AP Board 6th Class Hindi Solutions सन्नद्धता कार्यक्रम Chapter 15 मौखिक खेल

AP State Syllabus AP Board 6th Class Hindi Textbook Solutions सन्नद्धता कार्यक्रम Chapter 15 मौखिक खेल Textbook Questions and Answers.

AP State Syllabus 6th Class Hindi Solutions सन्नद्धता कार्यक्रम Chapter 15 मौखिक खेल

6th Class Hindi सन्नद्धता कार्यक्रम Chapter 15 मौखिक खेल Textbook Questions and Answers

AP Board 6th Class Hindi Solutions सन्नद्धता कार्यक्रम Chapter 15 मौखिक खेल 1
विधि :
छात्र गोलाकार में बैठते हैं। एक छात्र उठकर ”मैं ……. बनूँगा।” कहकर, बगल वाले छात्र से पूछता है कि “तुम क्या बनोगे?” बगलवाला छात्र भी “मैं ….. बनूँगा” बताकर उसके बगलवाले छात्र से पूछता है कि “तुम क्या बनोगे?” इस प्रकार एक के बाद एक कक्षा के सभी छात्र इस खेल में भाग लेते हैं। इसी प्रकार के अन्य प्रश्न भी पूछे जा सकते हैं।

కార్యము:
విద్యార్థులు గోళాకారం (గుండ్రంగా) కూర్చుందురు. ఒక విద్యార్థి లేచి “నేను ……. అగుదును” అని చెప్పి తన ప్రక్కన ఉన్న విద్యార్థితో “నీవు ఏమి అగుదువు ? అని ప్రశ్నించును. ఆ విద్యార్ధి “నేను…… అగుదును” అని చెప్పి అతని ప్రక్కనున్న విద్యార్ధిని “నీవు ఏమి అగుదువు?” అని అడుగును. ఇదే విధంగా ఒకరి తర్వాత ఒకరు తరగతి గదిలోని విద్యార్థులందరూ ఈ ఆటలో పాల్గొనెదరు. ఇదేవిధంగా ఇతర ప్రశ్నలు కూడా అడగవచ్చును.

पहला बालक : मैं डाक्टर बनूंगा। तुम क्या बनोगे?

दूसरा बालक : . मैं इंजनीर बनूँगा। तुम क्या बनोगे?

तीसरा बालक : मैं अध्यापक बनूँगा। तुम क्या बनोगी?

चौथा बालिका : मैं नेत्री बनूँगी? तुम क्या बनोगी?

पाँचव बालिका : . मैं सरपंच बनूँगी।

AP Board 6th Class Hindi Solutions सन्नद्धता कार्यक्रम Chapter 15 मौखिक खेल

पहला बालक : मैं सुबह पाँच बजे उठता हूँ। तुम रोज क्या पीते हो?

दूसरा बालक : मैं रोज हार्लिक्स पीता हूँ। तुम रोज क्या पीते हो?

तीसरा बालक : मैं रोज बूस्ट पीता हूँ। तुम रोज क्या पीती हो?

चौथा बालिका : मैं रोज कांप्लान पीती हूँ। तुम रोज क्या पीती हो?

पाँचव बालिका : मैं रोज दूध पीती हूँ।

पहला बालक : मैं रोज दूध पीता हूँ। तुम कब उठते हो?

दूसरा बालक : मैं सुबह छ: बजे उठता हूँ। तुम कब उठते हो?

तीसरा बालक : मैं सुबह सात बजे उठता हूँ। तुम कब उठती हो?

चौथा बालिका : मैं सुबह चार बजे उठती हूँ। तुम कब उठती हो?

पाँचव बालिका : मैं सुबह छ: बजे उठती हूँ।

शब्दार्थ

मैं = నేను, I am
डाक्टर = డాక్టర్, doctor
तुम = నీవు, you
क्या = ఏమి, ఏమిటి, what
बनना = అగుట, to make
रोज = రోజూ, everyday
पीना= త్రాగుట, to drink
सुबह = ఉదయం, morning
पाँच = అయిదు, five
बजे = గంటలు, hours .
उठना = లేచుట, awake
कब = ఎప్పుడు, when

AP Board 6th Class Hindi Solutions सन्नद्धता कार्यक्रम Chapter 15 मौखिक खेल

वर्णमाला चार्ट
AP Board 6th Class Hindi Solutions सन्नद्धता कार्यक्रम Chapter 15 मौखिक खेल 2

मौखिक अभ्यासः

1. चित्र देखो नाम बोलो।
AP Board 6th Class Hindi Solutions सन्नद्धता कार्यक्रम Chapter 15 मौखिक खेल 3

2. समरूपी शब्दो को जोड़िए।
AP Board 6th Class Hindi Solutions सन्नद्धता कार्यक्रम Chapter 15 मौखिक खेल 4
उत्तर:
AP Board 6th Class Hindi Solutions सन्नद्धता कार्यक्रम Chapter 15 मौखिक खेल 5

3. इन शब्दों में अ – 1 की मात्रा पर गोला ‘O’ लगाओ।
AP Board 6th Class Hindi Solutions सन्नद्धता कार्यक्रम Chapter 15 मौखिक खेल 6

4. बेमेल मात्राओं पर बाक्स ‘[ ]’ लगाइए।
AP Board 6th Class Hindi Solutions सन्नद्धता कार्यक्रम Chapter 15 मौखिक खेल 7

AP Board 7th Class Science Notes Chapter 4 Motion and Time

Students can go through AP State Board 7th Class Science Notes Chapter 4 Motion and Time to understand and remember the concept easily.

AP State Board Syllabus 7th Class Science Notes Chapter 4 Motion and Time

→ An object is said to be in motion if it changes its position with respect to its surroundings in a given time.

→ An object is said to be at rest if there is no change in its position with respect to its surroundings in a given time.

→ Motion is relative to the observer.

→ If a body covers equal distances in equal intervals of time, it is said to be in uniform motion.

→ If a body covers unequal distances in equal intervals of time, it is said to be in non¬uniform motion.

→ We classify the motion of bodies as

  • Translatory motion
  • Rotatory motion
  • Oscillatory motion.

→ If all parts of a moving body move in the direction of motion then the motion is said to be in translatory motion.

→ If a body in translatory motion moves along a straight line then the motion is called rectilinear motion.

→ If a body in translatory motion moves along a curved path then the motion is called curvilinear motion.

→ The ‘to’ and ‘fro’ motion of an object about a fixed point always following the same paths is called oscillatory motion.

→ The basic unit of time is a second (s).

→ The speed of an object is the distance travelled by it is a unit of time.

AP Board Solutions AP Board 7th Class Science Notes Chapter 4 Motion and Time

→ 1 km/h = 5/18 m/s.

→ Motion is a common experience in our life.

→ An object is said to be in motion if it changes its position.

→ The motion of all particles of a moving body follows a circular path with respect to a fixed centre or axis of rotation.

→ We measure time by using different instruments like electronic clocks, digital clocks etc.

→ A speedometer helps us to know the speed of a vehicle.

→ Units of speed in the SI system is meters per second.

→ MotIon: A meaningful or expressive change in the position of the body or a part of the body; a gesture.

→ Rest: Termination or absence of motion.

→ Translatory motion: If all parts of a moving body move in the direction of motion then the motion is said to be in translatory motion.

→ Rotatory motion: if a body moving in a circular path around a fixed point.

→ Axis of rotation: An imaginary line passing through the fixed point of rotatory motion.

→ Oscillatory motion: The body is in to and fro motion along the same path of motion.

→ Speed: Distance travelled and divided by the time of travel.

→ Average speed: Speed of an object as the distance travelled by it in a unit of time.

→ Speedometer: Añ instrument for indicating speed.

AP Board Solutions AP Board 7th Class Science Notes Chapter 4 Motion and Time

→ Odometer: An instrument that indicates the distance travelled by a vehicle.

→ Rectilinear: Moving in a straight line or lines.

→ CurvIlinear: Following a curved line.
AP Board 7th Class Science Notes Chapter 4 Motion and Time 1
→ Like minutes and hours, week, fortnight, month, season, Ayanami are also units for measuring time. Sundial, sand clock, water clock etc. are used primitively to measure the time.

→ Louis Pasteur (1822 – 1895):
Louis Pasteur was born in a village Dole in France on 27th December 1822. His father was a soldier. As a school student, Pasteur was a weak-minded scholar.
During his college days, he was inspired by the Lectures of Dumas the famous scientist. Thus Pasteur became a chemist after picturing his Doctorate.

Later Pasteur came to be known for his Pasteurisation, Antirabies vaccination etc. Pasteur dedicated his life to the invention of many precautionary measures to save lives. He died on 27th September 1895 and his grave was erected in the same institute where he conducted his experiments till his death.

AP Board 4th Class EVS Solutions 5th Lesson Eat Together

Andhra Pradesh AP Board 4th Class EVS Solutions 5th Lesson Eat Together Textbook Exercise Questions and Answers.

AP State Syllabus 4th Class EVS Solutions Lesson 5 Eat Together

I. Conceptual Understanding:

Question 1.
Name some occasions where people eat food together?
Answer:

  1. In marriages
  2. In picnics
  3. In functions
  4. Students in mid day meals
  5. In Annadana Satrams
    People eat food together.

Question 2.
When does the food get wasted at home?
Answer:

  1. If food is cooked in excess, then it gets wasted.
  2. Some people spill food while eating.
  3. Some people leave out food in the plate.
  4. Some parents serve much food for their children but children do not eat it completely.

Question 3.
Mention the people whose efforts are behind the process of producing the food we eat?
Answer:

  1. Farmers
  2. Agriculturalists
  3. Agricultural labourers,
  4. Blacksmith,
  5. Carpentors,
  6. Millers
  7. Vendors etc, are the people whose efforts are behind the process of producing the food we eat.

II. Questioning and Hypothesis:

Question 4.
What questions would you ask a farmer about how they can keep food grains safe from rats, mice and insects?
Answer:
I would ask the following questions .

  1. What do you do to protect your food grains from rats?
  2. What do you do to protect your food grains from insects
  3. Which methods do you follow to safe storage of food grains?

III. Experiments and field observations:

Question 5.
Observe the list of vegetables used at the mid day meal today and write them in your note book?
Answer:
The following vegetables are used at the midday meal today (Wednesday)

  • carrot
  • beans
  • potato
  • capsicum
  • green chilli

IV. Information Skills & Project Work:

Question 6.
List out the food items that you preserve at home for long periods?
Answer:
The following food items are preserve for long periods

  1. fryums (orugulu/Vadiyalu)
  2. pickles
  3. Jams
  4. meat etc.

V. Drawing Pictures and Model Making:

Question 7.
Make a tree diagram of vegetarian and non vegetarian food and healthy and junk food.
Answer:

AP Board 4th Class EVS Solutions 5th Lesson Eat Together 1

VI. Appreciation:

Question 8.
You noticed Kavya feeding the birds with some grains everyday. How would you appreciate her act ?
Answer:

  1. Kavya is doing a good work.
  2. Adding grains (feeding grains) to birds on a daily basis satisfies their hunger.
  3. Many birds are dying due to lack of food.
  4. We also need to feed and protect birds and dumb creatures.

Activity: (TextBook Page No.42)

List out the food items served during mid-day meals at your school for the last few days:

AP Board 4th Class EVS Solutions 5th Lesson Eat Together 2

Answer:

DaysName of the food served
MondayRice, egg curry, chikki
TuesdayPulihora, Tomato dal, Boiled egg.
WednesdayVegetable rice, Alookurma, Boiled egg, Chikki.
ThursdayKichidi, Tomato chutney, Boiled egg.
FridayRice, Asparagus, Boiled egg, chikki
SaturdayRice, Sambar, Sweet pongal

Activity: (TextBook Page No.44)

Make a pen stand and write the procedure.
Answer:

  1. Take a used water bottle.
  2. Cut it in the centre.
  3. Wrap a colour paper or colour it.
  4. Our pen stand is ready

Let us do: (TextBook Page No.44)

How do you prepare a flower pot?
Answer:

  1. Take a plastic bottle.
  2. Cut it in the centre.
  3. Wrap a colour paper or colour it.
  4. Pour water in it and put a money plant
  5. Our flower pot is ready

Additional Questions:

Question 1.
Why do we eat food?
Answer:

  1. Food gives us energy to work.
  2. If we do not eat we may get sick.
  3. So we need to eat food at timely intervals.

Question 2.
Some children leave out the vegetables and curry leaves put in the sam- bar. Is it good practice why?
Answer:
No, it is not a good practice vegetables and curry leaves have nutrients. If we leave them we could not get all nutrients that we need.

Question 3.
What do you do with the left over of the mid-day meals at school?
Answer:

  1. It would be given to the needy people.
  2. It would be fed to cows buffalo’s etc.
  3. Some food items are convert into manure and spread at trees and plants.

Question 4.
What are the harmful effects of plastics? or What happens If we preserve food in plastic covers?
Answer:

  1. If we preserve food in plastic plates, covers and bottles, Plastic particles may enter into the food and finally get into our body causing ill health.
  2. If we discard the food it will pollute the soil..
  3. Cows and buffaloes may eat plastic covers along with food causing sickness.
  4. If we bum plastic, the air gets polluted.

Question 5.
How can we preserve pickles for a long period with out getting spoiled?
Answer:

  1. Pickles, chutneys, Jams, fryums (vadiyalu) etc, are of the common pre-served food.
  2. Salt is a preservating agent and oil prevents bacteria and fungus to form in the pickle.

Question 6.
Prepare a list of food items and methods preserved for many days?
Answer:

  1. Fresh fruits can be preserved with the help of sugar syrup and by making jams.
  2. Some vegetables, meat and fish can be preserved for a few days by keeping them in freezers. This method is called freezing.
  3. By adding excess salt, chilly powder and oil to the pickles, vegetable, fmits, meat and milk they are preserved for long time.

Question 7.
How do you prepare Bengal gram powder(Kandipodi)?
Answer:

  1. Take some Bengal gram and heat them on a low flame.
  2. Take some red chillies, cumin seeds and fry them on a low flame.
  3. Now take the above ingredients in mixie jar add some salt and grind them to a fine powder.
  4. Our bengal gram powder is ready.

Question 8.
How do we avoid the spoilage and damage of stored food grains?
or
Collect information about the storage of food gains without damage and spoilage?
Answer:

  1. To avoid the damage and spoilage of food grains, neem leaves are dried and put in the storage bags
  2. The harvested grain is dried well and stored.
  3. Large containers of tin, steel, aluminium or bamboo are made to keep safe from rats, mice and insects.

Question 9.
Collect information about the person and activities involved behind the food that you eat?
Answer:

S.No.PersonTheir activity
1.Black SmithMake sickle
2.CarpenterMake plough
3.FarmersCultivate the crop
4.AgriculturalistGive suggestion to farmers
5.Agriculturelabour Work in field spray fertilizers
6.MillersStore the grains and grind them
7.VendorsSell the food items
8.FatherBuy the food items from vendor
9.MotherPrepare food for us

Question 10.
How do farmers keep grains safe from rats, mice and insects?
Answer:
Farmers used large containers of tin, steel, aluminium or bamboo to keep grains safe from rats, mice and insects.

Multiple Choice Questions:

Choose the correct answer:

Question 1.
_______ is a preservating agent.
A) Salt
B) Chilli
C) Water
D)All
Answer:
A) Salt

Question 2.
_______ prevents bacteria and fungus to form in the pickle.
A) Oil
B) Water
C) Flour
D) All
Answer:
A) Oil

Question 3.
Which of the following methods are used to preserve food items for long time.
A) Freezing
B) Making jams
C) Making pickles
D) All
Answer:
D) All

Question 4.
To avoid spoilage of ground nuts infected by insects and fungi _______ are stored in storage bags.
A) Dried neem leaves
B) Water
C) Wet vegetables
D) None
Answer:
A) Dried neem leaves

Question 5.
Mid-day meal is a _______ of children.
A) Need
B) Waste
C) Right
D) Habit
Answer:
C) Right

Question 6.
Meat and fish can be preserved for few days by keeping them in _______.
A) Water
B) Freezer
C) Open air
D) All
Answer:
B) Freezer

Question 7.
Fresh fruits can be preserved by making _______.
A) Pickles
B) Fryums
C) Jams
D) None
Answer:
C) Jams

AP Board 1st Class Telugu Solutions 4th Lesson ఊహల ఊయల, బావా బావా పన్నీరు

Andhra Pradesh AP Board 1st Class Telugu Solutions 4th Lesson ఊహల ఊయల, బావా బావా పన్నీరు Textbook Exercise Questions and Answers.

AP State Syllabus 1st Class Telugu Solutions Chapter 4 ఊహల ఊయల, బావా బావా పన్నీరు

Textbook Page No. 46

ఊ, య

ఊపూ ! ఊపూ ! ఊయల
హాయిగ ఊగెద ఊయల
ముందు వెనుకలకు ఊయల
పోవుచునుండే ఊయల
పొడవు త్రాళ్లుగల ఊయల
పొసగును సౌఖ్యము ఊయల
ప్రక్కకు ఊపిన ఊయల
వంకర తిరుగును ఊయల
సమముగ విడువుము ఊయల
చక్కగ ఊగెద ఊయల

AP Board 1st Class Telugu Solutions 4th Lesson ఊహల ఊయల, బావా బావా పన్నీరు 1

AP Board 1st Class Telugu Solutions 4th Lesson ఊహల ఊయల, బావా బావా పన్నీరు

Textbook Page No. 47

వినండి- మాట్లాడండి.

అ) గేయం పాడండి. అభినయించండి.
జవాబు:
గేయాన్ని పాడుట, అభినయించుట.

ఆ) పాఠం చిత్రంలో ఎవరేం చేస్తున్నారో చెప్ప౦డి.
జవాబు:
చెట్టుకు ఊయల కట్టి ఉంది. తల్లి వాళ్ళ పాపను ఊయల ఊపుతుంది. ఊయల సరిగా ఊపకపోతే వంకర తిరిగి పడిపోతారు. తల్లి భయపడుతుంది. పిల్ల (పాప) ఉత్సాహంగా ఊయల ఊగుతుంది.

ఇ) కింది చిత్రం ఆధారంగా మాట్లాడండి.
AP Board 1st Class Telugu Solutions 4th Lesson ఊహల ఊయల, బావా బావా పన్నీరు 2
జవాబు:
పిల్లి ఊయల ఊగుతుంది. కోతులు చెట్టుకు కట్టిన ఊయలలు ఊగుతున్నాయి. పిల్లి దర్జాగా ఊగుతుంది. కోతులు వివరం లేకుండా ఊగుతున్నాయి.

చదవండి.

అ) గేయంలోని వాక్యాలలో “ఊయల” పదానికి AP Board 1st Class Telugu Solutions 4th Lesson ఊహల ఊయల, బావా బావా పన్నీరు 3 చుట్టండి.
జవాబు:
గేయంలో చూడాలి.

ఆ) కింది వాక్యాలలో “ఊయల” పదానికి AP Board 1st Class Telugu Solutions 4th Lesson ఊహల ఊయల, బావా బావా పన్నీరు 3 చుట్టండి.
AP Board 1st Class Telugu Solutions 4th Lesson ఊహల ఊయల, బావా బావా పన్నీరు 4
జవాబు:
AP Board 1st Class Telugu Solutions 4th Lesson ఊహల ఊయల, బావా బావా పన్నీరు 5

AP Board 1st Class Telugu Solutions 4th Lesson ఊహల ఊయల, బావా బావా పన్నీరు

Textbook Page No. 48

ఇ) చిత్రం చూడండి. పదం చదవండి. అక్షరాలను వర్ణమాలలో గుర్తించండి..
AP Board 1st Class Telugu Solutions 4th Lesson ఊహల ఊయల, బావా బావా పన్నీరు 6

ఈ) కింది గళ్ళలో అక్షరాలు చెప్ప౦డి.
AP Board 1st Class Telugu Solutions 4th Lesson ఊహల ఊయల, బావా బావా పన్నీరు 7
1వ అక్షరం ఏమిటి ?
జవాబు:
2వ అక్షరం ఏమిటి ?
జవాబు:
1, 2, 3 అక్షరాలు కలిపి చదవండి.
జవాబు: ఊయల
4, 3 అక్షరాలు కలిపి చదవండి.
జవాబు: తల
6, 3, 5 అక్షరాలు కలిపి చదవండి.
జవాబు: బలం

ఉ) కింది బొమ్మలు ఊ, య అనే అక్షరాలతో మొదలవుతాయి. వాటి పేర్లు చెప్ప౦డి.
AP Board 1st Class Telugu Solutions 4th Lesson ఊహల ఊయల, బావా బావా పన్నీరు 8

ఊ) పదాలను చదవండి. ‘ఊ’ అక్షరానికి AP Board 1st Class Telugu Solutions 4th Lesson ఊహల ఊయల, బావా బావా పన్నీరు 9 చుట్టండి.
AP Board 1st Class Telugu Solutions 4th Lesson ఊహల ఊయల, బావా బావా పన్నీరు 10
జవాబు:
AP Board 1st Class Telugu Solutions 4th Lesson ఊహల ఊయల, బావా బావా పన్నీరు 11

AP Board 1st Class Telugu Solutions 4th Lesson ఊహల ఊయల, బావా బావా పన్నీరు

Textbook Page No. 49

రాయండి.

అ) గుర్తుల ఆధారంగా చుక్కలను కలుపుతూ అక్షరాలు రాయండి.
AP Board 1st Class Telugu Solutions 4th Lesson ఊహల ఊయల, బావా బావా పన్నీరు 12

ఆ) చుక్కలు కలుపుతూ గీతల్లో రాయండి.
AP Board 1st Class Telugu Solutions 4th Lesson ఊహల ఊయల, బావా బావా పన్నీరు 13
జవాబు:
AP Board 1st Class Telugu Solutions 4th Lesson ఊహల ఊయల, బావా బావా పన్నీరు 14

ఇ) కింది గళ్ళలోని అక్షరాలతో ఏర్పడే పదాలు రాయండి.
AP Board 1st Class Telugu Solutions 4th Lesson ఊహల ఊయల, బావా బావా పన్నీరు 15
జవాబు:
AP Board 1st Class Telugu Solutions 4th Lesson ఊహల ఊయల, బావా బావా పన్నీరు 16

సృజనాత్మకత:

పిల్లలూ ! చుక్కలు కలుపుతూ చిత్రం గీయండి. రంగులు వేయండి. పేరు రాయండి.
AP Board 1st Class Telugu Solutions 4th Lesson ఊహల ఊయల, బావా బావా పన్నీరు 17
జవాబు:
ఊయల

Textbook Page No. 50

బావా బావా పన్నీరు

బావా బావా పన్నీరు
బావను పట్టుకు తన్నేరు
వీథీ వీథీ తిప్పేరు
వీసెడు గంధం పూసేరు
చావడి గుంజకు కట్టేరు
చప్పిడి గుద్దులు గుద్దేరు
పట్టె మంచం వేసేరు
పాతిక గద్దులు గుద్దేరు
నులక మంచం వేసేరు
నూరు గుద్దులు గుద్దేరు
AP Board 1st Class Telugu Solutions 4th Lesson ఊహల ఊయల, బావా బావా పన్నీరు 18

Textbook Page No. 51

వినండి- మాట్లాడండి.

అ) గేయం పాడండి. అభినయించండి.
జవాబు:
గేయాన్ని పాడుట, అభినయించుట.

ఆ) పాఠం చిత్రంలో ఎవరేం చేస్తున్నారో చెప్ప౦డి.
జవాబు:
పెళ్ళికూతురు, పెళ్ళికొడుకు ఉన్నారు. బావగారిని పిల్లలు (మరదలు, బావమరిది) ఆటపట్టిస్తున్నారు. పెళ్ళికూతురు ఆశ్చర్యంగా ముక్కున వేలేసుకు చూస్తుంది. సరదాగా బావగారికి పన్నీరు పూస్తున్నారు. గుద్దులు, గంధం, నులక మంచాలతో ఆట పట్టిస్తున్నారు.

AP Board 1st Class Telugu Solutions 4th Lesson ఊహల ఊయల, బావా బావా పన్నీరు

Textbook Page No. 52

ఇ) కింది చిత్రం ఆధారంగా మాట్లాడండి.
AP Board 1st Class Telugu Solutions 4th Lesson ఊహల ఊయల, బావా బావా పన్నీరు 19
జవాబు:
మంచాలు రకరకాలుగా ఉన్న వాటిని చూపించారు. ఇంటిలో వాడే మంచం, వసతి గృహం (హాస్టల్)లో వాడే మంచం, నులక మంచం, ఆసుపత్రుల్లో వాడే మంచం ఉన్నాయి. నులక మంచం పై పెద్దాయన పేపర్ చదువుకుంటున్నాడు. మంచాలు రకరకాలుగా ఉన్నాయని అర్థం అవుతుంది.

చదవండి
అ) గేయంలోని వాక్యాలలో “మంచం” పదానికి AP Board 1st Class Telugu Solutions 4th Lesson ఊహల ఊయల, బావా బావా పన్నీరు 20 చుట్టండి.

ఆ) కింది వాక్యాలలో “మంచం” పదానికి AP Board 1st Class Telugu Solutions 4th Lesson ఊహల ఊయల, బావా బావా పన్నీరు 20 చుట్టండి.

AP Board 1st Class Telugu Solutions 4th Lesson ఊహల ఊయల, బావా బావా పన్నీరు 21

Textbook Page No. 52

ఇ) చిత్రం చూడండి. పదం చదవండి. వర్ణమాలలో గుర్తించండి.
AP Board 1st Class Telugu Solutions 4th Lesson ఊహల ఊయల, బావా బావా పన్నీరు 22

ఈ) కింది గళ్ళలో అక్షరాలు చెప్ప౦డి. అక్షరాలను
AP Board 1st Class Telugu Solutions 4th Lesson ఊహల ఊయల, బావా బావా పన్నీరు 23
1వ అక్షరం ఏమిటి ?
జవాబు:
మ 2వ అక్షరం ఏమిటి ?
జవాబు:
1, 3, 2, 3 అక్షరాలు కలిపి చదవండి.
జవాబు: మంచం
5, 4, 6 అక్షరాలు కలిపి చదవండి.
జవాబు: అలక
6, 3, 2, 3 అక్షరాలు కలిపి చదవండి.
జవాబు: కంచం

ఉ) కింది బొమ్మలు మ, చ అనే అక్షరాలతో మొదలవుతాయి. వాటి పేర్లు చెప్ప౦డి.
AP Board 1st Class Telugu Solutions 4th Lesson ఊహల ఊయల, బావా బావా పన్నీరు 24

ఊ) పదాలను చదవండి. మ, చ అక్షరాలకు AP Board 1st Class Telugu Solutions 4th Lesson ఊహల ఊయల, బావా బావా పన్నీరు 25 చుట్టండి.
AP Board 1st Class Telugu Solutions 4th Lesson ఊహల ఊయల, బావా బావా పన్నీరు 26
జవాబు:
AP Board 1st Class Telugu Solutions 4th Lesson ఊహల ఊయల, బావా బావా పన్నీరు 27

Textbook Page No. 53

రాయండి.

ఆ) గుర్తుల ఆధారంగా చుక్కలను కలుపుతూ అక్షరాలు రాయండి.
AP Board 1st Class Telugu Solutions 4th Lesson ఊహల ఊయల, బావా బావా పన్నీరు 28

ఆ) చుక్కలు కలుపుతూ గీతల్లో రాయండి.
AP Board 1st Class Telugu Solutions 4th Lesson ఊహల ఊయల, బావా బావా పన్నీరు 29
జవాబు:
AP Board 1st Class Telugu Solutions 4th Lesson ఊహల ఊయల, బావా బావా పన్నీరు 30

AP Board 1st Class Telugu Solutions 4th Lesson ఊహల ఊయల, బావా బావా పన్నీరు

ఇ) కింది గళ్ళలోని అక్షరాలతో ఏర్పడే పదాలు రాయండి.
AP Board 1st Class Telugu Solutions 4th Lesson ఊహల ఊయల, బావా బావా పన్నీరు 31
జవాబు:
AP Board 1st Class Telugu Solutions 4th Lesson ఊహల ఊయల, బావా బావా పన్నీరు 32

సృజనాత్మకత:

పిల్లలూ ! చుక్కలు కలుపుతూ చిత్రం గీయండి. రంగులు వేయండి. పేరు రాయండి.

AP Board 1st Class Telugu Solutions 4th Lesson ఊహల ఊయల, బావా బావా పన్నీరు 33
జవాబు:
మంచం

AP Board 9th Class Telugu Important Questions Chapter 5 పద్యరత్నాలు

AP State Syllabus AP Board 9th Class Telugu Important Questions Chapter 5 పద్యరత్నాలు

AP State Syllabus 9th Class Telugu Important Questions 5th Lesson పద్యరత్నాలు

9th Class Telugu 5th Lesson పద్యరత్నాలు Important Questions and Answers

I. అవగాహన – ప్రతిస్పందన

క్రింది అపరిచిత పద్యాలను చదివి, ప్రశ్నలకు జవాబులు రాయండి.

1. జన్మభూమి కంటే స్వర్గంబు వేరేది?
మాతృభాష కంటె మధురమేది?
కన్నతల్లి కంటె ఘనదైవమింకేది?
తెలియుమయ్య నీవు తెలుగు బిడ్డ !
ప్రశ్నలు:
1. మనిషికి స్వర్గం ఏది?
2. మాతృభాష ఎలాంటిది?
3. మనిషికి దైవం ఏది?
4. ‘తెలుగు’ ప్రకృతి పదం?
జవాబులు :
1. జన్మభూమి
2. మధురమైనది
3. కన్నతల్లి
4. త్రిలింగ

AP Board 9th Class Telugu Important Questions Chapter 5 పద్యరత్నాలు

2. అక్కరకు రాని చుట్టము
మ్రొక్కిన వరమీని వేల్పు మోహరమున దా
నెక్కిన బారని గుఱ్ఱము
గ్రక్కున విడువంగ వలయు గదా సుమతీ !
ప్రశ్నలు:
1. ‘అక్కర’ అంటే ఏమిటి?
2. ఎటువంటి వేల్పును విడిచి పెట్టాలి?
3. సుమతీ శతకం వ్రాసినదెవరు?
4. ఇంకా వేటిని విడవాలని ఈ పద్యం చెబుతోంది?
జవాబులు :
1. అవసరం
2. మొక్కినా వరం ఇవ్వని
3. బద్దెన
4. అవసరానికి ఉపయోగపడని చుట్టాన్ని, ఇష్టంతో ఎక్కినా నడవని గుఱ్ఱాన్ని,

3. ఈ కింది పద్యాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.
గుడ్లగూబ పెద్ద గుడ్లున్నదైనను
సుంతయైన వెలుగు చూడలేదు
విద్యలున్న నేమి విజ్ఞత లేకున్న
వాస్తవమ్ము నార్ల వారి మాట
ప్రశ్నలు:
1. వెలుగు చూడలేని పక్షి ఏది?
2. మనిషికి ఏది ముఖ్యమని పై పద్యంలో చెప్పారు?
3. “సుంతయైన” అనే పదానికి అర్థం ఏమై ఉంటుంది?
4. పై పద్యం ఆధారంగా ఒక ప్రశ్న తయారుచేయండి.
జవాబులు:
1. గుడ్లగూబ
2. విజ్ఞత
3. కొంచమైన
4. పై పద్యంలో మకుటం ఏది?

4. ఈ కింది పద్యాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి. (S.A. II – 2018-19)
అల్పుడెపుడు పల్కు నాడంబరముగాను
సజనుండు పల్కు చల్లగాను
కంచుమ్రోగునట్లు కనకంబు మ్రోగునా?
విశ్వదాభిరామ వినురవేమ?
ప్రశ్నలు:
1. సజ్జనుడు ఏ విధంగా మాట్లాడుతాడు?
2. అల్పుని పలుకులు ఎలా ఉంటాయి?
3. పై పద్యం ఏ విషయం గురించి చెప్తోంది?
4. పై పద్యానికి తగిన ప్రశ్నను తయారుచేయండి.
జవాబులు:
1. శాంతంగా / మంచిగా
2. ఆడంబరంగా
3. మాటతీరును (మంచివాని మాటతీరు, అల్పుని మాటతీరు)
4. పై పద్యానికి ‘ఓటికుండకు మోత ఎక్కువ’ అన్న సామెత వర్తిస్తుందా?

AP Board 9th Class Telugu Important Questions Chapter 5 పద్యరత్నాలు

5. ఈ కింది అపరిచిత పద్యాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.
తలనుండు విషము ఫణికిని
వెలయంగా తోకనుండు వృశ్చికమునకున్
తల తోక యనక నుండును
ఖలునకు నిలువెల్ల విషముగదరా సుమతీ !
ప్రశ్నలు :
1. పై పద్యంలో దేని గురించి చెప్పారు?
2. పై పద్యం ఏ శతకంలోనిది?
3. తేలుకు విషం ఎక్కడ ఉంటుంది?
4. పై పద్యానికి తగిన ప్రశ్నను తయారుచేయండి.

6. కింది పద్యాన్ని చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు సమాధానం రాయండి. (S.A. III – 2015-16)
కలిమిగల లోభికన్నను
విలసి తముగ పేద మేలు వితరణి యైనన్
చలిచెలమ మేలుగాదా !
కుల నిధియంబోధి కన్న గువ్వల చెన్నా !
ప్రశ్నలు :
1. లోభిని ఎవరితో పోల్చారు?
2. లోభియైన ధనవంతుని కంటె ఎవరు మేలు?
3. ‘చలి చెలమ’ అంటే మీకేమి తెలిసింది?
4. పై పద్యం ద్వారా అలవరచుకోవలసిన గొప్పగుణమేది?
జవాబులు:
1. సముద్రంతో
2. దానం చేసే బుద్ధి గల పేదవాడు
3. చిన్న నీటిగుంట
4. దానగుణం

7. కింది పద్యాన్ని చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు సమాధానం రాయండి. (S.A. I – 2017-18)
పూజకన్న నెంచ బుద్ది నిధానంబు
మాటకన్న నెంచ మనసు దృఢము
కులముకన్న నెంచ గుణము ప్రధానంబు
విశ్వదాభిరామ వినురవేమ.
ప్రశ్నలు :
1. పూజకన్నా ముఖ్య మైనది ఏది?
2. మాటకన్నా దృఢమైనది ఏది?
3. విధానము, సుధానము ఇటువంటి పదాలను ప్రాస పదాలు అంటారు. పై పద్యంలో అటువంటి పదాలు ఉన్నాయి. వెతికి రాయండి.
4. పై పద్యం ఆధారంగా ఒక ప్రశ్న తయారుచేయండి.
జవాబులు:
1. బుద్ధి
2. మనసు
3. నిధానంబు – ప్రధానంబు / పూజకన్న – మాటకన్న / రామ – వేమ
4. ఈ పద్యంలోని మకుటం ఏది?
జవాబులు:
1. చెడ్డవాని స్వభావాన్ని గూర్చి చెప్పారు.
2. సుమతీ
3. తోకలో
4. పై పద్యంలోని ప్రాణుల పేర్లు రాసి, వాటి అర్థం

AP Board 9th Class Telugu Important Questions Chapter 5 పద్యరత్నాలు

8. కింది పద్యాన్ని చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు సమాధానం రాయండి. (S.A. III – 2016-17)
తగిలినంతమేర దహియించుకొనిపోవు
చెడ్డవాని చెలిమి చిచ్చువోలె
మంచివారి మైత్రి మలయమారుతవీచి
లలిత సుగుణజాల తెలుగుబాల !
ప్రశ్నలు:
1. మలయమారుతంలా ఉండేదేది?
2. ఈ పద్యం ఏ శతకం లోనిది?
3. పై పద్యానికి తగిన శీర్షిక సూచించండి.
4. చెడ్డవాడి చెలిమిని గురించి ఒక ప్రశ్న తయారు చేయండి. రాయండి.
జవాబులు:
1. మంచివాని మైత్రి
2. తెలుగుబాల
3. చెలిమి
4. చెడ్డవాడి చెలిమిని కవి దేనితో పోల్చాడు?

II. స్వీయరచన

అ) క్రింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
కూచిమంచి తిమ్మకవి ‘శ్రీ భర్గ శతకం’ ద్వారా ఏమి చెప్పదలచారు?
జవాబు:
గాజుపూస విలువైన రత్నం ఎప్పటికీ కాలేదు. కాకి హంసగానూ, జోరీగ తేనెటీగ గానూ, దున్నపోతు సింహంగానూ, జిల్లేడు చెట్టు కల్పవృక్షం గానూ ఎప్పటికీ కాలేవు. అట్లే పిసినారి అయిన దుర్జనుడు రాజు కాలేడు – అని చెప్పడం ద్వారా వ్యక్తిత్వం అనేది పుట్టుకతో వస్తుంది గాని మధ్యలో రాదని తెలుస్తోంది.

ప్రశ్న 2.
లోకంలో భగవంతునికి నిజమైన సేవకుడు ఎవరు?
జవాబు:
లోకంలో భగవంతునికి నిజమైన సేవకుడు సత్యవంతుడు. మరియు దురాచారుడు కానివాడు. విచక్షణతో మెలిగేవాడు. దుర్జనులతో స్నేహం చేయనివాడు. భక్తులతో స్నేహంగా ఉండేవాడు. కామాతురుడు కానివాడు. ఈ లక్షణాలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళే నిజమైన సేవకులని యథావాక్కుల అన్నమయ్య తెలిపారు.

ప్రశ్న 3.
“స్నానంబుల్ నదులందు …………….” అను పద్యం ద్వారా పోతవ ఏమి తెలియజేస్తున్నాడు?
జవాబు:
బమ్మెర పోతన తన ‘నారాయణ శతక’ పద్యం ద్వారా భక్తిలేని జపతపాలు వృథా అని తెలియజేస్తూ “ఓ నారాయణా ! నీ పేరును తలవనివాడు, నీ మీద భక్తి లేనివాడు ఎన్ని నదుల్లో స్నానం చేసినా అది ఏనుగు స్నానంలా వృథానే ! మౌనంగా మనస్సులో వేద మంత్రాలు చదివినా అది అరణ్యరోదనే. ఎన్ని హోమాలు చేసినా అది బూడదలో వేసిన నెయ్యిలా వ్యర్థమే” – అని నిజమైన భక్తి లేని పూజాదికాలు చేయడం ద్వారా సమయం ఖర్చు అవుతుందేకాని భగవంతునికి దగ్గర కాలేమని ఈ పద్యం ద్వారా పోతన తెలిపారు.

AP Board 9th Class Telugu Important Questions Chapter 5 పద్యరత్నాలు

ప్రశ్న 4.
‘శతకం’ అంటే ఏమిటి? (S.A. I – 2019-2017)
జవాబు:
శత (నూఱు) పద్యాల సమాహారమే శతకం. నూఱుపద్యాల పైగా గల సాహిత్య ప్రక్రియ శతకం. మకుట నియమం దీనికున్న ఆకర్షణ.

ఏకపద మకుటం, ఏకపాద మకుటం, ద్విపాద మకుటం దీనిలోని భేదాలు. మకుటం అంటే కిరీటం. కిరీటం (తలపాగ) మనిషికి అందాన్ని ఇచ్చినట్లు, పద్యానికి మకుటం కూడా శోభనిస్తుంది. శతక పద్యాలు ఏ పద్యానికి ఆ పద్యమే స్వతంత్ర్య భావాన్ని కలిగి సమాజానికి మార్గదర్శనం చేస్తాయి. ఉదా : సుమతీ, వేమన మొ||.

ప్రశ్న 5.
“భద్రగిరిపై కొలువైన స్వామి” అంటే ఎవరు? ఆయనను కవి ఏమని వర్ణించాడు?
జవాబు:
భద్రుడనే భక్తుడు శ్రీమన్నానారాయణుని కోసం తపస్సు చేశాడు. తనను కొండగా మలచమని, తనపై సీతాలక్ష్మణులతో గూడి శ్రీరామునిగా వెలవమని కవి ఈ విధంగా ప్రార్థించాడు. “భద్రాద్రిపై వెలసిన ఓ స్వామీ ! దశరథుని కుమారుడైన ఓ రామా ! సముద్రమంత దయ గలవాడా ! నీవు యుద్ధంలో శత్రువుల్ని నాశనం చేశావు. గరుత్మంతుణ్ణి వాహనంగా చేసుకున్నావు. కష్టాలనే కారుచీకట్లను తొలగించగల సూర్యుడవు. హృదయమంతా దయతో నింపుకున్నావు. సీతాదేవి హృదయ కమలానికి తుమ్మెద లాంటి వాడవు. రాక్షసులనే కలువల్ని నాశనం చేయగల మదపుటేనుగువు, చక్కని శరీరాకృతి గల వాడవు.”

ప్రశ్న 6.
‘మంచి నడవడికను వదలిపెట్టకు’ అని తెలుసుకున్నారు కదా ! మంచి నడవడికకు కొన్ని ఉదాహరణలు రాయండి.
జవాబు:
ఆరోగ్యాన్ని కలిగించే ఆహారపు అలవాట్లను కలిగిఉండటం, ఇతరులను తక్కువ చేసి చూడకపోవడం, పెద్దలను గౌరవించడం. సత్యాన్నే మాట్లాడటం, పరులకు కీడు చేయకపోవడం, ఇతరులను బాధించకుండా నేర్పుగా తన పనులను సాధించుకోవడం. మర్యాదగా ప్రవర్తించడం, ఇతరుల మనోభావాలను గౌరవించడం.

AP Board 9th Class Telugu Important Questions Chapter 5 పద్యరత్నాలు

ఆ) క్రింది ప్రశ్నలకు పది లేక పన్నెండు వాక్యాలలో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
శతక పద్యాలు సమాజానికి ఏమి చెప్పదలచాయి?
జవాబు:
నూరు పద్యాలు గల సాహిత్య ప్రక్రియ శతకం. తెలుగు సాహిత్యంలో ఒక ప్రత్యేక ఒరవడి సృష్టించిన ప్రత్యేకత శతకానిదే. ఏ పద్యానికి ఆ పద్యమే స్వతంత్ర భావాన్ని కల్గి ఉండి ద్రాక్షగుత్తుల వలె మధురమైనవి శతకపద్యాలు. మనిషికి కిరీటం లాగా పద్యానికి మకుటం శోభను కల్గిస్తుంది.

“సమాజ హితం కోరేది సాహిత్యం ” అని పెద్దల మాట. సూటిగా మంచి విషయాన్ని చెప్పడం కన్న కథ రూపంలోను, పద్య రూపంలోను, కవిత రూపంలోను చెప్పడం వల్ల త్వరగా మనసుకు చేరుతుంది. అదే మన పూర్వులు చేసిన ప్రయత్నం. శతక పద్యాలు ప్రధానంగా ప్రబోధకాలు. కొన్ని భక్తి, వైరాగ్య, శృంగార హాస్య మొ|| అంశాలపై కూడా వచ్చాయి. సమాజంలోని చెడును, అజ్ఞానాన్ని తొలగించడానికి, ప్రజలను చైతన్యవంతులను చేయడానికి ఆయుధంగా కవుల శతక ప్రక్రియను ఎంచుకున్నారు. పాల్కురికి సోమనాథుని ‘వృషాధిప శతకం’ తొలి శతకంగా పేరు గాంచింది. నాటి నుండి నేటి కాలం వరకు శతక పద్యాలు రానివారు ఉండరు అనడంలో అతిశయోక్తి లేదు. చిన్నతనం నుండే శతకపద్యాలు ధారణ చేయడం మనల్ని మనమే సంస్కరించుకోవడం అవుతుంది. “కష్టబెట్టబోకు కన్న తల్లి మనసు, తల్లిదండ్రి మీద దయలేని పుత్రుండు, ఉపకారికి నుపకారము, తనకోపమే తన శత్రువు, పట్టు పట్టరాదు పట్టి విడువరాదు, అల్పుడెపుబల్కు నాడంబరముగాను, చదువది యెంత కల్గిన రసజ్ఞత యించుక చాలకున్ననా” – ఇలాంటి ఆణిముత్యాల వంటి పద్యాలు నేర్చుకోవడం వల్ల మానసిక ఎదుగుదల పెరుగుతుంది. సంబంధం బాంధవ్యాలు పెరుగుతాయి.

పెద్దయిన తర్వాత ప్రత్యేకంగా సైకాలజిస్టులను, మానసిక నిపుణులను కలిసి కౌన్సిలింగ్ తీసుకోవల్సిన పరిస్థితులు మనమే కల్పిస్తున్నాము. కవులు తమ విలువైన సమయాన్ని, జీవితాన్ని భావితరాల వారమైన మనం బాగుండాలని లోకం తీరును కళ్ళకు కట్టినట్లుగా ఉదాహరణలతో సహా రక్తాన్నే సిరాగా చేసి, రచించారు. వారి కష్టాన్ని గుర్తించి మనం మన భావితరాల వారి భవిష్యత్తును దృష్టియందుంచుకొని శతక పద్యాలు ధారణ చేయడం విధిగా భావించాలి.

వ్యక్తీకరణ – సృజనాత్మకత

క్రింది ప్రశ్నకు సమాధానము రాయండి.

ప్రశ్న 1.
నీవు చదివిన ఒక శతకాన్ని గూర్చి మిత్రునికి లేఖ రాయండి.
జవాబు:

తెనాలి,
x x x x

ప్రియమిత్రుడు ప్రవీడు
నేను క్షేమం. నీవు క్షేమమని తలుస్తాను. ఇటీవల మా పాఠశాల గ్రంథాలయంలో ‘భాస్కర శతకం’ పద్యాల పుస్తకం తీసుకొని, శ్రద్ధగా చదివాను. వాటిలో సుమారు 25 పద్యాలు కంఠస్థం చేసాను. వాటిలోని అర్థాలు ఎంత బాగున్నాయో! మొదటి రెండు పాదాలు నీతితో, చివరి రెండు పాదాలు ఉదాహరణతో మారయ(ద) వెంకయ్య బాగా రాసారు.

“దానము సేయ గోరిన వదాన్యుకీయగ శక్తిలేనిచో”, “తెలియని కార్యమెల్లఁగడ తేర్చుట కొక్క వివేకి జేకొనన్”, “చదువది యెంత కల్గిన రసజ్ఞత యించుక చాలకున్న నా”, “పలుమాఱు సజ్జనుండు ప్రియ భాషలె పల్కుగోర వాక్యముల్” – వంటి పద్యాలు నీతిని బోధిస్తాయి. నాకు ప్రేరణనిచ్చాయి. నీవు చదివిన ఏదేని శతకం గూర్చి రాయి.
ఇట్లు,
నీ ప్రియమిత్రుడు,
కె. జశ్వంత్.

చిరునామా:
డి. ప్రవీణ్ కుమార్,
9వ తరగతి,
జిల్లా పరిషత్ హైస్కూల్,
బాపట్ల, గుంటూరు జిల్లా.

AP Board 9th Class Telugu Important Questions Chapter 5 పద్యరత్నాలు

ప్రశ్న 2.
తేలికైన మాటలతో ఒక పద్యాన్ని రాయండి. / కవిత రాయండి.
జవాబు:
నాదియన్న చింత నాదిలో పుట్టెనా
పెరిగి పెద్దదైన తిరిగి పోదు
మొక్కపీకవచ్చు మొద్దును గాదురా
బుద్ధి కలిగినంత సిద్ధి కలుగు !

ప్రశ్న 3.
శతక పద్యాల ద్వారా మీరు గ్రహించిన నైతిక విలువలు పెంపొందే సూక్తులు ఐదింటిని రాయండి.
జవాబు:
శతకం ద్వారా గ్రహించిన నైతిక విలువలు :

  1. ఎన్ని కష్టాలు ఎదురైనా ధర్మాన్ని వీడకూడదు.
  2. ఎల్లప్పుడూ సత్యాన్నే పలకాలి.
  3. ఫలితాన్ని ఆశించక పని చేయాలి.
  4. గురువుల మాటకు ఎదురు చెప్పకూడదు.
  5. చెడు నడతను విడిచిపెట్టాలి.
  6. అందరికీ సాయం చేస్తూ ఆనందంగా బ్రతకాలి.
  7. సమాజానికి హాని చేసే పనులు చేయకూడదు.
  8. పేదవారి పట్ల నిర్లక్ష్యంగా ప్రవర్తించకూడదు.

III. భాషాంశాలు (పదజాలం, వ్యాకరణం)

1. పర్యాయపదాలు :

జలధి : సముద్రం, రత్నాకరం, సాగరం
సూర్యుడు : రవి, భాస్కరుడు, దివాకరుడు
చంద్రుడు : శశాంకుడు, సోముడు
జగడం : కలహం, తగాదా, కొట్లాట
వైరి : శత్రువు, రిపు, విరోధి
అటవి : అడవి, అరణ్యం, కాన, విపినం
హోమం : యజ్ఞం, యాగం, యూపం
ఆచార్యుడు : గురువు, ఉపాధ్యాయుడు

2. వ్యుత్పత్త్యర్థాలు :

సత్వం : సత్పురుషులందు పుట్టునది (నిజం)
నరకము : పాపులను తన సమీపమున పొందించునది, పరులు దీనియందు మొఱ పెట్టుదురు (ఒక లోకం)
నారాయణుడు : అవతారములందు నర సంబంధమయిన శరీరాన్ని పొందువాడు/ఉదకము స్థానముగా కలవాడు (పద్మం)
నిశాచరులు : రాత్రియందు సంచరించేవారు (రాక్షసులు)
అమృతం : మరణం లేనిది (సుధ)
జలధి : జలములు దీనిచే ధరింపబడును (సముద్రం)
పంచాస్యం : విస్తీర్ణమైన ముఖములు కలది (సింహం)
గురువు : అంధకార మనెడి అజ్ఞానమును ఛేదించువాడు (ఉపాధ్యాయుడు)
అబ్జము : నీటియందు పుట్టినది (పద్మము)

3. నానార్థాలు :

శైలము : కొండ, రసాంజనం, ఆనకట్ట, సాంబ్రాణి
జలము : నీరు, జడము, ఎఱ్ఱ తామర, ఎఱ్ఱ కలువ
ఈశ్వరుడు : శివుడు, ప్రభువు, పరమాత్మ,
శ్రేష్ఠవాచకం : అపకారం, మాలిన్యం, తగనిది, అశుభం
విభూతి : భస్మం, సంపద
శ్రీ : లక్ష్మి, సాలెపురుగు, విషం

4. ప్రకృతి – వికృతులు :

శ్రీ – సిరి
కుత్సితం – కుచ్చితం
శీత – సీతువు (చల్లని, మంచు)
బిక్ష – బిచ్చము
భక్తుడు – బత్తుడు
సాధువు – సాదువు
ద్రవ్యం – డబ్బు
ఘనము – గనము (అధికం)
రాజు – ఱేడు
దుష్టుడు – తుంటరి
ఈశ్వర – ఈసరుడు
భక్తి – బత్తి
రత్నము – రతనము
పుణ్యం – పున్నెం
కార్యము – కరము
మొల్లము – ముల్లె (ధనం)
రతి – రంతు
భూతి – బూది
అటవి – అడవి
హృదయం – ఎద, ఎడద
భూమి – బూమి
క్రుజ్ – కొంగ
స్నానము – తానము
బూతి – బూడి, భస్మం
తురంగం – తురికి (గుఱ్ఱం)
పుష్పం – పూవు
విషం – విసము

5. గణాలు :
AP Board 9th Class Telugu Important Questions Chapter 5 పద్యరత్నాలు 1

9th Class Telugu 5th Lesson పద్యరత్నాలు 1 Mark Bits

1. స్త్రీలకు విరులు అన్న మక్కువ ఎక్కువ – (గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి) (S.A. I – 2018-19)
ఎ) ఆభరణాలు
బి) కేశాలు
సి) వంకీలు
డి) పూవులు
జవాబు:
డి) పూవులు

2. మధువనమంతా మధువ్రతములతో నిండి ఉంది – (గీత గీసిన పదానికి వ్యుత్పత్యర్థాన్ని గుర్తించండి) (A S.A. I – 2018-19)
ఎ) మధువు సేకరించడం వ్రతంగా గలది
బి) మధువు సేకరింపకపోవడం వ్రతంగా గలది
సి) మధువును సేకరించడం వ్రతంగా లేనిది
డి) మధువును సేకరించే వ్రతం కలది
జవాబు:
ఎ) మధువు సేకరించడం వ్రతంగా గలది

AP Board 9th Class Telugu Important Questions Chapter 5 పద్యరత్నాలు

3. సత్మీర్తి దిగంతము వరకు వ్యాపిస్తుంది – (గీత గీసిన పదానికి సంధి విడదీయుము)
ఎ) దిక్ + అంతము
బి) దిస్ + అంతము
సి) దిగం + తము
డి) ది: + అంతము
జవాబు:
ఎ) దిక్ + అంతము

4. కార్యాలోచనమును ఒంటరిగా చేయరాదు – (గీత గీసిన పదానికి విగ్రహవాక్యం గుర్తించండి) (S.A. I – 2018-19)
ఎ) కార్యము వల్ల ఆలోచనము
బి) కార్యము యొక్క ఆలోచనము
సి) కార్యమును గురించి ఆలోచనము
డి) కార్యమును ఆలోచనమును కలుగుట
జవాబు:
సి) కార్యమును గురించి ఆలోచనము

5. ఓ రాజా ! నీవే కీర్తిమంతుడవు – చంద్రుడే కాంతిమంతుడు (అలంకారాన్ని గుర్తించండి) (S.A. I – 2018-19)
ఎ) ఉపమాలంకారం
బి) రూపక
సి) ఉత్ప్రేక్ష
డి) దృష్టాంత
జవాబు:
డి) దృష్టాంత

6. పంచాస్యం మత్తగజాన్ని బాధించింది. (గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి) (S.A. II – 2018-19)
ఎ) పులి
బి) ఎలుగు
సి) చిరుత
డి) సింహం
జవాబు:
డి) సింహం

7. దైవ పూజా సమయంలో విరులు విరివిగా వాడతారు – (గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి) (S.A. II – 2018-19)
ఎ) అగరువత్తులు
బి) దీపాలు
సి) పూలు
డి) ఫలాలు
జవాబు:
సి) పూలు

8. భారమైన జడలు కలిగిన వాడు – (వ్యుత్పత్త్యర్థం గుర్తించండి) (S.A. II – 2018-19)
ఎ) భారవి
బి) శైవుడు
సి) వాసవుడు
డి) ధూర్జటి
జవాబు:
డి) ధూర్జటి

9. విద్యాధనం – సర్వధన ప్రధానం – (గీత గీసిన పదానికి విగ్రహవాక్యం గుర్తించండి) (S.A. II – 2018-19)
ఎ) విద్యతో ధనం
బి) విద్యను ధనంగా గలది
సి) విద్య అనెడి ధనం
డి) విద్య యొక్క ధనం
జవాబు:
సి) విద్య అనెడి ధనం

10. కన్నులారా హిమాలయాలను దర్శించాలని శారద వాంఛ – (గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి) (S.A. II – 2017-18)
ఎ) వాదన
బి) కోరిక
సి) ఊహ
డి) మనవి
జవాబు:
బి) కోరిక

AP Board 9th Class Telugu Important Questions Chapter 5 పద్యరత్నాలు

11. మూడు అడుగుల దూరంలో ఏనుగు కనిపించేసరికి భయం వేసింది – గీత గీసిన పదాలకు నానార్థపదం గుర్తించండి. (S.A. II – 2017-18)
ఎ) హస్తి
బి) కపి
సి) గజం
డి) అష్టపది
జవాబు:
సి) గజం

12. కుత్సితముగాని దరి కలిగినది – (వ్యుత్పత్త్యర్థం గుర్తించండి) (S.A. II – 2017-18)
ఎ) మేఘం
బి) నది
సి) సరస్సు
డి) అకూపారం
జవాబు:
డి) అకూపారం

13. పంచాస్యం ఏనుగు కుంభస్థలంపైకి దూకింది – (గీత గీసిన పదానికి వ్యుత్పత్త్యర్థం గుర్తించండి) (S.A. II – 2017-18)
ఎ) ఐదైన ముఖాలు కలది
బి) వెడల్పైన ముఖం కలది
సి) పంచముఖాలతో ఉన్నది
డి) కుత్సితమైన అవయవం కలది
జవాబు:
బి) వెడల్పైన ముఖం కలది

14. సృష్టిలో ‘సమస్తాన్ని తనలో ధరించేది’ అనే అర్థాన్ని సూచించే వ్యుత్పత్తి పదం గుర్తించండి. (S.A. III – 2016-17)
ఎ) ధర
బి) పృథ్వి
సి) పుడమి
డి) నేల
జవాబు:
ఎ) ధర

15. ఖగములను వేటాడుట తప్పు. (గీత గీసిన పదానికి వ్యుత్పత్తిని గుర్తించండి.) (S.A. III – 2016-17)
ఎ) ఆకాశంలో సంచరించనిది
బి) ఆకాశంలో సంచరించేది
సి) ఆకాశం నుండి నేలకు రాలేది
డి) ఆకాశంలో సంచరించడం రానిది
జవాబు:
బి) ఆకాశంలో సంచరించేది

16. సజ్జనులు స్నేహం చేయదగినవారు. (సంధి విడదీసిన పదాన్ని గుర్తించండి.) (S.A. III – 2016-17)
ఎ) సద్ + జనులు
బి) సత్ + జనులు
సి) సః + జనులు
డి) స + జనులు
జవాబు:
బి) సత్ + జనులు

AP Board 9th Class Telugu Important Questions Chapter 5 పద్యరత్నాలు

17. వాక్యాలకు బింబ ప్రతిబింబత్వం ఉంటే – అలంకారం గుర్తించండి. (S.A. II – 2018-19)
ఎ) రూపకం
బి) ఉత్ప్రేక్ష
సి) ఉపమాలంకారం
డి) దృష్టాంతం
జవాబు:
డి) దృష్టాంతం

18. ‘చేతిరాత గుండ్రంగా రాయడం’ అనే విషయాన్ని విధ్యర్థకంగా మార్చండి.( S.A. III – 2016-17)
ఎ) చేతిరాత గుండ్రంగా రాయండి.
బి) దయచేసి చేతిరాత గుండ్రంగా రాయకండి.
సి) చేతిరాత గుండ్రంగా రాయొద్దు
డి) చేతిరాత గుండ్రంగా ఉంటే బాగుంటుంది
జవాబు:
ఎ) చేతిరాత గుండ్రంగా రాయండి.

