AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 3 అరణ్యకాండ

AP State Board Syllabus AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం 3rd Lesson అరణ్యకాండ Textbook Questions and Answers.

AP State Syllabus SSC 10th Class Telugu Solutions ఉపవాచకం 3rd Lesson అరణ్యకాండ

10th Class Telugu ఉపవాచకం 3rd Lesson అరణ్యకాండ Textbook Questions and Answers

I. అవగాహన – ప్రతిస్పందన

సంఘటనా క్రమం

సంఘటనల ఆధారంగా వరుస క్రమంలో వాక్యాలను అమర్చడం.

1. అ) దండకారణ్యం పవిత్ర ప్రదేశం. ప్రశాంత ప్రదేశం.
ఆ) ఆశ్రమ సముదాయాన్ని చూడగానే అల్లెతాడును ధనుస్సు నుండి వేరుచేశాడు శ్రీరాముడు.
ఇ) పక్షులు, మృగాలు – సకల ప్రాణులకు సురక్షితమైన ప్రాంతం అది.
ఈ) అక్కడ లోకక్షేమం కోసం యజ్ఞయాగాలు జరుగుతున్నాయి.
జవాబులు
అ) దండకారణ్యం పవిత్ర ప్రదేశం, ప్రశాంత ప్రదేశం.
ఇ) పక్షులు, మృగాలు, సకల ప్రాణులకు సురక్షితమైన ప్రాంతం అది.
ఈ) అక్కడ లోకక్షేమం కోసం యజ్ఞయాగాలు జరుగుతున్నాయి.
ఆ) ఆశ్రమ సముదాయాన్ని చూడగానే అల్లెతాడును ధనుస్సు నుండి వేరుచేశాడు.

2. అ) తన తండ్రికి ఆత్మీయుడైన జటాయువునకు సీత రక్షణ బాధ్యత అప్పగించాడు. శ్రీరాముడు.
ఆ) కష్టాలతో కూడిన వనవాసానికి సీత కోరిరావడం.సాహసమని అభినందించాడు.
ఇ) శ్రీరాముడి రాకను గమనించి అగస్త్యుడు శిష్యసమేతంగా ఎదురువెళ్లాడు.
ఈ) అగస్త్యుడు శ్రీరామునకు దివ్యధనుస్సు, అక్షయతూణీరాలు, అమోఘమైన ఖడ్గాన్ని బహుకరించాడు.
జవాబులు
ఇ) శ్రీరాముడి రాకను గమనించి అగస్త్యుడు శిష్యసమేతంగా ఎదురువెళ్లాడు.
ఈ) అగస్త్యుడు శ్రీరామునకు దివ్యధనుస్సు, అక్షయతూణీరాలు, అమోఘమైన ఖడ్గాన్ని బహుకరించాడు.
ఆ) కష్టాలతో కూడిన వనవాసానికి సీత కోరిరావడం సాహసమని అభినందించాడు.
అ) తన తండ్రికి ఆత్మీయుడైన జటాయువునకు సీత రక్షణ బాధ్యత అప్పగించాడు శ్రీరాముడు.

3. అ) సీతాదేవి అడ్డు తొలగించుకోవాలని ఆమెపై దాడికి దిగింది.
ఆ) ఇంతలో ‘శూర్పణఖ’ అనే రాక్షసి అక్కడికి వచ్చింది.
ఇ) ఆలస్యం చేయకుండా శూర్పణఖను విరూపిని చేయమన్నాడు శ్రీరాముడు.
ఈ) శ్రీరాముని సౌందర్యానికి ముగ్ధురాలైంది శూర్పణఖ.
జవాబులు
ఆ) ఇంతలో ‘శూర్పణఖ’ అనే రాక్షసి అక్కడికి వచ్చింది.
ఈ) శ్రీరాముని సౌందర్యానికి ముగ్ధురాలైంది శూర్పణఖ.
అ) సీతాదేవి అడ్డు తొలగించుకోవాలని ఆమెపై దాడికి దిగింది.
ఇ) ఆలస్యం చేయకుండా శూర్పణఖను విరూపిని చేయమన్నాడు శ్రీరాముడు.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 3 అరణ్యకాండ

4. అ) ఖరదూషణ త్రిశరులు, పద్నాలుగు వేల మంది రాక్షసవీరులు రాముడి ధాటికి నిలువలేక యముడి ఇంటికి పోవడాన్ని భరించలేకపోయింది శూర్పణఖ.
ఆ) రావణుడు మళ్లీ మారీచుని వద్దకు వెళ్లాడు. సీతాపహరణకు బంగారులేడిగా మారి సహకరించమన్నాడు.
ఇ) ‘సౌందర్యవతి అయిన సీతకు తగిన భర్తవు నీవే’నని రావణుడిలో కొత్త ఆశలను రేకెత్తించింది. .
ఈ) శ్రీరాముని బలంతో తన బలాన్ని పోల్చుకున్నాడు రావణుడు.
జవాబులు
అ) ఖరదూషణ త్రిశరులు, పద్నాలుగు వేల మంది రాక్షస వీరులు .రాముడి ధాటికి నిలువలేక యముడి ఇంటికి పోవడాన్ని భరించలేకపోయింది శూర్పణఖ.
ఇ) ‘సౌందర్యవతి అయిన సీతకు తగిన భర్తవు నీవే’నని రావణుడిలో కొత్త ఆశలను రేకెత్తించింది.
ఈ) శ్రీరాముని బలంతో తన బలాన్ని పోల్చుకున్నాడు రావణుడు.
ఆ) రావణుడు మళ్లీ మారీచుని వద్దకు వెళ్లాడు. సీతాపహరణకు బంగారు లేడిగా మారి సహకరించమన్నాడు.

5. అ) మారీచుని కంఠధ్వనిని రామునిదిగా భావించి సీత ఆందోళన చెందింది.
ఆ) మారీచుడు బంగారులేడిగా మారి శ్రీరాముని ఆశ్రమ ప్రాంతంలో తిరుగుతున్నాడు.
ఇ) సీత ఇష్టాన్ని తోసివేయలేక ఆ మాయలేడిని చంపి అయినా సరే తేవడానికి సంసిద్ధుడయ్యాడు శ్రీరాముడు.
ఈ) తనకు అదెంతో నచ్చిందని, తీసుకురావాలని కోరింది సీత.
జవాబులు
ఆ) మారీచుడు బంగారులేడిగా మారి శ్రీరాముని ఆశ్రమ ప్రాంతంలో తిరుగుతున్నాడు.
ఈ) తనకు అదెంతో నచ్చిందని, తీసుకురావాలని కోరింది సీత.
ఇ) సీత ఇష్టాన్ని తోసివేయలేక ఆ మాయాలేడిని చంపి అయినా సరే తేవడానికి సంసిద్ధుడయ్యాడు శ్రీరాముడు.
అ) మారీచుని కంఠధ్వనిని రామునిదిగా భావించి సీత ఆందోళన చెందింది.

6. అ) చివరకు రావణుడు ఖడ్గంతో జటాయువు రెక్కలను, కాళ్లను నరికివేశాడు.
ఆ) సన్యాసి వేషాన్ని వదిలి పదితలలతో భయంకరమైన నిజస్వరూపంతో సీత ఎదుట నిలిచాడు.
ఇ) యతి రూపంలో వచ్చిన రావణుణ్ణి ఆసనం మీద కూర్చుండబెట్టి సముచితంగా అతిథి మర్యాదలు చేసింది సీత.
ఈ) రావణుడు సీతాదేవిని తీసుకుని ఆకాశమార్గం పట్టాడు.
జవాబులు
ఇ) యతి రూపంలో వచ్చిన రావణుణ్ణి ఆసనంమీద కూర్చుండబెట్టి సముచితంగా అతిథి మర్యాదలు చేసింది సీత.
ఆ) సన్యాసి వేషాన్ని వదిలి పదితలలతో భయంకరమైన నిజస్వరూపంతో సీత ఎదుట నిలిచాడు.
అ) చివరకు రావణుడు ఖడ్గంతో జటాయువు రెక్కలను, కాళ్లను నరికివేశాడు.
ఈ) రావణుడు సీతాదేవిని తీసుకొని ఆకాశమార్గం పట్టాడు.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 3 అరణ్యకాండ

7. అ) మారీచుణ్ణి వధించి శ్రీరాముడు వెనుదిరిగాడు.
ఆ) రావణుడు సీతాదేవిని తీసుకొని ఆకాశమార్గం పట్టాడు.
ఇ) జటాయువు రావణుణ్ణి ఎదిరించాడు.
ఈ) లక్ష్మణుడు వెళ్ళడాన్ని గమనించాడు రావణుడు.
జవాబులు
ఈ) లక్ష్మణుడు వెళ్ళడాన్ని గమనించాడు రావణుడు.
ఆ) రావణుడు సీతాదేవిని తీసుకొని ఆకాశమార్గం పట్టాడు.
ఇ) జటాయువు రావణుణ్ణి ఎదిరించాడు.
అ) మారీచుణ్ణి వధించి శ్రీరాముడు వెనుదిరిగాడు.

8. అ) మారీచుడు బంగారు లేడిగా మారి సీత నివాసం ఉండే ప్రాంతానికి వచ్చాడు.
ఆ) శ్రీరాముని రాకను గమనించి అగస్త్యుడు శిష్య సమేతంగా ఎదురువెళ్ళాడు.
ఇ) ఒకనాడు శ్రీరాముడు పురాణకథా ప్రసంగంలో ఉన్నాడు.
ఈ) విరాధుని మాట ప్రకారం శ్రీరాముడు సీతా లక్ష్మణులతో కలిసి బయల్దేరాడు.
జవాబులు
ఈ) విరాధుని మాట ప్రకారం శ్రీరాముడు సీతా లక్ష్మణులతో కలిసి బయల్దేరాడు.
ఆ) శ్రీరాముని రాకను గమనించి అగస్త్యుడు శిష్య సమేతంగా ఎదురువెళ్ళాడు.
ఇ) ఒకనాడు శ్రీరాముడు పురాణకథా ప్రసంగంలో ఉన్నాడు.
అ) మారీచుడు బంగారులేడిగా మారి సీత నివాసం ఉండే ప్రాంతానికి వచ్చాడు.

9. అ) రావణుడు సీతను తీసుకొని ఆకాశమార్గంలో వెళ్ళాడు.
ఆ) లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు చెవులు కోశాడు.
ఇ) పంచవటిలో జీవనం ప్రశాంతంగా గడుస్తున్నది.
ఈ) సీతారామలక్ష్మణులకు మహర్షులు సాదర స్వాగతం పలికారు.
జవాబులు
ఈ) సీతారామలక్ష్మణులకు మహర్షులు సాదర స్వాగతం పలికారు.
ఇ) పంచవటిలో జీవనం ప్రశాంతంగా గడుస్తున్నది.
ఆ) లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు చెవులు కోశాడు.
అ) రావణుడు సీతను తీసుకొని ఆకాశమార్గంలో వెళ్ళాడు.

పాత్ర స్వభావాలు

1. శరభంగ మహర్షి :
శరభంగుడు మహాతపస్వి. దైవసాక్షాత్కారం పొందినవాడు. శ్రీరాముని చూసి శ్రీరామదర్శనం కోసమే తాను వేచివున్నానన్నాడు. తన తపఃఫలాన్నంతా శ్రీరామునికి ధారపోశాడు.

2. అగస్త్యుడు :
అగస్త్యుడు తపశ్శక్తి సంపన్నుడు. ఆకాశాన్ని తాకిన వింధ్య పర్వత గర్వాన్ని అణచినవాడు. ‘అగమ్ స్తంభయతీతి అగస్త్యః’ పర్వతాన్ని స్తంభింపజేసినవాడు కనుక అగస్త్యుడయ్యాడు.

3. జటాయువు :
ఒక పెద్ద గ్రద్ద. సంపాతికి తమ్ముడు. దశరథునికి మిత్రుడు. శ్రీరాముడు ఇతనికి సీత సంరక్షణ బాధ్యతను అప్పగించాడు. రావణాసురుడు సీతను అపహరించి తీసుకొని వెడుతుంటే నిరోధించాడు. గాయాల పాలయ్యాడు. శ్రీరామునికి విషయాన్ని వివరించాడు. శ్రీరాముని చేతిలో కన్నుమూశాడు.

4. కబంధుడు :
ఒక రాక్షసుడు. ఇతని చేతిలో చిక్కితే ఎవ్వరూ తప్పించుకోలేరు. రావణుడు అపహరించిన సీతాదేవి దొరికే ఉపాయాన్ని శ్రీరామునకు చెప్పాడు.

5. మారీచుడు :
మారీచుడు తాటకి అనే రాక్షసికి కుమారుడు. విశ్వామిత్రుడి యజ్ఞవేదికపై రక్తం కురిపించిన దుష్టుడు.

సీతాపహరణకై తనకు సాయం చేయమని రావణుడు మారీచుని కోరాడు. రాముడు సింహం వంటివాడని రాముణ్ణి కవ్వించడం కొరివితో తలగోక్కోడం వంటిదని, రావణునికి మారీచుడు హితవు చెప్పాడు.

రావణుడు తన మాట వినకపోతే చంపుతానని మారీచుని బెదిరించాడు.

రావణుని చేతిలో చావడం కంటే రాముని చేతిలో చస్తే తన జన్మ తరిస్తుందని మారీచుడు భావించాడు. బంగారు లేడిగా మారి సీతాపహరణకు రావణునికి సాయం చేశాడు. శ్రీరాముని బాణం దెబ్బకు మారీచుడు మరణించాడు. వేటకు వచ్చే రాజులను మాయలేడి రూపంలో మారీచుడు చంపేవాడు.

6. శబరి :
శబరి తపస్సిద్ధురాలు, జ్ఞానవయోవృద్ధురాలు. శ్రీరామదర్శనంతో ఆమె తనువు పులకించింది. పంపాతీరంలో దొరికే పండ్లను స్వామికి సమర్పించింది. తన జన్మ ధన్యమైనట్లు భావించింది. శ్రీరాముడి అనుమతిని పొంది తన దేహాన్ని అగ్నికి ఆహుతి చేసి అగ్నికాంతితో ఊర్ధ్వలోకాలకు వెళ్ళింది.

సంఘటన ద్వారా గ్రహించుట

ప్రశ్న 1.
“అన్నా! ఈ దైన్యాన్ని వదులు. అదే మనకు మేలుచేస్తుంది” అను లక్ష్మణుని మాటలను బట్టి, మీరేం గ్రహించారో తెలుపండి.
జవాబు:
రావణుడు సీతాదేవిని అపహరించాడు. రాముడు సీతావియోగంతో బాధపడుతున్నాడు. రామలక్ష్మణులు సీతను వెదకుతూ, అందమైన పంపాసరస్సు దగ్గరకు వచ్చారు. ఆ అందమైన ప్రకృతిని చూచి, శ్రీరాముడు మరింతగా విరహ బాధపడ్డాడు.

అప్పుడు రాముడు దైన్యాన్ని విడిచిపెడితే, మేలు కలుగుతుందని చెప్పి, లక్ష్మణుడు రాముని ఊరడించాడు. లక్ష్మణుడు చెప్పినట్లు, కష్టాలు వచ్చినపుడు అధైర్యపడకుండా ప్రయత్నం చేస్తే మంచి ఫలితం ఉంటుందనీ, ఉత్సాహం ఉన్న వాడికి అసాధ్యం ఏమీ ఉండదనీ, ఉత్సాహం ఉన్న వాళ్ళు ఎలాంటి కష్టాలు వచ్చినా, వెనుకడుగు వేయరనీ, నేను గ్రహించాను.

ప్రశ్న 2.
‘నీ చేతిలో చావడం కన్నా, శ్రీరాముని చేతిలో చావడమే నయం’ అన్న మారీచుని మాటలను బట్టి, మీరు ఏమి గ్రహించారు?
జవాబు:
రావణుడు మారీచుని దగ్గరకు వచ్చి, సీతను అపహరించడానికి తనకు సాయం చేయుమని కోరాడు. రాముడి జోలికి వెళ్ళడం మంచిది కాదని, మారీచుడు రావణునికి హితువు చెప్పి పంపాడు.

కాని రావణుడు మళ్ళీ మారీచుడి దగ్గరకు వచ్చి, బంగారు లేడి రూపం ధరించి, సీతాపహరణానికి తనకు సాయం చెయ్యమని కోరాడు. తాను చెప్పినట్లు చెయ్యకపోతే, మారీచుని చంపుతానని రావణుడు చెప్పాడు.

రావణుడు చెప్పినట్లు చేసినా చెయ్యకపోయినా, మారీచుడికి మరణం తప్పని పరిస్థితి వచ్చింది.

అందుకే మారీచుడు మూర్ఖుడయిన రావణుడి చేతిలో చావడం కన్నా, ధర్మాత్ముడూ, మహావీరుడూ అయిన రాముడి చేతిలో చావడమే మంచిదని నిశ్చయించుకున్నాడు. రాముడి చేతిలో మరణిస్తే తన జన్మ తరిస్తుందని, మారీచుడు అనుకున్నాడు. దీనిని బట్టి దుర్మార్గుని చేతిలో చావడం కన్న, మంచివాడి చేతిలో మరణం పొందడం మంచిదని నేను గ్రహించాను. మారీచుడు రాక్షసుడయినా, మంచి చెడ్డలు తెలిసిన వాడని గ్రహించాను.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 3 అరణ్యకాండ

ప్రశ్న 3.
‘క్రూరులైన దుష్టులతో పరిహాసం పనికి రాదు’ అని శూర్పణఖ విషయంలో రాముడు పలికిన దానిని బట్టి మీరేమి గ్రహించారు?
జవాబు:
క్రూరులు అత్యంత ప్రమాదకారులు. వారితో పరిహాసం ఎన్నటికీ పనికిరాదు. దానివల్ల ఎన్నో అనర్థాలు కలుగుతాయి. వారు ఎదుటివారిని చులకనగా చూస్తారు. చనువుగా ప్రవర్తిస్తారు. మన సామర్థ్యాన్ని తక్కువగా అంచనా వేస్తారు.

క్రూరులతో సహవాసం చేయడం వల్ల వ్యక్తిత్వం నశిస్తుంది. సమాజంలో గౌరవం. అందువల్ల రాముడు చెప్పినట్లుగా క్రూరులతో సహవాసం పనికిరాదు.

ప్రశ్న 4.
“మహాత్ములారా! మీరు నన్ను ప్రార్థించడం తగదు. ఆజ్ఞాపించాలి. మీ ఆజ్ఞలను నేను శిరసా వహిస్తాను” అని రాముడు మునులతో అన్న మాటను బట్టి, మీరు ఏమి గ్రహించారో రాయండి.
జవాబు:
శ్రీరాముడు వనవాస కాలంలో సుతీక్ష మహర్షిని కలిశాడు. తరువాత అక్కడి మునులు అందరూ రాముడిని కలిసి, రాక్షసులు చేసే అకృత్యాలను గూర్చి చెప్పారు. రాక్షసుల బారినుండి తమ్ము రక్షింపుమని వారు రాముని ప్రార్థించారు.

అప్పుడు రాముడు ఆ మునులతో తన్ను ప్రార్థించడం తగదనీ, ఆజ్ఞాపించమనీ మునులు చెప్పినట్లు రాక్షసులను తాను సంహరిస్తాననీ, మునులకు అభయం ఇచ్చాడు.

దీనిని బట్టి శ్రీరాముడు మునుల మాటలను చాలా గౌరవించేవాడని, మునుల మాటలను ఆజ్ఞగా గ్రహించి వారు చెప్పినట్లు చేసేవాడని గ్రహించాను.

శ్రీరామునకు మునీశ్వరులపై భక్తి గౌరవములు హెచ్చుగా ఉండేవని గ్రహించాను. రాముడు మహావీరుడని గ్రహించాను.

ప్రశ్న 5.
“నన్ను అపహరించి నీ చావును నీవే కొని తెచ్చుకోకు” అని సీత, రావణుని హెచ్చరించిన మాటలను బట్టి, నీవేమి గ్రహించావో చెప్పు.
జవాబు:
రావణుడు సన్న్యాసి వేషంతో సీతవద్దకు వచ్చి, తనను భర్తగా స్వీకరిస్తే, గొప్ప భోగభాగ్యాలు అనుభవించవచ్చునని సీతకు ఆశచూపాడు.

రావణుని మాటలకు, సీత మండిపడింది. సీత మహా పతివ్రత. రావణుడు సీతను అపహరించి తీసుకొని వెడితే, అతడు తన చావును తాను కోరి తెచ్చుకున్నట్లే అని, సీత నిజాన్ని చెప్పిందని గ్రహించాను. రావణుడు సీతాపహరణం చేయకపోతే అతనికి మరణమే లేదని గ్రహించాను.

సీత మాటలను బట్టి ఆమె మహా ధైర్యం కలదనీ, నిర్భయంగా రావణుని వంటి రాక్షసుణ్ణి తిరస్కరించి మాట్లాడగలదనీ, , సత్యమూ హితమూ ఆమె బోధించిందనీ, నేను అర్థం చేసుకున్నాను.

ప్రశ్న 6.
రావణుడు సీతను అపహరించే సందర్భంలో జటాయువు చేసిన ప్రయత్నం నుండి మీరు ఏమి గ్రహించారు?
జవాబు:
రామలక్ష్మణులు లేని సమయంలో రావణుడు సన్యాసి వేషంలో సీతాదేవి సమీపానికి వచ్చాడు. నిజ స్వరూపాన్ని ప్రదర్శించాడు. లొంగిపొమ్మని బెదిరించాడు. కోపంతో రావణుడు సీతను తీసికొని రథంలో కూర్చుండబెట్టుకొని ఆకాశ మార్గంలో ప్రయాణిస్తున్నాడు.

అది గమనించిన జటాయువు రావణుని ఎదిరించాడు. వారిద్దరి మధ్య పోరాటం జరిగింది. చివరకు రావణుని చేతిలో మరణించాడు. మిత్రధర్మం కోసం అవసరమైతే ప్రాణాలను అర్పించడానికి సిద్ధపడాలని గ్రహించాను. ఆపదల్లో ఉన్న వారిని, ముఖ్యంగా స్త్రీలను తప్పక రక్షించాలని గ్రహించాను.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 3 అరణ్యకాండ

ప్రశ్న 7.
శ్రీరాముడిని భక్తితో సేవించి తరించిన శబరి వ్యక్తిత్వం నుండి మీరేమి గ్రహించారు?
జవాబు:
సీతను అన్వేషిస్తూ రామలక్ష్మణులు అరణ్యమార్గంలో ప్రయాణిస్తున్నారు. మార్గమధ్యలో శబరి ఆశ్రమానికి వచ్చారు. శబరి శ్రీరాముని రాకకై ఎదురుచూస్తున్నది. శ్రీరాముని దర్శనంతో ఆనందాన్ని పొందింది. ఫలాలతో శ్రీరాముడిని సేవించింది. పండ్లను పరిశుభ్రం చేసి అందించింది. అగ్నిలో తన శరీరాన్ని దహింపజేసుకొంది. ఊర్ధ్వ లోకాలకు వెళ్ళింది. శబరి వ్యక్తిత్వం వల్ల దైవాన్ని భక్తి, శ్రద్ధలతో సేవించాలని, ఇంటికి వచ్చిన వారిని అతిథి మర్యాదలతో సేవించాలని గ్రహించాను.

విషయాత్మక ప్రశ్నలు

ఈ క్రింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో సమాధానాలు రాయండి. .

ప్రశ్న 1.
‘క్రూరులైన దుష్టులతో పరిహాసం పనికిరాదు’ ఈ మాట ఎవరు ఎవరితో ఎప్పుడు అన్నారు?
జవాబు:
పంచవటిలో శూర్పణఖ విషయంలో శ్రీరాముడు లక్ష్మణునితో అన్నాడు. ఆమె రావణుడి చెల్లెలు. శ్రీరాముడి సౌందర్యానికి ముగ్ధురాలైంది. తనను చేపట్టమంది. తమకు అడ్డుగా ఉన్న సీతాలక్ష్మణులను చంపి తింటానన్నది. శ్రీరాముడు పరిహాసంగా లక్ష్మణుని వద్దకు వెళ్లమన్నాడు. లక్ష్మణుడు కూడా పరిహాసం చేశాడు. సీతపై దాడికి దిగింది.

అప్పుడు క్రూరులైన దుష్టులతో పరిహాసం పనికిరాదు. శూర్పణఖను విరూపిని చేయమని లక్ష్మణుని రాముడు ఆజ్ఞాపించాడు. లక్ష్మణుడు తన అన్న ఆజ్ఞను అమలుపరిచాడు.

ప్రశ్న 2.
మారీచుని పరిస్థితి ‘ముందు నుయ్యి, వెనుక గొయ్యి’గా ఎందుకు మారింది?
జవాబు:
సీతాపహరణం చేయాలనుకొన్నాడు రావణుడు. మారీచుని బంగారులేడిగా మారమన్నాడు. రామబాణం రుచి తెలిసిన మారీచుడు తిరస్కరించాడు. రావణుడు చంపుతానన్నాడు. బంగారులేడిగా మారితే రాముడు చంపుతాడు. మారకపోతే రావణుడు చంపుతాడు. అప్పుడు మారీచుని పరిస్థితి ‘ముందు నుయ్యి వెనుక గొయ్యి’గా మారింది. శ్రీరాముని చేతిలో మరణిస్తే జన్మ ధన్యమవుతుందని భావించి బంగారు లేడిగా మారడానికి అంగీకరించాడు. అతని కోరిక తీరింది.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 3 అరణ్యకాండ

ప్రశ్న 3.
‘ఉత్సాహమున్న వానికి అసాధ్యం లేదు’ అని ఎవరు ఎవరితో ఏ సందర్భంలో అన్నారు?
జవాబు:
సీతాదేవిని రావణాసురుడు ఎత్తుకెళ్లాడు. ఆమె జాడ తెలియక రామలక్ష్మణులు వెతుకుతున్నారు. వెతుకుతూ, వెతుకుతూ పంపా సరోవర ప్రాంతాన్ని చేరుకొన్నారు. ఆ ప్రాంతం చాలా అందంగా ఉంది. దానితో శ్రీరాముని బాధ పెరిగింది. అప్పుడు లక్ష్మణుడు అన్నగారి దైన్యాన్ని పోగొట్టడానికి పలికిన వాక్యమిది.

ప్రశ్న 4.
శూర్పణఖ ఎవరు? ఆమె అవమానం పొందడానికి కారణమేమిటో తెల్పండి.
జవాబు:
శూర్పణఖ ఒక రాక్షసి. ఈమె రావణునికి చెల్లెలు. శ్రీరాముని అందానికి మురిసిపోయి తనను పెళ్ళి చేసుకోమన్నది. అందుకు అడ్డంగా ఉన్న సీతను, లక్ష్మణుని చంపితింటానన్నది. రాముడు ఆమెను పరిహాసంగా లక్ష్మణుని వద్దకు పంపించాడు. లక్ష్మణుడు తాను అన్నగారి సేవకుణ్ణని, తనను పెళ్ళాడితే ఆమెకూడా తనతోబాటే అన్నకు దాస్యం చేయాల్సి వస్తుందని చెప్పి రాముణే పెళ్ళాడమని పంపాడు. సీత ఉండటం వల్లే రాముడు తనను నిరాకరించాడనుకొని సీతను చంపడానికి దాడి చేసింది. ప్రమాదాన్ని గుర్తించిన లక్ష్మణుడు అన్న ఆదేశంపై శూర్పణఖ ముక్కు, చెవులు కోసి ఆమెను విరూపిని చేశాడు. అలా తన రాక్షసత్వం వలన శూర్పణఖ రామలక్ష్మణులను కోరి అవమానం పొందింది.

వ్యాసరూప ప్రశ్నలు

ఈ క్రింది ప్రశ్నలకు 10 లేక 12 వాక్యాల్లో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
పంచవటిలో సీతారామలక్ష్మణుల జీవితం ఎలా సాగిందో వివరించండి.
జవాబు:
అగస్త్య మహర్షి మాటపై, సీతారామలక్ష్మణులు, పంచవటికి చేరారు. లక్ష్మణుడు పంచవటిలో పర్ణశాలను నిర్మించాడు. సీత రక్షణ బాధ్యతను రాముడు, జటాయువుకు అప్పగించాడు. పంచవటిలో వారి జీవితం సుఖంగా సాగుతోంది. రావణుని చెల్లెలు శూర్పణఖ అక్కడకు వచ్చి, రాముడిని తనను చేపట్టమంది. లక్ష్మణుడు అన్న ఆజ్ఞతో శూర్పణఖ ముక్కు చెవులు కోశాడు. శూర్పణఖ సోదరుడైన ఖరుడి వద్దకు వెళ్ళి చెప్పింది. ఖరుడు 14 వేల మంది రాక్షసులతో రాముడి చేతిలో యుద్ధంలో మరణించాడు.

అకంపనుడు అనే గూఢచారి ఖరుడి మరణవార్త రావణుడికి అందించి రాముని భార్య సీతను అపహరించమని రావణుడికి సలహా చెప్పాడు. శూర్పణఖ వెళ్ళి రావణుడిని రెచ్చగొట్టింది.

రావణుడు మారీచుడిని మాయలేడిగా సీతారాములు ఉన్న పర్ణశాల వద్దకు పంపాడు. సీత ఆ లేడిని తెచ్చి ఇమ్మని రాముడిని కోరింది. రాముడు వెళ్ళి మాయలేడిని చంపాడు. మాయలేడి ‘సీతా! లక్ష్మణా! అంటూ అరచి రాముడి చేతిలో మరణించింది.

రాముడు ఆపదలో ఉన్నాడని సీత లక్ష్మణుడిని రాముని వద్దకు పంపింది. అదే సమయంలో సన్యాసి వేషంలో రావణుడు పర్ణశాలలో ఒంటరిగా ఉన్న సీతను బలాత్కారంగా తన రథంలో కూర్చోబెట్టి తీసుకువెడుతున్నాడు. సీత, ‘రామా, రామా’ అని కేకలు వేసింది. జటాయువు రావణుడిని ఎదిరించి, అతడి చేతిలో దెబ్బతింది. రావణుడు సీతను తన లంకా నగరానికి తీసుకువెళ్ళాడు.

రామలక్ష్మణులు ఆశ్రమానికి తిరిగి వచ్చారు. సీత జాడ తెలియక వారు దుఃఖించారు.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 3 అరణ్యకాండ

ప్రశ్న 2.
మాయలేడి వలన సీతారాములకు కష్టాలు వచ్చాయని ఎలా చెప్పగలవు?
జవాబు:
రావణుడు పంచవటిలో ఉన్న సీతాదేవిని అపహరించాలనుకున్నాడు. రావణుడు మారీచుడిని బెదరించి, బంగారులేడి రూపంలో అతడిని రాముడి ఆశ్రమ ప్రాంతానికి పంపాడు. సీత ఆ జింకను చూసి ఇష్టపడింది. లక్ష్మణుడు అది మాయా మృగం అని చెప్పాడు. సీత ఆ లేడిని తెచ్చి ఇమ్మని పట్టుపట్టింది.

సీత ఇష్టాన్ని కాదనలేక, ఆ మాయలేడిని చంపి అయినా తేడానికి రాముడు వెళ్ళాడు. రాముడు ఎంత ప్రయత్నించినా లేడి అందకుండా పరుగుదీసింది. దానితో రాముడు లేడిపై బాణాన్ని వేశాడు. ఆ లేడి ‘సీతా! లక్షణా!’ అని అరుస్తూ చచ్చింది.

మాయలేడి కంఠ ధ్వని రాముడిది అని, సీత కంగారుపడి, రాముడికి సాయంగా లక్ష్మణుడిని పంపింది. లక్ష్మణుడు తప్పనిసరి పరిస్థితులలో సీతను విడిచి, రాముడి దగ్గరకు వెళ్ళాడు.

అదే అదనుగా రావణుడు సన్యాసి వేషంలో పర్ణశాలకు వచ్చి సీతను బలవంతంగా తీసుకుపోయాడు. కాబట్టి సీతారాముల కష్టానికి మాయలేడియే కారణం అని చెప్పగలము.

ప్రశ్న 3.
కబంధుడు అనే రాక్షసుడు శ్రీరామునకు ఉపకారం చేశాడని ఎలా చెప్పగలవు?
జవాబు:
కబంధుడు క్రౌంచారణ్యంలో ఉన్న ఒక రాక్షసుడు. ఇతడికి తల, మెడ లేవు. ఇతడి కడుపు భాగంలో ముఖం ఉండేది. రొమ్ము భాగంలో ఒకే కన్ను ఉండేది. ఇతనికి యోజనం పొడవు వ్యాపించిన చేతులు ఉండేవి. ఆ చేతులతో వాడు పక్షులను, మృగాలను పట్టి తినేవాడు.

కంబంధుడు రామలక్ష్మణులను తన చేతులతో పట్టుకొని తినబోయాడు. కబంధుడి చేతులకు చిక్కితే, ఎవరూ తప్పించుకోలేరు. కాని రామలక్ష్మణులు ఖడ్గాలతో కబంధుడి చేతులు నరికారు. అప్పుడు కబంధుడు తనకు శాపం వల్ల రాక్షసరూపం వచ్చిందనీ, తన శరీరాన్ని దహిస్తే తనకు దివ్యజ్ఞానం వస్తుందనీ రామలక్ష్మణులకు చెప్పాడు.

రామలక్ష్మణులు కబంధుడి శరీరాన్ని దహనం చేశారు….ఆ జ్వాలల నుండి కబంధుడు దివ్యదేహంతో వచ్చి, సీత దొరికే ఉపాయాన్ని రామలక్ష్మణులకు చెప్పాడు. సుగ్రీవుడితో స్నేహం చెయ్యమని వారికి చెప్పాడు. సుగ్రీవుని స్నేహంతో రాముడు సీతను తిరిగి తెచ్చుకున్నాడు. దీనినిబట్టి కబంధుడు రామలక్ష్మణులకు ఉపకారం చేశాడని చెప్పగలం.

ప్రశ్న 4.
సీతారాముల దండకారణ్యవాస వృత్తాంతాన్ని తెలపండి. (సీతారాములు పంచవటిని చేరిన వృత్తాంతం)
జవాబు:
సీతారామలక్ష్మణులు దండకారణ్యంలో ప్రవేశించారు. అక్కడ ఎన్నో మునుల ఆశ్రమాలు ఉన్నాయి. అక్కడ యజ్ఞయాగాలు జరుగుతున్నాయి. మునులు వీరికి స్వాగతం పలికారు.

వీరు దండకవనం మధ్యకు చేరారు. ‘విరాధుడు’ అనే రాక్షసుడు సీతారామలక్ష్మణులపై పడ్డాడు. రామలక్ష్మణులను తన భుజాలపై వేసుకొని వాడు తీసుకుపోతున్నాడు. సీత ఏడ్చింది. రామలక్ష్మణులు విరాధుని భుజాలు నరికివేశారు. విరాధుడు కుప్పకూలాడు. విరాధుణ్ణి గోతిలో పాతిపెడదామని వారు అనుకున్నారు. విరాధుడు తాను తుంబురుడిననీ, శాపంవల్ల రాక్షసుడుగా అయ్యానని చెప్పి, శరభంగమహర్షిని దర్శించమనీ, తనను గోతిలో పూడ్చమనీ రామలక్ష్మణులకు చెప్పాడు.

రామలక్ష్మణులు విరాధుణ్ణి పూడ్చి, శరభంగ మహర్షి ఆశ్రమానికి వెళ్ళారు. శరభంగ మహర్షి రామదర్శనం కోసం వేచి చూస్తున్నాడు. తన తపః ఫలాన్ని రాముడికి ధారపోశాడు. సుతీక్ష మహర్షిని దర్శించమని ఆయన చెప్పాడు.

సీతారామలక్ష్మణులు సుతీక్ష మహర్షిని దర్శించారు. ఆయన రామదర్శనం కోసం ఎదురు చూస్తున్నాడు. ఆ మహర్షి తన తపస్సును రామునికి ధారపోశాడు. ఈ విధంగా దండకారణ్యంలోని మునుల ఆశ్రమాలను దర్శిస్తూ, సీతారామలక్ష్మణులు పదిసంవత్సరాలు వనవాసం చేశారు. వారు తిరిగి సుతీక్ష.. మహర్షి ఆశ్రమానికి వెళ్ళారు. ఆయన అగస్త్యుని సోదరునీ, అగస్త్య మహర్షినీ దర్శనం చేసుకోమని రామలక్ష్మణులకు చెప్పాడు.

సీతారామలక్ష్మణులు అగస్త్య భ్రాత (సోదరుడు) ఆశ్రమాన్ని దర్శించారు. తరువాత అగస్త్యుని దర్శించారు. అగస్త్య మహర్షి శిష్యులతో రామునికి స్వాగతం పలికాడు. ఆయన రామునికి దివ్య ధనుస్సు, అక్షయ తూణీరాలు, ఖడ్గమును ఇచ్చాడు. రామునకు జయం కల్గుతుందని ఆశీర్వదించాడు.

రాముడు తాము నివసించడానికి తగిన ప్రదేశాన్ని సూచించమని అగస్త్యుణ్ణి కోరాడు. ఆ మహర్షి గోదావరీ తీరంలో ఉన్న ‘పంచవటి’ లో ఉండమని వారికి సూచించాడు. రామలక్ష్మణులకు మార్గమధ్యంలో ‘జటాయువు’ కనబడింది. దానికి సీత రక్షణ బాధ్యతను వారు అప్పగించారు. పంచవటిలో ఆశ్రమం నిర్మించుకొని వారు అక్కడ నివసించారు.

ప్రశ్న 5.
సీతాపహరణం గురించి రాయండి.
(లేదా)
రావణుడు మారీచుని సాయంతో సీతాదేవిని అపహరించిన వృత్తాంతాన్ని రాయండి.
జవాబు:
‘సీతారాములు పంచవటిలో సుఖంగా జీవిస్తున్నారు. రావణుని చెల్లెలు శూర్పణఖ అక్కడకు వచ్చి రాముడి అందానికి మోహపడి తన్ను భార్యగా స్వీకరించమని రాముణ్ణి కోరింది. లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు, చెవులు కోశాడు. శూర్పణఖ దండాకారణ్యంలో ఉన్న సోదరుడు ఖరుడికి ఆ విషయం చెప్పింది. ఖరుడు పంపిన యోధులనూ, ఖరదూషణులనూ మొత్తం 14 వేల మంది రాక్షసులను రాముడు గడియలో చంపాడు.

‘అకంపనుడు’ అనే గూఢచారి దండకలో రాక్షససంహారం జరిగిందని రావణునకు వార్త చేర్చాడు. రావణుడు రాముణ్ణి చంపుతానన్నాడు. రాముణ్ణి చంపడం దేవాసురులకు కూడా అసాధ్యం అని అకంపనుడు చెప్పాడు. సీతను అపహరించమని సూచించాడు. రావణుడు మారీచుని సాయం అడిగాడు. మారీచుడు రాముణ్ణి కవ్వించవద్దని రావణునికి సలహా చెప్పాడు. శూర్పణఖ, తన అన్న రావణుడికి, సీతను అపహరించమని చెప్పింది.

రావణుడు తిరిగి మారీచుడి దగ్గరకు వెళ్ళి, సీతాపహరణకు బంగారు లేడిగా మారి తనకు సాయం చెయ్యమని అడిగాడు. మారీచుడు హితం చెప్పినా, రావణుడు వినలేదు. తనకు సాయపడకపోతే మారీచుని చంపుతానన్నాడు రావణుడు.

దానితో మారీచుడు బంగారు లేడిగా మారి రాముని ఆశ్రమ ప్రాంతంలో తిరిగాడు. సీత బంగారు లేడిని చూసి ముచ్చటపడింది.

ఆ బంగారు లేడిని పట్టి తెమ్మని, సీత రాముని కోరింది. అది మాయలేడి అని లక్ష్మణుడు చెప్పాడు. రాముడు, సీత మాట కాదన లేక లక్ష్మణుణ్ణి సీతకు కాపలాగా ఉంచి, తాను లేడి కోసం వెళ్ళాడు. మాయలేడి రామునికి దొరకలేదు. రాముడు దానిపై బాణం వేశాడు. మాయలేడి చస్తూ “హా సీతా ! హా లక్ష్మణా !” అని అరిచింది.

ఆ ధ్వని విని సీత రాముడు ఆపదలో చిక్కుకున్నాడని లక్ష్మణుడిని రామునికి సాయంగా వెళ్ళమని చెప్పింది. లక్ష్మణుడు కాదంటే, అతణ్ణి సీత నిందించింది. లక్ష్మణుడు సీతను విడిచి వెళ్ళాడు. ఇదే అదనుగా రావణుడు సన్యాసి వేషంలో సీత ఉన్న ఆశ్రమానికి వచ్చి, తాను రావణుడిని అని చెప్పి సీతను బలవంతంగా తన లంకా నగరానికి తీసుకుపోయాడు.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 3 అరణ్యకాండ

ప్రశ్న 6.
రామలక్ష్మణులు సీతను అన్వేషిస్తూ పంపా సరస్సు తీరానికి చేరిన వృత్తాంతాన్ని రాయండి.
జవాబు:
మారీచుణ్ణి చంపి, శ్రీరాముడు వెనుకకు ఆశ్రమానికి బయలుదేరాడు. దారిలో లక్ష్మణుడు కనబడ్డాడు. సీతను ఒంటరిగా విడిచి వచ్చావేమిటని రాముడు అడిగాడు. లక్ష్మణుడు జరిగిన విషయం చెప్పాడు. రామలక్ష్మణులు ఆశ్రమానికి వెళ్ళి, సీతను వెదికారు. వనమంతా వెదికారు. సీత జాడ కనబడలేదు. సీత జాడ చెప్పమని రాముడు ప్రకృతిని ప్రార్థించాడు. శ్రీరాముడు సీతా వియోగాన్ని భరించలేక ఏడ్చాడు. లక్ష్మణుడు రాముడిని ఓదార్చాడు.

రామలక్ష్మణులకు రక్తంతో తడిసిన జటాయువు కనిపించాడు. అతడిని చూసి గద్ద రూపంలో ఉన్న రాక్షసుడనీ, అతడే సీతను తిని ఉంటాడని వారు భ్రాంతి పడ్డారు. జటాయువు జరిగినది చెప్పాడు. రావణుడు సీతను అపహరించాడనీ, రావణుడే తనను దెబ్బ తీశాడనీ, జటాయువు వారికి చెప్పాడు. జటాయువు మరణించాడు. రాముడు జటాయువుకు అంత్యక్రియలు చేశాడు.

రామలక్ష్మణులు “క్రౌంచారణ్యం” చేరుకున్నారు. అక్కడ వారికి ఒక రాక్షసుడు కనబడ్డాడు. వాడికి తల, మెడ లేదు. వాడి ముఖం వాడి కడుపులో ఉంది. రొమ్ముమీద ఒకే కన్ను ఉంది. వాడి చేతులు యోజనం పొడుగున్నాయి. ఆ చేతులతో వాడు పక్షులను, మృగాలను పట్టి తింటాడు. అతడి పేరు ‘కబంధుడు’.

‘కబంధుడు’ రామలక్ష్మణులను చేతులతో పట్టుకున్నాడు. వాడి చేతుల్లో చిక్కితే, ఎవడూ తప్పించుకోలేడు. వాడు రామలక్ష్మణుల్ని తినడానికి నోరు తెరచాడు. వారు కబంధుని భుజాలు నరికిపారవేశారు. కబంధుడు కుప్పకూలాడు. శాపం వల్ల తనకు వికృత రూపం వచ్చిందని కబంధుడు వారికి చెప్పాడు.

రామలక్ష్మణులు రావణుని గురించి కబంధుణ్ణి అడిగారు. కబంధుడు తన శరీరాన్ని దహిస్తే తనకు దివ్యజ్ఞానం వస్తుందనీ, అప్పుడు రావణుడి గురించి చెప్పగలననీ చెప్పాడు. రామలక్ష్మణులు కబంధుడి శరీరానికి అగ్ని సంస్కారం చేశారు. కబంధుడు దివ్యదేహంతో వచ్చి, సీతాదేవి దొరికే ఉపాయాన్ని వారికి చెప్పాడు. సుగ్రీవుడితో స్నేహం చేయమన్నాడు. కబంధుడు స్వర్గానికి వెళ్ళాడు.

రామలక్ష్మణులు శబరి ఆశ్రమానికి వెళ్ళారు. శబరి రాముడికి పండ్లు పెట్టింది. తరువాత శబరి తన శరీరాన్ని అగ్నికి ఆహుతి చేసి ఊర్థ్వలోకాలకు వెళ్ళింది. రామలక్ష్మణులు ఈ విధంగా పంపా సరస్సుకు చేరారు.

AP SSC 10th Class Telugu Solutions Chapter 11 భిక్ష

AP State Board Syllabus AP SSC 10th Class Telugu Solutions 11th Lesson భిక్ష Textbook Questions and Answers.

AP State Syllabus SSC 10th Class Telugu Solutions 11th Lesson భిక్ష

10th Class Telugu 11th Lesson భిక్ష Textbook Questions and Answers

ఉన్ముఖీకరణ : చదవండి – ఆలోచించి చెప్పండి

తం. తన కోపమే తన శత్రువు ,
తన శాంతమె తనకు రక్ష దయచుట్టంబౌఁ
దన సంతోషమె స్వర్గము
తన దుఃఖమె నరకమండ్రు తథ్యము సుమతి.

ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
ఈ పద్యంలో శత్రువుగా దేన్ని పేర్కొన్నాడు? ఎందుకు?
జవాబు:
ఈ పద్యంలో కోపాన్ని శత్రువుగా పేర్కొన్నాడు. శత్రువు ఎలా మనకు నష్టం కల్గిస్తాడో, కష్టం కల్గిస్తాడో, అలాగే కోపం కూడా మనకు కష్ట నష్టాలను కల్గిస్తుంది.

ప్రశ్న 2.
శాంతి రక్షగా ఉంటుందనడంలో కవి ఉద్దేశమేమిటి?
జవాబు:
‘శాంతి’ అంటే కోపం వంటివి లేకపోవడం. శాంతగుణం ఉంటే, అదే మనలను రక్షిస్తుంది. శాంతం ఉంటే ఎవరితోనూ – మనకు తగవు రాదు. శాంతి మనకు రక్షణను కల్పిస్తుంది.

AP SSC 10th Class Telugu Solutions Chapter 11 భిక్ష

ప్రశ్న 3.
సంతోషాన్ని స్వర్గంగా కవి ఎందుకు భావిస్తున్నాడు?
జవాబు:
‘స్వర్గం’ అంటే దేవతల లోకం. స్వర్గ లోకంలో ఉండే వారికి దుఃఖాలు ఉండవు. సంతోషమే ఉంటుంది. కాబట్టి మన సంతోషమే మనకు స్వర్గం వంటిదని కవి చెప్పాడు.

ప్రశ్న 4.
కోపం వల్ల కలిగే అనర్థాలను గురించిన సంఘటనలు మీకేమైనా తెలుసా? చెప్పండి.
జవాబు:
1) కోషం వస్తే అనర్థాలు కలుగుతాయి. ఒక రోజున మా పక్క ఇంటివారు తమ వీధిని అంతా తుడిచి, ఆ తుక్కును మా ఇంటిముందు పోశారు. నేను వారిపై కోపపడి తిట్టాను. వాళ్ళు నన్ను కొట్టబోయారు. మా అమ్మగారు ఎలాగో సర్దిచెప్పారు.

2) నేను సైకిలు మీద వెడుతూ ఒకరోజు కాలు జారి, పక్కవారి బండి కింద పడ్డాను. నాకు దెబ్బలు తగిలాయి. అన్ని పక్కవారు నన్ను పట్టించుకోలేదు. నేను కోపంతో తగవుకు వెళ్ళాను. చివరకు ఒకరిపై ఒకరు పోలీసు కేసు పెట్టుకొన్నాం. మాకు వైద్యానికి, కేసులకు చాలా ఖర్చు అయ్యింది. కాబట్టి కోపం వల్ల అనర్థాలు కలుగుతాయి.

ఇవి చేయండి

I. అవగాహన – ప్రతిస్పందన

ప్రశ్న 1.
కింది పద్యం చదవండి. శ్రీనాథుడు తన గురించి తాను ఏమని చెప్పుకున్నాడో తెల్పండి.
సీ॥ వచియింతు వేములవాడ భీమన భంగి
నుద్దండ లీల నొక్కొక్కమాటు
భాషింతు నన్నయభట్టు మార్గంబున
నుభయ వాక్రౌఢి నొక్కొక్కమాటు
వాకృత్తు తిక్కయజ్వ ప్రకారము రసా
భ్యుచిత బంధమున నొక్కొక్కమాటు
పరిఢవింతు ప్రబంధ పరమేశ్వరుని ఠేవ
సూక్తి వైచిత్రి నొక్కొక్కమాటు

తే॥గీ॥ నైషధాది మహాప్రబంధములు పెక్కు
చెప్పినాడవు మాకు నాశ్రితుడ వనఘ
ఇపుడు చెప్పదొడంగిన యీ ప్రబంధ
మంకితము సేయు వీరభద్రయ్య పేర
(కాశీ || 1 – 18)
జవాబు:
ఈ పద్యం శ్రీనాథుడి కవిత్వ రచనా విధానాన్ని గూర్చి చెపుతోంది.

  1. శ్రీనాథుడు వేములవాడ భీమన అనే కవి వలె ఒక్కొక్కసారి ఉద్దండ లీలగా కవిత్వం చెపుతాడు.
  2. ఒక్కొక్కసారి నన్నయభట్టు కవి వలె ‘ఉభయ వాడ్రైఢి’తో కవిత్వం రాస్తాడు.
  3. ఒకసారి తిక్కన గారి వలె, రసాభ్యుచిత బంధముగా రాస్తాడు.
  4. ఒక్కొక్కసారి ప్రబంధ పరమేశ్వరుడైన ఎఱ్ఱన గారి వలె ‘సూక్తి వైచిత్రి’ని చూపిస్తాడు.
  5. నైషధము వంటి అనేక ప్రబంధాలు రాశాడు.
  6. రెడ్డిరాజులను ఆశ్రయించాడు.

ప్రశ్న 2.
‘అన్ని దానాల్లోకి అన్నదానం మిన్న’ అనే అంశంపై తరగతిలో చర్చించండి.
జవాబు:
‘దానం’ అంటే ఇతరుడికి ఇవ్వడం. దానం చేస్తే పుణ్యం వస్తుందని చెపుతారు. ఈ జన్మలో దానం చేసుకుంటే తరువాతి జన్మలో భగవంతుడు మనకు తిరిగి ఇస్తాడని మన గ్రంథాలు చెపుతున్నాయి.

దశదానాలు, షోడశ మహాదానాలు చేయాలని చెపుతారు. అయితే దానాలు అన్నింటిలోకి ‘అన్నదానం’ గొప్పది అని పెద్దలు చెపుతారు. ఈ మాట సత్యమైనది. ఎదుటి వ్యక్తికి తృప్తి కలిగేటట్లు అన్నదానం చేయవచ్చు. అన్నదానం చేస్తే తిన్నవాడికి కడుపు నిండుతుంది. మరింతగా పెడతానన్నా అతడు తినలేడు. ఇతర దానాలు ఎన్ని చేసినా ఎంత విరివిగా చేసినా దానం పుచ్చుకున్న వాడికి తృప్తి కలుగదు. మరింతగా ఇస్తే బాగుండు ననిపిస్తుంది.

అన్నదానం చేస్తే తిన్నవాడి ప్రాణం నిలుస్తుంది. కాబట్టి అన్ని దానాల్లోకి అన్నదానం మిన్న అన్నమాట నిజం.

ప్రశ్న 3.
శ్రీనాథ కవి గురించి వివరించండి.
జవాబు:
శ్రీనాథుడు తెలుగు సాహిత్యంలో పేరు పొందిన పెద్దకవి. ఈయన తల్లిదండ్రులు భీమాంబ, మారయ్యలు. ఈయన కొండవీడును పాలించిన పెద్దకోమటి వేమారెడ్డి ఆస్థానంలో విద్యాధికారిగా ఉండేవాడు.

విజయనగరం చక్రవర్తి ప్రౌఢదేవరాయల ఆస్థానంలో ‘గౌడడిండిమభట్టు’ను ఓడించి రాయలచే కనకాభిషేకమును, ‘కవి సార్వభౌమ’ అనే బిరుదును అందుకున్నాడు.

ఈయన శృంగార నైషథం, భీమఖండం, కాశీఖండం, హరవిలాసం, శివరాత్రి మాహాత్మ్యం వంటి కావ్యాలు రచించాడు. ఈయన జీవిత విధానాన్ని, చమత్కారాన్ని తెలిపే పెక్కు చాటు పద్యాలు రచించాడు.

శ్రీనాథుడు సీస పద్య రచనకు ప్రసిద్ధి పొందాడు. ఈయన రాజమహేంద్రవరం రెడ్డిరాజుల కొలువులో ఆస్థానకవిగా ఉన్నప్పుడు కాశీఖండ, భీమఖండములు రచించాడు. ఉద్దండ లీల, ఉభయ వాతైఢి, రసాభ్యుచిత బంధం, సూక్తి వైచిత్రి అనేవి శ్రీనాథుని కవితా లక్షణాలు.

ఈయన 15వ శతాబ్దివాడు. శ్రీనాథుడు చివరి రోజులలో రాజుల ఆశ్రయం లేక బాధలు పడ్డాడు. శ్రీనాథుడు ఆ బాల్య కవి.

AP SSC 10th Class Telugu Solutions Chapter 11 భిక్ష

ప్రశ్న 4.
‘అకంఠంబుగ …………. శిలోంఛప్రక్రముల్ తాపసుల్!’ పద్యానికి ప్రతి పదార్థం రాయండి.
జవాబు:
ఇప్డు = ఇప్పుడు
ఆకంఠంబుగన్ : కంఠము దాకా (గొంతు దాకా)
మాధుకర భిక్షాన్నంబు = మాధుకర రూపమైన భిక్షాన్నాన్ని
భక్షింపగాన్ = తినడానికి
లేకున్నన్ = లేకపోయేసరికి
కడున్ = మిక్కిలి
అంగలార్చెదవు = అంగలు వేస్తున్నావు (గంతులు వేస్తున్నావు)
మేలే = మంచిపని యేనా?
లేస్స = బాగున్నదా?
శాంతుండవే = నీవు శాంత గుణం కలవాడవేనా !
నీవార ముష్టింపచుల్ = ఏ పూటకు ఆ పూట పిడికెడు నివ్వరి వడ్లు దంచుకొని తినేవారూ
శాకాహారులు = కాయ కూరలు మాత్రమే తినేవారూ
కందభోజులు = దుంపలు మాత్రమే తినేవారూ
శిలోంఛ ప్రక్రముల్; శిల = కోత కోసిన వరిమళ్ళలో జారిపడిన కంకులు ఏరుకొని వాటితో బ్రతికేవారూ
ఉంఛ ప్రక్రముల్ = రచ్చరోళ్ళ వద్ద వడ్లు దంచేటప్పుడు చుట్టూ జారిపడిన బియ్యపు గింజలు ఏరుకొనడమే జీవనంగా కలవారూ అయిన
తాపసుల్ = తపస్సు చేసుకొనేవారూ కటకటా అక్కట కటా ! (అయిన మునులు)
నీకంటెన్ = నీ కన్న
మతిహీనులే = తెలివి తక్కువ వారా ? (చెప్పు)

II. వ్యక్తీకరణ-సృజనాత్మకత

1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాలలో సమాధానాలు రాయండి.

అ) వ్యాసుని పాత్ర స్వభావాన్ని వివరించండి.
జవాబు:
వ్యాసుడు అఖిల విద్యలకూ గురువు. ఈయనకు పదివేలమంది శిష్యులు ఉండేవారు. ఈయన కాశీ నగరంలో శిష్యులకు విద్య నేర్పుతూ, భిక్షాటన చేసుకొంటూ జీవించేవాడు.

ఉదయమే లేచి పాపాత్ముడి ముఖం చూడడం వల్లనే తనకు భిక్ష దొరకలేదని వ్యాసుడు అనుకున్నాడు. సూర్యాస్తమయం అయిన తర్వాత, ఆయన ఆ రోజుకు తినేవాడు కాదు. బ్రాహ్మణ గృహాల వద్ద మాధుకర భిక్షతో జీవించేవాడు.

వ్యాసుడు సులభ కోపి. తనకు రెండు రోజులు భిక్ష దొరకలేదని కాశీ నగరాన్ని శపించబోయాడు. ఈయన శిష్యులు లేకుండా తాను ఒక్కడూ భుజించననే వ్రతం పట్టిన శిష్య ప్రేమికుడు. నిత్యం పవిత్ర గంగాస్నానం చేసేవాడు.

పార్వతీదేవిచేత మందలింపబడి, తన తప్పును గ్రహించిన ఉత్తముడు వ్యాసుడు.

ఆ) “నేడు నిన్నటికి మఱునాఁడు నిక్కువంబు” ఈ మాటలు ఎవరు ఎవరితో ఏ సందర్భంలో అన్నారు? వీటి అంతరార్థమేమిటి?
జవాబు:
‘నేడు నిన్నటి మఱునాడు నిక్కువంబు” అన్న మాటలు, వేదవ్యాసుడు సామాన్య స్త్రీ రూపంలో కనబడిన పార్వతీదేవితో అన్నాడు. పార్వతీదేవి సామాన్య స్త్రీ రూపంలో కనబడి వేదవ్యాసుని మందలించి, తన ఇంటికి భోజనానికి రమ్మని పిలిచింది. అప్పుడు వ్యాసుడు ఆమెతో పై మాటలను అన్నాడు.

అంతరార్థం :
“ఈ రోజు నిన్నటి రోజుకు తరువాతి రోజు అన్నది నిజము” అని ఈ మాటకు అర్థం. అంటే నిన్న ఎలాగైతే భోజనం లేక పస్తు ఉన్నామో అలాగే ఈ రోజు కూడా, నిన్నటిలాగే పస్తు ఉంటామని దీని అంతరార్థం.

2. కింది ప్రశ్నలకు పదేసి వాక్యాల్లో సమాధానాలు రాయండి.

అ) పాఠంలోని కథను సంక్షిప్తంగా రాయండి.
జవాబు:
వ్యాసుడు సకల విద్యలకూ గురువు. ఒకరోజు మధ్యాహ్న వేళలో ఆయన శిష్యులతో కలిసి కాశీ నగరంలో బ్రాహ్మణ వాడలలో భిక్షాటనం కోసం వెళ్ళాడు. ఏవో కారణాలు చెప్పి, ఎవరూ ఆయనకు భిక్ష పెట్టలేదు. ఆ రోజుకు ఉపవాసం ఉందామనీ, మరుసటి రోజు భిక్ష తప్పక దొరుకుతుందనీ, వ్యాసుడు నిశ్చయించాడు.

ఈశ్వరుడి మాయవల్ల మరుసటి రోజున కూడా ఎవరూ ఆయనకు భిక్ష పెట్టలేదు. వ్యాసుడు కోపంతో భిక్షా పాత్రను నడివీధిలో పగులకొట్టి, కాశీ వాసులకు మూడు తరాల పాటు ధనం, మోక్షం, విద్య లేకపోవుగాక అని శపించబోయాడు.

ఇంతలో పార్వతీదేవి ఒక సామాన్య స్త్రీ రూపంలో ఒక బ్రాహ్మణ గృహం వాకిట్లో ప్రత్యక్షమయి, వ్యాసుని మందలించి తన ఇంటికి భోజనానికి రమ్మని ఆహ్వానించింది.

అప్పుడు వ్యాసుడు “సూర్యుడు అస్తమిస్తున్నాడు. నాకు పదివేలమంది శిష్యులున్నారు. వారు తినకుండా నేను తినను. ఈ రోజు కూడా నిన్నటి లాగే పస్తుంటాను” అన్నాడు.

అప్పుడు పార్వతీదేవి నవ్వి “నీవు శిష్యులందరినీ వెంట తీసుకొని రా ! ఈశ్వరుడి దయతో ఎంతమంది వచ్చినా, కావలసిన పదార్థాలు పెడతాను” అని చెప్పింది.

వ్యాసుడు సరే అని, శిష్యులతో గంగలో స్నానం చేసి వచ్చాడు. పార్వతీదేవి వారికి ఎదురేగి స్వాగతం చెప్పి భోజనశాలలో వారందరికి భోజనం పెట్టింది.

AP SSC 10th Class Telugu Solutions Chapter 11 భిక్ష

ఆ) కోపం కారణంగా వ్యాసుడు కాశీ నగరాన్నే శపించాలనుకున్నాడు కదా ! “కోపం- మనిషి విచక్షణను నశింపజేస్తుంది”. అనే అంశం గురించి రాయండి.
జవాబు:
“కోపం వస్తే నేను మనిషిని కాను” అని అంటూ ఉంటారు. అది నిజమే. కోపం వస్తే తనను తాను మరచి, మనిషి రాక్షసుడు అవుతాడు. ఆ కోపంతో తాను ఏమి చేస్తున్నాడో, తెలిసికోలేడు. కోపంలోనే అన్నదమ్ములనూ, అక్క చెల్లెండ్రనూ, చివరకు కట్టుకొన్న భార్యనూ, కన్నపిల్లల్నీ కూడా చంపుతూ ఉంటారు. కాబట్టి కోపం మంచిది కాదు.

ఈ కథలో వ్యాసుడి అంతటి బ్రహ్మజ్ఞాని, రెండు రోజులు భిక్ష దొరకలేదని కాశీ నగరాన్ని శపించబోయాడు. భర్తృహరి నీతి శతకంలో “క్షమ కవచంబు క్రోధమది శత్రువు” అంటాడు. అంటే ఓర్పు కవచం లాంటిది.
కోపం శత్రువు లాంటిది అని అర్థం. శత్రువులాంటి కోపాన్ని విడిచిపెట్టాలి.

దుర్యోధనుడికి పాండవులపైన, భీముడి మీద కోపం. అందుకే వారితో తగవు పెట్టుకొని యుద్ధంలో తాను మరణించాడు. దేవతలపై కోపంతోనే, రాక్షసులు అందరూ మరణించారు. “కోపమునను ఘనత కొంచెమైపోవును” అని వేమన కవి చెప్పాడు. కాబట్టి మనిషి కోపాన్ని అణచుకోవాలి. కోపము మనిషికి శత్రువు వంటిది. “తన కోపమే తన శత్రువు” అంటాడు సుమతీ శతక కర్త. కాబట్టి కోపం విడిచిపెట్టాలి.

3. కింది అంశాల గురించి సృజనాత్మకంగా ప్రశంసిస్తూ రాయండి.

అ) “కోపం తగ్గించుకోడం మంచిది !” అనే అంశాన్ని బోధిస్తూ మిత్రునికి లేఖ రాయండి.
జవాబు:

విజయవాడ,
x x x x x

మిత్రుడు రఘునందను,
నీ లేఖ అందింది. నేనూ మా తల్లిదండ్రులూ క్షేమంగా ఉన్నాము. నీ లేఖలో, నీకు ప్రియ మిత్రుడైన సీతారామ్ తో నీకు తగవు వచ్చిందనీ, మీరిద్దరూ దెబ్బలాడుకున్నారని రాశావు. మీ ఇద్దరికీ దెబ్బలు తగిలాయని కూడా రాశావు.

నీ ఉత్తరం చూసి నేను చాలా బాధపడ్డాను. సహజంగా నీవు శాంత స్వభావుడవు. నీకు కోపం ఎందుకు వచ్చిందో రాశావు. అయినా దెబ్బలు తగిలే వరకూ మీరు తగవు లాడడం బాగోలేదు. ‘తన కోపమె, తన శత్రువు’ అని సుమతీ శతక కర్త రాశాడు. క్రోధం మనకు శత్రువని భర్తృహరి కూడా చెప్పాడు. అయినా నీకు అన్ని విషయాలు తెలుసు.

కోపం వల్ల చాలా అనర్థాలు వస్తాయి. కోపంతో మనకు వివేకం నశిస్తుంది. సీతారామ్ తో నీకు వచ్చిన తగవు విషయం, మీ పెద్దలతో చెప్పు. వారు మీ తగవు పరిష్కరిస్తారు. కోపం తగ్గించుకొని శాంతంగా ఉండమని నిన్ను కోరుతున్నాను. త్వరలో నీవూ, సీతారామూ మిత్రులుగా మారుతారని ఆశిస్తున్నా.

ఇట్లు,
నీ ప్రియమిత్రుడు,
అవసరాల వెంకట్రావు,
10వ తరగతి,
మునిసిపల్ హైస్కూలు,
విజయవాడ.

చిరునామా:
కె. రఘునందన్,
S/O కె. రాజారావు గారు,
ఇంటి నెం. 4.1.104, మహారాణీ పేట,
విశాఖపట్టణం, ఆంధ్రప్రదేశ్,

ఆ) భిక్ష, రక్ష పరీక్ష, సమీక్ష, వివక్ష – వంటి పదాలతో ఒక చక్కని భావాన్ని ప్రకటించే కవిత రాయండి.
జవాబు:
వచన కవిత :
ఉపదేశం
నేనిస్తా మిత్రమా సలహాలు నీకు లక్ష
తోడివారిపై పెంచుకోకు నీవు కక్ష
ఉండాలి మరి మనకు సది తితిక్ష
మంచి చెడ్డలు మనం చెయ్యాలి సమీక్ష
చెడ్డపనులు చేస్తే తప్పదు శిక్ష
ఉంటుంది మనపై దైవం పరీక్ష
ఉండాలి యోగ్యుడు కావాలనే దీక్ష
మనందరికి దేవుడే శ్రీరామరక్ష
ఎందుకు మనలో మనకు ఈ వివక్ష
పుట్టించిన దేవుడే చేస్తాడంత శిక్ష

III. భాషాంశాలు

పదజాలం

1) కింది వాక్యాల్లో గీత గీసిన పదాలకు పర్యాయపదాలు రాయండి.
అ) ద్వాఃకవాటంబు దెఱవదు వనిత యొకతె.
జవాబు:
1) ద్వాఃకవాటంబు : 1) ద్వారబంధము
2) ద్వారం తలుపు

2) వనిత : 1) స్త్రీ 2) పురంధీ 3) అంగన 4) పడతి 5) నారి

ఆ) ప్రక్షాళితంబైన పసిఁడి చట్టువము.
జవాబు:
పసిడి : 1) బంగారము 2) సువర్ణము 3) కనకము 4) హిరణ్యము 5) పైడి

ఇ) పారాశర్యుండు క్షుత్పిపాసా పరవశుండై శపియింపఁ దలంచెను.
జవాబు:
పారాశర్యుండు : 1) వ్యాసుడు 2) బాదరాయణుడు 3) సాత్యవతేయుడు

ఈ) ఇవ్వీటి మీద నాగ్రహము తగునె?
జవాబు:
ఆగ్రహము : 1) కోపము 2) క్రోధము 3) రోషము 4) కినుక

ఉ) అస్తమింపగ జేసినాడు అహిమకరుడు.
జవాబు:
అహిమకరుడు : 1) సూర్యుడు 2) రవి 3) ఆదిత్యుడు 4) భాస్కరుడు

ఊ) భుక్తిశాల : భోజనశాల
జవాబు:
భుక్తిశాల : పెళ్ళివారు భుకిశాలలో ఫలహారాలు తింటున్నారు.

2. కింది పదాలను సొంతవాక్యాల్లో ఉపయోగించి రాయండి.
అ) ద్వాఃకవాటము : ద్వారము తలుపు
జవాబు:
ద్వాఃకవాటము : దొంగలకు భయపడి, మా ఊళ్ళో అందరూ, రాత్రి తొందరగానే ద్వాఃకవాటములు బిగిస్తున్నారు.

ఆ) వీక్షించు : చూచు
జ. వీక్షించు : నేటి కాలంలో బాలురు సినిమాలను ఎక్కువగా వీక్షిస్తున్నారు.

ఇ) అంగన : స్త్రీ
జవాబు:
అంగన : ప్రతి పురుషుడి విజయము వెనుక, ఒక అంగన తప్పక ఉంటుంది.

ఈ) మచ్చెకంటి : చక్కని ఆడది
జవాబు:
మచ్చెకంటి : తెలుగు సినీ నటీమణులలో శ్రీదేవి చక్కని మచ్చెకంటి.

ఉ) కుందాడుట : నిందించుట
జవాబు:
కుందాడుట : గురువులు, శిష్యుల తప్పులను ఎత్తిచూపి, కుందాడుట మంచిది కాదు.

3) కింది వాక్యాలలోని నానార్థాలను గుర్తించి రాయండి.
అ) వీడు ఏ వీడు వాడో గాని దుష్కార్యములను వీడు చున్నాడు.
జవాబు:
ఈ వాక్యంలో ‘వీడు’ అనే పదం మూడు అర్థాలలో వాడబడింది.
1. వీడు (నానార్థాలు) : 1) ఈ మనుష్యుడు 2) పట్టణము 3) వదలుట

ఆ) దేశ భాషలందు తెలుగు లెస్సయని రాయలు లెస్స గా బలికెను.
జవాబు:
ఈ వాక్యంలో ‘లెస్స’ అనే పదం రెండు అర్థాల్లో వాడబడింది.
2. లెస్స (నానార్థాలు) : 1) మేలు 2) చక్కన 3) మంచిది

ఇ) గురుని మాటలు విన్న ఇంద్రుడు కర్ణుని గురుడైన సూర్యుని గలిసి గురుయోజన చేయసాగినాడు.
జవాబు:
పై వాక్యంలో ‘గురుడు’ అనే మాట మూడు అర్థాలలో వాడబడింది.
3. గురుడు (నానార్థాలు) : 1) ఉపాధ్యాయుడు 2) తండ్రి 3) బలీయం

AP SSC 10th Class Telugu Solutions Chapter 11 భిక్ష

4. కింది ప్రకృతి పదాలకు సరైన వికృతి పదాలను ఎంపిక చేయండి.
అ) విద్య
క) విదియ
చ) విజ్ఞ
ట) విద్దె
త) విధ్య
జవాబు:
ట) విద్దె

ఆ) భిక్షము
క) బత్తెము
చ) బచ్చ
ట) బిచ్చ
త) బిచ్చము
జవాబు:
త) బిచ్చము

ఇ) యాత్ర
క) యతర
చ) జాతర
ట) జైత్ర.
త) యతనము
జవాబు:
చ) జాతర

ఈ) మత్స్యము
క) మచ్చీ
చ) మత్తియము
ట) మచ్చెము
త) మత్తము
జవాబు:
ట) మచ్చెము

AP SSC 10th Class Telugu Solutions Chapter 11 భిక్ష

5. కింది పదాలకు వ్యుత్పత్త్యర్థాలను రాయండి.

