AP Board 8th Class Telugu Solutions ఉపవాచకం Chapter 6 స్ఫూర్తి ప్రదాతలు

AP State Syllabus AP Board 8th Class Telugu Textbook Solutions ఉపవాచకం Chapter 6 స్ఫూర్తి ప్రదాతలు Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Telugu Solutions ఉపవాచకం 6th Lesson స్ఫూర్తి ప్రదాతలు

8th Class Telugu ఉపవాచకం 6th Lesson స్ఫూర్తి ప్రదాతలు Textbook Questions and Answers

I. అవగాహన – ప్రతిస్పందన

కింది పరిచిత గద్యాలను చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

1. నెల్లూరు జిల్లా సంగం మండలంలో గాంధీ జనసంఘం ఒక మారుమూల గిరిజన గ్రామం. యానాదులు, ఎరుకల సంక్షేమం కోసం అహర్నిశలూ కృషి చేసిన పద్మశ్రీ వెన్నెలకంటి రాఘవయ్యగారు గిరిజనులకోసం నిర్మించిన | గ్రామం ఇది. రెక్కాడితేగాని డొక్కాడని వీరు ఊరిపక్కనే ఉన్న కాలువలో చేపలు పట్టి అమ్ముకుంటూ, వ్యవసాయం, కూలిపనులు చేసుకుంటూ జీవనం సాగిస్తారు. ఆ కుగ్రామంలో మల్లి మస్తానయ్య కుటుంబానికి ఒక ప్రత్యేకత ఉంది. వాళ్ళ గురించి గ్రామంలోనే కాదు, చుట్టుపక్కల ఊళ్లలో కూడా చెప్పుకుంటారు. కారణం ఏమిటంటే పూటగడవడం కూడా కష్టంగా ఉండే ఆ కుటుంబంలోంచి ఆడపిల్లతో సహా నలుగుర్నీ బడికి పంపి చదివిస్తుండడమే. మస్తానయ్య కాస్త అక్షరజ్ఞానం ఉన్నవాడు. చదువు విలువ తెలిసినవాడు. ఉన్న కొద్దిపాటి పొలంలో వ్యవసాయం చేసేవాడు. ఇంట్లో తిండికి, బట్టకు లేకపోయినా పిల్లల పుస్తకాలకు మాత్రం కొరత రాకూడదనుకునేవాడు. అలాంటి నిరుపేద కుటుంబంలో 1974 సెప్టెంబరు 3వ తేదీన మస్తాన్ బాబు జన్మించాడు.
ప్రశ్నలు :
1. గాంధీ జనసంఘం ఏ జిల్లాలోని ఏ మండలంలో ఉంది?
జవాబు:
గాంధీ జనసంఘం నెల్లూరు జిల్లా సంగం మండలంలో ఉంది.

2. గాంధీ జనసంఘం గిరిజన గ్రామాన్ని ఎవరు నిర్మించారు?
జవాబు:
గాంధీ జనసంఘం గిరిజన గ్రామాన్ని వెన్నెలకంటి రాఘవయ్య నిర్మించాడు.

3. కాస్త అక్షరజ్ఞానం కలవాడు ఎవరు?
జవాబు:
కాస్త అక్షరజ్ఞానం కలవాడు మస్తానయ్య.

4. మస్తాన్ బాబు ఏ తేదీన జన్మించాడు?
జవాబు:
మస్తాన్ బాబు 3.9. 1974వ తేదీన జన్మించాడు.

AP Board 8th Class Telugu Solutions ఉపవాచకం Chapter 6 స్ఫూర్తి ప్రదాతలు

2. ఒకరోజు స్నేహితులతో కలిసి గుట్టలు ఎక్కడానికి వెళ్ళాడు. అదే అతడి పర్వతారోహణకు బీజం పడినరోజు. రాళ్ళు, ముళ్ళు దాటుకుంటూ కొండనెక్కడం అతనికి తెలియని ఆనందాన్నిచ్చింది. స్నేహితులంతా వంటచెరకు సేకరిస్తుంటే పొదల మధ్య కాలిబాట చేసుకుంటూ ముందుకు వెళ్ళసాగాడు. చేతిలో ఉన్న కత్తితో నాగజెముడు పొదలు నరుకుతుంటే ఆ చెట్లకుండే తెల్లని పాలు చింది కళ్ళలో పడ్డాయి. అంతే కళ్ళు మండిపోతుంటే ఏడుస్తూ బాధ తట్టుకోలేక కిందపడి దొర్లసాగాడు. ఇంతలో స్నేహితులు వచ్చారు. అందరూ కలిసి వైద్యశాలకు తీసుకుపోయారు. ఈ వార్త తండ్రికి చేరింది. కుటుంబ సభ్యులంతా హుటాహుటిన ఆసుపత్రికి చేరారు. డాక్టరు మందులిచ్చి | భయపడాల్సిందేమీ లేదని చెప్పి ఇంటికి పంపాడు.

ప్రశ్నలు:
1. మస్తాన్ గుట్టలు ఎక్కడానికి ఎవరితో వెళ్ళాడు?
జవాబు:
మస్తాన్ గుట్టలు ఎక్కడానికి స్నేహితులతో వెళ్ళాడు.

2. స్నేహితులందరూ మస్తాన్ ను ఎక్కడికి తీసుకొని వెళ్ళారు?
జవాబు:
స్నేహితులందరు మస్తాన్ ను వైద్యశాలకు తీసుకొని వెళ్ళారు.

3. ఏ పొదలను నరుకుతుంటే తెల్లని పాలు చిందాయి?
జవాబు:
నాగజెముడు పొదలను నరుకుతుంటే తెల్లని పాలు చిందాయి.

4. హూటాహుటిన ఆసుపత్రికి చేరుకున్నది ఎవరు?
జవాబు:
హుటాహుటిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరుకున్నారు.

3. 1962వ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ నుండి ఐ.ఎ.యస్.కు ఎంపికయిన నాదెళ్ళ యుగంధర్ నాయుడిది అనంతపురం జిల్లా, ఎల్లనూరు మండలం, బుక్కాపురం గ్రామం. వీరి శ్రీమతి ప్రభావతి. ఈ దంపతులకు 1967లో సత్య నాదెళ్ళ జన్మించారు. కలెక్టరుగా, ప్రధానమంత్రి నేతృత్వంలోని కేంద్ర ప్రణాళికాసంఘ సభ్యునిగా, ప్రధానమంత్రి కార్యదర్శిగా పనిచేసిన యుగంధర్ మంచి అధికారిగా మన్ననలు అందుకున్నారు. విద్యావంతుల కుటుంబంలో పుట్టిన సత్య బాల్యం నుంచే తెలివితేటలు ప్రదర్శించేవాడు. తండ్రికున్న కార్యదీక్షా లక్షణాల్ని పుణికిపుచ్చుకొని పెరిగాడు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ విద్యార్థిగా అందరితో కలవిడిగా ఉండడం, అందర్నీ కలుపుకొనిపోవడం, నిజాయితీగా వ్యవహరించడం, ఆత్మవిశ్వాసంతో అడుగులు వేయటం, అవసరాల్లో ఉన్నవారిని ఆదరించటం, చేయూతనివ్వడం లాంటి సర్వోన్నత లక్షణాలను అలవరుచుకున్నాడు. సత్యకు క్రికెట్ అంటే ఎంతో మక్కువ. క్రికెట్ జట్టులో సభ్యుడిగా, తన ప్రతిభను నిరూపించుకొని కెప్టెన్ గా కొనసాగాడు. క్రికెట్ బృందాన్ని సమన్వయపరిచే క్రమంలోనే నాయకత్వ లక్షణాలు నేర్చుకున్నానని ఆటలు ఆడటం ద్వారా మాత్రమే ఒత్తిడిని అధిగమించడం, విజయం కోసం పోరాడడం వంటి గుణాలు అలవడతాయనీ తాను నమ్ముతానని ఒక ఇంటర్వ్యూలో సత్య నాదెళ్ళ చెప్పారు. పాఠశాల విద్య పూర్తయిన తరువాత మణిపాల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చదివి 1988లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ లో బి.ఇ డిగ్రీ పొందారు. ఆ తరువాత అమెరికాలోని విస్కాన్సిన్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్సులో మాస్టర్స్ డిగ్రీ, షికాగో యూనివర్సిటీ నుంచి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో మాస్టర్ డిగ్రీ పొందారు.
ప్రశ్నలు :
1. సత్య నాదెళ్ళ ఏ జిల్లాలో జన్మించాడు?
జవాబు:
సత్య నాదేళ్ళ అనంతపురంలో జన్మించాడు.

2. సత్య నాదెళ్ళ ఏ సంవత్సరంలో జన్మించాడు?
జవాబు:
సత్య నాదేళ్ళ 1967లో జన్మించాడు.

3. సత్య నాదెళ్ళకు ఏ ఆట అంటే ఇష్టం?
జవాబు:
సత్య నాదేళ్ళకు క్రికెట్ అంటే చాలా ఇష్టం.

4. షికాగో యూనివర్సిటీ నుండి ఏ డిగ్రీ పొందాడు?
జవాబు:
చికాగో యూనివర్సిటీ నుండి బిజినెస్ అడ్మిని స్టేషన్లో మాస్టర్ డిగ్రీ పొందారు.

AP Board 8th Class Telugu Solutions ఉపవాచకం Chapter 6 స్ఫూర్తి ప్రదాతలు

4. మైక్రోసాఫ్ట్ ముందు అపార అవకాశాలున్నాయని, వాటిని అందిపుచ్చుకునేందుకు మరింత వేగంగా స్పందించటంతోపాటు మరింత కష్టపడవలసి ఉందని ఈ సందర్భంగా ‘సత్య’ వ్యాఖ్యానించాడు. టెక్నాలజీ ప్రపంచాన్నే మార్చేసిన అరుదైన సంస్థలలో ఒకటైన మైక్రోసాఫ్ట్ కి సి.ఇ.వో బాధ్యతలు చేపట్టడం తనకెంతో గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. ఏడాదికి 112 కోట్ల వేతనం తీసుకునే ఉద్యోగిగా తమ సంస్థలో నవకల్పనలకే పెద్దపీట వేస్తామని చెప్పారు. సత్య నాదెళ్ళ జీవితభాగస్వామి శ్రీమతి అనుపమ. వీరికి ఇద్దరమ్మాయిలు, ఒక అబ్బాయి. కుమారుడికి బుద్ధిమాంద్యం ఉండటం వల్ల అలాంటి పిల్లల కొరకు హైదరాబాద్ లో ఒక పాఠశాలను స్థాపించారు. ‘నేను నిర్మించటాన్ని, నిరంతరం నేర్చుకోవడాన్ని ఇష్టపడతాను. పట్టుదల, కార్యదక్షత, నిజాయితి, నాయకత్వం, సేవాభావం అనే లక్షణాలను సాధించినపుడే ఎంతటి క్లిష్టమైన విజయశిఖరాలనైనా అధిరోహించగలుగుతాం” అంటూ ఆ చరిత్రని నిరూపించిన సత్య నాదెళ్ళ నేటి యువతరానికి చక్కని రోల్ మోడల్.
ప్రశ్నలు :
1. సత్య నాదెళ్ళ జీవిత భాగస్వామి పేరు ఏది?
జవాబు:
సత్య నాదేళ్ళ జీవిత భాగస్వామి పేరు శ్రీమతి అనుపమ.

2. సత్య నాదెళ్ళ ఎవరి కోసం హైదరాబాద్ లో పాఠశాలను ప్రారంభించాడు?
జవాబు:
సత్య నాదేళ్ళ బుద్ధిమాంద్యం గల పిల్లల కోసం ఒక పాఠశాలను స్థాపించాడు.

3. సత్య నాదెళ్ళకు ఏడాదికి జీతం ఎంత?
జవాబు:
సత్య నాదేళ్ళకు ఏడాదికి జీతం 112 కోట్లు.

4. టెక్నాలజీ ప్రపంచాన్నే మార్చివేసిన అరుదైన సంస్థలలో అగ్రగామి సంస్థ ఏది?
జవాబు:
టెక్నాలజీ ప్రపంచాన్నే మార్చివేసిన అరుదైన సంస్థలలో అగ్రగామి సంస్థ మైక్రోసాఫ్ట్.

5. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం, తుమ్మపూడి గ్రామంలో కీ.శే. సూర్యదేవర రామదేవరాయలు, వెంకాయమ్మ దంపతులకు 1914వ సంవత్సరం జూలై నెల 3వ తేదీన సంజీవ్ దేవ్ జన్మించాడు. నాలుగేళ్ళ వయస్సులోనే అతని తల్లి మరణించింది. కొంతకాలం వారి చిన్నాన్న సూర్యదేవర వెంకటకృష్ణయ్యగారివద్ద పెరిగాడు. ఆ తరువాత కృష్ణాజిల్లాలోని కోనాయపాలెంలో అమ్మమ్మ సంరక్షణలో మేనమామ ఇంట పెరిగాడు. విద్యాభ్యాసమంతా ఇంటి దగ్గరే కొనసాగింది. కొత్త విషయాలను తెలుసుకోవడానికి ఎంతో ఆసక్తిని చూపేవాడు. తెలుగు, హిందీ, ఇంగ్లీషు భాషలలో చక్కని ప్రావీణ్యం సంపాదించాడు. అయితే 13 సంవత్సరాల వయస్సు వచ్చేటప్పటికి తనను గారాబంగా పెంచుతున్న ” అమ్మమ్మ కూడా చనిపోయింది. మరికొంతకాలానికి తాను అమితంగా ప్రేమించే తన గారాల చెల్లి కూడా చనిపోవడంతో జీవితంలో విషాదం తప్ప మరేమీ మిగలలేదని తల్లడిల్లిపోయాడు. అక్కున చేర్చుకుని అదరించేవారు లేక ఒంటరితనాన్ని భరించలేక 18 సంవత్సరాల వయస్సులో హిమాలయాలకు వెళ్ళిపోయాడు.
ప్రశ్నలు:
1. సంజీవ్ దేవ్ ఎక్కడ జన్మించాడు?
జవాబు:
సంజీవ్ దేవ్ గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం తుమ్మకూరు గ్రామంలో జన్మించాడు.

2. సంజీవ్ తల్లిదండ్రుల పేర్లు ఏమి?
జవాబు:
సంజీవ్ తల్లిదండ్రుల పేర్లు సూర్యదేవర రామ దేవరాయలు, వెంకాయమ్మ.

3. సంజీవ్ కు ఏ భాషల్లో ప్రావీణ్యం ఉంది?
జవాబు:
సంజీవ్ కు తెలుగు, హిందీ, ఇంగ్లీషు భాషల్లో ప్రావీణ్యం ఉంది.

4. సంజీవ్ ఎందుకు హిమాలయాలకు వెళ్ళాడు?
జవాబు:
సంజీవ్ ఒంటరితనాన్ని భరించలేక తన 18వ సంవత్సరంలో హిమాలయాలకు వెళ్ళాడు.

AP Board 8th Class Telugu Solutions ఉపవాచకం Chapter 6 స్ఫూర్తి ప్రదాతలు

6. అనేక భాషలను సొంతంగా నేర్చుకుని బహుభాషావేత్తగా రూపొందినట్లుగానే చిత్రకళను కూడా సొంతంగా అభ్యసించి చిత్రకారుడయ్యాడు. రవీంద్రనాథ్ ఠాగూర్ లాగా ముందు చిత్రకళా విమర్శకుడై యాభై సంవత్సరాల వయస్సు దాటాక కుంచె చేతపట్టి అద్భుతమైన వర్ణచిత్రాలను రూపొందించాడు. సాహిత్యాన్ని, చిత్రలేఖనాన్ని, సంగీతాన్ని, శిల్పాన్ని గురించి విడివిడిగా వివరించడమేకాక లలితకళలన్నింటిలోను అంతర్లీనంగా ఉన్న సంబంధ బాంధవ్యాలను, తాత్వికతలను తులనాత్మకంగా విశ్లేషించారు. ఆయన ప్రతిభను గుర్తించి ఆంధ్ర విశ్వవిద్యాలయం డి.లిట్ తో సత్కరించింది. కళలు, సాహిత్యం , సమాజ అభ్యున్నతికి దోహదపడేవిగా ఉండాలని కాంక్షించి జీవితాంతం దానికోసమే కృషిచేసిన కళాతత్వవేత్త సంజీవ్ దేవ్ 25-8-1999న ఇహలోక యాత్రను ముగించాడు. చిన్నతనంలోనే ఎన్నో కష్టాలను ఎదుర్కొని స్వయంకృషితో అద్భుత ప్రతిభను ప్రదర్శించిన సంజీవ్ దేవ్ జీవనవిధానం మనందరికీ ఆనంద దాయకం
ప్రశ్నలు :
1. సంజీవ్ చిత్రకళను ఎలా అభ్యసించాడు?
జవాబు:
సంజీవ్ చిత్రకళను సొంతంగా అభ్యసించి చిత్రకళా కారుడయ్యాడు.

2. దేనిని చేతబట్టి అద్భుతమైన వర్ణచిత్రాలను రూపొందించాడు?
జవాబు:
కుంచె చేతబట్టి అద్భుతమైన వర్ణచిత్రాలను రూపొందించాడు.

3. సంజీవ్ ను సత్కరించిన విశ్వవిద్యాలయం ఏది?
జవాబు:
సంజీవ్ ను సత్కరించిన విశ్వవిద్యాలయం ఆంధ్ర విశ్వవిద్యాలయం.

4. సంజీవ్ ఏ తేదీన మరణించాడు?
జవాబు:
సంజీవ్ 25-8-1999న మరణించాడు.

7. ఈ కింది అపరిచిత గద్యాన్ని చదివి ఇవ్వబడిన ప్రశ్నలకు జవాబులు రాయండి.

సీతారామరాజు 1897లో పశ్చిమగోదావరి జిల్లా మోగల్లులో క్షత్రియ కుటుంబంలో జన్మించారు. గుర్రపుస్వారీ, మూలికావైద్యం, జ్యోతిష్యంలో పట్టు సంపాదించాడు. ఆంగ్లేయుల విధానాలకు వ్యతిరేకంగా విశాఖ ఏజెన్సీ ప్రాంతాలలో 1922 నుంచి 1924 మే వరకు తెగువతో పోరాడిన వీరుడు సీతారామరాజు. అన్నవరం, శంఖవరం, రంపచోడవరం పోలీస్ రాణాలపై దాడిచేసి ఆంగ్లేయులకు చెమటలు పట్టించాడు. ఈ మన్యం వీరుని కుతంత్రంతో చుట్టుముట్టి రూథర్‌ఫోర్డ్ నేతృత్వంలోని సేనలు కాల్చి చంపాయి.
ప్రశ్నలు :
1. సీతారామరాజు జన్మస్థలం ఏది?
జవాబు:
పశ్చిమ గోదావరి జిల్లా ‘మోగల్లు’.

2. సీతారామరాజుకు ఏ విషయాలలో పట్టు ఉంది?
జవాబు:
గుర్రపుస్వారీ, మూలికా వైద్యం, జ్యోతిష్యంలో

3. ఆంగ్లేయులకు ఏ కారణంతో ఆగ్రహం కలిగింది?
జవాబు:
వీరి విధానాలకు వ్యతిరేకంగా పోరాడి, వారి పోలీస్ ఠాణాలపై దాడి చేయడం వల్ల.

4. పై పేరా ఆధారంగా ఒక ప్రశ్న తయారుచేయండి.
జవాబు:
సీతారామరాజును ఎవరి నేతృత్వంలోని సేనలు కాల్చాయి?

8. కింది సంభాషణ చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.

పద్మావతి : మిత్రులారా ! బాగున్నారా !
పూజిత : బాగున్నాము. మీ పాఠశాలలో జూలై 4న ఏదో ఉత్సవం జరిపినట్లున్నారు. ఏమిటది?
పద్మావతి : అవును. విప్లవజ్యోతి అల్లూరి సీతారామరాజు జయంతి నిర్వహించాము.
పూజిత : మీ పాఠశాలలో ఆయన జయంతిని ఎలా నిర్వహించారు?
పద్మావతి : ఆ రోజు ఉదయం పాఠశాల ప్రార్థనా సమావేశంలో అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించాం.
హరిత : మా ప్రధానోపాధ్యాయుల వారు అల్లూరి వారిని గురించి చెప్పి రంప విప్లవాన్ని వారు నడిపిన తీరు, ధైర్యాన్ని గురించి వివరించారు.
పూజిత : అలాగా ! ఆ మహావీరుని గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే ఏం చెయ్యాలి?
పద్మావతి : పాఠశాల గ్రంథాలయాలలో ఆ వీరుని జీవితచరిత్ర గురించి శ్రీ ఎం.వి.ఆర్. శాస్త్రి, శ్రీ ఎం. చలపతిరావు వంటివారు రాసిన పుస్తకాలున్నాయి చదువు.
పూజిత : అలాగే !
హరిత : నా దగ్గర పుస్తకం ఉంది ఇమ్మంటారా?
పూజిత : ఇవ్వు. చదివి మళ్ళీ ఇచ్చేస్తాను. ఉంటాను.
ప్రశ్నలు :
1. పై సంభాషణలో ‘పుట్టిన రోజు’ అనే అర్థం వచ్చే పదం ఉంది. వెతికి రాయండి.
జవాబు:
జయంతి.

2. అల్లూరి సీతారామరాజు నడిపిన విప్లవోద్యమం ఏది?
జవాబు:
రంప విప్లవోద్యమం.

3. పై సంభాషణ ఎవరెవరి మధ్య జరిగింది?
జవాబు:
పద్మావతి, పూజిత, హరితల మధ్య సంభాషణ జరిగింది.

4. చనిపోయిన ప్రముఖుల పట్ల గౌరవం, అభిమానం ప్రకటిస్తూ మాట్లాడే మాటలను ఏమంటారు?
జవాబు:
నివాళులు అర్పించడం.

II వ్యక్తీకరణ – సృజనాత్మకత

క్రింది ప్రశ్నలకు జవాబులను రాయండి.

ప్రశ్న 1.
సాహసవీరుడు మస్తాన్ బాబు జీవితచరిత్ర నుండి మీరేమి నేర్చుకున్నారు?
జవాబు:
మన రాష్ట్రంలో ఎందరో సాహసవీరులు ఉన్నారు. వారిలో మస్తాన్‌బాబు ప్రసిద్ధుడు. ఈయన జీవిత చరిత్ర అందరికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. మస్తాన్‌బాబు నెల్లూరు జిల్లాలోని ఒక కుగ్రామంలో 3-9-1974వ తేదీన జన్మించారు. వీరిది నిరుపేద కుటుంబం. తండ్రి అక్షర జ్ఞానం కలవాడు. చదువు విలువ తెలిసినవాడు. అందువల్లనే మస్తాన్ బాబు చదువుకోసం ఎంతో కష్టపడ్డారు.

మస్తాన్ బాబు మాత్రం చదువుపట్ల ఆసక్తి చూపేవాడు కాదు. తండ్రి మందలించినా వినిపించుకోలేదు. అల్లరిచిల్లరగా తిరిగేవాడు. తండ్రి ఆందోళన చెంది మస్తాన్ బాబును కోరుకొండ సైనిక స్కూలులో చేర్పించాడు. మస్తాన్ బాబు స్కూల్ లోని ఉదయ్ భాస్కర్ విగ్రహాన్ని తదేకంగా చూశాడు. ఉదయ్ భాస్కర్ ఆ పాఠశాల పూర్వ విద్యార్థి. ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన మహనీయుడు.

మస్తాన్ ఐ.ఐ.టిలో బి.టెక్ లో చేరాడు. తండ్రి ఎన్నో ఇబ్బందులు పడి కుమారుడిని చదివించాడు. చదువు పూర్తికాగానే సాఫ్ట్ వేర్ ఉద్యోగంలో చేరాడు. ఇంతలోనే తండ్రి మరణం మస్తాన్ ని బాగా కుంగదీసింది. లక్షలాది జీతాన్ని కూడా వదులుకొని తన లక్ష్యాన్ని చేరుకోవాలనుకున్నాడు. అందుకోసం గంధోతిలోయను చేరాడు. దాని కోసం కొత్త సాధన చేశాడు. శారీరకంగా శ్రమ చేశాడు. హిమాలయాల్లోని కాంచనగంగ కనుమలను చేరుకున్నాడు. శ్రమించి ఎవరెస్టు శిఖరంపై కాలుమోపాడు. జాతీయ పతాకాన్ని ఎగురవేశాడు. గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించాడు. నాలుగు శిఖరాలను దాటి తిరిగివస్తుండగా 600 కి.మీ. దిగువన మంచు తుపాను భయంకరంగా వచ్చింది. మస్తాన్ తలదాచుకున్న గుడారాన్ని కబళించి వేసింది. ఏ పర్వతాలను ప్రాణప్రదంగా భావించాడో ఆ పర్వాతాలలోనే తనువు చాలించాడు. దేశమంతా ఆ సాహసవీరునికి నివాళులను అర్పించింది.

ఈ విధంగా మస్తాన్ ఎన్నో కష్టాలను అనుభవించి చివరకు లక్ష్యం చేరుకున్నాడు. లక్షల రూపాయల ఉద్యోగాన్ని వదులుకున్నాడు. తాను కలలుకన్న లక్ష్యాన్ని చేరుకున్నాడు. వీరమరణం పొందాడు. ఆ మహనీయుని కార్యదక్షత, దృఢసంకల్పం ప్రతి విద్యార్థికి స్ఫూర్తిదాయకం కావాలి. తింటానికి తిండి లేకపోయినా, ఆర్థిక పరిస్థితులు బాగులేకపోయినా అందరితో కలిసిమెలిసి నవ్వుతూ ఉండడం మనం తప్పక నేర్చుకోవాలి.