19. “ఆడుకోవడం” అనే విషయాన్ని అనుమత్యర్థక వాక్యంగా మార్చండి. (S.A. III – 2016-17)
ఎ) ఆడుకోవచ్చు
బి) ఆడుకోకూడదు
సి) ఆడుకుంటారా?
డి) ఆడుకోవద్దు
జవాబు:
ఎ) ఆడుకోవచ్చు

భాషాంశాలు (పదజాలం, వ్యాకరణం)

1. అర్ధాలు :

20. దుష్టుల ఆలోచనలు కుత్సితంగా ఉంటాయి – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
A) అద్భుతం
B) మోసం
C) తెలివి
D) మంచి
జవాబు:
B) మోసం

21. సముద్రం మేర దాటి పొంగుతుంది – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
A) ఇల్లు
B) వీధి
C) హద్దు
D) సునామీ
జవాబు:
C) హద్దు

22. ఉత్తముడు దుర్జనుల గోష్ఠిని పొందడు – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
A) కొలువు
B) కొలుపు
C) మాట
D) పోట్లాట
జవాబు:
A) కొలువు

AP Board 9th Class Telugu Important Questions Chapter 5 పద్యరత్నాలు

23. జోరీగ మధువ్రతేంద్రమగునా? – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
A) సీతాకోక చిలుక
B) హంస
C) కందిరీగ
D) తుమ్మెద
జవాబు:
D) తుమ్మెద

24. మంచివారితో జగడం కీడును కలిగించును – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
A) స్నేహం
B) తగాదా
C) మాట
D) తిరగటం
జవాబు:
B) తగాదా

25. విష్ణువు ఖగరాజును వాహనంగా చేసుకొన్నాడు – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
A) పాము
B) నెమలి
C) పక్షి
D) ఎద్దు
జవాబు:
C) పక్షి

26. నదులన్నీ అకూపారంబులో కలుస్తాయి – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి. (S.A. III – 2016-17)
A) నేల
B) ఆకాశం
C) సముద్రం
D) పర్వతం
జవాబు:
C) సముద్రం

27. ‘మంచి నడవడి‘ – అనే అర్థాన్నిచ్చే శబ్దాన్ని గుర్తించండి.
A) దురాచారం
B) ఆచారం
C) నడక
D) నడవండి
జవాబు:
B) ఆచారం

AP Board 9th Class Telugu Important Questions Chapter 5 పద్యరత్నాలు

28. ‘మంచి బుద్ధి కలవాడు‘ – అనే అర్థాన్ని ఇచ్చే పదం కింది వాటిలో ఏది?
A) బుద్ధి
B) దుర్బుద్ధి
C) బుద్ధిమంతుడు
D) సుమతి
జవాబు:
D) సుమతి

29. పవి పుష్పంబగు – గీత గీసిన పదానికి అర్థము గుర్తించండి.
A) ఇంద్రుడు
B) వజ్రాయుధం
C) వజ్రం
D) కల్పవృక్షం
జవాబు:
B) వజ్రాయుధం

2. పర్యాయపదాలు :

30. సూర్యుడు నళినీబాంధవుడు – గీత గీసిన పదానికి సమానార్థాలు గుర్తించండి.
A) రవి, చంద్రుడు
B) భాస్కరుడు, దినకరుడు
C) ప్రభాకరుడు, సోముడు
D) కుజుడు, శుక్రుడు
జవాబు:
B) భాస్కరుడు, దినకరుడు

31. పున్నమి నాటి చంద్రుడు – గీత గీసిన పదానికి పర్యాయపదాలు రాయండి.
A) చందురుడు, ఇంద్ర
B) చంద్ర, సూర్య
C) సోముడు, శశాంకుడు
D) రవి, గోపి
జవాబు:
C) సోముడు, శశాంకుడు

AP Board 9th Class Telugu Important Questions Chapter 5 పద్యరత్నాలు

32. రత్నాలకు నిలయం రత్నాకరం – గీత గీసిన పదానికి సమానార్థాలు రాయండి.
A) జలధి, సాగరం
B) సముద్రం, వనం
C) విపినం, సంద్రం
D) గగనం, గహసం
జవాబు:
A) జలధి, సాగరం

33. ధర్మరాజు అజాతశత్రువు – గీత గీసిన పదానికి సమానార్థాలు రాయండి.
A) వైరి, వైరు
B) రిపు, పురి
C) విరోధి, వనధి
D) వైరి, రిపువు
జవాబు:
D) వైరి, రిపువు

34. నారదుడు కలహ భోజనుడు – గీత గీసిన పదానికి సమానార్థాలు రాయండి.
A) జగడం, జడగం
B) తగాదా, కొట్లాట
C) తగాదా, తదాగా
D) పోట్లాట, పోటు
జవాబు:
B) తగాదా, కొట్లాట

35. ఋషులు లోకకళ్యాణం కోసం హోమాలు చేసారు – గీత గీసిన పదానికి సమానార్థాలు రాయండి.
A) యాగం, ఆగం
B) యూపం, పాపం
C) యజ్ఞం, యాగం
D) యజ్ఞం, అజ్ఞం
జవాబు:
C) యజ్ఞం, యాగం

AP Board 9th Class Telugu Important Questions Chapter 5 పద్యరత్నాలు

36. ఆచార్యుని ఎదిరించక – గీత గీసిన పదానికి సమానార్థాలు రాయండి.
A) గురువు, ఉపాధ్యాయుడు
B) గురువు, వేత్త
C) ఒజ్జ, సజ్జ
D) గురువు, తరువు
జవాబు:
A) గురువు, ఉపాధ్యాయుడు

37. క్రూర భుజంగమున్ గవయ గూడునె – గీత గీసిన పదానికి సమానార్థక పదం గుర్తించండి.
A) కొంగ
B) దుష్టుని
C) సర్పము
D) సింహము
జవాబు:
C) సర్పము

38. జలధుల్మేరల నాక్రమించి ఉప్పొంగినన్ – గీత గీసిన పదానికి సమానార్థక పదం గుర్తించండి.
A) నదులు
B) పర్వతాలు
C) మైదానాలు
D) సముద్రాలు
జవాబు:
D) సముద్రాలు

39. నన్ను పంచాస్యమౌనా? – గీత గీసిన పదానికి సమాననార్ధక పదమును గుర్తించండి.
A) సింహము
B) ఏనుగు
C) తేనెటీగ
D) పులి
జవాబు:
A) సింహము

AP Board 9th Class Telugu Important Questions Chapter 5 పద్యరత్నాలు

40. శ్రీరాముడు ఖగరాజ తురంగుడు – గీత గీసిన పదానికి సమానార్ధక పదం ఏది?
A) పక్షి
B) రాజు
C) గరుత్మంతుడు
D) దేవేంద్రుడు
జవాబు:
C) గరుత్మంతుడు

41. అకూపారంబు భూమీ స్థలంబవు – గీత గీసిన పదానికి సమానార్థక పదం ఏది?
A) శైలము
B) సముద్రము
C) నది
D) వజ్రాయుధం
జవాబు:
B) సముద్రము

42. ‘జలజాత ప్రియ శీతభానులు యథా సంచారముఱ్ఱప్పినం’ – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
A) సూర్యుడు, చంద్రుడు
B) చంద్రుడు, సముద్రము
C) చంద్రుడు, చందమామ
D) మిత్రుడు, రవి
జవాబు:
C) చంద్రుడు, చందమామ

43. జలధుల్మేరల నాక్రమించి ఉప్పొంగినన్ – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
A) సముద్రము, అకూపారము
B) శైలము, సురావనజము
C) మధువ్రతము, భుజంగము
D) ఉదధి, ఏఱు
జవాబు:
A) సముద్రము, అకూపారము

AP Board 9th Class Telugu Important Questions Chapter 5 పద్యరత్నాలు

44. ‘గజ స్నానంబు చందంబగున్ ?’ – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
A) పాము, ఏనుగు
B) హస్తి, కరి
C) తేనెటీగ, భృంగము
D) సింహము, ఇభము
జవాబు:
B) హస్తి, కరి

45. అకూపారంబు భూమీ స్థలంబవున్ – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
A) శైలము, పర్వతం
B) జలధి, సాగరము
C) ఉదధి, భుజంగము
D) సముద్రము, నది
జవాబు:
B) జలధి, సాగరము

46. ‘క్రూర భుజంగమున్ గవయ గూడునె ?’ – గీత గీసిన పదానికి పర్యాయపదాలను గుర్తించండి.
A) పాము, సర్పము
B) నాగము, నగము
C) పంచాస్యము, శార్దూలం
D) దుష్టుడు, దుర్మార్గుడు
జవాబు:
A) పాము, సర్పము

3. వ్యుత్పత్యర్థాలు :

47. సత్పురుషులందు పుట్టినది ఎప్పటికి నిలిచి ఉండును – గీత గీసిన పదానికి వ్యుత్పత్త్యం గుర్తించండి.
A) బుద్ధి
B) సత్యం
C) మేథ
D) తెలివి
జవాబు:
B) సత్యం

48. “మరణం లేనిది” – దీనికి వ్యుత్పత్యర్థం గుర్తించండి.
A) అమరణం
B) చిరంజీవి
C) అమృతం
D) స్వర్గం
జవాబు:
C) అమృతం

AP Board 9th Class Telugu Important Questions Chapter 5 పద్యరత్నాలు

49. ‘పాపులను తన సమీపమున పొందించునది’ – దీనికి వ్యుత్పత్త్యం గుర్తించండి.
A) నరకం
B) నకరం
C) స్వర్గం
D) భూవి
జవాబు:
A) నరకం

50. ‘నారాయణుడు’ – వ్యుత్పత్తి పదం ఏది?
A) ఉదకంలో లేనివాడు
B) ఉదకం స్థానంగా కలవాడు
C) పాముపై నిద్రించేవాడు
D) సుదర్శనం కలవాడు
జవాబు:
B) ఉదకం స్థానంగా కలవాడు

51. ‘రాత్రియందు సంచరించేవారు’ – దీనికి వ్యుత్పత్త్యర్థం గుర్తించండి.
A) దయ్యాలు
B) భూతాలు
C) మనుష్యులు
D) రాక్షసులు
జవాబు:
D) రాక్షసులు

52. జలములు దీనిచే ధరింపబడును – దీనికి వ్యుత్పత్త్యర్థం గుర్తించండి.
A) జలాశయం
B) జలధి
C) తటాకం
D) కాలువ
జవాబు:
B) జలధి

53. ‘అజ్ఞానమనే అంధకారాన్ని పోగొట్టేవాడు’ – ఈ వ్యుత్పత్తి గల పదం ఏది?
A) సూర్యుడు
B) చంద్రుడు
C) గురువు
D) జ్ఞానము
జవాబు:
C) గురువు

AP Board 9th Class Telugu Important Questions Chapter 5 పద్యరత్నాలు

54. ‘వెడల్పైన ముఖం కలది’ – అనే వ్యుత్పత్త్యర్థం గుర్తించండి. (S.A. I – 2018-19)
A) దీర్ఘముఖము
B) పంచాస్యము
C) ద్విముఖము
D) సుముఖము
జవాబు:
B) పంచాస్యము

4. నానార్థాలు :

55. శైల పుత్రి పార్వతి – గీత గీసిన పదానికి నానార్థాలు రాయండి.
A) కొండ, గిరి
B) కొండ, ఆనకట్ట
C) రసాంజనం, రసం
D) సాంబ్రాణి, పన్నీర
జవాబు:
B) కొండ, ఆనకట్ట

56. జల ప్రవాహం ఎక్కువగా ఉన్నప్పుడు ప్రయాణం ప్రమాదం – గీత గీసిన పదానికి నానార్థాలు రాయండి.
A) నీరు, పానీయం
B) జడం, గడ
C) నీరు, ఎల్టతామర
D) కలువ, పూలు
జవాబు:
C) నీరు, ఎల్టతామర

57. ఈశ్వరుడు అంతటా కలడు – గీత గీసిన పదానికి నానార్థాలు రాయండి.
A) శివుడు, ప్రభువు
B) పరమాత్మ, స్వర్గం
C) శ్రేష్ఠవాచకం, వాచకం
D) శివుడు, శంకరుడు
జవాబు:
A) శివుడు, ప్రభువు

58. కీడు చేసిన వానికి మేలు చేయుట ఉత్తముల లక్షణం – గీత గీసిన పదానికి నానార్థాలు రాయండి.
A) తగనిది, తగిన
B) అపకారం, అశుభం
C) మాలిన్యం, మలినం
D) ఉపకారం, మేలు
జవాబు:
B) అపకారం, అశుభం

59. విభూతి స్వచ్ఛత చంద్రకాంతిని తలపిస్తుంది – గీత గీసిన పదానికి నానార్థాలు రాయండి.
A) బూడిద, బూతి
B) భస్మం, పొడి
C) సంపద, భస్మం
D) బూడిద, పొడి
జవాబు:
C) సంపద, భస్మం

AP Board 9th Class Telugu Important Questions Chapter 5 పద్యరత్నాలు

60. స్త్రీలను బాధపెట్టిన ఇంట శ్రీ నిలువదు – గీత గీసిన పదానికి నానార్థాలు రాయండి.
A) లక్ష్మి, సాలెపురుగు
B) లక్ష్మి, సిరి
C) సంపద, ధనం
D) విషం, విసం
జవాబు:
B) లక్ష్మి, సిరి

61. నీరు, గరళం – అనే నానార్ధములు గల పదాన్ని గుర్తించండి.
A) జలము
B) ఉదకము
C) విషము
D) క్షీరము
జవాబు:
C) విషము

62. గజసైన్యం విజయాన్ని సాధించింది – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి. (S.A. I – 2018-19)
A) గజం, అడుగు
B) ఏనుగు, మూడడుగుల కొలత
C) ఎనిమిది, ఐదు
D) హస్తి, గజము
జవాబు:
B) ఏనుగు, మూడడుగుల కొలత

5. ప్రకృతి – వికృతులు :

63. రాట్టులు పోయారు. రాజ్యాలు పోయాయి – గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.
A) ప్రభువు
B) నాయకుడు
C) భూపతి
D) రేడు
జవాబు:
D) రేడు

AP Board 9th Class Telugu Important Questions Chapter 5 పద్యరత్నాలు

64. దుష్టుల సహవాసం చెడుకు కారకం – గీత గీసిన పదానికి ప్రకృతి పదం గుర్తించండి.
A) దుసుట
B) తుంటరి
C) దుష్ట
D) దుసట
జవాబు:
B) తుంటరి

65. బిచ్చమెత్తి బ్రతికేవారిని చులకన చేయవద్దు – గీత గీసిన పదానికి ప్రకృతి పదం గుర్తించండి.
A) బిక్చ
B) భిక్ష
C) భిక్ష
D) అర్థి
జవాబు:
C) భిక్ష

66. పాప పుణ్యాలు కర్మను బట్టి ప్రాప్తిస్తాయి – గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.
A) పున్నెం
B) పున్నం
C) పుషైం
D) పున్యం
జవాబు:
A) పున్నెం

67. సిరి లేనివాడు ఎందుకు కొరగాడు – గీత గీసిన పదానికి ప్రకృతి పదం గుర్తించండి.
A) ధనం
B) లక్ష్మీ
C) శ్రీ
D) ద్రవ్యం
జవాబు:
C) శ్రీ

68. శుచిగా స్నానమాచరించనివాడు చర్మరోగి కాగలడు – గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.
A) సానం
B) తానం
C) స్థానం
D) పానం
జవాబు:
B) తానం

AP Board 9th Class Telugu Important Questions Chapter 5 పద్యరత్నాలు

69. ఘనమైన కార్యాలు ఘనులే చేయగలరు – గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.
A) కారం
B) కర్యం
C) కర్ణం
D) కార్టం
జవాబు:
C) కర్ణం

70. కొల్లేరు సరస్సు కొంగవంటి పక్షి జాతులకు విడిది ప్రాంతం – గీత గీసిన పదానికి ప్రకృతి పదం గుర్తించండి.
A) కొక్కొర
B) క్రుజ్
C) కొక్కెర
D) బకం
జవాబు:
B) క్రుజ్

71. రాయంచలు మానస సరోవరంలో క్రీడిస్తున్నాయి – గీత గీసిన పదానికి ప్రకృతి పదాన్ని గుర్తించండి.
A) హంస
B) రాజహంస
C) రాజు
D) భుజంగము
జవాబు:
B) రాజహంస

72. మీ ఇంట్లో పూవులు లేవా? – గీత గీసిన పదానికి ప్రకృతి ఏది?
A) పుష్పము
B) సుమము
C) కుసుమం
D) విరి
జవాబు:
A) పుష్పము

AP Board 9th Class Telugu Important Questions Chapter 5 పద్యరత్నాలు

73. మీది గజస్నానము వలె వ్యర్థము – గీత గీసిన పదానికి
వికృతిని గుర్తించండి.
A) సానము
B) తానము
C) స్తనం
D) నానము
జవాబు:
B) తానము

6. సంధులు :

74. సవర్ణదీర్ఘ సంధికి ఉదాహరణను కింది వాటిలో గుర్తించండి.
A) పంచాస్యం
B) సర్వేశ్వరా
C) ప్రాప్తమగు
D) నామోక్తి
జవాబు:
A) పంచాస్యం

75. ఉత్తునకు సంధి నిత్యం – ఇది ఏ సూత్రమో కింద గుర్తించండి.
A) గుణసంధి
B) త్రికసంధి
C) ఉత్వసంధి
D) ఇత్వసంధి
జవాబు:
C) ఉత్వసంధి

76. ‘సద్భక్తి’ – విడదీయుము.
A) సదా + భక్తి
B) సత్ + భక్తి
C) సత్ + బక్తి
D) సద + భక్తి
జవాబు:
B) సత్ + భక్తి

AP Board 9th Class Telugu Important Questions Chapter 5 పద్యరత్నాలు

77. జశ్త్వసంధికి ఉదాహరణను గుర్తించండి.
A) రాజౌనా
B) సర్వేశ్వరా
C) పదాబ్దం
D) వాగీశుడు
జవాబు:
D) వాగీశుడు

78. ‘శ్రీకాళహస్తీశ్వరా’ – సంధి పేరేమిటి?
A) వృద్ధి
B) గుణ
C) సవర్ణదీర్ఘ
D) త్రిక
జవాబు:
C) సవర్ణదీర్ఘ

79. ‘నామో!’ సంధి పేరేమిటి?
A) యణాదేశ
B) గుణ
C) యడాగమ
D) ఆమేడ్రితం
జవాబు:
B) గుణ

80. క, చ, ట, త, ప, ఫ, ఛ, ఠ, ఢ, ఫ, శ, ష, స వర్ణాలకు జరిగే సంధి ఏది?
A) జశ్త్వసంధి
B) త్రికసంధి
C) శ్చుత్వసంధి
D) గసడదవాదేశ సంధి
జవాబు:
A) జశ్త్వసంధి

81. కింది వాటిలో గుణసంధి సూత్రం కిందివాటిలో ఏదో గుర్తించండి.
AP Board 9th Class Telugu Important Questions Chapter 5 పద్యరత్నాలు 2
జవాబు:
D)

82. “మధుప్రతేంద్రం” – అనే పదాన్ని విడదీయండి. (S.A. II – 2017-18)
A) మధు + ప్రతేంద్రం
B) మధువ్ర + తేంద్రం
C) మధువ్రత + ఇంద్రం
D) మధువ్రత + ఏంద్రం
జవాబు:
C) మధువ్రత + ఇంద్రం

83. ‘నింద సేయబోకు’ – అనే పదాన్ని విడదీసి, సంధి పేర్కొనండి.
A) నింద + చేయబోకు – గసడదవాదేశ సంధి
B) నింద సేయన్ + బోకు – సరళాదేశ సంధి
C) నింద సేయ + బోకు – యణాదేశ సంధి
D) నింద + సేయబోకు – యడాగమ సంధి
జవాబు:
A) నింద + చేయబోకు – గసడదవాదేశ సంధి

AP Board 9th Class Telugu Important Questions Chapter 5 పద్యరత్నాలు

84. సర్వేశ్వరా ! – గీత గీసిన పదం ఏ సంధి?
A) సవర్ణదీర్ఘ సంధి
B) గుణసంధి
C) యణాదేశ సంధి
D) వృద్ధి సంధి
జవాబు:
B) గుణసంధి

85. ‘ జోరీగ’ విడదీయండి.
A) జోరు + ఈగ
B) జోర + ఈగ
C) జోరి + ఇగ
D) జో + రీగ
జవాబు:
A) జోరు + ఈగ

86. ‘ధరాత్మజ’ ఈ పదంలో గల సంధి ఏది?
A) సవర్ణదీర్ఘ సంధి
B) గుణసంధి
C) యణాదేశ సంధి
D) గసడదవాదేశ సంధి
జవాబు:
A) సవర్ణదీర్ఘ సంధి

7. సమాసాలు :

87. చల్లగా నూఱేండ్లు జీవించండని పెద్దలు దీవిస్తారు – గీత గీసిన పదానికి సమాసం పేరేమిటి?
A) ద్వంద్వం
B) ద్విగువు
C) బహుజొహి
D) రూపకం
జవాబు:
B) ద్విగువు

88. గురువుల నుండి శిష్యులు అమృత వాక్కులు పొందాలి – గీత గీసిన పదానికి సమాసం పేరేమిటి?
A) నజ్
B) అవ్యయీభావ
C) రూపకం
D) ప్రథమా
జవాబు:
C) రూపకం

89. ‘అరవిందం వంటి ముఖం’ సమాసపదంగా మార్చండి.
A) అరవింద ముఖం
B) ముఖ అరవిందం
C) పద్మముఖం
D) ముఖారవిందం
జవాబు:
D) ముఖారవిందం

90. ‘కాంతామణి’ విగ్రహవాక్యం గుర్తించండి.
A) మణి వంటి కాంత
B) మణే కొంత ఐ
C) కాంత వంటి మణి
D) మణి గల కాంత
జవాబు:
A) మణి వంటి కాంత

AP Board 9th Class Telugu Important Questions Chapter 5 పద్యరత్నాలు

91. ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసానికి ఉదాహరణను గుర్తించండి.
A) చిగురుకేలు
B) తేనెమాట
C) తనూలత
D) జుంటిమోవి
జవాబు:
C) తనూలత

92. రూపక సమాసానికి ఉదాహరణను గుర్తించండి.
A) సుధామధురం
B) జ్ఞానజ్యోతి
C) కరకమలం
D) కాంతామణి
జవాబు:
B) జ్ఞానజ్యోతి

93. ‘దుష్టచిత్తుడు’ – సమాసం పేరేమిటి?
A) ద్విగువు
B) ద్వంద్వ
C) రూపకం
D) బహువ్రీహి
జవాబు:
D) బహుజ్జీవీ

AP Board 9th Class Telugu Important Questions Chapter 5 పద్యరత్నాలు

94. ధనాఢ్యుడైన వాడు దాత అనిపించుకోవాలి – గీత గీసిన పదం ఏ సమాసం? (S.A. II – 2017-18)
A) ప్రథమా
B) తృతీయా
C) బహువ్రీహి
D) ద్వితీయా
జవాబు:
B) తృతీయా

95. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసానికి ఉదాహరణను గుర్తించండి.
A) కార్యాలోచనం
B) ఫణాగ్రభాగం
C) అనర్హరత్నాలు
D) అజ్ఞాన తిమిరం
జవాబు:
C) అనర్హరత్నాలు

96. ‘కార్యము యొక్క ఆలోచనము’ సమాస పదంగా కూర్చండి.
A) కార్యపు ఆలోచన
B) కార్యాలోచనము
C) కార్య లోచనలు
D) కార్య ఆలోచన
జవాబు:
B) కార్యాలోచనము

97. ‘నూఱేండ్లు’ పదానికి విగ్రహవాక్యం గుర్తించండి.
A) నూఱు సంవత్సరాలు గలది
B) నూటైన ఏండ్లు
C) నూఱును, ఏండ్లును
D) నూఱు ఏండ్లు కలది
జవాబు:
B) నూటైన ఏండ్లు

98. ‘మధువ్రతము’ – ఇది ఏ సమాసమో పేర్కొనండి.
A) బహువ్రీహి
B) ద్విగు
C) తత్పురుషము
D) అవ్యయీభావము
జవాబు:
A) బహువ్రీహి

99. ‘ముఖారవిందం’ సమాసానికి విగ్రహవాక్యాన్ని గుర్తించండి.
A) ఉపమాలంకారం
B) రూపకాలంకారం
C) దృష్టాంతం
D) స్వభావోక్తి
జవాబు:
C) దృష్టాంతం

100. ‘జ్ఞాన జ్యోతి’ – ఈ సమాస నామాన్ని గుర్తించండి.
A) ఉపమాన పూర్వపద కర్మధారయం
B) రూపక సమాసం
C) ద్విగు సమాసం
D) ఉపమాన ఉత్తరపద కర్మధారయం
జవాబు:
B) రూపక సమాసం

8. గణాలు :

101. ‘స – భ – ర – న – మ – య-వ’ – ఇవి ఏ పద్య గణాలు?
A) శార్దూలం
B) మత్తేభం
C) ఉత్పలమాల
D) చంపకమాల
జవాబు:
B) మత్తేభం

AP Board 9th Class Telugu Important Questions Chapter 5 పద్యరత్నాలు

102. ‘అవనీ’ గురులఘువులు గుర్తించండి.
A) III
B) UUU
C) IIU
D) UII
జవాబు:
C) IIU

103. ‘UII’ దీనికి సరి అయిన పదాన్ని గుర్తించండి.
A) భువనం
B) మండపం
C) శ్రీకాళ
D) మండలి
జవాబు:
D) మండలి

104. మత్తేభ వృత్తానికి యతిస్థానం గుర్తించండి.
A) 14
B) 10
C) 11
D) 13
జవాబు:
A) 14

105. భ,ర,న,భ,భ,ర,వ గణాలు గల పద్యం ఏ వృత్తానికి చెందినది?
A) ఉత్పలమాల
B) చంపకమాల
C) శార్దూలము
D) కందము
జవాబు:
A) ఉత్పలమాల

106. స,భ,ర,న,మ,య,వ గణాలు గల పద్యం ఏ వృత్తానికి చెందినది?
A) శార్దూలం
B) ఉత్పలమాల
C) మత్తేభం
D) చంపకమాల
జవాబు:
C) మత్తేభం

AP Board 9th Class Telugu Important Questions Chapter 5 పద్యరత్నాలు

107. ‘కుమారా’ అనేది ఏ గణము?
A) భ గణం
B) యగణము
C) న గణం
D) ర గణం
జవాబు:
B) యగణము

9. అలంకారాలు :

108. వాక్యాలకు బింబ ప్రతిబింబత్వం ఉన్నట్లయితే, అది ఏ అలంకారం? (S.A. III – 2016-17 S.A.II – 2018-19)
A) ముఖం వంటి అరవిందం
B) అరవిందం వంటి ముఖం కలది
C) అరవిందము వంటి ముఖం
D) ముఖమును, అరవిందమును
జవాబు:
C) అరవిందము వంటి ముఖం

109. ‘స్నానంబుల్ నదులందు జేయుట గజస్నానంబు చందంబగున్’ ఈ వాక్యంలోని అలంకారమేది?
A) రూపకము
B) ఉత్ప్రేక్ష
C) అర్థాంతరన్యాస
D) ఉపమాలంకారం
జవాబు:
D) ఉపమాలంకారం

110. ‘రంగ దరాతి భంగ ఖగరజ తురంగ విపత్పరం పరోత్తుంగ తమః పతంగ‘ – ఈ వాక్యంలో గల అలంకారమేది?
A) వృత్త్యనుప్రాస
B) అంత్యానుప్రాస
C) యమకము
D) ఛేకానుప్రాస
జవాబు:
B) అంత్యానుప్రాస

AP Board 9th Class Telugu Important Questions Chapter 5 పద్యరత్నాలు

111. ‘నానా హోమము లెల్ల బూడిదలలోన న్వేల్చు నెయ్యె చను’ ఈ వాక్యంలో గల అలంకారాన్ని గుర్తించండి.
A) రూపకము
B) ఉత్ప్రేక్ష
C) ఉపమ
D) యమకం
జవాబు:
C) ఉపమ

10. వ్యతిరేకార్థక వాక్యాన్ని గుర్తించడం:

112. గాజు పూస విలువైన రత్నం కాదు – వ్యతిరేక వాక్యం గుర్తించండి.
A) గాజు పూస విలువైన రత్నమా
B) గాజు పూస విలువైన రత్నము
C) గాజు పూస విలువైన నగ
D) రత్నం విలువలేని గాజు పూస
జవాబు:
B) గాజు పూస విలువైన రత్నము

113. పిసినారియైన దుర్మార్గుడు, రాజు కాలేడు – వ్యతిరేక వాక్యం గుర్తించండి.
A) పిసినారి రాజు కాగలడు
B) దుర్మార్గుడు రాజు కాగలడు
C) పిసినారియైన దుర్మార్గుడు, రాజు కాగలడు
D) రాజు దుర్మార్గుడు పిసినారి
జవాబు:
C) పిసినారియైన దుర్మార్గుడు, రాజు కాగలడు

AP Board 9th Class Telugu Important Questions Chapter 5 పద్యరత్నాలు

114. మంచివారితో తగవు హాని చేయదు – వ్యతిరేక వాక్యం గుర్తించండి.
A) తగవు హాని చేస్తుంది
B) తగవు హాని చేయదు
C) చెడ్డవారితో తగవు హాని చేయదు
D) మంచివారితో తగవు హాని చేస్తుంది
జవాబు:
D) మంచివారితో తగవు హాని చేస్తుంది

11. ప్రక్రియలను గుర్తించడం:

115. పేదలను నిందిస్తే, కీడు జరుగుతుంది – గీత గీసిన పదం ఏ ప్రక్రియకు చెందినది?
A) ఆశ్చర్యార్థకం
B) ఉక్తార్థం
C) చేదర్థకం
D) విధి
జవాబు:
C) చేదర్థకం

116. మంచివాడు నీతిమార్గాన్ని తప్పి సంచరించడు – గీత గీసిన పదం ఏ ప్రక్రియకు చెందినది?
A) అనంతర్యార్థకం
B) తుమున్నర్థకం
C) క్వార్థకం
D) ప్రేరణార్థకం
జవాబు:
C) క్వార్థకం

AP Board 8th Class Telugu Solutions Chapter 4 అజంతా చిత్రాలు

AP State Syllabus AP Board 8th Class Telugu Textbook Solutions Chapter 4 అజంతా చిత్రాలు Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Telugu Solutions 4th Lesson అజంతా చిత్రాలు

8th Class Telugu 4th Lesson అజంతా చిత్రాలు Textbook Questions and Answers

చదవండి – ఆలోచించండి – చెప్పండి
AP Board 8th Class Telugu Solutions Chapter 4 అజంతా చిత్రాలు 1

ప్రశ్న 1.
పై చిత్రంలో ఎవరెవరు ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఏం మాట్లాడుతున్నారు?
జవాబు:
పై చిత్రంలో అంబర్ పేట ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థినీ విద్యార్థులు బస్సులో విహారయాత్రకు వెళ్ళడానికి బస్సు ఎక్కుతున్నారు. కొందరు పిల్లలు బస్సు ఎక్కారు. మరి కొందరు ఎక్కుతున్నారు. వారి ఉపాధ్యాయులూ, ఉపాధ్యాయినులూ దగ్గరుండి, పిల్లలను బస్సు ఎక్కిస్తున్నారు.

ప్రశ్న 2.
విహారయాత్ర అంటే ఏమిటి? ఎందుకు వెళతారు?
(లేదా)
యాత్రల వల్ల దేశాన్ని చూడవచ్చు, విజ్ఞానాన్ని సంపాదించవచ్చు – అని రచయిత అన్నారు కదా ! యాత్రల వల్ల ఇంకా ఇతర ప్రయోజనాలేమిటి ?
జవాబు:
వినోదం ప్రధానంగా చేసుకొని, చేసే యాత్రను విహారయాత్ర అంటారు. పుస్తక పఠనం వల్ల పుస్తక జ్ఞానం మాత్రమే లభిస్తుంది. లోకానుభవం, ప్రజల ఆచార వ్యవహారాలు, మన సంస్కృతి తెలుసుకోవాలంటే పర్యటనలు తప్పనిసరి. పుస్తకాలలో ఉన్న విషయాలను పూర్తిగా ఆకళింపు చేసుకోవాలంటే యాత్రలు చేయవలసి ఉంది. విజ్ఞానయాత్రల వలన మానసికోల్లాసంతోపాటు, విజ్ఞానం పెరుగుతుంది. ప్రసిద్ధమైన పరిశ్రమలు, ప్రాజెక్టులు, తీర్థయాత్ర స్థలములు, అందమైన దృశ్యాలు, చారిత్రక ప్రదేశాలు, బౌద్ధ విహారాలు, శిల్పకళా క్షేత్రములు మొదలయిన వాటిని ప్రత్యక్షంగా చూసి తెలుసుకుంటారు.

AP Board 8th Class Telugu Solutions Chapter 4 అజంతా చిత్రాలు

ప్రశ్న 3.
ఒక అందమైన ప్రదేశాన్నో, దృశ్యాన్నో చూసినప్పుడు మనకు ఏమనిపిస్తుంది?
జవాబు:
ఒక అందమైన ప్రదేశాన్నో, దృశ్యాన్ని చూసినపుడు మనసుకు ఆనందం కలుగుతుంది. ఆ దృశ్యము ఎప్పటికీ మరవకూడదని మన వెంట తెచ్చుకున్న కెమేరాలలో బంధిస్తాము. తరువాత అప్పుడప్పుడు వాటిని చూస్తూ ఉంటే మన , తిరిగిన ఆ ప్రదేశాలు అన్నీ గుర్తుకు వచ్చి, మనసుకు మధురానుభూతి కలుగుతుంది.

ఇవి చేయండి

I. వినడం – మాట్లాడడం

ప్రశ్న 1.
మీరు ఏదైనా ప్రదేశాన్ని చూడడానికి వెళ్ళారా? ఆ ప్రదేశాన్ని గురించి చెప్పండి.
జవాబు:
మేము సంక్రాంతి సెలవులలో మా ఉపాధ్యాయుల పర్యవేక్షణలో మా తరగతిలోని విద్యార్థులమంతా కలసి ‘నాగార్జున సాగర్’ విహారయాత్రకు వెళ్ళాం. నాగార్జున సాగర్ చేరాక స్టీమర్ ద్వారా నాగార్జున కొండకు బయలుదేరాము. స్టీమర్ లో ప్రయాణిస్తున్నంత సేపు చల్లని గాలి, కనుచూపు మేర కృష్ణా నది, దూరంగా కొండలు మాలో సంతోషాన్ని నింపాయి. ఆ నాగార్జున కొండలో పూర్వం ఒక గొప్ప విశ్వవిద్యాలయం ఉన్నట్లుగా ఇప్పటికీ ఆధారాలు కన్పిస్తున్నాయి. అక్కడ ఆచార్య నాగార్జునుడనే ఒక గొప్ప తత్త్వవేత్త, ఆయుర్వేద పండితుడు ఉండేవాడని మా ఉపాధ్యాయులు చెప్పారు. అంతేగాక అక్కడి మ్యూజియంలో ఉన్న బుద్ధుని పాలరాతి శిల్పాలను చూశాం. బౌద్ధమత విశిష్టతను గురించి తెలుసుకున్నాం. తర్వాత మేము నాగార్జున సాగర్ ఆనకట్ట వద్దకు చేరాం. జల విద్యుత్ తయారయ్యే విధానాన్ని స్వయంగా చూసి తెలుసుకున్నాం. తిరుగు ప్రయాణంలో ఎత్తిపోతల జలపాతాన్ని, మాచర్ల చెన్నకేశవాలయాన్ని, వీరభద్రాలయాన్ని చూశాం.
ఈ విహారయాత్ర మాలో ఆనందంతో పాటు విజ్ఞానాన్ని కూడా నింపింది.

ప్రశ్న 2.
పాఠంలోని ఒక అంశాన్ని గ్రహించి అది మీకు ఎందుకు నచ్చిందో చెప్పండి.
జవాబు:
ఈ పాఠంలో ఏడవ పేరా నాకు నచ్చింది. ఆ పేరాలో అజంతా గుహలలోకి ప్రవేశించే దారిని నార్లవారు వర్ణించారు. అక్కడ ప్రకృతి వర్ణన నాకు నచ్చింది. అక్కడ నాలుగువైపులా కొండలే ఉన్నాయట. ఇక కొండ పక్కన నది. ఆ నదిలో నీళ్ళు నీలంగా ఉన్నాయి. పైన ఆకాశము నీలమే. ఆ పక్కనే పచ్చని చెట్లు ఉన్నాయట. ఆ చెట్ల పూలు కమ్మని వాసనలను ఇస్తున్నాయి. నిజంగానే అక్కడికి వెళ్ళి చూస్తున్నట్లు నార్లవారు వర్ణించారు. వారు చెప్పినట్లు అది ఒక కలల లోకం. అది నిజంగానే భూలోకంలోని స్వర్గం. వారు చెప్పినట్లు అది నిజంగా మరో ప్రపంచం – అందుకే నాకు ఆ అంశం నచ్చింది.

AP Board 8th Class Telugu Solutions Chapter 4 అజంతా చిత్రాలు

ప్రశ్న 3.
పాఠం చదువుతుంటే మీకు వచ్చిన ఆలోచనలను, అనుభూతిని వివరించండి.
జవాబు:
అజంతా గుహలు పాఠం చదువుతూ ఉంటే, పెద్ద అయ్యాక తప్పకుండా వెళ్ళి ఒకసారి ఆ గుహల అందాన్ని చూసి రావాలనిపించింది. అక్కడ బుద్ధుని చిత్రాలను, నెహ్రూగారిని సైతం ఆకర్షించిన అక్కడి అందమైన స్త్రీల చిత్రాలనూ చూడాలని అనిపించింది. ఆ కొండల వరుస గూర్చి చదువుతూ ఉంటే, నిజంగానే ఏదో కలలో కొండలమీద నేను తిరుగుతున్నట్టు అనిపించింది. అజంతా గుహల సౌందర్యాన్నీ, అక్కడి చిత్రాలనూ, తప్పక వీలయినంత త్వరలో మా కుటుంబ సభ్యులతో కలిసి చూద్దామని ఉంది.

II. చదవడం, అవగాహన చేసుకోవడం

ప్రశ్న 1.
పాఠం చదవండి. వర్ణనతో కూడి ఉన్న ఐదు వాక్యాలను గుర్తించండి. వాటి కింద గీత గీయండి. చదివి వినిపించండి.
జవాబు:
1. మీ పైన నీలాకాశం, మిమ్ము అలరిస్తూ అడవి పువ్వులు, మిమ్ము ఆవరిస్తూ ఆ పువ్వుల కమ్మని నెత్తావులు. గుహలను చేరే వరకు రెండు, మూడు మెలికలను కాబోలు మీరు తిరుగుతారు. ఏ మెలికలో అడుగుపెడితే, దానికి అదే ఒక ప్రపంచం.

2. ఇటు కొండ-అటు కొండ, ముందు కొండ వెనుక కొండ-పైన కొండ, పక్కనే నది – నీలాకాశం – నీలాల నీళ్ళు – పచ్చని చెట్లు – కమ్మని తావులు, అది వేరే ప్రపంచం – అదొక స్వాప్నిక జగత్తు. భూలోక స్వర్గము.

3. రాళ్ళ గుట్టల గుండా జలజల ప్రవహిస్తూ, నది పాడుకొనే పాటలను వింటూ, నది అంచు వెంట కాలినడకన, గుహలకు చేరాలి.

4. గుహలను సమీపిస్తూంటే ఇటు పచ్చని కొండ, అటు పచ్చని కొండ ఈ రెండు కొండల మధ్య వాఘోరా నది.

5. కొలను నుంచి కొలనుకు జాలువారుతూ, 250 అడుగుల ఎత్తు నుంచి పెద్ద ధారగా వాఘోరా నది కొండ దిగువకు దూకుతుంది.

ప్రశ్న 2.
కింద సూచించిన పదాలతో మొదలయ్యే పేరాలు చదివి, సరిపోయే శీర్షికలను సూచించండి.

పేరాశీర్షిక
ఇటీవలనే ……..అవ్యక్తానుభూతి
వాఘోరానది పుట్టి ……….వ్యూపాయింట్ – మేజర్ గిల్
గుహల గోడలకు …………శిథిలావస్థలో అజంతా చిత్రాలు
అజంతా గుహల నిర్మాణం ………..సర్వోత్తమ కృషి
ఇక్కడ అందాలొలుకు ………..అందాలొలుకు అజంతా స్త్రీలు

ప్రశ్న 3.
కింది పేరా చదివి పట్టికను పూరించండి.
అజంతా గుహలు మొత్తం 29. వాటిలో 5 బౌద్ధ చైత్యాలైతే మిగిలిన బౌద్ధ విహారాలు. మొత్తం 29లో మూడింటిని ప్రారంభించి పూర్తి చేయకుండానే ఆపివేశారు. ఇవి తప్ప మిగిలిన అన్నింటినీ చిత్రాలతో నింపివేశారు. కాని ఈనాడు పదమూడు గుహలలో మాత్రమే ఆ చిత్రాల శిథిలాలు కానవస్తున్నాయి. చెక్కు చెదరకుండా ఎన్నో కొన్ని చిత్రాలు మిగిలింది ఒకటవ, రెండవ, తొమ్మిదవ, పదవ, పదహారవ, పదిహేడవ గుహలలోనే. అజంతా గుహలలోని కొన్ని చిత్రాలకు నకళ్ళు వేయించి హైదరాబాదు పబ్లిక్ గార్డెన్స్ లోని అజంతా పెవిలియన్లో భద్రపరిచారు.
జవాబు:
AP Board 8th Class Telugu Solutions Chapter 4 అజంతా చిత్రాలు 2

4. పాఠం ఆధారంగా కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

అ) నార్ల వేంకటేశ్వరరావు గురించి రాయండి.
(లేదా)
అజంతా చిత్రాలు పాఠ్యభాగ రచయిత గురించి మీకు తెలిసిన విషయాలు రాయండి.
జవాబు:
నార్ల వేంకటేశ్వరరావు 1908 డిసెంబర్ 1వ తేదీన కృష్ణా జిల్లాలోని ‘కవుతరం’ అనే గ్రామంలో జన్మించారు. ఈయన రష్యన్ కథలు (అనువాద రచన), నరకంలో హరిశ్చంద్రుడు (నాటకం), నార్లవారి మాట (పద్య కావ్యం) మొదలైన గ్రంథాలను రచించారు. ఈయన పత్రికా సంపాదకుడు, కవి, విమర్శకుడు. నిరంతరం సమాజ శ్రేయస్సు కోసం కృషిచేసిన మేధావి. ఈయన రచన సరళంగా సొగసైన భావాలతో సుందర శైలిలో నడుస్తుంది.

ఆ) అజంతా గుహలు ఎక్కడ ఉన్నాయి ? వాటి విశిష్టతను తెలపండి.
జవాబు:
అజంతా గుహలు జల్గామ్ కు దక్షిణంగా 35 మైళ్ళ దూరంలో, ఔరంగాబాదు ఉత్తరంగా 55 మైళ్ళ దూరాన ఉన్నాయి. అజంతా గుహలలోని భారతీయ చిత్రకళ, అంతకు ముందుగాని, ఆ తర్వాత గాని అందుకోనంతటి మహోన్నత శిఖరాలను అందుకొంది. వాఘోరా నది పుట్టిన చోటుననే అజంతా గుహలున్నాయి. బౌద్ధభిక్షువులు అక్కడ చిత్రాలను చిత్రించారు. అజంతా గుహలు మనల్ని స్వాప్నిక జగత్తులోకి తీసుకొని వెడతాయని చెప్పి నెహ్రూ గారు అజంతా చిత్రకళను మెచ్చుకోవడం వాటి విశిష్టతను వెల్లడిస్తోంది.

ఇ) వాఘోరానది గురించి రాయండి.
జవాబు:
అజంతా గుహలు వాఘోరానది పుట్టిన చోటనే ఉన్నాయి. అజంతా గుహలను సమీపిస్తుంటే, రెండు వైపులా పచ్చని కొండలుంటాయి. ఆ రెండు కొండల మధ్య వాఘోరానది ఉంది. కొండలు అక్కడ ఎన్ని కనిపించినా, అవన్నీ ఒకే కొండ, ఆ కొండ చివర మెలికే వాఘోరానది జన్మస్థానం. కొండపైన ఏడు కొలనులు ఉన్నాయి. ఒక కొలను నుండి మరో కొలనులోకి ప్రవహిస్తూ 250 అడుగుల ఎత్తు నుంచి పెద్ద ధారగా వాఘోరా నది కొండ దిగువకు దూకుతుంది. దూకిన తరువాత కొండతో పాటు తాను కూడా మెలికలు తిరిగి, సమతల ప్రదేశానికి చేరి, కొన్ని వందల మైళ్ళు ప్రవహించి, ‘తపతి’ నదిలో కలుస్తుంది.

AP Board 8th Class Telugu Solutions Chapter 4 అజంతా చిత్రాలు

ఈ) నేడు అజంతా గుహలు ఏ స్థితిలో ఉన్నాయి?
జవాబు:
నేడు అజంతా గుహల గోడలు శిథిలావస్థలో ఉన్నాయి. గుహల గోడలకు మట్టి గిలాబా వేసి, దానిపై పలుచగా సున్నం పూసి తడి ఆరకముందే చిత్రాలను వేసినందువలన, అవి వానతేమకు పొడిపొడిగా వూడిపోయాయి. బందిపోటు దొంగలు పెట్టిన పొగకు కొన్ని చిత్రాలు మసిబారాయి. ఇటీవల కాలంలో కొంతమంది తమ కీర్తి సంపాదన కోసం గోళ్ళతో బొమ్మలపై తమ పేర్లను వ్రాసినారు. మరికొన్ని చిత్రాలు శిథిలావస్థలో ఉన్నాయి. అజంతా గుహలు మొత్తం 29. వీటిలో మూడింటిని ప్రారంభించి, పూర్తిచేయకుండానే ఆపివేశారు. ఈనాడు 13 గుహల్లోనే చిత్రాల శిథిలాలు కనిపిస్తున్నాయి. 1, 2, 9, 10, 11, 17 గుహల్లోనే చెక్కుచెదరకుండా ఎన్నో కొన్ని చిత్రాలున్నాయి. మొత్తం మీద నూటికి ఒకటవ వంతో, రెండవ వంతో చిత్రాలు మాత్రమే అజంతా గుహలలో నేడు మిగిలాయి.

ఉ) అజంతా శిల్పాలలో ఏమేమి ప్రతిబింబిస్తాయి?
జవాబు:
అజంతా చిత్రాలు భారతీయ జీవితాన్ని, సంస్కృతిని ప్రతిబింబిస్తాయి. ఇవి ఒక విశాల ప్రపంచాన్ని, ఆశ నిరాశలతో, రాగ విద్వేషాలతో, ప్రేమ ద్వేషాలతో, సంతోష విషాదాలతో, కళ్ళకు కట్టినట్లు చూపుతున్నాయి. గౌతమ బుద్ధుని కారుణ్య సందేశం, మనుష్యులకే కాక, పశుపక్ష్యాదుల జీవితాన్ని సయితం ఎంత పవిత్రం చేసిందో, తేజోవంతం చేసిందో అనేదాన్ని, ఈ అజంతా శిల్పాలు ప్రతిబింబిస్తాయి. ప్రాచీన కాలంలోని భారత సాంఘిక వ్యవస్థ, ఏ రూపంలో ఉండేదో, ఆనాటి వృత్తులేవో, వ్యాసంగాలేవో, వినోదాలేవో తెలిసికోవాలనుకునేవారు అజంతా గుహలకు వెళ్ళి దర్శించాలి.

III. స్వీయరచన

1) కింది ప్రశ్నలకు ఐదు వాక్యాలలో సమాధానాలు రాయండి.

అ) మేజర్ గిల్ వేటకు వెళ్ళి తొలిసారిగా అజంతా గుహలను దర్శించినట్టు చదివారు కదా ! దీనివలన మనదేశానికి జరిగిన మేలు ఏమని భావిస్తున్నారో రాయండి.
జవాబు:
మేజర్ గిల్ అనే బ్రిటిష్ మిలిటరీ ఆఫీసర్ 1819లో వేటకు వెళ్ళి ఒక జంతువును తరుముకుంటూ కొండపైకి పోయి, ఎదురుగుండా గుబురు చెట్ల సందు నుంచి సాహసించి కొండ దిగాడు. వాఘోరా నదిని దాటి కొండలపై నుంచి చూశాడు. అల్లంత దూరంలో మేజర్ గిల్, వ్యూపాయింట్ ని చూశాడు.

ఆనాడు మేజర్ గిల్ అజంతా గుహలను దర్శించి మనకు వాటిని గూర్చి తెలపడం వల్ల మనకు ఎంతో మేలు జరిగింది. ప్రాచీనకాలంలో భారత సాంఘిక వ్యవస్థ ఏ రూపంలో ఉండేది ? అప్పటి వృత్తులేవి ? వ్యాసంగాలేవి ? ఇలాంటి ప్రశ్నలన్నిటికి సమాధానాలు ఈ చిత్రాల వల్ల లభిస్తున్నాయి. ఒకప్పుడు మనదేశంలో రాణ్మందిరాలు, రాణులు, రాజులు వారి వేషభాషలూ ఎలా ఉండేవో, వారు రాజసభలను ఎలా తీర్చేవారో అజంతా చిత్రాల వలన మనం తెలుసుకోగలుగుతున్నాము.

ఆ) జవహర్ లాల్ నెహ్రూ “అజంతా మనను ఏదో స్వాప్నిక జగత్తులోకి తీసుకువెళుతుంది” అన్నాడు. ఆయన ఈ మాట ఎందుకు అన్నాడో రాయండి.
జవాబు:
అజంతా గుహలను, మన తొలి భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ గారు దర్శించి, ఆ చిత్రాలను చూస్తే మన మనస్సు కలల ప్రపంచంలోకి వెడుతుంది అన్నారు.

అజంతా గుహల్లో అందమైన స్త్రీల చిత్రాలు అనేకం ఉన్నాయి. రాకుమార్తెలు, గాయనీమణులు, నృత్యాంగనలు మొదలయిన అనేక స్త్రీల చిత్రాలు అక్కడ ఉన్నాయి. అక్కడ ఉన్న స్త్రీల చిత్రాలలో కొందరు స్త్రీలు కూర్చున్నారు. కొందరు నిలబడి ఉన్నారు. మరి కొందరు ముస్తాబు చేస్తున్నారు. కొందరు ఊరేగింపుగా వెడుతున్నారు. ఈ అజంతా స్త్రీల చిత్రాలు, ఎంతో పేరు పొందాయి. అలాగే అక్కడ బోధిసత్వుని అలౌకిక సుందర విగ్రహాలు ఉన్నాయి. అక్కడ చిత్రకారులు బుద్ధుని చిత్రాలను ఎంత శ్రద్ధతో అందంగా తీర్చిదిద్దారో, అంతే శ్రద్ధతో స్త్రీల చిత్రాలను సైతం, అందాలొలికేలా గీశారు.

అటువంటి అపురూప చిత్రాలను మనం కేవలం కలల్లోనే చూడగలం. వాస్తవిక లోకంలో చూడలేం. అందుకే నెహ్రూగారు, ఆ చిత్రాలు మనల్ని స్వాప్నిక జగత్తులోకి తీసుకువెడతాయి అని ప్రశంసించారు.

AP Board 8th Class Telugu Solutions Chapter 4 అజంతా చిత్రాలు

ఇ) “ప్రాచీన కాలంలో భారత సాంఘిక వ్యవస్థ ఏ రూపంలో ఉండేది? అప్పటి వృత్తులేవి? ఈ ప్రశ్నలకు సమాధానాలు కోరితే అజంతా గుహలకు వెళ్ళాలి” ఇలా అనడం వెనుక నార్ల వేంకటేశ్వరరావు గారి భావం ఏమై ఉంటుందో రాయండి.
జవాబు:
అజంతా చిత్రాలలో భారతీయ జీవితం, సంస్కృతి తొణికిసలాడుతున్నాయి. వాటి ద్వారా వివిధ భారతీయ జీవితాల్ని గురించి, సంస్కృతి గురించి, వారి వృత్తులు మొదలైన ఎన్నో విషయాల గురించి తెలుసుకోగలుగుతున్నాం. అజంతా చిత్రాల ద్వారా మన ప్రాచీన సాంఘిక వ్యవస్థ గురించి తెలుసుకోవచ్చు.

ఆ అజంతా చిత్రాలలో ఒకప్పుడు మనదేశంలో రాజమందిరాలు ఏ విధంగా ఉండేవో, రాజులు, రాణులు వేషభాషలు ఎలా ఉండేవో, వారు రాజసభలను ఎలా తీర్చుకొనేవారో తెలుస్తుంది. రాజుల సైనిక బల నిర్మాణం, వారి ఆయుధాలు, ఎలా ఉండేవో ఆ చిత్రాల వల్ల తెలుసుకోవచ్చు. అక్కడ చిత్రాలలో మన భారత సాయుధ దళాలు సింహళ దండయాత్ర చేసిన నౌకాదళ చిత్రాలున్నాయి. వీరశివాజీ, రాజ్యానికై సముద్రాలు దాటి వెళ్ళిన భారతదేశ వ్యక్తుల చిత్రాలున్నాయి. పర్ష్యన్ రాయబారులకు దర్శనం ఇచ్చిన మన భారతీయ రాజుల చిత్రాలు ఉన్నాయి. అందువల్లనే, నార్లవారు అజంతా చిత్రాల ద్వారా ఆనాటి భారత సాంఘిక వ్యవస్థ రూపం వెల్లడి అవుతుందని చెప్పారు.

ఈ) “అజంతా గుహలను చూడడానికి రెండు కళ్ళు చాలవు” అని రచయిత అన్నాడు కదా ! ఇలా “రెండు కళ్ళు చాలవు” అనే మాటను ఇంకా ఏయే సందర్భాలలో వాడతారు? కొన్నింటిని తెలపండి.
జవాబు:
ఎంత గొప్ప అందాన్ని అయినా, మనం మన రెండు కళ్ళతోనే చూడగలం. బాగా అందమైన వస్తువును ఎంత చూచినా, ఎంతగా చూచినా తృప్తి కలగదు. అలాంటప్పుడు ఆ అందాలను చూడ్డానికి రెండు కళ్ళూ చాలలేదు అని అంటారు.

నార్ల వేంకటేశ్వరరావుగారు అజంతా చిత్రాల అందం చూడ్డానికి మనకు ఉన్న రెండు కళ్ళూ చాలవు అన్నారు. అలాగే కింది సందర్భాల్లో కూడా రెండు కళ్ళూ చాలలేదు అంటూ ఉంటాము.

1. వేంకటేశ్వరస్వామిని గుడిలో ఆభరణాలతో అలంకరించినపుడు ఆ సొగసులను చూడ్డానికి మన రెండు కళ్ళూ చాలలేదని అంటాము.

2. చంటి పిల్లవాడిని చక్కగా అలంకరించి, తొట్టెలో వేసి ఊపుతాము. ఆ పిల్లవాడు బోసినవ్వులు నవ్వుతాడు. అప్పుడు కూడా, ఆ పిల్లవాడి బోసి నవ్వుల అందాలను చూడ్డానికి రెండు కళ్ళూ చాలలేదని అంటాము.

3. పెళ్ళి దుస్తులలో ఆకర్షణీయమైన అలంకరణలతో ధగధగా మెరిసిపోయే వధూవరులను చూడటానికి రెండు కళ్ళూ చాలవు అంటాము.

4. అతిలోక సౌందర్యరాశి అయిన స్త్రీని వర్ణించే సందర్భాల్లో ఆమె అందం చూసేందుకు రెండు కళ్ళూ చాలవు అంటాము.

AP Board 8th Class Telugu Solutions Chapter 4 అజంతా చిత్రాలు

2. కింది ప్రశ్నలకు పది వాక్యాలలో జవాబులు రాయండి.

అ) ప్రస్తుత పాఠ్యభాగం ద్వారా అజంతా గొప్పతనాన్ని వివరిస్తూ ఒక వ్యాసం రాయండి.
“అజంతా, మనను ఏదో స్వాప్నిక జగత్తులోకి తీసుకువెళుతుంది” అన్న నెహ్రూ మాటలను సమర్థిస్తూ అజంతా గొప్పదనాన్ని వివరిస్తూ రాయండి.
జవాబు:
అజంతా గుహలు “జల్గామ్”కు దక్షిణంగా, 35 మైళ్ళదూరంలో, “ఔరంగాబాద్’కు ఉత్తరంగా 55 మైళ్ళ దూరంలో ఉన్నాయి. ఈ గుహలు వాఘోరా నది పుట్టిన చోటుననే ఉన్నాయి. నాల్గు పక్కలా కొండలు, పచ్చని చెట్లు, నీలాకాశం, అదొక కలలలోకం, భూలోక స్వర్గం. ‘మేజర్ గిల్’ అనే మిలటరీ ఆఫీసర్, 1819లో వేటకు వెళ్ళి, ఈ గుహలను మొదటగా చూశాడు. 30 సంవత్సరాలు కష్టపడి ఎన్నో చిత్రాలను కాపీ చేసుకొని వాటిని అతడు ‘లండన్ క్రిస్టల్ ప్యాలెస్’లో పెట్టాడు.

ఈనాడు మిగిలిన అజంతా చిత్రాలు, నూటికి రెండు మాత్రమే. అన్ని చిత్రాలూ మిగిలి ఉంటే, అజంతా గుహలు చూడ్డానికి మన రెండు కళ్ళూ చాలేవి కావు. అజంతా చిత్రాలలో సిద్ధార్థుని జాతక కథలే ఎక్కువ. జాతక కథలతో సంబంధం లేనివి కూడా ఉన్నాయి. ఆ కళా తపస్వులు, తమ కుంచెతో సౌందర్య సృష్టిని చేశారు.

అజంతా గుహలు మొత్తం 29. గుహల నిర్మాణం ప్రథమ శతాబ్దిలో మొదలై, ఏడవ శతాబ్ది వరకూ సాగింది. 14వ శతాబ్ది నాటి వరకూ మన అజంతా చిత్రాలంత అందమైన చిత్రాలు యూరప్ ఖండంలో లేనే లేవట. అజంతాలో ఎన్నో స్త్రీల అందమైన చిత్రాలున్నాయి. బుద్ధుని సుందర చిత్రాలున్నాయి.

అజంతా చిత్రాలలో భారతీయ జీవితం, సంస్కృతి తొణికిసలాడుతుంది. ఇంత అందమైన చిత్రాలు, ఏ విదేశీ చిత్రకారుడూ గీయలేడు. ఈ అజంతా చిత్రాలు ప్రాచీన కాలంలో మన భారతీయ సాంఘిక వ్యవస్థ స్వరూపాన్ని తెలుపుతాయి. ఆనాటి రాజుల మందిరాలు, వారి వేషభాషలూ, సైనిక వ్యవస్థను గూర్చి తెలుపుతాయి.

“అజంతా మనను ఏదో స్వాప్నిక జగత్తులోకి తీసుకువెడుతుంది” అని నెహ్రుగారిచే ప్రశంసించబడిన అజంతా గుహలను చిత్రకారులే కాదు భారతీయ సంస్కృతి, చరిత్ర, విజ్ఞానం మొదలైన విషయాల పట్ల శ్రద్ధాభక్తులు ఉన్న వారందరూ తప్పక దర్శించాలి.

ఆ) రచయిత అజంతా చూసి అక్కడి విశేషాలు రాశాడు కదా ! అలాగే మీరు చూసిన లేదా తెలుసుకొన్న ఒక దర్శనీయ స్థలానికి సంబంధించిన విషయాలు రాయండి.
(లేదా)
మనం కుటుంబ సభ్యులతోనో, స్నేహితులతోనో చాలా ప్రదేశాలకు వెళుతుంటాం. మీరు చూసిన / తెలుసుకొన్న పర్యాటక స్థలం గురించి రాయండి.
జవాబు:
నేను ఇటీవల మా కుటుంబ సభ్యులతో కలిసి రాజస్థాన్‌లో పర్యటించాను. రాజస్థాన్ రాజధాని జైపూర్. తొలుత డబుల్ డెక్కర్ బస్సులో బయలుదేరి నగరాన్ని సందర్శించాం.

ముందుగా 1799లో మహారాజు సవాయి ప్రతాప్ సింగ్ కట్టించిన హవామహల్ కు వెళ్లాం. నెమలిపింఛంలా కనిపించే ఈ భవనాన్ని పునాదులు లేకుండా నిర్మించారు. పగలు గులాబీ రంగులోనూ రాత్రి బంగారు వర్ణంలోనూ శోభిల్లే ఈ ఐదంతస్తుల భవనంలో 300 గదులు, 953 కిటికీలు ఉన్నాయి. తరవాత బిర్లాలు నిర్మించిన లక్ష్మీనారాయణ మందిరానికి వెళ్లాం. దీనికి ఓ పక్కనే జైపూర్ కోట కనిపిస్తుంటుంది.

తరవాత రాజస్థాన్ సాంస్కృతిక వైభవాన్ని జీవన విధానాన్ని ప్రతిబింబించే సిటీ మ్యూజియానికి వెళ్లాం. విశాలమైన జైపూర్ నగరంలో అన్ని కట్టడాలకూ గులాబీరంగే. అందుకే దీన్ని ‘పింక్ సిటీ’ అని పిలుస్తారు. జైపూర్ కోటలోపల భవంతులు, గదులు…. నాటి రాజవైభవాన్ని కళ్ళకు కడతాయి. బలమైన శత్రుదాడుల్ని ఎదుర్కొన్నప్పటికీ చెక్కుచెదరకుండా ఉన్న ఆ ప్రాచీన కట్టడాల నిర్మాణశైలిని మెచ్చుకోకుండా ఉండలేం.

జలమహల్ గా ప్రాచుర్యం పొందిన చమేలీ బాగ్ ను కూడా సందర్శించాం. జైపూర్ నుంచి రాజస్థాన్ లో అతి పెద్ద రెండో పట్టణంగా పేరొందిన జోధ్ పూర్ కి వెళ్ళాం. నగరం నవీన రాజప్రాసాదాలకు నిలయం. కళాఖండాలకూ, తోలు వస్తువులకూ ప్రసిద్ధిచెందిన ఈ నగరం మొత్తం నీలం రంగులో ఉన్న భవంతులే. అందుకే దీనికి ‘బ్లూ సిటీ’ అని పేరు.

మేము జైసల్మేర్ ను కూడా సందర్శించాం. మహారాజ్ జైసాల్ సింగ్ 1156లో నిర్మించిన ఈ నగరం, మనదేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతం. పాకిస్థాన్ కి మనకీ మధ్య గీతలు గీసుకున్న పట్టణం ఇదే. ఈ నగరంలో ఎటు చూసినా బంగారు వర్ణంలో మెరిసే భవంతులే. అందుకే దీన్ని ‘గోల్డెన్ సిటీ’ అంటారు. ఈ రోజుకీ రాజప్రాసాదం ప్రాంగణంలో 400 కుటుంబాలు నివసించడం ఈ కోట ప్రత్యేకత.

ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో విశేషాలున్నాయి. రాజస్థాన్ యాత్ర ఒక గొప్ప అనుభవం. నాకు ఎన్నో అవ్యక్త మధురానుభూతులను కలిగించింది. ఈ యాత్ర ద్వారా నేను అనేక విజ్ఞానదాయకమైన విషయాలను తెలుసుకున్నాను.

IV. పదజాలం

1. కింది వాక్యాలలోని జాతీయాలకు సరిపోయే అర్థం గ్రహించి సరైన సమాధానం కింద గీత గీయండి.

అ) అజంతా గుహలోని కుడ్యచిత్రాలు నేటికీ చెక్కుచెదరలేదు. .
i) చెదిరిపోలేదు
ii) ఏమీ పాడుకాలేదు
iii) చెక్కబడలేదు
iv) శిథిలం కాలేదు
జవాబు:
ii) ఏమీ పాడుకాలేదు

ఆ) దొంగలు అజంతా గుహల్లో తలదాచుకున్నారు.
i) తలను దాచుకున్నారు
ii) వస్తువులను దాచుకున్నారు
iii) ఆశ్రయం పొందారు
iv) నివసించారు
జవాబు:
iii) ఆశ్రయం పొందారు

ఇ) అజంతా చిత్రాలు భారతీయ సంస్కృతిని కళ్ళకు కట్టినట్టు చూపుతున్నాయి.
i) కళ్ళకు కట్టుకున్నట్టు చూపుతున్నాయి
ii) కళ్ళముందు నిజంగా ఉన్నట్టు చూపుతున్నాయి
iii) చాలా మంచి విషయాలు చూపుతున్నాయి
iv) కళ్ళు చెదిరేట్టుగా ఉన్నాయి.
జవాబు:
iii) చాలా మంచి విషయాలు చూపుతున్నాయి

AP Board 8th Class Telugu Solutions Chapter 4 అజంతా చిత్రాలు

2. కింది వాక్యాలలో గీత గీసిన పదాన్ని మరో సందర్భానికి అన్వయించి వాక్యాలు తిరిగి రాయండి.

1. ఉదా : అనంతాకాశంలోని నక్షత్రాలను పరిశీలించి ఆ అనుభూతిని చెప్పగలమా?
మంచి కథను చదివితే గొప్ప అనుభూతి కలుగుతుంది.
జవాబు:
తాజ్ మహల్ ను సందర్శించినప్పుడు కలిగిన అనుభూతిని నేనెన్నటికీ మరువలేను.

అ. భారతీయ చిత్రకళ మహోన్నత శిఖరాలను అధిరోహించింది.
జవాబు:
సంగీతంలో మంగళంపల్లి బాలమురళీకృష్ణ ప్రతిభ, మహోన్నత శిఖరాలను తాకింది.

ఆ. చెక్కడపు పని మేజర్ గిల్ దృష్టిని ఆకర్షించింది.
జవాబు:
అనాథశరణాలయ విద్యార్థుల ప్రతిభ అందరి దృష్టిని ఆకర్షించింది.

ఇ. కాలగతిలో కొన్ని చిత్రాలు నశించాయి.
జవాబు:
అతడు తనకు కల్గిన దుఃఖాన్ని, కాలగతిలో మరచిపోయాడు.

ఈ. ఈ కుడ్యచిత్రాలను చిత్రించిన వారు బౌద్ధ భిక్షువులు.
జవాబు:
విజయనగర చక్రవర్తుల గృహాలలోని కుడ్యచిత్రాలలో లక్ష్మీనారాయణుల విగ్రహాలున్నాయి.

3. కింది వాక్యాలలోని పర్యాయపదాలను గుర్తించి వాటి కింద గీత గీయండి.
అ) హృదయాన్ని కదిలించే అనుభూతిని, ఆ ఎదలోని భావాలను సులభంగా వర్ణించలేం.
జవాబు:
హృదయం – ఎద

ఆ) వాఘోరానది కొండల చుట్టూ తిరుగుతూ ప్రవహించింది. ఆ వాహిని ప్రవహించే దృశ్యం మనోహరం.
జవాబు:
నది – వాహిని

ఇ) పడమటి గాలి సన్నగా వీస్తూంది. పశ్చిమ దిశ వైపు ఒక సుందరమైన తోట ఉంది.
జవాబు:
పడమర – పశ్చిమము

V. సృజనాత్మకత

* అజంతా చిత్రాల పాఠంలో అజంతా గుహల చరిత్ర, దాని విశేషాలూ చదివారు కదా ! అలాగే ప్రతి గ్రామానికీ ఒక చరిత్ర కానీ, విశేషం కానీ ఉండవచ్చు. మీ గ్రామానికి గల ప్రత్యేకతను లేదా మీకు దగ్గరలోని ఇతర గ్రామాల ప్రత్యేకతను వర్ణిస్తూ రాయండి. ఆ వివరాలతో ఒక బ్రోచర్ తయారుచేయండి.
జవాబు:
మాది తూర్పు గోదావరి జిల్లాలో అల్లవరంలోని ‘కొంగరగిరిపట్టణం’ – ఇది కోరుకొండ రాజధానిగా ‘కుమారగిరి రాయలు’ పరిపాలించినపుడు ఆయన పేర వెలసిన గ్రామం. ఇది సముద్ర తీరంలోని గ్రామం. ప్రక్కన బంగాళాఖాతం ఉంది. పూర్వం సముద్రంలో ప్రయాణించే ఓడలు ఇక్కడ ఆగేవి. ఇప్పటికీ దాన్ని ‘ఓడలరేవు’ అంటారు. ఈ గ్రామం గుండా రామలక్ష్మణులు ప్రయాణించారు. అందులో రాముడు ‘నత్తా రామేశ్వరం’ అనే ప్రాంతంలో ఈశ్వర విగ్రహాన్ని ప్రతిష్ఠించాడట. రాముడు ప్రతిష్ఠించడం వల్ల దాన్ని రామేశ్వరం అని పిలుస్తారు. మహాశివరాత్రికి మా చుట్టుపట్ల పల్లె గ్రామాల ప్రజలు సముద్రంలో స్నానం చేసి రామేశ్వరునికి అభిషేకాలు చేసి తీర్థప్రసాదాలు స్వీకరిస్తారు.

అలాగే లక్ష్మణుడు మా గ్రామంలోనే ఒక ప్రాంతంలో శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. దాన్ని ‘లక్ష్మణేశ్వరం’ అని పిలుస్తారు. సంక్రాంతికి ధనుస్సమయంలో ప్రజలు లక్ష్మణేశ్వరునికి అభిషేకాదులు చేస్తారు. ఇక్కడ సంక్రాంతి, కనుమనాడు ప్రభలతీర్థం చాలా వేడుకగా జరుగుతుంది. మా గ్రామ ప్రజలంతా వేడుకగా ఆ తీర్థంలో పాల్గొంటారు.