అ) గురుడు – అజ్ఞానమనెడి అంధకారమును తొలగించువాడు. (ఉపాధ్యాయుడు)
ఆ) వనజము – వనము(నీరు) నందు పుట్టినది. (పద్మము)
ఇ) అర్ఘ్యము – పూజకు తగిన నీరు.
ఈ) పాద్యము – పాదములు కడుగుకొనుటకు ఉపయోగించే నీరు.
ఉ) పారాశర్యుడు – పరాశర మహర్షి యొక్క కుమారుడు (వ్యాసుడు)

వ్యాకరణాంశాలు

1. కింది పాదాల్లోని సంధులను గుర్తించి, సంధి సూత్రాలను రాయండి.
అ) పుణ్యాంగనయు భిక్ష యిడదయ్యెఁ గటా !
జవాబు:
1. పుణ్యాంగన = పుణ్య + అంగన = సవర్ణదీర్ఘ సంధి

సవర్ణదీర్ఘ సంధి
సూత్రం : అ, ఇ, ఉ, ఋ లకు అవే అచ్చులు పరమైనపుడు వాని దీర్ఘాలు ఏకాదేశంగా వస్తాయి.

2. భిక్షయిడదయ్యె = భిక్ష + ఇడదయ్యె = యడాగమ సంధి

యడాగమ సంధి
సూత్రం : సంధిలేని చోట అచ్చు కంటె పరమైన అచ్చునకు యడాగమం వస్తుంది.

3. ఇడదయ్యె = ఇడదు + అయ్యె ఉత్వ సంధి

ఉత్వ సంధి
సూత్రం : ఉత్తునకు అచ్చు పరమైనపుడు సంధి నిత్యంగా వస్తుంది.

4. ఇడదయ్యెఁగటా = ఇడదయ్యెన్ + కడ = (సరళాదేశ సంధి) లేక (ద్రుత ప్రకృతిక సంధి)

సరళాదేశ సంధి
సూత్రం 1 : ద్రుత ప్రకృతికము మీది పరుషాలకు సరళాలు ఆదేశంగా వస్తాయి.
ఉదా : ఇడదయ్యెన్ + గటా

సూత్రం 2 : ఆదేశ సరళాలకు ముందున్న ద్రుతానికి బిందు సంశ్లేషలు విభాషగా వస్తాయి.
ఉదా : ఇడదయ్యెఁగటా

ఆ) కాశి; యివ్వీటి మీద నాగ్రహము దగునె.
1. కాశి; యివ్వీటి మీద
కాశి; + ఇవ్వీటి మీద = యడాగమ సంధి

యడాగమ సంధి
సూత్రం : సంధిలేని చోట అచ్చుకంటె పరమైన అచ్చునకు యడాగమం వస్తుంది.
ఉదా : కాశియివ్వీటి మీద
2. ఇవ్వీటి మీద – ఈ + వీటి మీద = త్రిక సంధి

త్రిక సంధి
సూత్రం 1 : త్రికం మీది అసంయుక్త హల్లునకు ద్విత్వం బహుళంగా వస్తుంది.
సూత్రం 2 : ద్విరుక్తమైన హల్లు పరమైనపుడు ఆచ్ఛిక దీరానికి హ్రస్వం వస్తుంది.
ఉదా : ఇవ్వీటి మీద
3. ఆగ్రహము దగునె – ఆగ్రహము + తగునే = గసడదవాదేశ సంధి

గసడదవాదేశ సంధి
సూత్రం : ప్రథమమీది పరుషాలకు గ స డ ద వలు బహుళంగా వస్తాయి.

4. అగునె – అగును . + ఏ = ఉత్వ సంధి

ఉత్వ సంధి
సూత్రం : ఉత్తునకు అచ్చు పరమైనపుడు సంధి నిత్యంగా వస్తుంది.

ఇ) ఓ మునీశ్వర ! వినవయ్య యున్నయూరు.
1. మునీశ్వర – ముని + ఈశ్వర = సవర్ణదీర్ఘ సంధి

సవర్ణదీర్ఘ సంధి
సూత్రం : అ, ఇ, ఉ, ఋ లకు అవే అచ్చులు పరమైనపుడు వాని దీర్ఘాలు ఏకాదేశంగా వస్తాయి.

2. వినవయ్య యున్నయూరు – వినవయ్య + ఉన్న = యడాగమ సంధి

యడాగమ సంధి
సూత్రం : సంధిలేని చోట అచ్చుకంటే పరమైన అచ్చునకు యడాగమం వస్తుంది.

3. ఉన్నయూరు – ఉన్న + ఊరు = యడాగమ సంధి

యడాగమ సంధి
సూత్రం : సంధిలేని చోట అచ్చుకంటె పరమైన అచ్చునకు యడాగమం వస్తుంది.

2. కింది పద్యపాదాల్లో ఏయే ఛందస్సులున్నాయో గుర్తించి సమన్వయం చేయండి.

అ) మునివర ! నీవు శిష్యగణముంగొని చయ్యనరమ్మ విశ్వనా
జవాబు:
AP SSC 10th Class Telugu Solutions Chapter 11 భిక్ష 1 AP SSC 10th Class Telugu Solutions Chapter 11 భిక్ష 2
1. పై పద్యపాదంలో “న జ భ జ జ జ ర” అనే గణాలు వరుసగా వచ్చాయి. కాబట్టి ఇది “చంపకమాల” పద్యపాదం.
2. మొదటి అక్షరానికి, 11వ అక్షరానికి యతిస్థానం. “ము – ముం”.

ఆ) య్యాదిమశక్తి సంయమివరా ! యిటురమ్మని పిల్చెహస్త సం
జవాబు:
AP SSC 10th Class Telugu Solutions Chapter 11 భిక్ష 2
1. పై పద్యపాదంలో “భ ర న భ భ ర వ” అనే గణాలు వరుసగా వచ్చాయి. కాబట్టి ఇది “ఉత్పలమాల” పద్యపాదం.
2. మొదటి అక్షరం ‘య్యా’ కు, 10వ అక్షరం ‘రా’ కు, యతిస్థానం. (రా = ర్ + ఆ)

ఇ) నఖిల విద్యాగురుండు భిక్షాటనంబు
జవాబు:
AP SSC 10th Class Telugu Solutions Chapter 11 భిక్ష 3
1. ఇది ‘తేటగీతి’ పద్యపాదం
2. దీనిలో ప్రతి పాదానికి ఒక సూర్యగణం, రెండు ఇంద్రగణాలు, రెండు సూర్యగణాలు వరుసగా ఉంటాయి.
3. మొదటి గణంలో మొదటి అక్షరానికి, నాలుగో గణ మొదటి అక్షరానికి యతిమైత్రి (న – క్షా)

3. కింది వాక్యాలను చదవండి.
అర్థాంతరన్యాసాలంకారం
అ) శివాజీ కళ్యాణి దుర్గాన్ని సాధించాడు.
వీరులకు సాధ్యము కానిది లేదు కదా !

ఆ) గొప్పవారితో ఉన్న సామాన్యులనూ గౌరవిస్తారు.
పూవులతో పాటు దారాన్ని కూడా సిగనెక్కిస్తారు.

గమనిక :
ఈ రెండు వాక్యాల్లో ఒక విషయాన్ని మరో విషయంతో సమర్థిస్తున్నాం కదూ”!

మొదటి వాక్యంలో : శివాజీ కళ్యాణి దుర్గాన్ని సాధించడం – (విశేష విషయం)
వీరులకు సాధ్యం కానిది లేదు కదా ! – (సామాన్య విషయం )
అంటే విశేష విషయాన్ని, సామాన్య విషయంతో సమర్థించాం.

ఇక రెండవ వాక్యంలో
గొప్పవారితో ఉన్న సామాన్యులను గౌరవించడం – (సామాన్య విషయం)
పూవులతో పాటు దారం సిగనెక్కటం – (విశేష విషయం)
అంటే దీంట్లో సామాన్య విషయాన్ని విశేష విషయంతో సమర్థించాం.

ఇలా విశేష సామాన్య విషయాలను పరస్పరం సమర్థించి చెప్పినట్లయితే, అటువంటి అలంకారాన్ని “అర్థాంతర న్యాసాలంకారం” అంటారు.

అర్ధాంతరన్యాసాలంకారం
లక్షణం :
విశేష విషయాన్ని సామాన్య విషయంతో గాని, సామాన్య విషయాన్ని’ విశేష విషయంతో గాని సమర్థించి చెప్పడమే ‘అర్థాంతరన్యాసాలంకారం’.

1. కింది లక్ష్యాలకు సమన్వయం రాయండి.

అ) హనుమంతుడు సముద్రాన్ని లంఘించాడు.
మహాత్ములకు సాధ్యం కానిది లేదు కదా!
జవాబు:
సమన్వయం :
పై వాక్యాలలో “అర్థాంతరన్యాసాలంకారం” ఉంది. ఇందులో “హనుమంతుడు సముద్రాన్ని లంఘించాడు” అన్నది విశేష విషయం. “మహాత్ములకు సాధ్యం కానిది లేదు కదా” అన్న వాక్యం సామాన్య వాక్యం. ఇక్కడ సామాన్య వాక్యంచే, విశేష వాక్యం సమర్థింపబడింది. కాబట్టి ఈ వాక్యాలలో “అర్థాంతరన్యాసాలంకారం” ఉంది.

ఆ) మేఘుడంబుధికి పోయి జలంబు తెచ్చి ఇస్తాడు.
లోకోపకర్తలకిది సహజగుణము.
జవాబు:
సమన్వయం : పై వాక్యాలలో ‘అర్థాంతరన్యాసాలంకారం’ ఉంది. ఇందులో “మేఘుడంబుధికి పోయి జలంబు తెచ్చిఇస్తాడు” అన్నది విశేష వాక్యం. “లోకోపకర్తలకిది సహజ గుణము” అనేది సామాన్య వాక్యం. ఇక్కడ సామాన్యముచే విశేష విషయం సమర్థింపబడింది. కాబట్టి ఇక్కడ “అర్థాంతరన్యాసాలంకారం” ఉంది.

అదనపు సమాచారము

సంధులు

1) బీఱెండ = బీఱు + ఎండ – ఉత్వ సంధి
2) రమ్మని = రమ్ము + అని – ఉత్వ సంధి
3) పట్టపగలు = పగలు + పగలు – ద్విరుక్తటకారాదేశ సంధి
4) నట్టనడుము = నడుము + నడుము – ద్విరుక్తటకారాదేశ సంధి
5) కట్టనుగు = కడు + అనుగు – ద్విరుక్తటకారాదేశ సంధి
6) భిక్షాటనంబు = భిక్షా + అటనంబు – సవర్ణదీర్ఘ సంధి
7) పాయసాపూపములు = పాయస + అపూపములు – సవర్ణదీర్ఘ సంధి
8) బ్రాహ్మణాంగనలు = బ్రాహ్మణ + అంగలు – సవర్ణదీర్ఘ సంధి
9) పుణ్యాంగన = పుణ్య + అంగన – సవర్ణదీర్ఘ సంధి
10) పాపాత్ముని = పాప + ఆత్ముని – సవర్ణదీర్ఘ సంధి
11) కోపావేశము = కోప + ఆవేశము – సవర్ణదీర్ఘ సంధి
12) శాకాహారులు = శాక + ఆహారులు – సవర్ణదీర్ఘ సంధి
13) మునీశ్వర = ముని + ఈశ్వర – సవర్ణదీర్ఘ సంధి
14) కమలానన = కమల + ఆనన – సవర్ణదీర్ఘ సంధి
15) అభీప్సితాన్నము = అభీప్పిత + అన్నము – సవర్ణదీర్ఘ సంధి
16) బింబాస్య = బింబ + ఆస్య – సవర్ణదీర్ఘ సంధి
17) శాలాంతరము = శాలా + అంతరము – సవర్ణదీర్ఘ సంధి
18) సంజ్ఞాదరలీల = సంజ్ఞా + ఆదరలీల – సవర్ణదీర్ఘ సంధి
19) శిఖాధిరూఢ = శిఖా + అధిరూఢ – సవర్ణదీర్ఘ సంధి
20) కటకాభరణంబులు = కటక + ఆభరణంబులు – సవర్ణదీర్ఘ సంధి
21) శిలోంఛప్రక్రముల్ = శిల + ఉంఛప్రక్రముల్ – గుణసంధి
22) కబ్జవెట్టి = కట్ట + పెట్టి – గసడదవాదేశ సంధి
23) పూజచేసి = పూజ + చేసి – గసడదవాదేశ సంధి
24) అమ్మహాసాధ్వి = ఆ + మహాసాధ్వి – త్రిక సంధి
25) అయ్యా దిమశక్తి = ఆ + ఆదిమశక్తి – యడాగమ త్రిక సంధులు
26) ముత్తైదువ = ముత్త + ఐదువ – అత్వ సంధి

సమాసాలు

సమాస పదంవిగ్రహవాక్యంసమాసం పేరు
1) మతిహీనులుమతిచేత హీనులుతృతీయా తత్పురుషం
2) భిక్షాపాత్రంబుభిక్ష కొఱకైన పాత్రముచతుర్థి తత్పురుష
3) భిక్షాటనముభిక్ష కొఱకు అటనముచతుర్థి తత్పురుష
4) భోజనశాలభోజనము కొఱకు శాలచతుర్దీ తత్పురుష
5) విప్రగృహవాటికలువిప్రగృహముల యొక్క వాటికలుషష్ఠీ తత్పురుష
6) విద్యాగురుడువిద్యలకు గురుడుషష్ఠీ తత్పురుష
7) ద్వాఃకవాటముద్వారము యొక్క కవాటముషష్ఠీ తత్పురుష
8) బ్రాహ్మణాంగనలుబ్రాహ్మణుల యొక్క అంగనలుషష్ఠీ తత్పురుష
9) బ్రాహ్మణ మందిరములుబ్రాహ్మణుల యొక్క మందిరములుషష్ఠీ తత్పురుష
10) కోపావేశముకోపము యొక్క ఆవేశముషష్ఠీ తత్పురుష
11) శాలాంతరాళముశాల యొక్క అంతరాళముషష్ఠీ తత్పురుష
12) బీఱెండబీఱు అయిన ఎండవిశేషణ పూర్వపద కర్మధారయం
13) అనుగుజెలులుప్రియమైన చెలులువిశేషణ పూర్వపద కర్మధారయం
14) పుణ్యాంగనపుణ్యమైన అంగనవిశేషణ పూర్వపద కర్మధారయం
15) అభీప్సితాన్నములుఅభీప్సితమైన అన్నములువిశేషణ పూర్వపద కర్మధారయం
16) వనజనేత్రవనజముల వంటి నేత్రములు గలదిబహుపద సమాసం
17) లేదీగె బోడిలేదీగె వంటి శరీరము కలదిబహువ్రీహి సమాసం
18) అహిమభానుడువేడి కిరణములు గలవాడుబహువ్రీహి సమాసం
19) ముక్కంటిమూడు కన్నులు గలవాడుబహువ్రీహి సమాసం
20) మచ్చెకంటెమత్య్సము వంటి కన్నులు గలదిబహువ్రీహి సమాసం
21) శాకాహారులుశాకములు ఆహారముగా గలవారుబహువ్రీహి సమాసం
22) కందభోజులుకందములు భోజనంగా కలవారుబహువ్రీహి సమాసం
23) చిగురుబోడిచిగురు వంటి శరీరము గలదిబహువ్రీహి సమాసం
24) కమలాననకమలము వంటి ఆననము కలదిబహువ్రీహి సమాసం
25) కాశికానగరము‘కాశి’ అనే పేరు గల నగరముసంభావనా పూర్వపద కర్మధారయం
26) వేదపురాణ శాస్త్రములువేదములును, పురాణములును, శాస్త్రములునుబహుపద ద్వంద్వము
27) ఇందు బింబాస్యఇందు బింబము వంటి ఆస్యము కలదిబహువ్రీహి సమాసం
28) అర్ఘ్యపాద్యములుఅర్ఘ్యమును, పాద్యమునుద్వంద్వ సమాసం
29) పుష్ప గంధంబులుపుష్పమును, గంధమునుద్వంద్వ సమాసం
30) క్షుత్పిపాసలుక్షుత్తు, పిపాసద్వంద్వ సమాసం
31) మధ్యాహ్నముఅహ్నము యొక్క మధ్యముప్రథమా తత్పురుషం
32) మోక్షలక్ష్మిమోక్షము అనెడి లక్ష్మీరూపక సమాసం
33) మూడుతరములుమూడైన తరములుద్విగు సమాసం
34) కాశికా పట్టణము‘కాశి’ అనే పేరు గల పట్టణంసంభావనా పూర్వపద కర్మధారయం

ప్రకృతి – వికృతి

శిష్యుడు – సిసువుడు
గృహము – గీము
విద్య – విద్దె
కార్యము – కర్జము
పుష్పము – పూవు, పువ్వు
గందము
స్వర్ణము – సొన్నము
పాయసము – పాసెము
బహు – పెక్కు
భక్తి – బత్తి
విశ్వాసము – విసువాసము
ముఖము – మొగము
బ్రాహ్మణుడు – బాపడు
రాత్రి – రాతిరి
లక్ష్మి – లచ్చి
పట్టణము – పట్నము
వేషము – వేసము
ఆహారము – ఓగిరము
తపస్వి – తపసి, తబిసి
రూపము – రూపు
పంక్తి – బంతి
శాల – సాల
ఛాత్రుడు – చట్టు

నానార్థాలు

1) కాయ : 1) చెట్టుకాయ 2) బిడ్డ 3) అరచేతిలో రాపిడివల్ల ఏర్పడిన పొక్కు
2) ఇల్లు : 1) గృహము 2) కుటుంబము 3) స్థానము
3) గృహము : 1) ఇల్లు 2) భార్య 3) రాశి
4) గురుడు : 1) తండ్రి 2) ఉపాధ్యాయుడు 3) బృహస్పతి
5) ముఖము : 1) మోము 2) ఉపాయము 3) ముఖ్యమైనది
6) బంతి : 1) కందుకము 2) ఒక జాతి పువ్వులచెట్టు 3) పంక్తి
7) రూపు : 1) ఆకారము 2) దేహము 3) కన్నెమెడలో బంగారు నాణెము
8) గంధము : 1) చందనము 2) గంధకము 3) సువాసన
9) కరము : 1) చేయి 2) తొండము 3) కిరణము
10) ఫలము : 1) పండు 2) ప్రయోజనం 3) లాభం
11) వీధి : 1) త్రోవ 2) వాడ 3) నాటక భేదము
12) లక్ష్మి : 1) రమ 2) సిరి 3) మెట్టదామర

పర్యాయపదాలు

1) అంగన : 1) వనిత 2)స్త్రీ 3) మహిళ
2) ఇల్లు : 1) గృహము 2) భవనము 3) మందిరము
3) పుష్పము : 1) పువ్వు 2) కుసుమము 3) ప్రసూనము
4) గంధము : 1) చందనము 2) మలయజము 3) గంధసారము
5) నెయ్యి : 1) ఆజ్యము 2) ఘృతము 3) నేయి
6) ముఖము : 1) వదనము 2) ఆననము 3) మొగము
7) గొడుగు : 1) ఛత్రము 2) ఆతపత్రము 3) ఖర్పరము
8) బ్రాహ్మణుడు : 1) భూసురుడు 2) విప్రుడు 3) ద్విజుడు

వ్యుత్పత్యర్థాలు

1) వనజనేత్ర : పద్మముల వంటి కన్నులు కలది. (స్త్రీ)
2) లేందీగె బోడి : లేత తీగ వంటి శరీరం కలది. (స్త్రీ)
3) అతిథి : తిథి, వార, నియమములు లేకుండా వచ్చేవాడు. (అతిథి)
4) పురం : గృహమును ధరించునది (గృహిణి)
5) అహిమభానుడు : చల్లనివి కాని కిరణములు గలవాడు. (సూర్యుడు)
6) ముక్కంటి : మూడు కన్నులు కలవాడు. (శివుడు)
7) పంచజనుడు : ఐదు భూతములచే పుట్టబడేవాడు. (మనిషి)
8) పార్వతి : పర్వతము యొక్క పుత్రిక. (గౌరి)
9) పారాశర్యుడు : పరాశర మహర్షి యొక్క కుమారుడు. (వ్యాసుడు)
10) వ్యాసుడు : వేదములను విభజించి ఇచ్చినవాడు. (వ్యాసమహర్షి)

భాషా కార్యకలాపాలు ప్రాజెక్టు పని గురు

* శ్రీనాథుడు సీస పద్య రచనకు ప్రసిద్ధి. శ్రీనాథుడు రచించిన ఏవైనా 5 పద్యాలు వేర్వేరు గ్రంథాల నుండి సేకరించండి. వాటిని రాయండి. తరగతిలో చదివి వినిపించండి. గోడ పత్రికలో ప్రదర్శించండి. ”
(శ్రీనాథుని సీస పద్యాలు )
జవాబు:
1. గుణనిధికి తల్లి చెప్పిన హిత వచనాలు శ్రీనాథుని “కాశీఖండము” నుండి.

సీ|| సచ్చో త్రియులు ననూచానులు సీమసీ థులునైన కులము పెద్దలఁ దలంచి
రాజమాన్యుడు సత్యరతుడు వినిర్మలా చారవంతుండు నైన జనకు దలచి
భాగ్యసంపదఁ బుణ్యపతి దేవతల లోన నెన్నంగఁ దగియెడు నన్నుదలచి
వేదశాస్త్ర పురాణ విద్యా నిరూఢులై వాసికెక్కిన తోడివారిఁ దలచి

తే|| చెడ్డయింటి చెదారమై శివుని కరుణ నివ్వటిలు నిర్వదేనేండ్ల నిన్ను దలచి
పదియు నార్వత్సరంబుల భార్యఁదలచి గోరతనములు మానురా ! గొడుకుఁగుఱ ! (కాశీ|| 4. ఆ. 91 ప)

2. పార్వతీదేవి చిరుతొండనంబి భార్య తిరువేంగనాంబి
వద్దకు, పచ్చిబాలెంతరాలు వేషంలో వచ్చుట
సీ|| ఫాల పట్టిక యందు భస్మత్రిపుండ్రంబుఁ గర్ణంబులను రాగి కమ్మదోయి
కంఠమందిత్తడి కంబంపుఁ గంటియ ఘన కుచంబుల మీదఁ గావిగంత
కటి మండలంబునఁ గరకంచుఁ బుట్టంబు కుడి సంది గిరి పెండ్లికొడుకుఁ గుఱ్ఱ
కేలు దామరయందుఁ గేదారవలయంబు జడకుచ్చుమీదఁ బచ్చడపుఁ గండ

తే|| సంతరించి పదాఱు వర్షముల వయసుఁ బచ్చి బాలెంతరాలు తాపసపురంధి
నంబి భామినిఁ దిరువెంగనాంబిఁ జేరి పాలు వోయింపు డమ్మ పాపనికి ననియె. (హర విలాసం – 2 ఆ. 94 ప)

3. భీమేశ్వర పురాణములోని పద్యం.
సీ|| శ్రీ భీమనాయక శివనామధేయంబు చింతింపనేర్చిన జిహ్వ జిహ్వ
దక్షవాటి పురాధ్యక్షమోహన మూర్తి చూడంగ నేర్చిన చూపు చూపు
దక్షిణాంబుధి తటస్థాయి పావన కీర్తి చే నింపనేర్చిన చెవులు చెవులు
తారక బ్రహ్మ విద్యాదాత య్దల విరులు పూన్సగ నేర్చు కరము కరము

గీ॥ ధవళకర శేఖరునకు ప్రదక్షిణంబు నర్గిఁదిరుగంగనేర్చిన యడుగులడుగు
లంబికానాయక ధ్యాన హర్షజలధి మధ్యమునఁ దేలియాడెడి మనసు మనసు. (భీమఖండం – 3 ఆ. 198 ప)

4. శృంగార నైషధం 2వ ఆశ్వాసం – 49 పద్యం.
(హంస, నల మహారాజుకు తన వృత్తాంతం చెప్పడం.)
సీ|| నవిన సంభవు సాహిణము వారువంబులు కులము సాములు మాకుఁ గువలయాక్షి
చదలేటి బంగారు జలరుహంబుల తూండ్లు భోజనంబులు మాకుఁ బువ్వు బోణి
సత్యలోకము దాక సకల లోకంబులు నాటపట్టులు మాకు నబ్జవదన
మధురాక్షరములైన మామాటలు వినంగ నమృతాంధసులే యోగ్యులనుంపమాంగి

తే|| భారతీదేవి ముంజేతి పలుకు జిలుక సమదగజయాన సబ్రహ్మచారిమాకు
వేదశాస్త్ర పురాణాది విద్యలెల్ల దరుణి ! నీయాన ఘంటాపథంబు మాకు. (శృంగార నైషధం – 2 ఆ. 49 ప)

5. శ్రీనాథుడు మరణించే సమయంలో చెప్పిన చాటు పద్యం
సీ|| కవిరాజు కంఠంబు కౌగిలించెను కదా పురవీధి నెదురెండఁ బొగడదండ
సార్వభౌముని భుజాస్తంభ మెక్కెను గదా నగరి వాకిట నుండు నల్లగుండు
ఆంధ్ర నైషధకర్త యంఘి యుగ్మంబునఁ దగిలి యుండెను గదా నిగళయుగము
వీరాభద్రారెడ్డి విద్వాంసు ముంజేత వియ్యమందెను గదా వెదురు గొడియ

తే|| కృష్ణవేణమ్మ’ కొనిపోయె నింత ఫలము బిలబిలాక్షులు తినిపోయెఁదిలలు పెసలు
బొడ్డు పల్లెను గొడ్డేటి మోసపోతి నెట్లు చెల్లింతు డంకంబు లేడు నూర్లు. (చాటువు)

కవి పరిచయం

పాఠ్యభాగం పేరు : భిక్ష

ఏ గ్రంథం మండి గ్రహింపబడింది. ఆ సం : “కాశీఖండం” కావ్యంలోని సప్తమాశ్వాసం నుండి

కవి : శ్రీనాథుడు

కాలం : 1380-1470 (15వ శతాబ్దము)

ఎవరి ఆస్థాన కవి – : రాజమహేంద్రవరం రెడ్డిరాజుల కొలువులో ఆస్థాన కవి

తల్లిదండ్రులు : శ్రీనాథుడు ‘మారయ – భీమాంబ’ల ముద్దుబిడ్డడు.

బిరుదం : ‘కవి సార్వభౌమ’

ప్రతిభా పాండిత్యం : ఆంధ్ర కవులలో కవిత్రయం తరువాత, అంతటి ప్రతిభావంతుడైన కవి. ఈయన పెదకోమటి వేమారెడ్డి ఆస్థానంలో “విద్యాధికారి”గా ఉండేవాడు.

గౌడడిండిముని కంచుఢక్క పగులగొట్టడం : ప్రాధదేవరాయల ఆస్థానంలో ‘గౌడడిండిమభట్టు’ అనే గొప్ప పండితునితో వాదించి, ఆయనను ఓడించి కనకాభిషేకాన్ని, కవిసార్వభౌమ బిరుదును పొందాడు.

శ్రీనాథుని రచనలు : 1) మరుత్తరాట్చరిత్ర 2) శాలివాహన సప్తశతి 3) పండితారాధ్య చరిత్ర 4) కాశీఖండం 5) శృంగార నైషధం 6) హరవిలాసం 7) ధనంజయ విజయం 8) క్రీడాభిరామం 9) శివరాత్రి మహాత్మ్యం 10) పల్నాటి వీరచరిత్ర 11) నందనందన చరిత్ర అనేవి శ్రీనాథుడి రచనలు.

శ్రీనాథుని చాటువులు : శ్రీనాథుని చమత్కారానికీ, లోకానుశీలనకూ, రసజ్ఞతకూ, జీవన విధానానికి అద్దం పట్టే చాటువులు చాలా ఉన్నాయి.

కవితా లక్షణాలు : ఉదందలీల, ఉభయవాతొడి, రసాభ్యుచిత బంధం, సూక్తి వైచిత్రి

పద్యాలు – ప్రతిపదార్థాలు – బావాలు

I. అవగాహన – ప్రతిస్పందన

పద్యం -1

తే॥గీ॥ నెట్టుకొని కాయ బీఎండ పట్టపగలు
తాము శిష్యులు నిల్లిల్లు దపుకుండఁ
గాఠిగా విప్రగృహ వాటికల నొనర్చు
నఖిల విద్యాగురుండు భిక్షాటనంబు.
ప్రతిపదార్థం :
అఖిల విద్యాగురుండు : అఖిల = సమస్తములయిన
విద్యా = విద్యలకునూ
గురుండు = గురువు అయిన వేదవ్యాస మునీంద్రుడు
తానున్ = తానునూ
శిష్యులున్ = శిష్యులునూ
పట్టపగలు : (పగలు + పగలు = పట్టపగలు) = పట్టపగటి యందు
బీజెండ (బీఱు + ఎండ) = తీక్షణమయిన ఎండ
నెట్టుకొని = అతిశయించి
కాయన్ = కాయుచుండగా
కాశికా విప్రగృహవాటికలన్ : కాశికా = కాశికా నగరము నందలి
విప్రగృహ = బ్రాహ్మణ గృహాలకు సంబంధించిన
వాటికలన్ = వాడలయందు (వీథుల యందు)
ఇల్లిల్లు = ప్రతి గృహాన్నీ
తప్పకుండన్ = విడువకుండా (ఏ ఇల్లునూ విడిచిపెట్టకుండా)
భిక్షాటనంబు (భిక్షా + అటనంబు) = భిక్ష కొఱకైన సంచారాన్ని
ఒనర్చున్ = చేయును (చేస్తూ ఉంటాడు)

భావం :
చతుర్దశ విద్యలకును గురువయిన వేదవ్యాస మునీంద్రుడు, శిష్యులతో కలిసి, పట్టపగలు పెరిగిన తీక్షణమైన ఎండలో, కాశీ నగరంలోని బ్రాహ్మణ వీధులలో భిక్ష కోసం ఏ ఇల్లూ విడిచిపెట్టకుండా, ప్రతి గృహానికి తిరుగుతున్నాడు.

AP SSC 10th Class Telugu Solutions Chapter 11 భిక్ష

పద్యం – 2

తే॥గీ॥ వండుచున్నారమనే నొక్క వనజనేత్ర
తిరిగి రమ్మమ వొక్క లేఁదీగెఁ బోఁడి
దేవకార్యంబు వేఁడమఁ దెఱవ యోర్తు
ద్వా: కవాటంబుఁ దెజవదు సవిత యొకతె
ప్రతిపదార్థం :
ఒక్క వనజనేత్ర = ఒక పద్మాక్షి; (వనజనేత్ర (వ్వు) పద్మముల వంటి కన్నులు కలది)
వండుచున్నారము = వంట చేస్తున్నాము
అనున్ = అన్నది
ఒక్క లేందీఁగె బోఁడి; ఒక్క = ఒక
లేదీగె బోడి – లేత తీగ వంటి శరీరము గల స్త్రీ
తిరిగి = మరల
రమ్మనున్; (రమ్ము + అనున్) = రమ్మని అన్నది
తెఱవయోర్తు; తెఱవ = స్త్రీ
ఓర్తు = ఒకామె
నేడు = ఆనాడు
దేవకార్యంబు = దేవతల పూజాకార్యం
అనున్ = అన్నది (పితృదేవతల కార్యము నాడు పితృదేవతలకు పెట్టకుండా భిక్ష వేయరాదు)
వనిత యొకతే = ఒక ఇల్లాలు
ద్వాః కవాటంబున్; ద్వాః = ద్వారము యొక్క
కవాటంబున్ = తలుపును
తెఱవదు = తెరవనే తెరవలేదు

భావం :
ఒక ఇల్లాలు “వండుతున్నాము” అన్నది. మరొక స్త్రీ “మరల రండి” అన్నది. ఇంకొక ఇల్లాలు ఈ రోజు దేవవ్రతం (దేవకార్యము) అని చెప్పింది. మరియొక ఇల్లాలు అసలు ద్వారబంధం యొక్క తలుపులు తెరవనేలేదు.

పద్యం -3

సీ॥ ముంగిట గోమయంబున గోముఖము దీర్చి
కడలు నాల్గుగ ముగ్గుకట్టు పెట్టి,
యతిథి వచ్చేవిల్పి యర్ఘ్యపాద్యము లిచ్చి
పుష్పగంధంబులఁ బూజు చేసి,
ప్రక్షాళితంబైన పసిఁడి చట్టువమున
వన్నంబుమీఁద నెయ్యభిఘరించి,
ఫలపాయపాపూప బహుపదార్థములతో
భక్తి విశ్వాస తాత్పర్యగరిమఁ

తే॥ బెట్టుదురు మాధుకరభిక్ష భిక్షుకులకుఁ
గంకణంబులతో పూడిగములు రాయఁ
గద్రకరముల బ్రాహ్మణాంగనలు కాశి
నన్నపూర్ణ భవాని కట్టమఁగుఁ జెలులు
ప్రతిపదార్థం :
ముంగిటన్ (ముంగల + ఇల్లు = ముంగిలి) = ఇంటి ముందు భాగంలో
గోమయంబునన్ = ఆవు పేడతో
గోముఖము తీర్చి = అలికి
కడలు = అంచులు
నాలుగన్ = నాలుగు అయ్యేటట్లుగా (చతురస్రముగా)
ముగ్గు కట్టు పెట్టి, (మ్రుగ్గు కట్టు + పెట్టి) = ముగ్గు పెట్టి
అతిథిన్ = వచ్చిన అతిథిని
అచ్చోన్ = ఆ రంగవల్లి మధ్యంలో (ఆ చతురస్రంగా వేసిన ముగ్గు మధ్యలో)
నిల్పి = నిలిపి
అర్ఘ్యపాద్యములు = కాళ్ళు, చేతులు కడుగుకోడానికి నీళ్ళు (హస్తముల యందు అర్హ్యమును, పాదముల యందు పాద్యమును)
ఇచ్చి = ఇచ్చి
పుష్పగంధంబులన్ = పువ్వులతో, గంధముతో
పూజచేసి (పూజ + చేసి) = పూజించి
ప్రక్షాళితంబైన (ప్రక్షాళితంబు + ఐన) = బాగుగా కడుగబడిన
పసిడి, చట్టువమునన్ = బంగారు గరిటెతో
అన్నంబు మీదన్ = అన్నము పైన
నెయ్యి = నేతిని
అఘరించి = కొంచెం వేసి (అభిషరము చేసి అనగా కొద్దిగా చల్లి)
ఫలపాయసాపూప బహుపదార్దములతోన్; ఫల = పండ్లు
పాయస = పరమాన్నం
అపూప = పిండి వంటకాలు మొదలయిన
బహు = అనేకములైన
పదార్థములతోన్ = పదార్థాలతో
భక్తి విశ్వాస తాత్పర్యగరిమన్, భక్తి = పూజ్య భావము యొక్క
విశ్వాస = నమ్మకము యొక్క
తాత్పర్య = తత్పర భావము యొక్క (మక్కువ యొక్క)
గరిమన్ = పెంపుతో
కమ్రకరములన్ = ఇంపైన చేతులయందు
కంకణంబులతోన్ = ముత్యాలు, పగడాలు మొదలయిన వానిని గుచ్చి చేతికి కట్టుకొనే తోరాలతో
సూడిగములు = గాజులు
రాయన్ = ఒరసి కొనుచుండగా
కాశిన్ = కాశీ నగరమందు
అన్నపూర్ణ భవాని కట్టనుగు జెలులు; అన్నపూర్ణ = అన్నపూర్ణ అనే పేరుగల
భవాని = భవుని భార్యయైన పార్వతీ దేవి యొక్క
కట్టనుగు (కడు + అనుగు) = మిక్కిలి ప్రియురాండ్రైన
చెలులు = చెలికత్తెలయిన (స్నేహితురాండైన)
బ్రాహ్మణాంగనలు (బ్రాహ్మణ + అంగనలు) = బ్రాహ్మణ స్త్రీలు
భిక్షుకులకున్ = యతులకు; (భిక్ష అడిగేవారికి)
మాధుకర, భిక్షన్ = తేనెటీగను పోలిన, భిక్షను; (మాధుకరము అనే భిక్షను)
పెట్టుదురు = పెడతారు (వడ్డిస్తారు)

భావం :
వాకిట్లో ఆవుపేడతో చక్కగా అలికి, నాలుగు అంచులూ కలిసే విధంగా దానిపై ముగ్గుపెట్టి, ఆ ముగ్గు మధ్యలో, వచ్చిన అతిథిని నిలబెట్టి, వారికి కాళ్ళూ చేతులూ కడుగుకోడానికి నీళ్ళు ఇచ్చి, (అర్ఘ్య పాద్యములు ఇచ్చి), వారిని పూవులతో, గంధముతో పూజచేసి, కడిగిన బంగారు గరిటెతో అన్నంపై ఆవునేతిని అభిషరించి (చల్లి), పండ్లతో, పరమాన్నముతో, పలు రకాల పిండివంటలతో, భక్తి విశ్వాసాలు ఉట్టిపడే రీతిగా, చేతి తోరాలతో గాజులు ఒరసికొని ధ్వని చేస్తుండగా, తమ ఇంపయిన చేతులతో, కాశీ నగరంలోని బ్రాహ్మణ స్త్రీలు, యతీశ్వరులకు మాధుకర భిక్ష పెడుతూ ఉంటారు. ఆ ఇల్లాండ్రు అన్నపూర్ణా భవానికి ప్రియమైన స్నేహితురాండ్రుగా పేరు పొందారు.
విశేషాంశాలు:
1. అతిథి : (వ్యుత్పత్తి) = తిథి నియమాలు లేకుండా భోజన సమయానికి వచ్చేవాడు.

2. అర్ఘ్యం : (వ్యుత్పత్తి) = పూజకు తగినది
అష్టార్ధ్యములు : అర్ఘ్యములు ఎనిమిది రకములు. 1) పెరుగు 2) తేనె 3) నెయ్యి 4) అక్షతలు 5) గణిక 6) నువ్వులు 7) దర్భ 8) పుష్పము

3. పాద్యము : (వ్యుత్పత్తి) = పాదములకు అర్హమైనది (కాళ్ళు కడుగుకొనుటకు అర్హమైన నీరు)

4. మాధుకర భిక్ష : (వ్యుత్పత్తి) = మధుకరం అంటే తుమ్మెద. తుమ్మెద వివిధ పుష్పాలపై వ్రాలి, తేనెను గ్రహించి నట్లు, సన్న్యాసులు వివిధ గృహాలకు వెళ్ళి, ఆ ఇంటి గృహిణుల నుండి భిక్షాన్నములను స్వీకరిస్తారు. అందువల్ల సన్న్యాసులు స్వీకరించే భిక్షను ‘మాధుకర భిక్ష’ అంటారు.

AP SSC 10th Class Telugu Solutions Chapter 11 భిక్ష

పద్యం -4

కం॥ ఆ పరమ పురంధ్రులయం
దే పుణ్యాంగవయు భిక్ష యిడదయ్యెఁ గటా !
రేపాడి మేలుకని యే
నే పాపాత్ముని ముఖంబు వీక్షించితివో?
ప్రతిపదార్థం :
ఆ, పరమ, పురంధ్రుల యందున్ ; ఆ = అటువంటి
పరమ = ముఖ్య మైన
పురంధ్రుల యందున్ = కుటుంబినులలో (మగడునూ, బిడ్డలునూ కల స్త్రీని ‘పురంధి’ అంటారు.)
ఏ పుణ్యాంగనయున్, (ఏ, పుణ్య + అంగనయున్) = ఏ పుణ్యవతియును
భిక్ష = భిక్షాన్నమును
ఇడదయ్యెన్ = పెట్టదాయెను (పెట్టలేదు)
కటా = అక్కటా !
ఏను = నేను
రేపాడి = తెల్లవారు జాముననే మేలుకొని
ఏ పాపాత్ముని = ఎటువంటి పాపి యొక్క
మోమును = ముఖాన్ని
ఈక్షించితినో; (ఈక్షించితిని + ఓ) = చూశానో

భావం :
అటువంటి పరమ పురంధ్రులలో ఏ యొక్క పుణ్య స్త్రీ కూడా నాకు భిక్ష పెట్టడానికి రాలేదు. నేను ఈనాడు ఉదయం నిద్రలేచి, ఎటువంటి పాపాత్ముని ముఖాన్ని చూశానో కదా !

విశేషాంశాలు:
1. పాపాత్ముని ముఖం చూడడం : దుర్మార్గుల ముఖం చూస్తే, చెడ్డ పరిణామాలు కలుగుతాయని నమ్మకం. అందుకే ఉదయం లేవగానే కాని, పాడ్యమి తిథినాడు చంద్రోదయాన్ని గమనించినప్పుడు కాని, ఇష్టమైన వాళ్ళ ముఖాలను చూస్తారు. అలాగే ఏదయినా పనిపై వెళ్ళేటప్పుడు, కులస్త్రీలు శకునంగా ఎదురువస్తే మంచిది అనే సంప్రదాయాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం ఇటువంటి వాటిపై, నమ్మకం పోతూ ఉండడం గమనింపదగిన విషయం.

పద్యం – 5
తే॥గీ॥ ఉపవసింతుముగాక వేఁడుడిగి మడిగి
యస్తమించుచు మన్నవాఁ డమామ భామం
డెల్లి పారణకైవ లేదెట్లు మనకు?
మాధుకరభిక్ష బ్రాహ్మణ మందిరముల
ప్రతిపదార్థం :
ఉడిగి = (భిక్ష కోసం తిరగడం) మాని
మడిగి = అణగి యుండి
నేడు = ఈరోజు
ఉపవసింతుముగాక; (ఉపవసింతుము + కాక) = ఉపవాసం ఉందుము గాక !
అహిమభానుడు = వేడి కిరణములు గలవాడైన సూర్యుడు
ఆస్తమించుచునున్నవాడు; (అస్తమించుచున్ + ఉన్నవాడు) = అస్తమిస్తున్నాడు
ఎల్లి = రేపు
మనకున్ = మనకు
బ్రాహ్మణ మందిరములన్ = బ్రాహ్మణ గృహాలలో
మాధుకర భిక్ష – మాధుకర రూపమైన భిక్ష
పారణకైనన్ = ఉపవాసం ఉండి మరునాడు చేయు భోజనానికి అయినా
లేదెట్లు (లేదు + ఎట్లు) = లేకుండా ఎలా ఉంటుంది? (తప్పక లభిస్తుంది)

భావం :
ఇంక భిక్ష కోసం తిరగడం కట్టిపెట్టి, కడుపులో కాళ్ళు పెట్టుకొని మడిగి ఉండి, ఉపవాసం చేద్దాము. సూర్యుడు అస్తమిస్తున్నాడు. రేపైనా మనకు ఈ బ్రాహ్మణ మందిరాలలో ఉపవాసం తర్వాత చేసే పారణ భోజనానికి సరిపడ భిక్ష దొరకక పోడు.

ఆలోచించండి – చెప్పండి

ప్రశ్న 1.
‘అతిథి దేవోభవ’ అంటే ఏమిటి?
జవాబు:
‘అతిథి దేవోభవ’ అంటే అతిథి దేవుడుగా గలవాడవు అగుము అని భావం. అంటే అతిథిని దేవునిగా భావించి పూజించుము అని సారాంశం.

ప్రశ్న 2.
ప్రాచీన కాలంలో భిక్షాటనాన్ని పవిత్రకార్యంగా ఎందుకు భావించేవారు?
జవాబు:
సన్యాసులు, బ్రహ్మచారులు, మహర్షులు ‘భిక్షా’ వృత్తితో జీవించాలని, ధర్మశాస్త్రాలు చెపుతున్నాయి. వ్యాసమహర్షి వంటివారు పంచ భిక్ష స్వీకరించేవారు. అంటే కేవలం ఐదు గృహాలకు వెళ్ళి, ఐదుమంది నుండి మాత్రమే భిక్ష స్వీకరించేవారు. ఉపనయనం చేసినప్పుడు బ్రహ్మచారులు ముందుగా తల్లి నుండి, తరువాత తండ్రి నుండి భిక్షలు స్వీకరించాలి. సన్యాసులు వంటి వారు జీవనం కోసం వస్తువులు, ధనం, వగైరా దాచరాదని, వారు భిక్ష ద్వారా లభించిన దానినే తిని జీవించాలనీ, శాస్త్రాలు చెపుతున్నాయి. భిక్ష పెట్టినవారికి పుణ్యం వస్తుందని శాస్త్రాలు చెప్పాయి. అందుకే ప్రాచీన కాలంలో భిక్షాటనాన్ని పవిత్రకార్యంగా భావించేవారు.

AP SSC 10th Class Telugu Solutions Chapter 11 భిక్ష

ప్రశ్న 3.
భిక్ష సమర్పించేటప్పుడు నాటికీ నేటికీ ఉన్న తేడాలేమిటి?
జవాబు:
భిక్ష సమర్పించేటప్పుడు పూర్వం గృహిణులు, తమ ఇంటివాకిలిని ఆవు పేడతో శుద్ధిచేసి, అక్కడ ముగ్గు పెట్టి, అతిథికి అర్ఘ్యపాద్యాలిచ్చి, పుష్ప గంధాలతో పూజచేసి, అన్నం మీద నెయ్యి అభిఘారం చేసి, పిండివంటలతో భక్తి విశ్వాసాలతో అతిథులకు పెట్టేవారు.

ఇప్పుడు భిక్ష పెట్టడం తక్కువ అయ్యింది. కేవలం కొంతమంది మాత్రం, ముష్టి పెడుతున్నారు. అది కూడా విసుగుకుంటూ, తప్పనిసరి పరిస్థితుల్లోనే బిచ్చగాండ్రకు ముష్టి వేస్తున్నారు. ముష్టి ఎత్తుకోడం, కొన్ని ప్రాంతాల్లో నేరంగా పరిగణింపబడుతోంది. నేడు దాన ధర్మాలు తగ్గిపోయాయి.

వచనం -6

అవి యారాత్రి గడపి మజువాఁడు మధ్యాహ్న కాలంబున ఆ శిష్యులుం దాను
వేటువేటు విప్రభవన వాటికల భిక్షాటవంబొనర్పంబోయి,
తొలువాఁటియట్ల ముక్కంటేమాయ వేమచ్చెకంటియు వంటకంబు
పెట్టకున్నఁ గటకటంబడి భిక్షాపాత్రంబు నట్టనడు వీధిం బగులవైచి కోపావేశంబున
ప్రతిపదార్థం :
అని = అట్లు చెప్పి
ఆ రాత్రి, గడపి = ఆ రాత్రి ఎలాగో వెళ్ళదీసి
మఱునాడు = తరువాతి రోజు
మధ్యాహ్నకాలంబునన్ = మధ్యాహ్న వేళయందు
శిష్యులున్ = శిష్యులునూ
తానున్ = తానునూ (వేద వ్యాసుడునూ)
వేఱువేఱన్ = విడివిడిగా
వేదవ్యాసుండు = వేద వ్యా సమహర్షి
విప్రభవన వాటికలన్; విప్ర భవన = బ్రాహ్మణ మందిరములు ఉన్న
వాటికలన్ = వాడలలో (వీథులలో)
భిక్షాటనంబు; (భిక్షా + ఆటనంబు) = భిక్ష కోసం సంచారం
ఒనర్పంబోయి (ఒనరన్ + పోయి) = చేయబోయి
తొలునాటియట్ల (తొలునాటి + అట్ల) – ముందురోజులాగే
ముక్కంటి మాయన్ = శివుని మాయచేత
ఏ మచ్చెకంటియున్ = ఏమీన నేత్రయును,
(మచ్చె కంటి : (వ్వు)) = చేపల వంటి కన్నులు కలది (స్త్రీ)
వంటకము = అన్నం
పెట్టకున్నన్ (పెట్టక + ఉన్నన్) = పెట్టకపోగా
కటకటంబడి = బాధపడి
భిక్షాపాత్రంబు = భిక్షా పాత్రను
నట్టనడు వీధిన్ = వీధి నట్టనడుమ (మధ్యలో)
పగులవైచి = పగులకొట్టి
కోపావేశంబునన్ (కోప + ఆవేశంబునన్)= కోపము యొక్క ఆవేశంతో

భావం :
అని వేదవ్యాసుడు, శిష్యులతో ఆ రాత్రి మఠంలో గడిపి, మరుసటి రోజు యథావిధిగా మధ్యాహ్న సమయానికి శిష్యులునూ, తానూ వేర్వేరుగా బ్రాహ్మణ వాడలలో భిక్షాటనం చేయసాగారు. కాని అంతకు ముందు రోజులాగే, విశ్వనాథుడి మాయవల్ల, ఏ ఇల్లాలు వారికి భిక్ష పెట్టలేదు. దానితో వ్యాసుడు బాధపడి, కోపంతో భిక్షాపాత్రను నట్టనడి వీధిలో ముక్కలు ముక్కలయ్యేటట్లు పగులకొట్టాడు. అంతటితో కోపావేశం దిగక.

పద్యం -7

తే॥ ( ధనములేకుండెదరు మూఁడు తరములందు
మూడు తరములఁ జెడుఁగాక మోక్షలక్ష్మి
విద్యయును మూడు తరముల వెడలవలయుఁ
పంచజనులకుఁ గారి పట్టణమున
ప్రతిపదార్థం :
కాశికాపట్టణమునన్ = కాశీ పట్టణము నందు
పంచ జనులకున్ = మనుష్యులకు (పంచభూత ములచే పుట్టువారు మనుష్యులు)
మూడు తరములన్ = మూడు తరముల పాటు
మోక్షలక్ష్మి = కైవల్య లక్ష్మి
చెడుఁగాక = చెడిపోవుగాక
మూడు తరములన్ = మూడు తరముల పాటు
విద్యయును = విద్య కూడా
వెడలవలయున్ – పోవాలి (నిష్క్రమించాలి)
మూడు తరముల యందున్ = మూడు తరముల పాటు
ధనము లేకుండెదరు. = ధనము లేకుండా ఉంటారు (పేదవారై ఉంటారు)

భావం :
కాశీ నివాసులకు ముదిరిన ఈ ధన మదం దిగిపోయే వరకు, “వీరు మూడు తరాల వఱకూ నిరుపేదలై ఉండాలి. మూడు తరాల వఱకూ వీరికి ముక్తి లక్ష్మి చెడిపోవాలి. మూడు తరాల వణుకూ వీరు చదువులేనివారు కావాలి.” అని వ్యాసుడు కాశీ నగరాన్ని శపించడానికి సిద్ధమయ్యాడు.

AP SSC 10th Class Telugu Solutions Chapter 11 భిక్ష

వచనం – 8

అవి పారాశర్యుండు పుత్పిపాసా పరవశుండై శపియింపం దలంచు
వనసరంబున నొక్క విప్రభవనంబు వాఁకిటం
బార్వతి ప్రాకృత వేషంబున
ప్రతిపదార్థం :
అని = ఈ విధంగా
పారాశర్యుండు = వ్యాసుడు (వ్య) పరాశర మహర్షి కుమారుడు (వేదవ్యాసుడు)
క్షుత్పిపాసాపరవశుండై; క్షుత్ = ఆకలితోనూ
పిపాసా = దప్పికతోనూ (నీరు త్రాగాలనే కోరికతోనూ)
పరవశుండై; (పరవశుండు + ఐ) = పరాధీనుడై (లొంగినవాడై)
శపియింపన్ = శపించడానికి
తలచు = ఊహించే
అవసరంబునన్ = సమయంలో
ఒక్క విప్రభవనంబు వాకిటన్; ఒక్క = ఒక
విప్రభవనంబు = బ్రాహ్మణ మందిరము యొక్క
వాకిటన్ = వాకిలి యందు (గృహ ద్వారమునందు)
పార్వతి = పార్వతీ దేవి
ప్రాకృత వేషంబునన్ = సామాన్య స్త్రీ వేషంలో

భావం :
అని ఆకలి దప్పులతో బాధపడుతున్న వ్యాసుడు శపించాలని ఆలోచిస్తున్న సమయంలో, ఒక బ్రాహ్మణ భవనం ద్వారము దగ్గర పార్వతీ దేవి సామాన్య స్త్రీ వేషంలో మందలించింది.

విశేషాంశాలు:
1. పారాశర్యుడు (వ్వ) : పరాశర మహర్షి కుమారుడు (వ్యాసుడు)

పద్యం – 9 : కంఠస్థ పద్యం

ఉ॥ వేదపురాణశాస్త్ర పదవి వదవీయసియైన పెద్దము
ఆదున కాళికానగర హాటకపీఠ శిఖాధిరూఢ య
య్యాదను శక్తి సంయమివరా ! యిటు రమ్మని పిల్చి హస్తనం
జాదరలీల రత్నఖచితాభరణంబులు ఘల్లు ఘల్లవన్
ప్రతిపదార్థం :
వేదపురాణ శాస్త్ర పదవీ నదవీయసి యైన; వేద = వేదముల యందు
పురాణ = పురాణముల యందు
శాస్త్ర = శాస్త్రముల యందు ప్రతిపాదింపబడిన
పదవీ = జ్ఞానమునకు
నదవీయసియైన (న + దవీయసి + ఐన) = మిక్కిలి దూరము నందు లేని
పెద్ద ముత్తైదువ = పెద్దదైన పురంధి
కాశికా నగర హాటిక పీఠ శిఖాధిరూఢ; కాశికా నగర = కాశికా నగరము అనెడి
హాటక పీఠ = స్వర్ణ పీఠము యొక్క
శిఖా = శిఖరమందు
అధిరూఢ = అధిరోహించియున్న
అయ్యాదిమ శక్తి (ఆ + ఆదిమ శక్తి) : ఆ మొదటి శక్తి స్వరూపిణి
హస్త సంజ్ఞాదర లీలన్; హస్త సంజ్ఞా = చేతి సంజ్ఞ యందు వెల్లడి యవుతున్న
ఆదర = ఆదరముతో కూడిన
లీలన్ = విధముతో
రత్న ఖచితా భరణంబులు: రత్న = రత్నములతో
ఖచిత = పొదుగబడిన (కూడిన)
ఆభరణంబులు = నగలు
ఘల్లు ఘల్లనన్ = గల్లు గల్లుమని శబ్దము చేయు చుండగా
సంయమివరా = ఓ మునీశ్వరా !
ఇటురమ్ము + అని = ఇటు రమ్మని
పిల్చెన్ = పిలిచింది

భావం :
సకల వేదాలు, సకల పురాణాలు, సకల శాస్త్రములు నిర్దేశిస్తున్న మార్గానికి దగ్గరగా ఉన్న పెద్ద ముత్తైదువ, కాశీనగరం. అనే బంగారు పీఠంపై అధిరోహించిన ఆ ఆదిమశక్తి, తన చేతితో సంజ్ఞ చేసింది. ఆ సంజ్ఞలో ఆదరం కనబడింది. అప్పుడు ఆమె రత్నఖచితమైన ఆభరణాలు ఘల్లు ఘల్లుమని చప్పు డయ్యాయి. అలా ఘల్లుమంటుండగా, ఆమె ‘ఓ మునీశ్వరా ! ఇటు రమ్ము’ అని వ్యాసుని పిలిచింది.

పద్యం – 10: కంఠస్థ పద్యం

శా॥ ఆకంఠంబుగ విష్ణు మాధుకర భిక్షాన్నంబు భక్షింపఁగా
లేకున్నం గడు వంగలార్చెదవు మేలే ? లెప్ప ! శాంతుండవే !
నీ కంటెన్ మతిహీమలే కటకటా ! నీవార ముస్లించచుల్
శాకాహారులుఁ గందభోజులు, శిలాంఛప్రక్రముల్ తాపసుల్!
ప్రతిపదార్థం :
ఇప్డు= ఇప్పుడు
ఆకంఠంబుగన్ = కంఠము దాకా (గొంతు దాకా)
మాధుకర భిక్షాన్నంబు = మాధుకర రూపమైన భిక్షాన్నమును
భక్షింపగాన్ = తినడానికి
లేకున్నన్ (లేక + ఉన్నన్) = లేకపోయేసరికి
కడున్ = మిక్కిలి
అంగలార్చెదవు = అంగలు వేస్తున్నావు (తొట్రు పడుతున్నావు) (దుఃఖిస్తున్నావు)
మేలే (మేలు + ఏ) : నీవు చేసే పని మంచిదా?
లెస్స = బాగున్నదా?
శాంతుండవే (శాంతుండవు + ఏ) = నీవు శాంత గుణం కలవాడవేనా !
కటకటా = అక్కట కటా !
నీవార ముష్టింపచుల్ = ఏ పూటకు ఆ పూట పిడికెడు నివ్వరి వడ్లు దంచుకొని వండి తినేవారునూ
శాకాహారులు (శాక + ఆహారులు) : కాయ కూరలు మాత్రమే తినేవారునూ
కందభోజులు = దుంపలు మాత్రమే తినేవారునూ
శిలోంఛ ప్రక్రముల్; శిల = కోతకోసిన వరిమళ్ళలో జారీ పడిన కంకులు ఏరుకొని వాటితో బ్రతికేవారునూ
ఉంఛ ప్రక్రముల్ = రచ్చరోళ్ళ వద్ద వడ్లు దంచేటప్పుడు చుట్టూ జారిపడిన బియ్యపు గింజలు ఏరుకొనడమే జీవనంగా కలవారునూ అయిన
తాపసుల్ = తపస్సు చేసుకొనేవారు; (మునులు)
నీకంటెన్ = నీ కన్న
మతిహీనులే (మతిహీనులు + ఏ) = బుద్ధితక్కువ వారా? (తెలివి తక్కువ వారా?)

భావం :
ఇప్పుడు గొంతు దాకా తినడానికి మాధుకర భిక్షాన్నం దొరకలేదని నీవు ఇంతగా చిందులు వేస్తున్నావు కదా ! ఇది
మంచి పనియేనా ? బాగున్నది. నిజంగా నీవు శాంత | స్వభావుడవేనా ? పిడికెడు వరిగింజలతో కాలం వెళ్ళబుచ్చేవారూ, శాకాహారంతో, దుంపలతో సరిపెట్టుకొనే వాళ్ళూ, వరి మళ్ళలో కంకులు ఏరుకొని బ్రతికేవాళ్ళూ, రోళ్ళ వద్ద జారిపడిన బియ్యం ఏరుకొని జీవించే వాళ్ళూ అయిన మునులు, నీ కంటె తెలివి తక్కువ వారా?

పద్యం – 11

తే॥గీ॥ మువీశ్వర ! వివవయ్య యున్న యూరుఁ
గన్నతల్లియు వొక్క రూపన్న రీతి
యటు విశ్లేషించి శివుని యర్థాంగలక్ష్మి
కాశి; యివ్విటి మీద వాగ్రహము దగునె?
ప్రతిపదార్థం :
ఓ మునీశ్వర (ముని + ఈశ్వరా) : ఓ మునీశ్వరుఁడా ! = (వేదవ్యాస మహర్షి !)
ఉన్నయూరున్ (ఉన్న + ఊరున్) = తాను ఉన్న ఊరును
కన్న తల్లియున్ = తనను కనిన తల్లియును
ఒక్కరూపు = ఒకే మాదిరి
అన్న రీతి = అనే రీతిని
వినవయ్య = నీవు వినలేదా?
అటు విశేషించి = అంతకంటెను విశేషించి
కాశి = కాశీ పట్టణం
శివుని = ఈశ్వరుని యొక్క
అర్థాంగ లక్ష్మి = భార్య
ఇవ్వీటిమీదన్ (ఈ + వీటిమీదన్) = ఈ కాశీనగరం మీద
ఆగ్రహము = కోపం
తగునె (తగును + ఎ) = తగునా?

భావం :
పెద్ద ముత్తైదువు రూపంలో ఉన్న పార్వతీ దేవి, వ్యాసుని “ఉన్న ఊరు కన్నతల్లితో సమానం” అనే రీతిని నీవు వినలేదా? అంతకంటెను విశేషించి శివుని అర్థాంగ లక్ష్మియైన ఈ కాశీనగరి మీద నీవు ఇంత కోపం చూపించడం తగునా?” అని మందలించింది.

AP SSC 10th Class Telugu Solutions Chapter 11 భిక్ష

వచనం – 12

ఇట్టి కాళికావగరంబుమీద భిక్షలేకుండుట
కారణంబుగా వీయంత వాడు కటకటంబడి
శపియింపందలంచువే? విశేషించి యాఁకొన్న వాఁడవు
గావున నీ యవపరంబున నిన్ను హెచ్చు గుందాడుట
మము బోఁటి గృహిణులకు మెచ్చుగాదు. మా
యింటికిం గుడువ రమ్ము! కుడిచి కూర్చున్న
పిమ్మటం గొన్ని మాటలు నీతో వాడఁగలవనివ
నమ్మహాసాధ్వింగని, పారాశర్యుండిట్టులనియె –
ప్రతిపదార్ధం :
ఇట్టి కాశికా నగరంబు మీదన్ = ఇటువంటి కాశీ పట్టణం పైన;
భిక్ష లేకుండుట కారణంబుగాన్ = భిక్ష దొరకలేదన్న కారణంగా
నీయంతవాడు = నీ యంతటివాడు
కటకటంబడి = కోపగించుకొని
శపియింపన్ = శపించాలని
తలంచునే = అనుకుంటాడా?
బ్రాహ్మణుండవు గదా ! = నీవు బ్రాహ్మణుడవు గదా !
నీవేమన్ననున్ (నీవు + ఏమి + అన్నన్) = నీవు ఏమన్నా
చెల్లున్ = చెల్లుబడి అవుతుంది
అటు విశేషించి = అంతకంటెను విశేషంగా
ఆకొన్నవాడవు = ఆకలితో ఉన్నావు
కావునన్ = కాబట్టి
ఈ యవసరంబునన్ = ఈ సందర్భంలో
నిన్నున్ = నిన్ను
హెచ్చుకుందాడుట = నిందించడం; (నీతో వాదులాడటం )
మముబోటి = మా వంటి
గృహిణులకున్ – ఇల్లాండ్రకు
మెచ్చుగాదు = మెప్పు కలిగించదు
మా యింటికిన్ (మా + ఇంటికిన్) = మా ఇంటికి
కుడువన్ = తినడానికి
రమ్ము = రావయ్యా !
కొన్ని మాటలు = కొన్ని మాటలు
నీతోన్ = నీతో
ఆడన్ = పలుకవలసినవి
కలవు = ఉన్నాయి
అనినన్ = అనగా
అమ్మహాసాధ్విన్ (ఆ + మహాసాధ్విన్) = ఆ గొప్ప పతివ్రతను
కని = చూచి
పారాశర్యుండు = వేదవ్యాసుడు (పరాశరుని కుమారుడు)
ఇట్టులనియె (ఇట్టులు + అనియె) = ఈ విధంగా అన్నాడు

భావం :
“ఇటువంటి కాశీ నగరం మీద, కేవలం భిక్ష దొరకలేదని నీలాంటి ఉత్తముడు, బాధపడి శపించాలని అనుకోవచ్చా ; నీవు బ్రాహ్మణుడవు కాబట్టి, నీవు ఏమన్నా నీకు చెల్లుతుంది. పైగా నీవు ఆకలితో ఉన్నావు. కాబట్టి ఈ సమయంలో నిన్ను ఎక్కువగా నిందించడం, మాలాంటి గృహిణులకు మర్యాద కాదు. మా ఇంటికి భోజనానికి రా, భోజనమైన తరువాత నీతో కొన్ని మాటలు మాట్లాడవలసి ఉన్నది.” అని పార్వతీ దేవి వ్యాసునితో చెప్పుగా, ఆ మహాసాధ్విని చూచి, వ్యాసుడు ఈ విధంగా అన్నాడు.

ఆలోచించండి – చెప్పండి

ప్రశ్న 1.
భిక్ష దొరకని వ్యాసుడు కోపగించాడు కదా ! దీనిపైన మీ అభిప్రాయమేమిటి?
జవాబు:
వ్యాసుడు వేదవేదాంగవేత్త. అష్టాదశ పురాణాలు రచించినవాడు. భారతం రచించినవాడు. అటువంటి వాడు కేవలం రెండు రోజులు భిక్ష దొరకలేదని కాశీ నగరంపై కోపించి శపించడానికి సిద్ధమయ్యాడు.

వ్యాసుడు కోపించడం, ధర్మం కాదు. లోకంలో ఎందరో మహర్షులు, తాపసులు నివ్వరి బియ్యం తిని జీవిస్తున్నారు. కొందరు శాకాహారంతో, కంద భోజనంతో కడుపు నింపుకుంటున్నారు. కొందరు ఉంఛ వృత్తితో జీవిస్తున్నారు. కాబట్టి వ్యాసుని వంటి మహర్షి రెండు రోజులు పస్తు ఉండలేక, శివుని భార్యయైన కాశీ నగరాన్ని శపించబోవడం నేరం అని నా అభిప్రాయం.

ప్రశ్న 2.
‘కోపం మనిషిని విచక్షణ కోల్పోయేలా చేస్తుంది. దీన్ని గురించి మాట్లాడండి.
జవాబు:
కోపం వస్తే మనిషికి ఏది మంచిదో, ఏది చెడ్డదో గ్రహించే విచక్షణ శక్తి పోతుంది. ఈ మాటలో సత్యం ఉంది. విశ్వామిత్రుడు, దుర్వాసుడు వంటి మహర్షులు ఈ విధంగానే కోపంతో విచక్షణ కోల్పోయి, ఎన్నో చిక్కులకు లోనయ్యారని పురాణాలు చెపుతున్నాయి.

దుర్యోధనుడు పాండవుల పై కోపంతోనే విచక్షణ కోల్పోయి, నిండు సభలో ద్రౌపదిని అవమానించాడు. దుర్వాసుడు కోపంతోనే అంబరీషుని, ధర్మరాజును పరీక్షించబోయి, తానే కష్టపడ్డాడు. విశ్వామిత్రుడు వశిష్ఠునిపై కోపంతో తానే భంగపడ్డాడు.

AP SSC 10th Class Telugu Solutions Chapter 11 భిక్ష

ప్రశ్న 3.
ఉన్న ఊరును కన్న తల్లితో సమానమని ఎందుకు అంటారు?
జవాబు:
కన్నతల్లి మనకు కావలసిన దానిని, తాను గుర్తించి మన కడుపు నింపుతుంది. కన్నతల్లి తన బిడ్డలపై ఎప్పుడూ కోపగించుకోదు. పిల్లలను కన్నతల్లి బాగా ప్రేమగా చూసి, వారికి కావలసిన వాటిని ఇస్తుంది.

అలాగే మనం ఉన్న ఊరు కూడా, మనకు కావలసిన వాటిని సమకూరుస్తుంది. మనం ఉన్న ఊరిలో మనకు ప్రజలు అందరూ తెలిసిన వారు ఉంటారు. వారు తన తోడి వ్యక్తిని ప్రేమగా కన్నతల్లి వలె చూస్తారు. అందుకే “జననీ, జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ” అన్నారు.

కన్నతల్లిని విడిచి వెళ్ళకూడదు. అలాగే మనం ఉన్న ఊరును విడిచి పొరుగూరు పోకూడదు. పొరుగూరిలో మనం ఎన్నటికీ ఉన్న ఊరులో వలె సుఖంగా ఉండలేము. కన్నతల్లి, ఉన్న ఊరు సమానం.

