దిగ్బంధం” అంటే ఏమిటి?
జవాబు:
ప్రపంచంలోని దేశాలు ఎగుమతులు, దిగుమతులు ఏవీ జరపకుండా, బర్మాని వాణిజ్యపరంగా ఏకాకిని చేయడం.

ప్రశ్న 20.
బర్మాలో ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పటానికి ప్రజల అభిప్రాయ సేకరణ (రిఫరెండం) ఎప్పుడు నిర్వహించారు?
జవాబు:
2008లో దేశం పేరుని ప్రజాస్వామిక గణతంత్రంగా మార్చారు.

ప్రశ్న 21.
ఆంగ్ సాన్ సూకీకి నోబెల్ శాంతి బహుమతి ఎప్పుడు లభించింది?
జవాబు:
1991లో

AP 9th Class Social Important Questions Chapter 19 విస్తరిస్తున్న ప్రజాస్వామ్యం

ప్రశ్న 22.
ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య భావనకు అనుకూలించే పరిస్థితులు ఏవి కల్పించాయి?
జవాబు:
పారిశ్రామికీకరణ, వలస వాదాలు.

AP 9th Class Social Important Questions Chapter 18 భారతదేశంపై వలసవాద ప్రభావం

These AP 9th Class Social Important Questions 18th Lesson భారతదేశంపై వలసవాద ప్రభావం will help students prepare well for the exams.

AP Board 9th Class Social 18th Lesson Important Questions and Answers భారతదేశంపై వలసవాద ప్రభావం

9th Class Social 18th Lesson 1 Mark Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
తిరుగుబాటు ఆదివాసీలు ఎవరు?
జవాబు:
1856లో జార్ఖండ్ సంతాల్ ఆదివాసీలు, 1880, 1992లో ఆంధ్రప్రదేశ్ లో కోయ ఆదివాసీలు, 1910లో బస్తర్ లోని ” మరియా, మురియా ఆదివాసీలు, 1940లలో గోండ్, కోలం ఆదివాసీలు తిరుగుబాటు చేశారు.

ప్రశ్న 2.
సీతారామరాజు దాడిచేసిన పోలీసు స్టేషన్లు ఏవి?
జవాబు:
బెంగాలీ విప్లవకారుల దేశభక్తితో స్ఫూర్తి పొంది చింతపల్లి, రంపచోడవరం, దమ్మనపల్లి, కృష్ణదేవిపేట, రాజవొమ్మంగి, అడ్డతీగల, నర్సీపట్నం, అన్నవరం వంటి ప్రాంతాల్లో పోలీసు స్టేషన్ల పై రాజు దాడులు చేశాడు.

ప్రశ్న 3.
నిజాం ప్రభుత్వం అడవిలో వసూలు చేసిన పన్నులేవి?
జవాబు:
అడవిలో పశువులను, మేపినందుకు, వంటకి కట్టెపుల్లలు సేకరించినందుకు నిజాం ప్రభుత్వం ‘బంబ్ రాం’, ‘దూప పెట్టి’ ” అన్న పేరుతో పన్ను వసూలు చేయసాగింది.

AP 9th Class Social Important Questions Chapter 18 భారతదేశంపై వలసవాద ప్రభావం

ప్రశ్న 4.
బ్రిటిషు కాలంలో ఏర్పడిన పారిశ్రామిక వేత్తల సంఘాలలో ముఖ్యమైనది ఏది?
జవాబు:
భారత పరిశ్రమల ప్రయోజనాల కోసం బ్రిటిషు కాలంలోనే పారిశ్రామికవేత్తలతో అనేక సంఘాలు ఏర్పడ్డాయి. వీటిల్లో ముఖ్యమైనది ‘వ్యాపార, పరిశ్రమల భారతీయ సమాఖ్య’ (FICCI – ఫిక్కీ).

ప్రశ్న 5.
కార్మిక సంఘాలు అని వేటిని అంటారు?
జవాబు:
సమ్మె సమయాల్లో కొంతమంది విద్యావంతుల సహాయంతో కార్మికులు తమ సొంత సంఘాలను ఏర్పరచుకున్నారు. వీటిని ‘కార్మిక సంఘాలు’ అంటారు.

ప్రశ్న 6.
కార్మిక సంఘాల పని ఏమి?
జవాబు:
ఈ కార్మిక సంఘాలు సమ్మేలు నిర్వహించేవి, మిల్లు యజమానులతో ఒప్పందాలు కుదుర్చుకునేవి. క్రమంగా ఈ సంఘాలు సమ్మెకాలంలోనే కాకుండా కార్మికుల సంక్షేమం, హక్కుల కోసం సంవత్సరం పొడవునా పని చేయసాగాయి.

ప్రశ్న 7.
గాంధీజీ ప్రభావంతో ఏర్పడిన కార్మికసంఘం ఏది?
జవాబు:
అహ్మదాబాదులో గాంధీజీ ప్రభావంతో ‘మజూర్ మహాజన్’ అన్న శక్తివంతమైన కార్మిక సంఘం ఏర్పడింది.

ప్రశ్న 8.
రక్షిత మార్కెట్ అనగానేమి?
జవాబు:
ఎగుమతులు, దిగుమతులపై ఆంక్షలతో కూడిన వాణిజ్య పద్ధతిని ‘రక్షిత మార్కెట్’ అని అంటారు.

ప్రశ్న 9.
రిజర్వ్ అడవి అనగానేమి?
జవాబు:
ప్రభుత్వ అధీనంలో, అటవీశాఖ నియంత్రణలో ఉండే అడవిని ‘రిజర్వ్ అడవి’ అంటారు.

AP 9th Class Social Important Questions Chapter 18 భారతదేశంపై వలసవాద ప్రభావం

ప్రశ్న 10.
ఆదివాసీలకు కొమరం భీం ఇచ్చిన పిలుపు ఏమిటి?
జవాబు:
కొమరం భీం ఆదివాసీలకు “జల్, జంగల్, జమీన్’ అనే పిలుపునిచ్చారు.

9th Class Social 18th Lesson 2 Marks Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
బ్రిటిష్ పరిపాలనా కాలంలో అడవుల నరికివేతకు దారి తీసిన కారణాలను రాయండి.
జవాబు:
ఈ క్రింది కారణాల వలన బ్రిటిష్ వారు అడవులను నరికివేశారు. ముంబై, కోల్‌కతా వంటి పట్టణాలు అభివృద్ధి చెందడం, ప్రభుత్వం దేశవ్యాప్తంగా వేల కిలోమీటర్లలో రైలు మార్గాలను నిర్మించడం, పెద్దపెద్ద ఓడలను తయారుచేయడం, గనుల తవ్వకం, వాటిన్నింటికి కలప కొరకు అడవుల వినియోగం జరిగింది.

రైలు మార్గాల కోసం కావలసిన చెక్క స్లీపర్లను హిమాలయ ప్రాంతముల నుండి సేకరించారు.

ఆ రోజులలో వర్తకం ఎక్కువగా జల మార్గాల ద్వారానే సాగేది కనుక భారీ ఓడల నిర్మాణానికి కూడా అడవులను నరికివేయడం తప్పనిసరి అయినది.

9th Class Social 18th Lesson 4 Marks Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
తొలి దశలో మిల్లులలో పని ప్రతిరోజూ సూర్యోదయంతో మొదలయ్యి సూర్యాస్తమయం తరువాతే ముగిసేది. తెల్లవారకముందే నిద్ర లేచి మిల్లులకు బారులు తీరిన కార్మికులు – వీళ్లల్లో పురుషులతో పాటు స్త్రీలు, పిల్లలు కూడా ఉండేవాళ్లు. యంత్రాల మీద పని చేయటం మొదలు పెట్టిన తరువాత ఇక ఆపటం అంటూ లేదు. భోజనాలకు కూడా ఖచ్చితమైన విరామం ఉండేది కాదు. తోటి కార్మికుడికి పని అప్పగించి 15-20 నిమిషాలలో కార్మికులు భోజనం ముగించేవాళ్లు. తినటానికి ప్రత్యేకంగా వేరే చోటు ఉండేది కాదు.

కర్మాగారపు వేడి, తేమ, మోత, ధూళితో. రోజంతా గడిచేది. మిల్లు వాతావరణంలో సరిగా ఊపిరాడేది కాదు. సూర్యుడు అస్తమించిన తరువాత చీకటిలో చూడటం అసాధ్యమైనప్పుడు మాత్రమే యంత్రాలతో ఆ రోజుకి పని ఆగేది. ఇలా నెలల తరబడి జరిగేది. వారానికి ఒకరోజు సెలవు కూడా నియమాల్లో లేదు. సంవత్సరంలో ముఖ్యమైన పండుగలకు మాత్రమే మిల్లు యజమాని సెలవు ఇచ్చేవాడు.
ప్రశ్న : పారిశ్రామికీకరణ తొలి దశలో, మిల్లులలోని కార్మికుల పని పరిస్థితులపై వ్యాఖ్యానించండి.
జవాబు:
తొలిదశలో మిల్లులలోని కార్మికుల పరిస్థితి మరీ దుర్భరంగా ఉంది.

  1. సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు పనిచేస్తే వారికి ఇచ్చే వేతనాలు చాలా తక్కువ.
  2. ఉత్పత్తి చేసే సమయంలో ఏదైనా అనర్థం జరిగితే యాజమాన్యం ఎలాంటి బాధ్యతలను కూడా వహించేది కాదు.
  3. ఉత్పత్తి చేసే వస్తువు డామేజ్ అయినా దాని ఖర్చు కార్మికుడి జీతం నుండి తీసుకునేవారు.
  4. కార్మికులు మురికివాడలలో నివసిస్తూ సరైన సదుపాయాలు లేక, వైద్య సదుపాయం లేక రోగాల బారిన పడి ఎంతో మంది మరణించారు.
  5. సెలవులు లేకపోవడం, ఒక దుర్భర పరిస్థితి.
  6. విశ్రాంతి లేకుండా పనిచేయడం వలన ఒళ్ళు నొప్పులతో కార్మికులు బాధపడుతూ దాని నుండి మరచిపోవడానికి మద్యానికి బానిసైపోయేవారు.

ఈ విధంగా వారి వేతనం కుటుంబ ఖర్చులకు చాలక దుర్భర దారిద్ర్య జీవితాన్ని అనుభవించారు.

తొలినాళ్లలో విద్యుత్ సౌకర్యం లేక రాత్రిపూట కార్మికులను వదిలివేశారు గాని లేకపోతే వారిని రాత్రిపూట కూడా పనికోసం హింసించేవారు.

AP 9th Class Social Important Questions Chapter 17 లాటిన్ అమెరికా, ఆసియా, ఆఫ్రికాలలో వలసవాదం

These AP 9th Class Social Important Questions 17th Lesson లాటిన్ అమెరికా, ఆసియా, ఆఫ్రికాలలో వలసవాదం will help students prepare well for the exams.

AP Board 9th Class Social 17th Lesson Important Questions and Answers లాటిన్ అమెరికా, ఆసియా, ఆఫ్రికాలలో వలసవాదం

9th Class Social 17th Lesson 1 Mark Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
జెనోయిస్ అంటే ఏమిటి?
జవాబు:
1400 సంవత్సరంలో యూరపువాసులకు తెలిసిన ప్రపంచంను ‘జెనోయిస్’ అంటారు.

ప్రశ్న 2.
ప్రపంచమంతా వేటికి గిరాకీ ఉండేది?
జవాబు:
చైనా నుంచి పట్టు, పింగాణి పాత్రలకు; భారతదేశం నుంచి నూలు వస్త్రాలు, ఉక్కు, సుగంధ ద్రవ్యాలకు; అరేబియా నుంచి పళ్లు, అత్తర్లకు, యూరపు నుంచి మద్యానికి ప్రపంచమంతటా గిరాకీ ఉండేది.

ప్రశ్న 3.
లాటిన్ అమెరికా దేశాలు అని వేటిని వ్యవహరించసాగారు?
జవాబు:
స్పెయిన్, పోర్చుగీసు భాషలు లాటిన్ నుంచి పుట్టాయి. కాబట్టి ఈ దేశాలు ‘లాటిన్ అమెరికన్’ దేశాలుగా వ్యవహరించసాగారు.

ప్రశ్న 4.
హసియండా అని దేనిని అంటారు?
జవాబు:
పెద్ద భూస్వాముల కింద ఉండే విశాల భూభాగాన్ని హసియండా’ అనేవాళ్లు.

AP 9th Class Social Important Questions Chapter 17 లాటిన్ అమెరికా, ఆసియా, ఆఫ్రికాలలో వలసవాదం

ప్రశ్న 5.
మన్రో సిద్ధాంత ముఖ్యాంశాలు ఏమి?
జవాబు:
అమెరికా అధ్యక్షుడు ‘జేమ్స్ మన్రో’ తయారుచేసిన ‘మన్రో సిద్ధాంతం’ ప్రకారం అమెరికా ఖండాలలో యూరప్ దేశాలు ఏవీ వలస ప్రాంతాలను ఏర్పరచుకోకూడదు. అందుకు ప్రతిగా ఇతర ఖండాలలో యూరపు వ్యవహారాల్లో కానీ, వలస ప్రాంతాల్లో కానీ అమెరికా జోక్యం చేసుకోదు.