AP Board 8th Class Telugu Solutions Chapter 4 అజంతా చిత్రాలు
(లేదా)
* చుట్టూ ఎత్తైన కొండలు, ఆ కొండల నుండి జలజల జాలువారే జలపాతాలు, పచ్చని ప్రకృతి శోభ, పక్షుల కిలకిలా రావాలతో ఆ ప్రదేశం ఎంతో సుమనోహరంగా ఉంది …….. ఇలా ఏదైనా ఒక ప్రాంతాన్ని వర్ణిస్తూ రాయండి.
జవాబు:
కోస్తా ప్రాంతములోని నెల్లూరు జిల్లాలో రావూరు ఒక చెప్పుకోదగిన తాలూకా. ఈ రావూరుకు సమీపంలో ఎత్తైన కొండలు ఉంటాయి. ఆ కొండల మధ్య నుంచి ఒక దారి ఉంది. కొండల మధ్యదారి మలుపులు తిరిగి మెలికలుగా ఉంటుంది. కొండల పైకి వెళ్ళిన తరువాత ఒక సుప్రసిద్ధమైన క్షేత్రం ఉంటుంది. దీనినే “పెంచలకోన” అని కూడా అంటారు. ఈ కోనలో కొండల మధ్య నుండి ఒక జలపాతం జాలువారుతూ ఉంటుంది. చుట్టూ కంటికింపైన పచ్చదనం, పక్షుల కిలకిల రావాలతో ఆ కొండ ప్రాంతమంతా చాలా ఆహ్లాదంగా, రమణీయంగా ఉంటుంది. ఇక్కడి పెంచలకోనలో నరసింహస్వామి వారి ఆలయం ఉంది. ఆ ఆలయానికి సందర్శకుల సందడి ఎక్కువగా ఉంటుంది.

VI. ప్రశంస

* మీరు చూసిన ఒక దర్శనీయ స్థలాన్ని కొనియాడుతూ ‘నీవు కూడా తప్పక చూడవలసింది’గా తెలుపుతూ మీ మిత్రుడికి లేఖ రాయండి.
జవాబు:

శ్రీకాకుళం,
x x x x x x x

ప్రియమైన స్నేహితుడు శ్రీనాథ్ కు,

నీ మిత్రుడు భరత్ సింహా వ్రాయునది. ఇక్కడ క్షేమము, అక్కడ క్షేమమని తలుస్తున్నాను. మేము ఇటీవల తీర్థయాత్రలకు వెళ్ళాము. అనేక ప్రదేశాలను దర్శించుకున్నాము. వాటిలో నాకు నచ్చినది కాణిపాక వరసిద్ధి వినాయకుల వారి ఆలయం. దాని గురించి ఈ లేఖలో వివరిస్తున్నాను.

ఈ ఆలయం చిత్తూరు జిల్లాలోని తిరుపతికి దగ్గరగా రేణిగుంట సమీపాన ఉన్నది. ఇందు గణపతి శిల ఆకారంలో ఉంటాడు. ఈ వినాయకుడు మొదట ఒక రాయేనట. ఊరికి దగ్గరలోని ఒక పాడుబడిన బావిలో వినాయకుని ఆకారంలో వెలిసినాడట. తరువాత ఆ శిలావిగ్రహం కొంచెం పెద్దదిగా అయిందట. అప్పుడే ఆ గ్రామ ప్రజలు అందరూ ఆ విగ్రహానికి ఒక గుడి కట్టించి పూజలు చేయటం ప్రారంభించారట. అప్పటి నుండి కాణిపాకం చాలా ప్రసిద్ధి చెందినదట. ఇక్కడ ఎవరైనా కోరికలు కోరినట్లయితే తప్పక నెరవేరుతాయని ఇక్కడి ప్రజల యొక్క నమ్మకం. మా కుటుంబంలోని వారందరమూ ఈ ఆలయాన్ని దర్శించుకున్నాము. చాలా ఆనందించాము. నీవు కూడా తప్పకుండా ఇటువంటి దర్శనీయ ప్రాంతాన్ని దర్శించవలెను. తిరిగి లేఖ వ్రాయుము. మీ అమ్మా, నాన్నగార్లకు నా నమస్కారాలు.

ఇట్లు
మీ మిత్రుడు,
భరత్ సింహా.

చిరునామా :
కె. శ్రీనాథ్,
S/O కె. వెంకటేశ్వర్లు,
డోర్ నెం. 8/64-7,
బ్రాడీపేట,
గుంటూరు.

ప్రాజెక్టు పని

1. మీ జిల్లాలోని దర్శనీయ స్థలాలు, పర్యాటక ప్రదేశాల చిత్రాలు సేకరించండి. వీటి వివరాలు రాయండి. వీటన్నిటితో ఒక సంకలనం తయారుచేసి ప్రదర్శించండి.
జవాబు:
మాది తూర్పు గోదావరి జిల్లా.
దర్శనీయ స్థలాలు :

  1. అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామివారి దేవాలయము.
  2. ద్రాక్షారామం , సామర్లకోట భీమేశ్వరాలయాలు.
  3. అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి దేవాలయము.
  4. రాజమండ్రి “గోదావరి కమ్ రైల్ బ్రిడ్జి”.
  5. కోనసీమ ప్రకృతి దృశ్యాలు.
  6. సముద్ర తీరం బీచు.
  7. రాజోలు తాలూకా ‘ఆదుర్రు’ బౌద్ధ స్తూపం – మొ||నవి.

AP Board 8th Class Telugu Solutions Chapter 4 అజంతా చిత్రాలు 3

VII. భాషను గురించి తెలుసుకుందాం!

1) కింది వాక్యాలను పరిశీలించి, మార్పులను గమనించండి.
అ) సంఘసంస్కర్తలు దురాచారాలను నిర్మూలించారు.
ఆ) సంఘసంస్కర్తల చేత దురాచారాలు నిర్మూలించబడ్డాయి.
పై రెండు వాక్యాల అర్థం ఒక్కటే. కాని వాక్య నిర్మాణంలో భేదం ఉందని గమనించారు కదా !
రెండు వాక్యాల మధ్య భేదం ఏమిటి?

అ) సంఘసంస్కర్తలు దురాచారాలను నిర్మూలించారు – అనే ఈ మొదటి వాక్యంలో కర్తకు ప్రాధాన్యం ఉంది. అంటే క్రియ కర్తను సూచిస్తుంది. కర్మకు ద్వితీయా విభక్తి ప్రత్యయం చేరి ఉంది. ఇలాంటి వాక్యాన్ని ‘కర్తరి వాక్యం’ అంటారు.

ఆ) ఇక సంఘసంస్కర్తల చేత దురాచారాలు నిర్మూలించబడ్డాయి. – అనే రెండవ వాక్యంలో (i) కర్తకు తృతీయా విభక్తి ప్రత్యయం ఉంది. (ii) క్రియకు “బడు” చేరింది. (iii) క్రియ – కర్మ ప్రధానంగా ఉంది.

వాక్యంలో క్రియకు ‘బడు’ చేరి, కర్తకు తృతీయా విభక్తి చేరే వాక్యాన్ని “కర్మణి వాక్యం” అంటారు.

AP Board 8th Class Telugu Solutions Chapter 4 అజంతా చిత్రాలు

2) కింది కర్తరి వాక్యాలను కర్మణి వాక్యాలుగా రాయండి.
అ) వాల్మీకి రామాయణాన్ని రచించాడు. (కర్తరి వాక్యం)
జవాబు:
రామాయణం వాల్మీకి చేత రచించబడింది. (కర్మణి వాక్యం)

ఆ) ప్రజలు శాంతిని కోరుతున్నారు. (కర్తరి వాక్యం)
జవాబు:
శాంతి ప్రజలచేత కోరబడింది. (కర్మణి వాక్యం)

3) కింది కర్మణి వాక్యాలను కర్తరి వాక్యాలుగా రాయండి.

అ) లైబ్రరీ నుంచి తెచ్చిన పుస్తకం నాచేత చదువబడింది. (కర్మణి వాక్యం)
జవాబు:
నేను లైబ్రరీ నుంచి తెచ్చిన పుస్తకాన్ని చదివాను. (కర్తరి వాక్యం)

ఆ) నాచే రచించబడిన గ్రంథం నేతాజీ చరిత్ర. (కర్మణి వాక్యం)
జవాబు:
నేను నేతాజీ చరిత్ర గ్రంథాన్ని రచించాను. (కర్తరి వాక్యం)

4) కింది సమాస పదాలకు విగ్రహవాక్యాలు రాసి సమాసం పేరు తెలపండి.

సమాస పదంవిగ్రహవాక్యంసమాసం పేరు
ఉదా : నదిగట్టునది యొక్క గట్టుషష్ఠీ తత్పురుష
అ) అజంతా స్త్రీలుఅజంతా యొక్క స్త్రీలుషష్ఠీ తత్పురుష
ఆ) ప్రకృతి సౌందర్యంప్రకృతి యొక్క సౌందర్యంషష్ఠీ తత్పురుష
ఇ) నదీ ప్రవాహంనది యొక్క ప్రవాహంషష్ఠీ తత్పురుష
ఈ) మానవ సమాజంమానవుల యొక్క సమాజంషష్ఠీ తత్పురుష

5) కింది విగ్రహవాక్యాలకు సమాస పదాలు రాసి దాని పేరును తెలపండి.

సమాస పదంవిగ్రహవాక్యంసమాసం పేరు
అ) గుహల యొక్క గోడగుహల గోడషష్ఠీ తత్పురుష
ఆ) కొండ యొక్క మలుపుకొండ మలుపుషష్ఠీ తత్పురుష

వ్యాకరణంపై అదనపు సమాచారం

పర్యాయపదాలు

సముద్రం : సాగరం, జలధి
నక్షత్రం : తార, చుక్క
పువ్వు : కుసుమం, సుమం
కెరటం : అల, తరంగం, భంగం
కన్ను : నేత్రం, నయనం, చక్షువు
స్త్రీ : మహిళ, వనిత, మగువ
తావి: పరిమళం, సువాసన, సుగంధం
ఆకాశం : గగనం, నింగి
పాట : గీతం, గేయం
కొండ : అద్రి, పర్వతం
నది : వాహిని, స్రవంతి, కూలంకష
చంద్రుడు : సోముడు, అమృతాంశుడు
నీరు : జలం, వారి, ఉదకం

వ్యుత్పత్యర్థాలు

మిత్రుడు : అన్ని ప్రాణుల యందు సమభావన కలవాడు (సూర్యుడు)
తార : దీనిచే నావికులు తరింతురు (చుక్క)
పక్షి : పక్షములు గలది (పిట్ట)
సాగరం : సగర కుమారుల చేత త్రవ్వబడినది (సముద్రం)
మహీపాలుడు : భూమిని పాలించువాడు (రాజు)

నానార్థాలు

కోటి : నూరులక్షలు, అంచు, గుంపు
వర్షం : వాన, సంవత్సరం, మబ్బు
కన్ను : నేత్రం, బండి చక్రం
చిత్రం : బొమ్మ, ఆశ్చర్యం
దక్షిణ : దిక్కు సంభావన
తార : నక్షత్రం, వాలి భార్య, కంటిపాప, ఓంకారం
కుడ్యం : గోడ, పుంత
ఉత్తరం : జాబు, సమాధానం

సంధులు

సవర్ణదీర్ఘ సంధి :
సూత్రం : అ, ఇ, ఉ, ఋ లకు సవర్ణమైన అచ్చులు పరమైనప్పుడు దాని దీర్ఘము ఏకదేశమగును.
నీలాకాశం = నీల + ఆకాశం – సవర్ణదీర్ఘ సంధి
కళాభిజ్ఞులు = కళ + అభిజ్ఞులు – సవర్ణదీర్ఘ సంధి
చంద్రాకారం = చంద్ర ఆకారం – సవర్ణదీర్ఘ సంధి
శతాబ్దం = శత + అబ్దం – సవర్ణదీర్ఘ సంధి
సిద్ధార్థ = సిద్ధ + అర్థ – సవర్ణదీర్ఘ సంధి
న్యత్యాంగన = నృత్య + అంగన – సవర్ణదీర్ఘ సంధి

AP Board 8th Class Telugu Solutions Chapter 4 అజంతా చిత్రాలు

గుణసంధి :
సూత్రం : అకారమునకు ఇ, ఉ, ఋ లు పరమైనపుడు క్రమముగా ఏ, ఓ, అర్లు ఏకాదేశమగును.
మహోన్నత = మహా + ఉన్నత – గుణసంధి
గజేంద్రుడు = గజ + ఇంద్రుడు – గుణసంధి
సర్వోత్తమం = సర్వ + ఉత్తమం – గుణసంధి

ఉత్వసంధి :
సూత్రం : ఉత్తునకు అచ్చు పరమైనపుడు సంధి అవుతుంది.
సులభమేమో = సులభము + ఏమో – ఉత్వ సంధి
అపారమైన = అపారము + ఐన – ఉత్వ సంధి
వచ్చినావని = వచ్చినావు + అని – ఉత్వ సంధి
మలుపులన్నీ = మలుపులు + అన్ని – ఉత్వ సంధి
లోతైనా = లోతు + ఐనా – ఉత్వ సంధి
చైత్యా లైతే = చైత్యాలు + ఐనా – ఉత్వ సంధి
అటొక = అటు + ఒక – ఉత్వ సంధి
పేరొందు = పేరు + ఒందు – ఉత్వ సంధి

ఆత్వసంధి :
సూత్రం : అత్తునకు సంధి బహుళంగా వస్తుంది.
నిలిచినప్పుడు = నిలిచిన + అప్పుడు – అత్వ సంధి
పోయినందున = పోయిన + అందున – అత్వ సంధి
అల్లంత = అల్ల + అంత – అత్వ సంధి
దక్కకుండు = దక్కక + ఉండు – అత్వ సంధి

ఇత్వగుంధి (అ):
సూత్రం : ఏమి మొదలైన పదాల్లోని ఇత్తునకు సంధి వైకల్పికంగా అవుతుంది.
దారైనా = దారి + ఐనా – ఇత్వ సంధి
అదొక = అది + ఒక – ఇత్వ సంధి

ఇత్వసంధి (ఆ) :
సూత్రం : క్రియా పదాల్లో ఇత్తునకు సంధి వైకల్పికంగా అవుతుంది.
లేనట్టు = లేని + అట్టు – ఇత్వ సంధి
వచ్చేదట = వచ్చేది + అట – ఇత్వ సంధి
ఉండేదేమో = ఉండేది + ఏమో – ఇత్వ సంధి

యణాదేశ సంధి :
సూత్రం : ఇ, ఉ, ఋ లకు అసవర్ణాచ్చులు పరమైనపుడు క్రమంగా య, వ, రలు ఆదేశమవుతాయి.
పక్ష్యాదులు = పక్షి + ఆదులు – యణాదేశ సంధి
ప్రత్యుత్తరం = ప్రతి + ఉత్తరం – యణాదేశ సంధి

పుంప్వాదేశ సంధి :
సూత్రం : కర్మధాయంలో మువర్ణకానికి పుంపులు అవుతాయి.
సముద్రపు అంచు = సముద్రపు + అంచు – పుంప్వాదేశ సంధి
చెక్కడపుపని = చెక్కడము + పని – పుంప్వాదేశ సంధి

గసడదవాదేశ సంధి :
సూత్రం : ప్రథమమీది పురుషాలకు గసడదవలు బహుళంగా వస్తాయి.
చెట్టుగాని = చెట్టు + కాని – గసడదవాదేశ సంధి
చరిత్రలుగా = చరిత్రలు + కా – గసడదవాదేశ సంధి
సరిగదా = సరి + కదా – గసడదవాదేశ సంధి

యడాగమ సంధి :
సూత్రం : సంధి లేనిచోట స్వరం కంటె పరంగా ఉన్న స్వరానికి యడాగమం అవుతుంది.
ఆయన యెత్తినట్లు = ఆయన + ఎత్తినట్లు – యడాగమ సంధి
తలయెత్తు = తల + ఎత్తు – యడాగమ సంధి

సమాసాలు

సమాస పదంవిగ్రహవాక్యంసమాసం పేరు
వేషభాషలువేషమును, భాషయునుద్వంద్వ సమాసం
భక్తిశ్రద్ధలుభక్తియును, శ్రద్ధయునుద్వంద్వ సమాసం
శ్రద్ధాభక్తులుశ్రద్ధయును, భక్తియునుద్వంద్వ సమాసం
ఆశనిరాశలుఆశయును, నిరాశయునుద్వంద్వ సమాసం
ప్రకృతి సౌందర్యంప్రకృతి యందలి గల సౌందర్యంసప్తమీ తత్పురుష సమాసం
అజంతా గుహలుఅజంతా యొక్క గుహలుషష్ఠీ తత్పురుష సమాసం
రాణ్మందిరాలురాణుల యొక్క మందిరాలుషష్ఠీ తత్పురుష సమాసం
రాజసభరాజు యొక్క సభషష్ఠీ తత్పురుష సమాసం
జీవిత చరిత్రజీవితము యొక్క చరిత్రషష్ఠీ తత్పురుష సమాసం
చంద్రాకారంచంద్రుని యొక్క ఆకారంషష్ఠీ తత్పురుష సమాసం
– నదిగట్టునది యొక్క గట్టు– షష్ఠీ తత్పురుష సమాసం
అగ్నిప్రమాదంఅగ్ని వలన ప్రమాదంపంచమీ తుత్పురుష సమాసం
పచ్చని చెట్లుపచ్చనైన చెట్లువిశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
శాశ్వత కీర్తిశాశ్వతమైన కీర్తివిశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
అనంతాకాశంఅనంతమైన ఆకాశంవిశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
ముప్పది సంవత్సరాలుముప్పదైన సంవత్సరాలుద్విగు సమాసం
పదమూడు గుహలుపదమూడైన గుహలుద్విగు సమాసం
వాఘోరానదివాఘోర అను పేరుగల నదిసంభావనా పూర్వపద కర్మధారయ సమాసం

AP Board 8th Class Telugu Solutions Chapter 4 అజంతా చిత్రాలు

ప్రకృతి – వికృతులు

హృదయం – ఎద, డెందము
ఆకాశం – ఆకసం
యాత్ర – జాతర
కథ – కత
పుష్పం – పూవు
చంద్రుడు – చందురుడు
దూరం – దవ్వు
సముద్రము – సంద్రము
రూపం – రూపు
గృహము – గీము
స్త్రీ – ఇంతి
దక్షిణం – దక్కినం

రచయిత పరిచయం

పాఠం పేరు : “అజంతా చిత్రాలు”

వ్యాస రచయిత : “నార్ల వేంకటేశ్వరరావు”

జననం, జన్మస్థలం : నార్ల వారు, 1908 డిశంబరు ఒకటవ తేదీన (1-12- 1908)న కృష్ణా జిల్లాలోని “కవుతరం” అనే గ్రామంలో జన్మించారు.

రచనలు :
1. “రష్యన్ కథలు” (అనువాద రచన)
2. “నరకంలో హరిశ్చంద్రుడు” (నాటకం)
3. “నార్లవారి మాట” (పద్యకావ్యం) మొదలయిన గ్రంథాలు రాశారు.

మేధావి : ఈయన పత్రికా సంపాదకుడు, కవి, విమర్శకుడు. నిరంతరం, సమాజ శ్రేయస్సు కోసం కృషి చేసిన మేధావి.

రచనాశైలి : నార్లవారి రచన సరళమైన శబ్దాలతో సొగసైన భావాలతో సుందరశైలిలో సాగుతుంది.

కఠిన పదాలకు – అర్థాలు

దృశ్యము = కంటికి ఇంపయినది (చూడదగినది)
అనుభూతి = సుఖ దుఃఖాదులను పొందడం (ప్రత్యక్షజ్ఞానం)
అపారము = అధికమైనది (అవధిలేనిది)
బస్తీ = పట్టణము
దిశ్చక్రాన్ని = దిక్కుల యొక్క చక్రమును
నెత్తావులు (నెలు + తావులు) = నిండు పరిమళములు
తావులు = సువాసనలు
జగత్తు = లోకము
ఆదిలో = మొదటిలో
శిరోభాగము (శిరః + భాగము) = పై భాగము
వ్యవధి = గడువు
ఘట్టం = సమయం
పరికించు = చూచు
బయలు = స్థలము
అస్తిత్వాన్ని = ఉనికిని
సభ్యలోకం = ఉత్తమ సమాజం

AP Board 8th Class Telugu Solutions Chapter 4 అజంతా చిత్రాలు

విస్మరించింది = మరచింది
కుడ్యచిత్రాలు = గోడ బొమ్మలు
స్వాప్నిక జగత్తు = కలల లోకము
గాయనీమణులు = శ్రేష్ఠులైన పాటకత్తెలు
నృత్యాంగనలు = నాట్యం చేసే స్త్రీలు
అలౌకిక సుందర విగ్రహము = లోక సహజం కాని, అందమైన విగ్రహము
బౌద్ధచైత్యాలు = బౌద్ధస్తూపములు
కుడ్యాన్ని = గోడను
మట్టిగిలాబా = మట్టితో పూత
దగ్గము = కాలినది
రాగవిరాగాలు = అనురాగము, అనురాగం లేకపోవడం
కళాతపస్వులు = ఉత్తమ కళాకారులు
సౌందర్యసృష్టి = అందాన్ని సృష్టించడం
కళాభిజ్ఞులు (కళా + అభిజ్ఞులు) = కళలలో నేర్పరులు
తొణికిసలాడుతున్న = చిందుతున్న
విజాతీయ చిత్రకారులు = ఇతర జాతి చిత్రలేఖకులు
ప్రజాసాధకులు = ప్రజ్ఞను సాధించినవారు
వ్యాసంగము = ఎక్కువ కృషి
రాణ్మందిరాలు రాట్ + మందిరాలు = రాజమందిరాలు
వణిక్కులు = వర్తకులు
మహీపాలకులు = రాజులు
కారుణ్య సందేశం = దయతో కూడిన ఆజ్ఞ
పునీతం = పవిత్రము

AP Board 9th Class Telugu Grammar

AP State Syllabus AP Board 9th Class Telugu Textbook Solutions 9th Class Telugu Grammar Notes, Questions and Answers.

AP State Syllabus 9th Class Telugu Grammar

తెలుగు సంధులు

నా చిన్నప్పుడు చేసిన పనులు గుర్తుకు వచ్చాయి.

గమనిక :
పై వాక్యంలో “చిన్నప్పుడు” అనే పదం, చిన్న + అప్పుడు అనే రెండు పదాలు కలవడం వల్ల వచ్చింది. దీనినే “సంధి పదం” అంటారు. ఉచ్చరించడంలో సౌలభ్యం కోసం, రెండు పదాలను వెంట వెంటనే కలిపి మాట్లాడవలసినప్పుడు,

లేదా రాయవలసినప్పుడు, “సంధి పదం” ఏర్పడుతుంది.

తెలుగు సంధులు :
రెండు తెలుగుపదాల మధ్య జరిగే సంధులను “తెలుగు సంధులు” అంటారు.

సంధి :
వ్యాకరణ పరిభాషలో రెండు స్వరాల (అచ్చుల) కలయికను “సంధి” అని పిలుస్తారు.

సంధి కార్యం :
రెండు అచ్చుల మధ్య జరిగే మార్పును “సంధి కార్యం” అని పిలుస్తారు.

పూర్వ స్వరం :
సంధి జరిగే మొదటి పదం చివరి అక్షరంలోని అచ్చును, (స్వరాన్ని) “పూర్వ స్వరం” అని పిలుస్తారు.

పర స్వరం :
సంధి జరిగే రెండవ పదము మొదటి అక్షరములోని అచ్చును (స్వరాన్ని) “పర స్వరం” అని పిలుస్తారు.
ఉదా :
రామ + అయ్య : ‘మ’ లో ‘అ’, పూర్వ స్వరం; ‘అయ్య’ లోని ‘అ’ పర స్వరం.

1. అత్వ సంధి
సూత్రం : అత్తునకు సంధి బహుళము.

ఈ కింది పదాలను విడదీయండి.
ఉదా :
మేనల్లుడు = మేన + అల్లుడు = (న్ +) అ + అ = అ = (అత్వ సంధి)
1) ఒకప్పుడు = ఒక + అప్పుడు = (అ + అ = అ) = (అత్వ సంధి)
2) వచ్చినందుకు = వచ్చిన + అందుకు = (అ + అ = అ) = (అత్వ సంధి)
3) రాకుంటే = రాక + ఉంటే = (అ + ఉ = ఉ) = (అత్వ సంధి)
4) లేకేమి = లేక + ఏమి = (అ + ఏ = ఏ) = (అత్వ సంధి)
5) పోవుటెట్లు = పోవుట + ఎట్లు = (అ + ఎ = ఎ) = (అత్వ సంధి)

గమనిక :
పై సంధి పదాలలోని పూర్వ స్వరం ‘అ’. అది పర స్వరంలోని అచ్చుతో కలిస్తే పూర్వ స్వరం ‘అ’ లోపిస్తుంది. ‘అ’ లోపించింది కాబట్టి ‘అత్వ సంధి’.

అత్వసంధి లేక ‘అకారసంధి’ అంటారు. పొట్టి ‘అ’ అనే అక్షరానికి అచ్చు పరమైతే ‘అత్వ సంధి’ వస్తుంది.

* అత్వ సంధి (అకార సంధి) సూత్రం :అత్తునకు సంధి బహుళము.

2. ఇత్వ సంధి
సూత్రం :ఏమ్యాదుల ఇత్తునకు సంధి వైకల్పికముగానగు.
ఈ కింది పదాలను విడదీయండి.
ఉదా :
అ) ఏమంటివి = ఏమి + అంటివి = (ఇ + అ = అ) = (ఇత్వ సంధి)
సంధి జరుగనప్పుడు “య కారం” ఆగమంగా వస్తుంది. దానినే ‘యడాగమం’ అని పిలుస్తారు.

ఆ) ఏమియంటివి = ఏమి + య్ + అంటివి = (ఇ + అ = య) : (ఇకారసంధి రాని యడాగమరూపం)

గమనిక :
ప్రథమ, ఉత్తమ పురుష బహువచన క్రియల ఇకారమునకు సంధి వైకల్పికంగా జరుగుతుంది.
వచ్చిరిపుడు = వచ్చిరి + ఇపుడు – (ఇ + ఇ + ఇ) – (ఇత్వ సంధి)
వచ్చిరియిపుడు = వచ్చిరి + య్ + ఇపుడు – (ఇ + ఇ + యి) (యడాగమం వచ్చిన రూపం)

గమనిక :
పై ఉదాహరణములలో హ్రస్వ ఇకారానికి అచ్చు కలిసినపుడు సంధి జరిగింది. దీనిని “ఇత్వసంధి” అంటారు. ఇత్వ సంధి తప్పక జరుగాలన్న నియమం లేదు.

వైకల్పికం :
ఇత్వ సంధి జరుగవచ్చు లేక జరుగకపోవచ్చు. వ్యాకరణంలో ఈ పరిస్థితిని “వైకల్పికం” అని పిలుస్తారు.
అభ్యాసము :
ఉదా :
1) ఏమంటివి = ఏమి + అంటివి = (మ్ + ఇ + అ = మ)
2) పైకెత్తినారు = పైకి + ఎత్తినారు – (ఇ + ఎ = ఎ) = ఇత్వ సంధి
3) మనిషన్నవాడు = మనిషి + అన్నవాడు = (ఇ + అ = అ) = ఇత్వ సంధి

AP Board 9th Class Telugu Grammar Chandassu ఛందస్సు

3. ఉత్వ సంధి
ఉకారసంధి సూత్రం : ఉత్తునకు అచ్చు పరమగునపుడు సంధి నిత్యం.

ఈ కింది పదాలను విడదీయండి.
ఉదా :
రాముడతడు = రాముడు + అతడు = (డ్ + ఉ + అ = డ) = (ఉత్వ సంధి)
1) అతడెక్కడ = అతడు + ఎక్కడ = (ఉ + ఎ = ఎ) = (ఉత్వ సంధి)
2) మనమున్నాము = మనము + ఉన్నాము = (ఉ + ఉ = ఉ) = (ఉత్వ సంధి)
3) మనసైన = మనసు + ఐన = (ఉ + ఐ = ఐ) = (ఉత్వ సంధి)

గమనిక :
హ్రస్వ ఉకారానికి, అనగా ఉత్తుకు, అచ్చు కలిసినప్పుడు, పూర్వ స్వరం ఉకారం లోపించి, పర స్వరం కనిపిస్తుంది. లోపించిన పూర్వ స్వరం ‘ఉ’ కాబట్టి, ఇది “ఉత్వ సంధి” అని పిలువబడుతుంది.

ఉత్వ సంధి సూత్రం : ఉత్తునకు అచ్చు పరమైనపుడు సంధి నిత్యం.
నిత్యం : నిత్యం అంటే, తప్పక సంధికార్యం జరుగుతుందని అర్థం

4. యడాగమం సంధి
సూత్రం : సంధి లేనిచోట అచ్చుల మధ్య “య్” వచ్చి చేరడాన్ని “యడాగమం” అని పిలుస్తారు.

ఈ కింది పదాలను విడదీయండి.
ఉదా :
అ) మాయమ్మ = మా + అమ్మ = మాయమ్మ
ఆ) మాయిల్లు = మా + ఇల్లు = మాయిల్లు
ఇ) హరియతడు = హరి + అతడు = హరియతడు

గమనిక :
పై ఉదాహరణలలో సంధి జరుగలేదు. కాని కొత్తగా ‘య్’ వచ్చి చేరింది. అలా చేరడం వల్ల ఈ కింది విధంగా మార్పు జరిగింది.
అ)మా + య్ + అమ్మ = మా ‘య’ మ్మ
ఆ)మా + య్ + ఇల్లు = మా ‘ఋ’ ల్లు
ఇ) హరి + య్ + అతడు = హరి ‘య’ తడు

యడాగమం :
సంధి లేనిచోట అచ్చుల మధ్య “య్” వచ్చి చేరడాన్ని “యడాగమం” అంటారు.

5. ఆమ్రేడిత సంధి
సూత్రం : అచ్చునకు ఆమ్రేడితం పరమైతే సంధి తరుచుగా వస్తుంది.

ఆమ్రేడితం :
మొదట పలికిన పదమునే తిరిగి పలుకుతాము. అలా రెండవమారు పలికిన పదాన్ని ‘ఆమ్రేడితం’ అంటాము.
ఉదా :
1) ‘ఆహా + ఆహా ఆహా అనే పదం రెండుసార్లు వచ్చింది. అందులో రెండవ ఆహా అనే దాన్ని ఆమ్రేడితం అని పిలవాలి.
2) అరెరె – అరె + అరె : రెండవసారి వచ్చిన ‘అరె’ ఆమ్రేడితం.
3) ఔరౌర = ఔర + ఔర – రెండవసారి వచ్చిన ‘ఔర’ ఆమ్రేడితం.

గమనిక :
పై ఉదాహరణములలో ఒక్కొక్క పదం రెండుసార్లు వచ్చింది. రెండవసారి వచ్చిన పదాన్ని ‘ఆమ్రేడితం’ అంటారు.
ఆమ్రేడిత సంధికి ఉదాహరణములు :
ఔర + ఔర = ఔర్ + అ
ఆహా + ఆహా ఆహ్ + ఆ
ఓహో + ఓహో = ఓహ్ + ఓ

గమనిక :
పై ఉదాహరణములలో పూర్వ పదం అనగా మొదటి పదం చివర, అ, ఆ, ఓ వంటి అచ్చులున్నాయి. ఈ అచ్చులకు ఆమ్రేడితం పరమైతే, సంధి వస్తుంది.
ఔర + ఔర = ఔరౌర = (అ + ఔ = ఔ)
ఆహా + ఆహా ఆహాహా – (ఆ + ఆ = ఆ)
ఓహో + ఓహో : ఓహోహో = (ఓ + ఓ = ఓ)
ఏమి + ఏమి = ఏమేమి = (ఇ + ఏ = ఏ)
ఎట్లు + ఎట్లు : ఎట్లెట్లు = (ఉ + ఎ = ఎ)
ఏమిటి + ఏమిటి = ఏమిటేమిటి = (ఇ + ఏ = ఏ)
అరె అరె . . అరెరె : (ఎ + అ = అ)
పై విషయాలను గమనిస్తే ఆమ్రేడిత సంధి సూత్రాన్ని ఇలా తయారుచేయవచ్చు.

ఆమ్రేడిత సంధి సూత్రం :
అచ్చునకు ఆమ్రేడితం పరమైతే, సంధి తరుచుగా అవుతుంది.

గమనిక :
అమ్రేడిత సంధి, కింది ఉదాహరణములలో వికల్పంగా జరుగుతుంది. ఈ కింది ఉదాహరణలను గమనిస్తే, సంధి జరిగిన రూపం, సంధిరాని రూపమూ కనబడతాయి.
ఉదా :
ఏమి + ఏమి = ఏమేమి, ఏమియేమి (సంధి వైకల్పికం)
ఎట్లు + ఎట్లు = ఎట్లెట్లు, ఎట్లు, ఎట్లు (సంధి వైకల్పికం)
ఎంత + ఎంత = ఎంతెంత, ఎంతయెంత (సంధి వైకల్పికం)

6. ఆమ్రేడిత ద్విరుక్తటకారాదేశ సంధి
సూత్రం :ఆమ్రేడితం పరమగునపుడు, కడాదుల, తొలి యచ్చు మీది వర్ణముల కెల్ల అదంతంబగు ద్విరుక్తటకారంబగు.
కింది ఉదాహరణలను గమనించండి.
1) పగలు + పగలు = పట్టపగలు
2) చివర + చివర = చిట్టచివర
3) కడ + కడ = కట్టకడ

గమనిక :
1) పగలు + పగలు : పట్టపగలు అవుతోంది. అంటే ‘ప’ తర్వాత ఉన్న ‘గలు’ అన్న అక్షరాలకు బదులుగా, ‘ట్ట’ వచ్చింది. ‘ట్ట’ వచ్చి, ‘పట్టపగలు’ అయింది.

2) చివర + చివర అన్నప్పుడు ‘చి’ తర్వాత రెండక్షరాల మీద ‘మీ’ వచ్చి, ‘చిట్టచివర’ అయింది.
3) కడ + కడ అన్నప్పుడు ‘డ’ స్థానంలో ‘మీ’ వచ్చి ‘కట్టకడ’ అయింది. ఇప్పుడు కిందివాటిని కలిపి రాయండి.
ఎదురు + ఎదురు = ఎట్ట యెదురు
కొన + కొన = కొట్టకొను
మొదట + మొదట = మొట్టమొదట
బయలు + బయలు = బట్ట బయలు
తుద + తుద = తుట్టతుద

గమనిక :
ఆమ్రేడితం పరంగా ఉంటే, కడ మొదలైన శబ్దాల, మొదటి అచ్చు మీద అన్ని అక్షరాలకు ‘ట్ట’ వస్తుండడం గమనించాము.

సూత్రం :
ఆమ్రేడితం పరమగునపుడు, కడాదుల, తొలి యచ్చు మీది వర్ణముల కెల్ల అదంతంబగు ద్విరుక్తటకారంబగు.

7. ద్రుతప్రకృతిక సంధి
సరళాదేశ సంధి : ద్రుత ప్రకృతికము మీది పరుషములకు సరళములగు.

ఈ కింది పదాలు చదివి పదంలోని చివర అక్షరం కింద గీత గీయండి. 1) పూచెను 2) చూచెన్ 3) తినెను 4) చూచెన్ 5) ఉండెన్

గమనిక :
పై పదాలను గమనిస్తే పదాల చివర, ను, చ్ లు కనిపిస్తాయి. అంటే పదాల చివర నకారం ఉంది. ఈ నకారాన్ని ‘ద్రుతం’ అంటారు. ద్రుతము చివరన గల పదాలను, “ద్రుత ప్రకృతికములు” అంటారు.

గమనిక :
పూచెను, చూచెన్, తినెను, చూచెన్, ఉండెన్ – అనేవి ద్రుత ప్రకృతికములు.
కింది ఉదాహరణములను గమనించండి.
ఉదా :
అ) పూచెన్ + కలువలు = పూచెన్ + గలువలు
ఆ) దెసన్ + చూచి = దెసన్ + జూచి
ఇ) చేసెన్ + టక్కు = చేసెన్ + డక్కు
ఈ) పాటిన్ + తప్ప = పాటిన్ + దప్ప
ఉ) వడిన్ + పట్టి = వడిన్ + బట్టి
ఊ) చేసెను + తల్లీ : చేసెను + దల్లీ
ఋ) దెసను + చూసి = దెసను + జూసి

గమనిక :
ద్రుత ప్రకృతానికి ‘క’ పరమైతే ‘గ’, ‘చ’ పరమైతే ‘జ’, ‘ఓ’ పరమైతే ‘డ’, ‘త’ పరమైతే ‘ద’, ‘ప’ పరమైతే ‘బ’ ఆదేశంగా వస్తాయి.
1) క – ‘గ’ గా,
2) చ – ‘జ’ గా
3) ట – ‘డ’ గా
4) త – ‘ద’ గా
5) ప – ‘బ’ గా మార్పు వచ్చింది.

ఇందులో ‘క చట తప’ లకు, ‘పరుషములు’ అని పేరు, ‘గ జ డ ద బ’ లకు, ‘సరళములు’ అని పేరు. దీనిని బట్టి సరళాదేశ సంధి సూత్రం ఇలా ఉంటుంది.

సూత్రం :
ద్రుత ప్రకృతికము మీది పరుషములకు, సరళములగు.

గమనిక :
ఇప్పుడు పై ఉదాహరణలలో మార్పు గమనించండి.
ఉదా :
పూచెఁ గలువలు ; (ద్రుతం అరసున్నగా మారింది)
పూచెను + కలువలు (పూచెం గలువలు (ద్రుతం సున్నగా మారింది) పూచెనలువలు (ద్రుతం మీద హల్లుతో కలిసి సంశ్లేష రూపం అయ్యింది) పూచెను గలువలు. ద్రుతము మార్పు చెందలేదు) దీనికి సూత్రం చెపితే సూత్రం ఇలా ఉంటుంది.

2వ సూత్రం : ఆదేశ సరళానికి ముందున్న ద్రుతానికి, బిందు, సంశ్లేషలు విభాషగా వస్తాయి.
గమనిక :
అంటే ఒక్కోసారి బిందువు వస్తుంది. ఒక్కోసారి సంశ్లేష వస్తుంది.

AP Board 9th Class Telugu Grammar Chandassu ఛందస్సు

8. గసడదవాదేశ సంధి
సూత్రం : ప్రథమ మీది పరుషములకు గసడదవలు బహుళంబుగానగు.

కింది పదాలను ఎలా విడదీశారో గమనించండి.
1) గొప్పవాడు గదా = గొప్పవాడు + కదా (డు + క)
2) కొలువు సేసి = కొలువు + చేసి (వు + చే)
3) వాడు డక్కరి = వాడు + టక్కరి (డు + ట)
4) నిజము దెలిసి = నిజము + తెలిసి (ము + 3)
5) పాలువోయక = పాలు + పోయక (లు + పో)

గమనిక :
పై ఉదాహరణలలో పూర్వపదం చివర ప్రథమా విభక్తి ప్రత్యయాలు ఉన్నాయి. పరపదం మొదట క, చ, ట, త, ప లు ఉన్నాయి. ఈ విధంగా ప్రథమావిభక్తి మీద, ప్రత్యయాలు క, చ, ట, త, ప లు పరమైతే, వాటి స్థానంలో గ, స, డ, ద, వ, లు ఆదేశంగా వస్తాయి. అంటే
1) క – గ – గా మారుతుంది
2) త – ద – గా మారుతుంది
3) చ – స గా మారుతుంది
4) ప – వ గా మారుతుంది
5) ట – డ గా మారుతుంది.

అంటే క, చ, ట, త, ప లకు, గ, స, డ, ద, వ లు ఆదేశంగా వస్తాయి.

గసడదవాదేశ సంధి సూత్రం :
ప్రథమ మీది పరుషములకు గ స డ ద వ లు బహుళంబుగానగు

ద్వంద్వ సమాసంలో : గ స డ ద వా దేశ సంధి.

కింది పదాలను గమనించండి
కూరగాయలు = కూర + కాయ + లు
కాలుసేతులు = కాలు + చేయి + లు
టక్కుడెక్కులు = టక్కు + టెక్కు + లు
తల్లి దండ్రులు = తల్లి + తండ్రి + లు
ఊరువల్లెలు = ఊరు + పల్లె + లు

గమనిక :
పై ఉదాహరణలు ద్వంద్వ సమాసపదాలు. పై ఉదాహరణలలో కూడా క చ ట త ప లకు గ స డ ద వ లు వచ్చాయి.
దీన్నే గ స డ ద వా దేశం అంటారు.

గసడదవాదేశ సంధి సూత్రం :
ద్వంద్వ సమాసంలో మొదటి పదంమీద ఉన్న క చ ట త ప లకు, గ స డ ద వలు క్రమంగా వస్తాయి.
కింది పదాలను కలపండి.
1) అక్క చెల్లి = అక్కాసెల్లెండ్లు
2) అన్న + తమ్ముడు – అన్నదమ్ములు

9. టుగాగమ సంధి
సూత్రం : కర్మధారయంబులందు ఉత్తునకు అచ్చుపరమగునపుడు టుగాగమంబగు.

ఈ కింది పదాలను పరిశీలించండి.
నిలువు + అద్దం = నిలువుటద్దం
తేనె + ఈగ = తేనెటీగ
పల్లె + ఊరు = పల్లెటూరు

గమనిక :
వీటిలో సంధి జరిగినపుడు ‘ట్’ అదనంగా చేరింది. ఇలా ‘ట్’ వర్ణం వచ్చే సంధిని ‘టుగాగమ సంధి’ అంటారు.
అలాగే కింది పదాలు కూడా గమనించండి.
1) చిగురు + ఆకు = చిగురుటాకు / చిగురాకు
2) పొదరు + ఇల్లు : పొదరుటిల్లు / పొదరిల్లు

గమనిక :
వీటిలో ‘ట్’ అనే వర్ణం, సంధి జరిగినపుడు రావచ్చు. ‘ట్’ వస్తే “టుగాగమం” అవుతుంది. ‘ట్’ రాకుంటే ‘ఉత్వ సంధి’ అవుతుంది.

టుగాగమ సంధి సూత్రం :
కర్మధారయములందు, ఉత్తునకు అచ్చు పరమైతే టుగాగమంబగు.

2) టుగాగమ సంధి (వికల్పం) :
కర్మధారయంబు నందు పేర్వాది శబ్దములకు అచ్చు పరమగునపుడు టుగాగమంబు విభాషనగు.
ఉదా :
1) పేరు + ఉరము = పేరు టురము / పేరురము
2) చిగురు + ఆకు = చిగురుటాకు / చిగురాకు
3) పొదరు + ఇల్లు = పొదరుటిల్లు / పొదరిల్లు

AP Board 9th Class Telugu Grammar Chandassu ఛందస్సు

10. లులన సంధి
సూత్రం : లులనలు పరమైనపుడు ఒక్కొక్కప్పుడు ముగాగమానికి లోపం, దాని పూర్వ స్వరానికి దీర్ఘం వస్తాయి.
ఈ కింది ఉదాహరణములు గమనించండి.
1) పుస్తకములు – పుస్తకాలు
2) దేశముల – దేశాల
3) జీవితమున – జీవితాన
4) గ్రంథములు – గ్రంథాలు
5) రాష్ట్రముల – రాష్ట్రాల
6) వృక్షమున – వృక్షాన

పై పదాల్లో మార్పును గమనించండి.
పుస్తకములు, గ్రంథములు, దేశములు, రాష్ట్రములు, జీవితమున, వృక్షమున – వీటినే మనం పుస్తకాలు, గ్రంథాలు, దేశాలు, రాష్ట్రాలు, జీవితాన, వృక్షాన అని కూడా అంటాం.

గమనిక :
ఈ మార్పులో లు, ల, న అనే అక్షరాల ముందున్న ‘ము’ పోయింది. ‘ము’ కంటే ముందున్న అక్షరానికి దీర్ఘం వచ్చింది.

లులన సంధి సూత్రం :
లు, ల, న లు పరమైనప్పుడు, ఒక్కొక్కప్పుడు మువర్ణానికి లోపము, దాని పూర్వ స్వరానికి దీర్ఘమూ వస్తాయి.

11. పడ్వాది సంధి
సూత్రం : పడ్వాదులు పరమగునపుడు ‘ము’ వర్ణకానికి లోపమూ, పూర్ణ బిందువూ (0) విభాషగా అవుతాయి.
ఈ కింది ఉదాహరణములు గమనించండి.
1) భయము + పడు = భయంపడు, భయపడు

విడదీసిన పదాలకూ, కలిపిన పదాలకూ తేడా గమనించండి. కలిపిన పదంలో ‘ము’ కు బదులుగా సున్న(0) వచ్చింది. మరో దానిలో ‘ము’ లోపించింది.

పడ్వాది సంధి సూత్రం :
పడ్వాదులు పరమగునపుడు ‘ము’ వర్ణకానికి లోపమూ, పూర్ణబిందువూ (0) విభాషగా అవుతాయి.

గమనిక :
పడ్వాదులు = పడు , పట్టె, పాటు అనేవి.

AP Board 9th Class Telugu Grammar Chandassu ఛందస్సు

12. త్రికసంధి సూత్రం :
త్రికము మీది అసంయుక్త హల్లుకు ద్విత్వం బహుళంగా వస్తుంది.
ఈ కింది ఉదాహరణ చూడండి
అక్కొమరుండు = ఆ + కొమరుండు
ఆ + కొమరుడు = అనే దానిలో ‘ఆ’, త్రికంలో ఒకటి. ఇది ‘అ’ గా మారింది. సంయుక్తాక్షరం కాని హల్లు ‘కొ’ ద్విత్వంగా ‘క్కొ’ గా మారింది.

అలాగే ఈ, ఏలు అనే త్రికములు కూడా, ఇ, ఎలుగా మారుతాయి.
ఉదా :
ఈ + కాలము = ఇక్కాలము
ఏ + వాడు : ఎవ్వాడు

త్రికసంధి సూత్రం :
త్రికము మీది అసంయుక్త హల్లుకు ద్విత్వం బహుళంగా వస్తుంది.
ఉదా :
ఈ + క్కాలము
ఏ + వ్వాడు.

సూత్రం 2 : ద్విరుక్తమైన హల్లు పరమైనపుడు ఆచ్ఛిక దీర్ఘానికి హ్రస్వం అవుతుంది.
ఉదా :
1) ఇక్కాలము
2) ఎవ్వాడు

13. రుగాగమ సంధి
సూత్రం : పేదాది శబ్దాలకు ‘ఆలు’ శబ్దము పరమైతే కర్మధారయంలో రుగాగమం వస్తుంది.
ఉదా :
పేద + ఆలు = పేద + ర్ + ఆలు = పేదరాలు

పై రెండు పదాలకు మధ్య ” అనేది వచ్చి, ప్రక్కనున్న ‘ఆ’ అనే అచ్చుతో కలిస్తే ‘రా’ అయింది. అదెలా వస్తుందంటే, పేద, బీద, బాలింత ఇలాంటి పదాలకు ‘ఆలు’ అనే శబ్దం పరమైతే, ఇలా ‘రుగాగమం” అంటే ‘5’ వస్తుంది.

ఆగమం :
రెండు పదాలలో ఏ అక్షరాన్ని కొట్టివేయకుండా, కొత్తగా అక్షరం వస్తే “ఆగమం” అంటారు.

రుగాగమ సంధి సూత్రం (1) :
పేదాది శబ్దములకు ‘ఆలు’ శబ్దంపరమైతే, కర్మధారయంలో రుగాగమం వస్తుంది.
పేద (విశేషణం) – ఆలు (స్త్రీ) నామము
విశేషణం = నామం మనుమ + ఆలు = మనుమరాలు బాలింత + ఆలు = బాలింతరాలు

రుగాగమ సంధి సూత్రం (2) :
కర్మధారయంలో తత్సమ పదాలకు, ఆలు శబ్దం పరమైతే, పూర్వ పదం చివరనున్న అత్వానికి ఉత్వమూ, రుగాగమం వస్తాయి.
ఉదా :
ధీరురాలు = ధీర + ఆలు
గుణవంతురాలు = గుణవంత + ఆలు
విద్యావంతురాలు = విద్యావంత + ఆలు

సంస్కృత సంధులు

1. సవర్ణదీర్ఘ సంధి
సూత్రం : అ, ఇ, ఉ, ఋ అనే వర్ణాలకు అవే వర్ణాలు సవర్ణాలు కలిసినప్పుడు, దీర్ఘం తప్పనిసరిగా వస్తుంది.
గమనిక :
‘అ’ వర్ణానికి – ‘అ’, ఆ – లు సవర్ణాలు
‘ఇ’ వర్ణానికి – ‘ఇ, ఈ లు’ – సవర్ణాలు
‘ఉ’ వర్ణానికి – ‘ఉ, ఊ లు’ – సవర్ణాలు
‘ఋ’ వర్ణానికి – ‘ఋ, ౠ లు’ – సవర్ణాలు

ఉదా :
1) రామానుజుడు = రామ + అనుజుడు = (అ + అ = ఆ) = సవర్ణదీర్ఘ సంధి
2) రామాలయం = రామ + ఆలయం = అ + ఆ = ఆ) = సవర్ణదీర్ఘ సంధి
3) కవీంద్రుడు = కవి + ఇంద్రుడు = (ఇ + ఇ = ఈ) = సవర్ణదీర్ఘ సంధి
4) భానూదయం = భాను + ఉదయం = (ఉ + ఉ = ఊ) = సవర్ణదీర్ఘ సంధి
5) వధూపేతుడు = వధూ + ఉపేతుడు : (ఊ + ఉ = ఊ) = సవర్ణదీర్ఘ సంధి
6) పిత్రణం = పితృ + ఋణం = (ఋ + ఋ = ౠ) = సవర్ణదీర్ఘ సంధి
7) మాతౄణం = మాతృ + ఋణం = (ఋ + ఋ = ౠ) = సవర్ణదీర్ఘ సంధి

2. గుణ సంధి
సూత్రం : అకారానికి ఇ, ఉ, ఋ లు పరమైతే ఏ, ఓ, అర్ లు ఏకాదేశంగా వస్తాయి.
1. ఉదా :
రాజేంద్రుడు = రాజ + ఇంద్రుడు = (అ + ఇ = గుణ సంధి
మహేంద్రుడు = మహా + ఇంద్రుడు – (ఆ + ఇ = ఏ) = గుణ సంధి
నరేంద్రుడు : నర + ఇంద్రుడు = (అ + ఇ = ఏ) = గుణ సంధి

2. ఉదా :
పరోపకారం = పర + ఉపకారం = గుణ సంధి
మహోన్నతి = మహా + ఉన్నతి – (ఆ + ఉ + ఓ) గుణ సంధి
దేశోన్నతి = దేశ + ఉన్నతి = (ఆ + ఉ + ఓ) = గుణ సంధి
గృహోపకరణం = గృహ + ఉపకరణం = (అ + ఉ = ఓ) = గుణ సంధి

3. ఉదా :
రాజర్షి = రాజ + ఋషి – (అ + ఋ = అర్) – గుణ సంధి
మహర్షి = మహా + ఋషి – (ఆ + ఋ = అర్) – గుణ సంధి

గమనిక :
1) అ, ఆ లకు, ఇ, ఈ లు కలిసి ‘ఏ’ గా మారడం
2) అ, ఆ లకు, ఉ, ఊ లు కలిసి ‘ఓ’ గా మారడం
3) అ, ఆ లకు, ఋ, ౠ లు కలిసి ‘అర్’ గా మారడం.

పై మూడు సందర్భాల్లోనూ, పూర్వ స్వరం అంటే, సంధి విడదీసినపుడు, మొదటి పదం చివరి అచ్చు, అ, ఆ లుగా ఉంది. పర స్వరం, అంటే విడదీసిన రెండవ పదంలో మొదటి అచ్చులు ఇ, ఉ, ఋ – లుగా ఉన్నాయి.
గమనిక :
1) అ, ఆ లకు – ‘ఇ’ కలిస్తే ‘ఏ’ గా మారుతుంది.
2) అ, ఆ లకు – ‘ఉ’ కలిస్తే ‘ఓ’ గా మారుతుంది.
3) అ, ఆ లకు – ‘ఋ’ కలిస్తే ‘అర్’ గా మారుతుంది.

గమనిక :
ఏ, ఓ, అర్ అనే వాటిని గుణాలు అంటారు. ఇలా గుణాలు వచ్చే సంధిని “గుణ సంధి” అంటారు.

AP Board 9th Class Telugu Grammar Chandassu ఛందస్సు

3. యణాదేశ సంధి
సూత్రం : ఇ, ఉ, ఋ, లకు, అసవర్ణాచ్చులు పరమైతే య, వ, ర లు ఆదేశంగా వస్తాయి.
ఈ కింది పదాలను విడదీయండి. మార్పును గమనించండి.
ఉదా :
అ) అత్యానందం. = అతి + ఆనందం = (త్ + ఇ + ఆ = యా) = యణాదేశ సంధి
1) అత్యంతం = అతి + అంతం = (అత్ + ఇ + అ + య) = యణాదేశ సంధి

ఉదా :
ఆ) అణ్వస్త్రం = అస్త్రం = (ణ్ + ఉ + అ = వ) = యణాదేశ సంధి
2) గుర్వాజ్ఞ = గురు + ఆజ్ఞ . : (ర్ + ఉ + ఆ = వ) = యణాదేశ సంధి

ఉదా :
ఇ) పిత్రాజ్ఞ = పితృ + ఆజ్ఞ = (ఋు + ఆ = రా) = యణాదేశ సంధి
3) మాత్రంశ = మాతృ + అంశ = (ఋ + అ = 6). = యణాదేశ సంధి

గమనిక :
ఇ, ఉ, ఋ లకు అసవర్ణాచ్చులు (వేరే అచ్చులు) పక్కన వచ్చినపుడు, క్రమంగా వాటికి య – వ – ర లు వచ్చాయి. యవరలను ‘యణులు’ అంటారు. యజ్ఞులు చేరితే వచ్చే సంధిని, యణాదేశ సంధి, అంటారు. యణాదేశ సంధిలో, ‘ఇ’ కి బదులుగా “య్”, ‘ఉ’ కి బదులుగా ‘ఏ’, ‘ఋ’ కి బదులుగా ‘5’ వచ్చాయి.

యణాదేశ సంధి సూత్రం : ఇ, ఉ, ఋ లకు, అసవర్ణాచ్చులు పరమైతే, య, వ, ర లు ఆదేశంగా వస్తాయి.

4. వృద్ధి సంధి
సూత్రం : అకారానికి ఏ, ఐలు పరమైతే ‘ఐ’ కారమూ, ఓ, ఔ లు పరమైతే ‘ఔ’ కారము వస్తాయి.

ఈ కింది పదాలను విడదీయండి.
1. ఉదా :
వసుధైక = వసుధా + ఏక = (ఆ + ఏ = ఐ) = వృద్ధి సంధి
అ) రసైక = రస + ఏక = (అ + ఏ = ఐ) = వృద్ధి సంధి
ఆ) సురైక ఏక = (అ + ఏ = ఐ) = వృద్ధి సంధి

2. సమైక్యం = సమ + ఐక్యం = (అ + ఐ = ఐ) = వృద్ధి సంధి
ఇ) అష్టైశ్వర్యం = అష్ట + ఐశ్వర్యం = (అ + ఐ = ఐ) = వృద్ధి సంధి
ఈ) దేవైశ్వర్యం = ఐశ్వర్యం = (అ + ఐ = ఐ) = వృద్ధి సంధి

3. పాపౌఘము = ఓఘము = (అ + ఓ = ఔ) = వృద్ధి సంధి
ఉ) వనౌకసులు = ఓకసులు = (అ + ఓ = ఔ) = వృద్ధి సంధి
ఊ) వనౌషధి = వన ఓషధి = (అ + ఓ = ఔ) = వృద్ధి సంధి

4. రసౌచిత్యం = రస + ఔచిత్యం = (అ + ఔ = ఔ) = వృద్ధి సంధి
ఋ) దివ్యాషధం = దివ్య + ఔషధం = (అ + ఔ = ఔ) = వృద్ధి సంధి
ఋ) దేశాన్నత్యం = దేశ + ఔన్నత్యం = (అ + ఔ = ఔ) = వృద్ధి సంధి

గమనిక :
పైన పేర్కొన్న పదాలను విడదీసినపుడు మీరు గమనింపదగిన విషయం ఇది.
1. వృద్ధి సంధి ఏర్పడేటప్పుడు, ప్రతిసారీ పూర్వ స్వరంగా ‘అ’ వచ్చింది.
2. పర స్వరం స్థానంలో వరుసగా “ఏ, ఐ, ఓ, ఔ” లు ఉన్నాయి.
3. అకారానికి ఏ, ఐ లు కలిపినపుడు ‘ఐ’ వచ్చింది.
4. అకారానికి ఓ, ఔ లు కలిపినపుడు ‘ఔ’ వచ్చింది.

వృద్ధి సంధి సూత్రం :
అకారానికి ఏ, ఐ లు పరమైనపుడు ఐకారమూ, ఓ, ఔ లు పరమైతే ఔ కారమూ వస్తాయి.
వృద్ధులు = ఐ, ఔ లను ‘వృద్ధులు’ అంటారు.

AP Board 9th Class Telugu Grammar Chandassu ఛందస్సు

5. జశ్వ సంధి
సూత్రం : “పరుషములకు వర్గ ప్రథమ ద్వితీయాక్షరాలు, శ ష స లు తప్ప, మిగిలిన హల్లులు కానీ, అచ్చులు కానీ పరమైతే వరుసగా సరళాలు ఆదేశమవుతాయి.
ఉదా :
సత్ + భక్తులు = సద్ + భక్తులు = సద్భక్తులు
పై సంధి పదాలను పరిశీలించండి. మొదట విడదీసిన పదాలలోని ‘త’ కార స్థానములో ‘ద’ కారం ఆదేశంగా వచ్చి, ‘సద్భక్తులు’ అనే రూపం వచ్చింది.

గమనిక :
ఈ విధంగా మొదటి పదం చివర, క, చ, ట, త, ప (పరుషాలు) లలో ఏదైనా ఒక అక్షరం ఉండి, రెండవ పదం మొదట క ఖ, చ ఛ, ట ఠ, త థ, ప ఫ, లు మరియు శ ష స లు తప్ప, మిగిలిన హల్లులూ, అచ్చులలో ఏ అక్షరం ఉన్నా ‘గ, జ, డ, ద, బ’ లు వరుసగా ఆదేశం అవుతాయి.

కింది పదాలను విడదీయండి.
1) దిగంతము = దిక్ + అంతము = జశ్వ సంధి
2) మృదటము = మృత్ + ఘటము = జశ్వ సంధి
3) ఉదంచద్భక్తి = ఉదంచత్ + భక్తి = జశ్వ సంధి
4) వాగీశుడు = వాక్ + ఈశుడు = జశ్వ సంధి
5) వాగ్యుద్ధం = వాక్ + యుద్ధం = జ్వ సంధి
6) వాగ్వాదం = వాక్ + వాదం = జశ్వ సంధి
7) తద్విధం = తత్ + విధం = జశ్వ సంధి

జశ్వసంధి సూత్రం :
పరుషములకు వర్గ ప్రథమ ద్వితీయాక్షరాలు, శష స లు తప్ప, మిగిలిన హల్లులు కానీ, అచ్చులు కానీ పరమైతే వరుసగా సరళాలు ఆదేశమవుతాయి.

సమాసాలు

సమాసం :
వేరు వేరు అర్థాలు కల రెండు పదాలు కలసి, ఏకపదంగా ఏర్పడితే దాన్ని ‘సమాసం’ అంటారు.

గమనిక :
అర్థవంతమైన రెండు పదాలు కలిసి, క్రొత్త పదం ఏర్పడడాన్ని సమాసం అంటారు. సమాసంలో మొదటి పదాన్ని పూర్వ పదం అంటారు. రెండవ పదాన్ని “ఉత్తరపదం” అంటారు.
ఉదా :
‘రామ బాణము’ అనే సమాసంలో, ‘రామ’ అనేది పూర్వపదము. ‘బాణము’ అనేది ఉత్తరపదము.

ద్వంద్వ సమాసం :
రెండు కాని, అంతకంటే ఎక్కువ కాని, నామవాచకాల మధ్య ఏర్పడే సమాసాన్ని “ద్వంద్వ సమాసం” అంటారు. (సమాసంలోని రెండు పదముల అర్థానికి ప్రాధాన్యం కల సమాసము ద్వంద్వ సమాసము.)

ఈ కింది వాక్యాల్లోని ద్వంద్వ సమాస పదాలను గుర్తించి రాయండి.

1) ఈ అన్నదమ్ములు ఎంతో మంచివాళ్ళు.
జవాబు:
అన్నదమ్ములు

2) నేను మార్కెట్ కు వెళ్ళి కూరగాయలు తెచ్చాను.
జవాబు:
కూరగాయలు.

3) ప్రమాదంలో నా కాలుసేతులకు గాయాలయ్యాయి.
జవాబు:
కాలుసేతులు

AP Board 9th Class Telugu Grammar Chandassu ఛందస్సు

I. ఈ కింది ద్వంద్వ సమాసాలను వివరించండి. విగ్రహవాక్యం రాయండి.

సమాస పదాలువిగ్రహవాక్యాలు
1) ఎండవానలుఎండా, వానా
2) తల్లిదండ్రులుతల్లి, తండ్రి
3) గంగా యమునలుగంగ, యమున

II. ఈ కింది విగ్రహవాక్యాలను సమాస పదాలుగా మార్చండి.

విగ్రహవాక్యంసమాసపదం
1) కుజనుడూ, సజ్జనుడూకుజన జనులు
2) మంచి, చెడూమంచిచెడులు
3) కష్టమూ, సుఖమూకష్టసుఖములు

2. ద్విగు సమాసం: సమాసంలో మొదటి (పూర్వ) పదంలో సంఖ్య గల సమాసాలను ద్విగు సమాసాలు అంటారు.
అభ్యాసం :
కింది సమాస పదాలను ఉదాహరణలలో చూపిన విధంగా వివరించండి.
ఉదా :
నవరసాలు – నవ (9) సంఖ్య గల రసాలు
1) రెండు జడలు – రెండు (2) సంఖ్య గల జడలు
2) దశావతారాలు — దశ (10) సంఖ్య గల అవతారాలు
3) ఏడురోజులు – ఏడు (7) సంఖ్య గల రోజులు
4) నాలుగువేదాలు – నాలుగు (4) సంఖ్య గల వేదాలు

గమనిక :
పైన పేర్కొన్న సమాసాలలో సంఖ్యావాచకం పూర్వ పదంగా ఉండటాన్ని గమనించండి. ఇలా మొదటి పదంలో సంఖ్య గల సమాసాలు “ద్విగు సమాసాలు”.

3. తత్పురుష సమాసం :
విభక్తి ప్రత్యయాలు విగ్రహవాక్యంలో ఉపయోగించే సమాసాలు తత్పురుష సమాసాలు.

అభ్యాసం :
కింది పదాలను చదివి, విగ్రహ వాక్యాలు రాయండి.

సమాసంవిగ్రహవాక్యం
1) రాజభటుడురాజు యొక్క భటుడు
2) తిండి గింజలుతిండి కొఱకు గింజలు
3) పాపభీతిపాపము వల్ల భీతి

గమనిక :
‘రాజ భటుడు’ అనే సమాసంలో ‘రాజు’ పూర్వ పదం. ‘భటుడు’ అనే పదం ఉత్తర పదం. ‘రాజభటుడు’ కు విగ్రహవాక్యం రాస్తే, ‘రాజు యొక్క భటుడు’ అవుతుంది. దీంట్లో యొక్క అనేది షష్ఠీవిభక్తి ప్రత్యయం. భటుడు, రాజుకు చెందినవాడు అని చెప్పడానికి ష విభక్తి ప్రత్యయాన్ని వాడారు. ఈ విధంగా ప్రత్యయాలు విగ్రహవాక్యంలో ఉపయోగించే సమాసాలు “తత్పురుష సమాసాలు”.

గమనిక :
పూర్వ పదం చివర ఉండే విభక్తిని బట్టి తత్పురుష సమాసాలు వస్తాయి.

తత్పురుష సమాసం రకాలువిభక్తులుఉదాహరణ, విగ్రహవాక్యం
1) ప్రథమా తత్పురుష సమాసండు, ము, వు, లుమధ్యాహ్నము – అహ్నము యొక్క మధ్య
2) ద్వితీయా తత్పురుష సమాసంని, ను, ల, కూర్చి, గురించిజలధరం – జలమును ధరించినది
3) తృతీయా తత్పురుష సమాసంచేత, చే, తోడ, తోబుద్ధిహీనుడు – బుద్ధిచేత హీనుడు
4) చతుర్థి తత్పురుష సమాసంకొఱకు, కైవంట కట్టెలు – వంట కొఱకు కట్టెలు
5) పంచమీ తత్పురుష సమాసంవలన, (వల్ల) కంటె, పట్టిదొంగభయం – దొంగ వల్ల భయం
6) షష్ఠీ తత్పురుష సమాసంకి, కు, యొక్క లో, లోపలరామబాణం – రాముని యొక్క బాణం
7) సప్తమీ తత్పురుష సమాసంఅందు, నదేశభక్తి – దేశము నందు భక్తి
8) నఞ్ తత్పురుష సమాసంనఞ్ అంటే వ్యతిరేకముఅసత్యం – సత్యం కానిది

అభ్యాసం : కింది సమాసాలు చదివి, విగ్రహవాక్యాలు రాయండి. అవి ఏ తత్పురుష సమాసాలో తెలపండి.