పద్యం – 13

తే॥గీ॥ | అస్తమింపగఁ జేరినాఁ డహిమకరుడు.
శిష్యులేగాక యయుతంబు చిగురుఁబోడి
వ్రతము తప్పి భుజింపంగ వలమగాడు
వేఁడు విన్నటి మజువాఁడు విక్కువంబు
ప్రతిపదార్థం :
అహిమకరుడు = సూర్యుడు (చల్లనివి కాని కిరణములు కలవాడు)
అస్తమింపగన్ = అస్తమించడానికి
చేరినాడు = సమీపించాడు
ఏఁగాక (ఏన్ + కాక) = నేను కాకుండ
శిష్యులు = శిష్యులు
అయుతంబు = పదివేలమంది ఉన్నారు
వ్రతము తప్పి = వ్రతం విడిచిపెట్టి
భుజియింపన్ = భుజించడానికి
వలను కాదు = యుక్తం కాదు; (ఒప్పిదం కాదు)
చిగురుబోడి = చిగురు వంటి శరీరం గల దానా !
నేడున్ = నేడు కూడా
నిన్నటి = నిన్నటి రోజునకు
మఱునాడు = మరుసటి రోజే (అనగా నిన్న లాగే నేడూ పస్తు ఉండటమే)
నిక్కువంబు = నిజం

భావం :
తల్లీ ! పల్లవగాత్రీ ! సూర్యుడు అస్తమించడానికి సమీపించాడు. (సూర్యాస్తమయం కాబోతుంది). నేను కాక ఇంకా పదివేలమంది శిష్యులు ఉన్నారు. అందరితో కలిసి భుజించే వ్రతం ఉన్న నేను, నా వ్రతాన్ని విడిచి పెట్టి మీ ఇంట్లో ఒక్కడినీ భుజించలేను. ఈ రోజు కూడా నిన్నటి రోజుకు మరుసటి రోజే. (అంటే నిన్నటి లాగే ఈ రోజు కూడా ఉపవాసం నాకు తప్పదు. అని ధ్వ ని)

పద్యం – 14: కంఠస్థ పద్యం

చం॥ అనవుడు నల్లవవ్వి కమలానవ యిట్లము, లెప్పగాక, యో
మునివర! నీవు శిష్యగణముంగొని చయ్యవ రమ్ము విశ్వనా
థునికృప పేర్మి వెందట తిథుల్ చమబెంచినఁ గామధేనువుం
ఐవి గొనునట్లు పెట్టుదు వపారములైన యభిప్పితాన్నముల్
ప్రతిపదార్థం :
అనవుడున్ = వేదవ్యాసుడు ఇట్లు చెప్పగా
కమలానన (కమల + ఆనన) = పద్మం వంటి ముఖం గల ఆ ముత్తైదువ
అల్ల = కొంచెం
నవ్వి = నవ్వి
ఇట్లనున్ (ఇట్లు + అనున్) = ఇలా చెప్పింది
లెస్సగాక = మేలు అగునుకాక !
ఓ మునివర = ఓ మునీశ్వరుడా !
నీవు = నీవు
శిష్యగణమున్ = శిష్యులందరినీ
కొని = తీసుకొని
చయ్యనన్ = శీఘ్రంగా
రమ్ము = రమ్ము (మా ఇంటికి భోజనానికి రా)
విశ్వనాథుని = విశ్వనాథుడైన పరమేశ్వరుని యొక్క
కృపపేర్మిన్ = దయాతిశయం చేత (అధికమైన దయచేత)
ఎందరతిథుల్ (ఎందరు + అతిథుల్) = ఎంతమంది అతిథులు వచ్చినప్పటికీ
కామధేనువున్ = దేవతల కామధేనువును
పనిగొనునట్లు – స్వాధీనం చేసికొన్న విధంగా
అపారములైన (అపారములు + ఐన) = అంతులేని;
అభీప్సితాన్నముల్ (అభీప్సిత + అన్నముల్) = కోరిన పదార్థాలను
పెట్టుదున్ = పెడతాను

భావం :
వేదవ్యాసుడు ఇలా చెప్పగా, పద్మం వంటి ముఖం గల ఆ ముత్తైదువ చిఱునవ్వు నవ్వి “మంచిది. సరేలే. విశ్వనాథుని దయవల్ల ఎంతమంది అతిథులు వచ్చినా, కామధేనువును కలిగియున్న యజమానురాలు రీతిగా, కోరిన పదార్థాలన్నీ నేను అనంతంగా పెట్టగలను. కాబట్టి నీ శిష్యులను తీసుకొని వెంటనే భోజనానికి రా” అన్నది.

వచనం – 15

అనిన వట్లకాక మహాప్రపాదంబని వేదవ్యాసుండు
శిష్యులం గూర్చుకొని భాగీరథికిం జని యువస్పర్శం
బాచరించి యేతెంచిన –
ప్రతిపదార్థం :
అనినన్ = అట్లు ముత్తైదువ చెప్పగా
అట్లకాక = అట్లే అగుకాక (అలాగే చేస్తాను)
మహాప్రసాదంబు + అని = మహానుగ్రహమని
వేదవ్యాసుండు = వేదవ్యాసుడు
శిష్యులన్ = శిష్యులను
కూర్చుకొని = కలుపుకొని (తన వెంటబెట్టుకొని)
చని = వెళ్ళి (గంగకు వెళ్ళి)
ఉపస్పర్శంబు = స్నానమును, ఆచమనమును
ఆచరించి = చేసి
ఏతెంచినన్= రాగా

భావం :
ఆ ముత్తైదువ అట్లు చెప్పగా “సరే మహాప్రసాదం” అని వేదవ్యాసుడు శిష్యులను తీసుకొని గంగానదికి వెళ్ళి స్నానం, ఆచమనం, పూర్తిచేసుకొని రాగా,

పద్యం – 16

తే॥గీ॥ గొడుగు పాగల గిలకలు గులకరింప
విందుబింబాస్య యెదురుగా వేగు దెంచి
ఛాత్ర సహితంబుగాఁ బరాశరతనూజు
బంతిపాగించే భుక్తిశాలాంతరమున
ప్రతిపదార్థం :
గొడుగు పాగల గిలకలు = గొడుగు పావకోళ్ల యొక్క గిలకలు (గొడుగుల వలెనుండు గుబ్బలు గల పావకోళ్ళు)
గులకరింపన్ = మ్రోగుతుండగా
ఇందు బింబాస్య (ఇందు బింబ + ఆస్య) = చంద్రబింబము వంటి ముఖం కల ఆ ఇల్లాలు
ఎదురుగాన్ = వ్యాసునకు ఎదురుగా
ఏగుదెంచి = వచ్చి (మునీశ్వరునకు ఎదురేగి)
ఛాత్ర సహితంబుగాన్ = శిష్య సమేతంగా
పరాశరతనూజు బంతి = పరాశరుని కుమారుడైన వ్యాసుడు మొదట కూర్చున్న బంతిని; (పంక్తిని)
భుక్తి శాలాంతరబునన్ (భుక్తిశాలా + అంతరమునన్) = భోజనశాల లోపల
సాగించెన్ = వడ్డన సాగించింది

భావం :
తాను ధరించిన గొడుగు పావుకోళ్ళ గిలకలు మ్రోగుతుండగా, చంద్రముఖియైన ఆ ముత్తైదువ, వారికి ఎదురుగా వచ్చి స్వాగతం చెప్పింది. శిష్య సమేతంగా వేదవ్యాస మునీంద్రుడు భోజనశాలలో కూర్చున్నాడు. అప్పుడు ఆమె ఆ పంక్తికి వడ్డన సాగించింది.

ఆలోచించండి – చెప్పండి

ప్రశ్న 1.
భోజనానికి ఆహ్వానించిన గృహిణితో వ్యాసుడు పలికిన మాటలను బట్టి మీకేమి అర్థమయింది?
జవాబు:
వ్యాసుడు తన శిష్యులతో కూడా భిక్షాటనం చేసి, వాళ్ళతో కలసి భుజించేవాడని అర్థమయ్యింది. ఒకవేళ పగటి సమయంలో భిక్ష దొరక్కపోతే ఉపవాసం ఉండేవాళ్ళని అర్థమయింది.

వ్యాసుడు తన శిష్యులతో కలసి భుజించాలనే వ్రతం కలవాడని అర్థమయింది. శిష్యులను విడిచి పెట్టి తానొక్కడే భుజించాలనే స్వార్థపు ఆలోచన లేనివాడని అర్థమయింది. తనను ఆశ్రయించిన శిష్యుల బాగోగులను పట్టించుకొనేవాడని అర్థమయింది.

AP SSC 10th Class Telugu Solutions Chapter 11 భిక్ష

ప్రశ్న 2.
ఈ పాఠం ఆధారంగా నాటి గురుశిష్య సంబంధం గురించి వివరించండి.
జవాబు:
ఈ పాఠం ఆధారంగా చూస్తే నాటి గురుశిష్య సంబంధం విడదీయరానిదని తెలుస్తోంది. శిష్యులు ఎల్లప్పుడూ గురువుని ఆశ్రయించి ఉండేవారు. గురువులతో పాటు శిష్యులు కూడా భిక్షాటనం చేసి లభించిన ఆహారాన్ని అందరూ కలసి భుజించేవారు. ఒకవేళ సూర్యాస్తమయం లోపల భిక్ష లభించకపోతే ఆ రోజు ఉపవాసం ఉండేవాళ్ళు. గురువు మాటను శిష్యులు అతిక్రమించే వారు కాదు. గురువు తనకంటే ముందుగా శిష్యుల బాగోగులను గురించి పట్టించుకొనేవాడు.

AP SSC 10th Class Telugu Grammar Alankaralu అలంకారాలు

AP State Board Syllabus AP SSC 10th Class Telugu Solutions 10th Class Telugu Grammar Alankaralu అలంకారాలు Notes, Questions and Answers.

AP State Syllabus SSC 10th Class Telugu Grammar Alankaralu అలంకారాలు

అలంకారం :
చెప్పదలచిన విషయాన్ని అందంగా మలిచేది.
అలంకారాలు రెండు రకాలు : –
అ) శబ్దాలంకారాలు
ఆ) అర్థాలంకారాలు

అ) “శబ్దాలంకారాలు” :
శబ్ద చమత్కారంతో పాఠకునికి ఆనందాన్ని కల్గించేవి “శబ్దాలంకారాలు.”
కింది గేయాన్ని గమనించండి.
“అది గదిగో మే
మేడకున్నది గో
గోడ పక్కని నీ
నీడలో కోడె దూ
దూడ వేసింది పే

పై కవితలో ప్రతివాక్యం చివర ‘డ’ అనే అక్షరం, మళ్ళీ మళ్ళీ వచ్చింది. (అంటే పునరావృతమయ్యింది) ఇది ఆ కవితకు అందం తెచ్చింది. వినడానికి సొంపుగా తయారయ్యింది. ఈ అందం, వినసొంపు ‘డ’ అనే శబ్దం మళ్ళీ మళ్ళీ ప్రయోగించడం వల్ల వచ్చింది. కాబట్టి దీనిని “శబ్దాలంకారం” అంటారు.

AP SSC 10th Class Telugu Grammar Alankaralu అలంకారాలు

1) అంత్యానుప్రాసాలంకారం :
ఒకే అక్షరం లేదా రెండు మూడు అక్షరాలు, వాక్యం చివర మాటి మాటికి వస్తే దాన్ని ‘అంత్యానుప్రాస’ అలంకారం అంటారు.
ఉదా :
1) భాగవతమున భక్తి
భారతమున యుక్తి
రామకథయే రక్తి
ఓ కూనలమ్మ

గమనిక :
పై కవితలో ప్రతివాక్యం చివర ‘క్తి’ అనే అక్షరం తిరిగి తిరిగి వచ్చింది. కాబట్టి ఈ ‘కవితలో ‘అంత్యానుప్రాస’ అనే శబ్దాలంకారం ఉంది.
2) గుండెలో శూలమ్ము
గొంతులో శల్యమ్ము

పై కవితలో ‘మ్ము’ అనే అక్షరం ప్రతి పాదం చివరా వచ్చింది. కాబట్టి దీనిలో ‘అంత్యానుప్రాస’ అనే శబ్దాలంకారం ఉంది.

అంత్యానుప్రాసాలంకారం : (లక్షణం) :
పాదాంతంలో లేదా పంక్తి చివరలో, ఒకే ఉచ్చారణతో ముగిసే పదాలు లేదా అక్షరాలు ఉంటే దాన్ని “అంత్యానుప్రాసాలంకారం” అంటారు.

కింది గేయాలు గమనించండి :
1) వేదశాఖలు వెలసె నిచ్చట
ఆదికావ్యం బలరె నిచ్చట

గమనిక :
ఈ గేయంలోని మొదటి పంక్తి చివర, ‘ఇచ్చట’ అనీ, అలాగే రెండవ పాదం చివర కూడా ‘ఇచ్చట’ అనీ ఉంది. కాబట్టి “అంత్యానుప్రాసాలంకారం” దీనిలో ఉంది.
2) తలుపు గొళ్ళెం
హారతి పళ్ళెం
గుర్రపు కళ్ళెం

పై మూడు పాదాల్లోనూ చివర ‘ళ్ళెం’ అనే అక్షరం వచ్చింది కాబట్టి దీనిలో కూడా ‘అంత్యానుప్రాసాలంకారం’ ఉంది.

2) వృత్త్యనుప్రాసాలంకారం :
అక్షరం అనేకసార్లు తిరిగి రావడాన్ని ‘వృత్త్యనుప్రాసాలంకారం’ అంటారు. ‘వృత్తి’ అంటే ఆవృత్తి అని అర్థం. ఆవృత్తి అంటే మళ్ళీ మళ్ళీ రావడం.
ఉదా :
నాయనా ! నేను నిన్నే మన్నా అన్నానా ? నీవు నన్నే మన్నా అన్నావా ?

గమనిక :
పై వాక్యంలో ‘న’ అనే అక్షరం, అనేకమార్లు వచ్చింది. కాబట్టి ఇది “వృత్త్యనుప్రాస” అనే శబ్దాలంకారం.

అభ్యాసం :

  1. కా కి కో కికా దు దా !
  2. లచ్చి పుచ్చకాయలు తెచ్చి ఇచ్చింది.

వృత్త్యనుప్రాసాలంకారం (లక్షణం) :
మొదటి వాక్యంలో ‘క’, రెండో వాక్యంలో ‘చ్చ’ అనే అక్షరం ఆవృత్తి అయ్యింది. కాబట్టి ఇది “వృత్త్యనుప్రాసాలంకారం”.

ఈ కింది వాక్యాలు చూడండి.

  1. ఆమె కడవతో వడి వడి అడుగులతో గడపను దాటింది.
  2. చిట పట చినుకులు టపటపమని పడుతున్నవేళ

గమనిక :
మొదటివాక్యంలో ‘డ’ అనే హల్లు, రెండవ వాక్యంలో ‘ఓ’ అనే హల్లు చాలాసార్లు వచ్చాయి.

ఈ క్రింది ఉదాహరణలు కూడా చూడండి.
అ) బాబు జిలేబి పట్టుకొని డాబా పైకి ఎక్కాడు.
ఆ) గట్టు మీది చెట్టు కింద కిట్టు రొట్టెను లొట్టలేస్తూ తింటున్నాడు.
ఇ) లక్ష భక్ష్యాలు తినేవాడికి, ఒక భక్ష్యం లక్ష్యమా.

లక్షణం :
ఒక హల్లు గాని, రెండు మూడు హల్లులు గాని, వేరుగా ఐనా, కలిసి ఐనా, మళ్ళీ మళ్ళీ వచ్చినట్లయితే, దాన్ని ‘వృత్త్యనుప్రాస అలంకారం’ అంటారు.

AP SSC 10th Class Telugu Grammar Alankaralu అలంకారాలు

3. ఛేకానుప్రాసాలంకారం : కింది వాక్యం చదవండి.
ఉదా :
“నీకు వంద వందనాలు”.

పై వాక్యంలో వంద అనే హల్లుల జంట, వెంట వెంటనే అర్థ భేదంతో వచ్చింది. ఇక్కడ మొదట వచ్చిన ‘వంద’ – నూరుసంఖ్యను తెలుపుతుంది. రెండోసారి వచ్చిన ‘వంద’, వందనాలు అంటే నమస్కారాలు అని తెలుపుతోంది.

ఛేకానుప్రాస (లక్షణం) :
హల్లుల జంట అర్థ భేదంతో వెంట వెంటనే వస్తే, దానిని ‘ఛేకానుప్రాస’ అలంకారం అంటారు.

ఛేకానుప్రాసకు మరికొన్ని ఉదాహరణలు :
1) పాప సంహరుడు హరుడు
2) మహా మహీభారము

4. ముక్తపదగ్రస్త అలంకారం : ఇది శబ్దాలంకారం.
లక్షణం :
ఒక పద్యపాదం గాని, వాక్యం కాని ఏ పదముతో పూర్తి అవుతుందో, అదే పదంతో తర్వాత పాదం / వాక్యం మొదలవుతుంది. దీన్ని “ముక్తపదగ్రస్త అలంకారం” అంటారు.
ఉదా :
జనకుడుండెడి యనుష్ఠాన వేదిక జూచు
చూచి క్రమ్మర బోయి జూడవచ్చు

గమనిక :
మొదటి పాదం చివర ‘చూచు’ అనే పదం ఉంది. రెండవ పాదం ‘చూచి’ అని ‘చూచు’తో మొదలయ్యింది. కాబట్టి ఇది ‘ముక్తపదగ్రస్త అలంకారం.
అ) ఉదా :
అది గదిగో మేడ
మేడ పక్కన నీడ
నీడలో ఉన్నది దూడ
దూడ వేసింది పేడ

గమనిక :

  1. మొదటి పాదం చివర ఉన్నది ‘మేడ’ అనే పదం. రెండవ పాదం మొదట తిరిగి ‘మేడ’ అనే అదే పదం వచ్చింది.
  2. అలాగే రెండవ పాదం చివర ‘నీడ’ అనే పదం ఉంది. మూడవ పాదం మొదటలో తిరిగి ‘నీడ’ అనే పదం వచ్చింది.
  3. మూడవ పాదం చివర ‘దూడ’ అనే పదం వచ్చింది. నాల్గవ పాదం మొదట్లో తిరిగి ‘దూడ’ అనే పదమే వచ్చింది.

వివరణ :
పాదం చివర విడిచిన పదం తిరిగి తరువాత పాదం మొదట్లో రావడం జరిగింది. కాబట్టి. ఇది “ముక్తపదగ్రస్త అలంకారం.”

అభ్యాసం :
కింది ఉదాహరణలు ఏయే అలంకారాలకు చెందినవో గుర్తించండి. సమన్వయం రాయండి.

ఆ) సుదతీ నూతన మదనా
మదనా గతురంగ పూర్ణమణిమయ సదనా
సదనామయ గజరదనా!
రదనాగేంద్ర నిభకీర్తిరస నరసింహా!

సమన్వయం :
పై పద్యంలో “ముక్తపదగ్రస్తం” అనే అలంకారం ఉంది.

ముక్తపదగ్రస్తాలంకారం (లక్షణం) :
ఒక పద్యపాదం గాని, వాక్యంకాని ఏ పదంతో పూర్తి అవుతుందో అదే పదంతో తర్వాత పాదం / వాక్యం మొదలవుతుంది. దీన్ని “ముక్తపదగ్రస్త అలంకారం” అంటారు.

గమనిక : పై పద్యంలో

  1. మొదటి పాదం చివర ‘మదనా’ అని ఉంది. రెండవ పాదం మొదట్లో తిరిగి ‘మదనా’ అని మొదలయ్యింది.
  2. రెండవ పాదం చివర ‘సదనా’ అని ఉంది. మూడవ పాదం మొదట్లో ‘సదనా’ అని మొదలయ్యింది.
  3. మూడవ పాదం చివర ‘రదనా’ అని ఉంది. నాల్గవ పాదం తిరిగి ‘రదనా’ తో మొదలయ్యింది. ఈ విధంగా పాదం చివర ఉన్న శబ్దంతోనే, తిరిగి తరువాతి పాదం మొదలవుతోంది. కాబట్టి ఇది “ముక్తపదగ్రస్త అలంకారం”.

5. యమకం : ఇది శబ్దాలంకారం.
లక్షణం : ఒకే పదం అర్థభేదంతో ప్రయోగించడాన్ని ‘యమకాలంకారం’ అంటారు.
ఉదా :
మన సైనిక కాయము కాయము మరచి పోరాడుతున్నది.

గమనిక :
పై ఉదాహరణలో ‘కాయము’ అనే పదం, రెండుసార్లు వచ్చింది. ‘కాయము’ అనే శబ్దం ఇక్కడ అర్థభేదంతో ప్రయోగింపబడింది.

మొదటి ‘కాయము’ అనేది ‘నికాయము’ = బృందము అనే పదంలోని భాగం. రెండవ ‘కాయము’ అనగా ‘శరీరం’ అని అర్థం.

సమన్వయం :
ఇక్కడ ‘కాయము’ అనే శబ్దం అర్థభేదంతో తిరిగి ప్రయోగింపబడింది. కాబట్టి ఇది “యమకం” అనే శబ్దాలంకారం.

అభ్యాసం :
ఈ కింది వాక్యాలలోని అలంకారాన్ని గుర్తించి సమన్వయించండి.

ఆ) ఆ తోరణం శత్రువుల తోరణానికి కారణమైంది.
సమన్వయం :
‘తోరణం’ అనే శబ్దం, ఈ వాక్యంలో రెండు సార్లు వచ్చింది. మొదటి ‘తోరణం’ అనే శబ్దానికి ద్వారానికి కట్టే అలంకారం అని అర్థం. రెండవ తోరణ శబ్దంలోని ‘రణం’, అంటే యుద్ధం అని అర్థం. ఈ విధంగా తోరణ శబ్దం అర్థం భేదంతో రెండుసార్లు వచ్చింది. కాబట్టి ‘యమకం’ అనే శబ్దాలంకారం పై వాక్యంలో ఉంది.

యమకం (లక్షణం) :
ఒకే పదం అర్థభేదంతో ప్రయోగించడాన్ని “యమకాలంకారం” అంటారు.

AP SSC 10th Class Telugu Grammar Alankaralu అలంకారాలు

6. లాటానుప్రాస : ఇది శబ్దాలంకారం.
లక్షణం :
ఒకే పదాన్ని అర్థం ఒకటే అయినా, తాత్పర్య భేదంతో ప్రయోగించడాన్ని ‘లాటానుప్రాసాలంకారం’ అంటారు.
ఉదా :

  1. హరి భజియించు చేయు హస్తములు హస్తములు
  2. దీనమానవులకు సేవ సేవ

గమనిక :
పై వాక్యాలలో హస్తములు, హస్తములు, సేవ, సేవ అని ఒకే పదం. అర్థంలో తేడా లేకున్నా, భావంలో తేడా ఉండేటట్లు ప్రయోగించారు.

వివరణ :

  1. ‘హస్తములు’ అనగా చేతులు, రెండవ సారి వచ్చిన ‘హస్తములు’ అనగా సార్థకమైన ‘హస్తములు’ అని అర్థం.
  2. ‘సేవ’ అనగా సేవ చేయడం . రెండవసారి వచ్చిన ‘సేవ’ అనగా ‘నిజమైన సేవ’ అని భావం.

అభ్యాసం :
ఈ కింది వాక్యంలో అలంకారాన్ని పేర్కొని సమన్వయించండి.
1) కమలాక్షునర్చించు కరములు కరములు.

సమన్వయం :
పై వాక్యంలో ‘కరములు’ అనే పదం రెండుసార్లు వచ్చింది. అర్థంలో భేదం లేదు. తాత్పర్యం మాత్రమే భేదం. కాబట్టి ఈ వాక్యంలోని శబ్దాలంకారం “లాటానుప్రాసం”.

లాటానుప్రాస అలంకారం (లక్షణం) :
ఒకే పదాన్ని అర్థం ఒకటే అయినా, తాత్పర్య భేదంతో ప్రయోగించడాన్ని “లాటానుప్రాస అలంకారం” అంటారు.

అర్థాలంకారాలు :
అర్థ చమత్కారంతో పాఠకునికి ఆనందాన్ని కలిగించేవి “అర్థాలంకారాలు.”

1. ఉపమాలంకారం :

  1. ఆమె ముఖం అందంగా ఉంది.
  2. అమె ముఖం చంద్రబింబంలాగ అందంగా ఉన్నది.

గమనిక :
పై వాక్యాలలోని తేడాను గమనించండి. ఆమె ముఖం చంద్రబింబంలాగా అందంగా ఉంది, అనే వాక్యం మనలను ఆకట్టుకుంటుంది. ఈ విధంగా ఒక విషయాన్ని ఆకట్టుకొనేలా చెప్పడానికిగాను అందమైన పోలికను చెప్పడాన్ని ‘ఉపమాలంకారం’ అంటారు.
ఉదా :
సోముడు భీముడివలె బలవంతుడు.

గమనిక :
ఈ వాక్యంలో సోముణ్ణి భీముడితో పోల్చారు. ఇలా చెప్పినపుడు వాక్యంలో ఉండే పదాలను, కొన్ని ప్రత్యేకమైన పేర్లతో పిలుస్తాము.
1) సోముడు – ఉపమేయం – (అంటే ఎవరిని గురించి చెప్పుతున్నామో ఆ పదం)
2) భీముడు – ఉపమానం – (ఎవరితో పోలుస్తున్నామో ఆ పదం)
3) బలవంతుడు – సమానధర్మం – (పోల్చడానికి వీలయిన సమాన గుణం)
4) వలె – ఉపమావాచకం – (ఉపమానాన్ని సమానధర్మంతో కలపడానికి వాడే పదం)

ఉపమాలంకారం :
ఉపమానోపమేయాలకు చక్కని పోలిక చెప్పడమే “ఉపమాలంకారం.”

2. ఉత్ప్రేక్షాలంకారం :
ఉపమేయాన్ని మరొక దానిలా ఊహించి చెప్పడం, “ఉత్ప్రేక్షాలంకారం.”
ఉదా :
ఆమె ఇంటి ముందున్న పెద్ద కుక్కను చూసి, సింహం ఏమో అని భయపడ్డాను.

గమనిక :
పై వాక్యంలో ఒక దాన్ని చూసి మరొకటి అనుకోవడం లేదా ఊహించుకోవడం జరిగింది. ఇలా అనుకోవడం లేదా ఊహించుకోవడం కూడా అలంకారమే. ఇలా ఉన్నదాన్ని లేనట్లుగా, లేనిదాన్ని ఉన్నట్లుగా ఊహించి చెప్పడాన్ని ‘ఉత్ప్రేక్షాలంకారం’ అంటారు.
ఉదా :

  1. ఆ మేడలు ఆకాశాన్ని ముద్దాడుతున్నాయో అన్నట్లు ఉన్నవి.
  2. ఆ ఏనుగు నడగొండా అన్నట్లు ఉంది.

పై వాక్యంలో 1) ఉపమేయం – ఏనుగు
2) ఉపమానం – నడకొండ (నడిచే కొండ)
అంటే ఏనుగును, నడిచే కొండలా ఊహించాము. కాబట్టి “ఉత్ప్రేక్షాలంకారం.”

AP SSC 10th Class Telugu Grammar Alankaralu అలంకారాలు

3. రూపకాలంకారం :
ఉపమాన ధర్మాన్ని ఉపమేయంలో ఆరోపించి, వీటి రెంటికీ అభేదాన్ని (భేదం లేదని) చెప్పడమే, ‘రూపకాలంకారం’ అంటారు.
ఉదా :
‘ఆయన మాట కఠినమైనా మనసు వెన్న’ ఇందులో
1) ‘మనస్సు’ – అనేది ఉపమేయం.
2) వెన్న – ఉపమానం (పోల్చినది)

ఉపమానమైన ‘వెన్న’ లక్షణాలను, ఉపమేయమైన ‘మనస్సు’తో భేదం లేకుండా పోల్చడం జరిగింది. అంటే వెన్నకూ, మనస్సుకూ భేదం లేదు. రెండూ ఒకటే అనే భావాన్ని ఇస్తోంది.

అభ్యాసం :
కింది వాక్యాలను పరిశీలించి అలంకారాన్ని గుర్తించండి.

  1. మా అన్న చేసే వంట నలభీమపాకం
  2. కుటుంబానికి తండ్రి హిమగిరి శిఖరం

గమనిక :
మొదటి వాక్యంలో అన్న చేసే వంటకూ, నలభీమపాకానికి భేదం లేనట్లు చెప్పబడింది. అలాగే రెండవ వాక్యంలో కుటుంబంలోని తండ్రికీ, హిమగిరి శిఖరానికి భేదం లేనట్లు చెప్పబడింది. కాబట్టి పై రెండు వాక్యాలలో ‘రూపకాలంకారాలు’ ఉన్నాయి.

ఈ కింది ఉదాహరణలు కూడా చూడండి.

  1. లతాలలనలు రాజు పై కుసుమాక్షతలు చల్లారు.
  2. రుద్రమ్మ చండీశ్వరీదేవి జలజలా పారించే శాత్రవుల రక్తమ్ము.
  3. ఈ మహారాజు సాక్షాత్తు ఈశ్వరుడే.
  4. మా నాన్నగారి మాటలే వేదమంత్రాలు.
  5. మౌనిక తేనె పలుకులు అందరికీ ఇష్టమే.

గమనిక : పై పాదాల్లో రూపకాలంకారాలు ఉన్నాయి.

4. స్వభావోక్తి అలంకారం :
ఏదైనా విషయాన్ని ఉన్నదున్నట్లుగా వర్ణిస్తే దాన్ని “స్వభావోక్తి” అలంకారం అంటారు.
ఉదా :
జింకలు బిత్తరి చూపులు చూస్తూ, చెవులు నిగిడ్చి చెంగుచెంగున గెంతుతున్నాయి.

స్వభావోక్తికి మరియొక ఉదాహరణం :
1) ఆ లేళ్లు బెదురుచూపులతో నిక్కపొడుచుకున్న చెవులతో భయభ్రాంత చిత్తములతో అటూ ఇటూ చూస్తున్నాయి.

సమన్వయం :
ఇక్కడ లేళ్ల యొక్క సహజ గుణాన్ని ఉన్నది, ఉన్నట్లుగా, కళ్లకు కట్టినట్లుగా వర్ణించడం వల్ల ఇది స్వభావోక్తి’ అలంకారం.

5. “అతిశయోక్తి” అలంకారం.
లక్షణం :
ఉన్న విషయాన్ని, ఉన్నదానికంటే ఎక్కువ చేసి చెప్పటాన్ని ‘అతిశయోక్తి’ అలంకారం అంటారు.
ఉదా :

  1. మా చెల్లెలు తాటి చెట్టంత పొడవుంది.
  2. దేవాలయ గోపురాలు ఆకాశానికి అంటుతున్నాయి.
  3. ఆ పట్టణంలోని భవనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

సమన్వయం :
పై వాక్యాలలో చెల్లెలు ఎత్తును, గోపురం ఎత్తును, ఉన్న ఎత్తుకంటె ఎక్కువ చేసి చెప్పడాన్ని అతిశయోక్తి అలంకారంతో చెప్పడం అంటారు.

భవనాలు ఎంత ఎత్తుగా ఉన్నా, ఆకాశాన్ని తాకడం అసంభవం. అంటే మామూలు విషయాన్ని అతిగా చేసి చెప్పడం పై మూడవ వాక్యంలో గమనిస్తున్నాము.

అభ్యాసం :
ఈ కింది లక్ష్యాలను పరిశీలించండి. అలంకారం గుర్తించండి.
1) కం|| “చుక్కలు తలపూవులుగా
అక్కజముగ మేను పెంచి యంబరవీధిన్
వెక్కసమై చూపట్టిన
అక్కోమలి ముదము నొందె ఆత్మస్థితికిన్”

సమన్వయం :
పై పద్యంలో ‘అతిశయోక్తి’ అనే అలంకారం ఉంది.

భావం :
నక్షత్రాలు తన తలపై ధరించే పువ్వులుగా ఉండేటట్లు ఆశ్చర్యంగా హనుమంతుడు శరీరాన్ని పెంచాడు.

ఎంత ఎత్తు పెరిగినా ఆకాశంలో నక్షత్రాలను తాకేటట్లు పెరగడం జరగదు. కాబట్టి ఇది ‘అతిశయోక్తి’ అలంకారం.

AP SSC 10th Class Telugu Grammar Alankaralu అలంకారాలు

2) మా పొలంలో బంగారం పండింది.
సమన్వయం :
పై వాక్యంలో ‘అతిశయోక్తి’ అలంకారం ఉంది.

భావం :
పొలంలో బాగా పంట పండింది అని చెప్పడానికి, ‘బంగారం’ పండిందని అతిశయోక్తిగా చెప్పబడింది. కాబట్టి పై వాక్యంలో “అతిశయోక్తి” అనే అర్థాలంకారం ఉంది.

6. శ్లేషాలంకారం :

అ) 1) మిమ్ము మాధవుడు (విష్ణువు) రక్షించుగాక !
2) మిమ్ము ఉమాధవుడు (శివుడు) రక్షించుగాక !

ఆ) మానవ జీవనం సుకుమారం
అర్థం :
1)మానవ (ఆధునిక) జీవితం సుకుమారమైనది.
2) మానవ (మనిషి) జీవితం సుకుమారమైనది.

పై అర్థాలను గమనించారు కదా ! ఒకే శబ్దం, రెండు వేరు వేరు అర్థాలను ఇస్తుంది. అంటే విభిన్న అర్థాలు ఆశ్రయించి ఉన్నాయి. ఇలా ఉంటే ‘శ్లేషాలంకారం’ అంటారు.

శ్లేషాలంకారం (లక్షణం) :
నానార్థాలను కలిగి ఉండే అలంకారం శ్లేష..

అభ్యాసం :
కింది అలంకారాలలో ఉన్న అలంకారాన్ని గుర్తించి సమన్వయం చేయండి.
1) రాజు కువలయానందకరుడు
అర్థం :

  1. చంద్రుడు కలువలకు ఆనందాన్ని ఇస్తాడు.
  2. రాజు భూమండలానికి సంతోషాన్ని ఇస్తాడు.

ఇక్కడ నానార్థాలు వచ్చాయి కాబట్టి ఈ వాక్యంలో శ్లేషాలంకారముంది.

2) నీవేల వచ్చెదవు?
అర్థం :
1) నీవు ఎందుకు వస్తావు?
2) నీవు ఏలడానికి వస్తావు.
ఇక్కడ నానార్థాలు వచ్చాయి. కాబట్టి శ్లేషాలంకారం ఉంది.

అలంకారములపై ప్రశ్నలు

1) ‘కుముదినీ రాగ రసబద్ద గుళిక యనగ చంద్రుడు దయించె’ ఈ వాక్యంలో ఉన్న అలంకారాన్ని గుర్తించండి.
A) ఉపమ
B) ఉత్ప్రేక్ష
C) రూపకము
D) స్వభావోక్తి
జవాబు:
B) ఉత్ప్రేక్ష

2) “అనుచున్ జేవురు మీఱు కన్నుగవతో, నాస్పందదోష్ణంబుతో, ఘనహుంకారముతో, నటద్ర్భుకుటితో గర్జిల్లు నా ఫోన్ సలేశుని” ఈ వాక్యంలో అలంకారాన్ని గుర్తించండి.
A) ఉపమ
B) ఉత్ప్రేక్ష
C) స్వభావోక్తి
D) వృత్త్యనుప్రాస
జవాబు:
C) స్వభావోక్తి

3) ‘నగారా మోగిందా, నయాగరా దుమికిందా’ ఈ వాక్యంలో అలంకారాన్ని గుర్తించండి.
A) అంత్యానుప్రాస
B) వృత్త్యనుప్రాస
C) ఛేకానుప్రాస
D) యమకము
జవాబు:
A) అంత్యానుప్రాస

AP SSC 10th Class Telugu Grammar Alankaralu అలంకారాలు

4) ‘హరిభజియించు హస్తములు హస్తములు’ ఈ వాక్యంలో గల అలంకారాన్ని గుర్తించండి.
A) వృత్త్యనుప్రాస
B) ఛేకానుప్రాస
C) లాటానుప్రాస
D) ముక్తపదగ్రస్తము
జవాబు:
C) లాటానుప్రాస

5) ‘ఆ తోరణం శత్రువులతో రణానికి కారణమైంది’ ఈ వాక్యంలో గల అలంకారం గుర్తించండి. (B)
A) శ్లేష
B) యమకము
C) ఛేకానుప్రాస
D) ఉపమ
జవాబు:
B) యమకము

6) ‘మా పొలంలో బంగారం పండింది’ ఈ వాక్యంలో అలంకారాన్ని గుర్తించండి.
A) స్వభావోక్తి
B) ఉపమ.
C) అతిశయోక్తి
D) రూపకము
జవాబు:
C) అతిశయోక్తి

7) ‘హనుమంతుడు సముద్రాన్ని దాటాడు. మహాత్ములకు సాధ్యము కానిది లోకమున లేదుకదా’ ఈ వాక్యాలలో అలంకారం గుర్తించండి.
A) అర్ధాంతరన్యాస
B) ఉపమ
C) స్వభావోక్తి
D) యమకము
జవాబు:
A) అర్ధాంతరన్యాస

AP SSC 10th Class Telugu Grammar Alankaralu అలంకారాలు

8) ‘నీ కరుణాకటాక్షవీక్షణములకై నిరీక్షించుచున్నారము’ ఈ వాక్యంలోని అలంకారాన్ని గుర్తించి, లక్షణం రాయండి.
జవాబు:
ఈ వాక్యంలో ‘వృత్త్యనుప్రాస’ అలంకారం ఉంది.
లక్షణం : ఒకే అక్షరము పలుమార్లు ఆ వృత్తియగుట వృత్త్యనుప్రాస.

9) “లేమా! దనుజుల గెలువగ లేమా?” ఈ వాక్యంలోని అలంకారాన్ని గుర్తించి, లక్షణం రాయండి.
జవాబు:
యమకము : లక్షణం : ఒకే పదం, అర్థభేదంతో ప్రయోగించడం యమకము.

10) ‘దేవాలయ గోపురాలు ఆకాశాని కంటుతున్నాయి. ఈ వాక్యంలో గల అలంకారాన్ని గుర్తించి, లక్షణం రాయండి.
జవాబు:
అతిశయోక్తి : విషయాన్ని ఉన్నదానికంటె ఎక్కువ చేసి చెప్పడం.

11) ‘మానవా? నీ ప్రయత్నం మానవా?’ ఈ వాక్యంలో అలంకారం గుర్తించి, లక్షణం రాయండి.
జవాబు:
యమకము : ఒకే పదం, అర్థభేదంతో ప్రయోగించడం యమకం.

12) ‘మిమ్ము మాధవుడు రక్షించుగాక!’ ఈ వాక్యంలో అలంకారాన్ని గుర్తించి, లక్షణం రాయండి.
జవాబు:
శ్లేష : నానార్ధములను కలిగి ఉండే అలంకారం శ్లేష.

13) “శివాజీ కళ్యాణి దుర్గాన్ని సాధించాడు. వీరులకు సాధ్యము కానిది లోకమున లేదు కదా” ఈ వాక్యాలలో గల అలంకారాన్ని గుర్తించి, లక్షణం రాయండి.
జవాబు:
అర్ధాంతర న్యాసాలంకారము : సామాన్యమును విశేషముచే కాని, విశేషమును సామాన్యముచే కాని సమరించుట.

14) ‘వాడు తాటిచెట్టంత పొడవున్నాడు’ ఈ వాక్యంలో అలంకారం గుర్తించి, లక్షణం రాయండి.
జవాబు:
అలంకారము : అతిశయోక్తి అలంకారం.
లక్షణం : విషయాన్ని ఉన్నదాని కంటే ఎక్కువ చేసి చెప్పడం.

15) అభినుతేందు చంద్రికాంభోధి యఖిలంబు నీట నిట్టలముగ నిట్టవొడిచె – అలంకారాన్ని గుర్తించి, లక్షణం రాయండి.
జవాబు:
అలంకారము : రూపకాలంకారము.
లక్షణం : ఉపమానోపమేయములకు, భేదము లేదని చెప్పడం రూపకము.

AP SSC 10th Class Telugu Grammar Alankaralu అలంకారాలు

16) ‘అడిగెదనని కడువడి జను, నడిగినఁదను మగుడ నుడుగడని నడయుడుగున్’, ఈ వాక్యంలో అలంకారం గుర్తించి, లక్షణం రాయండి.
జవాబు:
అలంకారము : వృత్త్యనుప్రాసాలంకారం.
లక్షణం : ఒకే అక్షరం, పలుమార్లు ఆవృత్తి అవడం.

17) ‘మకరందబిందు బృందరసస్యందన మందరమగు మాతృభాషయే’ – ఈ వాక్యంలో అలంకారం గుర్తించి, లక్షణం రాయండి.
జవాబు:
అలంకారము : వృత్త్యనుప్రాసాలంకారం.
లక్షణం : ఒకే అక్షరం, పలుమార్లు ఆవృత్తి అవడం.

18) ‘తండ్రి హరిజేరుమనియెడి తండ్రి తండ్రి’ – ఈ వాక్యంలో అలంకారం గుర్తించి, లక్షణం రాయండి.
జవాబు:
అలంకారము : ఈ పద్యంలో లాటానుప్రాసాలంకారము ఉంది.
లక్షణం : ఒకే పదాన్ని అర్థం ఒకటే అయినా, తాత్పర్య భేదంతో ప్రయోగించడం.

19) 1. ‘రాజు కవలయానందకరుడు’
2. నీవేల వచ్చెదవు- ఈ వాక్యాలలో అలంకారం గుర్తించి, లక్షణం రాయండి.
జవాబు:
అలంకారము : శ్లేషాలంకారం
లక్షణం : నానార్థాలను కలిగి ఉండే అలంకారము శ్లేష.

20) ‘హనుమంతుడు సముద్రాన్ని లంఘించాడు. మహాత్ములకు సాధ్యం కానిది లోకమున లేదుకదా’ – ఈ వాక్యంలో అలంకారం గుర్తించి, లక్షణం రాయండి.
జవాబు:
అలంకారము : అర్థాంతరన్యాసాలంకారం.
లక్షణం : విశేష విషయాన్ని సామాన్యంతో కాని, సామాన్య విషయాన్ని విశేష విషయంతో కాని సమర్థించడం.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 10 గోరంతదీపాలు

AP State Board Syllabus AP SSC 10th Class Telugu Important Questions Chapter 10 గోరంతదీపాలు

AP State Syllabus SSC 10th Class Telugu Important Questions 10th Lesson గోరంతదీపాలు

10th Class Telugu 10th Lesson గోరంతదీపాలు 2 Marks Important Questions and Answers

ఈ క్రింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాల్లో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
గోరంత దీపాలు పాఠం ఎవరు రచించారు? రచయిత గురించి వ్రాయండి.
జవాబు:
గోరంత దీపాలు పాఠం పులికంటి కృష్ణారెడ్డిగారు రచించారు. ఆయన 30.7.1931న చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలంలోని ‘జక్కదన్న’ గ్రామంలో జన్మించారు. తండ్రి గోవిందరెడ్డి, తల్లి పాపమ్మ. 18.11.2007లో తిరుపతిలో స్వర్గస్తులయ్యారు.

ఆయన రాయలసీమ కథానికా రచయిత, నటుడు, జానపద కళాకారుడు, కవి, నాటక రచయిత, బుర్రకథా కళాకారుడు. పునర్జన్మ నాటకంలో వృద్ధుని పాత్రను తొలిసారిగా ఆయన ధరించారు.

ప్రశ్న 2.
పులికంటి కృష్ణారెడ్డిగారి సాహిత్యసేవను వివరించండి.
జవాబు:
పులికంటివారు నటనలో అసమాన ప్రతిభ కనబరిచారు. 150 కథలు రచించారు. వాటిలో 14 కథలకు బహుమతులు అందుకొన్నారు. ‘గూడులేని గువ్వలు’ కథ తొలికథగా ఆయన కలం నుండి జాలువారింది.

కుటుంబ సంక్షేమం, వాతావరణ కాలుష్యం, పొదుపు మొదలైన సామాజిక అంశాలపై 100కు పైగా బుర్రకథలు వ్రాసి, ప్రదర్శించారు.

ఆంధ్రప్రభ దినపత్రికలో ‘నాలుగ్గాళ్ళ మండపం’ శీర్షికను 67 వారాలు నిర్వహించారు. దీనిలో గ్రామీణ రైతుల జీవితాన్ని రాయలసీమ మాండలికంలో చిత్రించారు.

ప్రశ్న 3.
పులికంటి వారు అందుకొన్న పురస్కారాలు, చేసిన సత్కారాలు వివరించండి.
జవాబు:
2001లో తెలుగు విశ్వవిద్యాలయం, పులికంటి కృష్ణారెడ్డిగారిని ఘనంగా సత్కరించింది. 2003లో గోపీచంద్ అవార్డు ఆయనను వరించింది.

2005లో నేదురుమల్లి జనార్ధనరెడ్డి పురస్కారం అందుకొన్నారు. శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ స్వీకరించారు.

2000వ సంవత్సరంలో ‘పులికంటి సాహితీ సంస్కృతి’ని పులికంటి కృష్ణారెడ్డిగారు ప్రారంభించారు. ఈ సాహితీ సంస్థ ఆధ్వర్యంలో 18 మందిని సన్మానించారు.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 10 గోరంతదీపాలు

ప్రశ్న 4.
‘గోరంత దీపాలు’ కథానిక ద్వారా మీరేమి గ్రహించారు?
జవాబు:

  1. అనాథ బాలురు కొడిగట్టిన దీపాలు వంటివారు. కొంచెం సానుభూతితో కొడిని దులిపి నూనెపోసి వత్తి ఎగదోస్తే, ఆ గోరంతదీపం ఎప్పటికో అప్పటికి, గొప్ప వెలుగును ఇస్తుంది.
  2. ప్రతి వ్యక్తి మానవత్వంతో దిక్కులేని వారికి, తనకు ఉన్నంతలో సాయం చేయాలి.
  3. దిక్కులేని వాళ్ళను చేరదీసి ఆశ్రయమిస్తే ఆశ్రయం పొందిన వ్యక్తి, జీవితాంతం ఆశ్రయం ఇచ్చిన వారికి కృతజ్ఞతగా ఉంటాడు.
  4. తమ సహాయంతో అనాథలు అభివృద్ధిలోకి వస్తే, సాయంచేసిన వారి మనస్సు ఆనందంతో నిండిపోతుంది.
  5. అనాథలకు మన శక్తి కొలదీ చేయూతను అందించాలి.

ప్రశ్న 5.
కుర్రవాడి బ్రతుకు మీద వృద్ధుడు చేసిన ప్రయత్నం ఏమిటి? దాని ఫలితం ఎలా ఉంది?
జవాబు:
ఆ వృద్ధుడు కావాలని ఐదు రూపాయిల కాగితం, రైలులో తన సీటు కింద పడవేశాడు. రైలు తుడిచే పిల్లవాడు నిజాయితీ గల పిల్లవాడు. అందువల్లనే ఆ నోటును తీసి వృద్దుడికి తిరిగి ఇచ్చాడు.

ఆ పిల్లవాడు నిజాయితీ గలవాడనీ, చేరదీసి చదివిస్తే బాగుపడతాడనీ వృద్ధుడు అనుకున్నాడు. అదే మాట ఆ కుర్రాడికి చెప్పాడు. ఆ కుర్రవాడు వృద్ధుడితో వెళ్ళడానికి అంగీకరించాడు. వృద్ధుడు ఆ పిల్లవాడిని తన విద్యానగరం పాఠశాలలో ఉంచి, చదివించి అతడికి ఉద్యోగం వచ్చాక పెళ్ళి కూడా చేశాడు.

ప్రశ్న 6.
కుర్రవాడి బ్రతుకు మీద వృద్ధుడు చేసిన ప్రయత్నం ఫలించిందా? వివరించండి.
జవాబు:
ఒక వృద్ధుడు రైలులో ప్రయాణం చేస్తూ ఉంటే రైలు పెట్టెలు తుడుస్తూ ప్రయాణికులు ఇచ్చే డబ్బులతో పొట్ట పోసుకొనే ఒక కుర్రవాడు ఆయనకు కనిపించాడు. ఆ పిల్లవాడు నిజాయితీ గలవాడు. వృద్ధుడు, ఆ కుర్రవాడు నిజాయితీపరుడని గ్రహించాడు. అతడిని చేరదీసి చదివిస్తే బాగుపడతాడని వృద్ధుడు అనుకున్నాడు. పిల్లవాడు కూడా చదువుకుంటానని చెప్పాడు.

ఆ కుర్రవాడిని ఆ వృద్ధుడు తాను నడిపే విద్యానగరం పాఠశాలలో చేర్చి చదివించాడు. ఆ కుర్రవాడు శ్రద్ధగా చదివాడు. ఉద్యోగం సంపాదించాడు. తరువాత ఆ వృద్ధుడు ఆ కుర్రవాడికి పెళ్ళి చేశాడు. ఈ విధంగా వృద్దుడి ప్రయత్నం చక్కగా ఫలించింది.

ప్రశ్న 7.
‘చదువుకొనే వయసులో సంపాదనపైకి దృష్టి పోకూడదు’ ఈ వాక్యంపై మీ అభిప్రాయం రాయండి.
జవాబు:
చదువుకొనే రోజులలో పిల్లల దృష్టి పూర్తిగా వారి చదువుల పైనే ఉండాలి. కాని కొందరు పిల్లలు తీరిక సమయాల్లో ఏదో విధంగా డబ్బులు సంపాదిస్తూ ఖర్చు పెట్టుకుంటారు. కొందరు పిల్లలకు ఏదోరకంగా సంపాదింపవలసిన అవసరాలు కూడా ఉంటాయి.

పేపర్లు వేయడం, పెట్రోలు బంకుల్లో పనిచేయడం, తండ్రి చేసే వృత్తుల పనుల్లో సాయం చెయ్యడం ద్వారా వారు సంపాదిస్తారు. అందువల్ల వారి దృష్టి చదువులపై పూర్తిగా పెట్టలేరు. సంపాదించే డబ్బుతో విలాసాలకు వారు అలవాటు పడతారు. సినిమాలకు పోతారు. సిగరెట్లు వగైరాలకు అలవాటు పడతారు.

కాబట్టి చదువుకొనే వయసులో సంపాదనపై దృష్టి పెట్టరాదు. దానివల్ల వారి చదువులు సక్రమంగా సాగవు.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 10 గోరంతదీపాలు

ప్రశ్న 8.
‘ఏకాంతంలో పుస్తకాలను మించిన నేస్తం లేదు’ దీనిపై మీ అభిప్రాయాన్ని వ్యక్తీకరించండి.
జవాబు:
ఒంటరిగా ఉన్నప్పుడు మనతో మాట్లాడే స్నేహితులు ఎవరూ ఉండరు. అలాంటప్పుడు ఏదో మంచి పుస్తకాన్ని తీసుకొని చదువుకుంటే, హాయిగా కాలం గడుస్తుంది. ప్రక్కన కబుర్లు చెప్పేవారు లేరనే బెంగ కూడా ఉండదు.

పుస్తకాలు స్నేహితుడిలా ఆనందాన్ని ఇస్తాయి. మంచి పుస్తకం చదువుతూ ఉంటే, కాలమే తెలియదు. కాబట్టి పుస్తకం ఒంటరిగా ఉన్నప్పుడు మన నేస్తం అనే మాటతో నేను ఏకీభవిస్తాను.

10th Class Telugu 10th Lesson గోరంతదీపాలు 4 Marks Important Questions and Answers

ఈ క్రింది ప్రశ్నలకు 10 లేక 12 వాక్యాల్లో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
‘ఒక వ్యక్తి ఆలోచన ఆచరణగా మారితే ఏర్పడిన మహాసంస్థ ఎన్నో కొడిగట్టిన దీపాలకు ఆశ్రయమిచ్చింది.’ గోరంత దీపాలు పాఠం ఆధారంగా వివరించండి. (June 2017)
జవాబు:
అనాథ బాలురు గోరంత దీపాల వంటివాళ్ళు. ఆ దీపాలను నిలుపుతున్న వ్యక్తి ఒక వృద్ధుడు.

వృద్ధుడు దీనజనబాంధవుడు. విద్యానగరం అనే విద్యాలయం కట్టించాడు. అక్కడ బాలబాలికలకు వసతి గృహాలు, అతిథులకు గదులు, వయస్సులో పెద్దవాళ్ళకు వసతులు, గ్రంథాలయం, ప్రార్థనాలయం ఏర్పాటుచేశాడు.

వృద్ధుడు విద్యానగరంలో మకుటం లేని మహారాజు, దిక్కులేని వారినందరినీ అక్కడకు చేర్చి, వాళ్ళకు విద్యాబుద్ధులు నేర్పించేవాడు. అక్కడ వందలాది మంది ఉపాధ్యాయుల్ని నియమించి, వేలాదిమంది పిల్లలకు చదువు చెప్పించేవాడు. దానికయిన ఖర్చు అంతా ఆయనే భరించేవాడు.

ఎవరయినా ఈ వృద్ధుణ్ణి స్వార్థం కల మనిషి అని నిందించినా, ఆయన తన ధ్యేయాన్ని విడిచి పెట్టేవాడు కాదు. రైల్లో అడుక్కుతింటున్న పిల్లవాణ్ణి తనతో తీసుకువచ్చి చదువు చెప్పించి పెళ్ళిచేశాడు. ఆ పిల్లవాడు ప్రతి పుట్టినరోజుకీ వచ్చి ఈ వృద్ధుడిని కలిసి, కృతజ్ఞత వెల్లడించేవాడు. పిల్లవాడికి తన యందుకల ప్రేమకు వృద్ధుడి మనస్సు పొంగిపోయేది. ఆ వృద్ధుని పిలుపులో ఆప్యాయత ఉండేది.

విద్యానగరంలో చదువుకొంటున్న పిల్లల్ని చూసి వృద్ధుడు ఆనందానుభూతిలో తేలిపోయేవాడు. వృద్ధుని మాటలు అక్షరసత్యాలు. ఈ విధంగా వృద్ధుడి ఆలోచనతో ఒక మహాసంస్థ వెలిసింది. ఎన్నో కొడిగట్టిన దీపాలకు అతడు ఆశ్రయం ఇచ్చాడు. ఆ వృద్ధుడు వెలిగించిన ఎన్నో గోరంత దీపాలు, కొండంత వెలుగునిచ్చాయి.

ప్రశ్న 2.
చిన్నతనంలో చదువుకొంటే పెద్దవయసులో బాగా సంపాదించవచ్చు. ఈ అభిప్రాయాన్ని సమర్థిస్తారా? చర్చించండి.
జవాబు:
చిన్న వయస్సులో చదువుకుంటే పెద్ద వయస్సులో సంపాదించుకోవచ్చు అని వృద్ధుడు రైలు తుడుస్తున్న పిల్లవాడితో అన్నాడు.

రైలు తుడుస్తున్న పిల్లవాడు చిన్న పిల్లవాడు. కాబట్టి రైలు తుడుస్తూ ప్రయాణీకులు ఇచ్చిన డబ్బులతో బతికేసేవాడు. వృద్ధుడు చెప్పినట్లు ఆ పిల్లవాడు పెద్దవాడు అయితే, సిగ్గు విడిచి అలా తుడవలేడు. డబ్బు సంపాదించలేడు. అదీగాక అందరూ అతణ్ణి తప్పుపడతారు.

కాబట్టి వృద్ధుడు చెప్పినట్లు అతడు అతనితో వెళ్ళి చదువుకున్నాడు. శ్రద్ధగా చదివాడు. ఉద్యోగం సంపాదించి పెద్ద అయ్యాక హాయిగా పెళ్ళి చేసుకొని సుఖంగా బ్రతికాడు.

కాబట్టి వృద్ధుడు పిల్లవాడితో అన్నమాట సరయిన మాట. పిల్లలందరూ బాల్యంలో చక్కగా చదువుకోవాలి. అప్పుడు వారు పెద్దతనంలో చక్కగా సంపాదించుకోవచ్చు.

ప్రశ్న 3.
క్రింది పాత్రల స్వభావాలను రాయండి.
జవాబు:
1. వృద్ధుడు :
అనాథలను చేరదీసి విద్యాబుద్ధులు చెప్పిస్తాడు. సమాజంలోని పేదలను, అనాథలను ఆదుకొనే స్వభావం కలవాడు. సమాజం పట్ల బాధ్యత గలవాడు. వయోవృద్ధులకు కూడా సదుపాయం కల్పించాడు. సమాజం పట్టించుకోని వారికి పెద్ద దిక్కు అయ్యాడు. తన వద్ద పెరిగిన అనాథలు ఉన్నత స్థితిలో ఉంటే చూసి, ఆనందించే స్వభావం కలవాడు. తనను విమర్శించే వారిని కూడా పట్టించుకోకుండా సేవ చేసే మహామనీషి.

2. కుర్రవాడు :
అనాథ. రైలు పెట్టెలు తుడిచేవాడు. వృద్ధుని దయతో విద్యానగరం వచ్చాడు. చక్కగా చదువుకొన్నాడు. మంచి ఉద్యోగం సంపాదించుకొన్నాడు. వృద్ధుని పట్ల అమితమైన కృతజ్ఞతను ప్రదర్శించాడు. తన కన్నీటితో వృద్ధుని పాదాలకు అభిషేకం చేశాడు. మేలు చేసిన వారిని భగవంతునితో సమానంగా పూజించే అత్యుత్తమ సంస్కారం కలవాడు. వినయం కలవాడు. ‘మంచివాడు’ అనడానికి సరిపోయే అన్ని లక్షణాలు ఉన్నవాడు.

3. రచయిత :
వృద్ధుని స్నేహితుడు. వృద్ధుని మంచితనాన్ని, గొప్పతనాన్ని ఆకళింపు చేసుకొన్న వ్యక్తి. పరిశీలనాత్మకంగా, విశ్లేషణాత్మకంగా సమాజాన్ని పరిశీలిస్తాడు. వృద్ధునిలోని ఆలోచనా ధోరణిని అభినందించిన సంస్కారి. గోరంతదీపాలు ఇచ్చే కొండంత వెలుగులో తన పాత్ర కూడా గోరంత ఉండాలని తపించే స్వభావం కలవాడు. ఓర్పు, నేర్పు కలవాడు.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 10 గోరంతదీపాలు

ప్రశ్న 4.
గోరంత దీపాలు కథలో వృద్ధుని గూర్చి వివరించండి.
(లేదా)
“గోరంత దీపాలు” కథానికలో వృద్ధుడు చేసిన సమాజసేవను వివరిస్తూ అతని గొప్పతనాన్ని తెలియజేయండి. (March 2019)
జవాబు:
గోరంత దీపాలు కథలో వృద్ధుడు దీనజన బాంధవుడు. ఆయన విద్యానగరం అనే విద్యాలయం కట్టించాడు. అక్కడ బాలబాలికలకు వసతి గృహాలు, అతిథులకు గదులు, వయస్సులో పెద్దవాళ్ళకు వసతులు, గ్రంథాలయం, ప్రార్థనాలయం కట్టించాడు.

దిక్కులేని పిల్లలను తన పాఠశాలలో చేర్చి, వారికి భోజనం పెట్టి చదువు చెప్పించేవాడు. అక్కడ వందల కొద్దీ ఉపాధ్యాయులను నియమించి, వేలాది పిల్లలకు చదువు చెప్పించేవాడు. దానికయిన మొత్తం ఖర్చును తానే భరించేవాడు.

ఇతరులు ఆయన్ని విమర్శించినా, ఆయన పట్టించుకొనేవాడు కాదు. రైలులో అడుక్కుతింటున్న పిల్లవాడిని తీసుకువచ్చి ఆయన వాడికి చదువు చెప్పించి పెళ్ళి చేశాడు. ఆ విద్యానగరంలో చదువుకొనే పిల్లల్ని చూసి ఆ వృద్ధుడు మురిసిపోయేవాడు. ఆయన కొడిగట్టిన దీపాలవంటివారికి ఆశ్రయం ఇచ్చి వారి జీవితాలను కొండంత దీపాలుగా వెలిగించాడు. ఆయన మహానుభావుడు, ఉత్తముడు.

ప్రశ్న 5.
వృద్ధునికి ప్రయోజకుడైన యువకుడికి గల అనుబంధాన్ని వివరించండి.
జవాబు:
ఒకసారి వృద్ధుడు రైలులో ప్రయాణం చేస్తున్నాడు. దానిలో ఒక పిల్లవాడు రైలు పెట్టి తుడుస్తూ అడుక్కుంటున్నాడు. వృద్ధుడికి ఆ పిల్లవాడి మనస్తత్వాన్ని పరీక్షించాలని బుద్ధిపుట్టింది. ఐదు రూపాయల నోటు కింద జారవిడిచాడు. ఆ పిల్లవాడు నోటును తీసి వృద్దుడికి అప్పగించాడు. ఆ పిల్లవాడిని చదివించి వృద్ధిలోకి తేవాలని వృద్ధుడు అనుకున్నాడు. పిల్లవాడు సరే అని, వృద్ధుని వెంట వెళ్ళి విద్యాలయంలో శ్రద్ధగా చదివి ఉద్యోగం కూడా సంపాదించాడు. వృద్ధుడు ఆ యువకుడికి పెళ్ళి కూడా చేశాడు.

ఆ యువకుడికి ఆ వృద్ధునిపై ఎంతో కృతజ్ఞత ఉంది. వృద్ధుడు ఆ యువకుడిని ప్రేమగా చూసేవాడు. ఆ యువకుడికి పుట్టినరోజు ఎప్పుడో కూడా తెలియదు. ఆ యువకుడు విద్యాలయంలో చేరిన రోజునే, తన పుట్టినరోజుగా ఆ యువకుడు భావించేవాడు.

యువకుడు ఎక్కడ ఉన్నా, వృద్ధుడు ఎక్కడ ఉన్నా యువకుడు తన పుట్టినరోజున తప్పకుండా వచ్చి ఆ వృద్ధుడి కాళ్ళు పట్టుకొని ఆ వృద్ధుడి పాదాలను, తన ఆనందబాష్పాలతో ముంచెత్తేవాడు. ఆ వృద్ధుడు ఆ యువకుడిని ఆశీర్వదించి, తన ఆనందబాష్పాలతో యువకుడి తలను తడిపివేసేవాడు. వారి మధ్యన ఉన్న అనుబంధం అనిర్వచనీయం.

10th Class Telugu 10th Lesson గోరంతదీపాలు Important Questions and Answers

ప్రశ్న 1.
‘అనాథ బాలలకు చేయూతనందిస్తే ఎంతటి స్థాయికైనా ఎదుగగలరు’ – ఈ అంశంపై వ్యాసం వ్రాయండి.
జవాబు:
‘అనాథ బాలలు – చేయూత’

తల్లిదండ్రులు లేని పిల్లలను అనాథ బాలలు అంటారు. అలాగే తల్లిదండ్రులకు డబ్బులేక, చదువు సంధ్యలు చదువుకోకుండా వీథి బాలలుగా తిరిగే దిక్కులేని పిల్లలు ఉంటారు. కొందరు పిల్లలు తల్లిదండ్రులపై కోపగించుకొని పారిపోయి రోడ్లపై బిచ్చం ఎత్తుకుంటూ, రైళ్ళల్లో చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ అనాథలుగా తిరుగుతారు. ఇలాంటి అనాథలకు రక్షణ కల్పించి వారు చదువుకోడానికి ఆశ్రయం కల్పిస్తే వారు కూడా మంచిగా పెరిగి అభివృద్ధిలోకి వస్తారు. ఆ గోరంత దీపాలను కొండంత దీపాలుగా చేయడానికి సంఘంలోని సంపన్నులూ, దాతలూ, అనాథ శరణాలయాలవారూ, ప్రభుత్వమూ సహాయం చేయాలి.

ఈనాడు దేశంలో ఎన్నో అనాథ శరణాలయాలు ఉన్నాయి. వారు ప్రజల నుండి చందాలు వసూలు చేసి అనాథ బాలబాలికలకు ఆశ్రయం కల్పించి, వారిని పెద్దవారిని చేసి వారికి పెళ్ళిళ్ళు చేయిస్తున్నారు. ఇటువంటి అనాథ శరణాలయాలకు డబ్బు కలవారు విరివిగా విరాళాలు ఇవ్వాలి. అనాథ బాలబాలికలకు తోడుగా నిలవాలి.

డబ్బు కలవారు, దాతలు, ఉదారహృదయం కలవారు తమ సంపాదనలో కొంత భాగం అనాథలకు కేటాయించాలి. అలా ఇచ్చి అనాథలను పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు చెప్పించాలి. అలా చేస్తే వారు పెద్దవారై ఎంతో ఉన్నత స్థానాన్ని తప్పక పొందుతారు. అటువంటి అనాథలు పెద్దవారై డాక్టర్లుగా, ప్రజాపరిపాలకులుగా, ఇంజనీర్లుగా తయారవుతారు. ప్రభుత్వం కూడా అనాథ శరణాలయాలను స్థాపించి, అనాథ బాలబాలికలకు చేయూతను అందివ్వాలి. అప్పుడే ఆ గోరంత దీపాలు పెద్దవై, కొండంత వెలుగును ఇస్తాయి. అనాథ బాలబాలికలకు సాయంచేస్తే దేవుడు కూడా సంతోషించి వారికి మోక్షాన్ని, సంపదలను, సౌఖ్యాన్ని ఇస్తాడు.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 10 గోరంతదీపాలు

ప్రశ్న 2.
అనాథలను ఆదుకొన్న మీ మామయ్యను అభినందిస్తూ లేఖ వ్రాయండి.
జవాబు:

నెల్లూరు,
x x x x x.

పూజ్యులైన చిన్న మామయ్యకు నమస్కరించి,
మీ మేనకోడలు పద్మ వ్రాయు లేఖ.

ఇక్కడంతా క్షేమం. అక్కడ మీరంతా క్షేమమని తలచెదను.

మొన్న తుపాను మీ ప్రాంతంలో చాలా భీభత్సం సృష్టించిందని టీ.వీ. లో చూశాను. పేపర్లో చదివాను. చాలా కంగారు పడ్డాము. మా అమ్మా నాన్నా మిమ్మల్ని చూసి వచ్చేక నాకొక సంగతి చెప్పారు.

ఒక కుటుంబంలో తుపానుకు ఇల్లు కూలి అందరూ మరణించారనీ, ముగ్గురు చిన్నపిల్లలు మిగిలారనీ, ఆ పిల్లలను మీరు పెంచుతున్నారనీ మా అమ్మ చెప్పింది. అంతేకాకుండా చాలామందికి ఆహారం, బట్టలు అందించారని కూడా చెప్పారు. మీ పరోపకార బుద్ధికి నాకు చాలా ఆనందం కల్గింది.

నా స్నేహితులకు మీ మంచి మనసు గురించి చెప్పాను. వాళ్ళంతా చాలా ఆనందించారు. మీ మేనకోడలిని అయినందుకు చాలా గర్వపడ్డాను. కేవలం మాటలు కాకుండా, చేతలతో మంచి చేసే మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను, అభినందిస్తున్నాను. అత్తయ్యకు నా నమస్కారాలు.

ఇట్లు,
మీ మేనకోడలు,
వి. పద్మ.

చిరునామా :
ఎస్. నరసింహారావుగారు,
తెలుగు ఉపాధ్యాయులు,
బాలికోన్నత పాఠశాల,
నరసరావుపేట, గుంటూరు జిల్లా.

ప్రశ్న 3.
అనాథలను ఆదుకోవలసిన అవసరం గురించి వివరిస్తూ ఒక కరపత్రం తయారుచేయండి.
జవాబు:
అమృత హృదయులారా ! ఆదుకోండి

అనాథలను ఆదుకోవడం మన కర్తవ్యం. మానవ సేవే మాధవ సేవ అన్నారు పెద్దలు. తోటి మనిషిని ఆదరించండి. పట్టెడన్నం పెట్టండి. సమాజానికి ఉపయోగపడే మాణిక్యాలను మట్టిలో కలిసిపోనీయకండి. ఇది మన బాధ్యత. వాళ్లు కూడా మన సోదరులే.

భగవంతుడికి ‘దరిద్ర దామోదరుడ’ని పేరు. అనాథలలో దైవాన్ని సందర్శించండి. ఆదరించండి. తీర్చిదిద్దండి. భరతమాత సేవలో పునీతులవ్వండి.

ఇట్లు,
అనాథల పెద్ద అన్న.

10th Class Telugu 10th Lesson గోరంతదీపాలు 1 Mark Bits

1. వ్యవసాయంలో అధిక దిగుబడుల కోసం శాస్త్రవేత్తలు ప్రయత్నం చేయాలి – గీత గీసిన పదాలకు నానార్థమును గుర్తించుము. (March 2017)
A) కృషీవలుడు
B) కృషి
C) కర్షకుడు
D) కారణము
జవాబు:
B) కృషి

2. ప్రజలను పాలించే ప్రభువు దేవతలకు తోడు ఇంద్రుడులా ఉండాలి – గీత గీసిన పదానికి నానార్థమును గుర్తించుము. (March 2017)
A) భర్త
B) రాజు
C) శని
D) ధర్మము
జవాబు:
B) రాజు

3. ఏ వయస్సులో చేయవలసిన దానిని, ఆ సమయంలో చేయకున్నచో జీవితము నరకంతో సమానం కాగలదు – గీత గీసిన పదాలకు సంబంధించిన నానార్థ పదాన్ని గుర్తించుము. (March 2018)
A) ప్రాయము
B) కాయము
C) కార్యము
D) ఆదాయము
జవాబు:
A) ప్రాయము

4. విద్యార్థులు ఎల్లవేళలా చదువుపై దృష్టిని తిరముగా ఉంచుకోవాలి – గీత గీసిన పదానికి ప్రకృతి రూపాన్ని గుర్తించండి. (March 2018)
A) తీరము
B) స్థిరము
C) దూరము
D) భారము
జవాబు:
B) స్థిరము

AP SSC 10th Class Telugu Important Questions Chapter 10 గోరంతదీపాలు

5. రైతులు కష్టపడగలరు. (ఏ వాక్యమో గుర్తించండి ?) (June 2017)
A) సంభావనార్ధకం
B) చేదర్థకం
C) ప్రశ్నార్ధకం
D) సామర్ధ్యార్ధకం
జవాబు:
D) సామర్ధ్యార్ధకం

6. వైద్యుడు ప్రథమ చికిత్స చేసి, మందులు ఇస్తాడు. (ఏ వాక్యమో గుర్తించండి.) (June 2017)
A) క్వార్థకము
B) శత్రర్థకం
C) చేదర్థకం
D) అష్యర్ధకం
జవాబు:
A) క్వార్థకము

7. గోరంత దీపాలు కొండంత వెలుగు నిస్తాయి – దీనికి వ్యతిరేకార్థక వాక్యాన్ని గుర్తించండి. (March 2018)
A) గోరంత దీపాలు కొండంత వెలుగు నివ్వవు
B) గోరంత దీపాలు కొండంత వెలుగు నివ్వవచ్చు
C) గోరంత దీపాలు కొండంత వెలుగు ఇవ్వగలవు.
D) గోరంత దీపాలు కొండంత వెలుగు ఇవ్వకపోవచ్చు
జవాబు:
A) గోరంత దీపాలు కొండంత వెలుగు నివ్వవు

8. వృద్ధుని చేత బాలుడు రక్షింపబడెను – ఇది ఏ రకమైన వాక్యమో గుర్తించండి.
A) సామాన్య
B) సంయుక్త
C) కర్తరి
D) కర్మణి
జవాబు:
D) కర్మణి

AP SSC 10th Class Telugu Important Questions Chapter 10 గోరంతదీపాలు

9. వఱదైన చేనుదున్న వద్దు. (ఇది ఏ వాక్యమో గుర్తించండి) (S.A. I – 2018-19)
A) నిషేధార్థక వాక్యం
B) ప్రార్థనార్థక వాక్యం
C) విధ్యర్ధకం
D) సామర్థ్యార్థక వాక్యం
జవాబు:
A) నిషేధార్థక వాక్యం

10. క్రింది వానిలో విధ్యర్థక వాక్యం గుర్తించండి. (S.A. I – 2018-19)
A) చదవ గలరు
B) చదవండి
C) దయచేసి చదవండి
D) చదువుతున్నారు
జవాబు:
B) చదవండి

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం రామాయణం

AP State Board Syllabus AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం రామాయణం Textbook Questions and Answers.