ప్రశ్న 6.
అర్థవలస ప్రాంతంగా దేనిని పరిగణిస్తారు?
జవాబు:
చైనా ఏ ఒక్క దేశానికీ పూర్తిగా వలస ప్రాంతంగా లేదు. అందుకనే దీనిని ‘అర్ధవలస’ ప్రాంతంగా పరిగణిస్తారు.

ప్రశ్న 7.
చీకటి ఖండం అని దేనిని పిలిచేవారు?
జవాబు:
ఆఫ్రికా ఖండం గురించి దాని లోపలి ప్రాంతాల గురించి చాలా తక్కువ సమాచారం మాత్రమే తెలియటం వల్ల దానిని ‘చీకటి ఖండం’గా ఐరోపావాసులు పిలిచేవారు.

ప్రశ్న 8.
బెల్జియం తరపున భూభాగ పటాలను తయారుచేసి యూరప్ అన్వేషకులు ఎవరు?
జవాబు:
యూరపుకు చెందిన ముఖ్యమైన అన్వేషకులలో ‘డేవిడ్ లివింగ్స్టన్’, ‘హెచ్.ఎం. స్టాన్లీ’ ముఖ్యమైన వాళ్ళు. వీరు బెల్జియం తరఫున దక్షిణ, మధ్య ఆఫ్రికాలోని భూభాగాల పటాలను తయారుచేశారు.

ప్రశ్న 9.
కాంగో స్వేచ్ఛా రాజ్యంగా దీనిని వ్యవహరించారు?
జవాబు:
1882 నాటికి లియోపోల్-II అధికారం ఆఫ్రికా ప్రాంతంలో 23,00,000 కి.మీ. మేర విస్తరించింది. ఇది బెల్జియం కంటే 75 రెట్లు ఎక్కువ. దీనిని ‘కాంగో స్వేచ్ఛా రాజ్యం (Congo Free state)’ గా వ్యవహరించే వాళ్లు.

ప్రశ్న 10.
జాతి వివక్ష అంటే ఏమిటి?
జవాబు:
జాతి ఆధారంగా జనాభాలో అధిక శాతంపై చూపే వివక్షతను జాతి వివక్షత అంటారు.

AP 9th Class Social Important Questions Chapter 17 లాటిన్ అమెరికా, ఆసియా, ఆఫ్రికాలలో వలసవాదం

ప్రశ్న 11.
యూరోపియన్లు ఆఫ్రికాను ఒక “చీకటి ఖండం”గా ఎందుకు పేర్కొన్నారు?
జవాబు:
ఆఫ్రికా ఖండం గురించి, దాని లోపలి ప్రాంతాల . గురించి చాలా తక్కువ సమాచారం మాత్రమే తెలియటం వల్ల దానిని “చీకటి ఖండం”గా ఐరోపా వాసులు పిలిచేవాళ్ళు.

9th Class Social 17th Lesson 2 Marks Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
భారతదేశ పౌరులుగా వలస పాలనకు మద్దతు ఇస్తారా? వ్యతిరేకిస్తారా? ఎందుకు?
జవాబు:
భారతదేశ పౌరులుగా వలస పాలనను వ్యతిరేకిస్తాను. ఎందుకంటే దాస్య బతుకులు, చీకటి పాలన వద్దని, పరదేశీయుల చేతుల్లో భారతమాత చిక్కరాదని, అపార సహజ వనరులు, ముడి పదార్థాలు, సుగంధ ద్రవ్యాలు విలువైన వస్తువులు వేరొక ప్రాంతానికి తరలించడం ఇష్టంలేక, అవమానాలు, బానిస బతుకులు మాకొద్దని, స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలు ఎంతో ముద్దని, త్యాగధనుల స్ఫూర్తి ఆదర్శాలు వెల్లివిరియాలని వలస పాలనను వ్యతిరేకిస్తాను.

9th Class Social 17th Lesson 4 Marks Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
కింద ఇచ్చిన రెండు పటాలను పరిశీలించండి.
పటం – ఎ 1913 – 14 సం||లో యూరప్ దేశాల వలస ప్రాంతాలను తెలియజేస్తుంది మరియు పటం – బి ఆఫ్రికా నందలి ఆధునిక దేశాలను తెలియజేస్తుంది.
AP 9th Class Social Important Questions Chapter 17 లాటిన్ అమెరికా, ఆసియా, ఆఫ్రికాలలో వలసవాదం 2

రెండు పటాలలో సమాచారాన్ని పోల్చండి. కింది పట్టికను మీ జవాబు పత్రంలో గీచి ఆధునిక ఆఫ్రికా దేశానికి ఎదురుగా వలసగా చేసుకొని పాలించిన దేశం పేరు రాయండి.
జవాబు:

ఆధునిక దేశం1913 నాటికి వలసగా చేసుకొని పాలించిన దేశం
దక్షిణ ఆఫ్రికా
ఈజిప్టు
నైజీరియా
ఘనా
లిబియా
అల్జీరియా
అంగోలా
కాంగో

జవాబు:

ఆధునిక దేశం1913 నాటికి వలసగా చేసుకొని పాలించిన దేశం
దక్షిణ ఆఫ్రికాఇంగ్లాండ్
ఈజిప్టుఇంగ్లాండ్
నైజీరియాఫ్రాన్స్
ఘనాఇంగ్లాండ్
లిబియాఇటలీ
అల్జీరియాఫ్రాన్స్
అంగోలాపోర్చుగీసు
కాంగోబెల్జియం

ప్రశ్న 1.
జాతి వివక్షత అంటే ఏమిటి?
జవాబు:
పౌరహక్కులు, స్వేచ్చగా సంచరించే హక్కు, సంఘాలుగా ఏర్పడే హక్కు, తమ కష్టాలను తెలియజేసే హక్కు వంటివేవీ లేకుండా, జాతి ఆధారంగా నాభాలో అధిక శాతంపై చూపే ఈ వివక్షతను జాతి వివక్షత అంటారు.

ప్రశ్న 2.
యూరప్ దేశాల వలస ప్రాంతాలుగా ఏ ఏ ఖండాలు తమ అధీనంలోకి వచ్చాయి?
జవాబు:
1400 నుంచి మొదలై అమెరికా, ఆఫ్రికా, ఆసియా, ఆస్ట్రేలియా అంతా – అంటే యూరపు మినహాయించి, మిగిలిన ఖండాలన్ని యూరప్ దేశాల వలస ప్రాంతాలుగా మారాయి. అయితే వాటన్నింటినీ ఒకే ఫలితాలతో, ఒకే రకంగా వలస ప్రాంతాలుగా మార్చలేదు. అమెరికాలోని అధికశాతం స్థానిక ప్రజలను చంపేశారు, దోచుకున్నారు. ఐరోపావాసులు అక్కడ పెద్ద సంఖ్యలో స్థిరపడ్డారు. ఆఫ్రికా వంటి ఇతర ఖండాల నుంచి కోట్లాది బానిసలను తెచ్చి అక్కడ స్థిరపడేలా చేశారు.

AP 9th Class Social Important Questions Chapter 17 లాటిన్ అమెరికా, ఆసియా, ఆఫ్రికాలలో వలసవాదం

ప్రశ్న 3.
భారతదేశ వలస ప్రాంతంగా ఏ విధానాన్ని అనుసరించారు?
జవాబు:
వలస ప్రాంతంగా భారతదేశాన్ని లోబరుచుకున్న ఐరోపా వాసులు, భారతదేశ ప్రజలను చంపకుండా, బానిసలుగా . మార్చకుండా, తమ పాలనను ఏర్పరచుకున్నారు. భారతదేశంలో వాళ్ళు పెద్ద సంఖ్యలో స్థిరపడటానికి కూడా ప్రయత్నించలేదు. వ్యవసాయంపై పన్ను, ముడి సరుకుల కొనుగోలు, ఇంగ్లాండ్ లో ఉత్పత్తి అయిన పారిశ్రామిక సరుకుల అమ్మకం వంటి చర్యల ద్వారా భారతదేశ ప్రకృతి వనరులపై నియంత్రణ సాధించారు.

ప్రశ్న 4.
600 సం||ల క్రితం రోపా వాసులు ఏ విధంగా ప్రయాణాలు చేసేవారు?
జవాబు:
600 సం||ల క్రితం ప్రజలు చాలా తక్కువగా ప్రయాణం చేసేవాళ్ళు. సాధారణంగా గుర్రాల మీద, ఒంటెల మీద ప్రయాణం చేసేవాళ్ళు. లేదా సముద్ర తీరం వెంట ఫడవులు, ఓడలలో ప్రయాణం చేసేవాళ్ళు.

ప్రశ్న 5.
ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలలో ఏ ఏ ఉత్పత్తులకు, వస్తువులకు గిరాకీ ఉండేది?
జవాబు:
విదేశీ వస్తువులను కొని, అధిక ధరలకు అమ్మే వ్యాపారస్తులు దూర దూరాలకు ప్రయాణించడంతో ప్రజల మధ్య, దేశాల మధ్య సంబంధాలు పెరగసాగాయి. చైనా నుంచి పట్టు, పింగాణీ పాత్రలకు, భారతదేశం నుంచి నూలు వస్త్రాలు, ఉక్కు, సుగంధ ద్రవ్యాలకు, అరేబియా నుంచి పళ్ళు, అత్తర్లకు, యూరపు నుంచి మద్యానికి ప్రపంచమంతటా గిరాకీ ఉండేది.

ప్రశ్న 6.
లాటిన్ అమెరికా దేశాలంటే ఏవి?
జవాబు:
1500 నుంచి 1800 వరకు మధ్య మూడు వందల సంవత్సరాల కాలంలో మధ్య, దక్షిణ అమెరికాలలో అధిక భాగం స్పెయిన్, పోర్చుగీసు అధీనంలోకి వచ్చింది. స్పెయిన్, పోర్చుగీసు భాషలు లాటిన్ నుంచి పుట్టాయి. కాబట్టి ఈ దేశాలను ‘లాటిన్ అమెరికన్’ దేశాలుగా వ్యవహరిస్తారు.

ప్రశ్న 7.
హసియండా అంటే ఏమిటి?
జవాబు:
స్పెయిన్ నుంచి వచ్చి దక్షిణ అమెరికాలో స్థిరపడిన వాళ్ళ చేతుల్లో ఆ దేశాల గనులు, భూములు ఉండేవి. వాళ్ళల్లో కొంతమంది పెద్ద భూస్వాములుగా ఉండేవాళ్ళు. వాళ్ళ కింద ఉండే విశాల భూ భాగాన్ని ‘హసియండా’ అంటారు.

AP 9th Class Social Important Questions Chapter 17 లాటిన్ అమెరికా, ఆసియా, ఆఫ్రికాలలో వలసవాదం

ప్రశ్న 8.
పోర్చుగీసు వలస పాలిత ప్రాంతంగా ఉన్న బ్రెజిల్ ఎప్పుడు స్వాతంత్ర్యం పొందింది?
జవాబు:
1822 లో

ప్రశ్న 9.
మన్రో సిద్ధాంతం అనగానేమి?
జవాబు:
అమెరికా అధ్యక్షుడు జేమ్స్ మన్రో తయారుచేసిన సిద్ధాంతం కాబట్టి దానికి మన్రో సిద్ధాంతమని పేరు. దీని ప్రకారం అమెరికా ఖండాలలో యూరప్ దేశాలు ఏవీ వలస ప్రాంతాలను ఏర్పరచుకోకూడదు. అందుకు ప్రతిగా ఇతర ఖండాలలో యూరపు వ్యవహారాల్లో కానీ, వలస ప్రాంతాల్లో కాని అమెరికా జోక్యం చేసుకోదు.

ప్రశ్న 10.
రెండవ ప్రపంచ యుద్ధ కాలం?
జవాబు:
1939 – 1945

ప్రశ్న 11.
నల్లమందు యుద్ధాలు ఎప్పుడు జరిగాయి? ఏ ఏ దేశాల మధ్య జరిగాయి?
జవాబు:
నల్లమందు యుద్ధాలు 1840 – 42 ల మధ్య జరిగాయి. ఇంగ్లాండ్, చైనాల మధ్య నల్లమందు యుద్ధాలు జరిగాయి.

ప్రశ్న 12.
యూరప్ సైన్యాన్ని ఓడించిన ఏకైక యూరపేతర సామ్రాజ్యం ఏది?
జవాబు:
ఇథియోపియా.

