AP Inter 2nd Year Civics Study Material Chapter 7 రాష్ట్ర శాసననిర్మాణ శాఖ

Andhra Pradesh BIEAP AP Inter 2nd Year Civics Study Material 7th Lesson రాష్ట్ర శాసననిర్మాణ శాఖ Textbook Questions and Answers.

AP Inter 2nd Year Civics Study Material 7th Lesson రాష్ట్ర శాసననిర్మాణ శాఖ

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
విధానసభ నిర్మాణం, అధికారాలు, విధులను వివరించండి.
జవాబు:
రాష్ట్ర శాసననిర్మాణ శాఖలో దిగువ సభను విధానసభ అంటారు. విధానసభ సభ్యులను యం.యల్.ఎ. (Members of Legislative Assembly) లు అని అంటారు. భారత రాజ్యాంగంలోని 170వ ప్రకరణ ప్రకారం రాష్ట్ర విధానసభలో సభ్యుల సంఖ్య 500కు మించకుండా 60కి తగ్గకుండా ఉండాలి. విధానసభ సభ్యుల సంఖ్య ఆ రాష్ట్ర జనాభాపైన మరియు విస్తీర్ణం పైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి చిన్న రాష్ట్రాలైన గోవా, మిజోరామ్లలో 40 మంది, సిక్కింలో 32 మంది సభ్యులు ఉండుటకు అవకాశం కల్పించబడింది.

నిర్మాణం: ప్రతి రాష్ట్రంలోను విధానసభ సభ్యులు వయోజన ఓటర్లు ద్వారా ప్రాదేశిక నియోజక వర్గాల వారీగా ప్రత్యక్షంగా ఎన్నకోబడతారు. విధానసభలో ఆంగ్లో-ఇండియన్ వర్గానికి తగిన ప్రాతినిధ్యం లేదని రాష్ట్ర గవర్నరు భావించినపుడు ఆ వర్గానికి చెందిన ఒకరిని విధానసభ సభ్యునిగా నియమిస్తారు. విధానసభ నియోజక వర్గాల సంఖ్య రాష్ట్ర జనాభా నిష్పత్తికి తగిన విధంగా ఉంటుంది.

విధానసభలో కొన్ని స్థానాలు షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగల ప్రతినిధులకు కేటాయించబడినవి. దేశంలోని రాష్ట్రాలలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అత్యధికంగా 404 మంది శాసనసభ్యులను కలిగి ఉండగా, సిక్కింలాంటి చిన్న రాష్ట్రాలలో అతి తక్కువ 32 మంది సభ్యులను కలిగి ఉన్నది. రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ విధానసభ సభ్యుల సంఖ్య 175 మందిగా నిర్ణయించడమైంది.

సభ్యుల అర్హతలు: విధానసభ సభ్యుడిగా పోటీచేయు వారికి క్రింద పేర్కొన్న అర్హతలను కలిగి ఉండాలి.

  1. భారతీయ పౌరుడై ఉండాలి.
  2. 25 సంవత్సరాల వయస్సు నిండి ఉండాలి.
  3. పార్లమెంట్ నిర్ణయించిన ఇతర అర్హతలు కలిగి ఉండాలి.
  4. పార్లమెంట్, రాష్ట్ర శాసనసభలలో ఒక వ్యక్తి ఒకేసారి రెండింటిలో సభ్యుడిగా వుండరాదు.

పదవీకాలము: విధానసభ సాధారణ కాల పరిమితి 5 సంవత్సరాలు. అయితే 5 సంవత్సరాలకు ముందుగానే అర్థాంతరంగా రద్దుచేయవచ్చు. రాజ్యాంగం 356వ ప్రకరణ ప్రకారం రాష్ట్రపతి జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటించిన సందర్భంలో విధానసభ కాలపరిమితిని గరిష్టంగా ఒక సంవత్సరము పొడిగించవచ్చును. అత్యవసర పరిస్థితిని తొలగించిన ఆరు నెలలలోగా విధానసభకు ఎన్నికలు జరిపించాలి.

విధానసభ అధికారాలు – విధులు

ఎ) శాసన నిర్మాణ అధికారాలు విధులు: విధానసభ అనేది ప్రధానమైన శాసన రూపకల్పనా విభాగము. విధానసభకు రాష్ట్ర జాబితాలోని అన్ని అంశాలపై చట్టాలను రూపొందించేందుకు అధికారముంది. అంతేగాకుండా అది ఉమ్మడి జాబితాలోని అంశాలపై కూడా చట్టాలను రూపొందించవచ్చు. అయితే ఒకవేళ విధానసభ ఉమ్మడి జాబితాలోని అంశాలపై చట్టాలు రూపొందిస్తే ఆ చట్టం పార్లమెంటు రూపొందించిన చట్టాలకు భిన్నంగా ఉండకూడదు.

ఒకవేళ భిన్నంగా ఉన్నట్లయితే పార్లమెంటు రూపొందించిన చట్టం మాత్రమే అమలులో ఉంటుంది. విధానసభ సమావేశంలో లేని కాలంలో గవర్నరు జారీచేసే ఆర్డినెన్స్లను విధానసభ ఆమోదిస్తుంది.

బి) కార్యనిర్వాహక అధికారాలు విధులు: విధానసభకు రాష్ట్ర మంత్రిమండలిని నియంత్రించే అధికారం ఉంది. ముఖ్యమంత్రి నాయకత్వంలోని రాష్ట్ర మంత్రిమండలి విధానసభకు వ్యక్తిగతంగాను, సమిష్టిగాను బాధ్యత వహిస్తుంది. విధానసభ విశ్వాసం ఉన్నంతవరకే రాష్ట్ర మంత్రిమండలి అధికారంలో కొనసాగుతుంది. విధానసభ రాష్ట్ర మంత్రిమండలిని అనేక విధాలుగా నియంత్రిస్తుంది. అవి: సావధాన తీర్మానం, వాయిదా తీర్మానం, ప్రశ్నోత్తరాలు, అనుబంధ ప్రశ్నలు, కోత తీర్మానం, అవిశ్వాస తీర్మానం. ఈ సందర్భంలో విధానసభ, విధానపరిషత్ కంటే ఎక్కువ అధికారాలను చెలాయిస్తుంది.

సి) ఆర్థిక అధికారాలు – విధులు: విధానసభకు కొన్ని నిర్దిష్టమైన ఆర్థిక సంబంధమైన అధికారాలు ఉంటాయి. విత్త సంబంధమైన నిధులను కేటాయించడానికి, ఆమోదించడానికి దానికి అధికారమున్నది. విత్తం లేకుండా ప్రభుత్వం ఏ రకమయిన విధులను నిర్వహించలేదు. ఎందుకంటే పాలనాయంత్రాంగానికి విత్తం అనేది ఇంధనం వంటిది. ద్రవ్య సంబంధమైన బిల్లులను విధానసభలోనే ప్రవేశపెట్టాలి. విధానసభ ఆర్థిక బిల్లును తిరస్కరిస్తే మంత్రిమండలి రాజీనామా చేయాల్సి ఉంటుంది.

డి) రాజ్యాంగ సంబంధమైన అధికారాలు: రాజ్యాంగ సవరణ విషయంలో విధానసభ ద్వితీయ పాత్రను పోషిస్తుంది. రాజ్యాంగ సవరణ ప్రక్రియలో విధానసభ ఎటువంటి చొరవ చూపదు. అయినప్పటికీ ముఖ్యమైన రాజ్యాంగ సవరణలన్నింటికి సగానికిపైగా రాష్ట్రాల శాసనసభల ఆమోదం అవసరం. ఏదైనా ఒక రాష్ట్రం సరిహద్దులను మార్చవలసివస్తే పార్లమెంటు సంబంధిత విధానసభ అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకొని రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది.

ఇ) ఎన్నికల సంబంధమైన విధులు: విధానసభ సభ్యులు భారత రాష్ట్రపతి పదవికి జరిగే ఎన్నికలలో పాల్గొంటారు. సంబంధిత రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించే రాజ్యసభ సభ్యులను విధాన సభ సభ్యులు పరోక్ష ఎన్నిక పద్ధతిలో ఎన్నుకుంటారు. విధానపరిషత్తు సభ్యులలో 1/3వ వంతు సభ్యులను విధానసభ సభ్యులు ఎన్నుకొంటారు.
ఎఫ్) ఇతర విధులు: విధానసభ ప్రజాభిప్రాయాన్ని వ్యక్తీకరించే వేదికగా పనిచేస్తుంది. నూతనంగా ఎన్నుకోబడిన సభ్యులకు శిక్షణాసంస్థగా వ్యవహరిస్తుంది. రాష్ట్రంలో విధానపరిషత్తు ఏర్పాటు చేయుటకు లేదా రద్దుచేయుటకు ఒక తీర్మానం ద్వారా పార్లమెంటుకు నివేదిస్తుంది.

ప్రశ్న 2.
విధానపరిషత్తు నిర్మాణం, అధికారాలు, విధులను క్లుప్తముగా రాయండి.
జవాబు:
విధానపరిషత్తు లేదా విధానమండలి అనేది రాష్ట్ర శాసన నిర్మాణ శాఖలో ఎగువ సభ. విధానపరిషత్తు సభ్యులను యం.యల్.సి. (మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్)లు అంటారు. భారతదేశంలో ఏడు రాష్ట్రాలలో విధాన పరిషత్తులు ఉన్నాయి. విధానపరిషత్తు సభ్యుల సంఖ్య కనీసం 40 మందికి తగ్గకుండా, విధానసభ సభ్యులు సంఖ్యలో 1/3వ వంతుకు మించకుండా ఉండాలి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ విధానపరిషత్లో 58 మంది సభ్యులు ఉన్నారు. విధానపరిషత్ కొనసాగింపు విషయంలో విధాన సభ అభీష్టంతో పాటుగా పార్లమెంట్ సాధారణ మెజారీటీతో ఆమోదం తెలపాలి. సంబంధిత శాసనసభ తీర్మానం మేరకు విధానపరిషత్ ఏర్పాటుకు లేక తొలగింపు పార్లమెంట్ తన ఆమోదాన్ని తెలియజేస్తే విధానపరిషత్ ఏర్పాటు లేదా రద్దు అవుతుంది.

నిర్మాణం: విధానపరిషత్తులో కొందరు ఎన్నిక ద్వారా మరికొందరు నియామకం ద్వారా సభ్యత్వం పొందుతారు. వారు పరోక్ష ఎన్నిక ద్వారా నైష్పత్తిక ప్రాతినిధ్య ఓటు పద్ధతిద్వారా ఎన్నుకోబడతారు.

విధానపరిషత్ సభ్యులు ఐదు విధాలుగా ఎన్నుకోబడతారు.

  1. మొత్తం సభ్యులలో 1/3వ వంతు మంది సభ్యులను రాష్ట్రంలోని స్థానిక సంస్థలైన పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థలు, జిల్లాపరిషత్తులు మొదలగు సంస్థల ప్రతినిధులు ఎన్నుకొంటారు.
  2. 1/3వ వంతు మంది సభ్యులను విధానసభ సభ్యులు ఎన్నుకొంటారు.
  3. 1/12వ వంతు మంది సభ్యులను రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాల పట్టభద్రులు ఎన్నుకొంటారు.
  4. 1/12వ వంతు మంది సభ్యులను రాష్ట్రంలోని సెకండరీ పాఠశాల స్థాయికి తగ్గకుండా కనీసం మూడేళ్ళపాటు పనిచేసిన ఉపాధ్యాయులు ఎన్నుకొంటారు.
  5. మిగిలిన 1/6 వంతు మంది సభ్యులను సాహిత్యం, కళలు, సహకారోద్యమం, సామాజిక సేవలకు సంబంధించి ప్రత్యేక పరిజ్ఞానం కలవారిని గవర్నర్ నియామకం చేస్తాడు.

సభ్యుల అర్హతలు: విధానపరిషత్తు సభ్యునిగా పోటీ చేయుటకు ఈ దిగువ తెలిపిన అర్హతలు కలిగి ఉండవలెను.

  • భారత పౌరుడై ఉండవలెను.
  • 30 సం||ల వయస్సు నిండి యుండాలి.
  • పార్లమెంటు చట్టం ద్వారా నిర్ణయించే ఇతర అర్హతలు కలిగి ఉండాలి.

పదవీకాలం: విధానపరిషత్తు శాశ్వత సభ. అయితే మొత్తం సభ్యులలో 1/3వ వంతు సభ్యులు ప్రతి రెండు సంవత్సరములకు ఒకసారి పదవీ విరమణ చేస్తారు. ఇది శాశ్వతసభ కాబట్టి పదవీ విరమణ చేసిన సభ్యుల స్థానంలో నూతన సభ్యులు ఎన్నుకోబడతారు. ఒక్కొక్క సభ్యుడి పదవీకాలం 6 సం॥లు. సంవత్సరానికి కనీసం రెండుసార్లు ఈ సభ సమావేశమౌతుంది.

విధానపరిషత్తు అధికారాలు విధులు

ఎ) శాసన నిర్మాణ అధికారాలు విధులు: రాష్ట్ర విధానసభతో పోల్చినప్పుడు విధానపరిషత్తుకు తక్కువ అధికారాలు ఉంటాయి. విధానపరిషత్తు అధికారాలు హుందాతనంతో కూడుకున్నట్టివి మాత్రమే. సాధారణ బిల్లులను విధానపరిషత్తులో కూడా ముందుగా ప్రవేశపెట్టవచ్చును. ఉభయ సభల ఆమోదంతోనే అటువంటి బిల్లులను గవర్నర్ | ఆమోదం కొరకు పంపుతారు. విధానసభ ఆమోదించిన సాధారణ బిల్లులను విధానపరిషత్తు తిరస్కరించడానికి లేదా | పునఃపరిశీలనకు పంపడానికి అధికారం కలదు.

బి) కార్యనిర్వాహక అధికారాలు విధులు: విధానసభ అధికారాలతో పోలిస్తే విధానపరిషత్తుకు పరిమితమైన కార్యనిర్వాహక అధికారాలు ఉంటాయి. ముఖ్యమంత్రి నాయకత్వంలోని రాష్ట్ర మంత్రిమండలి విధానసభకే బాధ్యత వహిస్తుంది. విధానపరిషత్తు మంత్రిమండలి భవిష్యత్తును నిర్ధారించలేదు. అయినప్పటికీ ప్రభుత్వ విధానాలు, కార్యక్రమాలను ప్రశ్నలు, అనుబంధ ప్రశ్నలు, సావధాన తీర్మానం ద్వారా అది మంత్రిమండలిని ప్రభావితం చేస్తుంది కాని మంత్రిమండలిని పదవి నుండి తొలగించే అధికారం మాత్రం విధానపరిషత్తుకు లేదు.

సి) ఆర్థిక అధికారాలు విధులు: ఆర్థికాధికారాల విషయంలో విధానపరిషత్తుకు పరిమితమైన అధికారాలు మాత్రమే ఉంటాయి. ఆర్థిక బిల్లులను విధానపరిషత్తులో ముందుగా ప్రవేశపెట్టకూడదు. ఆర్థిక బిల్లులను తిరస్కరించే అధికారం విధానపరిషత్తుకు లేదు. విధానసభ ఆమోదించిన ఆర్థిక బిల్లులను 14 రోజుల వ్యవధిలోగా విధానపరిషత్తు ఆమోదించాల్సి ఉంటుంది.

డి) ఎన్నికల సంబంధమైన విధులు: విధానపరిషత్తు సభా కార్యక్రమాలను హుందాగా నిర్వహించేందుకు తమలో ఒకరిని చైర్మన్గాను, వేరొకరిని డిప్యూటీ చైర్మన్ గానూ ఎన్నుకొంటుంది. సభా సంఘాలైన ప్రభుత్వ ఖాతాల సంఘం, ప్రభుత్వరంగ సంస్థల సంఘాల సభ్యులను ఎన్నుకుంటుంది.

ఇ) ఇతర విధులు: ప్రజాభిప్రాయాన్ని సేకరించి, సంఘటిత పరచి వ్యక్తీకరించేందుకు విధానపరిషత్తు ఒక వేదికగా పనిచేస్తుంది. కళలు, సాహిత్యం, సామాజిక సేవ మరియు సహకారోద్యమంకు చెందిన వివిధ రంగాల ప్రముఖులకు సభ్యత్వం కల్పించడం ద్వారా విధానపరిషత్తు శాసన నిర్మాణంలో వారి సేవలను వినియోగించుకొంటుంది.

ప్రశ్న 3.
విధానసభ స్పీకరు బాధ్యతలను, పాత్రను వివరించండి.
జవాబు:
సభా కార్యక్రమాల నిర్వహణ కొరకు విధానసభ సభ్యులు తమలో ఒకరిని స్పీకరుగా ఎన్నుకొంటారు. స్పీకరు పదవీకాలం 5 సంవత్సరములు.

విధానసభ స్పీకరు అధికారాలు – విధులు: విధానసభ స్పీకరు అధికారాలు – విధులు లోక్సభ స్పీకరు యొక్క అధికారాలు విధులను పోలిఉంటాయి. స్పీకరు అధికారాలు విధులు ఈ క్రింది విధముగా వివరింపవచ్చు.

  1. స్పీకరు విధానసభ సమావేశాలకు అధ్యక్షత వహిస్తాడు. సభా కార్యక్రమాలను అత్యంత హుందాగా, ప్రశాంతంగా, సమర్థవంతంగా నిర్వహిస్తాడు.
  2. సభా కార్యక్రమాల నిర్వహణలో వివిధ అంశాలపై చర్చించుటకు తగిన సమయాన్ని కేటాయిస్తాడు.
  3. సభలో నియమ నిబంధనల గూర్చి వివరిస్తాడు.
  4. వివిధ బిల్లులపై ఓటింగ్ నిర్వహించి ఫలితాలు ప్రకటిస్తాడు.
  5. ఏదైనా ఒక బిల్లు ఆమోదం విషయంలో ప్రతిష్టంబన ఏర్పడితే, తన నిర్ణాయక ఓటు (కాస్టింగ్ ఓటు)ను వినియోగించి బిల్లు భవితవ్యాన్ని నిర్ణయిస్తాడు.
  6. బిల్లులపై చర్చ సందర్భంగా అనేక తీర్మానాలను, పాయింట్ ఆఫ్ అర్డర్లను ప్రతిపాదించడానికి సభ్యులకు అనుమతినిస్తాడు.
  7. కోరమ్లోని సందర్భంలో సభా కార్యక్రమాలను వాయిదా వేస్తాడు.
  8. సభలో సభ్యుల గౌరవానికి భంగం కలిగించే అనుచిత వ్యాఖ్యలను రికార్డుల నుండి తొలగిస్తాడు.
  9. సభలో సభ్యులు ప్రసంగించేందుకు అవకాశం కల్పిస్తాడు.
  10. సభా కార్యక్రమాల నిర్వహణకు భంగం కలిగించే సభ్యులను సభనుండి బయటకు వెళ్ళమని ఆదేశిస్తాడు.
  11. సభలో గందరగోళ పరిస్థితులు ఏర్పడినప్పుడు సభను వాయిదావేసే అధికారం స్పీకరుకు ఉంటుంది.
  12. సభ్యుల రాజీనామాలను ఆమోదించుటకు లేదా తిరస్కరించుటకు స్పీకరుకు అధికారముంది. ఒకవేళ రాజీనామాలను ఆమోదించదలచుకుంటే, అవి నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయో లేదో పరిశీలిస్తారు.
  13. శాసనసభా కమిటీల ఛైర్మన్లను నియమించి వాటి పనితీరును పర్యవేక్షిస్తాడు. శాసనసభ వ్యవహారాల కమిటీ, రూల్స్ కమిటీ, సాధారణ ప్రయోజన కమిటీలకు ఛైర్మన్ గా వ్యవహరిస్తాడు.
  14. సభలో ప్రవేశపెట్టే బిల్లు సాధారణ బిల్లా ? లేక ఆర్థిక బిల్లా ? అని నిర్ణయించడంలో అంతిమ నిర్ణయాధికారాన్ని కలిగి ఉంటాడు.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
విధానసభ గురించి క్లుప్తంగా తెలపండి.
జవాబు:
రాజ్యాంగంలో 6వ భాగం 3వ అధ్యాయంలో రాష్ట్ర శాసన నిర్మాణశాఖను గురించి పేర్కొనబడింది. రాష్ట్ర శాసన నిర్మాణ శాఖ గవర్నర్, రెండు సభలు లేదా ఒక సభతో కూడి ఉండును. విధానసభనే శాసనసభ అని కూడా అంటారు. రెండు సభలుంటే ఒకటి విధానసభ, రెండవది విధాన పరిషత్తు.

విధానసభ లేదా శాసనసభ నిర్మాణము:
సభ్యుల సంఖ్య: విధానసభ ప్రజాప్రతినిధుల సభ. రాష్ట్ర శాసనసభలో ఇది దిగువసభ. దీని సభ్యుల సంఖ్య 500కి మించరాదు. 60కి తగ్గకూడదు. ఈ సభలోని సభ్యులను వయోజనులైన ఓటర్లు ఎన్నుకుంటారు. ఒక ఆంగ్లో – ఇండియన్ సభ్యుడిని అవసరమని భావిస్తే గవర్నర్ నామినేట్ చేస్తాడు. విధానసభ సభ్యులను M.L.A. లు (మెంబర్ ఆఫ్ ది లెజిస్లేటివ్ అసెంబ్లీ) అని అంటారు.

సభ్యుల అర్హతలు: విధానసభ సభ్యులు 1) భారతీయ పౌరులై ఉండాలి. 2) 25 సం||ల వయస్సు నిండినవారై ఉండాలి. 3) ఆదాయాన్నిచ్చే ప్రభుత్వ ఉద్యోగంగాని, లాభసాటి వ్యాపారం గాని చేయకూడనివారై ఉండాలి.

సభ్యుల పదవీకాలం: విధానసభ సభ్యుల పదవీకాలం 5 సంవత్సరాలు. ముఖ్యమంత్రి సలహాపై గవర్నర్ కాలపరిమితికి ముందే రద్దు చేయవచ్చు.

సభాపతి – ఉపసభాపతి (స్పీకర్ అండ్ డిప్యూటీ స్పీకర్): విధానసభ సభ్యులు తమలో ఒకరిని సభాపతిగాను, మరొకరిని ఉపసభాపతిగాను ఎన్నుకుంటారు. వీరు సభా కార్యక్రమాలు నిర్వహిస్తారు.

ప్రశ్న 2.
అంచనాల కమిటీ గురించి రాయండి.
జవాబు:
విధానసభ నియమనిబంధనలు, సభావ్యవహారాల నిర్వహణ ప్రకారం అంచనాల కమిటీలో 20 మంది సభ్యులుంటారు. వీరిలో విధానసభ నుండి 15 మంది, విధానపరిషత్తు నుండి 5గురు సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తారు. సభ్యుల పదవీకాలం ఒక సంవత్సరము. వీరు పరోక్ష ఎన్నిక ద్వారా ఎన్నుకోబడతారు. ఈ కమిటీ చైర్మన న్ను స్పీకరు నియమిస్తాడు. అధికార పక్షానికి చెందిన సభ్యుడు చైర్మన్ గా నియమించబడుతారు.

అంచనాల కమిటీ విధులు: అంచనాల కమిటీ విధులు లోక్సభ అంచనాల కమిటీ విధులను పోలివుంటాయి. అవి:

  1. ప్రభుత్వ వ్యయాన్ని నియంత్రించడం.
  2. ప్రభుత్వ అంచనాల విషయంలో విత్త సంస్కరణలను, పరిపాలనా సామర్థ్యం పెంపుదలకు తగిన సూచనలను అందించడం.
  3. ప్రభుత్వ పాలనా సామర్థ్యాన్ని, ఆదాను పెంపొందించడానికి ప్రత్యామ్నాయ విధానాలను సూచించడం.
  4. విధానాల పరిధిలో వివిధ మంత్రిత్వ శాఖల అంచనాల పరిధిని పరీక్షించడం.
  5. విధానసభకు అంచనాలను సమర్పించే పద్ధతిపై సలహాలివ్వడం.

ప్రశ్న 3.
ప్రభుత్వ ఖాతాల కమిటీ గురించి నీకేమి తెలియును ? [Mar. ’17]
జవాబు:
ఈ కమిటీలో 20 మంది సభ్యులు ఉంటారు. వారిలో 15 మంది విధానసభ సభ్యులు, 5గురు విధానపరిషత్తు సభ్యులు. వారు నైష్పత్తిక ప్రాతినిధ్య ఓటు ద్వారా ఒక సంవత్సర పదవీకాలానికి ఎన్నుకోబడతారు. ప్రభుత్వ ఖాతాల |కమిటీ చైర్మన్ గా ప్రతిపక్ష పార్టీకి చెందిన సభ్యుడు స్పీకర్చే నియమింపబడతాడు. ఈ కమిటీలో మంత్రులు సభ్యులుగా
ఉండరాదు.

ప్రభుత్వ ఖాతాల కమిటీ విధులు:
ప్రభుత్వ ఖాతాల కమిటీ ఈ క్రింది విధులను నిర్వర్తిస్తుంది.

  1. ఈ కమిటీ ప్రభుత్వ ఖాతాలను పరిశీలించి ఆయా శాఖలకు బడ్జెట్ ద్వారా కేటాయించిన నిధులు సక్రమంగా వినియోగించినది, లేనిది నిర్ధారిస్తుంది.
  2. కంప్టోలర్ & ఆడిటర్ జనరల్ సమర్పించిన వార్షిక నివేదికలోని అంశాలను, రాష్ట్ర ప్రభుత్వ ఉపకల్పనా ఖాతాలను తనిఖీ చేయడం.
  3. ఈ కమిటీ ప్రభుత్వ ఖాతాల నిర్వహణలో ఏవైనా లోపాలు ఉన్నట్లయితే వాటిని విధానసభ దృష్టికి తెస్తుంది.
  4. రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలు, ఆదాయ వ్యయాలు, లాభనష్టాలకు సంబంధించిన అంశాలను పరిశీలిస్తుంది.
  5. ప్రభుత్వ ఖాతాలు మరియు తనిఖీ పద్ధతులు ప్రక్రియలకు సంబంధించిన అంశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తుంది.
  6. వివిధ శాఖలు చేసిన వ్యయాన్ని, విధానాల అమలుకు సంబంధించిన విషయాలను దర్యాప్తు చేస్తుంది.

ప్రశ్న 4.
విధానసభ స్పీకరుకు గల అధికారాలు – విధులను తెలపండి. [Mar. ’16]
జవాబు:

  1. స్పీకరు విధానసభ సమావేశాలకు అధ్యక్షత వహిస్తాడు. సభా కార్యక్రమాలను అత్యంత హుందాగా, ప్రశాంతంగా, సమర్థవంతంగా నిర్వహిస్తాడు.
  2. సభా కార్యక్రమాల నిర్వహణలో వివిధ అంశాలపై చర్చించుటకు తగిన సమయాన్ని కేటాయిస్తాడు.
  3. సభలో నియమనిబంధనల గూర్చి వివరిస్తాడు.
  4. వివిధ బిల్లులపై ఓటింగ్ నిర్వహించి ఫలితాలు ప్రకటిస్తాడు.
  5. ఏదైనా ఒక బిల్లు ఆమోదం విషయంలో ప్రతిష్టంభన ఏర్పడితే, తన నిర్ణాయక ఓటు (కాస్టింగ్ ఓటు)ను వినియోగించి బిల్లు భవితవ్యాన్ని నిర్ణయిస్తాడు.
  6. బిల్లులపై చర్చ సందర్భంగా అనేక తీర్మానాలను, పాయింట్ ఆఫ్ ఆర్డర్లను ప్రతిపాదించడానికి సభ్యులకు అనుమతినిస్తాడు.
  7. కోరమ్లని సందర్భంలో సభా కార్యక్రమాలను వాయిదా వేస్తాడు.
  8. సభలో సభ్యుల గౌరవానికి భంగం కలిగించే అనుచిత వ్యాఖ్యలను రికార్డులనుండి తొలగిస్తాడు.
  9. సభలో సభ్యులు ప్రసంగించేందుకు అవకాశం కల్పిస్తాడు.

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
విధానసభ సభ్యుడి అర్హతలు.
జవాబు:

  1. భారతీయ పౌరుడై ఉండాలి.
  2. 25 సంవత్సరముల వయస్సు నిండి ఉండాలి.
  3. పార్లమెంటు నిర్ణయించిన ఇతర అర్హతలు కలిగి ఉండాలి.
  4. పార్లమెంటు, రాష్ట్రశాసన సభలలో ఒక వ్యక్తి ఒకేసారి రెండింటిలో సభ్యుడిగా ఉండరాదు.

ప్రశ్న 2.
విధానపరిషత్తు సభ్యుడి అర్హతలు.
జవాబు:

  1. భారతీయ పౌరుడై ఉండాలి.
  2. 30 సంవత్సరాల వయస్సు నిండి ఉండాలి.
  3. పార్లమెంటు చట్టం ద్వారా నిర్ణయించే ఇతర అర్హతలు కలిగి ఉండాలి.

ప్రశ్న 3.
కోరమ్. [Mar. ’17]
జవాబు:
విధానసభ కార్యక్రమాల నిర్వహణకు హాజరు కావలసిన కనీస సభ్యుల సంఖ్యను కోరమ్ అంటారు. భారత రాజ్యాంగంలోని 188వ ప్రకరణ ప్రకారం విధానసభ కోరమ్ సభ్యుల సంఖ్య 1/10వ వంతు.

ప్రశ్న 4.
రాష్ట్ర శాసనసభ్యుల జీతభత్యాలు.
జవాబు:
ఆంధ్రప్రదేశ్ విధానసభ సభ్యులు ఒక్కొక్కరు నెలకు 90,000/-ల జీతభత్యాలను పొందుతారు. అందులో వేతనం 15,000/-లు, నియోజకవర్గ అలవెన్సుగా 75,000/- లు చెల్లించబడతాయి. రాష్ట్రప్రభుత్వం నివాస వసతి కల్పించకపోతే అందుకుగాను ఇంటి అద్దె అలవెన్సుగా నెలకు 10,000/-లు చెల్లించటం జరుగుతుంది. శాసనసభ సమావేశాలకు హాజరైన సభ్యులకు రోజుకు 3 800/-లు దినసరిభత్యం ఇవ్వబడుతుంది.

ప్రశ్న 5.
రాష్ట్రశాసన సభ విశేషాధికారాలు.
జవాబు:
విధానసభ సభ్యులకు విధి నిర్వహణలో కల్పించిన ప్రత్యేక హక్కులే వారికి విశేషాధికారాల రూపంలో ఉంటాయి. ఈ అధికారాలు లేకుంటే విధానసభ హుందాగా, గౌరవప్రదంగా నిర్వహించబడదు. విశేషాధికారాలు రెండు రకాలు. అవి. 1. సమిష్టి విశేషాధికారాలు. 2. వ్యక్తిగత విశేషాధికారాలు. శాసనసభ్యుల ప్రసంగాలు, చర్చలను ఇతరులు ప్రచురించకుండా నిరోధించే హక్కును కల్గి ఉంటారు. శాసన సభ సమావేశాలకు 40 రోజుల ముందు గానీ సమావేశాలనంతరం 40 రోజుల వరకు గానీ సభ్యులను అరెస్టు చేయరాదు.

ప్రశ్న 6.
ఆంధ్రప్రదేశ్ శాసనసభ సంక్షిప్త చరిత్ర. [Mar. ’17]
జవాబు:
ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుండి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో వున్న 13 జిల్లాల ప్రాంతం కర్నూలు రాజధానిగా 1953 సంవత్సరం అక్టోబరు 1వ తేదీన ఆంధ్రరాష్ట్రం అవతరించింది. అప్పుడు ఆంధ్రరాష్ట్ర శాసనసభలో 140 మంది సభ్యులు ఉన్నారు. 1956 నవంబరు 1వ తేదీన ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ శాసనసభలో 245 మంది సభ్యులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం ఆంధ్రప్రదేశ్ను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలుగా 2014 జూన్ 2వ తేదీన విభజించడమైంది.

ప్రశ్న 7.
విధానపరిషత్తు చైర్మన్. [Mar, ’16]
జవాబు:
విధాన పరిషత్తు సమావేశాలను నిర్వహించటానికి ఒక చైర్మన్ మరియు ఒక డిప్యూటీ చైర్మన్ ఉంటారు. విధాన పరిషత్ చైర్మన్ అధికారాలు విధానసభ స్పీకర్ అధికారాలతో పోలి ఉంటాయి. కాని ఏది ఆర్థిక బిల్లో ? ఏది సాధారణ బిల్లో నిర్ణయించే విశిష్ట అధికారం స్పీకరు కల్గి ఉన్నాను. చైర్మన్కు ఆ అధికారం లేదు.

ప్రశ్న 8.
డిప్యూటీ స్పీకర్.
జవాబు:
సభ కార్యక్రమాల నిర్వహణకు విధానసభ సభ్యులు తమలో ఒకరిని స్పీకరుగాను మరొకరిని డిప్యూటీ స్పీకర్గాను ఎన్నుకొంటారు. స్పీకర్ సమావేశాలకు హాజరుగాని సమయంలో డిప్యూటీ స్పీకర్ సభా కార్యక్రమాలు నిర్వహిస్తాడు. ఇటువంటి సందర్భంలో స్పీకర్ అధికారాలన్ని డిప్యూటీ స్పీకరుకు వర్తిస్తాయి.

ప్రశ్న 9.
విధానపరిషత్తు డిప్యూటీ చైర్మన్.
జవాబు:
విధానపరిషత్తు సమావేశాలను నిర్వహించటానికి సభలోని సభ్యులు తమలో నుంచి ఒకరిని చైర్మన్గాను మరొకరిని డిప్యూటీ చైర్మన్ గాను ఎన్నుకొంటారు. చైర్మన్ పదవి ఖాళీ అయిన సందర్భంలోనూ, లేక చైర్మన్ సభకు హాజరు కాని సమయంలోను డిప్యూటీ చైర్మన్ సభా కార్యక్రమాలను నిర్వహిస్తారు.

ప్రశ్న 10.
కమిటీల రకాలు.
జవాబు:
రాజ్యాంగ నిర్మాతల ఆశయాలకనుగుణంగా పార్లమెంటు, రాష్ట్ర శాసనసభలలో వివిధ రకాల కార్యక్రమాల నిర్వహణ కొరకు కమిటీలు ఏర్పడినాయి. స్థూలంగా కమిటీలు రెండు రకాలు. అవి:

  1. స్థాయి సంఘాలు.
  2. తాత్కాలిక సంఘాలు.

AP Inter 2nd Year Civics Study Material Chapter 6 రాష్ట్ర కార్యనిర్వాహక శాఖ

Andhra Pradesh BIEAP AP Inter 2nd Year Civics Study Material 6th Lesson రాష్ట్ర కార్యనిర్వాహక శాఖ Textbook Questions and Answers.

AP Inter 2nd Year Civics Study Material 6th Lesson రాష్ట్ర కార్యనిర్వాహక శాఖ

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
రాష్ట్ర గవర్నర్ అధికారాలు – విధులను చర్చించండి.
జవాబు:
గవర్నర్ రాజ్యాంగం ఏర్పాటు చేసిన రాష్ట్ర అధినేత. అతను రాజ్యాంగం యొక్క ప్రతినిధి. కేంద్ర ప్రభుత్వ నియమితుడు. మన రాజ్యాంగం రాష్ట్ర స్థాయిలో గవర్నర్ పదవికి అవకాశం కల్పించింది. ప్రతి రాష్ట్రానికి ఒక గవర్నర్ ఉండాలని రాజ్యాంగంలోని 153వ ప్రకరణ తెలుపుతున్నది. అయితే రాజ్యాంగ (7వ సవరణ) చట్టం, 1956 ఒక వ్యక్తిని రెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు గవర్నర్ నియమించడానికి వీలు కల్పించింది. ఈ చట్టం ప్రకారమే ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఒకే వ్యక్తి గవర్నర్ గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం బీహార్ – పశ్చిమ బెంగాల్, మణిపూర్ – మేఘాలయ, త్రిపుర – నాగాలాండ్ రాష్ట్రాలకు కూడా ఉమ్మడి గవర్నర్లు ఉన్నారు.

అర్హతలు: రాజ్యాంగంలోని 157వ ప్రకరణ ప్రకారం గవర్నర్ గా నియమింపబడే వ్యక్తికి క్రింది పేర్కొన్న అర్హతలు ఉండాలి.

  1. భారతీయ పౌరుడై ఉండాలి.
  2. 35 సంవత్సరాల వయసు నిండి ఉండాలి.

అలాగే గవర్నర్గా నియమితుడయ్యే వ్యక్తి 158వ ప్రకరణ ప్రకారం క్రింద తెలిపిన షరతులను నిర్దేశించింది.

  1. పార్లమెంట్లో ఏ సభలోనూ లేదా రాష్ట్ర శాసన నిర్మాణశాఖలోని ఏ సభలోనూ సభ్యుడై ఉండకూడదు.
  2. ఎటువంటి లాభదాయకమైన పదవిని నిర్వహించకూడదు.
  3. కోర్టు ద్వారా దివాళా తీసిన వ్యక్తిగా ప్రకటింపబడి ఉండకూడదు.

AP Inter 2nd Year Civics Study Material Chapter 6 రాష్ట్ర కార్యనిర్వాహక శాఖ

నియామకం : రాజ్యాంగ ప్రకరణ 155 ప్రకారం రాష్ట్రపతి ప్రధానమంత్రి సలహా ప్రకారం గవర్నర్ను నియమిస్తాడు. గవర్నర్ నియామక విషయంలో రాష్ట్రపతి క్రింది రెండు సంప్రదాయాలను పాటిస్తాడు.

  1. సంబంధిత రాష్ట్ర ముఖ్యమంత్రితో సంప్రదించడం.
  2. సంబంధిత రాష్ట్రానికి చెందని ప్రముఖ వ్యక్తిని గవర్నర్ గా నియమించడం.

జీతభత్యములు:- ప్రస్తుతం గవర్నర్కు నెలకు రూ. 1,10,000 లు జీతం లభిస్తుంది. “రాజభవన్” అనే ఉచిత అధికార గృహంలో నివసిస్తాడు. వీటితోపాటు అనేక ఇతర భత్యాలు, సౌకర్యాలు, మినహాయింపులు గవర్నర్కు లభిస్తాయి. పదవీ ప్రమాణ స్వీకారం: రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవర్నర్ చేత పదవీ ప్రమాణ స్వీకారం చేయిస్తాడు.
పదవీకాలం: గవర్నర్ పదవిని స్వీకరించిన నాటినుండి 5 సంవత్సరాలు పదవిలో ఉండటం సాంప్రదాయం. అయితే రాష్ట్రపతి విశ్వాసాన్ని పొందినంతకాలం గవర్నర్ పదవిలో కొనసాగగలడు. వాస్తవానికి ఆచరణలో రాష్ట్రపతి విశ్వాసం అనేది ప్రధానమంత్రి అభిప్రాయంపైన ఆధారపడి ఉంటుంది. అంటే ప్రధానమంత్రి దృష్టిలో సదభిప్రాయం పొందినంతకాలం పదవిలో ఉండగలరు.

అధికారాలు – విధులు:
రాజ్యాంగం ప్రకారం గవర్నర్ రాజ్యాంగబద్ధమైన అధినేత. గవర్నర్ కొన్ని ముఖ్యమైన అధికారాలను, విధులను నిర్వర్తిస్తాడు. వాటిని క్రింది విధంగా పేర్కొనవచ్చు.

  1. కార్యనిర్వాహణ అధికారాలు విధులు
  2. శాసననిర్మాణ అధికారాలు – విధులు
  3. న్యాయాధికారాలు – విధులు
  4. ఆర్థికాధికారాలు – విధులు
  5. ఇతర అధికారాలు – విధులు
  6. వివేచనాధికారాలు

1) కార్యనిర్వాహణాధికారాలు – విధులు: రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాలను స్వయంగా సాగించడానికి అవసరమైన నియమ నిబంధనలను గవర్నర్ రూపొందిస్తాడు. అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ విధివిధానాలను సక్రమంగా నిర్వహించి అమలు చేయడానికి అనుకూలంగా రాష్ట్ర స్థాయిలో రాజ్యాంగ ఉన్నత పదవులలో కొన్నింటికి ప్రత్యక్షంగా నియామకాలు జరుపుతాడు. అందులో ముఖ్యమైనవి.

  1. గవర్నర్ ముఖ్యమంత్రిని నియమిస్తాడు. ముఖ్యమంత్రి సలహా మేరకు మంత్రులను నియమిస్తాడు.
  2. మంత్రులకు మంత్రిత్వ శాఖలను కేటాయించడం లేదా మంత్రివర్గ నిర్మాణంలో మార్పులు చేయడం, మంత్రుల శాఖలలో మార్పులు చేయడం వంటి విధులను నిర్వహిస్తాడు.
  3. ముఖ్యమంత్రి సూచనలపై మంత్రులను పదవుల నుండి తొలగిస్తాడు.
  4. రాష్ట్ర విశ్వ విద్యాలయాలకు ఉపకులపతులను నియమించడమే గాక కులపతిగా కూడా వ్యవహరిస్తాడు.
  5. రాష్ట్ర ముఖ్య కార్యదర్శి మరియు అడ్వకేట్ జనరల్ను నియమిస్తాడు.

2) శాసననిర్మాణ అధికారాలు విధులు: గవర్నర్ రాష్ట్ర శాసనసభలో సభ్యుడు కాదు. కాని అందులో ఒక అంతర్భాగంగా 168వ ప్రకరణ వర్ణిస్తుంది. ఆ స్థాయిలో శాసన నిర్మాణశాఖకు సంబంధించిన కొన్ని విధులను, అధికారాలను గవర్నర్ నిర్వహిస్తాడు.

  1. విధానసభ సాధారణ ఎన్నికల తరువాత మొదటి సమావేశాన్ని ఆవిష్కరిస్తాడు.
  2. విధానసభ మొదటి సమావేశానికి (బడ్జెట్ సమావేశం) ప్రారంభ ఉపన్యాసం చేస్తాడు.
  3. విధానసభకు సాధారణ ఎన్నికల అనంతరం ప్రొటెం స్పీకర్ను నియమించి, స్పీకర్ ఎన్నికకు మార్గం సుగమం చేస్తాడు.
  4. శాసన నిర్మాణశాఖలోని సభా సమావేశాలకు ఆదేశించడం లేదా వాయిదా వేసే అధికారం గవర్నర్కు కలదు.

3) న్యాయాధికారాలు విధులు: రాష్ట్ర గవర్నరు న్యాయ సంబంధమైన కొన్ని ముఖ్య అధికార విధులను నిర్వర్తిస్తాడు.

  1. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, న్యాయమూర్తుల నియామక ప్రక్రియలో రాష్ట్రపతి కోరినచో సలహా ఇస్తాడు.
  2. రాష్ట్ర అడ్వకేట్ జనరల్ న్ను నియమిస్తాడు.
  3. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించి జిల్లా జడ్జీల నియామకం, పోస్టింగులు, పదోన్నతులు వంటి విషయాలలో అధికారాలను చెలాయిస్తాడు.
  4. రాష్ట్ర హైకోర్టు (జిల్లా జడ్జీలను మినహాయించి) రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ సూచనలపై రాష్ట్రంలోని అధీన న్యాయస్థానాల (Sub-ordinate courts) లోని న్యాయ సిబ్బందిని నియమిస్తాడు.
  5. సంబంధిత రాష్ట్ర హైకోర్టు విధించిన శిక్షను తగ్గించడానికి, క్షమాభిక్ష పెట్టడానికి లేదా శిక్షను పూర్తిగా రద్దు చేయడానికి రాష్ట్ర గవర్నర్కు అధికారం ఉంటుందీ.

4) ఆర్థికాధిరాలు – విధులు:

  1. ప్రతి ఆర్థిక సంవత్సరములో రాష్ట్రవార్షిక ఆర్థిక నివేదికను (బడ్జెట్ను) విధాన సభలో సమర్పించే విధంగా చూస్తాడు.
  2. గవర్నర్ ముందస్తు అనుమతి ద్రవ్య బిల్లులను శాసనసభలో ప్రవేశపెట్టరాదు.
  3. గవర్నరు అనుమతి లేకుండా రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక గ్రాంట్లకు సంబంధించిన ఏ సిఫార్సులనైనా విధానసభలో ప్రవేశపెట్టడానికి వీలులేదు.
  4. రాష్ట్ర ప్రభుత్వ ఆగంతుక నిధి (Contingency fund) ని నిర్వహించడం, అనుకోని వ్యయాన్ని భరించడానికి ఆ నిధి నుండి నిధులను విడుదలచేసే అధికారం గవర్నర్కే ఉంది.

AP Inter 2nd Year Civics Study Material Chapter 6 రాష్ట్ర కార్యనిర్వాహక శాఖ

5) ఇతర అధికారాలు, విధులు:

  1. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ సమర్పించిన వార్షిక నివేదికను గవర్నర్ మంత్రిమండలి పరిశీలనకు పంపుతాడు. తరువాత ఆ నివేదికను, దానిపై మంత్రిమండలి సూచనలను రాష్ట్ర అసెంబ్లీకి పంపించి, దానిపై చర్చ జరిగేటట్లు చర్యలు తీసుకుంటాడు.
  2. రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల ఆదాయ వ్యయాల గురించి ఆడిటర్ జనరల్ పంపించిన నివేదికలను గవర్నర్ స్వీకరిస్తాడు. గవర్నర్ ఆ నివేదికను కూడా మంత్రి మండలికి, ఆ తరువాత శాసనసభకు పంపడానికి చర్యలు తీసుకుంటాడు.

6) వివేచనాధికారాలు: రాజ్యాంగంలోని 163(1) అధికరణ రాష్ట్ర గవర్నర్కు కొన్ని వివేచనాధికారాలను ప్రసాదించింది. ఈ విధులను మంత్రిమండలి సహాయ సలహాలతో నిమిత్తం లేకుండా గవర్నర్ తన వివేచన, విజ్ఞతలను ఉపయోగించి నిర్వహిస్తాడు. గవర్నరుకు క్రింద పేర్కొన్న వివేచనాధికారాలు ఉంటాయి.

  1. ఏ పార్టీకి పూర్తి మెజార్టీ లేని పరిస్థితులలో కొత్త ముఖ్యమంత్రిని ఎంపికచేయడం. ఈ సందర్భంలో గవర్నరు చాలా చురుకైన పాత్రను నిర్వహిస్తాడు.
  2. మెజార్టీ సభ్యుల మద్దతు కోల్పోయిన మంత్రి మండలి రాజీనామా చేయడానికి నిరాకరించినపుడు ఆ మంత్రిమండలిని రద్దుచేయడం.
  3. మంత్రిమండలి శాసనసభలో మెజారిటీ సభ్యుల విశ్వాసం కోల్పోయినపుడు, ముఖ్యమంత్రి సలహామేరకు శాసనసభను రద్దు చేయవచ్చు.
  4. రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగం విఫలమైనప్పుడు రాజ్యాంగ అత్యవసర పరిస్థితిని (రాష్ట్రపతిపాలన) విధించాల్సిందిగా రాష్ట్రపతిని కోరడం.
  5. విధానసభ ఆమోదించిన బిల్లులను రాష్ట్రపతి పరిశీలన కోసం నిలుపుదల చేయడం.

ప్రశ్న 2.
ముఖ్యమంత్రి అధికారాలు – విధులను వివరించండి.
జవాబు:
రాష్ట్ర ప్రభుత్వ రథసారథి ముఖ్యమంత్రి. అతడు ప్రభుత్వాధిపతి. మంత్రిమండలికి నాయకుడు. అధికార పక్షానికి నాయకుడు. గవర్నర్కు, మంత్రిమండలికి మధ్య వారధి వంటివాడు. ఈయన సమర్థతపై ఆధారపడి రాష్ట్ర పరిపాలన నడుస్తుంది. కేంద్రంలో ప్రధాని వలె, రాష్ట్రంలో ముఖ్యమంత్రి స్థానం ఉంటుంది.

నియామకం: సాధారణ ఎన్నికల తరువాత మెజారిటీ పార్టీ నాయకుడు గవర్నర్చే ముఖ్యమంత్రిగా నియమింపబడతాడు. ఆయన సలహాపై ఇతర మంత్రులను గవర్నర్ నియమిస్తాడు.

పదవీకాలం: రాజ్యాంగరీత్యా ముఖ్యమంత్రి గవర్నర్ విశ్వాసం పొందగలిగినంత కాలం పదవిలో ఉంటాడు. వాస్తవానికి అసెంబ్లీలో (విధానసభ) మెజారిటీ నిలుపుకొన్నంత కాలమే పదవిలో కొనసాగుతాడు.

అర్హతలు:

  1. భారతీయ పౌరుడై ఉండాలి.
  2. శాసనసభలో సభ్యుడై ఉండాలి. కాకపోతే 6 నెలల్లో శాసనసభా సభ్యత్వం పొందాలి. లేకుంటే పదవి పోతుంది.

ముఖ్యమంత్రి అధికారాలు

విధులు:
1) మంత్రిమండలి ఏర్పాటు: తన అభీష్టం మేరకు మంత్రిమండలిని ఏర్పాటుచేయడం ముఖ్యమంత్రి మొదటి ప్రధాన విధి. సాధారణంగా మంత్రివర్గ సభ్యుల ఎంపిక, నియామకాలలో ముఖ్యమంత్రికి పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. తన పార్టీలో లేదా సంకీర్ణ ప్రభుత్వమైతే భాగస్వామ్య పార్టీలలోని కొందరు సభ్యులను ఎంపిక చేసుకొని వారి పేర్లను గవర్నర్కు సిఫారసు చేసి మంత్రులుగా వారు నియమితులయ్యేటట్లు చూస్తాడు.

2) మంత్రిమండలి నాయకుడు: ముఖ్యమంత్రి రాష్ట్ర మంత్రిమండలి నాయకుడు. ఆ హోదాలో అత్యున్నత, అసామాన్యమైన అధికార స్థానాన్ని ముఖ్యమంత్రి అలంకరిస్తాడు. అతడు కేబినేట్ ఛైర్మన్ గా ఉంటూ, కేబినేట్ సమావేశ చర్చనీయాంశాలు (అజెండా), ప్రదేశం, సమయాలను నిర్ణయిస్తాడు. కేబినేట్ సమావేశాలకు అధ్యక్షత వహించి, అందులో చర్చలు సజావుగా, అర్థవంతంగా జరిగేందుకు మార్గనిర్దేశం చేస్తాడు.

3) గవర్నర్ – మంత్రిమండలి మధ్య వారధి: ముఖ్యమంత్రి, గవర్నర్ – మంత్రిమండలికి మధ్య ప్రధాన సమాచార మార్గంగానూ, వారధిగానూ పనిచేస్తాడు. మంత్రిమండలి సమావేశాలలో తీసుకున్న నిర్ణయాలను గవర్నర్కు తెలియజేయవలసిన బాధ్యత ముఖ్యమంత్రికి ఉంటుంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న పాలనా నిర్ణయాలు, చేపట్టిన శాసనప్రతిపాదనల గురించి గవర్నర్కు తెలియజేస్తాడు.

AP Inter 2nd Year Civics Study Material Chapter 6 రాష్ట్ర కార్యనిర్వాహక శాఖ

4) విధానసభ నాయకుడు: విధానసభలోని మెజార్టీ సభ్యుల విశ్వాసం, మద్దతులు ముఖ్యమంత్రికి ఉంటాయి. అందుచేత విధానసభకు నాయకుడుగా వ్యవహరిస్తాడు. సభా వ్యవహారాలను సజావుగా, సక్రమంగా నడుపుటకు సభాధ్యక్షునికి (Presiding Officer) పూర్తి సహకారాన్ని అందిస్తాడు.

5) రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి: ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం తరపున అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తాడు. ప్రభుత్వం ముఖ్య విధానాలు, నిర్ణయాలు, కార్యక్రమాలను అధికారికంగా ప్రకటిస్తాడు. కొన్ని సందర్భాలలో రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై ముఖ్యమంత్రి వివరణ ఇవ్వాలని, విస్పష్ట ప్రకటన చేయాలని విధానసభలో సభ్యులు పట్టుబట్టినప్పుడు ముఖ్యమంత్రి సభకు వచ్చి ఆమేరకు ప్రభుత్వ విధానం గురించి ప్రకటన చేస్తాడు.

6) అధికార పార్టీ నాయకుడు: రాష్ట్రంలో ముఖ్యమంత్రి అధికార పార్టీ నాయకుడిగా వ్యవహరిస్తాడు. తన పార్టీ ఏర్పాటు చేసిన సమావేశాలలో పాల్గొంటాడు. అధికార పార్టీ ఇచ్చిన ఎన్నికల హామీలను నెరవేర్చుటకు ప్రభుత్వం చేపట్టిన చర్యలు, అమలు చేస్తున్న కార్యక్రమాలను పార్టీ సభ్యులకు వివరిస్తాడు.

7) ప్రజల నాయకుడు: ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజల ఆలోచనలు, ఆశయాలు, ఆకాంక్షలను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు. అందుకొరకు తరచుగా వివిధ ప్రాంతాలలో పర్యటించి, ప్రజా సమూహాలను ఉద్దేశించి ప్రసంగిస్తాడు.. ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించి, వారి సమస్యలను, అభ్యర్థనలను ఓర్పుగా ఆలకిస్తాడు.

8) గవర్నర్కు ముఖ్య సలహాదారు: రాష్ట్ర గవర్నర్ విధి నిర్వహణలో ముఖ్య సలహాదారుడిగా వ్యవహరించాల్సిన రాజ్యాంగబద్ధమైన బాధ్యత ముఖ్యమంత్రికి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అన్ని అంశాలపై గవర్నర్కు ముఖ్యమంత్రి సలహాలు, సహాయం అందిస్తాడు.

9) కేంద్ర ప్రభుత్వంతో సుహృద్భావ సంబంధాలు కేంద్ర ప్రభుత్వంతో సుహృద్భావ సంబంధాలను కొనసాగించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వ వాస్తవ కార్యనిర్వాహక అధిపతిగా ముఖ్యమంత్రిపై ఉంటుంది. ప్రధానమంత్రి, అతని మంత్రివర్గ సభ్యులతో స్నేహపూర్వక సంబంధాలను పెంపొందించుకోవాలి. కేంద్ర మంత్రులతో సముచిత సంబంధాలను ఏర్పరచుకోవాలి.

10) ప్రతిపక్ష పార్టీతో సంబంధాలు: ముఖ్యమంత్రి ప్రతిపక్షాలకు చెందిన పార్టీ అధ్యక్షులు, సభా నాయకులు, శాసన సభ్యులతో మంచి సంబంధాలను కొనసాగించాలి. తరచుగా కలవడం, ఆరోగ్యకరమైన సంబంధాలు, ఉత్సాహంతో కూడిన స్నేహ పూర్వక దృక్పథం వంటి చర్యల ద్వారా ప్రతిపక్షాల నుంచి నిర్మాణాత్మక సహకారాన్ని పొందవచ్చు.

11) రాజ్యాంగ సంబంధ విధులు: భారత రాజ్యాంగం రాష్ట్రంలో వాస్తవ కార్య నిర్వాహణ అధికారాలన్నింటిని ముఖ్యమంత్రిపై ఉంచింది. ముఖ్యమంత్రి పదవి, స్థాయి రాజ్యాంగం నుంచి ఏర్పడతాయి. ముఖ్యమంత్రి తన అధికారాలను చెలాయించడంలోనూ, బాధ్యతలను నిర్వర్తించడంలోనూ రాజ్యాంగ సూత్రాలకు కట్టుబడి, రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలి.

ప్రశ్న 3.
రాష్ట్ర మంత్రిమండలి అధికారాలు – విధులను పేర్కొనండి.
జవాబు:
రాజ్యాంగంలోని 163(1)వ ప్రకరణ ప్రకారం ప్రతి రాష్ట్రంలో ఒక రాష్ట్ర మంత్రిమండలి ఉంటుంది. రాష్ట్ర గవర్నర్ రాష్ట్ర పాలన నడపడంలోనూ, అధికారాలను నిర్వహించడంలోనూ తగిన సలహాను ఇచ్చి, సహాయం అందించేందుకై ముఖ్యమంత్రి అధ్యక్షతన ఒక మంత్రిమండలి ఉండాలని పై ప్రకరణ నిర్దేశిస్తుంది.

నిర్మాణం: సాధారణంగా రాష్ట్ర మంత్రిమండలి అనేది మూడంచెల వ్యవస్థ. అందులో 1) కేబినెట్ హోదా మంత్రులు 2) స్టేట్ హోదా మంత్రులు 3) డిప్యూటీ మంత్రులు ఉంటారు. అరుదైన సందర్భాలలో కొన్ని రాష్ట్రాలలో పార్లమెంటరీ సెక్రటరీలను నియమిస్తారు. వీరు మంత్రిమండలిలో నాల్గవ శ్రేణిలో ఉంటారు.

1) కేబినెట్ మంత్రులు: రాష్ట్ర ప్రభుత్వంలోని హోం, ఆర్థిక, ప్రణాళిక, పరిశ్రమలు, గనులు భూగర్భ వనరులు వంటి ప్రధాన మంత్రిత్వశాఖకు అధిపతులుగా కేబినెట్ మంత్రులుంటారు. వీరు తమ మంత్రిత్వ శాఖలకు సంబంధించిన నిర్ణయాలను తీసుకొని అమలు చేయడంలో స్వతంత్రంగా వ్యవహరిస్తారు. కేబినెట్ సమావేశాలలో కేవలం వీరు మాత్రమే పాల్గొంటారు.

2) స్టేట్ హోదా మంత్రులు: కేబినెట్ మంత్రులతో పోల్చితే తక్కువ ప్రాధాన్యం గల శాఖలకు వీరు ఆధ్వర్యం వహిస్తారు. మంత్రిత్వ శాఖలకు వీరిని అనుసంధానం చేయవచ్చు లేదా స్వతంత్రంగా వ్యవహరించవచ్చు. వీరు నేరుగా ముఖ్యమంత్రికి జవాబుదారులుగా ఉంటారు. వీరిపై కేబినెట్ మంత్రుల అజమాయిషీ ఉండదు.

3) డిప్యూటీ మంత్రులు: డిప్యూటీ మంత్రులను కేబినెట్ మంత్రులకు అనుబంధంగా నియమిస్తారు. వీరు కేబినెట్ మంత్రులు తమకు అప్పగించిన విధులను మాత్రమే నిర్వహిస్తారు. మంత్రిత్వ శాఖకు సంబంధించిన శాసన, పరిపాలనా వ్యవహారాలలో కేబినెట్ మంత్రులకు వీరు సహాయపడతారు. అందుకే వీరిని సహాయ మంత్రులు అని కూడా పిలుస్తారు.

అర్హతలు: ఒక వ్యక్తి మంత్రిగా నియమించబడాలంటే ఈ క్రింది అర్హతలు కలిగి ఉండాలి.

  1. ఆ వ్యక్తి శాసన నిర్మాణ శాఖలోని ఏదో ఒక సభలో సభ్యుడై ఉండాలి. (ద్విసభా విధానం అయినట్లయితే)
  2. ఒకవేళ ఏ సభలోనూ సభ్యులు కానివారు మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన 6 నెలల వ్యవధిలోగా విధానసభ సభ్యులుగా ఎన్నిక కావలసి ఉంటుంది. లేకుంటే వారు మంత్రి పదవిని కోల్పోతారు.
  3. పార్లమెంటు నిర్దేశించే ఇతర అర్హతలను కలిగిఉండాలి.

నియామకం: రాజ్యాంగంలోని 164వ ప్రకరణ ప్రకారం మంత్రులందరినీ గవర్నర్ ముఖ్యమంత్రి సలహా మేరకు నియమిస్తాడు. విధాన సభలోని తన పార్టీకి (లేదా భాగస్వామ్య పార్టీలకు చెందిన కొందరు సభ్యులను ఎంపిక చేసుకొని వారి పేర్లను గవర్నరు నివేదించి, వారిని మంత్రులుగా నియమించాల్సిందిగా ముఖ్యమంత్రి గవర్నర్కు సిఫారసు చేస్తాడు. ముఖ్యమంత్రి సూచనల ప్రకారం గవర్నర్ మంత్రులను నియమించి వారికి శాఖలను కేటాయిస్తాడు.

AP Inter 2nd Year Civics Study Material Chapter 6 రాష్ట్ర కార్యనిర్వాహక శాఖ

పదవీ కాలం: గవర్నర్ మంత్రుల విధి నిర్వాహణ పట్ల సంతోషంగా ఉన్నంతకాలం మంత్రులు తమ పదవిలో కొనసాగగలరని రాజ్యాంగంలో 164(2)వ ప్రకరణ తెలియజేస్తుంది. 164(3)వ ప్రకరణ ప్రకారం మంత్రిమండలి విధానసభకు సమిష్టిగా బాధ్యత వహించాలి. కాబట్టి మంత్రులు ఈ క్రింద చూపిన నియమాలను అనుసరించి పదవిలో
కొనసాగుతారు. అవి:

  1. గవర్నర్ సంతోషంగా ఉన్నంతకాలం.
  2. విధానసభకు సమిష్టి బాధ్యతను నెరవేర్చుతూ ఆ సభ విశ్వాసాన్ని పొందినంతకాలం.

రాష్ట్ర మంత్రిమండలి అధికారాలు
విధులు:
1) విధానాల రూపకల్పన: ప్రజా ప్రగతికి, రాష్ట్ర అభివృద్ధికి అవసరం అయిన విధానాలను రాష్ట్ర మంత్రిమండలి రూపొందిస్తుంది. ఇది ఎంతో శ్రమతో కూడిన మేథోపరమైన విధి. మంత్రిమండలి సభ్యులు ముఖ్యంగా కేబినెట్ మంత్రులు ముఖ్యమంత్రి నాయకత్వాన తరచుగా సమావేశమై రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాల నిర్వహణ కోసం అన్ని అంశాలపై కూలంకషంగా చర్చిస్తారు.

2) చట్టాలను రూపొందించటం: రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన వివిధ అంశాలపై చట్టాలను రూపొందించే అధికారం, బాధ్యత రాష్ట్ర మంత్రిమండలిపై ఉంది. అందుకై చొరవ తీసుకొని ముసాయిదా బిల్లును రూపొందించి ఖరారు చేస్తుంది. మంత్రిమండలి ఆమోదం పొందిన తరువాత సంబంధిత మంత్రి ముసాయిదా బిల్లును విధానసభలో ప్రవేశపెట్టి, విధానసభ ఆమోదం పొందేటట్లు ప్రతి స్థాయిలో కృషి చేస్తాడు.

3) సుపరిపాలనను అందించడం: రాష్ట్ర మంత్రిమండలి రాష్ట్ర వాస్తవ కార్యనిర్వాహక అధిపతి. ప్రజలకు సుపరిపాలన అందించే బాధ్యతను మంత్రిమండలిపై ఉంచి ఓటు ద్వారా వారికి అధికారాన్ని అప్పగించారు. రాజ్యాంగ మూలసూత్రాలకు, ప్రజాస్వామ్య సిద్ధాంతాలకు అనుగుణంగా మంత్రిమండలి రాష్ట్ర పాలనను సాగించాలి.

4) ప్రభుత్వ కార్యక్రమాల సమన్వయం: వివిధ ప్రభుత్వ విభాగాల కార్యక్రమాలను, సమన్వయం చేసే అధికారం, బాధ్యత రాష్ట్ర మంత్రిమండలికి ఉంటుంది. మంత్రిత్వశాఖల మధ్య సమన్వయం లేకుండా రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన సంఘం కాజాలదు.

5) నియామక అధికారాలు: రాష్ట్ర ప్రభుత్వంలోని అన్ని ముఖ్యమైన ఉన్నత పదవుల నియామకంలో మంత్రిమండలి అత్యంత కీలక పాత్రను పోషిస్తుంది. ఉన్నతాధికారులందరినీ మంత్రిమండలి గవర్నర్ పేరుతో నియమిస్తుంది. ఈ విషయంలో ముఖ్యమంత్రి అభీష్టం చెల్లుబాటు అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, అడ్వకేట్ జనరల్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ముఖ్య కార్యదర్శులు, ఇతర కార్యదర్శులు, డిపార్ట్మెంట్ అధిపతులు మొదలగువారు మంత్రిమండలిచే నియమించబడతారు.

