AP SSC 10th Class Telugu Important Questions Chapter 5 ధన్యుడు

AP State Board Syllabus AP SSC 10th Class Telugu Important Questions Chapter 5 ధన్యుడు

AP State Syllabus SSC 10th Class Telugu Important Questions 5th Lesson ధన్యుడు

10th Class Telugu 5th Lesson ధన్యుడు 2 Marks Important Questions and Answers

ఈ క్రింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాల్లో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
ధన్యుడు పాఠం నేపధ్యాన్ని వివరించండి.
జవాబు:
మంచి స్నేహితులను మనం కలిస్తే, ఆ కలయిక, మన జీవితాన్ని ఒక చక్కని దారివైపునకు తిప్పుతుంది. అందుకే మనము ఎప్పుడూ మంచి స్నేహితులను కలిగియుండాలని, మన పెద్దవాళ్లు మనకు చెపుతారు. మంచి స్నేహితులతో స్నేహం మనకు మేలు చేస్తుందనీ, సత్పురుషులతో కలయిక ఎప్పటికీ మంచిది అనీ, చెప్పడమే ఈ పాఠం నేపథ్యం.

ప్రశ్న 2.
ధన్యుడు పాఠంలో నిజమైన ధన్యుడు ఎవరు? ఎట్లు చెప్పగలవు? (March 2017)
(లేదా)
నిజంగా “ధన్యుడు” ఎవరో “ధన్యుడు” పాఠ్యభాగం ఆధారంగా తెల్పండి. (June 2019)
జవాబు:
ధన్యుడు పాఠంలో నిజంగా ధన్యుడు “హిరణ్యకుడు” అనే పేరు గల ఎలుక.

హిరణ్యకుడు అనే ఎలుక, మొదట ధనలోభంతో సంచరించింది. తరువాత తెలివి తెచ్చుకొని ధనలోభాన్ని విడిచి ఉన్నదానితో తృప్తి పడ్డవాడే ధన్యుడు అని నిశ్చయించి, నిర్జనారణ్యంలో నివసించింది.

అక్కడ హిరణ్యకుడికి లఘుపతనకం అనే కాకితో మైత్రి కల్గింది. లఘుపతనకం ద్వారా మంథరుడు అనే తాబేలుతో మైత్రి కల్గింది. మంథరుడి అమృతం వంటి మాటలు, హిరణ్యకుడి తాపాన్ని చల్లార్చి, అతణ్ణి మరింతగా ధన్యుణ్ణి చేశాయి.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 5 ధన్యుడు

ప్రశ్న 3.
ధన్యుడు పాఠం ఎవరు వ్రాశారు? ఆయన గురించి వ్రాయండి.
(లేదా)
“ధన్యుడు” పాఠ్యభాగ రచయితను గూర్చి రాయండి. (S.N. I – 2019-207)
జవాబు:
ధన్యుడు పాఠమును పరవస్తు చిన్నయసూరిగారు రచించారు. ఆయన 1809వ సంవత్సరంలో జన్మించారు. ఆయన తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లాలోని, పెరంబుదూరులో జన్మించాడు. చిన్నయసూరి తండ్రి వేంకట రంగ రామానుజా చార్యులుగారు. తల్లి శ్రీనివాసాంబ. ఆయన నీతిచంద్రిక, బాలవ్యాకరణం, సూత్రాంధ్ర వ్యాకరణం మొదలైన గ్రంథాలు రాశారు.

ప్రశ్న 4.
ధన్యుడు పాఠ్యభాగ రచయిత ఎవరు? ఆయన పాండిత్యం, రచనల గూర్చి వ్రాయండి.
జవాబు:
ధన్యుడు పాఠమును పరవస్తు చిన్నయసూరిగారు రచించారు. ‘సూరి’ అనగా పండితుడు. ఆయన తెలుగు, తమిళం, సంస్కృతం, ఆంగ్ల భాషలలో పండితుడు.

ఆయన అక్షరగుచ్ఛము, ఆంధ్ర కాదంబరి, పద్యాంధ్ర వ్యాకరణం, బాలవ్యాకరణం, నీతిచంద్రిక, సూత్రాంధ్ర వ్యాకరణం, శబ్దలక్షణసంగ్రహము మొదలైన గ్రంథాలు రాశారు.

చిన్నయసూరి రచనా శైలి పాఠకుడిని ఆకట్టుకొనేలా ఉంటుంది. ఆయన ప్రాచీన కావ్య భాషలో రచించారు.
ఆయన పచ్చయ్యప్పకళాశాలలో తెలుగు పండితునిగా పనిచేశారు.

ప్రశ్న 5.
చిన్నయసూరి గురించి, ఆయన విశిష్ట రచనల గురించి వివరింపుము.
జవాబు:

  1. పరవస్తు చిన్నయసూరి తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లాలో “శ్రీ పెరంబుదూర్”లో జన్మించాడు. ఈయన మద్రాసులోని పచ్చయ్యప్ప కళాశాలలో తెలుగు పండితుడుగా పనిచేశాడు.
  2. ఈయన తమిళం, సంస్కృతం, తెలుగు, ఇంగ్లీషు భాషలలో మంచి పండితుడు. ‘సూరి’ అనేది ఈయన బిరుదు.
  3. చిన్నయసూరి బాలవ్యాకరణం, నీతిచంద్రిక, సూత్రాంధ్ర వ్యాకరణం, శబ్దలక్షణసంగ్రహం వంటి గ్రంథాలు రాశాడు.

ఈయన రాసిన బాలవ్యాకరణం నేటికీ ప్రామాణిక గ్రంథం.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 5 ధన్యుడు

ప్రశ్న 6.
ధన్యుడు పాఠం ఆధారంగా ధనలోభం వల్ల ఎలాంటి నష్టాలు ఉంటాయో నాలుగైదు వాక్యాల్లో రాయండి.
జవాబు:
ధన లోభం అంటే ధనం సంపాదించాలనే దురాశ, అత్యాశ. ధనలోభం ఆపదలు అన్నింటికీ మూలం. ధనలోభాన్ని విడిచిపెట్టడం కంటె, గొప్ప సుఖం ఉండదు.

కడుపుకోసం ఇతరులను యాచించకుండా లభించిన దానితో తృప్తిపడేవాడు. లోకంలో ధన్యుడు. అటువంటి వాడే సుఖవంతుడు.

ధనలోభం వల్ల మోహం కలుగుతుంది. మోహం దుఃఖాన్ని కలిగిస్తుంది. దుఃఖం అగ్నిలా తన స్థానానికి నాశం – కల్గిస్తుంది. కాబట్టి ధనలోభం పనికి రాదు.

ప్రశ్న 7.
ఎక్కడి ఎలుక? ఎక్కడి చిలుక కొయ్య? అనడంలో అంతరార్థం ఏమిటి?
జవాబు:
సాధారణంగా అంతరం ఎక్కువ ఉండేవాటి పట్ల ఈ విధంగా ప్రయోగిస్తారు. ఎలుక నేలపైనా, రంధ్రాలలోనూ ఉంటుంది. గోడను నిలువుగా ఎక్కువ దూరం ఎలుక ప్రాకలేదు. చిలుకకొయ్య గోడకి మధ్యలో ఉంటుంది. అటువంటి , చిలుకకొయ్య పైకి ఎలుక చేరడం అసంభవం. అది సాధ్యం కానిది ఎలాగ సాధ్యమైంది అనేది దీనిలో అంతరార్థం. అలాగే ‘నక్క ఎక్కడ ? నాగ లోకము (స్వర్గం) ఎక్కడ?” అని కూడా అంటారు.

ప్రశ్న 8.
“ధనము సర్వశ్రేయములకు నిదానము” మీ అభిప్రాయం చెప్పండి.
జవాబు:
ఏ శుభకార్యం చేయాలన్నా ధనం కావాలి. ధనం లేకపోతే ఏ పనీ చేయలేము. అందుకే ప్రతి పుణ్యకార్యానికి అసలు కారణం ధనమే. అన్నదానం, భూదానం, గృహదానం మొదలైన ఏ దానం చేయాలన్నా ధనం కావాలి. చెరువు త్రవ్వించడం, దేవాలయాలు నిర్మించడం, పాఠశాల, ఆసుపత్రి మొదలైనవి నిర్మించడం ధర్మకార్యాలు. కాని ధనం లేకపోతే ఏ ధర్మకార్యాలు చేయలేము. అందుకే సర్వశ్రేయాలకు అసలు కారణం ధనం. మన ఉన్నతత్వానికి, గౌరవానికి, మర్యాదకు మన ధనమే అసలు కారణం.

ప్రశ్న 9.
‘దారిద్యము సర్వశూన్యము” అనే మాటను వ్యాఖ్యానించండి.
జవాబు:
దారిద్ర్యము అంటే బీదతనము: సర్వశూన్యము అంటే ఏమి లేనిది. అంటే ఇంటిలో పదార్థములు లేకుండా పోతాయి. అందువల్ల సుఖసంతోషాలు పోతాయి. దుఃఖము కలుగుతుంది. భార్యాబిడ్డలకు, కడుపునిండా తిండి పెట్టలేము. కాబట్టి దారిద్ర్యము అన్నింటినీ లేకుండా చేస్తుందని భావము.

ప్రశ్న 10.
‘ఆశ దిగనాడినవాడే సత్పురుషుడు’ – ఎట్లు?
జవాబు:
ఆశ అన్ని అనర్థాలకు మూలం. ఆశ పడినది దొరకకపోతే కోపం వస్తుంది. కోపంలో విచక్షణ కోల్పోతాము. పిసినిగొట్టుతనం పెరుగుతుంది. ఆశ మితిమీరితే అజ్ఞానం పెరుగుతుంది. అజ్ఞానం వలన గర్వం పెరుగుతుంది. గర్వం పెరిగితే ఎవ్వరితోటి స్నేహం చేయలేము. అందుచేత ఆశను విడిచిపెడితే సత్పురుషుడౌతాడు. మితిమీరిన ఆశ పనికి రాదు.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 5 ధన్యుడు

ప్రశ్న 11.
‘ధనహీనుడై నలుగురిలో ఉండరాదు. ఎందుకు?
జవాబు:
ధనహీనుడు అంటే ధనం లేనివాడు. ధనం ఉన్నప్పుడు సమాజంలో గౌరవం ఉంటుంది. హోదా ఉంటుంది. స్నేహితులు ఉంటారు. బంధువులు చేరతారు. అందరూ పలకరిస్తారు. నలుగురూ చేరతారు. కాని, ధనం లేకపోతే ఎవ్వరూ మాట్లాడరు. స్నేహితులు, బంధువులు కూడా పలకరించరు. గౌరవం, హోదా ఉండవు. ఇటువంటి అవహేళనలకు గురి అవుతూ నలుగురిలో ఉండకూడదు. ఎవరూ తెలియని ప్రదేశంలో ఉంటే ధనము లేనివాని ఆత్మాభిమానం దెబ్బ తినదు.

ప్రశ్న 12.
‘మనస్సు గట్టిపరచుకోవటం’ అంటే ఏమిటి?
జవాబు:
మనస్సు చంచలమైనది. అది ఇష్టం వచ్చినట్లు సంచరిస్తుంది. గట్టి పరచుకోవడం అంటే మనస్సును దృఢం చేసికోవడం, నిశ్చయం చేసుకోవడం అని అర్థం.

ప్రశ్న 13.
‘చచ్చిన తరి వెంట రాబోదు’ అనడంలో మీకేమి అర్థమయ్యింది?
జవాబు:
మనిషి చచ్చిపోయే సమయంలో అతడు సంపాదించిన ధనం వగైరా అతడి వెంట వెళ్ళదు. కాబట్టి తాను ధనాన్ని హాయిగా వెచ్చించి, కడుపు నిండా తినాలి. ఇతరులకు ఇంత పెట్టాలి. ఇతరులకు ఇవ్వక, తాను తినక, దాచిన డబ్బు చచ్చిపోయేటప్పుడు ఆ వ్యక్తి వెంట వెళ్ళదు అని నాకు తెలిసింది.

ప్రశ్న 14.
చూడాకర్ణుని స్వభావం గురించి వ్రాయండి.
జవాబు:
చూడాకర్ణుడు అమాయకపు సన్యాసి, చంపకవతి అనే పట్టణంలో నివసించేవాడు. తాను తినగా మిగిలిన భోజనం భిక్షాపాత్రలో పెట్టి చిలుకకొయ్యకు తగిలించేవాడు. దానిని ప్రతిరోజూ ఒక ఎలుక తినేసేది.

తన ఎదురుగానే ఎలుక చిలుకకొయ్యపైకి ఎగురుతుంటే, చప్పుడు చేస్తే బెదిరించాడు. అంతేకాని, ఆ ఎలుకకు అంత బలం, ధైర్యం కలగడానికి కారణం ఆలోచించలేదు. దాని బలాన్ని, బలగాన్ని కొల్లగొట్టాలని ఆలోచించలేదు. తన స్నేహితుని సలహాతో హిరణ్యకుని పీడ వదిలించుకొన్నాడు. సలహా చెబితే పాటించే స్వభావం కలవాడు చూడాకర్ణుడు.

ప్రశ్న 15.
వీణాకర్లుని స్వభావం వ్రాయండి.
జవాబు:
వీణాకర్ణుడు ఒకసారి చూడాకర్ణుని దగ్గరకు వచ్చాడు. అతని ఆహారాన్ని ఎలుక దొంగిలిస్తున్న విధానం గమనించాడు. వీణాకర్ణుడు చాలా తెలివైనవాడు. కనుకనే ఎలుక బలానికి కారణాన్ని అన్వేషించాడు. తన స్నేహితునికి ఆ ఎలుక నివాసాన్ని కొల్లగొట్టమని చక్కని సలహా ఇచ్చాడు. స్నేహితునకు ఉపకారం చేసే స్వభావం కలవాడు. స్నేహితుల బాధలను తన బాధలుగా భావించి, నివారిస్తాడు. అతని సలహాతో చూడాకర్ణునికి ఎలుకబాధ పూర్తిగా తొలగిపోయింది.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 5 ధన్యుడు

ప్రశ్న 16.
హిరణ్యకుని స్వభావం వ్రాయండి.
జవాబు:
హిరణ్యకుడు, చూడాకర్ణుని భిక్షాన్నం దొంగిలించి బ్రతికేవాడు. కాని, చూడాకర్ణునిచేత సంపదంతా కొల్లగొట్టబడి తరమబడ్డాడు. ఇంకక్కడ ఉండకూడదనుకొన్నాడు. అడవికి వెళ్ళిపోయాడు. అడవికి వెళ్ళాక జ్ఞానోదయమయింది. సంపద ఉన్నపుడు తనకు ఎవరూ సాటి లేరనుకొని విర్రవీగాడు. సంపదపోగానే, పట్టుదల పెరిగింది. కాని, సన్న్యాసి విసిరిన కర్ర దెబ్బ నుండి తప్పించుకొన్నాక నిజమైన జ్ఞానం కలిగింది. అప్పుడే లోభం వలన కలిగే ప్రమాదం తెలుసుకొన్నాడు. లోభం విడిచి పెట్టాడు. అడవికి వెళ్ళాడు. ధన్యుడయ్యాడు.

ప్రశ్న 17.
మంథరుని స్వభావం వ్రాయండి.
జవాబు:
అన్నిటినీ కోల్పోయి ఒంటరిగా అడవికి వచ్చిన హిరణ్యకుని ఆదరించిన స్నేహశీలి మంథరుడు. తన స్నేహంతో అతనికి పునర్జన్మను ప్రసాదించాడు. తన మంచి మాటలతో జ్ఞానోదయం కల్గించాడు. అతి సంచయేచ్ఛ తగదని బోధించింది. మనోధైర్యాన్ని ప్రసాదించింది. లఘుపతనకునితో సమానంగా ఆదరించిన స్నేహశీలి.

ప్రశ్న 18.
వివేకహీనుడిని ఎందుకు సేవించకూడదు?
జవాబు:
వివేకహీనుడిని సేవించడం కంటే, వనవాసం ఉత్తమం అని హిరణ్యకుడు అనుకుంటాడు. వివేకము అంటే మంచి చెడులు సరిగా తెలిసికొనే జ్ఞానము. వివేకము లేనివాడిని అవివేకి అని, వివేకహీనుడని అంటారు.

మంచి చెడ్డలు తెలియని ప్రభువును సేవిస్తే అతడు తెలివితక్కువగా ప్రవర్తిస్తాడు. ప్రభువు మేలుకోరి పనిచేసేవాడిని కూడా వాడు నిందిస్తాడు. ఇతరుల చెప్పుడుమాటలు విని, తన దగ్గర పనిచేసే సేవకుడిని తప్పు పడతాడు. అకారణంగా శిక్షిస్తాడు. తన కోసం కష్టపడే సేవకుడి మంచితనాన్ని, కష్టాన్ని వివేకహీనుడయిన ప్రభువు గుర్తించలేడు. అకారణంగా, అన్యాయంగా తన తెలివితక్కువతనంతో తనవద్ద పనిచేసే సేవకుడి కష్టాన్ని గుర్తించడు. సేవకుడి మంచితనాన్ని పట్టించుకోడు. కాబట్టి వివేకహీనుడిని సేవించకూడదు.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 5 ధన్యుడు

ప్రశ్న 19.
బాలవ్యాకరణాన్ని గూర్చి రాయండి.
జవాబు:
బాలవ్యాకరణాన్ని చిన్నయసూరి రచించాడు. ఈయన బాలవ్యాకరణము, నీతిచంద్రిక, అక్షరగుచ్ఛము, ఆంధ్రకాదంబరి, సూత్రాంధ్ర వ్యాకరణము, పద్యాంధ్ర వ్యాకరణము అనే గ్రంథాలు రచించాడు. ఈయన రచించిన ‘బాలవ్యాకరణం’
కావ్యభాషకు మంచి ప్రామాణిక గ్రంథము. నీతిచంద్రిక – బాల వ్యాకరణాలు లక్ష్య – లక్షణ గ్రంథాలుగా ప్రసిద్ధిపొందాయి.

10th Class Telugu 5th Lesson ధన్యుడు 4 Marks Important Questions and Answers

ఈ క్రింది ప్రశ్నలకు 10 లేక 12 వాక్యాల్లో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
సంసార విషవృక్షమునకు అమృతతుల్యమైనవి ఏమిటో వివరించండి. (S.A.I – 2018-19 June 2016)
జవాబు:
‘సంసారం’ అంటే మనుషుల చావు పుట్టుకలు. ఈ సంసారం విషవృక్షము వంటిది. వృక్షమునకు పళ్ళు పుడతాయి. అలాగే సంసారం అనేది విషవృక్షం అనుకుంటే, ఆ సంసార విషవృక్షానికి రెండు అమృతము వంటి పళ్ళు పుడతాయని కవి చెప్పాడు.

అందులో ‘కావ్యామృత రసపానము’ మొదటి అమృత ఫలము, సత్పురుషులతో సహవాసము రెండవ అమృత ఫలము. అంటే మనుషులుగా పుట్టిన వారికి, రెండు ప్రయోజనాలు కలుగుతాయి. హాయిగా మహాకవులు రాసిన కావ్యాలలోని అమృతం వంటి రసాన్ని గ్రహించి ఆనందించవచ్చు. అలాగే సత్పురుషులతో స్నేహం చేసి దాని ద్వారా అమృతం వంటి ఆనందం పొందవచ్చునని కవి చెప్పాడు.

నిజంగానే రామాయణము, భారతము వంటి కావ్యాలలోని సారాన్ని గ్రహిస్తే, అది అమృతములా ఉంటుంది. అలాగే సత్పురుషులతో స్నేహం చేస్తే అందువల్ల అమృతం వంటి ఆనందం పొందవచ్చు. అందుకే రచయిత సంసారం చేస్తున్న మానవులకు, కావ్యాలను చదివి ఆనందం పొందే అదృష్టము, మంచివారితో సహవాసం చేసే అదృష్టమూ లభిస్తాయని చెప్పాడు.

ప్రశ్న 2.
హిరణ్యకుడు అడవులపాలు కావటానికి లోభమే ప్రధాన కారణమని తెల్పిన మంథరుని మాటలను సమర్థించండి. (Jure 2018)
జవాబు:
1) హిరణ్యకుడు లోభం కారణంగా అడవులపాలైన తన యొక్క పూర్వ వృత్తాంతాన్ని మిత్రుడైన మంథరునికి వినిపించాడు.
2) ఆ మాటలు విన్న మంథరుడు “సంపదలు శాశ్వతమైనవి కావని, యవ్వనం ప్రవాహవేగంలాంటిదని, జీవితం నీటి బుడగతో సమానమైనదని చెప్పాడు.
3) కావున బుద్ధిమంతుడు సత్వరమే (వెంటనే) ఈ నిజాన్ని గుర్తించి ధర్మకార్యాలు చక్కగా ఆచరించాలని, అలా ఆచరించని వారు పశ్చాత్తాపంతో దుఃఖమనే అగ్నిలో కాలిపోతారని చెప్పాడు.
4) “నీవు కావలసిన దానికన్నా ఎక్కువగా కూడబెట్టావు. నీ లోభ బుద్ధియే నిన్నిలా అడవుల పాలు చేసింది. ఎక్కువగా కూడబెట్టాలనే కోరిక తగదు. ఇతరులకిచ్చి మనం భుజించినదే మన సొత్తు. పరులకివ్వకుండా తాను తినకుండా దాచిన సొమ్ము చనిపోయినపుడు వెంటరాదు. బ్రతకడం కోసం ఇన్ని తిప్పలు పడనవసరం లేదు. ధర్మాలన్నీ తెల్సిన నీకు నేను వివరంగా చెప్పవలసిన పని లేదు.” అంటాడు.
5) ఈ అంశాలన్నీ సమర్థింపదగినవేనని నేను భావిస్తున్నాను. సంపదల స్వభావం గురించి యవ్వనం గురించి, జీవితం గురించి, ముఖ్యంగా లోభగుణం గురించి, ధర్మకార్యాలను ఆచరించవలసిన అవసరం గురించి మంథరుడు చెప్పిన మాటలు అందరూ అనుసరించదగినవని, ఆమోదించదగినవనీ నేను భావిస్తున్నాను.

ప్రశ్న 3.
ఈ క్రింది పాత్రల స్వభావాలను రాయండి.
జవాబు:
1. చూడాకర్ణుడు :
చంపకవతి అనే పట్టణంలోని సన్యాసి. తను భోజనము చేయగా మిగిలిన వంటకం చిలుక కొయ్య మీద దాచుకొనేవాడు. ఒక ఎలుక ప్రతిరోజూ దానిని తినేసేది. ఎలుకను బెదిరించాడు తప్ప దానిని భయపెట్టి తరిమేసే ప్రయత్నం చేయలేదు. ఒక సమస్యకు శాశ్వత పరిష్కారం ఆలోచించే స్వభావం కాదు. వీణాకర్ణుని సలహాతో హిరణ్యకుని పీడను వదిలించుకొన్నాడు. అతని మాటతీరును బట్టి చాలా గ్రంథాలు చదివిన వాడని తెలుస్తుంది. స్నేహితులు చెప్పే మంచి సలహాలను వింటాడు. ఆచరిస్తాడు. తెలివైనవాడు.

2. వీణాకర్ణుడు :
చూడాకర్ణుని స్నేహితుడు. ఒక సమస్య యొక్క మూలాలను వెతికి పట్టుకొంటాడు. పరిష్కారం సూచిస్తాడు. చూడాకర్ణునికి హిరణ్యకుని పీడ వదలడానికి కారణం వీణాకర్ణుని సలహాయే. ఆపదలో ఉన్న స్నేహితులకు మంచి సలహాలు చెప్పే స్వభావం కలవాడు.

3. హిరణ్యకుడు :
ఇతడు ఒక ఎలుక. అవకాశం ఉన్నంతకాలం చూడాకర్ణుని దోచుకొన్నాడు. అతని వలన ప్రమాదం ఏర్పడ్డాక జ్ఞానం కలిగింది. ధన వ్యామోహం తగ్గింది. అది తనకు తగిన ప్రదేశం కాదని గుర్తించాడు. భగవంతుని దయామయత్వం అవగాహన చేసుకొన్నాడు. అడవికి చేరాడు. ధన్యుడయ్యాడు. పరిపూర్ణమైన జ్ఞానం కలిగింది.

4. మంథరుడు :
మంథరుడు ఒక తాబేలు పేరు. స్నేహశీలము కలిగినవాడు. హిరణ్యకునికి ఆశ్రయం ఇచ్చాడు. ధనం అశాశ్వతమని, యౌవనం తొందరగా గడిచిపోతుందని తెలుసుకొన్న జ్ఞాని. ధర్మమును ఆచరించాలని చెప్పిన ధర్మాత్ముడు. జీవితం పట్ల పూర్తి అవగాహన కలిగి ఉన్నవాడు. తన స్నేహితులను కూడా మంచి మార్గంలో నడిపించే ఉత్తముడు మంథరుడు.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 5 ధన్యుడు

ప్రశ్న 4.
“యాచక వృత్తి సమస్త గౌరవాన్ని హరిస్తుంది”. విశ్లేషిస్తూ రాయండి.
జవాబు:
యాచక వృత్తి వలన సమస్త గౌరవం పోతుంది. ప్రపంచంలో అనేక రకాల వృత్తులున్నాయి. ఏ వృత్తిని చూసినా కొంతపని చేసి దానికి ప్రతిఫలం పొందడం కనిపిస్తుంది. పనిచేయకుండా ఫలితాన్ని ఆశించడం తప్పు. తప్పు చేస్తే గౌరవం తగ్గడం సహజం. యాచక వృత్తి అంటే ఇతరులకు ఏ మాత్రం ఉపయోగపడకుండా వారి నుంచి ధనం, వస్తువులు మొదలగునవి ఆశించడం. అలా ఎప్పుడైతే ఆశించామో అదే మన గౌరవానికి భంగం కలిగిస్తుంది. యాచక వృత్తిని చేసే వారిని తనవారు కానీ, పైవారు కానీ ఎవరూ గౌరవించరు. చిన్న పనైనా, పెద్ద పనైనా కష్టపడి పనిచేస్తూ సంపాదించుకుని బతుకుతుంటే గౌరవానికి భంగం కలుగదు.

ప్రశ్న 5.
‘ధన్యుడు’ అనే పేరు హిరణ్యకుని వృత్తాంతానికి ఎలా సరిపోయిందో సమర్థించండి.
జవాబు:
ఉదరముకయి పరులగోఁజక, ప్రాప్తి లాభానికి సంతోషించేవాడు ఒక్కడే లోకమందు ధన్యుడు అని హిరణ్యకుడు నిశ్చయించుకొని నిర్జనారణ్యంలో నివాసం చేశాడు.

పొట్టకోసం ఇతరులను పీడించకుండా, తనకు లభించిన దానితో తృప్తిపడి, సంతోషపడేవాడు ధన్యుడని హిరణ్యకుడి అభిప్రాయం. ఇది సరైన అభిప్రాయం. భగవంతుడే మనకు కావలసినవి ఇస్తాడు. అందుచేత పోషణ కోసం ఇతరుల కాళ్ళమీద పడి వారిని యాచించనక్కరలేదు.

రాతిలోని కప్పను దయామయుడైన భగవంతుడు రక్షిస్తున్నాడు. మనం చేసుకొన్న కర్మలను బట్టి మనకు దుఃఖాలు వచ్చినట్లే, కోరకుండానే సుఖాలు వస్తాయి.

హిరణక్యుడు అనే ఎలుక మొదట ధనలోభంతో సంచరించింది. చివరకు సన్యాసి కర్రదెబ్బ తగిలి, తెలివి తెచ్చుకొంది. మనుష్యులు లేని అడవిలో నివసించింది. చివరకు లఘుపతనకం సహాయంతో మంథరుడనే కూర్మరాజు మైత్రి పొందింది. తమకు దొరికిన దానితో ముగ్గురమూ కలసి సుఖంగా ఉందామని మంథరుడు హిరణ్యకునకు నచ్చ చెప్పాడు.

మంథరుడు అమృతం వంటి మాటల వలన తన తాపం పోయిందనీ, తాను ధన్యుడనయ్యానని హిరణ్యకుడు అనుకొన్నాడు. కనుక ధన్యుడు అనే పేరు హిరణ్యకుని వృత్తాంతానికి సరిపోయింది.

ప్రశ్న 6.
హిరణ్యకునిలో ఆలోచనను రేకెత్తించినదెవరు? ఎలా?
జవాబు:
చూడాకర్ణుడు తన స్నేహితుని సలహాతో హిరణ్యకుని కలుగును త్రవ్వాడు. దాని సంపదనంతా కొల్లగొట్టాడు. తర్వాత హిరణ్యకునికి బలం తగ్గింది. ఉత్సాహం కూడా తగ్గింది. ఆహారం కూడా సంపాదించుకొనలేనంతగా నీరసపడింది. నడకలో వేగం తగ్గింది. సంపద పోవడంతో ఆలోచించే అవకాశాన్ని చూడాకర్ణుడు తన చేష్టల ద్వారా కలిగించాడు. ధనము కలవాడే పండితుడు, అతడే బలవంతుడు. ధనమే అన్నింటికీ మూలమన్నాడు చూడాకర్ణుడు.

మూషికం తన సంపదతోపాటు బలాన్ని కూడా కోల్పోయిందని ఆక్షేపించాడు. ధనం లేనివాడికి ఎల్లప్పుడూ బాధగానే ఉంటుంది. నిరంతరం బాధపడడం వలన తెలివి మందగిస్తుంది. తెలివి తగ్గితే అన్ని పనులూ పాడవుతాయి అని దెప్పి పొడిచాడు.

ధనవంతుడికే పౌరుషం చెల్లుతుంది. మేథాసంపద, బంధుమిత్రులు ధనాన్ని బట్టే చేరతారు. భార్యాబిడ్డలు లేని ఇల్లు, మూర్ఖుడి మనసు శూన్యంగా ఉంటాయి. దరిద్రం వలన అంతా శూన్యంగా కనిపిస్తుంది. దరిద్రం కంటె మరణం మంచిది. మరణం చాలా బాధాకరం. జీవితమంతా దరిద్రం అనుభవించడం చాలా కష్టం. డబ్బు లేకుంటే సొంతవాళ్ళే పరాయివాళ్ళు అవుతారు. ఇలా అనేక విధాల తన మాటల ద్వారా హిరణ్యకుని చిత్రవధ చేశాడు.

చూడాకర్ణుని మాటలు, చేష్టలు హిరణ్యకునిలో ఆలోచనలను రేకెత్తించాయి. తనలో తాను ఆలోచించడం ప్రారంభించాడు. ఆ ఆత్మపరిశీలనే జ్ఞానోదయానికి కారణమయ్యింది.

ప్రశ్న 7.
హిరణ్యకుని ఆలోచనా ధోరణిని వివరించండి.
జవాబు:
చూడాకర్ణుడు హిరణ్యకుని సంపదనంతా కొల్లగొట్టాడు. ధనం యొక్క ప్రాధాన్యతని వివరిస్తూ హిరణ్యకుని చాలా కించపరిచాడు. అప్పుడు హిరణ్యకునిలో ఆలోచన మొదలైంది.

అక్కడింక నివసించకూడదనుకొన్నాడు. తనకు జరిగిన అవమానం ఇతరులకు చెప్పుకోవడం మంచిదికాదనే సుభాషితం గుర్తు చేసుకొన్నాడు. దైవం అనుకూలించనపుడు తన పౌరుషం వలన ప్రయోజనం లేదని గుర్తించాడు. వనవాసం మంచిదని తలపోసాడు.

యాచించి బ్రతకడం కంటె వనవాసం మేలనుకొన్నాడు. బ్రతికితే పువ్వులా బ్రతకాలనుకొన్నాడు. యాచన అవమానకరం అనుకొన్నాడు. ఎన్ని విధాల ఆలోచించినా లోభం వదలలేదు. అక్కడే ఉండి మళ్ళీ ధనార్జన చేయాలని సంకల్పించాడు.

కాని, లోభం వలన మోహం పుడుతుంది. మోహం వలన దుఃఖం కలుగుతుంది. దుఃఖం వలన ఆశ్రయం కోల్పోతారు. ఇవేవీ ఆలోచించలేదు. ఇంతలో చూడాకర్ణుడు హిరణ్యకుని పైకి కర్రను విసిరాడు. దైవికంగా ఆ కర్ర దెబ్బ నుండి తప్పించుకొన్నాడు.

అపుడు అతని ఆలోచనలో పరిణతి వచ్చింది. అన్ని ఆపదలకు ధనలోభమే మూలమని గ్రహించాడు. లోభమును విసర్జించినవాడే అన్నీ తెలిసినవాడని తెలుసుకొన్నాడు. వాడు మాత్రమే సుఖపడగలవాడని గ్రహించాడు.

అక్కడి నుండి హిరణ్యకుని ఆలోచనలో చాలా మార్పు వచ్చింది. అదేమి తన తాతముత్తాతల స్థలం కాదని గ్రహించాడు. అడవికిపోయి బ్రతకవచ్చనుకొన్నాడు.

ఈ విధంగా హిరణ్యకుని ఆలోచనా ధోరణిలో చాలా మార్పు వచ్చింది.

ప్రశ్న 8.
కావ్యామృత రసపానము, సజ్జ సంగతులను అమృతతుల్యములు అనడంలో రచయిత ఉద్దేశ్యం ఏమిటి?
జవాబు:
సంసారము అనే విషవృక్షమునకు, రెండు ఫలములు అమృతముతో సమానమైనవి ఉన్నాయి. అందులో ‘కావ్యామృత రసపానము’ ఒకటి. ‘సజ్జన సంగతి’ రెండవది అని, హిరణ్యకుడు అనే ఎలుక, మంథరుడు అనే తాబేలుతో చెప్పాడు.

సంసారము అంటే మానవుల చావు పుట్టుకలు. మనిషి పుడతాడు, తిరిగి చస్తాడు. తిరిగి పుడతాడు. దీన్నే ‘సంసారము’ అంటారు. ఈ సంసారం, విషవృక్షము వంటిది. వృక్షాలకు కాయలు, పళ్ళు కాస్తాయి. అలాగే సంసారం అనేది విషవృక్షము అనుకుంటే, దానికి రెండు పళ్ళు పుడతాయట. అందులో మొదటిది ‘కావ్యామృత రసపానము’. అనగా మహాకవులు రాసిన మంచి కావ్యాలను చదివి, దానిలోని అమృతం వంటి రసాన్ని ఆస్వాదించడం. రెండవది ‘సజ్జన సంగతి’ అంటే మంచివారితో స్నేహము.

మనిషి పుట్టడం, చావడం అనే సంసారం విషవృక్షము వంటిదయినా, ఆ పుట్టుక వల్ల మనిషికి రెండు ప్రయోజనాలు, అమృతము వంటివి సిద్ధిస్తాయట. అంటే మనిషిగా పుట్టినవాడు, చక్కగా అమృతం వంటి రసం గల మహా కావ్యాలు చదివి ఆనందం పొందవచ్చు. అలాగే మనిషిగా పుట్టి సంసారం చేసేవాడు, మంచివారితో స్నేహం చేసి, దానివల్ల అమృతం వంటి ఆనందం పొందవచ్చునని రచయిత ఉద్దేశ్యము.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 5 ధన్యుడు

ప్రశ్న 9.
‘అర్థములు నిత్యములు కావు. యౌవనము ఝరీవేగతుల్యము’. వీటిని గురించి మీరు ఏమి అర్థం చేసుకున్నారో సోదాహరణంగా రాయండి.
(లేదా)
అర్థములు నిత్యములు కావంటూ – మంధరుడు అన్న మాటలను మీరు ఏవిధంగా సమర్థిస్తారు? (S.A. I – 2019-20)
జవాబు:
‘అర్థములు నిత్యములు కావు’ అంటే ధనము శాశ్వతంగా ఉండదని అర్థము. డబ్బులు సంపాదించినా అది శాశ్వతంగా వాడి వద్ద ఉండవు. ఈ రోజు ధనవంతుడయినవాడు, మరునాటికి బీదవాడు కావచ్చు. పెద్ద పెట్టుబడి పెట్టి ఫ్యాక్టరీ పెట్టిన ధనవంతుడికి, పెద్ద నష్టం రావచ్చు. ఫ్యాక్టరీకి ప్రమాదం రావచ్చు.

బ్యాంకులో డబ్బు పెడితే, ఆ బ్యాంకు దివాలా తీయవచ్చు. లేదా అతడి ధనాన్ని దొంగలు అపహరింపవచ్చు. కాబట్టి అర్థములు నిత్యములు కావని రచయిత చెప్పాడు.

‘యౌవనము ఝరీవేగతుల్యము’ అంటే మంచి యౌవన వయస్సు, ప్రవాహవేగం వంటిది. ‘ఝరి’ అంటే సెలయేరు. సెలయేరు వర్షాలు వస్తే పొంగుతుంది. ఆ నీరు కొండ నుండి కిందికి దిగి పోగానే అది ఎండిపోతుంది. యౌవనము కూడా సెలయేరు వంటిది.

రోజు ఉన్న యౌవనం, శాశ్వతంగా ఉండదు. కొద్ది రోజుల్లో మనం అంతా ముసలివాళ్ళం అవుతాము. తరువాత మరణిస్తాము. వయస్సు వేగంగా వెళ్ళిపోతుంది. చూస్తూ ఉండగానే యువకులు వృద్ధులు అవుతారు. సెలయేరు ఎంత వేగంగా వెడుతుందో, వయస్సు కూడా అంతవేగంగా ముందుకుపోతుంది. కాబట్టి మనిషి ధనాన్ని, యౌవనాన్ని నమ్మి ఉండరాదు. అవి వేగంగా పోయేవని గ్రహించి డబ్బు, యౌవనము ఉన్నపుడే మంచిపనులు చేయాలని నేను గ్రహించాను.

ప్రశ్న 10.
చిత్రాంగుని హిరణ్యకుని జీవితచరిత్ర ఆధారంగా దాని వ్యక్తిత్వాన్ని విశ్లేషించండి.
గమనిక : చిత్రాంగుడి గూర్చి మనకు పాఠములో లేదు. హిరణ్యకుడి గురించి ఉంది (అందుకే హిరణ్యకుడి గురించి ఇవ్వడం జరిగింది.)
జవాబు:
హిరణ్యకుని లోభము :
హిరణ్యకుడు ఒక ఎలుక. అది చూడకర్ణుడనే సన్న్యాసి ఇంట్లో కన్నంలో ఉండి, అతడు దాచిన వంటకాన్ని దొంగిలించి బాగా సంపాదించింది. ఆ సన్న్యాసి, ఈ ఎలుక కన్నాన్ని తవ్వి, అది దాచిన సర్వస్వాన్నీ తీసుకున్నాడు. దానితో హిరణ్యకం దిగులుపడింది. కాని ధనలోభంతో ఆ చోటును విడిచిపెట్టలేదు.

జ్ఞానము – వివేకము :
హిరణ్యకం, అభిమానం కలవాడికి, వనవాసం మంచిదని గ్రహించింది. వివేకం లేనివాడిని సేవించరాదనుకొంది. యాచనా వృత్తి దోషం అనుకుంది. అడవికి వెళ్ళిపోదామని నిశ్చయించింది. కాని ధనలోభం వల్ల దానికి మోహం కలిగి, అక్కడే ఉండి తిరిగి సంపాదిద్దామనుకుంది.

వనవాసము – వైరాగ్యము :
ఒక రోజున హిరణ్యకుడిపై సన్న్యాసి కజ్జును విసిరాడు. దైవవశం వల్ల ఆ దెబ్బ నుండి హిరణ్యకం రక్షించబడింది. దానితో ధనలోభము వల్ల ఆపదలు వస్తాయని అది గ్రహించింది. దొరికిన దానితో సంతోషించేవాడే ధన్యుడని, సుఖవంతుడు అని హిరణ్యకం గుర్తించింది. కోరకుండానే ప్రాణికి దుఃఖాల వలె సుఖాలు కూడా వస్తాయని హిరణ్యకం గుర్తించి, నిర్జనారణ్యంలోకి వెళ్ళింది.

ఈ విధంగా హిరణ్యకుడు మొదట ధనలోభంతో సంచరించాడు. తరువాత తెలివి తెచ్చుకొని, లోభమోహాలను విడిచి, దొరికిన దానితో తృప్తి పడదామని నిర్జనారణ్యంలో నివసించాడు. కాబట్టి హిరణ్యకుడు ధన్యజీవి.

ప్రశ్న 11.
హిరణ్యకుడు మొదట ఎందుకు బలవంతుడు? తరువాత ఎందుకు బలహీనుడయ్యాడో విశ్లేషించండి.
జవాబు:
హిరణ్యకుడు అనే ఎలుక చూడాకర్ణుడు అనే సన్న్యాసి ఇంట్లో కన్నంలో ఉండేది. ఆ సన్న్యాసి తాను తినగా మిగిలిన వంటకాన్ని భిక్షాపాత్రలో పెట్టి చిలుకకొయ్యకు తగిలించేవాడు. హిరణ్యకుడు ఆ వంటకాన్ని భక్షించేవాడు. ఆ విధంగా హిరణ్యకుడు ఎంతో ఆహారాన్ని దాచాడు. దానితో మొదట్లో హిరణ్యకుడు బలవంతుడుగా ఉండేవాడు.

తరువాత ఒకరోజున చూడకర్ణుడు మిత్రుని సలహాపై హిరణ్యకుడి కన్నమును తవ్వి అతడు దాచుకున్న సర్వస్వాన్నీ గ్రహించాడు. దానితో హిరణ్యకుడు బలహీనుడయ్యాడు. అయినా హిరణ్యకుడు ఆ సన్న్యాసి ఇంట్లోనే తిరిగేవాడు. ఒక రోజున సన్న్యాసి హిరణ్యకుడి పై చేతి కణ్ణను విసిరాడు. దానితో హిరణ్యకుడు నిర్జనారణ్యంలోకి నివాసం మార్చాడు. ఈ విధంగా హిరణ్యకుడు బలహీనుడయ్యాడు.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 5 ధన్యుడు

ప్రశ్న 12.
సజ్జన సాంగత్యము లభించి ధన్యుడైన హిరణ్యకుని వృత్తాంతాన్ని మీ సొంతమాటల్లో వ్రాయండి. (March 2019)
జవాబు:
హిరణ్యకుడు ఒక ఎలుక. ఆ ఎలుక చూడాకర్ణుడు అనే సన్యాసి ఇంటిలో కన్నంలో నివాసము ఉండేది. ఆ సన్యాసి రోజూ తాను తినగా మిగిలిన అన్నాన్ని భిక్షాపాత్రలో పెట్టి దాన్ని చిలుక కొయ్యకు తగిలించేవాడు. ఎలుక చిలుక కొయ్య పైకి ఎగిరి, ఆ అన్నాన్ని తినివేసేది. ఆ ఎలుక ఈ విధంగా ఎంతో సంపాదించింది.

ఒకరోజు చూడాకర్ణుడి ఇంటికి వీణాకర్ణుడు అనే సన్యాసి వచ్చాడు. చూడాకర్ణుడు ఎలుకను తన కజ్జుతో బెదరిస్తున్నాడు. ఎలుక సంగతి చూడాకర్ణుడు, వీణాకర్ణుడికి చెప్పాడు. వీణాకర్ణుడి సలహాపై, చూడాకర్ణుడు ఎలుక కన్నాన్ని తవ్వి, ఎలుక దాచుకున్న దాన్ని తీసుకున్నాడు. దానితో ఎలుక ఆహారము లేక ఇంటిలో తిరుగుతోంది. సన్యాసి ఎలుకపై తన కజ్జను విసిరాడు. అదృష్టవశాత్తు ఎలుక తప్పించుకొని, ఆ ఇంటిపై విరక్తి పెంచుకొని, అడవిలోకి వెళ్ళిపోయింది. మనుష్యులు లేని ఆ అడవిలో ఆ ఎలుకకు కాకితో స్నేహము కుదిరింది. ఆ అడవిలో తినడానికి ఎలుకకు ఏమీ దొరకలేదు. దానితో ఎలుక, తన మిత్రుడైన కాకితోపాటు, కాకికి స్నేహితుడైన మంథరుడి వద్దకు వచ్చింది. కాకి, ఎలుక, మంథరుడు స్నేహితులయ్యారు.

10th Class Telugu 5th Lesson ధన్యుడు Important Questions and Answers

ప్రశ్న 1.
ధన్యుడు కథను చిన్ననాటికగా మలచండి.
జవాబు:
ఏకాంకిక : పాత్రలు 1) హిరణ్యకుడు 2) మంథరుడు

మంథరుడు : మనమంతా సుఖంగా కలసి ఉందాము. దొరికిన దాంతో కాలం గడిపేద్దాం. అది సరే కాని నీవు అడవిలో ఎందుకు ఉన్నావు హిరణ్యకా!

హిరణ్యకుడు : మిత్రమా! మంథరా ! నేను ఒకప్పుడు చూడాకర్ణుడు అనే సన్యాసి ఇంట్లో కన్నంలో ఉండి, అతడు చిలుక కొయ్యమీద దాచుకొన్న వంటకాన్ని తినేదాన్ని.

మంథరుడు : మరి ఏమైంది?

హిరణ్యకుడు : ఇక్కడ ఒకసారి ఆ సన్న్యాసి ఇంటికి వీణాళుడనే సన్న్యాసి వచ్చాడు. చూడాకర్ణుడిచే నా కన్నం త్రవ్వించాడు.

మంథరుడు : అప్పుడు నువ్వు అడవిలో మకాం పెట్టావా?

హిరణ్యకుడు : లేదు. నేను సన్న్యాసి ఇంట్లోనే తిరుగుతున్నా. ఒకరోజు సన్న్యాసి నాపై కర్ర విసిరాడు. అప్పుడు ఉన్న దానితో తృప్తి పడదామని అడవికి వచ్చా. అక్కడే మన మిత్రుడు లఘుపతనకుడితో స్నేహం అయ్యింది.

మంథరుడు : అడవిలో మీ ఇద్దరికీ ఆహారం సరిగ్గా దొరికిందా!

హిరణ్యకుడు : లేదు మిశ్రమా! అందుకే లఘుపతనకం నీ దగ్గరకు నన్ను కూడా తీసుకువచ్చింది.

మంథరుడు : మిత్రమా! హిరణ్యకా! డబ్బు శాశ్వతం కాదు. దాచిన డబ్బు మనతో రాదు. ప్రక్కవాడికి పెట్టి మనం హాయిగా తినాలి. మనం ముగ్గురమూ ఒకరికొకరు సాయం చేసికొంటూ బ్రతికేద్దాం.

హిరణ్యకుడు : మిత్రమా! నీ మాటలు విని నేను ధన్యుణ్ణి అయ్యాను.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 5 ధన్యుడు

ప్రశ్న 2.
చిన్నయసూరి కథను చెప్పే విధానాన్ని, రచయిత రచనా విధానాన్ని ప్రశంసిస్తూ మీ గ్రంథాలయంలో చిన్నయసూరి రచనలు పెట్టవలసిన అవసరాన్ని వివరిస్తూ మీ ప్రధానోపాధ్యాయునకు లేఖ వ్రాయండి.
జవాబు:

కర్నూలు,
x x x x x

గౌరవనీయులైన కర్నూలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుల వారికి,
తమ పాఠశాలలో 10వ తరగతి చదువుచున్న 8. వెంకట్ వ్రాయు లేఖ,

అయ్యా !

విషయము : పాఠశాల గ్రంథాలయంలో – చిన్నయసూరి రచనల గూర్చి – విజ్ఞప్తి.

మాకు పదవ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలో ‘ధన్యుడు’ పాఠం ఉన్నది. దానిని పరవస్తు చిన్నయసూరిగారు రచించారు.

అది కావ్యభాషలో ఉంది. చిన్నయసూరి రచనా శైలి చాలా బాగుంది. మమ్మల్ని ఆ శైలి ఆకట్టుకొంది. కథను చెప్పడంలో చక్కని వేగం ఉంది. ఆ వాక్య నిర్మాణం కూడా చాలా బాగుంది. పదాల ఎన్నికలో అర్థానికి తగినవి ఎన్నుకొన్నారు.

పరివ్రాజకుడు, కాణాచి, పాతకాపు, చెడగరపు బోడవంటి పాతపదాలు ఎక్కువగా ఉన్నాయి.

ఈ కథలోని పాత్రలు అన్నీ జంతువులు. జంతువుల ద్వారా నీతులు చెప్పించడం చిన్నయసూరి ప్రత్యేకత. సంభాషణలలో కూడా నాటకీయత ఉంది.

చిన్నయసూరి ఇలాంటి కథలు ఇంకా చాలా వ్రాశారని మా తెలుగు ఉపాధ్యాయులు చెప్పారు. ఆ కథలన్నీ చదవాలని మాకు చాలా కుతూహలంగా ఉంది.

కనుక మాయందు దయతో చిన్నయసూరి రచనలన్నింటినీ మన పాఠశాల గ్రంథాలయానికి కొనిపించండి.

నమస్కారములు.

ఇట్లు,
తమ విద్యార్థి,
కె. వెంకట్, 10వ తరగతి.

ప్రశ్న 3.
చిన్నయసూరి రచనలను చదవవలసిన అవసరాన్ని తెలియజేస్తూ, అవి చదవమని పాఠకులను కోరుతూ కరపత్రం రూపొందించండి.
జవాబు:

కరపత్రం

పాఠకులారా! తెలుగు పాఠకులారా! చదవండి.

ఈ రోజు టీ.వీ.లను చూడడానికి ఇచ్చిన ప్రాధాన్యం చదవడానికి ఇవ్వటల్లేదు. క్రమంగా పుస్తకాలు చదివే అలవాటుకు దూరమవుతున్నాం. కొన్ని పాత పదాలు మనకు తెలియటం లేదు.

చిలుకకొయ్య, నిదాఘ నదీపూరము, పరివ్రాజకుడు, ఝురీవేగతుల్యము మొదలైన ఎన్నో పాత పదాలు తెలియాలంటే ప్రాచీన రచనలు చదవాలి. చిన్నయసూరి రచనలు చదివితే ఇలాంటి పదాలు తెలుస్తాయి. కథాకథన విధానం తెలుస్తుంది. పాండిత్యం పెరుగుతుంది. మన సంభాషణా చాతుర్యం పెరుగుతుంది.

అందుకే చిన్నయ రచనలు చదవండి. చదివించండి.

ఇట్లు,
పాఠక సమాజం

ప్రశ్న 4.
పరవస్తు చిన్నయసూరి రచనల గురించి ఒక వ్యాసం వ్రాయండి.
జవాబు:
సూరి రచనల మాధుర్యం

‘చిన్నయ రచనలు పూర్తిగా చదివినవాడే తెలుగు భాషలో సూరి’ అని పెద్దల మాట. తెలుగు భాష సుష్టుగా నేర్చుకొన్నవాడు, సూరి రచనలను వదలలేడు.

పరవస్తు చిన్నయసూరి 1809వ సంవత్సరంలో పెరంబుదూరులో జన్మించాడు. శ్రీనివాసాంబ, వేంకట రంగ రామానుజాచార్యులు వారి తల్లిదండ్రులు.

తెలుగు, తమిళం, సంస్కృతం, ఆంగ్ల భాషలలో సూరి పండితుడు. అక్షర గుచ్ఛము, ఆంధ్రకాదంబరి, పద్యాంధ్ర వ్యాకరణం, నీతిచంద్రిక, సూత్రాంధ్ర వ్యాకరణం, శబ్ద లక్షణ సంగ్రహం మొదలైనవి ఆయన రచనలు.

పాఠకులను ఆకట్టుకొనే రీతిలో ఆయన రచనలు సాగుతాయి. ఆయన రచనలు ప్రాచీన కావ్య భాషలో ఉంటాయి. సూరి రచనల్లో చక్కటి నీతులు ఉంటాయి. లోకజ్ఞానం ఉంటుంది. మంచి పదబంధాలుంటాయి. వ్యాకరణ సూత్రాలకి అనుగుణమైన పదప్రయోగాలు మాత్రమే ఉంటాయి. జంతువులు, పక్షులు ప్రధాన పాత్రలుగా ఉంటాయి. చిన్నయసూరి రచించిన బాలవ్యాకరణం ఈనాటికే కాదు ఏనాటికైనా ప్రామాణిక వ్యాకరణ గ్రంథమే.

చిన్నయసూరి రచనలు చదివితే, ఇంక ఏ గ్రంథాలు చదవకపోయినా, అపారమైన జ్ఞానం కలుగుతుంది. తెలుగు భాషపై మంచి పట్టు సాధించవచ్చును. అందుకే కనీసం చిన్నయసూరిది ‘నీతిచంద్రిక’నైనా ప్రతి తెలుగువాడూ చదవాలి.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 5 ధన్యుడు

ప్రశ్న 5.
హిరణ్యకుడు – ఏకపాత్రాభినయం రాయండి.
జవాబు:
నేను హిరణ్యకుడిని. ఈ చూడకర్ణుడి ఇంట్లో వంటకము బాగా దొరుకుతోంది. బాగా సంపాదించా. నేను ఈ చోటును విడిచిపెట్టను. హాయిగా ఉంటాను.

అరే! ఈ సన్యాసి నా కన్నం తవ్వి నేను దాచినదంతా తీసుకున్నాడు. ఏమి చేయను ? నేను ఇంక ఇక్కడ ఉండడం మంచిది కాదు. అభిమానవంతుడు, ఉంటే ఉన్నతంగా బతకాలి లేదా అడవిలో నివాసం ఉండాలి. అడుక్కు తినడం కంటే చావడం మంచిది. అయినా మరికొంత కాలం ఇక్కడే ఉండి చూస్తా.

అబ్బా! ఎంత దెబ్బ కొట్టాడు ఈ సన్న్యాసి నన్ను. నేను ధనలోభం వల్ల ఈ స్థితి తెచ్చుకున్నా. ధనలోభమే అన్ని ఆపదలనూ తెస్తుంది. ప్రాణికి దుఃఖాలులాగే, సుఖాలు కూడా కోరకుండానే వస్తాయి. ఈ స్థలము నా తాతముత్తాతల కాణాచి కాదు. ఈ సన్న్యాసి దెబ్బలు తినడం కన్న, హాయిగా అడవిలో ఉండడం మంచిది. రాతిలో కప్పను పోషించే దేవుడు, నన్ను రక్షించకుండా ఉండడు.

సరే! నిర్జనారణ్యంలోకి పోతా ! వస్తా?

ప్రశ్న 6.
ధన్యుడు పాఠం ఆధారంగా సూక్తులు తయారుచేయండి.
జవాబు:

  1. ధనము కలవాడే బలవంతుడు – పండితుడు.
  2. ధనము సర్వశ్రేయములకు నిదానము.
  3. దారిద్ర్యము కంటే మరణము మేలు. దారిద్ర్యము సర్వశూన్యము.
  4. మానవంతునికి వనవాసము కంటె సుఖము లేదు.
  5. ఒక మ్రుక్కడిని యాచించుటకంటె, నిప్పులోపడి శరీరము విడుచుట మేలు.
  6. వివేకహీనుడయిన ప్రభువును సేవించుటకంటె, వనవాసము ఉత్తమము.
  7. యాచించుకొని బ్రతుకుటకంటే, మరణము శ్రేయము.
  8. సేవా వృత్తి మానమునువలె యాచనా వృత్తి సమస్త గౌరవమునూ హరిస్తుంది.
  9. ధనలోభము సర్వాపదలకూ మూలము.
  10. ఆశ దిగనాడినవాడే సత్పురుషుడు.
  11. అర్థములు నిత్యములు కావు. యౌవనము ఝరీవేగతుల్యము.
  12. జీవనము బుద్బుదప్రాయము.
  13. అతిసంచయేచ్ఛ తగదు.

10th Class Telugu 5th Lesson ధన్యుడు 1 Mark Bits

1. జ్వలనం అన్ని దిక్కులా వ్యాపించింది – గీత గీసిన పదానికి సరియైన అర్థాన్ని గుర్తించండి. (June 2017)
A) మంట
B) సువాసన
C) దుఃఖం
D) సంతోషం
జవాబు:
A) మంట

2. నా స్నేహితుడు ఉదయం వెళ్లి, సూర్యుడు అస్తమించేటప్పుడు ఇంటికి వచ్చాడు – గీత గీసిన పదాలకు నానార్థ పదాన్ని గుర్తించండి. (June 2017)
A) చంద్రుడు
B) మిత్రుడు
C) పగతుడు
D) ఫలం
జవాబు:
B) మిత్రుడు

3. దేవతలు, రాక్షసులు, పాల కడలి నుండి అమృతమును సాధించారు – గీత గీసిన పదానికి వ్యుత్పత్యర్థాన్ని గుర్తించండి. (June 2017)
A) జీవితాన్నిచ్చేది
B) మరణాన్నిచ్చేది
C) బలాన్నిచ్చేది
D) మరణం పొందింపనిది
జవాబు:
D) మరణం పొందింపనిది

AP SSC 10th Class Telugu Important Questions Chapter 5 ధన్యుడు

4. శివుని మూర్ఖమున గంగ కొలువైనది – (గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.) (March 2017)
A) తల, నెల
B) నెల, శిరస్సు
C) శిరస్సు, చేయి
D) శిరస్సు, తల
జవాబు:
D) శిరస్సు, తల

5. ధీరులు కర్ణము పూర్తి చేసేవరకు విశ్రమించరు – (గీత గీసిన పదమునకు ప్రకృతిని గుర్తించండి.) (March 2017)
A) కార్యము
B) కార్యక్రమం
C) కష్టం
D) కారణం
జవాబు:
A) కార్యము

6. శాస్త్రము అందరికీ సమ్మతమైనది. అందుకే మనం దానిని గౌరవించాలి – గీత గీసిన పదానికి వికృతి రూపం గుర్తించండి. (June 2018)
A) చుట్టము
B) నష్టము
C) చట్టము
D) కష్టము
జవాబు:
C) చట్టము

7. వివరములోని పాము ఆహారం కోసం బయటకు వచ్చింది – అర్థాన్ని గుర్తించండి. (S.A. I – 2018-19)
A) రంధ్రము
B) విషయము
C) పుట్ట
D) నీరు
జవాబు:
A) రంధ్రము

AP SSC 10th Class Telugu Important Questions Chapter 5 ధన్యుడు

8. అనృతమును పలుకుట కంటే మౌనము మేలు – పర్యాయ పదాలు గుర్తించండి. ( S.A. I – 2018-19)
A) అసత్యము, అబద్ధము
B) సత్యము, యథార్థము
C) నిజము, కారణము
D) అసత్యము, అకారణము
జవాబు:
A) అసత్యము, అబద్ధము

9. కింది వానిలో సంభావన పూర్వపద కర్మధారయ సమాసమునకు ఉదాహరణ గుర్తించుము. (S.A. I – 2018-19)
A) తల్లిదండ్రులు
B) ఏడు రోజులు
C) చంపకవతి పట్టణం
D) దైవ ప్రార్థన
జవాబు:
C) చంపకవతి పట్టణం

10. అందుఁ జూడా కర్ణుడను పరివ్రాజకుడు గలడు. (ఆధునిక వచన వాక్యాన్ని గుర్తించండి.) (June 2017)
A) అక్కడ చూడాకరుడు అనే సన్యాసి ఉన్నాడు.
B) అక్కడ చూడాకర్ణుడనే వ్యక్తి ఉన్నాడు.
C) అక్కడ చూడాకర్ణుడనే స్వామి గలడు.
D) అందు చూడాకర్ణుడనే సన్యాసి గలడు.
జవాబు:
A) అక్కడ చూడాకరుడు అనే సన్యాసి ఉన్నాడు.

11. ఆ పరివ్రాజకుడు చెప్పగా విని మిక్కిలి ఖిన్నుడనయితిని – ఈ వాక్యానికి ఆధునిక వచనాన్ని గుర్తించండి. (March 2017)
A) ఆ సన్యాసి చెప్పగా విని చాలా బాధపడ్డాను.
B) ఆ పరివ్రాజకుడు చెప్పగా విని ఖిన్నుడనయ్యానా?
C) ఆ పరివ్రాజకుడు చెప్పగా విని బాధపడలేదు.
D) ఆ సన్యాసి చెప్పగా విని ఖిన్నుడను కాలేదు.
జవాబు:
A) ఆ సన్యాసి చెప్పగా విని చాలా బాధపడ్డాను.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 5 ధన్యుడు

12. జీవనము బుద్బుద ప్రాయము – ఆధునిక వచన వాక్యాన్ని గుర్తించండి. – (June 2018)
A) జీవనము బుద్బుదంతో సమానం కాదు.
B) జీవనం బుద్బుద ప్రాయం.
C) బుద్బుద ప్రాయం జీవనమే.
D) జీవితం బుద్బుదప్రాయమే.
జవాబు:
B) జీవనం బుద్బుద ప్రాయం.

13. అనృతమాడుట కంటె మౌనము మేలు. (ఆధునిక వచన వాక్యాన్ని గుర్తించండి.) (S.A. I – 2018-19)
A) అనృతమాడుట కంటెను మౌనమ్ము మేలు.
B) అనృతం ఆడడం కంటే మౌనం మేలు.
C) అనృతంబాడుట కంటె మౌనము మేలు.
D) అనృతమ్మాడుట కంటె మౌనంబు మేలు.
జవాబు:
B) అనృతం ఆడడం కంటే మౌనం మేలు.

14. ప్రత్యక్ష ఫలం ప్రజాసముదాయం చేత కోరబడదు. (కర్తరి వాక్యం గుర్తించండి) (S.A. I – 2018-19)
A) ప్రజా సముదాయం ప్రత్యక్ష ఫలం కోరింది.
B) ప్రజా సముదాయం ప్రత్యక్ష ఫలమును కోరుతోంది.
C) ప్రజా సముదాయం ప్రత్యక్ష ఫలాన్ని కోరదు.
D) ప్రజా సముదాయం ప్రత్యక్ష ఫలం కోరగలదు.
జవాబు:
C) ప్రజా సముదాయం ప్రత్యక్ష ఫలాన్ని కోరదు.

15. “నాకు వసింప తగదు”, అని హిరణ్యకుడన్నాడు. (పరోక్ష కథనం గుర్తించండి) (S.I. I – 2018-19)
A) తను వసించనని హిరణ్యకుడన్నాడు.
B) తనకు వసింప తగదని హిరణ్యకుడన్నాడు.
C) తనకు వసించడం తగవని హిరణ్యకుడన్నాడు.
D) తనకు వసించుట ఇష్టం లేదని హిరణ్యకుడన్నాడు.
జవాబు:
B) తనకు వసింప తగదని హిరణ్యకుడన్నాడు.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 5 ధన్యుడు

16. చంపకవతి అను పట్టణము గలదు. (ఇది ఏ రకమైన వాక్యమో గుర్తించండి) (S.A. I – 2018-19)
A) సంయుక్త వాక్యం
B) చేదర్థక వాక్యం
C) సామాన్య వాక్యం
D) సామార్థ్యార్థక వాక్యం
జవాబు:
D) సామార్థ్యార్థక వాక్యం

చదవండి – తెలుసుకోండి

భారతదేశం కథా సాహిత్యానికి ప్రసిద్ధిపొందింది. ప్రాచీన కాలం నుండే భారతీయ సాహిత్యంలో ప్రాచుర్యం పొందిన కథలు ఎన్నో ఉన్నాయి. విష్ణుశర్మ అనే పండితుడు అమరశక్తి అనే రాజు కొడుకులను వివేకవంతులను చేయడానికి పంచతంత్ర కథలను బోధిస్తాడు. అవే కథా రూపంలో వ్యాప్తి చెందాయి. వీటిని దాదాపు 200 భాషల్లోకి అనువదించారు.

ఈ పంచతంత్ర కథలు మిత్రలాభం, మిత్రభేదం, కారోలూకీయం (సంధి, విగ్రహం), లబ్దప్రణాశం, అపరీక్షితకారకం (అసంప్రేక్షకారిత్వం) అనే భాగాలుగా ఉన్నాయి. వీటిని తెలుగులోకి అనువదించినవారిలో ముఖ్యులు చిన్నయసూరితో పాటు కందుకూరి వీరేశలింగం. వీరేశలింగం పంతులు సంధి, విగ్రహం అనే భాగాలను తెలుగులోకి అనువదించారు. ఈయన వీటితో పాటు రాజశేఖర చరిత్ర, ఆంధ్రకవుల చరిత్ర అభాగ్యోపాఖ్యానం మొదలైన గ్రంథాలను, శతకాలను, నాటకాలను రాసి గద్య తిక్కనగా ప్రసిద్ధికెక్కాడు. స్త్రీ విద్యావ్యాప్తికి కృషి చేశారు. సంఘసంస్కర్తగా పేరు పొందాడు.

AP SSC 10th Class Telugu Solutions Chapter 12 చిత్రగ్రీవం

AP State Board Syllabus AP SSC 10th Class Telugu Solutions 12th Lesson చిత్రగ్రీవం Textbook Questions and Answers.

AP State Syllabus SSC 10th Class Telugu Solutions 12th Lesson చిత్రగ్రీవం

10th Class Telugu 12th Lesson చిత్రగ్రీవం Textbook Questions and Answers

ఉన్ముఖీకరణ : చదవండి – ఆలోచించి చెప్పండి

రక్తాలు ఓడుతూన్న మా రాస్పెలదార్ గబగబా ఏదో రాసి ఆ కాగితాన్ని నా కాలికి కట్టారు. కట్టి నన్ను వంజరం లోంచి వదలిపెట్టారు. అతని కళ్లల్లో కనిపించిన ఆందోళనను బట్టి, వాళ్ళంతా తీవ్రమైన ఆపదలో ఉన్నారనీ, ముఖ్యస్థావరం నుంచి సత్వర సహాయం ఆశిస్తున్నారనీ అర్థమయింది. వెంటనే కాలికి కట్టిన సమాచార పత్రంతో సహాగాలిలోకి ఎగిరాను. ఎలాగైనా సరే ఘోండ్”వేచి ఉండే ప్రధాన స్థావరం దగ్గరకు చేరుకొని తీరాలన్న తవన. ‘చేరాలి. చేరి తరాలి’ అని మనసులో పదేవదే అనుకొన్నాను. పలికిన ప్రతీసారీ ఆ మాటలు విష్యమంత్రాల్లా నా మనసులో బాగా నాటుకొనిపోయి నాకు నూతన జవసత్త్వాలను అందించసాగాయి. అప్పటికే బాగా పైకి చేరుకొన్నాను. కాబట్టి ఒక్కసారి నాలుగు దిక్కులా కలయజూసి, పడమట దిశను గుర్తుపట్టి ఆ దిశగా ఎగర నారంభించాను. వంకర టింకర మార్గాల్లో పిచ్చిగా ఎగిరి, చిట్టచివరకు గమ్యంచేరి ఘోండ్ చేతిమీద వాలాను. రస్సెల్దార్ అందించిన ఆ సమాచారాన్ని ఘోండ్ గబగబా చదివి, సంతోషంతో దుక్కిటెద్దులా రంకె పెట్టారు. ప్రేమగా నా తల నిమిరారు.

ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
ఈ పేరాలోని మాటలు ఎవరు చెబుతున్నారు?
జవాబు:
ఈ పేరాలోని మాటలు, ఒక పక్షి చెపుతున్నది.

ప్రశ్న 2.
సమాచారాన్ని ఎవరి దగ్గర నుండి ఎవరికి ఆ పక్షి చేర్చింది.
జవాబు:
సమాచారాన్ని రాస్సెల్ దార్ నుండి ఊండకు చేర్చింది.

AP SSC 10th Class Telugu Solutions Chapter 12 చిత్రగ్రీవం

ప్రశ్న 3.
సమాచారాన్ని చేరవేయడానికి ఏ పక్షిని ఉపయోగించి ఉంటారు? ఎందుకు?
జవాబు:
సమాచారాన్ని చేరవేయడానికి పావురాన్ని ఉపయోగించి ఉంటారు. పావురానికి దిశాపరిజ్ఞానం ఉంది. అందువల్ల పావురాన్ని ఉపయోగించి ఉంటారు.

ప్రశ్న 4.
సమాచారాన్ని చేరవేసిన పక్షిలోని గొప్ప లక్షణాలు ఏవి?
జవాబు:
ఎలాగైనా సరే, ఘోండ్ వేచి ఉండే ప్రధాన స్థావరం దగ్గరకు చేరుకొని తీరాలన్న తపన ఆ పక్షిలో ఉంది. ఈ పక్షి రాస్సెల్ దార్ కళ్ళలోని ఆందోళనను గుర్తించింది.

ఇవి చేయండి

I. అవగాహన – ప్రతిస్పందన

ప్రశ్న 1.
“మనుషుల్లాగే పక్షులకు, జంతువులకు కూడా తమ పిల్లలను పెంచడం ఎలాగో తెలుసు” దీనిమీద మీ అభిప్రాయాన్ని తెల్పండి. కారణాలను వివరిస్తూ మాట్లాడండి.
జవాబు:
మనం చదివిన “చిత్రగ్రీవం” కథలో తల్లి పక్షి, తండ్రి పక్షి పిల్ల పక్షికి (చిత్రగ్రీవానికి) ఆహారాన్ని పెట్టాయి. తండ్రి పక్షి, దాని బద్ధకాన్ని పోగొట్టి, ఎగిరేలా చేసింది. ఎగిరేటప్పుడు చిత్రగ్రీవానికి తల్లి సాయపడింది. చిత్రగ్రీవానికి ఆయాసం వచ్చింది. అప్పుడు తల్లి పక్షి, దాన్ని దగ్గరకు తీసుకొని లాలించింది.

లోకంలో పక్షులు తమ పిల్లల రక్షణ కోసం గూళ్లను నిర్మిస్తున్నాయి. పిల్లలు ఎగిరి వాటి ఆహారం తెచ్చుకోనే వరకూ, అవే ఆహారాన్ని పిల్లలకు అందిస్తున్నాయి. జంతువులు తమ పిల్లలకు తాము పాలిచ్చి పెంచుతున్నాయి.

తల్లి కుక్క తన పిల్లలకు పరుగుపెట్టడం, కరవడం, వగైరా నేర్పుతుంది. తమ పిల్లల జోలికి ఇతరులు రాకుండా తల్లి జంతువులు కాపాడతాయి. తమ పిల్లల జోలికి వస్తే ఆవు, గేదె వగైరా జంతువులు తమ కొమ్ములతో పొడుస్తాయి. తమ దూడలు తమ దగ్గరకు రాగానే, అని పొదుగులను చేపి పాలిస్తాయి.

ఇందువల్ల పక్షులకూ, జంతువులకూ తమ పిల్లల్ని పెంచడం తెలుసునని నా అభిప్రాయం.

ప్రశ్న 2.
పాఠం ఆధారంగా కింది పట్టికను పూరించండి. పేరా సంఖ్య

పేరా సంఖ్యపేరాలో వివరించిన ముఖ్యమైన విషయాలుపేరాకు తగిన శీర్షిక
1వ పేరా :
2వ పేరా :
10వ పేరా:
15వ పేరా :
16వ పేరా :

జవాబు:

పేరా సంఖ్యపేరాలో వివరించిన ముఖ్యమైన విషయాలుపేరాకు తగిన శీర్షిక
1వ పేరా :1) కోల్ కతా నగరంలో పిల్లలు పావురాలను బాగా పెంచుతారు.
2) ఎన్నో శతాబ్దాల నుంచి రాజులూ, రాజులూ పావురాలను పెంచుతున్నారు. సామాన్యులు సైతం రంగురంగుల పావురాలను పెంచుతున్నారు.
భారతదేశం – పావురాల పెంపకం
2వ పేరా :మన దేశంలో పావురాలు ఎగురుతూ, కనువిందు చేస్తూ ఉంటాయి. పావురాలు బృందాలుగా ఎగురుతూ ఉంటాయి. అవి ఎంతదూరం ఎగిరి వెళ్ళినా, తిరిగి తమ యజమాని ఇంటికి చేరతాయి. ఇది ఆశ్చర్యంగా ఉంటుంది.
పావురాలకు దిశా జ్ఞానం ఉంది. పావురాలు తమ యజమానులు అంటే ప్రాణం పెడతాయి. వాటికి ఉన్న అంతఃప్రేరణతో అవి యజమాని ఇంటికి చేరతాయి.
పావురాల దిశా పరిజ్ఞానం
10వ పేరా:తల్లి పక్షి గుడ్డులోని శబ్దం వింటుంది. తల్లి పక్షి శరీరంలో స్పందన కనిపిస్తుంది. తల్లి పక్షిలో దివ్యస్పందన కలిగి, రెండు ముక్కుపోట్లతో అది గుడ్డును పగులకొట్టింది. పిల్ల పక్షి బలహీనంగా ఉంటుంది. తల్లి పిల్లను తన రొమ్ములో దాచుకుంటుంది.పావురం గుడ్లను పొదగడం
15వ పేరా :చిత్రగ్రీవం గూటి అంచున కూర్చుంది. అది చీమను ముక్కుతో పొడిచి, దాన్ని రెండు ముక్కలు చేసింది. పావురం చీమను తినే వస్తువు అనుకుంది. నిజానికి చీమ పావురాలకు మిత్రుడు. అందుకే పావురం పశ్చాత్తాపపడింది. పావురం తిరిగి ఆ తప్పు చేయలేదు.పావురం చీమను చంపడం
16వ పేరా :చిత్రగ్రీవానికి వయస్సు ఐదు వారాలు. అది గూటి దగ్గర మూకుడు నుండి నీళ్ళు తాగడం నేర్చుకొంది. ఆహారం కోసం తల్లిదండ్రులమీదే ఆధారపడుతోంది. యాజమాని పెట్టే గింజల్ని గొంతులో పైకి, కిందికీ ఆడిస్తూ తినేది. తాను గొప్పగా తినగలుగుతున్నానని దానికి గర్వంగా ఉండేది. తన చురుకుదనాన్ని తన తల్లిదండ్రులకు చెప్పమన్నట్లు, అది యజమానివైపు చూచేది. కానీ చిత్రగ్రీవం మిగిలిన పావురాలన్నింటి కన్నా మందకొడి.చిత్రగ్రీవం చదువు

3. పాఠం ఆధారంగా కింది ప్రశ్నలకు జవాబులు రాయండి.

అ) చిత్రగ్రీవం ఏ వయస్సులో ఏమేం చేయగలిగిందో రాయండి.
జవాబు:

  1. చిత్రగ్రీవం పుట్టిన రెండో రోజు నుండే, దాని తల్లిదండ్రులు గూటి వద్దకు వచ్చినప్పుడల్లా అది తన ముక్కు తెరచి, తన గులాబీ రంగు శరీరాన్ని బంతివలె ఉబ్బించేది.
  2. చిత్రగ్రీవం, తన మూడు వారాల వయసులో దాని గూటిలోకి వచ్చిన చీమను చూసి తినే వస్తువు అనుకొని తన ముక్కుతో దానిని పొడిచి రెండు ముక్కలు చేసింది.
  3. ఐదోవారంలో చిత్రగ్రీవం తను పుట్టిన గూడు నుండి బయటకు గెంతి, పావురాళ్ల గూళ్ల దగ్గర పెట్టిన మట్టి మూకుడులో నీటిని, తాగగల్గింది.
  4. అదే వయసులో యజమాని ముంజేయి మీద కూర్చుని అరచేతిలో గింజల్ని పొడుచుకు తినేది. చిత్రగ్రీవం గింజలను తన గొంతులో పైకి కిందికి ఆడించి, తర్వాత టక్కున మింగేది.
  5. గాలిదుమారం వచ్చినపుడూ, సూర్యుని కిరణాలు కంటిలో పడినపుడూ, చిత్రగ్రీవం తన కళ్లమీదకు దాని కనురెప్పల పక్కనున్న చర్మపు పొరను సాగదీసి కప్పేది.
  6. చిత్రగ్రీవం ఏడవ వారంలో ఎగరడం నేర్చుకుంది.

ఆ) చిత్రగ్రీవానికి దాని తల్లిపక్షి, తండ్రిపక్షి నుండి ఏమేమి సంక్రమించాయి?
జవాబు:
చిత్రగ్రీవం తల్లి పక్షి నుండి తెలివితేటలు సంపాదించుకుంది. తండ్రి పక్షి నుండి వేగం, చురుకుదనం, సాహసం ‘ సంపాదించుకుంది. తండ్రి పక్షి చిత్రగ్రీవానికి ఎగరడం నేర్పింది. తల్లి పక్షి చిత్రగ్రీవానికి ఎగరడంలో సాయపడింది.

ఇ) చిత్రగ్రీవం గురించి వివరిస్తూ అది సుందరమైనదని, మందకొడిదని, ఏపుగా ఎదిగిందని రచయిత ఎందుకన్నాడు?
జవాబు:
చిత్రగ్రీవం తల్లిదండ్రులు చిత్రగ్రీవం దగ్గరనే ఉండి దాన్ని లాలిస్తూ, దాని బాగోగులు చూస్తూ ఉండడం వల్ల, ఆహారం అందించడంలో శ్రద్ధ తీసుకోవడం వల్ల చిత్రగ్రీవం మహా ఏపుగా పెరిగింది.

చిత్రగ్రీవానికి ఐదోవారం వచ్చింది. అయినా చిత్రగ్రీవం తన ఆహారం కోసం ఇంకా తల్లిదండ్రులమీదే ఆధారపడి ఉంది. అందువల్లే శక్తియుక్తులు పెంపొందించుకోడంలో పావురాలు అన్నింట్లోనూ చిత్రగ్రీవమే మందకొడి అని రచయిత అన్నాడు.

చిత్రగ్రీవం పుట్టిన తర్వాత వారాలు గడిచేకొద్దీ దానికి ఈకలు పెరిగాయి. దానికి ఒక్కసారిగా నిండుగా ఈకలు పెరిగాక, ఆ ఈకలు అతి సుందరమైన రంగులతో నిండాక, అందంలో చిత్రగ్రీవానికి సాటిరాగల పావురం లేదని స్పష్టమయ్యింది.

AP SSC 10th Class Telugu Solutions Chapter 12 చిత్రగ్రీవం

ఈ) చిత్రగ్రీవం గురించి మనకు వివరిస్తున్నది ఎవరు? తాను చేసిన పనికిమాలిన పని అని దేన్ని గురించి చెప్పాడు?
జవాబు:
చిత్రగ్రీవం గురించి మనకు ధనగోపాల్ ముఖర్జీ గారు వివరించారు. ధనగోపాల్ ముఖర్జీ గారు, పావురాల గూళ్లను శుభ్రం చేస్తూ, గూటిలో ఉన్న రెండు గుడ్లనూ పక్క గూట్లో పెట్టారు. మొదటి గూడు శుభ్రం చేయడం పూర్తి అయ్యాక తిరిగి ఒక గుడ్డును గూట్లో పెట్టారు. రెండవ గుడ్డును కూడా ఆ గూట్లో పెడుతుండగా, తండ్రి పావురం ధనగోపాల్ ముఖర్జీ గారి ముఖంపై దాడిచేసింది. ఆయన గుడ్లను దొంగిలిస్తున్నాడని తండ్రి పావురం అనుకుంది. అప్పుడు ముఖర్జీ గారు రెండవ గుడ్డును నేలపై జారవిడిచారు.

పావురం గూడును బాగుచేసేటప్పుడు పావురాలు తనపై దాడిచేస్తాయని ఊహించకపోవడమే ముఖర్జీగారు చేసిన ‘పనికిమాలిన పని’.

ముందే పక్షిదాడి గూర్చి ఊహించి ఉంటే, రెండవ గుడ్డు పగిలిపోయేది కాదు.

ఉ) పిల్లపక్షి నిస్సహాయంగా ఉన్నప్పుడు, గాభరాపడినప్పుడు తల్లిపక్షి ఏం చేసింది?
జవాబు:
తండ్రి పక్షి చిత్రగ్రీవానికి ఎగరడం నేర్పడం కోసం చిత్రగ్రీవాన్ని పిట్టగోడమీద నుండి కిందికి గెంటింది. అప్పుడు చిత్రగ్రీవం నిస్సహాయంగా, రెక్కలు విప్పి గాలిలో తేలింది. అది చూసిన తల్లి పక్షి, చిత్రగ్రీవానికి సాయంగా తానూ ఎగిరింది. ఆ రెండూ ఆకాశంలో పదినిమిషాలు ఎగిరి, గిరికీలు కొట్టి కిందికి వాలాయి. తల్లి పక్షి రెక్కలు ముడుచుకొని శుభ్రంగా కిందికి వాలింది. చిత్రగ్రీవం మాత్రం నేలను రాసుకుంటూ వెళ్లి, రెక్కల్ని టపటపలాడిస్తూ, బాలన్సు చేసుకుంటూ, ముందుకు సాగి ఆగింది.

అప్పుడు తల్లి పక్షి చిత్రగ్రీవం పక్కకు చేరి, దాన్ని ముక్కుతో నిమిరింది. చిత్రగ్రీవం రొమ్ముకు తన రొమ్ము తాకించింది. చిన్నపిల్లాడిని లాలించినట్లు చిత్రగ్రీవాన్ని అది లాలించింది.

ఊ) “ధనగోపాల్ ముఖర్జీ” చేసిన సాహితీసేవ ఏమిటి?
జవాబు:
ధనగోపాల్ ముఖర్జీ గారు జంతువులకు సంబంధించిన తొమ్మిది పిల్లల పుస్తకాలు రాశారు. వీటిలో 1922లో ఆయన రాసిన “కరి ది ఎలిఫెంట్”, 1924లో రాసిన “హరిశా ది జంగిల్ ల్యాడ్” 1928లో రాసిన “గోండ్ ది హంటర్”, పుస్తకాలు బాగా ప్రాచుర్యం పొందాయి.

ఈయన రాసిన చిత్రగ్రీవం పుస్తకం 1928లో న్యూ బెరీ మెడల్‌ను గెల్చుకుంది. బాలసాహిత్యంలో విశిష్ట కృషి చేసిన వారికి “అమెరికన్ లైబ్రరీ అసోసియేషన్” వారు ఇచ్చే విశిష్ట పురస్కారమే ఈ “న్యూ బెరీ మెడల్”. ఈ బహుమతిని గెల్చుకున్న ఏకైక భారతీయ రచయిత మన ముఖర్జీ గారే.

4. కింది పేరా చదవండి. సరైన వివరణతో ఖాళీలు పూరించండి.

చాతకపక్షుల ముక్కులు చాలా చిన్నవి. తాము ఎగురుతూనే గాలిలోని కీటకాలను పట్టుకోగలవు. నోరు బార్లా తెరచి తమవైపుకు వచ్చే చాతకపక్షుల బారి నుండి కీటకాలు తప్పించుకోవడం దాదాపు అసాధ్యం. చాతకపక్షులు పరిమాణంలో చాలా చిన్నవి. వాటికి బరువులెత్తే సామర్థ్యం కూడా తక్కువే! అందుకే అవి వాటి గూళ్ళ నిర్మాణంలో గడ్డీగాదం, పీచూపత్తి, సన్నపాటి చెట్టురెమ్మలు… వంటి తేలికపాటి వస్తువులనే వాడతాయి. వాటి కాళ్ళు పొట్టిగా ఉంటాయి. పొడవాటి కాళ్ళున్న పక్షుల్లో ఉండే చురుకుదనం వీటి కాళ్ళల్లో కనిపించదు. అందుకని ఇవి గెంతడం, దభీమని దూకడం వంటి పనులు చెయ్యలేవు. ఐతే వాటి కొక్కేల్లాంటి కాలివేళ్ళ పుణ్యమా అని అవి తమ గోళ్ళతో ఎలాంటి జారుడు ప్రదేశాల్లోనైనా అతుక్కుపోయి ఉండిపోగలవు. కాబట్టి అవి అనితరసాధ్యమైన నైపుణ్యంతో, కుశలతతో పాలరాతి వంటి నున్నటి గోడల్ని, ప్రదేశాలను పట్టుకొని వెళ్ళగలవు. తమ గూళ్ళను నిర్మించుకోవడానికి ఇళ్ళ చూరుల దిగువన గోడల్లోని తొర్రలను ఎన్నుకొంటాయి. రాలిన ఆకుల్నీ, గాలిలో ఎగిరే గడ్డిపోచల్ని ముక్కున కరచుకొని గూట్లోకి చేరుస్తాయి. వాటిని తమ లాలాజలాన్ని జిగురులా వాడి గూటి ఉపరితలం మీద అతికిస్తాయి. వాటి లాలాజలం ఓ అద్భుత పదార్థం. అది ఎండి గట్టిపడిందంటే మామూలుగా వాడే ఏ జిగురూ దానికి సాటిరాదు. ఇదీ చాతకపక్షుల వాస్తుకళానైపుణ్యం.

అ) చాతకపక్షులు తేలికపాటి వస్తువులతో గూళ్ళను నిర్మించుకుంటాయి. ఎందుకంటే …………………….
జవాబు:
చాతకపక్షులు తేలికపాటి వస్తువులతో గూళ్ళను నిర్మించుకుంటాయి. ఎందుకంటే వాటికి బరువులెత్తే సామర్థ్యం తక్కువ.

ఆ) చాతకపక్షులు దభీమని దూకడం, గెంతడం చెయ్యలేవు. ఎందుకంటే ……………………………
జవాబు:
చాతకపక్షులు దభీమని దూకడం, గెంతడం కూడా చెయ్యలేవు. ఎందుకంటే వాటి కాళ్ళు పొట్టిగా ఉంటాయి.

ఇ) నున్నటి గోడలు, ప్రదేశాల్లో కూడా చాతకపక్షులు జారకుండా ఉండడానికి కారణం ………………….
జవాబు:
నున్నటి గోడలు, ప్రదేశాల్లో కూడా చాతకపక్షులు జారకుండా ఉండడానికి కారణం వాటికి ఉన్న కొక్కేల్లాంటి కాలివేళ్ళు.

ఈ) చాతకపక్షుల లాలాజలం వాటి గూటి నిర్మాణంలో ఎంతో ముఖ్యమైంది. ఎందుకంటే ………………
జవాబు:
చాతకపక్షుల లాలాజలం, వాటి గూటి నిర్మాణంలో ఎంతో ముఖ్యమైనది. ఎందుకంటే వాటి లాలాజలం ఎండి గట్టిపడిందంటే మామూలుగా వాడే ఏ జిగురూ దానికి సాటిరాదు.

ఉ) వాస్తు కళా నైపుణ్యం అంటే …………..
జవాబు:
వాస్తు కళానైపుణ్యం అంటే ఇళ్ళను నిర్మించే విద్యలో నేర్పరిదనం.

II. వ్యక్తి కరణ-సృజనాత్మకత

1. కింది ప్రశ్నలకు ఆలోచించి ఐదేసి వాక్యాల్లో సమాధానాలు రాయండి.

అ) చిత్రగ్రీవాన్ని గురించి మీకు ఆశ్చర్యం కలిగించిన విషయాలు ఏవి?
జవాబు:
చిత్రగ్రీవం తనకు మూడు వారాల వయస్సు ఉన్నప్పుడు తన గూట్లోకి వచ్చిన నల్ల చీమను ముక్కుతో పొడిచి రెండు ముక్కలు చేసింది. అయితే ఆ చీమ దానికి తినడానికి పనికిరానిది. ఆ విషయం గ్రహించిన చిత్రగ్రీవం తన జీవితంలో మళ్ళీ ఎప్పుడూ మరో చీమను చంపలేదు.

తాను చేసిన పని పొరపాటు అని గ్రహించిన పావురం తిరిగి ఆ తప్పును తిరిగి చేయకపోవడం, నాకు ఆశ్చర్యం కల్గించింది.

ఆ) మానవులను పావురాలకు మిత్రులూ, సహచరులని రచయిత ఎందుకు అన్నాడు?
జవాబు:
“ఏనుగులు, పావురాలు తమ తమ యజమానుల పట్ల గొప్ప విశ్వాసాన్ని ప్రదర్శిస్తాయి. వీటిని మించి యజమాని పై విశ్వాసాన్ని ప్రదర్శించే ప్రాణిని తాను చూడలేదని రచయిత చెప్పాడు.

అడవులలోని ఏనుగులు, నగరాల్లోని పావురాలు తమ యజమానులంటే ప్రాణం ఇస్తాయి. అవి రోజంతా ఎక్కడెక్కడ తిరిగినా, ఏ ఆకాశ సీమలో ఎగిరినా, చివరకు అవి వాటికి ఉన్న అద్భుతమైన ‘అంతఃప్రేరణాబలం’తో తమ మిత్రుడూ, సహచరుడూ అయిన మానవుడి పంచకే చేరుతాయి”.

అందువల్లనే రచయిత, మానవులను పావురాలకు మిత్రులు, సహచరులు అని అన్నాడు.

AP SSC 10th Class Telugu Solutions Chapter 12 చిత్రగ్రీవం

2. కింది ప్రశ్నలకు ఆలోచించి పదేసి వాక్యాల్లో సమాధానాలు రాయండి.

అ) చిత్రగ్రీవాన్ని గురించి మీ సొంతమాటల్లో వర్ణించండి.
జవాబు:
‘చిత్రగ్రీవం’ అనేది ఒక పావురం. దానిని తల్లి పక్షి, తండ్రి పక్షి అనురాగంగా పెంచాయి. తల్లిదండ్రుల శ్రమ, శ్రద్ధ వల్ల చిత్రగ్రీవం మహా ఏపుగా పెరిగింది. దానికి గులాబీరంగు మారి తెలుపురంగు వచ్చింది. ముళ్ళపందిలాంటి ఈకలు వచ్చాయి. దాని కళ్లు దగ్గర, నోటి దగ్గర ఉన్న, పసుపు పచ్చని చర్మాలు రాలిపోయాయి. పొడవాటి, గట్టిపాటి సూదిలాంటి ముక్కు ఏర్పడింది.

పుట్టిన ఐదోవారానికి చిత్రగ్రీవం గూడు నుండి బైటికి గెంతి, మూకుళ్లలో నీళ్ళు త్రాగేది. చిత్రగ్రీవం మందకొడిగా ఉండేది.. మూడు నెలల వయస్సు రాగానే, దాని ఒళ్ళంతా సముద్రపు నీలిరంగు ఈకలు ధగధగా మెరిశాయి. దాని మెడ ప్రాంతం, సూర్యకాంతిలో ఇంద్రధనుస్సు వర్ణాల పూసల గొలుసులా శోభిల్లింది. తండ్రి పక్షి చిత్రగ్రీవానికి ఎగరడం బలవంతంగా నేర్పింది. ఎగరడంలో అలసిన చిత్రగ్రీవాన్ని తల్లి పక్షి లాలించింది.

చిత్రగ్రీవానికి నిండుగా ఈకలు పెరిగాయి. ఆ ఈకలు అతి సుందరమైన రంగులతో నిండాయి. అందుకే, చిత్రగ్రీవానికి సాటిరాగల పావురం లేదు.

ఆ) శిశువుల పెంపకంలో పక్షులకు, మానవులకు మధ్య ఉన్న సామ్యాలను రాయండి.
(లేదా)
పిల్లల పెంపకంలో పక్షులకు, మానవులకు మధ్యగల పోలికలను వివరంగా సొంతమాటలలో పాఠ్యభాగం ఆధారంగా రాయండి.
జవాబు:
చంటిపిల్లల నోటికి తల్లి తన పాలను అందించినట్లే, పక్షిపిల్లల నోటికి తల్లి పక్షి, తండ్రి పక్షి ఆహారాన్ని అందిస్తాయి. పిల్లలకు తల్లి మంచి పక్కను ఏర్పాటు చేసినట్లే, పక్షి పిల్లలకు, తల్లి పక్షి, తండ్రి పక్షి ఆచితూచి గూట్లో వస్తువులను ఉంచి, పిల్లపక్షికి సుఖసౌకర్యాలను కల్పిస్తాయి.

తల్లి పిల్లలకు పదార్థాలను ఉడకపెట్టి, మెత్తగా చేసి, నోట్లో పెడుతుంది. అలాగే తల్లి పక్షి, తండ్రి పక్షి గింజల్నీ, విత్తనాల్నీ కాసేపు తమ నోటిలో నాననిచ్చి, మెత్తపరచి ఆ తర్వాతనే పక్షిపిల్లల నోట్లో పెడతాయి.

తల్లిదండ్రులు పిల్లలకు పాకడం, లేచి నిలబడడం, నడవడం నేర్పుతారు. వారు పిల్లల చేతులను పట్టుకొని జాగ్రత్తగా వారికి నడపడం నేర్పుతారు. అప్పుడప్పుడు పిల్లలు నడుస్తూ పరుగు పెడుతూ పడిపోతారు. అప్పుడు తల్లిదండ్రులు పిల్లలను దగ్గరకు తీసుకొని లాలిస్తారు.

చిత్రగ్రీవానికి తండ్రి ఎగరడాన్ని అలాగే నేర్పింది. బలవంతంగా చిత్రగ్రీవాన్ని తండ్రి పక్షి, ఆకాశంలోకి తోసింది. దానితో అప్రయత్నంగా రెక్కలు విప్పి చిత్రగ్రీవం ఎగిరింది. ఎగరడంలో అది అలిసిపోగా, తల్లి పక్షి చిత్రగ్రీవాన్ని లాలించింది.

ఈ విధంగా చిత్రగ్రీవం పెంపకానికీ, పిల్లల పెంపకానికి పోలికలు ఉన్నాయి.

3. సృజనాత్మకంగా/ప్రశంసిస్తూ రాయండి.

అ) ‘చిత్రగ్రీవం’ అనే పావురంపిల్ల ఎలా పుట్టిందీ ఎలా ఎగరడం నేర్చుకొన్నదీ తెలుసుకున్నారు కదా! అట్లాగే మీకు తెలిసిన లేదా మీ పరిసరాల్లోని ఏదైనా పక్షి / జంతువు గురించి మీరు కూడా ఒక కథనాన్ని రాయండి. (ఈ పాఠంలాగా).
జవాబు:

“ధోనీ” (కుక్కపిల్ల)

మా పక్క ఇంటివాళ్ళకూ కుక్కపిల్లలంటే మహాప్రేమ’. తనను పెంచుకుంటున్న యజమానిపై విశ్వాసం చూపడంలో కుక్కను మించిన జంతువు కనబడదు. మా పక్కింటి అబ్బాయి ఒక కుక్కను పెంచుకోవాలని ఆశపడుతున్నాడు.

వాళ్ళింట్లో ఒక కుక్క గర్భవతిగా ఉంది. ఒక రోజున దానికి మూడు పిల్లలు పుట్టాయి. అందులో ఒక పిల్ల అందంగా. తెల్లగా పాలరంగులో ఉంది. దానికి మంచి బొచ్చు ఉంది. దాన్ని చూస్తే ముద్దుగా ఉంది. దానికి ధోనీ అని పేరు పెట్టాలని ఆ పిల్లవాడి ఆశ. ఆ పిల్లాడు ఇంజనీరింగ్ చదువుతున్నాడు. క్రికెట్ అంటే బాగా ఇష్టం. అందుకే ముద్దు వచ్చే ఆ కుక్క పిల్ల ధోనీగా మారింది.

ఆ ధోనీ అంటే దాని తల్లికి బాగా ఇష్టం. ధోనీకి తల్లి కుక్క కడుపునిండా పాలిచ్చేది. ధోనీ తోకను ఊపుతూ కులాసాగా మా వీధిలో తిరుగుతూ ఉంటుంది. ‘ధోనీ’ అంటే మా వీధి వాళ్ళంతా ఇష్టపడతారు. దానికి మా పక్కింటబ్బాయి స్నానం చేయించి పాలు, బిస్కెట్లు, కోడిగుడ్లు, మాంసం పెడతాడు. ధోనీ క్రమంగా టైగర్ లా పెరిగింది.