AP 9th Class Social Important Questions Chapter 16 సామాజిక నిరసనోద్యమాలు

These AP 9th Class Social Important Questions 16th Lesson సామాజిక నిరసనోద్యమాలు will help students prepare well for the exams.

AP Board 9th Class Social 16th Lesson Important Questions and Answers సామాజిక నిరసనోద్యమాలు

9th Class Social 16th Lesson 1 Mark Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
కంచె వేయటం అనే ప్రక్రియ వలన ఏం జరిగింది?
జవాబు:
‘కంచె వేయటం’ అనే ప్రక్రియ ద్వారా 1770లో వందలాది చిన్న రైతులు భూములను శక్తిమంతులైన భూస్వాముల పెద్ద కమతాలతో కలిపివేశారు.

ప్రశ్న 2.
లుద్దిజం అంటే ఏమిటి?
జవాబు:
‘జనరల్ నె లుడ్జ్’ అన్న జనాకర్షక నాయకుడి నేతృత్వంలో మరొక రకమైన నిరసన వ్యక్తమైంది. ఈ ఉద్యమాన్ని ‘లుద్దిజం’ (1811 – 17) అంటారు.

ప్రశ్న 3.
సామ్యవాదం ఏం ఖండిస్తుంది?
జవాబు:
ఉత్పత్తి సాధనాలు వ్యక్తిగత ఆస్తిగా ఉండి, ఏం ఉత్పత్తి చేయాలి, అందులో ఎవరికి వాటా ఉండాలి అనే విషయాలను మార్కెట్ నిర్ణయించే పెట్టుబడిదారీ విధానంలోని మౌలిక భావనలను సామ్యవాదం ఖండిస్తుంది.

AP 9th Class Social Important Questions Chapter 16 సామాజిక నిరసనోద్యమాలు

ప్రశ్న 4.
బాబెఫ్ వాదన ఏమిటి?
జవాబు:
‘విలువైన సమానత్వం అన్న సిద్ధాంతాన్ని’ సాధించాలంటే వ్యక్తిగత ఆస్తిని రద్దుచేసి భూమి, దాని ఫలాలు ఉమ్మడిగా అనుభవించాలని బాబెఫ్ వాదించాడు.

ప్రశ్న 5.
సామ్యవాదం మద్దతుదారులు ఎవరు?
జవాబు:
ఎం.ఎన్. రాయ్, భగత్ సింగ్, జవహర్ లాల్ నెహ్రూ వంటి అనేక మంది నాయకులు సామ్యవాదం మద్దతుదారులు అయ్యారు.

ప్రశ్న 6.
వర్జీనియా ఉల్ఫ్ ఏమి రాశాడు?
జవాబు:
మహిళలపై పురుషుల ఆధిపత్యం గురించి, ఆధిపత్యం చెలాయించే సాధనాలుగా మహిళలు కూడా మారే విధానం గురించి ‘వర్జీనియా ఉల్ఫ్’ వంటి రచయిత్రులు రాయసాగారు.

9th Class Social 16th Lesson 2 Marks Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
“సామ్యవాదం అనే భావన ఎందుకు అభినందనీయము?” మీ అభిప్రాయం వ్రాయండి.
జవాబు:
ప్రకృతి వనరులు, ఆస్తులు వ్యక్తుల కింద వారి నియంత్రణలో కాకుండా ప్రజల అధీనంలో ఉండాలనే సిద్ధాంతమే సామ్యవాదం.

  1. సామ్యవాదంలో ఉత్పత్తి విషయంలో ప్రభుత్వ బాధ్యత ఉంటుంది.
  2. పరిశ్రమలను జాతీయం చేయడం వలన ఉత్పత్తి అయిన జాతీయ సంపద సర్వప్రజలకు సమానంగా చెందు అవకాశం కలదు.
  3. దీని వలన ఆర్థిక అసమానతలు తొలగి, ప్రజలందరి జీవితాలు మెరుగుపడటమే కాకుండా వాళ్ళకు ఎన్నో అవకాశాలను, శక్తులను ఇస్తుంది. దీనిలో చిన్నా, పెద్దా తేడాలు ఏమీ ఉండవు.

పై అన్ని అంశాల వలన సామ్యవాదం అభినందనీయం.

ప్రశ్న 2.
సామ్యవాద సిద్ధాంతానికి సంబంధించి రెండు అంశాలు రాయండి.
జవాబు:

  1. విలువైన సమానత్వం అన్న సిద్ధాంతాన్ని సాధించాలంటే వ్యక్తిగత ఆస్తిని రద్దుచేసి భూమి, దాని ఫలాలు ఉమ్మడిగా అనుభవించాలి.
  2. నిజమైన స్వేచ్ఛ, నిజమైన సమానత్వం ఉండాలంటే, వనరులు సామాజిక నియంత్రణలో ఉండాలి.

ప్రశ్న 3.
పెట్టుబడిదారీ వ్యవస్థలో కార్మికులు, శ్రామికులు, మహిళలు ఎదుర్కొను సమస్యలేవి?
జవాబు:
పెట్టుబడిదారీ వ్యవస్థలో పెట్టుబడిదారులు స్వతంత్ర జీవనాధారంలేని వేలాది మంది కార్మికులు, కూలీలను ఎన్నో ఇబ్బందులకు గురి చేసెను. కార్మికులు, యజమానులు ఇచ్చే స్వల్ప వేతనమునకే తప్పనిసరి పరిస్థితులలో పని చేయవలసి వచ్చెను. స్త్రీలకు, చిన్న పిల్లలకు తక్కువ కూలి ఇచ్చేవారు. యజమానులు వారి చేత నిర్దాక్షిణ్యంగా, కఠినంగా ప్రమాదకరమైన పనులు చేయించిరి. దినమునకు 15 నుండి 18 గంటల వరకు పని చేయవలసి వచ్చేది. కార్మికులు, శ్రామికులు నివసించే ప్రాంతాలు అనారోగ్యకరంగా ఉండి, అంటువ్యాధులకు నిలయమై ఉండేవి.

AP 9th Class Social Important Questions Chapter 16 సామాజిక నిరసనోద్యమాలు

ప్రశ్న 4.
సామ్యవాదం అంటే ఏమిటి? దాని లక్ష్యాలు ఏమి?
జవాబు:
ప్రకృతి వనరులు, ఆస్తులు వ్యక్తుల కింద వారి నియంత్రణలో కాకుండా ప్రజల అధీనంలో ఉండాలనే సిద్ధాంతమే సామ్యవాదం.

  1. సామ్యవాద పద్ధతిలో వస్తూత్పత్తి సాధనాలు. ప్రభుత్వ అధీనంలో ఉంటాయి.
  2. ఉత్పత్తికి కూడా ప్రభుత్వమే బాధ్యత వహించును.
  3. పరిశ్రమలు జాతీయం చేయడం వల్ల ఉత్పత్తి అయిన జాతీయ సంపద సర్వ ప్రజలకు సమానంగా చెందు అవకాశం కలుగును.
  4. దీనివల్ల ఆర్థిక అసమానతలను తగ్గించును.

9th Class Social 16th Lesson 4 Marks Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
“పారిశ్రామికీకరణ వల్ల కళాకారులు, మేధావులు కూడా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. గ్రామీణ ప్రజాజీవనం, వ్యవసాయోత్పత్తి లేదా చేతివృత్తి పనులతో ముడిపడి ఉన్న మానవ విలువలు అంతరించిపోయాయి.”
శాస్త్ర, సాంకేతిక విజ్ఞానాలు మానవ విలువలను ప్రభావితం చేస్తున్న అంశంపై వ్యాఖ్యానించుము.
జవాబు:
భావాలు ఉద్వేగాల కంటే హేతువు, శాస్త్ర సాంకేతిక విజ్ఞానాలకు అధిక ప్రాధాన్యతను ఇవ్వడం, పెద్ద ఎత్తున పారిశ్రామికీకరణ అచ్చెరువు గొలిపే ప్రభావంతో పాటు శ్రామిక ప్రజల దారిద్ర్యం, దుర్భర జీవనాలు, మేధావుల పైన గాఢ ముద్రను వేశాయి.

పారిశ్రామికీకరణ వలన కొత్త సామాజిక బృందాలు కూడా ఏర్పడ్డాయి. సమాజంలో ముఖ్యపాత్ర పోషించడానికి ఇవి. తహతహలాడసాగాయి. పారిశ్రామికీకరణ పారిశ్రామిక పెట్టుబడిదారులకు, బడా భూస్వాములకు, అధికారం, ప్రాబల్యంతో పాటు, సంఘటిత కార్మికవర్గ ఉద్యమాలకు దారితీసింది. తాము సమైక్యంగా ఉన్నప్పుడు మొత్తం ఆర్థిక జీవనాన్ని స్తంభింప చేయడం ద్వారా తమ శక్తిని శ్రామికులు గుర్తించారు. అదే విధంగా అప్పటివరకు ఇళ్ళకు పరిమితమైన మహిళలు బయటకు వచ్చి సమాజంలో ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక రంగాలలో సమాన భూమికను కోరసాగారు. తమ కోర్కెలు నెరవేర్చు కోవడానికి తరచుగా వారు సోషలిజం, ప్రజాస్వామిక జాతీయ వాదం వంటి సామాజిక ఉద్యమాలలో చేతులు కలిపారు.

AP 9th Class Social Important Questions Chapter 15 పారిశ్రామికీకరణ, సామాజిక మార్పు

These AP 9th Class Social Important Questions 15th Lesson పారిశ్రామికీకరణ, సామాజిక మార్పు will help students prepare well for the exams.

AP Board 9th Class Social 15th Lesson Important Questions and Answers పారిశ్రామికీకరణ, సామాజిక మార్పు

9th Class Social 15th Lesson 1 Mark Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
తొలి పారిశ్రామిక విప్లవం అని దేనిని అంటారు?
జవాబు:
1780-1850 ల మధ్య కాలంలో బ్రిటన్ పరిశ్రమలు, ఆర్థిక విధానంలో సంభవించిన మార్పులను “తొలి పారిశ్రామిక విప్లవం”గా పేర్కొంటారు.

ప్రశ్న 2.
పారిశ్రామిక విప్లవం అనే పదాన్ని మొదటగా వాడినవారు ఎవరు?
జవాబు:
ఐరోపా మేధావులైన ఫ్రాన్స్ లోని జార్జెన్ మిథైలెట్, జర్మనీలోని ఫ్రెడ్రిక్ ఎంగెల్స్ “పారిశ్రామిక విప్లవం” అన్న పదాన్ని వాడారు.

ప్రశ్న 3.
ఫిషర్ ప్రశంస ఏమిటి?
జవాబు:
“ఇనుము, బొగ్గు, వస్త్ర పరిశ్రమల ఆధారంగా బ్రిటన్ రూపొందించిన నాగరికతను ఆ తరువాత ప్రపంచమంతా అనుకరించింది” అని ఫిషర్ ప్రశంసించాడు.

AP 9th Class Social Important Questions Chapter 15 పారిశ్రామికీకరణ, సామాజిక మార్పు

ప్రశ్న 4.
మొదటి, రెండవ రైలు మార్గాలు ఏఏ నగరాలను కలిపాయి?
జవాబు:
మొదటి రైలు మార్గం 1825 సం||రంలో ‘స్టాక్టన్’, ‘డార్లింగ్ టన్’ పట్టణాలను కలిపింది. రెండవ రైలు మార్గం 1830లో లివర్‌పూల్ ని, మాంచెస్టర్ ని కలిపింది.

ప్రశ్న 5.
కాలువల ద్వారా, రైళ్ల ద్వారా రవాణాలోని ప్రయోజనాలు ప్రశంసించండి.
జవాబు:
కాలువలు, రైళ్ళ ద్వారా త్వరితగతిన పారిశ్రామికీకరణ జరగడమే కాకుండా, వాణిజ్యం, భావ ప్రసారం, ఆర్థిక ప్రగతి వంటివి పెరిగాయి.

ప్రశ్న 6.
బ్రిటన్లో పారిశ్రామిక విప్లవానికి అనుకూలించే అంశాలు ఏవి?
(లేదా)
ఆధునిక పారిశ్రామిక విప్లవము. బ్రిటన్లోనే ఎందుకు ఆవిర్భవించింది?
జవాబు:
ఇంగ్లాండ్ లో ముడిసరుకుకు కొరతలేదు. బొగ్గు, ఇనుము సమృద్ధిగానే కాకుండా పక్కపక్కనే దొరికేవి. జలశక్తికి ఎటువంటి కొరతా లేదు. వాతావరణ పరిస్థితులు అనుకూలం. అధిక సంఖ్యలో కార్మికులు అందుబాటులో ఉండేవారు.