AP Board 8th Class Telugu Solutions ఉపవాచకం Chapter 6 స్ఫూర్తి ప్రదాతలు

ప్రశ్న 2.
కార్యదక్షత, దృఢసంకల్పం మనకు మార్గదర్శనం చేస్తాయి. చర్చించండి.
జవాబు:
కార్యదక్షత, దృఢసంకల్పం మనకు మార్గదర్శనం చేస్తాయి. ఎందుకంటే ఒక పనిని సాధించాలంటే ఎన్నో అడ్డంకులు, ఇబ్బందులు ఎదురవుతాయి. అలాంటిది లక్ష్యం సాధించాలంటే ఎంతో శ్రమచేయవలసి ఉంటుంది. అన్ని పరిస్థితులు, సదుపాయాలు, అవకాశాలు సరిగ్గా ఉంటే లక్ష్యసాధన సులభం అవుతుంది. లక్ష్యం అనేది ఉన్నతంగా ఉంటే, దాన్ని సాధించడానికి ఎన్నో ఆటంకాలు, సమస్యలు ఎదురవుతాయి. వాటిని చాకచక్యంగా ఎదుర్కొని విజయాన్ని వరించాలి. కార్యదీక్ష, పట్టుదల ఉంటే ఎంతటి అసాధ్యాలను అయినా సుసాధ్యం చేయగలమని నమ్మాలి.

ఇలాంటి కార్యదక్షత, దృఢసంకల్పం గల వారిలో పర్వతారోహకుడు మస్తాన్‌వలి ప్రముఖుడు. కుటుంబ పరిస్థితులు బాగులేకపోయిన, ఆర్థిక పరిస్థితులు అడ్డంకులుగా నిలిచినా వాటిని లెక్కచేయలేదు. లక్షలాది రూపాయల ఉద్యోగాన్ని కూడా తృణప్రాయంగా భావించాడు. తాను కలలుగన్న పర్వతారోహణను చేయాలనుకున్నాడు. ఉద్యోగాన్ని వదులుకున్నాడు. శారీరకంగా కృషి చేశాడు. ఎన్నో ఇబ్బందులను పడి చివరకు లక్ష్యాన్ని చేరుకున్నాడు. అందరికి స్ఫూర్తి ప్రదాతగా నిలిచాడు.

ఆయన కార్యదీక్ష, దృఢసంకల్పం అందరికి ఆదర్శంగా నిలిచింది. లక్ష్యాన్ని సాధించి తిరుగుప్రయాణంలో తన ప్రాణాలను కోల్పోయాడు. తాను బాగా ప్రేమించిన శిఖరాలపైనే వీరమరణం పొందారు. మస్తాన్‌బాబు నుంచి విద్యార్థులందరు స్ఫూర్తి పొందాలి. కార్యదీక్షపై శ్రద్ధ వహించాలి. కష్టాలను అధిగమించే మనస్సును పెంపొందించుకోవాలి. అందరికి ఆదర్శంగా నిలవాలి. ఇదే మన ముందు తరాలకు అందించే గొప్ప కానుక.

ప్రశ్న 3.
సత్య నాదెళ్ళ వ్యాపారదిగ్గజంగా మారడానికి తోడ్పడిన అంశాలేమిటి?
జవాబు:
ఆంధ్రప్రదేశ్ లో ఎంతోమంది మేధావులు ఉన్నారు. వారు ప్రపంచంలోని వివిధ రంగాల్లో రాణిస్తున్నారు. తెలుగువారి మేధాసంపత్తిని దశదిశలా విస్తరింపజేశారు. వారిలో సత్య నాదెళ్ళ సుప్రసిద్ధులు. ఈయన వైఫల్యాలను ఎదుర్కొనడమేగాదు, వైఫల్యాల నుండి ఏమి నేర్చుకున్నామనేది అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు. ఉన్నత శిఖరాలకు చేరుకున్నాడు.

సత్య నాదెళ్ళ 1967లో అనంతపురంలో విద్యావంతుల కుటుంబంలో జన్మించాడు. అందువలనే చిన్నతనం నుండే అన్ని విషయాలలోనూ అసమాన ప్రతిభను కనబరిచేవాడు. తండ్రి నుండి కార్యదక్షను పుణికిపుచ్చుకున్నాడు. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయడం, అవసరాల్లో ఆదుకోవడం మొదలైన ఉత్తమ లక్షణాలు ఇతనిలో ఉన్నాయి. ఒత్తిడిని అధిగమించగలిగే నాయకత్వ లక్షణాలను పెంపొందించుకున్నాడు. దేశవిదేశాల్లో విద్యను పూర్తి చేశాడు. వ్యాపార రంగంలో మాస్టర్ డిగ్రీ పొందారు.

వీరి ప్రతిభను గుర్తించి ఎన్నో సంస్థలు ఉద్యోగంలో చేరమని ఆహ్వానించాయి. 1992లో మైక్రోసాఫ్ట్ వ్యాపార సేవల రంగంలో కీలకపాత్ర పోషించాడు. ఐదేళ్ళలో కంపెనీ వ్యాపారాన్ని 6 వేల కోట్ల నుండి 31 వేల కోట్లకు దాటించాడు. కొంత కాలం బిల్ గేట్సకు టెక్నాలజీ సలహాదారుగా ఉన్నాడు. ఆధునాతన సాఫ్ట్ వేర్ నిర్మాణంలో కీలకపాత్ర పోషించాడు. ప్రస్తుతం ఈయన కోట్లాది రూపాయల వ్యాపార సామ్రాజ్యానికి అధిపతి అయ్యాడు. అకుంఠితమైన సత్య నాదెళ్ళ కార్యదీక్ష అందరికి స్ఫూర్తిదాయకంగా ఉంటుంది.

ఈయనకు గల అత్యుత్తమ ఇంజనీరింగ్ నైపుణ్యాలు, వ్యాపార దృక్పథం, నిరంతర దీక్ష, నాయకత్వ ధోరణి ఇవన్నీ అందరినీ ఆకర్షించాయి. ఏడాదికి 112 కోట్ల వేతనం తీసుకునే ఉద్యోగిగా ఎంతో గర్వించారు. ఈయన సేవల వల్ల సాఫ్ట్ వేర్ ఎంతో ఘనత సాధించింది. కరెంటు బిల్లు నుండి క్రయోజనిక్ రాకెట్ ఇంజన్ దాకా ప్రతిచోటా సాంకేతిక పరిజ్ఞానం విస్తరించింది. కంప్యూటర్ అక్షరాస్యత అవసరంగా మారిన కాలం ఇది. ఈయనకు గల పట్టుదల, కార్యదక్షత, నిజాయితి, నాయకత్వం, సేవాభావం అనే లక్షణాలే ఈయనకు విజయశిఖరాలు అధిరోహించేలా చేశాయి.

ప్రశ్న 4.
డా|| సంజీవ్ దేవ్ తమ రచనలు, చిత్రాల ద్వారా సమాజానికి ఏమి తెలియజేస్తున్నారని మీరు భావిస్తున్నారు?
జవాబు:
ప్రకృతే మనకు గురువు, దైవం, ఆప్తమిత్రుడు. మనకు ఎదురయ్యే సమస్యలన్నింటికీ ప్రకృతి నుండే పరిష్కారం లభిస్తుంది. ప్రకృతిని ప్రేమించగలిగితే ప్రజాజీవితం సాధ్యమవుతుందని విశ్వసించే వారిలో ముఖ్యుడు డా|| సంజీవ్ దేవ్. వీరు 3. 7.1914వ తేదిన గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం – తుమ్మకూరు గ్రామంలో జన్మించాడు. వీరు నూతన విషయాలను తెలుసుకోవడానికి ఆసక్తి చూపేవారు. తెలుగు, హిందీ, ఇంగ్లీషు భాషల్లో మంచి ప్రావీణ్యం సంపాదించారు.

18 సంవత్సరాల వయసులో హిమాలయాలకు వెళ్ళాడు. అక్కడ స్వామి పవిత్రానంద దగ్గర శిష్యరికం చేస్తూ పాశ్చాత్య తర్కశాస్త్రాన్ని అధ్యయనం చేశాడు. మానవ జీవితం గురించి, ప్రకృతి గురించి పరిశోధన చేశాడు.

డా|| సంజీవ్ దేవ్ ఈ ప్రయాణంలో ఎందరో ప్రముఖులను కలిశాడు. ఈయన గొప్ప ప్రకృతి ప్రేమికుడు కావడంతో కవిగానే కాకుండా చిత్రకళా విమర్శకునిగా కూడా పేరు పొందాడు. కొంతకాలం తర్వాత తన స్వగ్రామానికి తిరిగి వచ్చి సొంత ఊరిని మించిన స్వర్గం లేదని భావించాడు. తనకు సన్నిహితులైన చిత్రకారుడు ఎస్.వి. రామారావు, భావకవి కృష్ణశాస్త్రి, నవలారచయిత చలం, కథారచయిత బుచ్చిబాబు మొదలగువారితో కవిత్వ చర్చలు చేసేవారు.

ఈయన గొప్ప మానవతావాది. దేశవిదేశాల నుండి ఎంతోమంది భిన్న అంశాలపై ఆయనకు ఉత్తరాలు రాసేవారు. గొప్ప లేఖా రచయిత కావడంతో వారందరికీ ఓపికగా ప్రత్యుత్తరాలిస్తూ సందేహ నివృత్తి చేసేవారు. ఈయన మనం ఆనందంగా జీవించడంతోపాటు ఇతరులను కూడా సంతోషపెట్టడమే సర్వమతాలసారం అని ప్రకటించారు. ఈయన కవి, చిత్రకారుడు మాత్రమే కాదు గొప్ప మనోవిజ్ఞాన శాస్త్రవేత్త కూడా.

డా|| దేవ్ గారు ఎన్నో భాషలను నేర్చుకున్నారు. బహుభాషావేత్తగా, విమర్శకుడిగా గుర్తింపు పొందారు. కుంచె చేతబట్టి అద్భుతమైన వర్ణచిత్రాలను రూపొందించాడు. సాహిత్యాన్ని, చిత్రలేఖనాన్ని, సంగీతాన్ని, శిల్పాన్ని గురించి విడివిడిగా వివరించడమే కాకుండా లలితకళలన్నింటిలోను అంతర్లీనంగా ఉన్న సంబంధ బాంధవ్యాలను తాత్వికతలను తులనాత్మకంగా విశ్లేషించు వీరు 25.8.1999న పరమపదించారు. వీరు స్వయంకృషితో, ఉన్నత శిఖరాలను అధిరోహించారు. వీరి జీవనవిధానం అందరికి ఆదర్శంగా నిలుస్తుంది. ఈ మహామనీషి మరణించినా వీరి రచనలు, చిత్రాలు, ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోతాయి.

AP Board 8th Class Telugu Solutions ఉపవాచకం Chapter 6 స్ఫూర్తి ప్రదాతలు

ప్రశ్న 5.
మన జీవితానికి స్ఫూర్తినిచ్చేవారు చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో ఒకరి గురించి రాయండి.
జవాబు:
మన జీవితానికి స్ఫూర్తినిచ్చేవారు ఎందరో ఉన్నారు. అలనాటి రాముడు మొదలుకొని గాంధీ, అంబేద్కర్ వంటి ప్రముఖులే కాక వెలుగులోకి రాని మహనీయులు ఎందరో ఉన్నారు. ఎందరు ఉన్నా నా తొలి ప్రాధాన్యం మాత్రం అమ్మానాన్నలే. వారే లేకపోతే మనం ఎక్కడున్నాం, ఎవరో ఒకరి పేరు పెట్టి ఏదో ఒకటి రాయవచ్చు. కానీ అమ్మనాన్నల గొప్పదనాన్ని గుర్తించి కూడా వేరొకర్ని కీర్తించడం సబబేనా ? కాదు కదా ! అందుకే మరి మా అమ్మా నాన్నల గురించి చెబితే స్వార్థం అంటారుగా. అందుకే వారిని మనసులో తలుచుకొంటూ వారి స్థానాన్ని, వారి ప్రేమను మీ ముందుంచుతాను.

ప్రపంచానికి నిన్ను పరిచయం చేసేది అమ్మ అయితే, ప్రపంచాన్ని నీకు పరిచయం చేస్తాడు నాన్న. కన్ను మూసే వరకు ప్రేమించేది అమ్మ. కళ్ళల్లో ప్రేమ కనబడకుండా ప్రేమించేది నాన్న. జీవితం అమ్మది. జీవనం నాన్నది. ఆకలి తెలీయకుండా అమ్మ చూస్తుంది. ఆకలి విలువ తెలిసేలా నాన్న చేస్తాడు. అమ్మ భద్రత. నాన్న బాధ్యత. పడిపోకుండా పట్టుకోవాలని అమ్మ చూస్తుంది. పడినా పైకి లేవాలని నాన్న చెప్తాడు. నడక అమ్మది. నడవడిక నాన్నది. తన అనుభవాలను విద్యలా అమ్మ బోధిస్తే, నీ అనుభవమే విద్య అని తెలిసేలా చేస్తాడు నాన్న. అమ్మ ఆలోచనైతే, నాన్న ఆచరణ.

అమ్మ ప్రేమను నీ పసిప్రాయం నుండే తెలుసుకోగలవు. కానీ నాన్న ప్రేమను నువ్వు నాన్నవు అయ్యాకే తెలుసుకోగలవు మిత్రమా !

AP Board 8th Class Telugu Important Questions Chapter 6 ప్రకృతి ఒడిలో

AP State Syllabus AP Board 8th Class Telugu Important Questions Chapter 6 ప్రకృతి ఒడిలో.

AP State Syllabus 8th Class Telugu Important Questions 6th Lesson ప్రకృతి ఒడిలో

8th Class Telugu 6th Lesson ప్రకృతి ఒడిలో Important Questions and Answers

I. అవగాహన-ప్రతిస్పందన

అ) కింది అపరిచిత గద్యాలకు అడిగిన విధంగా జవాబులు ఇవ్వండి.

1. కింది పేరా చదివి, అర్థవంతమైన నాలుగు ప్రశ్నలు రూపొందించండి.

నిరుద్యోగ సమస్య నిజమునకు నిరక్షరాస్యుల వలన నేర్పడినది కాదు. విద్యావంతుల విషయముననే ఇది తీరని | సమస్యగా పరిణమించినది. ఈ విద్యావంతులు కుర్చీలలో కూర్చుండి గుమాస్తా పని చేయుటకే కుతూహలపడుచున్నారు. చదివిన చదువు కూడ అందుకే ఉపకరించుచున్నది. కావున మన విద్యావిధానము కొంత మారవలయును. విద్యావంతులు వృత్తి విద్యల నభ్యసించుట మేలు. ప్రభుత్వమువారి ప్రోత్సాహముతో వారు కుటీర పరిశ్రమలను నెలకొల్పుటయే ఈ సమస్యకు తగిన పరిష్కారము. వృత్తి విద్యల నభ్యసించినవారికి ప్రభుత్వమువారి తోడ్పాటు తప్పక లభించి తీరును.
ప్రశ్నలు :
1. నిరుద్యోగ సమస్య ఎవరి వలన ఏర్పడినది?
2. చదివిన చదువు ఎందుకుపయోగపడుచున్నది?
3. నేటి విద్యావిధానములో ఎట్టి మార్పు రావలెను?
4. ప్రభుత్వమువారు ఎవరికి తోడ్పడుచున్నారు?

2. కింది పేరా చదివి, అర్థవంతమైన నాలుగు ప్రశ్నలు రూపొందించండి.

పరిణయవేళ పుట్టినింటి వారు ధూతాంబకు వెలలేని రత్నాలహారమును బహుకరించిరి. దానిని ఆమె వ్రతదానమను నెపమున మైత్రేయునకిచ్చెను. తన భర్తకే దానిని ఆతడిచ్చుననియు, పోయిన సువర్ణభాండమునకు బదులు దానికంటే పదిమడుంగులు ఎక్కువ వెలగల తన రత్నాలహారమును తన భర్త వసంత సేనకు పంపుననియు ధూతాంబ తలచెను. తాను స్వయముగనే తన భర్తకిచ్చుచో అది స్త్రీ ధనమని యెంచి అతడు గ్రహించకపోవచ్చును. కావున ఆమె మైత్రేయుని ద్వారా దానిని పంపుటకు ఉపాయమును పన్నెను.

సుగుణవతియగు ధూతాంబ యొక్క పవిత్రాశయము నెరింగిన మైత్రేయు డాహారమును తీసికొనిపోయి చారుదత్తునకిచ్చెను. అనుకూలవతియగు భార్య వల్ల భర్త యొక్క కీర్తి ప్రతిష్ఠలు అభివృద్ధి నొందునని పల్కి అతడు తనకు స్త్రీ విమునకు ఆశపడవలసిన దుర్గతి పట్టెనని మిక్కిలి సిగ్గుచెందెను.
ప్రశ్నలు :
1. ధూతాంబ ఎవరికేమి ఇచ్చెను?
2. ధూతాంబ భర్త పేరేమి?
3. తన భర్త దేనికి బదులు ఏమి ఇచ్చునని ధూతాంబ తలచెను?
4. తాను స్వయముగా ఇచ్చుటకు ధూతాంబ ఏల సంశయించెను?

AP Board 8th Class Telugu Important Questions Chapter 6 ప్రకృతి ఒడిలో

3. కింది పేరా ఆధారంగా కింది వాక్యములు సరైనవో కాదో (✓), (✗) గుర్తుల ద్వారా గుర్తించండి.

ఆ ముందుగా వ్యక్తి బాగుపడవలెను. ఆ వెనుక సంఘము బాగుండును. ముందుగా సంఘమును సంస్కరించవలెననుట వెట్టిమాట. మాటలో, చేతలో, తుదకు భావనలో సంస్కారముట్టిపడవలెను. అట్టి వ్యక్తులు పెక్కుమంది ఉన్నచో తనంతట తానే సంఘము ఉద్ధరింపబడును. వ్యక్తిని, తుదకు జాతిని తీర్చిదిద్దుకునే ఈ సంస్కారములు వాని ప్రణాళికను గమనించినచో తన పొట్టకు శ్రీరామరక్ష అనురీతిలో ఉండక వ్యక్తి శ్రేయస్సు, సమాజ కళ్యాణము పరస్పరము ముడివడియున్నవని విడివిడిగా లేవని తెలియచేయును. ఉదాహరణకు ప్రతి గృహస్థు విధిగా చేయవలసిన పంచమహాయజ్ఞములను చూడుడు. దేవయజ్ఞము నందు దేవతలను, ఋషి యజ్ఞమునందు ఋషులను, వారందించిన విజ్ఞానమును, పితృ యజ్ఞము నందు పితృదేవతలను కొలుచుచున్నాడు కదా! భూత యజ్ఞము నందు కుక్కలకు, కాకులకు బలివేయుచున్నాడు కదా! పొరుగువానిని ప్రేమింపమని ఇతర మతములన్నచో, పొరుగు ప్రాణిని కూడా ప్రేమింపమని ఈ సనాతన ధర్మము చాటుచున్నది. తనకుతాను వండుకొని తినువాడు కేవలము పాపమునే తినుచున్నాడని వేదము భాషించుట లేదా? ఇట్టి సూత్రములు సంస్కారములతో ముడివడియున్నవి.
ప్రశ్నలు :
1. వ్యక్తి బాగుపడినప్పుడే సంఘము బాగుపడుతుంది. (✓)
2. మాటలు, చేతలు, భావనలతో సంస్కారముట్టిపడదు. (✗)
3. ప్రతిగృహస్థు విధిగా పంచమహాయజ్ఞములను చేయవలెను. (✓)
4. పొరుగు వానిని ప్రేమించమని, పొరుగు ప్రాణిని ద్వేషించమని సనాతన ధర్మము చెప్పుచున్నది. (✗)

4. కింది పేరా చదివి, ఖాళీలు పూరించండి.

వ్యవసాయ భూముల్ని ఎలా ఉపయోగించుకుంటామో, జీవనోపాధి కోసం బీడు భూముల్ని కూడా ఒక పద్ధతి ప్రకారం ఉపయోగించుకోవచ్చు. అనేక సంక్షేమ కార్యక్రమాలు, ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలూ ఉన్నాయి. గుజరాత్ లో అముల్ ప్రయోగం మన రాష్ట్రంలోనూ చేయవచ్చు. వృత్తికులాల వాళ్ళు అనేక మంది పరిస్థితులను బట్టి వృత్తులు మార్చుకుంటారు. చిత్రమేమంటే పేదవాళ్ళు ఎప్పుడూ విద్యా, వైద్య సౌకర్యాల గురించి అడగరు. భూములు లీజుకు ఇస్తే పెత్తందారులకు, దళారులకు, కుల పెద్దలకూ లాభం వస్తుంది. ఈ విషయంలో పేదలను చైతన్యపరచవలసిన ప్రభుత్వాలు కూడా చురుకైన పాత్ర నిర్వహించకపోవడం దురదృష్టకరం!
ఖాళీలు :
1. బీడు భూములంటే ……………
2. జీవనోపాధి కోసం రైతులు ఆధారపడేది ………..
3. విద్యా, వైద్య సౌకర్యాల గురించి అడగని వాళ్ళు ……………….
4. దళారులు చేసేపని ………..
జవాబులు:
1. పంటలు పండని భూములు
2. వ్యవసాయంపై
3. పేదవాళ్ళు
4. భూములను లీజుకు తీసుకోవడం

5. కింది పేరా చదివి, అర్థవంతమైన నాలుగు ప్రశ్నలు రూపొందించండి.

20వ శతాబ్దపు తొలి రోజులలో కుటుంబ నియంత్రణను బూతు మాట క్రింద జమకట్టేవారు. అటువంటి సమయంలో నర్స్ గా పనిచేసే మార్గరేట్ సాంగర్ అనేక కష్టాలకోర్చి కుటుంబనియంత్రణను గూర్చి ప్రచారం చేశారు. 1914లో “ఉమన్ రెబల్” అన్న వ్యాసంలో ఆమె కుటుంబ నియంత్రణ కోసం తిరగబడమని పిలుపునిచ్చారు. అమెరికా ప్రభుత్వ ఒత్తిడి తట్టుకోలేక ఆమె యూరప్ కు వలసవెళ్ళి 1916లో తిరిగి వచ్చి అదే ప్రచారాన్ని మళ్ళీ మొదలు పెట్టారు. పోలీసులు ఆమె ప్రారంభించిన ఆస్పత్రి పై దాడి చేశారు. అయినా ఆమె చలించకుండా 1923లో కుటుంబ నియంత్రణ పరిశోధనాశాలను నెలకొల్పారు.
ప్రశ్నలు :
1. కుటుంబ నియంత్రణ కోసం ప్రచారం చేసిన నర్స్
2. ఏ సంవత్సరంలో, ఏ వ్యాసంలో ఆమె కుటుంబ నియంత్రణ కోసం తిరగబడమని పిలుపునిచ్చారు?
3. మార్గరేట్ సాంగర్ ఎప్పుడు, ఎక్కడికి వలస వెళ్ళినది?
4. 1923లో సాంగర్ దేనిని నెలకొల్పినది?

AP Board 8th Class Telugu Important Questions Chapter 6 ప్రకృతి ఒడిలో

6. కింది పేరా చదివి, అర్థవంతమైన నాలుగు ప్రశ్నలు రూపొందించండి.

బ్రౌనును ఒక వ్యక్తిగా గాక, పెద్ద సాహిత్య సంస్థగా భావించడం అవసరం. యుగసంధిలో నిలిచిన ఈ వ్యక్తి అనేకానేక తాళపత్ర లిఖిత ప్రతులను సేకరించి, అవి ఎక్కడున్నాసరే, ఎంత ధనవ్యయమైనా సరే, లెక్క పెట్టకుండా, తన ఉద్యోగుల ద్వారా సంపాదించాడు. కొందరు పండితులను సమీకరించి, వారికి జీతభత్యాలిచ్చి, శుప్రతులు వ్రాయించి, కొన్నిటికి అర్థతాత్పర్యాలు సిద్ధం చేయించాడు. ‘విశ్వదాభిరామ వినురవేమ’ పద్యం తెలియని తెలుగువాడు లేడు. అయితే ఈ పద్యాలను మొదట తెలుగువాళ్ళకు పరిచయం చేసినది విదేశీయుడైన బ్రౌను. బ్రౌను పేరు స్మరించగానే మనకు ముందు స్ఫురించేది బ్రౌనుకు నిఘంటువు. ఈ కృషి 1832లో ఆరంభించబడి, 1853లో పూర్తి అయి ప్రథమ ముద్రణ అయింది. ఈ కృషిలో బ్రౌనుకు ఏనుగుల వీరాస్వామి సహాయం పొందాడు. వీరాస్వామి రచించిన కాశీయాత్ర | గురించిన పుస్తకం చారిత్రక దృష్ట్యా విలువైనది.
ప్రశ్నలు:
1. తెలుగు సాహిత్యానికి సంబంధించినంతవరకు బ్రౌనును ఎట్లా పరిగణించడం భావ్యం?
2. బ్రౌను సంపాదించిన పుస్తకాలను ఏమంటారు?
3. పండితులతో బ్రౌను చేయించిన పనులేమిటి?
4. నిఘంటువు ప్రథమ ముద్రణ ఎప్పుడు వచ్చింది?

