AP Inter 1st Year Civics Study Material Chapter 4 చట్టం

Andhra Pradesh BIEAP AP Inter 1st Year Civics Study Material 4th Lesson చట్టం Textbook Questions and Answers.

AP Inter 1st Year Civics Study Material 4th Lesson చట్టం

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
చట్టం అంటే ఏమిటో నిర్వచించి, చట్టానికి గల వివిధ ఆధారాలను వివరించండి. (లేదా)
ప్రశ్న 2.
చట్టం అంటే ఏమిటి ? చట్టానికి గల వివిధ ఆధారాలను చర్చించండి.
జవాబు:
పరిచయం : రాజనీతిశాస్త్ర అధ్యయనంలో చట్టం అనేది ఒక ముఖ్యమైన భావన.

రాజ్యం శాసనాల ద్వారా ప్రజలను పరిపాలిస్తుంది. శాసనాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. రాజ్య సార్వ భౌమాధికారం శాసనాల ద్వారా వ్యక్తమవుతుంది. రాజ్యం ఆశించే సాంఘిక, ఆర్థిక, రాజకీయ మార్పులు శాసనం ద్వారానే సాధించగలవు. మానవుని బాహ్య ప్రవర్తనను క్రమబద్ధం చేసే నియమాలే శాసనాలు. వ్యక్తులు రాజ్యంలో చేయవలసినవి, చేయకూడనివి శాసనం చెబుతుంది. ప్రభుత్వంలోని శాసనశాఖ శాసనాలు చేస్తుంది.

అర్థం : శాసనాన్ని ఆంగ్లంలో ‘లా’ అంటారు. ‘లాగ్’ అనే ట్యూటానిక్ పదం నుండి ‘లా’ అనే మాట వచ్చింది. ‘లాగ్’ అంటే ‘సమమైన’ లేదా ‘స్థిరమైన’ అని అర్థం. శాసనాలు స్థిరమైన నిబంధనలు.

నిర్వచనాలు :
1) “సార్వభౌముడి ఆదేశమే చట్టం. ప్రజలందరూ సార్వభౌముడికి విధేయులుగా ఉండేందుకు చట్టం కొన్ని ఉమ్మడి నియమాలను రూపొందిస్తుంది” అని జాన్ ఎరిస్కిన్ పేర్కొన్నాడు.

2) “రాజకీయాధికారాన్ని పొందిన సార్వభౌముడిచే అమలు చేసే బాహ్య చర్యలకు సంబంధించిన సాధారణ నియమమే చట్టం” అని టి. ఇ. హాలండ్ పేర్కొన్నాడు.

3) న్యాయపాలనలో రాజ్యం ఉపయోగించే సూత్ర సముదాయమే చట్టం” అని జాన్ సాల్మండ్ పేర్కొన్నాడు.

శాసనానికి ఆధారాలు : హాలెండ్ అనే రచయిత సంప్రదాయాలు, మతము, ధర్మబద్ధత (సమత), న్యాయమూర్తుల తీర్పులు, శాస్త్రీయ వ్యాఖ్యానాలు, శాసనశాఖ అనేవి శాసనాలకు ఆధారాలని చెప్పాడు. శాసనాలు వివిధ రంగాలలో క్రమంగా రూపొందుతాయి. అనేక అంశాల ప్రభావం వాటిపై ఉంటుంది. రాజనీతి శాస్త్రజ్ఞులు చెప్పిన శాసనాల ఆధారాలు ఈ క్రింది విధంగా చెప్పవచ్చు.

1) ఆచార, సంప్రదాయాలు, వాడుకలు (Customs) : ఇవి శాసనానికి తొలి ఆధారాలు. ప్రజల ఆచారాలు, వాడుకలు, సంప్రదాయాలు శాసనాలకు మూలాధారము. సంప్రదాయాలు సంఘంలో ఒక అలవాటుగా, క్రమంగా రూపొందుతాయి. పూర్వం సంప్రదాయాలే సమాజ జీవితాన్ని క్రమబద్ధం చేసేవి. రాజ్యం వీటిని గుర్తించి, వాటిని ఆధారం చేసుకొని కొన్ని శాసనాలను రూపొందిస్తుంది. రాజకీయ ఆచారాలు కూడా రాజ్యంచే గుర్తించబడి అమలు చేయబడితే అవి శాసనాలవుతాయి. బ్రిటన్లో ‘సామాన్య న్యాయం’ సంప్రదాయబద్ధమైన శాసనానికి ఉదాహరణ. అదే విధంగా భారతదేశంలో వివాహ చట్టాలు, ఆస్తి పంపిణీ చట్టాలు మొదలగునవి సంప్రదాయాలు ఆధారంగా చేయబడ్డాయి.

AP Inter 1st Year Civics Study Material Chapter 4 చట్టం

2) మతం (Religion) : ఆచారానికి మతం సమాజాన్ని విపరీతంగా ప్రభావితం చేసే వ్యవస్థ. సంఘ జీవితం మత నియమాలకు అనుగుణంగా జరుపుకుంటారు. పూర్వం మతాధిపతులు చెప్పే నియమాలు శాసనాల వలె చెలామణి అయ్యేవి. ఆధునిక కాలంలో కూడా శాసనాలు చేయడానికి మతం ఒక ఆధారం. వారసత్వం, వివాహం, కుటుంబ ఆస్తి మొదలైన వాటి శాసనాలు మతం ఆధారంగా చేయబడ్డాయి. హిందువులు, క్రైస్తవులు, ముస్లిములకు గల శాసనాలు వారి మతాలు ఆధారంగా రూపొందాయి. ఇరాన్, పాకిస్థాన్ వంటి మత ప్రమేయ దేశాలలో సంఘ జీవనానికి మత నియమాలే ఆధారం.

3) న్యాయస్థానాల తీర్పులు (Judicial Decisions) : న్యాయస్థానాలలో న్యాయమూర్తులు ఇచ్చే తీర్పులు శాసన నిర్మాణానికి ఆధారాలు. న్యాయస్థానాలు చట్టాలను వ్యాఖ్యానిస్తాయి. ఈ విధి నిర్వహణలో న్యాయమూర్తులు తీర్పులిచ్చేటప్పుడు క్రొత్త న్యాయ సూత్రాలను సృష్టిస్తారు. ఈ తీర్పులు అదే విధమైన వివాదాలు తలెత్తినప్పుడు న్యాయసూత్రల వలె వర్తింపచేస్తారు. నేడు న్యాయమూర్తుల నిర్ణయాలు శాసనాలలో అంతర్భాగమవుతున్నాయి. ఉదా : భారతదేశంలో సుప్రీంకోర్టు తీర్పులిచ్చిన గోలక్నాథ్ కేసు, కేశవానంద భారతి కేసు, మినర్వామిల్స్ కేసు.

4) శాస్త్రీయ వ్యాఖ్యానాలు (Scientific commentories) : ప్రముఖ న్యాయశాస్త్ర కోవిదులు, రచయితలు, విమర్శకులు చేసే వ్యాఖ్యానాలు శాసన నిర్మాణానికి ఆధారమవుతాయి. ఇవి న్యాయస్థానాలలో న్యాయమూర్తుల వ్యాఖ్యానాలు, | వివరణలు, శాసనాలు చేయటానికి ప్రభుత్వానికి ఉపయోగిస్తాయి. న్యాయమూర్తుల నిర్ణయాలు, తీర్పులు, భవిష్యత్లో శాసన నిర్మాణానికి తోడ్పడతాయి. ఇంగ్లండ్లో కోక్, బ్లాక్టన్, అమెరికాలో స్టోరీ, కెంట్, భారతదేశంలో విజ్ఞానేశ్వర, ఆపరార్క వంటి వారి వ్యాఖ్యానాలు శాసన నిర్మాణానికి ఆధారాలు.

5) సమత లేదా సమబద్ధత (Equity) : ‘సమత’ అనే పదానికి నిష్పక్షపాతం, న్యాయంలాంటి సూత్రాలను పర్యాయపదాలుగా వాడుతున్నారు. సమత అంటే సహజన్యాయం. అమలులో ఉన్న చట్టాలు వివాదాల పరిష్కారానికి సరిపడని సందర్భాలలో న్యాయమూర్తులు తమ విజ్ఞతతో, సక్రమ అవగాహన ద్వారా వివాదాల పరిష్కారంలో కక్షిదారులకు
న్యాయం చేకూర్చేందుకు ప్రయత్నిస్తారు. సమత అనేది సహజన్యాయ భావన ద్వారా రూపొందింది. దానినే న్యాయమూర్తులచే నిర్మితమైన చట్టాలుగా పరిగణించడమైంది. ఈ సందర్భంలో హెన్రీమెయిన్ అనే పండితుడు సహజన్యాయం గురించి ప్రస్తావిస్తూ అది కొన్ని ప్రత్యేక సూత్రాల ఆధారంగా రూపొంది పౌరన్యాయంతో కూడిన నియమాల సముదాయంగా పేర్కొన్నాడు. పౌరన్యాయం కంటే సమత అనేది ఉన్నతమైనది. సమదృక్పథం, సహజన్యాయం లాంటి సూత్రాల ఆధారంగా పాత చట్టాల స్థానంలో కొత్త చట్టాలను రూపొందించే సాంప్రదాయకమైన పద్ధతికి సమత సంకేతంగా ఉంటుంది.

6) శాసనసభ (Legislature) : ప్రజాస్వామ్యంలో శాసన నిర్మాణశాఖ చట్టం ఆధారాలలో ముఖ్యమైనదిగా భావిస్తారు. ప్రభుత్వ సంస్థలలో ఒకటైన శాసనసభ, చట్టాలను ఆమోదిస్తుంది. అందుచేత శాసననిర్మాణ శాఖను చట్టం ఆధారాలలో ప్రత్యక్షమైన అంశంగా గుర్తించడమైంది. ఆధునిక కాలంలో చట్టాల రూపకల్పనలో శాసనసభలు ప్రముఖమైనవిగా భావించడమైంది. చట్ట నిర్మాణంలో శాసనసభలు సాధారణ ప్రజానీకం ఆకాంక్షలకు ప్రతీకగా ఉంటాయి. | శాసనసభలోని అధికార, ప్రతిపక్షాలు రెండూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వ్యవహరిస్తాయి.

ప్రశ్న 3.
మేకైవర్ పేర్కొన్న చట్టాల వర్గీకరణను వివరించండి.
జవాబు:
అర్థం : శాసనాన్ని ఆంగ్లంలో ‘లా’ అంటారు. ‘లాగ్’ అనే ట్యూటానిక్ పదం నుండి ‘లా’ అనే మాట వచ్చింది. ‘లాగ్’ అంటే ‘సమమైన’ లేదా ‘స్థిరమైన’ అని అర్థం. శాసనాలు స్థిరమైన నిబంధనలు.

నిర్వచనాలు :

  1. “సార్వభౌముడి ఆదేశమే చట్టం. ప్రజలందరూ సార్వభౌముడికి విధేయులుగా ఉండేందుకు చట్టం కొన్ని ఉమ్మడి నియమాలను రూపొందిస్తుంది” అని జాన్ ఎరిస్కిన్ పేర్కొన్నాడు.
  2. “రాజకీయాధికారాన్ని పొందిన సార్వభౌముడిచే అమలు చేసే బాహ్య చర్యలకు సంబంధించిన సాధారణ నియమమే చట్టం” అని టి. ఇ. హాలండ్ పేర్కొన్నాడు.
  3. న్యాయపాలనలో రాజ్యం ఉపయోగించే సూత్ర సముదాయమే చట్టం” అని జాన్ సాల్మండ్ పేర్కొన్నాడు.

చట్టం వర్గీకరణ : చట్టం వర్గీకరణ గురించి అనేకమంది రాజనీతి తత్త్వవేత్తలు భిన్నమైన ప్రతిపాదనలను చేశారు. అటువంటి వారిలో మేకైవర్ ప్రతిపాదించిన చట్ట వర్గీకరణ ప్రముఖమైనదిగా పరిగణించవచ్చు.

మేకైవర్ ప్రకారం చట్టం ప్రధానంగా రెండు రకాలుగా ఉంటుంది. అవి : 1) సహజ చట్టం (Natural Law), 2) సహేతుక చట్టం (Positive Law).

సహేతుక చట్టాన్ని (Positive Law), జాతీయ చట్టం (National Law), అంతర్జాతీయ చట్టం (International Law) అని రెండు రకాలుగా వర్గీకరించారు.

AP Inter 1st Year Civics Study Material Chapter 4 చట్టం

జాతీయ చట్టాన్ని (National Law), మరల రెండు రకాలుగా వర్గీకరించారు. అవి : రాజ్యాంగ చట్టం (Constitutional Law), సాధారణ చట్టం (Ordinary Law).

సాధారణ చట్టం (Ordinary Law), అనేది పబ్లిక్ చట్టం (Public Law), ప్రైవేట్ చట్టం (Private Law) అని రెండు రకాలుగా విభజించారు.

పబ్లిక్ చట్టాన్ని (Public Law), పరిపాలన చట్టం (Administrative Law), సార్వత్రిక చట్టం (General Law) అని తిరిగి రెండు రకాలుగా వర్గీకరించబడింది.

సార్వత్రిక చట్టాన్ని (General Law), శాసనాత్మక చట్టం (Statutory Law), ఉమ్మడి చట్టం (Common Law) అని రెండు రకాలుగా విభజించారు. పైన పేర్కొన్న వివిధ రకాల చట్టాలను కింది విధంగా వివరించవచ్చు.

1) సహజ చట్టం (Natural Law) : సహజచట్టాన్ని దైవిక న్యాయంగా కూడ వ్యవహరిస్తారు. సహజచట్టం అనేది ఏ ఒక్కరిచేత రూపొందినది కాదు. అది భౌతికశక్తి ఆధారంగా ప్రకృతిచేత ప్రసాదితమైనది. మానవ స్వభావాన్ని విశ్లేషించేందుకు హేతువును వినియోగించడాన్ని సహజ చట్టంగా పేర్కొనవచ్చు. భగవంతుని స్వహస్తాలతో మానవుల హృదయాలలో లిఖించబడినదే సహజ చట్టంగా కొందరు వర్ణించారు.

2) సహేతుక చట్టం (Positive Law) : మానవ సంస్థలచే రూపొందించబడేదే సహేతుక చట్టం. ఈ చట్టాన్ని రాజకీయ చట్టం అని కొందరు పేర్కొన్నారు. వర్తమాన, సామాజిక, రాజకీయ పరిస్థితుల ఆధారంగా ఈ చట్టం నిర్మితమైంది. సార్వభౌమత్వ రాజకీయ అధికారి ఈ చట్టానికి అనుమతిస్తాడు. ఈ చట్టాన్ని అతిక్రమించినవారు శిక్షకు గురి అవుతారు. ఈ చట్టాన్ని తిరిగి జాతీయ చట్టమని, అంతర్జాతీయ చట్టమని రెండు రకాలుగా పేర్కొన్నారు.

జాతీయ చట్టాన్ని మున్సిపల్ చట్టం లేదా రాజ్యచట్టం అని కూడ వ్యవహరిస్తారు.

జాతీయ చట్టం, రాజ్య భౌగోళిక ప్రదేశానికి పరిమితమవుతుంది. సార్వభౌమాధికారి ద్వారా అది అమలులోకి వస్తుంది. రాజ్యంలోని ప్రజలందరికీ వర్తిస్తుంది. ఇక అంతర్జాతీయ చట్టమనేది వివిధ రాజ్యాల మధ్య సౌహార్ధ సంబంధాలను నెలకొల్పి, నియంత్రణ చేసేందుకు ఉద్దేశించింది. అయితే ఈ రకమైన చట్టానికి వ్యక్తులను శిక్షించే అధికారం ఉండదు. ఐక్యరాజ్యసమితి ఆమోదించిన అంతర్జాతీయ చట్టాలు ఇందుకు ఉదాహరణలుగా పేర్కొనవచ్చు. అంతర్జాతీయ శాంతిభద్రతలను పెంపొందించేందుకై సభ్య రాజ్యాలచే పాటించబడే నియమనిబంధనల సముదాయమే అంతర్జాతీయ చట్టంగా పరిగణించవచ్చు.

జాతీయ చట్టాన్ని మరల రెండు రకాలుగా వర్గీకరించారు. అవి : 1) రాజ్యాంగ చట్టం 2) సాధారణ చట్టం. 3) రాజ్యాంగ చట్టం (Constitutional Law): రాజ్యాంగ చట్టమనేది సాధారణ చట్టం కంటే భిన్నంగా ఉంటుంది. రాజ్యంలో ఈ రకమైన చట్టం అత్యున్నతమైనది. ప్రభుత్వ నిర్మాణానికి ఇది వీలు కల్పిస్తుంది. ప్రభుత్వాంగాల మధ్య సంబంధాన్ని వివరిస్తుంది. ప్రభుత్వాంగాల అధికార పరిధిని నిర్ణయిస్తుంది. ఈ రకమైన చట్టం లిఖిత పూర్వకంగా ఉంటుంది. రాజ్యంలో నివసించే పౌరుల హక్కులు, బాధ్యతల గురించి వివరిస్తుంది. ప్రజాస్వామ్యంలో ఈ చట్టానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ఇది ప్రజాభీష్టానికి ప్రతీకగా ఉంటుంది.

4) సాధారణ చట్టం (Ordinary Law) : సాధారణ చట్టం అనేది రాజ్యాంగ చట్టానికి అనుగుణంగా ఉంటుంది. రాజ్యంలో నిర్దిష్ట అధికారాలు గల సంస్థచే రూపొందించబడి అమలవుతుంది. పౌరులకు సమాజం, ప్రభుత్వం, రాజ్యాలతో ఉండే సంబంధాలను అది వివరిస్తుంది. ఆచారాలు, సంప్రదాయాలు, మతం అనేవి ఈ రకమైన చట్టానికి ప్రాతిపదికగా ఉంటాయి. శాసనసభ అటువంటి చట్టాలను రూపొందించి, అవసరమైతే సవరణలు చేస్తుంది. సాధారణ చట్టాన్ని మరల పబ్లిక్ చట్టం, ప్రైవేట్ చట్టం అని రెండు రకాలుగా వర్గీకరించడమైంది.

5) పబ్లిక్ చట్టం (Public Law) : పబ్లిక్ చట్టం, రాజ్యం వ్యక్తుల మధ్య సంబంధాలను నియంత్రిస్తుంది. రాజ్యానికి సంబంధించిన మౌలిక నిర్మితి, విధులను పబ్లిక్ చట్టం వివరిస్తుంది. రాజ్యపు మితిమీరిన జోక్యానికి వ్యతిరేకంగా వ్యక్తులకు అవసరమైన హక్కులను అందిస్తుంది. పౌరులందరు ఈ చట్టాన్ని అనుసరించాల్సి ఉంటుంది. ఈ చట్టాన్ని అతిక్రమించడం శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తారు.

6) ప్రైవేట్ చట్టం (Private Law) : ప్రైవేట్ చట్టం వ్యక్తుల మధ్య సంబంధాలను నియంత్రిస్తుంది. సమాజంలో వ్యక్తుల ప్రవర్తనలను క్రమబద్దీకరిస్తుంది. వ్యక్తులందరూ తమ హక్కులను అనుభవించేందుకు తగిన హామీ ఇస్తుంది. ప్రైవేట్ చట్టాన్ని కొన్నిసార్లు సివిల్ చట్టంగా వ్యవహరిస్తారు. వ్యక్తుల మధ్య ఉత్పన్నమయ్యే వివాదాలు విచారణలో దేశంలోని వివిధ న్యాయస్థానాలు ప్రైవేట్ చట్టాన్ని పరిగణనలోకి తీసుకుంటాయి.

AP Inter 1st Year Civics Study Material Chapter 4 చట్టం

పబ్లిక్ చట్టాన్ని పరిపాలన చట్టం, సార్వత్రిక చట్టం అని రెండు రకాలుగా వర్గీకరించడమైంది.

7) పరిపాలక చట్టం (Administrative Law) : పరిపాలన నిర్విఘ్నంగానూ, ప్రశాంతంగానూ కొనసాగే విషయంలో చట్టం కీలకపాత్రను పోషిస్తుంది. ప్రజలకు ప్రభుత్వాధికారులకు మధ్య సంబంధాలను ఈ రకమైన చట్టం నియంత్రిస్తుంది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన సంస్కరణలను తీసుకురావడంలో ఇది దోహదపడుతుంది. పరిపాలక చట్టాలను అనుసరించడం ద్వారా ఈనాటి రాజ్యాలు అనేక దశలుగా శీఘ్రగతిన అభివృద్ధిని సాధించాయి. ప్రభుత్వ సిబ్బంది క్రమశిక్షణతో పనిచేసేటట్లు పరిపాలక చట్టం దోహదపడుతుంది.

8) సార్వత్రిక చట్టం (General Law) : రాజ్యం, సాధారణ పౌరుల మధ్య సంబంధాన్ని సార్వత్రిక చట్టం నిర్ణయిస్తుంది. ఈ చట్టం రాజ్యానికి – వ్యక్తులకు మధ్య ఉండే వ్యవహారాలకు సంబంధించినదై ఉంటుంది. వివాహం, విడాకులు, ఒప్పందాలు వంటి అనేక విషయాలకు సంబంధించిన వాటిని ఈ రకమైన చట్టాలకు ఉదాహరణగా పేర్కొనవచ్చు. సార్వత్రిక చట్టం తిరిగి శాసనాత్మక చట్టం, సామాన్య చట్టం అని రెండు రకాలుగా వర్గీకరించడమైంది.

9) శాసనాత్మక చట్టం (Statutory Law) : ఆధునిక చట్టంలోని అధిక భాగాన్ని శాసనాత్మక చట్టం అని పిలుస్తారు. దైనందిన పరిపాలన నిమిత్తమై రాజ్యంలోని శాసనసభ ఇటువంటి చట్టాన్ని రూపొందిస్తుంది. భారతదేశంలో పార్లమెంటు, అమెరికాలో కాంగ్రెసు, బ్రిటన్లో పార్లమెంటు ఈ రకమైన చట్టాన్ని రూపొందిస్తాయి.

10) సామాన్య చట్టం (Common Law) : సామాన్య చట్టాన్ని సంప్రదాయక చట్టంగా కొందరు వ్యవహరించారు. ప్రజానీకంలో బహుళవ్యాప్తి చెందిన ఆచార సంప్రదాయాల ఫలితమే సామాన్య చట్టం. ఈ రకమైన చట్టాన్ని న్యాయవ్యవస్థలో | భాగంగా న్యాయస్థానాలు తగిన గుర్తింపునిస్తాయి.

ప్రశ్న 4.
చట్టాన్ని నిర్వచించి, చట్టం – స్వేచ్ఛ మధ్య సంబంధాన్ని వర్ణించండి.
జవాబు:
నిర్వచనాలు :
1) “సార్వభౌముడి ఆదేశమే చట్టం. ప్రజలందరూ సార్వభౌముడికి విధేయులుగా ఉండేందుకు చట్టం కొన్ని ఉమ్మడి నియమాలను రూపొందిస్తుంది” అని జాన్ ఎరిస్కిన్ పేర్కొన్నాడు.

2) రాజకీయాధికారాన్ని పొందిన సార్వభౌముడిచే అమలుచేసే బాహ్య చర్యలకు సంబంధించిన సాధారణ నియమమే చట్టం” అని టి. ఇ. హాలండ్ పేర్కొన్నాడు.

చట్టం – స్వేచ్ఛ మధ్య సంబంధం (Relation between Law and Liberty) : రాజనీతి శాస్త్రంలో చట్టం, నైతికత అనేవి రెండు ప్రధాన భావనలు. రాజ్యం, ప్రభుత్వాలు పనిచేసేందుకు చట్టం ప్రాతిపదికగా ఉంటుంది. కొన్ని నియమ నిబంధనలను సూచించడం ద్వారా సమాజానికి స్థిరమైన పునాదిని చట్టం ఏర్పరుస్తుంది. చట్టం, స్వేచ్ఛ రెండూ పరస్పర ఆధారిత భావనలు. అయితే ఈ రెండు భావనల మధ్య ఉండే సంబంధం విషయంలో రాజనీతి శాస్త్రవేత్తల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. ఈ విషయంలో రాజనీతి శాస్త్రవేత్తలు రెండు విభిన్నమైన అభిప్రాయాలను వెల్లడించారు. వారిలో కొందరు ఈ రెండు భావనలు ఒకదానికొకటి పరస్పర విరుద్ధమైనవిగా పేర్కొన్నారు. మరి కొందరు ఈ రెండు భావనలు ఒకదానికొకటి సన్నిహిత సంబంధంగలవిగా భావించారు. ఈ రెండు భావనల గురించి కింది విధంగా వివరించవచ్చు.

1) చట్టం, స్వేచ్ఛ పరస్పరం విరుద్ధమైనవి (Law and Liberty are Antithetical) : చట్టం ఎల్లప్పుడు మానవుల కార్యకలాపాలపై నిర్బంధాలు విధిస్తుందని వ్యక్తి స్వేచ్ఛను సమర్థించేవారు భావిస్తారు. జె.ఎస్. మిల్, హెర్బర్ట్ స్పెన్సర్, ఆడమ్ స్మిత్, మార్షల్ వంటి వ్యక్తి స్వేచ్ఛావాదులు, ప్రౌధాన్, బకూనిస్, క్రొపోట్కిన్ వంటి అరాచకవాదుల ప్రకారం వ్యక్తి స్వేచ్ఛకు చట్టం ఆటంకాలను సృష్టిస్తుంది. వారి దృష్టిలో రాజ్యం వ్యక్తుల స్వేచ్ఛలకు భంగం కలిగించే ప్రధాన సాధనం. చట్టం అనేది ఎల్లప్పుడు వ్యక్తుల స్వేచ్ఛపై ఆంక్షలు విధిస్తుంది. రాజ్యం, ప్రభుత్వాలకు సంబంధించిన వ్యవహారాలలో వ్యక్తులు పాల్గొనేందుకు చట్టం అనుమతించదు. అలాగే రాజ్యానికి సంబంధించిన ఆర్థిక కార్యకలాపాల నిర్వహణలో చట్టం ఆటంకంగా పరిణమిస్తుంది. అయితే ఇటీవలి కాలంలో అనేక రాజ్యాలలో అమలులో ఉన్న సరళీకృత ఆర్థిక విధానాలు ఆ దేశాల ఆర్థిక వ్యవస్థలు శీఘ్రగతిన ప్రగతి దిశలో పయనించేందుకు అనుకూలంగా ఉన్నాయని చెప్పవచ్చు. ఈ విధానాలు ఆర్థిక వ్యవహారాలలో ప్రజలు స్వేచ్ఛగా పాల్గొనేందుకు వీలు కల్పించాయి. అవి జాతీయ, అంతర్జాతీయ మార్కెట్ల మధ్య ఏ విధమైన కఠినమైన ఆర్థిక చట్టాలతో ప్రమేయం లేకుండా పోటీకి అవకాశం ఏర్పరచాయి. రాజ్యమనేది ‘ఒక అవసరమైన చెడు’ (State is a necessary evil) గా వ్యక్తి స్వేచ్ఛావాదులు విశ్వసించారు. ఏ ప్రభుత్వమైతే అతి తక్కువగా పాలనగావిస్తుందో అదియే ఉత్తమమైన ప్రభుత్వంగా వారు వివరించారు. చట్టం వ్యక్తుల కార్యకలాపాలపై కొన్ని ఆంక్షలు విధిస్తుందని వారు పేర్కొన్నారు. అటువంటి ఆంక్షలు లేనప్పుడే వ్యక్తులు స్వీయవ్యక్తిత్వ వికాసానికి కృషి చేయగలుగుతారు. కాబట్టి చట్టం, స్వేచ్ఛ, ఒకదానికొకటి పరస్పరం విరుద్ధమైనవి.

AP Inter 1st Year Civics Study Material Chapter 4 చట్టం

2) చట్టం, స్వేచ్ఛ పరస్పర పోషకాలు (Law and Liberty are Complimentary) : సామ్యవాదులు, కమ్యూనిస్టుల ప్రకారం చట్టం, స్వేచ్ఛ ఒకదానికొకటి పరస్పర పోషకాలు. వారి దృష్టిలో రాజ్యం అనేది ఒక సంక్షేమ సంస్థ. రాజ్యం తన చట్టబద్ధమైన యంత్రాంగం ద్వారా మెరుగైన, న్యాయంతో కూడిన సామాజిక వ్యవస్థను సాధించవచ్చు. సామాజిక సంక్షేమానికి అవసరమైన ఆంక్షలను చట్టం విధిస్తుంది. పెట్టుబడిదారీవర్గం కార్మికవర్గాన్ని దోపిడీకి గురి చేస్తుందనే విషయం వాస్తవం. అటువంటి నేపథ్యంలో రాజ్యం దోపిడికి సంబంధించిన వర్గాలపై ఆంక్షలు విధించగలుగుతుంది. స్వేచ్ఛ అనేది అపరిమితమైనది కాదు. హక్కులను అనుభవించే రాజ్యం ప్రజలపై కొన్ని అవసరమైన ఆంక్షలను విధించేందుకు అధికారం కలిగి ఉంటుంది. ఈ సందర్భంలో లాస్కి కింది విధంగా పేర్కొన్నాడు. “మానవులు సామూహిక నాగరిక జీవనాన్ని గడిపేందుకు అవసరమైన ప్రవర్తనా నియమావళిని రూపొందించే విషయంలో చట్టం స్వేచ్ఛతో సన్నిహిత సంబంధం కలిగి ఉంటుంది. “రాజ్యాన్ని ఒక నైతిక సంస్థగా ఆదర్శవాదులు విశ్వసించారు. రాజ్యం సమాజంలోని జనేచ్ఛకు ప్రతీకగా ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ చట్టాలను విధిగా పాటించవలసి ఉంటుంది. వ్యక్తులు రాజ్యానికి, చట్టాలకు విధేయత చూపడం ద్వారా స్వేచ్ఛగా జీవించగలుగుతారు. చట్టం, స్వేచ్ఛల మధ్య సంబంధం గురించి ఫాసిస్టులు ఆచరణాత్మకమైన సంబంధాన్ని వెల్లడించారు. రాజ్యానికి వ్యతిరేకంగానూ, విరుద్ధంగానూ ఏదీ ఉండదన్న నినాదాన్ని ముస్సోలిని ఈ సందర్భంగా ఇవ్వడమైంది. రాజ్యం ఎల్లప్పుడూ ప్రజా ప్రయోజనాలను పరిరక్షిస్తుంది కాబట్టి చట్టం, స్వేచ్ఛ అనే రెండు భావనలు పరస్పర పోషకాలని చెప్పవచ్చు.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
చట్టాన్ని నిర్వచించి, చట్టం లక్షణాలను పేర్కొనండి.
జవాబు:
పరిచయం : రాజనీతిశాస్త్ర అధ్యయనంలో చట్టం అనేది ఒక ముఖ్యమైన భావన.

రాజ్యం శాసనాల ద్వారా ప్రజలను పరిపాలిస్తుంది. శాసనాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. రాజ్య సార్వ భౌమాధికారం శాసనాల ద్వారా వ్యక్తమవుతుంది. రాజ్యం ఆశించే సాంఘిక, ఆర్థిక, రాజకీయ మార్పులు శాసనం ద్వారానే సాధించగలవు. మానవుని బాహ్య ప్రవర్తనను క్రమబద్ధం చేసే నియమాలే శాసనాలు. వ్యక్తులు రాజ్యంలో చేయవలసినవి, చేయకూడనివి శాసనం చెబుతుంది. ప్రభుత్వంలోని శాసనశాఖ శాసనాలు చేస్తుంది.

అర్థం : శాసనాన్ని ఆంగ్లంలో ‘లా’ అంటారు. ‘లాగ్’ అనే ట్యూటానిక్ పదం నుండి ‘లా’ అనే మాట వచ్చింది. ‘లాగ్’ అంటే ‘సమమైన’ లేదా ‘స్థిరమైన’ అని అర్థం. శాసనాలు స్థిరమైన నిబంధనలు.

నిర్వచనాలు :
1) “సార్వభౌముడి ఆదేశమే చట్టం. ప్రజలందరూ సార్వభౌముడికి విధేయులుగా ఉండేందుకు చట్టం కొన్ని ఉమ్మడి నియమాలను రూపొందిస్తుంది” అని జాన్ ఎరిస్కిన్ పేర్కొన్నాడు.

2) “రాజకీయాధికారాన్ని పొందిన సార్వభౌముడిచే అమలు చేసే బాహ్య చర్యలకు సంబంధించిన సాధారణ నియమమే చట్టం” అని టి.ఇ. హాలండ్ పేర్కొన్నాడు.

3) న్యాయపాలనలో రాజ్యం ఉపయోగించే సూత్ర సముదాయమే చట్టం” అని జాన్ సాల్మండ్ పేర్కొన్నాడు.

శాసనానికి ఆధారాలు : హాలెండ్ అనే రచయిత సంప్రదాయాలు, మతము, ధర్మబద్ధత (సమత), న్యాయమూర్తుల తీర్పులు, శాస్త్రీయ వ్యాఖ్యానాలు, శాసనశాఖ అనేవి శాసనాలకు ఆధారాలని చెప్పాడు. శాసనాలు వివిధ రంగాలలో క్రమంగా రూపొందుతాయి. అనేక అంశాల ప్రభావం వాటిపై ఉంటుంది. రాజనీతి శాస్త్రజ్ఞులు చెప్పిన శాసనాల ఆధారాలు ఈ క్రింది విధంగా చెప్పవచ్చు.

AP Inter 1st Year Civics Study Material Chapter 4 చట్టం

చట్టం ముఖ్య లక్షణాలు (Features of Law) : చట్టానికి కింద పేర్కొన్న లక్షణాలు ఉన్నాయి.

  1. సార్వభౌముడు ఆమోదించిన నియమ నిబంధనల సముధాయమే చట్టం.
  2. చట్టాన్ని రాజ్యం అమలుపరుస్తుంది. రాజ్యం అనుమతి పొందడంతో చట్టాన్ని యోగ్యమైందిగా పరిగణించవచ్చు.
  3. చట్టం నిర్దిష్టమైనది, ఖచ్చితమైనది, విశ్వవ్యాప్తమైనది.
  4. చట్టం ప్రజల అభీష్టాన్ని ప్రతిబింబిస్తుంది.
  5. చట్టం ఉల్లంఘన శిక్షకు దారితీస్తుంది.
  6. చట్టాలు నిర్బంధమైన, శిక్షాత్మక స్వభావాన్ని కలిగి ఉంటాయి.
  7. చట్టం వైయుక్తిక, సాధారణ సంక్షేమాన్ని సంరక్షించే ఉద్దేశ్యాన్ని కలిగి ఉంటుంది.
  8. చట్టం ప్రజల అవసరాల మేరకు మార్చబడుతుంది.

ప్రశ్న 2.
వివిధ రకాల చట్టాలను తెలపండి.
జవాబు:
చట్టం వర్గీకరణ : చట్టం వర్గీకరణ గురించి అనేకమంది రాజనీతి తత్త్వవేత్తలు భిన్నమైన ప్రతిపాదనలను చేశారు. అటువంటి వారిలో మేకైవర్ ప్రతిపాదించిన చట్ట వర్గీకరణ ప్రముఖమైనదిగా పరిగణించవచ్చు.

మేకైవర్ ప్రకారం చట్టం ప్రధానంగా రెండు రకాలుగా ఉంటుంది. అవి : 1) సహజ చట్టం (Natural Law), 2) సహేతుక చట్టం (Positive Law).

సహేతుక చట్టాన్ని (Positive Law), జాతీయ చట్టం (National Law), అంతర్జాతీయ చట్టం (International Law) అని రెండు రకాలుగా వర్గీకరించారు.

జాతీయ చట్టాన్ని (National Law), మరల రెండు రకాలుగా వర్గీకరించారు. అవి : రాజ్యాంగ చట్టం (Constitutional Law), సాధారణ చట్టం (Ordinary Law).

సాధారణ చట్టం (Ordinary Law), అనేది పబ్లిక్ చట్టం (Public Law), ప్రైవేట్ చట్టం (Private Law) అని రెండు రకాలుగా విభజించారు.

పబ్లిక్ చట్టాన్ని (Public Law), పరిపాలన చట్టం (Administrative Law), సార్వత్రిక చట్టం (General Law) అని తిరిగి రెండు రకాలుగా వర్గీకరించబడింది.

సార్వత్రిక చట్టాన్ని (General Law), శాసనాత్మక చట్టం (Statutory Law), ఉమ్మడి చట్టం (Common Law) అని రెండు రకాలుగా విభజించారు. పైన పేర్కొన్న వివిధ రకాల చట్టాలను కింది విధంగా వివరించవచ్చు.

1) సహజ చట్టం (Natural Law) : సహజచట్టాన్ని దైవిక న్యాయంగా కూడ వ్యవహరిస్తారు. సహజచట్టం అనేది ఏ ఒక్కరిచేత రూపొందినది కాదు. అది భౌతికశక్తి ఆధారంగా ప్రకృతిచేత ప్రసాదితమైనది. మానవ స్వభావాన్ని విశ్లేషించేందుకు హేతువును వినియోగించడాన్ని సహజ చట్టంగా పేర్కొనవచ్చు. భగవంతుని స్వహస్తాలతో మానవుల హృదయాలలో లిఖించబడినదే సహజ చట్టంగా కొందరు వర్ణించారు.

2) సహేతుక చట్టం (Positive Law) : మానవ సంస్థలచే రూపొందించబడేదే సహేతుక చట్టం. ఈ చట్టాన్ని రాజకీయ చట్టం అని కొందరు పేర్కొన్నారు. వర్తమాన, సామాజిక, రాజకీయ పరిస్థితుల ఆధారంగా ఈ చట్టం నిర్మితమైంది. సార్వభౌమత్వ రాజకీయ అధికారి ఈ చట్టానికి అనుమతిస్తాడు. ఈ చట్టాన్ని అతిక్రమించినవారు శిక్షకు గురి అవుతారు. ఈ చట్టాన్ని తిరిగి జాతీయ చట్టమని, అంతర్జాతీయ చట్టమని రెండు రకాలుగా పేర్కొన్నారు.

జాతీయ చట్టాన్ని మున్సిపల్ చట్టం లేదా రాజ్య చట్టం అని కూడ వ్యవహరిస్తారు.

జాతీయ చట్టం, రాజ్య భౌగోళిక ప్రదేశానికి పరిమితమవుతుంది. సార్వభౌమాధికారి ద్వారా అది అమలులోకి వస్తుంది. రాజ్యంలోని ప్రజలందరికీ వర్తిస్తుంది. ఇక అంతర్జాతీయ చట్టమనేది వివిధ రాజ్యాల మధ్య సౌహార్ధ సంబంధాలను నెలకొల్పి, నియంత్రణ చేసేందుకు ఉద్దేశించింది. అయితే ఈ రకమైన చట్టానికి వ్యక్తులను శిక్షించే అధికారం ఉండదు. ఐక్యరాజ్యసమితి ఆమోదించిన అంతర్జాతీయ చట్టాలు ఇందుకు ఉదాహరణలుగా పేర్కొనవచ్చు. అంతర్జాతీయ శాంతిభద్రతలను పెంపొందించేందుకై సభ్య రాజ్యాలచే పాటించబడే నియమనిబంధనల సముదాయమే అంతర్జాతీయ చట్టంగా పరిగణించవచ్చు.

AP Inter 1st Year Civics Study Material Chapter 4 చట్టం

ప్రశ్న 3.
చట్టానికి గల మూడు ఆధారాలను రాయండి. [Mar. ’18, ’17]
జవాబు:
1) ఆచార, సంప్రదాయాలు, వాడుకలు (Customs) : ఇవి శాసనానికి తొలి ఆధారాలు. ప్రజల ఆచారాలు, వాడుకలు, సంప్రదాయాలు శాసనాలకు మూలాధారము. సంప్రదాయాలు సంఘంలో ఒక అలవాటుగా, క్రమంగా రూపొందుతాయి. పూర్వం సంప్రదాయాలే సమాజ జీవితాన్ని క్రమబద్ధం చేసేవి. రాజ్యం వీటిని గుర్తించి, వాటిని ఆధారం చేసుకొని కొన్ని శాసనాలను రూపొందిస్తుంది. రాజకీయ ఆచారాలు కూడా రాజ్యంచే గుర్తించబడి అమలు చేయబడితే అవి శాసనాలవుతాయి. బ్రిటన్లో ‘సామాన్య న్యాయం’ సంప్రదాయబద్ధమైన శాసనానికి ఉదాహరణ. అదే విధంగా భారతదేశంలో వివాహ చట్టాలు, ఆస్తి పంపిణీ చట్టాలు మొదలగునవి సంప్రదాయాలు ఆధారంగా చేయబడ్డాయి.

2) మతం (Religion) : ఆచారానికి మతం సమాజాన్ని విపరీతంగా ప్రభావితం చేసే వ్యవస్థ. సంఘ జీవితం మత నియమాలకు అనుగుణంగా జరుపుకుంటారు. పూర్వం మతాధిపతులు చెప్పే నియమాలు శాసనాల వలె చెలామణి అయ్యేవి. ఆధునిక కాలంలో కూడా శాసనాలు చేయడానికి మతం ఒక ఆధారం. వారసత్వం, వివాహం, కుటుంబ ఆస్తి మొదలైన వాటి శాసనాలు మతం ఆధారంగా చేయబడ్డాయి. హిందువులు, క్రైస్తవులు, ముస్లిములకు గల శాసనాలు వారి మతాలు ఆధారంగా రూపొందాయి. ఇరాన్, పాకిస్థాన్ వంటి మత ప్రమేయ దేశాలలో సంఘ జీవనానికి మత నియమాలే ఆధారం.

3) న్యాయస్థానాల తీర్పులు (Judicial Decisions) న్యాయస్థానాలలో న్యాయమూర్తులు ఇచ్చే తీర్పులు శాసన నిర్మాణానికి ఆధారాలు. న్యాయస్థానాలు చట్టాలను వ్యాఖ్యానిస్తాయి. ఈ విధి నిర్వహణలో న్యాయమూర్తులు తీర్పులిచ్చేటప్పుడు క్రొత్త న్యాయ సూత్రాలను సృష్టిస్తారు. ఈ తీర్పులు అదే విధమైన వివాదాలు తలెత్తినప్పుడు న్యాయసూత్రల వలె వర్తింపచేస్తారు. నేడు న్యాయమూర్తుల నిర్ణయాలు శాసనాలలో అంతర్భాగమవుతున్నాయి. ఉదా : భారతదేశంలో సుప్రీంకోర్టు తీర్పులిచ్చిన గోలక్నాథ్ కేసు, కేశవానంద భారతి కేసు, మినర్వామిల్స్ కేసు.

4) శాస్త్రీయ వ్యాఖ్యానాలు (Scientific commentories) : ప్రముఖ న్యాయశాస్త్ర కోవిదులు, రచయితలు, విమర్శకులు చేసే వ్యాఖ్యానాలు శాసన నిర్మాణానికి ఆధారమవుతాయి. ఇవి న్యాయస్థానాలలో న్యాయమూర్తుల వ్యాఖ్యానాలు, వివరణలు, శాసనాలు చేయటానికి ప్రభుత్వానికి ఉపయోగిస్తాయి. న్యాయమూర్తుల నిర్ణయాలు, తీర్పులు, భవిష్యత్లో శాసన నిర్మాణానికి తోడ్పడతాయి. ఇంగ్లండ్లో కోక్, బ్లాక్టన్, అమెరికాలో స్టోరీ, కెంట్, భారతదేశంలో విజ్ఞానేశ్వర, అపరార్క వంటి వారి వ్యాఖ్యానాలు శాసన నిర్మాణానికి ఆధారాలు.

ప్రశ్న 4.
చట్టం, నైతికత మధ్య వ్యత్యాసాలను తెలపండి.
జవాబు:
చట్టం, నైతికతల మధ్య వ్యత్యాసాలను క్రింది విధంగా పేర్కొనవచ్చు.
చట్టం (Law)

  1. చట్టం వ్యక్తుల బాహ్య ప్రవర్తనకు సంబంధించినది.
  2. చట్టం రాజ్యానికి సంబంధించినది.
  3. చట్టం రాజ్యాధికారపు నిర్భంధిత శక్తిచే ముడిపడి ఉంటుంది.
  4. చట్టం నిర్దిష్టమైంది, ఖచ్చితమైంది.
  5. రాజ్య భూభాగంలో మాత్రమే చట్టం వర్తిస్తుంది.
  6. చట్టాన్ని ఒక నిర్దిష్ట లక్ష్యంతో రూపొందించడం అవుతుంది.
  7. సార్వభౌమాధికారి చట్టానికి అనుమతి ఇస్తాడు.
  8. చట్టం అనేది రాజనీతిశాస్త్ర విషయ పరిధిలోకి వస్తుంది.
  9. చట్ట అతిక్రమణ శిక్షకు దారితీస్తుంది.
  10. చట్టాన్ని రూపొందించి అమలులో ఉంచేందుకు యంత్రాంగం ఉంటుంది.

AP Inter 1st Year Civics Study Material Chapter 4 చట్టం

నైతికత (Morality)

  1. నైతికత అనేది వ్యక్తుల మొత్తం జీవనానికి సంబంధించినది.
  2. నైతికత వ్యక్తి అంతరాత్మకు సంబంధించినది.
  3. నైతికతకు ప్రజాభిప్రాయం, వ్యక్తుల అంతరాత్మలు ఆలంబనగా ఉంటాయి.
  4. నైతికత అస్పష్టమైంది, అనిశ్చితమైంది.
  5. నైతిక సూత్రాలు విశ్వ వ్యాప్తమైన స్వభావాన్ని కలిగి ఉంటాయి.
  6. నైతిక సూత్రాలు సమాజంలో అంతర్లీనంగా ఉంటాయి.
  7. సమాజం నైతిక సూత్రాలను ఆమోదిస్తుంది.
  8. నైతిక సూత్రాలనేవి నీతిశాస్త్రం పరిధిలోకి వస్తాయి.
  9. నైతిక సూత్రాల అతిక్రమణ ఎటువంటి శిక్షకు దారితీయదు.
  10. నైతిక సూత్రాల అమలుకు ఎటువంటి ప్రత్యేక రాజ్య యంత్రాంగం ఉండదు.

ప్రశ్న 5.
“చట్టం, స్వేచ్ఛ పరస్పర విరుద్ధాలు” విశ్లేషించండి.
జవాబు:
చట్టం, స్వేచ్ఛ పరస్పరం విరుద్ధమైనవి (Law and Liberty are Antithetical) : చట్టం ఎల్లప్పుడు మానవుల కార్యకలాపాలపై నిర్బంధాలు విధిస్తుందని వ్యక్తి స్వేచ్ఛను సమర్థించేవారు భావిస్తారు. జె.ఎస్. మిల్, హెర్బర్ట్ స్పెన్సర్, ఆడమ్ స్మిత్, మార్షల్ వంటి వ్యక్తి స్వేచ్ఛావాదులు, ప్రాధాన్, బకూనిన్, క్రొపోట్కిన్ వంటి అరాచకవాదుల ప్రకారం వ్యక్తి స్వేచ్ఛకు చట్టం ఆటంకాలను సృష్టిస్తుంది. వారి దృష్టిలో రాజ్యం వ్యక్తుల స్వేచ్ఛలకు భంగం కలిగించే ప్రధాన సాధనం. చట్టం అనేది ఎల్లప్పుడు వ్యక్తుల స్వేచ్ఛపై ఆంక్షలు విధిస్తుంది. రాజ్యం, ప్రభుత్వాలకు సంబంధించిన వ్యవహారాలలో వ్యక్తులు పాల్గొనేందుకు చట్టం అనుమతించదు. అలాగే రాజ్యానికి సంబంధించిన ఆర్థిక కార్యకలాపాల నిర్వహణలో చట్టం ఆటంకంగా పరిణమిస్తుంది. అయితే ఇటీవలి కాలంలో అనేక రాజ్యాలలో ‘అమలులో ఉన్న సరళీకృత ఆర్థిక విధానాలు ఆ దేశాల ఆర్థిక వ్యవస్థలు శీఘ్రగతిన ప్రగతి దిశలో పయనించేందుకు అనుకూలంగా ఉన్నాయని చెప్పవచ్చు. ఈ విధానాలు ఆర్థిక వ్యవహారాలలో ప్రజలు స్వేచ్ఛగా పాల్గొనేందుకు వీలు కల్పించాయి. అవి జాతీయ, అంతర్జాతీయ మార్కెట్ల మధ్య ఏ విధమైన కఠినమైన ఆర్థిక చట్టాలతో ప్రమేయం లేకుండా పోటీకి అవకాశం ఏర్పరచాయి. రాజ్యమనేది ‘ఒక అవసరమైన చెడు’ (State is a necessary evil) గా వ్యక్తి స్వేచ్ఛావాదులు విశ్వసించారు. ఏ ప్రభుత్వమైతే అతి తక్కువగా పాలనగావిస్తుందో అదియే ఉత్తమమైన ప్రభుత్వంగా వారు వివరించారు. చట్టం వ్యక్తుల కార్యకలాపాలపై కొన్ని ఆంక్షలు విధిస్తుందని వారు పేర్కొన్నారు. అటువంటి ఆంక్షలు లేనప్పుడే వ్యక్తులు స్వీయ ‘ వ్యక్తిత్వ వికాసానికి కృషి చేయగలుగుతారు. కాబట్టి చట్టం, స్వేచ్ఛ, ఒకదానికొకటి పరస్పరం విరుద్ధమైనవి.

ప్రశ్న 6.
చట్టం, స్వేచ్ఛ ఏ విధంగా పరస్పర పోషకాలో వివరించండి.
జవాబు:
చట్టం, స్వేచ్ఛ పరస్పర పోషకాలు (Law and Liberty are Complimentary) : సామ్యవాదులు, కమ్యూనిస్టుల ప్రకారం చట్టం, స్వేచ్ఛ ఒకదానికొకటి పరస్పర పోషకాలు. వారి దృష్టిలో రాజ్యం అనేది ఒక సంక్షేమ సంస్థ. రాజ్యం తన చట్టబద్దమైన యంత్రాంగం ద్వారా మెరుగైన, న్యాయంతో కూడిన సామాజిక వ్యవస్థను సాధించవచ్చు.
సామాజిక సంక్షేమానికి అవసరమైన ఆంక్షలను చట్టం విధిస్తుంది. పెట్టుబడిదారీవర్గం కార్మికవర్గాన్ని దోపిడీకి గురి చేస్తుందనే విషయం వాస్తవం. అటువంటి నేపథ్యంలో రాజ్యం దోపిడికి సంబంధించిన వర్గాలపై ఆంక్షలు విధించగలుగుతుంది. స్వేచ్ఛ అనేది అపరిమితమైనది కాదు. హక్కులను అనుభవించే రాజ్యం ప్రజలపై కొన్ని అవసరమైన ఆంక్షలను విధించేందుకు అధికారం కలిగి ఉంటుంది. ఈ సందర్భంలో లాస్కి కింది విధంగా పేర్కొన్నాడు. “మానవులు సామూహిక నాగరిక జీవనాన్ని గడిపేందుకు అవసరమైన ప్రవర్తనా నియమావళిని రూపొందించే విషయంలో చట్టం స్వేచ్ఛతో సన్నిహిత సంబంధం కలిగి ఉంటుంది. “రాజ్యాన్ని ఒక నైతిక సంస్థగా ఆదర్శవాదులు విశ్వసించారు. రాజ్యం సమాజంలోని జనేచ్ఛకు ప్రతీకగా ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ చట్టాలను విధిగా పాటించవలసి ఉంటుంది. వ్యక్తులు రాజ్యానికి, చట్టాలకు విధేయత చూపడం ద్వారా స్వేచ్ఛగా జీవించగలుగుతారు. చట్టం, స్వేచ్ఛల మధ్య సంబంధం గురించి ఫాసిస్టులు ఆచరణాత్మకమైన సంబంధాన్ని వెల్లడించారు. రాజ్యానికి వ్యతిరేకంగానూ, విరుద్ధంగానూ ఏదీ ఉండదన్న నినాదాన్ని ముస్సోలిని ఈ సందర్భంగా ఇవ్వడమైంది. రాజ్యం ఎల్లప్పుడూ ప్రజా ప్రయోజనాలను పరిరక్షిస్తుంది కాబట్టి చట్టం, స్వేచ్ఛ అనే రెండు భావనలు పరస్పర పోషకాలని చెప్పవచ్చు.

AP Inter 1st Year Civics Study Material Chapter 4 చట్టం

ప్రశ్న 7.
చట్టం, నైతికతల మధ్య ఎటువంటి సంబంధం ఉంది ?
జవాబు:
చట్టం – నైతికత అనేవి సామాజిక సంస్థలకు ప్రధాన మూలాధారాలుగా పరిగణించవచ్చు. సమాజంలో శాంతి భద్రతల నిర్వహణలోనూ, ప్రగతి సాధనలోనూ ఈ రెండు అంశాలు ఎంతో కీలకపాత్రను పోషిస్తాయి. ఈ రెండు అంశాలు వేర్వేరు దృక్పథాలను కలిగి ఉన్నప్పటికీ ఒకే లక్ష్యాన్ని కలిగి ఉన్నాయి. అవి ఒకదానికొకటి పరస్పర సంబంధం కలిగి ఉంటూ పరస్పర ఆధారితాలుగా ఉంటాయి. కొందరు రాజనీతి తత్త్వవేత్తలు ఈ రెండింటినీ ఒకటిగా పరిగణించారు. ఈ సందర్భంలో ఆర్.జి.గెటిల్ కింది విధంగా ప్రకటించాడు. “చట్టం – నైతికత రెండూ ఒకే విధమైనవి. అవి రెండూ ప్రాచీన సామాజిక జీవనపు అలవాట్లు, అనుభవాల నుంచి ఉద్భవించాయి. ప్రాచీన సమాజంలో వ్యక్తుల నైతిక, సామాజిక వ్యవహారాలు అవిభాజ్యాలుగా ఉండేవి”. ఈ రెండింటి మధ్య కొన్ని నిర్దిష్టమైన వ్యత్యాసాలు ఉన్నప్పటికీ, శాసనం, నైతికత రెండూ ఉమ్మడి సంక్షేమాన్ని ఉద్దేశించి వాడుకలోకి వచ్చాయి.

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
చట్టం పదవృత్తాంతాన్ని వివరించండి.
జవాబు: ‘చట్టం’ అనే పదం టైటానిక్ భాష (జర్మన్) లోని ‘లాగ్’ అనే పదం నుండి గ్రహించబడింది. లాగ్ అనగా ‘స్థిరంగా ఉండటం’ అని అర్థం. పద అర్థాన్ని బట్టి సార్వభౌమత్వ రాజకీయ అధికారిచే ప్రతిపాదించబడి, అమల్లోకి వచ్చిన ప్రవర్తనా నియమావళియే చట్టం అని భావించవచ్చు. మరికొందరు రాజనీతిజ్ఞులు ‘చట్టం’ అనే పదం లాటిన్ భాషలోని ‘జస్’, ‘జంగేరి’ అనే రెండు పదాల నుండి గ్రహించబడిందని పేర్కొన్నారు. లాటిన్ భాషలోని ఈ రెండు పదాలకు ‘బంధం’ అనే అర్థం ఉంది.

ప్రశ్న 2.
చట్టానికి గల రెండు నిర్వచనాలను తెలపండి.
జవాబు:

  1. “రాజకీయాధికారాన్ని పొందిన సార్వభౌముడిచే అమలుచేసే బాహ్య చర్యలకు సంబంధించిన సాధారణ నియమమే చట్టం” అని టి. ఇ. హాలండ్ పేర్కొన్నాడు.
  2. “న్యాయపాలనలో రాజ్యం ఉపయోగించే సూత్ర సముదాయమే చట్టం” అని జాన్ సాల్మండ్ పేర్కొన్నాడు.

ప్రశ్న 3.
చట్టం లక్షణాలు ఏవీ ?
జవాబు:
చట్టం ఈ క్రింది ముఖ్య లక్షణాలను కలిగి ఉంటుంది.

  1. సార్వభౌముడు ఆమోదించిన నియమ నిబంధనల సముదాయమే చట్టం.
  2. చట్టం నిర్దిష్టమైనది, ఖచ్చితమైనది మరియు విశ్వవ్యాప్తమైనది.
  3. చట్టం ప్రజాభిప్రాయానికి అనుకూలంగా ఉంటుంది.
  4. చట్టం ఉల్లంఘన శిక్షకు దారితీస్తుంది.

AP Inter 1st Year Civics Study Material Chapter 4 చట్టం

ప్రశ్న 4.
సమన్యాయపాలన అంటే ఏమిటి ? [Mar. ’16, ’17 ]
జవాబు:
సమన్యాయపాలన అంటే చట్టం ఆధిక్యత అని అర్థం. సమన్యాయపాలన అమలులో ఉన్న దేశాలలో ప్రభుత్వాధికారాలు చట్టాల ద్వారా నిర్ణయించబడతాయి. ప్రభుత్వ చర్యలన్నింటికి చట్టసమ్మతి ఉండాలి. చట్టాన్ని ఉల్లంఘించినపుడు మాత్రమే వ్యక్తి శిక్షింపబడతాడు. ధనిక, పేద అనే విచక్షణ లేకుండా చట్టం అందరినీ సమానంగా చూస్తుంది. చట్ట ఆధిక్యత లేదా సమన్యాయ పాలన ఉండటం వలన వ్యక్తులకు స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలు లభిస్తాయి.

ప్రశ్న 5.
సహజ చట్టం అంటే ఏమిటి ?
జవాబు:
సహజ చట్టం (Natural Law) : సహజచట్టాన్ని దైవిక న్యాయంగా కూడ వ్యవహరిస్తారు. సహజచట్టం అనేది ఏ ఒక్కరిచేత రూపొందినది కాదు. అది భౌతికశక్తి ఆధారంగా ప్రకృతిచేత ప్రసాదితమైనది. మానవ స్వభావాన్ని విశ్లేషించేందుకు హేతువును వినియోగించడాన్ని సహజ చట్టంగా పేర్కొనవచ్చు. భగవంతుని స్వహస్తాలతో మానవుల హృదయాలలో లిఖించబడినదే సహజ చట్టంగా కొందరు వర్ణించారు.

ప్రశ్న 6.
పరిపాలక చట్టం అంటే ఏమిటో తెలపండి. (లేదా) పరిపాలక న్యాయం గురించి నీకేమి తెలియును ?
జవాబు:
పరిపాలక చట్టం (Administrative Law) : పరిపాలన నిర్విఘ్నంగానూ, ప్రశాంతంగానూ కొనసాగే విషయంలో చట్టం కీలకపాత్రను పోషిస్తుంది. ప్రజలకు ప్రభుత్వాధికారులకు మధ్య సంబంధాలను ఈ రకమైన చట్టం నియంత్రిస్తుంది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన సంస్కరణలను తీసుకురావడంలో ఇది దోహదపడుతుంది. పరిపాలక చట్టాలను అనుసరించడం ద్వారా ఈనాటి రాజ్యాలు అనేక దశలుగా శీఘ్రగతిన అభివృద్ధిని సాధించాయి. ప్రభుత్వ సిబ్బంది క్రమశిక్షణతో పనిచేసేటట్లు పరిపాలక చట్టం దోహదపడుతుంది.

ప్రశ్న 7.
చట్టానికి గల ఏ మూడు ఆధారాలనైనా రాయండి.
జవాబు:
చట్టానికి గల మూడు ఆధారాలు : i) ఆచారాలు ii) మతం iii) శాసనసభ.

ప్రశ్న 8.
రాజ్యాంగ చట్టం అంటే ఏమిటి ? [Mar. ’18]
జవాబు:
రాజ్యాంగ చట్టం (Constitutional Law): రాజ్యాంగ చట్టమనేది సాధారణ చట్టం కంటే భిన్నంగా ఉంటుంది. రాజ్యంలో ఈ రకమైన చట్టం అత్యున్నతమైనది. ప్రభుత్వ నిర్మాణానికి ఇది వీలు కల్పిస్తుంది. ప్రభుత్వాంగాల మధ్య సంబంధాన్ని వివరిస్తుంది. ప్రభుత్వాంగాల అధికార పరిధిని నిర్ణయిస్తుంది. ఈ రకమైన చట్టం లిఖిత పూర్వకంగా ఉంటుంది. రాజ్యంలో నివసించే పౌరుల హక్కులు, బాధ్యతల గురించి వివరిస్తుంది. ప్రజాస్వామ్యంలో ఈ చట్టానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ఇది ప్రజాభీష్టానికి ప్రతీకగా ఉంటుంది.

AP Inter 1st Year Civics Study Material Chapter 4 చట్టం

ప్రశ్న 9.
పబ్లిక్ చట్టాన్ని నిర్వచించండి.
జవాబు:
పబ్లిక్ చట్టం (Public Law) : పబ్లిక్ చట్టం, రాజ్యం వ్యక్తుల మధ్య సంబంధాలను నియంత్రిస్తుంది. రాజ్యానికి సంబంధించిన మౌలిక నిర్మితి, విధులను పబ్లిక్ చట్టం వివరిస్తుంది. రాజ్యపు మితిమీరిన జోక్యానికి వ్యతిరేకంగా వ్యక్తులకు అవసరమైన హక్కులను అందిస్తుంది. పౌరులందరు ఈ చట్టాన్ని అనుసరించాల్సి ఉంటుంది. ఈ చట్టాన్ని అతిక్రమించడం శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తారు.

ప్రశ్న 10.
జస్, జంగేరి పదవృత్తాంతాలను వివరించండి.
జవాబు:
కొంతమంది రాజనీతిజ్ఞుల ప్రకారం ‘చట్టం’ అనే పదం లాటిన్ భాషలోని ‘జస్’, ‘జంగేరి’ అనే రెండు పదాల నుండి ఉద్భవించింది. లాటిన్ భాషలో ఈ రెండు పదాలకు ‘బంధం’ అనే అర్థం ఉంది. సాధారణంగా చట్టం అనేది రాజకీయ సార్వభౌమాధికారిచే వ్యక్తుల బాహ్య ప్రవర్తనను నియంత్రించేందుకై రూపొందించబడిన నియమావళి అని పేర్కొనవచ్చు.

ప్రశ్న 11.
చట్టం అధ్యయనానికి గల దృక్పథాలు ఏవి ?
జవాబు:
చట్టం అధ్యయనానికి గల ప్రధాన దృక్పథాలు నాలుగు. అవి : 1) నైతిక దృక్పథం 2) రాజకీయ దృక్పథం 3) శాస్త్రీయ దృక్పథం 4) సాంఘిక లేదా సామాజిక దృక్పథం.

ప్రశ్న 12.
సమత అంటే ఏమిటో నిర్వచించండి. [Mar. ’16]
జవాబు:
‘సమత’ అనే పదానికి నిష్పక్షపాతం, న్యాయం లాంటి సూత్రాలను పర్యాయపదాలుగా వాడుతున్నారు. సమత అంటే సహజ న్యాయం. అమలులో ఉన్న చట్టాలు వివాదాల పరిష్కారానికి సహాయపడిన సందర్భాలలో న్యాయమూర్తులు తమ విజ్ఞత, విచక్షణతో వివాదాలను పరిష్కరిస్తారు. ఈ పరిష్కారాలే రాజ్యముచేత గుర్తించబడి చట్టాలుగా ప్రకటించబడతాయి.

ప్రశ్న 13.
శాస్త్రవేత్తల వ్యాఖ్యానాలు అంటే ఏవి ?
జవాబు:
శాస్త్రవేత్తల వ్యాఖ్యానాలు చట్టానికి మరొక ముఖ్యమైన ఆధారం. ప్రఖ్యాత న్యాయమూర్తులు, న్యాయవాదులు వెల్లడించే అభిప్రాయాలు ఎనలేని ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. న్యాయవేత్తలు తమ వ్యాఖ్యానాల ద్వారా చట్టంలోని దోషాలను గుర్తించి, వాటి నివారణకు కొన్ని సూచనలు చేస్తారు. కాలక్రమంలో ఈ సూచనలే చట్ట నిర్మాణానికి ప్రధాన ఆధారాలవుతాయి.

AP Inter 1st Year Civics Study Material Chapter 4 చట్టం

ప్రశ్న 14.
శాసన నిర్మాణ ప్రక్రియలో శాసనసభ పాత్ర ఏమిటి ?
జవాబు:
ప్రజాస్వామ్యంలో శాసనసభ శాసన నిర్మాణ ప్రక్రియలో ప్రధానపాత్ర పోషిస్తుంది. కావున శాసనసభను చట్టం యొక్క ప్రత్యక్ష ఆధారంగా పేర్కొంటారు. చట్ట నిర్మాణంలో శాసనసభలు ప్రజానీకం ఆకాంక్షలకు ప్రతీకగా ఉంటాయి. శాసనసభలోని అధికార, ప్రతిపక్షాలు రెండూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వ్యవహరిస్తాయి.

AP Inter 1st Year Civics Study Material Chapter 3 జాతీయవాదం

Andhra Pradesh BIEAP AP Inter 1st Year Civics Study Material 3rd Lesson జాతీయవాదం Textbook Questions and Answers.

AP Inter 1st Year Civics Study Material 3rd Lesson జాతీయవాదం

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
జాతీయత అంటే ఏమిటో నిర్వచించి, జాతీయత మౌలిక అంశాలను వివరించండి. [Mar. ’18, ’17, ’16]
జవాబు:
జాతీయతను ఆంగ్లంలో ‘నేషనాలిటీ’ (Nationality) అంటారు. ఈ ఆంగ్ల పదం ‘నేషియో’ అనే (Natio) లాటిన్ భాష నుండి గ్రహించబడినది. దీనికి “పుట్టుక” లేదా “జన్మ” అని అర్ధము. సంస్కృతంలో ‘జా’ అంటే ‘పుట్టుక’ అని అర్థం కలదు.

నిర్వచనం :
1. బర్జెస్ : “మొత్తం జనాభాలో మెజారిటీ సభ్యులతో కూడిన సామాజిక, సాంస్కృతిక సముదాయమే జాతీయత”. 2. జె.డబ్ల్యు గార్నర్ : “తెగవంటి అనేక ప్రజాబంధాలతో ఐక్యమైన ప్రజా సముదాయంలో భాగమే జాతీయత”. 3. ఆర్.జి.గెటిల్ : “ఒకే తెగ, భాష, మతం, ఆచారాలు, చరిత్ర వంటి ఉమ్మడి అంశాలు గల ప్రజానీకమే జాతీయత”.

జాతీయత లక్షణాలు :
1) స్వచ్ఛమైన తెగ (Purity of Race) : దీనిని ఏకజాతి లేదా వారసత్వము అనవచ్చు. ఒకే తెగ మనుషుల మధ్య రక్తసంబంధం ఉంటుంది. ఒకే సంతతికి చెందినవారమనే భావంతో ఒకే తెగ ప్రజలు ఐకమత్యభావంతో ఉంటారు. అది దృఢమైన జాతీయత, జాతిని పెంపొందిస్తుంది. ఉదా : హిట్లర్ కాలంలో జర్మనులు, తమిళనాడులో డి. యం. కె. పార్టీ తమ జాతీయతలను ప్రత్యేకమైనవిగా చెప్పుకున్నాయి. అయితే ఈ కాలంలో ఒకే తెగవారే ఒక రాజ్యంలో ఉండటం సాధ్యం కాదు.

AP Inter 1st Year Civics Study Material Chapter 3 జాతీయవాదం

2) ఉమ్మడి మతము (Common Religion) : ఒకే మతస్థుల మధ్య ఐకమత్య భావం ఏర్పడుతుంది. జాతులను సమైక్యపరచడంలో మతం ప్రముఖ పాత్ర వహించింది. అయితే ఆధునిక కాలంలో జాతీయతా భావానికి ఒకే మతం ఉండాలనే నియమం లేదు. ఉదా : 1947లో ముస్లిమ్లలంతా మత ప్రాతిపదికన పాకిస్థాన్ రాజ్యం ఏర్పరచుకున్నారు. అది 1972లో రెండుగా చీలిపోయి బంగ్లాదేశ్ ఏర్పడింది.

3) ఉమ్మడి భాష (Common Language) : ప్రజల మధ్య భావ వ్యక్తీకరణకు, సంప్రదింపులకు భాష అనేది ఒక సాధనం. ఒకే భాషను మాట్లాడే ప్రజలు ఎంతో సులభమైన రీతిలో ఒక జాతిగా రూపొందుతారు. ఉమ్మడి భాష, ఉమ్మడి సాన్నిహిత్యానికి దోహదపడుతుంది. ఒకే రకమైన భావాలు గల వ్యక్తులు సన్నిహితంగా మెలిగేందుకు భాష ముఖ్య సాధనంగా ఉంటుంది. ఉదా : స్విట్జర్లాండ్లో భాషాపరమైన వైవిధ్యాలు గల ఫ్రెంచ్, జర్మన్, ఇటాలియన్ జాతులకు చెందిన ప్రజలు నివసిస్తున్నప్పటికీ, వారందరి మధ్య ఉమ్మడి జాతీయత భావాలు నెలకొన్నాయి. అటువంటి పరిస్థితియే కెనడా, ఇండియా వంటి రాజ్యాలలో గోచరిస్తున్నది.

4) భౌగోళిక ఐక్యత (Geographical Unity) : జాతీయత, జాతి భావనలో భౌగోళిక ఐక్యత అనేది మరొక ముఖ్య అంశం. భౌగోళిక ఐక్యత అనేది ప్రకృతిలోనే ఇమిడి ఉంది. ఒక దేశపు సమైక్యతకు భౌగోళిక ఐక్యత చిహ్నంగా ఉంటుంది. అంతేకాకుండా, ఒకే రకమైన వాతావరణ పరిస్థితులలో ప్రజలందరూ కలిసికట్టుగా జీవించేందుకు భౌగోళిక ఐక్యత దోహదపడుతుంది. ఒక నిర్ణీత ప్రదేశంలో నివసించే ప్రజల మనసులు, శరీరాలపై భౌగోళిక ఐక్యత అంశం ప్రకృతి సహజమైన ప్రభావాన్ని చూపుతుంది. అటువంటి ప్రజలు ఒకేరకమైన భావాలతో కూడిన మానసిక సంబంధమైన ఆలోచనలు కలిగి ఉంటారు. అయితే భౌగోళిక ఐక్యత ఒక్కటే జాతీయ భావాన్ని పెంపొందిస్తుందని చెప్పలేం.
ఉదా : పాలస్తీనా రాజ్యం ఏర్పాటు జరుగకముందే యూదు జాతికి చెందిన ప్రజలు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో శ్రీ నివాస స్థావరాలు ఏర్పరచుకొన్నారు.

5) ఉమ్మడి చరిత్ర (Common History) : జాతీయతాభావ ఆవిర్భావంలో ఉమ్మడి చరిత్రను ఇంకొక | ప్రధాన అంశంగా పరిగణించవచ్చు. ఉమ్మడి చరిత్ర ప్రజానీకంలో ఎంతో ఉత్తేజాన్ని నింపి, వారిని కలిపి ఉంచుతుంది. కొన్నిసార్లు, చారిత్రక సంఘటనలు ప్రజలలో జాతీయతాభావాల వ్యాప్తికి దోహదపడతాయి. ఉదా : బ్రిటిష్ పాలన నుంచి భారతీయులు జాతీయతకు సంబంధించిన అనేక పాఠాలను నేర్చుకున్నారు.

6) ఉమ్మడి సంస్కృతి (Common Culture) : సంస్కృతి అంటే విస్తృతార్థంలో జీవనవిధానం. సంస్కృతి అనేది కొన్ని ఉమ్మడి అంశాలైన దుస్తులు, ఆచారాలు, ఆహారపు అలవాట్లు, మత విశ్వాసాలు, నైతిక విలువలు మొదలైన వాటి ద్వారా వెల్లడించబడుతుంది. ఈ ఉమ్మడి అంశాలు ప్రజలను ఒక త్రాటిపైకి తెచ్చి కలిపి ఉంచుతాయి.

7) ఉమ్మడి రాజకీయ ఆకాంక్షలు (Common Political Aspirations) : ఒక ప్రదేశంలో నివసించే ప్రజలు ఉమ్మడి రాజకీయ ఆర్థిక ఆకాంక్షలచే ప్రేరణ పొందుతారు. అటువంటి ఆకాంక్షలు జాతి అవతరణలో శక్తివంతమైన పాత్రను పోషిస్తాయి. ప్రత్యేక రాజ్యాంగం ఏర్పాటై రాజ్యాన్ని నిర్వహించే సామర్థ్యం గల ప్రజలు తగినంత మంది ఉంటే, అటువంటివారు స్వతంత్ర రాజకీయ వ్యవస్థగా రూపొందాలనే ఆకాంక్షను కలిగి ఉంటారు. విభిన్నమైన అంశాలతో కూడిన ప్రజానీకం కూడా ఉమ్మడి జాతీయతగా ఏర్పడే అవకాశం ఉంటుంది. జర్మనీ, ఇటలీలలోని ఏకీకరణ ఉద్యమాలు, అమెరికా స్వాతంత్య్ర పోరాటం, భారత జాతీయోద్యమాల మధ్య ఎన్నో పోలికలు ఉన్నాయి. ఇవన్నీ ఆయా దేశాల ప్రజల రాజకీయ ఆకాంక్షలకు ప్రతీకలుగా నిలిచాయి.

ప్రశ్న 2.
జాతి – జాతీయవాదం మధ్య సంబంధాన్ని చర్చించండి.
జవాబు:
ఆధునిక ప్రపంచ వ్యవహారాలలో జాతి, జాతీయవాదం అనేవి చాలా శక్తివంతమైన అంశాలు. ఈ రెండు భావనలు ప్రపంచవ్యాప్తంగా సర్వసత్తాక, సార్వభౌమాధికార రాజ్యవ్యవస్థలు ఏర్పరచుకొనేలా ప్రజలను ఉత్తేజపరిచాయి.

అర్థం : జాతి, జాతీయవాదం అనే ఈ రెండు పదాలు ఒకదానికొకటి పర్యాయపదాలుగా వాడబడతాయి. ఈ రెండు పదాలు లాటిన్ భాషలోని “నేషియో” (Natio) అనే పదం నుండి ఉద్భవించాయి. లాటిన్ భాషలో ఆ పదానికి జన్మతః పుట్టుక అనే అర్థం ఉంది.

జాతి (Nation) : ఈ ఆంగ్ల పదం ‘నేటస్’ (Nates), నేషియో (Natio) అనే లాటిన్ పదాల నుండి గ్రహించబడెను. దీనికి ‘పుట్టుక’ అని అర్థము కలదు. లార్డ్స్ ప్రకారము “స్వాతంత్య్రం పొందిన లేదా స్వాతంత్ర్యం పొందాలని కోరుకుంటూ, రాజకీయంగా వ్యవస్థీకృతమైన ప్రజలనే” జాతి అంటారు. బర్జెస్ ప్రకారం “భౌగోళిక ఐక్యత కలిగి ఉంటూ ఒక నిర్దిష్ట ప్రదేశములో నివసించే తెగకు సంబంధించిన జాతీయతయే జాతి”.

జాతీయవాదం (Nationalism) : జాతీయవాదం ఆధునిక రాజ్యానికి ఒక లక్షణం. ఇది ఒక మానసిక భావన. అంతర్గతంగా తమ హక్కులను పరిరక్షించుకునేందుకు, విదేశీ దండయాత్రల నుండి తమ దేశ స్వాతంత్య్రాన్ని రక్షించుకునేందుకు దేశ ప్రజలలో ఐకమత్యాన్ని ప్రేరేపించే మానసిక శక్తి ‘జాతీయవాదం’. దీనిని సంక్షిప్తంగా ‘ఐకమత్య ‘భావన’ అనవచ్చు. జాతుల స్వతంత్రానికి, దేశ అభివృద్ధికి ఇది అవసరం. కానీ సంకుచిత, మితిమీరిన జాతీయతా భావం హానికరము.

AP Inter 1st Year Civics Study Material Chapter 3 జాతీయవాదం

జాతి, జాతీయవాదం మధ్య సంబంధం :-
1) జాతీయవాదం ఒక మానసిక భావన. ఒక ప్రజా సమూహం స్వతంత్రంగా వేరుపడి, ప్రత్యేక రాజ్యం కలిగి ఉండటం అనే అంశం ఇందులో ఇమిడి ఉంటుంది.

2) ఈ భావం ప్రజలలో బలంగా నాటుకుపోవటంతో ప్రజలు తమ జాతి మనుగడ కోసం వారి సమస్త ప్రయోజనాలను పణంగా పెడతారు.

3) జాతీయత అనేది ప్రజల యొక్క ప్రగాఢమైన ఆకాంక్ష జాతిరాజ్య ఆవిర్భావానికి దోహదపడుటయే జాతీయవాదం.

4) 16వ శతాబ్దంలో ఐరోపాలో ఆవిర్భవించిన సాంస్కృతిక పునరుజ్జీవనం జాతీయవాదానికి బీజాలు వేసింది.

5) 1789లో సంభవించిన ఫ్రెంచ్ విప్లవం జాతీయవాదాన్ని ఐరోపాలో మరింత ఉన్నత స్థితికి తీసుకెళ్ళింది. దాని నినాదాలైన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం ఐరోపా జాతీయులలో తీవ్రమైన రాజకీయ చైతన్యాన్ని కలుగజేశాయి.

6) వియన్నా సమావేశం (1815) ఐరోపాలో జాతీయవాదాన్ని మరింత బలపరచింది.

7) ఇటలీ ఏకీకరణ మరియు జర్మనీ ఏకీకరణ జాతీయవాదానికి మరింత బలాన్నిచ్చాయి.

8) 1774లో సంభవించిన అమెరికా స్వాతంత్ర్య యుద్ధం ప్రజలలో జాతీయవాద వ్యాప్తికి బాగా తోడ్పడింది.

9) 1917లో నాటి అమెరికా అధ్యక్షుడు ఉడ్రోవిల్సన్ ప్రతిపాదించిన “జాతుల స్వయం నిర్ణయహక్కు” ప్రపంచ ప్రజలలో ప్రతి జాతీయ సముదాయం ఒక ప్రత్యేక రాజ్యంగా ఏర్పడాలనే భావాన్ని బలంగా నాటింది.

10) రెండవ ప్రపంచ యుద్ధానంతరం ఆసియా, ఆఫ్రికా మరియు లాటిన్ అమెరికాలలోని దేశాలలో జాతిరాజ్య ఆవిర్భావం కోసం స్వాతంత్ర్యోద్యమాలు ఊపందుకున్నాయి.

11) 1885 నుండి 1947 మధ్య సాగిన భారత జాతీయోద్యమం భారత్, పాకిస్థాన్లు స్వతంత్ర రాజ్యాలుగా ఆవిర్భవించటానికి దోహదం చేసింది.

దీనిని బట్టి మనం అర్థం చేసుకోవలసింది ఏమిటంటే జాతీయవాదం అనే భావం ఎప్పుడైతే ఐక్యతను, స్వాతంత్ర్యాన్ని సాధిస్తుందో, అప్పుడు అది సార్వభౌమాధికార జాతిగా రూపొందుతుంది.
కొంతమంది రాజనీతి శాస్త్రవేత్తలు ఈ రెండింటిని పర్యాయపదాలుగా పరిగణించారు.

ప్రశ్న 3.
జాతుల స్వయం నిర్ణయాధికారం డిమాండ్ గురించి క్లుప్తంగా రాయండి.
జవాబు:
ప్రతి జాతీయ సముదాయానికి స్వతంత్రంగా ఉండటానికి, అంటే రాజ్యంగా ఏర్పడటానికి సొంత హక్కు ఉన్నది – ‘అని చెప్పేదే జాతుల స్వయం నిర్ణయాధికార సిద్ధాంతం.
అమెరికా అధ్యక్షుడు ఉడ్రోవిల్సన్ మొదటి ప్రపంచయుద్ధ కాలంలో తాను ప్రతిపాదించిన 14 అంశాల కార్యక్రమంలో ఈ సిద్ధాంతాన్ని చేర్చాడు. అప్పటి నుంచి –

1) ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో జాతుల స్వయం నిర్ణయాధికార డిమాండ్లు వెలుగులోకి వచ్చాయి. అటువంటి వాటిలో ఒకటి, స్పెయిన్లోని బాస్క్ అనే ప్రాంతం పర్వతాలతో కూడిన సంపన్న ప్రాంతం. ఆ ప్రాంతాన్ని స్పెయిన్ ప్రభుత్వం సమాఖ్య పరిధిలో స్వయంపాలిత ప్రాంతంగా గుర్తించింది. అయితే అటువంటి ఏర్పాటు పట్ల బాస్క్ ప్రాంత ప్రజలు ఏ మాత్రం సంతృప్తి చెందలేదు. తమ ప్రాంతం ప్రత్యేక రాజ్యంగా ఏర్పడాలని వారు గట్టిగా ఆకాంక్షించారు.

2) ప్రపంచ రాజ్యాలలోని ప్రజలు అనేక తెగలు, భిన్న సంస్కృతుల సముదాయాలకు చెందినవారు. ఇటువంటి సముదాయాలలోని ప్రజలు ఎన్నో నష్టాలకు గురి అయ్యామనే భావనను వ్యక్తీకరించారు. దాంతో మైనారిటీ వర్గాలకు చెందిన ప్రజలకు జాతీయ జీవనస్రవంతిలో భాగస్వామ్యం కల్పించడమనేది విషమసమస్యగా మారింది. అయితే ఇక్కడ ఆసక్తిదాయక అంశం ఏమిటంటే విభిన్న సంస్కృతులకు చెందిన సముదాయాలకు ఆయా రాజ్యాలు రాజకీయ గుర్తింపును ప్రసాదించాయి. దీంతో ఆ సముదాయాలు పాలనలో భాగస్వామ్యం పొందేందుకు తమ భవిష్యత్తును తామే నిర్ణయించుకొనేందుకు ప్రయత్నించసాగాయి.

3) జాతీయ స్వయం నిర్ణయాధికార సిద్ధాంతం ఆసియా, ఆఫ్రికాలో జాతీయ విముక్తి పోరాటాలకు మద్దతు పలికింది. వలసప్రాంతాల ప్రజలు తమకు తగిన హోదా, గుర్తింపులు లభించాలనే హామీకై పట్టుబట్టారు. తమ సమిష్టి ప్రయోజనాల పరిరక్షణకై ఈ ఉద్యమాలు ప్రజలకు అండగా నిలిచాయి. జాతి ఔన్నత్యం, న్యాయసాధన అనే లక్ష్యాల సాధనకై అనేక జాతీయ ఉద్యమాలు నిర్వహించబడ్డాయి.

AP Inter 1st Year Civics Study Material Chapter 3 జాతీయవాదం

4) అయినప్పటికి ప్రతి సాంస్కృతిక సముదాయం ప్రత్యేక జాతిగా రూపొందాలనే ఆకాంక్షను వ్యక్తీకరిస్తూ రాజకీయ స్వాతంత్ర్యం, రాజత్వం పొందేటందుకు ప్రయత్నించటం సాధ్యంకాదని తేలిపోయింది. ఫలితంగా ప్రజలు వలస వెళ్ళడం, సరిహద్దుల్లో యుద్ధాలు, హింస అనేవి అనేక దేశాలలో సర్వసాధారణమయ్యాయి. దాంతో అనేక జాతి రాజ్యాలలో విచిత్రమైన ప్రత్యేక పరిస్థితులు తలెత్తాయి. జాతుల స్వయం నిర్ణయాధికారాన్ని కోరుతూ తమ భూభాగాలలో ఉద్యమాలు చేసి స్వాతంత్ర్యాలను సాధించిన దేశాలు, నేడు తమ దేశాలలోని మైనారిటీ వర్గాలకు వ్యతిరేకంగా ప్రవర్తించటాన్ని జాతీయ స్వయం నిర్ణయాధికారంగా ప్రకటించుకోవటం విడ్డూరంగా ఉంది.

ప్రశ్న 4.
భారతదేశం జాతిరాజ్యమా ? అనే విషయం గురించి సంగ్రహంగా వివరించండి.
జవాబు:
పాశ్చాత్య, ప్రాచ్య దేశాల రచయితలలో అనేకమంది భారతదేశాన్ని జాతిరాజ్యంగా వర్ణించారు. భారతదేశం జాతిరాజ్యం అని సమర్థించేందుకు అనేక బలమైన కారణాలు ఉన్నాయి. వాటిని ఈ క్రింది విధంగా పేర్కొనవచ్చు.
1) భారతీయులకు ఉమ్మడి చరిత్ర, సంస్కృతి ఉన్నాయి. అనేక సందర్భాలలో భారతీయులు జాతీయ సమైక్యతకు సంబంధించిన ప్రత్యేక లక్షణాలను ప్రదర్శించారు. చైనా, పాకిస్థాన్లు ఇండియాను ఆక్రమించిన సందర్భాలలో భారత ప్రభుత్వానికి ప్రజల నుండి సంపూర్ణ మద్దతు లభించింది.

2) భారతదేశ స్వాతంత్ర్య సాధనలో భారతీయులు అసమానమైన, అత్యున్నతమైన త్యాగాలను చేశారు. మహాత్మాగాంధీ నాయకత్వంలో విదేశీ పాలనకు వ్యతిరేకంగా ఎన్నో బాధలకు, దోపిడీలకు ఓర్చి ఉద్యమాలు చేశారు. బ్రిటిష్ ప్రభుత్వహయాంలో ఎన్నో అసౌకర్యాలకు లోనైన భారతీయులు మానసిక ఐక్యతను సాధించేందుకు కృషి చేశారు. అంతిమంగా వారి ప్రయత్నాలు ఫలించాయి.

3) భారతదేశంలో నెలకొన్న మిశ్రమ సంస్కృతి, ఆచార సాంప్రదాయాలు ప్రజలలో జాతీయభావాల పటిష్టతకు దోహదపడ్డాయి. అలాగే భారతమాత పట్ల నిబిడీకృతమైన భక్తిశ్రద్ధలు పెరిగి అంతిమంగా అది రాజకీయ ఆదర్శాల సాధనకు దోహదపడినాయి.

4) అనాదిగా భారతదేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రసిద్ధిగాంచింది. వివిధ రాష్ట్రాలలో నివసిస్తున్నప్పటికీ తామంతా మొదట భారతీయులమనే విషయాన్ని దేశ ప్రజలు గ్రహించారు. ఆ తరువాత తమ భాష, ప్రాంతాల పట్ల ఎంతో మమకారాన్ని పెంచుకొని ప్రకృతి ఉపద్రవాలు, రాజకీయ సంక్షోభాలు సంభవించినప్పుడు వారు ఒక త్రాటిపై నిలిచి ఐకమత్యంతో వ్యవహరించారు.

5) కన్నతల్లి, జన్మభూమి అనేవి స్వర్గం కంటే గొప్పవని భారతీయులు విశ్వసించారు. భారతదేశ చరిత్ర వారిని ఎంతగానో ఉత్తేజితులను గావించింది. జాతీయ వారసత్వం, సంస్కృతి, రాజ్యాంగం, ప్రభుత్వం వంటి ఉమ్మడి మౌలిక అంశాలు భారతీయులలో జాతీయభావాలను ప్రోగుచేసి జాతీయసమైక్యతను పెంపొందించాయి.

భారతజాతి విశిష్టత : ఒక జాతిగా భారతదేశం ఎన్ని ఒడుదుడుకులను ఎదుర్కొంటున్నప్పటికీ రాజ్యాంగం, పండుగలు, జాతీయ వేడుకలు, ఉమ్మడి ఆశయాలు వంటి అంశాల ప్రభావం వల్ల భారతీయులు ఎంతగానో స్ఫూర్తిని పొందుతున్నారు. సువిశాలమైన భారతదేశంలో సుసంపన్నమైన భారతీయ సంస్కృతిని పెంపొందించుకొంటూ, ప్రపంచంలో భారతదేశాన్ని అగ్రరాజ్యాలకు ధీటుగా ఒక శక్తివంతమైన రాజ్యంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారు. కాబట్టి భారతదేశాన్ని జాతిరాజ్యంగా పరిగణించవచ్చు.

AP Inter 1st Year Civics Study Material Chapter 3 జాతీయవాదం

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
జాతీయత మౌలిక అంశాలను క్లుప్తంగా వివరించండి.
జవాబు:
జాతీయత లక్షణాలు :
1) స్వచ్ఛమైన తెగ (Purity of Race) : దీనిని ఏకజాతి లేదా వారసత్వము అనవచ్చు. ఒకే తెగ మనుషుల మధ్య రక్తసంబంధం ఉంటుంది. ఒకే సంతతికి చెందినవారమనే భావంతో ఒకే తెగ ప్రజలు ఐకమత్యభావంతో ఉంటారు. అది దృఢమైన జాతీయత, జాతిని పెంపొందిస్తుంది. ఉదా : హిట్లర్ కాలంలో జర్మనులు, తమిళనాడులో డి. యం. కె. పార్టీ తమ జాతీయతలను ప్రత్యేకమైనవిగా చెప్పుకున్నాయి. అయితే ఈ కాలంలో ఒకే తెగవారే ఒక రాజ్యంలో ఉండటం సాధ్యం కాదు.

2) ఉమ్మడి మతము (Common Religion) : ఒకే మతస్థుల మధ్య ఐకమత్య భావం ఏర్పడుతుంది. జాతులను సమైక్యపరచడంలో మతం ప్రముఖ పాత్ర వహించింది. అయితే ఆధునిక కాలంలో జాతీయతా భావానికి ఒకే మతం ఉండాలనే నియమం లేదు. ఉదా : 1947లో ముస్లిమ్లంతా మత ప్రాతిపదికన పాకిస్థాన్ రాజ్యం ఏర్పరచుకున్నారు. అది 1972లో రెండుగా చీలిపోయి బంగ్లాదేశ్ ఏర్పడింది.

3) ఉమ్మడి భాష (Common Language) : ప్రజల మధ్య భావ వ్యక్తీకరణకు, సంప్రదింపులకు భాష అనేది ఒక సాధనం. ఒకే భాషను మాట్లాడే ప్రజలు ఎంతో సులభమైన రీతిలో ఒక జాతిగా రూపొందుతారు. ఉమ్మడి భాష, ఉమ్మడి సాన్నిహిత్యానికి దోహదపడుతుంది. ఒకే రకమైన భావాలు గల వ్యక్తులు సన్నిహితంగా మెలిగేందుకు భాష ముఖ్య సాధనంగా ఉంటుంది. ఉదా : స్విట్జర్లాండ్లో భాషాపరమైన వైవిధ్యాలు గల ఫ్రెంచ్, జర్మన్, ఇటాలియన్ జాతులకు చెందిన ప్రజలు నివసిస్తున్నప్పటికీ, వారందరి మధ్య ఉమ్మడి జాతీయత భావాలు నెలకొన్నాయి. అటువంటి పరిస్థితియే కెనడా, ఇండియా వంటి రాజ్యాలలో గోచరిస్తున్నది.

4) భౌగోళిక ఐక్యత (Geographical Unity) : జాతీయత, జాతి భావనలో భౌగోళిక ఐక్యత అనేది మరొక ముఖ్య అంశం. భౌగోళిక ఐక్యత అనేది ప్రకృతిలోనే ఇమిడి ఉంది. ఒక దేశపు సమైక్యతకు భౌగోళిక ఐక్యత చిహ్నంగా ఉంటుంది. అంతేకాకుండా, ఒకే రకమైన వాతావరణ పరిస్థితులలో ప్రజలందరూ కలిసికట్టుగా జీవించేందుకు భౌగోళిక ఐక్యత దోహదపడుతుంది. ఒక నిర్ణీత ప్రదేశంలో నివసించే ప్రజల మనసులు, శరీరాలపై భౌగోళిక ఐక్యత అంశం ప్రకృతి సహజమైన ప్రభావాన్ని చూపుతుంది. అటువంటి ప్రజలు ఒకేరకమైన భావాలతో కూడిన మానసిక సంబంధమైన ఆలోచనలు కలిగి ఉంటారు. అయితే భౌగోళిక ఐక్యత ఒక్కటే జాతీయ భావాన్ని పెంపొందిస్తుందని చెప్పలేం. ఉదా : పాలస్తీనా రాజ్యం ఏర్పాటు జరుగకముందే యూదు జాతికి చెందిన ప్రజలు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో నివాస స్థావరాలు ఏర్పరచుకొన్నారు.

ప్రశ్న 2.
జాతి, రాజ్యం ఏ విధంగా వ్యత్యాసాలను కలిగి ఉంటాయి ?
జవాబు:
జాతి, రాజ్యం ఒక్కటే అన్న భావాన్ని చాలామంది వ్యక్తపరిచారు. హేస్ అనే శాస్త్రజ్ఞుడి దృష్టిలో రాజకీయ ఐక్యత, సార్వభౌమత్వంతో కూడిన స్వాతంత్ర్యాన్ని పొందిన ఒక జాతీయ సముదాయం జాతి అవుతుంది. అలా ఏర్పడిన జాతినే జాతిరాజ్యం లేదా జాతీయరాజ్యం అని అనవచ్చునని హేస్ పేర్కొన్నాడు. అందువలన జాతి, రాజ్యం రెండు సమానార్థకాలుగా భావించవచ్చు. ఐక్యరాజ్యసమితి అనే అంతర్జాతీయ సంస్థను ఇంగ్లీషులో United Nations Organisation అంటారు. ఇక్కడ జాతి (Nation) అనే పదానికి రాజ్యం అనే అర్థం.

జాతి : లార్డ్ బ్రైస్ ప్రకారం, “స్వాతంత్య్రం పొందిన లేదా స్వాతంత్య్రం పొందాలని కోరుకుంటూ, రాజకీయంగా వ్యవస్థీకృతమైన ప్రజలే జాతి”.
రాజ్యం : ఉడ్రోవిల్సన్ ప్రకారం, “నిర్ణీత భూభాగంలో శాసనబద్ధులై నివసించే ప్రజలే రాజ్యం”.

AP Inter 1st Year Civics Study Material Chapter 3 జాతీయవాదం

జాతి, రాజ్యం మధ్య వ్యత్యాసాలు (Differences between Nation and State) :

జాతి (Nation)

  1. జాతి అనేది స్వతంత్ర రాజకీయ సముదాయం లేదా ఒకానొక బహుళజాతి రాజ్యంలో అంతర్భాగమైందిగా పరిగణించవచ్చు.
  2. రాజ్యం కంటే జాతి ముందుగా ఆవిర్భవించింది.
  3. ఒకే రకమైన మానసిక భావాలను కలిగి ఉమ్మడి లక్ష్యంతో నివసించే ప్రజా సముదాయమే జాతి.
  4. జాతి అనేది చారిత్రక, సాంస్కృతిక పరిణామాన్ని కలిగి ఉంటుంది.
  5. జాతి అనే భావన సుదీర్ఘకాలం పాటు జీవనం సాగించిన ప్రజలతో కూడిన సముదాయం.

రాజ్యం (State)

  1. రాజ్యం ఒక జాతి లేదా అనేక జాతుల ప్రజా సముదాయాన్ని కలిగి ఉండవచ్చు.
  2. రాజ్యం జాతి తరువాత ఉద్భవించింది. రాజ్యత్వ హోదాను కలిగి ఉండటమే జాతి అంతిమ లక్షణంగా పేర్కొనవచ్చు.
  3. ఒక నిర్దిష్ట ప్రదేశంలో శాసనబద్ధులైన ప్రజా సముదాయమే రాజ్యం.
  4. రాజ్యమనేది ఒకే రకమైన రాజకీయ, చట్టబద్ధమైన నిర్మితిని కలిగి ఉంటుంది.
  5. రాజ్యం పరిణామాత్మక స్వభావాన్ని కలిగి ఉండక పోవచ్చు. స్వాతంత్ర్యం గల కొన్ని చిన్న రాజకీయ సమాజాలు లేదా విభజన కారణంగా ఏర్పడిన రాజకీయ సమాజాల ఏకీకరణ ఫలితంగా రాజ్యం ఏర్పడుతుంది.

ప్రశ్న 3.
జాతీయవాదంలోని వివిధ దశలను వర్ణించండి.
జవాబు:
జాతీయవాదం అనే భావన ప్రపంచ వ్యవహారాలలో కీలకపాత్ర పోషించినది. గత రెండు శతాబ్దాలుగా జాతీయవాదం అత్యంత ప్రాముఖ్యత గల రాజకీయ సిద్ధాంతంగా ప్రాచుర్యం పొంది ప్రపంచ చరిత్రలో కీలక అంశంగా పరిణమించింది.

జాతీయవాదం (Nationalism) : జాతీయవాదం ఆధునిక రాజ్యానికి ఒక లక్షణం. ఇది ఒక మానసిక భావన. అంతర్గతంగా తమ హక్కులను పరిరక్షించుకునేందుకు, విదేశీ దండయాత్రల నుండి తమ దేశ స్వాతంత్ర్యాన్ని రక్షించుకునేందుకు దేశ ప్రజలలో ఐకమత్యాన్ని ప్రేరేపించే మానసిక శక్తి ‘జాతీయతావాదం’. దీనిని సంక్షిప్తంగా ‘ఐకమత్య భావన’ అనవచ్చు. జాతుల స్వతంత్రానికి, దేశ అభివృద్ధికి ఇది అవసరం. కానీ సంకుచిత, మితిమీరిన జాతీయతా భావం హానికరము.

జాతీయవాదం వివిధ దశలు (Different Phases of Nationalism) : జాతీయవాదాన్ని కాలానుగుణంగా, దేశాల వారీగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. హేయస్ (Hayes) అనే రచయిత ప్రకారం జాతీయవాదంలో ఐదు దశలు ఉన్నాయి. అవి :

  1. మానవతావాద దశ
  2. సాంప్రదాయక దశ
  3. సమీకృత దశ
  4. అధికారధిక్కారవాద దశ (జాకోబియన్ దశ)
  5. ఉదారవాద దశ

మొదటి నాలుగు దశలు 18, 19వ శతాబ్దాలలో సంభవించాయి. ఫ్రెంచ్ విప్లవం దాని పర్యవసానాలు ఐదోదశలో సంభవించాయి. ఈ దశలో సమీకృత జాతీయవాదం ఆవిర్భవించింది. నాలుగో దశ సంపూర్ణాధికారవాద రాజ్య లక్షణాలతో పాటు ప్రజాస్వామ్య రాజ్య విధానాలను అవలంబించినదిగా చెప్పవచ్చు.