సమాసంవిగ్రహవాక్యంసమాసం పేరు
అ) రాజ పూజితుడురాజుచే పూజితుడుతృతీయా తత్పురుషము
ఆ) ధనాశధనము నందు ఆశసప్తమీ తత్పురుషము
ఇ) పురజనులుపురమందు జనులుసప్తమీ తత్పురుషము
ఈ) జటాధారిజడలను ధరించినవాడుద్వితీయా తత్పురుషము
ఉ) భుజబలంభుజముల యొక్క బలంషష్ఠీ తత్పురుషము
ఊ) అగ్నిభయంఅగ్ని వల్ల భయంపంచమీ తత్పురుషము
ఋ) అన్యాయంన్యాయం కానిదినఞ్ తత్పురుష సమాసం

తత్పురుష సమాసాలు :
విభక్తులు ఆధారంగా ఏర్పడే తత్పురుష సమాసాలను గూర్చి తెలిసికొన్నారు. కింది వాటిని కూడా పరిశీలించండి.
1) మధ్యాహ్నము – అహ్నము యొక్క మధ్యము (మధ్య భాగము)
2) పూర్వకాలము – కాలము యొక్క పూర్వము (పూర్వ భాగము)

గమనిక :
పై వాటిలో మొదటి పదాలైన మధ్య, పూర్వ అనే పదాలకు ‘ము’ అనే ప్రథమా విభక్తి ప్రత్యయం చేరడం వల్ల ‘మధ్యము’, ‘పూర్వము’గా మారతాయి. ఇలా పూర్వపదానికి ప్రథమా విభక్తి ప్రత్యయం రావడాన్ని ‘ప్రథమా తత్పురుష సమాసం’ అంటాము.

కింది వాటిని పరిశీలించండి.
1) నఞ్ + సత్యం = అసత్యం – సత్యం కానిది
2) నఞ్ + భయం = అభయం – భయం కానిది
3) నఞ్ + అంతము = అనంతము – అంతము కానిది
4) నఞ్ + ఉచితం = అనుచితం – ఉచితము కానిది

గమనిక :
సంస్కృతంలో ‘నః’ అనే అవ్యయం వ్యతిరేకార్థక బోధకము. దీనికి బదులు తెలుగులో అ, అన్, అనే ప్రత్యయాలు వాడతారు. పై ఉదాహరణల్లో వాడిన ‘నఞ్’ అనే అవ్యయాన్ని బట్టి, దీన్ని “నఞ్ తత్పురుష సమాసం” అంటారు. అభ్యాసము : కింది పదాలకు విగ్రహవాక్యాలు రాసి, సమాస నామము పేర్కొనండి.

సమాసంవిగ్రహవాక్యంసమాసం పేరు
అ) అర్ధ రాత్రిరాత్రి యొక్క అర్ధముప్రథమా తత్పురుషము
ఆ) అనూహ్యముఊహ్యము కానిదినఞ్ తత్పురుషము
ఇ) అక్రమంక్రమము కానిదినఞ్ తత్పురుషము
ఈ) అవినయంవినయం కానిదినఞ్ తత్పురుషము

AP Board 9th Class Telugu Grammar Chandassu ఛందస్సు

4. కర్మధారయ సమాసం :
‘నల్లకలువ’ అనే సమాస పదంలో ‘నల్ల’, ‘కలువ’ అనే రెండు పదాలున్నాయి. మొదటి పదం ‘నల్ల’ అనేది, “విశేషణం”. రెండో పదం ‘కలువ’ అనేది, “నామవాచకం”; ఇలా విశేషణానికీ, నామవాచకానికీ (విశేష్యానికీ) సమాసం జరిగితే, దాన్ని కర్మధారయ సమాసం అంటారు.

4. అ) విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం :
విశేషణం పూర్వపదంగా (మొదటి పదంగా) ఉంటే, ఆ సమాసాన్ని ‘విశ్లేషణ పూర్వపద కర్మధారయ సమాసం’ అంటారు.
ఉదా :
1) తెల్ల గుర్రం – తెల్లదైన గుర్రం.
తెలుపు (విశేషణం) (పూర్వపదం) – (మొదటి పదం) గుర్రం – నామవాచకం (ఉత్తరపదం) – రెండవ పదం

4. ఆ) విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం :
‘మామిడి గున్న’ అనే సమాసంలో, మామిడి, గున్న అనే రెండు పదాలున్నాయి. మొదటి పదం (పూర్వపదం) ‘మామిడి’ నామవాచకం, రెండో పదం (ఉత్తరపదం) గున్న అనేది విశేషణం. ఇందులో విశేషణమైన ‘గున్న’ అనే పదం ఉత్తరపదంగా – అంటే రెండో పదంగా ఉండడం వల్ల, దీన్ని ‘విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం’ అంటారు.

అభ్యాసం :
కింది పదాలను చదివి, విగ్రహ వాక్యాలు రాసి, ఏ సమాసమో రాయండి.
1) పుణ్యభూమి – పుణ్యమైన భూమి – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
2) మంచిరాజు – మంచి వాడైన రాజు – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
3) కొత్త పుస్తకం – కొత్తదైన పుస్తకం – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
4) పురుషోత్తముడు – ఉత్తముడైన పురుషుడు – విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం

4.ఇ) సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం :
‘తమ్మివిరులు’ అనే సమాసంలో, మొదటి పదమైన ‘తమ్మి’, ఏ రకం విరులో తెలియజేస్తుంది. ఇలా పూర్వపదం, నదులు, వృక్షములు, ప్రాంతాలు, మొదలైన వాటి పేర్లను సూచిస్తే దాన్ని ‘సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం’ అంటారు.
ఉదా :
మఱ్ఱి చెట్టు – మట్టి అనే పేరుగల చెట్టు – సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం
గంగానది – గంగ యనే పేరుగల నది – సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం
భారతదేశం – ‘భారతము’ అనే పేరుగల దేశం – సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం

4.ఈ) ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం:
‘కలువ కనులు’ అనే సమాసంలో కలువ, కనులు అనే రెండు పదాలున్నాయి. దీనికి ‘కలువల వంటి కన్నులు’ అని అర్థం. అంటే కన్నులను కలువలతో పోల్చడం జరిగింది. సమాసంలోని మొదటి పదం
(పూర్వపదం) ఇక్కడ ‘ఉపమానం’ కాబట్టి దీన్ని “ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం” అంటారు.

4.ఉ) ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసం :
‘పదాబ్జము’ అనే సమాసంలో పద (పాదం) మరియు, అబ్జము (పద్మం) అనే రెండు పదాలున్నాయి. వీటి అర్థం పద్మము వంటి పాదము అని. ఇక్కడ పాదాన్ని పద్మం (తామరపూవు)తో పోల్చడం జరిగింది. కాబట్టి పాదం ఉపమేయం. పద్మం ఉపమానం. ఉపమానమైన అబ్జము అనే పదం, ఉత్తరపదంగా (రెండవపదం) గా ఉండడం వల్ల దీన్ని “ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసం” అంటారు.

అభ్యాసము :
కింది సమాసములకు విగ్రహవాక్యాలు రాసి, సమాస నామములు పేర్కొనండి.

సమాసంవిగ్రహవాక్యంసమాసం పేరు
1) తేనెమాటతేనె వంటి మాట
తేనె – ఉపమానం; మాట – ఉపమేయం
ఉపమాన పూర్వపద కర్మధారయం
2) తనూలతలత వంటి తనువు
తనువు – ఉపమేయం; లత – ఉపమానం
ఉపమాన ఉత్తరపద కర్మధారయం
3) చిగురుకేలుచిగురు వంటి కేలు
చిగురు – ఉపమానం; కేలు – ఉపమేయం
ఉపమాన పూర్వపద కర్మధారయం
4) కరకమలములుకమలముల వంటి కరములు
కరములు – ఉపమేయం
కమలములు – ఉపమానం
ఉపమాన ఉత్తరపద కర్మధారయం

AP Board 9th Class Telugu Grammar Chandassu ఛందస్సు

5. రూపక సమాసం :
‘విద్యాధనం’ – అనే సమాసంలో విద్య, ధనం అనే రెండు పదాలున్నాయి. పూర్వపదమైన విద్య, ధనంతో పోల్చబడింది. కాని ‘విద్య అనెడి ధనం’ అని దీని అర్థం కనుక, ఉపమాన, ఉపమేయాలకు భేదం లేనంత గొప్పగా చెప్పబడింది. ఈ విధంగా ఉపమాన, ఉపమేయాలకు భేదం లేనట్లు చెబితే అది ‘రూపక సమాసం’.
ఉదా :
1) హృదయ సారసం – హృదయం అనెడి సారసం
2) సంసార సాగరం – సంసారం అనెడి సాగరం
3) జ్ఞాన జ్యోతి – జ్ఞానము అనెడి జ్యోతి
4) అజ్ఞాన తిమిరం – అజ్ఞానము అనెడి తిమిరం

6. బహుప్రీహి సమాసం : అన్య పదార్థ ప్రాధాన్యం కలది.

కింది ఉదాహరణను గమనించండి.
చక్రపాణి – చక్రము పాణియందు (చేతిలో) కలవాడు. ‘విష్ణువు’ అని దీని అర్థము. దీంట్లో సమాసంలోని రెండు పదాలకు అనగా “చక్రానికి” కాని “పాణికి” కాని ప్రాధాన్యం లేకుండా, ఆ రెండూ మరో అర్థం ద్వారా “విష్ణువును” సూచిస్తున్నాయి. ఇలా సమాసంలో ఉన్న పదాల అర్థానికి ప్రాధాన్యం లేకుండా, అన్యపదముల అర్థాన్ని స్ఫూరింప జేసే దాన్ని బహుప్రీహి సమాసం అంటారు. అన్య పదార్థ ప్రాధాన్యం కలది. ‘బహుబ్లిహి సమాసం’.

అభ్యాసం :
కింది పదాలకు విగ్రహవాక్యాలు రాసి, సమాసం పేరు రాయండి.
1) నీలవేణి – నల్లని వేణి కలది – బహుప్రీహి సమాసం
2) నీలాంబరి – నల్లని అంబరము కలది – బహుప్రీహి సమాసం
3) ముక్కంటి – మూడు కన్నులు గలవాడు – బహుప్రీహి సమాసం
4) గరుడవాహనుడు – గరుత్మంతుడు వాహనంగా గలవాడు – బహుప్రీహి సమాసం
5) దయాంతరంగుడు – దయతో కూడిన అంతరంగము కలవాడు – బహుప్రీహి సమాసం
6) చతుర్ముఖుడు – నాలుగు ముఖములు గలవాడు – బహుబ్రీహి సమాసం

సమాపక – అసమాపక క్రియలు

ఈ కింది వాక్యాలలోని క్రియలను గమనించండి.
1) ఉదయ్ భోజనం చేసి సినిమాకు వెళ్ళాడు.
2) వైష్ణవి పుస్తకం చదివి నిద్రపోయింది.
3) అరుణ్ చిత్రాలు గీసి ప్రదర్శనకు పెట్టాడు.

అ) సమాపక క్రియలు :
పై వాక్యాలలో ప్రతివాక్యం చివరన ఉన్న వెళ్ళాడు, పెట్టాడు వంటి క్రియలు పని పూర్తి అయ్యిందని తెలుపుతున్నాయి. వీటిని సమాపక క్రియలు అంటారు.

ఆ) అసమాపక క్రియలు :
వాక్యం మధ్యలో ఉన్న ‘చేసి’ ‘గీసి’ ‘చదివి’ – అన్న క్రియలు పని పూర్తికాలేదని తెలుపుతున్నాయి. వీటిని అసమాపక క్రియలు అంటారు.

ఇ) అసమాపక క్రియా – భేదములు

AP Board 9th Class Telugu Grammar Chandassu ఛందస్సు

1) క్వార్ధకం : (భూతకాలిక అసమాపక క్రియ)
భాస్కర్ ఆట ఆడి, అలసిపోయి ఇంటికివచ్చాడు. ఈ వాక్యంలో భాస్కర్ ‘కర్త’. ‘వచ్చాడు’ అనేది కర్త్య. వాచకానికి చెందిన ప్రధాన క్రియ.

ఆడి, అలసి అనేవి కర్బవాచక పదానికి చెందిన ఇతరక్రియలు. ఆడి, అలసి అనే పదాలు క్రియలే కాని, వాటితో పూర్తి భావం తెలియడం లేదు. ఆడి, అలసిపోయి అనే క్రియల తర్వాత, ఏం చేస్తాడు ? అనే ప్రశ్న వస్తోంది. ఆడి, అలసిపోయి అనే క్రియలు, భూతకాలంలోని పనిని సూచిస్తున్నాయి. వీటిని భూతకాలిక అసమాపక క్రియలని, ‘క్వార్థకం’ అని పిలుస్తారు.

ఈ క్రియలన్నీ ‘ఇ’ కారంతో అంతమవుతాయి. అంటే చివరి – ‘ఇ’ అనే ప్రత్యయం చేరిన క్రియారూపం ‘క్వార్థం’.

ఉదాహరణలు :
పుష్ప అన్నం తిని నిద్రపోయింది. ఇందులో ‘తిని’ అనేది క్త్వార్థం (అసమాపక క్రియ).

2) శత్రర్థకం : (వర్తమాన అసమాపక క్రియ)
అఖిలేశ్ మధుకర్ తో ‘మాట్లాడుతూ’ నడుస్తున్నాడు. ఈ వాక్యంలో ‘నడుస్తున్నాడు’ అనే ప్రధానక్రియకు, ‘మాట్లాడుతూ అనే ఉపక్రియ వర్తమాన కాలంలో ఉండి, అసమాపక క్రియను సూచిస్తుంది.

ఈ విధంగా ‘మాట్లాడు’ అనే ధాతువుకు ‘తూ’ అనే ప్రత్యయం చేరుతున్నది. ఇలా చేరడం వల్ల వర్తమాన అసమాపక క్రియగా మారుతుంది. వర్తమాన అసమాపక క్రియను ‘శత్రర్థకం’ అంటారు.
ఉదా :
1) జ్యోతిర్మయి కంప్యూటర్ లో ఏదో చదువుతూ ముఖ్యాంశాలు రాసుకుంది.
2) మాధవి ఆలోచిస్తూ పుస్తకం చదువుతున్నది.

గమనిక :
పై వాక్యాలలో 1) చదువుతూ 2) ఆలోచిస్తూ అనేవి శత్రర్థకములు.

3) చేదర్థకం : (ధాతువుకు తే, ఐతే అనే ప్రత్యయాలు చేరతాయి.)
కింది వాక్యం చదవండి.
“కష్టపడి పనిచేస్తే ఫలితం దానంతట అదే వస్తుంది.”
పై వాక్యంలో ప్రధాన క్రియ ‘వస్తుంది’ – ఇది ఫలితాన్ని సూచిస్తుంది. ఈ ఫలితం రావాలంటే షరతును విధించడానికి చేర్చే అసమాపక క్రియ చేస్తే ఇది కారణం. అది కార్యం . ఈ విధంగా సంక్లిష్ట వాక్యాల్లో ప్రధాన క్రియ సూచించే పని జరగటానికి షరతును సూచించే క్రియ ‘చేదర్థకం’ అంటారు. చేత్ అర్థాన్ని ఇచ్చేది – చేదర్థకం. వీటిలో ధాతువుకు తే, ఐతే అనే ప్రత్యయాలు చేరతాయి.
ఉదా :
మొక్కలు నాటితే అవి పర్యావరణానికి మేలు చేస్తాయి.

అభ్యాసం :
ఈ కింది వాక్యంలోని అసమాపక క్రియలను రాయండి.
1) రమ రోడ్డు మీద ఉన్న ఒక కాగితం ముక్కను తీసి దగ్గరలో ఉన్న చెత్తకుండీలో వేసి మళ్ళీ సైకిలెక్కి వెళ్ళిపోయింది.
జవాబు:
తీసి, వేసి, ఎక్కి అనేవి ‘క్వార్థం’ అనే అసమాపక క్రియలు.

తధర్మ క్రియలు :
ఒక వస్తువు స్వభావాన్నీ, ధర్మాన్ని తెలిపే క్రియలనూ, నిత్య సత్యాలను తెలిపే వాటినీ, ‘తద్దర్మ క్రియలు’ అంటారు.
ఉదా :
1) సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు.
2) సూర్యుడు పడమట అస్తమిస్తాడు.
3) పక్షి ఆకాశంలో ఎగురుతుంది.

ప్రశ్నా వాక్యాలు :
ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు, ఎవరు, ఏమిటి అనే పదాలను ఉపయోగించి, ప్రశ్నార్థక వాక్యాలు తయారుచేయవచ్చునని మీకు తెలుసు. వాక్యం చివరలో ‘ఆ’ అనే ప్రత్యయాన్ని చేర్చి కూడా ప్రశ్నా వాక్యంగా మార్చవచ్చు.
ఉదా :
1) మీరు బడికి వెళతారా?
2) దైన్య స్థితిని చూస్తారా?

అభ్యాసం :
కింది వాటిని జతపరచండి.

1) వాటిని ఇనప్పెట్టెలో పెట్టి తాళాలు వేసిఅ) చేదర్థకం
2) కాపలా కాస్తూ హాయిగా తిని కూర్చోఆ) శత్రర్థకం
3) మానసికంగా ఎదిగినట్లైతేఇ) ప్రశ్నార్థకం
4) నిర్భయంగా జీవించాలని ఆశించడం తప్పాఈ) క్వార్ధకం

జవాబు:

1) వాటిని ఇనప్పెట్టెలో పెట్టి తాళాలు వేసిఈ) క్వార్ధకం
2) కాపలా కాస్తూ హాయిగా తిని కూర్చోఆ) శత్రర్థకం
3) మానసికంగా ఎదిగినట్లైతేఅ) చేదర్థకం
4) నిర్భయంగా జీవించాలని ఆశించడం తప్పాఇ) ప్రశ్నార్థకం

వాక్య భేదములు

వాక్యాలు మూడు రకములు.
1) సామాన్య వాక్యం 2) సంక్లిష్ట వాక్యం 3) సంయుక్త వాక్యం
1) ఉష పాఠం చదువుతున్నది.
2) మురళి మంచి బాలుడు.

1) సామాన్య వాక్యం :
గమనిక :
మొదటి వాక్యంలో క్రియ ఉంది. రెండో వాక్యంలో క్రియలేదు. ఈ విధంగా క్రియ ఉన్నా, లేకున్నా ఒకే ఒక్క భావాన్ని ప్రకటించే వాక్యాలను సామాన్య వాక్యాలు అంటారు.

AP Board 9th Class Telugu Grammar Chandassu ఛందస్సు

2) సంక్లిష్ట వాక్యం :
ఈ కింది సామాన్య వాక్యాలను కలిపి రాయండి.
ఉదా :
1) శ్రీకాంత్ అన్నం తిన్నాడు.
2) శ్రీకాంత్ బడికి వచ్చాడు.
జవాబు:
శ్రీకాంత్ అన్నం తిని, బడికి వచ్చాడు. (సంక్లిష్ట వాక్యం)

గమనిక :
పై వాక్యాలను కలిపినపుడు ఒక సమాపక క్రియ, ఒకటిగాని అంతకంటే ఎక్కువగాని అసమాపక క్రియలు ఉంటాయి. ఇటువంటి వాక్యాలను ‘సంక్లిష్ట వాక్యాలు’ అంటారు.

3) సంయుక్త వాక్యం :
సమ ప్రాధాన్యం కల వాక్యాలను కలపడం వల్ల ఏర్పడే వాక్యాలను ‘సంయుక్త వాక్యాలు’ అంటారు.
ఉదా :
1) సీత చదువుతుంది, పాడుతుంది.
2) అతడు నటుడు, రచయిత.
3) అశ్విని, జ్యోతి అక్కా చెల్లెండ్రు.

సామాన్య వాక్యాలు :
అ) రాజు అన్నం తిన్నాడు
ఆ) గోపి పరీక్ష రాశాడు
ఇ) గీత బడికి వెళ్ళింది

గమనిక :
పై వాక్యాల్లో తిన్నాడు, రాశాడు, వెళ్ళింది అనే క్రియలు సమాపక క్రియలు. ప్రతి వాక్యంలో ఒకే సమాపక క్రియ ఉంది. ఇలా ఒకే సమాపక క్రియ ఉంటే, ఆ వాక్యాలను ‘సామాన్య వాక్యాలు’ అంటారు.

కొన్ని సామాన్య వాక్యాలు క్రియ లేకుండా కూడా ఉంటాయి.
ఉదా :
హైదరాబాదు మన రాష్ట్ర రాజధాని.

సంక్లిష్ట వాక్యాలు :
గీత బజారుకు వెళ్ళింది. గీత కూరగాయలు కొన్నది.

గమనిక :
పై సామాన్య వాక్యాలలో రెంటిలోనూ ‘గీత’ అనే నామవాచకం ఉంది. ఈ విధంగా తిరిగి చెప్పబడిన నామవాచకాన్ని తొలగించి, మొదటి వాక్యంలోని క్రియ ‘వెళ్ళింది’ లోని క్రియ ‘వెళ్ళింది’ అనే దాన్ని ‘వెళ్ళి’ అనే అసమాపక క్రియగా మార్చి రాస్తే సంక్లిష్ట వాక్యం ఏర్పడుతుంది.
ఉదా :
గీత బజారుకు వెళ్ళి, కూరగాయలు కొన్నది. (సంక్లిష్ట వాక్యం)

అభ్యాసం :
కింది సామాన్య వాక్యాల్ని సంక్లిష్ట వాక్యాలుగా మార్చి రాయండి.
అ) 1) విమల వంట చేస్తుంది. విమల పాటలు వింటుంది.
జవాబు:
విమల వంట చేస్తూ, పాటలు వింటుంది (సంక్లిష్ట వాక్యం)

ఆ) అమ్మ నిద్ర లేచింది. అమ్మ ముఖం కడుక్కుంది.
జవాబు:
అమ్మ నిద్రలేచి, ముఖం కడుక్కుంది. (సంక్లిష్ట వాక్యం)

AP Board 9th Class Telugu Grammar Chandassu ఛందస్సు

అభ్యాసం :
కింది సంక్లిష్ట వాక్యాలను, సామాన్య వాక్యాలుగా మార్చి రాయండి.
1) తాత భారతం చదివి, నిద్రపోయాడు. (సంక్లిష్ట వాక్యం)
జవాబు:
తాత భారతం చదివాడు. తాత నిద్రపోయాడు. (సామాన్య వాక్యాలు)

2) చెట్లు పూత పూస్తే, కాయలు కాస్తాయి. (సంక్లిష్ట వాక్యం)
జవాబు:
చెట్లు పూత పూయాలి. చెట్లు కాయలు కాయాలి. (సామాన్య వాక్యాలు)

3). రాముడు నడుచుకుంటూ వెళ్ళి తన ఊరు చేరాడు. (సంక్లిష్ట వాక్యం)
జవాబు:
రాముడు నడుచుకుంటూ వెళ్ళాడు. రాముడు తన ఊరు చేరాడు. (సామాన్య వాక్యాలు)

అభ్యాసం :
కింది సామాన్య వాక్యాలను, సంక్లిష్ట వాక్యాలుగా మార్చి రాయండి.
ఉదా :
1) శర్వాణి పాఠం చదివింది. శర్వాణి నిద్రపోయింది. (సామాన్య వాక్యాలు)
జవాబు:
శర్వాణి పాఠం చదివి, నిద్రపోయింది. (సంక్లిష్ట వాక్యం)

2) మహతి ఆట ఆడింది. మహతి అన్నం తిన్నది. (సామాన్య వాక్యాలు)
జవాబు:
మహతి ఆట ఆడి, అన్నం తిన్నది. (సంక్లిష్ట వాక్యం)

3) నారాయణ అన్నం తింటాడు. నారాయణ నీళ్ళు తాగుతాడు. (సామాన్య వాక్యాలు)
జవాబు:
నారాయణ అన్నం తింటూ నీళ్లు తాగుతాడు. (సంక్లిష్ట వాక్యం)

అభ్యాసం :
కింది సంక్లిష్ట వాక్యాలను, సామాన్య వాక్యాలుగా మార్చి రాయండి.
ఉదా :
1) శరత్ ఇంటికి వచ్చి, అన్నం తిన్నాడు. (సంక్లిష్ట వాక్యం)
జవాబు:
శరత్ ఇంటికి వచ్చాడు. శరత్ అన్నం తిన్నాడు. (సామాన్య వాక్యాలు)

2) రజియా పాటపాడుతూ ఆడుకుంటున్నది. (సంక్లిష్ట వాక్యం)
జవాబు:
రజియా పాట పాడుతుంది. రజియా ఆడుకుంటున్నది. (సామాన్య వాక్యాలు)

AP Board 9th Class Telugu Grammar Chandassu ఛందస్సు

సంయుక్త వాక్యం :
కింది వాక్యాలను గమనించండి.
విమల తెలివైనది. విమల అందమైనది – విమల తెలివైనది, అందమైనది.

ఇలా రెండు సామాన్య వాక్యాలు కలిసి, ఒకే వాక్యంగా ఏర్పడటాన్ని సంయుక్త వాక్యం అంటారు.
సంయుక్త వాక్యాలుగా మారేటప్పుడు వచ్చే మార్పులు :
అ) వనజ చురుకైనది. వనజ అందమైనది
వనజ చురుకైనది, అందమైనది (రెండు నామపదాల్లో ఒకటి లోపించడం)

ఆ) అజిత అక్క. శైలజ చెల్లెలు.
అజిత, శైలజ అక్కా చెల్లెళ్ళు. (రెండు నామపదాలు ఒకచోట చేరి చివర బహువచనం చేరింది)

ఇ) ఆయన డాక్టరా? ఆయన ప్రొఫెసరా?
ఆయన డాక్టరా? ప్రొఫెసరా? (రెండు సర్వనామాల్లో ఒకటి లోపించింది)

అభ్యాసం :
కింది సామాన్య వాక్యాల్ని సంయుక్త వాక్యాలుగా మార్చి రాయండి.
1) ఆయన ఆంధ్రుడు. ఆయన కృష్ణాతీరమున పుట్టినవాడు (సామాన్య వాక్యాలు)
జవాబు:
ఆయన ఆంధ్రుడు, కృష్ణా తీరమున పుట్టినవాడు. (సంయుక్త వాక్యం)

2) మోహన కూచిపూడి నృత్యం. నేర్చుకొంది. భావన భరతనాట్యం నేర్చుకుంది. (సామాన్య వాక్యాలు)
జవాబు:
మోహన కూచిపూడి నృత్యం, భావన భరతనాట్యం నేర్చుకున్నారు. (సంయుక్త వాక్యం)

అభ్యాసం :
కింది సామాన్య వాక్యాలను, సంక్లిష్ట వాక్యాలుగా మార్చి రాయండి.
1) చుక్క పొడుపుతో సీత లేచింది. సీత గడపను పూజించింది. (సామాన్య వాక్యాలు)
జవాబు:
సీత చుక్క పొడుపుతో లేచి, గడపను పూజించింది. (సంక్లిష్ట వాక్యం)

2) బంధుమిత్రులంతా వచ్చేశారు. కావలసిన సంభారాలు ఏర్పాటు చేసుకున్నారు. (సామాన్య వాక్యాలు)
జవాబు:
బంధుమిత్రులంతా వచ్చి, ‘కావలసిన సంభారాలు ఏర్పాటు చేసుకున్నారు. (సంక్లిష్ట వాక్యం)

అభ్యాసం :
కింది సామాన్య వాక్యాలను, సంయుక్త వాక్యాలుగా మార్చి రాయండి.
1) సీతక్క నిశ్చితార్థం జరిగింది. నాగయ్య సంబరపడ్డాడు. (సామాన్య వాక్యాలు)
జవాబు:
సీతక్క నిశ్చితార్థం జరిగింది, కాబట్టి నాగయ్య సంబరపడ్డాడు. (సంయుక్త వాక్యం)

2) సీతక్క పెళ్ళికి ఏర్పాటుచేశారు. సీతమ్మ పెండ్లి పెటాకులయింది. (సామాన్య వాక్యాలు)
జవాబు:
సీతక్క పెళ్ళికి ఏర్పాటుచేశారు, కాని పెండ్లి పెటాకులయ్యింది. (సంయుక్త వాక్యం)

అభ్యాసం :
కింది వాటిని సంయుక్త వాక్యాలుగా రాయండి.
1) బుద్ధదేవుడు వటవృక్షచ్ఛాయకు వచ్చాడు. వెంటనే అష్టాంగ ధర్మప్రవచనం ప్రారంభమైంది.
జవాబు:
బుద్ధదేవుడు వటవృక్షచ్ఛాయకు వచ్చిన వెంటనే అష్టాంగ ధర్మప్రవచనం ప్రారంభమైంది. (సంయుక్త వాక్యం)

2) లేగ మూలంగా నందగోపునికి అదృష్టం కలిగింది. లేగదూడను నందగోపుడు ముద్దు పెట్టుకున్నాడు.
జవాబు:
లేగ మూలంగా నందగోపునికి అదృష్టం కలిగింది కాబట్టి లేగదూడను నందగోపుడు ముద్దు పెట్టుకున్నాడు. (సంయుక్త వాక్యం)

(అ) రెండు గాని, అంతకంటే ఎక్కువగాని వాక్యాలలోని సమాపక క్రియలను అసమాపక క్రియలుగా మార్చి, ఆ వాక్యాలను ఒకే వాక్యంగా రాస్తే దాన్ని, సంక్లిష్ట వాక్యం అంటారని మీరు తెలుసుకున్నారు.

అభ్యాసం :
కింది సామాన్య వాక్యాలను సంక్లిష్ట వాక్యాలుగా మార్చి రాయండి.
1) ఆంగ్లేయ గ్రంథము లెన్నియో వ్రాయుచున్నారు. ఆంగ్లేయ ఉపన్యాసములెన్నియో ఇచ్చుచున్నారు. (సామాన్య వాక్యం)
జవాబు:
ఆంగ్లేయ గ్రంథములెన్నియో వ్రాస్తూ ఆంగ్లేయ ఉపన్యాసము లెన్నియో ఇచ్చుచున్నారు. (సంక్లిష్ట వాక్యం)

2) నన్ను మీరు క్షమించవలయును. మఱియెప్పుడైన ఈ సభ తిరుగఁజేసి కొనుడు.
జవాబు:
నన్ను మీరు క్షమించి మటియెప్పుడైన ఈ సభ తిరుగజేసికొనుడు (సంక్లిష్ట వాక్యం)

AP Board 9th Class Telugu Grammar Chandassu ఛందస్సు

అభ్యాసం :
కింది వాక్యాన్ని పరిశీలించి, అది ఏ రకమైన వాక్యమో గుర్తించండి. క్రియా భేదాలను కూడా గుర్తించండి.
1) రమ రోడ్డు మీద ఉన్న కాగితం ముక్కను తీసి, దగ్గరలోనున్న చెత్తకుండీలో వేసి మళ్ళీ సైకిలెక్కి వెళ్ళిపోయింది. (ఇ)
అ) సామాన్య
ఆ) సంయుక్త
ఇ) సంక్లిష్ట
పై వాక్యంలో ఉన్న అసమాపక క్రియలను రాయండి.
జవాబు:
1) తీసి
2) వేసి
3) ఎక్కి

2. ప్రశ్నార్థక వాక్యం : ఎక్కడ? ఎప్పుడు? ఎందుకు? ఎవరు? ఏమిటి? అనే పదాలను ఉపయోగించి, ప్రశ్నార్థక వాక్యాలు తయారు చేయవచ్చునని మీకు తెలుసు. వాక్యం చివరలో ‘ఆ’ అనే ప్రత్యయాన్ని చేర్చి కూడా ప్రశ్నార్థకంగా మార్చవచ్చు. ఇలాంటి ప్రశ్నావాక్యాలను రకానికి ఒకటి చొప్పున మీ పాఠ్యపుస్తకం నుంచి ఉదాహరణలు వెతికి రాయండి.
ఉదా :
దైన్యస్థితిని చూస్తారు + ఆ = దైన్యస్థితిని చూస్తారా?
జవాబు:
1) మీరెప్పుడైనా గమనించారా? (గమనించారు + ఆ)
2) మీరు గమనిస్తారా? (గమనిస్తారు + ఆ)
3) వీటిని మీరు చూపిస్తారా? (చూపిస్తారు + ఆ)
4) నిజంగా మీరు చూస్తుంటారా? (చూస్తుంటారు + ఆ)
5) శ్రద్ధ చూపడం అంటే ఏమిటో మీకు తెలుసా? (తెలుసు + ఆ)
6) ఇంట్లకెట్ల ఆ పిల్లగాడు వొచ్చిండో? (వొచ్చిండు + ఓ)
7) అట్టి ప్రసిద్ధములైన కార్యముల జేయగలిగెడి వారేనా? (వారేను + ఆ)

AP Board 9th Class Telugu Grammar Chandassu ఛందస్సు

I. క్రియను మార్చి వ్యతిరేకార్థక వాక్యాలు రాయండి.
1) పుస్తక రచనను పూర్తి చేయడానికి ఒకనెల రోజుల వ్యవధి కావాలి.
జవాబు:
పుస్తక రచనను పూర్తి చేయడానికి ఒక నెల రోజుల వ్యవధి అక్కర్లేదు. (వ్యతిరేక వాక్యం )

2) నా మాతృభూమి విస్తృతి ఎంతో తెలుసుకోలేకపోయాను.
జవాబు:
నా మాతృభూమి విస్తృతి ఎంతో తెలుసుకోగలిగాను. (వ్యతిరేకార్థక వాక్యం)

II. కింది వానికి వ్యతిరేకార్థక వాక్యాలు రాయండి.
1) ఒకే ఒక్క ఆవు తిరిగి రాలేదు.
జవాబు:
ఒకే ఒక్క ఆవు తిరిగి వచ్చింది. (వ్యతిరేకార్థక వాక్యం)

2) రాత్రి తెల్లవార్లూ నందగోపుడు ఆరాటపడ్డాడు.
జవాబు:
రాత్రి తెల్లవార్లూ నందగోపుడు ఆరాటపడలేదు. (వ్యతిరేకార్థక వాక్యం)

3) నందుడతనికి తన ప్రయాణ కారణం తెలియజేశాడు.
జవాబు:
నందుడతనికి తన ప్రయాణ కారణం తెలియజేయలేదు. (వ్యతిరేకార్థక వాక్యం)

4) ఒక్క పలుకైనా ఆయన నోటి నుండి వెలువడలేదు.
జవాబు:
ఒక్క పలుకైనా ఆయన నోటి నుండి వెలువడింది. (వ్యతిరేకార్థక వాక్యం)

కర్తరి వాక్యాలు – కర్మణి వాక్యాలు

1) కింది వాక్యాలను పరిశీలించి మార్పులను గమనించండి.
అ) సంఘ సంస్కర్తలు దురాచారాలను నిర్మూలించారు.
ఆ) సంఘ సంస్కర్తల చేత దురాచారాలు నిర్మూలించబడ్డాయి.

గమనిక :
పై రెండు వాక్యాల అర్థం ఒక్కటే. కాని వాక్య నిర్మాణంలో తేడా ఉంది. ఈ రెండు వాక్యాల మధ్య భేదం ఇది.
1) “సంఘ సంస్కర్తలు దురాచారాలను నిర్మూలించారు”.

1) కర్తరి వాక్యం :
ఈ మొదటి వాక్యంలో కర్తకు ప్రాధాన్యం ఉంది. అంటే క్రియ, కర్తను సూచిస్తుంది. కర్మకు, ద్వితీయా విభక్తి చేరి ఉంది. ఇలాంటి వాక్యాన్ని ‘కర్తరి వాక్యం ‘ అంటారు.

2) సంఘసంస్కర్తల చేత దురాచారాలు నిర్మూలించబడ్డాయి. అనే రెండవ వాక్యంలో 1) కర్తకు తృతీయా విభక్తి ఉంది.
2) క్రియకు ‘బడు’ అనే ధాతువు చేరింది 3) క్రియ – కర్మ ప్రధానంగా ఉంది.

2) కర్మణి వాక్యం :
వాక్యంలో క్రియకు ‘బడు’ ధాతువు చేరి, కర్తకు తృతీయా విభక్తి చేరే వాక్యాన్ని ‘కర్మణి వాక్యం’ అంటారు.

అభ్యాసం – 1 : కింది కర్తరి వాక్యాలను కర్మణి వాక్యాలుగా రాయండి.
అ) వాల్మీకి రామాయణాన్ని రచించాడు. (కర్తరి వాక్యం)
జవాబు:
వాల్మీకిచే రామాయణం రచింపబడింది. (కర్మణి వాక్యం)

ఆ) ప్రజలు శాంతిని కోరుతున్నారు. (కర్తరి వాక్యం)
జవాబు:
ప్రజలచే శాంతి కోరబడుతోంది. (కర్మణి వాక్యం)

అభ్యాసం – 2 : కింది కర్మణి వాక్యాలను కర్తరి వాక్యాలుగా రాయండి.
అ) లైబ్రరీ నుంచి తెచ్చిన పుస్తకం నా చేత చదువబడింది. (కర్మణి వాక్యం)
జవాబు:
లైబ్రరీ నుంచి తెచ్చిన పుస్తకం నేను చదివాను. (కర్తరి వాక్యం)

ఆ) నాచే రచింపబడిన గ్రంథం, నేతాజీ చరిత్ర. (కర్మణి వాక్యం)
జవాబు:
నేను రచించిన గ్రంథం, నేతాజీ చరిత్ర. (కర్తరి వాక్యం)

AP Board 9th Class Telugu Grammar Chandassu ఛందస్సు

అభ్యాసం – 3 : కింది కర్తరి వాక్యాలను కర్మణి వాక్యాలుగా రాయండి.
ఉదా :
ఆళ్వారు స్వామి చిన్నప్పుడే కథ రాశారు. (కర్తరి)
జవాబు:
చిన్నప్పుడే ఆళ్వారు స్వామిచే కథ రాయబడింది. (కర్మణి)

అ) లింగయ్య ఉసిరికాయ తీసి నాయకునికి ఇచ్చాడు. (కర్తరి వాక్యం)
జవాబు:
ఉసిరికాయ తీసి, లింగయ్య చేత నాయకునికి ఇవ్వబడింది. (కర్మణి వాక్యం)

ఆ) నాయకులు పిల్లలతో అరగంట కాలం గడిపారు. (కర్తరి వాక్యం)
జవాబు:
పిల్లలతో నాయకులచేత అరగంట కాలం గడుపబడింది. (కర్మణి వాక్యం)

ఇ) వాద్యాల చప్పుడు విన్నారు. (కర్తరి వాక్యం)
జవాబు:
వాద్యాల చప్పుడు వినబడింది. (కర్మణి వాక్యం)

అభ్యాసం – 4 : కింది కర్మణి వాక్యాలను కర్తరి వాక్యాలుగా రాయండి.
అ) గ్రామీణులచే నాయకులు ఎదుర్కొని తీసుకుపోబడ్డారు. (కర్మణి వాక్యం)
జవాబు:
గ్రామీణులు నాయకులను ఎదుర్కొని తీసుకుపోయారు. (కర్తరి వాక్యం)

ఆ) కాయలన్నీ అతని ముందర పోయబడ్డాయి. (కర్మణి వాక్యం)
జవాబు:
కాయలు అతని ముందర పోశారు. (కర్తరి వాక్యం)

ఇ) బాలురచే సెలవు తీసికోబడింది. (కర్మణి వాక్యం)
జవాబు:
బాలురు సెలవు తీసికొన్నారు. (కర్తరి వాక్యం)

కర్తరి, కర్మణి వాక్యాలు

కర్తరి వాక్యం :
జిడ్డు కృష్ణమూర్తి గారు ఎన్నో మంచి విషయాలు చెప్పారు.

కర్మణి వాక్యం :
ఎన్నో మంచి విషయాలు జిడ్డు కృష్ణమూర్తి గారి చేత చెప్పబడ్డాయి.

గమనిక :
పై రెండు వాక్యాలలో కర్తరి వాక్యం మనకు సూటిగా అర్థం అవుతుంది. ఇది సహజంగా ఉంటుంది. కర్మణి వాక్యం చుట్టు తిప్పినట్లు ఉంటుంది. మన తెలుగు భాషలో వాడుకలో ప్రధానంగా కర్తరి వాక్యమే ఉంటుంది.

కర్మణి వాక్యప్రయోగాలు సంస్కృత భాషా ప్రభావం వల్ల తెలుగులోకి వచ్చాయి. ఇంగ్లీషు వాక్య పద్ధతి ఇలాగే ఉంటుంది.
1) కర్తరి వాక్యమును ఇంగ్లీషులో (Active voice) అంటారు.
2) కర్మణి వాక్యమును. ఇంగ్లీషులో (Passive voice) అంటారు.

అభ్యాసం :
కింది కర్తరి వాక్యాలను కర్మణి వాక్యాలుగా మార్చి రాయండి.
1) రమేష్ భారతాన్ని చదివాడు. (కర్తరి వాక్యం)
జవాబు:
రమేష్ చే భారతం చదువబడింది. (కర్మణి వాక్యం )

2) నేనెన్నో పుస్తకాలు రాశాను. (కర్తరి వాక్యం)
జవాబు:
ఎన్నో పుస్తకాలు నాచేత రాయబడ్డాయి. (కర్మణి వాక్యం )

ప్రత్యక్ష, పరోక్ష కథనాలు

అభ్యాసం :
కింది కర్మణి వాక్యాలను కర్తరి వాక్యాలుగా మార్చండి.
1) ఈ పురంలోని హిందూ సమాజం వారి యాజమాన్యంలో పై సభ జరుపబడింది. (కర్మణి వాక్యం)
జవాబు:
ఈ పురంలోని హిందూ సమాజం వారి యాజమాన్యం, పై సభను జరిపింది. (కర్తరి వాక్యం)

2) తిరువాన్కూరులో ఒక స్త్రీ మంత్రిణిగా నియమింపబడింది. (కర్మణి వాక్యం)
జవాబు:
తిరువాన్కూరులో ఒక స్త్రీని మంత్రిణిగా నియమించారు. (కర్తరి వాక్యం)

3) విద్యా సంఘాలలో స్త్రీలు సభ్యురాండ్రుగా నియమింపబడ్డారు. (కర్మణి వాక్యం)
జవాబు:
విద్యా సంఘాలలో స్త్రీలను సభ్యురాండ్రుగా నియమించారు. (కర్తరి వాక్యం)

AP Board 9th Class Telugu Grammar Chandassu ఛందస్సు

ప్రత్యక్ష కథనం :
కింది వాక్యాలు చదవండి.
1. “నన్ను ఉపన్యాసరంగము నొద్దకు దీసికొనిపోయిరి.”
2. “నేనిట్లు ఉపన్యసించితిని.”
3. “నాయనలారా ! నేను మీ సభా కార్యక్రమమునంతయు జెడగొట్టితిని.”
4. “నన్ను మీరు క్షమింపవలయును.”
పై వాక్యాలన్నీ జంఘాల శాస్త్రి నేరుగా చెబుతున్నట్లు ఉన్నాయి కదా !

నేను, మేము, …… ఇలా ఉండే వాక్యాలు అనగా ఉత్తమ పురుషలోని వాక్యాలు సాధారణంగా ప్రత్యక్షంగా చెబుతున్నట్లుగా ఉంటాయి.

అట్లే కింది వాక్యాలను చదవండి.
1) “నేనొక్కడినే అదృష్టవంతుడినా?” అన్నాడు జంఘాల శాస్త్రి.
2) “నేను రాను” అని నరేశ్ రఘుతో అన్నాడు.
(లేదా)
“నేను రా”నని నరేశ్ రఘుతో అన్నాడు. పై వాక్యాలలో గీత గీసిన మాటలను ఎవరు అన్నారు?

మొదటి దాంట్లో జంఘాలశాస్త్రి అన్న మాటలను, రెండవదాంట్లో నరేశ్ అన్న మాటలను “ఉద్ధరణ చిహ్నాలు” (ఇన్వర్టర్ కామాలు) ఉంచి చెప్పారు కదా ! ఇలా నేరుగా చెప్పదల్చుకున్న అంశాలను ఉద్ధరణ చిహ్నాలు ఉంచి చెప్పినపుడు వారే ప్రత్యక్షంగా చెప్పినట్లుగా ఉంటుంది.
ఈ విధంగా చెప్పడాన్ని ప్రత్యక్ష కథనం అంటారు.

అభ్యాసం – 1 : పరోక్ష కథనంలోకి మార్చండి.
1) “ఇది అంతర్జాతీయ సమస్యగా మారుతుంది. జాగ్రత్త” అని అతడినే బెదరించింది మెల్లీ. (ప్రత్యక్ష కథనం)
జవాబు:
మెల్లీ అది అంతర్జాతీయ సమస్యగా మారుతుందని అతడినే బెదరించింది. (పరోక్ష కథనం)

2) “చిన్నప్పటి నుండి నాకు బోటనీ విషయం అభిమాన విషయం” అన్నాడు రచయిత. (ప్రత్యక్ష కథనం)
జవాబు:
రచయిత చిన్నప్పటి నుండి తనకు బోటనీ విషయం అభిమాన విషయమని అన్నాడు. (పరోక్ష కథనం)

అభ్యాసం – 2 : పరోక్ష కథనంలోకి మార్చండి.
1) “మా అన్నయ్య ముస్తఫా కమల్ కి స్టేషన్ రోడ్ లో ఒక కిరాణా దుకాణం ఉండేది” అన్నారు కలామ్. (ప్రత్యక్ష కథనం)
జవాబు:
తన అన్నయ్య ముస్తఫా కమల్ కి స్టేషన్ రోడ్ లో ఒక కిరాణా దుకాణం ఉండేదని కలామ్ అన్నారు. (పరోక్ష కథనం)

AP Board 9th Class Telugu Grammar Chandassu ఛందస్సు

పరోక్ష కథనం :
కింది వాక్యాలు చదవండి.
1. నరేశ్ తాను రానని రఘుతో అన్నాడు.
2. ప్రధానోపాధ్యాయుడు చెప్పినట్లుగా చేస్తామని పిల్లలు అన్నారు.
3. తనను క్షమించమని రాజు తన మిత్రుడితో అన్నాను.

పై వాక్యాలను చదివారు కదా ! ఇవి నేరుగా చెబుతున్నట్లుగా ఉన్నాయా?
ఉత్తమ పురుషలో కాకుండా, ఇంకొకరు చెబుతున్నట్లుగా ఉన్నాయా?
ఇలాంటి వాక్యాలను పరోక్ష కథనం అంటారు. వీటిలో ఉద్ధరణ చిహ్నాలు ఉపయోగించాల్సిన అవసరం లేదు.

ప్రత్యక్ష కథనంలో ఉన్న వాటిని పరోక్ష కథనంలోకి మార్చడం. కింది వాక్యాలను చదవండి. ఏం మార్పు జరిగిందో చెప్పండి.
1. “నేనొక్కడినే అదృష్టవంతుడినా?” అన్నాడు జంఘాల శాస్త్రి.
2. తానొక్కడే అదృష్టవంతుడా అని జంఘాల శాస్త్రి అన్నాడు.

మొదటి వాక్యంలో జంఘాలశాస్త్రి మాట్లాడిన మాటలను ఉద్ధరణ చిహ్నాలు ఉంచి రాశారు. రెండో వాక్యంలో జంఘాల శాస్త్రి అన్నమాటలను ఇంకొకరు చెప్పినట్లుగా రాశారు. ఇందుకోసం ఉద్ధరణ చిహ్నాలు తీసివేసి “అని” చేర్చి వాక్యాన్ని రాసారు. కాబట్టి మొదటి వాక్యం ప్రత్యక్ష కథనంలో ఉంటే, రెండవ వాక్యం పరోక్ష కథనంలోకి మారింది. ప్రత్యక్ష కథనంలోని వాక్యాలు పరోక్ష కథనంలోకి మారేటపుడు కింది మార్పులు చోటు చేసుకుంటాయి.

మాటలు / వాక్యంలోని భావాన్ని స్వీకరిస్తారు. ఉద్ధరణ చిహ్నాలు తొలగించి ‘అని’ చేరుస్తారు. ఉత్తమ పురుషపదాలు అనగా నేను, మేము వంటివి, ప్రథమ పురుషలోకి అనగా తను, తమ, తాను, తాములాగా మారుతాయి.
1. పాఠంలోని ప్రత్యక్ష కథనంలోని వాక్యాలను గుర్తించండి. వాటిని పరోక్ష కథనంలోకి మార్చి రాయండి.
2. మీరే మరికొన్ని ప్రత్యక్ష కథనంలోని వాక్యాలు రాయండి. వాటిని పరోక్ష కథనంలోకి మార్చండి.

అలంకారాలు

అలంకారం : చెప్పదలచిన విషయాన్ని అందంగా మలిచేది.

అలంకారాలు రెండు రకాలు :
అ) శబ్దాలంకారాలు
ఆ) అర్థాలంకారాలు

అ) శబ్ద చమత్కారంతో పాఠకునికి ఆనందాన్ని కల్గించేవి “శబ్దాలంకారాలు”.
కింది గేయాన్ని గమనించండి. “అది గదిగో మేడ
మేడకున్నది గోడ
గోడ పక్కని నీడ
నీడలో కోడె దూడ
దూడ వేసింది పేడ

పై కవితలో ప్రతివాక్యం చివర ‘డ’ అనే అక్షరం, మళ్ళీ మళ్ళీ వచ్చింది. (అంటే పునరావృతమయ్యింది) ఇది ఆ కవితకు అందం తెచ్చింది. వినడానికి సొంపుగా తయారయ్యింది. ఈ అందం వినసొంపు, ‘డ’ అనే శబ్దం మళ్ళీ మళ్ళీ ప్రయోగించడం వల్ల వచ్చింది. కాబట్టి దీనిని “శబ్దాలంకారం” అంటారు.

1) అంత్యానుప్రాసాలంకారం :
ఒకే అక్షరం లేదా రెండు మూడు అక్షరాలు, వాక్యం చివర మాటి మాటికి వస్తే దాన్ని ‘అంత్యానుప్రాస’ అలంకారం అంటారు.
ఉదా :
1) భాగవతమున భక్తి
భారతమున యుక్తి రామకథయే రక్తి
ఓ కూనలమ్మ”

గమనిక :
పై కవితలో ప్రతివాక్యం చివర ‘కీ’ అనే అక్షరం తిరిగి తిరిగి వచ్చింది. కాబట్టి ఈ కవితలో ‘అంత్యానుప్రాస’ అనే శబ్దాలంకారం ఉంది.

2) ‘గుండెలో శూలమ్ము గొంతులో శల్యమ్ము పై కవితలో ‘మ్ము’ అనే అక్షరం ప్రతిపాదం చివరా వచ్చింది. కాబట్టి దీనిలో ‘అంత్యానుప్రాస’ అనే శబ్దాలంకారం ఉంది.

1. అంత్యాను ప్రాసాలంకారం : (లక్షణం) :
పాదాంతంలో, లేదా పంక్తి చివరలో, ఒకే ఉచ్చారణతో ముగిసే పదాలు, లేదా అక్షరాలు ఉంటే, దాన్ని ‘అంత్యానుప్రాసాలంకారం’ అంటారు.

కింది గేయాలు గమనించండి :
1) “వేదశాఖలు వెలసె నిచ్చట
ఆదికావ్యం బలరె నిచ్చట

గమనిక :
ఈ గేయంలోని మొదటి పంక్తి చివర, ‘ఇచ్చట’ అనీ, అలాగే రెండవ పాదం చివర కూడా ‘ఇచ్చట’ అనీ, ఉంది. కాబట్టి అంత్యానుప్రాసాలంకారం దీనిలో ఉంది. ‘తలుపు గొళ్ళెం హారతి పళ్ళెం గుర్రపు కళ్ళెం పై మూడు పాదాల్లోనూ చివర ‘ళ్ళెం’ అనే అక్షరం వచ్చింది కాబట్టి దీనిలో కూడా ‘అంత్యానుప్రాసాలంకారం’ ఉంది.

2. వృత్త్యను ప్రాసాలంకారం :
అక్షరం అనేకసార్లు తిరిగి రావడాన్ని ‘వృత్త్యనుప్రాసాలంకారం’ అంటారు. ‘వృత్తి’ అంటే ఆవృత్తి అని అర్థం. ఆవృత్తి అంటే, మళ్ళీ మళ్ళీ రావడం.
ఉదా :
నాయనా ! నేను నిన్నే మన్నా అన్నానా ? నీవు నన్నే మన్నా అన్నావా?

గమనిక :
పై వాక్యంలో ‘న’ అనే అక్షరం, అనేకమార్లు వచ్చింది. కాబట్టి ఇది ‘వృత్త్యనుప్రాస’ అనే శబ్దాలంకారం.
అభ్యాసము :
1) కా కి కో కి ల కాదు కదా !
2) లచ్చి పుచ్చకాయలు తెచ్చి ఇచ్చింది.

గమనిక :
మొదటి వాక్యంలో ‘క’, రెండో వాక్యంలో ‘చ్చ’ అనే అక్షరం ఆవృత్తి అయ్యింది. కాబట్టి ‘వృత్త్యనుప్రాసాలంకారం.

ఈ కింది వాక్యాలు చూడండి.
1) ఆమె కడవతో వడి వడి అడుగులతో గడపను దాటింది.
2) చిట పట చినుకులు ట ప ట ప మని పడుతున్నవేళ

గమనిక :
మొదటి వాక్యంలో ‘డ’ అనే హల్లు, రెండవ వాక్యంలో ‘ట’ అనే హల్లు చాలాసార్లు వచ్చాయి. ఈ ఉదాహరణలు కూడా చూడండి.

అ) బాబు జిలేబి పట్టుకొని డాబా పైకి ఎక్కాడు
ఆ) గట్టు మీది చెట్టు కింద కిట్టు రొట్టెను లొట్టలేస్తూ తింటున్నాడు.
ఇ) లక్ష భక్ష్యాలు తినేవాడికి, ఒక భక్ష్యం లక్ష్యమా.
గమనిక :
ఈ విధంగా ఒక హల్లు గాని, రెండు మూడు హల్లులు గాని, వేరుగా ఐనా, కలిసి ఐనా, మళ్ళీ మళ్ళీ వచ్చినట్లయితే,
దాన్ని ‘వృత్త్యనుప్రాస అలంకారం’ అంటారు.

AP Board 9th Class Telugu Grammar Chandassu ఛందస్సు

3. ఛేకాను ప్రాసాలంకారం : కింది వాక్యం చదవండి.
ఉదా :
“నీకు వంద వందనాలు”.
పై వాక్యంలో వంద అనే హల్లుల జంట, వెంట వెంటనే అర్థ భేదంతో వచ్చింది. ఇక్కడ మొదట వచ్చిన ‘వంద’ నూరుసంఖ్యను తెలుపుతుంది. రెండోసారి వచ్చిన ‘వంద’, వందనాలు అంటే నమస్కారాలు అని తెలుపుతోంది.

ఛేకాను ప్రాస (లక్షణం) :
హల్లుల జంట, అర్థభేదంతో వెంట వెంటనే వస్తే, దానిని ‘ఛేకానుప్రాస అలంకారం అంటారు.
ఛేకానుప్రాసకు మరికొన్ని ఉదాహరణములు :
1) పాప సంహరుడు హరుడు
అర్థాలంకారాలు :
1. ఉపమాలంకారం :
1) ఆమె ముఖం అందంగా ఉంది.
2) ఆమె ముఖం, చంద్రబింబంలాగ అందంగా ఉన్నది.

గమనిక :
పై వాక్యాలలోని తేడాను గమనించండి. ఆమె ముఖం చంద్రబింబంలాగా అందంగా ఉంది. అనే వాక్యం మనలను ఆకట్టుకుంది. ఈ విధంగా ఒక విషయాన్ని ఆకట్టుకొనేలా చెప్పడానికి, అందమైన పోలికను చెప్పడాన్ని ‘ఉపమాలంకారం’ అంటారు.
ఉదా :
సోముడు భీముడివలె బలవంతుడు. గమనిక : ఈ వాక్యంలో సోముణ్ణి భీముడితో పోల్చారు. ఇలా చెప్పినపుడు వాక్యంలో ఉండే పదాలను, కొన్ని ప్రత్యేకమైన పేర్లతో పిలుస్తాము.
1) సోముడు – ఉపమేయం – (అంటే ఎవరిని గురించి చెప్పుతున్నామో ఆ పదం)
2) భీముడు – ఉపమానం – (ఎవరితో పోలుస్తున్నామో ఆ పదం)
3) బలవంతుడు – సమానధర్మం (పోల్చడానికి వీలయిన సమాన గుణం)
4) వలె – ఉపమావాచకం – (ఉపమానాన్ని సమానధర్మంతో కలపడానికి వాడే పదం)

* ఉపమాలంకారం (లక్షణం) :
ఉపమానోపమేయాలకు చక్కని పోలిక చెప్పడమే ‘ఉపమాలంకారం’.

2. ఉత్ప్రేక్షాలంకారం : ఉపమేయాన్ని మరొక దానిలా ఊహించి చెప్పడం, “ఉత్ప్రేక్షాలంకారం”.
ఉదా :
ఆమె ఇంటి ముందున్న పెద్ద కుక్కను చూసి, సింహం ఏమో అని భయపడ్డాను.

గమనిక :
పై వాక్యంలో ఒక దాన్ని చూసి మరొకటి అనుకోవడం లేదా ఊహించుకోవడం జరిగింది. ఇలా అనుకోవడం లేదా ఊహించుకోవడం కూడా అలంకారమే. ఇలా ఉన్నదాన్ని లేనట్లుగా, లేనిదాన్ని ఉన్నట్లుగా, ఊహించి చెప్పడాన్ని ‘ఉత్ప్రేక్షాలంకారం’ అంటారు.
ఉదా :
1) ఆ మేడలు ఆకాశాన్ని ముద్దాడుతున్నాయో అన్నట్లు ఉన్నవి.
2) ఆ ఏనుగు నడగొండా అన్నట్లు ఉంది.

పై వాక్యంలో 1) ఉపమేయం – ఏనుగు
2) ఉపమానం – నడకొండ (నడిచే కొండ)

అంటే ఏనుగును, నడిచే కొండలా ఊహించాము కాబట్టి “ఉత్ప్రేక్షాలంకారము”.

AP Board 9th Class Telugu Grammar Chandassu ఛందస్సు

3. రూపకాలంకారం (లక్షణం) :
ఉపమాన ధర్మాన్ని ఉపమేయంలో ఆరోపించి, వీటి రెంటికీ అభేదాన్ని (భేదం లేదని) చెప్పడమే, రూపకాలంకారం అంటారు.

ఉదా :
‘ఆయన మాట కఠినమైనా మనసు వెన్న’ ఇందులో
1) ‘మనస్సు’ – అనేది ఉపమేయం.
2) వెన్న – ఉపమానం (పోల్చినది)

ఉపమానమైన ‘వెన్న’ లక్షణాలను, ఉపమేయమైన ‘మనస్సు’తో భేదం లేకుండా పోల్చడం జరిగింది. అంటే వెన్నకూ, మనస్సుకూ భేదం లేదు. రెండూ ఒకటే అనే భావాన్ని ఇస్తోంది.

అభ్యాసం :
కింది వాక్యాలను పరిశీలించి అలంకారాన్ని గుర్తించండి.
1) మా అన్న చేసే వంట నలభీమపాకం
2) కుటుంబానికి తండ్రి హిమగిరి శిఖరం

గమనిక :
మొదటి వాక్యంలో అన్న చేసే వంటకూ, నలభీమపాకానికి భేదం లేనట్లు చెప్పబడింది. అలాగే రెండవ వాక్యంలో కుటుంబంలోని తండ్రికీ, హిమగిరి శిఖరానికీ భేదం లేనట్లు చెప్పబడింది. కాబట్టి పై రెండు వాక్యాలలో ‘రూపకాలంకారాలు’ ఉన్నాయి. ఈ కింది ఉదాహరణలు కూడా చూడండి.
1) లతా లలనలు రాజుపై కుసుమాక్షతలు చల్లారు.
2) రుద్రమ్మ చండీశ్వరీ దేవి జల జలా పారించె శాత్రవుల రక్తమ్ము.
3) ఈ మహారాజు సాక్షాత్తు ఈశ్వరుడే.
3) మా నాన్నగారి మాటలే వేదమంత్రాలు.
4) మౌనిక తేనె పలుకులు అందరికీ ఇష్టమే.

గమనిక :
పై పాదాల్లో రూపకాలంకారాలు ఉన్నాయి.

AP Board 9th Class Telugu Grammar Chandassu ఛందస్సు

4. దృష్టాంతాలంకారం :
వాక్యాలకు బింబ ప్రతిబింబత్వం ఒక భావం అర్థం గావటానికి మరో భావం అద్దంలో చూపించినట్లు ఉంటే దాన్ని ‘దృష్టాంతాలంకారం’ అంటారు.
ఉదా :
“ఓ రాజా ! నీవే కీర్తిమంతుడవు. చంద్రుడే కాంతి మంతుడు”.

5. అతిశయోక్తి అలంకారం :
గోరంత విషయాన్ని కొండంతలుగా చేసి చెప్పడాన్ని ‘అతిశయోక్తి’ అలంకారం అంటారు.
కింది వాక్యాన్ని గమనించండి.
ఉదా :
ఆ పట్టణంలోని భవనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. భవనాలు ఎంత ఎత్తుగా ఉన్నా, ఆకాశాన్ని తాకడం అసంభవం. అంటే మామూలు విషయాన్ని అతిగా చేసి చెప్పడం పై వాక్యంలో గమనిస్తున్నాము.

5. అతిశయోక్తి అలంకారం : (లక్షణం) :
గోరంత విషయాన్ని కొండంతలుగా చేసి చెప్పటం.

6. స్వభావోక్తి అలంకారం :
ఏదైనా విషయాన్ని ఉన్నదున్నట్లుగా వర్ణిస్తే దాన్ని ‘స్వభావోక్తి’ అలంకారం అంటారు.
ఉదా :
జింకలు బిత్తరిచూపులు చూస్తూ, చెవులు నిగిడ్చి చెంగు చెంగున గెంతుతున్నాయి.

AP Board 9th Class Telugu Grammar Chandassu ఛందస్సు

స్వభావోక్తికి మరియొక ఉదాహరణము :
1) ఆ లేళ్ళు బెదురుచూపులతో నిక్కపొడుచుకున్న చెవులతో భయభ్రాంత చిత్తములతో అటూ ఇటూ చూస్తున్నాయి.

సమన్వయం :
ఇక్కడ లేళ్ళ యొక్క సహజగుణాన్ని ఉన్నది, ఉన్నట్లుగా, కళ్ళకు కట్టినట్లుగా వర్ణించడం వల్ల ఇది ‘స్వభావోక్తి’ అలంకారము.

“మునుమును బుట్టె నాకు నొక ముద్దుల పట్టి, యతండు పుట్టి యే
డెనిమిది నాళ్ళపాటి గలఁడింతియ, పూరియు మేయనేరడేఁ
జని, కడుపారఁ జన్లుడిపి చయ్యన వచ్చెద, నన్నుఁ బోయి ర
మ్మని సుకృతంబు గట్టికొనవన్న! దయాగుణ ముల్లసిల్లఁగన్”

గమనిక :
పై పద్యంలో గోవు యొక్క కొడుకు మొన్నమొన్ననే పుట్టాడని, ముద్దుముద్దుగా ఉంటాడని, ఏడెనిమిది రోజుల వయస్సు కలవాడని, కొద్దిగా కూడా గడ్డిని తినలేడని ఉన్నది ఉన్నట్లుగా చక్కని పదజాలంతో వర్ణించారు. కనుక ఇక్కడ ‘స్వభావోక్తి’ అలంకారం ఉంది.