II. వ్యక్తీకరణ – సృజనాత్మకత

అ) కింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాల్లో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
“ప్రకృతి ఒడిలో” అనే పాఠ్యభాగ రచయితను గురించి రాయండి.
జవాబు:
‘ప్రకృతి ఒడిలో’ అనే పాఠ్యభాగ రచయిత కొడవటిగంటి కుటుంబరావు. ఈయన 1909 – 1980 మధ్యకాలంలో జీవించారు. వీరు ప్రముఖ కథారచయిత, గల్పికలను ఎన్నో రాశారు. వారి కథలో సహజత్వం గోచరిస్తుంది. వీరి రచనల్లో చదువు, అద్దెకొంప, షావుకారు సుబ్బయ్య మొదలైనవి ప్రసిద్ధి చెందాయి. వీరి రచన సరళంగాను, మనోహరంగాను ఉంటుంది.

AP Board 8th Class Telugu Important Questions Chapter 6 ప్రకృతి ఒడిలో

ప్రశ్న 2.
శాస్త్రజ్ఞులకూ (శాస్త్రవేత్తలకూ), శాస్త్రజ్ఞానానికి గల సంబంధాన్ని వివరిస్తూ రాయండి.
జవాబు:
ప్రకృతిలో జరిగే ప్రతి సంఘటనకూ వెనుక ఒక భౌతిక కారణం ఉంటుందనీ, దాన్ని తెలుసుకోడానికి వీలు అవుతుందనీ శాస్త్రజ్ఞుడు నమ్ముతాడు. శాస్త్రజ్ఞుడు రుజువయ్యే అవకాశం ఉంటే ప్రతి సిద్ధాంతాన్ని పరిశోధిస్తాడు. శాస్త్రజ్ఞులు సత్యాన్వేషణకూ, విషయజ్ఞానానికి ప్రయత్నిస్తారు. శాస్త్రజ్ఞానం వల్ల మనకు ప్రకృతి రహస్యాలు తెలుస్తాయి. శాస్త్రజ్ఞుని శాస్త్రజ్ఞానం వల్ల, మన లౌకిక జీవితాలు పై అంతస్తుకు చేరతాయి.

ఆ) కింది ప్రశ్నకు 10 లేక 12 వాక్యాల్లో సమాధానం రాయండి.

ప్రశ్న 1.
ప్రకృతి అందాలను సొంతమాటల్లో రాయండి.
జవాబు:
ప్రకృతి ఎంతో అందమైనది. ప్రకృతి భూమాతకు ఎన్నో అందాలను తెచ్చి పెడుతుంది. ప్రకృతిలో రకరకాల చెట్లు ఉంటాయి. కొన్ని పూలమొక్కలు, కొన్ని ఔషధపు మొక్కలు ఉంటాయి. అట్లే ఎన్నో రకాల పక్షులు సంచరిస్తాయి. అవన్నీ తమ అందాలతో కనువిందు చేస్తాయి. కోయిలల కిలకిలారావాలు మనసున్న మనుషులను అలరిస్తాయి. కొన్ని రకాల పక్షులు పంటలను రక్షిస్తాయి. కొన్ని ప్రాణులు పర్యావరణాన్ని రక్షిస్తాయి. నదులు జీవకోటికి జీవనాధారం. నదులు అందరికీ నీటిని అందిస్తాయి. వాటిని మనం కలుషితం కాకుండా చెయ్యాలి.

ప్రకృతిలో లభించే కొన్ని వస్తువులను మానవుడు తన స్వార్థం కోసం వినియోగించుకుంటున్నాడు. అడవులను నరికివేస్తున్నాడు. పక్షులను వేటాడుతున్నాడు. ఇది మంచిది కాదు. మనమంతా పర్యావరణాన్ని రక్షించాలి. ఇది మన కర్తవ్యం.

ఇ) కింది అంశం గురించి సృజనాత్మకంగా / ప్రశంసిస్తూ రాయండి.

ప్రశ్న 1.
నీవు చూసిన ఒక ప్రకృతి దృశ్యాన్ని వివరిస్తూ మిత్రునికి లేఖ రాయండి.
జవాబు:

విజయనగరం,
x x x x x

ప్రియమైన మిత్రుడు నరసింహారావుకు,

నీ మిత్రుడు రాయునది. నేను బాగా చదువుతున్నాను. నీవు కూడా బాగా చదువుతున్నావని ఆశిస్తున్నాను. ముఖ్యముగా రాయునది నేను ఇటీవల కర్నూలు జిల్లాలోని మహానంది క్షేత్రానికి వెళ్ళాను. గిద్దలూరు దాటిన తరువాత నల్లమల అడవి వస్తుంది. అంతా లోయలు, చుట్టూ పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. పచ్చని చెట్లు అలరించాయి. లోయలు కనువిందు చేశాయి. మధ్యలో సొరంగమార్గం మరువలేనిది. పక్షుల కిలకిలారావాలు అలౌకిక ఆనందాన్ని పొందేలా చేశాయి. నీవు కూడా చూచిన ఒక ప్రకృతి దృశ్యాన్ని వివరిస్తూ లేఖ రాయి.. పెద్దలకు నమస్కారాలు తెలుపుతున్నాను.

ఇట్లు,
నీ ప్రియ మిత్రుడు,
x x x x x x x

చిరునామా :
జి. నరసింహారావు,
8వ తరగతి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,
వినుకొండ, ప్రకాశం జిల్లా,
ఆంధ్రప్రదేశ్.

8th Class Telugu 6th Lesson ప్రకృతి ఒడిలో 1 Mark Bits

1. ప్రథమా విభక్తి మీది ప్రత్యయాలకు కచటతపలు పరమైతే వాటి స్థానంలో గసడదవలు ఆదేశంగా వస్తాయి. (ఇది ఏ సంధి సూత్రం) (S.A. III – 2016-17)
ఎ) సరళాదేశసంధి
బి) ద్రుతప్రకృతికసంధి
సి) గసడదవాదేశసంధి
డి) ఆమ్రేడిత సంధి
జవాబు:
సి) గసడదవాదేశసంధి

2. జయ ఇంటికి వెళ్లింది. విజయ బడికి వెళ్లింది. (పై వాక్యాలను సంయుక్త వాక్యంగా మార్చండి.) (S.A. III – 2016-17)
ఎ) జయ, విజయ ఇంటికి వెళ్లారు.
బి) జయ ఇంటికి, విజయ బడికి వెళ్లారు.
సి) విజయ, జయ బడికి వెళ్లారు.
డి) జయ, విజయలు ఇళ్లకు వెళ్లారు.
జవాబు:
బి) జయ ఇంటికి, విజయ బడికి వెళ్లారు.

భాషాంశాలు – పదజాలం

అర్థాలు :

3. అభినందన తెలపాలి – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) పొగడ్త
బి) అగడ్త
సి) అంజన
డి) విషయం
జవాబు:
ఎ) పొగడ్త

4. ఇంటి ఆకృతి బాగుంది – గీత గీసిన పదానికి అరం గుర్తించండి.
ఎ) ఆకారం
బి) వికారం
సి) సకారం
డి) యకారం
జవాబు:
ఎ) ఆకారం

5. మనుష్యుల మధ్య సామ్యం ఉండాలి – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) ఆకృతి
బి) పోలిక
సి) చూపు
డి) తెలివి
జవాబు:
బి) పోలిక

AP Board 8th Class Telugu Important Questions Chapter 6 ప్రకృతి ఒడిలో

6. రుజువు కావాలి – గీత గీసిన పదానికి అర్థం పదాలు గుర్తించండి.
ఎ) నిదర్శనం
బి) ఆకాంక్ష
సి) ఆకారం
డి) సంప్రదాయం
జవాబు:
ఎ) నిదర్శనం

7. పాలు పేరుకొనుట జరిగింది – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) వారిధి, భూరుహం
బి) గగనం, నాశం
సి) నభం, నాకం
డి) నింగి, నభం
జవాబు:
డి) నింగి, నభం

8. పసిగట్టుట జరిగింది – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) గుర్తించడం
బి) పరిశీలించడం
సి) ఆదరించడం
డి) తిరస్కరించడం
జవాబు:
బి) పరిశీలించడం

9. విధిగా రావాలి – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) ఆకృతిగా
బి) తప్పనిసరిగా
సి) అప్పుడప్పుడు
డి) అనుకూలంగా
జవాబు:
బి) తప్పనిసరిగా

10. సాధనం అవసరం – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) ఉపకారం
బి) ఉపకరణం
సి) ఉపన్యాసం
డి) ఉపయోగం
జవాబు:
బి) ఉపకరణం

పర్యాయపదాలు :

11. కన్ను జ్ఞానేంద్రియం – గీత గీసిన పదానికి పర్యాయ పదాలు గుర్తించండి.
ఎ) పక్షి, నయనం
బి) చక్షువు, నయనం
సి) నాశిక, నయనం
డి) అక్షి, కుక్షి
జవాబు:
బి) చక్షువు, నయనం

AP Board 8th Class Telugu Important Questions Chapter 6 ప్రకృతి ఒడిలో

12. నీరు ఉంది – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
ఎ) జలం, వారి
బి) జారి, క్షీరం
సి) దుగ్ధం, దధి
డి) ఘృతం, క్షీరం
జవాబు:
ఎ) జలం, వారి

13. సముద్రం భీకరం – గీత గీసిన పదానికి పర్యాయ పదాలు గుర్తించండి.
ఎ) క్షీరం, ధరణి
బి) జలధి, అవని
సి) అంబుధి, అంబరం
డి) సాగరం, జలధి
జవాబు:
డి) సాగరం, జలధి

14. తరంగం ఉరికింది – గీత గీసిన పదానికి పర్యాయ గుర్తించండి.
ఎ) అల, వీచిక
బి) అంతరంగం, అవని
సి) దానం, దారి
డి) పధం, తపన
జవాబు:
ఎ) అల, వీచిక

15. ఆకాశం నిర్మలంగా ఉంది – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
ఎ) వాసన చూచుట
బి) చీల్చుట
సి) నానబెట్టుట
డి) గడ్డకట్టుట
జవాబు:
డి) గడ్డకట్టుట

16. గాలి వీచింది – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
ఎ) తరువు, తరుణి
బి) వాయువు, పవనం
సి) నాశిక, అనంతం
డి) ఆకారం, ఆకృతి
జవాబు:
బి) వాయువు, పవనం

ప్రకృతి – వికృతులు :

17. ఆశ్చర్యం పొందాను – అనే పదానికి వికృతి పదం ఏది?
ఎ) అచ్చెరువు
బి) ఆకారం
సి) ఆచెరం
డి) అచ్చెరం
జవాబు:
బి) ఆకారం

AP Board 8th Class Telugu Important Questions Chapter 6 ప్రకృతి ఒడిలో

18. బుద్ధి ఉండాలి – గీత గీసిన పదానికి వికృతి పదం ఏది?
ఎ) బుద్ధి
బి) బిద్దు
సి) బౌద్ధ
డి) బౌద్ధ
జవాబు:
ఎ) బుద్ధి

19. ఆకసంలో రవి ఉన్నాడు – గీత గీసిన పదానికి ప్రకృతి పదం ఏది?
ఎ) అనంతం
బి) అబ్బురం
సి) ఆకాశం
డి) ఆకారం
జవాబు:
సి) ఆకాశం

20. చట్టం గౌరవించాలి – గీత గీసిన పదానికి ప్రకృతి పదం ఏది?
ఎ) శర్మ
బి) శాస్త్రం
సి) శాసనం
డి) శాస్త్రి
జవాబు:
బి) శాస్త్రం

21. ధర్మం ఆచరించాలి – గీత గీసిన పదానికి వికృతి పదం
ఎ) దమ్మం
బి) దరమ
సి) గరమ
డి) మరద
జవాబు:
ఎ) దమ్మం

నానార్థాలు :

22. మిత్రుడు ప్రకాశించాడు – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
ఎ) సూర్యుడు, స్నేహితుడు
బి) వైరి, విరోధి
సి) పగతుడు, చిరంజీవి
డి) చినుకు, చింత
జవాబు:
ఎ) సూర్యుడు, స్నేహితుడు

AP Board 8th Class Telugu Important Questions Chapter 6 ప్రకృతి ఒడిలో

23. వర్షం వచ్చింది – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
ఎ) వాన, సంవత్సరం
బి) వాకిలి, వారుణి
సి) వారుణం, వారిధి
డి) కల్పం, కాంతం
జవాబు:
ఎ) వాన, సంవత్సరం

24. చరణం బాగుంది – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
ఎ) పాదం, పద్యపాదం
బి) వేదభావం, విరించి
సి) అనంతం, అనం
డి) విస్మయం, విరామం
జవాబు:
ఎ) పాదం, పద్యపాదం

25. ధర్మం పాటించాలి – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
ఎ) పుణ్యం, న్యాయం
బి) అధర్మం, అపకారి
సి) నృతం, అనృతం
డి) విదతి, వింజారం
జవాబు:
ఎ) పుణ్యం, న్యాయం

26. కరంతో పని చెయ్యాలి – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
ఎ) చేయి, తొండము
బి) కిరణము, కాంతి
సి) కలవ, కానుగ
డి) విధి, విధానం
జవాబు:
ఎ) చేయి, తొండము

27. కాలం చెల్లాడు – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
ఎ) కానుగ, కాటుక
బి) సమయం, మరణం
సి) మంచు, హిమం
డి) హేమం, కాంతి
జవాబు:
బి) సమయం, మరణం

28. దేవుడే దిక్కు – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
ఎ) దిశ, శరణు
బి) ధర, ధరణి
సి) దాన, విరిగి
డి) నిశ, నిద్ర
జవాబు:
ఎ) దిశ, శరణు

వ్యుత్పత్తర్థాలు :

29. పర్వత రాజు కుమార్తె – అనే వ్యుత్పత్త్యర్థం గల పదం ఏది?
ఎ) పార్వతి
బి) ఊర్వశి
సి) జలధి
డి) వైదేహి
జవాబు:
ఎ) పార్వతి

AP Board 8th Class Telugu Important Questions Chapter 6 ప్రకృతి ఒడిలో

30. నీటిని ధరించునది – అనే వ్యుత్పత్త్యర్థం గల పదం ఏది?
ఎ) వాసవి
బి) కాసారం
సి) వారిధి
డి) కౌముది
జవాబు:
సి) వారిధి

31. భూజము – అనే పదానికి వ్యుత్పత్తి ఏది?
ఎ) ఆకృతి లేనిది
బి) అనంతమైనది
సి) భూమి నుండి పుట్టినది
డి) భూమిలో దొరికినది
జవాబు:
సి) భూమి నుండి పుట్టినది

32. ఉర్వి – అనే పదానికి వ్యుత్పత్తి ఏది?
ఎ) మధురమైది
బి) ఫలవంతమైనది
సి) విశాలమైనది
డి) ఆకృతిలేనిది
జవాబు:
సి) విశాలమైనది

33. అగ్ని – అనే పదానికి వ్యుత్పత్తి ఏది?
ఎ) మండెడి స్వభావం కలది
బి) మంచుతో కూడినది
సి) మారాము చేయునది
డి) ఆకలి తీర్చునది
జవాబు:
ఎ) మండెడి స్వభావం కలది

వ్యాకరణాంశాలు

సంధులు:

34. అత్తటి – ఇది ఏ సంధి?
ఎ) త్రికసంధి
బి) అత్వసంధి
సి) ఉత్వసంధి
డి) గుణసంధి
జవాబు:
ఎ) త్రికసంధి

35. సవర్ణదీర్ఘ సంధికి ఉదాహరణను గుర్తించండి.
ఎ) రాజర్షి
బి) జ్ఞానాభివృద్ధి
సి) జ్ఞానోదయం
డి) ప్రాప్రోదయం
జవాబు:
బి) జ్ఞానాభివృద్ధి

36. అప్పుడప్పుడు – ఇది ఏ సంధి?
ఎ) ఆమ్రేడిత సంధి
బి) త్రికసంధి
సి) అత్వసంధి
డి) ఉత్వసంధి
జవాబు:
బి) త్రికసంధి

37. ద్విరుక్తము యొక్క పరరూపం గుర్తించండి.
ఎ) ఆమ్రేడితం
బి) త్రికం
సి) శబ్దపల్లవం
డి) సాధువు
జవాబు:
ఎ) ఆమ్రేడితం

AP Board 8th Class Telugu Important Questions Chapter 6 ప్రకృతి ఒడిలో

38. ఉష్ణోగ్రత పెరిగింది – ఇది ఏ సంధి?
ఎ) త్రికసంధి
బి) అత్వసంధి
సి) యణాదేశ సంధి
డి) గుణసంధి
జవాబు:
డి) గుణసంధి

39. విద్యుచ్ఛక్తి – ఇది ఏ సంధి?
ఎ) అత్వసంధి
బి) శ్చుత్వసంధి
సి) షుత్వసంధి
డి) టుగాగమ సంధి
జవాబు:
బి) శ్చుత్వసంధి

40. ప్రత్యామ్నాయం – దీనిని విడదీయండి.
ఎ) ప్రతో + ఆమ్నాయం
బి) ప్రతి + ఆమ్నాయం
సి) ప్రతె + ఆమ్నాయం
డి) ప్రత + ఆమ్నాయం
జవాబు:
బి) ప్రతి + ఆమ్నాయం

41. విద్యార్జన – ఇది ఏ సంధి?
ఎ) ఇత్వసంధి
బి) సవర్ణదీర్ఘ సంధి
సి) గుణసంధి
డి) అత్వసంధి
జవాబు:
బి) సవర్ణదీర్ఘ సంధి

సమాసాలు :

42. కళాదృష్టి – దీనికి విగ్రహవాక్యం ఏది?
ఎ) కళ యందు దృష్టి
బి) కళ చేత దృష్టి
సి) కళ కొరకు దృష్టి
డి) కళ వలన దృష్టి
జవాబు:
ఎ) కళ యందు దృష్టి

AP Board 8th Class Telugu Important Questions Chapter 6 ప్రకృతి ఒడిలో

43. ప్రార్థనా సమావేశం – దీనికి విగ్రహవాక్యం ఏది?
ఎ) ప్రార్ధన కొరకు సమావేశం
బి) ప్రార్ధన యందు సమావేశం
సి) ప్రార్థన చేత సమావేశం
డి) ప్రార్ధనతో సమావేశం
జవాబు:
ఎ) ప్రార్ధన కొరకు సమావేశం

44. షష్ఠీ తత్పురుషకు ఉదాహరణను గుర్తించండి.
ఎ) గ్రామగతుడు
బి) ప్రకృతి ధర్మం
సి) విద్యాహీనుడు
డి) కళాతృష్ణ
జవాబు:
బి) ప్రకృతి ధర్మం

45. ద్విగు సమాసానికి ఉదాహరణను గుర్తించండి.
ఎ) మంచిమాట
బి) వంద సంవత్సరాలు
సి) సాగరసంగమం
డి) కళారాధన
జవాబు:
బి) వంద సంవత్సరాలు

46. సంఖ్యా శబ్దం పూర్వంగా కలిగిన సమాసం
ఎ) ద్విగు సమాసం
బి) ద్వంద్వ సమాసం
సి) అవ్యయీభావ సమాసం
డి) తత్పురుష సమాసం
జవాబు:
ఎ) ద్విగు సమాసం

47. సంసార సాగరం – ఇది ఏ సమాసం?
ఎ) రూపక సమాసం
బి) అవ్యయీభావ సమాసం
సి) కర్మధారయ సమాసం
డి) సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం
జవాబు:
ఎ) రూపక సమాసం

గణ విభజన:

48. IUI- ఇది ఏ గణము?
ఎ) జ గణం
బి) త గణం
సి) స గణం
డి) య గణం
జవాబు:
ఎ) జ గణం

49. త గణం – దీనికి గణాలు ఏవి?
ఎ) IUI
బి) UUU
సి) UUI
డి) UII
జవాబు:
సి) UUI

AP Board 8th Class Telugu Important Questions Chapter 6 ప్రకృతి ఒడిలో

50. సూర్య గణాలు ఎన్ని?
ఎ) నాలుగు
బి) రెండు
సి) ఆరు
డి) ఎనిమిది
జవాబు:
బి) రెండు

51. IIUI- ఇది ఏ గణము?
ఎ) నగము
బి) సలము
సి) నలము
డి) యలము
జవాబు:
బి) సలము

52. అవ్విధం – ఇది ఏ గణము?
ఎ) IUI
బి) UIU
సి) III
డి) IIU
జవాబు:
బి) UIU

వాక్యాలు :

53. దయతో అనుమతించండి – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) హేత్వర్థక వాక్యం
బి) కర్తరి వాక్యం
సి) పాక్షికార్థక వాక్యం
డి) తమున్నర్థక వాక్యం
జవాబు:
సి) పాక్షికార్థక వాక్యం

54. రవి పాఠం చదువగలడు – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) కర్తరి వాక్యం
బి) హేత్వర్థక వాక్యం
సి) సామర్థార్థక వాక్యం
డి) కర్మణి వాక్యం
జవాబు:
సి) సామర్థార్థక వాక్యం

55. తప్పక పాఠం వింటాను – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) అనుకరణ వాక్యం
బి) నిశ్చయార్థక వాక్యం
సి) తద్ధర్మార్థక వాక్యం
డి) హేత్వర్థక వాక్యం
జవాబు:
బి) నిశ్చయార్థక వాక్యం

56. అందరు వెళ్ళండి – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) కరణి వాక్యం
బి) కరరి వాక్యం
సి) ఆత్మార్థక వాక్యం
డి) విధ్యర్థక వాక్యం
జవాబు:
డి) విధ్యర్థక వాక్యం

అలంకారాలు :

57. ఉపమానోపమేయాలకు అభేదం చెప్పండి.
ఎ) ఛేకానుప్రాసాలంకారం
బి) రూపకాలంకారం
సి) యమకాలంకారం
డి) వృత్త్యనుప్రాసాలంకారం
జవాబు:
బి) రూపకాలంకారం

AP Board 8th Class Telugu Important Questions Chapter 6 ప్రకృతి ఒడిలో

58. ఈ రాజు సాక్షాత్తు శంకరుడే – ఇందులోని అలంకారం గుర్తించండి.
ఎ) అనన్వయ
బి) రూపక
సి) అతిశయోక్తి
డి) అర్థాంతరన్యాస
జవాబు:
బి) రూపక

సొంతవాక్యాలు :

59. అభినందనలు : పరీక్షలో మంచి ర్యాంకు సాధించడం వల్ల నాకు అభినందనలు అందాయి.

60. పసిగట్టు : పాములు మనిషి జాడను పసిగడతాయి.

61. వైపరీత్యము : సముద్ర తీరాన ఉన్నవారికి ప్రకృతి వైపరీత్యాలు ఎక్కువ.

62. ప్రకంపన : ఈ మధ్య చైనాలో భూ ప్రకంపనలు తరచుగా వస్తున్నాయి.

63. ప్రతిపాదించు : మా గురువులు ప్రతిపాదించిన విషయాల్ని మేము తప్పక అంగీకరిస్తాము.

64. హడావిడిగా : నేను ఈ రోజు బడికి హడావిడిగా వచ్చాను.

65. రుజువు చేయు : శాస్త్రజ్ఞులు విషయాన్ని రుజువు చేసి చూపిస్తారు.

66. అంచనా వేయు : నా మిత్రునికి రాబోయే విషయాల్ని అంచనావేయు శక్తి ఉంది.

67. నిరూపించు : శాస్త్రజ్ఞులు విషయాన్ని నిరూపిస్తారు.

విశేషాంశాలు

1. ప్రకృతి వైపరీత్యాలు అంటే : ప్రకృతిలో ఏర్పడే విపరీత పరిస్థితులు భూకంపము, సునామీ, వరదలు, తుపానులు మొదలైనవి.

2. విశ్లేషణ శక్తి అంటే : విషయాన్ని విభజించి పరిశీలించే శక్తి.

3. శాస్త్ర దృష్టి అంటే : ప్రతి సంఘటనకూ వెనుక ఉన్న భౌతిక కారణాన్ని పరిశోధించి తెలిసికొనే దృష్టి.

4. కళాదృష్టి అంటే : సౌందర్య రసాస్వాదన దృష్టి.

5. భ్రమలు అంటే : లేనిదానిని ఉన్నట్లుగా భ్రాంతి చెందే దృష్టి.

6. ఇంద్రియ జ్ఞానం అంటే : మన ఇంద్రియాలు గ్రహించే జ్ఞానం.

7. జ్ఞానమంటే : సమాచారాన్ని జ్ఞాపకం పెట్టుకోవడం కాదు. జ్ఞానం అంటే ఆ జ్ఞానం కల్గించిన విచక్షణాశక్తితో గ్రహించడం.

AP Board 8th Class Telugu Solutions ఉపవాచకం Chapter 5 జీవ గడియారాలు

AP State Syllabus AP Board 8th Class Telugu Textbook Solutions ఉపవాచకం Chapter 5 జీవ గడియారాలు Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Telugu Solutions ఉపవాచకం 5th Lesson జీవ గడియారాలు

8th Class Telugu ఉపవాచకం 5th Lesson జీవ గడియారాలు Textbook Questions and Answers

I. అవగాహన – ప్రతిస్పందన

కింది పరిచిత గద్యాలను చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

1. చురుకుగా ఉండే సమయాన్ని ఆధారం చేసుకొని జంతు ప్రపంచంలోని జంతువులను రెండు వర్గాలుగా విభజించారు. దివాచరాలు-పగలు చురుగ్గా ఉండేవి. నిశాచరాలు – రాత్రివేళ చురుగ్గా ఉండేవి.