6) ఆర్థిక అధికారాలు – విధులు: రాష్ట్ర ఆర్థిక వనరులపై మంత్రిమండలి నియంత్రణ కలిగి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వ ద్రవ్య విధానాన్ని నిర్ణయించి అమలు చేస్తుంది. రాష్ట్ర మంత్రిమండలి ప్రభుత్వ రాబడి, వ్యయం, పెట్టుబడులు, ఆడిట్ వంటి అంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహించి, ఆయా అంశాలలో మెరుగైన ఫలితాల కోసం చర్యలను తీసుకుంటుంది.. రాష్ట్ర వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలను రూపొందించి విధానసభ పరిశీలన, ఆమోదాలకు సమర్పిస్తుంది.

7) ఇతర విధులు: రాష్ట్ర మంత్రిమండలి రాష్ట్ర సమగ్ర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని వ్యవసాయం, నీటి పారుదల, పరిశ్రమలు, రవాణా, విద్య, ప్రణాళికలు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజి వంటి రంగాలలో వ్యూహాలను ఖరారు చేసి అమలు చేస్తుంది. రాష్ట్ర శాసనసభ సమావేశాలు లేని సమయంలో గవర్నర్ పేరుతో అత్యవసర ఆజ్ఞలను (ఆరినెన్స్లను) జారీ చేస్తుంది.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
రాష్ట్ర గవర్నర్ ఏవైనా మూడు అధికారాలను వివరించండి.
జవాబు:
గవర్నర్ యొక్క అధికారాలు విధులు:
1) కార్యనిర్వాహణాధికారాలు – విధులు: రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాలను స్వయంగా సాగించడానికి అవసరమైన నియమ నిబంధనలను గవర్నర్ రూపొందిస్తాడు. అందులో భాగంగా రాష్ట్రప్రభుత్వ విధివిధానాలను సక్రమంగా నిర్వహించి అమలు చేయడానికి అనుకూలంగా రాష్ట్ర స్థాయిలో రాజ్యాంగ ఉన్నత పదవులలో కొన్నింటికి ప్రత్యక్షంగా నియామకాలు జరుపుతాడు. అందులో ముఖ్యమైనవి:

  1. గవర్నర్ ముఖ్యమంత్రిని నియమిస్తాడు. ముఖ్యమంత్రి సలహా మేరకు మంత్రులను నియమిస్తాడు.
  2. మంత్రులకు మంత్రిత్వ శాఖలను కేటాయించడం లేదా మంత్రివర్గ నిర్మాణంలో మార్పులు చేయడం, మంత్రుల శాఖలలో మార్పులు చేయడం వంటి విధులను నిర్వహిస్తాడు.
  3. ముఖ్యమంత్రి సూచనలపై మంత్రులను పదవుల నుండి తొలగిస్తాడు.
  4. రాష్ట్ర విశ్వ విద్యాలయాలకు ఉపకులపతులను నియమించడమే గాక కులపతిగా కూడా వ్యవహరిస్తాడు.
  5. రాష్ట్ర ముఖ్య కార్యదర్శి మరియు అడ్వకేట్ జనరల్ను నియమిస్తాడు.

AP Inter 2nd Year Civics Study Material Chapter 6 రాష్ట్ర కార్యనిర్వాహక శాఖ

2) శాసననిర్మాణ అధికారాలు విధులు: గవర్నర్ రాష్ట్ర శాసనసభలో సభ్యుడు కాదు. కాని అందులో ఒక అంతర్భాగంగా 168వ ప్రకరణ వర్ణిస్తుంది. ఆ స్థాయిలో శాసన నిర్మాణశాఖకు సంబంధించిన కొన్ని విధులను, అధికారాలను గవర్నర్ నిర్వహిస్తాడు.

  1. విధానసభ సాధారణ ఎన్నికల తరువాత మొదటి సమావేశాన్ని ఆవిష్కరిస్తాడు.
  2. విధానసభ మొదటి సమావేశానికి (బడ్జెట్ సమావేశం) ప్రారంభ ఉపన్యాసాన్ని చేస్తాడు.
  3. విధానసభకు సాధారణ ఎన్నికల అనంతరం ప్రోటెం స్పీకర్ను నియమించి, స్పీకర్ ఎన్నికకు మార్గం సుగమం చేస్తాడు.
  4. శాసన నిర్మాణశాఖలోని సభా సమావేశాలకు ఆదేశించడం లేదా వాయిదా వేసే అధికారం గవర్నర్కు కలదు.

3) న్యాయాధికారాలు – విధులు:

  1. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, న్యాయమూర్తుల నియామక ప్రక్రియలో రాష్ట్రపతి కోరినచో సలహా ఇస్తాడు.
  2. రాష్ట్ర అడ్వకేట్ జనరలున్ను నియమిస్తాడు.
  3. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించి జిల్లా జడ్జీల నియామకం, పోస్టింగులు, పదోన్నతులు వంటి విషయాలలో అధికారాలను చెలాయిస్తాడు.
  4. రాష్ట్ర హైకోర్టు (జిల్లా జడ్జీలను మినహాయించి) రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ సూచనలపై రాష్ట్రంలోని అధీన న్యాయస్థానాల (Sub-ordinate courts) లోని న్యాయ సిబ్బందిని నియమిస్తాడు.
  5. సంబంధిత రాష్ట్ర హైకోర్టు విధించిన శిక్షను తగ్గించడానికి, క్షమాభిక్ష పెట్టడానికి లేదా శిక్షను పూర్తిగా రద్దు చేయడానికి రాష్ట్ర గవర్నర్కు అధికారం ఉంటుంది.

ప్రశ్న 2.
రాష్ట్రపతి – గవర్నర్ పదవుల మధ్యగల వ్యత్యాసాలు ఏవి ?
జవాబు:
రాష్ట్రపతి – గవర్నర్ మధ్య గల వ్యత్యాసాలు:

రాష్ట్రపతి

  1. రాష్ట్రపతి ఎన్నుకోబడే వ్యక్తి.
  2. రాష్ట్రపతి పదవీకాలం సాధారణంగా 5 సం॥లు ఉంటుంది.
  3. రాష్ట్రపతి పదవి నుంచి తొలగించడానికి క్లిష్టమైన మహాభిశంసన తీర్మానం అవసరం.
  4. రాష్ట్రపతికి వివేచనాధికారాలు లేవు.
  5. రాష్ట్రపతికి సైనిక మరియు దౌత్య సంబంధమైన అధికారాలు ఉంటాయి.
  6. రాష్ట్రపతి క్షమాభిక్ష అధికారం పరిపూర్ణమైనది. మరణశిక్షను కానీ, సైనిక కోర్టులు విధించే శిక్షలను గానీ రద్దుచేసి క్షమించే అధికారం అతడికి ఉంది.
  7. రాష్ట్రపతికి మూడు రకాల అత్యవసర పరిస్థితులు ఉంటాయి.
  8. యూనియన్ పబ్లిక్ కమీషన్ ఛైర్మన్, ఇతర సభ్యులను రాజ్యాంగం నిర్దేశించిన కారణాల ప్రకారం తొలగించే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది.
  9. ఏ బిల్లునూ మరే ఇతర అధికారుల పరిశీలన కోసం రాష్ట్రపతి నిలుపుదల చేయవలసిన అవసరం లేదు.

గవర్నర్

  1. గవర్నర్ నియమింపబడే వ్యక్తి.
  2. గవర్నర్కు పదవీ కాల భద్రత లేదు. రాష్ట్రపతి సంతృప్తిపైన అతడి పదవీకాలం ఆధారపడి ఉంటుంది.
  3. గవర్నర్ను సులభంగా తొలగించవచ్చు.
  4. గవర్నర్కు వివేచనాధికారాలు ఉంటాయి.
  5. గవర్నర్కు సైనిక మరియు దౌత్య సంబంధమైన అధికారాలు ఉండవు.
  6. గవర్నర్ క్షమాభిక్ష అధికారాలు పరిమితమైనవి. మరణశిక్షను, సైనిక కోర్టులు విధించిన శిక్షను రద్దుచేసే అధికారం అతడికి లేదు.
  7. గవర్నర్కు ఎటువంటి అత్యవసర అధికారాలు ఉంటాయి.
  8. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ ఛైర్మన్, సభ్యులను తొలగించే అధికారం గవర్నర్కు లేదు.
  9. కొన్ని బిల్లులను, కొన్ని సమయాలలో రాష్ట్రపతి అనుమతి కోసం నిలుపుదల చేసే అధికారం గవర్నర్కు ఉన్నది.

ప్రశ్న 3.
రాష్ట్ర ప్రభుత్వంలో గవర్నర్ స్థానం, ప్రాముఖ్యతను పేర్కొనండి.
జవాబు:
రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాలలో గవర్నర్ స్థానం ఎంతో కీలకమైంది. గవర్నర్ ఒకవైపు తనను నియమించిన రాష్ట్రపతికి బాధ్యత వహిస్తూ, వేరొకవైపు ముఖ్యమంత్రి ఆధ్వర్యంలోని రాష్ట్ర మంత్రిమండలి సూచనల ప్రకారం తన అధికారాలను నిర్వహిస్తాడు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాస్తవ కార్యనిర్వాహక అధిపతులతో అతడు సుహృద్భావ సంబంధాలను కలిగి ఉంటాడు. అలాగే అతడు రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రభుత్వంలోని రాజకీయ, పరిపాలక అధిపతులు కృషి చేసేటట్లు చూస్తాడు. రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాలు రాజ్యాంగబద్ధంగా కొనసాగేటట్లు చూడవలసిన బాధ్యత కూడా గవర్నర్దే. రాజకీయ, పాలనాపరమైన ఒత్తిళ్ళకు లొంగి ఉండక, రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య సూత్రాలను రాష్ట్ర ప్రభుత్వ మంత్రులు, అధికార సిబ్బంది పాటించేటట్లు చూస్తాడు. క్రియాశీలక రాజకీయాలలో ఆసక్తి చూపించకుండా విస్తృత రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణకు కృషిచేస్తాడు. అందువల్ల గవర్నర్ గా నియమితులయ్యే వ్యక్తులకు సునిశిత బుద్ధి, లౌకిక దృక్పథం, మానవతా విలువలు, జాతీయ సమైక్యతా స్ఫూర్తి వంటి లక్షణాలు ఉండాలి. అధికార, ప్రతిపక్ష పార్టీల పట్ల సమదృక్పథం చూపించాలి. తన అధికార పరిమితులను, రాజ్యాంగ సంప్రదాయాలను గుర్తించి ప్రవర్తిస్తూ ప్రజల మన్ననలను పొందాలి.

AP Inter 2nd Year Civics Study Material Chapter 6 రాష్ట్ర కార్యనిర్వాహక శాఖ

సంకీర్ణ మంత్రివర్గాలు ఏర్పాటవుతున్న ప్రస్తుత తరుణంలో గవర్నర్లస్థానం, వారు నిర్వహించే అధికారాలు, విధులు ఆ పదవిలో ఉన్న వ్యక్తి తీరుకు పరీక్షగా పేర్కొనవచ్చు. నిష్కళంక ప్రవర్తన, నిష్పాక్షికత, రాజ్యాంగ సూత్రాల పట్ల నిబద్ధత, పారదర్శకత వంటి లక్షణాలను గవర్నర్లు కలిగి ఉండాలనీ, సామాన్య ప్రజలు, ముఖ్యంగా బలహీన వర్గాలు, మైనారిటీలకు చెందిన ప్రయోజనాలను పరిరక్షించడానికి వారు కృషి చేయవలసి ఉంటుందనీ పదకొండో రాష్ట్రపతి ఎ.పి.జె. అబ్దుల్ కలాం ఒక సందర్భంలో ఉద్భోదించారు.

2010 మే7న బి.పి. సింఘాల్ వర్సస్ యూనియన్ గవర్నమెంట్ వివాదంలో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం గవర్నర్ స్థానం గురించి చారిత్రాత్మక తీర్పునిచ్చింది. ఆ తీర్పులో గవర్నర్ అంకితభావంతో రాజ్యాంగబద్ధులై పనిచేయాలి. | ఏదైనా రాజకీయ పార్టీకి కాకుండా రాజ్యాంగానికి రక్షకుడిగా ఉండాలి. గవర్నర్ కేంద్రప్రభుత్వ ఏజెంట్ లేదా ఉద్యోగి కాదని పేర్కొంది. గవర్నర్ను చాలా అరుదైన, ప్రత్యేకమైన సందర్భాలలో కేంద్రం తొలగించవలసి ఉంటుందని ఉద్భోదించింది. సర్కారియా కమీషన్ కూడా 1947-1986 మధ్య 154 మంది గవర్నర్ల పదవీ కాలాలను పరిశీలించి వాటిలో 104 మంది పదవీకాలం అసంపూర్తిగా ముగిశాయని పేర్కొంది. 2004లో ఐక్య ప్రగతి కూటమి ప్రభుత్వం ఉత్తరప్రదేశ్, హర్యానా, గుజరాత్, గోవాలో గవర్నర్లను తొలగించడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. గతంలో గవర్నర్లుగా వ్యవహరించిన వారిలో సరోజినీనాయుడు (ఉత్తరప్రదేశ్), పద్మజానాయుడు (పశ్చిమబెంగాల్), విజయలక్ష్మి పండిట్ (మహారాష్ట్ర), శంకర్ దయాళ్ శర్మ, కృష్ణకాంత్ వంటి వారు తరువాత ఉపరాష్ట్రపతులుగానూ వ్యవహరించారు.

ప్రశ్న 4.
ముఖ్యమంత్రి అధికారాలు – విధులలో ఏవైనా మూడింటిని తెలపండి. [Mar. ’16]
జవాబు:
ముఖ్యమంత్రి తన అధికారాలను, విధులను నిర్వర్తించుటలో ఎంతో అధికార బాధ్యతతో వ్యవహరిస్తారు. అతడి అధికార బాధ్యతలను ఈ క్రింది శీర్షికల ద్వారా వివరించవచ్చు.
1) మంత్రిమండలి ఏర్పాటు: తన అభీష్టం మేరకు మంత్రిమండలిని ఏర్పాటు చేయడం ముఖ్యమంత్రి మొదటి ప్రధానవిధి. సాధారణంగా మంత్రివర్గ సభ్యుల ఎంపిక, నియామకాలలో ముఖ్యమంత్రికి పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. తన పార్టీలో లేదా సంకీర్ణ ప్రభుత్వమైతే భాగస్వామ్య పార్టీలలోని కొందరు సభ్యులను ఎంపిక చేసుకొని వారి పేర్లను గవర్నర్కు సిఫారసు చేసి మంత్రులుగా వారు నియమితులయ్యేటట్లు చూస్తాడు. వారికి మంత్రిత్వశాఖల కేటాయింపులో గవర్నరుకు సలహాలిస్తాడు. మంత్రిమండలి పరిమాణం కూడా ముఖ్యమంత్రి ఆలోచనల మేరకు ఉంటుంది.

2) మంత్రిమండలి నాయకుడు: ముఖ్యమంత్రి రాష్ట్ర మంత్రిమండలి నాయకుడు. ఆ హోదాలో అత్యున్నత, అసామాన్యమైన అధికార స్థానాన్ని ముఖ్యమంత్రి అలంకరిస్తాడు. అతడు రాష్ట్ర కేబినేట్ ఛైర్మన్ గా ఉంటూ, కాబినేట్ సమావేశ చర్చనీయాంశాలు (అజెండా), ప్రదేశం, సమయాలను నిర్ణయిస్తాడు. కేబినేట్ సమావేశాలకు అధ్యక్షత వహించి, అందులో చర్చలు సజావుగా, అర్థవంతంగా జరిగేందుకు మార్గనిర్ధేశం చేస్తాడు. మంత్రిమండలి విధానాలను ప్రభావితం చేస్తాడు. ఏదైనా అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనపుడు ముఖ్యమంత్రి చొరవ చూపి తగు సలహాలు, సూచనల ద్వారా ఏకాభిప్రాయ సాధన దిశ వైపు మంత్రిమండలిని నడిపిస్తాడు.

3) గవర్నర్ – మంత్రిమండలి మధ్య వారధి: ముఖ్యమంత్రి, గవర్నర్ – మంత్రిమండలికి మధ్య ప్రధాన సమాచార మార్గంగానూ, వారధిగా పనిచేస్తాడు. మంత్రిమండలి సమావేశాలలో తీసుకున్న నిర్ణయాలను గవర్నర్కు తెలియజేయవలసిన బాధ్యత ముఖ్యమంత్రికి ఉంటుంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న పాలనా నిర్ణయాలు, చేపట్టిన శాసన ప్రతిపాదనల గురించి గవర్నర్కు తెలియజేస్తాడు. మంత్రుల చర్యలకు సంబంధించిన సమాచారం కావాలని గవర్నర్ కోరితే సంబంధిత సమాచారాన్ని గవర్నరుకు పంపుతాడు. ముఖ్యమంత్రి ముందు అనుమతిలేనిదే మంత్రులు ఎవ్వరూ గవర్నర్ను కలిసి సంప్రదించకూడదు.

ప్రశ్న 5.
రాష్ట్ర మంత్రిమండలి నిర్మాణం గురించి తెలపండి.
జవాబు:
సాధారణంగా రాష్ట్ర మంత్రిమండలి అనేది మూడంచెల వ్యవస్థ. అందులో 1) కేబినెట్ హోదా మంత్రులు 2) స్టేట్ హోదా మంత్రులు 3) డిప్యూటీ మంత్రులు ఉంటారు. అరుదైన సందర్భాలలో కొన్ని రాష్ట్రాలలో పార్లమెంటరీ సెక్రటరీలను నియమిస్తాడు. వీరు మంత్రిమండలిలో నాల్గవ శ్రేణిలో ఉంటారు.

1) కేబినెట్ హోదా మంత్రులు: రాష్ట్ర ప్రభుత్వంలోని హోం, ఆర్థిక, ప్రణాళిక, పరిశ్రమలు, గనులు – భూగర్భ వనరులు వంటి ప్రధాన మంత్రిత్వశాఖలకు అధిపతులుగా కేబినెట్ మంత్రులుంటారు. వీరు తమ మంత్రిత్వ శాఖలకు సంబంధించిన నిర్ణయాలను తీసుకొని అమలు చేయడంలో స్వతంత్రంగా వ్యవహరిస్తారు.

AP Inter 2nd Year Civics Study Material Chapter 6 రాష్ట్ర కార్యనిర్వాహక శాఖ

2) స్టేట్ హోదా మంత్రులు: కేబినెట్ మంత్రులతో పోల్చితే తక్కువ ప్రాధాన్యం గల శాఖలకు వీరు ఆధ్వర్యం వహిస్తారు. మంత్రిత్వ శాఖలకు వీరిని అనుసంధానం చేయవచ్చు లేదా స్వతంత్రంగా వ్యవహరించవచ్చు. వీరు నేరుగా ముఖ్యమంత్రికి జవాబుదారులుగా ఉంటారు. వీరిపై కేబినెట్ మంత్రుల అజమాయిషీ ఉండదు.

3) డిప్యూటీ మంత్రులు: డిప్యూటీ మంత్రులను కేబినెట్ మంత్రులకు అనుబంధంగా నియమిస్తారు. వీరు కేబినెట్ మంత్రులు తమకు అప్పగించిన విధులను మాత్రమే నిర్వహిస్తారు. మంత్రిత్వ శాఖకు సంబంధించిన శాసన, పరిపాలనా వ్యవహారాలలో కేబినెట్ మంత్రులకు వీరు సహాయపడతారు. అందుకే వీరిని సహాయ మంత్రులు అని కూడా పిలుస్తారు.

AP Inter 2nd Year Civics Study Material Chapter 5 కేంద్ర న్యాయశాఖ

Andhra Pradesh BIEAP AP Inter 2nd Year Civics Study Material 5th Lesson కేంద్ర న్యాయశాఖ Textbook Questions and Answers.

AP Inter 2nd Year Civics Study Material 5th Lesson కేంద్ర న్యాయశాఖ

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
భారత సుప్రీంకోర్టు పై ఒక వ్యాసాన్ని రాయండి.
జవాబు:
భారతదేశంలో సుప్రీంకోర్టు సర్వోన్నత న్యాయస్థానం. మన పరిపాలనలో సుప్రీంకోర్టు ఎంతో ప్రాధాన్యత కలిగి ఉంది. ప్రజల ధన, మాన, ప్రాణ రక్షణచేసి, వారికి న్యాయం చేయడం దీని కర్తవ్యం. ప్రజల హక్కులు కాపాడటం, భారత సమాఖ్య వ్యవస్థను రక్షించడం, రాజ్యాంగాన్ని రక్షించి, శాసనాలను వ్యాఖ్యానించడం వంటి అత్యంత ముఖ్యమైన బాధ్యతలను సుప్రీంకోర్టు నెరవేరుస్తుంది. “ప్రపంచంలోని ఏ దేశపు సుప్రీంకోర్టుకు లేని అధికారాలు భారత సుప్రీంకోర్డుకు ఉన్నాయి” అని ప్రముఖ న్యాయవాది, రాజ్యాంగ నిర్మాణ సభ్యుడు శ్రీ అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ అభిప్రాయం. సుప్రీంకోర్టును 1950 జనవరి 26న దేశ రాజధాని కొత్తఢిల్లీలో నెలకొల్పడం జరిగింది.

నిర్మాణం: ప్రస్తుతం సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి గాక, 30 మంది ఇతర న్యామూర్తులు ఉన్నారు. అర్హతలు: సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించబడే వ్యక్తికి ఈ క్రింది అర్హతలు ఉండాలి.

  1. భారతీయ పౌరుడై ఉండాలి.
  2. ఏదైనా ఒకటి లేదా అంతకుమించిన హైకోర్టులలో నిరంతరాయంగా కనీసం అయిదేళ్ళపాటు న్యాయమూర్తిగా పనిచేసి ఉండాలి.
  3. ఏదైనా ఒకటి లేదా అంతకంటే ఎక్కువ హైకోర్టులలో నిరంతరాయంగా కనీసం పదేళ్ళపాటు న్యాయవాదిగా వ్యవహరించి ఉండాలి.
  4. రాష్ట్రపతి అభిప్రాయంలో న్యాయకోవిదుడై ఉండాలి.

నియామకం: ప్రధాన న్యాయమూర్తిని, ఇతర న్యాయమూర్తులను భారతరాష్ట్రపతి నియమిస్తారు.

AP Inter 2nd Year Civics Study Material Chapter 5 కేంద్ర న్యాయశాఖ

జీత, భత్యములు: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి నెలకు రూ.1,00,000/-, ఇతర న్యాయమూర్తులకు ఒక్కొక్కరికి రూ. 90,000/- వేతనంగా లభిస్తుంది.
వేతనంతోపాటు వారికి ఉచిత నివాసగృహం, కార్యాలయం, టెలిఫోన్ సదుపాయాలు మొదలగునవి కల్పిస్తారు. వారి వేతనాన్ని భారత సంఘటిత నిధి నుండి చెల్లిస్తారు. దానిపై పార్లమెంట్కు అదుపు లేదు.

ప్రమాణ స్వీకారం: న్యాయమూర్తులు తాము నిష్పక్షపాతంగా, నిర్భయంగా, అవినీతికి లోనుగాకుండా, విధి నిర్వహణ చేస్తామని, రాజ్యాంగాన్ని కాపాడతామని రాష్ట్రపతి సమక్షంలో ప్రమాణస్వీకారం చేస్తారు.

పదవీకాలం: న్యాయమూర్తులు 65 సం॥ల వయస్సు వచ్చేవరకు పదవిలో ఉంటారు. పదవీ విరమణ తరువాత వారు ఆదాయాన్నిచ్చే ప్రభుత్వోద్యోగం చేయరాదు.
అభిశంసన: సుప్రీంకోర్టు న్యాయమూర్తులను పార్లమెంట్ అభిశంసన ద్వారా రాష్ట్రపతి పదవి నుండి తొలగిస్తారు. అవినీతి, దుష్ప్రవర్తన, అసమర్థత, అధికార దుర్వినియోగం వంటి ఆరోపణలుంటే, పార్లమెంట్ ఉభయసభలు వేర్వేరుగా మొత్తం సభ్యులలో సగం మంది కంటే ఎక్కువమంది హాజరై, ఓటు చేసిన వారందరిలో 2/3 వంతు మెజారిటీతో తీర్మానం ఆమోదిస్తే న్యాయమూర్తులను తొలగించవచ్చు.

అధికారాలు: సుప్రీంకోర్టుకు ఈ దిగువ అధికారాలున్నాయి.
1. సహజ అధికారాలు లేదా ప్రారంభ విచారణాధికార పరిధి (Original Jurisdiction): వివాదాలను ముందుగా విని, నిర్ణయించే అధికారాన్ని ప్రారంభ అధికార పరిధి అంటారు. ఈ అధికారం ప్రకారం కొన్ని రకాల వివాదాలను క్రింది కోర్టులకు తీసుకెళ్ళకుండా నేరుగా సుప్రీంకోర్టు నిర్ణయానికి తీసుకెళ్ళవచ్చు. ఈ క్రింది పేర్కొన్న వివాదాలు సుప్రీంకోర్టు ప్రారంభ అధికార పరిధిలోకి వస్తాయి. అవి:

  1. కేంద్ర ప్రభుత్వం ఒకటి లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఏర్పడే వివాదాలు.
  2. కేంద్రప్రభుత్వం, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఒకవైపు, వేరొక వైపు మరికొన్ని రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఏర్పడే వివాదాలు,
  3. రెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల మధ్య ఏర్పడే వివాదాలు.
  4. సుప్రీంకోర్టు భారత సమాఖ్యను రక్షిస్తుంది.
  5. శాసనాలను వ్యాఖ్యానిస్తుంది.
  6. ప్రాథమిక హక్కుల రక్షణ కొరకై హెబియస్ కార్పస్, మాండమస్, కోవారెంటో వంటి రిట్లను జారీచేస్తుంది.

2) అప్పీళ్ళ విచారణాధికారం (Appelate Power) భారతదేశంలో సుప్రీంకోర్టు అత్యున్నతమైనది. హైకోర్టులిచ్చిన తీర్పులపై సుప్రీంకోర్టుకు కేసును పునర్విచారణ చేయమని అప్పీలు చేసుకోవచ్చు. అప్పీళ్ళు నాలుగు రకాలుగా ఉంటాయి. అవి:

  1. రాజ్యాంగ సంబంధమైన అప్పీళ్ళు
  2. సివిల్ అప్పీళ్ళు
  3. క్రిమినల్ అప్పీళ్ళు
  4. స్పెషల్ అప్పీళ్ళు.

3) సలహారూపక అధికార పరిధి (Advisory Function): రాష్ట్రపతి ఏదైనా విషయంలో న్యాయసంబంధమైన వివాదముందని భావించినప్పుడు సుప్రీంకోర్టు సలహాను కోరవచ్చు. అటువంటి సందర్భాలలో రాష్ట్రపతికి సుప్రీంకోర్టు సలహాను ఇచ్చును. ఆ సలహా రాష్ట్రపతి పాటించాలనే నియమం లేదు. 1978లో రాష్ట్రపతి శ్రీ నీలం సంజీవరెడ్డి, 1975లో ప్రవేశపెట్టిన అత్యవసర పరిస్థితిలో జరిగిన అధికార దుర్వినియోగంపై విచారణ జరపడానికి ప్రత్యేక న్యాయస్థానాల ఏర్పాటుపై సుప్రీంకోర్టును సలహా అడగటం జరిగెను.

4) కోర్ట్ ఆఫ్ రికార్డు (Court of Record): అనేక వివాదాలలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను, వాటికి సంబంధించిన రికార్డులను భద్రపరచడం జరుగుతుంది. అవి ఇతర కోర్టులకు, న్యాయవాదులకు మార్గదర్శకాలుగా ఉపకరిస్తాయి.

5) న్యాయ సమీక్షాధికారం (Judicial Review): భారత సుప్రీంకోర్టుకు న్యాయ సమీక్షాధికారం కలదు. రాజ్యాంగాన్ని రక్షించడం కోసం, చట్టాలకు అర్థవివరణ ఇస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన శాసనాలు రాజ్యాంగ విరుద్ధంగా ఉంటే చెల్లనేరవని కొట్టివేసే అధికారం సుప్రీంకోర్టుకు కలదు. దీనిని న్యాయ సమీక్ష అంటారు.

AP Inter 2nd Year Civics Study Material Chapter 5 కేంద్ర న్యాయశాఖ

6) తీర్పుల పునఃపరిశీలన (Reconsideration of Judgement): సుప్రీంకోర్టుకు గతంలో తాను ప్రకటించిన తీర్పులను పునఃపరిశీలించి, వాటిని ఆమోదించడానికి, తిరస్కరించడానికి అధికారం ఉంది. ఉదా: గోలక్నాథ్ – పంజాబ్ రాష్ట్రానికి మధ్య తలెత్తిన వివాదం విషయంలో సుప్రీంకోర్టు 1967లో తీర్పు చెబుతూ. భారత పౌరుల ప్రాథమిక హక్కులతో సహా ఏ రాజ్యాంగపరమైన అంశాన్నైనా సవరించేందుకు పార్లమెంటుకు అధికారం లేదని పేర్కొన్నది.

7) ఇతర అధికారాలు (Other Powers):

  1. సుప్రీంకోర్టు పనిచేయటానికి కావలసిన నియమావళి న్యాయమూర్తులే నిర్ణయిస్తారు.
  2. కోర్టు సిబ్బందిని నియమిస్తారు, సిబ్బందిని అదుపు చేస్తారు.
  3. కోర్టు ధిక్కరణ నేరం క్రింద ఏ వ్యక్తినైననూ శిక్షించవచ్చు.

సుప్రీంకోర్టు స్వతంత్ర ప్రతిపత్తి: సుప్రీంకోర్టు స్వతంత్రంగా వ్యవహరించటానికి కావలసిన అనుకూల పరిస్థితులు ఉన్నాయి. న్యాయమూర్తులకు ఉద్యోగ భద్రత, కార్యనిర్వాహకశాఖ నుండి న్యాయశాఖ వేరుచేయబడటం, న్యాయశాస్త్ర ప్రవీణులు న్యాయమూర్తులుగా నియమింపబడటం, వారికి మంచి వేతనాలుండటం వంటి పరిస్థితులున్నాయి. అయినా భారత సుప్రీంకోర్టు, అమెరికా సుప్రీంకోర్టు అంత శక్తివంతమైనది కాదని ఒక అభిప్రాయం కలదు.

ప్రశ్న 2.
భారత సుప్రీంకోర్టు అధికారాలు, విధులను రాయండి.
జవాబు:
భారతదేశంలో సుప్రీంకోర్టు సర్వోన్నత న్యాయస్థానం. మన పరిపాలనలో సుప్రీంకోర్టు ఎంతో ప్రాధాన్యత కలిగి ఉంది. ప్రజల ధన, మాన, ప్రాణ రక్షణచేసి, వారికి న్యాయం చేయడం దీని కర్తవ్యం. ప్రజల హక్కులు కాపాడటం, భారత సమాఖ్య వ్యవస్థను రక్షించడం, రాజ్యాంగాన్ని రక్షించి, శాసనాలను వ్యాఖ్యానించడం వంటి అత్యంత ముఖ్యమైన
బాధ్యతలను సుప్రీంకోర్టు నెరవేరుస్తుంది. “ప్రపంచంలోని ఏ దేశపు సుప్రీంకోర్టుకు లేని అధికారాలు భారత సుప్రీంకోర్టుకు “ఉన్నాయి” అని ప్రముఖ న్యాయవాది, రాజ్యాంగ నిర్మాణ సభ్యుడు శ్రీ అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ అభిప్రాయం. సుప్రీంకోర్టు దేశ రాజధాని ఢిల్లీలో కలదు.

నిర్మాణం: ప్రస్తుతం సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తిగాక, 30 మంది న్యాయమూర్తులు ఉన్నారు. అధికారాలు: సుప్రీంకోర్టుకు ఈ దిగువ అధికారాలున్నాయి.
1) సహజ అధికారాలు లేదా ప్రారంభ విచారణాధికార పరిధి (Original Jurisdiction): వివాదాలను ముందుగా విని, నిర్ణయించే అధికారాన్ని ప్రారంభ అధికార పరిధి అంటారు. ఈ అధికారం ప్రకారం కొన్ని రకాల వివాదాలను క్రింది కోర్టులకు తీసుకెళ్ళకుండా నేరుగా సుప్రీంకోర్టు నిర్ణయానికి తీసుకెళ్ళవచ్చు. ఈ క్రింది పేర్కొన్న వివాదాలు సుప్రీంకోర్టు ప్రారంభ అధికార పరిధిలోకి వస్తాయి. అవి.

  1. కేంద్ర ప్రభుత్వం ఒకటి లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఏర్పడే వివాదాలు.
  2. కేంద్ర ప్రభుత్వం, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఒక వైపు, వేరొక వైపు మరికొన్ని రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఏర్పడే వివాదాలు,
  3. రెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల మధ్య ఏర్పడే వివాదాలు.
  4. సుప్రీంకోర్టు భారత సమాఖ్యను రక్షిస్తుంది.
  5. శాసనాలను వ్యాఖ్యానిస్తుంది.
  6. ప్రాథమిక హక్కుల రక్షణకై హెబియన్ కార్పస్, మాండమస్, కోవారెంటో వంటి రిట్లను జారీ చేస్తుంది.

2) అప్పీళ్ళ విచారణాధికారం (Appelate Power): భారతదేశంలో సుప్రీంకోర్టు అత్యున్నతమైనది. హైకోర్టులిచ్చిన తీర్పులపై సుప్రీంకోర్టుకు కేసును పునర్విచారణ చేయమని అప్పీలు చేసుకోవచ్చు. అప్పీళ్ళు నాలుగు రకాలుగా ఉంటాయి. అవి:

  1. రాజ్యాంగ సంబంధమైన అప్పీళ్ళు
  2. సివిల్ అప్పీళ్ళు
  3. క్రిమినల్ అప్పీళ్ళు
  4. స్పెషల్ అప్పీళ్ళు.

AP Inter 2nd Year Civics Study Material Chapter 5 కేంద్ర న్యాయశాఖ

3) సలహారూపక అధికార పరిధి (Advisory Function): రాష్ట్రపతి ఏదైనా విషయంలో న్యాయసంబంధమైన వివాదముందని భావించినప్పుడు సుప్రీంకోర్టు సలహాను కోరవచ్చు. అటువంటి సందర్భాలలో రాష్ట్రపతికి సుప్రీంకోర్టు సలహాను ఇచ్చును. ఆ సలహా రాష్ట్రపతి పాటించాలనే నియమం లేదు. 1978లో రాష్ట్రపతి శ్రీ నీలం సంజీవరెడ్డి, 1975లో ప్రవేశపెట్టిన అత్యవసర పరిస్థితిలో జరిగిన అధికార దుర్వినియోగంపై విచారణ జరపడానికి ప్రత్యేక న్యాయస్థానాల ఏర్పాటుపై సుప్రీంకోర్టును సలహా అడగటం జరిగెను.

4) కోర్ట్ ఆఫ్ రికార్డు (Court of Record): అనేక వివాదాలలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను, వాటికి సంబంధించిన రికార్డులను భద్రపరచడం జరుగుతుంది. అవి ఇతర కోర్టులకు, న్యాయవాదులకు మార్గదర్శకాలుగా ఉపకరిస్తాయి.

5) న్యాయ సమీక్షాధికారం (Judicial Review) భారత సుప్రీంకోర్టుకు న్యాయ సమీక్షాధికారం కలదు. రాజ్యాంగాన్ని రక్షించడం కోసం, చట్టాలకు అర్థవివరణ ఇస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన శాసనాలు రాజ్యాంగ విరుద్ధంగా ఉంటే చెల్లనేరవని కొట్టివేసే అధికారం సుప్రీంకోర్టుకు కలదు. దీనిని న్యాయ సమీక్ష అంటారు.

6) తీర్పుల పునఃపరిశీలన (Reconsideration of Judgement): సుప్రీంకోర్టుకు గతంలో తాను ప్రకటించిన తీర్పులను పునఃపరిశీలించి, వాటిని ఆమోదించడానికి, తిరస్కరించడానికి అధికారం ఉంది. ఉదా: గోలక్నాథ్- పంజాబ్ రాష్ట్రానికి మధ్య తలెత్తిన వివాదం విషయంలో సుప్రీంకోర్టు 1967లో తీర్పు చెబుతూ, భారత పౌరుల ప్రాథమిక హక్కులతో సహా ఏ రాజ్యాంగపరమైన అంశాన్నైనా సవరించేందుకు పార్లమెంటుకు అధికారం లేదని పేర్కొన్నది.

7) ఇతర అధికారాలు (Other Powers):

  1. సుప్రీంకోర్టు పనిచేయటానికి కావలసిన నియమావళి న్యాయమూర్తులే నిర్ణయిస్తారు.
  2. కోర్టు సిబ్బందిని నియమిస్తారు, సిబ్బందిని అదుపు చేస్తారు.
  3. కోర్టు ధిక్కరణ నేరం క్రింద ఏ వ్యక్తినైననూ శిక్షించవచ్చు.
  4. రాజ్యాంగ సూత్రాల అంతిమ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తుంది.
  5. దేశంలోని న్యాయస్థానాలలో రికార్డుల నిర్వహణ, న్యాయవాదుల ప్రాక్టీస్కు సంబంధించిన నియమాలను రూపొందిస్తుంది.
  6. కొన్ని ప్రత్యేక పరిస్థితులలో భారత రాష్ట్రపతి పదవికి ఖాళీ ఏర్పడితే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరిస్తారు.

ప్రశ్న 3.
న్యాయ సమీక్షను వర్ణించండి.
జవాబు:
సుప్రీంకోర్టు అధికారాలన్నింటిలో న్యాయ సమీక్ష అత్యంత ముఖ్యమైనది. రాజ్యాంగ ఔన్నత్యాన్ని నిలబెట్టడమే న్యాయసమీక్ష ఉద్దేశ్యం. రాజ్యాంగంలో న్యాయసమీక్ష గురించి ఎక్కడా స్పష్టంగా పేర్కొనలేదు. భారత రాజ్యాంగ లిఖిత స్వభావాన్ని, భారతదేశ సమాఖ్య లక్షణాలను దృష్టిలో ఉంచుకొని అమెరికా రాజ్యాంగం నుండి ఈ న్యాయ సమీక్ష భావనను గ్రహించారు. శాసన నిర్మాణ శాఖ రూపొందించిన శాసనాలు, కార్యనిర్యాహక వర్గం చేపట్టిన చర్యలు రాజ్యాంగ బద్దంగా ఉన్నాయా ? లేదా ? అని సమీక్షించడానికి న్యాయస్థానాలకు గల అధికారాన్ని ‘న్యాయసమీక్ష’ అంటారు. ఒక వేళ శాసన సభ చట్టాలు, కార్యనిర్వహక వర్గం నిర్ణయాలు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉంటే వాటిని లోపభూయిష్టం, చెల్లుబాటుకావు. అని ప్రకటించవచ్చు. “శాసన నిర్మాణ. చట్టంలోని రాజ్యాంగ భద్రతను పరిశీలించి, నిర్ణయించి, ప్రకటించే సామర్థ్యాన్ని న్యాయస్థానానికి వుండటాన్ని న్యాయ సమీక్షగా ఎమ్.వి. పైలీ పేర్కొన్నాడు.

ప్రాథమిక హక్కులకు భంగం కలిగించే శాసనాలు లోపభూయిష్టమైనవి 13వ ప్రకరణం తెలియజేస్తుంది. కాబట్టి పౌరుల ప్రాథమిక హక్కుల సంరక్షకునిగా ప్రాథమిక హక్కులకు భంగం కలిగించే చట్టాలను, నిర్ణయాలను రాజ్యాంగ విరుద్ధమైనవనీ, అవి చెల్లవని సుప్రీంకోర్టు ప్రకటిస్తుంది. అంతేకాక కేంద్ర, రాష్ట్ర సంబంధాల విషయంలో కూడా సుప్రీం కోర్టు న్యాయసమీక్ష అధికారాన్ని వినియోగిస్తుంది. కేంద్ర రాష్ట్రాల మధ్య రాజ్యాంగం చేసిన అధికారాల పంపిణీకి భిన్నంగా ఉన్న ఏ శాసనాన్నైనా, కార్యనిర్వాహక వర్గ చర్యనైనా తన న్యాయ సమీక్ష అధికారాన్ని ఉపయోగించి సమీక్షిస్తుంది.

AP Inter 2nd Year Civics Study Material Chapter 5 కేంద్ర న్యాయశాఖ

క్రింది అంశాలను గమనించినట్లయితే సుప్రీంకోర్టుకు న్యాయ సమీక్షాధికారం అనివార్యమని తెలుస్తుంది. ఎ. ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు బి. సమాఖ్య విధానంలో అధికారాల పంపిణీకి విఘాతం కలిగినప్పుడు. సుప్రీంకోర్టు న్యాయ సమీక్ష అధికారాలు క్రింది వాటికి కూడా విస్తరించాయి.

  1. కేంద్ర, రాష్ట్ర శాసన సభలు రూపొందించిన శాసనాలకు.
  2. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్యనిర్వాహక చర్యలకు.
  3. ప్రభుత్వరంగ సంస్థల నిర్ణయాలకు.
  4. రాజ్యాంగ సవరణలకు సంబంధించిన అంశాలను.

సుప్రీంకోర్టు మొదటిసారిగా 1950లో న్యాయసమీక్ష అధికారాన్ని ఉపయోగించి నివారక నిర్భంద (ప్రివెంటివ్ డిటెన్షన్) చట్టం, 14వ సెక్షన్ రాజ్యాంగ విరుద్ధం అని ప్రకటించింది.

భారత సుప్రీంకోర్టు రాజ్యాంగ సవరణ చట్టాల జాబిత్యాన్ని నిర్ణయించే అధికారాన్ని వినియోగించడం ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఖ్యాతి చెందింది. ఏదేమైనప్పటికి ఈ క్రింది అంశాల వలన న్యాయసమీక్ష అవసరం తప్పనిసరని చెప్పవచ్చును.

  1. రాజ్యాంగ ఔన్నత్యాన్ని సమర్థించి నిలబెట్టడం
  2. సమాఖ్య వ్యవస్థ సమతౌల్యాన్ని కాపాడటం
  3. పౌరుల ప్రాథమిక హక్కులను పరిరక్షించడం

పై వాటితోబాటుగా న్యాయ సమీక్ష అధికారం అనేది రాజ్యాంగ పరిరక్షకురాలి హోదాలో సుప్రీంకోర్టుకు సంక్రమించిన అధికారంగా పేర్కొనవచ్చు. దాంతో రాజ్యాంగ అంతిమ వ్యాఖ్యాతగా సుప్రీంకోర్టు న్యాయసమీక్షాధికారం రాజ్యాంగంలోని అన్ని అంశాల పరిశీలనకు విస్తరించింది.

ప్రశ్న 4.
న్యాయశాఖ క్రియాశీలత అనగానేమి ? అందులోని గుణాలు, దోషాలు ఏవి ?
జవాబు:
న్యాయశాఖ క్రియాశీలతను కార్యనిర్వహకశాఖ, శాసన నిర్మాణశాఖల అధికార పరిధిలో జోక్యం చేసుకోవడానికి న్యాయవ్యవస్థ చూపే అత్యుత్సాహంగా భావిస్తారు. వాస్తవానికి న్యాయ వ్యవస్థ సాధారణ కార్యక్రమాలు, చర్యలకంటే న్యాయశాఖ క్రియాశీలత భిన్నమైనది కాదు. సాధారణ పరిభాషలో ‘క్రియాశీలత’ అంటే ‘చురుకుగా ఉండడం’ ‘నిర్ణయాలలో చర్యలు కొనసాగించడం’ ‘క్రియాశీలుడు’ అంటే ‘తన విధి పట్ల అత్యంత ఆసక్తి చూపేవాడు’. ఈ అర్థంలో ప్రతి న్యాయమూర్తి ఒక క్రియాశీలుడే. “ప్రతి న్యాయమూర్తి క్రియాశీలకంగా వుంటూ పురోగమన ధృక్పథంతో గాని లేదా మరొక విధంగా గాని తన విధులను నిర్వహిస్తాడ”ని జస్టిస్. కృష్ణయ్యర్ పేర్కొన్నాడు.

న్యాయవ్యవస్థ ఇంతవరకు తన ముందుకు వచ్చిన వివాదాలపట్ల మాత్రమే స్పందించే సాంప్రదాయ పద్ధతులను విడనాడి వార్తా పత్రికలలో వచ్చిన సమాచారం, పోస్ట్ ద్వారా అందే ఫిర్యాదుల పట్ల స్వయంగా స్పందించి అయా ఆంశాలను తనకు తాను (suo-moto) గా విచారణాంశాలుగా స్వీకరించి బాధితులకు సరియైన న్యాయం అందేటట్లు చర్యలు తీసుకోవడం ప్రారంభించినది. అయితే న్యాయశాఖ క్రియాశీలత ద్వారా చేపట్టిన వివాదాలలో అధిక భాగం ప్రజాప్రయోజన వాజ్యాల (PIL) ద్వారా అందినవే. మొత్తం మీద ప్రజారోగ్యం, బాలకార్మిక వ్యవస్థ, పర్యావరణం,. అవినీతి వంటి అనేక అంశాలపై దాఖలయ్యే ప్రజాప్రయోజన వ్యాజ్యాలు న్యాయశాఖ క్రియాశీలతను పెంచాయి. మొత్తం మీద న్యాయశాఖ అనేది న్యాయ వ్యవహారాలలో క్రియాశీలత అత్యంత ప్రజాధరణ పొందిన ప్రక్రియగా వర్ణించబడింది.

న్యాయశాఖ క్రియాశీలత – గుణాలు లేదా ప్రయోజనాలు:

  1. కేవలం వ్యక్తులకే పరిమితం కాకుండా, సమూహాలకు, న్యాయవ్యవస్థ ప్రజాస్వామ్యీకరించబడింది.
  2. అది కార్యనిర్వాహకవర్గం యొక్క జవాబుదారీతనాన్ని పటిష్ఠ పరచినది.
  3. ఎన్నికల వ్యవస్థను మరింత స్వేచ్ఛగా, స్వతంత్రంగా మార్చడానికి న్యాయక్రియాశీలత ప్రయత్నిస్తుంది.
  4. ఎన్నికలలో పోటీచేసే అభ్యర్థులు కోర్టు ఆదేశాన్ని అనుసరించి తమ ఆస్తులు, ఆదాయం, విద్యార్హతలు, నేరచరిత్ర వంటి అంశాలతో కూడిన అఫిడవిట్ (Affidavit) ను సమర్పిస్తున్నారు. దీని ద్వారా ఉత్తమ ప్రతినిధిని ఎన్నుకోవడానికి ప్రజలకు అవకాశం కల్పించింది.

న్యాయశాఖ క్రియాశీలత – దోషాలు లేదా నష్టాలు:

  1. శాసన, కార్యనిర్వాహకశాఖకు, న్యాయశాఖకు మధ్య ఉన్న అంతరాన్ని తొలగించింది.
  2. ప్రభుత్వంలోని మూడు అంగాల మధ్య సమతుల్యతను సంబంధాలను ఈ భావన దెబ్బతీసిందని కొందరు భావించారు.
  3. ప్రభుత్వ అంగాలలో ప్రతి ఒక్కటీ ఇతర అంగాల అధికారాలను, పరిధిని గౌరవించాలన్న సూత్రంపైన ప్రజాస్వామ్య ప్రభుత్వం ఆధారపడి ఉంటుంది. న్యాయక్రియాశీలత ఈ ప్రజాస్వామ్య సూత్రంను వక్రీకరించి నష్టపరచింది.

AP Inter 2nd Year Civics Study Material Chapter 5 కేంద్ర న్యాయశాఖ

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
సుప్రీంకోర్టు నిర్మాణం గురించి రాయండి.
జవాబు:
రాజ్యాంగంలోని 124వ నిబంధన సుప్రీంకోర్టు నిర్మాణం గురించి పేర్కొన్నది.
సుప్రీంకోర్టు ప్రారంభ సమావేశం 1950 జనవరి 28వ తేదీన పార్లమెంటు భవనంలోని ప్రిన్సెస్ ఛాంబర్లో జరిగింది. పూర్వ ఫెడరల్ కోర్టు చివరి ప్రధానన్యాయమూర్తిగానూ, సుప్రీంకోర్టు ప్రథమ ప్రధాన న్యాయమూర్తిగాను హరిలాల్ జె. కానియా వ్యవహరించాడు.

సుప్రీంకోర్టులో ఒక ప్రధాన న్యాయమూర్తి పార్లమెంటు చట్టం నిర్ణయించిన సంఖ్యలో ఇతర న్యాయమూర్తులు ఉంటారు. సుప్రీంకోర్టులోని న్యాయమూర్తుల సంఖ్యను నిర్ణయించే అధికారం పార్లమెంటుకు ఉన్నది. రాజ్యాంగం అమలులోకి వచ్చిన సమయంలో సుప్రీంకోర్టులో ఒక ప్రధాన న్యాయమూర్తి, ఏడుగురు ఇతర న్యాయమూర్తులు ఉండేవారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఒక ప్రధాన న్యాయమూర్తి, 30 మంది ఇతన న్యాయమూర్తులు ఉన్నారు. కొన్ని సందర్భాలలో మరికొంత మంది తాత్కాలిక న్యాయమూర్తులు, విశ్రాంత న్యాయమూర్తులు తాత్కాలిక ప్రాతిపదకన నియమించబడతారు.

అన్ని సాధారణ వివాదాలను ఇద్దరు లేదా అంతకన్నా ఎక్కువ న్యాయమూర్తులతో కూడిన డివిజన్ బెంచ్ విచారిస్తుంది. రాజ్యాంగ అంశాలు ఇమిడి ఉన్న వివాదాలను ఐదుగురు జడ్జిలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం పరిష్కరిస్తుంది. ప్రత్యేక వివాదాలను విచారించడానికి ఐదు లేదా అంతకంటే ఎక్కువ మంది న్యాయమూర్తులతో ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటు చేస్తారు.

ప్రశ్న 2.
సుప్రీంకోర్టు యొక్క రెండు అధికార పరిధులను తెలపండి.
జవాబు:
సుప్రీంకోర్టు భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానం. దాని తీర్పులు, నిర్ణయాలు అంతిమమైనవి. వాటిని మార్పుచేయడానికి లేదా సవరించడానికి కేవలం సుప్రీంకోర్టుకు మాత్రమే అధికారం ఉంది. సుప్రీంకోర్టుకు క్రింద అధికార విధులు ఉన్నాయి. అవి:

1) అప్పీళ్ళ విచారణాధికారం భారతదేశంలోని సుప్రీంకోర్టు అత్యున్నతమైనది. హైకోర్టులిచ్చిన తీర్పులపై సుప్రీంకోర్టుకు కేసును పునర్విచారణ చేయమని అప్పీలు చేసుకోవచ్చు. అప్పీళ్ళు నాలుగు రకాలుగా ఉంటాయి అవి: 1) రాజ్యాంగ సంబంధమైన అప్పీళ్ళు 2) సివిల్ అప్పీళ్ళు 3) క్రిమినల్ అప్పీళ్ళు 4) స్పెషల్ అప్పీళ్ళు. ఈ అప్పీళ్ళలో మొదటి మూడు విధాలైన వాటిలో హైకోర్టు సర్టిఫికేట్ ఇస్తే అప్పీల్ చేసుకోవచ్చు. 4వ దానికి సంబంధించిన అప్పీల్స్ను హైకోర్టు సర్టిఫికేట్ ఇవ్వడానికి నిరాకరిస్తే ఆ కేసుపై చేసిన అప్పీళ్ళను సుప్రీంకోర్టు స్వీకరించవచ్చు.

2) కోర్ట్ ఆఫ్ రికార్డు: రాజ్యాంగంలోని 141వ ప్రకరణ ప్రకారం సుప్రీంకోర్టు రికార్డులను భద్రపరిచే కోర్టుగా వ్యవహరిస్తుంది. కోర్ట్ ఆఫ్ రికార్డుగా వ్యవహరించే సుప్రీంకోర్టు, కోర్టు ధిక్కార నేరానికి పాల్పడే వ్యక్తులను దోషులుగా ప్రకటించి నిందుతులుగా నిలబెట్టవచ్చు. భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానం హోదాలో సుప్రీంకోర్టు తాను వివిధ వివాదాలను పరిష్కరించడంలో వెలువరించిన అభిప్రాయాలు, వ్యాఖ్యానాలు, తీర్పులు, ఇతర న్యాయసమాచార అంశాలన్నింటిని రికార్డు రూపంలో నమోదుచేసి భద్రపరుస్తుంది. భవిష్యత్తులో అదే రకమైన వివాదాలను పరిష్కరించడానికి దేశంలో అన్ని న్యాయస్థానాలకు అవి దిక్సూచిగానూ, మార్గదర్శకంగానూ, నమూనాగానూ ఉంటాయి.

AP Inter 2nd Year Civics Study Material Chapter 5 కేంద్ర న్యాయశాఖ

ప్రశ్న 3.
సుప్రీంకోర్టు విచారణ అధికారాలు ఏవి ?
జవాబు:
భారతదేశంలో అంతిమ అప్పీళ్ళ న్యాయస్థానంగా సుప్రీంకోర్టు వ్యవహరిస్తుంది. సుప్రీంకోర్టుకు గల అప్పీళ్ళ విచారణ పరిధిని మూడు శీర్షికల క్రింద విభజించవచ్చు. అవి:

  1. రాజ్యాంగ వ్యాఖ్యానంతో ముడిపడి ఉన్న వివాదాలు.
  2. సివిల్ వివాదాలు.
  3. క్రిమినల్ వివాదాలు.

రాజ్యాంగ వ్యాఖ్యానానికి సంబంధించిన అంశాలు ఇమిడి ఉన్న వివాదాలను సుప్రీంకోర్టు విచారిస్తుంది. అటువంటి కేసుల విచారణకు హైకోర్టు ధ్రువీకరణ పత్రాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాలలో రాజ్యాంగ వివరణకు సంబంధించిన అంశాలున్నాయని భావించిన వివాదాలను సుప్రీంకోర్టు స్వయంగా విచారిస్తుంది.

రాజ్యాంగ వ్యాఖ్యానంతో సంబంధంలేని వివాదాలను హైకోర్టు ధ్రువీకరణ పత్రం ప్రాతిపదికపై సుప్రీంకోర్టు విచారణను స్వీకరిస్తుంది. అటువంటి వివాదాల విషయంలో చట్టానికి సంబంధించిన అంశాలు ఉన్నాయని, సుప్రీంకోర్టు నిర్ణయం తప్పనిసరిగా అవసరం అని హైకోర్టు భావించాలి.

క్రిమినల్ వివాదాల విషయంలో, హైకోర్టు ప్రకటించిన తీర్పు, తుది ఆదేశం లేదా శిక్షలపై వచ్చే అప్పీళ్ళను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరిస్తుంది. ఈ రకమైన అప్పీళ్ళు రెండు రకాలు. అవి: 1) క్రింది న్యాయస్థానాలు ప్రకటించిన తీర్పులపై వచ్చిన అప్పీళ్ళను స్వీకరించి, క్రింది న్యాయస్థానాలు విముక్తి చేసిన నిందితునిపై తీర్పుకు వ్యతిరేకంగా మరణశిక్షను ప్రకటించడం 2) క్రింది న్యాయస్థానాల తీర్పులపై వచ్చే అప్పీళ్ళ విచారణను ప్రారంభించి, పునస్సమీక్షించి నిందితునికి మరణశిక్షను ఖరారు చేయడం.

హైకోర్టు ఇచ్చిన తీర్పుల పట్ల అసంతృప్తులైన వ్యక్తుల ప్రార్థనపై వారి వివాదం సుప్రీంకోర్టు పరిశీలించేందుకు అర్హలైందని హైకోర్టు పేర్కొన్న పక్షంలో, సుప్రీంకోర్టు అటువంటి వివాదాల విచారణకు ప్రత్యేక అనుమతిని మంజూరు చేస్తుంది. 136వ అధికరణం ప్రకారం సాధారణ చట్టం పరిధికి వెలుపల ఉండే వివాదాలను కూడా సుప్రీంకోర్టు విచారిస్తుంది.

ప్రశ్న 4.
సుప్రీంకోర్టు సలహాపూర్వక అధికార పరిధిని వివరించండి.
జవాబు:
ఏదైనా చట్ట సంబంధ విషయంలో లేదా ప్రజాప్రాముఖ్యం ఉన్న అంశాలపై తన అభిప్రాయం తెలుపవలసినదిగా రాష్ట్రపతి సుప్రీంకోర్టును కోరవచ్చు. ఆ అంశాన్ని పరిశీలించి సుప్రీంకోర్టు తన అభిప్రాయాన్ని తెలియజేయవచ్చు. రాజ్యాంగం అమలులోకి రాక పూర్వం కుదుర్చుకోబడిన ఒప్పందాలు, సంధులకు సంబంధించిన వివాదాల విషయంలో రాష్ట్రపతి సుప్రీంకోర్టు సలహాను కోరవచ్చు. ఈ వివాదాలు రాజ్యాంగం 131వ ప్రకరణ నుంచి మినహాయింపబడినవి.

అయితే రాష్ట్రపతి కోరిన అంశాలపై సుప్రీంకోర్టు తప్పనిసరిగా సలహా ఇవ్వాలనిగానీ, సుప్రీంకోర్టు అభిప్రాయాన్ని, సలహాను రాష్ట్రపతి విధిగా పాటించాలని గానీ నియమం ఏమిలేదు. అది వారి వివేచనకు వదిలివేయబడుతుంది. 1978లో రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి 1975లో ప్రవేశపెట్టిన అత్యవసర పరిస్థితిలో జరిగిన అధికార దుర్వినియోగంపై విచారణ జరపడానికి ప్రత్యేక న్యాయస్థానాల ఏర్పాటుపై సుప్రీంకోర్టును సలహా అడగటం జరిగింది. గతంలో కూడా ఆ విధంగా జరిగింది. యు.పి.యస్.సి. అధ్యక్షునిగా లేదా సభ్యులను అవినీతి, అక్రమాల ఆరోపణలపై నిర్బంధంగా పదవీ విరమణ చేయించదలిస్తే రాష్ట్రపతి సుప్రీంకోర్టు సలహా కోరవచ్చు. సుప్రీంకోర్టు సలహాలకు ప్రాధాన్యత ఉంటుంది. అమెరికా, ఆస్ట్రేలియాలలో ఈ అధికారం లేదు.

AP Inter 2nd Year Civics Study Material Chapter 5 కేంద్ర న్యాయశాఖ

ప్రశ్న 5.
రిట్ అధికార పరిధి గురించి రాయండి.
జవాబు:
రిట్ అనే పదానికి అర్థం ‘వ్రాతపూర్వక ఆదేశం’. రాజ్యాంగంలోని 32వ ప్రకరణ పౌరుల ప్రాథమిక హక్కులను అమలు చేయడానికి రిట్లను జారీ చేసే అధికారాన్ని సుప్రీంకోర్టుకు ఇచ్చింది. తన ప్రాథమిక హక్కులకు భంగం కలిగిన వ్యక్తి వాటి పరిరక్షణకై సుప్రీంకోర్టును నేరుగా ఆశ్రయించవచ్చు. ప్రాథమిక హక్కుల భంగం వాటిల్లినప్పుడు రాజ్యాంగ పరిహారంలో భాగంగా సుప్రీంకోర్టు 32వ ప్రకరణ ప్రకారం హెబియస్ కార్పస్, మాండమస్, ప్రొహిబిషన్, సెర్షియరరీ, కోవారెంటో వంటి రిట్లను ప్రాథమిక హక్కుల పునరుద్ధరణకు జారీ చేస్తుంది.

1) హెబియస్ కార్పస్: హెబియస్ కార్పస్ అనగా ‘వ్యక్తి శరీరాన్ని ప్రవేశపెట్టదు’ అని అర్థం. చట్ట వ్యతిరేకంగా నిర్బంధానికి గురైన వ్యక్తికి బంధ విముక్తి కలిగించడానికి ఈ రిట్ మంజూరు చేస్తారు. అక్రమంగా నిర్బంధించబడిన వ్యక్తిని కోర్టు ఎదుట హాజరుపరచండి అని సంబంధిత అధికారిని ఆదేశించడానికి హెబియస్ కార్పస్ రిట్ను సుప్రీంకోర్టు జారీ చేస్తుంది. ఆ ఆధికారి ఈ అదేశాన్ని పాటించనట్లయితే కోర్టు ధిక్కారనేరం క్రింద శిక్షార్హుడవు.

2) మాండమస్: మాండమస్ అనగా ‘మేము ఆజ్ఞాపిస్తున్నాము’ అని అర్థం. ఎవరైనా ప్రభుత్వ అధికారి, విధి నిర్వహణలో వైఫల్యం చెందినప్పుడు ఆ విధిని సక్రమంగా నిర్వర్తించమని ఆజ్ఞాపిస్తూ సుప్రీంకోర్టు ఈ రిట్ను జారీ చేస్తుంది. ప్రైవేట్ వ్యక్తులకు ఈ రిట్ను జారీ చేయబడదు.

3) ప్రొహిబిషన్: ‘నిషేదించుట’ అని దీని అర్థం. ఈ రిట్ను సుప్రీంకోర్టు క్రింది కోర్టులకు జారీ చేస్తుంది. ఏదైనా కేసు విచారణలో క్రింది కోర్టులు లేని అధికార పరిధిని అతిక్రమించి వ్యవహరించకుండా నిరోధించడానికి ఈరిట్ను జారీ చేస్తారు. దీనిని న్యాయ సంబంధిత సంస్థలకు మాత్రమే జారీచేస్తారు.

4) సెర్షియరరీ లాటిన్ లో దీని అర్థం ‘ధృవీకరించబడాలి’ లేదా ‘తెలియజేయుట’. క్రింది కోర్టులు వాటి పరిధిని అతిక్రమించి, వ్యవహరించినప్పుడు సుప్రీంకోర్టు, హైకోర్టులు ఈ రిట్ను జారీచేస్తాయి.

5) కో-వారెంటో: ‘ఏ అధికారంతో’ అని దీని అర్థం. ఒక వ్యక్తి తనకు అర్హత, అధికారం లేకపోయినా అధికార పదవిలో కొనసాగడాన్ని ప్రశ్నిస్తూ ఈ రిట్ను జారీచేస్తారు. ఏ అధికారంతో ఆ పదవి చేపట్టారో తెలియజేయమని సదరు వ్యక్తిని ఆదేశిస్తూ సుప్రీంకోర్టు ఈ రిట్లు జారీ చేస్తుంది. ఈ రిట్ను ప్రైవేట్ సంస్థలకు జారీచేయబడదు. వీటితోపాటుగా పౌరుల హక్కుల పరిరక్షణ కొరకు కొన్ని యంత్రాంగాలను ఏర్పాటుచేసారు. అవి జాతీయ మహిళా సంఘం, జాతీయ షెడ్యూల్డు కులాల, తెగల సంఘం, జాతీయ మానవ హక్కుల సంఘం మొదలైనవి.

ప్రశ్న 6.
భారతదేశంలో న్యాయశాఖ క్రియాశీలత గురించి తెలపండి.
జవాబు:
క్రియాశీలుడైన న్యాయమూర్తి రాజ్యాంగ స్వభావాన్ని అర్థం చేసుకొని వుండాలి. భారత రాజ్యాంగం కేవలం ఒక శాసన పత్రం కాదు. అది ప్రజల విలువలు, అభిలాషలను వ్యక్తీకరించే సామాజిక రాజకీయ పత్రం, సమసమాజాన్ని నిర్మించడమే రాజ్యాంగం యొక్క ప్రథమ లక్ష్యం. ఈ సందర్భంలో దేశంలోని పౌరలందరికి సమానహక్కులు హోదా, అవకాశాలు కల్పనే లక్ష్యంగా రాజ్యంగ ప్రవేశికలో స్పష్టంగా పేర్కొన్నారు. రాజ్యాంగ లక్ష్యాలను, గమ్యాన్ని సాధించడానికి ప్రజల ప్రాథమిక హక్కులకు హామీ ఇవ్వబడినది. రాజ్యపాలనలో ఆదేశక సూత్రాలు అతి ప్రధానమైనవిగా భావించడం జరిగింది, వివిధ చట్టాల తయారీలో ఆదేశక సూత్రాలను కాలానుగుణంగా పాటించాల్సిన బాధ్యత రాజ్యానికి ఉంటుంది.

