AP Board 8th Class Social Solutions Chapter 6 ఖనిజాలు, గనుల తవ్వకం

SCERT AP 8th Class Social Study Material Pdf 6th Lesson ఖనిజాలు, గనుల తవ్వకం Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Social Solutions 6th Lesson ఖనిజాలు, గనుల తవ్వకం

8th Class Social Studies 6th Lesson ఖనిజాలు, గనుల తవ్వకం Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
భూగర్భగని సందర్శనని చూపించే ఫ్లో చార్టు తయారుచేయండి. (AS1)
జవాబు:
AP Board 8th Class Social Solutions Chapter 6 ఖనిజాలు, గనుల తవ్వకం 1
AP Board 8th Class Social Solutions Chapter 6 ఖనిజాలు, గనుల తవ్వకం 2

ప్రశ్న 2.
గనులలో పని చేస్తున్నప్పుడు ఉద్యోగులు ఎదుర్కొనే ప్రధాన ఆరోగ్య సమస్యలు, ముందు జాగ్రత్తలు, గని కార్మికుల రక్షణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్న శీర్షికతో పట్టిక తయారుచేయండి. (AS3)
జవాబు:
గనులలో పని చేస్తున్నప్పుడు, ఉద్యోగంలో ఉన్నప్పుడు ప్రధాన ఆరోగ్య సమస్యలు, ముందు జాగ్రత్తలు, గని కార్మికుల రక్షణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు :-

గనులలో పనిచేసే వారికి ప్రధానంగా ఊపిరితిత్తుల సమస్యలు తలెత్తుతాయి. రెండవది మోకాళ్ళ నొప్పులు ఎక్కువగా వస్తాయి. కళ్ళ సమస్యలు కూడా ఎక్కువగా వస్తాయి, ఇవే కాకుండా ఏవేనీ ప్రమాదాలు జరిగినపుడు అనుకోని సమస్యలు తలెత్తుతాయి.

ఉద్యోగంలో ఉన్నవారికి వారి వారి వృత్తిని బట్టి, చేసే పనులను బట్టి వారికి వ్యాధులు వస్తాయి.

ఉదా : ఉపాధ్యాయులకు గొంతు సమస్యలు, డ్రైవర్లకు – కీళ్ళ, కళ్ళ సమస్యలు, బరువులు మోసే వారికి, వెన్నుపూస సమస్యలు.

కొంత మందికి వారికి ఉన్న ఒత్తిడుల మూలంగా అనేక రకాల మానసిక సమస్యలు కూడా రావడానికి అవకాశం ఉన్నది. వీరు నిత్య జీవితంలో ప్రాణాయామం , ధ్యానం, నడక వంటి యోగసాధనలు రోజుకి ఒక గంట చేసినట్లయితే -వీటిని అధిగమించవచ్చును.

గనులలో పనిచేసేవారు ముక్కుకి మాస్క్ లాంటిది పెట్టుకోవాలి. కాళ్ళకు బూట్లు, చేతులకు తొడుగులు వేసుకోవాలి. గనిలో పనిచేసే యంత్రాలను రోజూ పరీక్ష చేసి సరిగా ఉన్నాయని నిర్ధారించుకోవాలి. ముఖ్యంగా డాక్టర్లు, ఆక్సిజన్ సిలిండర్లు వారికి అందుబాటులో ఉండాలి.

AP Board 8th Class Social Solutions Chapter 6 ఖనిజాలు, గనుల తవ్వకం

ప్రశ్న 3.
జానకి ప్రస్తుతం వ్యవసాయ కూలిగా పని చేస్తోంది. ఆమెకు గని కార్మికురాలు కావాలని ఉంది. ఆమె పనిలో ఎటువంటి మార్పులు వస్తాయో, ఉపాధిరంగ చిత్రం, ఆరోగ్య సమస్యలు వంటివి ఆమెకు వివరించండి. (AS1)
జవాబు:
“జానకీ, ఇప్పటి వరకూ మీరు పనిచేసిన రంగం వేరు. గని రంగం వేరు. ఇవి షిప్టు వేళలలో పనిచేస్తాయి. అంటే రాత్రి వేళల్లో కూడా పనిచేయాల్సి రావచ్చు. ఒక స్త్రీగా మికది ఇబ్బందికరమేమో ఆలోచించండి. ఇప్పుడు మీరు పచ్చటి పొలాలలో పరిశుద్ధమయిన వాతావరణంలో పనిచేస్తున్నారు. కాని అపుడు దుమ్ము, ధూళిలో పనిచేయాల్సి వస్తుంది. తలకి, చేతులకి, కాళ్ళకి ఏదో ఒకటి ధరించాల్సి వస్తుంది. ముఖ్యంగా పేలుడు పదార్థాలతో పనిచేయాల్సి వస్తుంది. కొద్ది కాలం తరువాత ఊపిరితిత్తుల వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఆలోచించుకుని నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. మీకు మేలు జరుగుగాక.. ఉంటాను”.

ప్రశ్న 4.
గనులలో యంత్రాలు, మానవ శ్రమ వినియోగించేటప్పుడు కార్మికుల అవసరంలో తేడాలను పేర్కొనండి. (AS1)
జవాబు:
గనులలో యంత్రాలు లేనపుడు మానవశ్రమ అధికంగా అవసరమవుతుంది. యంత్రాలున్నపుడు మానవశ్రమ తగ్గుతుంది. ఉదా : ఇది వరకు బొగ్గు గనుల్లో త్రవ్విన బొగ్గును, లిఫ్టుకు చేర్చడానికి తోపుడు బండ్లను వాడేవారు. వాటిని శ్రామికులే నడిపేవారు. కాని ఇప్పుడు ఆ బొగ్గును కన్వేయరు బెల్టుపై పంపుతున్నారు. దీని వలన అక్కడ శ్రామికుల అవసరం తగ్గింది. ఇలా అనేక యంత్రాలను వినియోగించడం మూలంగా ఇటీవల గనులలోకి క్రొత్త శ్రామికులను చేర్చుకోవడం తగ్గిందని చెప్పవచ్చు.

ప్రశ్న 5.
దేశ ఆర్థిక పరిస్థితికి గనుల తవ్వకం దోహదం చేసిన దానిని ఈ అధ్యాయంలో ఎలా గుర్తించారు? (AS1)
జవాబు:
భారతదేశం స్వతంత్ర్యం వచ్చే నాటికి వెనుకబడిన ఆర్థిక వ్యవస్థ. ఈ గనుల త్రవ్వకం మొదలు పెట్టిన తరువాత ప్రభుత్వానికి ఆదాయము లభించింది. వీటిని కౌలుకిచ్చిన తరువాత కూడా ప్రభుత్వానికి ఆదాయం లభిస్తోంది. ఇందువలన ఆర్థిక పరిస్థితికి గనుల తవ్వకం దోహదం చేసిన దానిని నేను ఈ అధ్యాయంలో గుర్తించాను.

ప్రశ్న 6.
“ఆంధ్రప్రదేశ్ లో ఖనిజాలు” పటాన్ని చూసి ఏ జిల్లాలో ఏ ఖనిజాలు ఉన్నాయో గుర్తించండి. (AS5)
AP Board 8th Class Social Solutions Chapter 6 ఖనిజాలు, గనుల తవ్వకం 3
జవాబు:
మాది …………… జిల్లా : మా జిల్లాలో …………… ఖనిజాలు ఉన్నాయి.

ప్రశ్న 7.
“ఖనిజాలు ఎవరికి చెందుతాయి” అనే పేరాను చదివి కింది ప్రశ్నకు సమాధానం రాయండి. “ఖనిజ వనరులు ఏ ఒక్కరికీ చెందినవి కావు. ఇవి అందరి సంపద.” దీనిని ఏ విధంగా మీరు సమర్ధిస్తారు? (AS2)

ఖనిజాలు సాధారణంగా భూమి లోపలి పొరల్లో ఉంటాయి. ఇవి ఏ ఒక్క వ్యక్తికి చెందవు. ఇవి దేశ ప్రజలందరికీ చెందుతాయి. వీటిని అందరి ప్రయోజనం కోసం ఉపయోగించాలి. అందుకే దేశంలోని యావత్తు ఖనిజ సంపదను ఆ దేశ ప్రభుత్వ ఆస్తిగా భావిస్తారు. దేశంలోని ప్రజలందరి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఆ ఖనిజాలను వినియోగిస్తుంది.
జవాబు:
భూమి లోపల దొరికే వస్తువులన్నీ ప్రభుత్వానికి అంటే ప్రజలకి చెందుతాయి. అయితే ఇవి ఏ వ్యక్తికో చెందవు. ఇవి దేశ ప్రజలందరికీ చెందుతాయి. అందరి ప్రయోజనం కోసం ఉపయోగించాలి. అందుకే దేశంలోని ప్రజలందరి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఆ ఖనిజాలను వినియోగిస్తుంది.

ప్రశ్న 8.
ఈ క్రింది చిత్రాన్ని గమనించండి. ఇద్దరు వ్యక్తులు రెండు రకాలుగా వ్యాఖ్యానాలు చేస్తున్నారు. వాళ్ళు గనుల తవ్వకంలో ఏ విషయంపై మాట్లాడుతున్నారు? (AS1)
AP Board 8th Class Social Solutions Chapter 6 ఖనిజాలు, గనుల తవ్వకం 4
జవాబు:
ఖనిజాల వలన మేం బతకలేకున్నాం :
ఈ వ్యాఖ్యానం చేసిన వ్యక్తి, గనుల తవ్వకం మూలంగా తన ఇంటిని, న బ్రతకలేకున్నాం బ్రతకలేం స్థలాన్ని పోగొట్టుకుంటున్నాడు. వారి జీవితాలు అస్తవ్యస్త మవుతున్నాయి. అందువలన అలా వ్యాఖ్యానించాడు.

ఖనిజాలు లేకుండా మేం బతకలేం :
ఈ వ్యాఖ్యానం చేసిన వ్యక్తి ప్రభుత్వం ద్వారా గనిని కౌలుకి తీసుకున్న వ్యక్తి. ఇతనికి ఖనిజాలు, గనులు లేకపోతే సంపద ఉండదు. అందువలన అలా వ్యాఖ్యానించాడు.

ప్రశ్న 9.
ఖనిజాలు దేశాభివృద్ధికి ఏ రకంగా తోడ్పడుతున్నాయి?
(లేదా)
ఖనిజాల వలన కలిగే ఉపయోగాలు ఏవి? (AS6)
జవాబు:
ఖనిజాలు దేశ సంపద. వీటిని ఎగుమతి చేయడం ద్వారా విదేశీ మారకద్రవ్యము ఆర్జించవచ్చు. ఖనిజాలు త్రవ్వేచోట వేలాదిమందికి ఉపాధి లభిస్తుంది. వీటిని శుద్ధి చేసి వివిధ వస్తువులు, ఉత్పత్తులు తయారుచేసే పరిశ్రమల ద్వారా ప్రజలకు ఉపాధి లభించడమే గాక జాతీయాదాయం కూడా పెరుగుతుంది. ఖనిజాలు, పరిశ్రమలు గల ప్రాంతాలలో రవాణా, కమ్యూనికేషన్ వ్యవస్థ మెరుగుపడుతుంది. యురేనియం వంటి ఖనిజాలు అణుశక్తిగా ఉపయోగపడతాయి. ఈ రకంగా ఖనిజాలు దేశ సంపదను అభివృద్ధి చేస్తాయి.

AP Board 8th Class Social Solutions Chapter 6 ఖనిజాలు, గనుల తవ్వకం

ప్రశ్న 10.
వివిధ ఖనిజాలు, వాటి ఉపయోగాలను తెలిపే పట్టికను తయారుచేయండి. (AS3)
జవాబు:

ఖనిజముఉపయోగాలు
1) ఇనుప ధాతువు (ముడి ఇనుము)హెమటైట్ మరియు మాగ్నటైట్ ఇనుప ధాతువులను ఉక్కు, ఫెలిటైజేషన్, స్పాంజ్ ఐరన్, పిగ్ ఐరన్ పరిశ్రమలలో ఉపయోగిస్తారు.
2) మైకా (అభ్రకం)విద్యుత్, ఎలక్ట్రానిక్ పరిశ్రమలలో విస్తృతంగా ఉపయోగిస్తారు.
3) గ్రానైట్దీనిని కోత (కటింగ్) మరియు పాలిష్ పరిశ్రమలలో అలంకరణ స్మారక కట్టడాలలో, నేలను నునుపు చేసే సామానులలో ఉపయోగిస్తారు.
4) మాంగనీస్దీనిని పొటాషియం పర్మాంగనేట్, ఇనుము మిశ్రమ లోహాలలోనూ ఇనుము – ఉక్కు బ్యాటరీలు, రసాయనాలు, పింగాణి (సిరామిక్స్) గాజు పరిశ్రమలలో ఉపయోగిస్తారు.
5) బెరైటీస్పారిశ్రామిక, వైద్య అవసరాల కోసం వాడతారు.
6) ఫెల్డ్ స్పార్గాజు, సిరామిక్ వస్తువులు తయారు చేస్తారు.

8th Class Social Studies 6th Lesson ఖనిజాలు, గనుల తవ్వకం InText Questions and Answers

8th Class Social Textbook Page No.63

ప్రశ్న 1.
తనకు తానుగా పునరుద్ధరింపబడే ఖనిజం ఒకటి చెప్పండి. ఈ ప్రక్రియలో మనం ఎలా సహాయపడగలం?
జవాబు:
భూగర్భజలం ఒక పునరుద్ధరింపబడే ఖనిజము. వీటిని పెంచడానికి మనం ఈ క్రింది పనులు చేయాలి.

  1. ఇంకుడు గుంటలు త్రవ్వాలి.
  2. వర్షపు నీరు వృథాగా పోకుండా భూమిలోకి యింకి పోయేలా చర్యలు తీసుకోవాలి.
  3. చెట్లు కూడా భూగర్భజలాలని పెంచుతాయి. కాబట్టి చెట్లను పెంచాలి.
  4. పొలాల్లో ఉన్న మిగులు నీటిని కూడా బయటకు పారించి, వాటిని భూమిలోకి ఇంకేలా చేయవచ్చు.
  5. ఉపయోగించని డ్రెయిన్లలో నీరు పారించి, దానికి అడ్డు గేట్లను నిర్మించినట్లయితే అక్కడ నీరు నిదానంగా పారి, నేలలోకి ఇంకుతుంది.

ప్రశ్న 2.
మనం వాడుతున్నా తరిగిపోని, మనం ఏమి చేయకపోయినా పునరుద్ధరింపబడే శక్తి వనరు ఏదో చెప్పండి.
జవాబు:
గాలి

AP Board 8th Class Social Solutions Chapter 6 ఖనిజాలు, గనుల తవ్వకం

ప్రశ్న 3.
రైళ్ళు, కార్లు నడపటానికి వీలులేని ప్రపంచాన్ని మీరు ఊహించండి.
జవాబు:
రైళ్ళు, కార్లు కనిపెట్టని రోజుల్లో పరిస్థితి వేరుగా ఉండేది. కాని అవి ఉండి నడపడానికి వీలులేని పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. ప్రపంచంలో దూరాలు బాగా పెరుగుతాయి. జీవితం నల్లేరు మీద నడకలా ఉంటుంది.

8th Class Social Textbook Page No.64

ప్రశ్న 4.
కింద ఇచ్చిన సహజ వస్తువులను పునరుద్ధరింపబడేవి, అంతరించిపోయేవిగా వర్గీకరించండి.
ఖనిజం అయితే టిక్కు (✓) పెట్టండి, కాకపోతే ఇంటూ (✗) పెట్టండి : వెదురు, బొగ్గు, సముద్రపు నీరు, మట్టి, చీమలు, ఇసుక, ఇనుప ఖనిజం, వజ్రాలు, చెట్లు, ముడి చమురు, గడ్డి, గాలి, పాలరాయి, చేపలు, బావినీళ్లు, సూర్యకాంతి.
AP Board 8th Class Social Solutions Chapter 6 ఖనిజాలు, గనుల తవ్వకం 5
జవాబు:

పునరుద్ధరింపబడే వనరుఅంతరించిపోయే వనరుఖనిజాలు
1. వెదురు
2.బొగ్గు
3. సముద్రపు నీరు
4.చీమలు
5.మట్టి
6.ఇసుక
7.ఇనుప ఖనిజం
8.వజ్రాలు
9. చెట్లు
10.ముడిచమురు
11. గడ్డి
12. గాలి
13.పాలరాయి
14. చేపలు
15.బావినీరు
16. సూర్యకాంతి

ప్రశ్న 5.
కింద ఇచ్చిన ఖనిజాలను లోహాలు, లోహాలు కాని వాటిగా వర్గీకరించి, ఇంధన వనరులను పేర్కొనండి : ఇనుప ఖనిజం, బాక్సెట్ (అల్యూమినియం ఖనిజం), బొగ్గు, రాగి ఖనిజం, సున్నపురాయి, జిప్సం, మైకా, భూగర్భ జలాలు, ముడి చమురు, సైంధవ లవణం, ఇసుక, వజ్రపు రాళ్లు,
AP Board 8th Class Social Solutions Chapter 6 ఖనిజాలు, గనుల తవ్వకం 6
జవాబు:

లోహాలులోహాలు కానివిఇంధన వనరు
ఇనుప ఖనిజంబొగ్గుబొగ్గు
బాక్సెటుసున్నపురాయిముడిచమురు
రాగిభూగర్భ జలాలు
ముడిచమురు
సైంధవ లవణం
ఇసుక
వజ్రపు రాళ్ళు
జిప్సం
మైకా

8th Class Social Textbook Page No.66

ప్రశ్న 6.
కింద చిత్రాలు చూసి వాటిల్లో ఏది ఓపెన్ కాస్ట్ గనుల తవ్వకమో, భూగర్భ తవ్వకమో, చమురు కోసం బోరు బావుల తవ్వకమో చెప్పండి.
జవాబు:
AP Board 8th Class Social Solutions Chapter 6 ఖనిజాలు, గనుల తవ్వకం 7
చమురు కోసం బోరు బావుల తవ్వకం – ఓపెస్ట్ గనుల తవ్వకం – భూగర్భ తవ్వకం.

8th Class Social Textbook Page No.67

ప్రశ్న 7.
ఖనిజాలను ప్రభుత్వం ఎలా వినియోగించుకుంటుంది?
జవాబు:

  1. 1970లలో ప్రభుత్వం గనులన్నింటినీ జాతీయం చేసింది.
  2. దీని ద్వారా ప్రభుత్వం గనుల త్రవ్వకాన్ని తానే నిర్వహించడమో లేదా లీజుకిచ్చి వారి నుంచి సొమ్ము తీసుకోవడమో చేస్తుంది.
  3. వీటి ద్వారా వచ్చిన ఆదాయాన్ని ప్రభుత్వం ప్రజోపయోగానికి, అభివృద్ధి పనులకు వెచ్చిస్తుంది.

ప్రశ్న 8.
మీ ప్రాంతంలో గనుల తవ్వకం జరుగుతూ ఉంటే అక్కడ పనిచేసే, నివసించే ప్రజల గురించి తెలుసుకోండి. చుట్టుపక్కల వాతావరణాన్ని గనుల తవ్వకం ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకోండి. గనుల తవ్వకం వల్ల ఎంత మంది ప్రయోజనం , పొందుతున్నారో తెలుసుకోండి.
జవాబు:
మాది వై.యస్.ఆర్ కడప జిల్లాలో మంగంపేట. ఇక్కడ బెరైట్ ఖనిజ నిల్వలు ఉన్నాయి. వీటిని 1960లో కనుగొన్నారు. 1967 నుంచి దీని తవ్వకం కొనసాగుతుంది. ఈ గ్రామంలో ‘1200 కుటుంబాలు ఉండేవి. వీరిని కొత్త ప్రాంతానికి తరలించి ఆంధ్రప్రదేశ్ ఖనిజ అభివృద్ధి కార్పొరేషన్ (ప్రభుత్వరంగ కంపెనీ – ఎస్ఎండిసి) వారికి పునరావాసం కల్పించింది. ఈ గనులు ఈ కంపెనీకి చెందుతాయి. ఇందులో పనిచేసే కార్మికుల, ఉద్యోగస్టులు, స్థానిక ప్రజల కోసం NMDC చెట్లు నాటించడం లాంటి పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలను చేపడుతుంది. మా నాన్నగారి పేరు R. ఈశ్వరరావు. ఆయన ఇక్కడ G.M. ఆఫీసులోనే పనిచేస్తున్నాడు. ఇక్కడ పనిచేసే వారంతా కలిసి మెలిసి ఉంటారు.

8th Class Social Textbook Page No.68

ప్రశ్న 9.
a) మన ఖనిజాలను తవ్వడానికి ప్రైవేటు కంపెనీలను అనుమతించటంలోని లాభ, నష్టాలను చర్చించండి.
b) వాటిని ఎలా నియంత్రించవచ్చు?
c) పర్యావరణ సమస్యలు తలెత్తకుండా ఏమి చేయవచ్చు?
జవాబు:
a) 1. 1993లో కొత్త జాతీయ ఖనిజ విధానాన్ని ప్రభుత్వం ప్రకటించింది.
2. దీని ద్వారా గనులను ప్రైవేటు వారికి కౌలుకిచ్చి వాటిలో త్రవ్వకాలు నిర్వహించమంది.
లాభాలు :
గనుల తవ్వకం మీద ప్రభుత్వానికి నియంత్రణాధికారం ఉంటూనే, కొంత ఆదాయం సమకూరుతోంది. అదే సమయంలో పెట్టుబడులు పెట్టి కొత్త సాంకేతిక విజ్ఞానం తీసుకుని రావడానికి ప్రైవేటు కంపెనీలకు ప్రోత్సాహం లభిస్తుంది. ఈ విధానం ఫలితంగా గత 20 సం||రాలలో గనుల తవ్వకం ఊపందుకుంది. గనుల సంఖ్య, తవ్వి తీసే ఖనిజాలు, ఉపాధి ఈ రంగంలో పెరిగాయి.

నష్టాలు :
ప్రభుత్వ అనుమతిని లెక్క చేయకుండా ప్రయివేటు కంపెనీలు అడ్డూ అదుపు లేకుండా గనులను తవ్వేస్తున్నాయి. ఎక్కువ మొత్తంలో గనుల తవ్వకం వల్ల దీర్ఘకాల సుస్థిరతకు భంగం వాటిల్లుతుంది. ప్రభుత్వానికి రాయల్టీ చెల్లించకుండా ప్రైవేటు కంపెనీలు ఖనిజాలను తరలించి వేస్తున్నాయి. నిజంగా అవి చెందాల్సిన ‘ప్రజలకు చెందటం లేదు’.

b) గనులు ప్రభుత్వ ఆధీనంలోనే ఉంచాలి. లేదా ప్రైవేటు వారికిచ్చినపుడు ఉన్నత స్థాయి అధికారుల అజమాయిషీ. – స్థానికుల పర్యవేక్షణ దానిపై ఉండేలా చర్యలు తీసుకోవాలి.

c) గనులను కౌలుకిచ్చేటప్పుడు, భూగర్భ గనులను తవ్వేవారికే ఎక్కువ ప్రాధాన్యతనివ్వాలి. తవ్వగా ఏర్పడిన గోతులను, గుట్టలను సరిచేయాలి. ఇసుక లాంటి వాటిలో ఎక్కువ తవ్వకుండా పర్యవేక్షణ ఉండాలి.

AP Board 8th Class Social Solutions Chapter 6 ఖనిజాలు, గనుల తవ్వకం

ప్రశ్న 10.
ప్రజలందరూ ఖనిజ వనరుల అసలైన యజమానులు అయితే వాళ్ళందరి మేలు కోసం వీటిని ఉపయోగించుకోవడం ఎలా?
జవాబు:
వీటి ద్వారా వచ్చిన ఆదాయాన్ని రవాణా సౌకర్యాల అభివృద్ధికి, ప్రజారోగ్య వసతులకు, విద్యకు, ఇతర సబ్సిడీలకు ఉపయోగించాలి. అపుడు ప్రజలందరి మేలు కోసం ఉపయోగించినట్లవుతుంది.

ప్రశ్న 11.
రానున్న తరాలకు, అంటే మన పిల్లలు, వాళ్ళ పిల్లలకు కూడా ఈ వనరులు ఉండాలా, వద్దా? ఈ వనరులు అంతరించి పోకుండా వాళ్ళకి కూడా అందేలా ఎలా చూడగలం?
జవాబు:
రానున్న తరాలకు కూడా ఈ వనరులు ఉండాలి. ఇవి వారికి అందాలంటే మనం ప్రత్యామ్నాయ ఇంధన వనరులను వాడుకోవాలి. అలాగే కొన్ని వనరుల వాడకాన్ని నిర్దిష్ట శాతం మాత్రమే ఉండేలా చూడాలి. లేకుంటే ఇవి నిజంగానే భవిష్యత్తులో అంతరించిపోతాయి.

8th Class Social Textbook Page No.69

ప్రశ్న 12.
ఈ పరికరాలు ఏమిటో చెప్పండి.
AP Board 8th Class Social Solutions Chapter 6 ఖనిజాలు, గనుల తవ్వకం 8
జవాబు:
ఇవి గనిలో కార్మికుల భద్రత కోసం ఉపయోగించే పరికరాలు. అవి కర్ర, హెల్మెట్, లాంతరు మొదలైనవి.

ప్రశ్న 13.
కర్ర ఉపయోగం ఏమిటి?
జవాబు:
పేలుడు జరిగిన తరువాత, ఆ ప్రాంతం ఎలా ఉంది అని పరిశీలించడానికి అక్కడ కర్రతో తడుతూ ముందుకెళతారు. బొగ్గు వదులుగా ఉన్నచోట దుంగలు, ఇనుపరాడ్లు పెట్టి నిలబెడతారు.

AP Board 8th Class Social Solutions Chapter 6 ఖనిజాలు, గనుల తవ్వకం

ప్రశ్న 14.
హెల్మెట్ పై దీపం ఎందుకు ఉంది?
జవాబు:
గనిలో చాలా చీకటిగా ఉంటుంది. ఒక వ్యక్తి సంచరించే ప్రాంతంలో ముందు వైపు వెలుగు కోసం హెల్మెట్ పై దీపం ఉంటుంది.

ప్రశ్న 15.
చిత్రంలోని లాంతరును గుర్తించారా ? ఇది ఎందుకు ఉపయోగపడుతుంది?
జవాబు:
ఈ లాంతరు గనిలోనికి తీసుకువెళతారు. ఏమైనా విషవాయువులు గనిలో వెలువడినట్లయితే ఈ లాంతరు ద్వారా ఆ సంగతిని తెలుసుకుని జాగ్రత్త పడతారు.

ప్రశ్న 16.
కింద ఇచ్చిన హామీ పత్రం చూడండి. ఏఏ షరతులకు మేం అంగీకరించవలసి వచ్చింది?
AP Board 8th Class Social Solutions Chapter 6 ఖనిజాలు, గనుల తవ్వకం 9
జవాబు:
ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి దానిని అంగీకరించాల్సి వచ్చింది. తగిన జాగ్రత్తలు, పాటిస్తామని, ప్రమాదాలు జరిగినపుడు, భద్రతా పెట్టిలోని పరికరాలతో ఎదుర్కొంటామని అంగీకరించాల్సి వచ్చింది.

8th Class Social Textbook Page No.73

ప్రశ్న 17.
ఈ సమస్యను ఎలా పరిష్కరించవచ్చు ? పర్యావరణం, భూములను నష్టపరుస్తూ, జీవనోపాధులు నష్టపోయేలా చేస్తూ తక్కువ ఖర్చుతో బొగ్గుతవ్వకం చేపట్టటం సమంజసమైనదేనా?
జవాబు:
a) విద్యుత్తు ఉత్పత్తికి ప్రత్యామ్నాయ వనరులను (ఉదా: సముద్రపు నీరు, సూర్యకాంతి) ఉపయోగించే విధానాలను కనిపెట్టడం, కని పెట్టిన వాటిని అమలు పరచడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించవచ్చు.
b) ఇది సమంజసం కాదు. దీనివలన ప్రభుత్వరంగ సంస్థలకి, ప్రైవేటు సంస్థలకి తేడా లేకుండా పోయిందని నేను భావిస్తున్నాను.

8th Class Social Textbook Page No.75

ప్రశ్న 18.
బొగ్గుగనుల తవ్వకాన్ని, మంగంపేటలో గనుల తవ్వకాన్ని పోల్చండి. పోలికలు, తేడాలు ఏమిటి?
జవాబు:
పోలికలు:

  1. రెండూ నేల నుండి తవ్వి తీయబడేవే.
  2. ఇవి రెండూ ప్రభుత్వ పర్యవేక్షణలోనే ఉన్నాయి.
  3. వీటిని అవసరమైన చోట డిటోనేటర్ల సహాయంతో పేలుస్తారు.
  4. నాణ్యత కోసం లోపలి పొరల వరకూ వెళతారు.
  5. కార్మికుల భద్రత కోసం చర్యలు చేపడతారు.

తేడాలు :

బొగ్గు గనుల తవ్వకంమంగం పేటలో గనుల తవ్వకం
1. ఇవి అనేక చోట్ల ఉన్నాయి.1. ఇవి ఒకే చోట ఉన్నాయి.
2. వీటిలో వేల సంఖ్యలో కార్మికులు, ఉద్యోగస్థులు ఉన్నారు.2. వీటిలో వందల సంఖ్యలో మాత్రమే ఉన్నారు.
3. ఈ గనులు భూగర్భ, ఓపెన్ కాస్ట్ అని రెండు రకాలు.3. ఇవి ఓపెన్ కాస్ట్ మాత్రమే.
4. ఈ గనుల లోపల పురుషులు మాత్రమే పని చేస్తారు.4. వీటిలో స్త్రీలు కూడా పనిచేస్తారు.
5. స్వాతంత్ర్యం రాకముందు నుండి ఈ గనులు తవ్వబడుతున్నాయి.5. 1967 నుండి ఈ తవ్వకాలు మొదలయ్యా యి.

ప్రశ్న 19.
ఈ క్రింది పేరాను చదివి, దిగువనిచ్చిన ఖాళీలను పూరించుము.

కొన్ని ముఖ్యమైన ఖనిజాలు, వాటి వినియోగాలు

ఇనుప ఖనిజం, ఇసుక, ముడిచమురు, సున్నపురాయి, బొగ్గు మొదలైన ఖనిజాల ఉపయోగాలు మీకు తెలిసే ఉంటుంది. ఆధునిక పరిశ్రమలలో అనేక రకాల ఖనిజాలను ఉపయోగిస్తున్నాం. కాబట్టి ఈ ఖనిజాలు మన జీవితాల్లో చాలా ముఖ్యభాగం అయ్యాయి. కొన్ని ముఖ్యమైన ఖనిజాల ఉపయోగాల గురించి ఇక్కడ తెలుసుకుందాం. మీరు | గ్రంథాలయం, లేదా ఇంటర్నెట్ లో చూసి వీటి గురించి మరింత సమాచారం సేకరించవచ్చు.

ఇనుప ధాతువు (మడి ఇనుము) :
హెమటైట్ మరియు మాగ్నటైట్ ఇనుపధాతు నిల్వలు మన రాష్ట్రంలో లభిస్తున్నాయి. వీటిని ముఖ్యంగా ఉక్కు, ఫెలిటైజేషన్, స్పాంజ్ ఐరన్, పిగ్ ఐరన్ పరిశ్రమలలో ఉపయోగిస్తారు. దీనిని ముఖ్యంగా జపాను ఎగుమతి చేస్తున్నారు.

మైకా (అభ్రకం) :
ఇది మెరిసే ఖనిజం. విద్యుత్తు, ఎలక్ట్రానిక్ పరిశ్రమలలో దీనిని విస్తృతంగా ఉపయోగిస్తారు. దీనికి ఉపయోగపడే అనేక గుణాలు ఉన్నాయి. ఇది సన్నటి పొరలలో లభ్యమవుతుంది. ఇది విద్యుత్ నిరోధకం.

సున్నపురాయి :
‘సిమెంట్, కార్బెడ్, ఇనుము ఉక్కు, సోడాయాష్ (బట్టల సోడ), రసాయనాలు, కాగితం, ఎరువులు గాజు పరిశ్రమలలో ఉపయోగిస్తారు.

గ్రానైట్ :
దీనిని కోత (కటింగ్) మరియు పాలిష్ పరిశ్రమలలో అలంకరణకు, స్మారక కట్టడాలలో, నేలను నునుపు చేసే సామానులలో ఉపయోగిస్తారు.

మాంగనీస్ :
దీనిని పొటాషియం ఫర్మాంగనేట్, ఇనుము మిశ్రమ లోహాలలోనూ, ఇనుము – ఉక్కు, బాటరీలు, రసాయనాలు, పింగాణి (సిరామిక్), గాజు పరిశ్రమలలో ఉపయోగిస్తారు.

బెరైటిస్ :
ఇది కొన్ని ఖనిజాల సమూహం. వీటి నుంచి బేరియం అనే మూలకాన్ని వెలికితీస్తారు. పారిశ్రామిక, వైద్య అవసరాల కోసం బేరియంని ఉపయోగిస్తారు. ముడి చమురు, సహజవాయువుల కోసం చాలా లోతుగా తవ్వటానికి కూడా బెరైటిస్ ని ఉపయోగిస్తారు.

ఫెల్డ్ స్పార్ :
గాజు, సెరామిక్ వస్తువులు (వాష్ బేసిన్ వంటి) తయారు చేయటానికి ఇది ముడి సరుకుగా ఉపయోగపడుతుంది.

ఖాళీలను పూరింపుము :

1. ముడి ఇనుమును ముఖ్యంగా జపాన్‌కు ఎగుమతి చేస్తున్నారు.
2. మైకా మెరిసే ఖనిజం.
3. బట్టలసోడా పరిశ్రమలో సున్నపురాయిను ఉపయోగిస్తారు.
4. పారిశ్రామిక, వైద్య అవసరాల కోసం బేరియం ని ఉపయోగిస్తారు.
5. వాష్ బేసిన్లకు ఒక ముడి సరుకు ఫెల్ట్ స్పార్ .

ప్రశ్న 20.
ఈ క్రింది సమాచారమును చదివి, ప్రశ్నలకు సమాధానములిమ్ము.
2009 జూన్ 29న ప్రచురితమైన ఈ వార్తను చదవండి.

సింగరేణి ఓపెన్‌కాస్ట్ బొగ్గుగనుల వల్ల తలెత్తిన సమస్యలు

మా ప్రతినిధి :
వరంగల్, జూన్ 28 : బొగ్గుకి ఉన్న గిరాకీని దృష్టిలో ఉంచుకుని ఓపెన్ కాస్ట్ గని తవ్వకం చేపట్టాలని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) నిర్ణయించింది. ఈ నిర్ణయం వల్ల 200 గ్రామాలు ప్రభావితం కావచ్చు. 20,000 మంది నిరాశ్రయులు కావచ్చు. ఈ గనుల వల్ల 3000 హెక్టార్ల అడవులు కూడా ప్రభావితం అవుతాయని అంచనా.

“భూగర్భ గనుల ద్వారా రోజుకి 1500 టన్నుల బొగ్గు తవ్వగలిగితే, ఓపెన్ కాస్ట్ ద్వారా రోజుకి పదివేల టన్నుల బొగ్గు తియ్యవచ్చు. దీనికి ఖర్చు కూడా చాలా తక్కువ అవుతుంది,” SCCLలో ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఇది ఇలా ఉండగా, ఓపెన్‌కాస్ట్ గనుల తవ్వకం వల్ల వేలాది కుటుంబాలు నిర్వాసితులవుతాయి, పదుల సంఖ్యలో గ్రామాలు దెబ్బతింటాయి, స్థానికుల జీవనోపాధులు దెబ్బతింటాయి. కంపెనీ అధికారి ప్రకారం అడవులు నరికివేసినంత విసీరంలో కొత్తగా అడవులను వృద్ధి చేస్తారు. దానికి అయ్యే ఖర్చును భరిస్తారు. ఒక హెక్టారుకు 4.38 నుంచి 10.43 లక్షల రూపాయలు ఇందుకు చెల్లిస్తారని ఆ అధికారి చెప్పాడు. ఈ గనుల వల్ల తవ్విన మట్టి, రాళ్లు గుట్టలుగా ఏర్పడి వాగులు, నదుల ప్రవాహానికి ఆటంకం కల్పిస్తున్నాయని, భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయని, తాగునీటికి కూడా కొరత ఏర్పడుతోందని స్థానిక ప్రజలు ఫిర్యాదు చేస్తున్నారు.

ప్రశ్నలు – జవాబులు :
1. ఈ వార్త ఎప్పుడు ప్రచురితమైంది?
జవాబు:
2009 జూన్ 29న ప్రచురితమైనది.

2. ఎస్సిసిఎల్ అంటే ఏమిటి?
జవాబు:
సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్.

3. ఈ నిర్ణయం వల్ల ఏమి జరుగవచ్చు?
జవాబు:
ఈ నిర్ణయం వల్ల 200 గ్రామాలు ప్రభావితం కావచ్చు, 20,000 మంది నిరాశ్రయులు కావచ్చు. ఈ గనుల వల్ల 3000 హెక్టార్ల అడవులు కూడా ప్రభావితం అవుతాయని అంచనా.

4. భూగర్భ గనులు, ఓపెన్ కాస్ట్ – ఈ రెంటిలో ఏది కంపెనీకి లాభదాయకం?
జవాబు:
ఓపెన్కాస్ట్.

5. స్థానిక ప్రజలు ఏమని ఫిర్యాదు చేస్తున్నారు?
జవాబు:
ఈ గనుల వల్ల తవ్విన మట్టి, రాళ్లు గుట్టలుగా ఏర్పడి వాగులు, నదుల ప్రవాహానికి ఆటంకం కల్పిస్తున్నాయని, భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయని, తాగునీటికి కూడా కొరత ఏర్పడుతోందని స్థానిక ప్రజలు ఫిర్యాదు చేస్తున్నారు.

AP Board 8th Class Social Solutions Chapter 6 ఖనిజాలు, గనుల తవ్వకం

ప్రశ్న 21.
ఈ కింది పేరాను చదివి, దిగువ నిచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల్లో విస్తార బొగ్గు గనులు ఉన్నాయి. ఈ బొగ్గును సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) వెలికి తీస్తుంది. దీనిని మొదట 1886లో ఒక ప్రైవేటు బ్రిటిషు కంపెనీ నెలకొల్పింది. 1920లో దీనిని హైదరాబాదు నిజాం కొన్నాడు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత భారత ప్రభుత్వం దీనిని జాతీయం చేసింది. ప్రస్తుతం ఎస్ సిసిఎల్ భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి కంపెనీ. తెలంగాణాలో పైన పేర్కొన్న నాలుగు జిల్లాలలో ఈ కంపెనీ ప్రస్తుతం 15 ఓపెన్ కాస్ట్ గనులలో, 35 భూగర్భ గనులలో త్వకాలు చేపడుతోంది. ఈ కంపెనీలో 65,000 ఉద్యోగులు ఉన్నారు (2012).
ప్రశ్నలు – జవాబులు :
1) స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్ళలో గనులు ఎవరి అధీనంలో ఉండేవి?
జవాబు:
ప్రైవేట్ కంపెనీలు, వ్యక్తుల చేతుల్లో

2) బొగ్గు గనులు ఏ ఏ జిల్లాలలో అధికం?
జవాబు:
ఖమ్మం , కరీంనగర్, అదిలాబాద్, వరంగల్

3) సింగరేణి కాలరీస్లో మొత్తం ఉద్యోగులు ఎందరు?
జవాబు:
65,000 మంది (2012 నాటికి)

ప్రశ్న 22.
గనుల తవ్వకంలో ప్రభుత్వ నియంత్రణలలో వేటితో మీరు ఏకీభవిస్తారు? ఎందుకు?
జవాబు:
గనులు కౌలుకిచ్చే విధానం కాకుండా ప్రభుత్వమే ఆధునిక, సంక్లిష్ట సాంకేతిక విజ్ఞానాన్ని ప్రవేశ పెట్టి ఖనిజాలు వెలికి తీస్తే బాగుండేది. ఎందుకంటే ప్రభుత్వం తీసుకునే భద్రతా చర్యలు ప్రైవేటు వారు తీసుకోకపోవచ్చు. వారి లాభాపేక్ష భావితరాలకు శూన్యాన్ని అందించవచ్చు. ప్రభుత్వానికి చేరవల్సిన రాయల్లీ పూర్తిగా చేరకపోయే అవకాశం ఉంది. ముఖ్యంగా నిల్వలు అయిపోయిన గనులను పూర్తిగా మూసివేసే చర్యలు, ఖర్చులు ఎక్కువ అవుతుందని మూయకపోవచ్చు. కాబట్టి ప్రభుత్వ నియంత్రణనే నేను సమర్థిస్తాను.