AP State Syllabus SSC 10th Class Telugu Solutions ఉపవాచకం రామాయణం

10th Class Telugu ఉపవాచకం రామాయణం Textbook Questions and Answers

రామాయణం – కొన్ని వివరణలు

రామాయణం : సంస్కృతంలో వాల్మీకి మహర్షిచే రచింపబడింది. ఆదికావ్యం.

వాల్మీకి మహర్షి : సంస్కృత రామాయణ కర్త. ఆదికవి.

రామాయణానికి గల పేర్లు : రామాయణం, పౌలస్త్యవధ, సీతాయాశ్చరితం మహత్.

దశరథ మహారాజు : కోసలదేశానికి రాజు.

కోసలదేశం : సరయూ నదీ తీరంలో ఉంది.

అయోధ్య : కోసలదేశ రాజధాని

దశరథ మహారాజు భార్యలు : కౌసల్య, సుమిత్ర, కైక (కైకేయి).

రాముడు : కౌసల్య యందు దశరథ మహారాజుకు జన్మించాడు.

లక్ష్మణుడు : సుమిత్ర యందు దశరథ మహారాజుకు జన్మించాడు.

భరతుడు : కైక యందు దశరథ మహారాజుకు జన్మించాడు.

శత్రుఘ్నుడు : సుమిత్ర యందు దశరథ మహారాజుకు జన్మించాడు.

రామాయణంలోని శ్లోకాల సంఖ్య : 24 వేలు

రామాయణంలోని కాండములు : 1. బాలకాండ, 2. అయోధ్యాకాండ, 3. అరణ్యకాండ, 4. కిష్కింధ కాండ, 5. సుందరకాండ, 6. యుద్ధకాండ, 7. ఉత్తరకాండ

నారదుడు : దేవర్షి, తపస్వి, వాక్చతురుల్లో శ్రేష్ఠుడు.

వాల్మీకి ఆశ్రమం : తమసానదీ తీరంలో ఉంది.

వాల్మీకి నోట అప్రయత్నంగా వచ్చిన శ్లోకం : “మానిషాద ప్రతిషం…..”

ఋష్యశృంగుడు : విభాండక మహర్షి కుమారుడు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వానలు బాగా కురుస్తాయి.

పుత్రకామేష్టి : దశరథ మహారాజు సంతానం కోసం చేసిన యాగం.

మారీచసుబాహులు : తాటకాసునందనుల కుమారులు (రాక్షసులు). ఋషుల యజ్ఞయాగాలకు విఘ్నాలు కలిగించేవాళ్ళు.

మారీచుడు : ఇతడు తన రాక్షస మాయచేత బంగారు లేడి (మాయలేడి) రూపాన్ని ధరించాడు.

బల, అతిబల : విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు ఉపదేశించిన విద్యలు. వీటి ప్రభావం వల్ల అలసట, ఆకలి దప్పులు ఉండవు. రూపకాంతులు తగ్గవు.

తాటక : యక్షిణి

సిద్ధాశ్రమం : వామనుడు (విష్ణువు) సిద్ధిపొందిన చోటు.

జనక మహారాజు : మిథిలానగరానికి ప్రభువు. సీతాదేవి తండ్రి.

కుశధ్వజుడు : జనకమహారాజు తమ్ముడు.

అహల్య : గౌతమ మహర్షి భార్య.

శతానందుడు : అహల్యా గౌతముల కుమారుడు.

సీత (జానకి) : శ్రీరాముని భార్య

ఊర్మిళ : లక్ష్మణుని భార్య

మాండవి : భరతుని భార్య

శ్రుతకీర్తి : శత్రుఘ్నుని భార్య

పరశురాముడు : రేణుకా జమదగ్నుల కుమారుడు. ఇరవై ఒక్కసార్లు భూప్రదక్షిణం చేసి ఎంతో మంది క్షత్రియులను సంహరించాడు.

కార్తవీర్యార్జునుడు : పరశురాముని తండ్రియైన జమదగ్నిని సంహరించాడు.

మంథర : కైకేయి అత్తవారింటికి వచ్చినప్పుడు ఆమె వెంట వచ్చిన అరణపు దాసి.

సుమంత్రుడు : దశరథుని మంత్రులలో ఒకడు. దశరథుని రథం తోలేవాడు. ఇతడే శ్రీరాముని రథసారథి.

గుహుడు : శృంగిబేరపురానికి రాజు. శ్రీరామభక్తుడు. దండకారణ్య వాసానికి పోతున్న సీతారామ లక్ష్మణులను గంగానది దాటించాడు.

భరద్వాజుడు : సప్త ఋషులలో ఒకడు. వనవాసం చేస్తున్న రాముడు ఈయన ఆశ్రమాన్ని దర్శించాడు.

భరద్వాజాశ్రమం : గంగాయమున సంగమ ప్రదేశంలో ఉంది.

చిత్రకూటం : ఒక పర్వతం. ఇక్కడే రాముని ఆదేశం ప్రకారం లక్ష్మణుడు నేరేడు కర్రలతో కుటీరాన్ని నిర్మించాడు.

అత్రిమహర్షి : సీతారామలక్ష్మణులు అరణ్యవాసం చేసేటప్పుడు ఈయన ఆశ్రమాన్ని దర్శించారు.

అనసూయ : అత్రి మహర్షి భార్య. ఈమె సీతాదేవికి దివ్య వస్త్రాభరణాలను ఇచ్చింది.

దండకారణ్యం : ఇక్కడ మునుల ఆశ్రమాలు చాలా ఉన్నాయి. వింధ్య పర్వతానికి దక్షిణాన ఉన్న అరణ్యం. దండునిపురం మట్టిలో కలిసిపోయి అక్కడ అరణ్యంగా ఏర్పడటం చేత దీనికి దండకారణ్యం అని పేరు వచ్చింది.

విరాధుడు : తుంబురుడనే గంధర్వుడు కుబేరుని శాపంవల్ల రాక్షసుడిగా మారాడు. శరభంగ మహర్షిని దర్శించుకుంటే శుభం జరుగుతుందని శ్రీరామునికి చెప్పాడు.

శరభంగ మహర్షి : మహాతపస్వి. దైవ సాక్షాత్కారం పొందినవాడు. తన తపఃఫలాన్నంతా శ్రీరామునికి ధారపోశాడు.

సుతీక్ష్య మహర్షి : సీతారామలక్ష్మణులు ఈయన ఆశ్రమాన్ని దర్శించాడు. ఈయన తన తపశ్శక్తినంతా శ్రీరామునికి ధారపోశాడు.

విశ్వామిత్రుడు : గాధి కుమారుడు. యాగరక్షణార్థం రామలక్ష్మణులను తన వెంట తీసుకువెళ్ళాడు.

అగస్త్య భ్రాత : అగస్త్యుని సోదరుడు. ఇతని పేరు రామాయణంలో చెప్పబడలేదు. అందుకే పేరు తెలియని వారిని ‘అగస్త్య భ్రాత’ అంటారు.

అగస్త్య మహర్షి : వింధ్యపర్వత గర్వాన్ని అణచినవాడు. ఈయన శ్రీరామునికి దివ్య ధనుస్సు, అక్షయ తూణీరాలు, అమోఘమైన ఖడ్గాన్ని బహూకరించాడు.

పంచవటి : గోదావరి తీరాన ఉన్న ఒక అరణ్యం. వనవాసం చేస్తున్న సీతారామలక్ష్మణులు ఇక్కడే పర్ణశాలను నిర్మించుకొని నివసించారు.

జటాయువు : ఒక పెద్ద గ్రద్ద. సంపాతికి తమ్ముడు. ఈ జటాయువు దశరథునికి మిత్రుడు. శ్రీరాముడు ఈయనకే సీత సంరక్షణ బాధ్యతను అప్పగించాడు. రావణాసురుడు సీతను అపహరించి తీసుకొని వెళ్ళాడని శ్రీరామునికి తెలిపింది ఇతడే.

శూర్పణఖ : ఒక రాక్షసి. రావణాసురుని చెల్లెలు, లక్ష్మణుడు ఈమె ముక్కు, చెవులను కోసి విరూపినిగా చేశాడు.

ఖరదూషణులు : శూర్పణఖ సోదరులు.

అకంపనుడు : రావణాసురుడి గూఢచారులలో ఒకడు.

రావణుడు : కైకసీ విశ్రవసుల కుమారుడు. లంకానగరానికి అధీశుడు. సీతను అపహరించి తీసుకొని వచ్చినవాడు.

లంకానగరం : త్రికూట పర్వతం మీద ఉంది.

కబంధుడు : ఒక రాక్షసుడు. ఇతని చేతుల్లో చిక్కి తప్పించుకోవడం ఎవరి వల్ల కాదు. రావణునిచేత అపహరింపబడిన సీతాదేవి దొరికే ఉపాయాన్ని శ్రీరామునికి తెలియజేసినవాడు ఇతడే.

శబరి : ఒక బోయకాంత. తపస్సిద్ధురాలు. పంపాతీరంలో ఆశ్రమాన్ని ఏర్పరచుకొని నివసించింది. శ్రీరామ దర్శనంతో ఈమె తనువు పులకించింది. పంపాతీరంలో దొరికే పండ్లను రామునికి అర్పించింది.

ఋష్యమూక పర్వతం : కిష్కింధకు దగ్గరలో గల ఒక పర్వతం. సుగ్రీవుడు నివసించింది ఈ పర్వతం పైనే.

వాలి సుగ్రీవులు : వనరులు. అన్నదమ్ములు. వాలి సుగ్రీవులు శత్రువులుగా ఉన్నప్పుడే సుగ్రీవుడు రామునితో స్నేహం చేశాడు.

హనుమంతుడు : అంజనకు వాయుదేవుని అనుగ్రహం వల్ల జన్మించాడు. ఇతడు సుగ్రీవుని మంత్రి. ఇతడే సుగ్రీవునికి రామలక్ష్మణులతో స్నేహం ఏర్పాటు చేశాడు. సముద్రానికి వారధి కట్టి లంకలో ప్రవేశించాడు. సీత ఉన్న అశోకవనం తప్ప మిగిలిన లంక అంతా కాల్చాడు. కిష్కింధకు వెళ్ళి సీతను చూసిన వృత్తాంతాన్ని తెలియజేశాడు.

తార : వాలి భార్య.

రుమ : సుగ్రీవుని భార్య. అంగదుడు : వాలి కుమారుడు.

నీలుడు : ఒక వానరుడు. సుగ్రీవుని సేనలోనివాడు.

నలుడు : ఒక వానరుడు. విశ్వకర్మ యొక్క పుత్రుడు. సుగ్రీవుని సేనలోనివాడు. సముద్రానికి వారథి కట్టడానికి ఇతడే ప్రారంభించాడు.

జాంబవంతుడు : భల్లూకరాజు.

సుషేణుడు : వానరరాజు, తారతండ్రి.

సంపాతి : పక్షిరాజు. జటాయువుకు అన్న. లంకలో సీత ఉన్న పరిస్థితులను దివ్యదృష్టితో చూసి కళ్ళకు కట్టినట్లు వివరించాడు. లంకకు ఎలా వెళ్ళాలో చెప్పాడు.

మైనాకుడు : ఒక పర్వతం. మేనకా హిమవంతుల కుమారుడు. ఇంద్రుడు పర్వతాల రెక్కలు విరగగొడుతున్నప్పుడు ఇతడు భయపడి దక్షిణ సముద్రంలో దాక్కున్నాడు. హనుమంతుడు సముద్రం దాటేటప్పుడు మైనాకుడు పైకి వచ్చి తనపై విశ్రమింపమని కోరాడు. హనుమంతుడు కొంతసేపు విశ్రమించాడు.

సురస : నాగమాత. హనుమంతుని సూక్ష్మబుద్ధిని, సమయస్ఫూర్తిని చూసి ఆనందించి ఆశీర్వదించింది.

సింహిక : ఒక రాక్షసి. హనుమంతుని మింగాలని చూసింది. కాని హనుమంతుడే తన వాడి అయిన గోళ్ళతో సింహికను చీల్చేశాడు.

లంకిణి : లంకాధిదేవత.

కుంభకర్ణుడు : రావణుని తమ్ముడు. శ్రీరాముడు ఐంద్రాస్త్రంతో ఇతని శిరస్సును ఖండించాడు.

మహాపార్శ్వుడు : రావణుని సేనానాయకులలో ఒకడు.

వీభీషణుడు : రావణుని తమ్ముడు. రావణుడు పరాయి స్త్రీలను తీసుకొని వచ్చినప్పుడు అది తగదని బోధించాడు. ఇతడు రాముని పక్షంలో చేరాడు.

మహూదరుడు : ఒక రాక్షసుడు. రావణుని సేనలోనివాడు.

విరూపాక్షుడు : మాల్యవంతుని కుమారుడు. రావణుని పక్షాన పోరాడాడు. యుద్ధంలో ఇతనిని సుగ్రీవుడు సంహరించాడు.

విద్యుజిహ్వుడు : ఒక రాక్షసుడు. శూర్పణఖ భర్త.

త్రిజట : విభీషణుని కూతురు. లంకలో సీతకు కావలి ఉన్న రాక్షసి. తనకు వచ్చిన కలను బట్టి సీత కోరిక నెరవేరుతుందని, రావణునికి వినాశం తప్పదని, శ్రీరాముడికి జయం కలుగుతుందని చెప్పింది.

ఇంద్రజిత్తు : రావణుని పెద్ద కుమారుడు. ఇతని పేరు మేఘనాథుడు. ఇంద్రుని ఓడించడం వల్ల ఇంద్రజిత్తు. అని పేరు వచ్చింది. ఇతడు బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించి హనుమంతుణ్ణి బంధించాడు

ప్రహస్తుడు : రావణుని సేనానాయకులలో ఒకడు.

శుకసారణులు : రావణాసురుని మంత్రులు.

సరమ : విభీషణుని భార్య.

జంబుమాలి : ప్రహస్తుని కుమారుడు. రావణుని సేనలోనివాడు

అతికాయుడు : రావణుని కుమారుడు. ఇతనిని లక్ష్మణుడు సంహరించాడు.

మాతలి : ఇంద్రుని రథ సారథి.

పుష్పక విమానం : ఇది కుబేరుని విమానం. దీన్ని బ్రహ్మ కుబేరునికి ఇచ్చాడు. రావణుడు బలాత్కారంగా కుబేరుని వద్ద నుంచి తీసుకున్నాడు. రావణుని చంపిన తరువాత శ్రీరాముడు దీన్ని ఎక్కి లంక నుండి వచ్చాడు. తరువాత దీన్ని కుబేరునకు ఇచ్చాడు.

త్రికూట పర్వతం : లంకానగరం ఈ పర్వతం మీద ఉన్నది.

వ్యాసరూప ప్రశ్నలు

ప్రశ్న 1.
రామాయణ ప్రాశస్త్యమును గురించి రాయండి.
(లేదా)
రామాయణాన్ని ఎందుకు చదవాలి?
(లేదా)
“రామాయణం భారతీయులకు ఒక ఆచరణీయ గ్రంథం” వివరించండి.
(లేదా)
మానవ సంబంధాల గొప్పతనాన్ని వివరించిన రామాయణం యొక్క ప్రాశస్త్యాన్ని విశ్లేషించండి.
జవాబు:
‘రామాయణం’ మానవ జీవితాన్ని సంస్కరించగల మహాకావ్యం. ఈ కథ మానవహృదయాల నుండి ఎప్పటికీ చెరగదు. రామాయణం జీవిత పార్శ్వాలను ఎన్నింటినో కనబరుస్తుంది.

రామాయణంలో అమ్మానాన్నల అనురాగం, పుత్రుల అభిమానం, అన్నదమ్ముల అనుబంధం, భార్యాభర్తల సంబంధం, గురుభక్తి, శిష్యాను రక్తి, స్నేహఫలం ధర్మబలం, వినయంతో ఒదగడం, వివేకంతో ఎదగడం, జీవకారుణ్య భావన, ప్రకృతి లాలన వంటి జీవిత పార్శ్వా లు ఎన్నో కనబడతాయి.

రామాయణాన్ని చదవడం అంటే, జీవితాన్ని చదవడమే. ‘రామాయణం ఆచరణ ప్రధాన గ్రంథం. ఉత్తమమైన ధర్మాలను ఆచరిస్తే, మనిషి మనిషిగా ఎలా ఎదగగలడో, రామాయణం నేర్పుతుంది. చిన్న చిన్న పాత్రల ద్వారా రామాయణం గొప్ప సందేశాన్ని అందిస్తుంది.

రామాయణంలో వాల్మీకి మహర్షి మారీచుని వంటి రాక్షసుని నోటి నుండి, “రామో విగ్రహవాన్ ధర్మః, సత్యధర్మ పరాక్రమః” అనే గొప్పమాటను పలికించాడు.

రాముడి వంటి ఆదర్శమూర్తి, రామాయణం వంటి ఆదర్శకావ్యం ‘నభూతో నభవిష్యతి!” అంటే “పూర్వమందు లేదు, ముందు కాలంలో రాబోదు” మనిషి ఉన్నంత వరకూ రామాయణం ఉంటుంది.

రామాయణం ప్రపంచ సాహిత్యంలోనే ‘ఆదికావ్యం’. వాల్మీకి మహర్షి సంస్కృతంలో దీనిని 24 వేల శ్లోకాలతో రాశాడు. రామాయణం ముందు తరాల వారికి స్ఫూర్తిని ఇస్తుంది. అందువల్లనే మనం, రామాయణాన్ని తప్పక చదవాలి.

ప్రశ్న 2.
‘రామాయణం’ ఏ విధంగా విశ్వరూపాన్ని చూపిందో రాయండి.
జవాబు:
‘రామాయణం’ మానవ జీవిత మూల్యాలను చూపింపచేసే అక్షరమణుల అద్దం. అందుకే రామాయణం కొండలు, సముద్రాలు ఉన్నంత వరకూ ఉంటుందని బ్రహ్మ వాల్మీకి మహర్షికి చెప్పాడు. వాల్మీకి, రామాయణాన్ని రచించాడు. దీని తరువాత దేశ విదేశాలలో అనేక ప్రక్రియల్లో ఎన్నో రామాయణాలు వచ్చాయి. వీటన్నింటికీ మూలం “వాల్మీకి రామాయణం”. తరువాతి కాలంలో ఎన్నో రామాయణాలు వచ్చాయి. రచయితలు కొందరు వాల్మీకి రామాయణ మూలాన్ని అనుసరించారు. కొందరు స్వతంత్ర పోకడలు పోయారు.

సంస్కృత సాహిత్యం – రామకథ :
రామకథ వివిధ పురాణాల్లో కనబడుతుంది.

  1. ఆధ్యాత్మ రామాయణం
  2. కాళిదాసు రచించిన ‘రఘువంశం’- దీనిలో రామకథతోపాటు అతని పూర్వుల చరిత్ర కూడా రాయబడింది.
  3. చంపూ రామాయణం – భోజుడు దీనిని గద్యపద్యాలతో రచించాడు.
  4. “రావణవధ” దీనిని భట్టి కవి రాశాడు.
  5. “ప్రతిమా నాటకం’ పేరుతో రామకథను భాసుడు రాశాడు.
  6. ఉత్తర రామచరితం : భవభూతి నాటకంగా దీనిని రాశాడు.
  7. రాఘవ పాండవీయం : రెండర్థాల కావ్యంగా భారత రామకథలు మేళవించి, ధనంజయుడు దీనిని రాశాడు.

కాశ్మీరీ భాషలో దివాకర ప్రకాశభట్టు “రామావలోకచరిత”, “లవకుశ యుద్ధచరిత” ను రచించాడు. మరాఠీలో సమర్థరామదాసు ‘రామాయణం’, మోరోపంతు రాసిన “లవకుశాఖ్యానమ్’, ‘మంత్ర రామాయణమ్’ పేరు పొందాయి. వంగభాషలో కృత్తివాస ఓఝా “రామాయణానికి” మంచి పేరుంది. తమిళ భాషలో ‘కంబ రామాయణం’ మలయాళంలో ఎళుత్తచ్చన్ “అధ్యాత్మ రామాయణం”, కన్నడంలో నాగచంద్రుడు రాసిన “రామచంద్ర చరిత పురాణం’ చంపూ మార్గంలో సాగింది. ఒరియాలో సిద్ధేంద్రయోగి “విచిత్ర రామాయణం” రాశాడు.

తెలుగు భాషలో రామాయణాలు:
గోనబుద్ధారెడ్డి “రంగనాథ రామాయణం” తెలుగులో మొదటి రామాయణం. ఇందులో వాల్మీకి రాయని ఎన్నో కల్పనలు ఉన్నాయి. ఇది ద్విపద రామాయణం. తాళ్ళపాక అన్నమాచార్యుల రామాయణం, కట్టా వరదరాజు రామాయణం, ఏకోజీ రామాయణం ద్విపదలో సాగాయి.

తిక్కన ‘నిర్వచనోత్తర రామాయణం’ తెలుగుజాతిపై ముద్ర వేసింది. హుళక్కి భాస్కరుడు, అతని కుమారుడు మల్లికార్జున భట్టు, శిష్యుడు రుద్రదేవుడు, మిత్రుడు అయ్యలార్యుడు, “భాస్కర రామాయణం” రాశారు. ఇక మొల్ల సంక్షిప్తంగా సుందరంగా రామాయణాన్ని తీర్చిదిద్దింది. అయ్యలరాజు రామభద్రుడు ‘రామాభ్యుదయం’ మంచి ప్రబంధం. తంజావూరు రఘునాథ నాయకుడు ‘రఘునాథ రామాయణం’ వాల్మీకిని అనుసరించి రాశాడు. గోపీనాథ వేంకట కవి ‘గోపీనాథ రామాయణం’ రాశాడు. కంకంటి పాపరాజు ‘ఉత్తర రామాయణం’ రాశాడు.

కాణాదం పెద్దన “ఆధ్యాత్మ రామాయణం’ రాశాడు. గద్వాల సంస్థానాధీశులు, ఆరుగురు కవులచే రామాయణాన్ని ఆంద్రీకరింపజేశారు. వావిలికొలను సుబ్బారావుగారు “ఆంధ్రవాల్మీకి రామాయణం, శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రిగారి “శ్రీకృష్ణ రామాయణం” పేరు పొందాయి.

విశ్వనాథ సత్యనారాయణ గారి “శ్రీమద్రామాయణ కల్పవృక్షం” జ్ఞానపీఠ పురస్కారాన్ని సంపాదించింది. పింగళి సూరన ‘రాఘవ పాండవీయం’ ద్వ్యర్థి కావ్యాన్ని రాశాడు. నెల్లూరి రాఘవకవి. ‘యాదవ రాఘవ పాండవీయం’ అనే త్ర్యర్థి కావ్యం రాశాడు. కేశవయ్య “దాశరథి చరిత్ర” పేరుతో నిరోష్ఠ్యరామాయణం రాశాడు.

ఇవి కాక తెలుగులో రామాయణం పాటలు, నాటకాలు, హరికథలు, స్త్రీల రామాయణం పాటలు, వచన కావ్యాలు వచ్చా యి.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 6 శతక మధురిమ

AP State Board Syllabus AP SSC 10th Class Telugu Important Questions Chapter 6 శతక మధురిమ

AP State Syllabus SSC 10th Class Telugu Important Questions 6th Lesson శతక మధురిమ

10th Class Telugu 6th Lesson శతక మధురిమ 2 Marks Important Questions and Answers

ఈ క్రింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాల్లో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
పరుల ధనాన్ని ఆశించి చేసే పనులుగా ధూర్జటి కవి వేటిని పేర్కొన్నారు? (March 2018)
జవాబు:
జాతకాలు చెప్పడం, రాజులకు సేవలు చేయడం, అబద్దాలు కల్పించడం, ధర్మాన్ని తప్పడం, చాడీలు చెప్పడం, హింసలు చేయడం, ఉన్నవీ లేనివి పలకడం, మొదలగు వాటిని ఇతరుల ధనాన్ని ఆశించి చేసే పనులుగా ధూర్జటి కవి పేర్కొన్నాడు.

ప్రశ్న 2.
ఒక వ్యక్తి చేయకూడని పనులుగా బద్దెన కవి వేటిని పేర్కొన్నాడో తెలపండి. (March 2019)
జవాబు:
వరదలు వస్తే మునిగిపోయే పొలమును దున్నడం, కఱవు వచ్చినప్పుడు బంధువుల ఇళ్ళకి వెళ్ళడం, రహస్యాన్ని ఇతరులకు చెప్పడం, పిటికివాడికి సేనానాయకత్వమును ఇవ్వడం వంటివి ఒక వ్యక్తి చేయకూడని పనులుగా బద్దెన కవి పేర్కొన్నాడు.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 6 శతక మధురిమ

ప్రశ్న 3.
ధర్మం ఆచరించే వాడిని నీచుడు నిందించినా నష్టం ఏమీ లేదు అనే విషయాన్ని మారదవెంకయ్య ఏ ఉపమానంతో చెప్పాడు?
జవాబు:
‘ధర్మం ఆచరించే వాడిని నీచుడు నిందించినా నష్టం ఏమీ లేదు’ అనే విషయాన్ని మారద వెంకయ్య అమృత సముద్రంలో రెట్టవేసే కాకితో పోల్చాడు.

అమృత సముద్రముపై నుండి కాకి ప్రయాణం చేస్తూ ఆ సముద్రంలో ఆ కాకి రెట్ట వేస్తుంది. అంతమాత్రం చేత, ఆ సముద్రానికి ఏమీ లోటు రాదు. అలాగే ధర్మాత్ముడిని నీచుడు నిందించినా, ఆ ధర్మమూర్తికి లోటు రాదు.

ప్రశ్న 4.
‘శతకం’ అనే ప్రక్రియను గురించి వివరించండి.
జవాబు:
ప్రాచీన తెలుగు సాహిత్య ప్రక్రియల్లో ‘శతకం’ అనే ప్రక్రియ ప్రముఖమైనది. ఇందులో నూరు పద్యాలు ఉంటాయి. కొన్నింటిలో నూరుకు పైగా పద్యాలు ఉంటాయి. శతకంలో మకుటం ప్రధానంగా ఉంటుంది. శతకపద్యాలు నీతిని, ధర్మాన్ని, భక్తిని, వైరాగ్యాన్ని కలిగిస్తాయి. శతక పద్యాలు నైతిక విలువలను ప్రబోధిస్తాయి. శతకపద్యాలు జగతిని జాగృతం చేస్తాయి.

ప్రశ్న 5.
మీకు తెలిసిన ఒక దాతను గురించి సొంతమాటల్లో రాయండి.
జవాబు:
మా ఊళ్ళో సోమయ్య అనే వ్యాపారి ఉన్నాడు. ఆయన గొప్పదాత. తన వ్యాపారంలో వచ్చిన లాభాన్ని దానధర్మాలకు ఉపయోగిస్తాడు. పేద విద్యార్థులకు ఫీజులు కట్టడం, పుస్తకాలు కొనిపెట్టడం, స్కూలు యూనిఫారం కుట్టించడం మొదలగు పనులు చేస్తుంటాడు. వారికి భోజన వసతి కూడా ఏర్పాటు చేస్తాడు.

ఎవరైనా పేదవారు పెళ్ళిళ్ల సమయంలో వచ్చి యాచిస్తే వారికి ధన సహాయం చేస్తాడు. బంగారు మంగళసూత్రాలు దానం చేస్తాడు. ఆయన దేవాలయాలకు, ధర్మసత్రాలకు, అన్నసత్రాలకు, విద్యాలయాలకు విరివిగా దానధర్మాలు చేస్తుంటాడు. ఇరుగుపొరుగు ప్రాంతాలవారు వచ్చి యాచించినా ‘లేదు’ అనకుండా అందరికీ తన శక్తికొద్దీ దానం చేస్తుంటాడు. మా ప్రాంతంలో ఆయన ‘దాత’గా మంచి కీర్తి సంపాదించాడు.

ప్రశ్న 6.
సంపద ఎవరి వద్దకు వచ్చి చేరుతుంది?
జవాబు:
దైవం మనపై దయతో సంపదలు ప్రసాదిస్తాడు. కలిగినంతలో పేదలకు పెట్టాలి. నిందించకుండా, ఆదరణతో పెట్టాలి. ఆ విధంగా పెట్టినవారు ఏ ప్రయత్నం చేయకపోయినా సంపద వారిని చేరుతుంది.

దీనిలో విశేషమేమిటంటే విష్ణువుకు (దరిద్ర) నారాయణుడు, (దరిద్ర) దామోదరుడు అని పేర్లు. అంటే దరిద్రులలో నారాయణుడు ఉంటాడు. నారాయణుని భార్య లక్ష్మీదేవి. తన భర్తను ఆదరించిన వారి దగ్గరకే భార్య కూడా వెడుతుంది. కానీ, ఆదరించని వారి దగ్గరకు వెళ్ళదు కదా ! అందుచేత పేదలను (నారాయణుని) ఆదరించే వారి దగ్గరకు లక్ష్మి వెడుతుంది. సంపదలు ప్రసాదిస్తుంది.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 6 శతక మధురిమ

ప్రశ్న 7.
ఎవరిని ఆశ్రయిస్తే ఎలాంటి ఫలితం కలుగుతుందో వివరించండి.
జవాబు:
మనిషి అధముడిని ఆశ్రయిస్తే, అతడు కూడా అధముడై పేరు లేకుండా పోతాడు. మనిషి మధ్యముడిని ఆశ్రయిస్తే, తాను కూడా మధ్యముడు అవుతాడు. మనిషి ఉత్తముడిని ఆశ్రయిస్తే తాను కూడా ఉత్తముడు అవుతాడు.

భర్తృహరి ఈ విషయాన్ని చక్కగా సోదాహరణంగా ఇలా వివరించాడు. నీళ్ళు కాల్చిన ఇనుముమీద పడితే, అవి ఆవిరి అయిపోయి పేరులేకుండాపోతాయి. ఆ నీళ్ళు తామరాకు మీద పడితే ముత్యములవలె ప్రకాశిస్తాయి. ఆ నీళ్ళే, ముత్యపుచిప్పలలో పడితే, ముత్యములవలె మారతాయి. నీటి బిందువు తాను ఆశ్రయించిన స్థానాన్ని బట్టి ప్రకాశించింది. అలాగే మనిషి తాను పొందిన ఆశ్రయాన్ని బట్టి రాణిస్తాడని మనం గ్రహించాలి.

ప్రశ్న 8.
ధర్మవర్తనులు పాలసముద్రం వంటివారని ఎలా చెప్పగలవు?
జవాబు:
ధర్మప్రవర్తన గల మనుష్యులు పాలసముద్రం వంటివారు. ధర్మప్రవర్తనతో పేరుపడిన మానవుడిని, ఒక నీచుడు మిక్కిలి నీచమైన మాటలతో నిందించినా, తిరస్కరించినా, ఆ ధర్మాత్ముడికి ఎటువంటి లోపమూ కలుగదు. దీనికి భర్తృహరి ఒక మంచి దృష్టాంతం ఇలా చెప్పాడు.

పాలసముద్రం మీదుగా ఎగిరివెళ్ళే కాకి, ఆ పాలసముద్రములో రెట్టవేస్తుంది. అంతమాత్రంచేత ఆ పాలసముద్రానికి ఏమి లోపము రాదు.

అలాగే పాలసముద్రం వంటి ధర్మవర్తనులను నీచులు నిందించినా, ధర్మవర్తనులకు లోటురాదు. దీనిని బట్టి ధర్మవర్తనులు పాలసముద్రం వంటి వారని మనము చెప్పగలము.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 6 శతక మధురిమ

ప్రశ్న 9.
ధర్మవర్తనులకు, ముష్కరులకు గల తేడా ఏమిటో చర్చించండి.
జవాబు:
ధర్మవర్తనులు అనగా ధర్మబద్ధంగా నడుచుకొనే మానవులు. ధర్మవర్తనులు పాలసముద్రము వంటివారు. ముష్కరులు అంటే నీచులు. ఈ నీచులు కాకులవంటివారు. ధర్మబద్ధంగా జీవించేవారిని చూసి కొందరు నీచులు మిక్కిలి హీనమైన నీచవాక్యాలతో నిందిస్తూ మాట్లాడతారు. ఆ నీచుల తిరస్కారవాక్యాల వల్ల ఆ ధర్మవర్తనులకు ఏమి లోపము రాదు.

ఈ విషయంలో భాస్కరశతకకర్త, చక్కని దృష్టాంతం ఇచ్చాడు. పాలసముద్రము నిర్మలంగా ఉంటుంది. ఆ సముద్రం మీది నుండి కాకి ఎగిరివెడుతూ, ఆ పాలసముద్రంలో రేట్ట వేస్తుంది. అంతమాత్రం చేత ఆ పాలసముద్రానికి ఎలా లోటు కల్గదో, అలాగే నీచులు మాట్లాడిన నీచవాక్యాల వల్ల కూడా, ధర్మవర్తనులకు ఎటువంటి లోటు, లోపము రాదని ఆయన చెప్పాడు.

ప్రశ్న 10.
మంచివాని లక్షణములేవి?
జవాబు:
మంచివారు, ఇతరులు తమకు అపకారము చేసినా, తాము మాత్రం ఇతరులకు ఉపకారమే చేస్తూ ఉంటారు. సర్వకాల సర్వావస్థలలోనూ, మంచివారు తమ ధనమాన ప్రాణాలను పరుల మేలు కోసమే వినియోగిస్తారు. ఇతరుల నుండి మంచివారు ప్రత్యుపకారాన్ని కూడా కోరుకోరు.

పై విషయాన్ని సమర్థిస్తూ భాస్కర శతకకర్త మంచి దృష్టాంతము చెప్పాడు. పెరుగును మానవులు కవ్వమును చేతపట్టి ఎంత గట్టిగా చిలుకుతున్నా, పెరుగు ఆ బాధను ఓర్చుకొని, చిలుకుతున్న వారికి వెన్ననే ఇస్తుంది.

అలాగే మంచివాడు. తనకు ఇతరులు కీడు చేస్తున్నా తాను మాత్రం వారికి అపకారము చేయడు. అంతేకాదు మంచివాడు తనకు కీడు చేసినవారికి సైతం ఉపకారము చేస్తాడు.

10th Class Telugu 6th Lesson శతక మధురిమ 4 Marks Important Questions and Answers

ఈ క్రింది ప్రశ్నలకు 10 లేక 12 వాక్యాల్లో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
‘సుభాషిత రత్నావళి’ ని రచించిన ఏనుగు లక్ష్మణ కవిని గురించి మీకు తెలిసిన విషయాలు రాయండి.
జవాబు:
కవి పేరు : ఏనుగు లక్ష్మణకవి

రచించిన శతకం : సుభాషిత రత్నావళి

అనువాద శతకం : ఇది సంస్కృతము నుండి తెలుగులోకి అనువదింపబడిన శతకము. భర్తృహరి మహాకవి సంస్కృత భాషలో ‘సుభాషిత త్రిశతి’ అనే పేరున మూడు శతకాలు రచించాడు. వాటినే
ఏనుగు లక్ష్మణకవి ‘సుభాషిత రత్నావళి’ అనే పేరున తెనిగించాడు.

కాలము : క్రీ.శ. 1720 – 1780 మధ్యకాలము.

నివాసము : ఈయన తూర్పు గోదావరి జిల్లా ‘పెద్దాడ’ గ్రామంలో నివసించారు.

ఇతర గ్రంథాలు :

  1. రామేశ్వర మాహాత్మ్యం,
  2. విశ్వామిత్ర చరిత్ర,
  3. గంగా మాహాత్మ్యం,
  4. రామవిలాసం
    అనేవి వీరి ప్రసిద్ధ రచనలు.

ప్రశ్న 2.
శతక మధురిమలో కొన్ని నీతి పద్యాల నుండి నీతులను గ్రహించావు కదా ! మంచి విద్యార్థికి ఉండాల్సిన ఉత్తమ లక్షణాల గురించి సొంతమాటల్లో రాయండి.
జవాబు:
సమాజంలో విద్యార్థుల పాత్ర తిరుగులేనిది. విద్యార్థులు నవసమాజ నిర్మాతలని ఎందరో మహాకవులు చెప్పారు. విద్యార్థులు ప్రాథమిక దశనుండి వినయ విధేయతలు కలిగియుండాలి. గురువుల పట్ల శ్రద్ధాసక్తులు కలిగియుండాలి.

విద్యార్థులు తోటివారితో స్నేహభావంతో ఉండాలి. చదువుపట్ల ఆసక్తి కలిగి ఉండాలి. చిన్నతనం నుండి నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలి. సామాజిక సేవాకార్యక్రమాల్లో పాల్గొనాలి. బాగా చదువుకొని ఉన్నతస్థాయికి ఎదిగిన వారిని ఆదర్శంగా తీసుకోవాలి. దేశభక్తిని కలిగి ఉండాలి. తల్లిదండ్రులను, గురువులను గౌరవించాలి. మంచి మాటలతో సమాజంలో గౌరవాన్ని పొందాలి. క్రమశిక్షణతో కూడిన జీవనసరళిని అలవరచుకోవాలి.

విద్యార్థులు కొన్ని దురలవాట్లను కూడా దూరం చేసుకోవాలి. తిరస్కారంగా మాట్లాడడం, ఇతరులపై చాడీలు చెప్పడం, ఎదిరించి మాట్లాడడం, క్రమశిక్షణ లేకపోవడం, ఉపాధ్యాయులతోను, తోటి విద్యార్థులతోను గొడవలు పడడం మొదలైన దుర్గుణాలను దూరం చేసుకోవాలి. మంచి అలవాట్లను పెంపొందించుకోవాలి. ఇతరులకు ఆదర్శంగా మెలగాలి.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 6 శతక మధురిమ

ప్రశ్న 3.
శతకపద్యాలు సమకాలీన సమాజాన్ని ప్రతిబింబిస్తాయి – విమర్శిస్తాయి – వివరించండి.
జవాబు:
ప్రాచీన తెలుగు సాహిత్యంలో శతక సాహిత్యానికి సమున్నతమైన స్థానం ఉంది. శతక కవులు వివిధ అంశాలపై చక్కని పద్యాలను రచించారు. సమాజంలో నైతిక విలువల్ని పెంచడానికి ప్రయత్నించారు. శతకపద్యాలు జనాన్ని జాగృతం చేస్తాయి.

శతక కవులు తమ అనుభవ సారాన్ని మధించి తేట తెలుగు పద్యాలను రచించారు. వేమన వంటి ప్రజాకవులు ప్రజల్లోని మూఢనమ్మకాలను తొలగించారు. కొంతమంది శతక కవులు సంఘసంస్కరణోద్యమానికి ఆయుధంగా చేసుకున్నారు. మారద వెంకయ్య వంటి శతక కవులు చక్కని దృష్టాంతాలతో శతక పద్యాలను రచించారు. తెలుగుబాల, సుమతీశతక పద్యాలు పిల్లలలో నీతి వర్తనను కల్గించాయి. శ్రీకాళహస్తీశ్వర శతకం, దాశరథి శతకం వంటి శతకాలు ప్రజల్లో భక్తితత్పరతను కల్గించాయి. రాజుల దురహంకారాన్ని ధూర్జటి కళ్ళకు కట్టినట్లుగా శతక పద్యాల్లో చెప్పారు. పోతులూరి వీరబ్రహ్మం వంటి వారు సమకాలీన రుగ్మతలను తేటతెల్లం చేశారు. ప్రజల కళ్ళు తెరిపించారు.

ప్రశ్న 4.
సమాజానికి మార్గనిర్దేశకత్వం చేసేవాళ్ళు శతక కవులు – ఈ విషయాన్ని వివరించండి..
జవాబు:
తెలుగు సాహిత్యంలో శతక వాజ్మయానికి సమున్నతమైన స్థానం ఉంది. శతక కవులు తమ అనుభవసారాన్ని మధించి చక్కని నీతి పద్యాలను రచించారు. వేమన, సుమతి, కృష్ణ, దాశరథి మొదలైన శతకాలు ప్రజల్లో నీతివర్తనను కలుగజేస్తాయి.

అక్కరకు రాని చుట్టము, వినదగునెవ్వరు చెప్పిన, పుత్రోత్సాహము మొదలైన పద్యాలు జీవితాంతం గుర్తుంచుకునే విధంగా ఉంటాయి. వేమన ప్రజాకవిగా గుర్తింపు పొందాడు. సమాజంలోని అసమానతలను, కుళ్ళు, కుతంత్రాలను లోకానికి చాటాడు. భూర్జటి రాజాశ్రయం పొందినా రాజుల దురహంకారాన్ని నిర్భయంగా చాటిచెప్పాడు. భర్తృహరి సుభాషితాలను ఏనుగు లక్ష్మణకవి వంటివారు తేటతెలుగు పద్యాల్లో రచించారు. కరుణశ్రీ గారి తెలుగుబాల శతకంలోని పద్యాలు బాలల్లో ఆలోచనాశక్తిని పెంచుతాయి. శతక పద్యాలు తెలుగు పలుకుబడులను, సంస్కృతీ సాంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను తేటతెల్లం చేస్తున్నాయి

ప్రశ్న 5.
ఆశ్రయించిన వారిని బట్టి పొందే గౌరవంలో మార్పు వస్తుందనే విషయాన్ని సోదాహరణంగా వివరించండి.
జవాబు:
వ్యక్తులు మంచివారిని ఆశ్రయిస్తే, మంచి గౌరవం పొందుతారు. అధముడిని ఆశ్రయిస్తే వారు నశిస్తారు. భర్తృహరి సుభాషితాలలో ఈ విషయాన్ని సోదాహరణంగా ఇలా వివరించారు.

  1. నీరు కాల్చిన ఇనుము మీదపడితే, ఆ నీరు ఆవిరైపోతుంది. నీరు యొక్క రూపమే నశిస్తుంది.
  2. అదే, నీరు తామరాకుపై పడితే, ముత్యమువలె అందంగా మెరుస్తుంది.
  3. అదే నీరు ముత్యపుచిప్పలలో పడితే, మణులవలె మారుతుంది.

దీనిని బట్టి ఈ క్రింది విషయం మనకు తెలుస్తుంది. మనిషి ఒక అధముడిని ఆశ్రయిస్తే తాను కూడా అధముడు అవుతాడు. మనిషి మధ్యముడిని ఆశ్రయిస్తే, తాను కూడా మధ్యముడు అవుతాడు. ఉత్తముడిని ఆశ్రయిస్తే, తాను కూడా ఉత్తముడు ఔతాడు.

మనిషి అధముడిని ఆశ్రయిస్తే కాల్చిన ఇనుము మీద నీరువలె నామరూపాలు లేకుండా పోతాడు. మనిషి మధ్యముడిని ఆశ్రయిస్తే రామరాకుపై నీరువలె మెరుస్తాడు. మనిషి ఉత్తముడిని ఆశ్రయిస్తే ముత్యపుచిప్పలో నీరువలె మణిగా మారుతాడు.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 6 శతక మధురిమ

ప్రశ్న 6.
మూర్యులకు నీతులు చెప్పడం ఎటువంటిది?
జవాబు:
మూర్చులకు నీతులు చెప్పడం వ్యర్ధము. అందువల్ల కొంచెము కూడా ప్రయోజనం ఉండదని భర్తృహరి సుభాషిత పద్యాల్లో క్రింది ఉదాహరణములు ఇచ్చాడు.

మూర్సులకు నీతులు చెప్పాలని ప్రయత్నించడం, మదించిన ఏనుగును తామరతూడులోని దారములతో బంధించాలని ఆలోచించడం వంటిది. ఏనుగువంటి బలమైన జంతువును సన్నని, బలహీనమైన తారతూడులోని దారాలతో బంధించలేము. అలాగే మూర్చులకు నీతులు బోధించడం వల్ల ప్రయోజనం ఉండదు.

మూర్చులకు నీతులు చెప్పాలని ప్రయత్నించడం, దిరిసెన పువ్వుతో వజ్రాన్ని బద్దలు కొట్టాలని చూడడం వంటిది. మెత్తని దిరిసెనపువ్వుతో కఠినమైన వజ్రాన్ని భేదించలేనట్లే, మూర్యుడికి నీతులు బోధించడం అసాధ్యం. అది వ్యర్థమైన పని.

మూరులకు నీతులు చెప్పవలెనని అనుకోవడం, ఒక- తేనె బొట్టుతో ఉప్పు సముద్రంలోని నీటిని తియ్యగా మార్చాలనుకోవడం వంటిది. ఒక్క తేనె బిందువుతో ఉప్పు సముద్రాన్ని తియ్యగా మార్చడం అసాధ్యం. అలాగే మూర్ఖుడికి నీతులు బోధించడం కూడా అసాధ్యం అని, భర్తృహరి చెప్పాడు.

ప్రశ్న 7.
పరద్రవ్యము నాశించిన వాని ప్రవర్తనను విశ్లేషించండి.
జవాబు:
ఇతరుల నుండి ధనాన్ని ఆశించి కొందరు అనేకరకాలుగా జీవిస్తూ ఉంటారు. పరద్రష్యం కోసం అలాంటి తప్పుడు పనులు చేయడం వ్యర్థమని ఆ ద్రవ్యము వారివద్ద ఎన్నాళ్ళో ఉండదనీ, వారు కూడా శాశ్వతంగా జీవించరనీ, ధూర్జటి కాళహస్తీశ్వర శతకంలో ఇలా చెప్పాడు.

కొందరు పరధనాన్ని ఆశించి, జాతకములు చెపుతారు. మరికొందరు రాజులకు సేవలు చేస్తారు. కొందరు అన్యాయ ప్రవర్తన ద్వారా చెడ్డపేరు తెచ్చుకుంటారు. కొందరు చాడీలు చెపుతూ ఉంటారు. కొందరు ఇతరులను హింసిస్తూ ఉంటారు. కొందరు ఉన్నవీ లేనివీ మాట్లాడుతూ ఉంటారు. ఈ పైన చెప్పిన పనులన్నీ, వారు ఇతరుల నుండి ధనాన్ని ఆశించి చేస్తూ ఉంటారు.

కాని నిజానికి ఆ ద్రవ్యము వారి వద్ద ఎన్నాళ్ళో ఉండదు. అలా చెడుపనులు చేసేవారు కూడా, శాశ్వతంగా ఈ లోకంలో బ్రతికియుండరు. అందువల్ల పైన చెప్పినటువంటి చెడుపనులు చేసి డబ్బు సంపాదించడం వ్యర్థం అని గుర్తించాలి.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 6 శతక మధురిమ

ప్రశ్న 8.
నైతిక విలువల వలన ప్రయోజనములేవి?
జవాబు:
నైతిక విలువలు అంటే నీతి, ధర్మము, సహనము, సజ్జనత్వము, ఓర్మి, సత్యము, స్నేహము వంటి మంచి గుణాల వల్ల కలిగే ప్రయోజనాలు.

సంఘంలో మనుషులు ఎలా నడుచుకోవాలో, ఎలా నడిస్తే తనకూ, ఇతరులకూ కూడా మేలు జరుగుతుందో, ఈ నైతిక విలువలు పాటించడం వల్ల మనకు తెలుస్తుంది.

మన శతకకవులు చక్కని నీతి శతకాలు చెప్పారు. ‘ అందులో ఎన్నో నీతులను వారు మనకు తెలిపారు. భాస్కర శతకకర్త నీతులను దృష్టాంతాలతో బోధించాడు. సుమతీ శతకకర్త, భర్తృహరి, ధూర్జటి వంటి పూర్వ కవులు సైతం మనకు ఎన్నో నీతివాక్యాలు చెప్పారు.

ఈ పద్యాల్లోని నీతివాక్యాలను పాటించి నడచుకుంటే మనుషులు ధర్మవర్తనులు అవుతారు. ఆ నైతిక విలువలు, నేటి తరం వారి జీవితాలకు మార్గదర్శకంగా ఉంటాయి. ఈ నీతులు వారి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతాయి.

ఈ నైతిక విలువలను పాటిస్తే సంఘంలో మానవులు ధర్మమూర్తులు అవుతారు. చక్కగా ఏ ఆటంకాలు లేకుండా మానవులు తమ జీవితాన్ని హాయిగా నడుపుకోగల్గుతారు.

శాంతి, సత్యము, దయ, ప్రేమ వంటి సద్గుణాలు వారికి అలవడుతాయి. నైతిక విలువలు పాటించడం వల్ల సంఘం చక్కగా పురోగతి చెందుతుంది. అందుకే నీతి శతకపద్యాలను పిల్లలకు నేర్పించాలి.

10th Class Telugu 6th Lesson శతక మధురిమ Important Questions and Answers

ప్రశ్న 1.
నీకు నచ్చిన శతక కవిని గూర్చినీ మిత్రునికి లేఖ రాయండి.
జవాబు:

మిత్రుడికి లేఖ

అమలాపురం,
x x x x x x x

ప్రియమైన మిత్రుడు రాకేష్ కు,

నీ మిత్రుడు వ్రాయునది. నేను బాగా చదువుతున్నాను. నీవు కూడా బాగా చదువుతున్నావని ఆశిస్తున్నాను. ముఖ్యముగా వ్రాయునది తెలుగు సాహిత్యంలో ఎంతోమంది శతక కవులు ఉన్నారు. వారిలో వేమన కవి నాకు బాగా నచ్చిన కవి. ఈ మహాకవి తన జీవిత అనుభవసారాన్ని తేట తెలుగు పద్యాల్లో అందించాడు. జీవిత సత్యాలను. అలనాటి సామాజిక రుగ్మతలను చక్కగా తెలియజేశాడు. తన పద్యాలను అంటరానితనం వంటి అసమానతలపై ఆయుధంగా వాడుకున్నాడు. అందుకే నాకు వేమన అంటే బాగా ఇష్టం. నీకు నచ్చిన కవిని గురించి వివరంగా తెలియజేయి. పెద్దలందరికి నమస్కారాలు తెలుపగలవు.

ఇట్లు,
నీ ప్రియ స్నేహితుడు,
x x x x x x x

చిరునామా :
వి. రాకేష్, 10వ తరగతి,
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,
కనిగిరి, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్.

ప్రశ్న 2.
మీరు సందర్శించిన పర్యాటక ప్రదేశాన్ని వర్ణిస్తూ మిత్రునికి లేఖ రాయండి.
జవాబు:

విశాఖపట్టణం,
x x x x x

ప్రియమైన కృష్ణకు,
నీ మిత్రుడు మాధుర్ వ్రాయులేఖ.

నేనీ మధ్య అమరావతి వెళ్ళాను. అమరావతి చాలా విశాలమైన నగరం. చాలా అందమైన నగరం. కృష్ణానది పరవళ్ళతో ఆ అందం రెట్టింపయింది.

చక్కటి ఉద్యానవనాలున్నాయి. కొత్త కొత్త భవనాలు కట్టారు. ఏ విభాగానికి ఆ విభాగం చక్కగా ఉంది. చూపరులను కట్టిపడేసే అందాలతో విరాజిల్లుతున్న అమరావతి మన నవ్యాంధ్ర రాజధాని కావడం మన అదృష్టం. అమరావతిలో విశేషమైన శిల్ప సంపద ఉంది. మానవ శరీర ధర్మ శాస్త్రాననుసరించి చెక్కిన ఆ శిల్పాలను చూడవలసింది.
ఉంటాను మరి

ఇట్లు,
మాధుర్ వ్రాలు

చిరునామా:
చింత. శివరామకృష్ణ,
10వ తరగతి – ఎ,
మునిసిపల్ హైస్కూల్, పవర్ పేట, ఏలూరు.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 6 శతక మధురిమ

ప్రశ్న 3.
అనాథ శరణాలయాలకు, వృద్ధాశ్రమాలకు, అనాథలకు విరాళాలు ప్రకటించి తమ ఉదారతను, వదాన్యతను లోకానికి చాటించుకోవాలని కోరుతూ ఒక కరపత్రం తయారుచేయండి.
జవాబు:

ఆపన్నహస్తం ఇవ్వండి

ఆదుకుందాం ! ఆదరిద్దాం !

వదాన్యులారా ! ధనవంతులారా ! ఒక్క మనవి ఆలకించండి. మన సమాజంలో ఎందరో అనాథలు, అభాగ్యులు ఉన్నారు. వారందరిని ఆదుకోవాల్సిన ధర్మం అందరిపైనా ఉంది. ముఖ్యంగా సంపన్నుల పైన ఎక్కువగా ఉంది. ఎంతో మంది అనాథలు చదువులకు దూరంగా ఉన్నారు. వృద్ధులు నిరాదరణకు లోనవుతున్నారు.

స్వార్థం కొంత మానుకొని తోటి సమాజశ్రేయస్సుకై పాటుపడాలి. అనాథలపై కనికరం చూపండి. పేదలకు భోజన వసతులను కల్పించండి. అనాథాశ్రమాలను పోషించండి. పేద విద్యార్థుల చదువుకు ధన సహాయం చేయండి. గ్రామాలను, పాఠశాలలను దత్తత తీసుకోండి. మీలోని మానవీయతను చూపండి. అందరికి ఆదర్శంగా నిలవండి. సమాజ శ్రేయస్సునే మీ శ్రేయస్సుగా భావించండి. పేదలు లేని నవసమాజాన్ని నిర్మించడానికి కృషిచేయండి. ఈ మహాయజ్ఞంలో మీ వంటి ధనవంతుల భాగస్వామ్యం తప్పక ఉండాలి.

ఇట్లు,
నిర్వాసిత బాలల సంరక్షణ సమితి,
కనిగిరి.

ప్రశ్న 4.
శతకాలను చదవమని ప్రేరేపిస్తూ ఒక కరపత్రం తయారుచేయండి.
జవాబు:

కరపత్రం

శతక పద్యాలు, శతకకర్తల అనుభవసారాలు. వారు జీవితాన్ని కాచివడపోసిన అనుభవంతో, గమనించిన సత్యాలతో శతకాలు రచించారు. శతకంలో సుమారు వందపద్యాలు ఉంటాయి. ప్రతి శతకంలోనూ మకుటం ఉంటుంది. శతకాలలో నీతి, భక్తి, వైరాగ్య శతకాలు ఉన్నాయి.

ఈనాడు సంఘంలో ఎన్నో అవకతవకలు, అధర్మ ప్రవర్తనలు, తెలివితక్కువ పనులు జరుగుతున్నాయి. వాటిని సరిదిద్ది సంఘాన్ని మంచిదారిలో నడపాలంటే చిన్నప్పటి నుండే మంచి నీతులు నేర్చుకొని తెలివిగా బ్రతకాలి. ధర్మబద్ధంగా, ఇతరులకు ఆటంకాలు లేకుండా న్యాయబద్ధంగా, నీతి మార్గంలో నడవాలి.

అందుకు మనకు ఉన్నది ఒక్కటే మార్గం. మన కవులు మనకు అందించిన శతక పద్యాలను కంఠస్థం చేసి, వాటిలో చెప్పిన నీతిమార్గాన్ని పాటించి, నైతిక విలువలను కాపాడాలి. అందుకే మా పాఠ్యపుస్తకాల్లో ప్రతి తరగతిలోనూ నీతి శతక పద్యాలను పాఠాలుగా పెడుతున్నారు.

మనం అంతా శతకాలు చదువుదాం. మన పిల్లలచే శతకాలు చదివిద్దాం. శతక పద్యాలు చదివి, వాటిలో వేమన, సుమతీ శతకకర్త, భాస్కర శతకకర్త, భర్తృహరి వంటి వారు చెప్పిన శతకపద్యాలలోని విలువలను నేర్చుకుందాం. మన జీవితాన్ని బంగారుబాట పట్టిద్దాం. మన పిల్లలను మేలిమి రత్నాలుగా తీర్చిదిద్దుకుందాం. అందుకే మనం అంతా దీక్షగా శతక పద్యాలు చదువుదాం, కదలండి.

దివి, x x x x x

ఇట్లు,
ఆంధ్రభాషా ప్రవర్థక సమితి,
అమరావతి.

ప్రశ్న 5.
శతకాల వలన కలిగే ప్రయోజనాలను వివరిస్తూ వ్యాసం రాయండి.
జవాబు:

శతకములు – ప్రయోజనములు

‘శతకము’ అంటే నూరు పద్యాల గ్రంథము. శతకాలలో నూరు నుండి. నూట ఎనిమిది వరకు పద్యాలు ఉంటాయి. శతకాలలో మకుటం ఉంటుంది. మకుటం లేని శతకాలూ ఉన్నాయి. మన తెలుగు భాషలో ఎందరో కవులు శతకాలు వ్రాశారు. వీటిలో నీతి శతకాలు, భక్తి శతకాలు ఎక్కువగా ఉంటాయి. భర్తృహరి నీతి, శృంగార, వైరాగ్య శతకాలను మూడింటినీ రచించి, ‘సుభాషిత త్రిశతి’ అని పేరు పెట్టాడు.

శతకములలో వేమన రచించిన వేమన శతకము, కంచెర్ల గోపన్న రచించిన దాశరథీ శతకము, సుమతీ శతకము, భాస్కర శతకము, ధూర్జటి రచించిన కాళహస్తీశ్వర శతకము వంటివి బాగా ప్రసిద్ధి పొందాయి.

శతకములు చదవడం వల్ల ముఖ్యంగా ప్రజలలో నీతివర్తనం, భక్తి పొందుతుంది. నీతి శతకాలు మానవులకు జీవిత మార్గాన్ని ఉపదేశిస్తాయి. నీతి శతకాలవల్ల నైతిక విలువలు పెంపొందుతాయి. ముఖ్యంగా పిల్లలచే నీతి శతక పద్యాలు చదివిస్తే, వారు మంచి పౌరులుగా తయారు అవుతారు. ఏది మంచో, ఏది చెడో వారికి తెలుస్తుంది. వేమన నీతులను దృష్టాంతాలతో సులభంగా చెప్పాడు. భాస్కర శతకకర్త నీతులను దృష్టాంతాలతో చెప్పాడు. వీటిని చదవడం వల్ల సులభంగా మనకు నీతులు పట్టుపడతాయి.

భక్తి శతకాల ద్వారా దైవభక్తి పెరుగుతుంది. మొత్తంపై శతకాల వల్ల మానవులు భక్తి, నీతి కలవారై యోగ్యులైన ధర్మమూర్తులు అవుతారు. అందుకే మనం శతకాలు చదువుదాం. మన పిల్లలచే చదివిద్దాం.

10th Class Telugu 6th Lesson శతక మధురిమ 1 Mark Bits

1. కులం కంటె గుణం ప్రదానం – గీత గీసిన పదానికి వికృతి పదాన్ని గుర్తించండి.
A) కాలము
B) కొలం
C) కలము
D) కన్నం
జవాబు:
B) కొలం

2. గగ, భ, జ, స, నల గణములు మాత్రమే వచ్చే పద్యమేది? (June 2017)
A) సీసము
B) కందము
C) ద్విపద
D) తరువోజ
జవాబు:
B) కందము

3. సృష్టి మర్మమును ఎవరు తెలుసుకోగలరు? – (గీత గీసిన పదమునకు అర్థమును గుర్తించుము.) (March 2017)
A) పుట్టుక
B) నడవడిక
C) రహస్యం
D) ఆచరణ
జవాబు:
C) రహస్యం

AP SSC 10th Class Telugu Important Questions Chapter 6 శతక మధురిమ

4. నీరము తప్తలోహమున నిల్చి యనామకమై నశించు, నా – ఏ పద్యపాదమో గుర్తించండి. (March 2018)
A) చంపకమాల
B) మత్తేభము
C) ఉత్పలమాల
D) శార్దూలము
జవాబు:
C) ఉత్పలమాల

5. సిరి సంపదలకన్నా ప్రవర్తన గొప్పగా ఉండాలి – గీత గీసిన పదానికి ప్రకృతి పదం గుర్తించండి. (June 2018)
A) శ్రీశ్రీ
B) శ్రీ
C) శ్రీకారం
D) సాకారం
జవాబు:
B) శ్రీ

6. మహనీయులు వారు చేసిన పనుల వలన ఉత్తములుగా కీర్తి పొందారు. (అర్థాన్ని గుర్తించండి) (S.A. I – 2018-19)
A) స్నేహితులు
B) గొప్పవారు.
C) మధ్యములు
D) పేదవారు
జవాబు:
B) గొప్పవారు.

7. కరి రాజును తామరతూడులతో బంధించలేము. (పర్యాయ పదములు గుర్తించండి) (S.A. I – 2018-19)
A) కరము, కిరణము
B) గజము, ఏనుగు
C) హస్తి, హస్తము
D) గజము, సింహము
జవాబు:
B) గజము, ఏనుగు

8. మనదేశం కోసం ఎన్నో త్యాగాలు చేసిన గొప్ప గొప్ప నాయకులు అమరులుగా నిలిచారు. (వ్యుత్పత్యర్థాన్ని గుర్తించండి) (S.A. I – 2018-19)
A) మరణం పొందినవారు
B) మరణం లేనివారు
C) మరణం లెక్కచేయని వారు
D) మరణానికి భయపడనివారు
జవాబు:
B) మరణం లేనివారు

9. దేశాల మధ్య శాంతి కాపాడుకోవాలి. (విడదీసిన సరియైన రూపం గుర్తించండి) (S.A. I – 2018-19)
A) దే + శాల
B) దేశ + అల
C) దేశము + ల
D) దేశా + ల
జవాబు:
C) దేశము + ల

AP SSC 10th Class Telugu Important Questions Chapter 6 శతక మధురిమ

10. నీ కరుణా కటాక్ష వీక్షణములకై నిరీక్షించుచున్నారము. (అలంకారాన్ని గుర్తించండి) (S.A. I – 2018-19)
A) అంత్యానుప్రాసము
B) లాటానుప్రాసము
C) ఛేకానుప్రాసము
D) వృత్త్యనుప్రాసము
జవాబు:
D) వృత్త్యనుప్రాసము

11. పరధనాపహరణము కంటె దిరియుట మంచిది – ఈ వాక్యానికి ఆధునిక వచనాన్ని గుర్తించండి. (March 2018 )
A) ఇతరుల డబ్బు దొంగతనం చేయకూడదు.
B) పరుల సొమ్ము దొంగిలించడం కంటె బిచ్చమెత్తుకోవడం మంచిది.
C) ఇతరుల సొమ్ము దొంగిలించకుండా అడుక్కోవాలి.
D) పరుల నగదు అడిగి తీసుకోవడం మంచిది.
జవాబు:
B) పరుల సొమ్ము దొంగిలించడం కంటె బిచ్చమెత్తుకోవడం మంచిది.

12. సత్యాన్నే పలుకు, ధర్మాన్నే ఆచరించు – ఇది ఏ రకమైన వాక్యమో గుర్తించండి. (March 2018)
A) నిషేధాకం
B) విధ్యర్థకం
C) నిశ్చయార్థకం
D) ప్రశ్నార్థకం
జవాబు:
B) విధ్యర్థకం

చదవండి – తెలుసుకోండి

మహాత్మాగాంధీ బోధలు

సత్యం :
ప్రపంచానికి బోధించటానికి నా వద్ద కొత్తది ఏమీ లేదు. సత్యాహింసలు పర్వతాలంతటి ప్రాచీనమైనవి.

సత్యాహింసలే నా మతం. సత్యం నా భగవంతుడు. ఆయనను ప్రసన్నం చేసుకోవటానికి అహింస మార్గం.

సత్యమనేది, నీవు ఎంత ఎక్కువగా పోషిస్తే అంత ఎక్కువగా ఫలాలిచ్చే విశాల వృక్షం వంటిది. సత్యమనే గనిలో ఎంత లోతుగా అన్వేషిస్తే అక్కడ నిక్షిప్తమైవుండి దొరికే వజ్రం అంత విలువైనదిగా ఉంటుంది. ఇతోధిక సేవా మార్గాలకు దారులు కనిపించవచ్చు.

నా జీవితమంతటా, సత్యంపై దృఢంగా నిలబడటం రాజీ తాలూకు సౌందర్యాన్ని మెచ్చుకోవటం నాకు నేర్పింది. ఈ భావన సత్యాగ్రహం (అహింసాత్మక ప్రతిఘటన)లో తప్పనిసరి భాగమని ఉత్తరోత్తరా జీవితంలో నేను చూడగలిగాను.

నిలకడవున్న వ్యక్తిగా కనిపించేందుకు నేనెప్పుడూ శ్రద్ధచూపలేదు. నా సత్యాన్వేషణ ప్రయత్నంలో అనేక భావాలను విడనాడాను. అనేక కొత్త విషయాలు నేర్చుకున్నాను. నా వయోభారం పెరిగే కొద్దీ నా అంతర్గత వృద్ధి ఆగిపోతుందని గాని లేదా మాంసం కరిగిపోవటంతో నా వృద్ధి ఆగిపోతుందనే భావన గాని నాకు లేదు. నేను ఆలోచిస్తున్నదల్లా సత్యం. నా భగవంతుడు క్షణక్షణానికి యిచ్చే పిలుపును శిరసావహించేందుకు నా సంసిద్ధత గూర్చే.

సత్యం స్వభావరీత్యా స్వయం ప్రదర్శితం. దానిని ఆవహించివున్న అజ్ఞానమనే సాలెగూళ్ళను నీవు తొలగించగలిగితే అది స్పష్టంగా ప్రకాశిస్తుంది.

అహింస:
నేను నాలో ఉన్నట్లు చెప్పుకునే ఒకే ఒక సుగుణం సత్యం, అహింస. మానవాతీత శక్తులున్నట్లు నేను చెప్పుకోజాలను. అటువంటివాటిని నేను కోరుకోను. నా తోటి మానవులలో దురలుని శరీరముకున్న దుష్టమాంసఖండములే నా శరీరమునకూ ఉన్నవి. అందువల్ల అందరిలాగే నేనూ తప్పు చేయవచ్చును. నా సేవలకు అనేక పరిమితులున్నవి.

అహింస మానవాళికి అందుబాటులో ఉన్న గొప్ప శక్తి, అహింస రూపుదిద్దుకోవలసిన లేదా పాటించమని ఆదేశించవలసిన గుణం కాదు. అది అంతర్గతంగా వృద్ధి చెందేది. ఒక వ్యక్తి చేసే తీవ్రమైన ప్రయత్నంపై దాని మనుగడ ఆధారపడి ఉంటుంది.

మన సూత్రాలను ఇతరులు గౌరవించాలని మనం ఎలా ఆశిస్తామో తమ సూత్రాల పట్ల అదే పరిగణనకు ప్రత్యర్థి కూడా పాత్రుడు. ప్రత్యర్థులను గెలుచుకోవటానికి మనం ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అహింస కోరుతుంది.

క్రమశిక్షణ – విధి నిర్వహణ:
జీవిత ముఖ్య ప్రయోజనం సక్రమంగా జీవించడం, సక్రమంగా ఆలోచించడం, సక్రమంగా వ్యవహరించడం.

మనం ఏదైనా గొప్పదైన, శాశ్వతమైనదాన్ని సాధించే ముందు కఠినమైన, ఉక్కు క్రమశిక్షణ ఉండి తీరాలి. ఆ క్రమశిక్షణ కేవలం విద్యాసంబంధమైన వాదన నుండి, హేతువుకు, తర్కానికి విజ్ఞప్తి చేయటం ద్వారా రాదు. క్రమశిక్షణను ప్రతికూలత అనే పాఠశాలలోనే నేర్చుకోవాలి.

సంతృప్తి ప్రయత్నంలో ఉంటుంది గాని సాధించటంలో ఉండదు. సంపూర్ణ కృషి సంపూర్ణ విజయాన్నిస్తుంది.

నిరంతర అభివృద్ధి జీవిత సూత్రం. నిలకడగా ఉన్నట్లు కనిపించే నిమిత్తం తన పిడివాదాలను కాపాడుకునేందుకు ఎల్లప్పుడూ ప్రయత్నించే మనిషి తనను తాను బూటకపు స్థితిలోకి నెట్టుకుంటున్నాడు.

హక్కులకు సిసలైన మూలం విధి. ‘మనందరం గనుక మన విధులను నిర్వర్తించినట్లయితే హక్కును పొందటం దూరం కాజాలదు. విధులు నిర్వర్తించకుండా హక్కుల వెంట మనం పరుగెడితే అవి అగమ్య గోచరంగా మన నుండి తప్పించుకుంటాయి. మనం ఎంతగా వాటి వెంట పడితే అవి అంతగా దూరం ఎగిరిపోతాయి.

తన విధులు సష్యంగా నిర్వర్తించే వ్యక్తికి హక్కులు వాటంతట అవే సమకూరుతాయి.

ధైర్యం – దృఢ విశ్వాసం:
ధైర్యం అనేది కండర సంబంధమైన పదార్థంగా ఎవ్వరూ ఎన్నడూ చెప్పలేదు, అది హృదయానికి సంబంధించింది. అతి గట్టి కండరం కూడా ఊహాజనితమైన భయం ముందు వణికిపోతుందని మనకు తెలుసు. కండరాన్ని వణికించేది హృదయం.