రాజ్యాంగం యొక్క లక్ష్యాలను సాధించడం శాసననిర్మాణ శాఖ, కార్యనిర్వాహక వర్గం, న్యాయశాఖల యొక్క సమిష్టి బాధ్యత. మన రాజ్యాంగ ప్రధాన లక్ష్యమైన సామాజిక న్యాయాన్ని సాధించడంలో న్యాయశాఖ ప్రధాన పాత్రను పోషిస్తుంది. రాజ్యాంగం నిర్దేశించిన లక్ష్యాలను నెరవేర్చడానికి, సమాజంలో అణగారిన బడుగు, బలహీన వర్గాలు, పేదలకు కనీస జీవన అవసరాలను అందివ్వడానికి న్యాయశాఖ ప్రజాప్రయోజనాల వ్యాజ్యాన్ని స్వీకరిస్తున్నది. కార్యనిర్వాహక శాఖ, శాసన నిర్మాణ శాఖల మధ్యదూరాన్ని తగ్గించేందుకు, ప్రాథమిక హక్కుల పరిరక్షణకు సమున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు నూతన విధానాలను, పద్ధతులను అనుసరిస్తున్నది.

శాసన నిర్మాణశాఖ, కార్యనిర్వహకశాఖ, అశ్రద్ధ, అలసత్వం కారణంగా కొన్ని సందర్భాలలో సామాజిక దోపిడీకీ గురయ్యే వర్గాలకు సామాజిక న్యాయం అందివ్వడానికి సోషియల్ యాక్షన్ గ్రూపులు (Social Action Groups), పౌర స్వేచ్ఛా సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు ప్రజా ప్రయోజన వ్యాజ్యం న్యాయస్థానాల న్యాయసమీక్ష అధికారపరిధిని చెలాయించడంలో న్యాయ పరిమితులను ఎప్పటికప్పుడు విస్తృత పరిచింది. న్యాయస్థానాలకు విస్తరింపబడిన ఈ పాత్రను విమర్శించే వారు విస్తరించబడిన పాత్రకు ‘న్యాయశాఖ క్రియాశీలత’ అని పేరు పెట్టారు అని” జస్టిస్ ఎ.ఎస్.ఆనంద్ పేర్కొన్నారు.

న్యాయశాఖ క్రియాశీలతకు గల కారణాలు: ఈ క్రింద తెలిపిన అంశాలు భారతదేశంలో న్యాయశాఖ క్రియాశీలతను అనుసరించడానికి మూలకారణాలుగా పేర్కొనవచ్చు.

  1. పరిపాలనా ప్రక్రియలో విస్తరించిన ప్రజావినతుల స్వీకార పరిధి.
  2. అపరిమిత దత్తశాసనాధికారాలు.
  3. పరిపాలనపై న్యాయసమీక్ష.
  4. ప్రజా ప్రభుత్వం బాధ్యతల పెరుగుదల.
  5. కోర్టు అధికార పరిధిని విచక్షణా రహితంగా ఉపయోగించడం.
  6. లేని అధికారపరిధిని వినియోగించడం.
  7. సామాజిక, ఆర్థిక, విద్యాపరమైన లక్ష్యాల విషయంలో మితిమీరిన ప్రమాణిక నిబంధనల పెరుగుదల.
  8. ప్రభుత్వంలోని ఇతర యంత్రాంగాల విచ్ఛిత్తి.

AP Inter 2nd Year Civics Study Material Chapter 5 కేంద్ర న్యాయశాఖ

ప్రశ్న 7.
ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL) అనగా నేమి ? [Mar. ’17]
జవాబు:
ప్రజా ప్రయోజన వ్యాజ్యం అనే భావన 1960వ దశకంలో అమెరికాలో అవిర్భవించింది. న్యాయవ్యవస్థ యొక్క గుర్తించబడిన స్థాయి (Locus-standi) కి సంబంధించిన సరళీకృత నియమాలనుంచి పుట్టు కొచ్చినదే ప్రజాప్రయోజన వ్యాజ్యం లేదా సామాజిక చర్యా వ్యాజ్యం (Social action Litigation). ప్రభుత్వ అధికారం వలన ఏ వ్యక్తి తన చట్టబద్ధమైన హక్కులకు భంగం కలిగి నష్టపోయి గాయపడతాడో ఆవ్యక్తి మాత్రమే న్యాయపరిహారం (Judicial Remedy) కోసం న్యాయస్థానాలను ఆశ్రయించాలి అనే సూత్రం పైన సాంప్రదాయ ‘గుర్తింపబడిన స్థాయి’ (లోకస్ స్టాం) నియమంపై ఆధారపడి ఉంటుంది. ప్రజాప్రయోజన వ్యాజ్యం ఈ సాంప్రదాయ నియమాన్ని సరళీకరించదలచినది.

సరళీకృత నియమం ప్రకారం చట్టబద్ధమైన హక్కులను నష్టపోయిన లేదా అన్యాయానికి గురైన వ్యక్తి స్వయంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించలేనపుడు సామాజిక స్పృహ, చైతన్యం కలిగిన వ్యక్తుల సహాయంతో కోర్టుల ద్వారా న్యాయాన్ని అభ్యర్థించవచ్చు.

భారతదేశంలో ప్రజాప్రయోజనాల వ్యాజ్య ఉద్యమం, అత్యవసర పరిస్థితి అనంతర కాలంలో ప్రారంభమైనది. సామాజికంగా, ఆర్థికంగా అణగారిన వర్గాలకు న్యాయవ్యవస్థను అందుబాటులోకి తేవడానికి ఈ ఉద్యమం ఉద్దేశించింది. అనేక అంశాలలో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL) ద్వారా న్యాయశాఖ క్రియాశీలతను సంతరించుకున్నది. న్యాయస్థానాన్ని ఆశ్రయించడానికి అశక్తులు, అసమర్థులైన బాధితుడు లేదా బాధితుల తరుపున ఏ వ్యక్తి లేదా సంస్థ అయినా క్లేశనివారణ (Redressal of Grievances) కోసం ప్రజాప్రయోజన వ్యాజ్యం ద్వారా సుప్రీంకోర్టు లేదా హైకోర్టును ఆశ్రయించవచ్చు. ఈ ఏర్పాటు క్రింద పూర్తిగా అభాగ్యుడు, అనాథుడైనా వ్యక్తి కూడా న్యాయవ్యవస్థ యొక్క సాంప్రదాయ పద్ధతి జోలికి వెళ్ళకుండానే కేవలం ఒక ఉత్తరం ద్వారా కోర్టులో రిట్ పిటిషన్ వేయవచ్చు. రాజ్యాంగంలోని 32వ ప్రకరణ సూచించిన “తన బాధను కోర్టుకు వినిపించే హక్కు” (Right to be Heard) ద్వారా దీనికి అధీకృత నమ్మకత్వం (Authentica- tion) ఏర్పడుతుంది. పిల్ ద్వారా కోర్టును చేరుతున్న వ్యక్తి నిజాయితీగా సదుద్దేశ్యంతో వ్యవహరిస్తున్నాడు. తప్ప వ్యక్తి గత ప్రయోజనాలు, ప్రైవేట్ లబ్ది లేదా రాజకీయ లేదా మరి ఏ ఇతర నీతిబాహ్య లక్ష్యాల కోసం కాదు అని న్యాయస్థానం నిర్ధారించుకోవాలి. చట్టం చేత అనుమతింపబడిన, హేతుబద్దమై పాలనా చర్యలను ఆలస్యం చేయడానికో లేదా తమ రాజకీయ లక్ష్యాలను సాధించుకోవడానికో రాజకీయనాయకులు కానీ ఇతరులు కానీ ప్రజాప్రయోజనాల వ్యాజ్యాన్ని దుర్వినియోగం చేయడాన్ని కోర్టులు అనుమతించవు.

ప్రశ్న 8.
న్యాయశాఖ ప్రతిపత్తి అంటే ఏమిటి ? భారత రాజ్యాంగం దానిని ఏ విధంగా ఏర్పాటు చేసింది ?
జవాబు:
న్యాయశాఖ ప్రతిపత్తి – అర్థం: సమన్యాయ పాలనా సూత్రాన్ని కాపాడి అనుసరించడం, శాసన ఆధిక్యాన్ని, ఔన్నత్యాన్ని స్థాపించడం న్యాయశాఖ ప్రధాన విధి. న్యాయశాఖ చట్టం ప్రకారం వివాదాలను పరిష్కరించి వ్యక్తుల హక్కులను పరిరక్షిస్తుంది. ఎవరి నియంతృత్వానికి ప్రజాస్వామ్యం లోబడకుండా ఉండేటట్లు చూస్తుంది. ఈ బాధ్యతలను నెరవేర్చడానికి రాజకీయ ఒత్తిళ్ళకు అవకాశం లేని స్వతంత్ర న్యాయశాఖ అవసరం.

భారత రాజ్యంగంలో న్యాయశాఖ స్వతంత్ర ప్రతిపత్తిని ఏర్పాటు చేసేందుకు తీసుకున్న చర్యలు:
1) న్యాయమూర్తుల నియామకంలో శాసన నిర్మాణశాఖ పాల్గొనదు. అందువలన న్యాయమూర్తుల నియామక ప్రక్రియలో పార్టీ రాజకీయాలకు ఎటువంటి పాత్ర ఉండదని భావించవచ్చు.

2) న్యాయమూర్తులకు నిర్ణీత పదవీకాలం ఉన్నది. పదవీ విరమణ వయస్సు వచ్చేంతవరకు వారు పదవిలో కొనసాగవచ్చు. అరుదైన సందర్భాలలో రాజ్యాంగం నిర్దేశించిన పద్ధతి ప్రకారమే వారిని పదవి నుంచి తొలగించవచ్చు. ఈ చర్య వలన న్యాయమూర్తుల నిర్భీతిగా, స్వేచ్ఛగా పనిచేయగలరు.

3) న్యాయమూర్తుల జీతభత్యాల చెల్లింపునకు శాసన నిర్మాణశాఖ అనుమతి అవసరం లేకుండా రాజ్యాంగం ఏర్పాటు చేసింది. అందువలన న్యాయశాఖ అటు కార్యనిర్వాహక, శాసన నిర్మాణశాఖలపై ఆర్థిక విషయాలలో ఆధారపడదు.

4) వ్యక్తిగత విమర్శల నుండి న్యాయమూర్తుల నిర్ణయాలకు, చర్యలకు రాజ్యాంగం రక్షణ కల్పించింది. కోర్టు ధిక్కారం క్రింద దోషిగా గుర్తింపబడిన వ్యక్తులను శిక్షించే అధికారాన్ని న్యాయవ్యవస్థకు ఇవ్వబడింది. ఈ చర్య అనుచిత విమర్శల నుండి న్యాయమూర్తులను రక్షిస్తుంది.

5) న్యాయశాఖ అనేది శాసననిర్మాణ కార్యనిర్వాహకశాఖల యొక్క అనుబంధశాఖ కాదు. రాజ్యాంగంలో ఈ శాఖకు స్వతంత్ర్య వ్యవస్థగా గుర్తింపు ఉన్నది.

6) న్యాయమూర్తులకు రాజ్యాంగం నిర్దిష్టమైన, ఉన్నత అర్హతలను సూచించింది. అటువంటి నిర్దిష్ట అర్హతలు, అనుభవం ఉన్నవారు మాత్రమే న్యాయమూర్తులుగా నియమించబడతారు.

AP Inter 2nd Year Civics Study Material Chapter 5 కేంద్ర న్యాయశాఖ

ప్రశ్న 9.
భారత అటార్నీ జనరల్ అధికారాలు, విధులు ఏవి ? [Mar. ’16]
జవాబు:
భారత రాజ్యాంగంలోని 76వ ప్రకరణ భారత అటార్నీ జనరల్ పదవికి అవకాశం కల్పిస్తున్నది. ఈయన కేంద్ర ప్రభుత్వంలో అత్యున్నత న్యాయాధికారి. భారత అటార్నీ జనరల్ రాష్ట్రపతిచే నియమింపబడి, రాష్ట్రపతి సంతృప్తిని పొందినంత కాలం పదవిలో కొనసాగుతాడు. పార్లమెంటు సభ్యుడికి ఉన్న అన్ని ప్రత్యేక హక్కులు, రక్షణలను పొందడానికి అటార్నీ జనరల్ ఆర్హుడు. అతడు పార్లమెంట్ సమావేశాలకు హాజరైనప్పుడు ప్రభుత్వానికి కేటాయించిన స్థానాలలో (Government Benches) కూర్చుంటాడు.
అర్హతలు: అటార్నీ జనరల్గా నియమింపబడే వ్యక్తి సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు గల అర్హతలను కలిగిఉండాలి. అవి:

  1. భారత పౌరుడై ఉండాలి.
  2. హైకోర్టు న్యాయమూర్తిగా నిరంతరాయంగా కనీసం ఐదు సంవత్సరాలు పనిచేసి ఉండాలి.
  3. హైకోర్టు న్యాయవాదిగా నిరంతరాయంగా కనీసం పది సంవత్సరాలు వ్యవహరించాలి ఉండాలి.
  4. రాష్ట్రపతి దృష్టిలో న్యాయకోవిదుడై ఉండాలి.

జీతభత్యాలు: అటార్నీ జనరల్కు జీతం చెల్లించరు. రాష్ట్రపతి నిర్ణయించిన పారితోషికం మాత్రం చెల్లిస్తారు. అతడి పారితోషికాన్ని రాజ్యాంగం నిర్ణయించలేదు. అయితే అటార్నీ జనరల్ పారితోషికం సుప్రీంకోర్టు న్యాయమూర్తుల జీతాలతో సమానంగా ఉంటుంది.

తొలగింపు: సుప్రీంకోర్టు న్యాయమూర్తులను తొలగించే విధానము తొలగింపుకు వర్తిస్తుంది. రాష్ట్రపతికి రాజీనామా సమర్పించడం ద్వారా అతడు తన పదవి నుండి వైదొలగవచ్చు. నిరూపితమైన అనుచిత ప్రవర్తన లేదా అసమర్ధత వంటి అభియోగాలతో పార్లమెంటు ఉభయసభలు విడివిడిగా ఒక తీర్మానాన్ని మొత్తం సభ్యుల సంఖ్యలో సంపూర్ణ మెజారిటీతోనూ, ఓటింగ్ లో పాల్గొన్న వారిలో 2/3వ వంతు మెజారిటీతో ఆమోదించి రాష్ట్రపతికి పంపితే, ఆ తీర్మానం ఆధారంగా రాష్ట్రపతి అటార్నీ జనరల్ను పదవి నుండి తొలగిస్తాడు.

అధికారాలు
విధులు: భారత రాజ్యాంగం అటార్నీ జనరలు కొన్ని అధికారాలను దత్తత చేసి మరికొన్ని విధులను అప్పగించినది. అవి:

  1. రాష్ట్రపతి తన పరిశీలనకు పంపించిన చట్టపరమైన అంశాలపై అటార్నీ జనరల్ కేంద్ర ప్రభుత్వానికి సలహా ఇస్తాడు.
  2. రాష్ట్రపతి తనకు అప్పగించే న్యాయసంబంధమైన విధులను నిర్వహిస్తాడు.
  3. భారత రాజ్యాంగం కానీ, చట్టం కానీ తనపై ఉంచిన విధులను నిర్వర్తిస్తాడు.
  4. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అన్ని కేసులలోనూ ప్రభుత్వం తరపున న్యాయస్థానాలలో హాజరువుతాడు.
  5. రాష్ట్రపతి సుప్రీంకోర్టు పరిశీలనకు పంపిన ఏ అంశాల విషయంలోనయినా కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా వ్యవహరిస్తాడు.

అటార్నీ జనరల్ పార్లమెంటు సభ్యుడు కానప్పటికీ పార్లమెంటు సమావేశాలకు హాజరై చర్చలలో, సమావేశాలలో పాల్గొనవచ్చు. మాట్లాడవచ్చు. కానీ అతనికి తీర్మానాలపై ఓటుచేసే ఓటు హక్కు వుండదు.

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
సుప్రీంకోర్టు న్యాయమూర్తుల అర్హతలు.
జవాబు:

  1. భారతీయ పౌరుడై ఉండాలి.
  2. ఏదైనా ఒకటి లేదా అంతకు మించిన హైకోర్టులలో నిరంతరాయంగా కనీసం 5 సంవత్సరాల పాటు న్యాయమూర్తిగా పనిచేసి ఉండాలి.
  3. ఏదైనా ఒకటి లేదా అంతకుమించిన హైకోర్టులలో నిరంతరాయంగా కనీసం 10 సంవత్సరాల పాటు న్యాయవాదిగా వ్యవహరించి ఉండాలి.
  4. రాష్ట్రపతి అభిప్రాయంలో న్యాయకోవిదుడై ఉండాలి.

AP Inter 2nd Year Civics Study Material Chapter 5 కేంద్ర న్యాయశాఖ

ప్రశ్న 2.
సుప్రీంకోర్టు న్యాయమూర్తుల తొలగింపు.
జవాబు:
నిరూపితమైన అధికార దుర్వినియోగం, అశక్తత, అయోగ్యత, అసమర్థత మొదలైన కారణాల వలన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు తొలగించబడతారు. అటువంటి మహాభియోగాలతో కూడిన తీర్మానాన్ని పార్లమెంటులోని ఉభయసభలు విడివిడిగా ఆయాసభలలో హజరైన సభ్యులలో 2/3వ వంతు సభ్యులు ఆమోదించి ఆన్యాయమూర్తిని తొలగించమని రాష్ట్రపతిని కోరితే, రాష్ట్రపతి వారిని తొలగించవచ్చు.

ప్రశ్న 3.
న్యాయ సమీక్ష. [Mar. ’16]
జవాబు:
సుప్రీంకోర్టు అధికారాలన్నింటిలోకెల్లా న్యాయసమీక్ష అత్యంత ముఖ్యమైనది. శాసన నిర్మాణ శాఖ రూపొందించిన శాసనాలు, కార్యనిర్వాహిక వర్గం తీసుకున్న నిర్ణయాలు రాజ్యాంగబద్ధంగా ఉన్నాయా ? లేదా ? అని సమీక్షించడానికి న్యాయస్థానాలకు గల అధికారాన్నే ‘న్యాయ సమీక్ష’ అని అంటారు. ఒకవేళ శాసనసభ చట్టాలు, కార్యనిర్వాహక వర్గం నిర్ణయాలు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉంటే వాటిని లోపభూయిష్టం, చెల్లుబాటు కావని సుప్రీంకోర్టు ప్రకటిస్తుంది.

ప్రశ్న 4.
కోర్టు ఆఫ్ రికార్డ్.
జవాబు:
రాజ్యాంగంలోని 141వ ప్రకరణ ప్రకారం సుప్రీంకోర్టు రికార్డులను భద్రపరచే కోర్టుగా వ్యవహరిస్తుంది. కోర్టు ధిక్కారానికి పాల్పడే వ్యక్తులను దోషులుగా ప్రకటించి నిందితులుగా నిలబెట్టవచ్చు. సుప్రీంకోర్టు వివిధ సందర్భాలలో ప్రకటించే తీర్పులు దిగువ కోర్టులన్నింటికి మార్గదర్శకాలుగా పనిచేస్తాయి.

ప్రశ్న 5.
న్యాయశాఖ క్రియాశీలత.
జవాబు:
న్యాయశాఖ క్రియాశీలతను కార్యనిర్వాహకశాఖ, శాసన నిర్మాణశాఖల అధికార పరిధిలో జోక్యం చేసుకోవటానికి న్యాయవ్యవస్థ చూపే అత్యుత్సాహంగా భావిస్తారు. సాధారణ పరిభాషలో ‘క్రియాశీలత’ అంటే ‘చురుకుగా ఉండటం నిర్ణయాలలో చర్యలు కొనసాగించటం’. ప్రతి న్యాయమూర్తి క్రియాశీలకంగా వుంటూ పురోగమన దృక్పథంతోగాని లేదా మరొక విధంగా కాని తన విధులను నిర్వహిస్తాడని జస్టిస్. కృష్ణయ్యర్ పేర్కొన్నాడు.

ప్రశ్న 6.
ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం (PIL).
జవాబు:
చట్టబద్దమైన హక్కులను నష్టపోయినా లేదా అన్యాయానికి గురైన వ్యక్తి స్వయంగా న్యాయస్థానాన్ని | ఆశ్రయించలేనపుడు సామాజిక స్పృహ, చైతన్యం కలిగిన వ్యక్తుల సహాయంతో కోర్టుల ద్వారా న్యాయాన్ని అభ్యర్థించవచ్చు. సామాజికంగా, ఆర్థికంగా అణగారిన వర్గాలకు న్యాయవ్యవస్థను అందుబాటులోకి తేవటానికి ప్రజాప్రయోజన వ్యాజ్యం తోడ్పడుతుంది.

ప్రశ్న 7.
న్యాయశాఖ స్వతంత్ర ప్రతిపత్తి.
జవాబు:
న్యాయశాఖ చట్టం ప్రకారం వివాదాలను పరిష్కరించి వ్యక్తుల హక్కులను కాపాడుతుంది. ఎవరి నియంతృత్వానికి ప్రజాస్వామ్యం లోబడకుండా ఉండేటట్లు చూస్తుంది. ఈ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడానికి రాజకీయ ఒత్తిళ్ళకు అవకాశం లేని స్వతంత్ర న్యాయశాఖ అవసరం. భారతదేశంలో న్యాయశాఖ స్వతంత్ర ప్రతిపత్తిని కాపాడటానికి భారత రాజ్యాంగం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది.

AP Inter 2nd Year Civics Study Material Chapter 5 కేంద్ర న్యాయశాఖ

ప్రశ్న 8.
హెబియస్ కార్పస్.
జవాబు:
హెబియస్ కార్పస్ అనగా ‘వ్యక్తి శరీరాన్ని ప్రవేశ పెట్టడం’ అని అర్థం. చట్ట వ్యతిరేకంగా నిర్భంధానికి గురైన వ్యక్తికి బంధవిముక్తి కలిగించటానికి ఈ రిట్ను మంజూరు చేస్తారు. అక్రమంగా నిర్భంధించబడిన వ్యక్తిని కోర్టు ఎదుట హాజరు పరచండి అని సంబంధిత అధికారిని అదేశించడానికి హెబియస్ కార్పస్ రిట్ను సుప్రీంకోర్టు జారీచేస్తుంది.

ప్రశ్న 9.
సుప్రీంకోర్టు పీఠం. [Mar. ’17]
జవాబు:
సుప్రీంకోర్టు ప్రధాన కార్యాలయం న్యూఢీల్లిలో ఉంది. పూర్వపు ఫెడరల్ కోర్టు చివరి ప్రధాన న్యాయమూర్తి అయిన హెచ్.జె.కానియా సుప్రీంకోర్టు మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించారు. రాజ్యాంగ సంబంధమైన వివాదాలను ఐదురుగు జడ్జీలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం పరిష్కరిస్తుంది. ప్రత్యేక వివాదాలను విచారించడానికి ఐదు లేదా అంతకంటే ఎక్కువమంది న్యాయమూర్తులతో ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటు చేస్తారు.

ప్రశ్న 10.
రిట్లు (రిట్లు).
జవాబు:
రిట్ అనే పదానికి అర్థం ‘వ్రాతపూర్వక ఆదేశం’. రాజ్యాంగంలోని 32వ ప్రకరణ పౌరులు ప్రాథమిక హక్కులను |అమలు చేయటానికి రిట్లను జారీచేసే అధికారాన్ని సుప్రీంకోర్టు ఇచ్చింది. ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లినపుడు రాజ్యాంగ పరిహారంలో భాగంగా సుప్రీంకోర్టు హెబియస్ కార్పస్, మాండమస్, ప్రోహిబిషన్, సెర్షియోరరీ, కోవారంటో మొదలైన రిట్లను జారీ చేస్తుంది.

AP Inter 2nd Year Civics Study Material Chapter 4 కేంద్ర శాసననిర్మాణ శాఖ

Andhra Pradesh BIEAP AP Inter 2nd Year Civics Study Material 4th Lesson కేంద్ర శాసననిర్మాణ శాఖ Textbook Questions and Answers.

AP Inter 2nd Year Civics Study Material 4th Lesson కేంద్ర శాసననిర్మాణ శాఖ

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
పార్లమెంటు (కేంద్ర శాసన నిర్మాణ శాఖ) అధికారాలు, విధులను వివరించండి. [Mar. ’17, ’16]
జవాబు:
భారత పార్లమెంటు ద్వంద్వ శాసనసభ. దానిలో రెండు సభలు ఉన్నాయి. అవి: రాజ్యసభ, లోక్సభ. రాజ్యసభను ఎగువసభ అని అంటారు. లోక్సభను దిగువసభ అని అంటారు. రాజ్యసభ రాష్ట్రాలకు ప్రాతినిథ్యం వహించుటచే దానిని ‘హౌస్ ఆఫ్ స్టేట్స్’ (House of States) అని కూడా అంటారు. దీని గరిష్ఠ సంఖ్య 250. వీరిలో 238 మంది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహిస్తారు. 12 మందిని రాష్ట్రపతి నియమిస్తాడు. ఇది శాశ్వతసభ. సభ్యుల పదవీకాలం 6 సం॥లు. లోక్సభ ప్రజలకు ప్రాతినిధ్యం వహించుటచే అది ప్రజాప్రతినిధుల సభ. దానిని ఆంగ్లంలో ‘హౌస్ ఆఫ్ ది పీపుల్’ (House of the People) అని అంటారు. దీని గరిష్ఠ సంఖ్య 552. దీనిలో 530 మంది రాష్ట్రాల నుండి, 20 మంది కేంద్రపాలిత ప్రాంతాల నుండి ఎన్నుకోబడతారు. ఇద్దరు ఆంగ్లో-ఇండియన్లు రాష్ట్రపతిచే నియమింపబడతారు. కొన్ని విషయాలలో మినహా రెండు సభలకు సమానమైన అధికారాలున్నాయి. రెండు సభలలోని సభ్యులను పార్లమెంట్ సభ్యులనే అంటారు. పార్లమెంటుకు విశేషమైన అధికారాలు ఉన్నాయి.

పార్లమెంటు అధికారాలు: పార్లమెంటు విధులను, అధికారాలను ఈ క్రింది విధంగా వర్గీకరించవచ్చు.

1) శాసన నిర్మాణాధికారాలు: ప్రజాశ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని పరిపాలన నిర్వహించడానికి కావలసిన శాసనాలను తయారుచేయడం పార్లమెంటు ప్రధాన విధి. కేంద్ర మరియు ఉమ్మడి జాబితాలలోని అన్ని అంశాలపైన పార్లమెంటు శాసనాలు చేయవచ్చు. సాధారణంగా రాష్ట్ర జాబితాలోని అంశాలపై శాసనాలు చేసే అధికారం దానికి లేదు. కొన్ని ప్రత్యేక పరిస్థితులలో రాష్ట్ర జాబితాలోని అంశాలపై పార్లమెంటు శాసనాలు చేయవచ్చు. అవశిష్టాధికారాలపై (Residuary powers) శాసనాలు చేసే అధికారం పార్లమెంటుకు మాత్రమే కలదు.

2) కార్యనిర్వహణాధికారాలు: పార్లమెంటరీ విధానంలో మంత్రివర్గం తన చర్యలకు పార్లమెంట్ బాధ్యత వహిస్తుంది. పార్లమెంటు ఎన్నో విధాలుగా కార్యనిర్వహక వర్గాన్ని అదుపు చేస్తుంది. మంత్రులను ప్రశ్నలు అడగడం ద్వారాను, వారి పనులపై ఆక్షేపణ తీర్మానాలు ప్రవేశపెట్టడం ద్వారాను, ఆర్థికమంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్ను తిరస్కరించడం ద్వారాను, అవిశ్వాస తీర్మానాలు ఆమోదించడం ద్వారాను పార్లమెంటు మంత్రిమండలిని అదుపులో పెట్టగలుగుతుంది.

AP Inter 2nd Year Civics Study Material Chapter 4 కేంద్ర శాసననిర్మాణ శాఖ

3) ఆర్థికాధికారాలు: ఆర్థిక విషయాలలో పార్లమెంటుకు తిరుగులేని అధికారాలు ఉన్నాయి. పార్లమెంటు అనుమతి లేనిదే కొత్త పన్నులు విధించకూడదు. ప్రభుత్వ ఆదాయ వ్యయపట్టిక (బడ్జెట్ – Budget) పార్లమెంటు అనుమతితో అమలుపరచబడును. సాధారణ బడ్జెట్తో పాటు, రైల్వేబడ్జెట్ను కూడా ఆమోదించును. మనీబిల్లులను ఆమోదించడంలో రాజ్యసభ కంటే లోక్సభకే ఎక్కువ అధికారాలున్నాయి. లోక్సభ ఆమోదించిన తర్వాత మనీబిల్లులు రాజ్యసభకు పంపబడును. వాటిని రాజ్యసభ 14 రోజుల గడువులో తిరిగి లోక్సభకు పంపాలి. వివిధ కమిటీల నివేదికలను పార్లమెంట్ చర్చిస్తుంది.

4) రాజ్యాంగాన్ని సవరించే అధికారము: రాజ్యాంగాన్ని సవరించే అధికారాన్ని రాజ్యాంగం పార్లమెంటుకు ఇచ్చింది. రాజ్యాంగానికి సవరణలు ప్రతిపాదించే అధికారం రాష్ట్ర శాసనసభలకు లేదు. భారత రాజ్యాంగాన్ని సవరించడానికి రాజ్యాంగంలో మూడు పద్దతులు సూచించారు. ఆ పద్దతులననుసరించి పార్లమెంటు రాజ్యాంగాన్ని సవరిస్తుంది.

5) న్యాయాధికారాలు: భారత పార్లమెంటుకు కొన్ని న్యాయాధికారాలు కూడా ఉన్నాయి. అవి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతిపై వచ్చిన అభియోగాలను చర్చించి, 2/3వ వంతుమంది సభ్యుల ఆమోదంతో వారిని పదవుల నుండి తొలగించవచ్చు. సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను పెంచే అధికారం, వారిని పదవి నుండి తొలగించే అధికారం, అట్లాగే ఇతర ఉన్నతాధికారులను పదవి నుండి తొలగించమని రాష్ట్రపతికి సిఫారసు చేసే అధికారం, కొత్త హైకోర్టులను ఏర్పాటుచేసే అధికారం పార్లమెంటుకు ఉన్నాయి.

6) ఎన్నికల విధులు: రాజ్యసభకు మరియు లోక్సభకు ఎన్నికైన సభ్యులు అందరూ కలసి రాష్ట్రపతిని ఎన్నుకొనే నియోజకగణంలో భాగంగా ఉంటారు. ఉపరాష్ట్రపతిని పార్లమెంటులోని ఉభయసభల సభ్యులు కలసి ఎన్నుకొంటారు. వీరుగాక లోక్సభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్లను లోక్సభ సభ్యులు, రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ను రాజ్యసభ సభ్యులు ఎన్నుకొంటారు.

7) ప్రజాభిప్రాయ వేదిక: దేశ పరిపాలనకు సంబంధించిన అనేక విషయాలపైన, బిల్లులపైన పార్లమెంట్ సమావేశాలలో సభ్యులు స్వేచ్చగా తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తారు. పార్లమెంటు సభ్యులు ప్రజాప్రతినిధులు కాబట్టి, వారు దేశంలో వివిధ ప్రాంతాలకు చెందినవారు కాబట్టి వారి విమర్శలు, చర్చల ద్వారా ప్రజాభిప్రాయం వ్యక్తమవుతుంది.

8) ఇతర అధికారాలు: పార్లమెంటుకు రాష్ట్రాల సరిహద్దులు, శాసన మండలాల ఏర్పాటు లేదా రద్దు, రాష్ట్రాల పేర్లు మార్చే అధికారం ఉన్నది.
ముగింపు: పైన పేర్కొన్న అధికారాలను పరిశీలిస్తే రాజ్యాంగం, భారత పార్లమెంటుకు విశేషమైన అధికారాలను కల్పించినట్లు తెలియుచున్నది. కానీ న్యాయసమీక్ష, సమాఖ్య ప్రభుత్వ విధానం, లిఖిత రాజ్యాంగం, ప్రాథమిక హక్కులు మొదలగు లక్షణాలు పార్లమెంటు అధికారాలపై కొంత నియంత్రణ స్వభావాన్ని కలిగి ఉన్నాయి.

ప్రశ్న 2.
లోక్సభ స్పీకర్ అధికారాలు, విధుల గురించి వ్రాయండి.
జవాబు:
లోక్సభ స్పీకర్: భారత రాజ్యాంగంలోని 93 నుండి 97 వరకు గల ఐదు అధికరణాలు లోక్సభ స్పీకర్ గురించి పేర్కొన్నాయి. లోక్సభ ఎన్నికలు పూర్తయిన తరువాత రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు లోక్సభ మొదటి సమావేశం తేదీని ప్రకటించడం జరుగుతుంది. ఆ సమావేశానికి అధ్యక్షత వహించేందుకు రాష్ట్రపతి తాత్కాలిక స్పీకర్ (Protem |Speaker) ను నియమిస్తాడు. సాధారణంగా ఎన్నికైన సభ్యులలో అందరికంటే ఎక్కువసార్లు లోక్సభకు ఎన్నికైన సభ్యుడిని లేదా అందరికంటే వయస్సులో పెద్దవాడైన సభ్యుడిని లేదా సభా నియమాలపట్ల క్షుణ్ణమైన అవగాహన గల సభ్యుడిని రాష్ట్రపతి తాత్కాలిక స్పీకర్గా నియమిస్తాడు. తాత్కాలిక స్పీకర్ సభ్యులతో ప్రమాణస్వీకారం చేయిస్తాడు. సభ్యుల ప్రమాణస్వీకార కార్యక్రమం పూర్తయిన తరువాత స్పీకర్ ఎన్నిక జరుగుతుంది.

ఎన్నిక: లోక్సభ సభ్యులు తమలో ఒకరిని స్పీకర్గానూ, మరొకరిని డిప్యూటీ స్పీకర్ గానూ ఎన్నుకుంటారు. సాధారణంగా లోక్సభలో మెజారిటీ స్థానాలు గల అధికార పార్టీకి స్పీకర్ పదవి, భావసారూప్యత గల ఇతర పక్షాలలో ఒకదానికి డిప్యూటీ స్పీకర్ పదవి కేటాయించడం జరుగుతుంది. ఐతే అనేకసార్లు అందుకు భిన్నంగా రెండు పదవులను
|అధికారపక్షమే ఉంచుకోవడం జరిగింది. ఒకవేళ లోక్సభలో ఏ ఒక్క పార్టీకి సంపూర్ణ మెజారిటీ రానిపక్షంలో, సంకీర్ణ మంత్రిమండలి ఏర్పడిన సందర్భంలో స్పీకర్ పదవికి అభ్యర్థిని నిర్ణయించడంలో భాగస్వామ్య పక్షాలు ఒక అవగాహనకు వచ్చి తమలో తాము సర్దుబాటు చేసుకొని ఒకరికి ఆ పదవి వచ్చే విధంగా ప్రయత్నిస్తాయి. మరికొన్ని ప్రత్యేక పరిస్థితులలో భాగస్వామ్య పక్షాలు ఆ పదవిని తమ వెలుపలి నుంచి మద్దతు ఇస్తున్న పార్టీ ఎంపిక చేసిన సభ్యునికి కూడా ఇవ్వవచ్చు.

స్పీకర్ అధికారాలు – విధులు: స్పీకర్ అధికారాలు – విధులను సక్రమంగా, సమర్ధవంతంగా నిర్వహించేందుకై అతడికి భారత రాజ్యాంగం విశేషాధికారాలను సంక్రమింపజేసింది. అంతేగాకుండా పార్లమెంటు కార్యక్రమాల నిర్వహణకు సంబంధించిన నియమ నిబంధల చట్టం (Rules of procedures and conduct of Business in Parliament Act – 1956) లోక్ సభ స్పీకర్కు క్రింద పేర్కొన్న వైవిధ్యంతో కూడిన అధికారాలు విధులు ఉంటాయి.

1) లోకసభ సమావేశాలను స్పీకర్ అధ్యక్షత వహిస్తాడు. లోక్సభ సమావేశాలను ఎంతో హుందాతనం, భద్రత, సామర్ధ్యాలతో నిర్వహిస్తాడు. సభానాయకుడని సంప్రదించి అజెండాను నిర్ణయిస్తాడు.

2) బిల్లులపై సభ్యులు అభిప్రాయాలు తెలిపేందుకు తగిన సమాయాన్ని కేటాయిస్తాడు. బిల్లులపై అవసరమైతే ఓటింగ్ నిర్వహించి, ఫలితాలను ప్రకటిస్తాడు.

3) లోక్సభ ఆమోదించిన బిల్లులను రాజ్యసభకు పంపుతాడు. రాజ్యసభ పంపించిన బిల్లులను ధృవీకరించి, వాటిని రాష్ట్రపతి ఆమోదానికి పంపుతాడు.

4) లోక్సభ ప్రతినిధిగా వ్యవహరిస్తాడు.

5) లోక్సభ సభ్యుల హక్కులు, సౌకర్యాల పరిరక్షణకు అవసరమైన చర్యలను గైకొంటాడు. సభలో అధికారం, ప్రతిపక్ష పార్టీల సభ్యుల మధ్య సమానమైన, నిష్పాక్షిక వైఖరిని ప్రదర్శిస్తాడు. ‘సభలో ప్రతిష్టంభన ఏర్పడితే, తన రూలింగ్ ద్వారా సాధారణ పరిస్థితుల పునరుద్ధరణకు దోహదపడతాడు.

6) ఒక బిల్లు ఆర్థిక పరమైందా ? లేదా ? అనే అంశాన్ని నిర్ణయిస్తాడు. సభ ఆమోదించిన బిల్లులపై సంతకాలు చేస్తాడు.

7) ఎ) స్పీకర్ సభ్యులు
(1) బిలులపై పాయింట్ ఆఫ్ ఆర్డరు ప్రతిపాదించేందుకు
(2) ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు
(3) ముఖ్యమైన ప్రజా సమస్యలను ప్రస్తావించేందుకు
బి) లోక్సభ సమావేశాలను వాయిదా వేసేందుకు
సి) లోక్సభ సమావేశాల కోరమ్ నిర్ణయించేందుకు అధికారం ఉంది.

8) రాష్ట్రపతి ప్రసంగంపై ప్రవేశపెట్టే ధన్యవాద తీర్మానంపై సభ్యులు అభిప్రాయాలను వెల్లడించేందుకు అవకాశం ఇస్తాడు.

9) వివిధ సభా సంఘాలను ఏర్పరచి, వాటి చైర్మన్లు, సభ్యులను నియమిస్తాడు. సభా నియమాల కమిటీ, సభావ్యవహారాల కమిటీలకు పదవిరీత్యా చైర్మన్ గా వ్యవహరిస్తాడు.

10) పార్లమెంటు ఉభయసభల సంయుక్త సమావేశాలకు అధ్యక్షత వహిస్తాడు.

11) కామన్వెల్త్ స్పీకర్ల ఫోరమ్ సభ్యుడిగానూ, ఇండియన్ పార్లమెంటరీ గ్రూప్ చైర్మన్ గాను, లోక్సభ సచివాలయ అధిపతిగానూ వ్యవహరిస్తాడు.

12) లోక్సభలో కొత్తగా ఎన్నికైన సభ్యులవద్ద ఎన్నికల ధృవీకరణ పత్రాలను స్వీకరిస్తాడు. అట్లాగే సభ్యులు సమర్పించిన రాజీనామా పత్రాలపైన, లోక్సభలో పత్రికా విలేఖరులకు, సందర్శకులకు సీట్ల కేటాయింపు వంటి అంశాలపై నిర్ణయాలు తీసుకొంటాడు.

AP Inter 2nd Year Civics Study Material Chapter 4 కేంద్ర శాసననిర్మాణ శాఖ

13) లోక్సభలోను, లోక్సభ ప్రాంగణంలోనూ మార్షల్స్, ఇతర సిబ్బంది పనులను పర్వవేక్షిస్తారు.

14) ఒకానొక బిల్లుపై ఓటింగ్ విషయంలో ప్రతిష్టంభన ఏర్పడితే, ఆ బిల్లు భవితవ్యాన్ని నిర్ణయించేందుకై ఓటు వేస్తాడు.

15) డిప్యూటీ స్పీకర్ పదవిలో ఖాళీ ఏర్పడినచో, ఆ స్థానం భర్తీకి ఎన్నిక నిర్వహిస్తాడు.

ప్రశ్న 3.
పార్లమెంటులోని ఆర్థిక సంఘాల పాత్రను అంచనా వేయండి.
జవాబు:
ఉపోద్ఘాతం: భారత పార్లమెంటులో ఆర్థిక సంఘాలు మూడున్నాయి. అవి:

  1. ప్రభుత్వ ఖాతాల సంఘం
  2. అంచనాల సంఘం
  3. ప్రభుత్వ ఉపక్రమాల సంఘం

1) ప్రభుత్వ ఖాతాల సంఘం: ప్రభుత్వ ఖాతాల సంఘం 1921లో ఏర్పాటైంది. దీనిలో 22 మంది సభ్యులు ఉంటారు. వారిలో 15 మంది లోక్సభ నుంచి, 7 గురు రాజ్యసభ నుంచి ఎన్నుకోబడతారు. వారి పదవీకాలం ఒక సంవత్సరం. వారందరూ నైష్పత్తిక ప్రాతినిధ్య పద్దతి ప్రకారం ‘ఏకోఓటుబదిలి’ సూత్రం ప్రకారం ఎన్నుకోబడతారు. లోక్సభ స్పీకర్ వారిలో ఒకరిని ఆ సంఘం అధ్యక్షుడిగా నియమిస్తాడు.

అధికారాలు, విధులు:

  1. భారత కంప్టోలర్ మరియు ఆడిటర్ జనరల్ వార్షిక గణాంక తనిఖీ నివేదికలను పరీక్షిస్తుంది.
  2. ప్రభుత్వ ఖర్చును న్యాయపరమైన, లాంఛనప్రాయమైన దృష్టితో చూసి, వాటిలో సాంకేతిక అభ్యంతరాలను పరీక్షిస్తుంది. ఆర్థిక పొదుపు, జ్ఞానం, సందర్భోచిత కోణములలో పరీక్షిస్తుంది.
  3. లోకసభలో ప్రవేశపెట్టిన వినియోగాధికార గణాంకాలు, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక గణాంకాలు, ఇతర గణాంకాలను పరిశీలించి వెల్లడిస్తుంది.
  4. ప్రభుత్వ నిధులు సక్రమంగా బట్వాడా చేయబడినవా, లేదా అనే అంశాన్ని పరీక్షిస్తుంది.
  5. కంట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ నిర్వహించిన గణాంకాలను తనిఖీ చేస్తుంది.

2) అంచనాల సంఘం: 1921లో ఆర్థిక స్థాయి సంఘంగా ఇది ఏర్పడింది. తర్వాత 1950 ఏప్రియల్లో అంచనాల సంఘంగా పేరు మారచ్చబడి పనిచేయడం ప్రారంభించింది. ఈ సంఘంలో లోక్సభ నుంచి 30 మంది సభ్యులు ఉంటారు. దీనిలో రాజ్యసభకు ప్రాతినిధ్యం లేదు. ప్రతి సంవత్సరం లోక్సభ సభ్యులు తమలో కొందరిని నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతి ప్రకారం ‘ఏకఓటుబదిలీ’ సూత్రం అనుసరించి ఈ సంఘం సభ్యులను ఎన్నుకొంటారు. ఈ సంఘం సభ్యులు ఒక ఏడాది పాటు పదవిలో ఉంటారు. లోక్సభ స్పీకర్ ఈ సంఘం అధ్యక్షుణ్ణి నియమిస్తాడు.

అధికారాలు, విధులు:

  1. కేంద్ర ప్రభుత్వం వ్యవస్థ సామర్థ్యాన్ని పెంచుకొనేందుకు, ఖర్చును తగ్గించుకొనేందుకు ఆర్థికపరమైన పొదుపును పాటించే విషయంలో సలహాలను ఇస్తుంది.
  2. ప్రభుత్వ నిధులు అంచనాలకు అనుగుణంగా బట్వాడా చేయబడినవా, లేదా అనే అంశాన్ని పరీక్షిస్తుంది.
  3. లోక్సభ స్పీకర్ అప్పగించిన విషయాలను పరీక్షిస్తుంది.
  4. అంచనాలలో చేర్చబడిన నిర్ణీత పరిధులకు లోబడి విధానాలు, వాటికి సంబంధించిన ధన సక్రమ వినియోగం గురించి పరీక్షిస్తుంది. కొందరు ఈ సంఘాన్ని నిరంతర ఆర్థిక సంఘంగా వర్ణించారు.

3) ప్రభుత్వ ఉపక్రమాల సంఘం: ఈ సంఘం 1964లో కృష్ణమీనన్ సంఘం సిఫార్సుల ప్రకారం ఏర్పాటైంది. దీనిలో 22 మంది సభ్యులుంటారు. 15 మంది లోక్సభ నుంచి 7 గురు రాజ్యసభ నుండి ఎన్నుకోబడతారు. వారిని ఎన్నుకొనేందుకు నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతి ప్రకారం ‘ఏకఓటు బదిలి’ సూత్రం అనుసరించబడుతుంది. వీరి పదవీ కాలం ఒక సంవత్సరం. ఈ సంఘం ముఖ్యోద్దేశం ఏమిటంటే ప్రభుత్వ ఖాతాల సంఘం పని భారాన్ని తగ్గించడం. ఈ సంఘం అధ్యక్షుడిగా లోక్సభ నుంచి ఎన్నికైన సభ్యులలో ఒకరిని స్పీకర్ నియమిస్తాడు. అంటే రాజ్యసభకు చెందిన సభ్యులెవరూ ఈ సంఘం అధ్యక్షుడిగా ఎన్నుకోబడరు.

అధికారాలు, విధులు:

  1. ప్రభుత్వ ఉపక్రమాల గణాంకాలను, నివేదికలను పరీక్షించడం.
  2. ప్రభుత్వ ఉపక్రమాలపై కంట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ నివేదికను పరీక్షించడం.
  3. ప్రభుత్వ ఉపక్రమ సంఘాలు మంచి వ్యాపార సూత్రాలను పాటిస్తూ వాటిని సక్రమంగా అమలుచేస్తున్నాయా లేదా, అనే విషయాన్ని పరీక్షించడం.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
లోక్సభ నిర్మాణం గురించి వ్రాయండి.
జవాబు:
లోక్సభ నిర్మాణం: లోక్సభ భారత పార్లమెంటులోని దిగువసభ. దీన్ని ఆంగ్లంలో “హౌస్ ఆఫ్ ది పీపుల్” అని పిలుస్తారు.

భారత రాజ్యాంగం 81వ అధికరణం లోక్సభ నిర్మాణాన్ని తెలియజేస్తుంది. ఆ అధికరణం ప్రకారం లోక్సభలో 552 మంది సభ్యులుంటారు. మొత్తం సభ్యులలో 530 మంది రాష్ట్రాలకు, 20 మంది కేంద్రపాలిత ప్రాంతాలకు చెందినవారుకాగా, మిగిలిన ఇద్దరు సభ్యులు ఆంగ్లో ఇండియన్ వర్గానికి చెందినవారు. లోక్సభలో ఆంగ్లో ఇండియన్లకు తగిన ప్రాతినిధ్యంలేదని రాష్ట్రపతి భావిస్తే, ఆ వర్గానికి చెందిన ఇద్దరు సభ్యులను రాష్ట్రపతి నామినేట్ చేస్తాడు. రాజ్యాంగం 81వ అధికరణం ప్రకారం లోక్సభలో రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహించే సభ్యులను ఆయా రాష్ట్రాలలోని రిజిష్టర్డ్ ఓటర్లు ఎన్నుకుంటారు. అట్లాగే కేంద్రపాలిత ప్రాంతాలలోని సభ్యులను ఆ ప్రాంతంలోని రిజిష్టర్డ్ ఓటర్లు ఎన్నుకుంటారు. ప్రత్యక్ష ప్రాతినిధ్య పద్ధతి ప్రకారం సభ్యుల ఎన్నిక జరుగుతుంది.

AP Inter 2nd Year Civics Study Material Chapter 4 కేంద్ర శాసననిర్మాణ శాఖ

ప్రశ్న 2.
సభాపతి (స్పీకర్) ఎన్నిక విధానమును వివరించండి.
జవాబు:
లోక్సభ సభ్యులు తమలో ఒకరిని స్పీకర్గానూ, వేరొకరిని డిప్యూటీ స్పీకర్గానూ ఎన్నుకుంటారు. సాధారణంగా లోక్సభలో మెజారిటీ స్థానాలుగల అధికార పార్టీకి స్పీకర్ పదవి, భావసారూప్యత గల ఇతర పక్షాలలో ఒక దానికి డిప్యూటీ స్పీకర్ పదవిని కేటాయించడం జరుగుతుంది. ఐతే కొన్నిసార్లు అందుకు భిన్నంగా రెండు పదవులను అధికార పక్షమే ఉంచుకోవడం జరిగింది. ఒకవేళ లోక్సభలో ఏ ఒక్క పార్టీకి సంపూర్ణ మెజారిటీ రాని పక్షంలో, సంకీర్ణ మంత్రిమండలి ఏర్పడిన సందర్భంలో స్పీకర్ పదవికి అభ్యర్థిని నిర్ణయించడంలో భాగస్వామ్య పక్షాలు ఒక అవగాహనకు వచ్చి తమలో తాము సర్దుబాటు చేసుకుని ఒకరికి ఆ పదవి వచ్చే విధంగా ప్రయత్నిస్తాయి. మరికొన్ని ప్రత్యేక పరిస్థితులలో భాగస్వామ్య పక్షాలు ఆ పదవిని తమకు వెలపలి నుంచి మద్దతు ఇస్తున్న పార్టీ ఎంపిక చేసిన సభ్యునికి కూడా ఇవ్వవచ్చు. ఇటువంటి పరిస్థితి 1998 మార్చిలో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ఎన్.డి.ఏ. ప్రభుత్వానికి ఎదురైంది. ప్రభుత్వానికి వెలుపలి నుంచి మద్దతునిచ్చే ప్రాంతీయ పార్టీ తెలుగుదేశానికి చెందిన జి.ఎమ్.సి. బాలయోగికి ఆ పదవి లభించింది. తరువాత ఆయన ఆకస్మిక మరణంవల్ల భాగస్వామ్య పక్షాలలో ఒకటైన శివసేనకు చెందిన మనోహర్ గజానన్ జోషి 2002 మే 10న ఆ పదవిని చేపట్టాడు. అలాగే పద్నాలుగో లోక్సభలో ఐక్యప్రగతి కూటమి (యుపిఎ) కి మద్దతుగా కేంద్ర ప్రభుత్వాన్ని వెలుపలి నుంచి బలపరుస్తున్న భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) కి చెందిన సోమనాథ్ చటర్జీ లోక్సభ స్పీకర్గా ఎన్నికయ్యారు.

స్పీకర్ ఎన్నికలో రెండు ఆసక్తికరమైన అంశాలు ఉంటాయి. అవి: (1) స్పీకర్గా ఎన్నికయ్యే వ్యక్తి తప్పనిసరిగా లోక్సభ సభ్యుడై ఉండాలి. (2) లోక్సభ రద్దయినప్పటికీ స్పీకర్ ఆ పదవిలో కొనసాగుతాడు. కొత్త లోక్సభకు ఎన్నికలు జరిగి నూతన స్పీకర్ ఎంపిక, పదవీ స్వీకారం వరకు స్పీకర్ అధికారంలో కొనసాగుతాడు.

ఒకవేళ స్పీకర్ సక్రమంగా, నిష్పక్షపాతంగా అధికార విధులను నిర్వహించనట్లయితే లోక్సభ సభ్యులు అభిశంసన తీర్మానం ద్వారా ఆయనను తొలగించవచ్చు. అటువంటి తీర్మానాన్ని 14 రోజుల ముందుగా సభకు సమర్పించాలి. ఆ గడువు ముగిసిన తరువాత ఏదో ఒకరోజున సభ ఆ తీర్మానంపై చర్చను ప్రారంభిస్తుంది. ఆ సమయంలో, ఆ తరువాత తీర్మానంపై ఓటింగ్ నిర్వహించేటప్పుడు స్పీకర్ అధ్యక్ష స్థానంలో ఉండటానికి ఓటింగ్లో పాల్గొనడానికి వీలులేదు. తన అభిప్రాయాలను సభలో వెల్లడించేందుకు ఆయనకు అవకాశం ఉంటుంది.

ప్రశ్న 3.
రాజ్య సభ నిర్మాణం, సభ్యుల అర్హతలు గురించి నీకు ఏమి తెలియునో పేర్కొనండి.
జవాబు:
రాజ్యసభ నిర్మాణం: రాజ్యసభలో సభ్యత్వం మొత్తం 250కు మించి ఉండదు. భారత ఉపరాష్ట్రపతి ఈ సభకు అధికార హోదా రీత్యా అధ్యక్షుడిగా వ్యవహరిస్తాడు. రాజ్యసభ సభ్యులు తమలో ఒకరిని రాజ్యసభ ఉపాధ్యక్షుడిగా ఎన్నుకొంటారు. ప్రస్తుతం రాజ్యసభలో 245 మంది సభ్యులు ఉన్నారు. వారిలో 233 మంది రాష్ట్రాల నుండి ఎన్నుకోబడగా, మిగిలిన 12మంది భారత రాష్ట్రపతిచే నియమితులవుతారు. మొత్తం సభ్యులలో 229 మంది 29 రాష్ట్రాల నుండి ఎన్నుకోబడగా, ముగ్గురు సభ్యులు జాతీయ దేశ రాజధాని ప్రాంతం ఢిల్లీ నుండి, ఒకరు కేంద్రపాలిత ప్రాంతం అయిన పుదుచ్చేరి నుండి ఎన్నుకోబడతారు. వివిధ రంగాల్లో నిష్ణాతులు మరియు విశిష్ట సేవ చేసిన 12 మంది ప్రముఖులను రాష్ట్రపతి రాజ్యసభకు సభ్యులుగా నియమిస్తాడు. సాధారణంగా వారు సాహిత్య, శాస్త్ర విజ్ఞానము, కథలు, సామాజిక రంగాలకు చెందినవారై ఉంటారు.

రాజ్యసభ సభ్యులకుండవలసిన అర్హతలు:

  1. అతడు భారత పౌరుడై ఉండాలి.
  2. అతడు కనీసం 30 సం|| వయస్సు కలిగి ఉండాలి.
  3. అతడు ఆ రాష్ట్రంలో కనీసం ఆరు నెలలు నివాసం ఉండి ఉండాలి.
  4. అతడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో ఆదాయాన్ని పొందే ఏ హోదాలోనూ పనిచేసి ఉండరాదు.
  5. అతడు మతిస్థిమితం లేనివాడు లేదా దివాళా కోరు కారాదు.
  6. అతడు పార్లమెంటుచే సూచించబడిన ఇతర అర్హతలు కూడా పొంది ఉండాలి.

AP Inter 2nd Year Civics Study Material Chapter 4 కేంద్ర శాసననిర్మాణ శాఖ

ప్రశ్న 4.
రాజ్యసభ ఛైర్మన్ మరియు డిప్యూటీ ఛైర్మన్ల గురించి వ్రాయండి.
జవాబు:
రాజ్యసభ చైర్మన్: రాజ్యసభ కార్యక్రమాలను నిర్వహించే వ్యక్తిని చైర్మన్ అంటారు. రాజ్యసభలో సభ్యుడు కాకపోయిప్పటికి భారత ఉపరాష్ట్రపతి అధికార హోదా రీత్యా రాజ్యసభకు చైర్మన్. పార్లమెంటు సభ్యులు అతడిని ఉపరాష్ట్రపతిగా 5సం|| కాలానికి ఎన్నుకొంటారు. దాని అర్థం లోక్సభ, రాజ్యసభల సభ్యులందరూ ఉపరాష్ట్రపతి ఎన్నికలలో
పాల్గొంటారు. ప్రస్తుతం రాజ్యసభ చైర్మను నెలకు జీతభత్యాల క్రింద 1,40,000/- రూపాయలు చెల్లించబడతాయి. భారత సంఘటిత నిధి నుండి ఆయన జీతభత్యాలు చెల్లించబడతాయి. భారత ఉపరాష్ట్రపతి పదవి నుండి తొలగించబడినప్పుడే ఆయన రాజ్యసభ చైర్మన్ పదవీ బాధ్యతల నుంచి తప్పుకొంటాడు.

డిప్యూటీ చైర్మన్: రాజ్యసభ సభ్యులు తమలో ఒకరిని డిప్యూటీ చైర్మన్ గా ఎన్నుకొంటారు. రాజ్యసభ డిప్యూటీ * చైర్మన్ నెలకు 90,000/- రూపాయలు జీతభత్యాలు పొందుతారు. రాజ్యసభ చైర్మన్ సభకు హాజరు కాని సమయాలలో డిప్యూటీ చైర్మన్ రాజ్యసభ సభా కార్యక్రమాలను నిర్వహిస్తాడు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవి ఖాళీ అయితే, ఆ ఖాళీ భర్తీ చేయుటకు సభ్యులు ఇంకొకరిని ఎన్నుకొంటారు.

ప్రశ్న 5.
భారత పార్లమెంటుకు గల ఏవైనా మూడు అధికార విధులను తెలపండి.
జవాబు:
1) శాసన సంబంధమైనవి (Legislative Powers): భారత పార్లమెంటు కేంద్ర జాబితా, ఉమ్మడి జాబితాల్లోని అంశాలపై బిల్లులను పరిశీలించి ఆమోదిస్తుంది. అలాగే (ఎ) జాతీయ అత్యవసర పరిస్థితి (బి) రాష్ట్రపతి పాలన అమలులో ఉన్నప్పుడు, (సి) రాజ్యసభ విజ్ఞప్తిపై (డి) కొన్ని రాష్ట్రాల అసెంబ్లీల అభ్యర్థన మేరకు రాష్ట్ర జాబితాలోని అంశాలపై బిల్లులను ఆమోదిస్తుంది. రాష్ట్రపతి జారీచేసే ఆర్డినెన్సుల స్థానంలో మంత్రులు ప్రతిపాదించే బిల్లులను కూడా ఆమోదిస్తుంది. సాధారణంగా పార్లమెంటు ఉభయసభల్లో దేనిలోనైనా బిల్లులను ప్రతిపాదించడం జరుగుతుంది. ప్రతి బిల్లును రెండు సభలు ఆమోదించిన తరవాతనే స్పీకర్ సంతకంతో వాటిని రాష్ట్రపతి పరిశీలన, ఆమోదాలకు పంపించడం జరుగుతుంది. కొన్ని అరుదైన సందర్భాలలో ఏదైనా ఒక బిల్లు ఆమోదం విషయంలో రెండు సభల మధ్య అభిప్రాయభేదాలు తలెత్తితే, రాష్ట్రపతి సూచనపై పార్లమెంటు ఉభయసభల సంయుక్త సమావేశం ఏర్పాటవుతుంది.

2) కార్యనిర్వాహక సంబంధమైనవి (కార్యవర్గంపై అజమాయిషీ) (Executive Powers-Control Over Executive): భారత పార్లమెంటుకు కేంద్ర కార్యనిర్వాహకశాఖ (కేంద్ర మంత్రిమండలి)పై అజమాయిషీ ఉంటుంది. ప్రధానమంత్రితో సహా కేంద్ర మంత్రిమండలి జట్టులోని సభ్యులందరూ వ్యక్తిగతంగానూ, ఉమ్మడిగానూ, సమిష్టి బాధ్యతతో తమ అధికార – బాధ్యతలు నిర్వహించేటట్లు పార్లమెంటు చూస్తుంది. పార్లమెంటు సభ్యులు ప్రశ్నలు, అనుబంధ ప్రశ్నలు, కోత తీర్మానాలు, చివరికి అవిశ్వాస తీర్మానం వంటి సాధనాల ద్వారా కార్యనిర్వాహక శాఖపై నియంత్రణ కలిగి ఉంటారు. ప్రధానమంత్రితో సహా మంత్రులందరూ పార్లమెంటు ఉభయ సభలలో సభ్యులు అడిగే ప్రశ్నలు, అనుబంధ ప్రశ్నలకు సరైన సమాధానాలను సకాలంలో, సక్రమరీతిలో ఇవ్వవలసి ఉంటుంది. ప్రతి ఏటా రాష్ట్రపతి చేసే ప్రసంగానికి, ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెటుకు ఆమోదం తెలిపే సందర్భాలలో పార్లమెంటు సభ్యులు కేంద్ర ప్రభుత్వం పనితీరును, గతంలో తీసుకున్న నిర్ణయాలను, అమలులో ఉన్న విధాన నిర్ణయాలను, వర్తమానంలో అనుసరించే ధోరణిని నిశితంగా సమీక్షిస్తారు. జీరో అవర్, కోత తీర్మానం, సభాహక్కుల తీర్మానం, ఓట్-ఆన్-అకౌంట్ వంటి సందర్భాలలో పార్లమెంటు సభ్యులకు కార్యనిర్వాహక వర్గంపై పూర్తి అజమాయిషీ ఉంటుంది.

3) ఆర్థిక సంబంధమైనవి (Financial Powers): భారత ప్రభుత్వ వ్యవహారాల నిర్వహణకు అవసరమైన ద్రవ్యాన్ని పార్లమెంటు మంజూరు చేస్తుంది. కేంద్ర మంత్రిమండలి ప్రతిపాదించే వార్షిక బడ్జెట్, రైల్వే బడ్జెట్లతో సహా అనేక ఆర్థిక బిల్లులను అది ఆమోదిస్తుంది. పార్లమెంటు ఆమోదంతోనే కేంద్ర ప్రభుత్వం కొత్త పన్నులను విధించేందుకు, పాత పన్నులను సవరించేందుకు లేదా రద్దు చేసేందుకు చర్యలు తీసుకోవాలి. అలాగే (ఎ) భారత కంప్టోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (బి) ఆర్థిక సంఘం (సి) ప్రభుత్వ ఖాతాల సంఘం (డి) అంచనాల సంఘం వంటి సభా సంఘాల నివేదికలను పార్లమెంటు పరిశీలించి ఆమోదిస్తుంది. ఈ విషయంలో రాజ్యసభకంటే లోక్సభకే ఎక్కువ అధికారాలు ఉన్నాయి.

ప్రశ్న 6.
బిల్లుల రకాలను వ్రాయండి.
జవాబు:
బిల్లులనేవి పార్లమెంటులో ప్రతిపాదించబడి, చర్చించబడి ఆమోదించబడే రాతపూర్వక ముసాయిదాలు. పార్లమెంటు ఉభయసభలు బిల్లులును ఆమోదించనిదే అవి చట్టంగా చెలామణి కావు. ఒకసారి ఉభయసభల ఆమోదం పొందినచో, బిల్లులు చట్టాలుగా రూపొందుతాయి. మొత్తంమీద పార్లమెంటులో ప్రవేశపెట్టబడే బిల్లులు రెండు రకాలుగా ఉంటాయి. అవి 1. పబ్లిక్ బిల్లులు (ప్రభుత్వ బిల్లులు) 2. ప్రైవేటు బిల్లులు, పబ్లిక్ బిల్లులనేవి పార్లమెంటులో మంత్రులచే ప్రవేశపెట్టబడేవి. ఇక మంత్రులు కాని సభ్యులు పార్లమెంటులో ప్రతిపాదించబడే వాటిని ప్రైవేటు బిల్లులుగా పరిగణించడమైంది. వేరొకవైపు పార్లమెంటులో ప్రతిపాదించబడే బిల్లుల స్వభావం ఆధారంగా వాటిని నాలుగు రకాలుగా వర్గీకరించవచ్చు.
అవి:

  1. సాధారణ బిల్లు
  2. ఆర్థిక బిల్లు
  3. ద్రవ్య బిల్లు
  4. రాజ్యాంగ సవరణ బిల్లు.

సాధారణ బిల్లులనేవి ఆర్థికేతర విషయాలకు సంబంధించినవి. ద్రవ్యబిల్లులనేవి పన్నులు, ప్రభుత్వ వ్యయంలాంటి అంశాలలో ముడిపడి ఉంటాయి. ఆర్థిక బిల్లులనేవి ద్రవ్య బిల్లుల కంటే భిన్నమైనవి. ప్రభుత్వ రెవెన్యూ వంటి విషయాలు వీటిలో ఇమిడి ఉంటాయి. చివరగా రాజ్యాంగ సవరణ బిల్లులు రాజ్యాంగంలోని వివిధ అంశాల సవరణకు ఉద్దేశించినవి.