పట నైపుణ్యాలు

ప్రశ్న 23.
ఆంధ్రప్రదేశ్ ఖనిజాల పటం చూసి క్రింది పట్టిక నింపండి.
AP Board 8th Class Social Solutions Chapter 6 ఖనిజాలు, గనుల తవ్వకం 3
జవాబు:

జిల్లాఖనిజం
1. శ్రీకాకుళంబెరైటీస్
2. విజయనగరంసున్నపురాయి, బెరైటీస్
3. పశ్చిమ గోదావరిసున్నపురాయి
4. కృష్ణాగానైట్, ఇనుప ఖనిజం
5. గుంటూరుసున్నపురాయి
6. ప్రకాశంసున్నపురాయి, గ్రానైట్, ఇనుప ఖనిజం, బెరైటీస్
7. నెల్లూరుమైకా, బెరైటీస్
8. చిత్తూరుగ్రానైట్
9. అనంతపూర్సున్నపురాయి, ఇనుప ఖనిజం
10. కర్నూలుసున్నపురాయి
11. కడపసున్నపురాయి, బెరైటీస్, ఇనుప ఖనిజం

ప్రశ్న 24.
ఆంధ్రప్రదేశ్ ఖనిజ వనరులను ప్రశంసించండి.
జవాబు:
ఆంధ్రప్రదేశ్ లో ఖనిజ వనరులు :
మన రాష్ట్రంలో ఖనిజ వనరులు చాలా సమృద్ధిగా ఉన్నాయి. భవన నిర్మాణంలో ఉపయోగించే అనేక రంగుల గ్రానైటురాయి, కడప రాయిని పెద్ద మొత్తంలో మన రాష్ట్రం ఉత్పత్తి చేస్తుంది. సిమెంటు పరిశ్రమలో ఉపయోగించే సున్నపురాయి, డోలమైట్ కూడా ఉత్పత్తి చేస్తుంది. ఉత్తర జిల్లాలలో (గోదావరి లోయలో కొత్త గూడెంలో) పెద్ద ఎత్తున బొగ్గు నిల్వలు ఉన్నాయి. కృష్ణా – గోదావరి బేసిన్లో ఖనిజనూనె, వాయువుల నిక్షేపం ఉంది. ఆంధ్రప్రదేశ్ చారిత్రకంగా వజ్రపు గనులకు ప్రఖ్యాతిగాంచింది. ప్రపంచంలోనే అతి పెద్ద వజ్రాలు ఇక్కడే దొరికాయి. ఇవే కాకుండా ఆస్బెస్టాస్, బెరైటీస్, మైకా, ఫెల్డ్ స్పార్ వంటి ఖనిజాల విస్తార నిక్షేపాలు ఉన్నాయి.

AP Board 8th Class Social Solutions Chapter 6 ఖనిజాలు, గనుల తవ్వకం

ప్రశ్న 25.
ఖనిజాల వెలికితీతలోని సున్నితమైన అంశాలు ఏవి?
జవాబు:
గనుల తవ్వకంలోని అనేక పద్ధతుల వల్ల ఉపరితల ప్రదేశం దెబ్బతింటుంది – అంటే అడవులను నరికి వేయటం కావచ్చు. నివాసప్రాంతాలు, వ్యవసాయ భూములుగా మార్చటం కావచ్చు లేదా పెద్ద గోతులు కావచ్చు. ఖనిజాలను కడగటానికి గనుల వద్ద పెద్ద మొత్తంలో నీళ్లు కావాలి. దీని కారణంగా దగ్గరలోని నదులు, నీటి వనరులు కలుషితం అవుతాయి. దీని వల్ల భూమిని మునుపటి ప్రయోజనాల కోసం వాడటం సాధ్యంకాదు, అక్కడ నివసించే గిరిజనులు, రైతులు ఆ భూమిని వదిలి వెళ్లాల్సి వస్తుంది. గనుల తవ్వకం వల్ల చుట్టుపక్కల నివసించే ప్రజలు కూడా సమస్యలు ఎదుర్కొంటారు. అదే సమయంలో గనులు చాలా మందికి ఉద్యోగం కల్పిస్తాయి. వీళ్లకోసం చుట్టుపక్కల కొత్తగా కాలనీలు నిర్మిస్తారు. గనుల ద్వారా భారతదేశంలో సుమారు పది లక్షలమందికి, తెలంగాణలో లక్షకు పైగా మందికి ఉపాధి దొరుకుతోంది. గని కార్మికుల జీవితాలు చాలా ‘ప్రమాదకరంగా ఉంటాయి – వాళ్లు నిరంతరం ప్రమాదాల ముప్పును ఎదుర్కొంటారు, విషపూరిత వాయువులను పీల్చటం వల్ల దీర్ఘకాలంలో వాళ్ల ఆరోగ్యం దెబ్బతింటుంది.

ప్రశ్న 26.
ప్రజలందరూ ఖనిజ వనరుల అసలైన యజమానులు అయితే వాళ్ళందరి మేలు కోసం వీటిని ఉపయోగించుకోవడం ఎలా?
జవాబు:
వీటి ద్వారా వచ్చిన ఆదాయాన్ని రవాణా సౌకర్యాల అభివృద్ధికి, ప్రజారోగ్య వసతులకు, విద్యకు, ఇతర సబ్సిడీలకు ఉపయోగించాలి. అపుడు ప్రజలందరి మేలు కోసం ఉపయోగించినట్లవుతుంది.

ప్రశ్న 27.
బెరైటీస్ నాణ్యత గురించి రాయండి.
జవాబు:
పై పొరలలో దొరికే బెరైటీస్ నాణ్యత తక్కువగానూ, లోపలి పొరల్లో దొరికే దాని నాణ్యత ఎక్కువగాను ఉంటుంది. బెరైటీస్ రాయి పరిమాణాన్ని బట్టి దాని నాణ్యతను నిర్ణయిస్తారు.

ప్రశ్న 28.
వనరులు ఎన్ని రకాలు? అవి ఏవి?
జవాబు:
పర్యావరణవేత్తలు వనరులను రెండు రకాలుగా విభజిస్తారు. పునరుద్ధరింపబడేవి, పునరుద్ధరించడానికి వీలులేక అంతరించిపోయేవి.

పునరుద్ధరింపబడేవి :
మళ్ళీ మళ్ళీ పొందగలిగినది.
ఉదా : కలప, సూర్యరశ్మి.

అంతరించిపోయేవి లేదా పునరుద్ధరించడానికి వీలులేనివి :
తిరిగి తయారు చేయలేని వనరులు.
ఉదా : బొగ్గు, బంగారం.

ప్రశ్న 29.
S.C.C.L ఓపెన్‌కాస్ట్ మైనులపట్ల ఎందుకు ఆసక్తి చూపుతోంది?
జవాబు:
భూగర్భగనులు తవ్వడానికి ఎక్కువ ఖర్చు అవుతుంది. అదే ఓపెన్ కాస్టు తక్కువ ఖర్చు అవుతుంది. బొగ్గును కూడా యంత్రాల ద్వారా ఎక్కువ వెలికి తీయవచ్చు. ఇందువలన S.C.C.L ఓపెన్‌కాస్ట్ మైనుల పట్ల ఆసక్తి చూపుతోంది.

AP Board 8th Class Social Solutions Chapter 6 ఖనిజాలు, గనుల తవ్వకం

ప్రశ్న 30.
గనుల తవ్వకం మొదలుపెట్టిన చోట ఉన్న ప్రజలకు పునరావాసం ఎందుకు కల్పించాలి?
జవాబు:
ఆ ప్రజలు మొదటి నుండి ఆ ప్రాంతానికి చెందినవారు. ఆ భూములు వారికి చెంది ఉంటాయి. వారి నుంచి ఆ భూమిని సేకరిస్తున్నపుడు వారికి వేరే చోట భూమిని ఇచ్చి పునరావాసం కల్పించాల్సిన అవసరం ఉంది.

ప్రశ్న 31.
అణు ఇంధనాలకు సంబంధించిన గనుల త్రవ్వకం మొత్తం ఇప్పటికీ ప్రభుత్వం చేతుల్లోనే ఉంది. ఎందుకు?
జవాబు:
అణు ఇంధనాలు చాలా విలువైనవి, అతి తక్కువ నిల్వలున్నవి. అంతేకాక వాటి ఉపయోగాల దృష్ట్యా అవి చాలా కీలకమైనవి.

AP Board 8th Class Social Solutions Chapter 5 అడవులు – వినియోగం, సంరక్షణ

SCERT AP 8th Class Social Study Material Pdf 5th Lesson అడవులు – వినియోగం, సంరక్షణ Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Social Solutions 5th Lesson అడవులు – వినియోగం, సంరక్షణ

8th Class Social Studies 5th Lesson అడవులు – వినియోగం, సంరక్షణ Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
కింది వాక్యాలను మీరు అంగీకరిస్తారా ? అంగీకరించటానికీ, అంగీకరించకపోటానికి కారణాలను పేర్కొనండి. (AS1)
a) అడవులను సంరక్షించటానికి వ్యక్తిగత ఆస్తి అన్న భావన ముఖ్యమైనది.
b) అడవులన్నింటినీ మనుషులు కాపాడాలి. …
c) గత కొద్ది శతాబ్దాలుగా భూమి మీద నివసిస్తున్న ప్రజలు తమ జీవనోపాధికి అడవులపై ఆధారపడటం తగ్గింది.
జవాబు:
a) ఈ వాక్యాన్ని అంగీకరిస్తున్నాను. నాది అన్నభావనే ఎవరినైనా నడిపిస్తుంది. ఆ భావన గిరిజనులలో పోగొట్టడం మూలంగానే 200 ఏళ్ళ నుంచి అడవులు తగ్గిపోయాయి.

b) అవును, నేను ఈ వాక్యాన్ని అంగీకరిస్తున్నాను. అడవులనన్నింటినీ మనుషులు కాపాడాలి. ఎందుకంటే అడవుల వలన సకల మానవాళీ లబ్ధి పొందుతోంది. అవి లేకపోతే మానవాళి మనుగడే లేదు.

C) ఈ వాక్యాన్ని నేను అంగీకరిస్తున్నాను. ఎందుకంటే ప్రజలకి అనేక రకాలైన ఇతర ఉద్యోగ, వ్యాపార అవకాశాలు భూమి మీద లభిస్తున్నాయి. కాబట్టి వీరు అడవుల మీద జీవనోపాధికి ఆధారపడటం తగ్గించారు.

ప్రశ్న 2.
గత కొన్ని శతాబ్దాలలో అటవీ వినియోగంలో వచ్చిన ప్రధాన మార్పులతో ఒక పట్టిక తయారు చేయండి. గత తరగతుల పాఠ్య పుస్తకాలు చూడాల్సిన అవసరం రావచ్చు. (AS3)
AP Board 8th Class Social Solutions Chapter 5 అడవులు - వినియోగం, సంరక్షణ 1
జవాబు:

అంశంగిరిజన జీవనంపై ప్రభావంఅడవిపై ప్రభావం
వ్యవసాయ ఆవిర్భావంవ్యవసాయ ఆవిర్భావం మూలంగా గిరిజనులు తమ సాంప్రదాయ ఆహారాన్ని మార్చి, పంటలు పండించి తినటం అలవాటు చేసుకున్నారు. దుంపలు, పళ్ళు, తేనె మొదలైన సహజ ఆహారాలకు దూరమౌతున్నారు.దీని మూలంగా వీరు అడవిని నరికి చదును చేసి వ్యవసాయం చేస్తున్నారు. 4, 5 సం||రాల తర్వాత వేరే చోటికి వెళ్ళి అక్కడ కూడా యిదే విధంగా చేస్తారు. ఆ ప్రాంతాల్లో చెట్లు మొలిచి పెద్దవిగా ఎదగాలంటే చాలా ఏళ్ళు పడుతుంది.
వలసపాలకుల రాకవలసపాలకులు అడవులపై వీరికి ఉన్న హక్కులన్నీ, లాక్కున్నారు. వాళ్ళ గురించి పట్టించుకోలేదు. వీరు నిరాశ్రయులయ్యారు. కూలీలుగా మారారు. వీరు అభద్రతా భావనకు గురి అయ్యారు.అడవులు అటవీశాఖ ఆధ్వర్యంలోనికి వెళ్ళి పోయాయి, రక్షిత, రిజర్వు అడవులుగా వర్గీకరించబడ్డాయి. వీటి మీద ఆదాయం ప్రభుత్వం ఆ తీసుకునేది. తన బిడ్డలైన గిరిజనులను దూరం చేసుకున్నాయి. ప్రభుత్వ వినియోగం పెరిగింది.
ప్రభుత్వ నియమాలుస్వతంత్ర్యం తరువాత కూడా వీరి పరిస్థితులు మారటానికి ప్రభుత్వం ఏమి చేయలేదు. బ్రిటిషు విధానాన్నే అవలంబించారు. ఈ విధానాల కారణంగా వారి బ్రతుకులు ఇంకా అధ్వాన్నంగా తయారయ్యాయి.1988లో జాతీయ అటవీ విధానాన్ని, ఉమ్మడి అటవీ యాజమాన్యాన్ని ప్రకటించి అడవుల పరిరక్షణకు. గిరిజనులను, అటవీ శాఖను బాధ్యులను చేశారు. పులుల అభయారణ్యాలు ఏర్పడ్డాయి. అటవీ హక్కుల చట్టం 2006 వల్ల గిరిజనులకి వారి హక్కులు, వారి భూములు వారికి వచ్చాయి.

AP Board 8th Class Social Solutions Chapter 5 అడవులు - వినియోగం, సంరక్షణ

ప్రశ్న 3.
పైన ఇచ్చిన వాటి ఆధారంగా, లేదా అడవుల గురించి మీకు తెలిసిన దానిని బట్టి మీరు నివసిస్తున్న ప్రదేశానికి దగ్గరలో ఉన్న అడవిని ఈ దిగువ అంశాలలో వివరించండి. (AS4)
AP Board 8th Class Social Solutions Chapter 5 అడవులు - వినియోగం, సంరక్షణ 2
జవాబు:
మాది మారేడుమిల్లి గ్రామం. మా అడవి ఈ విధంగా ఉంటుంది.

చెట్ల సాంద్రతకనిపించే చెట్లుచెట్ల ప్రత్యేక అంశాలు
ఎకరాకు 650 నుండి750 చెట్ల వరకూ ఉన్నాయి.1. వెలగ1) ఈ కాయలు తినడానికి, పచ్చడికి ఉపయోగిస్తారు.
2. తునికి2) ఈ ఆకులను బీడీలు చుట్టటానికి ఉపయోగిస్తారు.
3. వేప3) శక్తి రూపం, వ్యాధి నిరోధక శక్తి కలిగినది.
4. ఉసిరి4) ఔషధ విలువలు కలిగినది.
5. టేకు5) గట్టికలప, గృహ వినియోగానికి
6. బూరుగు6) దూది తీయడానికి

ప్రశ్న 4.
ఆంధ్రప్రదేశ్-అడవులు పటాన్ని పరిశీలించి ఏ జిల్లా జిల్లాల్లో అత్యధికంగా అడవులచే ఆవరించబడి ఉన్నాయో పేర్కొనండి. (AS5)
జవాబు:
తూర్పు గోదావరి, విశాఖపట్నం, కడప, కర్నూలు, శ్రీకాకుళం మరియు ప్రకాశం జిల్లాలు అత్యధికంగా అడవులచే ఆవరించబడి ఉన్నాయి.

ప్రశ్న 5.
ఒక పాఠశాలలో కొంత మంది విద్యార్థులు ‘వనమహోత్సవ కార్యక్రమం’లో పాల్గొని కొన్ని మొక్కలు నాటారు. దీనికి మీరు ఎలా స్పందిస్తారు? (AS6)
జవాబు:
దీనికి నేను చాలా ఆనందిస్తాను. చిన్న వయస్సు విద్యార్థులు దీనికి అలవాటు పడితే దేశభవిష్యత్తు చాలా బాగుంటుంది. అయితే మొక్కలు నాటడమే కాక వాటిని సక్రమంగా పెరిగేలా కూడా బాధ్యత తీసుకోవాలి. అపుడే ఇది ఫలవంతమౌతుంది.

ప్రశ్న 6.
“ఆంధ్రప్రదేశ్ లో అడవులు” శీర్షిక కిందగల పేరాను చదివి క్రింది ప్రశ్నకు జవాబు రాయండి.
మన రాష్ట్రంలో అటవీ విస్తీర్ణ అభివృద్ధికై నీవు సూచించే సలహాలు ఏవి? (AS2)
జవాబు:

  1. సామాజిక అడవుల పెంపకం చేపట్టాలి.
  2. పూడ్చి వేసిన గనుల ప్రాంతంలో మొక్కలను పెంచాలి.
  3. అడవులలోని ఖాళీ ప్రదేశాలలో చెట్లను పెంచాలి.
  4. గృహావసరాలకు ప్రత్యామ్నాయాలను అన్వేషించాలి.
  5. ఆక్రమణదారులకు అడ్డుకట్ట వేయాలి.
  6. సామాన్య ప్రజలలో అడవుల ఆవశ్యకత పట్ల అవగాహనను కలిగించాలి.

AP Board 8th Class Social Solutions Chapter 5 అడవులు - వినియోగం, సంరక్షణ

ప్రశ్న 7.
ఈ పాఠంలో ఇచ్చిన వివిధ రకాలైన అడవుల చిత్రాలలో ఉన్న ప్రదేశాలను మీ దగ్గరున్న అట్లా లో గుర్తించండి. వాటి మధ్య ఉన్న పోలికలు, భేదాలను నీవు గుర్తించగలవా? (AS5)
జవాబు:
పాఠంలో ఇచ్చిన చిత్రాలలో క్రింది అడవుల గురించి పేర్కొనబడింది.

  1. పశ్చిమ కనుమలలోని అనైముడిలోని సతతహరిత అడవులు
  2. హిమాలయాలలోని గుల్ మాలో మంచుతో నిండిన దేవదారు చెట్ల అడవి.
  3. ఛత్తీస్ గఢ్ లోని టేకు అడవులు.
  4. రాయలసీమలోని పొద అడవులు.
  5. తూర్పు గోదావరి జిల్లాలోని కోరింగ మడ అడవులు.

పైన పేర్కొన్న అడవులు గల ప్రదేశాలను అట్లా లో గుర్తించగలను. వాటి మధ్య ఉన్న పోలికలు, భేదాలను కూడా గుర్తించగలను.

ప్రశ్న 8.
సతత హరిత అడవులకు, ఆకురాల్చే అడవులకు గల తేడాలేవి?
జవాబు:

సతత హరిత అడవులుఆకురాల్చే అడవులు
1) చాలా ఎక్కువ వర్షపాతం, అధిక ఉష్ణోగ్రతలు ఉండే భూమధ్యరేఖ ప్రాంతాలు, కేరళ, అండమాన్లలో ఎల్లప్పుడూ పచ్చగా ఉండే సతత హరిత అడవులుఉంటాయి.1) కొన్ని నెలల పాటు మాత్రమే వర్షాలు పడి సంవత్సరంలో అధిక భాగం పొడిగా, వెచ్చగా ఉండే ప్రాంతాలలో ఈ అడవులు పెరుగుతాయి.
2) ఈ ప్రాంత చెట్లు ఆకులు రాల్చి తిరిగి చిగురించేందుకు పట్టేకాలం తక్కువ2) బాగా వేడిగా ఉండే నెలల్లో ఇవి ఆకులను రాల్చి వర్షాకాలంలో తిరిగి చిగురిస్తాయి. మన రాష్ట్రంలో ఈ అడవులు మాత్రమే ఉన్నవి.
3) హిమాలయ ప్రాంతంలో మంచు కురిసే ప్రాంతంలో దేవదారు వంటి వృక్షాలు పెరుగుతాయి.3) ఈ అడవులు మన రాష్ట్రంలో శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లోనూ, తూర్పు గోదావరి ఏజెన్సీ ప్రాంతంలోనూ ఉన్నాయి.

ప్రశ్న 9.
పేజీ నెం. 59లో ఉన్న చిత్రాలను పరిశీలించి ఒక వ్యాఖ్య రాయండి. (AS2)
AP Board 8th Class Social Solutions Chapter 5 అడవులు - వినియోగం, సంరక్షణ 3
జవాబు:
అడవులలో జంతువులతో కలిసి జీవించిన మానవుడు వ్యవసాయానికై మైదాన ప్రాంతానికి వచ్చాడు. అయితే మానవ సంతతి (జనాభా) విపరీతంగా పెరగటంతో తన పూర్వపు నివాసాలైన అడవులను నాశనం చేసి నిర్మాణాలు చేపట్టి, జంతువులు నివసించేందుకు చోటులేకుండా చేశాడు. జీవ వైవిధ్యానికి తావులేకుండా చేసి తన మనుగడకే ముప్పు తెచ్చుకుంటున్నాడు. ఆ

ప్రశ్న 10.
అటవీ హక్కుల చట్టం 2006 సారాంశాన్ని వివరించండి. (AS1)
జవాబు:

  1. అటవీ హక్కుల చట్టం 2006లోని మార్పులకు వ్యతిరేకంగా గిరిజనులు నిరసనలు వ్యక్తం చేస్తూ వచ్చారు. పోరాడుతూ వచ్చారు.
  2. వీళ్ల తరఫున అనేక స్వచ్ఛంద సంస్థలు నిలబడి అడవులపై గిరిజనుల హక్కుల కోసం జాతీయస్థాయి ప్రచార ఉద్యమాన్ని చేపట్టాయి.
  3. సుదీర్ఘ చర్చల తరవాత 2006లో పార్లమెంటు అటవీ హక్కుల చట్టాన్ని చేసింది.
  4. గిరిజనులకు చెందిన అడవులలో వాళ్లకు సంప్రదాయంగా వస్తున్న హక్కులను తిరస్కరించి గత రెండు వందల సంవత్సరాలుగా గిరిజనులకు తీవ్ర అన్యాయం చేశామని మొదటిసారి అంగీకరించారు.
  5. గిరిజనుల హక్కులు పునరుద్ధరించకుండా అడవులను సంరక్షించటం అసాధ్యమని కూడా గుర్తించారు.
  6. ఈ కొత్త చట్టం చేయటానికి మూడు ప్రధాన కారణాలను అది పేర్కొంది. అవి :
    i) మొదటిది, అడవులను సంరక్షించటమే కాకుండా అదే సమయంలో అటవీ వాసులకు జీవనోపాధినీ, ఆహార భద్రతను కల్పించాల్సి ఉండడం.
    ii) రెండవది, అడవుల సుస్థిరత, మనుగడలలో అంతర్భాగమైన అటవీ వాసులు తరతరాలుగా సాగుచేస్తున్న భూములపై, నివాస ప్రాంతాలపై హక్కులను వలసపాలనలో, స్వతంత్రం వచ్చిన తరవాత కూడా గుర్తించకపోవటం వల్ల జరిగిన చారిత్రక అన్యాయాన్ని సరిచేయాల్సి ఉండడం.
    iii) మూడవది, ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనుల వల్ల (ఆనకట్టలు, పులుల అభయారణ్యాలు వంటివి) నిర్వాసితులైన వారితో సహా అటవీ వాసుల భూమి హక్కులు, అడవిలోకి వెళ్ళే హక్కుల విషయంలో దీర్ఘకాలంగా కొనసాగుతున్న అభద్రతను పరిష్కరించాల్సి ఉండటం.
  7. ఈ చట్టం వల్ల అటవీ వాసులకు, సంప్రదాయంగా అటవీ వస్తువులపై ఆధారపడిన వాళ్లకు అడవులపై తమ హక్కులు తిరిగి లభించాయి, సాగుచేస్తున్న భూములకు పట్టాలు వచ్చాయి.
  8. ఈ చట్టాన్ని సరిగా అమలు చేస్తే తరతరాలుగా గిరిజనులకు జరుగుతున్న అన్యాయాన్ని కొంతమేరకు సరిదిద్దవచ్చు.

8th Class Social Studies 5th Lesson అడవులు – వినియోగం, సంరక్షణ InText Questions and Answers

8th Class Social Textbook Page No.49

ప్రశ్న 1.
గత తరగతులలో వారు అదవుల గురించి, అక్కడ నివసిస్తున్న ప్రజల గురించి చదివారు. అవి గుర్తు తెచ్చుకుని అటవీ ప్రజల గురించి మాట్లాడండి.
జవాబు:
“అందరికీ నమస్కారం. అడవులు భూమి మీద జీవానికి ప్రాణ ప్రదాతలు. ఎక్కడైనా అడవులు ఆ దేశ విస్తీర్ణంలో 33% ఆక్రమించి ఉండాలి. కాని భారతదేశంలో కేవలం 24% మాత్రమే ఆవరించి ఉన్నాయి. ఈ సంఖ్యలు మనం ఎంత ప్రమాదంలో ఉన్నాయో సూచిస్తున్నాయి. అడవి బిడ్డలైన గిరిజనులలో దాదాపు 60% పైన అడవులలోనే నివసిస్తున్నారు. వారి జీవన విధానం ప్రకృతి ననుసరించి సాగుతుంది. వారి ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లు, మతపరమైన కార్యక్రమాలు, సమూహాలు, వ్యవసాయం ఒకటి కాదు, అన్నీ వారిని మిగతా ప్రపంచీకులతో భిన్నంగా నిలబెడతాయి. వారి మనుగడ సవ్యంగా సాగితేనే, ప్రపంచం సవ్యంగా నడుస్తుంది. కాబట్టి అడవుల అభివృద్ధికి అందరూ సహకరించండి. కృతజ్ఞతలు, నమస్తే”.

ప్రశ్న 2.
తరగతిలో ప్రతి ఒక్కరూ అడవి చిత్రం గీసి, వాటిని పోల్చండి.
AP Board 8th Class Social Solutions Chapter 5 అడవులు - వినియోగం, సంరక్షణ 5
జవాబు:
అన్ని చిత్రాలను పోల్చండి :
కొన్ని చిత్రాలలో అడవులు దట్టంగాను, క్రింద నేల కూడా కనబడకుండా తీగలు అల్లుకుని పోయి ఉన్నాయి. కొన్ని చిత్రాలలో అడవులలో చెట్లు దూరం దూరంగా మధ్యలో ఖాళీ నేల కనిపిస్తూ ఉన్నాయి. కొన్ని చిత్రాలలో అడవులు అక్కడక్కడా చెట్లు మధ్యలో మైదానాలు లాగా ఉన్నాయి.

ప్రశ్న 3.
మీలో కొంతమందికి దగ్గరలోని అడవి తెలిసే ఉంటుంది – అక్కడి చెట్లు, మొక్కలు, జంతువులు, రాళ్లు, వంకలు, పక్షులు, పురుగులు చూసి ఉంటారు. ఇవి తెలిసిన వాళ్లని వాటి గురించి వివరించమనండి, అక్కడ ఏం చేస్తారో చెప్పమనండి.
జవాబు:
మాది తూర్పు గోదావరి జిల్లా మారేడుమిల్లి. మా ఊరే ఒక అడవి. మా ఊరు ప్రకృతి సౌందర్యానికి నెలవు. ఇక్కడ వెదురు, రావి, వేప, ఉసిరి, టేకు, సాలు మొ॥న వృక్షాలు అధికంగా ఉన్నాయి. కాఫీ, రబ్బరు మొక్కలు కూడా ఉన్నాయి. ఇక్కడ కౄర మృగాలు కూడా ఉన్నాయని మా పెద్దలు చెబుతారు. ఇక్కడ రకరకాల పిట్టలు, రంగు రంగుల పురుగులు మాకు కనువిందు చేస్తాయి. ఈ ప్రాంతాన్ని చూడటానికి అనేక మంది ఇక్కడకు వస్తారు. ఆనందంగా చూసి వెళతారు. మేము ఇక్కడ దొరికే దుంపలు, పళ్ళు, తేనె తింటాము. వాటిని తీసుకుని వెళ్ళి పట్నాలలో అమ్మి డబ్బు సంపాదిస్తాము. ఎలుగుబంటి వెంట్రుకలు, మూలికలు కూడా అమ్మి మాకు కావలసిన సొమ్ములను సంపాదించుకుంటాము.

AP Board 8th Class Social Solutions Chapter 5 అడవులు - వినియోగం, సంరక్షణ

ప్రశ్న 4.
కట్టెపుల్లలు, ఆకులు, పళ్లు లేదా దుంపలు సేకరించటానికి మీరు ఎప్పుడైనా అడవికి వెళ్లారా? దాని గురించి తరగతిలో వివరించండి. మీ ప్రాంతంలో అడవినుంచి ప్రజలు సేకరించే వస్తువుల జాబితా తయారు చేయండి. అలా సేకరించిన వాటిని ఏమి చేస్తారు?
జవాబు:
మాది పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలం, శృంగవృక్షం గ్రామం. మా నాన్నగారు రామచంద్రరావుగారు ఇక్కడ పాఠశాలలో పనిచేస్తున్నారు. ఒకసారి మా యింట్లో చండీ హోమం తలపెట్టారు. దానికి కావలసిన సమిధలు సేకరించడానికి నేను, మా స్నేహితులు కలిసి మా దగ్గరలోని అడవికి వెళ్ళాము. రావి, మారేడు, నేరేడు సమిధల్ని సేకరించాము. అడవిలోపలికి వెళ్ళాలంటే చాలా భయం వేసింది. మా ప్రాంతం వారు తేనె, మూలికలు, అనేక రకాల బెరళ్ళు, ఉసిరి, జిగురు, కుంకుళ్ళు, చింతపండు మొదలైనవి సేకరిస్తారు. అవి వారి అవసరాలకు ఉంచుకుని మిగతావి చుట్టు ప్రక్కల వారికి అమ్ముతారు.

ప్రశ్న 5.
మన జానపద కథలు, పురాణాలు పలుమార్లు అడవులను పేర్కొంటాయి. అటువంటి కథ ఏదైనా తరగతిలో చెప్పండి.
జవాబు:
మన పురాణాలలో ప్రఖ్యాతి గాంచినవి రామాయణ, మహాభారతాలు. ఈ రెండూ వనవాసాల్ని గురించి చెబుతున్నాయి. ఇది రామాయణానికి సంబంధించినది. రామునికి పట్టాభిషేకం ప్రకటించగానే, ఆయనకి మారుటి తల్లి అయినటువంటి ‘కైక’, 14 ఏళ్ళు అరణ్యవాసం శిక్ష ఆయనకి వేస్తుంది. అప్పుడు రాముడు, లక్ష్మణుడు, సీతతో సహా వనవాసానికి వెళతారు. ఆ అడవి మధ్య భారతదేశంలో చత్తీస్ గఢ్, ఒడిశా, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో విస్తరించి ఉన్నటువంటి అడవి. దండనకు ఉపయోగపడింది కాబట్టి దీనిని దండకారణ్యమని కూడా అన్నారు. అయితే ఈ అరణ్యవాసమే లోకకళ్యాణానికి దారి తీసింది. రావణుడు సీత నెత్తుకుపోవడం, రాముడు రావణున్ని చంపడం ఇవన్నీ ఈ అరణ్యవాసం మూలంగానే జరిగాయి.

ప్రశ్న 6.
అనేక అడవులను ప్రజలు పవిత్రంగా భావించి పూజిస్తారు. దేవుళ్లు, దేవతలు నివసించే ప్రాంతాలుగా కొన్ని అడవులు ప్రఖ్యాతిగాంచాయి. వాటి గురించి తెలుసుకుని తరగతి గదిలో చెప్పండి.
జవాబు:
వాపరయుగం తరువాత కలియుగం ప్రారంభం అయ్యే సమయంలో మునులు, ఋషులు అందరూ కలిసి బ్రహ్మదేవుని ప్రార్థించారట – కలియుగంలో ‘కలి’ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మేము తపస్సు చేసుకోవడానికి మంచి ప్రదేశాన్ని చూపించండని అడిగారట. అప్పుడు బ్రహ్మదేవుడు ఒక పవిత్ర చక్రాన్ని తీసుకుని భూలోకం మీదకు విసిరాడట. అది ఉత్తరాన గోమతీ నదీ తీరంలో పాంచాల, కోసల (ప్రస్తుతం సీతాపూర్, U.P) ప్రాంతాల మధ్యలో పడిందట. ఆ ప్రాంతంలో వారిని తపస్సు చేసుకోమని బ్రహ్మ చెప్పాడట. అదే నేటి నైమిశారణ్యం చాలా పవిత్ర భూమి. భారతదేశంలో సూతుడు, శౌనకాది మహామునులకు చెప్పిన పురాణాలన్నీ ఇక్కడ చెప్పబడినవే. ఇది ఋషుల యజ్ఞయాగాదులతోనూ, తపోబలంతోను శక్తివంతమైన అడవి. మనం కూడా ఒకసారి చూసి వద్దాం రండి.

8th Class Social Textbook Page No.50

ప్రశ్న 7.
అడవి అంటే ఏమిటి? అడవిని అనేక రకాలుగా నిర్వచించవచ్చు. అడవికి నిర్వచనం రాయండి. వీటిని తరగతిలో చర్చించి అధిక శాతం విద్యార్థులకు సరైనవిగా అనిపించే అంశాలను రాయండి.
జవాబు:
చెట్లతో ఉన్న విశాలమైన భూ భాగాన్ని అడవి అని అంటారు.

నిర్వచనం :

  1. ఒక స్థలం యొక్క పరిసరాలు అన్ని వైపులా చెట్లతో ఆవరించబడి ఉంటే దానిని అడవి అంటారు.
  2. పర్యావరణాన్ని అనేక రకాల చెట్లతో ప్రభావితం చేసే ప్రాంతంను అడవి అంటారు.

విద్యార్థులకు సరియైనవిగా అనిపించే అంశాలు :

  1. స్థలం : చాలా పెద్దదై ఉండాలి.
  2. చెట్లు : అంత పెద్ద స్థలం ఒకే రకమైనగాని, అనేక రకాలయిన చెట్లతో ఆవరించబడియుండాలి.
  3. పర్యావరణాన్ని ప్రభావితం చేయటం : అడవుల వలన పర్యావరణం నిజంగానే ప్రభావితం అవుతుంది.

ప్రశ్న 8.
అడవి నేపథ్యంలో క్రింది చిత్రానికి ఒక వ్యాఖ్యానం రాయంది.
జవాబు:
AP Board 8th Class Social Solutions Chapter 5 అడవులు - వినియోగం, సంరక్షణ 6
వ్యాఖ్యానం:
“ముందు అడుగేస్తే నుయ్యి,
వెనుకడుగేస్తే గొయ్యి.”
“హద్దు మీరిన వినియోగం,
శూన్యమవును భవితవ్యం”

8th Class Social Textbook Page No.51

ప్రశ్న 9.
అడవులు ఉండటం ముఖ్యమా ? అడవులన్నింటినీ నరికివేసి వ్యవసాయానికి, గనుల తవ్వకానికి, కర్మాగారాల నిర్మాణానికి, మనుషుల నివాసానికి ఉపయోగిస్తే ఏమవుతుంది ? అడవులు లేకుండా మనం జీవించలేమా ? మీ తరగతిలో చర్చించండి.
జవాబు:
మానవులు, వృక్షాలు పరస్పర ఆధారితాలు. అడవులు లేకుండా మనుషులు జీవించలేరు. మనం వదిలిన CO2 వృక్షాలు, వృక్షాలు వదిలిన O2 మనము పీల్చుకుని జీవిస్తున్నాము. భూమి మీద 1/3వ వంతు వృక్షాలు, లేదా అడవులు ఉంటేనే మానవ మనుగడ సాధ్యమౌతుంది లేదా ప్రకృతి వైపరీత్యాలు సంభవించి మన జీవనానికి అవరోధం ఏర్పడుతుంది.

ప్రశ్న 10.
ఈ ఊరికి, పట్టణానికి దగ్గరలో ఉన్న అటవీ ప్రాంతం ఏది ? ఈ ప్రాంతం వ్యవసాయ భూమిగా, గనులుగా, నివాస , ప్రాంతంగా మారకుండా ఇంకా చెట్లతో ఎందుకు ఉందో తెలుసుకోండి?
జవాబు:
మాది మారేడుమిల్లి గ్రామం. ఇది కొండపైన ఉన్నది. తూ.గో జిల్లాలోనిది. రంపచోడవరం అడవి ప్రాంతం కూడా మాకు చాలా దగ్గర. ఇవి రెండూ అటవీ ప్రాంతాలే. ఇది బ్రిటిషువారి హయాంలో కూడా స్వతంత్రంగానే నిలిచింది. గిరిజనుల హయాంలోనే చాలా వరకూ ఉంది. ఈ ప్రాంతంలో ఎటువంటి ఖనిజాలు బయల్పడలేదు. త్రవ్వకాలు జరుపబడలేదు. దీని భౌగోళిక పరిస్థితి, చారిత్రక అంశాల రీత్యా ఇది చెట్లతో నిండి అడవిగానే మిగిలిపోయింది.

8th Class Social Textbook Page No.54

ప్రశ్న 11.
సముద్ర తీరంలోని ప్రత్యేక పరిస్థితులను మడ చెట్లు ఎలా మలుచుకున్నాయో కనుక్కోండి.
జవాబు:
మడ అడవులు సముద్రతీర ప్రాంతాలలో ఎక్కువగా పెరుగుతాయి. ఉప్పునీటికి, సముద్ర అలల ప్రవాహానికి అనుగుణంగా ఈ చెట్లు పెరుగుతాయి. సముద్ర అలలు ఈ ప్రాంతాలను రోజులో కొన్ని గంటల పాటు ముంచెత్తి తరువాత వెనక్కి తగ్గుతాయి. అంటే కొన్ని గం||ల పాటు ఉప్పునీటితోనూ, కొన్ని గంటల పాటు నీళ్ళు లేకుండానూ ఉంటుంది. ఇటువంటి క్లిష్టపరిస్థితులలో బతకటానికి ఈ చెట్లు కొన్ని ప్రత్యేక అంశాలను అలవరుచుకున్నాయి. ఇవి కొమ్మల నుండి గొట్టాలవంటి అమరిక కలిగిన వేర్లవంటి వాటిని కలిగి ఉండి అవి నేలలో పాతుకొనిపోయి ఉంటాయి. వీటి ద్వారా ఇవి నీటిని, వాటికి కావలసిన గాలిని పీల్చుకుంటాయి. అలలను తట్టుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. అంతేకాక ఉప్పును వేర్ల దగ్గరే అడ్డగిస్తాయి. వీటి ఆకులలో ఉప్పును విసర్జించే గ్రంథులు ఉన్నాయి.

AP Board 8th Class Social Solutions Chapter 5 అడవులు - వినియోగం, సంరక్షణ

ప్రశ్న 12.
నైజీరియాలోని భూమధ్యరేఖా ప్రాంత అడవుల గురించి చదివింది గుర్తుండి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ లోని అడవులకూ, భూమధ్యరేఖా ప్రాంతపు అడవులకు ముఖ్యమైన తేడాలు ఏమిటి?
జవాబు:

భూమధ్యరేఖా ప్రాంతపు అడవులుఆంధ్రప్రదేశ్ అడవులు
1) ఇవి భూమధ్యరేఖకు యిరువైపులా వ్యాపించి, ఉన్నాయి.1) ఇవి భూమధ్యరేఖకి ఉత్తరాన మాత్రమే ఉన్నాయి.
2) ఇవి చాలా దట్టమైనవి.2) ఇవి కొన్ని దట్టమైనవి, కొన్ని చాలా పలుచనివి.
3) ఇవి తడి, చిత్తడి నేలలో ఉంటాయి.3) ఇవి ఎక్కువ కాలం పొడిగా ఉండే నేలలో ఉంటాయి.
4) అనేక రకాల వృక్షాలు పెరుగుతాయి.4) చాలా తక్కువ రకాల వృక్షాలు ఉంటాయి.
5) ఇవి రవాణా సౌకర్యాలకు అనువుగా ఉండవు.5) వీటిలో చాలా వరకు ప్రయాణం చేయడానికి, రవాణా సౌకర్యాలకు అనువుగా ఉంటాయి.

ప్రశ్న 13.
“మన రాష్ట్రంలో ప్రతి సంవత్సరం వంద చదరపు కిలోమీటర్ల మేర అడవి తగ్గిపోతు ఉంది” …… ఈ పరిస్థితి సరైనదేనా? తరగతిలో చర్చించండి.
జవాబు:
ఈ పరిస్థితి సరియైనది కాదు. దీనివలన మన రాష్ట్రంలో జీవ వైవిధ్యం అడుగంటిపోతుంది. వర్షాలు తగ్గిపోతాయి. ఉపరితల సారం కొట్టుకుపోతుంది. యింకా అనేక కారణాల వలన యిది విషమ పరిస్థితి అని చెప్పవచ్చును.

8th Class Social Textbook Page No.56

ప్రశ్న 14.
a) అడవులను ప్రజలు ఉపయోగించుకుంటూ, వాటిని సంరక్షించడం సాధ్యమేనా?
b) చెట్లను కొట్టి, మార్కెట్టులో అమ్మి డబ్బు చేసుకోవచ్చని ఎవరైనా ఆశపెట్టి ఉంటే వాళ్ళు ఏమి చేసి ఉండేవాళ్ళు?
జవాబు:
a) సాధ్యమే. మన ప్రస్తుత సమాజంలో తోటలున్నవారు వాటి కాయలను, పళ్ళను అమ్ముకుని సంరక్షించుకున్నట్లే వీటిని సంరక్షించవచ్చు.

b) వారు కచ్చితంగా దీనిని వ్యతిరేకిస్తారు. వారు వారి అవసరాలకి కొమ్మో, రెమ్మో నరుకుతారేమో కాని ఎవరెంత ఆశచూపినా చెట్లు మాత్రం నరికి ఉండే వారు కాదు. ఎందుకంటే అడవి వారికి ఇల్లు వంటిది. ఉన్న యింటినే ఎవరూ కూలదోసుకోరు కదా !