9th Class Social 15th Lesson 2 Marks Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
“20వ శతాబ్దపు ఆవిష్కరణలు సాంకేతికాభివృద్ధిని మరియు సహజ వనరులను అత్యంత ప్రభావితం చేస్తాయి. నూతన ఆవిష్కరణల ఫలితంగా అందుబాటులోకి వచ్చిన ప్రధాన వస్తువులు మరియు పరికరాలు ఈనాడు మన జీవన విధానాన్ని మార్చివేశాయి.”
రవాణా మరియు వైద్యరంగంలోని ఏవేని ఒక్కొక్క నూతన ఆవిష్కరణను పేర్కొని, అవి నేటి మన జీవనాన్ని ఏవిధంగా మార్చాయో క్లుప్తంగా తెలపండి.
జవాబు:
రవాణా :
విమానాలు, మోటార్ వాహనాల ఆవిష్కరణ, రైల్వేల ఆవిర్భావం మొదలైనవి.

వైద్యం :
యాంటీ బయాటిక్స్, వ్యాధి నిరోధక టీకాలు, మత్తు మందు మొదలైనవి.

విమానాలు విశాల ప్రపంచాన్ని దగ్గర చేశాయి. సుదూర ప్రాంతాలకు సహితం వేగంగా చేరుకోవడానికి వీలు కల్పించాయి.

వ్యాధి నిరోధక టీకాల వల్ల మానవుల సగటు ఆయుఃప్రమాణం పెంపొందటం, అనేక వ్యాధులను అరికట్ట గలగడం గొప్ప విజయం.

AP 9th Class Social Important Questions Chapter 15 పారిశ్రామికీకరణ, సామాజిక మార్పు

ప్రశ్న 2.
పారిశ్రామిక విప్లవం వల్ల మానవజీవనంలో సంభవించిన దుష్పరిణామాలు ఏవి?
జవాబు:
పారిశ్రామిక విప్లవం వల్ల మానవ జీవనంలో సంభవించిన దుష్పరిణామాలు :

  1. విచ్ఛిన్నమైన కుటుంబాలు
  2. కొత్త చిరునామాలు, సమస్యలకు లోనైన పట్టణాలు
  3. గృహవసతి, తాగునీటికి కష్టాలు.
  4. కలరా, టైఫాయిడ్, క్షయ వంటి వ్యాధులు
  5. పాలకుల నిర్లక్ష్యం.

ప్రశ్న 3.
ఫ్రాన్స్ లో పారిశ్రామికీకరణ వృద్ధి చెందకపోవడానికి కారణాలు ఏవి?
జవాబు:

  1. పెట్టుబడిని సమీకరించి, పారిశ్రామికవేత్తలకు అప్పులు ఇవ్వగల పెద్ద బ్యాంకు ఫ్రాన్స్ లో వృద్ధి చెందలేదు.
  2. ఫ్రెంచి ఉత్పత్తిదారులలో చాలామంది కుటుంబ వనరుల పైనే ఆధారపడటం.
  3. ఫలితంగా వాళ్ళు చిన్న కంపెనీలుగానే మిగిలిపోవడం.
  4. కొత్త సాంకేతిక విజ్ఞానాన్ని, ఆలోచనలను వేగంగా ఆచరణలో పెట్టలేకపోవడం.
  5. బొగ్గు గనులు తక్కువ.
  6. ఫ్రెంచి పరిశ్రమలు వినియోగదారీ వస్తువులైన బట్టలు వంటి వాటి పైనే దృష్టి, పై కారణాల వలన ప్రగతి సాధించలేకపోయింది.

9th Class Social 15th Lesson 4 Marks Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
“పట్టణాల్లో ఇతర సామాజిక బృందాలతో పోలిస్తే కార్మికుల సగటు జీవితకాలం చాలా తక్కువగా వుందని 1842 లో చేసిన ఒక సర్వే వెల్లడి చేసింది.”
ప్రపంచ వ్యాప్తంగా కార్మికులు ఎదుర్కొన్న సమస్యలను వ్యాఖ్యానించండి.
జవాబు:

  1. వారు ఉన్న పల్లెలతో పోలిస్తే పట్టణాలలో వారి జీవన ప్రమాణం చాలా తక్కువగా ఉంది.
  2. పిల్లలలో సగం కంటే ఎక్కువ మంది 5 సం||ల కన్నా ఎక్కువ కాలం బ్రతికేవారు కాదు.
  3. జనాభా అధికంగా పెరగటం వల్ల సదుపాయాలు చాలా తక్కువగా ఉండేవి.
  4. నీటి కాలుష్యం వల్ల కలరా, టైఫాయిడ్ మరియు గాలి కాలుష్యం వలన క్షయ వంటి వ్యాధులు రావటంతో మరణాల సంఖ్య ఎక్కువగా ఉండేది.
  5. పురపాలక అధికారులు ప్రమాదాలను అరికట్టడానికి ఎటువంటి చర్యలను తీసుకోలేదు.
  6. వైద్యశాస్త్రం కూడా అంతగా అభివృద్ధి చెందలేదు.
  7. పారిశ్రామిక కార్మికుల జీవితాలకు ఎటువంటి గౌరవం, భద్రత లేవు.
  8. వారు సానుభూతి లేని యజమానులు మరియు పర్యవేక్షకుల నియంత్రణలో పనిచేసేవారు.

ఈ విధంగా ప్రపంచ వ్యాప్తంగా కార్మికులు చాలా ఇబ్బందులకు గురి అయినారు.

ప్రశ్న 2.
రోడ్లు నిర్మించిన జాన్ మెట్ కాఫ్ చూపులేని వ్యక్తి. అతడు స్వయంగా రోడ్ల ఉపరితలాలు సర్వేచేసి, వాటికి ప్రణాళికలు తయారుచేసేవాడు. కాలువలను నిర్మించిన జేమ్స్ బ్రాండ్లో దాదాపుగా నిరక్షరాస్యుడు. అతడికి పదాల అక్షరక్రమం (స్పెల్లింగ్) సరిగా వచ్చేది కాదు. నావిగేషన్ అన్న పదం కూడా పలికేవాడు కాదు. కాని అతడి జ్ఞాపకశక్తి, ఊహాశక్తి, ఏకాగ్రత అమోఘంగా ఉండేవి.
ప్రశ్న : పైన ఇచ్చిన పేరాను చదివి దానిపై వ్యాఖ్యానించండి.
జవాబు:
పైన ఇవ్వబడిన పేరా ఏమి చెప్తుందంటే …………
ఏదైనా మనం క్రొత్తగా కనిపెట్టాలి అంటే మనం శాస్త్ర విజ్ఞానం అన్వయించడం ద్వారా కంటే కృతనిశ్చయం, ఆసక్తి, కుతూహలం, ముఖ్యంగా అదృష్టం కూడా అవసరమే అని చెప్తుంది. అంతేకాకుండా శాస్త్ర పరిజ్ఞానం ఏమీ లేకుండానే ఇంత సాధించామంటే, ప్రస్తుతం ఉన్న శాస్త్ర పరిజ్ఞానంతో మనం ఎంతో సాధించవచ్చు. కావున మనకు విజ్ఞానంతో పాటు జ్ఞాపకశక్తి, పట్టుదల కూడా ఎంతో అవసరం.

ప్రశ్న 3.
పారిశ్రామికీకరణవల్ల మహిళలు, పిల్లలు అనుభవించిన బాధలు ఏవి?
(లేదా)
పారిశ్రామిక విప్లవ కాలంలో మహిళలు, పిల్లలు ఎదుర్కొన్న సమస్యల గురించి రాయండి.
జవాబు:
పిల్లలు :

  1. ఇంగ్లాండ్ లో పిల్లల దుస్థితి దారుణంగా ఉండేది.
  2. అధిక పనిగంటలు
  3. నిద్రలేమితో యంత్రాలలో పడి మరణాలు
  4. యంత్రాల వల్ల పిల్లలకు గాయాలు
  5. యంత్రాల వల్ల పిల్లల జుట్టు ఇరుక్కుపోయేది.

మహిళలు :

  1. నూలు వస్త్ర పరిశ్రమలో ఎక్కువగా పని
  2. పట్టు, లేసు, అల్లికలలో పని 3) తక్కువ కూలి
  3. చేసిన తప్పులకు కఠినమైన శిక్షలు 5) పని గంటల భారం
  4. తరచుగా సంభవించే జబ్బులు
  5. ప్రసవ సమయంలో మరణాలు

AP 9th Class Social Important Questions Chapter 15 పారిశ్రామికీకరణ, సామాజిక మార్పు

ప్రశ్న 4.
ప్రపంచంలోని వివిధ దేశాలలో రైళ్ళ రాకవల్ల ఏర్పడిన ప్రభావాలను పోల్చండి.
(లేదా)
చక్కటి రవాణా సౌకర్యాలు వేగవంతమైన పారిశ్రామికీకరణకు దారితీస్తాయి’ ఈ వాక్యంపై మీ అభిప్రాయం వివరించండి.
జవాబు:
ప్రపంచంలో అనేక దేశాలు పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి, తమ ఉత్పత్తులు ముడి సరుకులతో ప్రపంచాన్ని ఆకర్షించడానికి, ప్రయాణికులను, సరుకులను, ఉత్పత్తులను వేగంగా, సులువుగా తక్కువ ఖర్చుతో రవాణా చేయడానికి రైళ్ళు ప్రధాన భూమిక పోషించాయి. కలప పట్టాలకు బదులు ఇనుప పట్టాలను కనిపెట్టటం, ఆవిరి యంత్రంతో పెట్టెలను లాగటం అన్న రెండు ఆవిష్కరణల వల్ల ఇది సాధ్యమయ్యింది.

రైల్వేల వల్ల పారిశ్రామికీకరణ రెండవ దశలోకి మారటమే కాకుండా, కాలువల వినియోగంలో అనేక సమస్యలను అధికమించే క్రమంలో రైళ్ళు ఒక ప్రత్యేక పాత్ర పోషించాయి. 1850 నాటికి జర్మనీ, ఇంగ్లాండ్, ఫ్రాన్లతో పోలిస్తే రెట్టింపు నిధులు సమకూర్చి ఆ రెండు దేశాలను అధిగమించి రైల్వేలను అభివృద్ధి చేసింది. ఫ్రాన్స్ దేశంలో కూడా పారిశ్రామిక ప్రగతితో రైలు మార్గాలు విస్తరించి, రవాణా వ్యవస్థలో ప్రధానపాత్ర పోషించాయి. ప్రపంచంలోని చాలా దేశాల పరిశ్రమల వేగవంతానికి, ఆర్థిక పరిపుష్టి సాధనలో రైల్వేలు ముఖ్యపాత్ర పోషించాయి.

AP 9th Class Social Important Questions Chapter 14 19వ శతాబ్దంలో ప్రజాస్వామిక, జాతీయవాద విప్లవాలు

These AP 9th Class Social Important Questions 14th Lesson 19వ శతాబ్దంలో ప్రజాస్వామిక, జాతీయవాద విప్లవాలు will help students prepare well for the exams.

AP Board 9th Class Social 14th Lesson Important Questions and Answers 19వ శతాబ్దంలో ప్రజాస్వామిక, జాతీయవాద విప్లవాలు

9th Class Social 14th Lesson 1 Mark Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
రాజ్యం అంటే ఏమిటి?
జవాబు:
‘రాజ్యం’ అన్నపదానికి ఫ్రెంచి విప్లవం ఒక కొత్త అర్థాన్నిచ్చింది. రాజ్యమంటే దానికి చెందిన ప్రజలు నివసించే ప్రాంతం కాదు, రాజ్యమంటే అందులోని ప్రజలే.

ప్రశ్న 2.
సెర్ఫ్‌లు అనగా ఎవరు?
జవాబు:
సెర్ఫ్‌లు :
ఒక భూస్వామి భూములకు కట్టుబడి ఉన్నవాళ్లు. అతడి అనుమతి లేకుండా వేరే చోటుకి వెళ్ళటానికి వీలులేనివారు.

ప్రశ్న 3.
సప్లీజ్ అనగానేమి?
జవాబు:
సఫ్రేజ్ అనగా సార్వజనీన ఓటు హక్కు.

ప్రశ్న 4.
జంకర్లు అనగా ఎవరు?
జవాబు:
ప్రష్యాలోని బడా భూస్వాములను ‘జంకర్లు’ అనేవారు.

AP 9th Class Social Important Questions Chapter 14 19వ శతాబ్దంలో ప్రజాస్వామిక, జాతీయవాద విప్లవాలు

ప్రశ్న 5.
ఇటలీ ఏకీకరణలో “కవూర్” పోషించిన పాత్రను మీరు ఏ విధంగా ప్రశంసిస్తారు?
జవాబు:
కవూర్ పాత్ర ఇటలీ ఏకీకరణలో ప్రశంసనీయమైనది. ఎందుకనగా అతను ఒక విప్లవవాదిలా కాకుండా, ప్రజాస్వామ్యవాదిలా తనకున్న ఫ్రెంచ్ భాషా నైపుణ్యంతో దౌత్యనీతిని ప్రదర్శించి ఇటలీ భాగాలను ఏకీకరణ చేయడానికి కృషి చేశాడు.