AP Inter 2nd Year Civics Study Material Chapter 4 కేంద్ర శాసననిర్మాణ శాఖ

ప్రశ్న 7.
భారత పార్లమెంటులో శాసన నిర్మాణ ప్రక్రియ దశలను సంక్షిప్తంగా వివరించండి.
జవాబు:
పార్లమెంటులో సాధారణంగా చట్టంగా రూపొందక పూర్వం ప్రతి బిల్లు పార్లమెంటులో ఐదు దశలలో పయనిస్తుంది. అవి 1. బిల్లు ప్రతిపాదన 2. మూడు పఠనాలు 3. రెండో సభలో బిల్లు పరిశీలన 4. సంయుక్త సమావేశం 5. రాష్ట్రపతి ఆమోదం. పైన పేర్కొన్న ఐదు దశలను క్రింద వివరించడమైంది.

1) మొదటి దశ – బిల్లు ప్రతిపాదన: పార్లమెంటులో ఒకానొక బిల్లును ప్రవేశపెట్టాలనే ప్రతిపాదన వచ్చినపుడు, బిల్లుకు సంబంధించిన రాజకీయ, పాలనా అంశాల గురించి సంబంధిత మంత్రిత్వ శాఖ సమాచారాన్ని సేకరిస్తుంది. తరువాత ఆ మంత్రిత్వ శాఖ ఆ విషయాన్ని కేంద్ర కాబినెట్ దృష్టికి తీసుకువెళుతుంది. కేంద్ర కాబినెట్ కనుక ఆ బిల్లును ఆమోదిస్తే, సంబంధిత మంత్రి ఎనిమిది రోజుల వ్యవధిలో సభకు ఆ బిల్లును సమర్పిస్తాడు.

2) రెండో దశ – మూడు పఠనాలు: ఈ దశలో బిల్లు ప్రతిపాదన కర్త స్పీకర్ అనుమతితో ఒక నిర్ణీత రోజున బిల్లును సభలో ప్రవేశపెడతాడు. దీనినే ప్రథమ పఠనం అంటారు. రెండో పఠనంలో మరలా రెండు దశలుంటాయి. మొదటి దశలో బిల్లుపై సాధారణ చర్చ జరుగుతుంది. రెండవ దశలో బిల్లుకు అవసరమైన సవరణలు ప్రతిపాదించవచ్చు. మూడవ పఠనంలో బిల్లుకు సంబంధించిన షెడ్యూళ్ళు, క్లాజులను సభ పరిశీలించి ఓటింగ్ జరుగుతుంది.

3) మూడో దశ – రెండోసభలో బిల్లు పరిశీలన: మొదటి సభలో బిల్లును ఆమోదించిన తరువాత బిల్లు రెండో సభ పరిశీలనకు పంపించబడుతుంది. మొదటి సభవలె, రెండో సభ బిల్లును వివిధ దశలలో పరిశీలిస్తుంది. అప్పుడు రెండో సభ బిల్లును యధాతథంగా ఆమోదించుటకు, బిల్లులో కొన్ని సవరణలను ప్రతిపాదించుటకు లేదా బిల్లును పూర్తిగా తిరస్కరించేందుకు అధికారాన్ని కలిగి ఉంటుంది.

4) నాలుగోదశ సంయుక్త సమావేశం: ఒకానొక బిల్లు ఆమోదం విషయంలో రెండు సభల మధ్య ప్రతిష్టంభన ఏర్పడినపుడు రాష్ట్రపతి ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేస్తాడు. ఆ సమావేశానికి లోక్సభ స్పీకర్ అధ్యక్షత వహిస్తాడు. ఆ బిల్లులో ఏవైనా సవరణలను ప్రవేశపెట్టేందుకు సభ్యులకు అవకాశం ఉంటుంది.

5) ఐదోదశ – రాష్ట్రపతి ఆమోదం: ఒక బిల్లును రెండు సభలు ఆమోదించిన తరువాత స్పీకర్ ఆ బిల్లును రాష్ట్రపతి ఆమోదానికై పంపుతాడు. రాష్ట్రపతి బిల్లును ఆమోదిస్తే ఆ బిల్లు చట్టరూపంలో అమల్లోకి వస్తుంది.

ప్రశ్న 8.
ప్రభుత్వ ఖాతాల సంఘం గురించి నీకు ఏమి తెలియునో వ్రాయండి.
జవాబు:
ప్రభుత్వ ఖాతాల సంఘం 1921లో ఏర్పాటైంది. దీనిలో 22మంది సభ్యులు ఉంటారు. వారిలో 15 మంది లోక్సభనుంచి, 7 గురు రాజ్యసభనుంచి ఎన్నుకోబడతారు. వారి పదవీకాలం ఒక సంవత్సరం. వారందరూ నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతి ప్రకారం ‘ఏకఓటుబదిలీ’ సూత్రం ప్రకారం ఎన్నుకోబడతారు. లోక్సభ స్పీకర్ వారిలో ఒకరిని ఆ సంఘం అధ్యక్షుడిగా నియమిస్తాడు.

అధికారాలు, విధులు:

  1. భారత కంప్టోలర్ మరియు ఆడిటర్ జనరల్ వార్షిక గణాంక తనిఖీ నివేదికలను పరీక్షిస్తుంది.
  2. ప్రభుత్వ ఖర్చును న్యాయపరమైన, లాంభనప్రాయమైన దృష్టితో చూసి, వాటిలో సాంకేతిక అభ్యంతరాలను పరీక్షిస్తుంది. ఆర్థిక పొదుపు, జ్ఞానం, సందర్భోచిత కోణములలో పరీక్షిస్తుంది.
  3. లోకసభలో ప్రవేశపెట్టిన వినియోగాధికార గణాంకాలు, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక గణాంకాలు, ఇతర గణాంకాలను పరిశీలించి వెల్లడిస్తుంది.
  4. ప్రభుత్వ నిధులు సక్రమంగా బట్వాడా చేయబడినవా, లేదా అనే అంశాన్ని పరీక్షిస్తుంది.
  5. కంప్టోలర్ మరియు ఆడిటర్ జనరల్ నిర్వహించిన గణాంకాలను తనిఖీ చేస్తుంది.

ప్రశ్న 9.
అంచనాల సంఘం నిర్మాణము, విధులను వర్ణించండి.
జవాబు:
నిర్మాణం: 1921లో ఆర్థిక స్థాయి సంఘంగా ఇది ఏర్పడింది. తర్వాత 1950 ఏప్రియల్లో అంచనాల సంఘంగా పేరు మార్చబడి పనిచేయడం ప్రారంభించింది. ఈ సంఘంలో లోక్సభ నుంచి 30 మంది సభ్యులు ఉంటారు. దీనిలో రాజ్యసభకు ప్రాతినిధ్యం లేదు. ప్రతి సంవత్సరం లోక్సభ సభ్యులు తమలో కొందరిని నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతి ప్రకారం ‘ఏకఓటుబదిలీ’ సూత్రం అనుసరించి ఈ సంఘం సభ్యులను ఎన్నుకొంటారు. ఈ సంఘం సభ్యులు ఒక ఏడాది పాటు పదవిలో ఉంటారు. లోక్సభ స్పీకర్ ఈ సంఘం అధ్యక్షుణ్ణి నియమిస్తాడు.

విధులు:

  1. కేంద్ర ప్రభుత్వం వ్యవస్థ సామర్థ్యాన్ని పెంచుకొనేందుకు, ఖర్చును తగ్గించుకొనేందుకు ఆర్థికపరమైన పొదుపును పాటించే విషయంలో సలహాలను ఇస్తుంది.
  2. ప్రభుత్వ నిధులు అంచనాలకు అనుగుణంగా బట్వాడా చేయబడినవా, లేదా అనే అంశాన్ని పరీక్షిస్తుంది.
  3. లోక్సభ స్పీకర్ అప్పగించిన విషయాలను పరీక్షిస్తుంది.
  4. అంచనాలలో చేర్చబడిన నిర్ణీత పరిధులకు లోబడి విధానాలు, వాటికి సంబంధించిన ధన సక్రమ వినియోగం గురించి పరీక్షిస్తుంది. కొందరు ఈ సంఘాన్ని నిరంతర ఆర్థిక సంఘంగా వర్ణించారు.

AP Inter 2nd Year Civics Study Material Chapter 4 కేంద్ర శాసననిర్మాణ శాఖ

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
పార్లమెంటు నిర్మాణం.
జవాబు:
రాజ్యాంగం 79వ అధికరణం ప్రకారం కేంద్ర శాసన నిర్మాణ శాఖలో (ఎ) రాష్ట్రపతి, (బి) పార్లమెంటులోని ఉభయసభలు అంతర్భాగాలు. లోక్సభ అనేది పార్లమెంటులో దిగువసభ కాగా, రాజ్యసభ ఎగువసభ. రాష్ట్రపతికి ఉభయసభల సమావేశాలను ప్రారంభించేందుకు, వాయిదా వేసేందుకు అధికారం ఉంటుంది.

ప్రశ్న 2.
రాజ్యసభ సభ్యుల అర్హతలు.
జవాబు:

  1. భారతీయ పౌరుడై ఉండాలి.
  2. 30 సంవత్సరాలు వయస్సు నిండి ఉండాలి.
  3. ఏ రాష్ట్రం నుండి ఎన్నిక కాబడితే ఆ రాష్ట్రంలో కనీసం ఆరు నెలలు నివాసం ఉండి ఉండాలి.
  4. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో ఆదాయాన్ని పొందే ఏ హోదాలోను పనిచేసి ఉండరాదు.
  5. అతడు మతిస్థిమితం లేనివాడు లేదా దివాళాకోరు కారాదు.
  6. పార్లమెంటు సూచించిన ఇతర అర్హతలను కూడా కల్గి ఉండాలి.

ప్రశ్న 3.
లోక్సభలో కోరమ్. [Mar. ’16]
జవాబు:
లోక్సభ సమావేశాలను నిర్వహించేందుకు సభలో ఉండాల్సిన కనీస సభ్యుల సంఖ్యను ‘కోరమ్’ అంటారు. ఆ కనీస సంఖ్య మొత్తం సభ్యులలో 1/10వ వంతుగా నిర్ణయించబడింది.

ప్రశ్న 4.
లోక్సభ స్పీకర్.
జవాబు:
భారత రాజ్యాంగం లోక్సభలో స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవులను ఏర్పాటు చేసింది. లోక్సభ సభ్యులు తమలో ఒకరిని స్పీకర్గా ఎన్నుకొంటారు. స్పీకర్ లోక్సభ సమావేశాలను సక్రమంగా, సాఫీగా నిర్వహించే బాధ్యతను కల్గి ఉంటాడు. సభ్యుల సంరక్షకుడిగా, సభ ముఖ్య అధికార ప్రతినిధిగా ఉంటూ సభలో అత్యున్నత అధికారములు కల్గి ఉంటాడు.

ప్రశ్న 5.
లోక్సభ డిప్యూటీ స్పీకర్.
జవాబు:
భారత రాజ్యాంగంలోని 93వ ప్రకరణ ప్రకారం, లోక్సభ సమావేశాలను స్పీకర్ లేని సమయాలలో నిర్వహించేందుకు ఒక డిప్యూటీ స్పీకర్ ఉంటారు. లోక్సభ సభ్యులు తమలో ఒకరిని డిప్యూటీ స్పీకర్గా ఎన్నుకుంటారు. లోక్సభ సమావేశాలకు అధ్యక్షత వహించే సమయంలో స్పీకర్కుండే అధికారాలు, ప్రత్యేక హక్కులు అన్నీ డిప్యూటీ స్పీకర్కు ఉంటాయి.

AP Inter 2nd Year Civics Study Material Chapter 4 కేంద్ర శాసననిర్మాణ శాఖ

ప్రశ్న 6.
ప్రభుత్వ ఉపక్రమాల సంఘం. [Mar. ’17]
జవాబు:
ఈ సంఘం 1964లో కృష్ణమీనన్ సంఘం సిఫారసుల ప్రకారం ఏర్పాటైంది. దీనిలో 22 మంది సభ్యులుంటారు. వీరిలో 15 మంది లోక్సభ నుండి, 7 గురు రాజ్యసభ నుండి ఎన్నుకోబడతారు. వీరి పదవీకాలం ఒక సంవత్సరం. ఈ సంఘం ప్రభుత్వ ఉపక్రమాల గణాంకాలను, నివేదికలను పరీక్షిస్తుంది. ప్రభుత్వ ఖాతాల సంఘం, అంచనాల సంఘపు ఇతర విధులను నిర్వహిస్తుంది.

ప్రశ్న 7.
స్పీకర్ జాబితా.
జవాబు:
లోక్సభ స్పీకర్ లోక్సభలోని కొందరు సభ్యులతో కూడిన జాబితాలను తయారుచేసి ప్రకటిస్తాడు. ఈ జాబితాలో గరిష్ఠంగా పదిమంది సభ్యులుంటారు. లోక్సభ సమావేశాల సమయంలో స్పీకర్ మరియు డిప్యూటీ స్పీకర్ లేని సమయంలో ఈ జాబితాలో ఒకరు సభకు అధ్యక్షత వహించి సమావేశాలను నిర్వహిస్తారు.

ప్రశ్న 8.
తాత్కాలిక (ప్రోటెం) స్పీకర్.
జవాబు:
లోక్సభ సాధారణ ఎన్నికలు ముగిసిన తరువాత రాష్ట్రపతి ప్రొటెం స్పీకర్ను నియమిస్తాడు. ప్రోటెం స్పీకర్ లోక్సభ తొలి సమావేశానికి అధ్యక్షత వహిస్తాడు. సాధారణంగా రాష్ట్రపతి లోక్సభకు ఎన్నికైన సభ్యులందరిలో వయస్సులో పెద్దవాడైన వ్యక్తికి ప్రొటెం స్పీకర్గా నియమిస్తాడు. ప్రోటెం స్పీకర్ కొత్తగా ఎన్నికైన సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయిస్తాడు. ఆ తరువాత స్పీకర్ ఎన్నిక జరుగుతుంది. కొత్త స్పీకర్ ఎన్నికైన తరువాత ప్రొటెం స్పీకర్ పదవి రద్దవుతుంది.

ప్రశ్న 9.
ప్రశ్నా సమయం. [Mar. ’16]
జవాబు:
పార్లమెంటు సమావేశాలలో ప్రతిరోజు మొదటి గంట ప్రశ్నా సమయంకు కేటాయించబడుతుంది. సాధారణంగా ప్రశ్నాసమయం ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుంది. ఆ సమయంలో ప్రభుత్వ పాత్ర, ప్రజాసంబంధ విషయాలు, ప్రభుత్వ పాలన అసమర్థత మొదలగు అంశాలపై సభ్యులు ప్రశ్నల నోటీసులను స్పీకర్కు అందిస్తారు. ప్రశ్నలు మూడు రకాలు.

  1. నక్షత్ర ప్రశ్నలు
  2. నక్షత్రం లేని ప్రశ్నలు
  3. స్వల్ప వ్యవధి ప్రశ్నలు

ప్రశ్న 10.
వాయిదా తీర్మానం.
జవాబు:
పార్లమెంటు సమావేశాలలో ఒకానొక ప్రజా ప్రాధాన్యత అంశాన్ని సభ దృష్టికి తెచ్చేందుకై సభ్యులు ప్రవేశపెట్టే | తీర్మానాన్నే వాయిదా తీర్మానం అంటారు. ఈ తీర్మానాన్ని ప్రతిపాదించేందుకు కనీసం 50 మంది సభ్యుల యుద్ధము అవసరం. వాయిదా తీర్మానంపై రెండున్నర గంటల వ్యవధి తగ్గకుండా చర్చ జరుగుతుంది.

ప్రశ్న 11.
విప్. [Mar. ’17]
జవాబు:
పార్లమెంటు సమావేశాలకు హాజరవ్వాల్సిందిగా సభ్యులను కోరే అధికారం ఉండటాన్ని విప్ అంటారు. విపన్ను జారీ చేసే అధికారం అధికార పార్టీకి, ప్రతిపక్ష పార్టీకి ఉంటుంది. విప్లను ఆయా పార్టీల నాయకులు నియమిస్తారు. సభ్యులందరూ విప్ల ఆదేశాలను తప్పకుండా పాటించాలి. లేనట్లయితే వారిపై పార్టీ నాయకత్వం క్రమశిక్షణా చర్యలు తీసుకోవచ్చు.

AP Inter 2nd Year Civics Study Material Chapter 4 కేంద్ర శాసననిర్మాణ శాఖ

ప్రశ్న 12.
అవిశ్వాస తీర్మానం.
జవాబు:
అవిశ్వాస తీర్మానాన్ని లోక్సభలో ప్రతిపాదించేందుకు రాజ్యాంగంలోని 75వ ప్రకరణ వీలు కల్పించింది. అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపక్షపార్టీ సభ్యులు ప్రవేశపెడతారు. ఈ తీర్మానాన్ని ప్రతిపాదించాలంటే 50 మంది సభ్యుల మద్దతు అవసరం. అవిశ్వాస తీర్మానాన్ని లోక్సభ ఆమోదించినట్లయితే కేంద్ర కాబినెట్ రాజీనామా చేయాల్సి ఉంటుంది.

AP Inter 2nd Year Civics Study Material Chapter 3 కేంద్ర కార్యనిర్వాహక శాఖ

Andhra Pradesh BIEAP AP Inter 2nd Year Civics Study Material 3rd Lesson కేంద్ర కార్యనిర్వాహక శాఖ Textbook Questions and Answers.

AP Inter 2nd Year Civics Study Material 3rd Lesson కేంద్ర కార్యనిర్వాహక శాఖ

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
భారత రాష్ట్రపతి అధికారాలు, విధులను గూర్చి వివరించండి.
జవాబు:
భారత రాష్ట్రపతి రాజ్యాధినేత. రాజ్యాంగ నిర్మాతలు ఆయనను బ్రిటిష్ రాజుతో సమానుడుగా వర్ణించారు. దేశ ప్రథమ పౌరుడుగా, కార్యనిర్వహణాధిపతిగా, జాతి గౌరవ ప్రతిష్ఠలకు ఆయన ప్రతీక. రాజ్యాంగం ప్రకారం ఆయన అధీనంలో కార్య నిర్వహణాధికారం ఉంది. పార్లమెంటులో రాష్ట్రపతి అంతర్భాగం. దేశ పరిపాలన ఆయన పేరు మీదుగా జరుగుతుంది. అయితే నామమాత్రపు అధికారి కావడం వలన పార్లమెంటరీ సంప్రదాయాల ప్రకారం మంత్రిమండలి వాస్తవ అధికారాలను కలిగి ఉంటుంది. రాష్ట్రపతికి గల వివిధ అధికారాలు దిగువ పేర్కొనబడ్డాయి.

రాష్ట్రపతి అధికారాలు:
1) కార్యనిర్వహణాధికారాలు: అధ్యక్షుడు దేశానికి ప్రధాన కార్యనిర్వహణాధికారి. పరిపాలన ఆయన పేరు మీదనే జరుగుతుంది. రాష్ట్రపతి మంత్రిమండలి సలహా ప్రకారం వ్యవహరించాలి. డాక్టర్ రాజేంద్రప్రసాద్ అభిప్రాయం ప్రకారం అధ్యక్షుడు రాజ్యాంగానికి బద్ధుడు.

అధికారుల నియామకం: సాధారణ ఎన్నికల తరువాత లోక్సభలో మెజారిటీ పార్టీ నాయకుడిని ప్రధానమంత్రిగా నియమిస్తాడు. ఏ పార్టీకీ మెజారిటీ లభించకపోతే తనకు తోచిన వ్యక్తిని ప్రధానిగా నియమిస్తాడు. ప్రధాని సలహాపై ఇతర మంత్రుల చేత ప్రమాణ స్వీకారం చేయిస్తాడు. త్రివిధ బలగాల అధిపతులను, (సైన్యం, నౌకా, వైమానిక దళం) నియమిస్తాడు. రాష్ట్ర గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లు, రాయబారులు, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు, ఎన్నికల ప్రధానాధికారి, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ సభ్యులు, ఆర్థిక సంఘం సభ్యులు, కంప్టోలర్ మరియు ఆడిటర్ జనరల్ మొదలగువారిని రాష్ట్రపతి నియమిస్తాడు.

2) శాసనాధికారాలు:

  1. పార్లమెంట్ను సమావేశపరచడానికి, వాయిదా వేయడానికి, లోక్సభను రద్దు చేయడానికి రాష్ట్రపతికి అధికారాలున్నాయి.
  2. సాధారణ ఎన్నికల తరువాత ఉభయసభల సంయుక్త సమావేశంలో ప్రారంభోపన్యాసం చేస్తాడు.
  3. పార్లమెంట్కు సందేశాలు పంపవచ్చును.
  4. రాష్ట్రపతి సంతకం పొందిన తరువాతనే బిల్లులు చట్టాలవుతాయి. బిల్లులకు ఆమోదం తెలుపకుండా కొంతకాలం నిలపవచ్చు. కానీ రెండు సభలు తిరిగి ఆ బిల్లులను ఆమోదించి పంపితే, అధ్యక్షుడు తప్పనిసరిగా ఆమోదించాలి.
  5. పార్లమెంట్ సమావేశంలో లేనప్పుడు ఆర్డినెన్స్లను జారీ చేస్తాడు.
  6. ఆర్థిక బిల్లులు ఆయన అనుమతి లేనిదే పార్లమెంట్లో ప్రవేశపెట్టరాదు.
  7. ఆర్థిక సంఘం, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ వంటి సంస్థలు ఇచ్చిన నివేదికలను పార్లమెంట్కు పంపుతాడు.
  8. పార్లమెంట్ ఉభయసభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటుచేస్తాడు.
  9. రాజ్యసభకు 12 మందిని, లోక్సభకు ఇద్దరిని నియమిస్తాడు.

AP Inter 2nd Year Civics Study Material Chapter 3 కేంద్ర కార్యనిర్వాహక శాఖ

3) ఆర్థికాధికారాలు:

  1. రాష్ట్రపతి ఆమోదం లేనిదే ఆర్థిక బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెట్టకూడదు.
  2. కేంద్ర బడ్జెట్, అనుబంధ బడ్జెట్లు ఆయన అనుమతి లేనిదే పార్లమెంట్ ముందుంచరాదు.
  3. ఐదు సంవత్సరాలకొక పర్యాయం రాష్ట్రపతి ఆర్థిక కమీషన్ను ఏర్పాటు చేస్తాడు.
  4. కంప్టోలర్, ఆడిటర్ జనరల్ రూపొందించిన వార్షిక నివేదికను ఆయన పార్లమెంట్కు సమర్పిస్తాడు.

4) న్యాయాధికారాలు: రాష్ట్రపతి సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులను నియమిస్తాడు. కాని వారిని తొలగించే అధికారం ఆయనకు లేదు. తగిన కారణాలుంటే సుప్రీంకోర్టు విధించిన శిక్షలను తాత్కాలికంగా నిలిపి వేయవచ్చు. శిక్షలు అమలు కాకుండా వాయిదా వేయవచ్చు. ఒక రకమైన శిక్షను మరొక రకమైన శిక్షగా మార్చవచ్చు. శిక్షను పూర్తిగా రద్దు చేసి క్షమాభిక్ష పెట్టవచ్చు.

2) రాజ్యాంగపరమైన అత్యవసర పరిస్థితి (356వ ప్రకరణ): భారత రాజ్యాంగంలోని 356వ ప్రకరణ రాజ్యాంగపరమైన అత్యవసర పరిస్థితిని విధించే అధికారాన్ని రాష్ట్రపతికి కల్పించింది. ఆ రాష్ట్ర గవర్నర్ నుంచి గాని, మరొక విధంగా ఆ రాష్ట్రంలో రాజ్యాంగ సూత్రాల ప్రకారం పరిపాలన సాగించలేమనే పరిస్థితి ఏర్పడిందన్న నివేదిక తరువాత, రాష్ట్రంలో రాజ్యాంగపరమైన అత్యవసర పరిస్థితిని ప్రకటించే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. దీనినే రాష్ట్రపతి పాలన’ అంటారు.

రాష్ట్రపతి పాలన సమయంలో భారత రాజకీయ వ్యవస్థలో క్రింది మార్పులు సంభవిస్తాయి.

  1. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అన్ని లేదా ఏవైనా కొన్ని విధులను రాష్ట్రపతి స్వయంగా నిర్వహించవచ్చు. గవర్నరికి గానీ లేదా ఇతర కార్యనిర్వాహక అధికారికి గానీ అప్పగించవచ్చు.
  2. రాష్ట్ర శాసన నిర్మాణశాఖ అధికారాలను పార్లమెంటు వినియోగిస్తుందని ప్రకటించవచ్చు.
  3. అత్యవసర పరిస్థితి ప్రకటన ఉద్దేశాలకు అనుగుణమైన అంశాలను అమలులో ఉంచడానికి రాష్ట్రపతి తగిన ఆదేశాలను జారీ చేయవచ్చును.

3) ఆర్థిక అత్యవసర పరిస్థితి: భారతదేశం మొత్తానికి లేదా ఒక ప్రాంతం ఆర్థిక స్థిరత్వానికి లేదా పరపతికి ముప్పు వాటిల్లిన పరిస్థితి ఏర్పడినపుడు 360వ ప్రకరణ ప్రకారం రాష్ట్రపతి ఆర్థిక అత్యవసర పరిస్థితిని ప్రకటించవచ్చు. ఈ అత్యవసర పరిస్థితి ప్రకటనను రెండు నెలల లోగా పార్లమెంటు సాధారణ మెజారిటీతో ఆమోదించాలి. ఇప్పటివరకు ఇటువంటి అత్యవసర పరిస్థితిని మనదేశంలో విధించలేదు. ఆర్థిక అత్యవసర పరిస్థితి సమయంలో రాష్ట్రపతి, ప్రభుత్వ సిబ్బందితో సహా సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల జీతభత్యాలను తగ్గించవచ్చు.

ప్రశ్న 3.
భారత ప్రధానమంత్రి అధికారాలు, విధులను గూర్చి చర్చించండి. [Mar. ’16]
జవాబు:
భారత ప్రధాని పరిపాలనా యంత్రాంగంలోను, దేశంలోను అత్యంత ప్రముఖస్థానాన్ని కలిగి ఉంటాడు. పార్లమెంటరీ ప్రభుత్వ సంప్రదాయాల ప్రకారం, “ప్రధాని ప్రభుత్వానికి మకుటంలేని మహారాజు”. “మంత్రిమండలి అనుభవానికి పునాదివంటివాడు”. “సౌర కుటుంబంలో సూర్యునివలె మంత్రిమండలిలో ప్రకాశిస్తాడు”. అని ఐవర్ జెన్నింగ్స్ పేర్కొనెను.

నియామకం: సాధారణ ఎన్నికలు జరిగిన తరువాత లోక్సభలో మెజారిటీ పార్టీ నాయకుడిని, రాష్ట్రపతి ప్రధానిగా నియమిస్తాడు. ఏ పార్టీకి మెజారిటీ రాకపోతే తన వివేచన ఉపయోగించి రాష్ట్రపతి తగిన వ్యక్తిని ప్రధానిగా నియమిస్తాడు. తరువాత ప్రధానిగా నియమించబడిన వ్యక్తి లోక్సభలో మెజారిటీని నిరూపించుకోవాలి. ఉదా: 1978లో జనతా ప్రభుత్వం పడిపోయినపుడు, ఏ పార్టీకి మెజారిటీ లేదని భావించి అప్పటి అధ్యక్షుడు శ్రీ నీలం సంజీవరెడ్డి, చరణ్్సంగ్ను ప్రధానిగా నియమించి, ఒక నెలలోగా లోక్సభలో తన మెజారిటీని నిరూపించుకోమన్నాడు. ఈ విధమైన పరిస్థితులు ఈ మధ్యకాలంలో కూడా జరిగెను.

ప్రధానమంత్రి అధికారాలు, విధులు: ప్రధానమంత్రి కేంద్ర ప్రభుత్వ అధిపతి. ఆయన వాస్తవ కార్యనిర్వాహక అధికారి. ప్రధానమంత్రి లేకుండా కేంద్ర మంత్రిమండలి ఏర్పాటు కాదు. కేంద్ర ప్రభుత్వంలో ఆయన చాలా ముఖ్యమైన, శక్తివంతమైన, కీలకమైన అధినేత. అయితే దేశంలోని రాజకీయ పరిస్థితిని బట్టి ప్రధానమంత్రి చెలాయించే అధికారం ఆధారపడి ఉంటుంది. ప్రధానమంత్రి ఈ క్రింద పేర్కొన్న అధికారాలను, విధులను నిర్వహిస్తాడు.

1) కేంద్ర కేబినెట్ నాయకుడు: ప్రధానమంత్రి కేంద్ర కేబినెట్, కేంద్ర మంత్రిమండలికి నాయకుడు. తన పార్టీ లేదా సంకీర్ణ కూటమికి చెందిన పార్లమెంటు సభ్యులలో ప్రముఖమైన సభ్యులను ఎంపిక చేసి, వారు రాష్ట్రపతి చేత మంత్రులుగా నియమించబడేటట్లు చూస్తాడు. మంత్రులకు శాఖల కేటాయింపు, మంత్రివర్గంలో మార్పులు, చేర్పులు చేసేందుకు పూర్తి అధికారం ప్రధానమంత్రికి కలదు.

2) కేంద్ర ప్రభుత్వ నాయకుడు: ప్రధానమంత్రి కేంద్ర ప్రభుత్వ నాయకునిగా వ్యవహరిస్తాడు. కేంద్ర కార్యనిర్వాహక శాఖ కేంద్ర మంత్రిమండలి) వ్యవహారాలు ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారంతో మొదలవుతాయి. కేంద్ర మంత్రిమండలిలోని మంత్రులందరూ ప్రధానమంత్రితో పాటు తమ పదవులను స్వీకరించి, పదవీ బాధ్యతలను నిర్వహించే హోదాను పొంది ఉంటారు.

AP Inter 2nd Year Civics Study Material Chapter 3 కేంద్ర కార్యనిర్వాహక శాఖ

3) పార్లమెంటు నాయకుడు: ప్రధానమంత్రి పార్లమెంటు నాయకునిగా వ్యవహరిస్తాడు. ఆయన కూడా పార్లమెంటు సభ్యుడే. ఉభయ సభలు సాఫీగా జరిగేటట్లు సభాపతులకు తగిన సహకారాన్ని అందిస్తాడు. పార్లమెంటులో తమ పార్టీ సభ్యులను నియంత్రిస్తాడు. పార్లమెంటు సమావేశాల సమయంలో తమ పార్టీ సభ్యులు క్రమశిక్షణతో మెలిగేటట్లు చూస్తాడు.

4) రాష్ట్రపతి, కేంద్ర మంత్రిమండలి మధ్య వారధి: ప్రధానమంత్రి రాష్ట్రపతికి, కేంద్ర మంత్రిమండలికి మధ్య వారధి వలె వ్యవహరిస్తాడు. కేంద్ర మంత్రిమండలి తీసుకున్న నిర్ణయాలను రాష్ట్రపతికి తెలియజేయడం ప్రధానమంత్రి బాధ్యత. రాష్ట్రపతి అడిగినప్పుడు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని అందజేయవలసిన బాధ్యత ఆయనపై కలదు.

5) మెజారిటీ పార్టీ నాయకుడు: ప్రధానమంత్రి దిగువ సభలో మెజారిటీ పార్టీ లేదా వర్గానికి నాయకునిగా వ్యవహరిస్తాడు. ఆయన తమ పార్టీ సభ్యుల సమావేశాలలో పాల్గొని వారికి వివిధ అంశాలపై, పార్టీ చేసిన వాగ్దానాల అమలుకు తీసుకొన్న చర్యలను వివరిస్తాడు. ప్రభుత్వ పాలనలో పార్టీలోని పెద్దల సేవలను వినియోగించుకుంటాడు. ఆయన పార్టీకి, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటాడు.

6) జాతి నాయకుడు: ప్రధానమంత్రి జాతి నాయకుడిగా వ్యవహరిస్తాడు. ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించే | లోక్సభకు నాయకునిగా ఉండటం వలన ఆయన అభిప్రాయాలను మొత్తం జాతి అభిప్రాయాలుగా భావించడం జరుగుతుంది.

7) విదేశాంగ విధాన రూపకల్పన కర్త: ప్రధానమంత్రి భారతదేశ విదేశాంగ విధానాన్ని మరియు ఇతర దేశాలతో భారతదేశం యొక్క సంబంధాలను నిర్ణయించడంతో కీలకపాత్ర పోషిస్తాడు. అంతర్జాతీయ సంబంధాలు, దేశ గౌరవ ప్రతిష్టలను నిలబెట్టడంలో ముఖ్యమైన బాధ్యత వహిస్తాడు. ముఖ్యమైన అంతర్జాతీయ వేదికలపై దేశానికి ప్రాతినిధ్యం వహిస్తాడు.

8) నీతి అయోగ్ అధ్యక్షుడు: ప్రధానమంత్రి నీతి ఆయోగ్ అధ్యక్షుడు. నీతి ఆయోగ్ (NITI Aayog – భారత జాతీయ పరివర్తన సంస్థ) అనగా విధాన కమిటీ అని అర్థం. ఇది ప్రభుత్వంలోని మేధావులు, అనుభవజ్ఞులైన వారితో పూర్వపు ప్రణాళికా సంఘం స్థానంలో ఏర్పాటు చేయబడింది. దీని ముఖ్య ఉద్దేశం భారతదేశ ఆర్థిక ప్రణాళికలలో రాష్ట్రాలకు ప్రాతినిధ్యం కల్పించడం.

ప్రశ్న 4.
కేంద్ర మంత్రిమండలి నిర్మాణం, అధికారాలు, విధులను వివరించండి.
జవాబు:
కేంద్ర మంత్రిమండలి పరిపాలనలో కీలకమైన పాత్ర వహిస్తుంది. దీని సలహా ప్రకారం రాష్ట్రపతి తన విధులు నిర్వహిస్తాడు. “రాజ్యమనే నౌకకు మంత్రిమండలి చుక్కాని” వంటిదని రామ్సే మ్యూర్ అభిప్రాయం.

మంత్రులు ప్రధాని సలహాపై రాష్ట్రపతిచే నియమింపబడతారు. మంత్రిమండలి సభ్యులు సమిష్టిగాను, వ్యక్తిగతంగానూ లోక్సభకు బాధ్యత వహిస్తారు. రాజ్యాంగరీత్యా రాష్ట్రపతి విశ్వాసం పొందినంతవరకు పదవిలో ఉంటారు.

అర్హతలు:

  1. మంత్రులకు శాసన సభ్యత్వం అవసరం.
  2. పార్లమెంట్ ఉభయసభలలో ఏదో ఒక సభలో సభ్యత్వం ఉండాలి. ఒకవేళ సభ్యుడు కాకపోతే ఆరు నెలల లోగా ఏదో ఒక సభకు సభ్యుడిగా ఎన్నిక కావాలి.
  3. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో ఆదాయం పొందే ఉద్యోగంలో ఉండరాదు.

నిర్మాణం: కేంద్ర మంత్రిమండలిలో మూడు రకాల మంత్రులు ఉంటారు. వారు:

  1. కేబినెట్ మంత్రులు
  2. స్టేట్ మంత్రులు (స్వతంత్ర హోదా)
  3. డిప్యూటీ మంత్రులు (స్వతంత్ర హోదాలేని మంత్రులు).

1) కేబినెట్ మంత్రులు: కేంద్ర ప్రభుత్వంలో హోం, ఆర్థిక, రక్షణ, రైల్వేలు, విదేశీ వ్యవహారాలు, మానవ వనరుల అభివృద్ధి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, పట్టణాభివృద్ధి, పౌర విమానయానం, గనులు, ఉక్కు మొదలైన ముఖ్యమైన మంత్రిత్వ శాఖలకు కేబినెట్ హోదాగల మంత్రులు అధిపతులుగా వ్యవహరిస్తారు. వారు తమ మంత్రిత్వశాఖల పరిధిలో నిర్ణయాలు తీసుకోవడంలోను, వాటిని అమలు చేయడంలోనూ స్వతంత్రులు.

2) స్టేట్ మంత్రులు (స్వతంత్ర హోదా): కేంద్ర ప్రభుత్వంలో స్వతంత్ర హోదా కలిగిన స్టేట్ మంత్రులు ప్రధానమంత్రికి నేరుగా జవాబుదారిగా ఉంటూ కొన్ని ముఖ్యమైన మంత్రిత్వ శాఖలను నిర్వహిస్తారు. తమ మంత్రిత్వశాఖలో కేబినెట్ మంత్రుల అజమాయిషీ వారిపై ఉండదు. స్వతంత్ర హోదా కలిగిన స్టేట్ మంత్రులు తమ శాఖలో స్వతంత్ర నిర్ణయాలు తీసుకొనే అధికారం ఉంటుంది.

3) డిప్యూటీ మంత్రులు (స్వతంత్ర హోదాలేని మంత్రులు): స్వతంత్ర హోదాలేని మంత్రులను డిప్యూటీ మంత్రులు అంటారు. వారు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పరిపాలన, శాసన వ్యవహారాలలో కాబినెట్ మంత్రులకు సహాయంగా ఉంటారు. వారికి నిర్ణయాలు తీసుకొనే అధికారం ఉండదు.

AP Inter 2nd Year Civics Study Material Chapter 3 కేంద్ర కార్యనిర్వాహక శాఖ

అధికారాలు విధులు:
1) విధానాలను రూపొందించుట: దేశ పరిపాలనకు సంబంధించిన విధానాలను మంత్రివర్గం రూపొందిస్తుంది. విదేశాంగ విధానం, ఆంతరంగిక పరిపాలనా విధానం, ఆర్థిక విధానం మొదలగునవి.

2) పరిపాలనా నియంత్రణ: వివిధ శాఖలకు అధిపతులుగా ఉండే మంత్రులు తమ శాఖలపై నియంత్రణ చెలాయిస్తూ పరిపాలన సమర్థవంతంగా పనిచేసేటట్లు చూస్తారు.

3) శాసన విధులు: మంత్రులు పార్లమెంట్లో బిల్లులు ప్రవేశపెట్టి అవి చట్టాలుగా రూపొందించేటందుకు కృషి చేస్తారు.

4) నియోజిత శాసనాలు: మౌలిక శాసనాల పరిధిలో, తమ శాఖలు నిర్వహించడానికి కావలసిన నిబంధనలను మంత్రులు, కార్యదర్శుల సహకారంతో రూపొందిస్తారు.

5) ఆర్థికాధికారాలు: వార్షిక బడ్జెట్ను తయారుచేసి, లోక్సభ ఆమోదం పొందేటట్లు చూస్తారు. దేశ ఆర్థిక వ్యవహారాలను నియంత్రణ చేస్తారు.

6) సంక్షేమ పథకాలు: ప్రజల అభివృద్ధికి, సంక్షేమానికి పథకాలు రూపొందించి, అమలుచేయడం మంత్రివర్గం విధి. ఆర్థిక ప్రణాళికలు రూపొందించడం, ఆర్థిక సమస్యల పరిష్కారం, బలహీనవర్గాల రక్షణ, ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే సహాయం చేయడం మున్నగునవి మంత్రివర్గం యొక్క బాధ్యత.

7) శాంతిభద్రతల నిర్వహణ: దేశంలో అల్లర్లు జరగకుండా చూడటం, అందుకు కావలసిన పరిపాలనాపరమైన చర్యలు తీసుకోవడం మంత్రిమండలి విధి.

8) దేశ రక్షణ: రాజ్యాన్ని విదేశీ దురాక్రమణ నుండి కాపాడటం, సైన్యాన్ని సురక్షితం చేసి సరిహద్దుల రక్షణ, ఆయుధాల నిర్మాణం, రక్షక వూహ్యం, స్వాతంత్య్ర పరిరక్షణ, దేశ ప్రయోజనాలు కాపాడటం మంత్రివర్గం విధి. దేశాభివృద్ధి, పరిపాలనా సామర్థ్యం, ప్రజాశ్రేయస్సు మంత్రివర్గ సామర్థ్యంపై ఆధారపడి ఉంటాయి.

కేంద్ర కేబినెట్ పాత్ర: కేంద్ర ప్రభుత్వంలో విధాన నిర్ణయం, వాటి అమలులో కేబినెట్ చురుకైన, కీలకమైన పాత్రను పోషిస్తుంది.

  1. జాతీయస్థాయిలో కార్యనిర్వాహక చర్యలను నిర్ణయించే అత్యున్నత రాజకీయ వ్యవస్థగా కేబినెట్ వ్యవహరిస్తుంది.
  2. కేంద్ర మంత్రిమండలి తరపున అన్ని విధులను కేబినెట్ నిర్వహిస్తుంది.
  3. కేంద్ర కార్యనిర్వాహక, పరిపాలనా సిబ్బందిపై దానికి పూర్తి అజమాయిషీ ఉంటుంది.
  4. కేంద్ర కార్యనిర్వాహక అధికారులు తన అధీనంలో పనిచేసేటట్లు చూస్తుంది.

భారతదేశంలోని కేబినెట్, బ్రిటన్లోని కేబినెట్ను పోలి ఉంటుంది. “ప్రభుత్వ యంత్రాంగానికి మంత్రిమండలి జీవము”. సర్ జాన్ మేరియట్ మంత్రిమండలి గురించి ప్రస్తావిస్తూ “ప్రభుత్వ యంత్రాంగానికి మంత్రిమండలి కీటకం వంటిది అని, అది దాని చుట్టూ పరిభ్రమణ చేస్తూ ఉంటుంది” అని పేర్కొనెను.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
భారత రాష్ట్రపతి ఏ విధంగా ఎన్నిక అవుతాడు ?
జవాబు:
భారత రాష్ట్రపతి పదవికి పోటీచేసే వ్యక్తికి పేర్కొన్న అర్హతలు ఉండాలి.

  1. భారతీయ పౌరుడై ఉండాలి.
  2. 35 సంవత్సరాలు నిండి ఉండాలి.
  3. లోక్సభకు ఎంపిక కావడానికి కావలసిన అర్హతలుండాలి.
  4. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో ఆదాయాన్నిచ్చే పదవిలో ఉండరాదు.

ఎన్నిక: ఇవిగాక పార్లమెంట్ సమయానుకూలంగా నిర్ణయించే ఇతర అర్హతలు కలిగి ఉండాలి.

దేశాధ్యక్షునిగా పోటీచేసే వ్యక్తిని బలపరుస్తూ నామినేషన్ పత్రంపై కనీసం 50 మంది నియోజకులు సంతకం చేయాలి. రూ.15,000 ధరావతు చెల్లించాలి. ఎన్నికలలో 1/6వ వంతు కంటే తక్కువ ఓట్లు వస్తే ధరావతు (డిపాజిట్) కోల్పోతాడు.

పార్లమెంట్లోని రెండు సభల సభ్యులు, రాష్ట్ర శాసనసభలకు ఎన్నికైన సభ్యులు కలిసి ఒక ఎన్నికల గణంగా ఏర్పడి ఓటును బదిలీచేసే నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతి ప్రకారం ఎన్నుకుంటారు. రహస్య ఓటింగ్ విధానం అనుసరించబడుతుంది. ఎన్నికలలో పాల్గొనే ఓటరు విలువ ఈ దిగువ విధంగా నిర్ణయించబడుతుంది.
AP Inter 2nd Year Civics Study Material Chapter 3 కేంద్ర కార్యనిర్వాహక శాఖ 1

AP Inter 2nd Year Civics Study Material Chapter 3 కేంద్ర కార్యనిర్వాహక శాఖ

ప్రమాణ స్వీకారం: రాష్ట్రపతిగా ఎన్నికైన వ్యక్తి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి లేదా ఒక సీనియర్ న్యాయమూర్తి సమక్షంలో ప్రమాణం చేస్తాడు. పదవీకాలం 5 సంవత్సరాలు. పదవీకాలం పూర్తి కాకుండానే రాజీనామా చేయవచ్చు లేదా మహాభియోగం తీర్మానం వలన పదవీచ్యుతుడైనా కావచ్చును.

ప్రశ్న 2.
భారత రాష్ట్రపతి మహాభియోగ ప్రక్రియను గూర్చి క్లుప్తంగా వ్రాయుము.
జవాబు:
రాష్ట్రపతి పదవీకాలం ముగియక ముందే రాజీనామా చేయవచ్చు లేదా రాజ్యాంగాన్ని అతిక్రమిస్తే రాజ్యాంగంలోని 56, 61 అధికరణాల ప్రకారం పార్లమెంట్ మహాభియోగ తీర్మానం ద్వారా పదవి నుండి తొలగించవచ్చు. దానికి అనుసరించే పద్ధతి ఈ దిగువ వివరించిన విధంగా ఉంటుంది.

  1. పార్లమెంట్లో ఏదో ఒక సభలో 14 రోజుల వ్యవధితో ఒక నోటీసు జారీ చేసి మహాభియోగ తీర్మానాన్ని ప్రవేశపెట్టాలి. ఆ తీర్మానం మీద ఆ సభలోని సభ్యులలో 4వ వంతు సభ్యులు సంతకం చేయాలి.
  2. ఆ తీర్మానాన్ని చర్చించి ఆ సభ 2/3వ వంతు మెజారిటీతో ఆమోదించాలి.
  3. అలా ఆమోదించిన తీర్మానాన్ని రెండవ సభ ఒక కమిటీని ఏర్పరచి, ఆరోపణలపై విచారణ జరుపుతుంది.
  4. ఆరోపణలు రుజువైతే ఆ సభలో కూడా మొత్తం సభ్యులలో 2/3వ వంతు సభ్యులు ఆమోదిస్తే రాష్ట్రపతి పదవీచ్యుతుడౌతాడు.

ఇంతవరకు మహాభియోగ తీర్మానం ద్వారా ఏ రాష్ట్రపతి తొలగింపబడలేదు.

ప్రశ్న 3.
భారత రాష్ట్రపతికి గల ఏవైనా రెండు అత్యవసర అధికారాలను పేర్కొనండి.
జవాబు:
1) జాతీయ అత్యవసర పరిస్థితి (352వ ప్రకరణ): రాష్ట్రపతి ఈ రకమైన అత్యవసర పరిస్థితిని యుద్ధం, విదేశీ దండయాత్రలు, సాయుధ తిరుగుబాటు వంటి పరిస్థితులు ఏర్పడినపుడు వినియోగిస్తాడు. భారతదేశ సార్వభౌమత్వానికి, భద్రతకు లేక దేశంలోని ఏదో ఒక ప్రాంతానికి ముప్పు వాటిల్లిందని రాష్ట్రపతి భావించినపుడు ఇలాంటి అత్యవసర పరిస్థితిని ప్రకటిస్తాడు. అయితే ఇటువంటి అత్యవసర పరిస్థితి ప్రకటించాలంటే ప్రధానమంత్రి నేతృత్వంలో మంత్రిమండలి వ్రాతపూర్వకమైన సలహామేరకు మాత్రమే ప్రకటించాలని భారత రాజ్యాంగం 44వ సవరణ చట్టం 1978 స్పష్టం చేస్తుంది. జాతీయ అత్యవసర పరిస్థితి అమలులో ఉన్నప్పుడు మన రాజ్యాంగంలోని సమాఖ్య లక్షణాలు పనిచేయవు. అన్ని అధికారాలను కేంద్రమే చెలాయిస్తుంది. మన దేశంలో నాలుగు సందర్భాలలో జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించడం జరిగింది. అవి:

  1. చైనా దురాక్రమణ (1962)
  2. భారత్ – పాకిస్తాన్ యుద్ధం (1965)
  3. బంగ్లాదేశ్ విమోచన సందర్భంలో భారత్ – పాకిస్తాన్ యుద్ధం (1971)
  4. పార్లమెంటును స్తంభింపజేయాలన్న ప్రతిపక్షాల పిలుపు సందర్భంగా (1975)

2) రాజ్యాంగపరమైన అత్యవసర పరిస్థితి (356వ ప్రకరణ): భారత రాజ్యాంగంలోని 356వ ప్రకరణ రాజ్యాంగపరమైన అత్యవసర పరిస్థితిని విధించే అధికారాన్ని రాష్ట్రపతికి కల్పించింది. ఆ రాష్ట్ర గవర్నర్ నుంచి గాని, మరొక విధంగా ఆ రాష్ట్రంలో రాజ్యాంగ సూత్రాల ప్రకారం పరిపాలన సాగించలేమనే పరిస్థితి ఏర్పడిందన్న నివేదిక తరువాత, రాష్ట్రంలో రాజ్యాంగపరమైన అత్యవసర పరిస్థితిని ప్రకటించే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. దీనినే ‘రాష్ట్రపతి పాలన’ అంటారు.
రాష్ట్రపతి పాలన సమయంలో భారతీయ రాజకీయ వ్యవస్థలో క్రింది మార్పులు సంభవిస్తాయి.

  1. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అన్ని లేదా ఏవైనా కొన్ని విధులను రాష్ట్రపతి స్వయంగా నిర్వహించవచ్చు. అలాగే గవర్నర్కు గానీ లేదా ఇతర కార్యనిర్వాహణ అధికారికి గానీ అప్పగించవచ్చు.
  2. రాష్ట్ర శాసన నిర్మాణశాఖ అధికారాలను పార్లమెంటు వినియోగిస్తుందని ప్రకటించవచ్చు.
  3. అత్యవసర పరిస్థితి ప్రకటన ఉద్దేశాలకు అనుగుణమైన అంశాలను అమలులో ఉంచడానికి రాష్ట్రపతి తగిన ఆదేశాలను జారీ చేయవచ్చును.

AP Inter 2nd Year Civics Study Material Chapter 3 కేంద్ర కార్యనిర్వాహక శాఖ

ప్రశ్న 4.
కేంద్ర ప్రభుత్వంలో రాష్ట్రపతి పాత్ర, స్థానాన్ని వివరించండి.
జవాబు:
రాష్ట్రపతి పాత్ర: రాష్ట్రపతి పాత్ర – స్థానాల గురించి రాజ్యాంగ పరిషత్తు సమావేశాల సమయంలోనూ, తరువాత కాలంలోనూ విశేషమైన చర్చ జరిగింది. జవహర్లాల్ నెహ్రూ, అంబేద్కర్ వంటి ప్రసిద్ధ నాయకులు రాష్ట్రపతికి కేవలం నామమాత్రమైన అధికారాలు మాత్రమే ఉంటాయని భావించారు. అందుకు విరుద్ధంగా రాజేంద్రప్రసాద్, అలెన్ గ్లెడ్ల్, కె.ఎం. మునీ వంటి ప్రముఖులు కేంద్ర మంత్రిమండలి సలహాతో నిమిత్తం లేకుండా రాష్ట్రపతికి కొన్ని విచక్షణాధికారాలు ఉంటాయని పేర్కొన్నారు. రాష్ట్రపతికి విశేష అధికారాలు ఉన్నాయని వాదించేవారి ఉద్దేశంలో రాష్ట్రపతి తన పదవీ స్వీకార సమయంలో రాజ్యాంగాన్ని, చట్టాన్ని సంరక్షించి, పెంపొందిస్తాననీ, భారతదేశ ప్రజలసేవ, శ్రేయస్సులకోసం అంకితమవుతానని ప్రమాణం చేస్తాడని ఆ ప్రమాణం ప్రకారం రాష్ట్రపతికి స్వతంత్ర అధికారాలు ఉంటాయని వ్యాఖ్యానించారు.

లోక్సభలో ఏ పార్టీకీ మెజారిటీ రానప్పుడు లేదా కొన్ని పార్టీలు సంకీర్ణ మంత్రిమండలిని ఏర్పాటు చేయడం సాధ్యం కాదు. కేంద్ర ప్రభుత్వ వ్యవహారాలలో తనకు సలహా, సహాయాలు అందించడానికి అవసరమైన ప్రధానమంత్రి నియామకంలో రాష్ట్రపతి విచక్షణాధికారాలు వినియోగిస్తాడనేది నిజమే. అలాగే లోక్సభను రద్దుచేయాలనే ప్రధానమంత్రి సలహాను పాటించడానికి లేదా తిరస్కరించడానికి రాష్ట్రపతికి ఉన్న అధికారాన్ని న్యాయశాఖతో సహా ఎవరూ ప్రశ్నించడానికి వీలులేదు. ముఖ్యంగా, జాతీయస్థాయిలో రాజకీయ సంక్షోభం కొనసాగుతున్న సమయంలో రాష్ట్రపతి పాత్ర, స్థానం ఎంతో ప్రధానమైనవి, కీలకమైనవి కూడా. కేంద్రంలో ఆచరణ సాధ్యమైన, పనిచేయగలిగిన, సమర్థవంతమైన ప్రభుత్వాన్ని స్థాపించడానికి గల అన్ని అవకాశాలను రాష్ట్రపతి అన్వేషించాలి. మంత్రిమండలి సమర్థవంతంగా పనిచేయలేనప్పుడు, రాజ్యాంగపరమైన యంత్రాంగం అదుపు తప్పినప్పుడు రాష్ట్రపతి ఎంతో శక్తివంతమైన వ్యక్తిగా రూపొందుతాడు.

1997లో ఉత్తరప్రదేశ్లో రాష్ట్రపతి పాలన విధించాలని, ముఖ్యమంత్రి కళ్యాణ్సింగ్ ను తక్షణమే భర్తరఫ్ చేయాలని యునైటెడ్ ఫ్రంట్ నేతృత్వంలోని కేంద్ర మంత్రిమండలి సూచనను రాష్ట్రపతి కె.ఆర్. నారాయణన్ నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. పైగా అలాంటి సలహాను ఉపసంహరించుకోవలసిందిగా కేంద్ర మంత్రిమండలి కోరడం జరిగింది. అలాగే బీహార్ ఆర్.జె.డి. ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి, ఆ రాష్ట్రంలో రాష్ట్రపతిపాలన విధించాలని వాజ్పేయి ప్రభుత్వం చేసిన సూచనలను కూడా రాష్ట్రపతి కె.ఆర్. నారాయణన్ తిరస్కరించారు. అలాగే సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకం, కార్గిల్ యుద్ధంపై రాజ్యసభలో చర్చించాలనే ప్రతిపక్షాల డిమాండ్ను అధికారపక్షం విస్మరించడం, 1998లో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర క్యాబినెట్ ప్రసంగం బదులుగా ఒక పాత్రికేయునితో సంభాషణ ద్వారా జాతినుద్దేశించి మాట్లాడటం, 1999 ఆగస్టు – అక్టోబరుల మధ్య వాజ్పేయి ఆపద్ధర్మ ప్రభుత్వ నూతన టెలికాం విధానం, ఇండియన్ ఎయిర్లైన్స్న లాభాల బాటలో నడిపించడానికి రూ.125 కోట్ల ప్యాకేజి మొదలైన అంశాలపై రాష్ట్రపతి అభ్యంతరాలు తెలిపారు. అలాగే 1998లో జరిగిన పన్నెండో లోక్సభ ఎన్నికల్లో ఓటువేసి, ఓటుహక్కును వినియోగించుకున్న తొలి రాష్ట్రపతిగా ప్రజాస్వామ్య ప్రక్రియలో ఓటువేయడం పౌరుడి బాధ్యత అని, ఆ బాధ్యతను నిర్వర్తించానని ఆయన ఈ సందర్భంగా ప్రకటించారు.

భారత రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతిని అత్యవసర దీపం (Emergency lamp) గా రాష్ట్రపతి ఆర్. వెంకటరామన్ తన ‘మై ప్రెసిడెన్షియల్ ఇయర్స్’ (My Presidential Years) గ్రంథంలో వర్ణించారు. రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ తన పదవీ విరమణ సందర్భంలో ప్రసంగిస్తూ రాష్ట్రపతి నిష్పాక్షికత, రాజ్యాంగ ఔచిత్యం, పారదర్శకత అనే మూడు సూత్రాలను అనుసరించవలసి ఉంటుందని ఉద్ఘాటించారు. విభిన్న సందర్భాలలో నిష్పాక్షికంగా వ్యవహరించడానికి నిబంధనల గ్రంథాన్ని అనుసరించే లక్షణం సదా రాష్ట్రపతికి ఉండాలని ఆయన ప్రకటించారు.

ప్రశ్న 5.
భారత ఉపరాష్ట్రపతికి గల ఏవైనా రెండు అధికారాలను వ్రాయండి.
జవాబు:
1) రాజ్యసభకు పదవిరీత్యా అధ్యక్షుడిగా వ్యవహరించడం: ఉపరాష్ట్రపతి రాజ్యసభకు పదవిరీత్యా అధ్యక్షుడు. ఆయన రాజ్యసభ సమావేశాలకు అధ్యక్షత వహిస్తాడు. రాజ్యసభ సమావేశాలను ఎంతో గౌరవం, ఔచిత్యం, మర్యాదలతో నిర్వహిస్తాడు. వివిధ బిల్లులు, అంశాలపై సభ్యులు తమ అభిప్రాయాలను వెల్లడించడానికి అనుమతిస్తాడు. సమావేశాలలో అనేక విషయాలపై తన నిర్ణయాలను తెలుపుతాడు. బిల్లులపై చర్చలు పూర్తయిన తరువాత ఓటింగ్ జరిపి, ఫలితాలను ప్రకటిస్తాడు. రాజ్యసభ ఆమోదించిన బిల్లులపై సంతకం చేసి లోక్సభకు పంపుతాడు. దేశంలోని వివిధ కార్యనిర్వాహక, శాసన నిర్మాణ సంస్థలు, అధికారులతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుతాడు. రాజ్యసభ సభ్యుల ప్రత్యేక హక్కులు, సౌకర్యాలను కాపాడతాడు. లోక్ సభ స్వీకర్లాగే ఆయనకు అనేక అధికారాలుంటాయి. అయితే, ఒక బిల్లును ఆర్థిక బిల్లుగా ప్రకటించి దానిపై సంతకం చేయడానికి లేదా పార్లమెంటు ఉభయసభల సంయుక్త సమావేశాలకు అధ్యక్షత వహించడానికి ఆయనకు అధికారం లేదు. సభలో ఏదైనా ఒక బిల్లును ఆమోదించే విషయంలో సందిగ్ధత ఏర్పడితే, తన అంతిమ నిర్ణాయక ఓటును వినియోగించి బిల్లు భవితవ్యాన్ని నిర్ణయిస్తాడు. అయితే రాజ్యసభ సభ్యుడు కాకపోవడంవల్ల, సాధారణంగా ఆయన సభలోని బిల్లులపై జరిగే ఓటింగ్లో పాల్గొనడు.

2) రాష్ట్రపతిగా వ్యవహరించడం: రాష్ట్రపతి పదవిలో ఉండే వ్యక్తి మరణించినా, రాజీనామా చేసినా లేదా తొలగించబడినా లేదా మరొక కారణం వల్ల ఆ పదవిలో ఖాళీ ఏర్పడితే, ఉపరాష్ట్రపతి రాష్ట్రపతిగా వ్యవహరిస్తాడు. ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతిగా వ్యవహరించే కాలపరిమితి ఆరు నెలలకు మించకూడదు. కానీ, నూతన రాష్ట్రపతి పదవీ బాధ్యతలు చేపట్టేవరకు ఆయన రాష్ట్రపతిగా పదవిలో కొనసాగుతాడు. అలాగే, రాష్ట్రపతి అస్వస్థుడైన సందర్భంలో రాష్ట్రపతి తిరిగి ఆరోగ్యవంతుడై విధులను నిర్వహించేవరకు ఉపరాష్ట్రపతి రాష్ట్రపతిగా వ్యవహరిస్తాడు. ఉపరాష్ట్రపతి రాష్ట్రపతిగా వ్యవహరించే సమయంలో ఆయనకు రాష్ట్రపతికి గల జీతభత్యాలు, అధికారాలు, సౌకర్యాలన్నీ కల్పించడం జరుగుతుంది. ఈ విషయంలో పార్లమెంటు ఎప్పటికప్పుడు తగిన నిబంధనలను రూపొందిస్తుంది.

AP Inter 2nd Year Civics Study Material Chapter 3 కేంద్ర కార్యనిర్వాహక శాఖ

ప్రశ్న 6.
ప్రధానమంత్రి ఎలా నియమించబడతాడో తెలియజేయండి.
జవాబు:
ప్రధానమంత్రి నియామకం: మంత్రుల జట్టుతో కూడుకున్న ప్రధానమంత్రి రాష్ట్రపతికి కేంద్ర ప్రభుత్వ అధికార విధుల నిర్వహణలో సహాయకుడిగా, సలహాదారుడిగానూ వ్యవహరిస్తాడని భారత రాజ్యాంగం 74(1)వ అధికరణం స్పష్టం చేసింది. 75(1)వ అధికరణం ప్రకారం ప్రధానమంత్రిని రాష్ట్రపతి నియమిస్తాడు.

లోక్సభకు సార్వత్రిక ఎన్నికలు జరిగిన తరువాత, సభలో మెజారిటీ స్థానాలను గెలుచుకున్న పార్టీ నాయకుడిని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవలసిందిగా రాష్ట్రపతి ఆహ్వానిస్తాడు. ఒకవేళ లోక్సభలో ఏ ఒక్క పార్టీకీ మెజారిటీ స్థానాలు లభించని పక్షంలో, సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పరచడానికి గల అవకాశాలన్నింటినీ రాష్ట్రపతి అన్వేషిస్తాడు. సంకీర్ణమండలికి నాయకత్వం వహించిన వ్యక్తిని ప్రభుత్వం ఏర్పాటు చేయవలసిందిగా ఆహ్వానిస్తాడు. ఈ సందర్భంలో రాష్ట్రపతి తన విచక్షణాధికారాలను వినియోగిస్తాడు. సంకీర్ణమండలి నాయకుడికి ఆహ్వానం పంపేముందు రాష్ట్రపతి రాజకీయ స్థిరత్వం, మెజారిటీ సభ్యుల మద్దతు పొందగలిగిన సామర్థ్యం, రాజ్యాంగపరమైన, చట్టపరమైన అంతర్ధాలు, జాతీయ ప్రయోజనాలు, ప్రతిపక్షాల అభిప్రాయాలు మొదలైన అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుంటాడు. సంకీర్ణమండలికి చెందిన నాయకుడిని ప్రధానమంత్రిగా నియమించే సందర్భంలో, లోక్సభలో నిర్ణీత గడువులోగా మెజారిటీ సభ్యుల మద్దతును నిరూపించు కోవలసిందిగా రాష్ట్రపతి షరతును కూడా విధిస్తాడు. రాష్ట్రపతులు ఆర్. వెంకటరామన్, శంకర్ దయాళ్ శర్మ, కె.ఆర్. నారాయణన్లు పైన పేర్కొన్న షరతును విధించి, తమ హయాంలో ప్రధానమంత్రులను నియమించారు. ప్రధానమంత్రిగా ఎవరిని ఆహ్వానించాలి ? ఎవరిని ఎంపిక చేయాలి ? ఎవరిని నియమించాలి ? అనే వాటిపై రాష్ట్రపతికిగల అధికారాన్ని న్యాయస్థానంలో ప్రశ్నించే వీలు లేదు.

ప్రశ్న 7.
కేంద్ర ప్రభుత్వంలో ప్రధానమంత్రి పాత్రను వివరించండి.
జవాబు:
ప్రధానమంత్రి పాత్ర: కేంద్ర ప్రభుత్వ వ్యవహారాలలో ప్రధానమంత్రి ప్రబలమైన పాత్రను పోషిస్తాడు. కేంద్ర ప్రభుత్వ పాలనతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిపై ప్రధానమంత్రి చెరగని ముద్రవేస్తాడు. ఆయనను మంత్రివర్గ సభ్యులలో ప్రథముడిగా వర్ణించడం జరిగింది. కేంద్ర మంత్రిమండలి, కేంద్ర కాబినెట్, అధికారపార్టీ, లోక్సభ, కేంద్ర ప్రభుత్వం, దేశ ప్రజల నాయకుడిగానూ, కేంద్ర మంత్రిమండలి – రాష్ట్రపతికి, దేశ ప్రజల మధ్య సంధానకర్తగానూ ప్రధానమంత్రి విలక్షణమైన పాత్రను పోషిస్తాడు. ఆయన అత్యంత రాజకీయ శక్తిని, ప్రాపకాన్ని కలిగి ఉంటాడు. అయితే ప్రధానమంత్రిగా వ్యవహరించే వ్యక్తికి కేంద్ర ప్రభుత్వంలో ఉండే ప్రతిష్ట, పలుకుబడి, ఔన్నత్యం, వ్యక్తిత్వ స్థాయిలను బట్టి ఆయన పాత్ర ఆధారపడి ఉంటుంది.