8th Class Social Textbook Page No.57

ప్రశ్న 15.
నీలగిరి చెట్లు, తేయాకు తోటలకూ, అడవికీ మధ్య ఏమైనా తేడాలు ఉన్నాయా ? తరగతిలో చర్చించండి.
జవాబు:
అడవిలో ఉండే చెట్లు చాలా పొడవుగా ఉండి, పై భాగంలో దాని పొడవు ఎంత ఉందో దాదాపు అంత చుట్టుకొలతతో గుబురుగా కొమ్మలు, రెమ్మలు ఉండాలి. నీలగిరి చెట్లు పొడవుగానే ఉంటాయి కానీ, పై భాగంలో గుబురుగా ఉండవు. తేయాకు తోటల్లో మొక్కలు చాలా ఎత్తు పెరుగుతాయి కాని వాటిని ఎత్తు పెరగనివ్వరు. 3, 4 అడుగుల ఎత్తు పెరిగిన ‘వెంటనే కత్తిరిస్తారు. అంత కంటే ఎత్తు పెరిగితే అవి ఆకులు కోయటానికి అందక, పనికి రాకుండా పోతాయి. కాబట్టి ఈ మూడింటికీ మధ్య ఈ తేడాలు ఉన్నాయి.
AP Board 8th Class Social Solutions Chapter 5 అడవులు - వినియోగం, సంరక్షణ 4

8th Class Social Textbook Page No.58

ప్రశ్న 16.
అడవిని గిరిజనులు రక్షించడానికీ, అటవీ అధికారులు రక్షించడానికీ మధ్య తేడాలు ఏమిటి?
జవాబు:
అడవి గిరిజనులకు అమ్మ వంటిది. వారి జననం, జీవితం, మరణం అన్నీ ఆ అడవి తల్లి ఒడిలోనే. వారికి, అడవికి మధ్య తేడాను వారు భావించరు. కాబట్టి అడవికి వారు ఎటువంటి ముప్పు వాటిల్లనివ్వరు. చివరికి వారు చేసే వ్యవసాయంలో కూడా నేలను ఎక్కువ దున్నితే, నేల వదులయి మట్టి కొట్టుకు పోతుందని, అక్కడక్కడ గుంటలు చేసి దాంట్లో విత్తనాలు వేస్తారు.

అటవీ అధికారులు ఉద్యోగరీత్యా ఏవో ప్రాంతాల నుండి అక్కడకు వస్తారు. వారికి ఆ ప్రాంతంపై అభిమానం కాని, ప్రాణాలొడి దానిని రక్షించాలనే భావం కాని సాధారణంగా ఉండవు. వీరికి గిరిజనులపై విశ్వాసం కూడా ఉండదు. ఇవే అడవిని గిరిజనులు రక్షించటానికీ, అటవీ అధికారులు రక్షించడానికీ మధ్య తేడాలు.

ప్రశ్న 17.
ఏ పద్ధతి అనుసరించి ఉంటే బాగుండేదో తరగతిలో చర్చించండి.
జవాబు:
ప్రభుత్వం గిరిజన ప్రజలను తమ సాంప్రదాయ పద్ధతిలో జీవించనిచ్చి ఉంటే బాగుండి ఉండేదని మేము భావిస్తున్నాము. వారిని అడవుల నుండి వేరుచేసి అడవులకు, వారికి కూడా ద్రోహం చేసినట్లయింది. అంతేగాక వలస పాలకుల పాలనను అనుసరించినట్లయింది అని మేము భావిస్తున్నాము.

ప్రశ్న 18.
గత 200 సంవత్సరాలలో అడవులు తగ్గిపోతూ ఉండటానికి కారణాల జాబితా తయారు చేయండి. దీనికి పోడు వ్యవసాయం కూడా ఒక కారణమా ? మీ వాదనలు పేర్కొనండి.
జవాబు:
అడవులు తగ్గిపోవడానికి కారణాలు :

  1. వ్యవసాయం పెరుగుదల
  2. పశువులను మేపటం
  3. పెద్ద పెద్ద ప్రాజెక్టులు
  4. వంట చెరుకు, గృహవినియోగం కోసం ఎక్కువ ఉపయోగించడం
  5. పేపరు తయారీ
  6. గనుల త్రవ్వకం
  7. నూనె, గ్యాసు వెలికితీత
  8. కార్చిచ్చులు మొ||నవి.

దీనిలో పోడు వ్యవసాయం కూడా కొంత కారణమని చెప్పవచ్చు. పూర్వం గిరిజనులు అడవిపై ఆధారపడి జీవనం సాగించేవారు. వీరు కూడా ఎక్కువ శాతం ‘పోడు’ మీద ఆధారపడేసరికి అడవులు వ్యవసాయ భూములుగా మారుతున్నాయి. వీటిలో మళ్ళీ చెట్లు పెరగాలంటే దానికి చాలా ఏళ్ళు పడుతుంది.

AP Board 8th Class Social Solutions Chapter 5 అడవులు - వినియోగం, సంరక్షణ

ప్రశ్న 19.
ప్రభుత్వం విధించిన భూమి శిస్తును గిరిజనులు కట్టలేకపోవటానికి కారణాలు ఏమిటి?
జవాబు:
బ్రిటిషు వారు ఒక్క కలంపోటుతో గిరిజనుల హక్కులను నేలరాసి, ఈ భూమిని వ్యవసాయానికి, జమిందార్లకు, రైతులకు ఇచ్చి ఆదాయాన్ని పొందాలనుకున్నారు. ఏ హక్కులు లేని గిరిజనులు కూలీలైనారు. గిరిజనులు పొందిన భూములకు శిస్తులు చెల్లించాల్సి వచ్చేది. ఇవి కట్టడానికి వారి దగ్గర సొమ్ములుండవు. కారణం గిరిజనులు వారి రోజు వారీ గ్రాసాన్నీ చూసుకునే వారు తప్ప దాచుకోవడం, మదుపు చేయడం లాంటి అవకాశాలు, అవసరాలు వారికుండేవి కావు – కాబట్టి వారు ఈ శిస్తులను చెల్లించలేకపోయేవారు.

ప్రశ్న 20.
మీ ప్రాంతంలో అటవీ చట్టాల అమలు తీరు ఎలా ఉంది? ఇలా చట్టాలు ఉన్నా కూడా అడవులు అంతరించిపోవడానికి గల కారణాలు ఏమై ఉంటాయి?
జవాబు:
మా ప్రాంతంలో అటవీ చట్టాల అమలు తీరు అంతంత మాత్రంగానే ఉన్నాయి.

ఆక్రమణదారులు, గనుల యాజమానులు, గ్రామీణ వర్గాలవారు అడవులను దురుపయోగం చేస్తున్నారు. అడవుల పరిరక్షణ పట్ల సరియైన అవగాహన లేకపోవడం కూడా ఒక కారణం. రాజకీయ నాయకులలో చిత్తశుద్ధి లేకపోవడం దీనికి మరొక కారణంగా చెప్పవచ్చును. . యివేకాక అడవులు అంతరించిపోవడానికి ఇంకా అనేక కారణాలను చెప్పుకోవచ్చును.

8th Class Social Textbook Page No.60

ప్రశ్న 21.
గత 200 సంవత్సరాలుగా గిరిజనులకు జరిగిన అన్యాయాన్ని ఈ చట్టం ఎంతవరకు తీరుస్తుంది?
జవాబు:
చట్టం చేయటం వలన మాత్రమే గిరిజనులకు జరిగిన అన్యాయం తీరదు. దానిని సరిగా అమలు జరిగేలా పరిస్థితులు ఉంటేనే మనం మార్పును చూడగలం.

ప్రశ్న 22.
సి.ఎఫ్. ఎమ్, ఇతర సామాజిక అటవీ పథకాలకు సంబంధించి మీ పెద్ద వాళ్ళ అనుభవాలను తెలుసుకోండి.
జవాబు:
అటవీ విధానాలను బ్రిటిషు వారి కాలంలోనే ప్రవేశపెట్టారు. 1882లో మద్రాసు ప్రెసిడెన్సీలో మద్రాసు అటవీ చట్టాన్ని ప్రవేశపెట్టి దాని తర్వాత కాలంలో ఆంధ్రప్రదేశ్ అటవీ చట్టంగా మార్చారు. 1915లో ఒక చట్టాన్ని ప్రవేశపెట్టారు. 1956, 1967, 1970, 1971లలో ఆంధ్రప్రదేశ్ అటవీ విధానాలను తయారుచేస్తారు. చివరికి భారతదేశం 1990లో ఉమ్మడి అటవీ యాజమాన్యాన్ని ప్రకటించింది. 1993లో ఆంధ్రప్రదేశ్ అటవీ విధానాన్ని ప్రకటిస్తూ దానినే సి.ఎఫ్.ఎమ్ గా పేరు మార్చింది. అయితే 1990 తర్వాత వచ్చినవన్నీ ప్రభుత్వం, గిరిజనులు ఇద్దరూ అడవులను పరిరక్షించవలసినదిగా చెప్పాయి. వీటన్నిటి లోటుపాట్లను సవరిస్తూ, 2006లో చేసిన అటవీ చట్టం గిరిజనులకు పూర్వపు హక్కులను పునరుద్ధరింపచేసింది. హక్కులు, చట్టాలు ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకున్నపుడే విజయవంతం అవుతాయి. లేకుంటే పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి’ అక్కడే అన్నట్లు ఉంటుంది. ఇంతేగాక 1976లో సామాజిక అడవుల పెంపకాన్ని కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అడవుల పైనున్న ఒత్తిడిని తగ్గించి అన్ని రకాల ఖాళీ నేలలలో చెట్లను పెంచడమే దీని ముఖ్యోద్దేశం.

8th Class Social Textbook Page No.61

ప్రశ్న 23.
ఈ విషయాన్ని తరగతిలో చర్చించండి – గిరిజన ప్రజలకు జరిగిన అన్యాయాలను సరిచేయడానికి ఇదే సరియైన మార్గమా? అడవులను కాపాడటంలో ఇది ఎలా ఉపయోగపడుతుంది? దీనికి ఏ యితర చర్యలు చేపట్టాలి
జవాబు:
గిరిజన ప్రజలకు జరిగిన అన్యాయాలను సరిచేయడానికి ఇది సరియైన మార్గమని నేను విశ్వసిస్తున్నాను. అడవిలో పుట్టి పెరిగిన వారే అడవిని రక్షించగలరు. అయితే వాటిని గిరిజనులు వ్యాపార, వాణిజ్య అవసరాలకు ఉపయోగించకుండా చూడాల్సిన అవసరం ఉంది. వారికి కావలసిన కనీస అవసరాలకు కొంత ప్రభుత్వం మార్గం చూపించగలిగితే వారు ఎటువంటి వ్యతిరేక చర్యలకు పోకుండా ఉండే అవకాశం ఉంటుంది.

పట నైపుణ్యాలు

ప్రశ్న 24.
మీకీయబడిన భారతదేశ పటంలో ఈ క్రింది ప్రాంతాలను గుర్తించండి.
జవాబు:

  1. హిమాలయా ఆల్ఫైన్ అడవులు
  2. కేరళ అడవులు
  3. శ్రీకాకుళం
  4. పశ్చిమ కనుమలలోని అనైముడిలోని అడవులు
  5. దండకారణ్యం

AP Board 8th Class Social Solutions Chapter 5 అడవులు - వినియోగం, సంరక్షణ 7

8th Class Social Textbook Page No.54

ప్రశ్న 25.
ఆంధ్రప్రదేశ్ లో అడవులను చూపించే పటం చూడండి. మీ జిల్లాలో అడవులు ఉన్నాయా ? ఉంటే, అవి ఎటువంటి అడవులు?
AP Board 8th Class Social Solutions Chapter 5 అడవులు - వినియోగం, సంరక్షణ 9
జవాబు:
మాది తూర్పు గోదావరి జిల్లా, కాకినాడ. మాకు 20 కి||మీల దూరంలో ‘కోరింగ సాంక్చువరీ’ ఉన్నది. దాని దగ్గర మడ అడవులు ఉన్నాయి. ఇక్కడ సముద్రపు వెనుకజలాలున్నాయి. ఈ ప్రాంతంలోనే ఈ మడ అడవులు ఉన్నాయి.

ప్రశ్న 26.
నీకు తెలుసున్న వన మూలికా సంరక్షణ కేంద్రాల పేర్లను తెలుపుము.
జవాబు:

  1. వాలి, సుగ్రీవ ఔషధ మొక్క సంరక్షణ కేంద్రము
  2. కోరింగ వనమూలికల సంరక్షణ ప్రదేశము
  3. కార్తీకవనము. ఈ మూడు తూర్పుగోదావరి జిల్లాలో కలవు.

ప్రశ్న 27.
అడవి అంటే ఏమిటి?
జవాబు:
చెట్లతో ఉన్న విశాలమైన భూ భాగాన్ని అడవి అని అంటారు.

నిర్వచనం :

  1. ఒక స్థలం యొక్క పరిసరాలు అన్ని వైపులా చెట్లతో ఆవరించబడి ఉంటే దానిని అడవి అంటారు.
  2. పర్యావరణాన్ని అనేక రకాల చెట్లతో ప్రభావితం చేసే ప్రాంతాన్ని అడవి అంటారు.

AP Board 8th Class Social Solutions Chapter 5 అడవులు - వినియోగం, సంరక్షణ

ప్రశ్న 28.
అడవులను ప్రజలు ఉపయోగించుకుంటూ వాటిని సంరక్షించడం సాధ్యమేనా?
జవాబు:
సాధ్యమే. మన ప్రస్తుత సమాజంలో తోటలున్న వారు వాటి కాయలను, పళ్ళను అమ్ముకుని సంరక్షించుకున్నట్లే వీటిని రక్షించవచ్చు.

AP Board 8th Class Social Solutions Chapter 4 ధృవ ప్రాంతాలు

SCERT AP 8th Class Social Study Material Pdf 4th Lesson ధృవ ప్రాంతాలు Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Social Solutions 4th Lesson ధృవ ప్రాంతాలు

8th Class Social Studies 4th Lesson ధృవ ప్రాంతాలు Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
తప్పుగా ఉన్న వాక్యాలను సరైన వాస్తవాలతో తిరిగి రాయండి. (AS1)
అ. జంతువుల శరీర భాగాలను కేవలం బట్టలకే ఉపయోగించేవారు.
జవాబు:
జంతువుల శరీర భాగాలను ఆహారానికి, ఇళ్ళ నిర్మాణానికి, బట్టలకి, ఆయుధాల తయారీకి ఉపయోగించేవారు.

ఆ. ఆహారంలో ప్రధాన భాగం కూరగాయలు.
జవాబు:
ఆహారంలో ప్రధాన భాగం జంతు మాంసము, చేపలు.

ఇ. టండ్రా ప్రాంత ప్రజల ఆదరణ పొందిన ఆటలకు వారి రోజువారీ జీవితాలతో సంబంధం ఉంది.
జవాబు:
సరియైన వాక్యం

ఈ. బయటి వాళ్లతో సంబంధాలు వాళ్ల ఆరోగ్యాన్ని ప్రభావితం చేసింది.
జవాబు:
సరియైన వాక్యం

ప్రశ్న 2.
ఏడవ తరగతిలో మీరు భూమధ్యరేఖా ప్రాంతం గురించి చదివిన దాన్ని బట్టి ధృవ ప్రాంతంలో తేడాలు ఏమిటో చెప్పండి. (AS1)
జవాబు:

భూమధ్యరేఖా ప్రాంతంధృవ ప్రాంతం
1. ఇది 07 నుండి 23½  ఉత్తర, దక్షిణ అక్షాంశముల మధ్య వ్యాపించి ఉంది.1. ఇది 66½  ఉత్తర అక్షాంశం నుండి 90° ఉ|| అక్షాంశం వరకూ వ్యాపించి ఉన్నది.
2. ఇక్కడ సూర్యకిరణాలు నిట్టనిలువుగా పడతాయి.2. సూర్యకిరణాలు ఏటవాలుగా పడతాయి.
3. వీరికి 3 కాలాలు ఉంటాయి.3. వీరికి 2 కాలాలు మాత్రమే ఉంటాయి.
4. వీరికి రాత్రి, పగలు ఒక రోజులో ఏర్పడతాయి.4. వీరికి రాత్రి, పగలు 6 నెలల కొకసారి ఏర్పడతాయి.
5. వీరిది సంచార జీవనం.5. వీరిది స్థిర జీవనం.
6. వీరికి బయటి ప్రపంచంతో సహచర్యం ఎక్కువ.6. వీరికి బయట ప్రపంచంతో సహచర్యం తక్కువ.

AP Board 8th Class Social Solutions Chapter 4 ధృవ ప్రాంతాలు

ప్రశ్న 3.
టండ్రా ప్రాంత ప్రజల జీవితం అక్కడి వాతావరణం మీద ఎలా ఆధారపడి ఉంది? దిగువ అంశాలలో దీనిని వివరించండి. (AS1)
AP Board 8th Class Social Solutions Chapter 4 ధృవ ప్రాంతాలు 1
జవాబు:
AP Board 8th Class Social Solutions Chapter 4 ధృవ ప్రాంతాలు 2

ప్రశ్న 4.
మీరు నివసిస్తున్న ప్రాంతానికీ, ఈ పాఠంలో మీరు చదివిన ప్రాంతానికి మధ్య చాలా తేడాలు ఉన్నాయి. ఈ అధ్యాయంలోని శీర్షికల వారీగా తేడాలన్నింటినీ పేర్కొనండి. ఇప్పుడు మీ ప్రాంతంలోని, టండ్రా ప్రాంతంలోని వివరాలు, చిత్రాలతో ఒక గోడపత్రిక తయారు చేయండి. (AS6)
జవాబు:
గోడ పత్రిక (భూమధ్యరేఖా వాసులతో ధృవ వాసులు)

నేను నివసిస్తున్న ప్రాంతం
ఈ ప్రాంతం ఎక్కడ ఉంది?
పాఠంలో చదివిన ప్రాంతం
1. ఈ ప్రాంతం భూమధ్యరేఖకి, కర్కట రేఖకి మధ్యలో ఉన్నది.1. ఈ ప్రాంతం ఆర్కిటిక్ వలయానికి, ఉత్తర ధృవానికి మధ్యలో ఉన్నది.
కాలాలు :
2. ఇక్కడ ప్రతిరోజూ రాత్రి, పగలు వస్తాయి. ఇక్కడ వేసవి, వర్ష, శీతాకాలాలు ఉన్నాయి.
2. ఇక్కడరాత్రి, పగలు 6 నెలల కొకసారి వస్తాయి. ఇక్కడ శీతాకాలం, వేసవికాలం మాత్రమే ఉన్నాయి.
వేసవి :
3. ఇక్కడ వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయి.
3. ఇక్కడ వేసవిలో కూడా అల్ప ఉష్ణోగ్రతలే నమోదు అవుతాయి.
ప్రజలు :
4. ఇక్కడి ప్రజలు స్థిర నివాసాన్ని కలిగి, జీవితాన్ని గడుపుతారు.
4. వీరు సంచార జీవితాన్ని, అభద్రతతో కూడిన నమ్మకమైన జీవితాన్ని గడుపుతారు.
సామూహిక జీవనం :
5. ఇక్కడి ప్రజలు కుటుంబపరమైన జీవితాన్ని గడుపుతారు.
5. వీరు సామూహిక జీవితాన్ని గడుపుతారు.
వేట, చేపలు పట్టడం, ఆహారం :
6. ఈ ప్రాంతం వారు పండించిన ధాన్యం, కూరగాయలు ఉండటం అరుదు. అనేక వృత్తులు చేస్తారు.
6. వీరు వేటాడిన మాంసాన్ని, చేపలను తింటారు. కూరగాయలు, మాంసం, చేపలు తింటారు. ఆహారధాన్యాలు, ఆహార సేకరణే వారి వృత్తి.
ఆవాసం :
7. వీరు రకరకాల ఇళ్ళు, భవంతులు, గుడిసెలు, డేరాలలో నివసిస్తారు.
7. వీరు గుడారాలు, మంచు యిళ్ళు మొ||న వాటిలో నివసిస్తారు.
మతపరమైన నమ్మకాలు :
8. మతపరమైన విశ్వాసాలు, ఆత్మల పట్ల నమ్మకాల కలిగి ఉంటారు. పూజా విధానాలు కలిగి ఉన్నారు. అనేక రకాల మతాలు ఉన్నాయి.
8. మతం, ఆత్మలు, అతీత శక్తులు, ఆచారాలు వుంటాయి. సంబరాలు నిర్వహిస్తారు.
వినోదం :
9. ఆటలు, పాటలు, నృత్యాలు, విందులు, సినిమాలు ఎన్నో రకాలు.
9. నైపుణ్యానికి సంబంధించిన పోటీలు, ఆటలు, ఇతర ఆచారపరమైన ఆటలు ఉంటాయి. విందులు కూడా ఉంటాయి.
బయటి ప్రపంచంతో సంబంధాలు :
10. వీరికి ప్రపంచమంతా సంబంధ బాంధవ్యాలు ఉంటాయి.
10. వీరికి ఎవరైనా తమ దగ్గరికి వస్తేనే వారితో సంబంధ బాంధవ్యాలుంటాయి.
బట్టలు, కళలు:
11. వీరు అధునాతనమైన వస్త్రాలను, తేలికైన వస్త్రాలను ధరిస్తారు.
11. వీరు మందపాటివి, ఊలువి ధరిస్తారు. జంతు చర్మాలను కూడా ధరిస్తారు.
వృక్షజాలం :
12. ఇక్కడ పెద్ద పెద్ద చెట్లు, అడవులు కూడా ఉన్నాయి.
12. ఇక్కడ గడ్డి, పొదలు మాత్రమే ఉన్నాయి.

ప్రశ్న 5.
ఒక రోజు అంతా సూర్యుడు ఉండడనీ, మరొక రోజంతా సూర్యుడు అస్తమించడనీ ఊహించుకోండి. మీ రోజువారీ జీవితంలో ఎటువంటి మార్పులు చేస్తారు? వాటి గురించి క్లుప్తంగా రాయండి. (AS4)
జవాబు:
ఒక రోజంతా సూర్యుడు ఉండకపోతే తెల్లవారటం, చీకటిపడటం అనేది లేకుండా పోతుంది. తెల్లవారే సమయానికి అలవాటు ప్రకారం నిద్రలేచి ఇల్లంతా దీపాలు వేసి వెలుతురు చూసి పనులు చేసుకుంటాను. మా ప్రాంతమంతా యిదే విధంగా చేసి యధావిధిగా పనులు చేసుకుంటాము. పాఠశాలకు వెళ్ళి వస్తాను. చదువుకుని నిద్రపోతాను. సూర్యుడు అస్తమించనపుడు రాత్రి సమయానికి తలుపులు, కిటికీలు మూసివేసి యిల్లు చీకటి చేసుకుని నిద్రపోతాను.

ప్రశ్న 6.
మీ వద్ద గల అట్లాస్ సహాయంతో ఎస్కిమోకు చెందిన ఏవైనా ఐదు ప్రాంతాలను ప్రపంచ పటంలో గుర్తించండి. (AS5)
జవాబు:
AP Board 8th Class Social Solutions Chapter 4 ధృవ ప్రాంతాలు 3

8th Class Social Studies 4th Lesson ధృవ ప్రాంతాలు InText Questions and Answers

8th Class Social Textbook Page No.40

ప్రశ్న 1.
ఈ ప్రాంతంలో ఏ ఏ ఖండాల భాగాలు ఉన్నాయి?
జవాబు:
ఈ ప్రాంతంలో ఉత్తర అమెరికా, ఐరోపా, రష్యాలలోని భాగాలు ఉన్నాయి.

ప్రశ్న 2.
భూమధ్యరేఖ నుండి దూరంగా వెళుతున్న కొద్దీ ఏమవుతుందో గుర్తుకు తెచ్చుకోండి.
జవాబు:
భూమధ్యరేఖ నుండి దూరంగా వెళుతున్న కొద్దీ ఉష్ణోగ్రతలు తగ్గుతాయి.

8th Class Social Textbook Page No.42

ప్రశ్న 3.
టండ్రాలోని వేసవి గురించి అయిదు విషయాలు చెప్పండి.
జవాబు:

  1. టండ్రా ప్రాంతంలో ఫిబ్రవరి, మార్చి నెలల్లో సూర్యుడు ప్రకాశించడం మొదలు పెడతాడు.
  2. మొదట్లో కొద్ది సేపటికే అస్తమిస్తాడు.
  3. మే నుండి జులై వరకు మూడు నెలల పాటు సూర్యుడు అస్తమించడు.
  4. సూర్యుడు ఎప్పుడూ నడినెత్తికి రాడు. క్షితిజానికి కొంచెం పైన మాత్రమే ఉంటాడు. కావున ఎక్కువ వేడి ఉండదు.
  5. వేసవి కాలంలో కూడా చలిగానే ఉన్నప్పటికీ, మంచు కరుగుతుంది. నదులు ప్రవహిస్తాయి. చెరువులు నీటితో నిండుతాయి.
  6. వేసవిలో యిక్కడి నిర్జన ప్రాంతాలలో రంగులు అలుముకుని సజీవంగా మారుతుంది.

AP Board 8th Class Social Solutions Chapter 4 ధృవ ప్రాంతాలు

ప్రశ్న 4.
ఖాళీలను పూరించండి :
• సూర్యుడు ………………, నెలల్లో కనిపించడు.
• ఈ సమయంలో …………….. నీరు …………….. చెట్లు …………….
జవాబు:
• ఆగస్టు నుండి ఫిబ్రవరి;
• టండ్రాలలో, గడ్డకట్టి, మంచుతో కప్పబడి ఉంటాయి.

ప్రశ్న 5.
టంద్రా ప్రాంతంలోని ప్రజలకు చలికాలంలో కాంతి ఎలా లభిస్తుంది?
జవాబు:
ధృవ ప్రాంతంలో చలికాలంలో సూర్యోదయ, సూర్యాస్తమయాలు ఉండవు. అక్కడ ఉన్న మంచుపై నక్షత్రాల కాంతి ప్రతిఫలించి అనేక రంగులు కనిపిస్తాయి. ఇవి ధృవాల వద్ద చక్కని వెలుగునిస్తాయి. వీటిని ‘ధృవపు కాంతులు’ అని అంటారు. ఈ విధంగాను, నూనె, కొవ్వు దీపాలతోనూ వీరికి చలికాలంలో కాంతి లభిస్తుంది.

8th Class Social Textbook Page No.43

ప్రశ్న 6.
టండ్రా ప్రాంతంలో. అన్ని కాలాలలో మనుషులు నివసించకపోవటానికి కారణం ఏమిటి?
జవాబు:
టండ్రాలలో కాలాలు లేవు. ఎల్లప్పుడూ ఒకే రకమయిన వాతావరణం నెలకొని ఉంటుంది. ఉన్న రెండు కాలాలలో కూడా వేసవి నామమాత్రంగా ఉంటుంది. ఇక్కడ పంటలు పండవు. రుచికరమైన, రకరకాల ఆహార పదార్థాలు ఉండవు. చలికాలమంతా చీకటిగా, నిర్జనంగా, నిర్మానుష్యంగా మారిపోతుంది. వేసవికాలం కూడా కొద్దిపాటి ఉష్ణోగ్రతలే ఉంటాయి. అందువలన ఇక్కడ అన్ని కాలాలలో మనుషులు నివసించలేరు.

8th Class Social Textbook Page No.46

ప్రశ్న 7.
వాళ్ల పరిసరాల్లో దొరికే వనరులను ఇళ్లు కట్టుకోవటానికి ఎలా ఉపయోగించుకుంటారు?
జవాబు:

  1. వీరు జంతు చర్మాలను, చెక్కను గుడారాలు వేయడానికి ఉపయోగిస్తారు.
  2. దుంగలను, తిమింగలపు ప్రక్కటెముకలను ఉపయోగించి గుండ్రటి యిళ్ళు కడతారు.
  3. మంచును దట్టించి, ఇటుకలుగా తయారుచేసి వాటితో మంచు యిళ్ళను నిర్మిస్తారు.

ఈ విధంగా వారికి పరిసరాలలో దొరికే వనరులను ఇళ్లు కట్టుకోవటానికి ఉపయోగిస్తారు.

ప్రశ్న 8.
టండ్రా వృక్షజాలం అని వేటిని అంటారు?
జవాబు:
టండ్రా ప్రాంతంలో చాలా తక్కువ సూర్యకాంతి పడుతుంది. కాబట్టి యిక్కడ ప్రత్యేకమైన మొక్కల రకాలు ఉంటాయి. వీటిని ‘టండ్రా వృక్షజాలం’ అని అంటారు.

ప్రశ్న 9.
“ఎస్కిమో” అంటే ఏమిటి? వారి గురించి రాయండి.
జవాబు:
“ఎస్కిమో” అంటే మంచు బూట్ల వ్యక్తి అని అర్థం. ఎస్కిమోలు అని పిలువబడే వారిలో రెండు ప్రధాన బృందాలు ఉన్నాయి. అవి ఇన్యుయిట్, యుపిక్. వాళ్ళ భాషలో ఇన్యుయిట్ అంటే ‘అసలు ప్రజలు’ అని అర్థం. సైబీరియా నుండి వచ్చిన వాళ్ళ వారసులే ఎస్కిమోలు.

ప్రశ్న 10.
‘పర్మా ఫ్రాస్ట్’ అంటే ఏమిటి?
జవాబు:
చలి కారణంగా ధృవ ప్రాంతంలోని నేలపై పొర సంవత్సరం పొడవునా రాయిలాగా శాశ్వతంగా ‘గడ్డ కట్టుకుని ఉంటుంది. దీనిని “పర్మా ఫ్రాస్ట్” అని అంటారు.

AP Board 8th Class Social Solutions Chapter 4 ధృవ ప్రాంతాలు

ప్రశ్న 11.
సమాన్లు అని ఎవరిని అంటారు?
జవాబు:
ఎస్కిమోల ఆచారాలను నిర్వహించే వారిని షమాన్లు అని అంటారు.

ప్రశ్న 12.
ఎస్కిమోలు సంబరాలు ఎప్పుడు చేసుకుంటారు?
జవాబు:
ఎస్కిమోలు సంబరాలు, జనన-మరణాల సమయంలో లేదా వేట బాగా దొరికినప్పుడు, లేదా అస్సలు దొరకనప్పుడు ప్రతి బృందం పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటారు.

ప్రశ్న 13.
వాళ్ళ ఇళ్ళ నిర్మాణాన్ని వాతావరణం ఎలా ప్రభావితం చేస్తోంది?
జవాబు:
వేసవిలో చాలా మంది ఎస్కిమోలు జంతు చర్మాలతో చేసిన గుడారాలలో నివసిస్తారు. చెక్క చట్రాల మీద జంతు చర్మాలను కప్పి గుడారాలను తయారు చేస్తారు. కొన్ని చోట్ల దుంగలు, తిమింగలపు పక్కటెముకలతో గుండ్రటి యిళ్ళు కడతారు. నేలలో చిన్న గొయ్యి తవ్వి, దాని పైన గుండ్రటి కప్పు వేసి గడ్డి కట్టిన మట్టితో కప్పుతారు. కొన్నిచోట్ల రాతి పలకలతో యిళ్ళు కడతారు. కొంతమంది పొడిమంచును దట్టించి ఇటుకల మాదిరి చేసి గుండ్రటి పైకప్పు కడతారు. మంచు బల్లలు నిర్మించి వాటిని పడకకి, బట్టలు ఆరబెట్టుకోవడానికి ఉపయోగిస్తారు. వీరు మంచుతో కప్పబడిన నేలపై ఉండటం మూలంగా వీరు స్థిర నివాసం ఏర్పరుచుకోలేరు. కాబట్టి వీరి వాతావరణం వీరి ఇళ్ళ నిర్మాణాన్ని ప్రభావితం చేస్తుందని చెప్పవచ్చును.

8th Class Social Textbook Page No.48

ప్రశ్న 14.
ఈ పాఠంలోని చిత్రాలను చూడండి. ఎస్కిమోల బట్టలలో, వేటాడే విధానాలలో ఎటువంటి మార్పులు వచ్చాయి?
జవాబు:
పురాతన కాలం వారు ముతకవి, బాగా బరువైనవి తక్కువ పదును పెట్టిన వస్త్రాలను ధరించారు. జంతువుల కొమ్ములతోనూ, బరిసెలతోను సూదిగా తయారు చేసిన వాటితోనూ, వేటాడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత కాలం వారు డిజైన్లు వేసిన దుస్తులను ధరించారు. టోపీలు కూడా అందంగా డిజైన్లు చేయబడ్డాయి. పాత ఆయుధాల స్థానంలోకి తుపాకీలు వచ్చాయని తెలుస్తోంది.

ప్రశ్న 15.
ఈ పటాన్ని పరిశీలించి వ్యాఖ్యానించండి.
AP Board 8th Class Social Solutions Chapter 4 ధృవ ప్రాంతాలు 4
జవాబు:
ఈ పటం ఉత్తర ధృవమండలాన్ని చూపిస్తోంది. దీనిపైన వృత్తాలు అక్షాంశాలను, గీతలు రేఖాంశాలను సూచిస్తున్నాయి. ఈ రేఖాంశాలు కలిసిన స్థానమే ఉత్తర ధృవం. భూమి భూమధ్యరేఖ వద్ద ఉబ్బెత్తుగానూ, ధృవాల వద్ద నొక్కబడి ఉందని తెలుస్తుంది. దీనిపై గ్రీన్లాండ్ దక్షిణ భాగాన్ని, దానికి కొంచెం పై నున్న భూభాగాన్ని పటాన్ని దాటించి చూపించారు. దీనిని నేను తప్పుగా భావిస్తున్నాను.

ప్రశ్న 16.
ఇచ్చిన చిత్రంలో మీకు ఏమైనా చెట్లు కనపడ్డాయా?
AP Board 8th Class Social Solutions Chapter 4 ధృవ ప్రాంతాలు 5
జవాబు:
లేదు. గడ్డి, చిన్న చిన్న పొదలు లాంటివి కనపడుతున్నాయి తప్ప చెట్లు కనపడటం లేదు.

ప్రశ్న 17.
బయట వాళ్ళతో ఏర్పడిన సంబంధాల కారణంగా టండ్రా ప్రాంత వాసుల జీవితాలు మెరుగయ్యాయా, పాడయ్యాయా? మీ సమాధానానికి కారణాలు పేర్కొనండి.
జవాబు:
బయట వాళ్ళతో ఏర్పడిన సంబంధాల కారణంగా టండ్రా ప్రాంత వాసుల జీవితాలు వృద్ధికి, పతనానికి గురి అయ్యాయి అని చెప్పవచ్చు.

ఎస్కిమోలు, బయటివాళ్ల మధ్య సంబంధాన్ని ‘వృద్ధి, పతనం’ అంటారు. అలలు, అలలుగా బయటనుంచి వచ్చిన వాళ్ళ వల్ల కొంతకాలం పాటు సంపద, విద్య, ఉపాధి సమకూరాయి. ఆ తరవాత పేదరికం, ఎస్కిమోలు చెల్లాచెదురు కావడం వంటి విపత్తులు పరిణమించాయి. వృద్ధి దశలు : తిమింగిలాల వేట (1859 – 1910), జంతువుల వెంట్రుకల ఆధునిక వ్యాపారం (1925 – 1950), రక్షణకై సైనిక శిబిరాల నిర్మాణం (1950ల మధ్యకాలం), పట్టణాల నిర్మాణం (1960 ల మధ్యకాలం), చమురు అన్వేషణ, అభివృద్ధి (1970లు).

పైన పేర్కొన్న ఒకొక్కదాని వల్ల ఎస్కిమోలకు భిన్న సామాజిక, ఆర్థిక శక్తులతో సంబంధాలు ఏర్పడ్డాయి. ఒకప్పుడు ఎవరూ వెళ్లటానికి వీలులేకుండా ఉన్న ఉత్తర ప్రాంతాలు ఇప్పుడు విమానయానం, జాతీయ రహదారులు, శక్తిమంతమైన ఓడలు, సాటిలైట్ ప్రసారాల కారణంగా అందరికీ అందుబాటులోకి వచ్చాయి. ఈ మార్పుల ఫలితంగా ఎస్కిమోల జీవన విధానంపై తీవ్రమైన వత్తిడి ఏర్పడింది.

ప్రశ్న 18.
ధృవ ప్రాంతంలో పూచే పూవుల చిత్రాలను, జంతువుల చిత్రాలను సేకరించి ఆల్బమ్ తయారుచేయండి.
జవాబు:
AP Board 8th Class Social Solutions Chapter 4 ధృవ ప్రాంతాలు 6

ప్రశ్న 19.
ఒక ‘ఎస్కిమోను’ ఇంటర్వ్యూ చేసి వాటి వివరాలను రాయండి.
జవాబు:
నేను : మీ పేరు

ఎ : క్రిస్టోఫర్

నేను : మీరు ఏ ప్రాంతానికి చెందినవారు?

ఎ : కెనడా ఉత్తర ప్రాంతానికి చెందినవాణ్ణి.

నేను: మీ కుటుంబంలో ఎంతమంది సభ్యులున్నారు?

ఎ : మా కుటుంబంలో రక్తసంబంధీకులం 7,8 మంది ఉన్నా, మేము దాదాపు 70మంది ఒక సమూహంగా జీవిస్తాము. అన్నీ, అందరికీ అనేది మా సమూహ నియమం.

నేను: మీకు ఈ వాతావరణం నచ్చుతుందా?

ఎ : మేము పుట్టి పెరిగింది. ఈ వాతావరణంలోనే మాకు వేరే వాతావరణం తెలియదు. ఈ మంచు, తెల్లదనం, యిక్కడి కాంతులు, జంతువులు, మా ఇళ్ళు, మా బృందాలు యివన్నీ నాకు చాలా యిష్టం.

నేను: మీరు మా ప్రాంతానికి వచ్చే అవకాశం వస్తే ఏం చేస్తారు?

ఎ : కచ్చితంగా తిరస్కరిస్తాను. ఎందుకంటే మేము ప్రకృతి ఒడిలో, ప్రకృతిని అనుసరిస్తూ జీవిస్తాము. ఎప్పుడైనా దీనిని కాదన్నవారు మాలో చాలా మంది అనేక యిబ్బందులు పడ్డారు. ఈ సమాజంలో మేము జీవించలేము అన్నది నిజం. కాబట్టి నేను తిరస్కరిస్తాను.

నేను : కృతజ్ఞతలు.

ఎ : కృతజ్ఞతలు.

AP Board 8th Class Social Solutions Chapter 4 ధృవ ప్రాంతాలు

ప్రశ్న 20.
క్రింద నీయబడిన పేరాను చదివి, ప్రశ్నలకు సమాధానములిమ్ము.

గ్లోబుమీద ఉత్తర ధృవం, దక్షిణ ధృవాలను చూశారు. ధృవాల దగ్గర ఉండే ప్రాంతాన్ని ‘ధృవ ప్రాంతం’ అంటారు. ఈ అధ్యాయంలో మీరు ఉత్తర ధృవ ప్రాంతం గురించి తెలుసుకుంటారు. ఇది ఉత్తర ధృవం, దాని చుట్టుపక్కల ప్రాంతాన్ని చూపిస్తుంది. ధృవప్రాంతం వేరే రంగులో చూపబడి ఉంది. ఈ ప్రాంత సరిహద్దును గమనించండి. దీనిని ‘ఆ టిక్ వృత్తం’ అంటారు.. ధృవ ప్రాంతంలో ఉన్న ఖండాల ఉత్తర భాగాలను టండ్రా ప్రాంతం అంటారు. టం అంటే చాలా చలిగా ఉండే ప్రాంతం అని అర్థం. టండ్రా ప్రాంతంలో చాలా తక్కువ సూర్యకాంతి పడుతుంది. కాబట్టి ఇక్కడ ప్రత్యేకమైన మొక్కల రకాలు ఉంటాయి. వీటిని ‘టండ్రా వృక్షజాలం’ అంటారు.

1. ధృవ ప్రాంతం అని దేనిని అంటారు?
జవాబు:
ధృవాల దగ్గర ఉండే ప్రాంతాన్ని ‘ధృవ ప్రాంతం’ అంటారు.

2. ఈ ప్రాంత సరిహద్దును ఏమంటారు?
జవాబు:
ఈ ప్రాంత సరిహద్దును ‘ఆర్కిటిక్ వృత్తం’ అంటారు.

3. టండ్రా ప్రాంతం అని దేనిని అంటారు?
జవాబు:
ధృవ ప్రాంతంలో ఉన్న ఖండాల ఉత్తర భాగాలను టండ్రా ప్రాంతం అంటారు.

4. టండ్రా అంటే అర్థం ఏమిటి?
జవాబు:
టండ్రా అంటే చాలా చలిగా ఉండే ప్రాంతం అని అర్థం.

5. టండ్రా వృక్షజాలం అని దేనిని అంటారు?
జవాబు:
టండ్రా ప్రాంతంలో చాలా తక్కువ సూర్యకాంతి పడుతుంది. కాబట్టి ఇక్కడ ప్రత్యేకమైన మొక్కల రకాలు ఉంటాయి. వీటిని ‘టండ్రా వృక్షజాలం’ అంటారు.