9th Class Social 14th Lesson 2 Marks Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
19వ శతాబ్ద ఆరంభంలో ఉదారవాదులు సమర్థించిన రాజకీయ, ఆర్థిక, సామాజిక అంశాలు ఏమిటి?
జవాబు:
ఉదారవాదులు సమర్థించిన రాజకీయ, సామాజిక, ఆర్థిక అంశాలు :

  • వ్యక్తిగత స్వేచ్ఛ, చట్ట సమానత్వం.
  • రాజకీయంగా ప్రజామోదంతో ప్రభుత్వం అన్న భావన.
  • వ్యక్తిగత ఆస్తి హక్కుకు ప్రాధాన్యత.
  • రాజ్యాంగం, పార్లమెంట్ ద్వారా ప్రాతినిధ్య ప్రభుత్వం.
  • సరుకులు, ప్రజలు, పెట్టుబడి ఎటువంటి ఆటంకాలు లేకుండా తరలింపబడేలా ఏకీకృత ఆర్థిక ప్రాంతం ఏర్పాటు.
  • సుంకాల సమాఖ్య లేదా జోల్వెరిన్ ఏర్పాటు.
  • రైలు మార్గాల అభివృద్ధితో ప్రగతి అధికం.
  • దేశ ఐక్యతకు తగ్గట్లు ఆర్థిక, సామాజిక, రాజకీయ హక్కుల కల్పన.

ప్రశ్న 2.
సంవత్సరం సంఘటనలు
AP 9th Class Social Important Questions Chapter 14 19వ శతాబ్దంలో ప్రజాస్వామిక, జాతీయవాద విప్లవాలు 1
పై సమాచారాన్ని పరిశీలించి క్రింది ప్రశ్నలకు జవాబివ్వండి.
ఎ) ‘మధ్య తరగతి’ చేసిన డిమాండ్లు ఏవి?
బి) ఏ దేశంపై దాడితో నెపోలియానిక్ యుద్దాలు మొదలయ్యాయి?
జవాబు:
ఎ) రాజ్యాంగాన్ని ఏర్పాటు చేయడం
ప్రాతినిధ్య ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం

బి) ఇటలీపై నెపోలియన్ దాడి వలన నెపోలియానిక్ యుద్ధాలు మొదలయ్యాయి.

AP 9th Class Social Important Questions Chapter 14 19వ శతాబ్దంలో ప్రజాస్వామిక, జాతీయవాద విప్లవాలు

ప్రశ్న 3.
AP 9th Class Social Important Questions Chapter 14 19వ శతాబ్దంలో ప్రజాస్వామిక, జాతీయవాద విప్లవాలు 2
పై పటాన్ని చదివి దిగువ ప్రశ్నలకు జవాబులివ్వండి.
ఎ) పై పటంలో చూపబడిన ఏవైనా రెండు దీవుల పేర్లు రాయండి.
బి) పై పటంలో చూపబడిన రాజ్యాలు ప్రస్తుతం ఏ దేశంలో భాగాలు?
జవాబు:
ఎ) సార్డీనియా, సిసిలీ, కోర్సికో.
బి) పటంలో చూపబడిన రాజ్యాలు ప్రస్తుతం ఇటలీ దేశానికి చెందినవి.

ప్రశ్న 4.
పోలెండ్ ను రష్యా ఏ విధంగా విలీనం చేసుకుంది?
జవాబు:
వియన్నా సమావేశం పోలెండ్ లో అధిక భాగాన్ని రష్యాకి ఇచ్చింది. ఇప్పుడు విప్లవం పోలెండ్ కి విస్తరించింది. అయితే రష్యా బలమైన శక్తి కావటంతో బెల్జియం లాగా కాకుండా పోలెండ్ స్థితి భిన్నంగా ఉంది. పోలిష్ ప్రజలకు తమ పక్క దేశాల నుంచి మద్దతు లభించలేదు. వాళ్ళు ఎంతగానో పోరాడారు. కాని చివరకు ఓడిపోయారు. ఫలితంగా జారు చక్రవర్తి పోలెండ్ ను రష్యాలో కలిపేసుకున్నాడు.

ప్రశ్న 5.
1848 విప్లవానికి కారణాలేవి?
జవాబు:
ఫ్రాన్స్ లో లూయీ ఫిలిప్ రాజ్యాంగబద్ధ రాచరికంలో భాగంగా పరిపాలించాలి. సింహాసనాన్ని అధిష్టిస్తున్నప్పుడు అతడిని పౌరరాజుగా పేర్కొన్నారు. అతడి పట్టాభిషేకం “దేవుని దయతోను”, “జాతి కోరిక ప్రకారం” జరిగిందని అన్నారు. అయితే కాలం గడుస్తున్న కొద్దీ ఫిలిప్ తిరోగామి పంథాను అనుసరించాడు. శత్రువులు పెరిగారు. అతడు నియమించిన మంత్రులు, పాలకులపై తిరుగుబాట్లు జరిగాయి. ఈ సందర్భంగా ఫిలిప్ జరిపిన కాల్పులలో 23 మంది చనిపోయారు. పారిలో వీధి పోరాటాలతో విప్లవానికి నాంది పలికింది.

ప్రశ్న 6.
యూరపులో రాచరిక స్థానంలో జాతీయ రాజ్యాలు ఎలా ఏర్పడ్డాయి?
జవాబు:
యూరపు సామ్రాజ్యాలుగా, చిన్న రాజ్యాలుగా విభజింపబడి ఉంది. ఉమ్మడి చరిత్ర, సంస్కృతి, ఆర్థిక జీవనం పంచుకుంటున్నా మన్న భావం కలిగిన పౌరుల క్రియాశీల భాగస్వామ్యంపై ఆధారపడిన బలమైన దేశాలను ఏర్పాటు చేయటానికి ప్రజాస్వామిక, జాతీయవాద ఉద్యమాలు ప్రయత్నించాయి. ఈ ప్రయత్నాల ఫలితంగా పలు దేశాలతో కూడిన వంశపారంపర్య రాచరిక స్థానంలో యూరపులో జాతీయ రాజ్యాలు ఏర్పడ్డాయి.

9th Class Social 14th Lesson 4 Marks Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
AP 9th Class Social Important Questions Chapter 14 19వ శతాబ్దంలో ప్రజాస్వామిక, జాతీయవాద విప్లవాలు 1
పై సమాచారాన్ని చదివి క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
ఎ) వియన్నా సమావేశం ఏ సంవత్సరంలో జరిగింది?
బి) 1848 విప్లవ కాలంలో ఫ్రాన్స్ ని ఎవరు పరిపాలిస్తున్నారు?
సి) ఇటలీ ఏకీకరణను పూర్తిచేసిన వారెవరు?
డి) గ్రీకుల స్వాతంత్ర్య పోరాటం ఎప్పుడు ఆరంభమైంది?
జవాబు:
ఎ) వియన్నా సమావేశం 1815 వ సం||లో జరిగింది.
బి) 1848 విప్లవ కాలంలో ఫ్రాన్సును లూయి ఫిలిప్పీ పరిపాలిస్తున్నారు.
సి) ఇటలీ ఏకీకరణను పూర్తిచేసిన వారు విక్టర్ ఇమ్మాన్యుయెల్-II.
డి) గ్రీకు స్వాతంత్ర్య పోరాటం 1821 వ సం||లో ఆరంభమైనది.

AP 9th Class Social Important Questions Chapter 13 17, 18వ శతాబ్దాలలో ప్రజాస్వామిక, జాతీయవాద విప్లవాలు

These AP 9th Class Social Important Questions 13th Lesson 17, 18వ శతాబ్దాలలో ప్రజాస్వామిక, జాతీయవాద విప్లవాలు will help students prepare well for the exams.

AP Board 9th Class Social 13th Lesson Important Questions and Answers 17, 18వ శతాబ్దాలలో ప్రజాస్వామిక, జాతీయవాద విప్లవాలు

9th Class Social 13th Lesson 1 Mark Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
పౌరయుద్ధం అంటే ఏమిటి?
జవాబు:
ఒక దేశంలో జరిగే అంతర్యుద్ధాన్ని పౌర యుద్ధం అంటారు.

ప్రశ్న 2.
సుదీర్ఘ పార్లమెంట్ అని దేనిని అంటారు?
జవాబు:
1640 నుంచి 1660 వరకు కొనసాగిన పార్లమెంటును సుదీర్ఘ పార్లమెంట్ అంటారు.

ప్రశ్న 3.
రక్తరహిత విప్లవం అనగానేమి?
(లేదా)
ఇంగ్లండ్ విప్లవం ఎందువలన రక్తరహిత విప్లవంగా పిలవబడింది?
జవాబు:
ఇంగ్లండ్ విప్లవం ఎందువలన రక్తరహిత విప్లవంగా పిలువబడింది. అత్యున్నత అధికారాన్ని పార్లమెంటుకి బదిలీ చేశారు, ఈ మార్పులన్నీ ఒక్క తుపాకీ గుండు పేలకుండా, ఒక్క రక్తం బొట్టు చిందకుండా జరగడం వలన దానిని ‘మహోన్నత లేక రక్తరహిత విప్లవం’ అంటారు.

AP 9th Class Social Important Questions Chapter 13 17, 18వ శతాబ్దాలలో ప్రజాస్వామిక, జాతీయవాద విప్లవాలు

ప్రశ్న 4.
ఎస్టేటులో ఎవరెవరు ఉండేవారు?
జవాబు:
మొదటి ఎస్టేటులో ‘మతాధిపతులు’, రెండవ ఎస్టేటులో ‘కులీన వర్గం’, మూడవ ఎస్టేటులో వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలు, న్యాయస్థాన అధికారులు, న్యాయవాదులు, రైతులు, చేతివృత్తి కళాకారులు, చిన్న రైతులు, భూమిలేని కూలీలు, సేవకులు ఉన్నారు.

ప్రశ్న 5.
‘టైద్’ అంటే ఏమిటి?
జవాబు:
‘టైద్’ అనగా చర్చి విధించిన పన్ను, దీని ప్రకారం వ్యవసాయ ఉత్పత్తిలో 10వ వంతు చెల్లించాలి.

ప్రశ్న 6.
జూన్ 20న టెన్నిస్ కోర్టు మైదానంలో ఏం జరిగింది?
జవాబు:
టెన్నిస్ కోర్టు మైదానంలో జూన్ 20న మూడవ ఎస్టేట్ సభ్యులు సమావేశమయ్యారు. వాళ్లు తమను తాము జాతీయ శాసనసభగా ప్రకటించుకుని రాజు అధికారాలను పరిమితం చేసే రాజ్యాంగాన్ని తయారు చేసే దాకా విడిపోమని ప్రతినబూనారు.

ప్రశ్న 7.
కన్వెన్షన్ అని దేన్ని పిలవసాగారు?
జవాబు:
కొత్తగా ఎన్నికైన శాసనసభను ‘కన్వెన్షన్’ అని పిలవసాగారు.

ప్రశ్న 8.
డైరెక్టరీ అంటే ఏమిటి?
జవాబు:
అయిదుగురు సభ్యులతో కూడిన కార్యనిర్వాహక వర్గాన్ని (శాసనసభ) ఎన్నుకునే పాలన (జాకోబిన్ ప్రభుత్వం పడిపోవటంతో) ఫ్రాన్స్ లో ప్రారంభమయ్యింది. దీనినే ‘డైరెక్టరీ’ అంటారు.

AP 9th Class Social Important Questions Chapter 13 17, 18వ శతాబ్దాలలో ప్రజాస్వామిక, జాతీయవాద విప్లవాలు

ప్రశ్న 9.
మహోన్నత విప్లవ ఫలితం ఏమిటి?
జవాబు:
రాజు నుండి అత్యున్నత అధికారం పార్లమెంటుకు బదిలీ చేయబడినది.

ప్రశ్న 10.
1793 నుండి 1794 వరకు ఫ్రాన్స్ లో భీతావహ పాలనగా పిలవబడింది. కారణం రాయండి.
జవాబు:

  1. ఫ్రెంచి పరిపాలనా కాలంలో విప్లవం అనంతరం ఫ్రాన్స్ లో జరిగిన అత్యంత ముఖ్యమైన ఘట్టం భీతావహ పాలన.
  2. ఇది 1793-1794 మధ్యలో జరిగింది. ఈ కాలంలో రాబిస్పియర్ తీవ్ర నియంత్రణ, శిక్షల విధానాన్ని ఈయన అనుసరించాడు.
  3. రిపబ్లిక్ కి శత్రువులుగా గుర్తించబడిన మత గురువులు, కులీనులు, రాజకీయ పార్టీ సభ్యులను అరెస్టు చేసి జైలుకు పంపించి విప్లవ ట్రిబ్యునల్ ద్వారా విచారించి, నేరం రుజువైనచో “గిల్లెటిన్” ద్వారా చంపేసేవాళ్లు.
  4. ఖరీదైన తెల్ల పిండి (మైదా) వాడటాన్ని నిషేధించారు.