ఛందస్సు

కవులు పద్యాలను, గేయాలను కొన్ని నియమములకు లోబడి రాస్తారు. అందువల్లనే అవి రాగంతో పాడుకోడానికి వీలుగా ఉంటాయి.

1) లఘువు :
రెప్పపాటు కాలంలో లేదా చిటికె వేసే కాలంలో ఉచ్చరించే అక్షరాలు “లఘువులు”. హ్రస్వాక్షరాలుగా మనం పిలుచుకొనే అక్షరాలు.

2) గురువు :
లఘువు ఉచ్చరించే సమయం కంటె ఎక్కువ సమయం అవసరమయ్యే అక్షరాలు “గురువులు”.

గురులఘువుల గుర్తులు

లఘువు అని తెలుపడానికి గుర్తు : I
గురువు అని తెలుపడానికి గుర్తు : U

గురులఘువుల నిర్ణయము
ఎ) గురువుల లక్షణాలు – వాటిని గుర్తించే విధము.
AP Board 9th Class Telugu Grammar Chandassu ఛందస్సు 1 AP Board 9th Class Telugu Grammar Chandassu ఛందస్సు 2

బి) లఘువుల లక్షణాలు – వాటిని గుర్తించే విధం :
AP Board 9th Class Telugu Grammar Chandassu ఛందస్సు 3

గమనిక :
గురువులు కాని, అక్షరాలన్నీ లఘువులు :
AP Board 9th Class Telugu Grammar Chandassu ఛందస్సు 4

గణ విభజన

1) ఒకే అక్షరం గణాలు :
ఒకే అక్షరం గణంగా ఏర్పడితే, అది ఏకాక్షర గణం. ఈ గణంలో ఒక గురువు లేదా ఒక లఘువు ఒక్కొక్కటే గణంగా ఉంటాయి.
AP Board 9th Class Telugu Grammar Chandassu ఛందస్సు 7

2) రెండక్షరాల గణాలు :
రెండేసి అక్షరాలు కలిసి గణాలుగా ఏర్పడతాయి. వీటిలోనూ గురువులు, లఘువులు ఉంటాయి. ఇవి నాలుగు రకాలు.

అ) ఒక గురువు ఒక లఘువు కలిసి గణంగా ఏర్పడితే ఆ గణాన్ని ‘గలం’ లేదా ‘హ’ గణం అని అంటారు.
AP Board 9th Class Telugu Grammar Chandassu ఛందస్సు 8

ఆ) ఒక లఘువు, ఒక గురువు కలిపి గణంగా ఏర్పడితే అది ‘లగం’, లేదా ‘వ’ గణం అని అంటారు.
AP Board 9th Class Telugu Grammar Chandassu ఛందస్సు 9

ఇ) రెండూ గురువులే గల గణాన్ని – ‘గగము’ అంటారు.
AP Board 9th Class Telugu Grammar Chandassu ఛందస్సు 10

ఈ) రెండూ లఘువులే గల గణాన్ని – ‘లలము’ అంటారు.
AP Board 9th Class Telugu Grammar Chandassu ఛందస్సు 11

అభ్యాసం :
రెండక్షరాల గణాలు నాలుగు రకాలు ఉన్నాయి కదా ! ఒక్కొక్క దానికి 4 పదాల చొప్పున రాయండి.

మూడక్షరాల గణాలు

మూడక్షరాల గణములు మొత్తం ఎనిమిది (8).
AP Board 9th Class Telugu Grammar Chandassu ఛందస్సు 12 AP Board 9th Class Telugu Grammar Chandassu ఛందస్సు 13

అ) మూడక్షరాల గణములను గుర్తించే సులభ మార్గం :
AP Board 9th Class Telugu Grammar Chandassu ఛందస్సు 14

య, మా, తా, రా, జ, భా, న, స అనే సూత్రాన్ని కంఠస్థం చేసి, పై విధంగా ఒక చక్రం గీయండి. మీకు కావలసిన గణముపేరు గల మొదటి అక్షరం ఎక్కడ ఉందో గుర్తించండి. ఆ అక్షరాన్నుండి కుడిగా ఉన్న మూడక్షరాలలోనూ, గురు లఘువులు ఏ క్రమంగా ఉన్నాయో, మీకు కావలసిన గణానికి గురు లఘువులు ఆ క్రమంలో ఉంటాయి.
ఉదా :
మీకు య గణము యొక్క గురు లఘువుల క్రమం కావాలి అనుకోండి. అపుడు ‘య’ నుండి కుడివైపుగా ‘యమాతా’ అనే మూడక్షరాలను వేరుగా వ్రాయండి.
AP Board 9th Class Telugu Grammar Chandassu ఛందస్సు 15

AP Board 9th Class Telugu Grammar Chandassu ఛందస్సు

ఆ) మూడక్షరాల గణముల నిర్ణయంలో మరో పద్ధతి :
AP Board 9th Class Telugu Grammar Chandassu ఛందస్సు 16

అని వ్రాసుకొని, దానికి గురు లఘువులు గుర్తించండి. మీకు కావలసిన గణము పేరు గల అక్షరంతో, ప్రక్క రెండు అక్షరాలూ కలిపి, దానిలోని గురు లఘువులు ఎలా ఉన్నాయో గమనిస్తే, ఏ గణానికి ఏ అక్షరాలు ఉంటాయో తెలుస్తుంది.
ఉదా :
1) య గణము = యమాతా = IUU = ఆది లఘువు
2) మ గణము మాతారా = UUU = సర్వ గురువు
3) త గణము తారాజ = UUI = అంత్య లఘువు
4) ర గణము = రాజభా = UIU = మధ్య లఘువు
5) జ గణము = జభాన = IUI = మధ్య గురువు
6) భ గణము = భానస = UII = ఆది గురువు
7) న గణము : నసల = III = సర్వ లఘువులు
8) లగము (లేక ‘వ’ గణము = I U = లఘువు, గురువు)

నాలుగు అక్షరాల గణాలు
AP Board 9th Class Telugu Grammar Chandassu ఛందస్సు 17

AP Board 9th Class Telugu Grammar Chandassu ఛందస్సు 18

2) ఇంద్ర గణాలు : ఇవి ఆఱు రకములు : నల, నగ, సల, భ, ర, త – అనేవి ఇంద్ర గణములు.
AP Board 9th Class Telugu Grammar Chandassu ఛందస్సు 19
యతి – ప్రాసలు

I. గమనిక : పద్యానికి సౌందర్యాన్ని చేకూర్చేవి యతి, ప్రాసలు.
1. యతి :
పద్యపాదములోని మొదటి అక్షరాన్ని ‘యతి’ అంటారు.

2. ప్రాస :
పద్యపాదములోని రెండవ అక్షరాన్ని ‘ప్రాస’ అంటారు.

II. గమనిక : నియమము చెప్పినచోట ‘యతి’, ‘ప్రాస’లు ప్రయోగించడం వల్ల చదవడానికి, వినడానికీ, జ్ఞాపకం పెట్టుకోడానికీ సౌకర్యం కలుగుతుంది.
3. యతి మైత్రి :
పద్యపాదము యొక్క మొదటి అక్షరంతో, ఆ పద్యములో నిర్ణయింపబడిన స్థానమందలి అక్షరము మైత్రి కలిగి ఉండడాన్ని, యతిమైత్రి అంటారు. యతిమైత్రి యతిస్థానంలోని హల్లుకేకాక, అచ్చుతో కూడా మైత్రి ఉండాలి.

1. ఉత్పలమాల
కింది పద్య పాదాన్ని పరిశీలించండి.
AP Board 9th Class Telugu Grammar Chandassu ఛందస్సు 20
AP Board 9th Class Telugu Grammar Chandassu ఛందస్సు 21

గమనిక :
పై పాదాల్లో ‘భ, ర, న, భ, భ, ర, వ’ అనే గణాలు వరుసగా వచ్చాయి. ఇలా పద్యంలో నాలుగు పాదాల్లోనూ ఒకే రకమైన గణాలు ఒకే వరుసలో ఉన్న పద్యాన్ని ‘వృత్త పద్యం’ అంటారు.

యతి :
పద్య పాదంలో మొదటి అక్షరాన్ని ‘యతి’ అంటారు. ఈ యతి అక్షరం గానీ, దాని వర్ణమైత్రి అక్షరం గాని ఆ పాదంలో మరొకచోట రావడాన్ని ‘యతి మైత్రి’ లేదా యతి స్థానం అంటారు.

పై పద్యపాదాల్లో పదవ అక్షరం (ఆ – న; జే – సి) యతి.

ప్రాస :
పై పద్యపాదాల్లో రెండవ అక్షరంగా నాలుగు పాదాల్లోనూ ‘య’ అనే అక్షరం వచ్చింది. ఈ పద్యాలలో రెండవ అక్షరంగా ఒకే గుణింతాక్షరం రావడాన్ని ‘ప్రాస’ నియమం అంటారు. పై లక్షణాలు గల పద్యాన్ని ‘ఉత్పలమాల’ పద్యం అంటారు.

ఉత్పలమాల పద్యం లక్షణాలు :

  1. ఇది వృత్త పద్యం.
  2. ఈ పద్యంలో నాలుగు పాదాలుంటాయి.
  3. ప్రతి పాదంలోనూ భ, ర, న, భ, భ, ర, వ అనే గణాలుంటాయి.
  4. ప్రాస నియమం ఉంటుంది.
  5. ప్రతి పాదంలోనూ 20 అక్షరాలుంటాయి.

AP Board 9th Class Telugu Grammar Chandassu ఛందస్సు

2. చంపకమాల
కింది పద్య పాదాన్ని పరిశీలించండి.
AP Board 9th Class Telugu Grammar Chandassu ఛందస్సు 22

చంపకమాల పద్య లక్షణాలు :

  1. ఇది వృత్త పద్యం.
  2. ఈ పద్యంలో నాలుగు పాదాలుంటాయి.
  3. ప్రతి పాదంలో ‘న, జ, భ, జ, జ, జ, ర’ అనే గణాలుంటాయి.
  4. ప్రతి పాదంలో 11వ అక్షరం యతిస్థానం (అ – య).
  5. ప్రాస నియమం ఉంటుంది.
  6. ప్రతి పాదంలోనూ 21 అక్షరాలుంటాయి.

3. శార్దూలం
కింది పద్య పాదాన్ని పరిశీలించండి.
AP Board 9th Class Telugu Grammar Chandassu ఛందస్సు 23

శార్దూల పద్య లక్షణాలు :

  1. ఇది వృత్తపద్యం.
  2. ఈ పద్యంలో నాలుగు పాదాలుంటాయి.
  3. ప్రతి పాదంలోనూ ‘మ, స, జ, స, త, త, గ’ అనే గణాలుంటాయి.
  4. ప్రతి పాదంలో 13వ అక్షరం యతిస్థానం (ఆ – యం).
  5. ప్రాస నియమం ఉంటుంది.
  6. ప్రతి పాదంలోనూ 19 అక్షరాలుంటాయి.

4. మత్తేభం
కింది పద్య పాదాన్ని పరిశీలించండి.
AP Board 9th Class Telugu Grammar Chandassu ఛందస్సు 24

మత్తేభ పద్య లక్షణాలు :

  1. ఇది వృత్త పద్యం.
  2. ఈ పద్యంలో నాలుగు పాదాలుంటాయి.
  3. ప్రతి పాదంలోనూ ‘స, భ, ర, న, మ, య, వ’ అనే గణాలుంటాయి.
  4. ప్రతి పాదంలో 14వ అక్షరం యతిస్థానం (ప – పా).
  5. ప్రాస నియమం ఉంటుంది.
  6. ప్రతి పాదంలోనూ 20 అక్షరాలుంటాయి.

AP Board 9th Class Telugu Grammar Chandassu ఛందస్సు

5. ఛందస్సు – తేటగీతి
తేటగీతి పద్య లక్షణం :

  1. ఇది ‘ఉపజాతి’ పద్యం.
  2. ఈ పద్యానికి నాలుగు పాదాలుంటాయి.
  3. ప్రతి పాదానికి ఒక సూర్యగణం, రెండు ఇంద్రగణాలు, రెండు సూర్యగణాలు వరుసగా ఉంటాయి.
  4. నాలుగో గణం మొదటి అక్షరం యతి స్థానం.
  5. ప్రాస యతి చెల్లుతుంది.
  6. ప్రాస నియమం లేదు.

ఉదా :
AP Board 9th Class Telugu Grammar Chandassu ఛందస్సు 25
పై పద్యంలో 1 సూర్యగణం, 2 ఇంద్ర గణాలు, 2 సూర్య గణాలు వరుసగా వచ్చాయి కాబట్టి ఇది తేటగీతి పద్యపాదం. ఇక్కడ ‘ప్రాసయతి’ వాడబడింది.

AP Board 8th Class Telugu Solutions Chapter 6 ప్రకృతి ఒడిలో

AP State Syllabus AP Board 8th Class Telugu Textbook Solutions Chapter 6 ప్రకృతి ఒడిలో Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Telugu Solutions 6th Lesson ప్రకృతి ఒడిలో

8th Class Telugu 6th Lesson ప్రకృతి ఒడిలో Textbook Questions and Answers

చదవండి – ఆలోచించండి – చెప్పండి
AP Board 8th Class Telugu Solutions Chapter 6 ప్రకృతి ఒడిలో 1

ప్రశ్న 1.
చిత్రంలో ఏమేమి ఉన్నాయి?
జవాబు:

  1. చిత్రంలో ఒక చెట్టు ఉంది. చెట్టు కింద పిల్లలు ఆడుతున్నారు.
  2. ఇద్దరు పిల్లలు కాలువలో కాగితం పడవలు వదలి పెడుతున్నారు.
  3. ఇద్దరు స్త్రీలు ఇంటికి కడవలతో నీరు తీసుకువెడుతున్నారు.
  4. పక్షులు గూళ్ళకు ఎగిరి వస్తున్నాయి.
  5. మూడు గుడిసెలు ఉన్నాయి.
  6. కాలువపై వంతెన ఉంది.
  7. ఆవులు, కుక్క పరుగు పెడుతున్నాయి.

ప్రశ్న 2.
ఏం జరుగుతూంది?
జవాబు:
చిత్రంలో వర్షం పడుతూ ఉంది.

AP Board 8th Class Telugu Solutions Chapter 6 ప్రకృతి ఒడిలో

ప్రశ్న 3.
చిత్రంలోని పిల్లలు ఏం మాట్లాడుతుండవచ్చు? ఊహించి చెప్పండి.
జవాబు:

  1. చిత్రంలో పిల్లలు కొందరు కాగితపు పడవలు కాలువలో వేస్తూ, ఎదుటివారి పడవ కంటె తమ పడవ ముందుకు వేగంగా వెడుతూందని మాట్లాడుతూ ఉండవచ్చు.
  2. వర్షం వస్తుంది. ఇంటికి వేగంగా వెడదాం రండి అని ఒక బాలిక పక్కవారిని పిలుస్తూ ఉండవచ్చు.
  3. చెమ్మ చెక్క ఆడదాం రమ్మని బాలబాలికలు ఒకరిని ఒకరు పిలుస్తూ ఉండవచ్చు.

ఇవి చేయండి

I. వినడం – మాట్లాడడం

ప్రశ్న 1.
మనం చేయలేనివి జంతువులు చేయగలిగేవి ఏవి? మాట్లాడండి.
జవాబు:

  1. మనిషి వినలేని ధ్వనులు కూడా కుక్కలకు వినిపిస్తాయి.
  2. చీకట్లో గాలిలోకి విసరిన వస్తువులలో, అది పురుగో, బంతో, కర్రో సులువుగా గ్రహించేశక్తి గబ్బిలాలకు ఉంది.
  3. ఆకారాలను బట్టి ఒకే పరిమాణంలో ఉన్న ఆకులూ, పురుగులు వంటి వాటిని, గబ్బిలాలు గుర్తించగలవు.
  4. తిమింగలాలకు, గబ్బిలాలకన్నా ఎక్కువగా ఇకోలొకేషన్ శక్తి, విశ్లేషణ శక్తి ఉన్నాయి.
  5. పాములూ, ఎలుకలూ మన కంటే ముందుగా భూకంపాలను గుర్తించగలవు.
  6. ఏనుగులు సునామీని 250 కి||మీ దూరంలో ఉండగానే గుర్తిస్తాయి.

ప్రశ్న 2.
శాస్త్రజ్ఞానం అభివృద్ధి చెందడం అంటే ఏమిటి? దీనివల్ల గతంతో పోలిస్తే, నేడు దేంట్లో ఏమి మార్పులు వచ్చాయి?
జవాబు:
శాస్త్రజ్ఞానం అన్ని రంగాలలోనూ అభివృద్ధి అయ్యింది. ముఖ్యంగా సమాచార రంగంలో, అణుశక్తి రంగంలో, విద్యుచ్ఛక్తి సాధనాల తయారీలో, కంప్యూటర్ రంగంలో, ఇంటర్నెట్ రంగంలో, ప్రయాణ సాధనాల్లో, ఎన్నో మార్పులు వచ్చాయి. వైద్య రంగంలో శాస్త్రీయ విజ్ఞానం పెంపొందడం వల్ల కేన్సర్, గుండెపోటు, మోకాలు మార్పిడి వంటి అసాధ్యమైన రోగాలకు చికిత్సలు సాధ్యమవుతున్నాయి. శాస్త్రజ్ఞులు నిత్యం పరిశోధనలు చేస్తున్నారు. రోదసీ విజ్ఞానంలో చంద్రుడి వద్దకు మనిషిని పంపగలుగుతున్నాము. విమానాలు, రైళ్ళు, బస్సులు, మోటారు సైకిళ్ళు వచ్చాయి.

ప్రశ్న 3.
నిత్యజీవితంలో మీరు గమనించిన ప్రకృతి వింతలను గురించి చెప్పండి.
జవాబు:
నేను గమనించిన ప్రకృతి వింతలు ఇవి.

  1. నిప్పు ఎప్పుడు తాకినా కాలుతుంది.
  2. నీరు పల్లానికే ఎప్పుడూ ప్రవహిస్తుంది.
  3. ఒక్కొక్క పదార్థం ఒక్కొక్క ఉష్ణోగ్రత వద్ద కరుగుతుంది.
  4. చలికి నీరు గడ్డకడుతుంది.
  5. చలికి నెయ్యి, నూనె పేరుకుంటాయి.
  6. గోడ మీద బల్లి జారిపోకుండా పాకుతుంది. ఇవన్నీ నేను గమనించిన ప్రకృతి వింతలు.

II. చదవడం, అవగాహన చేసుకోవడం

ప్రశ్న 1.
పాఠం చదవండి. కింది భావం వచ్చే పేరాలను గుర్తించండి. వాటికి పేరు పెట్టండి.
అ) ప్రకృతి ఎంతో అందంగా ఉంటుంది. దీన్ని చూస్తే చాలా ఆనందం కలుగుతుంది.
జవాబు:
పాఠంలో మొదటి పేరా ఈ భావాన్ని ఇస్తుంది. “కాటారం బడిలో ………….. ప్రకృతిలో ఎన్ని రహస్యాలున్నాయో” ……… ఈ పేరాకు “ప్రకృతి అందాలు” అని పేరు పెట్టవచ్చు.

ఆ) మనం ఎన్నో విషయాలను తెలుసుకోడానికీ, పరిశీలించడానికి మనకున్న జ్ఞానేంద్రియాలు ఉపయోగపడుతున్నాయి.
జవాబు:
పాఠంలో 2వ పేరా పై భావాన్ని ఇస్తుంది. “ప్రకృతి రహస్యాలను …………. నీటిని మళ్ళించవచ్చు. ……… అనే పేరా, జ్ఞానేంద్రియాల గురించి చెపుతోంది. ఈ పేరాకు “ప్రకృతి ధర్మాలు – మానవుని గుర్తింపు” అని పేరు పెట్టవచ్చు.

ఇ) మానవుడు తనకున్న బలాలను, బలహీనతలను తెలుసుకున్నాడు. కాబట్టి ఉన్నదానితో తృప్తి చెందక, ఎన్నో విషయాలను కనుక్కున్నాడు.
జవాబు:
పాఠంలో 66వ పేజీలోని 12వ పంక్తి నుండి 18వ పంక్తి వరకు ఉన్న పేరా పై భావాన్ని ఇస్తుంది. “ఇంద్రియ జ్ఞానం మీదనే …………. రాడార్ వగైరాలు” – అనే పేరా పై భావాన్ని తెలుపుతుంది. ఈ పేరాకు “శాస్త్రజ్ఞులు – నూతన ఆవిష్కరణలు” – అని పేరు పెట్టవచ్చు.

ప్రశ్న 2.
జట్లు జట్లుగా కూర్చొని పాఠంలోని పేరాలను చదవండి. ఒక్కొక్క పేరాకు ఒక ప్రశ్నను తయారుచేయండి. అంటే అదే ప్రశ్నకు, పేరాలోని విషయం జవాబుగా రావాలి.
జవాబు:
1వ పేరా : “కాటారం బడిలో ………….. ఇలాంటివి కొన్ని చూద్దామా ?”
ప్రశ్న : ప్రకృతిలో కనిపించే అందాలను పేర్కొనండి.

2వ పేరా : “ప్రకృతి రహస్యాలను ……….. మళ్ళించవచ్చు”.
ప్రశ్న : ప్రకృతి ధర్మాలను మానవుడు తనకు అనుకూలంగా ఎలా మార్చుకుంటున్నాడు?

3వ పేరా : “ఆధునిక శాస్త్రవేత్త ………… తరంగాలు అంటారు”.
ప్రశ్న : శాస్త్రవేత్తలు కనుగొన్న జ్ఞాన సంపాదన గూర్చి తెలపండి.

4వ పేరా : కొన్ని పరిస్థితులలో ………. జిల్లు మంటుంది.
ప్రశ్న : శాస్త్రవేత్తలు జ్ఞానేంద్రియ జ్ఞానాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నారు?

5వ పేరా : “ఇంద్రియ జ్ఞానం మీదనే …………. రాడార్ వగైరాలు”
ప్రశ్న : శాస్త్రజ్ఞులు జ్ఞాన సంపాదనకు కనుగొన్న సాధనాలను తెలపండి.

6వ పేరా : శాస్త్రజ్ఞానం …………. సిద్ధాంతంగా ఆమోదం పొందుతుంది.
ప్రశ్న : శాస్త్రజ్ఞానం ఎప్పుడు సిద్ధాంతంగా రూపొందుతుంది?

7వ పేరా : “దృష్టి, వినికిడి ………. గబ్బిలాల కన్నా ఎక్కువ”.
ప్రశ్న : “ఇంద్రియ జ్ఞానంలో కొన్ని జంతువులు మానవులను మించాయి” వివరించండి.

8వ పేరా : “ప్రకృతి వైపరీత్యాలను ……….. శాస్త్రజ్ఞులు నిరూపించారు”.
ప్రశ్న : ప్రకృతి వైపరీత్యాలను కనిపెట్టడంలో జంతువులలో గల ప్రత్యేకత ఎట్టిది?

AP Board 8th Class Telugu Solutions Chapter 6 ప్రకృతి ఒడిలో

3. పాఠం ఆధారంగా కింది ప్రశ్నలకు జవాబులు రాయండి.
అ) జ్ఞానేంద్రియాలు అంటే ఏమిటి ? వాటివల్ల మనం ఏం చేయగలుగుతున్నాం?
జవాబు:
ప్రకృతి రహస్యాలను అన్వేషించడానికి, మనిషికి ఉన్న మూలసాధనాలు జ్ఞానేంద్రియాలు. మనకు జ్ఞానం కలిగించే ఐదు ఇంద్రియాలను, జ్ఞానేంద్రియాలు అంటాము.

  1. కన్ను దృశ్య జ్ఞానాన్ని ఇస్తోంది.
  2. చెవి శ్రవణ జ్ఞానాన్ని కల్గిస్తుంది.
  3. చర్మం స్పర్శ జ్ఞానాన్ని కల్గిస్తుంది.
  4. ముక్కు వాసనను తెలియజేస్తుంది.
  5. నాలుక రుచిని తెలుపుతుంది.

ఆ) ఇంద్రియజ్ఞానానికే పరిమితం కాకపోవడం వల్ల ఏం జరిగింది?
జవాబు:
మనం ఇంద్రియ జ్ఞానానికే పరిమితం కాకపోవడం వల్లనే, మనకు నేడు రేడియోలు వచ్చాయి. విద్యుచ్ఛక్తి వచ్చింది. ఆకాశంలోని నక్షత్రాలలో ఏ పదార్థాలు ఉన్నాయో తెలిశాయి. ఇంద్రియ జ్ఞానాన్ని విస్తరించడానికి శాస్త్రజ్ఞులు అనేక వేల సాధనాలు కల్పించారు. టెలిస్కోపులు, మైక్రోస్కోపులు, ఫోటోగ్రఫీ, ఎక్స్ రేలు, చీకట్లో చూడటానికి వీలైన సాధనాలూ, రాడార్ వంటి వాటిని కల్పించారు.

ఇ) చూపు, వినికిడి, వాసనలను తెలుసుకోవడం అన్నవాటి విషయంలో మనకు, జంతువులకు ఉండే తేడాలు ఏమిటి? దీని వలన మీరు ఏం గ్రహించారు?
జవాబు:
AP Board 8th Class Telugu Solutions Chapter 6 ప్రకృతి ఒడిలో 2 AP Board 8th Class Telugu Solutions Chapter 6 ప్రకృతి ఒడిలో 3

ఈ) ఈ పాఠంలోని మొదటి పేరాకు, మిగతా పేరాలకు మధ్య ఉన్న భేదమేమిటి?
జవాబు:
ఈ పాఠంలో మొదటి పేరా ప్రకృతిని వర్ణిస్తూ సాగింది. అది వర్ణనాత్మకంగా ఉంది. చిన్న సైజు అక్షరాలలో ఉంది. రెండవ పేరా నుండి శాస్త్ర విజ్ఞానం గురించి విశ్లేషణ ఉంది. కాబట్టి మిగిలిన పేరాలు విశ్లేషణాత్మకంగా సాగాయి. అవి పెద్ద టైపు అక్షరాలలో అచ్చయ్యా యి.

III. స్వీయరచన

1. ఈ కింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో మీ సొంతమాటలలో జవాబులు రాయండి.

అ) “ప్రకృతి రహస్యాలు అన్వేషించడానికి మనిషికి ఉన్న మూల సాధనాలు జ్ఞానేంద్రియాలు” దీని మీద మీ అభిప్రాయం ఐదు వాక్యాలలో రాయండి.
జవాబు:
మనిషికి కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మము అన్నవి జ్ఞానేంద్రియాలు. మనము ఏ విషయాన్ని గురించి తెలిసికోవాలని ఉన్నా, ఈ ఐదు ఇంద్రియాల వల్లనే సాధ్యం అవుతుంది. మనం కంటికి కనబడే కాంతి తరంగాల ద్వారానే వస్తువులను చూడగలం. చెవికి వినబడే ధ్వని తరంగాల ద్వారానే శబ్దాలు వినగలం. చర్మానికి తగిలిన స్పర్శ వల్లే అది వేడో, చలో గుర్తించగలం. నాలుకతో రుచి చూస్తేనే, పదార్థం రుచి తెలుస్తుంది. ముక్కుతో వాసన చూస్తేనే పరిమళం తెలు ,కోగలం.

ఆ) శాస్త్రజ్ఞులు జ్ఞానేంద్రియాల హద్దులను తెలుసుకోవడం వల్ల ఏం జరిగింది?
జవాబు:
శాస్త్రజ్ఞులు జ్ఞానేంద్రియాలు గుర్తించలేని విషయాలను తెలుసుకోడానికి, సాధనాలు తయారుచేశారు. వారు మైక్రోస్కోపులు, టెలిస్కోపులు, రాడార్లు , ఎక్స్ రేలు, ఫొటోగ్రఫీ, చీకట్లో చూడగల సాధనాలు తయారుచేశారు. గామా కిరణాలు, రేడియోతరంగాలు వంటి వాటిని తయారుచేశారు.

2. ఈ కింది ప్రశ్నలకు పదివాక్యాలలో సొంతమాటలలో జవాబులు రాయండి.

అ) సాధారణ దృష్టి, శాస్త్ర దృష్టి రెండూ ఒకటేనా? కాదా? ఎందుకు?
జవాబు:
సాధారణ దృష్టి, శాస్త్ర దృష్టి ఒకటి కాదు. సాధారణ దృష్టి కలవాడు ప్రతి సంఘటనకూ వెనుక ఉన్న కారణాన్ని గూర్చి ఆలోచించడు. సూర్యుడు తూర్పు దిక్కులోనే ఎందుకు ఉదయిస్తున్నాడు ? ఆటలమ్మ ఎందుకు వచ్చింది ? అని శాస్త్ర దృష్టి కలవాడు ఆలోచిస్తాడు. వేంకటేశ్వరస్వామి కోపం వల్ల తలనొప్పి వచ్చిందంటే, శాస్త్ర దృష్టి కలవాడు అంగీకరించడు. శాస్త్ర దృష్టి కలవాడు మూఢనమ్మకాలను నమ్మడు. శాస్త్ర దృష్టితో విషయాన్ని పరీక్షించి చూచి, సత్యాన్నే నమ్ముతాడు.

ఆ) ప్రకృతి అందాలను వివరిస్తూ వ్యాసం రాయండి.
జవాబు:
ప్రకృతి అందాలు :
భగవంతుడు ప్రకృతిలో ఎన్నో అందాలు సమకూర్చాడు. అందమైన సూర్యోదయం, ఆకాశంలో ఎర్రని సంధ్యారాగం, కోయిలల కూతలు, ఆకాశంలో పక్షుల బారులు, కొండలు, కోనలు, పచ్చని వనాలు, పూలతోటలు, ఆవులు, గేదెలు, అనేక రకాల జంతువులు ప్రకృతిలో ఉంటాయి.

వర్షం వచ్చే ముందు ఇంద్రధనుస్సు ఆకాశంలో కనబడుతుంది. వసంతం వస్తే చెట్లు అన్నీ చిగిర్చి పూలు పూస్తాయి. గాలికి కొమ్మలు రెపరెపలాడుతూ మనలను దగ్గరకు రమ్మని పిలుస్తూ ఉంటాయి. కోకిలలు కుహూకుహూ అంటూ కూస్తాయి. చిలుకలు మాట్లాడుతాయి. సాయం సంధ్యలో ఆకాశంలో కుంకుమ అరబోసినట్లు ఉంటుంది. ఈ ప్రకృతి అందాలను అందించిన దైవానికి మనం కృతజ్ఞతగా ఉండాలి.

IV. పదజాలం – వినియోగం

1. కింది వాక్యాలలో గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి. వాటితో సొంతవాక్యాలు రాయండి.

అ) శాస్త్ర దృష్టి మానవుడి కృషికి ఒక మార్గం చూపిస్తుంది. (త్రోవ)
ఆ) కొండలను పగలగొట్టినప్పుడు భూప్రకంపనలు వస్తాయి. (ఎక్కువ కదలికలు)
ఇ) ఎండమావులను చూసి నీరు అని భ్రమపడతాము. (భ్రాంతి)

2. కింది వాక్యాలలో గీత గీసిన పదాలకు అదే అర్థం వచ్చే మరి రెండు పదాలను ఎంపిక చేసుకొని వాటితో వాక్యాలు రాయండి.
ఉదా :
పార్వతికి అభినందనలు తెలుపుతూ చప్పట్లు కొట్టారు.
i) కొందరికి పొగడ్తలు ఇష్టం ఉండవు.
ii) ప్రశంసలకు లొంగకపోవడం గొప్పవారి లక్షణం.

అ) బొమ్మలలో రకరకాల ఆకృతులు ఉంటాయి.
జవాబు:
i) నగరంలో పలురకాల ఆకారాల ఇండ్లు ఉంటాయి.
ii) మానవుల్లో రకరకాల రూపాలు గలవాళ్ళు ఉంటారు.

ఆ) బుద్ధి కొన్ని సత్యాలను ప్రతిపాదిస్తుంది.
జవాబు:
i) విద్యార్థులు ఎల్లప్పుడు నిజం పలకాలి.
ii) మహాత్ములు సదా యథార్థం పలికి తీరుతారు.

ఇ) మన కన్ను చూసే కాంతి తరంగాలు చాలా తక్కువ.
జవాబు:
i) జ్ఞానేంద్రియాల్లో నయనం ప్రధానం.
ii) మనం ఎల్లప్పుడు చక్షువును రక్షించుకోవాలి.

ఈ) మానవుని కంటే జంతువులు తొందరగా వాసనలను పసిగడతాయి.
జవాబు:
i) పశువులు మానవులకు ఉపకారం చేస్తాయి.
ii) మృగాలు అరణ్యంలో సంచరిస్తాయి.

ఉ) చైనాలో ఒకసారి కలుగులలోంచి ఎన్నో పాములు బయటకు వచ్చాయి.
జవాబు:
i) ఇంటిలోని రంధ్రం నుంచి సర్పము వచ్చింది.
ii) పొలంలోని బిలంలో ఫణి చేరింది.

3. కింద గీత గీసిన పదాలకు పాఠం ఆధారంగా ప్రకృతులకు వికృతులు, వికృతులకు ప్రకృతులు రాయండి.
అ) పుష్పాలు సున్నితమైనవి.
ఆ) మన దమ్మం మనం పాటించాలి.
ఇ) శాస్త్రాన్ని అతిక్రమించగూడదు.
ఈ) కొందరికి చిత్తరువులు గీయడంలో నైపుణ్యం ఉంటుంది.
ఉ) ఎవరి ప్రాణం వారికి తీపి.

ప్రకృతి – వికృతి

పుష్పం – పూవు
శాస్త్రం – చట్టం
ప్రాణం – పానం
ధర్మం – దమ్మం
చిత్రము – చిత్తరువు

V. సృజనాత్మకత

ఈ కింది వాక్యాలు చదవండి.

1) “చప్పట్ల చప్పుడు విని, సీతాకోక చిలుకలు పైకి లేచాయి” – సాధారణ వాక్యం.

“ఆ చప్పట్ల ప్రకంపనలకు, ఆ పరిసరాలలో చెట్ల మీద ఉన్న రంగురంగుల సీతాకోకచిలకలు గుంపులు గుంపులుగా రెక్కలు రెపరెపలాడిస్తూ పైకి లేచాయి” – పై వాక్యాన్నే వర్ణిస్తూ రాసిన వాక్యం ఇది. వాక్యంలోని కర్త, కర్మ, క్రియ పదాలలో దేన్ని గురించి అయినా గొప్పగా / అందంగా వివరించేలా సరైన పదాలను జోడిస్తూ రాస్తే మామూలు వాక్యాలు కూడా వర్ణనాత్మక వాక్యాలుగా మారుతాయి. మీరు కూడా మీకు నచ్చిన కథను / సన్నివేశాన్ని / సంఘటనను లేదా ఏదైనా ఒక అంశాన్ని గురించి వర్ణిస్తూ రాయండి.
జవాబు:
ఆ గ్రామంలో అందం మాట వస్తే, అంతా వసంతసేన గురించే చెప్పుకొనేవారు. వసంతసేన ముఖం ముందు, చంద్రుడు వెలవెల పోయేవాడు. తోటలో పువ్వులు వసంతసేన ముఖాన్ని చూసి తెల్లపోయేవి. వసంతసేన ఆకుపచ్చ పట్టుచీర కట్టుకొని గుడికి రాజహంసలా వెడుతూంటే, ఆ గ్రామంలో పెద్దలూ, చిన్నలూ ఆమె కేసే కళ్ళు తిప్పకుండా చూసేవారు. వసంతసేన అందం ముందు అప్సరసలు కూడా దిగదుడుపే.

ఆ ఊరిలో హరిహరస్వామి ఆలయం ఉంది. వసంతసేనకు అమ్మమ్మ నృత్యగానాలలో మంచి శిక్షణను ఇప్పించింది. వసంతసేనకు వయస్సు రాగానే ఆమె అమ్మమ్మ రాగమాలిక దేవాలయంలో అరంగేట్రం చేయించింది. ఆ రోజు కోడెగారు పిల్లలంతా వసంత సేన కనుసన్నల కోసం పడిగాపులు కాశారు. ఆ సమయంలోనే దేవాలయానికి వచ్చిన ఆ దేశపు రాజు మదనసింహుడి దృష్టి వసంతసేన మీద పడింది. రాజు తన దృష్టిని వసంతసేన నుండి మరలించుకోలేకపోయాడు. వసంత సేన కూడా రాజును కన్ను ఆర్పకుండా చూసింది. ఆ తొలిచూపుల సమ్మేళన ముహూర్తం, వారి వివాహానికి నాంది పలికింది.

VI. ప్రశంస

1) భూమిమీద ఉన్న చెట్లు, పక్షులు, జంతువులు, మానవులు ……….. ఇలా ప్రతి ఒక్కదాంట్లో ఏదో ఒక గొప్పదనం ఉంటుంది. మీ మిత్రులతో చర్చించి దేంట్లో ఏ ఏ గొప్పదనాలున్నాయో రాయండి.
జవాబు:
1) చెట్లు గొప్పదనం :
మనకు పనికిరాని కార్బన్ డై ఆక్సైడ్ (బొగ్గుపులుసు) వాయువును గ్రహించి, మనకు ప్రాణవాయువును ఇస్తాయి.

2) పక్షులు గొప్పదనం :
పక్షులకు గొప్ప దిశా జ్ఞానం ఉంటుంది. అవి ఎక్కడకు ఎగిరి వెళ్ళినా, తిరిగి తమ గూటికి అవి వస్తాయి.

3) జంతువులు :
కొన్ని జంతువులు ప్రకృతి వైపరీత్యాలను మానవుల కంటే ముందే గుర్తిస్తాయి. దృష్టి, వినికిడి, వాసనలను పసిగట్టే విషయంలో జంతువులు మానవుని కన్నా ముందున్నాయి.

4) మానవులు :
మానవులు బుద్ధిజీవులు, మానవులకు ఆలోచనా శక్తి, వివేచనా శక్తి, నిర్ణయాత్మక శక్తి ఉంటాయి. జంతువులకు వివేచనా శక్తి ఉండదు.

ప్రాజెక్టు పని

* ప్రకృతిని గురించిన చిత్రాలను సేకరించి ప్రదర్శించండి.
జవాబు:
AP Board 8th Class Telugu Solutions Chapter 6 ప్రకృతి ఒడిలో 4

VII. భాషను గురించి తెలుసుకుందాం !

1) కింది పదాలను విడదీయండి. సంధి పేరు రాయండి.
ఉదా :
అందమైన = అందము + ఐన – ఉత్వ సంధి
(అ) సూక్ష్మమైన – సూక్ష్మము + ఐన – ఉత్వ సంధి
(ఆ) పైకెత్తు = పైకి + ఎత్తు – ఇత్వ సంధి
(ఇ) అయిందంటే = అయింది + అంటే – ఇత్వ సంధి

2) క్రింది విగ్రహవాక్యాలను సమాస పదాలుగా మార్చండి.
ఉదా :
మూడయిన రోజులు మూడు రోజులు
(అ) రెండయిన రోజులు – రెండు రోజులు
(ఆ) వజ్రమూ, వైఢూర్యమూ – వజ్రవైఢూర్యాలు
(ఇ) తల్లీ, బిడ్డా – తల్లీబిడ్డలు

AP Board 8th Class Telugu Solutions Chapter 6 ప్రకృతి ఒడిలో

3) కింది కర్తరి వాక్యాలను కర్మణి వాక్యాలుగా రాయండి.
ఉదా :
పార్వతికి అభినందనలను తెలుపుతూ అందరూ చప్పట్లు కొట్టారు.
పార్వతికి అభినందనలు తెలుపుతూ అందరిచేతా చప్పట్లు కొట్టబడ్డాయి.

అ) కర్తరి : జ్ఞానేంద్రియాలు మనిషికి అనుభవాలను కలిగిస్తాయి.
కర్మణి : జ్ఞానేంద్రియాలచేత మనిషికి అనుభవాలను కలిగింపజేస్తాయి.

ఆ) కర్తరి : చలికి నెయ్యి, నూనె పేరుకుంటాయి.
కర్మణి : చలిచేత నెయ్యి, నూనె పేరుకొనబడతాయి.

ఇ) కర్తరి : శాస్త్రజ్ఞానము కొన్ని ప్రతిపాదనలను చేస్తుంది.
కర్మణి : శాస్త్రజ్ఞానముచేత కొన్ని ప్రతిపాదనలు చేయబడుతుంది.

4) కింది కర్మణి వాక్యాలను కర్తరి వాక్యాలుగా రాయండి.

అ) కర్మణి : శాస్త్రజ్ఞులచేత అనేక వేల సాధనాలు కల్పించబడినవి.
కర్తరి : శాస్త్రజ్ఞులు అనేక సాధనాలను కల్పించారు.

ఆ) కర్మణి : ఈ ప్రతిపాదన శాస్త్రముచేత పరమ సత్యంగా పరిగణింపబడదు.
కర్తరి : ఈ ప్రతిపాదనను శాస్త్రము పరమసత్యంగా పరిగణిస్తుంది.

ఇ) కర్మ : అది సిద్ధాంతముగా ఆమోదము పొందబడుతుంది.
కర్తరి : అది సిద్ధాంతంగా ఆమోదం పొందింది.

5) తత్పురుష సమాసం.

1. మీరు తత్పురుష సమాసం గురించి తెలుసుకున్నారు కదా! కింది వాటిలో గీత గీసిన విభక్తి ప్రత్యయాల ఆధారంగా ఆయా తత్పురుష సమాసాల పేర్లు రాయండి.

అ) విద్యను అర్థించేవాళ్ళు = విద్యార్థులు – ద్వితీయా తత్పురుష సమాసం
ఆ) గుణాల చేత హీనుడు = గుణహీనుడు – తృతీయా తత్పురుష సమాసం
ఇ) సభ కొరకు భవనం = సభాభవనం – చతుర్థి తత్పురుష సమాసం
ఈ) దొంగ వల్ల భయం = దొంగభయము – పంచమీ తత్పురుష సమాసం
ఉ) రాముని యొక్క బాణం = రామబాణం – షష్ఠీ తత్పురుష సమాసం
ఊ) గురువులలో శ్రేష్ఠుడు = గురుశ్రేష్ఠుడు – షష్ఠీ తత్పురుష సమాసం
ఋ) దేశము నందు భక్తి = దేశభక్తి – సప్తమీ తత్పురుష సమాసం

(పై వాక్యాల్లో వేర్వేరు విభక్తులను గమనించారు కదా!)
పై విగ్రహవాక్యాలకు సమాస పదాలు రాయండి.

2. కింది సమాస పదాలను పరిశీలించి విగ్రహవాక్యాలు రాసి, సమాసాల పేర్లను రాయండి.
ఉదా :
విద్యార్థి – విద్యను అర్థించేవాడు – ద్వితీయా తత్పురుష సమాసం

పదంవిగ్రహవాక్యంసమాసం పేరు
1. ధనహీనుడుధనము చేత హీనుడుద్వితీయా తత్పురుష సమాసం
2. పొట్టకూడుపొట్ట కొరకు కూడుచతుర్థి తత్పురుష సమాసం
3. రాక్షసభయంరాక్షసుల వలన భయంపంచమీ తత్పురుష సమాసం
4. నాపుస్తకంనా యొక్క పుస్తకంషష్ఠీ తత్పురుష సమాసం
5. రాజశ్రేష్ఠుడురాజుల యందు శ్రేష్ఠుడుసప్తమీ తత్పురుష సమాసం

3. అతిశయోక్తి అలంకారం
కింది వాక్యాన్ని చదవండి.

ఆ పట్టణంలోని భవనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

భవనాలు ఎంత ఎత్తుగా ఉన్నా ఆకాశాన్ని తాకడం అసంభవం. అంటే మామూలు విషయాన్ని అతిగా చేసి చెప్పడం పై వాక్యంలో గమనిస్తున్నాం.

ఈ విధంగా గోరంత విషయాన్ని కొండంతలుగా చేసి చెప్పడాన్ని ‘అతిశయోక్తి అలంకార’మంటారు.

అతిశయోక్తి అలంకారానికి సంబంధించిన కొన్ని వాక్యాలు రాయండి.
1) మా ఊర్లో పంటలు బంగారంలా పండుతాయి.
2) మా తోటలోని మామిడిపండ్లు అమృతం వలె ఉంటాయి.
3) మా అన్నయ్య తాటిచెట్టంత పొడవున్నాడు.

వ్యాకరణంపై అదనపు సమాచారం

పర్యాయపదాలు

ప్రశంస : పొగడ్త, అభినందన
కలుగు : రంధ్రం, బిలం
నిప్పు : అగ్ని, చిచ్చు
పార్వతి : గౌరి, ఉమ
ఆకాశం : నింగి, నభం
సముద్రం : జలధి, వారిధి
ఆమోదం : అంగీకారం, సమ్మతి
లోకం : విశ్వం, జగము
గాలి : వాయువు, మారుతం
తరంగము : భంగము, అల
నక్షత్రం : తార, చుక్క

వ్యుత్పత్యర్థాలు

అగ్ని : మండెడి స్వభావం కలది
జలధి : నీటిని ధరించునది
సాగరం : సగర కుమారుల చేత త్రవ్వబడినది
ఉదధి : నీటిని ధరించునది

నానార్థాలు

అంబరం = గగనం, వస్త్రం, శూన్యం
వర్షం = వాన, సంవత్సరం
కన్ను = నేత్రం, బండి చక్రం
శక్తి = సామర్థ్యం, పార్వతి

సంధులు

సవర్ణదీర్ఘ సంధి :
సూత్రం : అ, ఇ, ఉ, ఋ లకు సవర్ణములైన అచ్చులు పరమైనప్పుడు వాని దీర్ఘములు ఏకాదేశమగును.
జ్ఞానాభివృద్ధి = జ్ఞాన + అభివృద్ధి – సవర్ణదీర్ఘ సంధి
ధనాశ = ధన + ఆశ – సవర్ణదీర్ఘ సంధి
నిజానందం = నిజ + ఆనందం – సవర్ణదీర్ఘ సంధి

గుణసంధి :
సూత్రం : అకారమునకు ఇ, ఉ, ఋ లు పరమగునపుడు క్రమముగా ఏ, ఓ, అర్లు ఏకాదేశమగును.
జ్ఞానేంద్రియం = జ్ఞాన + ఇంద్రియం – గుణసంధి
సర్వోన్నత = సర్వ + ఉన్నత – గుణసంధి

ఆమ్రేడిత సంధి :
సూత్రం : అచ్చునకు ఆమ్రేడితంబు పరమగునపుడు సంధి తరచుగానగు.
అప్పుడప్పుడు = అప్పుడు + అప్పుడు = ఆమ్రేడిత సంధి
ఔరౌర = ఔర + ఔర = ఆమ్రేడిత సంధి

లులనల సంధి :
సూత్రం : లు, ల, న లు పరమగునపుడు మువర్ణమునకు లోపమును, తత్పూర్వ స్వరమునకు దీర్ఘమును, బహుళముగా వచ్చును.
తరంగాలు = తరంగము + లు – లులనల సంధి
సముద్రాలు = సముద్రము + లు – లులనల సంధి
భూకంపాలు = భూకంపము + లు – లులనల సంధి
రహస్యాలు = రహస్యము + లు – లులనల సంధి

ఉత్వసంధి :
సూత్రం : ఉత్తునకు అచ్చు పరమగునపుడు సంధియగును.
ఊరెల్ల = ఊరు + ఎల్ల – ఉత్వసంధి
ముందున్నాయి = ముందు + ఉన్నాయి – ఉత్వసంధి
పరుగెత్తి = పరుగు + ఎత్తి – ఉత్వసంధి

సమాసాలు

సమాస పదంవిగ్రహవాక్యంసమాసం పేరు
ప్రార్థనా సమావేశంప్రార్థన కొఱకు సమావేశంచతుర్థీ తత్పురుష సమాసం
భూకంపాలుభూమి యొక్క కంపాలుషష్ఠీ తత్పురుష సమాసం
ప్రకృతి రహస్యాలుప్రకృతి యొక్క రహస్యాలుషష్ఠీ తత్పురుష సమాసం
ప్రకృతి ధర్మముప్రకృతి యొక్క ధర్మముషష్ఠీ తత్పురుష సమాసం
శాస్త్ర ప్రతిపాదనలుశాస్త్రము నందు ప్రతిపాదనలుసప్తమీ తత్పురుష మాసం
కళాదృష్టికళయందు దృష్టిసప్తమీ తత్పురుష సమాసం
ఇంద్రియజ్ఞానముఇంద్రియముల యొక్క జ్ఞానముషష్ఠీ తత్పురుష సమాసం
కాంతి తరంగాలుకాంతి యొక్క తరంగాలుషష్ఠీ తత్పురుష సమాసం
అద్భుత ప్రాణులుఅద్భుతమైన ప్రాణులువిశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
వంద సంవత్సరాలువంద (100) సంఖ్యగల సంవత్సరాలుద్విగు సమాసం
ఐదు కిలోమీటర్లుఐదు (5) సంఖ్యగల కిలోమీటర్లుద్విగు సమాసం
మూడు గంటలుమూడు (3) సంఖ్యగల గంటలుద్విగు సమాసం

రచయిత పరిచయం

పాఠము పేరు : ‘ప్రకృతి ఒడిలో

రచయిత పేరు : కొడవటిగంటి కుటుంబరావుగారు

దేని నుండి గ్రహింపబడింది : రచయిత రాసిన “తాత్త్విక వ్యాసాల నుండి”

రచయిత జననం : అక్టోబరు 28, 1909 (28.10.1909)

మరణం : ఆగస్టు 17, 1980 (17.08.1980)

జన్మస్థలం : తెనాలి, గుంటూరు జిల్లా

రచనలు :
1) ‘జీవితం’, ‘చదువు’ – అనే నవలలు
2) ‘అద్దెకొంప’, ‘షావుకారు సుబ్బయ్య’ మొదలైన కథానికలు
3) సినిమా వ్యాసాలు
4) సైన్సు వ్యాసాలు, సంస్కృతి వ్యాసాలు, తాత్త్విక వ్యాసాలు మొ||నవి.

కొత్త పదాలు – అర్థాలు

అంశము = విషయము
అభినందన = ప్రశంస, పొగడ్త
అన్వేషించు = వెదకు, పరిశీలించు
అక్కఱ = అవసరమైన పని
ఆమోదం = అంగీకారం
ఆస్వాదించు = అనుభవించు
ఆకృతులు = రూపాలు
ఆధునికము = క్రొత్తది
కలుగు = రంధ్రం, బొరియ
గండి = రంధ్రము, సందు
చలన చిత్రాలు = సినిమాలు
జ్ఞానేంద్రియాలు = జ్ఞానమును కల్గించే అవయవాలు. ఇవి ఐదు. 1) కన్ను 2) ముక్కు 3) చెవి 4) నాలుక 5) చర్మం

AP Board 8th Class Telugu Solutions Chapter 6 ప్రకృతి ఒడిలో

దృశ్యము = చూడదగినది, కనబడు వస్తువు
నిరూపించు = నిర్ణయించు
పసిగట్టుట = వాసన ద్వారా గుర్తించుట
పాటించు = ఆదరించు, కావించు
ప్రతిపాదించు = నిరూపించి తెలుపు
పరిమాణము = కొలత
ప్రకంపన = కదలిక
భ్రమలు = భ్రాంతి; లేనిది ఉన్నట్లుగా తోచడం
ఋజువు చేయు = నిరూపించు
విశ్లేషించు = విషయాన్ని విభజించి చూచు
వైపరీత్యము = విపరీతము
విధిగా = ఏర్పాటుగా (తప్పనిసరిగా)
సామ్యము = సాటి, పోలిక
శాస్త్రవేత్త = శాస్త్రం తెలిసినవాడు

AP Board 8th Class Telugu Solutions Chapter 10 సంస్కరణ

AP State Syllabus AP Board 8th Class Telugu Textbook Solutions Chapter 10 సంస్కరణ Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Telugu Solutions 10th Lesson సంస్కరణ

8th Class Telugu 10th Lesson సంస్కరణ Textbook Questions and Answers

చదవండి – ఆలోచించండి – చెప్పండి
AP Board 8th Class Telugu Solutions Chapter 10 సంస్కరణ 1

ప్రశ్నలు జవాబులు

ప్రశ్న 1.
మొదటి చిత్రంలో ఉన్నవారు ఎవరు? ఆయన ఎలా ప్రసిద్ధులు?
జవాబు:
మొదటి చిత్రంలో ఉన్నది రాజారామ్మోహన్ రాయ్. ఆయన 1821 నాటివాడు. గొప్ప సంఘసంస్కర్త. ఆయన బ్రహ్మ సమాజమతాన్ని స్థాపించాడు. నాడు హిందూ సమాజంలో ఉన్న ‘సతి’ అనే దురాచారాన్ని నిర్మూలించడానికి, బాల్య వివాహాలను అరికట్టడానికి కృషిచేశాడు.

ప్రశ్న 2.
రెండో చిత్రంలో ఉన్నవారు ఎవరు? వారు ఎవరికోసం కృషి చేశారు?
జవాబు:
రెండో చిత్రంలో ఉన్నది కందుకూరి వీరేశలింగం పంతులుగారు. ఆయనకు “ఆంధ్రా రాజా రామమోహన రాయలు” అనే పేరు ఉంది. ఆయన గొప్ప సంఘసంస్కర్త. హితకారిణీ సమాజాన్ని స్థాపించారు. సాంఘిక దురాచార నిర్మూలనకు కృషిచేశారు. ఆయన స్త్రీ విద్యావ్యాప్తికి, వితంతు స్త్రీలకు పునర్వివాహాలు చేయించడానికి కృషి చేశారు.

ప్రశ్న 3.
సాంఘిక దురాచారాలు అంటే ఏమిటి?
జవాబు:
సంఘంలో ఉన్న చెడ్డ ఆచారాలను, సాంఘిక దురాచారాలు అంటారు. వరకట్నం, కన్యాశుల్కం, ‘సతి’ ఆచారం, వితంతు స్త్రీలను చిన్నచూపు చూడటం. స్త్రీ విద్య పనికిరాదనడం వంటివి సాంఘిక దురాచారాలు.

AP Board 8th Class Telugu Solutions Chapter 10 సంస్కరణ

ప్రశ్న 4.
నేడు మన సమాజంలో ఏయే దురాచారాలు ఉన్నాయి?
జవాబు:
నేడు మన సమాజంలో వరకట్నం, బాల్యవివాహాలు, లంచగొండితనం, అంటరానితనం, మద్యపానం, ధూమపానం, మత్తుమందుల వాడకం, వెట్టిచాకిరి, మతదురహంకారం వంటి దురాచారాలు ఉన్నాయి.

ఇవి చేయండి

I. వినడం – మాట్లాడడం

ప్రశ్న 1.
మీరు గమనించిన దురాచారాలు, మూఢనమ్మకాలపై మీ అభిప్రాయాలు చెప్పండి.
జవాబు:
దురాచారాలు :
సంఘంలో దురాచారాలు అసంఖ్యాకంగా ఉన్నాయి. అంటరానితనం, మద్యపానం, ధూమపానం, మత్తుమందుల వాడకం, మూఢనమ్మకాలు, వరకట్నం, బాల్యవివాహాలు, వెట్టిచాకిరి, లంచగొండితనం, మతదురహంకారం వంటి దురాచారాలు సంఘంలో బాగా పేరుకుపోయాయి.

మూఢనమ్మకాలు :
దయ్యాలున్నాయని నమ్మడం, శకునాలు నమ్మడం, తాంత్రిక విద్యలపై నమ్మకం, అమావాస్య, చవితి వంటి తిథులు మంచివి కావనడం మొదలైన మూఢనమ్మకాలు కూడా సంఘంలో ప్రబలి ఉన్నాయి. నా

అభిప్రాయం :
ప్రజలలో చాలామంది నిరక్షరాస్యులు. వారిని సరిదిద్ది వారిలో గల దురాచారాల్ని మూఢనమ్మకాల్ని నిర్మూలించడంలో మనవంతు కృషి చేయాలి. సాంఘిక దురాచారాలను గురించి ప్రజలకు వివరించి చెప్పి వానిని ప్రజలు మానేటట్లు చేయడం మన కర్తవ్యం.

N.C.C., N.S.S., స్కౌటింగ్, రెడ్ క్రాస్ మొదలైన సంస్థల ద్వారా విద్యార్థులు ఈ సాంఘిక సేవలో పాలు పంచుకోవచ్చు. విద్యార్థులు తలచుకుంటే దేశంలోని ప్రజల దురాచారాలను, మూఢనమ్మకాలను సమూలంగా నిర్మూలించగలరని నా అభిప్రాయం.

ప్రశ్న 2.
ప్రస్తుతం సమాజంలో ఉన్న సాంఘిక దురాచారాలు ఏవి? వాటి నిర్మూలనకు మీ వంతు కృషిగా ఏమి చేయాలను కుంటున్నారు?
జవాబు:
ప్రస్తుతం సమాజంలో ఉన్న సాంఘిక దురాచారాలలో కొన్ని :
1. వరకట్న దురాచారము
2. అవినీతి
3. బాలకార్మిక వ్యవస్థ

వరకట్న దురాచారం చాలా భిన్నమైన సమస్య. దీన్ని నిర్మూలించుటకు ప్రజలే సిద్ధంగా లేరు అని చెప్పవచ్చును. కట్నం తీసుకోకపోవటం అన్నది వరుని వైపు వారు చిన్నతనంగా భావించటం, కట్నం అవసరం లేదు అని వరునివైపువారు చెబితే వరునివైపు ఏవో లోపాలు ఉన్నట్లు వధువువైపు వారు అనుకోవటం జరుగుతున్నది. దీనినే నేను నా వంతు కృషిగా వరునివైపు వారికి, వధువువైపు వారికి అలాగే సమాజంలోని వారి అందరికి వరకట్న నిర్మూలన గురించి వివరంగా తెలియచేస్తాను. అలాగే నేను కూడా వరకట్నం తీసుకోను, వరకట్నం ఇవ్వను.

అవినీతి – ఇది ఇప్పుడు పెద్ద జటిల సమస్య. ఎక్కడ చూసినా అవినీతి తాండవిస్తున్నది. నావైపు కృషిగా ముందు నేను అవినీతిని చేయను. అలాగే నా చుట్టూ వున్న సమాజ సభ్యులు అందరినీ కాకపోయినా నా స్నేహితుల వరకైనా అవినీతికి పాల్పడకుండా ఉండేందుకు కృషి చేస్తాను.

బాలకార్మికులు కూడా మనదేశంలో చాలామంది ఉన్నారు. నా స్నేహితుల సహాయంతో నేను వారిని ఆదుకుంటాను. అటువంటి వారిని గుర్తించి వారిని వెట్టిచాకిరి నుండి విడిపించి నావంతు కృషిగా పాఠశాలల్లో చేర్పిస్తాను.

AP Board 8th Class Telugu Solutions Chapter 10 సంస్కరణ

ప్రశ్న 3.
“వరకట్న నిర్మూలన” కు రావలసిన మార్పులను “వరునివైపు – వధువువైపు” జట్లుగా విడిపోయి చర్చించండి.
జవాబు:

వరుడువైపు వాళ్ళువధువువైపు వాళ్ళు
1) కట్నం తీసుకోవడమంటే బానిసలుగా అమ్ముడు పోవడమే అని మేం గ్రహిస్తాం. మీరు కూడా కట్నం ఇవ్వమని ఖచ్చితంగా చెప్పాలి.1) అవును. మా తల్లిదండ్రులకు కట్నాలు ఇవ్వవద్దని చెపుతాం. సంతల్లో పశువుల్లా మగపిల్లల్ని బేరం పెట్టి అమ్మే తల్లిదండ్రులను మీరు వ్యతిరేకించండి.
2) వరునివైపు వారు కట్నం తీసుకోమని అంటే వారిలో ఏదో లోపం ఉందని ఆడపిల్లల తల్లిదండ్రులు భావిస్తున్నారు. ఆ ఆలోచనా ధోరణిలో మార్పు రావాలి.2) కొంతమంది అలానే ఆలోచిస్తున్నారు. తమ ఆడ పిల్లలకు కట్నం ఇవ్వలేక బాధపడే తల్లిదండ్రులు సైతం తమ మగపిల్లలకు కట్నాల కోసం పంతం పట్టడం దురదృష్టం.
3) వరకట్న నిషేధ చట్టం చేసి, ఏళ్ళు గడుస్తున్నా, ఏ మార్పు రాలేదు. వరకట్నం పుచ్చుకోవడం నేరమని మేము భావిస్తాం.3) వరకట్నం ఇవ్వడం నేరమని మేము భావిస్తాం. వరకట్న బాధిత మహిళల గురించి రోజూ దినపత్రికల్లో చదువుతున్నాం, టీవీల్లో చూస్తున్నాం. వారిని హింసించేవారిని ప్రభుత్వం కఠినంగా శిక్షించాలి.
4) సృష్టిలో స్త్రీలు, పురుషులు ఇరువురికీ సమ ప్రాధాన్యముందని మా అభిప్రాయం.4) అవును. తల్లిదండ్రులు ఈ విషయం గుర్తించి తమ ఆడపిల్లలకు కూడా తమ ఆస్తిలో వాటా కల్పించాలి. స్త్రీవిద్యను ప్రోత్సహించాలి.
5) మహిళా సంఘాలవాళ్ళు వరకట్న సమస్య విషయంలో అంత చైతన్యవంతంగా లేరనే చెప్పాలి. వారు వరకట్న నిర్మూలన కోసం ఉద్యమాలు చేయాలి.5) అవును. పురుషులు కూడా వరకట్న వ్యతిరేక ఉద్యమాల్లో చురుకుగా పాల్గొనాలి. స్వచ్ఛంద సంస్థలు, ప్రచార, ప్రసార సాధనాలు తమ తోడ్పాటును అందించాలి.

II చదవడం, అవగాహన చేసుకోవడం

1. కింది పదాలు ఏ పేరాలోనివో గుర్తించి, ఆ పదాన్ని దేనికి సంబంధంగా వాడారో రాయండి.
జవాబు:

పదంపేరా సంఖ్యఎందుకోసం వాడారు
పెనుభూతం3తరతరాలుగా మన సమాజాన్ని బాధిస్తున్న వరకట్న దురాచారం.
జటిలసమస్య4స్త్రీల అభ్యున్నతికి అవరోధంగా నిలిచిన రెండు ముఖ్య సమస్యలలో రెండవది, పరిష్కరించడానికి కష్టతరమైనది అయిన వరకట్న దురాచారం (మొదటిది విద్యావిహీనత).
రూపుమాపడం2బాల్యవివాహ దురాచారం.
పరిపాటి8వివాహ వేడుకల్లో మితిమీరి ధనవ్యయం చేయడం ఘనతగా పరిగణించడం.

2. కింది పేరాను చదవండి. ఎక్కడ?, ఏమిటి?, ఎందుకు?, ఎవరు?, ఎలా? అనే పదాలతో ప్రశ్నలు రాయండి.
వేమన జన్మించింది, తిరిగిందీ రాయలసీమే ఐనా ఆయన పద్యాలు, ఆయన సందేశం, ప్రభావం ఆంధ్రదేశము అంతా వుంది. వీరి పద్యాలు వివిధ భాషల్లోకి అనువాదమయ్యాయి. వేమన సందేశానికి దేశ వ్యాప్తంగానే కాక ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. సమాజంలోని ఎక్కువ తక్కువలు, వివక్షలు, అంటరానితనం, అంధ విశ్వాసాలు, మూఢాచారాలు, జీవహింస, అవినీతి, అధర్మం మొదలైన విషయాలపై తన సరళమైన పద్యాల ద్వారా ప్రజల మనస్సులో హత్తుకుపోయేటట్లు విమర్శనాత్మక రచనలు చేశాడు. కులవ్యవస్థపై దాడి చేశాడు. స్వానుభవమైన, ఆచరణయోగ్యమైన తత్త్వాన్ని సరళభాషలో ప్రజలకు చెప్పి ప్రజాకవిగా తెలుగువారి మదిలో శాశ్వతస్థానం పొందారు.
ప్రశ్నలు :
1) వేమన ఎక్కడ జన్మించాడు?
2) వేమన ఎక్కడ తిరిగాడు?
3) వేమన పద్యాలూ, సందేశం ప్రభావం ఎక్కడ ఉంది?
4) ఆంధ్రదేశమంతా ఏమిటి ఉంది?
5) వేమన పద్యాలు ఎలా అనువాదమయ్యా యి?
6) వేమన సందేశానికి ఎక్కడెక్కడ గుర్తింపు వచ్చింది?
7) వేమన ఏ విషయాలపై రచనలు చేశాడు?
8) వేమన ఎలా విమర్శనాత్మక రచనలు చేశాడు?
9) వేమన దేనిపై దాడిచేశాడు?
10) కులవ్యవస్థపై దాడిచేసింది ఎవరు?
11) వేమన ఎందుకు విమర్శనాత్మక రచనలు చేశాడు?
12) వేమన పద్యాలు ఎలా ఉంటాయి?
13) వేమన ప్రజాకవి ఎలా అయ్యాడు?
14) వేమన ఎటువంటి తత్త్వాన్ని ప్రజలకు చెప్పాడు?
15) వేమన ఎవరి మదిలో శాశ్వత స్థానం పొందాడు?