ప్రశ్న 21.
క్రింది పేరాను చదివి దిగువ నీయబడిన ప్రశ్నలకు సమాధానమునిమ్ము.
జవాబు:
మతపరమైన నమ్మకాలు :

జీవితం, ఆరోగ్యం , రోగాలు, ఆకలి, మరణాల పట్ల ఎస్కిమోల మతం ప్రత్యేక ఆసక్తి చూపిస్తుంది. వీటన్నింటినీ ఆత్మలు నియంత్రిస్తాయని ఎస్కిమోలు నమ్ముతారు. అన్ని ఎస్కిమో బృందాలు శిల అనే అతీత శక్తిని, ఆత్మలను (జీవనం, ఆరోగ్యం , ఆహార దేవత అయిన సెడ్నా వంటి దేవతలు) నమ్ముతాయి. మనుషులు, జంతువుల ఆత్మలు చనిపోయిన తరవాత కూడా జీవించి ఉంటాయని వాళ్లు నమ్ముతారు. అయితే ప్రతి బృందానికి తమదైన నమ్మకాలు, సంప్రదాయాలు ఉంటాయి. ప్రతి వ్యక్తి, కుటుంబం లేదా బృందానికి ఒక ‘నిషిధమైనది’ (టాబూ) ఉంటుంది. దీని ప్రకారం వాళ్లు ఫలానా ఆహారం తినకూడదు వంటి ఆచారాలు ఉంటాయి. జననం, మరణాల సమయంలో లేదా వేట బాగా దొరికినప్పుడు, లేదా అస్సలు దొరకనప్పుడు ప్రతిబ్బందం పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటాయి. ఈ ఆచారాలను నిర్వహించే వారిని షమాన్లు అంటారు. ఆత్మల ప్రపంచంతో అనుసంధానానికి ఈ షమాన్లు సహాయం చేస్తారని నమ్ముతారు. తమ ఆచారాలలో మాయాజాలాన్ని, నాటకీయతను, అచేతనను షమాన్లు ఉపయోగిస్తారు.

1. ఎస్కిమోల మతం వేటిపట్ల ఆసక్తి చూపుతుంది?
జవాబు:
జీవితం, ఆరోగ్యం , రోగాలు, ఆకలి, మరణాల పట్ల ఎస్కిమోల మతం ప్రత్యేక ఆసక్తి చూపిస్తుంది.

2. అందరు ఎస్కిమోలు వేటిని నమ్ముతారు?
జవాబు:
అన్ని ఎస్కిమో బృందాలు శిల అనే అతీత శక్తిని, ఆత్మలను (జీవనం, ఆరోగ్యం , ఆహార దేవత అయిన సెడ్నా వంటి దేవతలు) నమ్ముతాయి. మనుషులు, జంతువుల ఆత్మలు చనిపోయిన తరవాత కూడా జీవించి ఉంటాయని వాళ్లు నమ్ముతారు.

3. ‘టాబూ’ అంటే ఏమిటి?
జవాబు:
‘టాబూ’ అంటే నిషిద్ధమైనది అని అర్థం.

4. వీరు సంబరాలు ఎప్పుడు చేసుకుంటారు?
జవాబు:
జననం, మరణాల సమయంలో లేదా వేట బాగా దొరికినప్పుడు, లేదా అస్సలు దొరకనప్పుడు ప్రతి బృందం పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటాయి.

5. షమాన్లు ఏమి చేస్తారు?
జవాబు:
తమ ఆచారాలలో మాయాజాలాన్ని, నాటకీయతను, అచేతనను షమాన్లు ఉపయోగిస్తారు.

పట నైపుణ్యాలు

ప్రశ్న 22.
ఈ క్రింద నీయబడిన ప్రపంచపటంలో ధృవ ప్రాంతంలో ఏవేని 5 దేశాలను గుర్తించుము.
జవాబు:
AP Board 8th Class Social Solutions Chapter 4 ధృవ ప్రాంతాలు 8

ప్రశ్న 23.
గ్లోబు నమూనాను గీచి, ఆర్కిటిక్ వలయాన్ని, రెండు ధృవాలను, భూమధ్యరేఖను గీచి చూపించుము.
జవాబు:
AP Board 8th Class Social Solutions Chapter 4 ధృవ ప్రాంతాలు 9

ప్రశ్న 24.
ఎస్కిమోల సామూహిక జీవనాన్ని ప్రశంసించండి.
జవాబు:
ఎస్కిమోలు బృందాలుగా జీవిస్తారు. వీరు సామూహికంగా సంచారం చేస్తూ జీవనం గడుపుతారు. వేట, వంట, ఆవాసం, నివాసం, కష్టం, సుఖం, దుఃఖం అన్నీ కలిసే పంచుకుంటారు. నేటి నాగరిక సమాజాలలో లేని ఐకమత్యం వీరిలో నేటికీ జీవించి ఉండటం నిజంగా ప్రశంసించదగిన అంశం.

ప్రశ్న 25.
ధృవ ప్రాంత సరిహద్దును ఏమంటారు?
జవాబు:
ధృవ ప్రాంత సరిహద్దును ‘ఆర్కిటిక్ వృత్తం’ అంటారు.

ప్రశ్న 26.
దిగ్మండలం అంటే ఏమిటి?
జవాబు:
భూమి, ఆకాశం కలసినట్టు అనిపించే ప్రదేశాన్ని క్షితిజం లేదా దిగ్మండలం అంటారు.

ప్రశ్న 27.
‘ఐర్స్’ అంటే ఏమిటి?
జవాబు:
పెద్ద పెద్ద మంచుగడ్డలు విడిపోయి నీటిలో తేలుతూ సముద్రంలోకి ప్రవేశిస్తాయి.. వీటిని ‘ఐస్ బెర్స్’ అంటారు.

ప్రశ్న 28.
ఎస్కిమోల ప్రధాన భాషలు ఏవి?
జవాబు:
ఎస్కిమోల ప్రధాన భాషలు 3. అవి : అల్యుయిట్, యుపిక్, ఇన్యుపిక్.

AP Board 8th Class Social Solutions Chapter 4 ధృవ ప్రాంతాలు

ప్రశ్న 29.
పర్కాలు అంటే ఏమిటి?
జవాబు:
ఎస్కిమోలు ముకులనే బూట్లు, ప్యాంట్లు, తలను కట్టే టోపీ ఉండే కోట్లు మొ||న వాటిని ప్కలు అంటారు.

ప్రశ్న 30.
ఎస్కిమోలు మొట్టమొదటి సారిగా చూసినదెవరు?
జవాబు:
ఎస్కిమోలు మొట్టమొదట చూసిన బయటివాళ్ళు ఐలాండ్ నుండి వచ్చి గ్రీన్లాండ్ లో నివాసం ఏర్పరుచుకున్న వైకింగ్లు.

AP Board 8th Class Social Solutions Chapter 3 భూ చలనాలు – రుతువులు

SCERT AP 8th Class Social Study Material Pdf 3rd Lesson భూ చలనాలు – రుతువులు Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Social Solutions 3rd Lesson భూ చలనాలు – రుతువులు

8th Class Social Studies 3rd Lesson భూ చలనాలు – రుతువులు Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
మీ ప్రాంతంలో పండించే పంటలకు, కాలాలకు మధ్య సంబంధం ఏదైనా ఉందా? పెద్దవాళ్ల తోటి, మిత్రుల తోటి చర్చించి దీని మీద చిన్న వ్యాసం రాయండి. (AS4)
జవాబు:
మాది తూర్పు గోదావరి జిల్లాలోని “అంతర్వేదిపాలెం” అనే చిన్న గ్రామం. మా ప్రాంతంలో రైతులు మూడు పంటలు పండిస్తారు. ఋతుపవనాల కాలంలో వరి, జొన్న మొదలైన పంటలు పండిస్తారు. ఈ కాలం అక్టోబరు, నవంబరు నెలల వరకు ఉంటుంది. తరువాత నుండి అనగా శీతాకాలం నుండి రబీ పంట పండిస్తారు. దీనిలో కూడా కొందరు వరిని, కొందరు మినుము, పెసర, కందులు మొదలైన వాటిని పండిస్తారు. ఇది వేసవికాలం వరకు ఉంటుంది. దీని తరువాత ఖరీఫ్ మొదలయ్యే లోపు కూరగాయలు, పండ్లు పండిస్తారు. ఇంతేకాక సంవత్సరం పొడుగునా కొబ్బరిచెట్లు దిగుబడినిస్తాయి. ఈ కారణాల రీత్యా పంటలకు, కాలాలకు మధ్య సంబంధం ఉంది అని నేను భావిస్తున్నాను.

ప్రశ్న 2.
శీతాకాలంలో ఆంధ్రప్రదేశ్ మంచు కురవకపోవటానికి కారణం ఏమిటి? (AS1)
జవాబు:
గాలిలో ఉన్న నీరు గడ్డ కట్టాలంటే అక్కడ 0°C ఉష్ణోగ్రత లేదా ఇంకా తక్కువ ఉష్ణోగ్రత ఉండాలి. అప్పుడే ఆ నీరు గడ్డ కట్టి మంచుగా మారి కురుస్తుంది. కాని ఆంధ్రప్రదేశ్ 16.5° ఉత్తర అక్షాంశం నుండి 22°C- 25°C ఉత్తర అక్షాంశం మధ్యన (సుమారుగా) వ్యాపించి ఉన్నది. అంటే ఉష్ణమండల ప్రాంతంలో ఉంది. ఇక్కడ శీతాకాలంలో కూడా 15°C నుండి 30°C వరకు ఉష్ణోగ్రత ఉంటుంది. ఈ పరిస్థితులలో నీరు మంచుగా మారలేదు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో శీతాకాలంలో మంచు కురవదు.

AP Board 8th Class Social Solutions Chapter 3 భూ చలనాలు - రుతువులు

ప్రశ్న 3.
మనకు వానాకాలం ఉంది. భూమి పరిభ్రమణానికీ, సూర్యుని కిరణాలు పడే తీరుకీ, వానాకాలానికీ మధ్య సంబంధం ఏమిటి? వానలు వేసవిలో పడతాయా, లేక శీతాకాలంలోనా, లేక రెండింటికీ మధ్యలోనా? (AS1)
జవాబు:
భూపరిభ్రమణం వలన కాలాలు, సూర్య కిరణాలు పడే తీరు వలన కాలాల్లో మార్పులు సంభవిస్తాయి. మనకి ఎండా కాలం వచ్చినపుడు ఇక్కడి ప్రాంతం మీద, సూర్యకిరణాలు నిట్టనిలువుగా పడతాయి. అప్పుడు ఈ ప్రాంతంలోని గాలి వేడెక్కి పైకిపోతుంది. ఇందుమూలంగా ఇక్కడ వేసవికాలంలో అల్పపీడనం ఏర్పడుతుంది. అప్పుడు హిందూ మహాసముద్రం మీద అధిక పీడన ప్రాంతం నుండి ఇక్కడకు గాలులు వీచి (ఋతుపవన) వర్షాన్నిస్తాయి. అంటే వేసవికాలం తరువాత వానలు పడతాయి. మరలా శీతాకాలం మొదట్లో ఈ ఋతుపవనాలు వెనక్కి తిరిగి వచ్చేటప్పుడు వర్షాన్నిస్తాయి.

ప్రశ్న 4.
మీ ప్రాంతంలో వివిధ నెలల్లో సూర్యోదయ, సూర్యాస్తమయ సమయాల సమాచారం సేకరించండి. (స్థానిక దినపత్రికల ద్వారా ఈ విషయం తెలుస్తుంది), ప్రతిరోజూ పగటి కాలం, రాత్రి కాలం ఎంతో అన్ని నెలలకూ లెక్కకట్టండి. దీంట్లో ఏమైనా ఒక పద్దతి కనపడుతోందా? (AS3)
జవాబు:
నేను సూర్యోదయ, సూర్యాస్తమయాలకు ఎంతో ప్రాముఖ్యమున్న కన్యాకుమారి, తమిళనాడుని ఈ ప్రాజెక్టుకు ఎంచుకున్నాను. ప్రతి నెలా మొదటి తేదీన సూర్యోదయ, సూర్యాస్తమయ వివరాలను సేకరించాను.
AP Board 8th Class Social Solutions Chapter 3 భూ చలనాలు - రుతువులు 1

ఈ పట్టికను పరిశీలించిన తరువాత ఆగస్టు నెల నుండి జనవరి వరకు పగటి కాలం తగ్గుతూ వచ్చింది. ఫిబ్రవరి నుండి జులై వరకు పెరుగుతూ వచ్చింది.

ఆగస్టు నుండి జనవరి వరకు రాత్రి పొద్దు ఎక్కువ.
ఫిబ్రవరి నుండి జులై వరకు పగటి పొద్దు ఎక్కువ.

ప్రశ్న 5.
భూ భ్రమణం గురించి మీ తల్లిదండ్రులకు లేదా తమ్ముడు, చెల్లెలికి వివరించండి. వాళ్లకు వచ్చిన అనుమానాలు, ప్రశ్నలు రాసుకోండి.
జవాబు:
భూ భ్రమణం గురించి నా తమ్ముడు, చెల్లెకి వివరించాను. వారు నన్ను ఈ క్రింది ప్రశ్నలు అడిగారు.

  1. భూమి అసలు ఎందుకు తిరుగుతుంది?
  2. భూమి ఎంత వేగంతో తిరుగుతుంది?
  3. భూమి తిరుగుతున్నట్లు మనకెందుకు తెలియటంలేదు?
  4. భూమి తిరుగుతోందని మనం ఎలా నిరూపించగలము?
  5. భూమి అక్షం ఎందుకు వంగి ఉంది?
  6. భూమి భ్రమించకపోతే ఏమి జరుగుతుంది? భూమిని ఎవరైనా తిప్పుతున్నారా?

ప్రశ్న 6.
భూమి తన చుట్టూ తాను తిరగకుండా, ఒక సంవత్సర కాలంలో సూర్యుడి చుట్టూ తిరుగుతోందని ఊహించుకోండి. దీని వల్ల వేరు వేరు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు, కాలాల్లో ఎటువంటి మార్పు ఉంటుంది? (AS4)
జవాబు:
భూమి తన చుట్టూ తాను తిరగకపోతే సూర్యునికి ఎదురుగా ఉన్న భాగానికి ఎల్లప్పుడు కాంతి, వేడిమి లభిస్తాయి. మిగిలిన భాగం చీకటిలో, చలిగా ఉండిపోతుంది. సూర్యుని వైపు ఉన్న భాగం చాలా వేడెక్కిపోతుంది. ఈ పరిస్థితులలో భూమిపై జీవం ఉనికి దెబ్బ తింటుంది.

ప్రశ్న 7.
ఉత్తరార్ధ, దక్షిణార్ధ గోళాల్లోని సమశీతోష్ణ మండలంలో ఒక్కొక్క దేశాన్ని గుర్తించండి. ఆ దేశాలలోని కాలాలను మీ ప్రాంతపు కాలాలతో పోల్చండి. మే-జూన్ నెలల్లో ఏ ప్రాంతం వేడిగా ఉంటుంది. డిసెంబరు – జనవరి నెలల్లో లేదా మార్చి సెప్టెంబరు నెలల్లో ఏ ప్రాంతం చలిగా ఉంటుంది? (AS5)
జవాబు:
నేను ఈ ప్రాజెక్టుకు ఉత్తర సమశీతోష్ణ మండలంలోని రష్యాను, దక్షిణ సమశీతోష్ణ మండలంలోని ఫాలాండ్ దీవులను ఎంచుకున్నాను.

రష్యాలోని మాస్కో:
ఈ ప్రాంతం 55.7517° ఉత్తర అక్షాంశం వద్ద ఉన్నది. ఇక్కడి ఉష్ణోగ్రతలు :
AP Board 8th Class Social Solutions Chapter 3 భూ చలనాలు - రుతువులు 2

ఫా లాండ్ దీవులు :
ఈ ప్రాంతం 51° దక్షిణ అక్షాంశం నుండి 52°ల దక్షిణ అక్షాంశం వరకు వ్యాపించి ఉంది.
AP Board 8th Class Social Solutions Chapter 3 భూ చలనాలు - రుతువులు 3

ఉత్తర సమశీతోష్ణ మండలంలో వేసవికాలంలో దక్షిణ ప్రాంతంలో శీతాకాలం ఉన్నది. ఉత్తరాన శీతాకాలం ఉన్నప్పుడు, దక్షిణాన వేసవికాలం ఉన్నది.

మా ప్రాంతం దక్షిణ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ. ఈ ప్రాంతం 16.5200° ఉత్తర అక్షాంశం దగ్గర ఉన్నది. ఇక్కడ ఏప్రిల్, మే నెలలలో అత్యధిక ఉష్ణంతో వేసవికాలం, డిసెంబరు, జనవరి నెలలలో శీతాకాలం ఏర్పడతాయి. ఇక్కడ ఆ ప్రాంతాల వేసవి ఉష్ణోగ్రతల కన్నా వేసవికాలంలోనూ, శీతాకాలంలోనూ అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయి. అయితే ఈ ప్రాంతాలు మూడింటిలోనూ కాలాలు హెచ్చు తగ్గులతో ఒకే విధంగా ఉన్నాయి.

ప్రశ్న 8.
భారతదేశంలోని ఆరు రుతువులు ఏమిటి? (AS1)
జవాబు:
భారతదేశంలోని ఆరు రుతువులు :

  1. వసంత రుతువు – మార్చి మధ్య నుండి మే మధ్య వరకు.
  2. గ్రీష్మ రుతువు – మే మధ్య నుండి జులై మధ్య వరకు.
  3. వర్ష రుతువు – జులై మధ్య నుండి సెప్టెంబరు మధ్య వరకు.
  4. శరదృతువు – సెప్టెంబరు మధ్య నుండి నవంబరు మధ్య వరకు.
  5. హేమంత రుతువు – నవంబరు మధ్య నుండి జనవరి మధ్య వరకు.
  6. శిశిర రుతువు – జనవరి మధ్య నుండి మార్చి మధ్య వరకు.

AP Board 8th Class Social Solutions Chapter 3 భూ చలనాలు - రుతువులు

ప్రశ్న 9.
ఈ పాఠంలోని మొదటి పేరాగ్రాఫ్ చదివి, కింది ప్రశ్నకు జవాబు రాయండి. అనేక చెట్లు, జంతువులతో కలిసి మనుషులు సహజీవనం చేస్తున్నారు.

కాలం గడుస్తున్న క్రమంలో మన పరిసరాల్లో నిరంతరం మార్పులు గమనిస్తూ ఉంటాం. మొక్కలు, చెట్లు పూలు పూస్తాయి. కాయలు కాస్తాయి. జంతువుల ప్రవర్తనలో మార్పు ఉంటుంది. నెలలు గడుస్తున్న కొద్దీ చెట్లు ఆకులను రాల్చటం గమనించి ఉంటారు. కొంతకాలం బోసిగా ఉండి చెట్లు కొత్త చిగుళ్లు తొడుగుతాయి. మళ్లీ పూలు పూస్తాయి. కాయలు కాస్తాయి. అదేవిధంగా సంవత్సరంలోని వివిధ కాలాల్లో వేరు వేరు రకాల పళ్లు, కూరగాయలు రావటం గమనించి ఉంటారు. కొన్ని నెలల్లో చాలా వేడిగా ఉంటుంది. మరి కొన్ని నెలల్లో చాలా చలిగా లేదా వానలు పడుతూ ఉంటుంది.
మానవ జీవితాన్ని రుతువులు ఎలా ప్రభావితం చేస్తాయి? (AS2)
జవాబు:
కాలంతోపాటు మనుషులు, జంతువుల ప్రవర్తనలోనూ, చెట్లలోను మార్పులు ఉంటాయి. ఉదా : ఎండాకాలంలో మనుషులు పల్చటి నేత వస్త్రాలు ధరిస్తారు. చలికాలంలో మందపాటి, ఊలు దుస్తులు ధరిస్తారు. చలికాలంలో చెట్టు ఆకులు రాలిస్తే, వర్షాకాలంలో పూస్తాయి, కాస్తాయి. ఆవులు వర్షంలో తడవడానికి ఇష్టపడవు. వేసవికాలంలో అధిక ఉష్టాన్ని భరించలేవు. ఈ విధంగా రుతువులు మానవ జీవితాన్ని ప్రభావితం చేస్తాయి.

8th Class Social Studies 3rd Lesson భూ చలనాలు – రుతువులు InText Questions and Answers

8th Class Social Textbook Page No.33

ప్రశ్న 1.
మీరు గమనించిన ముఖ్యమైన కాలాలు, సంబంధాలు పోల్చండి.
జవాబు:
నేను గమనించిన ముఖ్యమైన కాలాలు ఎండాకాలం, వానాకాలం మరియు చలికాలం. ఎండాకాలం చాలా వేడిగా ఉంటుంది. వానాకాలం వానలు కురుస్తాయి. చలికాలంలో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయి.

ప్రశ్న 2.
ప్రతి కాలంలో ఏం జరుగుతుందో వివరించండి – ఎంత వేడెక్కుతుంది, ఎంత వాన పడుతుంది, మొక్కలు, చెట్లు, . పశువులకు ఏమవుతుంది, తినటానికి ఏమి ఆహారం దొరుకుతుంది?
జవాబు:
ఎండాకాలం :
వాతావరణం చాలా వేడిగా (45°C వరకు) ఉంటుంది. ఈ కాలం చివరిలో అప్పుడప్పుడు జల్లులు పడతాయి. మొక్కలు, చెట్లు, మనుషులు, పశువులు కూడా నీడకి, చల్లదనానికి, ఆహారానికి, నీటికి అల్లాడుతారు. ఈ కాలంలో ప్రత్యేకించి పుచ్చకాయలు, మామిడిపళ్ళు, తాటిముంజలు దొరుకుతాయి.

వానాకాలం :
ఈ కాలంలో వర్షాలు ఎక్కువగా కురుస్తాయి. వేడి మాత్రం 35°C వరకు ఉంటుంది. మొక్కలు, చెట్లు . పచ్చగా కళకళలాడతాయి. పశువులు మేయడానికి పసిరిక దొరుకుతుంది. అవి కూడా పాలు ఎక్కువ ఇస్తాయి. చాలా రకాల కూరగాయలు, పుట్టగొడుగులు బాగా దొరుకుతాయి.

చలికాలం :
ఈ కాలంలో చలి ఎక్కువగా ఉంటుంది. వేడి 30°C వరకు ఉన్నా రాత్రిళ్ళు ఎక్కువ చలి ఉంటుంది. మొక్కలు, చెట్లు పూత తగ్గిపోతాయి. పశువులు కూడా వెచ్చదనం కోసం వెతుక్కుంటాయి. కాలిఫ్లవర్, టమాటా, ద్రాక్ష వంటివి ఎక్కువగా దొరుకుతాయి.

ప్రశ్న 3.
ప్రక్క చిత్రంలోని చెట్లను గమనించండి.
చిత్రాల్లో ఉన్నది ఒకే చెట్టా లేక వేరువేరు చెట్లా?
AP Board 8th Class Social Solutions Chapter 3 భూ చలనాలు - రుతువులు 4
జవాబు:
చిత్రాల్లో ఉన్నది ఒకే చెట్టు.

ప్రశ్న 4.
ఈ చెట్లలో ఏమి తేడాలు గమనించారు?
జవాబు:

  1. మొదటి చెట్టు మంచుతో నిండి ఉంది.
  2. రెండవది పెద్ద ఆకులతో ఉంది.
  3. మూడవది చిగురులు తొడుగుతోంది.
  4. నాల్గవది ఆకులు రాలుస్తోంది.

ప్రశ్న 5.
కాలాలు భిన్నంగా ఉండే దూరప్రాంతాల నుంచి వచ్చిన వారు ఎవరైనా మీ తరగతిలో ఉన్నారా ? అక్కడ ఏం జరుగుతుందో వాళ్లను వివరించమనండి.
జవాబు:
మా తరగతిలో ‘అచ్యుత్’ అనే విద్యార్థి డెహ్రాడూన్ నుండి వచ్చి చదువుకుంటున్నాడు. ఇక్కడ తన తాత, అమ్మమ్మల దగ్గర ఉంటున్నాడు. వాళ్ళ నాన్న, అమ్మ డెహ్రాడూన్లో ఉంటారు. అక్కడ కాలాలు మన ‘కన్నా చాలా భిన్నంగా ఉంటాయట. చలికాలం చాలా తీవ్రంగా ఉంటుందంట. అతనేం చెబుతాడో విందాము.

“నా పేరు అచ్యుత్, నేను హిమాలయాల పాదాల చెంత డెహ్రాడూన్లో ఉండేవాణ్ణి. అక్కడ ఎండాకాలం కొంచెం చెమటగా ఉండేది. ఎండ ఇక్కడి మీద కొద్ది తక్కువ. వానాకాలం వర్షాలు చాలా ఎక్కువగా పడతాయి. ఎంత పడినా కొండల్లో వర్షం తెలిసేది కాదు. కాని చెట్ల ఆకులన్నీ నీటి బొట్లతో కళకళలాడేవి.

ఇక చలికాలానికి వస్తే, అమ్మో ! చాలా చలి. ఏ పనికైనా వేడి నీళ్ళే వాడాల్సి వస్తుంది. మంచినీళ్ళు కూడా వేడిగానే తాగుతాం. పొద్దున్న 7/8 అయితే గాని వెలుతురు సరిగా ఉండదు. వంటి మీద ఇన్నర్లు, డ్రస్సులు, స్వెట్టర్లు, మఫ్లర్లు, టోపీలు, సాక్స్, గ్లోవ్స్ అన్నీ కచ్చితంగా ధరించాల్సిందే. కాని మా ప్రదేశం చూడటానికి చాలా అందంగా ఉంటుంది.”

8th Class Social Textbook Page No.34

ప్రశ్న 6.
భూమధ్యరేఖకు మొత్తం ఉత్తరాన ఉన్న ఖండం ఏదైనా మీకు కనిపించిందా?
జవాబు:
కనిపించాయి. ఐరోపా, ఉత్తర అమెరికా.

AP Board 8th Class Social Solutions Chapter 3 భూ చలనాలు - రుతువులు

ప్రశ్న 7.
భూమధ్యరేఖకు మొత్తం దక్షిణాన ఉన్న ఖండం ఏదైనా మీకు కనిపించిందా?
జవాబు:
కనిపించింది. అది ఆస్ట్రేలియా ఖండం

ప్రశ్న 8.
భూమధ్యరేఖకు ఉత్తరాన, దక్షిణాన విస్తరించిన ఖండం ఏదైనా మీకు కనిపించిందా?
జవాబు:
కనిపించింది. అది ఆసియా ఖండం

ప్రశ్న 9.
“అర్థరాత్రి సూర్యుడు ఉదయించే దేశం” అని ఏ దేశాన్ని అంటారో తెలుసుకుని దానిని గ్లోబు మీద గుర్తించండి. దాని రేఖాంశం తెలుసుకుని, ఆంధ్రప్రదేశ్ రేఖాంశంతో పోల్చండి.
జవాబు:
“అర్ధరాత్రి సూర్యుడు ఉదయించే దేశం” అనటం కన్నా ‘అర్ధరాత్రి సూర్యుడి ప్రాంతం’ అనటం సమంజసంగా ఉంటుంది. ఎందుకంటే ఉత్తర ధృవం దగ్గర ఉన్న దేశాలన్నింటిలో ఇదే పరిస్థితి నెలకొని ఉంటుంది. డెన్మార్క్ ఫిలాండ్, యూకన్ మరియు వాయవ్య ప్రాంతాలు నూనావత్ తో కలిపి కెనడా, ఐర్లాండ్, లావ్లాండ్, నార్వే, రష్యా, స్వీడన్, ఉత్తర అమెరికాలోని అలాస్కా – ఇవన్నీ కూడా ‘అర్ధరాత్రి సూర్యుడు ఉదయించే దేశాలే.’ ఆంధ్రప్రదేశ్ 80° తూర్పు రేఖాంశం వద్ద ఉన్నది.
నార్వే : 5.3400° తూర్పు రేఖాంశం
స్వీడన్ : 15.7591° తూర్పు రేఖాంశం
ఐర్లాండ్ : 18.9720° తూర్పు రేఖాంశం
లాటౌండ్ : 23.25° తూర్పు రేఖాంశం నుండి 26.65° తూర్పు రేఖాంశం వరకు
డెన్మార్క్ : 12.5700 తూర్పు రేఖాంశం
ఫిలాండ్ : 24.7271° తూర్పు రేఖాంశం
అలాస్కా : 148.5569° పశ్చిమ రేఖాంశం
రష్యా : 55.0423° తూర్పు రేఖాంశం
యూకాన్ : 135.7667° పశ్చిమ రేఖాంశం
కెనడా : 86.4196° పశ్చిమ రేఖాంశం మొదలగునవి.

గ్లోబు మీద ఈ దేశాలను వ్యక్తిగతంగా గుర్తించండి.

ప్రశ్న 10.
గ్లోబును చూసి భూమధ్యరేఖకు దక్షిణాన ఉన్న దేశాలను గుర్తించండి.
జవాబు:
ఆస్ట్రేలియా, దక్షిణ ఆఫ్రికా, చిలీలను గ్లోబుపై వ్యక్తిగతంగా గుర్తించండి.

ఆసియా : ఇండోనేషియా, తూర్పు టైమర్, మాల్దీవులలో కొంతభాగం.

ఆఫ్రికా : అంగోలా, బోట్స్వా నా, బురుండి మొ||నవి.

యూరప్ : ఏమీ లేవు.

ఉత్తర అమెరికా : ఏమీ లేవు

దక్షిణ అమెరికా : అర్జెంటీనా, చిలీ, బొలీవియా

ఆస్ట్రేలియా : ఆస్ట్రేలియా, న్యూగినియా

ప్రశ్న 11.
కాలాల మాయాజాలానికి సంబంధించి ప్రతి ఒక్కరూ ,మూడు ప్రశ్నలు రాయండి. వాటికి సమాధానాలు కనుక్కోటానికి ప్రయత్నిద్దాం.
1) కాలాలు ఏర్పడటానికి గల కారణమేమి?
జవాబు:
భూమి యొక్క అక్షం ఒంగి ఉండటము, భూపరిభ్రమణము దీనికి కారణము.

2) కాలాలు లేకపోతే ఏమవుతుంది?
జవాబు:
భూమి మీద జీవం అంతరించిపోతుంది.

8th Class Social Textbook Page No.37

ప్రశ్న 12.
సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతోంది కానీ అక్షం వంగిలేదని ఊహించుకోండి. ఆంధ్రప్రదేశ్ కాలాల్లో మార్పులను అది ఏ రకంగా ప్రభావితం చేస్తుంది?
ఇది ఈ పాఠం ప్రారంభంలో చూసిన చిత్రాల ఉత్తర ప్రాంతంలో కాలాల మార్పులను ఏ రకంగా ప్రభావితం చేస్తుంది?
జవాబు:
భూమి యొక్క అక్షం వంగి వుండకపోతే ఈ కింది విధంగా జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ఉష్ణమండలంలో ఉన్నది. కాబట్టి సూర్యకిరణాలు నిట్టనిలువుగా పడతాయి. అక్షం వంగి ఉండకపోవటం మూలంగా సంవత్సరమంతా ఇదే విధంగా ఉంటుంది. అందువలన ఆంధ్రప్రదేశ్ లో సంవత్సరమంతా వేసవికాలమే ఉంటుంది. ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. వర్షాకాలం, శీతాకాలం తమ సమయాలను మార్చుకుంటాయి లేదా అసలు ఉండకపోవచ్చు. దాదాపుగా వేసవికాలం, వర్షాకాలం, శీతాకాలం ఒకే రోజులో రావడానికి అవకాశం ఉండవచ్చు లేదా అసలు ఉండకపోవచ్చు.

పాఠం ప్రారంభంలో చూసిన చిత్రాలు ఉత్తర ప్రాంతంలో ఒక్కో కాలంలో, ఒక్కోలా ఉన్నాయి. భూమి అక్షం ఒంగి ఉండనట్లయితే, అక్కడ ఎప్పుడూ చలి, గడ్డ కట్టిన మంచుతో కప్పబడి ఉండేది. అటువంటప్పుడు అక్కడ పొదలు, గడ్డి , తప్ప వృక్షాలు పెరిగే అవకాశమే ఉండదు.

8th Class Social Textbook Page No.38

ప్రశ్న 13.
ఏ నెలలోనైనా సూర్యుడి కిరణాలు ఆంధ్రప్రదేశ్ లో నిటారుగా పడతాయా? పడితే, ఏ నెలలో?
జవాబు:
పడతాయి. ఆంధ్రప్రదేశ్ లో సూర్యుని కిరణాలు మే నెలలో దాదాపు నిటారుగా పడతాయి.

AP Board 8th Class Social Solutions Chapter 3 భూ చలనాలు - రుతువులు

ప్రశ్న 14.
భూమి యొక్క అక్షంను మనం ఎక్కడ నుండి చూడవచ్చు?
జవాబు:
భూమి యొక్క అక్షం ఒక ఊహా జనితరేఖ. దీనిని మనం కంటితో చూడలేము.

ప్రశ్న 15.
భూమి యొక్క అక్షంను మనం ఎక్కడ నుండి చూడవచ్చు?
జవాబు:
చూడలేము. ఎందుకంటే భూమి యొక్క అక్షం ఒక ఊహాజనిత రేఖ. దీనిని మనం కంటితో చూడలేము.

ప్రశ్న 16.
ఆంధ్రప్రదేశ్ ఉష్ణమండలంలో ఉందో, సమశీతోష్ణ మండలంలో ఉందో తెలుసుకోంది.
జవాబు:
ఆంధ్రప్రదేశ్ సుమారుగా 12° ఉత్తర అక్షాంశం నుండి 19° ఉత్తర అక్షాంశం మధ్యలో వ్యాపించి ఉన్నది. అంటే ఇది ఉష్ణమండల ప్రాంతంలో ఉన్నది.

ప్రశ్న 17.
ఢిల్లీ ఏ మండలంలో ఉందో తెలుసుకుని, శీతాకాలంలో అక్కడ మంచు కురుస్తుందేమో తెలుసుకోండి.
జవాబు:
ఢిల్లీ 28°22″ ఉత్తర అక్షాంశం నుండి 28°54″ ఉత్తర అక్షాంశం వరకు వ్యాపించి ఉన్నది. అంటే ఢిల్లీ సమశీతోష్ణ మండలంలో ఉన్నది. ఇక్కడ శీతాకాలం తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయి కానీ మంచు కురవదు.

ప్రశ్న 18.
భూమి రోజూ ఎంతో వేగంతో తిరుగుతున్నది. కానీ ఆ విషయం భూమిపై నున్న మనకు ఎందుకు తెలియటం లేదు?
జవాబు:
భూమి, భూమిపై నున్న మనుషులు, ఇళ్ళు, చెట్లు, జంతువులు, భూమిని ఆవరించియున్న వాతావరణము, అన్నిటితో సహా తిరుగుచున్నది. అందువలన ఈ విషయం మనకు తెలియటం లేదు.

పట నైపుణ్యాలు

ప్రశ్న 19.
భూమధ్యరేఖ, కర్కటరేఖ, మకరరేఖ, ఆర్కిటిక్, అంటార్కిటిక్ వలయాలను గీచి చూపండి.
జవాబు:
AP Board 8th Class Social Solutions Chapter 3 భూ చలనాలు - రుతువులు 5

ప్రశ్న 20.
భూమి మీద మూడు ఉష్ణోగ్రతా మండలాలను చిత్రించి చూపండి.
జవాబు:
AP Board 8th Class Social Solutions Chapter 3 భూ చలనాలు - రుతువులు 6

ప్రశ్న 21.
ఏ కాలంలో భూమి సూర్యుని వైపుకి వాలి ఉంటుంది?
జవాబు:
వేసవి కాలంలో భూమి సూర్యుని వైపుకి వాలి ఉంటుంది.

ప్రశ్న 22.
కాలాలను ప్రభావితం చేసే అంశాలు ఏవి?
జవాబు:
కాలాలను ప్రభావితం చేసే అంశాలు : వీటిని అర్థం చేసుకోవటానికి అనేక అంశాల మధ్య ఉండే సంక్లిష్ట సంబంధాలను అర్థం చేసుకోవాలి. ఇవి :

  1. భూమి బంతిలాగా గోళాకారంలో ఉండటం, దాని ఉపరితలం ఒంపు తిరిగి ఉండటం.
  2. భూమి తన అక్షం మీద రోజుకు ఒకసారి తన చుట్టూ తాను తిరగటం (భూభ్రమణం).
  3. సూర్యుడి చుట్టూ భూమి తిరిగే తలంతో పోలిస్తే తన చుట్టూ తాను తిరిగే అక్షం ఒంపు కలిగి ఉండటం.
  4. సంవత్సర కాలంలో సూర్యుని చుట్టూ భూమి తిరగటం (పరిభ్రమణం).

ప్రశ్న 23.
భూమి భ్రమణాన్ని, పరిభ్రమణాన్ని ప్రశంసించండి.
జవాబు:
భూమి పుట్టినది మొదలు ఈనాటి వరకూ అలుపెరగక భ్రమణ, పరిభ్రమణాలను జరుపుతోంది. అది ఒక్క క్షణం అలుపు తీర్చుకున్నా భూమి మీద ప్రాణికోటి మిగలదు. కాబట్టి భూమికి కృతజ్ఞతాపూర్వక వందనములు.

AP Board 8th Class Social Solutions Chapter 3 భూ చలనాలు - రుతువులు

ప్రశ్న 24.
భూమిపైన ఉన్న కాలాలన్నింటిలోకి ఏది ముఖ్యమని నీవు భావిస్తున్నావు?
జవాబు:
భూమిపై ఉన్న కాలాలన్నీ ముఖ్యమైనవే అని నా భావన. ఎండాకాలంలో ఎండిన నేలకి వాన స్వాంతన. ఈ రెండింటి తర్వాత చలి ఎంతో హాయినిస్తుంది. చలికాలం తరువాత ఎండ కూడా హాయిగానే ఉంటుంది. అయితే వాస్తవంగా ఏ కాలం లేకపోయినా భూమి మీద మానవ మనుగడ అసాధ్యం అని నేను భావిస్తున్నాను.

ప్రశ్న 25.
ముఖ్యమైన కాలాలు చెప్పండి.
జవాబు:
ముఖ్యమైన కాలాలు ఎండాకాలం, వానాకాలం మరియు చలికాలం.

ప్రశ్న 26.
భూ భ్రమణం, భూ పరిభ్రమణం ప్రశంసించండి.
జవాబు:
భూ భ్రమణం, భూ పరిభ్రమణం సమస్త జీవరాసులకు ప్రాణాధారం.

AP Board 8th Class Social Solutions Chapter 3 భూ చలనాలు - రుతువులు

ప్రశ్న 27.
భూమిపైన ఉన్న కాలాలన్నింటిలో ఏది ముఖ్యమైనది?
జవాబు:
భూమిపై ఉన్న కాలాలన్నీ ముఖ్యమైనవే. ఏ కాలం లేకపోయినా మానవాళి మనుగడ శూన్యమౌతుంది.

AP Board 8th Class Social Solutions Chapter 2 సూర్యుడు – శక్తి వనరు

SCERT AP 8th Class Social Study Material Pdf 2nd Lesson సూర్యుడు – శక్తి వనరు Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Social Solutions 2nd Lesson సూర్యుడు – శక్తి వనరు

8th Class Social Studies 2nd Lesson సూర్యుడు – శక్తి వనరు Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
తప్పు వాక్యాలను సరిచేయండి. (AS1)
జవాబు:
అ) ఒక ప్రదేశం సముద్రానికి దగ్గరగా ఉంటే, భూమధ్యరేఖ నుంచి ఎంత దూరంలో ఉంది అన్నదానితో సంబంధం లేకుండా ఎప్పుడూ చల్లగా ఉంటుంది.
జవాబు:
(ఒప్పు)

ఆ) భూమి నుంచి పైకి వెళుతున్న కొద్దీ సూర్యుడికి దగ్గరగా వెళతారు కాబట్టి బాగా వేడిగా ఉంటుంది. (తప్పు)
భూమి నుంచి పైకి వెళుతున్న కొద్దీ ఉష్ణోగ్రత తగ్గి చల్లగా ఉంటుంది.
జవాబు:
(ఒప్పు)

ఇ) సూర్యుడు ముందుగా గాలిని వేడిచేసి, తరవాత భూమిని వేడి చేస్తాడు. (తప్పు)
సూర్యుడు ముందుగా భూమిని, తద్వారా గాలిని వేడి చేస్తాడు.
జవాబు:
(ఒప్పు)

ఈ )భూగోళం వేడెక్కటానికి ప్రాణవాయువు (ఆక్సిజన్)తో సంబంధం ఉంది. (తప్పు)
భూగోళం వేడెక్కడానికి కార్బన్-డై-ఆక్సైడ్ తో సంబంధం ఉంది.
జవాబు:
(ఒప్పు)

ప్రశ్న 2.
పట్టిక 2లో అత్యధిక ఉష్ణోగ్రతకు, పట్టిక 1లో అతి తక్కువ ఉష్ణోగ్రతకు ఎంత తేడా ఉంది? (AS3)
జవాబు:
పట్టిక 2లో అత్యధిక ఉష్ణోగ్రత = 33°C
పట్టిక 1లో అతి తక్కువ ఉష్ణోగ్రత = 17°C
ఈ రెండింటి మధ్య తేడా = 16°C

ప్రశ్న 3.
డిసెంబరు 6న ఉదయం 10 గంటలకు మాస్కోలో ఉష్ణోగ్రత – 8°C అనుకుందాం. ఇరవై నాలుగు గంటల తరవాత ఉష్ణోగ్రత 12°C ఎక్కువ ఉంది. డిసెంబరు 7న ఉదయం 10 గంటలకు అక్కడ ఉష్ణోగ్రత ఎంత? (AS5)
జవాబు:
డిసెంబరు 7న ఉదయం 10 గంటలకు అక్కడ ఉష్ణోగ్రత 4°C గా ఉంటుంది.