ఒక రోజున ‘ధోనీ’ వాళ్ళింట్లోకి అడుగుపెడుతూ ఉన్న దొంగపై దూకి అతని పిక్క పట్టుకొంది. అది చూసిన మా పక్కింటి అబ్బాయి ‘ధోనీ’ అని ప్రేమగా పిలిచాడు. అంతే! దొంగను వదలి తోక ఊపుకుంటూ, ఆ అబ్బాయి దగ్గరకు అది పరుగుపెట్టింది. ‘ధోనీ’ని పోలీసు కుక్కగా చేయాలని మా పక్కింటి అబ్బాయి చూస్తున్నాడు.

ఆ) ఈ మధ్యకాలంలో సెల్ ఫోన్ టవర్ల నుండి వచ్చే వేడిమికి కొన్ని పక్షిజాతులు అంతరించిపోతున్నాయి. అలాగే ఎండాకాలంలో తీవ్రమైన వేడికి తాళలేక, తాగడానికి నీరు అందక, మృత్యువాతపడుతున్నాయి. పక్షులు ఇందుకోసం తమను కాపాడడానికి తగిన చర్యలు చేపట్టమని తమ తోటకు వచ్చిన పిల్లలతో సంభాషించాయి అనుకోండి. ఆ పిల్లలకూ, పక్షులకూ మధ్య జరిగే సంభాషణను ఊహించి రాయండి.
జవాబు:
“తోటలో మిత్రులు – పక్షులతో సంభాషణ”
రాము : ఓరేయ్ గోపాల్! పూలమీద తూనీగలు ఎగిరేవి కదా! ఇప్పుడు కనబడడం లేదేం?

గోపాల్ : ఈ మధ్య పక్షి జాతులు అనేక రకాలుగా నశిస్తున్నాయని అంటున్నారు కదా!

పిచ్చుక : బాబుల్లారా! మీ దృష్టి మా మీద పడింది. సంతోషము. మా పక్షులు ఎలక్ట్రిక్ తీగల మీద వాలితే చచ్చిపోతున్నాయి. రోజూ ఎన్ని కాకులూ, చిలుకలూ, గోరింకలూ అలా చస్తున్నాయో ! మీకు తెలుసా?

రాము : నిజమే. పక్షులు అంతరిస్తే, మన పర్యావరణం దెబ్బ తింటుంది కదా! మరేం చేయాలి?

చిలుక : నాయనా ! మీ పెరళ్ళలో జామ చెట్లు లేవు. మామిడి చెట్లు, సపోటాలు, సీతాఫలాల చెట్లూ లేవు. మేము ఏమి తిని బ్రతకాలి?

గువ్వ : నాయనా! మాకు తాగడానికి నీళ్ళు దొరకడం లేదు. మీరు చెరువులు పూడ్చివేస్తున్నారు. నూతులు కప్పివేస్తున్నారు. గ్రామాలలో మేము బతికే దారే లేదు.

గోరింక : గాలిలో హాయిగా ఎగురుదామంటే, ఈ సెల్ ఫోను టవర్లు, టి.వి. టవర్లు అడ్డుగా ఉంటున్నాయి. ఆ తరంగాల ప్రభావంతో మేము చస్తున్నాము.

గోపాల్ : మీరు చెప్పే మాటలు వింటూంటే భయంగా ఉంది. ఇంక మేము మీ పక్షులను టి.వి.ల్లోనే చూడాలేమో!

పక్షులు : మేము హాయిగా తిరగడానికి మీ గ్రామాల్లో చెట్లు పాతండి. చెరువులు, కాలువలూ పూడ్చి వేయకండి. మీ మీ పెరళ్లలో పూలమొక్కలూ, పండ్ల మొక్కలు పెంచండి.

రాము, గోపాల్: సరే. మీరు మాకు ఎన్నో విషయాలు చెప్పారు. తప్పకుండా పక్షులను రక్షించే కేంద్రాలను గురించి మా పెద్దలతో మాట్లాడతాం.

పక్షులు : మంచిది. కృతజ్ఞతలు.

భాషా కార్యకలాపాలు ప్రాజెక్టు పని

1. “ధనగోపాల్ ముఖర్జీ” రాసిన “చిత్రగ్రీవం ఓ పావురం కథ” అనే పుస్తకాన్ని లేదా పక్షుల గురించి తెలిపే ఏదైనా ఒక పుస్తకాన్ని గ్రంథాలయం నుండి చదవండి. మీరు తెలుసుకున్న వివరాలు రాసి ప్రదర్శించండి.
(లేదా)
అంతర్జాలం ద్వారా ఏవైనా రెండు పక్షుల వివరాలు, వాటి చిత్రాలు సేకరించి, రాసి ప్రదర్శించండి.
జవాబు:
అ) చిలుక: ఇది అందంగా ఉంటుంది. దీనిని పెంచుకుంటారు. ఇవి రెండు రకాలు.
1) చిలుకలు
2) కాక్కటూ
చిలుకలకు బలమైన వంకీ తిరిగిన ముక్కు, బలమైన కాళ్ళు ఉంటాయి. కొన్ని పంచరంగుల చిలుకలు ఉంటాయి. ఇవి పరిమాణంలో 3.2 నుండి 10 అం|| పొడవు వరకూ ఉంటాయి. ఇవి గింజలు, పండ్లు మొగ్గలు, చిన్న మొక్కలను తింటాయి. కొన్ని జాతుల చిలుకలు పురుగుల్ని తింటాయి. చిలుకలు చెట్టు తొట్టెలలో గూళ్లు కట్టుకుంటాయి.

ఇవి తెలివైన పక్షులు. ఇవి మనుష్యుల గొంతును పోలి మాట్లాడతాయి. పెంపుడు జంతువుల వ్యాపారం, వేట, పోటీ, కారణాల వల్ల ఇవి తొందరగా అంతరించిపోతున్నాయి. జ్యోతిషంలో చిలుక ప్రధాన పాత్ర వహిస్తుంది. పల్లెలలో సైతం చిలుక జోస్యం చెప్పేవారు కనిపిస్తారు.

ఆ) పిచ్చుక :
ఇది చిన్న పక్షి. ఇవి చిన్నగా, బొద్దుగా గోధుమ – ఊదా రంగుల్లో ఉంటాయి. చిన్న తోకతో పొట్టిగా ఉండే బలమైన ముక్కు కలిగి ఉంటాయి. పిచ్చుకలలో పెద్దగా తేడాలుండవు. ఇవి గింజలను తింటాయి. కొన్ని చిన్న చిన్న క్రిమి కీటకాలను తింటాయి. కొండపిచ్చుకలు పట్టణాల్లో నివసించి ఏదైనా తింటాయి. ఇది 4.5′ నుండి 7′ వరకు పొడవు ఉంటుంది. పిచ్చుకలు శరీర నిర్మాణంలో గింజలను తినే పక్షులలాగే ఉంటాయి. నాలుకలో ఒక ఎముక అధికంగా ఉంటుంది.

ప్రాచీన పిచ్చుకలు యూరప్, ఆఫ్రికా, ఆసియాలో విస్తరించాయి. జీవనశైలిలో పెద్దవేగంగా వచ్చిన మార్పు, పిచ్చుకపై బ్రహ్మాస్త్రంగా పరిణమించింది. పచ్చదనం అంతరించిపోవడం, రసాయనాలతో పళ్ళు, ఆహారధాన్యాల ఉత్పత్తి వల్ల పిచ్చుకలు అంతరిస్తున్నాయి. సెల్యూలర్ టవర్ల నుండి వచ్చే అయస్కాంత కిరణాలు, ఆ జాతికి ముప్పుగా పరిణమించాయి.

AP SSC 10th Class Telugu Solutions Chapter 12 చిత్రగ్రీవం

2. “చిత్రగ్రీవం” అనే పక్షి పేరు పంచతంత్ర కథలో కూడా ఉంది. పంచతంత్రం కథల పుస్తకం చదవండి. మీరు చదివిన కథ రాసి ప్రదర్శించండి.
జవాబు:
పంచతంత్ర కథల్లో చిత్రగ్రీవుడి కథ
‘చిత్రగ్రీవుడు’ పావురాల రాజు, అతగాడు తన పావురాలతో ఆకాశంలో తిరుగుతున్నాడు. గోదావరీ తీరంలో ఒక మర్రిచెట్టు ఉంది. ఒక బోయవాడు వచ్చి ఆ చెట్టు దగ్గరలో నూకలు చల్లి దానిమీద వల వేశాడు. “పక్షులు నూకల కోసం వలమీద వాలతాయి. వాటిని పట్టుకొని అమ్ముకుందాం” అనుకున్నాడు.

ఆ చిత్రగ్రీవుడితో ఎగురుతున్న పావురాలు ఆ నూకలను చూశాయి. అవి నేలమీద వాలి, నూకలను తిందామనుకున్నాయి. “ఇది మనుష్యుల సంచారం లేని అడవి. ఈ నూకలు ఇక్కడకు ఎందుకు వస్తాయి ? కాబట్టి ఈ నూకలకు ఆశపడకండి” అని చిత్రగ్రీవుడు స్నేహితులకు చెప్పాడు. ఒక ముసలి పావురం చిత్రగ్రీవుడి మాటలు కాదంది. నూకలు తిందామంది. సరే అని పావురాలు కిందికి దిగాయి. వలలో చిక్కుకున్నాయి.

పావురాలు ముసలి పావురాన్ని తిట్టాయి. చిత్రగ్రీవుడు “తిట్టకండి. మనం అంతా కలసి ఎగిరిపోదాం. నాకో స్నేహితుడు ఉన్నాడు. మనల్ని రక్షిస్తాడు” అని చెప్పింది. పావురాలు అన్నీ కలసి వల ఎత్తుకొని, చిత్రగ్రీవుడి స్నేహితుడు హిరణ్యకుడు అనే ఎలుక ఉండే కన్నం దగ్గర వాలాయి. హిరణ్యకుణ్ణి చిత్రగ్రీవుడు గొంతెత్తి పిలిచాడు. హిరణ్యకుడు స్నేహితుని మాట విని పావురాల బంధాలన్నీ తన పళ్లతో కొరికివేశాడు. పావురాలు చిత్రగ్రీవుణ్ణి, హిరణ్యకుణ్ణి మెచ్చుకున్నాయి. అందుకే మనందరికీ మంచి స్నేహితులు ఉండాలి.

III. భాషాంశాలు

పదజాలం

1. కింది పదబంధాలను ఉపయోగించి సొంతవాక్యాలు రాయండి.

అ) శ్రద్ధాసక్తులు
జవాబు:
వాక్యం : విజయం సాధించాలంటే పనిలో శ్రద్ధాసక్తులు చూపించాలి.

ఆ) ప్రేమ ఆప్యాయతలు
జవాబు:
వాక్యం : తల్లిదండ్రులు తమ పిల్లలపై ప్రేమ, ఆప్యాయతలు కురిపించాలి.

ఇ) వన్నెచిన్నెలు
జవాబు:
వాక్యం : మా ఆవుదూడ వన్నెచిన్నెలు చూసి నేను మురిసిపోతాను.

ఈ) సమయసందర్భాలు :
జవాబు:
వాక్యం : సమయసందర్భాలు లేకుండా హాస్యంగా మాట్లాడడం నాకు నచ్చదు.

ఉ) హాయిసౌఖ్యాలు
జవాబు:
వాక్యం : తల్లిదండ్రులు, బిడ్డల హాయిసౌఖ్యాల గురించి శ్రద్ధ పెట్టాలి.

2. కింది పదాలను వివరించి రాయండి.

అ) విజయవంతం కావడం అంటే
జవాబు:
విజయవంతం కావడం అంటే తాను ప్రారంభించిన పని ఏ విఘ్నమూ లేకుండా పూర్తి అవడం.

ఆ) ఉలుకూ పలుకూ లేకపోవడం అంటే
ఉలుకూ పలుకూ లేకపోవడం అంటే ఎవరు ఏమి మాట్లాడినా, తన మనస్సులో ఏమి ఉన్నా, పైకి మాత్రం మాట్లాడకుండా, నోరు మూసుకు కూర్చోడం.

AP SSC 10th Class Telugu Solutions Chapter 12 చిత్రగ్రీవం

3. కింద తెలిపిన వాటిని గురించి పాఠంలో ఏఏ పదాలతో వర్ణించారు?
అ) గద్దింపులు : కువకువ కూయడం
ఆ) పావురాలు : రకరకాల రంగురంగుల పావురాలు
ఇ) గువ్వలు : నీలికళ్లతో కువకువలాడడం
ఈ) పావురాల గుంపు : పెనుమేఘాలు
ఉ) పావురం మెడ : హరివిల్లు
ఊ) పుట్టిన పిల్లపక్షి : బలహీనమైన, నిస్సహాయమైన, అర్భకమైన
ఋ) చిత్రగ్రీవం ముక్కు : పొడవాటి, గట్టిపాటి, సూదిలాంటి బలమైన
ఎ) చిత్రగ్రీవం ఒళ్ళు : సముద్రపు నీలిరంగు
ఏ) చిత్రగ్రీవం మెడ ప్రాంతం : ఇంద్రధనుస్సు వర్ణాల పూసల గొలుసులా

వ్యాకరణాంశాలు

1. కింది అలంకారాల లక్షణాలు రాయండి. అ) శ్లేష
జవాబు:
లక్షణం : అనేకమైన అర్థాలు గల శబ్దాలను ఉపయోగించి చెబితే ‘శ్లేష’ అనబడుతుంది.
ఉదా :
1) రాజు కువలయానందకరుడు
2) మానవ జీవనం సుకుమారం

ఆ) అర్ధాంతరన్యాసం :
జవాబు:
లక్షణం : విశేష విషయాన్ని, సామాన్య విషయంతో కాని, సామాన్య విషయాన్ని విశేష విషయంతో కాని సమర్థించి చెప్పడం. దీన్ని “అర్థాంతరన్యాసాలంకారం’ అంటారు.
ఉదా :
1) హనుమంతుడు సముద్రాన్ని దాటాడు. మహాత్ములకు సాధ్యం కానిది లేదు కదా!
2) మేఘుడు అంబుధికి పోయి జలం తెచ్చి ఇస్తాడు. లోకోపకర్తలకు ఇది సహజగుణం.

2. కింది ఛందోరీతుల లక్షణాలు రాయండి.
అ) సీసం
జవాబు:
సీసం – (లక్షణం ) :
1) సీసంలో నాల్గు పాదాలుంటాయి. ప్రతిపాదం 2 భాగాలుగా ఉంటుంది. పాదంలోని రెండు భాగాల్లోనూ, ఒక్కొక్క భాగంలో 4 గణాల చొప్పున ఉంటాయి. మొత్తం పాదంలోని 8 గణాల్లో, ఆరు ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు క్రమంగా ఉంటాయి.
2) యతి పాదంలోని రెండు భాగాల్లోనూ మూడవ గణం మొదటి అక్షరంతో సరిపోతుంది. యతిలేనిచోట ప్రాసయతి చెల్లుతుంది.
3) సీసంలోని నాల్గు పాదాల తరువాత, ఒక తేటగీతి కాని లేక ఆటవెలది గాని తప్పనిసరిగా ఉంటుంది.
ఉదా :
సీ|| “హరిహర బ్రహ్మలఁ బురిటి బిడ్డలఁజేసి జోలఁ బాడిన పురంద్రీలలామ”

గమనిక :
పై పద్యంలో రెండు చోట్ల ప్రాస యతులు.

ఆ) ఆటవెలది
జవాబు:
ఆటవెలది – (లక్షణం ) :

  1. ఇది ‘ఉపజాతి’ పద్యం.
  2. ఈ పద్యానికి నాలుగు పాదాలు ఉంటాయి.
  3. 1, 3 పాదాల్లో వరుసగా మూడు సూర్యగణాలు, రెండు ఇంద్రగణాలు ఉంటాయి. .
  4. 2, 4 పాదాల్లో వరుసగా ఐదు సూర్యగణాలు ఉంటాయి.
  5. ప్రతిపాదంలోనూ నాల్గవ గణంలోని మొదటి అక్షరంతో యతి. యతిలేని చోట “ప్రాసయతి” ఉంటుంది.
  6. ప్రాసనియమం పాటించనవసరంలేదు.
    ఉదా :
    ఆ||వె : “పొదలి పొదలి చదల బొంగారి పొంగారి
    మించి మించి దిశల ముంచి ముంచి”

ఇ) తేటగీతి
జవాబు:
తేటగీతి – (లక్షణం ) :
1) ఇది ‘ఉపజాతి’ పద్యం.
2) ఈ పద్యానికి నాలుగు పాదాలు ఉంటాయి.
3) ప్రతి పాదానికి వరుసగా 1 సూర్య, 2 ఇంద్ర, 2 సూర్య గణాలు ఉంటాయి.
4) నాలుగవ గణం మొదటి అక్షరం యతి. ప్రాస యతి కూడా వేయవచ్చు.
5) ప్రాసనియమం లేదు.
AP SSC 10th Class Telugu Solutions Chapter 12 చిత్రగ్రీవం 1

3. కింది వాక్యాలలోని అలంకారాన్ని గుర్తించండి.

అ) శ్రీమంత్ చొక్కా మల్లెపూవులా తెల్లగా ఉంది.
జవాబు:
ఈ వాక్యంలో ‘ఉపమాలంకారం’ ఉంది. ఈ

ఉపమాలంకార లక్షణం :
ఉపమాన, ఉపమేయాలకు చక్కని పోలిక చెప్పడం ‘ఉపమాలంకారం’.

సమన్వయం : ఇందులో 1) ఉపమానం, 2) ఉపమేయం, 3) ఉపమావాచకం, 4) సమానధర్యం ఉంటాయి.

పై ఉదాహరణలో
1) మల్లెపూవు (ఉపమానం)
2) చొక్కా (ఉపమేయం)
3) వలె (ఉపమావాచకం)
4) తెల్లగా ఉంది (సమానధర్మం )

4. కింది పద్యపాదాలు పరిశీలించండి.
AP SSC 10th Class Telugu Solutions Chapter 12 చిత్రగ్రీవం 2
గమనిక :
పై పద్యంలో గగ, భ, జ, స, అనే గణాలు వాడబడ్డాయి. ఒకటవ, మూడవ పాదాల్లో మూడేసి గణాలు ఉన్నాయి. రెండవ, నాల్గవ పాదాల్లో ఐదేసి గణాలున్నాయి.
ఒకటి, రెండు పాదాలు కలిసి మొత్తం 8 గణాలు (3 + 5 = 8)
రెండు, నాల్గు పాదాలు కలిసి మొత్తం 8 గణాలు (3 + 5 = 8)
ఒకటి, రెండు పాదాలు కలిపిన | రెండు, నాల్గు పాదాలు కలిపిన | గణాలలో,| 8 గణాలలో, ఆరవ గణం ‘జగణం’ ఉంది.
రెండు, నాల్గు పాదాల చివరి అక్షరం ‘గురువు’ ఉంది.
ఇలాంటి లక్షణాలు కల పద్యాన్ని “కందపద్యం” అంటారు.

కందము :
పద్య నియమాలు తెలిసికొందాం.

  1. ఈ పద్యంలో గగ, భ, జ, స, నల అనే గణాలు ఉంటాయి.
  2. మొదటి పాదం లఘువుతో మొదలయితే, అన్ని పాదాల్లో మొదటి అక్షరం లఘువు ఉండాలి. గురువుతో మొదటి పాదం మొదలయితే, అన్ని పాదాల మొదటి అక్షరం గురువు ఉండాలి.
  3. రెండు, నాల్గవ పాదాలలోని చివరి అక్షరం గురువుగానే ఉంటుంది.
  4. 1, 2 పాదాల్లో (3 + 5 = 8 గణాలు); 3, 4 పాదాల్లో (3 + 5 = 8) గణాలు ఉంటాయి. ఈ 8 గణాల్లో ఆరవ గణం తప్పక నలం కాని, జగణం కాని కావాలి.
  5. 2, 4 పాదాల్లో యతి ఉంటుంది. నాల్గవ గణం మొదటి అక్షరానికి, ఏడవ గణం మొదటి అక్షరానికి యతి ఉండాలి.
  6. ప్రాస నియమం ఉండాలి. (4 పాదాల్లో) 7) పద్యంలోని 1 + 2 పాదాలు కలిపిన 8 గణాల్లో బేసిగణం ‘జగణం’ ఉండరాదు.

అబ్యాసం
“వినదగు నెవ్వరు జెప్పిన” అనే పద్యానికి లక్షణ సమన్వయం చేయండి.
AP SSC 10th Class Telugu Solutions Chapter 12 చిత్రగ్రీవం 3

సమన్వయం :

  1. మొదటి పాదంలో 3 గణాలు, రెండవ పాదంలో 5 గణాలు, మొత్తం 8 గణాలు ఉన్నాయి. ఈ పాదాలలో గగ, భ, జ, స, నల అనే గణాలే ఉన్నాయి.
  2. మొత్తం (1 + 2) పాదాలకు ఉన్న 8 గణాలలో ఆరవ గణం ‘నలం’ ఉంది. రెండవ పాదం చివర గురువు ఉంది.
  3. యతి 4, 7 గణాల మొదటి అక్షరాలకు సరిపోయింది. (వి – వి)
  4. ప్రాస నియమం ఉంది.
  5. బేసి గణంగా ‘జగణం’ లేదు.
    కాబట్టి ఇవి కంద పద్యపాదాలు.

అదనపు సమాచారము

సంధులు

1) ప్రపంచపు వెలుగు = ప్రపంచము + వెలుగు – పుంప్వాదేశ సంధి
2) ధాన్యపు గింజలు = ధాన్యము + గింజలు – పుంప్వాదేశ సంధి
3) ఉత్తరపు గాలి = ఉత్తరము + గాలి – పుంప్వాదేశ సంధి
4) నీలివర్ణపు ఈకలు = నీలివర్ణము + ఈకలు – పుంప్వాదేశ సంధి
5) సముద్రపు నీలిరంగు = సముద్రము + నీలిరంగు – పుంప్వాదేశ సంధి
6) చర్మపు పొర = చర్మము + పొర – పుంప్వాదేశ సంధి
7) జ్ఞానపు పావురాలు = జ్ఞానము + పావురాలు – పుంప్వాదేశ సంధి
8) అమాయకపు నల్లచీమ = అమాయకము + నల్లచీమ – పుంప్వాదేశ సంధి
9) మందిరాలు = మందిరము + లు – లులనల సంధి
10) వర్షాలు = వర్షము + లు – లులనల సంధి
11) మండుటెండ = మండు + ఎండ – టుగాగమ సంధి
12) నీలాకాశము = నీల + ఆకాశము – సవర్ణదీర్ఘ సంధి
13) శ్రద్ధాసక్తులు = శ్రద్ధా + ఆసక్తులు – సవర్ణదీర్ఘ సంధి
14) బాగోగులు = బాగు + ఓగులు – ఉత్వ సంధి
15) నాలుగంతస్తులు = నాలుగు + అంతస్తులు – ఉత్వసంధి
16) జలకాలాడు = జలకాలు + ఆడు – ఉత్వసంధి
17) చిట్టచివర = చివర + చివర – ఆమ్రేడిత సంధి
18) మొట్టమొదలు = మొదలు + మొదలు – ఆమ్రేడిత సంధి
19) పూరిల్లు = పూరి + ఇల్లు – ఇత్వ సంధి
20) నిస్సహాయము = నిః + సహాయము – విసర్గ సంధి
21) మనోహరం = మనః + హరము – విసర్గ సంధి
22) ముంజేయి = ముందు + చేయి – ప్రాతాది సంధి
23) పూఁదోట = పూవు + తోట – ప్రాతాది సంధి
24) తల్లిదండ్రులు = తల్లి + తండ్రి – గసడదవాదేశ సంధి

సమాసాలు

సమాస పదంవిగ్రహవాక్యంసమాసం పేరు
1) మూడు వారాలుమూడు సంఖ్యగల వారాలుద్విగు సమాసం
2) మూడు గంటలుమూడు సంఖ్యగల గంటలుద్విగు సమాసం
3) మూడు నెలలుమూడు సంఖ్యగల నెలలుద్విగు సమాసం
4) నాలుగడుగులునాలుగు సంఖ్యగల అడుగులుద్విగు సమాసం
5) రెండు ముక్కలురెండు సంఖ్యగల ముక్కులుద్విగు సమాసం
6) రెండు గుడ్లురెండు సంఖ్యగల గుడ్లుద్విగు సమాసం
7) ఇరవై నిమిషాలుఇరవై సంఖ్యగల నిమిషాలుద్విగు సమాసం
8) ఇరవై లక్షలుఇరవై సంఖ్యగల లక్షలుద్విగు సమాసం
9) పది లక్షలుపది సంఖ్యగల లక్షలుద్విగు సమాసం
10) శ్రద్ధాసక్తులుశ్రద్ధయు, ఆసక్తియుద్వంద్వ సమాసం
11) వన్నెచిన్నెలువన్నెయు, చిన్నెయుద్వంద్వ సమాసం
12) శక్తియుక్తులుశక్తియు, యుక్తియుద్వంద్వ సమాసం
13) సుఖసౌకర్యాలుసుఖమును, సౌకర్యమునుద్వంద్వ సమాసం
14) అసంఖ్యాకంసంఖ్యలేనిదినఞ్ తత్పురుష సమాసం
15) అసంకల్పితంసంకల్పితం కానిదినఞ్ తత్పురుష సమాసం
16) అసాధ్యంసాధ్యం కానిదినఞ్ తత్పురుష సమాసం
17) అప్రయత్నంప్రయత్నం కానిదినఞ్ తత్పురుష సమాసం
18) మహానగరంగొప్పనగరంవిశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
19) యువరాజుయువకుడైన రాజువిశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
20) యువరాణియువతియైన రాణివిశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
21) పెంపుడు పావురాలుపెంచుకొంటున్న పావురాలువిశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
22) తెల్లజెండాలుతెల్లవైన జెండాలువిశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
23) నీలాకాశంనీలమైన ఆకాశంవిశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
24) చిన్ని బృందాలుచిన్నవైన బృందాలువిశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
25) కులీన వంశముకులీనమైన వంశమువిశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
26) దివ్య సంకల్పందివ్యమైన సంకల్పమువిశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
27) పెద్ద పక్షులుపెద్దవైన పక్షులువిశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
28) మండుటెండమండుతున్న ఎండవిశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
29) యథాస్థానంస్థానమును అతిక్రమింపకఅవ్యయీభావ సమాసం
30) అతిసుందరంమిక్కిలి సుందరంఅవ్యయీభావ సమాసం
31) వెలుగు వెల్లువవెలుగుల యొక్క వెల్లువషష్ఠీ తత్పురుష సమాసం
32) పావురాల బృందాలుపావురాల యొక్క బృందాలుషష్ఠీ తత్పురుష సమాసం
33) హరివిల్లుహరియొక్క విల్లుషష్ఠీ తత్పురుష సమాసం
34) దిశాపరిజ్ఞానందిశల యొక్క పరిజ్ఞానంషష్ఠీ తత్పురుష సమాసం
35) చిత్రగ్రీవంచిత్రమైన గ్రీవము కలదిబహుహ్రీహి సమాసం
36) భారతదేశంభారతము అనే పేరుగల దేశంసంభావనా పూర్వపద కర్మధారయ సమాసం
37) బాగోగులుబాగును, ఓగునుద్వంద్వ సమాసం

నానార్థాలు

1. మిత్రుడు : స్నేహితుడు, సూర్యుడు, శత్రుదేశపు రాజు
2. పుణ్యము : ధర్మము, నీరు, బంగారము

ప్రకృతి – వికృతులు

రాజ్ఞి – రాణి
విశ్వాసము – విసువాసము
ఆశ్చర్యం – అచ్చెరువు
ప్రాణం – పానం
దిశ – దెస
వంశము – వంగడము
పుణ్యము – పున్నెము
పక్షి – పక్కి
పిత్స – పిట్ట
కుడ్యం – గోడ
శక్తి – సత్తి
యుక్తి – ఉత్తి
సుఖం – సుకం
స్వతంత్రమ్ – సొంతము
ఆకాశము – ఆకసము
నిమేషము – నిముసము
ఆహారము – ఓగిరము
అద్భుతము – అబ్బురము
ముహూర్తము – మూర్తము
చిత్రం – చిత్తరువు

పర్యాయపదాలు

1. నగరము : పురము, పట్టణము, పురి, పత్తనము
2. ఏనుగు : కరి, హస్తి, వారణము, ఇభము
3. అద్భుతము : అబ్బురము, అచ్చెరువు, వింత
4. ఆకాశము : గగనము, అంబరము, నభము, మిన్ను
5. గింజ : బీజము, విత్తు, విత్తనము
6. ముఖము : మొహం, ఆస్యము, వక్రము, ఆననము, మోము
7. తల్లి : జనని, జనయిత్రి, మాత, అమ్మ
8. తండ్రి : జనకుడు, అయ్య, నాయన, పిత
9. కన్ను : అక్షి, నేత్రము, నయనం, చక్షువు

వ్యుత్పత్యర్థాలు

1. చిత్రగ్రీవము : చిత్రమైన వర్ణాలతో కూడిన కంఠం కలది (పావురం)
2. పక్షి : పక్షములు (తెక్కలు) కలిది (పిట్ట)

రచయిత పరిచయం

పాఠ్యం పేరు : ‘చిత్రగ్రీవం’
పాఠ్య రచయిత : ధనగోపాల్ ముఖర్జీ (మూలం)
దాసరి అమరేంద్ర (అనువాద రచయిత)

దేని నుండి గ్రహింపబడింది : “చిత్రగ్రీవం” పుస్తకం నుండి

న్యూబెరీ మెడల్ : 1928లో అమెరికన్ లైబ్రరీ అసోసియేషన్ వారు ‘న్యూ జెరీ మెడల్’ బహుమతిని ‘ధనగోపాల్ ముఖర్జీ’కి ఇచ్చారు.

న్యూ బెరీ మెడల్ బహుమతిని ఎవరికి ఇస్తారు? : అమెరికాలో బాలసాహిత్యంలో విశేష కృషి చేసినవారికి ఈ బహుమతిని ఇస్తారు.

ధనగోపాల్ ముఖర్జీ విశిష్టత : ఈయన ‘న్యూ జెరీ మెడల్’ బహుమతిని గెల్చుకున్న ఏకైక భారతీయ రచయిత.

ముఖర్జీ పుట్టుక : 1890లో కోల్ కతాలో

విద్యాభ్యాసం : ముఖర్జీ 19వ ఏటనే అమెరికా వెళ్ళి, కాలిఫోర్నియా’, ‘స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయాల్లో చదువుకున్నారు.

ముఖ్య వ్యాపకాలు : రచనలు చేయడం, ఉపన్యాసాలు ఇవ్వడం.

రచనలు : జంతువులకు సంబంధించి తొమ్మిది రచనలు చేశారు.

ప్రాచుర్యం పొందిన రచనలు :
1) 1922లో రాసిన “కరి ది ఎలిఫెంట్”
2) 1924లో రాసిన “హరిశా ది జంగిల్ ల్యాడ్” చాలా ప్రసిద్ధములు.
3) 1928లో రాసిన ‘గోండ్ ది హంటర్’

పుట్టుక

కోల్‌కతా = కలకత్తా (పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి రాజధాని.)
మహానగరం = పెద్ద పట్టణం
డజను = పన్నెండు
గిరిక్ ల పావురాలు = గిరికీలు కొట్టే పావురాలు
మచ్చిక చెయ్యడం = ప్రేమించడం (దగ్గరకు, తియ్యడం)
అలరించే = సంతోషపెట్టే
విశిష్టమైన = మిక్కిలి శ్రేష్ఠమైన
శతాబ్దాలు (శత + అజ్ఞాలు) = నూర్ల సంవత్సరాలు
నిరుపేదలు = మిక్కిలి బీదవారు
పూరిల్లు (పూరి + ఇళ్లు) = గడ్డితో నేసిన ఇళ్లు
ఆప్యాయత = ప్రీతి
ఆసక్తి = ఆపేక్ష
పూదోటలు (పూవు + తోటలు) = పూలతోటలు
ఫౌంటెన్లు = నీటిని పైకి వెదజల్లే యంత్రాలు
ఉండడం కద్దు = ఉండడం ఉంది
ఉల్లాసకరమైన = సంతోషాన్ని ఇచ్చే
గిరికీలు కొట్టు = గిరికీలు తిరిగే (గాలిలో చక్కర్లు కొట్టే)
సంకేతాలు = సంజ్ఞలు
అసంఖ్యాకమైన = లెక్కపెట్టలేనన్ని
నీలాకాశం (నీల + ఆకాశం) = నీలంరంగు ఆకాశం
పెనుమేఘాలు = పెద్ద మేఘాలు
బృందాలు = గుంపులు
చెక్కర్లు కొడతాయి = తిరుగుతాయి
బృహత్తర సమూహం = మిక్కిలి పెద్ద గుంపు
రూపొందుతాయి = రూపం సంతరించుకుంటాయి (తయారవుతాయి)
స్థూలంగా = దాదాపుగా
పరిమాణం = సైజు
ఆకృతి = ఆకారం
దిశా పరిజ్ఞానం = దిక్కుల యొక్క జ్ఞానం
విశ్వాసం = నమ్మకం
సన్నిహిత పరిచయం = దగ్గరి పరిచయం
వనసీమ = అరణ్యసీమ
గజరాజులు = శ్రేష్ఠమైన ఏనుగులు
ప్రాణం పెడతాయి = ప్రాణం ఇస్తాయి (బాగా ప్రేమిస్తాయి.)
అంతఃప్రేరణాబలం = మనస్సు కలిగించే ప్రేరణ యొక్క బలం
సహచరుడు = చెలికాడు
పంచకు = వసారాకు
చిత్రగ్రీవం = పావురం (చిత్రమైన కంఠం గలది)
విచిత్రవర్ణభరితం = విచిత్రమైన రంగులతో నిండినది
హరివిల్లు మెడగాడు = ఇంద్రధనుస్సు వంటి మెడ కలవాడు
ఉట్టిపడలేదు = స్పష్టంగా కనబడలేదు
వన్నెచిన్నెలు = విలాసాలు
ఆచూకీయే = జాడయే
అతిసుందరమైన = మిక్కిలి అందమైన

ఆలోచించండి – చెప్పండి

ప్రశ్న 1.
కోల్ కతా నగరంలోని పిల్లలు పక్షుల ప్రేమికులని ఎలా చెప్పగలరు?
జవాబు:
కలకత్తా నగరంలో ప్రతి మూడవ కుర్రాడి వద్ద కనీసం ఒక డజను వార్తలు మోసే పావురాలు, గిరిక్స్ పావురాలు, పిగిలిపిట్టలు, బంతి పావురాలూ ఉంటాయి. కాబట్టి కోల్ కతా నగరం పిల్లలు పక్షుల ప్రేమికులని చెప్పగలం.

ప్రశ్న 2.
మీ ప్రాంతంలో ఏఏ పక్షులు ఎక్కువగా ఉంటాయి? వాటి కోసం మీరేం చేస్తున్నారు?
జవాబు:
మా ప్రాంతంలో కాకులూ, చిలుకలూ ఎక్కువగా ఉంటాయి. రోజూ మధ్యాహ్నం నేను భోజనం తినే ముందు మా ఇంట్లో వండిన పదార్థాలు అన్నీ కలిపి ఒక ముద్ద చేసి, కాకికి పెట్టిన తరువాత నేను తింటాను. మా పెరడులోని జామచెట్టు కాయలు అన్నీ చిలుకలకే వదలి పెడతాను.

AP SSC 10th Class Telugu Solutions Chapter 12 చిత్రగ్రీవం

ప్రశ్న 3.
పావురాల గురించి ఆశ్చర్యం కలిగించే విషయాన్ని తెలుసుకున్నారు కదా! అట్లే మిగతా పక్షుల్లో ఆశ్చర్యం కలిగించే విషయాలు ఏమున్నాయి?
జవాబు:
కాకులకు మంచి స్నేహభావం ఉంటుంది. ఏదైనా ఒక కాకికి ప్రమాదం వస్తే మిగతా కాకులన్నీ అక్కడ చేరి, తమ బాధను అరుపుల ద్వారా తెలుపుతాయి. ఒక కాకికి ఆహారం దొరికితే, ఆ కాకి మిగతా వాటిని కూడా పిలుచుకు వచ్చి, ఆ ఆహారాన్ని తినేటట్లు చేస్తుంది.

ప్రశ్న 4.
విశ్వాసం ప్రదర్శించడం అంటే ఏమిటి?
జవాబు:
విశ్వాసం ప్రదర్శించడం అంటే యజమాని యందు ప్రేమను చూపించడం. యజమానికి ఏ కష్టమూ రాకుండా చూడడం. అవసరమైతే యజమాని కోసం తన ప్రాణాలను ఇవ్వడానికి కూడా సిద్ధం కావడం.

ప్రశ్న 5.
‘అంతః ప్రేరణాబలం’ అంటే ఏమిటి? దీనివల్ల మనం ఏం చేయగలం?
జవాబు:
‘అంతః ప్రేరణాబలం అంటే మనస్సు గట్టిగా ప్రేరేపించడం వల్ల చేసే కార్యం. ఒక్కొక్కప్పుడు మనకు అక్కడ పదిమందీ ఉన్నా, అందులో ఒక వ్యక్తిపైనే మక్కువ ఏర్పడుతుంది. అతడితోనే ప్రేమగా ఉంటాం. దానికి కారణం ఏమిటో తెలియదు. దానికి కారణం బహుశః అంతః ప్రేరణాబలం కావచ్చు. అంటే మన మనస్సు యొక్క ప్రేరణ.

AP SSC 10th Class Telugu Solutions Chapter 12 చిత్రగ్రీవం

మొదలెడతాను = ప్రారంభిస్తాను
కులీన వంశానికి = శ్రేష్ఠమైన వంశానికి
అమోఘంగా = ఫలవంతంగా
వార్తాహరి = వార్తలను మోసుకువెళ్ళేది
రూపొందింది = రూపాన్ని పొందింది (తయారయ్యింది)
సంతరించుకుంది = సంపాదించుకుంది
త్రుటిలో = కొద్ది సేపట్లో
దుర్ఘటన = చెడ్డ సంఘటన
ఆకూ అలములు = ఆకులూ, తీగలు
యథాస్థానం = ఉన్నచోటున
దృఢంగా = బలిష్టంగా
తాకింది = తగిలింది
దారుణం = భయంకరం
ఛిన్నాభిన్నము = ముక్కలు ముక్కలు
సంగ్రహించడానికి = అపహరించడానికి
సంఘటన = పరిస్థితి
అడపాదడపా = అప్పుడప్పుడు
నిర్వహించేది = నెరవేర్చేది
పరిజ్ఞానం = పూర్ణజ్ఞానం
రూపొంది = ఏర్పడి
క్షుణ్ణంగా = బాగా (సంపూర్తిగా)
ఆహ్వానించడం = పిలవడం
తారాడటం = కదలియాడడం (తిరగడం)
నెట్టేసేది = గెంటేసేది
మహా ఆత్రంగా = మిక్కిలి వేగిరపాటుగా (తొందరగా)
స్పందన = కదలిక
దివ్యసంకల్పం = గొప్ప సంకల్పం
తల నిక్కించి = తల పైకెత్తి
నిస్సహాయమైన = ఏ సహాయమూలేని
అర్భకమైన = బలంలేని
నిస్సహాయత = శక్తిహీనత
మరుక్షణం = తరువాతి క్షణం
పొదవుకుంది = దాచుకుంది (కప్పుకుంది)

ఆలోచించండి – చెప్పండి

ప్రశ్న 1.
మీరు ఎప్పటికీ మరచిపోలేని రోజు ఏది? ఎందుకు?
జవాబు:
మా నాన్నగారు నాకు చేతి గడియారం, సైకిలు కొని ఇచ్చిన రోజును నేను ఎప్పటికీ మరువలేను.

ప్రశ్న 2.
తెలివిమాలిన పనులు అంటే ఏమిటి?
జవాబు:
తెలివిలేని మూర్ఖులు చేసే పనులను, తెలివిమాలిన పనులు అంటారు.

AP SSC 10th Class Telugu Solutions Chapter 12 చిత్రగ్రీవం

ప్రశ్న 3.
మీ మీద మీకే ఎప్పుడైనా కోపం వచ్చిందా? ఎందుకు?
జవాబు:
మా అమ్మగారు నన్ను సినిమాకు వెళ్ళవద్దన్నారు. మరునాటి పరీక్షకు చదువుకొమ్మన్నారు. అన్నీ చదివాను కదా అని, నా అభిమాన హీరో సినిమా కదా అని, సినిమాకు వెళ్ళాను. మరునాడు పరీక్షలో బాగా రాయలేక పోయాను. అప్పుడు నా మీద నాకే కోపం వచ్చింది.

ప్రశ్న 4.
పావురం గూడు ఎలా ఉందో తెలుసుకొన్నారు కదా! మీకు తెలిసిన పక్షి గూళ్లు ఎలా ఉంటాయో చెప్పండి. పక్షి గూళ్లన్నీ ఒకేలా ఉంటాయా?
జవాబు:
మా పెరటిలో కరివేపచెట్టుకు పిచ్చుక గూడు పెట్టింది. అది సన్నటి దారాల వంటి పీచుతో గూడు కడుతుంది. ఎండిన బీరకాయలా వేలాడుతూ ఉంటుంది. కొన్ని పక్షులు పుల్లముక్కలతోనూ, కొన్ని ఈత, కొబ్బరి వగైరా ఆకులతోనూ గూళ్లు కడతాయి. కాబట్టి అన్ని పక్షిగూళ్లు ఒకేలా ఉండవు.

ప్రశ్న 5.
‘దివ్య సంకల్పం చోటు చేసుకోవడం’ అంటే ఏమిటి?
జవాబు:
ఒకప్పుడు ఎందుకు చేస్తామో తెలియకుండానే కొన్ని, పనులు మనం చేస్తాం. సరిగ్గా ఆ సమయానికి చేయడం వల్ల ఆ పని చక్కగా పూర్తి అవుతుంది. చేసిన పని జయప్రదం అవుతుంది.

ఏదో దేవతల సంకల్పం ఉండడం వల్లనే ఆ పనిని సరిగ్గా అదే సమయంలో మొదలు పెట్టి ఉంటాం. దానినే దివ్య సంకల్పం చోటు చేసుకోవడం అంటారు.

చిత్రగ్రీవం చదువు

దృశ్యాలు = కనబడే వస్తువులు
వెలుగు వెల్లువ = కాంతి ప్రవాహం
అనురాగం = ప్రేమ
లాలిస్తే = బుజ్జగిస్తే
మోతాదు = హెచ్చుతగ్గూకాని పదార్థం
అరకొరజ్ఞానం = మిడిమిడి జ్ఞానం
దోహదం చేస్తాయి = ప్రోత్సహిస్తాయి
ఉత్పత్తి చేసిన – = పుట్టించిన
బాగోగులు (బాగు + ఓగులు)= మంచి చెడ్డలు
ఆహార సేకరణ = ఆహారం సంపాదన
నిమగ్నము = మునిగినది
ఏపుగా = సమృద్ధిగా
బొడిపెలు = చెట్టునందలి బుడిపులు
ఏకఖండంగా = ఒకే ముక్కగా
తునకలు = ముక్కలు
ఘనకార్యం = గొప్పపని
సందేహం = అనుమానం
స్టూలంగా = సుమారుగా (దాదాపుగా)
మందకొడి = మెల్లగా నడవడం (చురుకు లేకపోవడం)
నిరాటంకంగా = ఆటంకం లేకుండా
మండుటెండ = మండే ఎండ
పిల్లగాళ్లకు = పిల్లలకు
సంకోచం = మోమాటం
నిమ్మకు నీరెత్తినట్లు = గుట్టుచప్పుడు కానట్లు

ఆలోచించండి – చెప్పండి

ప్రశ్న 1.
పిల్లపక్షిని దానితల్లి ఎలా పెంచిందో తెలుసుకున్నారు కదా! మరి మిమ్మల్ని ఎవరు, ఎలా పెంచారో చెప్పండి.
జవాబు:
నేను మా అమ్మగారికి ఆమె 16వ సంవత్సరంలో పుట్టానట. నా చెల్లికీ, నాకూ కేవలం ఒక సంవత్సరం మాత్రమే తేడా ఉంది. మా చెల్లిని మా అమ్మ పెంచితే, నన్ను మా అమ్మమ్మ గారు పెంచి పెద్ద చేశారు.

ప్రశ్న 2.
“ఘనకార్యం చేయడం” అనే వాక్యం నుండి మీరేం గ్రహించారు? ఇలా దీన్ని ఇంకా ఏ ఏ సందర్భాలలో వాడతారు?
జవాబు:
మనం ఒక పనిని చేస్తాం. ఆ పనివల్ల నష్టం వస్తుంది. అప్పుడు పక్కవారు ‘చేశావులే పెద్ద ఘనకార్యం’ అని మనల్ని పరిహాసం చేస్తారు. ఏదైనా చాలా మంచి పని చేసినపుడు కూడా వారు ఘనకార్యం చేశారు అని పొగిడే సందర్భాల్లో కూడా దీన్ని వాడతారు.

ప్రశ్న 3.
“ఏ మాటకామాటే” అని ఏయే సందర్భాలలో ఉపయోగిస్తారు?
జవాబు:
“ఏ మాటకామాటే చెప్పుకోవాలి అని నిజం చెప్పేటప్పుడు చెపుతారు. ఒక వ్యక్తిలోని మంచి చెడ్డలను ఉన్నవి ఉన్నట్లు పైకి చెప్పేటప్పుడు, “ఏ మాటకామాటే” అనుకోవాలి అంటూ ప్రారంభిస్తారు.
ఉదా : ఏ మాటకా మాటే చెప్పుకోవాలి, మా అమ్మాయికి “అంత తెలివి లేదు.

ప్రశ్న 4.
‘పావురం’ కంటిలోని ప్రత్యేకతను గుర్తించారు కదా! ఇంకా ఇతర జంతువుల పక్షులకు సంబంధించిన ప్రత్యేకతలు ఏమున్నాయి?
జవాబు:
చీమలు పదార్థాలను కూడబెడతాయి. తేనెటీగలు తేనెను జాగ్రత్త చేస్తాయి. కుక్కలు వాసనను బట్టి వస్తువును గ్రహిస్తాయి. అందుకే కుక్కల సాయంతో నేరగాళ్లను పోలీసులు పట్టుకుంటున్నారు.

AP SSC 10th Class Telugu Solutions Chapter 12 చిత్రగ్రీవం

పచార్లు చెయ్యడం = తిరగడం
నిరాశాభరితము = నిరాశతో నిండినది
చిట్టచివరకు (చివరకు + చివరకు) = ఆఖరుకు
సంకోచాన్ని = మిక్కిలి కలతను (మిక్కుటమైన సంతాపాన్ని)
అధిగమించి = దాటి
బాలెన్సు = సరితూగేలా చెయ్యడం
ప్రక్రియ = పని
అప్రయత్నంగా = ప్రయత్నం లేకుండా
శోభిల్లసాగింది = ప్రకాశింపసాగింది
మహత్తరమైన = మిక్కిలి గొప్పదైన
తతంగం = వ్యవహారం
పరిధిలో = పరిమితిలో
అసాధ్యం = సాధ్యం కానిది
మంద్రంగా = గంభీరంగా
నిర్మలంగా = ప్రశాంతంగా
బడుద్దాయ్ = బద్దకస్తుడు
ఉలుకూపలుకూ = మాటామంతీ
చిర్రెత్తుకొచ్చింది = కోపం వచ్చింది
ఫక్కీ = తీరు
గద్దించసాగింది = అదలించసాగింది (బెదరింప సాగింది)
స్వీయరక్షణ = తన రక్షణ
అసంకల్పితంగా = సంకల్పం లేకుండానే (అనుకోకుండా)
అవధులు = హద్దులు
జలకాలాడుతున్న = స్నానం చేస్తున్న
యథాలాపంగా = ఆకస్మికంగా
రొప్పసాగింది = అరవడం మొదలు పెట్టింది
ఉత్తేజంతో = గొప్ప తేజస్సుతో

ఆలోచించండి – చెప్పండి

ప్రశ్న 1.
‘నిమ్మకు నీరెత్తడం’ అని ఏ ఏ సందర్భాలలో వాడతారు?
జవాబు:
ఒక వ్యక్తి నవనవలాడుతూ ఉంటే నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నాడంటారు.

ఒక వ్యక్తి విషయాన్ని కప్పిపుచ్చి, ఎవరికీ తెలియకుండా, మాట్లాడకుండా ఉన్నప్పుడు, నిమ్మకు నీరెత్తినట్లు మాట్లాడకుండా ఉన్నాడంటారు.

తనలో లోపమున్నా, అది పైకి తెలియకుండా కప్పిపెట్టి ఉంచినపుడు, నిమ్మకు నీరెత్తినట్లు కూర్చున్నాడంటారు.

ప్రశ్న 2.
‘మహత్తర ఘట్టానికి చేరుకోడం’ అంటే ఏమిటి ? దీనికి కొన్ని ఉదాహరణలు తెల్పండి.
జవాబు:
ఏదైనా గొప్పపనిని చేయడానికి ప్రయత్నిస్తాం. అది చివరికి ఫలించి పూర్తికావడానికి సిద్ధంగా ఉంటుంది. అప్పుడు ఆ పని “మహత్తర ఘట్టానికి చేరుకొంది” అంటారు.

  1. గ్రామంలో దేవాలయం కట్టిద్దామని ప్రయత్నం చేస్తారు. విగ్రహ ప్రతిష్ఠ దానిలో జరుగుబోతూ ఉంటే “మహత్తర ఘట్టానికి చేరుకొంది” అంటారు.
  2. ప్రాజెక్టు నిర్మాణం జరిగి, ప్రారంభోత్సవానికి సిద్ధమైనపుడు మహత్తర ఘట్టానికి చేరుకొంది అంటారు.

AP SSC 10th Class Telugu Solutions Chapter 12 చిత్రగ్రీవం

ప్రశ్న 3.
మే నెల చివరి రోజుల్లో వాతావరణం ఎలా ఉందో తెలుసుకొన్నారు కదా! చలికాలంలో వాతావరణం ఎలా ఉంటుందో మీ మాటల్లో వర్ణించండి.
జవాబు:
అది డిసెంబరు నెల. సాయంత్రం అయ్యేటప్పటికి చలి ప్రారంభం అవుతుంది. పిల్లలు, పెద్దలూ స్వెట్టర్లు వేసుకుంటారు. మంచినీళ్ళు కూడా తాగబుద్ధి పుట్టదు. రగ్గు కప్పినా చలి ఆగదు. చెట్లమీది నుండి పొగమంచు బొట్లు బొట్లుగా పడుతుంది. వర్షం వచ్చిందేమో అనిపిస్తుంది. పొగమంచు మూసివేయడంతో రోడ్డుమీద ప్రయాణాలు చేసేవారికి దారి కనబడదు. నీళ్ళపొయ్యి దగ్గరకు చిన్నా పెద్దా అంతా చేరతారు.

ప్రశ్న 4.
చిత్రగ్రీవం ఎగరడానికి దాని తండ్రిపక్షి ఏం చేసింది? తల్లిపక్షి ఏం చేసింది ? అట్లాగే చిన్న పిల్లలు నడక నేర్చుకోవడం ఎలా జరుగుతుందో చెప్పండి.
జవాబు:
చిత్రగ్రీవాన్ని తండ్రి పక్షి గద్దించింది. ఆ గద్దింపుల నుండి తప్పించుకోడానికి చిత్రగ్రీవం పక్క పక్కకు జరిగింది. చిత్రగ్రీవం మీద తండ్రి పక్షి, తన భారాన్ని అంతా మోపింది. చిత్రగ్రీవం కాలుజారింది. చిత్రగ్రీవం తన రక్షణకోసం, అప్రయత్నంగా రెక్కలు విప్పి గాలిలో ఎగిరింది. తల్లి పక్షి చిత్రగ్రీవానికి సాయంగా తానూ ఎగిరింది. ఎగరడం వల్ల రొప్పుతున్న చిత్రగ్రీవాన్ని తల్లి పక్షి లాలించింది.

చిన్న పిల్లలు నడక నేర్చుకోడానికి వీలుగా పెద్దవారు చిన్న పిల్లల వేళ్లు పట్టుకొని దగ్గరుండి నడిపిస్తారు. గోడసాయం ఇచ్చి పిల్లల్ని నడిపిస్తారు. పిల్లలు పడిపోతే, వారిని దగ్గరకు తీసుకొని బుజ్జగిస్తారు.

AP SSC 10th Class Telugu లేఖలు

AP State Board Syllabus AP SSC 10th Class Telugu Solutions 10th Class Telugu లేఖలు Notes, Questions and Answers.

AP State Syllabus SSC 10th Class Telugu లేఖలు

ప్రశ్న 1.
మీ పాఠంలో హనుమంతుని శక్తి యుక్తులను వర్ణించిన కవిని ప్రశంసిస్తూ, అతని రచనలు చదవమని సలహా ఇస్తూ మిత్రునికి లేఖ రాయండి.
జవాబు:

మిత్రునికి లేఖ

విశాఖపట్టణం,
x x x x x.

మిత్రుడు ప్రసాద్ కు,

మిత్రమా ! నీవు మన పదవ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలో 8వ పాఠం ‘సముద్రలంఘనం’ చదివావని అనుకుంటున్నాను. మాకు ఈ మధ్యనే మా తెలుగు పండితులు ఈ పాఠం చెప్పారు. ఈ పాఠం ‘అయ్యలరాజు రామభద్రుడు’ అనే మహాకవి రచించిన “రామాభ్యుదయము” అనే గ్రంథంలోనిది. రామాభ్యుదయంలోని కథ, సీతారామ కథయే. మన పాఠంలో హనుమంతుడు సముద్రం దాటిన ఘట్టమును కవి “అద్భుతంగా” వర్ణించాడు.

రామభద్రుడు సాహితీసమరాంగణ సార్వభౌముడైన శ్రీకృష్ణదేవరాయల అష్టదిగ్గజ కవులలో ఒకడు. రామాయణము ఒక తియ్యని కావ్యము. ఈ రామాభ్యుదయంలో కవి హనుమంతుని శక్తిని, పరాక్రమాన్ని గొప్పగా వర్ణించాడు. ఈ కవి ‘సకల కథాసార సంగ్రహం’ అనే మరో గ్రంథం కూడా రచించాడట. నేను ఈ రోజే “రామాభ్యుదయం” కావ్యం కొన్నాను. నీవు కూడా రామభద్రుని రచనలు తప్పక చదువు. ఆ కవిని గూర్చి, నీ అభిప్రాయం నాకు రాయి. ఉంటా.

ఇట్లు,
నీ మిత్రుడు,
పి. రఘునాథ్ బాబు,
మునిసిపల్ ఉన్నత పాఠశాల.

చిరునామా :
టి. ప్రసాద్,
S/o టి. రామయ్యగారు,
ఇంటి నెం. 4-1-3/A, గాంధీపురం,
కాకినాడ, తూర్పుగోదావరి జిల్లా,

ప్రశ్న 2.
మీ పాఠశాలను గురించి మీ మిత్రునకు లేఖ రాయండి.
జవాబు:

తెనాలి,
x x x x x.

పి. రామచంద్ర,
10వ తరగతి, శారదా కాన్వెంట్,
రాజావీధి, తెనాలి,
గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్.

మిత్రుడు రవికాంత్ కు,

నేను కొత్తగా చేరిన శారదా కాన్వెంట్ అందాల బృందావనంలా ఉంది. మా కాన్వెంట్ 5 ఎకరాల స్థలంలో ఉంది. ఎత్తైన భవనాలు ఉన్నాయి. ప్రతి తరగతి గదిలోనూ ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు ఉన్నాయి. ముఖ్యంగా మా సైన్సు ప్రయోగశాలలు చక్కగా అన్ని పరికరాలతో అందంగా తీర్చిదిద్దినట్లుంటాయి.

నిత్యం అసెంబ్లీ జరిగేచోట సరస్వతీ దేవి విగ్రహం రంగురంగుల అలంకరణలతో అద్భుతంగా ఉంటుంది. మా కాన్వెంటు అందం అంతా క్రీడా మైదానంలో ఉంది. అన్ని ఆటలకూ కోర్సులు ఉన్నాయి. మైదానం అంతా శుభ్రంగా ఉంటుంది.

కాన్వెంటులో పూలతోట ఉంది. అక్కడ అన్ని రకాల పూల మొక్కలు ఉన్నాయి. కుళాయి నీరు 24 గంటలు వస్తుంది. బాలబాలికలకు వేరువేరుగా మరుగుదొడ్లు ఉన్నాయి.

మా ప్రధానోపాధ్యాయుల గది చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ కాన్వెంట్ లో చేరినందులకు సంతోషంగా ఉంది. ఉంటా.

ఇట్లు,
నీ మిత్రుడు,
పి.రామచంద్ర.

చిరునామా:
యస్. రవికాంత్,
C/O. యస్. వెంకట్రావుగారు,
తాశీల్దార్, అమలాపురం,
తూ. గో. జిల్లా, ఆంధ్రప్రదేశ్.

AP SSC 10th Class Telugu లేఖలు

ప్రశ్న 3.
‘స్వచ్ఛ భారత్’ కార్యక్రమం ఆవశ్యకతను వివరిస్తూ మిత్రునకు లేఖ రాయండి.
జవాబు:

అమలాపురం
ది. x x x x x.

 

ప్రియమైన మిత్రుడు అనంత్ కు,

నీకు శుభాక్షాంక్షలు – నేను బాగా చదువుతున్నాను. నీవు కూడా బాగా చదువుచున్నావని ఆశిస్తున్నాను. ముఖ్యముగా వ్రాయునది. మనం మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలనే భావనతో మన ప్రధాని స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టారు. పరిసరాలు బాగుంటేనే మనదేశం ఆదర్శంగాను, ఆరోగ్యవంతంగాను ఉంటుంది. దాని కోసం మనమంతా పచ్చని చెట్లను నాటాలి. ఇంటిని, గ్రామాలను, నగరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఈ కార్యక్రమం ద్వారానే మనం దేశాన్ని ముందుకు నడిపించగలుగుతాం. మన పాఠశాలల్లో ముందుగా ఈ కార్యక్రమాన్ని చేపడదాం. మనం దీని కోసం సంకల్పం తీసుకుందాం ! పెద్దలకు నమస్కారాలు తెలుపగలవు.

ఇట్లు,
నీ ప్రియమిత్రుడు,
x x x x x.

చిరునామా:
వి. అనంత్, 10వ తరగతి,
వివేకానంద బాలుర ఉన్నత పాఠశాల,
వినుకొండ, గుంటూరు జిల్లా.

ప్రశ్న 4.
పల్లెటూరులోని ప్రకృతి అందాలను, మానవ సంబంధాలను వివరిస్తూ మీ మిత్రుడు / మిత్రురాలికి ఒక లేఖ రాయండి.
జవాబు:

రాజమండ్రి,
x x x x x.

మిత్రుడు రంగారావుకు / మిత్రురాలు కవితకు,

నీ లేఖ అందింది. ఈ మధ్య నేను మా అన్న పెళ్ళికి ‘కొమరగిరి పట్టణం’ అనే తూర్పుగోదావరి జిల్లా అల్లవరం మండలంలోని ఒక పల్లెటూరికి వెళ్ళాను. ఆ పల్లెటూరిలో సుమారు 16 వేల మంది జనాభా ఉన్నారట. సుమారు 20 వేల ఎకరాలలో వరిపంట, ఐదు-ఆరు వేల ఎకరాలలో కొబ్బరి తోటలు ఆ ఊరిలో ఉన్నాయట.

ఊళ్ళో అన్ని కులాల వారూ, అన్ని వృత్తుల వారూ ఉన్నారు. ఆ పెళ్ళి చేయించే పురోహితుణ్ణి, ఆ ఊరి కాపుగారు “బాబయ్యగారూ” అని ప్రేమగా పిలిచేవాడు. ప్రజలు ఎక్కువగా పేర్లు పెట్టికాక, పెద్దమ్మ, పిన్నమ్మ, అక్క బావ, మొదలయిన వరుసలు పెట్టి ప్రేమగా పిలుచుకున్నారు. ఆ గ్రామస్తుల ఐక్యత చూస్తే ఆనందం వేసింది. రామేశ్వరం, లక్ష్మణేశ్వరంలలో అందమైన శివాలయాలు ఉన్నాయి.

ఆ పల్లెటూరిలో ప్రకృతి శోభ, మహాద్భుతం. ఊళ్ళో పంటకాలువలూ, చెరువులూ ఉన్నాయి. ఫంటచేలు గాలికి తలలాడిస్తూ, మనల్ని పిలుస్తున్నట్లుంటాయి. కొబ్బరి తోటల్లో చెట్లు, నిండుగా గెలలతో కలకలలాడుతుంటాయి. కొబ్బరిచెట్టు, కల్పవృక్షం లాంటిది. పెళ్ళిలో అతిథులందరికీ చల్లని కొబ్బరి బొండాలు ఇచ్చారు.

అదీగాక ఈ ఊరి ప్రక్కనే కౌశికీ నది, దాని పక్కగా బంగాళాఖాతం ఉంది. ఆ సముద్ర కెరటాల శోభ వర్ణించడం అసాధ్యం. సముద్రతీరాన సరుగుడు తోటలు, ఏవో పాటలు పాడుతూ తలలు ఊపుతూ మనలను రమ్మని పిలుస్తూ ఉంటాయి.

పల్లెలు, దేశ సౌభాగ్యానికి పుట్టిళ్ళు. ప్రశాంత జీవితానికి నట్టిళ్ళు. ఉంటాను. లేఖ రాయి.

ఇట్లు,
నీ మిత్రుడు, / మిత్రురాలు,
గోపాలరావు. / రాధ.

చిరునామా :
పి. రంగారావు, / పి. కవిత,
S/o/ D/o పి. వరప్రసాద్,
గాంధీరోడ్డు, వరంగల్లు (ఆంధ్రప్రదేశ్).
పామర్రు, కృష్ణా జిల్లా.

ప్రశ్న 5.
మీ పాఠశాలలో జరిగిన గురుపూజోత్సవం కార్యక్రమాన్ని వివరిస్తూ మిత్రునికి లేఖ రాయండి.
జవాబు:

గుంటూరు,
x x x x x.

ప్రియమిత్రుడు పుష్పరాజ్ కు,

గడచిన సెప్టెంబర్ 5న మా పాఠశాలలో గురుపూజోత్సవం బ్రహ్మాండంగా జరుపుకున్నాం. మా జిల్లా విద్యాశాఖాధికారిని ముఖ్య అతిథిగా ఆహ్వానించాం. ఆ రోజు మన మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి. ఆయన జయంతినే ప్రభుత్వం గురుపూజోత్సవం దినంగా ప్రకటించింది కదా ! ఆ రోజు ఉదయం 8 గంటలకు ముఖ్య అతిథిగారిచే జాతీయ పతాకావిష్కరణతో ఉత్సవాన్ని ప్రారంభించాం. మేము మా పాఠశాలలోని ఉపాధ్యాయులందరిని ప్రత్యేకంగా సన్మానించాం. వారి ఆశీర్వచనాలు పొందాం. మనకు విద్య నేర్పుతున్న గురువులను గౌరవించి సన్మానించడం నాకెంతో ఆనందాన్ని కలిగించింది.

ఇట్లు,
నీ మిత్రుడు,
జయరాజ్.

చిరునామా :
ఎస్. పుష్పరాజ్, 10వ తరగతి,
నవోదయ హైస్కూలు,
నాయుడుపేట,
నెల్లూరు.

ప్రశ్న 6.
మీ పాఠశాలలో గ్రంథాలయ వసతి కల్పించమని కోరుతూ సంబంధిత అధికారికి లేఖ రాయండి.
జవాబు:

ఏలూరు,
x x x x x

చింతా రవిశంకర్,
పదవ తరగతి, ‘ఏ’ సెక్షన్,
మునిసిపల్ హైస్కూలు,
పవర్ పేట, ఏలూరు.

ఆర్యా ,
విషయము : గ్రంథాలయ వసతి కల్పించమని వినతి.

నమస్కారములు. మా పాఠశాలలో సుమారు 2 వేలమంది విద్యార్థినీ విద్యార్థులు చదువుతున్నారు. మా పాఠశాలలో మంచి గ్రంథాలయము లేదు. ఈ సంవత్సరము పాఠ్యప్రణాళికలు బాగా మారిపోయాయి. గ్రంథాలయంలోని పుస్తకాలు – చదివితే కానీ, పరీక్షలలో సరయిన జవాబులు వ్రాయలేము. నిత్యమూ వచ్చే రోజువారీ పత్రికలు చదివితే, మాకు దేశకాల పరిస్థితులు అర్థం అవుతాయి.

కాబట్టి మీరు తప్పక మా మునిసిపల్ కమిషనర్ గారికి చెప్పి, మీరు కూడా మంచి గ్రాంటు ఇచ్చి, మా పాఠశాలలో మంచి గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయించవలసిందిగా మా విద్యార్థుల తరుపున ప్రార్థిస్తున్నాను.

నమస్కారాలతో,

ఇట్లు,
తమ విధేయుడు,
చింతా రవిశంకర్,
పదవ తరగతి, ఎ. సెక్షన్ నెంబర్ : 26.

చిరునామా :
జిల్లా విద్యాశాఖాధికారి గార్కి,
పశ్చిమగోదావరి జిల్లా,
ఏలూరు.

AP SSC 10th Class Telugu లేఖలు

ప్రశ్న 7.
‘ఎదుటి వారిలో తప్పులు వెతకటం కన్నా, వారి నుండి మంచిని స్వీకరించడం మేలు’ అని తెలియజేస్తూ మిత్రునికి లేఖ రాయండి.
జవాబు:

చిత్తూరు,
x x x x x

స్నేహితుడు రంగనాకు,
స్నేహితురాలు శారదకు,

నీ లేఖ చేరింది. మీ నగరంలోని “సాయీ సేవామండలి” వారు మీ పాఠశాల విద్యార్థులకు పెన్నులు, నోట్సు పుస్తకాలు, వగైరా ఉచితంగా పంచి పెట్టారని రాశావు. ఆ సంస్థవారు నగరంలో చందాలు బాగా వసూలు చేస్తున్నారనీ, వాటికి రశీదులు మాత్రం ఇవ్వడం లేదని రాశావు. నీవు సేవామండలి వారు చేస్తున్న సేవా కార్యక్రమాల్ని ప్రశంసించాలి. వారి తప్పులు వెదకరాదు.

ఆ సేవామండలి వారు దేవాలయాల వద్ద నిలబడి భక్తులను క్యూ లైన్లలో పంపడం, వారి చెప్పులను కాపాడి, తిరిగి వారికి అప్పగించడం, మజ్జిగ, మంచినీరు అందించడం వగైరాలు చేస్తున్నారు. దొంగతనాలు జరుగకుండా కాపాడుతున్నారు.

వారు బీదపిల్లలకు విద్యా సదుపాయాలు కల్పిస్తున్నారు. పండుగరోజుల్లో బీదలకు అన్నదానం, వస్త్రదానం చేస్తున్నారు. రోగులకు పాలు పండ్లు ఇస్తున్నారు.

నీవు ఆ సేవామండలి వారు చేస్తున్న పరోపకారం, మానవసేవ, ధర్మకార్యాలు మెచ్చుకోవాలి. వారిని అభినందించాలి. అంతేకాని వారు వసూలు చేసే చందాలకు రశీదులు ఇవ్వడం లేదని వారిని తప్పు పట్టరాదు. రశీదు పొరపాటున ఇచ్చి ఉండకపోవచ్చు గదా !

మనం ఎదుటివారి తప్పులను వెతికి చూపిస్తాము. దానికంటే వారు చేసే మంచిని గ్రహించి, వారిని అభినందించడం మంచిది. వారు చేసే పనిలోని లోపాలను వారి దృష్టికి తేవాలి.

మంచిపని చేసేవారిని ప్రశంసించడం, మన ధర్మం. ఉంటా.

ఇట్లు,
నీ ప్రియ స్నేహితుడు,
నీ స్నేహితురాలు,
కె. జయ / కె. జయరాజు.

చిరునామా :
కె. రంగనాధ్, / యస్. శారద,
గాంధీ మునిసిపల్ హైస్కూలు,
గుంటూరు, ఆంధ్రప్రదేశ్.

ప్రశ్న 8.
నాటితో పోలిస్తే నేటి వివాహ వేడుకల్లో వచ్చిన మార్పులను గురించి విమర్శనాత్మకంగా మిత్రులకు లేఖ రాయండి.
జవాబు:

తిరుపతి,
x x x x x

మిత్రుడు ప్రసాద్ కు,

శుభాభినందనలు. మీ అక్క పెళ్ళి శుభలేఖను నీవు నాకు పంపించావు. సంతోషం. ఈ మధ్య మా అన్నయ్య స్నేహితుడి పెళ్ళికి వెళ్ళాను. పూర్వపు పెళ్ళిళ్ళకూ, ఇప్పటి పెళ్ళిళ్ళకూ ఎన్నో తేడాలున్నాయి.

కోపం వల్ల చాలా అనర్దాలు వస్తాయి. కోపంతో మనకు వివేకం నశిస్తుంది. సీతారామ్ తో నీకు వచ్చిన తగవు విషయం, మీ పెద్దలతో చెప్పు. వారు మీ తగవును పరిష్కరిస్తారు. కోపం తగ్గించుకొని శాంతంగా ఉండమని నిన్ను కోరుతున్నాను. త్వరలో నీవూ, సీతారామ్ మిత్రులుగా మారుతారని ఆశిస్తున్నా.

ఇట్లు,
నీ ప్రియమిత్రుడు,
అవసరాల వెంకట్రావు,
10వ తరగతి,
మునిసిపల్ హైస్కూలు,
విజయవాడ.

చిరునామా:
కె. రఘునందన్,
S/O కె. రాజారావు గారు,
ఇంటి నెం. 4.1. 104,
మహారాణీ పేట,
విశాఖపట్టణం, ఆంధ్రప్రదేశ్.

ప్రశ్న 9.
నీ సైకిలు పోయిందని తెలుపుతూ,వెతికించమని కోరుతూ పోలీసు అధికారికి లేఖ రాయండి.
జవాబు:

కర్నూలు,
x x x x x x

కె. జవహర్ రెడ్డి,
పదవ తరగతి, సెక్షన్ ‘ఎ’
మునిసిపల్ హైస్కూల్,
గాంధీనగర్, కర్నూలు.
గాంధీనగర్ పోలీసు ఇన్ స్పెక్టర్ గారికి, కర్నూలు,

అయ్యా ,

విషయము : సైకిలు దొంగతనం – చర్య తీసుకోవలసిందిగా విజ్ఞప్తి.

నమస్కారములు,
నిన్న అనగా 9 – 4 – 2016 నాడు, నేను మిత్రులతో కలసి గవర్నమెంటు హాస్పిటల్ కు, నా మిత్రుని పలకరించుటకు వెళ్ళాను. మా మిత్రులము అందరమూ, మా సైకిళ్ళను గేటు వద్ద చెట్టు క్రింద తాళం వేసి ఉంచి లోపలకు వెళ్ళాము. తిరిగి వచ్చేటప్పటికి నా సైకిలు కనబడలేదు. మిగిలిన వారి సైకిళ్ళు మాత్రం ఉన్నాయి. నా సైకిలు వివరాలు క్రింద ఇస్తున్నాను.

హీరో కొత్త సైకిలు, 24, నెంబరు హెచ్ 26723. దయచేసి నా సైకిలు వెతికించవలసినదిగా మిమ్మల్ని కోరుతున్నాను.
నమస్కారాలతో,

ఇట్లు,
మీ విశ్వసనీయుడు,
కె. జవహర్ రెడ్డి,
10వ తరగతి, సెక్షన్ – ‘ఎ’.

ప్రశ్న 10.
తోటి స్త్రీలను సోదరీమణుల్లా, మాతృమూర్తుల్లా భావించాలని గుర్తు చేస్తూ మీ మిత్రునకు లేఖ రాయండి.
జవాబు:

రాజమండ్రి,
x x x x x

ప్రియమైన అభిలేష్ కు,

నేను బాగా చదువుతున్నాను. నీవు బాగా చదువుతున్నావని భావిస్తాను. ఈ మధ్య నేను చిన్న సాహసం చేశాను. మా పాఠశాలలో నాతో చదివే జలజను ఒక దుర్మార్గుడు నిత్యం తన్ను ప్రేమించమని ఏడిపిస్తూ ఉండేవాడు. నేను వాడితో తగువు పెట్టుకొని వాడిని తన్నాను. పోలీసులకు వాణ్ణి అప్పగించాను.

మనం మనతోటి స్త్రీలను మన అక్కా చెల్లెళ్ళలా, మన తల్లుల్లా భావించి వారికి రక్షణగా నిలబడాలి. నిజానికి స్త్రీలు ఈ భూమిమీద తిరిగే పుణ్యదేవతలు. స్త్రీలపట్ల అపచారం చేస్తే వారు నాశనం అవుతారు. సమూలంగా వారి వంశం నశిస్తుంది. స్త్రీలు పూజింపదగినవారు.

స్త్రీలకు ఎటువంటి అవమానం జరుగకుండా, మనం చూడాలి. తోటి స్త్రీలను కన్నతల్లుల్లా, మన సోదరీమణుల్లా చూడాలి. నేను చేసిన సాహసాన్ని నీవు తప్పక అభినందిస్తావని నమ్ముతున్నా.

ఇట్లు,
నీ ప్రియమిత్రుడు,
రాజేష్.

చిరునామా :
పి. అఖిలేష్,
10వ తరగతి , జె.పి. హైస్కూల్,
కుప్పం, చిత్తూరు జిల్లా,

ప్రశ్న 11.
మీ ఊరికి బస్సు సదుపాయం కల్పించమని కోరుతూ సంబంధిత రోడ్డు రవాణా సంస్థ అధికారికి లేఖ రాయండి.
జవాబు:

చామర్రు,
x x x x x

ఆర్.టి.సి. జనరల్ మేనేజర్ గారికి,
చామర్రు నివాసియైన అగ్గరాజు శ్రీరామమూర్తి వ్రాయు విన్నపము.

అయ్యా ,

మాది అచ్చంపేట మండలంలోని చామర్రు అనే గ్రామం. మా గ్రామ జనాభా ఎనిమిదివందలు. ఇచ్చటి ప్రజలు నిత్యావసర సరకులు అచ్చెంపేట వెళ్ళి తెచ్చుకోవాలి. అలాగే విద్యార్థులు హైస్కూలు చదువుకు అచ్చెంపేట, కాలేజి చదువుకు సత్తెనపల్లి వెళ్ళి రావలసియున్నది. పిల్లలు, పెద్దలు, విద్యార్థులు అందరూ కూడా మండల కేంద్రానికి వెళ్ళటానికి నానా బాధలు పడుతున్నారు. కారణం మా ఊరికి ఎటువంటి బస్సు సౌకర్యం లేకపోవడమే. ‘ప్రజా సేవయే కర్తవ్యం’గా భావించే మీరు మా గ్రామానికి బస్సు సౌకర్యాన్ని కలిగించి మా కష్టాలను గట్టెక్కించవలసిందిగా కోరుతున్నాను.

ఇట్లు,
తమ విధేయుడు,
ఎ.ఎస్.ఆర్. మూర్తి.

చిరునామా :
జనరల్ మేనేజర్,
ఆర్.టి.సి. ఆఫీసు,
గుంటూరు రేంజి, గుంటూరు.

ప్రశ్న 12.
ఉపకార వేతనాన్ని మంజూరు చేయమని కోరుతూ జిల్లా సంక్షేమశాఖాధికారికి లేఖ రాయండి.
జవాబు:

ఉపకార వేతనం కోరుతూ జిల్లా సంక్షేమశాఖాధికారికి లేఖ.

పటమట,
x x x x x

కృష్ణాజిల్లా సంక్షేమశాఖాధికారి గారి దివ్య సముఖమునకు,

ఆర్యా !
నేను పటమట జిల్లా పరిషత్ హైస్కూలులో పదవ తరగతి చదువుచున్నాను. నేను ఆర్థికముగా వెనుకబడిన కుటుంబమునకు చెందినవాడను. 9వ తరగతి పరీక్షలలో నాకు 600 మార్కులకు 530 మార్కులు వచ్చినవి. పై చదువులు చదువుటకు ఆర్థికశక్తి లేకపోవుటచే మధ్యలోనే చదువుకు స్వస్తి చెప్పవలసి వచ్చుచున్నది. కనుక తమరు నా యందు దయయుంచి ఉపకార వేతనమును మంజూరు చేయవలసినదిగా ప్రార్థించుచున్నాను.

జతపరచినవి :

  1. ఆదాయ ధృవీకరణ పత్రం,
  2. మార్కుల ధృవీకరణ పత్రం,
  3. కుల ధృవీకరణ పత్రం.

ఇట్లు,
తమ విధేయుడు,
అగ్గిరాజు శ్రీహర్ష,
10వ తరగతి, జిల్లా పరిషత్ హైస్కూలు,
పటమట, కృష్ణాజిల్లా.

చిరునామా :
జిల్లా సంక్షేమశాఖాధికారి గారికి,
జిల్లా సంక్షేమశాఖాధికారి కార్యాలయం,
మచిలీపట్నం, కృష్ణాజిల్లా.

AP SSC 10th Class Telugu లేఖలు

ప్రశ్న 13.
మీ పాఠశాలలో జరిగిన ఒక ఉత్సవాన్ని గూర్చి మిత్రునకు లేఖ రాయండి.
జవాబు:

శ్రీకాకుళం,
x x x x x

ప్రియ స్నేహితురాలు,
మధుప్రియకు శుభాకాంక్షలు,

గడచిన జనవరి 26న మా పాఠశాలలో రిపబ్లిక్ దినోత్సవ వేడుకలు బ్రహ్మాండంగా జరిగాయి. మా జిల్లా విద్యాశాఖాధికారిని ముఖ్య అతిథిగా ఆహ్వానించాం. ఆ రోజు ఉదయం గం. 8 – 00 లకు ముఖ్య అతిథిగారిచే జాతీయ పతాకావిష్కరణ కావించబడింది. రిపబ్లిక్ దినోత్సవ ప్రాముఖ్యాన్ని గురించి ముఖ్య అతిథిగారు చక్కని సందేశమిచ్చారు. కొందరు ఉపాధ్యాయులు, విద్యార్థులు కూడా ఆ రోజు గొప్పతనాన్ని గురించి ఉపన్యాసమిచ్చారు. రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు పంచిపెట్టబడ్డాయి. తరువాత విద్యార్థులకు స్వీట్సు పంచిపెట్టబడ్డాయి. ‘జనగణమన’ జాతీయ గీతంతో నాటి కార్యక్రమం ముగిసింది.

ఇట్లు,
నీ ప్రియ స్నేహితురాలు,
టి. హరిప్రియ.

చిరునామా :
కె. మధుప్రియ,
10వ తరగతి,
మున్సిపల్ గరల్స్ హైస్కూలు,
రాజమండ్రి, తూర్పు గోదావరి జిల్లా.

ప్రశ్న 14.
అమరావతిలో అద్భుత శిల్ప సంపదను సృష్టించిన శిల్పులను అభినందిస్తూ ఒక లేఖ రాయండి.
జవాబు:

మిత్రునకు శిల్పులను అభినందిస్తూ లేఖ

విజయవాడ,
x x x x x

మిత్రుడు శ్రీకాంత్ కు, / మిత్రురాలు రాధకు,

మిత్రమా ! శుభాకాంక్షలు. ఈ మధ్య నేను మన నవ్యాంధ్ర రాజధాని నగరం, అమరావతికి వెళ్ళి అక్కడి శిల్ప సంపదను చూసి, ఆ శిల్పాలను చెక్కిన కళా తపస్వులయిన శిల్పులకు జోహార్లు సమర్పించాను. అక్కడ బుద్ధ విగ్రహాలు, జైన మందిరము, అమరేశ్వరాలయము, స్తూపాలు అన్నీ చూశాను. ఆ శిల్పాలు చెక్కిన శిల్పులకు అభినందనలు అందించాను. ఆ శిల్పాలు ప్రపంచ శిల్ప సంపదలోనే అగ్రశ్రేణివని డా|| ఫెర్గూసన్ పొగిడాడు.

జాషువా మహాకవి చెప్పినట్లు శిల్పి చేతి సుత్తె నుండి ఎన్నో దేవాలయాలు వెలిశాయి. అర్థం లేని బండరాయికి శిల్పి జీవం పోస్తాడు. రాళ్ళను దేవుళ్ళుగా మార్చి, వాటికి మనచే పూజలు చేయిస్తాడు. శిల్పి శాశ్వతుడు. రాళ్ళలో నిద్రపోయే బొమ్మల్ని ఉలి తగిలించి అతడు లేపుతాడు. శిల్పి చిరంజీవి. పుణ్యాత్ముడు. ప్రపంచ ప్రఖ్యాతిని పొందిన మహాశిల్పులకు మనం అభినందనలు అందించాలి. నీవు కూడా అమరావతి వచ్చి, మత తెలుగు శిల్పుల కళానైపుణ్యానికి జోహార్లు అందిస్తావని విశ్వసిస్తున్నాను.

‘అమరావతీ నగర అపురూప శిల్పాలు’ అని మనం నిత్యం తెలుగుతల్లి పాటలో పాడుతున్నాము. ఆ శిల్పులకు జోహార్లు అందించడం మన విధి. ఉంటా.

ఇట్లు,
నీ మిత్రుడు, / మిత్రురాలు,
శ్రీహర్ష. / రజని.

చిరునామా :
పి.శ్రీకాంత్, / పి.రాధ,
S/o/ D/o పి.వరప్రసాద్,
విశాఖపట్టణం,
అక్కయ్యపాలెం, ఆంధ్రప్రదేశ్.

ప్రశ్న 15.
పేదలకు దానం చేయుట వలన మనం పొందే మేలును గురించి తెలియజేస్తూ మిత్రునికి లేఖ రాయండి.
జవాబు:

మిత్రుడికి లేఖ

తిరుపతి,
x x x x x

మిత్రుడు శశిభూషణకు, / మిత్రురాలు కమలకు,

ఉభయ కుశలోపరి. నీవు రాసిన లేఖ చేరింది. మనం నైతిక విలువలను పాటించాలని రాశావు. సంతోషము. మన ఇరుగు పొరుగువారిలో ఎందరో పేదలు ఉంటారు. భగవంతుడు మానవులు అందరిలోనూ ఉంటాడు. కాబట్టి మనుషులు అంతా దైవంతో సమానం.

ముఖ్యంగా పేదవారికి, మనకు ఉన్నంతలో దానం చేయాలి. మన తరగతిలోని పేదవారికి పుస్తకాలు, పెన్నులు, నోట్సులు దానం చెయ్యాలి. పరీక్ష ఫీజులు కట్టడానికి వారికి డబ్బు సాయం చెయ్యాలి. వైద్య సహాయం కోసం డబ్బులు అడిగే వారికి తప్పక ఇవ్వాలి.

పేదలకు దానం చేస్తే మరుసటి జన్మలో మనకు భగవంతుడు మరింతగా ఇస్తాడు. పేదల ముఖాల్లో ఆనందం కనబడేలా చేస్తే, మన జీవితాలు సుఖసంతోషాలకు నిలయం అవుతాయి. నేను నాకు ఉన్నంతలో పేదలకు దాన ధర్మాలు చేస్తున్నాను.

నీవు కూడా చెయ్యి.

ఇట్లు,
నీ ప్రియ మిత్రుడు, / మిత్రురాలు,
సాయికుమార్. / శశికళ.

చిరునామా:
కె. శశిభూషణ్, / కె. కమల,
S/o వెంకటేష్, | D/o వెంకటేష్,
ఆర్యాపురం, రాజమహేంద్రవరం,
తూర్పుగోదావరి జిల్లా.

AP SSC 10th Class Telugu లేఖలు

ప్రశ్న 16.
విద్వాన్ విశ్వం కవితను ప్రశంసిస్తూ మిత్రునికి లేఖ రాయండి.
జవాబు:

మిత్రునకు లేఖ

గుంటూరు,
x x x x x

మిత్రుడు రామారావునకు,

శుభాభినందనలు. నీ లేఖ అందింది. నేను ఈ మధ్య విద్వాన్ విశ్వంగారి ‘మాణిక్యవీణ’ వచన కవిత చదివాను. విశ్వంగారు గొప్ప కవి పండితుడు. ఆయన ‘విశ్వరూపి నా హృదయం’ అని ప్రకటించుకున్నాడు. ఈ కవితలో చక్కని అభ్యుదయ భావాలు వెలిబుచ్చాడు.

మానవులు కేన్సరుతో బాధపడుతూ ఉంటే, దానికి మందులు కనుక్కోకుండా, రోదసిలోకి ఉపగ్రహాలు పంపడం వల్ల ప్రయోజనం ఏముంటుందని శాస్త్రజ్ఞులను ప్రశ్నించాడు.

తంత్రాలతో సమాజ సమస్యలు దారికి రావని హెచ్చరించాడు. శాస్త్రజ్ఞులు నిప్పునూ, చక్రాన్ని కనిపెట్టినరోజు నిజంగా, మానవ చరిత్రలో పండుగరోజు అని గుర్తు చేశాడు.

మానవ జీవితాన్ని కళలూ, కవిత్వం, విజ్ఞానం నడిపిస్తాయన్న యథార్థాన్ని విశ్వంగారు చెప్పాడు.

వచన కవితా రచనలో ఆయన చిన్న చిన్న పదాలతో లోతైన భావాలను తేలికగా అందించాడు.

విశ్వంగారు మాణిక్యవీణను మీటి, మానవీయ రాగాల్ని పలికించాడు. చక్కని లలిత పదాలతో, అనుప్రాసలతో కవిత మనోహరంగా చెప్పాడు.

తప్పక నీవు ఈ కవిత చదువు. ఉంటా.

ఇట్లు,
నీ ప్రియమిత్రుడు,
యన్. శ్రీకాంత్.

చిరునామా :
యస్. రామారావు,
S/o యస్: కృష్ణారావుగారు,
రామారావు పేట,
కాకినాడ, తూర్పుగోదావరి జిల్లా.

ప్రశ్న 17.
వ్యక్తిత్వ బదిలీ ధృవీకరణ పత్రాలను ఇప్పించవలసినదిగా ప్రధానోపాధ్యాయులకు లేఖ రాయండి.
జవాబు:

ప్రధానోపాధ్యాయులకు లేఖ

విజయవాడ,
x x x x x

గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయులవారికి,
మహాత్మాగాంధీ మునిసిపల్ ఉన్నత పాఠశాల,
గాంధీనగరం, విజయవాడ.

ఆర్యా !
విషయం : వ్యక్తిత్వ విద్యా, దిలీ ధృవీకరణ పత్రాలకై విజ్ఞప్తి.

నేను మీ పాఠశాలలో 10వ తరగతి చదివి, మంచి మార్కులతో పరీక్షలో ఉత్తీర్ణుడను అయ్యాను. దయచేసి నేను ఇంటర్‌లో చేరేందుకు వీలుగా నా వ్యక్తిత్వ, విద్యా, బదిలీ ధృవీకరణ పత్రములు ఇప్పించవలసినదిగా ప్రార్ధన.
నమస్కారాలతో,

ఇట్లు,
మీ విశ్వసనీయుడు,
x x x
10వ తరగతి – 24వ నెంబరు.

ప్రశ్న 18.
కోపం తగ్గించుకోవడం మంచిదని తెలుపుతూ మిత్రునకు లేఖ రాయండి.
జవాబు:

విశాఖపట్టణం,
x x x x x

మిత్రుడు రఘునందన్ కు,

నీ లేఖ అందింది. నేనూ, మా తల్లిదండ్రులూ క్షేమంగా ఉన్నాము. నీ లేఖలో, నీకు ప్రియ మిత్రుడైన సీతారామ్ తో నీకు తగవు వచ్చిందనీ, మీరిద్దరూ దెబ్బలాడుకున్నారని రాశావు. మీ ఇద్దరికీ దెబ్బలు తగిలాయని కూడా రాశావు.

నీ ఉత్తరం చూసి నేను చాలా బాధపడ్డాను. సహజంగా నీవు శాంత స్వభావుడవు. నీకు కోపం ఎందుకు వచ్చిందో రాశావు. అయినా దెబ్బలు తగిలే వరకూ మీరు తగవు లాడడం బాగోలేదు. ‘తన కోపమె, తన శత్రువు’ అని సుమతీ శతకకర్త రాశాడు. క్రోధం మనకు శత్రువని భర్తృహరి కూడా చెప్పాడు. అయినా నీకు అన్ని విషయాలు తెలుసు.

కోపం వల్ల చాలా అనర్థాలు వస్తాయి. కోపంతో మనకు వివేకం నశిస్తుంది.. సీతారామ్ తో నీకు వచ్చిన తగవు విషయం, మీ పెద్దలతో చెప్పు. వారు మీ తగవును పరిష్కరిస్తారు. కోపం తగ్గించుకొని శాంతంగా ఉండమని నిన్ను కోరుతున్నాను. త్వరలో నీవూ, సీతారామ్ మిత్రులుగా మారుతారని ఆశిస్తున్నా.

ఇట్లు,
నీ ప్రియమిత్రుడు,
అవసరాల వెంకట్రావు,
10వ తరగతి,
మునిసిపల్ హైస్కూలు,
విజయవాడ.

చిరునామా:
కె. రఘునందన్,
S/O కె. రాజారావు గారు,
ఇంటి నెం. 4.1.104,
మహారాణీ పేట,
విశాఖపట్టణం, ఆంధ్రప్రదేశ్.

AP SSC 10th Class Telugu వ్యాసాలు

AP State Board Syllabus AP SSC 10th Class Telugu Solutions 10th Class Telugu వ్యాసాలు Notes, Questions and Answers.

AP State Syllabus SSC 10th Class Telugu వ్యాసాలు

ప్రశ్న 1.
‘ఆరుబయట మలవిసర్జన’ ఎంతటి ప్రమాదకరమో వివరిస్తూ వ్యాసం రాయండి.
జవాబు:
అత్యంత ప్రమాదం

మలవిసర్జన అంటే మన శరీరంలోని మలినాలను బయటకు వదలడం.

మలవిసర్జన వలన వచ్చే మలినాలు చాలా దుర్వాసనతో కూడుకొని ఉంటాయి. అంతేకాకుండా వాటిపై అత్యంత ప్రమాదకరమయిన సూక్ష్మజీవులు ఉంటాయి. ఈ సూక్ష్మజీవులు వ్యాపించినట్లయితే కలరా వంటి వ్యాధులు వ్యాపిస్తాయి. ఇవి వృద్ధులకు, బలహీనులకు, చిన్న పిల్లలకు, అనారోగ్యవంతులకు, గర్భిణీలకు, బాలింతలు మొదలైన వారికి తొందరగా వ్యాపిస్తాయి.

బహిరంగ మలవిసర్జన చేసినపుడు దానిపై ఈగలు, దోమలు వాలతాయి. వాటిపైకి అక్కడి సూక్ష్మజీవులు చేరతాయి. ఆ ఈగలు, దోమలు మనం తినే ఆహారంపై వాలతాయి. ఈ సూక్ష్మజీవులు ఆహారంతోబాటు మనలోపలికి ప్రవేశిస్తాయి. ఆరోగ్యాన్ని పాడుచేస్తాయి.

అందుకే బహిరంగ మలవిసర్జన వద్దని ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు పేర్కొంటున్నాయి. ప్రజలను చైతన్యపరుస్తున్నాయి. మరుగుదొడ్లు నిర్మించుకొందుకు ప్రభుత్వం కూడా మినహాయింపుతో కూడిన ఋణం మంజూరు చేస్తోంది.
బహిరంగ మలవిసర్జన మానేద్దాం – నాగరికతను చాటుదాం.
మరుగుదొడ్డి వాడదాం – రోగాలు నివారిద్దాం.
పరిశుభ్రత పాటిద్దాం – పదికాలాలు చల్లగా ఉందాం.

AP SSC 10th Class Telugu వ్యాసాలు

ప్రశ్న 2.
‘స్వచ్ఛభారత్’ కార్యక్రమం గురించి ఒక వ్యాసం రాయండి.
జవాబు:
‘స్వచ్ఛభారత్’ అంటే భారతదేశం అంతా పరిశుద్ధంగా ఉండాలి అనే నినాదం. మనదేశ ప్రధాని నరేంద్రమోడీ గారు, దేశంలోని కాలుష్యమును గమనించి, నదీజలములు అన్నీ కలుషితం కావడం చూసి, ఈ ‘స్వచ్ఛభారత్’ అనే నినాదాన్ని ఇచ్చారు. ఈ కార్యక్రమ ప్రచారకులుగా దేశంలోని ప్రసిద్ధులయిన వ్యక్తులను మోడీ గారు నియమించారు. అమితాబ్ బచ్చన్, రామోజీరావు వంటి వారు, ఈ కార్యక్రమానికి చేయూత నిస్తున్నారు. మన విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, నగరాలలోని మురికిపేటలు, గంగ, గోదావరి వంటి నదుల జలాలు నేడు కాలుష్యంతో నిండిపోతున్నాయి. విద్యార్థులూ, ఆఫీసులలో ఉద్యోగులూ తమ పాఠశాలలనూ, కార్యాలయాలనూ “పరిశుభ్రంగా ఉంచుకోవాలి.” ప్రజలు తమ గృహాలనూ, పరిసరాలనూ శుభ్రంగా ఉంచుకోవాలి.

నదులు, చెరువులలోని నీటిని కలుషితం చేయరాదు. ఈ కాలుష్యం వల్ల రోగాలు పెరిగిపోతున్నాయి. దోమలు, క్రిములు పెరిగిపోతున్నాయి. ప్రజలందరూ స్వచ్ఛతను కాపాడితే, దేశం ఆరోగ్యవంతం అవుతుంది. ప్రజలకు కావలసిన మంచినీరు లభిస్తుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అని మన పెద్దలు ఏనాడో చెప్పారు.

స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని దేశం అంతా ప్రచారం చేయాలి. దీన్ని ప్రజల కార్యక్రమంగా తీర్చిదిద్దాలి. దేశంలోని పత్రికల వారు, దూరదర్శనా వారు స్వచ్ఛభారత్ గురించి మంచి ప్రచారం చేయాలి. దానివల్ల దేశం సుభిక్షంగా, ఆరోగ్యంగా ఉంటుంది.

ప్రశ్న 3.
అధిక జనాభా వల్ల మన పర్యావరణం దెబ్బ తింటోంది. పర్యావరణాన్ని ఎలా కాపాడుకోవాలో తెలియజేస్తూ వ్యాసం రాయండి.
జవాబు:
భూమి, నీరు, గాలి మొదలైన వాటితో మనిషికి ఉండే అవినాభావ సంబంధమే పర్యావరణం. కాబట్టి పర్యావరణం అంటే పరిసరాల వాతావరణం అని అర్థం. పరిసరాల వాతావరణం కలుషితం కాకుండా కాపాడుకోవడమే పర్యావరణ సంరక్షణ అనబడుతుంది.