మన ఇంట్లో ఉండే ఎలుకలు, బొద్దింకలు, దోమలు ఇత్యాదులు రాత్రివేళ మాత్రమే బయటకు వస్తాయి. పగలు విశ్రాంతి తీసుకుంటాయి. పిచ్చుకలు, కాకులు, ఆవులు, ఇతర జంతువులు పగలు చురుగ్గా ఉంటాయి. మానవునితో సహవాసం చేస్తున్నందుకుగాను కుక్క పిల్లి వంటి జంతువులు పగటివేళ మేలుకుని ఉన్నా, రాత్రిళ్లు మాత్రం చురుగ్గా ఉంటాయి. కారణం సహజసిద్ధంగా అవి రాత్రిళ్లు ఆహారం కోసం వేటాడతాయి. ఈ జీవులను శాస్త్రవేత్తలు రకరకాల పరీక్షలకు గురిచేసారు. ఉదాహరణకు రాత్రిపూట సంచరించే గబ్బిలాన్ని పగటి సమయంలో చీకటి గదిలో ఉంచడం, పగటిపూట సంచరించే ఉడతను రాత్రిపూట పగటిలా వెలుగులో వుంచడం వంటివి. అన్ని పరీక్షలలోనూ, జీవులన్నీ, ఈ దైనందిన లయలను నిర్దిష్ట క్రమంలోనే ప్రదర్శిస్తాయి అని రుజువైంది.
ప్రశ్నలు :
1. గబ్బిలాలు పగటిపూట ఏ గదిలో ఉంటాయి?
జవాబు:
గబ్బిలాలు పగటిపూట చీకటిగదిలో ఉంటాయి.

2. పగలు మాత్రమే విశ్రాంతి తీసుకునే జంతువులు ఏవి?
జవాబు:
ఎలుకలు, బొద్దింకలు, కోతులు మొదలైనవి పగలు విశ్రాంతి తీసుకుంటాయి.

3. రాత్రిళ్ళు ఆహారం కోసం వేటాడే జంతువులు ఏవి?
జవాబు:
రాత్రిళ్ళు ఆహారం కోసం వేటాడే జంతువులు కుక్కలు, పిల్లులు.

4. ప్రపంచంలోని జంతువులను ఎన్ని వర్గాలుగా విభజించారు?
జవాబు:
ప్రపంచంలోని జంతువులను రెండు వర్గాలుగా విభజించారు.

AP Board 8th Class Telugu Solutions ఉపవాచకం Chapter 5 జీవ గడియారాలు

2. ఈ దైనందిన లయలు జంతువులకు మాత్రమే పరిమితం అనుకుంటే పొరపాటే. మొక్కలలో కూడా ఇవి ఉంటాయి. కొన్ని చెట్ల ఆకులు మన మాదిరిగా రాత్రికాగానే నిద్రపోయి తెల్లవారగానే మేలుకుంటాయి. చిక్కుడు జాతికి చెందిన కొన్ని మొక్కలలో ఆకులు ఉదయం నిక్కబొడుచుకొని ఉండి, సాయంత్రానికి వాలిపోతాయి. అలాగే పూలు వికసించడం కూడా. ఈ మొక్కలను పూర్తిగా చీకటిలో ఉంచినా, లేదా 24 గంటలూ వెలుగులో ఉంచినా వాటి పనిలో మార్పురాదు. ఒక మల్లెపూవును పగటివేళ కటిక చీకటిగదిలో ఉంచినా కూడా వికసింపచేయడం సాధ్యం కాదు. ఈ విధంగా సూర్యుని వెలుతురు ఆధారం చేసుకొని జీవులు చూపే, ఈ మార్పులను పగటిలయలు – ‘డయర్నల్ రిథమ్స్’ అంటారు.
ప్రశ్నలు:
1. ఏ పూవును పగటివేళ, కటికచీకటి గదిలో ఉంచినా వికసింపచేయడం సాధ్యం కాదు?
జవాబు:
మల్లెపూవును పగటివేళ కటిక చీకటిలో ఉంచినా వికసింపచేయడం సాధ్యం కాదు.

2. జీవగడియారాలకు గల మరొక పేరు ఏమి?
జవాబు:
జీవగడియారాలకు గల మరొక పేరు శరీరధర్మ గడియారాలు.

3. లయలు జంతువులకు మాత్రమే కాకుండా వేటికి ఉంటాయి?
జవాబు:
లయలు జంతువులకు మాత్రమే కాకుండా మొక్కలకు కూడా ఉంటాయి.

4. ఏ జాతికి చెందిన ఆకులు ఉదయం పూట నిక్కపొడుచుకొని ఉంటాయి?
జవాబు:
చిక్కుడు జాతికి చెందిన కొన్ని మొక్కల ఆకులు ఉదయం పూట నిక్కపొడుచుకొని ఉంటాయి.

3. సీతాకోకచిలుకలు పుట్టిన వెంటనే సూర్యతాపానికి గురికాకుండా ఉండడానికి తెల్లవారుఝామునే ప్యూపా నుండి బయటకు వస్తాయి. కీటకాలు మకరందం లభించే సమాయల్లో చురుగ్గా ఉంటాయి. మొక్కలు కూడా కీటకాలు చురుగ్గా ఉండే సమయాల్లోనే పుష్పాలు వికసింపచేస్తాయి. ఇది పరస్పర సంబంధాలపై ఆధారపడి ఉంటుంది.

ఒక జీవి పుట్టిన నాటి నుండి ఏర్పడిన ఈ లయలు, ఆ జీవి బాహ్యపరిస్థిలులు మారినా లయలు మాత్రం మారవు. అందుకే కాబోలు పుట్టుకతో వచ్చిన బుద్దులు పుడకలతో కానిపోవు అంటారు మనవాళ్లు.
ప్రశ్నలు:
1. సీతాకోకచిలుకలు ఎందుకోసం ప్యూపా నుండి బయటకు వస్తాయి?
జవాబు:
సీతాకోక చిలుకలో సూర్యతాపానికి గురికాకుండా ఉండడానికి వీలుగా ప్యూపా నుండి బయటకు వస్తాయి.

2. కీటకాలు ఏ సమయాల్లో చురుగ్గా ఉంటాయి?
జవాబు:
కీటకాలు మకరందం లభించిన సమయాల్లో చురుగ్గా ఉంటాయి.

3. ఈ పేరాలోని సామెత ఏది?
జవాబు:
ఈ పేరాలోని సామెత – “పుట్టుకతో వచ్చిన బుద్ధులు పుడకలతో కానిపోవు”.

4. మొక్కలు ఏ సమయాల్లో పూలను వికసింపచేస్తాయి?
జవాబు:
మొక్కలు కీటకాలు చురుగ్గా ఉండే సమయాల్లో పుష్పాలు వికసింపచేస్తాయి.

AP Board 8th Class Telugu Solutions ఉపవాచకం Chapter 5 జీవ గడియారాలు

4. సముద్రపు ఒడ్డున నివసించే ఫిడ్లర్ క్రాబ్’ అనే వాయులీన పీత, ఉదయం ముదురు రంగులో ఉండి, రాత్రిళ్ళు లేతరంగులకు మారిపోతుంది. బహుశః శత్రువులనుండి రక్షించుకోవడానికి కాబోలు ఈ రంగులు మార్చడం, దాన్ని ఎప్పుడూ వెలుతురు ఉండే ఎ.సి.గదిలోకి మార్చినా, రంగుల మార్పిడిలో మాత్రం తేడా రాలేదు. అంటే సూర్యునితో సంబంధం లేకుండానే ఈ లయ కొనసాగుతుందన్నమాట. “పీత కష్టాలు పీతవి”. అలాగే నిద్రగన్నేరు మొక్కలో ఆకుల కదలిక ఈ కోవకు చెందినదే.

మానవులలో ఆహారం తీసుకోవడం ఒక అలవాటుగా మారడం వలన ఈ లయలో కొంత మార్పు ఉండవచ్చు. ప్రతిరోజూ నియమబద్ధంగా ఆహారం తీసుకొనే వారికి, నిర్ణీత సమయానికే ఆకలి వేస్తుంది. రోజుకు ఒకసారి మాత్రమే భోజనం చేసేవారికి రోజులో ఒకసారి మాత్రమే ఆకలి వేస్తుంది. అలాగే నిద్ర, మెలకువ కూడా,
ప్రశ్నలు :
1. సముద్రపు ఒడ్డున నివసించే వాయులీన పీత పేరు ఏమి?
జవాబు:
సముద్రపు ఒడ్డున నివసించే వాయులీన కేత ఫిడ్లర్ క్రాబ్.

2. వాయులీన పీత ఎందుకు రంగులను మార్చుకుంటుంది?
జవాబు:
వాయులీన పీత శత్రువుల నుండి రక్షించుకోవడానికి రంగులను మారుస్తుంది.

3. నిర్ణీత సమయానికి ఎవరికి ఆకలి వేస్తుంది?
జవాబు:
ప్రతిరోజు నియమబద్ధంగా ఆహారం తీసుకొనే వారికి నిర్ణీత సమయానికి ఆకలి వేస్తుంది.

4. సంవత్సరం పొడవునా ఏవి సమానంగా ఉండవు?
జవాబు:
సంవత్సరం పొడవునా పగలు, రాత్రి సమానంగా ఉండవు.

AP Board 8th Class Telugu Solutions ఉపవాచకం Chapter 5 జీవ గడియారాలు

5. మొక్కలు చైతన్యవంతంగా ఉన్నప్పుడే పోషకాలు అందించడం ద్వారా వృధావ్యయాన్ని తగ్గించి, అధిక దిగుబడి సాధించవచ్చు. చేపలు, రొయ్యలు ఎప్పుడు ఆహారాన్ని ఎక్కువ తీసుకుంటాయో, తెలియడం వలన చేపల చెరువు శుభ్రంగా ఉండటమే కాక వృధా వ్యయం తగ్గుతుంది. కోళ్ల ఫారంలో ఎక్కువ సమయం వెలుగు ఉంచడం వలన గ్రుడ్లు ఉత్పత్తి పెరగడం రైతులందరికీ తెలిసిందే. పగలు తక్కువ ఉన్న కాలంలో గొర్రెలలో ఉన్ని ఎక్కువవుతుంది. కాబట్టి ఎండాకాలం చీకటిలో ఉంచడం వలన ఉన్ని ఉత్పత్తి ఎక్కువ చేయవచ్చు. ఇక మన సంగతి, రక్తంలో కొలెస్టరాల్, గ్లూకోజ్ శాతం లయబద్ధంగా మారుతుంటుంది. కాబట్టి ఏ సమయంలో మనం మందులు వాడితే పూర్తి స్థాయిలో ఫలితం ఉంటుందో డాక్టర్లు నిర్ణయిస్తారు. ఉదాహరణకు ఆస్తమా రోగులలో రాత్రిళ్లు శ్వాస సమస్యలు అధికమౌతాయి. అందుచేత ఎడ్రినలిన్ అనే ఇంజక్షన్ రాత్రిళ్ళు ఇస్తారు. అలాగే ఇన్సులిన్ ఇంజక్షన్ రక్తంలో గ్లూకోజ్ శాతం పెరిగినపుడే ఇవ్వాలి.
ప్రశ్నలు:
1. ఏ రకంగా మొక్కల నుండి అధిక దిగుబడిని సాధించవచ్చు?
జవాబు:
మొక్కలు చైతన్యవంతంగా ఉన్నప్పుడే పోషకాలు అందించడం ద్వారా వృధా వ్యయాన్ని తగ్గించి అధిక దిగుబడిని సాధింపవచ్చు.

2. గొర్రెలలో ఎప్పుడు ఉన్ని ఎక్కువగా ఉంటుంది?
జవాబు:
గొర్రెలలో పగలు తక్కువ ఉన్న కాలంలో ఉన్ని ఎక్కువగా ఉంటుంది.

3. ఆస్తమా రోగుల్లో రాత్రిళ్ళు ఏ సమస్యలు అధికం అవుతాయి?
జవాబు:
ఆస్తమా ఉన్న రోగుల్లో రాత్రిళ్ళు శ్వాససంబంధమైన సమస్యలు అధికమౌతాయి.

4. ఇన్సులిన్ ఇంజక్షన్ ఎప్పుడు ఇవ్వాలి?
జవాబు:
ఇన్సులిన్ ఇంజక్షన్ రక్తంలో గ్లూకోజ్ శాతం పెరిగినప్పుడే ఇవ్వాలి.

II. వ్యక్తీకరణ – సృజనాత్మకత

క్రింది ప్రశ్నలకు జవాబులను రాయండి.

ప్రశ్న 1.
డయర్నల్ రిథమ్స్ అంటే ఏమిటి? వివరించండి.
జవాబు:
భూమిపై నివసించే జీవులన్నింటిలో జరిగే కార్యకలాపాలు నిర్ణీత సమయాలను అనుసరించి ఆవృత్తి అవుతుంటాయి. మానవులలో ఎన్ని గంటలకు నిద్రపోవాలి? ఎన్ని గంటలకు నిద్రలేవాలి? ఎప్పుడు భోజనం చేయాలి ? అనే విషయాలు మనం ఆరేడు నెలల వయసులో ఉన్నప్పుడే స్థిరపడిపోతాయి. ఈ గడియారాలు మనకు కనిపించకపోయినా వాటి ప్రభావం తెలుస్తూనే ఉంటుంది. మనకు అనుభవంలోకి వచ్చే, మనకు కనపించకుండా మన శరీరంలో ఉన్న ఈ జీవగడియారాలే మూలం.

మానవుల్లాగే జంతువులు కూడా ఈ భూమ్మీద తమ కార్యకలాపాలు నిర్వహిస్తుంటాయి. జంతువుల విషయానికొస్తే చురుకుగా ఉండే సమయాన్ని ఆధారం చేసుకొని జంతు ప్రపంచంలోని జంతువులను రెండు వర్గాలుగా విభజించారు. అవి :
1) దివాచరాలు (పగలు చురుగ్గా ఉండేవి)
2) నిశాచరాలు (రాత్రివేళ చురుగ్గా ఉండేవి)

మన ఇంట్లో ఉండే ఎలుకలు, బొద్దింకలు, దోమలు, ఇత్యాదులు రాత్రివేళ మాత్రమే బయటకు వస్తాయి. పగలు ఇవి విశ్రాంతి తీసుకుంటాయి. పిచ్చుకలు, కాకులు, ఆవులు, ఇతర జంతువులు పగలు చురుగ్గా ఉంటాయి. కుక్క పిల్లి వంటి జంతువులు పగటివేళ మేలుకుని ఉన్నా, రాత్రిళ్ళు ఆహారం కోసం వేటాడతాయి. ఈ జీవులను శాస్త్రవేత్తలు రకరకాలుగా పరీక్షలు చేశారు. ఉదాహరణకు రాత్రిపూట సంచరించే గబ్బిలాన్ని పగటి సమయంలో చీకటి గదిలో ఉంచడు. పగటిపూట సంచరించే ఉడతను రాత్రిపూట పగటిలా వెలుగులో ఉంచడం వంటివి. అన్ని పరీక్షలలోనూ, జీవులన్నీ ఈ దైనందిన లయలను నిర్దిష్ట క్రమంలోనే ప్రదర్శిస్తాయని ఋజువైంది.

ఈ దైనందిన లయలు జంతువులకు పరిమితం అనుకుంటే పొరపాటే. మొక్కలలో కూడా ఇవి ఉంటాయి. కొన్ని చెట్ల ఆకులు మన మాదిరిగానే రాత్రికాగానే నిద్రపోయి తెల్లవారగానే మేలుకుంటాయి. చిక్కుడు జాతికి చెందిన కొన్ని మొక్కలలో ఆకులు ఉదయం నిక్కబొడుచుకుని ఉండి, సాయంత్రానికి వాలిపోతాయి. అలాగే పూలు వికసించడం కూడా అంతే. ఈ మొక్కలను పూర్తిగా చీకటిలో ఉంచినా, లేదా 24 గంటలూ వెలుగులో ఉంచినా వాటి పనిలో మార్పు రాదు. ఒక మల్లెపువ్వును పగటివేళ కటిక చీకటిగదిలో ఉంచినా కూడా వికసింపజేయడం సాధ్యం కాదు. ఈ విధంగా సూర్యుని వెలుతురు ఆధారం చేసుకొని జీవులు చంపే ఈ మార్పులను పగటిలయలు – “డయర్నల్ రిథమ్స్” అని అంటారు. ఈ విధంగా మానవులు, జంతువులు మరియు మొక్కలు దైనందిన లయలు ఈ డయర్నల్ రిథమ్స్ ని ఆధారం చేసుకొని నడుస్తుంటాయి.

AP Board 8th Class Telugu Solutions ఉపవాచకం Chapter 5 జీవ గడియారాలు

2. జెట్ బాగ్ అంటే ఏమిటి? వివరించండి.
జవాబు:
మానవులలో, జంతువులలో, మొక్కలలో ఉండే జీవగడియారాల వల్లనే అవి ఎప్పుడు ఏ పనిచేయాలో నిర్ధారణ జరుగుతుంది. జీవుల శరీరంలోని గడియారంలో ఏ పని సమర్థవంతంగా చేయగలదో నిర్ణయిస్తుంది. మొక్కలు సూర్యుడు ఉండే పగటివేళలోనే ఆహారాన్ని తయారు చేయగలుగుతాయి. అంటే రాత్రివేళ ఆకులు విస్తరించి ఉండడం వలన ఉపయోగం ఉండదు. మనం చేతి గడియారం చూసుకొని ఏ పని ఎప్పుడు చేయాలో నిర్ణయించుకుంటాం. అలాగే సీతాకోకచిలుకలు పుట్టిన వెంటనే సూర్య తాపానికి గురికాకుండా ఉండడానికి తెల్లవారుఝామునే ప్యూపా నుండి బయటకు వస్తాయి. కీటకాలు మకరందం లభించే సమయాల్లో చురుగ్గా ఉంటాయి. మొక్కలు కూడా కీటకాలు చురుగ్గా ఉండే సమయాల్లోనే పుష్పాలు వికసింపజేస్తాయి. ఇది పరస్పర సంబంధాలపై ఆధారపడి ఉంటుంది.

ప్రతిరోజు నియమం ప్రకారం భోజనం చేసేవారికి నిర్ణీత సమాయానికే ఆకలి వేస్తుంది. రోజుకు ఒకసారి భోజనం చేసేవారికి ఒకసారి మాత్రమే ఆకలి వేస్తుంది. అలాగే నిద్ర, మెలకువ, కూడా అంతే. ప్రతిరోజు జీవుల శరీరంలోని ఈ కనిపించని గడియారం తనకు తాను సరిచేసుకుంటుంది. ఈ గడియారాన్ని మనం కృత్రిమంగా కూడా సరిచేయవచ్చు.

మనం విమానంలో ఖండాంతర ప్రయాణం చేసినప్పుడు అక్కడి రాత్రి, పగలు షిఫ్ట్ లో పనిచేసేవారికి, ఈ తేడాను అలవాటుపడటానికి కొంత సమయం పడుతుంది. ఎంత ప్రయత్నం చేసినా నిర్ణీత సమయం మించి మేల్కొనడం సాధ్యం కాదు. ఈ విధంగా శరీరంలోని లయలను అలవాటు ద్వారా కృత్రిమంగా సరిచేయడాన్ని “జెట్ లాగ్” అంటాము.

“జెట్ బాగ్” అనేది కృత్రిమ ప్రక్రియ. ఇది కేవలం ప్రయత్నం, అలవాటు ద్వారానే కొనసాగించబడుతుంది.

AP Board 8th Class Telugu Solutions ఉపవాచకం Chapter 5 జీవ గడియారాలు

3. జీవగడియారాలు పాఠం నుండి మీరు ఏమి గ్రహించారో సంక్షిప్తంగా గ్రహించండి.
జవాబు:
మానవ జీవన విధానంలో నిర్దిష్ట సమయంలో కార్యకలాపాలను నిర్దిష్ట సమయంలో నిర్వహించాలంటే దానికి గడియారం చాలా అవసరం. గడియారాలు రాకముందు మనిషికి సమయాన్ని తెలియజేసిన, ఇప్పటికీ తెలియజేస్తున్న జీవ గడియారం కోడిపుంజు. ఇది రోజులో నిర్ణీత సమయాలలో చాలాసార్లు కూస్తుంది. కోడిపుంజు ఇలా కూయడానికి కారణం దాని శరీరంలో ఉన్న, ఎవరికీ కనిపించని గడియారం.

దాని ప్రభావం వల్ల అది అప్రయత్నంగానే కూస్తుంది. మనుషుల్లో కూడా ఎప్పుడు భోంచేయాలి? ఎప్పుడు నిద్రపోవాలి? ఎప్పుడు మేల్కొనాలి? అనేది మన శరీరంలో కనిపించకుండా ఉన్న ఈ జీవగడియారాల వల్లనే తెలుస్తుంది. 24 గంటల కాలంలో ఒక జీవి ప్రదర్శించే దైనందిన కార్యకలాపాలను ‘దైనందిన లయలు’ లేదా సర్కేడియన్ రిథమ్స్ అని అంటారు. ఈ లయలు గడియారంలో 24 గంటలను పోలి యుంటాయి. అందువల్ల వీటిని జీవగడియారం లేదా శరీర ధర్మగడియారం అనవచ్చు.

మన చేతి గడియారం మాదిరిగానే జీవుల శరీరంలోని గడియారం ఏ సమయంలో జీవి ఒక పనిని సమర్థవంతంగా చేయగలదో నిర్ణయిస్తుంది. మొక్కలు సూర్యుడు ఉండే పగటివేళలోనే ఆహారాన్ని తయారు చేయగలుగుతాయి. సీతాకోకచిలుకలు పుట్టిన వెంటనే సూర్యతాపానికి గురికాకుండా ఉండడానికి తెల్లవారుఝామునే ప్యూపా నుండి బయటకు వస్తాయి. కీటకాల మకరందం లభించే సమయాల్లో చురుగ్గా ఉండడం కూడా ఈ “జీవ గడియారాల” ద్వారానే జరుగును. ఒక జీవికి పుట్టిన నాటి నుండి ఏర్పడిన లయలు, ఆ జీవి బాహ్య పరిస్థితులు మారినా లయలు మాత్రం మారవు. అందుకే మన పెద్దలు “పుట్టుకతో వచ్చిన బుద్ధులు పుడకలతో కాని పోవు” అంటారు.

తెలతెలవారుతుండగానే సందడిచేసే కాకులు, చీకటి పడగానే ముడుచుకుపోయే ఆకులు, 21 రోజులు రాగానే గుడ్డులోంచి బయటకు వచ్చే కోడిపిల్ల ఇలా ఎన్నెన్నో ప్రకృతి నియమాలను తెలియజేస్తాయి. ఇంత లయబద్దంగా కదులుతున్న ప్రకృతిని చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అందుకే ప్రకృతి తన గురించి తెలుసుకోమంటే నిరంతరం సవాళ్ళు విసురుతూనే ఉంటుంది. ఈ ప్రకృతి నియమాలు, జీవుల దైనందిన కార్యకలాపాలు ఈ జీవ గడియారాల వల్లనే నిరంతరంగా, నిర్దిష్టంగా, నియమిత సమయాలకనుగుణంగా పనిచేస్తున్నాయి.

AP Board 8th Class Telugu Important Questions Chapter 4 అజంతా చిత్రాలు

AP State Syllabus AP Board 8th Class Telugu Important Questions Chapter 4 అజంతా చిత్రాలు.

AP State Syllabus 8th Class Telugu Important Questions 4th Lesson అజంతా చిత్రాలు

8th Class Telugu 4th Lesson అజంతా చిత్రాలు Important Questions and Answers

I. అవగాహన – ప్రతిస్పందన

ఆ) కింది అపరిచిత గద్యాలను చదవండి. ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

*ఈ క్రింది వచనాలను చదివి వాటి క్రింద ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.

1. ‘మన ఆంధ్రదేశంలో గుంటూరు జిల్లాలో, నరసరావుపేటకు ఏడుమైళ్ళ దూరంలో “కోటప్పకొండ” ఉంది. ఆ కొండ మీద 600 అడుగుల ఎత్తున కోటేశ్వర స్వామి గుడి ఉంది. పూర్వపు శాసన ఆధారాలను బట్టి క్రీ.శ. 11వ శతాబ్దానికే ఈ గుడి ఉందని తెలుస్తోంది. ఈ కొండ ఎత్తు 1587 అడుగులు. ఈ కొండ చుట్టూ రాళ్ళ మధ్యలో చిన్న చిన్న నీటి గుంటలున్నాయి. వీనిని “దొనలు” అంటారు. ఈ కొండ మధ్యలో “పాపనాశనము” అనే తీర్థం ఉంది. ఇది శివుడు త్రిశూలంతో కొడితే ఏర్పడింది. దీనిలో స్నానం చేస్తే పాపాలు పోతాయని నమ్మకం.
ప్రశ్నలు :
1. కోటప్ప కొండ ఎక్కడ ఉంది?
జవాబు:
కోటప్పకొండ గుంటూరు జిల్లాలో, నరసరావుపేటకు ఏడుమైళ్ళ దూరంలో ఉంది.

2. కోటప్పకొండపై ఎవరి గుడి ఉంది ? అది ఎంత ఎత్తు?
జవాబు:
కోటప్పకొండపై కోటేశ్వరస్వామివారి గుడి ఉంది. ఆ కొండ 1587 అడుగుల ఎత్తు.