జవహర్లాల్ నెహ్రూ, అంబేద్కర్ వంటి ప్రముఖ జాతీయోద్యమ నాయకులు, రాజ్యాంగ పరిషత్తు సభ్యులు ప్రధానమంత్రిని కేంద్ర ప్రభుత్వంలో ప్రధాన వ్యక్తిగానూ, మూలస్తంభంగానూ, ఇరుసు చీలగానూ వర్ణించారు. ఈ కారణంగానే “ప్రధానమంత్రిగా వ్యవహరించేవారికి హూందాతనం, అధికారం, నియంత్రించగల దృఢత్వం, ఒప్పించగల నేర్పరితనం, సమయస్ఫూర్తి, వాస్తవికత, నిశ్చయత్వం, నిష్పాక్షికత, ప్రశాంతత, ప్రజలకు అందుబాటు, వ్యక్తిగతంగా దయ, దూరదృష్టివంటి లక్షణాలు ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారని” విలియం హారొ ్కర్ట్ పేర్కొన్నాడు.

ప్రశ్న 8.
కేంద్ర మంత్రిమండలి నిర్మాణం మరియు అధికారాలను వర్ణించండి.
జవాబు:
మంత్రిమండలి నిర్మాణం: కేంద్ర మంత్రిమండలిలో మూడు రకాల మంత్రులు ఉంటారు. వారు:

  1. కేబినెట్ మంత్రులు
  2. స్టేట్ మంత్రులు
  3. డిప్యూటీ మంత్రులు. మంత్రులు సమిష్టి బాధ్యత, వ్యక్తిగత బాధ్యత అనే సూత్రాలపై పనిచేస్తారు. వీరిని ప్రధాని తొలగించవచ్చు లేక విశ్వాసరాహిత్య తీర్మానం వలన మొత్తం ప్రభుత్వమే మారవచ్చు.

అధికారాలు

విధులు:
1) విధానాలను రూపొందించుట: దేశ పరిపాలనకు సంబంధించిన విధానాలను మంత్రివర్గం రూపొందిస్తుంది. విదేశాంగ విధానం, ఆంతరంగిక పరిపాలనా విధానం, ఆర్థిక విధానం మొదలగునవి.

2) పరిపాలనా నియంత్రణ: వివిధ శాఖలకు అధిపతులుగా ఉండే మంత్రులు తమ శాఖలపై నియంత్రణ చెలాయిస్తూ పరిపాలన సమర్థవంతంగా పనిచేసేటట్లు చూస్తారు.

3) శాసన విధులు: మంత్రులు పార్లమెంట్ లో బిల్లులు ప్రవేశపెట్టి అవి చట్టాలుగా రూపొందించేటందుకు కృషి చేస్తారు.

4) నియోజిత శాసనాలు: మౌలిక శాసనాల పరిధిలో, తమ శాఖలు నిర్వహించడానికి కావలసిన నిబంధనలను మంత్రులు, కార్యదర్శుల సహకారంతో రూపొందిస్తారు.

AP Inter 2nd Year Civics Study Material Chapter 3 కేంద్ర కార్యనిర్వాహక శాఖ

5) ఆర్థికాధికారాలు: వార్షిక బడ్జెట్ను తయారుచేసి, లోక్సభ ఆమోదం పొందేటట్లు చూస్తారు. దేశ ఆర్థిక వ్యవహారాలను నియంత్రణ చేస్తారు.

6) సంక్షేమ పథకాలు: ప్రజల అభివృద్ధికి, సంక్షేమానికి పథకాలు రూపొందించి, అమలు చేయడం మంత్రివర్గం విధి. ఆర్థిక ప్రణాళికలు రూపొందించడం, ఆర్థిక సమస్యల పరిష్కారం, బలహీనవర్గాల రక్షణ, ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే సహాయం చేయడం మున్నగునవి మంత్రివర్గం యొక్క బాధ్యత.

7) శాంతిభద్రతల నిర్వహణ: దేశంలో అల్లర్లు జరగకుండా చూడటం, అందుకు కావలసిన పరిపాలనాపరమైన చర్యలు తీసుకోవడం మంత్రిమండలి విధి.

8) దేశ రక్షణ: రాజ్యాన్ని విదేశీ దురాక్రమణ నుండి కాపాడటం, సైన్యాన్ని సురక్షితం చేసి సరిహద్దుల రక్షణ, ఆయుధాల నిర్మాణం, రక్షక వూహ్యం, స్వాతంత్ర్య పరిరక్షణ, దేశ ప్రయోజనాలు కాపాడటం మంత్రివర్గం విధి. దేశాభివృద్ధి, పరిపాలనా సామర్థ్యం, ప్రజాశ్రేయస్సు మంత్రివర్గ సామర్థ్యంపై ఆధారపడి ఉంటాయి.

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
కేంద్ర కార్యనిర్వాహక శాఖ నిర్మాణం.
జవాబు:
భారత రాజ్యాంగం అయిదో భాగంలో 52 నుండి 78 వరకు ఉన్న ప్రకరణలు కేంద్ర కార్యనిర్వాహక శాఖను గురించి వివరించాయి. కేంద్ర కార్య నిర్వాహక శాఖ

  1. రాష్ట్రపతి
  2. ఉపరాష్ట్రపతి
  3. ప్రధానమంత్రి
  4. మంత్రిమండలితో కూడుకొని ఉంటుంది.

ప్రశ్న 2.
రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేయడానికి కావలసిన అర్హతలేవి ?
జవాబు:

  1. భారతీయ పౌరుడై ఉండాలి.
  2. 35 సం||ల వయస్సు నిండి ఉండాలి.
  3. లోక్సభ సభ్యుడిగా ఎన్నికయ్యేందుకు తగిన అర్హతలుండాలి.
  4. కేంద్ర, రాష్ట్ర, స్థానిక స్థాయిలలో ఏ ప్రభుత్వంలోనూ లాభసాటి పదవిలో కొనసాగుతూ ఉండరాదు.

ప్రశ్న 3.
భారత రాష్ట్రపతి ఎన్నిక.
జవాబు:
భారత రాష్ట్రపతి పరోక్ష పద్ధతిలో నైష్పత్తిక ప్రాతినిధ్య ఏక ఓటు బదిలీ సూత్ర ప్రాతిపదికగా ఎన్నికవుతాడు. భారత రాష్ట్రపతిని ‘ఎన్నికల గణం’ రహస్య బ్యాలెట్ విధానం ద్వారా ఎన్నుకొంటుంది. ఈ ఎన్నికల గణంలో పార్లమెంటు ఉభయ సభలకు ఎన్నికైన సభ్యులు, రాష్ట్ర విధాన సభలకు ఎన్నికైన సభ్యులు ఉంటారు.

ప్రశ్న 4.
రాష్ట్రపతిచే ముఖ్యమైన నియామకాలు.
జవాబు:
భారత రాష్ట్రపతి నియమించే ముఖ్యమైన నియామకాలలో కొన్ని ప్రధానమంత్రి, కేంద్ర మంత్రిమండలి, భారత అటార్నీ జనరల్, భారత కంప్టోలర్ మరియు ఆడిటర్ జనరల్, సుప్రీంకోర్టు, హైకోర్టుల ప్రధాన మరియు ఇతర న్యాయమూర్తులు, రాష్ట్రాల గవర్నర్లు, కేంద్రపాలిత ప్రాంత లెఫ్టినెంట్, పరిపాలకులు, ప్రధాన ఎన్నికల కమీషనర్లు.

AP Inter 2nd Year Civics Study Material Chapter 3 కేంద్ర కార్యనిర్వాహక శాఖ

ప్రశ్న 5.
రాష్ట్రపతి న్యాయాధికారాలు.
జవాబు:
కేంద్ర ప్రభుత్వ సలహామేరకు రాష్ట్రపతి న్యాయాధికారాలను చెలాయిస్తాడు. అవి:

  1. సుప్రీంకోర్టు, హైకోర్టు ప్రధాన మరియు ఇతర న్యాయమూర్తులను నియమించటం.
  2. ఏదైనా చట్టపరమైన విషయాలపై సుప్రీంకోర్టు సలహాను కోరటం.
  3. న్యాయస్థానాలు విధించిన శిక్షలను మార్చటం, తగ్గించటం, నిలుపుదల చేయటం, క్షమాభిక్ష ప్రసాదించటం.

ప్రశ్న 6.
352వ ప్రకరణ. [Mar. ’16]
జవాబు:
352వ ప్రకరణ ప్రకారం భారత రాష్ట్రపతి యుద్ధం, విదేశీ దండయాత్రలు, సాయుధ తిరుగుబాటు వంటి పరిస్థితులు తలెత్తినపుడు జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటిస్తారు. ఈ అత్యవసర పరిస్థితి అమలులో ఉన్నప్పుడు మన రాజ్యాంగంలోని సమాఖ్య లక్షణాలు పనిచేయవు. అన్ని అధికారాలను కేంద్ర ప్రభుత్వమే చెలాయిస్తుంది.

ప్రశ్న 7.
356వ ప్రకరణ.
జవాబు:
భారత రాజ్యాంగంలోని 356వ ప్రకరణ రాజ్యాంగపరమైన అత్యవసర పరిస్థితిని విధించే అధికారం రాష్ట్రపతికి కల్పించింది. ఏదైనా రాష్ట్ర గవర్నర్, ఆ రాష్ట్రంలో రాజ్యాంగ సూత్రాల ప్రకారం పరిపాలన సాగించలేమనే పరిస్థితి ఏర్పడింది అని నివేదిస్తే, రాష్ట్రపతి. ఆ రాష్ట్రంలో ‘రాజ్యాంగపరమైన అత్యవసర పరిస్థితి’ ప్రకటిస్తాడు. దీనినే ‘రాష్ట్రపతి పాలన’ అని కూడా అంటారు. రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన రాష్ట్రపతి ద్వారా నిర్వహించబడుతుంది.

ప్రశ్న 8.
ఆర్థిక అత్యవసర పరిస్థితి.
జవాబు:
భారతదేశం మొత్తానికి లేదా ఏదో ఒక ప్రాంతం ఆర్థిక స్థిరత్వానికి, లేదా పరపతికి ముప్పు వాటిల్లినపుడు 360వ ప్రకరణ ప్రకారం రాష్ట్రపతి ఆర్థిక అత్యవసర పరిస్థితిని ప్రకటించవచ్చు. ఈ పరిస్థితిని ప్రకటించినపుడు రాష్ట్రపతి ప్రభుత్వ సిబ్బంది మరియు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల జీతభత్యాలను తగ్గించవచ్చు.

ప్రశ్న 9.
జాతీయ అత్యవసర పరిస్థితి.
జవాబు:
జాతీయ అత్యవసర పరిస్థితి (352 ప్రకరణ): రాష్ట్రపతి ఈ రకమైన అత్యవసర పరిస్థితిని యుద్ధం, విదేశీ దండయాత్రలు, సాయుధ తిరుగుబాటు వంటి పరిస్థితులు ఏర్పడినపుడు వినియోగిస్తాడు. భారతదేశ సార్వభౌమత్వానికి, భద్రతకు లేక దేశంలో ఏదో ఒక ప్రాంతానికి ముప్పు వాటిల్లిందని రాష్ట్రపతి భావించినపుడు ఇలాంటి అత్యవసర పరిస్థితిని ప్రకటిస్తాడు. అయితే ఇటువంటి అత్యవసర పరిస్థితి ప్రకటించాలంటే ప్రధానమంత్రి నేతృత్వంలో మంత్రిమండలి వ్రాతపూర్వకమైన సలహామేరకు మాత్రమే ప్రకటించాలని భారత రాజ్యాంగం 44వ సవరణ చట్టం 1978 స్పష్టం చేస్తుంది.

ప్రశ్న 10.
ఉపరాష్ట్రపతిగా పోటీ చేయడానికి కావలసిన అర్హతలు.
జవాబు:

  1. భారతీయ పౌరుడై ఉండాలి.
  2. 35 సం||ల వయస్సు నిండి ఉండాలి.
  3. రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యేందుకు తగిన అర్హతలను కలిగి ఉండాలి.
  4. భారతదేశంలో కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలలో ఆదాయాన్నిచ్చే పదవిలో ఉండరాదు.

AP Inter 2nd Year Civics Study Material Chapter 3 కేంద్ర కార్యనిర్వాహక శాఖ

ప్రశ్న 11.
రాజ్యసభ అధ్యక్షుడు. [Mar. ’17]
జవాబు:
ఉపరాష్ట్రపతి పదవిరీత్యా రాజ్యసభ అధ్యక్షుడిగా వ్యవహరిస్తాడు. రాజ్యసభ సమావేశాలకు అధ్యక్షత వహిస్తూ, సమావేశాలు హుందాగా నిర్వహిస్తాడు. సమావేశాలలో తన నిర్ణయాలను వెల్లడిస్తాడు. వివిధ బిల్లులపై ఓటింగ్ జరిపి, ఫలితాలను వెల్లడిస్తాడు.

ప్రశ్న 12.
ప్రధానమంత్రి నియామకం.
జవాబు:
ప్రధానమంత్రిని రాష్ట్రపతి నియమిస్తాడు అని మన రాజ్యాంగం సూచించింది. లోక్సభ సాధారణ ఎన్నికలు జరిగిన తరువాత, ఆ సభలో మెజారిటీ పార్టీ నాయకుడిని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవలసిందిగా రాష్ట్రపతి ఆహ్వానిస్తాడు. ప్రధానమంత్రి ఎంపిక ఆహ్వానం, నియామక విషయాలలో రాష్ట్రపతి అధికారాలను న్యాయస్థానాలలో ప్రశ్నించేందుకు వీలు లేదు.

ప్రశ్న 13.
కేంద్ర మంత్రిమండలి రకాలు.
జవాబు:
కేంద్ర మంత్రిమండలిలో మూడు రకాల మంత్రులుంటారు. వారు:

  1. కేబినెట్ మంత్రులు.
  2. స్టేట్ మంత్రులు (స్వతంత్ర హోదా).
  3. డిప్యూటీ మంత్రులు (స్వతంత్ర హోదాలేని మంత్రులు).

ప్రశ్న 14.
కేంద్ర కేబినెట్ ఏవేని రెండు విధులు. [Mar. ’17]
జవాబు:

  1. కేంద్ర కేబినెట్ కేంద్ర ప్రభుత్వ విధానాలను రూపొందిస్తుంది. జాతి ఆంతరంగిక, విదేశీ విధానాలను సుదీర్ఘమైన, తీవ్రమైన సమాలోచనల తరువాత ఖరారు చేస్తుంది.
  2. కేంద్ర ప్రభుత్వ వ్యవహారాలన్నింటిలో రాష్ట్రపతికి సలహాలు అందిస్తుంది. రాష్ట్రపతికి తన విధుల నిర్వహణలో కేబినెట్ మార్గదర్శకంగా ఉంటుంది.

AP Inter 2nd Year Civics Study Material Chapter 3 కేంద్ర కార్యనిర్వాహక శాఖ

ప్రశ్న 15.
సమిష్టి బాధ్యత.
జవాబు:
పార్లమెంటరీ ప్రభుత్వ లక్షణాలలో ప్రధానమైనదే సమిష్టి బాధ్యత. భారత రాజ్యాంగ నిర్మాతలు ఈ సూత్రాన్ని బ్రిటిష్ రాజ్యాంగం నుంచి గ్రహించారు. రాజ్యాంగం 75(3)వ అధికరణం మంత్రిమండలి సమిష్టిగా లోక్సభకు బాధ్యత వహిస్తుందని ప్రకటించింది. కేంద్ర మంత్రిమండలి ప్రధానమంత్రి ఆధ్వర్యంలో ఒక జట్టుగా వ్యవహరిస్తుంది. కార్యనిర్వాహక శాఖలోని మంత్రులు అధికారంలో ఉండగా తమ చర్యలకు, కార్యకలాపాలకు, పార్లమెంటుకు సమిష్టిగా బాధ్యత వహించడాన్నే సమిష్టి బాధ్యత అంటారు.

AP Inter 2nd Year Civics Study Material Chapter 2 ప్రాథమిక హక్కులు – ఆదేశక సూత్రాలు

Andhra Pradesh BIEAP AP Inter 2nd Year Civics Study Material 2nd Lesson ప్రాథమిక హక్కులు – ఆదేశక సూత్రాలు Textbook Questions and Answers.

AP Inter 2nd Year Civics Study Material 2nd Lesson ప్రాథమిక హక్కులు – ఆదేశక సూత్రాలు

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ప్రాథమిక హక్కుల రకాలను వివరింపుము.
జవాబు:
భారత రాజ్యాంగంలోని 3వ భాగంలో ప్రాథమిక హక్కులు ఉన్నాయి. 12వ అధికరణం నుండి 35వ అధికరణం వరకు గల అంశాలు ప్రాథమిక హక్కులను వివరిస్తాయి. ప్రాథమిక హక్కులు ప్రజల స్వేచ్ఛకు, సర్వతోముఖ వికాసానికి అవసరం. ఇవి ప్రజాస్వామ్యాన్ని సార్ధకం చేస్తాయి. ప్రస్తుతం 6 ప్రాథమిక హక్కులున్నాయి. వీటిని కోర్టు ద్వారా రక్షించుకోవచ్చు.

వీటిని గురించి విపులంగా చర్చిద్దాం
1) సమానత్వపు హక్కు (14 నుండి 18 వరకు గల ప్రకరణలు): ప్రాథమిక హక్కులలో సమానత్వపు హక్కు భారత పౌరులందరికి ‘చట్ట సమానత్వాన్ని కల్పించింది. రాజ్యాంగంలోని 14వ ప్రకరణ భారతదేశంలో నివసించే వ్యక్తులందరికి చట్టం ముందు సమానత్వాన్ని, చట్టం ద్వారా సమానమైన రక్షణ, సదుపాయాలను కల్పించింది.
పౌరుల మధ్య మతం, తెగ, కులం, లింగ, జన్మస్థల సంబంధమైన వివక్షతలను రాజ్యం పాటించరాదని 15వ ప్రకరణ స్పష్టం చేసింది. అలాగే బహిరంగ ప్రదేశాలు సందర్శించే విషయంలో పౌరుల మధ్య ఎలాంటి వివక్షత చూపించకూడదని పేర్కొంది.

16వ ప్రకరణ ప్రకారం రాజ్యానికి సంబంధించిన ఏ ఉద్యోగం లేదా నియామకానికైనా పౌరలందరికీ సమాన అవకాశాలు ఉంటాయి. ఉద్యోగపరమైన విషయాలలో మతం, తెగ, కులం, లింగం, పుట్టుక వంటి అంశాలేవి ప్రధానమైనవి కావని ఆ ప్రకరణ పేర్కొంది.

17వ ప్రకరణ అస్పృశ్యత లేదా అంటరానితనం పాటించడాన్ని నేరంగా పేర్కొంది. ఈ విషయంలో 1955లో పార్లమెంటు అస్పృశ్యత నివారణ చట్టాన్ని రూపొందించింది. ఈ చట్టాన్ని 1976 నుంచి పౌరహక్కుల పరిరక్షణ చట్టంగా వ్యవహరించడమైంది.

18వ ప్రకరణ ప్రకారం పౌరలకు సైనిక లేదా విద్యా విషయం బిరుదులు మినహా ఇతర బిరుదులను రాజ్యం ప్రసాదించకూడదు. భారత రాష్ట్రపతి అనుమతి లేకుండా విదేశాలు ప్రకటించే బిరుదులను పౌరులు స్వీకరించరాదు.

2) స్వేచ్ఛా హక్కు (19 నుండి 22 వరకు గల ప్రకరణలు): 19వ రాజ్యాంగ ప్రకరణ భారత పౌరులకు 7 రకాల స్వాతంత్ర్యాలను ప్రసాదించింది. అవి

  1. వాక్ స్వాతంత్య్రం, భావప్రకటనా స్వాతంత్య్రం.
  2. శాంతియుతంగా సమావేశమయ్యే స్వాతంత్య్రం.
  3. సంఘాలు, యూనియన్లు ఏర్పాటు చేసుకొనే స్వాతంత్య్రం.
  4. దేశమంతటా స్వేచ్ఛగా సంచరించే స్వాతంత్య్రం.
  5. దేశంలో ఎక్కడైనా నివసించడానికి, స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకోవడానికి స్వాతంత్ర్యం.
  6. ఆస్తిని సంపాదించుకొనుటకు, ఆర్జించుటకు, దానధర్మాలు, విక్రయాలు చేసుకొనే స్వాతంత్య్రం.
  7. ఏ వృతినైనా, వ్యాపారాన్నైనా చేసుకొనే స్వాతంత్య్రం.

20వ ప్రకరణ వ్యక్తులు నేరాలకు పాల్పడిన సందర్భాలలో శిక్ష విధించే విషయంలో రక్షణలను పేర్కొంది. ఈ ప్రకరణ అమలులో ఉన్న చట్టాన్ని అతిక్రమించనిదే ఏ వ్యక్తిని దోషిగా పరిగణించకూడదని పేర్కొంటుంది.

21వ అధికరణం ఏ ఒక్క వ్యక్తిని చట్టం పేర్కొన్న పద్ధతి ప్రకారం తప్ప మరో విధంగా అతని జీవనానికి, వ్యక్తి స్వాతంత్ర్యానికి భంగం కల్గించరాదని స్పష్టం చేసింది. ఈ ప్రకరణలను అత్యవసర పరిస్థితుల కాలంలో కూడా రద్దుచేయరు.

22వ ప్రకరణ ప్రకారం ఏ ఒక్క వ్యక్తిని కారణం లేకుండా నిర్భంధంలోకి తీసుకోకూడదు. నిర్భంధంలోకి తీసుకున్న వ్యక్తికి అందుకు కారణాలు తెలపటంతోపాటు న్యాయ సహాయం పొందటానికి వీలు కల్పించాలి. ఉదా: నిర్భంధంలోకి తీసుకున్న వ్యక్తిని 24 గం||లలోగా సమీప న్యాయమూర్తి ఎదుట హాజరుపరచాలి.

3) పీడనను నిరోధించే హక్కు (23 మరియు 24 ప్రకరణలు): 23వ ప్రకరణ ప్రకారం రాజ్యంగాని, సంపన్న వర్గాలు కాని వ్యక్తులను దోపిడీకి గురిచేయకూడదు. మనషుల క్రయ విక్రయాలు జరపటం, ప్రతిఫలం చెల్లించకుండా బలవంతంగా వెట్టిచాకిరీ చేయించుకోవటం నిషేధం.

24వ ప్రకరణ ప్రకారం 14 సంవత్సరాలలోపు పిల్లలను కర్మాగారాలు, గనులు వంటి ప్రమాదకరమైన, ఆరోగ్యానికి హాని కల్గించే పనులలో నియమించకూడదు. బాల కార్మికత్వం చేయించుకొనుట చట్టవిరుద్ధం.

4) మత స్వాతంత్ర్యపు హక్కు (25 నుండి 28 ప్రకరణలు): 25వ ప్రకరణ ప్రకారం ప్రతి వ్యక్తి ప్రజా భద్రత, నైతికతకు లోబడి తన అంతరాత్మకు అనుగుణమైన మతాన్ని అవలంబించటానికి, ప్రచారం చేసుకొనటానికి హక్కుంది. 26వ ప్రకరణ ప్రతి వ్యక్తికి ఈ క్రింది హక్కులను ప్రసాదించింది.

  1. మతపరమైన ధార్మిక సంస్థలను ఏర్పాటు చేసుకోవడానికి
  2. స్వీయ మత వ్యవహారాలను నిర్వహించుకోవడానికి
  3. స్థిర, చరాస్థులపై యాజమాన్య హక్కు పొందడానికి, వాటిని కొనుగోలు చేయడానికి
  4. చట్టప్రకారం ఆస్తిపాస్తులను నిర్వహించుకోవడానికి

27వ ప్రకరణ మతం ఆధారంగా రాజ్యం ఏ వ్యక్తిపై, ఏ విధమైన పన్ను విధించడానికి, వసూలు చేయడానికి వీలులేదని పేర్కొంది. ఏదో ఒక మత ప్రయోజనాలకై రాజ్యం వ్యక్తుల నుంచి పన్నుల రూపంలో ఎలాంటి మొత్తాలను వసూలు చేయకూడదని నిర్దేశించింది.

28వ ప్రకరణ రాజ్యం నుంచి సంపూర్ణంగానో, పాక్షికంగానో ఆర్థిక సహాయాన్ని పొందే విద్యాసంస్థలలో మతపరమైన బోధనలు విషేధించడమైంది.

5) సాంస్కృతిక మరియు విద్యా హక్కు (29 మరియు 30 ప్రకరణలు): భారతపౌరులకు సాంస్కృతిక, విద్యాపరమైన అవకాశాలను రాజ్యాంగము ఈ హక్కుల ద్వారా ప్రసాదించింది. 29వ ప్రకరణ ప్రకారం ప్రతి పౌరుడూ స్వంతభాష, సంస్కృతులను పరిరక్షించుకోవచ్చు. ఈ విషయంలో మత, భాష, ప్రాంతీయ అంశాలేవీ ఆటంకంగా ఉండవు. అల్పసంఖ్యాకులు వారి భాష, సంస్కృతులను పరిరక్షించుకోవచ్చని ఈ హక్కు పేర్కొంది.

30వ ప్రకరణం ప్రకారం ప్రభుత్వం నుంచి సంపూర్ణంగా గానీ, పాక్షికంగాగానీ ఆర్థిక సహాయం పొందే విద్యార్థులలో కులం, నుతం, ప్రాంతం, వర్ణం, భాష లేదా లింగపరమైన అంశాల ప్రాతిపదికపై పౌరులకు ప్రవేశాన్ని నిరాకరించకూడదు.

6) రాజ్యాంగ పరిహారపు హక్కు (32వ ప్రకరణ): ఈ హక్కు ప్రాథమిక హక్కులన్నింటిలోకి అత్యంత ప్రధానమైంది. ఈ హక్కును ప్రాథమిక హక్కులకు రక్షణ వలయంగాను, కంచెగాను, భద్రతా కవచంగాను పరిగణించటమైంది. 32వ ప్రకరణ ప్రకారం భారత పౌరల ప్రాథమిక హక్కుల పునరుద్ధరణకు, రక్షణకు సుప్రీంకోర్టు, రాష్ట్ర హైకోర్టులు హెబియస్ కార్పస్, మాండమస్, ప్రొహిబిషన్, సెర్షియరీ, కోవారంటో మొ॥ రిట్లను జారీచేసే అధికారాన్ని కల్గి ఉన్నాయి.

ప్రశ్న 2.
భారత రాజ్యాంగంలో పొందుపరచిన వివిధ రకాల ఆదేశక సూత్రాలను వివరింపుము. [Mar. ’17]
జవాబు:
భారత రాజ్యాంగంలోని 4వ భాగం ఆదేశక సూత్రాలకు సంబంధించినది. రాజ్యాంగంలోని 36వ అధికరణం నుండి 51వ అధికరణం వరకు అదేశక సూత్రాలకు సంబంధించినవి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రాజ్యాంగం ఇచ్చిన ఆదేశాలే ఈ సూత్రాలు. ఇవి ప్రభుత్వానికి ప్రజలపట్ల గల బాధ్యతలను వివరిస్తాయి. ప్రభుత్వం తన విధానాలను రూపొందించుకునేటప్పుడు వీటికి అనుగుణంగా రూపొందించుకోవాలి. వీటిని ఐరిష్ రాజ్యాంగం నుండి గ్రహించడం జరిగింది.

ఆదేశక సూత్రాల వర్గీకరణ: మన రాజ్యాంగంలో అదేశక సూత్రాలను ప్రత్యేకంగా వర్గీకరణ లేనప్పటికి ప్రభుత్వ పాలనా శాస్త్రవేత్తలు పతనాసౌలభ్యం కొరకు ఆదేశ సూత్రాలను మూడు రకాలుగా వర్గీకరించారు. అవి: 1. సామ్యవాద సూత్రాలు, 2. ఉదారవాద సూత్రాలు, 3. గాంధేయ సూత్రాలు. వీటిని గురించి క్రింది విధంగా వివరించవచ్చును.

1. సామ్యవాద సూత్రాలు: ఈ సూత్రాలు సామ్యవాద, శ్రేయోరాజ్య సిద్ధాంత స్థాపన లక్ష్యంగా సామాజిక ఆర్థిక న్యాయాన్ని అందించే ఉద్దేశ్యంతో అదేశక సూత్రాల జాబితాలో చేర్చారు. రాజ్యాంగంలోని 38, 39, 41, 42, 43, 46, 47 ప్రకరణలు ఆదేశక సూత్రాలలోని సామ్యవాద ఆదర్శాల గురించి వివరించాయి.
1. 38వ ప్రకరణ ప్రకారం రాజ్యం ప్రజలందరికీ న్యాయంతో కూడిన సామాజిక వ్యవస్థను సాధించి పెంపొందించడానికి కృషి చేయాలి. రాజ్యంలో ప్రజలందరికీ సామాజిక, ఆర్థిక న్యాయాలు దక్కేటట్లుగా చూడాలి.

2. 39వ ప్రకరణ ప్రకారం రాజ్యం క్రింద పేర్కొన్న చర్యలను అమలులో ఉంచడానికి కృషి చేయాలి.

  1. తగినంత జీవనోపాధి అవకాశాలను కల్పించడం.
  2. సమిష్టి సంక్షేమానికి దోహదపడే భౌతిక వనరులను సంపదను పంపిణీ చేయడం.
  3. స్త్రీ, పురుషులందరికీ సమాన వేతనాన్ని అందించడం.
  4. బాలకార్మికుల రక్షణ.
  5. జాతీయ సంపదను వికేంద్రీకరించడం.
  6. కార్మికుల ఆరోగ్యం, శక్తి దుర్వినియోగం కాకుండా చూడడం.
  7. బాలబాలికలను, యువకులను దోపిడీకి గురికాకుండా రక్షణ.

3. 41వ ప్రకరణ ప్రకారం నిరుద్యోగం, వృద్ధాప్యం, అస్వస్థత, అంగవైకల్యం వంటి ప్రమాదాల బారిన పడిన వారికి పనిహక్కు, విద్య, ప్రభుత్వ సహాయం అందే విధంగా చూడాలి.

4. 42వ ప్రకరణ ప్రకారం కార్మికులకు న్యాయబద్ధమైన మానవతా పరిస్థితులతో కూడిన పనిని కల్పించడం, స్త్రీలకు ప్రసూతి వైద్య సదుపాయాలను రాజ్యం కల్పించాలి.

5. 43వ ప్రకరణ ప్రకారం రాజ్యం వ్యవసాయ, పారిశ్రామిక కార్మికులందరికీ తగిన పనిని కల్పించడం. మంచి ప్రమాణంతో కూడిన జీవనాన్ని గడపడానికి అవసరమైన పరిస్థితులను, విరామాన్ని, సాంఘిక, సాంస్కృతిక అవకాశాలను కల్పించడానికి కృషిచేయాలి.

6. 47వ ప్రకరణ ప్రకారం ప్రజల పోషకాహార స్థాయిని, జీవన ప్రమాణాన్ని పెంపొందించడానికి, ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి కృషి చేయాలి.

2. ఉదారవాద సూత్రాలు: ప్రాథమిక విద్య, ఉమ్మడి పౌరస్మృతి, స్వతంత్ర న్యాయశాఖ, అంతర్జాతీయ శాంతి వంటి ఆశయాల సాధన కోసం ఉదారవాద సూత్రాలను చేర్చారు. వాటిని రాజ్యాంగంలోని 44, 45, 50, 51 ప్రకరణలలో పేర్కొనడమైంది.
1. 44వ ప్రకరణ ప్రకారం దేశంలో నివసించే పౌరులందరికీ వర్తించే విధంగా ఉమ్మడి పౌరస్మృతి (Common civil code) ని రాజ్యం రూపొందించాలి.

2. 45వ ప్రకరణ ప్రకారం 14సంవత్సరాలోపు పిల్లలందరికీ ఉచిత, నిర్భంద విద్యను అందించడానికి రాజ్యం ప్రయత్నించాలి. ఈ చర్యకు బదులుగా బాలబాలికలు 6సంవత్సరాల వయస్సు పూర్తయ్యే వరకు వారికి శిశుసంరక్షణ, విద్యలను సమకూర్చడానికి రాజ్యం చర్యలు తీసుకోవాలని రాజ్యాంగం (86వ రాజ్యాంగ సవరణ) చట్టం 2002 సూచించింది.

3. 48వ ప్రకరణ ప్రకారం వ్యవసాయం, పశుపోషణలను ఆధునిక, శాస్త్రీయ పద్ధతులలో నిర్వహించడానికి రాజ్యం చర్యలు తీసుకోవాలి.

4. 49వ ప్రకరణ ప్రకారం జాతీయ ప్రాధాన్యం ఉన్న కళాత్మకమైన లేదా చారిత్రక చిహ్నాలు, ప్రదేశాలు, వస్తువులను రాజ్యం సంరక్షించాలి.

5. 48ఎ ప్రకరణ అనుసరించి పర్యావరణాన్ని పరిరక్షించడానికి, అడవులు, వన్యప్రాణులను కాపాడటానికి రాజ్యం కృషిచేయాలి.

6. 50వ ప్రకరణ ప్రకారం ప్రజా సేవల విషయంలో కార్యనిర్వాహక శాఖ నుంచి న్యాయశాఖను వేరుచేయడానికి రాజ్యం చర్యలు తీసుకోవాలి.

7. 51వ ప్రకరణ ప్రకారం రాజ్యం (ఎ) అంతర్జాతీయ శాంతిని, న్యాయాన్ని, భద్రతను పెంపొందించడం, (బి) దేశాల మధ్య న్యాయపరమైన, గౌరవప్రదమైన, దౌత్య సంబంధాలను నిర్వహించడం, సి) చారిత్రక కట్టడాలను, సంస్కృతిని పరిరక్ష కల్పించటం, ఇ) అంతర్జాతీయ వివాదాలను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవడానికి ప్రోత్సహించడం వంటి చర్యల అమలుకోసం కృషిచేయాలి.

3. గాంధేయ వాద సూత్రాలు: భారతదేశంలో ఆదర్శపాలనను అందించడానికి గాంధేయ సూత్రాలు దోహదపడతాయి. గాంధీజీ ప్రవచించిన ఆదర్శాలను ఆదేశక సూత్రాలలోని 40, 43, 46, 47, 48ఎ, 49 ప్రకరణలలో ప్రస్తావించడం జరిగింది. వాటిని ఈ క్రింది వివరింపబడినవి.

  1. 40వ ప్రకరణ ప్రకారం రాజ్యం పంచాయితీరాజ్ సంస్థలను నిర్వహించి, అవి స్వయంపాలన సంస్థలుగా ఏర్పడటానికి తగిన అధికారాలు ఇవ్వాలి.
  2. 43వ ప్రకరణ ప్రకారం గ్రామీణ ప్రాంతాలలో వ్యక్తిగత లేదా సహకార ప్రాతిపదికపై కుటీర పరిశ్రమల స్థాపనకు రాజ్యం తోడ్పడాలి.
  3. 46వ ప్రకరణ ప్రకారం షెడ్యూల్డు కులాల, తరగతుల, బలహీన వర్గాల ప్రజల విద్యా, సామాజిక ప్రగతికి రాజ్యం ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
  4. 47వ ప్రకరణ ప్రకారం ఆరోగ్యానికి హాని కల్గించే మత్తుపానీయాలు, మాదక ద్రవ్యాల నిషేధానికి చర్యలు తీసుకోవాలి.

అదనపు సూత్రాలు: భారత రాజ్యాంగానికి 42 రాజ్యాంగ సవరణ చట్టం, 1976, 44వ రాజ్యాంగ సవరణ చట్టం, 1978 ద్వారా ఈ క్రింది వాటిని ఆదేశ సూత్రాల జాబితాలో అదనపు సూత్రాలుగా చేర్చాయి. 42వ రాజ్యాంగ సవరణ చట్టం 390, 430, 48ఎ ప్రకరణలను, 44వ రాజ్యాంగ సవరణ చట్టం, 38వ ప్రకరణ క్లాజ్ 2ను ఆదేశ సూత్రాల జాబితాలో పేర్కొనడం జరిగింది. ఈ సవరణల వల్ల ఆదేశక సూత్రాల సంఖ్య ఘననీయంగా పెరిగింది. వీటిలో క్రింది అంశాలు ఉన్నాయి.

  1. పిల్లల ఆరోగ్యం, ప్రగతి పరిరక్షణకు తగిన అవకాశాలు కల్పించడం.
  2. పేదలకు ఉచిత న్యాయ సహాయం అందించడం.
  3. కర్మాగార నిర్వహణలో కార్మికులకు భాగస్వామ్యం కల్పించడం.
  4. పర్యావరణం, అడవులు, వన్యమృగాల పరిరక్షణకు కృషి చేయటం.

ప్రశ్న 3.
భారత రాజ్యాంగంలో పొందుపరచిన ప్రాథమిక విధులను వర్ణించుము. [Mar. ’16]
జవాబు:
భారత రాజ్యాంగ లక్షణాలలో ప్రాథమిక విధులు అత్యంత విశిష్టమైనవి. అవి పూర్వపు సోవియట్ రష్యా రాజ్యాంగం చేత ప్రేరితమైనవి. భారత రాజ్యాంగం రూపకల్పన కాలం నందు వీటిని రాజ్యాంగం నందు చేర్చలేదు. అయితే శ్రీమన్నారాయణ అగర్వాల్ రచించిన గాంధియన్ కాన్స్టిట్యూషన్ ఫర్ ఫ్రీ ఇండియా (1946) అనే గ్రంథంలో వీటిని
గురించి పేర్కొన్నారు. భారత స్వాతంత్య్రానంతరము భారతదేశంలో రాజకీయపరంగాను, రాజ్యాంగపరంగాను అనేక మార్పులు చోటు చేసుకున్నవి. 1975 – 1977 సంవత్సరాల మధ్య కాలమందు రాజ్యాంగంలో ప్రాథమిక విధులను చేర్చవలెననే భావన కేంద్ర ప్రభుత్వమునకు వచ్చినది.

ఐక్యరాజ్యసమితి విశ్వజనీన మానవ హక్కుల ప్రకటన (Universal Declaration of Human Rights), 1948 సోవియట్ యూనియన్ తరహాలోని ప్రాథమిక విధులను, పరిగణలోనికి తీసుకొని భారత రాజ్యాంగంలో చేర్చాలని భావించి కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో చొరవ తీసుకొని సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీని 1976లో నియమించింది. ప్రపంచంలోని వివిధ రాజ్యాంగాలలో పొందుపర్చిన ప్రాథమిక విధులను పరిశీలించిన పిదప ఈ కమిటీ ఎనిమిది ప్రాథమిక విధులను రాజ్యాంగంలో పొందుపరచుటకు సూచనలను చేసింది. అందుకు అనుగుణంగా అప్పటి అధికార పార్టీ పార్లమెంట్లో 42వ రాజ్యాంగ సవరణ బిల్లు 1976ను ప్రవేశపెట్టింది. పార్లమెంట్ ఆ రాజ్యాంగంలో 10 ప్రాథమిక విధులు చేర్చడం జరిగింది. వాటిని రాజ్యాంగం iv ఎ భాగంలో 51ఎ అనే ప్రకరణంలో ప్రస్తావించడమైనది. తరువాత 2002లో రాజ్యాంగం 86వ సవరణ చట్టం ద్వారా మరొక అంశం ప్రాథమిక విధుల జాబితాలో చేర్చడమైంది. దాంతో అప్పటి నుంచి భారత పౌరులకు మొత్తం 11 ప్రాథమిక విధులను సూచించడమైంది. వాటిని క్రింది విధంగా పేర్కొనవచ్చు.

భారత రాజ్యాంగంలోని 51-ఎ ప్రకరణ ప్రకారం ప్రతి ఒక్క భారత పౌరుడు తప్పనిసరిగా ఈ క్రింది విధులను నిర్వర్తించవలసి ఉన్నది.

  1. భారత రాజ్యాంగం పట్ల, రాజ్యాంగ ఆదర్శాల పట్ల, సంస్థల పట్ల, జాతీయ పతాకం, జాతీయ గీతం పట్ల విధేయతను చూపటం.
  2. స్వాతంత్ర్యం సాధనకై జరిగిన జాతీయోద్యమ ఉదాత్త ఆశయాలను గౌరవించి అనుసరించడం.
  3. భారతదేశ సార్వభౌమత్వం, సమైక్యత, సమగ్రతలను సమర్థించి సంరక్షించుకోవడం.
  4. దేశాన్ని రక్షించుకోవడం, అవసరమయినపుడు జాతీయ సేవలో పాల్గొనడం.
  5. మత, భాషా, ప్రాంతీయ, వర్గ సంబంధమైన వైవిధ్యాలను అధిగమించి భారత ప్రజలందరిలో సమైక్యతను, ఉమ్మడి సౌభ్రాతృత్వ భావాలను పెంపొందించుకోవడం, మహిళల గౌరవానికి విరుద్ధమైన పద్ధతులను పరిత్యజించడం.
  6. సుసంపన్నమైన వారసత్వాన్ని, వైవిధ్యంతో కూడుకున్న సంస్కృతిని సంరక్షించుకోవడం.
  7. అడవులు, సరస్సులు, నదులు, వన్యప్రాణులతో కూడిన సహజ వాతావరణాన్ని సంరక్షించుకొని పెంపొందించు కోవడం, ప్రాణికోటి పట్ల కారుణ్యాన్ని చూపించడం.
  8. శాస్త్రీయ వైఖరి, మానవతావాదం, సమతా సంస్కరణ దృక్పథాన్ని కలిగి ఉండటం.
  9. ప్రభుత్వ ఆస్తులను సంరక్షించడం, హింసను విడనాడటం.
  10. జాతి ఉన్నత స్థాయిల్లోకి ఎదగడానికి వ్యక్తి పరంగానూ, సామూహికంగానూ సామాజిక కార్యకలాపాల్లో పాల్గొనడం.
  11. ఆరు నుంచి పద్నాలుగు ఏళ్ళ వయస్సు ఉన్న బాలబాలికలకు వారి తల్లిదండ్రులు, సంరక్షకులు తగిన విద్యా సదుపాయాలు కల్పించడం.

పైన పేర్కొన్న వాటిలో మొదటి పది ప్రాథమిక విధులు 1977 జనవరి మూడో తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. పదకొండో ప్రాథమిక విధి 2002 డిసెంబర్ పన్నెండో తేది నుంచి అమల్లోకి వచ్చింది.

ప్రశ్న 4.
ప్రాథమిక హక్కులు, ఆదేశక సూత్రాల మధ్య గల వ్యత్యాసాలను వివరింపుము.
జవాబు:
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రాజ్యాంగం ఇచ్చిన ఆదేశాలే ఈ సూత్రాలు. ప్రభుత్వం తన విధానాలను రూపొందించుకొనేటప్పుడు వీటికి అనుగుణంగా రూపొందించుకోవాలి. శాసన సభ్యులకు, పాలకులకు ఈ సూత్రాలు ఒక ప్రవర్తనా నియమావళి. భారతదేశంలో సాంఘిక, ఆర్థిక ప్రజాస్వామ్య స్థాపనకు ఇవి మూలము. ప్రజాస్వామ్య పద్ధతుల ద్వారా దేశంలో “సంక్షేమ రాజ్యాన్ని” స్థాపించుటే వీటి ఉద్దేశ్యము.

భారత రాజ్యాంగంలోని 4వ భాగంలో ఆదేశక సూత్రాలు ఉన్నాయి. అవి రాజ్యాంగ నిర్మాతల ఆశయాలను, ఆదర్శాలను ప్రతిబింబిస్తాయి. ఇవి ప్రభుత్వానికి ప్రజల పట్ల గల బాధ్యతలను వివరిస్తాయి. భారతదేశాన్ని ఒక సంక్షేమ రాజ్యంగానూ, వర్గరహిత రాజ్యంగానూ ఏర్పరచటమే ఈ నియమాల లక్ష్యం.

ఈ ఆదేశక సూత్రాలను న్యాయస్థానాల ద్వారా రక్షించుకోవటానికి వీలులేదు. ప్రభుత్వం విధానాలు రూపొందించుకొనేటప్పుడు వీటికి అనుగుణంగా రూపొందించుకోవాలి.
భారత రాజ్యాంగంలోని 3వ భాగంలో ప్రాథమిక హక్కులు 12వ అధికరణం నుండి 35వ అధికరణం వరకు ప్రస్తావించబడ్డాయి. ప్రాథమిక హక్కులు ప్రజల స్వేచ్ఛకు, సర్వతోముఖ వికాసానికి అవసరం. ఇవి ప్రజాస్వామ్యాన్ని సార్థకం చేస్తాయి. వీటిని కోర్టు ద్వారా రక్షించుకోవచ్చు.

ప్రాథమిక హక్కులకు, ఆదేశక సూత్రాలకు మధ్యగల తేడాలు:

ప్రాథమిక హక్కులు

  1. రాజ్యాంగం 3వ భాగంలో పొందుపరచబడ్డాయి.
  2. వ్యక్తికి స్వేచ్ఛనిచ్చి, సమగ్రాభివృద్ధికి, వికాసానికి తోడ్పడతాయి. ఇవి ప్రజాస్వామ్యాన్ని సార్థకం చేస్తాయి.
  3. ప్రాథమిక హక్కులకు ఆజ్ఞాపించే స్వభావం ఉంది. ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే న్యాయస్థానాల ద్వారా రక్షించుకోవచ్చు.
  4. ప్రాథమిక హక్కులు పౌరుడు అనుభవించడానికి ఉద్దేశించబడినవి.
  5. ప్రాథమిక హక్కులు వ్యక్తికి ఇవ్వబడ్డాయి. ప్రభుత్వ నిరంకుశత్వాన్ని ఇవి అరికడతాయి.
  6. ప్రాథమిక హక్కుల సంఖ్య, పరిధి తగ్గుచున్నది.
  7. ఇవి రాజకీయ ప్రజాస్వామ్య స్థాపనకు ఉద్దేశింపబడ్డాయి.
  8. వీటిని అమెరికా రాజ్యాంగం నుండి గ్రహించారు.
  9. ప్రాథమిక హక్కులకు భంగం కలిగించే శాసనాన్ని ‘చెల్లనేరదని’ కోర్టులు కొట్టివేస్తాయి.
  10. ప్రాథమిక హక్కులు ప్రభుత్వాన్ని కొన్ని పనులు చేయవద్దని శాసిస్తాయి.

ఆదేశక సూత్రాలు

  1. రాజ్యాంగం 4వ భాగంలో పొందుపరచబడ్డాయి.
  2. ఇవి సమాజ సంక్షేమానికి తోడ్పడతాయి. ఇవి ప్రజల ప్రయోజనాలకు, వారి నైతిక, భౌతిక, ఆర్థిక, సాంఘిక ప్రగతికి మూలము.
  3. ఆదేశక సూత్రాలకు ఆజ్ఞాపించే స్వభావం లేదు. వీటి అమలు రాష్ట్రాల ఆర్థిక వనరులపై ఆధారపడినాయి. వీటికి న్యాయస్థానాల రక్షణ లేదు.
  4. ఆదేశక సూత్రాలు రాజ్యాంగం ప్రభుత్వాలకు నిర్దేశించిన బాధ్యతలు.
  5. ఇవి సమాజ సంక్షేమానికై రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు పాటించవలసిన నియమాలు.
  6. ఆదేశక సూత్రాల సంఖ్య, పరిధి విస్తృతమగుచున్నది.
  7. ఇవి సాంఘిక, ఆర్థిక ప్రజాస్వామ్య స్థాపనకు ఉద్దేశింపబడ్డాయి.
  8. వీటిని ఐర్లాండ్ రాజ్యాంగం నుండి గ్రహించారు.
  9. ఆదేశక సూత్రాలకు భంగం కల్గించే శాసనం ‘చెల్లనేరదని’ కోర్టులు కొట్టివేయలేవు.
  10. ఆదేశక సూత్రాలు ప్రభుత్వం చేయవలసిన పనుల గురించి ఆదేశిస్తాయి.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ప్రాథమిక హక్కులు, ఆదేశక సూత్రాలు మధ్య మారుతున్న సంబంధాలను వివరింపుము.
జవాబు:
ప్రాథమిక హక్కులు, అదేశక సూత్రాల మధ్య చట్టబద్ధమైనవి మరియు చట్టబద్ధము కానివి అనే వర్గీకరణ ఉన్నప్పటికీ, ఆదేశక సూత్రాలు రాజకీయంగా ఎంతో ప్రాధాన్యతను సంతరించుకొన్నవి. ఎన్నో సంవత్సరముల నుండి ఈ రెండింటి మధ్య అనేక మార్పులు చోటుచేసుకొన్నాయి. అవి
1. వ్యక్తి ప్రయోజనాలను కాంక్షిస్తున్న ప్రాథమిక హక్కులకూ, సమాజ శ్రేయస్సు కాంక్షిస్తున్న ఆదేశక సూత్రాల మధ్య అమలు విషయంలో ప్రతిష్టంబన ఏర్పడినపుడు ఏమి జరుగుతుందనే విషయంలో దేశంలో ఇప్పుడు చర్చ జరుగుతుంది. ఈ వివాదాంశం రాజకీయాంశంగా రూపుదిద్దుకుంది.

2. ప్రాథమిక హక్కులు, ఆదేశక సూత్రాల అమలుకు సంబంధించి అనేక వివాదాంశాలలో సుప్రీంకోర్టు అనేక సందర్భాలలో ఆదేశక సూత్రాలే ప్రాథమిక హక్కులకు లొంగి ఉండాలనే అభిప్రాయాన్ని వెలిబుచ్చినది.

3. బ్యాంకుల జాతీయకరణ, రాజభరణాల రద్దు లాంటి చట్టాలు రాజ్యాంగ విరుద్ధమని న్యాయస్థానాల తీర్పుల ఫలితంగానే 1971లో 25వ రాజ్యాంగసవరణ చట్టంను పార్లమెంట్ రూపొందించింది. ఈ సవరణ చట్టంను అనుసరించి ఆదేశక సూత్రాలు అమలును ఉద్దేశించి చేసిన ఏ చట్టాలైనను ప్రాథమిక హక్కులలోని 14వ ప్రకరణ, 19వ ప్రకరణ మరియు 31వ ప్రకరణలు అతిక్రమించుతున్నవనీ, ఆ చట్టాలు రాజ్యాంగ విరుద్ధమని న్యాయస్థానాలు ప్రకటించరాదని సవరణ చట్టంలో పేర్కొనబడినది.

4. 1976లో పార్లమెంట్ 42వ రాజ్యాంగ సవరణ చట్టంను రూపొందించింది. ఆదేశక సూత్రాలలో కొన్ని గాని లేదా అన్ని సూత్రాలు గాని అమలుపరచుటకు పార్లమెంట్ రూపొందించే చట్టాలు ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉన్నవని న్యాయస్థానాలు భావించరాదని ఈ రాజ్యాంగ సవరణ చట్టం నందు పేర్కొనబడినది.

5. కేశవానంద భారతి Vs కేరళ ప్రభుత్వం కేసు విషయంలో భారత రాజ్యాంగ మౌలిక అంశాలను సవరణ చేయు అధికారం పార్లమెంట్కు లేదని సుప్రీంకోర్టు తీర్పును వెల్లడించినది. సుప్రీంకోర్టు తీర్పు అర్థాన్ని అనుసరించి ప్రాథమిక హక్కులు భారత రాజ్యాంగంలో మౌలిక లక్షణంగా భావించబడుచున్నవి.

ప్రశ్న 2.
పౌరునికి గల ఏవైనా మూడు ప్రాథమిక హక్కులను వివరింపుము.
జవాబు:
భారత రాజ్యాంగంలోని 3వ భాగంలో ప్రాథమిక హక్కులు ఉన్నాయి. 12వ అధికరణం నుండి 35వ అధికరణం వరకు గల అంశాలు ప్రాథమిక హక్కులను వివరిస్తాయి. ప్రాథమిక హక్కులు ప్రజల స్వేచ్ఛకు, సర్వతోముఖ వికాసానికి అవసరం. ఇవి ప్రజాస్వామ్యాన్ని సార్థకం చేస్తాయి. ప్రస్తుతం 6 ప్రాథమిక హక్కులున్నాయి. వీటిని కోర్టు ద్వారా రక్షించుకోవచ్చు.

వీటిని గురించి విపులంగా చర్చిద్దాం.
1) సమానత్వపు హక్కు (14 నుండి 18 వరకు గల ప్రకరణలు): ప్రాథమిక హక్కులలో సమానత్వపు హక్కు భారత పౌరులందరికి ‘చట్ట సమానత్వాన్ని కల్పించింది. రాజ్యాంగంలోని 14వ ప్రకరణ భారతదేశంలో నివసించే వ్యక్తులందరికి చట్టం ముందు సమానత్వాన్ని, చట్టం ద్వారా సమానమైన రక్షణ, సదుపాయాలను కల్పించింది.

పౌరుల మధ్య మతం, తెగ, కులం, లింగ, జన్మస్థల సంబంధమైన వివక్షతలను రాజ్యం పాటించరాదని 15వ ప్రకరణ స్పష్టం చేసింది. అలాగే బహిరంగ ప్రదేశాలు సందర్శించే విషయంలో పౌరుల మధ్య ఎలాంటి వివక్షత చూపించకూడదని పేర్కొంది.

16వ ప్రకరణ ప్రకారం రాజ్యాంగా సంబంధించిన ఏ ఉద్యోగం లేదా నియామకానికైనా పౌరులందరికీ సమాన అవకాశాలు ఉంటాయి. ఉద్యోగపరమైన విషయాలలో మతం, తెగ, కులం, లింగం, పుట్టుక వంటి అంశాలేవి ప్రధానమైనవి కావని ఆ ప్రకరణ పేర్కొంది.

17వ ప్రకరణ అస్పృశ్యత లేదా అంటరానితనం పాటించడాన్ని నేరంగా పేర్కొంది. ఈ విషయంలో 1955లో పార్లమెంటు అస్పృశ్యత నివారణ చట్టాన్ని రూపొందించింది. ఈ చట్టాన్ని 1976 నుంచి పౌరహక్కుల పరిరక్షణ చట్టంగా వ్యవహరించడమైంది.

18వ ప్రకరణ ప్రకారం పౌరులకు సైనిక లేదా విద్యా విషయం బిరుదులు మినహా ఇతర బిరుదులను రాజ్యం ప్రసాదించకూడదు. భారత రాష్ట్రపతి అనుమతి లేకుండా విదేశాలు ప్రకటించే బిరుదులను పౌరులు స్వీకరించరాదు.

2) స్వేచ్ఛా హక్కు (19 నుండి 22 వరకు గల ప్రకరణలు): 19వ రాజ్యాంగ ప్రకరణ భారత పౌరులకు 7 రకాల స్వాతంత్య్రాలను ప్రసాదించింది. అవి

  1. వాక్ స్వాతంత్ర్యం, భావప్రకటనా స్వాతంత్ర్యం.
  2. శాంతియుతంగా సమావేశమయ్యే స్వాతంత్ర్యం.
  3. సంఘాలు, యూనియన్లు ఏర్పాటు చేసుకొనే స్వాతంత్య్రం.
  4. దేశమంతటా స్వేచ్ఛగా సంచరించే స్వాతంత్ర్యం.
  5. దేశంలో ఎక్కడైనా నివసించడానికి, స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకోవడానికి స్వాతంత్ర్యం.
  6. ఆస్తిని సంపాదించుకొనుటకు, ఆర్జించుటకు, దానధర్మాలు, విక్రయాలు చేసుకొనే స్వాతంత్ర్యం.
  7. ఏ వృత్తినైనా, వ్యాపారాన్నైనా చేసుకొనే స్వాతంత్య్రం.

20వ ప్రకరణ వ్యక్తులు నేరాలకు పాల్పడిన సందర్భాలలో శిక్ష విధించే విషయంలో రక్షణలను పేర్కొంది. ఈ ప్రకరణ అమలులో ఉన్న చట్టాన్ని అతిక్రమించనిదే ఏ వ్యక్తిని దోషిగా పరిగణించకూడదని పేర్కొంటుంది.

21వ అధికరణం ఏ ఒక్క వ్యక్తిని చట్టం పేర్కొన్న పద్ధతి ప్రకారం తప్ప మరో విధంగా అతని జీవనానికి, వ్యక్తి స్వాతంత్ర్యానికి భంగం కల్గించరాదని స్పష్టం చేసింది. ఈ ప్రకరణలను అత్యవసర పరిస్థితుల కాలంలో కూడా రద్దు చేయరు.

22వ ప్రకరణ ప్రకారం ఏ ఒక్క వ్యక్తిని కారణం లేకుండా నిర్భంధంలోకి తీసుకోకూడదు. నిర్బంధంలోకి తీసుకున్న వ్యక్తికి అందుకు కారణాలు తెలపటంతోపాటు న్యాయ సహాయం పొందటానికి వీలు కల్పించాలి. ఉదా: నిర్బంధంలోకి తీసుకున్న వ్యక్తిని 24 గం॥లలోగా సమీప న్యాయమూర్తి ఎదుట హాజరుపరచాలి.

3) పీడనను నిరోధించే హక్కు (23 మరియు 24 ప్రకరణలు):
23వ ప్రకరణ ప్రకారం రాజ్యంగాని, సంపన్న వర్గాలు కాని వ్యక్తులను దోపిడీకి గురిచేయకూడదు. మనుషుల క్రయ విక్రయాలు జరపటం, ప్రతిఫలం చెల్లించకుండా బలవంతంగా వెట్టిచాకిరీ పనులు చేయించుకోవటం నిషేధం. 24వ ప్రకరణ ప్రకారం 14 సంవత్సరాలలోపు పిల్లలను కర్మాగారాలు, గనులు వంటి ప్రమాదకరమైన, ఆరోగ్యానికి హాని కల్గించే పనులలో నియమించకూడదు. బాల కార్మికత్వం చేయించుకొనుట చట్టవిరుద్ధం.

ప్రశ్న 3.
పౌరులకు గల ఆరు స్వాతంత్య్రాలను పేర్కొనుము. [Mar. ’17]
జవాబు:
ప్రాథమిక హక్కులలో సమానత్వపు హక్కు భారత పౌరులందరికి ‘చట్ట సమానత్వాన్ని కల్పించింది. రాజ్యాంగంలోని 14వ ప్రకరణ భారతదేశంలో నివసించే వ్యక్తులందరికి చట్టం ముందు సమానత్వాన్ని, చట్టం ద్వారా సమానమైన రక్షణ, సదుపాయాలను కల్పించింది.

  • వాక్ స్వాతంత్ర్యం, భావ ప్రకటన స్వాతంత్య్రం.
  • శాంతియుతంగా సమావేశమయ్యే స్వాతంత్య్రం.
  • సంఘాలు, యూనియన్లు ఏర్పాటు చేసుకొనే స్వాతంత్య్రం.
  • దేశమంతటా స్వేచ్ఛగా సంచరించే స్వాతంత్ర్యం.
  • దేశంలో ఎక్కడైనా నివసించడానికి, స్థిరనివాసం ఏర్పాటుచేసుకోవడానికి స్వాతంత్ర్యం.
  • ఆస్తిని సంపాదించుకొనుటకు, ఆర్జించుటకు, దానధర్మాలు, విక్రయాలు చేసుకొనే స్వాతంత్ర్యం.
  • ఏ వృత్తినైనా, వ్యాపారాన్నైనా చేసుకొనే స్వాతంత్య్రం.

అయితే ప్రకరణ 19(1) (f) సబ్ క్లాజులో చెప్పబడిన ఆస్తి హక్కును 44వ రాజ్యాంగ సవరణ చట్టం, 1978 ద్వారా తొలగించబడినది. ఇప్పుడు ఆరు ప్రాథమిక స్వాతంత్ర్యాలు మాత్రమే కలవు.

ప్రశ్న 4.
రాజ్యాంగ పరిహారపు హక్కును గూర్చి క్లుప్తంగా వ్రాయుము.
జవాబు:
రాజ్యాంగ పరిహార హక్కు ప్రాథమిక హక్కులన్నింటిలో అత్యంత ప్రధానమైంది. ఈ హక్కును ప్రాథమిక హక్కులకు రక్షణ వలయంగానూ, కంచెగానూ, భద్రతాకవచంగాను పరిగణించడమైంది. పౌరుల ప్రాథమిక హక్కులను ప్రభుత్వంతో సహా ఎవరైనా లేదా ఏ సంస్థ అయినా హరించడానికి లేదా కుదించడానికి ప్రయత్నిస్తే, బాధిత పౌరులు తగిన ఉపశమనాన్ని పొందడానికి ఈ హక్కు వీలు కల్పిస్తుంది. ప్రాథమిక హక్కుల విషయంలో తోటి పౌరులు, ప్రైవేట్ లేదా ప్రభుత్వ సంస్థల నుంచి పౌరులకు ఏవైనా ఇబ్బందులు ఎదురైతే, వారు సముచిత న్యాయస్థానం ద్వారా రక్షణ పొందవచ్చు. ఈ సందర్భంలో రాజ్యాంగం 32 మరియు 226వ అధికరణం ప్రకారం సుప్రీంకోర్టు, రాష్ట్ర హైకోర్టులు దురాక్రమణ దారుల చర్యలను క్రమబద్ధం చేయడానికి లేదా అడ్డుకోవడానికి బాధితుల ప్రాథమిక హక్కుల పునరుద్ధరణ కోసం హెబియస్ కార్పస్, ప్రొహిబిషన్, సెర్షియరీ, కోవారెంటో, మాండమస్ వంటి రెట్లును మంజూరు చేస్తాయి. డాక్టరు బి.ఆర్ అంబేద్కర్ ఈ హక్కును రాజ్యాంగానికి హృదయం, ఆత్మవంటిదని వర్ణించాడు.

ప్రశ్న 5.
ప్రాథమిక హక్కులకు ఆదేశక సూత్రాల మధ్య గల ఐదు వ్యత్యాసాలను వివరింపుము. [Mar. ’16]
జవాబు:
ప్రాథమిక హక్కులు

  1. రాజ్యాంగం 3వ భాగంలో పొందుపరచబడ్డాయి.
  2. వ్యక్తికి స్వేచ్ఛనిచ్చి, సమగ్రాభివృద్ధికి, వికాసానికి తోడ్పడతాయి. ఇవి ప్రజాస్వామ్యాన్ని సార్థకం చేస్తాయి.
  3. ప్రాథమిక హక్కులకు ఆజ్ఞాపించే స్వభావం ఉంది. ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే న్యాయస్థానాల ద్వారా రక్షించుకోవచ్చు.
  4. ప్రాథమిక హక్కులు పౌరుడు అనుభవించడానికి ఉద్దేశించబడినవి.
  5. ప్రాథమిక హక్కులు వ్యక్తికి ఇవ్వబడ్డాయి. ప్రభుత్వ నిరంకుశత్వాన్ని ఇవి అరికడతాయి.

ఆదేశక సూత్రాలు

  1. రాజ్యాంగం 4వ భాగంలో పొందుపరచబడ్డాయి.
  2. ఇవి సమాజ సంక్షేమానికి తోడ్పడతాయి. ఇవి ప్రజల ప్రయోజనాలకు, వారి నైతిక, భౌతిక, ఆర్థిక, సాంఘిక ప్రగతికి మూలము. ఆదేశక సూత్రాలకు ఆజ్ఞాపించే స్వభావం లేదు.
  3. వీటి అమలు రాష్ట్రాల ఆర్థిక వనరులపై ఆధారపడినాయి. వీటికి న్యాయస్థానాల రక్షణ లేదు.
  4. ఆదేశక సూత్రాలు రాజ్యాంగం ప్రభుత్వాలకు నిర్దేశించిన బాధ్యతలు.
  5. ఇవి సమాజ సంక్షేమానికై రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు పాటించవలసిన నియమాలు.

ప్రశ్న 6.
ఆదేశక సూత్రాల లక్షణాలను వివరింపుము.
జవాబు:

  1. ఆదేశక సూత్రాలు అనేవి భారతదేశంలో వివిధ ప్రభుత్వాలకు ఇచ్చిన ఆజ్ఞలు.
  2. ఇవి సంవర్ధక స్వభావాన్ని కలిగి ఉంటాయి. అంటే వివిధ స్థాయిలలో ఉన్న ప్రభుత్వాల అధికార, విధుల పరిధిని విస్తృత పరుస్తాయి.
  3. వీటిని వివిధ ప్రభుత్వాలు ఆర్థిక వనరుల లభ్యత మేరకే అమలుపరుస్తాయి.
  4. ఇవి ప్రజల సమ్మతిని కలిగి ఉంటాయి. సమసమాజ స్థాపనే వీటి లక్ష్యం.
  5. వివిధ స్థాయిలలో గల ప్రభుత్వాలలో అధికార బాధ్యతలు చేపట్టే ఏ పార్టీ అయినా స్వీయ రాజకీయ సిద్దాంతాలతో నిమిత్తం లేకుండా వీటిని అమలుచేయాల్సి ఉంటుంది.
  6. ఈ సూత్రాలను అమలు చేయకపోవడాన్ని ఎటువంటి చట్టధిక్కారమైన చర్యగా పరిగణించరు.
  7. వీటికి శిక్షాత్మక స్వభావం లేదు. వీటిని వెంటనే అమలుచేయాల్సిందిగా ఎవరూ నిర్బంధించరు. వీటి అమలులో ప్రభుత్వాలకు విచక్షణాత్మక అధికారాలు ఉంటాయి.
  8. భారతదేశంలో రాజకీయ ప్రజాస్వామ్యం, ఆర్థిక సమానత్వాలను సాధించి సామాజిక సుహృద్భావాన్ని పెంపొందించటమే వీటి ఆశయం.
  9. వ్యక్తి ప్రగతి కంటే సామాజిక సంక్షేమాన్ని పెంపొందించడమే వీటి అసలు లక్ష్యం.