AP Board 8th Class Telugu Solutions Chapter 10 సంస్కరణ

3. కింది పట్టికను చూడండి. సదాచారం ఏదో, దురాచారం ఏదో గుర్తించండి. కారణం రాయండి.
జవాబు:

అంశంసదాచారం/దురాచారం
బాల్య వివాహాలు చేయడందురాచారం
పెద్దలను గౌరవించడంసదాచారం
వరకట్నం తీసుకోవడం / ఇవ్వడందురాచారం
తల్లిదండ్రులకు సేవచేయడంసదాచారం
వృద్ధులను వృద్ధాశ్రమాల్లో చేర్చడందురాచారం
స్త్రీ విద్యను ప్రోత్సహించడంసదాచారం
బడి ఈడు పిల్లలను పనుల్లో పెట్టడందురాచారం
ఆడపిల్లలకు తొందరగా పెండ్లిండ్లు చేయడందురాచారం
చిన్న పిల్లలను వసతి గృహాల్లో ఉంచి చదివించడంసదాచారం
తోటివారిని ఎవరినైనా సమానంగా చూడడంసదాచారం

4. పాఠం ఆధారంగా కింది ప్రశ్నలకు జవాబులు రాయండి.

అ) శాసనాలు అమలు కావాలంటే ఏమి చేయాలని నండూరివారు అన్నారు?
జవాబు:
శాసనాలు చేసినంత మాత్రాన ఏ సాంఘిక సంస్కరణ ప్రయత్నమూ విజయవంతం కాబోదు. ఆ సాంఘిక సంస్కరణ యొక్క అవసరాన్ని ప్రజలు గుర్తించాలి. దానికి సంబంధించిన మానసిక చైతన్యం ప్రజలలో ప్రస్ఫుటించాలి. ప్రజల నుండి ఆ సంస్కరణకు, పూర్తి సహకారం రావాలని నండూరివారు అన్నారు.

ఆ) బాల్యవివాహాలు తగ్గుముఖం పట్టడానికి ఏమేమి తోడ్పడతాయి?
జవాబు:
అతి బాల్యవివాహాలు ఈనాడు చెదురు మదురుగానే అక్కడక్కడ జరుగుతున్నాయి. నేడు అది ఒక పెద్ద సమస్యగా పరిగణించదగినంతగా జరగడం లేదు. ఈ పరిణామం సాధ్యం కావడానికి ప్రభుత్వం చేసిన ‘శారదా శాసనం’ ఒక్కటే కారణం అని అనుకోలేము. బాల్యవివాహాలు అనే దురాచారాన్ని రూపుమాపడానికి ఎందరో మహానుభావులూ సంఘసంస్కర్తలు, కృషి చేశారు. వారి కృషి ఫలితంగా, ప్రజలలో బాల్యవివాహాల పట్ల కలిగిన ఏవగింపు ఈ దురాచార నిర్మూలనకు ముఖ్య కారణం.

ఇ) వరకట్న దురాచారం గురించి రచయిత అభిప్రాయం ఏమిటి?
జవాబు:
వరకట్న దురాచారం నిర్మూలనానికి శాసనాలు ఉన్నప్పటికీ ఇది నిర్మూలన కాలేదు సరిగదా, నానాటికీ పెనుభూతంలా పెరిగిపోతోంది.

ఈ దురాచార నిర్మూలనకు ప్రజలు సిద్ధంగా లేరని, వరకట్నం ఇవ్వడం, పుచ్చుకోవడం అన్నవి ప్రతిష్ఠకూ, సంఘంలో గౌరవానికి సంబంధించిన విషయాలుగా చెల్లుబాటు అవుతున్నాయని రచయిత అభిప్రాయం.

కట్నం అసలు తీసుకోకపోవడం, నలుగురిలో చిన్నతనంగా వరునివైపు వారు భావిస్తున్నారు. కట్నం తీసుకోని వరునిలో, ఏదో లోపం ఉండి ఉంటుందని, వధువువైపువారు సామాన్యంగా అనుకుంటున్నారు. ఎక్కువ కట్నం ఇవ్వడం, తీసుకోవడం గొప్పగా భావిస్తున్నారు.

వరకట్నం, వివాహంలో అధిక ధనవ్యయం చేయడం వంటి దురాచారాల నిర్మూలనకు, శాసనాలు అవసరమేకానీ, అంతకంటే ముఖ్యంగా వీటి పట్ల ఏహ్యభావాన్ని ప్రజల్లో కలిగించడం చాలా ముఖ్యమని, వీటి పట్ల యువతీయువకులు ఎదురు తిరిగేలా చేయాలని, కేవలం శాసనాలు దీన్ని సాధింపలేవని రచయిత అభిప్రాయపడ్డాడు.

III. స్వీయరచన

1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాలలో సమాధానాలు రాయండి.

అ) నేడు పెళ్ళిళ్ళ సందర్భంగా ఎన్ని రకాలుగా ధనం వృథా అవుతుందో మీరు గమనించిన విషయాలు రాయండి.
జవాబు:
నేడు పెళ్ళిళ్ళ సందర్భంగా కొంతమంది ధనవంతులు వృథాగా ధనాన్ని ఖర్చుచేస్తున్నారు. అనవసర ఆడంబరాలకు పోయి విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నారు. అలాగే మరికొంతమంది తమ తాహత్తుకు మించి, ఇతరులను చూచి (పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు) ధనాన్ని ఖర్చు పెడతారు. దానికి తమవద్ద ధనం లేక వడ్డీలకు తెచ్చి ఖర్చు పెడుతున్నారు. తరువాత వాటిని తీర్చలేక అప్పుల పాలవుతున్నారు.

ఆ) నేటికీ సమాజంలో ఏయే దురాచారాలు కనపడుతున్నాయి? దానికి కారణాలేమిటి?
(లేదా)
మన సంఘంలో ఉన్న దురాచారాలు తెలపండి.
జవాబు: నేటికీ వరకట్నాలు, మద్యపానం, క్లబ్బులు, పబ్బులు, అర్ధనగ్న నృత్యాలు, మత్తుమందులు, వగైరా దురాచారాలు సమాజంలో కనబడుతున్నాయి.

ముఖ్యంగా యువతీ యువకులు చదువులకూ, ఉద్యోగాలకూ గ్రామాలను వదలి, పట్టణాలకు వెడుతున్నారు. అక్కడ ప్రక్కవాళ్ళను చూసి, దురాచారాలు నేర్చుకుంటున్నారు. నాగరికత పేరుతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. కట్నం తీసుకోని మగాణ్ణి అసమర్థునిగా సంఘం జమకడుతోంది. వరకట్నం తీసుకోకుండా, ఏ మగాడైనా ఆదర్శంగా పెళ్ళిచేసుకుంటే, అతణ్ణి వధువు తరపువారే ఏదో లోపం ఉన్నవాడిగా జమకడుతున్నారు. ఆడపిల్లలకు బాగా చదువు లేకపోడంతో కట్నాలు
ఇచ్చి పెళ్ళిళ్లు చేయవలసి వస్తోంది. ఆడపిల్లలకు ఆస్తిహక్కు లేకపోడంతో వరకట్నాలు అడుగుతున్నారు.

ఇ) దేశంలో వందశాతం అక్షరాస్యత ఇంకా సాధించలేకపోవడానికి కారణాలు ఏమిటి?
జవాబు:

  1. తల్లిదండ్రులు నిరక్షరాస్యులు, బీదవారు కావడం వల్ల, వారికి చదువుపై ఆసక్తి లేకపోవడం వల్ల, పిల్లల్ని చదివించే ఆర్థికబలం లేకపోవడం వల్ల, పిల్లల్ని బడికి పంపడం లేదు.
  2. వయోజన పాఠశాలలు లేకపోవడం వల్ల చదువురాని పెద్దలు చదువుకోడం లేదు.
  3. చదువుకొనే వారికి హాస్టళ్ళలో భోజనం, ఉచిత పుస్తకాలు, దుస్తులు, పాఠశాలలకు వెళ్ళడానికి సైకిళ్ళు వగైరా ఇవ్వకపోడం వల్ల పిల్లలు చదవడం లేదు.
  4. గిరిజన ప్రాంతాల్లో, కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో నేటికీ విద్య నేర్పే పాఠశాలలు లేవు.
  5. చదువుకొనే బాలబాలికలను కొందరు తల్లిదండ్రులు బాల్యంలోనే పనిలో పెడుతున్నారు. వారి చిన్నపాటి సంపాదనకు తల్లిదండ్రులు ఆశపడుతున్నారు.
  6. బాలకార్మికులవల్ల విద్యా శాతం పెరగడం లేదు.
  7. మన భారత ప్రభుత్వం భారతీయులనందరినీ అక్షరాస్యులను చేయాలనీ, నిర్బంధ ప్రాథమిక విద్యను ప్రవేశపెట్టాలనీ తీర్మానించింది. మన కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు అక్షరాస్యతను పెంచడానికి అనేక పథకాలను ప్రవేశపెడుతున్నాయి. అందులో శాశ్వత పథకాలు నత్తనడక నడుస్తున్నాయి. తాత్కాలిక పథకాలు తాటాకులమంటలా చురచురా వెలిగి ఆరిపోతున్నాయి. అందువల్లే ఈ సమస్య పూర్తిగా పరిష్కారం కావటల్లేదు.
  8. పథకాలు మంచివయినా, ఆచరణలో చిక్కులు వస్తున్నాయి. విద్యాశాఖకు ఏటా వేలకోట్ల రూపాయలు వెచ్చిస్తున్నా, క్షేత్రస్థాయి సిబ్బందిలో గూడుకట్టుకున్న అలసత్వం, అశ్రద్ధ, నిర్లిప్తతతో ప్రజల్లో ఆశించిన చైతన్యం రావడం లేదు.
  9. AP Board 8th Class Telugu Solutions Chapter 10 సంస్కరణ

2. కింది ప్రశ్నలకు పదేసి వాక్యాలలో జవాబులు రాయండి. –

అ) “ఆడంబరంగా పెళ్ళిళ్ళు చేయడం కోసం అధికంగా ఖర్చు చేయడం”- దీన్ని వ్యతిరేకిస్తూ సరైన కారణాలు రాయండి.
జవాబు:
ఆడంబరంగా పెళ్ళిళ్ళు చేయడం కోసం అధికంగా ఖర్చు చేయడం అనేది నేను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను. దీనికి కారణాలు :

  1. అధికంగా ఖర్చు పెట్టి పెళ్ళిళ్ళు చేయడం వలన అమూల్యమైన డబ్బు దుర్వినియోగం అవుతుంది. అందుకు బదులుగా అనేక ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టడం శ్రేయస్కరం.
  2. అలా ఖర్చు చేయకుండా ఆ ధనాన్ని ఏ పేదవారికో, చదువుకునేందుకు ఆర్థికసాయం లేక మధ్యలోనే చదువుకు స్వస్తి చెపుతున్న వారికో వినియోగించవచ్చు.
  3. అడుగడుగునా మనకు కనిపించే అన్నార్తులను, అభాగ్యులను ఆదుకోవచ్చు.
  4. అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమాలు వంటివి నెలకొల్పవచ్చు.
  5. ధనవంతులు తాము ఖర్చు పెడుతున్న సొత్తుతో ఒక గ్రామాన్ని దత్తత చేసుకొని అక్కడి వారికి జీవనోపాధిని కల్పించవచ్చు.
  6. గ్రామాలలో పరిశ్రమలను, కర్మాగారాలను నెలకొల్పి ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చు.
  7. జాషువాగారు చెప్పినట్లు రెండు నూలు దండలు, రెండు కప్పుల టీ పెళ్ళికి చాలు. ఒకరిని చూసి మరొకరు ఎక్కువగా పెళ్ళి ఖర్చులు చేసి పొలాలు అమ్ముకోడం, అప్పులు చేయడం, బంగారం వగైరా తాకట్టు పెట్టడం, అమ్మడం చేయరాదు.
  8. వధూవరులు, భగవంతుని సన్నిధిలో దండలు మార్చుకోవాలి. రిజిష్టరు ఆఫీసులో మూడు వందల ఖర్చుతో, పెళ్ళితంతు పూర్తి చేయాలి. ఒక్క ఫోటో చాలు.

ఆ) ‘స్త్రీలందరూ విద్యావంతులైతే, వరకట్న నిర్మూలన జరుగుతుంది’ – దీనిపై మీ అభిప్రాయాలను తెలుపుతూ వ్యాసం రాయండి.
జవాబు:
స్త్రీలందరూ విద్యావంతులయితే, వరకట్నాలు తగ్గవచ్చు. కాని ఆ చదువువల్ల వరకట్నాలు పూర్తిగా పోవు. చదువుకున్న స్త్రీ, తన కన్న ఎక్కువ చదివిన, ఎక్కువ సంపాదిస్తున్న మగాడినే పెళ్ళాడుతోంది. అందుచేత అటువంటి మగాళ్ళు, మరింత కట్నం అడుగుతున్నారు.

స్త్రీలు అందరూ విద్యావంతులయి, తాము కట్నం తీసికొన్న మగవాడిని పెళ్ళాడము అని పంతంపడితే, వరకట్నాలు పూర్తిగా తగ్గిపోతాయి. వరకట్నం ఆశింపని, సజ్జనుడిని స్త్రీ పెళ్ళాడడానికి ముందుకు వస్తే వరకట్నాలు పోతాయి. స్త్రీలకు పురుషులతోపాటు సమాన ఆస్తి హక్కులు ఇస్తే, వరకట్నాలు పోతాయి. పెళ్ళిళ్ళలో దుబారా వ్యయాన్ని అరికడితే, వరకట్నాలు తగ్గుతాయి.

పెళ్ళికాని స్త్రీలు, విద్యావంతులయి, ఉద్యోగాలు చేసికొంటూ, లేదా వృత్తివిద్యలు నేర్చుకొని స్వయంగా ఉపాధిని కల్పించుకొంటే, క్రమంగా వరకట్నాలు దూరం అవుతాయి. ఆడపిల్లల తండ్రులూ ఆడపిల్లలూ, కట్నం ఇవ్వనే ఇవ్వము అని భీష్మిస్తే, కట్నాలు దూరం అవుతాయి.

కేవలం స్త్రీలందరూ విద్యావంతులయినంత మాత్రాన, కట్నాలు పోవు అని నా అభిప్రాయం.

IV. పదజాలం

1. కింది పదాలకు సమానార్థాన్నిచ్చే పదాల సమూహంలో సమానార్థాన్ని ఇవ్వని పదం ఉంది. దాన్ని గుర్తించండి.
ఉదా :
ఇనుడు – సూర్యుడు, రవి, ఇంద్రుడు, భానుడు

అ) పరిణయం – పెళ్ళి, పరిమళం, మనువు, వివాహం
ఆ) శాసనం – ఆజ్ఞ, చట్టం, ఉత్తరం, ఉత్తరువు
ఇ) స్త్రీ – కొమ్మ, బంతి, పడతి, ఉవిద
ఈ) ధనం – విత్తం, దండనం, ద్రవ్యం, పైకం
ఉ) అభ్యున్నతి – తిరోగతి, ప్రగతి, పురోగతి, అభివృద్ధి

2. కింద ప్రకృతి, వికృతి పదాల ఆధారంతో వాక్యాలు రాయండి.
(విద్య – విద్దె; స్త్రీ – ఇంతి, నిజం – నిక్కం, యత్నం – జతనం)
ఉదా :
అ) విద్య రహస్యంగా దాచిన ధనం వంటింది.
జవాబు:
విద్దె లేనివాడు వింత పశువు.

ఆ) నేడు స్త్రీలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతున్నారు.
జవాబు:
ఇంతులు ఇంటి సౌభాగ్యానికి పట్టుకొమ్మలు.

ఇ) నిజం నిర్భయంగా చెప్పాలి.
జవాబు:
దొంగ నిక్కం చెప్పినా, ఎవ్వరూ నమ్మరు.

ఈ) నిరంతర యత్నం వల్ల పనులు సాధింపవచ్చు.
జవాబు:
మనం జతనంతో ఏదైనా సాధించగలము.

AP Board 8th Class Telugu Solutions Chapter 10 సంస్కరణ

3. కింది వానిని సొంతవాక్యాలలో రాయండి.
అ) పెనుభూతం, ఆ) తరతరాలు, ఇ) నిరాడంబరం, ఈ) అప్పో సప్పో, ఉ) దిగజారిపోవు, ఊ) దురాచారాలు, ఋ) శాసనాలు, బ) హెచ్చుతగ్గులు.

అ) పెనుభూతం : అవినీతి నేటి కాలంలో పెనుభూతంలా మారింది.

ఆ) తరతరాలు : తరతరాలుగా ‘మా ఇంటిలో అందరూ వేంకటేశ్వర స్వామినే కొలుస్తున్నారు.

ఇ) నిరాడంబరం : గాంధీజీ నిరాడంబర జీవితాన్ని గడిపేవారు.

ఈ) అప్పో సప్పో : కొందరు తమ పిల్లలను అప్పో సప్పో చేసి కష్టపడి చదివించుకొంటున్నారు.

ఉ) దిగజారిపోవు : నేటి యువతరం చెడు వ్యసనాలకు లోనై దిగజారిపోతున్నది.

ఊ) దురాచారాలు : దురాచారాలను అందరం కలిసికట్టుగా రూపుమాపాలి.

ఋ) శాసనాలు : శాసనాలను చేసినంత మాత్రాన దురాచారాలు రూపుమాసిపోవు.

ఋ) హెచ్చుతగ్గులు : ధనిక, పేద అనే హెచ్చుతగ్గులు సమాజంలో చాలా ఎక్కువగా ఉన్నాయి.

V. సృజనాత్మకత

* వరకట్నానికి రోజూ ఎంతో మంది బలైపోతున్నారు. వాటిని గురించి పత్రికల్లో, టి.విల్లో రోజూ చూస్తూనే ఉన్నాం. వరకట్నం లాంటి భయంకరమైన దురాచారాన్ని నిర్మూలించాలనే భావం ప్రజల్లో కలిగేటట్లు “పోస్టర్” తయారు చేయండి.
జవాబు:
వరకట్నం వద్దు – కోడలే ముద్దు

సోదర సోదరీమణులారా ! నిత్యం మనం పత్రికల్లో వరకట్న బాధితుల వివరాలను చదువుతున్నాం. టి.విల్లో వరకట్నం సరిపడ ఇవ్వలేదనీ, ఇంకా ఇమ్మనీ, పుట్టింటి ఆస్తులు తెగనమ్మి పట్టుకురమ్మనీ బాధించే భర్తల గురించి, అత్తమామల గురించి, ఆడపడుచుల గురించి చూస్తున్నాం. మీ ఇంటికి వచ్చిన కోడలిని లక్ష్మీదేవిగా భావించి, ఆదరించాలి. మీ కోడళ్ళను, మీ కన్నబిడ్డలుగా చూడాలి.

మీరు మీ కోడళ్ళను ప్రేమగా చూస్తే, మీ ఆడుబిడ్డలను వాళ్ళ అత్తవారు అలాగే చూస్తారు. మీరు మీ కోడళ్ళను సూటిపోటీ మాటలు అనేటప్పుడు మీ కన్నబిడ్డలకు ఆ పరిస్థితే ఎదురయితే ఎలా ఉంటుందో ఆలోచించండి. కాబట్టి మీరు మీ ఆడపిల్లలకు కట్నం ఇవ్వకండి. మీరు తీసుకోకండి. మీ ఆడపిల్లలను బాగా చదివించండి. వారు కూడా సంపాదించేలా తయారుచేయండి. మీ మగపిల్లలతో సమంగా ఆడపిల్లలకు మీ ఆస్తి పంచి ఇవ్వండి. “ఇలా మీరంతా దీక్షపట్టండి. ప్రతిజ్ఞ చెయ్యండి.” “వరకట్నం ఇవ్వం. వరకట్నం తీసుకోము.” ఇదే మా ప్రతిజ్ఞ.

AP Board 8th Class Telugu Solutions Chapter 10 సంస్కరణ

(లేదా)
* ఈ మధ్య కాలంలో పెండ్లిళ్ళు, ఇతర కార్యక్రమాల్లో సుమారు 20% ఆహార పదార్థాలు వృథా అవుతున్నట్లు నివేదికలు తెలుపుతున్నాయి. దీన్ని అరికట్టడానికి నియమావళి రూపొందించి పోస్టర్ రూపొందించండి.
* శుభకార్యాలలో ఆహార పదార్థాల వృథాను అరికట్టడానికి ప్రజలను ఉద్దేశిస్తూ కరపత్రం రాయండి.
జవాబు:
పెళ్ళిళ్ళలో ఆహారపదార్థాల దుర్వ్యయం అరికడదాం

మిత్రులారా ! నిత్యావసర వస్తువుల ధరలు నిత్యం పెరిగిపోతున్నాయి. దేశ జనాభా పెరిగిపోతోంది. మన రైతులు చెమటోడ్చి పండించే పంటలు, దేశజనాభాకు సరిపోవడం లేదు.

మనలో చాలామంది పెళ్ళిళ్ళకు, చిన్న చిన్న కార్యక్రమాలకు వందల మందికి విందు చేస్తున్నాము. పిలిచిన వారందరూ రాకపోవడం, పూర్తిగా తినకపోవడం వల్ల కనీసం 30% పదార్థాలు మిగిలిపోతున్నాయి. అవి వృథా అవుతున్నాయి.

మనం కింది నియమాలు చేసికొందాం :

  1. పెళ్ళికి 100 మంది అతిథులు మించరాదు.
  2. చిన్న చిన్న శుభకార్యాలకు 10 మంది మించరాదు.
  3. మిగిలిన ఆహార పదార్థాలను వృద్ధాశ్రమాలకు గాని, అనాథ శరణాలయాలకు గాని తీసుకెళ్ళి వారికి పంచిపెట్టాలి. అంతేకాకుండా వండించేటప్పుడు తగిన పాళ్ళలో వండించాలి.
  4. మిగిలిన ఆహారపదార్థాలు పేదసాదలకు అన్నదానం చేయించాలి.
  5. వ్యర్థ పదార్థాలను బయట పడవేస్తే దానికి జరిమానా విధించాలి.

VI. ప్రశంస

* రంగాపురం గ్రామంలో రాధ 10వ తరగతి చదువుతున్నది. ఆమెకు వివాహం నిశ్చయమైంది. ఆ గ్రామంలోని ‘బాలల హక్కుల వేదిక’ సభ్యులు వెళ్ళి బాల్యవివాహం జరపడం వల్ల నష్టాలను ‘రాధ’ తల్లిదండ్రులకు వివరించారు. బాల్య వివాహాన్ని ఆపారు. రాధ తన చదువును తిరిగి కొనసాగించింది. రాధ వివాహం ఆపిన ‘బాలల హక్కుల వేదిక’ను అభినందిస్తూ ఒక లేఖ రాయండి.
జవాబు:

లేఖ

అనంతపురం,
x x x x x x x x

‘బాలల హక్కుల వేదిక’ వారికి,
రామాపురం,
బంటుమిల్లి మండలం,
కృష్ణాజిల్లా,
ఆంధ్రప్రదేశ్.

మిత్రులారా,
మీరు సాధించిన ఘనవిజయాన్ని గూర్చి పత్రికలో చదివాము. మీ వేదిక సభ్యులు ‘రాధ’ అనే 10వ తరగతి చదివే 15 సంవత్సరాల అమ్మాయికి నిశ్చయమైన బాల్యవివాహాన్ని ఆపుచేయించారని తెలిసింది. బాల్యవివాహం వల్ల రాధ జీవితంలో ఎదుర్కోవలసిన కష్టాలను, ఆమె తల్లిదండ్రులకు వివరించి చెప్పి ఆ పెళ్ళిని జరగకుండా మీరు ఆపు చేయించారని తెలిసి మేము ఎంతో ఆనందించాము. మీరు చాలా మంచిపని చేశారు. రాధకు తిరిగి చదువుకొనే అవకాశం కల్పించి, ఆమె జీవితంలో వెలుగు రేఖలు ప్రసరించేలా చేశారు. మీకు మా ప్రత్యేక అభినందనలు. ధన్యవాదములు.

మీ వేదిక సభ్యులందరికీ మా కృతజ్ఞతలు.

ఇట్లు,
స్నేహ బాల సంఘం,
అనంతపురం,
ఆంధ్రప్రదేశ్.

చిరునామా:
బాలల హక్కుల వేదిక,
రామాపురం,
బంటుమిల్లి మండలం,
కృష్ణాజిల్లా, ఆంధ్రప్రదేశ్.

ప్రాజెక్టు పని

* సంఘంలో దురాచారాలను రూపుమాపటం కోసం కృషిచేసిన సంఘసంస్కర్తల చిత్రపటాలు, వారి సేవల వివరాలు పాఠశాల గ్రంథాలయం నుండి / పత్రికల నుండి సేకరించి ప్రదర్శించండి.
జవాబు:
AP Board 8th Class Telugu Solutions Chapter 10 సంస్కరణ 2
1) ఆధునిక భారతదేశ సంఘసంస్కర్తలలో అగ్రగణ్యుడు రాజారామ్మోహన్ రాయ్. భారతీయ సాంఘిక పునరుజ్జీవనోద్యమ పితామహునిగా ఆయనను పేర్కొంటారు. సతీసహగమన నిషేధానికి, స్త్రీ విద్య, ఆధునిక విద్యా వ్యాప్తికి తన జీవితాన్ని అంకితం చేసెను. ఆయన చేసిన విజ్ఞప్తికి స్పందించి లార్డ్ బెంటింక్ ‘సతీసహగమన నిషేధ’ చట్టాన్ని జారీ చేసెను. రాజా రామమోహన్ రాయ్ ‘బ్రహ్మసమాజము’ను స్థాపించెను.

AP Board 8th Class Telugu Solutions Chapter 10 సంస్కరణ 3
2) కందుకూరి వీరేశలింగం (1848 – 1919) గొప్ప సంఘసంస్కర్త. ఆధునిక సాహిత్య యుగకర్త. స్త్రీ పునర్వివాహ ఉద్యమకర్త. ఆయన రచించిన ‘రాజశేఖర చరిత్ర’ తెలుగులో తొలి నవల. స్వీయచరిత్ర, ఆంధ్రకవుల చరిత్ర. ఇతర రచనలు, వివేకవర్ధిని, సతీహితబోధిని ఆయన ప్రారంభించిన తెలుగు పత్రికలు.

AP Board 8th Class Telugu Solutions Chapter 10 సంస్కరణ 4
3) రాజారామ్మోహన్ రాయ్ తరువాత అంతటి పేరొపొందిన సంఘసంస్కర్త, గొప్ప సంస్కృత పండితుడు, విద్యావేత్త ఈశ్వర చంద్ర విద్యాసాగర్. కలకత్తా సంస్కృత కళాశాలకు ప్రిన్సిపాల్ గా పనిచేశారు. వితంతు పునర్వివాహానికి చట్టబద్ధత కల్పిస్తూ 1856లో శాసనం వెలువడటం వెనుక ఈశ్వరచంద్ర విద్యాసాగర్ కృషి ఎంతగానో ఉంది. అనేక బాలికల పాఠశాలలను స్థాపించి స్త్రీ విద్యకై కృషి చేశారు.

AP Board 8th Class Telugu Solutions Chapter 10 సంస్కరణ 5
4) గోవింద రనడే గొప్ప మత, సాంఘిక సంస్కరణవేత్త. బాల్యవివాహాల నిషేధానికి, పరదా పద్ధతి తొలగించడానికి కృషి చేశారు. ‘ఇండియా నేషనల్ సోషల్ కాన్ఫరెన్స్’ను ప్రారంభించారు. ప్రార్థనా సమాజ అభివృద్ధికి కృషి చేశారు.

AP Board 8th Class Telugu Solutions Chapter 10 సంస్కరణ 6
5) శ్రీ నారాయణ గురు స్వాతంత్ర్యోద్యమ కాలంలోని దక్షిణాది సంఘసంస్కర్తలలో ఒకరు. ఆయన గొప్ప పండితుడు. తత్త్వవేత్త. కేరళ వజ్జవ కులంలో జన్మించిన ఆయన అంటరానితనాన్ని నిర్మూలించారు.

VII. భాషను గురించి తెలుసుకుందాం

1. కింది పదాలను ఏం చేసి, సంధి పేరు రాయండి.
ఉదా :
చేసినంత = చేసిన + అంత – అత్వసంధి
అ) ఎక్కడైనా = ఎక్కడ + ఐనా – అత్వసంధి
ఆ) కారణమని = కారణము _ అని – ఉత్వసంధి
ఇ) బాధిస్తున్న = బాధిస్తు + ఉన్న – ఉత్వసంధి
ఈ) నిజమే = నిజము + ఏ – ఉత్వసంధి
ఉ) ఏమైన = ఏమి + ఐన – ఇత్వసంధి
ఊ) లేరనడం = లేరు + అనడం – ఉత్వసంధి
ఋ) హీనుడైన = హీనుడు + ఐన – ఉత్వసంధి

2. కింది సమాస పదాలకు విగ్రహవాక్యాలు రాసి, సమాసం పేరు రాయండి.
ఉదా :
సంఘసంస్కర్తలు – సంఘమును సంస్కరించేవారు – ద్వితీయా తత్పురుషం
అ) వరకట్నం = వరుని కొరకు కట్నం – చతుర్డీ తత్పురుషం
ఆ) స్త్రీల అభ్యున్నతి = స్త్రీల యొక్క అభ్యున్నతి – షష్ఠీ తత్పురుషం
ఇ) విద్యావిహీనత = విద్యచేత విహీనత – తృతీయా తత్పురుషం
ఈ) విద్యావ్యాప్తి = విద్య యొక్క వ్యాప్తి – షష్ఠీ తత్పురుషం
ఉ) ధనవ్యయం = ధనము యొక్క వ్యయం – షష్ఠీ తత్పురుషం
ఊ) శక్తిహీనుడు = శక్తిచేత హీనుడు – తృతీయా తత్పురుషం

AP Board 8th Class Telugu Solutions Chapter 10 సంస్కరణ

3. ముందు పాఠాల్లో క్వార్థకం, చేదర్థకం, శత్రర్థకం క్రియలను గురించి తెలుసుకున్నారు కదా !
కింది వాక్యాలలో గీత గీసిన క్రియలు వేటికి సంబంధించినవో గుర్తించండి.
ఉదా :
నీటిని వృథా చేస్తే భవిష్యత్తులో ప్రజలు నీటి కోసం ఇబ్బందులు పడ్డారు. – చేదర్థకం
అ) టి.వి. ఎక్కువగా చూస్తే విలువయిన సమయం వృథా అవుతుంది. – చేదర్థకం
ఆ) అప్పన్న కొట్టు కుళ్ళి మంచివి ఏరి తీసుకురా! – క్వార్థకం
ఇ) దీప దిక్కులు చూస్తూ నడుస్తోంది. – శత్రర్థకం
ఈ) అఖిల పాటలు వింటూ ముగ్గులు వేస్తున్నది. – శత్రర్థకం
ఉ) మేధావంతుల వలస తగ్గితే మన దేశాభివృద్ధి వేగం పుంజుకుంటుంది. – చేదర్థకం
ఊ) మీ అక్క భోజనం చేసి లేవలేకపోతుందేమో? – క్వార్థకం
ఋ) మహేశ్ తేనీరు తాగుతూ పత్రిక చదువుతున్నాడు. – శత్రర్థకం

తత్పురుష సమాసాలు :
విభక్తులు ఆధారంగా ఏర్పడే తత్పురుష సమాసాల గురించి తెలుసుకున్నారు కదా ! కింది వాటిని కూడా పరిశీలించండి.
1) పూర్వకాయము – కాయము యొక్క పూర్వము

పై దానిలో ‘పూర్వ’ అనే పదానికి ‘ము’ అనే ప్రథమా విభక్తి ప్రత్యయం చేరడం వల్ల ‘పూర్వము’గా మారింది. ఇలా మొదటి పదానికి ప్రథమా విభక్తి ప్రత్యయం రావడాన్ని ‘ప్రథమా తత్పురుష సమాసం’ అంటాం.

* సమాసంలో పూర్వపదానికి ప్రథమా విభక్తి ప్రత్యయం చేరడమే ప్రథమా తత్పురుష, అంటే విగ్రహవాక్యంలో విభక్తి ప్రత్యయాలు (డు, ము, వు, లు) చేరతాయి.

దీనినే ఏకదేశి సమాసం అని కూడా అంటారు. సాధారణంగా తత్పురుష సమాసాలలో ఉత్తరపదార్థానికి ప్రాధాన్యం ఉంటుంది. కాని ఏకదేశి సమాసం అంటే పూర్వపదార్థ ప్రధానంగల తత్పురుష సమాసం. కింది వాటిని పరిశీలించండి.
1) నఞ్ + సత్యం అసత్యం = సత్యం కానిది
2) నఞ్ + న్యాయము = అన్యాయము = న్యాయము కానిది
3) నఞ్ + ఉచితం = అనుచితం = ఉచితము కానిది

సంస్కృతంలో ‘నఞ్’ అనేది వ్యతిరేకార్థ బోధకం. దీనికి బదులు తెలుగులో అ, అన్ అనే ప్రత్యయాలు వాడుతారు. పై ఉదాహరణల్లో వాడిన ‘నః’ అనే అవ్యయాన్ని అనుసరించి, దీన్ని “నఞ్ తత్పురుష సమాసం” అంటారు.

5. కింది పదాలకు విగ్రహవాక్యాలు, సమాస పదాలు రాసి, సమాసం పేరు రాయండి.

సమాస పదంవిగ్రహవాక్యంసమాసం పేరు
అ) అర్ధరాత్రిరాత్రి యొక్క అర్ధముప్రథమా తత్పురుష సమాసం
ఆ) అనూహ్యముఊహ్యము కానిదినఞ్ తత్పురుష సమాసం
ఇ) అక్రమంక్రమం కానిదినఞ్ తత్పురుష సమాసం

6. తత్పురుష సమాసానికి చెందిన పదాలను ఇంతకు ముందు పాఠాల్లో వెదకండి. పట్టికలో రాయండి.

సమాసం పేరువిగ్రహవాక్యంసమాస పదం
1) ప్రథమా తత్పురుష సమాసంఅర్ధము యొక్క ప్రథమముప్రథమార్ధము
2) ద్వితీయా తత్పురుష సమాసంకృష్ణుని ఆశ్రయించిన వాడుకృష్ణాశ్రితుడు
3) తృతీయా తత్పురుష సమాసంజలముతో అభిషేకముజలాభిషేకము
4) చతుర్డీ తత్పురుష సమాసములోకము కొఱకు హితములోకహితములు
5) పంచమీ తత్పురుష సమాసందొంగ వలన భయముదొంగభయము
6) షష్ఠీ తత్పురుష సమాసంజటల యొక్క పంక్తిజటాపంక్తి
7) సప్తమీ తత్పురుష సమాసంతటము నందలి భూజములుతటభూజములు
8) నఞ్ తత్పురుష సమాసంక్షరం కానిదిఅక్షరం

వ్యాకరణంపై అదనపు సమాచారం

పర్యాయపదాలు

కృషి : సేద్యం, వ్యవసాయం
ధనం : డబ్బు, సంపద, విత్తము
మిత్రుడు : స్నేహితుడు, నేస్తము, సఖుడు
శక్తి : సామర్థ్యం, బలము
ఏవగింపు : అసహ్యం, రోత, జుగుప్స
హర్షము : ఆనందం, సంతోషం
స్త్రీ : మహిళ, వనిత, ఉవిద
మంత్రి : ప్రధాని, సచివుడు, ప్రెగడ
సహకారం : సహాయం, తోడ్పాటు

వ్యుత్పత్యర్థాలు

మిత్రుడు : అన్ని ప్రాణుల యందు సమభావన కలవాడు (స్నేహితుడు)
సత్యం : సత్పురుషుల యందు పుట్టినిది (నిజం)
శాసనం : దీని చేత శిక్షింపబడును (ఆజ్ఞ)

నానార్థాలు

సత్యం – సత్తు, పూజ్యము, సాధువు
ప్రయత్నం – కృషి, సేద్యం, పరిశ్రమ
ప్రజ – జనం, సంతతి, పుట్టుట
చైతన్యం – ప్రాణం, తెలివి, ప్రకృతి
శక్తి – బలిమి, పార్వతి, పరాశరుని తండ్రి
కళ్యాణం – వివాహం, బంగారం, అక్షయం
ఘనం – మేఘం, శరీరం, గొప్పది
కృషి – సేద్యం, యత్నం

సంధులు

సవర్ణదీర్ఘ సంధి :
సూత్రం : అ, ఇ, ఉ, ఋ లకు సవర్ణములైన అచ్చులు పరమైనప్పుడు వాని దీర్ఘములు ఏకాదేశమగును.
వ్యతిరేకాభిప్రాయం = వ్యతిరేక + అభిప్రాయం – సవర్ణదీర్ఘ సంధి

యణాదేశ సంధి :
సూత్రం : ఇ, ఉ, ఋ లకు సవర్ణముకాని అచ్చు పరమగునప్పుడు క్రమముగా య, వ, రలు ఆదేశమగును.
అభ్యున్నతి = అ + ఉన్నతి – యణాదేశ సంధి

అత్వసంధి :
సూత్రం : అత్తునకు సంధి బహుళముగానగు.
చేసినంత = చేసిన + అంత – అత్వ సంధి
ఎక్కడైనా = ఎక్కడ + ఐనా – అత్వ సంధి
ఐనప్పుడు = ఐన + అప్పుడు – అత్వ సంధి
తగినంత = తగిన + అంత – అత్వ సంధి

లు ల న ల సంధి :
సూత్రం : లు, ల, న లు పరమైనపుడు ఒక్కొక్కపుడు ముగాగమానికి లోపమూ, దాని పూర్వ స్వరానికి దీర్ఘమూ విభాషగా వస్తాయి.
మాత్రాన = మాత్రము + న – లు ల సంధి
తరాలు = తరము + లు – లుల సంధి
వివాహాలు = వివాహము + లు – లు ల న ల సంధి
అవకాశాలు = అవకాశము + లు – లు ల న ల సంధి

ఇత్వసంధి :
సూత్రం : ఏమి మొదలైన పదాల్లోని ఇత్తునకు సంధి వైకల్పికంగా అవుతుంది.
ఒక్కటే = ఒక్కటి + ఎ – ఇత్వ సంధి

గసడదవాదేశ సంధి :
సూత్రం : ప్రథమ మీది పరుషాలకు గసడదవలు బహుళంగా వస్తాయి.
సరిగదా = సరి + కదా – గసడదవాదేశ సంధి

సమాసాలు

సమాస పదంవిగ్రహవాక్యంసమాసం పేరు
యువతీయువకులుయువతియును, యువకుడునుద్వంద్వ సమాసం
హెచ్చుతగ్గులుహెచ్చును, తగ్గునుద్వంద్వ సమాసం
వధూవరులువధువును, వరుడునుద్వంద్వ సమాసం
బంధుమిత్రులుబంధువులు, మిత్రులుద్వంద్వ సమాసం
బాల్యవివాహాలుబాల్యము నందలి వివాహములుసప్తమీ తత్పురుష సమాసం
సంస్కరణ ప్రయత్నంసంస్కరణ యొక్క ప్రయత్నంషష్ఠీ తత్పురుష సమాసం
స్త్రీల అభ్యున్నతిస్త్రీల యొక్క అభ్యున్నతిషష్ఠీ తత్పురుష సమాసం
విద్యావ్యాప్తివిద్య యొక్క వ్యాప్తిషష్ఠీ తత్పురుష సమాసం
వరకట్నంవరుని కొరకు కట్నంచతుర్డీ తత్పురుష సమాసం
పెనుభూతముపెద్దదైన భూతమువిశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
దురాచారందుష్టమైన ఆచారంవిశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
ముఖ్యమంత్రిముఖ్యమైన మంత్రివిశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
ముఖ్య సమస్యలుముఖ్యమైన సమస్యలువిశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
జటిల సమస్యజటిలమైన సమస్యవిశేషణ పూర్వపద కర్మధారయ సమాసం

ప్రకృతి – వికృతులు

మంత్రి – మంతిరి
వివాహం – వియ్యము
రూపము – రూపు
స్త్రీ – ఇంతి
విద్య – విద్దె
దూరము – దవ్వు
శ్రీమతి – సీమాటి
ఆశ్చర్యం – అచ్చెరువు
గౌరవం – గారవము
విషయం – విసయం
సత్యం – సత్తు
నిజం – నిక్కం

రచయిత పరిచయం

రచయిత : “శ్రీ నండూరి రామమోహనరావు”

జన్మస్థలం : వీరు కృష్ణాజిల్లా “విస్సన్నపేట”లో జన్మించారు.

జీవిత కాలం : 1927 – 2011.

ప్రసిద్ధి : రామమోహనరావుగారు, తెలుగు పాత్రికేయులలో సుప్రసిద్ధులు. వీరు జ్యోతి, ఆంధ్రజ్యోతి, బాలజ్యోతి, వనితా జ్యోతి మొదలైన పత్రికలలో సంపాదకులుగా పనిచేశారు.

రచనలు : వీరు పిల్లల కోసం కొన్ని ఇంగ్లీషు నవలలను, తెలుగులోనికి అనువదించి రాశారు. 1) “చిలక చెప్పిన రహస్యం”, 2) “మయూరకన్య” అనే పిల్లల నవలలూ, 3) “హరివిల్లు” పేరిట పిల్లల గేయాలు రాశారు. నండూరి వారి సంపాదకీయ వ్యాసాలు అయిన “అనుపల్లవి”, ! “చిరంజీవులు”, “నండూరి రామమోహనరావు వ్యాఖ్యావళి” పేరిట సంకలనాలుగా వచ్చాయి.

అవార్డులు : తెలుగు విశ్వవిద్యాలయం వీరికి గౌరవ డాక్టరేట్ ఇచ్చి గౌరవించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం , వీరిని “ఉత్తమ పాత్రికేయుడు” అవార్డు నిచ్చి సత్కరించింది.

కఠిన పదాలకు అర్థాలు

శాసనాలు = చట్టాలు
సాంఘిక సంస్కరణ = సంఘాన్ని చక్కజేయడం
ఆవశ్యకత = అవసరము
ప్రస్పుటించాలి = ప్రకాశించాలి; వెల్లడించాలి
చెదురు మదురు = అక్కడక్కడ
పరిణామం = మార్పు
రూపుమాపు = నశింపజేయు
మహామహులు = గొప్పవారు
ఏవగింపు = రోత
నిర్మూలన = పెల్లగించుట, నాశనం
పెనుభూతం = పెద్ద దయ్యం

AP Board 8th Class Telugu Solutions Chapter 10 సంస్కరణ

అభ్యున్నతి = అభివృద్ధి
అవరోధాలు = ఆటంకాలు
విద్యావిహీనత = విద్య లేకపోవడం
జటిల సమస్య = పెనగొనిన సమస్య (చిక్కు సమస్య)
ప్రయత్నపూర్వకంగా = ప్రయత్నం చేయడం ద్వారా
విద్యాశూన్యులు = విద్య చేత శూన్యులు (చదువు రానివారు)
ప్రతిష్ఠ = గౌరవం; కీర్తి
ధనవ్యయం = ధనాన్ని ఖర్చు చేయడం
పరిగణించడం = లెక్కించడం
హర్షించదు = సంతోషించదు
శక్తిహీనుడు = శక్తిలేనివాడు
ఏహ్యభావాన్ని = రోతను

AP Board 9th Class Telugu Important Questions Chapter 4 ప్రేరణ

AP State Syllabus AP Board 9th Class Telugu Important Questions Chapter 4 ప్రేరణ

AP State Syllabus 9th Class Telugu Important Questions 4th Lesson ప్రేరణ

9th Class Telugu 4th Lesson ప్రేరణ Important Questions and Answers

I. అవగాహన – ప్రతిస్పందన

1. ఈ క్రింది గద్యాన్ని చదివి, ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

నేను రామనాథపురంలో ఉన్న కాలంలో మా అనుబంధం గురుశిష్య సంబంధాన్ని దాటి వికసించింది. ఆయన సాహచర్యంలో ఒకరి జీవిత గమనాన్ని ఎవరైనా ఏ మేరకు ప్రభావితం చేయగలరో తెలుసుకున్నాను. ఇయదురై సోలోమోన్ అంటుండేవారు. జీవితంలో విజయం పొందడానికి, ఫలితాలు సాధించడానికి నువ్వు మూడు అంశాలు మీద పట్టు సాధించాల్సి ఉంటుంది – అవి “కోరిక”, “నమ్మకం”, “ఆశపెట్టుకోవడమూ”ను.
ప్రశ్నలు:
1. పై పేరాలో గురువు ఎవరు?
2. ఆయన ఏ అంశాలపై పట్టు సాధించాలని చెప్పారు?
3. దేనికోసం అంశాలపై పట్టు సాధించాలి?
4. ‘గురుశిష్యులు’ ఏ సమాసం?
జవాబులు:
1. ఇయదురై సోలోమోన్
2. “కోరిక, నమ్మకం, ఆశపెట్టుకోవడం”
3. జీవితంలో విజయం పొందడానికీ, ఫలితలు సాధించడానికీ
4. ద్వంద్వ సమాసం

AP Board 9th Class Telugu Important Questions Chapter 4 ప్రేరణ

2. ఈ క్రింది గద్యాన్ని చదివి, ప్రశ్నలకు సమాధానాలు రాయండి. (S.A. I – 2018-19)

కలాం రామనాథపురంలో హైస్కూల్లో స్థిరపడగానే ఆయనలోని పదిహేనేళ్ళ జిజ్ఞాసువు మేల్కొన్నాడు. కలాం తన ముందు పరచుకుని ఉన్న జీవితావకాశాల గురించి ప్రత్యామ్నాయాల గురించి ఇదమిత్థంగా ఏమి తెలుసుకోలేని ఒక నవ ఔత్సాహికుడైన ఆయనకు ఉపాధ్యాయుడు ఇయదురై సోలోమన్ ఆదర్శపథ నిర్దేశకుడయ్యాడు. ఉదార విశాల దృక్పథంతో ఆయన తన తరగతి గదిలోని విద్యార్థుల్ని ఉత్సాహపరచేవాడు. మందబుద్ధి శిష్యుడు ఉత్తమ గురువు నుంచి నేర్చుకోగలిగే దానికన్నా ఉత్తమ విద్యార్థి చెడ్డ ఉపాధ్యాయుడి నుంచి కూడా ఎక్కువ నేర్చుకోగలడనేవాడు కలాం.
ప్రశ్నలు:
1. కలామ్ గారు తనకు మార్గదర్శిగా ఎవరిని భావించారు?
2. ఉత్తమ విద్యార్థి లక్షణమేమిటి?
3. కలామ్ ఏ విషయం గూర్చి సందిగ్ధంలో ఉన్నారు?
4. పై పేరాననుసరించి ఒక ప్రశ్న తయారుచేయండి.
జవాబులు:
1. ఉపాధ్యాయుడు ఇయదురై సోలోమన్
2. చెడ్డ ఉపాధ్యాయుడి నుంచి ఎక్కువ నేర్చుకోగలగడం
3. జీవితావకాశాల గురించి, ప్రత్యామ్నాయాల గురించి
4. విద్యార్థిలో ఏ లక్షణం ఉండకుండా ఉంటే మంచిది?

3. కింది పేరా చదివి, ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.

సమాజ అభివృద్ధిలో శ్రమకు భాగం ఉంటుంది. ఒకరు మరొకరికోసం శ్రమిస్తారు. పిల్లల బాగుకోసం తల్లిదండ్రులు శ్రమిస్తారు. పంట పండించడానికి రైతు శ్రమిస్తాడు. విద్యార్థి సర్వతోముఖాభివృద్ధికి ఉపాధ్యాయుడు శ్రమిస్తాడు. దేశాన్ని శత్రువుల నుండి రక్షించడానికి సైనికుడు పడే శ్రమ అద్వితీయం. సమాజం నుంచి నువ్వు పొందుతున్నదంతా ఎవరో ఒకరు విశ్రాంతి లేకుండా కష్టపడితే వచ్చిందే. వారి శ్రమను గుర్తించి, వారిని గౌరవించి వారి పట్ల కృతజ్ఞతతో ఉండు. వారికి ఏది తిరిగి ఇవ్వగలవో ఆలోచించు. సమాజం సృష్టించిన సంపదలను పాడుచేసే హక్కు ఎవరికీ లేదు. దానిని మరింత పెంచడమే నీకు నాకు కర్తవ్యం.
ప్రశ్నలు – జవాబులు:
1. మన కర్తవ్యమేమిటి ?
జవాబు:
సమాజం సృష్టించిన సంపదలను పెంచడం.

2. ఎవరి పట్ల మనం కృతజ్ఞత కలిగి ఉండాలి?
జవాబు:
శ్రమించేవారి పట్ల

3. సైనికుడు ఏమి చేస్తాడు?
జవాబు:
దేశాన్ని సృష్టించిన సంపదలను పెంచడం.

4. పై పేరా ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి.
జవాబు:
పంట పండించడానికి ఎవరు శ్రమిస్తారు?

AP Board 9th Class Telugu Important Questions Chapter 4 ప్రేరణ

4. కింది పరిచిత గద్యాన్ని చదివి, ఇచ్చిన ప్రశ్నలకు సమాధానములు రాయండి.

నేను రామనాథపురంలో హైస్కూల్లో స్థిరపడగానే నాలోని పదిహేనేళ్ళ జిజ్ఞాసి మేల్కొన్నాడు. తనముందు పరచుకొని ఉన్న జీవితావకాశాల గురించి ప్రత్యామ్నాయాల గురించి ఇతమిద్ధంగా ఏమీ తెలుసుకోలేని ఒక నవ ఔత్సాహికుడికి నా ఉపాధ్యాయుడు ఇయదురై సోలోమోన్ ఆదర్శపథనిర్దేశకుడయ్యాడు. తన ఉదార విశాల దృక్పథంతో ఆయన తన తరగతి గదిలోని విద్యార్థుల్ని ఉత్సాహపరిచేవాడు. ‘మందబుద్ధి’ శిష్యుడు ఉత్తమ గురువు నుంచి నేర్చుకోగలిగిన దానికన్న ఉత్తమ విద్యార్థి చెడ్డ ఉపాధ్యాయుని నుంచి కూడా ఎక్కువ నేర్చుకోగలడు అనేవాడాయన.
ప్రశ్నలు – జవాబులు:
1. జిజ్ఞాసువు అంటే ఎవరు?
జవాబు:
తెలియని దానిని తెలుసుకోవాలనే ఇచ్ఛ కలవాడు.

2. కలాంకు మార్గదర్శకుడెవరు?
జవాబు:
ఉపాధ్యాయుడు ఇయదురై సోలోమోన్.

3. పై పేరా ప్రకారం నేర్చుకోవడం అనేది ఎవరిపై ఆధారపడి ఉంటుంది?
జవాబు:
విద్యార్థి

4. పై పేరాను చదివి ఒక ప్రశ్నను తయారు చేయండి.
జవాబు:
కలాం పూర్తి పేరు ఏమిటి?

5. కింది పేరా చదివి, ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి. (S.A. III – 2015-16)

భారతదేశంలో 8.7 కోట్ల మంది బాలలు పాఠశాలలకు వెళ్ళడం లేదని, వీరంతా ఇళ్ళలోను, కర్మాగారాల్లోను, పొలాల్లోను పనిచేస్తున్నారని ‘గ్లోబల్ మార్చ్ ఎగనెస్ట్ చైల్డ్ లేబర్’ అనే అంతర్జాతీయ సంస్థ పేర్కొంది. కాబట్టి బాలకార్మికుల కోసం ప్రత్యేక పాఠశాలలు నెలకొల్పాలి. వాళ్ళు చదువుకొనే అవకాశం కల్పించాలి. మనరాష్ట్రంలో 16 లక్షల మంది బాలకార్మికులు ఉన్నారు. బాలకార్మిక వ్యవస్థను పూర్తిగా రూపు మాపేందుకు ప్రభుత్వం తగుచర్యలు తీసుకొంటున్నది.
ప్రశ్నలు – జవాబులు:
1. బాలకార్మికుల స్థితిగతులపై పరిశోధన చేసిన సంస్థ ఏది?
జవాబు:
గ్లోబల్ మార్చ్ ఎగనెస్ట్ చైల్డ్ లేబర్ అనే అంతర్జాతీయ సంస్థ.

2. బాలకార్మికులు పనిలోకి వెళ్ళడానికి ప్రధాన కారణం ఏమిటి?
జవాబు:
ఆర్థిక సమస్యలు తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట లేని స్థితి వలన.

3. పై పేరాను ఆధారం చేసుకుని రెండు ప్రశ్నలను తయారు చేయండి.
జవాబు:
1) బాలకార్మిక వ్యవస్థ రూపుమాపడానికి ఏం చేయాలి?
2) మన రాష్ట్రంలో ఎంతమంది బాలకార్మికులున్నారు?

AP Board 9th Class Telugu Important Questions Chapter 4 ప్రేరణ

6. కింది పేరా చదివి, ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి. (S.A. II – 2017-18)

మోతీలాల్ నెహ్రూ భార్య పేరు స్వరూపరాణి. మంచి సుగుణవతి. ఈ దంపతులకు 1889వ సంవత్సరం నవంబరు 14న ఒక పుత్రుడు జన్మించాడు. జవహర్ అని పేరు పెట్టారు. జవహర్ అంటే రత్నం లేక మణి అని అర్థం. ఆయనే శాంతిదూతయై, భారతరత్నమై భారతదేశానికి విలువైన సేవల్ని అందించాడు. మొదటి ప్రధానిగా దేశాన్ని అభివృద్ధి పధంలోకి నడిపించాడు.
ప్రశ్నలు – జవాబులు:
1. మొదటి భారత ప్రధాని ఎవరు?
జవాబు:
జవహర్‌లాల్ నెహ్రూ

2. జవహర్ అంటే అర్థం ఏమిటి?
జవాబు:
రత్నం / మణి

3. నవంబరు 14ను ఏ దినంగా జరుపుకుంటాం?
జవాబు:
బాలల దినోత్సవం

4. ఈ పేరా ఆధారంగా ఒక ప్రశ్న తయారుచేయండి.
జవాబు:
జవహర్ తల్లి పేరేమి?

7. సజ్జన సహవాసం సత్యవాక్యాలనే పలికింపజేస్తుంది. బుద్ధిమాంద్యాన్ని పోగొడుతుంది. గౌరవాన్ని కలిగిస్తుంది. పాపాలను దూరం చేస్తుంది. కీర్తిని వ్యాపింపజేస్తుంది. మనో వికాసాన్ని కలిగింపజేస్తుంది. సజ్జన సహవాసం సమస్త ప్రయోజనాలనూ సాధిస్తుంది.
ప్రశ్నలు – జవాబులు :
1. పాపాలను దూరం చేసేది ఏది?
జవాబు:
సజ్జన సహవాసం

2. ‘కీర్తి’ వ్యతిరేకపదం ఏది?
జవాబు:
అపకీర్తి

3. ‘గౌరవం’ వికృతి పదం ఏది?
జవాబు:
గారవం

4. ‘సజ్జనులు’ విడదీయము.
జవాబు:
సత్ + జనులు

AP Board 9th Class Telugu Important Questions Chapter 4 ప్రేరణ

8. సంపదకు, సౌజన్యం, పరాక్రమానికి వాక్సంయమం, విద్యకు వినయం, మంచి జ్ఞానానికి శాంతి, అధిక ధనానికి దానం, శక్తికి ఓర్పు, ధర్మాచరణకు దంభం లేకపోవడం అలంకారాలు. ఈ అలంకారాలన్నింటి కన్నా శీలమే మేలైన అలంకారం.
ప్రశ్నలు – జవాబులు:
1. పరాక్రమానికి అలంకారం ఏది?
జవాబు:
వాక్సంయమం

2. శాంతి దేనికి అలంకారం ఏది?
జవాబు:
మంచిజ్ఞానం

3. శక్తికి అలంకారం ఏది?
జవాబు:
ఓర్పు

4. అన్నిటికన్న మేలైన అలంకారం?
జవాబు:
శీలం

9. ఈ కింది పేరా చదవండి. చదివి ఇవ్వబడిన ప్రశ్నలకు జవాబులు రాయండి. (S.A. I – 2018-19)

ముగ్గురు మిత్రులు సముద్రం దగ్గర ఉన్న ఎత్తైన ప్రాంతంలో నడుచుకుంటూ వెళ్తుంటే అక్కడొక వ్యక్తి నిలబడి ఉండటం చూశారు. మొదటి మిత్రుడు “బహుశా అతని పెంపుడు జంతువు తప్పిపోతే వెతుకుతున్నాడేమో” అన్నాడు. రెండవ మిత్రుడు “అదేం కాదు. ఎవరో స్నేహితుడు వస్తానని ఉంటాడు. అతనికోసం వచ్చినట్లున్నాడు” అన్నాడు. మూడవ మిత్రుడు “వేసవి కాలం కదా ! చల్లగాలి కోసం వచ్చినట్లున్నాడు” అన్నాడు. ముగ్గురూ వెళ్ళి” ఇక్కడికి ఎందుకు వచ్చారు ? అని అతనిని అడిగారు. అతను “ఊరికినే రావాలనిపించింది – వచ్చాను. నిలబడాలనిపించింది. నిలబడ్డాను” అన్నాడు. ముగ్గురు మిత్రులూ అవాక్కయ్యారు.

ఎదుటివారి గురించి ఏ ఆధారమూ లేకుండా ఏదేదో ఊహించుకోవడం పొరపాటు అని వారికి అర్థమైంది.
ప్రశ్నలు:
1) ఈ కథలో సందేశం ఏమిటి?
2) ఈ కథకు ఒక పేరు పెట్టండి.
3) “అవాక్కవడం” అంటే ఏమిటి?
4) పై గద్యం ఆధారంగా ఒక ప్రశ్న తయారుచెయ్యండి.
జవాబులు:
1) ఎదుట వారి గురించి ఏ ఆధారము లేకుండా ఏదేదో ఊహించుకోవడం పొరపాటు అని చెప్పడం.
2) కాలక్షేపానీకొక మాట
3) మాటరాకపోవడం
4) పై పేరాలో కాలాన్ని తెలిపే పదం గుర్తించండి.

II. స్వీయరచన

అ) క్రింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
‘ఆత్మకథ’ ప్రక్రియ గురించి రాయండి.
జవాబు:
ఒక వ్యక్తి తన జీవిత విశేషాల్ని తానే గ్రంథస్థం చేసుకుంటే అది అత్మకథ. దీనినే ‘స్వీయచరిత్ర’ అని కూడా అంటారు. ఇందులో సమకాలీన విశేషాలు ప్రతిబింబిస్తాయి. రచయిత అనుభవాలేకాక, ఆ కాలం నాటి సాంఘిక, ఆర్థిక రాజకీయ పరిస్థితులు తెలుస్తాయి. ఆత్మకథ ఇతరులకు ప్రేరణ కలిగిస్తుంది. ఇది ఉత్తమ పురుష కథనంలో ఉంటుంది.

ప్రశ్న 2.
‘ప్రేరణ’ పాఠ్యభాగ రచయిత గురించి రాయండి.
జవాబు:
‘ప్రేరణ’ పాఠ్యభాగాన్ని రచించినది డా|| అవుల్ ఫకీర్ జైనులాబీన్ అబ్దుల్ కలాం (ఏ.పి.జె. అబ్దుల్ కలాం)
జననం : 15-10-1931

మరణం : 27-07-2015

జన్మస్థలం : ధనుష్కోటి (తమిళనాడు)

రచనలు : ఒక విజేత ఆత్మకథ, ఇగ్నైటెడ్ మైండ్స్, ద వింగ్స్ ఆఫ్ ఫైర్, యాన్ ఆటోబయోగ్రఫి.

బిరుదులు : పద్మభూషణ్, పద్మవిభూషణ్, గౌరవ డాక్టరేట్లు, భారతరత్న.

ఆ) క్రింది ప్రశ్నలకు పది లేక పన్నెండు వాక్యాలలో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
‘పెద్దలమాట చద్దిమూట’ అన్నారు పెద్దలు. కలాం విషయంలో తండ్రి, గురువుల పలుకులు ఏ మేరకు ఆయన కృతకృత్యుణ్ణి చేసాయి?
జవాబు:
ఒక సామాన్య కుటుంబంలో జన్మించి, అత్యున్నత శిఖరాలను అధిరోహించిన మహనీయుని జీవితం ఎందరికో ప్రేరణ. ఆయనెవరో కాదు డా|| అవుల్ ఫకీర్ జైనులాల్దీన్ అబ్దుల్ కలామ్. ఏ.పి.జె. అబ్దుల్ కలాంగా ప్రసిద్ధులైన వీరి జీవితం అంత సాఫీగా ఏమీ సాగలేదు. అడుగడుగునా పరీక్షలతో, ఒత్తిళ్ళతో గడిచినా చివరకు విజయం సొంతం చేసుకున్నాడు. ఆయన విజయ సోపానాలకు ఆధారం గురువుల, తండ్రి మాటలే. కలాం గురువులలో ప్రథమంగా చెప్పుకోవల్సిన వ్యక్తి ఇయదురై సోలోమోన్. జీవితంలో పట్టు సాధించాల్సి ఉంటుంది. అవి “కోరిక, నమ్మకం, ఆశపెట్టుకోవడమూ” అని కలాంకి ఆదర్శపథ నిర్దేశకుడయ్యాడు. అంతేకాక “విశ్వాసంతో నువ్వు నీ విధిని కూడా తిరిగి రాయగలవు” అని ఆత్మగౌరవాన్ని మేల్కొల్పాడు.

లక్ష్యాన్ని చేరే సమయంలో వివిధ రకాల వ్యక్తులతో పరిచయాలు, వైఫల్యాలు, ఆశాభంగాలు, దారితప్పిన ప్రతివేళా కలాం తండ్రి మాటలు కలాంను మళ్ళీ సరిగా నిలబెట్టేవి. ఆ ఉత్తేజకరమైన మాటలు “ఇతరుల్ని అర్థం చేసుకున్నవాడు విజ్ఞాని. కానీ తన్ను తాను తెలుసుకున్న వాడే వివేకి. వివేకం లేని విజ్ఞానం, ప్రయోజన శూన్యం” అలాగే ప్రొఫెసర్ స్పాండర్, “నీ పరిశ్రమ నీ ఉపాధ్యాయులకి భవిష్యత్తులో మంచిపేరు తేవడానికి ఉపకరిస్తుంది. దేవుడే ఆశా, ఆశ్రయమూ, మార్గదర్శి కాగలడు. భవిష్యత్ లో నీ ప్రయాణానికి ఆయనే దారిచూపే దీపం కాగలడు” అన్న ఆ మహామేధావి మాటలు కలాం ఉన్నతికి దోహదపడ్డాయి.

AP Board 9th Class Telugu Important Questions Chapter 4 ప్రేరణ

ప్రశ్న 2.
మీరా అనే విద్యార్థిని శాస్త్రవేత్త కావాలని కోరుకుంది. ఆమె తన పాఠశాలకు వచ్చిన ఒక శాస్త్రవేత్తను ఏయే విషయాలను గురించి ప్రశ్నలను అడగ దలచినదో ఊహించి 10 ప్రశ్నలు రాయండి.
జవాబు:
మీరా : నమస్కారమండి.