3. కోటప్పకొండ పైనున్న గుడి యొక్క ప్రాచీనత ఎట్టిది?
జవాబు:
ఈ గుడి క్రీ.శ. 11వ శతాబ్దానికి చెందినది. కొండ మధ్యలో పాపనాశనము అనే తీర్థం ఉంది. దీనిలో స్నానం చేస్తే పాపాలు పోతాయని నమ్మకం.

4. దొనలు అంటే ఏమిటి?
జవాబు:
కొండ చుట్టూ రాళ్ళ మధ్యలో చిన్న చిన్న నీటి గుంటలున్నాయి. వీటిని దొనలు అంటారు.

2. శ్రీశ్రీ అసలు పేరు శ్రీరంగం శ్రీనివాసరావు. ఆయన భావ కవిత్వం పై తిరుగుబావుటా ఎగురవేసి అభ్యుదయ ఉద్యమానికి నాంది పలికాడు. ఆ తరువాత విప్లవ కవిత్వమునకు స్ఫూర్తినిచ్చాడు. “అనితర సాధ్యం నా మార్గం” అని చాటిన ప్రజాకవి. “మహాప్రస్థానం” కావ్యం, “సిరిసిరి మువ్వ శతకం” శ్రీశ్రీకి మంచి కీర్తిప్రతిష్ఠలు సంపాదించి పెట్టాయి. ఆయన సమాజాన్ని చైతన్యపరిచే రచనలెన్నో చేశాడు. అందుకే సాహిత్య విమర్శకులు ఆయనను అభ్యుదయ కవిత్వానికి యుగకర్త అంటారు.
ప్రశ్నలు :
1. శ్రీశ్రీ అసలు పేరేమి?
జవాబు:
శ్రీరంగం శ్రీనివాసరావు.

2. ఆయన అభ్యుదయ భావాలు దేనికి స్ఫూర్తినిచ్చాయి?
జవాబు:
ఆయన అభ్యుదయ భావాలు విప్లవ కవిత్వానికి స్ఫూర్తినిచ్చాయి.

3. తన రచనాశైలి విషయంలో ఆయన ఏమని చాటుకొన్నాడు?
జవాబు:
‘అనితర సాధ్యం నా మార్గం’ అని శ్రీ శ్రీ తన రచనా శైలి విషయంలో చాటుకొన్నాడు.

4. శ్రీశ్రీకి కీర్తి ప్రతిష్ఠలు తెచ్చిన రచనలు ఏవి?
జవాబు:
మహాప్రస్థానం అనే కావ్యం, సిరిసిరి మువ్వ అనే శతకం శ్రీశ్రీకి కీర్తిప్రతిష్ఠలు తెచ్చి పెట్టిన రచనలు.

AP Board 8th Class Telugu Important Questions Chapter 4 అజంతా చిత్రాలు

3. జనపదం అంటే పల్లెటూరు. జనపదాలలో ఉండేవారు జానపదులు. జానపదులు పాడే పాటలు లేక గేయాలను జానపద గేయాలంటారు. వీటిని ఆంగ్లంలో ‘ఫోక్ సాంగ్స్’ అంటారు. ఉత్తర భారతదేశంలో జానపద గేయాలను లోక్ గీత్ లేదా లోక్ సాహిత్య అంటారు. జానపద సాహిత్యం సమిష్టి సంపద. శిష్ట సాహిత్యంలాగా కాక జానపద సాహిత్యం పలువురి చేతులలో పెరిగింది. ఇది దాని మొదటి లక్షణం. గేయ రచనా కాలం స్పష్టంగా ఉండకపోవడం మరో లక్షణం. నదీ నదాలు, వాగులు, వంకలూ మనకు ఉపయోగపడక సముద్రం పాలైనట్లే జానపద గేయస్రవంతి కూడా చాలా భాగం మనకు అందలేదు. జానపద సాహిత్యాన్ని భద్రపరచవలసిన అవసరం ఉన్నది.
ప్రశ్నలు :
1. జానపదులు అంటే ఎవరు?
జవాబు:
జనపదాల్లో ఉండేవారిని జానపదులు అంటారు.

2. ఉత్తర భారతదేశంలో జానపదాలను ఏమంటారు?
జవాబు:
ఉత్తర భారతదేశంలో జానపదాలను ‘లోక్ గీత్’ (లేదా) ‘లోక్ సాహిత్య’ అని అంటారు.

3. జానపద సాహిత్యం ప్రథమ లక్షణం ఏమిటి?
జవాబు:
సమిష్టి సంపదయై, పలువురి చేతులలో పెరుగుట జానపద సాహిత్య ప్రథమ లక్షణం.

4. ఆంగ్లములో జానపద గేయాల్ని ఏమంటారు?
జవాబు:
ఆంగ్లములో జానపద గేయాలను “ఫోక్ సాంగ్స్” అని అంటారు.

4. . మేధా సంపత్తి విషయంలో స్త్రీలకు, పురుషులకు భేదం లేదన్నది వైజ్ఞానిక వాస్తవం. స్త్రీ విద్యావంతురాలైతే కుటుంబం అంతా విద్యావంతమవుతుంది అనేది ఎంతయినా యథార్థం. ఒక దేశం యొక్క సంస్కృతి, వికాసం, ప్రగతి ఆ దేశంలోని స్త్రీలందరూ విద్యావంతులా, కాదా అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఆధునిక యుగంలో విద్య మానవునికి ఒక ముఖ్యమైన జీవితావసరంగా కూడా మారింది. నిరక్షరాస్యతా నిర్మూలన, పేదరికం తొలగింపు ఒక ప్రాథమిక అవసరంగా భావించి వాటిని రాజ్యాంగంలో పొందుపరచడమైనది.
ప్రశ్నలు :
1. యథార్థమైనది ఏది?
జవాబు:
స్త్రీ విద్యావంతురాలైతే కుటుంబమంతా విద్యావంతమవుతుంది.

2. ఒక దేశ సంస్కృతి, ప్రగతి దేని మీద ఆధారపడి ఉంటుంది?
జవాబు:
ఒక దేశ సంస్కృతి, ప్రగతి ఆ దేశంలోని స్త్రీలందరూ విద్యావంతులా కాదా అనే దాని మీద ఆధారపడి ఉంటుంది.

3. రాజ్యాంగంలో పొందుపరచిన ప్రాథమిక అవసరాలేవి?
జవాబు:
నిరక్షరాస్యతా నిర్మూలన, పేదరికం తొలగింపు అనే ప్రాథమిక అవసరాలు రాజ్యాంగంలో పొందుపరచ బడ్డాయి.

4. వైజ్ఞానిక వాస్తవం ఏమిటి?
జవాబు:
మేధాసంపత్తి విషయంలో స్త్రీలకు, పురుషులకు భేదం లేదన్నది వైజ్ఞానిక వాస్తవం.

5. ఈ కింది పరిచిత గద్యాన్ని చదివి, ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి. (S.A. 1 – 2018-19)

ఈ గుహలను సమీపిస్తుంటే ఇటు పచ్చనికొండ, అటు పచ్చనికొండ. ఈ రెండు కొండల మధ్య ‘వాఘోరా’ నది రాళ్ళ గుట్టల గుండా జలజలా ప్రవహిస్తూ నది పాడుకొనే పాటలను వింటూ, నది అంచు వెంట కాలినడకన, గుహలకు చేరాలి. మీ పైన నీలాకాశం, మీమ్ము అలరిస్తూ అడవి పువ్వులు, మిమ్ము ఆవరిస్తూ ఆ పువ్వుల కమ్మని నెత్తావులు. గుహలను చేరేవరకు రెండు, మూడు మెలికలను కాబోలు మీరు తిరుగుతారు. ఏ మెలికలో అడుగు పెడితే, దానికి అదే ఒక ప్రపంచం.
ప్రశ్నలు
1. గుహల సమీపంలో ప్రవహిస్తున్న నది పేరేమిటి?
జవాబు:
వా ఘోరా నది

2. కణకణ, గడగడ ఇటువంటి పదాలను ధ్వన్యనుకరణ పదాలు అంటారు. పై పేరాలో అటువంటి పదం ఉంది. వెతికి రాయండి.
జవాబు:
జలజల

3. “పువ్వుల కమ్మని నెత్తావులు” అంటే ఏమిటి?
జవాబు:
పువ్వుల కమ్మని పరిమళాలు

4. పై పేరా ఆధారంగా ఒక ప్రశ్న తయారుచేయండి.
జవాబు:
‘మెలిక’ అంటే ఏమిటి?

AP Board 8th Class Telugu Important Questions Chapter 4 అజంతా చిత్రాలు

6. ఈ కింది పరిచిత గద్యాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి. (S.A. II – 2017-18)

అజంతా చిత్రాలలో అధిక భాగం జాతక కథలే. సిద్ధార్థుడిగా జన్మించడానికి పూర్వం గౌతమబుద్దుడు కొన్ని వందల జన్మలు ఎత్తినాడని బౌద్ధవుతస్తుల నమ్మకం. పూర్వ జన్మలలో బుద్ధుని జీవిత చరిత్రలే జాతక కథలు. ఉత్తమ మానవ జన్మలనే కాకుండా పక్షిరాజుగా, గజేంద్రుడిగా ఎన్నెన్నో జన్మలను ఆయన ఎత్తినట్లు జాతక కథలు పేర్కొంటున్నాయి. ఈ వివిధ జన్మలలో కొన్నింటికి సంబంధించిన ఘట్టాలను అజంతా చిత్రాలలో చూడవచ్చు. అయితే అజంతా చిత్రాలన్నీ జాతక కథలే కావు. జాతక కథలతో ఎలాంటి సంబంధం లేనివీ ఎన్నో ఉన్నాయి. వెలితిగా కాస్త చోటు కనబడితే చాలు దానిలో ఏ ఆకునో, రెమ్మనో, ఏ పువ్వునో చిత్రించి వేశారు. అదీ. ఇదీ కాకపోతే, ఆ కళా తపస్వులు తమ కుంచెతో అటోక గీతను, ఇటోక గీతను గీయడం ద్వారానే సౌందర్య సృష్టి చేశారు.
ప్రశ్నలు :
1. అజంతా చిత్రాలలో అధిక భాగం వేటిని గురించి తెలియజేశారు?
జవాబు:
జాతక కథలు

2. సిద్ధార్థుని జన్మ విషయంలో బౌద్ధ మతస్తుల నమ్మకం ఏమిటి?
జవాబు:
పూర్వం కొన్ని వందల జన్మలు ఎత్తాడని నమ్మకం.

3. కళాతపస్వులు సౌందర్య సృష్టి ఎలా చేసేవారు?
జవాబు:
వారు తమ కుంచెతో అటొక గీతను ఇటొక గీతను గీయడం ద్వారా సౌందర్య సృష్టి చేశారు.

4. పై పేరా ఆధారంగా ఒక ప్రశ్న తయారుచేయండి.
జవాబు:
జాతక కథలలోని విషయం ఏమిటి?

II. వ్యక్తీకరణ – సృజనాత్మకత

అ) కింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాల్లో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
“అజంతా చిత్రాలు” పాఠ్యభాగ రచయితను గూర్చి వివరించండి.
జవాబు:
‘అజంతా చిత్రాలు’ పాఠ్యభాగ రచయిత నార్ల వేంకటేశ్వరరావు. ఈయన 1908 లో కృష్ణాజిల్లాలోని ‘కవుతరం’ అనే గ్రామంలో జన్మించారు. ఈయన రష్యన్ కథలు (అనువాద రచన), నరకంలో హరిశ్చంద్రుడు (నాటకం), నార్లవారిమాట (పద్య కావ్యం ) మొదలైన గ్రంథాలు రచించారు. ఈయన పత్రికా సంపాదకుడు, కవి, విమర్శకుడు. నిరంతరం, సమాజ
శ్రేయస్సు కోసం కృషి చేసిన మేధావి. నార్లవారి రచన, సరళమైన శబ్దాలతో, సొగసైన భావాలతో సుందరశైలిలో సాగుతుంది.

ప్రశ్న 2.
వ్యూపాయింట్ గురించి రాయండి.
జవాబు:
వాఘోరా నది పుట్టినచోట కొండ అర్ధచంద్రాకారంలో ఉంటుంది. దాని ఒక వంపులో అజంతా గుహలుంటాయి. రెండవ వంపు పైన వలయాకారంలో ఏదో ఒక కట్టడం కనబడుతూ ఉంటుంది. దాన్ని ‘వ్యూపాయింట్’ అంటారు. కొన్ని శతాబ్దాలపాటు అజంతా గుహల గురించి లోకానికి తెలియదు. మేజర్ గిల్ అనే బ్రిటిష్ ఆఫీసర్ 1819లో వేటకు వెళ్ళి ఒక జంతువును తరుముకొంటూ కొండపైకి వెళ్ళాడు. ఎదురుగుండా చెట్ల సందులోనుంచి, ఒక చెక్కడపు పని అతనికి కనిపించింది. అతడు కొండ ఎక్కిచూస్తే అతనికి అజంతా గుహలలో పదహారవ దాని శిరోభాగం కనిపించినట్లు అర్థమయింది. లోకం మరచిపోయిన అజంతా గుహలను మేజర్ గిల్ ఏ ప్రదేశం నుంచి చూశాడో అదే “వ్యూపాయింట్”. చాలామంది సందర్శకులు వ్యూపాయింట్ కు వెళ్ళి అక్కడి నుండి అజంతా గుహలను చూస్తూ ఉంటారు.

AP Board 8th Class Telugu Important Questions Chapter 4 అజంతా చిత్రాలు

ప్రశ్న 3.
అజంతా గుహల ద్వారా భారతీయ సాంఘిక వ్యవస్థ రూపాన్ని వివరించండి.
జవాబు:
ప్రాచీన కాలంలో భారతీయ సాంఘిక వ్యవస్థ ఏ రూపంలో ఉండేదో, అప్పటి వృత్తులు, వ్యాసంగాలు, వినోదాలు ఎలాంటివో తెలుసుకోవాలంటే అజంతా గుహలను చూస్తే తెలుస్తుంది. ఒకప్పుడు రాణ్మందిరాలు ఏ విధంగా ఉండేవి? రాజుల, రాణుల వేషభాష లేవి? రాజసభలను ఏవిధంగా తీర్చేవారు? అప్పటి సైనికబలం ఏ విధంగా ఉండేది? ఆనాటి ఆయుధాలేవి? – ఇలాంటి ప్రశ్నలకు జవాబులు తెలిపేవి అజంతా గుహలే. అజంతా గుహలకు వెళితే భారత జాతీయ బలాలను సింహళం మీదకు దండయాత్రకు చేరవేసిన నౌకాదళాన్ని చూడవచ్చు. మహాసాగరాలను దాటి వెళ్ళిన భారతీయ వ్యాపారులను చూడవచ్చు. పర్ష్యన్ రాయబారులతో మాట్లాడే భారతీయ చక్రవర్తులను చూడవచ్చు. గౌతమ బుద్ధుని కారుణ్య సందేశం మానవ వికాసానికే కాక పశుపక్ష్యాదుల జీవితాన్ని సయితం ఎంత పునీతం చేసిందో, తేజోవంతం చేసిందో చూడవచ్చు. అందుచేత అజంతా గుహలను చూస్తే ఆనాటి భారతీయ సాంఘిక వ్యవస్థ ఎలాంటిదో తెలుస్తుంది.

ప్రశ్న 4.
“యాత్రా రచన” ప్రక్రియను పరిచయం చెయ్యండి. (S.A.I – 2019-20)
జవాబు:
రచయిత తాను చూసిన ప్రదేశాన్ని గురించి వర్ణించే రచనే యాత్రారచన. దీనిలో ఆ ప్రదేశం ప్రత్యేకత, ప్రకృతి రామణీయకత, చరిత్ర వంటి అంశాలుంటాయి. రచయిత ఆత్మాశ్రయ శైలిలో భావాలను తెలియజేస్తాడు.

ఆ) కింది ప్రశ్నకు 10 లేక 12 వాక్యాల్లో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
అజంతా చిత్రాల్లోని బుద్ధుని జాతక కథల విశేషాలను తెల్పండి.
జవాబు:
అజంతా చిత్రాలలో అధికభాగం జాతక కథలే. గౌతమ బుద్ధుడు సిద్ధార్థునిగా జన్మించడానికి ముందు కొన్ని వందల జన్మలు ఎత్తినాడని, బౌద్ధులు నమ్ముతారు. ఆ పూర్వజన్మలలోని బుద్ధుని జీవిత చరిత్రలనే ‘జాతక కథలు’ అని పిలుస్తారు. బుద్ధుడు పూర్వజన్మలలో మానవ జన్మలనే కాకుండా, పక్షిరాజుగా, గజేంద్రునిగా ఎన్నెన్నో జన్మలు ఎత్తినట్లు జాతక కథలు తెలియజేస్తున్నాయి. ఈ జన్మలలో కొన్నింటికి సంబంధించిన ఘట్టాలను అజంతా చిత్రాల్లో చూడగలము.

మానవుల పట్ల బౌద్ధులకు ఎంత నిరసన పూర్వకమైన అభిప్రాయముందో, వారు చిత్రించిన జాతక కథలు తెలుపుతాయి. అటువంటి కథలలో ఇది యొకటి.

జాతక కథ :
అడవిగుండా వెడుతున్న ఒక బాటసారి, ఒక గుంటలో పడిపోతాడు. అతనిపై జాలిపడి, ఒక కోతి అతడిని రక్షిస్తుంది. వాడు ఆ కోతి తనకు చేసిన మేలు మరచిపోయి, దాన్ని పట్టుకోవాలని ప్రయత్నిస్తాడు. వెంటనే కోతులన్నీ అతడిని ముట్టడిస్తాయి. అతడు భయపడి, తనని మన్నించుమని, ప్రాధేయపడతాడు. ఇక ముందైనా బుద్ధి కలిగియుండమని కోతులు అతడిని విడిచి పెడతాయి.

AP Board 8th Class Telugu Important Questions Chapter 4 అజంతా చిత్రాలు

ప్రశ్న 2.
అజంతా గుహల్లో వ్యక్తమయ్యే స్త్రీల సౌందర్యాన్ని వివరించండి.
జవాబు:
అజంతా గుహలలో బౌద్ధభిక్షువులు స్త్రీల సౌందర్యాన్ని అద్భుతంగా చిత్రించారు. అందుకే జవహర్ లాల్ నెహ్రూ గారు ‘అజంతా’ మన మనస్సును ఏదో కలల లోకానికి తీసుకొని వెడుతుందని చెప్పారు. అజంతా అతి వాస్తవికమైన లోకమని చెప్పారు. బుద్ధుడు శిష్యులకు “స్త్రీలకు దూరంగా ఉండండి. వారిని కన్నెత్తి కూడా చూడవద్దు” అని చెప్పినా, బౌద్ధభిక్షువులు అజంతా గుహల్లో అందాలు ఒలుకుతున్న స్త్రీలు అశేషంగా ఉన్నారని నెహ్రూగారు చెప్పారు.

అక్కడ రాజకుమార్తెలు, గాయనీమణులు, నృత్యాంగనలు వంటి స్త్రీలు ఎక్కడ చూసినా ఉన్నారు.

అందులో కొందరు కూర్చున్నవారు, కొందరు నిలబడి ఉన్నవారు, కొందరు ముస్తాబు చేసేవారు, కొందరు ఊరేగింపుగా వెడుతున్నవారు ఉన్నారు. ఈ అజంతా స్త్రీలు ఎంతగానో పేరు పొందారు. సన్యసించిన వారైనా ఈ చిత్రకారులు, ఈ స్త్రీలను ఎంతో సౌందర్యవంతులుగా చిత్రించారు. అజంతా గుహలలో మహారాణులే కాక, సమస్త వర్ణాలకు చెందిన స్త్రీలూ చిత్రింపబడ్డారు. ఆనాటి రాణుల మందిరాలనూ, రాణుల వేషాలను చిత్రించిన ఆ చిత్రకారుల ప్రతిభను చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది.

ప్రశ్న 3.
వాఘోరానది పుట్టుక, విశేషాలను తెలపండి.
జవాబు:
అజంతా గుహలకు వెళ్ళే దారిలో అటొక కొండ, ఇటొక కొండ ఉంటాయి. అందులో ఒక కొండమెలికే, వాఘోరానది యొక్క జన్మస్థానం. కొండమీద ఏడుకొలనులు ఉంటాయి. ఒక కొలను నుండి నీరు మరొక కొలనుకు జాలువారుతూ, 250 అడుగుల ఎత్తునుంచి పెద్ద ధారగా, కొండ దిగువకు వాఘోరానది దూకుతుంది. అలా దూకిన తరువాత, కొండ ఎన్ని మలుపులు తిరుగుతుందో, తానూ అన్ని మలుపులు తిరుగుతూ, సమతల ప్రదేశానికి చేరి, కొన్ని వందల మైళ్ళు ప్రవహించి, వాఘోరానది తపతిలో కలిసిపోతుంది.

వాఘోరానది వెంట వెళుతుంటే, రాళ్ళగుట్టల గుండా జలజల ప్రవహిస్తూ ఆ నది పాడే పాటలు వినిపిస్తాయి. పైన నీలాకాశమూ, అలరించే అడవి పువ్వులూ, ఆ పువ్వుల కమ్మని సువాసనలూ మరొక లోకంలో మనల్ని విహరింపచేస్తాయి. ఇటుకొండ, అటుకొండ, ముందుకొండ, వెనుకకొండ, పైన కొండ – ప్రక్కన వారానది – నీలాకాశం – నీలాలనీళ్ళు — పచ్చని చెట్లు – కమ్మని సువాసనలు – అదొక భూలోక స్వర్గం అనిపిస్తుంది.

వాఘోరా నది పుట్టిన చోట, కొండ అర్ధచంద్రాకారంగా ఉంటుంది. దాని ఒక వంపులో అజంతా గుహలుంటాయి. మరొక వంపులో వలయాకారంలో ఒక కట్టడం ఉంటుంది. దానిని ‘వ్యూ పాయింట్’ అంటారు.

ప్రశ్న 4.
నార్ల వారి అనుభూతిని గురించిన వర్ణనను వివరించండి.
జవాబు:
చూచిన ఒక దృశ్యాన్ని వర్ణించడం సులభం కావచ్చు కాని ఒక అనుభూతిని వర్ణించడం సులభం కాదు.

ఇరుకుగా ఉండే ఇంటిని వదలి, ఇరుకుగా ఉండే వీధుల వెంట నడిచి, అపారమైన సముద్రపు తీరంలో నిలిచినప్పుడు పొందే అనుభూతిని, పరిమిత జీవితాలలోని పరిమిత సమస్యలతో కంటికి నిద్ర దూరమయినప్పుడు, ఆకాశంలోని అనంతమైన నక్షత్రాలను చూచినప్పుడు, పొందే అనుభూతిని వర్ణించడం సులభం కాదు.

అదేవిధంగా జీవనోపాధి కోసం పగలంతా పాట్లు పడి, విసిగి వేసారి ఇంటికి చేరినప్పుడు, గడపలోనే కేరింతలు కొడుతూ కాళ్ళకు అడ్డంపడే తన ముద్దు బిడ్డను ఎత్తుకొన్నప్పుడు పొందే అనుభూతిని, పచ్చనిచెట్టును, పచ్చికబయలును చూసే అవకాశం లేని బస్తీలో బ్రతికే మనిషి గాలికి తలలూపుతూ, దిక్కులను అంటుకుంటున్నట్లు కనిపించే వరిచేలను చూచినప్పుడు పొందే అనుభూతిని వర్ణించడం సులభం కాదు.

హృదయాన్ని ఊపివేసే ఏ అనుభూతిని గాని, జీవితాన్ని కదిలించే ఏ అనుభూతిని గాని వర్ణించడం సులభం కాదు.

ప్రశ్న 5.
అజంతా గుహలలోని చిత్రాల గురించి విదేశీయుల అభిప్రాయాలను తెలపండి.
జవాబు:
అజంతా గుహలను ప్రపంచానికి తెలియజేసిన వ్యక్తి మేజర్ గిల్ అనే బ్రిటిష్ మిలటరీ ఆఫీసర్. వ్యూపాయింట్ నుండి చూస్తే చెక్కడపు పని కనిపించడంతో ఆయన కొండపైకి వెళ్ళి అజంతా గుహలను చూసి లోకానికి తెలియజేశాడు.

మేజర్ గిల్ ముప్పయి సంవత్సరాలపాటు కష్టపడి అజంతా చిత్రాలకు కాపీలను తయారుచేసుకొన్నాడు. వాటిలో కొన్ని అగ్నిప్రమాదంలో కాలిపోయాయి. మిగిలిన వాటికి జాన్ గ్రిఫిల్మ్ కాపీలు తయారుచేయించాడు. కాని అవి కూడా అగ్నిప్రమాదంలో బూడిదయ్యాయి. మేజర్ గిల్ కు జాన్ గ్రిఫికు అజంతా చిత్రాలంటే అమిత మక్కువని దీనిని బట్టి అర్థమవుతుంది.

ఫెర్గుసన్ అనే విదేశీయుడు ఫైజాల్, ఆర్కాన్యాజా ఇటలీలో తలెత్తడానికి ముందు అజంతా చిత్రాలకు సాటిరాగల చిత్రాలు యూరప్లో లేవని చెప్పాడు.