జాతీయవాదం గురించి స్నైడర్ చేసిన పరిశీలనలు ఎంతో ఆసక్తిదాయకంగా ఉన్నాయని చెప్పవచ్చు. ఇతని అభిప్రాయం ప్రకారం జాతీయవాదంలో నాలుగు దశలు ఉన్నాయి. వాటిని కింది విధంగా తెలపవచ్చు.
1) సమీకృత జాతీయవాదం (Integrative Nationalism – 1815 – 1871) : ఈ దశలో జాతీయవాదం అనేది సమైక్యతాశక్తిగా పరిణమించి, అది ఇటలీ, జర్మనీల ఏకీకరణలో ప్రస్ఫుటంగా గోచరించింది.

2) విధ్వంసకర జాతీయవాదం (Disruptive Nationalism – 1871 – 1890) : ఈ దశలో ఆస్ట్రియా – హంగేరీలకు చెందిన జాతీయతా ప్రజా సముదాయాలు, ఇతర బహుళజాతి రాజ్యాల ప్రజలు స్వాతంత్ర్యం కోసం విశేషంగా కృషి చేయడమైంది.

AP Inter 1st Year Civics Study Material Chapter 3 జాతీయవాదం

3) తీవ్రవాద జాతీయవాదం (Aggressive Nationalism – 1890 – 1945): ఈ దశలో జాతీయవాదాన్ని తీవ్రమైన సామ్రాజ్యవాదంతో సమానమైన భావనగా గుర్తించడమైంది. దాంతో రెండు ప్రపంచయుద్ధాల రూపంలో జాతీయ ప్రయోజనాలకై తీవ్రమైన ఘర్షణలు ఏర్పడినాయి.

4) సమకాలీన జాతీయవాదం (Contemporary Nationalism – 1945 తరువాత) : ఈ దశ ప్రారంభంలో రాజకీయ జాతీయవాదం అనేది ఐరోపా దేశాల అధినేతలపై తిరుగుబాట్ల రూపంలో పెల్లుబికి పూర్వపు సోవియట్ యూనియన్ ఆధ్వర్యాన స్టాలిన్ కమ్యూనిస్టు తరహా ఉద్యమం జరిగింది. అప్పటి నుంచి జాతీయవాదంలో తీవ్రమైన ధోరణులు చోటుచేసుకున్నాయి. పాశ్చాత్యదేశాల అంతర్జాతీయ రాజకీయాలకు ఈ దశలో ఊతం లభించింది. ఆసియా, ఆఫ్రికా ఖండాలలో కొత్తగా స్వాతంత్య్రం పొందిన అనేక దేశాలపై జాతీయవాదం విశిష్టమైన ప్రభావాన్ని చూపింది. అంతర్జాతీయ కమ్యూనిజంతో జాతీయవాదం అనుసంధానమైంది.

ప్రశ్న 4.
జాతి, జాతీయతల ప్రాముఖ్యతను పేర్కొనండి.
జవాబు:
జాతి, జాతీయత అనేవి పర్యాయపదాలుగా వాడబడుతున్నాయి. ఈ రెండు పదాలు లాటిన్ భాషలోని “నేషియో” (Natio) అనే పదం నుండి ఉద్భవించాయి. లాటిన్ భాషలో ఆ పదానికి జన్మతః పుట్టుక అనే అర్థం ఉంది.

జాతి అనే పదం రాజకీయ సంస్థను సూచిస్తుండగా, జాతీయత అనేది ఆధ్యాత్మిక, మానసిక సంబంధమైన విశ్వాసంగా పేర్కొనవచ్చు.

జాతి (Nation) : జాతిని ఆంగ్లంలో (Nation) ‘నేషన్’ అంటారు. ఈ ఆంగ్ల పదం ‘నేటస్’ (Nates), నేషియో (Natio) అనే లాటిన్ పదాల నుండి గ్రహించబడెను. దీనికి ‘పుట్టుక’ అని అర్థము కలదు. లార్డ్స్ ప్రకారం “స్వాతంత్య్రం పొందిన లేదా స్వాతంత్య్రం పొందాలని కోరుకుంటూ, రాజకీయంగా వ్యవస్థీకృతమైన ప్రజలనే” జాతి అంటారు. బర్జెస్ ప్రకారం “భౌగోళిక ఐక్యత కలిగిఉంటూ ఒక నిర్దిష్ట ప్రదేశంలో నివసించే తెగకు సంబంధించిన జాతీయతయే జాతి”.

జాతీయత (Nationality) : జాతీయతను ఆంగ్లంలో ‘నేషనాలిటీ’ అంటారు. ఇది (Natio) ‘నేషియో’ అనే లాటిన్ పదం నుంచి గ్రహించబడింది. దీనికి ‘పుట్టుక’ అని అర్థము. ఒక రాజకీయ వ్యవస్థగా రూపొందే జాతీయత జాతి అనబడుతుంది. అంటే రాజ్యము, జాతీయతల కలయిక జాతి అవుతుంది. “ఒకే రక్తసంబంధం, ఒకే భాష, సాహిత్యం, సంప్రదాయాలు, ఉండి కొన్ని కట్టుబాట్లకులోనై ఉన్న జనసమూహం” జాతీయత అని లార్డ్ బ్రైస్ నిర్వచించాడు.

జాతి, జాతీయతల ప్రాముఖ్యత (Importance of Nation and Nationality) : అనేక ఆధునిక రాజకీయ వ్యవస్థలకు జాతి, జాతీయతా భావనలు పటిష్టమైన పునాదులను వేశాయి. ఒక నిర్ణీత ప్రదేశానికి చెందిన ప్రజలలో ఈ రెండు భావనలు ఐక్యత, సౌభ్రాతృత్వం, సమైక్యతలను పెంపొందించాయి. జాతీయత, జాతీయవాదం తమ రాజ్యాలను నిర్మించుకోవడంలోనూ, స్వీయ ఆర్థిక ఔన్నత్యాన్ని తీర్చిదిద్దుకోవడంలోనూ ఈ రెండు భావనలు తీవ్రమైన ప్రభావాన్ని చూపాయి. వాస్తవానికి ఈ రెండు భావనలు అనేక ఆధునిక రాజ్యాలలో ప్రజల మధ్య ఐక్యత భావాల వ్యాప్తిలో కీలక పాత్రను పోషించాయి. కుటుంబ సభ్యులపట్ల ప్రేమానురాగాలు, జాతిపట్ల విశ్వాసం, ఇరుగుపొరుగు వారిపట్ల సహకార భావం మొదలైనవి ఆయా దేశాల ప్రజలలో జాతి, జాతీయతలు అనే భావనలచే పెంపొందాయని చెప్పవచ్చు. ఆధునిక రాజ్యాల నిర్మాణం, మనుగడ అనేవి చాలావరకు పైన పేర్కొన్న అంశాల ప్రేరణతో కూడిఉన్నాయని చెప్పవచ్చు.

జాతి, జాతీయత అనే రెండు భావనలు ఒకే రకమైన ఆవిర్భావాన్ని కలిగి ఉన్నాయి. ఈ రెండు భావనలకు అర్థం ఒక్కటే. ఈ సందర్భంలో లార్డ్ బ్రైస్, హేయస్ వంటి రాజనీతిశాస్త్ర రచయితలు రాజకీయంగా స్వాతంత్ర్యాన్ని సాధించిన ప్రజలే జాతిగా రూపొందుతారని వర్ణించారు. ప్రజలలో జాతీయపరమైన విశ్వాసాలు ఉంటే వారు జాతిగా రూపొందుతారు. ఉమ్మడి అవగాహన ప్రాతిపదికగా సజాతీయ సంస్థగా ప్రజలు ఏర్పడటం ద్వారా జాతి, జాతీయత అనే రెండు భావనలు ఎంతో ప్రాచుర్యాన్ని పొందాయి.

జాతి, జాతీయత అనే భావాల ప్రభావం వల్ల రాజ్యం అవతరిస్తుంది. ఐరోపాలోని అనేక దేశాల ప్రజలు నియంతృత్వపు కోరలలో చిక్కుకొన్న సమయంలో, జాతీయత భావాలు వారిని విశేషంగా ప్రభావితం చేశాయి. ఆయా దేశాల చక్రవర్తుల కబంధహస్తాల నుంచి విముక్తి పొంది, స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకొనే దిశగా ప్రజలలో జాతి, జాతీయత భావనలు ప్రేరణ కలిగించాయి. అంతేకాకుండా తమ భాష, మతం, ఆచారాల పట్ల ప్రజలలో ప్రగాఢమైన ప్రేమ, అభిమానం, గౌరవాలను అవి పెంపొందించాయి. స్వీయ సంస్కృతులను సంరక్షించుకొనేందుకు ప్రజలను ప్రోత్సహించాయి. కాబట్టి జాతి, జాతీయత భావనలు ప్రజలలో ఐక్యత, అవగాహనలను పెంపొందించే దిశలో కీలక పాత్ర వహించాయని చెప్పవచ్చు.

ప్రశ్న 5.
జాతి, జాతీయతల మధ్య వ్యత్యాసాలు ఏవి ? [Mar. ’18]
జవాబు:
జాతి, జాతీయతల మధ్య కింద అంశాలలో వ్యత్యాసాలు ఉన్నాయి.
జాతి (Nation)

  1. జాతి అనేది రాజకీయ భావన.
  2. జాతి అనేది ఎల్లప్పుడూ రాజకీయంగా సంఘటితమైన రాజ్యాన్ని సూచిస్తుంది.
  3. జాతి అనే భావన ఎల్లప్పుడూ స్వతంత్రతను కలిగి ఉంటుంది.
  4. జాతీయత లేకుండా జాతి అనేది ఉండదు.
  5. జాతిగా ఏర్పడిన ప్రజలు రాజ్య శాసనాలకు విధేయులుగా ఉంటారు.

జాతీయత (Nationality)

  1. జాతీయత అనేది మానసిక భావన.
  2. జాతీయత అనేది ఎల్లప్పుడూ అసంఘటితమైన, అతి సులభమైన భావన.
  3. జాతీయత అనే భావన స్వతంత్రతను కలిగి ఉండదు.
  4. జాతి లేకుండా జాతీయత ఉంటుంది.
  5. జాతీయతగల ప్రజలు జాతిగా రూపొందేవరకు, రాజ్యాంగ చట్టాలు ఉండవు. అయితే స్వీయ ప్రయోజనాల దృష్ట్యా ప్రజలు కొన్ని ఉమ్మడి నియమాలను అనుసరిస్తారు.

AP Inter 1st Year Civics Study Material Chapter 3 జాతీయవాదం

ప్రశ్న 6.
జాతుల స్వయం నిర్ణయాధికారం గురించి రాయండి.
జవాబు:
ప్రతి జాతీయ సముదాయానికి స్వతంత్రంగా ఉండటానికి, అంటే రాజ్యంగా ఏర్పడటానికి సొంతహక్కు ఉన్నది. అని చెప్పేదే జాతి స్వయం నిర్ణయాధికార సిద్ధాంతం. వియన్నా కాంగ్రెసు (1815) కాలం నుంచి 19వ శతాబ్దం చివరి వరకు ‘ఒకే జాతీయ సముదాయం ఒకే జాతి రాజ్యం’ అనే సిద్ధాంతం యూరప్ రాజకీయాలను ప్రభావితం చేస్తూ వచ్చింది. ఈ సిద్ధాంతాన్ని కారల్మార్క్స్, ఏంజల్స్, లెనిన్ మొదలగువారు బలపరిచారు. అలాగే అమెరికా అధ్యక్షుడు ఉడ్రోవిల్సన్ మొదటి ప్రపంచ యుద్ధకాలంలో తాను ప్రతిపాదించిన ’14 అంశాల కార్యక్రమంలో ఈ సిద్ధాంతాన్ని చేర్చాడు. 1945లో స్థాపించబడిన ఐక్యరాజ్యసమితి రాజ్యాంగం ఈ సిద్ధాంతానికి మరింత బలాన్ని చేకూర్చింది. ధర్మకర్తృత్వ మండలి ఉద్దేశ్యం జాతీయ సముదాయాలకు క్రమంగా స్వయం పాలన కలుగజేయటమే. ఒక్కోక్క జాతీయ సముదాయం ఒక్కొక్క జాతీయ రాజ్యంగా అవతరించినందువల్ల పెక్కు ప్రయోజనాలు ఉన్నమాట నిజమే. అయితే దానివలన కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ జాతీయ భావాన్ని ఖండిస్తూ దానిని మొత్తం ప్రజల వ్యవస్థీకృతమైన స్వార్థ ప్రయోజనంగా (Organised self interest of whole people) అభివర్ణించాడు. ఆధునిక కాలంలో జాతీయ భావం ఒక మత భావనకు దారితీస్తున్నదని షిలిటో (Schillito) హెచ్చరించాడు. లార్డ్ యాక్టన్ అభిప్రాయంలో ఏకజాతి రాజ్యం కన్నా బహుళ జాతిరాజ్యమే అన్ని విధాల మెరుగైనది.

ప్రశ్న 7.
భారతదేశం జాతిరాజ్యమా ? వివరించండి. [Mar. ’17, ’16]
జవాబు:
పాశ్చాత్య, ప్రాచ్య దేశాల రచయితలలో అనేకమంది భారతదేశాన్ని జాతిరాజ్యంగా వర్ణించారు. భారతదేశం జాతిరాజ్యం అని సమర్థించేందుకు అనేక బలమైన కారణాలు ఉన్నాయి. వాటిని ఈ క్రింది విధంగా పేర్కొనవచ్చు.

1) భారతీయులకు ఉమ్మడి చరిత్ర, సంస్కృతి ఉన్నాయి. అనేక సందర్భాలలో భారతీయులు జాతీయ సమైక్యతకు సంబంధించిన ప్రత్యేక లక్షణాలను ప్రదర్శించారు. చైనా, పాకిస్థాన్లు ఇండియాను ఆక్రమించిన సందర్భాలలో భారత ప్రభుత్వానికి ప్రజల నుండి సంపూర్ణ మద్దతు లభించింది.

2) భారతదేశ స్వాతంత్ర్య సాధనలో భారతీయులు అసమానమైన, అత్యున్నతమైన త్యాగాలను చేశారు. మహాత్మాగాంధీ నాయకత్వంలో విదేశీ పాలనకు వ్యతిరేకంగా ఎన్నో బాధలకు, దోపిడీలకు ఓర్చి ఉద్యమాలు చేశారు. |బ్రిటిష్ ప్రభుత్వ హయాంలో ఎన్నో అసౌకర్యాలకు లోనైన భారతీయులు మానసిక ఐక్యతను సాధించేందుకు కృషి చేశారు. అంతిమంగా వారి ప్రయత్నాలు ఫలించాయి.

3) భారతదేశంలో నెలకొన్న మిశ్రమ సంస్కృతి, ఆచార సాంప్రదాయాలు ప్రజలలో జాతీయభావాల పటిష్టతకు దోహదపడ్డాయి. అలాగే భారతమాత పట్ల నిబిడీకృతమైన భక్తిశ్రద్ధలు పెరిగి అంతిమంగా అది రాజకీయ ఆదర్శాల సాధనకు దోహదపడినాయి.

4) అనాదిగా భారతదేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రసిద్ధిగాంచింది. వివిధ రాష్ట్రాలలో నివసిస్తున్నప్పటికీ తామంతా మొదట భారతీయులమనే విషయాన్ని దేశ ప్రజలు గ్రహించారు. ఆ తరువాత తమ భాష, ప్రాంతాల పట్ల ఎంతో మమకారాన్ని పెంచుకొని ప్రకృతి ఉపద్రవాలు, రాజకీయ సంక్షోభాలు సంభవించినప్పుడు వారు ఒక త్రాటిపై నిలిచి ఐకమత్యంతో వ్యవహరించారు.

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
జాతీయత అంటే ఏమిటి ?
జవాబు:
జాతీయతను ఆంగ్లంలో ‘నేషనాలిటీ’ (Nationality) అంటారు. ఇది (Natio) ‘నేషియో’ అనే లాటిన్ పదం నుంచి గ్రహించబడింది. దీనికి “పుట్టుక” అని అర్థము. ఒక రాజకీయ వ్యవస్థగా రూపొందే జాతీయత జాతి అనబడుతుంది. అంటే రాజ్యము, జాతీయతల కలయిక జాతి అవుతుంది. “ఒకే రక్త సంబంధం, ఒకే భాష, సాహిత్యం, సంప్రదాయాలు, ఉండి కొన్ని కట్టుబాట్లకులోనై ఉన్న జనసమూహం” జాతీయత అని ‘లార్డ్ బ్రైస్’ నిర్వచించాడు.

AP Inter 1st Year Civics Study Material Chapter 3 జాతీయవాదం

ప్రశ్న 2.
జాతిని నిర్వచించండి.
జవాబు:
జాతిని ఆంగ్లంలో (Nation) ‘నేషన్’ అంటారు. ఈ ఆంగ్ల పదం ‘నేటస్’ (Nates), నేషియో (Natio) అనే లాటిన్ పదాల నుండి గ్రహించబడెను. దీనికి ‘పుట్టుక’ అని అర్థము కలదు. లార్డ్స్ ప్రకారము “స్వాతంత్ర్యం పొందిన లేదా స్వాతంత్ర్యం పొందాలని కోరుకుంటూ, రాజకీయంగా వ్యవస్థీకృతమైన ప్రజలనే” జాతి అంటారు. బడ్జెస్ ప్రకారం “భౌగోళిక ఐక్యత కలిగిఉంటూ ఒక నిర్దిష్ట ప్రదేశంలో నివసించే తెగకు సంబంధించిన జాతీయతయే జాతి”.

ప్రశ్న 3.
జాతి – రాజ్యాల మధ్య రెండు వ్యత్యాసాలను రాయండి.
జవాబు:
జాతి (Nation)

  1. జాతి అనేది స్వతంత్ర రాజకీయ సముదాయం లేదా ఒకానొక బహుళజాతి రాజ్యంలో అంతర్భాగం అయినదిగా పరిగణించవచ్చు.
  2. రాజ్యం కంటే జాతి ముందుగా ఆవిర్భవించింది.

రాజ్యం (State)

  1. రాజ్యం ఒక జాతి లేదా అనేక జాతుల ప్రజా సముదాయాన్ని కలిగి ఉండవచ్చు.
  2. రాజ్యం జాతి తరువాత ఉద్భవించింది. రాజ్యత్వ హోదాను కలిగి ఉండటమే జాతి అంతిమ లక్షణంగా పేర్కొనవచ్చు.

ప్రశ్న 4.
జాతీయతకు గల రెండు అర్థాలను పేర్కొనండి.
జవాబు:

  1. జాతీయత అనేది ఒక రాజ్యంలో పౌరుల చట్టబద్ధమైన హోదాలకు సంబంధించినది. పౌరులహోదా జాతీయతను సూచిస్తుంది.
  2. ఒక నిర్ణీతమైన దేశంలో వ్యక్తుల సముదాయానికి గల ప్రత్యేక గుర్తింపుకు జాతీయత చిహ్నంగా ఉంటుంది.

ప్రశ్న 5.
జాతీయత మౌలిక అంశాలలో రెండింటిని తెలపండి.
జవాబు:
జాతీయత లక్షణాలు :
1) స్వచ్ఛమైన తెగ (Purity of Race) : దీనిని ఏకజాతి లేదా వారసత్వము అనవచ్చు. ఒకే తెగ మనుషుల మధ్య రక్తసంబంధం ఉంటుంది. ఒకే సంతతికి చెందినవారమనే భావంతో ఒకే తెగ ప్రజలు ఐకమత్యభావంతో ఉంటారు. అది దృఢమైన జాతీయత, జాతిని పెంపొందిస్తుంది. ఉదా : హిట్లర్ కాలంలో జర్మనులు, తమిళనాడులో డి. యం. కె. పార్టీ తమ జాతీయతలను ప్రత్యేకమైనవిగా చెప్పుకున్నాయి. అయితే ఈ కాలంలో ఒకే తెగవారే ఒక రాజ్యంలో ఉండటం సాధ్యం కాదు.

2) ఉమ్మడి మతము (Common Religion) : ఒకే మతస్థుల మధ్య ఐకమత్య భావం ఏర్పడుతుంది. జాతులను సమైక్యపరచడంలో మతం ప్రముఖ పాత్ర వహించింది. అయితే ఆధునిక కాలంలో జాతీయతా భావానికి ఒకే మతం ఉండాలనే నియమం లేదు. ఉదా : 1947లో ముస్లిమ్లంతా మత ప్రాతిపదికన పాకిస్థాన్ రాజ్యం ఏర్పరచుకున్నారు. అది 1972లో రెండుగా చీలిపోయి బంగ్లాదేశ్ ఏర్పడింది.

AP Inter 1st Year Civics Study Material Chapter 3 జాతీయవాదం

ప్రశ్న 6.
జాతీయవాదం ప్రాముఖ్యత ఏమిటి ?
జవాబు:
జాతీయవాదాన్ని సూక్ష్మంగా పరిశీలించినచో ప్రపంచ వ్యవహారాలలో ఈ భావన కీలకపాత్ర పోషించినదని చెప్పవచ్చు. గత రెండు శతాబ్దాలుగా జాతీయవాదం అత్యంత ప్రాముఖ్యత గల రాజకీయ సిద్ధాంతంగా ప్రాచుర్యం పొంది ప్రపంచ చరిత్రలో కీలక అంశంగా పరిణమించింది. అయితే జాతీయవాదం ఒకవైపు ప్రపంచ ప్రజలను | ప్రభావితం చేయగా మరొకవైపు ప్రపంచ ప్రజానీకం మధ్య విద్వేషాలను కూడా సృష్టించింది. నియంతృత్వ పాలకుల ప్రతిఘటనల నుంచి ప్రజలకు విముక్తి గావించి అనేక సామ్రాజ్యాలు, పలు రాజ్యాల విభజనలలో నిర్ణయాత్మక పాత్రను పోషించింది. అనేక రాజ్యాల సరిహద్దులను నిర్ణయించడంలో సైతం కీలకపాత్ర పోషించింది.

ప్రశ్న 7.
జాతీయవాదంలోని రెండు సుగుణాలను రాయండి.
జవాబు:
1) జాతీయవాదం ప్రజల మధ్య నెలకొన్న పరస్పర వైరుధ్యాలు, వ్యక్తిగత విద్వేషాలు, అంతర్గతమైన ఘర్షణలను నిలువరించగలిగింది. ఒక జాతికి సంబంధించిన ప్రజలలో ఐక్యత, సమగ్రత, సంఘీభావాన్ని పెంపొందించింది. ఇరుగుపొరుగు ప్రజల ఉద్దేశ్యాలను తెలుసుకొనేందుకు వీలు కల్పించింది. కాబట్టి ప్రజల మధ్య చక్కని
అవగాహనను పెంపొందించింది.

2) ప్రజలు ప్రభుత్వం పట్ల విధేయత చూపించేలా జాతీయవాదం దోహదపడింది.

AP Inter 1st Year Civics Study Material Chapter 3 జాతీయవాదం

ప్రశ్న 8.
జాతీయవాదంలోని రెండు దోషాలను తెలపండి.
జవాబు:

  1. జాతీయవాదం ప్రజలలో అహంకారం, అసూయ, గర్వాలను ప్రోత్సహిస్తుంది. ఇటువంటి ధోరణులను జర్మన్, ఇటాలియన్ల చరిత్ర ద్వారా మనం గమనించవచ్చు.
  2. ఇరుగు పొరుగు రాజ్యాల ప్రజలపై మరొక రాజ్యం ప్రజలు ఆధిక్యతను ప్రదర్శించే ధోరణిని రెచ్చగొడుతుంది.

AP Inter 1st Year Zoology Study Material Chapter 7 పెరిప్లానెటా అమెరికానా (బొద్దింక)

Andhra Pradesh BIEAP AP Inter 1st Year Zoology Study Material 7th Lesson పెరిప్లానెటా అమెరికానా (బొద్దింక) Textbook Questions and Answers.

AP Inter 1st Year Zoology Study Material 7th Lesson పెరిప్లానెటా అమెరికానా (బొద్దింక)

అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
బొద్దింకను చీడపురుగు అని ఎందుకు అంటారు?
జవాబు:
బొద్దింకలు విసర్జన పదార్థాలతో ఆహార పదార్థాలను కలుషితం చేసే హానికర కీటకం. దీనివలన అనేక బాక్టీరియల్ వ్యాధులు సంక్రమిస్తాయి. కనుక దీనిని చీడపురుగు అంటారు.

ప్రశ్న 2.
బొద్దింక ఉరః ఖండింతంలో ఉన్న పృష్ఠఫలకాలను తెలపండి.
జవాబు:
బొద్దింక ఉరః ఖండితంలో ప్రాగ్వక్షంలో – పూర్వ పృష్టకం
అంత్య వక్షంలో – మధ్యపృష్ఠకం, అంత్యపృష్టకం అనే పృష్ఠ ఫలకాలుంటాయి.

ప్రశ్న 3.
బొద్దింక ఏయే నిర్మాణాలతో నునుపు, గరుకు తలాలపై నడుస్తుంది?
జవాబు:
బొద్దింక గరుకుతలంపై కాలి చివరన ఉండే నఖాలు, అరోలియమ్ సహాయంతో, ప్లాంటులాల సహాయంతో నునుపు తలపై గమనం చేస్తుంది.

ప్రశ్న 4.
బొద్దింక తల అమరికను హైపోగ్నాథస్ అని ఎందుకంటారు?
జవాబు:
బొద్దింక తల దేహానికి లంబకోణంలో వేలాడుతున్నట్లు ఉంటుంది. నోటి భాగాలు క్రిందికి వంగి ఉంటాయి. ఇటువంటి తల అమరికను హైపోగ్నాథస్ తల అంటారు.

ప్రశ్న 5.
బొద్దింక గమనంలో త్రిపాది ఏవిధంగా ఏర్పడుతుంది?
జవాబు:
బొద్దింక గమనంలో మూడు జత కాళ్ళను రెండు త్రిపాదులుగా ఏర్పరుచుకుంటుంది. ఒక్కో త్రిపాది ఒక వైపున ఉన్న పూర్వకాలు, పరకాలు మరోప్రక్క నున్న మధ్యకాలు ఏర్పడుతుంది. ఒక త్రిపాది మూడు కాళ్ళు నేలమీద ఉంటాయి. మరో త్రిపాది మూడుకాళ్ళు ముందుకు సాగుతాయి.

AP Inter 1st Year Zoology Study Material Chapter 7 పెరిప్లానెటా అమెరికానా (బొద్దింక)

ప్రశ్న 6.
బొద్దింకలో రెక్కలు లేపడానికీ, కిందికి దించడానికీ ఉపయోగపడే కండరాలు ఏవి?
జవాబు:
బొద్దింకలో రెక్కలు పృష్టోదర కండరాల సంకోచం వల్ల రెక్కలు పైకి లేస్తాయి. పృష్ఠ ఆయత కండరాల సంకోచంవల్ల రెక్కలు క్రిందికి దించబడతటాయి.

ప్రశ్న 7.
బొద్దింకలోని వివిధ రక్త కోటరాలను పేర్కొనండి.
జవాబు:
బొద్దింకలో మూడు రక్త కోటరాలుంటాయి. అవి.
1. హృదయావరణ రక్తకుహరం లేదా పృష్ఠకోటరం,
2. పర్వాంతరాంగ రక్తకుహరం లేదా మధ్యకోటరం,
3. ఉదరఫలక రక్తకుహరం లేదా ఉదరకోటరం లేదా పరినాడీ కోటరం.

ప్రశ్న 8.
కొవ్వు దేహాలు సకశేరుకాల కాలేయంతో ఏవిధంగా సమానం?
జవాబు:
బొద్దింకలోని కొవ్వు దేహాలను సకశేరుకాలలోని కాలేయంతో పోల్చవచ్చును. ఇవి కొన్ని విధులలో సకశేరుకాల కాలేయాన్ని పోలి ఉంటాయి. కొవ్వు దేహా కణాల విధులు.

  1. ట్రోఫోసైట్స్ – ఆహారాన్ని నిలువచేసే కణాలు.
  2. మైసిటోసైట్స్ – సహ జీవన బాక్టీరియాను కలిగి ఉంటాయి.
  3. ఈనోసైట్స్ – కొవ్వులను స్రవిస్తాయి.
  4. యూరేట్ కణాలు – యూరిక్ ఆమ్లాన్ని నిలువచేస్తాయి.

ప్రశ్న 9.
బొద్దింక ఆహార నాళంలో ఏ భాగం పెరిట్రాఫిక్ త్వచాన్ని స్రవిస్తుంది?
జవాబు:
బొద్దింక ఆహార నాళంలో పెరిట్రాఫిక్ త్వచాన్ని అంతర జఠరపు గరాటులాంటి ఆద్వముఖ కవాటం స్రవిస్తుంది.

ప్రశ్న 10.
బొద్దింక ఆహారనాళంలోని ఏ భాగం నీటిని పునఃశోషణ చేస్తుంది?
జవాబు:
బొద్దింక ఆహారనాళంలోని పురీషనాళంలోని పురీషనాళ సూక్ష్మాంకురాలు జీర్ణంకాని ఆహారంలోని నీటిని పునఃశోషణ జరుపుతాయి.

ప్రశ్న 11.
బొద్దింకలో ఆహారం కొరకడానికీ, రుచి తెలుసుకోడానికీ ఉపయోగపడే నోటి భాగాలను తెలపండి.
జవాబు:
బొద్దింకలో ఆహారాన్ని కొరకడానికి హనువులు, రుచి తెలుసుకోవడానికి అధరం ఉపయోగపడతాయి.

AP Inter 1st Year Zoology Study Material Chapter 7 పెరిప్లానెటా అమెరికానా (బొద్దింక)

ప్రశ్న 12.
పక్షాకార కండరాలు అంటే ఏవి?
జవాబు:
బొద్దింక దేహంలోని ప్రతికండితానికి పార్శ్వతలంలో ఒక జత త్రిభుజాకార కండరాలు ఒక శ్రేణిలో ఉంటాయి. వీటిని పక్షాకార కండరాలు అంటారు.

ప్రశ్న 13.
రక్తకుహరం అంటే ఏమిటి?
జవాబు:
బొద్దింకలో రక్తనాళాలలో ప్రవహించదు. దేహంకురం రక్తంలో నింపబడి ఉంటుంది. కనుక బొద్దింక శరీర కుహరాన్ని రక్త కుహరం అంటారు.

ప్రశ్న 14.
బొద్దింకలోని మూడు కోటరాలు పరిమాణంలో సమానంగా లేవు. ఎందుకు?
జవాబు:
బొద్దింకలోని మూడు కోటరాలు పరిమాణంలో సమానంగా ఉండవు. వీటిలో మధ్య కోటరం పెద్దది. ఎందుకంటే దీనిలో చాలా అంతరాంగ అవయవాలు ఉంటాయి. పృష్ఠ, ఉదర కోటరాలు చిన్నవి. వీటిలో గుండె, నాడీదండం మాత్రమే ఉంటాయి.

ప్రశ్న 15.
పెరిప్లానెటా రక్తాన్ని హీమోలింఫ్/రక్తశోషరసం అని ఎందుకంటారు?
జవాబు:
పెరిప్లానెటా (బొద్దింక) రక్తం వర్ణరహితం, కనుక దీనిని రక్తశోషరసం/హీమోలిఫ్ అంటారు. దీనిలో జీవ ద్రవ్యం, స్వేచ్ఛారక్త కణాలు లేదా హీమోసైట్లు ఉంటాయి.

ప్రశ్న 16.
పెరిప్లానెటా రక్తంలో ఉన్న హీమోసైట్ల విధి ఏమిటి?
జవాబు:
పెరిప్లానెటా రక్తంలోని హీమోసైట్లు భక్షక లక్షణాన్ని కలిగి ఉండి బాక్టీరియావంటి అన్య పదార్థాలను ‘అంతర్గ్రహణం’ చేస్తాయి.

AP Inter 1st Year Zoology Study Material Chapter 7 పెరిప్లానెటా అమెరికానా (బొద్దింక)

ప్రశ్న 17.
పెరిప్లానెటా రక్తం యొక్క ముఖ్య విధులను తెలపండి.
జవాబు:
పెరిప్లానెటా రక్తం :

  1. ఆహార నాళం నుండి జీర్ణమైన ఆహారపదార్థాలను దేహ అంగాలకు చేరవేస్తుంది.
  2. దేహ భాగాలనుండి నత్రజని సంబంధిత వ్యర్థాలను విసర్జిక అవయవాలకు చేరవేస్తుంది.
  3. రక్షక కణాలను వ్యాధి సాంక్రమిక ప్రదేశాలకు చేరవేస్తుంది.
  4. వినాళగ్రంథి స్రావకాలను వాటి లక్ష్య అవయవాలను రవాణా చేస్తుంది.

ప్రశ్న 18.
పెరిప్లానెటా రక్తం ఎరుపు రంగులో లేదు. దీనిలో ఏ వర్ణం లోపించిందని మీరు తలుస్తారు?
జవాబు:
పెరిప్లానెటా రక్తంలో హిమోగ్లోబిన్ (రక్త వర్ణకం) లేదు కనుక రక్తం ఎరుపురంగులో లేక తెల్లగా ఉంటుంది.

ప్రశ్న 19.
బొద్దింకలో ఎన్ని శ్వాసరంధ్రాలు ఉన్నాయి ? వాటి ప్రాంతాలను తెలపండి.
జవాబు:
బొద్దింకలో మొత్తం 10 జతల శ్వాసరంధ్రాలున్నాయి. మొదటి జత మధ్య వక్షంలోను, రెండవ జత అంత్య వక్షంలోను, మిగిలిన 8 జతల శ్వాస రంధ్రాలు ఉదరం మొదటి ఎనిమిది ఖండితాలలోను ఉంటాయి. ఈ రంధ్రాలు ఆయా ఖండితాల పార్శ్వ ఫలకాలపై తెరుచుకుంటాయి.

ప్రశ్న 20.
ట్రైకోమ్స్ అంటే ఏమిటి? వాటి విధులను తెలపండి.
జవాబు:
ధూళి రేణువులు శ్వాసరంధ్రాలలోకి ప్రవేశించకుండా ఉండేందుకు శ్వాసరంధ్రాలకు ఉండే చిన్న రోమాలను ట్రైకోమ్లు అంటారు.

ప్రశ్న 21.
బొద్దింక శ్వాసవ్యవస్థను పాలీన్యూస్టిక్, హోలోన్యూస్టిక్ వ్యవస్థ అని అంటారు ఎందుకు?
జవాబు:
కనీసం మూడు జతల శ్వాసరంధ్రాలు క్రియాత్మకంగా ఉంటే దాన్ని పాలీన్యూస్టిక్ శ్వాసవ్యవస్థ అని అంటారు. శ్వాసరంధ్రాలన్ని క్రియాత్మకంగా ఉంటే దానిని హోలోన్యూస్టిక్ రకం అంటారు. బొద్దింకలో అన్ని శ్వాసరంధ్రాలు క్రియాత్మకంగా ఉంటాయి. గనుక దీనిని హోలీన్యూస్టిక్, హోలోన్యూస్టిక్ శ్వాసవ్యవస్థ అంటారు.

ప్రశ్న 22.
ఇంటిమా అంటే ఏమిటి?
జవాబు:
బొద్దింకలో వాయునాళం లోపలి అవభాసినిస్తరాన్ని ఇంటిమా అంటారు.

ప్రశ్న 23.
బొద్దింక వాయునాళికను ఆవరించిన ప్రోటీన్ ను పేర్కొనండి.
జవాబు:
బొద్దింక వాయునాళికను ఆవరించి ఉండే ప్రోటీన్ ట్రేకిన్.

AP Inter 1st Year Zoology Study Material Chapter 7 పెరిప్లానెటా అమెరికానా (బొద్దింక)

ప్రశ్న 24.
ఉచ్ఛ్వాస సమయంలో ఏ శ్వాసరంధ్రాలు తెరుచుకుంటాయి? ఏ శ్వాసరంధ్రాలు మూసుకుంటాయి?
జవాబు:
ఉచ్ఛ్వాస సమయంలో వక్షంలోని శ్వాసరంధ్రాలు తెరుచుకుంటాయి. ఉదర భాగంలోని శ్వాసరంధ్రాలు మూసుకుంటాయి.

ప్రశ్న 25.
శ్వాసరంధ్రాలు తెరుచుకోవడాన్ని నియంత్రించగల కారకాలేవి?
జవాబు:
శ్వాసరంధ్రాలు తెరుచుకోవడం క్రియ పృష్టోదర కండరాలు ఆయుత కండరాలు సంకోచ, వ్యాకోచం వలన జరుగుతుంది.

ప్రశ్న 26.
బొద్దింకలో ఉచ్ఛ్వాస ప్రక్రియ నిష్క్రియాత్మకం, నిశ్వాస, సక్రియాత్మకం అని నిరూపించండి.
జవాబు:
బొద్దింకలో ఉచ్ఛ్వాస క్రియలో పృష్టోదర కండరాలు, ఆయుత కండరాలు సడలటంవలన గాలిలోనికి తీసుకోబడుతుంది. కనుక దీనిని నిష్క్రియాచర్య అంటారు. అంటారు.

నిశ్వాసంలో పృష్టోదర కండరాలు సంకోచం వలన శక్తిని వినియోగించుకుంటాయి. కనుక దీనిని సక్రియాత్మక చర్య అంటారు.

ప్రశ్న 27.
పెరిప్లానెటాలో ఆహారనాళం నత్రజని సంబంధ వ్యర్థాలను తొలగిస్తుంది. ఎందుకు?
జవాబు:
పెరిప్లానెటా ఆహార నాళం నత్రజని సంబంధిత వ్యర్థాలను తొలగించే ప్రక్రియ. వ్యర్థాలనుంచి నీటిని పునః శోషణ చేయడానికి అనార్థ యూరిక్ ఆమ్లం తయారవడానికి తోడ్పడుతుంది. ఇది దేహంలోని నీటిని సంరక్షించుకునే అనుకూలనం.

ప్రశ్న 28.
బొద్దింక అవభాసిని ఏ విధంగా విసర్జనక్రియలో తోడ్పడుతుంది?
జవాబు:
బొద్దింకలో కొన్ని నత్రజని సంబంధిత వ్యర్థ పదార్థాలు అవభాసినిపై నిక్షేపం చెంది నిర్మోచన సమయంలో విసర్జించబడతాయి.

ప్రశ్న 29.
విసర్జనక్రియలో కొవ్వు దేహాలు ఏవిధంగా తోడ్పడతాయి?
జవాబు:
బొద్దింలో కొవ్వు దేహంలోని యూరేట్ కణాలు యూరికామ్లాన్ని శోషణచేసి నిలువ చేస్తాయి.

AP Inter 1st Year Zoology Study Material Chapter 7 పెరిప్లానెటా అమెరికానా (బొద్దింక)

ప్రశ్న 30.
‘నిల్వ విసర్జనక్రియ’ అంటే ఏమిటి?
జవాబు:
బొద్దింకలోని కొవ్వు దేహాలలో యూరేట్ కణాలు జీవితాంత యూరిక్ ఆమ్లాన్ని శోషణ చేసి తమతో నిలువ చేస్తాయి. కొవ్వు దేహాలు లేదా వసాదేహాలు ఈ విధంగా యూరికామ్ల విసర్జనాలను నిలువ చేయడాన్ని ‘నిల్వ విసర్జన’ అంటారు.

ప్రశ్న 31.
బొద్దింకలో గల ఏ నిర్మాణం జ్ఞాన, వినాళ కేంద్రంగా పనిచేస్తుంది.
జవాబు:
బొద్దింకలోగల అధ్వాహారవాహికా నాడి సంధులు (మెదడు) జ్ఞాన, వినాళ కేంద్రంగా పనిచేస్తాయి.

ప్రశ్న 32.
స్కోలోపీడియా, సెన్సిల్లాలు మధ్య భేదాలు తెలపండి.
జవాబు:
సెన్సిల్లాల :
ఇది అవభాసిని గ్రాహక ప్రమాణాలు. ఇవి రసాయన గ్రాహకాలు. స్కాలోపీడియా. ఇవి అధ్యఅవభాసిని ఏర్పడిన కార్డోటోనల్ అంగంలోని యాంత్రిక గ్రాహకాలు.

ప్రశ్న 33.
బొద్దింక నేత్రాంశం, దివాచర కీటకం కంటే ఏ విధంగా భిన్నమైనది?
జవాబు:
బొద్దింక నిశాచర కీటకం, దివాచర కీటకాలలో నేత్రాంశంలోని ఉండే శంకుకణాల కింద ఉండే రెటిన్యూ స్థానం మరియు, ప్రతిబింబాలు ఏర్పడే విధానం భిన్నంగా ఉంటుంది. బొద్దింకలో ఏర్పడే ఎప్పొజిజేషన్ ప్రతిబింబం, సూపర్ పొజిషన్ ప్రతిబింబం ఏర్పడే విధానం కూడా భిన్నంగా ఉంటుంది.

ప్రశ్న 34.
ఏ ఉదర నాడీసంధి అతిపెద్దది? ఎందుకు?
జవాబు:
ఆరవ ఉదర నాడీ సంధి అతిపెద్దది. ఇది ఉదరానికి చెందిన 7, 8, 9, 10 ఖండితాలు నాడీ సంధులన్ని కలసిపోవడంవల్ల ఏర్పడుతుంది.

ప్రశ్న 35.
బొద్దింక సంయుక్త నేత్ర నిర్మాణాత్మక, క్రియాత్మక ప్రమాణం పేరు తెలపండి. ఒక సంయుక్త నేత్రంలో అలాంటి ప్రమాణాలు ఎన్ని?
జవాబు:
బొద్దింక సంయుక్త నేత్ర నిర్మాణాత్మక, క్రియాత్మక ప్రమాణం నేత్రాంశం. ఒక సంయుక్త నేత్రంలో ఇలాంటి నేత్రాంశాలు సుమారు 2,000 వరకు ఉంటాయి.

ప్రశ్న 36.
బొద్దింక మెదడును ప్రధాన జ్ఞానకేంద్రం అని ఎందుకంటారు?
జవాబు:
బొద్దింక మెదడు ప్రధానంగా నేత్రాలు, నోటి భాగాలు మిగిలిన అన్ని అవయవాలనుండి జ్ఞాన ప్రచోదనాలను గ్రహిస్తుంది. కనుక మెదడును ప్రధాన జ్ఞాన కేంద్రం అంటారు.

AP Inter 1st Year Zoology Study Material Chapter 7 పెరిప్లానెటా అమెరికానా (బొద్దింక)

ప్రశ్న 37.
ఎప్పొజిషన్, సూపర్ పొజిషన్ ప్రతిబింబాల మధ్య భేదం తెలపండి.
జవాబు:

ఎప్పొజిషన్ సూపర్ పొజిషన్
1. ఈ రకమైన ప్రతిబింబ దివాచర, కీటకాలలో ఏర్పడతాయి. 1. ఈ రకమైన ప్రతిబింబాలు నిశాచర కీటకాలలో ఏర్పడతాయి.
2. ఈ రకమైన దృష్టిలో ఏర్పడిన ప్రతిబింబం అనేక సూక్ష్మ ప్రతిబింబాల మెజాయిక్గా కనిపిస్తుంది. 2. అనేక ప్రతిబింబాలు ఒకదాని పక్కన ఒకటి ఉంటాయి.
3. దీనిని మొజాయిక్ దృష్టి అంటారు. 3. దీనిని అస్పష్ట దృష్టి అంటారు.

ప్రశ్న 38.
మగ, ఆడ బొద్దింకల మధ్య బేదాలను తెలిపే లక్షణాలను పేర్కొనండి.
జవాబు:

మగ బొద్దింక ఆడ బొద్దింక
1. ఉదరం సన్నగా, పొడవుగా ఉంటుంది. 1. ఉదరం పొట్టిగా, వెడల్పుగా ఉంటుంది.
2. పరాంతంలో ఒక జత పాయుశూకాలుంటాయి. 2. పరాంతంలో అండనిక్షేపంకం ఉంది.
3. ఎనిమిదవ పృష్ఠ ఫలకం కనపడదు. 3. ఎనిమిది, తొమ్మిదవ పృష్ఠ ఫలకాలు కనిపించవు.
4. తొమ్మిది ఉరః పలకాలు కనిపిస్తాయి. 4. 7 ఉరః ఫలకాలు కనిపిస్తాయి.
5. పాయు కీలాలు ఉంటాయి. 5. పాయు కీలాలు ఉండవు.

ప్రశ్న 39.
బొద్దింకలో గల మష్రూమ్ (పుట్ట గొడుగు) గ్రంథి విధి ఏమిటి?
జవాబు:
బొద్దింకలో 6, 7 ఉదర ఖండితాలలో ఒక పుట్ట గొడుగు ఆకారపు గ్రంధి ఉంటుంది. ఇది అదనపు ప్రత్యుత్పత్తి గ్రంథిలా పనిచేస్తుంది.

ప్రశ్న 40.
మష్రూమ్ గ్రంథి యొక్క యుట్రిక్యులై మేజోర్స్, యుట్రికులై బ్రివోర్స్ విధులను పోల్చండి.
జవాబు:
మష్రూమ్ గ్రంథియొక్క యుట్రిక్యులై మేజోర్స్ శుక్ర గుళిక లోపలి స్తరాన్ని ఏర్పరుస్తుంది. యుట్రిక్యులై బ్రివోర్స్ పోషణ ఇస్తుంది.

ప్రశ్న 41.
ఫెలోమియర్ అంటే ఏమిటి?
జవాబు:
మగ బొద్దింకలో సంపర్కానికి తోడ్పడే, బాష్పీ జనన నిర్మాణాలను ఫెలోమియర్ లేదా గొనాపోఫైసిస్లు లేదా ఫేలిక్ అవయవాలు అంటారు. ఇవి పురుష జననరంద్రం చుట్టూ ఉండే కైటిన్ నిర్మితాలు.

AP Inter 1st Year Zoology Study Material Chapter 7 పెరిప్లానెటా అమెరికానా (బొద్దింక)

ప్రశ్న 42.
గొనపోఫైసిస్ అంటే ఏమిటి?
జవాబు:
మగ బొద్దింక జనన రంద్రం చుట్టూ ఉండే కైటిన్ నిర్మాణాలను గోనాపోఫైసిస్, లేదా ఫెలోమియర్ అంటారు. ఇవి సంపర్కంలో తోడ్పడే బాహ్య జనన నిర్మాణాలు.

ప్రశ్న 43.
పెరిప్లానెటా ప్రత్యుత్పత్తిలో కొల్లాటీరియల్ గ్రంథి ఏ విధంగా తోడ్పడుతుంది?
జవాబు:
పెరిప్లానేటాలో స్త్రీ బీజకోశాల వెనుక ఒక జత కొల్లాటీరియ గ్రంథులుంటాయి. వీటి స్రావాలు గుడ్లచుట్టు ఒక దృడమైన పెట్టెను ఏర్పరుస్తాయి. ఈ పెట్టెను గుడ్ల పెట్టె అంటారు.

ప్రశ్న 44.
పారామెటాబోలస్ అభివృద్ధి అంటే ఏమిటి?
జవాబు:
బొద్దింక అభివృద్ధిలో గుడ్ల నుండి అపరిపక్వ పిల్ల బొద్దింకలు విడుదలవుతాయి. వీటిని సరూపశాభకాలు అంటారు. ఇలా ఏర్పడిన సరూపశాభకం ప్రౌఢ బొద్దింక ఏర్పడటాన్ని పారామెటాబోలస్ అంటారు.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
బొద్దింక నోటి భాగాలను చక్కని పటాన్ని గీసి భాగాలను గుర్తించండి. [Mar. ’14]
జవాబు:
AP Inter 1st Year Zoology Study Material Chapter 7 పెరిప్లానెటా అమెరికానా (బొద్దింక) 1

ప్రశ్న 2.
బొద్దింకలో జీర్ణక్రియా విధానాన్ని వివరించండి.
జవాబు:
బొద్దింక సర్వభక్షక కీటకం. దీని నోటి భాగాలు ఆహారాన్ని కొరికి నమిలే విధంగా ఉంటాయి.

కీటకం ఆహారాన్ని కొరికి ముక్కలుగా చేసి, నోటిలో నమిలే సమయంలో ఆహారం నోటిలోని లాలాజలంతో కలుస్తుంది.

జీర్ణక్రియ :
ఆహార సంగ్రణ తరువాత ఆహారం గ్రసని, ఆహారవాహికల ద్వారా అన్నాశయాన్ని చేరుతుంది. ఇక్కడ ఆహారం లాలాజలంతోను, అంతర జఠరం నిలువు గాడుల ద్వారా మధ్యాంత్రం నుండి వచ్చి చేరిన జీర్ణ రసాలతోను కలుస్తుంది. అందువలన చాలావరకు ఆహారం అన్నాశయంలోనే జీర్ణమవుతుంది. పాక్షికంగా జీర్ణమైన ఆహారం అంతర జఠరంలోని గండు రోమాల ద్వారా వడపోయబడి, ఆద్యముఖ కవాటం ద్వారా మధ్యాంత్రాన్ని చేరుతుంది.

నమిలే సమయంలో ఆహారం నోటిలోని లాలాజలంతో కలుస్తుంది.

  1. లాలాజల అమైలేస్ పిండి పదార్థాలను మొదట డైసాకరైడ్లుగా తరువాత సుక్రోజ్ మారుస్తుంది.
  2. ఇన్వర్టేస్ లేదా సుక్రేస్ ఎంజైమ్ సుక్రోస్ను గ్లూకోస్ మరియు ఫ్రక్టోస్ మారుస్తుంది.
  3. మాల్టేజ్ ఎంజైమ్ మాల్టోస్ ను గ్లూకోస్ గా మారుస్తుంది.
  4. లైపేస్ అనే ఎంజైమ్ కొవ్వులను కొవ్వు ఆమ్లాలు గాను, గ్లీసరాల్గా జలవిశ్లేషణ గావిస్తుంది.
  5. ప్రోటియేస్లు అనబడే ఎంజైములు మాంసకృత్తులను అమినో ఆమ్లాలుగా జీర్ణం చేస్తుంది.
  6. అంత్యాహార నాళంలో ఉండే సూక్ష్మజీవులు సెల్యులేస్ అనే ఎంజైమును స్రవించి సెల్యులోస్ న్ను గ్లూకోస్గా జీర్ణం చేస్తాయి.

జీర్ణమైన ఆహారం మధ్యాంత్రంలో శోషణం చెందుతుంది. జీర్ణం కాని ఆహార పదార్థాలు శేషాంత్రికం, పెద్దపేగు గుండా ప్రయాణించి పురుషనాళాన్ని చేరుతుంది. ఇక్కడ ఆహార పదార్థాలతో బాటుగా ఉన్న నీరు పునఃశోషణ గావించబడి జీర్ణంకాని ఆహార పదార్థాలు పొడిగా, ఘనరూపంలో ఉండే పెంటికలుగా విసర్జించబడతాయి.

ప్రశ్న 3.
బొద్దింక లాలాజల పరికరపు చక్కని పటాన్ని గీచి భాగాలను గుర్తించండి.
జవాబు:
AP Inter 1st Year Zoology Study Material Chapter 7 పెరిప్లానెటా అమెరికానా (బొద్దింక) 2

ప్రశ్న 4.
పెరిప్లానెటా హృదయ నిర్మాణం, విధిని వివరించండి.
జవాబు:
పెరిప్లానెటా హృదయం :
హృదయం హృదయావరణ రక్తకుహరంలో లేదా పృష్ఠకోటరంలో ఉంటుంది. ఇది పొడవాటి, కండరయుత, సంకోచశీల నాళం. ఇది పృష్ఠమధ్యాయుతంగా పక్షం, ఉదరంలోని పృష్ఠఫలకాల దిగువన ఉంటుంది. దీనిలో పదమూడు గదులుంటాయి. ప్రతీ గది దాని ముందరనున్న గదిలోకి తెరుచుకుంటుంది. పదమూడు గదుల్లో మూడు గదులు వక్షంలో, పది గదులు ఉదరంలో ఉంటాయి. దీని పరాంతం మూసుకొని ఉంటుంది. పూర్వాంతం, ముందుకు సాగి పూర్వ మహాధమనిగా కొనసాగుతుంది. చివరి గది తప్ప ప్రతీ గది పరాంతపు అంచులో ‘ఆస్టియా’ (Ostia) అనే ఒక జత చిన్న కవాటయుత రంధ్రాలుంటాయి. ఇవి రెండు వైపులా ఒక్కొక్కటి చొప్పున ఉంటాయి. కవాటాలు పృష్ఠ కోటరం నుంచి హృదయంలోకి మాత్రమే రక్తం ప్రసరించేలా అనుమతిస్తాయి.

AP Inter 1st Year Zoology Study Material Chapter 7 పెరిప్లానెటా అమెరికానా (బొద్దింక)

ప్రశ్న 5.
పెరిప్లానెటాలో రక్తప్రసరణ ప్రక్రియను వర్ణించండి.
జవాబు:
పెరిప్లానెటాలో రక్తం వర్ణరహితంగా ఉంటుంది. దీనిలో రక్త వర్ణకాలు ఉండవు. కనుక దీనిని రక్తశోషరసం అంటారు. దీనిలో జీవద్రవ్యం, స్వేచ్ఛా రక్తకణాలు ఉంటాయి.

బొద్దింక రక్తప్రసరణలో రక్తం రక్తనాళాలలో ప్రవహించదు. శరీర కుహరం రక్తంచే నింపబడి రక్త శరీర కుహరంగా పిలువబడుతుంది. రక్త ప్రసరణ వ్యవస్థలో ప్రధానంగా రక్తకుహరం, గుండె, రక్తం అనే భాగాలుంటాయి.

గుండె గదుల సంకోచం వల్ల గుండెలోని రక్తం ముందుకు ప్రవహిస్తుంది. ఈ రక్తం మహాధమనిలోకి ప్రవహించి, అక్కడి నుండి తలలోని కోటరానికి ప్రవహిస్తుంది. తల కోటరం నుంచి పర్యాంతరాగ కోటరాలకు, ఉదరఫలక కోటరాలకు ప్రవహిస్తుంది. పక్షాకార కండరాల సంకోచంతో హృదయావరణ విభాజకం కిందికి నెట్టబడుతుంది. ఈ చర్య హృదయావరణ కోటర ఘనపరిమాణాన్ని పెంచుతుంది. అందువల్ల రక్తం పర్యాంతరాంగ కోటరం నుంచి హృదయావరణ కోటరంలోకి హృదయావరణ విభాజకం రంధ్రాల ద్వారా ప్రవహిస్తుంది. పక్షాకార కండరాల సడలిక వల్ల, హృదయావరణ విభాజకం పైకి అంటే దాని అసలైన ప్రదేశంలోకి చేరుతుంది. ఇది రక్తాన్ని ఒత్తిడి చేసి హృదయావరణ కోటరం నుంచి ఆస్టియంల ద్వారా గుండె గదులకు చేరుతుంది.
AP Inter 1st Year Zoology Study Material Chapter 7 పెరిప్లానెటా అమెరికానా (బొద్దింక) 3

ప్రశ్న 6.
పక్షాకార కండరాల సంకోచ సడలికలు ఏ విధంగా రక్తప్రసరణలో తోడ్పడతాయి?
జవాబు:
రక్త ప్రసరణలో పక్షాకార కండరాల సంకోచ, వ్యాకోచాలు చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తాయి. రక్త, రక్తనాళాలలో కాక . కోటరాలలో ప్రవహిస్తుంది. పక్షాకార కండరాల సంకోచంతో హృదయావరణ విభాజకం క్రిందికి నెట్టబడుతుంది. ఈ చర్య హృదయావరణ కోటర ఘనపరిమాణాన్ని పెంచుతుంది. అందువలన పర్యాంతరాంగ కోటరం నుండి హృదయావరణ కోటరంలోకి రక్తం హృదయావరణ విభాజకం రంధ్రాల ద్వారా ప్రవహిస్తుంది.

పక్షాకార కండరాల సడలిక వలన హృదయావరణ విభాజకం పైకి అనగా దాని అసలు ప్రదేశానికి చేరుతుంది. దీనివలన హృదయావరణ కోటరంలోని రక్తంపై ఒత్తిడి కలుగజేయటం వలన రక్తం హృదయావరణ కోటరం నుండి ఆస్టియంల ద్వారా గుండె గదులకు చేరుతుంది.

ప్రశ్న 7.
పెరిప్లానెటాలో గల వివిధ విసర్జక అవయవాలు ఏవి ? విసర్జనక్రియను వివరంగా వర్ణించండి.
జవాబు:
బొద్దింక విసర్జక వ్యవస్థ నత్రజని సంబంధిత వ్యర్థాలను దేహం నుండి గ్రహించి యూరిక్ ఆమ్ల రూపంలో వెలుపలికి విసర్జించడానికి తోడ్పడుతుంది. అందువలన పెరిప్లానేటాను యూరికోటెలిక్ జీవి అంటారు. బొద్దింకలో విసర్జన క్రియను నిర్వర్తించే సంబంధింత అవయవాలు లేదా నిర్మాణాలు మాల్ఫీజియన్ నాళికలు, కొవ్వు దేహాలు, యూరికోజ్ గ్రంథులు, వృక్కకణాలు, అవభాసిని.

మాల్ఫీజియన్ నాళికలు :
మాల్ఫీజియన్ నాళికల గ్రంథి కణాలు నీటిని, CO2, లవణాలను నత్రజని వ్యర్థాలను రక్తం నుంచి శోషించి, నాళికా కుహరంలోకి స్రవిస్తాయి. నాళికల సమీపాగ్ర భాగ కణాలు నీటిని, కొన్ని ఉపయుక్త లవణాలను పునఃశోషణ చేస్తాయి. మిగిలిన విసర్జిత భాగం శేషాంత్రికంలోకి నెట్టబడుతుంది. ఇందులోని చాలా నీరు పునఃశోషణ చేయబడి, పురీష నాళాన్ని చేరినప్పుడు మరింత నీరు పునఃశోషణ జరిగి యూరిక్ ఆమ్లం దాదాపు ఘనరూపంలో మలంతోబాటు విసర్జించబడుతుంది.

కొవ్వు దేహాలు :
కొవ్వు దేహం అనేది తెల్లటి లంబికల నిర్మాణం. ఈ దేహంలోని యూరేట్ కణాలు విసర్జనలో తోడ్పడతాయి. ఈ కణాలు జీవితాంతం యూరిక్ ఆమ్లాన్ని శోషణం చేసి నిల్వ చేస్తాయి. వసాదేహం కణాలలో ఉన్న ఈ విధమైన నిల్వ పద్ధతిని ‘నిల్వవిసర్జన’ (Storage excretion) అంటారు.

యూరికోజ్ గ్రంథులు :
మగ బొద్దింక మష్రూమ్ గ్రంథిలో ఉన్న యూరికోజ్ గ్రంథి (Uricose gland) లేదా యుట్రిక్యులై మేజోర్స్ (Utriculi majores) లో యూరిక్ ఆమ్లం నిల్వ ఉంటుంది. అవి సంపర్క సమయంలో దీన్ని విసర్జిస్తాయి.

అవభాసిని :
కొన్ని నత్రజని సంబంధిత వ్యర్థపదార్థాలు అవభాసినిపై నిక్షేపం చెంది నిర్మోచన సమయంలో తొలగించబడతాయి.

ప్రశ్న 8.
పెరిప్లానెటా నీటిని ఏ విధంగా సంరక్షిస్తుంది? దీన్ని విసర్జనక్రియ ఆధారంగా తెలపండి.
జవాబు:
బొద్దింక మామూలుగా నీటిని తీసుకొని ఆహారంతో పాటుగా వచ్చే నీటిని ఇది దేహంలో కొన్ని పొదుపు చర్యలు పాటిస్తూ సంరక్షించుకుంటుంది.
1) దేహం మొత్తం కైటిన్ నిర్మిత ఫలకాలచే కప్పబడి ఉండుట వలన స్వేదం రూపంలో వ్యర్థం కానివ్వదు.

2) విసర్జన యూరికామ్ల రూపంలో విసర్జిస్తుంది కనుక నీరు వ్యర్థమవదు. నీటిని సంరక్షించుకోవడంలో బొద్దింకలో విసర్జన అవయావలు, మాల్ఫీజియన్ నాళికలు, పురీషనాళం, కొవ్వు దేహాలు, యూరికోస్ గ్రంథులు, అవభాసిని విసర్జన క్రియలో ముఖ్య పాత్ర వహిస్తాయి. మాల్ఫీజియన్ నాళికలు రక్తంలోని నత్రజని సంబంధిత వ్యర్థాలను, CO2 ను ఇతర విసర్జక పదార్థాలను, నీటిని శోషిస్తుంది. దీనిలో సమీపాగ్ర భాగం ఉపయుక్త పదార్థాలను, నీటిని పునఃశోషణ కావిస్తుంది. ఇప్పుడు విసర్జక పదార్థం శేషాత్రికంలోకి నెట్టబడుతుంది. ఇక్కడ చాలా వరకు నీరు పునఃశోషణ గావించబడుతుంది. తరువాత విసర్జక పదార్థం పురీషనాళం చేరుతుంది. ఇక్కడ మరింతగా నీరు పునఃశోషణ జరిగి యూరిక్ ఆమ్ల రూపంలో దాదాపు ఘన పదార్థ విసర్జింపబడుతుంది.

పై విధంగా ఆహార నాళం ద్వారా నత్రజని సంబంధ వ్యర్థాలను విసర్జిస్తూ, వ్యర్థ పదార్థాలలోని నీటిని పూర్తిగా పునఃశోషణ గావిస్తూ యూరికామ్ల రూపంలో విసర్జించడం నీటిని సంరక్షించుకునే అనుకూలనం.

ప్రశ్న 9.
నేత్రాంశాన్ని చక్కని పటం గీసి భాగాలతో వివరించండి.
జవాబు:
AP Inter 1st Year Zoology Study Material Chapter 7 పెరిప్లానెటా అమెరికానా (బొద్దింక) 4

ప్రశ్న 10.
మగ, ఆడ బొద్దింకలను ఏ విధంగా గుర్తిస్తారు ? వాటి బాహ్య, అంతర జననాంగాలను, లక్షణాలను వివరించండి.
జవాబు:
పెరిప్లానేటా ఏకలింగ జీవి. స్త్రీ, పురుష జీవుల్లో బాగా అభివృద్ధి చెందిన ప్రత్యుత్పత్తి అవయవాలుంటాయి. లైంగిక ద్విరూపకత బాహ్యంగాను, అంతర్గతంగాను స్పష్టంగా కనిపిస్తుంది. స్త్రీ జీవి ఉదరం పొట్టిగా, వెడల్పుగా ఉంటుంది. దాని పరాంతంలో అండ నిక్షేపం ఉంటుంది. పురుష జీవి ఉదరం సన్నగా, పొడవుగా ఉంటుంది. దీని పరాంతంలో ఒక జత పాయు శూకాలు ఉంటాయి.

జీవి ఉదరభాగాన్ని పరిశీలిస్తే పృష్ఠ ఫలకాలు 10 ఉంటాయి కాని ఉరఃఫలకాలు తొమ్మిది మాత్రమే ఉంటాయి. పదో ఉరః ఫలకం ఉండదు. మగజీవిలో ఎనిమిదో పృష్ఠఫలకం, స్త్రీ జీవులలో ఎనిమిదో, తొమ్మిదో పృష్ఠ ఫలకాలు కనపడవు. మగజీవిలో తొమ్మిది ఉరఃఫలకాలు, స్త్రీ జీవిలో ఏడు ఉరఃఫలకాలు కనబడతాయి. ఏడో, ఎనిమిదో, తొమ్మిదవ ఉరఃఫలకాలు కలిసి గుడ్ల సంచిని ఏర్పరుస్తాయి.

మగ జీవిలో ఉదరానికి పరభాగంలో ఒక జత పాయు ఉపాంగాలు, ఒక జత పాయుకీలాలు, గొనాపోఫైసిస్లు ఉంటాయి. పాయువాంగాలు అతుకుల సహితంగా ఉండి పదోషృష్ఠఫలకం పార్శ్వ భాగాల నుంచి ఏర్పడతాయి. ఇవి స్త్రీ, పురుష జీవులలోనూ ఉంటాయి. పాయుకీలాలు అతుకుల రహితంగా ఉండి తొమ్మిదో ఉరః ఫలకం నుండి ఏర్పడతాయి. ఇవి మగ జీవులలో మాత్రమే ఉంటాయి. ఐనాపోఫైసిస్లు మగ జీవులలో తొమ్మిదో ఉరఃఫలకం, స్త్రీ జీవులలో ఎనిమిదో, తొమ్మిదో ఉరః ఫలకాల నుండి వచ్చే చిన్న కైటిన్ నిర్మితాలు. ఇవి బాహ్య జననాంగాలు. ఉదరానికి పరభాగంలో పాయువు ఉంటుంది. మగ జీవులలో జనన రంధ్రం పాయువు కింద, ఒక గొనాపోఫైసిస్ పైన ఉంటుంది. స్త్రీ జీవుల్లో అది ఎనిమిదో ఉరఃఫలకంపై ఉంటుంది.

AP Inter 1st Year Zoology Study Material Chapter 7 పెరిప్లానెటా అమెరికానా (బొద్దింక)

ప్రశ్న 11.
బొద్దింక పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థను వర్ణించండి.
జవాబు:
AP Inter 1st Year Zoology Study Material Chapter 7 పెరిప్లానెటా అమెరికానా (బొద్దింక) 5
పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ :
పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఒక జత ముష్కాలు ఉంటాయి. ఇవి పొడవుగా ఉండే లంబికలు గల నిర్మాణాలు. ఇవి నాలుగు నుంచి ఆరు ఉదర ఖండితాలు పార్శ్వ భాగాలలో ఇరువైపులా కొవ్వు దేహాల్లో ఇమిడి ఉంటాయి. ఒక్కో ముష్కం పరభాగం నుంచి సన్నటి శుక్రవాహిక (Vas deferens) ఆరంభమవుతుంది. రెండు శుక్రవాహికలు వెనుకకు లోపలి వైపుగా ప్రయాణించి ఏడో ఖండితంలోని వెడల్పైన మధ్యస్థ స్కలననాళం (Ductus ejaculatus) లోకి తెరచుకుంటాయి. ఆ ఆరో ఏడో ఉదర ఖండితాల్లో ఒక పుట్టగొడుగు ఆకారపు గ్రంథి ఉంటుంది. ఇది అదనపు ప్రత్యుత్పత్తి గ్రంథిలాగా పనిచేస్తుంది. ఈ గ్రంథిలో రెండు రకాల నాళికలు ఉంటాయి. 1) పొడవైన సన్నటి నాళికలు యుట్రిక్యులై మేజోర్స్ (Utriculi majores) లేదా ‘పరిధీయ నాళికలు’, 2) పొట్టిగా ఉండే యుట్రిక్యులై బ్రివోర్స్ నాళికలు (Utriculi breviores) యుట్రిక్యులై మేజోర్స్ శుక్రగుళిక లోపలి స్తరాన్ని ఏర్పరచగా, యుట్రిక్యులై బ్రివోర్స్ శుక్రకణాలకు పోషణనిస్తాయి. ఈ నాళికలు స్కలననాళిక (Ejaculatory duct) పూర్వభాగంలో తెరుచుకుంటాయి.

శుక్రాశయాలు, స్కలన నాళిక ఉదరంలో ఉంటాయి. ఇవి శుక్రకణాలను కట్టలుగా చేసి నిల్వ ఉంచుతాయి. వీటిని శుక్రగుళికలు (Spermatophores) అంటారు. స్కలన నాళం కండరయుతమైంది. ఇది పరాంతం వరకు సాగి ‘పురుష జననరంధ్రం’ (Gonopore) లోకి తెరుచుకుంటుంది. బొద్దింక పురుష జననాంగాలతో పాటూ, ఒక ఫేలిక్ (Phallic) లేదా కాంగ్లోబేట్ (Conglobate) గ్రంథి ఉంటుంది. దీని నాళం జననరంధ్రం దగ్గర తెరుచుకుంటుంది. దీని విధి ఇంతవరకు తెలియదు. పురుష జననరంధ్రం చుట్టూ అసౌష్ఠవమైన కైటినస్ నిర్మాణాలు అంటే, ఫేలిక్ అవయవాలు లేదా గొనాపోఫైసిస్లు లేదా ఫెలోమియర్లు ఉంటాయి. ఇవి సంపర్కంలో తోడ్పడతాయి. ఇవి పురుషజీవి బాహ్య జననాంగాలు.

ప్రశ్న 12.
బొద్దింక స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థను వర్ణించండి.
జవాబు:
స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ :
స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఒక జత స్త్రీ బీజకోశాలు, ఒక జత స్త్రీ బీజవాహికలు, యోని, శుక్రగ్రాహికలు, శుక్రగ్రాహిక సూక్ష్మాంకురం మరియు కొల్లాటీరియల్ గ్రంథులు ఉంటాయి.

స్త్రీ బీజకోశాలు :
ఒక జత పెద్ద స్త్రీ బీజకోశాలు 2-6 ఉదర ఖండిత పార్శ్వ భాగాలలో ఉంటాయి. ఇవి లేత పసుపు రంగులో కొవ్వు దేహాలతో చుట్టబడి ఉంటాయి. ప్రతి స్త్రీ బీజకోశానికి ఎనిమిది స్త్రీ బీజకోశనాళికలు లేదా ఒవేరియోల్స్ (Ovarioles) ఉంటాయి. ఒక్కొక్క ఒవేరియోల్కు జర్మేరియమ్ (Germarium) అనే సాగి మొనదేలి ఉన్న పూర్వాంత పోగు, వెడల్పైన పరాంత విటలేరియం (Vitellarium) ఉంటాయి. జర్మేరియంలో అభివృద్ధి చెందుతున్న అనేక అండదశలు, విటలేరియంలో సొనతో పాటు పరిపక్వ అండాలు ఉంటాయి. ఒక్కొక్క స్త్రీ బీజకోశంలో ఉన్న ఒవేరియోల్ల సన్నగా సాగిన అంచులన్నీ కలిసి ఒక తాడుగా మారి పృష్ఠ దేహకుడ్యానికి అతుక్కొంటుంది. పరాంత అంచులు కలిసి కురచని వెడల్పైన స్త్రీ బీజవాహిక (Oviduct) గా ఏర్పడుతుంది. స్త్రీ బీజవాహికలు కలసిపోయి మధ్యలో అతి చిన్న యోని (Vagina) ఏర్పడుతుంది.
AP Inter 1st Year Zoology Study Material Chapter 7 పెరిప్లానెటా అమెరికానా (బొద్దింక) 6

యోని నిలువు రంధ్రాన్ని స్త్రీ జననరంధ్రం అంటారు. ఇది ఎనిమిదో ఉరఃఫలకంలో పెద్ద జననాశయం (Genital pouch) లోకి తెరుచుకుంటుంది., శుక్రగ్రాహిక లేదా శుక్రధానం (Seminal receptacle) ఎడమవైపున తిత్తితో, కుడివైపున పోగులాంటి అంధనాళంతో 6వ ఖండితంలో ఉంటుంది. ఇది 9వ ఉరః ఫలకంలోని జననాశయంలో ఒక మధ్యస్థ రంధ్రం ద్వారా తెరుచుకుంటుంది. ఫలవంతమైన స్త్రీ జీవిలో శుక్రగ్రాహికలు సంపర్కం ద్వారా గ్రహించిన శుక్రగుళికలను కలిగి ఉంటాయి.

స్త్రీ బీజకోశాల వెనక ఒక జత శాఖాయుతమైన కొల్లాటీరియల్ గ్రంథులు (Colleterial glands) ఉంటాయి. ఈ గ్రంథులు శుక్రగ్రాహిక రంధ్రం పైన వేర్వేరుగా జననాశయంలోకి తెరుచుకుంటాయి. ఈ రెండు కొల్లాటీరియల్ గ్రంథుల స్రావకాలు గుడ్ల చుట్టూ ఒక దృఢమైన పెట్టెను ఏర్పరుస్తాయి. దీన్నే గుడ్లుపెట్టె లేదా గుడ్లకోశం లేదా ఊథీకా (Ootheca) అంటారు. జననాశయం ఏడో, ఎనిమిదో, తొమ్మిదో ఉదర ఖండితాల ఉరఃఫలకాలతో ఏర్పడుతుంది. ఏడో ఖండిత ఉరః ఫలకం పడవ ఆకారంలో ఉంటుంది. ఇది జననాశయం అడుగు, పక్క భాగంలో గోడలను ఏర్పరుస్తుంది. ఎనిమిదో, తొమ్మిదో ఖండితాల ఉరఃఫలకాలు ఏడో ఖండితంలో చొచ్చుకొని వరుసగా జననాశయం పూర్వాంతపు గోడ, దాని పైకప్పుగా ఏర్పడతాయి. జననాశయానికి రెండు గదులు ఉంటాయి. అవి : పూర్వాంతపు గైనాట్రియం (Gynatrium) లేదా జననకోశం, పరాంతపు వెస్టిబ్యులమ్ (Vestibulum) లేదా గుడ్లకోశం.

స్త్రీ జననరంధ్రం చుట్టూ మూడు జతల కైటిన్ నిర్మిత ఫలకాలు ఉంటాయి. వీటిని గొనాపోఫైసిస్లు అంటారు. ఇవి అండ విక్షేపకం (Ovipositor) గా ఏర్పడి అండాలకు గుడ్లకోశంలోకి మార్గం చూపుతాయి. ఇవి స్త్రీ బాహ్య జననాంగాలు.

దీర్ఘ సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
బొద్దింక జీర్ణవ్యవస్థను భాగాలు గుర్తించిన చక్కని పటం సహాయంతో వర్ణించండి.
జవాబు:
బొద్దింక జీర్ణవ్యవస్థ :
బొద్దింక జీర్ణవ్యవస్థలో ఆహారనాళం, దానికి సంబంధించిన అనుబంధ గ్రంథులు ఉంటాయి. నోటి ముందు, నోటి భాగాలు చుట్టి ఉన్న పూర్వకుహరం ఉంటుంది. అధోగ్రసని ఈ కుహరాన్ని రెండు కక్ష్యలుగా విభజిస్తుంది. అవి సిబేరియమ్ (Cibarium) (పూర్వభాగం), సెలైవేరియమ్ (Salivarium) (పరభాగం).

AP Inter 1st Year Zoology Study Material Chapter 7 పెరిప్లానెటా అమెరికానా (బొద్దింక) 7
ఆహారనాళం :
బొద్దింక ఆహారనాళం అక్కడక్కడా మెలికలు పడి చాలా పొడవుగా ఉంటుంది. ఇది నోరు, పాయువుల మధ్య విస్తరించి ఉంటుంది. ఇది మూడు ప్రాంతాలుగా విభజించబడింది. లాలాజల గ్రంథులు
అవి – పూర్వాహారనాళం లేదా ఆద్యముఖం (Stomodaeum), మధ్యాహార నాళం లేదా మధ్యాంత్రం (Mesenteron), అంత్యాహార నాళం లేదా పాయుపథం (Proctodaeum), పూర్వాహారనాళం, అంత్యాహార నాళం లోపలివైపు బాహ్యస్త్వచంతో ఆవరించబడ్డాయి. మధ్యాహారనాళం అంతస్త్వచ కణాలతో ఆవరించి ఉంటుంది.

పూర్వాహారనాళం :
పూర్వాహారనాళంలో గ్రసని, ఆహార వాహిక, అన్నాశయం, అంతరజఠరం ఉంటాయి. దీని లోపలితలంలో కైటిన్ నిర్మిత అవభాసిని ఉంటుంది. నోరు గ్రసని (Pharynx) లోకి, మాల్ఫీజియన్ గ్రసని సన్నని గొట్టం లాంటి ఆహారవాహిక (Oesophagus) లోకి తెరుచు కుంటుంది. ఆహారవాహిక పరభాగంలోని సాగే గుణం గల సంచి లాంటి అన్నాశయం (crop) లోకి తెరచుకొంటుంది. అన్నాశయం ఆహారాన్ని నిల్వ ఉంచుతుంది. దీని వెలుపలి తలం వాయునాళాల జాలకంతో ఆవరించబడి ఉంటుంది.

అన్నాశయానికి పరభాగంలో కండరాలతో కూడిన మందమైన గోడలు గల పూర్వగ్రంథుల జఠరిక (Proventriculus) లేదా అంతర జఠరం (Gizzard) ఉంటుంది. దాని లోపలి కైటిన్ పొరకు గల ఆరు శక్తిమంతమైన దంతాలు ప్రభావవంతమైన నమిలే పరికరంగా ఏర్పడతాయి. ప్రతి దంతం వెనకగా రోమాలు కలిగిన మెత్త ఉంటుంది. వీటికి వెనకవైపు గండు రోమాలు ఉంటాయి. ఈ ఫలకాల మధ్య ఆహారం సన్నటి రేణువులుగా విసరబడుతుంది. గండు రోమాలు ఆహారాన్ని వడపోస్తాయి. అంతర జఠరం పిండిమరలాగా, జల్లెడగా పనిచేస్తుంది. అంతర జఠరం నుంచి ఏర్పడిన త్వచ నిర్మాణం ఒక గరాటు లాంటి ఆద్యముఖ కవాటంగా (Stomodeal valve) ఏర్పడుతుంది. మధ్యాంత్రం చేరిన ఆహారం తిరిగి అంతర జఠరంలోకి ప్రవేశించకుండా (వెనకకు మళ్లడం) ఈ కవాటం నివారిస్తుంది.

మధ్యాహారనాళం (మధ్యాంత్రం లేదా గ్రంథుల జఠరిక) :
మధ్యాహారనాళం లేదా మధ్యాంత్రం అంతర జఠరం వెనక ఒక సన్నటి కురచ గొట్టంలా ఉంటుంది. దీన్ని మధ్యాంత్ర (Mesenteron) లేదా గ్రంథుల జఠరిక (Ventriculus) అంటారు. మధ్యాంత్రానికి అంతర జఠరానికి మధ్యలో 6 నుంచి 8 వేళ్ళ లాంటి అంధ బాహువులు మధ్యాంత్రం నుంచి ఉత్పన్నమవుతాయి, వీటిని కాలేయాంధ నాళాలు (Hepatic caecae) అంటారు. ఆహారపదార్థాలను జీర్ణం చేయడం, శోషణ జరపడం కాలేయాంధనాళాల విధి. మధ్యాంత్రంలో రెండు భాగాలు ఉంటాయి. అవి – పూర్వ స్రావక భాగం, పర శోషణ భాగం.

మధ్యాంత్రంలోని స్రావక భాగంలో గ్రంథి కణాలుండి చాలా రకాల ఎంజైమ్లను స్రవిస్తాయి. మధ్యాంత్రాన్ని చేరిన ‘ఆహారపు ముద్ద’ చుట్టూ రంధ్రయుతమైన కైటిన్ నిర్మిత పొర, పెరిట్రాఫిక్ త్వచం (Peritrophic membrane) ఉంటుంది. ఈ త్వచాన్ని అంతరజఠరపు గరాటు లాంటి ఆద్యముఖ కవాటం స్రవిస్తుంది.

మధ్యాంత్రపు పరభాగంలో పెరిట్రాఫిక్ త్వచం ద్వారా జీర్ణమైన ఆహారం రక్తంలోకి శోషణ చెందుతుంది. గట్టిగా ఉన్న ఆహారరేణువుల వల్ల మధ్యాంత్రకుడ్యం దెబ్బతినకుండా పెరిట్రాఫిక్ త్వచం రక్షిస్తుంది. మధ్యాంత్రం అంత్యాహారనాళంలోకి తెరచుకొనే రంధ్రాన్ని సంవరణి కండరం (Sphincter muscle) నియంత్రిస్తుంది. ఇది జీర్ణం కాని ఆహారాన్ని, యూరిక్ ఆమ్లాన్ని అంత్యాహారనాళం నుంచి తిరిగి మధ్యాంత్రంలోకి ప్రవేశించకుండా నివారిస్తుంది.

AP Inter 1st Year Zoology Study Material Chapter 7 పెరిప్లానెటా అమెరికానా (బొద్దింక) 8
అంత్యాహారనాళం లేదా పాయుపథం :
అంత్యాహార నాళాన్ని పాయుపథం అని కూడా అంటారు. ఇది పొడవైన మెలికలు తిరిగిన నాళం. దీనిలో మూడు భాగాలు ఉంటాయి. అవి శేషాంత్రికం (lleum), పెద్దపేగు (Colon), పురీషనాళం (Rectum). అంత్యాహారనాళ లోపలి తలాన్ని ఆవరించి కైటినన్ అవభాసిని ఉంటుంది. మధ్యాంత్రానికి వెనకవైపున ఉన్న పొట్టి నాళాన్ని శేషాంత్రికం అంటారు. మధ్యాంత్రం శేషాంత్రికం కలిసేచోట ఆరు కట్టలుగా అమరిన లేత పసుపురంగు అంధనాళికలైన మాల్ఫీజియన్ నాళికలు (Malpighian tubules) ఉంటాయి. ఇవి విసర్జకావయవాలు. శేషాంత్రికం మధ్యాంత్రం నుంచి జీర్ణం కాని ఆహారపదార్థాన్ని, మాల్ఫీజియన్ నాళికల నుంచి యూరిక్ఆమ్లాన్ని గ్రహిస్తుంది. ఇది తరవాతి పొడవైన మెలికలు తిరిగిన కోలాన్ లేదా పెద్ద పేగులోకి తెరుచుకొంటుంది. పెద్దపేగు పొట్టిగా వెడల్పుగా ఉన్న పురీషనాళంలోకి తెరుచుకొంటుంది. ఇది పాయువు ద్వారా బయటికి తెరుచుకొంటుంది. దీని లోపలితలంలో ఆరు నిలువు మడతలు ఉంటాయి. వీటిని పురీషనాళసూక్ష్మాంకురాలు (Rectal papillae) అంటారు. ఇవి జీర్ణం కాని ఆహారపదార్థం నుంచి నీటిని పునఃశోషణ కావిస్తాయి.

బొద్దింక ఆహారనాళానికి అనుబంధంగా ఉండే జీర్ణగ్రంథులు – లాలాజల గ్రంథులు, కాలేయాంధనాళాలు, మధ్యాంత్రంలోని గ్రంథి కణాలు.

లాలాజల గ్రంథులు (Salivary glands) :
ఒక జత లాలాజలగ్రంథులు అన్నాశయానికి ఇరువైపులా ఒక్కొక్కటి చొప్పున ఉదర పార్శ్వతలంలో అంటిపెట్టుకొని ఉంటాయి. ఒక్కొక్క లాలాజల గ్రంథిలో రెండు లంబికలు ఉంటాయి. ఒక్కొక్క లంబికలో ఎసినై (Acini) అనబడే అనేక సూక్ష్మ లంబికలు ఉంటాయి.

ప్రతి ఎసినస్ సూక్ష్మనాళికను కలిగి ఉన్న స్రావక కణాలైన జైమోజన్ కణాలను (Zymogen cells) కలిగి ఉంటుంది. ఒక వైపున ఉన్న రెండు లంబికలకు చెందిన సూక్ష్మనాళికలన్నీ ఐక్యలాలాజలనాళాన్ని (Common salivary duct) ఏర్పరుస్తాయి. రెండు వైపుల నుంచి ఏర్పడిన ఈ ఐక్య లాలాజల నాళాలు కలిసి మధ్య లాలాజలనాళంగా (Median salivary duct) ఏర్పడతాయి. మధ్యభాగంలో ఒక్కొక్కవైపున ఉన్న రెండు లాలాజల లంబికల మధ్య తిత్తిలాంటి లాలాజలాశయం (salivary receptacle) ఉంటుంది. ఇది లాలాజలాన్ని నిలువ చేస్తుంది. ఇది లాలాజలాశయ నాళం లేదా ‘ఆశయనాళం’కు ఏర్పడుతుంది.

ఇరువైపుల నుంచి ఏర్పడిన లాలాజలాశయనాళాలు కలిసి ఐక్య లాలాజలాశయనాళం లేదా ‘ఐక్య ఆశయనాళం’ (Reservoir duct) ఏర్పడుతుంది. మధ్య లాలాజలనాళం ఐక్య లాలాజలనాళంలోకి తెరుచుకొంటుంది. తరువాత ఇవి రెండూ కలిసి అపవాహి లాలాజలనాళంగా (Efferent salivary duct) ఏర్పడతాయి. అపవాహి లాలాజలనాళం అధోగ్రసని పీఠభాగం వద్ద తెరుచుకొంటుంది. ఎసినార్ కణాలు లాలాజలాన్ని స్రవిస్తాయి. దీనిలో పిండిపదార్థాలను జీర్ణం చేసే అమైలేస్ (Amylase) లాంటి ఎంజైములు ఉంటాయి. కాలేయాంధనాళాలు (Hepatic Caecae).

వీటిని ‘మధ్యాంత్ర అంధనాళాల’ని కూడా అంటారు. వీటిలో స్రావక సంబంధమైన, శోషణం జరిపే కణాలు ఉంటాయి. మధ్యాంత్ర గ్రంథి కణాలు.

మధ్యాంత్ర గ్రంథికణాలు మాల్టేస్, ఇన్వర్టేస్, ప్రోటియేజెస్, లైపేన్ లాంటి ఎంజైములను స్రవిస్తాయి.

AP Inter 1st Year Zoology Study Material Chapter 7 పెరిప్లానెటా అమెరికానా (బొద్దింక)

ప్రశ్న 2.
పెరిప్లానెటా రక్తప్రసరణవ్యవస్థను వివరంగా వర్ణించి, చక్కని పటాన్ని గీసి భాగాలను గుర్తించండి. [Mar. ’14]
జవాబు:
పెరిప్లానెటా రక్తప్రసరణ వ్యవస్థ :
రక్తప్రసరణవ్యవస్థ జీర్ణమైన ఆహారాన్ని హార్మోనులను మొదలైనవాటిని దేహంలో ఒక భాగం నుంచి మరొక భాగానికి రవాణా చేయడంలో తోడ్పడుతుంది. పెరిప్లానెటా రక్తప్రసరణవ్యవస్థ వివృత రకం (Open type), ఎందుకంటే దీనిలో రక్తం, రక్తశోషరసం, శరీరకుహరంలో లేదా రక్తకుహరంలో స్వేచ్ఛగా ప్రవహిస్తాయి. రక్తనాళాలు అంతగా అభివృద్ధి చెందలేదు. అవి వివిధ కోఠరాల్లోకి తెరుచుకొంటాయి. రక్తకుహరంలో ఉన్న అంతరాంగ అవయవాలు రక్తంలో మునిగి ఉంటాయి. పెరిప్లానెటా రక్తప్రసరణవ్యవస్థలో మూడు ముఖ్యమైన అనుబంధిత భాగాలు – రక్తకుహరం, గుండె, రక్తం ఉంటాయి.

రక్తకుహరం :
బొద్దింక రక్తకుహరం రెండు కండరయుత అడ్డు త్వచాలలో అంటే పృష్ఠ విభాజక పటలం (Dorsal diaphragm) లేదా హృదయావరణ విభాజకం, ఉదర విభాజకం (Ventral diaphragm) తో మూడు కోటరాలుగా విభజించబడింది. రెండు విభాజక పటలాలకు రంధ్రాలు ఉంటాయి. దేహంలోని ప్రతీ ఖండితానికి పార్శ్వతలాల్లో ఒక జత త్రిభుజాకార పక్షాకార కండరాలు (Alary muscles) ఒక శ్రేణిలో ఉంటాయి. ఇవి వెడల్పైన ఆధారంతో హృదయావరణ విభాజకానికి మొనదేలిన అంచు లేదా అగ్రంతో పృష్ఠ ఫలకాలకు అతుక్కొని ఉంటాయి. రక్తకుహరంలో ఉన్న మూడు కోటరాలు – హృదయావరణ రక్తకుహరం (Pericardial haemocoel) లేదా ‘పృష్ఠకోటరం’ (Dorsal sinus) పర్యాంతరాంగ రక్తకుహరం లేదా ‘మధ్యకోటరం’, ఉదరఫలక రక్తకుహరం (Perivisceral haemocoel) లేదా ‘ఉదరకోటరం’ లేదా పరినాడీ కోటరం’ (Perineural sinus) . అన్నింటిలో మధ్యకోటరం చాలా పెద్దది. ఎందుకంటే దీనిలో చాలా అంతరాంగ అవయవాలు ఉంటా ఉంటాయి. పృష్ఠ, ఉదర కోటరాలు చిన్నవి. వీటిలో గుండె, నాడీదండం మాత్రమే ఉంటాయి.
AP Inter 1st Year Zoology Study Material Chapter 7 పెరిప్లానెటా అమెరికానా (బొద్దింక) 9

హృదయం :
హృదయం హృదయావరణ రక్తకుహరంలో లేదా పృష్ఠకోటరంలో ఉంటుంది. ఇది పొడవాటి, కండరయుత, సంకోచశీల నాళం. ఇది పృష్ఠమధ్యాయుతంగా వక్షం, ఉదరంలోని పృష్ఠఫలకాల దిగువన ఉంటుంది. దీనిలో పదమూడు గదులుంటాయి. ప్రతీ గది దాని ముందరనున్న గదిలోకి తెరుచుకొంటుంది. పదమూడు గదుల్లో మూడు గదులు వక్షంలో, పది గదులు ఉదరంలో ఉంటాయి. దీని పరాంతం మూసుకొని ఉంటుంది. పూర్వాంతం, ముందుకు సాగి పూర్వ మహాధమనిగా కొనసాగుతుంది. చివరి గది తప్ప ప్రతీ గది పరాంతపు అంచులో ‘ఆస్ట్రియా’ (Ostia) అనే ఒక జత చిన్న కవాటయుత రంధ్రాలుంటాయి. ఇవి రెండు వైపులా ఒక్కొక్కటి చొప్పున ఉంటాయి. కవాటాలు పృష్ఠ కోటరం నుంచి హృదయంలోకి మాత్రమే రక్తం ప్రసరించేలా అనుమతిస్తాయి.

ప్రశ్న 3.
బొద్దింకలో శ్వాసవ్యవస్థను భాగాలు గుర్తించిన చక్కని పటం సహాయంతో వర్ణించండి.
జవాబు:
బొద్దింక శ్వాసవ్యవస్థ :
బొద్దింక రక్తంలో ఆక్సిజన్ని గ్రహించి రవాణా చేసే శ్వాసవర్ణకం ఉండదు. అందువల్ల అది అవసరమైన ఆక్సిజన్ను కణజాలాలకు అందించలేదు. వాతావరణంలోని ఆక్సిజన్ను నేరుగా కణజాలాలకు అందించే విధంగా శ్వాసనాళ వ్యవస్థ అభివృద్ధి. చెందింది. బొద్దింక శ్వాసవ్యవస్థలో శ్వాసరంధ్రాలు, వాయునాళాలు, వాయునాళికలు అనే భాగాలు ఉంటాయి.

శ్వాసరంధ్రాలు :
10 జతల శ్వాసరంధ్రాల (Stigmata or spiracles) ద్వారా శ్వాసనాళ వ్యవస్థ పరిసరాలతో సంబంధాన్ని కలిగి ఉంటుంది. మొదటి రెండు జతల శ్వాసరంధ్రాలు వక్ష ఖండితాలలో ఉంటాయి. వీటిలో ఒక జత మధ్యవక్షంలోనూ, రెండో జత అంత్యవక్షంలోనూ ఉంటాయి. మిగిలిన ఎనిమిది జతలు ఉదరం మొదటి ఎనిమిది ఖండితాలలో ఉంటాయి. ఈ రంధ్రాలు ఆయా ఖండితాల పార్శ్వఫలకాలలో ఉంటాయి. శ్వాసరంధ్రాల సంఖ్య, వాటి స్వభావాన్ని బట్టి కీటకాల శ్వాసవ్యవస్థను వర్గీకరిస్తారు. కనీసం మూడు జతల క్రియాత్మక శ్వాసరంధ్రాలు ఉంటే దాన్ని పాలీన్యూస్టిక్ (Polyneustic type) రకం అంటారు. మొత్తం జతలూ క్రియాత్మక శ్వాసరంధ్రాలయితే దాన్ని హోలోన్యూస్టిక్ రకం (Holoneustic type) అంటారు. అన్ని శ్వాసరంధ్రాలు కవాటయుతంగా ఉంటాయి. ప్రతి రంధ్రాన్ని చుట్టి కైటిన్తో తయారైన పెరిట్రీమ్ (Peretreme) అనే వర్తులాకార ఫలకం ఉంటుంది. ధూళి రేణువులు లోపలికి ప్రవేశించకుండా నివారించేందుకు శ్వాసరంధ్రాలకు చిన్న రోమాలు ట్రైకోమ్లు (Trichomes) ఉంటాయి. ప్రతి శ్వాసరంధ్రం ఏట్రియమ్ (Atrium) అనే కక్ష్యలోకి తెరుచుకొంటుంది.
AP Inter 1st Year Zoology Study Material Chapter 7 పెరిప్లానెటా అమెరికానా (బొద్దింక) 10

వాయునాళాలు :
వక్ష భాగంలోని శ్వాసరంధ్రాల ఏట్రియమ్ నుంచి అనేక క్షితిజ సమాంతరనాళాలు లోపలికి వ్యాపించి ఒకదానితో మరొకటి కలుసుకొంటూ ముఖ్య పృష్ఠ శిరోనాళాలు ముఖ్య ఉదర శిరోనాళాలను, వాటి శాఖలను ఏర్పరుస్తాయి. ఈ శాఖలన్నీ తలలోని అవయవాలకు వ్యాపిస్తాయి. వక్ష భాగంలో ముఖ్య పార్శ్వఆయత శ్వాసనాళాలు ఉంటాయి. ఉదరభాగపు శ్వాసరంధ్రాలు ఏ ఏట్రియమ్లలోకి తెరుచుకొంటాయి. ప్రతి ఉదరశ్వాసరంధ్రం యొక్క ఏట్రియమ్ నుంచి మూడు వాయునాళాలు ఉత్పన్నమవుతాయి.

ఒకవైపు ఉన్న ఈ నాళాలన్నీ మూడు వేరు వేరు ముఖ్య ఆయతనాళాల్లోకి తెరుచుకొంటాయి. వీటిని పృష్ఠ ఉదర, పార్శ్వ ప్రధాన ఆయత నాళాలు అంటారు. వీటిలో పార్శ్వనాళాలు అన్నింటికంటే పొడవుగా ఉంటాయి. రెండువైపులా ఉన్న ప్రధాన ఆయత నాళాలను కలుపుతూ, వాటి మధ్య సంధాయక నాళాలు (Commissural tracheae) ఉంటాయి. అన్ని ప్రధాన వాయునాళాల నుంచి అనేక ఉపశాఖలు బయలుదేరి వివిధ అవయవాల్లోకి వ్యాపిస్తాయి. ఇవి ఒక్కొక్క అంగంలోకి ప్రవేశించి ప్రత్యేక వాయునాళికా కణాల్లో (Tracheole cells) అంతమవుతాయి.

వాయునాళ కుడ్యం మూడు పొరలతో ఏర్పడుతుంది. అవి వెలుపలి ఆధారత్వచం (Basement membrane), మధ్య ఒక కణ మందంతో ఏర్పడిన ఉపకళ (Epithelium), లోపలి ఇంటిమా (Intima) అనే అవభాసిని స్తరం. ఇంటిమా వాయునాళాల్లో టినీడియా (Taenidia) అనే సర్పిలాకార మందాలను ఏర్పరుస్తుంది. టినీడియా వల్ల వాయునాళాలు ముకుళించుకుపోకుండా ఎల్లప్పుడూ తెరుచుకొనే ఉంటాయి.

వాయునాళికలు :
వాయునాళం చివరి కణాన్ని ట్రాకియోబ్లాస్ట్ (Tracheoblast) లేదా వాయునాళ కణం అంటారు. దీనిలో చాలా కణాంతస్థ వాయునాళ అంత్యాలు ఉంటాయి. వీటిని వాయునాళికలు (Tracheoles) అంటారు. వాయునాళికలకు ఇంటిమా, టినీడియాలు ఉండవు. ఇవి ట్రేకిన్ (Trachein) అనే ప్రొటీన్ నిర్మితాలు. ఈ నాళికల్లో వాయునాళికాద్రవం ఉంటుంది. బొద్దింకలు శారీరకంగా, జీవక్రియాత్మకంగా చురుకుగా ఉన్నప్పుడు వాయునాళికల్లోని వాయునాళికాద్రవం కణజాలాల్లోకి పీల్చుకోబడి దాని స్థాయి తగ్గుతుంది. బొద్దింక విరామస్థితిలో నిస్తేజంగా ఉన్నప్పుడు నాళికాద్రవం స్థాయి పెరుగుతుంది. వాయునాళికలు కణంలోకి చొచ్చుకొనిపోయి మైటోకాండ్రియాకు సన్నిహితంగా ఉంటాయి (వాటికి ఆక్సిజన్ సరఫరా చేయడానికి).

AP Inter 1st Year Zoology Study Material Chapter 7 పెరిప్లానెటా అమెరికానా (బొద్దింక)

ప్రశ్న 4.
పెరిప్లానేటా ప్రత్యుత్పత్తి వ్యవస్థను వివరించి, చక్కని పటాన్ని గీసి భాగాలను గుర్తించండి.
జవాబు:
పెరిప్లానేటా ఏకలింగజీవి. స్త్రీ, పురుష జీవులు లైంగిక ద్విరూపకతను అంతర్గతంగా, బహిర్గతంగా కూడా ప్రదర్శిస్తాయి. స్త్రీ జీవి ఉదరం పొట్టిగా, వెడల్పుగా ఉంటుంది. పరాంతంలో అండ నిక్షేపం ఉంటుంది. పురుషజీవి ఉదరం సన్నగా, పొడవుగా ఉంటుంది. పరాంతంలో ఒక జత పాయు శూకాలుంటాయి.

పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ :
పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఒక జత ముష్కాలు ఉంటాయి. ఇవి పొడవుగా ఉండే లంబికలు గల నిర్మాణాలు. ఇవి నాలుగు నుంచి ఆరు ఉదర ఖండితాలు పార్శ్వ భాగాలలో ఇరువైపులా కొవ్వు దేహాల్లో ఇమిడి ఉంటాయి. ఒక్కో ముష్కం పరభాగం నుంచి సన్నటి శుక్రవాహిక (Vas deferens) ఆరంభమవుతుంది. రెండు శుక్రవాహికలు వెనుకకు లోపలి వైపుగా ప్రయాణించి ఏడో ఖండితంలోని వెడల్పైన మధ్యస్థ స్కలననాళం (Ductus ejaculatus) లోకి తెరచుకుంటాయి. ఆరో, ఏడో ఉదర ఖండితాల్లో ఒక పుట్టగొడుగు ఆకారపు గ్రంథి ఉంటుంది. ఇది అదనపు ప్రత్యుత్పత్తి గ్రంథిలాగా పనిచేస్తుంది. ఈ గ్రంథిలో రెండు రకాల నాళికలు ఉంటాయి. 1) పొడవైన సన్నటి నాళికలు యుట్రిక్యులై మేజోర్స్ (Utriculi majores) లేదా ‘పరిధీయ నాళికలు’, 2) పొట్టిగా ఉండే యుట్రిక్యులై బ్రివోర్స్ నాళికలు (Utriculi breviores), యుట్రిక్యులై మేజోర్స్ శుక్రగుళిక లోపలి స్తరాన్ని ఏర్పరచగా, యుట్రిక్యులై బ్రివోర్స్ శుక్రకణాలకు పోషణనిస్తాయి.

ఈ నాళికలు స్కలననాళిక (Ejaculatory duct) పూర్వభాగంలో తెరుచుకుంటాయి. శుక్రాశయాలు, స్కలన నాళిక ఉదరతంలో ఉంటాయి. ఇవి శుక్రకణాలను కట్టలుగా చేసి నిల్వ ఉంచుతాయి. వీటిని శుక్రగుళికలు (Spermatophores) అంటారు. స్కలన నాళం కండరయుతమైంది. ఇది పరాంతం వరకు సాగి ‘పురుష జననరంధ్రం’ (Gonopore) లోకి తెరుచుకుంటుంది. బొద్దింక పురుష జననాంగాలతో పాటూ, ఒక ఫేలిక్ (Phallic) లేదా కాంగ్లోబేట్ (Conglobate) గ్రంథి ఉంటుంది. దీని నాళం జననరంధ్రం దగ్గర తెరుచుకుంటుంది. దీని విధి ఇంతవరకు తెలియదు. పురుష జననరంధ్రం చుట్టూ అసౌష్ఠవమైన కైటినస్ నిర్మాణాలు అంటే, ఫేలిక్ అవయవాలు లేదా గొనాపోఫెసిస్లు లేదా ఫెలోమియర్లు ఉంటాయి. ఇవి సంపర్కంలో తోడ్పడతాయి. ఇవి పురుషజీవి బాహ్య జననాంగాలు.
AP Inter 1st Year Zoology Study Material Chapter 7 పెరిప్లానెటా అమెరికానా (బొద్దింక) 5

స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ :
స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఒక జత స్త్రీ బీజకోశాలు, ఒక జత స్త్రీ బీజవాహికలు, యోని, శుక్రగ్రాహికలు, శుక్రగ్రాహిక సూక్ష్మాంకురం మరియు కొల్లాటీరియల్ గ్రంథులు ఉంటాయి.

స్త్రీ బీజకోశాలు :
ఒక జత పెద్ద స్త్రీ బీజకోశాలు 2-6 ఉదర ఖండిత పార్శ్వ భాగాలలో ఉంటాయి. ఇవి లేత పసుపు రంగులో కొవ్వు దేహాలతో చుట్టబడి ఉంటాయి. ప్రతి స్త్రీ బీజకోశానికి ఎనిమిది స్త్రీ బీజకోశనాళికలు లేదా ఒవేరియోల్స్ (Ovarioles) ఉంటాయి. ఒక్కొక్క ఒవేరియోల్కు జర్మేరియమ్ (Germarium) అనే సాగి మొనదేలి ఉన్న పూర్వాంత పోగు, వెడల్పైన పరాంత విటలేరియం (Vitellarium) ఉంటాయి. జర్మేరియంలో అభివృద్ధి చెందుతున్న అనేక అండదశలు, విటలేరియంలో సొనతో పాటు పరిపక్వ అండాలు ఉంటాయి. ఒక్కొక్క స్త్రీ బీజకోశంలో ఉన్న ఒవేరియోల్ల సన్నగా సాగిన అంచులన్నీ కలిసి ఒక తాడుగా మారి పృష్ఠ దేహకుడ్యానికి అతుక్కొంటుంది. పరాంత అంచులు కలిసి కురచని వెడల్పైన స్త్రీ బీజవాహిక (Oviduct) గా ఏర్పడుతుంది. స్త్రీ బీజవాహికలు కలసిపోయి మధ్యలో అతి చిన్న యోని (Vagina) ఏర్పడుతుంది.
AP Inter 1st Year Zoology Study Material Chapter 7 పెరిప్లానెటా అమెరికానా (బొద్దింక) 6

యోని నిలువు రంధ్రాన్ని స్త్రీ జననరంధ్రం అంటారు. ఇది ఎనిమిదో ఉరఃఫలకంలో పెద్ద జననాశయం (Genital pouch) లోకి తెరుచుకుంటుంది. శుక్రగ్రాహిక లేదా శుక్రధానం (Seminal receptacle) ఎడమవైపున తిత్తితో, కుడివైపున పోగులాంటి అంధనాళంతో 6వ ఖండితంలో ఉంటుంది. ఇది 9వ ఉరః ఫలకంలోని జననాశయంలో ఒక మధ్యస్థ రంధ్రం ద్వారా తెరుచుకుంటుంది. ఫలవంతమైన స్త్రీ జీవిలో శుక్రగ్రాహికలు సంపర్కం ద్వారా గ్రహించిన శుక్రగుళికలను కలిగి ఉంటాయి.

స్త్రీ బీజకోశాల వెనక ఒక జత శాఖాయుతమైన కొల్లాటీరియల్ గ్రంథులు (Colleterial glands) ఉంటాయి. ఈ గ్రంథులు శుక్రగ్రాహిక రంధ్రం పైన వేర్వేరుగా జననాశయంలోకి తెరుచుకుంటాయి. ఈ రెండు కొల్లాటీరియల్ గ్రంథుల స్రావకాలు గుడ్ల చుట్టూ ఒక దృఢమైన పెట్టెను ఏర్పరుస్తాయి. దీన్నే గుడ్లుపెట్టె లేదా గుడ్లకోశం లేదా ఊథీకా (Ootheca) అంటారు. జననాశయం ఏడో, ఎనిమిదో, తొమ్మిదో ఉదర ఖండితాల ఉరఃఫలకాలతో ఏర్పడుతుంది. ఏడో ఖండిత ఉరః ఫలకం పడవ ఆకారంలో ఉంటుంది. ఇది జననాశయం అడుగు, పక్క భాగంలో గోడలను ఏర్పరుస్తుంది. ఎనిమిదో, తొమ్మిదో కండితాల ఉరఃఫలకాలు ఏడో ఖండితంలో చొచ్చుకొని వరుసగా జననాశయం పూర్వాంతపు గోడ, దాని పైకప్పుగా ఏర్పడతాయి. జననాశయానికి రెండు గదులుంటాయి. అవి : పూర్వాంతపు గైనాట్రియం (Gynatrium) లేదా జననకోశం, పరాంతపు వెస్టిబ్యులమ్ (Vestibulum) లేదా గుడ్లకోశం.

స్త్రీ జననరంధ్రం చుట్టూ మూడు జతల కైటిన్ నిర్మిత ఫలకాలు ఉంటాయి. వీటిని గొనాపోఫైసిస్లు అంటారు. ఇవి అండ విక్షేపకం (Ovipositor) గా ఏర్పడి అండాలకు గుడ్లకోశంలోకి మార్గం చూపుతాయి. ఇవి స్త్రీ బాహ్య జననాంగాలు.

AP Inter 1st Year Zoology Study Material Chapter 6 మానవ సంక్షేమంలో జీవశాస్త్రం

Andhra Pradesh BIEAP AP Inter 1st Year Zoology Study Material 6th Lesson మానవ సంక్షేమంలో జీవశాస్త్రం Textbook Questions and Answers.

AP Inter 1st Year Zoology Study Material 6th Lesson మానవ సంక్షేమంలో జీవశాస్త్రం

అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
పరాన్న జీవనాన్ని నిర్వచించి, వివరించండి.
జవాబు:
రెండు వేరువేరు జాతులకు చెందిన జీవుల మధ్య గల ఒక రకమైన సహవాసంలో ఒక జీవి రెండవ దానికి తీవ్రంగా నష్టం కలిగిస్తూ లేదా ఎటువంటి నష్టం లేకుండా తాను లాభం పొందుతూ జీవించడాన్ని పరాన్న జీవనం అంటారు.
ఉదా : మానవ దేహంలో నివసించే ఎంటమీబా హిస్టాలిటికా. చెదపురుగు జీర్ణవ్యవస్థలో నివసించే ట్రెకోనింఫా.

ప్రశ్న 2.
వాహకం, ఆశయ అతిథేయి మధ్యగల భేదాన్ని గుర్తించండి.
జవాబు:
వాహకం :
పరాన్నజీవుల సాంక్రమిక దశలను ముఖ్య అతిథేయి నుంచి వేరొక అతిథేయికి చేరవేసే జీవిని వాహకం (vector) అంటారు.
ఉదా : ఈగలు, బొద్దింకలు

ఆశయ అతిథేయి :
ముఖ్య అతిథేయి దొరకనప్పుడు పరాన్నజీవుల సంక్రమణ దశలకు ఆశ్రయం కల్పించే అతిథేయిలను ఆశ్రయాతిథేయి అంటారు. వీటిలో పరాన్నజీవులు అభివృద్ధి చెందవు, వ్యాధులను కలిగించవు. ఉదా : ప్లాస్మోడియంకు కోతి.

ప్రశ్న 3.
యాంత్రిక వాహనం, జీవసంబంధ వాహకం మధ్య ఉండే భేదాన్ని గుర్తించండి.
జవాబు:
యాంత్రిక వాహనం :
పరాన్నజీవి సాంక్రమిక దశలను ఒక అతిథేయి నుండి వేరొక అతిథేయికి రవాణా మాత్రమే చేసే జీవులను యాంత్రిక వాహనం అంటారు. ఈ విషయంలో వాహక జీవికి, పరాన్న జీవికి ఎటువంటి సంబంధం ఉండదు.
ఉదా : ఎంటమీబాకు ఈగలు.

జీవ సంబంధ వాహకం :
ఈ వాహకంలో పరాన్నజీవి సాంక్రమిక దశలు మనుగడ సాగించగలిగి, ఇంకొక జీవికి సంక్రమించేలోపు కొంతవరకు అభివృద్ధి చెందుతాయి.
ఉదా : ప్లాస్మోడియంకు ఆడ ఎనాఫిలిస్ దోమ.

ప్రశ్న 4.
అథి పరాన్నజీవి అంటే ఏమిటి? ఒకదాని పేరు రాయండి. [Mar. ’14]
జవాబు:
ఒక పరాన్నజీవిపై బాహ్యంగా గాని, అంతర్గతంగా గాని పరాన్న జీవనం సాగించే పరాన్నజీవిని అధి పరాన్నజీవి అంటారు.
ఉదా : టోడ్ చేప (అతిథేయి) – స్పీరోస్పోరా పాలిమార్పా (పరాన్నజీవి) – నోసిమా నొటాబిలిస్ (అధి పరాన్నజీవి)

ప్రశ్న 5.
పరాన్నజీవ కాస్ట్రేషన్ అంటే ఏమిటి ? ఉదాహరణ రాయండి.
జవాబు:
కొన్ని పరాన్న జీవులు వాటి అతిథేయి బీజకోశాలను నాశనం చేసి వాటిని వంధ్య జీవులుగా మారుస్తాయి. ఈ విషయాన్ని పరాన్నజీవ కాస్ట్రేషన్ అంటారు.
ఉదా : సాక్యులినా అనే పరాన్నజీవి తన అతిథేయి కార్సినస్ మీనాస్ అనే పీత బీజకోశాలను నాశనం చేస్తుంది. దీని వలన మగ పీతలోని లైంగిక హార్మోన్ల సమతుల్యత దెబ్బతిని మగపీత ఆడ లక్షణాలను సంతరించుకుంటుంది.

AP Inter 1st Year Zoology Study Material Chapter 6 మానవ సంక్షేమంలో జీవశాస్త్రం

ప్రశ్న 6.
ఫాసియోల హెపాటికాలో అంతర్ పరాన్నజీవ అనుకూలనాలను తెలపండి.
జవాబు:
ఫాసియోల హెపాటికా నత్తలో పరాన్న జీవనం సాగిస్తాయి. వీటి డింభకాలు నత్త దేహం విపరీతంగా పెరిగేలా ప్రభావితం చేస్తాయి. దీనిని అతికాయత (Gigantism) అంటారు.

ప్రశ్న 7.
నియోప్లాసియాను నిర్వచించండి. దీనికి ఒక ఉదాహరణ తెలపండి.
జవాబు:
కొన్ని పరాన్నజీవులు అతిథేయి కణజాలంలో కణాల సంఖ్యను విపరీతంగా పెరిగేలా ప్రభావితం చేసి కొత్త నిర్మాణాలను ఏర్పరుస్తాయి. దీనినే నియోప్లాసియా అంటారు. ఇది క్యాన్సర్కు దారితీస్తుంది.
ఉదా : కొన్ని వైరస్లు.

ప్రశ్న 8.
ఆరోగ్యాన్ని చక్కగా నిర్వచించి, ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే రెండు అంశాలను తెలపండి.
జవాబు:
ఆరోగ్యం అంటే పరిపూర్ణమైన భౌతిక, మానసిక, సామాజిక స్థితిని కలిగి ఉండటం. ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే ప్రధాన జన్యు రుగ్మతలు, సంక్రమణలు, వ్యక్తి జీవన విధానం. అంశాలు

ప్రశ్న 9.
సంక్రమణ, అసంక్రమణ వ్యాధుల మధ్య భేదాన్ని తెలపండి. ఒక్కొక్క దానికి రెండు ఉదాహరణలు తెలపండి.
జవాబు:
సంక్రమణ వ్యాధులు :
ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి సంక్రమించే వ్యాధులను సంక్రమణ వ్యాధులు అంటారు.
ఉదా : అమీబిక్ విరేచనాలు, మలేరియా జ్వరం, బోదకాలు వ్యాధి, సాధారణ జలుబులు, AIDS మొదలైనవి.

అసంక్రమణ వ్యాధులు :
ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి వ్యాపించని వ్యాధులను అసంక్రమణ వ్యాధులు అంటారు.
ఉదా : జన్యు సంబంధ వ్యాధులు, మూత్రపిండ వ్యాధులు, హృదయ సమస్యలు.

ప్రశ్న 10.
‘ఎంటమీబా హిస్టోలైటికా అవికల్పిక అవాయు పరాన్నజీవి’ అని ఎలా చెప్పగలవు?
జవాబు:
ఎంటమీబా హిస్టోలైటికా మానవ దేహంలో మాత్రమే జీవించగలదు. కనుక ఇది అవికల్పక పరాన్నజీవి. ఇది మానవ జీర్ణవ్యవస్థలో అవాయు శ్వాసక్రియ జరుపుకుంటుంది. కనుక ఇది ‘అవికల్పక అవాయు పరాన్నజీవి’ అని చెప్పవచ్చును.

ప్రశ్న 11.
ఎంటమీబా హిస్టోలైటికా పూర్వ కోశస్థ దశ మరియు కోశస్థ దశ మధ్య భేదాన్ని గుర్తించండి.
జవాబు:
పూర్వ కోశస్థ దశ :
జీవి చిన్నగా, గుండ్రంగా లేదా అండాకారంగా ఉంటుంది. జీవ పదార్థంలో గ్లైకోజన్ రేణువులు, కడ్డీల వంటి క్రొమాటిడ్ దేహాలు ఉంటాయి.

కోశస్థ దశ :
జీవి దేహం గుండ్రంగా ఉండి పలుచని, మృదువైన అధిక నిరోధక శక్తి కలిగి కోశకుడ్యాన్ని ఏర్పరచుకుంటుంది. జీవి దేహంలో నాలుగు పిల్ల కేంద్రకాలుంటాయి.

AP Inter 1st Year Zoology Study Material Chapter 6 మానవ సంక్షేమంలో జీవశాస్త్రం

ప్రశ్న 12.
ఎంటమీబా హిస్టోలైటికా పూర్వకోశస్థ దశ మరియు కోశస్థ ప్రారంభ (early) దశలో నిల్వ ఆహారమేది?
జవాబు:
ఎంటమీబా హిస్టోలైటికా పూర్వ కోశస్థ దశ మరియు కోశస్థ ప్రారంభ దశలో నిలువ ఆహారము గ్లైకోజన్ రేణువుల రూపంలో, క్రొమాటిడ్ దేహాల రూపం (రైబోన్యూక్లియో ప్రొటీన్)లో ఉంటుంది.

ప్రశ్న 13.
ఒక వ్యక్తి పేగులో క్రమరహితం, ఉదర నొప్పి, మలంలో రక్తం, శ్లేష్మం ఉన్నాయి. ఈ లక్షణాల ఆధారంగా జీవి పేరు, వ్యాధిని తెలపండి.
జవాబు:
మానవ పేగులో క్రమరహితం, ఉదర నొప్పి, మలంలో రక్తం, శ్లేష్మం మొదలైన లక్షణాలను ఎంటమీబా హిస్టోలైటికా పరాన్న జీవి కారణం. ఈ వ్యాధిని అమీబిక్ విరేచనాలు లేదా అమీబిక్ డిసెంట్రి లేదా అమీబియాసిస్ అంటారు.

ప్రశ్న 14.
ఒక వ్యక్తి డాక్టరు సలహాతో క్లినికల్ ప్రయోగశాలలో మల పరీక్షకు వెళ్లాడు. అందులోని టెక్నీషియన్ మలంను పరీక్షించి అమీబియాసిస్తో బాధపడుతున్నాడని గుర్తించాడు. టెక్నీషియన్ గుర్తించిన రెండు లక్షణాలను తెలపండి.
జవాబు:
అమీబియాసిస్తో బాధపడే వ్యక్తి మలంను పరీక్షించినట్లయితే మానవ మలంలో శ్లేష్మం, రక్తంతో బాటుగా చతుష్కేంద్రక దశలో ఉండే ఎంటమీబా హిస్టోలైటికా కోశస్థ దశలను గమనించవచ్చును.

ప్రశ్న 15.
ఎంటమీబా హిస్టోలైటికాను ఉద్దేశించి ఎసింప్టమాటిక్ సిస్ట్ పాసర్స్ను నిర్వచించండి.
జవాబు:
కొందరి వ్యక్తులలో ఎంటమీబా హిస్టోలైటికా పరాన్నజీవి ఉన్నప్పటికి వీరిలో అమీబియాసిస్ లక్షణాలు కనపడవు. కాని వీరి మలాన్ని పరిశీలించినట్లయితే చతుష్కేంద్రక కోశాలుంటాయి. ఇటువంటి వారిని ‘ఎసింప్టమాటిక్ సిస్టాపాసర్స్’ అంటారు.

ప్రశ్న 16.
మానవునిలో హిపాటోసైట్స్ను సంక్రమించే ప్లాస్మోడియం వైవాక్స్ దశలను తెలపండి.
జవాబు:
ప్లాస్మోడియం యొక్క స్పోరోజాయిట్ దశలు మానవ కాలేయ కణాలను (హిపాటోసైట్స్) సంక్రమణ దశలు.

AP Inter 1st Year Zoology Study Material Chapter 6 మానవ సంక్షేమంలో జీవశాస్త్రం

ప్రశ్న 17.
ప్రీపేటెంట్ కాలంను నిర్వచించండి. ప్లాస్మోడియం వైవాక్స్ జీవితచక్రంలో దీనికి ఎంత కాలం ఉంటుంది?
జవాబు:
ప్లాస్మోడియం ప్రప్రథమంగా స్పోరోజాయిట్ రూపంలో మానవ రక్తంలోకి ప్రవేశించినప్పటి నుండి, రెండవసారి క్రిప్టోజాయిట్లు రక్తంలోకి విడుదలయ్యే వరకు పట్టే కాలాన్ని ప్రీపేటెంట్ కాలం అంటారు. దీనికి ఎనిమిది రోజుల కాలం పడుతుంది.

ప్రశ్న 18.
పొదిగే కాలంను నిర్వచించండి. ప్లాస్మోడియం వైవాక్స్ జీవితచక్రంలో ఇది ఎంతకాలం ఉంటుంది?
జవాబు:
ప్లాస్మోడియం స్పోరోజాయిట్ దశలో మొదట మానవ దేహంలో ప్రవేశించిన నాటినుండి, మొదటిసారి మలేరియా జ్వరం వచ్చే వరకు పట్టే కాలాన్ని పొదిగే కాలం అంటారు. ఇది 10 నుండి 14 రోజులు పడుతుంది.

ప్రశ్న 19.
షఫ్నర్ చుక్కలు అంటే ఏమిటి? వీటి ప్రాముఖ్యం తెలపండి.
జవాబు:
ప్లాస్మోడియం పరాన్నజీవి RBC లోని హిమోగ్లోబిన్లోని హిమ్ను జీర్ణం చేసుకొని, జీర్ణం కాని హిమోజాయిను కణికలుగా ఏర్పరుస్తుంది. ఈ దశలో చిన్న ఎర్రని మచ్చలు ఎర్ర రక్తకణాల జీవపదార్థంలో ఏర్పడతాయి. వీటినే షఫ్నర్ చుక్కలు అంటారు.

ప్రశ్న 20.
హీమోజాయిన్ రేణువులు అంటే ఏమిటి ? వీటి ప్రాముఖ్యం తెలపండి.
జవాబు:
ప్లాస్మోడియం RBC లోని హిమోగ్లోబిన్ లోని గ్లోబిన్ భాగాన్ని గ్రహించిన తరువాత మిగిలిన జీర్ణంకాని హిమటిన్ భాగం హిమోజాయిన్ కణికలుగా ఏర్పడుతుంది. ఇది మలేరియా జ్వరాన్ని కలుగజేసే విష పదార్థం. ఇది రక్తంలోని ప్లాస్మాతో కలిసినప్పుడు మలేరియా జ్వరం వస్తుంది.

ప్రశ్న 21.
కశాభ నిర్మోచనం అంటే ఏమిటి? దీనివల్ల ఏర్పడినవి ఏవి?
జవాబు:
ప్లాస్మోడియం దోమలలో జరుపుకునే లైంగిక ప్రత్యుత్పత్తిలో పురుష లేదా సూక్ష్మ సంయోగ బీజాలు కొరడా మాదిరి కదలికలను చూపుతూ జీవ పదార్థం నుండి విడుదలవుతాయి. ఈ విధంగా ఏర్పడిన పురుష సంయోగ బీజాలు విడుదల కావడాన్ని ‘కశాభ నిర్మోచనం’ అంటారు.

ప్రశ్న 22.
ప్లాస్మోడియంలో బీజకణాల కలయికను అసమసంయోగం అని ఎందుకంటారు?
జవాబు:
ప్లాస్మోడియంలో సంయోగ బీజాలు పరిమాణ రీత్యా అసమానంగా ఉంటాయి. కనుక వీటి మధ్య జరిగే సంయోగం లేదా కలయికను అసమసంయోగం అంటారు.

ప్రశ్న 23.
గమన సంయుక్తబీజం అంటే ఏమిటి ? క్రోమోసోముల స్థితిని (sets) అనుసరించి దీన్ని ఎలా వివరిస్తావు?
జవాబు:
ప్లాస్మోడియంలో లైంగిక ప్రత్యుత్పత్తిలో ఏర్పడే సంయుక్త బీజం సన్నగా, పొడవుగా, కదలిక చూపే క్రిమి రూపాన్ని పొందుతుంది. దీనిని గమన సంయుక్త బీజం అంటారు. దీని క్రోమోసోముల స్థితి ద్వయస్థితికం.

ప్రశ్న 24.
ఒక వ్యక్తి చలి, వణుకుడు, అధిక ఉష్ణోగ్రతతో బాధపడుతున్నాడు. విపరీతమైన చెమటలతో ఉష్ణోగ్రత సాధారణ స్థాయికి చేరింది. ఈ లక్షణాల ఆధారంగా వ్యాధిని, కారక జీవిని తెలపండి.
జవాబు:
రోగి చలి, వణుకుడు, అధిక ఉష్ణోగ్రతతో బాధపడుతూ, విపరీతమైన చెమటతో ఉష్ణోగ్రత సాధారణ స్థాయికి చేరే లక్షణం ఉన్నట్లయితే అతడు మలేరియా జ్వరంతో బాధపడుతున్నాడు. దీనికి ప్లాస్మోడియం వైవాక్స్ అనే పరాన్నజీవి కారణం.

AP Inter 1st Year Zoology Study Material Chapter 6 మానవ సంక్షేమంలో జీవశాస్త్రం

ప్రశ్న 25.
దోమలను అరికట్టడానికి జీవసంబంధమైన నియంత్రణ తెలపండి.
జవాబు:
దోమలను అరికట్టడానికి జీవసంబంధమైన నియంత్రణ : దోమ డింభకాలను తినే గంబూసియా చేపలను, కీటకాహార మొక్కలైన ముట్రిక్యులేరియాలను దోమలు వృద్ధిచెందే ప్రాంతాలలో పెంచాలి.

ప్రశ్న 26.
ఆస్కారిస్ గుడ్లను ‘మామ్మిల్లేటిడ్ గుడ్లు’ అని ఎందుకు అంటారు?
జవాబు:
ఆస్కారిస్ అండము ఉపరితలంలో బుడిపెలుగా ఏర్పడిన ప్రొటీన్ పొరచే కప్పబడి ఉంటుంది. అందువలన ఆస్కారిస్ గుడ్లను మామిల్లేటిడ్ గుడ్లు అంటారు.

ప్రశ్న 27.
మీరు చదివిన నిమటోడా పరాన్నజీవి జీవితచక్రంలో నిశా కాలగమనం అంటే ఏమిటి?
జవాబు:
నిమటోడా పరాన్నజీవి ఉకరేరియా యొక్క మైక్రోఫైలేరియా డింభకాలు వేరొక అతిథేయిని చేరడానికి అనువుగా రాత్రి సమయంలో 10 నుండి ఉదయం 4 వరకు రోగి పరిధీయ రక్త ప్రసరణలో ఉంటాయి. ఇటువంటి రాత్రి సమయంలో చూపే గమనాన్ని ‘నిశా కాల అంటారు.

ప్రశ్న 28.
లింఫాడినైటిస్ మరియు లింఫాంజైటిస్ మధ్య భేదాన్ని తెలపండి.
జవాబు:
లింఫాంజైటిస్ :
సాధారణంగా ఫైలేరియా సంక్రమణతో శోషరస నాళాలు, వాపు కనిపిస్తుంది. దీనిని లింఫాంజైటిస్ అంటారు.

లింఫాడినైటిస్ :
శోషరస గ్రంథులలో కలిగే వాపును లింఫాడినైటిస్ అంటారు.

ప్రశ్న 29.
ఫైలేరియాసిస్ వ్యాధి చివరి ఘట్టం బోదకాలు / ఎలిఫెంటియాసిస్ నిరూపించండి.
జవాబు:
ఫైలేరియాసిస్ వ్యాధి తీవ్రత వలన వాపు చెందిన భాగాలలో ఫైబ్రోబ్లాస్ట్లు అభివృద్ధి చెంది తంతుయుత కణజాలంగా మారతాయి. ప్రభావిత భాగాలలో స్వేదగ్రంథులు క్షీణించి, అక్కడి చర్మం పొడిగాను, గరుకుగాను అవుతుంది. ఈ చివరి స్థితిని బోదకాలు లేదా ఎలిఫెంటియాసిస్ వ్యాధి అంటారు.

ప్రశ్న 30.
పొగాకు ఏ విధంగా శ్వాసక్రియను ప్రభావితం చేస్తుంది? దీనిలో గల ఆల్కలాయిడ్ ఏది?
జవాబు:
పొగాకులో నికోటిన్ అనే ఆల్కలాయిడ్ ఉంటుంది. పొగాకు పీల్చడం వలన పొగలలో ఉండే కార్బన్ మోనాక్సైడ్ ఎర్ర రక్తకణాలలోని హిమోగ్లోబిన్ లో కలిసి, Hb యొక్క ఆక్సిజన్ రవాణా సామర్థ్యాన్ని తగ్గించడం ద్వారా శ్వాసక్రియపై దుష్ప్రభావాన్ని చూపిస్తుంది.

ప్రశ్న 31.
మందుల దుర్వినియోగాన్ని నిర్వచించండి.
జవాబు:
వ్యాధులను నివారించి తద్వారా శారీరక, మానసిక సుఖశాంతులు పొందడానికి మనం మందులు వాడుతున్నాం. వీటిని వైద్యపరంగా కాకుండా వేరే విధంగా వినియోగించడం వల్ల శారీరక లేదా మానసిక రుగ్మతలకు గురవుతున్నాం. దీనినే మందుల దుర్వినియోగం అంటారు. ఉదా : హోలీ రోజున వాడే బంగ్, డాక్టర్ సలహాపై మత్తుకు వాడే వివిధ మందులు – డాక్టరు ద్వారా కాకుండా విపరీతంగా తీసుకోవడం.

ప్రశ్న 32.
కోక్, స్మాక్ దేని నుంచి లభిస్తాయి?
జవాబు:
కోక్ :
దీనిని ఎరిత్రోజైలం కొకా అనే మొక్క ఆకుల నుండి తయారుచేస్తారు.

స్మాక్ :
హెరాయిన్ను స్మాక్ అంటారు. దీనిని ఓపియం పాపి, పపావర్ సోమ్నిఫెరం (నల్లమందు మొక్క) అనే మొక్కల నుండి తయారు చేస్తారు.

ప్రశ్న 33.
మొక్కలలో చాలా ద్వితీయ జీవాణువులకు ఔషధ ధర్మాలు ఉన్నాయి. వీటి దుర్వినియోగం వల్ల సమస్యలు ఏర్పడుతున్నాయా? సరైన ఉదాహరణలతో నిరూపించండి.
జవాబు:
చాలా మొక్కల ద్వితీయ జీవాణువులకు ఔషధ ధర్మాలున్నాయి. ఇవి ఓపియోడ్స్, కనభినాయిడ్స్, కొకా ఆల్కలాయిడ్స్. వీటిని మందు రూపంలో కాక అతిగా మాదక ద్రవ్యాలుగా వినియోగిస్తూ దుర్వినియోగం చేయడం వలన అనేక ఆరోగ్య, సామాజిక సమస్యలు ఏర్పడుతున్నాయి.

ప్రశ్న 34.
ఆటలు, క్రీడలలో నిషేధించిన కనబినాయిడ్స్, అనబాలిక్ స్టీరాయిడ్స్ ఏవి?
జవాబు:
కొందరు క్రీడాకారులు ఆటలలో అలసత్వం రాకుండా ఉత్తేజాన్నిచ్చే స్థాయిలో కనబినాయిడ్స్, అనబాలిక్ స్టిరాయిడ్ను ఉపయోగిస్తున్నారు. ఇలా స్టిరాయిడ్ను ఉపయోగించడం చట్టరీత్యా నేరం కనుక వీటిని నిషేధించారు.

AP Inter 1st Year Zoology Study Material Chapter 6 మానవ సంక్షేమంలో జీవశాస్త్రం

ప్రశ్న 35.
కుంగిపోవడం, నిద్రలేమి మొదలైన మానసిక జబ్బులకు వాడే తరచుగా దుర్వినియోగం అయ్యే నాలుగు మందులను తెలపండి.
జవాబు:
కుంగిపోవడం, నిద్రలేమి మొదలైన మానసిక జబ్బులకు వాడే మందులు తరచుగా దుర్వినియోగమయ్యేవి.

  1. బార్బిటురేట్ – నిద్రమాత్రలు
  2. ఆంఫిటమైన్స్ – నిద్రహరిణి మాత్రలు
  3. బెంజోడయాజిపైన్స్ – ప్రశాంతకాలు
  4. లైసర్జిక్ ఆమ్ల డైఈథైల్ అమైడ్స్ – ప్రశాంతకాలు

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
పరాన్నజీవులలో ప్రత్యేక అనుకూలనాల అభివృద్ధి అవసరమేమిటి? పరాన్నజీవులలో ఏర్పడిన కొన్ని ప్రత్యేక అనుకూలనాలను తెలపండి.
జవాబు:
అతిథేయిలో విజయవంతమైన జీవనం కొనసాగించడానికి అనువుగా పరాన్నజీవులు ప్రత్యేక అనుకూలనాలను ఏర్పర్చుకుంటాయి.

  1. ఆస్కారిస్ వంటి ఆంత్ర పరాన్నజీవులైన గుండ్రటి పురుగులు వాటి అతిథేయిలు స్రవించే జీర్ణక్రియా ఎంజైముల నుంచి రక్షించుకోవడానికి అవభాసినిని ఏర్పరుచుకుంటాయి.
  2. బద్దె పురుగువంటి జీవులు వాటి అతిథేయి పేగు గోడలకు అంటి పెట్టుకోవడానికి చూషకాలు, కొక్కేలు వంటి అంగాలను ఏర్పరచుకుంటాయి.
  3. ఎంటమీబా హిస్టోలైటికా వంటి పరాన్న జీవులు తమ జీవిత చరిత్రలో కోశస్థ దశను ఏర్పరచుకుంటాయి. ఈవిధంగా ఇవి కొత్త అతిథేయిలోకి ప్రవేశిస్తాయి.
  4. పరాన్న జీవుల్లో ప్రత్యుత్పత్తి వ్యవస్థ బాగా అభివృద్ధిచెంది ఉంటుంది. వీటి స్త్రీ జీవులు అధిక సంఖ్యలో అండాలను విడుదల చేస్తాయి.
  5. ద్వంద్వ అతిథేయి వంటి లివరూక్ పరాన్నజీవులలో బహుపిండత్వాన్ని వ్యక్తంచేస్తూ క్లిష్టమైన జీవిత చరిత్రను కలిగి ఉంటుంది.
  6. ప్లాస్మోడియంవంటి పరాన్న జీవులు అవి ఉత్పత్తిచేసే ప్రతిజనకాలను తరచుగా మారుస్తాయి.

ప్రశ్న 2.
హైపర్ ట్రోఫీ మరియు హైపర్ ప్లాసియాల మధ్య భేదాలను ఒక్కొక్క ఉదాహరణతో వివరించండి.
జవాబు:
హైపర్ ట్రోఫీ :
ప్లాస్మాడియం వైవాక్స్ మానవ ఎర్ర రక్తకణంలోకి ప్రవేశించి రక్తకణంలోని జీవ పదార్థాన్ని, వర్ణకాన్ని తిన్న తరువాత తన ఆకృతిని పెంచుకుంటుంది. దీని ప్రభావం వలన RBC పరిమాణం కూడా పెరుగుతుంది. ఇలా పరాన్నజీవి ప్రభావంవలన అతిథేయి కణాకృతి పెరగడాన్ని హైపర్ ట్రోఫీ అంటారు.

హైపర్ ప్లాసియా :
ప్లాటి హెల్మింథస్ వర్గానికి చెందిన ఫాసియోలా హెపాటికా పరాన్నజీవి గొర్రెలలో పరాన్నజీవనం సాగిస్తుంది. దీని ప్రభావం వలన ఈ పరాన్నజీవి ఉండే గొర్రెలలో పైత్యరసనాళాలలో కణాలసంఖ్య పెరిగి పైత్యరస నాళాలు మందంగా మారతాయి. ఇలా పరాన్నజీవి ప్రభావం వలన అతిథేయి దేహంలో కణాల సంఖ్య పెరగడాన్ని హైపర్ ప్లాసియా అంటారు.

ప్రశ్న 3.
ఎంటమీబా హిస్టోలైటికా పోషకజీవి నిర్మాణాన్ని వివరించండి.
జవాబు:
AP Inter 1st Year Zoology Study Material Chapter 6 మానవ సంక్షేమంలో జీవశాస్త్రం 1
ఎంటమీబా హిస్టోలైటికా మానవుడి పెద్దపేగు, అంధనాళాలలో ఉండే ఆంత్ర పరాన్నజీవి. ఇది 20 నుంచి 30 మైక్రానుల లోతైన కణజాలాల్లో ఉంటుంది. పోషకజీవిని ఆవరించి ఉన్న పొరను ప్లాస్మాలెమ్మా అంటారు. జీవ పదార్థం వెలుపలి కణికారహితమైన బాహ్యజీవద్రవ్యంగాను, లోపలి కణికాయుతమైన అంతర్జీవ ద్రవ్యంగాను విభజించబడి ఉంటుంది. పోషక జీవి కదిలే వైపు పొట్టిగా, మొండిగా ఉండే మిథ్యాపాదం ఉంటుంది. ఎంటమీబా హిస్టోలైటికా అంతర్జీవ ద్రవ్యం మధ్యలో తిత్తి వంటి కేంద్రకం ఉంటుంది. కేంద్రక త్వచం లోపలి తలాన్ని అంటిపెట్టుకొని పూసలలాగా ‘క్రొమోటిన్ పదార్థముంటుంది. కేంద్రకం మధ్యలో ఎండోసోమ్ ఉంటుంది. సన్నని క్రొమాటిన్ తంతువులు, పూసల వంటి నిర్మాణాల నుంచి ఎండోసోమ్ వైపుకు చక్రంలోని చువ్వల మాదిరిగా ప్రసరించి ఉంటాయి. ఈ స్థితి కేంద్రకానికి బండి చక్రం రూపాన్నిస్తుంది. దీని ఆహారరిక్తికలలో ఎర్రరక్త కణాలుంటాయి.

AP Inter 1st Year Zoology Study Material Chapter 6 మానవ సంక్షేమంలో జీవశాస్త్రం

ప్రశ్న 4.
ఎంటమీబా హిస్టోలైటికా జీవిత చక్రంను తెలపండి.
జవాబు:
ఎంటమీబా హిస్టోలైటికా మానవ పెద్దపేగులో నివసించే పరాన్నజీవి. దీనివలన మానవులలో అమీబియాసిస్ లేదా అమీబిక్ డిసెంట్రీ (బంక విరేచనాలు) అనే వ్యాధి వస్తుంది. ఇది కలుషిత ఆహారం, నీరు వలన మానవ జీర్ణ వ్యవస్థలో ప్రవేశిస్తుంది.

జీవిత చక్రం :
పెద్దపేగు కుడ్యంలో ఎంటమీబా పోషక జీవులు ద్విధా విచ్ఛిత్తి జరిపి అనేక ఎంటమీబాలను ఏర్పరుస్తాయి. ఇవి బాక్టీరియా, అతిథేయి కణజాల భాగాలను పెరిగి మళ్ళీ విభజనచెంది, అనేకసార్లు జరిగిన ద్విధావిచ్ఛిత్తి వలన అనేక పోషకజీవులు ఏర్పడతాయి. వీటిలో కొన్ని పెద్ద పేగును చేరి పూర్వ కోశస్థ దశలుగా మారతాయి. తిరిగి ఈ దశలు కోశస్థ దశలుగా మారి చివరికి చతుష్కేంద్రక కోశాలుగా ఏర్పడతాయి. ఈ ప్రక్రియ మొత్తం కొన్ని గంటలలో జరుగుతుంది. చతుష్కేంద్రక దశలు మలంతోబాటు బయటకు విడుదలై సుమారు 10 రోజులు జీవంతో ఉంటాయి. ఈ కోశాలు కలుషితమైన నీరు, ఆహారంతోబాటు కొత్త అతిథేయిని చేరతాయి. ఇవి మానవ చిన్నపేగును చేరిన తరవాత ట్రిప్సిన్ ఎంజైమ్ చర్యవలన కోశం జీర్ణమై చతుష్కేంద్రక అమీబాలు విడుదలవుతాయి. వికోశీకరణం చెందిన చతుష్కేంద్రక అమీబాలను మెటాసిస్ట్ అంటారు.

మెటాసిస్ట్లోని నాలుగు కేంద్రకాలు సమవిభజనలో ఎనిమిది కేంద్రకాలుగా విభజన చెందుతాయి. ప్రతి కేంద్రకం కొంత జీవ పదార్థంతో ఎనిమిది పిల్ల ఎంటమీబాలు లేదా మెటాసిస్టిక్ పోషక జీవులు ఏర్పడతాయి. ఇవి పెద్దపేగు శ్లేష్మపొరలోకి ప్రవేశించి పరిపక్వ పోషక జీవులుగా పెరుగుతాయి.
AP Inter 1st Year Zoology Study Material Chapter 6 మానవ సంక్షేమంలో జీవశాస్త్రం 2

ప్రశ్న 5.
ఎంటమీబా హిస్టోలైటికా వ్యాధికారకతపై లఘుటీక రాయండి.
జవాబు:
ఎంటమీబా హిస్టోలైటికా పరాన్నజీవి మానవ పెద్దపేగులో ఉండే పరాన్నజీవి. ఇది కలుషిత ఆహారం, నీరు నుండి మరొకరికి వ్యాప్తి చెందుతుంది.

ఎంటమీబా పోషకజీవులు హిస్టోలైసిన్ అనే ఎంజైము స్రవించి అతిథేయి శ్లేష్మ స్థరాన్ని కరిగించిలోనికి ప్రవేశించి పెద్దపేగు కుడ్యంలో పుండ్లను ఏర్పరుస్తాయి. పుండ్లలో కణశిథిలాలు, లింఫోసైట్, ఎర్రరక్తకణాలు, బాక్టీరియాలు ఉంటాయి. పెద్దపేగు కుడ్యంలో చీముగడ్డలు ఏర్పడటానికి దారితీస్తాయి. చివరగా మలంలో రక్తం, శ్లేష్మం కనిపిస్తాయి. ఈ స్థితిని అమీబిక్ విరేచనాలు లేదా ఆంత్ర అమీబియాసిస్ లేదా ఉష్ణ అమీబియాసిస్ అంటారు. కొందరిలో ఎటువంటి వ్యాధి లక్షణాలు కనిపించవు. వీరిని వాహకులు లేదా ఎసింప్టోమాటిక్ సిస్ట్ పాసర్స్ అంటారు. వీరి మలంలో చతుష్కేంద్రక కోశాలు ఉంటాయి. ఇవి పరాన్నజీవి వ్యాప్తికి తోడ్పడతాయి.

ప్రశ్న 6.
ప్లాస్మోడియమ్ వైవాక్స్ స్పోరోజాయిట్ నిర్మాణాన్ని వివరించండి.
జవాబు:
ప్లాస్మోడియమ్ వైవాక్స్ స్పోరోజాయిట్ నిర్మాణం :
AP Inter 1st Year Zoology Study Material Chapter 6 మానవ సంక్షేమంలో జీవశాస్త్రం 3

  1. ప్లాస్మోడియమ్ వైవాక్స్ స్పోరోజాయిట్ యొక్క సూక్ష్మ నిర్మాణాన్ని గారోమ్ అధ్యయనం చేశాడు.
  2. ఇది కొడవలి ఆకారంలో ఒకవైపు వంగి ఉంటుంది. కణ దేహం కండె ఆకారంలో ఉంటుంది. మధ్యలో బొద్దుగా, కొన భాగాలు మొనదేలి ఉంటాయి. ఇది 15 మైక్రానుల పొడవు, 1 మైక్రాను వెడల్పు ఉంటుంది.
  3. స్పోరోజాయిట్ దేహాన్ని ఆవరించి సాగే గుణం కలిగిన పెలికల్ ఉంటుంది.
  4. పెలికిల్ మూడు పొరలలో ఏర్పడి ఉంటుంది. దీనిలో సూక్ష్మ నాళికలు లేదా పరిధీయ తంతువులు నిలువుగా అమరి ఉంటాయి. వీటి సంకోచాలు పరాన్నజీవి దేహంలో జరిగే క్రిమి చలనానికి తోడ్పడతాయి.
  5. కణ పూర్వభాగంలో ఒక “అగ్రచూషకం” లేదా “ఎపికల్ కప్” ఉంటుంది. ఒక జత పొడవైన స్రావక సూక్ష్మాంగాలు దీనిలోకి తెరుచుకుంటాయి. ఇవి కణవిచ్ఛిన్న ఎంజైములను స్రవిస్తూ, స్పోరోజాయిట్ కాలేయ కణాల్లోకి ప్రవేశించడానికి సహాయపడతాయి.
  6. కణదేహంలో అనేక సంవళిత నాళికలుంటాయి. వాటి నిర్దిష్టమైన విధి ఏమిటో తెలియదు.

AP Inter 1st Year Zoology Study Material Chapter 6 మానవ సంక్షేమంలో జీవశాస్త్రం

ప్రశ్న 7.
ప్లాస్మాడియం వైవాక్స్ జీవితచక్రంలో గాల్జి చక్రాన్ని వివరించండి.
జవాబు:
కాలేయ కణాలలో రక్తకణ పూర్వ, రక్తకణ బాహ్య జీవిత చక్రాలను పూర్తి చేసుకున్న పిదప ప్లాస్మోడియం పూర్వ తరంలోని క్రిప్టోజాయిట్స్ రూపంలోగాని, రక్తకణ బాహ్య చక్రంలోని సూక్ష్మ మెటాక్రిప్టోజాయిట్ల రూపంలోగాని రక్తంలోని RBC ని చేరి రక్తకణ జీవిత చక్రాన్ని ప్రారంభిస్తాయి. ఈ రక్తకణ జీవిత చక్రాన్ని మొదటగా కామిల్లోగాల్జి అనే శాస్త్రవేత్త వివరించాడు. కనుక ఈ చక్రాన్ని గాల్జిచక్రం అంటారు..

గాల్జి చక్రం :
ఇది పూర్వ తరంలోని క్రిప్టోజాయిట్లతో గాని లేదా రక్తకణబాహ్య జీవితచక్రంలోని సూక్ష్మ మెటాక్రిప్టోజాయిట్లతో గాని ప్రారంభమవుతుంది. ఎర్రరక్తకణాల్లోకి ప్రవేశించగానే మీరోజాయిట్లు గోళాకార ట్రోఫోజాయిట్లుగా మారతాయి. వీటిలో ఒక చిన్న రిక్తిక ఏర్పడి పరిమాణంలో పెరుగుతూ పోషకజీవిలోని జీవపదార్థాన్ని, కేంద్రకాన్ని అంచువైపుకు నెట్టడం వల్ల ఉంగరం మాదిరిగా కనిపిస్తుంది. ఈ దశను అంగుళీక దశ అంటారు. తరవాత రిక్తిక అదృశ్యమవుతుంది. పరాన్నజీవి మిథ్యాపాదాలను అభివృద్ధి చేసుకొని అమీబాయిడ్ దశగా మారుతుంది. ఇది RBC లోని పదార్థాలను మిథ్యాపాదాలతో గ్రహించి పోషణతో పరిమాణాన్ని పెంచుకొంటుంది. దీనివల్ల ఎర్రరక్తకణాల పరిమాణం రెండింతలు పెరుగుతుంది. ఈ స్థితిని అతివృద్ధి అంటారు. ఈ చక్రంలో ఎర్ర రక్తకణాల్లోని హీమోగ్లోబిన్ను పరాన్నజీవి ఆహారంగా తీసుకుంటుంది.

పరాన్నజీవి హీమోగ్లోబిన్లోని హీమ్ను జీర్ణం చేసుకొని మరియు కరిగే హీము కరగని హీమోజాయిన్ కణికలుగా ఏర్పరుస్తుంది. దీన్నే మలేరియా వర్ణకం అంటారు. ఈ దశలో చిన్న ఎర్రని మచ్చలు షఫ్నర్ చుక్కలు ఎర్రరక్తకణాల జీవపదార్థంలో ఏర్పడతాయి. ఇవి పరాన్నజీవి విడుదల చేసే ప్రతిజనకాలు. ప్లాస్మోడియం,మిథ్యాపాదాలను కోల్పోయి బాగా పెరిగి RBC ని మొత్తంగా ఆక్రమించి విఖండంగా మారుతుంది. ఇది రక్తకణపూర్వ చక్రంలో మాదిరిగా విఖండ జననం చెంది 12-24 ఎర్రరక్తకణ మీరోజాయిట్లను ఏర్పరుస్తుంది. ఇవన్నీ RBC లో గులాబీ రేకులా అమరి రోజెట్టిశగా మారుతుంది. చివరిగా ఎర్రరక్తకణం పగిలి హీమోజాయినను, మీరోజాయిట్లను రక్తంలో విడుదల చేస్తుంది. ఈ చక్రం దాదాపు 48 గంటలలో పూర్తవుతుంది.

స్పోరోజాయిట్లు దేహంలో ప్రవేశించిన నాటి నుంచి మొట్టమొదటిగా, మలేరియా లక్షణాలు జ్వరం వచ్చేవరకు పట్టే కాలాన్ని పొదిగే కాలం అంటారు. ఇది దాదాపు 10-14 రోజులలో పూర్తవుతుంది.

ప్రశ్న 8.
ఉకరేరియా బాంక్రాఫ్టి వల్ల మానవునిలో కలిగే వ్యాధి కారకతను తెలపండి.
జవాబు:
ఉకరేరియా బాంక్రాఫ్టి అనే నిమటొడా పరాన్నజీవి కారణంగా మానవులలో బోదకాలు వ్యాధి సంక్రమిస్తుంది. ఇది ఫైలేరిఫాం డింభక దశలో దోమకాటు ద్వారా మానవులకు సంక్రమిస్తుంది.

వ్యాధి కారకత :
సంక్రమణ స్వల్పంగా ఉంటే ఫైలేరియా జ్వరం, తలనొప్పి, మానసిక ఆందోళన, శరీర ఉష్ణోగ్రత పెరగడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. సాధారణంగా ఫైలేరియా సంక్రమణతో శోషరస నాళాలు, శోషగ్రంథులలో వాపు (infalmation) కలుగుతుంది. శోషనాళాలలో కలిగే వాపును లింఫాంజైటిస్ (Lymphangitis) ( Gr. angeos – నాళాలు, itis – మంట) అనీ, శోషరస గ్రంథులలో కలిగే వాపును లింఫాడెంటిస్ (Lymphadenitis) (Gr. adenos – గ్రంథి, itis – మంట) అని అంటారు. పరాన్న జీవుల సంక్రమణ అధికంగా ఉంటే, చనిపోయి పేరుకుపోయిన పురుగులు శోషరస నాళాలలోనూ, శోషరస గ్రంథులలోనూ శోషరస ప్రవాహాన్ని ఆటంకపరుస్తాయి.

ఫలితంగా అధిక వాపు ఏర్పడుతుంది. దీన్ని లింఫోఎడిమా (Lymphoedema)(Gr. oiedema – వాపు) అంటారు. ఈ వాపు గమనాంగాల చివరి భాగాలు, పురుషుల్లో ముష్కగోణులు, స్త్రీల స్తనాలలో అనూహ్యంగా కనిపిస్తుంది. ఈ వాపు చెందిన భాగాలలో ఫైబ్రోబ్లాస్ట్లు అభివృద్ధి చెంది తంతుయుత కణజాలంగా మారతాయి. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ప్రభావిత భాగాలలో స్వేదగ్రంథులు క్షీణించి, అక్కడ చర్మం పొడిగాను, గరుకుగాను అవుతుంది. ఈ చివరి స్థితిని ఎలిఫెంటియాసిస్ (Elephantiasis) లేదా బోదకాలు అంటారు.

ప్రశ్న 9.
టైఫాయిడ్ జ్వరం మరియు రోగనిరోధకతపై లఘుటీక రాయండి.
జవాబు:
టైఫాయిడ్ జ్వరం :
ఈ వ్యాధి సాల్మొనెల్ల టైఫీ అనే గ్రామ్ నెగిటివ్ బాక్టీరియా వల్ల వస్తుంది. ఇది ముఖ్యంగా మానవుడి చిన్నపేగులో నివసిస్తూ రక్తం ద్వారా ఇతర అవయవాలలోకి ప్రవేశిస్తుంది. ఈ వ్యాధిని వైడాల్ పరీక్ష చేసి నిర్ధారిస్తారు. సంక్రమణ విధానం : ఈ వ్యాధి కలుషితమైన ఆహారం, నీరు ద్వారా వ్యాప్తి చెందుతుంది.

వ్యాధి లక్షణాలు :
ఈ వ్యాధి సోకిన రోగికి 104°F వరకు పెరిగే ఉష్ణోగ్రతతో స్థిరంగా ఉండే జ్వరం, నీరసం, కడుపునొప్పి, మలబద్దకం, తలనొప్పి, ఆకలి మందగించడం మొదలైన లక్షణాలు కనిపిస్తాయి. వ్యాధి తీవ్రతలో పేగుకు రంధ్రాలు ఏర్పడటం, తీవ్రమైన స్థాయిలో మరణం సంభవించడం జరుగుతుంది.

ప్రశ్న 10.
న్యుమోనియా మరియు రోగనిరోధకతపై లఘుటీక రాయండి.
జవాబు:
న్యుమోనియా వ్యాధి శ్వాస వ్యవస్థలో బాధలు గురిచేసే వ్యాధి. ఇది స్ట్రెప్టోకోకస్ న్యుమోనియే, హీమోఫిలస్ ఇన్ఫ్లుయోంజాల వంటి గ్రామ్ పాజిటివ్ బాక్టీరియాల వల్ల వస్తుంది. ఈ బాక్టీరియా మానవ వాయుకోశాలపై దాడి చేస్తాయి.

సంక్రమణ :
వ్యాధి సోకిన వ్యక్తి నోటి తుంపర్లు (గాలిద్వారా వ్యాప్తి) పీల్చడం వలన లేదా వ్యాధిగ్రస్తుని యొక్క వంట పాత్రలు, వారు వాడిన తువాలు (టవల్స్) వాడటం వలన ఇతరులు ఈ వ్యాధి బారిన పడతారు.

వ్యాధి లక్షణాలు :
ఈ వ్యాధిగ్రస్తుల వాయుకోశాలు ద్రవంతో పూర్తిగా నిండి శ్వాసక్రియలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. వాయుకోశాల శ్వాస వాయువుల మార్పిడి ఆటంకం ఏర్పడుతుంది. వ్యాధి తీవ్రతలో దేహంలో ఆక్సిజన్ శాతం తగ్గి, కార్బన్ డైఆక్సైడ్ శాతం పెరగడం వలన పెదవులు, వేలిగోర్లు బూడిద లేదా నీలిరంగుకు మారతాయి.

AP Inter 1st Year Zoology Study Material Chapter 6 మానవ సంక్షేమంలో జీవశాస్త్రం

ప్రశ్న 11.
సాధారణ జలుబు మరియు రోగనిరోధకతపై లఘుటీక రాయండి.
జవాబు:
సాధారణ జలుబు :
ఈ వ్యాధి రైనోవైరస్ సమూహానికి చెందిన వైరస్ల వలన వస్తుంది. ఇది ముక్కు, వాయు మార్గానికి మాత్రమే సంక్రమిస్తుంది. ఊపిరితిత్తులపై ప్రభావం చూపదు. దీనికారణంగా ముక్కులో, వాయునాళంలో శ్లేష్మం స్రవించి శ్వాసలో ఇబ్బందులు (ముక్కు దిబ్బడ) ఎదురవుతాయి.

సంక్రమణ :
వ్యాధి సోకిన వ్యక్తి తుమ్ములు, దగ్గు వలన వెలువడిన నీటి తుంపరలను పీల్చడం ద్వారా (గాలి ద్వారా వ్యాప్తి) నేరుగాను, కలుషితమైన వస్తువులు అనగా రోగి వినియోగించే వస్తువు ద్వారా కర్చీఫ్, పెన్నులు, పుస్తకాలు, కప్పులు, డోర్ హాండిల్స్, కంప్యూటర్ కీబోర్డు, మౌస్ మొదలైన వాటిని శుభ్రపరచకుండా ఇతరులు వినియోగించడం వలన ఇతరులకు వ్యాప్తి చెందుతుంది.

వ్యాధి లక్షణాలు :
ముక్కు మూసుకుపోవడం (ముక్కు దిబ్బడ, ముక్కు కారడం, తుమ్ములు, దగ్గడం, గొంతునొప్పి, బొంగురు గొంతు, తలనొప్పి, అలసట మొదలైన లక్షణాలు కనిపిస్తాయి. సాధారణంగా 3 నుంచి 7 రోజులు ఉంటాయి.

ఈ వ్యాధి సోకినవారు ముఖ్యంగా విశ్రాంతి తీసుకొనవలెను. దుమ్ము, పొగ పీల్చకూడదు. గాటైన వాసనలు పీల్చరాదు. వేడి నీటి ఆవిరి పట్టినట్లయితే త్వరగా ఉపశమనం లభిస్తుంది.

ప్రశ్న 12.
తామర మరియు రోగనిరోధకతపై లఘుటీక రాయండి.
జవాబు:
తామర మానవులలో కలిగే సాధారణమైన, శిలీంధ్రాలవల్ల సంక్రమించే సంక్రమణ వ్యాధి. ఇది మైక్రోస్పోరం, ట్రైకోఫైటాన్, ఎఫిడెర్మోఫైటాన్ అనే ప్రజాతుల శిలీంధ్రాల వలన సంక్రమిస్తుంది. వేడిమి, తేమ ఈ శిలీంధ్రాల పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. ఇది సాధారణంగా చర్మపు ముడుతలలో అంటే గజ్జలు, కాలివేళ్ళు, చంకలు మొదలైన భాగాలలో పెరుగుతాయి.

సంక్రమణ :
వ్యాధి సోకిన వ్యక్తి వాడిన వస్తువులు అనగా తువ్వాలు, దుస్తులు, దువ్వెన మొదలైన వస్తువుల వలన మరియు మట్టి ద్వారా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది.

వ్యాధి లక్షణాలు :
పొడిగా, పొలుసులు గల గుండ్రటి పుండ్లు లేదా దద్దురులు ఏర్పడతాయి. దీని వలన తీవ్రమైన దురద ఉంటుంది. ఇవి చర్మం, గోరు, తలపై కూడా ఏర్పడతాయి.

ఈ వ్యాధి నివారణకు పరిశుభ్రత ప్రధానమైన మార్గం.

ప్రశ్న 13.
పొగాకు వల్ల జరిగే దుష్పరిణామాలను తెలపండి. [Mar. ’14]
జవాబు:
పొగాకును మానవుడు వివిధ రూపాలలో 400 సం॥రాలుగా వినియోగిస్తున్నాడు. దీనిలో వివిధ రసాయన పదార్థాలతోబాటుగా నికోటిన్ అనే ఆల్కలాయిడ్ ఉంటుంది. పొగాకును గుట్కా రూపంలో, పొగత్రాగడం (చుట్ట, బీడి, సిగరెట్), నమలడం లేదా నశ్యం రూపంలో పీల్చడం మొదలైన రూపాలలో వినియోగిస్తారు.

పొగాకును పొగరూపంలో (చుట్ట, బీడి, సిగరెట్) వినియోగించడం వలన పొగలో ఉండే కార్బన్మౌనాక్సైడ్ ఎర్రరక్త కణాలలోని హిమోగ్లోబిన్తో కలిసి, Hb యొక్క ఆక్సిజన్ రవాణా సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. దీనిలోని నికోటిన్ ఎడ్రినల్ గ్రంథిని ప్రేరేపించి ఎడ్రినాలిన్, నార్ – ఎడ్రినాలిన్ను రక్తంలోకి విడుదల చేస్తుంది. ఈ హార్మోన్లు రక్త పీడనాన్ని, గుండె కొట్టుకునే వేగాన్ని పెంచుతాయి. పొగతాగడం వల్ల బ్రాంకైటిస్, ఎంఫిసిమా, కరోనరీ గుండె వ్యాధి, జఠరంలో పుండ్లు, గొంతు, ఊపిరితిత్తులు, మూత్రాశయం మొదలైన వాటిలో కాన్సర్ వచ్చే అవకాశాలున్నాయి.

పొగతాగే అలవాటు తీవ్రమైన మత్తుమందులు – మార్ఫిన్, హెరాయిన్, కొకైన్ను కూడా తీసుకునే అలవాటుకు దారితీస్తుంది. పొగాకును నమలడం వలన, గుట్కా రూపంలో నమలడం వలన నోటి కాన్సర్కు అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇటువంటి పరిణామాలు చూస్తున్నా ఇంకా యువతలో, ముసలివారిలో పొగత్రాగడం, పొగాకు ఉత్పత్తుల వినియోగం ఇంకా మాన్పించలేకపోతున్నాము.

ప్రశ్న 14.
ఓపియోడ్స్పై లఘుటీక రాయండి.
జవాబు:
ఓపియోడ్స్ :
ఓపియోడ్స్ అనునవి మాదకద్రవ్యాలు. మందులను ఓపియం పాపి, పపావర్ సోమ్నిఫెరం (దీన్ని వాడుకలో నల్లమందు మొక్క అంటారు) నుంచి సేకరిస్తారు. ఈ మందులు మన కేంద్రనాడీ వ్యవస్థ, జీర్ణనాళంలోని ప్రత్యేక ఓపియోడ్ గ్రాహకాలతో బంధనం (bind) చెంది తమ ప్రభావాన్ని ప్రదర్శిస్తాయి. వీటిలో మార్ఫిన్, హెరాయిన్ మొదలైనవి ఉన్నాయి.

i) మార్ఫిన్ :
దీన్ని పాపి మొక్క అపరిపక్వ విత్తన గుళిక (capsule pad) యొక్క ఎండిన లేటెక్స్ (latex) నుంచి సేకరిస్తారు. ఇది రంగులేని స్ఫటికం (crystal) లేదా తెలుపు పటికపొడి రూపంలో లభిస్తుంది.

దుర్వినియోగ విధానం :
సాధారణంగా నీరు లేదా సూది (injection) ద్వారా తీసుకొంటారు.

ప్రభావం :
ఇది చాలా సమర్థమైన మత్తుమందు నొప్పి/బాధ నుంచి (pain killer) ఉపశమనం కలిగిస్తుంది. శస్త్ర చికిత్స చేసుకున్న రోగులకు ఈ మందు చాలా ఉపయోగపడుతుంది.

ii) హెరాయిన్ :
ఇది తెల్లని, వాసన రహిత, ఘాటుగా ఉండే స్ఫటిక సంయోగ పదార్థం. మార్ఫిన్ ను ఎసిటైలేషన్ చేయడం వల్ల ఇది ఏర్పడుతుంది. రసాయనికంగా దీన్ని డైఎసిటైల్ మార్ఫిన్ (diacetyl morphine) అంటారు. దీన్ని స్మాక్ (smack) అని కూడా అంటారు.

దుర్వినియోగ విధానం :
బలవంతంగా పీల్చుకోవడం (స్నార్టింగ్ – snorting) లేదా సూది ద్వారా తీసుకోవడం.

ప్రభావం :
ఇది ఉపశమనం కలిగించే మందు (anti depressant). ఇది శరీర చర్యలను నెమ్మదిస్తుంది.

AP Inter 1st Year Zoology Study Material Chapter 6 మానవ సంక్షేమంలో జీవశాస్త్రం

ప్రశ్న 15.
కనబినాయిడ్స్పై లఘుటీక రాయండి.
జవాబు:
కనాబినాయిడ్స్ :
కనాబినాయిడ్స్ అనునవి మాదకద్రవ్యాలు. ఇవి సమూహ రసాయనాలు. వీటిని భారత హెంప్ మొక్క కనాబిస్ సటైవా (Indian hemp plant – Cannabis sativa) (దీన్ని వాడుకలో గంజాయి మొక్క అంటారు) నుంచి సంగ్రహిస్తారు. ఇవి మెదడులోని కనబినాయిడ్ గ్రాహకాలకు బంధించబడతాయి. మొక్క పుష్పాల చివరలు, పత్రాలు, రెసిన్ ను వివిధ పాళ్లలో వినియోగించి మరిజువాన, హాషిష్, చరస్, గంజా (marijuana, hashish, charas, ganja) ను ఉత్పత్తి చేస్తారు. ఈ మధ్యకాలంలో కనబినాయిడ్స్ను క్రీడాకారులు (డోపింగ్ -doping ) కూడా దుర్వినియోగం చేస్తున్నారు.

దుర్వినియోగ విధానం :
ముక్కుతో పీల్చడం లేదా నోటితో మింగడం.

ప్రభావం :
ఇది హృదయ ప్రసరణవ్యవస్థపై ప్రభావాన్ని చూపిస్తుంది.

ప్రశ్న 16.
కొకైన్పై లఘుటీక రాయండి.
జవాబు:
కోకా ఆల్కలాయిడ్ లేదా కొకైన్ :
దక్షిణ అమెరికాలో పెరిగే కోకా యొక్క ఎరిత్రోజైలం కోకా (Erythroxylum coca) ఆకుల నుంచి తెల్లటి ఆల్కలాయిడ్ పటికను తీస్తారు. దీన్ని సాధారణంగా కోక్ లేదా క్రాక్ (crack) అంటారు.

దుర్వినియోగ విధానం :
బలవంతంగా పీల్చడం (snorting).

ప్రభావం :
ఇది కేంద్ర నాడీవ్యవస్థను శక్తివంతంగా ప్రేరేపిస్తుంది. డోపమైన్ అనే నాడీ అభివాహకం (neurotransmitter) రవాణాలో జోక్యం చేసుకొంటుంది. దీనివల్ల ఉల్లాసస్థితి (euphoria), శక్తి పెరుగుదల కలుగుతుంది. అధిక మోతాదులు భ్రాంతికి (hallucinations) కారణమవుతాయి.

బాగా ప్రాచుర్యం గల హాల్లుసినోజెనిక్ ధర్మాలు గల మొక్కలలో అట్రోపా బెల్లడొనా, దతూరా ఉన్నాయి. బార్బిటురేట్ (barbiturates – నిద్రమాత్రలు), ఆంఫీటమైన్స్ (నిద్రహారిణి మాత్రలు),

బెంజోడయాజిపైన్స్ (Benzodiazepines : ప్రశాంతకాలు – tranquilizers), లైసర్జిక్ ఆమ్ల డైఈథైల్ అమైడ్స్ (LSD), ఇతర మందులను సాధారణంగా మానసిక వ్యాధిగ్రస్తులకు అంటే వ్యాకులత/కుంగిపోవడం(depression), నిద్రలేమి (insomnia) మొదలైన వాటిలో బాధపడే రోగుల చికిత్సలో వినియోగించే మందులను దుర్వినియోగం చేస్తున్నారు.

ప్రశ్న 17.
కౌమారదశను భేద్యమైన దశగా ఎందుకంటారు?
జవాబు:
కౌమార దశ :
దీన్ని యవ్వనారంభ దశ (Puberty) కు ప్రౌఢ దశకు మధ్యకాలం అంటారు. ఈ దశ చిన్నతనానికి (childhood), ప్రౌఢ దశకు వారధి. 12-18 సం|| వయస్సు మధ్యకాలాన్ని కౌమారదశ అంటారు. ఈ కాలంలో పిల్లలు పరిపక్వత చెందుతారు. దీనితో అనేక జీవసంబంధ, ప్రవర్తనా మార్పులు ముడిపడి ఉంటాయి. ఒక వ్యక్తి మానసిక, మనోవిజ్ఞాన అభివృద్ధిలో కౌమారదశను హానిపొందే (vulnerable) దశగా పరిగణిస్తారు. కనుక ఈ దశను భేద్యమైన దశగా వర్ణిస్తారు. ఈ వయస్సులో యువత జిజ్ఞాస (curiosity), కోరిక (desire)తో సాహసం (adventure) మరియు ప్రకోపం/రెచ్చగొట్టుట (excitement) వల్ల చేసే ప్రయోగాలు (experiments) యువతను పొగాకు, మందులు, ఆల్కహాలు వినియోగానికి ప్రేరేపించే (motivate) కారణాలు. కానీ మొట్టమొదటసారిగా మందులు లేదా ఆల్కహాల్ వినియోగం కేవలం జిజ్ఞాస, ప్రయోగాలతోనే ప్రారంభమవుతుంది.

ఆ తరవాత ఇబ్బందులనుంచి తప్పించుకోవడానికి వీటిని వినియోగిస్తారు. ఈ మధ్యకాలంలో యువత పరీక్షలు లేదా విద్యా విషయాలలో(academics) ప్రగతి సాధించే క్రమంలో ఒత్తిడి (stress) వల్ల మత్తుమందుల వైపు మొగ్గుతున్నారు. దీనికి తోడుగా టెలివిజన్, సినిమాలు, వార్తాపత్రికలు, ఇంటర్నెట్లు దోహదపడుతున్నాయి. వీటితో పాటు ఆసరా ఇవ్వని లేదా చపలచిత్త (unstable) కుటుంబం, తోటివారి వల్ల ఒత్తిడి (peer pressure) అనే అంశాలు కూడా యువతలో పొగాకు, మందులు, ఆల్కహాల్ దుర్వినియోగానికి ప్రేరేపిస్తాయి.

ప్రశ్న 18.
వ్యసనం, ఆధారం మధ్య భేదాలను తెలపండి.
జవాబు:
వ్యసనం (addiction) మరియు ఆధారపడటం (dependence) :
పొగాకు, మందులు, ఆల్కహాలు దుర్వినియోగం వ్యసనానికి, ఇతరులపై ఆధారపడటానికి దారితీస్తుంది.

వ్యసనం :
ఇది మానసిక ఉల్లాసస్థితితో కూడిన బంధం. ఇది పొగాకు, మందులు, ఆల్కహాలు వినియోగానికి తనలో గల వ్యసన ప్రవృత్తే (addictive nature) ముఖ్యమైందని ఎవ్వరూ గుర్తించరు. TDA లను తరచుగా వినియోగించడం వల్ల శరీరంలో గ్రాహకాల సహనస్థాయి (tolerance level) పెరుగుతుంది. దీనివల్ల గ్రాహకాలు ఎక్కువ మోతాదు (dose) కు స్పందిస్తాయి. దీనితో TDAలను ఎక్కువ తీసుకోవడం వల్ల వ్యసనపరులవుతారు. TDAలను ఒక్కసారి తీసుకొన్నా అది వ్యసనానికి దారి తీయవచ్చు అనే విషయాన్ని బాగా గుర్తుంచుకోవాలి. వ్యసనశక్తి (addictive potential) గల పొగాకు, మందులు, ఆల్కహాల్స్ (TDAలు), వ్యసన స్వభావంగల (vicious circle) గుంపులోకి లాగేస్తాయి. దీనితో మందుల దుర్వినియోగం క్రమం తప్పకుండా మొదలై అందులోనుంచి బయటకు రాలేని స్థితికి త్వరగా దారితీస్తుంది. ఈ స్థితిలో సరైన సలహా లేదా కౌన్సిలింగ్ లేనప్పుడు ప్రజలు పూర్తిగా వ్యసనపరులై దానిపైనే ఆధారపడతారు.

ఆధారపడటం :
ఇది క్రమం తప్పని మోతాదులో మత్తుమందులు లేదా ఆల్కహాల్ వినియోగాన్ని ఒకేసారి మానివేయడం వల్ల శరీరంలో కనిపించే అసంతృప్తి లక్షణం లేదా ఉపసంహరణ సిండ్రోమ్ (withdrawl syndrome) . ఈ సిండ్రోమ్లో ఆందోళన(anxiety), వణకడం (tremors), వికారం(nausia), చెమట పట్టడం మొదలైన లక్షణాలు కనిపిస్తాయి. TDAలను వాడటం మళ్ళీ మొదలెడితే ఇవి కనిపించవు. ఆధారం అనేది అన్ని సామాజిక కట్టుబాట్లను వదిలే స్థితికి దారితీస్తుంది.

AP Inter 1st Year Zoology Study Material Chapter 6 మానవ సంక్షేమంలో జీవశాస్త్రం

ప్రశ్న 19.
TDA దుర్వినియోగాన్ని దృష్టిలో ఉంచుకుని “వ్యాధి చికిత్స కంటే నివారణ మంచిది” నిరూపించండి.
జవాబు:
TDA అనగా పొగాకు (Tobacco), మత్తుమందులు – మాదకద్రవ్యాలు (Drugs), సారాయి (Alcohol)లు. వీటి వినియోగం యువతపై చాలా చెడు ప్రభావాన్ని చూపిస్తున్నాయి. పొగాకు వినియోగం ఊపిరితిత్తులలో, నోటిలో కాన్సర్కు దారితీసే అవకాశం ఉంది. ఇంకా దీని ప్రభావం జీర్ణవ్యవస్థ, గుండె, రక్తప్రసరణ, శ్వాసవ్యవస్థపై విపరీత పరిణామాలు చోటు చేసుకుంటాయి.

మత్తుమందులు – మాదకద్రవ్యాలు – వీటి వినియోగాల మానసిక, శారీరక రుగ్మతలకు దారి తీస్తుంది.

ఆల్కహాల్ వినియోగం మానసిక దౌర్బల్యానికి దారితీసి వ్యక్తి వికాసాన్ని నాశనం చేస్తుంది. ఆరోగ్యాన్ని క్షీణింపజేస్తుంది. TDA కు అలవాటు పడిన వ్యక్తులు మానసికంగా, శారీరకంగా, సామాజికంగా పతనానికి గురి అవుతారు. చికిత్స కంటే నివారణ మంచిది కనుక TDA కి అలవాటు పడిన వారిని క్రింది జాగ్రత్తలు పాటించినట్లయితే మంచి పౌరులుగా మార్చవచ్చును.

  1. తల్లిదండ్రులు తమ పిల్లలపై ఇతరులతో పోల్చి వత్తిడి తేకూడదు.
  2. తల్లిదండ్రులు, ఉపాధ్యాయ యువతకు వారి ప్రవర్తనను గుర్తించి హితబోధ చేయాలి.
  3. మత్తుమందులు, పొగతాగడం, ఆల్కహాల్ త్రాగడం వంటి వాటి వలన సంభవించే అనారోగ్యాలను వారికి తెలియజేయాలి. వాటి పీడితులను గూర్చి వారికి తెలియజేయాలి.
  4. యువతకు విద్యావిషయాలు, మానసిక వత్తిడి, సామాజిక సమస్యలు, వయస్సుతోపాటు వచ్చే మార్పులు జీవితంలో ఒక భాగం అని, ప్రత్యేకత ఏమీ కాదని, వాటిని అధిగమించే విధంగా హితబోధ చేయాలి.
  5. మనోవిజ్ఞాన వేత్తలు, మానసిక వైద్యులు, రిహాబిలిటేషన్ ప్రోగ్రామ్స్, డీఅడిక్షన్ సలహాలు, వైద్యుల సూచనలు వారికి అందుబాటులో తీసుకురావాలి.

పై విధంగా వివిధ కార్యక్రమాల ద్వారా యువతను దుర్వినియోగం నుండి దూరంగా ఉంచి మంచి పౌరులుగా తీర్చిదిద్దవచ్చును.

దీర్ఘ సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ఎంటమీబా హిస్టోలైటికా నిర్మాణాన్ని, జీవిత చక్రాన్ని వివరించండి. పటం గీసి భాగాలను గుర్తించండి.
జవాబు:
ఎంటమీబా హిస్టోలైటికా మానవుడి పెద్దపేగు, అంధనాళంలో ఉండే అంతర పరాన్న జీవి. దీని వలన మానవుడికి అమీబిక్ డిసెంటరీ లేదా అమీబియాసిస్ అనే వ్యాధి కలుగుతుంది. ఇది తన జీవిత చక్రంను ఒకే అతిథేయిలో పూర్తి చేసుకొనును. కనుక దీనిని “మోనోజెనిటిక్” పరాన్న జీవి అందురు. దీని జీవిత చక్రములో రెండు దశలుంటాయి.

  1. మాగ్నదశ లేక పోషకజీవి.
  2. మైన్యూట దశ లేక కోశస్థ పూర్వ దశ

1. మాగ్నదశ లేక పోషకజీవి :
పోషకజీవి పెద్ద ప్రేగు గోడలలో వుంటుంది. దీనిని ఆవరించి ప్లాస్మాలెమ్మా అనే పొర ఉంటుంది. దీనిలో బాహ్య జీవ ద్రవ్యం మందంగా పారదర్శకంగా కణికారహితంగావుంటుంది. అంతర్జీవ ద్రవ్యం కణికాయుతంగా ఉంటుంది. అంతరజీవ ద్రవ్యంలో తిత్తివంటి కేంద్రకంవుంటుంది. కేంద్రకం మధ్యలో ఎండోసోమ్ అనే నిర్మాణమువుంటుంది. కేంద్రక త్వచం యొక్క లోపలి తలాన్ని అంటి పెట్టుకొని పూసలవంటి క్రొమాటిన్ పదార్థం వుంటుంది. దీని నుండి సన్నని క్రొమాటిన్ తంతువులు, కేంద్రక బిందువు వైపుకు చక్రంలోని చువ్వల మాదిరిగా ప్రసరించి ఉంటాయి. దీని వలన కేంద్రకం బండి చక్రం రూపంలో కనిపిస్తుంది. పోషకజీవి ఒక వేలు వంటి మిధ్యాపాదాన్ని కలిగి ఉంటుంది. దీని ఆహార రక్తికల్లో ఎర్రరక్త కణాలుంటాయి. పోషక జీవి ద్విదావిచ్ఛిత్తి ద్వారా తన సంఖ్యను పెంచుకుంటుంది. వీటిలో కొన్ని పిల్ల జీవులు ప్రేగు కుహరంలోకి ప్రవేశించి కోశస్థ పూర్వదశగా మారతాయి.

2. కోశస్థ పూర్వదశ :
ఈ దశలో ఎంటమీబా ఆహార రక్తికలను, మిథ్యాపాదాన్ని కోల్పోతుంది, గోళాకారంగా మారుతుంది. పరిమాణం తగ్గుతుంది. గ్లైకోజన్ కణికలను, ఒకటి లేదా రెండు క్రొమాటాయిడ్ దేహాలను కణ ద్రవ్యంలో నిల్వచేసుకుంటుంది. క్రొమాటాయిడ్ దేహాలు రైబోన్యూక్లియో ప్రోటీను తత్వాన్ని కలిగి ఉంటాయి.
AP Inter 1st Year Zoology Study Material Chapter 6 మానవ సంక్షేమంలో జీవశాస్త్రం 1

కోశస్థ దశ :
కోశస్థ పూర్వదశ తన చుట్టూ సున్నితమైన కోశాన్ని తయారుచేసుకొని కోశస్థ దశను చేరుతుంది. కోశికరణం జరగగానే పరాన్న జీవిలోని కేంద్రకం రెండు సమవిభజనలను జరుపుకొని చతుష్కేంద్రక కోశంగా రూపొందుతుంది. ఈ దశ ఏర్పడటం ఎంటమీబా హిస్టోలైటికా యొక్క ప్రత్యేక లక్షణం.

సంక్రమణం :
చతుష్కేంద్రక దశలు మానవునికి సంక్రమణ దశలు. ఇవి మలముతో పాటు బయటకి విసర్జింపబడతాయి. ఈ కోశాలు కాయగూరకు అంటుకొని గాని, ఆహారపదార్థాలతో కలిసిగాని నీటిలో తేలుతూ గాని ఉంటాయి. ఈ విధంగా కలుషితమైన నీటిని లేదా ఆహారాన్ని మానవుడు స్వీకరించుట వలన పరాన్నజీవి అతిథేయిని చేరుతుంది. ఈ దశలను అతిథేయికి చేరవేయటంలో, బొద్దింకలు, ఈగలు కూడ ఏజెంట్లుగా పనిచేస్తాయి.

వికోశీకరణ :
చతుష్కేంద్రక కోశాలు కొత్త అతిథేయి పేగులోకి ప్రవేశించిన తరువాత అక్కడి ఎంజైముల చర్య వలన కోశము కరుగుతుంది. నాలుగు కేంద్రకములు గల జీవులు బయటకు వస్తాయి. ఈవిధంగా కోశం నుండి పరాన్నజీవి బయటకు రావడాన్ని వికోశికరణము అంటారు. వికోశీకరణ చెంది విడుదలైన నాలుగు కేంద్రకాలు గల పరాన్నజీవి “మెటాసిస్టిక్” దశ అంటారు.

మెటాసిస్టిక్ దశ :
మెటాసిస్టిక్ రూపములోని నాలుగు కేంద్రకాలు విభజన చెంది, ఎనిమిది కేంద్రకాలుగా ఏర్పడతాయి. జీవ ద్రవ్యం కూడా విభజన చెంది కేంద్రకాల చుట్టు చేరుతుంది. దీనివలన మొత్తం 8 పిల్ల ఎంటమీబాలు ఏర్పడి, పెద్దపేగు గోడను చేరి పోషక జీవులుగా మారతాయి.
AP Inter 1st Year Zoology Study Material Chapter 6 మానవ సంక్షేమంలో జీవశాస్త్రం 2

ప్రశ్న 2.
మానవుడిలో ప్లాస్మోడియం వైవాక్స్ జీవితచక్రాన్ని వివరించండి. దాని పటం గీసి భాగాలు గుర్తించండి.
జవాబు:
మానవునిలో (మాధ్యమిక అతిథేయి) ప్లాస్మాడియం’ జీవిత చక్రం :
మాధ్యమిక అతిథేయి అయిన మానవుడిలో ప్లాస్మాడియం విఖండ జననం అనే అలైంగిక పద్ధతిలో తన జీవిత చక్రాన్ని పూర్తి చేస్తుంది. ఇది రెండు భాగాలుగా ఉంటుంది. కాలేయంలో జరిగే దానిని కాలేయ విఖండ జననం అని, ఎర్ర రక్తకణాలలో జరిగేదానిని రక్తకణ విఖండ జననం అని అంటారు.

కాలేయ విఖండ జననం :
ఇది రెండు రకాలుగా ఉంటుంది. రక్తకణపూర్వ, రక్తకణ బాహ్య జీవిత చక్రం.

రక్తకణ పూర్వ జీవితచక్రం :
స్పోరోజాయిట్ దశలున్న దోమ మానవుడిని కుట్టినప్పుడు దోమ లాగా జలంతో బాటుగా స్పోరోజాయిట్లు మానవ రక్తంలో ప్రవేశిస్తాయి. రక్తంలోకి ప్రవేశించిన స్పోరోజాయిట్లు అర్థగంటలోపులోనే కాలేయకణాలలోకి చేరి, కాలేయకణ పదార్థాన్ని ఆహారంగా తీసుకుంటు తమ ఆకృతిని గోళాకారంగా మార్చుకుంటాయి. వీటిని షైజాంట్ అంటారు. వీటిలోని కేంద్రకం బహుధావిచ్ఛిత్తి చెంది అనేక పిల్ల కేంద్రకాలను ఏర్పరుస్తుంది. ఈ కేంద్రకాల చుట్టూ కణద్రవ్యం చేరి అనేక పిల్లజీవులు ఏర్పడతాయి. ఇప్పుడు షైజాంట్ పగిలి అనేక పిల్ల క్రిప్టోజాయిట్స్ కాలేయ కణాలలోకి విడుదలవుతాయి. వీటిలో కొన్ని ఎర్ర రక్తకణాలలో ప్రవేశిస్తాయి. కొన్ని తిరిగి కొత్తగా కాలేయ కణాలలోకి ప్రవేశిస్తాయి. ఈ ప్రక్రియ 8 రోజులు పడుతుంది.

రక్తకణ బాహ్య జీవిత చక్రం :
క్రిప్టోజాయిట్స్ తిరిగి కాలేయ కణాలను చేరి రక్తకణ పూర్వ చక్రంలో మాదిరిగా అనేక మార్పులు చెంది రెండోదశ మీరోజాయిట్లను మెటాక్రిప్టోజాయిట్లను విడుదల చేస్తాయి. వీటిలో రెండు రకాలుంటాయి. చిన్నవిగా ఉండే సూక్ష్మమెటాక్రిప్టోజాయిట్లు, పెద్దవిగా ఉండే స్థూల మెటాక్రిప్టోజాయిట్లు. ఈ ప్రక్రియ దాదాపు 2 రోజులలో పూర్తి అవుతుంది. వీటిలో స్థూల మెటాక్రిప్టోజాయిట్లు తిరిగి కొత్త కాలేయకణాలను చేరి రక్తకణ బాహ్యిజీవితచక్రాన్ని ప్రారంభిస్తాయి. సూక్షక్రిప్టోజాయిట్లు ఎర్రరక్తకణాలను చేరి రక్తకణ జీవిత చక్రాన్ని ప్రారంభిస్తాయి.

ప్లాస్మోడియం స్పోరోజాయిట్ రూపంలో మానవ రక్తంలో ప్రవేశించినప్పుడినుండి తిరిగి రెండవసారి క్రిప్టోజాయిట్లు ఎర్రరక్తకణాలోకి ప్రవేశించడానికి పట్టేకాలాన్ని ప్రీపేటెంట్ కాలం అంటారు. ఈ సమయంలో ఎలాంటి రోగలక్షణాలు కనిపించవు.

రక్తకణ జీవిత చక్రం :
ప్లాస్మోడియం జీవితచక్రంలో ఈ భాగాన్ని కామిల్లోగాల్జి అనే శాస్త్రవేత్త వివరించాడు. కనుక దీనిని గాల్జిచక్రం అని కూడా అంటారు. ఇది రక్తకణ పూర్వ లోని క్రిప్టోజాయిట్లతోగాని, రక్తకణ బాహ్యజీవితచక్రంలోని సూక్ష్మమెటాక్రిప్టోజాయిట్స్ లాగా ప్రారంభమవుతుంది.

ఎర్రరక్తకణాలోకి ప్రవేశించగానే మీరోజాయిట్లు గోళాకార పోషక జీవులుగా మారతాయి. ఇవి RBC లోని హిమోగ్లోబిన్ను ఆహారంగా తీసుకోవడం ప్రారంభమవుతుంది. వీటిలో ఒక చిన్న రిక్తిక ఏర్పడి, పరిమాణంలో పెరుగుతూ పోషకజీవిలోని జీవపదార్థాన్ని కేంద్రకాన్ని అంచువైపు నెట్టడం వలన ఉంగరం మాదిరిగా కనిపిస్తుంది. ఈ దశను అంగూళీక దశ అంటారు. తరువాత రిక్తిక అదృశ్యమవుతుంది. పరాన్నజీవి మిథ్యాపాదాలను ఏర్పరుచుకుంటుంది. ఈ దశను అమీబాయిడ్ దశ అంటారు. ఎర్రరక్తకణ జీవ పదార్థాన్ని తింటు పోషకజీవి పరిమాణం పెరుగుతుంది, దీనివలన RBC పరిమాణం పెరుగుతుంది. పరాన్నజీవి హిమోగ్లోబిన్ లోని గ్లోబిన్ ప్రోటీన్ ను జీర్ణం చేసుకొని జీర్ణం కాని హిమ్ బాగాని హిమోజాయిన్ అనే కణికలుగా ఏర్పరుస్తుంది.

ఇది మలేరియా జ్వరాన్ని కలుగుజేసే విష పదార్థం. ఇది చిన్న ఎర్రని మచ్చలుగా RBC జీవ పదార్థంతో ఏర్పడతాయి. వీటిని షఫ్నర్ చుక్కలు అంటారు. ప్లాస్మోడియం మిథ్యాపాదాలను కోల్పోయి బాగా పెరిగి RBC ని మొత్తంగా ఆక్రమించి షైజాంట్గా మారుతుంది. దీనిలోని కేంద్రకం విఖండజనన జరుపుట 12 నుండి 24 ఎర్రరక్తకణ మీరోజాయిట్స్ను ఏర్పరుస్తుంది. ఇవి RBC తో గులాబిరేకులాగా మారి రోజెట్ దశగా మారుతుంది. చివరిగా ఎర్రరక్తకణం పగిలి మీరోజాయిట్స్, హీమోజాయిన్ రక్తంలోకి విడుదలవుతాయి.

రక్తంలోకి విడుదలైన మీరోజాయిట్స్ తిరిగి కొత్త RBC లలోకి ప్రవేశిస్తాయి. హీమోజాయి విషపదార్థం ప్రభావం వలన మలేరియా జ్వరం వస్తుంది. స్పోరోజాయిట్ మొదట మానవుడిలో ప్రవేశించింది మొదలు మలేరియా జ్వర లక్షణాలు వచ్చే వరకు పట్టేకాలాన్ని పొదిగేకాలం అంటారు. ఇది దాదాపు 10 నుండి 14 రోజులు పడుతుంది.

సంయోగ బీజమాతృకలు ఏర్పడటం :
అనేక పర్యాయాలు రక్తకణ జీవితచక్రం పూర్తిచేసుకున్న ప్లాస్మోడియం మీరోజాయిట్స్ కొన్ని సంయోగబీజ మాతృకలుగా మారతాయి. వీటిలో రెండురకాలుగా ఉంటాయి. సూక్ష్మంగా ఉన్న వాటిని సూక్ష్మ లేదా పురుష సంయోగబీజమాతృకలు అని, పెద్దవిగా ఉన్న వాటిని స్థూల లేదా స్త్రీ సంయోగ బీజమాతృకలు అంటారు. ఈ దశలు తదుపరి దోమలో ప్రవేశించి మాత్రమే అభివృద్ధి చెందుతాయి.
AP Inter 1st Year Zoology Study Material Chapter 6 మానవ సంక్షేమంలో జీవశాస్త్రం 4

ప్రశ్న 3.
దోమలో ప్లాస్మోడియం వైవాక్స్ జీవితచక్రాన్ని పటం సహాయంతో వివరించండి. [Mar. ’14]
జవాబు:
ప్లాస్మోడియం వైవాక్స్ దోమలో జరుపుకునే జీవిత చక్రాన్ని సర్ రోనాల్డ్స్ వివరించడం వలన దీనిని రాస్ చక్రం అని కూడా అంటారు.

ఈ ఎనాఫిలిస్ దోమ వ్యాధిగ్రస్తుడైన మానవుణ్ని కుట్టి రక్తాన్ని పీల్చినప్పుడు రక్తం సంయోగబీజ మాతృకలు, ఇతర దశలు దోమ అన్నాశయాన్ని చేరతాయి. దోమ జీర్ణ వ్యవస్థలో సంయోగబీజ మాతృకలు మాత్రమే జీవించి ఉంటాయి. మిగతా దశలు జీర్ణమవుతాయి.

ప్లాస్మోడియం తన జీవిత చక్రంలో లైంగిక ప్రత్యుత్పత్తి దోమలో పూర్తి అవుతుంది. దీనిలో క్రింది దశలుంటాయి.

  1. బీజకణోత్పత్తి (Gametogony)
  2. ఫలదీకరణం (Fertilization)
  3. గమనసంయుక్తబీజం, సంయుక్త బీజకోశాలు ఏర్పడటం (Formation of ookinite and oocysts)
  4. సిద్ధబీజోత్పత్తి (sporogony)

i) బీజకణోత్పత్తి (Gametogony) :
సంయోగబీజ మాతృకణాల నుంచి పురుష, స్త్రీ బీజకణాలు ఏర్పడటాన్ని బీజకణోత్పత్తి అంటారు. దోమ అన్నాశయకుహరంలో బీజకణాలు ఏర్పడతాయి.

పురుష సంయోగబీజకణాలు ఏర్పడటం :
ఈ ప్రక్రియలో సూక్ష్మ సంయోగబీజమాతృక యొక్క కేంద్రకం విభజనతో ఎనిమిది పిల్ల కేంద్రకాలను ఏర్పరుస్తాయి. వీటిని ప్రాక్కేంద్రాలు (Pronuclei) అంటారు. ఈ కేంద్రకాలు అంచులను చేరతాయి. జీవపదార్థం ఎనిమిది కశాభాలను పోలిన కీలితాలను ఏర్పరుస్తుంది. ఒక్కొక్క కేంద్రక భాగం ఒక్కొక్క జీవపదార్థ కీలితంలోకి ప్రవేశించి కశాభం లాంటి సూక్ష్మ సంయోగబీజాలు లేదా పురుష సంయోగబీజాలను ఏర్పరుస్తుంది. ఈ సూక్ష్మ సంయోగబీజాలు విసిరిన కొరడా మాదిరి కదలికలను (lashing movements) చూపుతూ జీవపదార్థం నుంచి విడుదలవుతాయి. ఈ విధంగా పురుష సంయోగబీజాలు విడుదల కావడాన్ని కశాభ నిర్మోచనం (exflagellation) అంటారు.

స్త్రీ సంయోగబీజకణాలు ఏర్పడటం :
స్త్రీ సంయోగబీజ మాతృకణాలు కొద్ది మార్పులతో స్త్రీ సంయోగ బీజకణంగా ఏర్పడుతుంది. దీన్ని పరిపక్వత (maturation) అంటారు. స్త్రీ సంయోగ బీజకణాల కేంద్రకం పరిధి వైపు కదులుతుంది. ఆ ప్రాంతంలో జీవపదార్థం ఉబ్బుతుంది. ఉబ్బిన ఈ భాగాన్ని ఫలదీకరణ శంకువు (fertilization cone) అంటారు.

ii) ఫలదీకరణం :
స్త్రీ, పురుష బీజకణాలు కలవడాన్ని ఫలదీకరణ అంటారు. ఇది దోమ అన్నాశయ కుహరంలో జరుగుతుంది. సూక్ష్మ సంయోగబీజాలు చురుకుగా కదులుతూ స్థూల సంయోగబీజం యొక్క ఫలదీకరణ శంకువును తాకగానే, దానిలోకి ప్రవేశిస్తుంది. రెండు బీజకణాల ప్రాక్కేంద్రకాలు, జీవపదార్థం కలిసి సంయుక్త కేంద్రకం (synkaryon) ఏర్పడుతుంది. ఈ కలయికలో సంయోగబీజాలు పరిమాణరీత్యా అసమానంగా ఉంటాయి.

కాబట్టి దీన్ని అసమసంయోగం (anisogamy) అంటారు. సంయుక్త కేంద్రకాన్ని కలిగిన స్త్రీ సంయోగ బీజాన్ని సంయుక్త బీజం (zygote) అంటారు. ఇది గుండ్రంగా ఉండి కదలలేదు.
AP Inter 1st Year Zoology Study Material Chapter 6 మానవ సంక్షేమంలో జీవశాస్త్రం 5

i) గమన సంయుక్తబీజం, సంయుక్త బీజకోశం ఏర్పడటం :
సంయుక్త బీజం కొంతకాలం చైతన్యరహితంగా ఉంటుంది. 18-24 గంటలలో ఇవి ఊకినైట్ / గమనసంయుక్తబీజం అనే పొడవైన, సన్నటి, కదలిక చూపే క్రిమి రూపాన్ని పొందుతుంది. ఇది అన్నాశయ కుడ్యాన్ని తొలుచుకొని, ఆధారత్వచం కింద చేరుతుంది. ఇది గుండ్రంగా మారి తన చుట్టూ ఒక కోశాన్ని స్రవిస్తుంది. ఈ కోశస్థ దశను ఊసిస్ట్ (Oocyst) అంటారు. అన్నాశయ కుడ్యంపై 50-500 ఊసిస్ట్లు ఏర్పడి చిన్నచిన్న బుడిపెలుగా కనిపిస్తాయి. (ఈ ఊసిస్ట్లను సర్ రొనాల్డ్ రాస్ మొట్టమొదటగా గుర్తించాడు).

AP Inter 1st Year Zoology Study Material Chapter 6 మానవ సంక్షేమంలో జీవశాస్త్రం 6
iv) సిద్ధబీజోత్పత్తి :
ఊసిస్ట్ స్పోరోజాయిట్లు ఏర్పడటాన్ని సిద్ధబీజోత్పత్తి అంటారు. బానో (Bano) అనే శాస్త్రజ్ఞుడు చెప్పిన ప్రకారం కేంద్రకం మొదట క్షయకరణ విభజన జరుపుకుంటుంది. ఆ తరువాత అనేకసార్లు సమవిభజనలను కొనసాగిస్తూ 1000 వరకు పిల్ల కేంద్రకాలను ఏర్పరుస్తుంది. ప్రతీ కేంద్రకం చుట్టూ కొంత జీవపదార్థం చేరి కొడవలి ఆకారం స్పోరోజాయిట్స్ ఏర్పడతాయి. స్పోరోజాయిట్స్ గల ఊసిస్ట్ను సిద్ధబీజకోశం (sporocyst) అంటారు. సిద్ధబీజకోశం పగిలినప్పుడు స్పోరోజాయిట్లు దోమ రక్తకుహరం (haemocoel) లోకి విడుదలవుతాయి. ఇవి అక్కడి నుంచి లాలాజలగ్రంథులలోనికి చేరి సంక్రమణకు సిద్ధంగా ఉంటాయి. దోమలో ప్లాస్మోడియం జీవితచక్రం పూర్తికావడానికి దాదాపుగా 10-24 రోజులు పడుతుంది.

AP Inter 1st Year Zoology Study Material Chapter 6 మానవ సంక్షేమంలో జీవశాస్త్రం

ప్రశ్న 4.
ఆస్కారిస్ లుంబ్రికాయిడిస్ నిర్మాణాన్ని, జీవితచక్ర పటాలతో వివరించండి.
జవాబు:
AP Inter 1st Year Zoology Study Material Chapter 6 మానవ సంక్షేమంలో జీవశాస్త్రం 7
నిమటోడా వర్గానికి చెందిన ఆస్కారిస్ లుంబ్రికాయిడిస్ మాన ఆంత్రంలో నివశించే అతి సాధారణ పరాన్నజీవి. ఇది కలుషిత నీరు, ఆహారం ద్వారా వ్యాప్తి చెందుతుంది. దీని పిండసహిత అండాలు మానవులకు సాంక్రమిక దశలు.

నిర్మాణం :
స్త్రీ, పురుష జీవులు వేరువేరుగా ఉంటాయి. స్పష్టమైన లైంగిక ద్విరూపకత ఉంటుంది. రెండు జీవులు స్తూపాకారంలో, సన్నగా ఉంటాయి. పూర్వాంతంలో నోరు మూడు కైటిన్ పెదవులతో ఆవరించి ఉంటుంది. నోటికి దగ్గరగా ఉదర మధ్యంగా చిన్న విసర్జక రంధ్రం ఉంటుంది.