పట్టికను పరిశీలించి 11, 12 ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

లివర్లుఫ్రాన్స్ లో ద్రవ్య కొలమానం (కరెన్సీ) 1794 నుంచి నిలిపివేయబడినది.
మతాధిపతులుచర్చిలో ప్రత్యేక విధులతో సంబంధం ఉన్న వ్యక్తుల బృందం.
టైద్చర్చి విధించిన పన్ను. దీని ప్రకారం వ్యవసాయ ఉత్పత్తిలో పదవ వంతు చర్చికి చెల్లించాలి.
టెయిలేప్రభుత్వానికి నేరుగా కట్టే పన్ను.
కులీనులుధనిక భూస్వాములు, రాజకుటుంబీకులు, పాలకవర్గం.

ప్రశ్న 11.
చర్చిచే విధించబడిన పన్ను ఎంత శాతంగా ఉండేది?
జవాబు:
చర్చిచే విధించబడిన పన్ను టైడ్. దీని ప్రకారం ఉత్పత్తిలో పదవ వంతు చర్చికి చెల్లించాలి.

ప్రశ్న 12.
పై పట్టికలో ‘పన్ను’కి సంబంధించిన పదాలేవి?
జవాబు:
పన్నుకి సంబంధించిన పదాలు

  1. టైద్,
  2. టెయిలే.

ప్రశ్న 13.
అమెరికా స్వాతంత్ర్య పోరాటంలో ప్రముఖ నినాదం ఏది?
జవాబు:
అమెరికా స్వాతంత్ర్య పోరాటంలోని ప్రముఖ నినాదమేమనగా “ప్రాతినిధ్యం లేకుండా పన్ను చెల్లింపు లేదు”.

ప్రశ్న 14.
రక్తరహిత విప్లవము యొక్క విశిష్టత ఏమిటి?
జవాబు:
రక్తరహిత విప్లవం యొక్క విశిష్టత ఏమిటంటే అత్యున్నత అధికారాన్ని రాజు నుండి పార్లమెంటుకి బదిలీ చేయడం. ఈ పని ఒక్క తుపాకీ గుండు పేలకుండానే, ఒక్క రక్తం బొట్టు కూడా చిందించకుండా జరగడమే.

9th Class Social 13th Lesson 2 Marks Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
“మహోన్నత”, లేక “రక్తరహిత విప్లవం” అంటే ఏమిటి?
(లేదా)
“మహోన్నత లేదా రక్త రహిత విప్లవం” గురించి మీకేమి తెలియును ?
జవాబు:
చార్లెస్ – I మరణం తర్వాత 1688లో ఆరెంజ్ కి చెందిన విలియంని అతని భార్య మేరీని (చార్లెస్ – I మనవరాలు) ఇంగ్లాండ్ సింహాసనాన్ని అధిష్టించాల్సిందిగా పార్లమెంట్ కోరింది. అనంతరం ఒక కొత్త విధానాన్ని రూపొందించారు. దీని ప్రకారం మంత్రులు పార్లమెంట్ కి జవాబుదారీగా ఉంటారు. రాజు అధికారాలను పరిమితం చేశారు. పార్లమెంటుకు సర్వోన్నత అధికారాన్ని ఇచ్చి ప్రజాస్వామ్యానికి దారివేశారు. రాజు అధికారం దైవదత్తం అయింది. కాక పార్లమెంట్ ఇచ్చినదిగా ఉంటుంది. అత్యున్నత అధికారం పార్లమెంట్ కి బదిలీ చేసారు. ఈ మార్పులన్నీ ఒక్క తుపాకీ గుండు పేలకుండా, ఒక్క రక్తం బొట్టు చిందించకుండా జరిగాయి. అందుకే ఈ మార్పుని మహోన్నత లేదా రక్తరహిత విప్లవం అంటారు.

AP 9th Class Social Important Questions Chapter 13 17, 18వ శతాబ్దాలలో ప్రజాస్వామిక, జాతీయవాద విప్లవాలు

ప్రశ్న 2.
జాకోబిన్స్ క్లబ్ నాయకుడెవరు? ఇందులో సభ్యులెవరు?
(లేదా)
జాకోబిన్ క్లబ్బులు అనగా నేమి?
జవాబు:
ప్రభుత్వ విధానాలను చర్చించటానికి, తమ కార్యాచరణ ప్రణాళికను తయారు చేసుకోటానికి ప్రజలకు రాజకీయ చైతన్యంకై ఏర్పడ్డదే జాకోబిన్ క్లబ్. దీని నాయకుడు మాక్సిమిలియన్ రాబిస్పియర్.

ఇందులో ప్రధానంగా సమాజంలోని పేద ప్రజల నుంచి ఉండే వాళ్ళు. చిన్న దుకాణదారులు, చేతివృత్తులవాళ్ళు, చెప్పులు తయారుచేసే వాళ్ళు, వంటలు వండే వాళ్ళు, రోజువారీ కూలీవాళ్ళు సభ్యులు.

ప్రశ్న 3.
మూడవ ఎస్టేట్ లోని మహిళల జీవన చిత్రం ఏ విధంగా ఉండేది?
జవాబు:
మూడవ ఎస్టేట్ లోని మహిళలు జీవనోపాధి కోసం శ్రమించాల్సి వచ్చేది. బట్టలు కుట్టడం, ఉతకడం వంటి పనులు చేసేవాళ్ళు. బజారులో పూలు, పళ్ళు, కూరగాయలు అమ్మేవాళ్ళు లేదా ధనికుల ఇళ్లల్లో పనులు చేసేవాళ్ళు. అధికశాతం మహిళలకు చదువురాదు. పిల్లల సంరక్షణ, వంట, నీళ్ళు తేవడం, రొట్టె కోసం బారులలో నిలబడటం వంటి పనులు చేసేవాళ్ళు.

పురుషుల కంటే స్త్రీల వేతనాలు తక్కువగా ఉండేవి.

ప్రశ్న 4.
పౌరులకు 1791 రాజ్యాంగం ఇచ్చిన రాజకీయ హక్కులను (చూడండి – పేజీ 160 లోని బాక్స్) హక్కుల ప్రకటనలోని 1 నుంచి 6 అధికరణాలను పోల్చండి. రెండు పత్రాలలో సారూప్యత ఉందా? రెండూ ఒకే భావనను తెలియజేస్తున్నాయా?
జవాబు:
జాతీయ శాసనసభ 1791 లో రాజ్యాంగ ముసాయిదా ప్రతిని తయారుచేసింది. దీని ప్రధాన ఉద్దేశం రాచరిక అధికారాలను పరిమితం చేయటం. ఈ అన్ని అధికారాలు ఒకే వ్యక్తి దగ్గర ఉండటానికి బదులు శాసనసభ, కార్యనిర్వాహక, న్యాయ విభాగాల మధ్య విభజించారు. చట్టాలను చేసే అధికారాన్ని జాతీయ శాసనసభకు ఇచ్చింది. పౌరులందరికీ ఓటు హక్కు లేదు. 25 సం||లు పైబడి కనీసం 3 రోజులు కూలీ అంతకన్నా పన్ను, చెల్లిస్తున్న వారికే ఓటు అధికారం.

పౌరహక్కుల ప్రకటనలో పౌరులందరికీ సమాన హక్కులు అందరికీ ఉన్నాయి. చట్టం ప్రజల అభీష్టాన్ని వ్యక్తపరుస్తుంది. అందరూ సమానమే.

ఈ రెండింటి మధ్య కొన్ని విషయాలలో సారూప్యత మరి కొన్నింటిలో వైరుధ్యం కన్పిస్తుంది.

9th Class Social 13th Lesson 4 Marks Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
క్రింది చిత్రం 1791 నాటి ఫ్రెంచి రాజ్యాంగం అందించిన రాజ్యాంగ పరిపాలన వ్యవస్థను తెలియజేస్తుంది. పరిశీలించి కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
AP 9th Class Social Important Questions Chapter 13 17, 18వ శతాబ్దాలలో ప్రజాస్వామిక, జాతీయవాద విప్లవాలు 1
ఎ) న్యాయవ్యవస్థను ఎన్నుకొనుటకు ఎవరు అధికారం కలిగి వున్నారు?
బి) పై రాజకీయ వ్యవస్థలో ఎవరు రాజు మరియు మంత్రులపై నియంత్రణాధికారం కలిగి ఉన్నారు?
సి) జాతీయ శాసనసభ చేసిన చట్టాలను “వీటో” చేసే అధికారం ఎవరికి కలదు?
డి) ఏ ప్రభుత్వ విభాగం చట్టాలు అమలు చేసే బాధ్యత కలిగి వుంది?
జవాబు:
ఎ) క్రియాశీలక పౌరులు – ఓటు హక్కు కలిగినవాళ్ళు.
బి) జాతీయ శాసనసభ రాజు మరియు మంత్రులపై నియంత్రణను కలిగి ఉంది.
సి) జాతీయ శాసనసభ చేసిన చట్టాలను ‘వీటో’ చేసే అధికారం రాజుకు కలదు.
డి) చట్టాలు అమలు చేసే బాధ్యత కార్యనిర్వాహక విభాగానికి కలదు.

AP 9th Class Social Important Questions Chapter 13 17, 18వ శతాబ్దాలలో ప్రజాస్వామిక, జాతీయవాద విప్లవాలు

ప్రశ్న 2.
పై (ప్రశ్న 1లోని) పట్టికను పరిశీలించి ప్రశ్నలకు జవాబులు రాయండి.
ఎ) “వీటో” అధికారం ఎవరికి ఉంటుంది?
బి) న్యాయమూర్తి ఎన్నికలలో ఓటు హక్కును ఎవరు కలిగి వుంటారు?
జవాబు:
ఎ) జాతీయ శాసనసభ చేసిన చట్టాలను ‘వీటో’ చేసే అధికారం రాజుకు కలదు.
బి) క్రియాశీలక పౌరులు – ఓటు హక్కు కలిగినవాళ్ళు.

ప్రశ్న 3.
ఫ్రెంచి మహిళలు ఏ హక్కుల కొరకు పోరాడారు ? భారతదేశం నేపథ్యంలో మహిళలకు ఆ హక్కులన్నీ ఇవ్వబడినవా? విశ్లేషించండి.
జవాబు:
1) ఫ్రెంచి మహిళలు ఓటు హక్కు కావాలని

2) శాసనసభకు పోటీ చేసే హక్కు కావాలని

3) రాజకీయ పదవి చేపట్టే హక్కు కావాలని పోరాడారు.

అయితే భారతదేశ నేపథ్యంలో మహిళలకు ఆ పై పేర్కొన్న హక్కులన్నీ పొందారు. అయితే ఆ హక్కులు పొందే విషయంలో కొంత నిర్లక్ష్యం ఉంది అని చెప్పవచ్చు.

భారతీయ మహిళలు అందరికీ ఓటు హక్కును ఇవ్వడం జరిగింది.
4) శాసన సభలలో పోటీ చేసే హక్కు పొందినప్పటికీ ఇంకా భారతదేశ శాసనసభలలో మహిళల ప్రాధాన్యం చాలా తక్కువ ఉన్నది అని చెప్పవచ్చు.

5) ఇప్పటికీ మహిళా రిజర్వేషన్ బిల్లు లోక్ సభలో ఆమోదం పొందలేదు.

6) రాజకీయ పదవులను చేపట్టే హక్కును మహిళలకు ఇచ్చినప్పటికీ ప్రస్తుత పరిస్థితి దృష్ట్యా రాజకీయ పదవులు చేపట్టే విషయంలో మహిళల సంఖ్య చాలా తక్కువగా ఉందని గమనించవచ్చు.

ప్రశ్న 4.
ఇవ్వబడిన సమాచారం పరిశీలించి క్రింది ప్రశ్నలకు సమాధానములు వ్రాయండి.
AP 9th Class Social Important Questions Chapter 13 17, 18వ శతాబ్దాలలో ప్రజాస్వామిక, జాతీయవాద విప్లవాలు 2
ఎ) మొదటి ఎస్టేట్ లో ఎవరు ఉంటారు?
బి) పై చార్టులో ఏ దేశ సమాచారం చూపబడింది?
సి) మూడవ ఎస్టేట్ లోని సంపన్న వర్గాలేవి?
డి) పై వారిలో పన్ను చెల్లించే వర్గమేది?
జవాబు:
ఎ) మొదటి ఎస్టేట్లో మతాధిపతులు ఉంటారు.

బి) పై చార్టులో ఫ్రాన్సు దేశపు సమాచారం చూపబడింది.