శారీరక దారుఢ్యం నుండి బలం చేకూరదు. అది మొక్కవోని సంకల్పం నుండి వస్తుంది. బలానికి సంయమనాన్ని, మర్యాదను జత చేసినపుడు అది ప్రబలమవుతుంది.
ప్రపంచంలో చూడాలని నీవు కోరుకుంటున్న మార్పు నీలో రావాలి.

నమ్రత:
అహింసా స్ఫూర్తి విధిగా నమ్రతకు దారి తీస్తుంది.

నమ్రత అనేది ప్రత్యేకించి పాటించేది కాదు. ఎందుకంటే, అది ఉద్దేశపూర్వకంగా ఆచరించటానికి ఉద్దేశించింది కాదు. అయితే అది ‘అహింసకు తప్పనిసరి పరీక్ష, ఎవరిలోనైతే ‘అహింస’ ఉంటుందో వినయం అతని స్వభావంలో భాగమవుతుంది.

తప్పులు చేయనివారు ఎవరూ ఉండరు – దైవాంశ సంభూతులైనా సరే. తప్పిదాలు లేకపోవటం వల్ల వారు దైవాంశ సంభూతులు కాలేదు. తమ తప్పులను తాము తెలుసుకోవటం వల్ల, వాటిని దిద్దుకోవటానికి కృషిచేయటం వల్ల, వాటిని దాచుకోకపోవటం వల్ల, తమను తాము దిద్దుకోవటానికి ఎల్లప్పుడూ సంసిద్ధులుగా వుండటం వల్ల వారు దైవాంశ సంభూతులైనారు.

మరో వ్యక్తి ఆలోచనలు చెడ్డవని, మనవి మాత్రమే మంచి ఆలోచనలని చెప్పటం, మన అభిప్రాయాలకు భిన్నమైన వాటిని కలిగి వున్నవారు దేశానికి శత్రువులని చెప్పటం దురలవాటు.

సహనశీలత – అస్పృశ్యత:
అసహనం అనేది కూడా ఒక హింసారూపం. నిజమైన ప్రజాస్వామిక భావన వృద్ధిచెందటానికి ప్రతిబంధకం. మనం నిజమైన ప్రజాస్వామిక స్ఫూర్తిని అలవరచుకోవాలంటే మనం అసహనపరులుగా వుండకూడదు. అసహనం ఒకని లక్ష్యంలోగల విశ్వాస వాంఛను దెబ్బతీస్తుంది.

ఇతరులు మనలను చూస్తునట్లుగా మనల్ని మనం చూసుకోటం మంచిది. మనం ప్రయత్నించినా, మనల్ని మనం సంపూర్ణంగా ఎన్నడూ తెలుసుకోలేము. ముఖ్యంగా మనలోని దుష్టపార్శ్వాన్ని అసలు తెలుసుకోలేము. మనలను విమర్శించేవారిపట్ల ఆగ్రహం చెందకుండా వున్నప్పుడు ఆ పని మనం చేయగలుగుతాము. వారు ఏమి చెప్పినప్పటికీ సహృదయంతో స్వీకరించాలి.

స్వేచ్ఛ – ప్రజాస్వామ్యం:
అంతర్గత ప్రమాదాలు లేనటువంటి మానవ వ్యవస్థ ఉండదు. వ్యవస్థ ఎంత పెద్దదైతే దుర్వినియోగ అవకాశాలు అంత హెచ్చుగా వుంటాయి. ప్రజాస్వామ్యం గొప్ప వ్యవస్థ. అందువల్ల అది ఎక్కువగా దుర్వినియోగానికి గురి అయ్యే అవకాశముంది. కనుక దానికి పరిష్కారం ప్రజాస్వామ్యాన్ని తప్పించటం కాదు, దుర్వినియోగ అవకాశాన్ని కనీస స్థాయికి తగ్గించటమే.

ప్రజాస్వామ్యం సారాంశం ఏమంటే, అందరి సమష్టి ప్రయోజనానికి సేవచేయటంలో అన్ని విభాగాల ప్రజల ఉద్యం యావత్ భౌతిక, ఆర్థిక, ఆధ్యాత్మిక వనరులను సమీకరించే కళ, శాస్త్రం అని అర్థం.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 2 అయోధ్యాకాండ

AP State Board Syllabus AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం 2nd Lesson అయోధ్యాకాండ Textbook Questions and Answers.

AP State Syllabus SSC 10th Class Telugu Solutions ఉపవాచకం 2nd Lesson అయోధ్యాకాండ

10th Class Telugu ఉపవాచకం 2nd Lesson అయోధ్యాకాండ Textbook Questions and Answers

I. అవగాహన – ప్రతిస్పందన

సంఘటనా క్రమం

సంఘటనల ఆధారంగా వరుస క్రమంలో వాక్యాలను అమర్చడం

1. అ) గతంలో దశరథుడు ఇచ్చిన రెండు వరాలను ఇప్పుడు ఉపయోగించుకొమ్మని సూచించింది మంథర.
ఆ) కైకేయి రెండు వరాలను గురించి చెప్పింది.
ఇ) శ్రీరాముడి కోసం ఏర్పాటు చేసిన సన్నాహాలతో భరతుడికి పట్టాభిషేకం చేయాలి. శ్రీరాముడు నారచీరెలు, జింక చర్మం ధరించి జటాధారి అయి దండకారణ్యానికి వెళ్లి తాపసవృత్తిలో పదునాల్గు సంవత్సరాలు ఉండాలి.
ఈ) శ్రీరాముణ్ణి చూడాలనుంది. వెంటనే తీసుకురమ్మన్నాడు దశరథుడు.
జనాబులు
అ) గతంలో దశరథుడు ఇచ్చిన రెండు వరాలను ఇప్పుడు ఉపయోగించుకొమ్మని సూచించింది మంథర.
ఇ) శ్రీరాముడి కోసం ఏర్పాటు చేసిన సన్నాహాలతో భరతుడికి పట్టాభిషేకం చేయాలి. శ్రీరాముడు నారచీరెలు, జింక చర్మం ధరించి జటాధారి అయి దండకారణ్యానికి వెళ్లి తాపసవృత్తిలో పదునాలుగు సంవత్సరాలు ఉండాలి.
ఈ) శ్రీరాముణ్ణి చూడాలనుంది. వెంటనే తీసుకురమ్మన్నాడు దశరథుడు.
ఆ) కైకేయి రెండు వరాలను గురించి చెప్పింది.

2. అ) భరతుని అభ్యర్థన మేరకు శ్రీరాముడు పాదుకలను అనుగ్రహించాడు.
ఆ) మహర్షి సూచననుసరించి యమునానదిని దాటి చిత్రకూటం చేరుకున్నారు సీతారామలక్ష్మణులు.
ఇ) మంత్రులు భరతుణ్ణి రాజ్యాధికారం చేపట్టమన్నారు.
ఈ) భరతుడు నందిగ్రామం చేరుకుని పాదుకలకు పట్టాభిషేకం చేశాడు.
జవాబులు
ఆ) మహర్షి సూచననుసరించి యమునానదిని దాటి చిత్రకూటం చేరుకున్నారు సీతారామలక్ష్మణులు.
ఇ) మంత్రులు భరతుణ్ణి రాజ్యాధికారం చేపట్టమన్నారు. అ) భరతుని అభ్యర్థన మేరకు శ్రీరాముడు పాదుకలను అనుగ్రహించాడు.
ఈ) భరతుడు నందిగ్రామం చేరుకొని పాదుకలకు పట్టాభిషేకం చేశాడు.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 2 అయోధ్యాకాండ

3. అ) శ్రీరాముడు సీతాలక్ష్మణ సమేతంగా అత్రిమహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు.
ఆ) పుత్ర వ్యా మోహంతో కౌసల్య శ్రీరాముని వెంట వనవాసానికి సిద్ధపడింది.
ఇ) కైక తన రెండు వరాలను గురించి చెప్పింది. ,
ఈ) శ్రీరామ పట్టాభిషేకం కోసం అయోధ్య తనను తాను అలంకరించుకుంది.
జవాబులు
ఈ) శ్రీరామ పట్టాభిషేకం కోసం అయోధ్య తనను తాను అలంకరించుకుంది.
ఇ) కైక తన రెండు వరాలను గురించి చెప్పింది.
ఆ) పుత్ర వ్యా మోహంతో కౌసల్య శ్రీరాముని వెంట వనవాసానికి సిద్ధపడింది.
అ) శ్రీరాముడు సీతాలక్ష్మణ సమేతంగా అత్రిమహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు.

4. అ) శ్రీరాముడు రథాన్ని ప్రజలు నీడలా అనుసరించారు.
ఆ) భరతుని కోరికపై శ్రీరాముడు పాదుకలను ఇచ్చాడు.
ఇ) అర్ధరాత్రి తరువాత దశరథుడు ప్రాణాలు విడిచాడు.
ఈ) శ్రీరాముడు లక్ష్మణునితో కలిసి కౌసల్యను దర్శించాడు.
జవాబులు
ఈ) శ్రీరాముడు లక్ష్మణునితో కలిసి కౌసల్యను దర్శించాడు.
అ) శ్రీరాముడు రథాన్ని ప్రజలు నీడలా అనుసరించారు.
ఇ) అర్ధరాత్రి తరువాత దశరథుడు ప్రాణాలు విడిచాడు.
ఆ) భరతుని కోరికపై శ్రీరాముడు పాదుకలను ఇచ్చాడు.

5. అ) కాలినడకన వస్తున్న శ్రీరాముడిని చూచి ప్రజలు బావురుమన్నారు.
ఆ) భరతుడు అయోధ్య వాసులతో అరణ్యానికి బయలుదేరాడు.
ఇ) శ్రీరాముని ఆదేశం మేరకు గుహుడు నావను సిద్ధం చేశాడు.
ఈ) శ్రీరాముని మాటలు విన్న దశరథుడు శోకభారంతో స్పృహ కోల్పోయాడు.
జవాబులు
ఈ) శ్రీరాముని మాటలు విన్న దశరథుడు శోకభారంతో స్పృహ కోల్పోయాడు.
అ) కాలినడకన వస్తున్న శ్రీరాముడిని చూచి ప్రజలు బావురుమన్నారు.
ఇ) శ్రీరాముని ఆదేశం మేరకు గుహుడు నావను సిద్ధం చేశాడు.
ఆ) భరతుడు అయోధ్య వాసులతో అరణ్యానికి బయలుదేరాడు.

6. అ) శ్రీరాముని ఎడబాటుకు దశరథుని మనసు కకావికలమైంది.
ఆ) దశరథుని మృతదేహాన్ని తైలద్రోణిలో ఉంచారు.
ఇ) ప్రజలు చేసేది లేక అయోధ్యకు వెనుతిరిగి వెళ్ళారు.
ఈ) సీత రాముని వెంట అరణ్యానికి వెళ్ళడానికి నిశ్చయించుకుంది.
జవాబులు
ఈ) సీత రాముని వెంట అరణ్యానికి వెళ్ళడానికి నిశ్చయించుకుంది.
ఇ) ప్రజలు చేసేది లేక అయోధ్యకు వెనుతిరిగి వెళ్ళారు.
అ) శ్రీరాముని ఎడబాటుకు దశరథుని మనసు కకావికలమైంది.
ఆ) దశరథుని మృతదేహాన్ని తైలద్రోణిలో ఉంచారు.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 2 అయోధ్యాకాండ

7. అ) గుహుని ద్వారా సుమంత్రుడు శ్రీరాముని విషయాలను గ్రహించాడు.
ఆ) కైక వరాలను విన్న రాముని ముఖంలో ఎలాంటి మార్పులేదు.
ఇ) శ్రీరామ వనవాస సమయంలో భరతుడు తల్లిని తప్పు బట్టాడు.
ఈ) శ్రీరామ పట్టాభిషేకాన్ని సమర్ధిస్తూ హర్షధ్వానాలు చేశారు.
జవాబులు
ఈ) శ్రీరామ పట్టాభిషేకాన్ని సమర్థిస్తూ హర్షధ్వానాలు చేశారు.
ఆ) కైక వరాలను విన్న రాముని ముఖంలో ఎలాంటి మార్పులేదు.
అ) గుహుని ద్వారా సుమంత్రుడు శ్రీరాముని విషయాలను గ్రహించాడు.
ఇ) శ్రీరామ వనవాస సమయంలో భరతుడు తల్లిని తప్పు బట్టాడు.

8. అ) సీతారామలక్ష్మణులు దశరథుని దర్శనానికి బయలుదేరారు.
ఆ) రాముడిని తీసుకొని రావలసిందిగా కైక సుమంత్రుడిని ఆజ్ఞాపించింది.
ఇ) శ్రీరాముడు తండ్రి మరణవార్త విని విలపించాడు.
ఈ) శ్రీరామ పట్టాభిషేకం కోసం అయోధ్య తనను తాను అలంకరించుకుంటుంది.
జవాబులు
ఈ) శ్రీరామ పట్టాభిషేకం కోసం అయోధ్య తనను తాను అలంకరించుకుంటుంది.
ఆ) రాముడిని తీసుకొని రావలసిందిగా కైక సుమంత్రుడిని ఆజ్ఞాపించింది.
అ) సీతారామలక్ష్మణులు దశరథుని దర్శనానికి బయలుదేరారు.
ఇ) శ్రీరాముడు తండ్రి మరణవార్త విని విలపించాడు.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 2 అయోధ్యాకాండ

9. అ) అద్రి అనసూయలు సీతారామలక్ష్మణులకు మర్యాదలు చేశారు.
ఆ) శ్రీరాముడు ప్రసంగవశాత్తు రాజనీతి ధర్మాలను బోధించాడు.
ఇ) శ్రీరాముడు వచ్చాడన్న వార్త విని గుహుడు రాముని వద్దకు వచ్చాడు.
ఈ) వశిష్ఠుని ఆజ్ఞ మేరకు దూతలు భరత శత్రుఘ్నులను తీసుకురావడానికి వెళ్ళారు.
జవాబులు
ఈ) వశిష్ఠుని ఆజ్ఞ మేరకు దూతలు భరత శత్రుఘ్నులను తీసుకురావడానికి వెళ్ళారు.
ఆ) శ్రీరాముడు ప్రసంగవశాత్తు రాజనీతి ధర్మాలను బోధించాడు.
ఇ) శ్రీరాముడు వచ్చాడన్న వార్త విని గుహుడు రాముని వద్దకు వచ్చాడు.
అ) అద్రి అనసూయలు సీతారామలక్ష్మణులకు మర్యాదలు చేశారు.

10. అ) భరతుడు నందిగ్రామం చేరుకొని పాదుకలకు పట్టాభిషేకం చేశాడు.
ఆ) గుహుని సహకారంతో భరద్వాజాశ్రమం చేరుకున్నాడు భరతుడు.
ఇ) భరతుడు అయోధ్యావాసులతో కలిసి శృంగిబేరిపురం చేరాడు.
ఈ) శత్రుఘ్నుడు శ్రీరాముని పాదాలపై పడ్డాడు.
జవాబులు
ఆ) గుహుని సహకారంతో భరద్వాజాశ్రమం చేరుకున్నాడు భరతుడు.
ఇ) భరతుడు అయోధ్యావాసులతో కలిసి శృంగిబేరిపురం చేరాడు.
ఈ) శత్రుఘ్నుడు శ్రీరాముని పాదాలపై పడ్డాడు. అ) భరతుడు నందిగ్రామం చేరుకొని పాదుకలకు పట్టాభిషేకం చేశాడు.

పాత్ర స్వభావాలు

1. శ్రీరాముడు :
రూపంలోనూ గుణంలోనూ శ్రేష్ఠుడు. మహావీరుడు. మృదువుగా మాట్లాడతాడు. శరణన్నవారిని కాపాడతాడు. కోపం, గర్వం లేనివాడు. సత్యం పలికేవాడు. పరుల సంపదను ఆశించనివాడు. దీనులను ఆదుకొనేవాడు. కాలాన్ని వృథా చేయకుండా జ్ఞానులతో, సజ్జనులతో వివిధ విషయాలను చర్చించేవాడు. వినయశీలి. తల్లిదండ్రుల పట్లా, గురువుల పట్లా నిశ్చలభక్తి కలవాడు. సోమరితనం, ఏమరుపాటు లేనివాడు, కళలలో ఆరితేరినవాడు, అసూయ, మాత్సర్యం లేనివాడు. ప్రజలపట్ల వాత్సల్యం కలవాడు.

2. మంథర :
కైకేయి అత్తవారింటికి వచ్చినపుడు వెంట వచ్చిన అరణపు దాసి మంథర. రాముని పట్టాభిషేక వార్త తెలిసి మంథర కైకకు చెప్పింది. ఆ వార్త విని కైక సంతోషిస్తూ ఉంటే ఆమె మనస్సును మార్చింది.

రాముడు రాజైతే కౌసల్య రాజమాత అవుతుందని అప్పుడు కైక కూడా దాసిలాగా ఉండాల్సి వస్తుందని చెప్పింది రాముడి సంతానానికే తరువాతి కాలంలో రాజ్యాధికారం వస్తుందని, భరతుని సంతానానికి రాదని తెలియజేస్తుంది. కాబట్టి భరతునికి రాజ్యాధికారం దక్కేటట్లు, రాముడు అడవులపాలయ్యేటట్లు చూడమని దుర్బోధ చేసింది. దశరథుడు ఇదివరలో ఇచ్చిన రెండు వరాలను ఇప్పుడు ఉపయోగించుకొమ్మని చూచించింది.

3. గుహుడు :
శృంగిబేరపురానికి రాజు. శ్రీరామభక్తుడు. దండకారణ్య వాసానికి వెడుతున్న సీతారామలక్ష్మణులను గంగా నదిని దాటించాడు. ధర్మాత్ముడు.

సంఘటన ద్వారా గ్రహించుట

ప్రశ్న 1.
‘పతిని అనుసరించుటయే సతికి ధర్మం, సుఖప్రదం, శుభప్రదం’. అన్న సీత మాటల ద్వారా మీరు ఏమి గ్రహించారు?
జవాబు:
సీతాదేవి పతివ్రత. పతిని సేవించనిదే జీవించలేదు. తన భర్తను మించిన లోకం లేదు. తన భర్తతోటే సకల సౌఖ్యాలు అనుకొనే ఉత్తమ ఇల్లాలు సీత అని గ్రహించాను.

ప్రశ్న 2.
“అమ్మా! నువ్వు చెప్పినట్లే చేస్తా” అని కైకేయితో రాముడు పలికిన సన్నివేశాన్ని బట్టి, మీరేం గ్రహించారు?
జవాబు:
రామునికి రాజ్యకాంక్ష లేదని, తండ్రి ఆజ్ఞను పాటించడం కన్న గొప్ప ధర్మం మరొకటి లేదని, రాముడు భావించేవాడనీ నేను గ్రహించాను.

రామునకు తల్లుల మాటపై పెద్ద గౌరవం అనీ, రామునికి తల్లులందరూ సమానమేననీ, వారి మాటను రాముడు బాగా గౌరవించేవాడని గ్రహించాను. అందుకే తనకు సవతి తల్లియైన కైక చెప్పగానే, తండ్రి స్వయంగా చెప్పకపోయినా, పినతల్లి కైక మాటను తండ్రి మాటగానే గౌరవించి రాముడు అడవికి ప్రయాణమాయ్యడు.

రాముడు మాతా పితృభక్తుడనీ, వారి మాటలకు జవదాటడనీ, రాజ్యకాంక్ష లేనివాడనీ పై మాటను బట్టి గ్రహించాను.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 2 అయోధ్యాకాండ

ప్రశ్న 3.
“కఠిన శిల కన్నీటికి కరుగుతుందా? కైకేయి మారలేదు”. కవి చెప్పిన ఈ మాటలను బట్టి, కైక మనః ప్రవృత్తిని నీవు ఏమి గ్రహించావో వివరించుము.
జవాబు:
కైక మంథర దుష్టబోధలను విని, రాముని 14 ఏండ్లు వనవాసానికి పంపమనీ, తన కుమారుడు భరతునికి రాజ్యపట్టాభిషేకం చేయమనీ దశరథుని కోరింది.

కైక మాటలు విని, దశరథుడు స్పృహ కోల్పోయాడు. కొంత సేపటికి తేరుకొని, దశరథుడు రాముని అడవులకు పంపవద్దని, కైకను బ్రతిమాలాడు. రాముణ్ణి విడిచి తాను ఒక్కక్షణమైనా బతకలేనని, చేతులు జోడించి కైకను ప్రార్థించాడు. కైక పాదాలను పట్టుకుంటానన్నాడు. రాముణ్ణి తనకు దూరం చేయవద్దని కైకను దశరథుడు బ్రతిమాలాడు.

కాని కైక మనస్సు కఠినమైన రాయి వంటిది. అందుకే భర్త బ్రతిమాలినా, ఆమె మనస్సు మార్చుకోలేదు. తన పట్టుదలను విడవలేదు. కైక మొండిదని, అందుకే భర్త తన కాళ్ళు పట్టుకొని బ్రతిమాలినా, తన మొండి పట్టు ఆమె విడిచి పెట్టలేదనీ గ్రహించాను.

ప్రశ్న 4.
“మీరు లేకుండా స్వర్గ సుఖాలు లభించినా, ఇష్టపడను” అని సీత రామునితో చెప్పిన మాటలను బట్టి, సీత స్వభావాన్ని గూర్చి నీవేమి గ్రహించావు?
జవాబు:
శ్రీరాముడు పితృవాక్య పాలనకై అడవికి వెడుతున్నాడు. రాముడు సీతకు ఆ విషయం చెప్పి, అయోధ్యలో సీత ఎలా మసలుకోవాలో ఆమెకు తెలిపాడు. సీత రాముని మాటలను కాదని, తాను రాముని వెంట వనవాసానికి వెళ్ళడానికే ఇష్టపడింది. అయోధ్యలో ఉంటే సుఖంగా ఉండవచ్చు. రాముని వెంట వెడితే అరణ్యాలలో బాధలు పడాలి.

సీత మహా పతివ్రత కాబట్టి, అయోధ్యలో రాముడు లేకుండా స్వర్గసుఖాలు తనకు లభించినా తనకు అవి అక్కరలేదనీ, భర్తను అనుసరించడమే భార్యకు ధర్మం అనీ, శుభప్రదం అనీ చెప్పింది.

దీనిని బట్టి సీత మహా పతివ్రత అని, ధర్మజ్ఞురాలని, ఉత్తమ స్త్రీయని, నేను గ్రహించాను.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 2 అయోధ్యాకాండ

ప్రశ్న 5.
“రాముడు పట్టాభిషిక్తుడు అవుతున్నాడంటే, అంతకన్నా నాకు ఆనందం ఏముంటుంది? అని కైక, మంథరతో అన్న మాటలను బట్టి, మీరు ఏమి గ్రహించారు?
జవాబు:
కైక మొదటిలో రాముడిని ఎంతో ప్రేమతో చూసేదనీ, తన పుత్రుడైన భరతునితో సమంగా ఆమె రాముని ప్రేమించేదనీ గ్రహించాను. అలాగే రాముడు కూడా తల్లులందరి దగ్గరా సమానమైన ఆదరాన్ని పొందేవాడనీ తెలుసుకున్నాను.

తన దాసి మంథర చేసిన దుష్టమైన ఉపదేశం వల్లనే కైక బుద్ధి మారిపోయిందనీ, రాముడిని ఆమె పట్టుపట్టి అడవులకు పంపిందనీ, నేను గ్రహించాను. చెడు మాటలు వింటే, మంచివారు సైతం పాడయిపోతారని గ్రహించాను.

ప్రశ్న 6.
“నా తండ్రే, నాకు పాలకుడు. గురువు. హితుడు. ఆయన ఆదేశించాలే కాని, విషాన్ని తాగడానికైనా, సముద్రంలో దూకడానికైనా నేను సిద్ధమే” అని రాముడు కైకతో పలికిన మాటలను బట్టి, మీరు ఏమి గ్రహించారు?
జవాబు:
రాముడు గొప్ప పితృభక్తి కలవాడని గ్రహించాను. తండ్రియే తనకు గురువనీ, పరిపాలకుడనీ రాముడు భావించేవాడని గ్రహించాను. అంతేకాదు. తండ్రి ఆజ్ఞాపిస్తే శ్రీరాముడు, విషమును సైతం శంకలేకుండా త్రాగుతాడని గ్రహించాను. తండ్రి ఆజ్ఞాపిస్తే శ్రీరాముడు సముద్రంలోనైనా దూకుతాడని గ్రహించాను.

రాముడు, పితృవాక్యపరిపాలకుడనీ, తండ్రి యంటే ఆయనకు గొప్ప భక్తి గౌరవములు ఉన్నాయని గ్రహించాను. రాముని వంటి పితృవాక్య పరిపాలకుడు చరిత్రలో మరొకడు ఉండడని తెలుసుకున్నాను.

ప్రశ్న 7.
“అన్నా ఈ పాదుకల మీదనే రాజ్యపాలనాభారాన్ని ఉంచుతాను. పదునాల్గవ సంవత్సరం కాగానే, నీ దర్శనం కాకుంటే, అగ్ని ప్రవేశం చేస్తాను” అని భరతుడు రామునితో చెప్పిన మాటలను బట్టి, నీవేమి తెలుసుకున్నావు?
జవాబు:
భరతుడు గొప్ప సోదర భక్తుడు. అతడు తనకు రాజ్యం లభించినా కాదని, అన్న పాదుకలకే పట్టాభిషేకం చేసి, అన్నకు సేవకునిగా తాను రాజ్యం పాలించాడు. అన్నగారు 14 సంవత్సరాల తర్వాత తనకు మాట ఇచ్చిన ప్రకారము అయోధ్యకు తిరిగి రాకపోతే, అగ్నిలో దూకి ప్రాణాలు వదలడానికి భరతుడు సిద్ధమైనాడని గ్రహించాను.

తల్లి తనకు రాజ్యం ఇప్పించినా కాదని, అన్న రామునిపై భక్తి గౌరవములు చూపించిన గొప్ప సోదర భక్తుడు, సోదర వాత్సల్యం కలవాడు, భరతుడని నేను గ్రహించాను.

ప్రశ్న 8.
శ్రీరాముని పాదుకలను తీసుకుని, నందిగ్రామం వెళ్ళి వాటికి పట్టాభిషేకం చేసిన భరతుని చర్యను బట్టి మీరు ఏమి గ్రహించారు?
జవాబు:
కైక కోరిన రెండు వరాల వల్ల శ్రీరాముడు వనవాసానికి వెళ్ళాడు. పుత్రశోకంతో దశరథుడు మరణించాడు. భరతుడు తన తల్లిని దూషించాడు. అరణ్యంలోకి వెళ్ళి శ్రీరాముడిని అయోధ్యకు వచ్చి రాజ్యాభిషేకం చేసుకోవాలని గ్రహించాడు. చివరకు భరతుడు రాముడు ఇచ్చిన పాదుకలను తీసుకొని అయోధ్యకు వెళ్ళకుండా నందిగ్రామం వెళ్ళి శ్రీరాముని పాదుకలకు పట్టాభిషేకం చేశాడు.

దీనివల్ల భరతునికి శ్రీరాముని పట్ల అపరిమితమైన భక్తి విశ్వాసాలు ఉన్నాయని గ్రహించాడు. అన్నలేని అయోధ్యకు వెళ్ళకూడదని, నిశ్చయించుకున్నాడని గ్రహించాను. భరతునికి రాజ్యాధికారం పట్ల వ్యామోహం లేదని గ్రహించాను.

విషయాత్మక ప్రశ్నలు

ఈ క్రింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
శ్రీరాముడంటే తల్లిదండ్రులకే కాదు, ప్రజలందరికీ పరమ ప్రీతి ఎందుకు?
జవాబు:
శ్రీరాముడు సద్గుణాల రాశి. రూపంలోనూ, గుణంలోనూ శ్రేష్ఠుడు. మహావీరుడు. మృదువుగా మాట్లాడతాడు. కోపం లేదు. గర్వం లేదు. సత్యం పలికేవాడు. పరుల సంపద ఆశించడు. దీనులను ఆదుకుంటాడు. కాలాన్ని వృధా చేయడు. వినయశీలి. తల్లిదండ్రులు, గురువులు, పెద్దలపట్ల భక్తి కలవాడు. సోమరితనం లేనివాడు.

ప్రశ్న 2.
కైకేయికి దశరథుడిచ్చిన వరాల వలన ఏమయింది?
జవాబు:
దేవాసుర సంగ్రామంలో కైకకు దశరథుడు వరాలిస్తానన్నాడు. సమయం వచ్చినపుడు అడుగుతానంది. శ్రీరామ పట్టాభిషేకం ఏర్పాట్లలో ఉన్నపుడు ఆ వరాలను అడిగింది. ఒకటి శ్రీరామునికి బదులుగా భరతునికి పట్టాభిషేకం చేయాలి. శ్రీరాముని వనవాసానికి పంపాలనేది రెండవ వరం. ఈ వరాలు ఇవ్వడం వలన దశరథుడు మరణించాడు. సీతారాములు అడవుల పాలయ్యారు.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 2 అయోధ్యాకాండ

ప్రశ్న 3.
పాదుకా పట్టాభిషేకం గురించి వ్రాయండి.
జవాబు:
తండ్రికి అంత్యక్రియలు జరిపాడు భరతుడు. తర్వాత చిత్రకూటం వైపు వెళ్లి శ్రీరాముని దర్శించాడు. అయోధ్యకు రమ్మన్నాడు. రాజువు కమ్మని వినయంగా ప్రార్ధించాడు. శ్రీరాముడు ఒప్పుకోలేదు. కనీసం పాదుకలనైనా ఇమ్మన్నాడు. రాముడు అనుగ్రహించాడు. పాదుకలతో నందిగ్రామం చేరాడు. ఆ పాదుకలను సింహాసనంపై ఉంచి పట్టాభిషేకం చేశాడు. ఆ పాదుకలకు ప్రతినిధి తాను సేవకుడిగా రాజ్య వ్యవహారాలు చూశాడు.

వ్యాసరూప ప్రశ్నలు

ఈ క్రింది ప్రశ్నలకు 10 లేక 12 వాక్యాల్లో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
చెప్పుడు మాటలు చేటుకు కారణమని రామాయణం ఆధారంగా ఎలా సమర్థిస్తావు?
జవాబు:
రాముడికి పట్టాభిషేకం చేస్తారని కైక అరణపుదాసి అయిన మంథరకు తెలిసింది. ఆమె, ఆ విషయం కైకతో చెప్పింది. కైకకు రాముడంటే చాల ఇష్టం. అందుకే ఆ వార్త తెచ్చిన మంథరకు, ఆనందంతో కైక మంచి బహుమతిని ఇచ్చింది. కైక ప్రవర్తనకు మంథర ఆశ్చర్యపోయింది. ఏడ్వవలసిన సమయంలో ఎందుకు సంతోషిస్తున్నావని మంథర కైకను అడిగింది. తనకు రామభరతులు ఇద్దరూ సమానమే అని కైక చెప్పింది.

అప్పుడు మంథర కైకకు దుష్టబోధ చేసింది. “రాముడు రాజు అయితే కౌసల్య రాజమాత అవుతుంది. కైక దాసి అవుతుంది. రాముడికి భరతుడు దాస్యం చేయవలసి వస్తుంది. తరువాత రాముడి సంతానానికే రాజ్యాధికారం వస్తుంది. భరతుడి సంతానానికి రాజ్యం రాదు. కాబట్టి భరతుడికి రాజ్యాధికారం దక్కేటట్లు, రాముడు అడవులపాలు అయ్యేటట్లు చూడు” అని మంథర కైకకు చెప్పుడు మాటలు చెప్పింది. ఆ చెప్పుడు మాటలు విని, కైక మనస్సు మార్చుకుంది. రాముడిని అడవులకు పంపింది. అందుకే చెప్పుడు మాటలు, చేటుకు కారణం అని చెప్పాలి.

ప్రశ్న 2.
సీతారామలక్ష్మణులు వనవాసానికి వెళ్ళిన వృత్తాంతాన్ని తెలపండి.
జవాబు:
శ్రీరాముడు అంటే ప్రజలకు ఇష్టం. ప్రజల కోరిక మేరకు దశరథుడు రాముడికి యువరాజ పట్టాభిషేకం చేద్దామనుకున్నాడు. రాజాజ్ఞతో మంత్రులు, అధికారులూ రాముని యౌవరాజ్య పట్టాభిషేకానికి, ఏర్పాట్లు చేస్తున్నారు. దశరథుడు రాముని పిలిచి, పట్టాభిషేకం గూర్చి చెప్పి, రాజధర్మాలు బోధించాడు. సీతారాములు పట్టాభిషేకానికి ఉపవాస దీక్ష చేపట్టారు.

రాముడి పట్టాభిషేకం వార్త కైక దాసి మంథరకు తెలిసింది. ఆ వార్తను మంథర కైకకు చెప్పింది. కైక సంతోషించింది. కాని మంథర దుర్బోధతో, కైక మనస్సు మారింది. భరతుడికి పట్టాభిషేకం జరగడానికి, దశరథుడు వెనుక కైకకు ఇచ్చిన రెండు వరాలనూ ఉపయోగించుకోమని మంథర సలహా చెప్పింది. కైక కోపగృహానికి చేరింది. దశరథుడు కైకను బ్రతిమాలాడు. కైక దశరథుణ్ణి రెండు వరాలు కోరింది. 1) భరతుడికి పట్టాభిషేకం 2) రాముడి వనవాసం. దశరథుడు రాముణ్ణి అడవులకు పంపవద్దని కైకను బ్రతిమాలాడు. కాని కైక మనస్సు మారలేదు.

కైక రామునికి కబురంపింది. తండ్రిగారి విచారానికి కారణం ఏమిటని రాముడు అడిగాడు. కైక రాముడికి తాను కోరిన వరాలు గురించి చెప్పింది. తండ్రి మాటను పాటిస్తానని రాముడు చెప్పాడు. కైక మాటపై రాముడు దండకారణ్యానికి బయలుదేరతానన్నాడు. దశరథుడు దుఃఖించాడు. రాముడు తండ్రికీ, కైకకూ నమస్కరించాడు. రాముడు తల్లి కౌసల్యను దర్శించాడు. రాముని వనవాసం గూర్చి విని కౌసల్య దుఃఖించింది. రాముడిని అడవికి వెళ్ళవద్దని తల్లి, లక్ష్మణుడు చెప్పారు. కాని రాముడు తండ్రి మాటనే గౌరవిస్తానన్నాడు.

కౌసల్య రాముని వెంట వనవాసానికి వస్తానంది. అది ధర్మం కాదు, తండ్రిగారి సేవ చేయాలని రాముడు తల్లికి చెప్పాడు. సీత కూడా వనవాసానికి వస్తానంది. లక్ష్మణుడు కూడా రాముని వెంట వస్తానన్నాడు. సీతారామలక్ష్మణులు దశరథుని వద్దకు వెళ్ళారు. కైకేయి వారికి నారచీరలను ఇచ్చింది. వారు నారచీరలు ధరించారు. సుమిత్ర లక్ష్మణుడితో సీతారాములను తల్లిదండ్రులవలె సేవింపుమని చెప్పింది.
సుమంత్రుడు రథాన్ని సిద్ధం చేశాడు. సీతారామలక్ష్మణులు రథం ఎక్కారు. పౌరులు వెంట బయలుదేరారు. ఈ విధంగా రాముడు భార్యాసోదరులతో అడవికి వెళ్ళాడు.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 2 అయోధ్యాకాండ

ప్రశ్న 3.
శ్రీరాముడు వనవాసం వెళ్ళడానికి గల కారణమేమి?
(లేదా)
సీతారామలక్ష్మణులు అయోధ్యను వీడి, చిత్రకూటం చేరిన వృత్తాంతాన్ని తెలపండి. (వనవాసానికి వెళ్ళిన వృత్తాంతం)
జవాబు:
సీతారామలక్ష్మణులు సుమంత్రుడు తెచ్చిన రథాన్ని ఎక్కారు. శ్రీరాముడిని విడిచిపెట్టలేక, కొందరు పౌరులు రథానికి ప్రక్కలనూ, వెనుక భాగంలోనూ వేలాడారు. అయోధ్య ఆర్తనాదాలతో నిండింది. కౌసల్యను సుమిత్ర ఓదార్చింది.

రాముని రథాన్ని ప్రజలు నీడలా అనుసరిస్తున్నారు. అయోధ్యకు వెళ్ళిపొండని రాముడు వారికి ఎంతగానో చెప్పాడు. రాముడిని అయోధ్యకు తిరిగి రమ్మనీ లేక తమను వెంటరానిమ్మనీ ప్రజలు రాముణ్ణి వేడుకున్నారు. రథం తమసానది దగ్గరకు చేరింది. ఆ రాత్రి ప్రజలు నిద్రిస్తుండగా రాముడు రథంపై బయలుదేరాడు. ప్రజలు లేచి చూశారు. తాము నిద్రపోయినందుకు తమను తామే ప్రజలు నిందించుకొని అయోధ్యకు తిరిగి వెళ్ళారు.

రాముని రథం కోసల దేశం పొలిమేరకు చేరింది. రాముడు అయోధ్యవైపు తిరిగి నమస్కరించాడు. క్రమంగా వారు గంగాతీరానికి చేరారు. ఆ తీరంలో ‘శృంగిబేరపురం’ ఉంది. గుహుడు ఆ దేశానికి రాజు. అతడు శ్రీరాముని భక్తుడు. అతడు రాముని వద్దకు వచ్చాడు. రాముడు గుహుడికి ఎదురేగివెళ్ళి గుహుని ఆతిథ్యం తీసుకున్నాడు.

గుహుడు గంగను దాటడానికి నావను ఏర్పాటు చేశాడు. శ్రీరాముడు మర్రిపాలు తెప్పించి తనకూ, తమ్మునికీ జడలను సిద్ధం చేశాడు. అడవిలో ముందు లక్ష్మణుడు, వెనుక సీత, ఆ వెనుక రాముడు నడిచారు. వారు సాయంత్రానికి భరద్వాజాశ్రమానికి చేరారు. ముని, సీతారామలక్ష్మణులకు అతిథి సత్కారాలు చేశాడు. వనవాస కాలాన్ని తన ఆశ్రమంలో గడపమని భరద్వాజ మహర్షి వారిని కోరాడు.

జనులకు అందుబాటులో ఉండని, ఆశ్రమ వాసానికి తగిన ప్రదేశాన్ని సూచించండని రాముడు భరద్వాజ మహర్షిని కోరాడు. పది కోసుల దూరంలోని ‘చిత్రకూటం’ పవిత్రమైనదనీ, అది మహర్షుల నివాస స్థానం అనీ, భరద్వాజుడు చెప్పాడు. రామలక్ష్మణులు యమునను దాటి ‘చిత్రకూటం’ చేరుకున్నారు. లక్ష్మణుడు అన్న ఆదేశం ప్రకారం, అక్కడ కుటీరం నిర్మించాడు. సీతారామలక్ష్మణులు చిత్రకూటంలో వనవాసం చేశారు.

ప్రశ్న 4.
“భరతుని పాదుకా పట్టాభిషేకం” గురించి రాయండి.
జవాబు:
దశరథుడు శ్రీరాముని ఎడబాటును సహింపలేక ప్రాణాలు విడిచాడు. రామలక్ష్మణులు అడవికి వెళ్ళారు. భరత శత్రుఘ్నులు మేనమామ ఇంటిలో ఉన్నారు. వశిష్ఠుడి ఆజ్ఞమేరకు దశరథుని శరీరాన్ని తైలద్రోణిలో జాగ్రత్త చేశారు. దూతలు వెళ్ళి ఎనిమిదవరోజున భరత శత్రుఘ్నులను అయోధ్యకు తీసుకువచ్చారు. భరతుడు తండ్రికి అంత్యక్రియలు పూర్తి చేశాడు.

భరతుడు కైకను తప్పు పట్టాడు. శత్రుఘ్నుడు మంథరను చంపడానికి సిద్ధమయ్యాడు. మంత్రులు భరతుణ్ణి రాజ్యాధికారం స్వీకరించమన్నారు. పెద్దవాడైన రాముడే రాజు కావాలని భరతుడు పట్టుపట్టాడు. తాను వెళ్ళి రాముణ్ణి అయోధ్యకు తీసుకువస్తానని భరతుడు అయోధ్యాపురవాసులతో కలసి అడవికి బయలుదేరాడు.

భరతుడు శృంగిబేరపురం చేరాడు. గుహుడు భరతుడి మనస్సు తెలియక, తికమక పడ్డాడు. విషయం తెలిసి గుహుడు భరతుణ్ణి ఆహ్వానించాడు. భరతుడు గుహుడితో కలిసి, భరద్వాజాశ్రమం చేరి విందు స్వీకరించాడు. తరువాత చిత్రకూటం బయలుదేరాడు.

భరతుడు సేనలతో వస్తూ ఉండడం చూసి, లక్ష్మణుడు పొరపాటుపడ్డాడు. భరతుడు రాముని మీదికి యుద్ధానికి వస్తున్నాడని, లక్ష్మణుడు రామునికి చెప్పాడు. భరతుడు అటువంటివాడుకాడని రాముడు లక్ష్మణునకు చెప్పాడు.

భరత శత్రుఘ్నులు రాముని పాదాలపై పడ్డారు. రాముడు కన్నీళ్ళు పెట్టాడు. రాముడు భరతునికి రాజనీతులు చెప్పాడు. రాముణ్ణి అయోధ్యకు తిరిగి రమ్మని భరతుడు కోరాడు. రాముడు తండ్రి మాటే తనకు శిరోధార్యం అన్నాడు.

చివరకు భరతుని కోరికపై శ్రీరాముడు తన పాదుకలను భరతునికి ఇచ్చాడు. ఆ పాదుకల మీదనే రాజ్యభారం ఉంచి, తాను నారచీరలు ధరించి, నగరం వెలుపల ఉంటాననీ, పదునాల్గవ సంవత్సరం కాగానే, రామదర్శనం కాకపోతే అగ్ని ప్రవేశం చేస్తానని భరతుడు చెప్పాడు.

భరతుడు నందిగ్రామం చేరి రామపాదుకలకు పట్టాభిషేకం చేశాడు.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 2 అయోధ్యాకాండ

ప్రశ్న 5.
శ్రీరామ పట్టాభిషేకాన్ని ప్రజలు ఎందుకు సమర్థించారు? విశ్లేషించండి.
జవాబు:
శ్రీరాముడు సకల గుణాభిరాముడు. శ్రీరాముడు సద్గుణాల రాశి. రాముడు రూపంలోనూ, గుణంలోనూ గొప్పవాడు. : . , రాముడు మహావీరుడు. రాముడు మృదువుగా మాట్లాడతాడు. శరణు అన్నవారిని రాముడు కాపాడతాడు.

శ్రీరాముడు కోపమూ, గర్వమూ లేనివాడు. సత్యమును పలికేవాడు. పరుల సంపదను ఆశించనివాడు. దీనులను ఆదుకొనేవాడు. కాలాన్ని వృథా చేయకుండా జ్ఞానులతో, సజ్జనులతో వివిధ విషయాలను చర్చించేవాడు. శ్రీరాముడు వినయము కలవాడు.

శ్రీరాముడు తల్లిదండ్రులపట్ల, గురువులపట్ల నిశ్చలభక్తి కలవాడు. రాముడు సోమరితనం, ఏమరుపాటు లేనివాడు. అన్ని కళలలోనూ ఆరితేరినవాడు. అసూయ, మాత్సర్యం లేనివాడు. ప్రజలపట్ల వాత్సల్యం కలవాడు.

శ్రీరాముడు ఇన్ని మంచి గుణాలు కలవాడు కాబట్టి తల్లిదండ్రులతోపాటు, ప్రజలు కూడా శ్రీరామ పట్టాభిషేకాన్ని సమర్థించారు.

ప్రశ్న 6.
శ్రీరాముడు వనవాసానికి ఎలా వెళ్ళాడు?
జవాబు:
ప్రజల కోరిక మేరకు దశరథుడు, శ్రీరాముడికి యువరాజ పట్టాభిషేకం చేద్దామనుకున్నాడు. దశరథుడు రామునికి పట్టాభిషేకం గూర్చి చెప్పి, రాజధర్మాలు బోధించాడు. సీతారాములు ఉపవాసదీక్ష చేపట్టారు.

రాముని పట్టాభిషేకం వార్త మంథరకు తెలిసింది. మంథర కైకకు చెప్పి, ఆమె మనస్సును మార్చింది. దశరథుడు వెనుక కైకకు ఇచ్చిన వరాలను ఉపయోగించుకోమని మంథర కైకకు దుర్బోద చేసింది. కైక కోపగృహానికి చేరింది. కైక దశరథుణ్ణి రెండు వరాలు కోరింది. 1) భరతుడికి పట్టాభిషేకం, 2) రాముడి వనవాసం.

దశరథుడు రాముణ్ణి అడవులకు పంపవద్దని కైకను బ్రతిమాలాడు. కైక మనస్సు మారలేదు. కైక భర్త అనుమతితో రామునికి కబురు చేసింది. రాముడు వచ్చి తండ్రి విచారానికి కారణం ఏమిటని కైకను అడిగాడు. కైక, తాను కోరిన వరాలను గూర్చి రాముడికి చెప్పింది. తండ్రి మాటను పాటిస్తానన్నాడు రాముడు. కైక మాటపై రాముడు దండకారణ్యానికి వెడతానన్నాడు.

రాముడు తల్లి కౌసల్య వద్దకు వెళ్ళాడు. రాముడిని అడవికి వెళ్ళవద్దని తల్లీ, లక్ష్మణుడు చెప్పారు. కాని రాముడు తండ్రి మాటనే గౌరవిస్తానన్నాడు.

రాముని వెంట సీతాలక్ష్మణులు వనవాసానికి వస్తానన్నారు. సీతారామలక్ష్మణులు తండ్రి వద్దకు వెళ్ళారు. కైకేయి వారికి నారచీరలను ఇచ్చింది. వారు నారచీరలు ధరించారు.

సుమంత్రుడు రథాన్ని సిద్ధం చేశాడు. సీతరామలక్ష్మణులు రథం ఎక్కారు. ఈ విధంగా రాముడు సీతాలక్ష్మణ సమేతంగా వనవాసానికి వెళ్ళాడు.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 2 అయోధ్యాకాండ

ప్రశ్న 7.
దశరథుని మరణవార్త విని, భరతుడెలా స్పందించాడు?
జవాబు:
రాముడు అడవికి వెళ్ళాడని దశరథుడు దుఃఖంతో మరణించాడు. దూతలు వెళ్ళి మేనమామ ఇంట్లో ఉన్న భరతుడిని అయోధ్యకు తీసుకువచ్చారు. భరతుడు, తండ్రికి అంత్యక్రియలు చేశాడు.

భరతుడు కైకను తప్పు పట్టాడు. మంత్రులు భరతుడిని రాజ్యాధికారం చేపట్టమన్నారు. పెద్దవాడైన రాముడే రాజు కావాలనీ, తాను రాముణ్ణి తీసుకు వస్తాననీ, భరతుడు అడవికి బయలుదేరాడు.

భరత శత్రుఘ్నులు అడవిలో రాముడిని కలిసి, ఆయన పాదాలపై పడ్డారు. రాముడు కన్నీరు పెట్టాడు. రాముడిని అయోధ్యకు తిరిగి వచ్చి రాజువు కమ్మని భరతుడు కోరాడు. రాముడు తండ్రి మాటయే తనకు శిరోధార్యం అన్నాడు.

చివరకు భరతుడు కోరగా, రాముడు తన పాదుకలను భరతుడికి ఇచ్చాడు. రాముని పాదుకల మీదనే రాజ్యభారం ఉంచి, భరతుడు నారచీరలు ధరించి, తాను అయోధ్యా నగరం బయట ఉంటానన్నాడు. భరతుడు నందిగ్రామం చేరి, రామపాదుకలకు పట్టాభిషేకం చేశాడు.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 2 అమరావతి

AP State Board Syllabus AP SSC 10th Class Telugu Important Questions Chapter 2 అమరావతి

AP State Syllabus SSC 10th Class Telugu Important Questions 2nd Lesson అమరావతి

10th Class Telugu 2nd Lesson అమరావతి 2 Marks Important Questions and Answers

ఈ క్రింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాల్లో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
అమరావతి రాజధానిగా అభివృద్ధి చెందడంలో ఎవరెవరు భాగస్వామ్యం వహించారు?
జవాబు:
అమరావతిని శాతవాహనులు తొలి రాజధానిగా చేసుకొని అభివృద్ధి పరిచారు. ఇక్ష్వాకులు కూడా అమరావతిని మెరుగుపరిచారు. పల్లవులు తమ శాయశక్తులా అభివృద్ధి చేశారు. చాళుక్యులు, విష్ణుకుండినులు కూడా అభివృద్ధి చేశారు. కోటబేతరాజు వంశీయులు కూడా అభివృద్ధి చేశారు.

ప్రశ్న 2.
అనేక రాజవంశాలు అమరావతిని ఎందుకు అభివృద్ధి పరిచారు?
జవాబు:
రాజవంశాలు అమరావతిని రాజధానిగా చేసుకొని పరిపాలించాయి. వారి అభిలాషలకు అనుగుణంగా అమరావతిని తీర్చిదిద్దుకొన్నారు. వారి అవసరాలకు తగినట్లుగా అమరావతిని మలచుకొన్నారు. వారి కళా పిపాస తీర్చుకోవడానికి అందమైన నిర్మాణాలు చేయించారు. ఆ పాలకుల మతాలకు, సంప్రదాయాలకు తగినట్లు రాజధాని ఉండాలి కనుక అభివృద్ధి పరిచారు.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 2 అమరావతి

ప్రశ్న 3.
శరీరధర్మశాస్త్రాన్ననుసరించి శిల్పాలు రూపొందించడంలోని ప్రత్యేకత ఏమిటి?
జవాబు:
శరీరంలో కొన్ని కొలతలతో అవయవాలుంటాయి. సాముద్రిక శాస్త్రం ప్రకారంగా కొలతలు గల అవయవ నిర్మాణం, రంగు, ఒడ్డు, పొడుగు ఉంటేనే అందంగా పరిగణించబడుతుంది. అటువంటి లక్షణాలను కల్పించడం దైవానికి మాత్రమే సాధ్యం.

శిలతో చెక్కిన శిల్పంలో మానవ శరీరం యొక్క ప్రత్యేక లక్షణాలను ప్రతిబింబింపచేయడం నిపుణులైన కళాకారులకు మాత్రమే సాధ్యం. అటువంటి శిల్పాలు ఎవరినైనా ఆకర్షిస్తాయి. అదే వాటి ప్రత్యేకత. అటువంటి శిల్పాలు ఉన్నచోట సంపదలు వృద్ధి చెందుతాయనే విశ్వాసం కూడా ఉంది.

ప్రశ్న 4.
శాతవాహనుల కులగురువు యొక్క స్వభావాన్ని విశ్లేషించండి.
జవాబు:
‘నాగార్జునుడు’ అనే బౌద్ధమతాచార్యుడు, శాతవాహన రాజులకు కుల గురువు. ఈయన ధరణికోటలోనూ, నందికొండ ప్రాంతంలోనూ ఉన్న బౌద్ధారామాలలో నివసించేవాడు. ఆ రోజుల్లో అక్కడ గొప్ప బౌద్ధ విశ్వవిద్యాలయము ఉండేది. ఈ విశ్వవిద్యాలయములో 7700 మంది బౌద్ధభిక్షువులు ఉండేవారు. ఆ విశ్వవిద్యాలయములో ఆచార్య బుద్ధఘోషుడు, ఆర్యదేవుడు, ధర్మకీర్తి వంటి తత్త్వవేత్తలు బోధించేవారని, క్రీ.శ. 640లో ఈ ప్రాంతాన్ని దర్శించిన చైనా యాత్రికుడు, హ్యూయత్సాంగ్ తెలియపరచాడు.

10th Class Telugu 2nd Lesson అమరావతి 4 Marks Important Questions and Answers

ఈ క్రింది ప్రశ్నలకు 10 లేక 12 వాక్యాల్లో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
అమరావతి నగర సాంస్కృతిక వైభవాన్ని శిల్పకళా సంపదనుగురించి సొంతమాటల్లో వివరించండి. (June 2018)
జవాబు:

  1. శాతవాహనుల రాజధానియైన ధాన్యకటకమే కాలక్రమంలో అమరావతిగా స్థిరపడింది.
  2. శాతవాహన, ఇక్ష్వాక, పల్లవ, విష్ణుకుండిన మొదలగు వంశాలకు చెందిన రాజుల పరిపాలనాకాలంలో అమరావతి ఎంతో అభివృద్ధి చెందింది.
  3. విజయనగర ప్రభువుల పాలనలో అమరావతి ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా పేరొందింది.
  4. క్రీ.శ. 1798లో స్థానిక జమీందారు రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడుగారు అమరావతిని అత్యంత వైభవోపేతమైన రాజధాని నగరంగా తీర్చిదిద్దారు.
  5. కాలానుగుణంగా ఆయా రాజుల పరిపాలనలో మతాచారాలు, సంస్కృతీ సంప్రదాయాలు, అమరావతి మీద ప్రభావం చూపినందున ఇక్కడ బౌద్ధ, జైన, శైవ, వైష్ణవ, ముస్లిం, క్రైస్తవ మత సంప్రదాయాలు, సంస్కృతులు విలసిల్లి; నాటి సాంస్కృతిక వైభవాన్ని చాటి చెబుతున్నాయి.
  6. అమరావతి అద్భుత శిల్పకళకు కాణాచి. ఇక్కడి శిల్పాలు శరీర ధర్మశాస్త్రాన్ని అనుసరించి రూపొందాయి. చిత్రకళలో మాత్రమే వీలైన హావభావ ప్రకటనలు శిల్పకళలో కూడా ప్రదర్శితం కావడం ఈ శిల్పాల విశిష్టత. క్రోధం, కరుణ, ప్రేమ, విషాదం, ఆరాధన వంటి భావాలు. ఈ శిల్పాలలో చక్కగా కనిపిస్తాయి.

ప్రశ్న 2.
ఏయే రాజవంశాలు అమరావతిని అభివృద్ధిపరచాయో తెల్పండి. (March 2018)
జవాబు:

  1. అమరావతిని రాజధానిగా చేసుకొని ఆంధ్రదేశాన్ని సమగోప, గోబధ, నరన, కంవాయల వంశాలకు చెందిన రాజులు శాతవాహనుల కంటే ముందు పాలించారని శాసనాల ద్వారా తెలుస్తోంది.
  2. శాతవాహనులు, ఇక్ష్వాకులు, పల్లవులు, విష్ణుకుండినులు, చాళుక్యులు అమరావతిని పాలించారు. అభివృద్ధిపథంలో నడిపించారు.
  3. కోట బేతరాజు వంశస్థులు పాలించారు.
  4. విజయనగర ప్రభువులు సైతం అమరావతిని పాలించారు.
  5. క్రీ.శ. 1798లో స్థానిక జమీందారు రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు అమరావతిని అత్యంత వైభవోపేతమైన నగరంగా తీర్చిదిద్దారు.

ప్రశ్న 3.
ఒక మామూలు నగరం రాజధానిగా ఉండడానికి పనికి వస్తుందా? రాదా? విశ్లేషించండి.
జవాబు:
ఒక మామూలు నగరం, రాష్ట్రమునకు రాజధానిగా ఉండడానికి పనికిరాదు. రాష్ట్ర రాజధాని నగరంలో మంత్రుల పరిపాలనకు సెక్రటేరియట్, డైరెక్టర్ల కార్యాలయాలు, అసెంబ్లీ భవనములు, హైకోర్టు భవనాలు ఉండాలి. మంత్రులకు, శాసనసభ్యులకు నివాస భవనాలు ఉండాలి. ఉద్యోగులకు నివాస భవనాలు ఉండాలి.

రాష్ట్ర రాజధాని నగరానికి రాకపోకలకు విశాలమైన రోడ్డుమార్గాలు ఉండాలి. రాష్ట్ర, కేంద్ర మంత్రుల రాకపోకలకు, విమాన సౌకర్యం ఉండాలి. రైలుమార్గాలు ఉండాలి. విద్యా, వైద్య సదుపాయాలు ఉండాలి. పెద్ద వర్తక కేంద్రాలు ఉండాలి. కేంద్రమునకు సంబంధించిన కార్యాలయాలకు భవనాలు ఉండాలి. క్రీడా సదుపాయాలు ఉండాలి.

కాబట్టి ఒక మామూలు నగరం, రాష్ట్ర రాజధానిగా ఉండడానికి ఎంత మాత్రం పనికిరాదు. రాజధానికి కావలసిన అన్ని హంగులతో రాజధాని నగరాన్ని వేరుగా నిర్మించుకోవాలి.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 2 అమరావతి

ప్రశ్న 4.
ఒక మామూలు నగరం రాజధానిగా మారాలంటే రావలసిన మార్పులేమిటి?
జవాబు:
మామూలు నగరం రాజధానిగా మారాలంటే, ముఖ్యంగా అక్కడ పరిపాలనకు సెక్రటేరియట్ భవనాలు రావాలి. అసెంబ్లీ, హైకోర్టు భవనాలు కావాలి. పోలీసుశాఖకు తగిన భవనాలు నిర్మించాలి.

మంత్రులకు, గవర్నరు గారికి, శాసనసభ్యులకు నివాస భవనాలు నిర్మించాలి. సెక్రటేరియట్ ఉద్యోగులకు నివాస భవనాలు కావాలి. రాజధానిలో నివసించేవారికి సరిపడ మంచినీటి సౌకర్యం ఉండాలి. విద్యా, వైద్య సదుపాయాలు ఉండాలి. చక్కని రోడ్డు మార్గాలు, రైలు మార్గాలు, విమాన ప్రయాణ సౌకర్యములు ఉండాలి. విశ్వవిద్యాలయాలు, పెద్ద పెద్ద వైద్యశాలలు ఉండాలి.

క్రీడలకు సదుపాయాలు ఉండాలి. ఉద్యానవనాలు, సరస్సులు ఉండాలి. పెద్ద పెద్ద ఆకాశహర్మ్యాలు నిర్మించాలి. పెద్ద పెద్ద వర్తక కేంద్రాలు, అత్యాధునిక హంగులతో కూడిన అన్ని సదుపాయాలు కావాలి. మంచి విద్యుచ్ఛక్తి సౌకర్యం ఉండాలి. ప్రజలు సులభంగా రాజధానికి రావడానికి, పోవడానికి ప్రయాణ సౌకర్యాలు కావాలి.

ప్రశ్న 5.
అమరావతి భిన్న సంస్కృతుల నెలవు కావడానికి కారణాలను విశ్లేషించండి.
జవాబు:
అమరావతి రాజధానిగా ఒకటవ శతాబ్దంలోనే, శాతవాహన చక్రవర్తులు దీనిని పాలించారు. తరువాత ఇక్ష్వాకులు, పల్లవులు, చాళుక్యులు, విష్ణుకుండినులు, కోట బేతరాజ వంశస్థులు పాలించారు. 1798లో స్థానిక జమీందారు రాజా వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు అమరావతిని మంచి రాజధాని నగరంగా తీర్చిదిద్దాడు.

ఆయా రాజుల పరిపాలనా విధానాలు, మతాచారాలు, సంస్కృతీ సంప్రదాయాలు, అమరావతిపై గట్టి ప్రభావం చూపించాయి. అందువల్లనే అమరావతి, ఆంధ్రప్రదేశ్ కు సాంస్కృతిక రాజధాని అయ్యింది. ఇక్కడ బుద్ధ, జైన, శైవ, వైష్ణవ, ముస్లిం, క్రైస్తవ మత సంప్రదాయాల, సంస్కృతుల ప్రభావాలు కన్పిస్తాయి.

క్రీ.పూ. 5వ శతాబ్దిలోనే గౌతమ బుద్ధుడు అమరావతిని సందర్శించాడు. అమరావతిలో బుద్ధుని ధాతువుల భరిణను ఉంచి, దానిపై మహా చైత్యం నిర్మించారు. నాగార్జునుడనే బౌద్ధమత గురువు, శాతవాహన రాజులకు కుల గురువు. ఆ రోజుల్లో ధరణికోటలో గొప్ప బౌద్ధ విశ్వవిద్యాలయము, దానిలో 7,700 మంది బౌద్ధ భిక్షువులూ ఉండేవారు.

ఆ కాలంలో అమరావతి కేంద్రంగా, జైనమతం కూడా విస్తరించింది. అమరావతిలోని పార్శ్వనాథుని ఆలయం, జైనమత వికాసానికి సాక్షీభూతంగా నేటికీ ఉంది.

12, 13 శతాబ్దాల్లో శైవమతం ఇక్కడ విస్తరించింది. శివుడి ఆత్మలింగంలో ఒక భాగాన్ని ఇంద్రుడు అమరావతిలో ప్రతిష్ఠ చేశాడట. అమరావతిలోని అమరలింగేశ్వర స్వామి ఆలయం, పంచారామాలలో ఒకటి.

రాజా వేంకటాద్రినాయుడు అమరావతికి దగ్గరలో, వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించాడు. తరువాత ఇస్లాం, క్రైస్తవ మతాలు కూడా ఇక్కడ వ్యాప్తి చెందాయి.

ఈ విధంగా అమరావతీ నగరం భిన్న సంస్కృతులకు నెలవు అయ్యింది.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 2 అమరావతి

ప్రశ్న 6.
“ఆచార్య నాగార్జునుడు విద్యాప్రదాత” అని ఎలా చెప్పగలవు?
జవాబు:
ఆచార్య నాగార్జునుడు అనే బౌద్ధమతాచార్యుడు, శాతవాహన, రాజులకు కుల గురువు. ఈయన కాలంలో ధరణికోటలో గొప్ప బౌద్ధ విశ్వవిద్యాలయం ఉండేది. దీనికి ధాన్యకటక విశ్వవిద్యాలయం, శ్రీ పర్వత విద్యాపీఠం అనే పేర్లు కూడా ఉండేవి.

అనేక దేశాల విద్యార్థులు వచ్చి, అక్కడ విద్యార్జన చేసేవారు. ఈ విశ్వవిద్యాలయములో 7700 మంది బౌద్ధ భిక్షువులు ఉండేవారట. ఈ విశ్వవిద్యాలయంలో ధర్మశాస్త్రము, రాజనీతి, సాహిత్యము, వైద్యము, రస, రసాయన, వృక్ష, లోహ శాస్త్రములను బోధించేవారు.

నందికొండలో 1500 గదుల ఆరామాలలో వివిధ శాస్త్ర గ్రంథాలు నిండి ఉండేవనీ, ఆచార్య బుద్ధఘోషుడు, ఆర్యదేవుడు, ధర్మకీర్తి మొదలైన తత్త్వవేత్తలు, అక్కడ బోధించేవారనీ, చైనా యాత్రికుడు హ్యూయత్సాంగ్ తన రచనల్లో తెలిపాడు.

దీనిని బట్టి ఆచార్య నాగార్జునుడు విద్యా ప్రదాత అని మనం చెప్పగలము.

ప్రశ్న 7.
అమరావతి శిల్పకళలకు కాణాచి అని ఎలా చెప్పగలవు?
జవాబు:
అమరావతి అద్భుతమైన శిల్పకళలకు కాణాచి. అశోకుడు ఇక్కడ మహా బౌద్ధస్తూపం నిర్మించాడు. దానికి ఆచార్య నాగార్జునుడు మహా ప్రాకారాన్ని నిర్మించాడు. శిల్పులు ఈ చైత్యం చుట్టూ, అద్భుతమైన శిల్పకళా ఖండాలను అమర్చారు. శిల్పులు అక్కడ నలుచదరము శిలా ఫలకాల మీద బుద్ధుని జీవిత ఘట్టాలను చక్కగా చెక్కారు. మెకంజీ 1779లో అమరావతి శివారులో ఉన్న దీపాల దిన్నె దిబ్బ దగ్గర ఉన్న శిల్ప సంపదను గుర్తించాడు. ఒక చర్మకారుడు పూర్ణకుంభ శిల్పాన్ని, అక్కడ చెక్కించి, ఆ శిల్పాల గురించి ఆంగ్ల ప్రభుత్వానికి తెలిపాడు.

దంతగిరి, నేలకొండ పల్లి, ధూళికట్ట, భట్టిప్రోలులలో లభించిన శిల్పాలను, “అమరావతి స్కూలు ఆఫ్ ఆర్ట్” అంటారు. ఇక్కడి శిల్పాలు, ఎన్నో కాలగర్భంలో కలిసాయి. కొన్ని విదేశాలకు వెళ్ళిపోయాయి. పల్నాడు పాలరాయిపై చెక్కిన 120కి పైగా అమరావతి శిల్పాలు, బ్రిటిష్ మ్యూజియంలో నేటికీ ఉన్నాయి. అవి అమరావతి శిల్పకళ గొప్పతనాన్ని ప్రపంచానికి వెల్లడిస్తున్నాయి. మరికొన్ని అమరావతి శిల్పాలు, మద్రాసు, కలకత్తా మ్యూజియంలలోనూ, కొన్ని నాగార్జున కొండ మ్యూజియంలోనూ దాచారు. ప్రపంచ శిల్ప సంపదలో అమరావతి శిల్పాలు చాలా గొప్పవని, గొప్ప శిల్పకళా పరిశోధకుడైన ఫెర్గూసన్ చెప్పాడు. దీనిని బట్టి అమరావతి శిల్ప కళలకు కాణాచి అని చెప్పవచ్చు.

ప్రశ్న 8.
సాంస్కృతిక వైభవానికి అమరావతి నెలవు అని ఎలా చెప్పగలవు?
జవాబు:
అమరావతి అనేకమంది రాజుల కాలంలో కాలానుగుణంగా అనేకమార్పులు పొందింది. ఆయా రాజుల పరిపాలనా విధానాలు, మతాచారాలు, సంస్కృతి సంప్రదాయాలు అమరావతిపై ప్రభావం చూపించాయి. అందువల్లనే అమరావతి ఆంధ్రప్రదేశ్ కు సాంస్కృతిక రాజధాని అయ్యింది. ఇక్కడ జైన, బౌద్ధ, శైవ, వైష్ణవ, ముస్లిం, క్రైస్తవ మత సంప్రదాయాల సంస్కృతుల ప్రభావాలు కనిపిస్తాయి.

బుద్ధుడు క్రీ.పూ. 5వ శతాబ్దంలో అమరావతిలోని అమరారామంలో కాలు పెట్టాడు. అందువల్ల అమరారామం, పవిత్రమయ్యింది. 2006లో ప్రపంచ బౌద్ధమత గురువు దలైలామా అమరావతిలో కాలచక్ర పరివర్తనం నిర్వహించాడు. అశోకుడు బుద్ధుని అస్థికలపై ఇక్కడ మహా చైత్యం నిర్మించాడు. నాగార్జునాచార్యుడు దానికి ప్రాకారం కట్టించాడు. ఇక్కడ బౌద్ధ విశ్వవిద్యాలయం ఉండేది.

తరువాత అమరావతి కేంద్రంగా జైనమతం విస్తరించింది. అమరావతిలోని పార్శ్వనాథుని ఆలయం, ఇక్కడ జైనమత వికాసానికి సాక్షి. 12, 13 శతాబ్దాలలో అమరావతిలో శైవమతం వ్యాప్తి చెందింది. అమరావతిలోని అమరారామం మందార యం పంచారామాలలో ఒకటి.

రాజా వాసిరెడ్డి వేంకటాద్రినాయుడు అమరావతి దగ్గరలో వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని నిర్మించాడు.

ఈ పై కారణాల వల్ల, అమరావతి సాంస్కృతిక వైభవానికి నెలవు అని చెప్పవచ్చు.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 2 అమరావతి

ప్రశ్న 9.
“అమరావతి గొప్ప రాజధాని” – నిరూపించండి.
జవాబు:
అమరావతి రాజధానికి 22. 10.2015న మన ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. మన కొత్త రాజధానికి మంచి పేరు తెచ్చేందుకు శ్రమిస్తానని మన ముఖ్యమంత్రిగారు ప్రతిజ్ఞ చేశారు.

మన రాజధానిని ఐదు అంచెల్లో పూర్తి చేస్తారు. మొత్తం మూడు దశల్లో 35 సంవత్సరాలలో అమరావతిని నిర్మించేందుకు ప్రణాళికలు వేశారు. దీనికి ప్రక్కనే కృష్ణానది ప్రవహిస్తుంది. దీనితో ఇది వెనిస్ నగరంలా ఉండబోతోంది.

సింగపూర్, జపాన్ దేశాల భాగస్వామ్యంలో ఇక్కడ ఆకాశహర్మ్యాలు, ఉద్యానవనాలు, సరస్సులు, రహదారులతో తొమ్మిది నగరాలు నిర్మిస్తారు.

అందులో పర్యాటక నగరంగా ఉండవల్లి, ఆరోగ్య నగరంగా కృష్ణయ్యపాలెం, ఎలక్ట్రానిక్ నగరంగా బేతపూడి, విజ్ఞాన నగరంగా శాఖమూరు, విద్యా నగరంగా అయినవోలు, పరిపాలనా నగరంగా రాయపూడి, న్యాయ నగరంగా నేలపాడు, క్రీడా నగరంగా అబ్బరాజుపాలెం, ఆర్థిక నగరంగా ఉద్దండరాయపాలెం, ఆధ్యాత్మిక నగరంగా అనంతవరం పరిసరాలు అభివృద్ధి అవుతాయి.

ఈ విధంగా అమరావతి చాలా గొప్ప రాజధాని అవుతుంది. 2016 జూలై నుండి అమరావతి కేంద్రంగా మన రాష్ట్ర పాలన సాగుతుంది.