ప్రశ్న 7.
ఆదేశక సూత్రాల అమలును పరిశీలింపుము.
జవాబు:
వాస్తవంగా దేశపాలనలో ఆదేశక సూత్రాల అమలు చాలా ముఖ్యమైనది. 1950 నుండి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అదేశక సూత్రాల అమలులో కాలానుగుణంగా అనేక చర్యలను తీసుకుంటున్నది. ఇవి క్రింద వివరించబడినవి.

  1. జమీందార్, జాగీర్దారి, ఇనాందారి వ్యవస్థలు రద్దు.
  2. భూసంస్కరణ చట్టాల రూపకల్పన.
  3. రాజభరణాల రద్దు.
  4. 14 వాణిజ్యబ్యాంకుల జాతీయకరణ.
  5. ఖాదీ, గ్రామీణ పరిశ్రమ బోర్డుల నిర్మాణం.
  6. గ్రామ పంచాయితీ వ్యవస్థలను ఏర్పాటు చేయడం.
  7. ప్రజా ప్రాతినిధ్య సంస్థల మరియు విద్యాసంస్థల్లో, షెడ్యూల్డు కులాల, తెగల వారికి కొన్ని స్థానాలను కేటాయించడం.
  8. జాతీయ ప్రాధాన్యం ఉన్న కళాత్మకమైన లేదా చారిత్రక స్మారక చిహ్నాలు, ప్రదేశాలు, వస్తువుల పరిరక్షణ చట్టం 1951 రూపకల్పన.
  9. భారత శిక్షాస్మృతి రూపకల్పన.
  10. గోవులు, దూడలు, ఇతర పాడిపశువులు, లాగుడు బండ్లకు కట్టే పశువుల వధను కొన్ని రాష్ట్రాలలో నిషేధం.

ప్రశ్న 8.
ఆదేశక సూత్రాల ప్రాముఖ్యతను వివరింపుము.
జవాబు:
ఆదేశ సూత్రాలు భారతరాజ్యాంగ లక్షణాలలో ముఖ్యమైనవిగా పరిగణించబడినవి. ఈ సూత్రాల అమలు బాధ్యతను విష్యత్తులో అధికారంలోకి వచ్చు ప్రభుత్వాలకు రాజ్యాంగ నిర్మాతలు అప్పగించారు. ఆదేశక సూత్రాలు, ప్రాథమిక హక్కులు రాజ్యాంగానికి అంతరాత్మగా గ్రావెల్లి ఆస్టిన్ అభివర్ణించాడు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఈ సూత్రాలను రాజ్యాంగ )న్నూత లక్షణాలుగా పేర్కొన్నాడు. రాజ్యాంగంలోని ఈ విభాగం ప్రాథమిక హక్కుల భాగానికి సన్నిహితంగా, అనుబంధంగా ఉంటాయి. అందువలననే రాజ్యాంగంలోని మూడవ భాగం మరియు నాల్గవ భాగం పరస్పర సంబంధం కలిగి ఉన్నవి.

ఆదేశక సూత్రాలను అధికారంలో ఉన్న ఏ పార్టీ అయిన ఈ సూత్రాలను అమలు చేయవచ్చు. ఆ సూత్రాలు ప్రభుత్వంలోని శాసన నిర్మాణ శాఖ, కార్యనిర్వాహణ శాఖకు మార్గదర్శకాలుగా దోహదపడతాయి. ప్రజలు వారి హక్కులను అనుభవించడానికి అనుకూలమైన వాతావరణాన్ని ఆదేశక సూత్రాలు కల్పిస్తాయి. ప్రభుత్వ వివిధ సంస్కరణలకు అవి సూచికలుగా ఉపయోగపడతాయి. రాబోయే ప్రభుత్వ విధానాల స్థిరత్వానికి, కొనసాగింపుకూ అవి హామీ ఇస్తాయి.

ఐవర్ జెన్నింగ్స్, ఆచార్య శ్రీనివాసన్, జి.యన్. జోషి, ఆచార్య కె.టి.షా, కె.సి.వేర్, టి.టి కృష్ణమాచారి, నసీరుద్దీన్ ఆహ్మద్ వంటి ప్రముఖ రాజ్యాంగవేత్తలు ఆదేశక సూత్రాలను శుష్క వాగ్దానాలుగాను, అందంగాను అమర్చిన వస్తువులు గాను, పవిత్ర సంకల్పాలుగాను, అలంకార ప్రాయ సూత్రాలుగా పరిగణించారు. ఆదేశ సూత్రాలకు ఒక ఉమ్మడి సిద్ధాంతమంటూ ఏదీ లేదని ఐవర్ జెన్నింగ్స్ భావించారు. ఆదేశక సూత్రాలనేవి బ్యాంకుల సౌకర్యార్థం డబ్బు చెల్లించడానికి ఇచ్చే చెక్కులుగా ఆచార్య కె.టి.షా వర్ణించాడు.

ఆదేశక సూత్రాలను మరుసటిరోజే మరచిపోయే నూతన సంవత్సర శుభాకాంక్షలుగా నసీరుద్దీన్ అహ్మద్ విమర్శించాడు.

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ప్రాథమిక హక్కులు.
జవాబు:
ప్రథమంగా భారత రాజ్యాంగం భారత పౌరులకు ఏడు ప్రాథమిక హక్కులను ప్రసాదించింది. ఈ హక్కులను రాజ్యాంగంలో మూడవ భాగంలో 12 నుంచి 35 వరకు గల ప్రకరణలలో పొందపరచడం జరిగింది. ప్రాథమిక ” హక్కులు అమెరికా రాజ్యాంగం నుండి గ్రహించబడినాయి. ప్రాథమిక హక్కులు

  1. సమానత్వపు హక్కు
  2. స్వేచ్ఛా హక్కు
  3. పీడనను నిరోధించే హక్కు
  4. మత స్వాతంత్ర్య హక్కు
  5. విద్యా, సాంస్కృతిక హక్కు
  6. ఆస్తి హక్కు
  7. రాజ్యాంగ పరిహార హక్కు, 44వ రాజ్యాంగ సవరణ చట్టం, 1978 ద్వారా ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా, నుండి తొలగించటం జరిగింది.

ప్రశ్న 2.
ఆదేశక సూత్రాల విశ్లేషణ.
జవాబు:
భారతరాజ్యాంగంలో నాల్గవ భాగంలో 36 నుండి 51వ ప్రకరణలు ఆదేశక సూత్రాలను గురించి వివరిస్తున్నాయి.
ఇవి మూడు రకాలు.

  1. సామ్యవాద సూత్రాలు
  2. ఉదారవాద సూత్రాలు
  3. గాంధేయవాద సూత్రాలు

ప్రశ్న 3.
హెబియస్ కార్పస్. [Mar. ’16]
జవాబు:
ఒక వ్యక్తిని నిర్బంధించిన వ్యక్తిపై గాని, అధికారిపై గాని ఈ రిట్జజారీ చేయబడుతుంది. ఈ ఆజ్ఞ ప్రకారం నిర్భంధంలో వున్న వ్యక్తిని కోర్టులో హాజరుపరచవలె. హాజరుపరచిన తరువాత విచారణ జరుగుతుంది. ఇది సాధారణంగా వ్యక్తి స్వేచ్ఛకు సంబంధించిన రిట్.

ప్రశ్న 4.
మాండమస్.
జవాబు:
ఈ ఆజ్ఞను న్యాయస్థానాలు ఒక అధికారిపై లేదా ఒక సంస్థపై జారీ చేస్తాయి. దాని ప్రకారం ఆ అధికారి లేదా సంస్థ తాను నెరవేర్చవలసిన విధులు పాటించవలసి ఉంటుంది.

ప్రశ్న 5.
సాంస్కృతిక విద్యా హక్కులు.
జవాబు:
భారత పౌరులకు సాంస్కృతిక, విద్యాపరమైన అవకాశాలను రాజ్యాంగం ఈ హక్కుల ద్వారా ప్రసాదించింది. | 29వ ప్రకరణ ప్రకారం ప్రతి పౌరుడు స్వంత భాష, సంస్కృతులను పరిరక్షించుకొనవచ్చు. 30వ ప్రకరణ ప్రకారం ప్రభుత్వం నుండి సంపూర్ణంగా కాని, పాక్షికంగా కాని ఆర్థిక సహాయం పొందే విద్యా సంస్థలలో కులం, మతం, ప్రాంతం, వర్ణం, భాష, లింగపరమైన అంశాల ప్రాతిపదికగా విద్యార్థులకు ప్రవేశాన్ని నిరాకరించకూడదు.

ప్రశ్న 6.
గాంధేయ వాద సూత్రాలు.
జవాబు:
మహాత్మాగాంధీ ప్రవచించిన ఆదర్శాలను ఆదేశక సూత్రాలలో 40, 43, 46, 47, 48ఎ, 49 ప్రకరణలలో ప్రస్తావించటం జరిగింది. భారతదేశంలో ఆదర్శపాలనను నెలకొల్పటానికి ఈ సూత్రాలు తోడ్పడతాయి. పంచాయితీరాజ్ సంస్థలను నెలకొల్పటం, గ్రామీణ ప్రాంతాలలో కుటీర పరిశ్రమలను ప్రోత్సహించటం, మత్తుపానీయాలు, మాదక ద్రవ్యాలను నిషేధించటం, షెడ్యూల్డు కులాలు, తరగతులు, బలహీన వర్గాల ప్రజల విద్యా, సామాజిక ప్రగతికి రాజ్యం ప్రత్యేక శ్రద్ధ వహించటం మొదలైన వాటిని గాంధేయవాద సూత్రాలకు ఉదాహరణలుగా పేర్కొనవచ్చు.

ప్రశ్న 7.
ప్రాథమిక విధుల ప్రాముఖ్యత. [Mar. ’17]
జవాబు:
రాజ్యాంగంలో మొదట ‘విధులు’ చేర్చబడలేదు. కాని 1976లో చేయబడిన 42వ రాజ్యాంగ సవరణ ప్రకారం 10 ప్రాథమిక విధులు చేర్చబడ్డాయి. స్వరణ్ సింగ్ అధ్యక్షతన ఏర్పడిన ఒక సంఘం ఈ విధులను సూచించింది. అయితే వీటిని న్యాయస్థానాల ద్వారా అమలు చేయడానికి అవకాశం లేదు. ఇవి ప్రజల ఆలోచనా ధోరణిలో మార్పు తెస్తాయని, విజ్ఞానదాయకమైన మానసిక అభ్యున్నతికి తోడ్పడతాయని భావింపబడింది. రాజ్యాంగంలోని నాలుగో భాగం ‘ఏ’ లోని 51(ఎ) అధికరణం వీనిని తెలుపుతుంది.

రాజ్యం ప్రజల వద్ద నుంచి ఆశించే సామాజిక చైతన్యం, ప్రవర్తనా నియమావళే ప్రాథమిక విధులు.

ప్రాముఖ్యత:

  1. ప్రాథమిక విధులు భారత పౌరులలో సామాజిక స్పృహను పెంపొందించి, బాధ్యతాయుత ప్రవర్తనను అలవరుస్తాయి.
  2. ఈ విధులు 1948లో ఐక్యరాజ్యసమితి సాధారణ సభ ఆమెదించిన విశ్వమానవ హక్కుల ప్రకటన తీర్మానానికి అనుగుణంగా ఉన్నాయి.
  3. ప్రాథమిక విధులు రాజ్యాంగ ఆశయాలను, రాజ్యాంగ చట్టాన్ని, ప్రభుత్వ వ్యవస్థలను గౌరవిస్తాయి.
  4. ప్రాథమిక విధులు ప్రజల మధ్య సౌభ్రాతృత్వం, సహకారాన్ని పెంపొందిస్తాయి.
  5. భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించుట.

ప్రశ్న 8.
ఏవైనా మూడు ఉదార సూత్రాలు.
జవాబు:
ఆదేశక సూత్రాలలోని ఉదారవాద సూత్రాలు:

  1. 44వ అధికరణం ప్రకారం దేశంలో నివసించే పౌరలందరికీ వర్తించే విధంగా ఉమ్మడి పౌరస్మృతిని రాజ్యం
    రూపొందించాలి.
  2. 45వ అధికరణం ప్రకారం 14 ఏళ్ళలోపు పిల్లలందరికీ ఉచిత, నిర్బంధ విద్యను అందించడానికి రాజ్యం ప్రయత్నించాలి.
  3. 50వ అధికరణం ప్రకారం పబ్లిక్ సర్వీసుల విషయంలో కార్యనిర్వాహక శాఖ నుంచి న్యాయశాఖను వేరుచేయడానికి రాజ్యం చర్యలు తీసుకోవాలి.
  4. 51వ అధికరణం ప్రకారం రాజ్యం (అ) అంతర్జాతీయ శాంతి భద్రతలను పెంపొందించుకోవడం
    (ఆ) దేశాల మధ్య న్యాయపరమైన, గౌరవప్రదమైన దౌత్య సంబంధాలను నిర్వహించుకోవడం.

ప్రశ్న 9.
కోవారెంటో.
జవాబు:
సక్రమమైన అధికారం లేకుండా ప్రజా సంస్థలో అధికారం నడిపించే వ్యక్తులను అధికారాన్ని నిర్వహించకుండా ఈ ఆజ్ఞ నిరోధిస్తుంది.

ప్రశ్న 10.
మత స్వాతంత్ర్యపు హక్కు.
జవాబు:
మత స్వాతంత్ర్య హక్కు భారత రాజకీయ వ్యవస్థ లౌకిక స్వభావానికి ప్రతీక. 25వ అధికరణం ప్రకారం ప్రతి వ్యక్తికీ ప్రజాభద్రత, నైతికత, ఆరోగ్యాలకు లోబడి తన అంతరాత్మకు అనుగుణమైన మతాన్ని అవలంభించడానికి, ప్రచారం చేసుకోవడానికి హక్కు ఉంది. మత ప్రభావానికి సంబంధించిన ఏ కార్యక్రమాలనైనా క్రమబద్ధం చేసే చట్టాన్ని రాజ్యం రూపొందించవచ్చు.

26వ అధికరణం ప్రకారం ఏ మతానికి చెందినవారైనా

  1. మతపరమైన ధార్మిక సంస్థలను ఏర్పాటు చేసుకోవడానికి
  2. స్వీయ మత వ్యవహారాలను నిర్వహించుకోవడానికి
  3. స్థిర, చరాస్తులపై యాజమాన్య హక్కు పొందడానికి, వాటిని కొనుగోలు చేయడానికి చట్ట ప్రకారం ఆస్తిపాస్తులను నిర్వహించుకోవచ్చు.

27వ అధికరణం మతం ఆధారంగా రాజ్యం ఏ వ్యక్తిపై, ఏ విధమైన పన్ను విధించడానికి, వసూలు చేయడానికి వీలులేదని పేర్కొంది. 28వ అధికరణం ప్రకారం రాజ్యం నుంచి సంపూర్ణంగానో, పాక్షికంగానో ఆర్థిక సహాయాన్ని పొందే విద్యా సంస్థలలో మతపరమైన బోధనలు నిషేధించడం జరిగింది.

ప్రశ్న 11.
పీడనను నిరోధించే హక్కు,
జవాబు:
భారతదేశంలో నివసించే అసంఖ్యాక ప్రజల ఆత్మగౌరవాన్ని, హుందాతనాన్ని గుర్తించి, పరిరక్షించి, పెంపొందించటానికి ఈ హక్కును ప్రసాదించటమైంది. రాజ్యం కాని, సంపన్న వర్గాలు కాని వ్యక్తులను దోపిడీకి గురిచేయకుండా నివారించటానికి ఈ హక్కు తోడ్పడుతుంది. మన రాజ్యాంగంలో 23 మరియు 24 ప్రకరణలు ఈ హక్కును వివరిస్తున్నాయి. 23వ ప్రకరణ ప్రకారం మనుషుల క్రయ విక్రయాలు, బలవంతంగా వెట్టిచాకిరీ చేయించుకోవటం నేరం. 24వ ప్రకరణ ప్రకారం 14 సంవత్సరాలలోపు పిల్లలను గనులు, కర్మాగారాలు మొదలైన ప్రమాదకర పనులలో నియమించదారు.

AP Inter 2nd Year Civics Study Material Chapter 1 భారత రాజ్యాంగం

Andhra Pradesh BIEAP AP Inter 2nd Year Civics Study Material 1st Lesson భారత రాజ్యాంగం Textbook Questions and Answers.

AP Inter 2nd Year Civics Study Material 1st Lesson భారత రాజ్యాంగం

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
రాజ్యాంగం అంటే ఏమిటి ? భారత రాజ్యాంగం చారిత్రక నేపథ్యాన్ని వివరించండి.
జవాబు:
పరిచయం : ఆధునిక కాలంలో ప్రతి రాజ్యానికి ఒక రాజ్యాంగముంటుంది. రాజ్యాంగంలో రాజ్యానికి సంబంధించిన అన్ని వ్యవస్థల అధికారాలు, విధులు మొదలైన విషయాలను స్పష్టంగా, నిర్ధిష్టంగా, క్లుప్తంగా తెలియజేయడం జరుగుతుంది. రాజ్యానికి సంబంధించిన వ్యవహారాలు క్రమబద్ధంగా జరగడానికి రాజ్యాంగం చాలా ముఖ్యం.

అర్థం : Constitution అనే ఇంగ్లీషు పదం “Constitutio” అనే లాటిన్పదం నుండి ఉద్భవించింది. లాటిన్ భాషలో కాన్స్టిట్యూషియో అంటే “స్థాపించు” అని అర్థం.
నిర్వచనాలు :

  1. అరిస్టాటిల్ : “రాజ్యంలో అత్యున్నతమైన పదవులతో సహా అన్నింటిని క్రమబద్ధంగా ఏర్పాటు చేసేదే రాజ్యాంగం”.
  2. లార్డ్ బ్రైస్ : “ప్రభుత్వం పనిచేసే విధానాన్ని తెలిపే నిర్దిష్ట నియమాల సముదాయమే రాజ్యాంగం”.
  3. స్టీఫెన్ లీకాక్ : “రాజ్యాంగం అంటే ప్రభుత్వరూపం”.

సాధారణంగా రాజ్యాంగాన్ని రాజ్యంలోని ప్రముఖ వ్యక్తులు, ప్రజాప్రతినిధులు, విషయ నిపుణులు మొదలైనవారు రూపొందిస్తారు. 385 మందితో కూడిన రాజ్యాంగ పరిషత్ రెండు సంవత్సరాల 11 నెలల 17 రోజుల పాటు నిర్విరామంగా కృషి చేసి భారత రాజ్యాంగాన్ని రూపొందించింది.

AP Inter 2nd Year Civics Study Material Chapter 1 భారత రాజ్యాంగం

భారత రాజ్యాంగ నిర్మాణ చారిత్రక నేపథ్యం: భారత రాజ్యాంగం ప్రపంచ రాజ్యాల రాజ్యాంగాలన్నింటి కంటే మిక్కిలి శ్రేష్టమైంది. దీనిని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆధ్వర్యంలోని రాజ్యాంగ ముసాయిదా కమిటీ రూపొందించగా, డాక్టర్ రాజేంద్రప్రసాద్ అధ్యక్షతన గల భారత రాజ్యాంగ పరిషత్తు ఆమోదించింది. అంతకుపూర్వం భారతీయులకు ప్రత్యేకంగా ఒక రాజ్యాంగం అవసరమని జాతీయోద్యమ నాయకులు పలుమార్లు డిమాండ్ చేశారు. 1922లో ఏర్పడిన స్వరాజ్యపార్టీ నాయకులు భారతీయులకు శాసనమండళ్ళలో ప్రాతినిధ్యం కల్పించడం ద్వారా రాజ్యాంగపరమైన ఏర్పాట్లు జరగవలసి ఉంటుందని పేర్కొన్నారు. తరువాత 1924 ఫిబ్రవరిలో కేంద్ర శాసన మండలి సమావేశంలో మోతీలాల్ నెహ్రూ ఒక తీర్మానాన్ని ప్రతిపాదిస్తూ భారత రాజ్యాంగాన్ని వెంటనే రూపొందించుకోవడానికి ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయవలసిన ఆవశ్యకత ఉందన్నారు. ఆ తీర్మానాన్ని కేంద్ర శాసనసభ్యులు అత్యధిక

మెజారిటీతో ఆమోదించారు. 1928 మేలో మొతీలాల్ నెహ్రూ ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటుచేసి, భారత ప్రజలకు తగిన రాజ్యాంగాన్ని ఏర్పరచడానికి కొన్ని నియమ నిబంధనలను రూపొందించవలసిందిగా కోరడం జరిగింది. తరువాత మోతీలాల్ నెహ్రూ కమిటీ తన నివేదికను 1928 ఆగస్టులో రూపొందించింది. ఆ కమిటీ సూచనలలో అధికభాగం స్వతంత్ర భారత రాజ్యాంగంలో పొందుపరచడమైంది.

1936-1937 కాలంలో భారతదేశంలో ప్రాంతీయ శాసనమండళ్ళకు జరిగిన ఎన్నికలలో భారత జాతీయ కాంగ్రెస్ తన ఎజెండాలో రాజ్యాంగ పరిషత్తు నిర్మాణాన్ని ప్రధాన అంశంగా పేర్కొంది. ఆ తరువాత 1937 ఫిబ్రవరిలో వార్ధాలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో భారతీయ శాసనసభ్యులు ప్రాంతీయ ప్రభుత్వాలలో చేరడానికి ఆమోదం తెలిపారు. నూతన ప్రాంతీయ మండళ్ళ సమావేశంలో రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటు డిమాండు ప్రస్తావించవలసిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు.

1940 ఏప్రిల్లో వార్దాలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో మహాత్మాగాంధీ, జవహర్లాల్ నెహ్రూల మధ్య రాజ్యాంగ పరిషత్తుకు సంబంధించి ఆసక్తికరమైన చర్చలు జరిగాయి.

1940లో వైస్రాయ్ లిన్లిత్ ఆగస్టు ప్రతిపాదన (August offer) ద్వారా భారతీయులు రెండో ప్రపంచ ‘యుద్ధంలో బ్రిటన్కు సహకరించాలనీ, భారత రాజ్యాంగాన్ని రూపొందించుకొనే బాధ్యత ప్రధానంగా భారతీయులకే ఉంటుందనీ మొట్టమొదటి సారిగా ప్రకటించాడు. భారత జాతీయ స్రవంతిలో పాల్గొనే వారికి ప్రాతినిధ్యం వహించే సంస్థయే నూతన రాజ్యాంగ రూపకల్పనలో పాలుపంచుకోవలసి ఉంటుందని పై ప్రతిపాదన పేర్కొంది. 1942లో బ్రిటన్ ప్రధాని విన్స్టన్ చర్చిల్ యుద్ధకాలపు మంత్రిమండలిలో లేబర్ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్న స్టాఫర్డ్ క్రిప్స్న భారతదేశంలో నెలకొన్న రాజ్యాంగ సంక్షోభాన్ని పరిష్కరించడానికి సమాయత్తం గావించాడు. నెహ్రూకు సన్నిహితుడైన క్రిప్స్ తన ప్రతిపాదనలలో మొట్టమొదటిసారిగా రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటు ప్రక్రియ గురించి పేర్కొన్నాడు.

భారత రాజ్యాంగ పరిషత్తుకు 1946 జూలై – ఆగస్టులలో ఎన్నికలు జరిగాయి.

భారత రాజ్యాంగ పరిషత్తు తొలి సమావేశం గవర్నర్ జనరల్ లార్డ్ వేవెల్ ఆదేశాలమేరకు 1946 డిసెంబర్ 9న జరిగింది. నెహ్రూ సూచనమేరకు అందరికంటే ఎక్కువ వయస్సు, అనుభవం ఉన్న సచ్చిదానంద సిన్హా రాజ్యాంగ పరిషత్తు తాత్కాలిక అధ్యక్షుడిగా వ్యవహరించాడు. మొట్టమొదటి సమావేశంలో 207 మంది సభ్యులు పాల్గొన్నారు. 1946 డిసెంబర్ 11న రాజేంద్రప్రసాద్ను రాజ్యాంగ పరిషత్తు శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నుకోవడమైంది. 1946 డిసెంబర్ 13న జవహర్లాల్ నెహ్రూ రాజ్యాంగపరిషత్తు సమావేశంలో చారిత్రాత్మకమైన రాజ్యాంగ లక్ష్యాల తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఆ తీర్మానం భారతదేశాన్ని సర్వసత్తాక, స్వతంత్ర్య ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా వర్ణించారు. రాజేంద్రప్రసాద్ తన తొలి అధ్యక్షోపన్యాసంలో భారతదేశం కామన్వెల్త్ రాజ్యంగా కొనసాగుతుందనీ, కుల, మత, వర్గాలతో సంబంధం లేని దిశగా భారతదేశం పయనిస్తుందనే ఆకాంక్షను వెల్లడించారు.

భారతదేశం 1947 ఆగస్టు 15వ తేదీన స్వతంత్ర రాజ్యంగా అవతరించింది. అంతకుపూర్వం భారత రాజ్యాంగ పరిషత్తు నాలుగు పర్యాయాలు సమావేశమైంది. మొదటి సమావేశం 1946 డిసెంబర్ 9-13 మధ్య, రెండో సమావేశం 1947 జనవరి 20-22 మధ్య, మూడో సమావేశం 1947 ఏప్రిల్ 28, మే 2 మధ్య, నాలుగో సమావేశం 1947 జూలైలో జరిగాయి. మొదటి సమావేశంలో రాజ్యాంగ లక్ష్యాల తీర్మానంపై చర్చ జరిగింది. రెండో సమావేశంలో రాజ్యాంగ రూపకల్పనకు దోహదపడే అల్పసంఖ్యాకుల కమిటీ, ప్రాథమిక హక్కుల కమిటీ, సభావ్యవహారాల కమిటీ వంటి అనేక కమిటీలు ఏర్పడ్డాయి. మూడో సమావేశంలో కేంద్రప్రభుత్వ అధికారాల కమిటీ వంటి వివిధ సభా సంఘాల నివేదికలపై చర్చ జరిగింది. నాలుగో సమావేశంలో భావిభారత రాజ్యాంగనమూనా, కేంద్ర ప్రభుత్వ రాజ్యాంగం వంటి విషయాలపై కూలంకషంగా చర్చించడం జరిగింది. 1947 జూన్ 3న మౌంట్ బాటన్ చేసిన దేశ విభజన ప్రకటనతో రాజ్యాంగ పరిషత్తు స్వరూపమే మారిపోయింది. దేశ విభజన తరువాత భారత రాజ్యాంగ పరిషత్తు నుంచి ముస్లిం లీగ్ వేరయిపోవడంతో దాని సభ్యత్వ సంఖ్య తగ్గిపోయింది. అలాగే దేశ విభజన దరిమిలా రాజ్యాంగ పరిషత్తు ఒకవైపు రాజ్యాంగ నిర్మాణసంస్థగానూ, వేరొకవైపు జాతీయస్థాయిలో అత్యున్నత శాసన నిర్మాణ సంస్థగా వ్యవహరించింది.

రాజ్యాంగ పరిషత్తుకు కార్యదర్శిగా హెచ్. వి. ఆర్. అయ్యంగార్, రాజ్యాంగ పరిషత్తుకు ముఖ్య సలహాదారుగా డాక్టర్ బెనగళ్ నర్సింగరావు వ్యవహరించారు.

రాజ్యాంగ ముసాయిదా కమిటీ (Drafting Committee)
భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీని భారత రాజ్యాంగ పరిషత్తు 1947 ఆగస్టు 29న ఏర్పరచింది. ఆ కమిటీలో చైర్మన్, ఆరుగురు సభ్యులు (మొత్తం ఏడుగురు) ఉన్నారు. డాక్టర్.బి.ఆర్. అంబేద్కర్ ఆ కమిటీ చైర్మన్ వ్యవహరించారు.

ముసాయిదా కమిటీ అనేక దఫాలు సమావేశమై రాజ్యాంగ ముసాయిదాను రూపొందించి 1947 నవంబర్ 5న రాజ్యాంగ పరిషత్తుకు సమర్పించింది. రాజ్యాంగ ముసాయిదా ప్రతి 1948 ఫిబ్రవరి 21న ముద్రితమైంది. రాజ్యాంగ ముసాయిదాలోని అంశాలను రాష్ట్రాల అసెంబ్లీ సభ్యులు, ప్రజలు, పత్రికలలో చర్చలు జరిగి అభిప్రాయాల వ్యక్తీకరణకోసం ముసాయిదా ప్రతులను పంచడమైంది.

మొత్తం మీద రాజ్యాంగ ముసాయిదా పై 7635 సవరణలు పరిశీలనకు వచ్చాయి. వాటిలో 2473 సవరణలను రాజ్యాంగ పరిషత్తు ఆమోదించింది. రాజ్యాంగ ముసాయిదా ప్రతిపై తృతీయ పఠనం 1949 నవంబర్ 14-26ల మధ్య జరిగింది. చివరిగా రాజ్యాంగ పరిషత్తు భారత రాజ్యాంగ ముసాయిదాను నవంబర్ 26న ఆమోదించింది. భారత రాజ్యాంగాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఆమోదించడానికి రాజ్యాంగ పరిషత్తుకు 2 ‘సంవత్సరాల 11 నెలల 18 రోజుల సమయం పట్టింది. భారత రాజ్యాంగ పరిషత్తు చివర సమావేశం 1950 జనవరి 24న జరిగింది. ఆ సమావేశంలో సభ్యులు డాక్టర్ రాజేంద్రప్రసాద్ ను భారతదేశ తొలి అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది.

భారత రాజ్యాంగం 1950 జనవరి 26 నుండి అమలులోకి వచ్చింది. నాటి నుండి ప్రతి ఏటా జనవరి 26న గణతంత్ర దినోత్సవంగా జరుపుకొంటున్నాము.

AP Inter 2nd Year Civics Study Material Chapter 1 భారత రాజ్యాంగం

ప్రశ్న 2.
భారత రాజ్యాంగం ముఖ్య లక్షణాలను వివరించండి. [Mar. ’17, ’16]
జవాబు:
భారత రాజ్యాంగం జనవరి 26, 1950వ సంవత్సరంలో అమలులోకి వచ్చింది. సుమారు రెండు శతాబ్దాల పరాయి పాలన తరువాత 1946లో ఏర్పడిన రాజ్యాంగ నిర్మాణ సభ రాజ్యాంగాన్ని రూపొందించింది. 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల కాలంలో క్రొత్త రాజ్యాంగ నిర్మాణం చేయబడింది. మేధావులు, పరిపాలనావేత్తలు, న్యాయశాస్త్ర నిపుణులు, రాజనీతివేత్తలు కలసి ప్రపంచంలోని ముఖ్య రాజ్యాంగాలు, 1935 భారత ప్రభుత్వ చట్టం ఆధారంగా క్రొత్త రాజ్యాంగ రచన చేశారు.

లక్షణాలు :
1. సుదీర్ఘమైన రాత పూర్వక ప్రతి : భారత రాజ్యాంగం లిఖిత రాజ్యాంగం. భారత రాజ్యాంగము ప్రపంచ రాజ్యాంగాలన్నింటిలోకి అతిపెద్ద రాజ్యాంగము. ఇందులో ప్రస్తుతం 444 అధికరణాలు, 12 ప్రకరణాలు ఉన్నాయి. రాజ్యాంగంలో 22 భాగాలున్నాయి. ఇప్పటి వరకు 100 సార్లు పైగా రాజ్యాంగం సవరించబడింది. ఇవన్నీ రాజ్యాంగంలో భాగమయ్యాయి. అన్ని వివరాలు పొందుపరచడం వలన రాజ్యాంగం పెద్దదిగా తయారైంది. ఐవర్ జెన్నింగ్స్ అనే రచయిత “భారత రాజ్యాంగం ప్రపంచంలో అతిదీర్ఘము, వివరణాత్మక రాజ్యాంగం” అని వర్ణించారు. కొన్ని అలిఖిత నియమాలు కూడా ఉన్నాయి. ఉదా : రాష్ట్రపతి పదవికి ఒక వ్యక్తి రెండు పర్యాయాలకు మించి పోటీ చేయరాదు. లోక్సభలో మెజారిటీ పార్టీ నాయకుని మాత్రమే ప్రధానిగా నియమించడం మొదలగునవి.

2. దృఢ, సరళ రాజ్యాంగాల సమ్మేళనం భారత రాజ్యాంగ నిర్మాతలు సమయం, సందర్భాలను బట్టి దృఢ, సరళ లక్షణాలు గల రాజ్యాంగాన్ని భారత ప్రజలకు అందించారు. భారత రాజ్యాంగం 368వ ప్రకరణ రాజ్యాంగ సవరణ విధానాన్ని సూచిస్తుంది.

  1. నూతన రాష్ట్రాల ఏర్పాటు (ఉదా : తెలంగాణ) భారత పౌరసత్వం, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల జీతభత్యాలు వంటి అంశాల సవరణకు సరళమైన పద్ధతి పేర్కొన్నది.
  2. రాష్ట్రపతి ఎన్నిక కేంద్రప్రభుత్వ కార్యనిర్వాహక అధికారాలు, కేంద్ర, రాష్ట్ర, ఉమ్మడి జాబితాలలోని అంశాలు మొదలగు వాటిని సవరించేందుకు పార్లమెంటు ఉభయసభలలో 2/3వ వంతు సభ్యుల ఆమోదంతోబాటు సగానికిపైగా రాష్ట్ర శాసనసభల ఆమోదం అవసరం. ఈ సందర్భంలో మన రాజ్యాంగం పాక్షిక, సరళ, పాక్షిక దృఢమైన పద్ధతిని అనుసరించాల్సి ఉంటుంది.
  3. ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు వంటి కొన్ని అంశాలను సవరించేందుకు పార్లమెంటులో ప్రత్యేక మెజారిటీ సభ్యుల ఆమోదం అవరమవుతుంది.

3. అర్ధ సమాఖ్య రాజ్యం : భారత రాజ్యాంగంలో కొన్ని సమాఖ్య లక్షణాలు, కొన్ని ఏకకేంద్ర లక్షణాలు ఉన్నాయి. ఉదా : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలుండటం, వాటి మధ్య అధికారాల విభజన, సుప్రీంకోర్టు, లిఖిత రాజ్యాంగం, దృఢ రాజ్యాంగం వంటి సమాఖ్య లక్షణాలు ఉన్నాయి. అట్లాగే ఒకే రాజ్యాంగం, ఒకే ఎన్నికల సంఘం, ఒకే పౌరసత్వం, ఏకీకృత న్యాయవ్యవస్థ, రాష్ట్రాల కంటే కేంద్రానికే ఎక్కువ అధికారాలు వంటి ఏకకేంద్ర లక్షణాలు ఉన్నాయి. భారతదేశంలో విచ్ఛిన్నకర ధోరణులను అరికట్టేందుకు రాజ్యాంగ నిర్మాతలు దృఢమైన కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశారు. పండితుడు కె.సి.వేర్ భారతదేశాన్ని అర్ధ సమాఖ్యగా వర్ణించడమైనది.

4. గణతంత్ర ప్రభుత్వం : పూర్వపు, వలస సౌర్వభౌమత్వ రాజ్యం ఇంగ్లండ్ వలె కాకుండా భారత రాజ్యాంగ నిర్మాతలు భారత గణతంత్ర ప్రభుత్వాన్ని సూచించారు. అటువంటి సంవిధానంలో అన్ని ప్రభుత్వ పదవులు అర్హతగల పౌరులకు అందుబాటులో ఉంటాయి. వంశపారంపర్య సూత్రానికి ఎటువంటి అవకాశం లేదు. ఎందుకంటే రాచరికం అనేది అప్రజాస్వామికమైంది.

5. పార్లమెంటరీ ప్రభుత్వం : భారత రాజ్యాంగం పార్లమెంటరీ ప్రభుత్వ పద్ధతిని కేంద్ర, రాష్ట్ర స్థాయిలలో ప్రవేశపెట్టింది. రాజ్యాంగ నిర్మాతలు ఐర్లాండ్ తరహాలో ఎన్నికైన దేశాధ్యక్షుడు ఉన్న పద్ధతిని సూచించారు. బ్రిటిష్ పార్లమెంటరీ వ్యవస్థలో మిగిలిన లక్షణాలైన రెండు రకాల కార్య వర్గాధిపతులు, ప్రధానమంత్రి నాయకత్వం, సమిష్టి బాధ్యత, పార్లమెంటుకు కార్యవర్గంపై నియంత్రణ, రాజ్యాధినేతకు నామమాత్ర కార్యనిర్వాహక వర్గ హోదా వంటి అంశాలను భారత రాజకీయ వ్యవస్థలో ఆమోదించడం జరిగింది. రాష్ట్రాలలో కూడా పార్లమెంటరీ ప్రభుత్వ విధానాన్నే సూచించడం జరిగింది.

6. ప్రాథమిక హక్కులు – ప్రాథమిక బాధ్యతలు : భారత రాజ్యాంగం మూడో భాగంలో 12 నుంచి 25 వరకు గల ప్రకరణలు పౌరులందరికీ ప్రధానమైన మానవ హక్కులను అందించాయి. అటువంటి హక్కులు న్యాయబద్ధమైనవిగా ఉంటూ మౌలికస్వాతంత్ర్యాలను పౌరులను ప్రసాదిస్తాయి. అధికార దుర్వినియోగాన్ని నివారిస్తాయి. ఇక రాజ్యాంగం (42వ సవరణ) చట్టం రాజ్యాంగం నాలుగో భాగంలో 51 A నిబంధనలో ప్రాథమిక విధులను చేర్చింది. ప్రాథమిక విధులన్నీ న్యాయబద్ధమైనప్పటకీ పౌరులు కొన్ని బాధ్యతలకు నిర్వర్తించాల్సిన ఆవశ్యకతను అవి పేర్కొంటాయి.

7. ఏక పౌరసత్వం : భారత రాజ్యాంగం సమాఖ్య పద్ధతి ద్వంద్వ ప్రభుత్వ విధానాన్ని కలిగి ఉన్నప్పటికీ పౌరులందరికీ ఒకే పౌరుసత్వాన్ని ప్రసాదించింది. అమెరికాలాంటి దేశాలలో పౌరులు కేంద్రం, రాష్ట్రాలలో రెండింటిలో పౌరసత్వాన్ని కలిగి ఉంటారు. కానీ భారతదేశంలో పౌరులు ఏ రాష్ట్రంలో జన్మించినప్పటికీ దేశవ్యాప్తంగా ఒకేరకమైన హక్కులను అనుభవిస్తారు. జమ్మూకాశ్మీర్, గిరిజన ప్రాంతాలలో నివసించే వారిని మినహాయిస్తే మిగతా ప్రజల మధ్య ఎటువంటి విచక్షణ పాటించబడదు.

8. వయోజన ఓటుహక్కు: పార్లమెంటు, రాష్ట్ర శాసన సభలకు జరిగే ఎన్నికలలో ప్రతినిధులను ఎన్నుకొనేందుకు భారత రాజ్యాంగం 18 ఏండ్లు నిండిన పౌరులందరికీ ఓటుహక్కును ప్రసాదించింది. దాని ప్రకారం వయోజన పౌరులందరికీ కులం, తెగ, మతం, లింగం, అక్షరాస్యతలతో సంబంధం లేకుండా ఓటుహక్కు ఇచ్చింది. అటువంటి ఏర్పాటు భారత ప్రజాస్వామ్యానికి విశేషమైన ప్రాముఖ్యతనిచ్చి సామాన్యప్రజల ఆత్మగౌరవం, ప్రతిష్టలను పెంపొందిస్తుంది. సమానత్వ సూత్రాన్ని సమర్థించి, మైనారిటీల ప్రయోజనాలను కాపాడుకొనేందుకు, సమాజంలోని బలహీనవర్గాలలో నూతన ఉత్తేజాలకు వీలు కల్పిస్తుంది.

9. లౌకిక రాజ్యం : భారత రాజ్యాంగం లౌకిక రాజ్యానికి ప్రతీకగా ఉంటుంది. మన రాజ్యాంగం భారతదేశంలో ఏ ఒక్కమతాన్ని అధికార మతంగా గుర్తించదు. మతప్రాతిపదికపై కల్పించిన రిజర్వేషన్లను రద్దు చేసింది. అయితే తాత్కాలిక ప్రాతిపదికపై షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల వారికి శాసననిర్మాణంలో తగిన ప్రాతినిధ్యం కల్పించేందుకై రిజర్వేషన్ సౌకర్యాలను కల్పించింది.

AP Inter 2nd Year Civics Study Material Chapter 1 భారత రాజ్యాంగం

10. స్వతంత్ర న్యాయశాఖ : సమాఖ్య వ్యవస్థలో రాజ్యాంగాన్ని వ్యాఖ్యానించేందుకు స్వతంత్ర న్యాయశాఖ అనేది అత్యంత ఆవశ్యకమైంది. శాసన నిర్మాణ, కార్యనిర్వహక శాఖల అధికారాల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు అది అవసరమవుతుంది. భారత సుప్రీంకోర్టు క్రమేణా ప్రపంచంలో అత్యంత శక్తివంతమైందిగా ఆవిర్భవించింది. స్వతంత్ర హోదా ఉండుటచేత, సుప్రీంకోర్టు, హైకోర్టుల న్యాయమూర్తులు దేశంలో శాసన నిర్మాణ, కార్యనిర్వాహక సంస్థల చర్యలను విధానాలలోని ఔచిత్యాన్ని నిర్ణయించగలుగుతారు.

11. ఆదేశక నియమాలు: భారత రాజ్యాంగం నాలుగో భాగంలో 36 నుంచి 51 వరకు గల ప్రకరణలు ఆదేశక నియమాలను ప్రస్తావించాయి. భారత రాజ్యాంగ నిర్మాతలు వాటిని ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి గ్రహించారు. ఆ నియమాలు సమాఖ్య రాజ్య భావనను ప్రతిబింబిస్తాయి. అవి ప్రభుత్వాలకు ఇవ్వబడిన ఆజ్ఞలు. సమానమైన పనికి సమాన వేతనం, ఉపాధి అవకాశాల కల్పన, సంపద న్యాయమైన రీతిలో పంపిణీ, వృద్ధాప్య పించన్లు, అస్వస్థత నుంచి కాపాడడం, శ్రామికులకు విశ్రాంతి, వన్యప్రాణుల సంరక్షణ, మహిళలు, చిన్న పిల్లలు, వృద్ధులను కాపాడడం వంటివి ఆదేశక నియమాలకు కొన్ని ఉదాహరణలు. ఆదేశక సూత్రాలకు న్యాయ స్వభావం లేకపోయినప్పటికీ వాటిని ఏ బాధ్యతాయుత ప్రభుత్వము విస్మరించరాదు.

12. ద్విసభా విధానం : భారత రాజ్యాంగం జాతీయ స్థాయిలో ద్విసభా విధానాన్ని ప్రవేశపెట్టింది. దానికి అనుగుణంగా భారత పార్లమెంటులో లోక్సభ (దిగువ సభ), రాజ్యసభ (ఎగువ సభ) అనే రెండు సభలు ఉంటాయి. లోక్సభ దేశ ప్రజలకు ప్రాతినిధ్యం వహించగా, రాజ్యసభ రాష్ట్రాల ప్రయోజనాల పరిరక్షణకు ఉద్దేశించింది. భారత రాజ్యాంగ నిర్మాతలు బ్రిటన్, అమెరికాలు అనుసరిస్తున్న ద్విసభావిధానాన్ని మన దేశానికి సూచించడమైంది.

13. పంచాయితీరాజ్, మునిసిపాలిటి చట్టాలు : ఇతర సమాఖ్య రాజ్యాంగాల వలె, భారత రాజ్యాంగం ప్రారంభంలో కేంద్రం, రాష్ట్రాలతో కూడిన రెండు ప్రభుత్వాలతో కూడిన రాజకీయ సంవిధానాన్ని ఏర్పరచింది. తరువాత రాజ్యాంగం (73వ, 74వ సవరణలు) చట్టాల ద్వారా పంచాయితీలు, మునిసిపాలిటీలకు రాజ్యాంగపరమైన గుర్తింపుకు ఏర్పాట్లు గావించింది. అటువంటి ఏర్పాట్లు ప్రపంచంలోని ఏ ఇతర రాజ్యాంగాలలోను లేకపోవడం ఒకే విశేషంగా ఈ సందర్భంలో పేర్కొనవచ్చు.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
రాజ్యాంగం ముఖ్యాంశాలను క్లుప్తంగా వివరించండి.
జవాబు:
ప్రజలు, ప్రభుత్వానికి మధ్య ఉన్న సంబంధాన్ని సూచించే కొన్ని నిర్దిష్ట నియమాల సముదాయాన్ని రాజ్యాంగం అని అంటారు. రాజ్యం, ప్రభుత్వాల అధికారాలు, విధులకు రాజ్యాంగం ముఖ్య ప్రాతిపదికగా ఉంటుంది. అదేవిధంగా పౌరుల హక్కులు, బాధ్యతలకు సంబంధించిన ప్రధాన ప్రామాణికతకు నిదర్శనం రాజ్యాంగమే. అందుకనే “ప్రభుత్వం పనిచేసే విధానాన్ని తెలిపే నిర్ధిష్ట నియమాల సముదాయమే రాజ్యాంగం” అని లార్డ్ బ్రైస్ పేర్కొన్నాడు.

రాజ్యాంగం – ముఖ్యాంశాలు :
1) సంఘంలో సభ్యులు, సముదాయాల మధ్య సమన్వయాన్ని చేకూర్చేందుకై అవసరమైన ప్రాథమిక నియమాలను రాజ్యాంగం సూచిస్తుంది. సంఘంలో శక్తి (power) పంపిణీ (distribution) గురించి అది ప్రత్యేకంగా పేర్కొంటుంది. చట్టాలను ఎవరు రూపొందిస్తారు ? అనే అంశాన్ని నిర్ణయిస్తుంది. ఉదాహరణకు భారతదేశం వంటి ప్రజాస్వామ్య దేశంలో ప్రజలచే ఎన్నుకోబడిన ప్రతినిధులు చట్టాలను రూపొందిస్తారు. అందుకు భిన్నంగా ప్రజా గణతంత్ర చైనా దేశంలో కమ్యూనిస్టుపార్టీ సర్వాధికారాలు చెలాయిస్తూ, చట్టాలను రూపొందిస్తుంది. సౌదీ అరేబియా వంటి రాజరికం అమల్లో ఉన్న రాజ్యంలో చట్ట స్వభావాన్ని రాజు నిర్ణయిస్తాడు. మొత్తంమీద భారతదేశంలో పార్లమెంటు లేదా రాష్ట్ర శాసన సభలు చట్టాల రూపకల్పనకు రాజ్యాంగం వీలు కల్పించింది.

2) రాజ్యాంగం ప్రభుత్వ నిర్మితిని నిర్దేశిస్తుంది. ఆధునిక ప్రభుత్వాలు i) శాసన నిర్మాణ శాఖ ii) కార్యనిర్వాహక శాఖ iii) న్యాయశాఖ అనే మూడు అంశాలతో కూడి ఉంటాయి. రాజ్యాంగం నిర్దేశించిన పరిమితులకు లోబడి శాసన నిర్మాణశాఖ చట్టాలను రూపొందించగా, దేశాధ్యక్షుడు లేదా రాష్ట్ర గవర్నర్, ప్రధానమంత్రి లేదా ముఖ్యమంత్రితో కూడిన మంత్రివర్గాలు పార్లమెంటు లేదా రాష్ట్ర శాసనసభలు సమకూర్చిన మార్గదర్శకాలకు లోబడి, విధాన నిర్ణయాలను
తీసుకొంటారు.

3) రాజ్యాంగం పాలితులు, ప్రభుత్వానికి మధ్య సంబంధాన్ని పేర్కొంటుంది. ప్రాథమిక హక్కులు, ప్రాథమిక బాధ్యతలు అనేవి పౌరుల హక్కులు. ప్రభుత్వ కర్తవ్యాల గురించి సంపూర్ణంగా ప్రస్తావించాయి. భారత రాజ్యాంగం మూడో భాగం, నాల్గో భాగం (ఎ) లు రాజ్యం, పౌరుల మధ్య పరస్పర సంబంధాన్ని సూచిస్తాయి.

AP Inter 2nd Year Civics Study Material Chapter 1 భారత రాజ్యాంగం

4) ప్రతి సంఘానికి (society) కొన్ని నిర్దిష్టమైన ఆకాంక్షలు, ఆశయాలు ఉంటాయి. రాజ్యం అనేది ప్రజల కనీస అవసరాలను సంతృప్తిపరచేందుకై, ప్రజలందరికి మంచి జీవనాన్ని అందించేందుకై ఆవిర్భవించింది. ప్రజల శ్రేయస్సుకై రాజ్యం (ప్రభుత్వం ద్వారా) కృషిచేయాల్సి ఉంటుందని రాజ్యాంగం పేర్కొంటుంది.

5) వర్తమాన, భావితరాలలో సంభవించే అస్థిర పరిస్థితులను నివారించేందుకు సర్వోన్నత ప్రతి అయిన రాజ్యాంగం దోహదపడుతుంది. ఎటువంటి మార్పులనైనా ఆమోదించేందుకు, అలాగే ఏవిధమైన ఒడిదుడుకులను తట్టుకొనే విధంగా రాజ్యాంగం రూపొందుతుంది. రాజ్యాంగం అనేది సజీవ ప్రతిగా ఉంటుంది. అది భూత, వర్తమాన, భవిష్యత్ కాలాలలో రాజ్యానికి సంబంధించిన విషయాలను జతపరుస్తుంది.

ప్రశ్న 2.
భారత రాజ్యాంగం నిర్మాణం గురించి తెలపండి.
జవాబు:
ఒకవైపు భారత్, పాకిస్తాన్ల మధ్య అధికారాల మార్పిడికి సంబంధించిన కసరత్తు జరుగుతుండగా వేరొకవైపు భారతదేశానికి ప్రత్యేక రాజ్యాంగాన్ని రూపొందించేందుకై రాజ్యాంగపరిషత్తు అనే సంస్థను ఏర్పాటు చేయడమైంది. 1946లో రాజ్యాంగ పరిషత్తు నిర్మాణం విషయంలో ముగ్గురు మంత్రుల బృందం, ప్రధాన రాజకీయ పార్టీల మధ్య అవగాహన కుదిరింది. రాజ్యాంగ పరిషత్తుకు పరోక్ష ఎన్నికలు నిర్వహించాలనీ, సభ్యులను రాష్ట్ర శాసనసభలలోని ఎన్నికైన సభ్యులు ఎన్నుకోవాలని సూచించడమైంది. రాజ్యాంగ పరిషత్తు మొత్తం సభ్యత్వ సంఖ్య 385కాగా అందులో 292 స్థానాలు బ్రిటీష్ ఇండియా పాలిత రాష్ట్రాలకు, 93 స్థానాలు స్వదేశీ సంస్థానాలకు కేటాయించడమైంది. 1946 డిసెంబరు 9వ తేదీన రాజ్యాంగ పరిషత్తు మొదటి సమావేశం జరిగింది. ఆ సమావేశాన్ని అఖిల భారత ముస్లిం లీగ్ సభ్యులు బహిష్కరించడమైంది. మొత్తం మీద భారత రాజ్యాంగాన్ని ఖరారు చేసేందుకై భారత రాజ్యాంగ పరిషత్తుకు రెండు సంవత్సరాల 11 నెలల 17 రోజులు సమయం పట్టింది. రాజ్యాంగ పరిషత్తు సభ్యులు కేవలం పార్టీ ప్రాతిపదికపై ఎన్నుకోబడి, భారతీయ ప్రజానీకానికి చెందిన దాదాపు ప్రతి వర్గానికి ప్రాతినిధ్యం వహించారని చెప్పవచ్చు. రాజ్యాంగ పరిషత్తులో స్ఫూర్తిదాయకంగా వ్యవహరించిన వారిలో జవహర్లాల్ నెహ్రూ, డాక్టర్ రాజేంద్రప్రసాద్, సర్దార్ వల్లబాయ్ పటేల్ వంటి ప్రముఖుల పేర్లను ప్రత్యేకంగా ప్రస్తావించాల్సి ఉంటుంది. పైన పేర్కొన్న ముగ్గురు నాయకులు రాజ్యాంగ ప్రధాన సూత్రాల రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు. అయితే భారత రాజ్యాంగానికి జవసత్త్వాలను అందించినవాడిగా భారత రాజ్యాంగ ముసాయిదా సంఘం అధ్యక్షుడు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ను పేర్కొనవచ్చు. భారత రాజ్యాంగ ముసాయిదా రచనలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్కు సహాయ సహకారాలను అందించిన ప్రముఖ న్యాయవేత్తలలో అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, ఎన్. గోపాలస్వామి అయ్యంగార్, ఎమ్.మునీ, టి.టి కృష్ణమాచారి వంటి వారు ఉన్నారు. ఇక రాజ్యాంగానికి పునాదుల ఏర్పాటుకు సంబంధించిన నివేదికలను అందించిన కమిటీలలో కేంద్ర ప్రభుత్వ అధికారాల కమిటీ, కేంద్రప్రభుత్వ నిర్మాణపు కమిటీ, ప్రాథమిక హక్కులు, మైనారిటీ హక్కుల కమిటీ వంటివి ఉన్నాయి. అంతిమంగా భారతరాజ్యాంగ పరిషత్తు భారత రాజ్యాంగాన్ని 1949 నవంబరు 26వ తేదీన ఆమోదించింది. భారత రాజ్యాంగం అధీకృత ప్రతిపై రాజ్యాంగ పరిషత్తు సభ్యులు సంతకం చేసిన తరువాత అది 1950 జనవరి 26వ తేదీనాడు అమల్లోకి వచ్చింది.

ప్రశ్న 3.
భారత రాజ్యాంగం ఆధారాలను వర్ణించండి. [Mar. ’17, ’16]
జవాబు:
భారత రాజ్యాంగం అనేక అనుభవాల ఆధారంగా రూపొందించి, ప్రపంచంలోని అనేక రాజ్యాంగాలలోని ఉత్తమ లక్షణాలను భారత రాజ్యాంగంలో పొందుపరచడమైంది. అలాగే భారతదేశంలోని రాజకీయ, సామాజిక, సాంస్కృతిక పరిస్థితులను, రాజకీయ వారసత్వాన్ని దృష్టిలో ఉంచుకొని భారత రాజ్యాంగాన్ని రచించడమైంది.
మొత్తం మీద భారత రాజ్యాంగ రచన సమయంలో క్రింది ఆధారాలను రాజ్యాంగ నిర్మాతలు స్వీకరించారు.
1. భారత రాజ్యాంగంలోని అనేక అంశాలు బ్రిటిష్ రాజ్యాంగానికి ప్రాతిపదికగా ఉన్న ‘వెస్ట్ మినిస్టర్ తరహా పద్దతి నుండి గ్రహించడం జరిగింది. పార్లమెంటరీ సంప్రదాయాలు, సమన్యాయపాలన, కేబినెట్ ప్రభుత్వం, శాసన నిర్మాణ – కార్యనిర్వాహక శాఖల మధ్య సంబంధం, ఏక పౌరసత్వం, నామమాత్ర కార్యనిర్వాహక అధిపతి వంటివి అందుకు ఉదాహరణలు.

2. భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు, న్యాయ సమీక్ష, సమాఖ్య విధానం, రాష్ట్రపతి ఎన్నిక, రాష్ట్రపతిపై మహాభియోగ తీర్మాన ప్రతిపాదన వంటి అంశాలు అమెరికా రాజ్యాంగం నుంచి గ్రహించడం జరిగింది.

3. రాజ్య విధాన ఆదేశక సూత్రాలను రాజ్యాంగ నిర్మాతలు ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి స్వీకరించారు.

4. జర్మనీ వైమర్ రాజ్యాంగం నుంచి భారత రాష్ట్రపతికి సంబంధించిన అత్యవసర అధికారాలను రాజ్యాంగ నిర్మాతలు గ్రహించారు.

5. ఆస్ట్రేలియా రాజ్యాంగం నుంచి ఉమ్మడి జాబితా, వర్తకం, వాణిజ్యం, అంతర్రాష్ట్ర రవాణా, పార్లమెంటు, శాసనసభల సభ్యుల ప్రత్యేక హక్కులు వంటి విషయాలను భారత రాజ్యాంగంలో చేర్చడమైంది.

6. భారత రాజ్యాంగంలోని కేంద్ర, రాష్ట్ర సంబంధాల శీర్షికను కెనడా రాజ్యాంగం నుంచి స్వీకరించడం జరిగింది.

7. దక్షిణాఫ్రికా నుంచి రాజ్యాంగ సవరణకు సంబంధించిన అధికరణాలను భారత రాజ్యాంగంలో పొందుపరచడమైంది.

8. గణతంత్ర రాజ్యం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలకు సంబంధించిన అంశాలు ఫ్రాన్స్ రాజ్యాంగం నుంచి తీసుకోవడం జరిగింది.

9. భారత రాజ్యాంగంలోని అత్యధిక అంశాలు భారత ప్రభుత్వ చట్టం, 1935 నుంచి గ్రహించడమైంది. పైన పేర్కొన్న రాజ్యాంగాల నుంచి అనేక అంశాలను గ్రహించడం వల్ల భారత రాజ్యాంగం అధిక పరిమాణంతో కూడిన సుదీర్ఘమైన రాజ్యాంగంగా గుర్తింపు పొందింది.
దానితో భారత్ రాజ్యాంగాన్ని కొందరు ఐరావతంతో పోల్చారు.

AP Inter 2nd Year Civics Study Material Chapter 1 భారత రాజ్యాంగం

ప్రశ్న 4.
భారత రాజ్యాంగంలోని ఏవైనా మూడు ముఖ్య లక్షణాలను వివరించండి.
జవాబు:
1) గణతంత్ర ప్రభుత్వం : పూర్వపు, వలస సౌర్వభౌమత్వ రాజ్యం ఇంగ్లండ్ వలె కాకుండా భారత రాజ్యాంగ నిర్మాతలు భారత గణతంత్ర ప్రభుత్వాన్ని సూచించారు. అటువంటి సంవిధానంలో అన్ని ప్రభుత్వ పదవులు అర్హతగల పౌరులకు అందుబాటులో ఉంటాయి. వంశపారంపర్య సూత్రానికి ఎటువంటి అవకాశం లేదు. ఎందుకంటే రాచరికం అనేది అప్రజాస్వామికమైంది.

2) లౌకిక రాజ్యం : భారత రాజ్యాంగం లౌకిక రాజ్యానికి ప్రతీకగా ఉంటుంది. మన రాజ్యాంగం భారతదేశంలో ఏ ఒక్కమతాన్ని అధికార మతంగా గుర్తించదు. మతప్రాతిపదికపై కల్పించిన రిజర్వేషన్లను రద్దుచేసింది. అయితే తాత్కాలిక ప్రాతిపదికపై షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల వారికి శాసననిర్మాణంలో తగిన ప్రాతినిధ్యం కల్పించేందుకై రిజర్వేషన్ సౌకర్యాలను కల్పించింది.

3) స్వతంత్ర న్యాయశాఖ : సమాఖ్య వ్యవస్థలో రాజ్యాంగాన్ని వ్యాఖ్యానించేందుకు స్వతంత్ర న్యాయ శాఖ అనేది అత్యంత ఆవశ్యకమైంది. శాసన నిర్మాణ, కార్యనిర్వహక శాఖల అధికారాల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు అది అవసరమవుతుంది. భారత సుప్రీంకోర్టు క్రమేణా ప్రపంచంలో అత్యంత శక్తివంతమైందిగా ఆవిర్భవించింది. స్వతంత్ర హోదా ఉండుటచేత, సుప్రీంకోర్టు, హైకోర్టుల న్యాయమూర్తులు దేశంలో శాసన నిర్మాణ, కార్యనిర్వాహక సంస్థల చర్యలను విధానాలలోని ఔచిత్యాన్ని నిర్ణయించగలుగుతారు.

ప్రశ్న 5.
“భారత రాజ్యాంగం ఆత్మయే ప్రవేశిక” వ్యాఖ్యానించండి.
జవాబు:
భారత రాజ్యాంగ లక్షణాలలో ప్రవేశిక అత్యంత ముఖ్యమైంది. అది భారత రాజ్యాంగ మూలతత్త్వాన్ని సూచిస్తుంది. రాజ్యాంగ నిర్మాతల ఆశయాలు, ఆకాంక్షలు, లక్ష్యాలను ప్రతిబింబిస్తుంది. జవహర్లాల్నెహ్రూ ప్రవేశికను ఒక నిశ్చయాత్మక తీర్మానం ప్రమాణం, హామీగా వర్ణించారు. ప్రవేశిక ‘భారతీయులమైన మేము, మా కోసం రాజ్యాంగాన్ని ‘సమర్పించుకుంటున్నాం’ అనే భావాన్ని వ్యక్తీకరించింది. భారతదేశాన్ని సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా ప్రకటించింది. భారతీయులకు స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, న్యాయాలను ప్రసాదిస్తున్నట్లు వెల్లడించింది. భారతదేశంలో సర్వసత్తాధికారం అంతిమంగా భారత ప్రజలకే చెందుతుందనీ స్పష్టీకరించింది. ప్రవేశికను సుప్రీంకోర్టు న్యాయమూర్తి మధోల్కర్ రాజ్యాంగ ప్రధాన లక్షణాల సారం’ అని వర్ణిస్తే, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి హిదయతుల్లా రాజ్యాంగపు ఆత్మగా ప్రస్తుతించారు.

1976లో భారత రాజ్యాంగపు 42వ సవరణ చట్టం తరువాత ప్రవేశిక క్రింది విధంగా ఉంది.

“భారత ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి; పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని, ఆలోచన, భావ ప్రకటన, విశ్వాసం, ధర్మం, ఆరాధనలలో స్వాతంత్ర్యాన్ని, అంతస్తుల్లోనూ, అవకాశాల్లోనూ సమానత్వాన్ని చేకూర్చడానికీ, వారందరిలో వ్యక్తి గౌరవాన్నీ, జాతీయ సమైక్యతను, సమగ్రతను సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడానికీ; ఈ 1949 నవంబర్ 26వ తేదీన మా రాజ్యాంగ పరిషత్తులో ఆమోదించి, శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేము సమర్పించుకుంటున్నాం”.

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
లిఖిత పూర్వక రాజ్యాంగం.
జవాబు:
పెద్ద లిఖిత రాజ్యాంగం: భారత రాజ్యాంగం లిఖిత రాజ్యాంగం. భారత రాజ్యాంగము ప్రపంచ రాజ్యాంగాలన్నింటిలోకి అతిపెద్ద రాజ్యాంగము. ఇందులో ప్రస్తుతం 444 అధికరణాలు, 12 ప్రకరణాలు ఉన్నాయి. రాజ్యాంగంలో 22 భాగాలున్నాయి. ఇప్పటి వరకు 100 సార్లు పైగా రాజ్యాంగం సవరించబడింది. ఇవన్నీ రాజ్యాంగంలో భాగమయ్యాయి. అన్ని వివరాలు పొందుపరచడం వలన రాజ్యాంగం పెద్దదిగా తయారైంది. ఐవర్ జెన్నింగ్స్ అనే రచయిత “భారత రాజ్యాంగం ప్రపంచంలో అతిదీర్ఘము, వివరణాత్మక రాజ్యాంగం” అని వర్ణించాడు. కొన్ని అలిఖిత నియమాలు కూడా ఉన్నాయి.