సి) మూడవ ఎస్టేటులో ఉన్న సంపన్నవర్గాల వారు :

  1. పెద్ద వ్యాపారస్తులు
  2. వాణిజ్యవేత్తలు
  3. న్యాయస్థాన అధికారులు
  4. న్యాయవాదులు

డి) పై వారిలో 3వ ఎస్టేటులోని ప్రజలు అందరూ ప్రభుత్వానికి పన్ను చెల్లించే వర్గం.

ప్రశ్న 5.
పై (ప్రశ్న 4లోని) పట్టికను చదివి ఈ క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
i) ఫ్రెంచి సమాజం ఎన్ని ఎస్టేట్లుగా వర్గీకరించబడింది?
ii) ఫ్రెంచి సమాజంలోని అత్యున్నత వర్గమేది?
iii) మూడవ ఎస్టేట్ లోని సంపన్న వర్గాల వారెవరు?
iv) ఫ్రెంచి సమాజంలో ఏ ఎస్టేట్ ప్రజలు మాత్రమే పన్నులు చెల్లించేవారు?
జవాబు:
i) ఫ్రెంచి సమాజం మూడు ఎస్టేట్లుగా వర్గీకరించబడింది.
ii) ఫ్రెంచి సమాజంలోని అత్యున్నత వర్గం మతాధిపతులు.
iii) మూడవ ఎస్టేటులోని పెద్ద వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలు, న్యాయస్థాన అధికారులు, న్యాయవాదులు సంపన్న వర్గాల వారు.
iv) ఫ్రెంచి సమాజంలో మూడవ ఎస్టేటు ప్రజలు మాత్రమే పన్నులు చెల్లించేవారు.

ప్రశ్న 6.
పై (ప్రశ్న 4లోని) పట్టికను పరిశీలించి క్రింది ప్రశ్నలకు జవాబులు యివ్వండి.
ఎ) ఫ్రెంచి సమాజము ఎన్ని వర్గాలుగా వర్గీకరించబడింది?
బి) మూడవ ఎస్టేటు అనగా ఎవరు ? అందులో ఎవరెవరు వుంటారు?
సి) 3వ ఎస్టేట్ ప్రజలు ఎదుర్కొన్న సమస్యలేమిటి?
డి) ఫ్రెంచి సమాజంలో ఉన్నత వర్గం ఏది?
జవాబు:
ఎ) ఫ్రెంచి. సమాజం మూడు ఎస్టేట్లుగా వర్గీకరించబడింది.

బి) కొంతమంది ధనికులు, ఎక్కువ మంది పేదవారితో కూడినదే మూడవ ఎస్టేటు. మూడవ ఎస్టేటులో పెద్ద వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలు, స్యాయస్థాన అధికారులు, న్యాయవాదులు, రైతులు, చేతివృత్తులవారు, చిన్న రైతులు, భూమిలేని కూలీలు, సేవకులు ఉన్నారు.

సి) మూడవ ఎస్టేటు ప్రజల సమస్యలు :

  1. ప్రభుత్వం మరియు చర్చిచే విధించబడే పన్నుల భారం అధికం.
  2. ఎక్కువ రైతాంగానికి భూమి లేదు.
  3. ఆహారపు కొరత
  4. సమానత్వం లేకపోవడం మొదలైనవి.

డి) ఫ్రెంచి సమాజంలోని ఉన్నత వర్గం మతాధిపతులు.

AP 9th Class Social Important Questions Chapter 13 17, 18వ శతాబ్దాలలో ప్రజాస్వామిక, జాతీయవాద విప్లవాలు

ప్రశ్న 7.
“1791లో ఫ్రెంచి విప్లవకారులు” మానవహక్కుల ప్రకటన తయారు చేస్తున్నప్పుడు ఫ్రెంచి మహిళలు చాలా మంది దానిని నిరసించి “మహిళల హక్కుల ప్రకటన”ను వేరేగా తయారు చేశారు. “మహిళలు స్వేచ్ఛా జీవులుగా జన్మించారు, హక్కులలో పురుషులతో సమానులుగా వుంటారు.”
పై పేరాగ్రాఫ్ ను ఆధారంగా చేసుకుని “మహిళలు ఓటు వేసే హక్కు” అనే అంశంపై మీ అభిప్రాయాన్ని వ్యాఖ్యానించండి.
జవాబు:
మహిళలకు పురుషులతో పాటు సమానంగా ఓటు హక్కు కల్పించినట్లయితే వారు తమ ప్రతినిధిని ఎన్నుకోవడంలో తమ వంతు పాత్ర పోషించడమేకాక ఎవరైతే తమకు సరియైన నాయకుడో గమనించగలరు.

మహిళలకు ఓటు హక్కు ఇవ్వడం వలన సమాజం అభివృద్ధి చెందుతుంది. కొన్ని సందర్భాలలో పురుషుల కన్నా మహిళల ఆలోచనా శక్తి చాలా పదునుగా అనిపిస్తుంది. వారికి సమాన హోదా కల్పించడం వల్ల సమాజంలోని అన్ని కార్యక్రమాలలో చురుకుగా పాల్గొని సమాజాభివృద్ధికి తోడ్పడతారు.

మహిళలకు ఓటు హక్కు కాకుండా శాసనసభలకు పోటీచేసే హక్కు మరియు అధికారాలను, పదవులను పొందే హక్కును కల్పించినట్లయితే పురుషులతో పాటు సమానంగా దేశాన్ని ముందుకు మరియు అభివృద్ధిలోనికి తీసుకు రావడానికి దోహదపడుతుంది.

మహిళల గొప్పతనం ఏమిటంటే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా బాగా లోతుగా ఆలోచించి ఏది మంచి ఏది చెడు అని విశ్లేషణ చేసి సరియైన నిర్ణయం తీసుకోగలరు.

నా అభిప్రాయంలో మహిళలకు ఓటు హక్కు కల్పించడం అనేది సరైన నిర్ణయం

ప్రశ్న 8.
క్రింది పట్టికను పరిశీలించి ప్రశ్నలకు జవాబులు వ్రాయండి.

అంశంవివరణ
1. జాకోబిన్ రాజ్యాంగంప్రజలందరికీ ఓటు వేసే హక్కు, తిరుగుబాటు చేసే హక్కులుంటాయి. ప్రజలకు పని లేదా జీవనోపాధిని కల్పించాలని పేర్కొంది.
2. కులీనవర్గంఐరోపా ఖండంలో సామాజికంగా, రాజకీయంగా భూమి కలిగిన వర్గం. ఈ.వర్గ ప్రజలు ఒకే రకమైన జీవన విధానం కలిగి ఉండి, ఒకటిగా ఉండేవారు.
3. ఉదారవాదంజాతీయ సమైక్యతా భావనలకు ఉదారవాద సిద్ధాంతంతో దగ్గర సంబంధం ఉండేది. వ్యక్తిగత స్వేచ్ఛ, జాతీయతావాద చట్టం ముందు అందరూ సమానులుగా వుండడం అన్న వాటికి ఉదారవాదం ప్రతీకగా నిలిచింది.

ఎ) జాకోబిన్ రాజ్యాంగం ఏ దేశానికి చెందినది?
బి) జాతీయసమైక్యతా భావనలకు సామీప్యత కల్గిన సిద్ధాంతం ఏది?
సి) వ్యక్తిగత స్వేచ్ఛ, చట్టం ముందు అందరూ సమానమే అన్నవాటికి ఏది ప్రతీకగా నిలిచింది?
డి) ఒకే రకమైన జీవన విధానం కలిగిన వారెవరు?
జవాబు:
ఎ) జాకోబిన్ రాజ్యాంగం ఫ్రాన్సు దేశానికి చెందినది.
బి) జాతీయ సమైక్యతా భావనలకు ఉదారవాద సిద్ధాంతంతో దగ్గర సంబంధం ఉంది.
సి) వ్యక్తిగత స్వేచ్ఛ, చట్టం ముందు అందరూ సమానమే అన్న వాటికి ఉదారవాదం ప్రతీకగా నిలిచింది.
డి) కులీనవర్గం వారు’ ఒకే రకమైన జీవనవిధానం కలిగి యుండేవారు.

AP 9th Class Social Important Questions Chapter 12 యూరప్లో మారుతున్న సాంస్కృతిక సంప్రదాయాలు: 1300-1800

These AP 9th Class Social Important Questions 12th Lesson యూరప్లో మారుతున్న సాంస్కృతిక సంప్రదాయాలు: 1300-1800 will help students prepare well for the exams.

AP Board 9th Class Social 12th Lesson Important Questions and Answers యూరప్లో మారుతున్న సాంస్కృతిక సంప్రదాయాలు: 1300-1800

9th Class Social 12th Lesson 1 Mark Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
పునరుజ్జీవనం అనగానేమి?
జవాబు:
యూరపులో (మధ్యయుగం, 1300 సం|| తరువాత) ఈ కాలంలో జరిగిన సాంస్కృతిక మార్పులను వివరించటానికి చరిత్రకారులు 19వ శతాబ్దం నుండి ‘పునరుజ్జీవనం’ అంటున్నారు. ఈ
(లేదా)
యూరప్ లో వచ్చిన ఒక కొత్త సాంస్కృతిక ఉద్యమాన్ని పునరుజ్జీవనం లేదా పునర్జన్మ అంటారు.

ప్రశ్న 2.
దృగ్గోచరం అంటే ఏమిటి?
జవాబు:
చిత్రంలో లోతు కూడా తెలిసేటట్లు చిత్రించే విధానం ‘దృగ్గోచరం’ అంటారు.
(లేదా )
దృగ్గోచరం : చిత్రంలో లోతు కూడా తెలిసేటట్లు చిత్రించే విధానం. దగ్గరగా ఉన్న వాటిని పెద్దగానూ, దూరంగా ఉన్న వాటిని చిన్నగానూ చూపించడం.

ప్రశ్న 3.
యథార్థవాదం అంటే ఏమిటి?
జవాబు:
శరీర నిర్మాణ శాస్త్రం, రేఖాగణితం, భౌతికశాస్త్రాలతో పాటు అందానికి సంబంధించిన బలమైన భావన. ఇటలీ కళలకు ఒక ప్రత్యేకత సమకూర్చింది, దీనిని యథార్థవాదం అన్నారు.
(లేదా)
కళాకారులు తమ చుట్టు ప్రక్కల ప్రకృతిని, ప్రజలను, ప్రదేశాలను పరిశీలించి వాటిని యథాతథంగా చిత్రీకరించడాన్ని ‘యధార్ధవాదం’ అంటారు.

AP 9th Class Social Important Questions Chapter 12 యూరప్లో మారుతున్న సాంస్కృతిక సంప్రదాయాలు: 1300-1800

ప్రశ్న 4.
జెస్క్యూట్లు అంటే ఎవరు?
జవాబు:
లయోలా అనుచరులను జెస్క్యూట్లు అంటారు.

ప్రశ్న 5.
ప్రజా రంగం, వ్యవస్థీకృత రంగం అంటే ఏమిటి?
జవాబు:
‘ప్రజారంగం’ అంటే ప్రభుత్వం, వ్యవస్థీకృత మతం అన్న అర్థాన్ని సంతరించుకుంది. వ్యక్తిగత రంగం అంటే కుటుంబం, వ్యక్తిగత మతంగా పరిగణింపబడసాగింది.

9th Class Social 12th Lesson 2 Marks Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
కింద ఇవ్వబడిన యూరప్ పటాన్ని పరిశీలించి దిగువ ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
AP 9th Class Social Important Questions Chapter 12 యూరప్లో మారుతున్న సాంస్కృతిక సంప్రదాయాలు: 1300-1800
ఎ) కొలంబస్ తన ప్రయాణాన్ని ఏ దేశం నుంచి ప్రారంభించారు.
బి) భారతదేశానికి మొట్టమొదట సముద్ర మార్గాన్ని కనుగొన్న వారెవరు?
జవాబు:
ఎ) కొలంబస్ మొదటిసారిగా తన ప్రయాణాన్ని స్పెయిన్ దేశం నుండి ప్రారంభించారు.
బి) భారతదేశానికి మొదటిసారిగా సముద్ర మార్గమును వాస్కోడగామా 1498 వ సం||లో కనిపెట్టారు.

AP 9th Class Social Important Questions Chapter 12 యూరప్లో మారుతున్న సాంస్కృతిక సంప్రదాయాలు: 1300-1800

ప్రశ్న 2.
థామస్ మూర్, ఎరాస్మస్ వంటి క్రైస్తవ మానవతావాదులు చర్చిని, మత గురువులను ఎందుకని విమర్శించారు?
జవాబు:

  1. చర్చి దురాశతో కూడిన వ్యవస్థగా మారిందన్నారు.
  2. సాధారణ ప్రజల నుంచి చర్చి తమచిత్తం వచ్చినట్లు డబ్బులు వసూలు చేస్తోందని విమర్శించారు.
  3. మత గురువులు బాగా వాడుకున్న పద్ధతుల్లో పాప పరిహార పత్రాలు అమ్మటం ఒకటని విమర్శించారు.
  4. ఈ పత్రాలను కొనుక్కొన్న వాళ్ళు తాము చేసిన పాపభారం నుంచి విముక్తులౌతారని చెప్పడం నమ్మక ద్రోహమని విమర్శించారు.