గ్రీఫ్ త్న్ అనే మరో విదేశీయుడు 26 అజంతా చిత్రాలకు సాటిరాగల చిత్రాలు యూరప్ లో ఉన్నవి అన్నాడు. ఫోరె టైన్ మరింత రేఖావిన్యాసాన్ని ప్రదర్శించినా, వెనాసియన్ మరింత వర్ల వైశిష్యాన్ని చూపినా మరణం ఆసన్నమైన రాకుమారి భావాలను మరింత ప్రభావవంతంగా వారు చూపడం వారికి సాధ్యపడేది కాదని ఆయన అభిప్రాయపడ్డాడు. కొండను తొలిచి, ఆ గుహలలో మలచిన ఆ ఆలయాలలోని చిత్రాలను చూచి రోడౌన్ సైల్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.

విన్ సెంట్ స్మిత్ అనే విదేశీయుడు అజంతా గుహలలోని చిత్రాలను గీసినవారు పర్ష్యన్ చిత్రకారులు కావచ్చని అన్నాడు.

ప్రశ్న 6.
అజంతా గుహలలో ఎన్నో బుద్ధుడి చిత్రాలు ఉన్నాయి. అజంతా గుహలకు – జాతక కథలకు ఉన్న సంబంధం ఏమిటో వివరించండి. (S.A. III – 2015-16)
జవాబు:
అజంతా చిత్రాలలో అధికభాగం జాతక కథలే. సిద్ధార్థుడుగా జన్మించడానికి పూర్వం గౌతమ బుద్ధుడు కొన్ని వందల జన్మలెత్తాడని బౌద్ధమతస్థుల నమ్మకం. పూర్వజన్మలలో బుద్ధుని జీవిత చరిత్రలే జాతక కథలు. ఉత్తమ మానవ జన్మలనే కాకుండా పక్షిరాజుగా, గజేంద్రుడుగా ఎన్నెన్నో జన్మలను ఆయన ఎత్తినట్లు జాతక కథలు పేర్కొంటాయి. ఈ వివిధ జన్మలలో కొన్నింటికి సంబంధించిన ఘట్టాలను అజంతా చిత్రాలలో చూడవచ్చు.

బోధిసత్వుని అలౌకిక సుందర విగ్రహాన్ని, ఆయన అంత గంభీరమూర్తిని చిత్రించిన భక్తి శ్రద్ధలను, ఈ జగత్తును చిత్రించడంలో ఈ కుడ్య చిత్రాలను చిత్రించిన బౌద్ధభిక్షువులు చూపించారు. అజంతా గుహలు మొత్తం 29. వాటిలో 5 బౌద్ధ చైత్యాలైతే, మిగిలినవి బౌద్ధ విహారాలు. గౌతమబుద్ధుని కారుణ్య సందేశం కేవలం మానవుని వికాసానికే కాక పశు పక్ష్యాదుల జీవితాన్ని సైతం ఎంత పునీతం చేసిందో, తేజోవంతం చేసిందో ఇక్కడ చూడవచ్చు.

బుద్ధుని బోధనలకు ప్రేరేపితులైన ఆయన శిష్యులు బుద్ధుని నిర్యాణానంతరం బౌద్ధమత వ్యాప్తికై బుద్ధుని బోధనలు ప్రచారం చేస్తున్నారు. దానిలో భాగంగా కొందరు అజంతా గుహలను, ఆ చుట్టుప్రక్కల ప్రాంతాలను లక్ష్యంగా బుద్ధుని భావాలను ప్రతిబింబించే విధంగా తీర్చిదిద్దారు. ప్రశాంత వాతావరణం, ప్రకృతి రమణీయత వారికి ఇంకా కలిసొచ్చే అంశాలుగా చెప్పవచ్చు. బుద్ధుని పట్ల ఉన్న భక్తి వారిచేత అజంతా గుహలను అంత అందంగా తీర్చిదిద్దేటట్లు చేసింది.

ఇ) కింది అంశం గురించి సృజనాత్మకంగా / ప్రశంసిస్తూ రాయండి.

ప్రశ్న 1.
శిల్పిని గురించి ఆత్మకథ రాయండి. దీన్ని ఏకపాత్రాభినయంగా రాయండి.
జవాబు:
నేను మీకు తెలుసా ! నేను రాళ్ళను బొమ్మలుగా చెక్కే శిల్పిని. నేను రాళ్ళను దేవుడి బొమ్మలుగా చెక్కితే, మీరు వాటిని పసుపు కుంకాలతో పూజిస్తున్నారు. పూర్వం మహారాజులు మాకు ఎంతో డబ్బు ఇచ్చి దేవాలయాల్లో శిల్పాలు చెక్కించేవారు. మీరు మేము చెక్కిన నంది విగ్రహాలూ, నాట్య ప్రతిమలూ లొట్టలు వేసుకుంటూ చూస్తారు. చూసినంత సేపూ ఓహో, ఆహా అని అంటారు. కానీ మీలో ఏ ఒక్కరూ నన్ను పోషించరు. మరి నన్ను ఎవరు చూస్తారు ? దేవుడు బొమ్మలు చెక్కే నాకు, ఇంక దేవుడే దిక్కు. నేను సంగీతం వచ్చే స్తంభాలు చెక్కాను. అందమైన స్త్రీమూర్తులను చెక్కాను. నా శిల్పాన్ని పోషించిన రాజులను మీరు రాజుల సొమ్ము రాళ్ళపాలన్నారు. కాని నా శిల్పాలు శాశ్వతంగా నిలుస్తాయి.

ప్రశ్న 2.
శిల్పం, సంగీతం ………. ఇలాంటి వాటికి సంబంధించిన అదనపు సమాచారం లేదా చిత్రాలు సేకరించండి. వాటిని గురించి రాయండి.
జవాబు:
కవిత్వం, సంగీతం, చిత్రలేఖనం, శిల్పం, నాట్యం అనేవి లలితకళలు :

ఎ) ప్రపంచ ప్రసిద్ధుడైన చిత్రలేఖన కళాకారుల వివరాలు :

1) వడ్డాది పాపయ్య :
ఆంధ్రదేశంలో శ్రీకాకుళంలో 1921లో పుట్టాడు. ఈయన భారతదేశం గర్వించదగ్గ చిత్రకారుడు. ఈయన తొలి గురువు తండ్రి. తరువాత గురువు రవివర్మ. చందమామ, ఆంధ్రపత్రిక వంటి పత్రికల్లో చిత్రాలు గీశారు. ఈయన చిత్రాలలో తెలుగుదనం, తెలుగు సంస్కృతి ఆచారవ్యవహారాలు, పండుగలకు ప్రాముఖ్యతను ఇచ్చేవారు.

2) లియోనార్డో డావిన్సి :
ఈయన ఇటలీ దేశస్థుడు. ఈయన ‘మొనాలిసా’ చిత్రాన్ని గీశాడు. ఈ చిత్రాన్ని ఎవరు చూసినా మంత్ర ముగ్ధులవుతారు. ఇప్పుడు ఈ చిత్రం పారిస్ నగరంలో ‘టాఫ్స్’ అనే వస్తు ప్రదర్శనశాలలో ఉంది.

3) పాబ్లో పికాసో (1881 – 1973) :
పికాసో 20వ శతాబ్దిలోని చిత్ర కళాకారులలో మిక్కిలి ప్రసిద్ధుడు. 1901లో ఈయన చిత్రించిన “తల్లి ప్రేమ (మాతా, శిశువు)” చిత్రం అద్భుత కళాఖండం. తన బుగ్గను శిశువు తలకు ఆనించి, కళ్ళు మూసి తన్మయత్వం చెందుతున్న తల్లి చిత్రం ఇది.

4) రాజా రవివర్మ :
దేవుడు మనిషిని సృష్టించాడు. ఆ మనిషి దేవుణ్ణి చిత్రించి మనుషులకు ఇచ్చాడు. గుళ్ళల్లో ఉన్న దేవుళ్ళను తన చిత్రకళ ద్వారా ఇళ్ళకు తెచ్చిన ఘనత రాజా రవివర్మకు దక్కుతుంది. రవివర్మ చిత్రించిన దేవుళ్ళ బొమ్మలు ప్రసిద్ధి పొందాయి. ఈయన చిత్రించిన కావ్యస్త్రీలందరిలో దమయంతి గొప్ప అందాల రాశి.

AP Board 8th Class Telugu Important Questions Chapter 4 అజంతా చిత్రాలు

ప్రశ్న 3.
విహారయాత్రను గూర్చి స్నేహితునికి / స్నేహితురాలికి లేఖ.
జవాబు:

లేఖ

నిడదవోలు,
x x x x x x x x

ప్రియమైన స్వప్నకు,

శుభాకాంక్షలతో శశిరేఖ రాయునది.
నేను గడచిన సెలవులలో హైదరాబాదు విహారయాత్ర చేసి వచ్చాను. అక్కడ చూడాల్సిన వింతలు, విశేషాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా సాలార్జంగ్ మ్యూజియం, పబ్లిక్ గార్డెన్స్, నెహ్రూ జంతుప్రదర్శనశాల (జూ), చార్మినార్, బిర్లా మందిర్, అసెంబ్లీ హాల్, గోలకొండ మొదలైనవి చూసి నేను పొందిన ఆనందం అంతా ఇంతా కాదు.

హైదరాబాదు, సికిందరాబాదు జంటనగరాల సౌందర్యాన్ని అందరూ తప్పక చూడవలసిందే. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ముఖ్యపట్టణమైన హైదరాబాదును నీవు కూడా దర్శించవలసిందిగా కోరుతున్నాను.

ఇట్లు,
నీ ప్రియ స్నేహితురాలు,
శశిరేఖ.

చిరునామా :
కె. స్వప్న,
7వ తరగతి, జిల్లా పరిషత్ హైస్కూలు,
ప్రత్తిపాడు, గుంటూరు జిల్లా.

ప్రశ్న 4.
దర్శనీయ స్థలాలలో “అజంతా గొప్పది” అని నిరూపిస్తూ మీ పాఠం ఆధారంగా రాయండి. (S.A. II – 2018-19)
జవాబు:
దర్శనీయ స్థలాల్లో ‘అజంతా గొప్పది’ అనడంలో ఎలాంటి సందేహం లేదు. భారతీయ చరిత్ర సంస్కృతులను ప్రతిబింబించే ప్రాచీన కట్టడాలు ఎన్నో అజ్ఞానం, నిర్లక్ష్యం, స్వార్థాల వల్ల పాడైపోతున్నాయి.

మనదేశంలో దర్శనీయ స్థలాలు అనగానే మొదట గుర్తుకు వచ్చేది అజంతా గుహలే. ప్రాచీనకాలంలో భారతీయ సాంఘిక వ్యవస్థ ఏ రూపంలో ఉండేదో, అప్పటి వృత్తులు, వ్యాసాంగాలు, వినోదాలు ఎలాంటివో తెలుసుకోవాలంటే అజంతా గుహలను చూస్తే తెలుస్తుంది. ఒకప్పటి రాజుల, రాణుల వేషభాషలు, రాజసభలు, సైనికబలం, ఆయుధాలు ఇవన్నీ అజంతా గుహల ద్వారా తెలుస్తాయి. ఇంకా నౌకాదళాన్ని, సాగరాలు దాటిన భారతీయ వ్యాపారులను, పర్ష్యన్ రాయబారులతో మాట్లాడిన భారతీయ చక్రవర్తులను, గౌతమబుద్ధుని సందేశాలను చూడవచ్చు.

అజంతా గుహల్లో బౌద్ధ భిక్షువులు స్త్రీల సౌందర్యాన్ని అద్భుతంగా చిత్రీకరించారు. అందుకే జవహర్‌లాల్ నెహ్రూ ‘అజంతా’ మన మనస్సును ఏదో కలల లోకానికి తీసుకువెళుతుందని, అజంతా అతి వాస్తవికమైన లోకమని చెప్పారు. అజంతా చిత్రాలలో భారతీయ జీవితం, సంస్కృతి తొణికిసలాడుతుంది.

అందుకే అజంతా దర్శనీయ స్థలాలలో గొప్పదని చెప్పవచ్చు.

8th Class Telugu 4th Lesson అజంతా చిత్రాలు 1 Mark Bits

1. అరకులోయ ప్రకృతి సౌందర్యం అద్భుతం (విగ్రహవాక్యం గుర్తించండి) (S.A. I – 2019-20)
ఎ) ప్రకృతి దైన సౌందర్యం
బి) ప్రకృతి కొఱకు సౌందర్యం
సి) ప్రకృతి యొక్క సౌందర్యం
డి) ప్రకృతి చేత సౌందర్యం
జవాబు:
సి) ప్రకృతి యొక్క సౌందర్యం

2. ప్రజలు శాంతిని కోరుతున్నారు (సరైన కర్మణి వాక్యాన్ని గుర్తించండి) (S.A. I – 2018-19)
ఎ) ప్రజలు శాంతిని కోరడం లేదు
బి) ప్రజలచే శాంతి కోరబడుచున్నది
సి) శాంతిని ప్రజలు కోరుచున్నారు
డి) శాంతి చేత ప్రజలు కోరుతున్నారు.
జవాబు:
బి) ప్రజలచే శాంతి కోరబడుచున్నది

3. అజంతా చిత్రాలు అగ్నిలో బూడిద పాలైనాయి. (పర్యాయపదాలు గుర్తించండి) (S.A. II – 2018-19)
ఎ) బూడిద, బుగ్గి
బి) వహ్ని, నిప్పు
సి) నీరు, జలము
డి) గృహము, ఇల్లు
జవాబు:
బి) వహ్ని, నిప్పు

AP Board 8th Class Telugu Important Questions Chapter 4 అజంతా చిత్రాలు

4. అజంతాలోని గుహలగోడల పై బుద్ధుని కుడ్య చిత్రాలున్నాయి. (సమాసాన్ని గుర్తించండి) (S.A. II – 2017-18)
ఎ) పంచమీ
బి) షష్టీ
సి) సప్తమీ
డి) ప్రథమ
జవాబు:
బి) షష్టీ

5. ప్రజలు పుస్తకాలు చదివారు. (కర్మణి వాక్యాన్ని గుర్తించండి.) (S.A. III – 2016-17)
ఎ) పుస్తకాలు ప్రజలను చదివాయి.
బి) చదవడం వల్ల ప్రజలు బాగుపడ్డారు.
సి) పుస్తకాలచేత ప్రజలు చదవబడ్డారు.
డి) ప్రజలచేత పుస్తకాలు చదవబడ్డాయి.
జవాబు:
డి) ప్రజలచేత పుస్తకాలు చదవబడ్డాయి.

6. సముద్రాన్ని వార్ధి అని కూడా అంటారు. గీత గీసిన పదానికి వికృతి పదాన్ని గుర్తించండి. (S.A. III – 2015-16)
ఎ) సంద్రం
బి) ఇంద్రం
సి) చంద్రం
డి) బృందం
జవాబు:
ఎ) సంద్రం

7. జాతీయాలకు సరిపోయే అర్థం గ్రహించి సరైన సమాధానం కింద గీత గీయండి. దొంగలు అజంతా గుహలో తలదాచుకున్నారు. (S.A. III – 2015-16)
ఎ) నివసించారు.
బి) వస్తువులు దాచుకున్నారు.
సి) తలను దాచుకున్నారు.
డి) ఆశ్రయం పొందారు.
జవాబు:
ఎ) నివసించారు.

భాషాంశాలు – పదజాలం

అర్ధాలు :

8. మేఘాలు ఆవరించాయి – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) ఆవరించాయి
బి) కప్పివేశాయి
సి) కనిపించాయి
డి) గోచరించాయి
జవాబు:
బి) కప్పివేశాయి

9. కొలనులో తామరలు ఉన్నాయి – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) అంబుధి
బి) జలధి
సి) సరస్సు
డి) సాగరం
జవాబు:
సి) సరస్సు

10. విహారయాత్రపై కుతూహలం ఉంది – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) ఆసక్తి
బి) అనాసక్తి
సి) గోచరించు
డి) దర్శించు
జవాబు:
ఎ) ఆసక్తి

11. రామాయణం ఆది కావ్యం – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) అంతిమ
బి) మొదటి
సి) చివరి
డి) మధ్యకు
జవాబు:
బి) మొదటి

12. మన అస్తిత్వం కోల్పోకూడదు – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) ఉనికి
బి) ఊపిరి
సి) ఊరు
డి) ఉసురు
జవాబు:
ఎ) ఉనికి

13. స్త్రీలు ముస్తాబు అవుతున్నారు – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) తిరస్కారం
బి) ఆస్కారం
సి) పరిష్కారం
డి) అలంకారం
జవాబు:
డి) అలంకారం

14. కుడ్యం పై చిత్రాలు ఉన్నాయి – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) గోడ
బి) ఇల్లు
సి) వాకిలి
డి) వారిధి
జవాబు:
ఎ) గోడ

పర్యాయపదాలు :

15. రాజు రాజ్యం పాలించాడు – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
ఎ) పురోహితుడు, అమాత్యుడు
బి) ప్రభువు, నృపతి
సి) నరపతి, సురపతి
డి) క్షితీశుడు, జాలరి
జవాబు:
బి) ప్రభువు, నృపతి

16. ఆకాశంలో తారలు ఉన్నాయి- గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
ఎ) నభం, నింగి
బి) విరులు, సుమం
సి) దివి, దానవం
డి) వరి, గది
జవాబు:
ఎ) నభం, నింగి

17. సరస్సులో జలం ఉంది – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
ఎ) సముద్రం, క్షీరం
బి) నీరం, సుధ
సి) అవని, జలధి
డి) వారి, ఉదకం
జవాబు:
డి) వారి, ఉదకం

18. సముద్రం అనంతం – గీత గీసిన పదానికి పర్యాయ పదాలు గుర్తించండి.
ఎ) క్షీరం, నీరం
బి) సాగరం, అంబుధి
సి) జలధి, జాగరణ
డి) అంబుధి, వారి
జవాబు:
బి) సాగరం, అంబుధి

19. పూల తావి మధురం – గీత గీసిన పదానికి పర్యాయ పదాలు గుర్తించండి.
ఎ) అంతరంగం, తాపత్రయం
బి) పరిమళం, సువాసన
సి) పరితపించు, తనివి
డి) ఆకాశం, అవరోధం
జవాబు:
బి) పరిమళం, సువాసన

AP Board 8th Class Telugu Important Questions Chapter 4 అజంతా చిత్రాలు

20. కొండ పై నది ఉంది – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
ఎ) పర్వతం, నగం
బి) శిఖరం, సమున్నది
సి) గాలి, మారుతం
డి) కొడవలి, కోరుడం
జవాబు:
ఎ) పర్వతం, నగం

21. సముద్రాలలోని కెరటం భయానకం – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
ఎ) వర్చస్సు, మేధస్సు
బి) తరంగం, అల
సి) మిత్రుడు, గోల
డి) సరస్సు, శిరస్సు
జవాబు:
బి) తరంగం, అల

ప్రకృతి – వికృతులు :

22. సంతోషంగా ఉంది – గీత గీసిన పదానికి వికృతి పదం ఏది?
ఎ) సంతసం
బి) సంబరం
సి) సంబురం
డి) సంబారం
జవాబు:
ఎ) సంతసం

23. ఇంతిని గౌరవించాలి – గీత గీసిన పదానికి ప్రకృతి పదం ఏది?
ఎ) మహిళ
బి) స్త్రీ
సి) శ్రీ
డి) వనిత
జవాబు:
బి) స్త్రీ

24. తెలుగు భాష లెస్స – గీత గీసిన పదానికి వికృతి పదం ఏది?
ఎ) బస
బి) బాస
సి) బోస
డి) బైస
జవాబు:
బి) బాస

25. యాత్ర చేశాము – గీత గీసిన పదానికి వికృతి పదం ఏది?
ఎ) యాతర
బి) జేతర
సి) జోతర
డి) జైతర
జవాబు:
ఎ) యాతర

26. పక్షి ఎగిరింది – గీత గీసిన పదానికి వికృతి పదం ఏది?
ఎ) పచి
బి) పచ్చి
సి) పక్కి
డి) విహంగం
జవాబు:
సి) పక్కి

AP Board 8th Class Telugu Important Questions Chapter 4 అజంతా చిత్రాలు

27. పూవు వికసించింది – గీత గీసిన పదానికి ప్రకృతి పదం ఏది?
ఎ) పూజ
బి) పుష్పం
సి) కుసుమం
డి) జలం
జవాబు:
బి) పుష్పం

28. గోడ చిత్రాలు ఉన్నాయి – గీత గీసిన పదానికి ప్రకృతి పదం ఏది?
ఎ) గహ్వర
బి) గవాక్షం
సి) కుడ్యం
డి) శిఖరం
జవాబు:
సి) కుడ్యం

29. మానవులు కీర్తి పొందాలి – గీత గీసిన పదానికి వికృతి పదం ఏది?
ఎ) కీరితి
బి) కిరితి
సి) కరితి
డి) కృతి
జవాబు:
ఎ) కీరితి

30. చిత్రం బాగుంది – గీత గీసిన పదానికి వికృతి పదం ఏది?
ఎ) చెత్తరువు
బి) చిత్తరువు
సి) చిక్కరువు
డి) చిత్తవు
జవాబు:
బి) చిత్తరువు

31. ప్రజ్ఞ ఇంటికి వెళ్ళింది – గీత గీసిన పదానికి వికృతి పదం ఏది?
ఎ) పగై
బి) పజ
సి) గజ
డి) జయీ
జవాబు:
ఎ) పగై

32. వేసము వేశాము – గీత గీసిన పదానికి ప్రకృతి పదం ఏది?
ఎ) ధరష
బి) వేషము
సి) వషము
డి) ధృతము
జవాబు:
బి) వేషము

33. దిస్ట్రి తగిలింది – గీత గీసిన పదానికి ప్రకృతి పదం ఏది?
ఎ) దిష్టి
బి) దృతి
సి) ధృతి
డి) దోష్టి
జవాబు:
ఎ) దిష్టి

నానార్థాలు :

34. దేవుడే దిక్కు – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
ఎ) దెస, దైవం, దాపరికం
బి) శరణు, రక్ష, అంబోధి
సి) శరణు, శతం, శాంకరి
డి) దిస, రక్షణ, పక్షం
జవాబు:
డి) దిస, రక్షణ, పక్షం

35. ఉత్తరం రాశాను – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
ఎ) ఉత్తరం, వేరుణ
బి) లేఖ, సమాధానం
సి) కాలం, విచారం
డి) ప్రశ్న, జవాబు
జవాబు:
బి) లేఖ, సమాధానం

AP Board 8th Class Telugu Important Questions Chapter 4 అజంతా చిత్రాలు

36. వర్షం కురిసింది – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
ఎ) వాస, సంవత్సరం
బి) మాసం, సంవత్సరం
సి) వాన, వాగ్యుద్ధం
డి) సమరం, వాన
జవాబు:
ఎ) వాస, సంవత్సరం

37. తపస్వి వెళ్ళాడు – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
ఎ) ముని, నారదుడు
బి) చంద్రుడు, చంచలం
సి) చారిత్రం, చరితం
డి) పులుగు, పయోధి
జవాబు:
బి) చంద్రుడు, చంచలం

వ్యుత్పత్త్యర్థాలు :

38. ‘పక్షి’ – దీనికి వ్యత్పత్తి ఏది?
ఎ) పక్షములు కలది
బి) పక్కములు లేనిది
సి) పయస్సు కలది
డి) పరువం కలది
జవాబు:
ఎ) పక్షములు కలది

39. సంతోషింపచేయువాడు – అనే వ్యుత్పత్యర్థం గల పదం ఏది?
ఎ) సర్వం సహా
బి) చంద్రుడు
సి) శుక్రుడు
డి) ధరణి
జవాబు:
బి) చంద్రుడు

40. మహిని పాలించువాడు – అనే వ్యుత్పత్యర్థం గల పదం ఏది?
ఎ) మహీపాలుడు
బి) మహాత్ముడు
సి) మహనీయుడు
డి) మహీధరము
జవాబు:
ఎ) మహీపాలుడు

41. సగరపుత్రులచే తవ్వబడినది – ఈ వ్యుత్పత్తి గల పదం గుర్తించండి.
ఎ) సారధి
బి) సాధికారత
సి) జలధి
డి) సాగరం
జవాబు:
డి) సాగరం

వ్యాకరణాంశాలు

సంధులు :

42. నీలాకాశం మనోహరం – ఇది ఏ సంధి?
ఎ) సవర్ణదీర్ఘ సంధి
బి) గుణసంధి
సి) త్రికసంధి
డి) ఉత్వసంధి
జవాబు:
ఎ) సవర్ణదీర్ఘ సంధి

43. క్రింది వానిలో యడాగమ సంధికి ఉదాహరణను గుర్తించండి.
ఎ) లేకుండెను
బి) తలయెత్తు
సి) అమ్మమ్మ
డి) ఊరెల్ల
జవాబు:
బి) తలయెత్తు

AP Board 8th Class Telugu Important Questions Chapter 4 అజంతా చిత్రాలు

44. పక్ష్యాదులు ఉన్నాయి – గీత గీసిన పదానికి విడదీయడం గుర్తించండి.
ఎ) పక్షి + అదులు
బి) పక్షే + యాదులు
సి) పక్షి + ఆదులు
డి) పక్ష్మ + ఆదులు
జవాబు:
సి) పక్షి + ఆదులు

45. క్రింది వానిలో వికల్ప సంధిని గుర్తించండి.
ఎ) గుణసంధి
బి) అత్వసంధి
సి) గసడదవాదేశ సంధి
డి) ఇత్వసంధి
జవాబు:
డి) ఇత్వసంధి