ప్రశ్న 10.
నాటి – నేటి అమరావతిని విశ్లేషించండి.
జవాబు:
నాటి అమరావతి :
ఒకటవ శతాబ్ది నాటికే అమరావతి మహా నగరంగా విరాజిల్లేది. అమరావతి నగరానికి ఎంతో చారిత్రక ప్రాధాన్యత ఉంది. మెగస్తనీసు తన ఇండికా గ్రంథంలో అమరావతిని గుర్తించి రాశాడు. అశోకుడికి పూర్వమే అమరావతిలో బౌద్ధస్తూపం ఉండేదని తెలుస్తోంది.

శాతవాహన రాజులు అమరావతిని రాజధానిగా చేసుకొని క్రీ.పూ. 220 వరకు పరిపాలించారు. తరువాత ఇక్ష్వాకులు, పల్లవులు, చాళుక్యులు, విష్ణుకుండినులు దీనిని పాలించారు. తరువాత కోట బేతరాజు వంశస్థులు పాలించారు. 1798లో అమరావతిని గొప్ప రాజధానిగా జమీందారు రాజా వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు తీర్చిదిద్దాడు.

నేటి అమరావతి :
ఇప్పుడు అమరావతి నగరం ఐదుకోట్ల ప్రజలు ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని అయ్యింది. ఈ రాజధానికి 22.10.2015న మన ప్రధాని శంకుస్థాపన చేశారు. మొత్తం మూడు దశల్లో ఈ రాజధాని 35 సంవత్సరాలలో సంపూర్ణ అమరావతి నగరంగా రూపొందుతుంది.

అమరావతికి రైలు, రోడ్డు సదుపాయాలు ఏర్పాటు అవుతాయి. సింగపూర్, జపాన్ దేశాల భాగస్వామ్యంలో ఇక్కడ ఆకాశహర్మ్యాలు, ఉద్యానవనాలు, సరస్సులు, రహదారులతో నవ నగరాలు నిర్మితం అవుతాయి. అమరావతి నగరం, అత్యాధునిక హంగులతో ప్రజా రాజధానిగా అభివృద్ధి అవుతుంది. 2016 జూలై నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిపాలన ఇక్కడి నుండే సాగుతుంది.

10th Class Telugu 2nd Lesson అమరావతి Important Questions and Answers

ప్రశ్న 1.
అమరావతి పర్యాటకులను ఆహ్వానిస్తూ ఒక కరపత్రం తయారుచేయండి.
జవాబు:
(ఆహ్వానము)

దేశ విదేశ పర్యాటకులకు ఇదే మా ఆహ్వానము. మీరు నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని, అమరావతిని గురించి వినే ఉంటారు. ఇది గొప్ప సాంస్కృతిక రాజధాని. అందాల కృష్ణమ్మ ఒంపులు తిరుగుతూ దీని పక్కనే ప్రవహిస్తూ ఉంటుంది. “అమరావతీ నగర అపురూప శిల్పాలు, తప్పక చూడదగినవి. ప్రపంచ ప్రసిద్ధ శిల్పకళా పరిశోధకుడు ఫెర్గూసన్ ప్రపంచ శిల్పకళా సంపదలో అమరావతీ శిల్పాలు మిక్కిలి గొప్పవని మెచ్చుకున్నాడు.

అమరావతిలో అశోకుడు కట్టించిన మహా బౌద్ధస్తూపం ఉంది. దానికి నాగార్జునుడు కట్టించిన మహా ప్రాకారం ఉంది. పంచారామాలలో ప్రసిద్ధమైన అమరారామం ఇక్కడే ఉంది. రాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు కట్టించిన వేంకటేశ్వరాలయం ఇక్కడ ఉంది. ఇవన్నీ చూడ ముచ్చటగా ఉంటాయి.

అమరావతిలో జైనమత వికాసానికి సాక్షిగా పార్శ్వనాథుని దేవాలయం ఉంది. అమరావతి నగరం, గొప్ప సాంస్కృతిక రాజధాని. ఇక్కడ అనేక మతాలు అభివృద్ధి చెందాయి. అమరావతిలో క్రీ.పూ. మొదటి శతాబ్దిలోనే శరీర ధర్మశాస్త్రాన్ని అనుసరించి తయారైన గొప్ప శిల్ప సంపద ఉంది.

అమరావతి అద్భుతమైన శిల్ప కళలకు కాణాచి. అమరావతి శిల్పాలు, నేటికీ బ్రిటిష్ మ్యూజియంలో భద్రపరచబడి ఉన్నాయి. ఆ శిల్పాలు అమరావతీ శిల్పకళా వైభవాన్ని ప్రపంచానికి వెల్లడిస్తున్నాయి.

ఇంత అందమైన శిల్పకళా లక్ష్మికి నిలయమైన రాజధాని అమరావతిని మీరు తప్పక దర్శించండి. మీకు ఇదే మా సుస్వాగతం. ఇదే మా ఆహ్వానం, పర్యాటకులకు అమరావతి కనులపండువగా ఉంటుంది. ఈ ప్రదేశాలు చూడడానికి బస్సులు ఉన్నాయి. రండి అమరావతిని దర్శించండి.
దివి. x x x x x

ఇట్లు,
అమరావతీ పర్యాటక సంస్థ,
అమరావతి,

ప్రశ్న 2.
“అమరావతి” ఆత్మకథ రాయండి.
జవాబు:
నేను ‘అమరావతి’ నగరాన్ని. తొలి తెలుగు రాజులు శాతవాహనులు నన్నే రాజధానిగా చేసుకొని సుమారు 220 సంవత్సరాలు పాలించారు. నా ప్రక్కనే కృష్ణానది గలగలా ప్రవహిస్తూ ఉంటుంది. నన్నే రాజధానిగా చేసుకొని ఇక్ష్వాకులు, పల్లవులు, చాళుక్యులు, విష్ణుకుండినులు, కోట బేతరాజ వంశస్థులు పాలించారు. 1798లో రాజా వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు నన్ను అందమైన రాజధాని నగరంగా తీర్చిదిద్దాడు – నా గడ్డపై బౌద్ధ, జైన, శైవ, వైష్ణవ మతాలు వ్యాప్తి చెందాయి.

గౌతమబుద్ధుడు క్రీ.శ. 5వ శతాబ్దిలోనే నా నేలపై అడుగుపెట్టాడు. ఆ మహాత్ముడి పాద స్పర్శతో నేను పునీతం అయ్యాను. నా ఈ నగరంలోనే మహా బౌద్ధస్తూపం, దానికి ప్రాకారాలు ఉన్నాయి. నా నగరంలోనే నాగార్జునుడు ఒకనాడు బౌద్ధ విశ్వవిద్యాలయం ఏర్పరచాడు.

నా అమరావతీ నగరంలో వెలిసిన శిల్పం, ప్రపంచ ప్రసిద్ధి పొందింది. నా నగరానికి ఎంతో గొప్ప చరిత్ర ఉంది. ఇప్పుడు నేను ఐదుకోట్ల ఆంధ్రులకు అందాల రాజధానిని అయ్యాను. ఇక్కడ తొమ్మిది నగరాలు అత్యాధునిక హంగులతో ఏర్పాటు అవుతున్నాయి. మనదేశ ప్రధాని ఇక్కడ నూతన రాజధానికి శంకుస్థాపన చేశారు. మూడు దశల్లో 35 ఏళ్ళలో నేను తెలుగువారికి గొప్ప రాజధాని నగరంగా అభివృద్ధి అవుతాను. నన్ను సర్వహంగులతో తీర్చిదిద్దుకోవడం, ఐదు కోట్ల తెలుగు ప్రజల కర్తవ్యం. ఉంటా…..

AP SSC 10th Class Telugu Important Questions Chapter 2 అమరావతి

ప్రశ్న 3.
అమరావతిని సందర్శించిన ఇద్దరు పర్యాటకుల సంభాషణను ఊహించి రాయండి.
జవాబు:
(రాజయ్య, వీరారెడ్డి అనే పర్యాటకుల సంభాషణ).

రాజయ్య : ఏవండీ ! మీరు ఎక్కడ నుంచి వచ్చారు? మీ పేరేమిటి?

వీరారెడ్డి : నేను అనంతపురం నుండి వచ్చా. నా పేరు వీరారెడ్డి. మీరు ఎక్కడివారు? మీ పేరేమిటి?

రాజయ్య : నేను శ్రీకాకుళం నుండి వచ్చా. నా పేరు రాజయ్య. మీరు ఇక్కడ ఏమి చూశారు?

వీరారెడ్డి : నేను అశోకుడు నిర్మించిన మహా బౌద్ధ స్తూపాన్ని, నాగార్జునాచార్యుడు దానికి కట్టించిన మహా ప్రాకారాన్ని చూశాను. అది ఎంత గొప్ప శిల్పం అండీ ! చాలా బాగుంది.

రాజయ్య : నేనూ అవి చూశాను. నిజంగా అమరావతి శిల్పం, అత్యద్భుతంగా ఉంది.

వీరారెడ్డి : నేను అమరారామం చూశా ! రాజయ్యగారూ ! శివలింగం, పై అంతస్థులో ఉంది.

రాజయ్య : అవునండి. శివుడి ఆత్మలింగంలో ఒక భాగాన్ని, దేవరాజు ఇంద్రుడు ఇక్కడ ప్రతిష్ఠ చేశాడటండీ ! ఇది గొప్ప మహా పుణ్యక్షేత్రం.

వీరారెడ్డి : నేను కృష్ణానదిలో స్నానం చేసి, ఆ నీళ్ళతో అమరలింగేశ్వరునికి అభిషేకం చేశానండి.

రాజయ్య : రెడ్డిగారూ ! మీరు పుణ్యాత్ములు. నాకు నదీస్నానం అంటే భయం. మీరు దీపాల దిన్నె వెళ్ళారా?

వీరారెడ్డి : లేదండి. ఏమిటి అక్కడ విశేషం?

రాజయ్య : పూర్వం ప్రతిరోజూ అక్కడ బౌద్ధ భిక్షువులు దీపాలు వెలిగించేవారట. అందుకే దాన్ని దీపాల దిన్నె అంటారట. అక్కడ ఒక చర్మకారుడు పూర్ణకుంభ శిల్పాన్ని చక్కగా చెక్కించాడు.

వీరారెడ్డి : నేనూ చూడాలి. నేను మొన్న ప్రధాని రాజధానికి శంకుస్థాపన చేసిన ప్రదేశానికి వెళ్ళా. పరిసరాలు బాగున్నాయి. అక్కడ తొమ్మిది నగరాలు నిర్మిస్తారట.

రాజయ్య : బాగుంది. మొత్తం పై మన ముఖ్యమంత్రిగారు మంచి ప్రదేశాన్ని మన రాష్ట్ర రాజధాని కేంద్రంగా ఏర్పాటు చేశారు. భేష్.

వీరారెడ్డి : సరే ఉంటానండి. ఇంకా నేను ఎన్నో చూడాలి.

రాజయ్య : సరేనండి. నేనూ రాష్ట్ర రాజధాని శంకుస్థాపన ప్రదేశం చూస్తా.

10th Class Telugu 2nd Lesson అమరావతి 1 Mark Bits

1. అమరావతి శిల్పకళకు కాణాచి. – గీత గీసిన పదానికి సరియైన అర్థాన్ని గుర్తించుము. (June 2018)
A) వలయము
B) నిలయము
C) ప్రధానము
D) సంకేతము
జవాబు:
B) నిలయము

2. మంచి మార్కులు రాలేదని నిరాశ చెందకుండా కష్టపడి చదవాలి – గీత గీసిన పదంలో గల సంధి పేరు గుర్తించండి. (June 2018)
A) గుణసంధి
B) అనునాసిక సంధి
C) సవర్ణదీర్ఘ సంధి
D) పడ్వాది సంధి
జవాబు:
D) పడ్వాది సంధి

3. ఒకనాటికీ, నేటికీ ఎన్నో విషయాలలో అంతరం ఉంది – గీత గీసిన పదానికి పర్యాయపదాలను గుర్తించండి. (March 2018)
A) పోలిక, సమానం
B) న్యాయం, ధర్మం
C) నీతి, నిజాయితీ
D) భేదము, తేడా
జవాబు:
D) భేదము, తేడా

AP SSC 10th Class Telugu Important Questions Chapter 2 అమరావతి

4. స్వభావముచేత ఐశ్వర్యము కలవాడు పార్వతీ దేవిని వివాహమాడెను. (వ్యుత్పత్తి పదమును గుర్తించండి.) (S.A. I – 2018-19)
A) రుద్రుడు
B) మహేశ్వరుడు
C) ఈశ్వరుడు
D) శివుడు
జవాబు:
C) ఈశ్వరుడు

5. “దేవాలయ గోపురాలు ఆకాశాన్నందుతున్నాయి” అలంకారం గుర్తించండి. (S.A. I – 2018-19)
A) స్వభావోక్తి
B) అర్థాంతరన్యాసం
C) అతిశయోక్త
D) ఉత్ప్రేక్ష
జవాబు:
C) అతిశయోక్త

6. అమరావతి శిల్పాలు నాగార్జున కొండలోని మ్యూజియంలో భద్రపరిచారు. (కర్మణివాక్యం గుర్తించండి.) (June 2017)
A) అమరావతి శిల్పాలు నాగార్జున కొండ మ్యూజియంలో భద్రపరచలేదు.
B) అమరావతి శిల్పాలు నాగార్జున కొండలోని మ్యూజియంలో భద్రపరచబడినవి.
C) అమరావతి శిల్పాలు నాగార్జున కొండలో మ్యూజియంలో దాచారు.
D) అమరావతి శిల్పాలు నాగార్జున కొండలో ఉన్నాయి.
జవాబు:
B) అమరావతి శిల్పాలు నాగార్జున కొండలోని మ్యూజియంలో భద్రపరచబడినవి.

7. ‘ప్రజ్ఞ పద్యాలు బాగా పాడింది’ అని అందరనుకుంటున్నారు. (పరోక్ష కథనం గుర్తించండి.) (June 2017)
A) ప్రజ్ఞ పద్యాలు బాగా పాడదని అందరనుకుంటున్నారు.
B) ప్రజ్ఞ పద్యాలు బాగా పాడుతుందని ఎవరూ అనలేదు.
C) ప్రజ్ఞ పద్యాలు బాగా పాడలేదని అందరనుకుంటున్నారు.
D) ప్రజ్ఞ పద్యాలు బాగా పాడిందని అందరనుకుంటున్నారు.
జవాబు:
D) ప్రజ్ఞ పద్యాలు బాగా పాడిందని అందరనుకుంటున్నారు.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 2 అమరావతి

8. తనకు పల్లెలంటే ఇష్టమని సోము అన్నాడు. (ప్రత్యక్ష కథనం గుర్తించండి.) (June 2017 )
A) “నాకు పల్లెలంటే ఇష్టం” అని సోము అన్నాడు.
B) “నేను పల్లెలంటే ఇష్టపడతాను” అని సోము అన్నాడు.
C) “వానికి పల్లెలంటే ఇష్టం” అని సోము అన్నాడు.
D) “అతనికి పల్లెలంటే ఇష్టం” అని సోము అన్నాడు.
జవాబు:
A) “నాకు పల్లెలంటే ఇష్టం” అని సోము అన్నాడు.

9. అమరావతీ ! నీ కీర్తి చిరకాలం వర్ధిల్లుగాక ! (ఏ వాక్యమో గుర్తించండి.) (June 2017)
A) ఆశీరర్థకం
B) నిశ్చయార్థకం
C) సందేహార్థకం
D) ఆశ్చర్యార్థకం
జవాబు:
A) ఆశీరర్థకం

10. “నేను తిరుపతికి వెళతాను” అని అమ్మ అన్నది – దీనికి పరోక్ష కథనం గుర్తించండి. (March 2017)
A) తాను తిరుపతికి వెళ్ళనని అమ్మ అన్నది.
B) తాను తిరుపతికి వెళతానని అమ్మ అన్నది.
C) నేను తిరుపతికి వెళ్ళను అని అమ్మ అన్నది.
D) నేను తిరుపతికి వెళతాను అని అమ్మ అనలేదు.
జవాబు:
B) తాను తిరుపతికి వెళతానని అమ్మ అన్నది.

11. చెప్పుడు మాటలు వినవద్దని రచయిత అన్నాడు – ప్రత్యక్ష కథనం గుర్తించండి. (March 2017)
A) “చెప్పుడు మాటలు వినవచ్చు” అని రచయిత అన్నాడు.
B) “చెప్పుడు మాటలు వినవద్దు” అని రచయిత అనలేదు.
C) “చెప్పుడు మాటలు వినవద్దు” అని రచయిత అన్నాడు.
D) “చెప్పుడు మాటలు వినమని” రచయిత అన్నాడు.
జవాబు:
C) “చెప్పుడు మాటలు వినవద్దు” అని రచయిత అన్నాడు.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 2 అమరావతి

12. “నేటి సినిమాలు నేను చూడలేకపోతున్నాను” అని అమ్మతో అన్నాను – పరోక్ష కథనం గుర్తించండి. (June 2018)
A) తాను ఈనాటి సినిమాలను చూడలేకపోతున్నానని అమ్మతో అన్నాను.
B) తాను ఈనాటి సినిమాలను చూడలేనని అమ్మతో అన్నాను.
C) నేటి సినిమాలను నేను చూడలేకపోతున్నానని అమ్మతో అన్నాను.
D) నాటి సినిమాలను తాను చూడలేకపోతున్నానని అమ్మతో అన్నాను.
జవాబు:
C) నేటి సినిమాలను నేను చూడలేకపోతున్నానని అమ్మతో అన్నాను.

13. తన రచనలో తన జీవితముందని రచయిత అన్నాడు – ప్రత్యక్ష కథనం గుర్తించండి. (June 2018)
A) “మా రచనలో నీ జీవితముంది” అని రచయిత అన్నాడు.
B) “నా రచనలో నా జీవితముంది” అని రచయిత అన్నాడు.
C) “తన రచనలో అతని జీవితముంది” అని రచయిత అన్నాడు.
D) “నా రచనలో ఎవరి జీవితం లేదు” అని రచయిత అన్నాడు.
జవాబు:
B) “నా రచనలో నా జీవితముంది” అని రచయిత అన్నాడు.

14. తనకు అమరావతి నిర్మాణం ముఖ్యమని ముఖ్యమంత్రి అన్నాడు – దీనికి ప్రత్యక్ష కథనం గుర్తించండి. (March 2018)
A) “నాకు అమరావతి నిర్మాణం ముఖ్యము” అని ముఖ్యమంత్రి అన్నాడు.
B) “మీకు అమరావతి నిర్మాణం ముఖ్యము” అని ముఖ్యమంత్రి అన్నాడు.
C) అమరావతి నిర్మాణం వారికి ముఖ్యమని ముఖ్యమంత్రి అన్నాడు.
D) ముఖ్యమంత్రి అన్నాడు “తమకు అమరావతి నిర్మాణం అవసరం.”
జవాబు:
A) “నాకు అమరావతి నిర్మాణం ముఖ్యము” అని ముఖ్యమంత్రి అన్నాడు.

15. రాజులు కూడా జైన మతాన్ని ఆవలంబించారు. (కర్మణి వాక్యం గుర్తించండి) (S.I. 1 – 2018-19)
A) రాజులచేత కూడా జైన మతం అవలంబించారు.
B) జైన మతం కూడా రాజులు అవలంబించారు.
C) జైన మతంచేత రాజులు అవలంబించబడ్డారు.
D) జైన మతం రాజులచేత కూడా అవలంబించబడింది.
జవాబు:
D) జైన మతం రాజులచేత కూడా అవలంబించబడింది.

16. పునీతం : గంగానదీ జలంతో భారతావని పునీతం అయ్యింది.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 1 బాలకాండ

AP State Board Syllabus AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం 1st Lesson బాలకాండ Textbook Questions and Answers.

AP State Syllabus SSC 10th Class Telugu Solutions ఉపవాచకం 1st Lesson బాలకాండ

10th Class Telugu ఉపవాచకం 1st Lesson బాలకాండ Textbook Questions and Answers

I. అవగాహన – ప్రతిస్పందన

సంఘటనా క్రమం

సంఘటనల ఆధారంగా వరుస క్రమంలో వాక్యాలను అమర్చడం
1. అ) దశరథుని మాటలకు విశ్వామిత్రుడు అగ్గిమీద గుగ్గిలమైనాడు.
ఆ) మిథిలలో అహల్యా గౌతముల పెద్ద కుమారుడైన శతానందుడు రామదర్శనం చేసుకున్నాడు.
ఇ) ఇచ్చిన మాట ప్రకారం జనకుడు సీతారాముల వివాహం జరపడానికి సంసిద్ధుడయ్యాడు.
ఈ) నారద మహర్షి ఒకనాడు మునిశ్రేష్ఠుడైన వాల్మీకి ఆశ్రమానికి వచ్చాడు.
జవాబులు
ఈ) నారద మహర్షి ఒకనాడు మునిశ్రేష్ఠుడైన వాల్మీకి ఆశ్రమానికి వచ్చాడు.
అ) దశరథుని మాటలకు విశ్వామిత్రుడు అగ్గిమీద గుగ్గిలమైనాడు.
ఆ) మిథిలలో అహల్యా గౌతముల పెద్ద కుమారుడైన శతానందుడు రామదర్శనం చేసుకున్నాడు.
ఇ) ఇచ్చిన మాట ప్రకారం జనకుడు సీతారాముల వివాహం జరపడానికి సంసిద్ధుడయ్యాడు.

2. అ) రామాయణగాథను సంక్షిప్తంగా వాల్మీకికి వినిపించాడు నారదుడు.
ఆ) శ్రీమన్నారాయణుని నిరంతరం స్మరించే నారద మహర్షి ఒకనాడు మునిశ్రేష్ఠుడైన వాల్మీకి ఆశ్రమానికి వచ్చాడు.
ఇ) ఒక వేటగాడు క్రూరబాణంతో మగపక్షిని నేలకూల్చాడు.
ఈ) రామకథ వాల్మీకి మనసులో నాటుకుపోయింది.
జవాబులు
ఆ) శ్రీమన్నారాయణుని నిరంతరం స్మరించే నారద మహర్షి ఒకనాడు ముని శ్రేష్ఠుడైన వాల్మీకి ఆశ్రమానికి వచ్చాడు.
అ) రామాయణగాథను సంక్షిప్తంగా వాల్మీకికి వినిపించాడు నారదుడు.
ఈ) రామకథ వాల్మీకి మనసులో నాటుకుపోయింది.
ఇ) ఒక వేటగాడు క్రూరబాణంతో మగపక్షిని నేలకూల్చాడు.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 1 బాలకాండ

3. అ) భరద్వాజాది శిష్యులు వెంట నడుస్తున్నారు.
ఆ) ఒక కొమ్మపై క్రౌంచపక్షుల జంటను చూశాడు.
ఇ) హృదయవిదారకమైన ఈ దృశ్యాన్ని చూశాడు వాల్మీకి.
ఈ) రామకథ వాల్మీకి మనసులో నాటుకుపోయింది.
జవాబులు
ఈ) రామకథ వాల్మీకి మనసులో నాటుకుపోయింది.
అ) భరద్వాజాది శిష్యులు వెంట నడుస్తున్నారు.
ఆ) ఒక కొమ్మపై క్రౌంచ పక్షుల జంటను చూశాడు.
ఇ) హృదయ విదారకమైన ఈ దృశ్యాన్ని చూశాడు వాల్మీకి.

4. అ) సరయూ నదీతీరంలో ‘కోసల’ అనే సుప్రసిద్ధ దేశముంది. అందులోనిదే ‘అయోధ్య’ అనే మహానగరం.
ఆ) కోసల దేశాన్ని దశరథ మహారాజు పరిపాలిస్తున్నాడు.
ఇ) ప్రజలు ధర్మవర్తనులై సుఖసంతోషాలతో ఉన్నారు.
ఈ) ధర్మపరాయణుడు. ప్రజలను కన్నబిడ్డల వలె చూసుకునేవాడు.
జవాబులు
అ) సరయూ నదీతీరంలో ‘కోసల’ అనే సుప్రసిద్ధ దేశముంది. అందులోనిదే ‘అయోధ్య’ అనే మహానగరం.
ఆ) కోసల దేశాన్ని దశరథ మహారాజు పరిపాలిస్తునాడు.
ఈ) ధర్మపరాయణుడు. ప్రజలను కన్నబిడ్డల వలె చూసుకునేవాడు.
ఇ) ప్రజలు ధర్మవర్తనులై సుఖసంతోషాలతో ఉన్నారు.

5. అ) మంత్రీ సారథీ అయిన సుమంత్రుడు ఈ యాగానికి ఋష్యశృంగ మహర్షిని ఆహ్వానిస్తే ఫలవంతమవుతుందని సూచించాడు.
ఆ) ఎన్ని ఉన్నా సంతానం లేదన్న చింత దశరథుని క్రుంగదీసింది. సంతానప్రాప్తి కోసం అశ్వమేధయాగం చేయాలన్న ఆలోచన కలిగింది.
ఇ) అతడు ఎక్కడ ఉంటే అక్కడ వానలు బాగా కురుస్తాయి.
ఈ) సరయూనదికి ఉత్తర తీరంలో యజ్ఞవేదిక సిద్ధమైంది.
జవాబులు
ఆ) ఎన్ని ఉన్నా సంతానం లేదన్న చింత దశరథుని క్రుంగదీసింది. సంతానప్రాప్తి కోసం అశ్వమేధయాగం చేయాలన్న ఆలోచన కలిగింది.
ఈ) సరయూనదికి ఉత్తర తీరంలో యజ్ఞవేదిక సిద్ధమైంది.
అ) మంత్రీ సారథీ అయిన సుమంత్రుడు ఈ యాగానికి ఋష్యశృంగ మహర్షిని ఆహ్వానిస్తే ఫలవంతమవుతుందని సూచించాడు.
ఇ) అతడు ఎక్కడ ఉంటే అక్కడ వానలు బాగా కురుస్తాయి.

6. అ) రావణాసురుడు బ్రహ్మ వరప్రభావం చేత విర్రవీగుతూ తమను చిత్రహింసలకు గురి చేస్తున్నారన్నారు.
ఆ) దశరథుని అభ్యర్థనను మన్నించిన ఋష్యశృంగుడు పుత్రకామేష్ఠి అనే యాగాన్ని ప్రారంభించాడు.
ఇ) అతని దుండగాలకు అంతేలేదన్నారు. ఋషుల, యక్షగంధర్వుల మాట అటుంచి అతని భయంతో సూర్యుడు, సముద్రుడు, వాయువు కూడా తమ సహజస్థితిని ప్రకటించలేకపోతున్నారని వాపోయారు.
ఈ) హవిస్సులందుకోవడానికి బ్రహ్మాది దేవతలు, గంధర్వులు, సిద్ధులు, మహర్షులు యజ్ఞశాలలో ప్రత్యక్షమయ్యారు.
జవాబులు
ఆ) దశరథుని అభ్యర్థనను మన్నించిన ఋష్యశృంగుడు పుత్రకామేష్ఠి అనే యాగాన్ని ప్రారంభించాడు.
ఈ) హవిస్సులందుకోవడానికి బ్రహ్మాది దేవతలు, గంధర్వులు, సిద్ధులు, మహర్షులు యజ్ఞశాలలో ప్రత్యక్షమయ్యారు.
అ) రావణాసురుడు బ్రహ్మ వరప్రభావంచేత విర్రవీగుతూ తమను చిత్రహింసలకు గురిచేస్తున్నారన్నారు.
ఇ) అతని దుండగాలకు అంతేలేదన్నారు. ఋషుల, యక్షగంధర్వుల మాట అటుంచి, అతని భయంతో సూర్యుడు, సముద్రుడు, వాయువు కూడా తమ సహజ స్థితిని ప్రకటించలేకపోతున్నారని వాపోయారు.

7. అ) దేవతలు వరగర్వముచేత కన్నూమిన్నూగానక ప్రవర్తిస్తున్న రావణుణ్ణి సంహరించడానికి మానవుడిగా అవతరించమని అభ్యర్థించారు.
ఆ) బ్రహ్మ దేవతలతో రావణుడు గంధర్వ, యక్ష, దేవ, దానవులచే మరణం లేకుండా నన్ను వరం కోరాడు.
ఇ) కనుక మానవుని చేతిలోనే రావణునికి మరణం ఉందని అన్నాడు.
ఈ) ఇంతలో శ్రీ మహావిష్ణువు శంఖచక్రగదాధారియై వచ్చాడు.
జవాబులు
ఆ) బ్రహ్మ దేవతలతో రావణుడు గంధర్వ, యక్ష, దేవ, దానవులచే మరణం లేకుండా నన్ను వరం కోరాడు.
ఇ) కనుక మానవుని చేతిలోనే రావణునికి మరణం ఉందని అన్నాడు.
ఈ) ఇంతలో శ్రీ మహావిష్ణువు శంఖచక్రగదాథారియై వచ్చాడు.
అ) దేవతలు వరగర్వము చేత కన్నూమిన్నూ గానక ప్రవర్తిస్తున్న రావణుణ్ణి సంహరించడానికి మానవుడిగా అవతరించమని అభ్యర్థించారు.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 1 బాలకాండ

8. అ) చైత్రశుద్ధ నవమినాడు కౌసల్యకు శ్రీరాముడు జన్మించాడు.
ఆ) ‘ఈ పాయసం సంపదలనిస్తుంది. ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. అన్నింటినీ మించి సంతానాన్ని ప్రసాదిస్తుంద’న్నాడు.
ఇ) దశరథుడు పుత్రకామేష్ఠి చేసినప్పుడు యజ్ఞకుండం నుంచి గొప్ప తేజస్సుతో ఒక దివ్య పురుషుడు ఆవిర్భవించాడు.
ఈ) చేతిలో బంగారు పాత్ర వెండిమూతతో. అందులో దివ్యపాయసముంది.
జవాబులు
ఇ) దశరథుడు పుత్రకామేష్టి చేసినప్పుడు యజ్ఞకుండం నుంచి గొప్ప తేజస్సుతో ఒక దివ్య పురుషుడు ఆవిర్భవించాడు.
ఈ) చేతిలో బంగారు పాత్ర వెండిమూతతో. అందులో, దివ్యపాయసముంది.
ఆ) ఈ పాయసం సంపదలనిస్తుంది. ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. అన్నింటిని మించి సంతానాన్ని ప్రసాదిస్తుంద’న్నాడు.
అ) చైత్రశుద్ధ నవమినాడు కౌసల్యకు శ్రీరాముడు జన్మించాడు.

9. అ) వేదశాస్త్రాలనభ్యసించారు. ధనుర్విద్యలో నైపుణ్యం సంపాదించారు. విజ్ఞానఖనులయ్యారు.
ఆ) రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు శుక్లపక్ష చంద్రునిలా పెరుగుతున్నారు.
ఇ) రాముడు ఎప్పుడూ తల్లిదండ్రుల సేవలో నిమగ్నమయ్యేవాడు.
ఈ) ఉత్తమ విద్యార్థులకు ఉండవలసిన లక్షణాలివే.
జవాబులు
ఆ) రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు శుక్లపక్ష చంద్రునిలా పెరుగుతున్నారు.
అ) వేదశాస్త్రాలనభ్యసించారు. ధనుర్విద్యలో నైపుణ్యం సంపాదించారు. విజ్ఞానఖనులయ్యారు.
ఈ) ఉత్తమ విద్యార్థులకు ఉండవలసిన లక్షణాలివే..
ఇ) రాముడు ఎప్పుడూ తల్లిదండ్రుల సేవలో నిమగ్నమయ్యేవాడు.

10. అ) సరిగ్గా అదే సమయంలో అక్కడ అడుగుపెట్టాడు మహాతేజశ్శాలియైన విశ్వామిత్ర మహర్షి.
ఆ) ఇది తెలిసిన దశరథుడు విశ్వామిత్రునకు సముచితరీతిన మర్యాదలు గావించాడు.
ఇ) అతిథి దేవోభవ అతిథి మనకు దేవుడితో సమానం.
ఈ) తన పైన కార్యభారం పెడితే నెరవేరుస్తానన్నాడు.
జవాబులు
అ) సరిగ్గా అదే సమయంలో అక్కడ అడుగుపెట్టాడు మహాతేజశ్శాలియైన విశ్వామిత్ర మహర్షి.
ఇ) అతిథి దేవోభవ అతిథి మనకు దేవుడితో సమానం.
ఆ) ఇది తెలిసిన దశరథుడు విశ్వామిత్రునకు సముచితరీతిన మర్యాదలు గావించాడు.
ఈ) తనపైన కార్యభారం పెడితే నెరవేరుస్తానన్నాడు.

11. అ) రామలక్ష్మణులకు ‘బల’, ‘అతిబల’ విద్యలనుపదేశించాడు విశ్వామిత్ర మహర్షి.
ఆ) విశ్వామిత్రుని వెంట ధనుర్ధారి అయి రాముడు నడుస్తున్నాడు. లక్ష్మణుడు అనుసరిస్తున్నాడు.
ఇ) వీటి ప్రభావం వల్ల, అలసట, ఆకలిదప్పులుండవు. రూపకాంతులు తగ్గవు.
ఈ) విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు మేల్కొలుపు పలికాడు.
జవాబులు
ఆ) విశ్వామిత్రుని వెంట ధనుర్ధారి అయి రాముడు నడుస్తున్నాడు.
అ) రామలక్ష్మణులకు ‘బల’, ‘అతిబల’ విద్యలనుపదేశించాడు విశ్వామిత్రుడు.
ఇ) వీటి ప్రభావం వల్ల అలసట, ఆకలిదప్పులుండవు. రూపకాంతులు తగ్గవు.
ఈ) విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు మేల్కొలుపు పలికాడు.

12. అ) జనకుడు తన కుమార్తెలైన సీతను, ఊర్మిళను రామలక్ష్మణులకు తన తమ్ముడు కుశధ్వజుని కుమార్తెలైన మాండవిని, శ్రుతకీర్తులను భరతశత్రుఘ్నులకు ఇచ్చి వివాహం జరిపించాడు.
ఆ) శివధనుస్సును ఎక్కుపెట్టగలవాడే సీతకు తగిన భర్త అన్నాడు.
ఇ) తాటక వధతో దుష్టసంహారానికి పూనుకొన్నాడు రాముడు.
ఈ) ధనుర్విద్యయందు ఆరితేరిన రాముని చేయి సోకినంతనే ఆ ధనుస్సు వంగింది.
జవాబులు
ఇ) తాటక వధతో దుష్టసంహారానికి పూనుకొన్నాడు రాముడు.
అ) జనకుడు తన కుమార్తెలైన సీతను, ఊర్మిళను రామలక్ష్మణులకు తన తమ్ముడు కుశధ్వజుని కుమార్తెలైన మాండవిని, శ్రుతకీర్తులను భరతశత్రుఘ్నులకు ఇచ్చి వివాహం జరిపించాడు.
ఆ) శివధనస్సును ఎక్కుపెట్టగలవాడే సీతకు తగిన భర్త అన్నాడు.
ఈ) ధనుర్విద్యయందు ఆరితేరిన రాముని చేయి సోకినంతనే ఆ ధనుస్సు వంగింది.

పాత్ర స్వభావాలు

1. నారద మహర్షి :
దేవఋషి. రామాయణగాథను వాల్మీకికి ఉపదేశించినవాడు. బ్రహ్మయొక్క మానసపుత్రుడు. త్రిలోక సంచారి. నిరంతరం నారాయణ నామాన్ని జపిస్తూ ఉంటాడు. లోకకల్యాణం కోసం నిరంతరం ప్రయత్నిస్తాడు. ఋషులకు మార్గదర్శకుడు. రామాయణ కథారచనకు మూలపురుషుడు.

2. వాల్మీకి :
మునిశ్రేష్టుడు. జిజ్ఞాసకలవాడు. ప్రకృతి అందాలకు పరవశించేవాడు. క్రౌంచ పక్షుల హృదయ విదారక దృశ్యాన్ని చూసి, అప్రయత్నంగా కవిత్వాన్ని వ్రాయగల కవి. పెద్దల పట్ల ప్రవర్తించవలసిన తీరు కలిగిన శ్రేష్టుడు.

3. దశరథ మహారాజు :
కోసల దేశానికి రాజు. సంతానం కోసం పరితపించాడు. పుత్రకామేష్ఠిని చేసి నలుగురు పిల్లలను పొందాడు. మహాబల పరాక్రమవంతుడు. ధర్మాత్ముడు. ప్రజలను కన్నబిడ్డల వలె పరిపాలించాడు. మితిమీరిన పుత్రవ్యామోహం కలవాడు. కైకకు ఇచ్చిన వరాల వల్ల శ్రీరాముని వనవాసానికి పంపాడు. శ్రీరామునిపై బెంగతో మరణించాడు.

4. వశిష్ఠుడు :
దశరథుని ఇంటి పురోహితుడు. బ్రహ్మర్షి. దశరథునికి అనేక ధర్మసందేహాలను తీర్చేవాడు. శ్రీరామునకు కర్తవ్యబోధ చేసినవాడు.

5. కౌసల్య :
దశరథ మహారాజు భార్య. శ్రీరాముని తల్లి. ఏనాడూ భర్త మాటకు ఎదురు చెప్పని మహాపతివ్రత. శ్రీరాముడు అరణ్యవాసానికి బయల్దేరేటప్పుడు శ్రీరాముని వనవాస ప్రయత్నం విరమింపజేయాలనుకుంది. ఫలించలేదు. పుత్రవ్యామోహంతో వనవాసానికి తానూ వస్తానంది. రాముడు ఒప్పుకోలేదు. శ్రీరాముడికి ధర్మబోధ చేసింది. ధైర్యం చెప్పిన వీరనారి. ధర్మాన్ని విడిచి పెట్టవద్దని చెప్పిన మహారాణి కౌసల్య.

6. సుమిత్ర :
దశరథ మహారాజుకు రెండవ భార్య. లక్ష్మణుడు, శత్రుఘ్నుడు ఈమె సంతానం. కౌసల్యాదేవి అడుగుజాడలలో నడిచింది. భర్త మాటకు ఎదురు చెప్పని మహాపతివ్రత. శ్రీరామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులందర్నీ సమానంగా చూసిన మాతృమూర్తి.

7. కైక :
కేకయరాజు కూతురు. పరాక్రమవంతురాలు. యుద్ధవిద్యలు కూడా తెలుసు. చెప్పుడు మాటలకు లొంగిపోయే స్వభావం కలది. మంథర చెప్పిన చెప్పుడు మాటలతో శ్రీరామ వనవాసానికి కారకురాలైంది. అందరి నిందలను పడింది. దశరథుని మరణానికి కూడా కారకురాలైంది. ఒక దుష్ట స్త్రీ పాత్రగా మిగిలిపోయింది.

8. ఋష్యశృంగుడు :
విభాండక మహర్షి కొడుకు. దశరథుని కుమార్తె శాంతను వివాహం చేసుకున్నాడు. పుత్రకామేష్ఠి యాగం దశరథుని చేత చేయించాడు. ఋష్యశృంగుడు సాక్షాత్తు దైవస్వరూపుడు. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ వర్షాలు బాగా కురుస్తాయి. భూమి సస్యశ్యామలంగా ఉంటుంది.

9. శ్రీరాముడు :
ఎవరికీ లేనన్ని మంచి గుణాలు కలవాడు. దశరథ మహారాజు యొక్క పెద్ద కుమారుడు. సీతాపతి. ధర్మమూర్తి. ఆదర్శవంతమైన కొడుకు. ఆదర్శమూర్తియైన, మర్యాద పురుషుడైన భర్త. శత్రువైన మారీచుని చేత కూడా పొగడబడినవాడు.

10. లక్ష్మణుడు :
దశరథ మహారాజుకు సుమిత్రయందు జన్మించినవాడు. అన్నావదినల సేవలో తరించినవాడు. 14 సంవత్సరాలు నిద్రాహారాలు మాని సీతారాములను సేవించాడు. అన్నావదినలకు నీడలా ఉన్నాడు. సీతారాములలోనే తన తల్లిదండ్రులను దర్శించుకున్నాడు. ముక్కోపి. రామరావణ సంగ్రామంలో శ్రీరామ విజయానికి ప్రధానకారకుడు. ధర్మస్వరూపుడు.

11. భరతుడు :
కైక యందు దశరథ మహారాజుకు జన్మించాడు. కైక రాజ్యా ధికారం చేపట్టమని కోరినా శ్రీరామ పాదుకలకు పట్టాభిషేకం చేశాడు. తల్లిని కూడా దూషించాడు. రాజ్యంపై కోరిక లేనివాడు. కేవలం శ్రీరాముని సేవించడానికే జన్మించాననుకొనే పుణ్యపురుషుడు.

12. శత్రుఘ్నుడు :
సుమిత్రయందు దశరథునకు జన్మించాడు. లక్ష్మణుని స్వభావం శత్రుఘ్నుని స్వభావం ఒక్కటే. అన్నగార్లపై అమితమైన గౌరవం కలవాడు.

13. విశ్వామిత్రుడు :
గాధి యొక్క కుమారుడు. శ్రీరామలక్ష్మణుల యాగ సంరక్షణార్థం తీసుకొని వెళ్ళాడు. వారికి బల, అతిబల, విద్యలను ఉపదేశించాడు. వాటి వలన రామలక్ష్మణులకు అలసట, ఆకలిదప్పులు ఉండవు. ధనుర్విద్యలో రామలక్ష్మణులను తీర్చిదిద్దాడు. అనేక అస్త్రాల ప్రయోగ ఉపసంహారాలను నేర్పాడు. రామలక్ష్మణుల ధనుర్విద్యా గురువు.

14. భగీరథుడు :
దృఢ సంకల్పం కలిగినవాడు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా సంకల్పం నుంచి ప్రక్కకు తప్పుకోకుండా, సంకల్పాన్ని నెరవేర్చుకోగల ధీశాలి. పట్టుదల కలవాడు. పట్టుదల విషయంలో ‘భగీరథ ప్రయత్నం’ అన్న జాతీయం ఏర్పడటానికి నెరవేర్చుకోగల ధీశా కలిగినవాడు.

15. జనక మహారాజు :
మిథిలానగరపు రాజు. సీతాదేవికి తండ్రి. రాజర్షి. ధర్మశాస్త్రాలు తెలిసినవాడు. ఋషులకు కూడా సందేహాలు తీర్చగలవాడు. మహాజ్ఞాని.

16. పరశురాముడు :
రేణుకా జమదగ్నుల కుమారుడు. ఇరవై ఒక్కసార్లు భూప్రదక్షణం చేసి, క్షత్రియులను సంహరించాడు. చాలా కోపం ఎక్కువ. అధర్మాన్ని సహించడు. అధికార గర్వాన్ని అంతం చేస్తాడు. వేదాధ్యయనం చేసినవాడు. తన శక్తిని కూడా శ్రీరామునకు ఇచ్చినవాడు. పరశురాముడంటే రాజులకు సింహస్వప్నం.

సంఘటన ద్వారా గ్రహించుట )

ప్రశ్న 1.
“మీరు చెప్పినట్లుగా నడుచుకొమ్మని మా నాన్నగారు నన్ను ఆదేశించారు. వారి ఆజ్ఞ నాకు శిరోధార్యము” అని – శ్రీరాముడు తాటకను చంపడం విషయంలో విశ్వామిత్ర మహర్షితో చెప్పిన మాటలను బట్టి, మీరేం గ్రహించారు?
జవాబు:
పై మాటలను బట్టి శ్రీరాముడు గొప్ప పితృవాక్య పరిపాలకుడని, గ్రహించాను. గురువైన విశ్వామిత్రుడు చెప్పినట్లు నడుచుకోవడం, ఆయన ఆజ్ఞను పాలించడం, శిష్యుని ధర్మమని రాముడు భావించాడనీ, అతడు గురువు చెప్పినట్లే తాటకను వధించాడనీ గ్రహించాను.

తాటక స్త్రీ అయినా, ఆమె దుష్టురాలు కాబట్టి ఆమెను చంపడం తన కర్తవ్యమని రాముడు భావించాడని నేను – గ్రహించాను. అదీగాక విశ్వామిత్రుడు చెప్పినట్లు చేయమని, తన తండ్రి దశరథుడు చెప్పిన మాటను, రాముడు వేదవాక్యంగా భావించి, స్త్రీవధ అని శంకించకుండా గురువు చెప్పినట్లు తాటకను సంహరించాడని గుర్తించాను.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 1 బాలకాండ

ప్రశ్న 2.
‘రాముణ్ణి వదలి నేను ఒక క్షణమైనా బతకలేను. మా నోముల పంట రాముడు’ అని దశరథుడు విశ్వామిత్రునితో చెప్పిన మాటలను బట్టి, మీరేమి గ్రహించారు?
జవాబు:
విశ్వామిత్రుడు తాను చేయబోయే యజ్ఞరక్షణకై శ్రీరాముడిని తనతో పంపమని, దశరథుడిని అడిగాడు. అప్పుడు దశరథుడు పై మాటలను విశ్వామిత్రుడితో అన్నాడు.

దశరథమహారాజుకు, రాముడు అంటే ప్రాణమనీ, రాముడు ఆయనకు లేక లేక పుట్టిన సంతానమనీ నేను గ్రహించాను. దశరథుడు పుత్రకామేష్టి చేయగా ఆయన నోములు పండి, రాముడు జన్మించాడనీ, రాముడిని వదలి దశరథుడు ఉండలేడనీ, రాముడు అంటే దశరథునకు బాగా ప్రేమ అనీ, పై దశరథుని మాటల వల్ల నేను అర్థం చేసుకున్నాను.

ప్రశ్న 3.
రాజు ఎలా ఉంటే ప్రజలు కూడా అలాగే ఉంటారు అని పలికిన మాటలను బట్టి మీరేమి గ్రహించారు?
జవాబు:
రాజు ధర్మాత్ముడైతే ప్రజలు కూడా ధర్మమార్గంలో ఉంటారని, సత్యం, నీతి, భక్తి, గౌరవం మొదలైన భావాలను కల్గి ఉంటారని గ్రహించాను. దశరథుడు, శ్రీరాముడు వంటి రాజులు ధర్మాత్ములు, సత్యకంధులు. ఆడినమాట తప్పనివారు. అట్టివారు రాజులుగా ఉన్నారు కాబట్టే ప్రజలు కూడా వారి మార్గంలోనే నడిచారని గ్రహించాను.

రాజులు ఎల్లప్పుడు ధర్మమార్గంలో ఉండాలని, ప్రజలను రక్షించాలని, వారి యోగక్షేమాలను చూడాలని, ఆ విధంగా చేస్తే ప్రజలు కూడా నీతిమార్గంలో నడిచే అవకాశం ఉంటుందని గ్రహించాను.

ప్రశ్న 4.
ఆకాశంలోని గంగను పాతాళానికి దింపిన భగీరథ ప్రయత్నం నుండి మీరేమి గ్రహించారు?
జవాబు:
గంగావతరణాన్ని గురించి విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు చెప్పాడు. గంగావతరణకు మూలకారణమైన భగీరథుని గురించి విశ్వామిత్రుడు రామునికి చెప్పాడు. దీనివల్ల ఈ క్రింది విషయాలను గ్రహించాను.

  1. దృఢసంకల్పానికి అసాధ్యమైనది ఏదీలేదని తెలుస్తుంది. ఎన్ని అడ్డంకులు ఎదురైనా చేపట్టిన పనిని వదలకుండా చేస్తే, జయం వస్తుందని తెలిసింది.
  2. భగీరథుడు రాముని వంశంవాడే. భగీరథుని గురించి చెప్పడం వల్ల రామునికి తన పూర్వీకులు ఎంత గొప్పవారో తెలియచేశాడు విశ్వామిత్రుడు. పూర్వీకుల పేరు, మంచితనం పోగొట్టకుండా జీవించాలని చెప్పడం ఆంతర్యం.
  3. మన పితరుల పట్ల భక్తి, గౌరవం కలిగి ఉండాలని తెలియజేయడం కూడా ఆంతర్యమే.

ప్రశ్న 5.
గురువు అనుగ్రహిస్తే ఇవ్వలేనిది ఏమిటి? శిష్యుడు పొందలేనిదేమిటి? అని కవి చెప్పడం వల్ల మీరేమి గ్రహించారు?
జవాబు:
విశ్వామిత్రుడు రామలక్ష్మణులను యాగరక్షణ కోసం తన వెంట తీసుకొని వెళ్ళాడు. రామలక్ష్మణులకు ఆకలి దప్పికలు కలుగకుండా ఉండటానికి బల, అతిబల అనే మంత్రాలను ఉపదేశించాడు. శ్రీరామునికి విద్యాస్త్రాలను అనుగ్రహించాడు.

ఆ శక్తితో రాముడు తాటకి వంటి రాక్షసులను సంహరించాడు. యాగాన్ని రక్షించాడు. రాక్షస సంహారానికి శ్రీకారం చుట్టాడు. అందువల్ల గురువు ప్రేమతో శిష్యునికి అనుగ్రహిస్తే అతడు పొందలేనిది ఏమీ లేదని గ్రహించాను.

ప్రశ్న 6.
” జ్ఞానాన్ని పొందడంలో నిరంతరం అప్రమత్తులై ఉండటం ఉత్తమ విద్యార్థుల లక్షణం” అని చెప్పిన కవి మాటలను బట్టి మీరేమి గ్రహించారు?
జవాబు:
గురువుల నుండి విద్యను అర్థించువారు విద్యార్థులు. విద్యార్థులు చక్కని విద్యను పొందడానికి గురువులను భక్తి, శ్రద్ధలతో సేవించాలని, నిరంతరం అప్రమత్తంగా ఉండాలని గ్రహించాను. రామలక్ష్మణులు విశ్వామిత్రుడిని సేవించారు. అతని మాటలను వేదవాక్కుగా భావించారు. అప్రమత్తులై సేవించారు. అందువల్లనే విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు దివ్యాస్త్రాలను అనుగ్రహించాడు.

విద్యార్థులు విద్యార్జనలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, సోమరితనం, గర్వం మొదలైన దుర్గుణాలను విడిచి పెట్టాలని, అదే ఉత్తమ విద్యార్థులకు ఉండాల్సిన లక్షణమని గ్రహించాను.

విషయాత్మక ప్రశ్నలు

ఈ క్రింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
వాల్మీకి చెప్పిన మొదటి శ్లోకానికి కారణాలేమిటి?
జవాబు:
ఒకసారి వాల్మీకి తన శిష్యులతో తమసా నదిలోకి స్నానానికి దిగాడు. అక్కడ ఒక కొమ్మపై క్రౌంచపక్షుల జంటను చూశాడు. ఆనందించాడు. ఇంతలో ఒక వేటగాడు ఆ జంటలోని మగపక్షిని బాణంతో కొట్టాడు. అది నెత్తురోడుతూ, విలవిలలాడుతూ మరణించింది. అది తట్టుకోలేక ఆడపక్షి తల్లడిల్లిపోయింది.

హృదయ విదారకమైన ఈ దృశ్యాన్ని వాల్మీకి చూశాడు. కరుణరసం జాలువారింది. ధర్మావేశం కట్టలు తెంచుకుంది. ఆయన నోటి వెంట అప్రయత్నంగా ‘మానిషాదప్రతిష్టాంత్వ..’ అనే శ్లోకం వచ్చింది.

ప్రశ్న 2.
అయోధ్యను వివరించండి.
జవాబు:
సరయూ నదీతీరంలో ‘కోసల’ దేశం ఉంది. దానిలోనిది అయోధ్యా నగరం. అయోధ్య అంటే యోధులకు జయించడానికి శక్యం కానిది అని అర్థం. దీనిని మనువు నిర్మించాడు.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 1 బాలకాండ

ప్రశ్న 3.
దశరథునికి ఎన్ని ఉన్నా ఒక చింత కుంగదీసింది కదా ! ఆ చింతను ఎలా అధిగమించాడు?
జవాబు:
దశరథునికి ఎన్ని ఉన్నా సంతానం లేదనే చింత కుంగదీసింది. సంతాన ప్రాప్తి కోసం ఋషీశ్వరుల అనుజ్ఞతో అశ్వమేధ యాగం చేశాడు. తర్వాత ‘పుత్రకామేష్ఠి’ చేశాడు. సంతానం కలిగింది. శ్రీరామలక్ష్మణ భరత శత్రుఘ్నులు జన్మించారు.

ప్రశ్న 4.
దశరథుని మాటలకు విశ్వామిత్రుడు అగ్గిమీద గుగ్గిలమైనాడు. ఎందుకు?
జవాబు:
తనపైన కార్యభారం పెడితే నెరవేరుస్తానని విశ్వామిత్రుడికి దశరథుడు చెప్పాడు. విశ్వామిత్రుడు తన యాగానికి మారీ సుబాహులనే రాక్షసుల వలన కలుగుతున్న బాధను చెప్పాడు. యాగ సంరక్షణకు శ్రీరాముని తనతో పది రోజులు పంపమన్నాడు. రావణుడు ఈ రాక్షసుల వెనుక ఉన్నాడు కనుక పంపలేనన్నాడు. కావాలంటే తాను వస్తానన్నాడు దశరథుడు. దానితో విశ్వా మిత్రుడికి కోపం వచ్చింది. అగ్గిమీద గుగ్గిలం అయ్యాడు.

ప్రశ్న 5.
బల, అతిబల విద్యల గురించి వ్రాయండి.
జవాబు:
ఈ విద్యలను రామలక్ష్మణులకు విశ్వామిత్రుడు ఉపదేశించాడు. వీటి ప్రభావం వలన అలసట ఉండదు. ఆకలి ఉండదు. దాహం ఉండదు. శరీరం కాంతి తగ్గదు. నిద్రలో ఉన్నా, అజాగ్రత్తగా ఉన్నా రాక్షసులేమీ చేయలేరు. ముల్లోకాలలో ఎవ్వరూ ఎదురొడ్డి నిలబడలేరు.

ప్రశ్న 6.
తాటక వధ న్యా యమా?
జవాబు:
తాటక యక్షిణి. వేయి ఏనుగుల బలం కలది. విశ్వామిత్రుని యజ్ఞాన్ని పాడుచేస్తోంది. ఒక స్త్రీని వధించడం మహా పాతకమని రాముడు అనుకొన్నాడు. మౌనంగా ఉన్నాడు. విశ్వామిత్రుడు తాటకను చంపమన్నాడు. అధర్మ పరాయణ అయిన తాటకను చంపితే దోషం రాదన్నాడు. తన తండ్రి తనను విశ్వామిత్ర మహర్షి చెప్పినట్లు నడుచుకోమన్న విషయం శ్రీరాముడు గుర్తుచేసుకొన్నాడు. పితృవాక్య పరిపాలకుడు కనుక విశ్వామిత్ర మహర్షి ఆజ్ఞను శిరసావహించాడు. తాటకను చంపాడు. ఇది న్యాయమే.

ప్రశ్న 7.
‘భగీరథ ప్రయత్నం’ అనే జాతీయం ఎందుకు ఏర్పడింది?
జవాబు:
పాతాళంలో కపిల మహర్షి కోపాగ్నికి సగరపుత్రులు బూడిద కుప్పలయ్యారు. గంగా ప్రవాహంతో వారికి ఉత్తమగతులు కల్పించాలని సంకల్పించారు. భగీరథుడు తపస్సు చేసి, బ్రహ్మను, విష్ణువును, శివుని మెప్పించి గంగను భూమికి దింపాడు. జహ్ను మహర్షిని ప్రార్థించి ఆటంకం తొలగించాడు. అనేక కష్టాలను ఓర్పుతో అధిగమించాడు. గంగను ప్రవహింపజేశాడు. అందుకే భగీరథ ప్రయత్నం జాతీయం ఏర్పడింది. చాలా కష్టపడి సాధించిన వాటి విషయంలో ఈ జాతీయం ఉపయోగిస్తారు.

ప్రశ్న 8.
శివధనుర్భంగాన్ని వివరించండి.
జవాబు:
మహాబలవంతులు ఐదువేల మంది శి వధనుస్సుతో ఉన్న పేటికను తెచ్చారు. విశ్వామిత్ర మహర్షి అనుమతితో ఆ ధనుస్సు మధ్య భాగాన్ని శ్రీరాముడు అవలీలగా పట్టుకొన్నాడు. ధనుర్విద్యలో ఆరితేరిన శ్రీరాముని చేయి సోకగానే ధనువు వంగింది. వింటి నారిని సంధించాడు. అల్లెత్రాడును ఆకర్ణాంతం లాగాడు. భయంకరమైన శబ్దం చేస్తూ విల్లు ఫెళ్లున విరిగింది. విశ్వామిత్రుడు, జనకుడు, రామలక్ష్మణులు తప్ప సభలోని వారంతా ఆ ధ్వనికి మూర్ఛపోయారు. సీతారాముల కల్యాణానికి అంకురార్పణ జరిగింది.

ప్రశ్న 9.
శ్రీరాముడంటే తల్లిదండ్రులకే కాదు, ప్రజలందరికీ పరమ ప్రీతి ఎందుకు?
జవాబు:
శ్రీరాముడు సద్గుణాల రాశి. రూపంలోనూ, గుణంలోనూ శ్రేష్ఠుడు. మహావీరుడు. మృదువుగా మాట్లాడతాడు. కోపం లేదు. గర్వం లేదు. సత్యం పలికేవాడు. పరుల సంపద ఆశించడు. దీనులను ఆదుకుంటాడు. కాలాన్ని వృధా చేయడు. వినయశీలి. తల్లిదండ్రులు, గురువులు, పెద్దలపట్ల భక్తి కలవాడు. సోమరితనం లేనివాడు.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 1 బాలకాండ

ప్రశ్న 10.
‘అతిథిదేవోభవ’ అతిథి మనకు దేవునితో సమానం – వివరించండి.
జవాబు:
తిథి నియమములు లేకుండా వచ్చేవాడు అతిథి. తల్లి, తండ్రి తర్వాత స్థానం అతిథిదే. మనవల్ల ఇతరులకు సంతోషం కలుగుతున్నప్పుడు మన జీవితానికి సార్ధకత ఏర్పడుతుంది. ఆ సార్థకత మనం అతిథులను ఆదరించినపుడే కలుగుతుంది. అందుకే పెద్దలు ‘అతిథి దేవోభవ’ అన్నారు. భగవత్స్వరూపంగా అతిథిని భావించాలి. సాయం కోరి మన వద్దకు వచ్చిన వ్యక్తిని నిరుత్సాహపరచకుండా కోరిన సాయం చేయటం ఉత్తమ లక్షణంగా పెద్దలు పేర్కొన్నారు. రామాయణంలోను విశ్వామిత్రుడు వచ్చినపుడు దశరథుడు అతిథి మర్యాదలు చేశాడు. విశ్వామిత్రుని ద్వారా రామలక్ష్మణులు ఎన్నో విద్యలను కూడా పొందారు. కనుక అతిథి మనకు దేవునితో సమానం.

వ్యాసరూప ప్రశ్నలు

ఈ క్రింది ప్రశ్నలకు 10 లేక 12 వాక్యాల్లో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
సీతారామ కళ్యాణమును రాయండి.
(లేదా)
సీతారాముల వివాహ వృత్తాంతాన్ని రాయండి.
(లేదా)
సీతారామ కళ్యాణమును మీ సొంతమాటల్లో వివరించండి.
జవాబు:
విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో “జనక మహారాజు యజ్ఞం చేస్తున్నాడు. అక్కడ ఒక మహాధనుస్సు ఉంది. అక్కడకు వెడదాం” అన్నాడు. రామలక్ష్మణులు విశ్వామిత్రుని వెంట మిథిలకు బయలుదేరారు. దారిలో మహర్షి రామలక్ష్మణులకు తన వంశాన్ని గూర్చి, గంగ వృత్తాంతాన్ని గూర్చి చెప్పాడు. భగీరథుని వృత్తాంతం చెప్పాడు.

మిథిలా నగరం సమీపంలో, వారు గౌతమ మహర్షి ఆశ్రమం చూశారు. ఆ ఆశ్రమంలో అహల్యాగౌతములు ఉండేవారు. అహల్య తప్పు చేసిందని గౌతముడు అహల్యను వేల సంవత్సరాల పాటు అన్నపానాలు లేకుండా బూడిదలో పడి ఉండమని శపించాడు. రాముని రాకతో శాపవిముక్తి కలుగుతుందని చెప్పాడు. రాముడు మహర్షి ఆదేశంపై గౌతమాశ్రమంలో కాలుమోపి, అహల్యకు శాపవిముక్తి కల్పించాడు.

మిథిలలో జనకమహారాజు వీరిని ఆదరించాడు. అహల్యా గౌతముల కుమారుడు శతానందుడు, రామునికి కృతజ్ఞతలు చెప్పాడు. జనకుడు రామలక్ష్మణులను ఆహ్వానించాడు. విశ్వామిత్రుడు జనకునితో “వీరు దశరథ పుత్రులు రామలక్ష్మణులు. నీ ధనుస్సును చూద్దామని వచ్చారు. చూపించు శుభం కలుగుతుంది” అని చెప్పాడు. జనకుడు శివధనుస్సు చరిత్రను వివరించి తన కూతురు సీత నాగటి చాలులో దొరికిందనీ, ఆ సీతను శివధనుస్సును ఎక్కుపెట్టగల వీరునికి ఇచ్చి పెండ్లి చేస్తానని చెప్పాడు. చాలామంది రాజులు శివధనుస్సును ఎక్కుపెట్టలేకపోయారని చెప్పాడు.

విశ్వామిత్రుడు శివధనుస్సును తెప్పించమన్నాడు. ఐదువేలమంది శివధనుస్సు ఉన్న పెట్టెను తెచ్చారు. రాముడు పట్టుకోగానే శివధనుస్సు వంగింది. నారి ఎక్కుపెట్టగా ఆ ధనుస్సు ధ్వని చేస్తూ విరిగింది.

జనకుడు సీతారాములకు పెండ్లి చేయడానికి సిద్ధం అయ్యాడు. దశరథునికి కబురుపెట్టారు. అయోధ్య నుండి అందరూ వచ్చారు. జనకుడు తన కుమార్తెలు సీతా, ఊర్మిళలను, రామలక్ష్మణులకు, తన తమ్ముడు కుశధ్వజుని కుమార్తెలు మాండవిని, శ్రుతకీర్తిని భరతశత్రుఘ్నులకు ఇచ్చి పెండ్లి చేశాడు.

దశరథుడు అయోధ్యకు తిరిగి వెడుతుండగా పరశురాముడు ఎదురు వచ్చాడు. రాముడు పరశురాముని చేతిలోని వైష్ణవ ధనుస్సును ఎక్కుపెట్టాడు. పరశురాముడు ఓడిపోయి, మహేంద్రపర్వతానికి వెళ్ళాడు.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 1 బాలకాండ

ప్రశ్న 2.
వాల్మీకి మహర్షి రామాయణ రచనకు శ్రీకారం చుట్టిన విధానం గురించి తెలపండి.
(లేదా)
వాల్మీకి రామాయణం రచించడానికి దారితీసిన పరిస్థితులను విశ్లేషించండి.
జవాబు:
నారద మహర్షి ఒకసారి వాల్మీకి మహర్షి ఆశ్రమానికి వచ్చాడు. “అన్ని మంచిగుణాలు కలవాడూ, మాట తప్పనివాడూ, ధర్మం తెలిసినవాడూ మొదలయిన శుభలక్షణాలు గలవాడు” ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా ? అని, వాల్మీకి మహర్షి నారదుని ప్రశ్నించాడు. “సాధారణంగా ఇన్ని విశిష్ట గుణాలు కలవాడు ఉండడు. కాని శ్రీరాముడు ఒక్కడు అలాంటి వాడు ఉన్నాడు అని చెప్పి, నారదుడు వాల్మీకికి రామకథను చెప్పాడు. నారదుడు బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు.

వాల్మీకి రామకథను గురించి ఆలోచిస్తూ, శిష్యులతో తమసానదీ స్నానానికి వెళ్ళాడు. అక్కడ ఒక వేటగాడు బాణంతో మగపక్షిని కొట్టి చంపాడు. వాల్మీకి హృదయంలో కరుణ రసం పొంగింది. “మానిషాద” అనే శ్లోకం చెప్పాడు. వాల్మీకి ఆశ్రమానికి తిరిగి వచ్చాడు.

సృష్టికర్త అయిన బ్రహ్మ, వాల్మీకిని చూడడానికి వాల్మీకి ఆశ్రమానికి వచ్చాడు. వాల్మీకి బ్రహ్మకు ఉపచారాలు చేశాడు. బ్రహ్మ, వాల్మీకిని కూర్చోమన్నాడు. వాల్మీకి హృదయంలో ‘మానిషాద’ శ్లోకం, మళ్ళీ మళ్ళీ ప్రతిధ్వనించింది. బ్రహ్మ చిరునవ్వు నవ్వి వాల్మీకితో “నీవు పలికినది శ్లోకమే. ఈ ఛందస్సులోనే నీవు రామాయణం రాయి. భూమండలంలో పర్వతాలూ, నదులూ ఉన్నంతకాలం, ప్రజలు రామాయణగాథను కీర్తిస్తూనే ఉంటారు” అని చెప్పాడు.

ఈ విధంగా బ్రహ్మ ఆజ్ఞ ప్రకారం, వాల్మీకి మహర్షి రామాయణ రచనకు శ్రీకారం చుట్టాడు.

ప్రశ్న 3.
భగీరథుడు గంగను భూమికి తీసుకురావడంలో ఎలా సఫలమయ్యాడోమీసొంతమాటల్లో వివరించండి.
జవాబు:

  1. పాతాళంలో బూడిద కుప్పలుగా పడివున్న తన పితరులైన సగరపుత్రులకు ఉత్తమగతులు కల్పించడానికి సురగంగను అక్కడ ప్రవహింపజేయాలని సంకల్పించాడు భగీరథుడు.
  2. బ్రహ్మను గూర్చి, శివుణ్ణి గూర్చి ఘోర తపమాచరించి గంగను భూమి పైకి వదలడానికి బ్రహ్మను, గంగను భరించడానికి శివుణ్ణి ఒప్పించాడు.
  3. గంగ యొక్క అహంకారానికి కోపించి శివుడు గంగను బంధించగా మరల శివుణ్ణి ప్రార్థించి గంగను విడిపించాడు.
  4. గంగా ప్రవాహ వేగానికి కోపించిన జహ్ను మహర్షిని శాంతింపజేసి గంగను మరల ప్రవహించేలా చేశాడు.
  5. ఈ విధంగా గంగను తీసుకురావడంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా భగీరథుడు వాటిని ఎదుర్కొని గంగను భూమి పైకి తీసుకురావడంలో కృతకృత్యుడయ్యాడు. అందుకే పట్టుదల విషయంలో “భగీరథ ప్రయత్నం” అన్న జాతీయం వాడుకలోకి వచ్చింది.

ప్రశ్న 4.
దశరథునికి పుత్రజననం గురించి రాయండి.
(లేదా)
రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల జననం.
జవాబు:
సరయూనదీ తీరంలో “కోసల” దేశం ఉంది. దాని ముఖ్యనగరం ‘అయోధ్య’. దాన్ని దశరథ మహారాజు పాలిస్తున్నాడు. దశరథుడు ధర్మపరాయణుడు. ఇతని పాలనలో దేశం భోగభాగ్యాలతో విలసిల్లేది. ప్రజలు సుఖంగా ఉండేవారు. దశరథునకు సంతానం లేదు. సంతానం కోసం ఆయన అశ్వమేథయాగం చేద్దామనుకున్నాడు. దశరథుని మంత్రి సుమంత్రుడు అందుకు ఋష్యశృంగమహర్షిని పిలవమన్నాడు.

ఋష్యశృంగుడు ఉన్నచోట వర్షాలు ఎక్కువగా కురుస్తాయి. ఋష్యశృంగుడు మూడు రోజులు అశ్వమేథయాగం చేయించాడు. పుత్రుల కోసం యజ్ఞం చేయించమని దశరథుడు, ఋష్యశృంగుని కోరాడు. ఇంతలో దేవతలు రావణాసురుడు తమను చిత్రహింస పెడుతున్నాడని బ్రహ్మకు చెప్పారు. రావణాసురుని బాధ తప్పే ఉపాయం చెప్పమని, దేవతలు బ్రహ్మను కోరారు.

బ్రహ్మ, దేవతలతో రావణాసురునికి మానవులవల్లనే మరణం ఉందని చెప్పాడు. ఇంతలో శ్రీమహావిష్ణువు వచ్చాడు. దేవతలు మానవుడిగా పుట్టి రావణాసురుని సంహరించమని విష్ణుమూర్తిని కోరారు. దశరథ మహారాజు ముగ్గురు భార్యలకూ నాలుగురూపాలలో పుత్రుడిగా పుట్టమని దేవతలు విష్ణువును కోరారు. విష్ణువు వారికి అభయం ఇచ్చాడు.

దశరథుడి పుత్రకామేష్టి యజ్ఞకుండం నుండి, బ్రహ్మ పంపించగా ఒక దివ్యపురుషుడు బంగారు పాత్రతో దివ్యపాయసం తీసుకొని వచ్చాడు. ఆ పాయసపాత్రను అతడు దశరథుడికి ఇచ్చాడు. దశరథుడు ఆ పాయసాన్ని తన భార్యలయిన కౌసల్య, సుమిత్ర, కైకేయిలకు పంచాడు. కౌసల్యకు రాముడు, కైకకు భరతుడు, సమిత్రకు లక్ష్మణ శత్రుఘ్నులు పుట్టారు.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 1 బాలకాండ

ప్రశ్న 5.
రామలక్ష్మణులు విశ్వామిత్ర యాగాన్ని రక్షించిన వృత్తాంతాన్ని తెలపండి.
జవాబు:
దశరథ పుత్రులు రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు, వేదశాస్త్రాలు, ధనుర్విద్య నేర్చారు. లక్ష్మణుడు రాముడికి బహిః ప్రాణం. తన కుమారులను దశరథుడు వివాహం చేద్దామనుకుంటున్నాడు. ఆ సమయంలో విశ్వామిత్రుడు దశరథుని దగ్గరకు వచ్చాడు. ఆ ఋషి చెప్పిన కార్యాన్ని చేస్తానన్నాడు దశరథుడు.