పురుషజీవి :
దీని తోక వంపు తిరిగి ఉంటుంది. పరాంతంలో అవస్కర రంధ్రం, ఒక జత కైటిన్ నిర్మిత పీనియల్ కంటకాలు (pineal spicules) లేదా పీనియల్ శూకాలు (pineal saetae) ఉంటాయి. ఇది సంపర్కంలో శుక్రకణాలను ప్రవేశపె ట్టడానికి తోడ్పడుతుంది.

స్త్రీ జీవి :
దీని తోక నిటారుగా ఉంటుంది. జనన రంధ్రం లేదా యోనిరంధ్రం ఉదరతలంలో నోటి కింద 1/3 వంతుల దూరంలో ఉంటుంది. తోకకు కొంచెం పైగా పాయువు ఉంటుంది.

AP Inter 1st Year Zoology Study Material Chapter 6 మానవ సంక్షేమంలో జీవశాస్త్రం 8
జీవిత చక్రం :
మానవుడి చిన్నపేగులో సంపర్కం జరుగుతుంది. సంపర్కం తరువాత స్త్రీ జీవి రోజుకు దాదాపుగా రెండు లక్షల గుడ్లను విడుదల చేస్తుంది. ప్రతి గుడ్డుకూ ఉపరితంలో బుడిపెలుగా ఏర్పడిన ప్రోటీన్ పొర ఉంటుంది. అందువల్ల ఆస్కారిస్ గుడ్లను మామ్మిల్లేటెడ్ గుడ్లు (mammilated eggs) అంటారు. ప్రోటీన్ పొరకు లోపల కైటిన్ కర్పరం, లిపిడ్ పొరలు ఉంటాయి. మలంతో పాటు గుడ్లు విడుదలవుతాయి. తేమ నేలలో గుడ్డులో పిండాభివృద్ధి జరిగి మొదటి దశ రాబ్దిటిఫార్మ్ డింభకం ఏర్పడుతుంది. ఇది మొదటి నిర్మోచనంతో రెండో దశ రాబ్దిటిఫార్మ్ డింభకంగా మారుతుంది. ఇది మానవుడికి వ్యాధిని కలిగించే సాంక్రమికదశ. కలుషిత ఆహారం, నోటితో ఈ దశలు మానవుడి ఆహారనాళాన్ని చేరతాయి.
AP Inter 1st Year Zoology Study Material Chapter 6 మానవ సంక్షేమంలో జీవశాస్త్రం 9

చిన్నపేగులో కర్పరం కరిగి రెండోదశ డింభకం విడుదల అవుతుంది. ఇది బాహ్యాంత్రవలస (extra intestinal migration) చేస్తుంది. కాలేయ నిర్వాహక సిర ద్వారా మొదట కాలేయాన్ని చేరుతుంది. అక్కడి నుండి పరమహాసిర ద్వారా హృదయాన్ని చేరుతుంది. అక్కడి నుండి పుపుస ధమని ద్వారా ఊపిరితిత్తులను చేరి వాయుకోశాలలో రెండో నిర్మోచనం చెంది మూడోదశ డింభకంగా మారుతుంది. ఆ తరువాత మూడో నిర్మోచనాన్ని కూడా వాయుకోశాలలో పూర్తిచేసి నాలుగోదశ డింభకంగా మారుతుంది. చివరగా ఈ డింభకం శ్వాసనాళికలు (bronchi), వాయునాళం (trachea) స్వరపేటిక (larynx), కంఠబిలం (glottis), గ్రసని, (pharynx) ఆహారవాహిక, జీర్ణాశయ మార్గంలో ప్రయాణించి చిన్నపేగు చేరుతుంది. చిన్నపేగులో నాల్గవ, చివరి నిర్మోచనం చెంది పిల్లజీవిగా మారుతుంది. ఇది 8-10 వారాలలో లైంగిక పరిపక్వతను పొందుతుంది.

వ్యాధి కారకత :
ఆస్కారిస్ లుంబ్రికాయిడిస్ వల్ల ఆస్కారియాసిస్ వ్యాధి వస్తుంది. వీటి సంఖ్య తక్కువైనప్పుడు వ్యాధి లక్షణాలు కనిపించవు. అధిక సంక్రమణ వల్ల పోషణ లోపాలు, ఉదరంలో తీవ్రమైన నొప్పి కలుగుతుంది. దీనివల్ల పిల్లలలో పెరుగుదల నిరోధించబడుతుంది.

నివారణ చర్యలు :
ఎంటమీబాకు వివరించిన అంశాలే వర్తిస్తాయి.

AP Inter 1st Year Zoology Study Material Chapter 6 మానవ సంక్షేమంలో జీవశాస్త్రం

ప్రశ్న 5.
ఉకరేరియా బాంక్రాఫ్టి జీవితచక్రాన్ని వివరించండి.
జవాబు:
ఉకరేరియా బాంక్రాఫ్టి తన జీవితచక్రాన్ని రెండు అతిథేయిలలో పూర్తి చేసుకుంటుంది.

  1. మానవుడు – ప్రాథమిక అతిథేయి,
  2. ఆడ క్యులెక్స్ దోమ – ద్వితీయ అతిథేయి.

మానవునిలో జీవితచక్రం :
ఉచరేరియా బాంక్రాఫ్టి యొక్క ఆడ, మగ జీవులు మానవుడి శోషరస వ్యవస్థలో నివాసముంటాయి. ఇక్కడే సంపర్కం జరుపుతాయి. స్త్రీ జీవులు అందశిశూత్పాదకాలు. ఇవి మైక్రోఫైలేరియా అనే డింభకాలను విడుదల చేస్తాయి. మైక్రోఫైలేరియాలు 0.2-0.3 మి.మీ. పొడవు ఉంటాయి. దీనిని ఆవరించి వదులుగా ఉండే అవభాసిని తొడుగు ఉంటుంది. డింభకం బాహ్య కేంద్రక స్థితిలో ఉంటుంది. డింభక పూర్వాంతంలో ఒక శూకిక ఉంటుంది. దీనిలో నాడీవలయం, వృక్కరంధ్రం, పాయురంధ్రం, లీనెటి కణం, నాలుగు పెద్ద జనన కణాలు, అధికంగా వర్ణకాలను గ్రహించిన కణ సముదాయం. అవశిష్ట ఆహార వాహిక ఉంటాయి.

శోషరస నాళికలోకి విడుదల చేయబడిన మైక్రొఫైలేరియాలు రక్తప్రసరణను చేరతాయి. మైక్రోఫైలేరియాలు అంతరాంగ అవయవాలలో లోతుగా ఉన్న రక్తనాళాలలో నివసిస్తూ రాత్రిపూట 10 గం. నుండి 4 గం.ల మధ్య పరిధీయ రక్తనాళాలోకి వస్తాయి. ఈ గమనాన్ని ‘నిశాకాల గమనం’ అంటారు. ఈ గమనానికి కారణం మాధ్యమిక అతిథేయి అయిన క్యూలెక్స్ దోమ మానవుని రక్తాన్ని రాత్రి సమయంలో పీల్చడమేనని తెలుస్తుంది. రోగగ్రస్తుని దోమ కుట్టి రక్తాన్ని పీల్చినపుడు రక్తంతో పాటుగా మైక్రోఫైలేరియా డింభకాలు క్యూలెక్స్ దోమలోకి చేరతాయి. 70 రోజుల లోపల దోమను చేరకపోతే మైక్రోఫైలేరియా డింభకాలు చనిపోతాయి. మైక్రోఫైలేరియా దోమకు సాంక్రమిక దశలు.

దోమలో జీవిత చరిత్ర :
దోమ ఆహారనాళంలో 2-6 గం.లలో డింభకం తొడుగు కరిగిపోతుంది. ఈ డింభకం దోమ ఆహార కుడ్యాన్ని తొలుచుకొని దోమ రక్త కుహరాన్ని చేరుతుంది. ఇక్కడి నుండి ఉరఃకండరాలను చేరి రెండు రోజులలో సాసేజ్ ఆకార డింభకంగా మారుతుంది. దీన్ని మొదటి డింభకదశ లేదా మొదటిదశ మైక్రోఫైలేరియా అంటారు. ఇది 10-20 రోజులలో రెండు నిర్మోచనాలు పూర్తి చేసుకొని పొడవైన సాంక్రమిక మూడోదశ మైక్రోఫైలేరియాగా మారుతుంది. ఇది దోమ అధరాన్ని చేరుతుంది.

మూడోదశ మైక్రొఫైలేరియా డింభకాలు కలిగిన దోమ మానవుని కుట్టినప్పుడు డింభకాలు మానవ రక్త ప్రవాహాన్ని చేరి అక్కడి నుండి శోషరస నాళాలు చేరతాయి. ఇక్కడ డింభకాలు మూడో, నాలుగో నిర్మోచనాలు జరుపుకొని ప్రౌఢజీవులుగా మారతాయి. ఇవి 5 నుండి 18 నెలల కాలంలో లైంగిక పరిపక్వతను పొందుతాయి.
AP Inter 1st Year Zoology Study Material Chapter 6 మానవ సంక్షేమంలో జీవశాస్త్రం 10

వ్యాధి కారకత :
ఉకరేయా సంక్రమణ వలన ఫైలేరియా జ్వరం, తలనొప్పి, మానసిక ఆందోళన, శరీర ఉష్ణోగ్రత పెరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. శోషరస నాళాలలో శోషరస గ్రంథులలో వాపు కనిపిస్తుంది. శోషరస నాళాలలో కలిగే వాపును లింఫాంజైటిస్ అంటారు. శోషరస గ్రంథులలో వాపును లింఫాడెంటిస్ అంటారు. శోషరస నాళాలలో ఆటంకం వలన శోషరసం సంచిత మవడం వలన అవయవాలలో వాపు ఏర్పడుతుంది. దీనిని లింఫొఎడిమా అంటారు.

వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ప్రభావిత భాగాలు (గమనాంగాలు, ముష్కగోణులు, స్తనాలు) అనూహ్యంగా వాపు కనిపిస్తుంది. ఈ భాగాలలో స్వేదగ్రంథులు క్షీణించి చర్మం పొడిబారి, గరుకుగా అవుతుంది. ఈ స్థితిని ఎలిఫెంటియాసిస్ లేదా బోదకాలు వ్యాధి అంటారు.

AP Inter 1st Year Civics Study Material Chapter 2 రాజ్యం

Andhra Pradesh BIEAP AP Inter 1st Year Civics Study Material 2nd Lesson రాజ్యం Textbook Questions and Answers.

AP Inter 1st Year Civics Study Material 2nd Lesson రాజ్యం

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
రాజ్యాన్ని నిర్వచించి, దాని ముఖ్య లక్షణాలను తెలపండి. [Mar. ’16]
జవాబు:
మానవుడు నిర్మించుకొన్న వివిధ సంస్థల్లో రాజ్యం అత్యంత ప్రధానమైనది, శక్తివంతమైనది కూడా. ఇది సాంఘిక జీవనాన్ని నియంత్రించి, క్రమబద్ధం చేస్తుంది.
క్రీ.శ. 16వ శతాబ్దంలో ఇటలీ దేశస్తుడైన మాఖియవెల్లి, తన గ్రంథమైన “ది ప్రిన్స్”లో మొదటిసారిగా ‘రాజ్యం’ అనే పదాన్ని ఉపయోగించారు. అప్పటి నుండి ఈ పదం బాగా వాడుకలోకి వచ్చింది.

అర్థం: రాజ్యాన్ని ఆంగ్లంలో ‘స్టేట్’ అంటారు. ఈ మాట ‘స్టేటస్’ అనే ట్యుటానిక్ పదం నుండి గ్రహించారు. దీనికి తెలుగులో సరైన అర్థం లేదు. కొందరు ‘స్టేట్’ అంటే ‘ప్రభుత్వం’ అని, ‘జాతి’ అని, ‘సమాజం’ అని భావిస్తున్నారు. కానీ రాజనీతి శాస్త్ర అధ్యయనం ప్రకారం స్టేట్ అంటే ‘రాజ్యం’ అనే అర్థంలో ఉపయోగిస్తున్నారు.
నిర్వచనాలు: రాజ్యాన్ని అనేకమంది రాజనీతి శాస్త్రజ్ఞులు నిర్వచించారు.
ఎ) “మానవునికి సుఖమైన, గౌరవమైన జీవనం ప్రసాదించడం లక్ష్యంగా కలిగిన కుటుంబాల, గ్రామాల సముదాయమే రాజ్యం’. – అరిస్టాటిల్
బి) ‘ఒక నిర్దిష్ట భూభాగంలో శాసనబద్ద ప్రభుత్వం గల ప్రజాసముదాయమే రాజ్యం’. – ఉడ్రోవిల్సన్
సి) “ఒక నిర్ణీత భూభాగంలో రాజకీయంగా వ్యవస్థాపితమైన ప్రజలే రాజ్యం”. – బ్లంటి షిలీ
డి) “ఒక నిర్దిష్ట భూభాగంలో నివసించే పౌరులు, ప్రభుత్వం ఉన్న రాజకీయ వ్యవస్థే రాజ్యం”. – రాబర్ట్ ఎ.డాల్

AP Inter 1st Year Civics Study Material Chapter 2 రాజ్యం

లక్షణాలు: పై నిర్వచనాలననుసరించి రాజ్యానికి నాలుగు ప్రధాన లక్షణాలున్నాయి. అవి 1. ప్రజలు 2. ప్రదేశం 3. ప్రభుత్వం 4. సార్వభౌమాధికారం. వీటితోపాటు ఆధునిక కాలంలో అంతర్జాతీయ గుర్తింపు రాజ్యలక్షణంగా ‘గుర్తించబడింది.

1) ప్రజలు: రాజ్యము ఒక మానవసంస్థ. ప్రజలు లేనిదే రాజ్యం లేదు. అయితే ఒక రాజ్యంలో ప్రజలు ఎంతమంది ఉండవలెననే అంశంపై రాజనీతి తత్త్వవేత్తలు ఒకే అభిప్రాయాన్ని కల్గిలేరు. ప్లేటో దృష్టిలో ఆదర్శ రాజ్య జనాభా 5,040. రూసో అభిప్రాయంలో ఆదర్శ రాజ్యానికి జనాభా 10,000 మంది. అరిస్టాటిల్ అభిప్రాయంలో ఆదర్శ రాజ్య జనాభా మరీ ఎక్కువగానూ, మరీ తక్కువగానూ ఉండరాదు. ప్రస్తుత కాలంలో ఆధునిక రాజ్యాలు కొన్ని తక్కువ జనాభాతోను (అండోరా, శాన్మారినో, వాటికన్ సిటీ), మరికొన్ని ఎక్కువ జనాభాతోను (చైనా, ఇండియా) ఉన్నాయి. ప్రజలు కష్టించి పనిచేసే తత్వాన్ని కల్గి ఉంటే జనాభా తక్కువగా ఉన్నా రాజ్యం అభివృద్ధి చెందుతుంది.

2) ప్రదేశము: నిర్ణీత ప్రదేశం రాజ్యానికి అవసరం. ప్రదేశము అనగా భూమి, ప్రాదేశిక వియత్తలము (ఆకాశము) మరియు ప్రాదేశిక జలాలు (సముద్రజలాలు 12 నాటికల్ మైళ్ళ వరకు) అయితే నాల్గువైపుల భూమినే సరిహద్దుగా కల్గిన, నేపాల్, భూటాన్ వంటి రాజ్యాలకు ప్రాదేశిక జలాలు ఉండవు. వాటికి ప్రదేశము అంటే భూమి, ప్రాదేశిక వియత్తలము మాత్రమే. తక్కువ ప్రదేశం ఉన్న రాజ్యాలు ఉత్తమమైనవిగా ప్లేటో, రూసో అభిప్రాయపడ్డారు. లార్డ్ ఆక్టన్, ట్రయష్కీలు పెద్ద ప్రదేశం కల్గిన రాజ్యాలు గొప్పవని విశ్వసించారు. అరిస్టాటిల్ రాజ్య ప్రదేశం మరీ ఎక్కువగాను, మరీ తక్కువగాను ఉండకూడదని తెల్పెను.

రాజ్యానికి ప్రదేశం ఎక్కువగా ఉంటే సహజవనరులు ఎక్కువగా దొరికే అవకాశం ఉంటుంది. ప్రపంచంలో నేడు ఎక్కువ భూభాగం కలిగిన రష్యా, అమెరికా, ఆస్ట్రేలియా లాంటి రాజ్యాలు, తక్కువ భూభాగం కలిగిన బ్రూనాయి, అండోరా, శాన్ మారినో వంటి రాజ్యాలు ఉన్నాయి.

3) ప్రభుత్వము: రాజ్యము యొక్క ఏజెంట్ ప్రభుత్వం. ఇది రాజ్యం యొక్క అభీష్టాన్ని నెరవేరుస్తుంది. రాజ్యం |తరపున సార్వభౌమాధికారాన్ని వినియోగిస్తుంది. ప్రభుత్వమునకు శాసన నిర్మాణ సభ, కార్యనిర్వాహక వర్గం, న్యాయశాఖ అను మూడు అంగములు కలవు. ప్రభుత్వం రాజ్యం కంటే ముందే ఆవిర్భవించింది. అందువలననే రాజ్య లేకుండా ప్రభుత్వం ఉంటుంది. ప్రభుత్వం శాశ్వతమైన సంస్థ కాదు. ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి. ప్రభుత్వాలు అనేక రకాలు. ప్రజాస్వామ్య, నియంతృత్వ, పార్లమెంటరీ, అధ్యక్షతరహా ఏకకేంద్ర, సమాఖ్య మొదలగునవి.

4) సార్వభౌమాధికారము: రాజ్యం మౌలిక లక్షణాలలో అత్యంత ముఖ్యమైనది సార్వభౌమాధికారము. లాటిన్ పదమైన ‘సుప్రానస్’ నుండి స్వార్నిటీ అను ఆంగ్లపదం ఉద్భవించినది. సార్వభౌమాధికారము వలననే రాజ్యం విశిష్టమైన, అత్యున్నతమైన రాజకీయ సంస్థగా పరిగణించబడుతోంది. సార్వభౌమాధికారము వలన రాజ్యంలో నివసించే ప్రజలు పనిచేసే సంస్థలు రాజ్యానికి విధేయులై ఉండటం జరుగుతుంది. అలా విధేయత చూపించని వ్యక్తులను, సంస్థలను రాజ్యం దండిస్తుంది. సార్వభౌమాధికారము అంతిమ అధికారం. దీనిని మించిన మరొక అధికారం రాజ్యంలో ఉండదు. ఇది విభజించుటకు, బదిలీ చేయుటకు వీలులేని అధికారము.

ప్రశ్న 2.
రాజ్యం, ప్రభుత్వం ఏ విధంగా వ్యత్యాసాలను కలిగి ఉన్నాయి ?
జవాబు:
రాజ్యము, ప్రభుత్వము అనే మాటలు సాధారణంగా ఒకే అర్థాన్నిచ్చేవిగా వాడబడుతుంటాయి. కానీ రాజనీతి శాస్త్రంలో ఈ రెండు పదాలు ప్రత్యేక అర్థాలు కలిగి ఉన్నాయి. హాబ్స్ అనే రచయిత రాజ్యము, ప్రభుత్వాల మధ్య భేదము చూపలేదు. లాస్కీ అభిప్రాయము ప్రకారము “రాజ్యము అంటే ఆచరణలో ప్రభుత్వం”. ప్రభుత్వం రాజ్యం పేరు మీద పనిచేస్తుంది. జి.డి. హెచ్. కోల్ “ఒక సమాజంలోని ప్రభుత్వ రాజకీయ యంత్రాంగమే రాజ్యము” అని అభిప్రాయపడ్డాడు. ఈ విధంగా కొందరు రచయితలు రాజ్యము, ప్రభుత్వము ఒక్కటే అని చెప్పారు. ఇంగ్లాండ్లో స్టువర్ట్ వంశరాజులు రాజ్యాన్ని, ప్రభుత్వాన్ని ఒకటిగా భావించారు. ఫ్రాన్స్లో 14వ లూయీ రాజు “నేనే రాజ్యము” అని వాదించి, రాజ్యానికి, ప్రభుత్వానికి భేదం లేకుండా చేశాడు.

కానీ ప్రభుత్వం రాజ్యానికి ఒక లక్షణము. రాజ్య ఆశయాలు ప్రభుత్వం ద్వారా తీర్చబడతాయి. రాజ్యంలో ప్రజలంతా భాగం. ప్రభుత్వంలో కొందరు ప్రజలే పనిచేస్తారు. మెకైవర్ అభిప్రాయం ప్రకారం ప్రభుత్వం రాజ్య ప్రతినిధి. ఈ విధంగా రాజ్యం, ప్రభుత్వాల మధ్య భేదాలున్నాయి.

AP Inter 1st Year Civics Study Material Chapter 2 రాజ్యం

భేదాలు:
రాజ్యం

  1. రాజ్యం శాశ్వతమైన రాజకీయ సంస్థ. మానవ సమాజం ఉన్నంతకాలం అది ఉంటుంది.
  2. రాజ్యమునకు 5 లక్షణాలుంటాయి. ప్రజలు, ప్రదేశం, ప్రభుత్వం, సార్వభౌమాధికారం, అంతర్జాతీయ గుర్తింపు దాని లక్షణాలు.
  3. రాజ్యము యజమాని వంటిది.
  4. రాజ్యానికి సార్వభౌమాధికారం సహజంగానే ఉంటుంది. అది ఉన్నతాధికారాలు చెలాయిస్తుంది.
  5. ప్రపంచంలోని అన్ని రాజ్యాలకు ముఖ్య లక్షణాలు ఒక్కటే.
  6. పౌరులంతా రాజ్యంలో సభ్యులే. రాజ్యంలో. ప్రజలకు సభ్యత్వం, తప్పనిసరిగా ఉంటుంది.
  7. రాజ్యానికి స్వతసిద్ధమైన రూపం లేదు. అది ప్రభుత్వ రూపంలోనే కనిపిస్తుంది.
  8. రాజ్యానికి ప్రదేశము ఒక ముఖ్య లక్షణము. ప్రదేశంలేని రాజ్యం ఉండదు.
  9. ప్రజలకు రాజ్యాన్ని వ్యతిరేకించే హక్కు లేదు.
  10. రాజ్యానికి మౌలికమైన అధికారాలున్నాయి.
    ఉదా: పార్లమెంటరీ, అధ్యక్షతరహా యూనిటరీ, సమాఖ్య మొదలగు ప్రభుత్వాలు.

ప్రభుత్వం

  1. ప్రభుత్వం ఎన్నికల వలనగానీ, విప్లవాల వలనగానీ మారవచ్చు. అందువలన అది శాశ్వతమైనది కాదు.
  2. ప్రభుత్వం రాజ్య లక్షణాలలో ఒకటి మాత్రమే. అది రాజ్య ప్రతినిధి, ఒక భాగము.
  3. ప్రభుత్వం రాజ్యానికి సేవకుని వంటిది. రాజ్యం పనులను ప్రభుత్వం చేస్తుంది.
  4. ప్రభుత్వం రాజ్యం తరపున సార్వభౌమాధికారాన్ని చెలాయిస్తుంది.
  5. ప్రపంచంలో ప్రభుత్వాలన్నీ ఒకే విధమైనవి కావు.
  6. ప్రభుత్వంలో కొద్దిమంది మాత్రమే సభ్యులు. సభ్యత్వం తప్పనిసరి కాదు.
  7. ప్రభుత్వము ఒక స్పష్టమైన రూపంలో కనిపిస్తుంది.
  8. ప్రభుత్వం నిర్దిష్ట ప్రదేశం లేకుండా పనిచేస్తుంది. అది ఎక్కడినుండైనా పనిచేస్తుంది.
  9. ప్రజలు తమకు నచ్చని ప్రభుత్వాన్ని ప్రతిఘటించ గలరు. న్యాయస్థానాల ద్వారా కూడా వ్యతిరేకించగలరు.
  10. ప్రభుత్వానికి రాజ్యాంగము ఇచ్చే అధికారాలే ఉంటాయి.

ప్రశ్న 3.
రాజ్యం, సమాజం మధ్యగల సంబంధం, వ్యత్యాసాలను వివరించండి.
జవాబు:
పరిచయం: రాజ్యం, సమాజం అనేవి ప్రముఖమైన మానవసంస్థలు. మేకైవర్ అభిప్రాయంలో రక్త సంబంధం సమాజ అవతరణకు దారితీస్తే, సమాజం రాజ్య ఆవిర్భావానికి నాంది పలికింది.

రాజ్యం: “ఒక నిర్ణీత భూభాగంలో రాజకీయంగా వ్యవస్థాపితమైన ప్రజలే రాజ్యం” – బ్లంటి సమాజం: “కొన్ని ఉమ్మడి లక్ష్యాలను సాధించేందుకై సమైక్యం చెందిన వ్యక్తుల సమూహం”.

రాజ్యానికి, సమాజానికి మధ్యగల సంబంధం (Relationship between State and Society):
1) ఒకే రకమైన లక్షణాలు (Common features): రాజ్యం, సమాజం రెండింటికి ఒకే తరహా లక్షణాలు ఉంటాయి. సాధారణంగా రాజ్యం, సమాజాలలో ప్రజలే ఉంటారు. సమాజంలోని సభ్యులే రాజ్యంలో సభ్యులుగా కొనసాగుతారు.

2) పరస్పర పూరకాలు (Complementary): రాజ్యం, సమాజం రెండూ పరస్పర పూరకాలు. ఒకదానికొకటి సహకరించుకొంటాయి. సమాజ ప్రగతి రాజ్య ప్రగతిపై ఆధారపడి ఉంటుంది. రాజ్య కార్యకలాపాలు లేదా పనితీరు సమాజంలోని ఆచారాలు, సంప్రదాయాలపై ఆధారపడి ఉంటాయి.

3) పర్యాయపదాలు (Synonymous terms): రాజ్యం, సమాజం అనే పదాలను అనేక సందర్భాలలో పర్యాయపదాలుగా వినియోగించడమైంది. గ్రీకు రాజనీతితత్త్వవేత్తలైన ప్లేటో, అరిస్టాటిల్లు, తరువాతి కాలంలో హెగెల్, బొసాంకేలు రాజ్యం, సమాజం రెండూ ఒకటే అని భావించారు. గ్రీకు రాజనీతి పండితులు నగర రాజ్యాలను, సమాజాన్ని పర్యాయపదాలుగా ఉపయోగించడం జరిగింది.

4) పరస్పర సంబంధం (Inter-relation): రాజ్యం, సమాజం మధ్యగల సంబంధాన్ని ఎవ్వరూ విస్మరించలేరు. రాజ్యం తాను రూపొందించిన చట్టాల ద్వారా సమాజంలో వ్యక్తుల బాహ్య ప్రవర్తనను నియంత్రిస్తుంది. సామాజిక వ్యవస్థకు విస్తృత పునాదిని ఏర్పరుస్తుంది. అందుచేత రాజ్యం సమాజాలను రెండు విభిన్న వ్యవస్థలలో విడదీయలేం. సమాజ ఆర్థిక, సాంస్కృతిక, మత, మానవతాపరమైన కార్యకలాపాల ద్వారా రాజ్యాన్ని పరిపుష్టంగావిస్తుంది.

రాజ్యం, సమాజం మధ్య వ్యత్యాసాలు (Differences between State and Society): రాజ్యం, సమాజాల మధ్య సన్నిహిత సంబంధం ఉన్నప్పటికీ, ఈ రెండూ ఒకదానికొకటి వ్యత్యాసాలను కలిగి ఉన్నాయి. వాటిని కింది పట్టిక ద్వారా తెలపవచ్చు.

రాజ్యం (State)

  1. రాజ్యం అనేది రాజకీయ సంస్థ.
  2. రాజ్యం వ్యక్తుల బాహ్య ప్రవర్తనను మాత్రమే నియంత్రిస్తుంది. ఈ విషయంలో అది కొన్ని నిబంధనలను రూపొందిస్తుంది.
  3. రాజ్యానికి దండనాధికారం ఉంది. రాజ్యశాసనాన్ని అతిక్రమించినవారు శిక్షార్హులుగా పరిగణించ బడతారు.
  4. రాజ్యం చేసే చట్టాలు రాజ్యానికి బలం చేకూరుస్తాయి.
  5. రాజ్యం అనేది ప్రాదేశిక సంస్థ. దానికి స్వీయ నిర్దిష్ట భూభాగం ఉంటుంది. ప్రాదేశికత అనేది రాజ్యానికి చెందిన ప్రధాన లక్షణంగా పేర్కొనవచ్చు.
  6. రాజ్యం ఒక్కటే సార్వభౌమాధికారాన్ని కలిగి ఉంటుంది. తన సార్వభౌమాధికారాన్ని వినియోగించి ప్రజల సంబంధాలను నిర్దేశించే అనేక చట్టాలను రూపొందించి, అమలు పరుస్తుంది.
  7. రాజ్యం సహజంగా ఏర్పడిన సంస్థ కాదు. అది మానవనిర్మితమైంది. దానిలో సభ్యత్వం వ్యక్తులకు నిర్బంధమైంది.
  8. రాజ్యం సమాజంలోని అతి ముఖ్యభాగం. సమాజంలోని రాజకీయంగా వ్యవస్థీకృతమైన భాగాన్ని అది సూచిస్తుంది.
  9. సాంఘిక వ్యవస్థ అభివృద్ధి చెందిన రూపమే రాజ్యం. అది సమాజం నుంచి ఆవిర్భవించింది.
  10. రాజ్యం శాశ్వతమైంది కాకపోవచ్చు. అది అంతరించి పోయే అవకాశం ఉంది. వేరొక రాజ్యం దానిని బలవంతంగా ఆక్రమించుకోవచ్చు.
  11. రాజ్య చట్టాలు, విధి, విధానాలు ఖచ్చితంగాను, స్పష్టంగాను ఉంటాయి.
  12. రాజ్యంలోని చట్టాలు ఒకే విధంగా ఉంటాయి. ఒకే చట్టాన్ని అతిక్రమించిన వ్యక్తులందరూ తారతమ్యం లేకుండా శిక్షకు గురవుతారు.
  13. రాజ్యానికి ప్రభుత్వం అనే రాజకీయ వ్యవస్థ ఉంటుంది. అది రాజ్యం తరపున చట్టాలను రూపొందించి, అమలుచేస్తుంది.

AP Inter 1st Year Civics Study Material Chapter 2 రాజ్యం

సమాజం (Society)

  1. సమాజం అనేది సాంఘిక వ్యవస్థ.
  2. సమాజం మానవుల బాహ్య, అంతర్గత ప్రవర్తనలు రెండింటిని నియంత్రిస్తుంది. వ్యక్తుల సామాజిక జీవనాన్ని ఇది క్రమబద్దం చేస్తుంది.
  3. సమాజానికి దండనాధికారం లేదు. సాంఘిక ఆచారాలను అతిక్రమిస్తే వారిని సమాజం శిక్షించ లేదు.
  4. సమాజంలోని ఆచారాలు, సంప్రదాయాలు, కట్టుబాట్లు సమాజానికి బలం చేకూరుస్తాయి.
  5. సమాజానికి నిర్దిష్టమైన భౌగోళిక హద్దులు లేవు. అది రాజ్యం కంటే విశాలమైంది కావచ్చు లేదా చిన్నదైనా కావచ్చు. సమాజం విశ్వమంతా విస్తరించి ఉంటుంది.
  6. సమాజానికి నిర్బంధ అధికారాలు అంటూ ఏవీ లేవు. సమాజం మానవ సామాజిక ప్రవర్తనను క్రమబద్దం చేసే నియమాలను రూపొందించి నప్పటికీ వాటికి చట్టబద్ధత ఉండదు.
  7. సమాజం సహజంగా, స్వతఃసిద్ధంగా ఏర్పడిన సంస్థ. వ్యక్తులు తమ విచక్షణను అనుసరించి దీనిలో సభ్యులుగా కొనసాగుతారు.
  8. రాజ్యం కంటే సమాజం విస్తృతమైంది. అనేక సంఘాలు, సంస్థలు, వ్యవస్థల ద్వారా అది ఏర్పడి అభివృద్ధి చెందుతుంది.
  9. సమాజం పెద్దది. రాజ్యం దానిలో అంతర్భాగం మాత్రమే. సమాజం రాజ్యం కంటే ముందు అవతరించింది. మానవుడు స్వభావరీత్యా సంఘ జీవి.
  10. సమాజం శాశ్వతమయింది. ఇది నిరంతరం కొనసాగుతుంది.
  11. సమాజ సూత్రాలు అస్పష్టమైనవి. అవి సాధారణంగా అనిర్దిష్టంగా ఉంటాయి. అవి సంప్రదాయాలు, కట్టుబాట్లపై ఆధారపడి ఉంటాయి.
  12. సమాజం నియమాలు ఒకే విధంగా ఉండవు. ఒక వర్గ నియమాలకు, వేరొక వర్గ నియమాలకు మధ్య వ్యత్యాసం ఉంటుంది. వివిధ సామాజిక వర్గాలు ఒకే రకమైన నేరానికి పాల్పడితే విధించే శిక్షలు వేరువేరుగా ఉంటాయి.
  13. సమాజ నియమాలను అమలుపరచడానికి ఒక ప్రత్యేకమైన యంత్రాంగమంటూ ఏదీ లేదు. ఆచారాలు, సంప్రదాయాలు, కట్టుబాట్ల ద్వారా అది మానవ ప్రవర్తనను నియంత్రిస్తుంది.

ప్రశ్న 4.
రాజ్యం, సంస్థల మధ్యగల సంబంధం, వ్యత్యాసాలను వర్ణించండి.
జవాబు:
పరిచయం: మానవుని సామాజిక స్వభావం, అతడి విభిన్న అవసరాలను తీర్చే అనేక సంఘాల, సముదాయాల ద్వారా వెల్లడవుతుంది. మానవుడు ఒంటరి జీవితాన్ని గడపలేడు. తన అభివృద్ధికి ఇతరుల సహాయ సహకారాలను కోరతాడు. కొన్ని నిర్దిష్ట ప్రయోజనాలను సాధించుకొనేందుకు సన్నిహిత సామాజిక సంబంధాలనేవి సంఘాల ఏర్పాటుకు దారితీస్తాయి.

రాజ్యం: “ఒక నిర్ణీత భూభాగంలో రాజకీయంగా వ్యవస్థాపితమైన ప్రజలే రాజ్యం” – బ్లంట్ల

సంఘం: మేకైవర్ నిర్వచనం ప్రకారం ‘సాధారణమైన లేదా ఉమ్మడి ప్రయోజనాలను నెరవేర్చుకొనేందుకు మానవుడు తన ప్రయోజనాన్ని ఆశించి ఏర్పాటు చేసుకున్నదే సంఘం.”

రాజ్యం-సంఘాల మధ్య సంబంధం (Relationship between State and Association): రాజ్యం, సంఘం రెండూ కూడా వ్యక్తులతో కూడుకొన్న వ్వవస్థలే. రాజ్యం, సంఘంలో వ్యక్తులే సభ్యులు. ఈ రెండూ కూడా వ్యక్తుల అనేక అవసరాలను తీర్చేందుకు ఏర్పాటైనాయి. సమిష్టి ప్రయోజనాలను సాధించుకొనే లక్ష్యంతో రాజ్యం, సంఘాలు ఏర్పాటవుతాయి. రాజ్యం, సంఘంల మధ్యగల సంబంధాన్ని కింది విధంగా వివరించవచ్చు.

  1. ఒకేరకమైన సభ్యత్వం (Same membership): రాజ్యం, సంఘాలు రెండూ కూడా మానవ సమూహాలే. వ్యక్తులందరూ ఆ రెండింటిలో సభ్యులుగా ఉంటారు.
  2. ఉమ్మడి ప్రయోజనాలు (Common Interests): వ్యక్తులు తమ సమిష్టి ప్రయోజనాలను సాధించుకోవడానికి రాజ్యాన్ని, సంఘాలను ఏర్పాటు చేసుకున్నారు.
  3. వ్యవస్థాపరమైనవి (Organisation): రాజ్యం, సంఘాలు రెండూ కూడా తమ ప్రయోజనాలను సాధించుకోవడానికి వ్యక్తులు ఏర్పాటు చేసుకున్న వ్యవస్థలే.
  4. ప్రవర్తనా నియమావళి (Code of conduct): రాజ్యం, సంఘాలు రెండూ తమ సభ్యులను నియంత్రించేందుకుగాను ప్రవర్తనా నియమావళిని కలిగి ఉన్నాయి. అటువంటి నియమావళి సభ్యులను ఒకతాటిపైన ఉంచుతాయి. అంతేకాకుండా అది వ్యవస్థకు స్థిరత్వాన్ని కలిగిస్తుంది.
  5. కార్యనిర్వహణశాఖ (Executive): ప్రతి రాజ్యానికి కార్యనిర్వాహకశాఖ ఉంటుంది. దీనినే ప్రభుత్వంగా పిలువబడుతుంది. ప్రతి సంఘానికి కూడా కార్యనిర్వాహక మండలి ఉండి, తమ విధివిధానాలను అమలుపరుస్తుంది.

రాజ్యం, సంఘాల మధ్యగల వ్యత్యాసాలు (Differences between State and Association):
రాజ్యం (State)

  1. రాజ్యం సభ్యత్వం నిర్బంధమైంది.
  2. రాజ్యం శాశ్వతమైంది.
  3. రాజ్యం ప్రజలందరి శ్రేయస్సు, ప్రగతి కోసం కృషి చేస్తుంది.
  4. రాజ్యం అనేది భౌగోళిక సంస్థ. దానికి నిర్దిష్టమైన సరిహద్దులు ఉంటాయి.
  5. రాజ్యం సార్వభౌమాధికారం గల సంస్థ.
  6. ఒక పౌరుడికి ఒకే సమయంలో ఒక రాజ్యంలో మాత్రమే సభ్యత్వం ఉంటుంది. తనకు సభ్యత్వం ఉన్న రాజ్యం పట్ల మాత్రమే విధేయత కనబరుస్తాడు.
  7. రాజ్య పరిధి విస్తృతమైనది.
  8. సంఘం కార్యకలాపాలలో రాజ్యం జోక్యం చేసుకోవచ్చు.
  9. రాజ్యం సంఘాల కంటే ఉన్నతమైంది.
  10. రాజ్యానికి పౌరులందరూ తప్పనిసరిగా విధేయులై ఉంటారు.
  11. ప్రపంచంలోని రాజ్యాలన్నింటికి ఒకే తరహా లక్షణాలు ఉంటాయి.
  12. రాజ్యం తనకున్న అధికారాన్ని చెలాయిస్తూ, రాజ్య చట్టాలను నిర్బంధంగా అమలుపరుస్తుంది.
  13. శాంతి భద్రతల నిర్వహణలో రాజ్యం బల ప్రయోగానికి పాల్పడవచ్చు.

AP Inter 1st Year Civics Study Material Chapter 2 రాజ్యం

సంఘాలు (Associations)

  1. సంఘంలో సభ్యత్వం ఐచ్ఛికమైంది.
  2. సంఘాలు శాశ్వతమైనవిగానూ, తాత్కాలికంగానూ ఉంటాయి.
  3. సంఘాలు తమ సభ్యుల ప్రయోజనాలను నెరవేర్చేం దుకు ప్రయత్నిస్తాయి.
  4. సంఘాలకు ఖచ్చితమైన సరిహద్దులు ఉండవు.
  5. సంఘాలకు సార్వభౌమాధికారం ఉండదు.
  6. ఒక వ్యక్తికి ఒకేసారి అనేక సంఘాలలో సభ్యత్వం ఉండవచ్చు.
  7. సంఘాల పరిధి పరిమితమైంది.
  8. రాజ్య కార్యకలాపాలలో సంఘం జోక్యం చేసుకో రాదు.
  9. సంఘాలు రాజ్యం కంటే ఉన్నతమైనవి కావు.
  10. సంఘాల నియమ నిబంధనలను సభ్యులు సమయం సందర్భాలను బట్టి ఆమోదించేందుకు లేదా అతిక్రమించేందుకు వీలుంటుంది.
  11. సంఘాలకు నిర్మాణం, స్వభావం, లక్ష్యాలు లేదా ఉద్దేశ్యాలలో వ్యత్యాసం ఉంటుంది.
  12. సంఘాలు తమ నియమ నిబంధనలను బలవంతంగా సభ్యులపైన రుద్దలేవు. సభ్యుల సహకారం పైన సంస్థల నియమావళి అమలు జరుపబడుతుంది.
  13. సభ్యుల అంగీకారంపై ఆధారపడి సంఘాలు తమ కార్యకలాపాలను నిర్వహిస్తాయి.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
రాజ్యానికి గల ఏవైనా రెండు ముఖ్య లక్షణాలను వివరించండి. [Mar. ’18, ’17]
జవాబు:
లక్షణాలు: రాజ్యానికి నాలుగు ప్రధాన లక్షణాలున్నాయి. అవి 1. ప్రజలు 2. ప్రదేశం 3. ప్రభుత్వం 4. సార్వభౌమాధికారం. వీటితోపాటు ఆధునిక కాలంలో అంతర్జాతీయ గుర్తింపు రాజ్యలక్షణంగా గుర్తించబడింది.

1) ప్రజలు: రాజ్యము ఒక మానవసంస్థ. ప్రజలు లేనిదే రాజ్యం లేదు. అయితే ఒక రాజ్యంలో ప్రజలు ఎంతమంది ఉండవలెననే అంశంపై రాజనీతి తత్త్వవేత్తలు ఒకే అభిప్రాయాన్ని కల్గిలేరు. ప్లేటో దృష్టిలో ఆదర్శ రాజ్య జనాభా 5,040. రూసో అభిప్రాయంలో ఆదర్శ రాజ్యానికి జనాభా 10,000 మంది. అరిస్టాటిల్ అభిప్రాయంలో ఆదర్శ రాజ్య జనాభా మరీ ఎక్కువగానూ, మరీ తక్కువగానూ ఉండరాదు. ప్రస్తుత కాలంలో ఆధునిక రాజ్యాలు కొన్ని తక్కువ జనాభాతోను (అండోరా, శాన్ మారినో, వాటికన్ సిటీ), మరికొన్ని ఎక్కువ జనాభాతోను (చైనా, ఇండియా) ఉన్నాయి. ప్రజలు కష్టించి పనిచేసే తత్వాన్ని కల్గి ఉంటే జనాభా తక్కువగా ఉన్నా రాజ్యం అభివృద్ధి చెందుతుంది.

2) ప్రదేశము: నిర్ణీత ప్రదేశం రాజ్యానికి అవసరం. ప్రదేశము అనగా భూమి, ప్రాదేశిక వియత్తలము (ఆకాశము) మరియు ప్రాదేశిక జలాలు (సముద్రజలాలు 12 నాటికల్ మైళ్ళ వరకు) అయితే నాల్గువైపుల భూమినే సరిహద్దుగా కల్గిన, నేపాల్, భూటాన్ వంటి రాజ్యాలకు ప్రాదేశిక జలాలు ఉండవు. వాటికి ప్రదేశము అంటే భూమి, ప్రాదేశిక వియత్తలము మాత్రమే. తక్కువ ప్రదేశం ఉన్న రాజ్యాలు ఉత్తమమైనవిగా ప్లేటో, రూసో అభిప్రాయపడ్డారు. లార్డ్ ఆక్టన్, ట్రయమ్మీలు పెద్ద ప్రదేశం కల్గిన రాజ్యాలు గొప్పవని విశ్వసించారు. అరిస్టాటిల్ రాజ్య ప్రదేశం మరీ ఎక్కువగాను, మరీ తక్కువగాను ఉండకూడదని తెల్పెను.

AP Inter 1st Year Civics Study Material Chapter 2 రాజ్యం

ప్రశ్న 2.
రాజ్యానికి గల ఇతర లక్షణాలు ఏవి ?
జవాబు:
ప్రజలు, ప్రదేశం, ప్రభుత్వం, సార్వభౌమాధికారంతో పాటు రాజ్యం కొన్ని ఇతర లక్షణాలను కూడా కలిగి ఉంటుంది. అవి:
1) అంతర్జాతీయ గుర్తింపు (International Recognition): అంతర్జాతీయ గుర్తింపు అంటే ఒక రాజ్య ఉనికిని, ప్రభుత్వాన్ని ప్రపంచంలోని ఇతర రాజ్యాలు గుర్తించడం. ఆధునిక యుగంలో ప్రపంచ రాజ్యాల మధ్య సంబంధాలు పెరగడంతో అనేక అంతర్జాతీయ సంస్థలు ఏర్పడ్డాయి. కొంతమంది రాజనీతి పండితుల అభిప్రాయంలో అంతర్జాతీయ గుర్తింపు కూడా రాజ్య మౌలిక లక్షణంగా పరిగణించడమైంది.

ప్రపంచంలోని ప్రతి రాజ్యం ఇతర సార్వభౌమ రాజ్యాల చేత గుర్తింపు పొందాలి. ఐక్యరాజ్యసమితి వంటి కొన్ని అంతర్జాతీయ సంస్థలు ఆ రకమైన గుర్తింపును ఇస్తున్నాయి. ఐక్యరాజ్యసమితిలో సభ్యత్వమున్నదంటే ఆ రాజ్యానికి చెందిన సార్వభౌమాధికారం గుర్తించబడినట్లుగా భావించవచ్చు. ఒక కొత్త రాజ్యం ఆవిర్భవించినప్పుడు, అది మిగతా ప్రపంచ రాజ్యాలతో పాటు ఐక్యరాజ్యసమితి చేత గుర్తించబడటం అత్యంత ఆవశ్యకం.

అంతర్జాతీయ గుర్తింపు అనే లక్షణం రాజకీయ దృక్కోణంతో కూడుకొని ఉంది. 1945 లో ఐక్యరాజ్యసమితి ఏర్పడక ముందునుంచే చైనా ఒక సమగ్రమైన రాజ్యం. 1949 నాటికి చైనా కమ్యూనిస్టుల వశమైంది. ప్రచ్ఛన్న యుద్ధ ప్రభావం వల్ల చైనా ఒక సార్వభౌమ రాజ్యంగా అమెరికా సంయుక్త రాష్ట్రాల చేత గుర్తించబడలేదు. చైనా-అమెరికాల మధ్య ప్రచ్ఛన్నయుద్ధ ఛాయలు తొలగిన తరువాత 1970వ దశకంలో ఐక్యరాజ్యసమితి చైనాను ఒక సార్వభౌమ రాజ్యంగా గుర్తించింది.

2) శాశ్వతత్వం (Permanence): రాజ్యం శాశ్వతమైన సంస్థ. ప్రాచీన కాలం నుంచి పరిశీలిస్తే ప్రజలు ఏదో ఒక రాజ్యంలో ప్రజాజీవనం సాగించడంతో పాటు తమ కార్యకలాపాలను నిర్వర్తించారు. రాజ్యానికున్న శాశ్వతత్వమనే లక్షణాన్ని రూపుమాపలేం. దురాక్రమణల ద్వారా ఒక రాజ్యం మరొక రాజ్యపరమైనప్పటికీ, దాని శాశ్వతత్వం అంతరించదు. ఒక రాజ్యం మరొక రాజ్యంలో విలీనమై కొత్త రాజ్యమేర్పడితే సార్వభౌమాధికారం బదిలీ అవుతుందే తప్ప రాజ్యం అంతరించదు. ఉదాహరణకు 1990వ దశకంలో సోవియటయూనియన్ విడిపోయి 15 స్వతంత్ర రాజ్యాలు ఆవిర్భవించాయి.

3) సాధారణ విధేయత (General Obediance): రాజ్య భౌగోళిక సరిహద్దులలో నివసించే ప్రజలందరి మీద రాజ్యాధికారం చెల్లుబాటవుతుంది. రాజ్యం ప్రజల నుండి, వారు ఏర్పాటుచేసుకున్న సంస్థల నుంచి విధేయతను కోరుకుంటుంది. రాజ్యంలోని ప్రజలు, వర్గాలన్నింటికీ విధేయత సూత్రం వర్తిస్తుంది. రాజ్యంలోని ప్రజలుగాని, సంస్థలు గాని రాజ్యాధికారానికి అతీతులమని భావించడానికి వీలులేదు. ప్రజలకు ప్రభుత్వ విధానాలు, కార్యక్రమాలను విమర్శించే హక్కు ఉంటుందే తప్ప, రాజ్యాన్ని విమర్శించే అధికారం వారికి ఉండదు. రాజ్యాధికారానికి లోబడిఉండటం ప్రజలకు తప్పనిసరి.

4) ప్రజాభీష్టం (Popular Will): విల్లోభి ప్రకారం ప్రజాభీష్టం రాజ్యానికి గల అత్యంత ముఖ్యమైన లక్షణం. ప్రజాసమ్మతి ఉన్నంతకాలం రాజ్య మనుగడకు ప్రమాదం ఉండదు. దురాక్రమణదారుల నుంచి రాజ్యాన్ని రక్షించుకోవాలన్నా, అంతర్గతవిప్లవాల నుంచి రాజ్యాన్ని తప్పించాలన్నా పటిష్టమైన ప్రజాభీష్టం అవసరం.

3. రాజ్య ముఖ్య లక్షణాలైన ప్రభుత్వం, సార్వభౌమాధికారం గురించి మీకు తెలిసింది రాయండి. జవాబు: ప్రభుత్వము: రాజ్యము యొక్క ఏజెంట్ ప్రభుత్వం. ఇది రాజ్యం యొక్క అభీష్టాన్ని నెరవేరుస్తుంది. రాజ్యం తరపున సార్వభౌమాధికారాన్ని వినియోగిస్తుంది. ప్రభుత్వమునకు శాసన నిర్మాణ సభ, కార్యనిర్వాహక వర్గం, న్యాయశాఖ అను మూడు అంగములు కలవు. ప్రభుత్వం రాజ్యం కంటే ముందే ఆవిర్భవించింది. అందువలననే రాజ్యం లేకుండా ప్రభుత్వం ఉంటుంది. ప్రభుత్వం శాశ్వతమైన సంస్థ కాదు. ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి. ప్రభుత్వాలు అనేక రకాలు. ప్రజాస్వామ్య, నియంతృత్వ, పార్లమెంటరీ, అధ్యక్షతరహా ఏకకేంద్ర, సమాఖ్య మొదలగునవి.

సార్వభౌమాధికారము: రాజ్యం మౌలిక లక్షణాలలో అత్యంత ముఖ్యమైనది సార్వభౌమాధికారము. లాటిన్ పదమైన ‘సుప్రానస్’ నుండి సావిర్నిటీ అను ఆంగ్లపదం ఉద్భవించినది. సార్వభౌమాధికారము వలననే రాజ్యం విశిష్టమైన, అత్యున్నతమైన రాజకీయ సంస్థగా పరిగణించబడుతోంది. సార్వభౌమాధికారము వలన రాజ్యంలో నివసించే ప్రజలు పనిచేసే సంస్థలు రాజ్యానికి విధేయులై ఉండటం జరుగుతుంది. అలా విధేయత చూపించని వ్యక్తులకు, సంస్థలను రాజ్యం దండిస్తుంది. సార్వభౌమాధికారము అంతిమ అధికారం. దీనిని మించిన మరొక అధికారం రాజ్యంలో ఉండదు. ఇది విభజించుటకు, బదిలీ చేయుటకు వీలులేని అధికారము.

ప్రశ్న 4.
రాజ్యం, సమాజం మధ్యగల సంబంధాన్ని వర్ణించండి.
జవాబు:
రాజ్యానికి, సమాజానికి మధ్యగల సంబంధం (Relationship between State and Society):
1) ఒకే రకమైన లక్షణాలు (Common features): రాజ్యం, సమాజం రెండింటికి ఒకే తరహా లక్షణాలు ఉంటాయి. సాధారణంగా రాజ్యం, సమాజాలలో ప్రజలే ఉంటారు. సమాజంలోని సభ్యులే రాజ్యంలో సభ్యులుగా కొనసాగుతారు.

2) పరస్పర పూరకాలు (Complementary): రాజ్యం, సమాజం రెండూ పరస్పర పూరకాలు. ఒకదాని కొకటి సహకరించుకొంటాయి. సమాజ ప్రగతి రాజ్య ప్రగతిపై ఆధారపడి ఉంటుంది. రాజ్య కార్యకలాపాలు లేదా పనితీరు సమాజంలోని ఆచారాలు, సంప్రదాయాలపై ఆధారపడి ఉంటాయి.

3) పర్యాయపదాలు (Synonymous terms): రాజ్యం, సమాజం అనే పదాలను అనేక సందర్భాలలో పర్యాయపదాలుగా వినియోగించడమైంది. గ్రీకు రాజనీతి తత్త్వవేత్తలైన ప్లేటో, అరిస్టాటిల్లు, తరువాతి కాలంలో హెగెల్, బొసాంకేలు రాజ్యం, సమాజం రెండూ ఒకటే అని భావించారు. గ్రీకు రాజనీతి పండితులు నగర రాజ్యాలను, | సమాజాన్ని పర్యాయపదాలుగా ఉపయోగించడం జరిగింది.

AP Inter 1st Year Civics Study Material Chapter 2 రాజ్యం

4) పరస్పర సంబంధం (Inter-relation): రాజ్యం, సమాజం మధ్యగల సంబంధాన్ని ఎవ్వరూ విస్మరించలేరు. రాజ్యం తాను రూపొందించిన చట్టాల ద్వారా సమాజంలో వ్యక్తుల బాహ్య ప్రవర్తనను నియంత్రిస్తుంది. సామాజిక వ్యవస్థకు విస్తృత పునాదిని ఏర్పరుస్తుంది. అందుచేత రాజ్యం సమాజాలను రెండు విభిన్న వ్యవస్థలలో విడదీయలేం. సమాజ ఆర్థిక, సాంస్కృతిక, మత, మానవతాపరమైన కార్యకలాపాల ద్వారా రాజ్యాన్ని పరిపుష్టంగావిస్తుంది.

ప్రశ్న 5.
రాజ్యం, సమాజం మధ్యగల వ్యత్యాసాలను పేర్కొనండి.
జవాబు:
రాజ్యం, సమాజం మధ్య వ్యత్యాసాలు (Differences between State and Society): రాజ్యం, సమాజాల మధ్య సన్నిహిత సంబంధం ఉన్నప్పటికీ, ఈ రెండూ ఒకదానికొకటి వ్యత్యాసాలను కలిగి ఉన్నాయి. వాటిని కింది పట్టిక ద్వారా తెలపవచ్చు.

రాజ్యం (State)

  1. రాజ్యం అనేది రాజకీయ సంస్థ.
  2. రాజ్యం వ్యక్తుల బాహ్య ప్రవర్తనను మాత్రమే నియంత్రిస్తుంది. ఈ విషయంలో అది కొన్ని నిబంధనలను రూపొందిస్తుంది.
  3. రాజ్యానికి దండనాధికారం ఉంది. రాజ్యశాసనాన్ని అతిక్రమించినవారు శిక్షార్హులుగా పరిగణించ బడతారు.
  4. రాజ్యం చేసే చట్టాలు రాజ్యానికి బలం చేకూరుస్తాయి.
  5. రాజ్యం అనేది ప్రాదేశిక సంస్థ. దానికి స్వీయ నిర్దిష్ట భూభాగం ఉంటుంది. ప్రాదేశికత అనేది రాజ్యానికి చెందిన ప్రధాన లక్షణంగా పేర్కొనవచ్చు.
  6. రాజ్యం ఒక్కటే సార్వభౌమాధికారాన్ని కలిగి ఉంటుంది. తన సార్వభౌమాధికారాన్ని వినియోగించి ప్రజల సంబంధాలను నిర్దేశించే అనేక చట్టాలను రూపొందించి, అమలు పరుస్తుంది.
  7. రాజ్యం సహజంగా ఏర్పడిన సంస్థ కాదు. అది మానవనిర్మితమైంది. దానిలో సభ్యత్వం వ్యక్తులకు నిర్బంధమైంది.
  8. రాజ్యం సమాజంలోని అతి ముఖ్యభాగం. సమాజంలోని రాజకీయంగా వ్యవస్థీకృతమైన భాగాన్ని అది సూచిస్తుంది.
  9. సాంఘిక వ్యవస్థ అభివృద్ధి చెందిన రూపమే రాజ్యం. అది సమాజం నుంచి ఆవిర్భవించింది.
  10. రాజ్యం శాశ్వతమైంది కాకపోవచ్చు. అది అంతరించి పోయే అవకాశం ఉంది. వేరొక దానిని బలవంతంగా ఆక్రమించుకోవచ్చు.
  11. రాజ్య చట్టాలు, విధి, విధానాలు ఖచ్చితంగాను, స్పష్టంగాను ఉంటాయి.
  12. రాజ్యంలోని చట్టాలు ఒకే విధంగా ఉంటాయి. చట్టాన్ని అతిక్రమించిన వ్యక్తులందరూ తారతమ్యం లేకుండా శిక్షకు గురవుతారు.
  13. రాజ్యానికి ప్రభుత్వం అనే రాజకీయ వ్యవస్థ ఉంటుంది. అది రాజ్యం తరపున చట్టాలను రూపొం దించి, అమలుచేస్తుంది.

సమాజం (Society)

  1. సమాజం అనేది సాంఘిక వ్యవస్థ.
  2. సమాజం మానవుల బాహ్య, అంతర్గత ప్రవర్తనలు రెండింటిని నియంత్రిస్తుంది. వ్యక్తుల సామాజిక జీవనాన్ని ఇది క్రమబద్ధం చేస్తుంది.
  3. సమాజానికి దండనాధికారం లేదు. సాంఘిక ఆచారాలను అతిక్రమిస్తే వారిని సమాజం శిక్షించ లేదు.
  4. సమాజంలోని ఆచారాలు, సంప్రదాయాలు, కట్టుబాట్లు సమాజానికి బలం చేకూరుస్తాయి.
  5. సమాజానికి నిర్దిష్టమైన భౌగోళిక హద్దులు లేవు. అది రాజ్యం కంటే విశాలమైంది కావచ్చు లేదా చిన్నదైనా కావచ్చు. సమాజం విశ్వమంతా విస్తరించి ఉంటుంది.
  6. సమాజానికి నిర్బంధ అధికారాలు అంటూ ఏవీ లేవు. సమాజం మానవ సామాజిక ప్రవర్తనను క్రమబద్దం చేసే నియమాలను రూపొందించి నప్పటికీ వాటికి చట్టబద్ధత ఉండదు.
  7. సమాజం సహజంగా, స్వతఃసిద్ధంగా ఏర్పడిన సంస్థ. వ్యక్తులు తమ విచక్షణను అనుసరించి దీనిలో సభ్యులుగా కొనసాగుతారు.
  8. రాజ్యం కంటే సమాజం విస్తృతమైంది. అనేక సంఘాలు, సంస్థలు, వ్యవస్థల ద్వారా అది ఏర్పడి అభివృద్ధి చెందుతుంది.
  9. సమాజం పెద్దది. రాజ్యం దానిలో అంతర్భాగం మాత్రమే. సమాజం రాజ్యం కంటే ముందు అవతరించింది. మానవుడు స్వభావరీత్యా సంఘజీవి.
  10. సమాజం శాశ్వతమయంది. ఇది నిరంతరం కొనసాగుతుంది.
  11. సమాజ సూత్రాలు అస్పష్టమైనవి. అవి సాధారణంగా అనిర్దిష్టంగా ఉంటాయి. అవి సంప్రదాయాలు, కట్టుబాట్లపై ఆధారపడి ఉంటాయి.
  12. సమాజం నియమాలు ఒకే విధంగా ఉండవు. ఒకే ఒక వర్గ నియమాలకు, వేరొక వర్గ నియమాలకు మధ్య వ్యత్యాసం ఉంటుంది. వివిధ సామాజిక వర్గాలు ఒకే రకమైన నేరానికి పాల్పడితే విధించే శిక్షలు వేరువేరుగా ఉంటాయి
  13. సమాజ నియమాలను అమలు పరచడానికి ఒక ప్రత్యేకమైన యంత్రాంగమంటూ ఏదీ లేదు. ఆచారాలు, సంప్రదాయాలు, కట్టుబాట్ల ద్వారా అది మానవ ప్రవర్తనను నియంత్రిస్తుంది.

ప్రశ్న 6.
రాజ్యం, సంస్థల మధ్య సంబంధం ఏమిటో తెలపండి.
జవాబు:
రాజ్యం-సంఘాల మధ్య సంబంధం (Relationship between State and Association): రాజ్యం, సంఘం రెండూ కూడా వ్యక్తులతో కూడుకొన్న వ్వవస్థలే. రాజ్యం, సంఘంలో వ్యక్తులే సభ్యులు. ఈ రెండూ కూడా వ్యక్తుల అనేక అవసరాలను తీర్చేందుకు ఏర్పాటైనాయి. సమిష్టి ప్రయోజనాలను సాధించుకొనే లక్ష్యంతో రాజ్యం, సంఘాలు ఏర్పాటవుతాయి. రాజ్యం, సంఘంల మధ్యగల సంబంధాన్ని కింది విధంగా వివరించవచ్చు.

1) ఒకేరకమైన సభ్యత్వం (Same membership): రాజ్యం, సంఘాలు రెండూ కూడా మానవ సమూహాలే. వ్యక్తులందరూ ఆ రెండింటిలో సభ్యులుగా ఉంటారు.

2) ఉమ్మడి ప్రయోజనాలు (Common Interests): వ్యక్తులు తమ సమిష్టి ప్రయోజనాలను సాధించుకోవడానికి రాజ్యాన్ని, సంఘాలను ఏర్పాటు చేసుకున్నారు.

3) వ్యవస్థాపరమైనవి. (Organisation): రాజ్యం, సంఘాలు రెండూ కూడా తమ ప్రయోజనాలను సాధించుకోవడానికి వ్యక్తులు ఏర్పాటు చేసుకున్న వ్యవస్థలే.

AP Inter 1st Year Civics Study Material Chapter 2 రాజ్యం

4) ప్రవర్తనా నియమావళి (Code of conduct): రాజ్యం, సంఘాలు రెండూ తమ సభ్యులను నియంత్రించేందుకుగాను ప్రవర్తనా నియమావళిని కలిగి ఉన్నాయి. అటువంటి నియమావళి సభ్యులను ఒకతాటిపైన ఉంచుతాయి. అంతేకాకుండా అది వ్యవస్థకు స్థిరత్వాన్ని కలిగిస్తుంది.

5) కార్యనిర్వహణ శాఖ (Executive): ప్రతి రాజ్యానికి కార్యనిర్వాహకశాఖ ఉంటుంది. దీనినే ప్రభుత్వంగా పిలువబడుతుంది. ప్రతి సంఘానికి కూడా కార్యనిర్వాహక మండలి ఉండి, తమ విధివిధానాలను అమలు పరుస్తుంది.

ప్రశ్న 7.
రాజ్యం, సంస్థ మధ్యగల వ్యత్యాసాలను పేర్కొనండి.
జవాబు:
రాజ్యం, సంఘాల మధ్యగల వ్యత్యాసాలు (Differences between State and Association):
రాజ్యం (State)

  1. రాజ్యం సభ్యత్వం నిర్బంధమైంది.
  2. రాజ్యం శాశ్వతమైంది.
  3. రాజ్యం ప్రజలందరి శ్రేయస్సు, ప్రగతి కోసం కృషి చేస్తుంది.
  4. రాజ్యం అనేది భౌగోళిక సంస్థ. దానికి నిర్దిష్టమైన సరిహద్దులు ఉంటాయి.
  5. రాజ్యం సార్వభౌమాధికారం గల సంస్థ.
  6. ఒక పౌరుడికి ఒకే సమయంలో ఒక రాజ్యంలో మాత్రమే సభ్యత్వం ఉంటుంది. తనకు సభ్యత్వం ఉన్న రాజ్యం పట్ల మాత్రమే విధేయత కనబరుస్తారు.
  7. రాజ్య పరిధి విస్తృతమైనది.
  8. సంఘం కార్యకలాపాలలో రాజ్యం జోక్యం చేసు కోవచ్చు.
  9. రాజ్యం సంఘాల కంటే ఉన్నతమైంది.
  10. రాజ్యానికి పౌరులందరూ తప్పనిసరిగా విధేయులై ఉంటారు.
  11. ప్రపంచంలోని రాజ్యాలన్నింటికి ఒకే తరహా లక్షణాలు ఉంటాయి.
  12. రాజ్యం తనకున్న అధికారాన్ని చెలాయిస్తూ, రాజ్య చట్టాలను నిర్బంధంగా అమలుపరుస్తుంది.
  13. శాంతి భద్రతల నిర్వహణలో రాజ్యం బల ప్రయోగానికి పాల్పడవచ్చు.

సంఘాలు (Associations)

  1. సంఘంలో సభ్యత్వం ఐచ్ఛికమైంది.
  2. సంఘాలు శాశ్వతమైనవిగానూ, తాత్కాలికంగానూ ఉంటాయి.
  3. సంఘాలు తమ సభ్యుల ప్రయోజనాలను నెరవేర్చేందుకు ప్రయత్నిస్తాయి.
  4. సంఘాలకు ఖచ్చితమైన సరిహద్దులు ఉండవు.
  5. సంఘాలకు సార్వభౌమాధికారం ఉండదు.
  6. ఒక వ్యక్తికి ఒకేసారి అనేక సంఘాలలో సభ్యత్వం ఉండవచ్చు.
  7. సంఘాల పరిధి పరిమితమైంది.
  8. రాజ్య కార్యకలాపాలలో సంఘం జోక్యం చేసుకోరాదు.
  9. సంఘాలు రాజ కంటే ఉన్నతమైనవి కావు.
  10. సంఘాల నియమ నిబంధనలను సభ్యులు సమయం సందర్భాలను బట్టి ఆమోదించేందుకు లేదా అతిక్రమించేందుకు వీలుంటుంది.
  11. సంఘాలకు నిర్మాణం, స్వభావం, లక్ష్యాలు లేదా ఉద్దేశ్యాలలో వ్యత్యాసం ఉంటుంది.
  12. సంఘాలు తమ నియమ నిబంధనలను బలవంతంగా సభ్యులపైన రుద్దలేవు. సభ్యుల సహకారం పైన సంస్థల నియమావళి అమలు జరుపబడుతుంది.
  13. సభ్యుల అంగీకారంపై ఆధారపడి సంఘాలు తమ కార్యకలాపాలను నిర్వహిస్తాయి.

ప్రశ్న 8.
రాజ్యం, ప్రభుత్వం మధ్య ఏ విధమైన సంబంధం ఉందో తెలపండి.
జవాబు:
రాజ్యం, ప్రభుత్వం అనే పదాలను సామాన్య పరిభాషలో పర్యాయపదాలుగా ఉపయోగించడమైంది. సామాన్య ప్రజలు ఈ రెండింటిని ఒకేరకంగా పరిగణిస్తారు. అట్లాగే అనేకమంది పాలకులు రాజ్యానికి, ప్రభుత్వానికి మధ్య వ్యత్యాసాన్ని విస్మరించారు. ఉదాహరణకు ఫ్రాన్స్ చక్రవర్తి 14వ లూయీ ప్రకారం “నేనే రాజు, నేనే రాజ్యం” అని ప్రకటించాడు. రాజ్యాధికారాన్ని ప్రభుత్వం తరపున నిర్వహిస్తున్న అతడు ఈ విధంగా పరిగణించాడని చెప్పవచ్చు. రాజనీతి శాస్త్రజ్ఞులు రాజ్యం, ప్రభుత్వం మధ్య స్పష్టమైన వ్యత్యాసాన్ని చూపారు. తద్వారా అనేక క్లిష్టసమస్యలకు పరిష్కారం తెలిపారు.

రాజ్యం – ప్రభుత్వం మధ్య సంబంధం (Relationship between State and Government): రాజ్యం, ప్రభుత్వం మధ్య సంబంధాన్ని కింద చర్చించడమైంది.
1) వ్యక్తులచే ఏర్పాటు (Established by Individuals): రాజ్యం – ప్రభుత్వం రెండూ వ్యక్తులచే ఏర్పాటయినాయి. ఈ రెండు ప్రజలను రక్షించేందుకై, ప్రజల మధ్య సంబంధాలను క్రమబద్దం చేసేందుకై కృషి చేస్తాయి. వివిధ రంగాలలో ప్రజాప్రయోజనాలను పెంపొందించేందుకు అవి ఏర్పాటై, కొనసాగుతున్నాయి.

AP Inter 1st Year Civics Study Material Chapter 2 రాజ్యం

2) పరస్పర పోషకాలు (Complementary): రాజ్యాన్ని అన్ని రకాలుగా ఆచరణలో ప్రభుత్వంగా పరిగణించ డమైంది. ప్రభుత్వ కార్యకలాపాలు అన్నింటిని రాజ్యం పేరుతో నిర్వహిస్తారు. ఇంగ్లాండ్కు చెందిన స్టూవర్ట్ రాజులు, ఫ్రాన్స్కు చెందిన 14వ లూయీ చక్రవర్తి రాజ్యం, ప్రభుత్వాలను పరస్పర పోషకాలుగా భావించారు.

3) రాజ్య అభీష్టం ప్రభుత్వంచే వెల్లడవటం (Will of State expressed by the Government): ప్రభుత్వమనేది రాజ్యానికి సంబంధించిన అతి ముఖ్య లక్షణం. అది రాజ్య లక్ష్యాలు, ఆశయాలను వెల్లడించి అమలు చేస్తుంది. రాజ్య లక్షణాలను సాధించడంలో ప్రభుత్వం కీలకమైన పాత్రను నిర్వహిస్తుంది. అందువలన ‘ప్రభుత్వాన్ని రాజ్యానికి చెందిన మెదడు’ గా భావిస్తారు. రాజ్యం లక్ష్యాలను ప్రతిబింబించే చట్టాలను ప్రభుత్వం రూపొందించి, అమలుచేస్తుంది.

రాజ్యానికి చెందిన ప్రతిచర్య ప్రభుత్వచర్యగా భావించాల్సి ఉంటుందని లాస్కీ ప్రకటించాడు. రాజ్యాభిష్టం చట్టాల రూపంలో ఉంటుంది. అయితే అటువంటి చట్టాలకు జవసత్వాలు, ప్రయోజనాలను ప్రభుత్వం చేకూర్చుతుంది.

ప్రశ్న 9.
రాజ్యం, ప్రభుత్వం మధ్యగల వ్యత్యాసాలను గుర్తించండి. [Mar. ’18, ’17, ’16]
జవాబు:
రాజ్యం:

  1. రాజ్యం శాశ్వతమైన రాజకీయ సంస్థ. మానవ సమాజం ఉన్నంతకాలం అది ఉంటుంది.
  2. రాజ్యమునకు 5 లక్షణాలుంటాయి. ప్రజలు, ప్రదేశం, ప్రభుత్వం, సార్వభౌమాధికారం, అంతర్జాతీయ గుర్తింపు దాని లక్షణాలు.
  3. రాజ్యము యజమాని వంటిది.
  4. రాజ్యానికి సార్వభౌమాధికారం సహజంగానే ఉంటుంది. అది ఉన్నతాధికారాలు చెలాయిస్తుంది.
  5. ప్రపంచంలోని అన్ని రాజ్యాలకు ముఖ్య లక్షణాలు ఒక్కటే.
  6. పౌరులంతా రాజ్యంలో సభ్యులే. రాజ్యంలో ప్రజలకు సభ్యత్వం, తప్పనిసరిగా ఉంటుంది.
  7. రాజ్యానికి స్వతసిద్ధమైన రూపం లేదు. అది ప్రభుత్వ రూపంలోనే కనిపిస్తుంది.
  8. రాజ్యానికి ప్రదేశము ఒక ముఖ్య లక్షణము. ప్రదేశంలేని రాజ్యం ఉండదు.
  9. ప్రజలకు రాజ్యాన్ని వ్యతిరేకించే హక్కు లేదు.
  10. రాజ్యానికి మౌలికమైన అధికారాలున్నాయి.

ప్రభుత్వం:

  1. ప్రభుత్వం ఎన్నికల వలనగానీ, విప్లవాల వలనగానీ మారవచ్చు. అందువలన అది శాశ్వతమైనది కాదు.
  2. ప్రభుత్వం, రాజ్య లక్షణాలలో ఒకటి మాత్రమే. అది రాజ్య ప్రతినిధి, ఒక భాగము.
  3. ప్రభుత్వం రాజ్యానికి సేవకుని వంటిది. రాజ్యం పనులను ప్రభుత్వం చేస్తుంది.
  4. ప్రభుత్వం రాజ్యం తరపున సార్వభౌమాధికారాన్ని చెలాయిస్తుంది.
  5. ప్రపంచంలో ప్రభుత్వాలన్నీ ఒకే విధమైనవి కావు. ఉదా: పార్లమెంటరీ, అధ్యక్ష తరహా యూనిటరీ, సమాఖ్య మొదలగు ప్రభుత్వాలు.
  6. ప్రభుత్వంలో కొద్దిమంది మాత్రమే సభ్యులు. సభ్యత్వం తప్పనిసరి కాదు.
  7. ప్రభుత్వము ఒక స్పష్టమైన రూపంలో కనిపిస్తుంది.
  8. ప్రభుత్వం నిర్దిష్ట ప్రదేశం లేకుండా పనిచేస్తుంది. అది ఎక్కడినుండైనా పనిచేస్తుంది.
  9. ప్రజలు తమకు నచ్చని ప్రభుత్వాన్ని ప్రతిఘటించ గలరు. న్యాయస్థానాల ద్వారా కూడా వ్యతిరేకించగలరు.
  10. ప్రభుత్వానికి రాజ్యాంగము ఇచ్చే అధికారాలే ఉంటాయి.

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
రాజ్యానికి గల ఏవైనా రెండు నిర్వచనాలను ఉదహరించండి.
జవాబు:
‘రాజ్యం’ అనే పదాన్ని అనేకమంది రాజనీతిశాస్త్ర పండితులు అనేక రకాలుగా నిర్వచించారు. వారిలో కొందరు ఇచ్చిన నిర్వచనాలను కింది విధంగా పేర్కొనడమైంది.

  1. అరిస్టాటిల్: “మానవునికి సుఖప్రదమైన, గౌరవప్రదమైన జీవనాన్ని ప్రసాదించడమే లక్ష్యంగా కలిగిన కుటుంబాలు, గ్రామాల సముదాయమే రాజ్యం”.
  2. బ్లంటి: “ఒక నిర్ణీత ప్రదేశంలో నివసిస్తూ రాజకీయంగా వ్యవస్థీకృతమైన ప్రజల సముదాయమే రాజ్యం”.

AP Inter 1st Year Civics Study Material Chapter 2 రాజ్యం

ప్రశ్న 2.
రాజ్యానికి ఎన్ని మౌలిక లక్షణాలుంటాయి? అవి ఏవి?
జవాబు:
రాజ్యానికి నాలుగు మౌలిక లక్షణాలుంటాయి. అవి:

  1. ప్రజలు
  2. ప్రదేశం
  3. ప్రభుత్వం
  4. సార్వభౌమాధికారం.

ప్రశ్న 3.
ప్రభుత్వం అంటే ‘ఏమిటి ?
జవాబు:
రాజ్యం యొక్క ఆశయాలను, లక్ష్యాలను నెరవేర్చే సాధనమే ప్రభుత్వం. ప్రభుత్వం మూడు అంగాలను కలిగి ఉంటుంది. అవి: 1) శాసనశాఖ 2) కార్యనిర్వాహక శాఖ 3) న్యాయ శాఖ.

ప్రశ్న 4.
రాజ్యానికి గల ఇతర లక్షణాలు ఎన్ని? వాటిని తెలపండి.
జవాబు:
ప్రజలు, ప్రదేశం, ప్రభుత్వం, సార్వభౌమాధికారంతోపాటు రాజ్యానికి నాలుగు ఇతర లక్షణాలు కూడా ఉంటాయి. అవి:

  1. అంతర్జాతీయ గుర్తింపు,
  2. శాశ్వతత్వం,
  3. సాధారణ విధేయత,
  4. ప్రజాభీష్టం.

ప్రశ్న 5.
“సమాజం” అంటే ఏమిటి ?
జవాబు:
సమాజం ప్రాచీనమైనది. రాజ్యం కంటే ముందు ఏర్పడినది. మానవుడు సంఘజీవి. సమాజంలో మాత్రమే వ్యక్తి సంపూర్ణ వికాసాన్ని, సుఖవంతమైన జీవితాన్ని గడపగలడు. “సమిష్టి జీవనాన్ని గడుపుతున్న మానవ సముదాయమే” సమాజము. సమాజంలో సభ్యత్వం లేని మానవుడిని ఊహించలేము. వలలాగా అల్లబడిన వివిధ రకాల మానవ సంబంధాలను ‘సమాజం’ అని చెప్పవచ్చు. అయితే రాజ్యంలాగా సార్వభౌమాధికారము, దండనాధికారం ఉండదు. సాంఘిక ఆచార సంప్రదాయాల ఆధారముగా శిక్షలు ఉంటాయి.

ప్రశ్న 6.
“సంస్థ” అంటే ఏమిటి ? [Mar. 2017]
జవాబు:
“ఒక లక్ష్యసిద్ధికి గాని, కొన్ని ఆశయాల సాధనకు గాని నిర్ణీత పద్ధతిలో ఐక్యతతో కృషి చేయుటకు ఏర్పడిన వ్యక్తుల సముదాయమే సంస్థ. మానవుడు కొన్ని ప్రత్యేక ప్రయోజనాలు నెరవేర్చుకోవడానికి వివిధ రకాలైన సంస్థలను నిర్మించుకొన్నాడు. ఉదా: మత సంస్థలు, రాజకీయ సంస్థలు, ఆర్థిక సంస్థలు, సాంఘిక సంస్థలు, సాంస్కృతిక సంస్థలు మొ||నవి.

ప్రశ్న 7.
రాజ్యంలోని జనాభా గుణాత్మక ధృక్పధాన్ని వ్రాయండి.
జవాబు:
రాజ్యం జనాభా గుణాత్మకంగా ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకొంది. ఒక రాజ్యం ఎటువంటి స్వభావంగల ప్రజలను కలిగి ఉంటుంది ? అక్కడి ప్రజలు విద్యావంతులు, అక్షరాస్యులు సాంస్కృతికంగా పురోగతి సాధించినవారై ఉంటారా ? అనే అంశాలకు ప్రాముఖ్యత ఏర్పడింది. ఈ సందర్భంలో ఉత్తమ పౌరులు, ఉత్తమ రాజ్య రూపకల్పనకు దోహదకారిగా ఉంటారని అరిస్టాటిల్ చెప్పాడు. అందుచేత రాజ్యానికి సంబంధించిన ప్రజల స్వభావం, సంస్కృతి, అంకిత భావాలు ప్రాధాన్యతను సంతరించుకొన్నాయి. అట్లాగే ప్రజల క్రమశిక్షణ, కష్టించి పనిచేసే గుణం, నిజాయితీ, వివేకం వంటి గుణాలను కలిగి ఉన్నట్లయితే, ఆ రాజ్యం శీఘ్రగతిన ప్రగతిని సాధించగలుగుతుంది.

AP Inter 1st Year Civics Study Material Chapter 2 రాజ్యం

ప్రశ్న 8.
రాజ్యానికి అంతర్జాతీయ గుర్తింపు అవసరమా ?
జవాబు:
అంతర్జాతీయ గుర్తింపు (International Recognition): అంతర్జాతీయ గుర్తింపు అంటే ఒక రాజ్య ఉనికిని, ప్రభుత్వాన్ని ప్రపంచంలోని ఇతర రాజ్యాలు గుర్తించడం. ఆధునిక యుగంలో ప్రపంచ రాజ్యాల మధ్య సంబంధాలు పెరగడంతో అనేక అంతర్జాతీయ సంస్థలు ఏర్పడ్డాయి. కొంతమంది రాజనీతి పండితుల అభిప్రాయంలో అంతర్జాతీయ గుర్తింపు కూడా రాజ్య మౌలిక లక్షణంగా పరిగణించడమైంది.

ప్రపంచంలోని ప్రతి రాజ్యం ఇతర సార్వభౌమ రాజ్యాల చేత గుర్తింపు పొందాలి. ఐక్యరాజ్యసమితి వంటి కొన్ని అంతర్జాతీయ సంస్థలు ఆ రకమైన గుర్తింపును ఇస్తున్నాయి. ఐక్యరాజ్యసమితిలో సభ్యత్వమున్నదంటే ఆ రాజ్యానికి చెందిన సార్వభౌమాధికారం గుర్తించబడినట్లుగా భావించవచ్చు. ఒక కొత్త రాజ్యం ఆవిర్భవించినప్పుడు, అది మిగతా ప్రపంచ రాజ్యాలతో పాటు ఐక్యరాజ్యసమితి చేత గుర్తించబడటం అత్యంత ఆవశ్యకం.

అంతర్జాతీయ గుర్తింపు అనే లక్షణం రాజకీయ దృక్కోణంతో కూడుకొని ఉంది. 1945లో ఐక్యరాజ్యసమితి ఏర్పడకముందు నుంచే చైనా ఒక సమగ్రమైన రాజ్యం. 1949 నాటికి చైనా కమ్యూనిస్టుల వశమైంది. ప్రచ్ఛన్న యుద్ధ ప్రభావం వల్ల చైనా ఒక సార్వభౌమ రాజ్యంగా అమెరికా సంయుక్త రాష్ట్రాల చేత గుర్తించబడలేదు. చైనా-అమెరికాల మధ్య ప్రచ్ఛన్నయుద్ధ ఛాయలు తొలగిన తరువాత 1970వ దశకంలో ఐక్యరాజ్యసమితి చైనాను ఒక సార్వభౌమరాజ్యంగా గుర్తించింది.

ప్రశ్న 9.
రాజ్యానికి గల నాలుగు ఇతర లక్షణాల పేర్లను రాయండి.
జవాబు:

  1. ప్రజలు
  2. ప్రదేశ
  3. ప్రభుత్వం
  4. సార్వభౌమాధికారం.

ప్రశ్న 10.
రాజ్యం, సమాజం మధ్యగల ఏవైనా రెండు వ్యత్యాసాలను పేర్కొనండి. [Mar. ’16]
జవాబు:
రాజ్యం (State)

  1. రాజ్యం అనేది రాజకీయ సంస్థ.
  2. రాజ్యం వ్యక్తుల బాహ్య ప్రవర్తనను మాత్రమే నియంత్రిస్తుంది. ఈ విషయంలో అది కొన్ని నిబంధనలను రూపొందిస్తుంది.

సమాజం (Society)

  1. సమాజం అనేది సాంఘిక వ్యవస్థ.
  2. సమాజం మానవుల బాహ్య, అంతర్గత ప్రవర్తనలు రెండింటిని నియంత్రిస్తుంది. వ్యక్తుల సామాజిక జీవనాన్ని ఇది క్రమబద్ధం చేస్తుంది.

ప్రశ్న 11.
రాజ్యం, ప్రభుత్వం మధ్యగల ఏవైనా రెండు వ్యత్యాసాలను వ్రాయండి.
జవాబు:
రాజ్యం

  1. రాజ్యం శాశ్వతమైన రాజకీయ సంస్థ. మానవ సమాజం ఉన్నంతకాలం అది ఉంటుంది.
  2. రాజ్యమునకు 5 లక్షణాలుంటాయి. ప్రజలు, ప్రదేశం, ప్రభుత్వం, సార్వభౌమాధికారం, అంతర్జాతీయ గుర్తింపు దాని లక్షణాలు.

ప్రభుత్వం

  1. ప్రభుత్వం ఎన్నికల వలన గానీ, విప్లవాల వలన గానీ మారవచ్చు.’ అందువలన అది శాశ్వత మైనది కాదు.
  2. ప్రభుత్వం, రాజ్య లక్షణాలలో ఒకటి మాత్రమే. అది రాజ్య ప్రతినిధి, ఒక భాగము.

ప్రశ్న 12.
ప్రభుత్వ అంగాలు ఎన్ని ? వాటి విధులను క్లుప్తంగా వివరించండి.
జవాబు:
ప్రభుత్వంలో మూడు అంగాలుంటాయి. అవి:

  1. శాసనశాఖ: ఇది పరిపాలనకు కావలసిన శాసనాలను రూపొందిస్తుంది.
  2. కార్యనిర్వాహకశాఖ: ఇది శాసనాలను అమలుచేస్తుంది.
  3. న్యాయశాఖ: ఇది శాసనాలను వ్యాఖ్యానించి అవి న్యాయబద్ధంగా ఉన్నాయో లేదో చెబుతుంది. ప్రజలకు న్యాయం చేస్తుంది.

AP Inter 1st Year Civics Study Material Chapter 2 రాజ్యం

ప్రశ్న 13.
రాజ్యం, సంస్థల మధ్యగల ఏవైనా రెండు వ్యత్యాసాలను పేర్కొనండి. [Mar. ’18]
జవాబు:
రాజ్యం (State)

  1. రాజ్యం సభ్యత్వం నిర్బంధమైంది.
  2. రాజ్యం శాశ్వతమైంది.

సంఘాలు (Associations)

  1. సంఘంలో సభ్యత్వం ఐచ్ఛికమైంది.
  2. సంఘాలు శాశ్వతమైనవిగానూ, తాత్కాలికం గానూ ఉంటాయి.

AP Inter 1st Year Civics Study Material Chapter 1 రాజనీతిశాస్త్రం, పరిధి-ప్రాముఖ్యత

Andhra Pradesh BIEAP AP Inter 1st Year Civics Study Material 1st Lesson రాజనీతిశాస్త్రం, పరిధి-ప్రాముఖ్యత Textbook Questions and Answers.

AP Inter 1st Year Civics Study Material 1st Lesson రాజనీతిశాస్త్రం, పరిధి-ప్రాముఖ్యత

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
రాజనీతిశాస్త్రాన్ని నిర్వచించి, ఆ శాస్త్ర పరిధిని వివరించండి. [Mar 19′,’17, ’16]
జవాబు:
పరిచయం: సాంఘిక శాస్త్రాలలో రాజనీతిశాస్త్రము ప్రధానమైనది. ప్రాచీన గ్రీకునగర రాజ్యాలైన ఏథెన్స్, స్పార్టా, గ్రీస్, రోమ్ లో క్రీ.పూ. 4వ శతాబ్దంలో ప్రారంభమైనది. ప్రముఖ గ్రీకు రాజనీతివేత్తలైన సోక్రటీస్, ప్లేటో, అరిస్టాటిల్ రాజనీతిని తత్త్వశాస్త్రము నుండి వేరుచేసి ప్రత్యేక అధ్యయన శాస్త్రముగా అభివృద్ధి చేసిరి. అరిస్టాటిల్ రాజనీతిశాస్త్రానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చాడు. అందువలన ఇతను “మొట్టమొదటి రాజనీతి శాస్త్రవేత్త”గాను, “రాజనీతి “శాస్త్ర పితామహుడు”గా కీర్తింపబడినాడు. అరిస్టాటిల్ తన ప్రఖ్యాత గ్రంథమైన “పాలిటిక్స్”లో రాజ్యము, ప్రభుత్వము గురించి అధ్యయనము చేసే శాస్త్రము రాజనీతిశాస్త్రమని పేర్కొనినాడు.

పద పరిణామము: “పాలిటిక్స్ అనే పదం “పోలిస్” (Polis) మరియు “పొలిటికస్” (Politicus) అనే లాటిన్ పదాల నుండి గ్రహించడమైనది. వీటి అర్థం నగర రాజ్యం (City State).

రాజనీతిశాస్త్ర నిర్వచనాలు (Definitions of Political Science): రాజనీతి శాస్త్రజ్ఞులు రాజనీతిశాస్త్రాన్ని వివిధ రకాలుగా నిర్వచించినారు. వాటిని రెండు రకాలుగా వర్గీకరించవచ్చు.

  1. సాంప్రదాయ నిర్వచనాలు
  2. ఆధునిక నిర్వచనాలు.

1. సాంప్రదాయక నిర్వచనాలు (Traditional Definitions): సాంప్రదాయకమైన నిర్వచనాలను మూడు ఉపవర్గాలుగా వర్గీకరించారు. వాటిని కింది విధంగా పేర్కొనవచ్చు.
i) రాజ్యం గురించి అధ్యయనం చేసేదే రాజనీతిశాస్త్రం (Study of the State): రాజనీతి తత్వవేత్తలైన జె.డబ్ల్యు. గార్నర్, ఆర్.జి.గెటిల్, అప్పాదొరై మరియు ఇతరులు రాజనీతిశాస్త్రం రాజ్యాన్ని గురించి అధ్యయనం చేస్తుందని వివరించారు.

  1. జె.డబ్ల్యు. గార్నర్: “రాజనీతిశాస్త్రం రాజ్యంతో ఆరంభమై రాజ్యంతోనే అంతమవుతుంది”.
  2. ఆర్.జి.గెటిల్: “రాజనీతిశాస్త్రమంటే రాజ్యం గతంలో ఎలా ఉండేదో పరిశోధించి, వర్తమాన కాలంలో ఎలా ఉన్నదో విశ్లేషించి, భవిష్యత్ కాలంలో ఎలా ఉండాలి అనే అంశంపై జరిపే రాజకీయ, నైతిక చర్చల సారాంశం”.

AP Inter 1st Year Civics Study Material Chapter 1 రాజనీతిశాస్త్రం, పరిధి-ప్రాముఖ్యత

ii) ప్రభుత్వాన్ని గురించి అధ్యయనం చేసేదే రాజనీతిశాస్త్రం (Study of the Government): రాజనీతి తత్వవేత్తలైన స్టీఫెన్ లీకాక్, జాన్ రిచర్డు సీలీ ఇతరులు రాజనీతి శాస్త్రం ప్రభుత్వాన్ని గురించి అధ్యయనం చేస్తుందని తెలిపారు.

  1. స్టీఫెన్ లీకాక్: “రాజనీతిశాస్త్రమంటే ప్రభుత్వం గురించి అధ్యయనం చేసే శాస్త్రం”.
  2. జాన్ రిచర్డు సీలీ: “ప్రభుత్వ దృగ్విషయాన్ని గురించి పరిశోధన జరిపే శాస్త్రమే రాజనీతిశాస్త్రం”.

iii) రాజ్యం, ప్రభుత్వం గూర్చి అధ్యయనం చేసేది (Study of State and Government): రాజనీతి
తత్వవేత్తలైన పాలానెట్, ఆర్.ఎన్. గిల్ క్రిస్ట్, డిమాక్, ప్రొఫెసర్ కాట్లిన్ ఇతరులు రాజనీతిశాస్త్రం రాజ్యాన్ని మరియు ప్రభుత్వాన్ని గురించి అధ్యయనం చేసే శాస్త్రంగా తెలియజేసారు.
“ప్రభుత్వాన్ని గురించి వివరిస్తుంది”:

  1. పాలానెట్: “రాజనీతిశాస్త్రమంటే రాజ్య మూలాధారాలు, ప్రభుత్వ సూత్రాల గురించి తెలియజేసే సామాజిక శాస్త్రంలోని ఒక విభాగం”.
  2. ఆర్.ఎన్.గిల్ క్రిస్ట్: ‘రాజ్యం, ప్రభుత్వ సూత్రాలను, అధ్యయనం చేసే శాస్త్రమే రాజనీతిశాస్త్రం’.
  3. కాట్లిన్: ‘ప్రభుత్వాంగాలు, వ్యక్తుల రాజకీయ కార్యకలాపాలను అధ్యయనం చేసే శాస్త్రమే రాజనీతిశాస్త్రం’.

2. ఆధునిక నిర్వచనాలు:

  • లాస్వెల్, కాప్లాన్: “రాజనీతిశాస్త్రం ఒక అనుభవాత్మక శాస్త్రంగా ఉంటూ అధికార రూపకల్పన, అధికారుల భాగస్వామ్యం గురించి అధ్యయనం చేస్తుంది”.
  • డేవిడ్ ఈస్టన్: “రాజనీతిశాస్త్రం సమాజం కోసం విలువలను (వస్తువులను) అధికారయుతంగా పంపిణీ చేయడానికి సంబంధించి అధ్యయనం చేస్తుంది”.

రాజనీతి శాస్త్రం-పరిధి: గత వంద సంవత్సరాలలో రాజనీతిశాస్త్ర పరిధి చాలా విస్తరించింది. ప్రస్తుతం ఉన్న ఆధునిక రాజ్యాల కార్యకలాపాలను వివరించే శాస్త్రముగా అభివృద్ధి చెందింది. వ్యక్తి స్వేచ్ఛను ఎలా కాపాడుకోవాలి, రాజ్యానికి, శాసనానికి ఎందుకు విధేయత చూపాలి అనే విషయాలను తెలియజేయును. వాస్తవానికి ప్రభుత్వ ప్రమేయం ప్రత్యక్షంగానో, పరోక్షంగానో లేని మానవ కార్యకలాపాలుండవు. రాజనీతిశాస్త్రము మానవుని ప్రవర్తనను అధ్యయనం చేస్తుంది. అందువలన ప్రవర్తనావాదులు “సర్వత్రా వ్యాపించిన రాజకీయాలు” (Ubiquity of Politics) అని అంటారు.

రాజనీతిశాస్త్రములో చర్చించబడే విషయాలను ఈక్రింది విధంగా వివరించవచ్చును.
i) సమాజం, రాజ్యాలతో మానవునికి గల సంబంధాలు అధ్యయనం (Study of Man in relation to the Society and State): మానవుడు సంఘజీవి అని అరిస్టాటిల్ భావించాడు. మానవుడు తన ఆహారం, వస్త్రం, గృహం వంటి ప్రాథమిక అవసరాలను సమాజంలో తీర్చుకొంటాడు. రాజనీతిశాస్త్రం మానవుడికి, సమాజానికి మధ్య గల సంబంధాన్ని వివరిస్తుంది. అంతేకాకుండా సమాజం పుట్టుక, పరిణామం, ఉద్దేశ్యాలను కూడా అది తెలుపుతుంది. మానవుడు సమాజంలో ఏ విధంగా సర్దుబాటు చేసుకొని జీవిస్తాడు అనే అంశాన్ని పరిశీలిస్తుంది. ఈ సందర్భంలో రాజనీతిశాస్త్ర అధ్యయనం వ్యక్తికి, సమాజానికి ఎంతో ప్రాముఖ్యతగలదిగా ‘దిలాన్’ అనే పండితుడు భావించాడు. సమాజం పట్ల ఆధునిక మానవుడు సరైన దృక్పథాన్ని ఏర్పర్చుకోవాల్సిన అవసరం ఉందన్నాడు. సమాజంలో మానవుడు | మమేకం అయినప్పుడు మాత్రమే అది సాధ్యపడుతుందని వివరించారు.

వ్యక్తులకు, రాజ్యానికి మధ్య సరియైన సంబంధాన్ని నెలకొల్పే ప్రధాన అంశాలపైనే రాజనీతిశాస్త్ర అధ్యయనం కేంద్రీకృతమవుతుంది. రాజ్యంలోని రాజకీయ సంస్థల ప్రాముఖ్యతను వివరించడం ద్వారా అనేక సంక్లిష్ట సమస్యల పరిష్కారానికి ఈ శాస్త్రం దోహదపడుతుంది. ఈ సందర్భంలో అది రాజ్యాధికార పరిమితులు, వ్యక్తి స్వాతంత్ర్యాల అవధులు వంటి అనేక విషయాలను చర్చిస్తుంది.

ii) రాజ్య అధ్యయనం (Study of State): పాలానెట్, బ్లంటి షిల్లీ, గార్నర్ లాంటి రాజనీతి శాస్త్రవేత్తలు రాజనీతిశాస్త్రాన్ని రాజ్యానికి సంబంధించిన అధ్యయన శాస్త్రంగా పరిగణించారు. వారి ప్రకారం, రాజ్యమనేది రాజకీయ సంస్థగా వారు భావించారు. రాజ్యం ప్రతి వ్యక్తికీ అవసరమైనది. రాజ్యానికి, పౌరులకు మధ్యగల సన్నిహిత సంబంధాన్ని రాజనీతిశాస్త్రం తెలుపుతుంది. అలాగే రాజ్య అవతరణ సిద్ధాంతాలను వివరిస్తుంది. అంతేకాకుండా రాజ్యం స్వభావం విధులు, వివిధ రాజ్యాధికార సిద్ధాంతాలను పేర్కొంటుంది. రాజనీతిశాస్త్రం గతంలో రాజ్య అవతరణ అభివృద్ధి గురించి, వర్తమానంలోనూ, భవిష్యత్తులోనూ రాజకీయ సంస్థ, రాజకీయ భావాలను వర్ణించి విశ్లేషించేందుకు దోహదపడుతుందని ఈ సందర్భంలో ఆర్.జి. గెటిల్ పేర్కొన్నాడు.
i) వర్తమానంలో రాజ్యం పరిస్థితి ii) గతంలో రాజ్యపు ఉనికి iii) భవిష్యత్లో రాజ్యం ఎలా ఉండబోతుంది అనే మూడు విషయాల విశ్లేషణలు రాజనీతిశాస్త్రం పరిధిలో ఉంటాయి.

iii) ప్రభుత్వ అధ్యయనం (Study of Government): రాజనీతిశాస్త్ర పరిధిలో ప్రభుత్వం గురించిన అంశాలు ఉంటాయి. స్టీఫెన్ లీకాక్, జాన్ రిచర్డ్ సీలీ లాంటి కొందరు రాజనీతిశాస్త్రవేత్తలు ఈ శాస్త్ర పరిధిని ప్రభుత్వ అధ్యయనానికి పరిమితం చేశారు. వారి ప్రకారం, ఈ శాస్త్రం ప్రభుత్వం గురించి అధ్యయనం చేస్తుంది. ప్రభుత్వమనేది రాజ్యపు ప్రతినిధి అని, ప్రభుత్వం లేకుండా రాజ్యం ఉండదని వారు భావించారు. ప్రభుత్వం ద్వారానే రాజ్య ఆశయాలు నెరవేరతాయి. రాజ్య అభీష్టాన్ని ప్రభుత్వం రూపొందించి, వ్యక్తీకరించి, అమలులో ఉంచుతుంది. కొంతమంది వ్యక్తులు లేదా వ్యక్తుల సముదాయం రాజ్యం తరపున అధికారికంగా ఆజ్ఞలను జారీచేస్తారు. వారినే ప్రభుత్వంగా పరిగణించడమైంది. రాజనీతిశాస్త్రం, ప్రభుత్వానికి గల అర్థం, నిర్మితి, రకాలు స్వభావం, కర్తవ్యాలను అధ్యయనం చేస్తుంది. అలాగే ప్రభుత్వ అంశాల మధ్య సంబంధాన్ని చర్చిస్తుంది. రాజ్యం, ప్రభుత్వాల మధ్య వ్యత్యాసాలను గుర్తిస్తుంది.

iv) సంఘాలు, సంస్థల అధ్యయనం (Study of Associations and Institutions): వ్యక్తి జీవనాన్ని ప్రభావితం చేసే అనేక సంఘాలు, సంస్థలు ఉన్నాయి. ప్రతి వ్యక్తి రాజ్యంలోని భిన్న సంఘాలు, సంస్థలలో సభ్యుడిగా ఉంటాడు. రాజ్యం వ్యక్తుల రాజకీయ అవసరాలను తీర్చగా, సంఘాలు, సంస్థలనేవి వ్యక్తుల నైతిక, మత, సాంస్కృతిక, వైజ్ఞానిక, సాంకేతిక ప్రగతికి సంబంధించిన విషయాలపై సహాయంగా ఉంటాయి. అవి స్థానిక, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలలో తమ కార్యక్రమాలను నిర్వహిస్తుంటాయి. వ్యక్తులు ఆ సంస్థలలో తమ ప్రయోజనాలు లేదా ఉద్దేశ్యాలకు అనుగుణంగా చేరి వ్యక్తిత్వ వికాసానికై కృషి చేస్తారు. పైన పేర్కొన్న సంఘాలు, సంస్థలు వ్యక్తుల సంపూర్ణ వికాసంలో కీలకపాత్ర పోషిస్తాయి. వ్యక్తులు, కుటుంబం, కులం, రాజకీయ పార్టీలు, మతం వంటి అనేక సంస్థలనుండి ప్రయోజనాలను పొందుతారు. రాజనీతిశాస్త్రం వివిధ సంస్థల నిర్మాణం, స్వభావం మరియు విధులను గురించి వివరిస్తుంది.