AP Inter 2nd Year Civics Study Material Chapter 1 భారత రాజ్యాంగం

ప్రశ్న 2.
దృఢ రాజ్యాంగం.
జవాబు:
రాజ్యాంగంలోని కొన్ని ముఖ్యమైన అంశాలను అత్యంత కఠినమైన రీతిలో సవరించడానికి వీలుంటే, మరికొన్ని అంశాలను సరళమైన రీతిలో మార్పు చేయవచ్చు. ఇంకొన్ని అంశాలను సగం కఠినమైన, సగం సరళమైన రీతిలో మార్పు చేయవచ్చు. భారత రాష్ట్రపతి, సుప్రీంకోర్టు, హైకోర్టుల అధికారాలు, కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలు వంటి అంశాలను సవరించడానికి రాజ్యాంగ నిర్మాతలు పరుషమైన పద్ధతిని సూచించారు. రాష్ట్రాల పేర్లు, సరిహద్దులు, విస్తీర్ణం, విలీనం లేదా విభజన, రాష్ట్ర శాసనమండళ్ళ ఏర్పాటు లేదా రద్దువంటి అంశాలను సులభమైన రీతిలో సవరించడానికి వీలుకల్పించారు. ప్రాథమిక హక్కులు, ఆదేశక సూత్రాలు వంటి అంశాలను మార్పు చేయడానికి | పాక్షిక కఠిన, పాక్షిక సరళ పద్ధతికి అవకాశం ఇచ్చారు.

ప్రశ్న 3.
పార్లమెంటరీ ప్రభుత్వం.
జవాబు:
భారత రాజ్యాంగం పార్లమెంటరీ ప్రభుత్వ పద్ధతిని కేంద్ర, రాష్ట్ర స్థాయిలలో ప్రవేశపెట్టింది. రాజ్యాంగ నిర్మాతలు | ఐర్లాండ్ తరహాలో ఎన్నికైన దేశాధ్యక్షుడు ఉన్న పద్ధతిని సూచించారు. బ్రిటిష్ పార్లమెంటరీ వ్యవస్థలో మిగిలిన లక్షణాలైన రెండు రకాల కార్య వర్గాధిపతులు, ప్రధానమంత్రి నాయకత్వం, సమిష్టి బాధ్యత, పార్లమెంటుకు కార్యవర్గంపై నియంత్రణ, రాజ్యాధినేతకు నామమాత్ర కార్యనిర్వాహక వర్గ హోదా వంటి అంశాలను భారత రాజకీయ వ్యవస్థలో ఆమోదించడం జరిగింది. రాష్ట్రాలలో కూడా పార్లమెంటరీ ప్రభుత్వ విధానాన్నే సూచించడం జరిగింది.

ప్రశ్న 4.
ప్రాథమిక హక్కులు.
జవాబు:
రాజ్యాంగంలోని 3వ భాగంలో 12వ అధికరణం నుండి 35వ అధికరణం వరకు ప్రాథమిక హక్కులను ప్రస్తావించారు. ఈ ప్రాథమిక హక్కులను 7 రకాలుగా విభజించవచ్చును. ప్రస్తుతం 6 ప్రాథమిక హక్కులే ఉన్నాయి. ఆస్తి హక్కును 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించారు. ఇవి ప్రజలకు స్వేచ్ఛనిస్తాయి. వీటికి భంగం కలిగితే పౌరులు న్యాయస్థానాల ద్వారా రక్షించుకోవచ్చు. స్వేచ్ఛ హక్కు, సమానత్వపు ” హక్కు, మత స్వాతంత్య్రపు హక్కు మొదలగునవి ప్రాథమిక హక్కులు. అత్యవసర పరిస్థితిలో రాష్ట్రపతి వీటిని తాత్కాలికంగా రద్దు చేయవచ్చు. ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రాథమిక హక్కులు చాలా అవసరము. ప్రాథమిక హక్కులు న్యాయసమ్మతమైనవి. ఇవి నిరపేక్షమైనవి కావు.

ప్రశ్న 5.
లౌకిక రాజ్యం.
జవాబు:
భారత రాజ్యాంగం లౌకిక రాజ్యానికి ప్రతీకగా ఉంటుంది. మన రాజ్యాంగం భారతదేశంలో ఏ ఒక్క మతాన్ని |అధికార మతంగా గుర్తించదు. మతప్రాతిపదికపై కల్పించిన రిజర్వేషన్లను రద్దుచేసింది. అయితే తాత్కాలిక ప్రాతిపదికపై షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల వారికి శాసన నిర్మాణంలో తగిన ప్రాతినిధ్యం కల్పించేందుకై రిజర్వేషన్ సౌకర్యాలను కల్పించింది.

ప్రశ్న 6.
వయోజన ఓటుహక్కు.
జవాబు:
పార్లమెంటు, రాష్ట్రశాసన సభలకు ఎన్నికలలో ప్రతినిధులను ఎన్నుకొనేందుకు భారత రాజ్యాంగం 18 ఏండ్లు నిండిన పౌరులందరికీ ఓటుహక్కును ప్రసాదించింది. దాని ప్రకారం వయోజన పౌరులందరికీ కులం, తెగ, మతం, లింగం, అక్షరాస్యతలతో సంబంధం లేకుండా ఓటుహక్కు ఇచ్చింది. అటువంటి ఏర్పాటు భారత ప్రజాస్వామ్యానికి విశేషమైన ప్రాముఖ్యతనిచ్చి సామాన్య ప్రజల ఆత్మగౌరవం, ప్రతిష్టలను పెంపొందిస్తుంది. సమానత్వ సూత్రాన్ని సమర్థించి, మైనారిటీల ప్రయోజనాలను కాపాడుకొనేందుకు, సమాజంలోని బలహీనవర్గాలలో నూతన ఉత్తేజాలకు వీలు కల్పిస్తుంది.

ప్రశ్న 7.
ద్విసభా విధానం.
జవాబు:
భారత రాజ్యాంగం జాతీయ స్థాయిలో ద్విసభా విధానాన్ని ప్రవేశపెట్టింది. దానిని అనుగుణంగా భారత పార్లమెంటులో లోక్సభ (దిగువ సభ), రాజ్యసభ (ఎగువ సభ), అనే రెండు సభలు ఉంటాయి. లోక్సభ దేశ ప్రజలకు ప్రాతినిధ్యం వహించగా, రాజ్యసభ రాష్ట్రాల ప్రయోజనాలు పరిరక్షణకు ఉద్దేశించింది. భారత రాజ్యాంగ నిర్మాతలు బ్రిటన్, అమెరికాలు అనుసరిస్తున్న ద్విసభావిధానాన్ని మన దేశానికి సూచించడమైంది.

ప్రశ్న 8.
ఆదేశిక నియమాలు.
జవాబు:
భారత రాజ్యాంగం నాలుగో భాగంలో 36 నుంచి 51 వరకు గల ప్రకరణలు ఆదేశిక నియమాలు ప్రస్తావించాయి. భారత రాజ్యాంగ నిర్మాతలు వాటిని ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి గ్రహించారు. ఆ నియమాలు సమాఖ్య రాజ్య భావనను ప్రతిబింబిస్తాయి. అవి ప్రభుత్వాలకు ఇవ్వబడిన ఆజ్ఞలు. సమానమైన పనికి సమాన వేతనం, ఉపాధి అవకాశాల కల్పన, సంపద న్యాయమైన రీతిలో పంపిణీ, వృద్ధాప్య పించన్లు, అస్వస్థత నుంచి కాపాడటం, శ్రామికులకు విశ్రాంతి, వన్య ప్రాణుల సంరక్షణ, మహిళలు, చిన్న పిల్లలు, వృద్ధులను కాపాడడం వంటివి ఆదేశిక నియయాలకు కొన్ని ఉదాహరణలు. ఆదేశిక సూత్రాలను న్యాయ స్వభావం లేకపోయినప్పటికీ వాటిని ఏ బాధ్యతాయుత ప్రభుత్వము విస్మరించరాదు.

AP Inter 2nd Year Civics Study Material Chapter 1 భారత రాజ్యాంగం

ప్రశ్న 9.
న్యాయశాఖ స్వతంత్ర ప్రతిపత్తి.
జవాబు:
సమాఖ్య వ్యవస్థలో రాజ్యాంగాన్ని వ్యాఖ్యానించేందుకు స్వతంత్ర న్యాయశాఖ అనేది అత్యంత ఆవశ్యకమైంది. శాసన నిర్మాణ, కార్యనిర్వాహక శాఖల అధికారాలు దుర్వినియోగాన్ని అరికట్టేందుకు అది అవసరమవుతుంది. భారత సుప్రీంకోర్టు క్రమేణా ప్రపంచంలో అత్యంత శక్తివంతమైందిగా ఆవిర్భివించింది. స్వతంత్ర హోదా ఉండుట చేత, సుప్రీంకోర్టు, హైకోర్టుల న్యాయమూర్తులు దేశంలో శాసన నిర్మాణ, కార్యనిర్వాహక సంస్థల చర్యలను విధానాలలోని జౌచిత్యాన్ని నిర్ణయించగలుగుతారు.

ప్రశ్న 10.
ప్రవేశిక. [Mar. ’17, ’16]
జవాబు:
రాజ్యాంగ నిర్మాతల ఆశయాలు, ఆకాంక్షలు, లక్ష్యాలను ప్రతిబింబిస్తుంది. జవహర్లాల్నెహ్రూ ప్రవేశికను ఒక నిశ్చయాత్మక తీర్మానం ప్రమాణం, హామీగా వర్ణించారు. ప్రవేశిక భారతదేశాన్ని సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా ప్రకటించింది. భారతీయులకు స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, న్యాయాలను ప్రసాదిస్తున్నట్లు వెల్లడించింది. భారతదేశంలోని సర్వసత్తాధికారం అంతిమంగా భారత ప్రజలకే చెందుతుందని స్పష్టీకరించింది. ప్రవేశికను సుప్రీంకోర్టు న్యాయమూర్తి మధోల్కర్ రాజ్యాంగ ప్రధాన లక్షణాల సారం అని వర్ణిస్తే, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి హిదయతుల్లా రాజ్యాంగపు ఆత్మగా ప్రస్తుతించారు.

AP Inter 2nd Year History Study Material Chapter 13 సమాకాలీన ప్రపంచ చరిత్ర

Andhra Pradesh BIEAP AP Inter 2nd Year History Study Material 13th Lesson సమాకాలీన ప్రపంచ చరిత్ర Textbook Questions and Answers.

AP Inter 2nd Year History Study Material 13th Lesson సమాకాలీన ప్రపంచ చరిత్ర

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ఐక్యరాజ్య సమితి ముఖ్య అంగాలను, దాని విధులను గూర్చి రాయండి.
జవాబు:
1945 అక్టోబర్ 24న ఐక్యరాజ్య సమితి ఆవిర్భవించింది. ఐ.రా.స లక్ష్యాలైన భద్రత, న్యాయం, సంక్షేమం, మానవ హక్కులు అనే లక్ష్యాలను సాధించడానికి అనేక విభాగాలున్నాయి.

ఐక్యరాజ్య సమితి ముఖ్య అంగాలు:
సాధారణ సభ (జనరల్ అసెంబ్లీ): ఐ.రా.సలోని ప్రతి సభ్య దేశము సాధారణ సభలో సభ్యులే. సాధారణ సభ ప్రతి సంవత్సరానికొకసారి సమావేశమౌతుంది. కొన్ని ప్రత్యేక పరిస్థితులలో సాధారణ సభ ప్రత్యేక సమావేశాలు జరుగుతాయి.

సాధారణ సభ ఐ.రా.స. పనితీరుని వివరిస్తుంది, సమీక్షిస్తుంది, పర్యవేక్షిస్తుంది. అంతర్జాతీయ శాంతి భద్రతలు నెలకొల్పుటకు చర్చలు, సూచనలు చేస్తుంది. ఐ.రా.స. లోని వివిధ సంస్థలలో నియామకాలు చేపడుతుంది. ఐ.రా.స విత్త వ్యవహారాలను నియంత్రిస్తుంది.

భద్రతామండలి: ఇది ఐ.రా.స కార్యనిర్వాహక అంగం. దీనిలో 5 శాశ్వత సభ్యదేశాలు మరియు 10 తాత్కాలిక దేశాలు ఉంటాయి. అమెరికా, రష్యా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్ మరియు చైనాలు సభ్యదేశాలు. మిగిలిన 10 తాత్కాలిక సభ్యదేశాలు రెండు సంవత్సరాల కాలపరిమితి కొరకు సాధారణ సభ రొటేషన్ పద్ధతిలో ఎన్నుకుంటుంది.

AP Inter 2nd Year History Study Material Chapter 13 సమాకాలీన ప్రపంచ చరిత్ర

సాధారణ విషయాలలో భద్రతామండలి సభ్యదేశాలు 15 ఓట్లలో 9 ఓట్లు వస్తే మెజారిటీగా పరిగణించబడతాయి. కానీ ముఖ్యమైన అంశాలలో చర్చ జరిగేటపుడు తొమ్మిది ఓట్లలో ఐదు శాశ్వత సభ్యదేశాల ఓట్లు ఖచ్చితంగా తీర్మానానికి అనుకూలంగా ఉండాలి. శాశ్వత సభ్యదేశాలకు వీటో హక్కు ఉంటుంది. భద్రతామండలి అవసరమైనప్పుడల్లా సమావేశమవుతుంది. భద్రతామండలి సభ్యదేశాల ప్రతినిధులు న్యూయార్క్ లో ఉంటారు.

ఆర్థిక మరియు సాంఘిక మండలి: ఈ మండలిలో 54 మంది విభిన్న దేశాలకు చెందిన సభ్యులు ఉంటారు. వీరు సాధారణ సభచే ఎంపిక చేయబడతారు. వీరి కాలపరిమితి 3 సంవత్సరాలు. ప్రతి మూడు సంవత్సరాలకు మూడవ వంతు సభ్యులు పదవీ విరమణ చేస్తారు. కొత్త సభ్యులు వారి స్థానాలలో ఎన్నిక అవుతారు. ఆర్థిక మరియు సాంఘిక మండలి సంవత్సరానికి రెండు సమావేశాలు నిర్వహిస్తుంది. ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక సమస్యలను పరిష్కరించడమే దీని ముఖ్య విధి.

ప్రజల జీవన ప్రమాణాలను పెంచడం, మానవ హక్కులకు హామీ ఇవ్వడం, నిరుద్యోగాన్ని నిర్మూలించడం. వివిధ దేశాల సాంఘిక, ఆర్థిక అభివృద్ధి కొరకు ఈ మండలి కృషి చేస్తుంది. ఈ మండలి యునెస్కో, I.M.F, W.H.O. I.C.O, వంటి ఇతర సంస్థల సహకారంతో పనిచేస్తోంది.

ధర్మకర్తృత్వ మండలి: ఇది వలస దేశాల ప్రతినిధులతో, సాధారణ సభచే ఎన్నుకొనబడిన ప్రతినిధులతో కూడి ఉంటుంది. ఈ మండలి ముఖ్య విధి తనకు అప్పగించబడిన ప్రాంతాల అభీష్టాలను నెరవేర్చడం మరియు ఐ.రా.స. ధర్మకర్తృత్వంలో ఉన్న దేశాల పాలనలో జనరల్ అసెంబ్లీకి సహాయపడటం దీని ముఖ్య విధి.

అంతర్జాతీయ న్యాయస్థానం ఐ.రా.స యొక్క న్యాయమూర్తుల పదవీకాలం 9 సంవత్సరాలు. దేశాల మధ్య వచ్చే న్యాయ వివాదాలను పరిష్కరించడం దీని ముఖ్య విధి. భద్రతామండలి, జనరల్ అసెంబ్లీలకు అవసరమైనపుడు న్యాయ సలహాలను ఇస్తుంది.

సచివాలయం (సెక్రటేరియట్): ఐ.రా.స. రోజువారీ కార్యక్రమాలను సమితి సచివాలయం నిర్వహిస్తుంది. సచివాలయం ముఖ్య పాలనాధికారి సెక్రటరీ జనరల్ పదవీకాలం ఐదు సంవత్సరాలు. భద్రతామండలి ప్రతిపాదనతో సెక్రటరీ జనరల్ నియమింపబడతాడు. వివిధ దేశాలకు చెందిన అనేకమంది అధికారులు సెక్రటరీ జనరల్ పర్యవేక్షణలో పనిచేస్తారు. సచివాలయం ఐ.రా.స.కు చెందిన అన్ని రంగాలు రికార్డులను భద్రపరుస్తుంది. ఐ.రా.స. వివిధ రంగాల వార్షిక నివేదికలను జనరల్ అసెంబ్లీకి సమర్పిస్తాడు.

ప్రశ్న 2.
ఐక్యరాజ్య సమితి సాధించిన విజయాలను తెలపండి.
జవాబు:
ఐక్యరాజ్య సమితి ఆవిర్భవించిన తొలినాళ్ళలో అనేక సమస్యలను పరిష్కరించడానికి కృషి చేసింది. కానీ అనేక సందర్భాలలో రష్యా వీటో హక్కును ఉపయోగించడం వలన కొన్ని సమస్యల పరిష్కారంలో ఆటంకాలు ఎదురయ్యాయి. అయినా ఐ.రా.స. స్థాపించబడిన కొద్ది కాలంలోనే అనేక సమస్యల పరిష్కారానికి కృషి చేసింది. 1946లో రష్యా, ఇరాన్ ల మధ్య సమస్యను పరిష్కరించింది. ఫ్రాన్స్కు వ్యతిరేకంగా సిరియా, లెబనాన్ల వివాదం, డచ్-ఇండోనేషియా సమస్య, పాలస్తీనా సమస్య, కొరియా వివాదం, కాశ్మీర్ సమస్య పరిష్కారానికి చొరవ చూపింది.

రెండవ ప్రపంచ యుద్ధానంతరం ఇండోనేషియా ప్రజలు హాలెండ్కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి తమ దేశాన్ని స్వతంత్రంగా, రిపబ్లిక్ దేశంగా ప్రకటించుకున్నారు. హాలెండ్, ఇండోనేషియా స్వాతంత్య్రాన్ని తిరస్కరించడంతో ఇరు దేశాల మధ్య సాయుధ పోరాటం మొదలయ్యింది. భద్రతామండలి జోక్యం చేసుకుని ఇరు దేశాలను యుద్ధ విరమణకు అంగీకరింపజేసింది. ఇండోనేషియాకు స్వాతంత్య్రం ఇప్పించడంలో సాయపడింది.

పాలస్తీనా విషయంలో అరబ్లకు, బ్రిటన్కు మధ్య విభేదాలు రూపుమాపడానికి ఐ.రా.స. 1948 ఏప్రిల్లో ఒక కమిటీని నియమించింది. ఆ కమిటీ నివేదికను అనుసరించి పాలస్తీనా నుండి సాయుధ బలగాలను తొలగించి దాని అంతర్గత విషయంలో జోక్యం చేసుకోవద్దని బ్రిటన్ ను ఐ.రా.స. ఆదేశించింది.

ఇజ్రాయేల్ మీద అరబ్లు దాడి చేసినపుడు ఐ.రా.స. జోక్యం చేసుకొని ఆయుధ పోరాటాన్ని నివారించి వాటి మధ్య యుద్ధ విరమణ ఒప్పందాన్ని కుదిర్చింది. పాలస్తీనా కాందిశీకుల కొరకు సహాయ పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేసి వారిని ఆదుకున్నది.

AP Inter 2nd Year History Study Material Chapter 13 సమాకాలీన ప్రపంచ చరిత్ర

రెండవ ప్రపంచ యుద్ధానంతరం కొరియా స్వాతంత్ర్యాన్ని పొందింది. కానీ, అది రెండుగా విభజింపబడింది. ఉత్తర కొరియా అప్పటి యు.ఎస్.ఎస్.ఆర్ ‘ నియంత్రణలోకి, దక్షిణ కొరియా అమెరికా, బ్రిటన్, చైనాల ఉమ్మడి నియంత్రణలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఉత్తర కొరియా, దక్షిణ కొరియాపై దాడిచేసింది. ఈ అంశంలో ఐ.రా.స. నిర్మాణాత్మక పాత్ర పోషించింది. జనరల్ మెక్ ఆర్థర్ నాయకత్వంలో దళాలను పంపి ఉత్తర కొరియా ఆగడాలను నియంత్రించింది. 1953లో ఇరుదేశాల మధ్య సంధి కుదిర్చి శాంతిని నెలకొల్పి యుద్ధాన్ని నివారించింది. 1966లో సూయజ్ కెనాల్ విషయంలో నెలకొన్న సంక్షోభాన్ని ఐ.రా.స. సమర్థవంతంగా పరిష్కరించింది.

ప్రశ్న 3.
ప్రచ్ఛన్న యుద్ధమనగానేమి ? అందులో భాగంగా ఏర్పడ్డ ఒడంబడికలు మరియు ప్రణాళికలను గురించి రాయండి.
జవాబు:
రెండవ ప్రపంచ యుద్ధకాలంలో రష్యా మరియు అమెరికాలు దగ్గరయ్యాయి. కానీ యుద్ధం అంతమైన తరువాత వారి సంబంధాలు కొంతమేర దెబ్బతిన్నాయి. వారి మధ్య శత్రుభావం ఏర్పడింది. ఈ వైరం యావత్ ప్రపంచాన్ని మూడవ ప్రపంచయుద్ధ అంచుల వరకు తీసుకొనిపోయింది. ఈ రెండు వ్యతిరేకశక్తుల మధ్య ఆయుధాలతో నిజమైన | పోరాటం జరగలేదు.

ప్రపంచంలోని రెండు అగ్రరాజ్యాల మధ్య ఉన్న సిద్దాంతపరమైన విభేదాలే ఈ ప్రచ్ఛన్న యుద్ధానికి కారణం. అమెరికా నాయకత్వంలోని పెట్టుబడిదారీ పాశ్చాత్యశక్తి, కమ్యూనిజంపై దాడి చేస్తుందేమోనని రష్యా భావించింది. అందువల్ల రష్యా తూర్పు యూరప్లో ఒక సోవియట్ కూటమిని ఏర్పాటు చేసుకోవడం ప్రారంభించింది. యూరప్లో కమ్యూనిజం వ్యాప్తి, సోవియట్ యూనియన్ కూటమి అనేది పాశ్చాత్యదేశాలు, ప్రపంచంలో కమ్యూనిజం వ్యాప్తిని వ్యతిరేకించడానికి దారితీసాయి. ఈ దేశాలు మరో సైనికశక్తి కూటమిగా ఏర్పడ్డాయి. ఈ విధంగా ప్రపంచం రెండు విరుద్ధ శక్తి కూటములుగా విడిపోయింది. వీటిలో ఒకటి అమెరికా నాయకత్వంలోని పాశ్చాత్య శక్తి కూటమి కాగా మరొకటి యు.ఎస్.ఎస్.ఆర్. నాయకత్వంలోని ప్రాచ్యశక్తి కూటమి అయింది.

యు.ఎస్.ఎ. మరియు రష్యా దేశాల మధ్య మొదటగా విభేదాలు రావడానికి కారణం పోలెండ్, యుగోస్లేవియాల నాజీ వ్యతిరేక ప్రతిఘటన, సైనిక వ్యూహానికి యుద్ధానంతర పునర్నిర్మాణానికి సంబంధించిన సమన్వయం వంటి అంశాలలో ఇరుదేశాల మధ్య తీవ్ర విభేదాలు వచ్చాయి.

రెండవ ప్రపంచ యుద్ధానికి ముందునుండే యూరప్ దేశాలైన పోలెండ్, బల్గేరియా, రుమేనియా, హంగరీ, యుగోస్లేవియా దేశాలలో రష్యా కమ్యూనిస్ట్ పాలన విధించింది. ఆ తరువాత సోవియట్ యూనియన్ తన దృష్టిని పశ్చిమ యూరప్ వైపునకు మళ్ళించింది. రాయితీలు పొందడానికి ఇది టర్కీ మీద, ఇరాక్ మీద ఒత్తిడి చేసింది. గ్రీసు వ్యతిరేకంగా కమ్యూనిస్ట్ విప్లవం తీసుకురావడానికి పథకం వేసింది. ఇటలీలో తన ప్రభావాన్ని విస్తరించింది. సోవియట్ రష్యాలో చేపట్టిన ఈ చర్యలను పాశ్చాత్య దేశాలు గొప్ప ఆందోళనతో గమనించాయి.

కమ్యూనిజం వ్యాప్తిని అరికట్టే బాధ్యతను అమెరికా చేపట్టింది. యూరప్ ఖండంలో కమ్యూనిస్ట్ ప్రభావం పెరగడాన్ని అరికట్టడానికి ట్రూమన్ సిద్ధాంతాన్ని, మార్షల్ ప్రణాళికను ప్రతిపాదించింది. ఈ చర్యలు, ప్రతిచర్యలే ప్రచ్ఛన్న యుద్ధానికి నాంది పలికాయి.

ట్రూమన్ సిద్ధాంతము: గ్రీస్, టర్కీలకు సైనిక ఆర్థిక సహాయం అందించడానికి సంబంధించిన ప్రతిపాదనే ట్రూమన్ సిద్ధాంతం. సాయుధ తిరుగుబాట్లు లేదా విదేశీ ఒత్తిడి ద్వారా స్థానికులను అణచడానికి చేస్తున్న ప్రయత్నాలను ప్రతిఘటించే ప్రజలకు సహాయం అందించే అమెరికా విధానాన్ని ట్యూమన్ సిద్ధాంతం అన్నారు. ఈ సిద్ధాంతం ఈ రెండు దేశాలలో విజయవంతమైంది.

మార్షల్ ప్రణాళిక: యూరప్లో కమ్యూనిజం పెరుగుదలను నివారించడానికి అమెరికా ఒక యూరప్ ఆర్థిక పునర్నిర్మాణ కార్యక్రమాన్ని ప్రారంభించింది. అమెరికా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ‘మార్షల్ ప్రణాళిక’ గా పేర్కొనడం జరిగింది. అమెరికా రాజ్య కార్యదర్శి అయిన మార్షల్ పేరునే దీనికి పెట్టడం జరిగింది.

ట్రూమన్ సిద్ధాంతానికి పొడిగింపే మార్షల్ ప్రణాళిక. ఈ ప్రణాళిక సర్వ సాధారణంగా యూరప్్కంతా వర్తిస్తుంది. ఇది ఒక ప్రత్యేక రాజ్యానికి పరిమితమైనది కాదు. ఇది నాలుగు సంవత్సరాల పాటు కొనసాగింది కాబట్టి విస్తృతమైన కార్యక్రమానికి ప్రాతినిధ్యం వహించింది. రెండవ ప్రపంచ యుద్ధం వల్ల తలెత్తిన ఆర్థిక సంక్షోభాన్ని నివారించడానికి దీన్ని ఉద్దేశించడమైనది. కమ్యూనిజంకు వ్యతిరేకంగా పోరాటం చేయాలనే అమెరికా దృఢ నిశ్చయాన్ని కూడా ఇది స్పష్టం చేసింది. ఈ ప్రణాళిక ప్రకారం యూరప్ లోని అనేక దేశాలు రెండవ ప్రపంచ యుద్ధానికి ముందున్న పటిష్ట స్థితికి చేరాయి. ఈ నేపథ్యంలో అమెరికా, సోవియట్ యూనియన్ల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగి అనేక ఒప్పందాలు,
సంధులకు దారితీసాయి.

బ్రస్సెల్స్ సంధి: రష్యా ఆధిపత్యాన్ని నివారించడానికి బ్రిటన్, ఫ్రాన్స్, బెల్జియం, నెదర్లాండ్స్, లగ్జంబర్గ్ మొదలైన దేశాలు 1948 మార్చిలో బ్రస్సెల్స్ సంధి మీద సంతకాలు చేసాయి. ఈ సంధి పరస్పర సైనిక, ఆర్థిక, రాజకీయ సహకారాన్ని సమకూర్చింది.

నాటో: 1949 ఏప్రియల్ 4న సోవియట్ కూటమికి వ్యతిరేకంగా అమెరికా, కెనడా, బెల్జియం, డెన్మార్క్, ఫ్రాన్స్, ఇటలీ, ఇంగ్లాడ్, లగ్జంబర్గ్, నెదర్లాండ్, నార్వే, పోర్చుగల్, గ్రీస్, టర్కీ దేశాలతో కలిసి నాటో ఒప్పందాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇది సోవియట్ కూటమికి వ్యతిరేకంగా ఏర్పాటయిన రక్షణాత్మక వ్యవస్థ. నాటో సభ్యులు విదేశీ దురాక్రమణకు వ్యతిరేకంగా వ్యష్టిగాకాని, సమిష్టిగా కాని పోరాడటానికి సంయుక్తంగా ప్రతిఘటించడానికి అంగీకరించారు. నాటో ఒప్పందం తర్వాత పశ్చిమ యూరప్ లో యుద్ధం జరగలేదు.

మాల్తోవ్ ప్రణాళిక: దీనిని రష్యా విదేశాంగ మంత్రి మాల్తోవ్ ప్రతిపాదించాడు. ఈ ప్రణాళికలో కమ్యూనిస్టు దేశాలన్నింటికి సభ్యత్వం ఉండేది. దీనిలో రష్యా, బల్గేరియా, పోలెండ్, రుమేనియా, తూర్పు యూరప్, మంగోలియా సభ్యులుగా ఉన్నారు. మార్షల్ ప్రణాళికకు ప్రతిచర్యగా రష్యా ప్రారంభించింది.

AP Inter 2nd Year History Study Material Chapter 13 సమాకాలీన ప్రపంచ చరిత్ర

వార్సా సంధి: అమెరికా ఏర్పాటు చేసిన నాటోకు వ్యతిరేకంగా 1955 మేలో రష్యా కమ్యూనిస్టు దేశంతో ఈ ఒప్పందాన్ని ప్రతిపాదించింది. అల్బేనియా, రష్యా, బల్గేరియా, హంగేరీ, తూర్పు జర్మనీ, జెకోస్లోవేకియా, రుమేనియా, పోలెండ్ దేశాలు ఆ ఒప్పందంపై సంతకం చేసారు. సంధి ప్రకారం ఏ సభ్యదేశమయినా విదేశీ ముట్టడికి గురైతే ఇతర సభ్యదేశాలన్ని ఆ ముట్టడిదారుడిని సమిష్టిగా ప్రతిఘటించాలి.

ఈ రెండు కూటముల విభజన 1991 డిసెంబర్ లో సోవియట్ సమాఖ్య పతనానంతరం గొప్ప మార్పులకు లోనయింది.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
అలీనోద్యమ ఆవిర్భావం గురించి వ్రాయండి.
జవాబు:
అమెరికా, రష్యాలు రెండు కూటములుగా ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతున్న రోజులలో అలీనోద్యమం 1961లో ప్రారంభమయింది. కొత్తగా స్వాతంత్రాన్ని పొందిన ఆసియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికా ఖండాలలోని కొన్ని వారు కలిసి ఈ అలీనోద్యమాన్ని ప్రారంభించారు.

అలీనోద్యమం 1955 బాండుంగ్ సదస్సులో అంకురార్పణ జరిగింది. 23 ఆసియా దేశాల, 6 ఆఫ్రికా దేశాల ప్రతినిధులు ఇండోనేషియాలో సదస్సులో పాల్గొన్నారు. ఇండోనేషియా అధ్యక్షుడు సుకార్నో, భారతదేశ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ,ఈజిప్ట్కు చెందిన నాజర్ అలీనోద్యమంలో కీలక పాత్ర వహించారు. చైనా ప్రధాని చౌ-ఎన్-లై కూడా ఈ సదస్సులో పాల్గొన్నారు. అలీనోద్యమ ముఖ్య ఉద్దేశాలను పంచశీల అంటారు. అవి:

  1. సభ్యదేశాల సార్వభౌమాధికారాన్ని, వారి సహజ సరిహద్దులను గౌరవించుట.
  2. సభ్యదేశాలు పరస్పరం యుద్ధానికి దిగరాదు..
  3. ఒకరి ఆంతరంగిక విషయాలలో మరొకరు జోక్యం చేసుకోరాదు.
  4. పరస్పర లాభాల కోసం సహకారాన్ని పెంచుకోవాలి.
  5. శాంతియుతంగా సభ్యదేశాలతో మెలగుట.

అలీనోద్యమాన్ని బలపరచిన దేశాలు ప్రచ్ఛన్న యుద్ధంలో భాగమైన అమెరికా కూటమిలోగాని, సోవియట్ కూటమిలోగాని చేరడానికి ఇష్టపడలేదు. ఆ విధంగా అలీనోద్యమం కొత్తగా స్వాతంత్రాన్ని పొందిన దేశాలు వారి స్వాతంత్రాన్ని కాపాడుకొంటూ అంతర్జాతీయ సమస్యలందు తటస్థంగా ఉండటానికి ఉద్దేశించబడింది.

ప్రశ్న 2.
నమీబియా ఎదుర్కొన్న సమస్యను గురించి SWAPO ఏవిధంగా పరిష్కరించిందో తెలపండి.
జవాబు:
దక్షిణ పశ్చిమ ఆఫ్రికా ప్రజల సమాఖ్య (SWAPO) ప్రస్తుతం నమీబియాగా ఏర్పడింది. ఈ ప్రాంతం జర్మనీ దేశానికి వలసగా మారింది. అక్కడి ఆఫ్రికా ప్రజలు జర్మనీ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమించారు. జర్మనీ వారు కౄరంగా 80 వేల మంది నమీబియన్లను చంపివేశారు.

మొదట ప్రపంచ యుద్ధంలో జర్మనీ దక్షిణాఫ్రికా చేతిలో ఓడటంతో నానాజాతి సమితి నమీబియాను పశ్చిమ |ఆఫ్రికా పాలనతో ఉండేట్లు ఏర్పాటు చేసింది. కానీ దక్షిణాఫ్రికా వారు నమీబియాను ఆక్రమించుకున్నారు. 1968లో దక్షిణ పశ్చిమ ఆఫ్రికాకు నమీబియా అని నామకరణం చేసారు. భద్రతా మండలి వారు దక్షిణాఫ్రికాను నమీబియాపై ఆధిపత్యాన్ని వదలమని వత్తిడి చేసారు.

దక్షిణాఫ్రికా పాలనకు వ్యతిరేకంగా స్థానిక నమీబియాన్లను ఐక్యం చేయడానికి SWAPO (సౌత్ వెస్ట్ ఆఫ్రికా పీపుల్స్ ఆర్గనైజేషన్) ఏర్పడింది. వీరి ముఖ్య ఆశయం సంపూర్ణ స్వాతంత్రం. SWAPO గెరిల్లా యుద్ధం ముమ్మరంగా సాగించింది. 74 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత నమీబియా స్వాతంత్రాన్ని సాధించారు. SWAPO నాయకుడైన సామ్ నుజోమ్ స్వతంత్ర నమీబియాకు తొలి అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డారు.

AP Inter 2nd Year History Study Material Chapter 13 సమాకాలీన ప్రపంచ చరిత్ర

ప్రశ్న 3.
ఐరోపా ఆర్థికమండలి వెనుక లక్ష్యాలను తెలుపండి.
జవాబు:
రెండు ప్రపంచ యుద్ధాల అనంతరం ప్రతి ఐరోపా దేశం వారు రెండు పెద్ద అగ్రరాజ్యాలతో పోలిస్తే చాలా చిన్న దేశాలుగా ఉన్నామని, బలహీనంగా ఉన్నామని భావించారు. అందువలన ఐరోపా దేశాల వారు పరస్పర స్నేహాన్ని, సహకారాన్ని పెంపొందించుకోవాలని అందరూ కలిసి సమిష్టి రాజకీయ, ఆర్థిక, సైనిక కృషి చేయాలని నిర్ణయించారు.

1947లో 16 ఐరోపా దేశాలవారు కలిసి అమెరికా వారి మార్షల్ పథకం ద్వారా లభించే సహాయాన్ని పంచుకోవడానికి ఒక సమాఖ్యగా ఏర్పడ్డారు. 1949లో నాటో ఏర్పడింది. 1951లో ఆరు పశ్చిమ ఐరోపా దేశాలు బొగ్గు, ఉక్కు ఖనిజాలకు సంబంధించి సంయుక్త వాణిజ్యాన్ని నిర్వహించుకోవడానికి సమాఖ్యగా ఏర్పడ్డారు.

ఐరోపా ఆర్థిక సమాఖ్య ‘రోమ్ ఒప్పందం’ ద్వారా 1957లో ఏర్పడింది. యూరప్ లోని అనేక దేశాల వారు దీనిలో సభ్యులు. వీరు వెనుకబడిన దేశాల వారి వస్తువులను దిగుమతి చేసుకునేది మరియు వాణిజ్యాన్ని ఐరోపా ఆర్థిక సమాఖ్య వారే నిర్వహించేవారు. ఈ సంస్థ ప్రధాన కార్యాలయం బ్రెసెల్స్ లో ఉంది. సభ్య దేశాల మధ్య ఏర్పడే ఆర్థికపరమైన వివాదాలను పరిష్కరిస్తూ, స్నేహపూరిత వాతావరణం నెలకొల్పటానికి కృషి చేస్తుంది. చివరగా ఈ యూనియన్ ‘యూరో’ అనే ఒక సంయుక్త ద్రవ్య చలామణి ఏర్పాటు చేసింది.

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
OPEC సంస్థలో సభ్యులు ఎవరు ?
జవాబు:
చమురు ఉత్పత్తిచేసే దేశాల వారు 1962లో బాగ్దాద్ నగరంలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ సమావేశంలో చమురు ఉత్పత్తి చేసే దేశాల వారు ఒక సమాఖ్యగా ఏర్పడ్డారు. దీనిని OPEC (ఆయిల్ ప్రొడ్యూసింగ్ అండ్ ఎక్స్పోర్టింగ్ కంట్రీస్) అంటారు. ఈ సమావేశానికి ఇరాన్, కువైట్, సౌదీ అరేబియా, వెనిజులా దేశాల వారు హాజరయ్యారు. కాలక్రమేణా ఆసియా, ఆఫ్రికా ఖండాలలోని అనేక చమురు ఉత్పత్తి దేశాల వారు ఇందులో చేరారు. OPEC ప్రధాన కార్యాలయం ఆస్ట్రియాలోని వియన్నాలో నెలకొల్పారు.

ప్రశ్న 2.
సార్క్ సంస్థ సభ్యదేశాలు ఏవి ?
జవాబు:
దక్షిణాసియాలో ఆర్థికాభివృద్ధి, సామాజిక ప్రగతి, సాంస్కృతిక సంబంధాలను పెంపొందించుట, స్వావలంబన లక్ష్యంలో సార్క్న ఏర్పాటు చేయడం జరిగింది. SAARC (సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోపరేషన్)ను దక్షిణాసియా ప్రాంత దేశాలు 1985లో ఢాకా నగరంలో జరిపిన శిఖరాగ్ర సమావేశంలో స్థాపించారు. భారతదేశం, పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, భూటాన్, మాల్దీవులు ఇందులో సభ్యదేశాలు.

AP Inter 2nd Year History Study Material Chapter 13 సమాకాలీన ప్రపంచ చరిత్ర

ప్రశ్న 3.
అట్లాంటిక్ చార్టర్.
జవాబు:
ఆగస్ట్ 1944న అమెరికా అధ్యక్షుడు F.D. రూజ్వెల్ట్, బ్రిటన్ ప్రధానమంత్రి అట్లాంటిక్ సముద్రం మీద సమావేశమై ఒక తీర్మానాన్ని రూపొందించారు. దానిని అట్లాంటిక్ చార్టర్ అంటారు.

దాని లక్ష్యాలు: అంతర్జాతీయ శాంతి భద్రతలు పెంచడం, దేశాల మధ్య స్నేహాన్ని పెంచడం, ప్రజల ప్రాథమిక హక్కులను గుర్తించడం. చార్టర్ సుత్రాల ప్రకారం సభ్యదేశాల మధ్య సమానత్వాన్ని అంగీకరించాలి. తమలోని విభేదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి. ఏదైనా దేశం ఐక్యరాజ్య సమితి తీర్మానాలను ఉల్లంఘిస్తే ఐక్యరాజ్య సమితి తీసుకునే చర్యలకు అండగా ఉండాలి.

AP Inter 2nd Year History Study Material Chapter 12 ఆధునికతకు మార్గాలు

Andhra Pradesh BIEAP AP Inter 2nd Year History Study Material 12th Lesson ఆధునికతకు మార్గాలు Textbook Questions and Answers.

AP Inter 2nd Year History Study Material 12th Lesson ఆధునికతకు మార్గాలు

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
చైనాలో జరిగిన నల్లమందు యుద్ధాలకు గల కారణాలు, యుద్ధ ఫలితాలు ఏవి ?
జవాబు:
బ్రిటన్ ఉత్పత్తులకు చైనాలో గిరాకీ లేదు. కానీ చైనా పింగాణి, తేయాకు, పట్టు వస్త్రాలకు యూరప్ లో డిమాండ్ ఉండేది. అందువల్ల బ్రిటీష్వారు వారి వ్యాపార వస్తువులలో నల్లమందును కూడా చేర్చారు. భారతదేశంలో పండించే నల్లమందును రహస్యంగా బ్రిటీష్వారు ఇంగ్లాండ్కు ఎగుమతి చేసి విపరీతమైన లాభాలు పొందారు. చైనాలో నల్లమందు నిషిద్ధం. ఫలితంగా రెండు దేశాల మధ్య మొదటి నల్లమందు యుద్ధం క్రీ.శ. 1839 నవంబర్ లో ప్రారంభమై మూడు సంవత్సరాలు జరిగింది. ఈ యుద్ధంలో చైనా ఓడిపోయింది. 1842లో నాన్ కింగ్ ఒప్పందం యూరోపియన్ల వ్యాపారానికి చైనా ద్వారాలు తెరుచుకున్నట్లయింది.

నౌకలలో దొంగ రవాణా జరుగుతోందన్న ఆరోపణలపై 12 మంది బ్రిటీష్ వారిని చైనా నిర్బంధించింది. ‘అగస్టీ చాప్ కులీన్’ అనే మత ప్రచారకుడిని తిరుగుబాటుదారుడనే అనుమానంతో చైనా ప్రభుత్వం మరణశిక్ష విధించింది. ఈ రెండు సంఘటనలు రెండవ నల్లమందు’ యుద్ధానికి దారితీసాయి. పెకింగ్ సంధితో ఆ యుద్ధం ముగిసింది. యుద్ధ

ఫలితాలు: ఈ రెండు నల్లమందు యుద్ధాల ఫలితంగా చైనీయులు పాశ్చాత్య దృక్పథానికి దగ్గరయ్యారు.

  • పాశ్చాత్యులను అనుకరించడం ద్వారా బలమైన శక్తిగా ఎదగవచ్చని చైనీయులు భావించారు.
  • చైనాలోని సంస్కర్తల కృషి మూలంగా చైనీయులు యూరోపియన్ల భాషలు, ఇంజనీరింగ్ విద్య, సైనిక పద్ధతులను నేర్చుకున్నారు.
  • చైనాలో పారిశ్రామికీకరణ, బొగ్గు గనుల త్రవ్వకం ప్రారంభమైనాయి.
  • చైనాలో ‘కాంగ్యువై “శతదిన సంస్కరణలు” ప్రారంభించాడు. పాఠశాలలో పాశ్చాత్య విద్యా విధానం, పోటీ పరీక్షల విధానం ప్రవేశపెట్టారు.
  • పెకింగ్ విశ్వ విద్యాలయం స్థాపన, విదేశీ గ్రంథాల అనువాదం మొదలైన వాటి ఫలితంగా 1911లో చైనాలో విప్లవం వచ్చింది.

AP Inter 2nd Year History Study Material Chapter 12 ఆధునికతకు మార్గాలు

ప్రశ్న 2.
సన్ట్సేన్ భావాలు ఏవి ? అతడు ఆ భావాలను చైనాలో అమలుపరచిన తీరును వివరింపుము.
జవాబు:
చైనాలో 1911వ సంవత్సరంలో వచ్చిన ప్రజాతంత్ర విప్లవానికి నాయకుడు ‘సన్మెట్సేన్’. ఇతడు క్రీ.శ. |1866వ సంవత్సరంలో కాంటన్ గ్రామంలో ఒక కర్షక కుటుంబంలో జన్మించాడు. చైనా తత్త్వవేత్త కన్ఫూషియస్ సిద్ధాంతాలకు ప్రభావితుడై చైనాలో జాతీయభావం, ప్రజాస్వామ్య భావజాలం, ఆధునిక దృక్పథాన్ని పెంపొందించి రిపబ్లిక్ స్థాపన ఆశయంతో చైనాలో ‘సన్ట్సేన్’ ‘తుంగ్మెంగ్ హూయి’ అనే విప్లవ సంస్థను స్థాపించాడు. పార్లమెంటరీ ప్రభుత్వ స్థాపనే తన ధ్యేయం అని ప్రకటించాడు. విద్యార్థులు, యువకులు దీనిలో సభ్యులయ్యారు. చైనా ప్రజలను ఇసుక రేణువులతో పోల్చుతూ వాటిని అనుసంధానం చేయడానికి దృఢతరం చేసే జాతీయభావం అనే సిమెంట్ అవసరం అన్నాడు. ప్రజలకు జీవనోపాధి కల్పించే బాధ్యతను ప్రభుత్వమే స్వీకరించాలన్నాడు. పెట్టుబడిని క్రమబద్దీకరించి, భూమిని సమానంగా పంచాలని ప్రబోధించాడు.

సనీయెట్సేన్ తను స్థాపించిన ‘తుంగ్మెంగ్ హూయి’ ని రద్దుచేసి జాతీయ లక్ష్యాలతో కొమిన్టింగ్ అనే జాతీయ రాజకీయ పార్టీని స్థాపించాడు. కొమిన్టింగ్ అంటే జాతీయ పక్షం అని అర్థం. క్రమంగా కొమిన్హాంగ్ పార్టీ బలపడింది. మేధావి వర్గం అభివృద్ధి చెందింది, పరిశ్రమలు అభివృద్ధి చెందాయి. పట్టణాలు, నగరాలు విస్తరించాయి. ఆధునిక విజ్ఞానం, ప్రజా ప్రభుత్వం, జాతీయవాదం మొదలైన వాటి ద్వారా చైనాను అభివృద్ధి పథంలో నడిపించాలని కొమిన్టంగ్ ఆకాంక్ష. కొమిన్లాంగ్ పట్టణీకరణ, పారిశ్రామికాభివృద్ధి కేంద్రంగా షాంగై నగరాన్ని వృద్ధి చేశారు. నౌకా నిర్మాణం అభివృద్ధి చెందింది. ఆధునిక పరిశ్రమలు ఏర్పాటు చేయబడ్డాయి. వీటి ద్వారా ఉద్యోగ, వర్తక, వ్యాపార, ఉపాధి అవకాశాలు మెరుగయ్యాయి. స్త్రీలు కూడా భాగస్వాములయ్యారు. ఉత్తర, దక్షిణ చైనాల ఏకీకరణకు కృషి చేసాడు. ‘సన్యాట్సన్’ చైనా జాతిపితగా ప్రసిద్ధికెక్కాడు.

ప్రశ్న 3.
మేజి పునః ప్రతిష్టకు దారితీసిన సంఘటనలను తెలపండి.
జవాబు:
టోకుగవా పాలన పట్ల సమాజంలోని అన్ని వర్గాలలో అసంతృప్తి ప్రారంభమైంది. 1866లో దైమ్యోలు కూడా తిరుగుబాటు చేసారు. 1868లో చక్రవర్తి, సైన్యాలు, దైమ్యోలు కలిసి టోకుగవా సైన్యాలను ఓడించాయి. ఆఖరి షోగున్ ‘హితోతిసుబాషి’ లొంగిపోయాడు. టోకుగవా షోగునెట్ అంతమైంది. చక్రవర్తి మత్సుహిటో సర్వాధికారాలతో ‘మెడో’ లో సింహాసనం అధిష్టించాడు.

టోకుగవా షోగునెట్ పతనమై, చక్రవర్తి తిరిగి అధికారంలోకి రావడంతో జపాన్లో మొయిజీ ప్రభుత్వ స్థాపన జరిగింది. ‘మెయిజీ’ అనగా ‘విజ్ఞతతో వ్యవహరించడం’ అని అర్థం. క్రీ.శ. 1868లో అధికారం చేపట్టిన ‘మత్సుహిటో’ రాజ్యాంగబద్ధ రాజరికాన్ని రూపొందించి, భూస్వామ్య వ్యవస్థను రద్దుచేసి, సాంప్రదాయ వ్యవస్థలకు స్వస్తిచెప్పి జపాన్ను పాశ్చాత్యీకరిస్తూ మొయిజీ పాలన సాగించాడు. మారుతున్న పరిస్థితులకనుగుణంగా ప్రభుత్వం, ప్రజలు ఇచ్చిపుచ్చుకునే తోడ్పాటు ఫలితంగా జపాన్ స్వల్పకాల వ్యవధిలో అద్భుత ప్రగతిని సాధించింది.

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
కన్ఫూషియస్
జవాబు:
ప్రపంచంలోని అత్యుత్తమ దార్శనికులలో కన్ఫూషియస్ ఒకడు. ఇతడు క్రీ.పూ. 551లో జన్మించాడు. క్రీ.పూ. 479లో మరణించాడు. కన్ఫూషియస్ అనే పేరు కుంగ్ – ఫూట్జ్ అనే యూరోపియన్ పద రూపం. కుంగ్ అనగా గురువు అని అర్థం. ఇతని శిష్యులు ఇతనిని “కుంగ్-దీ-పూ” అని పిలిచేవారు. 22 సంవత్సరాల వయసులో ఉపాధ్యాయ వృత్తిని చేపట్టి చరిత్రను, కవిత్వాన్ని, మర్యాదలను గురించిన అంశాలను బోధించాడు. ఇతడు “పంబ్లింగ్” అనే ఐదు గ్రంథాలను వ్రాశాడు. అవి.

  1. లీ – ఛీ: ప్రాచీన శాస్త్ర విధులను తెలియజేస్తుంది.
  2. ఈ-జింగ్: ఆత్మతత్త్వ విద్యలకు చెందినది.
  3. జింగ్: మానవుని నైతిక విలువలను వివరిస్తుంది.
  4. చూన్ చ్యూ: ఇది ‘లూ’ రాష్ట్ర చరిత్రను వివరిస్తుంది.
  5. ఘాజింగ్: చైనా ప్రాచీన చరిత్రను తెలియజేస్తుంది.

ప్రశ్న 2.
మావోజెడాంగ్
జవాబు:
ఆధునిక చైనా నిర్మాత మావోసెటుంగ్ (మావోజెడాంగ్) 1893 డిసెంబర్ 26న హూనాన్ రాష్ట్రంలోని ఒక సంపన్న కర్షక కుటుంబంలో జన్మించాడు. విద్యాభ్యాసం అనంతరం 1918లో పెకింగ్ గ్రంథాలయ ఉద్యోగిగా కొంతకాలం పనిచేసాడు. అక్కడ మార్కిస్ట్ సిద్ధాంతాలను బాగా ఆకళింపు చేసుకున్నాడు. మావో 1911 విప్లవం వలన ప్రభావితుడయ్యాడు. పెకింగ్ యూనివర్సిటీలో ఉన్న కాలంలో మావో మార్కిస్టు లెనినిస్ట్ భావాలకు ఆకర్షితుడయ్యాడు. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా స్థాపించడంలో కీలకపాత్ర వహించాడు. రష్యాలో ఏర్పడిన కర్షక సోవియట్ల స్ఫూర్తితో కియాంగీని రాష్ట్రాన్ని ఎంపిక చేసుకొని చైనా సోవియట్లను ఏర్పరచాడు. భూమి మొత్తం కమ్యూనిస్ట్ల వశమైంది. తరువాత కాలంలో 1949 అక్టోబర్ లో జరిగిన కమ్యూనిస్ట్ విప్లవం విజయవంతమై మావోజెడాంగ్ అధ్యక్షుడిగా, చౌఎన్ ప్రధానిగా చైనాలో ప్రజా రిపబ్లిక్ ఏర్పడింది.

AP Inter 2nd Year History Study Material Chapter 12 ఆధునికతకు మార్గాలు

ప్రశ్న 3.
టోకుగవా షోగునెట్
జవాబు:
1603లో టోకుగవా వంశీయులు షోగున న్ను చేజిక్కించుకుని 1868 వరకు పాలించాయి. ఈ కాలాన్ని ‘టోకుగవా ‘షోగునెట్’ అంటారు. 265 సంవత్సరాల వీరి పాలనలో భూస్వామ్య వ్యవస్థను, దైమ్యోలను అదుపులో ఉంచింది. సైనిక శక్తి మీద ఆధారపడి టోకుగవా అధికారాన్ని చెలాయించింది. పరిపాలన కోసం ఉద్యోగస్వామ్యాన్ని ఏర్పరిచింది. టోకుగవా పాలనలో శాంతి, సుస్థిరత ఉన్నా క్రమంగా సమాజంలోని అన్ని వర్గాలలో అసంతృప్తి ఏర్పడింది. టోకుగవా రాజధాని ‘యెడో’ కాగా చక్రవర్తి ‘క్యోటో’ లో నివసించాడు. ఇంగ్లండ్, రష్యాలతో కుదుర్చుకున్న ఒప్పందంతో టోకుగవా అప్రదిష్టపాలైంది. 1866లో దైమ్యోలు తిరుగుబాటు చేసారు. 1868లో చక్రవర్తి సైన్యాలు, దైమ్యోలు కలిసి టోకుగవా సైన్యాలను ఓడించాయి. ఆఖరి షోగున్ ‘హితోతి సుబాషి’ లొంగిపోయాడు. టోకుగవా షోగునెట్ అంతమైంది.

AP Inter 2nd Year History Study Material Chapter 11 చెదిరిన స్థానిక ప్రజలు

Andhra Pradesh BIEAP AP Inter 2nd Year History Study Material 11th Lesson చెదిరిన స్థానిక ప్రజలు Textbook Questions and Answers.

AP Inter 2nd Year History Study Material 11th Lesson చెదిరిన స్థానిక ప్రజలు

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ఐరోపా సామ్రాజ్యవాదం గూర్చి వ్రాయుము.
జవాబు:
17వ శతాబ్దం వరకు స్పెయిన్, పోర్చుగల్ దేశాల వ్యాపార, వాణిజ్య కార్యక్రమాలు అంతగా విస్తరించలేదు. కాని బ్రిటన్, ఫ్రాన్స్, హాలెండ్ దేశాలు తమ వ్యాపార, వాణిజ్య కార్యక్రమాలను విస్తరిస్తూ ఉత్తర అమెరికా, ఆఫ్రికా, ఆసియా ప్రాంతాలలో వలసలు ఏర్పాటును ప్రారంభించాయి. ఐర్లాండ్, బ్రిటన్ వలస ప్రాంతం. ఐర్లాండ్లోని భూ యజమానులందరూ బ్రిటన్ నుండి వచ్చి స్థిరపడినవారు. 18వ శతాబ్దంలో దక్షిణ ఆసియా, ఆఫ్రికాలలోని వర్తకులు, స్థానికులు, ప్రజలలో జోక్యం చేసుకొని వలసలలో వచ్చిన సమస్యలను పరిష్కరిస్తుండేవారు.

బ్రిటిష్ వర్తక సంఘం ఈస్టిండియా కంపెనీ స్థానికులను వంచించి, నమ్మకద్రోహం చేసో, ఓడించో, వారి పాలకులను ప్రలోభపెట్టి వారి ప్రాంతాలను ఆక్రమించడం ప్రారంభించారు. వారి నుండి పన్నులు వసూలు చేసి స్థానిక ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది. తర్వాత బ్రిటిషు వారు తమ వర్తక వాణిజ్యాభివృద్ధి కొరకు రైలు, రోడ్డు రవాణా మార్గాలను, సమాచార వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్నారు. ఆఫ్రికా రాజ్యాలను జయించి వాటిని తమ వ్యాపార కేంద్రాలుగా, వలస ప్రాంతాలుగా మార్చివేసారు. 19వ శతాబ్దంలో వలస ప్రాంతాల ప్రజల ముఖ్య వ్యవహారిక భాష ఆంగ్లం.

AP Inter 2nd Year History Study Material Chapter 10 జర్మనీ, ఇటలీలలో విమోచన (ఏకీకరణ) ఉద్యమాలు మొదటి నెపోలియన్

ప్రశ్న 2.
17వ శతాబ్దంలో అమెరికాలో స్థిరపడ్డ ఐరోపావాసులు గురించి వివరించుము.
జవాబు:
మతపరమైన అంశాలపై స్థానిక ప్రొటెస్టెంట్ క్రైస్తవులకు, ఐరోపా క్యాథలిక్ లకు మధ్య కొన్ని వైవిధ్యాలు ఉండేవి. అలాంటి భావాలు గల ఐరోపావాసులలో చాలామంది అమెరికాకు వలస వచ్చి నూతన జీవితాన్ని ప్రారంభించారు. వారు అడవులను నరికి వ్యవసాయ భూములను ఏర్పాటు చేసుకున్నారు. అమెరికా అధ్యక్షుడు థామస్ జఫర్సన్ అభిప్రాయం ప్రకారం “ఐరోపా ప్రజలచే ఏర్పాటు చేయబడిన చిన్న భూ కమతాలలో స్థానిక ప్రజల అవసరాలకు మాత్రమే పంటలు పండించారు కానీ లాభం కోసం కాదు. స్థానికులు భూమిని సొంతం చేసుకోకపోవడమే వారు అనాగరికులుగా మారడానికి కారణం” అని పేర్కొన్నాడు.

తరువాత 18వ శతాబ్దంలో అమెరికా, కెనడాలు తమ సుస్థిరత్వాన్ని నిలబెట్టుకొని క్రమంగా ఒక శతాబ్దం కాలానికి అనేక భూములను ఆక్రమించుకున్నాయి. అమెరికా, ఫ్రాన్స్ల నుండి విశాలమైన భూభాగాన్ని కొనుగోలు చేసి ‘దానికి ‘లూసియానా’ అని పేరు పెట్టింది. రష్యా నుండి ‘అలాస్కా’, దక్షిణ మెక్సికో నుండి కొన్ని ప్రాంతాలను పొందింది. దీనితో అమెరికా భౌగోళిక పరిస్థితి అనూహ్యంగా మారిపోయింది. ఇంగ్లండ్, ఫ్రాన్స్ల నుండి వచ్చిన వలస ప్రజలు అమెరికాలో స్థిరపడాలని కోరుకున్నారు. అదే విధంగా జర్మనీ, స్వీడన్, ఇటలీల నుండి వచ్చిన ప్రజలు కూడా భూములను స్వాధీనం చేసుకొని వాటిని వ్యవసాయ క్షేత్రాలుగా మార్చివేసారు. పోలెండ్ ప్రజలు ‘స్టెప్పీలు’ అనేవారి నుండి గడ్డిభూములు, ఇతర వ్యవసాయ భూములను తక్కువ ధరకు కొనుగోలు చేసారు. వాటిలో వ్యవసాయం చేయనారంభించారు.

అమెరికా దక్షిణ ప్రాంతం వేడి వాతావరణంతో కూడుకొని ఉంటుంది. దక్షిణ అమెరికాలోను, ఉత్తర అమెరికాలోను తమ వలసలలోని వ్యవసాయ భూములలో కూలీలుగా ఆఫ్రికా నుంచి నల్లజాతివారిని బానిసలుగా తెచ్చుకొనేవారు. వీరు చాలా దయనీయ స్థితిలో ఉండేవారు. ఉత్తర అమెరికాలోని కొందరు ఉదారవాదులు ఈ బానిస వ్యవస్థను ఖండించారు. 1864-65 మధ్య బానిస వ్యవస్థ అనుకూల, ప్రతికూలవాదుల మధ్య అంతర్యుద్ధం జరిగింది. తరువాత బానిస వ్యవస్థ రద్దు చేయబడింది. 20వ శతాబ్దానికి ముందు నల్ల జాతీయులు తెల్ల జాతీయులతో పాటు సమానంగా అమెరికాలో పౌరహక్కులు పొందారు.

స్థానికత కోల్పోయిన స్థానికులు అమెరికాలో స్థిరపడిన ఐరోపావాసులు స్థానికులైన అమెరికన్లను వారి ప్రదేశాల నుండి బలవంతంగా ఖాళీ చేయించాలనుకున్నారు. వారి మధ్య అనేకసార్లు సంప్రదింపులు జరిగాయి. ఐరోపావాసులు చాలా తక్కువ ధర చెల్లించి స్థానికుల నుండి భూమిని పొందారు. భూమి, పొందే విషయంలో జరిగే ఒప్పంద పత్రాలలోని మోసాన్ని స్థానికులు గ్రహించలేకపోయారు. అందువలన స్థానిక ప్రజలు వారి హక్కులను కోల్పోయి, చివరకు పరదేశీయులుగా మిగిలిపోయారు.

జార్జియా రాష్ట్రంలోని ‘చెరోకీ’ అనే గిరిజన తెగవారికి ప్రభుత్వం నుండి ఎలాంటి హక్కులు లేవు. 1832లో అమెరికా ప్రధాన న్యాయమూర్తి జాన్మార్షల్ చెరోకీ ప్రజలకు సర్వ హక్కులను కల్పించాడు. అదే విధంగా అమెరికా అధ్యక్షుడైన ఆండ్రూజాన్సన్ గిరిజన తెగల ఆర్థిక, రాజకీయ అవకాశాల కొరకు పోరాడాడు. అమెరికా నుండి వారిని బయటకు పంపే ఎలాంటి చట్టాలకు అనుమతివ్వలేదు. స్థానికులు పశ్చిమ ప్రాంతానికి నెట్టివేయబడ్డారు. అక్కడ వారికివ్వబడిన భూములలో సీసం, బంగారం, ఇతర ఖనిజ సంపద అపారంగా లభించింది. ఎంతో మారణకాండతో, మోసంతో, ఆయుధబలంతో అమెరికాలోని స్థానికులను ఐరోపావాసులు వారిని మైనారిటీలుగా మార్చివేసారు.

ప్రశ్న 3.
అమెరికాలో 19వ శతాబ్దంలో జరిగిన పారిశ్రామికాభివృద్ధిని గురించి రాయుము.
జవాబు:
1840 ప్రాంతంలో కాలిఫోర్నియాలో బంగారపు నిధులను కనుగొనడం జరిగింది. ఈ విషయం తెలిసిన ఐరోపా వ్యాపారులు అమెరికాకు వలస వచ్చారు. దీని వలన బంగారపు గనులలో వేలాదిమందికి ఉపాధి లభించింది. రెండు ఖండాల మధ్య 1870 ప్రాంతంలో రైలు మార్గాల నిర్మాణం జరిగింది. “ఆండ్రూకర్నేగి” అనే వలస కూలి కొద్ది కాలంలోనే ధనవంతుడిగా మారిపోయాడు.

AP Inter 2nd Year History Study Material Chapter 10 జర్మనీ, ఇటలీలలో విమోచన (ఏకీకరణ) ఉద్యమాలు మొదటి నెపోలియన్

ఇంగ్లాండ్లో పారిశ్రామిక విప్లవ ప్రారంభదశలో అనేకమంది రైతులు, పెద్ద భూస్వాములకు తమ భూములు ఇచ్చి ఫ్యాక్టరీలలో, పరిశ్రమలలో ఉపాధి పొందారు. అదే విధంగా ఉత్తర అమెరికాలో కూడా పారిశ్రామిక, రవాణా రంగాలలో గొప్ప మార్పులు వచ్చాయి. అమెరికా, కెనడాలలో పట్టణాలు, నగరాలు పెరిగాయి. ఈ పరిణామాలన్నీ త్వరితగతిన ఆర్థికాభివృద్ధి సాధించడానికి దోహదపడ్డాయి. వ్యవసాయ భూమి విస్తరించబడి వ్యవసాయాభివృద్ధి జరిగింది. ఈ అభివృద్ధి ద్వారా హవాయ్, ఫిలిప్పీన్స్ మొదలైనచోట్ల వలసలు స్థాపించి క్రమంగా అమెరికా ఒక బలమైన దేశంగా ఆవిర్భవించింది.

AP Inter 2nd Year History Study Material Chapter 10 జర్మనీ, ఇటలీలలో విమోచన (ఏకీకరణ) ఉద్యమాలు మొదటి నెపోలియన్

Andhra Pradesh BIEAP AP Inter 2nd Year History Study Material 10th Lesson జర్మనీ, ఇటలీలలో విమోచన (ఏకీకరణ) ఉద్యమాలు మొదటి నెపోలియన్ Textbook Questions and Answers.