46. చెట్టుగాని – ఇది ఏ సంధి?
ఎ) గుణసంధి
బి) త్రికసంధి
సి) గసడదవాదేశ సంధి
డి) ఆమ్రేడిత సంధి
జవాబు:
సి) గసడదవాదేశ సంధి

47. క్రింది వానిలో పుంప్వాదేశ సంధికి ఉదాహరణ ఏది?
ఎ) చెక్కడపు పని
బి) చెక్కపని
సి) చిలుకజోస్యం
డి) మహోన్నతం
జవాబు:
ఎ) చెక్కడపు పని

48. సర్వోత్తమంగా ఉంది – దీనిని విడదీస్తే
ఎ) సర్వ + ఉత్తమం
బి) సర్వో + త్తమం
సి) సర్వ + ఆత్తమ
డి) సర్వే + ఉత్తమ
జవాబు:
ఎ) సర్వ + ఉత్తమం

సమాసాలు :

49. ప్రకృతి సౌందర్యం పరవసింపజేసింది – గీత గీసిన పదానికి విగ్రహవాక్యం ఏది?
ఎ) ప్రకృతి యొక్క సౌందర్యం
బి) ప్రకృతితో సౌందర్యం
సి) ప్రకృతి కొరకు సౌందర్యం
డి) ప్రకృతియైన సౌందర్యం
జవాబు:
ఎ) ప్రకృతి యొక్క సౌందర్యం

AP Board 8th Class Telugu Important Questions Chapter 4 అజంతా చిత్రాలు

50. నది యొక్క ప్రవాహం – దీనికి సమాసపదం గుర్తించండి.
ఎ) జలనది
బి) నదీప్రవాహం
సి) నద్వజలం
డి) అమజలం
జవాబు:
బి) నదీప్రవాహం

51. భక్తి శ్రద్ధలు ఉండాలి – ఇది ఏ సమాసం?
ఎ) ద్విగు సమాసం
బి) కర్మధారయ సమాసం
సి) ద్వంద్వ సమాసం
డి) తత్పురుష సమాసం
జవాబు:
సి) ద్వంద్వ సమాసం

52. సప్తమీ తత్పురుషమునకు ఉదాహరణ గుర్తించండి.
ఎ) కుడ్య చిత్రాలు
బి) ప్రకృతి సౌందర్యం
సి) నలుదిక్కులు
డి) తల్లిదండ్రులు
జవాబు:
ఎ) కుడ్య చిత్రాలు

53. షష్ఠీ తత్పురుషమునకు ఉదాహరణను గుర్తించండి.
ఎ) కర్మణి వాక్యం
బి) కర్తరి వాక్యం
సి) దశకంఠుడు
డి) ముజ్జగములు
జవాబు:
ఎ) కర్మణి వాక్యం

54. అగ్ని ప్రమాదం జరిగింది – గీత గీసిన పదానికి విగ్రహవాక్యం గుర్తించండి.
ఎ) అగ్ని వలన ప్రమాదం
బి) అగ్నికి ప్రమాదం
సి) అగ్ని యందు ప్రమాదం
డి) అగ్ని కొరకు ప్రమాదం
జవాబు:
ఎ) అగ్ని వలన ప్రమాదం

55. సంఖ్యా శబ్దం – పూర్వంగా కలిగిన సమాసం గుర్తించండి.
ఎ) పంచమీ తత్పురుష
బి) ద్విగు సమాసం
సి) రూపకం
డి) షష్ఠీ తత్పురుష
జవాబు:
బి) ద్విగు సమాసం

56. ఉభయ పదార్థ ప్రాధాన్యం గల సమాసం గుర్తించండి.
ఎ) తత్పురుష సమాసం
బి) ద్వంద్వ సమాసం
సి) బహుప్రీహి సమాసం
డి) అవ్యయీభావ సమాసం
జవాబు:
బి) ద్వంద్వ సమాసం

AP Board 8th Class Telugu Important Questions Chapter 4 అజంతా చిత్రాలు

57. పచ్చిక బయలు – దీనికి విగ్రహవాక్యం గుర్తించండి.
ఎ) పచ్చిక యందు బయలు
బి) పచ్చిక వలన బయలు
సి) పచ్చిక కొరకు బయలు
డి) పచ్చికతో బయలు
జవాబు:
డి) పచ్చికతో బయలు

గణ విభజన:

58. అజంత – ఇది ఏ గణము?
ఎ) జ గణం
బి) త గణం
సి) న గణం
డి) మ గణం
జవాబు:
ఎ) జ గణం

59. చిత్తము – దీనికి గణాలు గుర్తించండి.
ఎ) UIU
బి) UII
సి) IUI
డి) III
జవాబు:
బి) UII

60. వ్యవధి – దీనికి గణాలు గుర్తించండి.
ఎ) UII
బి) IUI
సి) UUU
డి) II
జవాబు:
డి) II

61. IIUI – ఇది ఏ గణము?
ఎ) భగ
బి) సల
సి) నల
డి) గగ
జవాబు:
బి) సల

వాక్యాలు :

62. ప్రజల చేత శాంతి కోరబడింది – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) నీవార చరిత్ర
బి) పినాకపాణి
సి) అత్మార్థక వాక్యం
డి) ధాత్వర్థక వాక్యం
జవాబు:
ఎ) నీవార చరిత్ర

AP Board 8th Class Telugu Important Questions Chapter 4 అజంతా చిత్రాలు

63. వానలు కురిస్తే పంటలు పండుతాయి – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) అభ్యర్థక వాక్యం
బి) ధాత్వర్థక వాక్యం
సి) క్వార్థక వాక్యం
డి) చేదర్థక వాక్యం
జవాబు:
డి) చేదర్థక వాక్యం

64. పాలు తెల్లగా ఉండును – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) తద్ధర్మార్థక వాక్యం
బి) చేదర్థక వాక్యం
సి) శత్రర్థక వాక్యం
డి) ధాత్వర్థక వాక్యం
జవాబు:
ఎ) తద్ధర్మార్థక వాక్యం

65. స్వాతంత్ర్యం పొందాలి – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) విధ్యర్థక వాక్యం
బి) అప్యర్థక వాక్యం
సి) తద్ధర్మార్థక వాక్యం
డి) హేత్వర్థక వాక్యం
జవాబు:
ఎ) విధ్యర్థక వాక్యం

66. మీరు పాఠం విన్నారు – దీనికి వ్యతిరేకార్థక వాక్యం గుర్తించండి.
ఎ) మీరు పాఠం శ్రద్ధగా వినలేదు గదా !
బి) మీరు పాఠం వినలేదు.
సి) మీరు పాఠం వినకపోవచ్చు.
డి) మీరు విని తీరాలి.
జవాబు:
బి) మీరు పాఠం వినలేదు.

అలంకారాలు :

67. అర్థ భేదం లేకపోయినా తాత్పర్య భేదం కలిగిన అలంకారం ఏది?
ఎ) లాటానుప్రాస
బి) యమకం
సి) వృత్త్యనుప్రాస
డి) ముక్తపదగ్రస్తం
జవాబు:
ఎ) లాటానుప్రాస

68. విష్ణు రోచిష్ణు జిష్ణు సహిష్ణు – ఇందలి అలంకారం గుర్తించండి.
ఎ) ఉపమ
బి) వృత్త్యనుప్రాస
సి) యమకం
డి) ముక్తపదగ్రస్తం
జవాబు:
బి) వృత్త్యనుప్రాస

AP Board 8th Class Telugu Important Questions Chapter 4 అజంతా చిత్రాలు

69. మానవా ! నీ ప్రయత్నం మానవా! – ఇందలి అలంకారం గుర్తించండి.
ఎ) యమకం
బి) ముక్తపదగ్రస్తం
సి) అంత్యానుప్రాస
డి) పరికరం
జవాబు:
ఎ) యమకం

70. ‘ఉత్ప్రేక్ష’ అనగా
ఎ) ఊహ
బి) బింబప్రతిబింబ భావం
సి) అనన్వయం
డి) సమన్వయం
జవాబు:
ఎ) ఊహ

71. ఈ రాజు సాక్షాత్తు పరమేశ్వరుడే – ఇది ఏ అలంకారం?
ఎ) అతిశయోక్తి
బి) రూపకం
సి) అంత్యానుప్రాస
డి) లాటానుప్రాస
జవాబు:
బి) రూపకం

సొంతవాక్యాలు :

72. కుతూహలం : హిమాలయ సందర్శన కోసం మనస్సు కుతూహల పడుతున్నది.

73. శాశ్వత కీర్తి : సత్కార్యాలు చేసి శాశ్వత కీర్తిని పొందవచ్చు.

74. చెక్కుచెదరకుండ : అమరావతిలో శిల్ప సంపద చెక్కుచెదరకుండా ఉంది.

75. ప్రకృతి సౌందర్యం : హిమాలయాల్లోని ప్రకృతి సౌందర్యం పులకరింప జేస్తుంది.

76. భూతల స్వర్గం : కాశ్మీర్ భూతల స్వర్గంలా మనకు దర్శనం ఇస్తుంది.

77. ఆవరించు : నీలి మేఘాలు ఆకాశాన్ని ఆవరించి ఉన్నాయి.

78. పరిసరాలు : మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి.

79. తేజోవంతం : సూర్యబింబం తేజోవంతంగా వెలుగొందుతున్నది.

80. సభ్యలోకం : విద్వాంసులను సభ్యలోకం ఘనంగా సత్కరిస్తుంది.

81. పునీతం : పుణ్యక్షేత్ర దర్శనంతో పునీతం అవుతాము.

AP Board 8th Class Telugu Solutions Chapter 3 నీతి పరిమళాలు

AP State Syllabus AP Board 8th Class Telugu Textbook Solutions Chapter 3 నీతి పరిమళాలు Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Telugu Solutions 3rd Lesson నీతి పరిమళాలు

8th Class Telugu 3rd Lesson నీతి పరిమళాలు Textbook Questions and Answers

చదవండి – ఆలోచించండి – చెప్పండి

1. మీకు తెలిసిన నీతి వాక్యా లు తెలపండి.
2. నీతులు ఏ ఏ రూపాల్లో ఉంటాయి?
3. వందకుపైగా పద్యాలుండే ప్రక్రియను ఏమంటారు?
4. మకుటం అంటే ఏమిటి?
5. మకుటం ఏ రకంగా ఉండవచ్చు?
6. మీకు తెలిసిన నీతిశతకాల పేర్లు చెప్పండి.
7. మీకు తెలిసిన శతక కవుల పేర్లు చెప్పండి.
8. శతకాలలో కేవలం నీతిని బోధించేలే ఉంటాయా? వివరించండి.
9. ఇంతవరకు మీరు కంఠస్థం చేసిన పద్యాల్లో ఏయే శతకాల పద్యాలున్నాయి?

ప్రశ్నలు జవాబులు

ప్రశ్న 1.
మీకు తెలిసిన నీతివాక్యాలు తెల్పండి.
జవాబు:
1) ఖలునకు నిలువెల్ల విషము ఉంటుంది.
2) విద్యలేనివాడు వింతపశువు.
3) కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగదు.
4) సదౌష్టియె పాపములను చెఱచును.
5) పడతులు మర్యాదలేటిగి బ్రతుకవలెను.
6) చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు.
7) ఆలస్యంగా తింటే అమృతం కూడా విషం అవుతుంది.
8) ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు.

ప్రశ్న 2.
నీతులు ఏ ఏ రూపాల్లో ఉంటాయి?
జవాబు:
నీతులను భర్తృహరి పది రకాలుగా విభజించారు –
1) మూర్ఖ పద్ధతి
2) విద్వత్పద్ధతి
3) మానశౌర్య పద్ధతి
4) అర్థ పద్ధతి
5) దుర్జన పద్ధతి
6) సుజన పద్ధతి
7) పరోపకార పద్ధతి
8) ధైర్య పద్ధతి
9) దైవ పద్ధతి
10) కర్మ పద్ధతి.

AP Board 8th Class Telugu Solutions Chapter 3 నీతి పరిమళాలు

ప్రశ్న 3.
వందకు పైగా పద్యాలుండే ప్రక్రియను ఏమంటారు?
జవాబు:
వందకు పైగా పద్యాలుండే ప్రక్రియను శతకం అంటారు.

ప్రశ్న 4.
మకుటం అంటే ఏమిటి?
జవాబు:
మకుటం అనగా పద్యం చివర ఉండేది. ఇది పదంగా కాని, అర్ధపాదంగా కాని, పాదంగా కాని, పాద ద్వయంగా కాని ఉండవచ్చు.

ప్రశ్న 5.
మకుటం ఏ రకంగా ఉండవచ్చు?
జవాబు:
మకుటం పద్యరూపంలోగాని, గద్యరూపంలోగాని ఏ రకంగానైనా ఉండవచ్చు.

ప్రశ్న 6.
మీకు తెలిసిన నీతిశతకాల పేర్లు చెప్పండి.
జవాబు:
తెలుగులో పెక్కు నీతిశతకాలు ఉన్నాయి. తెలుగులో మొదటి నీతి శతకం బద్దెన రచించిన సుమతి శతకం. మారద వెంకయ్య రచించిన భాస్కర శతకం చక్కని నీతి శతకం. అట్లే వేమన రచించిన ‘వేమన శతకం’ చక్కని నీతి పద్యాల సంకలనం. ఏనుగు లక్ష్మణకవి రచించిన సుభాషిత రత్నావళిలో చక్కని నీతిపద్యాలున్నాయి. ఇంకా ఫక్కి అప్పల నరసయ్య రచించిన కుమారీ శతకం, కుమార శతకం, జంధ్యాల పాపయ్యశాస్త్రిగారి తెలుగుబాల పద్యాలు, నార్లవారి పద్యాలు, నాళం కృష్ణారావుగారి పద్యాలు మొదలైన అనేక నీతి శతకాలు తెలుగులో వచ్చాయి.

ప్రశ్న 7.
మీకు తెలిసిన శతక కవుల పేర్లు చెప్పండి.
జవాబు:

1) బద్దెనసుమతి శతకం
2) ఫక్కి అప్పల నరసయ్యకుమారీ శతకం, కుమార శతకం
3) వేమనవేమన శతకం
4) ఏనుగు లక్ష్మణకవిసుభాషిత రత్నావళి
5) గువ్వల చెన్నడు/పట్టాభిరామకవిగువ్వల చెన్న శతకం
6) మారద వెంకయ్యభాస్కర శతకం
7) కంచర్ల గోపన్నదాశరథీ శతకం

AP Board 8th Class Telugu Solutions Chapter 3 నీతి పరిమళాలు

ప్రశ్న 8.
శతకాలలో కేవలం నీతిని బోధించేవే ఉంటాయా? వివరించండి.
జవాబు:
శతకాలలో కేవలం నీతిని బోధించేవే కాకుండా భక్తిని బోధించేవి, వైరాగ్యాన్ని బోధించేవి, ధర్మాలను బోధించేవి, శృంగారాన్ని తెలిపేవి కూడా ఉంటాయి. తత్త్వ శతకాలు, అధిక్షేప శతకాలు, వ్యాజోక్తి శతకాలు మొదలైనవి కూడా ఉంటాయి.

ప్రశ్న 9.
ఇంతవరకు మీరు కంఠస్థం చేసిన పద్యాల్లో ఏయే శతకాల పద్యాలున్నాయి?
జవాబు:

  1. గువ్వల చెన్న శతకం
  2. కుమార శతకం
  3. తెలుగు పూలు శతకం
  4. వేమన శతకం
  5. సుమతి శతకం
  6. నరసింహ శతకం
  7. కృష్ణ శతకం
  8. దాశరథీ శతకం
  9. కాళహస్తీశ్వర శతకం
  10. సుభాషిత రత్నావళి.

ఇవి చేయండి

I. వినడం – మాట్లాడడం

ప్రశ్న 1.
పాఠంలోని పద్యాలను అర్థవంతంగా, రాగయుక్తంగా చదవండి.
జవాబు:
విద్యార్థి కృత్యము.

ప్రశ్న 2.
పద్యాల్లోని నీతిని సొంతమాటల్లో చెప్పండి.
జవాబు:
1. గుణవంతుడు లోకానికి మేలు చేకూర్చే కార్యము ఎంత భారమైనా చేయడానికి సిద్ధపడతాడు.
2. ఉప్పులేని వంటలూ, రసజ్ఞత లేని చదువు వ్యర్థం.
3. సంస్కారవంతమైన మాటయే మనిషికి నిజమైన అలంకారం.
4. మానవుణ్ణి ఇంద్రియ చాపల్యం నుండి భగవంతుడే కాపాడాలి.
5. ఓర్పు కలవారు అన్ని పనుల్లోనూ సమర్థులు అవుతారు.
6. మానవులు రాజును ఆశ్రయించడం వ్యర్థం.
7. ఎదుటి వాడి బలాన్ని గుర్తించకుండా పోరాటం చేసేవాడు అవివేకి.
8. జీర్ణం కాని చదువు, తిండి చెరుపు చేస్తాయి.

AP Board 8th Class Telugu Solutions Chapter 3 నీతి పరిమళాలు

ప్రశ్న 3.
‘చదువు జీర్ణం’ కావటాన్ని మీరు ఎలా అర్థం చేసుకున్నారో చెప్పండి.
జవాబు:
చదువు జీర్ణం అవడం అంటే చదివిన దాన్ని గ్రహించి ఆచరణలో పెట్టగలగడం. చదివిన విషయాన్ని ఆధారంగా చేసికొని దాని తరువాత విషయాలను నేర్చుకోగలగడం, చదివిన విషయం జ్ఞప్తిలో ఉంచుకోవడం – అని అర్థం చేసుకున్నాను.

II చదవడం, అవగాహన చేసుకోవడం

1. పాఠంలోని పదాల ఆధారంగా కింద తెలిపిన వాటిని వేటితో పోల్చారో రాయండి.
అ) రసజ్ఞత ఆ) అవివేకం ఇ) వాక్కు
జవాబు:
అ) రసజ్ఞత : కూరలో వేసే ‘ఉప్పు’ తో పోల్చారు.
ఆ) అవివేకం : ఎదుటివాడి బలం తెలియకుండా యుద్ధానికి దిగడం ‘అవివేకం’ అని చెప్పారు.
ఇ) వాక్కు : సంస్కారవంతమైన మాటను అలంకారంతో పోల్చారు.

2. కింద ఇచ్చిన భావానికి తగిన పద్యపాదం గుర్తించి రాయండి.
అ) గొప్పవారు లోకానికి మేలు జరిగే పనులను ఎంత కష్టమైనా చేస్తారు.
జవాబు:
ఘనగుణశాలి లోకహితకార్యము మిక్కిలి భారమైన మేలనుకొని పూను

ఆ) పొట్టేలు కొండతో ఢీకొంటే, దాని తల పగులుతుంది.
జవాబు:
కొండతోఁ దగరు ఢీకొని యెంత తాఁకినఁ దల ప్రక్కలగుఁగాక దాని కేమి

ఇ) తిన్నతిండి జీర్ణమైతే బలం కలుగుతుంది.
జవాబు:
తిండి జీర్ణమైన నిండు బలము

ఈ) రసజ్ఞత లేకపోతే గొప్పవాళ్ళు మెచ్చుకోరు.
జవాబు:
రసజ్ఞత యించుక చాలకున్న నా చదువు నిరర్థకంబు గుణసంయుతులెవ్వరు మెచ్చరు.

AP Board 8th Class Telugu Solutions Chapter 3 నీతి పరిమళాలు

3. సభారంజన శతకం’లో క్షమ అనే పదాన్ని ప్రతి పాదంలోనూ వాడటం కనిపిస్తున్నది కదా ! క్షమను ఏ ఏ అర్థాలలో ఉపయోగించారో చెప్పండి.
జవాబు:
మొదటి పాదంలో క్షమను “ఓరిమి” అనే అర్థంలోను,
రెండవ పాదంలో క్షమను “భూమి” అనే అర్థంలోను,
మూడవ పాదంలో క్షమను “సహనం” అనే అర్థంలోను
నాలుగవ పాదంలో క్షమను “సమర్థత” అనే అర్థంలోను వాడారు.

4. పాఠంలోని పద్యాలు ఆధారంగా తప్పు-ఒప్పులు గుర్తించండి.
అ) రత్నహారాలు మనిషికి నిజమైన అలంకారం. (తప్పు)
ఆ) ఉప్పులేని కూరైనా రుచిగా ఉంటుంది. (తప్పు)
ఇ) సూర్యుని పైకి దుమ్ము ఎత్తి పోస్తే అది పోసినవాడి మీదే పడుతుంది. (ఒప్పు)
ఈ) తిండి జీర్ణం కాకపోతే మనకు ఆరోగ్యం. (తప్పు)

5. పాఠం ఆధారంగా జవాబులు రాయండి.

అ) గొప్పవారి వల్ల ప్రజలకు కలిగే మేలు ఏమిటి?
జవాబు:
గొప్పవారు ఎప్పుడూ ఇతరులకు సహాయం చేసేటందుకే ప్రయత్నం చేస్తారు. ఎదుటివారి నుండి ఎటువంటి లాభాలను ఆశించరు. లోకానికి మేలు కలిగించే పని ఎంతటి భారమైనప్పటికీ చేయడానికి పూనుకుంటారు.

ఆ) రాజులను ఎందుకు ఆశ్రయించకూడదని కవి భావించాడు?
జవాబు:
రాజులను ఆశ్రయించవలసిన పనిలేదని ధూర్జటి కవి, తన శ్రీకాళహస్తీశ్వర శతకంలో ఇలా చెప్పాడు
1) తినడానికి తిండి కావాలని అడిగితే ఎవరైనా భిక్షం పెడతారు.
2) నివసించడానికి కావలసివస్తే గుహలు ఉన్నాయి.
3) వస్త్రాలు కావాలంటే వీధుల్లో దొరుకుతాయి.
4) త్రాగడానికి నదుల్లో తియ్యని నీరు ఉంది.

కాబట్టి రాజులను కూటికీ, ఇంటికీ, బట్టకూ ఆశ్రయించనక్కరలేదని కవి చెప్పాడు.

ఇ) “ఎలాంటి చదువు వ్యర్థమని” మీరు తెలుసుకున్నారు?
జవాబు:
ఎంత చదువు చదివినా దానిలోని అంతరార్థాన్ని, రసజ్ఞతను గ్రహించలేని చదువు వ్యర్థమని తెలుసుకున్నాను.

ఈ) ఏవేవి అవివేకమైన పనులని ఈ పాఠం ద్వారా తెలుసుకున్నారు? వీటివల్ల కలిగే ఫలితాలు ఏమిటి?
జవాబు:
సూర్యుని మీద దుమ్మెత్తి పోయడం, పొట్టేలు కొండతో ఢీకొనడం, మిడతలు మంటపైకి ఎగిసిపడడం, వలలో చిక్కుకున్న చేప పొరలాడడం, అలాగే ఎదుటివాడి బలం తెలియకుండా వాడితో యుద్ధానికి దిగడం – అనే పనులు అవివేకమైన పనులని నేను తెలిసికొన్నాను.

వీటి వల్ల కలిగే ఫలితాలు :
సూర్యుడి మీద దుమ్మెత్తి పోస్తే, పోసినవాడి నెత్తిమీదే పడుతుంది. పొట్టేలు కొండతో ఢీకొంటే పొట్టేలు తల బద్దలౌతుంది. మిడతలు మంటపైకి దూకితో అవే మాడిపోతాయి. వలలో చిక్కిన చేప పొరలాడితే అది మరింతగా బందీ అవుతుంది. ఎదుటివాడి బలం తెలియకుండా పోరాటానికి దిగితే దిగినవాడే ఓడిపోతాడు.

ఉ) నిజమైన అలంకారం ఏది?
జవాబు:
బంగారు హారాలు ధరించడం, సిగలో పువ్వులు అలంకరించుకోవడం, సుగంధ ద్రవ్యాలు వాడటం, పన్నీటి ‘స్నానం, మొదలైనవి మానవుడికి అలంకారాలు కావు. సంస్కారవంతమైన మాటయే, పురుషుడికి నిజమైన అలంకారం.

AP Board 8th Class Telugu Solutions Chapter 3 నీతి పరిమళాలు

ఊ) ఏ ఏ బలహీనతల వల్ల ఏవేవి ఎలా నశిస్తాయి?
జవాబు:
మానవుడు ఎన్నో బలహీనతలకు లోను అవుతున్నాడు. ఏనుగు తన దురదను పోగొట్టుకొనడానికి, చేప నోటి రుచిని ఆశించి, పాము రాగానికి వశపడి, జింక అందానికి బానిస అయి, తుమ్మెదలు పూల వాసనలకు మైమరచి బందీలవుతున్నాయి. ఇలా ఒక్కొక్క ప్రాణి ఒక్కొక్క బలహీనత వల్ల నశించిపోతున్నాయి.

III. స్వీయరచన

1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో సమాధానాలు రాయండి.

అ) గొప్పవాళ్ళే లోకహితమైన కార్యాలు ఎందుకు చేస్తారో మీరు ఊహించి రాయండి.
జవాబు:
‘పరోపకారార్థం ఇదం శరీరం’ అనగా ఇతరులకు మేలు చేయడం కోసమే ఈ శరీరం అని అర్థం. గొప్పవాళ్ళు అంటే, స్వార్థం విడిచి ఇతరులకు మేలు చేసేవారు. గొప్పవాళ్ళు కీర్తిని కోరుకుంటారు. స్వలాభాన్ని ఆశించరు. అటువంటి గొప్పవారు లోకానికి మేలు కలిగించే పని, అది ఎంత భారమైనా చేయడానికి పూనుకుంటారు. ఆదిశేషుడు తాను గాలిని మాత్రమే పీలుస్తాడు. కానీ తన వేయిపడగల మీద పెద్ద భూభారాన్ని ఏ మాత్రం కదలకుండా మోస్తాడు. స్వార్థ రాహిత్యం , కీర్తికాంక్ష కారణంగా, గొప్పవాళ్ళు లోకహిత కార్యాలు చేస్తారు.