AP Board 8th Class Social Solutions Chapter 2 సూర్యుడు - శక్తి వనరు

ప్రశ్న 4.
ఢిల్లీ, ముంబయి మైదాన ప్రాంతంలో ఉన్నాయి, సముద్ర మట్టం నుంచి వాటి ఎత్తు 300 మీటర్ల లోపు ఉంటుంది. వాటి నెలసరి సగటు ఉష్ణోగ్రతలలో అంత తేడా ఎందుకు ఉంది? ఈ రెండు నగరాలలో ఏ నెలల్లో సగటు ఉష్ణోగ్రతలు దాదాపు ఒకటిగా ఉంటాయి? వాటికి కారణాలు వివరించండి. (AS1)
జవాబు:
ముంబయి సముద్ర ప్రభావిత శీతోష్ణస్థితిని, ఢిల్లీ ఖండాంతర్గత శీతోష్ణస్థితిని కలిగి ఉంది. ముంబయి సముద్రతీర ప్రాంతంలో ఉండటం మూలంగా సంవత్సరం పొడుగునా ఒకే రకమైన శీతోష్ణస్థితిని కలిగి ఉంది. ఢిల్లీ సముద్రానికి దూరంగా ఉండటం మూలంగా ఇక్కడి ఉష్ణోగ్రతలో అత్యధిక హెచ్చు తగ్గులున్నాయి. ఈ రెండు ప్రాంతాల ఉష్ణోగ్రతలు ఆగస్టు, సెప్టెంబరు నెలలలో కొంచెం దగ్గరగా ఉన్నాయి.

ప్రశ్న 5.
జోధ్ పూర్ (రాజస్థాన్)లో నెలసరి సగటు గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు కింద పట్టికలో ఉన్నాయి. వాటితో రేఖాచిత్ర పటం (గ్రాఫ్) గీయండి. సంవత్సరంలో చాలా వేడిగా, చాలా చలిగా ఉండే నెలలు ఏవి?
జోధ్ పూర్ లో నెలసరి సగటు గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు (AS3).
AP Board 8th Class Social Solutions Chapter 2 సూర్యుడు - శక్తి వనరు 1
జవాబు:
AP Board 8th Class Social Solutions Chapter 2 సూర్యుడు - శక్తి వనరు 2
a) ఏప్రియల్, మే మరియు జూన్ నెలలు వేడిగా ఉంటుంది.
b) డిసెంబరు, జనవరి మరియు ఫిబ్రవరి నెల చలిగా ఉంటుంది.

ప్రశ్న 6.
ఎ, బి, సి అనే మూడు ప్రదేశాల సగటు గరిష్ఠ ఉష్ణోగ్రతలు కింద పట్టికలో ఉన్నాయి. వాటి రేఖా చిత్రపటం (గ్రాఫ్) తయారు చేయండి. పట్టిక, రేఖా చిత్రపటాలు చూసి ఆ ప్రదేశాల గురించి మీరు ఏమి ఊహిస్తారు. (AS3)
AP Board 8th Class Social Solutions Chapter 2 సూర్యుడు - శక్తి వనరు 3
జవాబు:
AP Board 8th Class Social Solutions Chapter 2 సూర్యుడు - శక్తి వనరు 4
A&C ప్రాంతాలు వేడి ప్రాంతాలు
B శీతల ప్రాంతము

ప్రశ్న 7.
జనవరిలో సిమ్లా, తిరువనంతపురం సగటు ఉష్ణోగ్రతలలో తేడాలకు మూడు కారణాలను ఇవ్వండి. అట్లాస్ చూడండి. (AS3)
జవాబు:
1. తిరువనంతపురం సముద్రతీర ప్రాంతం.
2. సిమ్లా ఎత్తైన ప్రదేశంలో ఉన్నది.
3. తిరువనంతపురం భూమధ్యరేఖకు దగ్గరగాను, సిమ్లాకు దూరంగానూ ఉన్నాయి.

ప్రశ్న 8.
భోపాల్, ఢిల్లీ, ముంబయి, సిమ్లాలలో ఏ రెండు ప్రదేశాలు ఒకే రకమైన ఉష్ణోగ్రత తీరును కలిగి ఉంటాయి. ఈ రెండు ప్రదేశాల మధ్య పోలికలకు కారణాలు వివరించండి. (AS1)
జవాబు:
భోపాల్, ఢిల్లీలలో ఉష్ణోగ్రతలు ఒకే తీరును కలిగి ఉంటాయి. ఈ రెండు ప్రాంతాలు సముద్రానికి దూరంగా ఉండటమే దీనికి కారణము.

ప్రశ్న 9.
కింద ఉన్న రేఖా చిత్రపటం (గ్రాఫ్) చూసి కింది ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి.
AP Board 8th Class Social Solutions Chapter 2 సూర్యుడు - శక్తి వనరు 5
అ) జులైలో సగటు గరిష్ఠ ఉష్ణోగ్రత ఎంత?
ఆ) డిసెంబరు నెలలో సాధారణంగా ఎంత వేడిగా ఉంటుంది?
ఇ) జూన్ నెలలో సాధారణంగా ఎంత చలిగా ఉంటుంది?
ఈ) పగటి, రాత్రి ఉష్ణోగ్రతలలో తేడా మే నెలలో ఎక్కువగా ఉంటుందా లేక ఆగస్టులోనా?
ఉ) వేసవి నెలలు ఏవి?
జవాబు:
అ) 28°C
ఆ) 26°C
ఇ) 20°C
ఈ) మే నెలలో
ఉ) మార్చి, ఏప్రిల్, మే నెలలు

ప్రశ్న 10.
నితిన్ థర్మల్ విద్యుత్తు మంచిదని అంటున్నాడు. కాని పద్మజ సౌర విద్యుత్తు మంచిదని అంటున్నది. వీరిలో ఎవరిని సమర్ధిస్తారు? ఎందుకు?
జవాబు:
నేను పద్మజను సమర్థిస్తాను. కారణం :
సౌరశక్తి, ధర్మల్ శక్తి కంటే మెరుగైనది. ఎందుకంటే సౌరశక్తి పరిశుభ్రమైనది. నిరంతరం లభ్యమయ్యేది. అంతేకాక ఇది పునరావృతమయ్యే సహజ వనరు. ఎంతవాడినా తరగని వనరు. మన శరీరానికి కావలసిన విటమిన్-డి ని కూడా ఇది అందిస్తుంది.

AP Board 8th Class Social Solutions Chapter 2 సూర్యుడు - శక్తి వనరు

ప్రశ్న 11.
పేజి నెం. 27లోని ‘ఎత్తు – ఉష్ణోగ్రత’ అంశాన్ని చదివి వ్యాఖ్యానించంది.
మండు వేసవిలో మైదాన ప్రాంతాలలోని కొంతమంది ఎండల నుంచి తప్పించుకోటానికి ఊటీ, సిమ్లా వంటి పర్వత ప్రాంత ప్రదేశాలకు వెళుతుంటారు. ఎత్తుగా ఉండే పర్వతాలలో వేసవి నెలల్లో కూడా ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయి. పర్వతాలలో ఎత్తైన ప్రాంతాలలో అతి తక్కువ ఉష్ణోగ్రతలు ఉంటాయి. ఎత్తు ప్రదేశాలకు వెళుతున్న కొద్దీ ఉష్ణోగ్రతలు తగ్గుతుంటాయి.

ప్రతినెలలోనూ ఢిల్లీలో కంటే సిమ్లాలో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉన్నాయని స్పష్టమవుతుంది.

సముద్ర మట్టం నుంచి ఢిల్లీ 200 మీటర్ల ఎత్తులో ఉంది. అదే సిమ్లా 2200 మీటర్ల ఎత్తులో ఉంది. సాధారణంగా సముద్ర మట్టం నుంచి ప్రతి వెయ్యి మీటర్ల పైకి వెళితే ఉష్ణోగ్రతలు 6°C మేర తగ్గుతాయి. ఎత్తైన కొండలు, పర్వతాలలో తక్కువ ఉష్ణోగ్రతల వల్ల అక్కడ పెరిగే చెట్లు, మొక్కలలో కూడా తేడా ఉంటుంది.
జవాబు:
సముద్ర మట్టం నుండి ప్రతి 1000 మీటర్లు ఎత్తుకు పోయిన కొలది 6°C ఉష్ణోగ్రత తగ్గుతుంది. కాబట్టి సిమ్లా, డార్జిలింగ్, హార్సిలీ హిల్స్, ఊటీ వంటి ప్రాంతాలలో వేసవిలో కూడా చల్లగా ఉండి వేసవి విడిది కేంద్రాలుగా ప్రసిద్ధి పొందాయి.

8th Class Social Studies 2nd Lesson సూర్యుడు – శక్తి వనరు InText Questions and Answers

8th Class Social Textbook Page No.18

ప్రశ్న 1.
మీరు నివసించే ప్రాంతం కంటే భిన్నమైన వాతావరణం ఉండే ప్రదేశానికి ఎప్పుడైనా వెళ్లారా ? తరగతి గదిలో వివరించండి.
జవాబు:
నేను విజయవాడ నివసిస్తాను. ఇక్కడి వాతావరణం చాలా వేడిగా ఉంటుంది. క్రిందటి వేసవి సెలవులలో నేను ఊటీ వెళ్ళాను. అది నీలగిరి కొండల పై, ఎత్తైన ప్రదేశంలో ఉన్నది. చాలా చల్లగా ఉంది. మేము రామగుండం నుండి కోయంబత్తూరు వెళ్ళి అక్కడి నుండి ఊటీకి చేరుకున్నాము. దీనిని కొండలలో రాణి అని అంటారు. అందమైన జలపాతాలు అక్కడి ప్రకృతి వరాలు. మేము అక్కడ హారేస్ కోర్సు ఎదురుగా ఉండే హోటల్ లో బస చేశాము. బొటానికల్ గార్డెన్స్, లేక్, దొడబెట్ట, లవ్ డేల్ మొదలైన ప్రదేశాలన్నీ సందర్శించాము. మండు వేసవిలో అక్కడ స్వెట్టర్లు వేసుకుని తిరగటం నాకు ఆశర్యంగాను, అద్భుతంగాను అనిపించింది. ప్రతి సంవత్సరం అక్కడికి వెళ్ళాలని కూడా అనిపించింది.

ప్రశ్న 2.
భూమి మీద వేడిమికి సూర్యుడు కారణమని మీకు తెలుసు. అయితే ఈ వేడిమి ఉదయం నుంచి సాయంత్రానికి, కాలాలను బట్టి, ప్రదేశాలను బట్టి మారటానికి కారణం ఏమిటి? ఇక్కడ ఉష్ణోగ్రతలలో కొన్ని తేడాలను ఇచ్చాం . వీటికి కారణాలను ఊహించి, తరగతి గదిలో చర్చించిన తరవాత ముందుకు వెళ్ళండి.
1. ఉదయం పూట చల్లగానూ, మధ్యాహ్నం వేడిగానూ ఉంటుంది.
2. వేసవిలో వేడిగానూ, శీతాకాలంలో చలిగానూ ఉంటుంది.
3. కొండలపై చల్లగానూ, మైదాన ప్రాంతంలో వేడిగానూ ఉంటుంది.
4. భూమధ్యరేఖా ప్రాంతంలో వేడిగానూ, ధృవప్రాంతంలో చలిగానూ ఉంటుంది. Page No. 18)
జవాబు:
భూమి మీద ఉష్ణోగ్రతలో మార్పులకు అనేక కారణాలున్నాయి. అవి :

  1. అక్షాంశము
  2. ఎత్తు
  3. సముద్రం నుండి దూరము
  4. సముద్ర తరంగాలు
  5. పర్వతాలు
  6. గాలులు మొ||నవి.

1. కారణం :
ఉదయం పూట భూభ్రమణం కారణంగా సూర్యకిరణాలు ఏటవాలుగాను, మధ్యాహ్నం పూట నిట్టనిలువుగా పడతాయి. అందువలన ఉదయం పూట చల్లగాను, మధ్యాహ్నం వేడిగాను ఉంటుంది.

2. కారణం :
వేసవిలో కిరణాలు భూమి మీద లంబంగా ప్రసరిస్తాయి. చలికాలంలో ఏటవాలుగా ప్రసరిస్తాయి. ఇది భూపరిభ్రమణం కారణంగా జరుగుతుంది.

3. కారణం :
సముద్రతీరం నుండి ఎత్తుకు పోయే కొలదీ ప్రతి 1000 మీ||లకు 6°C ఉష్ణోగ్రత తగ్గుతుంది. అందువలన మైదానాలలో కంటే కొండలపై చల్లగా ఉంటుంది.

4. కారణం :
భూమధ్యరేఖా ప్రాంతంలో సూర్యకిరణాలు నిట్టనిలువుగా (90°C) పడతాయి. ధృవాలవైపు ఏటవాలుగా పడతాయి. ఇది భూమి యొక్క ఆకృతి మూలంగా జరుగుతుంది.

8th Class Social Textbook Page No.19

ప్రశ్న 3.
సౌరవికిరణం (రేడియేషన్), సూర్యపుటం (ఇన్సోలేషన్) మధ్య తేడాలను పేర్కొనండి.
జవాబు:
1. సౌరవికిరణం : సూర్యుడు విడుదల చేసే శక్తిని సౌర వికిరణం అని అంటారు.
AP Board 8th Class Social Solutions Chapter 2 సూర్యుడు - శక్తి వనరు 6
2. సూర్యపుటం : సూర్యుడు విడుదల చేసే దాని నుండి భూమి ఉపరితలం గ్రహించే శక్తిని సూర్యపుటం అని అంటారు.

ప్రశ్న 4.
పొగ, ధూళితో వాతావరణం మరింత కలుషితమైతే ఏమవుతుంది?
జవాబు:
సౌరశక్తిలోని కొంత భాగాన్ని వాతావరణంలోని పొగ, ధూళి పరావర్తనం చేస్తాయి లేదా గ్రహిస్తాయి. ఇవి ఎక్కువై సౌరశక్తిని ఎక్కువ పరావర్తనం చేస్తే భూమి మీద వేడి ఉండదు. ఇవి ఎక్కువై సౌరశక్తిని ఎక్కువ గ్రహిస్తే భూమి మీద వేడిమి పెరుగుతుంది. ఈ రెండింటి వల్ల కూడా భూమి మీద జీవం ప్రమాదంలో పడుతుంది.

8th Class Social Textbook Page No.20

ప్రశ్న 5.
సూర్యకిరణాలు ఎక్కడ ఎక్కువ ఏటవాలుగా పడతాయి – జపాన్లోనా, ఉత్తర ధృవం వద్దా?
జవాబు:
సూర్యకిరణాలు ఉత్తర ధృవం వద్ద ఎక్కువ ఏటవాలుగా పడతాయి.

ప్రశ్న 6.
సూర్యకిరణాల సాంద్రత ఎక్కడ ఎక్కువగా ఉంటుంది – ఆంధ్రప్రదేశ్ లోనా, రాజస్థాన్లోనా?
జవాబు:
సూర్యకిరణాల సాంద్రత ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ లో ఉంటుంది.

ప్రశ్న 7.
భూమి గుండ్రంగా కాకుండా బల్లపరుపుగా ఉంటే జపాన్ ఎక్కువ వేడి ఎక్కుతుందా, భూమధ్యరేఖా ప్రాంతమా? లేక రెండూ సమంగా వేడి ఎక్కుతాయా?
జవాబు:
రెండూ సమానంగా వేడెక్కుతాయి.

AP Board 8th Class Social Solutions Chapter 2 సూర్యుడు - శక్తి వనరు

ప్రశ్న 8.
గ్లోబును చూసి ఏ దేశాలు ఎక్కువ వేడిగా ఉంటాయో, ఏ దేశాలు చల్లగా ఉంటాయో చెప్పండి.
జవాబు:
వేడి దేశాలు : ఆస్ట్రేలియా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, తైవాన్, బర్మా, ఇండియా, సూడాన్, అరేబియా, జింబాబ్వే, చిలీ, బ్రెజిల్, గ్వాటియాలా మొదలగునవి. చల్లని దేశాలు : ఉత్తర అమెరికా, ఐర్లాండ్, స్కాండినేవియా, రష్యా మొదలగునవి.

8th Class Social Textbook Page No.21

ప్రశ్న 9.
భూమి, సముద్రం వేడెక్కడంలో తేడా ఎందుకు ఉంది?
జవాబు:
భూమి, నీటితో పోలిస్తే మంచి ఉష్ణవాహకం. కాబట్టి సముద్రం కన్నా భూమి త్వరగా వేడెక్కి త్వరగా చల్లబడుతుంది.

8th Class Social Textbook Page No.23

ప్రశ్న 10.
వేర్వేరు ఉష్ణోగ్రతలు తెలుసుకోడానికి ఈ కింద పేర్కొన్న, వాటి ఉష్ణోగ్రతలు కొలవండి. కొలవటానికి ముందు వాటి ఉష్ణోగ్రత ఎంత ఉంటుందో ఊహించి అంచనా వేయండి.
జవాబు:

వస్తువుఉష్ణోగ్రత
అంచనాకొలత
బక్కెటులో నీళ్ళు25°C35°C
ఐసుగడ్డ0°C0°C
గ్లాసులోని చల్లటి నీళ్లు15°C10°C
స్నానానికి పెట్టుకున్న వేడినీళ్లు70°C76°C

ప్రశ్న 11.
10°C నుంచి 110°C వరకు కొలవగల ఉష్ణమాపకం ఉపయోగించటం మంచిది. ఇటువంటి ఉష్ణమాపకం ఉపయోగించి మరుగుతున్న నీళ్ళు, వేడిగా ఉన్న టీ ఉష్ణోగ్రతలను కొలవండి.
జవాబు:
మరుగుతున్న నీళ్ళు = 100°C; వేడిగా ఉన్న టీ = 95°C

ప్రశ్న 12.
రాబోయే వారం రోజులపాటు ప్రతిరోజూ ఒకే ప్రదేశం, ఒకే సమయంలో వాతావరణ ఉష్ణోగ్రతలు తీసుకోండి. (ఇందుకు నీడలో వుండే ప్రాంతాన్ని ఎన్నుకోండి). ప్రతిరోజూ ఉష్ణోగ్రత కొలవటానికి ముందు దానిని ఊహించి అంచనా వేయండి. – వీటిని ఒక పుస్తకంలో నమోదు చేయండి.
జవాబు:
ప్రదేశం : బెంగళూరు
సమయం : 12 గంటలు
నెల : జనవరి

తేదీవాతావరణ ఉష్ణోగ్రతలు
అంచనాకొలత
18.1.1928°C29°C
19.1.1927°C30°C
20.1.1929°C30°C
21.1.1929°C30°C
22.1.1928°C30°C
23.1.1927°C30°C
24.1.1928°C30°C

1) ఇలా వారం రోజులపాటు వేర్వేరు నెలల్లో ఉష్ణోగ్రతలు నమోదు చేయండి.
జవాబు:
ఈ విధంగా నేను వేర్వేరు నెలలలో 5 వారాల పాటు ఉష్ణోగ్రతలు నమోదు చేశాను.

2) మీరు నమోదు చేసిన వారం రోజుల ఉష్ణోగ్రతల సగటును కనుక్కోండి.
జవాబు:

  1. జనవరి 3వ వారం – 29°C
  2. మార్చి 2వ వారం – 32°C
  3. జులై 1వ వారం – 28°C
  4. అక్టోబరు 2వ వారం – 28°C
  5. డిసెంబరు 4వ వారం – 28°C

3) వివిధ వారాల ఉష్ణోగ్రతలలో తేడాల గురించి చర్చించండి.
జవాబు:
ఈ ఉష్ణోగ్రతల గురించి తరగతి గదిలో చర్చించిన తరువాత బెంగళూరు శీతోష్ణస్థితి సాధారణ శీతోష్ణస్థితి అని, అధిక ఉష్ణోగ్రతలు లేవు అని నిర్ధారించినాము.

AP Board 8th Class Social Solutions Chapter 2 సూర్యుడు - శక్తి వనరు

8th Class Social Textbook Page No.24

ప్రశ్న 13.
ఈ సంఖ్యారేఖపై గుర్తించిన ధన, ఋణ సంఖ్యలను గమనించండి. వీటి ఆధారంగా దిగువ ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
AP Board 8th Class Social Solutions Chapter 2 సూర్యుడు - శక్తి వనరు 7
1. ఏ ఉష్ణోగ్రత ఎక్కువ : 5°C లేక – 5°C?
జవాబు:
– 5°C

2. ఈ రెండు ఉష్ణోగ్రతలలో దేని దగ్గర మనకు ఎక్కువ చలిగా అనిపిస్తుంది?
జవాబు:
5°C

3. – 5°C నుండి 5°C వరకు ఎన్ని డిగ్రీల తేడా ఉంది?
జవాబు:
10°C (5° – (-59) = 5 + 5 = 10°C]

4. కింద పేర్కొన్న ఉష్ణోగ్రతలను క్లుప్తంగా రాయండి.
సున్నాకి దిగువన 88°C, నీరు గడ్డ కట్టుకోవటానికి 38°C ఎగువన, నీరు గడ్డకట్టుకోటానికి 32°C దిగువన.
జవాబు:
– 88°C, 38°C, – 32°C

5. ఈ రోజున మీ తరగతి గదిలో ఉష్ణోగ్రతని కొలిచారా? సున్నాకి దిగువున 88°C అంటే మీరు కొలిచిన ఉష్ణోగ్రత కంటే ఎంత తక్కువ?
జవాబు:
తరగతి గది ఉష్ణోగ్రత 28°C. నేను కొలిచిన ఉష్ణోగ్రత కంటే 116°C తక్కువ.

6. మనిషి శరీర ఉష్ణోగ్రత సాధారణంగా 37°C ఉంటుంది. ఉష్ణోగ్రత 50°C ఉంటే మనిషి సాధారణ ఉష్ణోగ్రత కంటే ఎంత ఎక్కువ ఉన్నట్టు?
జవాబు:
13°C

7. ఉష్ణోగ్రత – 5°C ఉంటే మనిషి సాధారణ ఉష్ణోగ్రత కంటే ఎంత తక్కువ ఉన్నట్టు?
జవాబు:
42°C

8. ఈ ఉష్ణోగ్రతలను ఎక్కువ నుంచి తక్కువకు క్రమంలో రాయండి.
12°C, – 16°C, 29°C, 0°C, – 4°C.
జవాబు:
29°C, 12°C, 0°C, – 4°C, – 16°C

9. పైన ఇచ్చిన ఉష్ణోగ్రతలలో దేని దగ్గర అన్నిటికంటే ఎక్కువ వేడిగా ఉంటుంది?
జవాబు:
29°C వద్ద

10. పైన ఇచ్చిన ఉష్ణోగ్రతలలో దేని దగ్గర అన్నిటికంటే ఎక్కువ చలిగా ఉంటుంది?
జవాబు:
– 16°C వద్ద

8th Class Social Textbook Page No.25

ప్రశ్న 14.
గ్రాఫ్ – 1 (అనంతపురం నెలసరి సగటు ఉష్ణోగ్రతలు)
AP Board 8th Class Social Solutions Chapter 2 సూర్యుడు - శక్తి వనరు 8
పట్టిక-1లోని వివరాలను ఉపయోగించుకుని అదే గ్రాలోనే అనంతపురం నెలవారీగా సగటు కనిష్ఠ ఉష్ణోగ్రతల రేఖను గీయండి. మొదటి రెండు నెలలకు చేసిన గ్రాఫ్ పైన ఉంది.
పట్టిక-1 : అనంతపురం నెలసరి సగటు ఉష్ణోగ్రతలు
AP Board 8th Class Social Solutions Chapter 2 సూర్యుడు - శక్తి వనరు 9
నెల కనిష్ఠం నెల గరిష్ఠ కనిష్ఠ జనవరి 30 17 జులై 24 ఫిబ్రవరి 33 1 9 ఆగసు 33 మార్చి 3722 సెప్టెంబరులో ఏప్రిల్ 39 అక్టోబరు 32 39 26 నవంబరు 30 జూన్ 35 డిసెంబరు
ఇచ్చిన గ్రాఫ్, పట్టిక -1 పరిశీలించి అనంతపురముకు సంబంధించి కింది ప్రశ్నలకు జవాబులు ఇవ్వండి.
1. అనంతపురంలో నవంబరులో ఎంత చలిగా ఉంటుంది?
జవాబు:
చలి తక్కువుగా ఉంటుంది. 20°C

2. అనంతపురంలో ఏ నెలలో గరిష్ఠ ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది?
జవాబు:
మే నెల

3. సంవత్సరంలో అత్యధిక గరిష్ట ఉష్ణోగ్రత, అతి తక్కువ కనిష్ఠ ఉష్ణోగ్రతకి మధ్య తేడా ఎంత?
జవాబు:
సంవత్సరంలో అత్యధిక గరిష్ట ఉష్ణోగ్రత = 39°C
సంవత్సరంలో అతి తక్కువ కనిష్ఠ ఉష్ణోగ్రత = 17°C
తేడా = 39° – 17°C = 22°C.

4. అనంతపురంలో బాగా వేడిగా ఉండే మూడు నెలలు ఏవి?
జవాబు:
మార్చి, ఏప్రిల్, మే.

5. బాగా చలిగా ఉండే మూడు నెలలు ఏవి?
జవాబు:
డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి.

6. జూన్ నుండి డిసెంబరు వరకు అనంతపురంలో సగటు కనిష్ఠ ఉష్ణోగ్రత తగ్గుతూ ఉంది. సగటు గరిష్ఠ ఉష్ణోగ్రత కూడా తగ్గుతూ ఉందా?
జవాబు:
తగ్గుతూ ఉంది.

7. మే నెలలో గరిష్ట, కనిష్ఠ సగటు ఉష్ణోగ్రతలలో తేడా ఎంత?
జవాబు:
39° – 26° = 13°C

8. ఆగస్టు నెలలో గరిష్ఠ, కనిష్ట సగటు ఉష్ణోగ్రతలలో తేడా ఎంత?
జవాబు:
33 – 24° = 9°C

9. పై రెండు ప్రశ్నలకు మీ సమాధానాల ఆధారంగా గరిష, కనిష్ట సగటు ఉష్ణోగ్రతల తేడా అనంతపురంలో వేసవిలో ఎక్కువగా ఉందా లేక వానాకాలంలో ఎక్కువగా ఉందా?
జవాబు:
రెండింటి మధ్య వేసవిలో ఎక్కువగా ఉంది.

8th Class Social Textbook Page No.26

ప్రశ్న 15.
పట్టిక-2 : (విశాఖపట్టణం నెలసరి సగటు ఉష్ణోగ్రత)
AP Board 8th Class Social Solutions Chapter 2 సూర్యుడు - శక్తి వనరు 10
AP Board 8th Class Social Solutions Chapter 2 సూర్యుడు - శక్తి వనరు 11
గరిష్ఠ°C – కనిష్ఠ నెల గరిష్ఠ కనిష్ఠ నెల జనవరి ఫిబ్రవరి ఆగస్టు 10006 మార్చి సెప్టె బరు అక్టోబరు ఏప్రిల్ 25 32 33 నవంబరు జూన్ 30 2 4 డిసెంబరు 32 21
జన ఫిబ్ర మార్చి ఏప్రి మే జూన్ జులై ఆగ సెప్టె అక్టో నవ డిసె

పై గ్రాలో విశాఖపట్టణం సగటు గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలను గుర్తించారు.
1. విశాఖలో ఏ నెలలో కనిష్ఠ ఉష్ణోగ్రత అతి తక్కువగా ఉంది? అది ఎంత?
జవాబు:
జనవరి నెలలో కనిష్ఠ ఉష్ణోగ్రత ఉంది. అది 19°C.

2. విశాఖలో చాలా వేడిగా ఉండే నెల ఏది? ఆ నెలలో సగటు గరిష్ఠ ఉష్ణోగ్రత ఎంత?
జవాబు:
ఏప్రిల్, మే, నవంబరు నెలలు చాలా వేడిగా ఉంటాయి. 33 °C.

8th Class Social Textbook Page No.27

ప్రశ్న 16.
గ్రాఫ్-3 (ఢిల్లీ నెలవారీ సగటు ఉష్ణోగ్రతలు)
AP Board 8th Class Social Solutions Chapter 2 సూర్యుడు - శక్తి వనరు 12
అనంతపురం, విశాఖల ఉష్ణోగ్రతలను పోల్చి కింది ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వండి.
1. జనవరిలో ఏ ప్రదేశంలో ఎక్కువ చలిగా ఉంటుంది?
జవాబు:
అనంతపురం

2. జూన్లో ఏ ప్రదేశంలో ఎక్కువ వేడిగా ఉంటుంది?
జవాబు:
విశాఖపట్టణం

3. ఏ ప్రదేశంలో సంవత్సరం పొడవునా ఉష్ణోగ్రత ఇంచుమించు ఒకే రకంగా ఉంటుంది?
జవాబు:
విశాఖపట్టణం

8th Class Social Textbook Page No.27, 28

ప్రశ్న 17.
గ్రాఫ్-4 (సిమ్లా నెలవారీ సగటు ఉష్ణోగ్రతలు)
AP Board 8th Class Social Solutions Chapter 2 సూర్యుడు - శక్తి వనరు 13
1. ఉష్ణోగ్రత ఇలా ఉండటానికి గల ఇతర కారణాలను ఊహించండి.
జవాబు:
ఉష్ణోగ్రతా విలోమానికి మరే కారణము ఊహించలేము.

2. విలోమనం జరిగితే ఏమవుతుంది?
జవాబు:
విలోమనం జరిగితే భూమికి దగ్గరగా ఉష్ణోగ్రత తగ్గుతుంది.

3. ఢిల్లీ కంటే సిమ్లా ఎన్ని మీటర్ల ఎత్తులో ఉంది?
జవాబు:
ఢిల్లీ కంటే సిమ్లా 1900 మీ. ఎత్తులో ఉంది.

4. సముద్ర మట్టం నుంచి రెండు ప్రదేశాల ఎత్తులో గల తేడాల ఆధారంగా ఆ రెండింటి ఉష్ణోగ్రతలలో ఎంత తేడా ఉంటుందో లెక్కకట్టండి.
జవాబు:
సుమారుగా 12°C

5. సిమ్లాలో ఏ నెలలో గరిష్ఠ ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంది? అది ఎంత?
జవాబు:
మే నెలలో గరిష్ఠ ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది. 22°C.

6. ఢిల్లీలో ఏ నెలలో గరిష్ఠ ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంది? అది ఎంత?
జవాబు:
మే నెలలో ఎక్కువగా ఉంటుంది. 40°C.

7. సెప్టెంబరులో సిమ్లాలో సగటు ఉష్ణోగ్రత ……. °C కాగా ఢిల్లీలో …… °C.
జవాబు:
17°C-34°C

8. ఏది ఎక్కువ చలిగా ఉంటుంది. జనవరిలో ఢిల్లీనా లేక జులైలో సిమ్లానా?
జవాబు:
ఢిల్లీలో జనవరిలో చలిగా ఉంటుంది.

AP Board 8th Class Social Solutions Chapter 2 సూర్యుడు - శక్తి వనరు

8th Class Social Textbook Page No.29

ప్రశ్న 18.
గ్రాఫ్-5 (సింగపూర్, షాంఘై, బ్లాడివోస్టాల నెలవారీ సగటు గరిష్ట ఉష్ణోగ్రతలు)
AP Board 8th Class Social Solutions Chapter 2 సూర్యుడు - శక్తి వనరు 14
1. రేఖా చిత్రపటంలో ఇచ్చిన మూడు ప్రదేశాలలో భూమధ్యరేఖకు దగ్గరగా ఏది ఉంది?
జవాబు:
సింగపూర్

2. ఆ ప్రదేశంలో సగటు వార్షిక ఉష్ణోగ్రత ఎంత?
జవాబు:
27°C

3. అక్కడ శీతాకాలంలో కంటే వేసవికాలంలో సాధారణంగా చాలా వేడిగా ఉంటుందా?
జవాబు:
లేదు, కొంచెం వేడిగా ఉంటుంది.

4. సింగపూర్ లో చలికాలంలో ఉన్నంత వేడిగా ఫ్లాడివోస్టా లో వేసవిలో ఉంటుందా?
జవాబు:
లేదు. రెండింటి మధ్యలో తేడా ఉన్నది.

5. జులైలో సాధారణంగా సింగపూర్ లో ఎక్కువ వేడిగా ఉంటుందా, లేక షాంఘైలోనా?
జవాబు:
రెండింటి మధ్యలో కొద్దిపాటి తేడా ఉన్నది. సింగపూర్ లో వేడిగా ఉంటుంది.

6. రేఖాచిత్ర పటంలో చూపించిన మూడు ప్రదేశాలలో తీవ్ర ఉష్ణోగ్రతలు ఎక్కడ నమోదైనాయి?
జవాబు:
బ్లాడివోస్టోక్ లో

7. షాంఘైలో అత్యంత వేడిగా ఉండే నెల ఏది?
జవాబు:
జులై, ఆగష్టు నెలలు

8. అక్కడ సగటు వార్షిక ఉష్ణోగ్రత ఎంత?
జవాబు:
15.3°C

9. ఈ ప్రదేశంలో సగటు వార్షిక ఉష్ణోగ్రత అతి తక్కువగా ఉన్న నెల ఏది?
జవాబు:
జనవరి, ఫిబ్రవరి

ప్రశ్న 19.
అట్లాస్ లోని పటాల ద్వారా ఈ ప్రదేశాల అక్షాంశాలు, జనవరిలో సగటు ఉష్ణోగ్రతలు తెలుసుకోండి. మొదటిది నింపి ఉంది. Page No.29,30

ప్రదేశంఅక్షాంశంఉష్ణోగ్రత (జనవరిలో)
ఆంధ్రప్రదేశ్, విజయవాడ16.59 ఉ. అ.22°C – 25°C మధ్య
ఆగ్రా, ఉత్తరప్రదేశ్27.18 ఉ. అ.22.3°C-8°C
మధురై, తమిళనాడు9.93 ఉ. అ.30°C-20°C
నాగపూర్, మహారాష్ట్ర21, 14 ఉ. అ.28°C – 12°C

ఈ పటం ప్రకారం భారతదేశంలో జనవరిలో 30°C సగటు ఉష్ణోగ్రత కంటే ఎక్కువ ఉన్న ప్రదేశాలు ఏవీ లేవు. (ఇది సగటు అన్న విషయం గుర్తుంచుకోండి. కొన్ని ప్రదేశాలలో, జనవరిలో 30°C కంటే వేడెక్కే రోజులు కొన్ని ఉండే ఉంటాయి. )
1. పటం చూసి (జనవరిలో) సాధారణంగా సగటు ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండే ప్రదేశాలు ఏవో చెప్పండి.
జవాబు:
మధురై, నాగపూర్.

2. ఈ ప్రదేశాలకు ఉత్తరంగా వెళితే జనవరిలో సగటు ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుందా, తక్కువగా ఉంటుందా?
జవాబు:
తక్కువగా ఉంటుంది.

8th Class Social Textbook Page No.30

ప్రశ్న 20.
ఉత్తరాన ఉన్న పట్టణాలలో పగటికాలం, దక్షిణాది పట్టణాల కన్న, ఎక్కువా? తక్కువా? ఎందుకు?
జవాబు:
ఉత్తర భారతదేశంలో ఉన్న పట్టణాలలో పగటి కాలం దక్షిణాది పట్టణాల కన్నా తక్కువ. ఉత్తర భారతదేశం – దక్షిణ భారతదేశం కంటే భూమధ్యరేఖకు దూరంగా ఉండుటయే యిందులకు కారణం.

ప్రశ్న 21.
పై సమాధానం ఆధారంగా శీతాకాలంలో భారతదేశంలో దక్షిణాదికంటే ఉత్తరాన ఎందుకు చల్లగా ఉంటుందో కారణం చెప్పగలవా?
జవాబు:
శీతాకాలంలో ఉత్తర భారతదేశం పగటి కాలం కంటే రాత్రి కాలం ఎక్కువ. అందుచే ఉత్తర భారతదేశంలో దక్షిణాది కంటే చలి ఎక్కువ.

AP Board 8th Class Social Solutions Chapter 2 సూర్యుడు - శక్తి వనరు

ప్రశ్న 22.
కింద ఉన్న పట్టికలో భారతదేశంలోని కొన్ని పట్టణాలలో జనవరి 10న సూర్యోదయ, సూర్యాస్తమయ సమయాలు ఉన్నాయి. వీటి ఆధారంగా పట్టిక కింద ఉన్న ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి.

ప్రదేశంసూర్యోదయంసూర్యాస్తమయం
హైదరాబాదు, తెలంగాణ6 : 495:58
ఆగ్రా, ఉత్తరప్రదేశ్7: 095: 42
మధురై, తమిళనాడు6: 376: 12
నాగపూర్, మహారాష్ట్ర6:535: 48
విశాఖపట్టణం , ఆం.ప్ర.6: 295:38
కోహిమా, నాగాలాండ్6: 024 : 40

1. పైన ఉన్న ఆరు పట్టణాలలో ముందుగా సూర్యోదయం ఎక్కడ అవుతుంది?
జవాబు:
కోహిమా, నాగాలాండ్

2. ఏ పట్టణంలో అన్నిటికంటే చివర సూర్యాస్తమయం అవుతుంది?
జవాబు:
మధురై, తమిళనాడు

3. ఈ ఆరు పట్టణాలలో పగటికాలం ఎంత? (సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం మధ్య ఉన్న కాలం పగటి కాలం అవుతుంది.)
జవాబు:
హైదరాబాదు : 11.09 ని॥లు
ఆగ్రా : 10.33 ని॥లు
మధురై : 11.35 ని॥లు
నాగపూర్ : 10.55 ని॥లు
విశాఖపట్టణం : 11.09 ని॥లు
కోహిమా : 10.38 ని॥లు

ప్రశ్న 23.
ఉష్ణోగ్రత, వర్షపాతం జీవితాలను ప్రభావితం చేస్తాయని ఎట్లు చెప్పగలవు?
జవాబు:
ఉష్ణోగ్రత, వర్షపాతం జీవితాలను ఎంతగానో ప్రభావితం చేస్తాయి. సూర్యరశ్మి, నీటిపై ఆధారపడి చెట్లు, జంతువులు బతుకుతాయి. చాలా కొద్ది రకాల చెట్లు మాత్రమే వేడిగా ఉండే ప్రాంతాలలో పెరుగుతాయి. చలి ప్రాంతాలలో మరికొన్ని పెరుగుతాయి. బాగా చలి ప్రాంతాలలో ఏవీ పెరగవు. ఈ విధంగా వృక్ష, జంతుజాలాలలో వైవిధ్యత ఉంది.

ప్రశ్న 24.
ఉష్ణోగ్రతకు, వర్షపాతానికి మధ్య గల సంబంధమేమి?
జవాబు:
రెండు ప్రదేశాల మధ్య గల ఉష్ణోగ్రతలలోని తేడాలు గాలులు, వానలను ప్రభావితం చేస్తాయి. ఉష్ణోగ్రత అధికంగా ఉన్నప్పుడు వర్షాలు కూడా బాగా కురుస్తాయి.

ప్రశ్న 25.
సౌరశక్తి ఏయే రూపాలలో ఉంటుంది?
జవాబు:
సౌరశక్తి కాంతి, వేడి, అల్ట్రావయొలెట్ తరంగాలు, రేడియో తరంగాలు మరియు X – కిరణాల రూపంలో ఉంటుంది.

ప్రశ్న 26.
భూగోళం వేడెక్కటం అంటే ఏమిటి?
జవాబు:
భూమి మీద వాతావరణంలో (CO) కార్బన్-డై-ఆక్సెడ్ అధికమవడం మూలంగా, వేడి వికిరణం తగ్గుతుంది. భూమి మీద ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. దీనినే భూగోళం వేడెక్కటం అంటారు.

AP Board 8th Class Social Solutions Chapter 2 సూర్యుడు - శక్తి వనరు

ప్రశ్న 27.
వేడిమి సమతుల్యం అంటే ఏమిటి?
జవాబు:
సూర్యుని నుండి భూమి పొందే వేడి వివిధ పద్ధతులలో తిరిగి వికిరణం చెందుతుంది. కొంతమాత్రమే భూమి గ్రహిస్తుంది. దీనివలన భూమి మీద భరించగలిగే స్థాయిలో మాత్రమే వేడి ఉంటుంది. దీనినే వేడిమి సమతుల్యం అంటారు.

ప్రశ్న 28.
భూమి మీద ఉష్ణోగ్రతలలో మార్పులకు గల కారణాలు ఏవి?
జవాబు:
భూమి మీద ఉష్ణోగ్రతలలో మార్పులకు అనేక కారణాలున్నాయి. అవి :

  1. అక్షాంశము
  2. ఎత్తు
  3. సముద్రం నుండి దూరము
  4. సముద్ర తరంగాలు
  5. పర్వతాలు
  6. గాలులు మొ||నవి.

ప్రశ్న 29.
సూర్యకిరణాలు, సౌరశక్తి అనగా నేమి?
జవాబు:
భూగోళంపై శక్తికి సూర్యుడు మూలవనరు. సూర్యుడు ఒక పెద్ద శక్తి కేంద్రం. కాంతి, వేడిమి రూపంలో అది శక్తిని విడుదల చేస్తూ ఉంటుంది. సూర్యుడి నుంచి నిరంతరాయంగా వెలువడే ఈ శక్తిని సౌర వికిరణం అంటారు. ఏదైనా ఒక వస్తువు శక్తిని వెలువరించటాన్ని వికిరణం అంటారు. సూర్యుడి నుంచి మనకు శక్తి సూర్యకిరణాల రూపంలో వస్తుంది.