ప్రాణులు నివసించేది నేలపైన గదా ! ఆ నేలతల్లిని సరిగా చూసుకోవాలి. భూమిపై చెత్త, చెదారమేకాదు ఓషధులుంటాయి. చెట్లుంటాయి. జంతువులుంటాయి. మనం జీవించటానికి ఆహారం లభించేది భూమి వల్లనే గదా ! రసాయనిక ఎరువుల వాడకం వల్ల భూమి నిస్సారమైపోతోంది. భూమిని ఆరోగ్యంగా ఉంచాలి. భూమి సమతౌల్యాన్ని పోషించాలి.

జలకాలుష్యం మిక్కిలి భయంకరమైనది. రసాయనిక పదార్థాలు, పరిశ్రమల వల్ల విడుదలయ్యే ద్రవపదార్థాలు సాగునీటిని, త్రాగేనీటిని కాలుష్యపరుస్తాయి. మురుగునీరు, త్రాగేనీరు అనే భేదం లేకుండా పోతోంది. డ్రైనేజి వ్యవస్థ అరొకరగా వుంది. దీనివల్ల కలరా, మలేరియా, ఫ్లోరోసిస్, విషజ్వరం, టైఫాయిడ్ వంటివేకాక వైద్యులకి అంతుపట్టని కొత్త రోగాలు కూడా బయలుదేరాయి.

ఇక వాయు కాలుష్యం, గాలివల్లనే మనం జీవిస్తున్నాం. అటువంటి గాలి స్వచ్ఛంగా వుండాలి. కాని ఆధునిక పారిశ్రామికత పేరుతో గాలి కూడా కలుషితమైపోతోంది. విషపూరితమైన గాలి పీల్చటం వలన ఊపిరితిత్తులు, జీర్ణకోశం, గుండెకాయ, కళ్ళు అనారోగ్యానికి గురై ప్రమాదాలు సంభవిస్తున్నాయి. జీవితం రోగాలమయం అవుతోంది.

యంత్రాలవల్ల, వాహనాలవల్ల ధ్వనికాలుష్యం వ్యాపిస్తోంది. అణుశక్తి పరీక్షల వల్ల కూడా వాతావరణ కాలుష్యం ఏర్పడుతోంది.

1970లో అమెరికాలో పర్యావరణ పరిరక్షణ ఉద్యమం బయలుదేరింది. వాటి నుంచి శాస్త్రజ్ఞులు పర్యావరణ కాలుష్యనివారణకు విశేషమైన కృషి చేస్తున్నారు. ప్రతి సంవత్సరం జూన్ 5వ తేదీని పర్యావరణ దినోత్సవంగా పాటిస్తున్నారు. పర్యావరణ వ్యవస్థలోని సమతౌల్యాన్ని కాపాడుకోవటానికి అందరూ కృషి చేయాలి.

ప్రశ్న 4.
నేటి సమాజంలో స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యలను విశ్లేషిస్తూ “వ్యాసం” రాయండి.
జవాబు:
పవిత్ర భారతదేశంలో స్త్రీలకు సమున్నతమైన గౌరవం ఉంది. స్త్రీలు భూమిపై కదిలే దేవతామూర్తులుగా భావిస్తాము. స్త్రీలు ఎక్కడ ఉంటే అక్కడ దేవతలు ఆనందిస్తారని మనం భావిస్తాము. కాని వర్తమాన సమాజంలో పరిస్థితులు పూర్తిగా మారాయి. స్త్రీల ప్రగతి నానాటికి దిగజారుతున్నది. స్త్రీలు ఎన్నో సమస్యలను, కష్టాలను ఎదుర్కొంటున్నారు.

స్త్రీలు ఇప్పటికీ స్వేచ్ఛగా జీవించలేకపోతున్నారు. కొందరు స్త్రీలను పైకి రానీయకుండా అడ్డుపడుతున్నారు. రాజకీయాల్లో రిజర్వేషన్ కోసం జరుగుతున్న ప్రయత్నాలు ఒక కొలిక్కి రాలేదు. చట్టసభల్లో మహిళా సభ్యులను చులకనగా చూస్తున్నారు.

ప్రేమ పేరుతో స్త్రీలపై దాడులు జరుగుతున్నాయి. అకృత్యాలు జరుగుతున్నాయి. కులాంతర వివాహాలు చేసుకున్న మహిళలపై వివక్షను చూపిస్తున్నారు. పరువు కోసం తండ్రులు కన్న కూతుర్లనే చంపడం మనం చూస్తున్నాం. దీన్ని నాగరిక సమాజం హర్షించదు. దీన్ని అధిగమించే ప్రయత్నం చేయాలి.

గ్రామీణ ప్రాంతాల్లో స్త్రీలు అక్షరాస్యతకు దూరంగా ఉంటున్నారు. కొందరు కట్నాల పేరుతో మహిళలను వేధిస్తున్నారు. ఆరోగ్యపరంగా స్త్రీలు సమస్యలను ఎదుర్కొంటున్నారు. బాలింతలకు తగిన పౌష్టికాహారం దొరకడం లేదు. ఈ రకంగా స్త్రీలు సమాజంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. వాటిని మన ప్రభుత్వాలు పరిష్కరించాలి. స్త్రీల జీవితాల్లో వెలుగులను నింపాలి.

AP SSC 10th Class Telugu వ్యాసాలు

ప్రశ్న 5.
మీకు నచ్చిన సన్నివేశాన్ని లేదా ప్రకృతి దృశ్యాన్ని వర్ణిస్తూ వ్యాసం రాయండి.
జవాబు:
సూర్యోదయం
తూర్పువైపు ఆకాశంలోకి ఉదయమే చూస్తే ఎర్రగా కనిపిస్తుంది. అప్పటి వరకూ కోళ్ళు కూస్తూ ఉంటాయి. నక్షత్రాలు ఆకాశంలో వెలవెలపోతాయి. అప్పుడు పక్షులు తమ గూళ్ళ నుండి బయలుదేరి ఆహారం కోసం బారులు కట్టి ప్రయాణం చేస్తూ ఉంటాయి. పక్షులు రెక్కలు ఆడిస్తూ నేరుగా దూసుకుపోతూ ఉంటే, ఆ దృశ్యం చూడ్డానికి కళ్ళకు పండుగలా కనిపిస్తుంది.

అదే సమయానికి సూర్యకిరణాలు నేరుగా వచ్చి నేలకు తాకుతాయి. మా ఇంటి పక్క గుళ్ళో గంటలు మోగుతూ ఉంటాయి. గుడి పక్క చెరువులో సూర్యకిరణాలు పడి, తామర పూలు విచ్చుకుంటాయి. తుమ్మెదలు ఆ పద్మాలపై ఏదో రొద చేస్తూ తిరుగుతూ ఉంటాయి.. సూర్యుడు మనకు కనిపించే ప్రత్యక్ష దైవం. సూర్యోదయం కాగానే ప్రకృతి అంతా మేలుకొని తమ తమ పనుల్లో మునిగిపోతుంది.

ప్రశ్న 6.
‘నవ సమాజంలో విద్యార్థుల పాత్ర అనే అంశం మీద వ్యాసము వ్రాయండి.
జవాబు:
విద్యార్థులు అంటే విద్యను కోరి వచ్చినవారు. విద్యార్థుల ముఖ్య కర్తవ్యం, శ్రద్ధగా చదివి, మంచి మార్కులు సాధించడం. ఈనాడు మన చుట్టూ ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల పరిష్కారానికి దేశ నాయకులతో పాటు, ప్రజలు కూడా బాబాధ్యత వహించాలి. విద్యార్థులు చదువుకుంటున్న దేశ పౌరులు. కాబట్టే భావి భారత పౌరులయిన విద్యార్థులు కూడా, నవ సమాజంలో పెరిగిపోతున్న అవినీతి, అపరిశుభ్రత, దురాగతాలు, రాజకీయ నాయకుల వాగ్దాన భంగాలు వంటి వాటిపై తప్పక తిరుగబడాలి.

విద్యార్థులు ‘స్వచ్ఛభారత్’ వంటి కార్యక్రమాలు చేపట్టాలి. అంటువ్యాధుల నిర్మూలనకు దీక్ష చేపట్టాలి. అవినీతి ఎక్కడ కనబడినా, సామూహికంగా. ఎదిరించాలి. విద్యార్థులు నీతినియమాలు పాటించాలి. వృద్ధులను గౌరవించాలి. తోడి వారికి సాయం చేయాలి.

విద్యార్థినీ విద్యార్థులు, క్రమశిక్షణను పాటించాలి. దేశభక్తిని కలిగియుండాలి. మంచి అలవాట్లను అలవరచుకోవాలి. గురువులనూ, తల్లిదండ్రులనూ గౌరవించాలి. బాగా ఆటలు ఆడి, వ్యాయామం చేసి ఆరోగ్యం కాపాడుకోవాలి. ఆరోగ్యమే మహాభాగ్యమని ప్రచారం చేయాలి.

విద్యార్థులు రాజకీయాలలో ప్రత్యక్షంగా పాల్గొనరాదు. కాని దేశం కోసం తమ శక్తియుక్తులనన్నింటినీ ధారపొయ్యాలి.

ప్రశ్న 7.
కాలుష్యంతో నిండిపోతున్న నేటి నగర వాతావరణాన్ని గురించి వ్యాసం రాయండి.
జవాబు:
కవి అలిశెట్టి ప్రభాకర్ “నగరం అర్థంకాని రసాయనశాల” అన్నమాట యదార్థము. నేడు పల్లెలను వీడి ప్రజలంతా పట్టణాలకు వలస పోతున్నారు. నగరాలు అన్నీ మురికివాడలుగా మారి పోయాయి.

నగరాల్లో జనాభా పెరిగిపోతోంది. ప్లాస్టిక్ సంచుల వాడకం పెరిగింది. ప్రజలు పారవేసే చెత్త, వాడి పారవేసిన ఇంజక్షను సూదులు, ఫ్యాక్టరీలవారు విడిచిపెట్టే రసాయనిక వ్యర్థాలు , పందులు, కుక్కలు వంటి జంతువుల మాలిన్యాలు, నగరంలో పోగుపడుతున్నాయి.

నగరాలలో ప్రజలకు త్రాగడానికి సరిపడ మంచినీరు దొరకడం లేదు. నగరాన్ని శుభ్రంగా ఉంచాలన్న దీక్ష, ప్రజలకు ఉండడం లేదు. నగరంలో తిరిగే వాహనాలు ఎంతో కాలుష్యాన్ని గాలిలోకి విడిచిపెడుతున్నాయి. నదులలో కాలువలలో, చెరువులలో మురికినీరు వదలుతున్నారు. జలాశయాల్లో బట్టలు ఉతుకుతున్నారు. చెత్త దూరంగా పారవేసేందుకు నగరాల్లో చోటు దొరకడం లేదు. అందువల్ల నగరాలు కాలుష్య నిలయాలుగా, రోగాలకు పుట్టుక స్థలాలుగా మారుతున్నాయి.

నివారణ :
ప్రతి నగర పౌరుడు తమ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచాలి. మొక్కలు నాటాలి. జలాశయాల్లోకి మురికినీరు విడువరాదు. పరిశుభ్రతకూ, మంచి నీటికి మంచి వాతావరణానికి నగరాధికారులతో పాటు అందరూ కృషి చేయాలి.

AP SSC 10th Class Telugu వ్యాసాలు

ప్రశ్న 8.
నగర జీవనంలోని అనుకూల అంశాలపై ఒక వ్యాసం రాయండి.
జవాబు:
నగర జీవనం – అనుకూల అంశాలు :
‘నగరం’ అంటే పట్టణము. పల్లెలలో కన్న నగరాలలో ప్రజలకు అవసరమయ్యే సదుపాయాలు ఎక్కువగా లభ్యమవుతున్నాయి. అందువల్ల ప్రజలు గ్రామాల నుండి నగరాలకు వలసపోతున్నారు.

నగరాలలో ప్రజలకు విద్యా, వైద్య, ప్రయాణ సౌకర్యాలు హెచ్చుగా దొరుకుతాయి. ప్రజలకు మంచి విద్య నగరాల్లో లభిస్తుంది. కార్పొరేట్ కళాశాలలు, వైద్యశాలలు నగరాల్లో ఉంటాయి. నగరాల్లో పరిశ్రమలు ఉంటాయి. అందువల్ల ప్రజలకు ఉద్యోగ వసతి లభిస్తుంది. నగరాల్లో ప్రయాణాలకు సిటీ బస్సులు, రైళ్ళు, ఆటోలు, టాక్సీలు దొరుకుతాయి.

చేతి వృత్తుల వారికి సైతము, నగరాల్లో వారికి తగ్గ పని లభిస్తుంది. ప్రజలు ఏదోరకంగా నగరాల్లో బ్రతుకగలరు. వారికి కావలసిన పాలు, కూరగాయలు, నిత్యావసర వస్తువులు నగరాల్లో దొరుకుతాయి. కుళాయిల ద్వారా మంచి నీరు దొరుకుతుంది. రైతు బజార్లలో చౌకగా కావలసిన వస్తువులు దొరుకుతాయి. రోగం వస్తే, చిన్న పెద్ద వైద్యశాలలు నగరంలో ఉంటాయి. నగరాల్లో 24 గంటలు విద్యుచ్ఛక్తి సరఫరా అవుతుంది.

ఈ విధమైన అనుకూలములు ఉన్నందు వల్లే ప్రజలు పల్లెలను వదలి నగరాలకు వలసపోతున్నారు.

ప్రశ్న 9.
మాతృభాషా ప్రాముఖ్యాన్ని గూర్చి ఒక వ్యాసం రాయండి.
జవాబు:
మాతృభాష అంటే తల్లి భాష అని అర్థం. మనం పుట్టిన చోట జనవ్యవహారంలో ఉండే భాష మాతృభాష. మానవుడు పుట్టింది మొదలు గిట్టేవరకు మాతృభాషలోనే ఎక్కువగా మాట్లాడటం జరుగుతుంది. మనం ఏ భాషలో మాట్లాడతామో, ఏ భాషలో కలలు కంటామో ఆ భాషలోనే విద్యను నేర్చుకోవడం ఎంతైనా అవసరం.

పరాయి భాషలో విద్యాభ్యాసం చేస్తే చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముందుగా పరాయి భాషను అర్థం చేసుకోవడానికే చాలా ప్రయాస పడాల్సివస్తుంది. అందులో తగినంత పరిజ్ఞానం అలవడనిదే విషయ గ్రహణంగానీ, విషయ వ్యక్తీకరణగానీ సాధ్యపడదు. మాతృభాషలో విద్యాభ్యాసం వల్ల విద్యార్థి ఉపాధ్యాయులు చెప్పిన విషయాన్ని సులభంగా అర్థం చేసుకోవచ్చు. గుర్తుంచుకొని పరీక్షలు బాగా వ్రాయవచ్చు. తక్కువ సమయంలో ఎక్కువ విజ్ఞానాన్ని పొందవచ్చు.

మాతృభాషలో విద్యను నేర్చుకోవడం తల్లిపాలు త్రాగి పెరగడం వంటిది. పరభాషలో విద్యను నేర్చుకోవడం దాది పాలు త్రాగడం వంటిది. ఆంగ్లం వంటి పరాయిభాషలో విద్యార్థికి సరైన పరిజ్ఞానం లేనందువల్ల విద్యార్థికి ఆ భాషరాక బట్టీపట్టి ఏదోవిధంగా కృతార్థుడవుతున్నాడు. ఉపాధ్యాయులు చెప్పేది అర్థం కాక గైడ్సు (Guides) వెంట పడుతున్నాడు. కాబట్టి కనీసం సెకండరీ విద్యాస్థాయి వరకు మాతృభాషలోనే విద్యను బోధించడం, విద్యను నేర్చుకోవడం అవసరం.

ప్రశ్న 10.
‘వాతావరణ కాలుష్యం’ లేదా ‘పర్యావరణ పరిరక్షణ’ అన్న విషయంపై వ్యాసం రాయండి.
జవాబు:
ఆరోగ్యమే మహాభాగ్యం. వాతావరణం పరిశుభ్రంగా ఉంటే, మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. అతడి జీవితం, ఆనందంగా సాగుతుంది. మానవుల ఆరోగ్యానికి హానిని కల్గించే హానికారక పదార్థాలు వాతావరణంలో కలిసిపోతే, దానిని వాతావరణ కాలుష్యం అంటారు.

మన చుట్టూ ఉండే గాలి, నీరు, భూమి వంటి వాటిని పర్యావరణం అంటారు. పర్యావరణాన్ని పరిశుభ్రంగా ఉంచాలి.

వివిధ కర్మాగారాలు, పరిశ్రమలు, లెక్కలేనన్ని మోటారు వాహనాలు, మురికి నీరు, మొ||నవి. వాతావరణ కాలుష్యాన్ని కల్గిస్తున్నాయి. కర్మాగారాలు వదిలే వ్యర్థ పదార్థాల వల్ల, నదుల జలాలు కలుషితం అవుతున్నాయి. దానితో జలకాలుష్యం ఏర్పడుతోంది. మోటారు వాహనాల ధ్వనులతో ధ్వని కాలుష్యం ఏర్పడుతోంది.

వాతావరణ కాలుష్యం వల్ల, మానవుని మనుగడకు ప్రమాదం ఏర్పడుతోంది. దీనివల్ల ఉదరకోశ వ్యాధులు, ఊపిరితిత్తుల వ్యాధులు, కేన్సర్ రోగాలు, గుండె జబ్బులు వస్తున్నాయి.

వాతావరణ కాలుష్య నివారణకూ, పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు తయారు చేసి అమలు పరచాలి. కర్మాగారములు పరిశుభ్రము చేసిన తరువాతే వ్యర్థాలను విడిచి పెట్టాలి. ఫ్యాక్టరీల వారు మొక్కలు బాగా పెంచాలి. అవకాశం ఉన్న చోట ప్రజలు మొక్కలను బాగా పెంచాలి. ఐక్యరాజ్య సమితి, ప్రపంచ ఆరోగ్య సంస్థలు, పరిశోధనలు చేసి, వాతావరణ కాలుష్య నివారణకు తగు సూచనలు అందించాలి.

AP SSC 10th Class Telugu వ్యాసాలు

ప్రశ్న 11.
నీకు నచ్చిన మహిళ గుణగణాలు (శ్రీమతి ఇందిరాగాంధీ) గురించి వ్యాసం రాయండి.
జవాబు:
నాకు నచ్చిన మహిళ (శ్రీమతి ఇందిరా గాంధీ) :
భరత మాత ముద్దుబిడ్డలలో, ఇందిరాగాంధీ ఒకరు. ప్రపంచ ప్రఖ్యాతి పొందిన మహిళామణులలో, ఇందిర సుప్రసిద్ధురాలు. ఈమె 1917వ సంవత్సరము నవంబరు 19వ తేదీన ఆమె అలహాబాదులో జవహర్ లాల్ నెహ్రూ – కమలా నెహ్రూ దంపతులకు జన్మించింది.

ఇందిర శాంతినికేతన్లో రవీంద్రుని వద్ద చదివింది. ఈమె గొప్ప దేశ భక్తురాలు.. ఈమె భర్త ఫిరోజ్ గాంధీ, మహమ్మదీయుడు. ఆ వివాహం ఈమెకు మత సహనాన్ని నేర్పింది. ఈమె తండ్రితో పాటు దేశ విదేశాలు పర్యటించి, రాజనీతి చతురజ్ఞ అయ్యింది.

ఈమె భారతదేశ ప్రధానమంత్రిగా 15 సంవత్సరాలు పనిచేసింది. ఆ కాలంలో ఈమె బ్యాంకులను జాతీయం చేసింది. రాజభరణాలను రద్దు చేసింది. భూ సంస్కరణలను చేపట్టింది. ‘గరీబీ హఠావో’ అని ఈమె ఇచ్చిన నినాదం భారతదేశం అంతటా మారుమ్రోగింది.

ఈమె బడుగువర్గాల ఆశాజ్యోతిగా, దళిత వర్గాల కన్నతల్లిగా పేరు తెచ్చుకొంది. ఈమె గొప్ప సాహసురాలు. గొప్ప రాజనీతిజ్ఞురాలు.

ప్రశ్న 12.
నీకు నచ్చిన జాతీయ నాయకుని గూర్చి వ్యాసం రాయండి.
జవాబు:
మహాత్మాగాంధీ అసలు పేరు మోహన్ దాస్ కరంచంద్ గాంధీ. కానీ భారత ప్రజలు ఆత్మీయంగా ‘బాపూజీ’ అని పిలిచేవారు. ‘మహాత్మా’ అని గౌరవించేవారు. భారత జాతి మహాత్మాగాంధీని ‘జాతిపిత’ గా గౌరవించి కృతజ్ఞత ప్రకటించుకుంది.

గాంధీజీ దక్షిణాఫ్రికా వెళ్ళినప్పుడు అక్కడున్న భారతీయుల దాస్య వృత్తిని చూసి చలించిపోయాడు. ఆంగ్లేయుల ప్రవర్తన సహించలేక ఎదురుతిరిగాడు. ఎన్నో కష్టాలకు లోనయ్యాడు.

స్వదేశానికి తిరిగి వచ్చిన గాంధీజీ భారతీయుల బానిస బ్రతుకుల్ని చూసి సహించలేకపోయాడు. భారతమాత పరాయి పాలకుల సంకెళ్ళలో బందీగా ఉన్నందుకు గాంధీ తల్లడిల్లాడు. ఆంగ్లేయులపై స్వాతంత్ర్య సమరం ప్రకటించాడు. శాంతి, సత్యం, అహింస అనే ఆయుధాలతో స్వాతంత్ర్య సమరం చేపట్టాడు. స్వరాజ్య ఉద్యమానికి కాంగ్రెసు సంఘం స్థాపించాడు.

ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా, విదేశీ వస్తు బహిష్కరణ, సహాయ నిరాకరణ, ఖద్దరు ఉద్యమాలను చేపట్టి ఆంగ్లేయులను గుక్క తిప్పుకోనీకుండా గడగడలాడించాడు. సత్యాగ్రహం, నిరాహారదీక్షల ద్వారా భారత జాతిని జాగృతం చేసి ఆంగ్లేయుల గుండెలు దద్దరిల్లజేశాడు.

అనేక జాతులు, కులాలు, మతాలు, భాషలు గల దేశ ప్రజల్ని ఒకే త్రాటి మీద నడిపించి, సమైక్యంగా పోరాటం సాగించాడు. గాంధీ నడిపించిన ఉద్యమం వల్ల 1947, ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్ర్యం లభించింది. దుడ్డు కర్ర, అంగవస్త్రం, కిర్రు చెప్పులు గల గాంధీ ప్రపంచ దేశాల చేత జేజేలు అందుకున్నాడు.

ప్రశ్న 13.
ప్రశాంతతకు, పచ్చదనానికి నిలయమైన పల్లెల గొప్పదనాన్ని వర్ణిస్తూ వ్యాసం రాయండి.
జవాబు:
గ్రామాలు దేశ సౌభాగ్యానికి మూలకందములు. పల్లెలలో జీవితం ప్రశాంతంగా, హాయిగా ఉంటుంది. చక్కని ఎండ, గాలి, ప్రతి ఒక్కరికీ పల్లెలలో లభిస్తుంది. పల్లెలు ప్రకృతి రమణీయతకు నిలయాలు. పల్లెలలో పచ్చని చెట్లు, పొలాలు, ఆ చెట్టుపై పక్షుల కలకూజితాలు మనోహరంగా ఉంటాయి. చెట్లు చల్లని గాలిని ఇస్తూ, గ్రామ ప్రజలను సుఖసంతోషాలతో ముంచెత్తుతాయి.

ప్రజలందరికీ పల్లెలలో పాడిపంటలు ఉంటాయి. తాజా కూరగాయలు, పళ్ళు, పూలు వారికి దొరుకుతాయి. గ్రామాలలో ప్రజలందరూ ఒకరితో నొకరు అన్నదమ్ముల్లాగా మెలగుతారు. వారు “అక్కా! బావా” అంటూ ఆప్యాయంగా పలకరించుకుంటారు. కష్టసుఖాల్లో అందరూ కలిసి పాలుపంచుకుంటారు. గ్రామాలలో తీర్థాలు, సంబరాలు మహావేడుకగా జరుగుతాయి.

పల్లెలలో ఒకరింట్లో పెండ్లి అంటే, గ్రామంలో అందరికీ వేడుకే. పల్లెలలో సంక్రాంతికి ముగ్గులు, పూలతోరణాలు, గొబ్బిళ్ళు, భోగిమంటలు, సంక్రాంతి ప్రభలు మహావైభవంగా ఉంటాయి. హరిదాసులు, గంగిరెద్దులు, పగటి వేషధారులు, వారి చక్కని పాటలు ఆనందంగా ఉంటాయి. గ్రామాల్లో పంటలు పండి ఇంటికి వస్తే, ఇళ్ళు కలకలలాడుతాయి. అందమైన పాడి పశువులు, దుక్కిటెడ్లు, ఎడ్ల బళ్ళు మహావైభవంగా ఉంటాయి.

అందుకే పల్లెలు ప్రకృతి రమణీయతకు నట్టిళ్ళు. ప్రశాంత జీవిత సౌఖ్యానికి పుట్టిళ్ళు అని చెప్పగలము.

ప్రశ్న 14.
అవినీతి నిర్మూలనమునకు మీరిచ్చే సలహాలేమిటి?
జవాబు:
మనదేశానికి స్వాతంత్ర్యం వచ్చాక అనేక రంగాలలో దేశం ముందంజ వేసింది. దురదృష్టవశాత్తూ మనదేశంలో అవినీతి కూడ పెచ్చుపెరిగింది. అక్రమ సంపాదన ప్రజల లక్ష్యమయిపోయింది. ఏదోరకంగా తప్పుచేసి అయినా డబ్బు సంపాదించడం, తన పని పూర్తిచేసుకోవడం, ఆశ్రితులకు మేలు చేయడం, నీతికి సమాధి కట్టడం జరుగుతోంది. ముఖ్యంగా దేశ రాజకీయ నాయకులలో ఈ అవినీతి జాడ్యము విస్తరించిపోతోంది. చిన్న పంచాయతీ మెంబరు నుండి దేశ ప్రధాని వరకు అందరూ అవినీతి ఆరోపణలకు గురియగుచున్నారు. ఇది దేశానికి పట్టిన దౌర్భాగ్యం. దీనిని అరికట్టడంలో భావిభారత పౌరులైన యువతీయువకులు ముఖ్యంగా విద్యార్థినీ విద్యార్థులు ముందడుగు వేయాలి.

ముందుగా దేశంలో జరిగే అవినీతి కార్యాలను గూర్చి చూద్దాము. వర్తకులు సరకులలో కలీ చేయడం, ప్రభుత్వము పంపిణీ చేసిన నిత్యావసర వస్తువులను దాచి, బ్లాక్ మార్కెట్లో అమ్మడం, ధరలు పెంచివేయడం, ప్రభుత్వానికి పన్నులు ఎగవేయడం వంటి పనులు చేస్తున్నారు. ప్రభుత్వోద్యోగులు ప్రభుత్వము ప్రజలకు ఇచ్చే సదుపాయాలు ప్రజలకు లభించేలా చూడ్డానికి భారీగా లంచాలు మింగుతున్నారు. రేషన్ కార్డులు ఇవ్వడానికి, ఇళ్ళ స్థలాలు మొదలైనవి పంచడానికి లంచాలు తీసికొంటూ అర్హులయిన వారికి అన్యాయం చేసి వారికి ఇష్టమైన వారికి ఇస్తున్నారు. చౌకధరల దుకాణంలో సరుకులను దాచివేసి అక్రమ లాభాలు ఆర్జిస్తున్నారు. బ్యాంకుల అప్పులకు లంచాలు తీసికొంటున్నారు. విద్యాలయాలలో సీట్లకు లంచాలు, పాస్ చేయించడానికి లంచాలు ముట్టచెప్పవలసివస్తోంది. ఇట్లా దేశంలో అవినీతి అన్ని రంగాలలో తాండవిస్తోంది.

ఈ అవినీతిని అరికట్టడానికి యువతీయువకులు ముందుకు రావాలి. పత్రికలకు లేఖలు వ్రాసి లంచగొండుల గూర్చి అవినీతి శాఖ వారికి తెలియజేయాలి. అవినీతి శాఖ ఉద్యోగులు కూడా మరింత చురుకుగా పనిచేసి లంచగొండులను నిర్బంధించాలి.

రోజుకొక లంచగొండిని, కలీ వ్యాపారిని, దుష్ట రాజకీయవేత్తను ప్రభుత్వానికి యువత అప్పగిస్తే, కొద్దిరోజులలో దేశములో అవినీతి దానంతట అదే అంతరిస్తుంది. అవినీతిపరులకు ప్రభుత్వం కూడ గట్టి శిక్షలు విధించాలి. వారి ఉద్యోగాలు తీసివేయాలి. కలీ వ్యాపారులకు జరిమానాలు, జైలు శిక్షలు వేయాలి.

అవినీతి నిర్మూలన ప్రజలందరి లక్ష్యం కావాలి. లేనిచో ఈ అవినీతి చెదపురుగు దేశాన్నే కొరికి తినివేస్తుంది.

AP SSC 10th Class Telugu వ్యాసాలు

ప్రశ్న 15.
‘స్వచ్ఛభారత్’ గురించి ఒక వ్యాసం వ్రాయండి.
జవాబు:
‘స్వచ్ఛభారత్’ అంటే భారతదేశం అంతా పరిశుద్ధంగా ఉండాలి అనే నినాదం. మనదేశ ప్రధాని నరేంద్రమోడీ గారు, దేశంలోని కాలుష్యమును గమనించి, నదీజలములు అన్నీ కలుషితం కావడం చూసి, ఈ ‘స్వచ్ఛభారత్’ అనే నినాదాన్ని ఇచ్చారు. ఈ కార్యక్రమ ప్రచారకులుగా దేశంలోని ప్రసిద్ధులయిన వ్యక్తులను మోడీ గారు నియమించారు. అమితాబ్ బచ్చన్, రామోజీరావు వంటి వారు, ఈ కార్యక్రమానికి చేయూత నిస్తున్నారు. మన విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, నగరాలలోని మురికి పేటలు, గంగా, గోదావరి వంటి నదులజలాలు నేడు కాలుష్యంతో నిండిపోతున్నాయి. విద్యార్థులూ, ఆఫీసులలో ఉద్యోగులూ తమ పాఠశాలలనూ, కార్యాలయాలనూ “పరిశుభ్రంగా ఉంచుకోవాలి.” ప్రజలు తమ గృహాలనూ, పరిసరాలనూ శుభ్రంగా ఉంచుకోవాలి.

నదులు, చెరువులలోని నీటిని కలుషితం చేయరాదు. ఈ కాలుష్యం వల్ల రోగాలు పెరిగిపోతున్నాయి. దోమలు, క్రిములు పెరిగిపోతున్నాయి. ప్రజలందరూ స్వచ్ఛతను కాపాడితే, దేశం ఆరోగ్యవంతం అవుతుంది. ప్రజలకు కావలసిన మంచినీరు లభిస్తుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అని మన పెద్దలు ఏనాడో చెప్పారు.

స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని దేశం అంతా ప్రచారం చేయాలి. దీన్ని ప్రజల కార్యక్రమంగా తీర్చిదిద్దాలి. దేశంలోని పత్రికల వారు, దూరదర్శన్ వారు స్వచ్ఛభారత్ గురించి మంచి ప్రచారం చేయాలి. దానివల్ల దేశం సుభిక్షంగా, ఆరోగ్యంగా ఉంటుంది.

ప్రశ్న 16.
నీ చుట్టూ ఉన్న పరిసరాలలో కనిపించే బాలకార్మిక వ్యవస్థపై ఒక వ్యాసం రాయండి.
జవాబు:
నిరక్షరాస్యత, కుటుంబ ఆర్థిక పరిస్థితులు, కరవు కాటకాల కారణంగా లక్షలాది పిల్లలు చిన్న వయస్సులోనే కార్మికులుగా చేరుతున్నారని అంతర్జాతీయ కార్మిక నిర్వహణ సంస్థ (ఐ.ఎల్.ఒ) తన సర్వేలో వెల్లడించింది.

ప్రపంచంలో ఏ దేశంలోనూ లేనంతగా భారతదేశంలో బాలకార్మిక వ్యవస్థ ఉందని ఐ.ఎల్.ఒ. నిర్వహించిన సర్వేలో తెలియజేసింది. దేశంలో ఆంధ్రప్రదేశ్ లోనే అత్యధికంగా బాల కార్మికులు ఉన్నారని ఆ నివేదికలో పేర్కొన్నారు.

బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం పలు సందర్భాలలో చేస్తున్న ప్రకటనలు కేవలం ప్రకటనలుగానే మిగిలిపోతున్నాయి. కాబట్టి నిర్దిష్టమైన ప్రణాళికను ఏర్పాటు చేసి అది అమలు జరిగేటట్లు చూడాలి. ప్రభుత్వం రూపొందించిన బాల కార్మిక నియంత్రణ చట్టం సరిగా అమలు అయ్యేట్లు చూడాలి. .

భారతదేశంలో 8.7 కోట్ల మంది బాలలు పాఠశాలలకు వెళ్ళడం లేదని, వీరంతా ఇళ్ళలోను, కర్మాగారాల్లోను, పొలాల్లోను పని చేస్తున్నారని ‘గ్లోబల్ మార్చ్ ఎగనెస్ట్ చైల్డ్ లేబర్’ అనే అంతర్జాతీయ సంస్థ పేర్కొంది. కాబట్టి బాల కార్మికుల కోసం ప్రత్యేక పాఠశాలలు నెలకొల్పాలి. వాళ్ళు చదువుకొనే అవకాశం కల్పించాలి.

బాల కార్మికులను కూలివారుగానే చూస్తే వారు కార్మికులుగానే మిగిలిపోతారు. వారిలో ఉన్న యోగ్యతను, ప్రతిభను వెలికి తీసేందుకు సహకారం అందజేస్తే భవిష్యత్తులో ఒక మంచి నిపుణుడిని అందించేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలు కూడా బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు సహకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 6 యుద్ధకాండ

AP State Board Syllabus AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం 6th Lesson యుద్ధకాండ Textbook Questions and Answers.

AP State Syllabus SSC 10th Class Telugu Solutions ఉపవాచకం 6th Lesson యుద్ధకాండ

10th Class Telugu ఉపవాచకం 6th Lesson యుద్ధకాండ Textbook Questions and Answers

I. అవగాహన – ప్రతిస్పందన

సంఘటనా క్రమం

సంఘటనల ఆధారంగా వరుస క్రమంలో వాక్యాలను అమర్చడం

1. అ) వంద యోజనాల పొడవు, పది యోజనాల వెడల్పు గల సేతువును కట్టడం ఐదు రోజుల్లో పూర్తయింది.
ఆ) శ్రీరాముడు యుద్ధనీతిని అనుసరించి సైన్యాన్ని వివిధ భాగాలుగా విభజించాడు.
ఇ) విశ్వకర్మ కుమారుడైన ‘నలుడు’ శిల్పకళా నిపుణుడు, ఉత్సాహం, శక్తి ఉన్నవాడు. సేతువు నిర్మించడానికి అతడే యోగ్యుడని సముద్రుడు తెలిపాడు.
ఈ) శ్రీరాముడు సముద్రతీరంలో దర్భాసనం మీద కూర్చుని సముద్రుణ్ణి ఉపాసించాడు.
జవాబులు
ఈ) శ్రీరాముడు సముద్రతీరంలో దర్భాసనం మీద కూర్చుని సముద్రుణ్ణి ఉపాసించాడు.
ఇ) విశ్వకర్త కుమారుడైన ‘నలుడు’ శిల్పకళా నిపుణుడు. ఉత్సాహం, శక్తి ఉన్నవాడు. సేతువు నిర్మించడానికి అతడే యోగ్యుడని సముద్రుడు తెలిపాడు.
అ) వందయోజనాల పొడవు, పది యోజనాల వెడల్పు గల సేతువును కట్టడం ఐదు రోజుల్లో పూర్తయింది.
ఆ) శ్రీరాముడు యుద్ధనీతిని అనుసరించి సైన్యాన్ని వివిధ భాగాలుగా విభజించాడు.

2. అ) లంకను నాలుగువైపుల నుండీ సైన్యంతో ముట్టడించాడు శ్రీరాముడు.
ఆ) సీతను అప్పగించకపోతే శ్రీరాముడి చేతిలో మరణం తథ్యమని, లంకకు విభీషణుడు రాజు కాగలడని శ్రీరాముని వాక్యంగా రావణునికి వినిపించాడు అంగదుడు.
ఇ) అంగదుని చేతిలో రావణ కుమారుడు ఇంద్రజిత్తు ఓడిపోయాడు.
ఈ) రామలక్ష్మణులను మూర్ఛపోయేటట్టు చేసి నాగాస్త్రంతో బంధించాడు.
జవాబులు
ఆ) సీతను అప్పగించకపోతే శ్రీరాముడి చేతిలో మరణం తథ్యమని, లంకకు విభీషణుడు రాజు కాగలడని శ్రీరాముని వాక్యంగా రావణునికి వినిపించాడు అంగదుడు.
అ) లంకను నాలుగువైపుల నుండీ సైన్యంతో ముట్టడించాడు శ్రీరాముడు.
ఇ) అంగదుని చేతిలో రావణకుమారుడు ఇంద్రజిత్తు ఓడిపోయాడు.
ఈ) రామలక్ష్మణులను మూర్చపోయేటట్టు చేసి నాగాస్త్రంతో బంధించాడు.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 6 యుద్ధకాండ

3. అ) సుషేణుని సూచన మేరకు హనుమంతుడు ఓషధులు తేవడానికి వేగంగా వెళ్లాడు.
ఆ) ఆకాశానికి ఆకాశం, సముద్రానికి సముద్రమే సమానమైనట్లు రామరావణ యుద్దానికి రామరావణ యుద్ధమే సమానమన్నట్లు సాగుతున్నది.
ఇ) ఐంద్రాస్త్రంతో కుంభకర్ణుని శిరస్సును ఖండించి శాశ్వత నిద్రలోకి పంపాడు శ్రీరాముడు.
ఈ) ఐంద్రాస్త్రమును ప్రయోగించి ఇంద్రజిత్తు తలను నేలరాల్చాడు లక్ష్మణుడు.
జవాబులు
ఇ) ఐంద్రాస్త్రంతో కుంభకర్ణుని శిరస్సును ఖండించి శాశ్వత నిద్రలోకి పంపాడు శ్రీరాముడు.
ఈ) ఐంద్రాస్త్రమును ప్రయోగించి ఇంద్రజిత్తు తలను నేలరాల్చాడు లక్ష్మణుడు.
అ) సుషేణుని సూచన మేరకు హనుమంతుడు ఓషధులు తేవడానికి వేగంగా వెళ్లాడు.
ఆ) ఆకాశానికి ఆకాశం, సముద్రానికి సముద్రమే సమానమైనట్లు రామరావణ యుద్ధానికి రామరావణ యుద్ధమే సమానమన్నట్లు సాగుతున్నది.

4. అ) ఆమె శీలం యొక్క గొప్పదనాన్ని ముల్లోకాలకు చాటడానికే అగ్నిప్రవేశం చేస్తున్నా ఊరుకున్నానన్నాడు.
ఆ) అగ్నిదేవుడు స్వయంగా సీతాదేవిని తీసుకువచ్చి ఆమె గొప్పదనాన్ని వెల్లడించాడు.
ఇ) ‘నా వంశ ప్రతిష్ఠ నిలుపుకోడానికి దుష్ట రావణుని చెరనుండి నిన్ను విడిపించాను. ఇంతకాలం పరుడి పంచన ఉన్నందువల్ల నీ ప్రవర్తన గురించి నాకు సందేహముంది. కనుక నువ్వు నీ ఇష్టం వచ్చిన చోటికి వెళ్లవచ్చునని’ శ్రీరాముడు అన్నాడు.
ఈ) శ్రీరామునికి విశ్వాసం కలిగించడానికి ‘అగ్నిప్రవేశం’ ఒక్కటే శరణ్యమని భావించింది.
జవాబులు
ఇ) ‘నా వంశ ప్రతిష్ఠ నిలుపుకోవడానికి దుష్ట రావణుని చెరనుండి నిన్ను విడిపించాను. ఇంతకాలం పరుడి పంచన . ఉన్నందువల్ల నీ ప్రవర్తన గురించి నాకు సందేహముంది. కనుక నువ్వు నీ ఇష్టం వచ్చిన చోటికి వెళ్లవచ్చు’నని శ్రీరాముడు అన్నాడు.
ఈ) శ్రీరామునికి విశ్వాసం కలిగించడానికి ‘అగ్నిప్రవేశం’ ఒక్కటే శరణ్యమని భావించింది.
ఆ) అగ్నిదేవుడు స్వయంగా సీతాదేవిని తీసుకువచ్చి ఆమె గొప్పదనాన్ని వెల్లడించాడు.
అ) ఆమె శీలం యొక్క గొప్పదనాన్ని ముల్లోకాలకు చాటడానికే అగ్నిప్రవేశం చేస్తున్నా ఊరుకున్నానన్నాడు.

5. అ) అంగరంగ వైభవంగా శ్రీరామపట్టాభిషేక మహోత్సవం జరిగింది.
ఆ) పరమశివుడు శ్రీరాముణ్ణి ప్రశంసించాడు.
ఇ) పుష్పక విమానంలో నందిగ్రామం చేరుకున్న సీతారామలక్ష్మణులకు భరతుడు, ప్రముఖులు ఘనంగా స్వాగతం పలికారు.
ఈ) శ్రీరాముడి కోరిక మేరకు ఇంద్రుడు మృతులైపడి ఉన్న వానరులను మళ్లీ బతికించాడు.
జవాబులు
ఆ) పరమశివుడు శ్రీరాముణ్ణి ప్రశంసించాడు.
ఈ) శ్రీరాముడి కోరిక మేరకు ఇంద్రుడు మృతులైపడి ఉన్న వానరులను మళ్లీ బతికించాడు.
ఇ) పుష్పక విమానంలో నందిగ్రామం చేరుకున్న సీతారామలక్ష్మణులకు భరతుడు, ప్రముఖులు ఘనంగా స్వాగతం పలికారు.
అ) అంగరంగ వైభవంగా శ్రీరామపట్టాభిషేక మహోత్సవం జరిగింది.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 6 యుద్ధకాండ

6. అ) రావణుడు ప్రయోగించిన శక్తి అనే ఆయుధం లక్ష్మణుడి గుండెలో నాటుకుంది.
ఆ) అంగదుని చేతిలో రావణుని కుమారుడు ఇంద్రజిత్తు ఓడిపోయాడు.
ఇ) సముద్రుడిని ప్రార్థించడం వల్ల అది సాధ్యపడదన్నాడు విభీషణుడు.
ఈ) రావణుడి బాణ శక్తికి సుగ్రీవుడు మూర్ఛపోయాడు.
జవాబులు
ఇ) సముద్రుడిని ప్రార్థించడం వల్ల అది సాధ్యపడదన్నాడు విభీషణుడు.
ఆ) అంగదుని చేతిలో రావణుని కుమారుడు ఇంద్రజిత్తు ఓడిపోయాడు.
ఈ) రావణుడి బాణ శక్తికి సుగ్రీవుడు మూర్చపోయాడు.
అ) రావణుడు ప్రయోగించిన శక్తి అనే ఆయుధం లక్ష్మణుడి గుండెలో నాటుకుంది.

7. అ) యజ్ఞయాగాది క్రతువులను శ్రీరాముడు నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నాడు.
ఆ) విభీషణుడు రావణునికి ఉత్తర క్రియలను నిర్వర్తించాడు.
ఇ) అతికాయుడు లక్ష్మణుని బ్రహ్మాస్తానికి బలైనాడు.
ఈ) విభీషణుని లంకారాజుగా లక్ష్మణుడు పట్టాభిషిక్తుణ్ణి చేశాడు.
జవాబులు
ఇ) అతికాయుడు లక్ష్మణుని బ్రహ్మాస్త్రానికి బలైనాడు.
ఆ) విభీషణుడు రావణునికి ఉత్తర క్రియలను నిర్వర్తించాడు.
ఈ) విభీషణుని లంకారాజుగా లక్ష్మణుడు పట్టాభిషిక్తుణ్ణి చేశాడు.
అ) యజ్ఞయాగాది క్రతువులను శ్రీరాముడు నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నాడు.

8. అ) కుంభకర్ణుడు యుద్ధంలో వానరులను చావుదెబ్బ తీస్తున్నాడు.
ఆ) శ్రీరామచంద్రాదులు వానర సైన్యంతో సువేల పర్వతానికి చేరుకున్నారు.
ఇ) రావణుని వద్దకు అంగదుడిని రాయబారిగా పంపాడు రాముడు.
ఈ) శ్రీరాముడు యుద్ధనీతిని అనుసరించి సైన్యాన్ని వివిధ భాగాలుగా విభజించాడు.
జవాబులు
ఈ) శ్రీరాముడు యుద్ధనీతిని అనుసరించి సైన్యాన్ని వివిధ భాగాలుగా విభజించాడు.
ఆ) శ్రీరామచంద్రాదులు వానర సైన్యంతో సువేల పర్వతానికి చేరుకున్నారు.
ఇ) రావణుని వద్దకు అంగదుడిని రాయబారిగా పంపాడు రాముడు.
అ) కుంభకర్ణుడు యుద్ధంలో వానరులను చావుదెబ్బ తీస్తున్నాడు.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 6 యుద్ధకాండ

9. అ) శ్రీరాముడు సముద్రతీరంలో దర్భాసనం మీద కూర్చొని సముద్రుడిని ఉపాసించాడు.
ఆ) సుషేణుని చేతిలో విద్యున్మాలి మరణించాడు.
ఇ) వందయోజనాల పొడవు పది యోజనాల వెడల్పు గల సేతువును కట్టడం ఐదురోజుల్లో పూర్తి అయింది.
ఈ) ఉత్సాహం ఉరకలు వేస్తుంటే అందరు సముద్రతీరాన్ని చేరుకున్నారు.
జవాబులు
ఈ) ఉత్సాహం ఉరకలు వేస్తుంటే అందరు సముద్రతీరాన్ని చేరుకున్నారు.
అ) శ్రీరాముడు సముద్రతీరంలో దర్భాసనం మీద కూర్చొని సముద్రుడిని ఉపాసించాడు.
ఇ) వందయోజనాల పొడవు పది యోజనాల వెడల్పు గల సేతువును కట్టడం ఐదురోజుల్లో పూర్తి అయింది.
ఆ) సుషేణుని చేతిలో విద్యున్మాలి మరణించాడు.

10. అ) పుష్పక విమానంలో సీతా రామలక్ష్మణులు నందిగ్రామం చేరుకున్నారు.
ఆ) అగ్నిదేవుడు స్వయంగా సీతను తీసుకొని వచ్చి ఆమె గొప్పతనాన్ని కొనియాడాడు.
ఇ) శ్రీరాముడు హనుమంతుని సాహసాన్ని ప్రశంసించాడు.
ఈ) లంకలో రావణుడు మంత్రులతో సమావేశమయ్యాడు.
జవాబులు
ఇ) శ్రీరాముడు హనుమంతుని సాహసాన్ని ప్రశంసించాడు.
ఈ) లంకలో రావణుడు మంత్రులతో సమావేశమయ్యాడు.
ఆ) అగ్నిదేవుడు స్వయంగా సీతను తీసుకొనివచ్చి ఆమె గొప్పతనాన్ని కొనియాడాడు.
అ) పుష్పక విమానంలో సీతా రామలక్ష్మణులు నందిగ్రామం చేరుకున్నారు.

పాత్ర స్వభావాలు

1. రావణుడు :
కైకసీ విశ్రవసుల కుమారుడు. లంకా నగరానికి అధిపతి. వేదాధ్యాయనం చేసినవాడు. శివభక్తుడు. కోపం ఎక్కువ. మూర్ఖత్వం ఎక్కువ. మంచి చెబితే వినడు. చెప్పిన వారిపై కక్ష కడతాడు. సీతాపహరణ చేశాడు. స్త్రీ వ్యా మోహం ఎక్కువ. శ్రీరాముని ఆగ్రహానికి గురి అయ్యాడు. తన వంశ నాశనానికి కారకుడయ్యాడు.

2. విభీషణుడు :
రావణుని తమ్ముడు. రావణుడు పరాయి స్త్రీలను తీసుకుని వచ్చినపుడు అది తప్పని చెప్పేవాడు. సీతాదేవిని అపహరించడం తప్పని చెప్పిన ధర్మాత్ముడు. అనేక ధర్మసూక్ష్మాలు తెలిసినవాడు. రావణునిచేత అనేక అవమానాలు పడ్డాడు. ధర్మ రక్షణకోసం శ్రీరాముని పక్షంలో చేరాడు. రాక్షస నాశనానికి కారకుడయ్యాడు. రావణ సంహారం తర్వాత లంకా నగరానికి రాజయ్యాడు.

3. ఇంద్రజిత్తు :
రావణుని పెద్ద కుమారుడు. ఇతని అసలు పేరు మేఘనాథుడు. ఇంద్రుని ఓడించడం వల్ల ఇంద్రజిత్తు అని పేరు వచ్చింది.

రావణుడు తన తమ్ముడైన కుంభకర్ణుణ్ణి, కొడుకైన అతికేయుని పోగొట్టుకొని తల్లడిల్లుతుంటే ఇంద్రజిత్తు ఆయనను ఓదార్చాడు. తాను యుద్ధ రంగానికి వచ్చి రామలక్ష్మణుల మీద బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. వాళ్ళు స్పృహ కోల్పోయినట్లు నటిస్తే మరణించారని భావించి ఆ వార్తను తన తండ్రికి తెలియచేశాడు. శత్రుపక్షాన్ని మానసికంగా దెబ్బతీయాలనే ఆలోచన కలవాడు ఇంద్రజిత్తు. అందుకే మాయ సీతను సృష్టించి ఆమెను సంహరించాడు. చివరికి లక్ష్మణుని చేతిలో ఇంద్రజిత్తు మరణించాడు.

సంఘటన ద్వారా గ్రహించుట

ప్రశ్న 1.
“ఏ దేశంలోనైనా భార్య దొరకవచ్చు, బంధువులు దొరకవచ్చు, కాని లక్ష్మణుని వంటి తమ్ముడు దొరకడు.” అన్న శ్రీరాముని మాటలను బట్టి మీరేం గ్రహించారు?
జవాబు:
రావణుడు ప్రయోగించిన “శక్తి” అనే ఆయుధం కారణంగా నేలకూలిన లక్ష్మణుడిని చూసి విలవిలలాడిపోతూ శ్రీరాముడు అన్న మాటలివి.

ఈ మాటలు రామలక్ష్మణులకు గల అనుబంధాన్ని సోదరప్రేమను చాటుతున్నాయి. అన్నకోసం అన్ని సుఖాలు . వదులుకొని అడవులకు వచ్చినవాడు లక్ష్మణుడు. అతడు లేనిచో తాను జీవించలేనని భావించినందున రాముడు ఈ మాటలు అన్నాడు. ఇవి రాముడికి లక్ష్మణునిపై గల ప్రేమాభిమానాలను సూచిస్తున్నాయి. శ్రీరామునికి లక్ష్మణుడు తలలోని నాలుకలాంటివాడని, ఆరోప్రాణమని ఈ మాటల ద్వారా నేను గ్రహించాను. లక్ష్మణుడి వంటి సోదరుడు ఎవరికీ దొరకడని గ్రహించాను.

ప్రశ్న 2.
“వ్యక్తులు జీవించి వున్నంత వరకే వైరముండాలి. తరువాత దానిని వదలి వేయాలి” అని విభీషణుడితో శ్రీరాముడు పలికిన మాటలను బట్టి మీరేం గ్రహించారు?
జవాబు:
1. వ్యక్తులు జీవించి ఉన్నంత వరకే వైరముండాలి, తరువాత దానిని వదిలివేయాలి అని విభీషణునితో శ్రీరాముడు పలికిన మాటలను బట్టి రాముడు గొప్ప వ్యక్తిత్వం కలవాడని నేను గ్రహించాను.
2. ఏ వ్యక్తి అయినా మరణించిన తర్వాత అతనితో పూర్వము ఉన్న వైరము మరచిపోవాలని, మరణముతోనే వైరము పోవాలని గ్రహించాను.
3. రావణుని మరణానంతరము శ్రీరాముడు విభీషణునితో “రావణుడు నీకు ఎటువంటి వాడో నాకు కూడా అటువంటివాడే” అని చెప్పి తన విశాల హృదయాన్ని చాటుకొన్నాడని గ్రహించాను.
4. రాముడు దుష్టశిక్షణ, శిష్టరక్షణ, మరణించిన శత్రువు పట్ల గౌరవ భావం కలవాడని గ్రహించాను.

ప్రశ్న 3.
“నీవు యుద్ధంలో అలసిపోయావు. సేద దీర్చుకొనిరా” అని రాముడు రావణాసురునితో చెప్పిన మాటలను బట్టి, మీరు ఏమి గ్రహించారు?
జవాబు:
రామరావణుల యుద్ధం మహాఘోరంగా సాగుతోంది. శ్రీరాముని పరాక్రమం ముందు రావణుని ధనుస్సు ముక్కలయ్యింది. రావణుని కిరీటం నేలపై పడింది. అప్పుడు కావాలంటే రాముడు రావణుని సంహరింపవచ్చు. కాని ధర్మాత్ముడయిన, కరుణా సముద్రుడయిన రాముడు రావణుడు తనకు శత్రువయినా అతనిపై దయతలచాడు. రావణునితో రాముడు “నీవు యుద్ధంలో అలసిపోయావు, విశ్రాంతి తీసుకొని మరునాడు యుద్దానికి రా” అని చెప్పి రావణుని దయతలచి విడిచిపెట్టాడు.

దీనిని బట్టి రాముడు శత్రువుపట్ల కూడా దయచూపే కరుణాంతరంగుడని గ్రహించాను. ధనుస్సు చేతపట్టిన ఆయుధం చేతిలో ఉన్న వీరునితోనే రాముడు యుద్ధం చేసేవాడని, రాముడు మహావీరుడని గ్రహించాను.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 6 యుద్ధకాండ

ప్రశ్న 4.
“వానరా! భళా, నాకు శత్రువువే అయినా, నీ శక్తిని మెచ్చుకుంటున్నాను” అని రావణుడు హనుమంతునితో అన్న – మాటలను బట్టి, మీరేమి గ్రహించారో తెల్పండి.
జవాబు:
యుద్ధంలో హనుమంతుడిని రావణుడు తన అరచేతితో చరచాడు. హనుమంతుడు తిరిగి కోపంతో రావణుడిని తన అరచేతితో ఒక్క దెబ్బ వేశాడు. ఆ దెబ్బకు రావణుడు కంపించి పోయి, హనుమంతుడి దెబ్బ వేశాడు. ఆ దెబ్బకు రావణుడు కంపించి పోయి, హనుమంతుడి బలపరాక్రమాలనూ, శక్తినీ, మెచ్చుకుంటూ పై విధంగా మాట్లాడాడు.

ఈ రావణుని మాటలను బట్టి, హనుమంతుడు మహాబలశాలి, ధైర్యశాలి, శక్తివంతుడు అనీ, రావణుడంతటి వీరునిచే ప్రశంసలు పొందిన గొప్ప బలపరాక్రమ సంపన్నుడనీ, నేను గ్రహించాను. శత్రువుచే మెచ్చుకోబడిన హనుమంతుడే నిజమైన వీరుడని నేను అభిప్రాయపడ్డాను.

ప్రశ్న 5.
“సీతను శ్రీరామునికి అప్పగించడమే, అన్ని విధాలా మంచిది. అనవసరంగా కలహం తెచ్చుకోవడం దేనికి? శ్రీరాముని పంటి మహావీరునితో యుద్ధం తగదు” అని విభీషణుడు అన్న రావణునకు చెప్పిన మాటలను బట్టి, మీరేమి గ్రహించారు?
జవాబు:
విభీషణుడు రావణాసురునికి తమ్ముడయినా, రాక్షసుడయినా, అతడు ధర్మాత్ముడనీ, విభీషణునికి రావణుడు చేసిన సీతాపహరణం ఇష్టం లేదనీ, సీతమ్మను రామునికి తిరిగి అప్పగించడం శ్రేయస్కరమని విభీషణుడు భావించాడనీ గ్రహించాను. శ్రీరాముడు మహావీరుడని గ్రహించాను. పరస్త్రీహరణం పాపకార్యం అనీ, అది ఎంత బలవంతునికైనా చేటు తెస్తుందనీ గ్రహించాను. విభీషణుడు రాక్షస జాతిలో పుట్టిన రత్నమాణిక్యం వంటివాడని, బుద్ధిమంతుడనీ గ్రహించాను. విభీషణుడు ధైర్యవంతుడనీ, అందుకే అన్నకు ఇష్టం లేకపోయినా, అన్నకు హితమైన మాటను ధైర్యం చేసి చెప్పాడనీ గ్రహించాను.

ప్రశ్న 6.
“సీతను అప్పగించకపోతే శ్రీరాముని చేతిలో మరణం తథ్యం” అని అంగదుడు పలికిన తీరును బట్టి మీరేమి గ్రహించారు?
జవాబు:
శ్రీరాముడు వానర సైన్యంతో కలిసి లంకను చేరాడు. అంగదుడిని రావణుని వద్దకు రాయబారిగా పంపించాడు. అంగదుడు రావణుని సమీపించి హితోపదేశం చేశాడు. సీతను శ్రీరామునికి అప్పగించకపోతే మరణం తప్పదని రావణుని హెచ్చరించాడు.

అంగదుని మాటల వల్ల శ్రీరాముడి పరాక్రమం, ధైర్యం, సాహసం అసమానమైనదని గ్రహించాను. అంగదుడిని రాయబారిగా రాముడు పంపించడం వల్ల శ్రీరాముడు రాజనీతిజ్ఞుడని గ్రహించాడు. శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకోవాలనే ఆలోచన శ్రీరామునికి ఉందని గ్రహించాను. అంతేగాదు శ్రీరాముని యుద్ధనీతిని కూడా గ్రహించాను.

ప్రశ్న 7.
యుద్ధరంగంలో అగస్త్యుడు శ్రీరామునికి ఆదిత్య హృదయాన్ని బోధించడం ద్వారా మీరేమి గ్రహించారు?
జవాబు:
రామరావణ యుద్ధం భీకరంగా సాగుతున్నది. ఆ సమయంలో అగస్త్యుడు శ్రీరాముడిని సమీపించాడు. ఆ మహర్షి శ్రీరామునికి ఆదిత్య హృదయాన్ని బోధించాడు. రామునిలో విజయకాంక్షను పెంచాడు. చక్కని విజయాన్ని అందించాడు. అగస్త్యుడు చేసిన ఉపదేశం ద్వారా ఆదిత్య హృదయం సర్వ విజయప్రదమని, శత్రువులను జయించు సామర్థ్యాన్ని అందించగలదని, యుద్ధరంగంలో శక్తిని సమకూర్చగలదని గ్రహించాను. ఆదిత్య హృదయాన్ని చదివితే ఆరోగ్యం కూడా కలుగుతుందని, అందువల్లనే శ్రీరాముడు రావణుని జయించగలిగాడని గ్రహించాను.

విషయాత్మక ప్రశ్నలు

ఈ క్రింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
సముద్రానికి వారధిని ఎవరు కట్టారు? ఎలా?
జవాబు:
విశ్వకర్మ కుమారుడు నలుడు. శిల్పకళా నిపుణుడు. ఉత్సాహవంతుడు. శక్తియుక్తులున్నవాడు. సేతువును భరిస్తానని శ్రీరామునకు సముద్రుడు మాట ఇచ్చాడు. నలుడు నిర్మిస్తానన్నాడు. వానరుల సహకారంతో నలుడి సూచనలననుసరించి సేతువు నిర్మాణం 5 రోజులలో పూర్తయింది. అది వంద యోజనాల పొడవు. పది యోజనాల వెడల్పు కలది.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 6 యుద్ధకాండ

ప్రశ్న 2.
రావణ మరణాన్ని వర్ణించండి.
జవాబు:
ఇంద్రుడు పంపిన రథాన్ని శ్రీరాముడు అధిరోహించాడు. రాముడు యుద్ధ నైపుణ్యం ముందు రావణుడు ఆగలేకపోతున్నాడు. అగస్త్యుడు రామునికి ‘ఆదిత్య హృదయం’ ఉపదేశించాడు. రామబాణ ధాటికి రావణ శిరస్సులు నేలరాలుతున్నాయి. మళ్ళీ మొలుస్తున్నాయి. మాతలి సూచనతో బ్రహ్మాస్త్రం ప్రయోగించాడు శ్రీరాముడు. రావణుడు అంతమయ్యాడు.

ప్రశ్న 3.
శ్రీరామ పట్టాభిషేకాన్ని వివరించండి.
జవాబు:
రావణ మరణానంతరం శ్రీరామ విజయం సీతకు హనుమ చెప్పాడు. అగ్ని ప్రవేశానంతరం సీతాదేవి శ్రీరాముని చేరింది. పుష్పక విమానంలో అయోధ్యకు చేరారు. పౌరులు ఘనస్వాగతం పలికారు. గురువులకు, పెద్దలకు నమస్కరించారు. శ్రీరామ పట్టాభిషేకం అంగరంగ వైభవంగా జరిగింది. భరతుణ్ణి యువరాజుగా పట్టాభిషిక్తుడిని చేశాడు. రామరాజ్యం ఏర్పడింది. ప్రజలకు శ్రీరామరక్ష కలిగింది.

ప్రశ్న 4.
శ్రీరాముడు శరణుకోరిన విభీషణుని ఆదరించిన విధానాన్ని వివరించండి.
జవాబు:
శ్రీరాముడు శరణుకోరిన విభీషణునితో “నేను రావణుణ్ణి బంధుమిత్ర సమేతంగా హతమారుస్తాను. నిన్ను రాజును చేస్తా” నని తమ్ముల మీద ఒట్టేసి చెప్పాడు. ఈ పనిలో తాను యథాశక్తి సహాయపడగలనని విభీషణుడు మాట ఇచ్చాడు. రాముడు విభీషణుణ్ణి ఆలింగనం చేసుకున్నాడు. రాముని ఆజ్ఞపై లక్ష్మణుడు సముద్రజలం తెచ్చి లంకారాజుగా విభీషణుణ్ణి పట్టాభిషిక్తుణ్ణి చేయటం జరిగింది. అందరూ ఆనందాన్ని ప్రకటించారు.

వ్యాసరూప ప్రశ్నలు

ఈ క్రింది ప్రశ్నలకు 10 లేక 12 వాక్యాల్లో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
శ్రీరాముడు సముద్రునిపై అస్త్ర ప్రయోగానికి సిద్ధపడటానికి కారణం ఏమిటి? దాని పర్యవసానమేమిటి?
జవాబు:
లంకకు వెళ్ళాలంటే రాముడు సముద్రం దాటాలి. సముద్రాన్ని దాటే ఉపాయం ఏమిటని సుగ్రీవుడిని రాముడు అడిగాడు. సముద్రుడిని ప్రార్థించమని విభీషణుడు సలహా చెప్పాడు. శ్రీరాముడు సముద్రతీరంలో దర్భాసనం మీద కూర్చుని సముద్రుడిని ప్రార్థించాడు. మూడు రాత్రులు గడచినా సముద్రుడు ఎదుట కనబడలేదు.

కోపముతో శ్రీరాముడి కళ్ళు ఎరుపు ఎక్కాయి. సముద్రుడి అహంకారాన్ని పోగొట్టాలనీ, సముద్రంలో నీటిని ఇంకిపోయేటట్లు చేయాలనీ రాముడు అనుకున్నాడు. అప్పుడు శ్రీరాముడు బ్రహ్మాస్తమును స్మరించాడు.

దానితో ప్రకృతి అంతా అల్లకల్లోలమయ్యింది. సముద్రుడు భయపడి పారిపోతున్నాడు. పరుగెత్తేవాడిపై బాణం ప్రయోగించరాదని, శ్రీరాముడు ఆగాడు. సముద్రుడు దారికి వచ్చాడు. లంకకు వెళ్ళడానికి తాను దారి ఇస్తానన్నాడు.

ఎక్కుపెట్టిన బాణం వృథాకారాదని, రాముడు సముద్రుడి మాటపై పాపాత్ములు ఉండే ద్రుమకుల్యంపై దాన్ని ప్రయోగించాడు. సేతువు నిర్మించడానికి నలుడు సమర్థుడనీ, సేతువును తాను భరిస్తాననీ, సముద్రుడు రామునికి చెప్పాడు. సేతు నిర్మాణం జరిగింది.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 6 యుద్ధకాండ

ప్రశ్న 2.
అంగద రాయబారాన్ని వివరించండి.
జవాబు:
అంగదుడు వాలి కుమారుడు. మహాశక్తిమంతుడు. రావణుడితో యుద్ధానికి దిగేముందు, రాముడు రావణుని దగ్గరకు అంగదుని రాయబారిగా పంపాడు. అంగదుడు రావణుడి దగ్గరకు వెళ్ళి, సీతను రామునికి అప్పగించకపోతే, శ్రీరాముడి చేతిలో రావణుడి మరణం తథ్యమనీ, లంకకు విభీషణుడు రాజు కాగలడనీ, రావణుడిని హెచ్చరించాడు.

దానితో రావణుని సభ అంతా అట్టుడికిపోయింది. నలుగురు రాక్షసులు అంగదుడి మీద విరుచుకుపడ్డారు. అంగదుడు ఆ రాక్షసులను తన చంకలో ఇరికించుకొని, మేడపైకి ఎగిరాడు. అంగదుడు మేడపై నుండి ఆ రాక్షసులను నేలపైకి విసిరాడు.

తరువాత అంగదుడు సింహనాదం చేసి, ఆకాశమార్గంలో శ్రీరాముడిని చేరాడు. ఈ విధంగా శ్రీరాముడు రావణుని భావాన్ని గ్రహించాడు. ఇక రావణుడితో యుద్ధం చేయక తప్పదని రాముడు నిశ్చయించాడు.

ప్రశ్న 3.
రావణుని శక్తి ఆయుధ ప్రయోగం వలన కలిగిన పరిణామాలను వివరించండి.
జవాబు:
రావణుడు తనతో యుద్ధం చేస్తున్న లక్ష్మణుడి పై ‘శక్తి’ అనే ఆయుధాన్ని ప్రయోగించాడు. ఆ శక్తి ఆయుధం, లక్ష్మణుడి హృదయంలో గుచ్చుకుంది. దానితో లక్ష్మణుడు స్పృహ తప్పాడు. రావణుడు లక్ష్మణుడిని ఎత్తుకొని వెళ్ళాలని అనేక విధాల ప్రయత్నించాడు. కాని రావణుడు లక్ష్మణుడిని పైకి ఎత్తలేకపోయాడు.

అప్పుడు ఆంజనేయుడు రావణుడి మీద దాడి చేశాడు. హనుమంతుడు రావణుడి వక్షఃస్థలం మీద తన పిడికిలితో గట్టిగా గుద్దాడు. దానితో రావణుడు కూలిపోయాడు. హనుమంతుడు లక్ష్మణుడిని శ్రీరాముడి వద్దకు చేర్చాడు. శ్రీరాముడు హనుమంతుడి భుజాలపై కూర్చుండి, రావణునితో యుద్ధం చేశాడు. రాముడి పరాక్రమం ముందు, రావణుడి ధనుస్సు ముక్కలయ్యింది. రావణుని కిరీటం నేలకూలింది.

శ్రీరాముడు రావణునిపై దయతలచి “రావణా ! నీవు యుద్ధంలో అలసిపోయావు.. విశ్రాంతి తీసుకొనిరా” అని చెప్పాడు. రావణుడు యుద్ధం నుండి తిరుగుముఖం పట్టాడు.

ప్రశ్న 4.
రామరావణ సంగ్రామాన్ని వివరించండి.
జవాబు:
రాముడు హనుమంతుడి భుజాలపై కూర్చుండి, రావణునితో యుద్ధం చేశాడు. రాముని పరాక్రమంతో రావణుని ధనుస్సు ముక్కలయ్యింది. రావణుడి కిరీటం నేలకూలింది. రాముడు రావణునిపై దయతలచి అప్పటికి విడిచి పెట్టాడు.

తరువాత రామలక్ష్మణులతో రావణుడు భయంకరంగా యుద్ధం చేశాడు. రావణుడు శక్తి అనే ఆయుధాన్ని లక్ష్మణుడిపై వేశాడు. రాముడు శక్తిని వేడుకున్నాడు. శక్తి తన ప్రాణశక్తిని కోల్పోయింది. శక్తి లక్ష్మణుడికి తగిలింది. రాముడు శక్తిని విరిచివేశాడు. రాముడు విజృంభించాడు. దానితో రావణుడు పరుగుపెట్టాడు.

హనుమ తెచ్చిన ఓషధీ ప్రభావంతో లక్ష్మణుడు లేచాడు. ఇంద్రుడు తన సారధి మాతలిని, తన దివ్యరథాన్ని, రాముని కోసం పంపాడు. రాముడు ఇంద్ర రథం ఎక్కి రావణుడితో యుద్ధం చేశాడు. రామరావణులు సమానంగా పోరాడారు.

రాముడు విజృంభించడంతో, రావణుడి రథసారధి రావణుని రథాన్ని ప్రక్కకు మరలించాడు. రావణుడు తన సారధిని మందలించాడు. తిరిగి రావణ రథం, రాముని ముందు నిలిచింది. అగస్త్య మహర్షి దేవతలతో వచ్చి, రామునికి ఆదిత్యహృదయ మంత్రం ఉపదేశించాడు.

రాముని బాణానికి రావణుడి తలలు నేలపై రాలి తిరిగి మొలుస్తున్నాయి. అప్పుడు మాతలి రావణునికై బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించమని రామునికి చెప్పాడు. రాముని బ్రహ్మాస్త్రంతో, రావణ సంహారం జరిగింది.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 6 యుద్ధకాండ

ప్రశ్న 5.
శ్రీరాముడు సైన్యంతో లంకానగరాన్ని చేరిన వృత్తాంతాన్ని తెలపండి.
జవాబు:
సీతాదేవిని చూసి వచ్చి కుశల వార్తను అందించిన హనుమను శ్రీరాముడు ఆలింగనం చేసికొన్నాడు. మహోపకారం చేసిన హనుమకు తాను ఇయ్యగల సత్కారం అదే అన్నాడు. రాముడికి దుఃఖం వచ్చింది. సుగ్రీవుడు రాముడిని ఓదార్చాడు. క్రోధం చూపించాలి అని రామునికి సుగ్రీవుడు సలహా ఇచ్చాడు. సముద్రానికి సేతువు కడితేకాని, లంకను జయించలేము అన్నాడు. హనుమ లంకానగర రక్షణ వ్యవస్థను గూర్చి తెలిపాడు.

విజయ ముహూర్తంలో లంకకు బయలుదేరాలని రాముడు అన్నాడు. నీలుడు సైన్యానికి మార్గం చూపించాలని, రాముడు హనుమంతుని భుజం మీద, లక్ష్మణుడు అంగదుని భుజం మీద కూర్చొని వెళ్ళాలని, సుగ్రీవుడు పల్లకిపై రావాలని, రాముడు నిర్ణయించాడు. అందరూ సముద్రతీరాన్ని చేరుకున్నారు.

విభీషణుడు ధర్మం విడిచిన రావణుని విడిచి పెట్టి, తన నలుగురు అనుచరులతో రామలక్ష్మణులు ఉన్న చోటికు చేరాడు. విభీషణుడు రాముని శరణు కోరగా, రాముడు అంగీకరించాడు. రాముడు రావణుని చంపి విభీషణుణ్ణి రాజును చేస్తానని ప్రమాణం చేశాడు. ఆ పనిలో రామునికి తాను సహాయం చేస్తానని విభీషణుడన్నాడు. రాముడు విభీషణుణ్ణి లంకకు పట్టాభిషిక్తుణ్ణి చేయమని లక్ష్మణుడికి చెప్పాడు. లక్ష్మణుడు ఆ పని చేశాడు. సముద్రుణ్ణి ప్రార్థిస్తే సముద్రాన్ని దాటగలవని విభీషణుడు రామునికు చెప్పాడు. శ్రీరాముడు సముద్రుణ్ణి ఉపాసించాడు. మూడు రోజులు అయినా, సముద్రుడు ప్రసన్నుడు కాలేదు. రాముడు బ్రహ్మాస్త్రాన్ని స్మరించాడు. సముద్రుడు పరుగుపెట్టాడు. లంకకు వెళ్ళడానికి దారి ఇస్తానని సముద్రుడు చెప్పాడు. రాముడు ఎక్కుపెట్టి అస్త్రం వ్యర్థం కాకుండా, పాపాత్ములు ఉండే “ద్రుమకుల్యం” పై ప్రయోగించాడు. నలుడు సేతువు నిర్మించడానికి తగినవాడని సముద్రుడు చెప్పాడు. సేతువును భరిస్తానని సముద్రుడు మాట ఇచ్చాడు.

రాముడు సేతువు నిర్మాణానికి శ్రీకారం చుట్టాడు. వానరులు వృక్షాలు తెచ్చి సముద్రంలో పడవేశారు. 100 యోజనాల పొడవు, 10 యోజనాల వెడల్పు గల సేతువు 5 రోజుల్లో కట్టబడింది. రామలక్ష్మణ సుగ్రీవులు ముందు నడుస్తున్నారు. సైన్యం వారి వెంట నడిచింది. వానరులు కొందరు సముద్రంలో దూకి ఈదుతూ వచ్చారు.

ఈ విధంగా శ్రీరాముడు, సుగ్రీవుడు మొదలయిన వానర నాయకులతో లంకా నగరానికి చేరాడు.

ప్రశ్న 6.
వానర సైన్యానికీ, రాక్షసులకు మధ్య జరిగిన యుద్ధం వివరాలను తెలపండి.
జవాబు:
రాముడు సైన్యాన్ని విభాగించి, ఎవరి బాధ్యతలు వారికి అప్పగించాడు. రావణుని మంత్రులైన శుకసారణులు రాముని బలం తెలిసికోడానికి గూఢచారులుగా వచ్చి వానరులలో చేరారు. విభీషణుడు వారిని గుర్తించి, రాముని ముందు పెట్టాడు. రాముడు వారిని క్షమించి, సీతను అప్పగించకపోతే రావణుడి మరణం తప్పదని హెచ్చరించాడు. శుకసారణులు రావణునికి ఆ విషయం తెలిపారు.

రావణుడు అశోకవనం వెళ్ళి రాముడు తన చేతిలో మరణించాడని సీతకు అబద్దం చెప్పాడు. విద్యుజిహ్వుడిచే రామునివి అనిపించే మాయా శిరస్సునూ, ధనుర్భాణాలనూ తెప్పించి, సీతకు చూపించాడు. సీతను తన్ను ఆశ్రయించమని కోరాడు. సీత విచారించింది. విభీషణుడి భార్య “సరమ” సీతను ఊరడించి రాముడు క్షేమంగా ఉన్నాడనీ, అదంతా రాక్షసమాయ అనీ సీతకు తెలిపింది.

శ్రీరామ చంద్రాదులు సువేల పర్వతానికి చేరారు. లంకానగర శోభను చూశారు. రావణుడు ఠీవిగా మేడపై ఉన్నాడు. సుగ్రీవుడు రావణునిపై కోపంతో ఎగిరి రావణ భవనంపై వాలాడు. తన నుండి రావణుడు తప్పించుకోలేడని, రావణుడి కిరీటాన్ని తీసి నేలపై కొట్టాడు. రావణుడు రెచ్చిపోయాడు. ఇద్దరికీ బాహాబాహీ యుద్ధం జరిగింది. సుగ్రీవుడు రావణుడిని ముప్పుతిప్పలు పెట్టి, తిరిగి సువేల పర్వతం చేరాడు. శ్రీరాముడు సుగ్రీవుణ్ణి మందలించాడు.

అంగదుడిని రాముడు రావణుడి దగ్గరకు రాయబారిగా పంపాడు. రాముడి చేతిలో రావణుడు మరణిస్తాడని, విభీషణుడు రాజు అవుతాడని రాముని వాక్యంగా, అంగదుడు రావణునికి తెలిపాడు. అంగదుడిని నలుగురు రాక్షసులు చంపబోయారు. అంగదుడు వారిని చంపి వచ్చాడు. రాముడు యుద్ధానికి సిద్ధం అయ్యాడు.

లంకపై దండయాత్ర :
వానరసైన్యం లంకను నాల్గువైపుల నుండి ముట్టడించింది. ఆంజనేయుడి చేతిలో జంబుమాలి, సుషేణుడి చేతిలో విద్యున్మాలి మరణించారు. అంగదుడి చేతిలో ఇంద్రజిత్తు ఓడిపోయాడు. దానితో ఇంద్రజిత్తు కపట యుద్దానికి దిగాడు. ఇంద్రజిత్తు నాగాస్త్రంతో రామలక్ష్మణులను బంధించాడు. రామలక్ష్మణులు మరణించారని ఇంద్రజిత్తు రావణుడితో చెప్పాడు. రావణుడు ఆజ్ఞాపించగా “త్రిజట మొదలయిన రాక్షస స్త్రీలు సీతను పుష్పక విమానంలో యుద్ధభూమికి తీసుకువచ్చి, నేలపై ఉన్న రామలక్ష్మణులను చూపించారు. సీత ఏడ్చింది. త్రిజట సీతను ఓదార్చింది. రామలక్షణులు బతికి ఉన్నారని ఆమె సీతకు ఆధారాలు చూపింది. సీత మనస్సు కుదుట పడింది.

గరుత్మంతుడి రాకతో నాగాస్త్ర ప్రభావం నుండి రామలక్ష్మణులు విముక్తి పొందారు. హనుమంతుడు అకంపనుణ్ణి, ధూమ్రాక్షుణ్ణి చంపాడు. అంగదుడు వజ్రదంష్ట్రుడిని, నీలుడు ప్రహస్తుడిని చంపాడు. రావణుడి చేతిలో సుగ్రీవుడు మూర్ఛపోయాడు. లక్ష్మణుడు రావణుడిని ఎదిరించాడు. రావణుడు బాణవర్షం కురిపించాడు. హనుమ అడ్డుకున్నాడు. రావణుడి అరచేతి దెబ్బకు హనుమ చలించి, తిరిగి తేరుకొని, రావణుడిని అరచేతితో కొట్టాడు. దశగ్రీవుడు కంపించిపోయి, ‘భళా! వానరా’ అని హనుమశక్తిని మెచ్చుకున్నాడు.

రావణుడు ‘శక్తి’ అనే ఆయుధాన్ని లక్ష్మణుడి పై వేశాడు. లక్ష్మణుడు స్పృహ కోల్పోయాడు. రావణుడు లక్ష్మణుడిని ఎత్తుకొని పోవడానికి విఫలయత్నం చేశాడు. ఆంజనేయుడు పిడికిలితో పొడిచి రావణుడిని కూలగొట్టి, లక్ష్మణుడిని రాముని దగ్గరకు చేర్చాడు. శ్రీరాముడు హనుమంతుని భుజాలపై కూర్చుండి రావణునితో యుద్ధం చేశాడు. రావణుని కిరీటం, ధనుస్సు నేలపై పడ్డాయి. రాముడు కరుణించి, అలసిపోయిన రావణుడిని విశ్రాంతి తీసుకొని తిరిగి యుద్ధానికి రమ్మన్నాడు.

ప్రశ్న 7.
రామరావణ యుద్ధాన్ని గురించి రాయండి.
జవాబు:
హనుమంతుని భుజాలపై కూర్చుండి, రాముడు రావణునితో యుద్ధం చేశాడు. రాముని పరాక్రమం ముందు, రావణుని ధనుస్సు, కిరీటం దాసోహం అన్నాయి. రాముడు రావణునిపై దయతలచి, “నీవు యుద్ధంలో అలసిపోయావు. విశ్రాంతి తీసుకొని రేపురా, నా బలం తెలుస్తుంది” అన్నాడు.

రావణుడు అంతఃపురానికి వెళ్ళి తమ్ముడు కుంభకర్ణుని నిద్ర నుండి లేపించాడు. కుంభకర్ణుడు ఆరునెలలు నిద్రపోయి, ఒకరోజు భోజనం చేస్తూ ఉంటాడు. రావణుడు కుంభకర్ణుడికి విషయం వివరించాడు. కుంభకర్ణుడు యుద్ధానికి సిద్ధమయి, వానరులను చావగొడుతున్నాడు. వానరులు తలో దారి పట్టారు. రాముడు కుంభకర్ణుని ఐంద్రాస్త్రంతో సంహరించాడు. కుంభకర్ణుని తల, లంకలో పడి రాజవీధులలోని భవనాల, ఇంటి కప్పులు, ప్రాకారాలు కూలిపోయాయి. కుంభకర్ణుని మరణవార్త విని రావణుడు విచారించాడు.

రావణ పుత్రుడైన “అతికాయుడు” లక్ష్మణుని బ్రహ్మాస్త్రానికి బలయ్యాడు. ఇంద్రజిత్తు తండ్రిని ఓదార్చాడు. ఇంద్రజిత్తు యుద్ధరంగానికి వచ్చి, రామలక్ష్మణులపై బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. రామలక్ష్మణులు స్పృహ కోల్పోయినట్లు పడియున్నారు. అదిచూసి రామలక్ష్మణులు మరణించారని ఇంద్రజిత్తు తండ్రికి చెప్పాడు.

వానరులు అలజడి చెందడంతో, విభీషణుడు వారికి ధైర్యం చెప్పాడు. రామలక్ష్మణులు బ్రహ్మపై గౌరవంతో అస్త్ర బాధను అనుభవించారని విభీషణుడు వానరులకు చెప్పాడు. బ్రహ్మాస్త ప్రభావంతో 67 కోట్ల మంది మరణించారు. హనుమ, విభీషణుడు జాంబవంతుడి కోసం వెతుకుతున్నారు. జాంబవంతుడు ధ్వనిని బట్టి విభీషణుడిని గుర్తించాడు. హనుమ క్షేమమా ? అని జాంబవంతుడు విభీషణుడిని అడిగాడు. హనుమ జీవిస్తే వానరులంతా జీవించినట్లే అన్నాడు. హనుమ సర్వౌషధి పర్వతాన్ని పెల్లగించి తెచ్చాడు. ఓషధుల వాసనకు రామలక్ష్మణుల గాయాలు మాయం అయ్యాయి. వానరులు లేచి కూర్చున్నారు. వానరులు లంకకు నిప్పు పెట్టారు.

ఇంద్రజిత్తు మాయా. సీతను సంహరించాడు. అందరూ చనిపోయింది నిజం సీత అనుకున్నారు. ఈ వార్త తెలిసి రాముడు విచారించాడు. అది ఇంద్రజిత్తు మాయ అని విభీషణుడు తెలిపాడు. శత్రువుల సంహారానికి ఇంద్రజిత్తు నికుంభిలా అభిచార హోమాన్ని తలపెట్టాడు. ఇంద్రజిత్తు యజ్ఞాన్ని భంగం చేయడానికి లక్ష్మణుడు వెళ్ళాడు. లక్ష్మణ ఇంద్రజిత్తులు ఘోరయుద్ధం చేశారు. లక్ష్మణుడు ఇంద్రజిత్తు తలను ఐంద్రాస్త్రంతో నేల రాల్చాడు.

రావణుని యుద్ధం :
రావణుడు ప్రళయకాల రుద్రుడిలా విజృంభించాడు. వానరులు పారిపోతున్నారు. సుగ్రీవుడు విరూపాక్షుడిని, మహోదరుడిని సంహరించాడు. రామలక్ష్మణులతో రావణుడి యుద్ధం భయంకరంగా సాగుతోంది. రావణుడు విభీషణుడిని చంపడానికి బల్లెము ఎత్తాడు. అప్పుడు లక్ష్మణుడు రావణునిపై బాణాలను వేశాడు. రావణుడు లక్ష్మణునిపై ‘శక్తి’ అనే ఆయుధాన్ని ప్రయోగించాడు. శ్రీరాముడు ‘శక్తి’ని వేడుకొన్నాడు. శక్తి తన ప్రాణశక్తిని కోల్పోయింది. శక్తి లక్ష్మణుని మాత్రం తాకింది. అతడు నేలపై పడ్డాడు. రాముడు ఆ శక్తిని లాగి విరచివేశాడు. రాముడు విజృంభించాడు. దానితో రావణుడు పరుగుపెట్టాడు.

పడిపోయిన లక్ష్మణుడిని చూసి, రాముడు విలవిలలాడాడు. సుషేణుడు లక్ష్మణుడు చనిపోలేదని చెప్పాడు. సుషేణుడి సూచన ప్రకారంగా హనుమ ఓషధులు తెచ్చాడు. ఓషధీ ప్రభావంతో లక్ష్మణుడు లేచాడు. ఇంద్రుడు మాతలితో పాటు తన దివ్య రథాన్ని రాముని కోసం పంపాడు. రాముడు రథం ఎక్కాడు. రామరావణులు సమంగా యుద్ధం చేశారు. రాముడు విజృంభించాడు. దానితో రావణుడి రథసారథి రావణుడి రథాన్ని పక్కకు మరలించాడు. రావణుడు సారథిని మందలించాడు. తిరిగి రావణరథం రాముని ముందు నిలిచింది. అగస్త్యుడు దేవతలతో అక్కడకు వచ్చి, రాముడికి ‘ఆదిత్య హృదయ మంత్రం’ ఉపదేశించాడు.

రాముని బాణానికి రావణుడి తలలు నేలరాలి తిరిగి మొలుస్తున్నాయి. రావణునిపై బ్రహ్మాస్త్రాన్ని వేయమని మాతలి రామునికి చెప్పాడు. రాముడి బ్రహ్మాస్త్రంతో రావణ సంహారం జరిగింది.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 6 యుద్ధకాండ

ప్రశ్న 8.
రావణుని చంపి శ్రీరాముడు పట్టాభిషిక్తుడై రాజ్యాన్ని పాలించిన విధానాన్ని తెలపండి.
జవాబు:
మాతలి సూచనతో శ్రీరాముడు రావణునిపై బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. రావణ సంహారం జరిగింది. రాముడి ఆదేశం మేరకు విభీషణుడు తన అన్న రావణునికి ఉత్తర క్రియలను నిర్వహించాడు. రాముని ఆజ్ఞ ప్రకారం, లక్ష్మణుడు విభీషణుడిని లంకారాజుగా పట్టాభిషేకం చేశాడు. హనుమ సీతమ్మకు రావణసంహారం గురించి చెప్పాడు. సీతను బాధించిన స్త్రీలను చంపుతానన్న హనుమను, సీతమ్మ వారించింది.

విభీషణుడు సీతను పల్లకిలో రాముని వద్దకు తీసుకువచ్చాడు. సీత భర్తను చేరుకుంది. రాముడు సీతతో తన వంశ ప్రతిష్ఠను నిలుపుకోడానికి రావణుడి చెర నుండి సీతను విడిపించాననీ, సీత పరుల పంచన ఉన్నందువల్ల తనకు ఆమెపై సందేహం ఉందనీ, ఆమె ఇష్టం వచ్చినచోటుకు వెళ్ళవచ్చునని అన్నాడు. శ్రీరాముడి మాటలు సీతకు బాణాల్లా గుచ్చుకున్నాయి. రాముడికి తనపై విశ్వాసం కల్గించడానికి ‘అగ్నిప్రవేశం’ ఒక్కటే దిక్కని సీత భావించింది. లక్ష్మణుడు చితిని సిద్ధం చేశాడు. సీత అగ్నిప్రవేశం చేసింది. అగ్నిదేవుడు సీతను స్వయంగా తీసుకువచ్చి ఆమెను స్వీకరించమని రాముని కోరాడు.

సీత శీలాన్ని ముల్లోకాలకూ చాటడానికే, సీత అగ్ని ప్రవేశం చేస్తున్నప్పటికీ, తాను ఊరుకున్నానన్నాడు. సీతను రాముడు స్వీకరించాడు. శివుడు రాముని ప్రశంసించాడు. ఇంద్రుడు చనిపోయిన వానరులను బ్రతికించాడు. విభీషణుడు రాముడిని మరికొంతకాలం లంకలో ఉండమన్నాడు. కాని భరతుని కోసం రాముడు పుష్పకవిమానంలో అయోధ్యకు బయలుదేరాడు. రాముడు తాను తిరిగి వస్తున్న విషయాన్ని భరతుడికి హనుమ ద్వారా కబురంపాడు.

పుష్పకవిమానంలో నందిగ్రామం చేరుకున్న సీతారామలక్ష్మణులకు, భరతాదులు స్వాగతం చెప్పారు. సీతారాములు తల్లులకూ, వశిష్ఠుడికి నమస్కరించారు. భరతుణ్ణి రాముడు దగ్గరకు తీసుకొన్నాడు. శ్రీరామ పట్టాభిషేకం మహా వైభవంగా జరిగింది. రాముడు లక్ష్మణుడిని యువరాజుగా ఉండమన్నాడు. లక్ష్మణుడు అంగీకరించలేదు. భరతుణ్ణి యువరాజుగా చేశాడు.

రాముడు ప్రజలను కన్నబిడ్డలవలె చూశాడు. ప్రజలు ధర్మబద్ధంగా నడచుకున్నారు. రాముడు 11 వేల సంవత్సరాలు పాలించాడు. ప్రజలకు ఈతిబాధలు లేవు. అందుకే రామరాజ్యం ‘ అనేమాట ప్రసిద్ధం అయ్యింది.

ప్రశ్న 9.
సేతువు నిర్మాణం గురించి రాయండి.
జవాబు:
శ్రీరాముడు సముద్రాన్ని దాటే ఉపాయమేమిటని సుగ్రీవుణ్ణి ప్రశ్నించాడు. సముద్రుణ్ణి ప్రార్థించడం వల్ల ఇది సాధ్యపడుతుందని విభీషణుడు చెప్పాడు. శ్రీరాముడు సముద్రతీరంలో దర్భాసనం మీద కూర్చొని సముద్రుణ్ణి ఉపాసించాడు. మూడు రాత్రులు గడిచాయి. సముద్రుడు ఎదుట నిలువలేదు. శ్రీరాముడికి కోపం వచ్చింది. సముద్రుడి అహంకారాన్ని అణగదొక్కాలనుకున్నాడు. బ్రహ్మాస్త్రాన్ని స్మరించాడు. సముద్రుడు పరుగెత్తాడు. లంకకు వెళ్ళడానికి దారి ఇస్తానన్నాడు.

విశ్వకర్మ కుమారుడైన ‘నలుడు’ శిల్పకళా నిపుణుడు. సేతువు (వంతెన)ను నిర్మించడానికి అతడే యోగ్యుడని సముద్రుడు తెలిపాడు. ఆ సేతువును తాను భరిస్తానని మాట ఇచ్చాడు. సేతువు నిర్మాణానికి వానర నాయకులకు ఆజ్ఞ ఇచ్చాడు శ్రీరాముడు. అందరూ మహారణ్యం దారి పట్టారు. పెద్ద పెద్ద చెట్లను బండరాళ్ళను మోసుకువచ్చారు. సముద్రంలో పడేశారు. వాటి దెబ్బకు సముద్రంలోని నీరు ఆకాశానికి ఎగిసిపడింది. నీలుని సూచనలను అనుసరించి కొలతల ప్రకారం సేతువు నిర్మాణం జరిగింది. వంద యోజనాల పొడవు, పది యోజనాల వెడల్పు గల సేతువును కట్టడం ఐదురోజుల్లో పూర్తయింది.

అదనపు ప్రశ్నలు

ప్రశ్న 1.
‘రామాయణం” ఆధారంగా అన్నదమ్ముల అనుబంధం ఎలా ఉండాలో వివరించండి. –
జవాబు:
రామాయణం ఆధారంగా అన్నదమ్ముల అనుబంధం ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో తెలుసుకొనే అవకాశం ఉంది.

  1. రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల మధ్య ఉండే అనుబంధం ఆదర్శప్రాయమైనది. ఆప్యాయతానురాగాలకు నిలయమైనది.
  2. వనవాసంలో అన్న సేవకు అడ్డు కాకూడదని ఊర్మిళను అయోధ్యలోనే విడిచి వచ్చిన లక్ష్మణుడు సోదరప్రేమకు, త్యాగానికి నిదర్శనంగా నిలిచాడు. శ్రీరామ సేవాభాగ్యము ముందు “త్రిలోకాధిపత్యం” కూడా చిన్నదేనని భావించి, వనవాసంలో సకలోపచారాలు చేసే అవకాశం తన కిమ్మని శ్రీరాముణ్ణి కోరిన ఆదర్శమూర్తి లక్ష్మణుడు.
  3. లక్ష్మణుడు రామునికి ఆరోప్రాణం. యుద్ధరంగంలో నేలమీద పడిపోయిన లక్ష్మణుడిని చూచి శ్రీరాముడు విలవిల లాడిపోవటం అతనికి తమ్మునిపై గల ప్రేమానురాగాలను చాటుతోంది.
  4. భరతుడు కూడా ఆదర్శ సోదరుడే. రామునివలే తానూ వనవాస నియమాలు పాటించి 14 ఏళ్ళు శ్రీరామ పాదుకలపై పాలనాభారం ఉంచి, రాజభోగాలకు దూరంగా నగరం వెలుపల గడిపిన ఆదర్శమూర్తి.
  5. వాలి సుగ్రీవుల అనుబంధం ఆదర్శవంతమైనది కాదు. అపోహలకు, అపార్థాలకు, అధర్మానికి నిలయమైనట్టిది.
  6. రావణ కుంభకర్ణ విభీషణుల అనుబంధం కూడ ఆదర్శనీయమైనది కాదు. రావణుని అధర్మమును పూర్తిగా తెలిసికొని కూడ సహాయపడిన వ్యక్తి కుంభకర్ణుడు. ధర్మం వీడిన రావణుని, వీడినవాడు విభీషణుడు.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 6 యుద్ధకాండ

ప్రశ్న 2.
రామ లక్ష్మణులు సిద్ధాశ్రమం చేరుకొన్న ప్రయాణ విశేషాలు వివరించండి.
జవాబు:
దశరథ పుత్రులు రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు, వేదశాస్త్రాలు, ధనుర్విద్య నేర్చారు. లక్ష్మణుడు రాముడికి బహిః ప్రాణం. తన కుమారులను దశరథుడు వివాహం చేద్దామనుకుంటున్నాడు. ఆ సమయంలో విశ్వామిత్రుడు దశరథుని దగ్గరకు వచ్చాడు. ఆ ఋషి చెప్పిన కార్యాన్ని చేస్తానన్నాడు దశరథుడు.

విశ్వామిత్రుడు తన యజ్ఞానికి రాక్షసులు విఘ్నం కలుగజేస్తున్నారనీ, యజ్ఞం చేసేటప్పుడు తాను శపించకూడదనీ, యజ్ఞరక్షణకు శ్రీరాముణ్ణి తనతో 10 రోజులు పంపమనీ దశరథుని కోరాడు. దశరథుడు మహర్షితో రాముడికి ఇంకా 16 ఏళ్ళు నిండలేదనీ రాముడికి యుద్ధం తెలియదనీ, రాముణ్ణి విడిచి తాను ఉండలేననీ, తానే యజ్ఞరక్షణకు వస్తానని చెప్పాడు.

తన యజ్ఞానికి రావణుని ఆజ్ఞపై మారీచ సుబాహులు విఘ్నాలు కల్గిస్తున్నారని విశ్వామిత్రుడు చెప్పాడు. అప్పుడు దశరథుడు రాముణ్ణి పంపనని చెప్పగా, విశ్వామిత్రునకు కోపం వచ్చింది. ‘వశిష్ట మహర్షి దశరథునికి నచ్చచెప్పి, రామలక్ష్మణుల్ని విశ్వామిత్రుని వెంట పంపాడు.

విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు ‘బల’, ‘అతిబల’ అనే విద్యలు ఉపదేశించాడు. ఆ విద్యల మహిమవల్ల అలసట, ఆకలిదప్పులు ఉండవు. రాముడు విశ్వామిత్రునికి గురుసేవ చేశాడు. రామలక్ష్మణులు మహర్షితో ‘మలద’ , ‘కరూశ’ గ్రామాలకు చేరారు. అక్కడ తాటక అనే యక్షిణి విధ్వంసం చేసేది. ఆమె కొడుకు మారీచుడు జనపదాలను అతలాకుతలం చేసేవాడు. తాటకను చంపమని విశ్వామిత్రుడు రామునికి చెప్పాడు. రాముడు వాడి బాణాలతో తాటక బాహువులను ఖండించాడు. లక్ష్మణుడు తాటక ముక్కు చెవులు కోశాడు. రాముడు శబ్దవేధి విద్యతో, బాణం వేసి తాటకను చంపాడు. విశ్వామిత్ర మహర్షి సంతోషించి, అనేక దివ్యాస్త్రాలను రాముడికి అనుగ్రహించాడు.

విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో తన సిద్ధాశ్రమం చేరి, యజ్ఞదీక్ష చేపట్టాడు. ఆ యజ్ఞం, ఆరురోజులు. రామలక్ష్మణులు యజ్ఞాన్ని జాగ్రత్తగా రక్షిస్తున్నారు. ఇంతలో మారీచ సుబాహులు అనే రాక్షసులు, యజ్ఞకుండంలో రక్తం కురిపించారు. మారీచుడి పై రాముడు ‘శీతేషువు’ అనే మానవాస్త్రాన్ని వేసాడు. మారీచుడు సముద్రంలో పడ్డాడు. రాముడు ఆగ్నేయాస్త్రంతో సుబాహుణ్ణి చంపాడు. మిగిలిన వారిని, ‘వాయవ్యాస్త్రం’తో రామలక్ష్మణులు తరిమారు. మహర్షి యజ్ఞం పూర్తయ్యింది.

ప్రశ్న 3.
రామాయణం ఎందుకు చదవాలి?
(లేదా)
‘రామాయణం వంటి ఆదర్శకావ్యం న భూతో న భవిష్యతి” దీనిని సమర్థిస్తూ రామాయణం గొప్పదనాన్ని రాయండి.
జవాబు:
మానవ జీవన మూలాలకు రామాయణం మణిదర్పణం. అందువల్లనే కొండలు, సముద్రాలు ఉన్నంతవరకూ రామాయణము లోకంలో ఉంటుందని బ్రహ్మగారు చెప్పారు. రామాయణం శాశ్వతత్వాన్ని సంపాదించుకున్న కావ్యము.

రామాయణం’ అంటే రాముని మార్గము. శ్రీరాముడు సత్యవాక్య పరిపాలకుడై ధర్మమార్గంలో ప్రజారంజకంగా పరిపాలించాడు. శ్రీరాముడు నడచిన నడత ధర్మబద్దం.

మానవ జీవితాన్ని సంస్కరించగల కావ్యం రామాయణం. మానవ హృదయాల నుండి ఎన్నటికీ చెరగని కథ రామాయణం. , ఇందులో అమ్మానాన్నల అనురాగం, పుత్రుల అభిమానం, అన్నదమ్ముల అనుబంధం, భార్యాభర్తల సంబంధం, గురువుపై భక్తి, శిష్యులపై ప్రేమ, స్నేహఫలం, ధర్మబలం వంటి జీవిత సంబంధాలను రామాయణం పట్టి చూపిస్తుంది.

వినయంతో ఒదగడం, వివేకంతో ఎదగడం, జీవనకారుణ్య భావం, ప్రకృతి లాలన వంటి జీవిత పార్శ్వాలకు రామాయణం మణిదర్పణం.

రామాయణం ఆచరణ ప్రధానమైన కావ్యం. సీతారాముల వంటి ఆదర్శనాయికానాయకుల చరిత్ర ఇది. “రామో విగ్రహవాన్ ధర్మః” అనే గొప్పమాట మారీచుని వంటి దుష్ట రాక్షసుని నోటి నుండి మహర్షి వాల్మీకి పలికించాడు. రామాయణం ఆదికావ్యం. ఇటువంటి కావ్యం ప్రపంచ సాహిత్యంలో “నభూతో నభవిష్యతి”.

ప్రశ్న 4.
రామాయణములోని స్నేహాల గురించి రాయండి.
జవాబు:
రామాయణంలో రామసుగ్రీవుల స్నేహం, రామవిభీషణుల స్నేహాలు, సుప్రసిద్ధమైనవి. సుగ్రీవుడు రామునితో స్నేహం చేశాడు. సుగ్రీవుడికీ అతని అన్న వాలికీ విరోధం ఉంది. వాలి, కిష్కింధకు రాజు. సుగ్రీవుడు రామునితో స్నేహం చేసి, రామునిచేత తన అన్న వాలిని చంపించి, తాను కిష్కింధకు రాజు అయ్యాడు. రాముడే సుగ్రీవుడిని కిష్కింధకు రాజును చేశాడు. రావణుని చంపి, సీతను తిరిగి తెచ్చుకోడానికి సుగ్రీవుడు తన వానర సైన్యంతో రామునికి సాయపడ్డాడు. ఈ విధంగా రామసుగ్రీవుల స్నేహం వల్ల వారిద్దరికీ మేలు జరిగింది.

రామాయణంలో రామవిభీషణుల స్నేహం కూడా ప్రసిద్ధమైనది. విభీషణుడు. లంకా నగరాధిపతి, రావణుడికి తమ్ముడు. రావణుడు సీతను అపహరించి తీసుకురావడం, విభీషణుడికి ఇష్టం లేదు. అందుకే విభీషణుడు తన అన్న రావణుని విడిచి, రాముని స్నేహాన్ని ఆశ్రయించాడు. రాముడు విభీషణుని ఆదరించాడు. రామ విభీషణుల స్నేహం గొప్పది.

విభీషణుని మాట సాయంతో రాముడు రావణుని జయించాడు. విభీషణుని లంకా నగరానికి రాజును చేశాడు. విభీషణుడు సీతను రామునకు అప్పగించాడు. ఈ విధంగా రామవిభీషణులు స్నేహం వల్ల ఒకరికి ఒకరు మేలు చేసుకున్నారు. రామవిభీషణుల స్నేహం వల్ల వారిద్దరికీ మేలు జరిగింది.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 6 యుద్ధకాండ

ప్రశ్న 5.
రామాయణంలో సీత – కైకల పాత్రల భేదాలను విశ్లేషించండి.
జవాబు:
సీత, శ్రీరామచంద్రునికి ధర్మపత్ని. ఈమె మహాపతివ్రత. మహా సౌందర్యవతి. ఈమె జనకమహారాజు కుమార్తె. రామునితో పాటు సీత కూడా వనవాసానికి వెళ్ళి ఎన్నో బాధలు పడింది. రావణుడు ఈమెను అపహరించి లంకకు తీసుకువెళ్ళాడు. రాముడు సీతాదేవి జాడను తెలిసికోడానికి హనుమంతుడిని దూతగా పంపాడు. హనుమ సీతను కలిసి, రాముని ఉంగరాన్ని ఆమెకు ఇచ్చాడు. సీత ఇచ్చిన చూడామణిని తెచ్చి రామునకు ఇచ్చాడు.

రాముడు సీత కోసం సముద్రానికి వారధిని కట్టి యుద్ధంలో రావణుని సంహరించి సీతను తీసుకువచ్చాడు. రామాయణంలోని పాత్రలలో రాముని తరువాత సీత పాత్ర ప్రధానమైనది.

కైక దశరథ మహారాజునకు ముద్దుల భార్య. ఈమెకు రాముడంటే మంచి ప్రేమ. మంథర చెప్పిన చెప్పుడు మాటలు విని, కైక తన మనస్సును మార్చుకొని దుష్టురాలయ్యింది. పుత్ర ప్రేమతో భరతుడిని రాజును చేయ్యమనీ, రాముడిని అడవులకు పంపమనీ ఈమె పట్టుపట్టింది. దశరథుడు బ్రతిమాలి చెప్పినా ఈమె వినలేదు. కైక మొండిది.

కైక పట్టుదల వల్లనే దశరథుడు రాముడిని వనవాసానికి పంపవలసి వచ్చింది. రామునిపై బెంగతో దశరథుడు మరణించాడు. రాముని వనవాసానికి, దశరథుని మరణానికి కైక యొక్క మూర్ఖపు పట్టుదలయే కారణము.

‘సీత’ భర్త రామునికి తోడుగా ఉండి అరణ్యానికి వెళ్ళింది. కైక, భర్త దశరథుని మరణానికి కారణం అయ్యింది. సీత మహాపతివ్రత కాగా, కైక గయ్యాళి భార్య. కైక భర్త మాటను లెక్కచేయలేదు. సీత రాముని కోసం, తన ప్రాణాలను కూడా ఇవ్వగల ఉత్తమ సతి.

రామాయణ కావ్యంలో సీత – కైక పాత్రలు రెండూ ప్రధానమైనవే. రామాయణ కథ, ఈ రెండు పాత్రల వల్లనే సాగింది. సీత మహాసాధ్వి. కైక గయ్యాళి గంప.

AP Board 10th Class Social Solutions Chapter 3 ఉత్పత్తి, ఉపాధి

SCERT AP 10th Class Social Study Material Pdf 3rd Lesson ఉత్పత్తి, ఉపాధి Textbook Questions and Answers.

AP State Syllabus 10th Class Social Solutions 3rd Lesson ఉత్పత్తి, ఉపాధి

10th Class Social Studies 3rd Lesson ఉత్పత్తి, ఉపాధి Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
బ్రాకెట్టులో ఇచ్చిన వాటి నుంచి సరైన వాటితో ఖాళీలు పూరించండి. (AS1)
i) ఉత్పత్తితో సమానంగా సేవారంగంలో ఉపాధి ……… (పెరిగింది / పెరగలేదు)
ii) ……………….. రంగంలోని కార్మికులు వస్తువులను ఉత్పత్తి చెయ్యరు. (సేవా / వ్యవసాయం)
iii) …………… రంగంలోని అధిక శాతం కార్మికులకు ఉద్యోగ భద్రత ఉంది. (వ్యవస్థీకృత / అవ్యవస్థీకృత)
iv) భారతదేశంలోని కార్మికులలో ………………. శాతం అవ్యవస్థీకృత రంగంలో పని చేస్తున్నారు. (ఎక్కువ / తక్కువ)
v) పత్తి …………………. ఉత్పత్తి, గుడ్డ ……………….. ఉత్పత్తి. (సహజ / పారిశ్రామిక)
జవాబు:
i) పెరగలేదు.
ii) సేవా
iii) వ్యవస్థీకృత
iv) ఎక్కువ
v) సహజ, పారిశ్రామిక

ప్రశ్న 2.
సరైన సమాధానాన్ని ఎంచుకోండి. (AS1)
అ) ఎక్కువగా సహజ ప్రక్రియలను ఉపయోగించుకుని ……………….. రంగంలో వస్తువులు ఉత్పత్తి చేస్తారు.
i) ప్రాథమిక
ii) ద్వితీయ
iii) తృతీయ
iv) సమాచార సాంకేతిక
జవాబు:
i) ప్రాథమిక

ఆ) స్థూల దేశీయోత్పత్తి అనేది ఒక సంవత్సరంలో ఉత్పత్తి చేసిన ……………. మొత్తం విలువ.
i) అన్ని వస్తువులు, సేవలు
ii) అన్ని అంతిమ వస్తువులు, సేవల
iii) అన్ని మాధ్యమిక వస్తువులు, సేవల
iv) అన్ని అంతిమ, మాధ్యమిక వస్తువులు, సేవల
జవాబు:
ii) అన్ని అంతిమ వస్తువులు, సేవల

ఇ) 2009-10 స్థూల దేశీయోత్పత్తిలో సేవా రంగం వాటా ………….
i) 20-30 శాతం మధ్య
ii) 30-40 శాతం మధ్య
iii) 50-60 శాతం మధ్య
iv) 70 శాతం
జవాబు:
iii) 50-60 శాతం మధ్య

AP Board 10th Class Social Solutions Chapter 3 ఉత్పత్తి, ఉపాధి

ప్రశ్న 3.
వేరుగా ఉన్నదానిని గుర్తించండి, కారణం చెప్పండి. (AS1)
i) టీచరు, డాక్టరు, కూరగాయలు అమ్మే వ్యక్తి, న్యాయవాది.
ii) పోస్టుమాన్, చెప్పులుకుట్టే వ్యక్తి, సైనికుడు, పోలీసు కానిస్టేబులు.
జవాబు:
1) కూరగాయలు అమ్మే వ్యక్తి:
– మిగతా మూడు విద్యావంతులైన, నైపుణ్యం కల వృత్తులు చేస్తున్నవారు.
– వీరు సేవా రంగానికి చెందినవారు.

ii) చెప్పులు కుట్టే వ్యక్తి : ఇతను ప్రైవేటు రంగంలో పనిచేస్తున్నాడు.

ప్రశ్న 4.
ఆర్థిక కార్యకలాపాలను ప్రాథమిక, ద్వితీయ, తృతీయ రంగాలుగా విభజించటం ఉపయోగకరమేనా ఎందుకో వివరించండి. (AS1)
(లేదా)
ఆర్థిక కార్యకలాపాలను ప్రాథమిక, ద్వితీయ, తృతీయ రంగాలుగా విభజించటం ఉపయోగకరమేనా? ఏవేని రెండు ఉపయోగాలు తెల్పుము.
జవాబు:

  1. ఆర్థిక కార్యకలాపాలను ప్రాథమిక (వ్యవసాయ), ద్వితీయ (పరిశ్రమలు), తృతీయ (సేవా) రంగాలుగా విభజించడం ఉపయోగకరమే.
  2. జాతీయాదాయం, తలసరి ఆదాయం మొదలగునటువంటివి గణించటానికి సులభంగా ఉంటుంది.
  3. ఏ రంగంలో ఎంత ఉత్పత్తి, ఉపాధి జరిగిందో తెలుసుకోవచ్చు. దానికనుగుణంగా అభివృద్ధి ప్రణాళికలను రూపొందించవచ్చును.
  4. సౌకర్యాల ఏర్పాటుకు, అభివృద్ధి చర్యలు చేపట్టుటకు ఇది ఉపయోగపడుతుంది.
  5. ఆదాయ, సంపద పంపిణీల్లో అసమానతలను తెలుసుకోవచ్చు. వాటిని రూపుమాపడానికి తగిన చర్యలు తీసుకోవచ్చు.
  6. జాతీయ ఉత్పత్తిలోని ఈ అంశాలు ఆర్థిక వ్యవస్థ నిర్మాణాన్ని తెలియచేస్తుంది. దేశంలోని ఆర్ధిక స్థితిగతులను తెలుసుకోవచ్చు.
  7. జాతీయ విధానాల రూపకల్పనకు, ప్రజల జీవన ప్రమాణస్థాయి తెలుసుకొనుటకు, మెరుగుపర్చుటకు.

ప్రశ్న 5.
ఈ అధ్యాయంలో మనం చూసిన ప్రతి రంగంలో స్థూల జాతీయోత్పత్తిలోనూ, ఉపాధిలోనూ దృష్టి ఎందుకు కేంద్రీకరించాలి? ఇంకా పరిశీలించాల్సిన ఇతర అంశాలు ఏమైనా ఉన్నాయా? చర్చించండి. (AS4)
జవాబు:

  1. ఆర్థిక వ్యవస్థ (దేశం) అభివృద్ధి పథంలో ఉందో లేదో తెలుసుకొనుటకుగాను స్థూల జాతీయోత్పత్తిలోనూ, ఉపాధిలోనూ దృష్టి కేంద్రీకరించాలి. ఇంకా
  2. ప్రజల యొక్క జీవన ప్రమాణ స్థాయి తెలుసుకొనుటకు, అభివృద్ధిపరచుటకు
  3. అభివృద్ధి ప్రణాళికలను వ్యూహాలను రూపొందించుటకు, ప్రణాళికల్లో ఏ రంగానికి ప్రాధాన్యతనివ్వాలో నిర్ణయించుటకు.
  4. పేదరికం, నిరుద్యోగ స్థాయిలు తెలుసుకొనుటకు, వాటిని రూపుమాపుటకు.
  5. సమన్యాయ పంపిణీ కోసం (జాతీయాదాయం), సమతౌల్య అభివృద్ధి సాధించుటకు,
  6. అన్ని రంగాలలో స్వయం సమృద్ధి సాధించుటకు ; ఉత్పత్తి, ఉపాధిపై దృష్టి పెట్టాలి.

ఇతర అంశాలు:

  1. సాంకేతిక, వైజ్ఞానిక నైపుణ్యం
  2. ఆధునిక సమాచార, ప్రసార అభివృద్ధి
  3. ఎగుమతులు, దిగుమతులు
  4. ప్రాంతీయాభివృద్ధి
  5. విద్య, వైద్యం, విద్యుత్, రవాణా, త్రాగునీరు, సాగునీరు మొదలయిన అవస్థాపన సౌకర్యాలు.

AP Board 10th Class Social Solutions Chapter 3 ఉత్పత్తి, ఉపాధి

ప్రశ్న 6.
సేవా రంగం ఇతర రంగాలకంటే ఎలా భిన్నమైనది? కొన్ని ఉదాహరణలతో వివరించండి. (AS1)
జవాబు:
సేవా రంగం ఇతర రెండు రంగాల కంటే భిన్నమైనది.

  1. దేశ సామాజిక, ఆర్థికాభివృద్ధికి సేవల రంగం ప్రాణవాయువులాంటిది.
  2. ఒక ఆర్థిక వ్యవస్థకు ప్రాథమిక, ద్వితీయ రంగాలు పుష్టినిస్తే, సేవల రంగం ఆధునికీకరణ చేస్తుంది.
  3. ఇతర రంగాలలాగా నేరుగా వస్తువులను తయారుచేయకుండా వస్తువుల ఉత్పత్తికి, ప్రజలకు అవసరమైన సేవలు మాత్రమే ఈ రంగం అందిస్తుంది.
    ఉదా : వస్తువులు, ప్రయాణీకులను రవాణా చేయటం.
  4. సేవారంగం ఇతర రంగాల అభివృద్ధికి పరిపూరక రంగంగా పనిచేస్తూ ఉంటుంది.
    ఉదా : ఉత్పత్తి పెరుగుదలకు అవసరమైన అవస్థాపనా సౌకర్యాలను సేవా రంగం అందిస్తుంది.
  5. వ్యవసాయ రంగం అభివృద్ధి చెందాలంటే సాగునీరు, విద్యుత్తు, పరపతి, రవాణా సౌకర్యాలు, రసాయనిక ఎరువులు మొదలయిన సేవలు అవసరం.
  6. పరిశ్రమల రంగం అభివృద్ధి చెందాలంటే యంత్ర పరికరాలు, విద్యుత్ (శక్తి వనరులు), బీమా సౌకర్యాలు, రవాణా, మార్కెట్ సౌకర్యాలు, బ్యాంకులు మొదలయిన సేవలు అవసరం.
  7. మిగతా రెండు రంగాల కంటే ఈ రంగం విశ్వవ్యాప్తంగా అతి పెద్ద రంగంగా అభివృద్ధి చెందుతుంది.
  8. మిగతా రెండు రంగాల కంటే ఈ రంగం ఎక్కువ భాగం ఉపాధిని, ఉత్పత్తిని కలిగిస్తోంది.

ప్రశ్న 7.
అల్ప ఉపాధి అంటే ఏమి అర్థం చేసుకున్నారు ? పట్టణ, గ్రామీణ ప్రాంతాల నుంచి ఒక్కొక్క ఉదాహరణతో వివరించండి. (AS1)
జవాబు:

  1. ఎవరికీ తమ పూర్తి సామర్థ్యానికి తగినట్లుగా మరియు తగినంతగా పని దొరకని స్థితిని అల్ప ఉపాధి అనవచ్చును. తక్కువ ఉత్పాదకత గల వ్యవసాయ, సేవల రంగంలో పనిచేస్తున్న శ్రామికులను “అల్ప ఉద్యోగులు” అంటారు. కనపడని ఈ రకమైన అల్ప ఉపాధినే “ప్రచ్ఛన్న నిరుద్యోగం” అంటారు.
  2. సిరిపురం గ్రామంలోని సాంబయ్య అనే రైతుకు 5 ఎకరాల వర్షాధార భూమి ఉంది. మిరప, ప్రత్తి, మొక్కజొన్న వంటి పంటలు పండిస్తాడు. కుటుంబంలోని ‘6’ గురు సభ్యులు సంవత్సరమంతా అందులోనే పనిచేస్తారు. కారణం వాళ్ళకు చెయ్యటానికి వేరే పనిలేదు. వారి శ్రమ విభజింపబడుతోంది. అందరూ ఏదో ఒక పని చేస్తున్నారు కానీ ఎవరికీ పూర్తి పని లేదు. ఈ కుటుంబంలోని ఇద్దరి ముగ్గురు వేరే పనికి వెళ్ళిన ఉత్పత్తి తగ్గదు.
  3. పట్టణ ప్రాంతంలో సేవా రంగంలో రోజుకూలీ కోసం వెతుక్కునేవాళ్లు వేలాదిగా ఉన్నారు. రంగులు వేయటం, నీటి పైపుల పని, మరమ్మతులు చేయటం వంటి పనులు చేస్తారు. వీళ్లల్లో చాలామందికి ప్రతిరోజూ పని దొరకదు.

ప్రశ్న 8.
అవ్యవస్థీకృత రంగంలోని కార్మికులకు ఈ కింది అంశాలలో రక్షణ కావాలి. (AS1)
కూలీ, భద్రత, వైద్యం : ఉదాహరణలతో వివరించండి. –
జవాబు:
అవ్యవస్థీకృతరంగంలో చిన్నచిన్న సంస్థలు అక్కడక్కడా ఉంటాయి. ఇవి సాధారణంగా ప్రభుత్వ నియంత్రణలో ఉండవు. నియమ నిబంధనలు ఉంటాయి కానీ వాటిని అనుసరించరు. స్వయం ఉపాధి పొందే చిన్నచిన్న (మరమ్మతులు) పనులు చేసేవారు కూడా కష్టంగానే జీవితం వెల్లబుచ్చాల్సి వస్తుంది. అందుకని అవ్యవస్థీకృత రంగంలోని కార్మికులకు కూలీ, భద్రత, వైద్యం మొదలగు వాటిల్లో రక్షణ కల్పించాలి.

1) కూలి :
అవ్యవస్థీకృత రంగంలోని కార్మికులకు జీతం తక్కువగా ఉంటుంది, పని ఎక్కువ, వేతనం తక్కువ, ఆర్జిత సెలవు, సెలవులు, అనారోగ్యమప్పుడు సెలవులు వంటివి ఉండవు. వ్యవసాయ కూలీలు భవన నిర్మాణ కూలీలు అధికశాతం మంది చాలా తక్కువ వేతనానికి పనిచేస్తున్నారు. వీళ్లు తరచు దోపిడికి గురవుతుంటారు, వీళ్లకు న్యాయమైన – వేతనం చెల్లించబడదు. సంపాదన తక్కువ అది క్రమం తప్పకుండా ఉండదు.

ఈ రంగంలోని కార్మికుల జీవన ప్రమాణాలు మెరుగు పడాలంటే, వీరి యొక్క కొనుగోలు శక్తి పెరగాలన్నా, ఆర్థిక, సామాజిక అభివృద్ధి పొందాలన్నా వీరికి రక్షణ, మద్దతు అవసరం.

2) భద్రత :
అవ్యవస్థీకృత రంగంలోని కార్మికులకు ఉద్యోగ భద్రత ఉండదు, అలాగే జీవితానికి భద్రత ఉండదు. ఏ కారణం లేకుండా ఉద్యోగస్తులను మానుకోమనవచ్చు. పని తక్కువగా ఉండే కాలాల్లో కొంతమందిని పని మానిపించవచ్చు. మారుతున్న మార్కెటు పరిస్థితి, ఉపాధి కల్పిస్తున్న వాళ్ల మానసిక స్థాయిపై ఆధారపడి ఉంటుంది. మరింత పని అవసరంతో పాటు అవ్యవస్థీకృత రంగంలోని కార్మికులకు రక్షణ, మద్దతు అవసరం.

3) వైద్యం :
అవ్యవస్థీకృత రంగంలోని కార్మికులకు వైద్య ప్రయోజనాలు అందవు, అనారోగ్యమప్పుడు సెలవులు వంటివి కూడా ఉండవు. అనారోగ్యం పాలైతే వారి కుటుంబ జీవనం దుర్భరంగా మారుతుంది. కనుక ఖచ్చితంగా వీరికి జీవితబీమా, ఆరోగ్యబీమా మొదలయినటువంటి సౌకర్యాలు కల్పించాలి. అప్పుడే వారి కుటుంబాలకు, వారికి రక్షణ ఉంటుంది.

AP Board 10th Class Social Solutions Chapter 3 ఉత్పత్తి, ఉపాధి

ప్రశ్న 9.
అహ్మదాబాదు నగరంలో జరిపిన అధ్యయనంలో 15 లక్షలమంది కార్మికులు ఉండగా అందులో 11 లక్షలమంది అవ్యవస్థీకృత రంగంలో పని చేస్తున్నారని తెలిసింది. ఆ సంవత్సరం (1997-98)లో నగరం మొత్తం ఆదాయం 6000 కోట్ల రూపాయలు. అందులో వ్యవస్థీకృత రంగం వాటా 3200 కోట్ల రూపాయలు. ఈ గణాంకాలను ఒక పట్టిక రూపంలో ఇవ్వండి. పట్టణంలో మరింత ఉపాధి కల్పించే మార్గాలు ఏమిటి?
జవాబు:
అహ్మదాబాదు నగరంలో వ్యవస్థీకృత, అవ్యవస్థీకృత రంగాల వాటాలు (1997-98) :

రంగంఉద్యోగస్తులుఆదాయం (కోట్లలో)
వ్యవస్థీకృత4,00,000₹ 3200/-
అవ్యవస్థీకృత11,00,000₹2800/-
మొత్తం15,00,000₹ 6000/-

పట్టణంలో మరింత ఉపాధి కల్పించే మార్గాలు :

  1. ప్రభుత్వం వివిధ పథకాలను, ప్రణాళికలను రూపొందించి అమలుచేయడం.
    ఉదా : TRVSEM, SHG లు
  2. స్వయం ఉపాధి పొందేవారికి ఆర్థిక మరియు ఇతరత్ర సహాయమందించడం.
    ఉదా : పన్నుల మినహాయింపు
  3. చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ప్రోత్సాహమందించాలి.
    ఉదా : సులభ లైసెన్సింగ్ విధానం, పరపతి సౌకర్యం కల్పించటం.
  4. విద్యావిధానం, మానవ వనరులను అభివృద్ధిపర్చే విధంగా ఉండాలి.
    ఉదా : వృత్తి విద్యా కళాశాలల ఏర్పాటు.
  5. అవ్యవస్థీకృత రంగంలోని కార్మికులకు రక్షణ, మద్దతు కల్పించాలి.
    ఉదా : కనీస వేతనాల చట్టం అమలుచేయటం.

ప్రశ్న 10.
మన రాష్ట్రంలో వివిధ ప్రదేశాలలో వ్యవస్థీకృత, అవ్యవస్థీకృత రంగాలలో ఉపాధి అవకాశాల గురించి క్రింది పట్టికలో రాయండి. (AS3)

ప్రాంతంవ్యవస్థీకృత ఉపాధి అవకాశాలుఅవ్యవస్థీకృత ఉపాధి అవకాశాలు
1. ఉత్తరాంధ్ర
2. దక్షిణ కోస్తా
3. రాయలసీమ

జవాబు:

ప్రాంతంవ్యవస్థీకృత ఉపాధి అవకాశాలుఅవ్యవస్థీకృత ఉపాధి అవకాశాలు
1. ఉత్తరాంధ్ర1. ప్రభుత్వ రంగంలో రవాణా, వైద్యం విద్య ఆరోగ్యం మొదలైనవి.
2. ప్రైవేటు రంగంలో
1. వ్యవసాయ రంగం
2. మత్స్య పరిశ్రమ
3. చేతి వృత్తులు
4. పారిశ్రామిక రంగం
2. దక్షిణ కోస్తా1. ప్రభుత్వ రంగంలో
2. ప్రైవేటు రంగంలో
1. వ్యవసాయ రంగం
2. మత్స్య పరిశ్రమ
3. చేతి వృత్తులు
4. పారిశ్రామిక రంగం
5. నిర్మాణ రంగం
3. రాయలసీమ1. ప్రభుత్వ రంగంలో
2. ప్రైవేటు రంగంలో
1. వ్యవసాయ రంగం
2. చేతి వృత్తులు

10th Class Social Studies 3rd Lesson ఉత్పత్తి, ఉపాధి InText Questions and Answers

10th Class Social Textbook Page No.28

ప్రశ్న 1.
దిగువ తెలిపిన వివిధ వృత్తుల వారిని వ్యవసాయం, పరిశ్రమ, సేవా రంగాల కింద వర్గీకరించండి. మీ వర్గీకరణకు కారణాలు ఇవ్వండి.

వృత్తివర్గీకరణ
బట్టలు కుట్టేవారు
బుట్టలు అల్లేవారు
పూల సాగు చేసేవారు
పాలు అమ్మేవారు
చేపలు పట్టేవారు
మత బోధకులు / పూజారులు
ఉత్తరాలు బట్వాడా చేసే కొరియర్
అగ్గిపెట్టెల కర్మాగారంలో పనిచేసేవారు
వడ్డీ వ్యాపారి
తోటమాలి
కుండలు చేసేవారు
తేనెటీగలను పెంచేవారు
వ్యోమగామి
కాల్ సెంటర్ ఉద్యోగులు

జవాబు:

వృత్తివర్గీకరణ
బట్టలు కుట్టేవారుసేవా రంగం
బుట్టలు అల్లేవారుపరిశ్రమల రంగం (కుటీర పరిశ్రమ)
పూల సాగు చేసేవారువ్యవసాయ రంగం
పాలు అమ్మేవారువ్యవసాయ రంగం
చేపలు పట్టేవారువ్యవసాయ రంగం
మత బోధకులు / పూజారులుసేవా రంగం
ఉత్తరాలు బట్వాడా చేసే కొరియర్సేవా రంగం
అగ్గిపెట్టెల కర్మాగారంలో పనిచేసేవారుపరిశ్రమల రంగం
వడ్డీ వ్యాపారిసేవా రంగం
తోటమాలివ్యవసాయ రంగం
కుండలు చేసేవారుపరిశ్రమల రంగం (కుటీర పరిశ్రమ)
తేనెటీగలను పెంచేవారువ్యవసాయ రంగం
వ్యోమగామిసేవా రంగం
కాల్ సెంటర్ ఉద్యోగులుసేవా రంగం

AP Board 10th Class Social Solutions Chapter 3 ఉత్పత్తి, ఉపాధి

10th Class Social Textbook Page No.29

ప్రశ్న 2.
కింది పట్టిక భారతదేశంలో 1972-73 లోనూ, తిరిగి 2009-10 అంటే 37 ఏళ్ల తర్వాత ఏ రంగంలో ఎంతమంది ఉపాధి పొందుతున్నారో తెలియచేస్తుంది.
AP Board 10th Class Social Solutions Chapter 3 ఉత్పత్తి, ఉపాధి 1
(అ) పై పట్టిక ద్వారా మీరు గమనించిన ప్రధాన మార్పులు ఏమిటి?
జవాబు:
1972-73 నుండి 2009-10 సం||ల మధ్య (దాదాపు 37 సం||లు) ఉపాధిలో వచ్చిన మార్పులు

  1. వ్యవసాయ రంగంలో ఉపాధి పొందుతున్నవారి శాతం 21% తగ్గింది.
  2. పరిశ్రమ రంగంలో ఉపాధి పొందుతున్నవారి శాతం 11% పెరిగింది.
  3. సేవల రంగంలో ఉపాధి పొందుతున్నవారి శాతం 10% పెరిగింది.
  4. ప్రాథమిక రంగం (వ్యవసాయ రంగం) లో ఉపాధి శాతం తగ్గటం, ద్వితీయ (పరిశ్రమ) తృతీయ (సేవల) రంగాలు అభివృద్ధి చెందటం ఆర్థికాభివృద్ధి సూచికగా చెప్పవచ్చు.

ఆ) ఇంతకుముందు మీరు చదివిన దాని ఆధారంగా ఈ మార్పులకు కారణాలు ఏమిటో చర్చించండి.
జవాబు:
ఈ మార్పులకు కారణాలు :

  1.  పారిశ్రామిక విప్లవం ద్వారా పరిశ్రమ అభివృద్ధి చెందడం వలన ఆ రంగంలో ఉపాధి పెరిగింది.
  2. ఉత్పత్తి పెరగడం, మార్కెట్స్ పెరగడం, వ్యాపారం, వాణిజ్యం పెరగడం (రవాణా పెరగడం) వలన సేవారంగంలో ఉపాధి పెరిగింది.
  3. ప్రభుత్వ విధానాలు (1991 పారిశ్రామిక విధానం, గ్లోబలైజేషన్ మొదలగునవి) ప్రణాళికలు కూడా ఈ మార్పుకు దోహదం చేశాయి.
  4. పెరుగుతున్న వైజ్ఞానిక, సాంకేతిక సమాచార వ్యవస్థ సేవారంగంలో ఎంతోమందికి ఉపాధి కల్పిస్తుంది.

10th Class Social Textbook Page No.29

ప్రశ్న 3.
ఈ దిగువ చిత్రాలను పరిశీలించి అవి ఏ రంగాలకు చెందినవో పేర్కొనండి.
AP Board 10th Class Social Solutions Chapter 3 ఉత్పత్తి, ఉపాధి 2
జవాబు:

  1. వ్యవసాయ రంగం
  2. (గనులు) ప్రాథమిక రంగం
  3. సేవల రంగం
  4. పారిశ్రామిక రంగం

10th Class Social Textbook Page No.30

ప్రశ్న 4.
ఈ కింది గ్రాఫ్ రెండు వేరు వేరు సంవత్సరాలు, 1972-73, 2009-10 లకు భారతదేశ స్థూల దేశీయోత్పత్తి విలువను చూపిస్తుంది. సంవత్సరాలలో మొత్తం ఉత్పత్తి పెరిగిన తీరును మీరు చూడవచ్చు.
AP Board 10th Class Social Solutions Chapter 3 ఉత్పత్తి, ఉపాధి 3
గ్రాఫ్ : వ్యవసాయం, పరిశ్రమలు, సేవా రంగాల వారీగా స్థూల దేశీయోత్పత్తి
గ్రాఫ్ ను చూసి కింది ప్రశ్నలకు జవాబులివ్వండి :
(1) 1972-78లో అధిక ఉత్పత్తి ఉన్న రంగం ఏది?
జవాబు:
1972-73లో వ్యవసాయం రంగం అధిక ఉత్పత్తి కలిగి ఉన్నది. మొత్తం GDP 5,86,346 కోట్లలో వ్యవసాయరంగం 2,43,082 కోట్లు కలిగి ఉంది.

(2) 2009-10 లో అధిక ఉత్పత్తి ఉన్న రంగం ఏది?
జవాబు:
2009-10 లో సేవా రంగం అధిక ఉత్పత్తి కలిగి ఉన్నది. మొత్తం GDP 45,16,071 కోటలో సేవా రంగం 26,78,165 కోట్లు మిగిలిన వ్యవసాయ రంగం 7,64,817 కోట్లు మరియు పరిశ్రమల రంగం 11,73,089 కోట్లు వాటా కలిగి ఉన్నాయి.

(3) 1972-73, 2009-10 సంవత్సరాల మధ్య భారతదేశంలో మొత్తం వస్తువులు, సేవల ఉత్పత్తి సుమారుగా …….. రెట్లు పెరిగింది.
జవాబు:
8 రెట్లు పెరిగింది.

10th Class Social Textbook Page No.31

ప్రశ్న 5.
ప్రతి దశలో మొత్తం వస్తువుల విలువ :
మొదటి దశ (రైస్ మిల్లర్‌కు రైతు వడ్లు అమ్మడం) రూ. 2500
రెండవ దశ (మాటలు యజమానికి ఊక, బియ్యం అమ్మడం) రూ. 3600
మూడవ దశ (ఇడ్లీ, దోశలు అమ్మడం) రూ. 5000
– చర్చించండి : ఉత్పత్తి అయిన మొత్తం వస్తువుల విలువను తెలుసుకోటానికి వీటన్నిటి మొత్తాన్ని జోడించాలా?
జవాబు:
అవసరం లేదు. ఉత్పత్తి అయిన మొత్తం వస్తువుల విలువను తెలుసుకోటానికి వీటన్నిటి మొత్తాన్ని జోడించనవసరం లేదు.

  • అంతిమ వస్తు ధరలో (విలువలో) ఆ వస్తువు తయారీలో వాడిన మాధ్యమిక వస్తువుల విలువ కలిసి ఉంటుంది.
  • అలా కనక జోడిస్తే ఆ వస్తువు ధరను రెండుసార్లు లెక్కించినట్లవుతుంది.
  • పై ఉదాహరణలో వడ్లు, బియ్యం, ఊక అనేవి మాధ్యమిక వస్తువులు, ఇడ్లీ, దోశ అనేవి అంత్య వస్తువులు.
  • ప్రతి దశలో ఉత్పత్తిదారులు ఉత్పాదకాలు తయారుచేసినవారికి మొత్తం విలువ చెల్లించారు.

AP Board 10th Class Social Solutions Chapter 3 ఉత్పత్తి, ఉపాధి

10th Class Social Textbook Page No.31

ప్రశ్న 6.
పై ఉదాహరణలో వడ్లు, బియ్యం మధ్య దశలోని ఉత్పాదకాలు కాగా, ఇడ్లీ, దోశ వంటివి తుది ఉత్పాదకాలు. మనం నిత్యజీవితంలో ఉపయోగించే కొన్ని వస్తువులను దిగువ సూచించడమైనది. వాటికి ఎదురుగా ఆయా వస్తువుల మధ్య దశ ఉత్పాదకాలను రాయండి.

తుది ఉత్పాదకాలుమధ్యదశ ఉత్పాదకాలు
నోటు పుస్తకం
కారు
కంప్యూటర్

జవాబు:

తుది ఉత్పాదకాలుమధ్యదశ ఉత్పాదకాలు
నోటు పుస్తకంకాగితపు గుజ్జు, కాగితం, కార్డ్ బోర్డు, బంక, పిన్నులు
కారుటైర్లు, లైట్స్, మెటల్ షీట్స్, రంగులు, సీట్లు, పెట్రోలు/డీసెల్
కంప్యూటర్సిలికాన్ చిప్స్, మానిటర్, కేబుల్స్, సాఫ్ట్ వేర్స్, సర్క్యుట్స్

10th Class Social Textbook Page No.32

ప్రశ్న 7.
మొదటి దశ (రైస్ మిల్లర్ కు రైతు వడ్లు అమ్మటం) = రూ. 2500 లోంచి కొనుగోలు చేసిన ఉత్పాదకాల విలువ ‘0’ రూపాయలు తీసేస్తే, జోడించిన విలువ 2500 రూపాయలు
రెండవ దశ (మాటలు యజమానికి ఊక, బియ్యం అమ్మటం) = రూ. 3600 లోంచి కొనుగోలు చేసిన ఉత్పాదకాల విలువ 2500 తీసేస్తే, జోడించిన విలువ 1100 రూపాయలు
మూడవ దశ (ఇడ్లీ, దోశల అమ్మకం) = రూ. 5000 లోంచి కొనుగోలు చేసిన విలువ 3600 తీసేస్తే, జోడించిన విలువ 1400 రూపాయలు.
ప్రతి దశలోనూ జోడించిన విలువ = 2500+ 1100 + 1400 = 5000
చర్చించండి : రెండు పద్ధతులలోనూ ఒకే సమాధానం ఎందుకు వచ్చింది?
జవాబు:

  1. ప్రతి దశలోనూ జోడించిన విలువ = (2500 + 1100 + 1400) = 5000
  2. అంతిమ వస్తువు ధర (దోశ ధర) = 5000. రెండు పద్ధతుల్లోను ఒకే సమాధానం వచ్చింది. కారణం
  3. జోడించిన విలువలు మాత్రమే లెక్కించడం వలన (మాధ్యమిక వస్తువులు జోడించిన విలువ)
  4. మొదటి పద్ధతిలో అంత్య వస్తువు (ఇడ్లీ) లోనే ఇవి అన్నీ ఇమిడి ఉంటాయి.
  5. రెండు పద్ధతుల్లో అంతిమ వస్తువుల విలువ ఒక్కటే కాబట్టి,
  6. రెండు పద్ధతుల్లోనూ ఒకే సమాధానం వచ్చింది.

AP Board 10th Class Social Solutions Chapter 3 ఉత్పత్తి, ఉపాధి

10th Class Social Textbook Page No.32

ప్రశ్న 8.
కింది పట్టికలో స్థూల జాతీయోత్పత్తి విలువ ఇవ్వబడింది. 2010-2011 సంవత్సరానికి లెక్కించిన విధంగా స్థూల దేశీయోత్పత్తి పెరుగుదల రేటును మిగతా సంవత్సరాలకు గణించండి.
AP Board 10th Class Social Solutions Chapter 3 ఉత్పత్తి, ఉపాధి 4
జవాబు:
AP Board 10th Class Social Solutions Chapter 3 ఉత్పత్తి, ఉపాధి 5

10th Class Social Textbook Page No.34

ప్రశ్న 9.
వ్యాపారం, టళ్లు, రవాణా, ప్రసారాలకు కొన్ని ఉదాహరణలు పేర్కొనండి.
జవాబు:

  1. వివిధ రకాల వస్తువులు అమ్మే అన్నీ రకాల దుకాణాలు, ఎగుమతులు దిగుమతులు, సూపర్ మార్కెట్లు, మాల్స్
  2. చిన్న హెూటళ్ల నుండి స్టార్ హోటళ్లు దాకా.
  3. రోడ్డు, రైల్వే, విమానయాన, ఓడల ద్వారా రవాణా ఈ కోవ కిందకి వస్తాయి.
  4. రేడియో, టి.వి., వార్తాపత్రికలు, వివిధ మాస వార పత్రికలు, ఇంటర్నెట్ సౌకర్యం, టెలికమ్యూనికేషన్స్ (టెలిఫోన్, సెల్ ఫోన్) ఉపగ్రహ సాంకేతికత మొదలగునవి.

10th Class Social Textbook Page No.35

ప్రశ్న 10.
పట్టిక : భారతదేశంలో పరిశ్రమలవారీగా కార్మికుల వివరాలు, 2009-2010 (%)
AP Board 10th Class Social Solutions Chapter 3 ఉత్పత్తి, ఉపాధి 6
పట్టికని జాగ్రత్తగా అధ్యయనం చేసి కింది ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వండి.
1) వ్యవసాయ రంగంలోని అత్యధిక మంది కార్మికులు ………………………… లో నివసిస్తున్నారు.
2) చాలామంది ………………………. పనివారు వ్యవసాయ రంగంలో ఉపాధి పొందుతున్నారు.
3) 90% కంటే అధికంగా పట్టణ ప్రాంత పనివారు ……………., ……………… రంగాలలో ఉపాధి పొందుతున్నారు.
4) స్త్రీ, పురుషుల నిష్పత్తి పోలిస్తే స్త్రీలు ………………., ………………….. రంగాలలో కొద్ది శాతం మాత్రమే ఉపాధి పొందుతున్నారు.
జవాబు:
1) గ్రామప్రాంతం
2) మహిళ (స్త్రీ)
3) పారిశ్రామిక, సేవా
4) పారిశ్రామిక, సేవా

10th Class Social Textbook Page No.36 & 37

ప్రశ్న 11.
‘పై’ చార్టు : మూడు రంగాలలో ఉపాధి వాటా
AP Board 10th Class Social Solutions Chapter 3 ఉత్పత్తి, ఉపాధి 8 AP Board 10th Class Social Solutions Chapter 3 ఉత్పత్తి, ఉపాధి 9 AP Board 10th Class Social Solutions Chapter 3 ఉత్పత్తి, ఉపాధి 10
జవాబు:
AP Board 10th Class Social Solutions Chapter 3 ఉత్పత్తి, ఉపాధి 11

AP Board 10th Class Social Solutions Chapter 2 అభివృద్ధి భావనలు

SCERT AP 10th Class Social Study Material Pdf 2nd Lesson అభివృద్ధి భావనలు Textbook Questions and Answers.

AP State Syllabus 10th Class Social Solutions 2nd Lesson అభివృద్ధి భావనలు

10th Class Social Studies 2nd Lesson అభివృద్ధి భావనలు Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
వివిధ దేశాలను వర్గీకరించటంలో ప్రపంచ బ్యాంకు ఉపయోగించే ముఖ్యమైన ప్రామాణికాలు ఏమిటి? పై ప్రామాణికాలలో ఏమైనా పరిమితులు ఉంటే వాటిని పేర్కొనండి. (AS1)
జవాబు:
వివిధ దేశాలను వర్గీకరించటంలో ప్రపంచ బ్యాంకు ఉపయోగించే ముఖ్యమైన ప్రామాణికాలు.

  1. తలసరి ఆదాయం (అమెరికన్ డాలర్లలో) ను ముఖ్య ప్రామాణికంగా తీసుకుంది.
  2. దేశం మొత్తం ఆదాయాన్ని (జాతీయాదాయం ) దేశ జనాభాతో భాగిస్తే తలసరి ఆదాయం వస్తుంది.
  3. తలసరి ఆదాయంను ‘సగటు ఆదాయం ” అని కూడా అంటారు.

పరిమితులు:
ఎ) పోలికకు “సగటు” ఉపయోగకరంగా ఉన్నా అది ప్రజల మధ్య అంతరాలను వెల్లడి చేయదు.
బి) ప్రజల మధ్య ఈ ఆదాయం ఎలా పంపిణీ అయిందో తెలియదు.
సి) వాస్తవ అభివృద్ధిని తెలియచేయకపోవచ్చు.

ప్రశ్న 2.
ప్రతి సామాజిక అంశం వెనుక ఒకటి కాక అనేక కారణాలు ఉంటాయి. ఇక్కడ కూడా అది వర్తిస్తుంది. మీ అభిప్రాయంలో హిమాచల్ ప్రదేశ్ లో ఏ ఏ అంశాలు పాఠశాల విద్యకు దోహదం చేశాయి? (AS1)
(లేదా)
హిమాచల్ ప్రదేశ్ లో మెరుగైన అక్షరాస్యతను సాధించడానికి దోహదపడిన అంశాలు ఏవి?
జవాబు:
హిమాచల్ ప్రదేశ్ లో పాఠశాల విద్యకు లేదా మెరుఅక్షరాస్యతకు దోహదం చేసిన అంశాలు.

  1. పాఠశాలలు తెరిచి చాలా వరకు విద్య ఉచితంగా ఉండేలా లేదా తల్లిదండ్రులకు నామమాత్రపు ఖర్చు అయ్యేలా ప్రభుత్వం చూసింది.
  2. పాఠశాలలో ఉపాధ్యాయులు, తరగతి గదులు, మరుగుదొడ్లు, త్రాగునీరు వంటి కనీస సదుపాయాలు ఉండేలా చూసింది.
  3. భారతదేశ రాష్ట్రాలలో ప్రభుత్వ బడ్జెటులో ప్రతి విద్యార్థి చదువుపై ఎక్కువ మొత్తం ఖర్చు పెడుతున్న రాష్ట్రాలలో హిమాచల్ ప్రదేశ్ ఒకటి.
  4. ఆడపిల్లల పట్ల అంతగా వివక్షత లేకపోవటం అనేది హిమాచల్ ప్రదేశ్ లో చెప్పుకోదగిన విషయం
  5. కొడుకుల లాగానే కూతుళ్లు కూడా చదువుకోవాలని అక్కడి తల్లిదండ్రులు కోరుకుంటున్నారు.
  6. లింగ వివక్షత తక్కువగా ఉండటం.
  7. మహిళా సాధికారిత (మహిళలు బయట ఉద్యోగాలు చేయటం).
  8. సామాజిక జీవితంలోనూ, గ్రామ రాజకీయాలలోనూ మహిళల పాత్ర ఎక్కువగా ఉండటం.

AP Board 10th Class Social Solutions Chapter 2 అభివృద్ధి భావనలు

ప్రశ్న 3.
అభివృద్ధిని కొలవటానికి ప్రపంచ బ్యాంకు ఉపయోగించే ప్రామాణికాలకూ, ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం ఉపయోగించే వాటికి తేడా ఏమిటి? (AS1)
జవాబు:

ప్రపంచ బ్యాంక్ ప్రామాణికాలుఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (UNDP) ప్రామాణికాలు
1) ప్రపంచ బ్యాంక్ తలసరి ఆదాయం (సగటు ఆదాయం ) ను ప్రధాన ప్రామాణికంగా ఉపయోగిస్తుంది.1) ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (UNDP) తలసరి ఆదాయంతోపాటు విద్యాస్థాయి, ఆయుః ప్రమాణం రేటును ప్రామాణికంగా ఉపయోగిస్తుంది.
2) ప్రపంచ బ్యాంకు అభివృద్ధి వేదికను “ప్రపంచ అభివృద్ధి నివేదిక” గా పిలుస్తారు.2) UNDP నివేదికను ‘మానవాభివృద్ధి నివేదిక’ అని పిలుస్తారు.
3) ప్రజల ఆదాయాలను మాత్రమే పరిగణనలోకి తీసుకొంటుంది. జీవిత ప్రమాణ స్థాయిని పరిగణనలోకి తీసుకోదు.3) ప్రజల ఆదాయాలతో పాటు జీవన ప్రమాణ స్థాయిని కూడా పరిగణనలోకి తీసుకుంటుంది.
4) ప్రజల సంక్షేమాన్ని దీనిద్వారా తెలుసుకోలేం.4) ప్రజల సంక్షేమాన్ని వీని ద్వారా తెలుసుకోగలం.
5) ఇవి ప్రజల మధ్య అంతరాలను వెల్లడి చేయదు.5) ఇవి ప్రజల (అభివృద్ధి) మధ్య అంతరాలను తెలియజేస్తుంది.
6) ఇవి పరిమాణాత్మకమైనవి.6) ఇవి పరిమాణాత్మకం మరియు గుణాత్మకమైనవి.

ప్రశ్న 4.
మానవ అభివృద్ధిని కొలవటానికి మీ దృష్టిలో ఇంకా ఏ అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి? (AS4)
(లేదా)
మానవాభివృద్ధిని కొలవడానికి ముఖ్యమైన అంశాలను ఉదహరించుము.
జవాబు:
మానవ అభివృద్ధిని కొలవటానికి పరిగణనలోకి తీసుకున్న అంశాలు :

  1. తలసరి ఆదాయం (కొనుగోలు శక్తి తెలుసుకోవటం కోసం)
  2. విద్యాస్థాయి
  3. ఆరోగ్య స్థితి

పరిగణనలోకి తీసుకోవాల్సిన మరికొన్ని అంశాలు :

  1. సామాజిక న్యాయం
  2. పంపిణీ న్యాయం
  3. త్రాగునీటి సౌకర్యాల ఏర్పాటు
  4. విద్యుత్ సౌకర్యం
  5. ఉద్యోగిత స్థాయి
  6. జీవన ప్రమాణ స్థాయి
  7. పర్యావరణం, పరిశుభ్రత
  8. అవినీతి రహితం
  9. సాంకేతిక ప్రగతి
  10. మెరుగైన రవాణా వ్యవస్థ

ప్రశ్న 5.
‘సగటు’ ఎందుకు ఉపయోగిస్తాం? దీనిని ఉపయోగించటంలో ఏమైనా పరిమితులు ఉన్నాయా? అభివృద్ధికి సంబంధించి మీ సొంత ఉదాహరణను తీసుకుని దీనిని వివరించండి. (AS1)
జవాబు:

  1. పోలికకు ‘సగటు’ను ఉపయోగిస్తాం.
  2. జాతీయాదాయం (మొత్తం) కన్నా తలసరి ఆదాయం (సగటు) మెరుగైన సూచిక.
  3. “సగటు” ను లెక్కించటం సులువు.

పరిమితులు :

  1. సగటు ప్రజల మధ్య అంతరాలను వెల్లడి చేయదు.
  2. ఇది పరిమాణాత్మకమైనదే కాని గుణాత్మకమైనది కాదు.
  3. పంపిణీ ఎలా జరిగిందో తెలియదు.
  4. వాస్తవ అభివృద్ధి తెలియజేయకపోవచ్చు.
  5. జీవన ప్రమాణ స్థాయిని ఖచ్చితంగా నిర్వచించలేకపోవచ్చు

AP Board 10th Class Social Solutions Chapter 2 అభివృద్ధి భావనలు 1

  1. పై ఉదాహరణలో రెండు దేశాల సగటు (20,000) ఒకే విధంగా ఉంది. అయితే,
  2. రెండు దేశాల అభివృద్ధి స్థాయి ఒకే విధంగా లేదు.
  3. ‘ఇ’ దేశంలో ఒక వ్యక్తి అత్యంత ధనవంతుడు, మిగతా నలుగురు పేదలు కాని సగటును తీసుకుంటే ఈ విషయం వెల్లడి కాదు. అంటే ఆదాయం ఎలా పంపిణీ అయిందో తెలియదు.
  4. సగటును తీసుకుంటే ‘ఇ’ దేశంలో వాస్తవ అభివృద్ధి జరిగిందో లేదో తెలియకపోవచ్చు.
  5. సగటును తీసుకుని ‘ఇ’ దేశంలో వ్యక్తులందరి కొనుగోలు శక్తి ఒకేలా ఉందని అనుకోవచ్చు కాని వాస్తవంలో అది కరెక్ట్ కాకపోవచ్చు.

AP Board 10th Class Social Solutions Chapter 2 అభివృద్ధి భావనలు

ప్రశ్న 6.
హిమాచల్ ప్రదేశ్ లో తలసరి ఆదాయం తక్కువ ఉన్నప్పటికీ పంజాబ్ కంటే మానవ అభివృద్ధి సూచికలో ముందుండటం అన్న వాస్తవం నేపథ్యంలో ఆదాయం యొక్క ప్రాముఖ్యత గురించి ఎటువంటి నిర్ధారణలు చేయవచ్చు? (AS1)
జవాబు:

  1. పౌరులు ఉపయోగించుకోగల భౌతిక వస్తువులు, సేవలను కేవలం ఆదాయం సూచించలేదు.
  2. డబ్బు కాలుష్యం లేని వాతావరణాన్ని కొనివ్వలేదు. కలీలేని మందులు దొరుకుతాయన్న హామీ ఇవ్వలేదు.
  3. ప్రజలందరూ నివారణ చర్యలు చేపడితే తప్పించి అంటురోగాల నుంచి (ఆదాయం) రక్షించలేకపోవచ్చు.
  4. మానవ అభివృద్ధి సూచికలో దిగువన ఉండటం ప్రజల జీవితాలలోని కొన్ని అంశాలపై దృష్టి కేంద్రీకరించాలన్న సంకేతాన్ని ఇస్తోంది.
  5. ప్రభుత్వమూ, ప్రజలూ అభివృద్ధి (మానవ వనరులు) పై ఆసక్తి కలిగి ఉంటే ఆదాయం (తలసరి) అంత ప్రాముఖ్య అంశం కాకపోయినప్పటికీ, అవసరమైన మేర ఉండాలి.
    ఉదా : హెచ్.పి. ప్రభుత్వం విద్యపై సగటున 2,005 రూపాయలు ఖర్చు పెడుతోంది, ఇది భారతదేశ సగటు (1049) కన్నా ఎక్కువ.
  6. తలసరి ఆదాయ అభివృద్ధి కన్నా, మానవ వనరుల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం వలన హిమాచల్ ప్రదేశ్ లో ఇది (HDI లో ముందుండటం) సాధ్యమయ్యింది.
  7. సామాజిక అంశాలు (లింగ వివక్షత, పురుషాధిక్యత మొదలయినవి) మానవ వనరుల అభివృద్ధిలో ఆదాయం కన్నా ముఖ్యపాత్ర పోషిస్తాయి.
    ఉదా : లింగ వివక్షత లేకపోవడం వలన హిమాచల్ ప్రదేశ్ లో బాలికలు అందరూ చదువుకోవడం జరుగుతుంది.
  8. మహిళా సాధికారత మానవాభివృద్ధిలో ప్రముఖ అంశంగా తోడ్పడుతుంది.
    ఉదా : హిమాచల్ ప్రదేశ్ లో సామాజిక జీవితంలో, గ్రామ రాజకీయాలలోను మహిళల పాత్ర ఎక్కువ. అలాగే పలు గ్రామాలలో చురుకుగా పనిచేస్తున్న మహిళా మండలులు ఉన్నాయి.

ప్రశ్న 7.
పట్టిక : హిమాచల్ ప్రదేశ్ లో ప్రగతి
AP Board 10th Class Social Solutions Chapter 2 అభివృద్ధి భావనలు 2

పై పట్టికలో ఉన్న వివరాల ఆధారంగా కింది వాటిని పూరించండి : (AS3)
ఆరు సంవత్సరాలు పైబడిన ప్రతి 100 మంది ఆడపిల్లల్లో హిమాచల్ ప్రదేశ్ లో 1993లో ….. ఆడపిల్లలు ప్రాథమిక స్థాయి దాటి చదివారు. 2006 నాటికి ఇది వందలో ………… మందికి చేరుకుంది. భారతదేశం మొత్తం మీద 2006లో ప్రాథమిక స్థాయి దాటి చదివిన మగపిల్లల సంఖ్య వందలో …….. మాత్రమే.
జవాబు:
ఆరు సంవత్సరాలు పైబడిన ప్రతి 100 మంది ఆడపిల్లల్లో హిమాచల్ ప్రదేశ్ లో 1993లో …. 39 మంది…. ఆడపిల్లలు ప్రాథమిక స్థాయి దాటి చదివారు. 2006 నాటికి ఇది వందలో …60 ….. మందికి చేరుకుంది. భారతదేశం మొత్తం మీద 2006లో ప్రాథమిక స్థాయి దాటి చదివిన మగపిల్లల సంఖ్య వందలో … 57….. మాత్రమే.

ప్రశ్న 8.
హిమాచల్ ప్రదేశ్ లో తలసరి ఆదాయం ఎంత? అధిక ఆదాయం ఉన్నప్పుడు పిల్లల్ని బడికి పంపటం తల్లిదండ్రులకు తేలిక అవుతుందా? చర్చించండి. హిమాచల్ ప్రదేశ్ లో ప్రభుత్వం పాఠశాలలు నడపటం ఎందుకు అవసరమయ్యింది? (AS1)
జవాబు:
ఎ) హిమాచల్‌ ప్రదేశ్ తలసరి ఆదాయం (2012 సం||లో) 74,000 రూపాయలు.
బి)

  1. అధిక ఆదాయం ఉన్నప్పుడు పిల్లల్ని బడికి పంపటం తల్లిదండ్రులకూ ఖచ్చితంగా తేలిక అవుతుంది. అయితే తలసరి ఆదాయం అధికంగా ఉన్నప్పుడు ఈ విషయాన్ని ఖచ్చితంగా చెప్పలేం. ఎందుకంటే ఆదాయ పంపిణీ ఎలా జరిగిందో చెప్పలేం కనుక.
  2. తక్కువ ఆదాయం కలిగి ఉన్న తల్లిదండ్రులు విద్యపై డబ్బు ఖర్చు పెట్టడం కష్టం. అలాగే పిల్లలను కూడా చదువు మాన్పించి కూలీకి (బాలకార్మికులుగా) పంపటం జరుగుతుంది.
  3. అధిక ఆదాయం ఉన్న తల్లిదండ్రులకు ఆ అవసరం ఉండదు కనుక పిల్లలను చక్కగా చదివిస్తారు.

సి) హిమాచల్ ప్రదేశ్ లో ప్రభుత్వం పాఠశాలలు నడపటం ఎందుకు అవసరమయ్యిందంటే.

  1. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినపుడు హిమాచల్ ప్రదేశ్ లో విద్యాస్థాయి తక్కువగా ఉండటం.
  2. కొండ ప్రాంతం కావటంతో జనసాంద్రత చాలా తక్కువ. పాఠశాల విస్తరణ, ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాలలో విస్తరించటం పెద్ద సవాలుగా ఉండింది.
  3. చాలావరకు విద్య ఉచితంగా లేదా తల్లిదండ్రులకు నామమాత్రపు ఖర్చు అయ్యేలా ప్రభుత్వం చూసింది.
  4. అక్కడి ప్రజలు విద్యపై ఎంతో ఆసక్తి చూపడం వలన.
  5. విద్యకు అత్యధిక ప్రాధాన్యతను ఇవ్వడం వలన.

ప్రశ్న 9.
అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిల చదువుకు తల్లిదండ్రులు తక్కువ ప్రాధాన్యత ఎందుకు ఇస్తారు? తరగతిలో చర్చించండి. (AS4)
జవాబు:
అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిల చదువుకు తల్లిదండ్రులు తక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.

కారణాలు :

  1. అమ్మాయిల చదువుకు తక్కువ ప్రాధాన్యత ఇవ్వటానికి ప్రధాన కారణం “లింగ వివక్షత”.
  2. “బాల్య వివాహాలు” (అమ్మాయిలకు తొందరగా పెళ్ళి చేసి పంపించేయాలని భావించటం),
  3. అమ్మాయిలను అబ్బాయిలకంటే తక్కువగా చూస్తూ వారిని ఇంటిపని, వంట పనులకు బాధ్యుల్ని చేయటం, చిన్నపిల్లల సంరక్షణను అప్పగించటం.
  4. అమ్మాయి ఎక్కువగా చదువుకుంటే తగిన పెళ్ళి సంబంధం కుదర్చాలంటే ఎక్కువ ఖర్చు మరియు కష్టంతో కూడుకున్నదని పెద్దలు అభిప్రాయపడటం.
  5. ఉద్యోగం పురుషలక్షణం అంటూ, అమ్మాయి చదివి ఏం ఉద్యోగం చేయాలని అంటూ అమ్మాయిల విద్యను నిరుత్సాహపరచటం. (ఒక విధమైన ‘పురుషాధిక్యత’)
  6. మనది “పితృస్వామ్య కుటుంబా”లవ్వటం వలన అబ్బాయిలకు ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది.
  7. అమ్మాయిలను “సరైన భద్రత” లేకుండా బయటకు (పాఠశాలలు మొ||నవి) పంపటం శ్రేయస్కరం కాదని భావించడం. సరైన సౌకర్యాలు (రవాణా, మరుగుదొడ్లు మొ||నవి) అందుబాటులో లేకపోవటం.
  8. మగపిల్లల చదువు (ఖర్చును) పెట్టుబడిగా, బాలికల చదువు (ఖర్చు) ఖర్చుగాను భావించడం. అబ్బాయిలకయ్యే ఖర్చును ఇతరత్రా రూపంలో తిరిగి పొందవచ్చని భావించడం.
  9. కొన్ని సామాజిక దురాచారాలు, పురుషాధిక్య సమాజం, మహిళా సాధికారత లోపించడం వలన అమ్మాయిల చదువుకు తక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.

AP Board 10th Class Social Solutions Chapter 2 అభివృద్ధి భావనలు

ప్రశ్న 10.
ఆడవాళ్ళు ఇంటిబయట పనిచెయ్యటానికి, లింగ వివక్షతకూ మధ్య గల సంబంధం ఏమిటి? (AS1)
జవాబు:
ఆడవాళ్ళు ఇంటిబయట పనిచెయ్యటానికి, లింగ వివక్షతకూ విలోమ (వ్యతిరేక) సంబంధం ఉంది.

  1. బయట ఉద్యోగాలు చేసే మహిళలు స్వతంత్రంగా ఉంటారు, ఆత్మవిశ్వాసం కనబరుస్తారు.
  2. ఇంటిలో తీసుకునే నిర్ణయాలలో అంటే పిల్లల చదువు, ఆరోగ్యం, పిల్లల సంఖ్య, గృహ నిర్వహణ వంటి వాటిల్లో ఆడవాళ్ళ మాటకు ప్రాధాన్యత ఉంటుంది.
  3. ఉద్యోగాల్లో ఉన్న మహిళలు పెళ్ళి అయిన తరువాత తమ కూతుళ్లు ఉద్యోగాలు చేయాలని తల్లులు కోరుకుంటారు, కాబట్టి చదువుకు ప్రాధాన్యత ఇవ్వటం సహజం.
  4. ఆడవాళ్లు ఉద్యోగం (బయటపని) చేయటం వలన ఆర్థిక స్వాతంత్ర్యం పొందుతారు, అలాగే ఆర్థికంగా స్థిరత్వం పొందుతారు. తద్వారా మహిళా సాధికారత పొందుతారు.
  5. మహిళలు సాధికారత సాధించిన తర్వాత లింగ వివక్షతకు అసలు చోటే ఉండదు. (పూర్తి అనాగరిక సమాజాలలో తప్ప) ఈ విషయాన్ని మనం అభివృద్ధి చెందిన దేశాలలో చూస్తున్నాం కూడా !

ప్రశ్న 11.
ఎనిమిదవ తరగతి పాఠ్యపుస్తకంలో మీరు విద్యాహక్కు చట్టం (వి.హ.చ) గురించి చదివారు. 6-14 సంవత్సరాల బాలలకు ఉచిత విద్యకు హక్కు ఉందని ఈ చట్టం పేర్కొంటోంది. పరిసర ప్రాంతాలలో తగినన్ని పాఠశాలలు నిర్మించేలా, అర్హులైన టీచర్లను నియమించేలా, అవసరమైన సదుపాయాలు కల్పించేలా ప్రభుత్వం చూడాలి. మీరు ఈ అధ్యాయంలో చదివినది, మీకు తెలిసిన దాన్నిబట్టి (1) బాలలకు (II) మానవ అభివృద్ధికి ఈ చట్టం ఎలాంటి ప్రాధాన్యత కలిగి ఉందో చర్చించండి, గోష్టి నిర్వహించండి. (AS2)
జవాబు:
(i) విద్యాహక్కు చట్టం – బాలలకు కలిగి ఉన్న ప్రాధాన్యత.

  1. దీని ప్రకారం 6 నుండి 14 సం|| మధ్య వయస్సు గల పిల్లలందరికీ ఉచిత, నిర్బంధ విద్యను ప్రభుత్వం అందిస్తుంది.
  2. పిల్లల పరిసరాలలోనే తగిన సంఖ్యలో కనీస సౌకర్యాలు కలిగిన పాఠశాలలు నిర్మించడం, తగినంతమంది ఉపాధ్యాయుల నియామకం చేయడం జరుగుతుంది.
  3. పిల్లలకు భయం, ఆందోళన లేకుండా (శారీరక, మానసిక హింసలేకుండా) కృత్యాల ద్వారా బోధన ద్వారా పిల్లల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తుంది.
  4. బాలల హక్కులు (అభివృద్ధి, భూస్వామ్య హక్కు మొ॥నవి) కాపాడబడటానికి ఈ చట్టం ఎంతో అవసరం.
  5. బాలకార్మిక వ్యవస్థ, వెట్టిచాకిరి, బాల్య వివాహాలు మొ||న సామాజిక దురాచారాల నుండి (బాలలను) విముక్తి కల్పిస్తుంది.

(II) మానవ అభివృద్ధికి ప్రాధాన్యత :

  1. మానవాభివృద్ధి సూచికలో ‘విద్యాస్థాయి’ ప్రధానమైన సూచిక. విద్యాస్థాయిని పెంపొందించటానికి ఈ విద్యాహక్కు చట్టం ఎంతో ఉపయోగపడుతుంది.
  2. సగటున బడిలో గడిపే సంవత్సరాలు ఈ చట్టం ద్వారా ఖచ్చితంగా పెరుగుతాయి.
  3. అలాగే పాఠశాల విద్యలో ఉండే సంవత్సరాలు, ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత విద్యలో నమోదు నిష్పత్తి కూడా ఈ చట్టం ద్వారా గణనీయంగా పెరుగుతుంది.
  4. ఈ చట్టం ద్వారా విద్యాభివృద్ధి తద్వారా మానవాభివృద్ధి ఆశించిన రీతిలో జరుగుతుంది.
  5. విద్యాభివృద్ధి అనేది ఆదర్శవంతమైన (మానవాభివృద్ధి) సూచిక.

10th Class Social Studies 2nd Lesson అభివృద్ధి భావనలు InText Questions and Answers

10th Class Social Textbook Page No.20

ప్రశ్న 1.
ప్రపంచ అభివృద్ధి నివేదిక 2012 ప్రకారం మధ్య ఆదాయ దేశాల తలసరి ఆదాయం ఎంతో పైన ఉన్న భాగం చదివి చెప్పండి.
జవాబు:
ప్రపంచ అభివృద్ధి నివేదిక 2012 ప్రకారం మధ్య ఆదాయ దేశాల తలసరి ఆదాయం 1,035 అమెరికన్ డాలర్ల కంటే ఎక్కువ, 12,600 అమెరికన్ డాలర్ల కంటే తక్కువ.

10th Class Social Textbook Page No.14 & 15

ప్రశ్న 2.
పట్టిక : వివిధ వర్గాల ప్రజలు, అభివృద్ధి లక్ష్యాలు

వివిధ వర్గాల ప్రజలుఅభివృద్ధి లక్ష్యాలు/ఆకాంక్షలు
1) భూమిలేని గ్రామీణ కార్మికులుమరిన్ని రోజుల పని, మెరుగైన కూలీ; స్థానిక పాఠశాల తమ పిల్లలకు నాణ్యమైన విద్యను అందించగలగటం; సామాజిక వివక్షత లేకపోవటం, వాళ్లు కూడా గ్రామంలో నాయకులు కాగలగటం.
2) ధనిక రైతులుతమ పంటలకు అధిక మద్దతు ధరల ద్వారా, తక్కువ కూలీకి బాగా కష్టపడే కూలీల ద్వారా అధిక ఆదాయాన్ని ఖచ్చితంగా పొందగలగటం; తమ పిల్లలు విదేశాలలో స్థిరపడగలగటం.
3) వర్షాధార రైతులు
4) భూమి ఉన్న కుటుంబంలోని గ్రామీణ మహిళ
5) పట్టణ ప్రాంతంలోని నిరుద్యోగ యువత
6) పట్టణ ప్రాంతంలోని ధనిక అబ్బాయి
7) పట్టణ ప్రాంతంలోని ధనిక కుటుంబానికి చెందిన అమ్మాయితన సోదరుడికి లభించే స్వేచ్చ తనకీ కావాలి, తన జీవితంలో ఏం చేయాలో తాను నిర్ణయించుకోగలగాలి. విదేశాలలో పై చదువులు చదువుకోవాలి.
8) గనుల తవ్వకం ప్రాంతంలోని ఆదివాసి
9) తీరప్రాంతంలో చేపలు పట్టే వ్యక్తి

జవాబు:
పట్టిక : వివిధ వర్గాల ప్రజలు, అభివృద్ధి లక్ష్యాలు వివిధ వర్గాల ప్రజలు

వివిధ వర్గాల ప్రజలుఅభివృద్ధి లక్ష్యాలు/ఆకాంక్షలు
1) భూమిలేని గ్రామీణ కార్మికులుమరిన్ని రోజుల పని, మెరుగైన కూలీ; స్థానిక పాఠశాల తమ పిల్లలకు నాణ్యమైన విద్యను అందించగలగటం; సామాజిక వివక్షత లేకపోవటం, వాళ్లు కూడా గ్రామంలో నాయకులు కాగలగటం.
2) ధనిక రైతులుతమ పంటలకు అధిక మద్దతు ధరల ద్వారా, తక్కువ కూలీకి బాగా కష్టపడే కూలీల ద్వారా అధిక ఆదాయాన్ని ఖచ్చితంగా పొందగలగటం; తమ పిల్లలు విదేశాలలో స్థిరపడగలగటం.
3) వర్షాధార రైతులుసకాలంలో రుతుపవనాలు వచ్చి వర్షాలు బాగా పడాలి. పొలాలకు సాగునీరు అందాలి. పంట దిగుబడి పెరగాలి. ఆ పంటకు మంచి గిట్టుబాటు ధర రావాలి. పిల్లలకు మంచి విద్యనందించటం.
4) భూమి ఉన్న కుటుంబంలోని గ్రామీణ మహిళపంట దిగుబడి పెరగాలి. పంటకు మంచి ధర రావాలి. నలుగురిలో (ఊరిలో) దర్పంగా ఉండాలి. మంచి బంగారు నగలు కొనుక్కోవాలి. ఇంట్లోవారు తన మాట వినాలి. పిల్లలకు ఉన్నతమైన సంబంధాలు తేవాలి.
5) పట్టణ ప్రాంతంలోని నిరుద్యోగ యువతచిన్నదో, పెద్దదో ఒక మంచి స్థిరమైన ఉద్యోగం (ప్రభుత్వ ఉద్యోగం) పొందాలి. స్థిరమైన ఆదాయం వచ్చే స్వయం ఉపాధిని వెతుక్కోవాలి. ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్స్ సకాలంలో వెలువడాలి, వాటికి ప్రిపేరయ్యి ఉద్యోగం సాధించాలి.
6) పట్టణ ప్రాంతంలోని ధనిక అబ్బాయివిదేశాలలో చదువుకోవాలి, ఉద్యోగం పొందాలి. స్వేచ్ఛావాతావరణంలో విహరించాలి. తండ్రి వ్యాపారం చేయటం ఇప్పుడే ఇష్టం లేదు, లేదా తండ్రి వ్యాపారాన్ని అభివృద్ధి చెయ్యాలి. కొత్త మోడల్ కారు, బైక్ కొనుక్కోవాలి.
7) పట్టణ ప్రాంతంలోని ధనిక కుటుంబానికి చెందిన అమ్మాయితన సోదరుడికి లభించే స్వేచ్ఛ తనకీ కావాలి. తన జీవితంలో ఏం చేయాలో తాను నిర్ణయించుకోగలగాలి. విదేశాలలో పై చదువులు చదువుకోవాలి.
8) గనుల తవ్వకం ప్రాంతంలోని ఆదివాసితమ భూములు తమకిచ్చేయాలి. ప్రమాదానికి గురికాకుండా రోజు గడవాలి. పర్యావరణాన్ని ఎలాగైనా కాపాడుకోవాలి. ప్రభుత్వం నిర్ణయం మార్చుకుంటే బాగుండు, మార్చే శక్తి తమకుంటే బాగుండు.
9) తీరప్రాంతంలో చేపలు పట్టే వ్యక్తివేట బాగా జరిగి ఎక్కువ చేపలు దొరకాలి. ఎటువంటి అంతరాయం, ప్రమాదం జరగకుండా క్షేమంగా ఇంటికి చేరాలి. చేపలకు మంచి ధర రావాలి. మంచి మర పడవ కొనుక్కోవాలి.

AP Board 10th Class Social Solutions Chapter 2 అభివృద్ధి భావనలు

10th Class Social Textbook Page No.16 & 17

ప్రశ్న 3.
క్రింద ఇచ్చిన వార్తాపత్రిక కథనం చూడండి.
“ఒక ఓడ 500 టన్నుల విషపూరిత వ్యర్థ ద్రవ పదార్థాలను చెత్త పడవేసే బహిరంగ ప్రదేశంలోనూ, పక్కన ఉన్న సముద్రంలోనూ పారబోసింది. ఆఫ్రికాలోని ఐవరీకోస్ట్ దేశంలోని అబిద్ జాన్ అనే పట్టణంలో ఇది జరిగింది. అత్యంత విషపూరితమైన ఈ వ్యర్థ పదార్థాల నుండి వెలువడిన వాయువుల వల్ల తల తిప్పటం, చర్మంపై దద్దురులు, స్పృహతప్పి పడిపోవటం, విరోచనాలు వంటి సమస్యలు ఏర్పడ్డాయి. ఒక నెల రోజులలో ఏడుగురు చనిపోయారు. ఇరవై మంది ఆసుపత్రిలో ఉన్నారు. విష ప్రభావానికి గురైన లక్షణాలకు 26,000 మంచి చికిత్స పొందారు. లోహాలు, ముడి చమురులతో వ్యాపారం చేసే ఒక బహుళజాతి కంపెనీ తన ఓడలోని వ్యర్థ పదార్థాలను పడవెయ్యటానికి ఐవరీకోస్టు చెందిన ఒక స్థానిక కంపెనీతో కాంట్రాక్టు కుదుర్చుకుంది.” (ది హిందూ పత్రికలో 2006 సెప్టెంబరు 16న వైజు నరవనె రాసిన వార్త ఆధారంగా)
ఎ) దీనివల్ల ప్రయోజనం పొందినవాళ్లు ఎవరు, పొందని వాళ్లు ఎవరు?
జవాబు:

  1. దీనివల్ల (కుడంకుళం అణు విద్యుత్ కేంద్రం) ప్రయోజనం పొందినవాళ్లు భారతదేశ ప్రజలు అందరూ. దీని ప్రధాన ఉద్దేశం నిరంతరం పెరుగుతున్న దేశ విద్యుచ్ఛక్తి అవసరాలు తీర్చడం.
  2. ఈ ప్రాంతం ప్రజలు, మత్స్యకారులు వారి భద్రత, రక్షణ, జీవనోపాధులు దెబ్బతింటాయని దీనివల్ల తమకు ప్రయోజనం ఉండదని భావించారు.
  3. రెండో ఉదాహరణలో బహుళ జాతి కంపెనీ లాభం పొందింది, ఐవరీకోస్ట్ తీరప్రాంత ప్రజలు నష్టపోయారు.

బి) ఈ దేశానికి అభివృద్ధి లక్ష్యాలు ఎలా ఉండాలి?
జవాబు:
ఈ దేశానికి అభివృద్ధి లక్ష్యాలు ఎలా ఉండాలి అంటే –

  1. అవసాపనా సౌకర్యాల (రోడు, రవాణా, విద్యుత్, నీరు మొ||నవి) లోటు లేకుండా ఏర్పాటు చేయడం.
  2. ఆధునిక సమాచార, సాంకేతిక రంగాలలో స్వయం సమృద్ధి సాధించుట.
  3. దేశ అభివృద్ధి లక్ష్యాలు ప్రజలందరి అభివృద్ధికి, అభ్యున్నతికి కృషి చేసేవిలా, దేశం స్వయం సమృద్ధి సాధించేలా, సుస్థిరమైన అభివృద్ధి సాధించేలా ఉండాలి.

సి) మీ గ్రామానికి, పట్టణానికి లేదా ప్రాంతానికి కొన్ని అభివృద్ధి లక్ష్యాలను పేర్కొనంది.
జవాబు:
మా గ్రామానికి / పట్టణానికి / ప్రాంతానికి కొన్ని అభివృద్ధి లక్ష్యాలు :

  1. రక్షిత మంచినీటి సౌకర్యం (అందరికి) కల్పించటం.
  2. విద్యా సౌకర్యాలు ఏర్పాటు చేయటం.
  3. పర్యావరణం, పరిశుభ్రతను కాపాడటం.
  4. వైద్య, ఆరోగ్య సదుపాయాలు కల్పించటం.
  5. మెరుగైన (రోడ్లు) రవాణా సౌకర్యాలను కల్పించటం.
  6. 100%, విద్యుదీకరణ, కోతలు లేని విద్యుత్ సౌకర్యం ఏర్పాటు.
  7. వ్యవసాయ కూలీలకు, ఇతర నిరుద్యోగులకు సంవత్సరమంతా ఉపాధి కల్పించే ప్రణాళికలు చేయడం.
  8. వ్యవసాయంతో పాటు పారిశ్రామికంగా అభివృద్ధి చేయటం.

డి) ప్రభుత్వానికి, అణువిద్యుత్ కేంద్ర ప్రాంతాలలో నివసించే ప్రజలకు మధ్య గల వివాదాలేవి?
జవాబు:

  1. భారత ప్రభుత్వం అణువిద్యుత్ కేంద్రాన్ని పెరుగుతున్న దేశ విద్యుచ్ఛక్తి అవసరాలు తీర్చు ప్రధాన ఉద్దేశముతో స్థాపించింది.
  2. కాని ఆ ప్రాంత ప్రజలు వారి భద్రత, రక్షణ, జీవనోపాధుల పరిరక్షణ కోసం ఉద్యమించారు.
  3. పెరుగుతున్న విద్యుచ్ఛక్తి అవసరాలు తీరాలంటే అణువిద్యుత్ శక్తి ఉత్పత్తి తప్పనిసరి అని ప్రభుత్వం భావిస్తోంది.
  4. కాని ఆ ప్రాంత ప్రజలు తీరప్రాంతం, దేశం రేడియోధార్మిక వినాశక ప్రమాదం నుండి రక్షించబడాలని కోరుకుంటు ఉద్యమిస్తున్నారు.
  5. ఆ ప్రాంత ప్రజలు ప్రత్యామ్నాయ ఇంధన వనరుల (సౌర విద్యుచ్ఛక్తి, పవన విద్యుచ్ఛక్తి మొ||నవి) గురించి ఆలోచించమంటూ, ప్రాజెక్ట్ నిర్మాణాన్ని ఆపాలంటున్నారు.
  6. ప్రభుత్వం ప్రాజెక్ట్ నిర్మాణానికి తగిన భద్రతా చర్యలన్నీ తీసుకుంటున్నామని ప్రకటించి, ఉద్యమాలకు అతీతంగా నిర్మాణం కొనసాగిస్తోంది.

ఇ) ఇటువంటి అభివృది విధానాలకు చెందిన వివాదాలు మీకేమైనా తెలుసా? ఇరుపక్షాల వాదనలు పేర్కొనండి.
జవాబు:

  1. పశ్చిమగోదావరి జిల్లా (ఆంధ్రప్రదేశ్) లో గోదావరి నదిపై నిర్మిస్తున్న బహుళార్థ సాధక ప్రాజెక్ట్ పై అనేక వివాదాలు ఉన్నాయి.
  2. ఈ ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తయితే అనేక లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది, అలాగే జలవిద్యుచ్ఛక్తి కూడా ఉత్పత్తవుతుంది.
  3. అయితే ఈ ప్రాజెక్ట్ నిర్మాణం వలన అనేక గ్రామాలు ముంపునకు గురవుతాయి. పెద్ద మొత్తంలో అటవీ ప్రాంతం మునిగిపోతుంది, పర్యావరణం దెబ్బతింటుందని అక్కడి ప్రజలు పెద్ద ఎత్తున నిరసన తెలుపుతున్నారు.
  4. మరో ఉదాహరణ నర్మదానదిపై నిర్మించతలపెట్టిన (సర్దార్ సరోవర్) ప్రాజెక్ట్ విషయంలో కూడా ఇలాంటి వివాదాలే తలెత్తితే, మేధాపాట్కర్ నాయకత్వాన ‘నర్మదా బచావో’ ఆందోళన సాగిస్తున్నారు.

10th Class Social Textbook Page No.19

ప్రశ్న 4.
ఉదాహరణకు క, గ అనే రెండు దేశాలను తీసుకుందాం. సంక్లిష్టంగా లేకుండా ఉండటానికి రెండు దేశాలలోనూ అయిదుగురే ప్రజలు ఉన్నారనుకుందాం. పట్టికలో ఇచ్చిన వివరాల ఆధారంగా రెండు దేశాల సగటు ఆదాయాన్ని లెక్కగట్టండి.
పట్టిక : రెండు దేశాలను పోల్చటం
AP Board 10th Class Social Solutions Chapter 2 అభివృద్ధి భావనలు 5
జవాబు:
ఎ) దేశం ‘క’ సగటు ఆదాయం = 10000
బి) దేశం ‘గ’ సగటు ఆదాయం = 10000

10th Class Social Textbook Page No.20

ప్రశ్న 5.
ఇక్కడ ఇచ్చిన ఉదాహరణ కాకుండా పోలికకు సగటును ఉపయోగించే మరో మూడు ఉదాహరణలు ఇవ్వండి.
జవాబు:

  1. ఒక పరిశ్రమలోని ఉత్పత్తి, ఉద్యోగులు (ధరలు, వ్యయం) అనుసరించి సగటు ఉత్పత్తి, సగటు వ్యయం మొదలైనవి ఉపయోగించి పోలుస్తారు.
  2. తరగతిలోని వివిధ మార్కుల సగటు. .
    ఉదా : తరగతి మార్కుల సగటు, సబ్జెక్ట్ మార్కుల సగటు, జి.పి.ఎ. (గ్రేడ్ పాయింట్ సగటు)
  3. జనాభాను పోల్చుటకు “సగటు జనసాంద్రత” (ఒక చదరపు కిలోమీటరులో నివసించే జనాభా) ను ఉపయోగిస్తున్నారు.

AP Board 10th Class Social Solutions Chapter 2 అభివృద్ధి భావనలు

10th Class Social Textbook Page No.18

ప్రశ్న 6.
విభిన్న వ్యక్తులకు అభివృది పట్ల విభిన్న భావనలు ఎందుకుంటాయి? కింద ఇచ్చిన వివరణల్లో ఏది ముఖ్యమైనది, ఎందుకు?
(అ) వ్యక్తులు వేరు కాబట్టి
(ఆ) వ్యక్తుల జీవన పరిస్థితులు వేరు కాబట్టి
(లేదా)
వివిధ వర్గాల ప్రజల అభివృద్ధి లక్ష్యాలు భిన్నంగా ఉంటాయనడానికి ఉదాహరణలివ్వండి.
AP Board 10th Class Social Solutions Chapter 2 అభివృద్ధి భావనలు 4-1
జవాబు:

  1. విభిన్న వ్యక్తులకు అభివృద్ధి పట్ల విభిన్న భావనలు ఎందుకుంటాయంటే వ్యక్తుల జీవన పరిస్తితులు వేరు కాబట్టి.
  2. వ్యక్తులు వారి వారి పరిస్థితులను బట్టి వారి అభివృద్ధి లక్ష్యాలు, ఆకాంక్షలు కలిగి ఉంటారు.
  3. ఇద్దరు వ్యక్తులకు లేదా బృందాలకు పరస్పర విరుద్ధమైన కోరికలు ఉండవచ్చు.
  4. వ్యక్తులు తామున్న జీవన పరిస్థితుల్లో వివిధ కోరికలు లక్ష్యాలు/ఆకాంక్షలు కలిగి ఉంటారు. ఇవి వారి జీవన పరిస్థితులకు అనుగుణంగానే ఉంటాయి.
  5. ఒకరికి అభివృద్ధి అయినది మరొకరికి అభివృద్ధి కాకపోవచ్చు, అది విధ్వంసం కూడా కావచ్చు.

10th Class Social Textbook Page No.18

ప్రశ్న 7.
కింది రెండు వాక్యాల అర్థం ఒకటేనా ? మీ సమాధానాన్ని ఎలా సమర్థించుకుంటారు?
(అ) ప్రజల అభివృద్ధి లక్ష్యాలు వేరు వేరుగా ఉంటాయి.
(ఆ) ప్రజల అభివృద్ధి లక్ష్యాలు పరస్పర విరుద్ధంగా ఉంటాయి.
జవాబు:

  1. రెండు వాక్యాల అర్థం ఒకటి కాదు, వేరు వేరు.
  2. ప్రజల అభివృద్ధి లక్ష్యాలు వేరువేరుగా ఉంటాయి అంతేకాని పరస్పర విరుద్ధంగా ఉండాలని లేదు.
  3. కొన్ని సందర్భాలలో ఒకరికి అభివృద్ధి అనుకున్నది మరొకరికి (కాకపోవచ్చు) విధ్వంసం కావచ్చు కాని అన్ని సందర్భాలలో కాదు.
    ఉదా : విద్యుత్ కోసం పారిశ్రామికవేత్తలు మరిన్ని ఆనకట్టలు కోరుకోవచ్చు. కాని ముంపునకు గురయ్యే నిర్వాసితులు ఆనకట్టలకు బదులు చెక్ డ్యాములు కోరుకోవచ్చు. కాని ప్రజలందరూ ఇలా కోరుకోటం లేదు కదా !
  4. ఒక అమ్మాయి తన సోదరుడికి లభించే స్వేచ్చ తనకూ కావాలని ఆశించవచ్చు. ఈ కోరిక సోదరుడి కోరికకు విరుద్ధం కాదు కదా !

10th Class Social Textbook Page No.18

ప్రశ్న 8.
మన జీవితంలో ఆదాయం కంటే ముఖ్యమైన ఇతర అంశాలకు కొన్ని ఉదాహరణలు ఇవ్వండి.
జవాబు:
మన జీవితంలో ఆదాయం కంటే ముఖ్యమైన అంశాలు చాలానే ఉన్నాయి.

  1. డబ్బు లేదా అది కొనగలిగిన వస్తువులు మన జీవితంలో ఒక అంశం మాత్రమే.
  2. భౌతికం కాని అంశాలపైన జీవన నాణ్యత ఆధారపడి ఉంటుంది.
  3. సమానత, స్వేచ్ఛ, భద్రత, ఇతరుల నుంచి గౌరవం పొందడం.
  4. ఇతరుల స్నేహాన్ని కోరుకోవటం, అభిమానాన్ని పొందడం.
  5. మన కుటుంబానికి ఉండే సదుపాయాలు, పని పరిస్థితులు, నేర్చుకోవటానికి గల అవకాశాలు.
  6. ఉద్యోగ భద్రత ఉండటం.
  7. కుటుంబానికి దగ్గరగా పనిచేయడం.
  8. సురక్షితమైన వాతావరణం.

AP Board 10th Class Social Solutions Chapter 2 అభివృద్ధి భావనలు

10th Class Social Textbook Page No.18

ప్రశ్న 9.
పై భాగంలోని ముఖ్యమైన అంశాలను మీ సొంత మాటలలో వివరించండి.
జవాబు:
1) ఉద్యోగ భద్రత :
తక్కువ జీతమైనా క్రమం తప్పకుండా పని దొరికి అది భద్రతా భావాన్ని కలిగిస్తుంది. మరొక ఉద్యోగంలో ఎక్కువ జీతం ఉండవచ్చు కానీ అందులో ఉద్యోగ భద్రత లేకపోతే (అభద్రతాభావం) దానిని కోరుకోకపోవచ్చు.

2) కుటుంబానికి దగ్గరగా ఉండటం :
వ్యక్తులు ఎక్కువగా తమ కుటుంబాలతో సమయం గడపాలని ఆశిస్తారు. తక్కువ జీతం అయినా, కుటుంబానికి దగ్గరగా ఉండే ఉద్యోగాలవైపు మొగ్గు చూపుతారు.

3) సురక్షిత వాతావరణం :
భద్రతతో కూడిన సురక్షితమైన వాతావరణం ఉంటే మహిళలు అనేక రకాల ఉద్యోగాలు చేపట్టటానికి, వ్యాపారాలు నిర్వహించటానికి అవకాశం ఉంటుంది.

4) సమానత (వివక్షతలు లేకపోవడం) :
వివక్షత లేని సమానత్వ వాతావరణంలో పనిచేయటానికి ఇష్టపడతారు, ఆదాయం కోసం వివక్షతను ఎదుర్కొనటానికి ఇష్టపడరు.

5) స్వేచ్ఛా వాతావరణం :
అభివృద్ధి చెందటానికి అవకాశం ఉన్న స్వేచ్ఛా వాతావరణంలో పనిచేయటానికి యువకులు ఇష్టపడతారు, ఆదాయం ముఖ్యమని భావించకపోవచ్చు.

10th Class Social Textbook Page No.20

ప్రశ్న 10.
అభివృద్ధికి సగటు ఆదాయం ముఖ్యమైన ప్రామాణికమని ఎందుకంటున్నారు? వివరించండి.
జవాబు:
ఒక దేశ (ప్రాంత, రాష్ట్ర అభివృద్ధిని తెలుసుకునేందుకు సగటు ఆదాయం (తలసరి ఆదాయం ) ముఖ్యమైన ప్రామాణికంగా భావిస్తున్నారు.

  1. తలసరి ఆదాయం (సగటు ఆదాయం ) ఆ దేశ ప్రజల కొనుగోలు శక్తిని తెలియజేస్తుంది.
  2. సగటు ఆదాయం , దేశం మొత్తం ఆదాయము (ఉత్పత్తుల మొత్తం) ను కూడా తెలియజేస్తుంది.
  3. ఒక దేశంలోని ప్రజలు మరో దేశ ప్రజల కంటే మెరుగ్గా ఉన్నారా లేదా అనే విషయం తెలుసుకోవడానికి మనం సగటు ఆదాయాన్ని పోలుస్తాం.
  4. ప్రజలు తమకు ఇష్టమైనవి, అవసరమైనవి ఎక్కువ ఆదాయాలతో సమకూర్చుకోగలుగుతారు. కాబట్టి అధిక ఆదాయం ఉండటం ఒక ముఖ్యమైన ప్రామాణికంగా పరిగణిస్తారు.
  5. మొత్తం ఆదాయంలో పెరుగుదల దేశాలను పోల్చటానికి అంతగా ఉపయోగపడదు ఎందుకంటే వివిధ దేశాల జనాభాలో తేడా ఉంటుంది కాబట్టి.
  6. అయితే పోలికకు “సగటు” ఉపయోగకరంగా ఉన్నా అది ప్రజల మధ్య అంతరాలను వెల్లడి చేయదు.

10th Class Social Textbook Page No.20

ప్రశ్న 11.
కొంతకాలంగా ఒక దేశ సగటు ఆదాయం పెరుగుతోందని గణాంకాలు చెబుతున్నాయని అనుకుందాం. సమాజంలోని అన్ని వర్గాల ప్రజల జీవితం మెరుగయ్యిందని దీని ఆధారంగా చెప్పగలమా ? మీ జవాబుకు ఒక ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:

  1. ఒక దేశ సగటు ఆదాయం పెరుగుతోందని గణాంకాలు చెబుతున్నా, సమాజంలోని అన్ని వర్గాల ప్రజల జీవితం మెరుగయ్యిందని దీని ఆధారంగా “చెప్పలేం*.
  2. ఉదాహరణకు దేశంలోని కొన్ని ఉన్నత వర్గాల ప్రజల (ధనవంతుల) ఆదాయం పెరిగినా సగటు ఆదాయం పెరిగినట్లు గణాంకాలు చెబుతాయి, కాని నిజంగా ప్రజలందరి ఆదాయం (పేద, బి.పి.ఎల్. వర్గాలందరి) పెరిగి ఉండకపోవచ్చు.
  3. అలాగే ఒక దేశంలోని మొత్తం ఆదాయం పెరగకపోయినా దానికంటే జనాభా తగ్గినట్లయితే (పెరుగుదల రేటు) తలసరి (సగటు) ఆదాయం పెరిగినట్లుగా గణాంకాలు చూపుతాయి. కాని ఇక్కడ ఆదాయాలు పెరగలేదు, జనాభా తగ్గరు.
  4. సగటు ఆదాయం పెరిగినా ప్రజల మధ్య ఈ ఆదాయం ఎలా పంపిణీ జరిగిందో తెలియదు.
  5. సగటు ఆదాయం ప్రజల మధ్య అంతరాలను వెల్లడి చేయదు.

