AP Inter 1st Year History Notes Chapter 5 క్రీ.శ. 3వ శతాబ్దం నుంచి క్రీ.శ. 7వ శతాబ్దం వరకు రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిస్థితులు, సంస్కృతి

Students can go through AP Inter 1st Year History Notes 5th Lesson క్రీ.శ. 3వ శతాబ్దం నుంచి క్రీ.శ. 7వ శతాబ్దం వరకు రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిస్థితులు, సంస్కృతి will help students in revising the entire concepts quickly.

AP Inter 1st Year History Notes 5th Lesson క్రీ.శ. 3వ శతాబ్దం నుంచి క్రీ.శ. 7వ శతాబ్దం వరకు రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిస్థితులు, సంస్కృతి

→ శ్రీ.పూ. 326 సం॥లో అలెగ్జాండర్ భారతదేశాన్ని వీడినప్పుడు రాజకీయ పరిస్థితులు సంతృప్తిగా లేవు.

→ భారతదేశ గొప్ప పాలకుల్లో అశోకుడు ఒకడు.

→ భారతదేశంలో మొదటి చారిత్రక వంశం మౌర్య వంశం.

→ భారతదేశానికి వచ్చిన విదేశీ ఆక్రమణకారుల్లో కుషాణులు చాలా శక్తివంతమైనవారు.

→ గుప్తుల కాలాన్ని ప్రాచీన భారతదేశ చరిత్రలో స్వర్ణయుగం’ అన్నారు.

→ క్రీ.శ. 3వ శతాబ్దం నుంచి క్రీ.శ. 7వ శతాబ్దం వరకు గల భారతదేశ చరిత్ర పునర్నిర్మాణం అనేక స్వదేశీ, విదేశి ఆధారాల ద్వారా పునర్నిర్మించబడింది.

→ చంద్రగుప్త మౌర్యుడు తన చివరి రోజుల్లో జైన మతం తీసుకొని రాజ్యాన్ని కుమారుడైన బిందుసారునికి అప్పగించి శ్రావణ బెళగొలకు వెళ్లి సల్లేఖనం ద్వారా ప్రాణాలు త్యజించాడు.

→ కళింగ యుద్ధం క్రీ.పూ. 261 సం॥లో జరిగింది.

→ మధ్య ఆసియాలో ఉన్న ఐదు ‘యూచీ’ తెగల్లో కుషాణ తెగ ఒకటి.

→ పెషావర్ లేదా పురుషపురం కనిష్ముని రాజధాని.

AP Inter 1st Year History Notes Chapter 5 క్రీ.శ. 3వ శతాబ్దం నుంచి క్రీ.శ. 7వ శతాబ్దం వరకు రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిస్థితులు, సంస్కృతి

→ గుప్త వంశంలో మొదటి చక్రవర్తి మొదటి చంద్రగుప్తుడు. ‘మహారాజాధిరాజు’ అనే బిరుదు ధరించాడు.

→ సముద్రగుప్తుడు తన విజయాలకు గుర్తుగా ‘అశ్వమేధ యాగం’ నిర్వహించాడు.

→ చైనా యాత్రికుడైన ఫాహియాన్ చంద్రగుప్త విక్రమాదిత్యుని కాలంలో భారతదేశానికి వచ్చాడు.

→ తీర్చుని కాలంలో చైనా యాత్రికుడైన హయాన్సాంగ్ భారతదేశానికి వచ్చాడు.

→ గుప్తుల కాలంలో విజ్ఞానశాస్త్రం, కళలు, మతం, సాహిత్య రంగాల్లో పురోభివృద్ధి సాధించారు.