AP Inter 1st Year Civics Study Material Chapter 1 రాజనీతిశాస్త్రం, పరిధి-ప్రాముఖ్యత

v) హక్కులు, బాధ్యతల అధ్యయనం (Study of Rights and Responsibilities): రాజనీతిశాస్త్ర పరిధి, వ్యక్తుల హక్కులకు, బాధ్యతలకు సంబంధించిన అధ్యయనంగా ఉంది. ప్రజాస్వామ్య రాజ్యాలలోని పౌరులు జీవించే హక్కు, స్వాతంత్య్రపు హక్కు, ఆస్తిహక్కు కొన్ని హక్కులను అనుభవిస్తారు. ఈ సందర్భంలో రాజనీతిశాస్త్రం హక్కుల నిర్వచనం, వర్గీకరణ, వివిధ సిద్ధాంతాలను ప్రస్తావిస్తుంది. అలాగే ప్రాథమిక హక్కులకు సంబంధించిన రాజ్యాంగ అంశాలపై దృష్టిని సారిస్తుంది. రాజ్యం పట్ల పౌరులు కొన్ని బాధ్యతలు కలిగి ఉంటారు. అటువంటి బాధ్యతలలో పన్నుల చెల్లింపు, శాసన విధేయతలాంటివి ఉంటాయి. రాజనీతిశాస్త్రం, పౌరుల హక్కుల బాధ్యతల ప్రాముఖ్యతను
వివరిస్తుంది.

vi) జాతీయ – అంతర్జాతీయ అంశాల అధ్యయనం (Study of National and International Issues): రాజనీతిశాస్త్ర పరిధిలో 20వ శతాబ్ది ప్రారంభం నుంచి ప్రాముఖ్యత వహించిన అంతర్జాతీయ సంబంధాలనేవి చేర్చబడినాయి. ఈ శాస్త్రం వర్ధమాన జాతి రాజ్యాలతో పాటుగా అంతర్జాతీయ రాజకీయాలను కూడా చర్చిస్తుంది. ఆధునిక రాజ్యాలు ఇతర రాజ్యాలతో ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమత్వం పరిరక్షణకు సంబంధించిన అంశాలను ఈ శాస్త్రం వివరిస్తుంది. ప్రచ్ఛన్న యుద్ధం, ప్రాబల్య సమతౌల్యం, నిరాయుధీకరణ, దౌత్యనీతి వంటి విషయాలను అధ్యయనం చేస్తుంది. అలాగే అంతర్జాతీయ రాజకీయాలు, అంతర్జాతీయ న్యాయం, అంతర్జాతీయ సంస్థలు వంటి అనేక అంశాలు ఈ శాస్త్ర అధ్యయనంలో ఉంటాయి.

vii) శక్తి అధ్యయనం (Study of Power): 20వ శతాబ్ద కాలం నాటి ప్రవర్తనావాదులు రాజనీతిశాస్త్రాన్ని రాజకీయ శక్తి నిర్మాణం, దాని భాగస్వాములను గురించి అధ్యయనం చేసే శాస్త్రంగా భావించారు. ఈ శాస్త్రం శక్తి ఏ విధంగా దక్కించుకోబడి, వినియోగించబడుతుందనే విషయాన్ని వివరిస్తుందన్నారు. రాజకీయ సామాజికీకరణ రాజకీయ సంస్కృతి, రాజకీయ ప్రాతినిధ్యంలాంటి అనేక అంశాలు ఈ శాస్త్ర అధ్యయనంలో ఉన్నాయన్నారు. అంతేకాకుండా, రాజకీయ ప్రసరణ, ప్రయోజనాల వ్యక్తీకరణ, ప్రయోజనాల సమీకరణల వంటి లాంఛనప్రాయం కాని రాజకీయశక్తి దృక్కోణాలు కూడా ఈ శాస్త్ర అధ్యయనంలో భాగంగా ఉన్నాయన్నారు.

viii) ప్రభుత్వ విధానాల అధ్యయనం (Study of Public Policy): డేవిడ్ ఈస్టన్, ఆండర్సన్, ఛార్లెస్ లిండ్బామ్ లాంటి ఆధునిక రాజనీతిశాస్త్రవేత్తలు రాజనీతిశాస్త్రాన్ని విధానశాస్త్రమని వాదించారు. రాజనీతిశాస్త్రాన్ని ప్రభుత్వ విధాన రూపకల్పన, అమలు, మూల్యాంకనాలకు సంబంధించినదన్నారు. లాంఛనప్రాయమైన రాజకీయ నిర్మితులు, లాంఛనప్రాయంకాని రాజకీయ వర్గాల పాత్రను ఈ శాస్త్రం అధ్యయనం చేస్తుందన్నారు.

ఒక రాజ్యం యొక్క ప్రభుత్వ విధానాన్ని అధ్యయనం చేసే సందర్భంలో అంతర్జాతీయ సంబంధాలపరంగా దౌత్యపరమైన, ఆర్థిక, సైనికపరమైన అంశాలకు శాస్త్రీయ వ్యూహాల రూపకల్పన కీలకపాత్రను పోషిస్తుంది.

ప్రశ్న 2.
రాజనీతిశాస్త్ర అధ్యయన ప్రాముఖ్యతను చర్చించండి.
జవాబు:
పరిచయం: సాంఘిక శాస్త్రాలలో రాజనీతిశాస్త్రము ప్రధానమైనది. ప్రాచీన గ్రీకునగర రాజ్యాలైన ఏథెన్స్, స్పార్టా, గ్రీస్, రోమ్ లో క్రీ.పూ. 4వ శతాబ్దంలో ప్రారంభమైనది. ప్రముఖ గ్రీకు రాజనీతివేత్తలైన సోక్రటీస్, ప్లేటో, అరిస్టాటిల్ రాజనీతిని తత్త్వశాస్త్రము నుండి వేరుచేసి ప్రత్యేక అధ్యయన శాస్త్రముగా అభివృద్ధి చేసిరి. అరిస్టాటిల్ రాజనీతిశాస్త్రానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చాడు. అందువలన ఇతను “మొట్టమొదటి రాజనీతి శాస్త్రవేత్త”గాను, “రాజనీతి శాస్త్ర పితామహుడు”గా కీర్తింపబడినాడు. అరిస్టాటిల్ తన ప్రఖ్యాత గ్రంథమైన “పాలిటిక్స్”లో రాజ్యము, ప్రభుత్వము గురించి అధ్యయనము చేసే శాస్త్రము రాజనీతిశాస్త్రమని పేర్కొనినాడు.

పద పరిణామము: “పాలిటిక్స్ అనే పదం “పోలిస్” (Polis) మరియు “పొలిటికస్” (Politicus) అనే లాటిన్ పదాల నుండి గ్రహించడమైనది. వీటి అర్థం నగర రాజ్యం (City State).
నిర్వచనం:

  1. జె.డబ్ల్యు.గార్నర్: “రాజనీతి శాస్త్రం రాజ్యంతో ఆరంభమై రాజ్యంతోనే అంతమవుతుంది”.
  2. డేవిడ్ ఈస్టన్: “రాజనీతిశాస్త్రం సమాజం కోసం విలువలను (వస్తువులను) అధికారయుతంగా పంపిణీ చేయడానికి సంబంధించి అధ్యయనం చేస్తుంది”.

రాజనీతిశాస్త్రం ప్రాముఖ్యత (Significance of Political Science): రాజనీతిశాస్త్ర అధ్యయనం ఎంతో ప్రయోజనకరమైనది, విలువైనదిగా పేర్కొనవచ్చు. ఈ శాస్త్ర పరిజ్ఞానం పాలకులు, పాలితులు ఇరువురికీ ఎంతగానో ఆవశ్యకమైంది. ఈ శాస్త్ర ప్రాముఖ్యతను కింద పేర్కొన్న విధంగా విశ్లేషించవచ్చు.

1) రాజ్యం గురించి సమాచారం (Information about the State): రాజనీతిశాస్త్ర అధ్యయనం ప్రధానంగా రాజ్యానికి సంబంధించిన పరిజ్ఞానాన్ని అందించేందుకు ఉద్దేశించింది. రాజ్యం అవతరణ, దాని స్వభావం, నిర్మితి విధుల గురించి ఈ శాస్త్రం తెలుపుతుంది. రాజ్యానికి సంబంధించిన పరిజ్ఞానం ప్రతి ఒక్కరికీ ఎంతగానో అవసరం. రాజ్యాలలో రాజకీయ సంస్థల పాత్ర పట్ల సరియైన అవగాహన కలిగి ఉన్నప్పుడు వివిధ రాజకీయ సమస్యలకు పరిష్కారం కనుగొనే వీలుంటుంది. అలాగే తగిన సామాజిక అవగాహన కూడా ఎంతగానో అవసరమవుతుంది. ఈ విషయంలో రాజనీతిశాస్త్రం చాలినంత పరిజ్ఞానం, అవగాహనను వ్యక్తులకు అందిస్తుంది.

AP Inter 1st Year Civics Study Material Chapter 1 రాజనీతిశాస్త్రం, పరిధి-ప్రాముఖ్యత

2) ప్రభుత్వం – పరిపాలనల పరిజ్ఞానం (Knowledge of Government and Administration): రాజ్య కార్యకలాపాలను నిర్వహించే పరిపాలకులు, రాజకీయ నాయకులు, దౌత్యవేత్తలు తమ విధులను సమర్థవంతంగా నిర్వహించేందుకై రాజనీతిశాస్త్ర పరిజ్ఞానం ఎంతగానో అవసరమవుతుంది. పరిపాలన యంత్రాంగం, సిబ్బంది, పాలన, ప్రజా సంబంధాల నిర్వహణ, పరిపాలన న్యాయం, సంప్రదింపులు వంటి అంశాల గురించి వారికి ఈ శాస్త్ర అధ్యయనం విశేషమైన అవగాహనను ఏర్పరుస్తుంది. అలాగే ఈ శాస్త్ర అధ్యయనం ద్వారా స్థానిక స్వపరిపాలన సంస్థలైన కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, జిల్లా పరిషత్తులు, మండల పరిషత్తులు, గ్రామ పంచాయితీలు లాంటి సంస్థలకు సంబంధించిన విషయాలను తెలుసుకోవచ్చు.

3) ప్రజాస్వామ్య విలువల సమాచారం (Information about Democratic Values): రాజనీతిశాస్త్ర అధ్యయనం రాజ్యం, ప్రభుత్వం, జాతి, జాతీయత, రాజ్యాంగం ప్రజాస్వామ్యం, ఉదారవాదం, పెట్టుబడిదారీ విధానం, సామ్యవాదం, కమ్యూనిజంలాంటి అనేక రాజకీయ భావనలకు సంబంధించిన ఖచ్చితమైన సమాచారాన్ని అందిస్తుంది. ఈ భావనలు మానవ జీవనంలో అనేక రంగాలలో వాడుకలో ఉన్నాయి. వాటి సారం, స్వభావం, పరిధుల గురించి ఖచ్చితమైన అర్థాన్ని గురించి రాజనీతిశాస్త్రం తెలుపుతుంది. రాజనీతిశాస్త్రం రాజకీయ భావనలైన హక్కులు, స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం పట్ల మంచి పరిజ్ఞానం, అవగాహనలను ఏర్పరుస్తుంది.

4) ప్రజాస్వామ్య విజయం (Success of Democracy):’ వర్తమాన ప్రపంచంలో ప్రజాస్వామ్యం అత్యంత ప్రాముఖ్యతగల ప్రభుత్వ విధానంగా రూపొందింది. అది “ప్రపంచ గొప్ప రాజకీయ మతం” గా భావించబడింది. ఈ విధానంలో ప్రజలు తమ ప్రతినిధులను ఎన్నుకోవడం, ఆ ప్రతినిధులు ప్రజలను పరిపాలించడం జరుగుతుంది.
రాజనీతిశాస్త్రం ఓటుహక్కు ప్రాముఖ్యతను వివరిస్తుంది. ప్రజాస్వామ్య భావాలు, ఆదర్శాలను సామాన్య వ్యక్తులకు నేర్పుతుంది. ప్రజాస్వామ్య విజయానికి ఈ శాస్త్రం ఎంతగానో ఉపకరిస్తుంది. ఈ శాస్త్ర అధ్యయనం పౌరులలో ప్రజాస్వామ్య విలువలను, వివేకాన్ని, దేశభక్తిని మరియు అప్రమత్తతను ఏర్పరుస్తుంది.

5) హక్కులు, బాధ్యతల పట్ల అవగాహన (Awareness about Rights and Responsibilities): రాజనీతిశాస్త్ర అధ్యయనం ప్రజలలో హక్కులు, బాధ్యతల పట్ల చక్కని అవగాహనను పెంపొందిస్తుంది. ఈ శాస్త్ర అధ్యయనం ద్వారా పౌరులు తమ హక్కులు, బాధ్యతలను గుర్తుంచుకొని, ఆ రెండింటి మధ్య పరస్పర సంబంధాన్ని తెలుసుకోగలుగుతారు. ప్రజాస్వామ్య ప్రభుత్వ విజయం హక్కులు, విధుల మధ్యగల సంబంధాన్ని సక్రమంగా అర్థం చేసుకొనే అంశంపైనే ఆధారపడి ఉంటుంది.

6) మంచి పౌరసత్వ గుణాల బోధన (Teaching the qualities of good citizenship): రాజనీతి శాస్త్ర అధ్యయనం మంచి పౌరసత్వాన్ని పొందేందుకు, జాతీయ సమైక్యతను సాధించేందుకు ఎంతో అవసరం. ఈ శాస్త్ర అధ్యయనం పౌరులకు జాతీయ ఆశయాలు, లక్ష్యాలను గుర్తుచేస్తుంది. మంచి పౌరుడనేవాడు చట్టాలు ఎలా రూపొందించబడి అమలు చేయబడతాయనే విషయాన్ని తప్పకుండా తెలుసుకోవాలి. రాజనీతిశాస్త్రం మంచి పౌరసత్వపు వివిధ దృక్కోణాలను, ప్రయోజనాలను బోధిస్తుంది. పౌరులను ఆదర్శపౌరులుగా తీర్చిదిద్దేందుకు శిక్షణ ఇస్తుంది. విధేయత, సామాజిక సేవ, నిస్వార్థంలాంటి మంచి పౌరసత్వ గుణాలను పెంపొందిస్తుంది. పౌరులు సమాజం, రాజ్యం పట్ల బాధ్యత కలిగి ఉండాల్సిన అవసరాన్ని తెలుపుతుంది. మొత్తం మీద వ్యక్తుల మూర్తిమత్వాన్ని పెంపొందిస్తుంది.

7) ప్రపంచ వ్యవహారాల పరిజ్ఞానం (Knowledge of World Affairs): రాజనీతిశాస్త్ర అధ్యయనం వలన వ్యక్తులకు ప్రపంచ వ్యవహారాల పరిజ్ఞానం పెంపొందుతుంది. వ్యక్తుల మేధోపరమైన పరిధి విస్తృతమవుతుంది. సమకాలీన ప్రపంచ వ్యవహారాలను పరిశీలించి అవగాహన చేసుకొనుటకు ఈ శాస్త్ర అధ్యయనం ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది. అంతర్జాతీయ రాజకీయాలకు సంబంధించిన అనేక దృగ్విషయాలను అర్థం చేసుకొనేందుకు అవసరమైన ఆలోచన విధానం, విశాలదృష్టి వంటి లక్షణాలను వ్యక్తులకు పెంపొందిస్తుంది.

8) అంతర్జాతీయ సంస్థల పరిజ్ఞానం (Knowledge of International Organisations): రాజనీతి శాస్త్ర అధ్యయనం అంతర్జాతీయవాద స్ఫూర్తిని పెంపొందిస్తుంది. ఐక్యరాజ్యసమితి లాంటి అంతర్జాతీయ సంస్థల గురించి పరిజ్ఞానాన్ని అందిస్తుంది. ఈనాటి ప్రపంచ రాజ్యాల మధ్య ఉత్పన్నమయ్యే ఉద్రిక్తతలను తొలగించే విషయంలో ఈ శాస్త్ర అధ్యయనం ఎంతగానో అవసరమవుతుంది. నిరాయుధీకరణ ఆవశ్యతకను గట్టిగా వాంఛిస్తుంది. అంతేకాకుండా ఈ శాస్త్రం పౌరులకు ప్రచ్ఛన్నయుద్ధం, వలసవాదం, సామ్రాజ్యవాదం, నయావలసవాదాల వల్ల ఏర్పడే ప్రమాదాలను తెలిపి, ప్రపంచశాంతి స్థాపన ఆవశ్యకతను వివరిస్తుంది.

9) రాజకీయ అవగాహనను పెంపొందించడం (Developing Political Awareness): రాజనీతిశాస్త్ర అధ్యయనం ద్వారా స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, న్యాయం వంటి రాజకీయ ఆదర్శాలకు సంబంధించిన పరిజ్ఞానాన్ని ప్రతి ఒక్కరూ పొందవచ్చు. అలాగే ఈ శాస్త్ర అధ్యయనం ద్వారా ఫాసిజం, సామ్యవాదం, కమ్యూనిజం లాంటి కొన్ని రాజకీయ భావజాలాల గురించి సమగ్రమైన అవగాహనను పొందవచ్చు. భావజాలాల గురించి ప్రజలలో ఉండే అజ్ఞానాన్ని పారద్రోలవచ్చు. ఈ శాస్త్ర అధ్యయనం అంతిమంగా ప్రజలలో రాజకీయ అవగాహనను పెంపొందిస్తుంది.

AP Inter 1st Year Civics Study Material Chapter 1 రాజనీతిశాస్త్రం, పరిధి-ప్రాముఖ్యత

10) సహకారం, సహనం, ఆవశ్యకతల వివరణ (Explaining the need for Co-operation and Toleration): అనేక రాజ్యాలలో జాతీయ సమైక్యత అత్యంత ప్రాముఖ్యత గల అంశంగా గుర్తించబడింది. ఈ రాజ్యాలలో మతతత్వం, భాషాతత్వం, ఉప, జాతీయ, ప్రాంతీయభావాల వంటి ఆటంకాలు జాతీయ సమైక్యతకు సవాళ్ళుగా పరిణమించాయి. ఈ సందర్భంలో రాజనీతిశాస్త్ర అధ్యయనం సర్దుబాటు, సహకారం, సహనం వంటి అంశాల ఆవశ్యకతను బోధిస్తుంది. ప్రజలలో సంకుచిత మనస్తత్వం, స్వార్ధ దృక్పథాలను తొలగిస్తుంది. వర్గ సంబంధమైన ఆసక్తులను అధిగమించాల్సిన ఆవశ్యకతను నొక్కి చెబుతుంది. సమాజంలో ప్రతి ఒక్కరూ పరస్పర గౌరవంతో జీవించాల్సిన అవసరాన్ని వివరిస్తుంది.

ప్రశ్న 3.
రాజనీతిశాస్త్రాన్ని నిర్వచించి, ఆ శాస్త్ర స్వభావాన్ని పేర్కొనండి.
జవాబు:
పరిచయం: సాంఘిక శాస్త్రాలలో రాజనీతి శాస్త్రము ప్రధానమైనది. ప్రాచీన గ్రీకునగర రాజ్యాలైన ఏథెన్స్, స్పార్టా, గ్రీస్, రోమ్ లో క్రీ.పూ. 4వ శతాబ్దంలో ప్రారంభమైనది. ప్రముఖ గ్రీకు రాజనీతివేత్తలైన సోక్రటీస్, ప్లేటో, అరిస్టాటిల్ రాజనీతిని తత్త్వశాస్త్రము నుండి వేరుచేసి ప్రత్యేక అధ్యయన శాస్త్రముగా అభివృద్ధి చేసిరి. అరిస్టాటిల్ రాజనీతిశాస్త్రానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చాడు. అందువలన ఇతను “మొట్టమొదటి రాజనీతి శాస్త్రవేత్త”గాను, “రాజనీతి శాస్త్ర పితామహుడు”గా కీర్తింపబడినాడు. అరిస్టాటిల్ తన ప్రఖ్యాత గ్రంథమైన “పాలిటిక్స్”లో రాజ్యము, ప్రభుత్వము గురించి అధ్యయనము చేసే శాస్త్రము రాజనీతిశాస్త్రమని పేర్కొనినాడు.

పద పరిణామము: “పాలిటిక్స్ అనే పదం “పోలిస్” (Polis) మరియు “పొలిటికస్” (Politicus) అనే లాటిన్ పదాల నుండి గ్రహించడమైనది. వీటి అర్థం నగర రాజ్యం (City State).

నిర్వచనం:
1. జె.డబ్ల్యు. గార్నర్: “రాజనీతిశాస్త్రం రాజ్యంతో ఆరంభమై రాజ్యంతోనే అంతమవుతుంది”.

2. డేవిడ్ ఈస్టన్: “రాజనీతిశాస్త్రం సమాజం కోసం విలువలను (వస్తువులను) అధికారయుతంగా పంపిణీ చేయడానికి సంబంధించి అధ్యయనం చేస్తుంది”.

రాజనీతిశాస్త్ర స్వభావం (Nature of Political Science): రాజనీతిశాస్త్ర స్వభావం విషయంలో రాజనీతి శాస్త్రజ్ఞుల మధ్య కొంత వివాదముంది. కొంతమంది రాజనీతిశాస్త్రం ఒక శాస్త్రమని, మరికొందరు ఇది ఒక ‘కళ” అని అంటారు. అరిస్టాటిల్, బ్లంటే లీ, బోడిన్, హాబ్స్, జెల్లినిక్, మాంటెస్క్యూ, సిడ్జివిక్ మొదలైనవారు రాజనీతిశాస్త్రాన్ని ఒక శాస్త్రమని పేర్కొనగా మరోవైపు బార్కర్, కొలిన్, మెయిట్లాండ్, జె.యస్. మిల్ రాజనీతిశాస్త్రం ఒక కళ అని పేర్కొన్నారు.
1) రాజనీతి శాస్త్రం ఒక శాస్త్రమా ? (Is Political Science a Science ?): రాజనీతిశాస్త్రాన్ని క్రింది అంశాల ప్రాతిపదికగా పరిగణించవచ్చు.

  1. రాజనీతిశాస్త్రాన్ని ఒక క్రమ పద్ధతిలో అధ్యయనం చేయవచ్చు.
  2. రాజకీయాలలో ప్రయోగాత్మకతకు అవకాశం ఉంది.
  3. ఇతర సామాజిక శాస్త్రాల వలె నిరపేక్షమైన, విశ్వవ్యాప్తమైన చట్టాలను కలిగి ఉంటుంది.
  4. రాజకీయాలలో అంచనాలను సులభంగా వర్తింపచేయవచ్చు.
  5. రాజనీతిశాస్త్ర అధ్యయనంలో నిర్దిష్టమైన సార్వత్రిక ఆమోదిత సూత్రాలను పొందుపరచవచ్చు.
  6. రాజనీతిశాస్త్రం శాస్త్రీయ స్వభావాన్ని కలిగి ఉంటుంది. అందువల్ల ఈ శాస్త్ర అధ్యయనంలో శాస్త్రీయమైన సూత్రాలను పొందుపరచటం జరిగింది.
  7. రాజనీతిశాస్త్రం ఇతర శాస్త్రాల వలె కార్యకారణ సంబంధాన్ని అమలు చేసేందుకు అవకాశమిస్తుంది.

2) రాజనీతి శాస్త్రం ఒక కళా ? (Is Political Science an Art ?): రాజనీతిశాస్త్రాన్ని క్రింది అంశాలను బట్టి ఒక కళగా భావించవచ్చు.

  1. రాజనీతిశాస్త్రం, భౌతికశాస్త్రాలకు భిన్నంగా నిరపేక్షమైన, విశ్వవ్యాప్త చట్టాలను కలిగి ఉండదు.
  2. రాజనీతిశాస్త్రంలో కొన్ని దృగ్విషయాలను సమయం సందర్భాన్ని బట్టి వివిధ రకాలుగా వ్యాఖ్యానించి అధ్యయనం చేయవచ్చు. అందువల్ల ఈ శాస్త్రం వివిధ భావనల వ్యాఖ్యానాలకు సంబంధించి ఏకరూపతను కలిగి ఉండదు.
  3. అన్ని శాస్త్రాలకు ప్రాతిపదికగా పరిగణించే కార్యకారణ సిద్ధాంతాన్ని ఖచ్చితంగా అనుసరించేందుకు ఈ శాస్త్రం అవకాశమివ్వదు.
  4. రాజనీతిశాస్త్రం పరిణామాత్మక స్వభావాన్ని కలిగి ఉండదు. ఎందుకంటే ఈ శాస్త్రంలోని భావనలు క్రమాను గతంగా నిరంతర ప్రాతిపదికపై రూపొందించబడి అభివృద్ధి చెందలేదు.
  5. రాజనీతిశాస్త్రంలో శాస్త్రీయ పద్ధతులైన పరిశీలన, ప్రయోగాత్మకతలు పాటించబడవు.
  6. రాజనీతిశాస్త్రంలోని వివిధ అధ్యయన అంశాల వివరణలలో సంపూర్ణమైన నిష్పాక్షికత, ప్రత్యేకత గోచరించవు.
  7. రాజనీతిశాస్త్రం ఖచ్చితమైన ఫలితాలకు అవకాశమివ్వదు.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
రాజనీతిశాస్త్ర సాంప్రదాయక నిర్వచనాల గురించి రాయండి.
జవాబు:
సాంప్రదాయకమైన నిర్వచనాలను మూడు ఉప వర్గాలుగా వర్గీకరించారు. వాటిని క్రింది విధంగా పేర్కొనవచ్చు. i) రాజ్యం గురించి అధ్యయనం చేసేదే రాజనీతిశాస్త్రం (Study of the State): రాజనీతి తత్వవేత్తలైన జె.డబ్ల్యు గార్నర్, ఆర్.జి.గెటిల్, అప్పాదొరై మరియు ఇతరులు రాజనీతిశాస్త్రం రాజ్యాన్ని గురించి అధ్యయనం చేస్తుందని
వివరించారు.

  1. జె.డబ్ల్యు. గార్నర్: “రాజనీతిశాస్త్రం రాజ్యంతో ఆరంభమై రాజ్యంతోనే అంతమవుతుంది”.
  2. ఆర్.జి.గెటిల్: “రాజనీతిశాస్త్రమంటే రాజ్యం గతంలో ఎలా ఉండేదో పరిశోధించి, వర్తమాన కాలంలో ఎలా ఉన్నదో విశ్లేషించి, భవిష్యత్ కాలంలో ఎలా ఉండాలి అనే అంశంపై జరిపే రాజకీయ, నైతిక చర్చల సారాంశం”.
  3. అప్పాదొరై: “రాజ్య మనుగడ, అభివృద్ధికి అవసరమైన పరిస్థితుల గురించి అధ్యయనం చేసే శాస్త్రమే” రాజనీతి శాస్త్రం.

AP Inter 1st Year Civics Study Material Chapter 1 రాజనీతిశాస్త్రం, పరిధి-ప్రాముఖ్యత

ii) ప్రభుత్వాన్ని గురించి అధ్యయనం చేసేదే రాజనీతిశాస్త్రం (Study of the Government): రాజనీతి తత్వవేత్తలైన స్టీఫెన్ లీకాక్, జాన్ రిచర్డ్ సీలి, ఇతరులు రాజనీతిశాస్త్రం ప్రభుత్వాన్ని గురించి అధ్యయనం చేస్తుందని తెలిపారు.

  1. స్టీఫెన్ లీకాక్: “రాజనీతిశాస్త్రమంటే ప్రభుత్వం గురించి అధ్యయనం చేసే శాస్త్రం”.
  2. జాన్ రిచర్డ్ సీలీ: “ప్రభుత్వ దృగ్విషయాన్ని గురించి పరిశోధన జరిపే శాస్త్రమే రాజనీతిశాస్త్రం”.

iii) రాజ్యం, ప్రభుత్వం గురించి అధ్యయనం చేసేది (Study of State and Government): రాజనీతి తత్వవేత్తలైన పాల్ జానెట్, ఆర్.ఎన్.గిల్ క్రిస్ట్, డిమాక్, ప్రొఫెసర్ కాట్లిన్, ఇతరులు రాజనీతి శాస్త్రం రాజ్యాన్ని మరియు ప్రభుత్వాన్ని గురించి అధ్యయనం చేసే శాస్త్రంగా తెలియజేసారు.
“ప్రభుత్వాన్ని గురించి వివరిస్తుంది”

  1. పాల్ జానెట్: “రాజనీతిశాస్త్రమంటే రాజ్య మూలాధారాలు, ప్రభుత్వ సూత్రాల గురించి తెలియజేసే సామాజిక శాస్త్రంలోని ఒక విభాగం”.
  2. ఆర్.ఎన్.గిల్ క్రిస్ట్: “రాజ్యం, ప్రభుత్వ సూత్రాలను అధ్యయనం చేసే శాస్త్రమే రాజనీతిశాస్త్రం”.
  3. ప్రొఫెసర్ కాట్లిన్: “ప్రభుత్వాంగాలు, వ్యక్తుల రాజకీయ కార్యకలాపాలను అధ్యయనం చేసే శాస్త్రమే రాజనీతిశాస్త్రం”.

ప్రశ్న 2.
రాజనీతిశాస్త్రపు ఆధునిక నిర్వచనాలు ఏవి ?
జవాబు:
ఆధునిక రాజనీతి శాస్త్రజ్ఞుల దృష్టిలో సాంప్రదాయక నిర్వచనాలు చాలా సంకుచితంగాను, న్యాయ, సంస్థాగత దృక్పథంతో కూడి ఉన్నవని వారి అభిప్రాయం. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత రాజనీతిశాస్త్ర దృష్టి రాజకీయ సంస్థల నుంచి రాజకీయ ప్రక్రియల వైపు మళ్ళింది. ప్రవర్తనావాద దృక్పథం వాడుకలోకి వచ్చింది. దీనివల్ల రాజనీతి శాస్త్ర అధ్యయనంలో పెనుమార్పులు సంభవించాయి. పౌరుల రాజకీయ ప్రవర్తనా అధ్యయన ప్రాముఖ్యత పెరిగింది. ఆధునిక రాజనీతిశాస్త్రజ్ఞులు, రాజనీతిశాస్త్రాన్ని ఒక విధాన శాస్త్రంగా పేర్కొన్నారు. అంతేకాకుండా, రాజనీతిశాస్త్ర అధ్యయనంలో శక్తిని ఒక ముఖ్య అంశంగా వివరించారు.
అవి:
మొత్తానికి ఆధునిక రాజనీతిశాస్త్రజ్ఞులు రాజనీతిశాస్త్ర నిర్వచనాలను రెండు ఉప తరగతులుగా విభజించారు.
i) రాజనీతిశాస్త్రం – శక్తి అధ్యయనం (Study of Power):

  1. లాస్వెల్, కాప్లాన్: “రాజనీతిశాస్త్రం ఒక అనుభవాత్మక శాస్త్రంగా ఉంటూ అధికార రూపకల్పన, అధికారుల భాగస్వామ్యం గురించి అధ్యయనం చేస్తుంది”.
  2. విలియం.ఎ.రాబ్సన్: “రాజనీతిశాస్త్రం ప్రధానంగా సమాజంలో అధికారానికి సంబంధించినది”.

ii) రాజనీతిశాస్త్రం – విలువల పంపకాన్ని అధ్యయనం చేస్తుంది (Study of allocation of values):

  1. డేవిడ్ ఈస్టన్: “రాజనీతిశాస్త్రం సమాజం కోసం విలువలను (వస్తువులను) అధికారయుతంగా పంపిణీ చేయడానికి సంబంధించి అధ్యయనం చేస్తుంది”.
  2. హిల్మన్: “రాజనీతిశాస్త్రం ఎవరు, ఎప్పుడు, ఎక్కడ, ఏమి, ఎలా పొందుతారో అధ్యయనం చేసే శాస్త్రం”.
    పైన పేర్కొన్న ఆధునిక నిర్వచనాలు రాజకీయ’ సంస్థల అధికారాలు, ఇతర కార్యకలాపాలను మూల్యాంకనం చేసే అంశాల అధ్యయనంగా రాజనీతిశాస్త్రాన్ని పరిగణించారని మనం చెప్పవచ్చు.

ప్రశ్న 3.
రాజనీతిశాస్త్ర పరిధిలోని ఏవైనా మూడు అంశాలను పేర్కొనండి.
జవాబు:
రాజనీతిశాస్త్రం – పరిధి:
i) సమాజం, రాజ్యాలతో మానవునికి గల సంబంధాలు అధ్యయనం (Study of Man in relation to the Society and State): మానవుడు సంఘజీవి అని అరిస్టాటిల్ భావించాడు. మానవుడు తన ఆహారం, వస్త్రం, గృహం వంటి ప్రాథమిక అవసరాలను సమాజంలో తీర్చుకొంటాడు. రాజనీతిశాస్త్రం మానవుడికి, సమాజానికి మధ్య గల సంబంధాన్ని వివరిస్తుంది. అంతేకాకుండా సమాజం పుట్టుక, పరిణామం, ఉద్దేశ్యాలను కూడా అది తెలుపుతుంది. మానవుడు సమాజంలో ఏ విధంగా సర్దుబాటు చేసుకొని జీవిస్తాడు అనే అంశాన్ని పరిశీలిస్తుంది. ఈ సందర్భంలో రాజనీతిశాస్త్ర అధ్యయనం వ్యక్తికి, సమాజానికి ఎంతో ప్రాముఖ్యతగలదిగా ‘దిలాన్’ అనే పండితుడు భావించాడు. సమాజం పట్ల ఆధునిక మానవుడు సరైన దృక్పథాన్ని ఏర్పర్చుకోవాల్సిన అవసరం ఉందన్నాడు. సమాజంలో మానవుడు మమేకం అయినప్పుడు మాత్రమే అది సాధ్యపడుతుందని వివరించారు.

AP Inter 1st Year Civics Study Material Chapter 1 రాజనీతిశాస్త్రం, పరిధి-ప్రాముఖ్యత

వ్యక్తులకు, రాజ్యానికి మధ్య సరియైన సంబంధాన్ని నెలకొల్పే ప్రధాన అంశాలపైనే రాజనీతిశాస్త్ర అధ్యయనం కేంద్రీకృతమవుతుంది. రాజ్యంలోని రాజకీయ సంస్థల ప్రాముఖ్యతను వివరించడం ద్వారా అనేక సంక్లిష్ట సమస్యల పరిష్కారానికి ఈ శాస్త్రం దోహదపడుతుంది. ఈ సందర్భంలో అది రాజ్యాధికార పరిమితులు, వ్యక్తి స్వాతంత్ర్యాల అవధులు వంటి అనేక విషయాలను చర్చిస్తుంది.

ii) రాజ్య అధ్యయనం (Study of State): పాలానెట్, బ్లంటి షిల్లీ, గార్నర్ లాంటి రాజనీతిశాస్త్రవేత్తలు రాజనీతిశాస్త్రాన్ని రాజ్యానికి సంబంధించిన అధ్యయన శాస్త్రంగా పరిగణించారు. వారి ప్రకారం, రాజ్యమనేది రాజకీయ సంస్థగా వారు భావించారు. రాజ్యం ప్రతి వ్యక్తికీ అవసరమైనది. రాజ్యానికి, పౌరులకు మధ్యగల సన్నిహిత సంబంధాన్ని రాజనీతిశాస్త్రం తెలుపుతుంది. అలాగే రాజ్య అవతరణ సిద్ధాంతాలను వివరిస్తుంది. అంతేకాకుండా రాజ్యం స్వభావం విధులు, వివిధ రాజ్యాధికార సిద్ధాంతాలను పేర్కొంటుంది. రాజనీతిశాస్త్రం గతంలో రాజ్య అవతరణ అభివృద్ధి గురించి, వర్తమానంలోనూ, భవిష్యత్తులోనూ రాజకీయ సంస్థ, రాజకీయ భావాలను వర్ణించి విశ్లేషించేందుకు దోహదపడుతుందని ఈ సందర్భంలో ఆర్.జి.గెటిల్ పేర్కొన్నాడు.

  • వర్తమానంలో రాజ్యం పరిస్థితి
  • గతంలో రాజ్యపు ఉనికి
  • భవిష్యత్లో రాజ్యం ఎలా ఉండబోతుంది అనే మూడు విషయాల విశ్లేషణలు రాజనీతిశాస్త్రం పరిధిలో ఉంటాయి.

iii) ప్రభుత్వ అధ్యయనం (Study of Government): రాజనీతిశాస్త్ర పరిధిలో ప్రభుత్వం గురించిన అంశాలు ఉంటాయి. స్టీఫెన్ లీకాక్, జాన్ రిచర్డ్ సీలీ లాంటి కొందరు రాజనీతిశాస్త్రవేత్తలు ఈ శాస్త్ర పరిధిని ప్రభుత్వ అధ్యయనానికి పరిమితం చేశారు. వారి ప్రకారం, ఈ శాస్త్రం ప్రభుత్వం గురించి అధ్యయనం చేస్తుంది. ప్రభుత్వమనేది రాజ్యపు ప్రతినిధి అని, ప్రభుత్వం లేకుండా రాజ్యం ఉండదని వారు భావించారు. ప్రభుత్వం ద్వారానే రాజ్య ఆశయాలు నెరవేరతాయి. రాజ్య అభీష్టాన్ని ప్రభుత్వం రూపొందించి, వ్యక్తీకరించి, అమలులో ఉంచుతుంది. కొంతమంది వ్యక్తులు లేదా వ్యక్తుల సముదాయం రాజ్యం తరపున అధికారికంగా ఆజ్ఞలను జారీచేస్తారు. వారినే ప్రభుత్వంగా పరిగణించడమైంది. రాజనీతిశాస్త్రం, ప్రభుత్వానికి గల అర్థం, నిర్మితి, రకాలు స్వభావం, కర్తవ్యాలను అధ్యయనం చేస్తుంది. అలాగే ప్రభుత్వ అంశాల మధ్య సంబంధాన్ని చర్చిస్తుంది. రాజ్యం, ప్రభుత్వాల మధ్య వ్యత్యాసాలను గుర్తిస్తుంది.

ప్రశ్న 4.
ప్రభుత్వానికి సంబంధించి రాజనీతిశాస్త్ర పరిధిని వర్ణించండి.
జవాబు:
రాజనీతిశాస్త్ర పరిధిలో ప్రభుత్వం గురించిన అంశాలు ఉంటాయి. స్టీఫెన్ లీకాక్, జాన్ రిచర్డ్ సీలీ లాంటి కొందరు రాజనీతిశాస్త్రవేత్తలు ఈ శాస్త్ర పరిధిని ప్రభుత్వ అధ్యయనానికి పరిమితం చేశారు. వారి ప్రకారం, ఈ శాస్త్రం ప్రభుత్వం గురించి అధ్యయనం చేస్తుంది. ప్రభుత్వమనేది రాజ్యపు ప్రతినిధి అని, ప్రభుత్వం లేకుండా రాజ్యం ఉండదని వారు భావించారు. ప్రభుత్వం ద్వారానే రాజ్య ఆశయాలు నెరవేరతాయి. రాజ్య అభీష్టాన్ని ప్రభుత్వం రూపొందించి, వ్యక్తీకరించి, అమలులో ఉంచుతుంది. కొంతమంది వ్యక్తులు లేదా వ్యక్తుల సముదాయం రాజ్యం తరపున అధికారికంగా ఆజ్ఞలను జారీచేస్తారు. వారినే ప్రభుత్వంగా పరిగణించడమైంది. రాజనీతిశాస్త్రం, ప్రభుత్వానికి గల అర్థం, నిర్మితి, రకాలు స్వభావం, కర్తవ్యాలను అధ్యయనం చేస్తుంది. అలాగే ప్రభుత్వ అంశాల మధ్య సంబంధాన్ని చర్చిస్తుంది. రాజ్యం, ప్రభుత్వాల మధ్య వ్యత్యాసాలను గుర్తిస్తుంది.

ప్రశ్న 5.
“రాజనీతిశాస్త్రమనేది రాజ్యపు గతం, వర్తమాన, భవిష్యత్ విషయాల అధ్యయనం” విశ్లేషించండి.
జవాబు:
వర్తమానంలో రాజ్యం పరిస్థితి, గతంలో రాజ్యపు ఉనికి మరియు భవిష్యత్లో రాజ్యం ఎలా ఉండబోతుంది అనే మూడు విషయాల విశ్లేషణలు రాజనీతిశాస్త్ర పరిధిలో ఉంటాయి. వాటిని క్రింది విధంగా వివరించవచ్చు.
i) వర్తమానంలో రాజ్యం పరిస్థితి (Study of State in the Present): రాజనీతిశాస్త్రం వర్తమాన కాలంలో రాజ్యం పరిస్థితిని చర్చిస్తుంది. రాజ్యం, అర్థం, స్వభావం, ఉద్దేశ్యం, అభివృద్ధి, పనితీరులను వివరిస్తుంది. అలాగే రాజ్య అవతరణ సిద్ధాంతాలను అధ్యయనం చేస్తుంది. ప్రజాభిప్రాయం, రాజకీయ పార్టీలు, ప్రభావ వర్గాలు ఏ విధంగా రాజకీయ అధికార సాధనకు ప్రభుత్వ విధానాల ప్రభావానికి కృషి చేస్తాయనే విషయాలను తెలుపుతుంది.

ii) గతంలో రాజ్యపు ఉనికి (Study of State in the Past): రాజనీతిశాస్త్రం రాజ్యవ్యవస్థ అవతరణ, దాని పరిణామ క్రమాలను వివరిస్తుంది. అలాగే రాజ్యంలోని వివిధ రాజకీయ సంస్థల గురించి చర్చిస్తుంది. రాజ్య ఆవిర్భావం, వికాసాలను ప్రభావితం చేసిన వివిధ అంశాలను అధ్యయనం చేస్తుంది. ఇటువంటి చారిత్రక అధ్యయనం ఒక్క రాజనీతిశాస్త్రంలోనే సాధ్యమవుతుంది.

AP Inter 1st Year Civics Study Material Chapter 1 రాజనీతిశాస్త్రం, పరిధి-ప్రాముఖ్యత

iii) భవిష్యత్లో రాజ్యం ఎలా ఉంటుంది ? (Study of State in Future): ఆదర్శ రాజ్య సూత్రాలను, భావనలను నిర్ణయించే అంశాలను రాజనీతిశాస్త్రం అధ్యయనం చేస్తుంది. అదే విధంగా, రాజ్య పరిధిలో ఆచరణలో ఉన్న వివిధ రాజకీయ సంస్థలను గురించి చర్చిస్తుంది. మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో భవిష్యత్తులో రాజకీయ సంస్థల ప్రమాణాలను, కార్యకలాపాలను మెరుగుపరచేందుకు అనుసరించాల్సిన మార్గాలను రాజనీతిశాస్త్రం సూచిస్తుంది. మొత్తం మీద రాజనీతిశాస్త్ర పరిధిలో రాజ్య స్వభావం, ఆవిర్భావం, పరిణామం, అభివృద్ధి వంటి అనేక అంశాలు ఉంటాయని చెప్పవచ్చు. అలాగే ఈ శాస్త్రంలో వివిధ రాజ్యావతరణ సిద్ధాంతాలు అధ్యయనం చేయబడతాయి. ప్రాచీన కాలపు పోలీసు రాజ్యం మొదలుకొని ఆధునిక కాలపు సంక్షేమరాజ్యం వరకు గల రాజ్య కార్యకలాపాల అధ్యయనం చేస్తుంది. కాబట్టి రాజనీతిశాస్త్రం రాజ్యపు భూత, వర్తమాన, భవిష్యత్ అంశాలను చర్చిస్తుందని పేర్కొనవచ్చు.

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ప్రాచీన రాజ్యాల గురించి రాయండి. [Mar. ’18, ’17, ’16]
జవాబు:
రాజనీతిశాస్త్రం ప్రాచీన గ్రీకునగర రాజ్యాలలో ఆవిర్భవించిందని రాజనీతిశాస్త్రజ్ఞుల అభిప్రాయం. మొదట గ్రీకు నగరాలు అయిన ఏథెన్స్, కోరింత్, మెసిడోనియా, థేబ్స్, స్పార్టా, మిలాన్ నగరాలలో నాగరికత విరాజిల్లినట్లుగా రాజనీతి శాస్త్రజ్ఞులు వివరించారు. ఈ నగర రాజ్యాలు సార్వభౌమాధికారాన్ని, అవి స్వయం సమృద్ధి, స్వయం ఆధారితలను కలిగి ఉండేవి. ప్రొఫెసర్ కాల్టిన్ వీటిని నగర సమాజాలుగా అభివర్ణించారు. ఈ నగర నివాసితులను మూడు రకాలకు చెందినవారిగా పరిగణించారు. వారికి (1) పౌరులు (2) విదేశీయులు (పరులు) (3) బానిసలుగా పేర్కొన్నారు. వీరిలో పౌరులు నగర రాజ్యాల కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనేవారు.

ప్రశ్న 2.
రాజనీతిశాస్త్ర ఏవైనా రెండు సాంప్రదాయక నిర్వచనాలను పేర్కొనండి.
జవాబు:
సాంప్రదాయకమైన నిర్వచనాలను మూడు ఉప వర్గాలుగా వర్గీకరించారు. వాటిని క్రింది విధంగా పేర్కొనవచ్చు.

  1. రాజ్యం గురించి అధ్యయనం చేసేదే రాజనీతిశాస్త్రం (Study of the State): రాజనీతి తత్వవేత్తలైన జె.డబ్ల్యు గార్నర్, గెటిల్; అప్పాదొరై మరియు ఇతరులు రాజనీతిశాస్త్రం రాజ్యాన్ని గురించి అధ్యయనం చేస్తుందని వివరించారు.
  2. ఆర్.జి.గెటిల్: “రాజనీతిశాస్త్రమంటే రాజ్యం గతంలో ఎలా ఉండేదో పరిశోధించి, వర్తమాన కాలంలో ఎలా ఉన్నదో విశ్లేషించి, భవిష్యత్ కాలంలో ఎలా ఉండాలి అనే అంశంపై జరిపే రాజకీయ, నైతిక చర్చల సారాంశం”.
  3. అప్పాదొరై: “రాజ్య మనుగడ, అభివృద్ధికి అవసరమైన పరిస్థితుల గురించి అధ్యయనం చేసే శాస్త్రమే” రాజనీతిశాస్త్రం.

ii) ప్రభుత్వాన్ని గురించి అధ్యయనం చేసేదే రాజనీతిశాస్త్రం (Study of the Government): రాజనీతి ‘తత్వవేత్తలైన స్టీఫెన్ లీకాక్, జాన్ రిచర్డ్ సీలి, ఇతరులు రాజనీతిశాస్త్రం ప్రభుత్వాన్ని గురించి అధ్యయనం చేస్తుందని తెలిపారు.

  1. స్టీఫెన్ లీకాక్: “రాజనీతిశాస్త్రమంటే ప్రభుత్వం గురించి అధ్యయనం చేసే శాస్త్రం”.
  2. జాన్ రిచర్డ్ సీలీ: “ప్రభుత్వ దృగ్విషయాన్ని గురించి పరిశోధన జరిపే శాస్త్రమే రాజనీతిశాస్త్రం”.

ప్రశ్న 3.
ఏవైనా రెండు రాజనీతి శాస్త్ర ఆధునిక నిర్వచనాలను రాయండి.
జవాబు:
ఆధునిక రాజనీతిశాస్త్రజ్ఞులు రాజనీతిశాస్త్ర నిర్వచనాలను రెండు ఉప తరగతులుగా విభజించారు. అవి:
i) రాజనీతిశాస్త్రం – శక్తి అధ్యయనం (Study of Power):
1. లాస్వెల్, కాప్లాన్: “రాజనీతిశాస్త్రం ఒక అనుభవాత్మక శాస్త్రంగా ఉంటూ అధికార రూపకల్పన, అధికారుల భాగస్వామ్యం గురించి అధ్యయనం చేస్తుంది”.
2. విలియం.ఎ.రాబ్సన్: “రాజనీతిశాస్త్రం ప్రధానంగా సమాజంలో అధికారానికి సంబంధించినది”.

ii) రాజనీతిశాస్త్రం – విలువల పంపకాన్ని అధ్యయనం చేస్తుంది (Study of allocation of values): 1. డేవిడ్ ఈస్టన్: “రాజనీతిశాస్త్రం సమాజం కోసం విలువలను (వస్తువులను) అధికారయుతంగా పంపిణీ చేయడానికి సంబంధించి అధ్యయనం చేస్తుంది”.

AP Inter 1st Year Civics Study Material Chapter 1 రాజనీతిశాస్త్రం, పరిధి-ప్రాముఖ్యత

2. హిల్మన్: “రాజనీతిశాస్త్రం ఎవరు, ఎప్పుడు, ఎక్కడ, ఏమి, ఎలా పొందుతారో అధ్యయనం చేసే శాస్త్రం”. .
పైన పేర్కొన్న ఆధునిక నిర్వచనాలు రాజకీయ సంస్థల అధికారాలు, ఇతర కార్యకలాపాలను మూల్యాంకనం చేసే అంశాల అధ్యయనంగా రాజనీతిశాస్త్రాన్ని పరిగణించారని మనం చెప్పవచ్చు.

ప్రశ్న 4.
రాజనీతిశాస్త్రం ఏ విధంగా ఉత్తమ పౌరసత్వ గుణాలను బోధిస్తుంది ?
జవాబు:
మంచి పౌరసత్వ గుణాల బోధన (Teaching the qualities of good citizenship): రాజనీతి శాస్త్ర అధ్యయనం మంచి పౌరసత్వాన్ని పొందేందుకు, జాతీయ సమైక్యతను సాధించేందుకు ఎంతో అవసరం. ఈ శాస్త్ర అధ్యయనం పౌరులకు జాతీయ ఆశయాలు, లక్ష్యాలను గుర్తుచేస్తుంది. మంచి పౌరుడనేవాడు చట్టాలు ఎలా రూపొందించబడి అమలు చేయబడతాయనే విషయాన్ని తప్పకుండా తెలుసుకోవాలి. రాజనీతిశాస్త్రం మంచి పౌరసత్వపు వివిధ దృక్కోణాలను, ప్రయోజనాలను బోధిస్తుంది. పౌరులను ఆదర్శపౌరులుగా తీర్చిదిద్దేందుకు శిక్షణ ఇస్తుంది. విధేయత, సామాజిక సేవ, నిస్వార్థంలాంటి మంచి పౌరసత్వ గుణాలను పెంపొందిస్తుంది. పౌరులు సమాజం, రాజ్యం పట్ల బాధ్యత కలిగి ఉండాల్సిన అవసరాన్ని తెలుపుతుంది. మొత్తం మీద వ్యక్తుల మూర్తిమత్వాన్ని పెంపొందిస్తుంది.

ప్రశ్న 5.
రాజనీతిశాస్త్రం ఒక కళయని ప్రకటించడాన్ని సమర్థించండి.
జవాబు:
రాజనీతి శాస్త్రం ఒక కళా ? (Is Political Science an Art ?): రాజనీతిశాస్త్రాన్ని క్రింది అంశాలను బట్టి ఒక కళగా భావించవచ్చు.

  1. రాజనీతిశాస్త్రం, భౌతికశాస్త్రాలకు భిన్నంగా నిరపేక్షమైన, విశ్వవ్యాప్త చట్టాలను కలిగి ఉండదు.
  2. రాజనీతిశాస్త్రంలో కొన్ని దృగ్విషయాలను సమయం సందర్భాన్ని బట్టి వివిధ రకాలుగా వ్యాఖ్యానించి అధ్యయనం చేయవచ్చు. అందువల్ల ఈ శాస్త్రం వివిధ భావనల వ్యాఖ్యానాలకు సంబంధించి ఏకరూపతను కలిగి ఉండదు.
  3. అన్ని శాస్త్రాలకు ప్రాతిపదికగా పరిగణించే కార్యకారణ సిద్ధాంతాన్ని ఖచ్చితంగా అనుసరించేందుకు ఈ శాస్త్రం అవకాశమివ్వదు.
  4. రాజనీతిశాస్త్రం పరిణామాత్మక స్వభావాన్ని కలిగి ఉండదు. ఎందుకంటే ఈ శాస్త్రంలోని భావనలు క్రమానుగతంగా నిరంతర ప్రాతిపదికపై రూపొందించబడి అభివృద్ధి చెందలేదు.
  5. రాజనీతిశాస్త్రంలో శాస్త్రీయ పద్ధతులైన పరిశీలన, ప్రయోగాత్మకతలు పాటించబడవు.
  6. రాజనీతిశాస్త్రంలోని వివిధ అధ్యయన అంశాల వివరణలలో సంపూర్ణమైన నిష్పాక్షికత, ప్రత్యేకత గోచరించవు.
  7. రాజనీతిశాస్త్రం ఖచ్చితమైన ఫలితాలకు అవకాశమివ్వదు.

ప్రశ్న 6.
ఏ అంశాల ప్రాతిపదికగా రాజనీతిశాస్త్రాన్ని ఒక శాస్త్రంగా పరిగణించవచ్చు ?
జవాబు:
రాజనీతిశాస్త్రం ఒక శాస్త్రమా ? (Is Political Science a Science ?): రాజనీతిశాస్త్రాన్ని క్రింది అంశాల ప్రాతిపదికగా పరిగణించవచ్చు.

  1. రాజనీతిశాస్త్రాన్ని ఒక క్రమ పద్ధతిలో అధ్యయనం చేయవచ్చు.
  2. రాజకీయాలలో ప్రయోగాత్మకతకు అవకాశం ఉంది.
  3. ఇతర సామాజిక శాస్త్రాల వలె నిరపేక్షమైన, విశ్వవ్యాప్తమైన చట్టాలను కలిగి ఉంటుంది.
  4. రాజకీయాలలో అంచనాలను సులభంగా వర్తింపచేయవచ్చు.
  5. రాజనీతిశాస్త్ర అధ్యయనంలో నిర్దిష్టమైన సార్వత్రిక ఆమోదిత సూత్రాలను పొందుపరచవచ్చు.
  6. రాజనీతిశాస్త్రం శాస్త్రీయ స్వభావాన్ని కలిగి ఉంటుంది. అందువల్ల ఈ శాస్త్ర అధ్యయనంలో శాస్త్రీయమైన సూత్రాలను పొందుపరచటం జరిగింది.
  7. రాజనీతిశాస్త్రం ఇతర శాస్త్రాల వలె కార్యకారణ సంబంధాన్ని అమలు చేసేందుకు అవకాశమిస్తుంది.

AP Inter 1st Year Civics Study Material Chapter 1 రాజనీతిశాస్త్రం, పరిధి-ప్రాముఖ్యత

ప్రశ్న 7.
రాజనీతిశాస్త్ర పరిధిలో ఏవైనా నాలుగు విషయాలను తెలపండి.
జవాబు:

  1. రాజ్య అధ్యయనం
  2. ప్రభుత్వ అధ్యయనం
  3. సంఘాలు, సంస్థల అధ్యయనం
  4. హక్కులు, బాధ్యతల అధ్యయనం

ప్రశ్న 8.
రాజనీతిశాస్త్రం ఏ విధంగా ప్రభుత్వ అధ్యయనశాస్త్రంగా పరిగణించబడింది ?
జవాబు:
స్టీఫెన్ లీకాక్, జె.ఆర్.సీలి లాంటి ప్రముఖ రాజనీతిశాస్త్రవేత్తలు రాజనీతిశాస్త్రం ప్రభుత్వం గురించి అధ్యయనం చేసేదని పేర్కొన్నారు. ప్రభుత్వమనేది రాజ్యపు ప్రతినిధి అని, ప్రభుత్వం లేకుండా రాజ్యం ఉండదని వారు భావించారు. ప్రభుత్వం ద్వారానే రాజ్య ఆశయాలు నెరవేరుతాయి. రాజ్య అభీష్టాన్ని ప్రభుత్వం రూపొందించి, వ్యక్తీకరించి అమలులో ఉంచుతుంది.

AP Inter 2nd Year Civics Study Material Chapter 13 ఆంధ్రప్రదేశ్, ఇండియాలలో ఇటీవలి పరిణామాలు

Andhra Pradesh BIEAP AP Inter 2nd Year Civics Study Material 13th Lesson ఆంధ్రప్రదేశ్, ఇండియాలలో ఇటీవలి పరిణామాలు Textbook Questions and Answers.

AP Inter 2nd Year Civics Study Material 13th Lesson ఆంధ్రప్రదేశ్, ఇండియాలలో ఇటీవలి పరిణామాలు

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆవిర్భావాన్ని వర్ణించండి.
జవాబు:
ఆంధ్రులంతా ఒక్క రాష్ట్రంగా ఏర్పడాలన్న భావన కొత్తదేమీ కాదు. 1938లో ఉస్మానియా విశ్వవిద్యాలయ స్నాతకోపన్యాసానికి ఆహ్వానితుడై వచ్చిన సర్ కట్టమంచి రామలింగారెడ్డి గారు తెలుగు మాట్లాడే ప్రజలంతా ఒక్క రాష్ట్రంలో మనుగడ సాగించే పరిస్థితులేర్పడితే బాగుంటుందని ప్రస్తావించారు. ఆ తరువాత ఆచార్య మామిడిపూడి వెంకటరంగయ్య గారు ఒక రచనలో మద్రాసు ఆంధ్రులూ, నిజాం ఆంధ్రులూ ఒక్కటై బాధ్యతాయుత పాలన ఏర్పరిస్తే బాగుంటుందని అభిప్రాయపడినారు.

1) కమ్యూనిస్టు పార్టీ పాత్ర: ఈ భావాలకు వ్యక్తరూపాన్నిచ్చిన ఘనత ఆంధ్ర కమ్యూనిస్టులది. 1946లోనే విశాలాంధ్ర వాదాన్ని పైకి తెచ్చింది ఆంధ్ర కమ్యూనిస్టు పార్టీయే. 1952లో జరిగిన సాధారణ ఎన్నికల్లో అటు ఆంధ్రలోనూ, ఇటు తెలంగాణలోనూ కమ్యూనిస్టులు ఘనవిజయం సాధించారు. వారి ఎన్నికల నినాదంలో విశాలాంధ్ర కూడా ఒక. అంశం వారు ప్రత్యేకంగా “విశాలాంధ్ర” పత్రికను నడిపి ప్రజల్లో ముమ్మరమైన ప్రచారం కూడా చేశారు. 1953లో అక్టోబర్ మొదటి తేదీనాడు ఆంధ్ర రాష్ట్ర అవతరణ జరగటంతో ఇటు ఆంధ్ర ప్రాంతంలోనూ, అటు తెలంగాణా ప్రాంతంలోనూ విశాలాంధ్ర స్థాపన దిశగా రాజకీయాలు నడిచాయి.

2) ప్రధమ విశాలాంధ్ర మహాసభ: 1949 నవంబరు, 26న శ్రీ అయ్యదేవర కాళేశ్వరరావు నాయకత్వంలో విజయవాడలో విశాలాంధ్ర మహాసభ జరిగెను.

3) రెండవ విశాలాంధ్ర మహాసభ: 1954 జూన్ 13, 14 తేదీలలో శ్రీశ్రీ అధ్యక్షతన రెండవ విశాలాంధ్ర మహాసభ హైదరాబాద్లో జరిగెను.

4) ఫజల్ అలీ కమీషన్: ప్రత్యేకాంధ్ర రాష్ట్రం ఏర్పాటు కావడంతో కేరళులు, కర్ణాటకులు ప్రత్యేక రాష్ట్రాలు కావాలని అందోళన చేయసాగారు. వారి జతకు మహారాష్ట్రులు కూడా కలిశారు. దక్షిణ భారతంలో కాంగ్రెస్ పార్టీ నిలబడాలంటే భాషా ప్రాతిపదికన రాష్ట్రాల నిర్మాణం అనివార్యమని ప్రధానమంత్రి నెహ్రూకు ఎన్.వి. గాద్గిల్ సలహా ఇచ్చారు. ఈ నేపధ్యంలో 22 డిసెంబర్ 1953 నాడు ఫజల్ ఆలీ నేతృత్వంలో రాష్ట్రాల పునర్నిర్మాణ సంఘాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ కమీషన్లో ఇతర సభ్యులు పండిట్ హృదయనాధ కుంజూ, సర్దార్ కె.ఎం.ఫణిక్కర్, కమిటీ తన నివేదికను 30 సెప్టెంబర్ 1955 నాడు కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది.

AP Inter 2nd Year Civics Study Material Chapter 13 ఆంధ్రప్రదేశ్, ఇండియాలలో ఇటీవలి పరిణామాలు

ఈ నివేదికలో విశాలాంధ్రను ఏర్పాటు చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను, ఆ విధంగానే ప్రత్యేక తెలంగాణా ఏర్పాటుకు అనుకూల వాదాలను కూడా కూలంకుషంగా పరిశీలించింది. సదరు అనుకూల ప్రతికూల వాదాలను ప్రస్తావించి పూర్వం ఆంధ్ర, రాయలసీమ నాయకుల మధ్య శ్రీ భాగ్ ఒప్పందం లాంటిది కుదుర్చుకొని, తెలంగాణ ప్రాంతం అభివృద్ధికి గానీ, ఉద్యోగావకాశాలకు హాని కలిగించని రీతిలో తగిన పరిరక్షణలను కల్పించి విశాలాంధ్రను ఏర్పాటు చేసుకోవచ్చని కమీషన్ సూచించింది. అలాగే ఆంధ్రరాష్ట్రంతో ఏకం కావడానికి 1952లో ఎన్నికైన తెలంగాణా రాష్ట్ర శాసన సభ్యులు 2/3 మెజారిటీతో ఆ మేరకు తీర్మానాన్ని ఆమోదిస్తే విశాలాంధ్రను ఏర్పాటు చేసుకోవచ్చు.

5) పెద్ద మనుషుల ఒప్పందం: ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు మూలంగా తెలంగాణా ప్రయోజనాలకు భంగం కలుగుతుందేమోననే అనుమాలను నివారించడానికి పెద్ద మనుషుల ఒప్పందం 1956 ఫిబ్రవరి 20న ఢిల్లీలో జరిగింది.

ఆంధ్రరాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ బెజవాడ గోపాలరెడ్డి, అతని మంత్రి మండలి సహచరులు సర్వ శ్రీ నీలం సంజీవరెడ్డి, గౌతు లచ్చన్న, ఎ.పి.సి.సి. అధ్యక్షుడు అలూరి సత్యనారాయణ రాజు సమావేశానికి హాజరైనవారు.

హైదరాబాదు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ బూర్గుల రామకృష్ణారావు, అతని మంత్రి మండలి సహచరులు. సర్వ శ్రీ కొండా వెంకటరంగారెడ్డి, డా॥ మర్రి చెన్నారెడ్డి, హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు జె.వి నర్సింగరావు వీరు ఒప్పందంపై సంతకాలు చేశారు.

ఒప్పందంలోని అంశాలు:
1) రాష్ట్రానికి సంబంధించిన కేంద్ర, సాధారణ పరిపాలన వ్యయం ఆంధ్ర తెలంగాణా నిష్పత్తి ప్రకారం భరించాలి. తెలంగాణాలో మిగులు, ఆ ప్రాంతపు అభివృద్ధికి కేటాయించాలి. అయిదేళ్ల దాకా ఈ ఏర్పాటు ఉండాలి. అటు తరువాత, తెలంగాణా శాసన సభ్యుల కోరికపై మరో అయిదేళ్లు పొడిగించవచ్చు.

2) తెలంగాణలో ఉన్న విద్యా సౌకర్యాలు తెలంగాణా వారికే లభింపజేసి ఇంకా అభివృద్ధి చేయాలి. లేకపోతే మొత్తం రాష్ట్రంలో సాంకేతిక విద్యతో సహా అన్ని విద్యాలయాల్లోను మూడోవంతు తెలంగాణా విద్యార్థులకు కేటాయించాలి.

3) ముందు రాబోయే ఉద్యోగాలు ఉభయ ప్రాంతాల జనాభా ప్రాతిపదిక మీద ఉండాలి.

4) తెలంగాణలో నిష్పత్తి ప్రకారం నిర్ణయించిన ఉద్యోగాల్లో ప్రవేశించడానికి అభ్యర్థులు ఆ ప్రాంతంలో 12 సంవత్సరాల నివాసం ఉండాలి.

5) తెలంగాణా సర్వతోముఖాభివృద్ధి సాధించడానికి ఒక ప్రాంతీయ మండలి ఉండాలి.

6) మంత్రివర్గంలో ఆంధ్ర ప్రాంతం నుంచి 60% తెలంగాణా ప్రాంతం నుంచి 40% ఉండాలి. తెలంగాణా భాగంలో ఒక ముస్లిం కూడా ఉండాలి.

7) ముఖ్యమంత్రి ఆంధ్ర ప్రాంతం వాడైతే ఉపముఖ్యమంత్రి తెలంగాణా వ్యక్తి అయి ఉండాలి. ముఖ్యమంత్రి తెలంగాణా ప్రాంతం వాడైతే ఉపముఖ్యమంత్రి ఆంధ్ర ప్రాంతంవాడై ఉండాలి. హోం, ఫైనాన్స్, రెవెన్యూ, ప్లానింగ్, డెవలప్మెంట్, వాణిజ్య పరిశ్రమల శాఖల్లో కనీసం రెండైనా తెలంగాణా వారికివ్వాలి.

పెద్ద మనుషుల ఒప్పందం కుదరడంతో విశాలాంధ్ర ఏర్పాటు సుగమమైంది. 1956 మార్చి 16వ తేదీన పార్లమెంటు ఉభయసభల్లో రాష్ట్రాల పునర్నిర్మాణ బిల్లును ప్రతిపాదించడమైంది.

  • 1956 ఏప్రిల్ 5న ఆంధ్ర శాసనసభలో సదరు బిల్లుపై తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. శాసనసభ కొన్ని సవరణలతో తీర్మానాన్ని ఆమోదించింది.
    1. రాష్ట్రం పేరు ఆంధ్రప్రదేశ్ అని వుండాలి.
    2. రాజధాని మరియు హైకోర్టు హైదరాబాద్లో నే వుండాలి.
    3. ఆంధ్రప్రదేశ్ అంతటికీ 1962లోనే సాధారణ ఎన్నికలు జరగాలి.
    4. 72 మంది సభ్యులతో కూడిన విధాన పరిషత్ ఏర్పాటుకావాలి.
  • 1956 ఏప్రిల్ 13న హైదరాబాదు రాష్ట్ర శాసనసభ రాష్ట్రాల పునర్నిర్మాణ బిల్లును ఆమోదించింది.
  • 1956 ఆగష్టు 25న రాజ్యసభ బిల్లును ఆమోదించింది. అటు తరువాత లోక్సభ కూడా ఆమోదించింది. + 1956 ఆగష్టు 31న బిల్లుపై రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు.
  • 1956 నవంబర్ 1న అక్షర క్రమంలో మొదటిది భాషా రాష్ట్రాల్లో కూడా మొదటిదై ఆంధ్రప్రదేశ్ దీపావళి పర్వదినాన అవతరించింది. నాటి గవర్నర్ సి.ఎం. త్రివేది, ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డిలు వ్యవహరించారు.

ప్రశ్న 2.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు దారి తీసిన కారణాలను పరిశీలించండి.
జవాబు:
2000 సంవత్సరంలో చత్తీస్ ఘడ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ఏర్పాటుతో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం మళ్ళీ తెరపైకి వచ్చింది. ఈ సారి తెలంగాణ రాష్ట్ర సమితి (Telangana Rastra Samithi – T.R.S) ఆధ్వర్యంలో రాజకీయ ఉద్యమం కొనసాగింది. ఆంధ్రప్రదేశ్ అనేది భారతదేశంలో మొట్టమొదటి భాషాప్రయుక్త రాష్ట్రమనే విషయాన్ని మనం ఈ సందర్భంలో గుర్తుంచుకోవాలి. ఐతే ఆంధ్రప్రదేశ్ ఏర్పడి 57 సంవత్సరాలు పూర్తి అయినప్పటికీ ఒకే భాష (తెలుగు) రాష్ట్ర ప్రజలందరినీ కలిపి ఉంచడంలో విఫలమైందని చెప్పవచ్చు.

తెలంగాణ ఉద్యమానికి ఒక్క ఆర్థికంగా వెనుకబాటుతనమే ప్రధాన ఇతివృత్తం కాదు. దాంతోబాటుగా నీటి వనరులు, ఆర్థిక వనరుల పంపిణీ, ఉపాధి అవకాశాలు, సాంస్కృతిక వికాసం మొదలైన అనేక అంశాలలో తెలంగాణ ప్రాంతం వివక్షకు గురి అయిందని ఆ ప్రాంత నాయకులు భావించడం జరిగింది. అయితే అటువంటి అంశాలు వాదోపవాదనలతో కూడినవిగా కొందరు పేర్కొన్నారు. అయితే ఒకసారి ప్రజానీకంలో కొన్ని వర్గాలలో అసౌకర్యం, అనుమానం ఏర్పడి అధికమైతే ఇతర ప్రాంతాల ప్రజలతో కలిసిమెలిసి జీవనం సాగించడం సాధ్యం కాదని చెప్పవచ్చు.

2009 డిసెంబర్లో తెలంగాణ ఉద్యమం తీవ్రం అయిన సమయంలో దేశీయ వ్యవహారాల శాఖమంత్రి చిదంబరం తెలంగాణ విషయంలో కేంద్రం ఎంతో శ్రద్ధను ప్రదర్శిస్తున్నట్లుగా ప్రకటించాడు. అందులో భాగంగా 2010 ఫిబ్రవరి మూడో తేదీన భారత ప్రభుత్వం న్యాయమూర్తి బి.ఎన్.శ్రీకృష్ణ ఆధ్వర్యంలో ఒక సంఘాన్ని నియమించి తెలంగాణ విషయంలోనూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ రాజకీయ పరిస్థితిని అధ్యయనం చేయాల్సిందిగా కోరింది. ఆ సంఘం రెండు ప్రధాన అంశాలను విస్తృతంగా పరిశీలించింది. అవి 1) తెలంగాణ ప్రాంతానికి ప్రత్యేక రాష్ట్ర హోదా కావాలని డిమాండ్ చేయడం. 2) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని యథావిధంగా కొనసాగించడం. శ్రీకృష్ణ సంఘం తన నివేదికను 2010 డిసెంబరు 30వ తేదీన దేశీయ వ్యవహారాల శాఖకు సమర్పించింది.

తెలంగాణ నాయకులు శ్రీకృష్ణ సంఘం నివేదికను తిరస్కరించారు. హైదరాబాద్ రాజధానిగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రాంతంలో సమ్మెలు, నిరాహార దీక్షలు, ఆత్మహత్యలు విజ్ఞప్తులను అందించడం, ప్రభుత్వ అధికారులకు గులాబీపూల బహుకరణ, ప్రభుత్వ ఉత్సవాల బహిష్కరణ వంటి చర్యలకు ఆందోళనకారులు పాల్పడ్డారు. దాంతో పరిస్థితి తీవ్రతను గమనించి భారత ప్రభుత్వం 2013 జూలై 30వ తేదీన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ప్రకటించింది. తదుపరి 2014 ఫిబ్రవరిలో పార్లమెంటు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ |బిల్లును తీవ్ర గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో ఆమోదించింది. దాంతో సీమాంధ్ర ప్రాంతం అట్టుడిగిపోయింది. పార్లమెంటు ఆమోదించిన పై బిల్లు రాష్ట్రపతి 2014 మార్చి ఒకటో తేదీన సంతకం చేశారు. తెలంగాణ భారతదేశంలో 29వ రాష్ట్రంగా 2014 జూన్ రెండో తేదీన ఆవిర్భవించింది.

AP Inter 2nd Year Civics Study Material Chapter 13 ఆంధ్రప్రదేశ్, ఇండియాలలో ఇటీవలి పరిణామాలు

ప్రశ్న 3.
మానవ హక్కులంటే ఏమిటో నిర్వచించి, భారతదేశంలో జాతీయ మానవ హక్కుల సంఘం నిర్మాణాన్ని వర్ణించండి.
జవాబు:
మానవ హక్కుల నిర్వచనం: మానవ హక్కుల పరిరక్షణ చట్టం, 1993, రెండో సెక్షన్ (d) మానవ హక్కులను క్రింది విధంగా నిర్వచించింది.

“మానవ హక్కులు అనేవి వ్యక్తి జీవనం, స్వేచ్ఛ, సమానత్వం, హోదాలకు సంబంధించినవి. రాజ్యాంగం చేత హామీ ఇవ్వబడిన అంతర్జాతీయ చట్టాలు, భారతదేశ న్యాయస్థానాల చర్యల ద్వారా అమలవుతాయి.”

జాతీయ మానవ హక్కుల సంఘం నిర్మాణం: జాతీయ మానవ హక్కుల సంఘం అనేది బహుళసభ్య సంస్థ. ఆ సంస్థ నియమావళి సభ్యుల అర్హతలు, నియామకం గురించి పేర్కొన్నది. ఆ సంస్థకు సంబంధించిన సెక్షన్ 3 ప్రకారం క్రింది పట్టికలో సూచించిన సభ్యులు ఉంటారు.
AP Inter 2nd Year Civics Study Material Chapter 13 ఆంధ్రప్రదేశ్, ఇండియాలలో ఇటీవలి పరిణామాలు 1

దీనిలో నలుగురు సభ్యులు ఉంటారు. దీనికి సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి అధ్యక్షత వహిస్తాడు. దీనిలో సభ్యులుగా సుప్రీం కోర్టు ప్రస్తుత లేదా మాజీ న్యాయమూర్తి, హైకోర్టు ప్రస్తుత న్యాయమూర్తి లేదా మాజీ ప్రధాన న్యాయమూర్తితో పాటుగా మానవ హక్కుల కార్యకలాపాలకు సంబంధించిన ఇద్దరు వ్యక్తులు సభ్యులుగా ఉంటారు. ఈ కమీషన్ ఛైర్మన్, సభ్యులను భారత రాష్ట్రపతి నియమిస్తారు. ఈ విషయంలో అతడు కేంద్ర హోంమంత్రి, లోక్సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్, పార్లమెంటు ఉభయసభలలోని ప్రతిపక్ష నేతలను సంప్రదిస్తారు. ఛైర్మన్, సభ్యులు ఐదేళ్ళ పాటు లేదా 70 ఏళ్ళు నిండేవరకు వారి పదవులలో కొనసాగుతారు. ఈ కమీషన్లో జాతీయ షెడ్యూల్డ్ కులాల, షెడ్యూల్డ్ తెగల, మైనారిటీల, మహిళల కమీషన్లకు సంబంధించిన ఛైర్మన్లు పదవిరీత్యా సభ్యులుగా ఉంటారు. ఈ కమీషన్ సాధారణ కార్యదర్శిగా కేంద్ర ప్రభుత్వంలో సెక్రటరీ జనరల్ హోదా గల అధికారి వ్యవహరిస్తాడు.

విధులు: జాతీయ మానవ హక్కుల కమీషన్ కింద పేర్కొన్న ముఖ్య విధులను నిర్వహిస్తోంది.

  1. ప్రభుత్వాధికారులు మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడినట్లు ఆరోపణలు వస్తే, వాటిపై జాతీయ మానవ హక్కుల కమీషన్ విచారణ జరిపిస్తుంది.
  2. న్యాయస్థానాలు అనుమతించినమేరకు మానవ హక్కుల ఉల్లంఘన ఉదంతాలపై విచారణ జరుపుతుంది.
  3. మానవ హక్కుల అమలుకు సంబంధించిన వివిధ చట్టబద్ధమైన చర్యలను సమీక్షిస్తుంది.
  4. మానవ హక్కులకు భంగం కలిగించే టెర్రరిస్టుల కార్యకలాపాలను నివారించేందుకై సలహాలు ఇస్తుంది.
  5. మానవ హక్కులకు సంబంధించిన విషయాలపై పరిశోధనలను కొనసాగిస్తుంది.
  6. మానవ హక్కుల పట్ల ప్రజలలో అవగాహనను పెంపొందించేందుకై తగిన చర్యలను తీసుకొంటుంది.
  7. మానవ హక్కులను పరిరక్షించే స్వచ్ఛంద సంస్థలకు తగిన ప్రోత్సాహకాలను అందిస్తుంది.

ప్రశ్న 4.
సమాచార హక్కు చట్టం గురించి వివరించండి.
జవాబు:
సమాచార హక్కు చట్టం 2005 పార్లమెంటు ద్వారా ఆమోదించబడి అమలులోకి వచ్చింది. ఈ చట్టం ద్వారా ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఏ సంస్థ నుండి అయినా సమాచారాన్ని కోరే హక్కు ప్రతి భారతీయుడికి కల్పించింది. ఈ చట్టం జమ్మూకాశ్మీర్ రాష్ట్రం మినహా యావత్ భారతదేశానికి వర్తిస్తుంది.

ఈ చట్టం ద్వారా పౌరులు ప్రభుత్వ డాక్యుమెంటులు, ఉత్తర్వులు, నివేదికలు, మెమోలు మొదలగు వాటికి సంబంధించిన సమాచారాన్ని పొందవచ్చు.

సమాచారం పొందగోరే వారు సంబంధిత సమాచార అధికారికి లిఖిత పూర్వకంగా ఆర్జీ పెట్టుకొని 10 రుసుము చెల్లించవలెను. దారిద్ర్య రేఖకు దిగువున ఉన్నవారు ఎట్టి రుసుము చెల్లించనవసరము లేదు. 30 రోజుల లోపు సమాధానము ఇవ్వాలి.

ప్రభుత్వ సమాచార అధికారులు: ప్రతి పాలనా విభాగంలో ఒక ప్రభుత్వ సమాచార అధికారిని ప్రభుత్వం నియమిస్తుంది. ఈ అధికారి పౌరులడిగిన సమాచారాన్ని అందించాలి. సాధారణ సమాచారం అయితే ముప్పది రోజుల లోపల సమాధానం ఇవ్వాలి. అదే వ్యక్తి ప్రాణానికి, స్వేచ్ఛకు సంబంధించిన సమాచారం అయితే 48 గంటల లోపు సమాధానం ఇవ్వాలి. సమాచారాన్ని తిరస్కరిస్తే దానికి తగు కారణాలను పేర్కొనాలి.

సమాచార హక్కు చట్టం మినహాయింపులు: దేశ సమగ్రతకు, సార్వభౌమాధికారానికి సంబంధించిన అంశాలు (రక్షణ, అణుశాస్త్రీయ) సమాచార హక్కు చట్టం నుండి మినహాయింపబడినాయి. కేంద్ర, రాష్ట్రమంత్రి వర్గాల నిర్ణయాలు పార్లమెంటు, రాష్ట్ర శాసనసభల హక్కులకు భంగం కల్గించే అంశాలు కూడా మినహాయింపబడినాయి.
ఇదిగాక పెక్కు సంస్థలు చట్ట పరిధి నుండి మినహాయించబడ్డాయి. అవి ఏమనగా: IBR మరియు AW, Direc- torate of Revenue Intelligence, Aviation Research Centre, BSF, CRPF, Assam Riffles, Special Branch CID, మున్నగునవి. కాని ఈ సంస్థలు అవినీతి చర్యలకు పాల్పడ్డా, మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డా సమాచారం కోరే హక్కు ఉంది.

సమాచార కమీషన్లు: సంబంధిత సమాచార అధికార ఫిర్యాదుదారునికి సరియైన సమాచారాన్ని సకాలంలో ఇవ్వకపోయినా, ఎక్కువ రుసుము వసూలు చేసినా, మరే విధంగానైనా ఇబ్బంది కల్గచేసినా అప్పీలు చేసుకోవటానికి సమాచార హక్కు చట్టం కేంద్ర స్థాయిలో కేంద్ర సమాచార కమీషను, రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర సమాచార కమీషన్ న్ను ఏర్పాటు చేసింది.

కేంద్ర సమాచార కమీషన్: ఈ కమీషన్లో ఒక ముఖ్య సమాచార కమీషనర్, 10 మందికి మించని సమాచార కమీషనర్లు ఉంటారు. వీరిని రాష్ట్రపతి నియమిస్తాడు. వీరి పదవీకాలం 5 సం॥లు లేక 65 సం॥ వయోపరిమితి. రాష్ట్ర సమాచార కమీషన్: ఈ కమీషన్లో ఒక ముఖ్య సమాచార కమీషనర్ పది మంది మించని సమాచార కమీషనర్లు ఉంటారు. వీరిని గవర్నరు నియమిస్తారు. వీరి పదవీకాలం 5 సం॥లు లేక 68 సం॥లు వయోపరిమితి. కేంద్ర, రాష్ట్ర సమాచార కమీషన్ల నిర్ణయమేతుది తీర్పు, ఈ తీర్పులపై ఎవ్వరికి అప్పీలు చేసుకొనే అధికారం లేదు. కాని రాజ్యాంగం ద్వారా అధికారాలు కల్గిన హైకోర్టు ఈ కమీషన్ల తీర్పులపై రిట్ల ద్వారా ఫిర్యాదుదారునికి మేలు చేకూర్చవచ్చు.

AP Inter 2nd Year Civics Study Material Chapter 13 ఆంధ్రప్రదేశ్, ఇండియాలలో ఇటీవలి పరిణామాలు

కేంద్ర సమాచార కమీషన్ మరియు రాష్ట్ర సమాచార కమీషన్ ఇచ్చే తీర్పులు సాధారణ న్యాయస్థానాలతో సమానమైనవి.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ఆంధ్రరాష్ట్ర అవతరణ గురించి వర్ణించండి. [Mar. ’16]
జవాబు:
ప్రత్యేకాంధ్ర రాష్ట్ర వాంఛ: ఒకవైపు వందేమాతరం స్వదేశీ ఉద్యమం, దేశవ్యాప్తంగా పుంజుకొంటూ ఉండగా మచిలీపట్నంలో భోగరాజు పట్టాభి సీతారామయ్య పంతులుగారు, ముట్నూరి కృష్ణారావు పంతులుగారు, కొండా వెంకటప్పయ్య పంతులుగారు, టంగుటూరి ప్రకాశం పంతులుగారు సమావేశమై ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణా
ప్రాంతాలను ఏకం చేసి సంయుక్త ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటును గురించి ఆలోచించసాగారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో 58% తెలుగు ప్రాంతాలుండి 40% తెలుగు జనాభా ఉండి కూడా తెలుగు వారు వెనుకబడి ఉండడం వారిని రోషపూరితుల్ని చేసేది. ఆ తరువాత, 1912లో నిడదవోలులో గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల సంయుక్త సమావేశం ఒకటి జరిగింది. ఆ సమావేశానికి కీ.శే. వేమనరపు రామదాసు పంతులుగారు అధ్యక్షత వహించారు.

1. ప్రధమాంద్ర మహాసభ, బాపట్ల 1913: ఆంధ్రరాష్ట్ర నిర్మాణ సమస్యపై ప్రధమాంధ్ర మహాసభ 1913లో గుంటూరు జిల్లా, బాపట్లలో శ్రీ బి.ఎన్. శర్మగారి అధ్యక్షతన జరిగింది. ఆ మహాసభకు మొత్తం 800 మంది ప్రతినిధులు, 2000 మంది ప్రేక్షకులు హాజరయ్యారు.

2. ద్వితీయాంధ్ర మహాసభ, విజయవాడ 1914: రెండో ఆంధ్ర మహాసభ 1914లో విజయవాడలో ఏప్రిల్ 11న జరిగింది. ఈ సభకు న్యాపతి సుబ్బారావుగారు అధ్యక్షత వహించారు. ఈ సభకు విజయవాడకు చెందిన శ్రీ అయ్యదేవర కాళేశ్వరరావు గారు నిర్వహకులుగా వ్యవహరించారు. సుమారు 1600 మంది ప్రతినిధులు ఈ సభకు హజరయ్యారు.

3. తృతీయాంధ్ర మహాసభ, విశాఖపట్నం 1915: మూడో ఆంధ్ర మహాసభ విశాఖపట్నంలో 1915 మే నెలలో జరిగింది. ఈ సభకు పానగల్లు రాజారామారాయణింగారు అధ్యక్షత వహించారు. ఈ సభ రెండు తీర్మానాలు చేసింది.

  1. ప్రత్యేకాంధ్ర రాష్ట్రం అత్యవసరం.
  2. సెకండరీ స్కూలు స్థాయిలో మాతృభాషలోనే బోధన జరగాలి.

1920లో నాగపూర్లో జరిగిన కాంగ్రెస్ మహాసభ భాషా రాష్ట్రాల సిద్ధాంతాన్ని అంగీకరిస్తున్నట్లు అధికారికంగా ఒక ప్రకటన చేసింది. దానికి నాందిగా మొత్తం 21 భాషలను గుర్తించి, ఆ ప్రాతిపదికనే ప్రత్యేక ప్రదేశ్ కాంగ్రెస్లను ఏర్పాటుచేసింది.

మాంటేగ్ – ఛెమ్స్ఫర్డ్ నివేదిక ఆధారంగా భారత కౌన్సిల్ చట్టం 1919ని బ్రిటిష్ పార్లమెంటు ఆమోదించింది. చట్టంలోని 52 (ఎ) ప్రకరణం రాష్ట్ర శాసనసభల్లో అత్యధిక సంఖ్యాకులు ప్రత్యేక రాష్ట్ర నిర్మాణాన్ని అంగీకరిస్తూ తీర్మానించినట్లయితే ప్రభుత్వం అందుకు సమ్మతించవచ్చు అని పేర్కొన్నది.

ఆ రోజుల్లో ఆంధ్రులకు ముఖ్యంగా బ్రహ్మణేతర విద్యార్థులకు మద్రాసు విశ్వవిద్యాలయంలో ప్రవేశం దొరకడం చాలా కష్టంగా వుండేది. ఆనాటి విద్యామంత్రి అనెం పరశురామ పాత్రో కృషి ఫలితంగా 1926లో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఏర్పాటైంది.

1932లో మద్రాసులో శ్రీ కడప కోటిరెడ్డి గారు అధ్యక్షతన ప్రత్యేకాంధ్ర మహసభ జరిగింది. ఈ సభకు శ్రీ కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుగారితో పాటు ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు చెందిన ముఖ్య నాయకులు హాజరైనారు.

ప్రశ్న 4.
శ్రీ భాగ్ ఒప్పందం 1937 నవంబర్: 14, నవంబర్ 1937 నాడు మద్రాసులో శ్రీ కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుగారి స్వగృహమైన “శ్రీ భాగ్”లో ఆంధ్ర, రాయలసీమ నాయకుల సమావేశం జరిగింది. ఆంధ్ర ప్రాంతం నుంచి శ్రీయుతులు డా॥ భోగరాజు పట్టాభి సీతారామయ్య, కొండా వెంకటప్పయ్య, మహబూబ్ ఆలీబేగ్, దేశిరాజు
హనుమంతరావు, ముళ్ళపూడి పళ్లం రాజు, కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుగారు, రాయలసీమ నుంచి శ్రీయుతులు కడప కోటిరెడ్డి, సీతారామిరెడ్డి, దేశపాండ్యా సుబ్బరామిరెడ్డి, టి.ఎన్. రామకృష్ణా రెడ్డి, పప్పురి రామాచారి, వరదాచారి పాల్గొన్నారు.

1938 మార్చి, 30న ప్రత్యేకాంధ్ర రాష్ట్రాన్ని స్థాపించాలని కోరుతూ దేశభక్త కొండా వెంకటప్పయ్యగారు మద్రాసు శాసనసభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దాన్ని కడప కోటిరెడ్డిగారు బలపరిచారు. తీర్మానాన్ని బలపరుస్తూ ముఖ్యమంత్రి రాజగోపాలాచారి గంభీరోపన్యాసం చేశారు. తీర్మానం ఏకగ్రీవామోదం పొందింది.
1938లో ఆంధ్ర మహాసభ డా॥, సర్వేపల్లి రాధాకృష్ణన్ అధ్యక్షతన జరిగింది. ఆ సభలో రాజధాని గురించి చర్చించారు.

5. జె.వి.పి. నివేదిక: జైపూర్, కాంగ్రెస్ సభల్లో సభ్యులు సమస్యను పునఃపరిశీలించాలని అభిప్రాయపడ్డారు. దాన్ని పురస్కరించుకొని పార్టీ ఒక ఉపసంఘాన్ని నియమించింది. అందులో జవహర్లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్, పట్టాభిసీతారామయ్య గారు సభ్యులు ముద్దుగా మూడక్షరాల మాటగా దీన్ని జె.వి.పి. కమిటీ అని పిలిచారు. ఈ కమిటీ ||ఏప్రిల్ 1949లో తన నివేదికను ప్రకటించింది. చిరకాలంగా ఆంధ్రుల్లో నెలకొని వున్న అలజడి దృష్ట్యా ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయవచ్చు. అందుకోసం ఆంధ్రులు మద్రాసు నగరం కోరికను వదులుకోవాలని పేర్కొంది.

6. స్వామి సీతారం ఉపవాస దీక్ష: ఆంధ్ర రాష్ట్ర సిద్ధిని శుభం చేయాలనే సంకల్పంతో 15 ఆగష్టు 1952 నాడు శ్రీ స్వామి సీతారాం (శ్రీ గొల్లపూడి సీతారామశాస్త్రి గారు) ఆమరణ నిరాహార దీక్షను ప్రారంభించారు. ఈయన ఉపవాస దీక్ష గుంటూరు పట్టణంలో టౌన్ హాలులో జరిగింది. మొత్తం 36 రోజులు ఉపవాస దీక్ష సాగింది.

AP Inter 2nd Year Civics Study Material Chapter 13 ఆంధ్రప్రదేశ్, ఇండియాలలో ఇటీవలి పరిణామాలు

7. పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్ష: ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం 19 అక్టోబరు, 1952 నాడు పొట్టి శ్రీరాములు గారు మహర్షి బులుసు సాంబమూర్తి గారి ఇంట్లో దీక్ష ప్రారంభించారు. ఆ ఇంటికి “యజ్ఞశాల” అని నామకరణం చేశారు.

ఈ వాతావరణంలో డిశంబర్ 9, 1952 నాడు పార్లమెంటులో మద్రాసును వదులుకొని ఆంధ్ర రాష్ట్రానికి అంగీకరిస్తే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకాంధ్ర రాష్ట్రం ఏర్పాటును పరిశీలించగలదని ఒక ప్రకటన చేయడమైనది. ఈ ప్రకటన వెలువడే నాటికి శ్రీరాములు దీక్ష మొదలు పెట్టి 52 రోజులైంది. ఆ తరువాత 15 డిశంబరు, 1952 రాత్రి 11 గం॥ 39 ని॥లకు పొట్టి శ్రీరాములు అమరజీవి పొట్టి శ్రీరాములయ్యారు.

8. వాంఛూ కమిటీ 1953: 1953 జనవరిలో ప్రత్యేకాంధ్ర రాష్ట్ర నిర్మాణ విషయాలను పరిశీలించడానికి కేంద్ర ప్రభుత్వం రాజస్థాన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కె.ఎన్.వాంఛను నియమించింది. వాంఛూ నివేదిక అందటంతోనే ప్రధానమంత్రి నెహ్రూ ఒక ప్రకటన చేస్తూ, ఆంధ్ర రాష్ట్రం అక్టోబరు 1, 1953 నాడే ఏర్పాటవుతుందని, కాబట్టి రాజధాని నగరం ఆంధ్ర ప్రాంతంలో ఎక్కడ వుండాలో తేల్చుకోవాల్సిన బాధ్యత ఆంధ్ర శాసన సభ్యులదే అని తెలిపారు. అంతేకాని మద్రాసు నగర ప్రసక్తి మాత్రం లేదు అని ఆయన స్పష్టం చేశారు.

9) ఆంధ్ర రాష్ట్ర అవతరణ: నూతనంగా రాష్ట్ర నిర్మాణం చేయడానికి భారత ప్రభుత్వం సి.ఎం.త్రివేదీని ప్రత్యేకాధికారిగా నియమించింది. అనుకొన్న ప్రకారం 1 అక్టోబర్, 1953 నాడు కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం అధికారికంగా ఏర్పాటయింది. దీనిలో శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు 11 జిల్లాలు వున్నాయి.

4 జూలై, 1954న గుంటూరులో హైకోర్టును ఏర్పాటు చేశారు. హైకోర్టుకు మొదటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్. కోకా సుబ్బారావుగారు, ఆంధ్రరాష్ట్రానికి మొదట గవర్నర్ సి.ఎం. త్రివేది ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు గారు. భారత ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ రాష్ట్రానికి 1 అక్టోబర్, 1953 నాడు ఆంధ్ర రాష్ట్ర అవతరణకు ప్రారంభోత్సవం చేశాడు. ఆనాడు అశేషాంధ్ర ప్రజానీకం వాడవాడలా విందులు, వినోదాలు జరుపుకున్నారు.

ప్రశ్న 2.
జై ఆంధ్ర ఉద్యమానికి దారితీసిన అంశాలను పరిశీలించండి.
జవాబు:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆవిర్భావం తరువాత కూడా తెలంగాణ ప్రాంతంలో ముల్కీ నిబంధనలు అమలులో ఉన్నాయి. అటువంటి నిబంధనలు ఆంధ్రప్రాంత ప్రజలకు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో ఆటంకంగా ఉన్నాయనే భావన ఏర్పడింది. దాంతో ఆ నిబంధనలను రాష్ట్ర హైకోర్టులో కొందరు సవాల్ చేయడమైంది. అప్పుడు ఆ అంశంపై రాష్ట్ర హైకోర్టు సమగ్రంగా విచారించి ముల్కీ నిబంధనలు చెల్లుబాటు కావని ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైకోర్టు తీర్పుపై సమగ్ర వివరణ కోరుతూ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ ను దాఖలు చేసింది. సుప్రీంకోర్టు ఆ అంశాన్ని క్షుణ్ణంగా విచారించి ముల్కీ నిబంధనలు సక్రమమే అని తీర్పును ఇచ్చింది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెనురాజకీయ ప్రకంపనలను సృష్టించింది. ఆంధ్రప్రాంత ప్రజలు హైదరాబాద్ రాజధాని పట్టణంలోని ద్వితీయశ్రేణి పౌరులుగా దిగజారిపోయామనే భావన వ్యక్తీకరించారు. ఆంధ్రప్రదేశ్ నుండి ఆంధ్రప్రాంతం విడిపోయి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడాలనే డిమాండ్తో వారు జై ఆంధ్ర ఉద్యమాన్ని చేపట్టారు.

ప్రశ్న 3.
జాతీయ మానవ హక్కుల సంఘం అమలు చేసిన ప్రతిపాదనలు ఏవి ?
జవాబు:

  1. మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన అంశాల విచారణ.
  2. న్యాయస్థానం విచార క్రమంలో మానవ హక్కులకు సంబంధించిన అంశాలు ఉన్నట్లయితే జోక్యం చేసుకోవడం.
  3. కారాగారాలను సందర్శించి, అక్కడి పరిస్థితులను అధ్యయనం చేసి తగిన సూచనలు అందించడం.
  4. మానవ హక్కుల పరిరక్షణకు సంబంధించిన రాజ్యాంగ, చట్టపరమైన పరిరక్షణలను సమీక్షించడం.
  5. మానవ హక్కులను అనుభవించడంలో ఎదురయ్యే ఆటంకాలను సమీక్షించి, నివారణ చర్యలను సూచించడం.
  6. మానవ హక్కులకు సంబంధించిన అంతర్జాతీయ చట్టాలను అధ్యయనం చేసి, వాటిని సమర్థవంతంగా అమలులో ఉంచేందుకు సూచనలు అందించడం.
  7. మానవ హక్కులకు సంబంధించిన అంశాలపై పరిశోధనలు గావించడం.
  8. ప్రజలలో మానవ హక్కుల పట్ల అవగాహనను పెంపొందించి, మానవ హక్కుల పరిరక్షణకు సంబంధించిన సమాచారాన్ని అందించడం.
  9. మానవ హక్కుల విషయంలో ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థల కృషిని ప్రోత్సహించడం.
  10. మానవ హక్కులను కోల్పోయిన బాధితులకు నష్టపరిహారాన్ని అందించడంలో సంబంధిత అధికారులకు సూచనలు చేయడం.