AP Inter 2nd Year History Study Material 10th Lesson జర్మనీ, ఇటలీలలో విమోచన (ఏకీకరణ) ఉద్యమాలు మొదటి నెపోలియన్

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
కౌంట్్కవూర్ జీవితం, ఇటలీ ఏకీకరణలో అతని పాత్ర ఎట్టిది ?
జవాబు:
ఇటలీ ఏకీకరణ కోసం పోరాడిన ముఖ్య నాయకుడు కౌంట్-కామిలో-డి-కవూర్’. ఇతడు 1810 సంవత్సరంలో పీడ్మాంట్లో భూస్వామ్య కుటుంబంలో జన్మించాడు. యుక్తవయస్సులో సార్టీనియా సైన్యంలో ఇంజనీర్గా పనిచేసాడు. ఇతడు ప్రజాస్వామ్య, పార్లమెంటరీ విధానాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేశాడు. పీడ్మాంట్ పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. 1850లో ఇతనిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. 1852లో సార్జీనియా ప్రధానమంత్రి అయ్యాడు. ఆంగ్ల రచయితల ప్రభావం వల్ల కవూర్ వివిధ రంగాలలో ఆరితేరాడు. ఇంగ్లాండ్, ఫ్రాన్స్ దేశాలకు వెళ్ళి సమగ్రమైన, విశాలమైన భావాలను అవగాహన చేసుకున్నాడు. పీడ్మాంట్ నాయకత్వంలో ఇటలీ ఏకీకరణ సాధ్యమవుతుందని బలంగా నమ్మి రాజ్యాంగబద్ద రాజరికం స్థాపించాలని ఆశించాడు.

క్రిమియా యుద్ధం – ఫ్రాన్స్లో సంధి: కవూర్ ఇటలీ ఏకీకరణ కోసం ఇంగ్లాండ్, ఫ్రాన్స్లతో సంధి కోసం ఎదురుచూస్తున్నాడు. ఇంగ్లాండు పెద్ద సైన్యం లేకపోయినా యుద్ధాలలో మునిగి ఉంది. కాని ఫ్రాన్స్కు మంచి సైన్యం ఉంది. 3వ నెపోలియన్ ఆశాపరుడు, సాహసికుడు. కవూర్ 3వ నెపోలియన్కు దగ్గరయ్యాడు. అప్పుడు క్రిమియా యుద్ధం కవూర్కు మంచి అవకాశం కలిగించింది. ఫ్రాన్స్, ఇంగ్లాండ్లతో పొత్తు కుదుర్చుకుని రష్యాతో యుద్ధానికి సిద్ధమయ్యాడు. రెండు సంవత్సరాల తర్వాత క్రిమియా యుద్ధంలో ఫ్రాన్స్, ఇంగ్లాండ్లకు ఇటలీ చేసిన సేవలకు గుర్తుగా మూడవ నెపోలియన్ కవూర్ను ప్లాంబియర్స్కు ఆహ్వానించి ఆస్ట్రియాతో యుద్ధానికి కుట్ర పన్ని ఇటలీ నుంచి తరిమివేయడానికి అంగీకరించాడు.

ఫ్రాన్స్లో సంధి, ఆస్ట్రియాతో యుద్ధం: ఆస్ట్రియాను ఇటలీ నుండి పారద్రోలుటకు కవూర్కు ఫ్రెంచి సహాయం అవసరం. దీనికోసం 1858 జూలైలో ఫ్రెంచి రాజు 3వ నెపోలియన్, కవూర్ల మధ్య ఒప్పందం కుదిరింది. ఆస్ట్రియాను లంబార్డీ, వెనీషియాల నుంచి పారద్రోలటానికి ఫ్రాన్స్ అంగీకరించింది. దీని ద్వారా సార్డీనియాతో అవి విలీనమౌతాయి. అందుకు ప్రతిఫలంగా పీడ్మాంట్ ఆధీనంలోని నైస్, సెవాయ్లను ఫ్రాన్స్ పొందుతుంది. ఆ తర్వాత 1859 ఏప్రిల్లో ఆస్ట్రియా సార్టీనియా సైన్యాన్ని తగ్గించమని హెచ్చరిక చేసింది. సార్డీనియా తిరస్కరించగా పార్టీనియా, ఆస్ట్రియా, ఫ్రాన్స్ల మధ్య యుద్ధం మొదలైంది.

AP Inter 2nd Year History Study Material Chapter 10 జర్మనీ, ఇటలీలలో విమోచన (ఏకీకరణ) ఉద్యమాలు మొదటి నెపోలియన్

యుద్ధం 1859 ఏప్రిల్ నుండి జూలై వరకు జరిగింది. మిత్రరాజ్యాలు మాజెంటా, సల్ఫరినోలలో విజయాన్ని సాధించాయి. అయితే యుద్ధం మధ్యలో ఫ్రెంచి రాజు హఠాత్తుగా యుద్ధం నుంచి విరమించుకొని ఆస్ట్రియాతో జూలై 11, 1859లో విల్లా ఫ్రాంకా సంధి చేసుకున్నాడు. ఆ సమయంలో లంబార్డ్ పీడ్మాంట్ ఆధీనంలోను, వెనీషియా ఆస్ట్రియా ఆధీనంలోను ఉన్నాయి.

ఈ సంఘటనతో కవూర్ అసంతృప్తి చెంది తన పదవికి రాజీనామా చేసాడు. అయితే రాజు రాజీనామాను అంగీకరించలేదు. తరువాత జరిగిన పరిణామాల వల్ల మొడీనా, ఫార్మా, టస్కనీ, పోప్ రాష్ట్రాల రాజులు కవూర్ ప్రోద్భలంతో సార్టీనియా, పీడ్మాంట్లతో కలిసిపోవుటకు ముందుకొచ్చారు. విక్టర్ ఇమ్మాన్యుయేల్, కవూర్లు ప్రజాభిప్రాయ సేకరణ జరిపి ఈ రాజ్యాలను సార్డీనియా, పీడ్మాంట్లలో 1860 మార్చి నెలలో ఏకం చేసారు. విక్టర్ ఇమ్మాన్యుయేల్ను ఇటలీ రాజుగా చేసి 2 ఏప్రియల్ 1860లో మొదటి పార్లమెంట్ సమావేశాన్ని ట్యురిన్లో ఏర్పాటు చేశారు. కవూర్ ప్రోద్భలం వల్ల చివరకు మూడవ నెపోలియన్ మనసు మార్చుకొని సెవాయ్, నైస్లను తీసుకొని ఇటలీ రిపబ్లికన్ను గుర్తించాడు.

ప్రశ్న 2.
జర్మనీ ఏకీకరణలో బిస్మార్క్ పాత్ర ఎటువంటిది ?
జవాబు:
బిస్మార్క్ 1815 సంవత్సరంలో బ్రాండెన్ బర్గ్ లోని ప్రభువుల కుటుంబంలో జన్మించాడు. ఇతడు గోటింజెన్, బెర్లిన్ విశ్వవిద్యాలయాలలో విద్యను అభ్యసించి సివిల్ సర్వీస్లోకి వచ్చాడు. అయితే క్రమశిక్షణా రహిత్యం వల్ల బర్తరఫ్ అయ్యాడు. 1849 99 విప్లవ కాలంలో ఉదారవాదుల నుండి ప్రష్యా రాష్ట్రాన్ని కాపాడాడు. 1851లో బిస్మార్క్ రాజకీయ తత్వవేత్తగా చేరాడు. 1851 నాటికి బిస్మార్క్ రాజీలేని పోరాట యోధుడుగా, నాయకత్వ ప్రతిభ కలిగిన వాడుగా గణుతికెక్కాడు. విలియం బిస్మార్క్ పట్ల విశ్వాసంతో అతని మనస్తత్వాన్ని ఫ్రాంక్ఫర్డ్ జర్మనీ డైట్ లో ప్రష్యా ప్రతినిధిగా నియమించాడు. 1862లో రాజు విలియం బిస్మార్క్న ప్రధానమంత్రిగా నియమించాడు. అదే రోజు బిస్మార్క్ చేసిన నిర్ణయాలను పార్లమెంట్ తిరస్కరించగా, బిస్మార్క్ ఖచ్చితంగా తన నిర్ణయాలను పార్లమెంట్ ఆమోదం ఉన్నా లేకున్నా అమలు చేస్తానని చెప్పాడు. బిస్మార్క్ ధైర్యం వల్ల మొదటి విలియం జర్మనీ ఏకీకరణకు పార్లమెంట్తో పోరాడటానికి సిద్ధమయ్యాడు.

రక్తపాత విధానం: బిస్మార్క్ ముఖ్య ధ్యేయం జర్మనీ ఏకీకరణ ప్రష్యా ఆధీనంలో జరగాలని భావించడం. యుద్ధాల వల్ల జర్మనీ ఏకీకరణ సాధ్యము కాదని అతని అభిప్రాయం. “సమస్యలు, ఉపన్యాసాల వల్ల కాని, చర్చలు, సమావేశాలు, పార్లమెంట్ తీర్మానాల వల్లగాని పరిష్కరింపబడజాలవు. కఠిన దండనీతే దీనికి పరిష్కారం” అని పేర్కొన్నాడు. దీనినే ‘రక్తపాత విధానం’ అంటారు. బిస్మార్క్ జర్మనీ ఏకీకరణకు ఈ ‘రక్తపాత విధానం’నే అనుసరించాడు. తరువాత జర్మనీ ఏకీకరణ కోసం ప్రష్యా డెన్మార్క్ ను, ఆస్ట్రియాతోను, ఫ్రాన్స్ ను మూడు యుద్ధాలు చేసింది.

డెన్మార్క్తో యుద్ధం 1864: ఆస్ట్రియాతో యుద్ధం కోసం ఎదురు చూస్తున్న బిస్మార్క్కు ఫ్లెష్వగ్, హాల్టిస్టీన్ సమస్య అవకాశం కలిగించింది. ఈ రెండు సంస్థానాలు డెన్మార్క్ రాజు ఆధీనంలో ఉండేవి. ఇవి రెండు డెన్మార్క్ రాజు ఆధీనంలో ఉన్న వాటిని కలుపుకునే హక్కు అతనికి లేదు. 1863లో 9వ క్రిష్టియన్ సింహాసనం అధిష్టించి డేనిష్ ప్రజలు కోరిక మేరకు రెండు సంస్థానాలను విలీనం చేయడంలో ఆ సంస్థానాల్లో ఉన్న జర్మన్లు ఈ చర్యను తీవ్రంగా వ్యతిరేకించి తిరుగుబాటు చేసారు.

ఆస్ట్రియాతో సంధి: బిస్మార్క్ ఫ్లెష్వగ్, హాల్టిన్ సమస్య పరిష్కరించుటకు ఆస్ట్రియాతో సంధి కుదుర్చుకున్నాడు. 1864లో ప్రష్యా, ఆస్ట్రియా దేశాలు డెన్మార్క్ మీద యుద్ధం ప్రకటించి డెన్మార్క్న ఓడించాయి. డెన్మార్క్ రాజు ఆ ప్రాంతాలను ఆస్ట్రియా, ప్రష్యాలకు అప్పగించాడు.

ఆస్ట్రియాతో యుద్ధం: తరువాత కాలంలో బిస్మార్క్ ఆస్ట్రియాపై యుద్ధం చేయడానికి పన్నాగం పన్నాడు. తన దౌత్యనీతితో యూరప్ దేశాలు ఆస్ట్రియాకు అండగా నిలబడకుండా చేసాడు. రష్యా, ఫ్రాన్స్, సార్డీనియాలతో, ఇతర దేశాలతో ప్రత్యేక సంధులను చేసుకున్నాడు. చివరకు 1866 లో ప్రష్యా, ఆస్ట్రియాల మధ్య యుద్ధం జరిగింది. దీనిని AP ఏడు వారాల యుద్ధం అన్నారు. యుద్ధంలో ఓడిన ఆస్ట్రియా ‘ప్రేగ్సంధి’కి ఒప్పుకుంది. దీని ప్రకారం ప్రష్యాకు ‘హాల్టిన్’ ను ఇచ్చింది. ఉత్తర జర్మన్ రాష్ట్రాలు ప్రష్యా ఆధీనంలోకి వచ్చాయి.

దక్షిణ జర్మన్ రాజ్యాలు ఉత్తర జర్మన్ సమాఖ్యలో చేరుట: దక్షిణ జర్మన్ రాష్ట్రాలైన బవేరియా, వర్టంబర్గ్, బెడెన్, హెస్పె ఉత్తర జర్మన్ సమాఖ్యకు వెలుపల ఉన్నాయి. బిస్మార్క్ వీటి ఐక్యత కొరకు జర్మన్లలో ఫ్రెంచివారి పట్ల విముఖత కలిగేటట్లు చేసాడు. ఫ్రాన్స్లో చివరకు 1870లో ప్రష్యాకు యుద్ధం జరిగింది. బిస్మార్క్ తన కుటిలనీతితో ఇరు దేశాల మధ్య యుద్ధం జరిగేలా చూసాడు. ఈ యుద్ధంలో ఫ్రాన్స్ ప్రష్యాకు లొంగిపోయింది.

ఫ్రాంకో-ప్రష్యా యుద్ధం తర్వాత జర్మనీ ఏకీకరణకు దక్షిణ జర్మన్ రాజ్యాలు ప్రష్యాలో విలీనానికి అంగీకరించాయి. జనవరి 18, 1871న మొదటి విలియం జర్మనీ చక్రవర్తిగా ‘వర్సే’ రాజప్రసాదంలో పట్టాభిషేకం జరుపుకున్నాడు. బెర్లిన్ జర్మనీ రాజధానిగా ప్రకటించబడింది.

తన యొక్క దండనీతి రక్తపాత విధానంతోపాటు సామ, దాన, దండ, భేదోప్రాయాలతో జర్మన్ ఏకీకరణ చేసి ‘ఐరన్ మ్యాన్’ అని కీర్తినిపొందాడు.

ప్రశ్న 3.
1866 ఆస్ట్రియా – ప్రష్యాల యుద్ధ వివరాలు తెలపండి.
జవాబు:
సమాఖ్య రాజ్యాల సేవలు ఆస్ట్రియాతో కలసి ప్రష్యామీద దాడి చేయడంతో ఆత్మరక్షణ కోసం తమకు యుద్ధం అనివార్యమైందని ప్రష్యా యుద్ధంలోకి దిగింది. కానీ యుద్ధానికి సిద్ధంగా లేని ఆస్ట్రియా ‘గాస్టిన్ ఒప్పందాన్ని’ 1865 ఆగస్ట్లో చేసుకుంది. దీని ప్రకారం ప్లేష్వగ్ ప్రష్యా ఆధీనంలోను, హాల్టిన్ ఆస్ట్రియా ఆధీనంలో ఉంటాయి. మరోవైపు ఆస్ట్రియాపై యుద్ధం ప్రకటించడానికి బిస్మార్క్ పన్నాగం పన్నాడు.

సంస్థానాల పంపకాన్ని నిరసించిన ఆస్ట్రియా ప్రాంక్ఫర్టోని జర్మనీ సమాఖ్య పార్లమెంట్కు ఫిర్యాదు చేసింది. ఆస్ట్రియా గాస్టిన్ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని బిస్మార్క్ ఆరోపించాడు. బిస్మార్క్ భవిష్యత్తులో జరిగే ఆస్ట్రియా ప్రష్యా యుద్ధంలో ఐరోపా రాజ్యాలు ఆస్ట్రియావైపు వెళ్ళకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. తన దౌత్యనీతితో ఐరోపా రాజ్యాలు జోక్యం చేసుకోకుండా ఆస్ట్రియాను ఏకాకిని చేసాడు. రష్యా ఫ్రాన్స్, సార్డీనియా ఇతర దేశాలతో ప్రత్యేక సంధులను చేసుకున్నాడు. చివరకు ప్రష్యా, ఆస్ట్రియాల మధ్య జూన్ 1866లో యుద్ధం మొదలైంది.

AP Inter 2nd Year History Study Material Chapter 10 జర్మనీ, ఇటలీలలో విమోచన (ఏకీకరణ) ఉద్యమాలు మొదటి నెపోలియన్

ప్రష్యా – ఆస్ట్రియాల మధ్య యుద్ధం ఏడువారాలు జరిగింది. అందువలన దీనిని ఏడువారాల యుద్ధమని కూడా అంటారు. సైనిక పాటవానికి పేరుగాంచిన ప్రష్యా సైన్యం ఆస్ట్రియాను సెడోవా వద్ద ఓడించింది. ఆస్ట్రియా సంధికై వేడుకొంది. ఫలితంగా ఇరువురికి మధ్య ప్రేగ్ సంధి జరిగింది.

ప్రేగ్ సంధి షరతులు: దీని ప్రకారం

  1. ఆస్ట్రియా, ప్రష్యాకు హాల్షన్ను, ఇటలీకి వెనీషియాను ఇచ్చింది.
  2. యుద్ధ నష్టపరిహారం చెల్లించటానికి ఒప్పుకున్నది.
  3. జర్మన్ రాష్ట్రాలతో ఉత్తర జర్మన్ సమాఖ్య ప్రష్యా నాయకత్వంలో ఏర్పడి ఫ్లెష్వగ్, హాల్టిన్, హోనోవర్, హెస్సే – కాస్సెల్, నాసా, ఫ్రాంక్ఫర్ట్లు ప్రష్యా ఆధీనంలో వచ్చాయి.
  4. జర్మన్ రాష్ట్రాలపై ప్రష్యా ఆధిపత్యాన్ని బిస్మార్క్ తొలగించాడు.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ఇటలీ ఏకీకరణకు గారిబాల్డి చేసిన సేవ ఎటువంటిది ?
జవాబు:
మాజినీ, కవుర్ వలె ఇటలీ ఏకీకరణకు పోరాడిన మరో నాయకుడు గారిబాల్డి. ఇతడు 1807లో ‘నైస్’లో జన్మించాడు. యంగ్ ఇటలీలో చేరాడు. 1834లో సెనాయ్ మాజనీ పన్నిన కుట్రలో పాల్గొని, విఫలమై మరణ శిక్షకు గురయ్యాడు తప్పించుకుని దక్షిణ అమెరికాకు పారిపోయి 14 సంవత్సరాలు ప్రవాస జీవితం గడిపాడు. తరువాతి కాలంలో గారిబాల్డి ‘రెడ్ షర్ట్స్’ అనే స్వచ్ఛంద సైనిక దళాన్ని నిర్మించి సిసిలీ ప్రజలకు అండగా నిలిచాడు.

గారిబాల్డి ప్రజాస్వామిక వాది. అంతకుమించిన గొప్ప దేశభక్తిపరుడు. జాతీయ సమైక్యత కోసం తన స్వప్రయోజనాన్ని ప్రక్కన పెట్టి సిసిలీ రాజ్యాన్ని విక్టర్ ఇమ్మాన్యుయేల్కు అప్పగించాడు. ప్రజాభిప్రాయంలో గారిబాల్డి రెండవ ఫ్రాన్సిస్లు నేపుల్స్, సిసిలీలను సార్డీనియాలో విలీనం చేసాడు.

ప్రశ్న 2.
మొదట నెపోలియన్ జర్మనీ ఏకీకరణకు చేసిన సేవ ఎటువంటిది ?
జవాబు:
మొదటి నెపోలియన్ జర్మనీలో జాతీయతా భావం, ప్రజాస్వామ్యాలకు బీజం వేసాడు. జర్మనీలో పవిత్ర రోమన్ సామ్రాజ్యాన్ని రద్దుచేసాడు. క్రీ.శ. 1806లో ప్రష్యా, ఆస్ట్రియాలు లేకుండా జర్మనీ రాష్ట్రాలతో రైన్ కూటమిని లేక సమాఖ్యతను ఏర్పాటు చేసాడు. జర్మనీ ప్రజల్లో స్వేచ్ఛ, జాతీయతా భావం, దేశభక్తి, సౌభ్రాతృత్వాలను రగుల్కొలిపాడు. మరోవైపు ఆస్ట్రియా, మెటర్నిక్ తో తమ పెత్తనంతో జర్మనీ పరిపాలకులకు చక్రవర్తి వంటి బిరుదులు ఇవ్వలేదు. జర్మన్లకు ఒక జాతీయ పతాకం ఇవ్వలేదు. కనీసం వారిని జర్మనీ ప్రజలుగా గుర్తించలేదు. ఇంగ్లాండ్, లగ్జంబర్గ్, డెన్మార్క్, ఆస్ట్రియా, సార్జనీ, జర్మనీ రాష్ట్రాలపై పెత్తనం వహించేవి.

ప్రశ్న 3.
జోల్వెరిన్ ప్రాముఖ్యత తెలపండి.
జవాబు:
1819లో 12 జర్మన్ రాష్ట్రాలతో ప్రష్యా ఏర్పరిచిన వర్తక సుంకాల సంస్థ జోల్వెరిన్. అంతకు మునుపు ప్రష్యాలో ఆర్థికవ్యవస్థ సక్రమంగా లేక వ్యాపారస్థులను మరియు వినియోగదారులను అణచివేసేవారు. సుంకాల పద్ధతి, అధిక ధరలతో వారి దోపిడీ చేసేవారు. ప్రష్యా 28 మే, 1818 సంవత్సరంలో వ్యాపారస్థులకు మరియు వినియోగదారులకు అనుకూలంగా ఒకే విధమైన సుంకాల చట్టాలను తయారుచేసింది. ఈ చట్టం ప్రకారం ప్రష్యాలో దిగుమతి సుంకాలను తొలగించారు. తయారైన వస్తువులపై 10% మించి సుంకం విధించరాదు. దీని ఫలితంగా ప్రష్యా సరళ వాణిజ్య కేంద్రమైంది. ఈ సంస్థ చెకోపోస్ట్లు, ఆంతరంగిక సుంకాలను ఎత్తివేసి సరళవ్యాపార విధానాన్ని ఏర్పాటు చేసింది. దీని వలన జర్మన్ రాష్ట్రాల మధ్య వ్యాపార సంబంధాలు పటిష్టమయ్యాయి. 1834 నాటికి అన్ని జర్మన్ రాష్ట్రాలు ఇందులో సభ్యులయ్యారు. దీని ద్వారా జర్మన్లలో జాతీయతా భావం పెరిగి, రాజకీయ ఏకత్వానికి దారి ఏర్పడింది.

ప్రశ్న 4.
1870 – 71 ఫ్రాన్స్ – ప్రష్యా యుద్ధాన్ని గురించి వివరించండి.
జవాబు:
మూడవ నెపోలియన్ ప్రష్యారాజుతో ప్రష్యా వంశం వారెవ్వరూ కూడా స్పెయిన్ సింహాసనాన్ని అధిష్టించడానికి వీలులేదు అనే షరతు విధించాడు. ఈ సమస్యపై చర్చించడానికి ప్రష్యారాజు, ఫ్రాన్స్ రాయబారుల మధ్య ‘ఎమ్స్’ అనే చోట చర్చలు జరిగాయి. ప్రష్యారాజు మొదటి విలియం చర్చల సారాంశాన్ని ‘ఎమ్స్ టెలిగ్రామ్’ ద్వారా బిస్మార్క్క పంపాడు. బిస్మార్క్ దీనిని ఇరుదేశాలలో ఆగ్రహం కలిగేటట్లు చేసాడు. ఫలితంగా ప్రష్యారాజు తమ రాయబారిని అవమానవపరచాడని ఫ్రెంచి ప్రజలు భావించారు. దీనితో ఫ్రాన్స్ ప్రష్యాపై యుద్ధం ప్రకటించింది.

AP Inter 2nd Year History Study Material Chapter 10 జర్మనీ, ఇటలీలలో విమోచన (ఏకీకరణ) ఉద్యమాలు మొదటి నెపోలియన్

ఈ ఫ్రాంకో ప్రష్యన్ యుద్ధం 1870 నుండి 1871 వరకు జరిగింది. 1870లో జరిగిన సెడాన్ యుద్ధంలో ఫ్రాన్స్ ఘోరపరాజయం పొందింది. మూడవ నెపోలియన్ ప్రష్యాకు లొంగిపోయాడు. యుద్ధఖైదీగా పట్టుబడ్డాడు. తరువాత ఫ్రెంచి రిపబ్లిక్ యుద్ధాన్ని కొనసాగించింది. జర్మన్ సేవలు 1871లో పారిస్ను ముట్టడించాయి. చివరికి 1871లో పారిస్ ప్రష్యాకు లొంగిపోయింది. ఫ్రాంక్ఫర్ట్ సంధికి అంగీకరించింది. దీని ప్రకారం ఫ్రెంచి వారి ఆల్సెన్, లో రైన్లను వదులుకున్నారు. యుద్ధనష్టపరిహారం కింది ఐదువేల మిలియన్ ఫ్రాంకులు చెల్లించింది. ఈ యుద్ధం తర్వాత జర్మన్ రాజు వర్సైల్స్ రాజ ప్రాసాదంలో చక్రవర్తిగా పట్టాభిషేకం చేసుకున్నాడు.

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
యంగ్ ఇటలీ,
జవాబు:
జోసఫ్ మాజినీ 1831లో ‘యంగ్ ఇటలీ’ అనే సంస్థను స్థాపించాడు. దీనిలోని సభ్యులు చదువుకున్నవారై, నీతితో, వైజ్ఞానికంగా ఇటలీ ప్రజలను ప్రోత్సాహపరుస్తూ, ఆదర్శమైన జీవితం గడుపుతూ ఉండాలి. ప్రాణత్యాగానికైనా సంసిద్ధులను చేయడమే దీని ముఖ్య ఉద్దేశము. 40 సంవత్సరాలలోపు ఉన్నవారు దీనిలో సభ్యులు. యుద్ధం చేసి ఇటలీ నుంచి ఆస్ట్రియాను తొలగించడం, ఇటలీ స్వయం సమృద్ధిగా ఎదగడం, రిపబ్లిక్ గా ఏర్పడటం ఈ సంస్థ ప్రధాన
ఆశయాలు.

ప్రశ్న 2.
క్రిమియా యుద్ధం.
జవాబు:
కవూర్ ఇటలీ ఏకీకరణకు ఇంగ్లాండ్, ఫ్రాన్స్లతో సంధి కోసం ఎదురుచూస్తున్నాడు. ఇంగ్లాండుకు పెద్ద సైన్యం లేక యుద్ధాలలో మునిగి ఉంది. ఫ్రాన్స్కు మంచిసైన్యం ఉంది. కవూర్ మూడవ నెపోలియన్కు దగ్గరయ్యాడు. క్రిమియా యుద్ధం కవూర్కు మంచి అవకాశం కలిగించింది. ఫ్రాన్స్, ఇంగ్లాండ్లతో పొత్తు కుదుర్చుకుని రష్యాతో యుద్ధానికి సిద్ధమయ్యాడు. రెండు సంవత్సరాల తర్వాత క్రిమియా యుద్ధంలో ఫ్రాన్స్, ఇంగ్లాండ్లకు ఇటలీ చేసిన సేవలకు గుర్తుగా మూడవ నెపోలియన్ కపూర్ను ఆహ్వానించి అతనికి సహాయం చేయడానికి అంగీకరించాడు. ఈ విధంగా క్రిమియా యుద్ధాన్ని కవూర్ ఇటలీ ఏకీకరణకు అనుకూలంగా మలచుకున్నాడు.

ప్రశ్న 3.
కారలా బాడ్ ఉత్తర్వులు, 1819.
జవాబు:
మెటర్నిక్ ప్రష్యా రాజైన మూడవ విలియం సహాయంతో జర్మనీలో జాతీయతా భావాన్ని, విప్లవ భావాలను అణచివేయడానికి కారల్స్బాడ్ ఆజ్ఞలు 1819లో జారీచేసాడు. వీటి ప్రకారం

  1. ఉపాధ్యాయుల, విద్యార్థుల కార్యక్రమాలను గమనించడానికి యూనివర్సిటీ ప్రతినిధులు నియమించబడ్డారు.
  2. ఉపాధ్యాయులు మతవిస్తరణ, ప్రభుత్వ విరుద్ధ కార్యకలాపాలు చేయరాదు.
  3. ఏ ఉపాధ్యాయుడైన మెటర్నిక్ ఆదేశాలు పాటించని ఎడల అతనిని ఉద్యోగం నుండి తీసివేస్తారు. తిరిగి ఏ విశ్వవిద్యాలయంలో చేర్చుకోరు.
  4. విద్యార్థులను ఒక యూనివర్సిటీ నుంచి తొలగిస్తే తర్వాత ఏ యూనివర్సిటీ తీసుకోదు.
  5. పత్రికలపై ఆంక్షలు విధించారు. బుర్సెన్ షాఫ్ట్ అనే సంఘాన్ని రద్దుచేసారు.
  6. కారలా ్బడ్ ఆజ్ఞలను ప్రష్యాలో కఠినంగా అమలుచేసి ఉద్యమాన్ని జర్మనీలో అణచివేసారు.

AP Inter 2nd Year History Study Material Chapter 10 జర్మనీ, ఇటలీలలో విమోచన (ఏకీకరణ) ఉద్యమాలు మొదటి నెపోలియన్

ప్రశ్న 4.
ఆయుధము – రక్తపాత విధానము
జవాబు:
బిస్మార్క్ ముఖ్యధ్యేయము జర్మనీ ఏకీకరణ ప్రష్యా ఆధీనంలో జరగాలని భావించడం. యుద్ధాల వలన జర్మనీ ఏకీకరణ సాధ్యంకాదని అతని అభిప్రాయం. సమస్యలు, ఉపన్యాసాలవల్లకాని, చర్చలు, సమావేశాలు, పార్లమెంట్ తీర్మానాలతో పరిష్కరించబడదు” కఠిన దండనీతే Policy of Blood and Iron దీనికి పరిష్కారం అని పేర్కొన్నాడు. దీనినే ‘రక్తపాత విధానం’ అంటారు. బిస్మార్క్ జర్మనీ ఏకీకరణకు ఈ రక్తపాత విధానాన్ని అనుసరించాడు. ఆ తరువాత జర్మనీ ఏకీకరణ కోసం ప్రష్యా, డెన్మార్క్, ఆస్ట్రియా, ఫ్రాన్స్లో మూడు యుద్ధాలు చేసింది.

AP Inter 2nd Year History Study Material Chapter 9 పారిశ్రామిక విప్లవం

Andhra Pradesh BIEAP AP Inter 2nd Year History Study Material 9th Lesson పారిశ్రామిక విప్లవం Textbook Questions and Answers.

AP Inter 2nd Year History Study Material 9th Lesson పారిశ్రామిక విప్లవం

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
బ్రిటన్ దేశములో మొదటిగా పారిశ్రామిక విప్లవం జరగడానికి దోహదపడిన అంశాలను వివరించండి.
జవాబు:
పారిశ్రామిక విప్లవం ఇంగ్లాండ్లోను, ఇతర పాశ్చాత్య ప్రపంచంలోనూ సంభవించడానికి కారణం అక్కడ శాస్త్ర విజ్ఞానం సమాజంతో జతకట్టి ఉండటమే. తత్త్వవేత్త, చేతివృత్తి నిపుణుడు సన్నిహితంగా సహజీవనం చేసిన పాశ్చాత్య సమాజాలలో అభివృద్ధి అనూహ్యంగా జరిగింది.

మానవ జాతికి ఆవశ్యకమైన కొన్ని వస్తువుల ఉత్పత్తి విధానంలో 18, 19 శతాబ్దాలలో ఇంగ్లాండ్లో పూర్తి మార్పు వచ్చింది. మానవ శ్రమ ద్వారా వస్తువుల ఉత్పత్తి విధానాన్ని మొదట యంత్రాల ద్వారా, తర్వాత భారీ యంత్రాల ద్వారా ఉత్పత్తి చేసే విధానాలు వచ్చాయి. ఈ మార్పులు అనేక ఇతర రంగాలలో మార్పులకు కారణభూతమయ్యాయి. ఉత్పత్తి పద్ధతుల్లో మార్పునకు స్థావరం కావటంతో, ఆ మార్పు ఫలితాలను అనుభవించటంలోను, ఐరోపా దేశాలలో ఇంగ్లాండ్ మార్గదర్శకమైంది. ‘ప్రపంచ కర్మాగారం’గా పరిగణించబడింది. లాభదాయకమైన యంత్రాగారాల స్థాపనకు దారితీసిన అనుకూల పరిస్థితులు, అవసరమైన రంగం ఇంగ్లాండ్లో సిద్ధంగా ఉండటమే దీనికి ప్రధాన కారణం.

పాలనా పరిస్థితులు: ఆధునిక పరిశ్రమలను ఏర్పాటు చేసిన మొదటి దేశం బ్రిటన్. 17వ శతాబ్ది నుండి ఇంగ్లాండ్ ఒకే రాచరిక ఏలుబడిలో రాజకీయంగా స్థిరత్వం పొందింది. దేశమంతా ఒకే పాలనా చట్టం, ఒకే ద్రవ్యం చలామణిలోకి వచ్చాయి. బ్రిటన్ మినహా ఇతర ఐరోపా దేశాలలో స్థానిక అధికారుల ప్రాబల్యం ఉండటం వలన, వారు తమ ప్రాంతాల గుండా ప్రయాణించే వస్తువులపై పన్నులు వసూలు చేస్తూ ఉండటం వలన వస్తువుల ధరలు పెరిగినవి. కానీ ఇంగ్లాండ్లో ఇటువంటి పరిస్థితులు లేకపోవడం వల్ల వస్తువుల ధరలు చౌకగా అందుబాటులో ఉండేవి.

AP Inter 2nd Year History Study Material Chapter 9 పారిశ్రామిక విప్లవం

అనుకూల పరిస్థితులు: 17వ శతాబ్దం చివరి నాటికి వస్తు మారకంగా ద్రవ్యం విరివిగా వాడుకలోకి వచ్చింది. వస్త్ర పరిశ్రమకు కావలసిన పత్తి పరిశ్రమకు అనుకూలమైన తేమతో కూడిన వాతావరణం ఇంగ్లాండ్లో ఉండేది. ఇంగ్లాండ్కు నీరు, ముడిసరుకుల కొరత లేదు. బొగ్గు, ఇనుము పుష్కలంగా లభించేవి. ఫ్రాన్స్, జర్మనీ వంటి ఏ ఇతర యూరోపియన్ దేశంలో కూడా ఇంగ్లాండ్లో ఉన్నట్లు బొగ్గుగనులు, ముఖ్యమైన ఓడరేవులు సమీపంలో లేవు. ఇది జల రవాణాకు చాలా అనుకూలం. “ఇనుము, బొగ్గు, వస్త్రాల ఆధారంగా ప్రపంచం అంతా అనుకరించిన ఒక కొత్త నాగరికతను ఇంగ్లాండ్ రూపొందించింది” అని ఫిషర్ కొనియాడాడు.

పెట్టుబడి వ్యవస్థ: మూలధనం ఇంగ్లాండ్లో పెద్ద మొత్తంలో పోగుపడి ఉంది. ఈ సంపదకు అనేక కారణాలున్నాయి. 17వ శతాబ్దం ప్రారంభం నుండి బ్రిటన్ విదేశాలతో సమర్థవంతమైన వాణిజ్య విధానాలను అనుసరించి అత్యధికంగా లాభాలను గడించింది. మూలధనం ఉన్నా సరైన విధానంలో పెట్టుబడి పెట్టకపోతే ఉపయోగం ఉండదు. ‘ఇంగ్లాండ్ బ్యాంక్’ స్థాపన, ‘లండన్ ద్రవ్య మార్కెట్’, ‘జాయింట్ స్టాక్ బ్యాంక్’, ‘జాయింట్ స్టాక్ కార్పొరేషన్’ ఏర్పాటుతో ఆర్థిక వనరులు సమకూర్చుకోవడం తేలికయింది. మెథడిజం, పూరిటానిజం వంటి మత శాఖల ప్రభావం వలన ప్రజలు వ్యసనాలు మానుకుని నిరాడంబరంగా జీవిస్తూ ఉండటం వలన కూడా ధనం పొదుపు చేయబడి పెట్టుబడిగా మారింది. ఋణాలివ్వటంలోను బ్యాంకులు అవలంబించిన పటిష్టమైన విధానం నిధుల వినియోగ యంత్రాంగాన్ని ప్రభావితం చేసిందని ఫిషర్ పేర్కొన్నాడు.

సామాజిక పరిస్థితులు: పురాతన లాభసాటికాని, వ్యవసాయ పద్ధతులకు బదులుగా నూతన వ్యవసాయ పద్ధతులైన పంటల ఆవర్తన పద్ధతి, వ్యవసాయంలో యంత్రాల వాడకం పెరగటంతో ఆహార సరఫరా పెరిగింది. ఫలితంగా జనాభా కూడా పెరిగింది. 18వ శతాబ్దం నాటికి అనేక రాజకీయ, మత కారణాల వలన ఐరోపా దేశాల నుండి ఇంగ్లాండ్కు జనాభా వలసలు పెరిగాయి. కంచెలు వేసే ఉద్యమం వల్ల భూములు కోల్పోయిన చిన్న రైతులు, బానిస వ్యవస్థ నిషేధం వల్ల రోడ్డున పడ్డ పనివారు నూతనంగా ఏర్పాటైన పరిశ్రమలలో శ్రామికులుగా చేరారు. ఇది కూడా కొత్తగా ఏర్పడిన భారీ పరిశ్రమలకు అనుకూలమయింది.

రవాణా సౌకర్యాలు: 18వ శతాబ్దం నాటికి ఇంగ్లాండ్ సముద్ర వర్తకంలో ఆధిక్యత నెలకొల్పింది. ఇంగ్లాండ్లో ఎన్నో రేవులున్నాయి. ఆధునిక రోడ్లు, కాలువల నిర్మాణంతో దేశంలో కూడా రవాణా మెరుగుపడింది.

శాస్త్రీయ ఆవిష్కరణలు: ఇంగ్లాండ్, స్కాట్లాండ్ ప్రజలు అనేక నూతన యంత్రాలను ఆవిష్కరించటంలోను, వాటిని ఉపయోగించి వస్తూత్పత్తి చేపట్టడంలోనూ ముందున్నారు.
ఈ కారణాలన్నింటి వలన ఇంగ్లాండ్లో ప్రారంభమైన పారిశ్రామిక విప్లవం ఐరోపా ఖండమంతా వ్యాపించింది.

ప్రశ్న 2.
వస్త్ర పరిశ్రమలో పారిశ్రామిక కాలంలో జరిగిన నూతన యంత్రాల ఆవిష్కరణలను వివరించండి.
జవాబు:
పారిశ్రామిక విప్లవానికి ఆధారం ఆవిరి శక్తిని యంత్రాలకు, ఆ పైన మొదటగా వస్తూత్పత్తికి తర్వాత రవాణాకు ఉపయోగించడమేనని థాంప్సన్ అన్నాడు.

ఆవిరి యంత్రం: ఆవిరి శక్తి అందుబాటులోకి రావడం వల్లనే గణనీయమైన పారిశ్రామికీకరణ సాధ్యపడింది. ఆవిరి అధిక ఉష్ణోగ్రతల వద్ద అధిక పీడనాన్ని కలిగి ఉండి యంత్రాలు పనిచేయడానికి శక్తి వనరుగా ఉపయోగపడటంతో యంత్రాలు బహుళ వాడుకలోనికి వచ్చాయి

18వ శతాబ్ది ప్రారంభంలో ‘న్యూకామెన్’ అనే మెకానిక్ ఇంగ్లాండ్లోని గనుల నుంచి నీరు తోడటానికి ఆవిరి యంత్రాన్ని కనుగొన్నాడు. దానిలో కొన్ని లోపాలున్నాయి. తరువాత కాలంలో జేమ్స్ వాట్ ఒక ప్రత్యేక కండెన్సర్ తయారు చేయడం ద్వారా ఆవిరి యంత్రంలోని లోపాలను తొలగించాడు. వాట్ తయారుచేసిన ఆవిరి యంత్రం, ఆవిరి యుగాన్ని ఆరంభించింది. గ్రేట్ బ్రిటన్లోని పరిశ్రమలను విప్లవాత్మకంగా మార్చివేసింది. అంతకు ముందు కేవలం గనులకు మాత్రమే పరిమితమై ఉన్న ఆవిరి యంత్రం బండ్లను, యంత్రాలను ముందుకు కదిలించే సామర్థ్యం గల ఇంజన్ మారింది. గనుల నుండి నీరు తోడటానికి, క్రేన్ల ద్వారా బరువులెత్తడానికి, యంత్రాల రవాణాకు, రైలు రవాణాకు, ఆవిరి నౌకలు నడపడానికి ఈ ఆవిరి యంత్రం ఉపయోగపడింది. జలచక్రం కదలికను అనుసరించి రోటరీ మిషన్ ను కనిపెట్టడంతో 1781లో ఆవిరి యంత్రం ప్రతి కర్మాగారాలలో ప్రవేశించింది.

ప్రత్తి – వస్త్ర పరిశ్రమ: 1780 నుండి వస్త్ర పరిశ్రమ బ్రిటిష్ పారిశ్రామికీకరణకు చిహ్నంగా మారింది. వస్త్రోత్పత్తిలో రెండు ప్రధాన ప్రక్రియలున్నాయి. ఒకటి ముడిసరుకు, పత్తి, ఉన్ని, పట్టు నుంచి దారం తీయటం, రెండు దారాలను వస్త్రంగా నేయడం. ఈ ప్రక్రియలో అనేక కొత్త విషయాలు కనుగొన్నారు. ఫలితంగా ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ దారాలను తీయడం సాధ్యమైంది.

1) జానకే 17వ శతాబ్దంలో ఫ్లయింగ్ షటిల్ను కనిపెట్టాడు. నేతపనివాడు చేతితో దారాన్ని ముందుకు, వెనుకకు పంపే బదులు తీగలను లాగడం ద్వారా యంత్రాన్ని పనిచేయించవచ్చు. దీనివలన ఇద్దరికి బదులు ఒక పనివాడు పెద్ద మొత్తంలో వస్త్రాన్ని నేయడం సాధ్యపడింది.

2) 1765లో జేమ్స్ హర్ గ్రీవ్స్ ‘స్పిన్నింగ్ జెన్నీ’ ని అభివృద్ధిపరిచాడు. ఇది పదకొండు కుదుళ్ళను ఒకేసారి తిప్పగల సామర్థ్యం కలిగి ఉంది. దీనితో తయారుచేసిన దారం పురి తక్కువ ఉండి, వస్త్రం నేయడానికి దృఢంగా ఉండేది కాదు.

3) రిచర్డ్ ఆర్క్ రైట్ 1769లో కొత్త సూత్రాన్ని ఆధారం చేసుకొని ‘వాటర్ ఫ్రేమ్’ ను రూపొందించాడు. దీనితో చేసిన దారం దృఢంగా, ముతకగా ఉండి నేయడానికి అనుకూలంగా ఉండేది.

4) 1779లో శామ్యూల్ క్రాంప్టన్ మ్యూల్ తన పేరున ‘మ్యూల్ యంత్రాన్ని’ నిర్మించాడు. ఇది స్పిన్నింగ్ జెన్నీ, వాటర్ ఫ్రేమ్లలోని మేలైన లక్షణాలను కలిపి సన్నగా, దృఢంగా ఉండే దారాన్ని తీయగలిగింది. ఫలితంగా పలుచని ‘మస్లిన్’ వస్త్రాలు తయారు చేయగలిగారు.

5) ఎడ్వర్డ్ కార్టైరైట్ 1787లో ‘పవర్లూమ్’ కనుగొనడంతో సులభంగా పనిచేయడానికి, దారం తెగినా ఇబ్బంది లేకుండా, ఎటువంటి వస్త్రాన్నయినా నేయడానికి అవకాశం ఏర్పడింది.

బొగ్గు మరియు ఇనుము ఉక్కు కర్మాగారాలు: ఆవిరి యంత్రం, ఇతర యంత్రాల వాడకం, ఇనుము, బొగ్గుల అవసరాన్ని సృష్టించింది. యంత్రాల తయారీకి ఇనుము, ఆవిరి యంత్రాన్ని నడపడానికి కావలసిన ఆవిరి కోసం బొగ్గు అవసరమైనాయి. 18వ శతాబ్దం నుండి ప్రధాన ఇంధన వనరుగా బొగ్గు గుర్తించబడింది.

18వ శతాబ్దానికి ముందు ముడి ఇనుమును కరిగించి ఇనుప వస్తువులు తయారు చేయడానికి వంట చెరుకును ఉపయోగించేవారు. తరువాత రాతిబొగ్గును ఉపయోగించారు. 18వ శతాబ్దం ప్రథమార్థంలో బొగ్గును కోక్గా మార్చే ప్రయత్నంలో ముడి ఇనుమును కరిగించి శుద్ధి చేయడంలోను, బలమైన గాలి పేలుళ్ళ ద్వారా ‘డర్బీలు’ సఫలమయ్యారు. డార్బ ‘కోక్ బ్లాస్ట్’ ఇనుము ఉత్పత్తిని పెంచింది. ఈ ఆవిష్కరణతో మునుపటి కంటే పెద్ద నాణ్యమైన పోతలు పోయడం సాధ్యపడింది.

AP Inter 2nd Year History Study Material Chapter 9 పారిశ్రామిక విప్లవం

జేమ్స్ వాట్, స్టీమ్ హేమర్, హంట్స్మన్ యొక్క ‘స్టీల్ ప్రాసెస్’, జాన్ స్మిటస్ యొక్క గాలింపు, హెన్రీకార్ట్, పీటర్, ఓనియమ్ల రివర్బరేటరీ ఫర్నేస్, రోలింగ్ మిల్లులు నికొల్సన్ యొక్క మాట్లా బ్లాస్ట్ మొదలైనవి 19వ శతాబ్దపు తొలి దశలో ఇనుము ఉత్పత్తి బహుళంగా వేగంగా సాగడానికి తోడ్పడిన ఆవిష్కరణలు. 1815లో ‘హంఫ్రీ డేవిస్’ కనుగొన్న ‘సేఫ్టీలాంప్’ గనుల నుండి బొగ్గు ఉత్పత్తి అధికమవడానికి దోహదమైంది.

రవాణా సౌకర్యాలు: పారిశ్రామికీకరణ, నూతన యంత్రాలతో రవాణా రంగంలో విప్లవాత్మకమైన మార్పు వచ్చింది. ప్రయాణ సాధనాలకు ఆవిరి యంత్రాన్ని ఉపయోగించడంతో ఇంగ్లాండ్లో రవాణా సమస్య పరిష్కారానికి దోహదమయింది. స్టీఫెన్సన్ మొదటి రైల్వే ఆవిరి ఇంజన్ ‘రాకెట్’ను 1814లో తయారు చేశాడు. 1825లో స్టాక్టన్, డార్లింగ్టన్ పట్టణాల మధ్య రైలు నడిచింది. వీటి మధ్య ఉన్న 9 మైళ్ళ దూరాన్ని 5 మైళ్ళ వేగంతో సుమారు రెండు గంటలలో అధిగమించారు. 20 సంవత్సరాల కాలంలోనే గంటకు 30 నుండి 50 మైళ్ళ వేగం సాధారణ విషయంగా మారిపోయింది.

విస్తృతంగా తవ్విన జలమార్గాలలో ఆవిరి పడవలు తిరగడం మరొక ముఖ్య పరిణామం. ఆవిరి ఓడల నిర్మాణంలో రాబర్ట్ పుల్టన్, నికొలస్ రూజ్వెల్ట్లు ముఖ్యపాత్ర పోషించారు. ఈ స్టీమర్ల ద్వారా అధిక మోతాదుల్లో సరుకులు, పెద్ద సంఖ్యలో ప్రయాణీకులు తక్కువ ఖర్చుతో వేగంగా ప్రయాణించడం సాధ్యపడింది.

ప్రశ్న 3.
పారిశ్రామిక విప్లవం వలన కలిగిన లాభనష్టాలను వివరించండి.
జవాబు:
పారిశ్రామిక విప్లవం ప్రజల ఆర్థిక, సామాజిక, రాజకీయ, తాత్త్విక రంగాలలో ఊహించని ఫలితాలను, మార్పులను తీసుకువచ్చింది.

ఆర్థిక రంగం: యంత్రాగార వ్యవస్థ, పారిశ్రామిక పెట్టుబడిదారీ వ్యవస్థలు ఒక దానితో ఒకటి ముడిపడ్డాయి. కొత్త యంత్రాలు భారీవి, ఖరీదైనవి. అందువలన ధనవంతులు వాటి యజమానులైనారు. ఈ భారీ యంత్రాలను ప్రత్యేక భవనాలు, కర్మాగారాలలో స్థాపించి నడపటం ప్రారంభించారు. భారీ పరిశ్రమలకు పెద్ద పెద్ద పెట్టుబడులు కావాల్సి వచ్చాయి. అది కొత్తరకమైన పెట్టుబడిదారీ వ్యవస్థకు దారితీసింది. యాంత్రిక శక్తి వలన ఎంతోమంది చేతివృత్తుల వారు కార్మికులుగా మారారు. ఇంగ్లాండ్లో వస్తూత్పత్తి అధికమై ‘ప్రపంచ కర్మాగారం’ గా మారింది. పెద్ద పారిశ్రామిక వ్యవస్థలు రైలు మార్గాల వంటి జాయింట్ స్టాక్ కంపెనీలు కార్పొరేషన్లుగా తలెత్తాయి. ఇవి వేతనంపై ఉద్యోగస్తులను పనిచేయించుకోవడం ప్రారంభించాయి.

సంపద పెంపు: యాంత్రిక శక్తి ఉపయోగంతో పెట్టుబడి అనూహ్యంగా పెరిగింది. 1870 తరువాత కొత్త పరిశ్రమలు తలెత్తటం, పాత పరిశ్రమల అధిక విస్తరణలు భారీ పెట్టుబడులకు అవకాశాన్ని కల్పించాయి. ఎంతోమంది పారిశ్రామిక పెట్టుబడిదారులు, వ్యక్తిగత సామర్థ్యంతో పైకొచ్చినవారు ప్రపంచ పారిశ్రామిక నాయకులుగా ప్రసిద్ధికెక్కారు.
ప్రజా సౌకర్యాలు: 1870 నుంచి విద్యుచ్ఛక్తి ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఇది క్రమంగా పరిశ్రమలకు, గృహాలకు వ్యాపించింది. ఐస్ తయారీ, నిల్వ ఉంచడానికి రిఫ్రిజిరేటర్ తయారీ, ‘సింగర్’ కనిపెట్టిన కుట్టుమిషన్, రెమింగ్టన్ ఆవిష్కరించిన టైప్ రైటర్, శీఘ్ర చలనానికి ఆవిష్కరింపబడిన సైకిల్ వంటివి ప్రజా జీవితంలో ఎన్నో సౌఖ్యాలను, విలాసాలను సృష్టించింది.

పారిశ్రామిక విప్లవం మానవ జీవితాన్ని అనేక విధాలుగా మార్చివేసింది. ఎంతో సాంకేతిక అభివృద్ధితో పాటు ఎన్నో సామాజిక, ఆర్థిక సమస్యలను సృష్టించింది.
సామ్రాజ్యవాదం: పారిశ్రామిక విప్లవం వలన వస్తువుల అధికోత్పత్తి జరిగి వాటి ధరలు తగ్గిపోయాయి. తమ అధికోత్పత్తులు అమ్ముకోవడం కోసం అంతర్జాతీయ మార్కెట్ల కొరకు ప్రయత్నించారు. ఈ ప్రయత్నాలు వలస వాదానికి, క్రమేణా సామ్రాజ్యవాదానికి దారితీసి వలసల కొరకు యుద్ధాలు జరిగాయి. వీటి కోసం ఇంగ్లాండ్, ఫ్రాన్స్ దేశాల మధ్య యుద్ధాలు జరిగాయి. ఆసియా, ఆఫ్రికా ఖండాలలోని ఎన్నో దేశాలను వీరు ఆక్రమించి ఆయా దేశాలను దోపిడీ చేసారు.

నగరీకరణ: పారిశ్రామిక విప్లవం ఫలితంగా భారీ పరిశ్రమలు స్థాపించబడ్డాయి. ఈ పరిశ్రమల చుట్టూ పెద్ద పట్టణాలు అభివృద్ధి చెందాయి. 1750 నాటికి యాభైవేలు, అంతకన్నా ఎక్కువ జనాభా ఉన్న పట్టణాలు 29కి పెరిగాయి. పట్టణాలలో రెండు సాంఘిక వర్గాలు ఏర్పడ్డాయి. మధ్య తరగతి ప్రజలు ఒక వర్గంగా, పనిచేసే శ్రామికులు ఒక వర్గంగా ఏర్పడ్డారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా గృహాలు, త్రాగునీరు. ప్రజారోగ్య వసతులు పెరగలేదు. కొత్తగా నగరానికి వచ్చినవారు అప్పటికే కిక్కిరిసిన మురికివాడల్లో నివసించారు. సగర కాలుష్యం నుండి తప్పించుకోవడానికి ధనికులు నగరపు శివార్లకు చేరారు. నగరాలలో టైఫాయిడ్, కలరా. కాలుష్యంతో వేలాదిమంది ప్రజలు మరణించారు.
సామాజిక పరిణామాలు: పారిశ్రామిక విప్లనం వలన అనేక సామాజిక పరిణామాలు సంభవించాయి. ఆర్థిక వ్యవస్థలో నూతన మార్పులు ప్రజలకు కష్టాలను, అసంతృప్తిని మిగిల్చాయి. పట్టణ పేదలు, పారిశ్రామిక కార్మికులలో అకస్మాత్తుగా తలెత్తిన పరిణామాలు 1848 విప్లవానికి, ఇంగ్లాండ్లో చార్టిస్ట్ ఉద్యమానికి దారితీసాయి. శాఖోపశాఖలుగా విస్తరించిన పారిశ్రామిక విప్లవ ప్రభావాన్ని తట్టుకొనే పరిజ్ఞానం లేని చిన్న వ్యాపారులు, మధ్య తరగతి పెట్టుబడిదారులు అసంతృప్తికి గురయ్యారు. గమ్యం తోచని శ్రామికులు యంత్రాలు తమ జీవితాన్ని నాశనం చేస్తున్నాయని భావించి వాటిని ధ్వంసం చేసారు. పెట్టుబడిదారులు కార్మికుల శ్రమను దోచుకొని ఆదాయాలను విపరీతంగా పెంచుకున్నారు. ఆ ధనాన్ని తిరిగి పరిశ్రమలలో పెట్టుబడి పెట్టారు. వారి ధనదాహం కార్మికులను తిరగబడేటట్లు చేసింది.

స్త్రీలు – బాలకార్మికులు: పారిశ్రామిక విప్లవం స్త్రీలు – పిల్లలు పనిచేసే విధానంలో మార్పు తెచ్చింది. లాంకై షైర్, యార్కైర్ నూలు మిల్లు కర్మాగారాలలో స్త్రీలు, పిల్లలు ఎక్కువగా పనిచేసేవారు. పెద్ద పెద్ద యంత్రాల మధ్య ఎందరో బాల కార్మికులు గాయాల పాలవడం లేదా సురణించడం జరిగేది. స్త్రీలు కూడా దుర్భర పరిస్థితులలో పనిచేసేవారు.

కార్మిక చట్టాలు: ఫలితంగా కార్మికులలో పెరిగిన నిరసనలు తొలగించడానికి కార్మిక చట్టాలు తయారయ్యాయి.

బాల కార్మిక వ్యవస్థను నిషేధించారు. కానీ ఆ చట్టాలు సక్రమంగా అమలవ్వలేదు.

సామ్యవాద ప్రభావం: ఐరోపాలో నాటి పరిస్థితుల నుంచి సాన్యువాద భావం ఊపందుకుంది. కార్ల్ మార్క్స్ తన మిత్రుడు ఏంగిల్స్తో కలిసి కమ్యూనిస్ట్ మానిఫెస్టో గ్రంథాన్ని రచించాడు. ప్రపంచ కార్మికులారా ఏకం కండి అని పిలుపునిచ్చాడు. ఇతను ‘దాస్ కాపిటల్’ అనే గ్రంథం రచించాడు.

AP Inter 2nd Year History Study Material Chapter 9 పారిశ్రామిక విప్లవం

మానవ చరిత్రలో ఏ విప్లవం కూడా పారిశ్రామిక విప్లవం ప్రభావితం చేసినట్లుగా మానవ జీవితాన్ని ప్రభావితం చేయలేదు. ఈ విప్లవ ఫలితంగా ఇంగ్లండ్ తదితర ఐరోపా దేశాలు ఆసియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికా ఖండాలలో ప్రజలను దోపిడీకి గురిచేసి చెప్పలేని కడగండ్లకు గురిచేసాయి.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
టి. హర్ గ్రీవ్స్.
జవాబు:
హవ్స్ 1720లో ఇంగ్లాండ్ నందు జన్మించాడు. ఇతడు చేనేత కార్మికుడుగా ఉండేవాడు. నిరక్షరాస్యుడు. | 1765లో హర్ గ్రీవ్స్ స్పిన్నింగ్ జెన్నీని అభివృద్ధి చేసాడు. ఇది పదకొండు కుదుళ్ళను ఒక్కసారే తిప్పగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఆ విధంగా 8 లేక 10 మంది పనిని చేయగలిగింది. దీని సహాయంతో తీసిన దారం పురి తక్కువగా ఉండి దారం తెగిపోయి వస్త్రం నేయడానికి దృఢంగా ఉండేది కాదు.

ప్రశ్న 2.
ఆవిరి యంత్రం.
జవాబు:
1698లో థామస్ సావొరి గనుల నుండి తోడటానికి ‘ద మైనర్ ఫ్రెండ్స్’ అనే నమూనా ఆవిరి యంత్రాన్ని రూపొందించాడు. ఈ ఇంజన్ నిదానంగా పనిచేసేది. 1712లో న్యూకామెన్ మరొక ఆవిరి యంత్రాన్ని తయారు చేసాడు. ఈ ఇంజన్ కండెన్సింగ్ సిలిండర్ను నిరంతరం చల్లబరుస్తూ ఉండటం వలన శక్తిని కోల్పోతూ సరిగా పనిచేసేది కాదు. 1769లో జేమ్స్వట్ తన యంత్రాన్ని రూపొందించే వరకు ఆవిరి యంత్రం గనులకే పరిమితమయింది.

జేమ్స్వాట్ ఆవిరి యంత్రాన్ని వాయువులను, నీరు వంటి ద్రవాలను వేగంగా ముందుకు తీయడంతో పాటు, బండ్లను, యంత్రాలను కదిలించే సామర్థ్యం గల ఇంజన్ గా మార్పు చేసాడు. మథ్యూ బౌల్డన్ అనే సంపన్న వ్యాపారవేత్త సహాయంతో బర్మింగ్రమ్ నందు జేమ్స్వట్ సోహా అనే కార్ఖానా స్థాపించాడు. గనుల నుండి నీరు తోడడానికి, క్రేన్లను ఉపయోగించి బరువులు ఎత్తడానికి, యంత్రాల రవాణాకు, రోడు, రైలు, జల రవాణాకు ఆవిరి యంత్రం (స్టీమ్ ఇంజన్) ఉపయోగపడింది.

ప్రశ్న 3.
లూధిజమ్.
జవాబు:
‘జనరల్ లూడ్’ అనే జనాకర్షక నాయకుడు మరొక నూతన నిరసన ఉద్యమాన్ని చేపట్టాడు. దీనినే లుద్దిజం అంటారు. లుద్దిజం కేవలం యంత్రాలపై దాడిచేసే తిరోగమన విధానాన్ని అనుసరించలేదు. కనీస వేతనాలు, స్త్రీలు, పిల్లలపై పనిభారం తగ్గించడం, యంత్రాల రాకతో పని కోల్పోయిన వారికి ఉపాధి కల్పించడం, తమ కోర్కెలను చట్టబద్ధంగా తెలియజేయడానికి కార్మిక సంఘాలుగా ఏర్పడే హక్కును ప్రబోధించింది. పారిశ్రామిక విప్లవం సంభవించిన తొలినాళ్ళలో కార్మికుల జీవితాలు దుర్భరమయ్యాయి. వారికి నిరసన తెలియజేయడానికి కాని, ఓటు హక్కు గాని లేవు. లుద్దిజం ఈ లోపాలను తొలగించడానికి కృషి చేసింది.

ప్రశ్న 4.
బాల కార్మికులు.
జవాబు:
పారిశ్రామిక విప్లవ కాలంలో ఏర్పడిన అనేక పరిశ్రమలలో ఎంతోమంది బాల కార్మికులుగా పనిచేసేవారు. లాంకైర్, యార్కైర్ నూలు మిల్లు కర్మాగారాలలో ఎందరో బాల కార్మికులు పనిచేసేవారు. నూలువడికి జెన్నీ వంటి యంత్రాలను బాల కార్మికులు చిన్న శరీరాలతో, చేతి వేళ్ళతో వేగంగా పనిచేయడానికి అనువుగా తయారు చేసారు. బాల కార్మికుల శరీరాలు ఇరుకైన యంత్రాల మధ్య అటూ ఇటూ తిరుగుతూ పని చేయడానికి అనుకూలంగా ఉంటుంది. సుదీర్ఘ పనిగంటలు, ఆదివారాలు యంత్రాలను శుభ్రం చేయడం వంటి పనుల వల్ల వారికి కొద్ది సమయమైనా స్వచ్ఛమైన గాలి పీల్చుకోవడానికి, వ్యాయామానికి కాని అవకాశం ఉండేది కాదు. వారి జుట్టు యంత్రాలలో ఇరుక్కుపోవడం, చేతులు యంత్రాలలో పడి నలిగిపోవడం, అధిక శ్రమవల్ల అలసటకు గురై నిద్రలోకి జారుకొని యంత్రాలలో పడి చనిపోవడం వంటి ప్రమాదాలకు గురయ్యేవారు. చిన్న వయసులో బాలురతో పని చేయించడం భవిష్యత్తులో కర్మాగారాలలో వారు చేసే పనులకు శిక్షణగా భావించేవారు. బాల కార్మికుల పరిస్థితులు మెరుగుపరచడానికి ఎన్నో చట్టాలు చేసినా, ఆ చట్టాలు సరిగా అమలు కాలేదు.

AP Inter 2nd Year History Study Material Chapter 9 పారిశ్రామిక విప్లవం

ప్రశ్న 5.
జాన్ మెక్ మ్.
జవాబు:
పురాతన కాలం నుండి ఇంగ్లీషు రోడ్లు, వస్తువులు, మానవుల రవాణాకు అనుకూలంగా ఉండేవి కావు. రవాణా చాలా వ్యయప్రయాసలతో కూడి నిదానంగా జరిగేది. ఈ సమస్య పరిష్కారానికి జాన్మెక్మ్ అనే స్కాట్లండు చెందిన ఇంజనీర్ కంకరరోడ్డు నిర్మించే పద్ధతి కనుగొన్నాడు. రహదారి ఉపరితలం మీద చిన్న చిన్న రాళ్ళను పరచి, చదును చేసి, బంకమట్టితో అతికాడు. ఈ విధానం ‘మెకాడమైజేషన్’ అనే పేరు పొందింది. తరువాత కాలంలో వీరెందరో కాంక్రీట్, తారు ఉపయోగించి మరిన్ని మంచి ఫలితాలు సాధించారు. మెకాడమ్ కనిపెట్టిన ఈ విధానంతో రవాణా రంగం సులభంగా, వేగంగా జరిగింది.

ప్రశ్న 6.
రైల్వేల ప్రయోజనాలు.
జవాబు:
మొదటి రైల్వే ఆవిరి ఇంజన్ ‘రాకెట్’ ను స్టీఫెన్ సన్ 1814లో తయారు చేసాడు. సంవత్సరం పొడవునా రవాణా చేయడానికి అనుకూలమైన సాధనంగా రైల్వేలు ఆవిర్భవించాయి. ఇవి ప్రయాణీకులను, సరుకులను వేగంగా తక్కువ ఖర్చుతో రవాణా చేయసాగాయి. 1760 నాటికి కలప పట్టాలకు బదులు, ఇనుప పట్టాలు కనిపెట్టడంతో ఆవిరి యంత్రంతో పెట్టెలు లాగడం వలన ఇది సాధ్యపడింది.

రైలు మార్గాలలో పారిశ్రామికీకరణ రెండవ దశకు చేరుకుంది. రైల్వేలు అత్యంత సౌకర్యవంతమైన ప్రత్యామ్నాయ రవాణా మార్గాలుగా ఆవిర్భవించాయి. బ్రిటన్లో 1850 నాటికి అత్యధిక భాగం రైల్వేలైన్లు అందుబాటులోకి వచ్చాయి. దీనికొరకు పెద్ద మొత్తంలో బొగ్గు, ఇనుము ఉపయోగించబడ్డాయి. ఇందువల్ల ప్రజా పనులు, నిర్మాణ రంగానికి ప్రోత్సాహం చేకూరి అనేకమంది కార్మికులకు ఉపాధి లభించింది.