ప్రశ్న 3.
ప్రొటెస్టెంట్ సంస్కరణ వాదం ఎవరు ప్రవేశపెట్టారు? ఆయన అభిప్రాయాలు ఏవి?
జవాబు:
1517లో మార్టిన్ లూథర్ (1483-1546) అనే యువ మత గురువు కాథలిక్కు చర్చికి వ్యతిరేకంగా ప్రచారోద్యమం మొదలు పెట్టాడు. దేవునితో సంబంధం ఏర్పరచుకోవడానికి మత గురువు అవసరం లేదని అతడు ప్రచారం చేయసాగాడు. తన అనుచరులను దేవునిలో పూర్తి విశ్వాసముంచమని, విశ్వాసం ఒక్కటే సరైన జీవనం, స్వర్గ ప్రవేశం కల్పించగలదని చెప్పాడు. ఈ ఉద్యమాన్ని ప్రొటెస్టెంట్ సంస్కరణ వాదంగా వ్యవహరిస్తారు.

ప్రశ్న 4.
కోపర్నికస్ సిద్ధాంతమేమి? దానిని “చర్చి” అధిపతులు ఎందుకు తిరస్కరించారు?
జవాబు:
సూర్యుడు చుట్టూ తిరుగుతున్న అనేక గ్రహాలలో భూమి కూడా ఒకటని కోపర్నికస్ చెప్పాడు. బైబిలు, చర్చి బోధనలకు విరుద్ధంగా ఉందని ఈ కొత్త సిద్ధాంతాన్ని చర్చి తిరస్కరించింది. మనిషి కోసం చేసిన విశ్వానికి అతడు కేంద్రంగా లేక పోవడంతో అతడి హోదా పోతుందని చర్చి భావించింది.

9th Class Social 12th Lesson 4 Marks Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
14వ మరియు 17వ శతాబాల నాటి పునరుజ్జీవనం, మధ్యయుగ కాలానికి మరియు ఆధునిక కాలానికి మధ్య వారధిగా పరిగణింపబడుతుంది. ఇది ఇటలీ నందు మధ్యయుగ చివరి కాలంలో సాంస్కృతిక విప్లవంగా ప్రారంభమైంది. తరువాత మిగతా ఐరోపా అంతట వ్యాపించింది.
“పునరుజ్జీవనం ఒక సాంస్కృతిక విప్లవం అనడాన్ని మీరు ఏ విధంగా భావిస్తారు?” వ్యాఖ్యానించండి.
జవాబు:

  1. మధ్యయుగం తర్వాత ఇటలీ మరియు యూరప్లో పరిస్థితులు మారుతూ వచ్చాయి.
  2. ప్రజలు చర్చి నియంత్రణ నుండి బయటపడి స్వేచ్ఛా జీవితాన్ని అనుభవించసాగారు.
  3. యూరప్ లో పునరుజ్జీవనం పేరుతో ఒక సాంస్కృతిక ఉద్యమం మొదలైంది.
  4. ప్రజలు మతాధికారులను వ్యతిరేకించి హేతుబద్ధంగా ఆలోచించడం ప్రారంభించారు.
  5. కళలు, చిత్రకళ, శిల్పం మరియు సాహిత్యంలో కొత్త కొత్త ధోరణులు అభివృద్ధి చెందసాగాయి.
  6. మానవతా వాద పండితులు అరబ్ సాహిత్యాన్ని, గ్రీకు, లాటిన్ భాషలలోకి అనువదించి అధ్యయనం చేశారు.
  7. ముద్రణా యంత్రం కనుగొనడం వలన ఒక దేశం నుండి మరొక దేశానికి భావజాల వ్యాప్తి జరిగి సాంస్కృతిక విప్లవానికి దారితీసింది.
  8. యథార్థ వాదం, మానవ శరీర నిర్మాణాన్ని అధ్యయనం చేయడం, చర్చి నియంత్రణ తొలగిపోవడం, నూతన ఆవిష్కరణలు జరగడం ఇవన్నీ పునరుజ్జీవన కాలంలోనే జరిగాయి. కాబట్టి దీనిని సాంస్కృతిక పునరుజ్జీవనంగా పిలవవచ్చు.

AP 9th Class Social Important Questions Chapter 12 యూరప్లో మారుతున్న సాంస్కృతిక సంప్రదాయాలు: 1300-1800

ప్రశ్న 2.
“ముద్రణ, సాంకేతిక విజ్ఞానంపై పట్టు సాధించడం 16వ శతాబ్దపు మహావిప్లవం” అచ్చు యంత్రం కనుగొనుట , మానవజీవితాలని ఎలా ప్రభావితం చేసింది?
జవాబు:
15 వ శతాబ్దం తరువాత చేతితో రాసిన పురాతన పుస్తకాలన్నింటిని ముద్రించారు. అచ్చు అయిన పుస్తకాలను కొనుక్కోవడానికి విద్యార్థులు ఆసక్తి చూపారు. అంతకు ముందెన్నడూ లేనంతగా భావాలు, అభిప్రాయాలు, సమాచారం విస్తారంగా వ్యాపించడంతో కొత్త భావాలను ప్రచారం చేసే ముద్రిత పుస్తకాలు వెంటనే లక్షలాది పాఠకులను చేరుకున్నాయి. నిదానంగా ప్రజలలో చదివే అలవాటు పెరిగింది. ఇటలీ మానవతా సంస్కృతిపై ఆసక్తి కనపరిచిన లక్షలాది మంది విద్యార్థులు, ప్రజలకు ముద్రిత పుస్తకాలపై ఆసక్తి పెరగడంతో 18 వ శతాబ్దం నాటికి కోట్ల కొలది పుస్తకాలు ప్రచురితమయ్యా యి.

అతితక్కువ సమయంలో శాస్త్రసాంకేతిక విజ్ఞానం, శిల్పం, సాహిత్యం, మానవతావాదం, అభివృద్ధి చెందిన భూగోళం, తత్వం, వైద్యశాస్త్ర మూలాలను చదవడం వల్ల అవి మానవ జీవనంలో ప్రముఖపాత్ర పోషించాయి. విశ్వరహస్యాలు, ఆవిష్కరణలు, నూతన సిద్ధాంతాలు, ప్రకృతి సమాజం, మూఢనమ్మకాలపై సమరం మొదలగు విషయాలు ముద్రిత పుస్తకాల ద్వారా వెలుగుచూపించి, మానవ అభ్యున్నతికి తోడ్పాటునందించాయి.

ప్రశ్న 3.
“మానవతా వాద సంస్కృతి అనగా చర్చి అధీనం నుండి బయటపడిన ఆధునిక మానవుని ఆలోచనలు” – మానవతావాద ఆలోచనలోని ముఖ్య అంశములేవి?
జవాబు:

  1. మానవతా వాద సంస్కృతిలోని ఒక అంశం మానవ జీవితాలపై మతం నియంత్రణ బలహీనమవ్వటం.
  2. భౌతిక సంపద, అధికారం, కీర్తి పట్ల ఇటలీ ప్రజలు బలంగా ఆకర్షింపబడ్డారు. అంతమాత్రం చేత వాళ్ళు మతాన్ని వ్యతిరేకించారని కాదు.
  3. అధికారం, సంపద, భౌతిక సుఖాలు వంటివి కోరుకోదగినవే కాని త్యజించవలసిన అవసరం లేదని వాళ్ళు భావించసాగారు.
  4. ఈ సమయంలో సత్ప్రవర్తనపై ఎక్కువ శ్రద్ధ కనపరచసాగారు.
  5. మర్యాదగా ఎలా మాట్లాడాలి, సరైన వస్త్రధారణ ఎలా ఉండాలి, సంస్కారవంతుడైన వ్యక్తి ఏ నైపుణ్యాలు అలవరచుకోవాలి వంటి వాటికి ప్రాధాన్యతనిచ్చారు.
  6. మానవతావాదం వల్ల డబ్బు, అధికారం, సంపాదించడం ద్వారా మాత్రమే కాకుండా ఇతరత్రా తమ జీవితాలను మలచుకునే సామర్థ్యం మనుషులకుందని నమ్మసాగారు.

ప్రశ్న 4.
మధ్య యుగాలు, ఆధునిక యుగం ఆరంభంలో ప్రపంచమంతటా మహిళలపై పురుషుల ఆధిపత్యం ఉండేది. ప్రస్తుత సమాజంలో పరిస్థితి దీనికి భిన్నంగా ఉందా? వివరించంది.
జవాబు:
మధ్యయుగానికి, ఆధునిక యుగ ఆరంభానికి ప్రస్తుతానికి మహిళల పరిస్థితిలో చాలా మార్పులు వచ్చాయి.

ఒకప్పుడు మహిళలపై పురుషుల ఆధిపత్యం ఎక్కువగా ఉండేది. క్రమక్రమంగా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మరియు మహిళల పోరాటాల కారణంగా మహిళల పరిస్థితులలో చాలా మార్పు వచ్చాయి.

ప్రస్తుతం మహిళలు స్వయం శక్తిగా ఎదుగుతున్నారు. విద్య, వైద్యం, అంతరిక్షం, వ్యవసాయం అన్ని రంగాలలో పురుషులతో సమానంగా అవకాశాలను పొందుతున్నారు. అంతేకాకుండా రాజకీయాలలో కొన్ని సందర్భాలలో అత్యున్నత పదవులను కూడా అలంకరించారు. కొన్ని సందర్భాలలో మహిళలు తీసుకున్న నిర్ణయాలే దేశాభివృద్ధికి ఉపయోగపడ్డాయి అని చెప్పవచ్చు. కొన్ని రంగాలలో పురుషుల కంటే మహిళలు ముందంజలో ఉన్నారు అని చెప్పవచ్చు. అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. అన్ని రంగాలలో మహిళలు పురుషులకంటే ఆధిక్యంలో ఉన్నప్పటికీ కొన్నిచోట్ల మహిళలు పురుషుల వల్ల ఇబ్బందులకు గురి అవుతున్నారు. ఇంకా మన సమాజం పురుషాధిక్య సమాజమని కొన్ని సంఘటనలు మనకు గుర్తు చేస్తున్నాయి.

ప్రశ్న 5.

వాదముముఖ్యాంశాలు
1. మానవతా వాదము– మధ్యయుగాల పండితుల మాదిరి మరణానంతర జీవితం గురించి కాక మానవతా వాదులు ప్రస్తుతం ప్రపంచం గురించి ఆసక్తి చూపేవారు.
– మనిషిని జీవితంలో ప్రభావితం చేసే ప్రకృతి సమస్తాన్ని, విజ్ఞానశాస్త్రం, కళలు వంటి వాటిని వీరు ముఖ్యమైనవిగా భావించేవారు.
2. యథార్థవాదము– మానవతావాద భావాలు చిత్రకళ, శిల్పకళలకు కూడా విస్తరించాయి.
– కళాకారులు తమ చుట్టు ప్రక్కల ప్రకృతిని, ప్రజలను, ప్రదేశాలను పరిశీలించి వాటిని యథాతథంగా చిత్రించడానికి ప్రయత్నించారు.
3. కాల్పనిక వాదము– సాంస్కృతిక ఉద్యమమైన కాల్పనిక వాదము ఒక ప్రత్యేక రకమైన జాతీయతా భావాన్ని పెంపొందించటానికి ప్రయత్నించింది.
– కాల్పనికవాద కవులు మరియు కళాకారులు, విజ్ఞానశాస్త్రము, హేతువులకు పెద్దపీట వేయడాన్ని విమర్శించారు.

పై సమాచారం ఆధారంగా దిగువ ప్రశ్నలకు జవాబులివ్వంది.
ఎ) ప్రస్తుత జీవితం కంటే మరణానంతర జీవితానికి ప్రాధాన్యతనిచ్చిన వారెవరు?
బి) మానవ జీవితాలపై మత నియంత్రణ బలహీన మవ్వటం ఏవాదంలో గమనించవచ్చు?
సి) “జీసస్ శరీరాన్ని ఒడిలో పెట్టుకొన్న మేరీ” యొక్క ప్రసిద్ధ శిల్పము ఏ వాదాన్ని ప్రతిబింబిస్తుంది?
ది) విజ్ఞానశాస్త్రానికి హెచ్చు ప్రాముఖ్యత నివ్వడాన్ని వ్యతిరేకించే వాదమేది?
జవాబు:
ఎ) మధ్యయుగాలలోని పండితులు
బి) మానవతా వాదం
సి) యథార్థవాదం
డి) కాల్పనిక వాదం