AP Board 10th Class Social Solutions Chapter 2 అభివృద్ధి భావనలు

10th Class Social Textbook Page No.20

ప్రశ్న 12.
అభివృద్ధి చెందిన దేశంగా మారటానికి మీకు గల ఆలోచన ప్రకారం భారతదేశం ఏం చెయ్యాలో, లేదా ఏం సాధించాలో ఒక పేరా రాయండి.
జవాబు:
భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే ఇవి సాధించాలి.

  1. సంపూర్ణ (100%) అక్షరాస్యత సాధించాలి.
  2. వైద్యం, ఆరోగ్యం అందరికి అందుబాటులో ఉండాలి.
  3. వ్యవసాయంలో అధిక దిగుబడి (ఆధునిక వ్యవసాయ పద్ధతులు, హరిత విప్లవం) సాధించేలా కృషి చేయాలి.
  4. దేశంలో ఉన్న వనరులను సక్రమంగా ఉపయోగించుకుని పారిశ్రామిక వృద్ధి (ఉత్పత్తి) సాధించాలి.
  5. శాస్త్ర, సాంకేతిక, సమాచార రంగంలో స్వయం సమృద్ధి సాధించాలి.
  6. మెరుగైన రవాణా మరియు ఆధునిక సమాచార (వ్యవస్థలు) సౌకర్యాలు కల్పించాలి.
  7. విద్యుత్, త్రాగునీరు, రోడ్లు మొదలైన అవస్థాపనా సౌకర్యాలు మెరుగుపర్చాలి.
  8. పొదుపు, పెట్టుబడుల సక్రమ నిర్వహణకై పటిష్టమైన బ్యాంకింగ్, ద్రవ్య వ్యవస్థ కలిగి ఉండాలి.
  9. పటిష్టమైన, పారదర్శకమైన, అవినీతిరహిత పాలన వ్యవస్థ కలిగి ఉండాలి.

10th Class Social Textbook Page No.22

ప్రశ్న 13.
క్రింది పట్టికలలోని వివరాలు చూడండి. తలసరి ఆదాయాలలో బీహార్ కంటే పంజాబు ముందున్నట్లుగా అక్షరాస్యత వంటి వాటిల్లో కూడా ఉందా?
పట్టిక : కొన్ని రాష్ట్రాల తలసరి ఆదాయం

రాష్ట్రం2012 సం||లో
తలసరి ఆదాయం (రూ.లో)
పంజాబ్78,000
హిమాచల్ ప్రదేశ్74,000
బీహార్25,000

పట్టిక : కొన్ని రాష్ట్రాలకు సంబంధించి కొన్ని తులనాత్మక గణాంకాలు
AP Board 10th Class Social Solutions Chapter 2 అభివృద్ధి భావనలు 3
జవాబు:

  1. తలసరి ఆదాయంలో పంజాబు (₹ 78,000) బీహార్ (₹ 25,000) కంటే ముందుంది.
  2. అక్షరాస్యత పంజాబులో 77% ఉంటే బీహార్లో 64% మాత్రమే ఉంది.
  3. నికర హాజరు పంజాబులో 76% ఉంటే బీహార్‌లో 56% మాత్రమే ఉంది.
  4. అలాగే శిశుమరణాలరేటు పంజాబులో 42 ఉంటే బీహార్ 62 కలిగి ఉంది. ఈ వివరాలు గమనించినట్లైతే పంజాబు, బీహార్ కంటే తలసరి ఆదాయాలలోనే కాకుండా అక్షరాస్యత మొదలైన వాటిల్లో కూడా ముందు ఉందని అవగాహనవుతుంది.

10th Class Social Textbook Page No.22

ప్రశ్న 14.
వ్యక్తులుగా సమకూర్చుకోవటం కంటే సామూహికంగా వస్తువులు, సేవలు సమకూర్చుకోవటానికి తక్కువ ఖర్చు అయ్యే మరికొన్ని ఉదాహరణలు పేర్కొనండి.
జవాబు:
వాస్తవానికి ఎన్నో ముఖ్యమైన వాటిని అందించటానికి (సమకూర్చుకోవటానికి), తక్కువ ఖర్చుతో చెయ్యాలంటే వస్తువులను,
సేవలను సామూహికంగా అందించాలి. ఉదాహరణకు

  1. ఇంటి ముందు (రహదారి) రోడ్డు ఒక్కరే వేసుకోవాలంటే చాలా ఖర్చవుతుంది, రోడ్డులోని ఇళ్ళవారందరూ కలసి వేసుకుంటే తక్కువ ఖర్చు అవుతుంది (విద్యుత్ లైన్, డ్రైనేజి వ్యవస్థ మొదలైనవి కూడా).
  2. అపార్ట్మెంట్లో ప్రతి ఒక్కరు ఒక లిఫ్ట్ పెట్టుకోవాలంటే ఖర్చు పెరుగుతుంది. కనుక సామూహికంగా ఒక లిఫ్ట్ ఏర్పాటు చేసుకుంటున్నారు (మంచినీటి సరఫరా, భద్రత సిబ్బంది మొదలైనవి కూడా).
  3. ప్రతి ఒక్కరూ అన్నీ పుస్తకాలు కొనుక్కొని చదవాలంటే ఖర్చు పెరుగుతుంది. అదే లైబ్రరీ ఏర్పాటు చేసుకుని సామూహికంగా వాడుకుంటే ఖర్చు చాలా తగ్గుతుంది.
  4. ఆట స్థలమును వ్యక్తిగతంగా ఏర్పాటు చేసుకోవటం వ్యయంతో కూడుకున్నది, సామూహికంగా అయితే ఖర్చు తగ్గుతుంది. (స్విమ్మింగ్ పూల్, పార్క్ మొదలైనవి కూడా)
  5. ‘షేర్ ఆటో’ దగ్గర నుంచి ‘ఎయిర్ బస్’ వరకు సామూహికంగా వినియోగించుకోవటం వల్ల వాటి వినియోగ సేవల ఖర్చు తగ్గుతుందని తెలుస్తుంది.

AP Board 10th Class Social Solutions Chapter 2 అభివృద్ధి భావనలు

10th Class Social Textbook Page No.22

ప్రశ్న 15.
ఆరోగ్యం, విద్యపై ప్రభుత్వం ఖర్చు పెట్టే డబ్బుపైనే మెరుగైన సేవలు అందుబాటులో ఉండటం ఆధారపడి ఉందా? ఇంకా ఏయే అంశాలు ప్రధానపాత్ర పోషిస్తాయి?
జవాబు:

  1. అభివృద్ధి చెందుతున్న, తక్కువ అభివృద్ధి చెందిన (వెనకబడిన) దేశాలలో ఆరోగ్యం, విద్యపై ప్రభుత్వం ఖర్చుపెట్టే డబ్బుపైనే మెరుగైన సేవలు అందుబాటులో ఉండటం ఆధారపడి ఉంది.
  2. అలాగే ప్రభుత్వ ప్రోత్సాహంతో పాటు ఇతర సామాజిక అంశాలు కూడా ప్రధానపాత్ర పోషిస్తాయి.
  3. ప్రజల యొక్క చైతన్యం, సేవా దృక్పథం. (విద్యను పొందాలని, ఆరోగ్యం బాగుండాలని ప్రజల్లో చైతన్యం వస్తే ప్రజలు సేవా దృక్పథం కలిగి ఉంటే మెరుగైన సేవలు అందుతాయి.)
  4. మానవ వనరుల అభివృద్ధి, అందుబాటు. (డాక్టర్లు, ఉపాధ్యాయులు ఎక్కువగా లభ్యమయితే, మెరుగైన సేవలు అందుతాయి.)
  5. స్వచ్చంద సంస్థలు, (NGOS) (వీరి సేవలు అందించుట వల్ల మెరుగైన ఆరోగ్యం , విద్య అందుతుంది)
  6. యువజన సంఘాలు, మత సంస్థలు మొదలైనవి.

10th Class Social Textbook Page No.22

ప్రశ్న 16.
తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ లోని గ్రామీణ ప్రాంతంలోని కుటుంబం 2009-10 లో చౌకధరల దుకాణాల నుంచి తమకు అవసరమైన దాంట్లో 53 శాతం, 33 శాతం కొనుక్కున్నాయి. మిగిలిన బియ్యం బజారు నుంచి కొనుక్కుంటారు. పశ్చిమ బెంగాల్, అసోంలలో 11 శాతం, 6 శాతం బియ్యం మాత్రమే పౌర సరఫరా దుకాణాల నుంచి కొనుక్కుంటున్నాయి. ఏ రాష్ట్రాల ప్రజలు మెరుగ్గా ఉన్నారు? ఎందుకు?
జవాబు:
పశ్చిమబెంగాల్, అసోం రాష్ట్రాల ప్రజలు మెరుగ్గా ఉన్నారు. కారణం :

  1. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ లోని గ్రామీణ ప్రాంతంలోని కుటుంబాలు 2009-10 లో చౌకధరల దుకాణాల నుంచి 53% మరియు 33% వరుసగా కొనుక్కున్నాయి.
  2. అంటే 47% మరియు 67% (బియ్యం) బజారు నుంచి కొనుగోలు చేశారు.
  3. పశ్చిమ బెంగాల్, అస్సాంలు చౌకధరల దుకాణాల నుంచి 11 శాతం, 6 శాతం బియ్యం మాత్రమే కొనుక్కుంటున్నాయి.
  4. అంటే 89% మరియు 94% బియ్యం బజారు నుంచి కొనుక్కుంటున్నారు.
  5. బియ్యం బజారు నుంచి పశ్చిమబెంగాల్, అసోం రాషాల కుటుంబాలు ఎక్కువగా కొంటున్నాయి. కాబట్టి ఈ రెండు రాష్ట్రాల ప్రజల కొనుగోలు శక్తి అధికంగా ఉంది. కనుక వీరు మెరుగ్గా ఉన్నారు.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 5 సుందరకాండ

AP State Board Syllabus AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం 5th Lesson సుందరకాండ Textbook Questions and Answers.

AP State Syllabus SSC 10th Class Telugu Solutions ఉపవాచకం 5th Lesson సుందరకాండ

10th Class Telugu ఉపవాచకం 5th Lesson సుందరకాండ Textbook Questions and Answers

I. అవగాహన – ప్రతిస్పందన

సంఘటనా క్రమం

సంఘటనల ఆధారంగా వరుస క్రమంలో వాక్యాలను అమర్చడం

1. అ) సీతాన్వేషణను సఫలం చేయగల సమర్థుడు హనుమంతుడేనని సుగ్రీవుడి నమ్మకం. హనుమంతుడు అదే విశ్వాసంతో ఉన్నాడు. శ్రీరాముడి భావన కూడా అదే.
ఆ) హనుమంతుడు (రెట్టించిన ఉత్సాహంతో బలాన్ని పుంజుకున్నాడు.
ఇ) సంపాతి తన సోదరుడి మరణానికి ఎంతో విలపించాడు. లంకలో సీత ఉన్న పరిస్థితులను దివ్యదృష్టితో చూసి కళ్లకు కట్టినట్లు వివరించాడు.
ఈ) అందుకే తనపేరు చెక్కబడిన ఉంగరాన్ని హనుమంతుడికి ఇచ్చాడు శ్రీరాముడు. సీత దీన్ని చూస్తే హనుమను రామదూతగా నమ్ముతుందన్నాడు.
జవాబులు
అ) సీతాన్వేషణను సఫలం చేయగల సమర్ధుడు హనుమంతుడేనని సుగ్రీవుని నమ్మకం. హనుమంతుడూ అంతే విశ్వాసంతో ఉన్నాడు. శ్రీరాముడి భావన కూడా అదే.
ఈ) అందుకే తన పేరు చెక్కబడిన ఉంగరాన్ని హనుమంతుడికి ఇచ్చాడు శ్రీరాముడు. సీత దీన్ని చూస్తే హనుమను రామదూతగా నమ్ముతుందన్నాడు.
ఇ) సంపాతి తన సోదరుడి మరణానికి ఎంతో విలపించాడు. లంకలో సీత ఉన్న పరిస్థితులను దివ్యదృష్టితో చూసి కళ్లకు కట్టినట్లు వివరించాడు.
ఆ) హనుమంతుడు రెట్టించిన ఉత్సాహంతో బలాన్ని పుంజుకున్నాడు.

2. అ) సీతాదేవిని చూడగానే హనుమంతుని కన్నుల నుండి ఆనందాశ్రువులు జారాయి. శ్రీరాముని స్మరించుకుని నమస్కరించాడు.
ఆ) హనుమంతుడు మహానాదం చేస్తూ ఎడమచేతితో లంకిణి పై ఒకదెబ్బవేశాడు.
ఇ) హనుమంతుని పరీక్షించడానికి వచ్చిన ‘సురస’ అనే నాగమాత అతని సూక్ష్మబుద్ధిని, సమయస్ఫూర్తిని చూసి ఆనందించి ఆశీర్వదించింది.
ఈ) శ్రీరామ కార్యమునకు వెళుతున్న హనుమంతునికి సూర్యుడు తాపాన్ని కలిగించలేదు.
జవాబులు
ఈ) శ్రీరామ కార్యమునకు వెళుతున్న హనుమంతునికి సూర్యుడు తాపాన్ని కలిగించలేదు.
ఇ) హనుమంతుణ్ణి పరీక్షించడానికి వచ్చిన ‘సురస’ అనే నాగమాత అతని సూక్ష్మబుద్ధిని, సమయస్ఫూర్తిని చూసి ఆనందించి ఆశీర్వదించింది.
ఆ) హనుమంతుడు. మహనాదం చేస్తూ ఎడమ చేతితో లంకిణిపై ఒక్కదెబ్బవేశాడు.
అ) ఒక వానరుడు వచ్చి లంకిణిని జయించినప్పుడు రాక్షసులకు కీడుమూడుతుందని బ్రహ్మ చెప్పాడు.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 4 కిష్కింధ కాండ

3. అ) శ్రీరాముడి నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదని హెచ్చరించింది.
ఆ) రావణునిలో ఆవేశం పెల్లుబికింది. రెండు నెలల గడువు విధించాడు.
ఇ) రావణుని తేజస్సు చూసి ఆశ్చర్యచకితుడయ్యాడు హనుమంతుడు.
ఈ) సీత దగ్గరికి వచ్చి రావణుడు నయానా భయాన సీత మనసుమార్చే ప్రయత్నం చేశాడు.
జవాబులు
ఇ) రావణుని తేజస్సు చూసి ఆశ్చర్యచకితుడయ్యాడు హనుమంతుడు.
ఈ) సీత దగ్గరకి వచ్చి రావణుడు నయానా భయాన సీత మనసుమార్చే ప్రయత్నం చేశాడు.
అ) శ్రీరాముడి నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదని హెచ్చరించింది.
ఆ) రావణునిలో ఆవేశం పెల్లుబికింది. రెండు నెలలు గడువు విధించాడు.

4. అ) శ్రీరాముడు రావణుణ్ణి సంహరించి తనను తీసుకుపోవడమే ఆయన స్థాయికి తగినదన్నది.
ఆ) సీతాదేవికి వినబడేటట్లు రామకథను వర్ణించాడు.
ఇ) హనుమంతుడు శ్రీరాముడి రూపగుణాలను వివరించాడు. శ్రీరాముడి ముద్రికను సమర్పించాడు.
ఈ) కొంగుముడి విప్పి అందులోని దివ్యచూడామణిని హనుమంతునికిచ్చింది.
జవాబులు
ఆ) సీతాదేవికి వినబడేటట్లు రామకథను వర్ణించాడు.
ఇ) హనుమంతుడు శ్రీరాముడి రూపగుణాలను వివరించాడు. శ్రీరాముడి ముద్రికను సమర్పించాడు.
ఈ) కొంగుముడి విప్పి అందులోని దివ్య చూడామణిని హనుమంతునికిచ్చింది.
అ) శ్రీరాముడు రావణుణ్ణి సంహరించి తనను తీసుకుపోవడమే ఆయన స్థాయికి తగినదన్నది.

5. అ) ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి హనుమంతుణ్ణి బంధించాడు.
ఆ) విభీషణుని భవనం తప్ప లంకంతా నిప్పుపెట్టాడు.
ఇ) హనుమంతుని తోకకు నిప్పంటించి లంకంతా కలియదిప్పమన్నాడు రావణుడు.
ఈ) మహేంద్రగిరికి చేరుకోబోతుండగా మహానాదం చేశాడు. జాంబవంతుడు దానిని విని పొంగిపోయాడు. హనుమంతుడు విజయుడై తిరిగివస్తున్నాడని ప్రకటించాడు.
జవాబులు
అ) ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి హనుమంతుణ్ణి బంధించాడు.
ఇ) హనుమంతుణి తోకకు నిప్పంటించి లంకంతా కలియదిప్పమన్నాడు రావణుడు.
ఆ) విభీషణుని భవనం తప్ప లంకంతా నిప్పు పెట్టాడు.
ఈ) మహేంద్రగిరికి చేరుకోబోతుండగా మహానాదం చేశాడు. జాంబవతుడు దానిని విని పొంగిపోయాడు. హనుమంతుడు విజయుడై తిరిగి వస్తున్నాడని ప్రకటించాడు.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 4 కిష్కింధ కాండ

6. అ) అంగద హనుమదాదాలు శ్రీరాముడు సుగ్రీవుడున్న చోటుకు చేరారు.
ఆ) ప్రాణత్యాగానికి సిద్ధపడ్డ సీతకు శుభశకునాలు తోచాయి.
ఇ) రాత్రి కాగానే పిల్లి ప్రమాణంలోకి తన శరీరాన్ని కుదించుకొని లంకలోకి ప్రవేశించాడు.
ఈ) సముద్రంపై సాగిపోతున్న హనుమంతుని చూసి సాగరుడు సహాయపడదలచాడు.
జవాబులు
ఈ) సముద్రం పై సాగిపోతున్న హనుమంతుని చూసి సాగరుడు సహాయపడదలచాడు.
ఇ) రాత్రి కాగానే పిల్లి ప్రమాణంలోకి తన శరీరాన్ని కుదించుకొని లంకలోకి ప్రవేశించాడు.
ఆ) ప్రాణత్యాగానికి సిద్ధపడ్డ సీతకు శుభశకునాలు తోచాయి.
అ) అంగద హనుమదాదాలు శ్రీరాముడు సుగ్రీవుడున్న చోటుకు చేరారు.

7. అ) వానరులు మధువనాన్ని ధ్వంసం చేశారు.
ఆ) శ్రీరాముడికి దూరమై బతకడం కన్నా శరీరాన్ని విడవడమే మేలన్నది సీత.
ఇ) సీత కోరికపైన హనుమంతుడు రాముడి గుణరూపాలను వివరించాడు.
ఈ) ప్రాణ త్యాగానికి సిద్ధపడ్డ సీతకు శుభశకునాలు తోచాయి.
జవాబులు
ఆ) శ్రీరాముడికి దూరమై బతకడం కన్నా శరీరాన్ని విడవడమే మేలన్నది.
ఈ) ప్రాణ త్యాగానికి సిద్ధపడ్డ సీతకు శుభశకునాలు తోచాయి.
ఇ) సీత కోరికపైన హనుమంతుడు రాముడి గుణరూపాలను వివరించాడు.
అ) వానరులు మధువనాన్ని ధ్వంసం చేశారు.

8. అ) రావణుని తేజస్సును చూచి హనుమంతుడు ఆశ్చర్యపోయాడు.
ఆ) శ్రీరామునికి దూరమై బ్రతకడం కన్నా శరీరాన్ని విడవడం మంచిదని సీత తలచింది.
ఇ) హనుమంతుడు సీతతో తాను శ్రీరామదూతనని చెప్పుకున్నాడు.
ఈ) అంతఃపురంలో ఎందరో స్త్రీలు చెల్లాచెదురుగా నిద్రపోవడం హనుమంతుడు చూశాడు.
జవాబులు
ఈ) అంతఃపురంలో ఎందరో స్త్రీలు చెల్లాచెదురుగా నిద్రపోవడం హనుమంతుడు చూశాడు.
అ) రావణుని తేజస్సును చూచి హనుమంతుడు ఆశ్చర్యపోయాడు.
ఆ) శ్రీరామునికి దూరమై బ్రతకడం కన్నా శరీరాన్ని విడవడం మంచిదని సీత తలచింది.
ఇ) హనుమంతుడు సీతతో తాను శ్రీరామదూతనని చెప్పుకున్నాడు.

9. అ) లంకను కాల్చాక హనుమంతుడు సముద్రంలో చల్లార్చుకున్నాడు.
ఆ) హనుమంతుడు మహేంద్రగిరి శిఖరం మీద అడుగుపెట్టాడు.
ఇ) హనుమంతుడు తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు.
ఈ) హనుమంతుని తోకకు నిప్పు అంటించి లంకంతా కలయదిప్పమన్నాడు రావణుడు.
జవాబులు
ఇ) హనుమంతుడు తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు.
ఈ) హనుమంతుని తోకకు నిప్పు అంటించి లంకంతా కలయదిప్పమన్నాడు రావణుడు.
అ) లంకను కాల్చాక హనుమంతుడు సముద్రంలో చల్లార్చుకున్నాడు.
ఆ) హనుమంతుడు మహేంద్రగిరి శిఖరం మీద అడుగుపెట్టాడు.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 4 కిష్కింధ కాండ

10. అ) హనుమంతుడు లంకలో చిత్రవిచిత్రమైన ఇళ్ళను చూశాడు.
ఆ) అంతవరకు వెతకని అశోకవనాన్ని వెతకాలనుకున్నాడు హనుమంతుడు.
ఇ) సీత హనుమంతునితో వెళ్ళడానికి నిరాకరించింది.
ఈ) హనుమ లంకిణిని చంపి లంకలో ప్రవేశించాడు.
జవాబులు
ఈ) హనుమ లంకిణిని చంపి లంకలో ప్రవేశించాడు.
అ) హనుమంతుడు లంకలో చిత్రవిచిత్రమైన ఇళ్ళను చూశాడు.
ఆ) అంతవరకు వెతకని అశోకవనాన్ని వెతకాలనుకున్నాడు హనుమంతుడు.
ఇ) సీత హనుమంతునితో వెళ్ళడానికి నిరాకరించింది.

11. అ) హనుమంతుడు మందహాసం చేస్తూ లంకిణిపై బలంగా కొట్టాడు.
ఆ) హనుమంతుడు అశోకవనంలో ప్రవేశించాడు.
ఇ) హనుమంతుడు ముఖద్వారం గుండా లంకలోకి వెళ్ళలేదు.
ఈ) త్రికూట పర్వతంపై ఉన్న లంకను చేరాడు హనుమంతుడు.
జవాబులు
ఈ) త్రికూట పర్వతంపై ఉన్న లంకను చేరాడు హనుమంతుడు.
అ) హనుమంతుడు మందహాసం చేస్తూ లంకిణిపై బలంగా కొట్టాడు.
ఇ) హనుమంతుడు ముఖద్వారం గుండా లంకలోకి వెళ్ళలేదు.
ఆ) హనుమంతుడు అశోకవనంలో ప్రవేశించాడు.

12. అ) నిద్రలేచిన రావణుడు అశోకవనం వైపు అడుగులు వేస్తున్నాడు.
ఆ) ప్రాణత్యాగానికి సిద్ధపడిన సీతకు శుభశకునాలు తోచాయి.
ఇ) సీతాదేవిని చూడగానే హనుమంతుని కళ్ళల్లో ఆనందాశ్రువులు వచ్చాయి.
ఈ) రాక్షస స్త్రీలు ఎన్నో రకాలుగా సీతకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.
జవాబులు
ఇ) సీతాదేవిని చూడగానే హనుమంతుని కళ్ళల్లో ఆనందాశ్రువులు వచ్చాయి.
అ) నిద్రలేచిన రావణుడు అశోకవనం వైపు అడుగులు వేస్తున్నాడు.
ఈ) రాక్షస స్త్రీలు ఎన్నో రకాలుగా సీతకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.
ఆ) ప్రాణత్యాగానికి సిద్ధపడిన సీతకు శుభశకునాలు తోచాయి.

పాత్ర స్వభావాలు

1. త్రిజట :
త్రిజట విభీషణుని కూతురు. రాక్షస స్త్రీలను అదలించింది. తనకు వచ్చిన కలను చెప్పింది. ‘వేయి హంసలతో కూడిన పల్లకిమీద లక్ష్మణుడితో శ్రీరాముడు కూర్చునట్లు చూశాను. సముద్రం మధ్య ఒక తెల్లని పర్వతంమీద సీత కూర్చోవడం చూశాను. నూనెపూసిన శరీరంతో రావణుడు నేలమీద పడి ఉండటం చూశాను. ఒక నల్లని స్త్రీ శరీరమంతా బురద పూసుకొని ఎర్రని వస్త్రములు కట్టి, రావణుని మెడకు తాడుకట్టి దక్షిణంవైపుగా ఈడ్చుకువెళ్ళడం చూశాను. వరాహం మీద రావణుడు, మొసలిమీద ఇంద్రజిత్తూ, ఒంటిమీద కుంభకర్ణుడు దక్షిణదిశగా వెళ్ళడం చూశాను. లంక చిన్నాభిన్నం కావడం చూశాను’ అన్నది. స్వప్నంలో విమానదర్శనం కావడాన్ని బట్టి సీత సిద్ధిస్తుందని, రావణునికి వినాశం తప్పదని, శ్రీరాముడికి జయం కలుగుతుందనీ చెప్పింది.

సంఘటన ద్వారా గ్రహించుట

ప్రశ్న 1.
‘దూతను చంపడం రాజనీతి కాదు’ అని పలికిన విభీషణుని మాటలను బట్టి మీరేమి గ్రహించారు?
జవాబు:
హనుమంతుడు రావణునికి హితోపదేశం చేశాడు. అది రావణునికి నచ్చలేదు. హనుమంతుడిని సంహరించమని ఆదేశించాడు. అది విని విభీషణుడు దూతను చంపడం రాజనీతి కాదని, రావణునికి సూచించాడు.

ఈ విభీషణుని మాటల ద్వారా విభీషణుడు రాక్షస వంశంలో జన్మించినా గొప్ప రాజనీతి కలవాడని గ్రహించాను. ఆవేశంతో కాకుండా ఆలోచనతో మంచి నిర్ణయాలు తీసుకోవాలని గ్రహించాను. రాజు ఎల్లప్పుడు రాజనీతిని అనుసరించి పాలించాలని, మంచి మాటలు చెప్పే మంత్రులు రాజుకు అవసరమని గ్రహించాను.

ప్రశ్న 2.
త్రిజట సీతను ఓదార్చిన విధానం ద్వారా మీరేమి గ్రహించారు?
జవాబు:
రావణుడు అశోకవనంలో ఉన్న సీతను సమీపించాడు. అనేక రకాలుగా ప్రలోభ పెట్టాడు. తీవ్రంగా భయపెట్టాడు. చంపుతానని బెదిరించాడు. ఆ సమయంలో దుఃఖిస్తున్న సీతను విభీషణుని కుమార్తె అయిన త్రిజట ఓదార్చింది. ఆమెలో ధైర్యాన్ని నింపింది.

త్రిజట సీతను ఓదార్చడం ద్వారా ఎన్నో విషయాలను గ్రహించాను. త్రిజట రాక్షస వంశంలో జన్మించినా ఉత్తమ గుణములు కల మహిళగా గుర్తించాను. ఆపదల్లోను, దుఃఖంలో ఉన్నవారిని ఆదుకోవాలని, వారిలో ధైర్యం నింపాలనిగ్రహించాను. త్రిజట మాటల వల్లనే సీత ధైర్యంగా జీవించగలిగిందని గ్రహించాను.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 4 కిష్కింధ కాండ

ప్రశ్న 3.
మైనాకుడు హనుమంతుడిని విశ్రాంతి తీసుకొనమని ప్రార్థించిన తీరును బట్టి మీరేమి గ్రహించారు?
జవాబు:
మైనాకుడు వాయుదేవుని అనుగ్రహం వల్ల సముద్రంలో దాగియున్నాడు. హనుమంతుడు సముద్రాన్ని దాటడానికి ప్రయత్నించాడు. మార్గమధ్యలో మైనాకుడు హనుమంతునికి ఆతిథ్యం ఇవ్వడానికి ప్రయత్నించాడు. హనుమంతుడు మైనాకుడిని స్పృశించి ముందుకు వెళ్ళాడు.

ఈ సన్నివేశం ద్వారా చేసిన ఉపకారాన్ని మరువకూడదని, దూరప్రయాణం చేసేవారికి విశ్రాంతిని ఇచ్చి, అతిథి మర్యాదలతో సత్కరించాలని గ్రహించాను. అంతేగాక కార్యరంగంలో దిగినవాడు అవిశ్రాంతంగా పనిచేయాలని, మార్గమధ్యలో కలిగే అంతరాలకు లోనుకాకూడదని కూడా గ్రహించాను.

ప్రశ్న 4.
ఆత్మహత్య కన్నా బతికి యుండటమే ఎన్నో విధాల మంచిదని, బాధల్లో నిరుత్సాహ పడకూడదనే విషయం ద్వారా మీరేమి గ్రహించారు?
జవాబు:
హనుమంతుడు లంకలో సీతను అన్వేషించాడు. ఎక్కడా కనిపించలేదు. నిరాశతో హనుమంతుడు ఆత్మహత్య చేసుకోవాలని ముందుగా అనుకొని తరువాత మనసు మార్చుకున్నాడు. ఆత్మహత్య కన్నా బతికి యుండటమే మంచిదని హనుమంతుడు నిశ్చయించుకున్నాడు.

ఈ సన్నివేశం ద్వారా ఆత్మహత్య ఎన్నటికీ మంచిదికాదనీ గ్రహించాను. మానవుడు ఆలోచనాపరుడు, వివేకవంతుడు. కష్టాలు వచ్చినప్పుడు ధైర్యంతో ఎదుర్కోవాలని, సమస్యలకు పరిష్కారాలను అన్వేషించాలని గ్రహించాను. కష్టాలకు, దుఃఖాలకు ఆత్మహత్యలు పరిష్కారం కాదని గ్రహించాను.

ప్రశ్న 5.
హనుమంతుడుపిల్లి ప్రమాణంలో తన శరీరాన్ని కుదించుకుని ఎడమకాలును పెట్టి లంకలో ప్రవేశించిన హనుమంతుని ప్రవర్తన ద్వారా మీరేమి గ్రహించారు?
జవాబు:
హనుమంతుడు సముద్రాన్ని దాటి లంకకు చేరాడు. పిల్లి ప్రమాణంలోకి తన శరీరాన్ని కుదించుకొని లంకలో ప్రవేశించాడు. ఎడమకాలిని ముందుగా లంకలో పెట్టి ప్రవేశించాడు.

దీని ద్వారా హనుమంతుని సమయస్ఫూర్తిని గుర్తించాను. పిల్లి అపశకునానికి ప్రతీక అని, ఎడమకాలు ముందుగా పెడితే ఆ ప్రాంతానికి అనర్థం కలుగుతుందని గ్రహించాను. హనుమంతుని రాక లంకా నగర వినాశనానికి కారణమైందని గ్రహించాను. శత్రువుల ప్రాంతంలోనికి వెళ్ళేముందు ఎడమకాలు ముందుగా పెట్టడం శ్రేష్ఠమని కూడా గ్రహించాను.

ప్రశ్న 6.
హనుమంతుడు రావణునితో “ఓయీ ! సీతను రామునికి అప్పగించు లేనిచో అనర్ధం తప్పదు” అని హెచ్చరించాడు. దీని ద్వారా మీరేమి గ్రహించారు?
జవాబు:
హనుమంతుడు అశోకవనాన్ని ధ్వంసం చేశాడు. చివరకు హనుమంతుడు రావణుని సమీపానికి వచ్చాడు. సీతను రామునికి అప్పగించి క్షేమంగా ఉండమని హెచ్చరించాడు. లేకపోతే అనర్హం కలుగుతుందని హెచ్చరించాడు.

ఈ హనుమంతుని మాటలనుబట్టి శ్రీరాముడు అమిత పరాక్రమవంతుడని, శ్రీరామునితో వైరం అన్ని విధాలుగా అనర్ధం కలుగుతుందని గ్రహించాను. రామదూతగా చక్కగా వ్యవహరించాడని కూడా గ్రహించాను. శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకుంటే యుద్ధాలు తప్పుతాయని కూడా గ్రహించాను.

విషయాత్మక ప్రశ్నలు

ఈ క్రింది ప్రశ్నకు నాలుగైదు వాక్యాలలో సమాధానం రాయండి.

ప్రశ్న 1.
హనుమంతుడు మొట్టమొదట చూసినప్పుడు సీతాదేవి ఎలా ఉంది?
జవాబు:
హనుమంతుడు లంకంతా వెదికాడు. సీత కనబడలేదు. శింశుపావృక్షం ఎక్కాడు. దానికింద మలినమైన వస్త్రాలతో సీత ఉంది. ఆమె కృశించి ఉంది. దీనావస్థలో ఉంది. ఆమె ఆభరణాలను బట్టి హనుమ ఆమెను సీతగా నిర్ధారించుకొన్నాడు.

వ్యాసరూప ప్రశ్నలు

ఈ క్రింది ప్రశ్నలకు 10 లేక 12 వాక్యాల్లో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
శ్రీరామ కార్యం నిమిత్తం హనుమంతుడు లంకకు యే విధంగా చేరాడు?
జవాబు:

  1. సుగ్రీవుని ఆజ్ఞమేరకు హనుమంతుడు మిగిలిన వానర వీరులతో దక్షిణ దిక్కుకు శ్రీరామ కార్యం నిమిత్తం బయలుదేరి సముద్రపు ఒడ్డుకు చేరాడు.
  2. జాంబవంతుడు, అంగదుడు మొదలగు వానర ప్రముఖుల ప్రోత్సాహంతో హనుమంతుడు సముద్ర లంఘనానికి పూనుకున్నాడు.
  3. హనుమంతుడు దేవతలందరికి నమస్కరించి తన శరీరాన్ని పెంచి, తోకను ఆకాశము పైకి రిక్కించి నడుం మీద చేతులు ఆనించి, గట్టిగా గర్జించి, పాదాలతో పర్వతాన్ని తొక్కి పైకి లంఘించాడు.
  4. హనుమంతుడు ఆ విధంగా సముద్రం మీద ఎగురుతుండగా సముద్ర గర్భంలోనున్న మైనాకుడు హనుమకు సాయం చేయాలన్న కోరికతో పైకి వచ్చి హనుమంతుని మార్గానికి అడ్డము వచ్చాడు.
  5. హనుమంతుడు మైనాకుణ్ణి చేతితో తాకి తన ప్రయాణాన్ని ముందుకు కొనసాగించాడు.
  6. హనుమంతుణ్ణి పరీక్షించాలని “సురస” అనే నాగమాత ప్రయత్నించి అతని సూక్ష్మబుద్ధిని మెచ్చుకుంది.
  7. “సింహిక” అనే రాక్షసి హనుమంతుణ్ణి మింగాలని చూసి అతని చేతిలో మరణించింది.
  8. హనుమంతుడు సముద్రాన్ని లంఘించి, లంకలో కాలుపెట్టాడు.
  9. రాత్రివేళ అన్వేషణకు అనువయిన సమయమని చీకటి పడేదాకా వేచియున్నాడు.
  10. చీకటి పడగానే లంకలో ప్రవేశించబోగా లంకిణి అడ్డగించింది.
  11. లంకిణిని ఒక దెబ్బతో నేలకూల్చాడు.
  12. లంకిణి హనుమంతుని చేతిలో ఓడింపబడి అతనికి దారి వదిలింది.
  13. ఈ విధంగా హనుమంతుడు సీత కొరకు అన్వేషించాలని లంకకు చేరాడు.

ప్రశ్న 2.
హనుమ సముద్రలంఘనం చేసిన విధానం వివరించండి.
జవాబు:
మహాబలవంతుడైన హనుమ, సముద్రం దాటడానికి ముందు దేవతలు అందరికీ నమస్కరించాడు. తన శరీరాన్ని పెంచాడు. పెద్దగా గర్జించాడు. చేతులు నడుముపై పెట్టాడు. అంగదాది వీరులతో తాను రామబాణంలా లంకకు వెడతానన్నాడు.

సముద్రం పై నుండి వెడుతున్న హనుమంతుడికి సాయం చేద్దామని సముద్రుడు అనుకున్నాడు. రామకార్యం మీద వెడుతున్న హనుమకు శ్రమ కలుగకూడదని, సముద్రంలోని మైనాకుణ్ణి సముద్రుడు బయటకు రమ్మన్నాడు. మైనాకుడి శిఖరాలపై హనుమ కొంచెం విశ్రాంతి తీసికొంటాడని సముద్రుడు అనుకున్నాడు.

మైనాకుడు పైకి లేచాడు. మైనాకుడు తనకు అడ్డు వస్తున్నాడని హనుమ అనుకొని, తన వక్షంతో అతడిని గెంటివేశాడు. మైనాకుడు మానవరూపంతో పర్వత శిఖరంపై నిలబడి, సముద్రుడి కోరికను హనుమకు చెప్పాడు. హనుమ, సంతోషించాడు. తనకు సమయం లేదని, చేతితో మైనాకుణ్ణి హనుమ తాకి వెళ్ళాడు.

తరువాత హనుమంతుడిని పరీక్షించడానికి సురస అనే నాగమాత వచ్చి, హనుమ సూక్ష్మబుద్ధిని మెచ్చుకొని, అతడిని ఆశీర్వదించింది. సింహిక అనే రాక్షసి, హనుమను మ్రింగాలని చూసింది. కాని హనుమంతుడు గోళ్ళతో సింహికను చీల్చివేశాడు.

ఇలా హనుమ నూరు యోజనాల సముద్రాన్ని దాటి లంకకు చేరాడు.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 4 కిష్కింధ కాండ

ప్రశ్న 3.
సీతాదేవిని హనుమంతుడు తొలిసారి సందర్శించినపుడు అతడు పొందిన ఆనందాన్ని విశ్లేషించండి.
జవాబు:
హనుమంతుడు సీతను వెతుకుతూ, రావణుడి అంతఃపురంలోకి వెళ్ళాడు. అక్కడ గొప్ప అందంతో ఉన్న రావణుడి భార్య మండోదరిని చూసి, సీత అని భ్రాంతిపడ్డాడు. తాను సీతను చూశానని హనుమ ఆనందంతో గంతులు వేశాడు. కొద్దిసేపటికే తన ఆలోచన తప్పు అనుకున్నాడు.

తరువాత హనుమ అశోకవనం అంతా, సీతకోసం వెతికాడు. శింశుపా వృక్షం ఎక్కాడు. ఆ చెట్టు క్రింద మాసిన బట్టలు కట్టుకొన్న ఒక స్త్రీని హనుమ చూశాడు. ఆమె చుట్టూ రాక్షస స్త్రీలు ఉన్నారు. ఆమె దీనావస్థలో ఉంది. ఆమె సీతయే అని, హనుమ అనుకున్నాడు.

అతడు ఆమె ధరించిన ఆభరణాలు చూశాడు. రాముడు చెప్పిన వాటితో అవి సరిపోయాయి. దానితో ఆమె సీతయే అని హనుమంతుడు గట్టిగా నిశ్చయించాడు.

సీతాదేవిని చూడగానే హనుమంతుడి కళ్ళ నుండి ఆనందభాష్పాలు జారాయి. శ్రీరాముడిని మనస్సులో స్మరించుకొని, హనుమంతుడు నమస్కరించాడు.

ప్రశ్న 4.
త్రిజటా స్వప్నం గురించి రాయండి.
జవాబు:
‘త్రిజట’ విభీషణుని కూతురు. రావణుడు సీతను అశోకవనంలో ఉంచి, రాక్షస స్త్రీలను ఆమెకు కాపలాగ పెట్టాడు. వారిలో ‘త్రిజట’ కూడ ఉంది. రావణుని భర్తగా అంగీకరించడానికి సీతను ఒప్పించమని రావణుడు రాక్షస స్త్రీలకు చెప్పాడు. రాక్షస స్త్రీలు సీతకు నచ్చచెప్పడానికి ప్రయత్నించారు. లేకపోతే చంపుతామని వారు సీతను బెదిరించారు. సీత ఎంతో ఏడ్చింది.

అంత వరకూ నిద్రపోతున్న త్రిజట లేచి తనకు కల వచ్చిందని అక్కడున్న రాక్షస స్త్రీలకు చెప్పింది. కలలో వేయి హంసల పల్లకిపై రామలక్ష్మణులు కనబడ్డారని, సీత తెల్లని పర్వతం మీద కూర్చుందనీ వారికి చెప్పింది. రావణుడు నూనె పూసిన శరీరంతో నేలపై పడి ఉన్నాడని, ఒక నల్లని స్త్రీ రావణుని మెడకు తాడు కట్టి దక్షిణం వైపు ఈడ్చుకువెడుతోందని కూడా చెప్పింది. రావణుడు పందిమీద దక్షిణ దిశగా వెళ్ళడం తాను కలలో చూశానని, లంకానగరం చిన్నాభిన్నం కావడం తాను చూశానని త్రిజట తోడి రాక్షస స్త్రీలకు చెప్పింది.

తనకు కలలో విమానం కనబడింది. కాబట్టి సీత కోరిక సిద్ధిస్తుందనీ, రావణుడికి వినాశం, రాముడికి జయం కలుగుతుందనీ త్రిజట చెప్పింది. త్రిజట ఉత్తమురాలు.

ప్రశ్న 5.
లంక దహనానికి అసలు కారకులెవరు? ఎలా? విశ్లేషించండి.
జవాబు:
హనుమంతుడు సీత జాడను తెలుసుకున్నాక, రావణుడి శక్తి సామర్థ్యాలు తెలుసుకోవాలనుకున్నాడు. అశోకవనాన్ని ధ్వంసం చేశాడు. రావణుడు పంపిన రాక్షస వీరులను అందరినీ హనుమ చంపాడు. చివరకు ఇంద్రజిత్తు హనుమను బ్రహ్మాస్త్రంతో బంధించి, రావణుడి వద్దకు తీసుకువెళ్ళాడు.

రావణుడు హనుమంతుడిని చంపమని ఆజ్ఞాపించాడు. దూతను చంపడం భావ్యం కాదని, ఇతర పద్ధతులలో దండింపవచ్చునని విభీషణుడు అన్న రావణునికి చెప్పాడు.

హనుమంతుడి తోకకు నిప్పు అంటించి, లంక అంతా తిప్పమని రాక్షసులకు రావణుడు చెప్పాడు. వారు బట్టలు హనుమంతుడి తోకకు చుట్టారు. దానిని నూనెతో తడిపారు. హనుమ తోకకు నిప్పు అంటించి, వారు లంక అంతా ఊరేగిస్తున్నారు. హనుమంతుడు ఒక్కసారిగా ఆకాశంలోకి ఎగిరాడు. విభీషణుడి భవనం తప్ప, లంకనంతా కాల్చాడు. ఈ విధంగా రాముడు సీతను చూసి రమ్మని హనుమంతుడిని పంపితే, హనుమ లంకను కాల్చి వచ్చాడు.

దీనినిబట్టి లంకను కాల్చడానికి అసలు కారకుడు రావణుడు అని మనకు తెలుస్తుంది. హనుమంతుడు రాముడి పరాక్రమాన్ని గుర్తుచేసి, సీతను రాముడి వద్దకు పంపమని రావణుడికి చెప్పడానికే వెళ్ళాడు. కాని రావణుడు, తెలివి తక్కువగా హనుమ తోకకు నిప్పు పెట్టించాడు. కాబట్టి లంకా దహనానికి రావణుడే అసలు కారకుడు.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 4 కిష్కింధ కాండ

ప్రశ్న 6.
హనుమంతుడు లంకలో ప్రవేశించి సీతను చూసి మాట్లాడిన వృత్తాంతాన్ని తెలపండి.
జవాబు:
హనుమంతుడు దేవతలకు నమస్కరించాడు. తన శరీరాన్ని పెంచాడు. పెద్ద ధ్వని చేస్తూ, చేతులను నడుం మీద ఉంచి, తోకను విదల్చాడు. సీతను చూసి వస్తానని, అంతరిక్షంలోకి ఎగిరాడు. హనుమ సముద్రంపై వెడుతుండగా, సముద్రుడు హనుమకు సాయం చేద్దామని తనలో దాగిన మైనాకుణ్ణి పైకి రమ్మన్నాడు. హనుమ ఆ గిరిశిఖరాలపై విశ్రాంతి తీసికొంటాడని సాగరుడు అనుకున్నాడు. పైకి లేచిన మైనాకుణ్ణి చూసి తనకు అడ్డంగా ఉన్నాడని, హనుమ తన వక్షస్థలంతో నెట్టివేశాడు. మైనాకుడు మనిషి రూపంలో గిరి శిఖరంపై నిలిచి, సముద్రుడి కోరికను హనుమకు తెలిపాడు. హనుమ తనకు మధ్యలో ఆగడం కుదరదని, మైనాకుని చేతితో తాకి ముందుకు సాగాడు.

హనుమను పరీక్షించాలని ‘సురస’ అనే నాగమాత యత్నించి హనుమ సూక్ష్మబుద్దిని మెచ్చుకుంది. ‘సింహిక’ అనే రాక్షసి హనుమను మింగాలని చూసి, తానే హనుమ చేతిలో మరణించింది. హనుమ లంకను చూశాడు. రాత్రి కాగానే పిల్లి ప్రమాణంలో తన శరీరాన్ని తగ్గించుకొని, లంకలో ప్రవేశించాడు. లంకాధిదేవత (లంకిణి) లంకలోకి వెళ్ళడానికి హనుమంతుని అడ్డగించింది. హనుమ లంకను చూసి వస్తానన్నాడు. లంకిణి హనుమను అరచేతితో కొట్టింది. హనుమ లంకిణిని ఒక్క దెబ్బ వేశాడు. లంకిణి కూలిపోయింది. వానరుడు వచ్చి లంకిణిని జయించినపుడు రాక్షసులకు కీడు కల్గుతుందని బ్రహ్మ చెప్పాడని హనుమకు లంకిణి చెప్పింది. హనుమను లంకలోకి వెళ్ళమంది.

హనుమ ప్రాకారం నుండి లంకలోకి దూకాడు. లంకలో ఎడమపాదం పెట్టాడు. హనుమ లంకలో రాక్షస భవనాలన్నీ వెదికాడు. రావణుని భార్య మండోదరిని చూసి సీత అని భ్రమపడ్డాడు. తరువాత ఆమె సీత కాదని నిశ్చయించాడు. చివరకు సీత చనిపోయి ఉంటుందని అనుకున్నాడు. హనుమ తాను కూడా మరణిద్దాం అనుకున్నాడు. చివరకు బతికి ఉంటే శుభాలు పొందవచ్చుననుకున్నాడు.

హనుమ అశోకవనంలోకి వెళ్ళాడు. సీతారాములకు నమస్కరించాడు. హనుమ ఆ వనంలో శింశుపావృక్షం ఎక్కాడు. దానికింద మలిన వస్త్రాలు ధరించిన ఒక స్త్రీని చూశాడు. ఆమె సీత అయి ఉంటుందని నిశ్చయించాడు. హనుమ చెట్టుమీదే ఉన్నాడు. తెల్లవారుతోంది. రావణుడు వచ్చి, సీత మనస్సును మార్చబోయాడు. సీత లొంగలేదు. రావణుడు సీతకు రెండు నెలలు గడువు ఇచ్చి, సీతను తన దారికి తెమ్మని రాక్షస స్త్రీలకు చెప్పాడు. రావణుడు వెళ్ళిపోయాక, రాక్షస స్త్రీలు సీత మనస్సు మార్చడానికి యత్నించారు. సీత రాముడిని విడిచి ఉండలేక చనిపోదామనుకుంది.

విభీషణుడి కూతురు త్రిజట నిద్ర నుండి లేచింది. త్రిజట తనకు కల వచ్చిందనీ ఆ కలలో వేయి హంసల పల్లకిలో రాముడూ, తెల్లని పర్వతంపై సీత కనబడ్డారని, రావణుడు నూనె పూసిన శరీరంతో నేలపై పడి ఉన్నాడని లంక చిన్నాభిన్నం అయ్యిందని, రాముడికి జయం కల్గుతుందని చెప్పింది.

సీతకు శుభశకునాలు కనబడ్డాయి. హనుమంతుడు రామకథను గానం చేశాడు. సీత చెట్టు మీద హనుమను చూసి ఆశ్చర్యపడింది. హనుమ చెట్టుదిగి, ఆ స్త్రీని “నీ వెవరవు ? నీవు సీతవైతే నీకు శుభం అవుతుంది” అన్నాడు. తన పేరు సీత అని, ఆ స్త్రీ చెప్పింది. హనుమ తాను శ్రీరామ దూతనని చెప్పాడు. హనుమను చూసి సీత మొదట రాక్షసుడు అనుకుంది. రామదూతవయితే రాముణ్ణి గురించి చెప్పు అన్నది. హనుమ రాముని రూపాన్ని వర్ణించాడు. రాముడిచ్చిన అంగుళీయకాన్ని సీత గుర్తుగా ఇచ్చాడు.

రాముణ్ణి త్వరగా లంకకు తీసుకురమ్మని హనుమకు సీతమ్మ చెప్పింది. వెంటనే సీతను రాముని వద్దకు తీసుకు వెడతాననీ, తన వీపుపై కూర్చోమనీ, హనుమ చెప్పాడు. అందుకు సీత నిరాకరించింది. తాను పరపురుషుడిని తాకననీ, రాముడు రావణుని చంపి నన్ను తీసుకువెళ్ళడం ధర్మం అనీ చెప్పింది. హనుమంతుడు రాముడు గుర్తించే ఆనవాలును ఇమ్మని సీతను అడిగాడు. సీత కాకాసురుని కథ చెప్పింది. ఆమె తన దివ్య చూడామణిని హనుమకు ఇచ్చింది. ఈ విధంగా హనుమ లంకలో సీతను కలిసి వెళ్ళాడు.

ప్రశ్న 7.
సీతాన్వేషణ వృత్తాంతం రాయండి.
(లేదా)
హనుమ లంకను కాల్చి వచ్చి, సీత జాడను రామునికి నివేదించిన వృత్తాంతాన్ని వివరించండి.
జవాబు:
సీతాదేవిని దర్శించడంతో హనుమకు ఒక ముఖ్యకార్యం పూర్తి అయ్యింది. రావణుడి శక్తిసామర్థ్యాలు హనుమ తెలుసుకుందామనుకున్నాడు. అశోకవనాన్ని ధ్వంసం చేశాడు. అశోక వన ధ్వంసం గురించి రాక్షస స్త్రీలు, రావణునకు చెప్పారు. రావణుడు ఎనభైవేల మంది రాక్షసులను పంపాడు. హనుమ వాళ్ళను చంపాడు. రావణుడు పంపిన జంబుమాలిని, ఏడుగురు మంత్రి పుత్రులను, ఐదుగురు సేనాపతులను, అక్షకుమారుణ్ణి హనుమ చంపాడు. చివరకు రావణుడు తన కుమారుణ్ణి ఇంద్రజిత్తును పంపాడు. ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రంతో హనుమను బంధించాడు. అది హనుమపై స్వల్పకాలమే పని చేసింది.

రాక్షసులు హనుమను రావణుని ముందు ప్రవేశపెట్టారు. హనుమ తాను రామదూతనని చెప్పి, రాముని పరాక్రమాన్ని చాటాడు. దూతను చంపడం తగదని రావణుని తమ్ముడు విభీషణుడు చెప్పడంతో, రావణుడు హనుమంతుని తోకకు నిప్పంటించి లంకలో తిప్పమన్నాడు. రాక్షసులు రావణుని తోకకు బట్టలు చుట్టి, నూనెతో తడిపి, నిప్పు ముట్టించి ” లంకానగరంలో ఊరేగించారు. హనుమ ఆకాశంలోకి ఎగిరి, విభీషణుని భవనం తప్పించి, మిగిలిన లంకంతా తగులబెట్టాడు.

తరువాత హనుమ లంకను అంటించి తాను తప్పు చేశానని, సీతామాత ఆ మంటలలో కాలిపోయిందేమో అని, సందేహించాడు. తన తోకను కాల్చని అగ్ని, సీతను దహింపదని చివరకు ధైర్యం తెచ్చుకున్నాడు. సీత క్షేమంగా ఉందని చారణుల ద్వారా తెలుసుకొని సంతోషించాడు. హనుమ సీత వద్దకు వెళ్ళి ఆమెను నమస్కరించి తిరుగు ప్రయాణం అయ్యాడు.

హనుమ ‘అరిష్టం’ అనే పర్వతాన్నుండి ఆకాశంలోకి ఎగిరాడు. మహేంద్రగిరికి చేరుతూ మహానాదం చేశాడు. జాంబవంతుడు ఆ ధ్వనిని విని హనుమ విజయం సాధించి వస్తున్నాడని వానరులకు చెప్పాడు.

హనుమ మహేంద్రగిరి చేరాడు. పెద్దలకు నమస్కరించాడు. ‘చూశాను సీతమ్మను’ అని చెప్పాడు. ప్రయాణ విషయాలు వారికి చెప్పాడు. అంగదుడు లంకకు వెళ్ళి, రావణుని చంపి సీతను తీసుకొని వచ్చి రాముని వద్దకు వెడదాం అన్నాడు. జాంబవంతుడు, అది సరికాదన్నాడు. రామసుగ్రీవులు సీతమ్మను చూసి రమ్మన్నారు. రాముడు రావణుని సంహరిస్తానని ప్రతిజ్ఞ చేశాడు. రామునికి విషయం తెలుపుదాం అన్నాడు.

దారిలో మధువనాన్ని వానరులు ధ్వంసం చేశారు. మధువనాన్ని రక్షిస్తున్న దధిముఖుడు, వానరుల చేతిలో దెబ్బతిని, ఆ విషయం సుగ్రీవుడికి చెప్పాడు. సుగ్రీవుడు ఇదంతా శుభసూచకంగా భావించాడు. అంగద హనుమదాదులు సుగ్రీవుల దగ్గరకు వెళ్ళారు. హనుమ, రాముడికి నమస్కరించి ‘చూశాను సీతమ్మను’ అని చెప్పి, సీత ఇచ్చిన చూడామణిని రాముడికి ఇచ్చి సీతాన్వేషణ వృత్తాంతాన్ని రామునకు వివరించాడు.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 4 కిష్కింధ కాండ

ప్రశ్న 8.
లంకా దహనం వర్ణించండి.
జవాబు:
సీతాదేవి దర్శనంతో ప్రధాన కార్యం ముగిసింది హనుమంతునికి. రావణుడు, అతని సైన్యపు. శక్తి సామర్థ్యాలను కూడా తెలుసుకోవాలనిపించింది. అందుకు అశోకవనాన్ని ధ్వంసం చేయడమే మార్గంగా భావించాడు. అనుకున్నంతా చేశాడు. ఆ కపివీరుడు. రాక్షస స్త్రీలు పరుగుపరుగున వెళ్ళి లంకేశునికీ విషయం చెప్పారు. రావణుడు ఎనభై వేల మంది రాక్షసులను ఈ పంపాడు. హనుమంతుడు వాళ్ళను మట్టుపెట్టాడు. తనపైకి వచ్చిన జంబుమాలిని, మంత్రిపుత్రులేడుగురిని రావణుడి సేనాపతులైదుగురిని, అక్షకుమారుణ్ణి అంతమొందించాడు. చివరకు ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి హనుమంతుణ్ణి బంధించాడు. బ్రహ్మవరంచేత అది హనుమంతునిమీద క్షణకాలమే పనిచేస్తుంది. అయినా తాను దానికి కట్టుబడి ఉన్నట్లు నటించాడు హనుమంతుడు. రావణుని ముందు ప్రవేశపెట్టారతన్ని. రావణుడడుగగా తాను రామదూతనని చెప్పాడు. శ్రీరాముని పరాక్రమమెలాంటిదో సభాముఖంగా చాటాడు. సహించలేని రావణుడు హనుమంతుణ్ణి చంపమని ఆజ్ఞ ఇచ్చాడు. దూతను చంపడం భావ్యం కాదన్నాడు విభీషణుడు. ఇతర పద్ధతుల్లో దూతను దండించవచ్చునన్నాడు.

హనుమంతుని తోకకు నిప్పంటించి లంకంతా కలయ దిప్పమన్నాడు రావణుడు. బట్టలతో హనుమంతుని తోకను చుట్టారు. నూనెతో తడిపారు. తోకకు నిప్పు పెట్టి ఊరంతా ఊరేగిస్తున్నారు. హనుమంతుడు ఒక్కసారిగా ఆకాశంలోకి ఎగిరాడు. విభీషణుని భవనం తప్ప లంకంతా నిప్పుపెట్టాడు. అందుకే ‘(సీతను) చూసిరమ్మంటే (లంకను) కాల్చివచ్చాడని’ సామెత
పుట్టింది. లంకలో హాహాకారాలు మిన్నుముట్టాయి.

AP SSC 10th Class Telugu Solutions Chapter 7 మా ప్రయత్నం

AP State Board Syllabus AP SSC 10th Class Telugu Solutions 7th Lesson మా ప్రయత్నం Textbook Questions and Answers.

AP State Syllabus SSC 10th Class Telugu Solutions 7th Lesson మా ప్రయత్నం

10th Class Telugu 7th Lesson మా ప్రయత్నం Textbook Questions and Answers

ఉన్ముఖీకరణ : చదవండి – ఆలోచించి చెప్పండి

ఈ శతాబ్ది నాదే అని సగర్వంగా ప్రకటించుకున్న మహాకవి శ్రీశ్రీ. వారి మహాప్రస్థానం ఆధునిక తెలుగు సాహిత్యంలో దీపస్తంభంగా నిలబడింది. అటువంటి ప్రసిద్ధ కవితాసంపుటికి ప్రఖ్యాత రచయిత చలం ‘యోగ్యతాపత్రం’ అనే పేరుతో గొప్ప ముందుమాట రాశాడు. ఆ పీఠికలోని ప్రతి వాక్యం సాహితీ అభిమానుల నాలుకల మీద నాట్యం చేసింది. అందులోని కొన్ని వాక్యాలను చూడండి!

“తన కవిత్వానికి ముందుమాట రాయమని శ్రీశ్రీ అడిగితే,
కవిత్వాన్ని తూచే రాళ్ళు తన దగ్గర లేవన్నాడు చలం.”
“నెత్తురూ, కన్నీళ్ళూ కలిపి కొత్త టానిక్ తయారుచేశాడు
శ్రీశ్రీ ఈ వృద్ధ ప్రపంచానికి.”

ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
పై పేరా ఏ విషయాన్ని గురించి తెలియజేస్తుంది?
జవాబు:
శ్రీశ్రీ రచించిన మహాప్రస్థానం పీఠిక (ముందుమాట) గురించి పై పేరా తెలియజేస్తోంది.

ప్రశ్న 2.
శ్రీశ్రీ పుస్తకానికి ఎవరు ‘ముందుమాట’ రాశారు?
జవాబు:
శ్రీశ్రీ పుస్తకానికి చలం ‘ముందుమాట’ ను రాశారు.

AP SSC 10th Class Telugu Solutions Chapter 7 మా ప్రయత్నం

ప్రశ్న 3.
ముందుమాట ఎందుకు రాస్తారు?
జవాబు:
ఒక పుస్తకంలోని విషయాన్ని సమీక్షిస్తూ ముందుమాట రాస్తారు. ఆ పుస్తకంలోని మంచి, చెడులను గూర్చి ముందుమాట రాస్తారు. పుస్తకంలోని కీలకమైన విషయాలను, ఆశయాలను, తాత్వికతను తెలియజేయడానికి ముందుమాట రాస్తారు.

ప్రశ్న 4.
‘చలం’ శ్రీ శ్రీ గురించి రాసిన వాక్యాలు చదివారు కదా ! దీన్నిబట్టి శ్రీశ్రీ కవిత్వం ఎలా ఉంటుందని భావిస్తున్నారు?
జవాబు:
శ్రీశ్రీ కవిత్వాన్ని ఎవరూ తూచలేరు. శ్రీశ్రీ కవిత్వం చాలా ఉన్నతమైనది. బరువైన భావాలతో ఉంటుంది. విప్లవాత్మకమైనది. దానిలో పీడితులు, అనాథలు, దోపిడీకి గురౌతున్నవారి బాధలు, కన్నీళ్ళు ఉంటాయి. కర్షక, కార్మిక వీరుల కష్టాలు ఉంటాయి. ప్రపంచంలో దగాపడినవారి గాథలు ఉంటాయి. శ్రామిక వర్గపు పోరాటాలు, బాధలు, కన్నీళ్ళు ఉంటాయి.

ఇవి చేయండి

I. అవగాహన – ప్రతిస్పందన

1. పాఠం ఆధారంగా కింది అంశాలపై మాట్లాడండి.
అ) ఇరవయ్యో శతాబ్దాన్ని స్త్రీల శతాబ్దంగా గుర్తించవచ్చా? చర్చించండి.
జవాబు:
ఇరవయ్యో శతాబ్దాన్ని స్త్రీలు ప్రభావితం చేశారు. అందుచేత ఇరవయ్యో శతాబ్దాన్ని స్త్రీల శతాబ్దంగా గుర్తించవచ్చును.

ప్రపంచ వ్యాప్తంగా ఇరవయ్యో శతాబ్దంలో స్త్రీలు విద్యా, వైజ్ఞానిక, సాంస్కృతిక, రాజకీయాది రంగాలలో ప్రధాన పాత్ర వహించారు.

లుక్రేటియా మాట్, ఎలిజిబెత్ కేడీ స్టాండన్ అనే ఇద్దరు మహిళలు కలిసి 1848లో న్యూయార్క్ లో ‘స్త్రీల స్వాతంత్ర్య ప్రకటన’ రూపొందించారు.

1850లో లూసీస్టోన్ అనే మహిళ ‘జాతీయ స్త్రీల హక్కులు’ రూపొందించారు.

భారతదేశంలో రాజారామమోహనరాయ్ ‘సతీసహగమనానికి వ్యతిరేకంగా పోరాడి విజయం సాధించాడు. మహాత్మాగాంధీ స్త్రీల అక్షరాస్యత, హక్కుల గురించి పోరాడాడు. 20వ శతాబ్దంలో ఎంతోమంది స్త్రీలు ఉపాధ్యాయినులు, నర్సులు, గుమస్తాలు, ఎయిర్ హోస్టెస్టు మొదలైన ఉద్యోగాలలో చేరారు.

మేరీక్యూరీ రేడియం, పొలోనియంలపై పరిశోధనలు చేసింది. ఆమె మొట్టమొదటి నోబెల్ బహుమతిని పొందిన మహిళ. రెండుసార్లు నోబెల్ బహుమతి పొందిన శాస్త్రవేత్తగా 20వ శతాబ్దపు చరిత్రలో ప్రథమస్థానంలో నిలిచింది.

మార్గరెట్ శాంగర్ కుటుంబ నియంత్రణ ఉద్యమం నడిపింది. స్త్రీలకు కుటుంబ నియంత్రణపై అవగాహన కలిగించింది. స్త్రీ, శిశు సంక్షేమానికి కృషి చేసింది.

భారతదేశాన్ని 15 సంవత్సరాలు ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించిన ఇందిరాగాంధీ ప్రపంచంలో 2వ మహిళా . ప్రధాని. తొలి మహిళా ప్రధాని సిరిమావో భండారు నాయకే (శ్రీలంక).

ఈ విధంగా అనేకమంది మహిళామణులు 20వ శతాబ్దాన్ని తమదిగా చేసుకొని చరిత్ర పుటలలో సువర్ణాక్షరాలతో లిఖించబడ్డారు.

ఆ) మహిళా దినోత్సవం సందర్భంగా పాఠశాలలో కింది వాటిలో ఏ అంశంపై ఏమేం మాట్లాడతారు?
1) బాలికా విద్య – ఆవశ్యకత
2) నీకు నచ్చిన మహిళ – గుణగణాలు
3) మహిళల సాధికారత – స్వావలంబన
4) పురుషులతో దీటుగా మహిళల ప్రగతి నిజమేనా?
జవాబు:
1) బాలికా విద్య – ఆవశ్యకత
“ఒక తల్లి విద్యావంతురాలైతే ఆ కుటుంబమంతా విద్య నేర్చుకొంటుంది” అన్నారు విజ్ఞులు.

బాలికలు విద్య నేర్చుకొంటే సమాజానికి చాలా మంచిది. ఎందుకంటే సమాజంలో కుల, మతాలతో పనిలేకుండా వివక్షకు గురయ్యేది స్త్రీ. ఎటువంటి దురాచారానికైనా మొదట బలి అయ్యేది స్త్రీయే. సంసారానికి దిక్సూచి స్త్రీయే. అటువంటి స్త్రీ విద్యావంతురాలైతే ఆమె తనకు జరిగే అన్యాయాన్ని ప్రతిఘటిస్తుంది. తన కుటుంబానికి, తనకు న్యాయం చేసుకొంటుంది. అందుచేత బాలికా విద్య ప్రోత్సహించ తగినది. బాలికా విద్య సంఘ సంస్కరణకు తొలిమెట్టు. “ముదితల్ నేర్వగరాని విద్యగలదే ముద్దార నేర్పించినన్” అన్నట్లుగా స్త్రీలకు విద్య నేర్పితే ఎంతటి ఉన్నత స్థానాలనైనా అధిరోహించ
గలుగుతారు.

2) నీకు నచ్చిన మహిళ – గుణగణాలు

కస్తూరిబా గాంధీ :
11 ఏప్రిల్ 1869లో పోర్బందర్ లో జన్మించింది. గోకుల్ దాస్, విరాజ్ కున్వెర్బా కపాడియా దంపతులకు జన్మించింది. 1882లో మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీ (మహాత్మాగాంధీ) తో వివాహమయ్యింది.

1897లో భర్తతో కలసి దక్షిణాఫ్రికాకు వెళ్ళింది. అక్కడ తన భర్తతో అనేక ఉద్యమాలలో పాల్గొంది. జైలుకు వెళ్ళింది. భారతదేశం వచ్చాక, భర్తతో కలసి భారత స్వాతంత్ర్య సమరంలో పాల్గొంది. ఇక్కడ కూడా అనేకసార్లు జైలుకు వెళ్ళింది. ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. విశ్రాంతి తీసుకోమని వైద్యులు చెప్పినా వినలేదు. భరతమాత దాస్యశృంఖలాలను ట్రెంచడానికి తన కృషి మానలేదు. దేశ ప్రజలను చైతన్యవంతులను చేసింది. దేశం కోసం అహర్నిశలూ కృషి చేసింది. క్విట్ ఇండియా ఉద్యమంలో అరెస్టయ్యింది. ఆరోగ్యం ఇంకా క్షీణించింది. గుండె నొప్పి వచ్చింది. అయినా దేశసేవ మానలేదు. విశ్రాంతి తీసుకోలేదు. మాతృదేశ సేవలో చివరి నిమిషం వరకూ గడిపింది. 22-2-1944లో తుదిశ్వాస విడిచింది. భరతమాత ముద్దులపట్టిగా చరిత్రలో లిఖించబడిన నారీమణి కస్తూరిబా గాంధీ.
(సూచన : గ్రంథాలయం నుండి వివరాలు సేకరించి విద్యార్థులు తలొకరి గురించి మాట్లాడాలి.)

3) మహిళల సాధికారత – స్వావలంబన
మహిళలకు సాధికారత చదువు వలన మాత్రమే వస్తుంది. మహిళలకు సాధికారత వచ్చినట్లైతే దేశం పురోగమిస్తుంది. మహిళలకు విద్యా, ఉద్యోగ, ఆస్తి హక్కులను ప్రాథమిక హక్కులలో చేర్చాలి. స్వావలంబన అంటే తమకు తామే అభివృద్ధి చెందడం. తమ కాళ్ళపై తాము నిలబడడం. ప్రభుత్వం స్త్రీలకు విద్యా ప్రోత్సాహకాలు కల్పించాలి. వారి స్వావలంబనకు వడ్డీలు లేని ఋణాలు మంజూరు చేయాలి. ఆర్థికంగా పుంజుకొనే అవకాశం కల్పించాలి. రాజకీయ పదవులలో ఎక్కువగా మహిళలను నిలపాలి. మహిళలకు సాధికారత, స్వావలంబన కల్పిస్తే, ప్రపంచ దేశాలలో భారత్ అగ్రగామి అవుతుంది. అవినీతి అంతమవుతుంది.

4) పురుషులతో దీటుగా మహిళల ప్రగతి నిజమేనా?
పురుషులతో దీటుగా మహిళల ప్రగతి కొంతవరకే నిజం. విద్యారంగంలో మహిళలు, మగవారికి దీటుగానే కాదు, అధిగమించి తమ ఆధిక్యతను చాటుకొంటున్నారు. క్రీడలలో కూడా మగవారితో దీటుగా ఉంటున్నారు. ఉద్యోగాలలో కూడా మగవారికి దీటుగానే ఉంటున్నారు. కాని, ఎంత ప్రగతిని సాధించినా, ఎంత దీటుగా నిలబడినా మగవారి పెత్తనం తప్పదు. ఒక మహిళ పదవిని చేపట్టినా, ఆమె భర్త, అన్న, తండ్రి, కొడుకు ఎవరో ఒకరు పెత్తనం చెలాయిస్తారు. రాజకీయంగా ఒక మహిళ సర్పంచ్ గా ఎన్నికైనా పెత్తనం ఆమెది కాదు. ఆమె ఇంటి మగవారిదే. ఆమె అలంకార ప్రాయంగానే మిగిలిపోతోంది. పల్లెటూళ్ళలో ఇది మరీ ఎక్కువ.
ఈ విధానం మారినపుడే మహిళల ప్రగతి నిజమైన ప్రగతి అవుతుంది. లేకపోతే అదంతా బూటకపు ప్రగతే.

2. ఈ కింది వాక్యాలు పాఠ్యాంశంలో ఎక్కడ వచ్చాయో గుర్తించి వాటి సందర్భాల్ని వివరించండి.

అ) సంప్రదాయ చరిత్రకారులు స్త్రీలను చరిత్రలో అక్కడక్కడా పౌడర్ అద్దినట్లు అద్దుతుంటారు.
జవాబు:
పరిచయం :
ఈ వాక్యం ఓల్గా, వసంత కన్నబిరాన్, కల్పన కన్నబిరాన్లు రచించిన ‘మహిళావరణం’ గ్రంథం ‘ముందుమాట’ నుండి గ్రహింపబడిన “మా ప్రయత్నం” పాఠంలోనిది.

సందర్భం :
ఉద్యమాలు, చరిత్రలలో స్త్రీల పాత్ర గురించి రచయిత్రులు వివరిస్తున్న సందర్భంలోని వాక్యమిది.

భావం:
చరిత్రకారులు స్త్రీలను చరిత్రలో అక్కడక్కడ అలంకారానికి మాత్రమే రాశారు తప్ప, స్త్రీల గురించి పూర్తిగా రాయలేదు.

ఆ) ఊహలకూ, ఆలోచనలకూ లేని పరిమితులు పనిలో ఉన్నాయి.
జవాబు:
పరిచయం :
ఈ వాక్యం ఓల్గా, వసంత కన్నబిరాన్, కల్పన కన్నబిరాన్లు రచించిన ‘మహిళావరణం’ గ్రంథం ‘ముందుమాట’ నుండి గ్రహింపబడిన “మా ప్రయత్నం” పాఠంలోనిది.

సందర్భం :
రచయిత్రులు ‘మహిళావరణం’ పుస్తక రచనలో ఏర్పడిన ఇబ్బందులను వివరిస్తున్న సందర్భంలోని వాక్యమిది.

భావం:
సమాజంలో ప్రతిదాన్నీ మార్చటానికి సమాయత్తమైన స్త్రీల సమూహం ఇచ్చిన ప్రేరణ కలిగించిన ఊహలను, ఆలోచనలను పుస్తక రూపంలోకి తేవడంలో అనేక కారణాలు పరిమితులను ఏర్పరచాయి.

ఇ) శాల్యూట్లన్నీ హీరోలకే, హీరోయిన్లు ఆ తర్వాతే… ఇదీ మన సమాజ విధానం.
జవాబు:
పరిచయం:
ఈ వాక్యం ఓల్గా, వసంత కన్నబిరాన్, కల్పన కన్నబిరాన్లు రచించిన ‘మహిళావరణం’ గ్రంథం ‘ముందుమాట’ నుండి గ్రహింపబడిన “మా ప్రయత్నం” పాఠంలోనిది.

సందర్భం :
రచయిత్రులు షావుకారు జానకి గారిని ఇంటర్వ్యూ చేసినపుడు ఆమె పలికిన వాక్యమిది.

భావం:
సినిమాలలో నటించిన హీరోలకిచ్చిన ప్రాధాన్యం, గౌరవం హీరోయిన్లకివ్వదు సమాజం.

AP SSC 10th Class Telugu Solutions Chapter 7 మా ప్రయత్నం

3. కింది గద్యం చదవండి. ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

50వ దశకపు రెండవ భాగం నుంచీ డెబ్బయవ దశాబ్దం వరకూ రచయిత్రులు ఒక వెల్లువలా తెలుగు సాహిత్యాన్ని ముంచెత్తారు. ఆచంట శారదాదేవి, ఇల్లిందల సరస్వతీదేవి, మాలతీ చందూర్, లత, శ్రీదేవి, వాసిరెడ్డి సీతాదేవి, రంగనాయకమ్మ, ద్వివేదుల విశాలాక్షి, యద్దనపూడి సులోచనారాణి, ఆనందారామం , డి. కామేశ్వరి, బీనాదేవి మొదలైన రచయిత్రుల పేర్లు ఇంటింటా వినిపించే పేర్లయ్యాయి. రచయిత్రుల నవలలతో నవలా సాహిత్యానికి తెలుగులో విస్తృతమైన మార్కెట్ ఏర్పడింది. రచయితలు ఆడవారి పేర్లతో తమ రచనలను ప్రచురించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. 1980వ దశకం తెలుగు సాహిత్యంలో స్త్రీల దశాబ్దంగా చెప్పవచ్చు. నవలా సాహిత్యంలో అరవయ్యవ దశాబ్దంలో తిరుగులేని స్థానం సంపాదించుకున్న రచయిత్రులు 80వ దశాబ్దంలో కవిత్వంలో, కథలలో తమ ముద్ర వేశారు. అంతవరకు కవిత్వం తమదనుకునే పురుషుల భ్రమలను బద్దలు కొట్టారు. కవిత్వం రాయడమేకాదు – అంతవరకు కవిత్వంలోకి రాని స్త్రీల అణచివేతలోని పలు కోణాలను తమ కవితావస్తువుగా స్వీకరించారు.

అ) తెలుగు సాహిత్యంలో రచయిత్రులు ఏ కాలంలో వెల్లువలా వచ్చారు?
జవాబు:
50వ దశకపు రెండవ భాగం నుంచీ డెబ్బెవ దశాబ్దం వరకూ రచయిత్రులు తెలుగు సాహిత్యంలో వెల్లువలా తెలుగు
సాహిత్యాన్ని ముంచెత్తారు.

ఆ) 80 వ దశకం స్త్రీల దశాబ్దమని ఎలా చెప్పగలవు?
జవాబు:
80వ దశకంలో స్త్రీలు నవలా సాహిత్యంతో బాటు కవిత్వం, కథలలో కూడా తమ ముద్ర వేశారు. స్త్రీల అణచివేతలోని పలుకోణాలను తమ కవితా వస్తువుగా స్వీకరించారు. అంతవరకు కవిత్వం తమదనుకొనే పురుషుల భ్రమలను బద్దలు కొట్టారు. కనుక 80వ దశకం స్త్రీల దశాబ్దమని చెప్పవచ్చును.

ఇ) స్త్రీవాద కవయిత్రులు సాధించిన విజయాలు ఏమిటి?
జవాబు:
‘నీలిమేఘాలు’ రెండవ ఉత్తమ స్త్రీ వాద కవితా సంకలన ప్రచురణ, ఓల్గా రచనలు, అనేకమంది స్త్రీవాద రచయిత్రుల ప్రవేశం మొదలైనవి స్త్రీవాద కవయిత్రులు సాధించిన విజయాలు.

ఈ) స్త్రీవాద సాహిత్యంలో ఏ వస్తువులు ప్రాధాన్యం వహించాయి?
జవాబు:
స్త్రీల శరీర రాజకీయాలు, కుటుంబ అణచివేత ప్రాధాన్యం వహించాయి.

ఉ) పై పేరాకు అర్థవంతమైన శీర్షికను పెట్టండి.
జవాబు:
రచయిత్రులు – కవయిత్రులు, స్త్రీవాదం, స్త్రీల దశాబ్దం.

సూచన : పై మూడింటిలో ఏదైనా శీర్షికగా పెట్టవచ్చును. పై పేరాలో ప్రధినంగా చర్చించిన విషయానికి సరిపోయే విధంగా ఏ శీర్షికమైనా పెట్టవచ్చును. ప్రతి విద్యార్థి వేరు వేరు శీర్షికలు పెట్టేలాగా ప్రోత్సహించాలి)

4. పాఠం ఆధారంగా కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

అ) సంపాదకులు మహిళావరణం పుస్తకాన్ని ఎందుకు తీసుకురావాలనుకున్నారు?
జవాబు:
గత శతాబ్దపు చరిత్ర నిర్మాతలుగా స్త్రీలది తిరుగులేని స్థానమని రచయిత్రులకు అనిపించింది. ఐతే దానిని సాధికారికంగా, సోదాహరణంగా నిరూపించటానికి ఎంతో అధ్యయనం అవసరం. ఎంతో సమయం కూడా పడుతుంది. అంతకంటే ముందుగా ఈ శతాబ్దంలో భిన్న రంగాలలో కీలక స్థానాలలో కీలక సమయాలలో పనిచేసి, అక్కడ తమ ముద్ర వేసిన వందమంది స్త్రీల ఫోటోలతో, వారి సమాచారంతో ఒక పుస్తకం తీసుకురావాలని రచయిత్రులు భావించారు. అదే ‘మహిళావరణం’.

ఆ) మహిళావరణం రచయిత్రులు ఏఏ రంగాలకు చెందిన స్త్రీల వివరాలు సేకరించాలనుకున్నారు.
జవాబు:
మొదటిసారి చదువుకొన్న స్త్రీలు, మొదటగా వితంతు వివాహం చేసుకొనే సాహసం చేసిన స్త్రీలు, స్త్రీ విద్య కోసం ఉద్యమించిన స్త్రీలు, ఉద్యమాలలో చేరి జైలుకు వెళ్ళేందుకు తెగించిన స్త్రీలు, నాటకం, సినిమా, రేడియో వంటి రంగాలలోకి తొలిసారి అడుగిడిన స్త్రీలు, మొదటి తరం డాక్టర్లు, శాస్త్రవేత్తలు, సంగీతకారులు, నృత్య కళాకారిణులు, విద్యాధికులు
మొదలైన స్త్రీల వివరాలు సేకరించి మహిళావరణం పుస్తకంలో పొందుపరచాలని రచయిత్రులు భావించారు.

ఇ) మహోన్నతులైన స్త్రీల విశేషాలు సేకరిస్తున్న సందర్భంలో సంపాదకులు పొందిన అనుభూతులు ఏంటి?
జవాబు:
మహోన్నతులైన స్త్రీల విశేషాలు సేకరిస్తున్న సందర్భంలో సంపాదకులు చాలామంది స్త్రీలను కలిశారు. వాళ్ళతో మాట్లాడుతుంటే ఉత్సాహంగా ఉండేవారు. వాళ్ళ అనుభవాలు వింటుంటే వారికి ఉద్వేగం కలిగేది. చరిత్రను వారు సంపాదకుల ముందుపరిచేవారు. సరిదె మాణిక్యాంబ గారు, అప్పుడు తమ కులం వారిని ఆడవద్దన్నారని, తర్వాత అన్ని కులాల వారిని ఆడవచ్చన్నారనీ, వారి వృత్తి, పొలాలు, జీవనం అన్నీ లాగేసుకొన్నారనీ చెప్పినప్పుడు సంపాదకులకు కళ్ళు చెమర్చాయి.

నాటక రంగంలోకి కుటుంబ స్త్రీలు రావాలంటారు. కానీ, తామూ కుటుంబ స్త్రీలమే కదా ! ఏ స్త్రీ అయినా కుటుంబం నుండి కాక, ఎక్కడ నుండి వస్తుందని పావలా శ్యామల గారు కోపంగా అడిగినప్పుడు పితృస్వామ్య వ్యవస్థ స్త్రీలను మర్యాద – అమర్యాద పరిధులలో బంధించి తనకనుకూలంగా మాత్రమే వాళ్ళ కదలికను నియంత్రించే విధానమంతా సంపాదకుల కళ్ళకు కట్టింది.

హీరోలకే శాల్యూట్ లని, హీరోయిన్లు ఆ తర్వాతే, చివరకు మిగిలేది హీరోగారి గొప్పతనమే అని షావుకారు జానకి గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పినపుడు సంపాదకులకు చరిత్రను తిరిగి రాయాలనే కోరిక బలంగా కలిగింది.

సంపాదకులు 118 మంది మహోన్నత స్త్రీల సమాచారం సేకరిస్తూ, 118 సందర్భాల కంటే ఎక్కువ సార్లు ఉద్వేగానికి గురి అయ్యారు.

ఈ) మహిళావరణం పుస్తకంలోకి ఎంతో మంది స్త్రీలను తీసుకోవాలని ఉన్నా, కొద్దిమందిని మాత్రమే ఎంపిక చేసుకోవడానికి గల కారణాలు ఏమిటి?
జవాబు:
ఈ శతాబ్దంలో విశేష కృషి చేసి, చరిత్ర నిర్మాతలుగా ప్రసిద్ధికెక్కిన మహోన్నతులైన స్త్రీలను అందరినీ, ‘మహిళావరణం’ పుస్తకంలోకి తీసుకురావాలనుకున్నారు. అన్ని రంగాలలోకీ దృష్టి సారించాలనుకున్నారు. కానీ, ఆర్ధిక పరిస్థితులు సహకరించలేదు. కనీసం రెండు వందల మందినైనా చేర్చాలనుకొన్నారు. వీలుపడక 100 మందిని మాత్రమే చేర్చాలనుకొన్నారు. అయితే, ఆ సంఖ్య వారికి తృప్తినివ్వలేదు. అందుచేత 118 మందిని చేర్చారు.

ఆ 118 మందిని ఎంపిక చేయడం కూడా చాలా కష్టం. ప్రతి రంగంలో తమదంటూ ఒక ముద్రవేసిన వారిని ఎంచుకోవాలి. అంటే ఆ రంగంలో నిష్ణాతులైన వారిని ఎంచుకోవాలి. వారిలో కొందరు మరణించి ఉండవచ్చు. వారి వివరాలు సేకరించాలి. బ్రతికున్నవారితో మాట్లాడాలి. వారి మాటలు, ఫోటోలు రికార్డు చేయాలి. ఇంటర్వ్యూలు చేయాలంటే, మరణించినవారి విషయంలో కుదరదు. పుస్తకంలో విలువైన ఇంటర్వ్యూలకు చోటు చాలదు. అందువల్ల ఇంటర్వ్యూలు తీసుకొని, వేయకపోవడం బాగుండదు. ఇంతా శ్రమపడినా ఆర్థికంగా నిధులు లేవు. అందుచేత క్లుప్తత తప్పదు.

మొత్తం మీద సమయం లేక, ఆర్థిక పరిస్థితి బాగోలేక, ఉత్సాహం ఉన్న కొద్దిమందిని మాత్రమే ఎంపిక చేశారు.

ఉ) మహిళావరణం పుస్తకం ప్రచురణలో సంపాదకులకు సహాయపడిన వారెవరు?
జవాబు:
మహిళావరణం పుస్తకానికి ప్రతి దశలోనూ అనేకమంది తమ సహాయసహకారాలను సంపాదకులకు అందించారు. పుస్తక రూపకల్పనకు సంపాదకులు ఎందరినో సంప్రదించారు.

భరత్ భూషణ్ చాలా ఉత్సాహంగా ఫోటోలు తీశారు. అనారోగ్యాన్ని కూడా లెక్కచేయలేదు. జీవించిలేనివారి ఫోటోలను కూడా ఆయన సేకరించారు. ఆయన తను ఒప్పుకొన్న పనిని సంతృప్తిగా, సంతోషంగా పూర్తి చేశారు.

ఎస్.ఆర్. శంకరన్, అక్కినేని కుటుంబరావు గార్లు సంపాదకుల కంటే సీరియస్ గా ఆలోచించారు. ప్రతి సందర్భంలో సంపాదకులను తరచి, తరచి ప్రశ్నించి, మేము ఎంచుకొన్న వారిని గురించి ఎందుకు ఎంచుకొన్నారనీ, ఎంచుకోని వారిని ఎందుకు విడిచారని ప్రశ్నించారు. చక్కటి సలహాలిచ్చారు. నాగార్జున చక్కటి “గ్లోసరీ” తయారుచేశారు. చేకూరి రామారావు గారు భాషా విషయంలో సంపాదకులకు చక్కటి సలహాలనిచ్చారు. పుస్తకం విషయానికి తగినట్లు అందంగా, గంభీరంగా, హుందాగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దినవారు రాజ్ మోహన్ తేళ్ళ గారు. డిజైన్లో, ఆర్ట్ వర్క్ లో ఒక పరిపూర్ణత సాధించడానికి ఆయన చాలా శ్రమపడ్డారు. అనుకున్న సమయానికి పుస్తకాన్ని అందించడానికి రాజ్ మోహన్ విశేష కృషి చేశారు.

నీనా జాదవ్, కంచ రమాదేవి, భరత్ భూషణ్ తో పాటు వెళ్ళి జీవిత విశేషాలు సేకరించారు. అవి అన్నీ ఒక క్రమ పద్ధతిలో భద్రపరిచారు. పద్మిని, సుజాత, సుబ్బలక్ష్మి ఇంగ్లీషులో పుస్తకాన్ని కంప్యూటరు మీద కంపోజ్ చేశారు. బీనా కూడా చాలా పనుల బాధ్యత తీసుకొని, సంపాదకులకు వెసులుబాటు కల్పించింది.

II. వ్యక్తికరణ-సృజనాత్మకత

1. కింది ప్రశ్నలకు ఆలోచించి ఐదేసి వాక్యాల్లో సమాధానాలు రాయండి.

అ) “సామాన్యంగా చరిత్ర నిర్మాతలుగా స్త్రీలకు గుర్తింపు దొరకదు” దీంతో మీరు ఏకీభవిస్తారా? ఎందుకు?
జవాబు:
“సామాన్యంగా చరిత్ర నిర్మాతలుగా స్త్రీలకు గుర్తింపు దొరకదు” అనేదానితో ఏకీభవిస్తాను. ఎందుకంటే –

స్త్రీని సాధారణంగా కుటుంబానికి అంటిపెట్టుకొని ఉండే వ్యక్తిగానే పరిగణిస్తారు. తండ్రి చాటున లేదా భర్త చాటున ఉండి ఉద్యమాలలో వారికి చేదోడు వాదోడుగా ఉన్నట్లుగానే స్త్రీలను చిత్రీకరించారు. చరిత్ర నిర్మాతలుగా పురుషులు కీర్తింపబడతారు. వారి సహాయకులుగా స్త్రీలను చరిత్రలో పేర్కొంటారు. కానీ, స్త్రీలను చరిత్ర నిర్మాతలుగా రాయరు. అక్కడక్కడా కొందరిని పేర్కొన్నా, పెద్దగా పట్టించుకోరు. సమాజం ఏర్పరచిన అడ్డంకులను అధిగమించినా, గుర్తింపు లేదు. తమకోసం, దేశంకోసం, సమూహంగా స్త్రీలు చేసిన పోరాటాలకు చరిత్ర గుర్తింపు నివ్వలేదు. స్త్రీలు పడిన సంఘర్షణలకూ, సాధించిన విజయాలకూ గుర్తింపు దొరకదు. చరిత్రలో వారి ఉనికి తునాతునకలైపోయింది.

మొత్తం సామాజికాభివృద్ధి క్రమంలో విడదీయలేని భాగంగా వారిని చూడకుండా వారి జీవిత కథలను విడిగా చరిత్రలో చూపుతారు. ఇలాంటి స్త్రీలు వేళ్ళమీద లెక్కపెట్టగలిగినంత మంది కూడా మన చరిత్ర పుస్తకాలలో కనిపించరు. ఇప్పటికి 30 సంవత్సరాల నుంచి స్త్రీలకు చరిత్రలో స్థానం లేదు. ఉన్న చరిత్ర స్త్రీల ప్రాతినిధ్యాన్ని ప్రతిబింబించే చరిత్ర కాదనే విమర్శ ఉంది.

స్త్రీ విద్యను ప్రోత్సహించిన పురుషులకు చరిత్రలో స్థానం దక్కింది. కానీ, మొదటిసారి చదువుకున్న సామాన్య స్త్రీలకు చరిత్రలో స్థానం దక్కలేదు. వితంతు వివాహ్లాలకు నడుంకట్టిన పురుషులకు చరిత్రలో పెద్దపీట వేశారు కానీ, మొదటగా వితంతు వివాహం చేసుకొన్న స్త్రీలు చరిత్రలో కనబడరు. అలాగే ప్రతి ఉద్యమంలోనూ స్త్రీలను చరిత్రలో తక్కువగా చూపారు. కనుక “సామాన్యంగా చరిత్ర నిర్మాతలుగా స్త్రీలకు గుర్తింపు దొరకదు” అనే సంపాదకుల అభిప్రాయంతో ఏకీభవిస్తాను.

“సామాన్యంగా చరిత్ర నిర్మాతలుగా స్త్రీలకు గుర్తింపు దొరకదు” అనే దానితో ఏకీభవించను. ఎందుకంటే –

చరిత్రలో ఎవరి గొప్పతనం వారిదే. చరిత్ర నిర్మాతలుగా ఎవరు ఉంటే వారినే పేర్కొంటారు తప్ప చరిత్రకారులకు పక్షపాతం ఉండదు.

చరిత్రలో మహాత్మాగాంధీకి ఎంత స్థానం ఉందో, కస్తూరిబా గాంధీకి కూడా చరిత్ర నిర్మాతగా అంత స్థానం దక్కింది. : కస్తూరిబా గాంధీని చరిత్ర నిర్మాతగా ప్రపంచం గౌరవించింది. ఆమెకు సమున్నత స్థానం ఇచ్చింది.

మదర్ థెరిసా కూడా తన సేవల ద్వారా సేవా రంగంలో అపూర్వమైన చరిత్ర సృష్టించింది. ఆమె తండ్రి పేరు మీద ఈ చరిత్రలో స్థానం సంపాదించలేదు. థెరిస్సాను చరిత్ర నిర్మాతగానే గుర్తించారు. గౌరవించారు. నేటికీ గౌరవిస్తున్నారు.

దానగుణంలో డొక్కా సీతమ్మ గారు (పి.గన్నవరం, తూ! గోదావరి జిల్లా) చరిత్ర నిర్మాతగా ప్రసిద్ధికెక్కారు. బ్రిటిషు ప్రభుత్వం కూడా ఆమెను గౌరవించింది. ఇందిరాగాంధీ కూడా తనకు తానుగానే చరిత్ర నిర్మాతగా ప్రసిద్ధికెక్కింది.

కల్పనా చావ్లా అంతరిక్ష పరిశోధనలలో తనకు తానే సాటి అనిపించుకొని చరిత్ర నిర్మాతగా ప్రసిద్ధి కెక్కింది. శకుంతలాదేవి గణితశాస్త్రంలో చరిత్ర నిర్మాతగా ప్రసిద్ధి కెక్కింది.

వ్యాపార రంగం, సినిమా రంగం, ఉద్యమాలు, విద్య, వైద్యం, ఎందులో చూసినా చరిత్ర నిర్మాతలుగా ప్రసిద్ధి కెక్కిన స్త్రీలు వేళ్ళ మీద లెక్కపెట్టగలిగినవారు కాదు వేలమంది ఉన్నారు.

కనుక “స్త్రీలకు చరిత్ర నిర్మాతలుగా తగిన గుర్తింపు దొరకదు” అనే సంపాదకుల అభిప్రాయంతో నేను ఏకీభవించను.

(సూచన: పై రెండు అభిప్రాయాలలో ఏ ఒక్క దినినైనా గ్రహించవచ్చును. రెండింటిని మాత్రం గ్రహించకూడదు.)

ఆ) రచయిత్రులు సంకలనం చేసిన పుస్తకానికి “మహిళావరణం” అనే పేరు సరిపోయిందని భావిస్తున్నారా? ఎందుకు?
జవాబు:
రచయిత్రులు సంకలనం చేసిన పుస్తకానికి “మహిళావరణం” అనే పేరు సరిపోయిందని భావిస్తున్నాను. ఎందుకంటే ఈ పుస్తకం రచించిన ఓల్గా, వసంత కన్నబిరాన్, కల్పన కన్నబిరాన్, ముగ్గురూ స్త్రీలే. ఈ పుస్తకంలో 118 మంది వివిధ రంగాలకు చెందిన మహోన్నతులైన స్త్రీలనే పేర్కొన్నారు. స్త్రీలు నడిపిన ఉద్యమాలు, స్త్రీల కొరకు స్త్రీలు చేసిన పోరాటాలు పేర్కొన్నారు. కనుక దీనికి “మహిళావరణం” అనే పేరు సరిపోయిందని భావిస్తున్నాను.

రచయిత్రులు సంకలనం చేసిన పుస్తకానికి, “మహిళావరణం” అనే పేరు సరిపోలేదు అని భావిస్తున్నాను ఎందుకంటేకేవలం మహిళల వలన కానీ, కేవలం పురుషుల వలన కానీ ఏ ఉద్యమాలూ నడవవు. నడిచినా విజయాన్ని సాధించలేవు. సమస్య మహిళలదైనా, పురుషులదైనా అందరూ కలసి ఉద్యమం చేస్తేనే విజయవంతమౌతుంది. ఈ పుస్తకంలో పేర్కొన్న ప్రతి ఉద్యమంలోనూ మహిళలతోపాటు పురుషులు కూడా పాల్గొనే ఉంటారు. అంతెందుకు ? ఈ పుస్తకం రాయాలనే ఆలోచన వచ్చిన దగ్గర నుండి పుస్తకం ప్రచురణ పూర్తయి చేతిలోకి వచ్చే వరకూ ఎంతమంది స్త్రీల, పురుషుల కష్టం ఉందో సంపాదకులే స్వయంగా రాశారు. కనుక ఈ పుస్తకానికి మహిళావరణం కాక వేరే పేరు పెట్టి ఉంటే బాగుండేదని నా అభిప్రాయం.
సూచన: పై అభిప్రాయాలు రెండూ పంచకూడదు. ఏ ఒక్క దినినైనా గ్రహించవచ్చును.)

ఇ) “ప్రతివాళ్ళూ ప్రశ్నించారు చరిత్ర సాగిన క్రమాన్నీ !” అని స్త్రీల గురించి రచయిత్రులు ఎందుకు పేర్కొన్నారు?
జవాబు:
అప్పుడు తమ కులంవారిని ఆడవద్దన్నారనీ, తర్వాత అన్ని కులాల వారిని ఆడమన్నారనీ సరిదె మాణిక్యాంబ గారు చెప్పారు. వారి వృత్తి, పొలాలు, జీవనం అన్నీ తీసేసుకున్నారని ఆమె చెప్పారు. ఇప్పుడు అదే జీవనోపాధిగా అన్ని కులాల వాళ్ళు బతుకుతున్నారు. అది తప్పు కాదా ? అని ఆమె ప్రశ్నించారు.