ప్రశ్న 4.
జాతీయ, రాష్ట్రస్థాయిలలో మానవహక్కుల సంఘాలు ఎందుకు అవసరమో తెలపండి.
జవాబు:
జాతీయ మానవహక్కుల సంఘం (National Human Rights Commission – NHRC) అనేది చట్టబద్ధమైన సంస్థ. ఆ సంస్థ 1993 అక్టోబరు 12న ఏర్పాటయింది. దానికి సంబంధించిన అంశాలను 1993 నాటి మానవహక్కుల పరిరక్షణ చట్టం నుండి గ్రహించడమైంది. ఆ చట్టం 1991 అక్టోబరులో పారిస్ లో జరిగిన అంతర్జాతీయ అధ్యయన సదస్సులో ఆమోదించిన నియమాలకు అనుగుణంగా ఉంటుంది. అట్లాగే ఆ చట్టం మానవహక్కుల పరిరక్షణ, వికాసానికి దోహదపడుతుంది. ఆ నియమాలను 1993 డిసెంబర్ 20వ తేదీన ఐక్యరాజ్యసమితి సాధారణ సభ 48/134 వ తీర్మానం ద్వారా ఆమోదించింది. మానవహక్కుల పరిరక్షణ, వికాసంలో భారతదేశపు ఆసక్తికి జాతీయ మానవహక్కుల సంఘం ప్రతీకగా ఉంటుంది. జాతీయ మానవహక్కుల సంఘం ఆ చట్టాన్ని 2006లో సవరించండం జరిగింది.

AP Inter 2nd Year Civics Study Material Chapter 13 ఆంధ్రప్రదేశ్, ఇండియాలలో ఇటీవలి పరిణామాలు

మానవహక్కుల పరిరక్షణ చట్టం, 1993 జాతీయ మానవహక్కుల సంఘంతో బాటుగా రాష్ట్ర మానవహక్కుల సంఘాల ఏర్పాటుకు వీలు కల్పించింది. ప్రస్తుతం భారతదేశంలో 23 రాష్ట్రాలు మానవహక్కుల సంఘాలను ఏర్పాటుచేశాయి. వాటిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఉంది. భారత రాజ్యాంగం ఏడో షెడ్యూలులోని రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితాలలో పేర్కొన్న అంశాల విషయంలో, మానవ హక్కుల ఉల్లంఘనలపై విచారణ జరిపే ముఖ్య ఉద్దేశ్యంతో రాష్ట్ర మానవహక్కుల సంఘం ఏర్పాటయింది.

ప్రశ్న 5.
సమాచార సంఘాల అధికారాలు, విధులు ఏవి ?
జవాబు:
సమాచార సంఘాల అధికారాలు, విధులు: [Mar. ’17]
1. కేంద్ర సమాచార సంఘం / రాష్ట్ర సమాచార సంఘం ఏ వ్యక్తి వద్ద నుంచైనా ఫిర్యాదులను స్వీకరించవచ్చు. అటువంటి వ్యక్తులు

  • ప్రధాన సమాచార అధికారి నియామకం జరగకపోవడంతో సమాచారం పొందేందుకు అవకాశం లేనివారై ఉండాలి.
  • అడిగిన సమాచారాన్ని ఇచ్చేందుకు అధికారులు తిరస్కరించి ఉండాలి.

2. సహేతుక కారణాలపై విచారణ జరిపించే అధికారం.

3. కేంద్ర సమాచార సంఘం / రాష్ట్ర సమాచార సంఘాలకు పౌరన్యాయస్థానాలుగా నిర్వహించే అధికారాలు ఎ) వ్యక్తుల హాజరు, వారి ప్రమాణంపై మౌఖిక, రాతపూర్వక సాక్ష్యాలను తీసుకోవడం, రాతప్రతుల వస్తువులను సమకూర్చడం.
బి) రాతప్రతులను పరిశోధించి, తనిఖీ చేయడం.
సి) అఫిడవిట్ ఆధారంగా సాక్ష్యాన్ని తీసుకోవడం.

4. విచారణ సమయంలో ఈ చట్టం ప్రకారం అన్ని ప్రతులను కేంద్ర సమాచార సంఘం / రాష్ట్ర సమాచార సంఘాలకు అందించడం.

5. ప్రభుత్వ అధికారుల నుంచి తన నిర్ణయాల అమలు గురించి సమాచారాన్ని రాబట్టడం.

  • నిర్ణీత ఫారంలో సమాచారాన్ని అందించే వీలుకల్పించడం.
  • ఎవరూ లేనిచో ప్రజాసమాచార అధికారి (PIO) / సహాయ ప్రజాసమాచార అధికారి (APIO) నియామకం గురించి ప్రభుత్వ అధికారులను ఆదేశించడం.

ప్రశ్న 6.
కేంద్ర సమాచార సంఘం ఏ విధంగా నిర్మితమైంది ?
జవాబు:
కేంద్ర సమాచార సంఘాన్ని ఒక ప్రత్యేక గెజిట్ ప్రకటన ద్వారా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఆ సంఘంలో ఒక ప్రధాన సమాచార కమీషనర్, పది మందికి మించకుండా సమాచార కమీషనర్లు ఉంటారు. వారందరినీ భారత రాష్ట్రపతి నియమిస్తారు. భారత రాష్ట్రపతి వారిచే ప్రమాణ స్వీకారం చేయిస్తాడు. ఆ సంఘం ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. కేంద్రప్రభుత్వం ఆ సంఘానికి సంబంధించిన కార్యాలయాలను దేశంలోని ఇతర ప్రాంతాలలో ఏర్పాటు చేయవచ్చు. ఆ సంఘం తన కార్యకలాపాలకు ఇతర అధికారులు / సంస్థల ఆదేశాలకు లోబడక స్వతంత్రంగా నిర్వహిస్తుంది.

AP Inter 2nd Year Civics Study Material Chapter 13 ఆంధ్రప్రదేశ్, ఇండియాలలో ఇటీవలి పరిణామాలు

ప్రశ్న 7.
సమాచారం పొందేందుకు గల సమయ పరిమితి ఏమిటి ?
జవాబు:
దరఖాస్తుదారుడు ప్రజాసమాచార అధికారి లేదా సహాయ ప్రజా సంబంధాల అధికారికి తదుపరి ఏ ఇతర అధీకృత అధికారికి గానీ తనకు కావాల్సిన సమాచారాన్ని ఒక దరఖాస్తు ద్వారా కోరతాడు. అందుకు అతడు కౌ 10లతో కూడిన డిమాండ్ డ్రాఫ్ట్, బ్యాంకు చెక్కు, ఇండియన్ పోస్టల్ ఆర్డర్ కోర్టు స్టాంపునుగానీ దరఖాస్తుతో జతపరచాలి. పేదరికం దిగువన నివసించే వారికి అటువంటి రుసుము చెల్లింపు నుంచి మినహాయంపు ఇవ్వబడింది. అయితే అందుకు సంబంధించిన నకలు పత్రాన్ని వారు దరఖాస్తుతో జతపరచాలి. సమాచారాన్ని ప్రజా సంబంధాల అధికారి, సహాయ ప్రజా సంబంధాల అధికారి దరఖాస్తుదారుడికి 30 రోజులలోగా అందించాలి. ఒకవేళ దరఖాస్తుదారుడి జీవనం, స్వేచ్ఛలకు సంబంధించిన అంశాలు ఇమిడి ఉంటే, సమాచారాన్ని అతడికి 48 గంటలలోగా అందించాలి. మూడో వ్యక్తి ఉన్నట్లయితే, అతడికి 40 రోజుల వ్యవధిలోగా సమాచారాన్ని అందించాలి. ఆ నిర్ణీత వ్యవధిలో సమాచారాన్ని అందించని యెడల, శాఖాధిపతికి దరఖాస్తుదారుడు మొదటిసారి అప్పీలు చేసుకోవచ్చు. కొంత నిర్ణీత వ్యవధి తరువాత దరఖాస్తుదారుడు సమాచార సంఘానికి అప్పీలు చేసుకోవచ్చు. ఒకవేళ సమాచారం అందించే విషయంలో నిర్హేతుకమైన జాప్యం ఏర్పడినచో లేదా తప్పుడు సమాచారం అందించినచో రోజుకు సంబంధిత, అధికారి 250ల మొత్తాన్ని దరఖాస్తుదారుడికి చెల్లించాలి. ఆ మొత్తం గరిష్ఠంగా 25000 వరకు ఉంటుంది. సంబంధిత అధికారిని విచారణ చేసేందుకు వీలుంటుంది.

ప్రశ్న 8.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోదా గురించి శ్రీకృష్ణ కమిటీ సూచించిన వివిధ ప్రతిపాదనలేవి ? [Mar. ’17, ’16]
జవాబు:
1. శ్రీకృష్ణ కమిటీ ఆరు ఐచ్ఛిక అంశాలతో కూడిన ప్రతిపాదనలను సూచించింది. అవి: 1. యథాతథస్థితిని కొనసాగించడం.

2. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సీమాంధ్ర, తెలంగాణ అనే రెండు రాష్ట్రాలుగా విభజించి, హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించడం.

3. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని (1) హైదరాబాద్ రాజధానిగా తెలంగాణ, రాయలసీమ ప్రాంతాలతో కూడిన రాయల తెలంగాణగా ఏర్పరచడం (2) కోస్తా ప్రాంతాన్ని అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉంచడం.

4. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సీమాంధ్ర, తెలంగాణలుగా విభజించి, హైదరాబాద్ మెట్రోపాలిటన్ ప్రాంతాన్ని ప్రత్యేక కేంద్రపాలిత ప్రాంతంగా ఉంచడం. దానిని భౌగోళికంగా కోస్తా ప్రాంతంలోని గుంటూరు జిల్లాతో అనుసంధానం గావించడం. అందులో భాగంగానే దక్షిణ ఆగ్నేయంలో ఉన్న నల్గొండ జిల్లాను దక్షిణాన ఉన్న మహబూబ్నగర్ జిల్లా మొదలుకొని రాయలసీమ ప్రాంతంలోని కర్నూలు జిల్లాతో అనుసంధానం గావించడం.

5. ప్రస్తుతం ఉన్న సరిహద్దుల ఆధారంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తెలంగాణ, సీమాంధ్రలుగా విభజించి, తెలంగాణకు హైదరాబాదు రాజధానిగా ఉంచడం, సీమాంధ్రకు నూతన రాజధాని నిర్మాణం గావించడం.

6. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచి, తెలంగాణ ప్రాంత సామాజిక – ఆర్థిక అభివృద్ధికి, రాజకీయ ప్రగతికి ఒక ప్రాంతీయ మండలిని ఏర్పాటు గావించడం.

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
పెద్ద మనుషుల ఒప్పందం.
జవాబు:
హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణ ప్రాంత విలీనాన్ని గట్టిగా వ్యతిరేకించాడు. కాని కాంగ్రెస్ అధిష్ఠానవర్గం ఆంధ్రప్రాంత నాయకుల ఒత్తిళ్ళుకు తలొగ్గి విశాలాంధ్ర ఏర్పాటును ఆమోదించింది. తెలంగాణ ప్రజానీకంలో ఉన్న భయాందోళనలను నివారించేందుకై ఆంధ్ర, తెలంగాణ ప్రాంత నాయకుల మధ్య కుదిరిన ఒప్పందాన్ని పెద్ద మనుషుల ఒప్పందం అని అంటారు. ఈ ఒప్పందంలోని ప్రధాన ఆంశం ప్రకారం తెలంగాణ సంపూర్ణ అభివృద్ధి కొరకై ప్రాంతీయ మండలి ఏర్పాటయింది.

AP Inter 2nd Year Civics Study Material Chapter 13 ఆంధ్రప్రదేశ్, ఇండియాలలో ఇటీవలి పరిణామాలు

ప్రశ్న 2.
జె.వి.పి కమిటీ. [Mar. ’16]
జవాబు:
దక్షిణ భారతదేశంలో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ జరగాలనే డిమాండ్ ఉదృతం కావడంతో, భారత జాతీయ కాంగ్రెస్ ఆ అంశాన్ని పరిశీలించేందుకై ఒక త్రిసభ్య సంఘాన్ని నియమించింది. ఆ సంఘంలో జవహర్లాల్నెహ్రూ, వల్లభబాయి పటేల్, పట్టాభి సీతారామయ్య సభ్యులు ఉన్నారు. ఈ సంఘాన్ని జె.వి.పి కమిటీ అంటారు. ఈ కమిటీ తన నివేదికను 1949 ఏప్రిల్ 1వ తేదిన సమర్పించింది.

ప్రశ్న 3.
శ్రీబాగ్ ఒడంబడిక.
జవాబు:
1953 అక్టోబర్ 1వ తేదిన ఆంధ్రరాష్ట్రం అవతరించింది. నూతన రాష్ట్రానికి కర్నూల్ పట్టణాన్ని రాజధానిగా ఎంపిక చేయటమైంది. ఈ సమయంలో రాయలసీమ ఆంధ్రప్రాంత నాయకుల మధ్య కుదిరిన ఒడంబడికనే శ్రీబాగ్ ఒడంబడిక అంటారు. ఆంధ్రరాష్ట్ర అవతరణ దినోత్సవానికి ప్రధాని నెహ్రూ ముఖ్య అతిధిగా విచ్చేయడమైంది. ఆంధ్రరాష్ట్ర మొదటి ముఖ్యమంత్రిగా టంగుటూరి ప్రకాశం పంతులు వ్యవహరించారు.

ప్రశ్న 4.
ఫజల్ ఆలీ సంఘం.
జవాబు:
1952 డిసెంబర్ 15వ తేదిన ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం కావాలని ఆమరణ దీక్ష చేపట్టిన పొట్టి శ్రీరాములు అశువులు బాశారు. దాని ఫలితంగా ఆంధ్ర ప్రాంతంలో శాంతి భద్రతలకు తీవ్ర విఘాతం కలగటంలో ప్రజాభిప్రాయానికి తలొగ్గి ఆనాటి ప్రధాని నెహ్రూ 1) ఫజల్ ఆలీ 2) కె.ఎమ్. ఫణిక్కర్ 3) హృదయేంద్ర నాథ్ కుంజ్రూలతో ఒక సంఘాన్ని నియమించటం జరిగింది. ఈ సంఘానికి ఫజల్ ఆలీ చైర్మన్ గా వ్యవహరించటంతో దీనిని ఫజల్ అలీ సంఘం అంటారు. ఈ సంఘం ప్రత్యేక రాష్ట్రాల డిమాండ్ను పరిశీలించి తన నివేదికను 1955 అక్టోబర్లో కేంద్రప్రభుత్వానికి సమర్పించింది.

ప్రశ్న 5.
జాతీయ మానవ హక్కుల సంఘం చైర్మన్ నియామకంలో అనుసరించాల్సిన నియమాలు.
జవాబు:
జాతీయ మానవ హక్కుల సంఘం చైర్మను భారత రాష్ట్రపతి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించిన తరువాత ఖరారు చేసి నియమించటం జరుగుతంది. ఈ సందర్భంలో రాష్ట్రపతి ఆరుగురు సభ్యులతో కూడిన నియామకపు సంఘం సూచనలను పాటిస్తాడు.

AP Inter 2nd Year Civics Study Material Chapter 13 ఆంధ్రప్రదేశ్, ఇండియాలలో ఇటీవలి పరిణామాలు

ప్రశ్న 6.
మానవ హక్కుల సంఘం చైర్మన్, సభ్యుల నియామకంలో అనుసరించాల్సిన ప్రక్రియ. [Mar. ’17]
జవాబు:
రాష్ట్ర మానవ హక్కుల సంఘం చైర్మన్, సభ్యులను సంబంధిత రాష్ట్ర గవర్నర్ నియమిస్తారు. ఈ సందర్భంలో గవర్నర్కు సలహా ఇచ్చేందుకు అత్యున్నత స్థాయి సలహామండలి ఉంటుంది. అందులో రాష్ట్రముఖ్యమంత్రి, రాష్ట్ర హోం మంత్రి విధానసభ స్పీకర్, విధాన సభలోని ప్రతిపక్ష పార్టీ నాయకుడు సభ్యులుగా ఉంటారు. ఆ సలహా మండలికి ముఖ్యమంత్రి కన్వీనర్ ఉంటాడు. రాష్ట్ర మానవహక్కుల సంఘం సభ్యుల నియామకంలో గవర్నర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సంప్రదిస్తాడు.

ప్రశ్న 7.
పౌర న్యాయస్థానంగా మానవ హక్కుల సంఘం.
జవాబు:
మానవ హక్కుల సంఘం పౌర న్యాయస్థానంగా పనిచేస్తుంది. పౌర శిక్షాస్మృతికి అనుగుణంగా పనిచేసే సివిల్ కోర్టుకు ఉండే అధికారాలు ఈ సంఘానికి ఉంటాయి. దానితో సాక్షులను పిలిచేందుకు, ఏదైనా రాత ప్రతిని సమర్పించాలని కోరేందుకు, అఫిడవిట్లపై అవసరమైన సాక్ష్యాన్ని రాబట్టేందుకు మానవ హక్కుల సంఘం సంపూర్ణ అధికారాన్ని కలిగి ఉంది.

ప్రశ్న 8.
సైనిక దళాలపై జాతీయ మానవ హక్కుల సంఘం పరిధి.
జవాబు:
సైనిక దళాల సిబ్బంది మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడిన ఉదంతాలపై విచారణ జరిపే విషయంలో జాతీయ మానవ హక్కుల సంఘానికి పరిమితమైన పాత్ర మాత్రమే ఉంటుంది. అయితే ప్రభుత్వం ఆ సంఘం చేసిన సిఫార్సులను విమర్శించటానికి వీలులేదు అని ఆ కమీషన్ లోని మాజీ సభ్యుడు ఒకరు వ్యాఖ్యానించారు.

ప్రశ్న 9.
ప్రజా సమాచార అధికారి (P.I.O).
జవాబు:
ప్రజా సమాచార అధికారిని సమాచార కమీషన్ ఆదేశాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తుంది. ఈ అధికారి |సమాచార కమీషన్కు తన అధికారాలు, విధులలో తన సహాయ సహకారాలను అందిస్తారు.

AP Inter 2nd Year Civics Study Material Chapter 13 ఆంధ్రప్రదేశ్, ఇండియాలలో ఇటీవలి పరిణామాలు

ప్రశ్న 10.
సమాచారం అంటే ఏమిటి ?
జవాబు:
సమాచారమంటే ఏదో ఒక భౌతికరూపంలో ఉండేదిగా పేర్కొనవచ్చు. రికార్డులు, డాక్యుమెంట్లు, మెమోలు, ఈ-మెయిళ్ళు, అభిప్రాయాలు, సలహాలు, పత్రికాప్రకటనలు, సర్క్యులర్లు. ఆదేశాలు, లాగ్ పుస్తకాలు, నివేదికలు, కాగితాలు, నమూనాలు, ఎలక్ట్రానిక్ రూపంలో ఉండే ఏమైనా మెటీరియల్ మొదలైనవి సమాచారం క్రిందకు వస్తాయి.

AP Inter 2nd Year Civics Study Material Chapter 12 రాజకీయ పార్టీలు

Andhra Pradesh BIEAP AP Inter 2nd Year Civics Study Material 12th Lesson రాజకీయ పార్టీలు Textbook Questions and Answers.

AP Inter 2nd Year Civics Study Material 12th Lesson రాజకీయ పార్టీలు

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
భారతదేశంలోని జాతీయ పార్టీలపై ఒక వ్యాసం వ్రాయండి.
జవాబు:
జాతీయ పార్టీ: దేశంలో నాలుగు (లేదా) అంతకు మించిన రాష్ట్రాలలో జరిగే ఎన్నికలలో పాల్గొని, పోలైన ఓట్లలో ఆరు శాతం పొందటంతో పాటు నాలుగు లోక్సభ సీట్లను గెలుచుకొన్న పార్టీని జాతీయ (లేదా) అఖిల భారత పార్టీగా భారత ఎన్నికల సంఘం గుర్తిస్తుంది.
భారతదేశంలోని ప్రధాన జాతీయ పార్టీలను ఈ క్రింది విధంగా పేర్కొనవచ్చు. అవి:

  1. భారత జాతీయ కాంగ్రెస్
  2. భారతీయ జనతా పార్టీ
  3. భారత కమ్యూనిస్టు పార్టీ
  4. భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
  5. బహుజన సమాజ్ పార్టీ
  6. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ

1) భారత జాతీయ కాంగ్రెస్: భారత జాతీయ కాంగ్రెస్ మన దేశంలో అతి పురాతన పార్టీ. దీనిని 1885 డిశంబరు, 28వ తేదీన బ్రిటిష్ సివిల్ సర్వెంట్ (A. O) ఎ.ఒ హ్యూమ్ స్థాపించాడు. ఉమేష్ చంద్ర బెనర్జీ దీనికి ప్రధమ అధ్యక్షుడుగా వ్యవహరించాడు. స్వాతంత్య్ర ఉద్యమంలో ఈ పార్టీ చురుకైన పాత్ర పోషించి దేశానికి స్వాతంత్య్రాన్ని తీసుకోచ్చింది.

స్వాతంత్ర్యానంతరం జరిగిన 15 సాధారణ ఎన్నికల్లో, కాంగ్రెస్ పార్టీ ఆరుసార్లు ఎన్నికల్లో స్పష్టమైన మెజారిటి సాధించింది. నాలుగు సార్లు అధికార సంకీర్ణానికి నాయకత్వం వహించింది. మొత్తం దాదాపు 49 సంవత్సరాల పాటు కేంద్రప్రభుత్వానికి నాయకత్వం వహించింది. దీనిలో ప్రధాని జవహర్లాల్ నెహ్రూ మొదలుకొని (1947 – 64), ఇటీవలి మన్మోహన్ సింగ్ (2004-14) వరకు ఏడుగురు కాంగ్రెస్ ప్రధాన మంత్రులు దేశాన్ని పాలించారు. 2004 నుండి 2014 వరకు కాంగ్రెస్ నాయకత్వంలోని ఐక్య ప్రగతిశీల కూటమి (United Progressive Alliance – UPA) మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఎన్నో ప్రాంతీయ పార్టీల సంకీర్ణంగా ప్రభుత్వాన్ని ఏర్పరచింది. 2014లో జరిగిన పదహారవ సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్వాతంత్య్రానంతరం మొదటిసారిగా హీనమైన ఓటమిని చవిచూచి, 543 మంది గల లోక్సభలో 44 స్థానాలకు పరిమితమైంది.

AP Inter 2nd Year Civics Study Material Chapter 12 రాజకీయ పార్టీలు

2) భారతీయ జనతా పార్టీ: భారతీయ జనతా పార్టీ (బిజెపి) ని 1980లో స్థాపించారు. భారతీయ జనతా పార్టీ 1951 అక్టోబర్ 21న శ్యాంప్రసాద్ ముఖర్జీ అధ్యక్షతన స్థాపించిన భారతీయ జన సంఘ్క ఒక నూతన, సవరించిన స్వరూపంగా పేర్కొనవచ్చు. భారతీయ జనతా పార్టీ తన పూర్వపు జన సంఘ్్కు కొనసాగింపుగా క్రమశిక్షణ – చక్కని వ్యవస్థీకృత యంత్రాంగం, సంప్రదాయ హిందూ సాంఘిక – సాంస్కృతిక సంస్థలైన రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ (ఆర్. ఎస్. ఎస్), విశ్వహిందూ పరిషత్ (వి. హెచ్. పి) తదితర సంస్థలతో అనుబంధాన్ని కొనసాగిస్తూ వచ్చింది. ఏవో కొన్ని రాజకీయ దృక్పధాలు, పార్టీ స్థాపించిన తొలినాళ్ళలో 1984 సాధారణ ఎన్నికల్లో బిజెపి దేశ వ్యాప్తంగా రెండు సీట్లలో మాత్రమే విజయం సాధించింది. అయితే ఆ తరువాత కాలంలో రామజన్మ భూమి – బాబ్రీ మసీదు అంశం ఆధారంగా తన బలాన్ని బాగా పుంజుకుని గణనీయంగా పెంచుకోగలిగింది. ఎన్నో రాష్ట్రాలకు జరిగిన ఎన్నికలలో విజయాలు సాధించడం, జాతీయ స్థాయి ఎన్నికల్లో చక్కని ఫలితాలు సాధించడంతో 1996 కల్లా బిజెపి పార్లమెంటులో అతి పెద్ద పార్టీగా మారింది. అయితే పార్లమెంటులోని దిగువ సభలో సరైన మెజారిటీ లేకపోవడంతో ఆ పార్టీ ప్రభుత్వం కేవలం 13 రోజులు మాత్రమే అధికారంలో కొనసాగింది.

అనంతరం 1998 సాధారణ ఎన్నికల్లో బిజెపి మాత్రమే నేతృత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి (National Democratic Alliance) అటల్ బీహారీ వాజ్పాయ్ ప్రధానమంత్రిగా ఒక సంవత్సరంపాటు అధికారంలోకి వచ్చింది. ఆ తరువాత మళ్ళీ తాజాగా ఎన్నికలు జరగడంతో ఎన్. డి. ఎ ప్రభుత్వం అటల్ బిహారీ వాజ్పాయ్ నాయకత్వంలో పూర్తి పదవీకాలం అధికారంలో కొనసాగింది. అందుచేత స్వాతంత్య్రానంతర చరిత్రలో కాంగ్రెసేతర ప్రభుత్వం అనేది పూర్తి పదవీకాలం కొనసాగడం ఇదే మొదటిసారిగా పేర్కొనవచ్చు. ఆ తరువాత 2004లో జరిగిన సాధారణ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి (NDA) అనూహ్యంగా పరాజయం పాలైంది. అలాగే 2009లో జరిగిన లోక్సభ సాధారణ ఎన్నికలలో కూడా ఇదే జరిగింది. ఫలితంగా దాదాపు 10 సంవత్సరాల పాటు భారతీయ జనతా పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా కొనసాగింది. ఆ తరువాత 2014 సాధారణ ఎన్నికలలో సుదీర్ఘ కాలం గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ ప్రధాన ప్రచారకునిగా, పార్టీలో జనాకర్షణ గల నాయకునిగా భారతీయ జనతాపార్టీని నడిపించి, పార్టీకి అద్భుతమైన విజయాన్ని అందించగలిగాడు. అప్పటి నుండి, నరేంద్ర మోడి ప్రధానమంత్రిగా భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఏర్పడిన 13 రాష్ట్రాలకు చెందిన రాజకీయ పార్టీల సంకీర్ణంగా జాతీయ ప్రజాస్వామ్య కూటమి (NDA) ప్రభుత్వం ఏర్పడి కొనసాగుతోంది.

3) భారత కమ్యూనిస్టు పార్టీ: భారతదేశంలోని రెండో అతి ప్రాచీన జాతీయ పార్టీయే భారత కమ్యూనిస్టు పార్టీ. |కమ్యూనిస్టు పార్టీ జాతీయోద్యమములో ప్రముఖపాత్ర వహించింది. భారతదేశంలో కమ్యూనిస్టు భావాలను వ్యాప్తి చేసే బాధ్యత ఎమ్. ఎన్. రాయ్కి అప్పజెప్పారు. 1925 డిశంబరు 26వ తేదీన మార్క్సిస్టు సిద్ధాంతములను విశ్వసించిన కొంతమంది కమ్యూనిస్టు పార్టీని స్థాపించారు. పశ్చిమ బెంగాల్, కేరళ, బీహార్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో దీని ప్రాబల్యము హెచ్చుగా వుంది.

4) భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు): 1964 సంవత్సరములో విజయవాడ సమావేశములో భారత కమ్యూనిస్టు పార్టీ రెండుగా చీలిపోయి పి. సుందరయ్య, జ్యోతిబసు, నంబూద్రిపాద్ మొదలగు నాయకుల ఆధ్వర్యంలో భారత కమ్యూనిస్టు పార్టీలోని అతివాదులు సి. పి. ఐ. (ఎమ్)గా ఏర్పడిరి. సి.పి.ఐ కి భిన్నముగా సి.పి.ఎమ్ నాయకులు (అతివాదులు) మావో సిద్ధాంతాలకు సన్నిహితులై చైనా కమ్యూనిజాన్ని అనుసరించిరి. పశ్చిమబంగ, త్రిపుర, కేరళలలో ఈ పార్టీకి చెప్పుకోదగ్గ మద్దతు ఉంది. ఈ పార్టీ పశ్చిమబంగలో 1977 నుండి 2012 వరకు అధికారంలో వుంది.

5) బహుజన సమాజ్ పార్టీ: బహుజన సమాజ్ పార్టీ దళితులు ఆధిపత్యం కలిగిన పార్టీ. ఈ పార్టీ ఉద్యోగుల సమాఖ్య. దళిత్ శోషిత్ సమాజ్ సమితిల విలీనం ఫలితంగా 1984లో ఏర్పండింది. కాన్షీరాం ఈ పార్టీ వ్యవస్థాపక నాయకుడు. మాయావతి ప్రస్తుతం ఈ పార్టీకి నాయకురాలుగా వ్యవహరిస్తున్నారు. ఈ పార్టీ భారత రాజకీయ వ్యవస్థలో జాతీయ పార్టీగా గుర్తింపు పొందింది. మాయావతి నాయకత్వంలో ఆ పార్టీ జనాకర్షణ క్రమేణా పెరుగుతూ వచ్చింది.

6) నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ: 1999, మే, 25 వ తేదీన కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ అయిన శరద్ పవార్, పి. ఎ. సంగ్మా, తారిక్ అన్వర్ తదితరులు స్థాపించిన పార్టీయే నేషనలిస్ట్ కాంగ్రెస్. ఈ పార్టీ స్థాపన సమయంలో ఇండియన్ కాంగ్రెస్ (సోషలిస్ట్) ను తనలో విలీనం చేసుకుంది. భారత ఎన్నికల సంఘం నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీని జాతీయ పార్టీగా గుర్తించింది. మహారాష్ట్ర, మణిపూర్, మేఘాలయ మొదలగు రాష్ట్రాలలో ఈ పార్టీకి చెప్పుకోదగ్గ

2. పార్టీలలోని వివిధ రకాలను తెలిపి, భారతదేశంలో ప్రాంతీయ పార్టీల పాత్రను అంచనా వేయండి. జవాబు: పార్టీలలోని వివిధ రకాలు: ఆధునిక ప్రజాస్వామ్య రాజ్యాల్లో నాలుగు రకాలైన రాజకీయ పార్టీలు ఉంటాయి.

  1. నిరోధకవాద (ప్రతిక్రియాత్మక) పార్టీలు,
  2. సాంప్రదాయకవాద పార్టీలు,
  3. ఉదారవాద పార్టీలు,
  4. విప్లవాత్మక (సమూల సంస్కరణవాద పార్టీలు.

నిరోధకవాద (ప్రతిక్రియాత్మక) పార్టీలు పూర్వపు సాంఘిక, ఆర్థిక, రాజకీయ సంస్థలను సర్థిస్తూ ఉంటాయి. సాంప్రదాయకవాద పార్టీలు యథాతథ స్థితిని విశ్వసిస్తాయి. ఉదారవాద పార్టీలు వర్తమాన సంస్థలో సంస్కరణలను ప్రవేశపెట్టే లక్ష్యంతో పనిచేస్తాయి. విప్లవాత్మకవాద (సమూల సంస్కరణవాద) పార్టీలు ప్రస్తుత సంస్థలను కూలద్రోసి వినూత్న వ్యవస్థ స్థాపన లక్ష్యంతో పనిచేస్తాయి.

AP Inter 2nd Year Civics Study Material Chapter 12 రాజకీయ పార్టీలు

భారతదేశంలో ప్రాంతీయ పార్టీల పాత్ర: భారత రాజకీయాల్లో ప్రాంతీయపార్టీల పాత్రను గురించి వ్యాఖ్యానిస్తూ డా॥ కె. ఆర్. బాంబువాల్ (Dr. K. R. Bambwal) కొన్ని విశిష్ట దృక్కోణాలను గుర్తించారు.
1) ప్రాంతీయ పార్టీలు భారతదేశంలోని ‘ఏకపార్టీ ఆధిపత్య వ్యవస్థ’ కు ఎంతో శక్తివంతమైన సవాలుగా నిలిచాయి.
2) ప్రాంతీయ పార్టీలు కేంద్ర, రాష్ట్ర సంబంధాల కూర్పుపైన, స్వభావంపైన ఒక బలమైన ప్రభావాన్ని చూపాయి. కేంద్ర ప్రభుత్వం వద్ద తమ వ్యవహారాల విషయంలో రాష్ట్ర నాయకులు మరింత హెచ్చుగా వ్యక్తీకరించుకోవడానికి ప్రయత్నించడం, కేంద్ర ప్రభుత్వం ప్రాంతీయ శక్తుల అవసరాలు, డిమాండ్లపై మరింతగా స్పందించడం మొదలైంది.
3) ప్రాంతీయ పార్టీలు రాజకీయాలను మరింత పోటీతత్త్వంతో ఉండే విధంగా మార్చాయి. అలాగే రాజకీయ ప్రక్రియలో ప్రజల భాగస్వామ్యం అట్టడుగు స్థాయిలో మరింత విస్తృతంగా ఉండేలా చేశాయి.
4) ప్రాంతీయ పార్టీలతో ఉండే మరో ప్రయోజనం ఏమంటే ప్రజలు నాయకులతో సాన్నిహిత్యాన్ని కలిగి ఉండడం. ప్రజలు తమ సమస్యల పరిష్కారానికి, జాతీయపార్టీకి చెందిన ఉన్నత పదవిలో ఉన్న వ్యక్తిని కలుసుకోవడం కంటే స్థానిక రాజకీయ పార్టీకి చెందిన నాయకుని కలుసుకోవడం తేలికగా భావిస్తారు.

భారతదేశంలో 1996 తరువాత అనేక ప్రాంతీయపార్టీలు జాతీయ రాజకీయాలలో కీలకంగా మారాయి. జాతీయ ప్రజాసామ్య కూటమి (NDA) లో భాగస్వామ్య పక్షాలుగా 23 ప్రాంతీయపార్టీలు 1999లో, 2004లో కేంద్ర ప్రభుత్వంలో అధికారాన్ని పంచుకున్నాయి. కొన్ని ప్రాంతీయపార్టీలు రాష్ట్రాల్లో అధికార పార్టీలుగా ఉన్నాయి. వీటిలో ఎఐఎడిఎంకె (AIADMK), టి.డి.పి (TDP), జె.డి.యు (JDU), బిజెడి (BJD), యుడిఎఫ్ (UDF), ఎస్.ఎ.డి (SAD) మొదలైనవి ఉన్నాయి. ఈ పరిణామం భారత రాజకీయాల్లో నిరంతరం పెరుగుత్ను, ప్రాముఖ్యంలో వృద్ధి కొనసాగుతున్న ప్రాంతీయపార్టీల ఉనికిని ప్రతిబింబిస్తుంది

ప్రశ్న 3.
భారతదేశంలో ఏకపార్టీ ఆధిపత్యంపై ఒక వ్యాసం వ్రాయండి.
జవాబు:
భారతదేశంలో స్వాతంత్య్ర పోరాటం సమర్థవంతమైన రాజకీయ పార్టీల వ్యవస్థ స్థాపనకు పిలుపునిచ్చింది. దేశంలోని బ్రిటిషు వ్యతిరేక శక్తులను – జాతీయవాద శక్తులను సమీకరించి ఒకే గొడుకు క్రిందకు తెచ్చిన సంస్థగా భారత జాతీయ కాంగ్రెస్ అవతరించింది. భారతదేశం స్వాతంత్ర్యం సాధించిన తరువాత జాతిపిత మహాత్మగాంధీ ఈ పార్టీని ఒక సాంఘిక సంస్థగా మాత్రమే కొనసాగించాలని కోరినప్పటికీ, అది ఒక రాజకీయ పార్టీగానే కొనసాగుతూ వచ్చింది. స్వాతంత్య్రానంతర దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ క్రియాశీల పాత్ర ఎంతఘనమైనదంటే, చాలా తరుచుగా భారతదేశాన్ని ఏక పార్టీ ఆధిపత్య వ్యవస్థగా అభివర్ణించడం జరిగింది. ఈ పార్టీ సర్వసమ్మత పార్టీగా, అందరి సమీకృత ప్రయోజనాలే తన వ్యూహంగా పేర్కొన్నది. భారతీయ సమాజానికి ప్రతిరూపంగా కాంగ్రెస్ పార్టీ జాతి ఆవశ్యక లక్షణాలన్నింటిని తనలో ప్రతిబింబించింది.

జాతీయోద్యమ స్థాయి నుండి ఒక రాజకీయ పార్టీగా మారడంతో, కాంగ్రెస్, పార్టీ బ్రహ్మాండమైన సంస్థగా ఉంటూ విభిన్న అభిప్రాయాలు గల పలు సమూహాలను తనలో ఇముడ్చుకోగలిగింది. స్వాతంత్య్రానంతరం జరిగిన 15 సాధారణ ఎన్నికల్లో, కాంగ్రెస్ పార్టీ ఆరుసార్లు ఎన్నికల్లో స్పష్టమైన మెజారిటీ సాధించింది. నాలుగు సార్లు అధికార సంకీర్ణానికి నాయకత్వం వహించింది. మొత్తం దాదాపు 49 సంవత్సరాల పాటు కేంద్రప్రభుత్వానికి నాయకత్వం వహించింది. దీనిలో ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ మొదలుకొని (1947 – 64), ఇటీవలి మన్మోహన్ సింగ్ |(2004-14) వరకు ఏడుగురు కాంగ్రెస్ ప్రధాన మంత్రులు దేశాన్ని పాలించారు. 2004 నుండి 2014 వరకు కాంగ్రెస్ నాయకత్వంలోని ఐక్య ప్రగతిశీల కూటమి (United Progressive Alliance – UPA) మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఎన్నో ప్రాంతీయ పార్టీల సంకీర్ణంగా ప్రభుత్వాన్ని ఏర్పరచింది. 2014లో జరిగిన పదహారవ సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్వాతంత్య్రానంతరం మొదటిసారిగా హీనమైన ఓటమిని చవిచూచి, 543 మంది గల లోక్సభలో 44 స్థానాలకు పరిమితమైంది.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
రాజకీయ పార్టీ అనగానేమి ? దాని లక్షణాలను, విధులను వివరించండి. [Mar. ’16]
జవాబు:
రాజకీయ పార్టీ అర్థం: రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్యం సజీవంగా ఉండడానికి రక్తప్రసరణవలే పనిచేస్తాయి. అవి ప్రజాభిప్రాయాన్ని తీర్చిదిద్ది, వ్యక్తిగత అభిప్రాయాల ఫలితంగా ఏర్పడే సందిగ్ధత నుండి ప్రజాభిప్రాయాన్ని ఏర్పరుస్తాయి. ప్రజాభిప్రాయాన్ని పటిష్టంగా రూపొందించడంలో, పెంపొందించడంలో రాజకీయపార్టీలు ప్రధాన సాధనాల వలే పనిచేస్తాయి. విధాన రూపకర్తలనకు, పౌరులకు మధ్య రాజకీయ పార్టీలు మధ్యవర్తుల వలే పనిచేస్తాయి.

AP Inter 2nd Year Civics Study Material Chapter 12 రాజకీయ పార్టీలు

రాజకీయ పార్టీ లక్షణాలు: రాజకీయ పార్టీకి ఈ దిగువ సూచించిన ముఖ్య లక్షణాలు ఉంటాయి.

  1. రాజకీయపార్టీ ఉమ్మడి ప్రయోజనాలు, ఒకేరకమైన విలువలు కలిగి ఉండే వ్యక్తుల సమూహంగా ఉంటుంది.
  2. రాజకీయపార్టీ తన స్వీయ రాజకీయ భావజాలాన్ని, కార్యక్రమాన్ని కలిగి ఉంటుంది.
  3. రాజ్యాంగపార్టీ సాధనాలతో ఎన్నికల ద్వారా మాత్రమే అధికారాన్ని చేజిక్కించుకోవడానికి ప్రయత్నిస్తుంది.
  4. జాతీయ ప్రయోజనాలను, జాతీయ, సంక్షేమాన్ని పెంపొందించడానికి రాజకీయ పార్టీ ప్రయత్నిస్తుంది.

రాజకీయపార్టీల విధులు:

  1. సామాజిక ప్రయోజనాల సమీకరణ, వ్యక్తీకరణ
  2. రాజకీయ భర్తీ
  3. ప్రజాభిప్రాయ సాధనాలు
  4. రాజకీయ సామాజికీకరణ, పౌరుల భాగస్వామ్యాన్ని పెంపొందించటం
  5. శాసనాల తయారీ
  6. ప్రతిపక్ష పాత్ర
  7. ప్రభుత్వ యంత్రాంగం, సంక్షేమ పథకాల అందుబాటు
  8. రాజకీయ వ్యవస్థకు న్యాయబద్ధతను చేకూర్చటం

ప్రశ్న 2.
పార్టీల వ్యవస్థ గురించి నీకేమి తెలియును ? పార్టీల వ్యవస్థ రకాలపై ఒక సంక్షిప్త సమాధానం వ్రాయండి.
జవాబు:
పార్టీల వ్యవస్థ అనేది సంక్లిష్ట సాంఘిక రాజకీయ ప్రక్రియలు, వ్యక్తిగత నాయకులు, సాంఘిక సంస్థలు, రాజకీయ సమూహాలు, సంస్థలు వాటిమధ్య పరస్పర చర్యలు, అంతర్గత సంబంధాలు మొదలైన వాటి సమాహారంగా పేర్కొనవచ్చు. ఈ చర్య – ప్రతిచర్యల రీతులు రాజ్యాంగాలు, శాసనాలు, నియమనిబంధనలు, సంస్థలు మొదలైన వాటి ఆధారంగా జరుగుతాయి. అలాగే ఒక సమాజంలో, రాజకీయ వ్యవస్థలో ఉండే రాజకీయ ఆలోచనలు, ప్రవర్తనలు కూడా వీటిని నిర్దేశిస్తాయి. ఈ విధమైన పరస్పర సంబంధాలు రాజకీయ భావజాలాల్లో, నాయకుల్లో, పార్టీ నిర్మాణంలో, పార్టీల్లో ఏర్పడే చీలికలలో, పార్టీ మద్దతు, నిరసన రీతుల్లో, ఓటర్ల సమీకరణలో, ఎన్నికల్లో జరిగే పోటీల్లో, ఇలా అనేక అంశాల్లో ప్రతిబింబిస్తుంది. భారతదేశం వంటి బహుళ సంస్కృతి సమాజంలో వివిధ స్థాయిల్లో అంటే జాతీయ, ప్రాంతీయ, ఉపప్రాంతీయ, గ్రామీణ – పట్టణ స్థాయిల్లో పార్టీల మధ్య సంకీర్ణాల నిర్మాణం జరుగుతుంది. పార్టీలు భారత రాజకీయాల్లో ఇతర ప్రధాన ప్రజాస్వామ్యాల్లో వలే కేంద్రస్థానాన్ని పొందుతాయి.

పార్టీల వ్యవస్థ – రకాలు: పార్టీల వ్యవస్థ మూడు రకాలు. అవి: 1) ఏక పార్టీ వ్యవస్థ 2) రెండు పార్టీల వ్యవస్థ 3) బహుళ పార్టీ వ్యవస్థ.
1) ఏక పార్టీ వ్యవస్థ: ఏక పార్టీ వ్యవస్థలో ఒకే ఒక రాజకీయపార్టీ మనుగడలో ఉంటుంది. ఇతర రాజకీయపార్టీలు పనిచేయడానికి అనుమతి ఉండదు. ఒకే రాజకీయపార్టీలో అసంతృప్తులు, వర్గాలు ఉండవచ్చు. ఉదాహరణకు జర్మనీలో నాజీ పార్టీ, ఇటలీలో ఫాసిస్టు పార్టీ, చైనాలో – పూర్వపు సోవియట్ యూనియన్ కమ్యూనిస్టు పార్టీలను ఏకపార్టీ వ్యవస్థగా పేర్కొనవచ్చు.

2) రెండు పార్టీల వ్యవస్థ: రెండు పార్టీల వ్యవస్థలో రాజకీయ వ్యవస్థ రెండు ప్రధాన రాజకీయ పార్టీలు ఆధారంగా పనిచేస్తుంది. వీటిలో ఒకటి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే, మరొకటి ప్రతిపక్ష పార్టీగా విధులు నిర్వహిస్తుంది. ఈ తరహా వ్యవస్థలో రాజకీయ అధికారం రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్య పరస్పర ప్రత్యామ్నాయంగా పనిచేస్తాయి. ఇంగ్లాండ్ (యు.కె)లోని లేబర్ పార్టీ, కన్సర్వేటివ్ పార్టీలు, అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని (USA) రిపబ్లికన్, డెమొక్రటిక్ పార్టీలు వీటికి ఉదాహరణలుగా చెప్పవచ్చు.

3) బహుళ పార్టీ వ్యవస్థ: ఈ తరహా వ్యవస్థలో రెండు పార్టీల కంటే ఎక్కువ పార్టీలు ఉంటాయి. అయితే వాస్తవంలో అవి అధికార పార్టీకిగానీ, ప్రతిపక్ష పార్టీకి గానీ స్నేహబంధంతో ఉంటాయి. ఈ విధమైన బహుళ పార్టీ వ్యవస్థ భారతదేశం, ఫ్రాన్స్, స్వీడన్, నార్వే తదితర దేశాల్లో వాడుకలో ఉంది.

ప్రశ్న 3.
భారతీయ పార్టీ వ్యవస్థ లక్షణాలను సంక్షిప్తంగా వ్రాయండి.
జవాబు:
భారతదేశంలో పార్టీ వ్యవస్థ లక్షణాలు:

  1. బహుళ పార్టీ వ్యవస్థ: భారతదేశంలో బహుళ సంఖ్యలో పార్టీలున్నాయి. ప్రస్తుతం దేశంలో 6 జాతీయ పార్టీలు, 64 రాష్ట్రస్థాయి పార్టీలున్నాయి.
  2. ఏకపార్టీ ఆధిపత్య వ్యవస్థ భారతదేశ రాజకీయ రంగంలో సుదీర్ఘకాలంపాటు కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యంతో కొనసాగింది.
  3. స్పష్టమైన భావజాలం లేకపోవటం: BJP, CPI, CPI (M) మినహా మిగిలిన పార్టీలకు స్పష్టమైన సిద్ధాంత భావజాలం లేదు.
  4. వ్యక్తిపూజ: చాలా తరచుగా భారతదేశంలో రాజకీయ పార్టీలు గొప్ప నాయకుని చుట్టూ వ్యవస్థీకృతమై ఉంటాయి.
  5. సాంప్రదాయక అంశాలు: భారతదేశంలో అనేక పార్టీలు మతం, కులం, భాష, సంస్కృతి, తెగ తదితర |అంశాల ప్రాతిపదికగా ఏర్పడతాయి.
  6. ప్రాంతీయ పార్టీల అవతరణ: భారత రాజకీయ వ్యవస్థలో పెద్ద సంఖ్యలో ప్రాంతీయ పార్టీలు అవతరించటానికి ప్రధాన లక్షణంగా చెప్పవచ్చు..
  7. చీలికలు, ఫిరాయింపులు: వర్గపోరు, ఫిరాయింపులు, చీలికలు, విలీనాలు, విచ్ఛిన్నాలు, సమీకరణాలు భారతదేశ రాజకీయ పార్టీల కార్యాచరణలో ప్రధాన అంశాలుగా కొనసాగుతున్నాయి.
  8. సమర్థవంతమైన ప్రతిపక్షం లేకపోవటం: భారతదేశ రాజకీయ వ్యవస్థలో సమర్థవంతమైన ప్రతిపక్షం |లేకపోవటం ఒక ప్రధాన లోపంగా గోచరిస్తుంది.

AP Inter 2nd Year Civics Study Material Chapter 12 రాజకీయ పార్టీలు

ప్రశ్న 4.
భారతదేశంలో కాంగ్రెస్ పార్టీపై సంక్షిప్త సమాధానం వ్రాయండి.
జవాబు:
భారత జాతీయ కాంగ్రెస్ మన దేశంలో అతి ప్రాచీన పార్టీ. దీనిని 1885 డిశంబరు 28వ తేదీన బ్రిటిష్ సివిల్ సర్వెంట్. A.O. హ్యూమ్ స్థాపించాడు.

భారత జాతీయ కాంగ్రెస్ ఆసియా – ఆఫ్రికా ఖండాల్లో బాగా విజయవంతమైన జాతీయోద్యమాల్లో ఒక దానిని నిర్వహించింది. స్వాతంత్ర్యం సాధించిన తరువాత, దేశాన్ని పరిపాలించే బాధ్యతను కాంగ్రెస్ స్వీకరించింది. స్వతంత్ర భారతదేశంలో రెండు దశాబ్దాల పాటు పూర్తి స్థాయి రాజకీయ ఆధిపత్యాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రదర్శించింది. 1960వ దశకం చివరిభాగంలో కాంగ్రెస్ పార్టీ మొదటిసారిగా చీలిపోయింది. దాంతో కమ్యూనిస్టేతర పార్టీలు, కాంగ్రెస్ (ఒ)లు సంయుక్తంగా శ్రీమతి ఇందిరాగాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ (ఆర్)ను అధికారం నుండి తొలగించడానికి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. 1972లో జరిగిన ఎన్నికలలో శ్రీమతి ఇందిరాగాంధీ పూర్తి మెజారిటీ సాధించి తిరిగి అధికారంలోనికి వచ్చింది. అయితే కాంగ్రెస్ పార్టీ అనుసరించిన కొన్ని విధానాల వలన క్రమేణా దాని జనాకర్షణ తగ్గిపోయింది. దీంతో 1977లో పార్లమెంటుకు జరిగిన ఎన్నికల్లో చారిత్రాత్మక కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటిసారిగా ఓటమిని చవిచూచి, ప్రతిపక్షపార్టీ స్థాయికి దిగజారిపోయింది.

స్వాతంత్య్రానంతరం జరిగిన గత 15 సాధారణ ఎన్నికల్లో, కాంగ్రెస్ పార్టీ ఆరుసార్లు ఎన్నికల్లో స్పష్టమైన మెజారిటీ సాధించింది. నాలుగుసార్లు అధికార సంకీర్ణానికి నాయకత్వం వహించింది. మొత్తం దాదాపు 49 సంవత్సరాలపాటు కేంద్ర ప్రభుత్వానికి నాయకత్వం వహించింది. దీనిలో ప్రధాని జవహర్లాల్ నెహ్రూ మొదలుకొని (1947-64), ఇటీవలి మన్మోహన్ సింగ్ (2004-14) వరకు ఏడుగురు కాంగ్రెస్ ప్రధాన మంత్రులు దేశాన్ని పాలించారు. 2004 నుండి 2014 వరకు కాంగ్రెస్ నాయకత్వంలోని ఐక్య ప్రగతిశీల కూటమి (United Progres- sive Alliance – UPA) మన్మోహన్సంగ్ ప్రధానమంత్రిగా ఎన్నో ప్రాంతీయపార్టీలు సంకీర్ణంగా ప్రభుత్వాన్ని ఏర్పరచింది. 2014లో జరిగిన పదహారవ సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్వాతంత్య్రానంతరం మొదటిసారిగా హీనమైన ఓటమిని చివిచూచి, 543 మంది గల లోక్సభలో 44 స్థానాలకు పరిమితమైంది.

ప్రశ్న 5.
భారతీయ జనతా పార్టీ గురించి సంక్షిప్తంగా వివరించండి.
జవాబు:
భారతీయ జనతా పార్టీ (బిజెపి) ని 1980లో స్థాపించారు. భారతీయ జనతా పార్టీ 1951 అక్టోబర్ 21న శ్యాంప్రసాద్ ముఖర్జీ అధ్యక్షతన స్థాపించిన భారతీయ జనసంఘక్కు ఒక నూతన, సవరించిన స్వరూపంగా పేర్కొనవచ్చు. భారతీయ జనతా పార్టీ తన పూర్వపు జనసంఘ్్కు కొనసాగింపుగా క్రమశిక్షణ – చక్కని వ్యవస్థీకృత యంత్రాంగం, సంప్రదాయ హిందూ సాంఘిక – సాంస్కృతిక సంస్థలైన రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ (ఆర్ ఎస్ ఎస్), విశ్వహిందూ పరిషత్(వి హెచ్ పి) తదితర సంస్థలతో అనుబంధాన్ని కొనసాగిస్తూ వచ్చింది. ఏవో కొన్ని రాజకీయ దృక్పథాలు, విధాన స్వభావాలలో వైవిధ్యాలు మినహా, బిజెపికి తన పూర్వపు జనసంఘ్ ఎంతో సామీప్య అనుబంధం ఉంది.

జనసంఘ్ తన అస్థిత్వాన్ని రద్దు చేసుకొని, 1977 మే ఒకటో తేదీన జనతా పార్టీలో విలీనమైంది. అయితే కొంతకాలం తరువాత జనతాపార్టీలో చీలిక రావడంతో, పూర్వపు జనసంఘ్ నాయకులు, సభ్యులు కొద్దిమందితో కలిసి జనతా పార్టీని విడిచిపెట్టి, భారతీయ జనతా పార్టీ పేరుతో కొనసాగుతున్నారు.

ప్రశ్న 6.
భారతదేశంలో ప్రాంతీయ పార్టీల ప్రాధాన్యతను అంచనా వేయండి. [Mar. 17]
జవాబు:
అనేక ప్రాంతీయ పార్టీలు గణనీయమైన ప్రజా ఎన్నికల మద్దతుతో ముఖ్య రాజకీయ సంస్థలుగా సుస్థిరంగా కొనసాగుతున్నాయి. భారతదేశ సమాఖ్య ప్రజాస్వామిక రాజకీయ వ్యవస్థలో ప్రాంతీయపార్టీలు, స్థానిక పార్టీలు ఎంతో ఆవశ్యకంగా కొనసాగుతున్నాయి. ప్రధానంగా కొన్ని ఆధిపత్య, సాంఘిక, ఆర్థిక ప్రయోజనాల కోసం ఇవి తప్పనిసరి అవుతాయి. రాజకీయపార్టీలలో విస్తృతస్థాయి పాత్ర విషయంలో చాలా పార్టీలకు ప్రయోజిత వర్గాలు, ప్రభావ వర్గాల వలె సమరూప లక్షణాలు ఉంటాయి. జాతీయపార్టీలు నడిపే విస్తృత పాత్ర నేపథ్యంలో ప్రాంతీయపార్టీల ప్రభావం కొన్నిసార్లు ప్రభావవంతంగా, మరికొన్నిసార్లు బలహీనంగా ఉంటుంది. అనేక ప్రాంతీయపార్టీలు రాష్ట్ర ప్రభుత్వాల ఏర్పాటులో జాతీయపార్టీలకు సంకీర్ణ భాగస్వాములయ్యాయి. కొన్ని ప్రాంతీయ పార్టీలు స్థిరంగా ఉండి, కొన్ని రాష్ట్రాల్లో ప్రధాన రాజకీయ సంస్థలుగా పనిచేస్తున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా, పెరుగుతున్న ప్రాంతీయ పార్టీల మనుగడ నిస్సందేహంగా, భారతదేశంలో ఒక విశిష్ట రాజకీయ పరిణామానికి చెందిన అంశంగా పేర్కొనవచ్చు.

ప్రశ్న 7.
ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీపై ఒక సంక్షిప్త సమాధానం వ్రాయండి.
జవాబు:
1983వ సంవత్సరములో ఆకస్మాత్తుగా రాష్ట్ర రాజకీయ చిత్రపటంలో గణనీయమైన మార్పు వచ్చింది.
ఎన్.టి.రామారావు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ నూతన ప్రాంతీయ రాజకీయపార్టీగా ఆవిర్భవించింది. అప్పటికే కలతలతో, ముఠాలతో విడిపోయి ఉన్న కాంగ్రెస్ పార్టీని ఎన్నికల్లో మట్టి కరిపించింది. ఎన్. టి. రామారావు తెలుగు చలనచిత్ర రంగంలో ప్రఖ్యాత కథానాయకునిగా ఎంతో పేరు ప్రతిష్టలు గడించాడు. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఒక వేగుచుక్కవలె దూసుకురావడానికి ఎన్నో అంశాలు తోడ్పడ్డాయి. కాంగ్రెస్ పార్టీ ఎంతోకాలం అధికారంలో ఉండి అసమర్థతతో వ్యవహరించడంతో సామాన్య ప్రజల విశ్వసనీయతను కోల్పోయింది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను సరిగా నిర్వహించలేకపోవడం, ద్రవ్యోల్బణం, పెరుగుతున్న నిరుద్యోగాన్ని పట్టించుకోకపోవడం, పరిపాలన వ్యవస్థలో అన్ని స్థాయిల్లో అవినీతి వంటి అంశాలు ఆ పార్టీ పతనానికి దారితీసాయి. దీనికితోడు, తరచుగా ముఖ్యమంత్రుల మార్పుతో రాష్ట్రంలో నాయకత్వ శూన్యత ఏర్పడింది. ముఖ్యమంత్రులు, రాష్ట్ర మంత్రిమండలి కాంగ్రెస్ అధినాయకత్వం చేతిలో ఆట బొమ్మలుగా మారారు. దాంతో జాతీయ స్థాయిలో రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించి, ప్రాతినిధ్యం వహించే సామర్థ్యం రాష్ట్ర కాంగ్రెస్ నాయకులలో లేదనే అభిప్రాయం ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. ఆంధ్రుల ఆత్మగౌరవం దెబ్బతిందనే విషయాన్ని తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారంలో చాటి చెప్పింది.

AP Inter 2nd Year Civics Study Material Chapter 12 రాజకీయ పార్టీలు

2014లో జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 14వ శాసనసభ ఎన్నికలలో ఆ పార్టీ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో 174 స్థానాలకు 102 స్థానాలు సాధించి ప్రభుత్వాన్ని ఏర్పరచింది. శ్రీనారా చంద్రబాబునాయుడు విభజించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి అయ్యాడు.

ప్రశ్న 8.
తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అవతరణకు తోడ్పడిన పరిస్థితులను అంచనా వేయండి.
జవాబు:
ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షలు ప్రజల్లో సజీవంగా ఉన్నప్పటికీ, వాటిని నెరవేర్చే రీతిలో తీవ్రస్థాయిలో పోరాటం చేసే వేదిక అవతరించడానికి ఎంతో సమయం పట్టింది. 1990 దశకం మధ్యభాగంలో అనేక ప్రజాసంఘాలు, సంస్థలు ప్రత్యేక రాష్ట్ర అంశంపై సమావేశాలు ఏర్పాటు చేయడం మొదలుపెట్టాయి.

ఇదే తరుణంలో తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడు, మాజీమంత్రి డిప్యూటీ స్పీకర్గా ఉన్న సిద్దిపేట శాసనసభ్యుడు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్రావు, ఆనాడు నారా చంద్రబాబునాయుడు పెంచిన విద్యుత్ బిల్లులకు వ్యతిరేకంగా ఒక బహిరంగ లేఖ రాసినాడు. దానిలో పెంచిన విద్యుత్ బిల్లుల వలన తెలంగాణా ప్రాంత ప్రజలు, రైతులకు 80% తీవ్ర అన్యాయం జరుగుతుందని ఎదురు తిరుగుబాటుచేసి తెలంగాణావాదులకు కేంద్ర బిందువుగా మారినాడు. తెలంగాణావాదులు మేధావులు అందరూ తెలంగాణాకు జరుగుతున్న వివక్ష గురించి వివరించటం జరిగింది. దీనితో తెలంగాణా బలం గ్రహించిన కె.సి.ఆర్, కొన్ని వందల గంటలపాటు వివిధ వర్గాల వారితో చర్చించి తెలంగాణా రాష్ట్రమే ఏకైక ఎజెండాగా T.R.S. పార్టీ ఆవిర్భావానికి పునాది వేసినాడు.

కల్వకుంట్ల చంద్రశేఖరరావు (KCR) తెలంగాణ రాష్ట్ర సాధన అంశంపై 2000 సంవత్సరం మొదట్లో తన ప్రయత్నాలను ప్రారంభించాడు. 2001 మే నెల 17వ తేదీన కె. చంద్రశేఖరరావు తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటుచేసుకున్నట్లు ప్రకటించాడు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ మద్ధతును కె. చంద్రశేఖరరావు పొందాడు. 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో టి.ఆర్.ఎస్ (TRS) పార్టీ భారత జాతీయ కాంగ్రెస్తో మైత్రి ఏర్పరచుకొని తెలంగాణలో 26 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించడమే కాక, జాతీయ స్థాయిలో 5 పార్లమెంటు స్థానాల్లో విజయం పొందింది. అలాగే రాష్ట్రస్థాయిలో, కేంద్రంలో టి.ఆర్.ఎస్. (TRS) పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వంతో చేరింది. 2006 సెప్టెంబర్ నెలలో టి.ఆర్.ఎస్ (TRS) పార్టీ కేంద్ర ప్రభుత్వం నుండి వైదొలిగింది. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు విషయంలో ఎన్నికల వాగ్దానానికి అనుగుణంగా కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకోలేకపోవడాన్ని కారణంగా చూపి కేంద్రప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంది.

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
రాజకీయ పార్టీ విధులు. [Mar. ’17]
జవాబు:
రాజకీయ పార్టీ విధులు:

  1. సామాజిక ప్రయోజనాల సమీకరణ, వ్యక్తీకరణ,
  2. రాజకీయ భర్తీ బాధ్యతలు,
  3. ప్రజాభిప్రాయ సాధనాలుగా పనిచేయడం,
  4. రాజకీయ సామాజికీకరణ, పౌరుల భాగస్వామ్యాన్ని పెంపొందించటం.
  5. శాసనాలను రూపొందించటం,
  6. ప్రతిపక్ష పాత్రను పోషించటం,
  7. ప్రభుత్వ యంత్రాంగం, సంక్షేమ పథకాలను అమలుచేయటం,
  8. రాజకీయ వ్యవస్థకు న్యాయబద్ధతను చేకూర్చటం మొదలగునవి.

ప్రశ్న 2.
పార్టీ వ్యవస్థ రకాలు.
జవాబు:
పార్టీ వ్యవస్థను ముడు రకాలుగా పేర్కొంటారు. అవి:
1) ఏకపార్టీ వ్యవస్థ: ఈ వ్యవస్థలో ఒకే రాజకీయ పార్టీ ఉంటుంది.
ఉదా: జర్మనీలో నాజీ పార్టీ, ఇటలీలో ఫాసిస్ట్ పార్టీ.

2) రెండు పార్టీల వ్యవస్థ: ఈ వ్యవస్థలో రెండు రాజకీయ పార్టీలుంటాయి. ఉదా: ఇంగ్లాండులో లేబర్ పార్టీ మరియు కన్సర్వేటివ్ పార్టీలు.

3) బహుళ పార్టీ వ్యవస్థ: ఈ వ్యవస్థలో ఎక్కువ పార్టీలు ఉంటాయి. ఉదా: భారతదేశం, ఫ్రాన్స్

AP Inter 2nd Year Civics Study Material Chapter 12 రాజకీయ పార్టీలు

ప్రశ్న 3.
జాతీయ పార్టీలు.
జవాబు:
జాతీయ స్థాయిలో దేశమంతటా విస్తరించి జాతీయ అజెండాను రూపొందించుకొని రాజ్యాంగ పద్ధతుల ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు నిరంతరం కృషిచేసే ప్రజల స్వచ్ఛంద సంస్థ లేదా సమూహాన్ని జాతీయ పార్టీగా పేర్కొంటారు.
ఉదా: భారతదేశంలో కాంగ్రెస్, జనతాపార్టీ, భారత కమ్యూనిస్టు పార్టీ, భారతీయ జనతా పార్టీ మొదలగునవి.

ప్రశ్న 4.
ప్రాంతీయ పార్టీలు. [Mar. ’16]
జవాబు:
ప్రాంతీయ పార్టీలు భౌగోళిక, రాజకీయ, హేతుబద్ధమైన అంశాల ప్రాతిపదికగా అవతరిస్తాయి. సమాఖ్య వ్యవస్థలో జాతీయ పార్టీల నాయకుల ఆధిపత్య, సిరంకుశ ధోరణి, ప్రాంతీయ, రాష్ట్ర సమస్యలను నిర్లక్ష్యం చేయటం. రాష్ట్రస్థాయి నాయకశ్రేణిని అగౌరవపరచటం, అవమానించటం తదితర కారణాలు ప్రాంతీయ పార్టీల ఆవిర్భావానికి ముఖ్య కారణాలుగా చెప్పవచ్చు. ప్రాంతీయ పార్టీలు ఒక రాష్ట్రానికి పరిమితంగా తమ కార్యకలాపాలను కొనసాగిస్తాయి.
ఉదా: తెలుగుదేశం, తెలంగాణ రాష్ట్ర సమితి, ద్రవిడ మున్నేట్ర కజగం, ఆల్ ఇండియా అన్నా డి.ఎం.కె. మొదలగునవి.

ప్రశ్న 5.
డి.ఎం.కె.
జవాబు:
1949 వ సంవత్సరంలో సి. ఎస్. అన్నాదురై దాదాపు నాలుగింట మూడొంతులు అనుచర గణంతో ద్రవిడ కజగం నుండి వేరుపడి ద్రవిడ మున్నేట్ర కజగం (డి.ఎం.కె) అనే పార్టీని స్థాపించాడు. ఈ రాజకీయ పార్టీ తమిళుల గుర్తింపుపై దృష్టి నిలిపి, పార్టీ మౌళిక భావన అయిన బ్రాహ్మణ వ్యతిరేక వాదాన్ని చేపట్టింది. తరువాత ఎన్నికలలో క్రియాశీలంగా పాల్గొని తమిళనాడు రాష్ట్ర విధానసభలో బలీయమైన శక్తిగా అవతరించింది.

ప్రశ్న 6.
ఎ.ఐ.ఎ.డి.ఎం.కె.
జవాబు:
1972వ సంవత్సరంలో ఎం.జి. రామచంద్రన్ నాయకత్వంలో ఏర్పడిన అన్నా డి.ఎం.కె. పార్టీ తరువాత ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగంగా రూపాంతరం చెందింది. 1988వ సంవత్సరములో ఎం.జి. రామచంద్రన్ మరణం తరువాత ఎ.ఐ.ఎ.డి.ఎం.కె. పార్టీ జయలలిత నాయకత్వంలో బలపడి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పలుమార్లు ఘనవిజయం సాధించింది. నేడు ఆ పార్టీ నాయకురాలు కుమారి జయలలిత తమిళనాడు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు.

ప్రశ్న 7.
ఏకపార్టీ ఆధిపత్యం.
జవాబు:
స్వాతంత్ర్యానంతరం దేశరాజకీయాలలో కాంగ్రెస్ పార్టీ క్రియాశీల పాత్ర పోషించటంతో తరుచుగా భారతదేశాన్ని ఏకపార్టీ ఆధిపత్యం వ్యవస్థగా అభివర్ణించటం జరిగింది. ఈ పార్టీ సర్వసమ్మత పార్టీగా, అందరి సమీకృత ప్రయోజనాలే ముఖ్యంగా, భారతీయ సమాజానికి ప్రతిరూపంగా కాంగ్రెస్ పార్టీ జాతి ఆవశ్యక లక్షణాలన్నింటిని తనలో ప్రతిబింబించింది. అయితే కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం సంపూర్ణం కాదని కొద్దిమంది రాజకీయ విశ్లేషకులు పేర్కొంటారు.

ప్రశ్న 8.
బహుళ పార్టీ వ్యవస్థ. [Mar. ’16]
జవాబు:
దాదాపు ఒక భౌగోళిక ఖండం పరిమాణంలో విస్తరించిన దేశం. భిన్నభిన్న సంస్కృతుల స్వభావం, వయోజన ఓటుహక్కు విచిత్ర తరహా రాజకీయ ప్రక్రియ తదితర కారణాలు భారతదేశంలో బహుళ పార్టీ వ్యవస్థకు దారితీసినాయి. ప్రస్తుతం మన దేశంలో 6 జాతీయ పార్టీలు, 64 రాష్ట్రస్థాయి పార్టీలు, 1737 రిజిష్టర్ అయి గుర్తింపులేని పార్టీలు మన దేశంలో ఉన్నాయి.

AP Inter 2nd Year Civics Study Material Chapter 12 రాజకీయ పార్టీలు

ప్రశ్న 9.
బహుజన సమాజ్ పార్టీ.
జవాబు:
బహుజన సమాజ్ పార్టీ దళితులు ఆధిపత్యం కలిగిన పార్టీ. ఈ పార్టీ ఉద్యోగుల సమాఖ్య, దళిత్ శోషిత్ సమాజ్ సమితిల వీలినం ఫలితంగా ఏర్పడింది. కాన్షీరాం ఈ పార్టీ వ్యవస్థాపక నాయకుడు. మాయావతి ప్రస్తుతం ఈ పార్టీకి నాయకురాలుగా వ్యవహరిస్తున్నారు. ఈ పార్టీ భారత రాజకీయ వ్యవస్థలో జాతీయ పార్టీగా గుర్తింపు పొందింది. మాయావతి నాయకత్వంలో ఆ పార్టీ జనాకర్షణ క్రమేణా పెరుగుతూ వచ్చింది.

ప్రశ్న 10.
నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ.
జవాబు:
కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ అయిన శరద్ పవార్, పి.ఎ. సంగ్మా, తారిక్ అన్వర్ తదితరులు స్థాపించిన పార్టీయే నేషనలిస్ట్ కాంగ్రెస్. ఈ పార్టీ స్థాపన సమయంలో ఇండియన్ కాంగ్రెస్ (సోషలిస్ట్)ను తనలో విలీనం చేసుకుంది. భారత ఎన్నికల సంఘం నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీనీ జాతీయ పార్టీగా గుర్తించింది. మహారాష్ట్ర, మణిపూర్, మేఘాలయ మొదలగు రాష్ట్రాలలో ఈ పార్టీకి చెప్పుకోదగ్గ బలముంది.

AP Inter 2nd Year Civics Study Material Chapter 11 ఎన్నికలు – ప్రాతినిధ్యం

Andhra Pradesh BIEAP AP Inter 2nd Year Civics Study Material 11th Lesson ఎన్నికలు – ప్రాతినిధ్యం Textbook Questions and Answers.

AP Inter 2nd Year Civics Study Material 11th Lesson ఎన్నికలు – ప్రాతినిధ్యం

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
భారతదేశ ఎన్నికల వ్యవస్థపై ఒక వ్యాసం వ్రాయండి.
జవాబు:
పౌరులందరూ ప్రభుత్వం చేసే నిర్ణయాలన్నింటిలో ప్రత్యక్షంగా పాల్గొనే వీలులేదు. కాబట్టి ప్రజాప్రతినిధులు ప్రజలచే ఎన్నుకోబడి వారి కోరికలు, ఆకాంక్షలు నెరవేర్చుతారు. కావున ఎన్నికలకు విశేషమైన ప్రాధాన్యత ఉన్నది. భారతదేశం ఒక ప్రజాస్వామ్య దేశమని మనం అనుకున్నప్పుడు మన ఆలోచనలు గతంలో జరిగిన సార్వత్రిక ఎన్నికలవైపు మళ్ళుతాయి. నేడు ఎన్నికలు ప్రజాస్వామ్య ప్రక్రియకు ప్రతీకలుగా నిలిచాయి.

భారత ఎన్నికలవ్యవస్థ యొక్క ముఖ్య లక్షణాలు:
ఈ క్రింది ముఖ్యలక్షణాలు భారతదేశంలోని ఎన్నికల వ్యవస్థ యొక్క నిర్మాణాన్ని మరియు నిర్వహణను విశదీకరిస్తున్నాయి. అవి:
1) ప్రజాప్రతినిధుల ప్రత్యక్ష ఎన్నిక: భారతదేశంలోని ప్రజలు తమ ప్రజాప్రతినిధులను ప్రత్యక్షంగా ఎన్నుకొనుటకు రాజ్యాంగం వీలుకల్పించింది. పార్లమెంటు సభ్యులను, రాష్ట్ర శాసనసభలకు, పట్టణ, నగరపాలక సంస్థలు గ్రామ పంచాయితీ సభ్యులను ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకుంటున్నారు. భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈ శాసనసభలు ప్రజల అధికారానికి ముఖ్యకేంద్రాలు.

2) కొన్ని సంస్థలకు పరోక్ష ఎన్నికలు: రాజ్యసభ, రాష్ట్రాలవిధానమండలు, రాష్ట్రపతి మరియు ఉపరాష్ట్రపతి ఎన్నికలకు రాజ్యాంగం పరోక్ష ఎన్నికలకు అవకాశం కల్పించింది. ఆయా సంస్థలకు, పదవులకు పరోక్షంగా నైష్పత్తిక ప్రాతినిధ్య ఓటు పద్ధతిలో ఎన్నికలు నిర్వహించబడతాయి.

3) వయోజన ఓటు హక్కు: భారత రాజ్యాంగం పౌరులందరికి వయోజన ఓటుహక్కును కల్పించినది. 21 సంవత్సరములు నిండిన పౌరులందరికీ కుల, మత, జాతి, లింగవివక్షత లేకుండా ఓటుహక్కును కల్పించినది. ఆ తరువాత ఓటు హక్కుకు అర్హత వయస్సు 21 నుండి 18 సంవత్సరములకు తగ్గించడం జరిగినది. నేడు భారతదేశంలో 18 సంవత్సరములు నిండిన పౌరులందరి పేర్లు ఓటర్ల జాబితాలలో చేర్చబడి వారు స్వేచ్ఛగా తమ ఓటుహక్కు వినియోగించుకొనేందుకు అర్హత లభించింది.

4) షెడ్యూల్డ్ కులాలు, తెగలకు సీట్ల కేటాయింపులో ప్రాతినిధ్యం: షెడ్యూల్డ్ కులాలు, తెగల అభీష్టాన్ని పరిరక్షించేందుకు భారతరాజ్యాంగం వారికి పార్లమెంటు, శాసనసభ సీట్ల కేటాయింపులో ప్రత్యేక ప్రాతినిధ్యం కల్పించింది. రాజ్యాంగంలోని 330 ప్రకరణ లోక్సభలోని సీట్లు, 332 ప్రకరణ రాష్ట్రశాసనసభలలోని సీట్లు కేటాయింపులో ఆయాతరగతులకు ప్రాతినిధ్యం కల్పించాలని పేర్కొన్నది. వారికి కేటాయించిన స్థానాలలో ఆయా తెగలకు చెందిన అభ్యర్థులు మాత్రమే పోటీ చేయాలి.

AP Inter 2nd Year Civics Study Material Chapter 11 ఎన్నికలు - ప్రాతినిధ్యం

5) నియామకపు ప్రతిపాదనలు: భారతరాజ్యాంగంలోని 337 ప్రకరణం పార్లమెంటులోని లోక్సభకు రాష్ట్రపతి ఇద్దరు ఆంగ్లో ఇండియన్లను నియమించి చెయ్యవచ్చును. ఇదే పద్ధతిలో గవర్నర్ రాష్ట్రశాసన సభకు ఒక ఆంగ్లో ఇండియన్ను నియమించే అధికారం ఉంది.

6) ఓటరు జాబితాల సవరణ: భారతదేశంలో ప్రతి 10 సంవత్సరాలకు ఒక సారి ఓటర్లనమోదు, ఓటరు జాబితాల సవరణ, తయారీ ప్రక్రియలను భారత ఎన్నికల సంఘం చేపడుతుంది. అంతేగాక ప్రతిసాధారణ ఎన్నికలకు ముందుగా ఎన్నికల జాబితాల సవరణ, కొత్త ఓటర్ల నమోదు కార్యక్రమాలకు ఎన్నికల సంఘం ఆదేశిస్తుంది. ప్రతి ఏడాది ఓటరు జాబితాల సవరణకు కూడా అవకాశం ఉన్నది. ఓటరు జాబితాలో ఎవరి పేరు నమోదు కాబడిందో వారు మాత్రమే ఎన్నికల తేదీన ఓటు హక్కు వినియోగించుకొనేందుకు అర్హులు.

7) ప్రాదేశిక, ఏక సభ్య నియోజకవర్గాలు: భారత ఎన్నికల వ్యవస్థ ఏక సభ్య ప్రాదేశిక నియోజకవర్గాల ఏర్పాటుకు అవకాశం కల్పించింది. నిర్దేశించబడిన ప్రతిపాదిత ప్రాంతంలో నివశించే ఓటర్లు అందర్నీ కలిపి ఒక నియోజకవర్గంగా పరిగణిస్తారు. ఇలాంటి ఒక నియోజకవర్గం నుండి ఒకే ప్రతినిధిని ఓటర్లు ఎన్నుకోవలసి ఉంటుంది. దేశంలోని అన్ని రాష్ట్రాలూ శాసన, పార్లమెంటు నియోజకవర్గాలుగా విభజించబడ్డాయి. ప్రతీ నియోజకవర్గం నుండి ఒక శాసనసభ్యుడ్ని, పార్లమెంటు సభ్యుడ్ని ఓటర్లు ఎన్నిక చేసుకుంటారు. వీటిలో కొన్ని నియోజకవర్గాలు షెడ్యూలు కులాలు, తెగలకు కేటాయిస్తారు. `ఆయా నియోజకవర్గాలలో ఆ తెగలకు, కులాలకు చెందిన అభ్యర్థులను మాత్రమే ఎన్నిక చేసుకోవాలి.

8) నియోజకవర్గాల పునర్విభజన: ప్రతి పది సంవత్సరములకు జనాభాలెక్కల ఆధారంగా నియోజకవర్గాలు పునర్విభజన చేయబడుతాయి. దీనికొరకు నియోజ వర్గాల పునర్విభజన సంఘం ఏర్పాటు చేయబడుతుంది. ఈ సంఘం ప్రతిపాదనల మేరకు నియోజకవర్గాలు పునర్విభజన చేయబడవచ్చు లేదా ఒకదానిలో ఒకటి కలపవచ్చు. ఈ విషయంలో నియోజకవర్గాల పునర్విభజన సంఘం నిర్ణయమే అంతిమం. ఈ సంఘం యొక్క నిర్ణయాన్ని ఏ న్యాయస్థానంలోనూ సవాలు చేయుటకు వీలులేదు.

9) రహస్య బ్యాలెట్ పద్ధతి: ఓటర్లు ఓటును స్వేచ్ఛగా తమ అభీష్టం మేరకు వినియోగించుకొనేందుకు రహస్య ఓటింగుకు వీలు కల్పించింది. ఎన్నికలలో ఓటర్లు తమ ఓటుహక్కును నిర్భయంగా, రహస్యంగా వినియోగించుకొనేందుకు, దొంగ ఓట్లు వేసేవారిని గుర్తించేందుకు ప్రత్యేకమైన చర్యలు, తీసుకున్నారు. ఇటువంటి విధానం ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు చాలా అవసరం.

10) ఓటింగు యంత్రాలను ప్రవేశపెట్టడం: భారత ఎన్నికల సంఘం ఎన్నికలలో ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకొనేందుకు, ఓట్ల లెక్కింపుకు ఓటింగు యంత్రాలను ప్రవేశపెట్టింది. వీటిని ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు అంటారు. ఓటింగులో బ్యాలెట్ పత్రాలకు బదులుగా ఓటింగు యంత్రాలను వినియోగించడమైంది.

11) పరస్పర ఆధిక్యత ఓటు పద్ధతి: ప్రతీ నియోజకవర్గంలోనూ ఎన్నికలలో తోటి అభ్యర్థుల కన్నా ఎక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థిని ఎన్నిక కాబడిన ప్రజాప్రతినిధిగా ప్రకటిస్తారు. ఈ పద్ధతిలో ఓట్ల లెక్కింపుకు అర్హత కల్గిన ఓట్లను మాత్రమే పరిగణనలోనికి తీసుకుంటారు. ఒక అభ్యర్థి విజయాన్ని ఆ అభ్యర్థితో పోటీపడిన అభ్యుర్థులకు వచ్చిన ఓట్లకన్నా ఎక్కువగా వచ్చిన ఓట్లను బట్టి నిర్దేశింపబడుతుంది. అంటే తోటి అభ్యర్థుల కన్నా ఏ అభ్యర్థికైతే ఎక్కువ ఓట్లు పోలౌతాయో ఆ అభ్యర్థి గెలుపొందినట్లు లెక్క

2) స్వయంప్రతిపత్తి కలిగిన యంత్రాంగం: రాజ్యాంగంలోని 324 ప్రకరణ ప్రకారం దేశంలోని ఎన్నికల నిర్వహణ భారత ఎన్నికల సంఘం యొక్క ముఖ్యబాధ్యత. ఎన్నికలను స్వతంత్రంగా, స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు రాజ్యాంగబద్ధంగా ఏర్పాటు చేయబడిన స్వయంప్రతిపత్తి కలిగిన రాజ్యాంగ వ్యవస్థ భారత ఎన్నికల సంఘం.

ప్రశ్న 2.
భారత ఎన్నికల సంఘం విధులను వివరించండి.
జవాబు:
భారత రాజ్యాంగంలోని ప్రకరణ 324(1) ప్రకారం పార్లమెంటు, రాష్ట్ర శాసనసభలు, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతులకు సంబంధించిన ఎన్నికలను పర్యవేక్షించి, నిర్వహించుటకై ఎన్నికల సంఘం ఏర్పాటు కొరకు వీలుకల్పించాయి.

భారత ఎన్నికల సంఘం రాజ్యాంగబద్ధంగా ఏర్పాటు చేయబడిన శాశ్వతమైన స్వయం ప్రతిపత్తి కలిగిన వ్యవస్థ. నిర్మాణం: భారత ఎన్నికల సంఘం ఒక ప్రధాన ఎన్నికల కమీషనర్ మరియు ఇద్దరు ఎన్నికల కమీషనర్లను కలిగి బహుళ సభ్య వ్యవస్థగా పనిచేయుచున్నది.

నియామకం: ప్రధాన ఎన్నికల కమీషనర్ మరియు ఇతర కమీషనర్లను భారత రాష్ట్రపతి నియమిస్తారు. పదవీకాలం: భారత ప్రధాన ఎన్నికల కమీషనర్ మరియు ఇద్దరు ఎన్నికల కమీషనర్లు 6 సంవత్సరములు లేదా 65 సంవత్సరమలు వయస్సు నిండే వరకు పదవిలో కొనసాగుతారు.

ఎన్నికల సంఘం విధులు: భారత రాజ్యాంగంలోని 324 నుండి 328 వరకు గల ప్రకరణలు ఎన్నికల సంఘం యొక్క ఏర్పాట్లు, అధికారాలు, విధులను విశదీకరిస్తున్నాయి. అవి.

  1. భారత ఎన్నికల సంఘం నిర్ణీత కాలవ్యవధిలో ఓటర్ల జాబితాలను సవరిస్తుంది.
  2. ఓటర్ల జాబితాలు నమోదు చేయబడ్డ అర్హత కలిగిన ఓటర్ల పేరులో తప్పులు లేకుండా తయారుచేయటం ఎన్నికల సంఘం విధి.
  3. ఎన్నికల నిర్వహణకు ఎన్నికల తేదీ, ఇతర వివరాలతో ఎన్నికల ప్రకటన, అభ్యర్థుల నామినేషన్ పత్రాల పరిశీలన కూడా నిర్వహిస్తుంది.
  4. ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు తగిన నిర్ణయాలు తీసుకునే అధికారం ఉంది.
  5. ఎన్నికల నిర్వహణ, ప్రశాంతతకు భంగం కలిగినట్లయితే దేశం మొత్తం ఎన్నికలను, లేదా కొన్ని రాష్ట్రాలలో లేదా రాష్ట్రంలో, కొన్ని నియోజకవర్గాలు లేదా నియోజకవర్గంలో ఎన్నికలను రద్దు చేయవచ్చు లేదా వాయిదా వేయవచ్చును.
  6. పార్టీలకు, ఎన్నికలలో పోటీచేయు అభ్యర్థులకు ఎన్నికల నియమావళిని వర్తింపచేస్తుంది.
  7. ఏదో ఒకటి లేదా కొన్ని నియోజకవర్గాలలో తిరిగి ఎన్నికల నిర్వహణకు ఆజ్ఞలు జారీ చేయవచ్చును.
  8. ఎన్నికల లెక్కింపు ప్రక్రియ సవ్యంగా జరగలేదని భావిస్తే ఎన్నికల సంఘం తిరిగి ఓట్ల లెక్కింపునకు ఆదేశించవచ్చును.
  9. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీకి ఎన్నికల గుర్తులు కేటాయించటం, రాజకీయ పార్టీలకు గుర్తింపునివ్వటం ఎన్నికల సంఘం ముఖ్యవిధి.
  10. రాష్ట్రపతి పాలన సమయంలో రాష్ట్రాలలో ఎన్నికల నిర్వహణకు రాష్ట్రపతికి ఎన్నికల సంఘం సలహాలనిస్తుంది.
  11. రాష్ట్ర శాసనసభలో సభ్యుల అర్హత లేదా అనర్హత విషయాలలో రాష్ట్ర గవర్నర్కు సలహాలిస్తుంది.

ప్రశ్న 3.
ప్రాతినిధ్యం అనగానేమి ? భారతదేశంలో ఎన్ని రకాల ప్రాతినిధ్య వ్యవస్థలు ఉన్నాయో తెలపండి.
జవాబు:
ప్రాతినిధ్యం – అర్థం: ఆధునిక ప్రజాస్వామ్య దేశాలు ప్రజలచే ఎన్నుకోబడిన ప్రతినిధులచే ఏర్పడిన ప్రాతినిధ్య లేదా పరోక్ష ప్రజాస్వామ్య దేశాలుగా కొనసాగుతున్నాయి. ఆధునిక ప్రజాస్వామ్య దేశాలు ప్రత్యక్ష ప్రజాస్వామ్య లేదా |ప్రాతినిధ్య ప్రజాస్వామ్య ప్రభుత్వాలను కలిగి ఉంటున్నాయి. ఇలాంటి వ్యవస్థలో ప్రజలు తమకు బదులుగా శాసనాల తయారీ కొరకు ప్రతినిధులను ఎన్నుకుంటారు. ఈ ప్రతినిధులు శాసనసభలో ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తారు. భారతదేశంలో అమలులో ఉన్న ప్రాతినిధ్య వ్యవస్థలు:

AP Inter 2nd Year Civics Study Material Chapter 11 ఎన్నికలు - ప్రాతినిధ్యం

భారతదేశంలో రెండు రకాల ప్రాతినిధ్య వ్యవస్థలు లేదా పద్ధతులు ఉన్నాయి. అవి:

  1. ప్రాదేశిక ప్రాతినిధ్య పద్ధతి
  2. వృత్తి ఆధారిత ప్రాతినిధ్య పద్ధతి.

1) ప్రాదేశిక ప్రాతినిధ్య పద్ధతి: ప్రాదేశిక ప్రాతినిధ్య పద్ధతిలో దేశంలోని ఓటరులందరినీ వివిధ ప్రాదేశిక నియోజకవర్గాలుగా విభజించి, ప్రతి నియోజకవర్గం నుండి ఒకరు లేదా అంతకన్నా ఎక్కువ ప్రతినిధులను ఓటర్లు ఎన్నుకుంటారు. అన్ని ప్రాదేశిక నియోజకవర్గాలు దాని పరిమాణంలోగాని, జనాభా సంఖ్యలో గాని సుమారుగా ఒకే విధంగా ఉంటాయి. నియోజకవర్గంలో నివసించే ఓటరులందరూ తమ ప్రజాప్రతినిధి ఎన్నికప్రక్రియలో భాగస్వామ్యులౌతారు. ప్రాదేశిక నియోజకవర్గం నుండి ఒకే ప్రజాప్రతినిధి ఎన్నిక కాబడితే అది ఏకసభ్య నియోజకవర్గంగా పరిగణిస్తారు. అలాకాక ఒక నియోజక వర్గం నుండి ఒకరికన్నా ఎక్కువమంది ప్రతినిధులు ఎన్నికైతే దానిని బహుళ సభ్య నియోజక వర్గం అంటారు. భారతదేశం లాంటి ఆధునిక ప్రజాస్వామ్య దేశాలలో దిగువసభ సభ్యుల ఎంపిక కొరకు ఏకసభ్య ప్రాదేశిక నియోజకవర్గ పద్దతిని అనుసరిస్తున్నారు.

2) వృత్తి ఆధారిత ప్రాతినిధ్య పద్ధతి: పౌరులు చేసే వృత్తుల ఆధారంగా ఇటువంటి నియోజకవర్గాలు ఏర్పాటవుతాయి. ఇటువంటి నియోజకవర్గాలలో పౌరులు ఒకే రకమైన వృత్తి లేదా సమాన లక్షణాలు కలిగిన వృత్తులలో నిమగ్నమై ప్రాదేశిక ప్రాంతంలో నివాసముంటారు. వైద్యులు, వ్యవసాయదారులు, వ్యాపారులు, పత్రికా విలేకరులు, న్యాయవాదులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు, శ్రామికులు తదితరులు వివిధ రకాల వృత్తి సంఘాల్ని కలిగి ఉంటారు. ఒకే వ్యక్తి అన్ని రకాల వృత్తులకు ప్రాతినిధ్యం వహించలేడు కనుక వృత్తి లేదా పని ఆధారంగా ప్రాతినిధ్యం ఉండాలి. ఇక చట్టసభలు వివిధ రకాల వృత్తుల సమూహాలకు ప్రాతినిధ్యం వహిస్తే, ఆ సభ వివిధ రకాల ప్రజాభీష్టాన్ని ప్రతిబింబిస్తూ వాటిని వ్యక్తీకరిస్తుంది. కాని అసంఖ్యాకమైన వృత్తులు, పనులను నిర్వహిస్తున్న అపరిమితమైన సమూహాలున్న దేశంలో అన్ని వృత్తుల వారికి, సమూహాలకు ప్రాతినిధ్యం కల్పించటం సాధ్యం కాదని చెప్పవచ్చు.

ప్రశ్న 4.
భారత ఎన్నికల వ్యవస్థను సంస్కరించాల్సిన అవసరం ఉందని నీవు భావిస్తున్నావా ?
జవాబు:
భారతదేశంలో ఎన్నికల వ్యవస్థ, యంత్రాంగం, ఎన్నికల ప్రక్రియలను పరిశీలించి సంస్కరణలను ప్రతిపాదించుటకై అనేక కమిటీలు, కమిషన్లను భారత ప్రభుత్వం నియమించింది. అందులో కొన్నింటిని క్రింద పేర్కొనడం జరిగింది.

  1. 1974 తార్కుండై కమిటీని నియమించగా అది 1975లో తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది.
  2. 1990లో ఎన్నికల సంస్కరణల కొరకు దినేష్ గోస్వామి కమిటీని నియమించడమైంది.
  3. రాజకీయాలు, నేరాల మధ్య సంబంధాల అధ్యయనం కోసం 1993 సంసత్సరంలో ఓహ్రా కమిటీ నియామకం జరిగింది.
  4. ఎన్నికలలో రాజకీయ నిధుల అధ్యయనం కొరకు 1998 సంవత్సరంలో ఇంద్రజిత్ గుప్తా కమిటీ నియమించబడింది.

ఎన్నికల సంస్కరణలు:
పైన పేర్కొన్న వివిధ కమిటీలు ఎన్నికల సంస్కరణల కొరకు అనేక సూచనలు, సంస్కరణలు ప్రతిపాదించాయి. వాటిలో ముఖ్యమైనవిగా ఈ క్రింది వాటిని పేర్కొనవచ్చు. అవి.
1) ఓటు అర్హత వయస్సు తగ్గింపు:
ప్రాతినిధ్యం లేని యువతకు ఓటుహక్కు కల్పించేందుకు రాజ్యాంగం (61వ సవరణ) చట్టం 1998 ద్వారా ఓటుహక్కు వయస్సును 21 సంవత్సరాల నుండి 18 సంవత్సరాలకు తగ్గించడమైంది.

2) ఎన్నికల సంఘానికి ఉద్యోగుల బదిలీ: ఎన్నికల సమయాలలో ఓటర్ల జాబితా తయారీ, సవరణ మరియ తప్పులు సరిదిద్దడం వంటి విధుల నిర్వహణకు అధికారులు మరియు ప్రభుత్వ సిబ్బందికి 1988 నుండి ఎన్నికల సంఘంకు తాత్కాలికంగా బదిలీ చేయడమైంది. ఆ ఉద్యోగులు ఎన్నికల సమయాలలో ఎన్నికల సంఘం నియంత్రణ, పర్యవేక్షణా పరిధిలో ఉంటారు.

3) ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు:
ఎన్నికలలో ఎలక్ట్రానిక్ ఓటింగు యంత్రాలను (Electronic Voting Machines) వినియోగించేందుకు 1989లో అవకాశం కల్పించుట జరిగినది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఢిల్లీ శాసనసభ ఎన్నికల కొరకు 1998 సంవత్సరంలో మొట్టమొదట ప్రయోగాత్మకంగా కొన్ని నియోజక వర్గాలలో ఎలక్ట్రానిక్ ఓటింగు యంత్రాలు ఉపయోగించడమైంది. దేశం మొత్తానికి 1999 సాధారణ ఎన్నికలలో మొదటిసారిగా ఎలక్ట్రానిక్ ఓటింగు యంత్రాలను ఉపయోగించుట జరిగినది.

4) మద్యం అమ్మకాలపై నిషేధం:
ఫలహార లేదా భోజనశాలలో గాని, ప్రభుత్వ ప్రయివేటు ప్రదేశాలలో గాని ఎన్నికల గడువు ముగియడానికి 48 గంటల ముందునుండి మద్యంగాని లేదా ఇతర మత్తుపానీయాలు గాని విక్రయించుట, పంపిణీ చేయుట, ఓటర్లకు అందించుట చేయరాదు. ఎవరైనా ఈ నిబంధన అతిక్రమించినట్లయితే వారు శిక్షార్హులుగా పరిగణించబడి శిక్షించబడటం జరుగుతుంది.

5) అభ్యర్థులు రెండు నియోజక వర్గాలలో పోటీకి పరిమితం చేయటం:
సాధారణ ఎన్నికలు లేదా ఉపఎన్నికలలో పార్లమెంటు, శాసనసభ నియోజకవర్గాలలో ఒకేసారి రెండు నియోజకవర్గాల కంటే ఎక్కువ నియోజకవర్గాలలో అభ్యర్థులు పోటీ చేయరాదు. ఇదే తరహా పరిమితి రాజ్యసభ, శాసనమండలి ఎన్నికలలో కూడా వర్తిస్తుంది.

6) ఆయుధాలపై నిషేధం:
పోలింగు కేంద్రం సమీపంలో గాని, పోలింగు కేంద్రం లోపలికి గాని ఏ రకమైన ఆయుధాలతో ఎవరు ప్రవేశించరాదు లేదా సంచరించరాదు. అలా చేసినచో అది నేరంగా పరిగణిస్తూ రెండు సంవత్సరాల జైలుశిక్ష లేదా కొంత మొత్తం అపరాధ రుసుము లేదా రెండూ విధించవచ్చును. అంతేగాక ఆ ఆయుధానికి సంబంధించిన లైసైన్సు కూడా రద్దు చేయబడుతుంది.

AP Inter 2nd Year Civics Study Material Chapter 11 ఎన్నికలు - ప్రాతినిధ్యం

7) ఎన్నికల ప్రచార సమయం కుదింపు:
ఎన్నికలలో పోటీచేయు అభ్యుర్థుల నామినేషన్ పత్రాల ఉపసంహరణ గడుపునుండి పోలింగు తేది మధ్యగల కనీస వ్యవధి 20 రోజుల నుండి 14 రోజులకు కుదించడమైంది.

8) పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్:
కొందరు వ్యక్తులు తమ ఓటును పోస్టల్ బ్యాలెట్ ద్వారా వినియోగించేందుకు అవకాశం 1999 సంవత్సరంలో కల్పించబడింది. ఎన్నికల సంఘంచే గుర్తించబడిన కొన్ని వర్గాల వ్యక్తులు తమ ఓటుహక్కును సంబంధిత నియోజకవర్గాల ఎన్నికలలో పోస్టల్ బ్యాలెట్ ద్వారా మాత్రమే వినియోగించుకోవాలి.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ఎన్నికల విధులపై లఘటీక రాయండి.
జవాబు:
ఎన్నికల విధులు: ఎన్నికల విధులను నాలుగు రకాలుగా వర్గీకరించారు. అవి 1) రాజకీయ ఎంపిక 2) రాజకీయ భాగస్వామ్యం 3) మద్దతును అందించడం, కొనసాగించడం 4) అనుబంధ విధులు.

1) రాజకీయ ఎంపిక:
ఎన్నికలను ప్లెబిసైట్, రిఫరెండం లేదా ప్రజానిర్ణయం వంటి వాటిని వివరించడానికి ఉపయోగిస్తారు. ఎన్నికలు ప్రజలు తమ నాయకుల్ని ఎన్నిక చేసుకొనేందుకు, జనేచ్ఛను నిర్ణయించడానికి ఎన్నికలు కీలకమైన సాధనాలుగా ఉంటాయి. అధికారం చట్టబద్ధంగా బదలాయించడానికి, శాంతిని పరిరక్షించడానికి ఎన్నికలు సహాయపడతాయి.

2) రాజకీయ భాగస్వామ్యం:
ఎన్నికల అతిపెద్ద విధి ప్రజలకు రాజకీయ భాగస్వామ్య అవకాశాల్ని, మార్గాల్ని కల్పించడం, ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల రాజకీయ భాగస్వామ్యం అతిముఖ్యమైనది. కావున ఎన్నికలకు ఇది కేంద్రబిందువు. ప్రజల భాగస్వామ్యమే ప్రజాస్వామ్య వ్యవస్థకు బలం.

3) నిర్మాణ సహకారం – వ్యవస్థ నిర్వహణ:
ఒక రాజకీయ వ్యవస్థకు ఎన్నికలు చట్టబద్ధతను, రాజకీయ స్థిరత్వాన్ని, సమైక్యతను, గుర్తింపును కల్పించటం ద్వారా సహకరిస్తాయి. కాబట్టి ఎన్నికలు రాజకీయ వ్యవస్థ సహాయం అందించేవి మాత్రమేగాక దానిని నియంత్రించగలిగే కారకంగా చెప్పవచ్చును.