ప్రశ్న 30.
ఏఏ ప్రాంతాల ఉష్ణోగ్రతలలో తేడాలు ఉంటాయి?
జవాబు:
సముద్రానికి దగ్గరగా, దూరంగా ఉన్న ప్రాంతాల మధ్య సాధారణంగా ఉష్ణోగ్రతలలో తేడాలు ఉంటాయి. కొండపైన కొండ కింద ఉష్ణోగ్రతలలో తేడాలు ఉంటాయి. భూమధ్య రేఖ నుంచి ఉత్తరానికి లేదా దక్షిణానికి ప్రయాణం చేస్తుంటే ఉష్ణోగ్రతలు తగ్గుతాయి.

ప్రశ్న 31.
హరిత గృహాలు గూర్చి వ్రాయుము.
జవాబు:
మొక్కలకు అనువైన వాతావరణాన్ని కృత్రిమంగా కల్పించటం ద్వారా అన్ని చోట్ల పంటలు పండించటానికి మానవులు ప్రయత్నించటం ఆశక్తికరంగా ఉంటుంది. బాగా చలిగా ఉండే ప్రదేశాలలో హరిత గృహాలు నిర్మించి కూరగాయలు, పళ్ళు పండిస్తున్నారు. హరిత గృహాల గోడలు పారదర్శకంగా ఉండి ఎండను లోపలికి రానిస్తాయి. కానీ బయటకు వెళ్ళనివ్వవు. వారికి అనువుగా మడులు కట్టి సాగునీరు ఇచ్చి నీటిని నిల్వ కడతారు.

AP Board 8th Class Social Solutions Chapter 2 సూర్యుడు - శక్తి వనరు

ప్రశ్న 32.
సూర్యుడు ప్రాణకోటికి ప్రాథమిక శక్తి వనరు. సూర్యరశ్మిని చెట్లు ఆహారంగా మార్చేసే ఫ్యాక్టరీలు, అటువంటి చెట్లను, అడవులను మనం పెంచుతున్నామా? తగ్గిస్తున్నామా? చెట్ల వల్ల కలిగే ప్రయోజనాలు చెట్లను పెంచే మన బాధ్యతను గురించి వివరించండి.
జవాబు:
మనం పెంచే చెట్లకన్నా అధికశాతం చెట్లను నరికివేస్తున్నాము.

చెట్లు వలన ఉపయోగాలు :

  1. చెట్లు వాతావరణంలోని గాలి వేడిని తగ్గిస్తాయి.
  2. చెట్లు సహజ ఎయిర్ కండిషనర్లుగా పనిచేస్తాయి.
  3. చెట్లు ధ్వని కాలుష్యాన్ని తగ్గిస్తాయి.
  4. చెట్ల నుంచి రాలిన ఆకులు నేలలోని ఉష్టాన్ని తగ్గిస్తాయి.
  5. చెట్లు పక్షులకు, కొన్ని జంతువులకు ఆవాసాన్నీ, ఆహారాన్ని అందిస్తాయి.
  6. చెట్లు CO2 ను తీసుకుని O2 ను వదిలి మనకు ఊపిరినిస్తాయి.
  7. చెట్లు నీటిని సముద్రంలోనికి పోకుండా పట్టి ఉంచుతాయి. నేలలో సారం కొట్టుకుపోకుండా ఉంచుతాయి. నీటిని నేలలోనికి ఇంకిపోయేలా చేస్తాయి. దీనిమూలంగా కలుషితమైన ఎక్కువ చోటు పారకుండా నేలలోనికి యింకిపోతాయి.

పట నైపుణ్యా లు

ప్రశ్న 33.
గ్లోబు – ఆసియా వైపు
పై చిత్రంలో సింగపూర్, షాంఘై, బ్లాడివోస్టాళ్లను గుర్తించంది. Page No. 28)

ప్రశ్న 34.
ప్రపంచ పటములో ఈ క్రింది వాటిని గుర్తించుము.
1. భూమధ్యరేఖ 2. ధృవాలు 3. రష్యా 4. ఆస్ట్రేలియా
జవాబు:

ప్రశ్న 35.
పై పటం పరిశీలించి క్రింది ప్రశ్నలకు సమాధానములు వ్రాయుము.
1. భూమధ్యరేఖకు దక్షిణాన ఉన్న రేఖ ఏది?
జవాబు:
మకరరేఖ.

2. ఈ పటం ఏ ప్రక్షేపణకు చెందినది?
జవాబు:
రాబిన్సన్ ప్రక్షేపణకు చెందినది.

3. భూమధ్యరేఖకు ఆనుకుని ఉన్న ఖండాలేవి?
జవాబు:
దక్షిణ అమెరికా, ఆఫ్రికా, ఆసియా.

ప్రశ్న 36.
హరిత గృహాలను ప్రశంసించండి.
జవాబు:
హరిత గృహాలనే గాజు గృహాలుగా కూడా పిలుస్తారు. ఇవి మొక్కలను పెంచడానికి నిర్మిస్తారు. ఇవి నియంత్రించబడిన వాతావరణాన్ని కలిగి ఉంటాయి. ఇవి మంచి వేడిని, నీటిని మొక్కలకి అందిస్తాయి. వీటి సృష్టి చాలా అద్భుతం.

ప్రశ్న 37.
‘భూగోళం వేడెక్కడం’ మూలంగా ఏం జరుగుతుంది?
జవాబు:
‘భూగోళం వేడెక్కడం’ మూలంగా ధృవాలలో ఉన్న మంచు కరిగి, సముద్రమట్టాలు పెరుగుతాయి. భూమి మీద ఖండాలన్నీ నీట మునుగుతాయి.

ప్రశ్న 38.
హరిత గృహాలను ప్రశంసించండి.
జవాబు:
హరిత గృహాలనే గాజు గృహాలుగా కూడా పిలుస్తారు. ఇవి మొక్కలను పెంచడానికి నిర్మిస్తారు. ఇవి నియంత్రించబడిన వాతావరణాన్ని కలిగి ఉంటాయి. ఇవి మంచి వేడిని, నీటిని మొక్కలకి అందిస్తాయి. వీటి సృష్టి చాలా అద్భుతం.

AP Board 8th Class Social Solutions Chapter 2 సూర్యుడు - శక్తి వనరు

ప్రశ్న 39.
భూగోళం వేడెక్కడం,మూలంగా ఏం జరుగుతుంది?
జవాబు:
భూగోళం వేడెక్కడం మూలంగా ధృవాలలో ఉన్న మంచు కరిగి, సముద్రమట్టాలు పెరుగుతాయి. భూమి మీద ఖండాలన్నీ నీట మునిగిపోతాయి.

AP Board 8th Class Social Solutions Chapter 1 పటాల అధ్యయనం – విశ్లేషణ

SCERT AP 8th Class Social Study Material Pdf 1st Lesson పటాల అధ్యయనం – విశ్లేషణ Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Social Solutions 1st Lesson పటాల అధ్యయనం – విశ్లేషణ

8th Class Social Studies 1st Lesson పటాల అధ్యయనం – విశ్లేషణ Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
మీ పాఠశాలలోని అట్లాస్ లో వివిధ విషయ నిర్దేశిత పటాలను క్షుణ్ణంగా అధ్యయనం చేయండి. (AS2)
జవాబు:
స్వయం అధ్యయనం

ప్రశ్న 2.
ప్రాచీన గ్రీకుల కాలం నాటికి, నేటికి పటాల వినియోగంలో మార్పులు వచ్చాయని భావిస్తున్నారా? పోలికలు, తేడాలు కింది పట్టికలో పొందుపరచండి. (AS1)

విషయంప్రాచీన గ్రీకుల కాలంలోప్రస్తుతం
పోలికలు
తేడాలు

జవాబు:

విషయంప్రాచీన గ్రీకుల కాలంలోప్రస్తుతం
పోలికలువారు అక్షాంశాలు, రేఖాంశాలు ఊహించి, వాటి సహాయంతో పటాలను కచ్చితంగా గీయడానికి ప్రయత్నించేవారు.నేడు ఉపగ్రహాల సహాయంతో పటాలను  ఒంపులతో సహా కచ్చితంగా గీస్తున్నారు.
తేడాలుపటాలు నావికులకు ఉపయోగపడటానికి రచించే వారు. వర్తక, వ్యాపార అభివృద్ధికి కూడా ఉపయోగించేవారు.తేడాలు నేడు పటాలను ప్రణాళికల కొరకు, దేశాభివృద్ధికి, వ్యూహరచనకు ఉపయోగిస్తున్నారు.

AP Board 8th Class Social Solutions Chapter 1 పటాల అధ్యయనం - విశ్లేషణ

ప్రశ్న 3.
వలసపాలకులు తుపాకుల ద్వారా కంటే పటాలు తయారు చేయడం ద్వారా ఆ ప్రాంతాలను బాగా దోచుకోగలిగారని, అదుపులో ఉంచగలిగారని చాలామంది భావిస్తారు. మీరు దీంతో ఏకీభవిస్తారా? కారణాలను తెలపండి. (AS1)
జవాబు:
అవును. నేను కూడా దీనితో ఏకీభవిస్తాను. ఇందుకు గల కారణాలు :

  1. ఐరోపా దేశాలు ఇతర ప్రపంచ దేశాలను తమ వలసలుగా మార్చుకోవడంతో, ఆ ప్రాంత వివరాలను తెలుసు కోవలసిన అవసరం ఏర్పడింది.
  2. వీరు పటాలను తయారుచేసేవారిని శాస్త్రబృందాలతో కలిపి ఆయా ప్రాంతాలకు పంపారు.
  3. వారు అక్కడ అన్ని ప్రాంతాలలోనూ ప్రయాణించి, శాస్త్రీయంగా అధ్యయనం చేసి పటాలు రచించారు.
  4. ఆ పటాలు ఆ ప్రాంత రవాణా సౌకర్యాలు, పంటలు, ఇతర వనరుల సమాచారాన్ని వెల్లడి చేశాయి.
  5. వీటి ఆధారంగా వలసపాలకులు ఆయా ప్రాంతాలపై తమ పాలనను పటిష్టపరచుకొని అక్కడి వనరులను దోచుకున్నారు.

ప్రశ్న 4.
టాలమీ లేదా ఇద్రిసీ తయారుచేసిన పటాలకు బ్రిటిష్ వాళ్లు తయారుచేసిన పటాలకు గల తేడాలు ఏమిటి? (AS5)
జవాబు:

బ్రిటిష్ వారి పటాలుటాలమీ ఇద్రిసి పటాలు
1. వీరు పటాలను ఆ ప్రాంతాలను, ఆ ప్రాంతాలలోని వనరులను దోచుకోవడానికి తయారుచేశారు.1. వీరు పటాలను వారి ఆసక్తి కోసం, వారి రాజుల కోసం తయారుచేశారు.
2. వీరి పటాలు వీరి వలసల సమాచారాన్ని అందిస్తున్నాయి.2. వీరి పటాలు ఐరోపా ఖండాన్ని, దాని చుట్టుప్రక్కల దేశాల్ని చూపించాయి.
3. ఇవి నేటి పటాలకు, వాస్తవానికి దగ్గరగా ఉన్నాయి.3. ఇవి వారి దేశాలను భూమికి మధ్యలో ఉంచాయి.
4. ఇవి పటానికి పైభాగాన ఉత్తరాన్ని సూచించాయి.4. అల్ ఇద్రిసి పటము పైభాగాన దక్షిణాన్ని సూచించింది.

ప్రశ్న 5.
ఎనిమిదవ పేజిలోని “మన కాలంలో పటాల వినియోగం” అనే అంశం చదివి ప్రశ్నకు జవాబు రాయండి.
వ్యాపారం, నౌకాయానం, యుద్ధాలు, వలస ప్రాంతాలను ఏర్పరచుకోవటం వంటి వాటికోసం పటాలు తయారుచేసి ఉపయోగించారని మనం తెలుసుకున్నాం. నేటి కాలంలో దేశ అభివృద్ధికి, ప్రణాళికలు తయారు చేయటానికి పటాలను విస్తృతంగా వినియోగిస్తున్నారు. ఒక ప్రాంతంలోని వనరులు, ఆ ప్రాంతం ఎదుర్కొంటున్న సమస్యలు వంటివి ప్రణాళికలు తయారు చేసేవాళ్లకు తెలియాలి. పటాల ద్వారా ఈ విషయాలు తెలుస్తాయి. ఉదాహరణకు తాగునీటి సమస్య ఉన్న ప్రదేశాలను చూపించే పటాన్ని తయారు చేయవచ్చు. ఈ పటాన్ని నీటి వనరులైన వర్షపాతం, భూ గర్భజలాలు, నదుల పటాలతో పోల్చవచ్చు. ఈ పోలికల ఆధారంగా ఆ ప్రాంతం ప్రజలందరికీ తాగునీరు అందించటానికి బోరుబావులు తవ్వటం, నదులకు అడ్డంగా ఆనకట్టలు కట్టడం, చెరువులు తవ్వటం లేదా దూర ప్రాంతం నుంచి పైపుల ద్వారా నీటిని చేరవేయడం – వీటిలో ఏది ఉత్తమమైన విధానమో నిర్ణయించవచ్చు. అదే విధంగా పటాల సహాయంతో వ్యవసాయ అభివృద్ధికీ, కొత్తగా పరిశ్రమలు నెలకొల్పటానికీ, రోడ్డు వెయ్యటానికి, ఆసుపత్రులు, పాఠశాలల నిర్మాణానికి ప్రణాళికలు తయారు చెయ్యవచ్చు.
ప్రస్తుతం పటాలను వివిధ ఉద్దేశాలతో ఉపయోగిస్తున్నారు? అవి ఏవి? (AS1)
జవాబు:

  1. నేటి కాలంలో దేశాభివృద్ధికి, ప్రణాళికలు తయారుచేయటానికి పటాలను విస్తృతంగా ఉపయోగిస్తున్నారు.
  2. పటాల సహాయంతో వ్యవసాయ అభివృద్ధికి, కొత్తగా పరిశ్రమలు నెలకొల్పడానికి, రోడ్లు వేయడానికి, ఆసుపత్రులు, పాఠశాలల నిర్మాణానికి ప్రణాళికలు తయారుచేయవచ్చు.
  3. కంపెనీలు తమ వ్యాపార కార్యకలాపాలు రూపొందించుకోవడానికి పటాలు తయారుచేస్తాయి.

AP Board 8th Class Social Solutions Chapter 1 పటాల అధ్యయనం - విశ్లేషణ

ప్రశ్న 6.
వివిధ రకాల పటాలను గురించి తెలుసుకోవడానికి కొన్ని ప్రశ్నలను తయారుచేయండి. (AS5)
జవాబు:

  1. ప్రపంచంలో దేశాల సరిహద్దులతో ముద్రించిన పటాలనేమంటాం? (ప్రపంచం – రాజకీయ పటం)
  2. ప్రపంచంలోని వివిధ భూ స్వరూపాలతో ముద్రించిన పటాలను ఏమంటాం? (ప్రపంచం – భౌగోళిక పటం)
  3. భారతదేశంలోని రాష్ట్రాలను సూచించే పటాన్ని ఏమంటాం? (భారతదేశం – రాజకీయపటం)
  4. భారతదేశంలో రవాణా సౌకర్యాలను సూచించే మానచిత్రాన్ని ఏమంటారు? (భారతదేశం – రవాణా సౌకర్యాలు)
  5. మన గ్రామం – చిత్తు పటాన్నేమంటాం? (గ్రామం – స్కెచ్ పటం)
  6. అల్ ఇద్రిసి, దామింగ్ హయితు, మెర్కేటర్ రూపొందించిన పటాల విశిష్టత ఏమిటి?
  7. పవిత్ర బైబిలు ప్రకారం ప్రపంచనమూనా ఎట్లా ఉండేది?

8th Class Social Studies 1st Lesson సూర్యుడు – శక్తి వనరు InText Questions and Answers

8th Class Social Textbook Page No.6

ప్రశ్న 1.
ప్రాచీన కాలంలో పటాల తయారీని నావికులు ఏ విధంగా ప్రభావితం చేశారు?
జవాబు:
ప్రాచీన కాలంలో నావికులు విస్తృతంగా సముద్ర ప్రయాణాలు చేసేవారు. వారు సందర్శించిన భూమిని గురించి, కలిసిన వ్యక్తులను గురించి, విన్న చరిత్రను గురించి, పుస్తకాలను రచించేవారు. దానికి సంబంధించిన పటాలను కూడా తయారుచేసేవారు. అవి పెద్దగా ప్రాచుర్యంలోనికి రానప్పటికీ చరిత్రకారులు వాటిని ఉపయోగించి తిరిగి పటాలను తయారుచేసేవారు.

ప్రశ్న 2.
పటాలను తయారు చేసేవాళ్ళు తమ దేశాన్ని పటం మధ్యలో ఎందుకు ఉంచారు?
జవాబు:
పటాలను తయారు చేసేవారు వాటిని తయారుచేయటానికి నావికుల, అన్వేషకుల రచనల మీద ఆధారపడేవారు. అంతేకాక వీరు అమిత దేశభక్తులని చెప్పవచ్చు. వీరు తమ దేశం ప్రపంచానికి మూలమని, చాలా ముఖ్యమైనదని భావించేవారు. అందుకే వీరు తమ దేశాన్ని పటం మధ్యలో ఉంచారు.

8th Class Social Textbook Page No.8

ప్రశ్న 3.
పటాలు అందరికీ అందుబాటులో ఉండటం మంచిదేనా? ఎందుకు?
జవాబు:
పటాలు అందరికీ అందుబాటులో ఉండటం మంచిది కాదు అని నా అభిప్రాయము. ఏ దేశ ప్రభుత్వానికైనా కొంత రహస్యత అవసరము. దేశ రక్షణకు సంబంధించిన పటాలు శత్రువుల చేతిలో పడినట్లయితే వాటిని దుర్వినియోగం చేసే అవకాశం ఉంటుంది. దేశ భద్రతకు ముప్పు వాటిల్లుతుంది. కానీ ఈ రోజుల్లో ఉపగ్రహ ఛాయాచిత్రాలు అందరికీ అందుబాటులోకి వచ్చేస్తున్నాయి.

ప్రశ్న 4.
ఆసుపత్రి నెలకొల్పటానికి అనువైన ప్రాంతాన్ని ఎంచుకోవాలనుకుంటున్న వ్యక్తికి ఏ ఏ పటాలు అవసరమవుతాయి? జాబితా తయారుచేయండి.
జవాబు:

  1. ఆసుపత్రుల పటము
  2. లాబొరేటరీల పటము
  3. స్కానింగ్ సెంటర్ల పటము
  4. అనారోగ్యం ఎక్కువగా ఏ ప్రాంతంలో ఉందో చూపించే పటము
  5. బస్సు రవాణా పటము
  6. రైలు రవాణా పటము
  7. బ్లడ్ బ్యాంకుల పటము

AP Board 8th Class Social Solutions Chapter 1 పటాల అధ్యయనం - విశ్లేషణ

ప్రశ్న 5.
కొత్త పాఠశాలలు, కళాశాలలు నెలకొల్పటానికి పటాలను ఎలా ఉపయోగించవచ్చో చెప్పండి. దీని కోసం ఏఏ పటాలను అధ్యయనం చేయవలసి ఉంటుంది?
జవాబు:
కొత్త పాఠశాలలు, కళాశాలలు నెలకొల్పడానికి ఆ ప్రాంతంలో పాఠశాలకు, కళాశాలకు వెళ్ళే విద్యార్థులు ఎంతమంది ఉన్నారు, వారు ఏయే ప్రాంతాలకు ఎంత దూరం వెళుతున్నారు, ఆ ప్రాంతంలో విద్యాలయం స్థాపించడానికి తగిన వసతి ఎక్కడ ఉన్నది, ఫీజు నిర్ణయించడానికి వారు ఏ స్థాయికి చెందినవారు మొదలైన అంశాలను తెలుసుకోవాలి. దీని కోసం జనాభా పటము, నివాస పటము, రవాణా పటము, నీటివసతి పటము మొదలైన వాటిని అధ్యయనం చేయాలి.

ప్రశ్న 6.
డేవిడ్ లివింగ్స్టన్, స్టాన్లీ, అముద్సన్ వంటి ప్రముఖ అన్వేషకుల జీవితాల గురించి తెలుసుకోండి. వారి అన్వేషణలకు అయ్యే ఖర్చును ఎవరు భరించారు? ఎందుకు?
జవాబు:
1. డేవిడ్ లివింగ్స్టన్ : 19-3-1813 నుండి 1-5-1873 వరకు జీవించాడు.
స్కాట్లాండ్ దేశస్థుడు. ఆఫ్రికాను కనుగొన్నాడు. లండన్ మిషనరీ సొసైటీ వారు పంపించారు.
ఈ వ్యాపారాన్ని వృద్ధి చేసి, క్రైస్తవాన్ని వ్యాపింపచేయడానికి.

2. సర్ హెన్రీ మోర్టన్ స్టాన్లీ : 21-1-1841 నుండి 10-5-1904 వరకు జీవించాడు.
డెంబిగ్-వేల్స్-యు.కె. దేశస్థుడు. న్యూయార్క్ హెరాల్డ్ పత్రికవారు పంపారు.
డేవిడ్ లివింగ్ స్టనను వెతికి పట్టుకోవడానికి.

3. రోల్డ్ అముడ్సన్ : 16-7-1872 నుండి 18-6-1928.
బోర్డ్-ఓ ఫోల్డ్ – నార్వే దేశస్థుడు.
బెల్జియన్ అంటార్కిటిక్ ఎక్స్ పెడిషన్ వారు పంపారు.
దక్షిణ ధృవ అన్వేషణకు పంపారు.

4. అల్ఫోన్సా డి అల్బుకర్క్ : పోర్చుగీసు నావికుడు.
పోర్చుగల్ రాజైన ఇమ్మాన్యుయేల్-I పంపారు.
హిందూ మహాసముద్రంలో పోర్చుగీసు వలస సామ్రాజ్యాన్ని స్థాపించడానికి

ప్రశ్న 7.
అన్ని వివరాలతో కూడిన పటాలను తయారు చేయటానికి వలస పాలకులు పెద్ద ఎత్తున నిధులు ఎందుకు వెచ్చించారు?
జవాబు:
పటాల తయారీ వలన వలసపాలకులకు తమ వలసల పట్ల, వాటి వనరుల పట్ల పూర్తి అవగాహన కలిగేది. తద్వారా వారు తమ వలస దేశాలను దోచుకోవడానికి వీలు కలిగేది. అందువలన వలస పాలకులు పటాల తయారీకి పెద్ద ఎత్తున నిధులు వెచ్చించారు.

AP Board 8th Class Social Solutions Chapter 1 పటాల అధ్యయనం - విశ్లేషణ

ప్రశ్న 8.
యుద్ధ సమయంలో సైన్యానికి పటాలు ఏ విధంగా ఉపయోగపడతాయి?
జవాబు:
యుద్ధ సమయంలో సైన్యానికి, ఎయిర్ ఫోర్స్ వారికి పటాలు అత్యంత ఆవశ్యకం. వారు ప్రాంతాల వివరాలను, సంస్థల ప్రాంతాలను, వారి గమ్యాల నిర్దేశానికి స్ట్రాటజీ’ పటాలను ఉపయోగిస్తారు.

ప్రశ్న 9.
పూర్వకాలంలో వారు పటాలను ఎలా తయారుచేసేవారు?
జవాబు:
నాటి భౌగోళిక శాస్త్రవేత్తలు విరివిగా ప్రయాణాలు చేసి వాటికి సంబంధించిన వివరాలను పుస్తకాల రూపంలో నమోదు చేసేవారు. పటాలను తయారు చేసేవారు. వీటిని ఆధారంగా చేసుకుని పటాలను తయారు చేసేవారు. ఇవి వాస్తవ దూరంగా ఉండి పెద్దగా వాడుకలోనికి రాలేదు. కానీ, చరిత్రకారులు వీటిని ఉపయోగించి పటాలను తిరిగి తయారు చేసేవారు.

ప్రశ్న 10.
ఎవరెస్టు శిఖరానికి ఆ పేరు ఎట్లు వచ్చింది?
జవాబు:
1802లో విలియం లాంటన్ ఒక ప్రముఖ సర్వేను చెన్నై నుండి ప్రారంభించారు. ఇది హిమాలయాల వరకు రేఖాంశాలను, ఇతర ఎత్తులను తెలుసుకోవడానికి ఉద్దేశించబడినది. ఈ సర్వే జార్జి ఎవరెస్ట్ చే పూర్తి చేయబడింది. ఈ సర్వేలోనే ‘ఎవరెస్ట్’ అన్ని శిఖరాలలోకి ఎత్తైనది అని ప్రపంచానికి వెల్లడైంది. కాబట్టి ఆ శిఖరానికి ఆయన పేరు పెట్టడం జరిగింది.

ప్రశ్న 11.
పటాలకు, చిత్రాలకు మధ్య గల భేదమేమి?
జవాబు:
పటం :
ముఖ్యమని భావించే అంశాలను చూపించడానికి భౌగోళిక శాస్త్రజ్ఞులు పటాలను ఉపయోగిస్తారు.

చిత్రం :
చిత్రం పటం వలే ఆ ప్రాంతంలోని నిజమైన అంశాలను కాక కేవలం కంటికి కనిపించే వాటిని మాత్రమే చూపిస్తుంది.

ప్రశ్న 12.
నిర్దేశిత పటాలను ఎట్లు చదవాలి?
జవాబు:

  1. ఒకే అంశంపై కేంద్రీకరించబడే పటాలను నిర్దేశిత పటాలు అంటారు.
  2. వీటిని చదవడానికి మనకు పటాలలో ఉపయోగించే గుర్తులు, రంగులు, వివిధ ఆచ్ఛాదనలు తెలిసి ఉండాలి.
    ఉదా : ముదురు ఊదా : కొండలు, నలుపు : సరిహద్దులు
    అప్పుడు మాత్రమే నిర్దేశిత పటాలను మనం చదవగలగుతాం.

ప్రశ్న 13.
ఐసోలైన్స్ అంటే ఏమిటి?
జవాబు:
సముద్ర మట్టం నుంచి ఒకే ఎత్తులో ఉన్న ప్రదేశాలన్నింటినీ కలిపే వాటిని ఐసోలైన్స్ అంటారు.

ప్రశ్న 14.
కాంటూరు రేఖల వలన ఉపయోగమేమి?
జవాబు:
కాంటూరు రేఖల వలన ఒక ప్రాంతపు ఎత్తును, పల్లాన్ని సులభంగా తెలుసుకోవచ్చును.

ప్రశ్న 15.
పూర్వకాలం నాటి పటం తయారీదారుల పేర్లను తెలపండి.
జవాబు:
గ్రీకులు, అరబ్బులు, చైనీయులు, సుమేరియన్లు, బాబిలోనియన్లు మరియు యూరోపియన్లు మొదలైనవారు పూర్వకాలం ఆనాటి పటం తయారీదారులు.

AP Board 8th Class Social Solutions Chapter 1 పటాల అధ్యయనం - విశ్లేషణ

ప్రశ్న 16.
సాంప్రదాయ సంకేతాలు అంటే ఏమిటి?
జవాబు:
పూర్వకాలం నాటి నుండి పటాల తయారీదారులు తమ సౌలభ్యం కోసం కొన్ని గుర్తులను ఉపయోగించేవారు. వాటినే సాంప్రదాయ సంకేతాలు అంటారు.

ప్రశ్న 17.
ఈ ప్రక్క నీయబడిన చిత్రాన్ని గమనించి మీ అభిప్రాయాన్ని రాయండి.
AP Board 8th Class Social Solutions Chapter 1 పటాల అధ్యయనం - విశ్లేషణ 1
జవాబు:

  1. ఈ పటం బైబిలును అనుసరించి ప్రపంచ నమూనా.
  2. ఇది చుట్టూ సముద్రంచే ఆవరించబడి, మూడు ఖండాలుగా విభజించబడినది.
  3. అవి ఆసియా, ఐరోపా మరియు ఆఫ్రికా.
  4. వీటిలో ఆసియా జెరూసలెంను కలిగి ఉన్న కారణంగా ప్రాముఖ్యతను సంతరించుకుని ఆ పటంలో సగభాగాన్ని ఆక్రమించింది.
  5. జెరూసలెం క్రీస్తు జన్మస్థలం. కావున అది పై భాగంలో చూపబడినది.

ప్రశ్న 18.
ప్రక్కనీయబడిన చిత్రాన్ని పరిశీలించి, ‘మెర్కేటర్ ప్రక్షేపణ’ పై మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.
AP Board 8th Class Social Solutions Chapter 1 పటాల అధ్యయనం - విశ్లేషణ 2
జవాబు:

  1. గెరార్డస్ మెర్కేటర్ ప్రఖ్యాతి గాంచిన భౌగోళిక శాస్త్రవేత్త మరియు కార్టో గ్రాఫర్.
  2. ఈయన ప్రక్షేపణ ప్రకారం భూమధ్యరేఖ నుండి ధృవాల వైపుకు వెళ్ళేకొలదీ ప్రదేశాల ఆకారాలు పెద్దవిగా కనబడతాయి.
    ఉదా : 1. గ్రీన్‌లాండ్ వాస్తవానికి చిన్నదైనా, ప్రపంచ పటంలో ఆఫ్రికా ఖండం అంత కనబడుతుంది. వాస్తవానికి ఆఫ్రికా గ్రీన్‌లాండ్, కన్నా 14 రెట్లు పెద్దది. గ్రీన్ లాండ్ అర్జెంటీనా దేశమంత మాత్రమే ఉంటుంది.
    2. అలాస్కా – బ్రెజిల్
    3. ఫిలాండ్ – ఇండియా

ప్రశ్న 19.
అల్ ఇద్రిసి జీవితాన్ని గురించి సమాచారాన్ని సేకరించి ఒక చిన్న వ్యాసం వ్రాయండి.
AP Board 8th Class Social Solutions Chapter 1 పటాల అధ్యయనం - విశ్లేషణ 3
జవాబు:
అప్రఫ్ అల్ ఇద్రిసి 1099లో జన్మించారు. ఆయన ముస్లిం భౌగోళిక శాస్త్రవేత్త. కార్టోగ్రాఫర్ మరియు యాత్రికుడు. రోజర్ – II అనే రాజు కొలువులో, సిసిలీలో నివసించేవారు. ఆయన చిన్నతనంలో చాలా జీవితం ఉత్తర ఆఫ్రికా, స్పెయిన్స్ లో ప్రయాణం చేశారు. ఆఫ్రికా, హిందూ మహాసముద్రం, దూర ప్రాచ్యానికి సంబంధించి ఇస్లాం వర్తకులు, అన్వేషకులు సేకరించి ఇచ్చిన సమారాన్ని క్రోడీకరించి ఇస్లాం పటాలను తయారుచేశారు. ఆయన దీనికి సంబంధించి ఒక గ్రంథాన్ని కూడా రచించారు. (ది టాబులా రోజియానా). ఈ పుస్తకాన్ని నార్మన్ రాజు అయినటువంటి రోజర్-II కోసం రచించారు. ఈయన సిసిలీలో 1165/1166లో మరణించారు.

ప్రశ్న 20.
ఈ క్రింది సమాచారాన్ని చదివి, ఈయబడిన ప్రశ్నలకు సమాధానమునిమ్ము.

పటాలలో ఎత్తు, పల్లాలను చూపడం : భూమిపై ఎత్తులు, పల్లాలు అంటే కొండలు, లోయలు, పీఠభూములు, మైదానాలు, నదీ పరీవాహక ప్రాంతాలు, రాళ్లు, ఇసుకతో కూడిన ప్రదేశాలు ఉంటాయి. పటాలు బల్లపరుపుగా ఉంటాయి. కాబట్టి వాటిలో ఎత్తు, పల్లాలను చూపించలేం. అందుకని వీటిని చూపించటానికి కాంటూరు రేఖలు అనే ప్రత్యేక సంకేతాలను ఉపయోగిస్తాం. సముద్ర మట్టం నుంచి ఒకే ఎత్తులో ఉన్న ప్రదేశాలన్నిటినీ కలిపే వాటిని కాంటూరు రేఖలు అంటారు. ఇంకోరకంగా చెప్పాలంటే ఒక కాంటూరు రేఖ మీద ఉన్న ప్రదేశాలన్నీ సముద్ర మట్టం నుంచి ఒకే ఎత్తులో ఉంటాయి. కాంటూరు రేఖలను ఐసోలైన్స్ అని కూడా అంటారు.
1. భూమిపై ఎత్తు, పల్లాలు అంటే ఏమిటి?
జవాబు:
భూమిపై ఎత్తు, పల్లాలు అంటే కొండలు, లోయలు, పీఠభూములు, మైదానాలు, నదీ పరీభాహక ప్రాంతాలు, రాళ్లు, ఇసుకతో కూడిన ప్రదేశాలు మొదలగునవి.

2. పటాలలో ఎత్తు, పల్లాలను ఎందుకు చూపించలేము?
జవాబు:
పటాలు బల్ల పరుపుగా ఉంటాయి. కాబట్టి వాటిలో ఎత్తు, పల్లాలను చూపించలేము.

3. ప్రత్యేక సంకేతాలు అంటే ………………………
జవాబు:
కాంటూరు రేఖలు

4. …………. నుంచి ఒకే ఎత్తులో ఉన్న ప్రదేశాలను కలిపే వాటిని కాంటూరు రేఖలు అంటారు.
జవాబు:
సముద్ర మట్టం

5. కాంటూరు రేఖలను …………………. అని కూడా అంటారు.
జవాబు:
ఐసోలైన్స్)

ప్రశ్న 21.
ఇచ్చిన వివరాలను పరిశీలించి ఈ క్రింది ప్రశ్నలకు జవాబులిమ్ము.
AP Board 8th Class Social Solutions Chapter 1 పటాల అధ్యయనం - విశ్లేషణ 4
1. పోర్చుగీసు అన్వేషకులు ఎవరు?
జవాబు:
ఫెర్డినాండ్ మాజిలాన్, వాస్కోడిగామా, బార్త్ లోవ్ మ్యూడియాస్.

2. మార్కోపోలో గురించి నీకేమి తెలుసును?
జవాబు:
మార్కోపోలో ఇటలీ దేశస్థుడు. 1254లో జన్మించాడు. ఆసియా ఖండాన్ని, చైనా దేశాన్ని అన్వేషించాడు. 1324లో మరణించాడు.

3. అమెరికాను కనుగొన్నదెవరు?
జవాబు:
క్రిస్టోఫర్ కొలంబస్

4. మాజిలాన్ జీవితకాలం ఏది?
జవాబు:
1480 నుండి 1521 వరకు

5. మొదటగా ప్రపంచాన్ని చుట్టి వచ్చినదెవరు?
జవాబు:
ఫెర్డినాండ్ మాజిలాన్

AP Board 8th Class Social Solutions Chapter 1 పటాల అధ్యయనం - విశ్లేషణ

ప్రశ్న 22.
మీ పాఠశాలకు సంబంధించి జనాభా పటాన్ని తయారుచేయుము.
జవాబు:
నేను గాంధీజీ మునిసిపల్ కార్పొరేషన్ ఎలిమెంటరీ పాఠశాలలో చదువుతున్నాను. మా పాఠశాలలో 5 తరగతి గదులు, ఒక ప్రధానోపాధ్యాయుని గది, స్టాఫ్ రూమ్, వంట గది, టాయ్ లెట్లు ఉన్నాయి. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 176.

తరగతివారీగావిద్యార్థులు
1వ తరగతి44
2వ తరగతి40
3వ తరగతి42
4వ తరగతి28
5వ తరగతి22

AP Board 8th Class Social Solutions Chapter 1 పటాల అధ్యయనం - విశ్లేషణ 5

ప్రశ్న 23.
ఇద్రిసి తయారుచేసిన పటంలో ‘దక్షిణం’ పై వైపు ఉండగా, గ్రీకులు తయారుచేసిన పటాలలో పై వైపు ఉత్తర దిశ ఎందుకు ఉంది?
జవాబు:
ఇస్లాం సాంప్రదాయాలు చాలా వరకు ప్రపంచంలోని ఇతర సాంప్రదాయాల కన్నా భిన్నంగా ఉంటాయి.
ఉదా : వారు వ్రాసే విధానం. అదేవిధంగా ఇద్రిసి పటంలో దక్షిణం పై వైపు ఉండి ఉండవచ్చు.
(లేదా)
సూర్యుని వైపు తిరిగి దానిని తూర్పుగా భావించి వారు కుడి చేతి వైపుకి ప్రాముఖ్యత యిచ్చి (అంటే దక్షిణానికి) దానిని పటంలో పైకి చూపించి ఉండవచ్చును.

ప్రశ్న 24.
ఈ క్రింది వివరణను చదివి దానికి సంబంధించి ఒక ప్రశ్నను వ్రాయుము.
“పటం తయారుచేసేవాళ్ళు ముఖ్యమనుకునే వాటిని చూపించే నమూనాగా పటాన్ని తయారుచేస్తారు. వీరు దేని – కోసం అన్న దాన్ని బట్టి వివిధ రకాల పటాలను తయారుచేస్తారు.”
జవాబు:
వివిధ రకాల పటాలను ఎందుకు తయారుచేస్తారు?

ప్రశ్న 25.
గ్రీకులు, రోమన్లు పటాల తయారీలో ఎందుకు ఆసక్తిని కలిగి ఉండేవారు?
జవాబు:
నాటి గ్రీకులకు, రోమన్లకు ప్రపంచ విజేతలు కావాలనే కోరిక ఎక్కువగా ఉండేది. అందుకే వారు పటాల తయారీలో ఎక్కువ ఆసక్తిని కలిగి ఉండేవారు.

పట నైపుణ్యాలు

8th Class Social Textbook Page No.4

ప్రశ్న 26.
అల్ ఇద్రిసి గీసిన పటంలో శ్రీలంకను, భారతదేశాన్ని గుర్తించండి.
జవాబు:
అల్ ఇద్రిసి పటంలో ద్వీపకల్ప పీఠభూమి ఉత్తర భారతదేశంలోనికి నెట్టివేయబడింది. తూర్పు, పశ్చిమ తీరాలు బాగా కలిసిపోయినాయి. దక్కను పీఠభూమి ఉత్తర, దక్షిణాలుగా వ్యాపించి కన్యాకుమారి వద్ద సూదిమొనగా తేలింది. శ్రీలంకను వాస్తవంగా ఉన్న దానికన్నా బాగా పెద్దదిగా చూపించారు. కావున అల్ ఇద్రిసి పటంలో భారతదేశాన్ని, శ్రీలంకను గుర్తించుట చాలా కష్టము.
AP Board 8th Class Social Solutions Chapter 1 పటాల అధ్యయనం - విశ్లేషణ 6
గమనిక : ఈ మ్యాపును చదువుటకు దీనిని తలక్రిందులు చేయాలి.

ప్రశ్న 27.
‘పటం -4లో భారతదేశం, అరేబియా, ఆఫ్రికాలను గుర్తించండి.
AP Board 8th Class Social Solutions Chapter 1 పటాల అధ్యయనం - విశ్లేషణ 7
జవాబు:
ఈ పటంలో భారతదేశం, అరేబియా, ఆఫ్రికాలు హిందూ మహాసముద్రంను దృష్టిలో వుంచుకొని చూపించారు. కావున అవి వాటి ఆకారాన్ని కొంతవరకు మాత్రమే పొందగలిగాయి. అవి పటంలో ఎడమచేతి వైపు క్రింది భాగంలో చిత్రించబడ్డాయి.

ప్రశ్న 28.
పటం 8ను చూడండి. బ్రిటిష్ కాలంలో తయారు చేసిన భారతదేశ పటంతో, నేటి భారతదేశాన్ని పోల్చండి.
AP Board 8th Class Social Solutions Chapter 1 పటాల అధ్యయనం - విశ్లేషణ 8
జవాబు:

  1. పటం 8లో ఉన్న భారతదేశ పటం బ్రిటిష్ కాలంలో 19వ శతాబ్దం ప్రారంభంలో తయారు చేశారు. అనగా ఇది 200 సం||ల క్రితం తయారైంది. ప్రస్తుత భారతదేశ పటం ఎప్పటికప్పుడు సవరించబడి నేటి రూపంలో ఉంది.
  2. నాడు బ్రిటిష్ వారు రూపొందించిన ఊహాపటం కాదిది. సర్వే నిర్వహించి రూపొందించిందే. అయితే నాడు ఉపగ్రహచిత్రాలు లేకపోవడం, సాంకేతిక అభివృద్ధి ప్రారంభంలో ఉండటంతో కొంత సమగ్రత లోపించింది. నేడు సాంకేతిక పరిజ్ఞానం సహకారంతో కచ్చితమైన పటాలను రూపొందించగలుగుతున్నాం.
  3. నాడు హిందుస్థాన్ లేక బ్రిటిష్ ఇండియా పేరుతో ఈ పటాన్ని రూపొందించారు. నేడు ఇండియా (భారతదేశం) పేరుతో దేశ పటాలను తయారు చేస్తున్నాం.
  4. ఇన్ బాక్స్ లో నాటి ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రావన్సీలైన బొంబాయి, మద్రాస్, కలకత్తాలు ముద్రించారు. నాటి పటంలో జమ్మూ, కాశ్మీర్ ప్రాంతాన్ని గుర్తించలేదు. నేటి మయన్మార్, బంగ్లాదేశ్, కాంబోడియా, వియత్నాం దేశాలను హిందూస్థాన్లో చేర్చారు. నేటి పటంలో ఈ దేశాలు మన సమీపంలోని దేశాలుగా తెల్లరంగులో ముద్రిస్తున్నాం.
  5. ఇండియన్ ఓషన్, బే ఆఫ్ బెంగాల్, అరేబియన్ సీ (హిందూమహా సముద్రం, బంగాళాఖాతం, అరేబియా ‘సముద్రం) నాడు, నేడూ ఒకే రకంగా ఉన్నాయి.
  6. పాకిస్థాన్‌ను బ్రిటిష్ వారి .హిందూస్థాన్ పటంలో చూపలేదు.