  1. మీరు శాస్త్రవేత్త కావాలనే కోరిక ఏ వయసులో కలిగింది?
  2. శాస్త్రవేత్త అవడానికి గల కారణాలేమిటి?
  3. శాస్త్రవేత్త అవడానికి ప్రేరణ ఇచ్చిన ఉపాధ్యాయులు ఎవరు?
  4. మీ తల్లిదండ్రులు, కుటుంబసభ్యుల సహకారం ఎంత ఉంది?
  5. మీ స్నేహితులు ఎలా సపోర్టు చేశారు?
  6. ఆర్థికంగా ఏవైనా ఇబ్బందులు ఏర్పడ్డాయా?
  7. ఎటువంటి అభ్యాసం చేశారు?
  8. ఆరోగ్య సమస్యలు ఏమైనా వచ్చాయా?
  9. మిమ్మల్ని ముందుకు నడిపించిన మార్గదర్శకులు ఎవరు?
  10. మాలాంటి వారికి మీరిచ్చే సూచనలు ఏమిటి?

ప్రశ్న 3.
కింది వివరాల ఆధారంగా “ఏ.పి.జె. అబ్దుల్ కలాం” జీవిత విశేషాలను వర్ణనాత్మకంగా ఒక క్రమపద్ధతిలో రాయండి.
* పూర్తి పేరు : అవుల్ ఫకీర్ జైనులాథీన్ అబ్దుల్ కలామ్
* జననం : 15 అక్టోబర్, 1931
* జన్మస్థలం : రామేశ్వరం, మద్రాస్ ప్రెసిడెన్సీ (గతంలో) ధనుష్కోటి రామనాథపురం, తమిళనాడు (ఇప్పుడు)
* భారత రాష్ట్రపతి : 2002 – 2007.
* విద్య : మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (1955-1960)
* అవార్డులు : భారతరత్న, పద్మభూషణ్, పద్మ విభూషణ్, హూవర్ మెడల్
* మరణం : 27 జూలై, 2015, షిల్లాంగ్, మేఘాలయ
* రచనలు : వింగ్స్ ఆఫ్ ఫైర్
జవాబు:
అందరూ ఏ.పి.జె అబ్దుల్ కలాంగా పిలిచే డాక్టర్ అబ్దుల్ ఫకీర్ జైనుల్ ఆబిదీన్ అబ్దుల్ కలాం 1931 అక్టోబరు 15న తమిళనాడులోని రామేశ్వరం దగ్గర ధనుష్కోటి (మద్రాస్ ప్రెసిడెన్సీ (గతంలో) రామనాథపురం, తమిళనాడు (ఇప్పుడు)లో జన్మించారు. సామాన్య కుటుంబంలో పుట్టిన ఆయన పట్టుదల, క్రమశిక్షణ, జ్ఞాన జిజ్ఞాసతో మద్రాసు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో (1955-60) విద్య నభ్యసించారు. అనతికాలంలోనే ఇంజనీరుగా, శాస్త్రవేత్తగా, భారత రాష్ట్రపతిగా (2002-2007) తమ సేవలను ఈ జాతికి అందించారు.

‘ఒక విజేత ఆత్మకథ’ (ఇగ్నేటెడ్ మైండ్స్ ద వింగ్స్ ఆఫ్ ఫైర్ – యాన్ – ఆటోబయోగ్రఫీ) వంటి రచనలు చేశారు.

శాస్త్ర రంగంలో విశేష కృషి చేసినందుకు గాను పద్మభూషణ్, పద్మవిభూషణ్ తో పాటు దేశ అత్యున్నత పురస్కారం భారత రత్నతోను భారత ప్రభుత్వం సత్కరించింది. దేశవిదేశాల్లోని విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్లతో, హూవర్ మెడల్ తో ఆయనను గౌరవించాయి.

భారతదేశానికి ఒక శాస్త్రవేత్త రాష్ట్రపతి అయ్యాడని ప్రపంచమంతా ఇండియా వైపు తలయెత్తి చూసింది. అంత ఘనత నిచ్చిన ఆ మహనీయుడు జులై 27, 2015లో మేఘాలయ లోని షిల్లాంగ్ లో మరణించారు.

III. భాషాంశాలు (పదజాలం, వ్యాకరణం)

1. పర్యాయపదాలు :

స్పృహ : ఇచ్ఛ, కోరిక
వ్యతాసం : భేదం, తేడా

2. వ్యుత్పత్త్యర్థాలు :

ఉపాధ్యాయుడు : వేదమును చదివించువాడు, చదువు చెప్పువాడు (గురువు)

AP Board 9th Class Telugu Important Questions Chapter 4 ప్రేరణ

3. నానార్థాలు :

వ్యవధి = మేర, ఎడమ
నిర్దేశం = ఉపదేశం, చూపుట
చైతన్యం = తెలివి, ప్రాణం

4. ప్రకృతి – వికృతులు :

శిష్యుడు – సిసువడు
కష్టం – కసటు, కస్తి
లక్ష్యం – లేక్క
శక్తి – సత్తి
ఆశా – ఆస
త్యాగం – చాగం
శూన్యం – సున్న
భూమి బూమి
ఆసక్తి – ఆసత్తి
శాస్త్రం – చట్టం
రేఖా – రేక

5. సంధులు :

అమిత + ఆసక్తి – అమితాసక్తి – సవర్ణదీర్ఘ సంధి
విద్యా + అర్థి – విద్యార్థి – సవర్ణదీర్ఘ సంధి
రామ + ఈశ్వరం – రామేశ్వరం – గుణసంధి
తల్లి + తండ్రి – తల్లిదండ్రులు – గసడదవాదేశ సంధి
కష్ట + ఆర్జితం – కష్టార్జితం – సవర్ణదీర్ఘ సంధి
గ్రంథము + లు – గ్రంథాలు – లులనల సంధి
ఏక + ఏక – ఏకైక – వృద్ధి సంధి
ప్రతి + ఏక – ప్రత్యేక – యణాదేశ సంధి
వాక్ + దానం – వాగ్దానం – అనునాసిక సంధి

6. సమాసాలు :

గురుశిష్యులు – గురువు మరియు శిష్యుడు – ద్వంద్వ సమాసం
జీవిత గమనం – జీవితం యొక్క గమనం – షష్ఠీ తత్పురుష సమాసం
అమితాసక్తి – అమితమైన ఆసక్తి – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
దృఢ సంకల్పం – దృఢమైన సంకల్పం – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
అదృశ్యం – దృశ్యము కానిది – నఞ్ తత్పురుష సమాసం
తాగ్య నిరతి – త్యాగము నందు ఆసక్తి – సప్తమీ తత్పురుష సమాసం
జ్ఞానతృష్ణ – జ్ఞాన సంపాదనమందు ఆసక్తి – సప్తమీ తత్పురుష సమాసం
నిశిత బోధన – నిశితమైన బోధన – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం

9th Class Telugu 4th Lesson ప్రేరణ 1 Mark Bits

1. సురేఖకు అందరూ బాగుండాలని ఆకాంక్ష – (గీత గీసిన పదానికి అర్ధం గుర్తించండి) (S.A. I – 2018-19)
ఎ) ఆంక్ష
బి) కోరిక
సి) ఆశయం
డి) కోరకం
జవాబు:
బి) కోరిక

2. దేవతలు సముద్రం మధించగా, పయోధి నుంచి అమృతం సిద్ధించింది. (గీత గీసిన పదాలకు సరియగు పర్యాయ పదం గుర్తించండి) (S.A. I – 2018-19)
ఎ) సరోవరం
బి) కాసారం
సి) అకూపారం
డి) కాపారం
జవాబు:
సి) అకూపారం

AP Board 9th Class Telugu Important Questions Chapter 4 ప్రేరణ

3. పెద్దలపట్ల గారవమును ప్రదర్శించుట మంచిది – (ప్రకృతి పదం గుర్తించండి) (S.A. I – 2018-19)
ఎ) గర్వము
బి) గరువము
సి) గౌరవం
డి) గార్వం
జవాబు:
సి) గౌరవం

4. భూమి మీద ఎన్నో నిక్షేపాలున్నాయి – (గీత గీసిన పదానికి పర్యాయ పదం గుర్తించండి)(S.A. II . 2018-19)
ఎ) వసుధ – అవని
బి) వసుధ – సుధ
సి) వసుధ – ఆమని
డి) వసుధ – నింగి
జవాబు:
ఎ) వసుధ – అవని

5. మంచి వాని పథంలో పయనించాలి. ఆ దారి పదుగురికి మార్గదర్శకమవుతుంది. (గీత గీసిన పదాలకు సరియగు పర్యాయ పదం గుర్తించండి) (S.A. I – 2017-18)
ఎ) పదవి
బి) మార్గం
సి) మార్దవం
డి) మాలోకం
జవాబు:
బి) మార్గం

6. ధనం కంటే విద్య మిన్నయైనది. (అర్థం గుర్తించండి) (S.A. III – 2016-17)
ఎ) అనువు
బి) మనస్సు
సి) ఎక్కువ
డి) హృదయం
జవాబు:
సి) ఎక్కువ

7. చాలా మంచి కథలు నాన్నచేత చెప్పబడ్డాయి. (కర్తరి వాక్యాన్ని గుర్తించండి) (S.A. I – 2018-19)
ఎ) చాలా మంచి కథలు ఎవరో చెప్పారు.
బి) నాన్న చాలా మంచి కథలు చెప్పబడ్డాయి.
సి) నాన్న చాలా మంచి కథలు చెప్పాడు.
డి) మంచి కథలు ఎవరు చెప్పినా వినాలి.
జవాబు:
సి) నాన్న చాలా మంచి కథలు చెప్పాడు.

AP Board 9th Class Telugu Important Questions Chapter 4 ప్రేరణ

8. రమేష్ భారతాన్ని చదివాడు. (కర్మణి వాక్యాన్ని గుర్తించండి) (S.A. II – 2018-19)
ఎ) రమేష్ చేత భారతం చదువబడింది.
బి) రమేష్ చేత భారతం అనువదించబడింది.
సి) రమేష్ చేత భారతం చదువబడలేదు.
డి) రమేష్ చేత భారతం విడువబడింది.
జవాబు:
ఎ) రమేష్ చేత భారతం చదువబడింది.

9. నా చేత ఎన్నో పుస్తకాలు వ్రాయబడ్డాయి. (కర్తరి వాక్యాన్ని గుర్తించండి) (S.A. II – 2017-18)
ఎ) ఎన్నో పుస్తకాలు నాచేత వ్రాయబడ్డాయి.
బి) ఎన్నో పుస్తకాలను వ్రాశాను.
సి) ఎన్నో పుస్తకాలే వ్రాశాను.
డి) నేను ఎన్నో పుస్తకాలను వ్రాశాను.
జవాబు:
డి) నేను ఎన్నో పుస్తకాలను వ్రాశాను.

10. శ్రీనివాసన్ కలాంను ఆప్యాయంగా కౌగిలించుకున్నాడు. (ఈ కర్తరి వాక్యానికి కర్మణి వాక్యాన్ని గుర్తించండి.)(S.A. III – 2016-17)
ఎ) శ్రీనివాసన్ చేత కలాం ఆప్యాయంగా కౌగిలించుకోబడ్డాడు.
బి) శ్రీనివాసన్, కలాం ఒకరినొకరు కౌగిలించుకున్నారు.
సి) శ్రీనివాసన్, కలాం ఆప్యాయంగా కౌగిలించుకోబడలేదు.
డి) శ్రీనివాసన్, కలాం కౌగిలించుకోలేదు.
జవాబు:
ఎ) శ్రీనివాసన్ చేత కలాం ఆప్యాయంగా కౌగిలించుకోబడ్డాడు.

11. తమ విమానాన్ని తామే తయారు చేసుకుంటాం అని కలాం అన్నారు. (ప్రత్యక్ష కథనం గుర్తించండి) (S.A. II – 2018-19)
ఎ) “మా విమానాన్ని మేము తయారు చేయమ”ని కలాం అన్నారు.
బి) “మా విమానాన్ని మేమే తయారు చేసుకుంటాం” అని కలాం అన్నారు.
సి) “మా విమానాన్ని వేరే వారు తయారు చేస్తారు” అని కలాం అన్నారు.
డి) “మేమెప్పటికీ విమానం తయారు చేయం” అన్నారు కలాం.
జవాబు:
బి) “మా విమానాన్ని మేమే తయారు చేసుకుంటాం” అని కలాం అన్నారు.

12. గోపాల్ ఏ పనినైనా చేయగలడు. (ఏ రకమైన వాక్యమో గుర్తించండి) (S.A. II – 2018-19 S.A. II – 2017-18)
ఎ) ఆశ్చర్యార్థకం
బి) వ్యతిరేకార్థకం
సి) సామర్థ్యార్థకం
డి) అభ్యర్థకం
జవాబు:
సి) సామర్థ్యార్థకం

13. మీరు బయటకు వెళ్ళవచ్చును. (ఏ రకమైన వాక్యమో గుర్తించండి) (S.A. II – 2018-19)
ఎ) అనుమత్యర్థకం
బి) ప్రశ్నార్థకం
సి) నిశ్చయార్థకం
డి) శత్రర్థకం
జవాబు:
ఎ) అనుమత్యర్థకం

14. ‘లోపలికి రావడం’ (అనుమత్యర్థకం గుర్తించండి) (S.A. II – 2017-18) (ఎ)
ఎ) లోపలికి రావచ్చు
బి) లోపలికి రా
సి) లోపలికి రావద్దు
డి) లోపలికి రాగలడు
జవాబు:
ఎ) లోపలికి రావచ్చు

AP Board 9th Class Telugu Important Questions Chapter 4 ప్రేరణ

15. ఏదో ఓ కొత్త విషయం చెప్పాలి. (వాక్యానికి వ్యతిరేకార్థం వచ్చే వాక్యాన్ని గుర్తించండి.) (S.A. III – 2016-17)
ఎ) ఏదో ఓ కొత్త విషయం చెప్పకూడదు.
బి) ఏదో ఓ కొత్త విషయం చెప్పేశాడు.
సి) ఏదో ఓ కొత్త విషయం చెప్పను.
డి) ఏదో ఓ కొత్త విషయం చెప్పలేదు.
జవాబు:
ఎ) ఏదో ఓ కొత్త విషయం చెప్పకూడదు.

భాషాంశాలు (పదజాలం, వ్యాకరణం)

1. అర్థాలు :

16. ప్రతి విద్యార్థి ఒక లక్ష్యంతో చదవాలి – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
A) పంతం
B) గురి
C) సరదా
D) నిర్లక్ష్యం
జవాబు:
A) పంతం

17. ప్రతిభ ఉంటే గుర్తింపు అదే వస్తుంది – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
A) నేర్పు
B) బద్దకం
C) తెలివి
D) వినయం
జవాబు:
C) తెలివి

AP Board 9th Class Telugu Important Questions Chapter 4 ప్రేరణ

18. చైతన్యం లేకపోతే పశువుకి, మనిషికి తేడా ఏమిటి? – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
A) జ్ఞానం
B) కదలిక
C) మాట
D) నిద్ర
జవాబు:
A) జ్ఞానం

19. స్వార్థం విడిచి, దేశ ప్రగతికోసం అందరూ ప్రయత్నించాలి – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
A) కులం
B) మతం
C) ప్రాంతం
D) అభివృద్ధి
జవాబు:
D) అభివృద్ధి

20. ఉత్తములైన పెద్దల ఆధ్వర్యంలో ముందుకు నడవాలి – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
A) ఆశీస్సు
B) పెత్తనం
C) ఇష్టం
D) మాట
జవాబు:
B) పెత్తనం

21. నాలోని పదిహేనేళ్ళ జిజ్ఞాస మేల్కొంది – గీత గీసిన పదానికి అర్థం ఏమిటి?
A) జ్ఞానము
B) అజ్ఞానము
C) తెలుసుకోవాలనే కోరిక
D) విజ్ఞానం
జవాబు:
C) తెలుసుకోవాలనే కోరిక

AP Board 9th Class Telugu Important Questions Chapter 4 ప్రేరణ

22. మా ఉపాధ్యాయుడు విద్యార్థులందరిలో ఏదో ఒక విలువ గురించి స్మృహని మేల్కొల్పేవాడు – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
A) జానం
B) కోరిక
C) ప్రేమ
D) వైరాగ్యం
జవాబు:
B) కోరిక

2. పర్యాయపదాలు :

23. సామాజిక స్పృహతో ప్రతి ఒక్కరు మసలుకోవాలి – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
A) ఇచ్ఛ, ఆకలి
B) కోరిక, క్షామం
C) ఇచ్ఛ, కోరిక
D) కాంక్ష, ఒత్తిడి
జవాబు:
C) ఇచ్ఛ, కోరిక

24. ధనిక, పేద అనే వ్యత్యాసం తొలగినపుడే సమాజం బాగుంటుంది – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి
A) భేదం, ప్రబోధం
B) తేడా, భేదం
C) తేడా, కలయిక
D) కూడిక, తేడా
జవాబు:
B) తేడా, భేదం

25. వారు తమ నిశిత బోధనల వల్ల నాలో తృష్ణని జాగరితం చేశారు – గీత గీసిన పదానికి సమానార్థక పదం ఏది?
A) మేల్కొల్పడం
B) పెంచడం
C) తగ్గించడం
D) అధికం
జవాబు:
A) మేల్కొల్పడం

26. అపరిచితుల గుంపులో నీ పాతమిత్రుడిని పసిగట్టడం వంటిది – గీత గీసిన పదానికి సమానార్థాన్ని గుర్తించండి.
A) తెలియడం
B) వెదకడం
C) సూచనగా తెలిసికోవడం
D) గుర్తింపకపోవడం
జవాబు:
C) సూచనగా తెలిసికోవడం

27. అది నా తండ్రికి తలకు మించిన ఖర్చు – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
A) తాత, అత్త
B) జనకుడు, అయ్య
C) నాన్న, అమ్మ
D) ఆర్య, పిత
జవాబు:
B) జనకుడు, అయ్య

AP Board 9th Class Telugu Important Questions Chapter 4 ప్రేరణ

28. ఉపాధ్యాయుడు సోలోమాన్ మాకు మార్గనిర్దేశకుడు గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
A) ఆచార్యుడు, పూజారి
B) గురువు, ఛాత్రుడు
C) అధ్యాపకుడు, ఒజ్జ
D) ఒజ్జ, మిత్రుడు

29. విశ్వాసంతో నీవు, నీ విధిని తిరిగి రాయగలవు – గీత గీసిన పదానికి పర్యాయపదాలు ఏవి?
A) కర్మం, ధర్మం
B) అదృష్టం, దురదృష్టం
C) బ్రహ్మ, చతురాననుడు
D) తలరాత, విధాత
జవాబు:
C) బ్రహ్మ, చతురాననుడు

3. వ్యుత్పత్తరాలు :

30. వేదమును చదివించువాడు – అనే వ్యుత్పత్తి గల పదాన్ని గుర్తించండి.
A) గురువు
B) వేదవ్యాసుడు
C) ఉపాధ్యాయుడు
D) వేదజ్ఞుడు
జవాబు:
C) ఉపాధ్యాయుడు

31. ‘గురువు‘ గారు ఇటురారు – గీత గీసిన పదానికి వ్యుత్పత్త్యర్థం గుర్తించండి.
A) జ్ఞానం ఇచ్చేవాడు
B) అంధకారమనే అజ్ఞానాన్ని ఛేదించేవాడు
C) చీకటి పోగొట్టేవాడు
D) వెలుగును ప్రసాదించేవాడు
జవాబు:
B) అంధకారమనే అజ్ఞానాన్ని ఛేదించేవాడు

4. నానార్థాలు :

32. ప్రతి ఒక్కరు చదువు ద్వారా చైతన్యవంతులు – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
A) జ్ఞానం, అజ్ఞానం
B) తెలివి, ప్రాణం
C) ప్రాణం, నీరు
D) తెలివి, స్పర్శ
జవాబు:
B) తెలివి, ప్రాణం

33. పెద్దలు నిర్దేశించిన పనులనే పిల్లలు చేయాలి – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
A) ఉపదేశం, ఆదేశం
B) చూపుట, ఆజ్ఞ
C) ఉపదేశం, చూపుట
D) మాట, పాట
జవాబు:
C) ఉపదేశం, చూపుట

34. వ్యవధులు దాటితే అవరోధాలు ఎదురవుతాయి – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
A) మేర, ఎడమ
B) హద్దు, పొద్దు
C) దారి, తెన్ను
D) కాలం, మాట
జవాబు:
A) మేర, ఎడమ

AP Board 9th Class Telugu Important Questions Chapter 4 ప్రేరణ

35. నమ్మకం, ఆశ పెట్టుకోవాలి – గీత గీసిన పదానికి నానార్థాలు ఏవి?
A) కోరిక, వాంఛ
B) ఆకాంక్ష, అపనమ్మకం
C) కోరిక, దిక్కు
D) విశ్వాసం, ప్రేమ
జవాబు:
C) కోరిక, దిక్కు

36. విధి నీతో ఆటలాడుకుంటోంది – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి. –
A) బ్రహ్మ, భాగ్యం
B) కర్తవ్యం , దేవుడు
C) దైవం, పరమాత్మ
D) కాలం, కర్మం
జవాబు:
A) బ్రహ్మ, భాగ్యం

5. ప్రకృతి – వికృతులు :

37. గురు శిష్య సంబంధం లోకంలో అత్యున్నతమైనది -గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.
A) శిశువు
B) సిసువుడు
C) చట్టు
D) సిశువు
జవాబు:
B) సిసువుడు

38. ఆశకు లోనై మనిషి పతనమౌతున్నాడు – గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.
A) అస
B) ఆసా
C) ఆస
D) అసా
జవాబు:
C) ఆస

39. చదువుపట్ల ఆసక్తి ఉండాలి – గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.
A) ఆసత్తి
B) ఇష్టం
C) అసత్తి
D) ఆస
జవాబు:
A) ఆసత్తి

40. ‘కష్టేఫలి‘ అన్నారు పెద్దలు – గీత గీసిన పదానికి వికృతి
A) కస్టం
B) కాస్తి
C) కషటు
D) కసటు
జవాబు:
D) కసటు

41. ఎందరో వీరుల త్యాగఫలం మననేటి స్వేచ్చకు మూలధనం – గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.
A) తాగం
B) చాగం
C) దానం
D) కష్టం
జవాబు:
B) చాగం

AP Board 9th Class Telugu Important Questions Chapter 4 ప్రేరణ

42. పెద్దలమాట లక్ష్యం లేనపుడు పతనానికి దారితీస్తుంది – గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.
A) అశ్రద్ధ
B) శ్రద్ధ
C) లెక్క
D) పెడచెవి
జవాబు:
C) లెక్క

43. శూన్యం నిన్ను ప్రశ్నిస్తుంది. నీలో ఏముందని – గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.
A) సున్నం
B) ఆకాశం
C) చదువు
D) సున్న
జవాబు:
D) సున్న

44. జ్ఞానం ఉన్నవారే మరొకరికి పంచగలరు – గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.
A) నాన
B) గ్యానం
C) సిగ్గు
D) బుద్ధి
జవాబు:
A) నాన

45. మహాత్ముల గూర్చి రేఖా మాత్రంగా తలచుకున్న మంచి జరుగుతుంది – గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.
A) ఏ
B) తక్కువ
C) రేక
D) కొద్ది
జవాబు:
C) రేక

46. సత్తి లేనపుడు కష్టమైన పనులకు పూనుకోకూడదు – గీత గీసిన పదానికి వికృతి పదం గురించండి.
A) బలం
B) శక్తి
C) సత్తువ
D) సామర్థ్యం
జవాబు:
B) శక్తి

47. నీవు ఎక్కడికి ప్రయాణం అయ్యావు? – గీత గీసిన పదానికి వికృతి ఏది?
A) పయాణం
B) యానం
C) పయనం
D) పాయనం
జవాబు:
C) పయనం

48. బంగారు గాజులు కనబడడం లేదు – గీత గీసిన పదానికి ప్రకృతిని గుర్తించండి.
A) కనకము
B) స్వర్ణము
C) భృంగారము
D) పైడి పదం గుర్తించండి.
జవాబు:
C) భృంగారము

49. శంఖము ఊదినా, వినబడడం లేదు – గీత గీసిన పదానికి వికృతి ఏది?
A) సంకు
B) సంఖం
C) జంకు
D) సన్నాయి
జవాబు:
A) సంకు

6. సంధులు:

50. ‘విద్యార్థి’ విడదీయుము.
A) విద్యా + అర్థి
B) విద్దె + అర్థి
C) విద్య + అర్థి
D) విద + అర్థ
జవాబు:
A) విద్యా + అర్థి

51. సవర్ణదీర్ఘ సంధికి ఉదాహరణ రాయండి.
A) కష్టార్జితం
B) గ్రంథాలు
C) రామేశ్వరం
D) ప్రత్యేకం
జవాబు:
A) కష్టార్జితం

52. ‘తల్లి + తండ్రి’ – సంధి చేయండి.
A) తల్లిదండ్రి
B) తల్లితండ్రులు
C) తల్లిదండ్రులు
D) తల్లితండ్రి
జవాబు:
C) తల్లిదండ్రులు

AP Board 9th Class Telugu Important Questions Chapter 4 ప్రేరణ

53. ‘ఏకెక’ సంధి పేరు రాయండి.
A) ఆమ్రేడిత సంధి
B) వృద్ధి సంధి
C) గుణసంధి
D) యణాదేశ సంధి
జవాబు:
B) వృద్ధి సంధి

54. కింది వానిలో అనునాసిక సంధికి ఉదాహరణ ఏది?
A) రామేశ్వరం
B) అమితాసక్తి
C) గ్రంథాలు
D) వాజ్మయం
జవాబు:
D) వాజ్మయం

55. ‘ప్రతి + ఏకం’ – పదాలను కలపండి.
A) ప్రతేకం
B) ప్రతిఏకం
C) ప్రత్యేకం
D) ప్రత్యేకం
జవాబు:
C) ప్రత్యేకం

56. ‘గ్రంథాలు’ విడదీయుము.
A) గ్రంథ + ఆలు
B) గ్రంథము + లు
C) గ్రంథి + ఆలు
D) గ్రంథము + ఆలు
జవాబు:
B) గ్రంథము + లు

57. అకారానికి ఇ, ఉ, ఋ లు పరమైన క్రమంగా ఏ, ఓ, అర్లు వచ్చును. ఇది ఏ సంధి సూత్రమో గుర్తించండి.
A) సవర్ణదీర్ఘ సంధి
B) వృద్ధి సంధి
C) యణాదేశ సంధి
D) గుణసంధి
జవాబు:
D) గుణసంధి

58. ‘బలోపేతం’ పదాన్ని విడదీయండి.
A) బలో + పేతం
B) బలా + ఉపేతం
C) బల + అపేతం
D) బల + ఉపేతం
జవాబు:
D) బల + ఉపేతం

59. విద్యాభ్యాసము బాగా జరుగుతోంది – గీత గీసిన పదం ఉదాహరణను గుర్తించండి.
A) యణాదేశ సంధి
B) సవర్ణదీర్ఘ సంధి
C) వృద్ధి సంధి
D) అత్వ సంధి
జవాబు:
B) సవర్ణదీర్ఘ సంధి

60. ‘సముద్రము + గువ్వలు’ సంధి జరిగిన పిమ్మట ఏర్పడే పదం ఏది?
A) సముద్ర గువ్వలు
B) సముద్రం గువ్వలు
C) సముద్రపు గువ్వలు
D) సముద్రంలో గువ్వలు
జవాబు:
C) సముద్రపు గువ్వలు

7. సమాసాలు :

61. త్యాగనిరతి యందు తరువులే గురువులు – గీత గీసిన పదానికి సమాసం పేరు గుర్తించండి.
A) ద్వంద్వ
B) షబ్న్
C) సప్తమీ
D) ద్విగు
జవాబు:
C) సప్తమీ

62. “జ్ఞాన సంపాదనమందు ఆసక్తి” ఈ విగ్రహవాక్యాన్ని సమాసపదంగా మార్చండి.
A) జ్ఞానాసక్తి
B) జ్ఞానతృష్ణ
C) జ్ఞాన సంపాదనాసక్తి
D) జ్ఞాన సంపాదన తృష్ణ
జవాబు:
B) జ్ఞానతృష్ణ

AP Board 9th Class Telugu Important Questions Chapter 4 ప్రేరణ

63. “దృశ్యము కానిది” – సమాసం పేరు గుర్తించండి.
A) నణ్
B) అవ్యయీభావ
C) భ్రాంతి
D) రూపకం
జవాబు:
A) నణ్

64. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసానికి ఏ సంధి?
A) జ్ఞానతృష్ణ
B) జీవిత గమనం
C) గురుశిష్యులు
D) నిశిత బోధన
జవాబు:
D) నిశిత బోధన

65. గురుశిష్యుల అనుబంధం ఎంతో గొప్పది – గీత గీసిన పదానికి సమాసం పేరు గుర్తించండి.
A) ద్విగువు
B) ద్వంద్వ
C) రూపకం
D) బహుజొహి
జవాబు:
B) ద్వంద్వ

66. ‘కష్టముతో ఆర్జితము’ సమాస పదంగా మార్చండి.
A) కష్టార్జితము
B) కష్ట ఆర్జితము
C) కష్టపు ఆర్జితము
D) కష్టంపు ఆర్జితం
జవాబు:
A) కష్టార్జితము

67. ‘త్యాగనిరతి’ – ఏ సమాసం?
A) సప్తమీ తత్పురుష
B) ద్వితీయా తత్పురుష
C) బహుబ్లిహి
D) ఉపమాన పూర్వపద కర్మధారయం
జవాబు:
A) సప్తమీ తత్పురుష

AP Board 9th Class Telugu Important Questions Chapter 4 ప్రేరణ

68. ‘విద్యాభ్యాసము’ పదానికి విగ్రహవాక్యం గుర్తించండి.
A) విద్య కొఱకు అభ్యాసము
B) విద్య యొక్క అభ్యాసము
C) విద్యను అభ్యసించడం
D) విద్యల యందు అభ్యాసము
జవాబు:
B) విద్య యొక్క అభ్యాసము

8. ఆధునిక వచనాన్ని గుర్తించడం :

69. ‘ఆచార్యున కెదిరించకు’ – ఈ వాక్యానికి ఆధునిక వచనాన్ని గుర్తించండి.
A) ఆచార్యున కెదిరించు
B) ఆచార్యుని పొగడు
C) గురువును ఎదిరించకు
D) టీచర్ని కాదనకు
జవాబు:
C) గురువును ఎదిరించకు

9. కర్తరి, కర్మణి వాక్యాలను గుర్తించడం:

70. ‘నేనెన్నో పుస్తకాలు రాశాను’ – దీనికి కర్మణి వాక్యాన్న గుర్తించండి. (S.A. I – 2018-19)
A) నేను ఎన్నో పుస్తకాలు రాశా.
B) నా చేత ఎన్నో పుస్తకాలు రాయబడ్డాయి.
C) నా చేత పుస్తకాలు వ్రాయబడినవి.
D) పుస్తకాలు వ్రాసిన వారు నేనే.
జవాబు:
B) నా చేత ఎన్నో పుస్తకాలు రాయబడ్డాయి.

71. ‘జిడ్డు కృష్ణమూర్తి గారు ఎన్నో విషయాలను చెప్పారు’ – ఈ వాక్యం యొక్క కర్మణి వాక్యాన్ని గుర్తించండి. (S.A. II – 2017-18)
A) ఎన్నో విషయాలు జిడ్డు కృష్ణమూర్తి గారు చెప్పారు.
B) జిడ్డు కృష్ణమూర్తి గారిచే ఎన్నో విషయాలు చెప్పబడ్డాయి.
C) జిడ్డు కృష్ణమూర్తి గారు చెప్పే విషయాలు వినాలి.
D) జిడ్డు కృష్ణమూర్తి గారు చెప్పే విషయాలు ఎన్నో.
జవాబు:
B) జిడ్డు కృష్ణమూర్తి గారిచే ఎన్నో విషయాలు చెప్పబడ్డాయి.

10. ప్రత్యక్ష, పరోక్ష కథనంలోకి మార్చడం :

72. ‘రా నాతో పాటు ముందు కూర్చో’ చెప్పారు ప్రొఫెసరు – దీనికి పరోక్ష కథనాన్ని గుర్తించండి.
A) రమ్మనీ, తనతో పాటు ముందు కూర్చోమనీ ప్రొఫెసరు చెప్పారు.
B) రా నాతో కూర్చో అని ప్రొఫెసరు అన్నారు.
C) వచ్చి నాతో కూర్చో అన్నారు ప్రొఫెసరు.
D) ప్రొఫెసరు రమ్మని, కూర్చోమని అన్నారు.
జవాబు:
A) రమ్మనీ, తనతో పాటు ముందు కూర్చోమనీ ప్రొఫెసరు చెప్పారు.

11. వ్యతిరేకార్థక వాక్యాన్ని గుర్తించడం :

73. ‘నా మాతృభూమి విస్తృతి ఎంతో గుర్తించాను’ – క్రియను మార్చిన వ్యతిరేక వాక్యాన్ని గుర్తించండి.
A) నా మాతృభూమి విస్తృతి ఎంతో గుర్తించగలను.
B) నా మాతృభూమి విస్తృతి ఎంతో గుర్తించలేదు.
C) నా మాతృభూమి విస్తృతి గుర్తింపలేదు.
D) నా మాతృభూమి విస్తృతి గుర్తించావా?
జవాబు:
B) నా మాతృభూమి విస్తృతి ఎంతో గుర్తించలేదు.

12. వాక్యరకాలను గుర్తించడం :

74. “నీ పరిశ్రమ నీ ఉపాధ్యాయులకి భవిష్యత్తులో మంచిపేరు తేవడానికి ఉపకరిస్తుంది” ఇది ఏ రకమైన వాక్యం?
A) ఆశ్చర్యార్థకం
B) అనుమత్యర్థకం
C) ప్రశంసా వాక్యం
D) ప్రశ్నార్థక వాక్యం
జవాబు:
C) ప్రశంసా వాక్యం

AP Board 9th Class Telugu Important Questions Chapter 4 ప్రేరణ

75. “దేవుడే నీ ఆశా, ఆశ్రయమూ, మార్గదర్శి కాగలడు” – ఇది ఏ రకమైన వాక్యం
A) సామర్థ్యార్థకం
B) ఆశ్చర్యార్థకం
C) ప్రశంసా వాక్యం
D) నిషేధకం
జవాబు:
A) సామర్థ్యార్థకం

76. ‘ఆంగ్లేయ గ్రంథము లెన్నియో వ్రాయుచున్నారు. ఆంగ్లేయ ఉపన్యాసము లెన్నియో ఇచ్చుచున్నారు’ – ఈ సామాన్య వాక్యాలతో ఏర్పడిన సంక్లిష్ట వాక్యాన్ని గుర్తించండి.
A) ఆంగ్లేయ గ్రంథాలు ఎన్నో వ్రాస్తున్నారు. ఉపన్యాసా లిస్తున్నారు.
B) ఆంగ్లేయ గ్రంథోపన్యాసకులు ఇస్తున్నారు.
C) ఆంగ్లేయ గ్రంథము లెన్నియో వ్రాసి, ఉపన్యాసము లెన్నియో ఇచ్చుచున్నారు.
D) గ్రంథములు వ్రాసి ఉపన్యాసాలిచ్చుచున్నారు.
జవాబు:
C) ఆంగ్లేయ గ్రంథము లెన్నియో వ్రాసి, ఉపన్యాసము లెన్నియో ఇచ్చుచున్నారు.

13. ప్రక్రియలను గుర్తించడం :

77. ‘రంగయ్యకు రెక్కాడితే కాని డొక్కాడదు’ – గీత గీసిన పదం ఏ ప్రక్రియకు చెందినది?
A) క్వార్థకం
B) అనంతర్యార్థకం
C) చేదర్థకం
D) అభ్యర్థకం
జవాబు:
C) చేదర్థకం

AP Board 9th Class Telugu Important Questions Chapter 4 ప్రేరణ

78. కవిత గ్రంథాలయానికి వెళ్ళి పుస్తకాలు తెచ్చింది – గీత గీసిన పదం ఏ ప్రక్రియకు చెందినది?
A) క్వార్థకం
B) చేదర్థకం
C) శత్రర్థకం
D) అనంతర్యార్థకం
జవాబు:
A) క్వార్థకం

AP Board 8th Class Telugu Solutions Chapter 8 జీవన భాష్యం

AP State Syllabus AP Board 8th Class Telugu Textbook Solutions Chapter 8 జీవన భాష్యం Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Telugu Solutions 8th Lesson జీవన భాష్యం

8th Class Telugu 8th Lesson జీవన భాష్యం Textbook Questions and Answers

చదవండి – ఆలోచించండి – చెప్పండి

“శ్రద్ధగలవాడే జ్ఞానాన్ని పొందుతాడు”.
“కటిని తిడుతూ కూర్చోడం కన్నా చిన్న దీపం వెలిగించు”.
“అణుశక్తి కన్నా ఆత్మశక్తి మిన్న”.
“త్యాగగుణానికి తరువులే గురువులు”.

ప్రశ్నలు జవాబులు

ప్రశ్న 1.
పై వాక్యాల ద్వారా మీరేం గ్రహించారు?
జవాబు:
పై వాక్యాల ద్వారా కొన్ని సూక్తులను తెలుసుకున్నాము. కొన్ని సందేశాలను, ఉపదేశాలను గ్రహించాము.

ప్రశ్న 2.
ఇలాంటి వాక్యాలనేమంటారు?
జవాబు:
ఇలాంటి వాక్యాలను సుభాషితములని, సూక్తులని అంటారు. మంచి మాటలు, సందేశాలు అని కూడా అంటారు.

AP Board 8th Class Telugu Solutions Chapter 8 జీవన భాష్యం

ప్రశ్న 3.
ఇలాంటి సందేశాలు, మంచిమాటలు ఇంకా ఏ ఏ రూపాలలో ఉంటాయి?
జవాబు:
ఇలాంటి సందేశాలు, మంచి మాటలు పద్యాలు, శ్లోకాలు, గేయాలు, మినీ కవితలు, గజళ్ళు మొదలైన రూపాలలో ఉంటాయి.

ఇవి చేయండి

I. వినడం – మాట్లాడడం

ప్రశ్న 1.
‘జీవన భాష్యం’ గజలను రాగయుక్తంగా, భావయుక్తంగా పాడండి.
జవాబు:
పాడడం, మీ ఉపాధ్యాయుల సాయంతో నేర్చుకోండి.

ప్రశ్న 2.
‘జీవన భాష్యం’ అనే పేరు ఈ పాఠానికి తగిన విధంగా ఉందా? ఎందుకు? చర్చించండి.
జవాబు:
‘జీవన భాష్యం’ అంటే బ్రతుకు పై వ్యాఖ్యానం. జీవితం ఎలా నడిపించుకోవాలో వివరంగా చెప్పడమే ‘జీవన భాష్యం’. ఈ గజల్ లో నారాయణరెడ్డి గారు జీవితమును గూర్చి కొన్ని సత్యాలు చెప్పారు. మనసుకు దిగులు మబ్బు ముసిరితే కన్నీళ్ళు వస్తాయన్నారు. ఆటంకాలు వస్తాయనీ, జంకకుండా అడుగులు వేయాలనీ చెప్పారు. బీడు భూములు దున్ని విత్తితే పంటలు పండుతాయని చెప్పారు. మనుషులు అందరూ కలిసి ఉండాలని చెప్పారు. ఎంత ఎత్తుకు ఎదిగినా జీవితంలో పరీక్షలు తప్పవన్నారు. కేవలం బిదుదులు పొందినంత మాత్రాన విలువలేదనీ, మంచి త్యాగం చేస్తేనే మనిషి పేరు నిలబడుతుందని చెప్పారు. ఈ విధంగా జీవితం గూర్చి వివరించి చెప్పినందువల్ల ‘జీవనభాష్యం’ అన్న పేరు ఈ పాఠానికి తగియుంది.

ప్రశ్న 3.
ఈ “గజల్స్” ద్వారా “సినారె” ఏం సందేశమిస్తున్నారు?
జవాబు:
లక్ష్యసాధనలో ఎన్నో కష్టాలు, అడ్డంకులు ఎదురవుతాయనీ, అయినా జంకకుండా ముందుకు నడిస్తేనే విజయం లభిస్తుందనీ, ఆ స్ఫూర్తె నలుగురూ అనుసరించే దారి అవుతుందని సినారె చెప్పారు.

  • ఎడారి దిబ్బలను దున్నితే ఏమి ఫలితం ఉండదని అనుకోక, వాటిని దున్నితే పంటలు పండుతాయని చెప్పారు.
  • మనుషులు తమలో తాము భేదాలు ఎంచుకోకుండా కలసిమెలిసి జీవించాలని చెప్పారు.
  • మనిషి ఎంత ఎత్తుకు ఎదిగినా పరీక్ష ఉంటుందని గుర్తు చేశారు.
  • బిరుదులు, సత్కారాలు పొందడంలో విలువ, గుర్తింపు లేవని, మానవాళికి పనికివచ్చే గొప్ప పని, నిస్వార్థ త్యాగం చేస్తేనే ఆ మనిషి పేరు చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతుందని సినారె సందేశమిచ్చారు.

II. చదవడం, అవగాహన చేసుకోవడం

1. అ) కరిగితే, ముసిరితే, మమత, దేవత, పెరిగి, మరిగి వంటి పదాలు గజల్ లో ఎక్కడెక్కడ ఉన్నాయో చూసి, వాటి కింద గీత గీయండి. ఆ పాదాలు రాయండి.
జవాబు:

  1. మబ్బుకు మనసే కరిగితే అది నీరవుతుంది.
  2. మనసుకు మబ్బే ముసిరితే కన్నీరవుతుంది.
  3. నిలువెల్ల మమతల వెలుగై నిలిచిందో అమ్మరూపు
  4. అమ్మ ఒకవైపు దేవతలంతా ఒకవైపు
  5. విరిగినపుడు నిలువెత్తుగా పెరిగి తెలుసుకో
  6. మౌలిక తత్వం సలసల మరిగి తెలుసుకో

ఆ) గజళ్ళలో కవి తన గురించి ప్రస్తావించిన పంక్తులు ఏవి? వాటిని రాసి భావాన్ని సొంతమాటల్లో రాయండి.
జవాబు:
బిరుదులు పొందే వ్యాప్తికీ విలువేమి “సినారే”. చెరగని త్యాగం మిగిలితే ఒక పేరవుతుంది – అనే పంక్తులు కవి తన గురించి ప్రస్తావించినవి.

భావం :
ఓ సినారే! గొప్ప బిరుదులు, సత్కారాలు పొందామని అనుకోవడంలో నిజమైన విలువ, గుర్తింపు లేదు. మానవాళికి పనికొచ్చే గొప్ప పని, నిస్వార్థ త్యాగం చేస్తేనే ఆ మనిషి పేరు చరిత్రలో నిలిచిపోతుంది.

AP Board 8th Class Telugu Solutions Chapter 8 జీవన భాష్యం

2. కింది పేరాను చదివి, ఐదేసి ప్రశ్నలు తయారుచేయండి.

చైనా తత్త్వవేత్త కన్ఫ్యూషియస్. ఆయన చాలా తెలివైనవాడు. ఒక రాజుగారు అతణ్ణి గురించి విని తన సభకు పిలిపించుకున్నాడు. మూడు పంజరాలు చూపించాడు. మొదటి పంజరంలో ఒక ఎలుక, దాని ఎదురుగా తినే పదార్థాలు ఉన్నాయి. రెండో పంజరంలో పిల్లి ఉంది. దాని ఎదురుగా పళ్ళెంలో పాలు ఉన్నాయి. మూడో పంజరంలో ఒక గద్ద ఉంది. దాని ఎదురుగా తాజా మాంసం ఉంది. కానీ ఎలుక ఏ పదార్థం తినటం లేదు; పిల్లి పాలు ముట్టుకోవడం లేదు; గద్ద కూడా మాంసం ముట్టడం లేదు. దీనికి కారణమేమిటి? అని అడిగాడు రాజు. తత్త్వవేత్త ఇలా సమాధానం ఇచ్చాడు- “పిల్లిని చూసి భయపడి ఎలుక ఆహారం తీసుకోలేదు. పిల్లి ఎలుకమీద ఆశతో పాలు ముట్టుకోలేదు. పిల్లిని, ఎలుకను ఒకేసారి తినాలనే ఆశతో గద్ద మాంసం ముట్టుకోలేదు. అలాగే భవిష్యత్తు మీద ఆశతో ప్రజలు వర్తమానాన్ని విస్మరిస్తున్నారు. సుఖానికి దూరమవుతున్నారు. ఈ సమాధానానికి సంతృప్తిపడి రాజు కన్ఫ్యూషియకు విలువైన బహుమానాన్ని ఇచ్చాడు.
జవాబు:
ప్రశ్నలు:

  1. కన్ఫ్యూషియస్ ఎవరు? ఆయన ఎలాంటివాడు?
  2. మొదటి, రెండు, మూడు పంజరాలలో ఏమేమి ఉన్నాయి?
  3. మూడో పంజరం ఎదురుగా ఏమి ఉంది?
  4. రాజు ఏమని ప్రశ్నించాడు?
  5. రాజు అడిగిన ప్రశ్నకు తత్త్వవేత్త ఏమి సమాధానమిచ్చాడు?

3) కింది ప్రశ్నలకు పాఠం ఆధారంగా సమాధానాలు రాయండి.

అ) “ఎడారి దిబ్బలు దున్నితే ఫలమేముందనకు” అనే వాక్యంలో మీరేమి గ్రహించారు?
జవాబు:
ఎడారిలో ఇసుకదిబ్బలు ఉంటాయి. అక్కడ నీళ్ళు దొరకవు. ఇసుక నేలల్లో పంటలు పండవు. అందువల్ల నీళ్ళు దొరకని ఎడారులలోని ఇసుక దిబ్బలను దున్నితే ఫలితము ఏముంటుంది? అవి వ్యవసాయానికి పనికిరావు కదా ! అని నిరాశపడరాదని కవి చెప్పాడు. సేద్యానికి పనికిరావు కదా అని బంజరు బీడులను దున్నకుండా విడిచి పెట్టవద్దనీ, వాటిని దున్ని విత్తులు చల్లితే చక్కని పైరుపంటలు పండుతాయనీ, నిరాశ పనికిరాదనీ, ఆశావహ దృక్పథంతో ముందుకు నడిస్తే తప్పక ఫలితాలు వస్తాయనీ కవి ఈ వాక్యాల ద్వారా సందేశం అందించాడు.

ఆ) నిలువెల్లా మమతల వెలుగై నిలిచిందో అమ్మరూపు – అంటే మీకేమి అర్థమైంది?
జవాబు:
సి. నారాయణరెడ్డిగారు తల్లిని చక్కగా అభివర్ణించారు. మాతృత్వ మధురిమలను సుమనోహరంగా ఆవిష్కరించారు. మానవునికి తొలి గురువు తల్లి. చేతులను పట్టుకొని నడిపిస్తుంది. అజ్ఞానాంధకారాన్ని తొలగిస్తుంది. మమతానురాగాలను అందిస్తుంది. మూర్తీభవించిన శాంతమూర్తి తల్లి. మమతను అందిస్తుంది. మనలో దుఃఖాన్ని తొలగిస్తుంది. సుఖాన్ని కల్గిస్తుంది. వెలుగులా దారి చూపిస్తుంది. అందుకే సి.నా.రె. గారు తల్లిని ఉద్దేశించి, నిలువెల్ల మమతల వెలుగై నిలిచిందో అమ్మరూపు – అని ప్రశంసాత్మకంగా అన్నాడు.

ఇ) సమైక్య సంఘర్షణ అంటే ఏమిటి ? వివరించండి.
జవాబు:
పచ్చదనమంటే అది వృక్ష సంపదకు చిరునామా. చినుకులు కురవాలంటే మేఘం రూపుదిద్దుకోవాలి. కేవలం ప్రభుత్వాలు, చట్టాల వలన సమాజం బాగుపడదు. ఎవరికి వారు స్వీయక్రమశిక్షణను, నైతిక నియమాలను అలవరచుకోవాలి. రాశికన్నా వాసి ముఖ్యం. పుక్కిటి పురాణాలు ఎన్ని రాసినా ప్రయోజనం శూన్యం. సమైక్యతతోనే సంఘం వర్థిల్లుతుంది గానీ, వ్యక్తిగతంగా పోరాడి సాధించేది ఏమీ ఉండదు. మానవతను మేలుకొలిపేదే నిజమైన సాహిత్యమవుతుంది. అలాగే తోటి మనిషికి సేవచేసే దయగల మనుషుల్లోనే దైవం దాగి ఉందనే భావాన్ని కవి వ్యక్తపరిచారు.

III. స్వీయరచన

1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో సమాధానాలు రాయండి.

అ) ఈ పాఠంలో గజల్ ప్రక్రియను గూర్చి తెలుసుకున్నారు కదా ! మీకు తెలిసిన నాలుగు సాహిత్య ప్రక్రియల పేర తెలపండి. వాటిని గురించి రాయండి.
జవాబు:
నాకు తెలిసిన నాలుగు సాహిత్య ప్రక్రియలు :
1. ప్రబంధం
2. కథానిక
3. ఆత్మకథ
4. ఇతిహాసం

1. ప్రబంధం :
పురాణేతిహాసాల నుండి చిన్న కథను తీసుకొని వర్ణనలతో పెంచి స్వతంత్ర కావ్యంగా వ్రాస్తే దాన్ని “ప్రబంధం” అంటారు. మనుచరిత్ర, వసుచరిత్ర, ఆముక్తమాల్యద మొ||నవి ప్రబంధాలు.

2. కథానిక :
ఒక వ్యక్తి జీవితంలోని ఒక ముఖ్య సన్నివేశాన్నీ, సంఘటనల మధ్య సంబంధాన్ని కళాత్మకంగా చిత్రించ సాహిత్య ప్రక్రియను “కథానిక” అంటారు. ఇది వచన ప్రక్రియ. మరీ చిన్నదిగాను, మరీ పెద్దది గాను లేకుండా ఉండటం కథానిక లక్షణం.

3. ఆత్మకథ :
ఆత్మకథ అంటే తనను గురించి తాను రాసుకొన్న కథ. ఎవరైనా తమ ఆత్మకథను రాసుకోవచ్చు. అవి ఆత్మకథలే అయినా సమాజ జీవితాన్ని కూడా ప్రతిబింబిస్తాయి. ప్రముఖ వ్యక్తులు తమ జీవితాల గురించి రాసుకొన్న విషయాలు సమకాలిక సమాజానికి వ్యాఖ్యానాలుగా ఉపయోగపడతాయి.

4. ఇతిహాసం :
ఇతిహాసం అంటే పూర్వ కథ అని అర్థం. ఇతిహాసాలు గ్రంథస్థం కాకముందు ఆశురూపంలో ఉండేవి. ఇతిహాసంలో కథకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. రామాయణం, భారతం మొ||నవి ఇతిహాసాలు.

ఆ) మంచి పంటలు పండడానికి రైతు చేసే శ్రమ ఎలాంటిదో వివరించండి.
(లేదా)
విరామము లేకుండా శ్రమిస్తూ మనకు అన్నం పెడుతున్న కర్షకుల శ్రమను గురించి వివరించండి.
జవాబు:
మంచి పంటలు పండించాలంటే రైతులు పొలాల్ని చక్కగా దున్నాలి. తరువాత నీరు పెట్టాలి. మంచి విత్తనాలు తెచ్చి, నారుమళ్ళు వేయాలి. సేంద్రియ ఎరువుల్ని వేయాలి. పశువుల పేడను ఎరువులుగా వేస్తే మంచిది. పురుగుమందులు ఎక్కువగా వాడరాదు. సకాలంలో చేనుకు నీరు పెట్టాలి. కలుపు మొక్కలను తీసిపారవేయాలి. చేనును ఆరబెట్టి, సకాలంలో చేనుకు నీరందించాలి. ఎలుకల బెడద లేకుండా చూసుకోవాలి. రైతులు నిత్యం చేనును గమనించాలి. ఏదైనా పురుగుపడితే వేప పిండి వగైరా చల్లి వాటిని అరికట్టాలి. వర్షాధారంగా పండే పంట అయితే, నీరు కావలసినపుడు ఇంజన్ల ద్వారా తోడి నీరు పెట్టాలి. రైతు ఇంతగా శ్రమిస్తేనే మంచిపంటలు పండుతాయి.

ఇ) ఓటమి కలిగినపుడు మనిషి మనస్తత్వం ఎలా ఉంటుంది? వివరించండి.
జవాబు:
సాధారణంగా ఓటమి మానవుని కుంగదీస్తుంది. నీరసింపజేస్తుంది. శూన్యుడిగా మారుస్తుంది. అయితే మానవుడు ఓటమి నుండి గుణపాఠాలు నేర్చుకోవాలని బోధించాడు. ధైర్యంగా ముందుకు వెళ్ళాలని ఉపదేశించాడు.

పరమాణువులో దాగిన లక్షణాలను విశ్లేషించడం ద్వారా భూమి స్వభావాన్ని తెలుసుకోవచ్చు. సముద్రంలోతు తెలియాలంటే కారే కన్నీటి బిందువుల వెనుక దాగున్న కష్టాల కడలిని అర్థం చేసుకోవాలి. సంతృప్తి గురించి తెలియాలంటే, ఎంత సంపద ఉన్నా సంపన్నులు పొందలేకపోతున్న సంతృప్తిని తమ కళారాధనతో పొందుతున్న కళాకారులను పరిశీలించాలి. గుండెలోతుల్లో నుండి ప్రేమతో పలకరించే వారూ, నోటితో నవ్వుతూ నొసటితో వెక్కిరించేవారూ ఉంటారు. ఎవరి మాట వెనుక ఏ ఏ అర్థాలున్నాయో తెలుసుకోగలగాలి. కెరటం నాకు ఆదర్శం. పడుతున్నందుకు కాదు పడినా లేస్తున్నందుకు అన్నట్లుగా ఓటమిని జయించాలంటే కెరటంలా కిందపడినా పైకి లేవగలగాలి. పండిన చెట్టు వంగడానికి కారణం ఉపకార గుణం. అలా ఎంత ఎదిగినా ఒదిగి ఉపకరించడం నేర్చుకోవాలి. అనాయాసంగా ఏదీ పట్టుబడదు. విజయం సాధించాలంటే కష్టపడడం తప్ప మరొక దొడ్డిదారి ఏదీ లేదు. దాని మూలాలను బాగా శోధించి తెలుసుకోవాలనే భావనను ఈ గజల్ ద్వారా సి.నా.రె గారు తెలిపారు.

ఈ) అమ్మను జ్ఞానపీఠంగా కవి ఎందుకు వర్ణించాడు?
జవాబు:
‘జీవన భాష్యం’ అనే పాఠ్యభాగంలో నారాయణరెడ్డిగారు మాతృత్వాన్ని, అమ్మ గొప్పతనాన్ని చక్కని మాటలతో ఆవిష్కరించారు. అమ్మ గొప్పతనాన్ని చక్కగా తెలియజేశారు. అమ్మ మనకందరికి తొలి గురువు.

పెరిగే సినారె బ్రతుకులో దొరికింది అమ్మ ప్రాపు.

చిన్నప్పుడు ఆ బొమ్మ కావాలి ! ఈ మిఠాయి కావాలి ! అని మొండికేసి ఇప్పుడే కొని పెట్టమని మంకుపట్టు పట్టి అమ్మ చంకనెక్కి ఇదుగో ఈ బండి చూడు ఎంత బాగుందీ అదుగో ఆ గుర్రం చూడు అది నీకే అంటూ బుజ్జగించినా అమ్మ చంక దిగలేదు. నేనెంత అల్లరి చేసినా, చిరునవ్వుతో భరించింది. దెబ్బతగిలి ఏడుస్తున్నప్పుడు ఓర్చుకోవాలని, మిత్రులతో దెబ్బలాడినపుడు సర్దుకోవడం నేర్చుకోవాలనీ జ్ఞాన బోధచేస్తూ నా బాల్యమంతా వేలుపట్టి నడిపించింది. చీకటిలో ఏమీ కనిపించనపుడు తన వెన్నెల వెలుగులతో దారిని చూపే చంద్రునిలా, ఆకలైనపుడు ఆకలికి తీర్చే నిండుకుండలా తన ప్రేమానురాగాలతో వెలుగులా నిలిచింది అమ్మ. మెరిసే సూర్యోదయకాలపు సూర్యకిరణంలా వసంత ఋతువులో పూచే పూవులా పెరిగిన నాకు అమ్మ అండ దొరికిందని ఈ గజల్ ద్వారా కవి అమ్మ ప్రేమను, గొప్పతనాన్ని తెలియపరుస్తున్నాడు.

AP Board 8th Class Telugu Solutions Chapter 8 జీవన భాష్యం

2. కింది ప్రశ్నలకు పదేసి వాక్యాల్లో సమాధానాలు రాయండి.

అ) సంతకం యొక్క ప్రాధాన్యం ఏమిటి ? సంతకం గురించి సినారె ఏమి చెప్పారు?
జవాబు:
ఆధునిక సమాజంలో సంతకానికి తరగని విలువ ఉంది. సంతకం లేని ఏ ఉత్తరువు చెల్లనేరదు. ఒక్క సంతకం జీవితాన్నే మారుస్తుంది. కవి సంతకం యొక్క గొప్పదనాన్ని తన పరిభాషలో చక్కగా వ్యక్తపరిచారు.
పచ్చదనమంటే అది వృక్ష సంపదకు చిరునామా. చినుకులు కురవాలంటే మేఘం రూపుదిద్దుకోవాలి. కేవలం ప్రభుత్వాలు, చట్టాల వలన సమాజం బాగుపడదు. ఎవరికి వారు స్వీయక్రమశిక్షణను, నైతిక
నియమాలను అలవరచుకోవాలి. రాశికన్నా వాసి ముఖ్యం. పుక్కిటి పురాణాలు ఎన్ని రాసినా ప్రయోజనం శూన్యం. సమైక్యతతోనే సంఘం వర్ధిల్లుతుంది గానీ, వ్యక్తిగతంగా పోరాడి సాధించేది ఏమీ ఉండదు. మానవతను మేలుకొలిపేదే నిజమైన సాహిత్యమవుతుంది. అలాగే తోటి
మనిషికి సేవచేసే దయగల మనుషుల్లోనే దైవం దాగి ఉందనే భావాన్ని ఈ గజల్ ద్వారా కవి వ్యక్తపరిచారు.

ఆ) తెలుసుకోడం వల్ల ప్రయోజనం ఏమిటి ? కవి ఏమేమి తెలుసుకోమన్నాడు?
(లేదా)
సి.నా.రె గారు గజల్ అనే ప్రక్రియ ద్వారా తెలుసుకోవడం వల్ల ప్రయోజనాలు చెప్పారు. అవి మీ మాటల్లో రాయండి.
జవాబు:
పరమాణువులో దాగిన లక్షణాలను విశ్లేషించడం ద్వారా భూమి స్వభావాన్ని తెలుసుకోవచ్చు. సముద్రంలోతు తెలియాలంటే కారే కన్నీటి బిందువుల వెనక దాగున్న కష్టాల కడలిని అర్థం చేసుకోవాలి. సంతృప్తి గురించి తెలియాలంటే, ఎంత సంపద ఉన్నా సంపన్నులు పొందలేకపోతున్న సంతృప్తిని తమ కళారాధనతో పొందుతున్న కళాకారులను పరిశీలించాలి. గుండెలోతుల్లో నుండి ప్రేమతో పలకరించే వారూ, నోటితో నవ్వుతూ నొసటితో వెక్కిరించేవారూ ఉంటారు. ఎవరి మాట వెనుక ఏ ఏ అర్థాలున్నాయో తెలుసుకోగలగాలి. కెరటం నాకు ఆదర్శం. పడుతున్నందుకు కాదు పడినా లేస్తున్నందుకు అన్నట్లుగా ఓటమిని జయించాలంటే కెరటంలా కిందపడినా పైకి లేవగలగాలి. పండిన చెట్టు వంగడానికి కారణం ఉపకార గుణం. అలా ఎంత ఎదిగినా ఒదిగి ఉపకరించడం నేర్చుకోవాలి. అనాయాసంగా ఏదీ పట్టుబడదు. విజయం సాధించాలంటే కష్టపడడం తప్ప మరొక దొడ్డిదారి ఏదీ లేదు. దాని మూలాలను బాగా శోధించి తెలుసుకోవాలనే భావనను ఈ గజల్ ద్వారా సి.నా.రె గారు తెలిపారు.

IV. పదజాలం

1. కింది పదాలకు అర్థాలు తెలుసుకోండి. ఆ పదాల్ని ఉపయోగించి సొంతవాక్యాలు రాయండి.

అ) ముసరడం = క్రమ్ముకోవడం, చుట్టుముట్టడం, వ్యాపించడం
సొంతవాక్యం : ఆకాశంలో నీలిమేఘాలు ముసరడంతో చీకటిగా ఉంది.

ఆ) అలవోకగా = అతి సులువుగా, తేలికగా
సొంతవాక్యం : కరణం మల్లేశ్వరి వెయిట్ లిఫ్టింగ్ లో అలవోకగా బరువును ఎత్తింది.

ఇ) పూర్ణకుంభం = నిండినది, సమస్తము
సొంతవాక్యం : అధికారులకు దేవాలయాలలో పూర్ణకుంభంతో స్వాగతం పలుకుతారు.

ఈ)హృదయం = మనసు, ఎద
సొంతవాక్యం : సజ్జనుల హృదయం ఎప్పుడూ మంచి ఆలోచనతోనే ఉంటుంది.

V. సృజనాత్మకత

* ‘జీవన భాష్యం’ గజల్ లోని అంత్యప్రాసల ఆధారంగా సొంతగా ఒక వచన కవితను రాయండి.
జవాబు:
……………. నీరవుతుంది.
…………….దారవుతుంది.
……………. పైరవుతుంది.
……………. ఊరవుతుంది.
……………. ఏరవుతుంది.
……………. పేరవుతుంది.
జవాబు:
సొంత వచన కవిత :
1) శాంతి, మంచు కూడితే కోపాగ్ని నీరవుతుంది.
2) పదిమందీ అట్లానే నడిస్తే అదే నీ దారవుతుంది.
3) సకాలంలో విత్తులు చల్లితే ఆ విత్తే పైరవుతుంది.
4) కులమత భేదాలే కూలితే ఉన్నదే ఊరవుతుంది.
5) శక్తికి మించని త్యాగం నీ ఈవికి ఏరవుతుంది.
6) పదిమందీ నిను పొగిడితే నీ కీర్తికి పేరవుతుంది.

AP Board 8th Class Telugu Solutions Chapter 8 జీవన భాష్యం

(లేదా)

*ఆచార్య సి.నారాయణరెడ్డిగారు ఒకవేళ మీ పాఠశాలకు వస్తే మీరు వారి దగ్గర ఏం తెలుసుకోవాలనుకొంటున్నా! ప్రశ్నలు రాయండి.
జవాబు:
ప్రశ్నలు : 1) సినారె గారూ ! మీరు సాహిత్య రచనలు ఎప్పటి నుంచి ప్రారంభించారు?
2) మీరు వ్రాసిన సినిమా పాటలు మీరు వింటున్నపుడు మీకు ఎటువంటి అనుభూతి కలుగుతుంది?
3) మీరు ఇంత గొప్ప రచయితగా మారటానికి ప్రేరణ ఎవరు?
4) మీరు “పద్మభూషణ్” బిరుదును పొందినపుడు మీరు ఎలా స్పందించారు?
5) సినీ గేయ రచయితగా మీకు నచ్చిన సినిమా పాట ఏది?
6) వేటూరిని గొప్ప సినీ గేయ రచయిత అంటారు కదా ! వారి రచనలపై మీ అభిప్రాయం ఏమిటి?
7) తెలుగులో పాండిత్యం రావాలంటే ఏమి చేయాలి?

VI. ప్రశంస

* చదువులో వెనకబడిన ఒక విద్యార్థి తనలో కలిగిన మార్పు వల్ల కొద్దికాలంలోనే గతంలో కన్నా మెరుగైన ఫలితాల: పొందాడు. అతనిలో వచ్చిన మార్పును గురించి తెలుపుతూ వాళ్ళ అమ్మానాన్నలకి ఉత్తరం రాయండి.
జవాబు:

లేఖ

ప్రొద్దుటూరు,
x x x x x x x x

పూజ్యులు, ఆనందరావు గారికి,

మీకు నమస్కారములు. నేను మీ అబ్బాయి సురేష్ సహ విద్యార్థిని. మేము కూడా ప్రొద్దుటూరు జి పరిషత్ ఉన్నత పాఠశాలలోనే చదువుతున్నాము. ఈ మధ్య మీ సురేష్ అన్ని పరీక్షల్లోనూ మంచి మార్కులు తెచ్చుకుంటున్నాడ తరగతిలో శ్రద్ధగా పాఠాలు వింటున్నాడు. సాయంత్రం మాతో ఆటలు కూడా ఆడుతున్నాడు.