4) అనుబంధ విధులు:
ప్రభుత్వానికి మరియు ప్రజలకు మధ్య రాజకీయ సమాచారాన్ని అందించే ముఖ్యప్రతినిధులు ఎన్నికలే. ప్రజలు తమ రాజకీయ ప్రతినిధులతో ప్రత్యక్ష సంబంధాన్ని కలిగి ఉండేందుకు ఎన్నికలు దోహదపడతాయి.

ప్రశ్న 2.
భారత ఎన్నికల ప్రక్రియను గూర్చి చర్చించండి.
జవాబు:
భారతదేశంలో పార్లమెంటులోని లోక్సభ (దిగువసభ) మరియు రాష్ట్ర విధానసభల సభ్యులను ఎన్నుకునేందుకై చేపట్టే సాధారణ ఎన్నికల నిర్వహణ ప్రపంచంలోనే పెద్ద ప్రక్రియగా చెప్పవచ్చు. ప్రతి ఐదుసంవత్సరాలకు రాష్ట్రపతి అదేశానుసారం ఎన్నికల ప్రకటన విడుదలవుతుంది. దేశంలోని ఓటర్లు తమ ప్రతినిధులను ఎంపిక చేసుకొనేందుకు రాష్ట్రపతి, రాష్ట్ర గవర్నర్లు ఎన్నికల నోటిఫికేషన్లు ఇస్తారు. లోక్సభ, విధానసభల స్థానాలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించవచ్చు లేదా వేర్వేరు సమయాలలోనూ నిర్వహించవచ్చు.

భారతదేశంలో ఎన్నికల ప్రక్రియ వివిధ దశలలో నిర్వహించబడుతుంది. అవి:
1) నియోజక వర్గాల పునర్విభజన: ఎన్నికల ప్రక్రియలో మొదటి దశ నియోజక వర్గాల పునర్విభజనతో మొదలౌతుంది. రాష్ట్రపతిచే నియమితమైన నియోజకవర్గాల పునర్విభజనసంఘం ప్రతి పదిసంవత్సరాలకు నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను చేపడుతుంది. సాధారణంగా లోక్సభ నియోజవర్గం ఆరు లేక ఏడు శాసనసభ నియోజకవర్గాలలో కలిపి ఉంటుంది.

2) రాజకీయ పార్టీల గుర్తింపు: దేశంలోని రాజకీయ పార్టీలన్నీ ఎన్నికల సంఘం గుర్తింపు పొందాల్సి ఉంటుంది. ఎన్నికలలో పొందిన ఓట్ల శాతం ఆధారంగా పార్టీలను జాతీయ లేదా ప్రాంతీయ పార్టీలుగాను, లేదా నమోదు చేయబడి గుర్తింపు లేని పార్టీలుగాను వర్గీకరిస్తుంది. అలాగే పార్టీలకు ఎన్నికల గుర్తులను కేటాయిస్తుంది.

3) ఓటరు గుర్తింపు కార్డులు: ఓటరు జాబితాలు తప్పులు లేనివిగా తీర్చిదిద్దటం, ఎన్నికలలో అక్రమాలకు అడుకట్టవేయటం కొరకు ఎన్నికల సంఘం దేశంలోని అర్హతకలిగిన అందరు ఓటర్లకు ఓటరు గుర్తింపు కార్డులు ఆగష్టు 1993 నుండి జారీచేయటం జరిగింది.

4) ఓటర్ల జాబితాలు: ఎన్నికల నిర్వహణకు దేశంలోని అర్హత కలిగిన ఓటర్ల పేరుతో నియోజకవర్గాల వారీగా ఓటర్ల జాబితాలను తయారు చేయటం ముఖ్యమైన విధి. ప్రతి పది సంవత్సరాలకు జరిపే జనాభా లెక్కలు ఆధారంగా ఓటర్లు జాబితాలు సవరించబడతాయి.

5) ఎన్నికల ప్రకటన – రిటర్నింగ్ అధికార్ల నియామకం: ప్రతీసాధారణ ఎన్నికల నిర్వహణకు రాష్ట్రపతి ఎన్నికలసంఘానికి ఆజ్ఞలు జారీ చేస్తారు. వెంటనే ఎన్నికల సంఘం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదించి ఎన్నికలతేదీలు, నామినేషన్లు దాఖలు, ఉపసంహరణ తేదీలు ప్రకటిస్తుంది. వివిధ నియోజకవర్గాల ఎన్నికల నిర్వహణకు రిటర్నింగ్ అధికారాలను ఎన్నికల సంఘం నియమిస్తుంది.

6) నామినేషన్ పత్రాల దాఖలు చేయుట: ఎన్నికలలో పోటీ చేయ్యాలనుకొనే అభ్యర్థులు తమతమ నియోజకవర్గాలలోని రిటర్నింగ్ అధికారులకు తమ నామినేషన్ పత్రాలు దాఖలు చేయవలసి ఉంటుంది. ఎన్నికల సంఘంచే ఇవ్వబడిన నామినేషన్ పత్రాలను పూర్తివివరాలతో అభ్యర్థులు సమర్పించాల్సి ఉంటుంది. పార్టీ తరపున పోటీచేయు అభ్యర్థుల పేర్లను ఇద్దరు ప్రతిపాదించాల్సి వుంటుంది.

7) నామినేషన్ పత్రాల పరిశీలన: నామినేషన్ పత్రాల దాఖలుకు గడువు పూర్తయిన వెంటనే అభ్యర్థులు లేదా వారి అనుమతి పొందిన వ్యక్తుల సమక్షంలో సంబంధిత నియోజకవర్గాలలోని రిటర్నింగ్ అధికారులు అభ్యర్థులందరి నామినేషన్ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలిస్తారు.

8) నామినేషన్ల ఉపసంహరణ: నామినేషన్ పత్రాల పరిశీలనానంతరం ఎన్నికల సంఘం ప్రకటించిన తేదీ, సమయంలోపుగా అభ్యర్థులు స్వచ్ఛందంగా తమ నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చును.

AP Inter 2nd Year Civics Study Material Chapter 11 ఎన్నికలు - ప్రాతినిధ్యం

9) ఎన్నికల ప్రచారం: ఎన్నికల ప్రక్రియలో తరువాత దశ ఎన్నికల ప్రచారం. పోటీలో నిలిచిన అభ్యర్థులు, పార్టీలు తమ గెలుపు కోరుతూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తారు. రాజకీయ పార్టీలు తమ విధానాలు, కార్యక్రమాలు, వాగ్దానాలుతో కూడిన ఎన్నికల ప్రణాళికలను (Election Manfesto) విడుదల చేస్తారు.

10) ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు: బ్యాలెట్ పత్రాలకు, బ్యాలెట్ పెట్టెలకు ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రానిక్ ఓటింగు యంత్రాలను ఉపయోగించటం ద్వారా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.

11) ఓటర్లు ఓటు వేయుట: ప్రతి ప్రాదేశిక నియోజక వర్గంలోనూ ఎన్నికల సిబ్బంది పోలింగు బూత్లు ఏర్పాటు చేసి ఓటర్లు తమ ఓటుహక్కును స్వేచ్ఛగా వినియోగించుకొనేందుకు తగిన ఏర్పాట్లు చేస్తారు.

12) ఎన్నికల పరిశీలకుల పర్యవేక్షణ: ఎన్నికలు సజావుగా జరిగేందుకు, ఎన్నికలప్రచారం నిబంధనల మేరకు నిర్వహించేందుకు, ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకొనేందుకు ఎన్నికల సంఘం ప్రతీ నియోజకవర్గంలోనూ ఎన్నికల పరిశీలకులను నియమిస్తుంది.

13) ప్రసార మాధ్యమాల ప్రచారం: ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా ఉంచేందుకు గాను ప్రచారమాధ్యమాలను ఎన్నికల తేదీల ఎన్నికల ప్రక్రియను ప్రసారం చేసేందుకు అవకాశం కల్పిస్తారు.

14) ఓట్లలెక్కింపు -ఫలితాల ప్రకటన ఓటింగు పూర్తయిన తర్వాత ఎన్నికల సంఘం నిర్దేశించిన తేదీన సమయానికి రిటర్నింగు అధికారి మరియు సిబ్బంది అభ్యర్థులు మరియు వారి ప్రతినిధులు సమక్షంలో ఓటింగు యంత్రాలను తెరుస్తారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రంలో ప్రతీ అభ్యర్థి తనకుపోలైన ఓట్లను సరిచూసుకుంటారు. ప్రతీ నియోజకవర్గంలోనూ ఏ అభ్యర్థికైతే సమీప అభ్యర్థి కన్నా ఎక్కువ ఓట్లు వస్తాయో ఆ అభ్యర్థి గెలిచినట్లుగా ప్రకటిస్తారు. సంబంధిత ఎన్నికల రిటర్నింగ్ అధికారి అధికారికంగా ప్రకటిస్తూ గెలిచిన అభ్యర్థికి ధ్రువప్రతాన్ని అందజేస్తారు.

15) ఎన్నికల ఫిర్యాదులు: ఎన్నికలలో అవినీతి, అక్రమాలు చోటు చేసుకున్నట్లు భావిస్తే ఓటరు లేదా అభ్యర్థి ఎన్నికల సంఘానికి ఎన్నికలపై ఫిర్యాదు చేయవచ్చును. ఎన్నికల ఫిర్యాదు న్యాయస్థానంలో వేసే వాజ్యం (Suit) కాదు. కాని ఈ ఫిర్యాదులో మొత్తం నియోజకవర్గం అంతా భాగస్వామి అవుతుంది. న్యాయస్థానంలో కూడా ఎన్నిక చెల్లదు అని అభ్యర్థి ఎన్నికను సవాలు చేయవచ్చును. ఇలాంటి ఫిర్యాదు ఆయారాష్ట్రాల ఉన్నత న్యాయస్థానాల (High Court) లలో విచారించబడతాయి. ఎన్నికలలో అక్రమాలు రుజువైతే అభ్యర్థి ఎన్నిక నిలిపివేయబడి రద్దు చేయబడుతుంది.

ప్రశ్న 3.
భారత ఎన్నికల సంఘం నిర్మాణం, విధులను రాయండి. [Mar. ’16]
జవాబు:
నిర్మాణం: భారత ఎన్నికల సంఘం ఒక ప్రధాన ఎన్నికల కమీషనర్ మరియు ఇద్దరు ఎన్నికల కమీషనర్లను కలిగి బహుళసభ్య వ్యవస్థగా పనిచేయుచున్నది. దీనిని 1950 జనవరి 26న నెలకొల్పారు.

ఎన్నికల సంఘం విధులు:
భారత రాజ్యాంగంలోని 324 నుండి 328 వరకు గల ప్రకరణలు ఎన్నికల సంఘం యొక్క ఏర్పాటు, అధికారాలు, విధులను విశదీకరిస్తున్నాయి. అవి.

  1. భారత ఎన్నికల సంఘం నిర్ణీత కాలవ్యవధిలో ఓటర్ల జాబితాలను సవరిస్తుంది.
  2. ఓటర్ల జాబితాలు నమోదు చేయబడ్డ అర్హత కలిగిన ఓటర్ల పేరుతో తప్పులు లేకుండా తయారుచేయటం ఎన్నికల సంఘం విధి.
  3. ఎన్నికల నిర్వహణకు ఎన్నికల తేదీ, ఇతర వివరాలతో ఎన్నికల ప్రకటన, అభ్యర్థుల నామినేషన్ పత్రాల పరిశీలన కూడా నిర్వహిస్తుంది.
  4. ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు తగిన నిర్ణయాలు తీసుకునే అధికారం ఉంది.
  5. ఎన్నికల నిర్వహణ, ప్రశాంతతకు భంగం కలిగినట్లయితే దేశం మొత్తంగా ఎన్నికలను, లేదా కొన్ని రాష్ట్రాలలో లేదా రాష్ట్రంలో, కొన్ని నియోజకవర్గాలు లేదా నియోజకవర్గంలో ఎన్నికలను రద్దు చేయవచ్చు లేదా వాయిదా వేయవచ్చును.
  6. పార్టీలకు, ఎన్నికలలో పోటీచేయు అభ్యర్థులను ఎన్నికల నియమావళిని వర్తింపచేస్తుంది.

ప్రశ్న 4.
ప్రాతినిధ్యం అనగానేమి ? ప్రాదేశిక ప్రాతినిధ్యం గురించి నీకు ఏమి తెలుసో రాయండి.
జవాబు:
ప్రాతినిధ్యం – భావం:
ప్రభుత్వ ప్రక్రియలో పాల్గొనే అవకాశం లేదు. అందుచేతనే ఆధునిక ప్రజాస్వామ్య దేశాలు ప్రజలచే ఎన్నుకోబడిన ప్రతినిధులచే ఏర్పడిన ప్రాతినిధ్య లేదా పరోక్ష ప్రజాస్వామ్య దేశాలుగా కొనసాగుతున్నాయి. ఆధునిక ప్రజాస్వామ్య దేశాలు ప్రత్యక్ష ప్రజాస్వామ్య లేదా ప్రాతినిధ్య ప్రజాస్వామ్య ప్రభుత్వాలను కలిగి ఉంటున్నాయి. ఇలాంటి వ్యవస్థలో ప్రజలు తమకు బదులుగా శాసనాల తయారీ కొరకు ప్రతినిధులను ఎన్నుకొంటారు. ఆ ప్రతినిధులు శాసనసభలో ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తారు.

AP Inter 2nd Year Civics Study Material Chapter 11 ఎన్నికలు - ప్రాతినిధ్యం

ప్రాదేశిక ప్రాతినిధ్యం:
ప్రాదేశిక ప్రాతినిధ్య పద్ధతిలో దేశంలోని ఓటరులందరినీ వివిధ ప్రాదేశిక నియోజకవర్గాలుగా విభజించి, ప్రతి నియోజకవర్గం నుండి ఒకరు లేదా అంతకన్నా ఎక్కువ ప్రతినిధులను ఓటర్లు ఎన్నుకుంటారు. అన్ని ప్రాదేశిక నియోజకవర్గాలు దాని పరిమాణంలోగాని, జనాభా సంఖ్యలో గాని సుమారుగా ఒకే విధంగా ఉంటాయి. నియోజక వర్గంలో నివసించే ఓటరులందరూ తమ ప్రజాప్రతినిధి ఎన్నిక ప్రక్రియలో భాగస్వామ్యలౌతారు. ప్రాదేశిక నియోజకవర్గం నుండి ఒకే ప్రజాప్రతినిధి ఎన్నిక కాబడితే అది ఏకసభ్య నియోజకవర్గంగా పరిగణిస్తారు. అలాకాక ఒక నియోజకవర్గం నుండి ఒకరికన్నా ఎక్కువమంది ప్రతినిధులు ఎన్నికైతే దానిని బహుళ సభ్య నియోజక వర్గం అంటారు. భారతదేశం లాంటి ఆధునిక ప్రజాస్వామ్య దేశాలలో దిగువసభ సభ్యుల ఎంపిక కొరకు ఏకసభ్య ప్రాదేశిక నియోజవర్గ పద్ధతిని అనుసరిస్తున్నారు.

ప్రశ్న 5.
ఎఫ్.పి.టి.సి వ్యవస్థ యొక్క గుణదోషాలను అంచనా వేయండి.
జవాబు:
ఎఫ్.పి.టి.పి పద్ధతినే “ప్రథమ ఆధిక్యతతో పదవీ విధానం” (First Past The Post System) (FPTP) అంటారు. ఎన్నికలబరిలో ఏ అభ్యర్థి అయితే ఇతర అభ్యర్థుల కన్నా ఆధిక్యంతో ఉంటాడో, ఎన్నికకు కావల్సిన అధిక ఓట్లు సంపాదిస్తాడో అతడే విజయం సాధించినట్లు ప్రకటిస్తారు. ఈ పద్ధతినే ‘బహుత్వ ప్రాతినిధ్య విధానం’ (ప్లూరల్ సిస్టమ్) అంటారు. ఇదే ఎన్నిక పద్ధతిని మన రాజ్యాంగం ప్రతిపాదించినది.

ఇండియాలో FPTP పద్ధతి యొక్క సాధారణ మరియు సున్నితమైన స్వభావం మూలంగా బహుళ ప్రాచుర్యంలో ఉండి విజయం సాధించినది. ఈ పద్ధతి రాజకీయాలు, ఎన్నికలలో స్పష్టమైన ఎటువంటి పరిజ్ఞానం లేని సాధారణ పౌరునికి కూడా అర్థమయ్యే రీతిలో ఉంటుంది. అంతేగాక ఎన్నికలలో స్పష్టమైన తమ నిర్ణయాన్ని ఓటర్లు ప్రకటించడానికి ఈ పద్ధతి అనువుగా ఉంటుంది. ఓటర్లు ఎన్నికలలో అత్యధిక ప్రాధాన్యత పార్టీకి, అభ్యర్థికి లేదా రెండింటికి సమతౌల్యంగా ఇస్తారు. ఈ పద్ధతి సాధారణంగా అతిపెద్ద జాతీయ పార్టీకి లేదా సంకీర్ణ ప్రభుత్వాల ఏర్పాటుకు అవకాశం కల్పిస్తుంది. ఈ విధానం- ఒక ప్రాంతంలోని వివిధ సామాజిక సమూహాలు ఒకటిగా కలిసి ఎన్నికలలో విజయం సాధించేందుకు వీలుకల్పిస్తూ ప్రోత్సాహాన్నిస్తుంది. ఏది ఏమైనప్పటికి FPTP వ్యవస్థ సాధారణ ఓటర్లకు సుపరిచయంగాను, సరళమైనదిగాను నిరూపితమైనది. కేంద్ర, రాష్ట్ర స్థాయిలలో అతి పెద్ద పార్టీలు ఎన్నికలలో స్పష్టమైన ఆధిక్యతతో విజయం సాధించేందుకు ఈ పద్ధతి సహకరిస్తుంది.

ప్రశ్న 6.
ఎన్నికల సంస్కరణ పై లఘు వ్యాసం రాయండి. [Mar. ’17]
జవాబు:
భారతదేశంలో ఎన్నికల వ్యవస్థ, యంత్రాంగం, ఎన్నికల ప్రక్రియలను పరిశీలించి సంస్కరణలను ప్రతిపాదించుటకై అనేక కమిటీలు, కమిషన్లను భారత ప్రభుత్వం’ నియమించింది. అందులో కొన్నింటిని క్రింద పేర్కొనడం జరిగింది.

  1. 1974లో తార్కుండె కమిటీని నియమించగా అది 1975లో తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది.
  2. 1990లో ఎన్నికల సంస్కరణల కొరకు దినేష్ గోస్వామి కమిటీని నియమించడమైంది.
  3. రాజకీయాలు, నేరాల మధ్య సంబంధాల అధ్యయనం కోసం 1993 సంవత్సరంలో ఓహ్రా కమిటీ నియామకం జరిగింది.
  4. ఎన్నికలలో రాజకీయ నిధుల అధ్యయనం కొరకు 1998 సంవత్సరంలో ఇంద్రజిత్ గుప్తా కమిటీ నియమించబడింది.
  5. ఎన్నికల చట్టాల సంస్కరణలపై భారత న్యాయసంఘం 1999లో నివేదిక సమర్పించినది.

పైన పేర్కొన్న కమిటీలు, కమిషన్లు ఎన్నికల సంస్కరణల కొరకు చేసిన సూచనలలో ముఖ్యమైనవి

  1. ఓటు అర్హత వయస్సు తగ్గింపు
  2. ఎన్నికల సంఘానికి ఉద్యోగుల బదిలీ
  3. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు
  4. మద్యం అమ్మకాలపై నిషేధం
  5. ఎన్నికల వ్యయపరిమితి పెంపు
  6. ఆయుధాలపై నిషేధం మొదలగునవి.

AP Inter 2nd Year Civics Study Material Chapter 11 ఎన్నికలు - ప్రాతినిధ్యం

ప్రశ్న 7.
నైష్పత్తిక ప్రాతినిధ్య వ్యవస్థ గురించి నీకు ఏమి తెలుసు ?
జవాబు:
ఈ ఎన్నిక పద్ధతిలో రాజకీయ పార్టీల ఓటింగు బలాన్ని బట్టి తమ ప్రాతినిధ్యాన్ని పొందుతుంది. ఈ ఎన్నిక రహస్య పద్ధతిలో నిర్వహిస్తారు. భారత రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, రాజ్యసభ సభ్యులు, విధాన మండలి సభ్యుల ఎన్నికకు ఈ పద్ధతిని ఉపయోగిస్తారు. రాష్ట్రాల మధ్య సమానత్వానికి సభ్యుడు చెలాయించే ఓటును విలువలతో గుణించడం చేస్తారు. ముందుగా రాష్ట్ర శాసనసభ్యుల ఓట్ల విలువలను నిర్ధారిస్తారు. ఒక రాష్ట్ర మొత్తం జనాభాను రాష్ట్ర శాసనసభలో ఎన్నికైన సభ్యుల సంఖ్యచే భాగించగా వచ్చిన లబ్దమును మరల వెయ్యిచే భాగించగా వచ్చిన సంఖ్యను ఆ రాష్ట్ర శాసనసభ్యుని ఓటు విలువగా లెక్కిస్తారు. రాష్ట్ర శాసనసభ్యుల మొత్తం ఓటు విలువలను ఎన్నికైన పార్లమెంటు ఉభయసభల సభ్యుల సంఖ్యచేత భాగించగా వచ్చిన సంఖ్య పార్లమెంటు సభ్యుని విలువగా పరిగణిస్తారు. ఓట్ల లెక్కింపులో మొదటి ప్రాధాన్యతా ఓటు లేదా ద్వితీయ ప్రాధాన్యతా ఓటును పరిగణనలోనికి తీసుకొని ఆధిక్యత సాధించిన అభ్యర్థిని గెలుపొందినట్లుగా ప్రకటిస్తారు. ఈ పద్ధతిలో ఎక్కువమంది ప్రతినిధులు, అల్పసంఖ్యాకులు అల్పసంఖ్యలో ప్రతినిధులను ఎంపిక చేసుకొనే వీలుంటుంది.

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ఎన్నికలు, ప్రజాస్వామ్యంకు గల సంబంధం.
జవాబు:
ప్రజాస్వామ్య ప్రాతినిధ్య ప్రభుత్వాలకు ఎన్నికలు కీలకమైనవి. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు నిర్ణీత కాలవ్యవధిలో జరుగుతాయి. ఎన్నికయ్యే ప్రతినిధులు ప్రజలకు జవాబుదారీగా ఉంటారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలు అంతర్భాగం. రాజకీయ వ్యవస్థకు, దేశంలోని పౌరులకు ఎన్నికలు ముఖ్య సేవలందిస్తాయి. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయీకరణను పెంపొందించేందుకు ఎన్నికలు పెద్ద ప్రతినిధి సంస్థలుగా పనిచేస్తాయి.

ప్రశ్న 2.
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు. [Mar. ’16]
జవాబు:
భారత ఎన్నికల సంఘం ఎన్నికలలో ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకునేందుకు, ఓట్లు లెక్కింపుకు ఓటింగు యంత్రాలను ప్రవేశపెట్టింది. వీటినే ఎలక్ట్రానిక్ ఓటింగు యంత్రాలని అంటారు. ఓటింగులో బ్యాలెట్ పత్రాలను బదులుగా ఓటింగు యంత్రాలను వినియోగించటమైనది.

ప్రశ్న 3.
ప్రాదేశిక ప్రాతినిధ్యం.
జవాబు:
ప్రాదేశిక ప్రాతినిధ్య పద్ధతిలో దేశంలోని ఓటరులందరిని వివిధ ప్రాదేశిక నియోజకవర్గాలుగా విభజించి, ప్రతి నియోజక వర్గం నుండి ఒకరు లేదా అంతకన్నా ఎక్కువ ప్రతినిధులను ఓటర్లు ఎన్నుకొంటారు. అన్ని ప్రాదేశిక నియోజకవర్గాలు దాని పరిమాణంలో కాని, జనాభా సంఖ్యలో కాని సుమారుగా ఒకే విధంగా ఉంటాయి. నియోజకవర్గంలో నివసించే ఓటర్లందరూ తమ ప్రజాప్రతినిధిని ఎన్నుకోవటంలో భాగస్వాములవుతారు.

ప్రశ్న 4.
వృత్తి ఆధారిత ప్రాతినిధ్యం.
జవాబు:
పౌరులు చేసే వృత్తుల ఆధారంగా ఇటువంటి నియోజకవర్గాలు ఏర్పాటవుతాయి. ఇటువంటి నియోజకవర్గంలో పౌరులు ఒకేరకమైన వృత్తి లేదా సమాన లక్షణాలు కలిగిన వృత్తులలో నిమగ్నమైన ప్రాదేశిక ప్రాంతాలలో నివాసముంటారు. వైద్యులు, వ్యవసాయదారులు, వ్యాపారులు, న్యాయవాదులు, అధ్యాపకులు, ఉపాధ్యాయులు, శ్రామికులు, తదితరులు వివిధ రకాల వృత్తి సంఘాల్ని కల్గి ఉంటారు.

AP Inter 2nd Year Civics Study Material Chapter 11 ఎన్నికలు - ప్రాతినిధ్యం

ప్రశ్న 5.
భారత ఎన్నికల సంఘం నిర్మాణం.
జవాబు:
భారత ఎన్నికల సంఘం ఒక ప్రధాన ఎన్నికల కమీషనర్ మరియు ఇద్దరు ఎన్నికల కమీషనర్లను కలిగి బహుళ సభ్య వ్యవస్థగా పని చేయుచున్నది. దీనిని 1950 జనవరి 26న నెలకొల్పారు.

ప్రశ్న 6.
ఎన్నికల సంస్కరణలు. [Mar. ’16]
జవాబు:
భారతదేశంలో ఎన్నికలను స్వేచ్చగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు వీలుగా స్వయంప్రతిపత్తి కలిగిన ఎన్నికల సంఘాన్ని ఏర్పాటుచేయటం జరిగింది. అయిన్నప్పటికీ గడిచిన 65 సం॥ల అనుభవం మన ఎన్నికల వ్యవస్థలో సంస్కరణల అవసరాన్ని తెలియజేస్తుంది. ఎన్నికల సంఘం, వివిధ రాజకీయ పార్టీలు, అనేక స్వచ్ఛంద సంస్థలు, రాజ్యాంగ ఎన్నికల నిపుణులు ఎన్నికల వ్యవస్థలో అనేక సలహా సంప్రదింపులలో ముందుకు రావడం జరిగింది.

ప్రశ్న 7.
ఎన్నికల నేరాలు.
జవాబు:
ఎన్నికల్లో చట్టవ్యతిరేక కార్యకలాపాలు, లేదా పద్ధతులను పాల్పడినట్లయితే జైలుశిక్ష లేదా అపరాధ రుసుము లేదా రెండూ విధించబడతాయి. ఎన్నికల నేరాలకు జైలుశిక్ష మూడునెలల నుండి మూడు సంవత్సరాలవరకు ఉంటుంది. మతం, జాతి, కులం, భాష, ప్రాంతాల ఆధారంగా ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం, ఎన్నికల సభలలో గొడవలు సృష్టించి భగ్నం చేయటం ఎన్నికల నేరాలకు ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు.

ప్రశ్న 8.
ఎన్నికలలో అక్రమ పద్ధతులు.
జవాబు:
ఎన్నికలలో అభ్యర్థులు అక్రమ పద్ధతులకు పాల్పడితే ఆ ఎన్నికలను సంఘం రద్దు చేయగలదు. అవినీతి, అక్రమాలకు పాల్పడిన అభ్యర్థిని ఆరు సంవత్సరముల వరకు ఎన్నికలలో పోటీచేయటానికి అనర్హునిగా ప్రకటించడమేగాక అటువంటి అభ్యర్థిని న్యాయస్థానంలో విచారణ చేసి శిక్షిస్తారు. ఎన్నికల్లో ముఖ్యమైన అవినీతి, అక్రమ పద్ధతులను ఎన్నికల సంఘం నియంత్రించేందుకు అనేక చర్యలు తీసుకొంటుంది.

ప్రశ్న 9.
భారత ఎన్నికల సంఘం పాత్ర. [Mar, ’17]
జవాబు:
భారతదేశంలో నిష్పక్షపాతంగా, సమర్థవంతంగా ఎన్నికలను నిర్వహించే విషయంలో కాలానుగుణంగా ఎన్నికల సంఘం ఒక స్వతంత్ర మరియు స్వయంప్రతిపత్తి గల అధికార వ్యవస్థగా రూపుదిద్దుకొంది. ఎన్నికల ప్రక్రియ, పవిత్రతను కాపాడేందుకు ఎన్నికల సంఘం నిష్కర్షగాను, నిష్పక్షపాతంగా వ్యవహరిస్తుంది. ఎన్నికల సంఘం గతంలో కన్నా మరింత స్వతంత్రంగా, నిర్ణయాత్మకంగా, క్రియాశీలకంగా నేడు వ్యవహరిస్తుందని అందరూ అంగీకరిస్తున్న మాట వాస్తవం.

AP Inter 2nd Year Civics Study Material Chapter 11 ఎన్నికలు - ప్రాతినిధ్యం

ప్రశ్న 10.
ప్రాతినిధ్యం.
జవాబు:
ఆధునిక దేశాలలో ప్రభుత్వ ప్రక్రియలో ప్రజలు నేరుగా భాగస్వాములు కాలేరు. ఇలాంటి వ్యవస్థలో ప్రజలు తమకు బదులుగా శాసనాలను రూపొందించుకొనటానికి ప్రతినిధులను ఎన్నుకుంటారు. ఆ ప్రతినిధులు శాసనసభలో ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తారు. ప్రపంచ దేశాలలో రెండు రకాల సాధారణ ప్రాతినిధ్యం ప్రామాణికంగా ఉన్నాయి. అవి 1) ప్రాదేశిక ఆధారిత ప్రాతినిధ్యం 2) వృత్తి ఆధారిత ప్రాతినిధ్యం.

AP Inter 2nd Year Civics Study Material Chapter 10 భారతదేశంలో స్థానిక ప్రభుత్వాలు

Andhra Pradesh BIEAP AP Inter 2nd Year Civics Study Material 10th Lesson భారతదేశంలో స్థానిక ప్రభుత్వాలు Textbook Questions and Answers.

AP Inter 2nd Year Civics Study Material 10th Lesson భారతదేశంలో స్థానిక ప్రభుత్వాలు

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
భారతదేశంలో పంచాయతీరాజ్ సంస్థల విధులను వివరించండి.
జవాబు:
ప్రస్తుతం భారతదేశంలో పంచాయతీరాజ్ సంస్థలు భారత రాజ్యాంగం 73వ సవరణ చట్టం, 1992 ప్రకారం ఏర్పాటయ్యాయి. సాధారణంగా భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో (జనాభా ఇరవై లక్షల కంటే తక్కువ కాకుండా) గ్రామీణ ప్రాంతాలలో ప్రతి జిల్లాలో మూడంచెల సంస్థలు ఏర్పాటయ్యాయి. అవి.
విధులు.

  1. గ్రామ పంచాయతీలు
  2. మధ్యస్థాయి సంస్థలు (మండల పరిషత్తు)
  3. జిల్లాస్థాయి (జిల్లా పరిషత్తు)

1) గ్రామ పంచాయతీ విధులు: గ్రామపంచాయతీ విధులు రెండు రకాలు: i) ఆవశ్యక విధులు ii) వివేచనాత్మక
i) ఆవశ్యక విధులు: ఆవశ్యక విధులను గ్రామపంచాయతీ తప్పనిసరిగా నిర్వహించవలసి ఉంటుంది. అలాంటి వాటిలో క్రింద పేర్కొన్నవి ఉంటాయి.

  1. రహదార్లను నిర్మించడం, మరమ్మత్తులు చేయించడం, నిర్వహించడం.
  2. శ్మశానవాటికలను నిర్మించడం, నిర్వహించడం..
  3. విద్యుత్ స్థంభాలను ఏర్పరచడం, విద్యుత్ సౌకర్యాలను అందించడం.
  4. జనన, మరణాల రిజిస్టర్లను నిర్వహించడం.
  5. అంటురోగాల బారి నుంచి ప్రజలను కాపాడటానికి వారికి తగిన టీకాలను వేయించడం.
  6. త్రాగునీటి సౌకర్యాలను సమకూర్చడం.
  7. కాలిబాటలు, చిన్నవంతెనలు, పబ్లిక్ పార్క్లు, క్రీడాస్థలాలను నిర్మించడం, మరమ్మత్తులు చేయించి నిర్వహించడం.

AP Inter 2nd Year Civics Study Material Chapter 10 భారతదేశంలో స్థానిక ప్రభుత్వాలు

ii) వివేచనాత్మక విధులు:
గ్రామపంచాయతి వివేచనాత్మక లేదా ఐచ్ఛిక విధులను ఆర్థిక వనరుల లభ్యతమేరకు నిర్వహిస్తుంది. వాటిలో క్రిందివి ఉంటాయి.

  1. విశ్రాంతి గృహాల నిర్మాణం, నిర్వహణ.
  2. ప్రాథమిక పాఠశాలలు, ఆరోగ్యకేంద్రాలు, గ్రంథాలయాలు, పఠన మందిరాల నిర్మాణం.
  3. మాత, శిశు సంక్షేమ కేంద్రాల నిర్మాణం, నిర్వహణ.
  4. సమాజాభివృద్ధి పథకాల అమలులో స్వచ్చంద శ్రామిక శిబిరాల నిర్వహణ.
  5. ఆధునిక సేద్య పద్ధతుల ప్రచారం.
  6. భూసంస్కరణల అమలు..

2) మధ్యస్థాయి సంస్థలు (మండల పరిషత్తు) విధులు:
మండల పరిషత్తు మండల పరిధిలో క్రింద పేర్కొన్న విధులను నిర్వహిస్తుంది.

  1. సమాజాభివృద్ధి పథకాల అమలుకు అవసరమైన చర్యలు తీసుకుంటుంది.
  2. వైద్యశాలలు, త్రాగునీరు, టీకాలు, పొగరాని పొయ్యలు వంటి సదుపాయాల కల్పనకు తగిన కార్యక్రమాలు చేపడుతుంది.
  3. సామాజిక విద్య, కమ్యూనికేషన్లు, సహకారం, కుటీరపరిశ్రమలు, మహిళాభివృద్ధి, సాంఘిక సంక్షేమం వంటి అనేక కార్యక్రమాల అమలుకు సంబంధించిన వ్యవహారాలను సమీక్షిస్తుంది.
  4. వ్యవసాయరంగంలో అధికోత్పత్తిని సాధించడానికి మేలు రకమైన ఎరువులు, క్రిమిసంహారకమందులు, అధునాతన వ్యవసాయ పరికరాలను వినియోగించుకోవడానికి తగిన చర్యలు తీసుకుంటుంది.
  5. పశు సంపద అభివృద్ధి కోసం పశుగ్రాసాన్ని అందించడం కృత్రిమ వీర్యకేంద్రాలు, పశుగ్రాస క్షేత్రాల నిర్వహణ వంటి వివిధ కార్యక్రమాలను అమలుచేస్తుంది.

3) జిల్లా పరిషత్తు విధులు:
జిల్లా పరిషత్తు క్రింద పేర్కొన్న విధులను నిర్వహిస్తుంది.

  1. జిల్లాలోని మండల పరిషత్తుల వార్షిక బడ్జెట్లను ఆమోదిస్తుంది.
  2. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మండలాల అభివృద్ధి కోసం మంజూరు చేసిన సహాయక గ్రాంట్లను మండల పరిషత్తులకు కేటాయిస్తుంది.
  3. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామీణాభివృద్ధి కోసం ఇచ్చే ఆదేశాలను అమలుచేస్తుంది.
  4. వివిధ మండల పరిషత్తుల కార్యకలాపాలను సమన్వయపరిచి, పర్యవేక్షిస్తుంది.
  5. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాలకు అనుగుణంగా గణాంక సర్వేలను నిర్వహిస్తుంది.
  6. జిల్లాలోని సెకండరీ స్కూళ్ళను నిర్వహిస్తుంది.
  7. మండల పరిషత్తులు, గ్రామపంచాయతీల ఆర్థిక పరిపుష్టికి అవసరమైన సూచనలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పంపుతుంది.

ప్రశ్న 2.
భారతదేశంలో వివిధ రకాల పట్టణ స్థానిక ప్రభుత్వాలను వర్ణించండి. [Mar. ’17]
జవాబు:
భారతదేశంలో పట్టణ స్థానిక ప్రభుత్వాలు 9 రకాలు. అవి

  1. నగరపాలక సంస్థలు
  2. పురపాలక సంస్థలు
  3. నగర పంచాయతీలు
  4. నోటిఫైడ్ ఏరియా కమిటీలు
  5. టౌన్ ఏరియా కమిటీలు
  6. కంటోన్మెంట్ బోర్డులు
  7. టౌన్ షిప్పులు
  8. పోర్ట్ ట్రస్ట్లు
  9. ప్రత్యేక ప్రయోజిత సంస్థలు.

AP Inter 2nd Year Civics Study Material Chapter 10 భారతదేశంలో స్థానిక ప్రభుత్వాలు

1) నగరపాలక సంస్థలు:
పట్టణ స్థానిక ప్రభుత్వాలలో నగరపాలక సంస్థలు చాలా ముఖ్యమైనవి. ఇవి అత్యున్నత పట్టణ, స్థానిక సంస్థలుగా అతిపెద్ద నగరాలలో ఏర్పాటు చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టం ద్వారా ఈ నగరపాలక సంస్థలను ఏర్పాటుచేస్తుంది. భారతదేశంలో 1687లో మద్రాస్ నగరంలో మొట్టమొదటి నగరపాలక సంస్థ ఏర్పాటైంది. మూడు లక్షల జనాభా కలిగి నాలుగుకోట్ల వార్షికాదాయమున్న పట్టణాలను నగరపాలక సంస్థలుగా రాష్ట్రప్రభుత్వం ప్రత్యేక చట్టం ద్వారా ఏర్పాటుచేస్తుంది.

నగర జనాభా ఆధారంగా ఆయా నగర సంస్థలలోని ప్రతినిధుల సంఖ్యను రాష్ట్ర శాసన సభ నిర్ణయిస్తుంది. ప్రతి నగరపాలక సంస్థలో 1) నగరపాలక మండలి, 2) మేయర్, 3) కమీషనర్, 4) స్థాయీ సంఘాలు అనే నాలుగు ప్రధాన అంగాలు ఉంటాయి.

2) పురపాలక సంస్థలు:
ప్రతి పురపాలక సంస్థలో నాలుగు అంగాలు ఉంటాయి. 1) పురపాలక మండలి, 2) పురపాలక చైర్మన్, 3) మున్సిపల్ కమీషనర్, 4) స్థాయీ సంఘాలు. పురపాలక సంస్థ చర్చావేదికయే పురపాలక మండలి. దీనిలో 1) ఎన్నికయ్యే సభ్యులు 2) అనుబంధ సభ్యులు 3) గౌరవ సభ్యులు అనే మూడు రకాల సభ్యులు ఉంటారు. పురపాలక సంస్థ పరిధిలోని రిజిష్టర్ ఓటర్లు మొదటి తరహా సభ్యులను ఎన్నుకుంటారు. వీరిని కౌన్సిలర్స్ అంటారు.

3) నగర పంచాయతీలు:
గ్రామ స్థాయి నుండి పట్టణ స్థాయికి పరిణామం చెందే ప్రాంతం లేదా అతిచిన్న పట్టణ ప్రాంతాలలో ఏర్పాటయ్యే స్థానిక సంస్థలను నగర పంచాయతీ అంటారు. దీని కొరకు జనసాంద్రత, స్థానిక సంస్థల ఆదాయం, వ్యవసాయేతర రంగాలలో ఉపాధి అవకాశాలు. ఆ ప్రాంత ఆర్థిక ప్రాధాన్యత మొదలైన ప్రామాణికాల ఆధారంగా నగర పంచాయతీ ఏర్పాటు జరుగుతుంది.

నగర పంచాయితీ సభ్యుల సంఖ్యను ఆ రాష్ట్ర శాసనసభ నిర్ణయిస్తుంది. ఈ సభ్యులు ప్రజలచే వయోజన ఓటుహక్కు ద్వారా ప్రత్యక్షంగా ఎన్నుకోబడతారు. దీని కొరకు నగర పంచాయతీని వార్డులుగా విభజించి ప్రతి వార్డు నుండి ఒక ప్రతినిధిని ఎన్నుకునేందుకు అవకాశం కల్పిస్తారు.

4) నోటిఫైడ్ ఏరియా కమిటీలు:
శీఘ్రగతిన అభివృద్ధి పథంలో పురోగమించే పట్టణాలలో లేదా పురపాలక సంస్థల ఏర్పాటుకు అనుకూలంగాలేని పరిస్థితులలో ఈ కమిటీ ఏర్పాటవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రకటన ద్వారా ఈ కమిటీ ఏర్పడటంతో దీనిని నోటిఫైడ్ ఏరియా కమిటీగా వ్యవహరించడమైంది. దీనికి చట్టబద్ధమైన హోదా ఉండదు. దీనిలో ఒక చైర్మన్, కొందరు సభ్యులు ఉంటారు. వారిని రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తుంది.

5) టౌన్ ఏరియా కమిటీలు:
రాష్ట్ర శాసనసభ ఆమోదించే ప్రత్యేక చట్టం ద్వారా టౌన్ ఏరియా కమిటీ ఏర్పాటవుతుంది. చిన్న పట్టణాల అవసరాలను తీర్చడానికి ఈ కమిటీలు అవసరమవుతాయి. అవి పరిమితమైన విధులను మాత్రమే నిర్వహిస్తుంటాయి. వీధిదీపాలను అమర్చడం, డ్రైనేజీ సౌకర్యాల కల్పన వంటి విధులను అవి నిర్వహిస్తాయి.

AP Inter 2nd Year Civics Study Material Chapter 10 భారతదేశంలో స్థానిక ప్రభుత్వాలు

6) కంటోన్మెంట్ బోర్డులు:
భారతదేశంలో ప్రస్తుతం మూడు రకాల కంటోన్మెంట్ బోర్డులున్నాయి. అవి దేశరక్షణ మంత్రిత్వశాఖ ప్రత్యేక ఉత్తర్వుల ద్వారా ఏర్పాటై కొనసాగుతున్నాయి. ప్రతి కంటోన్మెంట్ బోర్డులో కొందరు ఎన్నుకోబడినవారు సభ్యులుకాగా, కొందరు కేంద్ర ప్రభుత్వంతో నామినేట్ చేయబడినవారు, మరికొందరు పదవిరీత్యా సభ్యులుగా ఉంటారు. ప్రతి కంటోన్మెంట్ బోర్డులో ఒక జనరల్ ఆఫీసర్ – ఆఫ్- కంమాండర్ (GOC – General Officer of Commander) ఉంటాడు.

7) టౌన్ షిప్ లు:
టౌన్షిప్లు అనేవి ప్రభుత్వరంగ సంస్థలలో ఏర్పాటవుతాయి. ప్రభుత్వరంగ సంస్థలలో పనిచేసే సిబ్బందికి మౌలిక సదుపాయాలను కల్పించడానికి అవి కృషిచేస్తాయి. వాటిలో ఎన్నుకోబడే సభ్యులు ఎవరూ ఉండరు. ప్రతి టౌన్షిప్కు ఒక టౌన్ పరిపాలన అధికారి ఉంటాడు. అతడిని కేంద్రప్రభుత్వంలోని సంబంధిత మంత్రిత్వశాఖ నియమిస్తుంది. టౌన్ షిప్ సేవలు సామాన్య ప్రజలకు కాకుండా అందులో పనిచేసే వారికే లభ్యమవుతాయి.

8) పోర్ట్ ట్రస్ట్:
దేశంలో సముద్రతీరంలో ఓడరేవులు ఉన్న ప్రాంతాలలో పోర్ట్ ట్రస్ట్లు ఏర్పాటవుతాయి. అలాగే నౌకాశ్రయాలలో పనిచేసే సిబ్బందికి సంబంధించిన వ్యవహారాలను పర్యవేక్షిస్తాయి. అవి నౌకాశ్రయాలలో మౌలిక సదుపాయాలను కల్పించడానికి కృషిచేస్తాయి. కేంద్రప్రభుత్వం అందుకోసం కొన్ని కమిటీలను నియమిస్తుంది. ఆ కమిటీల సభ్యులలో కొందరు ఎన్నుకోబడగా, మరికొందరు నామినేట్ అవుతారు.

9) ప్రత్యేక ప్రయోజిత సంస్థలు:
పట్టణ ప్రాంతాలలో నివసించే ప్రజలు ఎదుర్కొనే సమస్యల పరిష్కారానికి ఈ రకమైన సంస్థలు పనిచేస్తుంటాయి. పురపాలక సంఘాలు. ఇతర నోటిఫైడ్ ప్రాంతాలలో నివసించే ప్రజల ప్రత్యేక అవసరాలను తీర్చడానికి అవి కృషిచేస్తాయి. రాష్ట్ర శాసనసభ ఆమోదించిన ప్రత్యేక చట్టాల ప్రకారం వాటిని స్థాపించడం జరుగుతుంది. కొన్ని సందర్భాలలో రాష్ట్ర కార్యనిర్వాహక వర్గం ప్రత్యేకంగా జారీచేసే ఆజ్ఞల ద్వారా అవి ఏర్పడతాయి.

ప్రశ్న 3.
భారత రాజ్యాంగం 73వ సవరణ చట్టాన్ని గురించి క్లుప్తంగా వివరించండి.
జవాబు:
భారతదేశంలో పంచాయతీరాజ్ సంస్థలను సమర్థవంతమైనవిగా తీర్చిదిద్దడానికి ఏకీకృత చట్టం అవసరమని కేంద్ర, రాష్ట్రాల సంబంధాలపై నియమించిన సర్కారియా కమీషన్ సూచించింది. పర్యవసానంగా రాజీవ్ గాంధీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం 1988లో పి.కే. తుంగన్ ఆధ్వర్యంలో పార్లమెంటరీ ఉపసంఘాన్ని నియమించింది. జిల్లా కమిటీల ఏర్పాటుకు అవసరమైన ఆదర్శవంతమైన పరిపాలన, రాజకీయ యంత్రాంగాన్ని సూచించవలసిందిగా ఆ ఉపసంఘాన్ని కేంద్ర ప్రభుత్వం కోరింది. రెండేళ్ళ తరువాత 1991 జూన్లో శ్రీ పి.వి. నరసింహారావు ఆధ్వర్యంలో అధికారంలోకి వచ్చిన కేంద్రప్రభుత్వం పంచాయితీరాజ్ సంస్థలకు వెంటనే రాజ్యాంగ ప్రతివృత్తిని కల్పించవలసిన విషయాన్ని గుర్తించింది. 1991 సెప్టెంబర్ లో అందుకు సంబంధించిన బిల్లును పార్లమెంటులో ప్రతిపాదించింది. తరువాత ఆ బిల్లు సంయుక్త పార్లమెంటరీ కమిటీకి సమర్పించడమైంది. పార్లమెంటు ఆ కమిటీ సమర్పించిన నివేదికను ఆమోదించింది. ఆ బిల్లుపై రాష్ట్ర శాసనసభల ఆమోదం కోసం పంపడమైంది. మెజారిటీ రాష్ట్ర శాసనసభలు ఆ బిల్లుపట్ల తమ సమ్మతిని తెలిపాయి. దాంతో ఆ బిల్లును రాజ్యాంగం (73వ సవరణ) చట్టం, 1992గా పిలవడం జరిగింది.

AP Inter 2nd Year Civics Study Material Chapter 10 భారతదేశంలో స్థానిక ప్రభుత్వాలు

ప్రధాన అంశాలు: రాజ్యాంగం (73వ సవరణ) చట్టం 1992లో క్రింది ముఖ్యాంశాలు ఉన్నాయి.
1. ఆ చట్టం నూతనంగా జిల్లా, గ్రామసభ, పంచాయితీ, గ్రామం అనే నూతన పదాలను చేర్చింది

2. ప్రతి గ్రామానికి ఒక గ్రామ సభను ఏర్పాటుచేసింది. ఆ గ్రామసభ గ్రామ స్థాయిలో శాసన నిర్మాణ సంస్థగా వ్యవహరిస్తుంది.

3. ప్రతి రాష్ట్రప్రభుత్వం పంచాయతీరాజ్ యొక్క మూడంచెల విధానాన్ని ఏర్పాటు చేయవలసి ఉంటుంది. ఉదా: గ్రామ, మాధ్యమిక, జిల్లా స్థాయిలలో పంచాయతీలు

4. ప్రతి రాష్ట్ర శాసనసభ తప్పనిసరిగా పంచాయతీల నిర్మాణానికి సంబంధించిన చట్టాలను రూపొందించాలి. ప్రాదేశిక నియోజకవర్గాల ప్రాతిపదికపై పంచాయతీలకు ప్రత్యక్ష ఎన్నికలను నిర్వహించాలి. పంచాయతీల అధ్యక్షులకు, ఇతర సభ్యులకు, (వారు ప్రత్యక్షంగానో లేదా పరోక్షంగానో ఎన్నుకోబడినప్పటికీ) తీర్మానాలపై ఓటుచేసే హక్కు ఉంటుంది.

5. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు పంచాయతీలలో రిజర్వేషన్లు కల్పించడం జరిగింది. అలాగే మొత్తం సీట్లలో 1/3వ వంతుకు మించకుండా మహిళలకు రిజర్వేషన్ కేటాయించడమైంది. (ఉమ్మడి ఆంధ్రప్రదేశ్) ప్రభుత్వ మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు పెంచడం జరిగింది.)

6. పంచాయతీల కాలపరిమితి అయిదేళ్ళు. ఆ గడుపు ముందే కొత్తగా ఎన్నికలు జరిపించుకోవచ్చు. కాలపరిమితికి ముందే అవి ఒకవేళ రద్దయితే వాటికి ఎన్నికలను నిర్వహించవలసి ఉంటుంది.

7. స్థానిక సంస్థలకు పోటీచేసే అభ్యర్థుల అర్హతలు, అనర్హతలను ఎదుర్కొనడమైంది.

8. ఈ చట్టం స్థానిక సంస్థలకు ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేసింది.

9. పంచాయితీల ఖాతాలు, వ్యయాలపై తనిఖీ జరపడానికి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉంటుంది.

10. స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించడానికి స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న ఎన్నికల సంఘం ఏర్పాటవుతుంది.

ప్రశ్న 4.
భారత రాజ్యాంగం 74వ సవరణ చట్టాన్ని గురించి క్లుప్తంగా వివరించండి.
జవాబు:
74వ రాజ్యాంగ సవరణ చట్టం: రాజ్యాంగం 74వ సవరణ చట్టం, 1993ను భారత పార్లమెంటు 1992. డిసెంబర్ లో ఆమోదించింది. దానికి 1993, ఏప్రిల్ 20వ తేదీన రాష్ట్రపతి ఆమోదం లభించింది. భారతదేశంలో పట్టణస్థానిక ప్రభుత్వాలను పటిష్టపరచడంలో ఆ చట్టం అత్యంత ముఖ్యమైందిగాను, ప్రగతిశీలమైనదిగానూ వర్ణించడం జరిగింది. భారతదేశంలో పట్టణ స్థానిక ప్రభుత్వాలు సమర్థవంతంగా కార్యకలాపాలను నిర్వహించడానికి ఆ చట్టం ఒక ఉమ్మడి విధివిధానాలను రూపొందించింది. అంతకు పూర్వం ఆ చట్టాన్ని రూపొందించడానికి విశేషమైన కృషి జరిగింది. తొలుత పార్లమెంటు ఆ చట్టానికి సంబంధించిన బిల్లును 1989లో రాజ్యాంగం (65వ సవరణ) బిల్లుగా ప్రతిపాదించడం జరిగింది. అయితే లోక్సభ అర్ధంతర రద్దు కారణంగా ఆ బిల్లు పార్లమెంటు ఆమోదానికి నోచుకోలేదు.

తరువాత ఆ బిల్లులో కొన్ని సవరణలు చేసి, 1991, సెప్టెంబర్ 16వ తేదీన లోక్సభలో ప్రవేశపెట్టడం జరిగింది. దరిమిలా పార్లమెంటు ఉభయసభలు ఆ బిల్లును కూలంకషంగా పరిశీలించి, 1992 డిసెంబర్లో ఆమోదించాయి. చివరికి రాష్ట్రపతి ఆమోదం తరవాత ఆ బిల్లు చట్టంగా రూపొంది 1993, జూన్ 1వ తేదీన అమల్లోకి వచ్చింది. . ముఖ్యాంశాలు:
1. ఈ చట్టం పట్టణ స్థానిక సంస్థలకు మొట్టమొదటిసారిగా రాజ్యాంగపరమైన గుర్తింపునిచ్చింది. రాజ్యాంగంలో 9(ఎ) అనే భాగాన్ని అదనంగా చేర్చింది.

2. రాజ్యాంగంలో పన్నెండో షెడ్యూల్ను ప్రవేశపెట్టింది.

3. పట్టణ స్థానిక సంస్థలకు 18 అంశాలపై తీర్మానాలను రూపొందించుకొని అమలులో ఉంచుకోవడానికి అధికారాన్నిచ్చింది.

4. పట్టణ స్థానిక సంస్థలకు సంబంధించిన వివిధ పదాలను నిర్వచించింది. జనాభా పదిలక్షలు లేదా అంతకుమించి ఉంటే పట్టణ ప్రాంతాన్ని మహానగర ప్రాంతం (మెట్రోపాలిటన్ ఏరియా) గా ప్రకటించింది.

AP Inter 2nd Year Civics Study Material Chapter 10 భారతదేశంలో స్థానిక ప్రభుత్వాలు

5. నగరపాలకసంస్థ, మున్సిపల్ కౌన్సిల్, నగర పంచాయతీ వంటి అనేక సంస్థల నిర్మాణానికి ఈ సవరణ వీలు కల్పించింది. నగరపాలక సంస్థ అనేది విస్తృతమైన పట్టణ ప్రాంతాలను వర్తిస్తుంది. పట్టణ స్థానిక సంస్థల పేర్లను ఖరారు చేయడానికి, వాటి భౌగోళిక సరిహద్దులను స్పష్టంగా గుర్తించడానికి ఈ చట్టం రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఇచ్చింది.

6. పురపాలక సంస్థ నిర్మాణాన్ని ఈ చట్టం ప్రత్యేకంగా గుర్తించింది. పురపాలక సంస్థ పరిధిలోని విధానసభ సభ్యులు, లోక్సభ సభ్యులు పురపాలక సంస్థల కౌన్సిళ్ళు సమావేశంలో పదవి రీత్యా సభ్యుల హోదాలో పాల్గొంటారని స్పష్టం చేసింది. అంతేకాకుండా పురపాలక సంస్థ సమావేశాలలో రాష్ట్ర విధానపరిషత్తు లేదా రాజ్యసభ సభ్యులు పాల్గొనడానికి అర్హులని ప్రకటించింది.

7. జనాభా మూడులక్షల లేదా అంతకుమించి ఉన్న పురసాలక సంస్థలలో వార్డ్ కమిటీల ఏర్పాటుకు అవకాశం ఇచ్చింది. అలాంటి వార్డు కమిటీల ఏర్పాటు విషయంలో శాసనాలను రూపొందించే అధికారాన్ని రాష్ట్ర శాసనసభలకు అప్పగించింది.

8. పట్టణ స్థానిక సంస్థలలో కొన్ని స్థానాలను షెడ్యూల్డ్ కులాలు, తెగలకు వారి జానాభా నిష్పత్తికి అనుగుణంగా కేటాయించడం జరుగుతుందని పేర్కొంది. అంతేకాకుండా ఆ సంస్థలలో మూడోవంతు స్థానాలు మహిళలకు, మహిళా అధ్యక్ష పదవులకు రొటేషన్ పద్ధతిలో కేటాయించునట్లు ప్రకటించింది.

ప్రశ్న 5.
జిల్లా కలెక్టర్ అధికారాలు, విధులను అంచనా వేయండి. [Mar. ’16]
జవాబు:
జిల్లా పరిపాలనలో కలెక్టర్ కీలకపాత్ర వహిస్తాడు. అతడు జిల్లా పరిపాలన అధిపతిగా వ్యవహరిస్తాడు. జిల్లాస్థాయిలో వివిధ పాలనా విధానాల రూపకల్పన, అమలులో ప్రత్యక్ష ప్రమేయం కలిగి ఉంటాడు. జిల్లా ప్రజల సత్వర వికాసానికి అవసరమయ్యే విధి విధానాలను రూపొందించి, అమలు చేయడంలో కలెక్టర్కు కీలకపాత్ర ఉంటుంది. అతడి అధికారాలు విధుల నిర్వహణలో అనేకమంది అధికారులు సహాయపడతారు.

భారతదేశంలో జిల్లా కలెక్టర్ పదవిని 1722లో మొదటిసారిగా తూర్పు ఇండియా కంపెనీ ప్రవేశపెట్టింది. కాలంలో ప్రజల వద్ద నుంచి భూమిశిస్తు వసూలుచేసే ఉద్దేశంతో ఆ పదవిని ఏర్పాటుచేసింది. అప్పటి నుంచి ఆ పదవిని నిర్వహించే వ్యక్తుల అధికారాలు, విధులలో విశేషమైన మార్పులు చోటుచేసుకున్నాయి. క్రమేణా తూర్పు ఇండియా కంపెనీ, తరువాత బ్రిటిష్ ప్రభుత్వం జిల్లా కలెక్టర్ అధికార విధులను గణనీయంగా పెంచుతూ వచ్చాయి. వర్తమాన కాలంలో భారతదేశంలో జిల్లా కలెక్టర్గా నియమితులయ్యేవారు ప్రతిష్టాత్మకమైన ఐ.ఏ.ఎస్. హోదా కలిగి ఉంటున్నారు. జిల్లా కలెక్టర్ను రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తుంది.

జిల్లా కలెక్టర్ అధికారాలు – విధులు: జిల్లా పాలన అధిపతిగా – కలెక్టర్కు విశేష అధికారాలు, విస్తృత విధులు ఉంటాయి. వాటిని క్రింది విధంగా వివరించడమైంది.
1) కలెక్టర్ – ప్రధాన రెవిన్యూ అధికారి: జిల్లాలో కలెక్టర్ ప్రధాన రెవిన్యూ అధికారిగా వ్యవహరిస్తాడు. ఆ హోదాలో అతడు జిల్లాలోని రైతులకు మార్గదర్శిగా ఉంటాడు. జిల్లాలోని గ్రామాలలో భూమిశిస్తు, జమాబందీ లెక్కలకు ఆధ్వర్యం వహిస్తాడు. భూమిశిస్తు వసూళ్ళు, రైతులకు రుణాల మంజూరు, ప్రకృతి విపత్తుల సమయంలో రైతులకు పంట నష్టపరిహారాలను చెల్లించడం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికార బృందాలకు నష్టపరిహార అంచనా సేకరణ, తయారీలలో సహకరించడం, ప్రభుత్వ భూముల రికార్డులను నిర్వహించడం వంటివి జిల్లా కలెక్టర్కు ఉన్న రెవిన్యూ అధికారాలలో ముఖ్యమైనవి. కలెక్టర్ జిల్లాలో ప్రభుత్వ కోశాగారాల పనితీరును సమీక్షిస్తాడు. పైన పేర్కొన్న విధులన్నీ జిల్లా అభివృద్ధికి సంబంధించినవై ఉంటాయి. అంతేకాకుండా వాటి నిర్వహణలో భౌతిక, ఆర్థిక, మానవ సంబంధమైన వనరుల సమీకరణకు సంబంధం ఉంటుంది.

2) జిల్లా మెజిస్ట్రేట్గా వ్యవహరించడం: కలెక్టర్ జిల్లా మెజిస్ట్రేట్ గా వ్యవహరిస్తాడు. జిల్లాలో పనిచేసే పోలీస్ సిబ్బంది వ్యవహారాలపై అతనికి పర్యవేక్షణాధికారం ఉంటుంది. జిల్లాలో శాంతిభద్రతలు సాధారణ స్థాయిలో కొనసాగేటట్లు చూడవలసిందిగా పోలీస్ అధికారులకు సూచిస్తాడు. జిల్లాలో పోలీస్ యంత్రాంగం అంతా కలెక్టర్కు సహాయకారిగా ఉంటుంది. జిల్లా పోలీస్ సూపరింటెండెంట్, ఇతర అధికారులు కలెక్టర్ ఆదేశాల మేరకు వ్యవహరిస్తారు. జిల్లాలోని కారాగారాలు, పోలీస్ సిబ్బంది వ్యవహారాలను కలెక్టర్ నిర్ణీత వ్యవధులలో సమీక్షిస్తాడు.

సబార్డినేట్ కోర్టులపై పర్యవేక్షణ, కార్మిక సమస్యల పరిష్కారం, పేలుడు పదార్థాల తయారీ, రవాణాకు అనుమతినివ్వడం, పెట్రోలు బంకులు, సినిమా థియేటర్లు వంటి అధునాతన సౌకర్యాలు కల్పించడానికి అనుమతులు మంజూరుచేయడం వంటి అనేక విధులను కలెక్టర్ నిర్వహిస్తాడు. పైన పేర్కొన్న విధులన్నీ జిల్లా అభివృద్ధికి సంబంధించిన వ్యవహారాలపై విశేషమైన ప్రభావాన్ని చూపిస్తాయి.

3) ముఖ్య సమన్వయ కర్త: జిల్లాలోని వివిధ ప్రభుత్వశాఖల అధికారుల మధ్య కలెక్టర్ సమన్వయ కర్తగా వ్యవహరిస్తాడు. వ్యవసాయం, నీటిపారుదల, సహకారం, విద్య, పరిశ్రమలు వంటి వివిధ శాఖల అధిపతులతో సమీక్ష సమావేశాలను నిర్వహిస్తాడు. జిల్లాలోని వివిధ శాఖల అధికారుల పనితీరును తెలుసుకుంటాడు. ప్రభుత్వ పథకాల అమలులో వారికి తగిన ఆదేశాలను, సూచనలను ఇస్తాడు. వివిధ శాఖల అధిపతులు విడివిడిగా జిల్లా అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించి, అమలు చేసినప్పటికీ, అంతిమంగా వారంతా కలెక్టర్కు జవాబుదారీగా ఉంటూ కలెక్టర్ సూచనల మేరకు వ్యవహరిస్తారు.

4) జిల్లా ముఖ్య ఎన్నికల అధికారి: జిల్లా ముఖ్య ఎన్నికల అధికారిగా కలెక్టర్ వ్యవహరిస్తాడు. భారత ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘం తరపున జిల్లాలోని వివిధ ప్రాతినిధ్య సంస్థల ప్రతినిధుల ఎన్నికకు అవసరమైన ఏర్పాట్లు చేస్తాడు. ఎన్నికలను ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా జరిగేటట్లు చూస్తాడు.

ఎన్నికలకు సంబంధించిన వారంతా పార్టీలు అభ్యర్థులు, అధికారులు, నాయకులు, ప్రజలు ఎన్నికల నియమావళిని పాటించేలా చూస్తాడు. జిల్లాలో సహకార బ్యాంకులు, డెయిరీ యూనిట్లు, నీటి వినియోగ కమిటీలు, పాఠశాల నిర్వహణ కమిటీలు మొదలైన వాటికి రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు ఎన్నికలను నిర్వహిస్తాడు.

5) జనాభా లెక్కల ముఖ్య అధికారి: కలెక్టర్ జిల్లాలో జనాభా లెక్కల ముఖ్య అధికారిగా వ్యవహరిస్తాడు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పదేళ్ళకొకసారి జనాభా లెక్కల సేకరణకోసం పంపించే మార్గదర్శక సూత్రాలకు అనుగుణంగా జనాభా లెక్కల సేకరణకు చర్యలు తీసుకుంటాడు. అలాగే జిల్లాలో పాడిపశువులు, ఫలసాయమిచ్చే వృక్షాలు, పెంపుడు జంతువులకు సంబంధించిన గణాంక సమాచారాన్ని సేకరించడానికి తగిన ఏర్పాట్లు చేస్తాడు. జిల్లాలో నిరుపేదలకు ఇండ్లు నిర్మించి ఇవ్వడం, ఇతర కుటుంబ సంక్షేమ మహిళా సాధికారత వంటి అంశాలకు సంబంధించిన సమాచార సేకరణకు కలెక్టర్ ఏర్పాట్లు చేస్తాడు.

AP Inter 2nd Year Civics Study Material Chapter 10 భారతదేశంలో స్థానిక ప్రభుత్వాలు

6) స్థానిక సంస్థల సమావేశాలకు శాశ్వత ఆహ్వానితుడు: జిల్లాలోని పంచాయితీరాజ్, పట్టణ పాలిత స్థానికసంస్థల సమావేశాలలో కలెక్టర్ శాశ్వత ఆహ్వానితుని హోదాలో పాల్గొంటాడు. జిల్లాలోని వివిధ స్థానిక సంస్థలకు, కేంద్ర, రాష్ట్రాల మధ్య కలెక్టర్ ప్రధాన సంధానకర్తగా వ్యవహరిస్తాడు. జిల్లా పరిషత్/మండల పరిషత్, సాధారణ/అత్యవసర సమావేశాలకు హాజరై వివిధ అంశాలపై ప్రజా ప్రతినిధులకు, అధికారులకు సలహాలిస్తాడు. జిల్లాలోని స్థానిక సంస్థల వ్యవహారాలు, పనితీరు గురించి రాష్ట్ర ప్రభుత్వానికి నిర్ణీత సమయాలలో విశ్వసనీయ నివేదికలను పంపుతాడు. జిల్లా పరిషత్ ఛైర్మన్పై వచ్చే అవిశ్వాస తీర్మానంపై జిల్లాపరిషత్తు సమావేశాన్ని నిర్వహించి, ఆ తీర్మానంపై ఓటింగ్ నిర్వహించి ఫలితాన్ని ప్రకటిస్తాడు. జిల్లాలో గ్రామీణ/పట్టణ ప్రాంతాలలో కొత్తగా స్థానిక సంస్థల ఏర్పాటు విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి తగిన ప్రతిపాదనలు పంపుతాడు.

ఇతర విధులు: జిల్లా కలెక్టర్ క్రింద పేర్కొన్న ఇతర విధులను నిర్వహిస్తాడు.

  1. మాజీ సైనికోద్యోగుల సంక్షేమం.
  2. నీటిపారుదల సౌకర్యాల కల్పన.
  3. ప్రభుత్వకోశాగారాలపై పర్యవేక్షణ.
  4. వివిధ ప్రభుత్వశాఖల మధ్య సమన్వయం చేకూర్చటం.
  5. జూనియర్ అధికారులకు వివిధ అంశాలపై తర్ఫీదు ఇప్పించటం.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
భారతదేశంలో స్థానిక ప్రభుత్వాల చారిత్రక నేపధ్యాన్ని సంక్షిప్తంగా రాయండి.
జవాబు:
చారిత్రక నేపథ్యం: భారతదేశంలో స్థానిక ప్రభుత్వాలకు విశేషమైన చారిత్రక ప్రాముఖ్యత ఉంది. ప్రశస్తమైన నాలుగు వేదాలలో మొదటిదైన రుగ్వేదంలో సభ, సమితి అనే రెండు సంస్థల గురించి ప్రస్తావన ఉంది. ఆ రెండు సంస్థలూ, స్థానిక సంస్థలకు ప్రతిరూపాలే. గ్రామస్థాయిలో ఆ రెండూ అనేక పరిపాలన, రాజకీయ విధులను నిర్వర్తించాయి. ప్రాచీన భారతదేశంలో చక్కని సమర్థవంతమైన ప్రభుత్వ వ్యవస్థలు ఏర్పడి, పనిచేశాయి. గ్రామీణ సమాజానికి సంబంధించిన పరిపాలన, న్యాయ వ్యవహారాలను పర్యవేక్షించడానికి అవి కొనసాగాయి. వాటిని గ్రామపంచాయితీలు, కుల పంచాయితీలుగా పరిగణించడం జరిగింది. ఆనాటి పాలకుల మద్దతు లేకపోయినప్పటికీ అవి సమర్థవంతంగా వ్యవహరించాయి. మెగస్తనీస్, కౌటిల్యుడు, ఫాహియాన్ వంటి ప్రసిద్ధ పర్యాటకులు తమ గ్రంథాలలో పైన పేర్కొన్న సంస్థల గురించి ప్రస్తావించారు.

మధ్యయుగంలో దక్షిణ భారతదేశంలో చోళ వంశ రాజుల పరిపాలన కాలంలో గ్రామపంచాయితీలు వికసించాయి. స్థానిక సంస్థలను ఏర్పాటు చేసి పోషించిన వారిలో చోళులకు మంచిపేరు వచ్చింది. అయితే వర్తమాన స్థానిక ప్రభుత్వాల నిర్మాణం, పనితీరుపై బ్రిటీష్ ప్రభుత్వానికి చెందిన ఉన్నతాధికారుల పాత్ర విస్మరించలేనిది. బ్రిటిష్ పాలకులు స్వీయ ప్రయోజనాలను పెంపొందించుకొనే లక్ష్యంతో స్థానిక ప్రభుత్వాల అభివృద్ధికి కృషి చేశారు. 1870 నాటి మేయో ప్రభువు, 1882 నాటి రిప్పన్ ప్రభువుల తీర్మానాలు భారతదేశంలో ఈ రకమైన ప్రభుత్వాల పురోగతికి మార్గదర్శకమయ్యాయి. అంతకు పూర్వం 1688లో తూర్పు ఇండియా కంపెనీ భారతదేశంలో మొదటిసారిగా మదరాసు (ప్రస్తుతం చెన్నై) నగరపాలక సంస్థను ఆనాటి బ్రిటిష్ చక్రవర్తి రెండో జార్జి అనుమతితో ఆరంభించింది. 1726 నాటికి మదరాసులో ప్రజల వద్ద నుంచి పన్నులను సేకరించడం, న్యాయపాలన వంటి ప్రధాన విధులను నిర్వహించడానికి కొన్ని మేయర్ కోర్టులు ఏర్పాటయ్యాయి. 1773 నాటి రెగ్యులేటింగ్ చట్టం ద్వారా కలకత్తా (కోల్కతా), మదరాసు (చెన్నై), బొంబాయి (ముంబై) నగరాలలో స్థానిక ప్రభుత్వాల ఏర్పాటుకు మార్గం సుగమమైంది.

1935 చట్టం స్థానిక స్వపరిపాలన అనే అంశాన్ని ఆ చట్టం 12వ ప్రవేశ విషయంగా (Entry 12) ప్రకటించింది. భారతదేశంలో రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ చట్టాలను రూపొందించడం ద్వారా గ్రామపంచాయితీల అధికారాలను విశేషంగా పెంచడానికి చర్యలు తీసుకున్నాయి. గ్రామపంచాయతీల ఆధీనంలో క్రిమినల్ న్యాయంతో సహా అనేక అంశాలను చేర్చడం జరిగింది. మహత్మాగాంధీ వంటి ప్రముఖ జాతీయోద్యమ నాయకులు స్థానిక ప్రభుత్వాలను వెంటనే ఏర్పాటు చేయవలసిందిగా బ్రిటీష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

AP Inter 2nd Year Civics Study Material Chapter 10 భారతదేశంలో స్థానిక ప్రభుత్వాలు

1935 భారత ప్రభుత్వ చట్టం స్థానిక ప్రభుత్వాలు సమర్థవంతంగా పనిచేయటానికి వీటి ఏర్పాటు నిర్వహణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించింది. స్థానిక స్వపరిపాలన రాష్ట్ర ప్రభుత్వ అధికారాలలో 12వ అంశంగా పేర్కొంటారు. వీటి పాలనతో పాటు క్రిమినల్ న్యాయవ్యవస్థలు స్థానిక ప్రభుత్వాల పరిధిలోకి తెచ్చారు. మనదేశ పెద్దలైన మహాత్మాగాంధీలాంటి వారు దీనిని గట్టిగా సమర్థించారు. అయితే రెండవ ప్రపంచయుద్ధం తరువాత తగినంత ప్రగతి స్థానిక ప్రభుత్వాలలో కొనసాగలేదు. మనం ఇప్పుడు స్థానిక ప్రభుత్వాల అధికారాలు, విధులను రెండు భాగాలుగా విభజించి అధ్యయనం చేయవచ్చు. 1) గ్రామీణ స్థానిక ప్రభుత్వాలు 2) పట్టణ స్థానిక ప్రభుత్వాలు.

ప్రశ్న 2.
స్థానిక ప్రభుత్వాల ప్రయోజనాలను వివరించండి.
జవాబు:
ప్రయోజనాలు: వర్తమాన ప్రజాస్వామ్య రాజ్యాలలో స్థానిక ప్రభుత్వాలు పనిచేస్తుంటాయి. ఆ సంస్థల వల్ల అనేక ప్రయోజనాలు లభించడం వల్ల వాటిని ఆధునిక ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ప్రోత్సహిస్తాయి. స్థానిక ప్రభుత్వాల వల్ల క్రింది ప్రయోజనాలు ఉంటాయి.

  1. స్థానిక ప్రభుత్వాలు ప్రజాస్వామ్యాన్ని అట్టడుగు స్థాయిలో పెంపొందించి పటిష్టంగావిస్తాయి. మారుమూల ప్రాంతాల ప్రజలు సైతం స్థానిక రాజకీయ ప్రక్రియలో సమర్థవంతంగా పాల్గొనేటట్లు ప్రోత్సహిస్తాయి.
  2. స్థానిక ప్రభుత్వాలు ప్రజలలో రాజకీయ అవగాహనను, బాధ్యతను పెంపొందిస్తాయి. ఎందుకంటే అవి స్థానిక స్థాయిలో వివిధ రాజకీయ సంస్థల నిర్వహణలో విధానాలపై నిర్ణయం, విధానాల అమలులో ప్రజలకు అవకాశమిస్తాయి.
  3. స్థానిక ప్రభుత్వాలు స్థానిక స్థాయిలో ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రజలకు భాగస్వామ్యం కల్పించి ఆ సమస్యలు శీఘ్రంగానూ, సంపూర్ణంగానూ పరిష్కారమయ్యేలా చూస్తాయి.
  4. స్థానికంగా అందుబాటులో ఉండే మానవీయ, భౌతిక వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవడంలోనూ, సక్రమంగా నిర్వహించుకోవడంలోనూ స్థానిక ప్రభుత్వాలు దోహదపడతాయి.
  5. స్థానిక ప్రభుత్వాలు పాలనలో పొదుపు పెంచుతాయి.
  6. ఇవి ప్రజలలో స్వేచ్ఛా వాతావరణాన్ని పెంపొందిస్తాయి.
  7. ఇవి స్వయం సహాయ, స్వయం ఆధారిత స్ఫూర్తిని అలవరుస్తాయి.

ప్రశ్న 3.
పంచాయితీ కార్యదర్శి విధులు ఏవి?
జవాబు:
ప్రతి గ్రామ పంచాయితీకి పూర్తి కాల ప్రభుత్వ అధికారిగా కార్యదర్శి వ్యవహరిస్తాడు. ఇతనిని రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తుంది. కార్యదర్శి జీతం ఇతర భత్యాలు ప్రభుత్వనిబంధనల ప్రకారం పంచాయితీ నిధుల నుంచి కేటాయిస్తారు. ఇతను సర్పంచ్ ప్రత్యక్ష పర్యవేక్షణలో పనిచేస్తాడు.

పంచాయతీ కార్యదర్శి ఈ క్రింది పేర్కొన్న విధులను నిర్వహిస్తాడు.

  1. పంచాయతీ బడ్జెట్ తయారుచేయడం, వార్షిక పాలనా నివేదికలు తయారుచేయడం.
  2. నెలవారీ, త్రైమాసిక, ఆర్థిక గణాంకాలు తయారుచేయడం.
  3. నగదు పుస్తక నిర్వహణ.
  4. పంచాయతీ రికార్డులను తన ఆధీనంలో భద్రపరుచుట.
  5. పంచాయతీలో ఇతర ఉద్యోగులకు విధులు కేటాయించడం.
  6. గ్రాంటు కోసం ధరఖాస్తుచేయడం, గ్రాంట్ ఇన్ ఎయిడ్ రిజిష్టరు చేయడం.
  7. పంచాయతీలో జరిగే పనులు తనిఖీ, పని ప్రగతిని పరిశీలించడం.
  8. అభివృద్ధి పనులకు సంబంధించిన ఫిర్యాదులను స్వీకరించి, పరిశీలించి తగు చర్యలు తీసుకోవడం.

ప్రశ్న 4.
గ్రామ సభ గూర్చి నీకు ఏమి తెలియును?
జవాబు:
ప్రతి గ్రామపంచాయతీలో గ్రామసభ ఏర్పాటవుతుంది. దానిలో గ్రామానికి చెందిన రిజిష్టర్డ్ ఓటర్లు సభ్యులుగా ఉంటారు. అది సంవత్సరానికి కనీసం మూడుసార్లయినా సమావేశమవుతుంది. గ్రామసభ పంచాయతీకి సంబంధించిన వార్షిక పరిపాలన, ఆడిట్ నివేదికలను పరిశీలించి ఆమోదిస్తుంది. వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాల లబ్ధిదారుల జాబితాను ఖరారు చేస్తుంది. సమాజ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు శ్రీఘ్రగతిన అమలుపరచడానికి, ప్రజల భౌతిక సేవలను స్వచ్ఛందంగా వినియోగించుకోవడానికి తగిన సూచనలిస్తుంది. గ్రామసభలను బీహార్లో పంచాయతీ అని, ఒడిస్సాలో పాలీ సభ అని వ్యవహరిస్తారు. కేంద్రప్రభుత్వం 2009-2010 సంవత్సరాన్ని పంచాయతీరాజ్ సంస్థలను ఏర్పరచి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో గ్రామసభ సంవత్సరంగా ప్రకటించింది. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14వ తేదీన గ్రామసభలను తప్పనిసరిగా నిర్వహించాలని పేర్కొంది.

AP Inter 2nd Year Civics Study Material Chapter 10 భారతదేశంలో స్థానిక ప్రభుత్వాలు

ప్రశ్న 5.
మండల పరిషత్తు గూర్చి క్లుప్తంగా రాయండి.
జవాబు:
జిల్లాలో మాథ్యమిక స్థాయిలో గల స్థానిక సంస్థయే మండల పరిషత్తు, రాష్ట్ర ప్రభుత్వ చట్టం ద్వారా మండల పరిషత్తు ఏర్పాటవుతుంది. మండల పరిషత్తులను వివిధ రాష్ట్రాలలో వివిధ రకాల పేర్లతో పిలుస్తారు. ఉదాహరణకు తమిళనాడులో పంచాయతి యూనియన్ కౌన్సిల్, కర్నాటకలో తాలూక అభివృద్ధి బోర్డు, గుజరాత్లో తాలూక పంచాయత్ అని అంటారు. అయినప్పటికీ దీనికి ప్రాచుర్యంలో ఉన్న పేరు పంచాయతీ సమితి.

నిర్మాణం: ప్రతి మండలాన్ని కొన్ని మండల ప్రాదేశిక నియోజకవర్గాలుగా (జనాభా ప్రాతిపదికన) విడదీస్తారు. ఓటర్లు మండల ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులను ఎన్నుకుంటారు. మండల పరిషత్తులో నాలుగు అంగాలుంటాయి. అవి: 1) మండలపరిషత్తు, 2) మండల పరిషత్తు అధ్యక్షుడు 3) మండల పరిషత్తు అభివృద్ధి అధికారి 4) మండల మహాసభ.

ప్రశ్న 6.
జిల్లా పరిషత్తు నిర్మాణం గురించి వివరించండి.
జవాబు:
రాష్ట్రంలోని ప్రతి జిల్లాకు ఒక జిల్లా పరిషత్తు ఉంటుంది. జిల్లా స్థాయిలో అత్యున్నత స్థాయి స్వపరిపాలన సంస్థయే జిల్లా పరిషత్తు, జిల్లా పరిషత్తుకు చట్టబద్ధమైన ప్రతిపత్తి ఉంటుంది.

జిల్లా పరిషత్: జిల్లా పరిషత్తులో ఆరు ప్రధాన అంగాలు ఉంటాయి. అవి:

  1. జిల్లా పరిషత్తు,
  2. ఛైర్మన్,
  3. జిల్లా మహాసభ,
  4. ముఖ్య కార్యనిర్వహణాధికారి,
  5. స్థాయీ సంఘాలు,
  6. జిల్లా కలెక్టర్.

జిల్లా పరిషత్తు అనేది జిల్లా స్థాయిలో శాసన నిర్మాణ అంగంగా వ్యవహరిస్తుంది. దానిలో వివిధ రకాల సభ్యులు ఉంటారు. వారిలో ఎన్నికయినవారు కో-ఆప్టెడ్ చేసుకోబడినవారు, ఎక్స్-అఫీషియో సభ్యులుంటారు. జిల్లా స్థాయి అధికారులైన జిల్లా కలెక్టర్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు, జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ, జిల్లా గ్రంథాలయ సంస్థలకు చెందిన అధ్యక్షులు శాశ్వత ఆహ్వానితుల హోదాలో జిల్లా పరిషత్తు సమావేశాలలో పాల్గొంటారు. అంతేకాకుండా జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గ సభ్యులు (MLAs) జిల్లా పరిషత్తు సమావేశాలలో పాల్గొంటారు.

ప్రశ్న 7.
భారతదేశంలో వివిధ రకాల పట్టణ స్థానిక సంస్థల గూర్చి చర్చించండి.
జవాబు:
భారతదేశంలో 9 రకాల పట్టణ స్థానిక సంస్థలున్నాయి. అవి

  1. నగరపాలక సంస్థలు,
  2. పురపాలక సంస్థలు
  3. నగర పంచాయతీలు
  4. నోటిఫైడ్ ఏరియా కమిటీలు
  5. టౌన్ ఏరియా కమిటీలు
  6. కంటోన్మెంట్ బోర్డులు
  7. టౌన్ షిప్పులు
  8. పోర్టుట్రస్టులు
  9. ప్రత్యేక ప్రయోజిత సంస్థలు.

1) నగరపాలక సంస్థలు: పట్టణ స్థానిక ప్రభుత్వాలలో నగరపాలక సంస్థలు చాలా ముఖ్యమైనవి. ఇవి అత్యున్నత పట్టణ, స్థానిక సంస్థలుగా అతిపెద్ద నగరాలలో ఏర్పాటుచేస్తారు.

2) పురపాలక సంస్థలు: నగరపాలక సంస్థకు దిగువన, గ్రామపంచాయతీ/నగర పంచాయతీకి ఎగువన గల పట్టణ స్థానిక సంస్థలే పురపాలక సంస్థలు. సాధారణంగా జనాభా 20,001 లేదా అంతకుమించితే లేదా . అరవై లక్షలకు మించిన వార్షికాదాయం ఉంటే పురపాలక సంస్థలుగా ఏర్పాటవుతాయి.

AP Inter 2nd Year Civics Study Material Chapter 10 భారతదేశంలో స్థానిక ప్రభుత్వాలు

3) నగర పంచాయతీలు: గ్రామ స్థాయి నుండి పట్టణ స్థాయికి పరిణామం చెందే ప్రాంతం’ లేదా అతిచిన్న పట్టణ ప్రాంతాలలో ఏర్పాటయ్యే స్థానిక సంస్థలను నగర పంచాయతీ అంటారు.

4) నోటిఫైడ్ ఏరియా కమిటీలు: శీఘ్రగతిన అభివృద్ధి పథంలో పురోగమించే పట్టణాలలో లేదా పురపాలక సంస్థల ఏర్పాటుకు అనుకూలంగా లేని పరిస్థితులలో ఈ కమిటీ ఏర్పాటవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రకటన ద్వారా ఈ కమిటీ ఏర్పడడంతో దీనిని నోటిఫైడ్ ఏరియా కమిటీగా వ్యవహరించడమైంది.

5) టౌన్ ఏరియా కమిటీలు: రాష్ట్ర శాసనసభ ఆమోదించే ప్రత్యేక చట్టం ద్వారా టౌన్ ఏరియా కమిటీ ఏర్పాటవుతుంది. చిన్న పట్టణాల అవసరాలను తీర్చడానికి ఈ కమిటీలు అవసరమవుతాయి. అవి పరిమితమైన విధులను మాత్రమే నిర్వహిస్తుంటాయి.

6) కంటోన్మెంట్ బోర్డులు భారతదేశంలో కంటోన్మెంట్ బోర్డులనేవి భారత ప్రభుత్వ కంటోన్మెంట్ చట్టం, 1904 ద్వారా ఏర్పాటయ్యాయి. ప్రస్తుతం భారతదేశంలో 62 కంటోన్మెంట్ బోర్డులు పనిచేస్తున్నాయి. కంటోన్మెంట్ ప్రాంతాలలో నివసించే పౌరులు, సైనిక సిబ్బంది తాలుకు వ్యక్తుల ప్రయోజనాలను పెంపొందించడానికి అవి కృషి చేస్తున్నాయి.

7) టౌన్షిప్లు: టౌన్షిప్లు అనేవి ప్రభుత్వరంగ సంస్థలలో ఏర్పాటవుతాయి. ప్రభుత్వరంగ సంస్థలలో పనిచేసే సిబ్బందికి మౌలిక సదుపాయాలను కల్పించడానికి అవి కృషిచేస్తాయి. వాటిలో ఎన్నుకోబడే సభ్యులు ఎవరూ ఉండరు. ప్రతి టౌన్షిప్కు ఒక టౌన్ పరిపాలన అధికారి ఉంటాడు.

8) పోర్ట్ స్ట్లు: దేశంలోని సముద్రతీరంలో ఓడరేవులు ఉన్న ప్రాంతాలలో పోర్ట్ స్ట్లు ఏర్పాటవుతాయి. అలాగే నౌకాశ్రయాలలో పనిచేసే సిబ్బందికి సంబంధించిన వ్యవహారాలను పర్యవేక్షిస్తాయి.

9) ప్రత్యేక ప్రయోజిత సంస్థలు: పట్టణ ప్రాంతాలలో నివసించే ప్రజలు ఎదుర్కొనే సమస్యల పరిష్కారానికి ఈ రకమైన సంస్థలు పనిచేస్తుంటాయి. పురపాలక సంఘాలు. ఇతర నోటిఫైడ్ ప్రాంతాలలో నివసించే ప్రజల ప్రత్యేక అవసరాలను తీర్చడానికి అవి కృషిచేస్తాయి. రాష్ట్ర శాసనసభ ఆమోదించిన ప్రత్యేక చట్టాల ప్రకారం వాటిని స్థాపించడం జరుగుతుంది.

ప్రశ్న 8.
మున్సిపాలిటీల గురించి నీకు ఏమి తెలియును?
జవాబు:
నగరపాలక సంస్థకు దిగువన, గ్రామపంచాయతీ / నగర పంచాయితీకి ఎగువన గల పట్టణ స్థానిక సంస్థలే పురపాలక సంస్థలు. సాధారణంగా జనాభా 20,001 లేదా అంతకుమించితే లేదా అరవై లక్షలకు మించిన వార్షికాదాయం ఉంటే పురపాలక సంస్థలుగా ఏర్పాటవుతాయి.

ప్రతి పురపాలక సంస్థలో నాలుగు అంగాలు ఉంటాయి. 1) పురపాలక మండలి, 2) పురపాలక చైర్మన్, 3) మున్సిపల్ కమీషనర్, 4) స్థాయీ సంఘాలు, ఆ నాలుగు రకాల అంగాల గురించి క్రింది విధంగా వివరించవచ్చు.

పురపాలక సంస్థ చర్చావేదికయే పురపాలక మండలి. దీనిలో i) ఎన్నికయ్యే సభ్యులు ii) అనుబంధ సభ్యులు iii) గౌరవ సభ్యులు అనే మూడు రకాల సభ్యులు ఉంటారు. పురపాలక సంస్థ పరిధిలోని రిజిష్టర్డ్ ఓటర్లు మొదటి తరహా సభ్యులను ఎన్నుకుంటారు. వీరిని కౌన్సిలర్స్ అంటారు. అనుబంధ సభ్యులను, ఎన్నికయిన సభ్యులు ఎన్నుకుంటారు. జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమీషనర్, పురపాలక సంస్థ పరిధిలోని లోక్సభ, విధానసభ సభ్యులు తమ అధికార హోదారీత్యా పురపాలక మండలిలో సభ్యులుగా వ్యవహరిస్తారు.

ప్రశ్న 9.
జిల్లా కలెక్టర్ యొక్క ఏవైనా మూడు విధులను గూర్చి రాయండి.
జవాబు:
జిల్లా పాలనాధిపతిగా – కలెక్టరుకు విశేష అధికారాలు, విస్తృత విధులు ఉంటాయి. వాటిని ఈ క్రింది విధంగా పేర్కొనవచ్చు.
1) కలెక్టర్ – ప్రధాన రెవిన్యూ అధికారి: జిల్లాలో కలెక్టర్ ప్రధాన రెవిన్యూ అధికారిగా వ్యవహరిస్తాడు. హోదాలో అతడు జిల్లాలోని రైతులకు మార్గదర్శిగా ఉంటాడు. జిల్లాలోని గ్రామాలలో భూమిశిస్తు, జమాబందీ లెక్కలకు ఆధ్వర్యం వహిస్తాడు. భూమిశిస్తు వసూళ్ళు, రైతులకు రుణాల మంజూరు, ప్రకృతి విపత్తుల సమయంలో రైతులకు పంట నష్టపరిహారాలను చెల్లించడం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికార బృందాలకు నష్టపరిహార అంచనా సేకరణ, తయారీలలో సహకరించడం, ప్రభుత్వ భూముల రికార్డులను నిర్వహించడం వంటివి జిల్లా కలెక్టర్కు ఉన్న రెవిన్యూ అధికారాలలో ముఖ్యమైనవి.

2) జిల్లా మెజిస్ట్రేట్గా వ్యవహరించడం: కలెక్టర్ జిల్లా మెజిస్ట్రేట్గా వ్యవహరిస్తాడు. జిల్లాలో పనిచేసే పోలీస్ సిబ్బంది వ్యవహారాలపై అతనికి పర్యవేక్షణాధికారం ఉంటుంది. జిల్లాలో శాంతిభద్రతలు సాధారణ స్థాయిలో కొనసాగేటట్లు చూడవలసిందిగా పోలీస్ అధికారులకు సూచిస్తాడు. జిల్లాలో పోలీస్ యంత్రాంగం అంతా కలెక్టర్కు సహాయకారిగా ఉంటుంది. జిల్లా పోలీస్ సూపరింటెండెంట్, ఇతర అధికారులు కలెక్టర్ ఆదేశాల మేరకు వ్యవహరిస్తారు.

3) ముఖ్య సమన్వయ కర్త: జిల్లాలోని వివిధ ప్రభుత్వశాఖల అధికారుల మధ్య కలెక్టర్ సమన్వయ కర్తగా వ్యవహరిస్తాడు. వ్యవసాయం, నీటిపారుదల, సహకారం, విద్య, పరిశ్రమలు వంటి వివిధ శాఖల అధిపతులతో సమీక్ష సమావేశాలను నిర్వహిస్తాడు. జిల్లాలోని వివిధ శాఖల అధికారులు పనితీరును తెలుసుకుంటాడు. ప్రభుత్వ పథకాల అమలులో వారికి తగిన ఆదేశాలను, సూచనలను ఇస్తాడు.

AP Inter 2nd Year Civics Study Material Chapter 10 భారతదేశంలో స్థానిక ప్రభుత్వాలు

ప్రశ్న 10.
జిల్లా కలెక్టరు పాత్రను అంచనా వేయండి.
జవాబు:
జిల్లాలోని వివిధ స్థానిక ప్రభుత్వాల వ్యవహారాల నిర్వహణలో కలెక్టర్ అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తాడు. జిల్లాలో నివసించే సాధారణ ప్రజానీకానికి కలెక్టర్ స్నేహితుడిగా, తాత్త్వికుడిగా, మార్గదర్శకుడిగా ఉంటాడు. జిల్లాలోని స్థానిక ప్రభుత్వాలకు, ప్రజలకు మధ్య సంధానకర్తగా వ్యవహరిస్తాడు. ‘సాధారణంగా జిల్లాలోని సామాన్య ప్రజలు ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు కలెక్టర్ అందించే సహాయసహకారాల కోసం ఆత్రుతతో ఎదురుచూస్తూ ఉంటారు.

జిల్లాలోని స్థానిక ప్రభుత్వాల పనితీరు గురించి కలెక్టర్ రాష్ట్ర ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు తగిన సూచనలందిస్తాడు. జిల్లాలో నూతనంగా స్థానిక సంస్థలను ఏర్పాటు చేసే విషయంలో కలెక్టర్ సిఫారసులు, వ్యాఖ్యానాలు అత్యంత కీలకమైన స్థానాన్ని ఆక్రమిస్తాయి. అనేక సందర్భాలలో జిల్లాలో వ్యవసాయం, పశుపోషణ, రెవిన్యూ, పోలీసు, ఆరోగ్యం, విద్య వంటి రంగాలలో పనిచేసే సిబ్బంది కలెక్టర్ సలహాల ప్రకారం వ్యవహరిస్తారు. జిల్లాలోని రైతులకు వ్యవసాయక ఉత్పాదితాలైన ఎరువులు, క్రిమిసంహారక మందులు, సహకార రుణాలు వంటి సౌకర్యాలు, వ్యవసాయ పంటల మార్కెటింగ్ సదుపాయాలు, ఆరోగ్యం, విద్యవంటి రంగాలలో పనిచేసే సిబ్బంది కలెక్టర్ సలహాల ప్రకారం వ్యవహరిస్తారు. జిల్లాలోని రైతులకు వ్యవసాయక ఉత్పాదితాలైన ఎరువులు, క్రిమిసంహారక మందులు, అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటాడు. వ్యవసాయ కార్యకలాపాలు నిరాటంకంగా కొనసాగడానికి కృషిచేస్తాడు. అలాగే పేదరిక రేఖ దిగువన నివసించే ప్రజలకు ఆరోగ్యం, ఆహారం, త్రాగునీరు, ఉపాధి వంటి సౌకర్యాలు కల్పించడానికి దోహదపడతాడు.

జిల్లా స్థాయిలో కలెక్టర్ దాదాపు నూరుకు పైగా కమిటీల సమావేశాలకు అధ్యక్షత వహించడమనే విషయం కలెక్టర్ పదవి ప్రాముఖ్యత గురించి, జిల్లా పాలనా వ్యవహారాలలో కలెక్టర్ నిర్వహించే కీలకపాత్ర గురించి తెలుపుతుంది. కలెక్టర్ జిల్లాస్థాయిలో వివిధ కమిటీల సమావేశాలకు అధ్యక్షత వహించడంతోపాటుగా ఆ సమావేశాలలో తీసుకున్న నిర్ణయాలను అమలుచేయడానికి తగిన శ్రద్ధ వహిస్తాడు. జిల్లాలో వివిధ మండల పరిషత్తులు, గ్రామపంచాయతీలను నెలలో దాదాపు ఇరవై రోజులపాటు సందర్శించి, ఆయా సంస్థల పనితీరును సమీక్షించి, వాటి మెరుగుదలకు తగిన సూచనలిస్తాడు. రాష్ట్రస్థాయిలో ముఖ్యకార్యదర్శి వలె, జిల్లాస్థాయిలో కలెక్టర్ విశేషమైన ప్రభావాన్ని చూపిస్తూ, తన అధికారాల వినియోగంలో వివేకం, వివేచనలను ప్రదర్శిస్తాడు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన అనేక అభివృద్ధి పథకాలైన జాతీయగ్రామీణ ఉపాధి హామీ పథకం (NREGS – National Rural Employment Guarantee Scheme), ప్రధానమంత్రి గ్రామ శోధక్ యోజన (PMGSY), జాతీయ గ్రామీణ ఆరోగ్య పథకం వంటి అనేక కార్యక్రమాల అమలు, విజయాలు, జిల్లా కలెక్టర్ చైతన్యవంతమైన నాయకత్వం పైనే ఆధారపడి ఉంటాయి. అందువల్ల జిల్లాస్థాయిలో ఉత్పన్నమయ్యే ఆర్థిక, రాజకీయ సమస్యల పరిష్కారంలో, జిల్లా ప్రజలతో మమేకమయ్యే జిల్లా కలెక్టర్తో ఆ ప్రభుత్వాలు నిరంతరం దృశ్య, శ్రవణ మాధ్యమాల ద్వారా సంబంధాలను కలిగి ఉంటాయి. జిల్లా స్థాయిలో జరిగే ప్రభుత్వ సంబంధమైన అనేక కమిటీలకు కలెక్టర్ కన్వీనర్గానో, సంధానకర్తగానో, సమన్వయ కర్తగానో వ్యవహరిస్తాడు.

ఇటీవలి కాలంలో కలెక్టర్ పదవిలో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. సరళీకరణ, ప్రైవేటీకరణల ప్రభావంవల్ల కలెక్టర్ అధికార విధులు పునర్నిర్వచించబడినాయి. ఆ పరిణామాలు తమ అధికార విధుల నిర్వహణలో ఎంతో అప్రమత్తతతో వ్యవహరించేటట్లు కలెక్టర్ను తీర్చిదిద్దాయి. అంతేకాకుండా జనాభా పెరుగుదల, శాస్త్రసాంకేతిక రంగాలలో పురోగతి, ప్రణాళికలు, మహిళా సాధికారత, బలహీనవర్గాల సంక్షేమం, రాజ్యాంగపరమైన కర్తవ్యాలు మొదలైన అంశాలు జిల్లా కలెక్టర్ అధికార విధుల నిర్వహణలో విశేషమైన మార్పులకు దారితీశాయి.