నాటక రంగంలోకి కుటుంబ స్త్రీలు రావాలంటారు. తామంతా కుటుంబ స్త్రీలం కామా ? ఏ స్త్రీయైనా కుటుంబంలోంచి కాకుండా ఎక్కడ నుండి వస్తుంది ? అని పితృస్వామ్య వ్యవస్థని నిలదీశారు పావలా శ్యామల గారు.

శాల్యూట్లన్నీ హీరోలకేనా ? హీరోయిన్లు పట్టరా ? హీరో గొప్పతనం ఉంటే సినిమాలు ఆడేస్తాయా ? అని షావుకారు జానకిగారు సినీ రంగంలోని పురుషాధిక్యతను ప్రశ్నించారు.

ఈ రకంగా ప్రతివాళ్ళు స్త్రీలను తక్కువగా చూసినందుకు చరిత్రను కడిగి పారేశారు. అందుచేతనే “ప్రతివాళ్ళూ ప్రశ్నించారు చరిత్ర సాగిన క్రమాన్నీ” అని రచయిత్రులు పేర్కొన్నారు. వారి ఆవేశంలో అర్థముంది. వారి ప్రశ్నలో పరమార్ధముంది. వారు ప్రశ్నించిన తీరులో అంతరార్థముంది.

AP SSC 10th Class Telugu Solutions Chapter 7 మా ప్రయత్నం

2. కింది ప్రశ్నలకు ఆలోచించి పదేసి వాక్యాల్లో సమాధానాలు రాయండి.

అ) చరిత్ర నిర్మాతలుగా స్త్రీలు ప్రధానంగా ఉన్నారనే భావన సంపాదకులకు కలగడానికి గల కారణాలను వివరించండి.
(లేదా)
చరిత్ర నిర్మాతలుగా స్త్రీలు ప్రధానంగా ఉన్నారనే భావన సంపాదకులకు కలగడానికి గల కారణాలను “మా ప్రయత్నం” పాఠం ఆధారంగా వివరించండి.
జవాబు:
సామాజికంగా 20వ శతాబ్దంలో స్త్రీలు చాలా పెద్ద మార్పులు తెచ్చారు. నిజానికి ఈ శతాబ్దం స్త్రీలది అని చెప్పవచ్చును. అన్ని రంగాలలో స్త్రీలు చరిత్ర నిర్మాతలుగా ఉన్నారు. ప్రతి రంగంలో స్త్రీలు తమదంటూ ఒక ముద్రను వేశారు.

కొందరైతే చరిత్ర సాగిన క్రమాన్ని ప్రశ్నించారు. సరిదె మాణిక్యాంబ గారు తమ కులం వారిని ఆడవద్దన్నందుకు ఆవేదన చెందారు. తర్వాత అన్ని కులాల వాళ్ళూ ఆడలేదా ? అని తీవ్రంగా ప్రశ్నించారు. నాటక రంగంలో తమను చిన్న చూపు చూసినందుకు పావలా శ్యామల గారు ఊరుకోలేదు. పితృస్వామ్య వ్యవస్థపై ధ్వజమెత్తారు. శాల్యూట్లన్నీ హీరోలకేనా? అంటూ షావుకారు జానకిగారు సినీ పరిశ్రమని కడిగి పారేశారు. ఈ విధంగా చరిత్ర నిర్మాతలుగా స్త్రీలు చరిత్రను ప్రశ్నించారు.

ఆయా రంగాలలో స్త్రీలు చేసిన కృషి, వాళ్ళు వేసిన ముద్ర, మొట్టమొదటిగా ఒక ప్రత్యేక రంగంలో అడుగుపెట్టినప్పుడు వాళ్ళు ఎదుర్కొన్న సంక్లిష్ట సందర్భాలు, ప్రజలలో వారికున్న స్థానం, వీటిని . అన్నిటినీ పరిగణనలోకి తీసుకొంటే చరిత్ర నిర్మాతలుగా స్త్రీలు ప్రధానంగా ఉన్నారు.

సమాజంలోని ప్రతిదాన్నీ మార్చటానికి స్త్రీలు చరిత్రలో సమాయత్తమయ్యారు. దేశంకోసం, తమకోసం, సంఘసంస్కరణ కోసం ఎన్నో పోరాటాలు చేశారు. తాము ముందు వరుసలో ఉండి ఎన్నో ఉద్యమాలు నడిపారు. ఎందరినో ప్రభావితులను చేశారు. స్త్రీలు రాణించిన రంగాలు ఎన్నో ఉన్నాయి.

మొదట చదువుకొన్న స్త్రీ, మొదట వితంతు వివాహం చేసుకొన్న స్త్రీలే నిజమైన చరిత్ర నిర్మాతలు. ఉద్యమాలలో చేరి జైలుకు వెళ్ళిన స్త్రీలు నిజమైన చరిత్ర నిర్మాతలు. నాటకం, సినిమా, రేడియో వంటి రంగాలలోకి మొదటిసారి అడుగుపెట్టిన స్త్రీలు నిజమైన చరిత్ర నిర్మాతలు.

అందువల్లనే చరిత్ర నిర్మాతలుగా స్త్రీలు ప్రధానంగా ఉన్నారనే భావన సంపాదకులకు కలిగింది.

ఆ) “ఈ స్త్రీలందరూ ఈ చరిత్రను నిర్మించేందుకు ఎంత మూల్యం చెల్లించారో తలచుకుంటే మా గుండెలు బరువెక్కాయి” అనడంలో పీఠికాకర్తల ఆంతర్యం ఏమిటి?
జవాబు:
చరిత్రకారులు స్త్రీలకు తగిన గుర్తింపు నివ్వలేదు. పితృస్వామ్య వ్యవస్థ, పురుషాధిక్యత స్త్రీలను తక్కువగానే చూసింది. అయినా స్త్రీలు వెనుకంజ వేయలేదు. స్త్రీల ఉద్యమాలు ఈ విషయాన్ని ప్రశ్నించాయి. విలువా, గుర్తింపూ లేకపోయినా స్త్రీలు దేశం కోసం, తమ కోసం ఉద్యమాలు చేశారు. ఎంతోమంది స్త్రీలు సమాజపు కట్టుబాట్లను ప్రశ్నించారు. సమాజాన్ని ఎదిరించి విద్యాభ్యాసం చేశారు. వితంతువులు పునర్వివాహాలు చేసుకొన్నారు. ఉద్యమాలలో తెగించి పాల్గొన్నారు. జైళ్ళకు :. వెళ్లడానికి కూడా భయపడలేదు. నాటకం, సినిమా, రేడియో వంటి రంగాలలోకి మొదటిసారి అడుగుపెట్టిన స్త్రీలకు వారి కుటుంబాల నుండీ, సమాజం నుండీ ఎన్ని ఆటంకాలు ఎదురయ్యాయో ఊహించుకొంటేనే భయం వేస్తుంది. మొదటి తరం డాక్టర్లు, లాయర్లు, శాస్త్రవేత్తలు, సంగీతకారులు, నృత్య కళాకారిణులు మొదలైన వారంతా ఎన్నో బాధలు పడి ఉంటారు. ఎన్నో ఈసడింపులకు గురై ఉంటారు. ఎన్నెన్నో అవమానాలను ఎదుర్కొని ఉంటారు. ఇంకెన్నో సూటిపోటి మాటలను ధరించి ఉంటారు. ఎంతో ఆవేదన చెంది ఉంటారు. ఎన్నో కోల్పోయి ఉంటారు.

అయినా ధైర్యం కోల్పోలేదు. పట్టుదల వీడలేదు. సంస్కరణలను వదిలి పెట్టలేదు. ఉద్యమాలు ఆపలేదు. తమ కోసం, దేశం కోసం పరితపిస్తున్నారు. ఉద్యమిస్తున్నారు. ఉద్యమాలే ఊపిరిగా స్త్రీలు చేసిన సాహసాలు తలుచుకొంటే ఒళ్ళు పులకరిస్తుంది. వారు పడిన బాధలు ఊహించుకొంటే హృదయం ద్రవిస్తుంది.

అటువంటి చరిత్ర నిర్మాతలైన స్త్రీల బాధలను, అనుభూతులను వారి మాటలలోనే సంపాదకులు విన్నారు. సరిదె మాణిక్యాంబ గారు తమ కులం వారిని ఆడవద్దన్నపుడు ఆమెకు కలిగిన ఆవేదన, తర్వాత అన్ని కులాల వారూ ఆడినపుడెవరూ అభ్యంతరం చెప్పకపోవడంతో రెట్టింపయింది. షావుకారు జానకిగారు ఎంత గొప్ప నటి అయినా హీరోలకే గౌరవాలు దక్కినపుడు ఆమె వేదన వర్ణనాతీతం. నాటక రంగంలో తమను తక్కువ చూపు చూసినందుకు పావలా శ్యామల గారి బాధను చెప్పడానికి మాటలు చాలవు.

అప్పటి కందుకూరి రాజ్యలక్ష్మి గారు వితంతు పునర్వివాహాల కోసం ఉద్యమించారు. స్త్రీ విద్యకోసం తపించారు. ఆమె నుండి మేకప్ రంగంలో స్త్రీలకు స్థానం కోసం పోరాడిన శోభాలత వరకూ అందరూ కొత్త వెలుగుల కోసం తాపత్రయపడిన వారే. అందరూ ఎంతో కొంత మూల్యం చెల్లించినవారే. అందుకే అవన్నీ స్వయంగా పరిశీలించిన సంపాదకుల హృదయాలు బాధతో బరువెక్కాయి. వారి మాటలలోని ఆంతర్యం అదే.

3. కింది అంశాల గురించి సృజనాత్మకంగా ప్రశంసిస్తూ రాయండి.

అ) ఒక ప్రముఖ స్త్రీవాద రచయిత్రి మీ పాఠశాల వార్షికోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొనడానికి వస్తున్నారు. వారిని మీరు ఏమి ప్రశ్నించదలచుకున్నారో ఆ ప్రశ్నల జాబితా రాయండి.
జవాబు:
నమస్కారాలండీ, మా పాఠశాల వార్షికోత్సవానికి మీకు స్వాగతం పలుకుతున్నాం. మీ వంటి పెద్దవారు మా పాఠశాలకు రావడం మాకు చాలా ఆనందంగా ఉందండీ. మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడిగి, మా సందేహాలు తీర్చుకోవాలని, విద్యార్థులందరం కలిసి ఒక జాబితా రూపొందించాం. ఇవండీ ఆ ప్రశ్నలు –
ప్రశ్నల జాబితా:

  1. మీ పేరు మా అందరికీ తెలుసు. అయినా మీ నోటితో మీ పేరు వినాలని మా కుతూహలం. మీ పేరు చెప్పండి.
  2. మీదే ఊరండీ?
  3. మీ చిన్నతనంలో మీరే స్కూలులో చదివారు?
  4. అది ప్రభుత్వ పాఠశాలా? ప్రైవేటుదా?
  5. మీ తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మీపై కోప్పడేవారా?
  6. మీరు అల్లరి చేసేవారా?
  7. ఎవరితోనైనా ఫైటింగులు చేసేవారా?
  8. మీరు ఎక్కడి వరకూ చదివారు? మీ విద్యావిశేషాలు చెప్పండి.
  9. స్త్రీవాద రచయిత్రిగా మీరు మారడానికి కారణాలేమిటి?
  10. మీరు స్త్రీవాద రచయిత్రిగా స్త్రీలు ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలకు ఏ విధమైన పరిష్కారాలు చెబుతారు?
  11. స్త్రీవాద రచయిత్రుల వలన సమాజానికేమిటి ఉపయోగం?
  12. మీ రచనల పేర్లు చెప్పండి. వాటిలోని విషయాలు కూడా సంక్షిప్తంగా చెప్పండి.
  13. మీ భర్త గారూ, పిల్లలూ మిమ్మల్ని స్త్రీవాద విషయంలో ప్రోత్సహిస్తారా?
  14. ఇప్పుడు కూడా ఇంట్లో మగవారి మాటే చెల్లుతుంది కదా ! దీనిపై మీ అభిప్రాయం చెప్పండి.
  15. మీరు మాకిచ్చే సందేశం చెప్పండి.
  16. మీకు నచ్చిన, మీరు మెచ్చిన స్త్రీవాద రచయిత్రులెవరు? ఎందుకు?
  17. మీరు మగవారి రచనలు చదువుతారా? చదవరా?
  18. మీ వంటి రచయిత్రి మా పాఠశాలకు వచ్చి, మా సందేహాలు తీర్చినందుకు ధన్యవాదాలండీ. నమస్కారమండీ.

ఆ) మహిళల పట్ల చూపుతున్న వివక్షలను, వారి మీద జరుగుతున్న దాడులను ఖండిస్తూ, మహిళలందరూ ధైర్యంతో మెలగాలని తెలియజేసేలా ఒక కరపత్రం తయారుచేయండి.
జవాబు:
(మహిళలే మహిని వేల్పులు )
మనలను తన కడుపులో పెట్టుకొని, నవమాసాలు మోసి, కని, పెంచిన అమ్మ ఒక స్త్రీ. ప్రతి స్త్రీలోనూ అమ్మనే చూడాలని రామకృష్ణ పరమహంస ఉద్బోధించారు. ఉపనిషత్తులు ‘మాతృదేవోభవ’ అని తల్లికి మొదటి స్థానం ఇచ్చి దైవంగా పూజించమన్నాయి. వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు, మొత్తం ప్రపంచంలోని ఏ భాషకు చెందిన సాహిత్యమైనా స్త్రీని గౌరవించమని బోధించింది. కానీ, స్త్రీని చిన్నచూపు చూడమని ఏ సాహిత్యమూ చెప్పలేదు. చెప్పకూడదు. చెప్పదు.

స్త్రీలను చిన్నచూపు చూడడం, ఆడపిల్ల కదా అని వివక్షతతో మాట్లాడడం కుసంస్కారానికి నిదర్శనం. ఆడపిల్లలకు చురుకుతనం ఎక్కువ ఉంటుంది. సహజసిద్ధంగానే తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. ఓర్పు ఎక్కువ. నేర్పు ఎక్కువ. అటువంటి బాలికలను ప్రోత్సహించాలి. చదవించండి. వివక్షతకు గురి చేయకండి.

ఇప్పటి సినిమాల ప్రభావమో ఏమోకాని, స్త్రీలపై దాడులు పెరిగిపోతున్నాయి. ఇది మన సమాజానికి సిగ్గుచేటు. ప్రపంచానికి ‘గీత’ ను బోధించిన భారతీయులు ‘గీత’ను దాటడం తగదు. ఎక్కడైనా స్త్రీలకు అన్యాయం జరుగుతుంటే తిరగబడండి. శత్రుదేశపు స్త్రీని కూడా తల్లిలాగ భావించిన శివాజీ మనకు ఆదర్శం. స్త్రీని దేవతగా భావిద్దాం . తల్లిగా, సోదరిగా గౌరవిద్దాం. మన సంస్కారాన్ని ప్రపంచమంతా చాటిద్దాం. ఎక్కడ స్త్రీలు ఆనందంగా ఉంటారో అక్కడ దేవతలు ఆనంద తాండవం చేస్తారు.

రుద్రమదేవి, ఝాన్సీ లక్ష్మీబాయి, జోన్ ఆఫ్ ఆర్క్, చాంద్ బీబీ వంటి వీరనారులు ఉద్భవించిన ఈ భూమిమీద పుట్టిన నీవు అబలవా ! సబలవా ! నిన్ను నీవు నిరూపించుకో! నువ్వు వేసే ప్రతి అడుగూ కావాలి దుర్మార్తులకు దడుపు. నిన్ను నువ్వే కాపాడుకో! తెగించు ! పోరాడు ! మేమున్నాం భయపడకు! నారీలోకపు విజయ పతాకం చేబూను! అందుకో ! జయజయ ధ్వానాలు.

భాషా కార్యకలాపాలు ప్రాజెక్టు పని

వివిధ రంగాలలో ప్రసిద్ధులైన మహిళల ఫోటోలను, జీవిత విశేషాలను సేకరించి, ఒక మోడల్ “మహిళావరణం”
పుస్తకాన్ని తయారుచేయండి. ప్రదర్శించండి.
జవాబు:
1. సుసన్నా అరుంధతీరాయ్ (రచయిత్రి – సంఘసంస్కర్త) :
AP SSC 10th Class Telugu Solutions Chapter 7 మా ప్రయత్నం 5
మొట్టమొదటిసారిగా తన రచన ‘ది గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ అనే పుస్తకానికి 1997 లో ‘బ్రిటన్ వారిచ్చే ‘బుకర్ ప్రైజ్’ ను గెలుచుకున్న భారతీయ మహిళ. 1961 నవంబరు 25న బెంగాల్ లో జన్మించి కేరళ, కొట్టాయంలోని ‘అయ్ మానమ్’ గ్రామంలో పెరిగింది. ‘ఆమె చాలామందికి స్ఫూర్తి ప్రదాత. చిన్నతనం నుండి బాలికగా, స్త్రీగా ఎన్నో ఇబ్బందులను, అడ్డంకులను అధిగమించి ఈ స్థాయికి చేరింది. పేదలు, అణగారిన వర్గాల తరఫున గొంతెత్తి ‘అధికారం’ తో మాట్లాడాలంటే ఈమెకి ఈమే సాటి. 2004లో ఈమె సిడ్నీ అరుందరాయ్) శాంతి బహుమతిని కూడా గెలుచుకుంది.

2. శకుంతలాదేవి :
AP SSC 10th Class Telugu Solutions Chapter 7 మా ప్రయత్నం 6
మానవ కంప్యూటర్ – గణితంలో ఎంత కష్టమైన సమస్యనైనా ఎటువంటి యంత్ర సహాయం లేకుండానే సాధించగలిగే అసమాన ప్రతిభ కలిగిన స్త్రీ. 1939 లో కర్ణాటకలోని బెంగళూరులో జన్మించింది. చాలా దేశాలు ఈవిడ ప్రతిభను ప్రదర్శించడానికి తమ దేశాలకు ఆహ్వానించాయి. 1995లో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో ఈమె పేరును 26వ పేజీలో లిఖించారు.

3. అనిబిసెంట్ :
AP SSC 10th Class Telugu Solutions Chapter 7 మా ప్రయత్నం 7
లండన్లో జన్మించిన ఐరిష్ మహిళ. 1893 వ సం||లో భారతదేశానికి వచ్చారు. ఈమె ప్రఖ్యాతిగాంచిన విద్యావేత్త, జర్నలిస్టు, సోషల్ వర్కర్, మరియు ఆధ్యాత్మికవేత్త. ఈమె థియోసాఫికల్ సొసైటీ (దివ్యజ్ఞాన సమాజం) ను స్థాపించారు. భారతదేశంలో స్వాతంత్ర్యపోరాట కాలంలో హోమ్ రూల్ లీగ్ ను ప్రారంభించారు. అంతేగాక, న్యూ ఇండియా’ కు సంపాదకత్వం వహించారు. భారతీయ బాలుర స్కౌట్ అసోసియేషను కూడా ప్రారంభించారు. 86 సం||ల వయస్సులో ఈమె మరణించారు.

4. కరణం మల్లేశ్వరి :
AP SSC 10th Class Telugu Solutions Chapter 7 మా ప్రయత్నం 8
భారతదేశ వెయిట్ లిఫ్టర్. ఒలింపిక్స్ లో భారతదేశం తరఫున మెడల్ సాధించిన తొలి మహిళ. 2000 సం||రం సిడ్నీ ఒలింపిక్స్ లో ఈమె పతకాన్ని సాధించింది. 1994 – 95 సం||రానికి రాజీవ్ ఖేల్ రత్న అవార్డును పొందింది. మహిళ అయివుండి పురుషులు ఎక్కువగా పాల్గొనే వెయిట్ లిఫ్టింగ్ లో ఒలింపిక్ పతకం గెలవడమంటే ఎన్ని కష్టనష్టాలకు ఓర్చి ఉంటుందో ఊహించండి.

5. ఎం.ఎస్.సుబ్బులక్ష్మి :
AP SSC 10th Class Telugu Solutions Chapter 7 మా ప్రయత్నం 9
మధురై షణ్ముఖవడివు సుబ్బులక్ష్మి 1916 సెప్టెంబరు 16న మధురైలో జన్మించారు. కర్ణాటక సంగీతంలో నైటింగేలని అంటారు. ఈమె 1954లో ‘పద్మభూషణ్’, 1974లో రామన్ మెగసెసె అవార్డు, 1975లో ‘పద్మ విభూషణ్’ లతో గౌరవించబడ్డారు. 1998లో ‘భారతరత్న’ అవార్డును కూడా పొందారు. మహిళలు అంతగా బయటకి రాని రోజుల్లోనే ఆమె సంగీత కచేరీలు చేశారు. 88 సం|| రాల వయసులో ఈమె మరణించారు.

6. ఇందిరాగాంధీ :
AP SSC 10th Class Telugu Solutions Chapter 7 మా ప్రయత్నం 10
మొట్టమొదటి మహిళా ప్రధాని, అలహాబాదులో జన్మించారు. 13 సంవత్సరాల వయసులోనే ‘వానరసేన’ ను స్థాపించి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన ధీరురాలు. ఆమె ప్రధానమంత్రిగా ఉన్నపుడు బ్యాంకుల జాతీయీకరణ, బంగ్లాదేశ్ కు స్వేచ్ఛ, 20 పాయింట్ ప్రోగామ్ మొదలైనవి అమలుచేశారు. ఆమె భారతరత్న పురస్కారాన్ని 1971లో పొందారు. 1984 అక్టోబరు 31న ఇందిరాగాంధీ తన సొంత గార్డులచే కాల్చి చంపబడ్డారు. ఈమె తన రాజకీయ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్న ప్రపంచంలోనే ప్రఖ్యాతి గాంచిన మహిళ.

7. కల్పనాచావ్లా :
AP SSC 10th Class Telugu Solutions Chapter 7 మా ప్రయత్నం 11
జననం 1 – 7 – 1961, మరణం 1 – 2 – 2003. ఇండియన్ అమెరికన్ వ్యోమగామి. కొలంబియా స్పేస్ షటిల్ లో మరణించిన ఏడుగురు వ్యోమగాములలో ఈమె కూడా ఒకరు. ఈమెకు నాసా అనేక మెడల్స్ ఇచ్చింది. మరణం తథ్యమని తెలిసినా కూడా స్పేస్ షటిల్ లో ఆమె ప్రవర్తన, ధైర్యం చిరస్మరణీయం.

8. మేథాపాట్కర్ :
AP SSC 10th Class Telugu Solutions Chapter 7 మా ప్రయత్నం 12
ఈమె 1954 డిసెంబరు 1న జన్మించారు. సామాజికవేత్త. ప్రముఖ పర్యావరణవేత్త, ముంబై వాసి. ‘నర్మదా బచావో’ ఆందోళనలో పాలుపంచుకుంటున్నారు. 1991లో రైట్ లైవ్లీహుడ్ అవార్డును పొందారు.

9. తస్లీమా నస్క్రీన్ :
AP SSC 10th Class Telugu Solutions Chapter 7 మా ప్రయత్నం 13
ఈమె 1962 ఆగస్టు 25న బంగ్లాదేశ్ లో జన్మించారు. ప్రముఖ ఫెమినిస్టు. మతాలకతీతంగా స్త్రీకి స్వేచ్ఛ, సమానత్వాలు ఉండాలని ‘అక్షర యుద్ధం’ చేస్తున్నారు. ఈమె వ్రాసిన ‘లజ్జ’ అనే పుస్తకం బాగా ప్రాచుర్యం పొందింది. దీని మూలంగా ఆమె అనేక దాడులకు గురయింది. ఆమె ప్రస్తుతం బంగ్లాదేశ్ ను వదిలిపెట్టి ప్రవాసంలో జీవితాన్ని గుడుపుతున్నారు.

10. కిరణ్ బేడి :
AP SSC 10th Class Telugu Solutions Chapter 7 మా ప్రయత్నం 14
ఈమె 1949 జూన్ 9న జన్మించారు. విశ్రాంత ఐ.పి.ఎస్ ఆఫీసరు. మొట్టమొదటి మహిళా ఆఫీసరు. 1994లో రామన్ మెగసెసె అవార్డు గ్రహీత. పంజాబ్ రాష్ట్రంలోని అమృత్ సర్ లో జన్మించారు. తన విధి నిర్వహణలో అనేక ఇబ్బందులు, ఒడిదుడుకులు ఎదుర్కొన్న మహిళ.

III. భాషాంశాలు

పదజాలం

1) కింది వాక్యాలలో గీత గీసిన పదాలకు పర్యాయపదాలు రాయండి.

అ) సామాన్యంగా చరిత్ర నిర్మాతలుగా స్త్రీలకు గుర్తింపు దొరకదు.
జవాబు:
స్త్రీ : 1) పడతి 2) వనిత 3) ముదిత

ఆ) అందరికీ ఒక పద్ధతి పాటించడమే బాగుంటుంది.
జవాబు:
పద్దతి : 1) విధానం 2) కరణి 3) చందము

ఇ) ఎన్నో అనుభవాలు స్మరణలోకి తెచ్చుకున్నాను.
జవాబు:
స్మరణ : 1) జ్ఞప్తి 2) గుర్తు 3) తలపు

AP SSC 10th Class Telugu Solutions Chapter 7 మా ప్రయత్నం

2) ఈ పాఠంలో శబ్దాలంకారం ఉన్న వాక్యాలను గుర్తించి రాయండి.
AP SSC 10th Class Telugu Solutions Chapter 7 మా ప్రయత్నం 1
జవాబు:
1) కొత్త సహస్రాబ్దంలోకీ, శతాబ్దంలోకి అడుగుపెడుతున్న సందర్భంలో గడిచిన
AP SSC 10th Class Telugu Solutions Chapter 7 మా ప్రయత్నం 2
AP SSC 10th Class Telugu Solutions Chapter 7 మా ప్రయత్నం 3

3) పాఠం ఆధారంగా కింది జాతీయాలు ఏ సందర్భాలలో వాడతారో వివరించండి.

అ) గుండెలు బరువెక్కడం :
జవాబు:
విపరీతమైన మానసిక బాధ కలిగినపుడు ఈ జాతీయం ఉపయోగిస్తారు.
సొంతవాక్యం : పేదల పాట్లు చూస్తే, ఎవరికైనా గుండెలు బరువెక్కడం సహజం.

ఆ) నీరు కారిపోవడం :
జవాబు:
పాడైపోవడం, నిరుత్సాహపడడం, ఆశలన్నీ అడుగంటిపోవడం వంటి సందర్భాలలో ఈ జాతీయం ఉపయోగిస్తారు.

సొంతవాక్యం :
కురుక్షేత్రంలో అర్జునుడు నీరు కారిపోవడం చూసి, కృష్ణుడు గీతోపదేశం చేశాడు.

ఇ) కనువిప్పు :
జవాబు:
‘జ్ఞానం’ కలగడం అనే సందర్భంలో ఈ జాతీయం ఉపయోగిస్తారు.

సొంతవాక్యం :
గీతోపదేశంతో అర్జునుడికి కనువిప్పు కలిగింది.

ఈ) కాలధర్మం చెందడం :
జవాబు:
కాల ప్రవాహంలో ఏదైనా నశింపక తప్పదు. అలాగే ‘మరణించడం’ అనే సందర్భంలో ఈ జాతీయం ఉపయోగిస్తారు. .

సొంతవాక్యం :
ఎంతోమంది రోడ్డు ప్రమాదాలలో కాలధర్మం చెందడం రోజూ జరుగుతోంది.

ఉ) తునాతునకలు :
జవాబు:
ముక్కముక్కలవడం, పూర్తిగా దెబ్బతినడం అనే సందర్భాలలో ఈ జాతీయం ఉపయోగిస్తారు.

సొంతవాక్యం :
ఈ మధ్య రోడ్డు ప్రమాదాలలో చాలా బస్సులు తునాతునకలయ్యాయి.

AP SSC 10th Class Telugu Solutions Chapter 7 మా ప్రయత్నం

4) కింది పదాలను గురించి వివరించండి.
అ) సామాజిక మార్పు :
జవాబు:
సమాజంలో ఈ రోజు ఉన్న ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు, ధర్మాలు తర్వాత మారిపోవచ్చును. ఇలా సమాజంలో కలిగే మార్పును సామాజిక మార్పు అంటారు.

సొంతవాక్యం :
సామాజిక మార్పు వలన బాల్యవివాహాలు తగ్గాయి.

ఆ) విజయోత్సవం :
జవాబు:
విజయం లభించినందుకు చేసుకొనే పండుగ.

సొంతవాక్యం :
ఎన్నికలలో నెగ్గినవారు విజయోత్సవాలు చేసుకొన్నారు.

ఇ) సామాజికాభివృద్ధి :
జవాబు:
సమాజపరమైన అభివృద్ధి.

సొంతవాక్యం :
విద్య సామాజికాభివృద్ధికి దోహదం చేస్తుంది.

ఈ) సాంస్కృతిక వారసత్వం :
జవాబు:
సంస్కృతి అంటే ఒక సమాజపు ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లు, వినోదాలు మొ||నవి. సాంస్కృతికము అంటే సంస్కృతికి సంబంధించింది. సాంస్కృతిక వారసత్వం అంటే సంస్కృతికి సంబంధించిన వాటి కొనసాగింపు.

సొంతవాక్యం :
మన భారతీయ సాంస్కృతిక వారసత్వం కుటుంబ వ్యవస్థ.

ఉ) అగ్రతాంబూలం :
జవాబు:
ఒక రంగానికి చెందిన లేదా ఒక గ్రామానికి లేదా ఒక సమాజానికి చెందిన వారిలో ఉన్నతునిగా గుర్తించడం.

సొంతవాక్యం :
కవులలో కాళిదాసుదే అగ్రతాంబూలం.

వ్యాకరణాంశాలు

1. కింది వాక్యాలు ఏ రకమైన వాక్యాలో గుర్తించి రాయండి.
ఉదా : మీరు రావద్దు నిషేధార్థక వాక్యం

అ) దయచేసి నన్ను కాపాడు. – ప్రార్ధనార్థక వాక్యం
ఆ) మీరు రావచ్చు. – అనుమత్యర్థక వాక్యం
ఇ) వారందరికి ఏమైంది? – ప్రశ్నార్థక వాక్యం
ఈ) నేను తప్పక వస్తాను. – నిశ్చయార్థక వాక్యం
ఉ) ఆహా ! ఎంత బాగుంది ! – ఆశ్చర్యార్థక వాక్యం
ఊ) వారు వెళ్ళవచ్చా? – సందేహార్థక వాక్యం

2. కింద ఇచ్చిన సంధులు – పదాల మధ్య సంబంధాన్ని గుర్తించి వాటిని జతచేసి, సూత్రాలు రాయండి.
AP SSC 10th Class Telugu Solutions Chapter 7 మా ప్రయత్నం 4

3. కింద ఇచ్చిన సమాసాలు – పదాలు వేటికి ఏవి వర్తిస్తాయో గుర్తించి, ఆయా పదాలకు సంబంధించిన సమాసాలను, విగ్రహవాక్యాలు రాయండి.

సమాసం పేరుసమాస పదం
తృతీయా తత్పురుష సమాసంవితంతు వివాహం
సంభావనా పూర్వపద కర్మధారయ సమాసంవిద్యాధికులు
షష్ఠీ తత్పురుష సమాసంగంగానది
ద్విగు సమాసంముప్పయి సంవత్సరాలు
ద్వంద్వ సమాసంస్త్రీ పురుషులు భారతదేశం

 

సమాస పదంవిగ్రహవాక్యంసమాసం పేరు
1) వితంతు వివాహంవితంతువు యొక్క వివాహంషష్ఠీ తత్పురుష సమాసం
2) విద్యా ధికులువిద్యచేత అధికులుతృతీయా తత్పురుష సమాసం
3) గంగానదిగంగ అను పేరు గల నదిసంభావనా పూర్వపద కర్మధారయ సమాసం
4) ముప్పయి సంవత్సరాలుముప్పయి అయిన సంవత్సరాలుద్విగు సమాసం
5) స్త్రీపురుషులుస్త్రీలును, పురుషులునుద్వంద్వ సమాసం
6) భారతదేశంభారత్ అనే పేరు గల దేశముసంభావనా పూర్వపద కర్మధారయ సమాసం

4. కింది ఉదాహరణలు ఏయే అలంకారాలకు చెందినవో గుర్తించండి. సమన్వయం రాయండి.

అ) సుదతీ నూతన మదనా!
మదనాగతురంగ పూర్ణమణిమయసదనా!
సదనామయ గజ రదనా!
రదనాగేంద్ర నిభకీర్తి రస నరసింహా!
జవాబు:
ఈ పద్యంలో ‘ముక్తపదగ్రస్తము’ అనే అలంకారం ఉంది.

వివరణ :
పై పద్యంలోని మొదటి పాదం ‘మదనా’ తో పూర్తయింది. రెండవ పాదం ‘మదనా’ తో మొదలయింది. ఆ ‘సదనా’తో పూర్తయింది. మూడవ పాదం ‘సదనా’ తో ప్రారంభమయింది. ‘రదనా’ తో పూర్తయింది. నాలుగవ పాదం ‘రదనా’ తోనే ప్రారంభమయింది. సమన్వయం : మొదటి పాదం చివరి పదంతో రెండవ పాదం, రెండవ పాదం చివరి పదంతో మూడవ పాదం, మూడవ పాదం చివరి పదంతో నాల్గవ పాదం ప్రారంభమయ్యాయి. విడిచిన (ముక్త) పదాన్నే మళ్ళీ గ్రహించారు కనుక పై పద్యంలో ముక్తపదగ్రస్తాలంకారం ఉంది.

ఆ) మానవా! నీ ప్రయత్నం మానవా?
జవాబు:
దీనిలో యమకాలంకారం ఉంది.
వివరణ :
ఒకే పదం అర్థభేదంతో ప్రయోగిస్తే అది ‘యమకాలంకారం’ అంటారు. సమన్వయం : పై వాక్యంలో మొదట ప్రయోగించిన ‘మానవా!’ అనేది ‘మనిషీ’ అనే అర్థంలో ప్రయోగించబడింది. రెండవసారి ప్రయోగించిన ‘మానవా’ అనేది ‘విడిచిపెట్టవా’ అనే అర్థంలో ప్రయోగించబడింది. ఇలాగ ఒకే పదం అర్థభేదంతో ప్రయోగించబడింది. కనుక అది యమకాలంకారం.

AP SSC 10th Class Telugu Solutions Chapter 7 మా ప్రయత్నం

ఇ) తండ్రి ! హరి జేరుమనియెడి తండ్రి తండ్రి.
జవాబు:
దీనిలో లాటానుప్రాసాలంకారం కలదు.
వివరణ :
ఒకే పదం అర్థంలో భేదం లేకున్నా భావంలో తేడా ఉండేలా ప్రయోగిస్తే అది లాటానుప్రాసాలంకారం. సమన్వయం : పై వాక్యంలో ‘తండ్రి’ అనే పదం మూడు సార్లు ప్రయోగించబడింది. మూడు పదాలకు ‘నాన్న’ అనే అర్థం. కానీ, ‘తండ్రి తండ్రి’ అంటే ‘అటువంటి తండ్రి మాత్రమే నిజమైన తండ్రి’ అని భావం. అర్థంలో భేదం లేకపోయినా భావంలో భేదం ఉంది. కనుక అది లాటానుప్రాసాలంకారం.

5. కింది సమాస పదాలను వాటి విగ్రహవాక్యాలను పరిశీలించండి.
అధ్యలూ భావ సమాసం

సమాస పదంవిగ్రహవాక్యంప్రథమ పదం
అ) ప్రతిదినముదినము, దినము(ప్రతి – అవ్యయం)
ఆ) యథాశక్తిశక్తిననుసరించి(యథా – అవ్యయం)
ఇ) ఆబాలగోపాలంబాలుడి నుండి గోపాలుడి వరకు(ఆబాల – అవ్యయం)
ఈ) మధ్యాహ్నంఅహ్నం యొక్క మధ్యభాగం(మధ్య – అవ్యయం)
ఉ) అనువర్షంవర్షముననుసరించి(అను – అవ్యయం)

(సూచన : కొందరు ‘మధ్యాహ్నం’ను ‘అహ్నము యొక్క మధ్యము’ అని విగ్రహవాక్యంతో ప్రథమా తత్పురుష సమాసంగా చెప్పారు.)

పైన పేర్కొన్న 5 సమాస పదాలలోనూ పూర్వపదాలైన ప్రతి, యథా, ఆబాల, మధ్య అనేవి అవ్యయాలు. లింగ, విభక్తి, వచనాలు లేనివి అవ్యయ పదాలు.

ఇటువంటి అవ్యయ భావంతో ఏర్పడిన సమాసాలు కనుక పైవి అవ్యయీభావ సమాసాలు.

6. కింది ఉదాహరణలకు విగ్రహవాక్యాలు రాయండి.

అ) అనుకూలం – కూలముననుసరించి – అవ్యయీభావ సమాసం
ఆ) యథామూలం – మూలమును అనుసరించి అవ్యయీభావ సమాసం
ఇ) ప్రతిమాసం – మాసం, మాసం అవ్యయీభావ సమాసం

అదనపు సమాచారము

సంధులు

అ) పాఠంలోని కొన్ని సంధులు
1) సహస్రాబ్దం = సహస్ర + అబ్దం – సవర్ణదీర్ఘ సంధి
2) శతాబ్దం = శత + అబ్దం – సవర్ణదీర్ఘ సంధి
3) సామాజికాభివృద్ధి = సామాజిక + అభివృద్ధి – సవర్ణదీర్ఘ సంధి
4) సాధికారం = స + అధికారం – సవర్ణదీర్ఘ సంధి
5) విద్యాధికులు = విద్యా + అధికులు – సవర్ణదీర్ఘ సంధి
6) సోదాహరణం = స + ఉదాహరణం – గుణసంధి
7) విజయోత్సవం = విజయ + ఉత్సవం – గుణసంధి
8) జీవనోపాధి = జీవన + ఉపాధి – గుణసంధి
9) సంస్కరణోద్యమం = సంస్కరణ + ఉద్యమం – గుణసంధి
10) శతాబ్దపు చరిత్ర = శతాబ్దము + చరిత్ర – పుంప్వాదేశ సంధి
11) మొదటి తరపు డాక్టరు = మొదటితరము + డాక్టరు – పుంప్వాదేశ సంధి
12) ప్రవాహపు వేగం = ప్రవాహము + వేగం – పుంప్వాదేశ సంధి
13) అద్దినట్లు = అద్దిన + అటు – అత్వ సంధి
14) ఏముంటుంది = ఏమి + ఉంటుంది – ఇత్వ సంధి
15) గురయ్యారు = గురి + అయ్యారు – ఇత్వ సంధి
16) బరువెక్కాయి = బరువు + ఎక్కాయి – ఉత్వసంధి
17) గుర్తుంచుకుంటాం = గుర్తు + ఉంచుకుంటాం – ఉత్వసంధి
18) మేమంతా = మేము + అంత – ఉత్వసంధి
19) జగన్నాథ జగత్ + నాథ – అనునాసిక సంధి
20) ఆశ్చర్యపడతాం = ఆశ్చర్యము + పడతాం – పడ్వాది సంధి
21) తాపత్రయపడిన + తాపత్రయము + పడిన – పడ్వాది సంధి
22) మొట్టమొదటగా = మొదటగా + మొదటగా – ఆమ్రేడితద్విరుక్త -టకారాదేశసంధి

సమాసాలు

సమాస పదంవిగ్రహవాక్యంసమాసం పేరు
1) ఆంధ్రదేశము‘ఆంధ్ర’ అనే పేరుగల దేశముసంభావనా పూర్వపద కర్మధారయం
2) స్థలకాలాలుస్థలమును, కాలమునుద్వంద్వ సమాసం
3) విద్యాధికులువిద్యచేత అధికులుతృతీయా తత్పురుష సమాసం
4) స్త్రీల శతాబ్దంస్త్రీల యొక్క శతాబ్దంషష్ఠీ తత్పురుష సమాసం
5) శతాబ్దపు చరిత్రశతాబ్దము యొక్క చరిత్రషష్ఠీ తత్పురుష సమాసం
6) జీవిత విధానంజీవితము యొక్క విధానంషష్ఠీ తత్పురుష సమాసం
7) రథచక్రాలురథము యొక్క చక్రాలుషష్ఠీ తత్పురుష సమాసం
8) చరిత్ర నిర్మాతచరిత్ర యొక్క నిర్మాతషష్ఠీ తత్పురుష సమాసం
9) భిన్నరంగాలుభిన్నములైన రంగాలువిశేషణ పూర్వపద కర్మధారయం
10) కీలకస్థానాలుకీలకమైన స్థానాలువిశేషణ పూర్వపద కర్మధారయం
11) ముఖ్యవివరాలుముఖ్యమైన వివరాలువిశేషణ పూర్వపద కర్మధారయం
12) సామాన్య స్త్రీలుసామాన్యులైన స్త్రీలువిశేషణ పూర్వపద కర్మధారయం
13) ప్రతికూల పరిస్థితులుప్రతికూలములైన పరిస్థితులువిశేషణ పూర్వపద కర్మధారయం
14) కొత్తకలలుకొత్తవైన కలలువిశేషణ పూర్వపద కర్మధారయం
15) ప్రతిరంగమురంగము, రంగముఅవ్యయీభావ సమాసం

పీఠిక రచయితుల పరిచయం

1) ఓల్గా :
ప్రముఖ రచయిత్రి. ఎన్నో పుస్తకాలకు సంపాదకత్వం నిర్వహించారు. ఈమె పలు పురస్కారాలను, అవార్డులను అందుకొన్నారు. వీరి ‘స్వేచ్ఛ’ నవల ప్రసిద్ధి పొందింది.

2) వసంత కన్నబిరాన్ :
ఈమె మానవ హక్కులు, స్త్రీ సమానత్వం కోసం కృషి చేస్తున్నారు. నేషనల్ అలయెన్స్ ఆఫ్ ఉమెన్, ఇండియన్ నేషనల్ సోషల్ యాక్షన్ ఫోరంలో పనిచేస్తున్నారు.

3) కల్పన కన్నబిరాన్ :
‘సెంటర్ ఫర్ నేషనల్ డెవలప్ మెంట్’ (హైదరాబాద్) సంచాలకులుగా పనిచేస్తున్నారు. జెండర్ స్టడీస్, క్రిమినల్ లో విస్తృత అధ్యయనం, పరిశోధనలు చేశారు.

కఠిన పదాలకు అర్థాలు

1వ పేరా

సహస్ర + అల్లం = వెయ్యి సంవత్సరాలు
పరామర్శ = చక్కని విచారణ
స్మరించుకోవడం = గుర్తు చేసుకోవడం
ఉత్సవం = పండుగ

2వ పేరా
రాణించిన = ఒప్పిన

3వ పేరా
సంఘర్షణ = రాపిడి
జగన్నాథ రథచక్రాలు = కాలగమనం (కాలం భగవత్స్వరూపం కనుక విష్ణువు రథచక్రాలు)
మూల్యం = వెల
గుండెలు బరువెక్కడం = చాలా బాధ కలగడం
ప్రేరణ = సిద్ధపరచడం

4వ పేరా
ప్రెసిడెన్సి = ఆధిపత్యము

అలోచించండి – చెప్పండి

ప్రశ్న 1.
కాలాన్ని పరామర్శించడం అంటే ఏమిటి?
జవాబు:
పరామర్శ అంటే చక్కని విచారణ అని అర్థం. కాలాన్ని పరామర్శించడం అంటే కాలాన్ని చక్కగా విచారించడం. కాలం నాలుగు రకాలు.

  1. భూతకాలం,
  2. భవిషత్ కాలం,
  3. వర్తమాన కాలం,
  4. తద్దర్శకాలం

నాలుగు కాలాలలో స్త్రీల పరిస్థితి గురించి కూలం కషంగా విచారించడం. దానికి కారణాలు, పరిష్కారాలు అన్వేషించడం.

AP SSC 10th Class Telugu Solutions Chapter 7 మా ప్రయత్నం

ప్రశ్న 2.
గడిచిన శతాబ్దాన్ని స్త్రీల శతాబ్దంగా ఎలా చెప్పుకోవచ్చు?
జవాబు:
గడిచిన శతాబ్దంలో అంటే 20వ శతాబ్దంలో చాలా మంది స్త్రీలు అనేక రంగాలలో విజయాలు సాధించారు. రాజకీయ రంగంలో అనిబిసెంట్, మార్గరెట్ థాచర్, ఇందిరాగాంధీ, సిరిమావో భండారు నాయకే మొదలైన వారు. అలాగే విద్యా, వైద్య, సేవా, పరిశోధనా, క్రీడా రంగాలలోనే గాక అనేక రంగాలలో ఆణిముత్యాల వంటి స్త్రీలు ఉన్నారు. పురుషులతో సమానంగా అన్ని రంగాలలో స్త్రీలు పోటీపడి అభివృద్ధిని సాధించిన శతాబ్దం కనుక గడిచిన శతాబ్దాన్ని స్త్రీల శతాబ్దంగా చెప్పుకోవచ్చును.

ప్రశ్న 3.
చరిత్ర ఎలా రూపుదిద్దుకుంటుంది ?
జవాబు:
చరిత్ర చాలా రకాలుగా రూపుదిద్దుకొంటుంది. ఒక ప్రాంతానికి చెందిన మానవుల సాంస్కృతిక రూప కల్పనను, అభివృద్ధిని బట్టి సాంస్కృతిక చరిత్ర రూపుదిద్దుకొంటుంది. మానవుల భాషా వికాసాన్ని భాషాచరిత్ర అంటారు. అలాగే రాజకీయ మార్పులను బట్టి రాజకీయ చరిత్ర ఏర్పడుతుంది. అంటే సామాజికంగా జరిగిన దానిని చరిత్ర అంటారు.

ప్రశ్న 4.
మూల్యం చెల్లించడమంటే అర్థం ఏమిటి?
జవాబు:
మూల్యం అంటే విలువ అని అర్థం. మూల్యం చెల్లించడమంటే విలువ చెల్లించడమని సామాన్యార్థం. ఒక వస్తువును తీసుకొన్నప్పుడు దానికి సమానమైన విలువ గల డబ్బు గాని, సరుకు గాని చెల్లించాలి. అంటే మనం కూడా దానితో సమాన విలువ గలది కోల్పోవాలి. అలాగే ఏదైనా చెడు పని చేస్తే దానికి సమానమైన పరపతిని కోల్పోతాం. అదే మూల్యం చెల్లించడమంటే.

ప్రశ్న 5.
‘సామాన్యుల సాహసం అసామాన్యమనిపించింది’ అని రచయిత్రులు అనడానికి కారణాలు ఏమిటి ?
జవాబు:
సాధారణంగా సామాన్యమైన స్త్రీ తన కుటుంబంతో సర్దుకుపోతుంది. పూర్వకాలపు స్త్రీ తన కుటుంబం గురించి తప్పు, తన గురించి, తన సుఖం గురించి ఆలోచించలేదు. ఇది సామాన్య స్త్రీల స్వభావం. వారేదైనా అందుకు భిన్నంగా ప్రవర్తించినా, ఆలోచించినా అనేక చికాకులు వారికి కలిగేవి. వాస్తవ పరిస్థితులన్నీ ప్రతికూలంగా మారిపోతాయి. అటువంటి ప్రతికూల పరిస్థితులతో తలపడుతూ, కొత్త జీవిత విధానాలను కనుగొనాలంటే ఎంత కష్టం ? అటువంటి పరీక్షలకు నిలబడి, ఎదురొడ్డి తమ కలలను సాకారం చేసుకొన్న పూర్వకాలపు సామాన్య స్త్రీల సాహసం రచయిత్రులకు అసామాన్యమనిపించింది.

5వ పేరా
నిష్ణాతులు కాలధర్మం విపులము క్లుప్తం నీరు కారడం
= పూర్తిగా తెలిసినవారు = మరణం = సవిస్తరము = సంక్షిప్తం = నిరుత్సాహపడటం

6వ వరా
ఉద్వేగం = కలత నొందుట

9వ పేరా
తాపత్రయం = బాధ (ఆధ్యాత్మికం, అధిభౌతికం, అధిదైవికం అను మూడూ తాపత్రయం)

10వ పేరా
పితృస్వామ్యం = తండ్రికి అధికారంగల వ్యవస్థ
కళ్ళకు కట్టింది = బాగా అర్థమైంది

11వ పేరా
అనువైన = తగిన

12వ పేరా
వెసులుబాటు = తీరుబడి
అడుగు పెట్టడం = ప్రారంభించడం

14వ పేరా
గ్లోసరీ = సాంకేతిక పదముల నిఘంటువు, పదకోశం
అమూల్యమైన = విలువైన

అలోచించండి – చెప్పండి

ప్రశ్న 1.
‘ముద్రవేయడం’ అంటే ఏమిటి?
జవాబు:
ముద్ర అంటే ఒకదాన్ని శాశ్వతంగా ఉండేలా చేయడం. మానవ స్వభావాలు అనేక రకాలు. కొందరికి, కొన్ని ఆశయాలు ఉంటాయి. ఆ ఆశయాలు సామాన్యులవైతే, అవి వారితోనే ఉంటాయి. వారి కుటుంబాల పైనే ఆ ఆశయాల ముద్రలు ఉంటాయి. అదే నాయకులవైతే, వాటి ముద్రలు సమాజంలో ఉంటాయి. ఏ రంగంలోనైనా, ఆ రంగంలో విశేష కృషి చేసినవారి ఆశయాలు, ఆలోచనలు కార్యరూపంలో శాశ్వతంగా ఉంటాయి. అంటే వారు ఆ రంగంలో తమదైన ముద్ర వేశారని అర్థం.

AP SSC 10th Class Telugu Solutions Chapter 7 మా ప్రయత్నం

ప్రశ్న 2.
సంస్కరణోద్యమ రథచక్రాల కింద నలగడమంటే ఏమిటి?
జవాబు:
సంస్కరణోద్యమం అనేది రథం. అది వేగంగా నడవాలంటే మార్పులు అనే చక్రాలు కావాలి. ఈ మార్పులు జరిగేటపుడు కొందరికి బాధ కలుగుతుంది. ఒకప్పుడు సమాజానికి తప్పుగా కనిపించింది, కొన్నాళ్ళకు ఒప్పుగా కనబడుతుంది. కానీ, ఆ తప్పుగా కనబడిన రోజులలో ఎంతోమంది బాధపడతారు. ఉదాహరణకు ఒకప్పుడు స్త్రీ సినిమాలలో నటించడం తప్పు. కానీ నేడు కాదు. ఆనాటి సంస్కరణోద్యమాలు దానిని తప్పు పట్టడం వలన ఎంతోమంది స్త్రీలు వేదన చెందారు. ఎన్నో కుటుంబాలు తీవ్రమైన మానసిక వ్యధను అనుభవించాయి. అదే సంస్కరణోద్యమ రథచక్రాల కింద నలగడమంటే అర్థం.

ప్రశ్న 3.
“ప్రతివాళ్ళూ ప్రశ్నించారు చరిత్రను మార్చటానికి” అని స్త్రీల గురించి రచయిత్రులు ఎందుకన్నారు?
జవాబు:
కేవలం సంఘసంస్కరణ, చరిత్రను మార్చడం మగవారికే సాధ్యం అనుకొంటే పొరబాటు. అనేకమంది స్త్రీలు చరిత్రను మార్చటానికి ప్రశ్నించారని రచయిత్రుల ఉద్దేశం. కందుకూరి రాజ్యలక్ష్మిగారు స్త్రీ విద్య గురించి ఉద్యమించారు. బాల్య వివాహాలను ప్రతిఘటించారు. భర్త చనిపోయిన స్త్రీలకు మళ్ళీ వివాహాలు చేయాలని పోరాడారు. చేశారు. అలాగే ఎంతోమంది స్త్రీలు మార్పుకోసం పోరాడారు. తమ జీవితాలలో, సామాజిక జీవనరంగంలో కొత్త అర్థాలనూ, వెలుగులనూ సృష్టించాలని తాపత్రయపడ్డారు. కనుకనే “ప్రతివాళ్ళూ ప్రశ్నించారు చరిత్రను మార్చటానికి” అని స్త్రీల గురించి రచయిత్రులు అన్నారు.

ప్రశ్న 4.
కొత్త అర్థాలు, వెలుగుల సృష్టి ఎలా సాధ్యమవుతుంది?
జవాబు:
గతంలో సామాజికంగా స్త్రీల జీవితాలలో కొత్తదనం ఉండేది కాదు. అంటే స్త్రీలు కేవలం చాకిరీకి, పిల్లలను కనడానికే అని పూర్వకాలపు సమాజం భావించేది. కానీ విద్య, ఉద్యోగం మొదలైన వాటిలో అభివృద్ధిని సాధించి, స్త్రీలు తమ జీవితాలలో కొత్త అర్థాలను సాధించారు. అలా కొత్త అర్థాలు సాధించి తమ జీవితాలలో స్త్రీలు జ్ఞానజ్యోతులను వెలిగించుకున్నారు. ఆ జ్ఞానజ్యోతుల వెలుగులలో నూతన ఉత్తేజంతో జీవితాలను ఆనంద మయం చేసుకొంటున్నారు.

AP SSC 10th Class Telugu Solutions Chapter 5 ధన్యుడు

AP State Board Syllabus AP SSC 10th Class Telugu Solutions 5th Lesson ధన్యుడు Textbook Questions and Answers.

AP State Syllabus SSC 10th Class Telugu Solutions 5th Lesson ధన్యుడు

10th Class Telugu 5th Lesson ధన్యుడు Textbook Questions and Answers

ఉన్ముఖీకరణ : చదవండి – ఆలోచించి చెప్పండి

లఘుపతనతుండు మంథరునితో నిట్లనియె. “చెలితాఁడా! యీ మూషిక రాజును నీవు మిక్కిలి | సమ్మానింపుము. ఇతఁడు పుణ్యకరులలోపల ధురీణుఁడు, గుణరత్నాకరుఁడు, హిరణ్యకుఁ డనువాఁడు. ఈతని గుణములు శేషుఁడు సహితము వర్ణింపజాలఁడు. నే నేపాటివాడఁను” అని పలికి మొదటి నుండి హిరణ్యకుని వృత్తాంతము సర్వము వినిపించెను. అంతట మంథరుఁడు హిరణ్యకుని మిక్కిలి సమ్మానించి యిట్లనియె. “హిరణ్యతా! నీవు నిర్జన వనమునందు వాసము చేయుటకు నిమిత్తమేమి ? చెప్పుము” అని యడిగెను. హిరణ్యకుఁడిట్లనియె.

ఈ ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
ఇలాంటి శైలిలో ఉన్న పాఠాలను చదివారా? లేదా? (ఈ రూపంలో ఉన్న మీకు తెలిసిన పుస్తకాల పేర్లు చెప్పండి.)
జవాబు:
ఇలాంటి భాషతో ఉన్న పాఠాలను చదివాము. 7వ తరగతిలో ‘దురాశ పాఠమును చదివాము. అది పరవస్తు చిన్నయసూరి గారు రచించిన నీతిచంద్రిక లోనిది. 9వ తరగతిలో ‘స్వభాష’ పాఠం చదివాము. ఇది పానుగంటి గారి రచన.

పానుగంటి లక్ష్మీనరసింహారావుగారు రచించిన సాక్షి వ్యాసాలు ఇటువంటి రచనే. కందుకూరి వీరేశలింగం పంతులు గారు రచించిన సంధి, విగ్రహం ఇటువంటివే. అడవి బాపిరాజు గారు, కోలాంచల కవి, ఏనుగుల వీరాస్వామి, మధిర సుబ్బన్న దీక్షితులు, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి మొదలైన వారి రచనలు ఇట్టివే.

ప్రశ్న 2.
మంథరుడు ఎవరి వృత్తాంతాన్ని విన్నాడు?
జవాబు:
మంథరుడు హిరణ్యకుని వృత్తాంతాన్ని విన్నాడు. దానిని లఘుపతనకుడు చెప్పాడు.

AP SSC 10th Class Telugu Solutions Chapter 5 ధన్యుడు

ప్రశ్న 3.
హిరణ్యకుని నివాసమెక్కడ?
జవాబు:
హిరణ్యకుని నివాసము నిర్జన వనము.

ప్రశ్న 4.
హిరణ్యకుడు తన నివాసం గురించి ఏం చెప్పి ఉంటాడు?
జవాబు:
“హిరణ్యకా! నీవు నిర్జన వనము నందు వాసము చేయుటకు నిమిత్తమేమి? చెప్పుము” అని మంథరుడు అడిగిన దానిని బట్టి ఆ నిర్జన వనము హిరణ్యకుని నివాసము కాదని తెలుస్తోంది. అక్కడకు చేరకముందు హిరణ్యకునిది మంచి నివాసమే అయి ఉండును. అక్కడ ఏదో బాధ కలగడం వలన దాని మకాం నిర్జన వనానికి మారి ఉండును. బహుశా ఆ కారణాలన్నీ మంథరునితో చెప్పి ఉంటాడు.
(ఇంకా అనేక ప్రశ్నలడిగి పిల్లలందరిచేత మాట్లాడించాలి.)

1. అవగాహన-ప్రతిస్పందన

ప్రశ్న 1.
చూడాకర్ణుని మాటలను బట్టి మీకర్ణమైన విషయమేమి? దానిపై మీ అభిప్రాయమేమిటో చెప్పండి.
జవాబు:
చూడాకర్ణుని మాటలను బట్టి ధనము కలవాడే బలవంతుడని తెలిసింది. ధనముగల వాడే పండితుడు. ధనము లేకపోతే బలహీనుడౌతాడు. ధనము ఉంటే బలం పెరుగుతుందని, ధనవంతునికి సాధ్యము కానిది లేదని తెలిసింది. అన్ని ‘ శుభములకు ధనమే మూలమని చూడాకరుని అభిప్రాయమని అతని మాటలను బట్టి తెలిసింది.

కేవలం ధనం ఉంటే గొప్పవాడు కాదని నా అభిప్రాయం. ఎంత ధనం ఉన్నా వివేకం లేకపోతే ప్రయోజనం లేదు. ఆ వివేకం రావాలంటే విద్య కావాలి. ‘విద్యా ధనం సర్వ ధన ప్రధానమ్’ అని ఆర్యోక్తి. అందుచేత విద్యను మించిన ధనం లేదు. మూర్యుడు తన ఇంటిలోనే గౌరవింపబడతాడు. ధనవంతుడు తన గ్రామంలోనే గౌరవింపబడతాడు. రాజు తన రాజ్యంలోనే గౌరవింపబడతాడు కానీ, విద్యావంతుడు భూమండలమంతా గౌరవింపబడతాడు. మంచి పనుల కోసం ధనాన్ని విడిచిపెట్టాలి. కాని, ధనం కోసం కీర్తిని, మంచి పనులను, విద్యను, వివేకాన్ని విడిచిపెట్టకూడదు.

AP SSC 10th Class Telugu Solutions Chapter 5 ధన్యుడు

ప్రశ్న 2.
“ఆహా! ధనలోభము సర్వయాపదలకు మూలము కదా!” ఈ విషయాన్ని సమర్థిస్తూ, వ్యతిరేకిస్తూ మీ అభిప్రాయాలు చెప్పండి.
జవాబు:
ధనం పట్ల పిసినిగొట్టుతనం అన్ని కష్టాలకు, ప్రమాదాలకు మూలమని దీని భావం.

సమర్థన:
ధనమును ఖర్చు పెట్టనిదే సౌఖ్యం దొరకదు. ధన సంపాదనే ధ్యేయంగా ఉంటే గౌరవం పోతుంది. కీర్తి పోతుంది. ఆరోగ్యం పాడవుతుంది. ధనం కోసం మంచి, చెడు మరచిపోతాము. స్నేహితులు, బంధువులు అందరినీ పోగొట్టుకుంటాము. విలువైన జీవితకాలంలో సంపాదించవలసిన జ్ఞానం సంపాదించలేము. అన్నిటినీ కోల్పోతాము. ధనం మాత్రమే మిగులుతుంది. అందుచేత ధనలోభం మంచిది కాదు.

వ్యతిరేకత :
ధనమును మితిమీరి ఖర్చు చేయడం దారిద్ర్యానికి దగ్గర దారి. ధనం లేకపోతే ఎవరూ పలకరించరు. సమాజంలో గౌరవస్థానం ఉండదు. హోదా ఉండదు. ధనం లేకపోతే ఏ పుణ్యకార్యాలు చేయలేము. దానధర్మాలకు ధనం కావాలి. పేదవాని కోపం పెదవికి చేటు. ధనవంతుని కోపం ధరణికే చేటు. ధనలోభం గలవారే ముందు తరాల వారికి కూడా సంపదను కూడబెట్టగలరు. ధనలోభం గలవారే లక్ష్మీపుత్రులు. సిరిసంపదలతో తులతూగుతారు. నచ్చిన ఆహారం తినగలరు. చక్కగా, విలాసవంతంగా బ్రతకగలరు. అనారోగ్యం వచ్చినా ఖరీదైన వైద్యం చేయించుకోగలరు. అందుకే “పశువుకు తిన్నది బలం. మనిషికి ఉన్నది బిలం” అన్నారు. కలిమి కలవాడే కలవాడు. లేనివాడు లేనివాడే కదా!

ప్రశ్న 3.
ఈ పాఠానికి పెట్టిన శీర్షికను విశ్లేషిస్తూ చెప్పండి.
జవాబు:
ఈ పాఠానికి ఉన్న శీర్షిక ‘ధన్యుడు’. ధన్యుడు ఎవరనేది పాఠ్య రచయిత స్పష్టంగా చెప్పాడు. ‘ఉదరముకయి పరుల గోఁజక ప్రాప్తిలాభమునకు సంతోషించువాఁడొక్కడు లోకమందు ధన్యుడు’ అని మూడవ పేరాలో హిరణ్యకుని చేత రచయిత (చిన్నయసూరి) చెప్పించాడు.

సన్న్యాసికి ధనం మీద వ్యామోహం ఉండకూడదు. కాని, చూడాకర్ణుడనే సన్న్యాసికి ధనమే గొప్పదనే భావం ఉంది. ధనహీనుని చేయడానికి హిరణ్యకుని బాధించాడు. అతని వేషం సన్న్యాసి వేషం, మనసు మాత్రం క్రూరమైనది.

హిరణ్యకుడు ధనం పోగుచేసినాడు. అది పోగానే జ్ఞానం కలిగింది. తన పొట్ట నింపుకోవడానికి ఇతరులను బాధించకూడదనే జ్ఞానం పొందాడు. ధన్యుడయ్యాడు.

ధన్యుడు కావాలంటే వేషం కాదు, ఆత్మ పరిశీలన కావాలి. ఆత్మ పరిశీలనతో తనను తాను ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలి . అని చెప్పకుండానే పాత్రల ద్వారా, సన్నివేశాల ద్వారా నిరూపించిన ఈ పాఠానికి ‘ధన్యుడు’ అనే శీర్షిక చక్కగా సరిపోయింది.

AP SSC 10th Class Telugu Solutions Chapter 5 ధన్యుడు

ప్రశ్న 4.
ఈ కింది వాక్యాలు ఎవరు, ఎవరితో అన్నారో గుర్తించి రాయండి.

అ) “అనృత మాడుట కంటె మౌనము మేలు.”
జవాబు:
పరిచయం :
ఈ వాక్యం పరవస్తు చిన్నయసూరి రచించిన నీతిచంద్రికలోని మిత్రలాభం నుండి గ్రహింపబడిన ధన్యుడు అను పాఠంలోనిది.

సందర్భం :
చూడాకర్ణుని చేతిలో తన సర్వస్వము కోల్పోయిన హిరణ్యకుడు ఒక అడవిలో ఉండెను. తన గతమును మంథరునితో చెప్పుచున్న సందర్భంలో పలికిన వాక్యమిది. భావం : అసత్యము పలకడం కంటే మౌనంగా ఉండడం మంచిది.

ఆ) “దీని కేమైనను నిమిత్తము లేక మానదు.”
జవాబు:
పరిచయం :
ఈ వాక్యం పరవస్తు చిన్నయసూరి రచించిన నీతిచంద్రికలోని మిత్రలాభం నుండి గ్రహింపబడిన ధన్యుడు అను పాఠంలోనిది.

సందర్భం :
చంపకవతి అనే పట్టణంలోని చూడాకర్ణుని వద్దకు వీణాకర్ణుడు వచ్చాడు. మాటలలో చూడాకర్ణుడు తను చిలుకకొయ్య పై పెట్టిన ఆహారాన్ని హిరణ్యకుడు కాజేస్తున్న విషయం చెప్పాడు. ఒక ఎలుక చిలుక
కొయ్యపైకి ఎగరడానికి బలమైన కారణమేదో ఉండాలని వీణాకర్ణుడు పలికిన సందర్భంలోని వాక్యమిది.

భావం :
ఒక ఎలుక చిలుకకొయ్య అంత ఎత్తు ఎగరడానికి తప్పనిసరిగా ఏదో కారణం ఉంటుంది.

ఇ) “సత్సంగతి కంటే లోకమందు మేలేదియు లేదు.”
జవాబు:
పరిచయం :
ఈ వాక్యం పరవస్తు చిన్నయసూరి రచించిన నీతిచంద్రికలోని మిత్రలాభం నుండి గ్రహింపబడిన ధన్యుడు అను పాఠంలోనిది.

సందర్భం :
తన గతమును మంథరునితో హిరణ్యకుడు చెప్పాడు. తన సర్వస్వం కోల్పోయి అరణ్యానికి చేరానన్నాడు. ఆ నిర్జనారణ్యంలో లఘుపతనకునితో తనకు స్నేహం ఏర్పడడం తన అదృష్టమని చెప్తూ పలికిన వాక్యమిది.

భావం :
మంచివారితో స్నేహం కంటే మంచిదేదీ ఈ లోకంలో లేదు.

ప్రశ్న 5.
కింది పద్యాన్ని చదివి, భారాన్ని పూరించండి.
“ఒక్కడె చాలు నిశ్చల బలోన్నతుఁ డెంతటి కార్యమైన దాఁ
జక్కనొనర్చుఁగారవు లసంఖ్యులు పట్టిన ధేనుకోటులం
జక్కగనీక తబలసేన ననేక శిలీముఖంబులన్
మొక్కవడంగ జేసి తుదముట్టఁడె యొక్క కిరీటి భాస్కరా!

భావం:
………………………. ఎంతటి పని ఐనా ……………………… ఆవుల మందను .. ……………… తన బాణాలతో ఆ బలమైన …………….. అర్జునుడే కదా!
జవాబు:
ఒక బలవంతుడు చాలు ఎంతటి పని అయినా చేయడానికి. కౌరవులనేకమంది పట్టిన ఆవుల మందను విడిపించాడు. వాడియైన , 5 బాణాలతో ఆ బలమైన సైన్యాన్ని బాధించి, విజయం సాధించినవాడు అర్జునుడే కదా !

II. వృశికరణ-సృజనాత్మకత

1. కింది ప్రశ్నలకు ఐదు వాక్యాలలో సమాధానాలు రాయండి.

అ) “సంసార విషవృక్షమునకు రెండు ఫలము లమృతతుల్యములు” పాఠాన్ని ఆధారంగా చేసుకొని దీన్ని గురించి వివరించండి.
జవాబు:
సంసార విషవృక్షానికి రెండు ఫలాలు అమృతంతో సమానమైనవి. అవి :

  1. కావ్యమునందలి అమృతము వంటి మంచి విషయమును తెలుసుకొనడం.
  2. మంచివారితో స్నేహం.

ప్రస్తుత పాఠం పరిశీలించినట్లైతే హిరణ్యకుడు సంసారంపై వ్యామోహంతో చాలా సంపాదించి దాచాడు. అంటే సంసారమనే విషవృక్షానికి తనను తానే బఁ “ని చేసుకొన్నాడు. ఆ ధనమదంతో చూడాకర్ణుని ఆహారాన్ని చిలుక కొయ్యపైకి ఎగిరి కాజేసేవాడు. ఎంతో గర్వంతో బ్రతికాడు. ఆ సన్న్యాసిని ముప్పుతిప్పలు పెట్టాడు.

సంపాదించినదంతా పోయింది. చూడాకర్ణుడు ఎలుక కలుగును త్రవ్వి, దాని సంపదంతా హరించాడు. అప్పటితో హిరణ్యకుని ధన గర్వం తగ్గింది. వీణాకర్ణుని మాటలతో అజ్ఞానం పోయింది. ధనం కలవాడే బలవంతుడు. ధనం లేనివాడు మరణించినట్లే అని వీణాకర్ణుడు చెప్పాడు. దానితో పర ధనం మీద వ్యా మోహం విడిచిపెట్టి అడవికి చేరాడు. ఆ సన్న్యాసి చెప్పిన మంచిమాటలు కావ్యామృతం వంటివి.

రెండవ ఫలం సజ్జన స్నేహం. అది లఘుపతనకునితో స్నేహం. లఘుపతనకుని వంటి ఉత్తమునితో స్నేహం ఏర్పడింది. దానితో హిరణ్యకునికి పరిపూర్ణంగా జ్ఞానం కలిగింది. ఈ విధంగా హిరణ్యకుడు ధన్యుడయ్యాడు.

ఆ) “వివేకహీనుడైన ప్రభువును సేవించుటకంటె వనవాస ముత్తమం” – దీని ఔచిత్యాన్ని గురించి చర్చించండి.
జవాబు:
వివేకవంతుడైన ప్రభువు తన వారి గురించి ఆలోచిస్తాడు. తనను సేవించే వారి సౌఖ్యానికి ప్రాధాన్యం ఇస్తాడు. సేవకులకు సౌఖ్యాలు కల్పిస్తే నిరంతరం ప్రభువు సేవలో అప్రమత్తులై ఉంటారు.

వివేకహీనుడైన ప్రభువు తనగురించి ఆలోచిస్తాడు. తన సౌఖ్యమే చూసుకొంటాడు. తన సేవకులను పట్టించుకోడు. సేవకులకు జీతభత్యాలను సక్రమంగా ఇవ్వడు. దానితో అర్ధాకలి బ్రతుకులు తప్పవు. అర్ధాకలి భరించలేక డబ్బుకోసం తప్పులు చేయాలి. అంటే ప్రభు ద్రోహానికి పాల్పడాలి. అది మహాపాపం. మన శక్తియుక్తులన్నీ రాజు క్షేమానికి ఉపయోగపడాలి. కాని, వివేకహీనుడైన ప్రభువు విషయంలో అది సాధ్యం కాదు. అందుచేత అటువంటి ప్రభువు సేవను విడిచిపెట్టి వనవాసం చేయడం నయం. అడవిలో దుంపలు, పళ్ళు తింటూ దైవధ్యానం చేసుకొంటూ మునుల వలే జీవించడం మంచిది. వివేకహీనుడైన ప్రభువు రక్షించడు. అడవిలోనూ రక్షణ ఉండదు. కాని, వివేకహీనుడైన ప్రభువును సేవించలేక పాపాలు చేయాలి. అడవిలో అయితే పుణ్యం సంపాదించుకోవచ్చు. అందుచేత వివేకం లేని ప్రభువును సేవించడం కంటే వనవాసమే మంచిది.

AP SSC 10th Class Telugu Solutions Chapter 5 ధన్యుడు

ఇ) చిన్నయసూరిని గూర్చిన విశేషాలు రాయండి.
జవాబు:

  1. పరవస్తు చిన్నయసూరి తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లాలో “శ్రీ పెరంబుదూర్”లో జన్మించాడు. ఈయన మద్రాసులోని పచ్చయప్ప కళాశాలలో తెలుగు పండితుడుగా పనిచేశాడు.
  2. ఈయన తమిళం, సంస్కృతం, తెలుగు, ఇంగ్లీషు భాషలలో మంచి పండితుడు. ‘సూరి’ అనేది ఈయన బిరుదు.
  3. చిన్నయసూరి బాలవ్యాకరణం, నీతిచంద్రిక, సూత్రాంధ్ర వ్యాకరణం, శబ్దలక్షణసంగ్రహం వంటి గ్రంథాలు రాశాడు. ఈయన రాసిన బాలవ్యాకరణం నేటికీ ప్రామాణిక గ్రంథం.

2. కింది ప్రశ్నలకు పది వాక్యాలలో సమాధానాలు రాయండి.

అ) ‘అర్థనాశం, మనస్తాపం, గృహమందలి దుశ్చరితం, వంచనం, పరాభవం’ – ఈ పదాల గురించి మీరు ఏరకంగా అర్థం చేసుకున్నారో సోదాహరణంగా రాయండి.
జవాబు:
అర్థనాశం :
అర్థనాశం అంటే డబ్బు నశించిపోవడం, కష్టపడి సంపాదించినదంతా, తనకు, తనవారికి కాకుండా పోవడం. ‘ధన్యుడు’ కథలో హిరణ్యకుడు ఎంతో కష్టపడి, ఎన్నో రోజులు కూడబెట్టాడు. కూడబెట్టిన ధనమంతా తన కలుగులో దాచుకొన్నాడు. చూడాకర్ణుడు గునపంతో ఆ కలుగు తవ్వి ఆ సంపదంతా కొల్లగొట్టాడు. హిరణ్యకునికి అర్థనాశం కలిగింది.

మనస్తాపం :
మనసుకు బాధ కలగడం. చేయని తప్పుకు నిందమోపినా మనస్తాపం కలుగుతుంది. సంపదంతా పోయినా మనస్తాపం కలుగుతుంది. హిరణ్యకుని సంపదంతా పోవడం వలన మనస్తాపం కలిగింది.

గృహమందలి దుశ్చరితం :
మన ఇంట్లో అందరూ సమాజంలో మంచి పేరు తెచ్చుకొంటే ఆనందం. ఎవరైనా కొందరు చెడ్డ పేరు తెచ్చుకొంటే అది ఇంట్లో వారందరినీ బాధిస్తుంది. సమాజంలో ఆ ఇంటికి గౌరవం తగ్గుతుంది. అందరూ చులకనగా చూస్తారు. హిరణ్యకుని సంపద పోయాక అక్కడ ఉండలేక అడవికి వెళ్లిపోయింది.

వంచనం:
వంచనం అంటే మోసం. మనం మోసం చేయడం తప్పు. మోసపోవడం అవమానం. హిరణ్యకుడు రోజూ చూడాకర్ణుని వంచించి ఆహారం దొంగిలించాడు. తన సంపద పోయాక ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసుకున్నాడు.

పరాభవం :
పరాభవం అంటే అవమానం. పరాభవం జరిగితే ఎవరికీ చెప్పుకోకూడదు. చెప్పుకొంటే గౌరవం పోతుంది. ఈ పాఠంలో హిరణ్యకుని సంపదంతా చూడాకర్ణుడు కొల్లగొట్టాడు. అప్పుడు హిరణ్యకునికి విరక్తి కలిగింది. పరాభవం జరిగినచోట ఉండకూడదని అడవిలోకి మకాం మార్చాడు.

ఆ) మంథరుని మాటలను మీరు సమర్థిస్తారా? ఎందుకు?
జవాబు:
మంథరుడు “ధనము, యౌవనము, నిత్యములు కావనీ, జీవితం బుడగవంటిదనీ సత్యము” చెప్పాడు. ధనము ఏదో రకంగా పోవచ్చు. వయస్సు తరిగి పోయి, మరణం వస్తుంది. ప్రాణం, నీటిమీద బుడగలా ఎప్పుడయినా పోవచ్చు. ఇవన్నీ కఠోర సత్యములు.

అందువల్ల బుద్ధిమంతుడు ధనము, యౌవనము, ప్రాణము ఉన్నప్పుడే, ధర్మములు చేయాలి. లేకపోతే తరువాత బాధపడవలసి వస్తుంది. కాబట్టి మంథరుని మాటలను, నేను గట్టిగా సమర్థిస్తాను.

3. కింది అంశాలకు సృజనాత్మకంగా ప్రశంసిస్తూ రాయండి.

అ) చూడాకర్ణునికి, వీణాకర్ణునికి మధ్య జరిగిన మాటలను సంభాషణా రూపంలో రాయండి.
జవాబు:
చూడాకర్ణుడు : రండి, మిత్రమా ! వీణాకర్ణా! కూర్చోండి.

వీణాకర్ణుడు – : (కూర్చొని) ఏమిటి విశేషాలు?

చూడాకర్ణుడు : (గిలుక కల్బుతో నేలమీద కొడుతూ) ఏమున్నాయి. మీరు రావడమే విశేషం.

వీణాకర్ణుడు : అదేమిటి ? అలా నేలపై కొడుతున్నారెందుకు?

చూడాకర్ణుడు : ఎలుకను బెదిరించడానికి,

వీణాకర్ణుడు : మరి, పైకి చూస్తున్నారెందుకు?

చూడాకర్ణుడు : ప్రతిరోజూ చిలుకకొయ్యమీద దాచుకొన్న అన్నం ఒక ఎలుక తినేస్తోంది. దాని బాధ పడలేకపోతున్నాను.

వీణాకర్ణుడు : చిలుకకొయ్య ఎక్కడ? ఎలుక ఎక్కడ? అంత చిన్న ఎలుక అంత ఎత్తు ఎగురుతోందా? అయితే ఏదో బలమైన కారణం ఉండి ఉంటుంది.

చూడాకర్ణుడు : చాలాకాలం నుండీ ఎలుక ఒక కన్నంలో ఉంది. దానికి కారణం తెలియట్లేదు. తవ్వి చూస్తాను.

వీణాకర్ణుడు : ఏమైనా దొరికిందా?

చూడాకర్ణుడు : చూడండి! ఎంత ఆహారం దాచిందో. దీని బలమంతా ఈ సంపదే. ఈ సంపదంతా లాగేస్తాను.

వీణాకర్ణుడు : పూర్తిగా లాగేయండి. ఏదీ వదలకండి.

చూడాకర్ణుడు : చూడండి. పూర్తిగా ఖాళీ చేసేశాను. ఇంక దీని పని అయిపోయింది.

వీణాకర్ణుడు : ఆ ఎలుక చూడండి. ఎంత మెల్లిగా కదులుతోందో ! బక్కచిక్కిపోయింది కదా ! ఎందుకంటారండీ! అంతలా కృశించిపోయింది.

చూడాకర్ణుడు : ధనం కలవాడే బలవంతుడు. ధనం ఉన్నవాడే పండితుడు.

వీణాకర్ణుడు : ధనం లేకపోతే ఏమవుతుంది?

చూడాకర్ణుడు : ధనం లేకపోతే నిరంతరం బాధగా ఉంటుంది. ఆ బాధలో బుద్ది పనిచేయదు. బుర్ర పనిచేయకుంటే అన్ని పనులూ పాడవుతాయి. సమస్తం శూన్యమవుతుంది.

వీణాకర్ణుడు : దరిద్రం అంత బాధాకరమా?

చూడాకర్ణుడు : దారిద్ర్యం చాలా బాధాకరం. అంతకంటే మరణం మంచిది.

వీణాకర్ణుడు : ఇవి విని, ఎలుక వెళ్ళిపోతోందండోయ్.

చూడాకర్ణుడు : ఇంక ఆ ఎలుక రాదు. దాని పీడ నాకు విరగడయ్యింది. అందుకే ‘ఊరక రారు మహాత్ములు’ అన్నారు.

AP SSC 10th Class Telugu Solutions Chapter 5 ధన్యుడు

ఆ) ఈ కథను ఓ చిన్న నాటికగా రాయండి.
జవాబు:
పాత్రలు – చూడాకర్ణుడు, వీణాకర్ణుడు, లఘుపతనకుడు, మంథరుడు, హిరణ్యకుడు.

మంథరుడు : లఘుపతనకా ! మిత్రమా! ఎవరీ కొత్త మిత్రుడు?

లఘుపతనకుడు : స్నేహితుడా ! ఇతను చాలా పుణ్యాత్ముడు. చాలా గొప్పవాడు.

మంథరుడు : ఈ కొత్త మిత్రుని పేరు?

లఘుపతనకుడు : హిరణ్యకుడు. పేరుకు తగ్గట్టే బంగారంలాంటివాడు,

మంథరుడు .: నా స్నేహితుడికి స్నేహితుడవంటే నాకూ స్నేహితుడివే.

హిరణ్యకుడు : అలాగే ! మిత్రమా ! మన ముగ్గురమింక ప్రాణ స్నేహితులం.

మంథరుడు : నీ గురించి చెప్పలేదు. ఈ నిర్ణనవనంలో ఎందుకున్నావు?

హిరణ్యకుడు : అదొక పెద్ద కథ. నా జీవితం ఇప్పటికి కుదుటపడింది.

మంథరుడు : ఏఁ ఏమయ్యింది? మిత్రుని వద్ద దాపరికమా?

హిరణ్యకుడు : లేదు. లేదు. నిన్ను , నా గతంలోకి తీసుకువెళతాను. పద. (చూడాకర్ణుడు, వీణాకర్ణుడు ఉంటారు.)

చూడాకర్ణుడు : మిత్రమా! వీణాకర్ణా! రండి. రండి.

వీణాకర్ణుడు : ఈ చంపకవతీ నగరం వస్తే మిమ్మల్ని చూడందే వెళ్లలేను.

చూడాకర్ణుడు : ఏమిటి విశేషాలు?

వీణాకర్ణుడు : ఏవో మంచి విషయాలు చెబుతారనే వచ్చాను.

చూడాకర్ణుడు : (గిలుక కర్రతో నేలపై కొడుతూ, చిలుకకొయ్య వైపు చూస్తుంటాడు.)

వీణాకర్ణుడు : ఇదేమైనా ఆధ్యాత్మిక సాధనా?

చూడాకర్ణుడు : అదేమీ లేదు. నా తలరాత.

వీణాకర్ణుడు : అదేమిటి?

చూడాకర్ణుడు : ఏం చెప్పనండీ ! ఆ చిలుకకొయ్యపై ఉన్న భిక్షాన్న శేషాన్ని ఒక ఎలుక తినేస్తోంది.

వీణాకర్ణుడు : ఒక ఎలుక అంత ఎత్తు ఎగురుతోందంటే, తప్పకుండా దీని వెనుక ఏదో బలమైన కారణం ఉండి ఉంటుంది.

చూడాకర్ణుడు : అది ఒక కన్నంలో ఉండి, నా ఆహారం దోచుకొంటోంది.

వీణాకర్ణుడు : ఆ కలుగులోనే దాని సంపద ఉంటుంది. తవ్వండి.

చూడాకర్ణుడు : (తవ్వినట్లు నటిస్తూ) అమ్మో ! అమ్మో ! ఎంత సంపద? తవ్వేకొలదీ వస్తోంది. ఇంక దీని పని అయిపోయింది. (ఇంతలో హిరణ్యకుడు కృశించి, మెల్లగా తిరుగుతుంటాడు.)

వీణాకర్ణుడు : పాపం! హిరణ్యకుని చూశారా? ఎంత నీరసపడ్డాడో!

చూడాకర్ణుడు : ధనము కలవాడే బలవంతుడు. ధనం కలవాడే పండితుడు. ధనమే సర్వ శ్రేయాలకు మూలం.

వీణాకర్ణుడు : మరి, ధనం లేకపోతే?

చూడాకర్ణుడు : (నవ్వుతూ) ధనం లేకపోతే నిరంతరం బాధ కలుగుతుంది. ఆ బాధతో వివేకం నశిస్తుంది. వివేకం లేకపోతే ఏ పనీ సాధించలేము. అందరూ దూరమౌతారు.

హిరణ్యకుడు : (ఆలోచిస్తూ తనలో) నిజమే ! ఈ బాధ ఎవరికీ చెప్పుకోలేను. ఈ అవమానం భరించలేను. అయినా ఇక్కడే ఉంటాను. మళ్ళీ సంపాదిస్తాను.

వీణాకర్ణుడు : అదుగోనండోయ్. ఆ ఎలుక మిమ్మల్ని వదల్లేదండోయ్.

చూడాకర్ణుడు : దీని అంతు చూస్తా. (ఎలుకపై కర్ర విసిరాడు)

హిరణ్యకుడు : (తనలో) అమ్మో! చచ్చాను. హమ్మయ్య తప్పించుకొన్నాను. ఇంక ఈ ధనవ్యామోహం వదిలేస్తా. నిర్జనవనానికి పోతాను. ఆ భగవంతుడే కాపాడుతాడు. (మంథరుడు, హిరణ్యకుడు అడవిలో ఉంటారు.)

మంథరుడు : కళ్లకు కట్టినట్లుగా మీ గతం చెప్పారు.

హిరణ్యకుడు : ఇప్పుడు మీ స్నేహంలో నాకది ఒక పీడకల.

లఘుపతనకుడు : మీ ఇద్దరూ నన్ను వదిలేశారు.

మంథరుడు, హిరణ్యకుడు : ప్రాణాలైనా వదుల్తాం కానీ, స్నేహాన్నీ, మంచి స్నేహితులనీ వదలలేం.

భాషా కార్యకలాపాలు ప్రాజెక్టు పని

పాఠశాల గ్రంథాలయంలో పంచతంత్ర కథల పుస్తకంలోని కథలను చదవండి. మీకు నచ్చిన కథను మీ సొంతమాటల్లో రాసి ప్రదర్శించండి.
జవాబు:
మితిమీరిన ఆశ (పంచతంత్ర కథ)
ఒక అడవిలో ఒక నక్క ఉండేది. దానికి ఆశ ఎక్కువ. సింహం, పులి వంటి జంతువులు వేటాడి తినగా మిగిలిన జంతువుల మాంసాన్ని తిని, అది జీవించేది.

ఒకరోజు ఒక వేటగాడు లేడిని చంపి, దాన్ని భుజాన వేసుకొని వస్తున్నాడు. ఇంతట్లో అతడికి ఒక పెద్ద అడవి పంది కనిపించింది. అతడు గురి చూసి పందిపై బాణం వేశాడు. బాణం గురి తప్పింది. పందికి గట్టి గాయం అయ్యింది. పంది కోపంతో వేటగాడిమీదికి దూకి, వాడిని చంపింది. పంది కూడా ప్రాణం విడిచింది. ఒక పాము పంది కాళ్ళ కిందపడి నలిగి చచ్చింది.

ఇంతలో ఆ దారినే వస్తూ నక్క చచ్చి పడియున్న మనిషినీ, పందినీ, పామునూ, లేడినీ చూసింది. ఒక్కసారిగా దానికి ఎంతో మాంసం దొరికింది. దానికి అసలే దురాశ గదా! వేటగాడి బాణంకు ఒక నరం బిగించి ఉంది. మిగిలిన మాంసం తరువాత తినవచ్చు. ముందు ఆ నరం తిందాము అనుకుంది నక్క.

నరాన్ని నక్క కొరికింది. బిగించిన ఆ నరం తెగి, ఊపుగా సాగి, నక్క గుండెను బలంగా తగిలింది. నక్క వెంటనే మరణించింది.

కథలోని నీతి : దురాశ దుఃఖానికి చేటు.

III. భాషాంశాలు

పదజాలం

1. కింది వాక్యాలకు అర్థాన్ని మీ సొంత పదాల్లో రాయండి.

అ) బుద్ధిహీనత వల్ల సమస్తకార్యములు నిదాఘ నదీపూరములట్లు వినాశము నొందును.
జవాబు:
నిదాఘము అంటే వేసవికాలం. నదీ పూరములు అంటే నదులలోని నీటి ప్రవాహాలు, నిదాఘ నదీపూరములు అంటే మండువేసవిలో నదులలోని నీటి ప్రవాహాలు.

పని నెరవేరాలంటే వివేకం కావాలి. అంటే ఏది మంచో, ఏది చెడో తెలియాలి. వివేకం లేకపోతే అన్ని పనులూ వేసవిలో నదీ జలప్రవాహాలవలె ఆవిరైపోతాయి. అంటే పనులన్నీ పాడవుతాయి

ఆ) ధనమును బాసిన క్షణముననే లాతివాఁడగును.
జవాబు:
ధనము ఉంటే స్నేహితులు ఎక్కువవుతారు. అవసరమున్నా, లేకపోయినా అందరూ పలకరిస్తారు. ఇక బంధువులైతే ఏదో వంకతో వస్తారు. బంధువులు కానివారు కూడా ఆ ధనవంతుడు మావాడే అని చెప్పుకొంటారు. మా ఊరువాడు, మా జిల్లా వాడు, మా రాష్ట్రం వాడు, మా దేశం వాడే అని చెప్పుకొంటారు.

కాని ధనం పోతే ఎవ్వరూ పలకరించరు. పరిచయం లేనట్లు ఉంటారు. అందరికీ పరాయివాడు (లాతివాడు) అవుతాడు.

AP SSC 10th Class Telugu Solutions Chapter 5 ధన్యుడు

ఇ) పరధనాపహరణము కంటె దిరియుట మంచిది.
జవాబు:
పరధనము పాము వంటిది. ఇతరుల వస్తువులను వేటినీ దొంగిలించకూడదు. మనకి ఉన్న దానితోటే తృప్తి పడాలి. ‘ లేకపోతే యాచించుట (తిరీయుట) మంచిది. అంటే పరధనాన్ని దొంగిలించడం మంచిది కాదు. అంతకంటె యాచన ద్వారా జీవించడం నయం.

ఈ) ఉదరమునకయి పరుల గోజక ప్రాప్త లాభమునకు సంతోషించు వాఁడొక్కడు లోకమందు ధన్యుడు.
జవాబు:
మన ఉదరము నింపుకోవడానికి అంటే మనం జీవించడం కోసం ఇతరులను పీడించకూడదు. దొరికిన దానితో సంతృప్తి పడుతూ ఆనందంగా జీవించేవాడే ధన్యుడు. అంటే సంతోషమనేది సంతృప్తిని బట్టి ఉంటుంది. కాని, సంపదని బట్టి ఉండదు.

2. కింది పదాలకు ప్రకృతి – వికృతులను పాఠం నుండి వెతికి ఆ వాక్యాలను రాయండి.
అ) బోనం : భోజనము
జవాబు:
అతడు తాను భోజనము చేసి మిగిలిన వంటకము భిక్షాపాత్రలో బెట్టి చిలుకకొయ్యమీద నుంచి నిద్రపోవును.

ఆ) శబ్దం : సద్గు
జవాబు:
నేను సద్దు చేయక దానిమీది కెగిరి ప్రతిదినమావంటకము భక్షించి పోవుచుండును.

ఇ) కర్షం : కార్యము
జవాబు:
బుద్దిహీనత వలన సమస్త కార్యములు నిదాఘ నదీపూరములట్లు వినాశము నొందును.

ఈ) గీము : గృహము
జవాబు:
పుత్ర, మిత్ర, విరహితుని గృహమును, మూర్చుని చిత్తమును శూన్యములు.

ఉ) గారవం : గౌరవము
జవాబు:
సేవా వృత్తి మానమును వలె, యాచనా వృత్తి సమస్త గౌరవమును హరించును.

ఊ) చట్టం : శాస్త్రము
జవాబు:
వాడే సర్వశాస్త్రములు చదివిన వాడు.

ఋ) దమ్మము : ధర్మము
జవాబు:
వాడే సర్వ ధర్మము లాచరించినవాడు.

ఋ) సంతసం : సంతోషము
జవాబు:
ఉదరముకయి పరుల గోజక ప్రాప్తి లాభమునకు సంతోషించు వాడొక్కడు లోకమందు ధన్యుడు.

3. వ్యుత్పత్త్యర్థాలు రాయండి.

అ) పుత్రుడు
జవాబు:
పున్నామ నరకము నుంచి రక్షించువాడు

ఆ) దేహి
జవాబు:
దేహాన్ని ధరించినవాడు

ఇ) ఈశ్వరుడు
జవాబు:
ఐశ్వర్యము ఉన్నవాడు

ఈ) మూషికము
జవాబు:
అన్నాదులను దొంగిలించునది

4. నానార్థాలు రాయండి.

అ) వివరము
జవాబు:
వివరణము, దూషణము

ఆ) వనము
జవాబు:
అడవి, నీరు, గుంపు

ఇ) ఫలము
జవాబు:
పండు, ప్రయోజనము, సంతానం

ఈ) అమృతము
జవాబు:
సోమరసము, వసనాభి, పరబ్రహ్మము

AP SSC 10th Class Telugu Solutions Chapter 5 ధన్యుడు

5. పర్యాయపదాలు రాయండి.

అ) జంతువు
జవాబు:
పశువు, జింక, అన్వేషణము

ఆ) మూర్ధము
జవాబు:
మస్తకము, శీర్షము, ఉత్తమాంగము

ఇ) బలము
జవాబు:
అంబ, బిరుదు, సత్తువ

ఈ) వివరము
జవాబు:
రంధ్రం, బిలం, కలుగు

వ్యాకరణాంశాలు

1. కింది వాక్యాల్లోని సంధి పదాలను గుర్తించి, వాటిని విడదీయండి. అవి ఏ సంధులో సూత్రయుక్తంగా తెల్పండి.

అ) అందుఁ జూడాకర్ణుఁడను పరివ్రాజకుఁడు గలడు.
సంధి పదాలు :

  1. అందుఁజూడాకర్ణుఁడు
  2. చూడాకర్ణుఁడను
  3. పరివ్రాజకుఁడు గలడు.

వివరణ :
సరళాదేశ సంధి

1) అందున్ + చూడాకర్ణుఁడు
సూత్రము 1: ద్రుత ప్రకృతికము మీది పరుషములకు సరళములగు.

అందున్ + చూడాకర్ణుఁడు
సూత్రము 2 : ఆదేశ సరళములకు ముందున్న ద్రుతమునకు బిందు సంశ్లేషలు విభాషగా వస్తాయి.

అందుంజూడాకర్ణుఁడు (పూర్ణబిందు రూపం)
అందుఁజూడాకర్ణుఁడు (అర్ధబిందు రూపం)
అందున్టూడాకర్ణుఁడు (సంశ్లేష రూపం)
అందుజూడాకర్ణుఁడు (విభాష వలన మార్పు రాని రూపం)

2) చూడాకర్ణుఁడను
వివరణ : ఉత్వసంధి
సూత్రము : ఉత్తునకు అచ్చు పరమగునపుడు సంధియగు.
చూడాకర్ణుఁడు + అను – (ఉ + అ = అ)

3) పరివ్రాజకుఁడు గలడు
వివరణ : గసడదవాదేశ సంధి
సూత్రము : ప్రథమ (డు, ము, వు, లు) మీది పరుషములకు (క, చ, ట, త, ప లకు) గ, స, డ, ద, వలు బహుళంబుగానగు.

పరివ్రాజకుఁడు + కలడు = పరివ్రాజకుఁడు గలడు.

ఆ) తడవులఁ బట్టి ఈ యెలుక విడువక వాసము చేయుచున్నది.
సంధి పదాలు :

  1. తడవులఁబట్టి
  2. ఈ యెలుక
  3. చేయుచున్నది

1) తడవులన్ + పట్టి
వివరణ : సరళాదేశ
సంధి సూత్రము 1: ద్రుత ప్రకృతికము మీది పరుషములకు సరళములగు.
తడవులన్ + బట్టి

సూత్రము 2 : ఆదేశ సరళములకు ముందున్న ద్రుతమునకు బిందు సంశ్లేషలు విభాషనగు.
తడవులంబట్టి (పూర్ణబిందు రూపం)
తడవులఁబట్టి (అరబిందు రూపం)
తడవులనబట్టి (సంశ్లేష రూపం)
తడవుల్బట్టి (విభాష వలన మార్పు రాని రూపం)

2) ఈ యెలుక
వివరణ : యడాగమం
ఈ + ఎలుక = ఈ యెలుక.
సూత్రము : సంధి లేనిచోట స్వరంబుకంటే పరమయిన స్వరమునకు యడాగమంబగు.