AP Board 8th Class Social Solutions Chapter 1 పటాల అధ్యయనం - విశ్లేషణ 9

ప్రశ్న 29.
క్రిందనీయబడిన ప్రపంచ పటములో ఈ క్రింది వాటిని గుర్తించుము.
1. ప్రస్తుత బాబిలోనియా (సుమేరియా
2. గ్రీసు
3. సిసిలీ
4. లిబియా
5. ఆసియా
6. ఐరోపా
7. అరేబియా
8. చైనా
9. ఉత్తర అమెరికా
10. దక్షిణ అమెరికా

AP Board 8th Class Social Solutions Chapter 1 పటాల అధ్యయనం - విశ్లేషణ 10

ప్రశ్న 30.
క్రిందనీయబడిన పటాన్ని చూచి, ఈ క్రింది. ప్రశ్నలకు సమాధానములిమ్ము.
AP Board 8th Class Social Solutions Chapter 1 పటాల అధ్యయనం - విశ్లేషణ 11
1. అరేబియా సముద్రంలోని దీవులేవి?
జవాబు:
లక్షదీవులు

2. గుర్తు దేనిని సూచిస్తుంది.
జవాబు:
గుర్తు సరిహద్దులను సూచిస్తుంది.

3. పటం యొక్క స్కేలు ఎంత?
జవాబు:
1 సెం.మీ. = 200 కిలోమీటర్లు

4. తూర్పు తీరంలోని ఏదేని ఒక రాష్ట్రం పేరు తెలుపుము.
జవాబు:
ఆంధ్రప్రదేశ్

5. పశ్చిమతీరంలోని ఏదేని ఒక రాష్ట్రం పేరు తెలుపుము.
జవాబు:
గుజరాత్

ప్రశ్న 31.
క్రిందనీయబడిన పటాన్ని చూచి, ఈ క్రింది ప్రశ్నలకు సమాధానములిమ్ము.
AP Board 8th Class Social Solutions Chapter 1 పటాల అధ్యయనం - విశ్లేషణ 12
1. ఆంధ్రప్రదేశ్ లో రెండు నదీ వ్యవస్థ పేర్లు రాయండి.
జవాబు:
కృష్ణా, గోదావరి.

2. ఉభయ గోదావరి జిల్లాల సాధారణ భౌగోళిక ఉన్నతి ఎంత?
జవాబు:
సముద్ర మట్టము నుండి 0 నుండి 150 మీటర్ల ఎత్తులో ఉన్నాయి.

3. మీ జిల్లా సాధారణ భౌగోళిక ఉన్నత ఎంత?
జవాబు:
విద్యార్థి కృత్యం.

ప్రశ్న 32.
క్రిందనీయబడిన పటాన్ని చూచి, ఈ క్రింది ప్రశ్నలకు సమాధానములిమ్ము.
AP Board 8th Class Social Solutions Chapter 1 పటాల అధ్యయనం - విశ్లేషణ 13
1. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పశ్చిమంగా ఉన్న రాష్ట్రం ఏది?
జవాబు:
తెలంగాణ

2. ఆంధ్రప్రదేశ్ లో అధిక వర్షపాతం (100 సెం.మీ.) కన్నా ఎక్కువ పొందే జిల్లాలు ఏవి?
జవాబు:
శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలు.

3. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాధారణ వర్షపాతం (70 సెం.మీ. – 100 సెం.మీ.) వర్షపాతం పొందే జిల్లాలు ఏవి?
జవాబు:
కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలు.

ప్రశ్న 33.
క్రిందనీయబడిన పటాన్ని చూచి, ఈ క్రింది ప్రశ్నలకు సమాధానములిమ్ము.
AP Board 8th Class Social Solutions Chapter 1 పటాల అధ్యయనం - విశ్లేషణ 14
1. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నందలి ఎన్ని రకాల మృత్తికాలున్నాయి?
జవాబు:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నందు ప్రధానంగా నాలుగు రకాల మృత్తికలున్నాయి.

2. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నందలి మృత్తికలు ఏ రకానికి చెందినవి?
జవాబు:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నందలి మృత్తికలు ఎర్ర, నల్లరేగడి, ఇసుక మరియు రాతి రకానికి చెందినవి.

3. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నందు నల్లరేగడి మృత్తికలు ఏ ఏ జిల్లాలలో ఉన్నాయి?
జవాబు:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నందు నల్లరేగడి మృత్తికలు ఉన్న జిల్లాలు

  1. కృష్ణా
  2. కర్నూలు
  3. ఉభయగోదావరి జిల్లాలలోని మధ్య ప్రాంతాలు.

4. పై పటాన్ని పరిశీలించగా అత్యధిక ప్రాంతంలో నల్లరేగడి నేలలు ఉన్న జిల్లా ఏది?
జవాబు:
కర్నూలు.

5. మీ జిల్లాలో ఏ రకమైన మృత్తికలు ఉన్నాయి?
జవాబు:
విద్యార్థి కృత్యం.

ప్రశ్న 34.
బాబిలోనియన్ల మట్టి పలకపై ఉన్న ప్రపంచ పటాన్ని ప్రశంసించండి.
జవాబు:
బాబిలోనియన్ల మట్టి పలకపై ప్రపంచపటం పర్షియన్ల కాలం నాటిది. అది సమతలంగాను, గుండ్రంగాను ఉన్నది. లోపలి ‘0’ లో వారికి తెలిసిన అన్ని ప్రాంతాలను చర్చించారు. బాబిలోనియాను పలక మధ్యలో చిత్రించారు. బయటి భాగంలో ఉప్పు సముద్రాన్ని చిత్రించారు. దానిలో 7 త్రికోణాకారపు దీవులను చూపించారు.
AP Board 8th Class Social Solutions Chapter 1 పటాల అధ్యయనం - విశ్లేషణ 15
వారి ఆలోచనా శక్తి, ఊహాశక్తి, దానిని తయారుచేసిన కళానైపుణ్యం చాలా ప్రశంసించతగినది.

ప్రశ్న 35.
అక్షాంశ, రేఖాంశాలను, గ్రిడ్ ను ఎవరు కనిపెట్టారు?
జవాబు:
హిప్పొర్కస్ గ్రీకు ఖగోళవేత్త (190-120 BC). ఈయన అక్షాంశ, రేఖాంశాల ఆధారంగా ఒక ప్రాంతాన్ని తెలుసుకోవచ్చని భావించాడు. టాలమీ గ్రీకు ఖగోళవేత్త మరియు గణిత విద్యా పారంగతుడు. ఈయన ఈజిప్టులో జీవించాడు. ఈయన – కూడా ఈ అక్షాంశ, రేఖాంశ విధానాన్ని అవలంబించాడు. ఇది తరువాత తరం నాటి పటాల తయారీదార్లను అనుసరించేలా చేసింది. కావున టాలమీ ఈ పటాల రచనకు శాస్త్రీయత అనే పునాది వేశాడని భావించవచ్చు.

AP 9th Class Social Important Questions Chapter 24 రోడ్డు భద్రతా విద్య

These AP 9th Class Social Important Questions 24th Lesson రోడ్డు భద్రతా విద్య will help students prepare well for the exams.

AP Board 9th Class Social 24th Lesson Important Questions and Answers రోడ్డు భద్రతా విద్య

9th Class Social 24th Lesson 1 Mark Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
వాహనాల రద్దీ ఎలా పెరిగింది?
జవాబు:
జనాభా, పారిశ్రామికీకరణ, నగరీకరణ, ప్రపంచీకరణ (గ్లోబలైజేషన్) వలన వాహనాల రద్దీ కూడా పెరిగింది.

ప్రశ్న 2.
క్రమబద్ధీకరణ అంటే ఏమిటి?
జవాబు:
రవాణా సులభతరం కావడానికి ఒక క్రమబద్ధీకరణ అవసరం. క్రమబద్దీకరణ అనగా రోడ్డును ఉపయోగించే వారందరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించటమే.

ప్రశ్న 3.
ట్రాఫిక్, రోడ్డు ట్రాఫిక్ అంటే ఏమిటి?
జవాబు:
ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వెళ్ళే వాటిని ట్రాఫిక్ అంటాం. అలాగే వాహనాలు ఒక చోటు నుంచి మరొక చోటుకు రోడ్డుమీద వెళ్లటాన్నే రోడ్డు ట్రాఫిక్ అంటాం.

ప్రశ్న 4.
ట్రాఫిక్ విద్య అంటే ఏమిటి?
జవాబు:
ట్రాఫిక్ నియమ నిబంధనలు సరళంగా, స్పష్టంగా వివరించి తెలియజేయడాన్ని ట్రాఫిక్ విద్య అంటాం.

AP 9th Class Social Important Questions Chapter 24 రోడ్డు భద్రతా విద్య

ప్రశ్న 5.
రోడ్డును ఉపయోగించే వారి సంఖ్య ఎలా పెరిగింది?
జవాబు:
జనాభా పెరగడం, వాహనాల వినియోగం కూడా పెరగడం మూలంగా రోడ్డును ఉపయోగించుకునే వారి సంఖ్య పెరిగింది.

ప్రశ్న 6.
డ్రైవింగ్ లైసెన్స్ ఎన్ని రకాలు? అవి ఏవి?
జవాబు:
డ్రైవింగ్ లైసెన్స్ రెండు రకాలు :

  1. లెర్నర్ లైసెన్స్, ఇది తాత్కాలికమైనది. డ్రైవింగ్ నేర్చుకొనుటకు ఆరు నెలల కాలపరిమితితో దీనిని జారీ చేస్తారు.
  2. శాశ్వత లైసెన్స్ తాత్కాలిక లైసెన్స్ జారీ చేసిన ఒక నెల తరువాత నుంచి శాశ్వత లైసెన్స్ పొందుటకు అర్హత లభిస్తుంది.

ప్రశ్న 7.
ట్రాఫిక్ గుర్తులు ఎన్ని రకాలు? అవి ఏవి?
జవాబు:
ట్రాఫిక్ గుర్తులు మూడు రకాలు.

  1. తప్పనిసరిగా పాటించవలసిన గుర్తులు (ఎర్ర వృత్తాలు ఏమి చేయగూడదో తెలుపుతాయి)
  2. సమాచార గుర్తులు (నీలంరంగు దీర్ఘచతురస్రంలోని గుర్తులు)
  3. జాగ్రత్తపరచే గుర్తులు (ముక్కోణంలో ఉన్న గుర్తులు జాగ్రత్త పడేలా చేస్తాయి)

ప్రశ్న 8.
జీబ్రా క్రాసింగ్ అంటే ఏమిటి?
జవాబు:
జీబ్రా క్రాసింగ్ – పాదచారులు రోడ్డును ఒక వైపు నుంచి మరొకవైపుకు దాటడానికి ఉద్దేశించినది. ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ప్రాంతాలలో వీటిని సూచిస్తారు.

ప్రశ్న 9.
ట్రాఫిక్ గుర్తులు అనగానేమి?
జవాబు:
వాహనాలను ప్రమాదరహితంగా నడపటానికి వీలుగా రెండు లేదా అంతకన్నా ఎక్కువ రోడ్లు కలిసిన ప్రాంతంలో ఏర్పాటు చేసిన గుర్తులను సూచించే పరికరాన్ని ట్రాఫిక్ గుర్తులు అంటారు.

ప్రశ్న 10.
రోడ్డు భద్రతకు అడ్డంకులు ఏవి?
జవాబు:
పౌరుల నిర్లక్ష్యం, రోడ్డుల స్థితి మంచిగా లేకపోవడం, రోడ్డు భద్రతా ప్రమాదాలు అమలు జరగకపోవడం, అత్యవసర సేవలు తక్కువగా ఉండటం, చట్టాల అమలు సక్రమంగా లేకపోవటడం రోడ్డు భద్రతకు అడ్డంకులు.

AP 9th Class Social Important Questions Chapter 24 రోడ్డు భద్రతా విద్య

ప్రశ్న 11.
రోడ్డు ప్రమాదాలకు ప్రధానమైన ఏవేని రెండు కారణాలను రాయండి.
జవాబు:

  1. ట్రాఫిక్ విద్యపట్ల అవగాహన లేకపోవడం
  2. అపరిమితమైన వేగం
  3. త్రాగి వాహనాలు నడపడం
  4. ఫుట్ బోర్డుపై నిలబడి ప్రయాణించడం
  5. సీట్ బెల్ట్, హెల్మెట్ లను ఉపయోగించకపోవడం మొ||వి.

9th Class Social 24th Lesson 2 Marks Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
కింది ‘పై’ చార్టు 2006 సం||లో రోడ్డు ప్రమాదాలు, బాధితుల వయస్సు, వారి వివరాలు వున్నాయి. చార్టును పరిశీలించి ప్రశ్నకు సమాధానం రాయండి.
AP 9th Class Social Important Questions Chapter 24 రోడ్డు భద్రతా విద్య 1
‘పై’ చార్టులోని వివరాల ఆధారంతో విర్ధారణకు రాదగిన ప్రధానమైన విషయం ఏమిటి?
జవాబు:
పై చార్టులోని వివరాల ఆధారంతో నిర్ధారణకు రాదగిన ప్రధానమైన విషయం ఏమిటంటే.

  1. రోడ్డు ప్రమాదబాధితులలో అన్ని వయస్సుల వారూ ఉన్నారు.
  2. రోడ్డు ప్రమాద బాధితుల సంఖ్య 25-35 సంవత్సరాల మధ్య వయస్సు కలవారిలో ఎక్కువగా ఉంటోంది.
  3. యుక్త వయస్సు పిల్లలు స్వతంత్రతను ఎక్కువగా కోరుకోవడంతో ఎక్కువ ప్రమాదాల బారిన పడుతు.
  4. కౌమార దశలోని పిల్లలే రోడ్డును ఉపయోగించే వారిలో ఎక్కువ.
  5. వీటన్నింటికీ కారణం ప్రజలకు ట్రాఫిక్ విద్య పట్ల అవగాహన లేకపోవడం.
  6. ప్రమాదాల నివారణకి ప్రజలకు ట్రాఫిక్ విద్య, రోడ్డు భద్రత పట్ల అవగాహన కలిగించడం తప్పనిసరి.

9th Class Social 24th Lesson 4 Marks Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
AP 9th Class Social Important Questions Chapter 24 రోడ్డు భద్రతా విద్య 2

ప్రశ్న : పై సమాచారాన్ని విశ్లేషించి దాని ఆధారంగా ట్రాఫిక్ విద్య యొక్క అవసరాన్ని, ప్రాముఖ్యతను తెలపండి.
జవాబు:

  1. ట్రాఫిక్ గుర్తులను పాటించకపోవడం వలన ప్రమాదాలు జరగటానికి అవకాశం ఉంటుంది.
  2. ప్రమాదాలు ఒక్కొక్కసారి తీవ్ర గాయాలు, అంగవైకల్యానికి దారితీయవచ్చు.
  3. ఘోర ప్రమాదాలు జరిగి విలువైన ప్రాణాలను కోల్పోవటానికి అవకాశం ఉంటుంది.
  4. ట్రాఫిక్ గుర్తులను పాటించకపోవడం వలన మనకు మాత్రమేగాక ఎదుటివారికి కూడా హాని జరగవచ్చు.
  5. విలువైన వాహనాలు దెబ్బతింటాయి.
  6. అందువల్ల ట్రాఫిక్ గుర్తులను పాటిస్తూ మన ప్రాణాలను కాపాడుకుంటూ, ఎదుటివారి ప్రాణాలకు కూడా రక్షిణ కల్పిస్తే మానవ జీవితానికి సార్థకత చేకూరుతుంది.

ప్రశ్న 1.
శ్వాస పరీక్ష పరికరం ఎలా పనిచేస్తుంది?
జవాబు:

  1. ఎవరైనా ఆల్కహాల్ తీసుకున్నట్లయితే అది రక్తంలో కలిసిపోయి, వారి శరీరం మొత్తానికి రక్తం ద్వారా వ్యాపిస్తుంగ్.
  2. ఊపిరితిత్తులలోకి చేరడం ద్వారా ఆ వ్యక్తి విడిచిపెట్టే గాలిలో ఆల్కహాల్ కు సంబంధించిన ఆనవాలును ఒక ఎలక్ట్రానిక్ పరికరం ద్వారా గుర్తించగలం.
  3. ఆల్కహాల్ తీసుకున్న వ్యక్తి విడిచి పెట్టే గాలిలో కార్బన్ డై ఆక్సైడ్ తో పాటుగా ఆల్కహాల్ ఆనవాలు కూడా ఉంటుంది.
  4. ఇది తక్కువ మోతాదులో ఉన్నప్పటికీ ఈ పరికరం గుర్తించగలదు.
  5. ఒకవేళ ఈ పరికరం ద్వారా పరీక్షించిన అనంతరం సంబంధిత అధికారులు నిందితులకు మేలు చేయాలని ప్రయత్నించినా ఆ పరికరంలో నమోదైన విషయాలను తొలగించే అవకాశం లేదు.

ప్రశ్న 2.
డ్రైవింగ్ లైసెన్స్ ను ఎలాంటి పరిస్థితులలో రద్దు చేయవచ్చును?
జవాబు:
ఈ కింది సందర్భాల్లో ప్రాంతీయ ట్రాన్స్పోర్టు అధికారి లైసెన్సులను రద్దు చేయు అధికారం కలిగి ఉన్నారు.
ఒక వ్యక్తి :

  1. నిత్య తాగుబోతు అయినా
  2. ప్రమాదభరిత మత్తు పదార్థాలకు అలవాటుపడినా
  3. తన వాహనాన్ని నేరపూరిత విషయాలకు ఉపయోగించినా
  4. ప్రమాదభరితంగా వాహనాన్ని నడిపినా
  5. రిజిస్ట్రేషన్ చేయించకుండా వాహనాలను ఉపయోగించినా
  6. పోలీసు అధికారులు అడిగిన సమాచారాన్ని అందించకున్నా
  7. ప్రమాదం జరిగిన సందర్భంలో బాధితులను దగ్గరలోని హాస్పిటల్ కు చేర్చకపోయినా
  8. పోలీసులు అడిగినపుడు కింద ఇవ్వబడిన ధ్రువపత్రాలను చూపకపోయినా
    – ఇన్స్యూరెన్స్ సర్టిఫికెట్
    – రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్
    – డ్రైవింగ్ లైసెన్స్
    – కాలుష్య నియంత్రణ సర్టిఫికెట్

AP 9th Class Social Important Questions Chapter 24 రోడ్డు భద్రతా విద్య

ప్రశ్న 3.
ప్రమాదాలను నివారించడానికి డ్రైవరకు ఎలాంటి సలహాలు ఇవ్వవలెను?
జవాబు:
డ్రైవరుకు సలహాలు :

  1. రోడ్డుకు ఎడమవైపున ఉండి కుడివైపున వేగంగా వెళ్లే వాహనాలకు దారి వదలాలి.
  2. ఎడమవైపు నుంచి వాహనాలను దాటరాదు.
  3. రక్షిత ప్రయాణానికి ఎల్లప్పుడూ హెల్మెట్ ధరించాలి.
  4. తక్కువ కార్బన్ మోనాక్సైడ్ వదిలే వాహనాలనే ఉపయోగించాలి.
  5. అనవసరంగా హారన్ మోగించరాదు.
  6. భారీ వాహనదారులు తప్పనిసరిగా సీటు బెల్టులు ఉపయోగించాలి.
  7. ట్రాఫిక్ సిగ్నల్స్ ను అతిక్రమించరాదు.
  8. తమ వాహనాన్ని మంచి స్థితిలో ఉంచుకోవాలి.

ప్రశ్న 4.
రోడ్డు భద్రతకు అడ్డంకులు ఏవి?
జవాబు:
రోడ్డు భద్రతకు అడ్డంకులు :

  1. పౌరుల నిర్లక్ష్యం
  2. రోడ్ల నాణ్యత మంచిగా లేకపోవడం
  3. వాహనాల నిర్మాణం రక్షణపరంగా లేకపోవడం
  4. రోడ్డు భద్రతా ప్రమాణాలు అమలు జరగకపోవడం
  5. చట్టాల అమలు సక్రమంగా లేకపోవడం
  6. అత్యవసర సేవలు తక్కువగా ఉండటం

ప్రశ్న 5.
పాదచారులు పాటించవలసిన నిబంధనలు ఏవి?
జవాబు:
పాదచారులకు నిబంధనలు :

  1. పాదచారులు తమకు’ నిర్దేశించిన మార్గంలోనే నడవాలి. ఒకవేళ అలాంటి ప్రత్యేక మార్గం లేకుంటే, రోడ్డు ఇరుకుగా ఉంటే రోడ్డుకు కుడివైపున ఎదురుగా వస్తున్న వాహనాలను పరిశీలిస్తూ నడవాలి.
  2. రాత్రివేళ బయట రోడ్డుపై నడుస్తున్నప్పుడు తప్పనిసరిగా ప్రతిబింబించే దుస్తులను ధరించాలి.
  3. రాత్రివేళల్లో నడిచేటప్పుడు విధిగా టార్చిలైట్ దగ్గర ఉంచుకోవాలి.
  4. రోడ్డును దాటునపుడు ఎడమవైపు, కుడివైపు చూసి వాహనాలు రాకుండా ఉన్నప్పుడు దాటాలి.
  5. ఒకవేళ వాహనాలు రెండువైపులా, వస్తూ ఉంటే అవి వెళ్లే వరకు వేచి ఉండాలి.
  6. వాహనాలు రాకుండా ఉన్నప్పుడు వేగంగా నడుచుకుంటూ రోడ్డును దాటాలి. రెండువైపులా వాహనాలు వస్తున్నాయో లేదో గమనించాలి.
  7. రోడ్డును దాటుటకు జీబ్రా క్రాసింగ్ ను ఉపయోగించుకోవాలి.
  8. రోడ్డుపై నడుస్తున్నపుడు, రోడ్డును దాటుతున్నపుడు మొబైల్ ఫోన్ ను ఉపయోగించరాదు.
  9. ట్రాఫిక్ పోలీస్ సహాయంతో రోడ్డును దాటాలి.

ప్రశ్న 6.
ద్విచక్ర వాహనదారులు పాటించవలసిన నిబంధనలు ఏవి?
జవాబు:
ద్విచక్ర వాహనదారులకు నిబంధనలు :

  1. గడువు తీరని డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.
  2. బీమా చేయించుకుని మాత్రమే వాహనాన్ని రోడ్డుపై నడపాలి.
  3. వాహనదారులు హెల్మెట్ ధరించాలి.
  4. వాహనం వెనుక సీటుపై ఒక్కరినే కూర్చోబెట్టుకోవాలి. అతడు కూడా సక్రమంగా కూర్చోవాలి.

AP 9th Class Social Important Questions Chapter 23 విపత్తుల నిర్వహణ

These AP 9th Class Social Important Questions 23rd Lesson విపత్తుల నిర్వహణ will help students prepare well for the exams.

AP Board 9th Class Social 23rd Lesson Important Questions and Answers విపత్తుల నిర్వహణ

9th Class Social 23rd Lesson 1 Mark Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
వైపరీత్యా లేవి?
జవాబు:
మానవుల నిర్లక్ష్యం వల్ల లేదా కావాలని ఒక వ్యక్తి లేదా బృందం చేసే పనుల వల్ల ఏర్పడే వైపరీత్యాలను మానవ కారణంగా ఏర్పడే వైపరీత్యాలని చెప్పవచ్చు.

ప్రశ్న 2.
అధికశాతం రోడ్డు ప్రమాదాలు ఎలా జరుగుతున్నాయి?
జవాబు:
అధికశాతం ప్రమాదాలు నిర్లక్ష్యం, ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించడం, తాగి వాహనం నడపటం, వాహనాలు సరైన స్థితిలో ఉండకపోవటం, వాతావరణ పరిస్థితులు సరిగా లేకపోవటం వంటి కారణాల వల్ల జరుగుతున్నాయి.

ప్రశ్న 3.
రైలు ప్రమాదాలు ఎందుకు జరుగుతాయి?
జవాబు:
రైలు మార్గాల నిర్వహణ సరిగా లేకపోవటం, మానవ పొరపాటు, విద్రోహ చర్యలు వంటి వాటి కారణంగా ప్రమాదాలు జరుగుతుంటాయి.

ప్రశ్న 4.
విమాన ప్రమాదాలకు కారణాలేవి?
జవాబు:
విమానాల పెరుగుదల, సాంకేతిక సమస్యలు, అగ్ని, పైకి ఎగిరేటప్పుడు ఉండే. పరిస్థితులు, విమానం వెళ్ళే దారి, హైజాకింగ్, బాంబు దాడుల వంటి సమయాల్లో విమానాశ్రయాల్లో ఉండే భద్రత వంటి అనేక అంశాలు విమాన ప్రమాదాలకు కారణాలవుతున్నాయి.

AP 9th Class Social Important Questions Chapter 23 విపత్తుల నిర్వహణ

ప్రశ్న 5.
నిప్పును ఎలా ఆపవచ్చు?
జవాబు:
వేడిమి, ఇంధనం, ప్రాణవాయువు – ఈ మూడు కలిసినప్పుడు అగ్ని ప్రమాదం జరుగుతుంది. ఈ మూడింటిలో ఏదో ఒకటి అందకుండా చేయటం ద్వారా నిప్పును ఆపవచ్చు.

ప్రశ్న 6.
ప్రకృతి వైపరీత్యాలు అని వేటిని చెప్పవచ్చు?
జవాబు:
ప్రకృతి సిద్ధంగా మానవ ప్రమేయం లేకుండా సంభవించే తుపాన్లు, సునామీలు, వరదలు, భూకంపాలు, అగ్ని పర్వతాలు పేలడం, కొండచరియలు విరిగిపడటం మొ||నవి ప్రకృతి వైపరీత్యాలని చెప్పవచ్చు.

ప్రశ్న 7.
మానవుల కారణంగా ఏర్పడే విపత్తులకు ఉదాహరణలు ఇవ్వండి.
జవాబు:

  1. రోడ్డు, రైలు, విమాన ప్రమాదాలు.
  2. అగ్నిమాపక ప్రమాదాలు.
  3. ఉగ్రవాద చర్యలు మొదలైనవి.

9th Class Social 23rd Lesson 2 Marks Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
వాహనాలను ఏ వ్యక్తులు నడపరాదు?
జవాబు:

  1. మద్యం సేవించి ఉన్నవారు.
  2. జబ్బు పడినవారు, గాయాల పాలైనవారు.
  3. కోపంగా లేదా ఆందోళనగా ఉన్నవారు.
  4. అలసిపోయి ఉన్నవారు.
  5. ఏకాగ్రత లేనివారు.

ప్రశ్న 2.
ఘోర ఘటనల తరవాత తల్లిదండ్రులకు గల సూచనలు ఏవి?
జవాబు:

  1. ఘోర ఘటనల తరవాత పెద్దవాళ్ళు మొట్టమొదట తమ పిల్లలపై దృష్టి పెట్టాలి.
  2. వాస్తవాలను, పుకార్లను వేరు చేయటంలో పిల్లలకు ‘సహాయపడాలి.
  3. తెలిసిన వాస్తవాలను పిల్లలతో చర్చించి ఊహగానాలకు, అతిశయోక్తులకు తెరదించాలి.

AP 9th Class Social Important Questions Chapter 23 విపత్తుల నిర్వహణ

ప్రశ్న 3.
అగ్ని ప్రమాద సమయంలో చేయవలసిన పనులు మూడు రాయండి.
జవాబు:
అగ్ని ప్రమాద సమయంలో

  1. నిప్పు లేదా పొగ చూసినప్పుడు అలారం మ్రోగించాలి లేదా హెచ్చరిక జారీ చేయాలి.
  2. ఫోన్ ఎక్కడుందో తెలుసుకొని 101 కి ఫోన్ చేయండి. నిదానంగా, స్థిమితంగా మీ చిరునామా చెప్పి అగ్నిమాపక దళాన్ని పంపమని చెప్పండి.
  3. విద్యుత్ స్విచ్చులన్నీ తీసేసి ఉంచాలి. మెయిన్ స్విచ్ ను కట్టేయటం ఉత్తమం.

ప్రశ్న 4.
మన దేశంలో విమాన ప్రమాదాలకు గల కారణాలు ఏవి?
జవాబు:
విమాన ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. దీనికి అనేక కారణాలు ఉన్నాయి.

  • విమానాల పెరుగుదల
  • విమానాలలో తలెత్తే సాంకేతిక సమస్యలు .
  • విమానాలు దిగేటప్పుడు, పైకి ఎగిరేటప్పుడు ఉండే పరిస్థితులు
  • విమానం వెళ్ళే దారిలో పర్వతాలు ఉండడం లేదా తరచు తుపానులు సంభవించటం ఊ హైజాకింగ్
  • బాంబు దాడులు మొదలగునవి.

AP 9th Class Social Important Questions Chapter 22 మహిళా రక్షణ చట్టాలు

These AP 9th Class Social Important Questions 22nd Lesson మహిళా రక్షణ చట్టాలు will help students prepare well for the exams.

AP Board 9th Class Social 22nd Lesson Important Questions and Answers మహిళా రక్షణ చట్టాలు

9th Class Social 22nd Lesson 1 Mark Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
అక్రమ రవాణా రూపాలు ఏవి?
జవాబు:
లైంగిక దాడి, చట్ట వ్యతిరేక కార్యగ-2 వెస్ట్ – 30, ఇళ్లలో పని, వ్యవసాయకూలీ, నిర్మాణకూలీల చేత ఎక్కువ పని చేయించుకొని వారి శ్రమను దోచుకోవడం, పైశాచిక ఆనందం మొ||నవి అక్రమ రవాణా రూపాలు.

ప్రశ్న 2.
సెక్స్ వర్కర్స్ అనగా నారు?
జవాబు:
బలవంతంగా వ్యభిచారం చేయించడం నేరం. ఈ విధంగా వ్యభిచారం చేసే వారిని సెక్స్ వర్కర్స్ అంటారు. వీరి రక్షణకు సంబంధించిన ఎన్నో చట్టాలు అమల్లో ఉన్నాయి.
(లేదా)
బలషంతంగా వ్యభిచారం చేయించి, ఆ తదుపరి తప్పనిసరి పరిస్థితులలో వ్యభిచారం చేసే వారిని సెక్స్ వర్కర్స్ అంటారు.

ప్రశ్న 3.
అక్రమ రవాణాకు శిక్ష ఎలాంటిది?
జవాబు:
అక్రమ రవాణా ఒక పెద్ద నేరం. ఈ నేరానికి 7 సం||రాల కఠిన కారాగార శిక్ష నుండి జీవిత ఖైదు వరకు శిక్షతో పాటు జరిమానా కూడా విధించవచ్చు.

AP 9th Class Social Important Questions Chapter 22 మహిళా రక్షణ చట్టాలు

ప్రశ్న 4.
గృహ హింస రూపాలు ఏవి?
జవాబు:
గృహ హింస రూపాలు :
లైంగిక అత్యాచారం, భౌతిక అత్యాచారం, మానసిక క్షోభకు గురిచేయటం, మానసిక అత్యాచారం, ఆర్థిక అత్యాచారం.

ప్రశ్న 5.
న్యాయ సహాయం పొందటానికి అర్హులు ఎవరు?
జవాబు:
షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలవారు, మానవ అక్రమ రవాణా బాధితులు, యాచకులు, స్త్రీలు, పిల్లలు, మతిస్థిమితం లేని వారు, అవిటివారు, ప్రకృతి వైపరీత్యాల బాధితులు, వ్యవసాయ, పారిశ్రామిక కార్మికులు, హిరసాకాండ, కులవైషమ్యాల బాధితులు, రూ. 50,000 కంటే తక్కువ సాంవత్సరిక ఆదాయం కలవారు న్యాయసహాయం పొందటానికి అర్హులు.

ప్రశ్న 6.
ఉచిత న్యాయసహాయం కోరేవారు ఎవరికి దరఖాస్తు చేసుకోవాలి?
జవాబు:
ఉచిత న్యాయ సహాయం కోరువారు తమ తమ జిల్లాలకు చెందిన జిల్లా కోర్టులందు, రాష్ట్ర హైకోర్టునందు గల జిల్లా ఆ న్యాయసేవా అధికార సంస్థలకు గాని తమ కేసు వివరాలను తెలుపుతూ దరఖాస్తు చేసుకోవచ్చును.

ప్రశ్న 7.
న్యాయ సహాయ విధానాలు ఏవి?
జవాబు:
న్యాయ సహాయ విధానాలు – న్యాయవాదిచే ఉచితంగా న్యాయ సలహా ఇప్పించుట, కోర్టులో కేసులు చేపట్టడం, కోర్టు ఫీజు, కేసుకు సంబంధించిన కోర్టు ఖర్చులు భరించడం, కేసులలో తీర్పుల నకళ్లు ఉచితంగా ఇవ్వడం మొదలైన సహాయాలు అందించబడతాయి.

ప్రశ్న 8.
మహిళల మరియు బాలికల సంరక్షణకు భారత ప్రభుత్వం అనేక చట్టాలను చేసింది. భారత ప్రభుత్వం అమలు చేసిన .. అలాంటి ఏవైనా రెండు చట్టాలను పేర్కొనండి.
జవాబు:

  1. బాల్య వివాహాల నిషేధ చట్టం – 2006
  2. అక్రమ రవాణా నిరోధక చట్టం – 1956
  3. వరకట్న నిషేధ చట్టం – 1961
  4. అత్యాచారం, లైంగిక వేధింపుల చట్టం (నిర్భయ చట్టం) – 2013

9th Class Social 22nd Lesson 2 Marks Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
బాల్య వివాహ నిషేధ చట్టం అమలులో ఉన్నా అక్కడక్కడా బాల్య వివాహాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఈ దురాచారాన్ని ఆపడానికి కొన్ని చర్యలను సూచించండి. ,
జవాబు:

  1. మొదటగా తల్లిదండ్రులకు బాలికలకు విద్యను ఇవ్వడం వల్ల కలిగే లాభాలను వివరించడం.
  2. బాల్య వివాహం వలన కలిగే అనర్థాలను వివరించి వారిలో చైతన్యం తీసుకువచ్చి బాల్య వివాహాలను ఆపివేయించాలి.
  3. కొంతమంది తల్లిదండ్రులు మూర్బంగా వ్యవహరిస్తే అప్పుడు అధికారులకు సమాచారం అందించి వివాహాలను ఆపివేయించాలి.
  4. బాల్యవివాహాల వలన కలిగే అనర్థాలను టి.వి., షార్ట్ ఫిలిమ్ ల ద్వారా వారికి ప్రత్యక్ష సంఘటనలను మరియు పరోక్ష సంఘటనలను గురించి వివరించాలి.

AP 9th Class Social Important Questions Chapter 22 మహిళా రక్షణ చట్టాలు

ప్రశ్న 1.
అక్రమ రవాణా అంటే ఏమిటి?
జవాబు:
అక్రమ రవాణా అంటే వ్యక్తులను వారి ఇష్టానికి విరుద్దంగా తరలించడం, అధికారికంగా లొంగదీసుకోవటం, భయపెట్టి పని చేయించుట, జీవనోపాధి లేదా వివాహం లాంటి ఆశ చూపి తెలియని ప్రాంతాలకు తరలించి వెట్టిచాకిరి చేయించడం, లైంగిక దోపిడీ లాంటి కృత్యాలకు పాల్పడటం లేదా అమ్మకానికి పెట్టడం.

ప్రశ్న 2.
బాల్య వివాహం చేసుకుంటే పురుషుడికి విధించే శిక్ష?
జవాబు:
18 సం||లు నిండని బాలికను పురుషుడు వివాహం చేసుకుంటే 2 సంవత్సరాల జైలు శిక్ష లేదా లక్ష రూపాయల వరకు జరిమానా.

ప్రశ్న 3.
బాలల హక్కులు ఏవైనా నాలుగు వ్రాయుము.
జవాబు:
బాలల హక్కులు :

  1. జీవితం – జీవించే హక్కు
  2. సాధ్యమైనంతవరకూ బాలలు తల్లిదండ్రులతో కలసి ఉండడం.
  3. బాలల విద్యకు, ఆరోగ్యానికి హాని కలిగించే పని చేయకుండా ఉండడం.
  4. బాలలు సంపూర్ణ ఆరోగ్యం, వైద్య సౌకర్యం పొందే హక్కు,

ప్రశ్న 4.
బాల్య వివాహం అంటే ఏమిటి?
జవాబు:
పురుషునికి 21 సం||లు, స్త్రీకి 18 సం||లు నిండకుండా జరిపించే పెండ్లి.

ప్రశ్న 5.
పాఠ్య పుస్తకంలోని ఆప ‘బడి” న బాల్య వివాహం – ఒక విజయగాథ ఏ జిల్లాలో జరిగింది? ఆ బాలిక పేరేమి?
జవాబు:
మహబూబ్ నగర్ జిల్లా, అచ్చంపేట మండలం, బొమ్మనపల్లి గ్రామం. ఆ బాలిక పేరు ఎర్రమోని సరిత.

ప్రశ్న 6.
చట్ట వ్యతిరేక కార్యకలాపాలు ఏవి?
జవాబు:

  1. అక్రమ రవాణాకు గురైన వారిచే భిక్షాటన
  2. మానవ అవయవాల అమ్మకం
  3. మత్తు మందుల అక్రమ వ్యాపారం

ప్రశ్న 7.
కార్మికులు అంటే ఎవరు?
జవాబు:
వెట్టిచాకిరి చేసేవారు, ఇళ్ళలో పనిచేసేవారు, వ్యవసాయ కూలీ, నిర్మాణ కూలీలు మొ||వారు.

AP 9th Class Social Important Questions Chapter 22 మహిళా రక్షణ చట్టాలు

ప్రశ్న 8.
వరకట్న నిషేధ చట్టం పరిధిలోకి వచ్చే అంశాలు ఏవి?
జవాబు:
వివాహం అనంతరం అమ్మాయిని వేధించడం, తిట్టడం, కొట్టడం, ఒక్కోసారి చంపివేయటం, కొన్నిసార్లు బాధలు భరించలేక స్త్రీలు ఆత్మహత్యలు చేసుకోవడం మొదలైనవి ఈ చట్టం పరిధిలోకి వస్తాయి.

ప్రశ్న 9.
లైంగిక దాడి అంటే ఏమిటి?
జవాబు:
లైంగిక దాడి అంటే బలవంతపు వ్యభిచారం, సాంఘిక, మతపరమైన వ్యభిచారం (జోగిని, మాతాంగి, దేవదాసి మొ||నవి) పర్యాటక రంగంలో లైంగిక దోపిడి, అసభ్యత అశ్లీల రచనలు – చిత్రాలు ‘మొ||నవి.

ప్రశ్న 10.
వరకట్న నిషేధ చట్టం ఉల్లంఘించిన వారికి విధించే శిక్ష ఏమిటి?
జవాబు:
5 సం||ల వరకు జైలు శిక్ష, 15 వేలు వరకు జరిమానా లేదా కట్నం విలువ మొత్తంలలో ఏది ఎక్కువైతే ఆ మొత్తం జరిమానా విధించబడును.

ప్రశ్న 11.
గృహహింస అంటే ఏమిటి?
జవాబు:
కుటుంబ సంబంధాల్లో ఉన్న స్త్రీకి లేదా ఆమె సంతానానికి అదే కుటుంబంలోని వ్యక్తుల వల్ల హింసాపూరిత చర్యలు, ఇబ్బందులు కలిగినట్లయితే దానిని గృహహింసగా చెప్పవచ్చును.

ప్రశ్న 12.
సమాజంలో మహిళలు ఎదుర్కొను సమస్యలు ఏవి?
జవాబు:
మన సమాజంలో మహిళలు అనేక సమస్యలు, ఇంటా బయటా ఎదుర్కొంటున్నారు. ఆడ పిల్లలు బడికి వెళ్ళడానికి కూడా భయపడుతున్నారు. ముఖ్యంగా స్త్రీలను మాటలతో వేధించడం, బాధించడం, తక్కువ చేసి మాట్లాడటం, ఎగతాళి చేయడం, శారీరకంగా, మానసికంగా, లైంగికంగా హింసించడం.

ప్రశ్న 13.
అంతర్జాతీయ బాలల హక్కుల ఒడంబడిక ఎప్పుడు జరిగింది? ఎన్ని దేశాలు సంతకం చేశాయి?
జవాబు:
అంతర్జాతీయ బాలల హక్కుల ఒడంబడిక, 1989లో జరిగింది. 191 దేశాలు సంతకం చేశాయి.