విశ్వామిత్రుడు తన యజ్ఞానికి రాక్షసులు విఘ్నం కలుగజేస్తున్నారనీ, యజ్ఞం చేసేటప్పుడు తాను శపించకూడదనీ, యజ్ఞరక్షణకు శ్రీరాముణ్ణి తనతో 10 రోజులు పంపమనీ దశరథుని కోరాడు. దశరథుడు మహర్షితో రాముడికి ఇంకా 16 ఏళ్ళు నిండలేదనీ రాముడికి యుద్ధం తెలియదనీ, రాముణ్ణి విడిచి తాను ఉండలేననీ, తానే యజ్ఞరక్షణకు వస్తానని చెప్పాడు.

తన యజ్ఞానికి రావణుని ఆజ్ఞపై మారీచ సుబాహులు విఘ్నాలు కల్గిస్తున్నారని విశ్వామిత్రుడు చెప్పాడు. అప్పుడు దశరథుడు రాముణ్ణి పంపనని చెప్పగా, విశ్వామిత్రునకు కోపం వచ్చింది. వశిష్ట మహర్షి దశరథునికి నచ్చచెప్పి, రామలక్ష్మణుల్ని విశ్వామిత్రుని వెంట పంపాడు.

విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు ‘బల’, ‘అతిబల’ అనే విద్యలు ఉపదేశించాడు. ఆ విద్యల మహిమవల్ల అలసట, ఆకలిదప్పులు ఉండవు. రాముడు విశ్వామిత్రునికి గురుసేవ చేశాడు. రామలక్ష్మణులు మహర్షితో ‘మలద’ , ‘కరూశ’ గ్రామాలకు చేరారు. అక్కడ తాటక అనే యక్షిణి విధ్వంసం చేసేది. ఆమె కొడుకు మారీచుడు జనపదాలను అతలాకుతలం చేసేవాడు. తాటకను చంపమని విశ్వామిత్రుడు రామునికి చెప్పాడు. రాముడు వాడి బాణాలతో తాటక బాహువులను ఖండించాడు. లక్ష్మణుడు తాటక ముక్కు చెవులు కోశాడు. రాముడు శబ్దవేధి విద్యతో, బాణం వేసి తాటకను చంపాడు. విశ్వామిత్ర మహర్షి సంతోషించి, అనేక దివ్యాస్త్రాలను రాముడికి అనుగ్రహించాడు.

విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో తన సిద్ధాశ్రమం చేరి, యజ్ఞదీక్ష చేపట్టాడు. ఆ యజ్ఞం, ఆరురోజులు. రామలక్ష్మణులు యజ్ఞాన్ని జాగ్రత్తగా రక్షిస్తున్నారు. ఇంతలో మారీచ సుబాహులు అనే రాక్షసులు, యజ్ఞకుండంలో రక్తం కురిపించారు. మారీచుడి పై రాముడు ‘శీతేషువు’ అనే మానవాస్త్రాన్ని వేసాడు. మారీచుడు సముద్రంలో పడ్డాడు. రాముడు ఆగ్నేయాస్త్రంతో సుబాహుణ్ణి చంపాడు. మిగిలిన వారిని, ‘వాయవ్యాస్త్రం’తో రామలక్ష్మణులు తరిమారు. మహర్షి యజ్ఞం పూర్తయ్యింది.

ప్రశ్న 6.
రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు జన్మించిన విధం రాయండి.
జవాబు:
అయోధ్యను రాజధానిగా చేసుకొని, కోసల దేశాన్ని దశరథుడు పాలించేవాడు. దశరథునికి సంతానం లేదు. సంతానం కోసం దశరథుడు అశ్వమేధయాగాన్ని చేద్దామనుకున్నాడు. దశరథుని మంత్రి సుమంత్రుడు యాగాన్ని చేయించడానికి ఋష్యశృంగ మహర్షిని పిలవమన్నాడు.

ఋష్యశృంగుడు అశమేధయాగం చేయించా. పుత్రుల కోసం యజ్ఞం చేయించండని దశరథుడు ఋష్యశృంగుడిని కోరాడు. ఇంతలో దేవతలు విష్ణుమూర్తిని మానవుడిగా పుట్టి రావణాసురుడిని సంహరింపమని కోరారు. దశరథుని ముగ్గురు భార్యలకూ నాలుగు రూపాలలో పుత్రుడిగా పుట్టమని, దేవతలు విష్ణువును ప్రార్థించారు. విష్ణువు సరే అని వారికి అభయం ఇచ్చాడు.

దశరథుడు పుత్రకామేష్టి చేశాడు. ఆ యజ్ఞకుండం నుండి బ్రహ్మ పంపించిన ఒక దివ్యపురుషుడు, బంగారుపాత్రతో దివ్యపాయసం తెచ్చి దశరథుడికి ఇచ్చాడు. దశరథుడు ఆ పాయసాన్ని తన భార్యలయిన కౌసల్య, సుమిత్ర, కైకేయిలకు పంచాడు. కౌసల్యకు రాముడు, కైకకు భరతుడు, సుమిత్రకు లక్ష్మణ శత్రుఘ్నులు పుట్టారు.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 1 బాలకాండ

ప్రశ్న 7.
ఉత్తమ విద్యార్థుల లక్షణాలేమిటి? రామలక్ష్మణులు ఉత్తమ విద్యార్థులని ఎలా చెప్పగలవు?
జవాబు:
జ్ఞానాన్ని పొందడంలో నిరంతరం అప్రమత్తులై ఉండడం, ఉత్తమ విద్యార్థుల లక్షణం. గురువుగారికి సేవ చేయడం, కూడా ఉత్తమ విద్యార్థి లక్షణం.

రామలక్షణులు ఉత్తమ విద్యార్థులు : వారు తమ గురువైన విశ్వామిత్రుడి పాదాలు ఒత్తారు. వారు గురువు వెంట వెళ్ళి, సకాలంలో లేచి, నిత్యకర్మలు చేసేవారు. గంగాసరయూ నదుల సంగమం వంటి వాటి గురించి గురువుగారిని అడిగి వివరంగా తెలిసికొన్నారు. గురువు ఆజ్ఞను పాటించడం శిష్యుడి కర్తవ్యమని గ్రహించి, విశ్వామిత్రుడు చెప్పినట్లుగా వారు తాటకను వధించారు.

వారు సిద్ధాశ్రమం చేరి విశ్వామిత్రుని యజ్ఞాన్ని కాపాడారు. మారీచ సుబాహులను తరిమి కొట్టారు. మిథిలా నగరానికి గురువుగారితో వెడుతూ, గంగ మొదలయిన వాటిని గురించి గురువుగారిని అడిగి తెలిసికొన్నారు. గురువుగారి అనుగ్రహంతో ఎన్నో అస్త్రాలను ప్రయోగ, ఉపసంహారాలతో నేర్చుకున్నారు.

దీనినిబట్టి రామలక్ష్మణులు ఉత్తమ విద్యార్థులని చెప్పగలము.

ప్రశ్న 8.
రాముడు తొలిసారిగా తాటక అనే సీని సంహరించడాన్ని ఎలా సమర్థించగలవు?
జవాబు:
తాటక, ఒక యక్షిణి. ఆమె వేయి ఏనుగుల బలం కలది. తాటక, ఆమె కుమారుడు మారీచుడు, కలసి మలద, కరూశ జనపదాలను విధ్వంసం చేశారు. దుష్టురాలు తాటకను వధించమని విశ్వామిత్రుడు రామునికి చెప్పాడు. రాముడు కొంచెం సేపు మాట్లాడలేదు.

అప్పుడు విశ్వామిత్రుడు “స్త్రీని చంపడం ఎలా అని, నీకు అనుమానం వద్దు. అధర్మపరురాలయిన తాటకను చంపితే దోషం రాదు” అని రాముడికి కర్తవ్యం ఉపదేశించాడు.

విశ్వామిత్రుడు చెప్పినట్లు చేయమని దశరథుడు రాముడికి వచ్చేటప్పుడు చెప్పాడు. తండ్రిగారి ఆజ్ఞ రామునకు శిరోధార్యము. అలాగే గురువుగారయిన విశ్వామిత్రుడి ఆజ్ఞను పాటించడం శిష్యుడిగా రాముడి కర్తవ్యం. అందువల్లనే తాటక స్త్రీ అయినప్పటికీ, తండ్రి, గురువుల ఆజ్ఞలను శిరసావహించి, రాముడు తాటకను చంపాడు. అందులో తప్పు లేదు.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 9 మాణిక్యవీణ

AP State Board Syllabus AP SSC 10th Class Telugu Important Questions Chapter 9 మాణిక్యవీణ

AP State Syllabus SSC 10th Class Telugu Important Questions 9th Lesson మాణిక్యవీణ

10th Class Telugu 9th Lesson మాణిక్యవీణ 2 Marks Important Questions and Answers

ఈ క్రింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాల్లో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
“చిన్నవాడు మానవుడు – చిరంజీవి మానవుడు” అంటూ చాటిన “విద్వాన్ విశ్వం” గురించి మీకు తెలిసిన విషయాలు రాయండి. (June 2018)
జవాబు:
1) మాణిక్యవీణ పాఠ్యరచయిత విద్వాన్ విశ్వం కాలము 1915 – 1987.

2) రచనలు : పత్రికా సంపాదకునిగా “అవి-ఇవి, తెలుపు నలుపు, మాణిక్యవీణ” వంటి శీర్షికలతో సంపాదకీయాలు, “ప్రేమించాను” అనే నవల, “ఒకనాడు”, “పెన్నేటిపాట” అనే కావ్యాలు రాశారు.

3) బిరుదులు : కళాప్రపూర్ణ

4) రచనా విధానం : చిన్న చిన్న పదాలు, వాక్యాలతో ధ్వని గర్భితంగా ఉండే కవితలు రచించారు.

ప్రశ్న 2.
మాణిక్య వీణ పాఠం ఎవరు రచించారు? రచయిత గురించి వ్రాయండి.
జవాబు:
మాణిక్య వీణ పాఠం విద్వాన్ విశ్వంగారు రచించారు. ఆయన పూర్తి పేరు మీసరగండ విశ్వరూపాచారి. ఆయన తల్లిదండ్రులు లక్ష్మమ్మ, రామయ్య. విశ్వం అనంతపురం జిల్లా తరిమెల గ్రామంలో జన్మించారు. 21.10.1915 ఆయన పుట్టినరోజు. ఆయన 19.10.1987న స్వర్గస్తులయ్యారు.

ప్రశ్న 3.
విద్వాన్ విశ్వం సాహిత్యసేవ, అందుకొన్న సన్మానాలు వ్రాయండి.
జవాబు:
విద్వాన్ విశ్వం తెలుగు, సంస్కృతం, ఆంగ్లభాషలలో పండితులు. మీజాన్, ప్రజాశక్తి, ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి పత్రికలలో పనిచేశారు.

‘కాదంబరి’తో సహా అనేక సంస్కృత గ్రంథాలను తెలుగులోనికి అనువదించారు.

పత్రికలలో ‘అవి-ఇవి’, ‘తెలుపు-నలుపు’, ‘మాణిక్య వీణ’ మొదలైన శీర్షికలతో రచనలు చేశారు. భాష, సాహిత్యం , సమాజం, నైతిక విలువలు మొదలైన అంశాలపై రాసిన విశ్వం సంపాదకీయాలు విలువైనవి. ‘పెన్నేటిపాట’, ‘ఒకనాడు’ అనే కావ్యాలను, ‘ప్రేమించాను’ అనే నవలను రచించారు. కళాప్రపూర్ణ, డి.లిట్. వంటి డిగ్రీలను అందుకొన్నారు.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 9 మాణిక్యవీణ

ప్రశ్న 4.
మానవ చరిత్రలోని గొప్ప మలపులేవి?
జవాబు:
మానవ చరిత్రలో క్రింద చెప్పినవన్నీ గొప్ప మలపులు. మానవుడు చక్రం కనుక్కొన్న రోజు, మానవుడు చకచకా నాలుగు గీతలతో అక్షర లిపిని కనుక్కొన్న రోజు, నిప్పును కనిపెట్టిన రోజు, మానవుడు తప్పటడుగులు మాని తాండవం చేసిన రోజు, మానవ చరిత్రలో గొప్ప మలపులు.

అలాగే మానవుడు కిచకిచలు మాని, మంచి భాషలు నేర్చుకొన్నరోజు, చిన్న చిన్న మాటలతో జానపద గీతాలు అల్లుకొన్న రోజు, ధాన్యాన్ని పండించడం నేర్చుకున్న రోజు, లలిత కళలను పండించుకొన్న రోజు కూడా, మానవ చరిత్రలో గొప్ప మలపులు.

ఈ విధంగా మానవుడు చక్రం కనుక్కొన్న రోజు, లిపిని నేర్చిన రోజు, నిప్పును కనుక్కొన్న రోజు, కళలు, కవిత్వము నేర్చిన రోజు మానవ చరిత్రలో అసాధారణ పర్వదినాలని, గొప్ప మలపులు అని చెప్పాలి.

ప్రశ్న 5.
మాణిక్యవీణ పాఠం ఆధారంగా సమాజ రుగ్మతలు అంటే ఏమిటో వివరించండి.
జవాబు:
సమాజ రుగ్మతలు అంటే సమాజానికి అనగా సంఘానికి పట్టిన జబ్బులు.

  1. అంటరానితనాన్ని పాటించడం
  2. కులమత భేదాలు పాటించడం
  3. మూఢనమ్మకాలు కలిగియుండడం
  4. అవినీతి దురాచారం
  5. కులసంఘాలు, మత సంఘాలు మొ||నవి.

10th Class Telugu 9th Lesson మాణిక్యవీణ 4 Marks Important Questions and Answers

ఈ క్రింది ప్రశ్నలకు 10 లేక 12 వాక్యాల్లో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
మానవాభివృద్ధిలో చోటు చేసుకున్న మార్పులను “మాణిక్యవీణ” పాఠ్యభాగం ఆధారంగా వివరించండి. (June 2018)
జవాబు:

  1. ప్రకృతిని చూచి పరవశించిన మానవుడు దానిని తన కనుసన్నలలో ఉంచుకొనేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో మానవాభివృద్ధిలో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి.
  2. గుహలలో జీవించిన ఆదిమానవుడే గుర్రాల్ని, జింకలను గీస్తూ చిత్రలేఖన నైపుణ్యాన్ని పెంపొందించుకున్నాడు. తన గానమాధుర్యంతో ఎండిన మోడుల్ని చిగురింపజేశాడు.
  3. పాటకు అనుగుణంగా కఠినరాతినేలపై కాళ్ళకు గజ్జెకట్టి గంతులేశాడు. స్వరాల సొబగులతో మనసుకు హత్తుకొనే పాటలు పాడాడు. ఇలా కళలపై అభిరుచిని పెంచుకున్నాడు.
  4. ఈ క్రమంలోనే చక్రాన్ని కనుగొనడం, నిప్పును కనుగొనడం వంటి మార్పులు చోటు చేసుకున్నాయి. చక్రాన్ని కనుగొన్న రోజు ఎంత గొప్పదో చకచకా నాలుగు గీతలతో లిపిని కనుగొన్న రోజూ అంతే ముఖ్యమైనది. చక్రం చలనానికి, లిపి భావ సంచలనానికి వేదికలై సృజనాత్మక ప్రపంచం వైపు మానవుడిని నడిపించాయి.
  5. అరుపుల నుండి అర్థవంతమైన మాటలు నేర్వటం, సారవంతమైన భూమి నుండి భుక్తిని పండించుకోవడం – ఈ మార్పులన్నీ ఆదిమ దశ నుండి ఆధునిక దశ వైపు మానవుడిని అభివృద్ధి పథంలో నడిపించి శాశ్వతుణ్ణి చేశాయి.

ప్రశ్న 2.
“ప్రకృతి ఒడిని పాఠశాలగా చేసుకొని మానవుడు కళాభిరుచిని పెంపొందించుకున్నాడనే” కవి అభిప్రాయాన్ని సమర్థించండి. (March 2018)
జవాబు:

  1. మనిషి కళ్ళు తెరవగానే చుట్టూ ఉన్న ప్రకృతి అందాలను చూసి పరవశించాడు. ప్రకృతిని తన కనుసన్నలలో ఉంచే ప్రయత్నం చేస్తూ అందలి రంగులను, ధ్వనులను అనుకరించాడు. పూర్తిగా ప్రకృతిలో లీనమైపోయాడు.
  2. గుహలలో జీవించిన ఆదిమానవుడు గుర్రాలను, జింకలను గీస్తూ చిత్రలేఖన నైపుణ్యాన్ని పెంపొందించుకొన్నాడు.
  3. ఆటవికుడుగా ఉన్నప్పుడే తన గాన మాధుర్యంతో ఎండిన మోడులను చిగురింపజేశాడు. పాటకు తగినట్లుగా కఱకు రాతినేలపై కాలికి గజ్జెకట్టి గంతులు వేశాడు. స్వరాల సుకుమారపు నొక్కులతో మనస్సుకు హత్తుకొనేలా పాటలు పాడాడు.
  4. ఊహ తెలిసిన నాటి నుండి ప్రకృతిని ఆరాధిస్తూ తనను తాను మైమరచి పాటలు పాడుతూ ఆనందడోలికల్లో తేలిపోయాడు.
  5. ఈ విధంగా అతడు కళలను తన జీవితంలో ఒక భాగం చేసుకొన్నాడు. ప్రకృతి అతడికి తొలి గురువు. ప్రకృతి ఒడి అతడికి తొలి బడి. కనుక మానవుడు ప్రకృతి ఒడిని పాఠశాలగా చేసుకొని కళాభిరుచిని పెంపొందించుకున్నాడనే కవి అభిప్రాయాలు సంపూర్ణంగా సమర్థించదగినవని నేను భావిస్తున్నాను.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 9 మాణిక్యవీణ

ప్రశ్న 3.
మానవ మహాప్రస్థానంలో కవికి తోడైన వాటిని గూర్చి వివరించండి.
(లేదా)
మానవ మహాప్రస్థానంలో అతనితో పెనవేసుకొనిపోయిన అంశాలేవి? వాటిని కవి ఎలా స్మరించుకున్నాడో వివరించండి. (March 2019)
జవాబు:
మానవ మహాప్రస్థానంలో కవికి కళ, కవిత, విజ్ఞానం తోడుగా ఉన్నాయి. ఆదిమ మానవుడికి కళలు తెలియవు. అతడు ప్రకృతిని చూసి సంతోషించి, దాన్ని స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నం ద్వారా మంచి విజ్ఞానం పొందాడు. చిత్రలేఖనం నేర్చుకున్నాడు. పక్షుల ధ్వనులను అనుకరించాడు. ఎండిన చెట్లు చిగిరించేలా పాడడం నేర్చుకున్నాడు. కాలికి గజ్జెకట్టి నాట్యం నేర్చాడు. మంచి కవిత్వం చెప్పడం నేర్చాడు.

గీతలు గీయడం ద్వారా లిపిని నేర్చుకొని తన అభిప్రాయాన్ని ఇతరులకు తెలుపగలిగాడు. చక్కని గీతాలు చిన్న మాటలతో రాశాడు. ధాన్యం పండించి హాయిగా తింటున్నాడు. మానవుడు తన అలసటను, కళా కవితల ద్వారా పోగొట్టుకుంటున్నాడు. విజ్ఞానం పెంచుకొని చక్రాన్ని కనిపెట్టి దాని ద్వారా వాహనాలు, యంత్రాలు కనిపెట్టాడు. వైజ్ఞానికంగా ఎంతో ముందడుగు వేశాడు. నిప్పును కనిపెట్టి వంటకాలు వండుకు తిన్నాడు.

ఈ విధంగా ఆదిమ మానవుడు, కళలు, కవిత, విజ్ఞానముల ద్వారా మిన్నులు పడిన చోటు నుండి ఆకాశానికి ఎదిగాడు.

ప్రశ్న 4.
మైలు రాళ్ళ వంటి అంశాలు వేటికి గుర్తులుగా మీరు భావిస్తున్నారు?
జవాబు:
విద్వాన్ విశ్వంగారు తన ‘మాణిక్య వీణ’ అనే గేయంలో చరిత్రలో మైలురాళ్ళుగా నిలిచిన కొన్ని విషయాలను గూర్చి పేర్కొన్నాడు.

1) మానవుడు ‘చక్రం’ ను కనుక్కొన్న రోజు చరిత్రలో మైలురాయిగా నిలుస్తుందన్నారు. అలాగే చకచకా నాలుగు గీతలతో లిపిని కనుక్కొన్న రోజు కూడా విశేషమైనదన్నారు. చక్రం, మానవ చలనానికి దోహదపడింది. ‘లిపి’, భావ సంచలనానికి వేదిక అయి, సృజనాత్మకత ప్రపంచంలోకి దారితీసింది.

2) నిప్పును కనుక్కొన్న రోజు ఎంత గొప్పదో, తప్పటడుగుల చిందుల నుండి, గొప్ప నృత్యాలు చేసిన రోజు కూడా అంతే గొప్పది.

3) అరుపుల నుంచి అర్థవంతమైన మాటలు నేర్చిన రోజు, ఆ మాటలతో జానపద గీతాలు అల్లిన రోజు, సారవంతమైన భూమి నుండి ఆహారం పండించుకున్న రోజు, మనస్సుకు ఆనందం కల్గించే కళ ఆవిష్కరణ జరిగిన రోజు, మొదలయినవి అన్నీ చరిత్రలో మైలురాళ్ళుగా నిలుస్తాయి. అవన్నీ గొప్ప రోజులే.

మానవుని జీవన పరిణామచరిత్రలో అసాధారణ సంఘటనలు జరిగిన ప్రతిరోజూ శుభదినమే అని విద్వాన్ విశ్వంగారు చెప్పారు.

ప్రశ్న 5.
చరిత్రలో మైలురాళ్ళుగా కవి వేటిని గుర్తించాడు? ఎందుకు?
జవాబు:
మానవుడు చక్రాన్ని కనుక్కొన్న రోజు, నిప్పును కనిపెట్టిన రోజు, నాలుగు గీతలతో లిపిని కనుక్కొన్న రోజు, తప్పటడుగులు మాని తాండవ నృత్యం చేసిన రోజు, భాషలు నేర్చుకొన్న రోజు, చిన్న చిన్న మాటలతో పదాలు అల్లుకొన్నరోజు, ధాన్యం పండించుకున్న రోజు కళలను పండించుకొన్న రోజు, మానవ జీవిత చరిత్రలో మైలురాళ్ళుగా నిలుస్తాయని, విద్వాన్ విశ్వంగారు చెప్పారు. పైవన్నీ మానవుడి జీవనయాత్రలో అభ్యుదయానికీ, విజ్ఞానానికీ, ప్రతీకలు.
1) చక్రం కనుక్కొన్న రోజు :
చక్రాన్ని కనిపెట్టాకే, బళ్ళు, రిక్షాలు, సైకిళ్ళు, మోటారు సైకిళ్ళు, రైళ్ళు, ఫ్యాక్టరీ యంత్రాలు . వగైరా వాడుకలోకి వచ్చాయి. పారిశ్రామికాభివృద్ధి అంతా, చక్రం తిరగడం మీదే ఆధారపడి ఉంది.

2) నాలుగు గీతలతో ఆకార నిర్మాణం :
ఈ విధంగానే భాషలకు చిత్రలేఖనం, లిపులు, గ్రంథాలు, మహాకావ్యాలు, విజ్ఞాన సాధన, చదువులు వచ్చాయి.

3) నిప్పును కనుక్కోడం :
నిప్పును మానవుడు కనిపెట్టాక, పదార్థాలను ఉడికించి కమ్మగా, రుచిగా అతడు తింటున్నాడు. ఆధునిక నాగరికతకు ఇది ప్రతీక.

4) తాండవ నృత్యం చేయడం :
నృత్యం ద్వారానే, నాట్యకళ అభివృద్ధి అయ్యింది. భరతనాట్యం వంటి వివిధ నృత్యాలు, కళాభివృద్ధి జరిగింది.

5) భాషలు నేర్చుకోడం :
భాషలు నేర్చుకోడం వల్లే కవిత్వము, సాహిత్యాభివృద్ధి జరిగింది. 6) ధాన్యం పండించడం : పచ్చి మాంసం తిన్న మానవుడు నాగరికత పెంచుకొని, వ్యవసాయం నేర్చుకొని ఆహార పదార్థాలను పండించాడు.

7) కళలు పండించడం :
లలిత కళాభివృద్ధి దీనివల్లే జరిగింది. మానవుడు సౌందర్యమును ఆరాధించేవాడయ్యాడు. అందుకే చక్రం, నిప్పు మొ||వి చరిత్రలో మైలురాళ్ళుగా నిలిచాయి.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 9 మాణిక్యవీణ

ప్రశ్న 6.
మానవుడు సాధించిన ప్రగతిని కవి వర్ణించిన తీరుపై మీ అభిప్రాయం ఏమిటి?
జవాబు:
విద్వాన్ విశ్వంగారు మాణిక్య వీణలో మానవుడు ఎంతో ప్రగతిని సాధించాడని, మానవ ప్రస్థానంలో కళ, కవిత, విజ్ఞానం తోడుగా ఉన్నాయని చెప్పారు.

ఆదిమ మానవుడికి కళలు తెలియవు. అతడు ప్రకృతిని తన అధీనం చేసుకోడానికి ప్రయత్నించాడు. ఆ ప్రయత్నంలో ఎంతో విజ్ఞానం సాధించాడు. చిత్రలేఖనం నేర్చుకున్నాడు. ఎండిన మోళ్ళు చిగురించేలా పాటలు పాడడం నేర్చాడు. నాట్యం చేయడం నేర్చాడు. కవిత్వం చెప్పడం నేర్చుకున్నాడు.

గీతలు గీసి దాని ద్వారా లిపిని నేర్చుకొన్నాడు. చిన్న మాటలతో జానపద గీతాలు అల్లుకున్నాడు. ధాన్యం పండించాడు. విజ్ఞానం అభివృద్ధి చేసుకొని ‘చక్రం’ కనిపెట్టి దాని ద్వారా పరిశ్రమలు, వాహనాలు, యంత్రాలు కనిపెట్టి ముందుకు సాగాడు. నిప్పును కనిపెట్టి వంటకాలు వండుకొని తిన్నాడు.

కవి వర్ణించినట్లుగా, మానవుడు కళలు, కవిత్వం, విజ్ఞానం అనే వాటిని తోడుగా చేసుకొని, ప్రగతిని సాధించాడని నేను కూడా నమ్ముతున్నాను.

ప్రశ్న 7.
మానవ చరిత్రలోని అసాధారణ పర్వదినాల ఆంతర్యం ఏమిటి?
జవాబు:
‘అసాధారణ పర్వదినాలు’ అంటే, గొప్ప విశేషమైన పండుగలు అని అర్ధము. మానవుడు పుట్టినప్పుడు అతడికి ఇల్లు కట్టుకోవడం తెలియక, గుహలలో నివసించాడు. చక్రం గూర్చి తెలియక, కాలి నడకన ప్రయాణం సాగించాడు. నిప్పు గురించి తెలియక, పచ్చిమాంసం తిన్నాడు. అక్షరం గూర్చి తెలియక, గీతలు గీశాడు. భాషలు తెలియక, కిచకిచలాడాడు.

అటువంటి ఆదిమ మానవుడు చక్రాన్ని, నిప్పును, కళలను, భాషలను, వ్యవసాయ పద్ధతులను తెలిసికొన్నాడు. దాని ద్వారా ఎన్నో వాహనాలను, యంత్రాలను నిర్మించి పరిశ్రమలను వృద్ధి చేశాడు. నిప్పు ద్వారా చక్కగా వండుకొని కమ్మగా తిన్నాడు. భాషలను నేర్చుకొని చక్కగా మాట్లాడగలిగాడు. లలిత కళలను నేర్చుకొని ఆనందాన్ని పొందాడు. జానపద గీతాలు, కవిత్వం అల్లాడు. కాబట్టి మానవుని అభ్యుదయ యాత్రలో అతడు నూతనంగా వస్తువులు కనిపెట్టిన రోజులన్నీ, కవి చెప్పినట్లు అసాధారణ పర్వదినాలనే నా అభిప్రాయము.

ప్రశ్న 8.
మానవ ప్రస్థానాన్ని కవి వర్ణించిన తీరును ఎలా సమర్థిస్తావు?
జవాబు:
మానవ ప్రస్థానంలో కళ, కవిత, విజ్ఞానం తోడుగా ఉన్నాయని కవి చెప్పిన మాట నిజం.

ఆదిమ మానవుడికి కళలు తెలియవు. అతడు ప్రకృతిని చూచి పరవశుడయి, ప్రకృతిని తన అధీనం చేసుకోడానికి యత్నించాడు. ఆ ప్రయత్నంలో అతడు ఎంతో విజ్ఞానం సంపాదించాడు. చిత్రలేఖనం నేర్చుకున్నాడు. రంగులనూ, ధ్వనులను అనుకరించాడు. ఎండిన మోళ్ళు చివురించేలా పాటలు పాడడం నేర్చాడు. కాలికి గజ్జెకట్టి నాట్యం చేయడం నేర్చుకున్నాడు. చిక్కని పదాలతో కవిత్వం చెప్పడం నేర్చుకున్నాడు.

గీతలు గీయడం ద్వారా లిపిని నేర్చుకొని తన అభిప్రాయాన్ని ఇతరులకు తెలుపగలిగాడు. చిన్న చిన్న మాటలతో చక్కగా జానపద గీతాలు అల్లుకున్నాడు. ధాన్యం పండించుకొని దానిని ఆహారంగా తిన్నాడు. అతనికి జీవితంలో కలిగిన అలసటనూ, యాంత్రికతనూ కళా కవితల ద్వారా దూరం చేసుకున్నాడు.

విజ్ఞానం అభివృద్ధి చేసుకొని చక్రం కనిపెట్టి దాని ద్వారా పరిశ్రమలు, వాహనాలు, యంత్రాలు కనిపెట్టి ఎంతో వైజ్ఞానికంగా ముందుకుసాగాడు. నిప్పును కనిపెట్టి, అనేక వంటకాలు వండుకొని తిన్నాడు.

ఆదిమ మానవుడు ఈ విధంగా కళలు, కవిత్వం, విజ్ఞానం నేర్చుకోవడం ద్వారా, మిన్నులు పడ్డచోటు నుండి ఎదిగి మిన్నందుకున్నాడు. అతని ప్రస్థానంలో కళ, కవిత, విజ్ఞానం తోడుగా ఉన్నాయి.

ప్రశ్న 9.
మాణిక్య వీణ కవితలో కవిగారు చెప్పిన అంశాలేవి?
జవాబు:
మంత్రాలతో చింతకాయలు ఎలా రాలవో, అలాగే పద్యాల ధాటితో చింతలు తొలగిపోవు. యంత్రాలతో రోగాలు నయం కానట్లే, తంత్రాలతో సమాజ సమస్యలు దారికిరావు.

కడుపులో కేన్సరుతో సంఘం బాధపడుతూ ఉంటే, అంతరిక్షంలోకి రాకెట్లు పంపితే మాత్రం ఏం ప్రయోజనం? మనిషి పుట్టగానే ప్రకృతిని చూచి ఆనందించాడు. దాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకోవాలని అతడు ప్రయత్నించాడు. ప్రకృతిలోని రంగులనూ, ధ్వనులనూ అనుకరించాడు.

మానవుడు గుహలలో జీవించే ఆదిమ కాలంలోనే, గోడలపై జంతువుల బొమ్మలు గీశాడు. ఎండిన చెట్లు చిగిర్చేలా పాడాడు. గజ్జెకట్టి నాట్యం చేశాడు. చక్కని తీరుగా పదాలు పాడుకున్నాడు.

‘చక్రం’ కనుక్కొన్న రోజు, ‘లిపి’ తో రాసిన రోజు, నిప్పును కనిపెట్టిన రోజు, చక్కగా నాట్యం చేసిన రోజు, మానవ చరిత్రలో మంచి రోజులు. మానవుడు అర్ధవంతమైన భాషలు నేర్చుకొన్న రోజు, చిన్నమాటలతో జానపద గీతాలు అల్లుకున్న రోజు, ధాన్యం పండించిన రోజు, కళలను పండించిన రోజు గొప్పరోజులు. మానవచరిత్రలో అవి అన్నీ పండుగరోజులు.

కళలు, కవితలు, విజ్ఞానం, ప్రజ్ఞానం కలగలసి మానవుడిని మహోన్నతంగా నడిపిస్తాయి. ఈ విధంగా నేల నుండి ఎదిగి మానవుడు ఆకాశాన్ని అందుకున్న చిన్నవాడు. మానవుడు చిరంజీవి. అతి ప్రాచీనుడు.

అనాదిగా నడుస్తున్న ఈ మానవుడి జీవనయాత్రలో కళాకవితలూ, జ్ఞాన విజ్ఞానాలూ, మానవుడి వెంటనే ఉండి, అతనితో నడుస్తూ, అతణ్ణి నడిపిస్తున్నాయి.

10th Class Telugu 9th Lesson మాణిక్యవీణ Important Questions and Answers

ప్రశ్న 1.
దిన పత్రికలు చదవమని విద్యార్థులను ప్రోత్సహిస్తూ కరపత్రం తయారు చేయండి.
జవాబు:
పత్రికా పఠనం
విద్యార్థులారా ! భావిభారత నిర్దేశకులారా !

పత్రికలు చదవండి. నిరంతరం ప్రపంచంలో జరుగుతున్న మార్పులను తెలుసుకోండి. పత్రిక పేరు ఏదైనా కావచ్చు. ప్రపంచ పరిజ్ఞానం ప్రధానం, టీ.వీ.ల మోజులో చదువుకు దూరం కాకండి.

పాఠ్య పుస్తకాలలో పరిజ్ఞానానికి, దిన పత్రికలలోని విశ్లేషణాత్మక పరిజ్ఞానం తోడైతే వ్యాఖ్యానించగల నేర్పు కలుగుతుంది. రోజూ క్రమం తప్పక పత్రికలు చదవండి. నిత్య నూతన విజ్ఞాన కాంతులతో విరాజిల్లండి.
ఇట్లు,
పాఠక బృందం.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 9 మాణిక్యవీణ

ప్రశ్న 2.
మానవుడు సాధించిన ప్రగతిని వివరిస్తూ ఒక వ్యాసం రాయండి.
జవాబు:
ఆదిమ మానవుడికి బట్ట కట్టుకోడం తెలియదు. అన్నం వండుకొని తినడం తెలియదు. చెట్టు బెరడులు కట్టుకొని,జంతువులను చంపి పచ్చిమాంసం తినేవాడు. ప్రకృతిలో దొరికే కాయలు, దుంపలు, పళ్ళు తినేవాడు. ఆదిమ మానవుడికి రాయడం, చదవడం, కళలు తెలియవు. ఇళ్ళు కట్టుకోడం తెలియక, గుహలలో నివసించేవాడు.

మానవుడు క్రమంగా లలిత కళలు నేర్చుకున్నాడు. రాయడం, కవిత్వం చెప్పడం నేర్చుకున్నాడు. చక్రాన్ని, నిప్పును కనిపెట్టాడు. అర్థవంతమైన భాషలు నేర్చాడు. లిపులు నేర్చాడు. బట్టలు నేయడం, ధరించడం నేర్చాడు. కవిత్వం చెప్పడం నేర్చుకున్నాడు.

విజ్ఞానం నేర్చుకొని సైన్సు ద్వారా ఎన్నో కొత్త యంత్రాలు కనిపెట్టాడు. వంటలు వండడంలో మెలకువలు గ్రహించాడు. సమాచార రంగంలో విప్లవం సాధించాడు. రేడియో, టి.వి, ఇంటర్నెట్ వంటివి కనిపెట్టాడు. కంప్యూటర్ రంగంలో విప్లవం సాధించాడు. ఫోటోలు తీయడం నేర్చాడు. కొత్త కొత్త శాస్త్ర విద్యలు నేర్చాడు.

కొత్త ప్రయాణ సాధనాలు కనిపెట్టాడు. ఫ్రిజులు, ఎ.సి.లు వగైరా కనిపెట్టాడు. రాకెట్లు కనిపెట్టాడు. ఇతర గ్రహాల పైకి వెళ్ళి వస్తున్నాడు. విమానాలపై ప్రయాణం సాగిస్తున్నాడు.

మానవుడు ఈ విధంగా అద్భుతమైన ప్రగతిని సాధిస్తున్నాడు.

ప్రశ్న 3.
‘ప్రగతికి మూలం నిరంతర కృషి’ అని తెలియజేసే నినాదాలు రాయండి.
జవాబు:
మానవుడి అభ్యుదయం – మనిషి చేతిలోనే ఉంది.
నిరంతర పరిశోధనయే – నిజ కల్యాణానికి పట్టాభిషేకం
శాస్త్ర ప్రయోగశాలలే – మానవుడి విజయసోపాన మందిరాలు
గోళ్ళు కొరుకుతూ కూర్చోకు – నీ అభివృద్ధికి నిరంతరం పాటుపడు
బద్ధకం, మాంద్యం – మనిషి అభివృద్ధికి వైరుధ్యం
ఈనాటి నీ కృషియే – రేపటి నీ విజయానికి సోపానం
కృషితో నాస్తి దుర్భిక్షం – కృషియే నీ భావి సౌభాగ్యం
బద్దకుడు, సోమరి – దేశ ప్రగతికి విరోధి
కృషి చేస్తే మనుషులు – ఋషులు అవుతారు.
కష్టపడి పనిచేస్తే – కడుపునిండా కూడు లభిస్తుంది.
ఆనాటి మానవుని కృషే – నేటి నీ వైజ్ఞానిక సౌఖ్యం
ఒళ్ళు వంచి పనిచేద్దాం – హాయిగా కులుకుతూ బ్రతికేద్దాం

10th Class Telugu 9th Lesson మాణిక్యవీణ 1 Mark Bits

1. సమాజంలోని రుగ్మతలు తొలగినపుడే దేశం బాగుపడుతుంది – గీత గీసిన పదానికి పర్యాయపదాలను గుర్తించండి. (June 2017)
A) నీతి, ధర్మం
B) కల్మషం, విరోధం
C) జబ్బు, రోగం
D) ఆదాయం, లాభం
జవాబు:
C) జబ్బు, రోగం

2. శ్లేషాలంకారానికి ఉదాహరణ గుర్తించండి. (June 2018)
A) మా అన్న చేతివంట నలభీమపాకం.
B) ఆమె పలుకులు తేనె పలుకులు.
C) రాజు కువలయానందకరుడు.
D) సంసార సాగరమును ఈదుట కష్టము.
జవాబు:
C) రాజు కువలయానందకరుడు.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 9 మాణిక్యవీణ

3. సినిమాలు జీవితాన్ని తీర్చిదిద్దగలవు. (వ్యతిరేక వాక్యాన్ని గుర్తించండి.) (June 2017)
A) సినిమాలు జీవితాన్ని తీర్చబోవు.
B) సినిమాలు జీవితాన్ని తీర్చవు.
C) సినిమాలు జీవితాన్ని తీర్చిదిద్దలేవు.
D) సినిమాలు జీవితాన్ని తీర్చిదిద్దుతాయి.
జవాబు:
C) సినిమాలు జీవితాన్ని తీర్చిదిద్దలేవు.

4. ఈ సంవత్సరం వర్షాలు కురుస్తాయో, కురవవో – ఇది ఏ రకమైన వాక్యమో గుర్తించండి. (March 2018)
A) సందేహార్థకం
B) ఆశ్చర్యార్థకం
C) నిశ్చయార్థకం
D) నిషేధార్థకం
జవాబు:
C) నిశ్చయార్థకం

5. మంత్రాలకు చింతకాయలు రాలడం : “కష్టపడకుండా ఫలితం రాదు” అనే అర్థంలో ఈ జాతీయాన్ని వాడతారు. (March 2017)

AP SSC 10th Class Telugu కరపత్రాలు, ఇంటర్వ్యూలు

AP State Board Syllabus AP SSC 10th Class Telugu Solutions 10th Class Telugu కరపత్రాలు, ఇంటర్వ్యూలు Notes, Questions and Answers.

AP State Syllabus SSC 10th Class Telugu కరపత్రాలు, ఇంటర్వ్యూలు

ప్రశ్న 1.
ఒక ప్రముఖ స్త్రీ వాద రచయిత్రి మీ పాఠశాల వార్షికోత్సవంలో ముఖ్య అతిధిగా పాల్గొనడానికి వస్తున్నారు. వారిని మీరు ఏమి ప్రశ్నించుతున్నారో ఆ ప్రశ్నల జాబితా వ్రాయండి.
జవాబు:

  1. స్త్రీ వాదము యొక్క ప్రాముఖ్యం ఏమిటి?
  2. స్త్రీలకు నేడు నిజంగానే స్వాతంత్ర్యం లేదా?
  3. స్త్రీలు నేడు సంఘంలో ఎదుర్కొంటున్న సమస్యలేమిటి?
  4. స్త్రీలకు పార్లమెంటులో రిజర్వేషన్లు ఇవ్వవలసిన అవసరం ఉందా?
  5. ‘స్త్రీలను స్త్రీలే కించపరుస్తున్నారు’ అంటే మీరు అంగీకరిస్తారా?
  6. స్త్రీలకు ఆర్థిక స్వాతంత్ర్యం వస్తే స్త్రీల సమస్యలు పోతాయా?
  7. స్త్రీలపై అత్యాచారాలకు స్త్రీల వేషభాషలు కారణమా?
  8. పురుషులు వంటగరిట చేతబడితే సమస్య పరిష్కారం అవుతుందా?
  9. స్త్రీలకు ఎటువంటి స్వాతంత్ర్యం కావాలి?
  10. స్త్రీలను భారతీయులు అనాదికాలం నుండి గౌరవిస్తున్నారని మీరు అంగీకరిస్తారా?

ప్రశ్న 2.
అనేక వ్యాధులకు కారణమవుతున్న దోమలను నివారించాలని తెలియజేస్తూ కరపత్రం తయారు చేయండి.
జవాబు:

దోమలపై దండయాత్ర
యువతీ యువకులారా ! ఆలోచించండి !

ఆరోగ్యవంతమైన శరీరంలో ఆరోగ్యవంతమైన ఆలోచనలు వస్తాయి. దోమలను నివారిద్దాం. ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దాం. మురుగునీరు దోమలకు నిలయం. మురుగునీరు నిలవ ఉండకుండా చూద్దాం. నీటిలో కుళ్లిన ఆకులు, చెత్తా చెదారం వలన దోమలు వృద్ధి అవుతాయి. రోగాలు వ్యాపిస్తాయి. క్యూలెక్స్ జాతికి చెందిన ఆడదోమ వలన ఫైలేరియా వస్తుంది. ఆడ ఎనాఫిలస్ దోమ వలన మలేరియా వ్యాపిస్తుంది. డెంగ్యూ కూడా దోమల వలన వస్తుంది. అందుచేత దోమల నివారణకు నడుం బిగిద్దాం – రండి – తరలిరండి.

ఇట్లు,
ఆరోగ్య శాఖ

AP SSC 10th Class Telugu కరపత్రాలు, ఇంటర్వ్యూలు

ప్రశ్న 3.
స్త్రీల అభ్యున్నతికి తీసుకోవలసిన చర్యలను గూర్చి వివరిస్తూ “కరపత్రం” తయారు యండి.
జవాబు:

మహిళాభ్యుదయం – కర్తవ్యం

సోదరులారా ! ఒక్కమాట ! –
మన సమాజంలో అనాది నుండి మహిళలకు సమున్నతమైన గౌరవం ఉంది. స్త్రీలను దేవతలగా భావిస్తాం. కాని రోజులు మారాయి. మనుషుల మనసులు మారాయి. పురుషాధిక్య సమాజంలో స్త్రీలకు తగిన గుర్తింపు దొరకడం లేదు. అన్ని విధాలుగా వారిని అణగదొక్కడానికి పురుషులు ప్రయత్నిస్తున్నారు. ఇది మంచిది కాదు. మనం స్త్రీల అభ్యున్నతికి కృషి చేయాలి. వాని కోసం మనం కొన్ని చర్యలు తీసుకోవాలి అవి :

  • స్త్రీలను అక్షరాస్యులుగా చేయాలి.
  • ఉద్యోగాల్లోను, రాజకీయ పదవుల్లోను తగిన రిజర్వేషన్ కల్పించాలి.
  • వృత్తి విద్యల శిక్షణను అందించాలి. సాంకేతిక విద్య పట్ల ప్రోత్సాహం కల్పించాలి.
  • స్త్రీలను చులకనగా చూడటం మానుకోవాలి.

ఇట్లు,
మహిళా రక్షణ సమితి,
కర్నూలు.

ప్రశ్న 4.
మరుగుదొడ్లు నిర్మించి, వినియోగించాలని కోరుతూ ఒక కరపత్రం రాయండి.
జవాబు:

మరుగుదొడ్లు నిర్మిద్దాం – రోగాలు నివారిద్దాం

సోదరీసోదరీమణులారా !
మన గ్రామంలో మరుగుదొడ్ల వసతి లేక ఎంతోమంది బహిరంగ మలవిసర్జన చేస్తున్నారు. దానిపై ఈగలు, దోమలు, సూక్ష్మజీవులు వాలతాయి. ఆ ఈగలు, దోమలు మనం తినే ఆహారంపై వాలతాయి. ఆ ఆహారం తినడం వల్ల మన ” ఆరోగ్యాలు పాడైపోతున్నాయి.

అందుకే బహిరంగ మలవిసర్జన వద్దని ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు పేర్కొంటున్నాయి. అవి ప్రజలను బాగా చైతన్యపరుస్తున్నాయి. మరుగుదొడ్లు నిర్మించుకొనేందుకు ప్రభుత్వం కూడా మినహాయింపుతో కూడిన ఋణం మంజూరు చేస్తుంది. కాబట్టి అందరు తమ ఇండ్లలో మరుగుదొడ్లను నిర్మించుకొని, వాటిని వినియోగించాలని కోరుతున్నాం. ఆ విధంగా మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకొన్నవారమవుతాం. ‘మరుగుదొడ్లు నిర్మించుకొందాం – మంచి ఆరోగ్యంగా బ్రతుకుదాం’.
తేది : x x x x x

ఇట్లు,
ప్రజా ఆరోగ్య పరిరక్షణ సమితి,
పాములపాడు.

ప్రశ్న 5.
బాలికల విద్య ఆవశ్యకతను వివరిస్తూ ఒక కరపత్రం రాయండి.
జవాబు:

బాలికల విద్య – సమాజానికి ప్రగతి

తల్లిదండ్రులారా !
బాలికలు విద్యావంతులైనచో సమాజం వివేకవంతమవుతుంది. బాలికలు విద్యావంతులైనచో ప్రయోజనం ‘ఇంత’ అని చెప్పటానికి వీలులేదు.

ఇటీవలి కాలంలో రాజకీయ దాస్యంతోను, భావ దాస్యంతోను సంఘం మునిగి ఉంది. అందువల్ల బాలికల విద్య , చాలావరకు వెనుకబడి ఉంది.

‘ మనదేశానికి స్వాతంత్ర్యం సంపాదించుటకు గాంధీ ‘మహాత్ముడు తన నిర్మాణ కార్యక్రమంలో మహిళాభ్యుదయం: ప్రధానంగా చేర్చారు. బాలికల విద్యకు ప్రాముఖ్యం ఇచ్చారు. ఆధునిక కాలంలో వీరేశలింగం పంతులుగారు స్త్రీ విద్యక మొట్టమొదటిగా ఒక పాఠశాలను పెట్టి కృషి చేశారు.

సాంకేతిక విద్యలో నైపుణ్యం సంపాదించుటకై బాలికలకు ప్రత్యేకంగా ‘పాలిటెక్నిక్’ కళాశాలను ఏర్పరిచారు. కనుక స్త్రీలు గృహకృత్యాలను నిర్వహించుటలో విద్యావంతులైనచో బహుముఖ ప్రజ్ఞను వెల్లడించి దేశ సేవలోను, సంఘసేవలోను రాణించగలడు. తమ సంతానానికి విద్యాబుద్ధులు నేర్పుటలో శ్రద్ధ వహించి వారిని సత్పురుషులుగా తీర్చిదిద్దుతారు. కనుక బాలికల విద్యను ఇతోధికంగా ప్రోత్సహించినచో దేశానికి, సమాజానికి శ్రేయస్సు కల్గుతుంది.

ఇట్లు,
బాలికల విద్యా ప్రోత్సాహక సంఘము
శ్రీకాకుళం.

ప్రశ్న 6.
వందేమాతరానికి వందేళ్ళు పూర్తయిన సందర్భాన్ని గుర్తు చేస్తూ ఒక కరపత్రాన్ని తయారు చేయండి.
జవాబు:

“వందేమాతరం” కరపత్రం

సోదర భారతీయులారా ! మనమందరం, పవిత్ర భారతమాత కన్నబిడ్డలం. మన దేశ స్వాతంత్ర్య పరిరక్షణకై మనమంతా మన ప్రాణాల్ని సైతం ధారపోయడానికి సిద్ధం కావాలి.

మన భారతదేశానికి స్వాతంత్ర్యం సంపాదించడానికై జరిగిన స్వాతంత్ర్య పోరాటానికి ‘వందేమాతరం’ గీతం శంఖారావం చేసింది. బంకించంద్ర ఛటర్జీ ఆ వందేమాతరం గీతం రాసి నేటికి నూరు సంవత్సరాలు అయ్యింది. ఆనాడు దేశమంతా ఆ గీతాన్ని అంది పుచ్చుకొని, “వందేమాతరం మందే రాజ్యం” అంటూ గొంతెత్తి నినాదం చేసింది. బ్రిటిష్ వారిని తరిమికొట్టి స్వాతంత్ర్యాన్ని సాధించి పెట్టింది.

ఆనాడు గాంధీజీ, నెహ్రూ, తిలక్, పటేలు వంటి నాయకులు దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసి మనకు స్వాతంత్ర్యం భిక్ష పెట్టారు. ఈనాడు మనం హాయిగా వందేమాతరం గీతాన్ని జాతీయగీతంగా గొంతెత్తి పాడుకుంటున్నాము. ఆనాడు ‘వందేమాతరం’ అంటే నేరం.

మనకు స్వాతంత్ర్యాన్ని సంపాదించి పెట్టిన ‘వందేమాతరం గేయం యొక్క స్ఫూర్తిని కాపాడుకుందాం” మనతో కయ్యానికి కాలు దువ్వుతున్న చైనా, పాకిస్తాన్ దేశాల పొగరును అణచివేద్దాం. మనమంతా ఒక్కొక్క సైనికునిలా ‘కదంతొక్కుదాం. దేశభక్తియే మనకు జీవం. మరువకండి. మనమంతా భరతమాత వీరపుత్రులం. వీర పుత్రికలం.

‘జైహింద్’.

AP SSC 10th Class Telugu కరపత్రాలు, ఇంటర్వ్యూలు

ప్రశ్న 7.
ప్రస్తుత పరిస్థితి దృష్ట్యా మానవాళి నీటిని ఎంతో జాగ్రత్తగా వాడుకోవలసిన అవసరం ఉంది. నీటిని దుర్వినియోగం చేయకుండా తీసికోవలసిన జాగ్రత్తలు, ఆవశ్యకతను తెలియజేస్తూ ఒక కరపత్రాన్ని తయారు చేయండి.
జవాబు:

నీటి పొదుపు – తీసుకోవలసిన జాగ్రత్తలు (కరపత్రం)

సోదర సోదరీమణులారా!
నేడు మన దేశంలో జనాభా పెరిగిపోతోంది. వాతావరణ కాలుష్యం వల్ల, వర్షాల రాక తగ్గింది. ప్రతి నీటి బిందువును మనం సద్వినియోగం చేసుకోవలసిన అవసరం ఎంతో ఉంది.

అడవులు తగ్గిపోతున్నాయి. వర్షాలు బాగా తగ్గాయి. భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి. నదీ జలాలు సముద్రాల పాలవుతున్నాయి. మనం నీటిని జాగ్రత్తగా పొదుపుగా వాడుకోవాలి.

వ్యవసాయదారులు బిందు సేద్యాన్ని చేయాలి. ప్రతి ఇంటిలో ఇంకుడు కుంటలు ఏర్పాటు చేయాలి. వృథాగా కారిపోతున్న కుళాయిలను కట్టివేయాలి. నదులు, చెరువులు, కుంటలు లోని నీటిని కలుషితం చేయరాదు. వర్షపు నీటిని సైతం నేలలో ఇంకేటట్లు చేయాలి.

ఒక నీటి చుక్కను పొదుపు చేస్తే, అది మరో ప్రాణి ప్రాణాన్ని నిలుపుతుంది. అనవసరంగా నీటిని వదలి పెట్టరాదు. స్నానం చేసిన నీటిని, మొక్కలకు పోయాలి. ఆ నీటితో అంట్లు తోముకొని, శుభ్రం చేసుకోవాలి. నీటిని పొదుపుగా వాడుకోవాలి. దుర్వినియోగం చేయవద్దు. మరువకండి.

ఇట్లు,
యువజన విద్యార్థి సంఘం.

ప్రశ్న 8.
మీ పాఠశాల వార్షికోత్సవానికి ప్రముఖులు వస్తున్నారు. వారిని ఇంటర్వ్యూ చేయడానికి ప్రశ్నావళిని తయారు చేయండి
(లేదా )
మీ పాఠశాలను సందర్శించిన కవి/ కవయిత్రిని ఇంటర్వ్యూ చేయడానికి తగిన ప్రశ్నావళిని రూపొందించండి.
జవాబు:
‘ప్రశ్నావళి’ – ప్రముఖులతో ఇంటర్వ్యూ : –

  1. పూజ్యులయిన మీకు వందనాలు. సుస్వాగతము.
  2. నేటి పాఠశాల విద్యపై మీ అభిప్రాయం చెప్పండి.
  3. నేటి పాఠశాల విద్యలో మీరు గమనించిన లోపాలను చెప్పండి.
  4. నేటి బాలబాలికల విద్యాభివృద్ధికి మీరిచ్చే సూచనలు చెప్పండి.
  5. మా విద్యార్థులలో మంచి అలవాట్లు పెంపొందడానికి మీరిచ్చే సలహాలు ఏమిటి ?
  6. నిరుద్యోగ సమస్య పై మీ అభిప్రాయాలు చెప్పండి.
  7. పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం చేపట్టవలసిన చర్యలను సూచించండి.
  8. మీరు నేడు గొప్ప వారయ్యారు. మీ అభివృద్ధికి కారణమైన సంఘటనలు తెల్పండి.
  9. విద్యార్థులకు క్రీడలపై ఆసక్తి పెంపొందడానికి, మీరిచ్చే సూచనలు తెలపండి.
  10. విద్యార్థులను ఆశీర్వదిస్తూ రెండు మాటలు చెప్పండి.

ప్రశ్న 9.
పాఠశాలలో జరిగే భాషోత్సవాన్ని తిలకించడానికి ప్రముఖ శతక కవులు వస్తున్నారు. వారి ద్వారా శతకాల గురించి, వారి రచనల గురించి, తెలిసికోడానికి పిల్లలు ఇంటర్వూ చేయాలనుకున్నారు. మీరైతే ఏమని ఇంటర్వ్యూ చేస్తారు? ప్రశ్నావళి రూపొందించండి. ..
జవాబు:
ఇంటర్వ్యూ ప్రశ్నావళి

  1. శతక కవులకు స్వాగతం. ‘శతకాలు’ ఎన్ని రకాలు?
  2. తెలుగులో మొదటి శతకకర్త ఎవరు?
  3. శతకాల్లో ఎన్ని రకాలున్నాయి?
  4. మకుటం లేని శతకాలు ఏమైనా ఉన్నాయా?
  5. నీతి శతకాల ప్రాముఖ్యత ఏమిటి?
  6. భక్తి శతకాలు మీరు ఏమైనా రాశారా?
  7. ‘కాళహస్తీశ్వర శతకం’లో భక్తి ఎక్కువగా ఉందా? రాజదూషణ ఉందా?
  8. ‘సుమతి శతకం’ ప్రత్యేకత ఎటువంటిది?
  9. వసురాయకవి గారి భక్త చింతామణి శతకం గూర్చి చెప్పండి.
  10. మీకు నచ్చిన శతకం ఏమిటి?
  11. మీరు మాకు ఇచ్చే సందేశం ఏమిటి?
  12. ఛందోబద్దం కాని శతకాలు ఏమైనా ఉన్నాయా?

ప్రశ్న 10.
మహిళల పట్ల చూపుతున్న వివక్షలను, వారి మీద జరుగుతున్న దాడులను ఖండిస్తూ, మహిళలందరూ ధైర్యంగా మెలగాలని తెలియజేసేలా ఒక కరపత్రాన్ని తయారు చేయండి.
జవాబు:

“ధైర్యే సాహసే లక్ష్మీ”

మహిళామణులారా! ‘పదండి ముందుకు, పదండి తోసుకు పోదాం పోదాం, పైపైకి’ అన్న శ్రీశ్రీ మాట మరచిపోకండి. ఈనాడు మనపట్ల సంఘం ఎంతో వివక్షత చూపిస్తోంది. ఆడపిల్ల గర్భాన పడిందని తెలిస్తే, తల్లిదండ్రులు విలవిల లాడుతున్నారు. కొందరు భ్రూణహత్యలకు దిగుతున్నారు.

తండ్రి ఆస్తిలో స్త్రీలకు మగవారితో సమాన వాటాలు ఇవ్వడం లేదు. పేపరు తిరగవేస్తే, స్త్రీల మానభంగాల వార్తలు, టి.వి. పెడితే స్త్రీలకు జరిగిన అన్యాయాలు, అత్తవారింట స్త్రీల కష్టాలు, వరకట్నాల చావులు కనబడతాయి. వినబడతాయి. — పసిపిల్లల నుండి పండు ముదుసళ్ళు వరకు అత్యాచారాలకు గురి అవుతున్నారు.

స్త్రీలంతా కరాటే నేర్చుకోవాలి. అల్లరి చేసే మగవారి చెంపలు పగుల కొట్టాలి. నిర్భయంగా పోలీసు వారికి రిపోర్టు చెయ్యాలి. మీరు పొరపాటున అన్యాయానికి గురి అయితే, సిగ్గుతో చితికిపోవద్దు. ధైర్యంగా నిలవండి. అన్యాయాన్ని ఎదిరించి పోరాడండి. బాగా చదవండి. ఉద్యోగాలు చేయండి. మనం ఈ దురాచారాల్ని ఖండిద్దాం.

అన్యాయం జరిగిన తోటి స్త్రీలకు, మనం అండగా నిలవాలి. ఆడపిల్ల ఇంటికి మహాలక్ష్మి అని, ఆనందించే రోజు రావాలి. అందుకు మనమంతా చేయి చేయి కలిపి పోరాడుదాం. ఝాన్సీ లక్ష్మీబాయిలా, సరోజినీ దేవిలా దుర్గాబాయమ్మలా తలలెత్తి నిలుద్దాం. ధైర్యమే మనకు శ్రీరామరక్ష.

ఇట్లు,
వనితా సంఘం.

AP SSC 10th Class Telugu కరపత్రాలు, ఇంటర్వ్యూలు

ప్రశ్న 11.
‘మహిళల రక్షణ మన కర్తవ్యం’ అనే అంశముపై కరపత్రం రాయండి..
జవాబు:

‘మహిళల రక్షణ – మన కర్తవ్యం’

సోదర సోదరీమణులారా ! చెప్పడానికి సిగ్గువేస్తోంది. దేశంలో ఎక్కడో అక్కడ రోజూ స్త్రీలపట్ల అకృత్యాలు జరుగుతూనే ఉన్నాయి. పసిపాపలపై, యువతులపై, ముసలి స్త్రీలపై సైతం అత్యాచారాలు జరుగుతున్నాయి. స్త్రీలపై యాసిడ్ దాడులు, ఈవ్ టీజింగ్, మానభంగాలు, హింసాకృత్యాలు నిత్యం జరుగుతున్నాయి.

మన ఇంట్లో మన తల్లిని అక్కచెల్లెళ్ళను మనం కాపాడుకుంటున్నాం. అలాగే ప్రతి స్త్రీని మనం కాపాడాలి. మహిళలకులు అన్యాయం జరిగితే ఎవరూ సహించరు అనే విషయం దుండగులకు గట్టిగా తెలియపరచాలి.

మహిళలపట్ల అకృత్యం జరిగితే మీరు ఉగ్రనరసింహరూపం ధరించి దుండగులను చీల్చిచెండాడండి. పోలీసువారికి కబురు అందించండి. ప్రక్కవారి సాయం తీసుకోండి. మన సోదరీమణులను మనమే రక్షించుకుందాం.

స్త్రీలు భారతదేశ భాగ్య కల్పలతలు. ప్రతి ఒక్కడూ స్త్రీల రక్షణకు ఉద్యమిస్తే ఎవరూ వారిపట్ల దుర్మార్గానికి సిద్ధం కారు. లెండి ఉద్యమించండి. దుర్మార్గులను చీల్చి చెండాడండి. మన అక్క చెల్లెండ్రను మనమే కాపాడుకుందాం.

ఇట్లు,
యువజన సంఘం.

12. ఉపాధ్యాయులను గౌరవించాలని ప్రబోధిస్తూ ఒక కరపత్రాన్ని సిద్ధం చేయండి.
జవాబు:

“ఆచార్య దేవో భవ”

సంఘములో మానవుల అభివృద్ధికి తల్లిదండ్రుల తర్వాత గురువులే ప్రధానపాత్ర వహిస్తారు. అందుకే మన ఉపనిషత్తులు ‘ఆచార్య దేవోభవ’ అని గురువును దైవంగా సేవించమని చెప్పాయి.

గురువులు తమకు అప్పగించిన విద్యార్థులకు ఎంతో కష్టపడి విద్యను బోధించి, వారిని విజ్ఞానవంతులుగా తీర్చి దిద్దుతారు. అందువల్ల విద్యార్థులు, వారి తల్లితండ్రులూ గురువులను గౌరవించాలి. అందుకే సర్.యస్. రాధాకృష్ణన్ గారు తన పుట్టిన రోజును, అధ్యాపక దినోత్సవంగా జరుపుకోమని చెప్పారు. ఆనాడు ఉత్తమ ఉపాధ్యాయులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సన్మానిస్తాయి.

ఉపాధ్యాయులను ఆ రోజు ప్రతి గ్రామంలో, నగరంలో పెద్దలు సన్మానించాలి. విద్యార్థులు సైతం కృతజ్ఞతా పూర్వకంగా గురువులను అభినందించి సత్కరించాలి. పూర్వకాలంలో సైతం మహారాజులు గురువులకు ఈనాములిచ్చి పెద్ద గౌరవమిచ్చి, వారిని పోషించేవారు. మనది ప్రజా ప్రభుత్వము. అందువల్ల ప్రజలే అధ్యాపకులను “గురుభ్యోనమః” అని వారిని సత్కరించాలి.

ప్రశ్న 13.
‘మొక్కల పెంపకం’ ఆవశ్యకతను వివరిస్తూ ఒక కరపత్రం తయారు చేయండి.
జవాబు:

“వృక్షముల పెంపకం”

చెట్లు జీవన సౌభాగ్యానికి మెట్లు. నేడు నగరాలు, గ్రామాలు కూడా, పర్యావరణ కాలుష్యంతో సతమతమవుతున్నాయి. ప్రజలంతా రోగాలతో డాక్టర్ల వెంట తిరుగుతున్నారు. దీనికి కారణం దేశంలో పచ్చని చెట్లు తక్కువ కావడమే.

చెట్లు బొగ్గుపులుసు వాయువును పీల్చి, ప్రాణవాయువును మనకు అందిస్తాయి. పూలను, పండ్లను ఇస్తాయి. చల్లని నీడను, గాలిని ఇస్తాయి. పర్యావరణ కాలుష్యం నుండి మనలను కాపాడతాయి.

కాబట్టి ప్రతి వ్యక్తి ఒక్కొక్క చెట్టును పాతి పెంచాలి. ప్రభుత్వము మంచి మొక్కలను ప్రజలకు ఉచితంగా ఇచ్చి వాటిని పాతించాలి. మొక్కలను పెంచి, వాటికి రక్షణ కల్పించాలి. దేశంలో సహితం అడవుల విస్తీర్ణం నేడు తగ్గిపోయింది. అందుకే మనకు వర్షాలు లేవు.

ప్రతి పంచాయితీ వారు మునిసిపాలిటీ వారు, మొక్కలను ఖాళీ ప్రదేశాల్లో పెంచాలి. మొక్కలను పెంచిన వారికి ప్రోత్సాహకాలు ఇవ్వాలి. గిరిజనులను ప్రోత్సహించి అడవులలో మొక్కలు పెంచాలి. మనమంతా మొక్కలను పెంచుదాం. మన దేశాన్ని సస్యశ్యామలం చేద్దాం.

ఇట్లు,
నగర రక్షణ సమితి.

ప్రశ్న 14.
అనాథ బాలబాలికలను ఆదుకోవాలని ప్రబోధిస్తూ ఒక కరపత్రం సిద్ధం చేయండి.
జవాబు:

“అనాథ రక్షణ”

మిత్రులారా ! దిక్కులేని వారిని మనం అనాథలు అంటున్నాము. దిక్కులేని వారికి దేవుడే దిక్కు అంటారు. ఈనాడు ఎన్నో కారణాల వల్ల కొంతమంది, అనాథలు అవుతున్నారు. తల్లిదండ్రులు ప్రమాదాల్లో మరణించడం జరుగుతుంది. భయంకర వ్యాధుల వల్ల తల్లిదండ్రులు మరణించవచ్చు.

మానవ సేవయే మాధవ సేవ. మనకు భగవంతుడే సంపదలు ఇస్తున్నాడు. మనకు ఉన్నదానిలో కొంత మొత్తం దీన జన సేవకు వినియోగిద్దాం. మన నగర ప్రజలంతా అనాథ రక్షణ సంఘంగా ఏర్పడదాం.

మనం అన్నం వండుకునే ముందు, రెండు గుప్పిళ్ళు బియ్యం వేరే పాత్రలో ఉంచుదాం. ఆ బియ్యాన్ని పోగుచేసి అనాథలకు భోజనాలు పెడదాం. వారికి ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేద్దాం. డబ్బున్న వారి నుండి చందాలు వసూలు చేద్దాం. మన నగరం చైర్మెన్ గారి సాయం తీసుకుందాం. అనాథలకు చదువులు చెప్పిదాం. వారికి పుస్తకాలు, బట్టలు ఇద్దాం.

మనం అనాథలను ఆదుకుంటే, భగవంతుడు మనలను రక్షిస్తాడు. సిరిసంపదలిస్తాడు. అనాథలకు మనమంతా తల్లిదండ్రులు అవుదాం. కదలండి. ఒక మంచి పని చేద్దాం.
విజయవాడ,
x x x x x

ఇట్లు,
అనాథ పరిరక్షణ సమితి.

AP SSC 10th Class Telugu కరపత్రాలు, ఇంటర్వ్యూలు

ప్రశ్న 15.
‘చెట్టు – నీరు’ పథకం గురించి, ప్రజలందరూ దానిలో పాల్గొనాలని ప్రబోధిస్తూ కరపత్రం సిద్ధం చేయండి.
జవాబు:

‘చెట్టు – నీరు పథకం’

ఈనాడు దేశం ఎదుర్కొంటున్న పెద్ద సమస్య ‘నీరు’ యొక్క కొరత. మనకు చాలాకాలంగా మహారాజులు, దాతలు గ్రామాల్లో చెరువులు త్రవ్వించి, వర్షం నీటిని దానిలో నిల్వ చేసి ప్రజలకు నీటి సదుపాయం కల్పించారు. దేశ విస్తీర్ణంలో మూడవ వంతు అడవులు ఉంటే మంచి వర్షాలు పడతాయి. ఇప్పుడు అడవుల విస్తీర్ణం తగ్గిపోయింది. దానితో వర్షాలు లేవు. దానితో నదులు నిండుగా ప్రవహించడం లేదు.

ఇప్పుడు రోడ్లు, ఇళ్ళు అన్నీ కాంక్రీట్ అయిపోయాయి. దానితో నీరు భూముల్లోకి ఇంకడం లేదు. అందువల్ల ప్రతి ఇంటివారు ఇంకుడు గుంటలు ఏర్పాటు చేయాలి. చెరువులను బాగా త్రవ్వించి నీరు నిలువ చేయాలి. చెరువులలో, కాలువల్లో నీరు నిండుగా ఉంటే భూగర్భజలాలు పుష్కలంగా ఉంటాయి.

ప్రతి ఒక్కరు ఖాళీ ప్రదేశాల్లో చెట్లు పెంచాలి. అందువల్ల వాతావరణం చల్లబడుతుంది. పరిశుభ్రమవుతుంది. మంచి వర్షాలు పడతాయి. ప్రభుత్వం ఇందుకే చెట్టు – నీరు పథకం మొదలు పెట్టింది. దీనిలో ప్రజలంతా పాల్గొవాలి. తమ ఊరిలో చెరువు వారు బాగు చేసుకోవాలి. ప్రజలందరికీ నీరు పుష్కలంగా లభించేలా చూడాలి. నీటి వనరులను కలుషితం కాకుండా కాపాడుకోవాలి.