3) చేయుచున్నది
వివరణ : ఉత్వసంధి
చేయుచు + ఉన్నది = చేయుచున్నది.
సూత్రము : ఉత్తునకు అచ్చు పరమగునపుడు సంధియగు.

పై వాక్యాలలో సరళాదేశ, గసడదవాదేశ, ఉత్వ సంధులు, యడాగమము ఉండటాన్ని గమనించారు కదా ! ఈ పాఠంలో సరళాదేశ, గసడదవాదేశ సంధి పదాలు ఇంకా ఏమేమున్నాయో గుర్తించి, సంధి సూత్రాలను రాయండి.

1. సరళాదేశ సంధి
సూత్రములు :

  1. ద్రుత ప్రకృతికము మీది పరుషములకు సరళములగు.
  2. ఆదేశ సరళములకు ముందున్న ద్రుతమునకు బిందు సంశ్లేషలు విభాషనగు.

పాత్రలోఁబెట్టి = పాత్రలోన్ + పెట్టి
అడుగగాఁజూడాకర్ణుడు = అడుగగాన్ + చూడాకర్ణుడు
తడవులఁబట్టి = తడవులన్ + పట్టి
సంపాదించుకొనఁ జాలక = సంపాదించుకొనన్ + చాలక
ఉండగాఁజూచి = ఉండగాన్ + చూచి
పరులతోఁ జెప్పికోలును = పరులతోన్ + చెప్పికోలును
ప్రకాశింపఁజేయ = ప్రకాశింపన్ + చేయు
చేయఁదగదు = చేయన్ + తగదు
అపహరణము కంటెఁ దిరియుట = అపహరణము కంటెన్ + తిరియుట
వలనఁ దప్పిపోయినది = వలనన్ + తప్పిపోయినది
నన్నుఁ గఱ్ఱతో = నన్నున్ + కఱ్ఱతో
ఇంకఁదావు = ఇంకన్ + తావు
నన్నుఁ గాపాడకుండునా = నన్నున్ కాపాడకుండునా
వనములోఁ గాయగసరులు = వనములోన్ + కాయగసరులు

2) గసడదవాదేశ సంధి
సూత్రము :
ప్రథమమీది పరుషములకు గసడదవలు బహుళంబుగానగు.
పట్టణము గలదు = పట్టణము + కలదు
ధనము గలవాడె +ధనము + కలవాడె
మూలము గదా = మూలము + కదా
కాణాచి గాదు = కాణాచి + కాదు
మోఁదులు వడి = మోదులు + పడి

3) గసడదవాదేశ సంధి
సూత్రము :
ద్వంద్వంబునందు పదంబుపయి పరుషములకు గసడదవలగు.
పెట్టువోతలు = పెట్టు + పోత
కాయగసరులు = కాయ + కసరు

AP SSC 10th Class Telugu Solutions Chapter 5 ధన్యుడు

2. కింది పదాలకు విగ్రహవాక్యాలు రాసి, సమాసాలను పేర్కొనండి.

సమాస పదంవిగ్రహవాక్యంసమాసం పేరు
అ) ఉదా :
చంపకవతి పట్టణము
చంపకవతి అనే పేరుగల పట్టణముసంభావనా పూర్వపద కర్మధారయము
ఆ) మహాభాగ్యముగొప్పదైన భాగ్యమువిశేషణ పూర్వపద కర్మధారయము
ఇ) సేవావృత్తిసేవయే వృత్తిఅవధారణ కర్మధారయ సమాసం
ఈ) పదాబ్జములుఅబ్జముల వంటి పదములుఉపమాన ఉత్తరపద కర్మధారయము
ఉ) కలువకన్నులుకలువల వంటి కన్నులుఉపమాన పూర్వపద కర్మధారయము
ఊ) మామిడిగున్నగున్నయైన మామిడివిశేషణ ఉత్తరపద కర్మధారయము
ఎ) మృదుమధురముమృదువును, మధురమునువిశేషణ ఉభయపద కర్మధారయము

3. పుంప్వాదేశ సంధి
కింది పదాలు విడదీయండి. మార్పును గమనించండి.
ఉదా :
అచ్చపు పూలతోట = అచ్చము + పూలతోట
అ) నీలపు గండ్లు = నీలము + కండ్లు
ఆ) ముత్తెపుసరులు = ముత్తెము + సరులు
ఇ) సరసపుమాట = సరసము + మాట

పైనున్న అన్ని సంధులలోనూ మొదటి పదం విశేషణం, రెండవ పదం విశేష్యం (నామవాచకం). అంటే పైవన్నీ కర్మధారయ సమాసాలే కదా! సంధి జరిగినపుడు మొదటి పదంలో చివరగల ‘ము’ లోపించింది. దానికి బదులుగా ‘పు’ వచ్చింది. ఒక్కొక్కసారి పూర్ణబిందు పూర్వక పు (ంపు) కూడా రావచ్చును. ‘పు’, ‘ంపు’ ఆదేశమవ్వడాన్ని పుంప్వాదేశం అంటారు. అందుకే దీన్ని పుంప్వాదేశ సంధి అన్నారు.

దీనికి సూత్రము:
కర్మధారయంబున ‘ము’ వర్ణకమునకు పు, పులగు.
అ) సింగప్తుకొదమ = సింగము + కొదమ
ఆ) ముత్యపుచిప్ప = ముత్యము + చిప్ప
ఇ) కొంచపునరుడు = కొంచము + నరుడు

4. వచనంలో శైలీ భేదం :
కింది వాక్యాలు చదవండి. భేదాలు గమనించండి.

అ) ఆ పరివ్రాజకుడు సెప్పగా విని మిక్కిలి ఖిన్నుడనయితిని.
ఆ) ఆ సన్యాసి చెప్పగా విని చాలా బాధపడ్డాను.
ఇ) ఆ సన్యాసి జెప్పింది యిని శానా దుక్కమొచ్చింది.

మొదటి వాక్యం , ప్రాచీన శైలిని తెలుపుతుంది. దీనినే ‘గ్రాంథికం’ అని కూడా అంటారు. ‘ధన్యుడు’ పాఠమంతా ఈ శైలిలోనే నడుస్తుంది.

రెండవ వాక్యం శిష్టవ్యవహార శైలిని అనుసరించి ఉంది. ఇది విద్యావంతులు ఉపయోగించేది.

మూడవ వాక్యం నిరక్షరాస్యులు ఉపయోగించే పద్ధతి. ఇది స్థానిక మాండలిక పదాలతో ఉంటుంది.

కాలాన్ననుసరించి, ప్రాంతాన్ననుసరించి, సందర్భాన్ని బట్టి భాషను ఉపయోగించే విధానంలో మార్పు ఉంటుంది. ఇది భాషలో వైవిధ్యమేగాని, గొప్ప, తక్కువ అనే సంకుచిత దృష్టికూడదు.

కనుక పై మూడూ అనుసరించ తగినవే. ఏదీ ఎక్కువా కాదు, ఏదీ తక్కువా కాదు దేని సొగసు దానిదే.

సాధారణంగా శిష్టవ్యవహారిక శైలినే చాలామంది ఈ రోజుల్లో రచయితలు ఉపయోగిస్తున్నారు. ఈ మార్పులలో ‘ంబు’, ‘ము’లు పోయి ‘0’ వస్తుంది.

ఉదా : కాలంబు, కాలము – ప్రాచీన గ్రాంథికం
కాలం – వ్యవహారికం
చూచి, వ్రాసి మొ||నవి – ప్రాచీన గ్రాంథికం
చూసి, రాసి మొ||నవి – వ్యవహారికం
యడాగమం, సరళాదేశాలు, గసడదవాదేశాలు – ప్రాచీన గ్రాంథికం
విసంధిచేయడం – వ్యవహారికం

కింది వాక్యాలను ఆధునిక వ్యవహార శైలిలోకి, స్థానిక మాండలిక శైలిలో మార్చండి.
గమనిక :
ఈ మార్పులు చేసేటప్పుడు ‘ము’ వర్ణాలు, బిందుపూర్వక ‘బు’ కారాలు (ంబు), యడాగమాలు, క్రియారూపాలు (చేయును, జరుగును, చూడుము ……… వంటివి మారడాన్ని) గమనించండి.

అ) వివేకహీనుడయిన ప్రభువును సేవించుట కంటె వనవాసముత్తమము.
జవాబు:
వ్యవహారికం :
వివేక హీనుడైన ప్రభువును సేవించడం కంటే వనవాసం ఉత్తమం.

ఆ) ఎలుక ప్రతిదినము చిలుకకొయ్య మీఁదికెగిరి పాత్రమునందున్న యన్నము భక్షించి పోవుచున్నది.
జవాబు:
వ్యవహారికం :
ఎలుక ప్రతిదినం చిలక్కొయ్య మీకెగిరి పాత్రలోని అన్నం భక్షించి పోతోంది.

ఇ) బుద్ధిహీనత వలస సమస్త కార్యములు నిదాఘ నదీపూరములట్లు వినాశము నొందును.
జవాబు:
వ్యవహారికం : బుద్ధిహీనత వల్ల సమస్త కార్యాలు నిదాఘ నదీపూరాలు లాగా వినాశమౌతాయి.

అదనపు సమాచారము

సంధులు

1) యాతనావహము = యాతనా + ఆవహము – సవర్ణదీర్ఘ సంధి
2) దైవానుకూల్యము = దెవ + ఆనుకూల్యము – సవర్ణదీర్ఘ సంధి
3) ధనాపహరణము = ధన + అపహరణము – సవర్ణదీర్ఘ సంధి
4) స్వాశ్రయము = స్వ + ఆశ్రయము – సవర్ణదీర్ఘ సంధి
5) సర్వాపదలు = సర్వ + ఆపదలు – సవర్ణదీర్ఘ సంధి
6) కర్మానురూపము = కర్మ + అనురూపము. – సవర్ణదీర్ఘ సంధి
7) శిలాంతరాళము = శిలా + అంతరాళము – సవర్ణదీర్ఘ సంధి
8) జీవనార్ధము = జీవన + అర్థము – సవర్ణదీర్ఘ సంధి
9) వచనామృతము = అమృతము – సవర్ణదీర్ఘ సంధి
10) శోకాగ్ని = శోక + అగ్ని – సవర్ణదీర్ఘ సంధి
11) చిరకాలోపార్జితము = చిరకాల + ఉపార్జితము – గుణసంధి
12) సత్వోత్సాహములు = సత్త్వ + ఉత్సాహములు – గుణసంధి
13) అతిసంచయేచ్చ = అతిసంచయ + ఇచ్ఛ – గుణసంధి
14) చెడగరపుబోడ = చెడగరము + బోడ – పుంప్వాదేశ సంధి
15) యావజ్జీవము = యావత్ + జీవము – శ్చుత్వసంధి
16) ఏమది = ఏమి + అది – ఇత్వ సంధి
17) ఏమయినను = ఏమి + అయినను – ఇత్వ సంధి
18) ప్రయాసపాటు = ప్రయాసము + పాటు – పడ్వాది సంధి
19) ఆయాసంపాటు = ఆయసము + పాటు – పడ్వాది సంధి

సమాసాలు

సమాస పదంవిగ్రహవాక్యంసమాసం పేరు
1) సత్వోత్సాహములుసత్త్వమును, ఉత్సాహమునుద్వంద్వ సమాసం
2) జవసత్త్వములుజవమును, సత్త్వమునుద్వంద్వ సమాసం
3) బంధుమిత్రులుబంధువులును, మిత్రులునుద్వంద్వ సమాసం
4) పెట్టుబోతలుపెట్టు, పోతద్వంద్వ సమాసం
5) ధనహీనుడుధనముచేత హీనుడుతృతీయా తత్పురుష సమాసం
6) వివేకహీనుడువివేకముచే హీనుడుతృతీయా తత్పురుష సమాసం
7) దైవానుకూల్యముదైవము యొక్క అనుకూల్యముషష్ఠీ తత్పురుష సమాసం
8) కుసుమ స్తబకముకుసుమముల యొక్క స్తబకముషష్ఠీ తత్పురుష సమాసం
9) ధనాపహరణముధనము యొక్క అపహరణముషష్ఠీ తత్పురుష సమాసం
10) యమలోకముయముని యొక్క లోకముషష్ఠీ తత్పురుష సమాసం
11) శిలాంతరాళముశిల యొక్క అంతరాళముషష్ఠీ తత్పురుష సమాసం
12) అమృత తుల్యముఅమృతముతో తుల్యముతృతీయా తత్పురుష సమాసం
13) ధనలోభముధనమందు లోభముసప్తమీ తత్పురుష సమాసం
14) సజ్జన సంగతిసజ్జనుల యొక్క సంగతిషష్ఠీ తత్పురుష సమాసం
15) మహాభాగ్యముగొప్ప అయిన భాగ్యమువిశేషణ పూర్వపద కర్మధారయం
16) సర్వశ్రేయములుసర్వములయిన శ్రేయములువిశేషణ పూర్వపద కర్మధారయం
17) అనృతముఋతము కానిదినఇ్ తత్పురుష సమాసం
18) రెండు ఫలములురెండైన ఫలములుద్విగు సమాసం
19) మిత్రలాభముమిత్రుల వలన లాభముపంచమీ తత్పురుష
20) సంచయేచ్ఛసంచయమునందు ఇచ్చసప్తమీ తత్పురుష సమాసం

పర్యాయపదాలు

1) అమృతము : 1) సుధ 2) పీయూషము
2) భోజనము : 1) తిండి 2) ఆహారము 3) అశనము
3) ఎలుక : 1) మూషికం 2) ఆఖనికం 3) ఖనకం 4) ఎలక
4) బలము : 1) శక్తి 2) పరాక్రమము 3) పౌరుషము
5) సన్న్యాసి : 1) పరివ్రాజకుడు 2) భిక్షువు 3) బోడ 4) యతి
6) ధనము : 1) అర్థం 2) ద్రవ్యం 3) విత్తం 4) ధనం
7) గృహము : 1) ఇల్లు 2) భవనము 3) మందిరము
8) అన్నము : 1) వంటకం 2) కూడు 3) బువ్వ
9) బుద్ధి : 1) ప్రజ్ఞ 2) మతి 3) ప్రజ్ఞానం 4) మేధ 5) ధిషణ
10) స్నేహితుడు : 1) మిత్రుడు 2) చెలికాడు 3) మిత్రము

నానార్థాలు

1) వాసము : 1) వెదురు 2) బట్ట 3) ఇల్లు 4) కాపురం
2) నిమిత్తము : 1) కారణం 2) శకునము 3) గుటి
3) నామము : 1) పేరు 2) బొట్టు 3) ప్రాతిపదిక
4) ప్రభువు : 1) స్వామి 2) సమర్థుడు 3) అధిపుడు
5) ధర్మము : 1) న్యాయం 2) విల్లు 3) స్వభావం
6) ప్రాణము : 1) జీవుడు 2) గాలి 3) చైతన్యం
7) పుణ్యము : 1) సుకృతం 2) ఆకాశం 3) నీరు 4) పూవు
8) ఫలము : 1) పండు 2) ప్రయోజనం 3) సంతానం
9) వనము : 1) అడవి 2) నీరు 3) గుంపు
10) లోకము : 1) జనం 2) స్వర్గం వంటి లోకము 3) చూపు
11) మిత్రుడు : 1) స్నేహితుడు 2) సూర్యుడు
12) శాస్త్రము : 1) తర్కము మొదలయిన శాస్త్రములు 2) చట్టం 3) ఆజ్ఞ
13) ఆశ : 1) దిక్కు 2) కోరిక
14) ఉదరము : 1) కడుపు 2) నడుము 3) యుద్ధం
15) గృహము : 1) ఇల్లు 2) భార్య 3) గృహస్థాశ్రమం
16) జీవనము : 1) బ్రతుకుట 2) గాలి 3) నీరు
17) గౌరవము : 1) బరువు 2) గొప్పదనము 3) మన్నన, మర్యాద
18) బలము : 1) సత్తువ 2) సైన్యం 3) బలాత్కారం

వ్యుత్పత్తరాలు

1) సన్న్యా సి : సర్వమూ న్యాసం (వదలివేసిన) చేసినవాడు.
2) పరివ్రాజకుడు : అన్నింటినీ పరిత్యజించిపోయేవాడు (సన్న్యాసి)
3) మూషికము : అన్నాదులను దొంగిలించునది (ఎలుక)
4) నిదాఘము : దీనియందు జనము మిక్కిలి దహింపబడతారు (గ్రీష్మ ఋతువు
5) పుత్తుడు : పున్నామ నరకం నుండి తల్లిదండ్రులను రక్షించేవాడు (కుమారుడు)
6) దేహి : దేహమును (శరీరాన్ని) ధరించినవాడు (మనిషి)
7) ఈశ్వరుడు : స్వభావం చేతనే ఐశ్వర్యం కలవాడు (శివుడు)
8) మిత్రుడు : సర్వభూతముల యందు స్నేహయుక్తుడు (సూర్యుడు)
9) లఘుపతనకుడు : తేలికగా ఎగిరేది (కాకి)

రచయిత పరిచయం

రచయిత :
ఈ పాఠ్యాంశ రచయిత పేరు పరవస్తు చిన్నయసూరి. క్రీ.శ. 1809లో తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లాలోని శ్రీ పెరంబుదూరులో జన్మించాడు. తల్లి శ్రీనివాసాంబ, తండ్రి వేంకట రామానుజాచార్యులు. చిన్నయసూరి మద్రాసులోని పచ్చయ్యప్ప కళాశాలలో తెలుగు పండితులుగా పని చేశారు.

రచనలు :
పద్యానికి నన్నయ, గద్యానికి చిన్నయ అని లోకోక్తి. ‘సూరి’ అనేది వీరి బిరుదు. సూరి అంటే పండితుడు అని అర్థం. అక్షరగుచ్ఛము, ఆంధ్ర కాదంబరి, పద్యాంధ్ర వ్యాకరణం, సూత్రాంధ్ర వ్యాకరణం,
పరవస్తు చిన్నయసూరి శబ్దలక్షణసంగ్రహము బాలవ్యాకరణం, నీతిచంద్రిక మొదలైన గ్రంథాలు 1809 – 1882) రచించారు.

రచనా శైలి :
ఈయన రచనా శైలి పాఠకుడిని ఆకట్టుకొనేలా ఉంటుంది. గ్రాంథిక రచన. ఈయన వ్రాసిన బాలవ్యాకరణం ప్రామాణిక గ్రంథం. నీతిచంద్రిక – బాలవ్యాకరణాలు లక్ష్య – లక్షణ గ్రంథాలుగా ప్రసిద్ధి పొందాయి. తెలుగు, తమిళం, సంస్కృతం, ఆంగ్లభాషలలో సూరి మంచి పండితుడు.

కఠిన పదాలకు అర్థాలు

సన్న్యాసి = కామ్యకర్మలను విడిచినవాడు
వాసము = నివాసము
తట్టు = కొట్టు
పరివ్రాజకుడు = సర్వమును విడిచి పెట్టినవాడు(సన్న్యాసి)
చిలుకకొయ్య = బట్టలు తగిలించుకొనుటకు గోడకు కొట్టబడిన చిలుక ఆకారపు కొయ్య (Hanger)
లాఁగ = రంధ్రము
మీదు = పైన
తడవు = చిరకాలము
ఉపద్రవము = విప్లవము
నిమిత్తము = కారణము
వివరము = రంధ్రము
గుద్దలి = గునపము
చిరకాలము = చాలా కాలం
ఆర్జితము = సంపాదింపబడినది
సత్యము = బలము
కృశించి = బక్కచిక్కి
శ్రేయము = శుభము
నిదానము = అసలు కారణము
తొంటి = మొదటి
జవము = వేగము

AP SSC 10th Class Telugu Solutions Chapter 5 ధన్యుడు

స్వజాతి = తన జాతి
అర్థ పరిహీనుడు = ధనము లేనివాడు, దరిద్రుడు
నిరంతరము = ఎల్లప్పుడు
ఖేదము = దుఃఖము
నిదాఘము = వేసవి
పూరము = జల ప్రవాహము
మేధ = తెలివి
మిత్రులు = స్నేహితులు
విరహితము = లేనిది
ఆపాతము = పడుట
యాతన = బాధ
ఆవహము = కూడినది
వేదన = బాధ
ఆకరము = చోటు
నామము = పేరు
వచోధోరణి = మాట్లాడే పద్ధతి
లాంతివాడు = రాయివాడు, అన్యుడు
ఖిన్నుడు = భేదము పొందినవాడు, బాధితుడు
యుక్తము = తగినది
వంచనము = మోసము
పరాభవము = అవమానము
అనుకూల్యము = అనుకూలమైనది
మానవంతుడు = పౌరుషం కలవాడు
స్తబకము = గుత్తి
మూరము = తల, శిరస్సు
యాచన = ముష్టి
గర్హితము = నిందింపబడినది
మ్రుక్కడి = అల్పము, అల్పుడు
తొఱుఁగుట = విడచుట
అనృతము = అసత్యము, అబద్ధము
అపహరణము = దొంగతనము
తిరియుట = బిచ్చమెత్తుట, యాచించుట
నింద్యము = నిందింపతగినది
నానావిధములు = అనేక విధాలు
విచారించి = ఆలోచించి
అర్ధసంగ్రహము = ధన సంపాదన
లోభము = పిసినిగొట్టుతనము
మోహము = అజ్ఞానము, వలపు
ఉత్పాదించును = పుట్టించును
జ్వలనము = అగ్ని
అనంతరము = తరువాత
వర్జనము = విడిచిపెట్టుట
దిగనాడుట = విడిచి పెట్టుట
ఉదరము = పొట్ట
పరులు = ఇతరులు
తత్ + తత్ + కర్మ + అనురూపము = ఆయా పనులకు తగినట్లుగా
గోఁజక = పీడింపక
దేహి = దేహము కలవాడు, మానవుడు
ప్రయాస = కష్టము, శ్రమ
నిరర్థకము = వృథా
తావు = స్థానము
కాణాచి = నిలయము
చెడగరపుబోడ (చెడగరము =క్రూరము) (బోడ = సన్యా సి) = క్రూరుడైన సన్యాసి
మోదులు = దెబ్బలు
విజన ప్రదేశము = జనులు లేని చోటు
అంతరాళము = లోపలి భాగము
శిల = రాయి
కసరు = పిందె (లేతకాయ)
పడియ = నీటిగుంట
సజ్జన సంగతి = సజ్జనులతో కలియుట
తుల్యము = సమానం
అమృత రసపానము = అమృత రసమును త్రాగుట

ఆలోచించండి – చెప్పండి

ప్రశ్న 1.
ఎక్కడి ఎలుక ? ఎక్కడి చిలుకకొయ్య? అనడంలో అంతరార్థం ఏమై ఉంటుంది?
జవాబు:
సాధారణంగా అంతరం ఎక్కువ ఉండేవాటి పట్ల ఈ విధంగా ప్రయోగిస్తారు. ఎలుక నేలపైనా, రంధ్రాల లోనూ ఉంటుంది. గోడను నిలువుగా ఎక్కువ దూరం ఎలుక ప్రాకలేదు. చిలుకకొయ్య గోడకి మధ్యలో ఉంటుంది. అటువంటి చిలుకకొయ్య పైకి ఎలుక చేరడం అసంభవం. అది సాధ్యం కానిది ఎలాగ సాధ్యమైంది అనేది దీనిలో అంతరార్థం. అలాగే ‘నక్క ఎక్కడ ? నాక లోకము (స్వర్గం) ఎక్కడ ?’ అని కూడా అంటారు.

ప్రశ్న 2.
“ధనము సర్వశ్రేయములకు నిదానము”. మీ అభిప్రాయం చెప్పండి.
జవాబు:
ఏ శుభకార్యం చేయాలన్నా ధనం కావాలి. ధనం లేకపోతే ఏ పనీ చేయలేము. అందుకే ప్రతి పుణ్య కార్యానికి అసలు కారణం ధనమే. అన్నదానం, భూదానం, గృహదానం మొదలైన ఏ దానం చేయాలన్నా ధనం కావాలి. చెరువు త్రవ్వించడం, దేవాలయాలు నిర్మించడం, పాఠశాల, ఆసుపత్రి మొదలైనవి నిర్మించడం ధర్మకార్యాలు. కాని ధనం లేకపోతే ఏ ధర్మకార్యాలు చేయలేము. అందుకే సర్వశ్రేయాలకు అసలు కారణం ధనం. మన ఉన్నతత్వానికి, గౌరవానికి, మర్యాదకు మన ధనమే అసలు కారణం.

AP SSC 10th Class Telugu Solutions Chapter 5 ధన్యుడు

ప్రశ్న 3.
‘దారిద్ర్యము సర్వశూన్యము’ అనే మాటను బట్టి మీకేమర్థమయింది?
జవాబు:
దారిద్ర్యము అంటే బీదతనము. సర్వశూన్యము అంటే ఏమి లేనిది. అంటే ఇంటిలో పదార్థములు లేకుండా పోతాయి. అందువల్ల సుఖసంతోషాలు పోతాయి. దుఃఖము కలుగుతుంది. భార్యాబిడ్డలకు, కడుపునిండా తిండి పెట్టలేము. కాబట్టి దారిద్ర్యము అన్నింటినీ లేకుండా చేస్తుందని భావము.

ప్రశ్న 4.
ఆశ దిగనాడినవాడే సత్పురుషుడు. ఎట్లు?
జవాబు:
ఆశ అన్ని అనర్ధాలకు మూలం. ఆశ పడినది దొరకకపోతే కోపం వస్తుంది. కోపంలో విచక్షణ కోల్పోతాము. పిసినిగొట్టుతనం పెరుగుతుంది. ఆశ మితిమీరితే అజ్ఞానం పెరుగుతుంది. అజ్ఞానం వలన గర్వం పెరుగుతుంది. గర్వం పెరిగితే ఎవ్వరితోటి స్నేహం చేయలేము. అందుచేత ఆశను విడిచిపెడితే సత్పురుషుడౌతాడు. మితిమీరిన ఆశ పనికి రాదు.

ప్రశ్న 5.
ధనహీనుడై నలుగురిలో నుండరాదు. ఎందుకు?
జవాబు:
ధనహీనుడు అంటే ధనం లేనివాడు. ధనం ఉన్నప్పుడు సమాజంలో గౌరవం ఉంటుంది. హోదా ఉంటుంది. స్నేహితులు ఉంటారు. బంధువులు చేరతారు. అందరూ పలకరిస్తారు. నలుగురూ చేరతారు. కాని, ధనం లేకపోతే ఎవ్వరూ మాట్లాడరు. స్నేహితులు, బంధువులు కూడా పలకరించరు. గౌరవం, హోదా ఉండవు. ఇటువంటి అవహేళనలకు గురి అవుతూ నలుగురిలో ఉండ కూడదు. ఎవరూ తెలియని ప్రదేశంలో ఉంటే ధనము లేనివాని ఆత్మాభిమానం దెబ్బ తినదు.

ప్రశ్న 6.
‘మనసు గట్టి పరచుకోవటం’ అంటే ఏమిటి?
జవాబు:
మనస్సు చంచలమైనది. అది ఇష్టం వచ్చినట్లు సంచరిస్తుంది. గట్టి పెంచుకోవడం అంటే మనస్సును దృఢము చేసికోవడం, నిశ్చయం చేసుకోవడం అని అర్థం.

AP SSC 10th Class Telugu Solutions Chapter 5 ధన్యుడు

ప్రశ్న 7.
‘చచ్చిన తరి వెంట రాబోదు’ అనడంలో మీకేమరమైంది?
జవాబు:
మనిషి చచ్చిపోయే సమయంలో అతడు సంపాదించిన ధనం వగైరా అతడి వెంట వెళ్ళదు. కాబట్టి తాను ధనాన్ని హాయిగా వెచ్చించి, కడుపు నిండా తినాలి. ఇతరులకు ఇంత పెట్టాలి. ఇతరులకు ఇవ్వక, తాను తినక, దాచిన డబ్బు చచ్చిపోయేటప్పుడు ఆ వ్యక్తి వెంట వెళ్ళదు అని నాకు తెలిసింది.

AP SSC 10th Class Telugu Solutions Chapter 6 శతక మధురిమ

AP State Board Syllabus AP SSC 10th Class Telugu Solutions 6th Lesson శతక మధురిమ Textbook Questions and Answers.

AP State Syllabus SSC 10th Class Telugu Solutions 6th Lesson శతక మధురిమ

10th Class Telugu 6th Lesson శతక మధురిమ Textbook Questions and Answers

ఉన్ముఖీకరణ : చదవండి – ఆలోచించి చెప్పండి

రాజేశ్ : రవీ! బాగున్నావా!

రవి : బాగున్నాను రాజేశ్. నువ్వేం చేస్తున్నావు? మన చిన్ననాటి మిత్రులు ఎవరైనా కలుస్తున్నారా?

రాజేశ్ : ఆ! ఆ! అందరూ కలుస్తున్నారు. సంతోష్ లాయరైనాడు. భాను టీచరైనాడు. మధు వ్యాపారం చేస్తున్నాడు. సుభాష్ రాజకీయనేతగా ఎదిగాడు. ఇలా అందరూ ఒక్కో రంగంలో నీతి నిజాయితీలతో రాణిస్తున్నారు.

రవి : చిన్నప్పుడు మనం చదివిన చదువు, పొందిన జ్ఞానం ఊరికే పోతుందా? ఆ చదువుల ఫలితం, గురువుల దీవెనలు అన్నీ కలిస్తేనే మన అభివృద్ధి.

రాజేశ్ : ఔనౌను! ముఖ్యంగా శతక పద్యాలలోని నీతులు మన వ్యక్తిత్వానికి బాటలు వేశాయి. ఆత్మవిశ్వాసాన్ని నింపాయి కదూ!

రవి : బాగా చెప్పావు రాజేశ్! శతక పద్యాలు నేటికీ మార్గదర్శకాలు. మీ పిల్లలకు కూడా నేర్పించు బాగా!

రాజేశ్ : నేర్పుతున్నాను. సరే రవీ! బస్సు వచ్చింది. మళ్ళీ కలుద్దాం.

ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
సంభాషణను బట్టి వారు ఎవరని భావిస్తున్నారు?
జవాబు:
సంభాషణను బట్టి వారు ఇద్దరూ చిన్ననాటి మిత్రులనీ, ఒకే బడిలో ఒకే తరగతిలో కలసి చదువుకున్నారని భావిస్తున్నాను.

ప్రశ్న 2.
వారి అభివృద్ధికి కారణాలేవి?
జవాబు:
చిన్నప్పుడు వారు చదివిన చదువు, అప్పుడు నేర్చుకున్న జ్ఞానం వారి అభివృద్ధికి కారణాలు.

AP SSC 10th Class Telugu Solutions Chapter 6 శతక మధురిమ

ప్రశ్న 3.
వ్యక్తిత్వాన్ని ఏవి తీర్చిదిద్దుతాయి?
జవాబు:
శతక పద్యాల్లోని నీతులు (సూక్తులు) వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతాయి.

ప్రశ్న 4.
ఏవి నేటి తరానికి మార్గదర్శకాలని రవి చెప్పాడు?
జవాబు:
‘శతక పద్యాలు’, నేటితరానికి మార్గదర్శకాలని రవి చెప్పాడు.

ఇవి చేయండి

1. అవగాహన – ప్రతిస్పందన

1. కింది అంశాల గూర్చి మాట్లాడండి.

అ) ఆచారం :
‘ఆచారము’ అంటే ఒక సంఘములోని సభ్యుల్లో సాంప్రదాయకంగా ఉన్న, ప్రామాణికమైన ప్రవర్తనా పద్దతి. నిషేధమే ఆచారానికి మూలం. ఆచారం, మానవజాతి యొక్క ప్రాచీనమైన వ్రాయబడని ధర్మశాస్త్రం. ఒక వ్యక్తి ఒక పనిని నిత్యమూ చేస్తే, అది ‘అలవాటు’. అదే జాతి పరంగానో, సంఘ పరంగానో చేస్తే, ‘ఆచారం’ అవుతుంది.

ఈ ఆచారాలు, జాతి జీవన విధానాన్ని తెలుపుతూ, ఆ జాతిని నైతికపతనం నుండి కాపాడవచ్చు. ఈ ఆచారాలు క్రమంగా తమ అంతశ్శక్తిని పోగొట్టుకొని, చెడు ఫలితాలకు దారి తీస్తున్నాయి.

ఆ) సత్కార్యం :
‘సత్కార్యం’ అంటే మంచి పని. ఏ పని చేస్తే సంఘం సంతోషిస్తుందో అది సత్కార్యం. వేదంలో చెప్పిన పని, ‘సత్కార్యం’ – ఒక పేదవాడిని ఆదరించి అన్నం పెడితే అది సత్కార్యం.

  1. దానాలు చేయడం
  2. గుడులు కట్టించడం
  3. ధర్మకార్యాలు చేయడం
  4. తోటలు నాటించడం
  5. ఒక బ్రాహ్మణుడికి పెండ్లి చేయించడం
  6. చెరువులు త్రవ్వించడం
  7. మంచి సంతానాన్ని కనడం – అనే వాటిని సత్కార్యాలని, వాటినే సప్తసంతానాలని అంటారు.

ఇ) న్యాయం:
న్యాయమునే ‘ధర్మము’ అని కూడా అంటారు. ఈ న్యాయము కాలానుగుణముగా మారుతుంది. ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క న్యాయపద్ధతి ఉంటుంది. ఈ న్యాయాన్ని కాపాడేవి న్యాయస్థానాలు. న్యాయస్థానాలు ఏది న్యాయమో, ఏది అన్యాయమో నిర్ణయిస్తాయి. లోకములోనూ, శాస్త్రమునందూ ప్రసిద్ధమైన ఒక దృష్టాంత వాక్యాన్ని “న్యాయము” అంటారు.

ఈ) దాస్యం :
‘దాస్యము’ అంటే సేవ. ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వానికి సేవ చేస్తారు. ఇంట్లో అంట్లు, చెంబులు తోమి పాచి పని చేయడం కూడా ‘దాస్యమే’. కద్రువకు ఆమె సవతి వినత, దాస్యం చేసింది.

2. పాఠంలోని పద్యాలు ఆధారంగా కింది వాక్యాలకు తగిన పద్యపాదం గుర్తించండి.

అ) అనామకమై నశించడం
జవాబు:
‘నీరము తప్తలోహమున నిల్చి యనామకమై నశించు’.

ఆ) సముద్రాన్ని తియ్యగా మార్చడం
జవాబు:
‘తీపు రచింపన్ లవణాబ్దికిన్ మధుకణంబుం జిందు యత్నించు’.

ఇ) సముద్రంలో కాకిరెట్ట
జవాబు:
………………… అకుంఠిత పూర్ణ సుధాపయోధిలో నరుగుచుఁ గాకి రెట్ట యిడినందున నేమి”

3. కింది పద్యాలను పాదభంగం లేకుండా పూరించండి.
సూచన : పధ్యంలో 4 పాదాలలోని ప్రతిపాదం పాఠ్యపుస్తకంలో ఎక్కడికి పూర్తయిందో అక్కడికే పూర్తవ్వాలి. రెండవ అక్షరం ప్రాస. ఆ ప్రాస ఒక అక్షరం పొల్లు ఉంటుంది. దానిని తదంతో గుర్తుపెట్టుకోవాలి. గణాలు కూడా గుర్తు పెట్టుకొంటే, రాసేటపుడు పాదభంగం రాదు.

అ) నీరము ………………… కొల్చువారికిన్
జవాబు:
ఉ|| నీరము తప్తలోహమున నిల్చి యనామకమై నశించు నా
నీరమె ముత్యమట్లు నళినీదళ సంస్థితమై తనర్చునా
నీరమె శుక్తిలోఁబడి మణిత్వము గాంచు సమంచిత ప్రభన్
బౌరుష వృత్తులి టధము మధ్యము నుత్తము గొల్చువారికిన్.

ఆ) తన దేశంబు …………. భక్త చింతామణీ!
జవాబు:
మ|| తన దేశంబు స్వభాష నైజమతమున్ అస్మత్సదాచారముల్
తన దేహాత్మల నెత్తెఱంగున సదాతానట్లు ప్రేమించి, త
ద్ఘనతా వాప్తికి సాధనంబులగు సత్కార్యమ్ములన్ జేయఁగా
ననుహౌ బుద్ధి యొసంగుమీ ప్రజకు దేవా! భక్త చింతామణీ!

AP SSC 10th Class Telugu Solutions Chapter 6 శతక మధురిమ

4. కింది పద్యాన్ని చదవండి. ప్రశ్నలకు జవాబులు రాయండి.
సత్యసూక్తి ఘటించు, ధీజడిమ మాన్చు
గౌరవమొసంగు, జనులకుఁ గలుషమడచు
కీర్తి ప్రకటించు, చిత్త విస్పూర్తి జేయు
సాధుసంగంబు సకలార్థ సాధకంబు.
ప్రశ్నలు :
అ) సూక్తి అంటే ఏమిటి?
జవాబు:
సూక్తి అంటే ‘మంచిమాట’.

ఆ) కీర్తి ఎలా వస్తుంది?
జవాబు:
సాధుసంగము వలన అనగా మంచివారితో స్నేహంగా ఉండడం వల్ల ‘కీర్తి’ వస్తుంది.

ఇ) సాధుసంగం వల్ల ఏం జరుగుతుంది?
జవాబు:
సాధుసంగం సకల ప్రయోజనాలనూ సాధించి పెడుతుంది.

ఈ) ఈ పద్యానికి శీర్షిక సూచించండి.
జవాబు:
ఈ పద్యానికి శీర్షికగా “సాధుసంగం” అనేది తగియుంటుంది.

సూచన:
పధ్యంలో దేని గురించి అధినంగా చెప్పారో అని శీర్షికగా పెట్టాలి, దేనికైనా సరే సుభాషితం , సూక్తి వంటి శీర్షికలు పెట్టి వచ్చును.

II. వ్యక్తీకరణ సృజనాత్మకత

1. కింది ప్రశ్నలకు ఆలోచించి ఐదేసి వాత్యాల్లో జవాబులు రాయండి.

అ) కాలిన ఇనుముపై నీళ్ళు పడితే ఆవిరిగా మారుతాయని తెలుసుకదా! అలాగే, మనుషులు ఎవరిని చేరితే ఎలా అవుతారో. సోదాహరణంగా రాయండి.
జవాబు:
కాలిన ఇనుము మీద నీళ్ళు పడితే ఆవిరైపోయి, అవి పూర్తిగా నశిస్తాయి. ఆ నీళ్ళు తామరాకుపైన పడితే ముత్యాల్లా ప్రకాశిస్తాయి. ఆ నీళ్ళే సముద్రంలోని ముత్యపుచిప్పలో పడితే, ముత్యాల్లా మారతాయి. దీనిని బట్టి మనిషి అధములలో చేరితే అధముడు అవుతాడు. కాలిన ఇనుముపై నీళ్ళవలె, అతడు అనామకుడవుతాడు. మనిషి మధ్యములలో చేరితే, మధ్యముడు అవుతాడు. అపుడు తామరాకుపై నీరులా ముత్యమువలె కనిపిస్తాడు. మనిషి ఉత్తములతో చేరితే, ఉత్తముడు అవుతాడు. అపుడు ముత్యపు చిప్పలో పడిన నీరు వలె, ‘ముత్యము’ అవుతాడు.

ఆ) ధర్మవర్తనులను నిందించడం వల్ల ప్రయోజనం లేదు అనే విషయాన్ని సోదాహరణంగా రాయండి.
జవాబు:
ధర్మాన్ని పాటించే ధర్మవర్తనుడిని, ఒక నీచుడు మిక్కిలి హీనంగా నిందించినా, ఆ ధర్మవర్తనుడికి ఏ మాత్రమూ లోటురాదు. ఎందుకంటే అమృత సముద్రముపై నుండి కాకి ప్రయాణము చేస్తూ ఆ సముద్రములో ఆ కాకి రెట్ట వేస్తుంది. అంతమాత్రము చేత ఆ సముద్రానికి ఏమీ లోటు రాదు. అలాగే, ధర్మాత్ముడిని నీచుడు నిందించినా, ఆ ధర్మమూర్తికి లోటు రాదు.

ఇ) “కరిరాజున్” అనే పద్యభావాన్ని మీ సొంతమాటల్లో రాయండి.
జవాబు:
మూర్ఖులను అమృతధారలవంటి మాటలతో సమాధాన పరిచేవాడూ, మదపుటేనుగును తామర తూడునందలి దారములతో బంధించాలని ఆలోచించేవాడూ, దిరిసెన పువ్వుతో వజ్రాన్ని బ్రద్దలు చేయాలని యత్నించేవాడూ, ఒక్క తేనెబొట్టుతో ఉప్పు సముద్రపు నీటిని తియ్యగా మార్చాలనుకొనేవాడూ, సమానులు.

AP SSC 10th Class Telugu Solutions Chapter 6 శతక మధురిమ

2. కింది ప్రశ్నలకు ఆలోచించి పదేసి వాత్యాల్లో జవాబులు రాయండి.

అ) సజ్జన లక్షణాలు పేర్కొనండి.
జవాబు:
సజ్జన లక్షణాలు : –

  1. మనిషి ఉత్తములతో స్నేహం చేయాలి. అలా చేస్తే ముత్యపు చిప్పలో ముత్యంలా అతడు శోభిస్తాడు.
  2. అమృత ధారల వంటి తియ్యటి మాటలతో, మూర్యుడికి బోధించడం మానుకోవాలి.
  3. తనకున్న దానితోనే అనాథలనూ, నిరుపేదలనూ ప్రేమతో లాలిస్తూ వారికి అన్నం పెట్టాలి.
  4. తన దేశాన్నీ, తన మతాన్నీ, భాషనూ, ఆచారాన్ని అభిమానించే బుద్ధి కలిగి ఉండాలి.
  5. ఇతరులు తనకు కీడు చేసినా, వారికి అపకారము చేయకుండా, ఉపకారమే చేయాలి.
  6. ధర్మవర్తనులను ఎప్పుడూ తాను నిందించకూడదు.
  7. పరద్రవ్యాన్ని ఆశించి, చెడు పనులు చేయకూడదు.
  8. వరదల్లో మునిగిపోయే పొలాన్ని దున్నకపోవడం, కరవు వచ్చినపుడు చుట్టాల ఇళ్ళకు వెళ్ళకపోవడం, రహస్యాన్ని ఇతరులకు వెల్లడించకపోవడం, పిరికివాడిని సేనానాయకునిగా చేయకపోవడం అనేవి సజ్జన లక్షణాలు.

ఆ) నైతిక విలువలంటే ఏమిటి? మీరు గమనించిన విలువల్ని పేర్కొనండి.
జవాబు:
‘నైతిక విలువలు’ అంటే నీతి శాస్త్రానికి సంబంధించిన విలువైన మంచి పద్ధతులు అని భావము. వీటినే ఆంగ్ల భాషలో ‘Moral Values’ అంటారు. అంటే అమూల్యమైన నీతులు అని అర్థము. మనిషి ఎలా నడచుకోవాలో నీతి శాస్త్రము చెపుతుంది. నీతి శాస్త్రంలో చెప్పిన, ధర్మశాస్త్రంలో చెప్పిన నీతులను పాటించడం, నైతిక విలువలను పాటించడం అంటారు.
నేను గమనించిన నైతిక విలువలు :

  1. తల్లిదండ్రులను, గురువులను, పెద్దలను గౌరవించడం.
  2. స్త్రీలను అందరినీ కన్నతల్లులవలె, సోదరీమణులవలె గౌరవించడం, ఆదరించడం.
  3. కులమత భేదాలను పాటించకుండా, తోటి విద్యార్థులనందరినీ సోదరులుగా, విద్యార్థినులను సోదరీమణులుగా ఆదరించాలి. గౌరవించాలి.
  4. మన ఇంటిని మనం శుభ్రంగా ఉంచుకున్నట్లే, మన గ్రామాన్ని, పాఠశాలను, మనకు ఉన్న నీటి వసతులను, రోడ్లను పరిశుభ్రంగా ఉంచాలి. ‘స్వచ్ఛ భారత్’ కార్యక్రమాల్లో స్వచ్ఛందంగా పాల్గొనాలి.
  5. అహింసా మార్గాన్ని ఎప్పుడూ చేపట్టకూడదు. గాంధీజీ వలె ఒక చెంపపై కొడితే, రెండవ చెంప చూపాలి. జాలి, దయ, కరుణ కలిగి ఉండాలి.
  6. మత్తుపదార్థాలు సేవించకపోవడం, చెడు అలవాట్లకు బానిసలు కాకపోవడం అనేవి మంచి నైతిక విలువలుగా నేను భావిస్తున్నాను.

3. కింది ప్రశ్నలకు సృజనాత్మకంగా ప్రశంసిస్తూ రాయండి.

అ) పేదలకు దానం చేయటం వల్ల మనం పొందే మేలును గురించి తెలియజేస్తూ మిత్రునికి లేఖ రాయండి.
జవాబు:

(మిత్రుడికి లేఖ)

తిరుపతి,
XXXXXX.

మిత్రుడు శశిభూషణకు, / మిత్రురాలు కమలకు,

ఉభయ కుశలోపరి. నీవు రాసిన లేఖ చేరింది. మనం నైతిక విలువలను పాటించాలని రాశావు. సంతోషము. మన ఇరుగు పొరుగువారిలో ఎందరో పేదలు ఉంటారు. భగవంతుడు మానవులు అందరిలోనూ ఉంటాడు. కాబట్టి మనుషులు అంతా దైవంతో సమానం.

ముఖ్యంగా పేదవారికి, మనకు ఉన్నంతలో దానం చేయాలి. మన తరగతిలోని పేదవారికి పుస్తకాలు, పెన్నులు, నోట్సులు దానం చెయ్యాలి. పరీక్ష ఫీజులు కట్టడానికి వారికి డబ్బు సాయం చెయ్యాలి. వైద్య సహాయం కోసం డబ్బులు అడిగే వారికి తప్పక ఇవ్వాలి.

పేదలకు దానం చేస్తే మరుసటి జన్మలో మనకు భగవంతుడు మరింతగా ఇస్తాడు. పేదల ముఖాల్లో ఆనందం కనబడేలా చేస్తే, మన జీవితాలు సుఖసంతోషాలకు నిలయం అవుతాయి. నేను నాకు ఉన్నంతలో పేదలకు దాన ధర్మాలు చేస్తున్నాను.

నీవు కూడా చెయ్యి.

ఇట్లు
నీ ప్రియ మిత్రుడు, / మిత్రురాలు,
సాయికుమార్. / శశికళ.

చిరునామా :
కె. శశిభూషణ్, / కె. కమల,
S/o వెంకటేష్, / D/o వెంకటేష్ఆ
ర్యాపురం, రాజమహేంద్రవరం,
తూర్పుగోదావరి జిల్లా,

(లేదా)

ఆ) పాఠశాలలో జరిగే భాషోత్సవాన్ని తిలకించడానికి ప్రముఖ శతక కవులు వచ్చారు. వారి ద్వారా శతకాల గురించి, వారి రచనల గురించి తెలుసుకోవడానికి పిల్లలు ఇంటర్వ్యూ చేయాలనుకున్నారు. మీరైతే ఏమని ఇంటర్వ్యూ చేస్తారు? ఇంటర్వ్యూకు అవసరమైన ప్రశ్నావళిని రూపొందించండి.
జవాబు:
ఇంటర్వ్యూ ప్రశ్నావళి :

  1. శతక కవులకు సుస్వాగతం. తెలుగు భాషలో శతకాలు ఎన్ని రకాలో దయచేసి చెప్పండి.
  2. మన తెలుగులో మొదటి శతక కర్త ఎవరు?
  3. మకుటం అంటే ఏమిటి?
  4. మకుటం లేని శతకాలు మనకు ఉన్నాయా? ఉంటే అవి ఏవి?
  5. నీతి శతకాల ప్రత్యేకత ఏమిటి?
  6. భక్తి శతకాలు మీరు ఏమైనా వ్రాశారా?
  7. భక్తి శతకాల్లో దాశరథీ శతకం ప్రత్యేకత ఏమిటి?
  8. కాళహస్తీశ్వర శతకంలో భక్తి ఎక్కువా? రాజదూషణ ఎక్కువా?
  9. ‘సుమతీ శతకం’ ప్రత్యేకత ఏమిటి?
  10. కృష్ణ శతకాన్ని ఎవరు రచించారు?
  11. మీకు నచ్చిన శతకం ఏమిటి?
  12. మీరు మాకు ఇచ్చే సందేశం ఏమిటి?
  13. ఛందోబద్ధం కాని తెలుగు శతకం ఏది?

భాషా కార్యకలాపాలు ప్రాజెక్టు పని

పాఠశాల గ్రంథాలయంలో శతకపద్యాలున్న పుస్తకాలు తీసుకొని చదవండి. వాటిలో ఏవైనా ఐదు శతకపద్యాలను, వాటి భావాలను రాసి ప్రదర్శించండి.
జవాబు:
1) సుమతీ శతకం :
తలనుండు విషము ఫణికిని
వెలయంగా తోకనుండు వృశ్చికమునకున్
తల తోక యనక యుండును
ఖలునకు నిలువెల్ల విషము గదరా సుమతీ!

భావం :
పాముకు విషం తలలో ఉంటుంది. తేలుకు విషం తోకలో ఉంటుంది. దుర్మార్గుడికి మాత్రం తల, తోక అని కాకుండా నిలువెల్లా ఉంటుంది.

2) కృష్ణ శతకం :
దేవేంద్రు డలుక తోడను
వావిరిగా రాళ్ళవాన వడి గురియింపన్
గోవర్ధనగిరి యెత్తితి
గోవుల గోపకుల గాచుకొఱకై కృష్ణా !

భావం:
ఓ కృష్ణా ! దేవేంద్రుడు కోపంతో రాళ్ళవానను వేగంగా కురిపించాడు. అప్పుడు నీవు ఆవులను, గోపాలురను రక్షించడానికి మందరపర్వతాన్ని ఎత్తిపట్టుకున్నావు.

3) వేమన శతకం:
గంగిగోవు పాలు గరిటెడైనను చాలు
కడవడైన నేమి ఖరము పాలు
భక్తి కలుగు కూడు పట్టెడైనను చాలు
విశ్వదాభిరామ వినురవేమ.

భావం :ఓ వేమనా ! గంగిగోవు పాలు గరిటెడు చాలు. గాడిదపాలు కుండెడు ఉంటే మాత్రం, ఏం ప్రయోజనం ఉంటుంది? భక్తితో పట్టెడు అన్నం పెడితే చాలు కదా !

4) కుమార శతకం:
ఆచార్యున కెదిరింపకు;
బ్రోచిన దొర నింద సేయబోకుము; కార్యా
లోచనము లొంటిఁ జేయకు
మాచారము విడువబోకుమయ్య కుమారా !

భావం:
కుమారా ! గురువు మాటకు ఎదురు చెప్పవద్దు. నిన్ను పోషించే యజమానిని నిందించకు. ఒంటరిగా కార్యమును గూర్చి ఆలోచింపకు. మంచి నడవడికను వదలిపెట్టకు.

5) గువ్వలచెన్నా శతకం ::
కలకొలది ధర్మ ముండిన
గలిగిన సిరి కదలకుండు, కాసారమునన్
గలజలము మడువులేమిని
గొలగల గట్టు తెగిపోదె గువ్వలచెన్నా !

భావం :
సిరిసంపదలకు తగినట్లుగా, దానధర్మాలు చేస్తే, ఆ సంపద పెరుగుతుంది. చెరువులోని నీటికి సరియైన వినియోగం లేకపోతే, గట్లు తెగిపోతాయి కదా !

III. భాషాంశాలు

పదజాలం

1) కింది పదాలకు అర్థాలు రాసి, వాటితో సొంతవాక్యాలు రాయండి.
ఉదా : ఉత్తములు = గొప్పవారు
సొంతవాక్యం :
ఉత్తములు ధనిక, పేద భేదాలు చూపరు.

అ) ముష్కరుడు = దుష్టుడు
సొంతవాక్యం :
ఢిల్లీ నగరములో అత్యాచారాలు చేసే ముష్కరుల సంఖ్య పెరుగుతోంది.

ఆ) లాలన = బుజ్జగించడం
సొంతవాక్యం :
తల్లిదండ్రులు తమ పిల్లలను అతిగా లాలన చేయకూడదు.

ఇ) ఘనత = గొప్పతనము
సొంతవాక్యం : రామభక్తియే, కంచర్ల గోపన్న ఘనతకు ముఖ్యకారణము.

ఈ) మర్మము = రహస్యము
సొంతవాక్యం :
దేశమర్మములను విదేశ గూఢచారులకు ఎన్నడూ తెలుపరాదు.

AP SSC 10th Class Telugu Solutions Chapter 6 శతక మధురిమ

2) కింది పదాలకు వ్యుత్పత్త్యర్థాలు రాయండి.

అ) భాస్కరుడు : కాంతిని కలుగజేయువాడు (సూర్యుడు)
ఆ) పయోనిధి : దీని యందు నీరు నిలిచియుంటుంది. (సముద్రము)
ఇ) దాశరథి : దశరథుని యొక్క కుమారుడు (రాముడు)

3) కింది పదాలకు పర్యాయపదాలు రాసి, వాటితో వాక్యాలు రాయండి.
ఉదా : ఈశ్వరుడు : 1) శివుడు 2) శంకరుడు.
వాక్య ప్రయోగము :
శివుడు కైలాసవాసి. ఆ శంకరుని “ఈశ్వరా! కాపాడు” అని వేడుకుంటే పాపాలు పోతాయి.

అ) లక్ష్మి : 1) కమల 2) హరిప్రియ 3) పద్మ 4) ఇందిర.
వాక్య ప్రయోగము :
‘కమల‘ వైకుంఠ నివాసిని. హరిప్రియను భక్తులు ‘పద్మ‘ అని, ‘ఇందిర‘ అని పిలుస్తారు.

ఆ) దేహం : 1) శరీరము 2) కాయము 3) గాత్రము.
వాక్య ప్రయోగము :
ఆమె శరీరము ఆహారము లేక ఎండిపోయింది. ఆ కాయమునకు బలమైన తిండి పెడితే, ఆ గాత్రము తిరిగి చక్కనవుతుంది.

ఇ) నీరము : 1) జలము 2) ఉదకము 3) పానీయము.
వాక్య ప్రయోగము :
ఆ గ్రామం చెరువులో జలము లేదు. ఉదకము కోసం గ్రామస్థులు నూయి తవ్వినా పానీయము పడలేదు.

ఈ) పయోనిధి : 1) సముద్రము 2) కడలి 3) సాగరము.
వాక్య ప్రయోగము :
జాలరులు వేటకు సముద్రము మీద పడవపై వెళ్ళారు. కడలిలో తరంగాలు హెచ్చుగా ఉండి ఆ పడవ సాగరములో మునిగిపోయింది.

4) కింది వాక్యాలను గమనించండి. ఆయా వాక్యాల్లోని ప్రకృతి – వికృతుల్ని గుర్తించి పట్టికగా కూర్చండి.

అ) మూర్ఖులకు నీతులు చెప్పడం వల్ల ఆ మొరకులకు లోకువ అవుతాము.
ఆ) సిరిని కురిపించు లచ్చిని ప్రసన్నం చేసుకోవడానికి శ్రీలక్ష్మిని పూజించాలి.
ఇ) న్యాయము తప్పి చరించరాదు. నాయమును కాపాడుట మన కర్తవ్యం.
జవాబు:
ప్రకృతి – వికృతి
అ) మూర్ఖులు – మొరకులు
ఆ) శ్రీ – సిరి
ఇ) న్యాయము – నాయము

వ్యాకరణాంశాలు

1. కింది సందర్భాలలో పునరుక్తమయిన హల్లులను పరిశీలించండి. అవి వృత్త్యనుప్రాస అలంకారాలవునో, కాదో చర్చించండి.

అ) నీ కరుణాకటాక్ష వీక్షణములకై నిరీక్షించుచున్నారము.
ఆ) అడిగెదనని కడువడిఁజను
నడిగినఁదను మగుడనుడుగడని నడయుడుగున్.
ఇ) మకరంద బిందు బృంద రసస్యందన మందరమగు మాతృభాషయే.
ఈ) చూరుకు, తేరుకు, యేరుకు, నారకు, దారువును వాడు నరవరులిలలోన్.

వృత్త్యను ప్రాసాలంకారం :
‘లక్షణం’ : ఒకటిగాని అంతకంటే ఎక్కువగాని అక్షరాలు కాని, అనేకసార్లు తిరిగి రావడాన్ని ‘వృత్త్యను ప్రాసాలంకారం’ అంటారు. వృత్తి అంటే ఆవృత్తి; ఆవృత్తి అంటే మళ్ళీ మళ్ళీ రావడం.

అ) “నీ కరుణా కటాక్ష వీక్షణములకై నిరీక్షించుచున్నారము”.
సమన్వయం :
పై వాక్యంలో, ‘క్ష’ అనే అక్షరం, మూడుసార్లు ఆవృత్తి చెందింది. కాబట్టి ఇది ‘వృత్త్యనుప్రాసాలంకారం’.

ఆ) ‘అడిగెదనని కడుడిఁజను
డిగినఁదను మగునుడుగడని నయుడుగున్’.
సమన్వయం :
పై పద్యపాదంలో ‘డ’ అనే హల్లు పలుమార్లు ఆవృత్తి అయ్యింది. కాబట్టి ఇది ‘వృత్త్యనుప్రాసాలంకారం’.

ఇ) ‘మకరంద బిందు బృంద రసస్యందన మందరమగు మాతృభాషయే’.
సమన్వయం :
పై వాక్యములో బిందు పూర్వక ‘ద’ కారము పలుమార్లు ఆవృత్తి అయ్యింది. కాబట్టి ఇది ‘వృత్త్యనుప్రాసాలంకారం’.

ఈ) చూరుకు, తేరుకు, మీరుకు, నారకు, దారువును వాడు నరవరులిలలోన్’.
సమన్వయం :
పై వాక్యములో, ‘ర’ అనే హల్లు పలుమార్లు ఆవృత్తి అయ్యింది. కాబట్టి ఈ వాక్యంలో ‘వృత్త్యనుప్రాస’ అలంకారం ఉంది.

విసర్గ సంధి

2. సంస్కృత పదాల మధ్య ‘విసర్గ’ మీద తరచు సంధి జరుగుతూ ఉంటుంది. అది వేర్వేరు రూపాలుగా ఉండటం గమనిద్దాం.

కింది ఉదాహరణలు విడదీసి చూడండి..
అ) నమోనమః
ఆ) మనోహరం
ఇ) పయోనిధి
ఈ) వచోనిచయం

1. పై సంస్కృత సంధి పదాలను విడదీస్తే, ఈ కింద చెప్పిన మార్పు జరిగిందని గుర్తింపగలం.
అ) నమః
ఆ) మనః + హరం
ఇ) పయః + నిధి
ఈ) వచః + నిచయం
సూత్రము :
అకారాంత పదాల విసర్గకు శషసలు, వర్గ ప్రథమ, ద్వితీయాక్షరాలు (క ఖ చ ఛట ఠ త థ ప ఫ లు) కాక మిగతా అక్షరాలు కలిస్తే, అకారాంత పదాల మీదున్న విసర్గ లోపించి, అకారం ‘ఓ’ కారంగా మారింది.

గమనిక :
ఈ ఉదాహరణలలో మొదటి పదాలు, అకారాంతాలుగా ఉన్నాయి. అకారాంత పదాల మీదున్న విసర్గ లోపించి, అకారం ‘ఓ’ కారంగా మారింది.
అ) నమోనమః
ఆ) మనోహరం
ఇ) పయోనిధి
ఈ) వచోనిచయం

2. కింది పదాలు కలిపి, మార్పును గమనించండి.

అ) మనః + శాంతి = మనశ్శాంతి
ఆ) చతుః + షష్టి = చతుషష్టి
ఇ) నభః + సుమం = నభస్సుమం

గమనిక :
పై సంధి పదాలను కలుపగా, వరుసగా మనశ్శాంతి, చతుషష్టి, నభస్సుమం – అనే రూపాలు ఏర్పడ్డాయి. అంటే విసర్గ తరువాత ‘శ, ష, స’లు ఉంటే, విసర్గలు కూడా శషసలుగా మారి ద్విత్వాలుగా తయారవుతాయి.

3. కింది పదాలను విడదీయండి.
అ) ప్రాతఃకాలము = ప్రాతస్ + కాలము – ప్రాతఃకాలము
ఆ) తపఃఫలము = తపస్ + ఫలము – తపఃఫలము

గమనిక :
పై ఉదాహరణములలో సకారము (‘స్’) విసర్గగా ప్రయోగింపబడింది.
నమస్కారము, శ్రేయస్కరము, వనస్పతి మొదలయిన మాటలలో ‘స్’ కారము విసర్గగా మారలేదు.
1) శ్రేయస్ + కరము = శ్రేయస్కరమ
2) నమస్ + కారము = నమస్కారము
3) వనస్ + పతి = వనస్పతి మొ||నవి.

4. కింది పదాలను కలిపి, మార్పును గమనించండి.
ఉదా: అంతః + ఆత్మ = అంతరాత్మ

అ) దుః + అభిమానం = దురభిమానం
ఆ) చతుః + దిశలు = చతుర్దిశలు
ఇ) ఆశీః + వాదము + ఆశీర్వాదము
ఈ) పునః + ఆగమనం + పునరాగమనం
ఉ) అంతః + మథనం = అంతర్మథనం

గమనిక:
పై విసర్గ సంధులలో 1) అంతః, 2) దుః, 3) చతుః, 4) ఆశీః, 5) పునః మొదలయిన పదాలకు, వర్గ ప్రథమ, నమః ద్వితీయాక్షరాలు, శ, ష, స లు గాక, మిగతా అక్షరాలు కలిస్తే విసర్గ రేఫ(ర్)గా మారడం గమనించండి.

5. కింది పదాలు విడదీయండి.
ఉదా:
ధనుష్కోటి = ధనుః + కోటి (ధనుస్ + కోటి)

అ) నిష్ఫలము = నిః + ఫలము (నిస్ + ఫలము)
ఆ) దుష్కరము = దుః + కరము (దుస్ + కరము)
ఇస్ (ఇః), ఉస్ (ఉః)ల విసర్గకు క, ఖ, ప, ఫ లు కలిసినప్పుడు, విసర్గ (స్) ‘ష’ కారంగా మారుతుంది.

AP SSC 10th Class Telugu Solutions Chapter 6 శతక మధురిమ

6. కింది పదాలు విడదీయండి.
ఉదా:
నిస్తేజము = నిః + తేజము
అ) దుశ్చేష్టితము = దుః + చేష్టితము
ఆ) ధనుష్టంకారము = ధనుః + టంకారము
ఇ) మనస్తాపము = మనః + తాపము
విసర్గకు చ, ఛలు పరమైతే ‘శ’ గా, ట, ఠ లు పరమైతే ‘ష’ గా, త, థ లు పరమైతే ‘స’ గా మారుతుంది.

7. పై ఉదాహరణలన్నీ పరిశీలించిన మీదట, విసరసంధి ఆఱు విధాలుగా ఏర్పడుతున్నదని తెలుస్తున్నది.

i) అకారాంత పదాల విసర్గకు, వర్గ ప్రథమ ద్వితీయాక్షరాలు అనగా (క చట తప; ఖ, ఛ, ఠ, థ ఫ); శ, ష, సలు గాక, మిగతా అక్షరాలు కలిసినప్పుడు విసర్గ లోపించి ‘అ’ కారం ‘ఓ’ కారంగా మారుతుంది.
ii) విసర్గకు శ, ష, స లు పరమైనప్పుడు శ, ష, స లుగా మారుతుంది.
iii) విసర్గమీద క, ఖ, ప, ఫ లు వస్తే, విసరకు మార్పు రాదు (సంధి ఏర్పడదు).
iv) అంతః, దుః, చతుః, ఆశీః, పునః మొదలయిన పదాల విసర్గ, రేఫ (5) గా మారుతుంది.
v) ఇస్, ఉన్ల విసర్గకు, క, ఖ, ప, ఫలు పరమైతే, విసర్గ ‘ష’ కారంగా మారుతుంది.
vi) విసర్గకు చ, ఛలు పరమైతే ‘శ’ కారం; ట, ఠలు పరమైతే ‘ష’ కారం; త, థలు పరమైతే ‘స’ కారం వస్తాయి.

అదనపు సమాచారము

సంస్కృత సంధులు

1. సవర్ణదీర్ఘ సంధి :

1) లవణాబ్ది = లవణ + అబ్ది – సవర్ణదీర్ఘ సంధి
2) సుధాధారానుకారోక్తులు = సుధాధారా + అనుకారోక్తులు – సవర్ణదీర్ఘ సంధి
3) దేహాత్మలు = దేహా + ఆత్మలు – సవర్ణదీర్ఘ సంధి
4) శ్రీకాళహస్తీశ్వరుడు = శ్రీకాళహస్తి + ఈశ్వరుడు – సవర్ణదీర్ఘ సంధి
5) హింసారంభకుండు = హింసా + ఆరంభకుడు – సవర్ణదీర్ఘ సంధి

2. గుణ సంధి:

1) ధారానుకారోక్తులు = ధారానుకార + ఉక్తులు – గుణ సంధి

3. జశ్వ సంధి:

1) ‘సదాచారము = సత్ + ఆచారము – జశ్వ సంధి

తెలుగు సంధులు

4. అత్వ సంధులు :

1) ఇచ్చినంతలో = ఇచ్చిన + అంతలో – అత్వ సంధి
2) ఊరకుండినన్ = ఊరక + ఉండినన్ – అత్వ సంధి
3) ఇడినందునన్ = ఇడిన + అందునన్ – అత్వ సంధి
4) వఱదైన = వఱద + ఐన – అత్వ సంధి

5. ఇత్వ సంధి:

1) అదెట్లు = అది +ఎట్లు – ఇత్వ సంధి

6. ఉత్వ సంధులు:

1) ముత్యమట్లు = ముత్యము + అట్లు – ఉత్వ సంధి
2) కాదని = కాదు + అని – ఉత్వ సంధి
3) కఱవైనను = కఱవు + ఐనను – ఉత్వ సంధి

7. యడాగమ సంధులు :
1) బుద్ధి యొసంగు = బుద్ధి + ఒసంగు – యడాగమ సంధి
2) రెట్టయిడు = రెట్ట + ఇడు – యడాగమ సంధి

8. త్రిక సంధులు :

1) అమ్మహాత్ముడు = ఆ + మహాత్ముడు – త్రిక సంధి
2) ఇద్దరణిన్ = ఈ + ధరణిన్ – త్రిక సంధి
3) ఎత్తెఱంగున = ఏ + తెఱంగున – త్రిక సంధి
4) అయ్యెడన్ = ఆ + ఎడన్ – యడాగమ త్రిక సంధులు

9. గసడదవాదేశ సంధులు :

1) జాతుల్సెప్పుట = జాతుల్ + చెప్పుట – గసడదవాదేశ సంధి
2) మర్మము సెప్పకు = మర్మము + చెప్పకు – గసడదవాదేశ సంధి
3) అపకారము సేయడు = అపకారము + చేయడు – గసడదవాదేశ సంధి
4) మణిత్వము గాంచు = మణిత్వము + కాంచు – గసడదవాదేశ సంధి

10. సరళాదేశ సంధులు (ద్రుతప్రకృతిక సంధులు) :

1) శుక్తిలోఁబడి = శుక్తిలోన్ + పడి – సరళాదేశ సంధి
2) ఉత్తముఁగొల్చు = ఉత్తమున్ + కొల్చు – సరళాదేశ సంధి
3) మధుకణంబుం జిందు = మధుకణంబున్ + చిందు – సరళాదేశ సంధి
4) మూర్ఖులఁదెల్పు = మూర్ఖులన్ + తెల్పు – సరళాదేశ సంధి
5) లాలనఁజేసి = లాలనన్ + చేసి – సరళాదేశ సంధి
6) లక్ష్మిఁబొందు = లక్ష్మి న్ + పొందు – సరళాదేశ సంధి
7) కీడుఁజేయగాన్ = కీడున్ + చేయగాన్ – సరళాదేశ సంధి
8) కవ్వముఁబట్టి = కవ్వమున్ – సరళాదేశ సంధి
9) తరువగఁజొచ్చు = తరువగన్ + చొచ్చు – సరళాదేశ సంధి

11. నుగాగమ సంధి:

1) తనర్చు నా నీరము = తనర్చు + ఆ నీరము – నుగాగమ సంధి

సమాసాలు

సమాస పదంవిగ్రహవాక్యంసమాసం పేరు
1) భక్త చింతామణిభక్తులకు చింతామణిషష్ఠీ తత్పురుష సమాసం
2) పరహితముపరులకు హితముషష్ఠీ తత్పురుష సమాసం
3) సుధాధారసుధయొక్క ధారషష్ఠీ తత్పురుష సమాసం
4) మధుకణంబుమధువు యొక్క కణముషష్ఠీ తత్పురుష సమాసం
5) తంతు సంతతులుతంతువుల యొక్క సంతతులుషష్ఠీ తత్పురుష సమాసం
6) కరిరాజుకరులకు రాజుషష్ఠీ తత్పురుష సమాసం
7) దయా పయోనిధిదయకు పయోనిధిషష్ఠీ తత్పురుష సమాసం
8) స్వ భాషతమ యొక్క భాషషష్ఠీ తత్పురుష సమాసం
9) కరుణాపయోనిధికరుణకు పయోనిధిషష్ఠీ తత్పురుష సమాసం
10) నళినీ దళ సంస్థితమునళినీ దళము నందు సంస్థితముసప్తమీ తత్పురుష సమాసం
11) లవణాబ్ధిలవణ సహితమైన అభివిశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
12) చిక్కని పాలుచిక్కనైన పాలువిశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
13) ధర్మవర్తనధర్మమైన వర్తనవిశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
14) నీచ వాక్యములునీచమైన వాక్యములువిశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
15) తప్త లోహముతప్తమైన లోహమువిశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
16) ఉరువజ్రంబుగొప్పదైన వజ్రంబువిశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
17) పౌరుష వృత్తులుపురుషులకు సంబంధించిన వృత్తులువిశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
18) శిరీష పుష్పములుశిరీషము అనే పేరు గల పుష్పములుసంభావనా పూర్వపద కర్మధారయ సమాసము
19) దీన దేహులుదీనమైన దేహము గలవారుబహుప్రీహి సమాసము
20) అనామకముపేరు లేనిదినజ్ బహుజొహి సమాసము

ప్రకృతి – వికృతులు

నీరమ్ – నీరు
మౌక్తికము – ముత్తియము
రాట్టు – రేడు
వజ్రమ్ – వజ్జిరము
పుష్పమ్ – పూవు
మూర్యుడు – మొఱకు
లక్ష్మి – లచ్చి
భాష – బాస
కార్యము – కర్ణము
రూపము – రూపు
శ్రీ – సిరి
యుగము – ఉగము
భీరుకుడు – పిటికి
యుగమ్ – ఉగము
హితమ్ – ఇతము
న్యాయము – నాయము
ధర్మము – దమ్మము
కాకము – కాకి

వ్యుత్పత్యర్థాలు

1. వజ్రము : అడ్డము లేకపోవునట్టిది (వజ్రము )
2. పుష్పము : వికసించేది (పుష్పము)
3. ధరణి : విశ్వమును ధరించేది (భూమి)
4. ఈశ్వరుడు : స్వభావముచేతనే ఐశ్వర్యము కలవాడు (శివుడు)
5. భాస్కరుడు : కాంతిని కలుగజేయువాడు (సూర్యుడు)
6. పయోనిధి : దీనియందు నీరు నిలిచియుండునది (సముద్రము)
7. పయోధి : నీటికి ఆధారమైనది (సముద్రము)

పర్యాయపదాలు

1. పయోనిధి : పయోధి, జలనిధి, సముద్రము, ఉదధి.
2. లక్ష్మి : పద్మ, కమల, రమ, లచ్చి,
3. ఈశ్వరుడు : ఈశుడు, శివుడు, శంభువు, పినాకి, ముక్కంటి,
4. కరి : ఏనుగు, హస్తి, సామజము, ఇభము, దని.
5. కాకి : వాయసము, చిరజీవి, అరిష్టము.
6. నీరము : నీరు, జలము, ఉదకము.
7. పుష్పము : పూవు, ప్రసూనము, కుసుమము, సుమము, విరి.
8. ముత్యము : మౌక్తికము, పాణి, ముక్తాఫలము, ముత్తియము.
9. అబ్ది : సముద్రము, జలధి, ఉదధి, పారావారము.
10. ధరణి : భూమి, ధర, జగత్తు, జగము, క్షోణి, కాశ్యపి.
11. దేహం : శరీరము, కాయము, గాత్రము, వపువు.
12. సుధ : అమృతము, పీయూషము.
13. కఱవు : కాటకము, క్షామము.

నానార్థాలు

1. కరి : ఏనుగు, కోతి, ఎనిమిది, సాక్షి.
2. రాజు : ప్రభువు, చంద్రుడు, ఇంద్రుడు.
3. దళము : ఆకు, సేన, సగము, గుంపు.
4. ప్రభ : వెలుగు, పార్వతి, ప్రభల సంబరము, సూర్యుని భార్య.
5. సంతతి : కులము, సంతానము, పుత్ర పౌత్ర పారంపర్యము.
6. కణము : నీటిబొట్టు, బాణము, కొంచెము, నూక, కణత.
7. సుధ : అమృతము, సున్నము, ఇటుక, చెముడు మొక్క.
8. ఈశ్వరుడు : ప్రభువు, శివుడు, భర్త, భగవంతుడు.
9. లక్ష్మి : శ్రీదేవి, కలువ, పసుపు, ముత్యము, జమ్మిచెట్టు.
10. సాధనము : సాధించుట, ధనము, తపము, ఉపాయము.
11. పట్టు : గ్రహణము, అవకాశము, బంధుత్వము, పట్టుదల.
12. శ్రీ : లక్ష్మి, ఐశ్వర్యము, అలంకారము, విషము, సాలిపురుగు, ఒక రాగము.
13. యుగము : జంట, రెండు, బండికాడి, వయస్సు.
14. ద్రవ్యము : ధనము, ఇత్తడి, ఔషధము, లక్క.

కవయిత్రి, కపుల పరిచయం

1) కవి పేరు : ఏనుగు లక్ష్మణకవి

రచించిన శతకం : సుభాషిత రత్నావళి

అనువాద శతకం : ఇది సంస్కృతము నుండి తెలుగులోకి అనువదింపబడిన శతకము. భర్తృహరి మహాకవి సంస్కృత భాషలో ‘సుభాషిత త్రిశతి’ అనే పేరున మూడు శతకాలు రచించాడు. వాటినే ఏనుగు లక్ష్మణకవి ‘సుభాషిత రత్నావళి’ అనే పేరున అనువదించాడు.

కాలము : క్రీ.శ. 1720 – 1780 మధ్యకాలము.

నివాసము : ఈయన తూర్పు గోదావరి జిల్లా ‘పెద్దాడ’ గ్రామంలో నివసించారు.

ఇతర గ్రంథాలు :
1) రామేశ్వర మాహాత్మ్యం,
2) విశ్వామిత్ర చరిత్ర,
3) గంగా మాహాత్మ్యం,
4) రామవిలాసం,
అనేవి వీరి ప్రసిద్ధ రచనలు.

2) కవయిత్రి : తరిగొండ వెంగమాంబ

రచించిన శతకం : తరిగొండ నృసింహ శతకం

కాలం : ఈమె 18వ శతాబ్దానికి చెందిన కవయిత్రి.

జన్మస్థలం : చిత్తూరు జిల్లా ‘తరిగొండ’ గ్రామము.

భక్తి జీవనం : ఈమె బాల్యము నుండి భగవద్భక్తురాలు.

రచనలు : ఈమె తరిగొండ నృసింహ శతకం, శివనాటకం, ‘నారసింహ (ఊహాచిత్రం) విలాసకథ’ అనే యక్షగానాలు, ‘రాజయోగామృతం’ అనే ద్విపద కావ్యం, శ్రీ వేంకటాచల మాహాత్మ్యం, అష్టాంగ యోగసారం, వాశిష్ఠ రామాయణం అనే పద్యకావ్యాలు రచించి ప్రసిద్ధి పొందింది.

3) కవి పేరు : వడ్డాది సుబ్బారాయ కవి (వసురాయకవి)

రచించిన శతకం : భక్తచింతామణి శతకం

కాలం : 20వ శతాబ్దం

ప్రసిద్ధి : వీరు “వసురాయకవి”గా ప్రసిద్ధులు.

ఉద్యోగం : రాజమహేంద్రవరంలోని ఫస్టుగ్రేడ్ కళాశాలలో ఆంథ్రోపన్యాసకులుగా పనిచేశారు.

భక్తచింతామణి శతకం : వీరు ‘హిందూ జన సంస్కారిణి’ అనే పత్రికలో మొదట “భక్త చింతామణి” పేర 80 పద్యాలు వ్రాశారు. తరువాత దాన్ని భక్తచింతామణి శతకంగా వీరు పూర్తిచేశారు.

రచనలు : వీరి ‘వేణీ సంహారము’ నాటకానువాదము చాలా ప్రసిద్ధి పొందింది. ‘ప్రబోధ చంద్రోదయం’ అనే మరో నాటకం, నందనందన శతకం, భగవత్కీర్తనలు- అనేవి వీరి ఇతర రచనలు.

AP SSC 10th Class Telugu Solutions Chapter 6 శతక మధురిమ

4) కవి పేరు : మారద వెంకయ్య
ఈయనను మారన వెంకయ్య’ అని, ‘మారవి’ అని కూడా కొందరు అంటారు.

రచించిన శతకం : “భాస్కర శతకము”

కాలము : క్రీ.శ. 1650 – 1600 మధ్య కాలంలో ఇతడు జీవించి ఉంటాడని విమర్శకుల అభిప్రాయం.

భాస్కర శతకం విశిష్టత : సుమతీ శతకం, వేమన శతకం తరువాత మంచి ప్రచారంలో ఉన్న నీతి శతకాలలో ‘భాస్కర శతకం’ మొదటిది. ఇందులో పద్యాలు అకారాది క్రమంలో ఉన్నాయి. దృషాంత అలంకారం ప్రయోగించడం వల్ల భావపుషికి సాయపడుతుంది. దృషాంత పూర్వక నీతిబోధ హృదయంపై చెరగని గాఢముద్ర వేస్తుంది. ‘భాస్కర శతకము’ తెలుగులో వెలసిన మొదటి దృష్టాంత శతకము.

5) కవి పేరు : కంచర్ల గోపన్న

రచించిన శతకం : ‘దాశరథీ శతకం’. ఇది ‘దాశరథీ కరుణాపయోనిధీ’ అనే మకుటంతో రచింపబడింది.

కాలము : 17వ శతాబ్దానికి చెందిన కవి.

కంచర్ల గోపన్న విశిష్టత : ఈయనకు ‘రామదాసు’ అనే పేరు ఉంది. ఈయన భద్రాచలంలో శ్రీరామునికి దేవాలయాన్ని పునరుద్ధరణ చేయించాడు. సీతారామలక్ష్మణులకూ, హనుమంతునికీ ఆభరణాలు చేయించాడు. ఈయనను తానీషా గోలకొండ కోటలో బంధించాడు. ఈయన శ్రీరామునిపై అనేక కీర్తనలు వ్రాశాడు. అవే రామదాసు కీర్తనలుగా ప్రసిద్ధి పొందాయి. ఈయన శ్రీరామ భక్తాగ్రగణ్యుడు.

6) కవి పేరు : ధూర్జటి

రచించిన శతకం : ‘శ్రీకాళహస్తీశ్వర శతకం’. ఇది శ్రీకాళహస్తీశ్వరా ! అనే మకుటంతో వ్రాయబడింది.

కాలము : క్రీ.శ. 16వ శతాబ్దము వాడు. ధూర్జటి మహాకవి శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోని అష్టదిగ్గజకవులలో ఒకడిగా ఉండి, అనేక సత్కారాలు పొందాడు.

ఇతర గ్రంథము : ఈయన “కాళహస్తి మాహాత్మ్యము” అనే కావ్యాన్ని ప్రబంధ శైలిలో వ్రాశాడు. ఈయన శుద్ధ శైవుడు. పరమ శివభక్తుడు. అపార మహిమగల కవి. రాజులనూ, రాజసేవనూ నిరసించాడు.

7) కవి పేరు : బద్దెన

శతకం పేరు : ‘సుమతీ శతకము’. ‘సుమతీ’ అనే మకుటంతో ఈ శతకం వ్రాయబడింది.

కాలము : 13వ శతాబ్దము

సుమతీ శతక విశిష్టత : సుమతీ శతక రచనా విధానం, లలితంగా ఉంటుంది. ఈ శతకం లలితమైన శబ్దాలతో, హృదయంగమైన శైలిలో సరళంగా ఉంటుంది. భావాలు సులభంగా పఠితుల మనస్సులకు హత్తుకొనేటట్లు ఈ శతకం ఉంటుంది. తరువాతి కాలంలో కందములలో వ్రాయబడ్డ శతకాలకు ఈ సుమతీ ‘శతకం’ ఆదర్శంగా నిలిచింది. ఆనాటి సమకాలీన ప్రజల జీవిత విధానాన్ని, వారి మనస్తత్వాన్ని బద్దెన బోధించిన నీతులు అద్దముల వలె ప్రతిఫలిస్తున్నాయి.

అవగాహన – ప్రతిస్పందన

పద్యం – 1 : కంఠస్థ పద్యం

ఉ॥ వీరము తప్తలోహమున నిల్చి యవాచకమై వశించు వా
వీరము ముత్యమట్లు వళివీదళ సంగీతమై తవర్చునా
నీరమె శక్తిలో(బడి మణిత్వము గాంచు సమంచిత ప్రభవ్
బౌరుష వృత్తులి బ్లధము మధ్యము మత్తము గొల్చువారికిన్.
– ఏనుగు లక్ష్మణకవి
ప్రతిపదార్థం :
నీరము = నీరు
తప్తలోహమునన్ = కాల్చిన ఇనుము నందు
నిల్చి = నిలబడి
అనామకమై = పేరులేనిదై
నశించున్ = నశిస్తుంది
ఆ నీరము = ఆ నీరే
నళినీదళ సంస్థితమై ; నళినీదళ = తామర ఆకునందు
సంగీతము + ఐ = ఉన్నదై
ముత్యమట్లు (ముత్యము + ఆట్లు) = ముత్యమువలె
తనర్చున్ = అలరిస్తుంది (భాసిస్తుంది)
ఆ నీరము = ఆ నీరే
శుక్తిలోఁబడి (శుక్తిలోన్ + పడి) = ముత్యపు చిప్పలో పడి (సముద్రములోని ముత్యపు చిప్పలో పడినట్లయితే)
సమంచిత ప్రభన్; సమంచిత = మిక్కిలి ఒప్పిదమైన
ప్రభన్ = ప్రకాశముతో
మణిత్వమున్ = మణియొక్క రూపమును ; (మణి యొక్క స్వభావమును)
కాంచున్ = పొందుతుంది;
అధమున్ = అధముని (నీచుని)
మధ్యమున్ = మధ్యముని
ఉత్తమున్ = ఉత్తముడిని
కొల్చువారికిన్ = సేవించేవారికి
పౌరుష వృత్తులు ; పౌరుష = పురుషునకు సంబంధించిన
వృత్తులు = నడవడులు (బ్రతుకు తెరువులు)
ఇట్లు = ఈ విధంగానే ఉంటాయి.

భావం:
కాల్చిన ఇనుము మీద నీళ్ళుపడితే, ఆవిరైపోయి, పేరు లేకుండా పోతాయి. ఆ నీళ్ళే తామరాకు పైన పడితే, ముత్యమువలె కన్పిస్తాయి. ఆ నీళ్ళే ముత్యపు చిప్పలలో పడితే, మణులవలె (ముత్యములవలె) మారతాయి. అలాగే మనిషి అధముడిని సేవిస్తే, తాను కూడా అధముడు ఔతాడు. మధ్యముడిని సేవిస్తే, మధ్యముడు ఔతాడు. ఉత్తముడిని సేవిస్తే, తాను కూడా ఉత్తముడౌతాడు.

పద్యం – 2 : కంఠస్థ పద్యం

మ॥ కరిరాజువ్ బిసతంతు సంతతులచే గట్టన్ విజృంభించు వాఁ
దురు వజ్రంబు శిరీష పుష్పములచే సహించు భేదింపఁదీ
పురచింపన్ లవణాఫ్రికన్ మధుకణంబుం ఇందు యత్నించు ని
ధరణిన్ మూర్ఖులఁ దెల్పువెవ్వడు సుధాధారామకారోక్తులన్
– ఏనుగు లక్ష్మణకవి
ప్రతిపదార్థం :
ఎవ్వడు = ఎవడు;
సుధాధారానుకారోక్తులన్; సుధాధారా = అమృత ధారలను
అనుకార = పోలునట్టి;
ఉక్తులన్ = మాటలతో
ఇద్దరణిన్ (ఈ + ధరణిన్) = ఈ భూమండలములో
మూర్చులన్ = మూర్ఖులను;
తెల్పున్ = స్పష్టపరుస్తాడో (సమాధాన పరుస్తాడో)
వాడు = వాడు
కరిరాజున్ = మదపు టేనుగును ;
బిసతంతు సంతతులచేన్ ; బిసతంతు = తామర తూడునందలి దారముల యొక్క
సంతతులచేన్ = సమూహముచే
కట్టన్ = కట్టడానికి
విజృంభించున్ = ప్రయత్నిస్తాడు
ఉరువజ్రంబున్ = గొప్ప వజ్రపుమణిని
శిరీషపుష్పములచేన్ = దిరిసెన పూవులతో
భేదింపన్ – బ్రద్దలు చేయడానికి
ఊహించున్ = ఆలోచిస్తాడు
లవణాభికిన్ (లవణ + అబ్ధికిన్) = ఉప్పు సముద్రానికి
తీపు రచింపన్ = తియ్యన చేయడానికి (తీయగా చేయడానికి)
మధుకణంబున్ = తేనె బొట్టును
చిందు యత్నించున్ = ఒలికించడానికి ప్రయత్నిస్తాడు

భావం:
మూర్ఖులను అమృతధారలవంటి మాటలతో సమాధాన పరిచేవాడూ, మదపుటేనుగును తామర తూడునందలి దారములతో బంధించాలని ఆలోచించేవాడూ, దిరిసెన పువ్వుతో వజ్రాన్ని బ్రలు చేయాలని యత్నించేవాడూ, ఒక్క తేనెబొట్టుతో ఉప్పు సముద్రపు నీటిని తియ్యగా మార్చాలనుకొనేవాడూ, సమానులు.

ఆలోచించండి – చెప్పండి

ప్రశ్న 1.
ఉత్తమ లక్షణాలు ఏవి?
జవాబు:
తల్లిదండ్రులనూ, గురువులనూ, పెద్దలను గౌరవించడం, సత్యమునే మాట్లాడడం, సకాలంలో తనకు ఉన్న పనులు చేయడం, ధర్మమార్గాన్ని పాటించడం, బీదలనూ, అనాథులనూ ఆదుకోవడం, దానధర్మాలు చేయడం, చక్కగా చదువుకోవడం, తోటివారిపై కరుణ, జాలి కలిగియుండడం, తనకున్న దానిలో కొంత ప్రక్కవారికి ఇవ్వడం, మొదలైనవి ఉత్తమ లక్షణాలు.

ప్రశ్న 2.
మీకు తెలిసిన లోహాల పేర్లు చెప్పండి.
జవాబు:
ఇనుము, వెండి, బంగారము, ఇత్తడి, కంచు, రాగి, స్టెయిన్లెస్ స్టీలు, తగరము, సీవెండి మొదలైనవి నాకు తెలిసిన కొన్ని లోహాలు.

AP SSC 10th Class Telugu Solutions Chapter 6 శతక మధురిమ

ప్రశ్న 3.
మూర్ఖుల స్వభావం ఎలాంటిది?
జవాబు:
మూర్యుడు మొండి పట్టుదల గలవాడు. అతడికి విషయము తెలియదు. ఇతరులు చెపితే అతడు వినడు. తెలియని వాడికి చెప్పవచ్చు. తెలిసినవాడికి మరింత సులభంగా చెప్పవచ్చు. కాని మూర్ఖుడికి చెప్పడం, ఎవరికీ శక్యం కాదు. ఇసుక నుండి నూనెను తీయగలము. ఎండమావిలో నీరు త్రాగగలము. కాని మూర్ఖుడి మనస్సును మాత్రం సంతోషపెట్టలేము.

ప్రశ్న 4.
‘ధరణి’ అనే పదానికి పర్యాయపదాలు చెప్పండి.
జవాబు:
భూమి, అచల, రస, విశ్వంభర, అనన్త, స్థిర, ధర, ధరిత్రి, ధరణి, క్షోణి, కాశ్యపి, క్షితి, సర్వంసహ, వసుమతి, వసుధ, ఉర్వి, వసుంధర, పృథివి, పృథ్వి, అవని, మేదిని, మహి, ఇల, విపుల, జగతి, రత్నగర్భ, భూత ధాత్రి, కుంభిని, క్షమ, పుడమి, నేల మొదలైనవి ధరణి అనే పదానికి పర్యాయపదములు.

పద్యం – 3 : కంఠస్థ పద్యం

ఉ॥పట్టుగ నీశ్వరుండు తన పాలిట మండిపుడిచ్చినంతలో
దిట్టక దీనదేహలమ దేటగ లాలవఁ జేసి, యన్నమున్
బెట్టు వివేకి మానసముఁ బెంపావరించుచు మారకుండినన్
గుట్టుగ లక్ష్మి(బొందుఁ; దరిగొండపృసింహ! దయాపయోనిధీ!
– తరిగొండ (తరికుండ) వెంగమాంబ
ప్రతిపదార్థం :
దయాపయోనిధీ = దయకు సముద్రుడవైన వాడా ! (సముద్రమంత గొప్ప దయ కలవాడా !)
తరిగొండ నృసింహ : తరిగొండ గ్రామంలో వెలసిన ఓ నృసింహ స్వామీ!
వివేకి = వివేకము గలవాడు
ఈశ్వరుండు = భగవంతుడు
పట్టుగన్ = దృఢముగా
తన పాలిటనుండి = తన పక్షమున ఉండి
ఇపుడు = ఈ జన్మములో
ఇచ్చినంతలోన్ = తనకు ప్రసాదించిన దానిలోనే
దీనదేహులను = దరిద్రులను
తిట్టక = నిందింపక (కసురుకోక)
దేటగన్ = ఇంపుగా (ఆప్యాయంగా)
లాలనఁజేసి = (దీనులను)లాలించి (బుజ్జగించి)
అన్నమున్ = అన్నాన్ని
పెట్టున్ = పెడతాడు
మానసమున్ = తన మనస్సును (అతడు)
పెంపొనరించుచున్ (పెంపు+ఒనరించుచున్) = ఆనందింపజేసికొంటూ (సంతోషపరచుకుంటూ)
ఊరకుండినన్ (ఊరక+ఉండినన్) = (తనకు ఇమ్మని ఏమీ) అడుగకుండా ఊరకున్నప్పటికీ
గుట్టుగన్ = రహస్యంగా
లక్ష్మిన్ = ఐశ్వర్యాన్ని
పొందున్ = పొందుతాడు

భావం :
ఓ దయా సముద్రుడా ! తరిగొండ నృసింహదేవా! వివేకి అయినవాడు, తనకు భగవంతుడు ప్రసాదించిన దానిలోనే నిరుపేదలను కసరుకోక, ఆప్యాయతతో లాలిస్తూ వారికి అన్నము పెడతాడు. అతడు మనసులో ఆనందపడుతూ ఉంటే, అతడు తనకు పెట్టమని అడుగకపోయినా, లక్ష్మీదేవి రహస్యంగా అతడిని వచ్చి చేరుతుంది.

పద్యం – 4 : కంఠస్థ పద్యం

మ|| తన దేశంబు స్వభాష వైజమతమున్ ఆస్మత్సదాచారముల్
తన దేహాత్మల ఎత్తెలుంగువ పదా రావట్లు ప్రేమించి, త
దృవతావాప్తికి సాధనంబులగు సత్కార్యమ్ములన్ జేయఁగా
నమవా బుద్ధి యొసంగుమీ ప్రజకు దేవా! భక్త చింతామణి!
– వడ్డాది సుబ్బరాయకవి
ప్రతిపదార్థం :
దేవా = ఓ దైవమా !
భక్త చింతామణీ = భక్తులకు చింతామణి రత్నంవలె కోరిన కోరికలను ఇచ్చేవాడా!
తన దేహాత్మలన్; (తన దేహ + ఆత్మలన్) తన దేహ = తన శరీరాన్ని
ఆత్మలన్ = ఆత్మలను
ఎత్తెఱంగునన్ (ఏ + తెలుంగునన్) – ఏ విధంగా మనిషి ప్రేమిస్తాడో,
అట్లు = ఆ విధంగానే
తన దేశంబున్ = తన దేశాన్ని
స్వభాషన్ = తన భాషను
నైజమతమున్ = తన మతాన్ని
అస్మత్ సదాచారముల్; అస్మత్ = తన యొక్క
సదాచారముల్, (సత్ + ఆచారముల్) = మంచి ఆచారములను
సదా = ఎల్లప్పుడునూ
తాను = తాను
ప్రేమించి = ప్రేమతో చూసి
తద్ఘనతా వాప్తికిన్; (తత్ +ఘనతా+అవాప్తికిన్) తత్ = ఆ దేశము, భాష, మతము సదాచారములు అనేవి
ఘనతా = గొప్పతనమును
అవాప్తికిన్ = పొందడానికి
సాధనంబులగు = సాధనములయిన
సత్కార్యములన్ = మంచి పనులను
చేయగాన్ = చేయడానికి
అనువౌ (అనువు+ఔ) = తగినటువంటి
బుద్దిన్ = బుద్ధిని
ప్రజకున్ = దేశప్రజలకు
ఒసంగుమీ = ఇమ్ము

భావం :
భక్తుల పాలిటి చింతామణి రత్నం వంటి వాడవైన ఓ స్వామీ ! ఎవరైనా తన శరీరాన్ని, ఆత్మనూ ఏవిధంగా అభిమానిస్తూ ఉంటారో, ఆవిధంగానే తన దేశాన్ని, తన భాషనూ, తన మతాన్ని, తన మంచి ఆచారాలనూ కూడా అభిమానించే టట్లు, వాటి ఔన్నత్యానికి సాధనాలయిన మంచి పనులను చేసేటట్లూ తగిన బుద్ధిని ప్రజలకు ప్రసాదించు.

ఆలోచించండి – చెప్పండి

ప్రశ్న 1.
ఎవరిని ఆదరించాలి? లక్ష్మి ఎప్పుడు వచ్చి చేరుతుంది?
జవాబు:
దీనులనూ, అనాథలనూ, కష్టములలో ఉన్నవారినీ మనం ఆదరించాలి. దీనులను ఆదరించి, వారికి అన్నము పెడితే లక్ష్మి తనంతట తానుగా మనలను వచ్చి చేరుతుంది.