రాత్రివేళ హాస్టలులో 10 గంటల వరకూ చదువుతున్నాడు. తెల్లవారుజామున 4 గంటలకే లేచి, 6 గంటల వరక చదువుతున్నాడు. ఏ రోజు ఇంటిపని ఆ రోజే పూర్తిచేస్తున్నాడు. రోజూ ఉదయం పండ్లరసం, సాయంత్రం హార్లి! తాగుతున్నాడు. అందువల్ల సురేష్ అలసిపోకుండా చదువుపై మంచి దృష్టి పెడుతున్నాడు. ప్రత్యేకంగా లెదులు, సామాన్యశాస్త్రములలో మంచి ప్రతిభను ప్రదర్శిస్తున్నాడు. సురేశ్, ప్రతిభకు కారణం అతను చూపే శ్రద్ధ, ఆహారపు .. అలవాట్లలో మార్పు, చదువుతో పాటు ఆటలపై చూపే ఆదరము అని నా అభిప్రాయం.

నా సహవిద్యార్థి, మీ అబ్బాయి సురేష్ కు మా తరగతి విద్యార్థుల తరఫున అభినందనలు. మీకు మా నమస్కారాలు. సెలవు.

ఇట్లు,
మీ విశ్వసనీయురాలు,
x x x x x x,
8వ తరగతి,
జిల్లా పరిషత్ హైస్కూలు,
ప్రొద్దుటూరు.

చిరునామా :
బి. ఆనందరావుగారు,
8/23-6, సంతబజార్,
శివాలయం వీధి,
బద్వేలు.

ప్రాజెక్టు పని

*ఆచార్య సి.నారాయణరెడ్డిగారి రచనలు, పాటల వివరాలను సేకరించి ఒక పట్టికను తయారుచేయండి. దాన్ని తరగతిలో చదివి వినిపించండి. ప్రదర్శించండి.
జవాబు:
రచనలు:

1) ఆధునికాంధ్ర కవిత్వము – సంప్రదాయములు – ప్రయోగములు2) ‘విశ్వంభర’ (జ్ఞానపీఠ అవార్డు గెలుచుకుంది)
3) నాగార్జున సాగరం4) కర్పూర వసంతరాయలు
5) మధ్యతరగతి మందహాసం6) ప్రపంచపదులు
7) విశ్వనాథనాయకుడు8) నారాయణరెడ్డి గేయాలు
9) దివ్వెల మువ్వలు10) అజంతా సుందరి
11) రామప్ప12) నవ్వని పువ్వు
13) వెన్నెలవాడ14) ఋతుచిత్రం
15) స్వప్నభంగం16) విశ్వగీతి
17) జలపాతం18) సినీగేయాలు
19) జాతిరత్నం20) తరతరాల వెలుగు (గేయ రూపకాలు)
21) అక్షరాల గవాక్షాలు22) మంటలు – మానవుడు
23) ఉదయం నా హృదయం24) మార్పు నా తీర్పు
25) ఇంటిపేరు చైతన్యం26) రెక్కలు
27) నడక నా తల్లి28) కాలం అంచుమీద
29) కవిత నా చిరునామా30) కలం సాక్షిగా
31) భూమిక, మట్టీ – మనిషి (దీర్ఘ కావ్యాలు)32) తెలుగు గజళ్ళు
33) వ్యాసవాహిని, సమీక్షణం34) పాశ్చాత్య దేశాల్లో 50 రోజులు (యాత్రా సాహిత్యం)
35) పాటలో ఏముంది – నా మాటలో ఏముంది (సినిమా పాటల విశ్లేషణ)

ఈ పాఠం ‘జీవన భాష్యం’ వలెనే సినారే గారి ‘ప్రపంచ పదులు’ కావ్యం కూడా స్ఫూర్తిదాయకంగా ఉండి, మానవ జీవితానికి ఉపకరించే అమూల్యమైన సందేశాలను అందిస్తుంది.

ప్రపంచ పదులు

1. ఏ రాపిడి లేకుండా వజ్రం ఎలా మెరుస్తుంది?
ఏ అలజడి లేకుండా సంద్రం ఎలా నిలుస్తుంది?
నడిపించే చైతన్యం లేనిదే నడవదు ఈ సృష్టి
ఏ ప్రేరణ లేకుండా నాదం ఎలా పలుకుతుంది?
ఏ స్పందన లేకుండా హృదయం ఎలా బతుకుతుంది?

2. చీకటికి చురకపెడుతుందిలే చిన్న మిణుగురు పురుగు
మొండివానను ఆపుతుందిలే రెండు మూరల గొడుగు
మంచి ఏ కొంచెమైనా చాలు మార్పు తేవాలంటే
దూరాన్ని చెరిపివేస్తుందిలే బారుచీమల పరుగు
పాపాన్ని కడిగివేస్తుందిలే పాలనవ్వుల నురుగు

3. కరగనిదే కొవ్వొత్తికి కాంతి ఎలా పుడుతుంది?
చెక్కనిదే శిల కడుపున శిల్పమెలా పుడుతుంది?
ఫలితం అందేది తీవ్ర పరిణామంలోనే సుమా
మరగనిదే నీరు ఎలా మబ్బురూపు కడుతుంది?
నలగనిదే అడుగు ఎలా నటన రక్తి కడుతుంది?

4. ఒక్క చినుకు చాలు మట్టి గుక్కను పలికించాలంటే
ఒక్క చెణుకు చాలు నవ్వు చుక్కలు మొలిపించాలంటే
ఊహల్లో గీసుకున్న వ్యూహాలకు విలువేముంది?
ఒక్క మెరుపు చాలు నింగి పక్కను దొరలించాలంటే
ఒక్క చరుపు చాలు పుడమి రెక్క ఎగిరించాలంటే

మరికొన్ని సినారె విరచిత గేయాలు :
1) “నా పేరు కవి
ఇంటి పేరు చైతన్యం
ఊరు సహజీవనం
తీరు సమభావనం.”

2) “నా వచనం బహువచనం
నా వాదం సామ్యవాదం
కవిత్వం నా మాతృభాష
ఇతివృత్తం మానవత్వం”

3) “ఊపిరాడడం లేదు
ఉక్కపోస్తుంది, ఎ.సీ గదిలో
కారణం తెలిసిపోయింది.
కవిత రాయలేదు ఇవాళ”.

VII. భాషను గురించి తెలుసుకుందాం

1. క్వార్థకం
భాషాభాగాల్లో ఒకటైన ‘క్రియ’ను గురించి కింది తరగతుల్లో తెలుసుకున్నారు. క్రియలను బట్టి వచ్చే వాక్య భేదాలను కొన్నింటిని చూద్దాం.

కింది వాక్యం చదవండి.

భాస్కర్ ఆటలు ఆడి ఆలసిపోయి ఇంటికి వచ్చాడు.
భాస్కర్ – కర్త
వచ్చాడు – కర్తృవాచక పదానికి సంబంధించిన ప్రధాన క్రియ.
ఆడి, అలసి – కర్తృవాచక పదానికి సంబంధించిన ఇతర క్రియలు.
ఆడి, అలసిపోయి అనే పదాలు క్రియలే కానీ, వాటితో పూర్తిభావం తెలియడం లేదు.
‘ఆడి’ అనే క్రియకు ‘ఆడి’ తర్వాత ఏం చేశాడు ? ఏం జరిగింది ? అనే ప్రశ్న ఉదయిస్తోంది.
పూర్తి అర్థాన్ని ఇవ్వడం లేదు. ఇంకా, జరిగిపోయిన విషయాన్ని అంటే భూతకాలంలోని పనిని సూచిస్తుంది.
‘ఆలసిపోయి’ అనే క్రియ కూడా అలాంటిదే.

వీటిని భూతకాలిక అసమాపక క్రియలని, క్వార్థం అనీ అంటారు.

ఈ క్రియలన్నీ కూడా ‘ఇ’ కారంతో అంతమవుతాయి. అంటే భూతకాలిక అసమాపక క్రియ అయి, చివర ‘ఇ’ అనే ప్రత్యయం చేరిన క్రియారూపం క్వార్థక క్రియ అన్నమాట.

కొన్ని ఉదాహరణలు చూడండి. కింది వాక్యాల్లోని క్త్వార్థక క్రియలను గుర్తించండి.

1. రాముడు లంకకు వెళ్ళి, రావణునితో యుద్ధం చేసి, జయించి, సీతను తీసుకొని అయోధ్యకు వచ్చాడు.
2. పుష్ప అన్నం తిని, నిద్రపోయింది.

2. శత్రర్థకం
కింది వాక్యం చదవండి.

“అఖిలేశ్ మధుకరుడితో మాట్లాడుతూ నడుస్తున్నాడు”.
ఈ వాక్యంలో –
‘నడుస్తున్నాడు’ అనే ప్రధాన క్రియకు ‘మాట్లాడుతూ’ అనే ఉపక్రియ వర్తమానకాలంలో ఉండి అసమాపక క్రియను సూచిస్తున్నది.

ఈ విధంగా,
‘మాట్లాడు’ అనే ధాతువుకు ‘-తూ’ అనే ప్రత్యయం చేరుతున్నది. ఇలా చేరడం వల్ల, వర్తమానకాలిక అసమాపక క్రియగా మారుతున్నది. వర్తమానకాలిక అసమాపక క్రియను శత్రర్థకం’ అంటారు.

కింది వాక్యాలు చదవండి. వీటిలో ‘శత్రర్థకం’ పదాల కింద గీత గీయండి.

అ) జ్యోతిర్మయి కంప్యూటర్ లో ఏదో చదువుతూ ముఖ్యాంశాలు రాసుకుంటున్నది.
ఆ) సౌజన్య పడుతూ లేస్తూ సైకిల్ తొక్కడం నేర్చుకుంటున్నది.
ఇ) మాధవి ఆలోచిస్తూ పుస్తకం చదువుతున్నది.
ఈ) ఫల్గుణ్ పేపరు చదువుతూ టీ.వి చూస్తున్నాడు.
ఉ) సలీమా పాడుతూ నాట్యం చేస్తున్నది.

పైన తెలిపిన విధంగా మరికొన్ని వాక్యాలు రాయండి.

1. లత అన్నం తింటూ చదువుతున్నది.
2. రవి పాఠం వింటూ రాస్తున్నాడు.
3. అమ్మ వంట చేస్తూ పాటలు వింటున్నది.
4. పరీక్ష రాస్తూ, ఆలోచిస్తున్నాడు.

3. చేదర్థకం
కింది వాక్యం చదవండి.

“కష్టపడి పనిచేస్తే ఫలితం దానంతటదే వస్తుంది”.
కింది ప్రశ్నకున్న జవాబు గురించి ఆలోచించండి.
ప్ర|| ఫలితం దానంతటదే ఎప్పుడు వస్తుంది?
జవాబు:
కష్టపడి పనిచేస్తే –
కష్టపడడం – కారణం
ఫలితం – కార్యం

కార్యం ఫలించడానికి కారణం అవసరం. కార్యకారణ సంబంధ వాక్యమే చేదర్థక వాక్యం.

అంటే పై వాక్యం కార్యకారణ సంబంధాన్ని సూచిస్తున్నది. ఇలా కార్యకారణ సంబంధాలను సూచించే వాక్యాల్లో తే/ ఇతే| ఐతే/ అనే ప్రత్యయాలు చేరుతాయి. (ప్రాచీన వ్యాకరణం ప్రకారం ఇన / ఇనన్ అనే ప్రత్యయాలు). దీన్ని బట్టి వీటిని ‘చేత్’ అనే అర్థం ఇచ్చే ప్రత్యయాలు అని అంటాం. (ఇదే చేతే అనే ఇచ్చేవి)

సంక్లిష్ట వాక్యాల్లో చేత్ అనే ప్రత్యయం చేరి కార్యకారణ సంబంధం తెలిపే వాక్యాలను చేదర్థక వాక్యాలని అంటాం.

కింది వాక్యాలు పరిశీలించండి. చేదర్థక పదాల కింద గీత గీయండి.

అ) మొక్కలు నాటితే అవి పర్యావరణానికి మేలు చేస్తాయి.
ఆ) జీవ వైవిధ్యాన్ని కాపాడితే ప్రకృతి సమతులితమవుతుంది.
ఇ) మంచి పుస్తకాలు చదివితే అజ్ఞానం తొలగుతుంది.

1. కింది పదాలు విడదీసి, సంధుల పేర్లను పేర్కొనండి.
అ) బాల్యమంతా – బాల్యము + అంతా – ఉత్వసంధి
ఆ) దేవతలంతా = దేవతలు + అంతా – ఉత్వసంధి
ఇ) దారవుతుంది = దారి + అవుతుంది – ఇత్వసంధి
ఈ) విరిగినప్పుడు = విరిగిన + అప్పుడు – అత్వసంధి

AP Board 8th Class Telugu Solutions Chapter 8 జీవన భాష్యం

2. రూపకాలంకారం :
కింది వాక్యాన్ని చదవండి.
“ఆయన మాట కఠినమైనా మనసు వెన్న”.
పై వాక్యంలో
మనసు – ఉపమేయం (పోల్చబడేది)
వెన్న – ఉపమానం (పోల్చినది)

ఉపమానమైన ‘వెన్న’ లక్షణాలను, ఉపమేయమైన ‘మనసు’తో భేదం లేకుండా పోల్చడం జరిగింది.

అంటే, వెన్నకు, మనసుకు భేదం లేదు. రెండూ ఒకటే (మెత్తనివే) అనే భావాన్ని ఇస్తున్నది.

ఇలా,
ఉపమానానికి ఉపమేయానికీ అభేదాన్ని (భేదం లేదని) చెప్పడాన్ని “రూపకాలంకారం” అంటారు.
ఉదా :
(అ) లతాలలనలు రాజుపై కుసుమాక్షతలు చల్లినారు.

సమన్వయం :
ఉపమానమైన లతలను, ఉపమేయమైన లలనలను, అట్లే ఉపమానమైన కుసుమములను, ఉపమేయమైన అక్షతలకు అభేదం తెలుపుతుంది. అందువల్ల ఇది రూపకాలంకారం.

(ఆ) మౌనిక తేనెపలుకులు అందరికీ ఇష్టమే.
సమన్వయం :
ఇక్కడ ఉపమానమైన తేనెకు, ఉపమేయమైన పలుకులకు అభేదం తెల్పబడింది. అందువల్ల ఇది రూపకాలంకారం.

3. కింది వాక్యాలను పరిశీలించండి. అలంకారాన్ని గుర్తించండి.
అ) మా అన్నచేసే వంట నలభీమపాకం.
అన్న చేసే వంట – ఉపమేయం (పోల్చబడేది)
నలభీమపాకం – ఉపమానం (పోల్చినది)

ఇక్కడ ‘అన్న చేసే వంట’ అనే ఉపమేయానికి, ‘నలభీమపాకం’ అనే ఉపమానానికి అభేదం చెప్పినందున రూపకాలంకారము.

ఆ) కుటుంబానికి తండ్రి హిమగిరి శిఖరం.
తండ్రి – ఉపమేయం (పోల్చబడేది)
హిమగిరి శిఖరం – ఉపమానం (పోల్చినది)

ఇక్కడ ఉపమేయమైన తండ్రికి, ఉపమానమైన హిమగిరి శిఖరానికి అభేదం చెప్పినందున రూపకాలంకారము.

ఇ) నందనందనుడు ఆనందంగా నర్తించెను.
ఈ వాక్యంలో నంద అనే హల్లుల జంట అర్థభేదంతో వెంట వెంటనే ప్రయోగింపబడింది. అందునల్ల ఇది ఛేకానుప్రాసాలంకారం.

ఈ) నల్లపిల్లి మెల్లగా ఇల్లు చొచ్చి చల్లని పాలు తాగింది.
ఈ పై ఉదాహరణలో ‘ల్ల’ కారం పలుమార్లు ఆవృత్తం అయ్యింది. అందువల్ల ఇది వృత్త్యనుప్రాసాలంకారం.

వ్యాకరణంపై అదనపు సమాచారం

పర్యాయపదాలు

అడుగు : పాదము, చరణము
మనసు : చిత్తము, ఉల్లము, హృదయము
నేస్తము : మిత్రుడు, స్నేహితుడు
గిరి : పర్వతం, అది
కన్ను : చక్షువు, నయనం, అక్షి
హిమగిరి : హిమాలయం, శీతాద్రి, తుహినాద్రి
మనిషి : మానవుడు, నరుడు
దారి : బాట, మార్గము, పథము

వ్యుత్పత్తరాలు

పక్షి – పక్షములు గలది (పిట్ట)
ధరణి – విశ్వాన్ని ధరించునది (భూమి)
భూజము – భూమి నుండి పుట్టినది (చెట్టు)

నానార్థాలు

ఫలము – పండు, ప్రయోజనం
గుణం – స్వభావం, వింటినారి
కన్ను – నేత్రం, బండిచక్రం

AP Board 8th Class Telugu Solutions Chapter 8 జీవన భాష్యం

సంధులు

అ) సంధి పదాలను విడదీసి, సంధి పేరు రాయండి.

నీరవుతుంది = నీరు + అవుతుంది – ఉత్వసంధి
కన్నీరవుతుంది = కన్నీరు + అవుతుంది – ఉత్వసంధి
దారవుతుంది = దారి + అవుతుంది – ఉత్వసంధి
ఫలమేమి = ఫలము + ఏమి – ఉత్వసంధి
ఎత్తులకెగిరినా = ఎత్తులకు + ఎగిరినా – ఉత్వసంధి
విలువేమి = విలువ + ఏమి – ఉత్వసంధి

ఆ) సంధికార్యాలు.
అవ్వసంది
సూత్రం : అత్తునకు సంధి బహుళము.
విలువేమి = విలువ + ఏమి – అత్వసంధి

ఇత్వసంధి
సూత్రం : ఏమ్యాదులలోని, క్రియాపదాలలోని ఇత్తునకు సంధి వైకల్పికముగానగు.
దారవుతుంది = దారి + అవుతుంది – ఇత్వసంధి

ఉత్వసంధి
సూత్రం : ఉత్తునకు అచ్చు పరమగునపుడు సంధియగును.
నీరవుతుంది = నీరు + అవుతుంది – ఉత్వసంధి
ఫలమేమి = ఫలము + ఏమి – ఉత్వసంధి

AP Board 8th Class Telugu Solutions Chapter 8 జీవన భాష్యం

సమాసాలు

సమాస పదంవిగ్రహవాక్యంసమాసం పేరు
ఇసుక గుండెలుఇసుక యొక్క గుండెలుషష్ఠీ తత్పురుష సమాసం
కన్నీరుకంటి యొక్క నీరుషష్ఠీ తత్పురుష సమాసం
హిమగిరి శిరసుహిమగిరి యొక్క శిరసుషష్ఠీ తత్పురుష సమాసం
ఎడారి దిబ్బలుఎడారి యందలి దిబ్బలుషష్ఠీ తత్పురుష సమాసం

ప్రకృతి – వికృతులు

హృదయం – ఎద, ఎడద
త్యాగం – చాగం
మనిషి – మనిసి
సుఖం – సుకం
నీరము – నీరు
మృగము – మెకము

కవి పరిచయం

కవి : ఆచార్య సింగిరెడ్డి నారాయణరెడ్డి

జననం : 1931

స్థలం : కరీంనగర్ జిల్లా హనుమాజీపేట గ్రామం.

నిర్వహించిన పదవులు : ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖలో ఆచార్యులుగా, అధికార భాషా సంఘం అధ్యక్షులుగా, అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయానికీ, తెలుగు విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా, ఆంధ్ర సారస్వత పరిషత్తు అధ్యక్షులుగా ఉన్నారు.

రచనలు : నాగార్జునసాగరం, కర్పూరవసంతరాయలు, మధ్యతరగతి మందహాసం, విశ్వంభర, ప్రపంచపదులు మొ॥న నలభైకి పైగా కావ్యాలు, అద్భుతమైన సినిమా పాటలు రాశారు. ‘ఆధునికాంధ్ర కవిత్వము – సంప్రదాయములు, ప్రయోగములు’ అనే సిద్ధాంత గ్రంథం ! ప్రసిద్ధి పొందింది.

పురస్కారాలు : జాతీయ స్థాయిలో అత్యున్నత సాహితీ పురస్కారమైన జ్ఞానపీఠ’ అవార్డు, భారత ప్రభుత్వ ‘పద్మభూషణ్’ అవార్డు.

గజల్ పాదాలు – భావాలు

1, 2 పాదాలు :
మబ్బుకు మనసే కరిగితే అది నీరవుతుంది
మనసుకు మబ్బే ముసిరితే కన్నీరవుతుంది

భావం : నీటితో నింపుకున్న మబ్బులు తడితో బరువెక్కిపోతే వర్షమై అవి భూమి మీద కురుస్తాయి. అలాగే మనసుకు ఆందోళనలు, బాధలు, చింతలు అనే దిగులు మబ్బులు కమ్ముకుంటే దుఃఖస్థితి వస్తుంది. అది కన్నీరుగా మారుతుంది. భయపడకుండా నిరుత్సాహపడకుండా ముందుకు అడుగులు

3, 4 పాదాలు:
వంకలు దొంకలు కలవని జడిపించకు నేస్తం
జంకని అడుగులు కదిలితే అది దారవుతుంది.

భావం :
ఓ నేస్తమా ! మనం ఒక లక్ష్యాన్ని సాధించటానికి బయలుదేరినపుడు అడుగడుగునా ఎన్నో కష్టాలు, అడ్డంకులు ఎదురవుతాయని లోకం భయపెడుతుంది. కానీ ఆ మాటలకు వేస్తే నీవు అనుకున్న విజయం లభిస్తుంది. ఆ స్ఫూర్తె నలుగురు అనుసరించే దారిగా మారుతుంది.

AP Board 8th Class Telugu Solutions Chapter 8 జీవన భాష్యం

5, 6 పాదాలు :
ఎడారి దిబ్బలు దున్నితే ఫలమేముందనకు
ఇసుక గుండెలు పగిలితే అది పైరవుతుంది

భావం :
నేల అంతా బీటలు పడి, ఎందుకూ పనికి రాకుండా ఉన్నదని, ఏ పంటలూ పండవనీ, ఏ ప్రయత్నం చేయకుండానే నిరాశపడకూడదు. కష్టపడి శ్రమతో ఆ నేలనే దున్నితే, విశ్వాసంతో విత్తనాలు నాటితే మంచి పంటలు పండుతాయి.

7, 8 పాదాలు :
మృగమూ ఒకటనే అనుకుంటే వ్యర్థం
మనుషులు పదుగురు కూడితే ఒక ఊరవుతుంది

భావం :
మనం మనిషీ, మృగమూ ఒకటి అని భావించ కూడదు. మృగం ఏ అరణ్య ప్రాంతంలోనైనా ఒంటరిగా నివసించగలదు. కానీ మనిషి అలాకాదు. నలుగురు మనుషులు కలిసి పరస్పర సహకారంతో జీవించటమే ఉత్తమ సాంఘిక జీవనం అవుతుంది. సాటి మనుషుల పట్ల సానుకూల దృక్పథం ఉండాలి. అప్పుడే అందరూ కలసిమెలసి ఆనందంగా జీవించ గలుగుతారు. అటువంటి మనుషులు కలిస్తేనే ఒక ఊరు ఏర్పడుతుంది.

9, 10 పాదాలు :
ఎంతటి ఎత్తుల కెదిగినా ఉంటుంది పరీక్ష
హిమగిరి శిరసే మాడితే అది యేరవుతుంది

భావం :
మనం ఎంత సమర్థులం అయినా, అధికారం, సంపదలు ఉన్నా, ఎన్నో విజయాలు సాధించినా. ఇక మనకు ఎలాంటి కష్టాలూ, బాధలూ రావని ధీమాగా ఉండలేం. విధి ఎప్పుడు ఏ కష్టాలు కలిగిస్తుందో, సమస్యల పరీక్షలు పెడుతుందో ఎవరూ ఊహించలేరు. దాని శక్తి ముందు ఎవరైనా తలవంచ వలసిందే. ఉన్నతమైన హిమాలయ శిఖరం కూడా ఎండవేడికి కరిగిపోయి నదిగా ప్రవహించవలసిందే. అలాగే ఎంతటి మనిషికైనా గర్వం నీరు కారిపోవలసిందే.

11,12 పాదాలు :
బిరుదులు పొందే వ్యాప్తికి విలువేమి “సినారే”
చెరగని త్యాగం మిగిలితే ఒక పేరవుతుంది.

భావం :
మన పేరు ప్రపంచానికంతా తెలిసేలా ప్రఖ్యాతి పొందామని, ప్రతిష్టాత్మక బిరుదులు, సత్కారాలు పొందామని అనుకోవడంలో నిజమైన విలువ, గుర్తింపు లేదు. మానవాళికి మనిషీ పనికి వచ్చే గొప్ప పని, నిస్వార్థ త్యాగం చేస్తే ఆ మనిషి పేరు చరిత్రలో శాశ్వతంగా మిగిలిపోతుంది.

AP Board 9th Class Telugu Important Questions Chapter 3 శివతాండవం

AP State Syllabus AP Board 9th Class Telugu Important Questions Chapter 3 శివతాండవం.

AP State Syllabus 9th Class Telugu Important Questions 3rd Lesson శివతాండవం

9th Class Telugu 3rd Lesson శివతాండవం Important Questions and Answers

I. అవగాహన – ప్రతిస్పందన

క్రింది అపరిచిత పద్యాలను చదివి, ప్రశ్నలకు జవాబులు రాయండి.

1. భాష రాదు, వట్టిపాలు మాత్రమె త్రాగు
నిద్రవోవు, లేచి నిలువ లేడు
ఎవరెఱుంగరితనిదే దేశమో కాని,
మొన్న, మొన్న నిలకు మొలచినాఁడు.
ప్రశ్నలు:
1. ఈ పద్యం ఎవరి గురించి ప్రస్తావిస్తోంది (చెబుతోంది)?
2. ఇతనికి ఏమేమి రావు?
3. ‘మొలచినాడు’ అంటే అర్థం?
4. ఎవరూ ఎఱుగనది ఏది?
జవాబులు :
1. పసిబాలుడు (శిశువు)
2. భాష రాదు, లేచి నిలబడటం రాదు.
3. పుట్టినవాడు
4. ఇతని దేశం (ఎక్కడివాడో)

AP Board 9th Class Telugu Important Questions Chapter 3 శివతాండవం

2. పట్టమేలే రాజు పోయెను
మట్టి కలిసెను కోటపేటలు
పదం పద్యం పట్టి నిలిచెను
కీర్తులపకీర్తుల్
ప్రశ్నలు:
1. నేలలో కలిసినవేవి?
2. లోకంలో నిలిచేవేవి?
3. ‘రాజు ‘ వికృతి?
4. ‘పద్దెము’ ప్రకృతి?
జవాబులు:
1. కోటపేటలు
2. కీర్తి – అపకీర్తి
3. జేడు
4. పద్యము

3. ఈ కింది అపరిచిత గద్యాన్ని చదివి ఇవ్వబడిన ప్రశ్నలకు జవాబులు రాయండి. (S.A. II – 2018-19)
మానవ మనుగడకు నీరు ప్రాణాధారం. నీరు అనేక విధాలుగా లభ్యం అవుతుంది. ముఖ్యంగా నదుల నుండి లభించే నీరు మానవకోటి బ్రతకడానికే కాదు పాడిపంటలు సమృద్ధిగా పండటానికి దోహదం చేస్తుంది. నదుల వల్ల దేశంలోని పంటపొలాలు సస్యశ్యామలమై విరాజిల్లుతున్నాయి. నదుల వల్ల డెల్టాలు ఏర్పడుతున్నాయి. నదులు సారవంతమైన ఒండ్రు మట్టిని తమతో కొట్టుకొని తెచ్చి మేట వేస్తాయి. ఈ విధంగా పుట్టినవే కృష్ణా, గోదావరి డెల్టాలు, నదుల వల్ల పంటలు పండడమే కాదు పారిశ్రామికాభివృద్ధి కూడా జరుగుతుంది.
ప్రశ్నలు:
1. నదుల వలన ఏర్పడిన డెల్టాలు ఏవి?
2. మానవ మనుగడకు ప్రాణాధారమేమి?
3. నదుల వలన మానవులకు కలిగే ఒక ప్రయోజనం రాయండి.
4. పై గద్యం ఆధారంగా ఒక ప్రశ్న తయారుచెయ్యండి.
జవాబులు:
1. కృష్ణా, గోదావరి డెల్టాలు
2. నీరు
3. మానవులు బ్రతకడానికి / పాడిపంటలు సమృద్ధిగా పండటానికి
4. నదులు సారవంతమైన ఒండ్రుమట్టిని మేట వేయడాన్ని ఏమంటారు?

II. స్వీయరచన

1. క్రింది ప్రశ్నకు నాలుగైదు వాక్యాలలో సమాధానం రాయండి.

ప్రశ్న 1.
‘శివతాండవం’ ప్రక్రియను గూర్చి రాయండి.
జవాబు:
పుట్టపర్తి నారాయణాచార్యులు రచించిన శివతాండవం ‘గేయ కవిత’ ప్రక్రియకు చెందినది. గేయం అంటే పాట. గేయకవిత పాడుకోవడానికి అనువైనది. పద్యాలలో లాగే దీనిలోనూ మాత్రాఛందస్సు ఉంటుంది. లయాత్మకంగా ఉండి అంత్యప్రాసలూ, యతులూ కూడా ఉండవచ్చు.

ప్రశ్న 2.
సంగీత సాహిత్య సమ్మిళితమైన శివతాండవాన్ని ఆవిష్కరించిన కవిని గూర్చి రాయండి. (S.A. I – 2018-19)
సత్వరజస్తమో గుణాలనావిష్కరిస్తూ శివతాండవాన్ని వర్ణించిన కవి పరిచయం చేయండి. (S.A. II – 2018-19)
జవాబు:
పుట్టపర్తి నారాయణాచార్యులు (1914 – 1990) స్వస్థలం అనంతపురం జిల్లా చియ్యేడు గ్రామం. 14 భాషల్లో ప్రవీణులు. 8 భాషల్లో కవిత్వం చెప్పగల దిట్ట. సంగీత, నాట్య శాస్త్రాల్లో సంపూర్ణ పాండిత్యం కలవారు. “సరస్వతీ పుత్ర” వీరి బిరుదు. శివతాండవం, మేఘదూతం, షాజీ, కావ్యమాల, జనప్రియ రామాయణం, పండరీ భాగవతం, సాక్షాత్కారం మొదలైన రచనలు చేశారు. ‘లీవ్స్ ఇన్ ద విండ్’ అనే ఆంగ్ల కావ్యం కూడా వీరి రచనే. వీరు రాసిన శివతాండవం సంగీత సాహిత్య నాట్య సంకేతాల సమ్మేళనం. పుట్టపర్తి రచనల్లో దేశభక్తి, సాంస్కృతిక విలువలు, జాతీయభావాలు, మానవీయ విలువలు తొణికిసలాడతాయి.

వ్యక్తీకరణ – సృజనాత్మకత

అ) క్రింది ప్రశ్నకు సమాధానము రాయండి.

ప్రశ్న 1.
మీ ఊరిలో జరిగే నాట్య ప్రదర్శనకు అందరికీ ఆహ్వానం పలుకుతూ ఒక ‘కరపత్రాన్ని రాయండి.
జవాబు:
నాట్య ప్రదర్శన కంచిభొట్ల సాహితీ సమితివారి ఆధ్వర్యంలో నాట్యమయూరి స్రవంతి గారిచే నాట్య ప్రదర్శన. ది. x x x x x న సా|| 7 గం||లకు మన గ్రామంలోని త్రివిక్రమ స్వామి వారి దేవస్థాన ప్రాంగణమున ప్రదర్శన జరుగును. హైదరాబాద్, బెంగళూరు, గుంటూరు, మద్రాస్, విశాఖపట్టణం, విజయవాడ, తెనాలి మున్నగు ప్రాంతాలలో ఎన్నో ప్రదర్శనలిచ్చి, ఘనమైన సన్మానాలు, బంగారు కంకణాలు బహుమతులు పొందిన కుమారి స్రవంతి మన గ్రామంలో ప్రదర్శన ఇవ్వడానికి వస్తున్నది. ప్రజలంతా తప్పక విచ్చేసి, నాట్యమయూరి కుమారి స్రవంతి గారి నాట్య ప్రదర్శన చూసి, ఆశీర్వదించవలసినదిగా కోరుతున్నాం. కుమారి స్రవంతికి నాట్యాన్ని నేర్పిన శ్రీమతి శశిశ్రీగారి దివ్య సముఖంలో ఈ ప్రదర్శన జరగడం విశేషం. ఈ ప్రదర్శనకు వాద్య సహకారం హార్మోనియం : శ్రీ జస్వంత్ సమీర్, డోలక్ : శ్రీ సాయిశ్రీ ప్రసాద్, ఆర్గనైజర్ : శ్రీ సాయి భరద్వాజ్. ప్రతి ఒక్కరికీ పేరు పేరున ఇదే మా ఆహ్వానం. తప్పక విచ్చేయండి.

ఇట్లు,
కంచిభొట్ల సాహితీ సమితి సభ్యులు,
చెరుకూరు.

AP Board 9th Class Telugu Important Questions Chapter 3 శివతాండవం

ప్రశ్న 2.
మీరు చూసిన నృత్య ప్రదర్శన గూర్చి మిత్రునికి లేఖ రాయండి.
జవాబు:

బాపట్ల,
x x x x

ప్రియమిత్రుడు నాగలక్ష్మణు
ఉభయ కుశలోపరి. నేను బాగా చదువుతున్నాను. నీవు కూడా బాగా చదువుతున్నావని ఆశిస్తున్నాను. ముఖ్య విషయం – ఇటీవల మా ఊరిలో కుమారి గౌరి నృత్య ప్రదర్శన జరిగింది. చాలా బాగుంది. సహజమైన అభినయంతో అందరి ప్రశంసలు పొందింది. శాస్త్రీయ నృత్యంతో పాటు, సినిమాల్లోని భక్తి పాటలు కొన్నింటికి కూడా నృత్యం చేసింది. జనం కూడా బాగా ఆనందించారు. అభినందించారు. మా తల్లిదండ్రులతో కలిసి నేనూ ఆ ప్రదర్శన చూసాను. నీవు ఏదైన నాట్య ప్రదర్శన చూసి ఉంటే ఉత్తరం రాయి.

ఇట్లు,
నీ మిత్రుడు,
కె. ఫణిరామ్.

చిరునామా:
యస్. నాగలక్ష్మణ్,
9వ తరగతి,
జిల్లా పరిషత్ హైస్కూల్,
ఒంగోలు, ప్రకాశం జిల్లా.

ప్రశ్న 3.
‘శివతాండవం’ పాఠంలో ప్రకృతి వర్ణనను చూశారు కదా ! ఏదేని ప్రకృతి అంశం (పూలు, పండ్లు, పక్షులు ……. మీతో మాట్లాడుతున్నట్లు సంభాషణ రూపంలో రాయండి.
జవాబు:
పుష్పవిలాపం
బాలుడు : (పూలు కోస్తూ) ఆహా ! ఈ పూలు ఎంత అందంగా ఉన్నాయో.

పూవు : ఓ అబ్బాయీ ! నన్నెందుకు హింసిస్తున్నావు?

బాలుడు : అయ్యో ! లేదు లేదు. నా కోసం నిన్ను కోయడం లేదు. అర్చనకై నిన్ను ఉపయోగిస్తున్నాను.

పూవు : తోటి ప్రాణులను హింసించకూడదన్న సంగతి తెలిసి కూడా ఎందుకు నీ పూజలు?

బాలుడు : నిజమే. కానీ ! ………..

పూవు : నీవు గమనించావో లేదో. చెట్టుతల్లి ఒడిలో హాయిగా ఆడుకునే మమ్మల్ని త్రుంచి, ఎందుకు తల్లీ బిడ్డలను వేరు చేస్తారు మీ దయలేని మనుష్యులు?

బాలుడు : అయ్యో పాపం ! నిజమే.

పూవు : పేరుకు మాత్రమే మానవత్వం కల్గిన మానవులు మీరు. బుద్ధుని మీ ప్రతినిధిగా చెపుతారు. రాక్షసంగా ప్రవర్తిస్తారు.

బాలుడు : లేదు. లేదు. మేం మనుష్యులమే.

పూవు : హాయిగా తల్లి ఒడిలో ఆడుకుని, ఆమె పాదాల చెంతనే రాలిపోయే మమ్మల్ని, మీ గొప్పలకోసం మెడలో వేసుకుంటారు. కాళ్ళకింద నలిపేస్తారు. అలా చేయడం మాకు ఇష్టం లేదు.

బాలుడు : అవును. అది తప్పే.

పూవు : మరి ఈ సంగతి విను. దారాలతో మెడలకు ఉరి బిగించేవారు, సూదులతో మా గుండెలలో గ్రుచ్చేవారు ఇలా మా ప్రాణాలు తీసే మీ జాతి మానవత్వం లేని జాతి. ఛీ, ఛీ. అయ్యో తెల్లవారిందే.

బాలుడు : కాదు, కాదు, మాకూ మానవత్వం ఉంది, ఉంది. (ఏమిట్రా కలవరిస్తున్నావ్ – తెల్లవారింది లే అన్న అమ్మ పిలుపుతో మెలకువ వచ్చి) ఇదంతా కలా. ఇంకెప్పుడూ పూలు కోయను.

III. భాషాంతాలు (పదజాలం, వ్యాకరణం)

1. పర్యాయపదాలు :

బూది : విభూతి, విబూది, భస్మం
హిమగిరి : చలికొండ, మంచుకొండ
అల : కెరటం, తరంగం
దిక్కు : దిశ, దెస
శివుడు : శంకరుడు, భవుడు, ఈశ్వరుడు
గజ్జె : గజ్జియ, కింకిణి, చిరుగంట
మబ్బు : మేఘం, జీమూతం, మొయిలు
తుమ్మెద : భ్రమరం, ద్విరేఫం, భృంగము
తెలుపు : శుక్లం, శ్వేతం, ధవళం
నలుపు : శ్యామం, నల్ల, కటి, కృష్ణం
ఎఱుపు : రోహితం, లోహితం, తొగరు
తాండవం : నృత్యం, నాట్యం గజ్జియ, కింకిణి, చిరుగంట
నెమలి : మయూరం, కేకి, నెమ్మి, నీలకంఠం, శిఖి

AP Board 9th Class Telugu Important Questions Chapter 3 శివతాండవం

2. వ్యుత్పత్త్యర్థాలు:

సుకృతం : లెస్సగా చేయబడినది (పుణ్యం, ధర్మం)
శివుడు : సాధుల హృదయమున శయనించువాడు, మంగళప్రదుడు (ఈశ్వరుడు)
అమృతం : మరణమును పొందింపనిది (సుధ)
ఘనసారం : శీతల మగుటచే ఘనము వంటి సారము కలది (కప్పురం)

3. నానార్థాలు :

అమృతం = సుధ, నేయి, పాలు,నీరు
విభూతి = భస్మం, సంపద, ఒక వృత్తం
తమము = చీకటి, దుఃఖం, తమోగుణం
రక్తం = నెత్తురు, ఎఱుపు, కుంకుమ
కమ్మ = పత్రిక, చెవి ఆభరణం, కులవిశేషం, ఒక రుచి, ప్రియమైనది

4. ప్రకృతి – వికృతులు :

కస్తూరి – కస్తురి
దిశ – దెస, దిక్కు
చిత్రము – చిత్తరువు
భాగ్యం – బాగెం
తామరస – తామర, తమ్మి
చిహ్నము – చిన్నె
శాస్త్రం – చట్టం
పుష్పం – పూవు

5. సంధులు :

నీలము + కండ్ల – నీలపు గండ్ల – పుంప్వాదేశ సంధి
అబ్బురము + నీలము – అబ్బురపు నీలము – పుంప్వాదేశ సంధి

6. సమాసాలు:

మబ్బుగములు – మేఘాల యొక్క సమూహాలు – షష్ఠీ తత్పురుష సమాసం
సుకృత రూపము – మంగళప్రదమైన రూపము – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం

7. అలంకారాలు :

ఉపమాలంకారం : ఉపమాన ఉపమేయములకు మనోహరమైన పోలిక చెప్పుట ఉపమాలంకారం. దీనిలో
ఉపమానం : పోలిక వస్తువు
ఉపమేయం : ఉన్న వస్తువు
ఉపమావాచకం : వలె, పోలె, లాగ
సమాన ధర్మం : రెండు వస్తువులోని ధర్మం
అనే నాలుగు (కొన్నిట్లో ఉపమావాచకం ఉండదు) అంశాలు ఉంటాయి.
ఉదా :
కర్పూరం వెన్నెల వలె చల్లదనాన్ని కలిగిస్తుంది.
ఇక్కడ ఉపమేయం : కర్పూరం
ఉపమానం : వెన్నెల
ఉపమావాచకం : వలె
సమాన ధర్మం : చల్లదనం

9th Class Telugu 3rd Lesson శివతాండవం 1 Mark Bits

1. ఉపమాలంకారం లక్షణం గుర్తించండి. (S.A. I – 2018-19)
ఎ) ఉపమేయమునందు ఉపమాన ధర్మం ఆరోపించడం
బి) ఉపమాన ఉపమేయాలకు అభేదం చెప్పుట.
సి) ఉపమేయ ఉపమానములకు మనోహరమైన సాదృశ్యం చెప్పడం
డి) ఉపమాన ఉపమేయాలకు భేదం చెప్పుట
జవాబు:
సి) ఉపమేయ ఉపమానములకు మనోహరమైన సాదృశ్యం చెప్పడం

2. వెన్నెల విరగకాస్తే హాయిగా ఉంటుంది – (గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి) – (S.A. II – 2017-18)
ఎ) కౌముది – కైరవం
బి) కౌముది – చంద్రుడు
సి) చంద్రిక – కౌముది
డి) కౌముది – కౌమారం
జవాబు:
సి) చంద్రిక – కౌముది

AP Board 9th Class Telugu Important Questions Chapter 3 శివతాండవం

3. పాఠశాలకు వెళ్ళునపుడు పుస్తకాలు మరువరాదు (సంధి పేరు గుర్తించండి) (S.A. II – 2017-18)
ఎ) ఉత్వసంధి
బి) సవర్ణదీర్ఘ సంధి
సి) లు,ల,న,ల సంధి
డి) లుత్వసంధి
జవాబు:
సి) లు,ల,న,ల సంధి

4. గరుడుడు అమృతమును తీసుకొచ్చి మాతృదాస్యాన్ని తొలగించారు. (పర్యాయపదాలు గుర్తించండి.) (S.A. III – 2016-17)
ఎ) క్షుధ, సుధ
బి) సుధ, పీయూషం
సి) సుధ, వ్యధ
డి) సుధ, ధరా
జవాబు:
బి) సుధ, పీయూషం

5. ‘కర్మధారయంబులందు ఉత్తునకచ్చు పరంబగునప్పుడు టుగాగమంబగు’ అనే సంధి సూత్రానికి ఉదాహరణను గుర్తించండి. (S.A. III – 2016-17)
ఎ) ఉద్భటుడు
బి) వాగ్భటుడు
సి) చిట్టెలుక
డి) తూగుటుయ్యాల
జవాబు:
డి) తూగుటుయ్యాల

6. చిరుగాలి పొరలు లేచినయట్లు శివుని నాట్యం ఆహ్లాదకరంగా ఉంది. (పై వాక్యంలోని అలంకారాన్ని గుర్తించండి.) (S.A. III – 2016-17)
ఎ) అర్థాంతరన్యాస
బి) ఉపమాలంకారం
సి) స్వభావోక్తి
డి) శ్లేష
జవాబు:
బి) ఉపమాలంకారం

భాషాంశాలు (పదజాలం, వ్యాకరణం)

1. అర్థాలు :

7. చలికొండపై శివపార్వతులు కొలువు చేసారు – గీత గీసిన పదానికి అర్థమేమిటి?
A) వింధ్య
B) హిమాలయం
C) ఆరావళి
D) సాత్పురా
జవాబు:
B) హిమాలయం

8. ముఖముపై హాసపు రేఖ ఉండాలి – గీత గీసిన పదానికి అర్థమేమిటి?
A) అందం
B) హాయి
C) నవ్వు
D) విచారం
జవాబు:
C) నవ్వు

9. బంగారానికి తావి అబ్బినట్లు – గీత గీసిన పదానికి అర్థమేమిటి?
A) వజ్రం
B) మణి
C) ఇత్తడి
D) సువాసన
జవాబు:
D) సువాసన

10. పౌర్ణమినాడు సముద్రంలో తరగలు ఎక్కువైతాయి – గీత గీసిన పదానికి అర్థమేమిటి?
A) అలలు
B) చేపలు
C) పర్యాటకులు
D) సందర్శకులు
జవాబు:
A) అలలు

11. ‘ఘనసారమును దెచ్చి కలయ జల్లు విధాన’ – గీత గీసిన పదానికి అర్థం ఏమిటి?
A) ఉప్పు
B) కర్పూరం
C) మంచు
D) ఆకు
జవాబు:
B) కర్పూరం

AP Board 9th Class Telugu Important Questions Chapter 3 శివతాండవం

12. ‘తమ్ములై, ఘటిత మోదమ్ములై’ – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
A) తమ్ముళ్ళు
B) సోదరులు
C) పద్మములు – పద్మములు
D) పూలు
జవాబు:
C) పద్మములు – పద్మములు

13. వసంత ఋతువులో వృక్షాలు నవకోరకములతో శోభాయమానంగా ఉంటాయి – గీత గీసిన పదానికి అర్థం ఏది?
A) చిగురు
B) పుష్పము
C) మొగ్గ
D) పండు
జవాబు:
C) మొగ్గ

14. శివుని నేత్రములు రక్త కిసలములవలె ఉన్నాయి – గీత గీసిన పదానికి అర్థము ఏది?
A) చిగురుటాకు
B) మొగ్గు
C) పుష్పము
D) పద్మము
జవాబు:
A) చిగురుటాకు

2. పర్యాయపదాలు :

15. శివుడు భస్మధారుడు – గీత గీసిన పదానికి పర్యాయ పదాలు గుర్తించండి.
A) విబూది, దూది
B) విభూతి, బూతి
C) బూడిద, గుమ్మడి
D) ఏదీకాదు
జవాబు:
B) విభూతి, బూతి

16. మా చెల్లి గజ్జె కట్టి ఆడితే ఎంతో బాగుంటుంది – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
A) కింకిణి, చిరుగంట
B) కింకిణి, తాళం
C) గజ్జయ, గొలుసు
D) ఏదీకాదు
జవాబు:
A) కింకిణి, చిరుగంట

17. మంగళప్రదుడు శివుడు – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
A) భవుడు, దేవుడు
B) ఈశ్వరుడు, దేవా
C) శంకరుడు, భవుడు
D) రుద్రుడు, రుద్రాణి
జవాబు:
C) శంకరుడు, భవుడు

18. పూల మకరందాలకై తుమ్మెదలు దండెత్తాయి – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
A) భ్రమరం, భ్రమ
B) ద్విరేఫం, ఏకం
C) భృంగం, భంగం
D) భ్రమరం, భృంగం
జవాబు:
D) భ్రమరం, భృంగం

19. విబూది ధరించిన శివుడు శుక్లపక్షం చంద్రునివలె ఉన్నాడు – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
A) తెలుపు, చెప్పు
B) శ్వేతం, సౌధం
C) ధవళం, శ్వేతం
D) తెలుపు, తలుపు
జవాబు:
C) ధవళం, శ్వేతం

AP Board 9th Class Telugu Important Questions Chapter 3 శివతాండవం

20. తాండవ కృష్ణ తారంగం – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
A) నాట్యం, నాటకం
B) నృత్యం, నాట్యం
C) నృత్యం, సంగీతం
D) నడక, పాట
జవాబు:
B) నృత్యం, నాట్యం

21. నెమలి పురివిప్పి నాట్యమాడుతుంది – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
A) కేకి, కాకి
B) నెమ్మి, నిమ్మ
C) శిఖి, శాఖి
D) మయూరం, నీలకంఠం
జవాబు:
D) మయూరం, నీలకంఠం

22. రక్తపు రంగు ఎఱుపు – గీత గీసిన పదానికి పర్యాయ పదాలు గుర్తించండి.
A) రోహితం, తొగరు
B) లోహితం, లోహం
C) సూర్యుడు, పగలు
D) ఏదీకాదు
జవాబు:
A) రోహితం, తొగరు

23. ఆహా ! ఏమి తావి. బహుశా పరిమళం గులాబీది కాబోలు-గీత గీసిన పదానికి పర్యాయపదం గుర్తించండి. (S.A. II – 2018-19)
A) సౌరభం
B) ఆమని
C) మధువు
D) పాలు
జవాబు:
A) సౌరభం

24. ‘సూర్యుడు అస్తమించగానే అంధకారం అలుముకుంది. ఆ చీకటి భయం కలిగిస్తుంది – గీత గీసిన పదానికి పర్యాయపదం గుర్తించండి.
A) తమస్సు
B) రజస్సు
C) ప్రభాతము
D) సంధ్య
జవాబు:
A) తమస్సు

25. సముద్రంలో తరగలు విపరీతంగా వస్తున్నాయి – గీత గీసిన పదానికి పర్యాయపదాలను గుర్తించండి.
A) కెరటములు, అలలు
B) నురుగు, హోరు
C) తరంగాలు, నాచు
D) కెరటాలు, ముత్యపు చిప్పలు
జవాబు:
A) కెరటములు, అలలు

26. చిరుగాలిలో తమ్మి విరులు కదిలాయి – గీత గీసిన పదానికి గల పర్యాయపదాలు ఏవి?
A) పద్మములు, కలువలు
B) మల్లెలు, మొల్లలు
C) పూలు, కుసుమములు
D) సుమములు, కిసలయములు
జవాబు:
C) పూలు, కుసుమములు

3. వ్యుత్పత్యర్థాలు :

27. మరణం పొందింపనిది – వ్యుత్పత్తి పదం ఏది?
A) పాలు
B) నీరు
C) అమృతం
D) నెయ్యి
జవాబు:
C) అమృతం

28. శీతల మగుటచే ఘనము వంటి సారం కలది – వ్యుత్పత్తి పదం గుర్తించండి.
A) కర్పూరం
B) ఘన పదార్థం
C) ఘనసారం
D) ఉప్పు
జవాబు:
B) ఘన పదార్థం

29. సాధుల హృదయాన శయనించువాడు – వ్యుత్పత్తి పదం గుర్తించండి.
A) ఋషి
B) మౌని
C) విష్ణువుడు
D) శివుడు
జవాబు:
D) శివుడు

30. ‘సుకృతం’ – వ్యుత్పత్తి గుర్తించండి.
A) లెస్సగా చేయబడింది
B) బాగా చేశారు
C) బాగా చేశావు
D) లెస్సగా తయారు చేసింది
జవాబు:
A) లెస్సగా చేయబడింది

AP Board 9th Class Telugu Important Questions Chapter 3 శివతాండవం

31. ‘మరణము లేనిది’ – అనే వ్యుత్పత్తి గల పదాన్ని గుర్తించండి.
A) అమరణం
B) అమృతము
C) సంజీవని
D) అమృత్యువు
జవాబు:
B) అమృతము

4. నానార్థాలు :

32. అమృతం పంచేవారు అమ్మానాన్నలు – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
A) సుధ, సాధు
B) నేయి, వెయ్యి
C) పాలు, నీరు
D) నీరు, మీరు
జవాబు:
C) పాలు, నీరు

5. ప్రకృతి – వికృతులు :

33. ‘ఈ తమం‘ కన్నులుండీ గుడ్డిని చేస్తున్నది – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
A) చీకటి, వెలుగు
B) దు:ఖం, చీకటి
C) దుఃఖం, సంతోషం
D) తమోగుణం, రజోగుణం
జవాబు:
B) దు:ఖం, చీకటి

34. కృష్ణుడు గీతలో విభూతి యోగం గూర్చి చెప్పాడు- గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
A) భస్మం, బూది
B) సంపద, ధనం
C) ఒక వృత్తం, కందం
D) భస్మం, ఐశ్వర్యం
జవాబు:
D) భస్మం, ఐశ్వర్యం

35. స్వాతంత్ర్యం కోసం ఎందరో భారతీయులు తమ రక్తం చిందించారు – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
A) ఎఱుపు, కుంకుమ
B) నెత్తురు, రక్తం
C) కుంకుమ, పసుపు
D) ఎఱుపు, పచ్చ
జవాబు:
A) ఎఱుపు, కుంకుమ

36. చెవి కమ్మలు పెట్టుకొని తిరుగుతున్న నా చెల్లి ఎంతో బాగుంది – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
A) పత్రిక, పుత్రిక
B) రుచి, వాసన
C) చెవి ఆభరణం, కుల విశేషం
D) ప్రియం, అప్రియం
జవాబు:
C) చెవి ఆభరణం, కుల విశేషం

37. కస్తూరి యట చూడ కాంతి నల్లగనుండు – గీత గీసిన పదానికి వికృతి పదం ఏది?
A) కసూరి
B) కస్తురి
C) కస్తి
D) కసిరి
జవాబు:
B) కస్తురి

38. కొలనులోని తామరలు అందంగా ఉన్నాయి – గీత గీసిన పదానికి ప్రకృతి పదం ఏది ?
A) తమ్మి
B) కలువ
C) తామరస
D) పద్మం
జవాబు:
C) తామరస

39. ఆ చిన్నది వన్నె చిన్నెలు ఒలకబోస్తున్నది – గీత గీసిన పదానికి ప్రకృతి పదం ఏది?
A) చిహ్నం
B) అందం
C) సిగ్గు
D) ఒయ్యారం
జవాబు:
A) చిహ్నం

40. పురివిప్పి నాట్యమాడే నెమలిని చూసి నేను ‘చిత్రం‘ వలె నిల్చున్నాను – గీత గీసిన పదానికి వికృతి పదం ఏది ?
A) చితరం
B) చిత్ర
C) బొమ్మ
D) చిత్తరువు
జవాబు:
D) చిత్తరువు

41. శాస్త్రము తెలిసినవాడు పండితుడు – గీత గీసిన పదానికి వికృతి పదం ఏది?
A) శాసతరం
B) చట్టం
C) శాసనం
D) బుద్ధి
జవాబు:
B) చట్టం

AP Board 9th Class Telugu Important Questions Chapter 3 శివతాండవం

42. సంక్రాంతి పండుగ భోగభాగ్యాలు ఇంట కురిపిస్తుంది – గీత గీసిన పదానికి వికృతి పదం ఏది?
A) భాగం
B) బాగం
C) బాగెం
D) సంపద
జవాబు:
C) బాగెం

43. పూలు తమను కోయవద్దని కోరాయి – గీత గీసిన పదానికి ప్రకృతి పదం ఏది?
A) పువ్వు
B) విరి
C) సుమం
D) పుష్పం
జవాబు:
D) పుష్పం

44. ‘అపూర్వం’ పదానికి వికృతిని గుర్తించండి.
A) పూర్వం
B) అప్పురము
C) అపురూపము
D) అబ్రము
జవాబు:
C) అపురూపము

45. ముత్యము – దీని ప్రకృతి పదాన్ని గుర్తించండి.
A) ముత్తియము
B) ముత్తెం
C) మౌక్తికం
D) ముత్తెము
జవాబు:
C) మౌక్తికం

6. సంధులు :

46. ‘నీలపుగండ్ల’ – పదాన్ని విడదీయండి.
A) నీలము + గండ్ల
B) నీలం + కండ్ల
C) నీలము + కండ్ల
D) నీలపు + కండ్ల
జవాబు:
C) నీలము + కండ్ల

47. ‘అబ్బురపు నీలము’ – సంధి పేరేమిటి?
A) పడ్వాది సంధి
B) పుంప్వాదేశ సంధి
C) ఆమ్రేడిత సంధి
D) టుగాగమ సంధి
జవాబు:
B) పుంప్వాదేశ సంధి

48. ఉత్వసంధికి ఉదాహరణ రాయండి.
A) జారినయట్లు
B) కదిలినట్లు
C) తేనెటీగ
D) దిక్కులెల్ల
జవాబు:
D) దిక్కులెల్ల

49. కన్ + కొనల – పదాన్ని కలపండి.
A) కన్కొనల
B) కల్గొనల
C) కనుగొనల
D) కనగొనల
జవాబు:
B) కల్గొనల

50. ‘వగలు + పోయిన’ – సంధి పేరేమిటి?
A) గసడదవాదేశ సంధి
B) అత్వసంధి
C) ఉత్వసంధి
D) యడాగమసంధి
జవాబు:
A) గసడదవాదేశ సంధి

AP Board 9th Class Telugu Important Questions Chapter 3 శివతాండవం

51. ‘పల్లె + ఊరు’ – సంధి పేరేమిటి?
A) టుగాగమ సంధి
B) ద్విరుక్తటకారాదేశ సంధి
C) అత్వసంధి
D) ఉత్వసంధి
జవాబు:
A) టుగాగమ సంధి

52. ‘దేశాల’ విడదీయండి.
A) దేశ + అల
B) దేశ + ఆల
C) దేశము + ల
D) దేశా + ల
జవాబు:
C) దేశము + ల

53. ‘చుట్టాలు’ – సంధి పేరేమిటి?
A) అత్త్వసంధి
B) లు,ల,నల సంధి
C) ఉత్వసంధి
D) ఇత్వసంధి
జవాబు:
B) లు,ల,నల సంధి

54. ‘అబ్బురపు నీలము’ – సంధి విడదీయండి.
A) అబ్బురపు + నీలము
B) అబ్బు + రపు నీలము
C) అబ్బురము + నీలము
D) అబ్బుర + నీలము
జవాబు:
C) అబ్బురము + నీలము

55. ‘నిలువుటద్దం’లో గల సంధి
A) టుగాగమ సంధి
B) ఆమ్రేడిత సంధి
C) లులన సంధి
D) ద్విరుక్తటకారాదేశ సంధి
జవాబు:
A) టుగాగమ సంధి

56. ‘కఱకుటమ్ము’ విడదీసి సంధి పేర్కొనండి.
A) కఱకుట + అమ్ము (అత్వ సంధి)
B) కఱకు + అమ్ము (టుగాగమ సంధి)
C) కఱకు + టమ్ము (ఉత్వ సంధి)
D) కఱకుట్ + అమ్ము (హల్సంధి)
జవాబు:
B) కఱకు + అమ్ము (టుగాగమ సంధి)

57. భారతదేశ రాష్ట్రాలలో అల్లర్లు జరుగుతున్నాయి – గీత గీసిన పదంలో గల సంధి ఏది?
A) అత్వసంధి
B) లులనల సంధి
C) ఆమ్రేడిత సంధి
D) టుగాగమ సంధి
జవాబు:
B) లులనల సంధి

7. సమాసాలు :

58. ‘మేఘాల యొక్క సమూహం’ సమాస పదంగా మార్చండి.
A) మేఘాల వరుస
B) మబ్బుగములు
C) మబ్బు వరుస
D) మెయిలు పంక్తి
జవాబు:
B) మబ్బుగములు

59. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసానికి ఉదాహరణ రాయండి.
A) గంగానది
B) శివతాండవం
C) సుకృత రూపం
D) జడధారి
జవాబు:
C) సుకృత రూపం

60. ‘తిరుపతి అనే పేరుగల పట్టణము’ సమాసపదంగా కూర్చండి.
A) తిరుపతి పట్టణము
B) తిరుపతి నగరం
C) తిరుపతి క్షేత్రము
D) తిరుపతి
జవాబు:
A) తిరుపతి పట్టణము

61. ‘తమ్మివిరులు’ అనేది ఏ సమాసమో గుర్తించండి.
A) ద్వంద్వ
B) బహువ్రీహి
C) సంభావనా పూర్వపద కర్మధారయం
D) ద్విగు
జవాబు:
C) సంభావనా పూర్వపద కర్మధారయం

8. అలంకారాలు :

62. ‘కర్పూరం వెన్నెల వలె చల్లదనాన్ని కలిగిస్తుంది’ – ఈ వాక్యంలో గల అలంకారం
A) ఉపమా
B) రూపకం
C) ఉపేక్ష
D) అతిశయోక్తి
జవాబు:
A) ఉపమా

AP Board 9th Class Telugu Important Questions Chapter 3 శివతాండవం

63. ‘తరితీపు వెన్నెలలు విరిసికొన్న విధాన కళ్ళల్లో కాంతులు మెరిసేలా శివుడు నాట్యమాడాడు.
A) ఉపమ
B) రూపకము
C) ఉత్ప్రేక్ష
D) శ్లేష
జవాబు:
A) ఉపమ

64. ‘భ,ర,న,భ,భ,ర,వ’ గణాలు ఏ వృత్తానికి చెందినవి?
A) ఉత్పలమాల
B) చంపకమాల
C) మత్తేభము
D) శార్దూలము
జవాబు:
A) ఉత్పలమాల

65. ‘పింఛము’ – ఇది ఏ గణమో గుర్తించండి.
A) భ గణము
B) త గణము
C) ర గణము
D) న గణము
జవాబు:
A) భ గణము

66. ‘భాగవతమున భక్తి, భారతమ్మున యుక్తి, రామకథయే రక్తి’ – ఈ గేయ పంక్తుల్లో గల అలంకారాన్ని గుర్తించండి.
A) స్వభావోక్తి
B) అంత్యానుప్రాస
C) వృత్త్యనుప్రాస
D) యమకము
జవాబు:
B) అంత్యానుప్రాస

9. ఆధునిక వచనాన్ని గుర్తించడం :

67. నల్ల కలువలు దిక్కులెల్ల విచ్చు విధాన – ఈ వాక్యాన్ని ఆధునిక వచనంలోకి మార్చండి.
A) నల్ల కలువలు దిక్కులంతా విచ్చుకున్నాయి.
B) నల్ల కలువలు దిక్కులంతటా విప్పారాయి.
C) నల్ల కలువలు దిక్కులంతా విచ్చుకున్నట్లుగా.
D) నల్ల కలువలు అన్ని దిక్కులా వ్యాపించాయి.
జవాబు:
C) నల్ల కలువలు దిక్కులంతా విచ్చుకున్నట్లుగా.

68. చిగురుటాకులు గాలి వగలు వోయిన యట్లు – ఈ వాక్యాన్ని ఆధునిక వచనంలోకి మార్చండి.
A) చిగురాకులు గాలికి వయ్యారాలు పోయాయి.
B) చిగురాకులు గాలికి ఒయ్యారాలు పోయినట్లు.
C) లేతాకులు గాలికి ఒయ్యారాలు పోతున్నట్లు.
D) లేతాకులు గాలివల్ల వయ్యారాలు పోయాయి.
జవాబు:
B) చిగురాకులు గాలికి ఒయ్యారాలు పోయినట్లు.

10. వ్యతిరేకార్థక వాక్యాన్ని గుర్తించడం :

69. శివుడు పాడుతున్నాడు – వ్యతిరేక వాక్యం రాయండి.
A) శివుడు ఆడుతున్నాడు
B) శివుడు పాడుతూ ఉన్నాడు
C) పాడడు
D) శివుడు పాడటం లేదు
జవాబు:
D) శివుడు పాడటం లేదు

AP Board 9th Class Telugu Important Questions Chapter 3 శివతాండవం

70. శివతాండవంలో ప్రకృతి ప్రతిబింబించింది – వ్యతిరేక వాక్యం రాయండి.
A) శివతాండవంలో వికృతి ప్రతిబింబించింది
B) శివతాండవంలో ప్రకృతి ప్రతిబింబించలేదు
C) శివతాండవంలో ప్రకృతి లేదు
D) శివతాండవంలో వికృతి ఉంది
జవాబు:
B) శివతాండవంలో ప్రకృతి ప్రతిబింబించలేదు

11. వాక్యరకాలను గుర్తించడం :

71. శివుడు ఆడుతున్నాడు మఱియు పాడుతున్నాడు – ఇది ఏ రకమైన వాక్యం?
A) సంక్లిష్ట
B) సామాన్య
C) సంయుక్త
D) మహాకావ్యం సూక్తి – సౌందర్యం, సత్యం – వీటి రసవత్సమ్మేళనమే కళ – ఠాగూర్
జవాబు:
C) సంయుక్త