ప్రశ్న 11.
ఆకర్షణీయ గ్రామ స్వభావాన్ని వివరించండి. [Mar. ’17]
జవాబు:
నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు 2015లో ఆకర్షణీయ గ్రామ (Smart Village) పథకాన్ని ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ సుస్థిరాభివృద్ధి సాధించాలనే లక్ష్యానికి కట్టుబడి స్వర్ణాంధ్ర లక్ష్యం విజన్ 2029 నాటికి దేశంలో అభివృద్ధి చెందిన మొదటి మూడు రాష్ట్రాలలో ఒకటి చేయాలనేది ప్రభుత్వలక్ష్యం. ఈ లక్ష్యసాఫల్యం కోసం ప్రభుత్వం మిషన్ ఆధారిత దృక్పథంతో సాంఘిక, ఆర్థిక, మౌలిక సదుపాయాల సౌకర్యాలను సృష్టిస్తారు. ఈ లక్ష్య సాధన కోసం రాష్ట్రంలో పెద్దఎత్తున ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తారు.

జన్మభూమి, మా ఊరు కార్యక్రమానికి కొనసాగింపుగా ఆకర్షణీయ గ్రామం, ఆకర్షణీయ వార్డు కార్యక్రమాన్ని ప్రభుత్వం రూపొందించి పాలన వికేంద్రీకరణ, అధికార దత్తత, ప్రభుత్వసేవలు, అభివృద్ధి పథకాలు మొ॥ విషయాలలో ప్రజలను భాగస్వాములను చేసి వారి జీవన విధానంలో నాణ్యత పెంచడం ద్వారా స్వర్ణాంధ్రప్రదేశ్ ఏర్పాటు చేయాలనేది ఈ పథకం లక్ష్యం.

AP Inter 2nd Year Civics Study Material Chapter 10 భారతదేశంలో స్థానిక ప్రభుత్వాలు

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
గ్రామీణ స్థానిక ప్రభుత్వాలు
జవాబు:
ప్రస్తుతం భారతదేశంలో పంచాయితీరాజ్ సంస్థలు లేదా గ్రామీణ స్థానిక ప్రభుత్వాలు 73వ రాజ్యాంగ సవరణ చట్టం 1992 ప్రకారం ఏర్పాటయ్యాయి. గ్రామీణ స్థానిక ప్రభుత్వాలు మూడు అంచెలలో వుంటాయి. అవి:

  1. గ్రామస్థాయిలో గ్రామ పంచాయితీలు
  2. మండల లేదా మధ్య స్థాయిలో మండల పరిషత్లు
  3. జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్లు.

ప్రశ్న 2.
రాజ్యాంగం (73వ సవరణ చట్టం) 1992
జవాబు:
భారతదేశంలో గ్రామీణ స్థానిక ప్రభుత్వాలు లేదా పంచాయితీరాజ్ సంస్థలను సమర్థవంతంగా తీర్చిదిద్దటానికి రాజ్యాంగం (73వ సవరణ) చట్టం 1992ని కేంద్ర ప్రభుత్వం రూపొందించింది. ఈ చట్టంలో నూతనంగా జిల్లా, గ్రామసభ, పంచాయితీ గ్రామం అనే పదాలను చేర్చడం జరిగింది. ప్రతి గ్రామానికి ఒక గ్రామసభను ఏర్పాటు చేసింది. ఈ చట్టం షెడ్యూల్డు కులాలకు, షెడ్యూల్డు తెగలకు, వెనుకబడిన తరగతులకు మరియు మొత్తం సీట్లలో 33.3 శాతం మహిళలకు కేటాయిస్తూ పంచాయితీరాజ్ సంస్థలలో రిజర్వేషన్లను కల్పించింది.

ప్రశ్న 3.
గ్రామసభ
జవాబు:
ప్రతి గ్రామ పంచాయితీలో క గ్రామ సభ ఏర్పాటవుతుంది. దానిలో గ్రామానికి చెందిన రిజిష్టర్డ్ ఓటర్లు సభ్యులుగా ఉంటారు. ఇది సంవత్సరానికి కనీసం మూడుసార్లు సమావేశమవుతుంది. గ్రామసభ పంచాయితీకి సంబంధించిన వార్షిక పరిపాలన, ఆడిట్ నివేదికలను పరిశీలించి ఆమోదిస్తుంది. అభివృద్ధి, సంక్షేమం, ప్రభుత్వ పథకాలకు లబ్దిదారులను ఎంపిక చేయడం దీని పని.

ప్రశ్న 4.
జిల్లా పరిషత్
జవాబు:
రాష్ట్రంలో ప్రతి జిల్లాకు ఒక జిల్లా పరిషత్తు ఉంటుంది. జిల్లా స్థాయిలో అత్యున్నత స్థాయి స్వపరిపాలన సంస్థయే జిల్లా పరిషత్తు, జిల్లా పరిషత్కు చట్టబద్ధమైన ప్రతిపత్తి ఉంటుంది. జిల్లా పరిషత్లో ఆరు అంగాలుంటాయి. అవి:

  1. జిల్లా పరిషత్
  2. ఛైర్మన్
  3. జిల్లా మహాసభ
  4. ముఖ్య కార్యనిర్వహణాధికారి
  5. స్థాయీసంఘాలు
  6. జిల్లా కలెక్టరు.

AP Inter 2nd Year Civics Study Material Chapter 10 భారతదేశంలో స్థానిక ప్రభుత్వాలు

ప్రశ్న 5.
ఎం.పి.డి.ఒ (లేదా) మండల పరిషత్ అబివృద్ధి అధికారి [Mar. ’16]
జవాబు:
ఎం.పి.డి.ఒ అంటే మండల పరిషత్ డెవలప్మెంట్ అధికారి. ఇతనిని రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తుంది. ఇతను మండల పరిషత్క పరిపాలనాధిపతిగా వ్యవహరిస్తారు. మండల పరిషత్, మండల మహాసభ తేదీలు, అజెండాల రూపకల్పనలోనూ ముఖ్యపాత్ర పోషిస్తాడు. మండల పరిషత్ వార్షిక బడ్జెట్ను రూపొందిస్తాడు. మండల పరిషత్ సమర్థవంతంగా పనిచేయడానికి అవసరమైన చర్యలను తీసుకుంటాడు.

ప్రశ్న 6.
మండల పరిషత్తు
జవాబు:
జిల్లాలో మాధ్యమిక స్థాయిలో గల స్థానిక సంస్థయే మండల పరిషత్తు. రాష్ట్ర ప్రభుత్వ చట్టం ద్వారా మండల పరిషత్తు ఏర్పడుతుంది. ప్రతి మండలాన్ని కొన్ని మండల ప్రాదేశిక నియోజక వర్గాలుగా (జనాభా ప్రాతిపదికన) విభజిస్తారు. ఓటర్లు మండల ప్రాదేశిక నియోజక వర్గ సభ్యులను ఎన్నుకుంటారు. మండల పరిషత్తులో నాలుగు అంగాలుంటాయి. అవి: 1) మండల పరిషత్తు 2) మండల పరిషత్తు అధ్యక్షుడు 3) మండల పరిషత్తు అభివృద్ధి అధికారి 4) మండల మహాసభ.

ప్రశ్న 7.
జిల్లా మహాసభ
జవాబు:
ప్రతి జిల్లాపరిషత్లో జిల్లా మహాసభ ఉంటుంది. దానిలో జిల్లా పరిషత్ చైర్మన్, కొందరు సభ్యులుంటారు. జిల్లా మహాసభ జిల్లా పరిషత్కు సలహా సంస్థగా వ్యవహరిస్తుంది. దాని సమావేశాలకు జిల్లా పరిషత్ చైర్మన్ అధ్యక్షత వహిస్తాడు. జిల్లా పరిషత్ వార్షిక బడ్జెట్, ఆడిట్ నివేదికలను పరిశీలించడం, జిల్లా పరిషత్క సంబంధించిన గత సంవత్సరపు పరిపాలన నివేదికను పరిశీలించటం జిల్లా మహాసభ ముఖ్య విధులుగా భావిస్తారు.

ప్రశ్న 8.
జిల్లా పరిషత్తు స్థాయీ సంఘాలు
జవాబు:
ప్రతి జిల్లా పరిషత్తులో ఏడు స్థాయి సంఘాలుంటాయి. అవి జిల్లా పరిషత్కు అనేక అంశాలపై సలహాలిస్తుంటాయి. ప్రణాళికలు, విత్తం, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, మహిళాభ్యుదయం, సామాజిక సంక్షేమం, విద్య, ఆరోగ్యం మొ॥ అంశాలు స్థాయి సంఘాలు పరిధిలో ఉన్నాయి. జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి జిల్లా పరిషత్తు చైర్మన్ ను సంప్రదించి స్థాయి సంఘాల సమావేశాలను ఏర్పాటుచేస్తాడు.

ప్రశ్న 9.
జిల్లా పరిషత్తు ముఖ్య కార్యనిర్వహణ అధికారి
జవాబు:
ప్రతి జిల్లా పరిషత్తులో ఒక ముఖ్య కార్యనిర్వహణ అధికారి ఉంటాడు. అతడిని రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తుంది. అతడు తన అధికారాల, విధుల నిర్వహణలో ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వానికి, మరొకవైపు జిల్లా పరిషత్తుకు బాధ్యత వహిస్తాడు. అతడు జిల్లా పరిషత్తు పరిపాలన అధిపతిగా వ్యవహరిస్తాడు. జిల్లా పరిషత్ సాధారణ సమావేశాల అజెండాను, వార్షిక బడ్జెట్ను రూపొందించడంలో కీలకపాత్ర పోషిస్తాడు. జిల్లా పరిషత్తుకు సంబంధించిన సిబ్బంది, ఆస్తులు, భవనాలు, రికార్డులపై పరిపాలనాపరమైన అజమాయిషీ కలిగి ఉంటాడు. జిల్లా పరిషత్తు, జిల్లామహాసభ, జిల్లా స్థాయీ సంఘాలు తీసుకున్న నిర్ణయాలను, ఆమోదించిన తీర్మానాలను అమలులో ఉంచడానికి చర్యలు తీసుకుంటాడు.

AP Inter 2nd Year Civics Study Material Chapter 10 భారతదేశంలో స్థానిక ప్రభుత్వాలు

ప్రశ్న 10.
పురపాలక మండలి
జవాబు:
పురపాలక సంస్థ చర్చా వేదికయే పురపాలక మండలి. దీనిలో మూడు రకాల సభ్యులుంటారు. వారు 1) ఎన్నికయ్యే సభ్యులు 2) అనుబంధ సభ్యులు 3) గౌరవ సభ్యులు, పురపాలక మండలి సాధారణంగా నెలకొక పర్యాయం సమావేశమవుతుంది. పురపాలక మండలి సమావేశాల అజెండాను మున్సిపల్ కమీషనర్, మున్సిపల్ ఛైర్మన్ నన్ను సంప్రదించి రూపొందిస్తాడు. పురపాలక సంస్థకు సంబంధించిన వ్యవహారాలన్నింటిని పురపాలక మండలి పరిశీలిస్తుంది.

ప్రశ్న 11.
నగర పంచాయతి
జవాబు:
గ్రామస్థాయి నుండి పట్టణ స్థాయికి పరిణామం చెందే ప్రాంతం లేదా అతిచిన్న పట్టణ ప్రాంతాలలో ఏర్పాటయ్యే స్థానిక సంస్థలను నగర పంచాయతి అంటారు. జనసాంద్రత, స్థానిక సంస్థల ఆదాయం, వ్యవసాయేతర రంగాలలో ఉపాధి అవకాశాలు, ఆ ప్రాంత ఆర్థిక ప్రాధాన్యత మొదలైన అంశాల ఆధారంగా నగర పంచాయితీల ఏర్పాటు
జరుగుతుంది.

ప్రశ్న 12.
నోటిఫైడ్ ఏరియా కంపెనీ
జవాబు:
శీఘ్రగతిన అభివృద్ధి పథంలో పురోగమించే పట్టణాలలో లేదా పురపాలక సంస్థల ఏర్పాటుకు అనుకూలంగాలేని పరిస్థితులలో ఈ కమిటీ ఏర్పాటవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రకటన ద్వారా ఈ కమిటీ ఏర్పడుతుంది. కావున దీనిని నోటిఫైడ్ ఏరియా కమిటీ అని అంటారు. దీనికి చట్టబద్ధమైన హోదా ఉండదు. దీనిలో ఒక చైర్మన్. కొంతమంది సభ్యులను రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తుంది. దీని విధులు పురపాలక సంస్థ విధులను పోలి ఉంటాయి.

ప్రశ్న 13.
కంటోన్మెంట్ బోర్డులు
జవాబు:
భారతదేశంలో కంటోన్మెంట్ బోర్డులనేవి భారత ప్రభుత్వ కంటోన్మెంట్ చట్టం, 1904 ద్వారా ఏర్పాటయ్యాయి. ప్రస్తుతం భారతదేశంలో 62 కంటోన్మెంట్ బోర్డులు పనిచేస్తున్నాయి. కంటోన్మెంట్ ప్రాంతాలలో నివసించే పౌరులు, సైనిక సిబ్బంది తాలుకు వ్యక్తుల ప్రయోజనాలను పెంపొందించడానికి అవి కృషిచేస్తున్నాయి.

భారతదేశంలో ప్రస్తుతం మూడు రకాల కంటోన్మెంట్ బోర్డులున్నాయి. అవి దేశరక్షణ మంత్రిత్వశాఖ ప్రత్యేక ఉత్తర్వుల ద్వారా ఏర్పాటై కొనసాగుతున్నాయి. ప్రతి కంటోన్మెంట్ బోర్డులో కొందరు ఎన్నుకోబడిన వారు సభ్యులుకాగా, కొందరు కేంద్ర ప్రభుత్వంతో నామినేట్ చేయబడినవారు, మరికొందరు పదవిరీత్యా సభ్యులుగా ఉంటారు. ప్రతి కంటోన్మెంట్ బోర్డులో ఒక జనరల్ ఆఫీసర్ – ఆఫ్ – కమాండర్ (GOC – General Officer of Commander) ఉంటాడు.

ప్రశ్న 14.
టౌన్ ఏరియా కమిటి
జవాబు:
రాష్ట్ర శాసనసభ ఆమోదించే ప్రత్యేక చట్టం ద్వారా టౌన్ ఏరియా కమిటీ ఏర్పాటవుతుంది. చిన్న పట్టణాల అవసరాలను తీర్చడానికి ఈ కమిటీలు అవసరమవుతాయి. ఈ కమిటీ నిర్వర్తించే విధులలో ముఖ్యమైనవి వీధి దీపాలను అమర్చటం, డ్రైనేజీ సౌకర్యాల కల్పన, పట్టణ ప్రాంతాలలో నివసించే ప్రజల స్థితిగతులను మెరుగుపరచటం మొదలగునవి.

ప్రశ్న 15.
టౌన్ షిప్
జవాబు:
టౌన్ షిప్ నేవి ప్రభుత్వరంగ సంస్థలలో ఏర్పాటవుతాయి. ప్రభుత్వరంగ సంస్థలలో పనిచేసే సిబ్బందికి మౌలిక సదుపాయాలను కల్పించడానికి ఇవి కృషిచేస్తాయి. వాటిలో ఎన్నుకోబడే సభ్యులు ఎవరూ ఉండరు. ప్రతి టౌన్షిప్కి ఒక టౌన్ పరిపాలన అధికారి ఉంటాడు. అతడిని కేంద్రప్రభుత్వంలోని సంబంధిత మంత్రిత్వశాఖ నియమిస్తుంది.

AP Inter 2nd Year Civics Study Material Chapter 10 భారతదేశంలో స్థానిక ప్రభుత్వాలు

ప్రశ్న 16.
పోర్ట్ ట్రస్ట్లు
జవాబు:
దేశంలోని సముద్రతీరంలో ఓడరేవులు ఉన్న ప్రాంతాలలో పోర్ట్ ట్రస్ట్లు ఏర్పాటవుతాయి. అలాగే నౌకాశ్రయాలలో పనిచేసే సిబ్బందికి సంబంధించిన వ్యవహారాలను పర్యవేక్షిస్తాయి. అవి నౌకాశ్రయాలలో మౌలిక సదుపాయాలను కల్పించడానికి కృషి చేస్తాయి. కేంద్ర ప్రభుత్వం అందుకోసం కొన్ని కమిటీలను నియమిస్తుంది. ఆ కమిటీల సభ్యులలో కొందరు ఎన్నుకోబడగా, మరికొందరు నామినేట్ అవుతారు.

ప్రశ్న 17.
జిల్లా రెవిన్యూ అధికారిగా కలెక్టర్ [Mar. ’17]
జవాబు:
జిల్లాలో కలెక్టర్ ప్రధాన రెవిన్యూ అధికారిగా వ్యవహరిస్తాడు. జిల్లాలోని గ్రామాలలో భూమిశిస్తు, జమాబందీ లెక్కలకు ఆధ్వర్యం వహిస్తాడు. భూమిశిస్తు వసూళ్ళు, రైతులకు రుణాల మంజూరు, ప్రకృతి విపత్తుల సమయంలో రైతులకు పంట నష్టపరిహారాలు చెల్లించటం, ప్రభుత్వభూముల రికార్డులను నిర్వహించటం మొదలగునవి జిల్లా కలెక్టరుకు ఉన్న రెవిన్యూ అధికారాలలో ముఖ్యమైనవి.

ప్రశ్న 18.
జిల్లా ముఖ్య ఎన్నికల అధికారిగా కలెక్టర్
జవాబు:
జిల్లా ముఖ్య ఎన్నికల అధికారిగా కలెక్టర్ వ్యవహరిస్తాడు. జిల్లాలో ఎన్నికలను ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా జరిగేటట్లు చూసే బాధ్యత కలెక్టర్పై ఉంది. ఓటర్ల జాబితా తయారీ, ఓటర్ల జాబితాలో సవరణలు, ఓటర్ల జాబితాలపై ఫిర్యాదుల పరిశీలన, కొత్త ఓటర్ల నమోదు, రిటర్నింగ్ అధికారుల నియాయకం మొదలగు అనేక విధులను కలెక్టర్ నిర్వహిస్తాడు.

ప్రశ్న 19.
స్వర్ణాంధ్రప్రదేశ్
జవాబు:
నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2015లో ఆకర్షణీయ గ్రామ పథకాన్ని ప్రారంభించారు. జన్మభూమి, మా వూరు కార్యక్రమానికి కొనసాగింపుగా ఆకర్షణీయ గ్రామం (Smart Village), ఆకర్షణీయ వార్డు కార్యక్రమాన్ని ప్రభుత్వం రూపొందించి, పాలనా వికేంద్రీకరణ, అధికార దత్తత, ప్రభుత్వ సేవలు, అభివృద్ధి పథకాలతో ప్రజలను భాగస్వాములను చేయటం ద్వారా స్వర్ణాంధ్రప్రదేశ్ను ఏర్పాటు చేయటమే ఈ పథకం ఉద్దేశ్యం.

ప్రశ్న 20.
ఆకర్షణీయ నగరం [Mar. ’16]
జవాబు:
‘ఆకర్షణీయ నగరం (Smart City), అనేది అవస్థాపన సౌకర్యాల పరంగా ఎంతగానో అభివృద్ధి చెందిన పట్టణ ప్రాంతం. ఆ ప్రాంతంలో రియల్ ఎస్టేట్, కమ్యూనికేషన్లు, మార్కెట్ల సామర్థ్యం వంటి అంశాలు ఉంటాయి. నివాసితులకు అత్యవసర, ప్రాథమిక సేవలను అందించేందుకు అవసరమైన ప్రధాన అవస్థాపక (Infrastracture), సమాచార సాంకేతికత (Information Technology) లు అందుబాటులో ఉంటాయి.

AP Inter 2nd Year Civics Study Material Chapter 10 భారతదేశంలో స్థానిక ప్రభుత్వాలు

ఆకర్షణీయ నగరాలు పెట్టుబడులు తరలివచ్చేందుకు దోహదపడతాయి. మంచి అవస్థాపన, సాధారణ పారదర్శక, శీఘ్రతతో కూడిన స్థాపనాలకు వీలు కల్పిస్తాయి. పెట్టుబడిదారీ మితృత్వ నగరాలుగా ఉంటూ, ఉద్యమిత్య సంస్థలను స్థాపించి, సమర్థవంతంగా నిర్వహించుకొనేందుకు వీలుకల్పిస్తాయి.

AP Inter 2nd Year Civics Study Material Chapter 9 కేంద్ర – రాష్ట్ర సంబంధాలు

Andhra Pradesh BIEAP AP Inter 2nd Year Civics Study Material 9th Lesson కేంద్ర – రాష్ట్ర సంబంధాలు Textbook Questions and Answers.

AP Inter 2nd Year Civics Study Material 9th Lesson కేంద్ర – రాష్ట్ర సంబంధాలు

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
భారతదేశంలోని కేంద్ర – రాష్ట్ర సంబంధాలను క్లుప్తంగా వివరించండి.
జవాబు:
భారత రాజ్యాంగం కూడా అన్ని సమాఖ్య రాజ్యాంగాల వలె కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికారాలను విభజించింది. భారత రాజ్యాంగం 11, 12 భాగాలలోని 245 నుంచి 300 వరకు గల అధికరణాలు కేంద్ర, రాష్ట్రాల మధ్యగల సంబంధాలను ప్రస్తావించాయి. కేంద్ర, రాష్ట్ర సంబంధాలను స్థూలంగా మూడు శీర్షికల క్రింద అధ్యయనం చేయవచ్చు. అవి:

  1. శాసన సంబంధాలు
  2. పరిపాలనా సంబంధాలు
  3. ఆర్థిక సంబంధాలు.

1. శాసన సంబంధాలు: భారత రాజ్యాంగంలోని 245 నుంచి 255 వరకు గల 11 అధికరణాలలో కేంద్ర, రాష్ట్రాల మధ్యగల శాసన సంబంధాలు వివరించబడ్డాయి. శాసనపరమైన అంశాలను మూడు జాబితాల క్రింద వర్గీకరించారు. అవి:

  1. కేంద్ర జాబితా
  2. రాష్ట్ర జాబితా
  3. ఉమ్మడి జాబితా.

i) కేంద్ర జాబితా: జాతీయ ప్రాధాన్యం ఉన్న అంశాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఈ అంశాలపై శాసనాలను రూపొందించే అధికారం ఒక్క పార్లమెంటుకే ఇవ్వడం జరిగింది. ఉదా: దేశరక్షణ, సాయుధ దళాలు, విదేశీ వ్యవహారాలు, రైల్వేలు, తంతితపాలా, ఆకాశవాణి, దూరదర్శన్ మొదలగునవి.

ii) రాష్ట్ర జాబితా: ఈ జాబితాలోని అంశాలపై రాష్ట్ర శాసనసభలు చట్టాలు చేస్తాయి. ఉదా: శాంతి భద్రతలు, పోలీసు, జైళ్ళు, గ్రంథాలయాలు, వ్యవసాయం, పశుపోషణ మొదలగునవి.

AP Inter 2nd Year Civics Study Material Chapter 9 కేంద్ర – రాష్ట్ర సంబంధాలు

iii) ఉమ్మడి జాబితా: ఈ జాబితాలోని అంశాలపై శాసనాలు చేసే అధికారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండింటికీ ఉంది. అయితే పార్లమెంటు, రాష్ట్ర శాసనసభలు ఈ జాబితాలోని ఏదైనా ఒకానొక అంశంపై శాసనం రూపొందిస్తే, పార్లమెంటు రూపొందించిన శాసనానికి ఆధిక్యం ఇవ్వడం జరుగుతుంది. ఉదా: వివాహం, విడాకులు, ధర్మాదాయ, దేవాదాయ సంస్థలు, విద్య, విద్యుచ్ఛక్తి. వార్తాపత్రికలు మొదలగునవి.

పై మూడు జాబితాల్లో లేని అంశాలపై శాసనాలు చేసే అధికారం పార్లమెంటుకు ఉంది. ఈ అంశాలను అవశిష్టాధికారాలు అంటారు.

  • జాతీయ అత్యవసర పరిస్థితి ప్రవేశపెట్టినప్పుడు రాష్ట్ర జాబితాలోని అంశాలపై కూడా పార్లమెంటు చట్టాలు చేసే అధికారం పొందుతుంది.
  • ఏదైనా రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధిస్తే ఆ రాష్ట్రానికి అవసరమైన చట్టాలను పార్లమెంటు రూపొందిస్తుంది. శాసన వ్యవహారాల్లో రాష్ట్రాలకంటే కేంద్రానికే ఎక్కువ అధికారాలున్నాయి.

2. పరిపాలనా సంబంధాలు: భారత రాజ్యాంగంలోని 256 నుంచి 263 వరకు గల 8 అధికరణలలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పరిపాలనా సంబంధాలు వివరించబడ్డాయి.

  • కేంద్ర ప్రభుత్వం తన విధులను కొన్నింటిని రాష్ట్రాలకు అప్పగించవచ్చు. వాటికి అయ్యే ఖర్చు కేంద్రం భరిస్తుంది.
  • జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటించినప్పుడు పరిపాలనకు సంబంధించి కేంద్రం రాష్ట్రాలకు ఆదేశాలిస్తుంది.
  • కేంద్ర ప్రభుత్వ కార్యనిర్వహణాధికారానికి భంగం వాటిల్లని రీతిలో రాష్ట్ర ప్రభుత్వాలు తమ కార్యనిర్వహణాధికారాన్ని వినియోగించుకోవాలి.
  • కేంద్రం అంతర్ రాష్ట్రమండలిని ఏర్పాటు చేయడం ద్వారా రాష్ట్రాల మధ్య ఏర్పడే తగాదాలను పరిష్కరిస్తుంది.

3. ఆర్థిక సంబంధాలు: భారత రాజ్యాంగంలోని 264 నుండి 300 వరకు అధికరణలలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్యగల ఆర్థిక సంబంధాలు వివరించబడ్డాయి. కేంద్ర, రాష్ట్రాల మధ్య ఆర్థిక వ్యవహారాల్లో సంఘర్షణలు నివారించడానికి ఏయే పన్నులను ఏయే ప్రభుత్వాలు వసూలు చేయాలో, ఎలా పంచుకోవాలో అనే విషయాలపై ప్రత్యేక వివరణ ఇచ్చారు.

  • కేంద్ర ప్రభుత్వానికి 12 రకాల పాలనాంశాలపై విధించే పన్నుల ద్వారా ఆదాయం లభిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలకు 19 రకాల ఆదాయ మార్గాలు ఉన్నాయి.
  • అభివృద్ధి కోసం ఉద్దేశించిన కొన్ని ప్రత్యేక ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు కేంద్రం, రాష్ట్రాలకు ప్రత్యేక గ్రాంట్లను మంజూరు చేస్తుంది.
  • రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం సమ్మతి లేనిదే ఎటువంటి ఋణాలు పొందకూడదు. ఆర్థిక విషయాలలో రాష్ట్రాలు, కేంద్రంపై ఆధారపడి ఉన్నాయని తెలుస్తుంది.

ప్రశ్న 2.
కేంద్ర – రాష్ట్ర సంబంధాలలోని మూడు జాబితాలను చర్చించండి.
జవాబు:
భారతరాజ్యాంగం కేంద్ర, రాష్ట్రాల మధ్య శాసనాధికారాల పంపిణీని మూడు రకాలుగా విభజించింది. అవి: మొదటి జాబితా (కేంద్ర జాబితా), రెండవ జాబితా (రాష్ట్ర జాబితా), మూడవ జాబితా (ఉమ్మడి జాబితా) కేంద్ర జాబితా: కేంద్ర రాష్ట్రాల మధ్య శాసన సంబంధాలను ఒక ప్రత్యేకమైన పద్ధతిలో విభజించడం జరిగింది. కేంద్ర జాబితా చాలా సుదీర్ఘమైనది. భారతరాజ్యాంగ ప్రారంభంలో ఇందులో 97 అంశాలు ఉండేవి. ప్రస్తుతం ఇందులో 100 అంశాలు కలవు. ఈ జాబితాలోని అంశాలపైనా చట్టాలు చేయడానికి పార్లమెంట్కు మాత్రమే అధికారం కలదు. ఈ జాబితాలోని కొన్ని ముఖ్యాంశాలు: దేశభద్రత, ఐక్యరాజ్య సమితి సంబంధించిన అంశాలు, విదేశీ వ్యవహారాలు, దౌత్య సంబంధాలు, విదేశాలతో సంధులు చేసుకోవడం, యుద్ధం, శాంతి, పౌరసత్వం, రైల్వేలు, జాతీయ రహదారులు, విమానయానం, నౌకాయానం, విమానయాన నియంత్రణ, తపాలా, టెలిఫోన్, నాణెములు, వాణిజ్యం, బ్యాంకింగ్, అంతర్ రాష్ట్ర వ్యాపారం, బీమా, విదేశీ అప్పులు, పేటెంట్లు, తూనికలు, జలాలు, కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్, అఖిల భారత సర్వీసులు, పార్లమెంటుకు ఎన్నికలు, అణుశక్తి, ఆయుధాల తయారీ, నౌక, వైమానిక, సైనికదళాలు, కేంద్ర భద్రతా దళాలు, ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, పేలుడు పదార్థాలు, వైమానిక రవాణా నియంత్రణ మరియు క్రమబద్ధీకరణ మొదలగునవి. ఈ అంశాలపై తయారుచేసిన చట్టాలు దేశంలోని అన్ని రాష్ట్రాలకు మరియు దేశ పౌరులందరికీ సమానంగా వర్తిస్తాయి.

AP Inter 2nd Year Civics Study Material Chapter 9 కేంద్ర – రాష్ట్ర సంబంధాలు

రాష్ట్ర జాబితా: సాధారణ పరిస్థితులలో రాష్ట్ర జాబితాలోని అంశాలపై చట్టాలను తయారుచేయడానికి రాష్ట్ర శాసనసభలకు అధికారం కలదు. ఇందులో స్థానిక ప్రాముఖ్యత కలిగిన 66 అంశాలు ఉంటాయి. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా వీటి సంఖ్యను 62కు కుదించడం జరిగింది.

ఈ జాబితాలోని కొన్ని ముఖ్య అంశాలు: శాంతిభద్రతలు, న్యాయం, జైళ్ళు, పోలీసులు, వ్యవసాయం, నీటిపారుదల, ప్రజారోగ్యం, స్థానిక స్వపరిపాలన సంస్థలు, తీర్థయాత్రలు, గ్రంథాలయం, ఫిషరీస్, మార్కెట్లు, సంతలు, భూమిశిస్తు మొదలగునవి. వీటిపై చేసిన చట్టాలు రాష్ట్రంలోని వ్యక్తులకు మరియు సంస్థలకు మాత్రమే వర్తిస్తాయి.

ఉమ్మడి జాబితా: ఈ జాబితాలోని అంశాలపై చట్టాలు చేయడానికి పార్లమెంట్కు మరియు రాష్ట్ర శాసనసభలకు అధికారం కలదు. ఇందులో జాతీయ మరియు స్థానిక ప్రాధాన్యత గల 47 అంశాలు ఉంటాయి. 42వ రాజ్యాంగ సవరణ తరువాత వీటి సంఖ్య 52కు పెరిగింది. ఈ అంశాలపై పార్లమెంట్ మరియు రాష్ట్ర శాసనసభలు చట్టాలు చేసినప్పటికీ ఏదైనా సమస్య ఉత్పన్నమయినపుడు పార్లమెంటు తయారుచేసిన చట్టాలు మాత్రమే అమలులో ఉంటాయి.

ఈ జాబితాలోని ముఖ్యాంశాలు: అడవులు, అడవి జంతువులు మరియు పక్షుల పరిరక్షణ, జనాభా నియంత్రణ, కుటుంబ నియంత్రణ, విద్య (సాంకేతిక మరియు వైద్య విద్య), నేర విచారణ విధానం, వివాహం మరియు విడాకులు, ధార్మిక సంస్థలు మరియు ధర్మకర్తృత్వ మండళ్ళు, కల్తీలు, కార్మిక సంఘాలు, విద్యుచ్ఛక్తి, ముద్రణాలయాలు, వార్తాపత్రికలు, తూనికలు మరియు కొలతలు (ప్రమాణముల నిర్థారణ మినహాయించి) మొదలగు ఈ జాబితాలో పొందుపరచిన అంశాలను సవరించుటకు మరియు రద్దు చేయుటకు, రాష్ట్ర శాసనసభలు ఈ అంశాలపై చేసిన చట్టాలను సవరించుటకు, రద్దు చేయుటకు పార్లమెంటు అధికారం కలదు. రాష్ట్ర జాబితా మరియు ఉమ్మడి జాబితాలలో పేర్కొనని ఏ అంశంపైన అయినా శాసనాలు తయారు చేయుటకు పార్లమెంట్కు ప్రత్యేక అధికారం కలదు. రాష్ట్ర శాసనసభలు తయారుచేసిన రాష్ట్ర జాబితాలోని అంశాలను కొన్ని ప్రత్యేక సందర్భాలలో రద్దు చేయుటకు కేంద్ర ప్రభుత్వానికి అధికారం కలదు.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
భారతదేశంలోని కేంద్ర – రాష్ట్రాల మధ్య గల పరిపాలన సంబంధాలను తెలపండి. [Mar. ’17, ’16]
జవాబు:
భారత రాజ్యాంగంలోని 256 నుంచి 263 వరకు గల 8 అధికరణాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలనా సంబంధాల గురించి వివరించాయి. ప్రగతి సాధనకు పాలనా వ్యవస్థ గుండెకాయ వంటిది. కేంద్ర, రాష్ట్రాల మధ్య పాలనా వ్యవహారాల్లో ఎటువంటి ఘర్షణలు రాకుండా చూసేందుకు మన రాజ్యాంగం తగిన విధంగా రూపొందించబడింది.

  1. కేంద్ర ప్రభుత్వ శాసనాల అమలుకు అనుగుణంగా రాష్ట్రాలు తమ పరిపాలనను నిర్వహించుకోవలెను.
  2. అవసరమని భావించినప్పుడు కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వాలకు పరిపాలనా సంబంధమైన ఆదేశాలను ఇస్తుంది.
  3. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల సంక్షేమానికి సంబంధించి కేంద్రం రాష్ట్రాలకు ఆదేశాలు ఇవ్వవచ్చు. ఈ విషయంలో కేంద్రం రూపొందించి, అమలుపరిచే పథకాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ఉండాలి.
  4. సైనిక లేదా జాతీయ ప్రాముఖ్యత కలిగిన రహదారులను నిర్మించి, వాటిని రక్షించుటలో రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలను ఇస్తుంది. వాటి నిర్మాణానికి అయ్యే ఖర్చును కేంద్రమే భరిస్తుంది.
  5. రైల్వేలు మొదలైన ఆస్తుల రక్షణకు సంబంధించి కేంద్రం రాష్ట్రాలకు సూచనలు చేస్తుంది. 6) అంతర్ రాష్ట్ర నదీజలాల వివాదాలను పరిష్కరించే అధికారం కేంద్ర పార్లమెంటుకు ఉంది.
  6. ఏదైనా ఒక రాష్ట్రంలో పాలన రాజ్యాంగబద్ధంగా జరగనప్పుడు ఆ రాష్ట్రంలో కేంద్రం రాష్ట్రపతి పాలనను విధించవచ్చు.
  7. రాష్ట్ర పాలకులైన గవర్నర్లను రాష్ట్రపతి (కేంద్ర ప్రభుత్వం) నియమిస్తాడు. రాష్ట్రపతి పాలన విధించబడినప్పుడు వారు కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులుగా వ్యవహరిస్తారు.
  8. విదేశీ దురాక్రమణల నుంచి, అల్లకల్లోలాల నుంచి రాష్ట్రాలను కాపాడవలసిన బాధ్యత కేంద్రంపై ఉంది.
  9. కేంద్రం అంతర్ రాష్ట్రమండలిని ఏర్పాటు చేయడం ద్వారా రాష్ట్రాల మధ్య ఏర్పడే తగాదాలను పరిష్కరిస్తుంది మొదలైనవి.
  10. కేంద్ర, రాష్ట్రాలలో ఎన్నికలను నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం స్వతంత్రమైన రాజ్యాంగబద్ధ ఎన్నికల కమీషన్ను నియమిస్తుంది.
  11. రాష్ట్రాల ముఖ్యమంత్రుల పైన వచ్చే ఆరోపణలను విచారించడానికి కేంద్ర ప్రభుత్వం విచారణ సంఘాన్ని ఏర్పాటు చేసే అధికారం కలదు.

ప్రశ్న 2.
కేంద్ర – రాష్ట్రాల మధ్య గల ఆర్థిక సంబంధాలను వివరించండి.
జవాబు:
రాజ్యాంగంలోని 12వ భాగంలోని 268 నుంచి 293 వరకు గల ప్రకరణలు కేంద్ర, రాష్ట్రాల మధ్యగల ఆర్థిక సంబంధాలను గూర్చి వివరిస్తాయి. ఈ క్రింది శీర్షికల ద్వారా కేంద్ర, రాష్ట్రాల మధ్యగల ఆర్థిక సంబంధాలను తెలుసుకోవచ్చు.
a) కేంద్ర విధించే పన్నులు, సుంకాలు: కొన్ని రకాల పన్నులను కేంద్ర ప్రభుత్వం మాత్రమే విధిస్తుంది. దిగుమతి సుంకాలు, కస్టమ్స్, పొగాకు, జనపనారపై ఎక్సైజ్ సుంకం, కార్పొరేషన్ పన్ను, మూలధన విలువపై పన్ను, వ్యవసాయేతర ఎస్టేట్లపై పన్ను, రైల్వేలు, తంతితపాలా, టెలిఫోన్స్, వైర్లెస్, విదేశీ మారకద్రవ్యం, కరెన్సీ, నాణేల ముద్రణ, ప్రసార మాధ్యమాలు, ఇతర రకాల కమ్యూనికేషన్లు మొదలైనవి ఇందులోకి వస్తాయి.

b) రాష్ట్రం విధించి, ఉపయోగించే పన్నులు, సుంకాలు: కొన్ని రకాల పన్నులు రాష్ట్ర ప్రభుత్వాల పరిధి క్రిందకు మాత్రమే వస్తాయి. భూమిశిస్తు, రోడ్డు మరియు దేశీయ జలమార్గాల ద్వారా ప్రయాణించే ప్రయాణికులు మరియు వస్తువులపై పన్నులు, విద్యుత్ వినియోగం మరియు అమ్మకంపై పన్ను, టోల్యాక్స్, మద్యపానంపై పన్ను, వినోదపు పన్ను, పందాలపై, జూదాలపై, విలాసాలపై పన్నులు మొదలగునవి.

AP Inter 2nd Year Civics Study Material Chapter 9 కేంద్ర – రాష్ట్ర సంబంధాలు

c) కేంద్రం విధించి, రాష్ట్రాలు సేకరించి ఉపయోగించుకునే పన్నులు: ఈ క్రింద తెలిపిన పన్నులు కేంద్రంచే విధించబడతాయి. అయితే వాటిని రాష్ట్రాలు సేకరించి, ఉపయోగించుకుంటాయి. బిల్లుల మారకం, చెక్కులు, ప్రామిసరీ నోటులు, బిల్స్ ఆఫ్ లెండింగ్, కంపెనీ వాటాల బదలాయింపు, టాయ్లెట్ సంబంధ వస్తువులపై ఎక్సైజ్ డ్యూటీలు, మత్తుపదార్థాలు మొదలగునవి ఈ కోవకు చెందుతాయి.

d) కేంద్రం విధించి, సేకరించి రాష్ట్రాలకు పంపిణీ చేసే పన్నులు: ఈ క్రింద తెలిపిన పన్నులు కేంద్రం విధించి, రాష్ట్రాలకు పంపిణీ చేస్తుంది. వ్యవసాయేతర ఆస్తిపై ఎస్టేట్ సుంకం, రైల్వే ఛార్జీలు, రైల్వే వస్తువుల రవాణా ద్వారా వచ్చే ఆదాయంపై పన్ను, రైలు, సముద్ర, వైమానిక, సాధనాల ద్వారా పంపే వస్తువులు, ప్రయాణీకులపై విధించే టెర్మినల్ పన్నులు మొదలైనవి ఈ కోవలోకి వస్తాయి.

e) కేంద్రం విధించి, వసూలు చేసి కేంద్ర – రాష్ట్రాల మధ్య పంపిణీ చేసే పన్నులు: ఈ పన్నులను కేంద్ర ప్రభుత్వం విధించి, వసూలు చేస్తుంది. కానీ రాష్ట్రాలతో కలిసి పంచుకుంటుంది. వ్యవసాయేతర ఆదాయంపై పన్ను, టాయ్లెట్, ఔషదేతర వస్తువులపై విధించే ఎక్సైజ్ సుంకాలు మొదలగునవి.

ప్రశ్న 3.
కేంద్ర – రాష్ట్రాల మధ్య గల శాసన సంబంధాలను పరిశీలించండి.
జవాబు:
భారత రాజ్యాంగం 11వ భాగంలోని మొదటి అధ్యాయంలోని 245 నుంచి 255 ప్రకరణలు కేంద్రం మరియు రాష్ట్రాల మధ్యగల శాసన సంబంధాలను తెలియజేస్తాయి. భారత రాజ్యాంగం కేంద్ర, రాష్ట్రాల మధ్య గల శాసన | సంబంధాలను ప్రాదేశిక పరిధి ప్రాతిపదికపై ఈ విధంగా తెలపవచ్చు.
ఎ) పార్లమెంటు భారతదేశం మొత్తానికి గానీ లేదా దేశంలో కొంత ప్రాంతానికి గానీ చట్టాలు చేయవచ్చు.

బి) కేంద్రపాలిత ప్రాంతాలకు కూడా పార్లమెంటే చట్టాలు చేస్తుంది.

సి) భారత రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్లోని మొదటి జాబితా (కేంద్ర జాబితా) నందు పేర్కొన్న ఏదైనా అంశం మీద చట్టాలు చేయడానికి పార్లమెంటుకు మాత్రమే అధికారం కలదు.

డి) భారత రాజ్యాంగం 7వ షెడ్యూల్లోని తృతీయ జాబితా (ఉమ్మడి జాబితా) నందు పేర్కొన్న ఏదైనా అంశం మీద చట్టాలు చేయడానికి పార్లమెంటుకు, రాష్ట్ర శాసనసభలకు అధికారం కలదు.

ఇ) భారత రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్లోని ద్వితీయ జాబితా (రాష్ట్ర జాబితా) నందు తెలియజేయబడిన ఏదైనా అంశం మీద చట్టాలు చేయడానికి రాష్ట్ర శాసన సభలకు మాత్రమే అధికారం కలదు.

ఎఫ్) రాష్ట్ర ప్రభుత్వాల భౌగోళిక పరిధికి వెలుపలున్న భారతదేశంలోని ఇతర ప్రాంతాలకు సంబంధించి పార్లమెంటు ఎటువంటి చట్టాలైన (రాష్ట్ర జాబితాలో వున్నప్పటికి చేయవచ్చు.

జి) మూడు జాబితాలలో పేర్కొనని ఏ అంశాల పైన అయినా చట్టాలు తయారు చేయడానికి పార్లమెంటుకు ప్రత్యేక అధికారం కలదు.

హెచ్) కొన్ని ప్రత్యేకమైన సందర్భాలలో ద్వితీయ జాబితాలోని (రాష్ట్ర జాబితా) అంశాలపైన చట్టాలు చేయడానికి పార్లమెంటుకు అధికారం కలదు. అవి: జాతీయ ప్రాధాన్యత గల అంశాలు; జాతీయ అత్యవసర పరిస్థితి సమయంలో రెండు లేక అంతకంటే ఎక్కువ రాష్ట్రాలు కలిసి పార్లమెంట్ను చట్టాలు చేయమని అడిగినప్పుడు; అంతర్జాతీయ సంధులు, ఒప్పందాలు అమలు చేసేటప్పుడు.

AP Inter 2nd Year Civics Study Material Chapter 9 కేంద్ర – రాష్ట్ర సంబంధాలు

ప్రశ్న 4.
ఆర్థిక సంఘం నిర్మాణం, అధికారాలు, విధులను వివరించండి.
జవాబు:
నిర్మాణం: భారత రాజ్యాంగం 280వ ప్రకరణలో ఆర్థిక సంఘ నిర్మాణం, అధికారాలు మరియు విధులను గూర్చి చర్చించడం జరిగింది. పాక్షిక న్యాయాధికారాలు గల ఈ ఆర్థిక సంఘాన్ని రాష్ట్రపతి ఏర్పాటు చేస్తాడు. ఇందులో ఒక అధ్యక్షుడు మరియు నలుగురు సభ్యులు ఉంటారు. వీరిని ఐదు సంవత్సరాల పదవీ కాలానికి రాష్ట్రపతి నియమిస్తాడు. ఈ సభ్యులు తిరిగి నియమింపబడటానికి అర్హులు. ఈ సంఘ అధ్యక్ష మరియు ఇతర సభ్యుల అర్హతలు నిర్ణయించడానికి పార్లమెంటుకు రాజ్యాంగం అధికారం కల్పించింది. అందుకు అనుగుణంగా పార్లమెంట్ ఆర్థిక సంఘ అధ్యక్షునితో పాటు ఇతర సభ్యుల అర్హతలను ప్రత్యేకంగా ప్రస్తావించడం జరిగింది. ఈ సంఘం కేంద్ర, రాష్ట్రాల మధ్య ఆర్థిక వనరుల పంపిణీ గురించి రాష్ట్రపతికి సిఫార్సులు చేస్తుంది. ఈ సంఘ అధ్యక్షుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాలలో అనుభవజ్ఞుడై ఉండాలి. మిగిలిన నలుగురు సభ్యులు

ఈ క్రింది రంగాల నుండి నియమించబడుతారు.

  • హైకోర్టు న్యాయమూర్తి (లేదా) హైకోర్టు న్యాయమూర్తి నియామకానికి అర్హత గల వ్యక్తి అయి ఉండాలి.
  • మరో సభ్యుడు ప్రభుత్వ ఆర్థిక లావాదేవీలు మరియు ఖాతాలలో అనుభవం కలిగి ఉండాలి.
  • మూడవ సభ్యుడు విత్త విషయాలలో నిష్ణాతుడై ఉండాలి.
  • నాల్గవ సభ్యుడు ఆర్థికశాస్త్రంలో నిపుణుడై ఉండాలి.

అధికారాలు విధులు: ఆర్థిక సంఘం కేంద్ర మరియు రాష్ట్రాల మధ్య ఆర్థిక సంబంధాలకు సంబంధించి ఎప్పటికప్పుడు సమీక్షించి భారత రాష్ట్రపతికి తగు సిఫార్సులు ఈ క్రింది విషయాలలో చేయవలసి ఉంటుంది.

  1. కేంద్ర పన్నులను రాష్ట్రాలకు ఏ నిష్పత్తి ప్రకారం పంపిణీ చేయాలో సిఫార్సులు చేస్తుంది.
  2. భారత సంఘటిత నిధి నుండి రాష్ట్రాలకు సహాయక నిధులకు సంబంధించి ఏ సూత్రాల ఆధారంగా పంపిణీ చేయాలో తగు మార్గదర్శక సూత్రాలను సూచిస్తుంది.
  3. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలతో చేసుకున్న ఒప్పందాలను కొనసాగించాలా లేదా మార్పులు చేయాలా అనే విషయంలో ఈ సంఘం సిఫార్సులు చేస్తుంది.
  4. దేశ ఆర్థిక పటిష్టతకు సంబంధించి రాష్ట్రపతి కోరినప్పుడు తగిన సూచనలిస్తుంది.
  5. 73 మరియు 74 రాజ్యాంగ సవరణల ద్వారా ఈ ఆర్థిక సంఘ విధులు మరింత విస్తృతం అయ్యాయి. రాష్ట్రాలలోని పంచాయితీలకు మరియు మున్సిపాలిటీలకు ఆర్థిక వనరులు అందజేయుటకు భారత సంఘటిత నిధికి వనరులను ఏ విధంగా పెంచాలో చర్యలను సూచిస్తుంది.
  6. పటిష్టమైన ఆర్థిక స్థిరత్వం కొరకు పరిపాలన మరియు రాజకీయ రంగాలలోని ఉన్నతాధికారులతో ప్రముఖ నేతలతో చర్చలు జరుపుతుంది. దేశంలోని వివిధ ఆర్థిక సంఘాల అధినేతల సూచనలను ఆహ్వానిస్తుంది.

ఆర్థిక సంఘం తన నివేదిక రాష్ట్రపతికి సమర్పిస్తుంది. దీనిని సాధారణంగా కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తుంది. రాష్ట్రపతి ఆర్థిక సంఘం చేసిన కొన్ని లేదా అన్ని సిఫార్సులను అంగీకరించవచ్చు లేదా తిరస్కరించవచ్చు. ఈ సిఫార్సులు ఐదు సంవత్సరాల కాలం అమలులో ఉంటాయి.

ప్రశ్న 5.
సర్కారియా కమీషన్ సిఫార్సులను మూల్యాంకనం చేయండి. [Mar. ’17]
జవాబు:
సర్కారియా కమిషన్ (1983 – ’87): 1983, జూన్ 9వ తేదీన కేంద్ర ప్రభుత్వం రంజిత్సింగ్ సర్కారియా ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి కమిషను ఒకదానిని ఏర్పరచింది. కేంద్ర-రాష్ట్ర సంబంధాలను పునఃపరిశీలన జరిపి తగిన సిఫారసులు చేయవలసిందిగా ఆ కమిషన్ను కోరడమైంది. ఆ కమిషన్లో బి. శివరామన్, ఎస్. సేన్ అనే ఇద్దరు సభ్యులు ఉన్నారు. కమిషన్ కార్యదర్శిగా ఎమ్.ఆర్. సుబ్రహ్మణ్యం, రాజ్యాంగ సలహాదారుడిగా ఎల్.ఎన్. సిన్హా వ్యవహరించారు. 1987, అక్టోబరు 27వ తేదీన 247 సిఫారసులతో కూడిన 5000 పేజీలకు పైగా ఒక అంతిమ నివేదికను సర్కారియా కమిషన్ కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది.

సిఫారసులు: సర్కారియా కమిషన్ పేర్కొన్న సిఫారసులలో కింద పేర్కొన్నవి అత్యంత ప్రధానమైనవి.

  1. రాజకీయేతర రంగాలకు చెందిన, వివాదాస్పదం కాని ప్రముఖ వ్యక్తులు, సాధ్యమైనంతవరకు మైనారిటీలకు చెందిన వ్యక్తులను రాష్ట్ర గవర్నర్లుగా నియమించాలి.
  2. రాష్ట్ర గవర్నర్ల నియామకంలో ముఖ్యమంత్రులను సంప్రదించాలి.
  3. ముఖ్యమంత్రి నియామకం, రాష్ట్ర మంత్రివర్గం కొనసాగింపు విషయాలలో విధానసభలో మెజారిటీ సభ్యుల అభిప్రాయాలను తెలుసుకోవాలి.
  4. అరుదైన సందర్భాలలో మాత్రమే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను ప్రవేశపెట్టాలి.
  5. అఖిల భారత సర్వీసు సిబ్బందికి సంబంధించిన విషయాలలో కేంద్రం రాష్ట్రాలను సంప్రదించాలి.
  6. జోనల్ కౌన్సిళ్ళను పునర్వ్యవస్థీకరించాలి.
  7. శాశ్వత ప్రాతిపదికపై అంతర్ ప్రభుత్వ మండలిని ఏర్పాటు చేయాలి.
  8. జాతీయ అభివృద్ధి మండలి పేరును జాతీయ ఆర్థిక అభివృద్ధి మండలిగా మార్చి, దాని అస్థిత్వాన్ని పరిరక్షించాలి.
  9. ఆర్థిక నిపుణులను ఆర్థిక సంఘ సభ్యులుగా నియమించాలి.
  10. భారతదేశ సమిష్టి సంస్కృతిని సంరక్షించేందుకు ప్రాంతీయ భాషలలో జాతీయ కార్యక్రమాలను ప్రసారం చేయాలి.
  11. జాతీయ వ్యవహారాల విషయంలో కేంద్రం – రాష్ట్రాల మధ్య సంప్రదింపులు జరగాలి.
  12. అవశిష్టాంశాలపై పన్నులు విధించే శాసన నిర్మాణాధికారాన్ని పార్లమెంటుకు అప్పగించాలి.
  13. రాష్ట్రాలతో సంప్రదించి కేంద్రం ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసు, ఇండియన్ హెల్త్ సర్వీసు, ఇండియన్ ఎడ్యుకేషన్ సర్వీసులను ఏర్పాటు చేయాలి.
  14. కార్పొరేషన్ పన్నులో కొంత భాగాన్ని రాష్ట్రాలకు ఇవ్వాలి.
  15. రాష్ట్రాలకు సైన్యాన్ని పంపేముందు కేంద్రం రాష్ట్రాలతో సంప్రదింపులు జరపాలి.

AP Inter 2nd Year Civics Study Material Chapter 9 కేంద్ర – రాష్ట్ర సంబంధాలు

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
కేంద్ర – రాష్ట్రాల మధ్య గల ఏవైనా మూడు సంబంధాలు.
జవాబు:
కేంద్ర, రాష్ట్రాల మధ్య గల సంబంధాలను మూడు రకాలుగా వర్గీకరించటం జరిగింది. అవి:

  1. శాసన సంబంధాలు
  2. పరిపాలనా సంబంధాలు
  3. ఆర్థిక సంబంధాలు

ప్రశ్న 2.
కేంద్ర జాబితా.
జవాబు:
కేంద్ర జాబితా చాలా సుదీర్ఘమైనది. ప్రస్తుతం ఈ జాబితాలో 100 పరిపాలనాంశాలు ఉన్నాయి. ఈ జాబితాలోని అంశాలపై చట్టాలు చేయడానికి పార్లమెంటుకు మాత్రమే అధికారం ఉంది. ఈ జాబితాలో దేశభద్రత, ఐక్యరాజ్య సమితికి సంబంధించిన అంశాలు, విదేశీ వ్యవహారాలు, దౌత్య సంబంధాలు మొదలైన ముఖ్యమైన అంశాలు ఉన్నాయి.

ప్రశ్న 3.
అత్యవసర పరిస్థితులలో పరిపాలన సంబంధాలు.
జవాబు:
జాతీయ అత్యవసర పరిస్థితి అమలులో ఉన్న సమయంలో, కేంద్ర ప్రభుత్వానికి ఏకకేంద్ర ప్రభుత్వం వలె అధికారాలు చెలాయించడానికి భారత రాజ్యాంగం అవకాశం కల్పించింది. ఈ పరిస్థితులలో రాష్ట్ర ప్రభుత్వాలు రద్దు కాకుండా, కేంద్ర ప్రభుత్వం పూర్తి ఆధీనంలో పనిచేస్తాయి. రాష్ట్రపతి పాలన అమలులో ఉన్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారాలను రాష్ట్రపతి తరుఫున గవర్నర్ చెలాయిస్తాడు.

ప్రశ్న 4.
కేంద్ర, రాష్ట్రాల మధ్యగల శాసన సంబంధాలు.
జవాబు:
పార్లమెంటు భారతదేశం మొత్తానికి గానీ లేదా దేశంలో కొంత ప్రాంతానికి గానీ చట్టాలు చేయవచ్చు. కేంద్రపాలిత ప్రాంతాలకు కూడా పార్లమెంటే చట్టాలు చేస్తుంది. కేంద్ర జాబితాలో పేర్కొన్న ఏదైనా అంశంపై చట్టాలు చేయడానికి పార్లమెంటుకు మాత్రమే అధికారం ఉంది. కేంద్ర, రాష్ట్ర, ఉమ్మడి జాబితాలలో పేర్కొనబడని అంశాలపై చట్టాలు చేయడానికి పార్లమెంటుకు మాత్రమే అధికారం ఉంది.

ప్రశ్న 5.
అవశిష్ట అధికారాలు.
జవాబు:
కేంద్ర, రాష్ట్ర మరియు ఉమ్మడి జాబితాలలో లేని అంశాలను అవశిష్ట అధికారాలు అంటారు. వీటి పై శాసనాలను రూపొందించే అధికారం పార్లమెంటుకు మాత్రమే కలదు.
ఉదా: ఆర్థిక వ్యవస్థలోని సేవారంగంపై పన్నులు విధించే అధికారం పార్లమెంటుకు ఉంది.

ప్రశ్న 6.
కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన రెండు రాజ్యాంగేతర సాధనాలు.
జవాబు:

  1. నీతి అయోగ్.
  2. జాతీయ అభివృద్ధి మండలి.

1) నీతి అయోగ్ జాతీయ ప్రణాళికా సంఘం స్థానంలో రాజ్యాంగేతర సంస్థగా ఏర్పాటు చేయబడింది. దీనినే 2015 జనవరి 1వ తేదీన ప్రస్తుత భారత ప్రధానమంత్రి నరేంద్రమోడి ఏర్పాటు చేయడం జరిగింది.

2) జాతీయ అభివృద్ధి మండలి రాజ్యాంగేతర, శాసనేతర సంస్థ. ఇది ప్రణాళికలను తయారు చేయటంలో సహాయపడుతుంది.

AP Inter 2nd Year Civics Study Material Chapter 9 కేంద్ర – రాష్ట్ర సంబంధాలు

ప్రశ్న 7.
నీతి ఆయోగ్. [Mar. ’17, ’16]
జవాబు:
నీతి ఆయోగ్ జాతీయ ప్రణాళికా సంఘానికి ప్రత్యామ్నాయంగా ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్రమోడి చేత | 2015 జనవరి 1వ తేదీన ఏర్పాటు చేయబడింది. ఇది విధాన, ఆర్థిక విషయాలకు సంబంధించిన సాంకేతిక, వ్యూహాత్మక సలహాలతో కూడిన జాతీయ అజెండాను కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేస్తుంది. గ్రామీణస్థాయి ప్రణాళికల యంత్రాంగాన్ని అభివృద్ధి చేయడంతోపాటు వివిధ స్థాయిలలోని ప్రభుత్వాల ప్రణాళికలకు సంబంధించి ఒక యంత్రాంగాన్ని అభివృద్ధి
పరుస్తుంది.

ప్రశ్న 8.
జాతీయ అభివృద్ధి మండలి.
జవాబు:
జాతీయ అభివృద్ధి మండలి రాజ్యాంగేతర, శాసనేతర సంస్థ. ఇది ప్రణాళికలను తయారు చేయడంలో సహాయపడుతుంది. ఈ సంస్థను 1952లో ఏర్పాటు చేశారు. దీనికి ప్రధానమంత్రి అధ్యక్షుడిగా ఉంటారు. కేంద్ర కేబినెట్ సభ్యులందరూ, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అన్ని కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, నీతి ఆయోగ్ సభ్యులు ఇందులో సభ్యులుగా ఉంటారు. నీతి ఆయోగ్ దీనికి కార్య నిర్వాహక శాఖగా పనిచేస్తుంది.

ప్రశ్న 9.
జాతీయ సమగ్రత మండలి.
జవాబు:
కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో “భిన్నత్వంలో ఏకత్వం” పై జరిగిన జాతీయ సదస్సులో తీసుకొన్న ఒక నిర్ణయం మేరకు మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ జాతీయ సమగ్రతా మండలి 1961లో న్యూఢిల్లీలో ఏర్పాటు చేశారు. ప్రధానమంత్రి దీనికి అధ్యక్షులు కాగా, కేంద్ర హోంశాఖామంత్రి, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాజకీయ పార్టీలకు చెందిన ఏడుగురు నాయకులు. యు.జి.సి. అధ్యక్షుడు, ఇద్దరు విద్యావేత్తలు మొదలగు వారు ఇందులో సభ్యులుగా ఉంటారు. మతవాదం, కులవాదం, ప్రాంతీయవాదం, భాషావాదం మరియు జాతీయ సమగ్రతకు సంబంధించి సంకుచిత భావనలు మొదలగు వాటికి సంబంధించిన సమస్యలను పరిశీలించి, వ్యవహరించవలసిన విధానం గూర్చి సిఫారసు చేస్తుంది.

ప్రశ్న10.
కేంద్ర, రాష్ట్ర సంబంధాలలో మూడు ఉద్రిక్త పరిస్థితులు.
జవాబు:

  1. గవర్నర్ల నియామక పద్ధతి
  2. గవర్నర్ల పక్షపాత వైఖరి
  3. రాష్ట్రాలపై 356 నిబంధనను ప్రయోగించడం.

ప్రశ్న 11.
పూంఛీ కమీషన్.
జవాబు:
కేంద్ర, రాష్ట్ర సంబంధాలను అధ్యయనానికై ఏర్పాటైన మరొక కమీషన్లే పూంఛీ కమీషన్.
పదవీ విరమణ పొందిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మదన్మోహన్ పూంఛీ అధ్యక్షతన కేంద్ర, రాష్ట్ర సంబంధాలను అధ్యయనం చేయడానికి UPA ప్రభుత్వం ఏప్రిల్ 28, 2007న ఈ కమీషన్ ను ఏర్పాటు చేసింది. భారత రాజకీయ వ్యవస్థలో వచ్చిన గణనీయమైన మార్పులను దృష్టిలో ఉంచుకొని కేంద్ర – రాష్ట్ర సంబంధాలను అధ్యయనం చేయవలసిందిగా ప్రభుత్వం కమీషన్ను కోరింది. ఎందుకంటే కేంద్ర, రాష్ట్ర సంబంధాలను సర్కారియా కమీషను సమీక్షించి దాదాపు దశాబ్దాలు గడిచిపోయాయి. కేంద్ర – రాష్ట్ర సంబంధాలలో ప్రాధాన్యత కలిగిన అంశాలతో ఏ విధంగా వ్యవహరించాలి అనే విషయంపై కమీషన్ దాదాపు 310 సిఫార్సులు చేసింది. కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి ఏప్రిల్ 20, 2010న సమర్పించింది. పూంఛీ కమీషన్ చాలా అంశాలలో కేంద్ర రాష్ట్ర సంబంధాలను లోతుగా పరిశీలించి, భారతదేశ సమైక్యతను, సమగ్రతకు భావితరాల ఆర్థిక మరియు సామాజిక అభివృద్ధి మెరుగు పరచడానికి భారతదేశం ఒక సహకార సమాఖ్యగా ఉండాలని సూచించింది. సహకార సమాఖ్య సూత్రాలు భారత రాజకీయ వ్యవస్థకు మరియు సుపరిపాలనకు ఆచరణలో మార్గదర్శకంగా ఉండాలని వివరించింది.

AP Inter 2nd Year Civics Study Material Chapter 9 కేంద్ర – రాష్ట్ర సంబంధాలు

ప్రశ్న 12.
కేంద్ర – రాష్ట్ర సంబంధాలు.
జవాబు:
కేంద్ర – రాష్ట్ర సంబంధాలు అనగా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికారాలు, విధులు మరియు బాధ్యతలు ప్రధానాంశంగా నిలుస్తాయి. కేంద్ర – రాష్ట్ర సంబంధాలను గూర్చి భారత రాజ్యాంగంలోని 11 మరియు 12 భాగాలలో 245 – 300 వరకు గల ప్రకరణలలో వివరించడమైంది. భారతదేశంలో కేంద్ర, రాష్ట్ర సంబంధాలను మూడు శీర్షికల క్రింద చర్చించవచ్చు. అవి: i) శాసన సంబంధాలు ii) పరిపాలన సంబంధాలు. iii) ఆర్థిక సంబంధాలు.

AP Inter 2nd Year Civics Study Material Chapter 8 రాష్ట్ర న్యాయశాఖ

Andhra Pradesh BIEAP AP Inter 2nd Year Civics Study Material 8th Lesson రాష్ట్ర న్యాయశాఖ Textbook Questions and Answers.

AP Inter 2nd Year Civics Study Material 8th Lesson రాష్ట్ర న్యాయశాఖ

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
హైకోర్టు అధికార విధులను వివరించండి.
జవాబు:
భారత రాజ్యాంగం ప్రతి రాష్ట్రానికి ఒక హైకోర్టును ఏర్పాటు చేసింది. 1956వ సంవత్సరములో చేపట్టిన 7వ రాజ్యాంగ సవరణను అనుసరించి 2 లేదా 3 రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఉమ్మడి హైకోర్టును ఏర్పరిచేందుకు పార్లమెంటుకు అధికారం కల్పించబడింది. దేశంలోని చాలా రాష్ట్రాలలో హైకోర్టులు కలిగియున్నాయి.

భారత రాజ్యాంగంలోని ఆరో భాగంలో 214 నుండి 231 వరకు గల నిబంధనలు రాష్ట్ర హైకోర్టు నిర్మాణం, న్యాయమూర్తుల అర్హతలు, నియామకం, స్వతంత్ర ప్రతిపత్తి, న్యాయపరిధి, అధికారాలు, ప్రక్రియల గురించి పేర్కొన్నాయి. నిర్మాణం: ప్రతి హైకోర్టులో ఒక ప్రధాన న్యాయమూర్తి, కొందరు ఇతర న్యాయమూర్తులుంటారు. వీరిని భారత రాష్ట్రపతి నియమిస్తారు.

న్యాయమూర్తుల అర్హతలు: హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించబడుటకు రాజ్యాంగంలో నిర్ధేశించిన విధంగా క్రింది అర్హతలు కలిగి వుండాలి.

  1. భారతీయ పౌరుడై వుండాలి.
  2. భారతదేశంలో కేంద్ర, రాష్ట్ర న్యాయ సర్వీసులలో కనీసం 10 సంవత్సరాలు న్యాయాధికారిగా అనుభవం కలిగి ఉండాలి. లేదా
  3. రెండుగాని అంతకన్నా ఎక్కువ హైకోర్టులలో 10 సంవత్సరాలు న్యాయవాదిగా అనుభవముండాలి.

AP Inter 2nd Year Civics Study Material Chapter 8 రాష్ట్ర న్యాయశాఖ

హైకోర్టు న్యాయమూర్తుల నియామకానికి రాజ్యాంగంలో ఎటువంటి కనీస వయోపరిమితి ప్రస్తావన లేదు. జీతభత్యములు: హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి నెలసరి వేతనంగా 90,000/- ఇతర న్యాయమూర్తులకు 3 80,000/- లభిస్తాయి. వేతనంతో పాటు వారికి ఉచిత నివాస సౌకర్యం, వైద్యం, టెలిఫోన్, కారు సౌకర్యాలు మరియు ఇతర అలవెన్సులు ఉంటాయి.

ప్రమాణ స్వీకారం: హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తులు సంబంధిత రాష్ట్ర గవర్నర్ సమక్షంలో పదవీ ప్రమాణ స్వీకారం చేస్తారు.

పదవీ కాలం: హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తులు 62 సంవత్సరముల వయస్సు నిండే వరకు పదవిలో కొనసాగుతారు.

తొలగింపు విధానం: హైకోర్టు న్యాయమూర్తుల నిరూపించబడిన అధికార దుర్వినియోగం, అవినీతి, అసమర్థత, అనైతిక ప్రవర్తనల ఆధారంగా భారత రాష్ట్రపతి సుప్రీంకోర్టు న్యాయమూర్తులను తొలగించే విధంగా హైకోర్టు న్యాయమూర్తులను తొలగిస్తారు.

హైకోర్టు అధికారాలు విధులు: భారత రాజ్యాంగం ప్రకారం హైకోర్టు ఈ క్రింది పేర్కొన్న అధికారాలను, విధులను కల్గి ఉంది. అవి:
1) ప్రారంభ అధికార పరిధి: భారతదేశంలోని ప్రతి హైకోర్టుకు క్రింది విషయాలలో ప్రారంభ అధికార పరిధిని భారత రాజ్యాంగం కల్పించింది. వాటిలో వీలునామా, వివాహము, విడాకులు, కంపెనీ చట్టము, కోర్టు ధిక్కరణ, రెవెన్యూ వివాదాలు మొదలైనవి ఉన్నాయి. ప్రతి హైకోర్టు కొన్ని సూచనలను, ఆదేశాలను లేదా ఆజ్ఞలను (రిట్) ప్రాథమిక హక్కుల అమలుకు జారీచేస్తుంది. పార్లమెంటు సభ్యుల, రాష్ట్ర శాసన సభ్యుల ఎన్నికల వివాదాలు హైకోర్టు పరిధిలోనే పరిష్కరించబడతాయి.

2) అప్పీళ్ళ విచారణ పరిధి: సబార్డినేట్ కోర్టు తీర్పులపై వచ్చే అప్పీళ్ళపై హైకోర్టుకు విచారణ చేసే అధికారముంది. హైకోర్టు సివిల్, క్రిమినల్ వివాదాలపై వచ్చే అప్పీళ్ళను విచారిస్తుంది.

సివిల్ కేసులు: హైకోర్టుకు వచ్చే సివిల్ వివాదాలు మొదటి అప్పీలు లేదా రెండవ అప్పీలుగా ఉంటాయి. సివిల్ వివాదాలలో హైకోర్టుకు వచ్చే అప్పీళ్ళు జిల్లా కోర్టు నిర్ణయంపై ఆధారపడి ఉంటాయి. ఏదైనా వివాదం విలువ కౌ 5,00,000/- లు లేదా అంతకు మించివుంటే అటువంటి వివాదాలపై సబార్డినేటు కోర్టులు ఇచ్చిన తీర్పులపై వచ్చే అప్పీళ్ళను హైకోర్టు విచారణకు స్వీకరిస్తుంది.

క్రిమినల్ కేసులు: జిల్లా సెషన్స్ కోర్టులు ఏడు సంవత్సరాల పైబడి కారాగార శిక్ష విధించిన సందర్భాలలో వచ్చే అప్పీళ్ళను హైకోర్టు విచారణకు స్వీకరిస్తుంది. అలాగే మరణ శిక్ష విధించిన జిల్లా సెషన్స్ కోర్టు తీర్పులన్నీ హైకోర్టు పరిశీలనకు, అంతిమ ఆమోదం కొరకు నివేదించబడతాయి.

3) కోర్టు ఆఫ్ రికార్డ్: రాష్ట్ర హైకోర్టు ‘కోర్ట్ ఆఫ్ రికార్డ్’గా వ్యవహరిస్తుంది. వ్యక్తులు గానీ, సంస్థలు కానీ, కోర్టు ధిక్కారానికి పాల్పడితే, హైకోర్టు వారిని విచారించి శిక్షిస్తుంది. హైకోర్టు ఇచ్చిన తీర్పులు, వెలువరించిన నిర్ణయాలు రికార్డుల రూపంలో భద్రపరుస్తుంది. ఆ రికార్డులకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. హైకోర్టు ఇచ్చిన తీర్పులు రాష్ట్రంలోని క్రింది న్యాయస్థానాలకు మార్గదర్శకాలుగా ఉంటాయి.

4) న్యాయ సమీక్ష: సుప్రీంకోర్టు వలే హైకోర్టుకు న్యాయ సమీక్ష అధికారం ఉంటుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించిన చట్టాలు లేదా జారీ చేసే ఆదేశాలు రాజ్యాంగ మూల సూత్రాలకు విరుద్ధంగా ఉంటే అవి చెల్లవని (Ultra vires) ప్రకటించే అధికారం హైకోర్టుకు ఉంటుంది.

5) సర్టిఫికేషన్ అధికారం: హైకోర్టు ఇచ్చిన తీర్పుల పట్ల సంతృప్తి చెందని వారు సుప్రీంకోర్టుకు అప్పీలు చేసుకోవచ్చు. అటువంటి అప్పీళ్ళను సర్టిఫై చేసే అధికారం హైకోర్టుకు ఉంది. కనుక సుప్రీంకోర్టుకు అప్పీలు చేసుకొనే వ్యక్తులందరూ చాలావరకు హైకోర్టు ధృవీకరణను తీసుకోవాల్సి ఉంటుంది.

6) సలహాపూర్వక విధులు: హైకోర్టు న్యాయసంబంధ విషయాలలో గవర్నరుకు సలహాలిస్తుంది. జిల్లా న్యాయమూర్తుల నియామకం, పదోన్నతి, బదిలీలు మొదలగు అంశాల విషయములో కూడా సలహాలు ఇస్తుంది. జిల్లా న్యాయస్థానాలలో జిల్లా జడ్జి మినహా ఇతర పదవులలో ఏర్పడే ఖాళీల భర్తీ విషయంలో రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్తో పాటు హైకోర్టు గవర్నర్కు సలహా ఇస్తుంది.

7) పరిపాలనా సంబంధమైన విధులు: హైకోర్టు తన ప్రాదేశిక పరిధిలో కొన్ని పాలనా సంబంధమైన విధులను నిర్వహిస్తుంది. అవి:

  • 227వ ప్రకరణను అనుసరించి హైకోర్టు రాష్ట్రంలోని అన్ని న్యాయస్థానాలు, ట్రిబునల్స్పై (మిలిటరీ కోర్టులు మినహా) పర్యవేక్షణాధికారాన్ని కలిగి ఉంటుంది.
  • దిగువ కోర్టులు సమర్థవంతంగా పనిచేయడానికి అవసరమైన నియమనిబంధనలను రూపొందించడంలో కీలక పాత్ర వహిస్తుంది.
  • రాజ్యాంగంలోని 228వ ప్రకరణ ప్రకారం హైకోర్టు కొన్ని ప్రత్యేక పరిస్థితులలో కేసులను ఒక కోర్టు నుండి మరొక కోర్టుకు బదిలీ చేస్తుంది.

ప్రశ్న 2.
జిల్లాస్థాయి న్యాయ వ్యవస్థలపై ఒక వ్యాసం రాయండి.
జవాబు:
ప్రతి రాష్ట్రంలో హైకోర్టుకు దిగువన సబార్డినేట్ కోర్టుల వ్యవస్థ ఉంటుంది. భారత రాజ్యాంగం అధీన న్యాయవ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తిని కాపాడుతుంది. రాజ్యాంగంలోని VIవ భాగంలో 233 నుండి 237 వరకు గల ప్రకరణలు సబార్డినేట్ కోర్టుల గురించి పేర్కొన్నాయి. 233వ ప్రకరణ రాష్ట్రంలోని జిల్లా జడ్జిల నియామకం, పదోన్నతి మొదలగు అంశాలను వివరిస్తుంది.

రాష్ట్రంలో రెండు రకాల సబార్డినేట్ కోర్టులుంటాయి. అవి:

  1. సివిల్ కోర్టులు
  2. క్రిమినల్ కోర్టులు

AP Inter 2nd Year Civics Study Material Chapter 8 రాష్ట్ర న్యాయశాఖ

1) సివిల్ కోర్టులు: సివిల్ సంబంధమైన వివాదంతో ముడిపడిన వివాహాలు, విడాకులు, వారసత్వం, వ్యాపారం మొదలగు సివిల్ కేసులను సివిల్ కోర్టులు విచారణకు స్వీకరిస్తాయి. జిల్లా అంతటికి జిల్లా కోర్టుంటుంది. జిల్లా జడ్జి సివిల్ కోర్టుకు అధిపతిగా వ్యవహరిస్తారు. జిల్లాలోని అన్ని సివిల్ కోర్టులపై జిల్లా జడ్జి నియంత్రణ, పర్యవేక్షణా అధికారాలను కలిగి ఉంటాడు. జిల్లా సివిల్ కోర్టుకు దిగువన సీనియర్ సివిల్ జడ్జి కోర్టులు ఉంటాయి. వీటితో పాటు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులు ఉంటాయి. సబార్డినేట్ కోర్టులలోని క్రింద పేర్కొన్న న్యాయాధికారులు ఉంటారు.

  1. ప్రిన్సిపల్ జిల్లా జడ్జి.
  2. కుటుంబ కోర్టు జడ్జి.
  3. యస్.సి & యస్. టి. చట్టం కోర్టు జడ్జి.
  4. సీనియర్ సివిల్ కోర్టు జడ్జి
  5. జూనియర్ సివిల్ కోర్టు జడ్జి.

< 10 లక్షల అంతకు మించిన ఆస్థి విలువ కలిగిన వివాదాలపై ప్రిన్సిపల్ జిల్లాకోర్టు విచారణ జరిపి తీర్పునిస్తుంది. ప్రిన్సిపల్ జిల్లా జడ్జిని ప్రత్యక్ష భర్తీ విధానం లేదా పరోక్ష భర్తీ విధానం (పదోన్నతి) ద్వారా నియమించబడతారు. జిల్లా జడ్జి కేడర్ కలిగిన న్యాయాధికారులు కుటుంబ కోర్టులకు న్యాయమూర్తులుగా వ్యవహరిస్తారు.

సీనియర్ సివిల్ జడ్జి కోర్టులు లక్ష రూపాయలకు పైబడి పదిలక్షలలోపు ఆస్థి విలువ గల కేసులను విచారించి తీర్పునిస్తాయి. లక్ష రూపాయలలోపు ఆస్థివిలువ గల కేసులను జూనియర్ సివిల్ జడ్జి కోర్టు విచారించి తీర్పునిస్తుంది. స్థానిక న్యాయ వివాదాలను పరిష్కరించేందుకు జిల్లాలో క్రింది స్థాయిలో న్యాయ పంచాయితీలు, గ్రామ కచేరీలు, అదాలత్ పంచాయితీలు ఉంటాయి.

2) క్రిమినల్ కోర్టులు: జిల్లాలో సెషన్స్ కోర్టు అత్యున్నత క్రిమినల్ కోర్టు. క్రిమినల్ వివాదాలను జిల్లాస్థాయిలో విచారించేందుకు సెషన్స్ కోర్టు అత్యున్నత న్యాయస్థానంగా వ్యవహరిస్తుంది. ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లోని అంశాల ఆధారంగా సెషన్స్ జడ్జి తీర్పునిస్తాడు. జిల్లాస్థాయిలో క్రింద పేర్కొన్న న్యాయమూర్తులు క్రిమినల్ కేసులను విచారిస్తారు.

  1. జిల్లా సెషన్స్ జడ్జి.
  2. సీనియర్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి.
  3. జూనియర్ సివిల్ జడ్జి.
  4. స్పెషల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్.

ప్రిన్సిపల్ జిల్లా న్యాయమూర్తే జిల్లా సెషన్స్ జడ్జిగా వ్యవహరించి హత్య, మోటారు వాహనాల చట్ట ఉల్లంఘన కేసులను విచారించి, దోషులకు జీవిత ఖైదు లేదా మరణశిక్ష విధిస్తాడు. అయితే అటువంటి శిక్షలను హైకోర్టు ధృవీకరించాల్సి ఉంటుంది. సీనియర్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి కేసు స్వభావాన్ని బట్టి ఐదు నుండి ఏడు సంవత్సరాల | వరకు కారాగార శిక్షను విధించవచ్చు.

జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఏదైనా పట్టణములో ఉన్నట్లయితే ఆ కోర్టు సివిల్ మరియు క్రిమినల్ కోర్టుగా వ్యవహరించి సంబంధిత కేసులను విచారించి మూడు సంవత్సరాలలోపు కారాగార శిక్ష విధించవచ్చు. సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులు ఐదు వందల రూపాయల వరకు పెనాల్టీని లేదా ఒక సంవత్సరం కారాగార శిక్షను లేక రెండింటిని విధించవచ్చు.

స్పెషల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టును ప్రతి పట్టణములోను ఏర్పాటు చేయవచ్చు. ఇవి చిల్లర (పెట్టీ) కేసులను విచారించి ఐదు వందల రూపాయలలోపు జరిమానా, ఆరునెలలలోపు కారాగార శిక్షను విధించవచ్చు.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
హైకోర్టు నిర్మాణాన్ని గూర్చి సంక్షిప్తంగా వివరించండి.
జవాబు:
ప్రతి హైకోర్టులో ఒక ప్రధాన న్యాయమూర్తి, కొందరు ఇతర న్యాయమూర్తులుంటారు. వీరిని భారత రాష్ట్రపతి సందర్భానుసారంగా నియమిస్తాడు. హైకోర్టు న్యాయమూర్తి తాత్కాలికంగా శెలవుపై ఉన్నా లేదా విధులను నిర్వహించలేని పరిస్థితిలో ఉన్నా అతడు తన బాధ్యతలను తిరిగి చేపట్టేంతవరకు తాత్కాలిక న్యాయమూర్తిని రెండు సంవత్సరాల పదవీకాలానికి మించకుండా భారత రాష్ట్రపతి నియమించవచ్చు.

రాజ్యాంగం హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్యపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఉదా: అలహాబాద్ హైకోర్టులో అత్యధికంగా 48మంది న్యాయమూర్తులు ఉండగా గౌహతి హైకోర్టులో అతి తక్కువగా 5గురు న్యాయమూర్తులు ఉన్నారు. రాష్ట్రపతి విచక్షణపై, హైకోర్టుల పనిభారాన్ని దృష్టిలోవుంచుకొని రాష్ట్రపతి కాలానుగుణంగా హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను నిర్ణయిస్తాడు.

ప్రశ్న 2.
రాష్ట్ర హైకోర్టు ఏవైనా రెండు అధికార విధులను గూర్చి రాయండి. [Mar. 16]
జవాబు:
1) ప్రారంభ అధికార పరిధి: భారతదేశంలోని ప్రతి హైకోర్టుకు క్రింది విషయాలలో ప్రారంభ అధికార పరిధిని భారత రాజ్యాంగం కల్పించింది. వాటిలో వీలునామా, వివాహము, విడాకులు, కంపెనీ చట్టము, కోర్టు ధిక్కరణ, రెవెన్యూ వివాదాలు మొదలైనవి ఉన్నాయి. ప్రతి హైకోర్టు కొన్ని సూచనలను, ఆదేశాలను లేదా ఆజ్ఞలను (రిట్) ప్రాథమిక హక్కుల అమలుకు జారీచేస్తుంది. పార్లమెంటు సభ్యుల, రాష్ట్ర శాసన సభ్యుల ఎన్నికల వివాదాలు హైకోర్టు పరిధిలోనే పరిష్కరించబడతాయి.

226వ ప్రకరణను అనుసరించి ప్రాథమిక హక్కుల పరిరక్షణకు ఐదు రకాల రిట్లను హైకోర్టు జారీచేసే అధికారం కలిగి ఉంది. అవి హెబియస్ కార్పస్, సెర్షియోరరీ, మాండమస్, కో-వారంటో, ఇంజక్షన్ మొదలైనవి.

2) అప్పీళ్ళ విచారణ పరిధి: సబార్డినేట్ కోర్టు తీర్పులపై వచ్చే అప్పీళ్ళపై హైకోర్టుకు విచారణ చేసే అధికారముంది. హైకోర్టు సివిల్, క్రిమినల్ వివాదాలపై వచ్చే అప్పీళ్ళను విచారిస్తుంది.

సివిల్ కేసులు: హైకోర్టుకు వచ్చే సివిల్ వివాదాలు మొదటి అప్పీలు లేదా రెండవ అప్పీలుగా ఉంటాయి. సివిల్ వివాదాలలో హైకోర్టుకు వచ్చే అప్పీళ్ళు జిల్లా కోర్టు నిర్ణయంపై ఆధారపడి ఉంటాయి. ఏదైనా వివాదం విలువ 5,00,000/- లు లేదా అంతకు మించివుంటే అటువంటి వివాదాలపై సబార్డినేటు కోర్టులు ఇచ్చిన తీర్పులపై వచ్చే అప్పీళ్ళను హైకోర్టు విచారణకు స్వీకరిస్తుంది.

క్రిమినల్ కేసులు: జిల్లా సెషన్స్ కోర్టులు ఏడు సంవత్సరాల పైబడి కారాగార శిక్ష విధించిన సందర్భాలలో వచ్చే అప్పీళ్ళను హైకోర్టు విచారణకు స్వీకరిస్తుంది. అలాగే మరణ శిక్ష విధించిన జిల్లా సెషన్స్ కోర్టు తీర్పులన్నీ హైకోర్టు పరిశీలనకు, అంతిమ ఆమోదం కొరకు నివేదించబడతాయి.

AP Inter 2nd Year Civics Study Material Chapter 8 రాష్ట్ర న్యాయశాఖ

ప్రశ్న 3.
హైకోర్టు పాలన విధులను వివరించండి.
జవాబు:
హైకోర్టు తన ప్రాదేశిక పరిధిలో కొన్ని పాలనా సంబంధమైన విధులను నిర్వహిస్తుంది. అవి:
ఎ) 227వ ప్రకరణను అనుసరించి హైకోర్టు రాష్ట్రంలోని అన్ని న్యాయస్థానాలు, ట్రిబునల్స్పై (మిలిటరీ కోర్టులు మినహా) పర్యవేక్షణాధికారాన్ని కలిగి ఉంటుంది.

బి) దిగువ కోర్టులు సమర్థవంతంగా పనిచేయడానికి అవసరమైన నియమ నిబంధనలను రూపొందించడంలో కీలక పాత్ర వహిస్తుంది.

సి) రాజ్యాంగంలోని 228వ ప్రకరణ ప్రకారం హైకోర్టు కొన్ని ప్రత్యేక పరిస్థితులలో కేసులను ఒక కోర్టు నుండి మరొక కోర్టుకు బదిలీ చేస్తుంది.

డి) దిగువ న్యాయస్థానాల రికార్డులను, సంబంధిత పత్రాలను తనిఖీ చేసే అధికారం హైకోర్టుకు కలదు.

ఇ) హైకోర్టు తన పరిధిలోని పాలనాపరమైన ఉద్యోగులను నియమించి వారి జీతభత్యాలను నిర్ణయించే అధికారంతో పాటు దిగువ న్యాయస్థానాలలోని ఉద్యోగుల సర్వీసు నిబంధనలను రూపొందించే అధికారాన్ని కలిగి ఉంటుంది.

ఎఫ్) రాజ్యాంగ వ్యాఖ్యానానికి సంబంధించిన ఎటువంటి వివాదంపై విచారణ కొనసాగించేందుకు లేదా నిలిపివేసేందుకు అధికారాన్ని కలిగి ఉంటుంది.

జి) రాష్ట్రంలో హైకోర్టు అత్యున్నత న్యాయ వ్యవస్థ. రాష్ట్రంలోని అన్ని కోర్టులు, ట్రిబునల్స్ (మిలటరీ కోర్టులు మినహా) హైకోర్టు ప్రత్యక్ష పర్యవేక్షణ, నియంత్రణలో పనిచేస్తాయి.

ప్రశ్న 4.
జిల్లా కోర్టు అధికార విధులను వివరించండి.
జవాబు:
భారతదేశంలో రాష్ట్ర న్యాయ వ్యవస్థలో హైకోర్టుకు దిగువన సబార్డినేట్ కోర్టులు లేదా జిల్లా కోర్టులు ఉంటాయి. జిల్లా స్థాయి న్యాయపాలనలో జిల్లాకోర్టులు ప్రధానమైన పాత్రను పోషిస్తాయి. జిల్లాకోర్టులో జిల్లా జడ్జి, ఇతర జడ్జిలు ఉంటారు. వారు జిల్లాస్థాయిలోను, పట్టణ, మేజర్ పంచాయితీల స్థాయిలో అనేక కర్తవ్యాలను, బాధ్యతలను నిర్వహిస్తూ సివిల్, క్రిమినల్ కేసులను విచారిస్తారు. జిల్లా కోర్టులు పాలనా వ్యవహారాలలో రాష్ట్ర ప్రభుత్వ అధికారానికి, నియంత్రణకు లోబడి పనిచేస్తాయి. న్యాయ విషయాలలో హైకోర్టుకు లోబడి పనిచేస్తాయి.

రాష్ట్రంలో రెండు రకాల సబార్డినేట్ కోర్టులుంటాయి. అవి: 1) సివిల్ కోర్టులు 2) క్రిమినల్ కోర్టులు

1) సివిల్ కోర్టులు: సివిల్ సంబంధమైన వివాదంతో ముడిపడిన వివాహాలు, విడాకులు, వారసత్వం, వ్యాపారం మొదలగు సివిల్ కేసులను సివిల్ కోర్టులు విచారణకు స్వీకరిస్తాయి. జిల్లా అంతటికి జిల్లా కోర్టుంటుంది. జిల్లా జడ్జి సివిల్ కోర్టుకు అధిపతిగా వ్యవహరిస్తారు. జిల్లాలోని అన్ని సివిల్ కోర్టులపై జిల్లా జడ్జి నియంత్రణ, పర్యవేక్షణా అధికారాలను కలిగి ఉంటాడు. జిల్లా సివిల్ కోర్టుకు దిగువన సీనియర్ సివిల్ జడ్జి కోర్టులు ఉంటాయి. వీటితో పాటు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులు ఉంటాయి. సబార్డినేట్ కోర్టులలోని క్రింద పేర్కొన్న న్యాయాధికారులు ఉంటారు.

  1. ప్రిన్సిపల్ జిల్లా జడ్జి.
  2. కుటుంబ కోర్టు జడ్జి.
  3. యస్.సి & యస్. టి. చట్టం కోర్టు జడ్జి.
  4. సీనియర్ సివిల్ కోర్టు జడ్జి.
  5. జూనియర్ సివిల్ కోర్టు జడ్జి.

< 10 లక్షల అంతకు మించిన ఆస్థి విలువ కలిగిన వివాదాలపై ప్రిన్సిపల్ జిల్లాకోర్టు విచారణ జరిపి తీర్పునిస్తుంది. ప్రిన్సిపల్ జిల్లా జడ్జిని ప్రత్యక్ష భర్తీ విధానం లేదా పరోక్ష భర్తీ విధానం (పదోన్నతి) ద్వారా నియమించబడతారు.

జిల్లా జడ్జి కేడర్ కలిగిన న్యాయాధికారులు కుటుంబ కోర్టులకు న్యాయమూర్తులుగా వ్యవహరిస్తారు. ఈ కోర్టు హిందూ వివాహ చట్టానికి సంబంధించి విడాకులు, మధ్యంతర భరణం, పిల్లల సంరక్షణలకు సంబంధించిన కేసులను విచారిస్తుంది. షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగల వారి హక్కులను కాపాడటానికి యస్. సి & యస్. టి. చట్టాన్ని తు.చ. తప్పకుండా అమలు చేయుటకు జిల్లా మొత్తానికి ఒక న్యాయస్థానం ఉంటుంది.

సీనియర్ సివిల్ జడ్జి కోర్టులు లక్ష రూపాయలకు పైబడి పదిలక్షలలోపు ఆస్థి విలువ గల కేసులను విచారించి తీర్పునిస్తాయి. లక్ష రూపాయలలోపు ఆస్థివిలువ గల కేసులను జూనియర్ సివిల్ జడ్జి కోర్టు విచారించి తీర్పునిస్తుంది. స్థానిక న్యాయ వివాదాలను పరిష్కరించేందుకు జిల్లాలో క్రింది స్థాయిలో న్యాయ పంచాయితీలు, గ్రామ కచేరీలు, అదాలత్ పంచాయితీలు ఉంటాయి.

2) క్రిమినల్ కోర్టులు: జిల్లాలో సెషన్స్ కోర్టు అత్యున్నత క్రిమినల్ కోర్టు. క్రిమినల్ వివాదాలను జిల్లాస్థాయిలో విచారించేందుకు సెషన్స్ కోర్టు అత్యున్నత న్యాయస్థానంగా వ్యవహరిస్తుంది. ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లోని అంశాల ఆధారంగా సెషన్స్ జడ్జి తీర్పునిస్తాడు. జిల్లాస్థాయిలో క్రింద పేర్కొన్న న్యాయమూర్తులు క్రిమినల్ కేసులను విచారిస్తారు.

  1. జిల్లా సెషన్స్ జడ్జి.
  2. సీనియర్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి.
  3. జూనియర్ సివిల్ జడ్జి.
  4. స్పెషల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్.

ప్రిన్సిపల్ జిల్లా న్యాయమూర్తే జిల్లా సెషన్స్ జడ్జిగా వ్యవహరించి హత్య, మోటారు వాహనాల చట్ట ఉల్లంఘన కేసులను విచారించి, దోషులకు జీవిత ఖైదు లేదా మరణశిక్ష విధిస్తాడు. అయితే అటువంటి శిక్షలను హైకోర్టు ధృవీకరించాల్సి ఉంటుంది. సీనియర్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి కేసు స్వభావాన్ని బట్టి ఐదు నుండి ఏడు సంవత్సరాల వరకు కారాగార శిక్షను విధించవచ్చు.

AP Inter 2nd Year Civics Study Material Chapter 8 రాష్ట్ర న్యాయశాఖ

జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఏదైనా పట్టణములో ఉన్నట్లయితే ఆ కోర్టు సివిల్ మరియు క్రిమినల్ కోర్టుగా వ్యవహరించి సంబంధిత కేసులను విచారించి మూడు సంవత్సరాలలోపు కారాగార శిక్ష విధించవచ్చు. సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులు ఐదు వందల రూపాయల వరకు పెనాల్టీని లేదా ఒక సంవత్సరం కారాగార శిక్షను లేక రెండింటిని విధించవచ్చు.

స్పెషల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టును ప్రతి పట్టణములోను ఏర్పాటు చేయవచ్చు. ఇవి చిల్లర (పెట్టీ కేసులను విచారించి ఐదు వందల రూపాయలలోపు జరిమానా, ఆరునెలలోపు కారాగార శిక్షను విధించవచ్చు.

ప్రశ్న 5.
రాష్ట్ర అడ్వకేట్ జనరల్ అధికార విధులను గూర్చి చర్చించండి. [Mar. ’17]
జవాబు:
భారత యూనియన్లో ప్రతి రాష్ట్రంలో ఒక అడ్వకేట్ జనరల్ పదవి ఏర్పాటైంది. ఆ పదవి భారత అటార్నీ జనరల్ పదవిని పోలి ఉంటుంది. అందుచేత రాష్ట్ర అడ్వకేట్ జనరల్ భారత అటార్నీ జనరల్ నిర్వహించే విధులను కలిగి ఉంటాడు. అతడు రాష్ట్రంలో ఉన్నత న్యాయ అధికారిగా వ్యవహరిస్తారు.

నియామకం:
రాజ్యాంగంలోని 165వ ప్రకరణ అనుసరించి రాష్ట్ర అడ్వకేట్ జనరల్ను గవర్నరు నియమిస్తాడు. అడ్వకేట్ జనరల్ నియమించబడే వ్యక్తి ఈ క్రింది అర్హతలను కలిగి ఉండాలి.

  • భారత పౌరుడై ఉండాలి.
  • ఏదైనా న్యాయ వ్యవస్థలో ముఖ్య పదవిలో 10 సంవత్సరముల అనుభవం కలిగి వుండాలి. లేదా ఏదైనా హైకోర్టులో 10 సంవత్సరాల న్యాయవాదిగా పనిచేసియుండాలి.
  • హైకోర్టు న్యాయమూర్తిగా నియమింపబడుటకు కావలసిన అర్హతలను కలిగి ఉండవలెను.

అధికారాలు – విధులు:
రాష్ట్ర ప్రభుత్వ అత్యున్నత న్యాయాధికారి అయిన అడ్వకేట్ జనరల్ క్రింది విధులను నిర్వహిస్తాడు.

  1. గవర్నరు కోరిక మేరకు న్యాయపరమైన అంశాలపై రాష్ట్ర ప్రభుత్వానికి సలహాలిస్తాడు.
  2. న్యాయ సంబంధమైన ఇతర విధులను గవర్నరు కోరిక మేరకు నిర్వర్తిస్తాడు.
  3. రాజ్యాంగం నిర్దేశించిన విధులను నిర్వహిస్తాడు.
  4. తన బాధ్యతల నిర్వహణలో భాగంగా రాష్ట్రంలోని ఏ న్యాయ స్థానంలోనైనా అడ్వకేట్ జనరల్ రాష్ట్ర ప్రభుత్వం తరపున హాజరవుతాడు.
  5. రాష్ట్ర శాసనసభా కార్యక్రమాలలో పాల్గొని మాట్లాడే హక్కు అడ్వకేట్ జనరల్ కు కలదు. అయితే అతడికి సభలో బిల్లులపై ఓటింగ్ లో పాల్గొనే హక్కు మాత్రం లేదు.
  6. రాష్ట్ర శాసనసభ స్థాయీసంఘాల సమావేశాలకు హాజరవుతాడు.

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
హైకోర్టు జడ్జీల నియామకం. [Mar 17]
జవాబు:
సంబంధిత రాష్ట్ర గవర్నర్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సంప్రదించిన తరువాత భారత రాష్ట్రపతి రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని, ఇతర న్యాయమూర్తులను నియమిస్తాడు. అదేవిధంగా ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తులను నియమించేందుకు సంబంధిత రాష్ట్రాల గవర్నర్లను సంప్రదిస్తాడు.

ప్రశ్న 2.
హైకోర్టు జడ్జీల అర్హతలు.
జవాబు:

  1. భారతీయ పౌరుడై ఉండాలి. [Mar. 16]
  2. భారతదేశంలో కేంద్ర, రాష్ట్ర న్యాయ సర్వీసులలో కనీసం 10 సంవత్సరములు న్యాయాధికారిగా అనుభవం కలిగి ఉండాలి.
  3. రెండు కాని లేదా అంతకన్నా ఎక్కువ హైకోర్టులలో కాని 10 సంవత్సరాలు న్యాయవాదిగా అనుభవం

ప్రశ్న 3.
హైకోర్టు కోర్టు ఆఫ్ రికార్డు.
జవాబు:
రాష్ట్ర హైకోర్టు కోర్టు ఆఫ్ రికార్డుగా వ్యవహరిస్తుంది. వ్యక్తులుకాని, సంస్థలు కానీ కోర్టు ధిక్కారానికి పాల్పడితే, హైకోర్టు వారిని విచారించి శిక్షిస్తుంది. హైకోర్టు ఇచ్చిన తీర్పులు, వెలువరించిన నిర్ణయాలు రికార్డుల రూపంలో భద్రపరుస్తుంది. ఈ రికార్డు దిగువ న్యాయస్థానాలకు మార్గదర్శకంగా పనిచేస్తుంది.

AP Inter 2nd Year Civics Study Material Chapter 8 రాష్ట్ర న్యాయశాఖ

ప్రశ్న 4.
హైకోర్టు సలహా రూపక విధులు.
జవాబు:
హైకోర్టు న్యాయ సంబంధ విషయాలలో గవర్నర్కు సలహాలిస్తుంది. జిల్లా న్యాయమూర్తుల నియమకం, పదోన్నతి, బదిలీలు మొదలగు అంశాలలో కూడా సలహాలిస్తుంది. జిల్లా న్యాయస్థానాలలో జిల్లా జడ్జి మినహా ఇతర పదవులలో ఏర్పడే ఖాళీల భర్తీ విషయంలో రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమీషన్ తోపాటు, హైకోర్టు గవర్నర్కు సలహా ఇస్తుంది.