AP 9th Class Social Important Questions Chapter 22 మహిళా రక్షణ చట్టాలు

ప్రశ్న 14.
ఉచిత న్యాయ సహాయం ఎవరికి అందించబడుతుంది?
జవాబు:
న్యాయ సహాయం పొందుటకు అర్హులు :

  1. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు చెందినవారు.
  2. మానవ అక్రమ రవాణా బాధితులు, యాచకులు, స్త్రీలు, పిల్లలు, మతి స్థిమితం లేనివారు, అవిటివారు.
  3. ప్రకృతి వైపరీత్యాల బాధితులు, వ్యవసాయ, పారిశ్రామిక కార్మికులు.
  4. రూ. 50,000 కంటే తక్కువ సాంవత్సరిక ఆదాయం కలవారు.

ప్రశ్న 15.
లోక్ అదాలత్ అంటే ఏమిటి?
జవాబు:
ఆర్థిక పరిస్థితులు, ఇతర బలహీనతలు కారణంగా న్యాయాన్ని పొందే అవకాశాలను కోల్పోకుండా ఉండటం కోసం ఉద్దేశించినదే ఉచిత న్యాయస్థానం. దీనినే లోక్ అదాలత్ అంటాం.

ప్రశ్న 16.
న్యాయ సహాయ విధానాలు తెలుపుము.
జవాబు:
న్యాయ సహాయ విధానాలు :

  1. న్యాయవాదిచే ఉచితంగా న్యాయ సలహా ఇప్పించుట.
  2. కేసులను పరిశీలించిన మీదట అవసరమైనచో దరఖాస్తుదారుని తరపున న్యాయవాదులను నియమించి ఆయా కోర్టులలో కేసులు చేపట్టడం.
  3. న్యాయ సహాయం పొందినవారికి కోర్టు ఫీజు, కేసుకు సంబంధించిన కోర్టు ఖర్చులు భరించడం.
  4. న్యాయ సహాయం పొందినవారికి కేసులలో తీర్పుల నకళ్ళు ఉచితంగా ఇవ్వడం మొ||లగు సహాయాలు అందించబడతాయి.

AP 9th Class Social Important Questions Chapter 21 మానవహక్కులు, ప్రాథమిక హక్కులు

These AP 9th Class Social Important Questions 21st Lesson మానవహక్కులు, ప్రాథమిక హక్కులు will help students prepare well for the exams.

AP Board 9th Class Social 21st Lesson Important Questions and Answers మానవహక్కులు, ప్రాథమిక హక్కులు

9th Class Social 21st Lesson 1 Mark Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
ప్రాథమిక హక్కులు అనగానేమి?
జవాబు:
వ్యక్తికి మౌలికమైన కొన్ని హక్కులు ఉన్నాయి, వీటికి రాజ్యాంగంలో ప్రత్యేక స్థానం ఇచ్చారు. ఈ హక్కులను ప్రాథమిక హక్కులంటారు.

ప్రశ్న 2.
రిట్ అనగానేమి?
జవాబు:
రాజ్యాంగ హక్కులను కాపాడటానికి, అమలు అయ్యేలా చూడటానికి ప్రభుత్వానికి న్యాయస్థానం ఆదేశాలు జారీచేసే అధికారాన్ని ‘రిట్’ అంటారు. ఇది న్యాయస్థానాలకు స్వతహాగా లభించే హక్కు.

ప్రశ్న 3.
సమన్యాయపాలన అనగానేమి?
జవాబు:
ప్రభుత్వం ఏ వ్యక్తికీ చట్టం ముందు సమానత్వాన్ని, చట్టాల రక్షణలో సమానత్వాన్ని తిరస్కరించగూడదు అని రాజ్యాంగం పేర్కొంటోంది. దీనిని ‘సమన్యాయపాలన’ అంటారు.

AP 9th Class Social Important Questions Chapter 21 మానవహక్కులు, ప్రాథమిక హక్కులు

ప్రశ్న 4.
వాక్ స్వాతంత్ర్యం, భావ ప్రకటన స్వేచ్ఛ ప్రయోజనాలు ఏవి?
జవాబు:
వాక్ స్వాతంత్ర్యం, భావ ప్రకటన స్వేచ్ఛ : దీనివల్ల వ్యక్తులకు ప్రజా కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం లభిస్తుంది. సమావేశాలు, ప్రచురణలు, నాటకాలు, చిత్రలేఖనం వంటి వివిధ రూపాల ద్వారా తమ అభిప్రాయాలను వ్యక్తపరచవచ్చు.

ప్రశ్న 5.
“బాల కార్మికుల నిర్మూలన” పై రెండు నినాదాలు రాయండి.
జవాబు:

  1. విద్య బాలల భవిష్యత్తు – వారిని చదువుకోనివ్వండి.
  2. బాలకార్మిక విధానం ప్రకృతి విరుద్ధం.

9th Class Social 21st Lesson 2 Marks Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
కింది సందర్భాలను పరిశీలించండి. ప్రతి సందర్భంలో ఏ ప్రాథమిక హక్కుకు భంగం కలిగింది మరియు ఏవిధంగా భంగం కలిగిందో వివరించండి.
అ) ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ డాక్యుమెంటరీ చిత్రాలు తీస్తున్న ఒక దర్శకున్ని అరెస్టు చేసి జైలుకు పంపడం జరిగింది.
ఆ) ఒక 10 సం||రాల బాలున్ని బడికి వెళ్ళనివ్వడం లేదు మరియు బలవంతంగా టపాసుల తయారీ పరిశ్రమలో పని చేయడానికి పంపిస్తున్నారు.
జవాబు:
అ) మొదటి కేసులో ప్రాథమిక హక్కైన ‘వాక్ స్వాతంత్ర్యం, భావ ప్రకటనా స్వేచ్ఛ’ ఉల్లంఘించబడింది. ఎందువలన అనగా ప్రతి వ్యక్తికి తన అభిప్రాయాలను శాంతియుతంగా వ్యక్తీకరించే స్వేచ్ఛ ఉంది. పౌరులు సమావేశాలు, ప్రచురణలు, నాటకాలు, చిత్రలేఖనం, వంటి వివిధ రూపాలలో తమ అభిప్రాయాలను వ్యక్తం చేయవచ్చు. అందువలన ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ డాక్యుమెంటరీ తీయడం తప్పు కాదు. కానీ ఈ స్వేచ్చపై పరిమితి ఉంటుంది. పరిమితికి మించి వ్యక్తిగత విమర్శలకు దిగితే ప్రభుత్వం చట్ట ప్రకారం శిక్ష విధిస్తుంది.)

ఆ) రెండవ కేసులో ప్రాథమిక హక్కు అయిన ‘పీడనాన్ని నిరోధించే హక్కు’ (కర్మాగారాలలో బాలలను పనిలో పెట్టుకోవడం నిషేధం) ఉల్లంఘించబడింది. “14 సంవత్సరాల లోపు బాలలను కర్మాగారాలు, గనులు, ఇతర ప్రమాదకరమైన పనులలో పెట్టుకోవడం నిషేధం” అని రాజ్యాంగం పేర్కొంటోంది. అందువలన ఆ .10 సంవత్సరాల బాలుడు కర్మాగారానికి కాక స్కూల్ కి పంపబడాలి.

ప్రశ్న 2.
ఇచ్చిన అంశాలను సంబంధిత ప్రాథమిక హక్కుల కింది పట్టికలో పొందుపరచండి.
• కర్మాగారాలలో బాలలను పనిలో పెట్టుకోవటం నిషేధం.
• అల్పసంఖ్యాక వర్గాలు తాము ఎంచుకున్న విద్యా సంబంధ సంస్థలు స్థాపించి, నిర్వహించుకునే హక్కు
• బిరుదులు రద్దు
• జీవించే హక్కు
AP 9th Class Social Important Questions Chapter 21 మానవహక్కులు, ప్రాథమిక హక్కులు 1
జవాబు:
AP 9th Class Social Important Questions Chapter 21 మానవహక్కులు, ప్రాథమిక హక్కులు 2

9th Class Social 21st Lesson 4 Marks Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
ప్రాథమిక హక్కులు ఏవి? మెరుగైన జీవనం కొరకు ఇవి మనకు ఏ విధంగా సాయపడుతున్నాయి?
జవాబు:
1) ప్రాథమిక హక్కులు ఆరు :

  1. సమానత్వపు హక్కు,
  2. స్వాతంత్ర్యపు హక్కు,
  3. మత స్వాతంత్ర్యపు హక్కు,
  4. పీడనాన్ని నిరోధించే హక్కు,
  5. సాంస్కృతిక విద్యా విషయపు హక్కు,
  6. రాజ్యాంగ పరిహారపు హక్కు,

2) ఈ పైన తెలుపబడిన హక్కులలో మొదటిది అయిన సమానత్వపు హక్కు ప్రజలందరూ సమానులే అని తెలియజేయడంతో పాటు మన అభివృద్ధికి దోహదపడుతుంది.

3) రెండవ హక్కు ప్రజలందరూ స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలతో తమకు నచ్చిన విధంగా జీవనాన్ని గడపటానికి అవకాశం ఇచ్చింది.

4) మూడవ హక్కు ప్రజలు వారికి నచ్చిన మతాన్ని అనుసరించే విధంగా అవకాశం కల్పించింది.

5) నాల్గవ హక్కు ఎవరూ ఇంకొకరి చేత బలవంతంగా పనిచేయించటం గాని, పని పేరిట హింసించరాదని తెలియచేస్తుంది.

6) ఐదవ హక్కు అల్పసంఖ్యాక వర్గాల వారు కూడా వారి భాష, మతం ఆధారంగా విద్యా సంస్థలను ఏర్పాటుచేసుకుని అభివృద్ధి చెందటానికి అవకాశం కల్పించింది.

7) చివరి హక్కు పై హక్కులలో ఏది ఉల్లంఘనకు గురి అయినా ప్రజలకు కోర్టుల నుండి రక్షణ కల్పించి మరల వారు
హక్కులను పొందేలాగా చేస్తుంది.

AP 9th Class Social Important Questions Chapter 21 మానవహక్కులు, ప్రాథమిక హక్కులు

ప్రశ్న 2.
ప్రాథమిక విధులేవి?
జవాబు:
హక్కులు ఉన్నట్లే మనకు కొన్ని విధులు, బాధ్యతలు ఉన్నాయి.

ప్రతి ఒక్క భారత పౌరుని విధులు :

  1. రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాలి. జాతీయ గీతాన్ని కాని, జాతీయ జెండాను కాని అవమానించకూడదు.
  2. స్వాతంత్ర్యానికి స్ఫూర్తినిచ్చిన జాతీయ ఉద్యమ ఉన్నత ఆదర్శాలను గౌరవించి, అనుసరించాలి.
  3. భారతదేశ సార్వభౌముకత, సమగ్రతలను కాపాడాలి.
  4. దేశ రక్షణకు బాధ్యత వహించాలి.
  5. వివిధ భాషలు, మతాల ప్రజల మధ్య శాంతి, సామరస్యాలను నెలకొల్పాలి. మహిళల గౌరవానికి భంగం కలిగించరాదు.
  6. దేశ పర్యావరణ క్షీణతను నివారించి, మెరుగుపరచాలి.
  7. మనదేశ ఉమ్మడి సంస్కృతి, మహోన్నత, వారసత్వ సంపదను గౌరవించి, కాపాడాలి.
  8. శాస్త్రీయ దృక్పథం, మానవతావాదం, అన్వేషణ, సంస్కరణల దృక్పథాన్ని అలవర్చుకోవాలి.
  9. ప్రజా ఆస్తులను కాపాడాలి.
  10. అన్ని రంగాలలో అత్యున్నత శ్రేణిని అందుకోటానికి కృషి చేయాలి.
  11. పిల్లలను విద్యావంతులుగా చేయాలి.

AP 9th Class Social Important Questions Chapter 20 ప్రజాస్వామ్యం – రూపుదిద్దుకుంటున్న భావన

These AP 9th Class Social Important Questions 20th Lesson ప్రజాస్వామ్యం – రూపుదిద్దుకుంటున్న భావన will help students prepare well for the exams.

AP Board 9th Class Social 20th Lesson Important Questions and Answers ప్రజాస్వామ్యం – రూపుదిద్దుకుంటున్న భావన

9th Class Social 20th Lesson 1 Mark Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
ప్రజాస్వామ్యం ఏ సూత్రంపై ఆధారపడి ఉంది?
జవాబు:
రాజకీయ సమానత్వం, అందరినీ కలుపుకోవటం అన్న మౌలిక సూత్రంపై ప్రజాస్వామ్యం ఆధారపడి ఉంది.

ప్రశ్న 2.
1980 నుండి జింబాబ్వే స్థితి ఏమిటి?
జవాబు:
అల్పసంఖ్యాక శ్వేత జాతీయుల పాలన నుంచి జింబాబ్వే 1980లో స్వాతంత్ర్యం పొందింది. అప్పటినుంచి దేశ స్వాతంత్ర్య .. ఉద్యమానికి నేతృత్వం వహించిన జాను-పీఎఫ్ అన్న పార్టీయే దేశాన్ని పాలిస్తోంది. ఈ పార్టీ నాయకుడు రాబర్ట్ ముగాబే స్వాతంత్ర్యం పొందినప్పటి నుంచి అధ్యక్షుడిగా ఉన్నాడు.

ప్రశ్న 3.
ఎన్నికలు ఎలా జరగాలి?
జవాబు:
ఒకదేశ ప్రజలు ప్రభుత్వంలో తమకు నిజంగా ప్రాతినిధ్యం వహించే సరైన వ్యక్తులను, లేదా పార్టీలను ఎంచుకోవాలంటే ఎన్నికలు స్వేచ్ఛగా, ఎటువంటి భయంలేని వాతావరణంలో నిర్వహించబడటం ఎంతో ముఖ్యం.

ప్రశ్న 4.
ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఎలా ఉండాలి?
జవాబు:
ప్రజాస్వామ్య ప్రభుత్వాలు చట్టాలను గౌరవించాలి. చట్టాలలో పేర్కొన్న న్యాయవ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ స్వతంత్రంగా పనిచేయటాన్ని అనుమతించాలి.

AP 9th Class Social Important Questions Chapter 20 ప్రజాస్వామ్యం – రూపుదిద్దుకుంటున్న భావన

ప్రశ్న 5.
బెల్జియంలో ప్రజలు ఏ భాషలు మాట్లాడతారు?
జవాబు:
యూరప్ ఖండంలో ఒక చిన్న దేశం ‘బెల్జియం’. ఆ దేశ జనాభాలో 59% మంది ఫ్లెమిస్ ప్రాంతానికి చెందిన ‘డచ్’ భాష మాట్లాడే ప్రజలు. మిగిలిన 40% మంది వలోనియా ప్రాంతానికి చెందిన ‘ఫ్రెంచ్’ మాట్లాడే ప్రజలు. మిగిలిన ఒక్కశాతం ‘జర్మన్’ భాష మాట్లాడే ప్రజలు.

ప్రశ్న 6.
బెల్జియం అనుసరించిన విధానాలు ఏవి?
జవాబు:
బెల్జియం అనుసరించిన విధానాలు – ఏ ఒక్క సమూహమూ (భాష) ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోలేదు, కేంద్ర ప్రభుత్వ అధీనంలో రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేయవు, బ్రస్సెల్స్ కి ప్రత్యేక ప్రభుత్వం (ఇందులో రెండు సమూహాలకు సమాన ప్రాతినిధ్యం) మొదలైనవి.

ప్రశ్న 7.
బెల్జియం నాయకులు ఏమి గుర్తించారు?
జవాబు:
వివిధ ప్రాంతాల ప్రజల ప్రయోజనాలు, భావనలను మన్నించినపుడే దేశం ఐక్యంగా ఉంటుందని ‘బెల్జియం’ నాయకులు గుర్తించారు.

9th Class Social 20th Lesson 2 Marks Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
ప్రజాస్వామ్యంలో ‘ఓటు వేయడం’ మరియు “ప్రతినిధులను ఎన్నుకోవడం” ఎందుకు అత్యంత ముఖ్యమైనవి?
జవాబు:
భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ఓటింగ్ ప్రక్రియపై పూర్తిగా ఆధారపడి ఉంది.

  1. ఓటు హక్కు పౌరులు తమకు నచ్చిన ప్రభుత్వాన్ని ఎన్నుకోవటానికి అవకాశం కల్పిస్తుంది.
  2. తమ ప్రాంత వివిధ ప్రజల ఆకాంక్షలను, సమస్యలను వ్యక్తం చేసే తమ ప్రతినిధిని ఎన్నుకోవటానికి ఓటు, వీలు కల్పిస్తుంది.
  3. ప్రజాస్వామ్యంలో ప్రజలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి ఒక మార్గం ఓటు.
  4. ప్రజాస్వామ్య విజయం ఆ దేశ ఓటర్లు క్రియాశీలకంగా పాల్గొనడం, చైతన్యవంతులుగా ఉండటంపై ఆధారపడి ఉంటుంది.

ప్రశ్న 1.
ప్రజాస్వామ్యం అంటే?
జవాబు:
ప్రజాస్వామ్యం అంటే బాధ్యతాయుతమైన ప్రభుత్వం ప్రజలతో ఎన్నుకోబడి, ప్రజలకు జవాబుదారిగా ఉండే ప్రభుత్వం.

ప్రశ్న 2.
లిబియాలో అంతిమ అధికారం ఎవరికి ఉంది?
జవాబు:
లిబియాలో అంతిమ అధికారం రివల్యూషనరీ కమాండ్ కౌన్సిల్ (ఆర్.సి.సి) కి ఉంది.

ప్రశ్న 3.
సార్వజనీన ఓటు హక్కు కల్పించిన తొలి పెద్ద దేశం ఏది?
జవాబు:
సార్వజనీన ఓటు హక్కు కల్పించిన తొలి పెద్ద దేశం సంయుక్త సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ (రష్యా).

AP 9th Class Social Important Questions Chapter 20 ప్రజాస్వామ్యం – రూపుదిద్దుకుంటున్న భావన

ప్రశ్న 4.
ప్రజాస్వామ్యం దేని మీద ఆధారపడి ఉంది?
జవాబు:
ప్రజాస్వామ్యం రాజకీయ సమానత్వం, అందరినీ కలుపుకోవడం అన్న మౌలిక సూత్రంపై ఆధారపడి ఉంది.

ప్రశ్న 5.
ప్రజాస్వామ్యంలో ప్రజల భాగస్వామ్యం ఎలా సాధ్యమవుతుంది?
జవాబు:
ప్రజలందరూ బహిరంగంగా పాల్గొని తమ అవసరాలు, అభిప్రాయాలు స్పష్టంగా పేర్కొనెలా బహిరంగ చర్చలు జరిపిన తరువాత చట్టాలు, విధానాలు రూపొందించినపుడు ఇది సాధ్యమవుతుంది.

ప్రశ్న 6.
ప్రజాస్వామ్యానికి స్వేచ్ఛాయుత ఎన్నికలు ఎంత ముఖ్యం?
జవాబు:
ఒక దేశ ప్రజలు ప్రభుత్వంలో తమకు నిజంగా ప్రాతినిధ్యం వహించే సరైన వ్యక్తులను లేదా పార్టీలను ఎంచుకోవాలంటే ఎన్నికలు స్వేచ్చగా, ఎటువంటి భయంలేని వాతావరణంలో నిర్వహించడం ఎంతో ముఖ్యం. ఎన్నికలలో ఏ ఒక్క పార్టీకి ప్రత్యేక అవకాశాలు ఉండవు. ఏ పార్టీయైన ఏ వ్యక్తులైన అందులో పాల్గొనగలుగుతారు.

ప్రశ్న 7.
ప్రజాస్వామ్యాన్ని అంచనా వేయాలంటే దేనిని పరిశీలించుట ముఖ్యం?
జవాబు:
ప్రజాస్వామ్యాన్ని అంచనా వేయాలంటే ఎన్నికలను పరిశీలించుట ముఖ్యం.

ప్రశ్న 8.
ప్రజాస్వామ్యం దేనిని రక్షణగా ఉండాలి?
జవాబు:
ప్రజలలో అధిక శాతానికి భిన్నమైన అభిప్రాయాలు కలిగిన వ్యక్తులను ప్రజాస్వామ్యం రక్షణగా ఉండాలి.

ప్రశ్న 9.
ప్రజాస్వామ్యం దేనికి లోబడి పని చేయాలి?
జవాబు:
ప్రజాస్వామ్యం రాజ్యాంగ చట్టం, పౌరుల హక్కుల పరిమితులకు లోబడి పని చేయాలి.

AP 9th Class Social Important Questions Chapter 20 ప్రజాస్వామ్యం – రూపుదిద్దుకుంటున్న భావన

ప్రశ్న 10.
ప్రజాస్వామ్యంలో పౌరుల గౌరవం, స్వేచ్ఛ గూర్చి వ్రాయుము.
జవాబు:
వ్యక్తి గౌరవాన్ని, స్వేచ్ఛని కాపాడటంలో వివిధ రకాల ప్రభుత్వాలలో ప్రజాస్వామ్య ప్రభుత్వం మెరుగైనది. గౌరవం, స్వేచ్ఛలపట్ల నిబద్ధతే ప్రజాస్వామ్యానికి పునాది.

AP 9th Class Social Important Questions Chapter 19 విస్తరిస్తున్న ప్రజాస్వామ్యం

These AP 9th Class Social Important Questions 19th Lesson విస్తరిస్తున్న ప్రజాస్వామ్యం will help students prepare well for the exams.

AP Board 9th Class Social 19th Lesson Important Questions and Answers విస్తరిస్తున్న ప్రజాస్వామ్యం

9th Class Social 19th Lesson 1 Mark Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
లిబియాలో ఉద్యమం ఎవరి ఆధ్వర్యంలో నడిచింది?
జవాబు:
సైన్యంలోని 12 మంది సభ్యులతో కూడిన ‘రివల్యుషనరీ కమాండ్ కౌన్సిల్’ (RCC) నేతృత్వంలో ఈ ఉద్యమం నడిచింది.

ప్రశ్న 2.
లిబియాలో కొత్త ప్రభుత్వం చేపట్టిన పనులేవి?
జవాబు:
కొత్త ప్రభుత్వం, చమురు వనరులను జాతీయం చేసింది, సంచార జీవనాన్ని అంతం చేయటానికి పేద ప్రజలకు నీటివసతి ఉన్న భూములను ఇచ్చింది, సాగు విస్తీర్ణాన్ని పెంచే కార్యక్రమం చేపట్టింది.. మహిళలతో సహా అందరికీ ఉచిత విద్య, ఉచిత వైద్య సేవలు, చమురు నుంచి వచ్చిన లాభాలలో కొంత ప్రజలందరికీ పంచటం, గృహవసతి వంటివి చేపట్టింది.

ప్రశ్న 3.
అరబ్బు వసంతంగా ప్రఖ్యాతి గాంచినది ఏది?
జవాబు:
2010 డిసెంబరులో మొదలైన అరబ్బు ప్రపంచంలోని నిరసనలు, ప్రదర్శనలు, యుద్ధాల విప్లవ తరంగం ‘అరబ్బు వసంతం’గా ప్రఖ్యాతి గాంచింది.

ప్రశ్న 4.
బర్మాను పాలించిన సైన్యాధిపతులు ఎదుర్కొన్న ఆరోపణలు ఏవి?
జవాబు:
బర్మాని పాలించిన సైన్యాధిపతులు మానవ హక్కులను ఉల్లంవించారని, పౌరులను బలవంతంగా స్థానచలనానికి గురిచేశారని, పిల్లలతో సహా ప్రజలతో బలవంతంగా వెట్టిచాకిరి చేయించుకున్నారని అనేక తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్నారు.

AP 9th Class Social Important Questions Chapter 19 విస్తరిస్తున్న ప్రజాస్వామ్యం

ప్రశ్న 5.
NLD ని విస్తరించండి.
జవాబు:
నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసీ NLD.

ప్రశ్న 6.
కమ్యూని నమ్మకం ఏమిటి?
జవాబు:
‘శ్రామిక వర్గ నియంతృత్వాన్ని’ ఏర్పాటు చేయటం ద్వారా మాత్రమే. కార్మికుల ప్రయోజనాలను కాపాడగలమని , వాళ్లు (కమ్యూనిస్టు) నమ్మారు.

ప్రశ్న 7.
కమ్యూనిస్టుల విశ్వాసం ఏమిటి?
జవాబు:
ఇంగ్లాండులో మాదిరి పార్లమెంటరీ ప్రజాస్వామ్యం దేశాన్ని నియంత్రించటంలో ధనిక పెట్టుబడిదారులకు మాత్రమే ఉపయోగపడుతుందని, పేద శ్రామిక ప్రజల నిజమైన ప్రయోజనాలకు అది ప్రాతినిధ్యం వహించ లేదని కమ్యూనిస్టు విశ్వసించారు.

ప్రశ్న 8.
అంతర్యుద్ధం అనగానేమి
జవాబు:
వివిధ వర్గాలు లేదా ప్రాంతాల మధ్య ఒక దేశంలో చెలరేగే యుద్ధం.

ప్రశ్న 9.
స్వయం ప్రతిపత్తి అనగానేమి?
జవాబు:
ఒక దేశం లేదా ప్రాంతం లేదా సంస్థ తనను తాను స్వతంత్రంగా నిర్వహించుకునే స్వేచ్ఛనే ‘స్వయం ప్రతిపత్తి’ అంటారు.

ప్రశ్న 10.
పట్టణీకరణ అనగానేమి?
జవాబు:
గ్రామీణ ప్రాంత ప్రజలు వివిధ వృత్తులరీత్యా పట్టణాలకు వచ్చి స్థిరపడటాన్ని, పట్టణ జనాభా పెరగడాన్ని ‘పట్టణీకరణ’ అంటారు.

ప్రశ్న 11.
కింది పటంలో 1900 మరియు 1950 మధ్య కాలం నాటి ప్రజాస్వామ్య దేశాలను నలుపుచే గుర్తించడమైనది.
ప్రశ్న : పటంలో చూపిన ఏవేని రెండు ప్రజాస్వామ్య దేశాల పేర్లు రాయండి.
జవాబు:
అమెరికా సంయుక్త రాష్ట్రాలు, కెనడా, గ్రేట్ బ్రిటన్, చిలీ, పెరూ, అలస్కా మొదలైనవి.

AP 9th Class Social Important Questions Chapter 19 విస్తరిస్తున్న ప్రజాస్వామ్యం

ప్రశ్న 12.
క్రింది పటంలో “A” తో గుర్తించబడిన దేశం ఏది?
జవాబు:
రష్యా

9th Class Social 19th Lesson 4 Marks Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
19వ శతాబ్దం నాటి ఇటలీ ఏకీకరణ ప్రక్రియను వివరించండి.
జవాబు:
19వ శతాబ్దం నాటి ఇటలీ ఏకీకరణ ప్రక్రియ :

  1. 19వ శతాబ్దం మధ్య కాలానికి ఇటలీ అనేక చిన్న చిన్న రాజ్యాలుగా విభజించబడింది.
  2. 1830 లలో మాజినీ ఇటలీ ఏకీకరణకు ఒక ప్రణాళికను రూపొందించాడు.
  3. తన భావాలను ప్రచారం చేయుటకు, ఇటలీ ఏకీకరణ దిశగా ప్రయాణానికి యంగ్ ఇటలీ అనే రహస్య సంస్థను స్థాపించాడు.
  4. తరువాత 1831, 1848లలో జరిగిన తిరుగుబాట్లు విఫలం కావడంతో యుద్ధాల ద్వారా అయినా ఇటలీ ఏకీకరణను సాధించవలసిన బాధ్యత రాజు విక్టర్ ఇమ్మాన్యుయెల్ – II మీద పడింది.
  5. అధికారంలో ఉన్న ఇతర రాజ కుటుంబీకులు కూడా ఏకీకరణ ద్వారానే ఇటలీ ఆర్థిక ప్రగతి సాధ్యం అని భావించారు.
  6. ఫ్రాన్స్ తో కవూర్ నడిపిన దౌత్యం ఫలితంగా సార్డీనియా – పీడ్మంబు ఆస్ట్రియా సేనలను ఓడించగలిగాయి.
  7. 1860 లో సైన్యంతో పాటు గారిబార్లీ నాయకత్వంలో సాయుధ సేనలు సిసిలీ లోనికి ప్రవేశించి అక్కడ ఉన్న స్పెయిన్ పాలకులను తరిమివేశాయి. దానితో అన్ని దేశాలూ రాజు పాలన క్రిందకి వచ్చి ఇటలీ ఏకీకరణ ముగిసింది.
  8. 1871 లో, విక్టర్ ఇమ్మాన్యుయెల్ – II ఏకీకృత ఇటలీకి రాజుగా ప్రకటించబడ్డాడు.

ప్రశ్న 2.
“సమకాలీన ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న సంక్లిష్ట సమస్యల పరిష్కారానికి మరియు ప్రజలందరికి స్వేచ్ఛను మరియు హక్కులను గౌరవించేందుకు ప్రజాస్వామ్యమే ఉత్తమ పరిష్కారం”. – ఈ విషయంతో మీరు ఏకీభవిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని సమర్థించుకొనండి.
(లేదా)
“అత్యంత పేద ప్రజలు, బలహీనవర్గాలు కూడా తమ గొంతుక వినిపించి, ప్రభుత్వ విధానాలను ప్రభావితం చేయగల, అందరికీ న్యాయం, శాంతిని అందించగల నూతన ప్రజాస్వామిక విధానాన్ని రూపొందించటానికి ప్రపంచ వ్యాప్తంగా ప్రయత్నం జరుగుతోంది.”
“ప్రజాస్వామ్యమే అత్యుత్తమ పరిపాలన విధానం” వ్యాఖ్యానించండి.
జవాబు:
ప్రస్తుతం ప్రపంచ సమస్యలకు ఒక పరిస్కారం ప్రజాస్వామ్యం అనడాన్ని నేను అంగీకరిస్తాను. ఎందుకంటే ప్రజాస్వామ్యం లేని దేశాల ప్రజలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఉదాహరణ : తమ పాలకులను ఎన్నుకునే స్వేచ్ఛ లేకపోవడం, ప్రజలు సంఘాలను, సంస్థలను ఏర్పాటుచెయడానికి స్వేచ్ఛ లేకపోవడం, పాలకులకు వ్యతిరేకంగా నిరసన తెలియజేయడానికి అవకాశం లేకపోవడం, ఆయా దేశాలలో పౌర హక్కులకు, మానవ హక్కులకు రక్షణ లేకపోవడం వంటివి.

మరోవైపు ప్రజాస్వామ్యంలో ప్రజలు తమకు నచ్చిన ప్రతినిధులను, తమ పాలకులను ఎన్నుకునే స్వేచ్ఛను కలిగి ఉన్నారు. వాక్ స్వాతంత్ర్యాన్ని, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను, ప్రభుత్వ నిర్ణయాల పట్ల నిరసనను తెలియచేసే అవకాశాన్ని, ప్రజలు పార్టీలను, సంస్థలను ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛను కలిగి ఉన్నారు.

ప్రజాస్వామ్యం పౌరులందరి మానవ హక్కులను రక్షిస్తుంది. సమన్యాయ పాలనలో భాగంగా చట్టం ముందు అందరూ సమానులే. చట్టాలు అందరికీ సమానంగా వర్తిస్తాయి.

ప్రజాస్వామ్యంలో పాలకులు ప్రజల అవసరాలకు అనుగుణంగా స్పందించాలి. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీతనం కలిగి ఉంటుంది.

ప్రజాస్వామ్యం రాజకీయ సమానత్వం అనే సూత్రంపై ఆధారపడి ఉంది. ఇక్కడ పేదలు, నిరక్షరాస్యులు సైతం ధనికులు, అత్యంత విద్యావంతులతో సమానమైన హోదాను పొందుతారు. భిన్నత్వాలు గల సమాజంలో వివిధ వ్యక్తులు వివిధ ఆలోచనలు, ఆసక్తులు కలిగి ఉంటారు. అందరి అభిప్రాయాలకు, ఆలోచనలకు విలువనివ్వడం ప్రజాస్వామ్య లక్షణం.

ప్రజాస్వామ్యాన్ని అత్యంత ఉత్తమమైన ప్రభుత్వ వ్యవస్థ అనడంలో సందేహం లేదు.

ప్రశ్న 1.
లిబియా ఏ దేశ వలస పాలనలో ఉండేది?
జవాబు:
ఇటలీ

ప్రశ్న 2.
లిబియాకు ఎప్పుడు స్వాతంత్ర్యం లభించింది?
జవాబు:
లిబియాకు 1951లో స్వాతంత్ర్యం లభించింది.

AP 9th Class Social Important Questions Chapter 19 విస్తరిస్తున్న ప్రజాస్వామ్యం

ప్రశ్న 3.
లిబియా ప్రజల జీవనాధారం ఏమిటి?
జవాబు:
లిబియా ప్రజలు వ్యవసాయం, ఎడారులలో పశువుల పాలన పై ఆధారపడి జీవనం సాగించేవారు.

ప్రశ్న 4.
లిబియా అతి తక్కువ కాలంలో సంపన్నదేశమవ్వడానికి గల కారణం?
జవాబు:
1959 సంవత్సరంలో లిబియాలో విస్తారమైన ముడిచమురు నిధులను కనుగొన్నారు.. చమురు అమ్మకంతో దేశంలోకి సంపద ప్రవహింపసాగింది. సంపన్నదేశమైంది.

ప్రశ్న 5.
లిబియా అభివృద్ధి కొరకు, సంక్షేమం కొరకు ఏయే కార్యక్రమాలు అమలుచేయాలని యువత కోరింది?
జవాబు:

  1. ప్రజాసంక్షేమం కోసం పనిచేసే ఆధునిక ప్రభుత్వాలు ఏర్పాటుచేయాలని యువత కోరింది.
  2. మహిళలపై అణచివేతను అంతం చేయాలని, వివిధ జాతుల మధ్య నిరంతర యుద్ధాలకు స్వస్తి పలకాలని, ఐక్యత, శాంతిని స్థాపించాలని యువత రాజు ఇద్రిస్ ని కోరింది.

ప్రశ్న 6.
మువమ్మర్ గఢాఫి లిబియా అధికారం ఎప్పుడు చేజిక్కించుకున్నాడు?
జవాబు:
మువమ్మర్ గఢాఫి 70 యువ సైనిక అధికారుల బృందం, తమను తాము స్వేచ్ఛ అధికారుల ఉద్యమంగా పేర్కొని 1969లో లిబియా అధికారాన్ని కైవసం చేసుకున్నాడు.

ప్రశ్న 7.
లిబియాలో అధిక ప్రజల మతమేది?
జవాబు:
లిబియాలో అధిక ప్రజల మతం ఇస్లాం.

ప్రశ్న 8.
లిబియా దేశం ఎదుర్కొను సమస్యలేవి?
జవాబు:
లిబియాలో అధికశాతం ప్రజలు పేదవారు. పశుపాలనలో సంచార జీవనం గడుపుతుండేవాళ్ళు. నిరక్షరాస్యత అధికం. మహిళలకు పరదా పద్ధతి అమలులో ఉండేది.

ప్రశ్న 9.
గఫి నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం ఏయే సంస్కరణలు అమలుచేసింది?
జవాబు:
కొత్త ప్రభుత్వం అనేక కొత్త సంస్కరణలు అమలుచేసి లిబియాను ప్రగతిపథంలో నిలిపింది.

  1. చమురు వనరులను జాతీయం చేసింది.
  2. సంచార జీవనం నాశనం చేయ తలంచింది.
  3. పేద ప్రజలకు నీటి వసతి ఉన్న భూములను ఉచితంగా అందజేసింది.
  4. సాగు విస్తీర్ణ పద్ధతులు అమలుచేసింది.
  5. అందరికీ విద్య, అందరికీ వైద్యం ఉచితంగా అందజేసింది.
  6. మహిళలకు, స్వేచ్ఛ, సమాన సదా.
  7. చమురు నుండి వచ్చే ఆదాయంలో కొంత ప్రజలకు పంచడం వంటి సంస్కరణలతో లిబియా సామాజిక సంక్షేమంలో అత్యున్నత స్థానం పొందింది.

ప్రశ్న 10.
ప్రజాస్వామిక ప్రభుత్వాలను ఏర్పాటు చేయడానికి అరబ్ ప్రపంచంలో 2010లో ఏయే దేశాలలో ఉద్యమాలు జరిగాయి?
జవాబు:
ట్యునీసియా, ఈజిప్టు, లిబియా, ఎమెన్, బబ్రాన్, సిరియా వంటి దేశాలలో ఉద్యమం మొదలైంది.

AP 9th Class Social Important Questions Chapter 19 విస్తరిస్తున్న ప్రజాస్వామ్యం

ప్రశ్న 11.
లిబియా తిరుగుబాటులో ఏయే వర్గాలు వారు ప్రాతినిధ్యం వహించారు?
జవాబు:
తిరుగుబాటు బృందాలలో సైన్యం నుంచి బయటకు వచ్చిన కొంతమంది సైనికులు. అధికశాతం మంది న్యాయవాదులు, కార్మికులు, ఇంజనీర్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు సామాన్య ప్రజలు.

ప్రశ్న 12.
లిబియా తిరుగుబాటుదారులకు ప్రపంచంలోని చాలా దేశాలు ఎందుకు మద్దతు ఇచ్చాయి?
జవాబు:
ప్రపంచంలోని అమెరికా వంటి దేశాల నుండి లిబియాలోని తిరుగుబాటుదారులకు మద్దతు లభించింది. ఎందుకంటే దీని వెనుక లిబియాలోని అపార చమురు నిల్వలను చేజిక్కించుకోవాలన్న కోరిక ఉంది. ఐక్యరాజ్యసమితి సైతం తిరుగుబాటుదారులకు మద్దతు పలికి లిబియాని విమానాలు ఎగరగూడని ప్రాంతంగా ప్రకటించింది.

ప్రశ్న 13.
బర్మా ప్రపంచదేశాలకు ఏయే వస్తువులకు, ఆహారపదార్థాలకు సరఫరాదారుగా ఉండేది?
జవాబు:
టేకు, కలప, బియ్యం వంటి ఆహారధాన్యాలు, తగరం వంటి ఖనిజాలు, కెంపులు, నీలాలు వంటి విలువైన రాళ్ళకు బర్మా ప్రధాన సరఫరాదారుగా ఉండేది.

ప్రశ్న 14.
వివిధ రాజకీయ పార్టీలు పోటీ చేసిన ఎన్నికలు బర్మాలో ఏయే సంవత్సరాలలో జరిగాయి?
జవాబు:
1951, 1956, 1960లలో ఎన్నికలు జరిగాయి.

ప్రశ్న 15.
1947లో బర్మాకి స్వాతంత్ర్యం సాధించి తెచ్చినవాడు?
జవాబు:
బర్మాకి స్వాతంత్ర్యం తెచ్చినవాడు టర్మన్ జాతి నాయకుడు ఆంగ్ సాన్ (ప్రస్తుత ప్రతిపక్షనేత ఆంగ్ సాన్ సూకీకి తండ్రి).

AP 9th Class Social Important Questions Chapter 19 విస్తరిస్తున్న ప్రజాస్వామ్యం

ప్రశ్న 16.
బర్మాలో సైన్యాధిపతుల పాలకులు ఎటువంటి ఆరోపణలు ఎదుర్కొన్నారు?
జవాబు:

  1. బర్మా సైన్యాధిపతుల పాలనలో పేద దేశంగానే ఉండిపోయింది.
  2. దేశ వనరులన్నీ సైన్యాధిపతుల అధీనంలోకి వెళ్ళాయి.
  3. రైతాంగం తమ పిల్లలను సైన్యానికి అమ్ముకోవలసి వచ్చింది.
  4. పేద ప్రజలు బానిసల మాదిరి గనులలో పనిచేయవలసి వచ్చేది.
  5. బర్మాని పాలించిన సైన్యాధిపతులు మానవహక్కులను ఉల్లంఘించారు.
  6. పిల్లలతో సహ ప్రజలతో బలవంతంగా వెట్టిచాకిరి చేయించుకున్నారని తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్నారు.

ప్రశ్న 17.
బర్మాలో ప్రజాస్వామ్యం నెలకొల్పటానికి జరుగుతున్న పోరాటాలు, నిరసనలకు ఆనాటి నుంచి నేటి వరకు కేంద్ర బిందువు ఎవరు?
జవాబు:
ఆంగ్ సాన్ సూకి.

ప్రశ్న 18.
ఆంగ్ సాన్ సూకి ఆధ్వర్యంలో గల కూటమి పేరేమి?
జవాబు:
జాతీయ ప్రజాస్వామ్య కూటమి (నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసి) (NLD)

ప్రశ్న 19.
“ఆర్థిక దిగ్బంధం” అంటే ఏమిటి?
జవాబు:
ప్రపంచంలోని దేశాలు ఎగుమతులు, దిగుమతులు ఏవీ జరపకుండా, బర్మాని వాణిజ్యపరంగా ఏకాకిని చేయడం.

ప్రశ్న 20.
బర్మాలో ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పటానికి ప్రజల అభిప్రాయ సేకరణ (రిఫరెండం) ఎప్పుడు నిర్వహించారు?
జవాబు:
2008లో దేశం పేరుని ప్రజాస్వామిక గణతంత్రంగా మార్చారు.

ప్రశ్న 21.
ఆంగ్ సాన్ సూకీకి నోబెల్ శాంతి బహుమతి ఎప్పుడు లభించింది?
జవాబు:
1991లో

AP 9th Class Social Important Questions Chapter 19 విస్తరిస్తున్న ప్రజాస్వామ్యం

ప్రశ్న 22.
ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య భావనకు అనుకూలించే పరిస్థితులు ఏవి కల్పించాయి?
జవాబు:
పారిశ్రామికీకరణ, వలస వాదాలు.