AP SSC 10th Class Telugu Solutions Chapter 6 శతక మధురిమ

ప్రశ్న 2.
మంచి పనులకు అవసరమైన బుద్ది అనగా ఏమిటో వివరించండి.
జవాబు:
మంచి పనులకు అవసరమైన బుద్ధి, అంటే తన దేశాన్ని, తన మతాన్ని, తన భాషను, తన దేశ ప్రజలను ప్రేమించే మనస్తత్వం కలిగియుండడం. అలాగే ఇరుగుపొరుగు వారిపై జాలి, కరుణ, దయ, ఆర్థత కల్గియుండడం. ఇరుగు పొరుగు వారి కష్టసుఖాలలో తాము పాలు పంచుకోవాలి. తాను నమ్మిన దైవాన్ని పూజించాలి. తోటి ప్రజలను అన్నదమ్ములవలె అక్కాచెల్లెండ్రవలె, ఆదరించగలిగిన మనస్తత్వం ఉండాలి. ఉన్నంతలో తోటివారికి దానధర్మాలు చేయగలగాలి.

పద్యం – 5 : కంఠస్థ పద్యం

చం॥ ఉరుగుణవంతుఁ దొడ్లు తన కొండపకారము చేయునపుడుం
బరహితమే యొనర్చు వాక పట్టువ నైవను గీడుఁజేయగా
తెలుగదు; విక్కి మేకద యదెట్లనఁ గవ్వముఁబట్టి యెంతయున్
దరువగ జొచ్చినం బెరుగు తాలిమివీయదె వెన్న భాస్కరా!
– మారద వెంకయ్య
ప్రతిపదార్థం :
భాస్కరా = ఓ సూర్య భగవానుడా !
ఒడ్లు = ఇతరులు
తనకున్ = తనకు
ఒండు = ఒక
అపకారము = కీడు
చేయునప్పుడున్ = చేస్తున్నప్పుడు కూడ
ఉరుగుణవంతుడు = గొప్ప గుణములు కలవాడు
పరహితమే (పరహితము + ఏ) = ఇతరులకు మేలునే
ఒనర్చున్ = చేస్తాడు
ఒక పట్టునన్+ఐనన్ = ఒక సమయమునందైనా ఎప్పుడైనా)
కీడున్ = కీడును
చేయఁగాన్ (చేయన్+కాన్) = చేయడానికి
ఎఱుగడు = తెలియదు
నిక్కమేకద = అది నిజమే కదా !
అదెట్లనన్ (అది+ఎట్లు+అనన్) = అది ఎలాగున అంటే
కవ్వమున్ పట్టి = కవ్వమును చేతితో పట్టుకొని
ఎంతయున్ = మిక్కిలిగా (అధికంగా)
తరువగఁ జొచ్చినన్ (తరువగన్+చొచ్చినన్) = (పెరుగును) చిలుకుతున్నా
పెరుగు = పెరుగు
తాలిమిన్ = ఓర్పుతో
వెన్నన్ = వెన్నను
ఈయదె (ఈయదు +ఎ)= ఇస్తుంది కదా !

భావం :
పెరుగును మానవులు కవ్వమును చేతపట్టి ఎంతగా చిలుకుతున్నప్పటికీ అది ఓర్చుకొని చిలుకుతున్న వారికి వెన్ననే ఇస్తుంది. అలాగే గుణవంతుడు తనకు ఇతరులు కీడు చేస్తున్నప్పటికీ వారికి అపకారము చేయకుండా తాను పరోప కారమే చేస్తాడు.

పద్యం – 6 : కంఠస్థ పద్యం

చం॥ స్థిరతర ధర్మవర్తనఁ బ్రసిద్దికి వెక్కివని నొక్కము
ష్కరుఁ డతి విచవాక్యములఁ గాదని పల్కిన నమ్మహాత్ముఁడుం
గొంతవహింపఁ డయ్యెడ, వకుంఠిత పూర్ణ మధాపయోధిలో
వరుగుచుఁ గాకి రెట్ట యిడి వందున వేమి కొంత భాస్కరా!
– మారద వెంకయ్య
ప్రతిపదార్థం :
భాస్కరా = ఓ సూర్యుడా !
ఒక ముష్కరుడు = ఒక దుష్టుడు (నీచుడు)
స్థిరతర ధర్మవర్తనన్; స్థిరతర = మిక్కిలి స్థిరమైన
ధర్మవర్తనన్ = న్యాయ ప్రవర్తన చేత;
ప్రసిద్ధికి నెక్కినవానిన్ = పేరుపడిన వానిని
అతి నీచవాక్యములన్ = మిక్కిలి హీనములైన మాటల చేత
కాదని (కాదు + అని) = తిరస్కరించి
పల్కినన్ = మాట్లాడినా
అయ్యెడన్ (ఆ+ఎడన్) = ఆ సమయమందు
అమ్మహాత్ముడున్ (ఆ +మహాత్ముడున్) = ఆ గొప్పవాడును
కొఱతన్ = లోపమును
వహింపడు = పొందడు
ఎట్లనినన్ = ఎలాగునా అంటే
కాకి = కాకి
అరుగుచున్ = ఆకాశము నుండి ఎగిరివెడుతూ
అకుంఠిత పూర్ణసుధాపయోనిధిలోన్, అకుంఠిత = అడ్డులేని
పూర్ణ = నిండినదైన
సుధాపయోనిధిలోన్ = అమృతసముద్రములో
రెట్ట = మలము (పక్షిమలము)
ఇడినందునన్ = వేసినంత మాత్రముచేత
ఏమి కొఱంత – (ఆ సముద్రానికి వచ్చిన) లోపము ఏమిటి? (లోపమూ ఏమీ లేదు)

భావం:
ధర్మ ప్రవర్తనతో పేరుపొందిన మానవుడిని, ఒక నీచుడు, మిక్కిలి నీచమైన మాటలతో తిరస్కరించినంత మాత్రముచేత ఆ ధర్మాత్మునికి లోపము కలుగదు. అమృత సముద్రము మీదుగా ఎగిరివెళ్ళే కాకి ఆ సముద్రములో రెట్టవేసినంత మాత్రముచేత ఆ సముద్రమునకు ఏమియు లోపము రాదు కదా !
గమనిక : అలంకారము : దృష్టాంతాలంకారము

ఆలోచించండి – చెప్పండి

ప్రశ్న 1.
ఇతరులకు మేలు చేస్తే మనకు కలిగే ప్రయోజనమేమిటి?
జవాబు:
ఇతరులకు మేలు చేస్తే మనకు భగవంతుడు మేలు చేస్తాడు. మనవల్ల మేలు పొందినవారు మనలను అవసర సమయాల్లో తమ ప్రాణాలు అడ్డువేసి కాపాడతారు. ఒకరికొకరు సాయం చేసుకుంటే దేశ ప్రజలంతా సుఖసౌఖ్యాలలో ఓలలాడతారు.

ప్రశ్న 2.
మహాత్ముల గుణాలు ఎటువంటివి?
జవాబు:
ఇతరులు తమకు అపకారము చేసినా మహాత్ములు మాత్రం ఉపకారమే చేస్తారు. వారు ఎప్పుడూ ఇతరులకు అపకారం తలపెట్టరు. సర్వకాల సర్వావస్థల యందూ మహాత్ములు తమ ధనమాన ప్రాణాలను పరహితము కోసమే వినియోగిస్తారు. ఇతరుల నుండి మహాత్ములు ప్రత్యుపకారమును కోరుకోరు.

AP SSC 10th Class Telugu Solutions Chapter 6 శతక మధురిమ

ప్రశ్న 3.
తాలిమి వల్ల ఉపయోగమేమిటి?
జవాబు:
తాలిమి అంటే ఓర్పు. “ఓర్పు’ కవచము వంటిది. ఓర్పు మనకు . ఉన్నట్లయితే అది మన శరీరానికి మనము ధరించిన కవచమువలె మనల్ని కాపాడుతుంది. ఓర్పు అనేది మంచి గుణం. ఓర్పు ఉన్నవారికి శత్రువులు ఉండరు.

పద్యం – 7 : కంఠస్థ పద్యం

ఉ॥ చిక్కవిపాలపై మిసిమిఁ చెందిన మీగడ పంచదారతో
మెక్కిన భంగి నీ విమల మేచకరూప సుధారసంబు నా
మక్కువ పశ్చిరంబువ సమాహిత దావ్యమనేటి దోయిటవ్
దక్కా నటంచు బుచ్చెదను దాశరథీ కరుణాపయోనిధీ !
– కంచర్ల గోపన్న
ప్రతిపదార్థం :
కరుణాపయోనిధీ = దయాసముద్రుడవైన
దాశరథీ = దశరథుని కుమారుడైన ఓ శ్రీరామచంద్రా !
చిక్కని పాలపైన్ = చిక్కనైన పాలమీద నున్న
మిసిమి చెందిన = మిసమిసలాడుతున్న
మీగడన్ = మీగడను
పంచదారతోన్ = పంచదారతో కలిపి
మెక్కిన భంగిన్ = తిన్న విధంగా; (తినే విధముగా)
నీ విమల మేచకరూప సుధారసంబున్; నీ = నీ యొక్క
విమల = అచ్చమైన
మేచక = నల్లని
రూప = ఆకారము అనే (నీలమేఘచ్ఛాయతో కూడిన రూపము అనే)
సుధారసంబున్ = అమృతరసమును;
నా = నాయొక్క
మక్కువ = ప్రేమ అనే
పళ్ళెరంబునన్ = భోజన పాత్రములో (పళ్ళెములో (కంచములో) ఉంచుకొని)
సమాహిత దాస్యము = శ్రద్ధతో కూడిన సేవ అనే
దోయిటన్ = దోసిలియందు
దక్కెను = చిక్కింది (లభించింది)
అటంచున్ = అనుకుంటూ
జుఱ్ఱెదను = జుఱ్ఱుతూ త్రాగుతాను (ఇష్టముతో తింటాను)

భావం :
దయాసముద్రుడవైన ఓ దశరథనందనా ! శ్రీరామా! చిక్కని పాలమీద మిసమిసలాడునట్టి మీగడను పంచదారతో కలిపి తిన్నవిధంగా, నీ నీలమేఘచ్ఛాయతో కూడిన రూపము అనే అమృతరసమును, ప్రేమ అనే పళ్ళెమందు ఉంచుకొని, శ్రద్ధతో కూడిన సేవ అనే దోసిలి యందు పెట్టుకొని ఇష్టంగా జుజ్జుతూ త్రాగుతాను.

పద్యం – 8 : కంఠస్థ పద్యం

శా॥ జాతుల్పిప్పుట, సేవచేయుట మృషల్ సంధించుట వ్యాయామం
బ్యాతింబొందుట, కొండిగాడవుట, పాంపారంభకుండాట, మి
ధ్యా తాత్పర్యము లాడు టన్నియుఁ బరద్రవ్యంబు వారించి, యా
శ్రీ తా నెన్ని యుగంబులుండగలదో శ్రీకాళహస్తీశ్వరా !
– ధూర్జటి
ప్రతిపదార్థం :
శ్రీకాళహస్తీశ్వరా = ఓ శ్రీకాళహస్తీశ్వరుడు అనే పేరుగల స్వామి !
జాతుల్సెప్పుట; (జాతుల్ + చెప్పుట) = జాతకములు చెప్పడం;
సేవచేయుట = రాజులకుగాని, ఇతరులకు గాని సేవలు చేయుటయు
మృషల్ సంధించుట = అసత్యములు (అబద్దాలు) కల్పించడమూ
అన్యాయాపఖ్యాతిన్; (అన్యాయ + అపఖ్యాతిన్) – అన్యాయ ప్రవర్తన ద్వారా చెడ్డ పేరును
పొందుట = పొందుటయూ
కొండెకాడవుట; (కొండెకాడు + అవుట) = చాడీలు చెప్పేవాడు కావడమూ
హింసారంభకుండౌట; (హింసా + ఆరంభకుడు + ఔట) = హింసా ప్రయత్నమునకు ఉపక్రమించుటయు
మిధ్యాతాత్పర్యములాడుట; (మిధ్యా తాత్పర్యములు+ఆడుట) = ఉన్నవీ, లేనివీ తలు మాట్లాడుటయు;
అన్నియున్ = పై చెప్పినవన్నియునూ
పరద్రవ్యంబున్ = ఇతరుల ధనమును
ఆశించి = కోరి చేయునట్టివే కదా !
ఆ శ్రీ = అలా సంపాదించిన లక్ష్మి (సంపద)
తాను = తాను
ఎన్ని యుగంబులు = ఎన్ని యుగాలపాటు
ఉండగలదో = సంపాదించిన వాడివద్ద ఉంటుందో (ఉండదుకదా!)

తాత్పర్యం :
శ్రీకాళహస్తీశ్వరా ! ప్రజలు పరధనమును కోరి, జాతకములు చెప్పడం, రాజుల సేవలు చేయడం, అన్యాయంగా అపఖ్యాతిని పొందడం, చాడీలు చెప్పడం, హింసలు చేయడం, ఉన్నవీ, లేనివీ మాట్లాడడం మొదలయిన పనులు చేస్తున్నారు. ఈ పనులన్నీ ఇతరుల ద్రవ్యాన్ని ఆశించి చేసేవే. ఆ ద్రవ్యము మాత్రము ఎన్నాళ్ళు ఉంటుంది ? తాను కూడా శాశ్వతంగా బ్రతికి యుండడు కాబట్టి ఈ చెడుపనులు చేయడం నిరర్షకం.

పద్యం – 9

క॥ వఱదైన చేను దున్నకు
కరవైనను బంధుజనుల కడ కేగకుమీ
పరులకు మర్మము పెప్పకు
పితికి దళవాయితనముఁ బెట్టకు సుమతీ!
– బద్దెన
ప్రతిపదార్థం :
సుమతీ = ఓ మంచి బుద్ధి కలవాడా !
వఱదైన; (వఱద + ఐన) = వజద వస్తే మునిగిపోయే
చేనున్ = పొలమును
దున్నకు = సేద్యానికి దున్నవద్దు
కఱవైనను; (కఱవు + ఐనను) = కఱవు వచ్చినట్లయితే
బంధుజనుల కడకున్ = చుట్టాల వద్దకు
ఏగకుమీ = వెళ్ళవద్దు
పరులకున్ = ఇతరులకు
మర్మము + చెప్పకు = (ఇంటి) రహస్యాన్ని చెప్పవద్దు
పిఱికికిన్ = పిఱికివాడికి
దళవాయితనమున్ = సైన్యాధిపత్యమును
పెట్టకు = కల్పించకు (ఇవ్వవద్దు)

భావం :
ఓ మంచిబుద్ధి కలవాడా ! వఱదలు వస్తే మునిగిపోయే పొలమును దున్నవద్దు, కణవు వచ్చినపుడు బంధువుల ఇండ్లకు వెళ్ళవద్దు. రహస్యాన్ని ఇతరులకు చెప్పవద్దు. వీటికివాడికి సేనానాయకత్వమును ఇవ్వవద్దు.

ఆలోచించండి – చెప్పండి

ప్రశ్న 1.
భగవద్దర్శనం వలన కలిగే అనుభూతులు చెప్పండి.
జవాబు:
భగవంతుడిని దర్శనం చేసుకుంటే మన మనస్సులు సంతోషంతో నిండిపోతాయి. మన మనస్సులోని దుఃఖం తొలగిపోతుంది. మన కలతలన్నీ తీరిపోతాయి. ఆనందంతో మన కన్నుల వెంట ఆనందబాష్పాలు వస్తాయి. ఆనందంతో మన మనస్సులు తేలిఆడుతాయి. మన బాధలన్నీ పోయి, మనస్సు తేలిక పడుతుంది.

AP SSC 10th Class Telugu Solutions Chapter 6 శతక మధురిమ

ప్రశ్న 2.
జాతకాలను నమ్మవచ్చా? ఎందుకు?
జవాబు:
జాతకాలు చెప్పడం చాలా కాలంగా ఉంది. అదొక శాస్త్రము. సరైన పుట్టిన వేళ, నక్షత్రము, హోర తెలిస్తే, కొంతవఱకూ జాతకం చెప్పవచ్చు. కాని జాతకాలు అన్నీ నిజము కావు. జాతకములపై పిచ్చి పనికిరాదు. చక్కగా జ్యోతిశ్శాస్త్రం తెలిసిన పండితులు సైతమూ నేడు లేరు. కాబట్టి అదే పనిగా పెట్టిగా నేడు జాతకాలను నమ్మడం అవివేకం.

ప్రశ్న 3.
ఇంటి గుట్టు ఎవరికి, ఎందుకు చెప్పకూడదు?
జవాబు:
‘ఇంటి గుట్టు’ అంటే మన ఇంటిలోని రహస్యము. రహస్యమును ఎప్పుడూ ఇతరులకు చెప్పకూడదు. ‘ఇంటిగుట్టు లంకకు చేటు’ అన్న సామెత మనకు ఉంది. లంకాధిపతి తమ్ముడైన విభీషణుడు రాముడితో చేరి, లంకలోని రహస్యాలను రాముడికి చెప్పి రావణుడి పతనానికి కారణం అయ్యాడు. అందువల్లనే ఇంటి గుట్టును ఇతరులకు ఎప్పుడూ చెప్పరాదు.

AP SSC 10th Class Telugu Solutions Chapter 4 వెన్నెల

AP State Board Syllabus AP SSC 10th Class Telugu Solutions 4th Lesson వెన్నెల Textbook Questions and Answers.

AP State Syllabus SSC 10th Class Telugu Solutions 4th Lesson వెన్నెల

10th Class Telugu 4th Lesson వెన్నెల Textbook Questions and Answers

ఉన్ముఖీకరణ : చదవండి – ఆలోచించి చెప్పండి

ఈ కవిత చదవండి.
కొండకోనల్లో
నవ్వుతూ, తుళ్ళుతూ పరుగెడుతున్న
సెలయేరు
కాలుజారి లోయలో పడిపోయింది.
అది చూసి
ఆకులు చాటుచేసుకొని,
మొగ్గలు బుగ్గలు నొక్కుకున్నాయి.
ఇదంతా చూస్తున్న సూరీడు
పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతూ
పడమటి కొండల వెనక్కి
పడిపోయాడు.

ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
ఈ కవిత దేన్ని వర్ణిస్తున్నది?
జవాబు:
సూర్యాస్తమయాన్ని వర్ణిస్తున్నది. సూర్యాస్తమయంతో బాటు సెలయేరును, పూలమొగ్గలను కూడా వర్ణిస్తున్నది.

ప్రశ్న 2.
సూరీడు పడమటి కొండల వెనక్కి పడిపోవడమంటే ఏమిటి?
జవాబు:
సూరీడు పడమటి కొండల వెనక్కి పడిపోవడమంటే సూర్యాస్తమయం జరిగిందని సూచన.

AP SSC 10th Class Telugu Solutions Chapter 4 వెన్నెల

ప్రశ్న 3.
సెలయేరు కొండకోనల మీద నవ్వుతూ, తుళ్ళుతూ పరుగెత్తడం అంటే మీకేమని అర్థమయ్యింది?
జవాబు:
ప్రాణులకు జవసత్వాలను, ప్రకృతికి అందాలను, ఉత్సాహాన్ని ఇచ్చేవాడు సూర్యుడు. సూర్యకాంతి సమస్త జీవులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆహారాన్ని అందిస్తుంది. ఆహారంతో కడుపు నిండితే ఆనందం కలుగుతుంది. ఆనందం వలన తుళ్ళుతూ, నవ్వుతూ ఉంటాం. దీనికి సంకేతంగానే సెలయేరు కొండకోనల మీద నవ్వుతూ, తుళ్ళుతూ పరుగెత్తడం వర్ణించబడింది. అందుకే సూర్యాస్తమయ వర్ణనలో సెలయేరు కాలుజారి లోయలో పడిపోయిందని వర్ణించారు.

ప్రశ్న 4.
వర్ణనాత్మకమైన కవిత్వం చదవడం వల్ల కలిగే ప్రయోజనాలేవి?
జవాబు:
వర్ణనాత్మకమైన కవిత్వం చదవడం వలన మనోవికాసం కలుగుతుంది. ఒక విషయానికి అనేక విషయాలతో కల అనుబంధం తెలుస్తుంది. ఈ కవితలో సూర్యాస్తమయ వర్ణనలో భాగంగా సెలయేరును, మొగ్గలను చాలా చక్కగా వర్ణించారు.

సూచన :
ఇదే విధంగా ఉపాధ్యాయుడు అనేక ప్రశ్నలు వేస్తూ, వారిచేత ఎక్కువగా మాట్లాడిస్తూ సమాధానాలు రాబట్టాలి.

అవి చేయండి

I. అవగాహన – ప్రతిస్పందన

ప్రశ్న 1.
పాఠంలో వెన్నెలను వర్ణించడం గమనించారు కదా ! ప్రకృతిలోని వివిధ సందర్భాలను వర్ణించడం వల్ల మీకు కలిగే అనుభూతులను తరగతిలో చరించండి.
జవాబు:
తెలతెలవారుతుంటే రకరకాల పక్షుల కిలకిలారావాలు వింటుంటే చాలా ఆనందంగా ఉంటుంది. చల్లటి పైరగాలి శరీరానికి తగులుతుంటే ఆ హాయి గిలిగింతలు గొలుపుతుంది. చేలు, తోటలతో పచ్చగా ఉన్న పరిసరాలు చూస్తుంటే పరవశం కలుగుతుంది. పిల్ల కాలువలు, సెలయేళ్లు, నదులు, సముద్ర తీరాలలో ప్రొద్దుటే తిరగాలి. ఆ అందం వర్ణించలేము. హిమాలయ పర్వతాలను ఎంతోమంది మహాకవుల నుండి సామాన్యుల వరకు తనివితీరా దర్శించారు. వర్ణించారు.

సూర్యుడు పడమటికి వాలుతుంటే, అది ఒక అద్భుతమైన సుందర దృశ్యం. సూర్యాస్తమయాన్ని సముద్రతీరంలో చూస్తే చాలా బాగుంటుంది. ఎంతోమంది చిత్రకారుల కుంచెలకు పని కల్పిస్తున్న అద్భుత సన్నివేశాలెన్నో ప్రకృతిలో ఉన్నాయి.

ప్రశ్న 2.
మీకు నచ్చిన ఒక సందర్భాన్ని వర్ణించండి.
జవాబు:
మాది కోనసీమలోని ఒక చిన్న గ్రామం. ఎటుచూసినా కొబ్బరి తోటలే. ఆ పచ్చని కొబ్బరాకులను చూస్తే భూమాత తన సౌభాగ్యానికి గర్వించి, స్వర్గానికి సవాలుగా ఎగరేసిన జెండాలలా కనిపిస్తాయి. సరిహద్దుల రక్షణకు, భారతదేశ బలపరాక్రమాలకు ప్రతీకలుగా నిలబడిన మన భారత సైన్యంలా కనిపిస్తాయి కొబ్బరిచెట్ల వరుసలు. ఉట్టిమీద దాచిన పాలు, పెరుగు, మిఠాయిలలా కనిపిస్తాయి కొబ్బరికాయలు.
( సూచన : ఇదే విధంగా ప్రతి విద్యార్థి తన సొంతమాటలలో నచ్చింది వర్ణించాలి.

AP SSC 10th Class Telugu Solutions Chapter 4 వెన్నెల

ప్రశ్న 3.
ఎఱ్ఱన రాసిన కింది పద్యం చదవండి.

సీ|| కలఁడు మేదిని యందుఁ గలఁ డుదకంబులఁ
గలఁడు వాయువునందుఁ గలఁడు వహ్నిఁ
గలఁడు భానుని యందుఁ గలఁడు సోముని యందుఁ
గలఁ డంబరంబునఁ గలఁడు దిశలఁ
గలఁడు చరంబులఁ గలఁ డచరంబులఁ
గలఁడు బాహ్యంబున గలఁడు లోన
గలఁడు సారంబులఁ గలఁడు కాలంబులఁ
గలఁడు ధర్మంబులఁ గలడు క్రియలఁ

తే॥నీ॥ గలఁడు కలవాని యందును, గలఁడు లేని
వాని యందును, గలఁడెల్లవాని యందు
నింక వేయును నేల సర్వేశ్వరుండు .
కలఁడు నీయందు నాయందుఁ గలఁడు కలఁడు
(నృసింహపురాణం-పంచమాశ్వాసం-78)

అ) పై పద్యంలో చాలా సార్లు పునరుక్తమైన పదమేది?
జవాబు:
పై పద్యంలో ‘కలడు’ అనే పదం 22 సార్లు కలదు.

ఆ) పునరుక్తమైన పదం పలుకుతున్నప్పుడు, వింటున్నప్పుడు మీకు కల్గిన అనుభూతిని చెప్పండి.
జవాబు:
‘కలడు’ అనే పద్యాన్ని ప్రతి పాదంలోను సుమారుగా 4 సార్లు ప్రయోగించారు. ఈ పద్యం ‘కలడు’ తో ప్రారంభమై’ ‘కలడు’ తోనే ముగిసింది. ‘కలడు’ అని అనేకసార్లు చెప్పారు అంటే తప్పనిసరిగా అది దైవం గురించే. దేవుడు ‘కలడు’ అని చెప్పాలంటే ప్రతి వస్తువును పరిశీలించి దైవతత్వాన్ని తెలుసుకొన్నవారికి మాత్రమే సాధ్యం. సృష్టిలోని ప్రతి వస్తువులోను పరమాత్మను సరిదర్శించాలి అని ఈ పద్యం చెబుతోంది. నాకైతే ఈ పద్యం వింటున్నప్పుడు దైవాన్ని సందర్శించినంత ఆనందం (బ్రహ్మానందం) కలిగింది.

AP SSC 10th Class Telugu Solutions Chapter 4 వెన్నెల

ఇ) గీత గీసిన మాటల అర్థాలు తెలుసుకోండి.
జవాబు:
మేదిని = భూమి
ఉదకంబు = నీరు
వాయువు = గాలి
వహ్ని = అగ్ని
భానుడు = సూర్యుడు
సోముడు = చంద్రుడు
అంబరము = ఆకాశం
దిశలు = దిక్కులు
చరంబులు = కదిలేవి (జంతువులు, పక్షులు మొ||నవి.)
అచరంబులు = కదలనివి (పర్వతాలు, చెట్లు మొ||నవి.)
బాహ్యంబు = పై భాగము (కంటికి కనబడే భౌతిక వస్తువులు)
లోన = కంటికి కనబడనివి (ఆత్మ, మనస్సు, ప్రాణం మొ||నవి)
సారంబులు = సారవంతమైనవి
కాలంబులు = భూతభవిష్యద్వర్తమానాది సమయములు
ధర్మంబులు = నిర్దేశించబడిన స్వభావాలు
క్రియలు = పనులు
కలవాడు = ధనవంతుడు
లేనివాడు = పేదవాడు
నీయందు = ఎదుటి వానియందు
నాయందు = కర్తయందు
ఇప్పుడు పోతన రాసిన కింది పద్యం చదవండి.

మ|| | కలఁడంబోధిఁ గలండు గాలిఁ గలఁ డాకాశంబునన్ కుంభినిన్
గలఁ డగ్నిన్ దిశలం బగళ్ళ నిశలన్ ఖద్యోత చంద్రాత్మలన్
గలఁ డోంకారమునం ద్రిమూర్తులఁ ద్రిలింగవ్యక్తులం దంతటన్
గలఁ డీశుండు గలండు తండ్రి ! వెదకంగా నేల నీయాయెడన్.

(శ్రీమదాంధ్ర మహాభాగవతం-సప్తమస్కంధం-78)

అ. ఎఱ్ఱన పద్యంలో మీరు గుర్తించిన పదాలకు ఈ పద్యంలో ఉన్న సమానార్థకాలేవి?
జవాబు:
ఎఱ్ఱన – పోతన
మేదిని – కుంభిని
ఉదకంబు – అంభోధి
వాయువు – గాలి
వహ్ని = అగ్ని
భానుడు – ఖద్యోతుడు
సోముడు – చంద్రుడు
అంబరము – ఆకాశం
దిశలు – దిశలు
బాహ్యంబు – త్రిమూర్తులు, త్రిలింగ వ్యక్తులు
ఎల్లవానియందు – అంతటన్
సర్వేశ్వరుడు – ఈశుండు
కాలంబులు – పగళ్ళు, నిశలు
వేయునునేల – ఈయాయెడన్

ఆ) రెండు పద్యాలను పోల్చి చూడండి.
జవాబు:
ఎఱ్ఱన ‘సీస పద్యం’లో రచించిన భావాన్ని పోతన ‘శార్దూలం’లో రచించాడు. ఎఱ్ఱన ప్రస్తావించిన వాటిని చాలా వరకు (13 పదాలు) పోతన ప్రస్తావించాడు. ఇద్దరు కవులూ ‘కలడు’ అనే పదంతోటే పద్యం ప్రారంభించారు. ‘కలడు’ అనేది ఎఱ్ఱన 22 సార్లు ప్రయోగించాడు. పోతన 9 సార్లే ప్రయోగించాడు. ఎఱ్ఱన చెప్పిన ధర్మాలు, క్రియలు, చరాచరాలు, ధనిక – పేద వంటివి పోతన వదిలేసి, అన్నిటికీ సరిపడు ఒకే పదం ‘ఓంకారం’ ప్రయోగించాడు. దైవం ఉండేది ఓంకారంలోనే. అందుకే దానిని ప్రస్తావించి పోతన తన భక్తిని చాటుకొన్నాడు.

4. పువ్వు గుర్తుగల పద్యాలను భావస్ఫోరకంగా చదవండి. .
జవాబు:

చ|| సురుచిరతారకాకుసుమశోభి నభోంగణభూమిఁ గాలమ
న్గరువపు సూత్రధారి జతనంబున దిక్పతికోటి ముందటన్
సరసముగా నటింపఁగ నిశాసతి కిత్తిన క్రొత్తతోఁపుఁబెం
దెర యన నొప్పి సాంధ్యనవదీధితి పశ్చిమదికటంబునన్.

 

చ| దెసలను కొమ్మ లొయ్య నతిబీర్ఘములైన తరంబులన్ బ్రియం
బెసఁగఁగ నూఁది నిక్కి రజనీశ్వరుఁ డున్నతలీలఁ బేర్చు నా
కస మను వీరి భూరుహము కాంతనిరంతర కారణా లస
త్కుసుమ చయంబు గోయుట యనఁ బ్రాణి సముత్సుకాకృతిన్.

 

చ|| వడిగొని చేతులుప్పతిల వాలిన కేసరముల్ దలిర్పఁ బు
ప్సోడి దలమెక్కి తేనియలు పొంగి తరంగలుఁగాఁ జలంగి పైఁ
బడు నెలడింటిదాఁటులకుఁ బండువులై నమసారభంబు లు
గడువుగ నుల్లసిల్లె ఘనకైరవషండము నిండు వెన్నెలన్.

AP SSC 10th Class Telugu Solutions Chapter 4 వెన్నెల

5. రెండో పద్యానికి ప్రతిపదార్థం ఈ కింద ఉన్నది. ఇదే విధంగా 5, 7 సంఖ్యగల పద్యాలకు ప్రతిపదార్థాలు రాయండి.
2వ పద్యం (సురుచిరతార …… పశ్చిమదిక్తటంబునన్.)
జవాబు:
ప్రతిపదార్ధం :
సురుచిర = చాలా అందమైన
తారకా = చుక్కల
కుసుమ = పూల (చే)
శోభి = మనోజ్ఞమైనదైన
నభః = ఆకాశమనే
అంగణభూమిన్ = రంగస్థలం (వేదిక) పై
కాలము + అన్ = కాలం అనే
గరువపు = గొప్ప
సూత్రధారి = సూత్రధారి (దర్శకుడు)
జతనంబున = ప్రయత్నపూర్వకంగా
దిక్పతికోటి = దిక్పాలకుల సమూహం
ముందటన్ = ముందు (ఎదుట)
సరసముగా = చక్కగా (యుక్తంగా)
నటింపగ = నాట్యం చేయడానికి సిద్ధపడిన
నిశాసతికిన్ = రాత్రి అనే స్త్రీకి
ఎత్తిన = నిలిపిన (పట్టిన)
క్రొత్త = కొత్తదైన
తోఁపున్ = ఎర్రని
పెన్ + తెర = పెద్ద తెర
అనన్ = అన్నట్లుగా
పశ్చిమ దిక్ + తటంబునన్ = పడమటి తీరంలోని (పడమటి దిక్కున)
సాంధ్య = సంధ్య సంబంధించిన (సంధ్యాకాలపు)
నవ దీధితి = కొత్త వెలుగు
ఒప్పెన్ = ప్రకాశించింది

5వ పద్యం (దెసలను ………… సముత్సుకాకృతిన్.)
జవాబు:
ప్రతిపదార్థం :
ఆకసమను = ఆకాశమనెడు
పేరి = పేరుగల
భూరుహము = చెట్టున
దెసలను = దిక్కులనెడు
కొమ్మలు = కొమ్మలలో గల
తారకా = నక్షత్రాలనెడు
లసత్ = ప్రకాశించు
కుసుమచయంబున్ = పూల సమూహమును
కోయుటకు = త్రుంచుటకు
ఒకోయనన్ = కదా ! అనునట్లు
ఒయ్యన్ = వెంటనే
రజని + ఈశ్వరుడు = రాత్రికి ప్రభువైన చంద్రుడు
ప్రియంబు = ఇష్టము
ఎసగన్ = ఎక్కువ కాగా
ఊది = నిశ్శ్వాసించి(గాలిని ఊది)
నిక్కి = నిలబడి
నిరంతర = ఎల్లపుడు
కాంత = కాంతులతో
అతిదీర్ఘములైన = మిక్కిలి పొడవైన
కరంబులన్ = చేతులతో (కిరణములతో)
సముత్సుకాకృతిన్ = మిక్కిలి ఉత్సాహమే రూపు దాల్చినట్లు
ప్రాకెన్ = ప్రాకెను

AP SSC 10th Class Telugu Solutions Chapter 4 వెన్నెల

7వ పద్యం (వడిగొని తేకు ………… వెన్నెలన్.)
జవాబు:
ప్రతిపదార్థం :
నిండు వెన్నెలన్ = పండు వెన్నెలలో
ఘన = గొప్పవైన
కైరవ షండము = కలువల సమూహం
వడిన్ = వేగంతో
కొని = పూని
ఱేకులు = పూల ఱేకులు
ఉప్పతిల = అతిశయించగా
వాలిన = కిందికి దిగిన (వాడిపోయిన)
కేసరముల్ = దిద్దులు
తలిర్పన్ = అతిశయించునట్లుగా
పుప్పొడి = పుప్పొడి యొక్క
తలము = పై భాగమును
ఎక్కి = అధిరోహించి
తేనియలు = మధువులు
పొంగి = ఉప్పొంగి
తరంగలుగాన్ = ప్రవాహాలుగా
చెలంగి = విజృంభించి
పైన్ = పైన
పడు = పడుచున్న
నెల = చంద్రుడు అనెడు
తేటి =తుమ్మెద
దాటులకున్ = కలయికలకు
పండువులై = (కనుల) పండువలవుతూ
ఉగ్గడువుగ = ఎక్కువగా
నవ సౌరభంబులు = క్రొత్త సువాసనలు
ఉల్లసిల్లె = ప్రకాశించెను.

II. వ్యక్తీకరణ-సృజనాత్మకత

1. క్రింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో సమాధానాలు రాయండి.

అ) “కాటుక గ్రుక్కినట్టి కరవటంబన జగదండఖండ మమరె” ఈ మాటలు కవి ఏ సందర్భంలో పేర్కొన్నాడో వివరించండి.
జవాబు:
ఈ మాటలు ఎఱ్ఱన రచించిన నృసింహపురాణం తృతీయాశ్వాసం నుండి గ్రహించబడిన ‘వెన్నెల’ అను పాఠంలోనిది. దిక్కులు, ఆకాశం, భూమిని చీకటి ఆక్రమించిన విధానాన్ని వివరిస్తున్న సందర్భంలో కవి ప్రయోగించిన మాటలివి. ఈ లోకమనెడు బ్రహ్మాండ భాగము కాటుక భరిణెలాగా ఉందని భావం.

ఆ) ఈ పాఠంలో కవి వెన్నెలను వర్ణించడానికి ఏయే అంశాల నెన్నుకున్నాడో తెల్పండి.
జవాబు:
సూర్యాస్తమయాన్ని, పద్మాలు ముడుచుకొనడాన్ని కవి వర్ణించాడు. సాయంసంధ్యలో పడమటి వెలుగును వర్ణించాడు. చంద్రోదయాన్ని కూడా రమణీయంగా వర్ణించాడు. 3 పద్యాలలో, వెన్నెల వర్ణించడానికి ముందు అంశాలను వర్ణించాడు. తర్వాతి పద్యంలో చంద్రకాంతి వ్యాప్తిని వర్ణించాడు. ‘వెన్నెల’ దృశ్యం వర్ణించడానికి బలమైన పూర్వరంగం కళ్లకు కట్టినట్లు వర్ణించి వర్ణనకు మంచి పునాది వేశాడు. ప్రబంధములకు కావలసిన వర్ణనా నైపుణ్యమిదే. అందుకే ఎఱ్ఱనకు ‘ప్రబంధపరమేశ్వరుడు’ అనెడి బిరుదు కలిగింది. తర్వాతి కవులందరూ ఎఱ్ఱనలోని ఈ వర్ణనా క్రమ నైపుణ్యాన్ని అనుకరించారు.

2. క్రింది ప్రశ్నలకు పదేసి వాక్యాల్లో సమాధానాలు రాయండి.

అ) పద్య భావాలను ఆధారంగా చేసుకొని పాఠ్యభాగ సారాంశాన్ని ఇరవై వాక్యాలకు కుదించి రాయండి.
(లేదా)
తుమేదల బృందానికి పండుగ చేసిన వెన్నెల ఎలా విజృంభించిందో రాయండి.
మనోహరంగా, ధీరగంభీరంగా వెన్నెల ఎలా విస్తరించిందో రాయండి.
ఆబాల గోపాలానికి ఆత్మీయ బంధువైన చందమామ వెలుగైన వెన్నెల ఎలా విజృంభించిందో పాఠ్యభాగం ఆధారంగా వర్ణించండి.
జవాబు:
సూర్యాస్తమయమయ్యింది, పద్మం ముడుచుకొంది. పడమట సంధ్యారాగ కాంతి కనబడింది. చీకటి బాగా పెరిగి దిక్కులూ, భూమ్యాకాశాలూ కలిసిపోయి కాటుక నింపిన బరిణెలా విశ్వం కనిపించింది.

చంద్రోదయం :
చంద్రుడు ఉదయించాడు. వెన్నెల ప్రవాహం పాలసముద్రంలా పొంగి ఆకాశాన్ని ముంచెత్తింది. చంద్రబింబం ఆ పాలసముద్రంలో గుండ్రంగా చుట్టుకొన్న ఆదిశేషుడి శయ్యలా, చంద్రుడిలోని మచ్చ ఆ శయ్య మధ్యన ఉన్న విష్ణువులా కనబడింది.

ఆ వెన్నెలలో కలువల రేకులు విచ్చుకున్నాయి. కలువ పూలలో తేనెలు పొంగి కెరటాలుగా విజృంభించాయి. తుమ్మెదలకు విందు చేస్తూ పూల పరిమళాలు బయలుదేరాయి.

చంద్రకాంత శిలల వానలతో, చకోరాల రెక్కల స్పర్శలతో, స్త్రీల చిరునవ్వుల కాంతులతో అతిశయించి, దిక్కులన్నింటినీ ముంచెత్తి వెన్నెల’ సముద్రంలా వ్యాపించింది. ఆ వెన్నెల అనే సముద్రపు నీటి నుండి చంద్రుడు ఆవిర్భవించాడు.

ఆ విధంగా అందంగా, గంభీరంగా, నిండుగా చంద్రుని వెన్నెల వ్యాపించింది.

3. కింది అంశాల గురించి సృజనాత్మకంగా ప్రశంసిస్తూ రాయండి.

అ) ఈ పాఠంలోని వర్ణనల్లాగే మీకు నచ్చిన ఒక ప్రకృతి దృశ్యాన్ని గాని, సన్నివేశాన్ని గాని, సమయాన్ని గాని వర్ణిస్తూ రాయండి.
ఉదా : సూర్యోదయం/ సూర్యాస్తమయం.
జవాబు:
సూర్యోదయం :
చీకటి అనే అజ్ఞానంలో తడబడుతూ అనేక అవలక్షణాలకు ఆలవాలమైన వానికి జ్ఞానం ప్రసాదించే సద్గురువులా సూర్యుడు తూర్పుతలుపు తీస్తున్నాడా అన్నట్లు వెలుగు రేఖలు వస్తున్నాయి. ఆ లేత వెలుగు సోకగానే లోకమంతా ఉత్సాహం ఉరకలేసింది. పక్షుల కిలకిలలు, లేగదూడల గెంతులు, అంబారవాలు, పిల్లల మేలుకొలుపులు, సంధ్యావందనాదులు, ఒకటేమిటి అప్పటి వరకు బద్దకంగా, నిస్తేజంగా నిద్రించిన యావత్ప్రపంచం దైనందిన క్రియలకు బయల్దేరింది. కొలనులలో తామరపూలు పరవశంతో తమ ఆప్తుని చూడటానికి రేకులనే కళ్లతో ఆత్రంగా నింగిని పరికిస్తున్నాయి. ఆ పూల అందాలను చూసి పరవశించిన తుమ్మెదలు ఝంకారం చేస్తూ తేనెల వేటకు ఉపక్రమించాయి.

రైతులు బద్దకం వదిలి నాగలి భుజాన వేసుకొని పొలాలకు బయల్దేరారు. మహిళలు కళ్ళాపి జల్లి వాకిట రంగ వల్లికలు తీరుస్తున్నారు. పిల్లలు పుస్తకాలు ముందేసుకొని ఆవులిస్తూ చదవడం మొదలుపెట్టారు.

లేత సూర్యకిరణ ప్రసారంతో చైతన్యం పెరిగిన జీవరాశి జీవనయాత్రకు నడుం బిగించింది.

సూర్యాస్తమయం :
నవ్వుతూ, తుళ్ళుతూ జీవితమంతా గడిపిన వ్యక్తిని వార్ధక్యం ఆవహించినట్లుగా, తుపాసులో సర్వం కోల్పోయిన వ్యక్తి జీవితంలాగా, వైభవం కోల్పోయిన చక్రవర్తిలాగా సూర్యుడు తన వేడిని, వాడిని ఉపసంహరించు కొంటున్నాడు. పక్షులు గబగబా గూళ్లకు చేరుకొంటున్నాయి. మేతకు వెళ్ళిన పశువులమందలు, ఇళ్లకు చేరుతున్నాయి. ఎక్కడి పనులక్కడ ఆపి, కర్షకులు తల పైన పచ్చగడ్డి మోపులతో ఇళ్లకు ప్రయాణమయ్యారు. నిషేధాజ్ఞలు జారీ అయినట్లు సూర్యుడు బెరుకుబెరుకుగా పడమటి కొండలలోకి పారిపోయాడు. పెద్ద దిక్కు కోల్పోయిన కుటుంబంలా ప్రపంచం కళా విహీనమయ్యింది. దరిద్రుడిని కష్టాలు ఆక్రమించినట్లుగా లోకాన్ని చీకటి ఆక్రమిస్తోంది. క్రూరత్వానికి, దుర్మార్గానికి, అన్ని పాపాలకు చిరునామా అయిన చీకటి దర్జాగా నవ్వుకొంటోంది. దండించే నాథుడు లేని లోకంలో అరాచకం ప్రబలినట్లుగా సూర్యుడు లేకపోవడంతో చీకటి విజృంభిస్తోంది, మూర్ఖుల ప్రేలాపనలతో సజ్జనులు మౌనం వహించినట్లుగా మెల్లగా పడమటి తలుపులు మూసుకొని సూర్యుడు చీకటిని చూడలేక నిష్క్రమించాడు.

AP SSC 10th Class Telugu Solutions Chapter 4 వెన్నెల

ఆ) పాఠం ఆధారంగా ఎఱ్ఱన రచనా శైలి గురించి 10 వాక్యాలు రాయండి.
జవాబు:
ప్రబంధ పరమేశ్వరుడనే బిరుదు గల ఎఱ్ఱన వర్ణనలు అద్భుతంగా చేస్తాడు. వర్ణనాంశానికి తగిన పదాలను, పద్యవృత్తాలను ఎన్నుకొంటాడు.

‘ఇను ససమాన తేజు’ అనే పద్యంలో సూర్యుని చూచినట్లు ‘భృంగ తారకాల’ను చూడలేని పద్మిని కళ్లుమూసుకొన్నట్లు పర్ణించాడు. దీనిని ‘చంపకమాల’ వృత్తంలో వర్ణించాడు. ‘చంపకము’ అంటే సంపెంగపువ్వు అని అర్థం. పద్యంలో ‘భృంగము’ అని పదం ప్రయోగించాడు. భృంగము అంటే తుమ్మెద అనే అర్థం. తుమ్మెద అన్ని పూలపైనా వాలుతుంది. తానీ సంపెంగపై వాలదు. సంపెంగ వాసనకు తుమ్మెదకు తలపోటు వచ్చి మరణిస్తుంది. ఆ విషయం అన్యాపదేశంగా చెప్పడానికే చంపకమాల వృత్తంలో చెప్పాడు, అంటే తుమ్మెదకు ప్రవేశం లేదని చెప్పే పద్యం కదా!

అలాగే పద్మిని అనేది కూడా ఒక జాతి స్త్రీ, పద్మినీజాతి స్త్రీ తన భర్తను తప్ప పరపురుషుల గూర్చి విసదు, చూడదు, ఇక్కడ తామర పువ్వు సూర్యుని తప్ప ఇతరులను (తుమ్మెదలను) చూడడానికి అంగీకరించక కళ్లు మూసుకొంది. అందుకే తామరకు ‘పద్మిని’ అని ప్రయోగించాడు.

(ఇదే విధంగా ప్రతి పద్యంలోనూ విశేషాలు ఉన్నాయి.)

భాషా కార్యకలాపాలు ప్రాజెక్టు పని

‘నరసింహస్వామి కథ’ నేపథ్యంతో వచ్చిన గ్రంథాలు, వివరాలను ఈ కింది పట్టికలో రాయండి.
AP SSC 10th Class Telugu Solutions Chapter 4 వెన్నెల 1

III. భాషాంశాలు

పదజాలం

1) కింది వాక్యాల్లో గీత గీసిన మాటల అర్థాన్ని గ్రహించి, వాటిని అర్థవంతంగా సొంతవాక్యాల్లో ఉపయోగించండి.
అ. భరతమాత స్మితకాంతి అందరినీ ఆకట్టుకున్నది.
జవాబు:
స్మితకాంతి = నవ్వుల వెలుగు
సొంతవాక్యం :
ముద్దులొలికే పసిపాప నవ్వుల వెలుగులో ఇల్లు కళకళలాడుతుంది.

ఆ. మేఘం దివి నుండి భువికి రాల్చిన చినుకుపూలే ఈ వర్షం.
జవాబు:
దివి = ఆకాశం
సొంతవాక్యం :
ఆకాశం నక్షత్రాలతో పెళ్ళి పందిరిలా శోభిల్లుతోంది.

ఇ. కష్టాలు మిక్కుటమై రైతులు ప్రభుత్వ సహాయం కోసం ఎదురు చూస్తున్నారు.
జవాబు:
మిక్కుటము = ఎక్కువ
సొంతవాక్యం :
కోపం ఎక్కువైతే ఆరోగ్యం పొడవుతుంది.

ఈ. రజనీకరబింబం రాత్రిని పగలుగా మారుస్తున్నది.
జవాబు:
రజనీకరబింబం = చంద్రబింబం
సొంతవాక్యం :
పున్నమినాడు నిండైన చంద్రబింబం చూసి సముద్రం ఉప్పొంగుతుంది.

AP SSC 10th Class Telugu Solutions Chapter 4 వెన్నెల

2) నిఘంటువు సాయంతో కింది పదాలకు నానార్థాలు వెతికి రాయండి.’
అ. వెల్లి = ప్రవాహము, పరంపర
ఆ. కుండలి = పాము, నెమలి, వరుణుడు
ఇ. నిట్టవొడుచు = ఉప్పొంగు, రోమాంచితమగు, విజృంభించు

3) కింది మాటలకు పర్యాయపదాలు రాయండి.
అ. చాడ్పు = పగిది, విధము , వలె
ఆ. వెల్లి = ప్రోతస్సు, వెల్లువ, ప్రవాహము
ఇ. కైరవం = తెల్లకలువ, కుముదము, గార్దభము, చంద్రకాంతము, సృకము, సోమబంధువు
ఈ. కౌముది . . వెన్నెల, జ్యోత్స్న, చంద్రిక
ఉ. చంద్రుడు = శశి, నెలవంక, అబారి
ఊ. తమస్సు/తమం = చీకటి, ధ్వాంతము, తిమిరము

4) కింది ప్రకృతి పదాలకు వికృతి పదాలు రాయండి.
అ. సంధ్య – సంజ
ఆ. దిశ – దెస
ఇ. ధర్మము – దమ్మము
ఈ. రాత్రి – రాతిరి, రేయి
ఉ. నిశ – నిసి

5) కింది వికృతి పదాలకు ప్రకృతి పదాలు రాయండి. అ, సంధ్య
అ. గరువము – గర్వము
ఆ. జతనము – యత్నము
ఇ. దెస – దిశ
ఈ. ‘చందురుడు – చంద్రుడు

వ్యాకరణాంశాలు

1. కింది సంధులకు సంబంధించిన పదాలు ఈ పాఠంలో గుర్తించి, వాటిని విడదీసి సూత్రాలు రాయండి.

అ) సవర్ణదీర్ఘ సంధి
సూత్రము :
అ, ఇ, ఉ, ఋ లకు అవే (సవర్ణ) అచ్చులు పరములయినచో వానికి దీర్ఘములు వచ్చును. పాఠంలో గుర్తించినవి.

రజని + ఈశ్వరుడు = రజనీశ్వరుడు – (ఇ + ఈ = ఈ)
కులిశ + ఆయుధుని = కులిశాయుధుని – (అ + ఆ = ఆ)
ఉత్సుక + ఆకృతిన్ = ఉత్సుతాకృతిన్ (అ + ఆ = ఆ)
చంద్రిక + అంభోధి = చంద్రికాంభోధి – (అ + అ = అ)

ఆ) గుణసంధి
సూత్రము :
అకారమునకు ఇ, ఉ, ఋ లు పరమైన వానికి క్రమముగా ఏ, ఓ, అర్లు ఆదేశమగును. పాఠంలో గుర్తించినవి.
దివస + ఇంద్రు = దివసేంద్రు – (అ + ఇ = ఏ)
చంద్రకాంత + ఉపలంబుల = చంద్రకాంతో పలంబుల – (అ + ఉ = ఓ)
నుత + ఇందు = నుతేందు – (అ + ఇ = ఏ)

ఇ) ఉత్వసంధి
సూత్రము :
ఉత్తునకచ్చు పరమగునపుడు సంధియగు పాఠంలో గుర్తించినవి.
పొమ్ము + అనన్ = పొమ్మనన్ – (ఉ + అ = అ)
మీలనము + ఒంద = మీలనమొంద – (ఉ + ఒ = ఒ)
తిలకము + అనగ = తిలకమనగ – (ఉ + అ = అ)
కుంభము + అనగ = కుంభమనగ – (ఉ + అ = అ)
దీపము + అనగ = దీపమనగ – (ఉ + అ = అ)
కబళము + అనగ = కబళమనగ – (ఉ + అ = అ)
చంద్రుడు + ఉదయించె = చంద్రుడుదయించె – (ఉ + ఉ = ఉ)
నిస్తంద్రుడు + అగుచు = నిస్తంద్రుడగుచు – (ఉ + అ = అ)
ఇట్లు – ఉదయించి = ఇట్లుదయించి – (ఉ + ఉ = ఉ)
దీర్ఘములు + ఐన = దీర్ఘములైన – (ఉ + ఐ = ఐ)
ప్రియంబు + ఎసగగ = ప్రియంబెనగగ – (ఉ + ఎ – ఎ)
ఈశ్వరుడు + ఉన్నతలీల = ఈశ్వరుడున్నతలీల – (ఉ + ఉ = ఉ)
ఆకసము + అను = ఆకసమను – (ఉ + అ = అ)
కోయుటకు = ఒకో = కోయుటకొకో – (ఉ + ఒ – ఒ)
కలంకము + అత్తటిన్ = కలంకమత్తణిన్ – (ఉ + అ = అ)
ఱేకులు + ఉప్పతిల = ఱేకులుప్పతిల – (ఉ + ఉ = ఉ)
తలము + ఎక్కి = తలమెక్కి (ఉ + ఎ = ఎ)
పండువులు + ఐ = పండువులె – (ఉ + ఐ = ఐ)
సౌరభంబులు + ఉగ్గడువుగ = సౌరభంబులుగడువుగ – (ఉ + ఉ = ఉ)
ఇట్లు + అతి = ఇట్లతి – (ఉ + అ = అ)

AP SSC 10th Class Telugu Solutions Chapter 4 వెన్నెల

2. కింది పదాలు విడదీసి, సంధులను గుర్తించి, సూత్రాలు రాయండి.

అ) అత్యంత = అతి + అంత – యణాదేశ సంధి.
సూత్రం :
ఇ, ఉ, ఋలకు అసవర్ణాచ్చులు పరమైన వానికి య,వ,రలు ఆదేశంగా వస్తాయి.

ఆ) వంటాముదము = వంట + ఆముదము – అత్వసంధి
సూత్రం :
అత్తునకు సంధి బహుళంబుగానగు.

ఇ) ఏమనిరి = ఏమి + అనిరి – ఇత్వసంధి
సూత్రం :
ఏమ్యాదుల ఇత్తునకు సంధి వైకల్పికముగానగు.

ఈ) అవ్విధంబున = ఆ + విధంబున – త్రికసంధి
సూత్రం :

  1. ఆ, ఈ, ఏలు త్రికమనబడును.
  2. త్రికంబుమీది అసంయుక్త హల్లునకు ద్విత్వంబు బహుళంబుగానగు.
    ఆ + వ్విధంబున
  3. ద్విరుక్తంబగు హల్లు పరమగునపుడు’ డాచ్చికంబగు దీర్ఘమునకు హ్రస్వంబగు.
    అవ్విధంబున

3. కింది పదాలకు విగ్రహవాక్యాలు రాసి, అవి ఏ సమాసాలో గుర్తించండి.

అ) నలుదెసలు – నాలుగైన దెసలు – ద్విగుసమాసం
లక్షణం : సమాసంలోని పూర్వపదం సంఖ్యావాచకమైతే అది ద్విగు సమాసం. నలు (నాల్గు) అనేది సంఖ్యావాచకమైన పూర్వపదం కనుక ఇది ద్విగు సమాసం.

ఆ) సూర్యచంద్రులు – సూర్యుడును, చంద్రుడును – ద్వంద్వ సమాసం లక్షణం : సమాసంలోని రెండు పదాలకూ ప్రాధాన్యం ఉంటే అది ద్వంద్వ సమాసం.
సూర్యుడు, చంద్రుడు అనే రెండు పదాలకూ ప్రాధాన్యం ఉంది కనుక ఇది ద్వంద్వ సమాసం.

AP SSC 10th Class Telugu Solutions Chapter 4 వెన్నెల

4. కింది పద్యపాదాల్లోని అలంకారాన్ని గుర్తించండి, సమన్వయం చేయండి.

అ) అభినుతేందు చంద్రికాంభోధి యఖిలంబు
నీట నిట్టలముగ నిట్టవొడిచె.
జవాబు:
ఈ పద్యపాదములందు రూపకాలంకారం ఉన్నది.

సమన్వయం :
ఇక్కడ వెన్నెల అనే సముద్రము నుండి చంద్రుడు నిండుగా ఆవిర్భవించాడు అని చెప్పబడింది. పై పద్యపాదాల్లో ఉపమేయమైన వెన్నెలకు ఉపమానమైన సముద్రానికి అభేదం చెప్పబడింది. అందువల్ల ఇక్కడ రూపకాలంకారం ఉంది.

లక్షణం :
ఉపమాన ఉపమేయములకు అభేదం చెప్పినట్లయితే దానిని రూపకాలంకారం అంటారు.

5. పాఠంలోని తేటగీతి పద్యాన్ని గుర్తించి లక్షణాలతో సమన్వయం చేసి చూడండి.
జవాబు:
AP SSC 10th Class Telugu Solutions Chapter 4 వెన్నెల 2
లక్షణాలు:

  1. 4 పాదాలుంటాయి.
  2. ప్రతి పాదంలోను ఒక సూర్యగణం, రెండు ఇంద్రగణాలు, రెండు సూర్యగణాలు వరుసగా ఉంటాయి.
  3. యతి – 4వ గణం యొక్క మొదటి అక్షరం.
  4. ప్రాస నియమం కలదు.

AP SSC 10th Class Telugu Solutions Chapter 4 వెన్నెల 3

బొదలి పొదలి … అనే పద్యంలోని ‌రెండు పాదాలు పరిశీలించి లక్షణ సమన్వయం చేయండి.
AP SSC 10th Class Telugu Solutions Chapter 4 వెన్నెల 4

పై పద్యపాదాల్లో ప్రతి పాదానికి ఐదు గణాలుంటాయి. కాని,
AP SSC 10th Class Telugu Solutions Chapter 4 వెన్నెల 5

(‘హ’ గణాన్నే ‘గలం’ అనడం వాడుకలో ఉన్నది. ‘వ’ గణాన్ని ‘లగం’ అన్నట్లు.)
యతి ప్రాస, నియమాలు, తేటగీతికి సంబంధించినవే దీనికీ వర్తిస్తాయి.
లక్షణాలు :

  1. ఇది ఉపజాతి పద్యం. దీనికి 4 పాదాలుంటాయి.
  2. 1, 3 పాదాల్లో వరుసగా మూడు సూర్యగణాలు, రెండు ఇంద్రగణాలు ఉంటాయి.
  3. 2, 4 పాదాల్లో ఐదూ సూర్యగణాలే ఉంటాయి.
  4. ప్రతి పాదంలో 4వ గణంలోని మొదటి అక్షరం యతి. యతిలేని చోట ప్రాసయతి చెల్లుతుంది.
  5. ప్రాస నియమం పాటించనవసరం లేదు. న

AP SSC 10th Class Telugu Solutions Chapter 4 వెన్నెల 6

మొదటి పాదం వలెనే 3వ పాదం ఉంది.
దీనిలో కూడా 3 సూర్యగణాలు, రెండు ఇంద్ర గణాలు వరుసగా ఉన్నాయి.
రెండవ పాదం వలెనే 4వ పాదం ఉంది.
దీనిలో కూడా 5 సూర్యగణాలు వరుసగా ఉన్నాయి.
4 పాదాలలోనూ యతి 4వ గణం మొదటి అక్షరం.
1వ పాదం – పొ, పొం 2వ పాదం – మించి – ముంచి (ప్రాసయతి)
3వ పాదం – అ – అం 4వ పాదం – నీ – ని (ట్ట)

అదనపు సమాచారము

సంధులు

1) జగదండఖండము = జగత్ + అండఖండము – జశ్వసంధి
2) తదంతరము = తత్ + అంతరము జత్త్వసంధి
3) కాటుకగ్రుక్కిన = కాటుక + క్రుక్కిన – గసడదవాదేశ సంధి
4) నిట్టవొడిచే = నిట్ట + పొడిచే – గసడదవాదేశ సంధి
5) గ్రుక్కినట్టి = గ్రుక్కిన + అట్టి – అత్వసంధి
6) అత్తఱిన్ = ఆ = తఱిన్ – త్రికసంధి
7) గర్వంపుదాటులు = గర్వము + దాటులు – పుంప్వాదేశ సంధి
8) గరువపుసూత్రధారి = గరువము + సూత్రధారి – పుంప్వాదేశ సంధి
9) వేడ్క యొనర్చె = వేడ్క + ఒనర్చె – యడాగమ సంధి
10) లీలనమొందఁజేసె = లీలనమొందన్ + చేసె – సరళాదేశ సంధి
11) పెందెర = పెను + తెర – సరళాదేశ సంధి
12) నభోంగణము = నభః + అంగణము – విసర్గ సంధి
13) అంతరంగము = అంతః + అంగము , – విసర్గ సంధి
14) రంజనౌషధము = రంజన + ఔషధము వృద్ధి సంధి

సమాసాలు
AP SSC 10th Class Telugu Solutions Chapter 4 వెన్నెల 7

ప్రకృతి – వికృతులు

1) సత్త్వము – సత్తువ
2) రాత్రి – రాతిరి, రేయి
3) యత్నము – జతనము
4) దిశ – దెస
5) ఆకాశము ఆకసము
6) స్రవణము – సోన
7) మాణిక్యము – మానికము
8) శంక – జంకు
9) విష్ణుడు – వెన్నుడు

పర్యాయపదాలు

1) కుసుమము : 1) సుమం 2) పుష్పం 3) పువ్వు
2) లలన : 1) సతి 2) స్త్రీ 3) ఇంతి
3) లోచనము : 1) నేత్రం 2) నయనం 3) కన్ను
4) చంద్రుడు : 1) రజనీశ్వరుడు 2) సుధాంశుడు 3) సోముడు
5) తోయధి : 1) అంభోధి 2) పయోనిధి 3) సముద్రం

నానార్థాలు

1) కరము : 1) చేయి 2) తొండం 3) కిరణం
2) తరంగము : 1) కెరటం 2) వస్త్రం 3) గుఱ్ఱపు దాటు
3) ఇనుడు : 1) సూర్యుడు 2) ప్రభువు

వ్యుత్పత్త్యర్థాలు

1) వనజాతము : నీటి నుండి పుట్టునది (పద్మం)
2) రజనీశ్వరుడు : రాత్రులకు ప్రభువు (చంద్రుడు)
3) రజనీకరుడు : రాత్రిని కలుగచేసేవాడు (చంద్రుడు)
4) పన్నగము : పాదములచే పోవనిది (పాము)
5) సుధాకరుడు : అమృతమయములైన కిరణాలు కలవాడు (చంద్రుడు)
6) భూరుహము : భూమి నుండి మొలచునది (చెట్టు)

కవి పరిచయం

కవిత్రయం :
సంస్కృతంలో వేదవ్యాస మహర్షి రచించిన 18 పర్వాల మహాభారతాన్ని నన్నయ, తిక్కన, ఎఱ్ఱన అనే ముగ్గురు మహాకవులు తెలుగులోకి అనువదించారు. దీనిలో నన్నయ రెండున్నర పర్వాలు, తిక్కన 15 పర్వాలు, ఎఱ్ఱన అరణ్యపర్వశేషం (నన్నయ వదిలిన భాగం) రచించారు.

ఎఱ్ఱన :
పోతమాంబిక, సూరనార్యుల పుత్రుడు. 14వ శతాబ్దంలో ప్రథమార్ధంలో అంటే క్రీ.శ 1300-1360 సం||లలో ఎఱ్ఱన జీవించాడు. ప్రోలయ వేమారెడ్డి ఆస్థానకవి.

ఎఱ్ఱన రచనలు :
అరణ్యపర్వశేషం, నృసింహపురాణం, రామాయణం, హరివంశం మొదలగు గ్రంథాలను రచించాడు. వీటిలో రామాయణం ప్రస్తుతం లభించడం లేదు. ‘రామాయణం’, ‘హరివంశం’లను ప్రోలయ వేమారెడ్డికి అంకితమిచ్చాడు. అరణ్యపర్వశేషాన్ని నన్నయ అంకితమిచ్చిన రాజరాజనరేంద్రునిపై గౌరవంతో ఆయనకే అంకితమిచ్చాడు. నృసింహపురాణాన్ని అహోోబిల నృసింహస్వామికి అంకితమిచ్చాడు.

ఎఱ్ఱన వర్ణనలు :
ఎఱ్ఱన రచనలో వర్ణనలు అధికంగా ఉంటాయి. తదనంతర కాలంలో వర్ణనాత్మకమైన కావ్యాలు రావడానికి ఎఱ్ఱన వర్ణనలే ప్రేరణ. ప్రబంధాలలోని అష్టాదశ (18) వర్ణనల్లోని చాలా వర్ణనలు నృసింహపురాణంలో కనిపిస్తాయి. ఎఱ్ఱన నృసింహపురాణ ప్రభావం పోతన మీద విశేషంగా ఉంది. పోతన భాగవతంలోని సప్తమ స్కంధంలోని ప్రహ్లాద చరిత్రలో ఈ ప్రభావం కనిపిస్తుంది.

బిరుదులు :
ప్రబంధ వర్ణనలకు మొదటివాడు కనుక ‘ప్రబంధ పరమేశ్వరుడు’ అను బిరుదు కలదు. శివభక్తుడగుటచేత ‘శంభుదాసుడు’ అను బిరుదు పొందాడు.

గురువు :
ఎఱ్ఱన గురువు గారి పేరు శంకరస్వామి,

అవగాహన – ప్రతి స్పందన

పద్యం -1
చ|| | ఇను ససమానతేజు దివసేంద్రుఁ గనుంగొనుమాడ్కిఁ జూడఁగాఁ
జన దొరు సల్పతేజు నను చాద్పునఁ జంచలభృంగతారకా
ఘన వనజాతలోచనము గ్రక్కున మీలన మొందఁజేసెఁబ
ద్మిని పతిభక్తి సత్త్వమున మేలిమికిం గుణి దానపొమ్మనన్.
ప్రతిపదార్థం :
అసమాన తేజున్ = సాటిలేని కాంతి గలవానిని
దివస + ఇంద్రున్ = పగటికి రాజును (అయిన)
ఇనున్ = సూర్యుని
కనున్ + కొనుమాడ్కిన్ = చూచునట్లుగా
పద్మిని = పద్మము (కమలము)
అల్పతేజుని = అల్పమైన తేజస్సు కలవానిని
ఒరున్ = ఇతరుని
చూడగాన్ = చూచుటకు
చనదు = ఒప్పదు
అను = అనెడు
చాడ్పునన్ = విధముగా
చంచల = చలించుచున్న
భృంగ = తుమ్మెదలనెడు
తారకా = తారకల యొక్క
ఘన = గొప్పదనమును (చూడక)
పతిభక్తి = భర్తపై ఇష్టం (సూర్యునిపై అభిమానము)
సత్త్వమున = బలమున
మేలిమికిన్ = గొప్పదనమునకు
గుటి = లక్ష్యము (ఉదాహరణ)
తాన = తానే (కమలమే)
పొమ్ము + అనన్ = పో అనగా (తాను మాత్రమే అనునట్లు)
గ్రక్కున = వెంటనే
వనజాత = కమలము
లోచనము = కన్నును
మీలన మొందన్ = మూసుకొనునట్లు
చేసెన్ = చేసెను

భావం :
పద్మము పతిభక్తిలో సాటిలేనిదా అనినట్లుండెను. అసమాన తేజస్సు కలవాడు, దినరాజు అయిన సూర్యుని చూచితిని. ఆ విధంగా అల్ప తేజస్సు గల ఇతరులను చూడను. చలించుచున్న తుమ్మెదలనెడు తారకలను చూడను అనునట్లుగా గొప్పవైన తన కన్నులను పద్మము వెంటనే మూసుకొన్నది.

పద్యం – 2: కంఠస్థ పద్యం

*చం. సురుచిరతారకాకుసుమశోభి సభాంగణభూమిఁ గాలను
పరువపు మాత్రధారి జతనంబున దికృతికోటి ముందటన్
సరసముగా నటింపగ విశానతి కెత్తిన క్రొత్తతోఁపుఁబెం
దెరయన నొప్పి సాంధ్యనవదీధితి పశ్చిమదిక్తటంబునన్.
ప్రతిపదార్థం :
సురుచిర తారకాకుసుమ శోభి నభోంగణ భూమిన్; సురుచిర = చాలా అందమైన
తారకా = నక్షత్రాలనే (చుక్కలనే)
కుసుమ = పూలచే
శోభి = అలంకరింపబడిన
నభః = ఆకాశమనే
అంగణభూమిన్ = రంగస్థలంపై (వేదికపై)
కాలమన్ (కాలము + అన్) = కాలం అనే
గరువపు సూత్రధారి; గరువపు = గొప్ప
సూత్రధారి = సూత్రధారి (దర్శకుడు) (నాటకం ఆడించేవాడు)
జతనంబునన్ = ప్రయత్నపూర్వకంగా
దిక్పతికోటి ముందటన్; దికృతికోటి = దిక్పాలకుల సమూహం
ముందటన్ = ముందు (ఎదుట)
సరసముగాన్ = చక్కగా (తగువిధంగా)
నటింపగన్ = నటించడానికి (నాట్యం చేయడానికి సిద్ధపడిన)
నిశాసతికిన్ = రాత్రి అనే స్త్రీకి (అడ్డంగా)
ఎత్తిన = నిలిపిన (పట్టిన)
క్రొత్తతోఁపుపెందెర; క్రొత్త = క్రొత్తదైన
తోఁపు= ఎర్రని రంగు గల (తోపు రంగు గల)
పెందెర (పెను + తెర) : పెద్ద తెర యేమో
అనన్ = అన్నట్లుగా
పశ్చిమ దిక్తటంబునన్; పశ్చిమదిక్ = పడమటి దిక్కు యొక్క
తటంబునన్ = తీరంలోని
సాంధ్య నవదీధితి; సాంధ్య = సంధ్యకు సంబంధించిన (సంధ్యాకాలపు)
నవదీధితి = కొత్త వెలుగు
ఒప్పెన్ = ప్రకాశించింది

భావం :
ప్రకాశించే చుక్కలనే పూవులతో అలంకరింపబడిన ఆకాశం అనే రంగస్థలం మీద, కాలం అనే గొప్ప సూత్రధారి (దర్శకుడు) ప్రయత్నం వల్ల, దిక్పాలకుల సమూహం ముందు, రాత్రి అనే స్త్రీ రసవంతముగా నాట్యం చేయడానికి రాగా, ఆమె ముందు పట్టుకొన్న లేత ఎరుపు రంగు (తోపు రంగు) తెర ఏమో అనేటట్లుగా, సంధ్యాకాలపు కొత్త కాంతి, పడమట దిక్కున ప్రకాశించింది.

విశేషం :
సంధ్యాకాలమయ్యింది. పడమటి దిక్కున ఆకాశం ఎఱుపురంగులో కనబడుతోంది. ఆకాశంలో నక్షత్రాలు వచ్చాయి. రాత్రి వస్తోంది. అది తన చీకటిని సర్వత్రా వ్యాపింపచేస్తుంది.

కవి సంధ్యాకాలం వెళ్ళిన తర్వాత జరిగిన మార్పుల్ని కాలము అనే సూత్రధారి ఆడించిన నాటక ప్రదర్శనగా ఊహించాడు.

  1. ఇక్కడ కాలము అనేది సూత్రధారుడు వలె ఉంది.
  2. సంధ్యాకాలంలో పడమటి దిక్కున కన్పించిన ఎజ్యని కాంతి, నాటకంలో కట్టిన ఎఱ్ఱని తోపురంగు తెరలా ఉంది.
  3. చుక్కలతో కూడిన ఆకాశం, పువ్వులతో అలంకరించిన నాట్య రంగస్థలంలా ఉంది.
  4. రాత్రి అనే స్త్రీ, ‘నర్తకి’ వలె ఉంది.

రాత్రి అనే స్త్రీ చేయబోయే నాట్యానికి రంగస్థలం మీద కట్టిన ఎల్లరంగుతోపు తెరవలె పడమటి దిక్కున ఆకాశంలో సంధ్యాకాంతి కనబడింది.

కవి సంధ్యాకాలాన్ని పూర్వపు నాటక సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ అద్భుతంగా వర్ణించాడు.

పద్యం – 3
తే॥ | పొదలి యొందొండ దివియును భువియు దిశలుఁ
బొదివి కొనియుందు చీకటిప్రోవు వలన
మిక్కుటంబుగఁ గాటుక గ్రుక్కినట్టి
(కరవటంబన జగదందఖండ మమరి.
ప్రతిపదార్థం :
పొదలి = వృద్ధి చెంది
దివియును = ఆకాశమును
భువియు = భూమియును
దిశలున్ = దిక్కులును
ఒండు + ఒండు + అ = ఒకదానితో ఒకటి
పొదివికొని + ఉండు = దగ్గరకు చేర్చుకొని ఉన్నటువంటి
చీకటిప్రోవు = చీకటి యొక్క కుప్ప
వలన = వలన
మిక్కుటంబుగన్ = ఎక్కువగా
కాటుకన్ = (నల్లని) అంజనమును
క్రుక్కినట్టి = నిండా కూరినటువంటి
కరవటంబు + అన : భరిణె అనునట్లు (కాటుక భరిణ వలె)
జగత్ = లోకమనెడు
అండఖండము – బ్రహ్మాండములోని భాగము
అమరె = ఏర్పడినది (ఉన్నది)

భావం :
ఆకాశం, భూమి, దిక్కులు, చీకటి ఒకదానిలో ఒకటి కలిసిపోయాయి. చీకటి ఈ లోకము అనెడు బ్రహ్మాండ భాగం కాటుక భరిణలాగ ఉంది.

వచనం -4
అంత,
అంత = అంతట

ఆలోచించండి – చెప్పండి

ప్రశ్న 1.
రెండో పద్యంలో కవి దేనిని దేనితో పోల్చాడు? ఎందుకు?
జవాబు:
చుక్కలను పూలతో, ఆకాశమును వేదికతో, కాలమును సూత్రధారితో, దిక్పాలకులను రసజ్ఞులైన ప్రేక్షకులతో, రాత్రిని నాట్యకత్తెతో, పడమటి సంధ్య వెలుగును పరదాతో కవి పోల్చాడు.

ఎందుకంటే నక్షత్రాలకు పూలకు రాలే గుణం, అందగించే గుణం, ప్రకాశించే గుణం, ఆకర్షించే గుణం, అందీ అందనట్లు మురిపించే గుణం ఉంటుంది.

ఆకాశము-వేదిక విశాలమైనవి. అలంకరింప బడినవి. నటులకు తప్ప ఎవరికీ స్థానం లేనివి.

కాలానికి సూత్రధారికి పరిమితి లేదు. ఎవరైనా లోబడవలసిందే. ‘దిక్పాలకులు-ప్రేక్షకులు’, సాక్షులు. వేదిక చుట్టూ ఉండి చూస్తారు.

‘రాత్రి – నాట్యకత్తె’ తనవంతు పూర్తవగానే వెళ్ళిపోవాలి. వేదికంతా వీరి అధీనంలోనే ఉంటుంది.

“సంధ్య – పరదా’ పరిస్థితిని బట్టి వెలుగు-చీకటుల గతులు మార్చుకొంటాయి.

AP SSC 10th Class Telugu Solutions Chapter 4 వెన్నెల

ప్రశ్న 2.
ఆకాశాన్ని కవి ఏమని వర్ణించాడు? రాత్రివేళ చుక్కలతో కూడిన ఆకాశాన్ని చూస్తే మీకెలా అన్పిస్తుంది?
జవాబు:
ఆకాశాన్ని కవి చక్కగా అలంకరింపబడిన వేదికతో పోల్చాడు. చుక్కలతో ఉన్న ఆకాశం-చుక్కల చీరలో, సంక్రాంతికి ముగ్గులు పెట్టడానికి గాను చుక్కలు పెట్టిన వాకిలిలా, పిండి వడియాలు పెట్టిన వస్త్రంలా, రేఖా గణితపు నల్లబల్లలాగా, వినాయకచవితికి కట్టే పాలవెల్లిలా, అనేక జంతువుల (మేషం, వృషభాది రాశులు) వలె, ఇంకా అనేక విధాల కనిపిస్తుంది.

పద్యం – 5 : కంఠస్థ పద్యం

*చ దెసలను కొమ్మ లొయ్య వతిదీర్ఘములైన కరంబులన్ బ్రియం
వినఁగఁగ మాది విక్కి రణవీశ్వరుఁ డుప్పతలీలఁ బేర్చు నా
కన మమ పేరి భూరుహము శాంతనిరంతర తారకాలస
త్కుసుమ చయంబు గోయుటకొకో యవఁ బ్రాఁకె సముత్సుకాకృతిన్.
ప్రతిపదార్ధం :
రజనీశ్వరుడు (రజనీ + ఈశ్వరుడు) = రాత్రికి ప్రభువైన చంద్రుడు
దెసలను (దెసలు + అను) = దిక్కులు అనే
కొమ్మలు = కొమ్మలను
ఒయ్యన్ = మెల్లగా
అతిదీర్ఘములైన = మిక్కిలి పొడవైన
(అతిదీర్ఘములు + ఐన) కరంబులన్ = కిరణాలు అనే (తన) చేతులతో
ప్రియంబు + ఎసగగన్ = మిక్కిలి ప్రేమతో
ఊది = పట్టుకొని
నిక్కి = పైకి లేచి
ఉన్నత లీలన్ = ఎత్తయిన విధంగా
పేర్చు = అతిశయించిన (విస్తరించిన)
ఆకసము = ఆకాశం
అను పేరి = అనే పేరు గల
భూరుహము = చెట్టు యొక్క
కాంతనిరంతర తారకా లసత్కుసుమచయంబు; కాంత = ఇంపైన (మనోహరమైన)
నిరంతర = మిక్కిలి దగ్గరగా ఉన్న
తారకా = నక్షత్రాలు అనే
లసత్ = ప్రకాశిస్తున్న
కుసుమచయంబు = పుష్ప సమూహాన్ని
కోయుటకున్ + ఒకో + అనన్ = కోయడం కోసమా అన్నట్లుగా సముత్సుకాకృతిన్ (సముత్సుక + ఆకృతిన్)
సముత్సుక = మిక్కిలి ఆసక్తి గల
ఆకృతిన్ = ఆకారంతో
ప్రాకెన్ = (ఆకాశంలోకి) వ్యాపించాడు.

భావం:
చంద్రుడు, దిక్కులనే కొమ్మలను మెల్లగా తన పొడవైన కిరణాలనే చేతులతో ఇష్టంగా పట్టుకొని, పైకి లేచి ఆకాశం అనే పేరుతో ఉన్న చెట్టు యొక్క మనోహరమైన నక్షత్రాలు అనే పువ్వులను కోయడం కోసమా అన్నట్లుగా, మిక్కిలి ఆసక్తిగా ఆకాశంలోకి పాకాడు. (చంద్రుని కాంతి ఆకాశమంతా వ్యాపించిందని భావం)
అలంకారం :రూపకం, ఉత్ప్రేక్ష.

పద్యం – 6

ఉ॥ వెన్నెలవెళ్లి పాల్కడలి వేఁకదనంబునఁ బేర్చి దిక్కులున్
మిన్నును ముంప నందు రజనీకరబింబము కుందరీ భవ
త్పన్నగతల్పకల్పనము భంగిఁ దనర్చిం దదంతరంబునన్
వెన్ను నిభంగిఁ జూద్కులకు వేర్మయొనర్చెఁ గలంత మత్తజిన్.
ప్రతిపదార్థం :
వెన్నెల వెల్లి = వెన్నెల ప్రవాహమనెడు
పాల్కడలి = పాల సముద్రము
ప్రేకదనంబున = భారముతో
పేర్చి = ఏర్పరచి (ప్రసరింపచేసి)
దిక్కులున్ = దిశలును
మిన్నును = ఆకాశమును
ముంప నందు = ముంచగా
రజనీకర బింబము = చంద్రబింబం
కుండలీభవత్ = చుట్టలు చుట్టుకొనియున్న
పన్నగతల్ప = శేషపాన్పు
కల్పనము భంగి = కల్పింపబడిన విధముగా
తనర్చెన్ = ప్రకాశించెను
ఆ + తటిన్ = ఆ సమయంలో
తత్ = దాని (శేష పాన్పువంటి చంద్రుని)
అంతరంబునన్ = లోపల గల
కలంకము = మచ్చ
చూడ్కులకు = చూపులకు
వెన్నుని భంగి = విష్ణువు వలె
వేడ్క = వేడుకను
ఒనర్చెన్ = కలిగించెను

భావం :
వెన్నెల ప్రవాహం పాల సముద్రం లాగ ఉంది. అది అన్ని దిక్కులను, ఆకాశాన్ని ముంచెత్తుతోంది. ఆ సమయంలో చంద్రుడు చుట్టలు చుట్టుకొన్న ఆదిశేషువులాగ ఉన్నాడు. చంద్రునిలోని మచ్చ నల్లని విష్ణువు వలె ఉంది.

ఇది తెలుసుకోండి :
విష్ణువు నల్లగా ఉంటాడు. ఆయన పవ్వళించే శేషుడు తెల్లగా ఉంటాడు. శివుడు తెల్లగా ఉంటాడు. ఆయన మెడలో ధరించే వాసుకి నల్లగా ఉంటుంది.

ఆలోచించండి – చెప్పండి

ప్రశ్న 1.
“చంద్రోదయాన్ని” చూస్తున్నప్పుడు ఎలా అనిపిస్తుంది?
జవాబు:
అమ్మ జోలపాటను గుర్తుకు తెస్తుంది. అమ్మ తినిపించిన గోరుముద్దలు గుర్తుకు వస్తాయి. పాలమీగడ, పెరుగుబిళ్ళ గుర్తుకు వస్తుంది. ఎలాగైనా చంద్రమండలం పైకి వెళ్ళి, అక్కడ ఏముందో చూడాలనిపిస్తుంది.

ప్రశ్న 2.
నిండు పున్నమినాడు చంద్రబింబాన్ని చూస్తే ఏమేమి ఉన్నట్లుగా అనుభూతి చెందుతాము?
జవాబు:
ఆ వెన్నెలలో తనివితీరా ఆదుకోవాలనిపిస్తుంది. చంద్రుణ్ణి చూస్తూ పరుగెడితే మనకూడా చంద్రుడు వస్తున్నట్లుగా అనిపిస్తుంది.

ఆకాశంలో పెద్ద మెర్క్యురీ లైటు ఉన్నట్లుగా అనిపిస్తుంది. చంద్రుడు చల్లని సూర్యుడిలా కనిపిస్తాడు. ఆ వెన్నెలలో చదువుకోగలనో లేదో చూడాలనిపిస్తుంది.

AP SSC 10th Class Telugu Solutions Chapter 4 వెన్నెల

ప్రశ్న 3.
పౌర్ణమి నాటి కలువలను చూస్తుంటే కలిగే ఆనందం ఎలా ఉంటుంది?
జవాబు:
పిండారబోసినట్లుగా తెల్లని వెన్నెలలో కలువలు ఉన్న కొలనును చూస్తే చాలా ఆనందం కలుగుతుంది. సున్నితమైన రేకులతో ఉన్న కలువలను చేతితో తాకాలనిపిస్తుంది. వాటితో బుగ్గలపై రాసుకోవాలని పిస్తుంది. వాటిని కెమెరాతో ఫోటోలు తీసి దాచుకోవాలని పిస్తుంది. వీడియో తీసుకోవాలనిపిస్తుంది. వెన్నెలలో కలువలను చూస్తుంటే, చదువు-మార్కులు, ఆటలుపాటలు, అల్లరి-గిల్లికజ్జాలు, తిండి-నిద్ర ఏమీ గుర్తురానంత ఆనందం కలుగుతుంది.

ప్రశ్న 4.
‘రజనీకర బింబం’ అని కవి దేన్ని గురించి అన్నాడు?
జవాబు:
రజనీకర బింబం అని కవి చంద్రుని గురించి అన్నాడు. వెన్నెల పాలసముద్రంలా, చంద్రుడు పాలసముద్రంలోని ఆదిశేషునిలాగా, చంద్రునిలోని మచ్చ విష్ణువులాగా కనిపించిందని కవి అన్నాడు.

పద్యం – 7 : కంఠస్థ పద్యం

*చ వడిగొని చేకులుప్పతిల వాలిన కేసరముల్ దలిర్పఁబు
పాడి దలమెకి, తేనియలు పొంగి తరంగలుగా జెలంగి పైఁ
ఐదు నెలదేఁటిదాఁటులకు బండువులై నవసారభంబు లు
గ్గడుపున మల్ల సిల్లె ఘనకైరవషండము నిండువెన్నెలన్.
ప్రతిపదార్థం :
ఘనకైరవషండము: ఘన ఘన = గొప్పవైన
కైరవ = కలువ పూల యొక్క
షండము = సముదాయం
నిండు వెన్నెలన్ = ఆ నిండైన వెన్నెలలో
వడిగొని = వేగం కలిగి (వేగంగా)
ఱేకులు = (తమ) పూలరేకులు
ఉప్పతిలన్ = విచ్చుకొనగా
వాలిన = కిందికి వాలిన
కేసరముల్ = కింజల్కములు (తామరపువ్వు బొడ్డు చుట్టూ ఉండే అకరువులు)
తలిర్సన్ = తలఎత్తి కన్పడగా
పుప్పొడిన్ = పుప్పొడితో
దలమెక్కి = దళసరియయి (రేకులు దళసరి అయి)
తేనియలు = మకరందాలు
పొంగి = పొంగి
తరంగలుగాన్ = కెరటాలుగా
చెలంగి = విజృంభించి
పైఁబడు = తమపైన వాలేటటువంటి
ఎలతేటి = లేత తుమ్మెదల
దాఁటులకున్ = గుంపులకు
పండువులై = విందు చేసేవయి
నవసౌరభంబులు – క్రొత్త పరిమళాలు
ఉగ్గడువుగన్ = మిక్కిలి అధికంగా
ఉల్లసిల్లెన్ = బయలుదేరాయి

భావం :
ఆ నిండు వెన్నెలలో కలువల రేకులు బాగా విచ్చు కున్నాయి. వాలిన కేసరాలు తలలెత్తాయి. పుప్పొడితో రేకులు దళసరియై, తేనెలు పొంగి కెరటాలుగా విజృంభించాయి. కలువలపై వాలే తుమ్మెదల గుంపులకు విందు చేస్తూ, కొత్త సువాసనలు అధికంగా బయలుదేరాయి.

అలంకారం : స్వభావోక్తి

పద్యం – 8

సీ॥ | కరఁగెడు నవచంద్రకాంతోపలంబుల
తఱచు సోనలఁ గడు దలముకొనుచుఁ
జటుల చకోరసంచయముల యెఱకల
గర్వంపుదాఁటులఁ గడలుకొనుచు
విరియు కైరవముల విపుల రంధ్రములపైఁ
దీవంబుగాఁ గ్రమ్మి త్రిప్పుకొనుచుఁ
గామినీజనముల కమనీయవిభ్రమ
స్మితకాంతిలహరుల మెందుకొనుచుఁ

ఆ॥వె॥ బొదలిపొదలి చదలఁ బొంగారి పొంగారి
మించి మించి దిశలు ముంచిముంచి
యభినుతేందు చంద్రికాంభోధి యఖిలంబు
నీట నిట్టలముగ నిట్టవొదిచె.
ప్రతిపదార్థం :
అభినుత = మిక్కిలి పొగడబడిన
ఇందు = చంద్రుని
చంద్రిక = వెన్నెల అనెడు
అంభోధి = సముద్రము
కరగెడు = కరుగుతున్న
నవ = క్రొత్తదైన
చంద్రకాంత = చంద్రకాంతములనెడు
ఉపలంబుల = ఱాళ్ళను
తఱచు = ఎక్కువగా
సోనలన్ = తుంపరలతో (అల్ప వర్షంతో)
కడు = ఎక్కువగా
తలముకొనుచున్ = తడుపుతూ
చటుల = చలించు
చకోరపక్షుల = చక్రవాక పక్షుల
సంచయముల = సమూహముల యొక్క
ఎఱకల = ఱెక్కల
గర్వంపుదాటులన్ = గర్వము గల కదలికలను
కడలుకొనుచు = అతిశయిస్తూ
విరియ = విరబూసిన
కైరవముల = కలువల
విపుల = ఎక్కువైన (అధికమైన)
రంధ్రముల పైన్ = రంధ్రాల మీద
తీవ్రంబుగాన్ = ఎక్కువగా
క్రమ్మి = ఆవరించి
త్రిప్పుకొనుచున్ = (తనవైపు) ఆకర్షిస్తూ
కామినీజనముల = స్త్రీల యొక్క
కమనీయ = అందమైన
విభ్రమ = అలంకారాదుల కాంతి
స్మిత = చిరునవ్వుల
కాంతిలహరుల = వెలుగు కెరటాలను
మెండుకొనుచున్ = ఎక్కువ చేస్తూ
పొదలి పొదలి = పెరిగి పెరిగి
చదలన్ = ఆకాశంలో
పొంగారి పొంగారి = పొంగిపొంగి (ఉప్పొంగి)
మించిమించి = బాగా అతిశయించి
దిశలు = దిక్కులు
ముంచిముంచి = బాగా మునుగునట్లు చేసి
నీటు + అ = మురిపముతో
నిట్టలముగ = అధికంగా
నిట్టవొడిచే = ఉప్పొంగెను.

భావం :
బాగా పొగడబడిన చంద్రకాంతి అనే సముద్రం ప్రపంచాన్ని ముంచింది. అది చాలా వ్యాపించింది. ఆకాశంలో ఉప్పొంగింది. దిక్కులు ముంచింది. చంద్రకాంత శిలలను తన ప్రవాహపు తుంపరలతో తడిపింది. చక్రవాక పక్షుల రెక్కల గర్వపు కదలికలను పెంచింది. విరబూస్తున్న కలువల రంధ్రాలపై వ్యాపించి తనవైపు ఆకర్షిస్తోంది. స్త్రీల అందమైన ఆభరణాల కాంతులను, వారి చిరునవ్వుల కాంతులను పెంచుతోంది.

వచనం -9

వ॥ ఇట్లతిమనోహర గంభీరధీరంబైన సుధాకర కాంతి
పూరంబు రాత్రి యను తలంపు దోఁవనీక తమంబను
నామంబును విననీక యవ్యక్తయను శంక నంకురింపనీక
లోచనంబులకు నమృత సేచనంబును, శరీరంబునకుఁ
జందనా సారంబును, నంతరంగంబునకు నానంద
తరంగంబును నగుచు విజృంభించిన సమయంబున
ప్రతిపదార్థం :
ఇట్లు = ఈ విధంగా (పైన పేర్కొన్న విధంగా)
అతి మనోహర = చాలా అందమైన
గంభీర = గంభీరమైన (నిండైన)
ధీరంబు + ఐన = ధైర్యము కలిగిన (అన్నిచోట్ల వ్యాపించిన)
సుధాకర = చంద్రుని (అమృత కిరణుని)
కాంతి పూరంబు = కాంతి సమూహము
రాత్రి + అను = రేయి అనెడు
తలంపున్ = ఆలోచనను
తోపనీక = తోచనివ్వక
తమంబను = చీకటి అనెడు
నామంబును = పేరును
వినన్ + ఈక = విననివ్వక
అవ్యక్త + అను = పరమాత్మ అను
శంకన్ = అనుమానమును
అంకురింపనీక = పుట్టనివ్వక
లోచనంబులకు = కళ్లకు
అమృతసేచనంబును = అమృతాభిషేకమును
శరీరంబునకున్ = శరీరానికి
చందన + ఆసారంబును = గంధపు వర్షమును
అంతరంగంబునకును = ఆత్మకును (మనస్సునకు)
ఆనంద = ఆనందమనెడు
తరంగంబును = కెరటమును
అగుచు = అవుతూ
విజృంభించిన = అతిశయించిన
సమయంబున = సమయంలో

భావం :
ఈ విధంగా వెన్నెల చాలా అందంగా ఉంది. గంభీరంగా ఉంది. ధైర్యంగా ఉంది. ఆ వెన్నెల రాత్రి అనే ఆలోచన కూడా రానివ్వడం లేదు. చీకటి అనే పేరు కూడా విననివ్వడం లేదు. పరమాత్మ అనే ఆలోచన కూడా పుట్టనివ్వడం లేదు. కళ్లకు ఆ వెన్నెల అమృతాభిషేకం చేస్తోంది. శరీరానికి మంచి గంధంలాగ ఉంది. అంతరాత్మకు బ్రహ్మానంద ప్రవాహం లాగ ఉంది.

ఇది తెలుసుకోండి:
వెన్నెల మన కళ్లకు అందంగా కనిపిస్తూ, రాత్రి అనే ఆలోచన రానివ్వక అమృతాభిషేకం చేసింది. శరీరానికి గంభీరంగా కనిపిస్తూ, భయం కలిగించే చీకటి అనే పేరును విననివ్వక గంధపు వర్షమైంది. ఆత్మకు కావలసినంత ధైర్యంగా కనిపిస్తూ, దైవాన్ని స్మరించే స్థితిని దాటించి, బ్రహ్మానందాన్ని కల్గించింది.

ఆలోచించండి – చెప్పండి

ప్రశ్న 1.
వెన్నెలను చూసిన కలువలు ఎలా ప్రతిస్పందించాయి?
జవాబు:
పండు వెన్నెలలో కలువలు తమ రేకులు అతిశయించగా వాడిపోయిన కేసరాలు ప్రకాశించాయి. పుప్పొడి పైన తేనె పొంగి ప్రవహించింది, పైన పడుతున్న చంద్రుని కలయికలతో పరవశించే కలువలు కనులపండువగా ఆనందంతో, క్రొత్త సౌరభాలతో ప్రకాశించాయి.

AP SSC 10th Class Telugu Solutions Chapter 4 వెన్నెల

ప్రశ్న 2.
చంద్రుడు తన వెన్నెలతో ప్రపంచానికి ఆహ్లాదాన్ని ఎలా కలిగించాడు?
జవాబు:
ఆకాశమనే వృక్షానికి దిక్కులనే కొమ్మలలో గల నక్షత్రాలనే పూలను కోయుటకు చంద్రుడు నిలబడి పొడవైన తన కిరణాల (చేతుల) తో ఉత్సాహంగా కనిపిస్తూ ప్రపంచానికి ఆనందం కలిగించాడు.

వెన్నెల అనే పాలసముద్రంలో చంద్రుడు ఆదిశేషుని లాగా కనిపించాడు. చంద్రునిలోని మచ్చ శ్రీమహా విష్ణువులాగా కన్పించి భక్తులకు కూడా ఆనందాన్ని కలిగించాడు.

వెన్నెల చంద్రకాంత శిలలకు, చక్రవాక పక్షులకు, కలువలకు, అందమైన స్త్రీలకు, సమస్త చరాచర జగత్తుకీ ఆనందం కలిగిస్తోంది.

ప్రపంచానికి రాత్రి అనే ఆలోచన రానివ్వక, చీకటి అనే పేరు కూడా వినపడనివ్వకుండా, పరమాత్మను కూడా స్మరింపనీయక అమితమైన బ్రహ్మానందాన్ని వెన్నెల కలిగిస్తోంది.

ప్రశ్న 3.
‘పొదలి పొదలి చదలఁ బొంగారి పొంగారి మించి మించి దిశలు ముంచి ముంచి’ అనే పాదంలోని పద సౌందర్యం గురించి చెప్పండి.
జవాబు:
పొదలి, పొంగారి, మించి, ముంచి అనే పదాలు వ్యవధానం లేకుండా ప్రయోగించడం వలన పద్య పాదానికి చాలా అందం వచ్చింది. ఈ శబ్దాలు ఈ పద్యపాదానికి అలంకారాలు. ఇది ఛేకానుప్రాసా
లంకారంతో శోభిస్తోంది.

ప్రశ్న 4.
‘మనోహర గంభీర ధీరంబైన సుధాకర కాంతి పూరంబు’ దీని భావం ఏమిటి?
జవాబు:
మనస్సును ఆకర్షించగల అందమైన, గంభీరమైన, ధైర్యము గలిగిన అమృత కిరణుడైన చంద్రుని కాంతి ప్రవాహము.