ప్రశ్న 16.
మహిళల పట్ల చూపుతున్న వివక్షలను, వారిమీద జరుగుతున్న దాడులను ఖండిస్తూ, మహిళలందరూ ధైర్యంతో మెలగాలని తెలియజేసేలా ఒక కరపత్రం తయారుచేయండి.
జవాబు:

“ధైర్యే సాహసే లక్ష్మీ”

మహిళలారా! “పదండి ముందుకు, పదండి తోసుకు, పోదాం పోదాం పైపైకి” అన్న శ్రీశ్రీ మాట మనం మరచి పోకూడదు. ఈనాడు స్త్రీల విషయంలో సంఘం ఎంతో వివక్ష చూపిస్తోంది. ఆడపిల్ల గర్భాన పడిందంటేనే తల్లిదండ్రులు అతలాకుతలం అయిపోతున్నారు. కొందరు భ్రూణహత్యలకు దిగుతున్నారు. ‘స్త్రీలను గౌరవిద్దాం’ అనే బోర్డులు మాత్రమే కాని, బస్సుల్లో సహితం ఆడవాళ్ళకు సీట్లు దొరకడం లేదు.

స్త్రీలకు ఉద్యోగాల్లోనూ, చదువుకోడానికి సీట్లు ఇవ్వడంలోనూ రిజర్వేషన్లు సక్రమంగా అమలుకావడం లేదు ‘అభయ’ చట్టం వచ్చినా పసిపిల్లలు సహితం అత్యాచారాలకు గురి అవుతున్నారు.

ఆడపిల్లలందరూ కరాటే నేర్చుకోవాలి. అల్లరి చేస్తున్న మగవాడి చెంప పగులకొట్టండి. అవమానం జరిగితే నిర్భయంగా అధికారులకు రిపోర్టు ఇవ్వండి. పొరపాటున అన్యాయానికి గురయితే సిగ్గుతో చితికిపోకండి. ధైర్యంగా నిలబడండి. అన్యాయాన్ని ఎదిరించి పోరాడండి.

ఒక స్త్రీ అన్యాయానికి గురయితే, మిగిలిన ఆడవాళ్ళంతా ఆమెకు అండగా నిలవండి. ఆడపిల్ల పుడితే ఇంటికి మహాలక్ష్మి వచ్చినట్లు అని తల్లిదండ్రులు ఆనందించేలా చేయండి. ఉద్యోగం సంపాదించండి. తల్లిదండ్రులకు అండగా నిలవండి. సంఘబలం కూడగట్టి, దుర్మార్గులను శిక్షించండి. ప్రభుత్వం ఆదుకోకపోతే, వనితా సంఘాల, స్వచ్ఛంద సంస్థల సాయం తీసుకోండి. ఝాన్సీలక్ష్మీబాయిలా, రాణి రుద్రమలా, సరోజినీ దేవిలా, దుర్గాబాయమ్మలా తలలెత్తి నిలవండి.

దివి. x x x x x

ఇట్లు,
గుంటూరు వనితా సంఘం.

ప్రశ్న 17.
మీ పాఠశాల గురించి లేదా ఒక పర్యాటక క్షేత్రాన్ని గురించి వర్ణిస్తూ కరపత్రం రాయండి.
జవాబు:

మా పాఠశాల

మా పాఠశాల ఐదు ఎకరాల విస్తీర్ణంలో వ్యాపించి ఉంది. పాఠశాల భవనంలో 12 గదులున్నాయి. గదులన్నింటిలో పంఖాలు, ట్యూబ్ లైట్లు ఉన్నాయి. పిల్లలకు కావలసిన బెంచీలున్నాయి. ప్రతి తరగతి గదిలో గోడమీద నల్లబల్లలు ఉన్నాయి. మా అధ్యాపకులకు వేరుగా ఒక గది ఉంది. అక్కడ మంచినీటి ఫిల్టరు ఉంది. దాని ప్రక్క గదిలో మా ప్రధానోపాధ్యాయులు ఉంటారు. ప్రధానోపాధ్యాయుల గదిలో దేశనాయకుల, దేవుళ్ళ చిత్రపటాలు ఉన్నాయి.

పాఠశాల ఆఫీసు వారికి వేరే గది ఉంది. అక్కడ గుమాస్తాలు కూర్చుంటారు. పిల్లలందరికీ మంచినీటి సదుపాయం, పాయిఖానా ఏర్పాట్లు ఉన్నాయి. తూర్పు వైపున మంచి పూలతోట ఉంది. ఆ తోటలో మల్లి, మొల్ల, కనకాంబరం, చేమంతి పూలచెట్లున్నాయి. ఈ మధ్యనే గులాబీ మొక్కలు కూడా నాటారు.

ఆటస్థలంలో అన్నిరకాల కోర్టులూ ఉన్నాయి. క్రికెట్ ఆడుకొనే సదుపాయాలు ఉన్నాయి. పాఠశాలకు వేరుగా గ్రంథాలయం ఉంది. అక్కడకు రోజూ 2, 3 పత్రికలు వస్తాయి. విశ్రాంతి సమయంలో మేము అక్కడ కూర్చుని వాటిని చదువుతాము.

మా గ్రామ ప్రజలు పాఠశాల అభివృద్ధికి బాగా సాయం చేస్తారు. మేము పాఠశాలను పరిశుభ్రంగా ఉంచుతాం. ఆ పాఠశాల మాకు రెండవ తల్లి వంటిది.

ప్రశ్న 18.
మీ పరిసరాల్లోని ఏదైనా పక్షి/ జంతువు గురించి మీరు ఒక కథనాన్ని రాయండి.
జవాబు:

“ధోని” (కుక్కపిల్ల)

మా పక్క ‘ఇంటివాళ్ళకూ కుక్కపిల్లలంటే మహాప్రేమ. ‘తనను పెంచుకుంటున్న యజమానిపై విశ్వాసం చూపడంలో కుక్కను మించిన జంతువు కనబడదు. మా పక్కింటి అబ్బాయి ఒక కుక్కను పెంచుకోవాలని ఆశపడుతున్నాడు.

వాళ్ళింట్లో ఒక కుక్క, గర్భవతిగా ఉంది. ఒక రోజున దానికి మూడు పిల్లలు పుట్టాయి. అందులో ఒక పిల్ల అందంగా. తెల్లగా పాలరంగులో ఉంది. దానికి మంచి బొచ్చు ఉంది. దాన్ని చూస్తే ముద్దుగా ఉంది. దానికి ధోనీ అని పేరు పెట్టాలని ఆ పిల్లవాడి ఆశ. ఆ పిల్లాడు ఇంజనీరింగ్ చదువుతున్నాడు. క్రికెట్ అంటే బాగా ఇష్టం. అందుకే ముద్దు వచ్చే ఆ కుక్క పిల్ల ధోనీగా మారింది.

ఆ ధోనీ అంటే దాని తల్లికి బాగా ఇష్టం. ధోనీకి, దాని తల్లి కుక్క, కడుపునిండా పాలిచ్చేది. ధోనీ తోకను ఊపుతూ కులాసాగా మా వీథిలో తిరుగుతూ ఉంటుంది. ‘ధోనీ’ అంటే మా వీధి వాళ్ళంతా ఇష్టపడతారు. దానికి మా పక్కింటబ్బాయి స్నానం చేయించి పాలు, బిస్కట్లు, కోడిగుడ్లు, మాంసం పెడతాడు. ధోనీ క్రమంగా టైగర్ లా పెరిగింది.

ఒక రోజున ‘ధోనీ’ వాళ్ళింట్లోకి అడుగుపెడుతూ ఉన్న దొంగపైకి దూకి వాడి పిక్క పట్టుకొంది. అది చూసిన మా పక్కింటి అబ్బాయి ‘ధోనీ’ అని ప్రేమగా పిలిచాడు. అంతే! దొంగను వదలి తోక ఊపుకుంటూ, ఆ అబ్బాయి దగ్గరకు అది పరుగుపెట్టింది. ‘ధోనీ’ని పోలీసు కుక్కగా చేయాలని మా పక్కింటి అబ్బాయి చూస్తున్నాడు.

AP SSC 10th Class Telugu కరపత్రాలు, ఇంటర్వ్యూలు

ప్రశ్న 19.
‘శాంతి’ ఆవశ్యకతను తెలియజేస్తూ ఒక కరపత్రం రాయండి. .
జవాబు:

ప్రపంచశాంతి

మిత్రులారా ! ఈ విషయాన్ని గూర్చి ఒక్కసారి ఆలోచించండి. చిన్న చిన్న విషయాలకోసం దెబ్బలాటలకు దిగి, తలలు బద్దలుకొట్టుకోకండి. న్యాయస్థానాలకు వెళ్ళి డబ్బు తగులబెట్టకండి. మనది గాంధీ, బుద్ధుడు, జవహర్‌లాల్ నెహ్రూ పుట్టిన దేశం. ఎందరో మహర్షులు, ప్రవక్తలు పుట్టిన దేశం. వారి శాంతి బోధలు తలకు ఎక్కించుకోండి.

ప్రపంచంలో ఇప్పటికే రెండు ప్రపంచయుద్ధాలు జరిగాయి. ఇంకా ఎన్నో చిన్న చిన్న తగవులు జరిగాయి. యుద్ధాలవల్ల ఎంతో ధనవ్యయం, ప్రాణనష్టం జరుగుతుంది. యుద్ధాల్లో పాల్గొన్న దేశాలు, అభివృద్ధి లేకుండా వెనుకబడతాయి.

కాబట్టి యుద్ధాలు వద్దు. శాంతి మనకు ముద్దు. ప్రపంచ పౌరులంతా సోదరుల వలె మెలగుదాం. స్నేహం, ప్రేమ, కరుణ, వాత్సల్యం మనకు మంచిదారిని చూపిస్తాయి. శాంతి మంత్రాన్ని అంతా జపిద్దాం. సరేనా?

ఇట్లు
ప్రపంచ బాలబాలికల సంఘం.

ప్రశ్న 20.
ధనము ఉన్నవాళ్ళు దానం చేయాలని విజ్ఞప్తి చేస్తూ అనాథశరణాలయాలకు, వృద్ధాశ్రమాలకు, బీదలకు విరాళాలు ప్రకటించమని ధనవంతులకూ, వదాన్యులకూ ఒక కరపత్రం ద్వారా విజ్ఞప్తి చేయండి.
జవాబు:

విజ్ఞప్తి

సోదర సోదరీమణులారా ! మనం అందరం భగవంతుని బిడ్డలం. మనలో కొందరు బీదవారుగా, దిక్కులేనివారుగా ఉన్నారు. వారికి మనతోపాటు బతికే హక్కు ఉంది. మనలో డబ్బు ఉన్నవారు ఉన్నారు. మనం పుట్టినపుడు ఈ డబ్బును మన వెంట తేలేదు. రేపు చనిపోయినపుడు ఈ ధనాన్ని మనం వెంట తీసికొని పోలేము.

మనం ఎంత లక్షాధికారులమైనా బంగారాన్ని తినము. డబ్బున్నవారమని గర్వపడడమే కాని, కూడబెట్టిన దాన్ని అంతా మనం తినలేము – ఎవరికీ దానధర్మాలు చేయకుండా బ్యాంకుల్లో దాస్తే ఆదాయం పన్ను వాళ్ళు తీసుకుపోతారు.

కాబట్టి మనతోటి దరిద్రనారాయణులకూ, దిక్కులేని ముసలివారికీ తోడ్పడండి. మీ డబ్బును విరివిగా వృద్ధాశ్రమాలకు చందాలుగా ఇవ్వండి. లేదా మీరే అనాథశరణాలయాలు స్థాపించండి.

‘మానవసేవయే మాధవసేవ’ అని గుర్తించండి. తోటివారికి మనం డబ్బు ఇచ్చి తోడ్పడితే, దైవకృప మనకు తప్పక లభిస్తుంది. లోభిత్వం విడువండి. వదాన్యులై విరివిగా విరాళాలు ప్రకటించండి. భగవంతుడు నాకు మంచిబుద్ధిని ప్రసాదించాలి.

ఇట్లు,
మీ తోడి సోదరసోదరీమణులు.

ప్రశ్న 21.
వివాహాల్లో చేయవలసిన సంస్కరణల గూర్చి కరపత్రం తయారుచేయండి.
జవాబు:

వివాహాలలో చేయవలసిన సంస్కరణలు

మిత్రులారా ! ఈ రోజుల్లో పెండ్లి ఏర్పాట్లు చాలా ఘనంగా బాగా ఖర్చు పెట్టి చేస్తున్నారు. వేలమందికి విందులు చేస్తున్నారు. కల్యాణ మండపాల అలంకరణలకు, దీపాల అమరికకు, చాలా డబ్బు ఖర్చు చేస్తున్నారు. కట్నాలు, . బహుమతులు పెరిగిపోయాయి. వధూవరులను వెతకడం, జాతకాలు చూపించడం వంటి వాటికి, ఖర్చులు పెరిగిపోయాయి.

  1. పెండ్లిళ్ళు దేవుని మందిరాలలో అలంకరణల ఖర్చు లేకుండా చేయాలి.
  2. ఎవరింట వారు భోజనాలు చేసి ముహూర్తానికి గుడికి వచ్చి పెళ్ళి పూర్తి చేయాలి. విందులు ఏర్పాటు చేయరాదు.
  3. కట్నాలూ, బహుమతులూ పూర్తిగా మానివేయాలి. ఊరేగింపులు మానుకోవాలి.
  4. విలాసాలకు ఖర్చు చేయరాదు. పెళ్ళికి మంగళసూత్రం, వధూవరులు ముఖ్యం అని గుర్తించాలి.
  5. రిజిష్టర్డు వివాహాలు చేసుకుంటే మరింత కలిసి వస్తుంది. వధూవరులూ వారి తల్లిదండ్రులూ రిజిస్ట్రార్ వద్దకు చేరి, అవసరమైన ఏర్పాట్లతో పెండ్లి తంతు ముగించాలి. పెళ్ళి పేర దుర్వ్యయం చేయకండి.

ఇట్లు,
మిత్ర సమాజం.

ప్రశ్న 22.
మీ పాఠశాలలో ప్రపంచ శాంతి అనే అంశంపై మండలస్థాయి వ్యాసరచన పోటీ, నిర్వహణకు, విద్యార్థులను ఆహ్వానిస్తూ – కరపత్రం తయారుచేయండి.
జవాబు:

ప్రపంచశాంతి మిత్రులారా !

“తన సొంతమె తనకు రక్ష’ అని సుమతీశతకకారుడు చెప్పాడు. ఇది వ్యక్తులకే కాదు దేశాలకు అంటే దేశ ప్రజలకు కూడా వర్తిస్తుంది.

మనది గాంధీ, బుద్ధుడు, జవహర్ లాల్ నెహ్రూ వంటి శాంతమూర్తులు పుట్టిన దేశం. ఎందరో మహర్షులు, ప్రవక్తలు పుట్టిన దేశం. వారి శాంత బోధలు తలకు ఎక్కించుకోండి.

ప్రపంచంలో ఇప్పటికే రెండు ప్రపంచ యుద్ధాలు జరిగాయి. ఇంకా దేశాల మధ్య ఎన్నో చిన్న చిన్న తగవులు జరిగాయి. యుద్ధాలవల్ల ఎంతో ధనవ్యయం, ప్రాణనష్టం జరుగుతుంది. యుద్ధాల్లో పాల్గొన్న దేశాలు అభివృద్ధి లేకుండా వెనుకబడతాయి.

కాబట్టి యుద్ధాలు వద్దు. శాంతి మనకు ముద్దు. ప్రపంచ పౌరులందరం సోదరులవలె మెలగుదాం. స్నేహం, ప్రేమ, కరుణ, వాత్సల్యం కలిగి ప్రజలందరం శాంతియుత జీవనం సాగిద్దాం. అందరం ప్రపంచ శాంతికై పాటుపడదాం.

ఇట్లు,
ప్రపంచ శాంతి మండలి.

AP SSC 10th Class Telugu కరపత్రాలు, ఇంటర్వ్యూలు

ప్రశ్న 23.
ఆదర్శ రైతు రామయ్యను అభినందిస్తూ అభినందన పత్రాన్ని తయారుచేయండి.
జవాబు:

అభినందన పత్రం

అభ్యుదయ రైతురాజు రామయ్య మహాశయా !
మీకు అభినందన మందారాలు. భారతదేశ సౌభాగ్యం పల్లెలపై ఆధారపడియుంది. పల్లెల్లో రైతులు పండించే పంటలపైనే మన వర్తక పరిశ్రమలు ఆధారపడియున్నాయి. మేం కడుపునిండా అన్నం తింటున్నామంటే అది మీ వంటి కర్షకోత్తముల హస్తవాసి అనే చెప్పాలి.

కర్షకోత్తమా !
మీరు మన ప్రభుత్వ వ్యవసాయశాఖ వారు సూచించిన సూచనలను అందిపుచ్చుకొని, మీ పొలాల్లో ఈ సంవత్సరం ఎకరానికి 60 బస్తాల ధాన్యం పండించారు. చేల గట్లపై కంది మొక్కలు పాతి 20 బస్తాల కందులు పండించారు. రసాయనిక ఎరువులు, పురుగుమందుల జోలికి పోకుండా, మీ తోటలో 10 గేదెలను పెంచి, పాడి పరిశ్రమను ప్రోత్సహిస్తూ, ఆ పశువుల పేడతో సేంద్రియ ఎరువుల్ని తయారు చేసి వాటినే ఉపయోగించి మంచి పంటలు పండించారు. మీ కృషికి ప్రభుత్వ పక్షాన అభినందనలు అందిస్తున్నాము.

రైతురత్న రామయ్య గారూ!
నమస్కారం. ప్రభుత్వం మీకు ‘రైతురత్న’ అనే బిరుదునిచ్చి సత్కరిస్తోంది. మీరే ఈ జిల్లాలో రైతులకు ఆదర్శం. మీరు వ్యవసాయంలో మరిన్ని నూతన పద్ధతులు పాటించి, మన జిల్లాలో, రాష్ట్రంలో రైతులకు ఆదర్శంగా నిలవాలని కోరుతున్నాము. ఈ సందర్భంగా మీకు మన ముఖ్యమంత్రిగారి తరపున రూ. 25,000లు బహుమతి ఇస్తున్నాము. మీకు మా శుభాకాంక్షలు. మా నమస్సులు.
అభినందనములు.

ఇట్లు,
జిల్లా వ్యవసాయాధికారి,
ఏలూరు,
ప|గో|| జిల్లా,

ప్రశ్న 24.
ప్రభుత్వ పాఠశాలల్లోని సౌకర్యాలను వివరిస్తూ కరపత్రాన్ని తయారుచేయండి.
జవాబు:
తల్లిదండ్రులారా !
మీరు మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించండి. ప్రభుత్వ పాఠశాలలో మీరు ఏ విధమైన ఫీజు కట్టనవసరం లేదు. పాఠ్యపుస్తకాలు ఉచితంగా ఇస్తారు. అక్కడ పాఠం చెప్పే ఉపాధ్యాయులు, మెరిట్ ప్రాతిపదికపై ఎన్నిక చేయబడినవారు. చక్కని అర్హతలు కలవారు. మధ్యాహ్నం మీ పిల్లలకు భోజన సదుపాయం ఉంటుంది. హాస్టలు సదుపాయం ఉంటుంది. హాస్టలులో మీ పిల్లలకు కావలసిన సదుపాయాలు ఉచితంగా సమకూరుస్తారు.

ప్రభుత్వ పాఠశాలలకు మంచి భవనాలు ఉంటాయి. ఆటలు ఆడుకొనే ఆటస్థలము, పరికరాలు ఉంటాయి. ఆటలు ఆడించే శిక్షణ పొందిన ఉపాధ్యాయులు ఉంటారు. ప్రభుత్వ పాఠశాలలు మంచి అనుభవజ్ఞులయిన ప్రధానోపాధ్యాయుల పర్యవేక్షణలో నడుస్తాయి. ప్రభుత్వము అక్కడి ఉపాధ్యాయులకు చక్కని జీతాలు ఇస్తోంది. అందువల్ల ప్రభుత్వం కల్పించే సదుపాయాలను చక్కగా వినియోగించుకొని మీ బాలబాలికలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించండి. అక్రమంగా ఫీజులు పిండే ప్రయివేటు కాన్వెంటులలో చేర్చకండి. ప్రభుత్వం ఇచ్చే ఉపకారవేతనాలను మీరు పొందండి. ప్రెయివేటు పాఠశాలల్లో పై సదుపాయాలు ఏమీ ఉండవు. దయతో మేల్కోండి.. జాగ్రత్త పడండి.
దివి. x x x x x

ఇట్లు,
ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయ సంఘం.

ప్రశ్న 25.
స్వచ్ఛభారత్ లో అందరూ పాల్గొనాలని ఒక కరపత్రం తయారుచేయండి.
జవాబు:

‘స్వచ్ఛభారత్’

‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అని మన పెద్దలు ఏనాడో మనకు ఉపదేశించారు. భారతదేశ స్వచ్చతయే, దేశ సౌభాగ్యానికి మొదటిమెట్టు. స్వచ్ఛమైన ప్రదేశంలోనే లక్ష్మీదేవి నిలుస్తుంది. నీ ఇల్లు శుభ్రంగా ఉంటే నీ ఇంట లక్ష్మి తాండవిస్తుంది. దేశమంతా స్వచ్ఛంగా ఉంటే, దేశంలో మహాలక్ష్మి వెల్లివిరుస్తుంది. అందుకే మన దేశాన్నీ నదులనూ, పరిశుభ్రంగా ఉంచుకుందాం. ఆరోగ్యంతో, ఐశ్వర్యంతో సుఖ సంపదలతో మనం వర్ధిల్లుదాం.

మన ప్రధాని నరేంద్రమోడీ గారు భారతదేశాన్ని స్వచ్ఛంగా, ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దాలని కంకణం కట్టుకున్నారు. నీ ఇంటితో పాటు, నీ పరిసరాలను, నీ గ్రామాన్ని, నగరాన్ని, దేశాన్ని నిర్మలంగా తీర్చిదిద్దుకోండని మనదేశ ప్రజలకు ఆయన పిలుపును ఇచ్చారు.

కేంద్రమంత్రులు, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు దేశాన్ని కాలుష్యరహితంగా తీర్చిదిద్దాలని ప్రయత్నిస్తున్నారు. అయితే ఇది కేవలము ప్రభుత్వం వల్ల కాదు. దేశంలోని 130 కోట్ల ప్రజానీకం ఇందుకు నడుం కట్టుకోవాలి. దీని కోసం . ప్రభుత్వం, ఎంతో ధన సహాయం చేస్తోంది. ఉపయోగించుకుందాం.

ముఖ్యంగా ప్రతి విద్యార్థి, విద్యార్థిని, యువకుడు, యువతి, స్వచ్ఛభారత్ కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొని, ఎక్కడా దేశంలో చెత్త లేకుండా అందంగా ఆరోగ్యవంతంగా మనదేశాన్ని తీర్చిదిద్దుకొందాం. కదలిరండి. నడుం బిగించండి. లేవండి. మనదేశం “స్వచ్ఛభారత్” అయ్యేదాకా, పట్టు విడువకండి. మరువకండి.
దివి. x x x x x

ఇట్లు,
పట్టణ విద్యార్థినీ, విద్యార్థుల సంఘం,
కర్నూలు.

ప్రశ్న 26.
‘ప్రసార మాధ్యమాలు (టి.వి., సినిమాలు) నేటి సమాజాన్ని పెడదారి పట్టిస్తున్నాయి’ అనే విషయం గూర్చి ఇద్దరు మిత్రుల మధ్య జరిగిన చర్చను సంభాషణ రూపంలో రాయండి.
జవాబు:
రవి : ఏరా ! ఈ రోజు సెలవు కదా ! ఏం చేద్దాం?
కృష్ణ : చక్కగా చదువుకుందాం ! ప్రాజెక్టువర్కులు పూర్తి చేద్దాం.
హరి : కాదురా ! ఈ రోజు సెలవు కదా ! మంచి సినిమాకు వెళ్లాం.
కృష్ణ : వద్దురా ! ఈనాటి సినిమాలు సమాజాన్ని పెడదోవ పట్టిస్తున్నాయి.
ప్రసాద్ : కనీసం టీ.వీ. నైనా చూద్దాం.
కృష్ణ : ఈనాడు టీ.వీలో వచ్చే కార్యక్రమాలు బాగుండటంలేదు.
రవి : ఎందుకలా చెప్తున్నావు? సమాజాన్ని ఎలా చెడగొడుతున్నాయి?
కృష్ణ : ఈనాడు టీ.వీ.లు గాని, సినిమాలు గాని జనానికి ఉపయోగకరంగా లేవు. టీవీల్లో ప్రసారమయ్యే కార్యక్రమాలు ఉపదేశాత్మకంగా లేవు.
ప్రసాద్ : మరి సినిమాల సంగతేమిటి?
కృష్ణ : ఈనాడు సినిమాలు కూడా హింసను, అకృత్యాలను చూపిస్తున్నాయి.
రవి : నీవు చెప్పింది నిజమేరా ! నీవు చెప్పినట్లుగానే చక్కగా చదువుకుందాం.
ప్రసాద్ : మనం సమాజానికి ఆదర్శంగా ఉండాలి కదా ! సరే మనకు సినిమాలు వద్దు, టీ.వీ.లు వద్దు. చదువే ముద్దు.

AP SSC 10th Class Telugu కరపత్రాలు, ఇంటర్వ్యూలు

ప్రశ్న 27.
మీ చుట్టూ ఉండే పరిసరాలను వర్ణిస్తూ పది పంక్తులు మించకుండా ఒక కవిత రాయండి.
జవాబు:
మా చుట్టూ ఉండే పరిసరాలు
మా పల్లెవాసులకు ఆనంద నిలయాలు
ఎటు చూసినా ఏపుగా పెరిగిన పచ్చని చెట్లు
చెట్లపై పక్షుల కిలకిలారావాలు
కొండ కోనల్లో
నవ్వుతూ, తుళ్ళుతూ
పరుగెడుతున్న సెలయేటి గలగలలు
చెఱువులలో విరబూసిన అరవిందాలు
తలలాడిస్తూ ఆహ్వానించే పచ్చని పైరులు
జోరుజోరుగా వినిపించే
పశుకాపర్ల జానపద గీతాలు
ప్రకృతి శోభతో కళకళలాడుతుంది మా పరిసరం.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 8 సముద్ర‌లంఘ‌నం

AP State Board Syllabus AP SSC 10th Class Telugu Important Questions Chapter 8 సముద్ర‌లంఘ‌నం

AP State Syllabus SSC 10th Class Telugu Important Questions 8th Lesson సముద్ర‌లంఘ‌నం

10th Class Telugu 8th Lesson సముద్ర‌లంఘ‌నం 2 Marks Important Questions and Answers

ఈ క్రింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాల్లో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
సముద్రలంఘనం పాఠం నేపథ్యం రాయండి. (S.A. I – 2019-20)
జవాబు:
సీతను వెతుకుతూ రామలక్ష్మణులు కిష్కింధకు చేరుకుంటారు. రామలక్ష్మణులు, సుగ్రీవునితో స్నేహం చేస్తారు. సుగ్రీవుడు సీతను వెతకటానికి వానర సైన్యాన్ని నాలుగు దిశలకు పంపిస్తాడు. అంగదుని నాయకత్వంలో ఆంజనేయుని బృందం, దక్షిణ దిక్కుకు వెళ్తుంది. జాంబవంతుని ప్రోత్సాహంతో ఆంజనేయుడు మహేంద్రగిరి నుంచి సముద్ర లంఘనానికి సిద్ధమౌతాడు.

ప్రశ్న 2.
హనుమంతుడు సముద్రలంఘనానికి ముందు చేసిన చేష్టలను గురించి రాయండి. (June 2018)
జవాబు:

  1. సముద్ర లంఘనానికి ముందు హనుమంతుడు పెద్ద పెద్దగా అంగలు వేస్తూ బలంగా నడవడం, తోకను వేగంగా తిప్పడం, చేతిని జబ్బపై చరచడం, సింహనాదం చేయడం వంటి పనులను చేశాడు.
  2. ఈ పనులు అతని ఆత్మవిశ్వాసాన్ని, సమస్త శక్తులను కూడగట్టుకోవడాన్ని సూచిస్తున్నాయి.
  3. ఏ పనినైనా చేయడానికి పూనుకొనే ముందు శక్తులన్నింటినీ సమీకరించడం వీరులు చేసే ముఖ్యమైన పని.
  4. మహావీరుడైన రూనుమంతుడు కూడా తనలో అంతర్గతంగా ఉన్న శక్తులను బయటకు రప్పించడానికే అలా చేశాడని నేను భావిస్తున్నాను.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 8 సముద్ర‌లంఘ‌నం

ప్రశ్న 3.
అయ్యలరాజు రామభద్రుని గురించి రాయండి.
జవాబు:
‘సముద్రలంఘనం’ పాఠ్యభాగ రచయిత అయ్యలరాజు రామభద్రుడు. ఈయన 16వ శతాబ్దానికి చెందినవాడు శ్రీకృష్ణదేవరాయల అష్టదిగ్గజ కవులలో ఇతడు ప్రసిద్ధుడు. వీరి రచనల్లో రామాభ్యుదయం, సకల కథాసార సంగ్రహం వంటి రచనలు రచించాడు. రామాభ్యుదయంలో ఎనిమిది ఆశ్వాసాలు ఉంటాయి. ఉత్తరకాండను వదలివేశారు. వీరికి ‘చతురసాహిత్య లక్షణ చక్రవర్తి’, ‘ప్రతివాది మదగజ పంచానన’ అనే బిరుదులు ఉన్నాయి. వీరి శైలి కవితాసామర్థ్యంతో కూడి యుంటుంది. వీరి వర్ణన సహజ ధోరణిలో సాగుతుంది.

ప్రశ్న 4.
హనుమంతుని స్వభావాన్ని వివరించండి.
జవాబు:
హనుమంతుడు, సుగ్రీవునకు, మంత్రి, ఇతడు మహాబలశాలి. స్వామిభక్తి పరాయణుడు, శ్రీరామ భక్తుడు. సుగ్రీవునికి నమ్మిన బంటు. రామలక్ష్మణులకు, ఇతడే సుగ్రీవునితో స్నేహం కల్పించాడు. శ్రీరాముని సహాయంతో సుగ్రీవుడిని వానర రాజ్యాధిపతిని చేశాడు. సీతాన్వేషణలో హనుమంతుడు ప్రముఖ పాత్ర వహించాడు. నూరుయోజనాల సముద్రాన్ని దాటి వెళ్ళి పట్టుదలతో సీతాదేవి జాడను కనిపెట్టి, సీతమ్మకు రాముని ఉంగరాన్ని ఇచ్చి, ఆమెకు ధైర్యం చెప్పాడు. సీతమ్మ తనకు ఇచ్చిన చూడామణిని, శ్రీరామునకు తెచ్చి ఇచ్చి, సీత వృత్తాంతాన్ని రామునకు తెలియచెప్పాడు. ఇతడు ఒంటరిగా లంకకు వెళ్ళి, రాక్షస సైన్యాన్ని చంపి, లంకను దహనం చేసి, రావణునికి, రాముని సందేశం అందించిన రామదూత. ఇతడు రామరావణ యుద్ధంలో వీరోచితంగా పోరాడాడు. సంజీవిని తెచ్చి లక్ష్మణుని బ్రతికించాడు. ఆంజనేయుడు మహావీరుడు.

ప్రశ్న 5.
మీకు నచ్చిన ఒక సందర్భాన్ని వివరించండి.
జవాబు:
నేను, నా మిత్రులతో కలిసి విహారయాత్రకై మహానంది బయలుదేరాను. ఈ యాత్ర నాకు మధురానుభూతిని మిగిల్చింది. ముఖ్యంగా ఈ క్షేత్రం నల్లమల అడువుల్లో ఉంటుంది. గిద్దలూరు దగ్గరి నుండి నంద్యాల వరకు రైలు ప్రయాణం అరణ్యం గుండా జరిగింది. వంపుసొంపుల మార్గాలు, ఇరువైపులా ఆకాశాన్ని తాకుతున్న పర్వత శిఖరాలు, వాటిపై పొడవైన చెట్లు, ఆ చెట్టుకున్న ‘పూలు చూడముచ్చటగా ఉన్నాయి. మధ్యలో పొడవైన రెండు పెద్ద గుహలు. ఆ గుహల్లోకి రైలు వెళ్ళగానే అంతా దట్టమైన చీకటి. ఏమీ కనిపించదు. ఇది చూచి అనుభవించి తీరవలసిందే. ఎతైన కొండల నుండి కిందికి జాలువారే సెలయేళ్ళు, అక్కడక్కడా గిరిజనుల నివాసాలు సుమనోహరంగా ఉన్నాయి. ప్రకృతి అందాలకు నల్లమల పుట్టినిల్లు. భూదేవికి పచ్చని చీర కట్టినట్లుగా ఉంటుంది. పక్షుల కిలకిలారావాలు, కోయల విన్యాసాలు చూడముచ్చటగా ఉంటాయి.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 8 సముద్ర‌లంఘ‌నం

ప్రశ్న 6.
సముద్రలంఘనానికి ముందు హనుమంతుని ప్రవర్తనను బట్టి నీవేమి గ్రహించావు?
జవాబు:
సముద్రలంఘనానికి ముందు హనుమంతుడు గట్టిగా ఒత్తి అడుగులు వేసి, రాళ్ళను పగులకొట్టి, చెట్లను కూలగొట్టి, క్రూర జంతువులను సైతం పారిపోయేలా చేసి, గుహలు ప్రతిధ్వనించేలా సింహనాదం చేశాడు. ఆతని పాదాల ఒత్తిడికి పర్వత శిఖరాలు కంపించిపోయాయి.

హనుమంతుడు తన శక్తిని మిగిలిన వానరులకు, ఈ విధంగా చూపించాడు. తాను సీత జాడను తెలిసికొని రాగలనని తనవారికి ఆ విధంగా ధైర్యం కల్పించాడు. తాను మహాశక్తిమంతుడననీ, కొండల్ని పిండి చేయగలననీ నిరూపించాడు. తాను వాయుదేవుని అనుగ్రహం కలవాడినని, మిగిలిన వానరులకు తెలియపరచి, వారికి ధైర్యం కల్పించాడు. హనుమంతుడు తాను తప్పక సీత జాడను తెలిసికొని రాగలనని, ముందుగానే తన తోడి వానరులకు ఈ విధంగా భరోసా ఇచ్చాడు. అందుకే హనుమంతుడు ఆ చేష్టలు చేశాడు.

ప్రశ్న 7.
హనుమంతుడు ఆకాశంలోకి ఎగిరినపుడు సమీపంలోని వారికి ఎలా కనిపించాడు? ఎందుకో వివరించండి.
జవాబు:
హనుమంతుడు మహేందగిరిపై కాళ్ళు వేసి, దానిని క్రిందికి అణగదొక్కి ఆకాశంలోకి ఎగిరాడు. అప్పుడు హనుమంతుడు ఆకాశంలో ఎగురుతున్నట్లు కాకుండా ఒక పర్వతము ఆకాశంలో ఎగురుతున్నట్లు సమీపం నుండి చూసే వారికి కనబడింది.

కారణము : హనుమంతుడు సూరుయోజనాల సముద్రాన్ని దాటడానికి తన రూపాన్ని బాగా పర్వతం అంత ఆకారంలో పెంచి వేశాడు. అందుకే హనుమంతుడు అప్పుడు చూసేవారికి పర్వతం అంత పరిమాణంలో కనిపించాడు. అందుకే ఆకాశంలో పర్వతం ఎగురుతున్నట్లు దగ్గర నుండి చూసేవారికి కనిపించింది.

10th Class Telugu 8th Lesson సముద్ర‌లంఘ‌నం 4 Marks Important Questions and Answers

ఈ క్రింది ప్రశ్నలకు 10 లేక 12 వాక్యాల్లో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
సముద్రాన్ని దాటడానికి ప్రయత్నించిన హనుమంతుడిని కవి వర్ణించాడు కదా ! అయితే నీవు చూచిన ఒక అద్భుత ప్రకృతి దృశ్యాన్ని నీ సొంతమాటల్లో రాయండి.
జవాబు:
పవిత్రమైన భారతదేశంలో చూడదగిన ముఖ్యప్రదేశం కాశ్మీర్ ప్రాంతం. ఇక్కడి వాతావరణం సుమనోహరం. ప్రకృతి దృశ్యాలు నయనానందాన్ని కల్గిస్తాయి. ఒక్కమాటలో, చెప్పాలంటే కాశ్మీర్ ఒక భూతల స్వర్గం.

ఇక్కడ ఎటు చూసినా సమున్నత పర్వత శ్రేణి, వృక్షసంపద, సెలయేటి ధారలు యాత్రకులకు అలౌకికమైన అనందాన్ని కలిగిస్తాయి. పచ్చని పంటల శోభ, వాటి మధ్య ప్రవహించే కొండవాగుల అందం అన్నీ కలగలిపి భూదేవి హృదయాన ధరించిన ముత్యాలహారంలోని పచ్చలపతకంలా కాశ్మీరు లోయ ప్రకాశిస్తుంది.

పిర్ పంజల్ పర్వత శ్రేణిలో ‘బనిహాల్’కనుమ ఉంది. దాని చుట్టూ ఎత్తైన కొండలు. అక్కడ కొండల అంచుల్ని మంచు ముసుగు కప్పేస్తుంది. ఆ కొండల చివళ్ళనున్న మంచు పెళ్ళలుగా గట్టిగా పాలరాతి ముక్కల్లా మెరుస్తోంది. నల్లగా నిగనిగలాడే కొండ శరీరంపై అంచున తెల్లని పాలరాతి ముక్కలు ‘ఎమ్ బాస్’ చేసినట్లుగా ఉంది. అక్కడ కొండవాలుల్లో అన్నీ వరిపైర్లు, కొండవాగులోని నీరే ఆ పంటలకు ఆధారం. పచ్చని పైర్ల శోభ, వాటి మధ్య కొండవాగుల అందం అన్నీ కలగలిపి, భూదేవి హృదయాన ధరించిన ముత్యాలహారంలోని పచ్చల పతకంలా కాశ్మీరలోయ ప్రకాశిస్తోంది. అది అంత అందమైన లోయ కాబట్టే ప్రభుత్వం వారు కూడా అక్కడ ‘స్టాప్ అండ్ సీ బ్యూటిఫుల్ బనిహాల్’ (ఆగి బనిహాల్ సౌందర్యాన్ని దర్శించండి) అనే బోర్డు పెట్టి యాత్రికుల మనస్సులను సైతం అటువైపుకు తిప్పే ప్రయత్నం చేశారు.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 8 సముద్ర‌లంఘ‌నం

ప్రశ్న 2.
ప్రాచీన కావ్యాలకు సంబంధించిన వర్ణనాత్మక పాఠ్యాంశాలను చదవడం వల్ల కలిగే ప్రయోజనాలను రాయండి.
జవాబు:
సనాతనమైన భారతీయ సంస్కృతిలో సాహిత్య సంపదకు సమాన్నతమైన స్థానం ఉంది. మన సంస్కృతిలో కావ్య సంపద ఉన్నతమైంది. మన తెలుగు సాహిత్యంలో ఎన్నో వర్ణనాత్మక కావ్యాలు ఉన్నాయి. వాటికి సంబంధించిన పాఠ్యాంశాలు కూడా చెప్పుకోదగ్గ రీతిలో ఉన్నాయి. వర్ణనాత్మక పాఠ్యాంశాలను చదవడం వల్ల విద్యార్థులకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. వాటిలో కొన్ని.

  • మన ఇతిహాసాలకు సంబంధించిన కళాత్మక రూపాలను, సుందర ప్రదేశాల విశిష్ఠతను తెలుసుకొనవచ్చు.
  • వర్ణనల్లో ఉండే అందాలను, అనుభూతులను గ్రహించవచ్చు.
  • మనం చూడలేని ప్రకృతి దృశ్యాల అందాలను విద్యార్థులు తెలుసుకోవచ్చు.
  • వర్ణనల్లో ఉండే అలంకార మధురిమలను తెలుసుకోవచ్చు.
  • శైలి భేదాలను, రసాత్మకతను గ్రహింపవచ్చు.
  • ప్రాచీన కవుల అలంకారప్రయోగాలను, నుడికారాలను, యాసలను, సామెతలను తెలుసుకోవచ్చు.

ఈ రకంగా ప్రాచీన వర్ణనాత్మక పాఠంను చదవడం వల్ల మనకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. తరతరాల వారసత్వాన్ని తెలుసుకొని భావితరాలకు అందించవచ్చు.

ప్రశ్న 3.
హనుమంతుడు సముద్రలంఘనం చేసేటప్పటి పరిస్థితిని బట్టి అతని బలాన్ని ఊహించి రాయండి.
జవాబు:
సముద్రాన్ని దాటడానికి సిద్ధమైన హనుమంతుడు, మహేంద్ర పర్వతంపై అడుగులు నొక్కిపెట్టి వేసినపుడు, పిడుగులు పడ్డట్లుగా అక్కడ పెద్ద పెద్ద రాళ్ళు పగిలి పడిపోయాయి. దీనిని బట్టి హనుమంతుడు గొప్ప బరువు కలవాడని తెలుస్తోంది. హనుమంతుడు వేగంగా తోకను తిప్పినప్పుడు, ఆ వేగానికి పెద్ద పెద్ద అడవులు సైతం ఖాళీ ప్రదేశాలు అయ్యాయి. చెట్లు అన్నీ కూలిపోయాయి. దీనినిబట్టి హనుమంతుడు వాయుదేవుని మించిన వేగం గలవాడని తెలుస్తోంది.

హనుమంతుడు చేతితో చరిస్తే, కఱ్ఱతో కొట్టినట్లు ఏనుగులు, సింహాలు సైతం బెదరి పారిపోయాయి. దీనినిబట్టి హనుమంతుడి చేతిలో గొప్పబలం, శక్తి ఉందని తెలిసింది. హనుమంతుడు సింహనాదం చేస్తే, ఆ ధ్వనికి గుహలు సైతం ప్రతిధ్వనించాయి. దీనినిబట్టి హనుమంతుని సింహనాదం, కర్ణకఠోరంగా భయంకరంగా ఉంటుందని తెలిసింది.

హనుమంతుడు నడుస్తూంటే, కొండలు కంపించిపోయాయి. ఆ కంపనాలకు కొండలపై ఉన్న సెలయేటి కెరటాలు ఆకాశాన్ని అంటేటట్లు ఎగసిపడ్డాయి. దీనినిబట్టి హనుమంతుడు మహాబలవంతుడని అపారశక్తి సామర్థ్యాలు కలవాడని మనకు తెలుస్తోంది.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 8 సముద్ర‌లంఘ‌నం

ప్రశ్న 4.
అందరు వానర వీరుల్లో హనుమయే సముద్రలంఘనానికి సమర్థుడని ఎలా గుర్తించారు?
జవాబు:
ఈ ప్రశ్నకు జవాబు, మన పాఠంలో లేదు. అయినా రామాయణాన్ని బట్టి, దీనికి సమాధానం ఇలా ఉంటుంది.

సీతను అపహరించిన రావణుని గూర్చి, లంకా నగరాన్ని గూర్చి సంపాతి, వానరులకు చెప్పింది. దానితో వానరులు సముద్రాన్ని దాటడంలో వారి వారి శక్తి సామర్థ్యాలను గూర్చి చెప్పారు.

వానరులలో కొందరు తాము 50 యోజనాల దూరం’ దాటగలం అన్నారు. జాంబవంతుడు తాను 90 యోజనాల దూరం దాటగలనన్నాడు. యువరాజైన అంగదుడు తాను సూరుయోజనాల సముద్రాన్ని దాటగలను గాని, తిరిగి రాలేనేమో అన్నాడు.

అప్పుడు జాంబవంతుడు అంగదుడు యువరాజు కాబట్టి అతడు లంకకు వెళ్ళడం తగదని చెప్పాడు. జాంబవంతుడు హనుమంతుని దగ్గరకు వెళ్ళి, అతడు వాయుపుత్రుడని సముద్రాన్ని దాటగలడని చెప్పాడు. హనుమంతుడు చిన్నప్పుడే సూర్యుడిని చూసి పండు అనుకొని నూరు యోజనాలు ఎగిరాడని అతనికి గుర్తు చేశాడు. బ్రహ్మవరం వల్ల హనుమంతుడిని వజ్రం కూడా ఏమి చేయలేదన్నాడు.

దానితో హనుమంతుడు తన శక్తిని వెల్లడించాడు. వేలకొద్దీ యోజనాల దూరం తాను దాటగలనని ప్రకటించాడు. అందువల్ల హనుమయే సముద్రలంఘనానికి సమర్థుడని వానర వీరులు గుర్తించారు. హనుమంతుడిని మెచ్చుకొని సీతాన్వేషణకు అతడినే పంపారు.

ప్రశ్న 5.
మీ పాఠం ఆధారంగా హనుమంతుడి సమర్థతను వివరించండి.
జవాబు:
హనుమంతుడి సమర్దత :
హనుమంతుడు సముద్రం పైకి ఎగిరేటప్పుడు మహేంద్ర పర్వతం పై పాదాలు నొక్కివేస్తే పిడుగులు పడినట్లుగా పెద్దరాళ్ళు పగిలిపోయాయి. హనుమ తోకను త్రిప్పిన గాలివేగానికి అడవులు అన్నీ కూలి శూన్య ప్రదేశాలు ఏర్పడ్డాయి. హనుమ చేతితో చరిస్తే కల్టుతో కొట్టినట్లు ఏనుగులు, సింహాలు పారిపోయాయి. హనుమ సింహనాదం చేస్తే పోటీపడ్డట్లు గుహలు ప్రతిధ్వనించాయి. కొండలు కంపించాయి. ఆ కంపనాలకు కొండలపై సెలయేళ్ళు ఆకాశానికి ఎగసిపడ్డాయి.

హనుమంతుడు శరీరాన్ని ధరించిన వాయుదేవుడు వలె ఉన్నాడు. హనుమ తన శరీరాన్ని పెంచితే, పర్వత శిఖరాలు కదలిపోయాయి.

హనుమంతుడు మహేంద్రగిరిని అణగదొక్కి, ఆకాశంపైకి ఎగిరినప్పుడు పర్వతము ఎగిరినట్లు కనబడింది. దానిని బట్టి హనుమ, పర్వతం అంత ఆకారంలో ఉన్నాడని తెలుస్తుంది.

హనుమంతుడి కాలిపిక్కల నుండి పుట్టిన గాలివేగానికి సముద్రం లోతుగా చీలిపోయింది. హనుమంతుడి కాలిపిక్కల నుండి వచ్చే గాలి వేగానికి సముద్రము మధ్య చీలినట్లు కనబడింది.

ఆ విధంగా చీలిన సముద్రాన్ని చూసినవారికి, రాముడి క్రోధరసము లంకకు చేరడానికి కాలువ త్రవ్వారేమో అనిపించింది. రాబోయే కాలంలో కట్టబోయే సేతువుకు పునాది త్రవ్వారేమో అనిపించింది. హనుమంతుడిని చూడ్డానికి పాతాళంలోని ఆదిశేషువు వచ్చి తలుపులు తెరిచాడేమో అన్నట్లు కనబడింది. హనుమంతుడు భూదేవికి కీర్తి వస్త్రాలను అర్పించి, ఆమె ధరించిన నల్లని వస్త్రాలను చీల్చివేసినట్లు కనబడింది. హనుమంతుడు మహా సమర్థుడు.

ప్రశ్న 6.
సముద్రలంఘనానికి ముందు హనుమంతుని చేష్టలు సమర్థనీయమా? చర్చించండి.
జవాబు:
సముద్రమును దాటడానికి ముందు హనుమంతుడు మహేంద్రగిరిపై గట్టిగా ఒత్తి అడుగులు వేసి కొండ రాళ్ళను పగుల గొట్టాడు. తన తోకను త్రిప్పి ఆ గాలివేగంతో చెట్లను కూలగొట్టాడు. క్రూర జంతువులను సైతం బెదిరించి పారిపోయేటట్లు చేశాడు. గుహలు ప్రతిధ్వనించేలా సింహనాదం చేశాడు. పర్వత శిఖరాలు కంపించిపోయేలా చేసి, సెలయేరులోని నీళ్ళు ఆకాశానికి తగిలేలా చేశాడు.

ఈ పనుల వల్ల హనుమంతుడు తన శక్తిని, బలాన్ని మిగిలిన వానరులకు చూపించాడు. సముద్రమును దాటడం ఎలాగా అని, ఆందోళన పడుతున్న తనతోడి వానరులకూ, యువరాజు అంగదుడికీ, ధైర్యం చేకూర్చాడు. తాను సముద్రాన్ని దాటివెళ్ళి సీత జాడను తెలిసికొని రాగలనని, తనవారికి ధైర్యం కల్పించాడు. తాను మహాశక్తివంతుడననీ, కొండలను పిండి చేయగలనని నిరూపించాడు.

తాను వాయుదేవుని అనుగ్రహంతో ఎంతటి సాహసకార్యం అయినా చేయగలనని తనవారికి భరోసా కల్పించాడు. హనుమంతుడు మహాశక్తివంతుడని, బలవంతుడని ఈ చర్యల ద్వారా మిగిలిన వానరులకు అర్థమయ్యింది. వారి ఆరాటం శాంతించింది. కాబట్టి సముద్రమును దాటే ముందు హనుమంతుడు చేసిన చేష్టలు, సమంజసంగానే ఉన్నాయి.

ప్రశ్న 7.
మీ పాఠం ఆధారంగా హనుమంతుని స్వభావాన్ని విశ్లేషించండి.
జవాబు:
హనుమంతుడు మహాబలవంతుడు. ధైర్యశాలి. సాహసం కలవాడు. దృఢమైన దీక్ష కలవాడు. కార్యసాధకుడు. అందువల్లనే సముద్రలంఘనానికి తాను సిద్ధపడ్డాడు.

హనుమంతుడి శక్తి బలములు :
హనుమంతుడి బలము, శక్తి, ధైర్యము అసమానములైనవి. .సముద్రం దాటడానికి అతడు పర్వతంపై ఒత్తి అడుగులు వేస్తే కొండరాళ్ళన్నీ, పగిలిపోయాయి. అతడు తోకను త్రిప్పిన గాలి వేగానికి చెట్లన్నీ కూలిపోయాయి. అతడు చేతితో చరిస్తే క్రూర జంతువులు సైతం పారిపోయాయి. అతడు సింహనాదం చేస్తే, గుహలు ప్రతిధ్వనించాయి. హనుమంతుడి పాదాల ఒత్తిడికి పర్వతాలు కంపించి, ఏరులలోని జలాలు ఆకాశానికి ఎగసిపడ్డాయి.

పర్వతం అంత ఆకారము:
హనుమంతుడు తన శరీరాన్ని పెంచితే సాక్షాత్తు అతని తండ్రి వాయుదేవుడిలా కనిపించాడు. అతడు ఎగురుతూ ఉంటే, పర్వతం ఎగిరినట్లు కనిపించింది.

సోదర వానరులకు ధైర్యం :
హనుమంతుడు సముద్రంపై ఎగిరే ముందు, తన శక్తి సామర్థ్యాలను తోడి వానరులకు చూపించి తప్పక తాను సీత జాడ తెలిసేని రాగలనని వారికి ధైర్యం కల్పించాడు. హనుమంతుడు మహేంద్ర గిరిపై పాదాలు తొక్కిపెట్టి, పైకి లేవగా ఆ పర్వతమే భూమిలోకి దిగిపోయింది.

కాలిపిక్కల వేగం :
హనుమంతుడు ఎగిరేటప్పుడు అతడి కాలిపిక్కల నుండి వచ్చిన గాలి వేగానికి, సముద్రము చీలిపోయింది. అది రాముడి క్రోధరసం లంకకు చేరడానికి తవ్విన కాలువలా, సేతువు కట్టడానికి తవ్విన పునాదిలా, బలి చక్రవర్తి ఇంటి వాకిలిలా కన్పించింది.

దీనినిబట్టి హనుమంతుడు మహాబలవంతుడని, ధైర్యం కలవాడని, గొప్ప సాహసవంతుడని, కార్యసాధకుడని తెలుస్తోంది.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 8 సముద్ర‌లంఘ‌నం

ప్రశ్న 8.
సముద్రలంఘనం పాఠంలో కవి చాతుర్యాన్ని విశ్లేషించండి.
జవాబు:
సముద్రలంఘనం పాఠం అయ్యలరాజు రామభద్రుడు రచించిన ‘రామాభ్యుదయం’ ప్రబంధములోనిది. ఈ కవి గొప్ప – కవితాచాతుర్యం కలవాడు. గొప్ప భావకుడు, మంచి కవితాశక్తి కలవాడు. ఆలంకారిక సిద్ధహస్తుడు.

ఈ పద్యాలలో స్వభావోక్తి, ఉత్ప్రేక్షాలంకారాలు చక్కగా ఉన్నాయి. హనుమంతుడు ఎగరడానికి ముందు చేసిన చేష్టల వర్ణన, చక్కని స్వభావోక్తిలో ఉంది. హనుమంతుడి అడుగులకు కంపించి ఎగిరిన సెలయేళ్ళ జలాలు, ఆకాశం ఎత్తు ఎగిరి దావాగ్నులను, వానరుల మనస్సులలోని తాపాన్ని చల్లార్చాయని కవి చక్కగా చెప్పాడు.

హనుమంతుడు ఎగిరినప్పుడు వచ్చిన పిక్కలగాలికి సముద్రం రెండుగా లోతుగా చీలి పోయిందట. అప్పుడు అది ఆ రాముని క్రోధరసాన్ని లంకకు చేరడానికి తవ్విన కాలువలా, సేతు నిర్మాణానికి తవ్విన పునాదిలా, హనుమంతుడిని చూడ్డానికి శేషుడు వచ్చి తలుపు తెరిచిన బలిమందిరంలా ఉందని, అద్భుతమైన ఉత్ర్ఫేక్షలు ఇక్కడ కవి ప్రయోగించాడు.

రామభద్రకవి ఊహాశక్తికి జోహార్లు అర్పిద్దాం.

10th Class Telugu 8th Lesson సముద్ర‌లంఘ‌నం Important Questions and Answers

ప్రశ్న 1.
హనుమంతుడు సముద్రలంఘనం చేసేటప్పుడు ప్రకృతి ఎలా సహకరించింది?
జవాబు:
హనుమంతుడు సముద్రలంఘనం చేసేటప్పుడు ప్రకృతి అనేక విధాలుగా సహకరించింది. రామ కార్యానికి వెళ్తున్న హనుమంతుడికి సూర్యుడు తాపాన్ని కలిగించలేదు. వాయువు చల్లగా ప్రసరించాడు. దేవతలు, గంధర్వులు, మహర్షులు కీర్తించారు. హనుమంతునికి శ్రమ కలుగకూడదని సముద్రుడు భావించాడు. సముద్రుని ఆజ్ఞపై మైనాకుడు సముద్రం నుండి బయటికి వచ్చి హనుమంతుడ్ని కొంతసేపు తన బంగారు శిఖరాల మీద విశ్రాంతి తీసుకోమన్నాడు.

ప్రశ్న 2.
సముద్రలంఘనం పాఠం కథ రూపంలో రాయండి.
జవాబు:
హనుమంతుడు మహాబలవంతుడు. అతడు సముద్రాన్ని దాటేముందు శరీరాన్ని పెంచి మహేంద్రగిరిపై అడుగులు వేశాడు. అప్పుడు పిడుగులు పడ్డట్లు రాళ్ళు పగిలిపోయాయి. హనుమంతుడు తోకను త్రిప్పినప్పుడు వచ్చిన గాలి వేగానికి చెట్లు కూలిపోయాయి. అతడు చేతితో చరిస్తే భయపడి క్రూర జంతువులు పారిపోయాయి. అతడు చేసిన సింహనాదానికి గుహలు ప్రతిధ్వనించాయి. కొండలు కంపించాయి. కొండలపై సెలయేళ్ళ కెరటాలు ఎగసిపడి ఆకాశాన్ని తాకాయి. హనుమంతుడు పెరిగి మహేంద గిరిపై నిలిచాడు.

హనుమంతుడు సముద్రం వైపు చూసి, తన రెండు చెవులు రిక్కించి, వంగి, చేతులను నడుముకు ఆనించి, తోకను ఆకాశం మీదికి పెంచి, పాదాలు దగ్గరగా పెట్టి, గాలి గట్టిగా పీల్చి, తాను నిలబడ్డ కొండను అణగదొక్కి పైకి ఎగిరాడు.

హనుమంతుడు ఎగురుతూ ఉంటే, పర్వతము ఎగిరినట్లు అనిపించింది. హనుమంతుడు విల్లు నుండి విడిచిన బాణంలా పెద్ద ధ్వనితో లంకవైపు దూసుకుపోయాడు.

హనుమంతుడు తోకతో ఎగరడం చూసిన దేవతలు, సూర్యుడు మహా వేగంగా కాడి ఉన్న తన రథాన్ని అటువైపు తోలుకు వస్తున్నాడేమో అనుకొన్నారు. హనుమంతుని పిక్కల నుండి వచ్చిన గాలి వేగానికి, సముద్రం లోతుగా చీలింది. ఆ గాలి పాతాళంలో ఉన్న పాములకు, ఆహారం వచ్చిందేమో అనిపించింది.

హనుమంతుడి పిక్కల బలంతో వీచిన గాలి వేగానికి సముద్రం చీలినట్లు కాగా, రాముని క్రోధరసం లంకకు చేరడానికి తవ్విన కాలువలా, రాబోయే కాలంలో కట్టే సేతువుకు పునాదిలా, ఆదిశేషుడు తలుపులు తెరిచిన బలిమందిరం యొక్క వాకిలిలా కనిపించింది. హనుమ, త్రికూటాద్రి పై దిగాడు.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 8 సముద్ర‌లంఘ‌నం

ప్రశ్న 3.
‘సామాన్యులు కూడా అద్భుతాలు సాధించగలరు’ అనే అంశం దృష్టిలో పెట్టుకొని సామాన్య విద్యార్థులను ప్రోత్సహిస్తూ కరపత్రం తయారు చెయ్యండి.
జవాబు:

(కరపత్రం )

విద్యార్థినీ, విద్యార్థులారా ! ఒక్కసారి ఆలోచించండి. మనం మన దృష్టిని చదువు పైనే కేంద్రీకరిద్దాం. కొద్దిగా పరీక్షల్లో మార్కులు తక్కువ వచ్చాయని మనం నిరుత్సాహపడకూడదు. మనం ప్రభుత్వ స్కూళ్ళలో చదువుతున్నాం, కాన్వెంట్లకు వెళ్ళలేక పోతున్నాం అని బాధపడకండి.

కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు. కృషి చేస్తే సామాన్యులు సైతం, ఎంతో ఎత్తుకు ఎదుగుతారు. మొన్న ఐ.ఎ.యస్ పరీక్ష ఫలితాలు గమనించండి. ఒక కూలి వాని బిడ్డ, ఒక ఫ్యాక్టరీ గుమస్తా కుమార్తె, ఒక మత్స్యకారుని కుమారుడు, ఒక దర్జీ కొడుకులు, కూతుళ్ళు ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియంలో చదివి ఐ.ఎ.యస్ పరీక్షలలో మంచి ర్యాంకులు సాధించారు. సామాన్య విద్యార్థులు సైతం ఐ.ఐ.టీలలో సీట్లు సాధించి, లక్షలు, కోట్ల జీతాలపై నేడు ఉద్యోగాలు చేస్తున్నారు.

కొందరు స్వయంకృషితో మంచి వ్యాపారవేత్తలుగా, మంచి ప్రతిభావంతులైన ఉద్యోగులుగా, రాజకీయనాయకులుగా తయారవుతున్నారు. టీలు అమ్మిన మన మోదీ గారు నేడు మన ప్రధాని అయ్యారు. విదేశాలలో మంచి ప్రధానమంత్రిగా ఆయన రాణిస్తున్నాడు. ఎందరో చిన్న చిన్న పనివారల పిల్లలు, పెద్ద జీతాలు సాధిస్తున్నారు. MP లుగా, MLA లుగా పేరు సంపాదిస్తున్నారు.

అందుకే నేను సామాన్యుడనని మీరు అనుకోకండి. కృషి చేయండి. పట్టుదల పట్టండి. గొప్పవారు కావాలనే కలలు కనండని మన మాజీ రాష్ట్రపతి కలామ్ మనకు చెప్పిన మాటలు మరచి పోకండి. చిన్న చిల్లర కొట్టు యజమాని కొడుకు మన అబ్దుల్ కలామ్, గొప్ప శాస్త్రవేత్తగా, పరిపాలనా దక్షుడైన రాష్ట్రపతిగా ఆయన కీర్తిని సంపాదించాడు కదా !

అందరూ సంపన్నులుగా, తెలివి కలవారుగా, పెట్టి పుట్టిన వారుగా పుట్టరు. మనమే భవిష్యత్తును బంగారం చేసుకోవాలి. కాబట్టి ప్రయత్నించండి. గొప్పవారు కండి.

రాష్ట్ర విద్యార్థి యూనియన్,
విజయవాడ.

ప్రశ్న 4.
గ్రంథాలయాల ఆవశ్యకత, ప్రయోజనాలు, సంరక్షణ గురించి అవగాహన కల్పిస్తూ కరపత్రం తయారుచేయండి.
జవాబు:

(కరపత్రం )

మిత్రులారా !

“చిరిగిన చొక్కా అయినా తొడుక్కో – కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కో” అన్నది సూక్తి. ఇటువంటి సూక్తులెన్నో పుస్తకాల ప్రాముఖ్యాన్ని, ప్రాశస్త్యాన్ని వివరించేవి వున్నాయి. తరతరాల విజ్ఞాన సంపదను అందించేవి గ్రంథాలు. అటువంటి గ్రంథాలు గల నివాసాన్ని గ్రంథాలయం (Library) అంటారు.

ప్రపంచంలో గొప్ప గొప్ప గ్రంథాలయాలున్నాయి. ఆమెరికాలో గల ‘కాంగ్రెసు లైబ్రరీ’, రోము నగరంలోని ‘వాటికన్ లైబ్రరీ’, ‘బ్రిటిష్ లైబ్రరీ’ మొదలైనవి ప్రపంచంలో పేరొందాయి. మనదేశంలో చెన్నైలోని “కన్నెమరా” గ్రంథాలయం, తంజావూరులోని “సరస్వతీ మహలు”, వేటపాలెంలోని “సారస్వత నికేతనం”, హైదరాబాదులోగల “శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయం” మొదలైనవి చెప్పుకోదగ్గవి చాలా ఉన్నాయి. కడపలో సి.పి. బ్రౌన్ స్మారక గ్రంథాలయం కూడా నెలకొల్పబడింది.

గ్రంథాలయాలలో చాలా రకాలున్నాయి. ప్రభుత్వ గ్రంథాలయాలు, స్వచ్ఛంద సంస్థల గ్రంథాలయాలు వున్నాయి. గ్రంథాలయాల వల్ల చాలా లాభాలున్నాయి :

  1. గ్రంథాలయాలు మనిషిని మనీషిగా మారుస్తాయి.
  2. మహామేధావులు తరతరాలుగా సంపాదించిన అనుభవాలు, ఆలోచనలు గ్రంథాలలో భద్రపరచబడతాయి.
  3. దేశాభ్యుదయానికి, సమాజవికాసానికి మూలస్తంభాలు గ్రంథాలయాలు.
  4. గ్రంథపఠనమనే మంచి అలవాటు అలవడుతుంది.
  5. గ్రంథాలు తండ్రివలె ఆదేశిస్తాయి. తల్లివలె లాలిస్తాయి. మిత్రుని వలె ఆదుకుంటాయి. గురువువలె ప్రబోధిస్తాయి.

గ్రంథాలయాధికారులు పుస్తకాలు కొనేటప్పుడు అత్యంత శ్రద్ధ వహించాలి. డబ్బును దుర్వినియోగం చెయ్యకుండా మంచి పుస్తకాలనే కొనాలి. హాని కలిగించు పుస్తకాలను నిర్మొహమాటంగా తిరస్కరించాలి. పోటీ పరీక్షలకి, ఉద్యోగ పరీక్షలకి, చదువుకి కావలసిన పాఠ్య గ్రంథాలు, క్విజ్ పుస్తకాల వంటివాటికి ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రభుత్వం గ్రంథాలయోద్యమాన్ని నీరుకార్చకుండా తగిన శ్రద్ధవహిస్తే సమాజం అభ్యుదయ పథంలో పయనిస్తుంది.

ఇట్లు
గ్రంథాలయాల అభివృద్ధి మండలి

ప్రశ్న 5.
అయ్యలరాజు రామభద్రుని కవితా విశిష్టతను తెలుపుతూ మిత్రునికి లేఖ రాయండి.
జవాబు:

తిరుపతి,
x x x x

ప్రియమైన మిత్రుడు సతీష్ చంద్రకు,

నీ మిత్రుడు వ్రాయునది. నేను బాగా చదువుతున్నాను. నీవు కూడా బాగా చదువుతున్నావని ఆశిస్తున్నాను. ముఖ్యముగా వ్రాయునది మా తెలుగు పాఠ్యాంశాల్లో సముద్రలంఘనం పాఠం ఒకటి. ఇది వర్ణనాత్మక పాఠం. దీన్ని అయ్యలరాజు రామభద్రుడు అనే కవి రచించాడు. రామభక్తుని వర్ణనాత్మక రచన అందరిని ఆకట్టుకుంటుంది. ఈ మహాకవి వర్ణనలు సహజంగా ఉంటాయి. ప్రకృతి దృశ్యాలను కళ్ళకు కట్టినట్టుగా తెలియచేశారు. హనుమంతుని పరారకమాన్ని సుమనోహరంగా వర్ణించాడు. అందువల్లనే నాకు రామభద్రుని వర్ణనాత్మక రచన అంటే ఇష్టం. నీవు ఏ కవిని అభిమానిస్తావో నాకు తెలియజేయి. పెద్దలందరికి నమస్కారములు తెలుపగలవు.

ఇట్లు,
నీ ప్రియ మిత్రుడు,
x x x x x x

చిరునామా :
వి.సతీష్ చంద్ర, 10వ తరగతి,
జిల్లాపరిషత్ బాలుర ఉన్నత పాఠశాల,
మంగళగిరి, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్.

ప్రశ్న 6.
మీ ప్రాంతంలో ప్రవహించే నదిని వర్ణిస్తూ, ఒక కవితా గేయం రాయండి.
జవాబు:
మా ప్రాంతంలో గౌతమీ నది ప్రవహిస్తోంది.
కవితా గేయం :

“సప్తర్షి సంఘాన గౌతముడు పెద్ద
వనము పెంచెను ఋషి ఫలవృక్షములను
గోవొకటి దానిని భగ్నంబు చేసె
గౌతముడు కోపాన కనువిచ్చి చూసే
భస్మమయ్యెను గోవు మునికోపదృష్టి
ఋషిమండలంబంత నిందించె ఋషిని
గౌతముడు తాపమున తపము చేయంగ
పరమేశుడప్పుడు ప్రత్యక్షమయ్యె
గోవు స్వర్గతి చెంద శివు డంత కరుణ
గోదావరీనదిని సృష్టించి విడిచె
నాసిక్కు క్షేత్రాన గోదావరీ మాత
సన్నని పాయగా ప్రభవించెనంత
ప్రవహించి జలము గోభస్మమును ముంచె
గోవు స్వర్గతి చెంద మునియు హర్షించె
గోదావరీ పాయ గౌతమి నదియై
సాగు తాగునీరు జనులకు నందించె
మోక్షమ్ము తా నొసగె దేహమ్ము ముంప
స్వర్గమోక్షదమ్ము గోదావరమ్ము
వేద నాదం బొలుకు దాని కమ్ర రవమ్ము”

10th Class Telugu 8th Lesson సముద్ర‌లంఘ‌నం 1 Mark Bits

1. దనువు అనే స్త్రీ యందు పుట్టిన వాళ్ళు. వీరు దేవతలకు శత్రువులు – గీత గీసిన పదానికి వ్యుత్పత్యర్థ పదాన్ని గుర్తించండి. (June 2017)
A) దానవులు
B) ధర్మాత్ములు
C) దుర్జనులు
D) దుష్టులు
జవాబు:
A) దానవులు

2. అపారమైన తీరము గలది – (వ్యుత్పత్తిని చెప్పే పదం గుర్తించుము. ) (March 2017)
A) పారాశర్యుడు
B) పారావారం
C ) తాపసుడు
D) కార్ముకం
జవాబు:
B) పారావారం

AP SSC 10th Class Telugu Important Questions Chapter 8 సముద్ర‌లంఘ‌నం

3. యమకాలంకారానికి ఉదాహరణ గుర్తించుము. (March 2017)
A) రాజు కువలయానందకరుడు
B) మా పొలంలో బంగారం పండింది
C) లేమా ! దనుజుల గెలవగ లేమా !
D) శ్రీనాథు వర్ణించు జిహ్వజిహ్వ
జవాబు:
C) లేమా ! దనుజుల గెలవగ లేమా !

4. ‘హరి భజియించు హస్తములు హస్తములు’ ఇందులోని అలంకారం గుర్తించండి. (June 2018)
A) లాటానుప్రాసము
B) ఛేకానుప్రాసము
C) యమకము
D) ముక్తపదగ్రసము
జవాబు:
A) లాటానుప్రాసము

5. హనుమంతుడు పర్వతమెక్కాడు – (వ్యతిరేకార్థక వాక్యాన్ని గుర్తించండి) (S.I. I – 2018-19)
A) హనుమంతుడు పర్వతమెక్కుటలేదు.
B) హనుమంతుడు పర్వతమెక్కలేడు.
C) హనుమంతుడు పర్వతమెక్కుట కష్టం.
D) హనుమంతుడు పర్వతమెక్కలేదు.
జవాబు:
D) హనుమంతుడు పర్వతమెక్కలేదు.