ఆ) వాక్కు మనిషికి నిజమైన అలంకారమని ఎలా చెప్పగలవు?
జవాబు:
సంస్కారవంతమైన వాక్కే, మనిషికి నిజమైన అలంకారం. బంగారు హారాలు ధరించడం, సిగలో పూలు పెట్టుకోవడం, సుగంధ ద్రవ్యాలు ఉపయోగించడం, పన్నీటితో స్నానం చెయ్యడం మొదలైన పనులు, మానవుడికి అలంకారాలు కావు. ఒక్క పవిత్రమైన వాక్కే, మానవుని అలంకరిస్తుంది. వాక్కు అనే అలంకారమే నిజమైన మంచి అలంకారము. మిగిలిన కేయూరములు వంటి భూషణాలు అన్నీ నశించేవే.

ఇ) సమర్థులు అంటే ఎవరు ? సామర్థ్యం ఎలా వస్తుంది?
జవాబు:
ఎవరైతే ఓర్పుతో, సహనంతో అన్ని పనులను తమంత తాము నిర్వర్తించగలుగుతారో వారిని “సమర్థులు” అంటారు. ఎవరు ప్రయత్నం చేసి ఓరిమిని కాపాడుకుంటారో, వారే భూమిని కాపాడగలరు. అంటే క్షమాగుణం గల ప్రభువులే, రాజ్యమును రక్షింపగలరు. ఎవరిలో సహనగుణం నిశ్చలంగా ఉంటుందో వారే అన్ని పనుల్లోనూ సమర్థులై ఉంటారు. క్షమాగుణం గలవారే సమర్థులు. క్షమాగుణం వల్లనే సామర్థ్యం వస్తుంది.

ఈ) చదువును మంచికూరతో కవి ఎందుకు పోల్చాడు?
జవాబు:
చాలామంది చదువుకుంటారు. ఎంతో పాండిత్యాన్ని సంపాదిస్తారు. ఎంత చదువు చదివినా వారిలో కొంచెం రసజ్ఞత లేకపోతే ఆ చదువు వ్యర్థం. చదువును మంచికూరతో కవి పోల్చాడు. కూరలో తక్కిన దినుసులు అన్నీ వేసి చక్కగా నలభీమపాకం చేసినా, అందులో కొంచెం ఉప్పు వేయకపోతే ఆ కూర రుచిగా ఉండదు. అందుకే రసజ్ఞత లేని చదువుకు దృష్టాంతంగా ఉప్పులేని కూరను, కవి చెప్పాడు.

AP Board 8th Class Telugu Solutions Chapter 3 నీతి పరిమళాలు

2. కింది ప్రశ్నలకు పదేసి వాక్యాలలో జవాబులు రాయండి.

అ) మంచితనమంటే ఏమిటి? కొంతమందిలో మీరు గమనించిన మంచితనాన్ని గూర్చి రాయండి.
జవాబు:
ఎదుటివారిని నొప్పించకుండా, బాధ పెట్టకుండా, ఇతరులకు తన చేతనైన సహాయం చేస్తూ, సమాజంలో ఒక గొప్ప వ్యక్తిగా జీవించటాన్నే ‘మంచితనం’ అంటారు.

భారతంలో “సక్తుప్రస్థుడి” కథ ఉంది. కురుక్షేత్రంలో ‘సక్తుప్రస్థుడు’ అనే గృహస్థుడు ఉండేవాడు. ఆయనకు భార్య, కొడుకు, కోడలు ఉండేవారు. వారు ఆ పరిసరాల్లోని చేలల్లో తిరిగి, అక్కడ రాలిన ధాన్యం గింజలను ఏరి తెచ్చుకొని, వాటిని దంచి పిండి చేసికొని, దాన్ని వండుకొని సమంగా పంచుకొని తినేవారు.

ఒక రోజు వాళ్ళు తినడానికి సిద్ధంగా ఉండగా, ఒక ముసలివాడు ఆకలి అంటూ వచ్చాడు. వారు తమకు ఉన్నదంతా ఆ ముసలివాడికి తృప్తిగా పెట్టారు. ఆ వృద్దుడు సంతోషించాడు. సక్తుప్రస్తుడి కుటుంబం ఆకలితో ఉన్నా అతిథి ఆకలి తీర్చడమే ముఖ్యమని వారు భావించారు. అదే మంచితనం అని నా అభిప్రాయం.

ప్రస్తుత సమాజంలో నేను చాలా మందిలో ఈ మంచితనాన్ని గమనించాను. కొందరు తమ మంచితనంతో ఎదుటివారికి ధనరూపంలో సాయం చేస్తారు, వస్తురూపంలో సాయం చేస్తారు. కొందరు అనాథలైన పిల్లలను చేరదీసి వారి కోసం ఒక ట్రస్టును ఏర్పాటుచేసి దానికి ఆర్థిక సాయం చేస్తున్నారు. కొందరు వృద్ధులకు, పెద్దవారికి ఆశ్రమాలను ఏర్పాటు చేసి వారిని చేరదీస్తున్నారు. ఇంకా అనేక మంది తమ మంచితనంతో పలు ప్రజాహిత కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆదర్శప్రాయమైన జీవనం సాగిస్తున్నారు.

ఆ) ‘సమర్థులకు క్షమ అవసరం’ వివరించండి.
జవాబు:
సమర్థులకు ‘ఓర్పు’ చాలా అవసరం. దీనికి భారత కథలో ధర్మరాజు చక్కని ఉదాహరణ. ధర్మరాజు గొప్ప పరాక్రమం గలవాడు. ఆయనకు కోపం వస్తే సప్త సముద్రాలూ ఏకం అవుతాయని కృష్ణుడు చెప్పాడు. ధర్మరాజుకు భీమార్జునుల వంటి తమ్ముళ్ళు ఉన్నారు. దుర్యోధనుడు ధర్మరాజుకు ఎన్నో ఆపదలు కల్గించాడు. ద్రౌపదిని అవమానించాడు. పాండవులను లక్క ఇంటిలో పెట్టి దహనం చేయాలని చూశాడు. వారిని అడవులకు పంపాడు. ఘోషయాత్ర పేరుతో వారిని అవమానించాలని చూశాడు. పాండవుల అజ్ఞాతవాసాన్ని భంగం చేయాలని విరాటుడి గోవులను పట్టించాడు. ఇన్ని చేసినా ధర్మరాజు క్షమాగుణంతో సహించాడు. కృష్ణుణ్ణి రాయబారిగా పంపాడు. విధిలేక యుద్ధం చేశాడు. జయించాడు. ఏకచ్ఛత్రాధిపతిగా రాజ్యం పాలించాడు.

దీనంతటికీ ధర్మరాజు క్షమాగుణమే కారణం.

IV. పదజాలం

1. కింది వాక్యాల్లో సమానమైన అర్థాన్నిచ్చే పదాలున్నాయి. వాటిని గుర్తించి, వాటి కింద గీతలు గీయండి.

అ) హృదయం మంచిదైతే అతడు మంచి మనిషి. అతని డెందములో అందరి పట్ల అభిమానమే ఉంటుంది. ఎదలో కల్మషం లేకుండా మాట్లాడితే అందరి చిత్రాలు సంతోషిస్తాయి.
జవాబు:
హృదయం మంచిదైతే అతడు మంచి మనిషి. అతని డెందములో అందరి పట్ల అభిమానమే ఉంటుంది. ఎదలో కల్మషం లేకుండా మాట్లాడిన అతని మాటలకి అందరి చిత్తాలు సంతోషిస్తాయి.
హృదయం, డెందము, ఎద, చిత్తము

ఆ) మిడుతలు చిచ్చుపైకి ఎగిసిపడ్డాయి. అడవిలో వహ్ని రగులుకొన్నది. అగ్నిలో చేయిపెడితే కాలుతుంది.
జవాబు:
మిడుతలు చిచ్చు పైకి ఎగిసిపడ్డాయి. అడవిలో వహ్ని రగులుకొన్నది. అగ్నిలో చేయిపెడితే కాలుతుంది.
చిచ్చు, వహ్ని, అగ్ని

AP Board 8th Class Telugu Solutions Chapter 3 నీతి పరిమళాలు

2. కింది పదాలకు వ్యతిరేకార్థకం రాసి, ఈ రెండు పదాలతోనూ సొంతవాక్యాలు రాయండి.
ఉదా :
కీర్తి – అపకీర్తి
మంచిపనులు చేస్తే కీర్తి వస్తుంది. చెడ్డపనులు చేస్తే అపకీర్తి వస్తుంది.

అ) అహితం – హితం
అహితం చేకూర్చే మాటలు వినకూడదు. హితం చేకూర్చే మాటలే వినాలి.

ఆ) బాగుపడు – చెడిపోవు
కొందరు బాగా చదువుకొని బాగుపడతారు. మరికొందరు పెద్దల మాటలు వినకుండా చెడిపోతున్నారు.

ఇ) నిస్సారం – సారం
నా సారం గల మాటలు, నీకు నిస్సారంగా తోచాయి.

ఈ) ఫలం – నిష్ఫలం
మంచివానికి నీతి చెపితే ఫలం ఉంటుంది. కాని మూర్ఖునికి ఎన్ని నీతులు ఉపదేశించినా అది నిష్ఫలం అవుతుంది.

3. కింది పదాలు చదవండి. ఏవైనా రెండేసి పదాలను ఉపయోగిస్తూ సొంతవాక్యాలు రాయండి.
అ) చదువు
ఆ) చెడిపోవు
ఇ) హారాలు
ఈ) ధనం
ఉ) దుష్టుడు
ఊ) బలం
ఎ) మార్గం
ఏ) చంచల స్వభావం
ఉదా :
చదువు జీవితానికి మార్గం చూపుతుంది.
జవాబు:

  1. చదువు మనకు మార్గం చూపుతుంది.
  2. ధనం చంచల స్వభావం కలది.
  3. దుష్టుడు చెడిపోవుట తథ్యము.
  4. మనిషికి చదువు ధనంతో సమానం.
  5. దుష్టుడు మంచి మార్గంలో సంచరించడు.
  6. హారాలు, ధనం ఎప్పటికైనా పోయేవే.
  7. దుష్టుడు చంచల స్వభావం కలవాడు.
  8. ధనం, బలం ఉన్నవాడికి గర్వం వస్తుంది.

V. సృజనాత్మకత

* పాఠశాలలో పిల్లలకు ‘పద్యాలతోరణం’ అనే పోటీ పెట్టారు. ఈ పోటీలో పిల్లలందరూ పాల్గొనాలని తెలియజేయడానికి ప్రకటన రాయండి. ప్రకటనలో నిర్వహించే తేదీ, స్థలం, సమయం మొదలగు వివరాలు ఉండాలి.
జవాబు:

ప్రకటన

విజయవాడ నగరంలోని ఉన్నత పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థినీ విద్యార్థులందరకూ ఒక శుభవార్త. దివి. xxxxxవ తేదీ గురువారం మధ్యాహ్నం 3 గంటలకు సత్యనారాయణపురం, మహాత్మాగాంధీ మునిసిపల్ ఉన్నత పాఠశాల ఆడిటోరియంలో ‘పద్యాలతోరణం’ పోటీ నిర్వహిస్తున్నాము. ఈ పోటీలో నగరంలోని విద్యార్థినీ విద్యార్థులందరూ పాల్గొనవచ్చు. తెలుగు పద్యాలు మాత్రమే చదవాలి. విజేతలకు ‘ఆంధ్ర మహాభారతం’ పూర్తి సెట్ బహుమతిగా ఇవ్వబడుతుంది. పాల్గొనే బాలబాలికలు తాము ప్రస్తుతం పాఠశాలలో చదువుతున్నట్లు తమ ప్రధానోపాధ్యాయుల నుండి ధృవీకరణ పత్రం దాఖలు చేయాలి. పోటీలో పాల్గొనేందుకు రుసుము లేదు. పోటీ నియమాలు గంట ముందు తెలుపుతారు.

ఇట్లు,
రసభారతి కళాపీఠం, విజయవాడ.

x x x x x,
విజయవాడ.

VI. ప్రశంస

* పాఠంలోని పద్యాలలో మీ మనసుకు హత్తుకున్న పద్యాలను గురించి, మీ మిత్రులతో చర్చించండి. మీరు చర్చించిన విషయాలు పది వాక్యాల్లో రాయండి.
జవాబు:
నేను, నా మిత్రులతో నేను చదివిన పద్యాలలో నుంచి కొన్నింటిని గూర్చి చర్చించాను. నాకు ‘చదువది ఎంత గలిగిన ….’ అనే పద్యంలోని విషయాలు, నీతి బాగా నచ్చాయని చెప్పాను. అలాగే ‘క్షమను కడఁక …..’ అనే పద్య సారము కూడా నాకు బాగా నచ్చిందని చెప్పాను. నా మిత్రుడు సాయి తనకు ‘ఊరూరం జనులెల్ల ….’ అనే పద్యం, దాని భావం బాగా నచ్చిందని చెప్పాడు. ఇంకొక మిత్రుడు ‘వనకరి చిక్కె ….’ అను పద్యసారం, ‘చదువు జీర్ణమైన …’ అను పద్యసారం బాగా నచ్చాయని చెప్పాడు. మేము ముగ్గురము ఈ పద్యాలలోని సారాన్ని, నీతిని ఎప్పటికీ మరువకుండా పాటించాలని నిర్ణయించుకున్నాము.

నాకు నచ్చిన పద్యములో చదువుకున్న విషయంలో ‘చదువది యెంతగల్గిన’ పద్యం ఎందుకు నచ్చిందంటే కవి చదువుకు వున్న ప్రాధాన్యతను చక్కగా చెప్పారు.

నా స్నేహితుడు సాయి తనకు ఊరూరం జనులెల్ల పద్యంలో కవి చెప్పిన నీతివాక్యాలు బాగా నచ్చాయని, ఎవరికి ఏ అవసరం వచ్చినా తీర్చడానికి భగవంతుడు ఉన్నాడని చెప్పిన మాటలు బాగా నచ్చాయని చెప్పాడు.

ఇలా ఒక్కొక్కరం ఒక్కొక్క పద్యాన్ని గురించి వివరంగా ‘చర్చించుకున్నాము.

AP Board 8th Class Telugu Solutions Chapter 3 నీతి పరిమళాలు

(లేదా)

* చక్కని నీతులు చెప్పిన శతకకవుల గొప్పతనాన్ని వర్ణిస్తూ ఒక వ్యాసం రాయండి.
జవాబు:
‘శతకం’ అంటే నూరు పద్యాల చిన్న గ్రంథం. శతక పద్యాలకు సామాన్యంగా చివర మకుటం ఉంటుంది. శతకాలలో సుమతీ శతకం, వేమన శతకం, భాస్కర శతకం, దాశరథీ శతకం, శ్రీకాళహస్తీశ్వర శతకం, కృష్ణ శతకం మొదలయిన శతకాలున్నాయి.

శతకకవులు నీతిని, భక్తిని, వైరాగ్యాన్ని ప్రబోధిస్తూ గొప్ప శతకాలు రాశారు. వేమన శతకం, సుమతీ శతకాలలోని పద్యాలు రాని, తెలుగువాడుండడు. వేమన చెప్పిన “గంగిగోవుపాలు”, ‘ఉప్పు కప్పురంబు’, “తల్లిదండ్రి మీద దయలేని పుత్రుడు”, “నిక్కమైన మంచి నీలమొక్కటి చాలు” వంటి పద్యాలు, గొప్ప జ్ఞానాన్ని బోధిస్తాయి. ఇక సుమతీ శతకకారుడు బద్దెన చెప్పిన ‘కనకపు సింహాసనమున’, “తన కోపమె తన శత్రువు”, “ఎప్పుడు సంపద కలిగిన”, “వినదగు నెవ్వరు సెప్పిన” మొదలైన కంద పద్యాలు, జీవితం అంతా గుర్తుంచుకోదగినవి. కృష్ణ శతకం, దాశరథీ శతకం, శ్రీకాళహస్తీశ్వర శతకం భక్తిని ప్రబోధించి వైరాగ్యాన్ని కల్గిస్తాయి. శేషప్పకవి రచించిన నరసింహ శతకం కూడా భక్తినీ, నీతిని బోధిస్తుంది. కుమార కుమారీ శతకాలు బాలబాలికలకు చక్కని నీతులనూ, ధర్మాలనూ, కర్తవ్యాన్ని బోధిస్తాయి. ఏనుగు లక్ష్మణకవి భర్తృహరి సుభాషితాలను అనువదించి, మూడు గొప్ప శతకాలను తెలుగువారికి అందించాడు.

మన తెలుగు శతకకర్తలు మన తెలుగువారికీ తెలుగుభాషకూ మహోన్నతమైన సేవచేసి ధన్యులయ్యారు.

ప్రాజెక్టు పని

* శతకపద్యాలలో చెప్పిన నీతులకు సరిపోయే కథలను సేకరించి, వాటికి నీతిపద్యాలను జోడించి ఆల్బమ్ తయారుచేయండి.
జవాబు:
ఉదా :
(నీతిపద్యాలు – కథలు)
1. సీ. దుష్టు సూర్యుని దెస దుమ్మెత్తి జల్లినఁ
దనపైనె పడుఁగాక దానికేమి
కొండతోఁ దగరు ఢీకొని యెంత తాఁకినఁ
దల ప్రక్కలగుఁగాక దాని కేమి
మిడతలు చిచ్చుపై వడి నెంతయెగసినఁ
దామె పొక్కెడుఁ గాక దానికేమి
వలఁ బడ్డ మీ నెంత వడి దాఁక బొరలిన
దనుఁజుట్టు కొనుఁగాక దానికేమి

తే.గీ. యెదిరి సత్త్వంబు తన సత్త్వమెఱుఁగలేక
పోరువాఁడెందున వివేకబుద్ధి యండ్రు
కలిత లక్ష్మీశ, సర్వజగన్నివేశ
విమల రవికోటిసంకాశ వేంకటేశ ! (వేంకటేశ శతకం)

2. బలవంతులకు గుణపాఠం

అనగనగా ఒక అడవి ఉన్నది. ఆ అడవిలో చాలా చీమలు నివసిస్తూ ఉండేవి. వాటిల్లో కొన్ని చీమలు కలిసి పెద్ద పుట్టను నిర్మించుకున్నాయి. అందులోనే జీవించసాగాయి. కొన్నాళ్ళకు ఆ పుట్టలో పెద్దపాము ప్రవేశించింది. దానితో చీమలకు కష్టాలు ప్రారంభమయ్యాయి. చీమలు కష్టపడి ఆహారాన్ని సంపాదించుకుని ఆ పుట్టలో దాచి పెట్టుకున్నాయి. అదంతా ఆ పామువలన పాడైపోతున్నది. తనకు బలం ఉన్నది గదా ! అని పాము గర్వంతో ప్రవర్తిస్తున్నది.

చీమలు ఆలోచించాయి. “తాము కలిసికట్టుగా దాడిచేస్తే పాము ఏమీ చేయలేదు” అని అనుకున్నాయి. ఎక్కడెక్కడో ఉన్న తమతోటి చీమలకు తమ బాధను తెలుపుకున్నాయి. దానితో అవి అన్నీ కలసి వచ్చాయి. పెద్ద దండు తయారయ్యింది. అదను చూసి అన్నీ కలిసి పాము మీద దాడి చేశాయి. చీమల గుంపులో పాము కూరుకుపోయింది. ఏమీ చేయలేని నిస్సహాయురాలయ్యింది పాము. ఊపిరాడక కొంత సేపటికి ప్రాణాలు కోల్పోయింది. చీమలకు పాము పీడ విరగడయ్యింది.

నీతి : బలహీనులు అందరూ కలిస్తే బలవంతుల గర్వం అణగక తప్పదు.

VII. భాషను గురించి తెలుసుకుందాం!

1) కింది పదాలను విడదీసి, సంధి పేర్లు రాయండి.
అ) చాలకున్న = చాలక + ఉన్న – (అ + ఉ) – (ఉత్వసంధి)
ఆ) అదేమిటి = అది + ఏమిటి – (ఇ + ఏ) – (ఇత్వసంధి)
ఇ) వెళ్ళాలని = వెళ్ళాలి + అని – (ఇ + అ) – (ఇత్వసంధి)
ఈ) ఒకింత = ఒక + ఇంత -(అ + ఇ) – (అత్వసంధి)

AP Board 8th Class Telugu Solutions Chapter 3 నీతి పరిమళాలు

2) కింది పదాలు చదవండి. పదంలోని చివరి అక్షరం కింద గీత గీయండి.
పూచెను, వచ్చెను, తినెను, చూచెన్, ఉండెన్

పై పదాలను గమనిస్తే, పదాల చివర ‘ను’, ‘న్’లు కనిపిస్తాయి. అంటే పదాల చివర నకారం ఉన్నది.

ఈ ‘న’ కారాన్ని ద్రుతం అంటారు. ఈ చివరన ‘న’ కారం గల పదాలను ద్రుతప్రకృతికాలు అంటారు. పూచేను, వచ్చెను, చూచెన్ మొదలైనవి ద్రుతప్రకృతికాలే.

మరికొన్ని ద్రుతప్రకృతికాలను రాయండి.
కాచెను, వ్రాసెను, తినెను, త్రాగెన్, చదివెన్ మొదలగునవి.

3) కింది వాటిని గమనించండి.
ఉదా :
అ) పూచెన్ + కలువలు = పూచెన్ + గలువలు
ఆ) దెసన్ + చూచి = దెసన్ + జూచి
ఇ) చేసెన్ + టక్కు = చేసెన్ + డక్కు

అభ్యాసం :
పైన తెల్పిన ఉదాహరణల్లాగా కింది వాటిని వివరించండి.
1) చేసెను + తల్లీ : చేసెను + దల్లీ
2) దెసను + చూసి = దెసను + జూసి

గమనిక :
మొదటి ఉదాహరణలో ద్రుత ప్రకృతికానికి ‘క’ పరమైతే, దానికి ఆదేశం (దాని స్థానంలో) ‘గ’ వచ్చింది.

రెండవ ఉదాహరణలో ద్రుత ప్రకృతికానికి ‘చూ’ పరమైతే దానికి ఆదేశంగా ‘జూ’ వచ్చింది. అలాగే ‘ట’ కు ‘డ’, ‘క’ కు ‘గ’, ‘చ’ కు ‘జ’ ఆదేశంగా వచ్చా యి.
అంటే
‘క’ కు – గ ; ‘చ’ కు + జ ; ‘ట’ కు – డ;

గమనిక :
1) ‘క, చ, ట, త, ప’ లకు ‘పరుషాలు’ అని పేరు.
2) ‘గ, జ, డ, ద, బ, లకు ‘సరళాలు ‘ అని పేరు.
పై ఉదాహరణలలోని భావాన్ని బట్టి సూత్రీకరిస్తే, ద్రుత ప్రకృతిక సంధి లేక సరళాదేశ సంధి సూత్రం ఇలా ఉండాలి.

1. సూత్రం :
ద్రుత ప్రకృతికాలకు పరుషాలు పరమైతే సరళాలు ఆదేశంగా వస్తాయి.
గమనిక :
కింది ఉదాహరణలు చూడండి.

పూచెఁగలువలు – ద్రుతం అరసున్న (C) గా మారింది.
ఉదా :
పూచెను + కలువలు
1) పూచెంగలువలు – ద్రుతం పూర్ణబిందువుగా (0) గా మారింది.
2) పూచెన్గలువలు – ద్రుతం సంశ్లేషగా మారింది అంటే ద్రుతం మీది హల్లుతో కలిసింది.
3) పూచెనుగలువలు – ద్రుతం ఏ మార్పూ చెందకుండా ఉంది.

పై ఉదాహరణల ఆధారంగా, ద్రుత ప్రకృతిక సంధి జరిగిన తీరును సూత్రీకరిస్తే ఇలా ఉంటుంది.

2. సూత్రం :
ఆదేశ సరళానికి ముందున్న ద్రుతానికి బిందు సంశ్లేషలు విభాషగా వస్తాయి. అనగా ఒక్కోసారి బిందువు వస్తుంది. ఒక్కోసారి సంశ్లేష వస్తుంది.

ఛందస్సు :

1) ఒకే అక్షర గణాలు :
ఒకే అక్షరం గణంగా ఏర్పడితే అది ఏకాక్షర గణం. ఈ గణంలో ఒక గురువు లేదా ఒక లఘువు ఒక్కొక్కటే గణంగా ఉంటాయి.

2) రెండు అక్షరాల గణాలు :
రెండేసి అక్షరాలు కలిసి గణాలుగా ఏర్పడతాయి. వీటిలోనూ గురువు, లఘువులుంటాయి. ఇవి నాలుగు రకాలు
అ) ఒక గురువు ఒక లఘువు కలిసి గణంగా ఏర్పడితే ఆ గణాన్ని ‘గలం’ లేదా ‘హ’ గణం అని అంటారు.

ఆ) ఒక లఘువు, ఒక గురువు కలిసి గణంగా ఏర్పడితే, అది ‘లగం’ లేదా ‘వ’ గణం అని అంటారు.

ఇ) రెండూ గురువులే గల గణాన్ని – ‘గగము’ అంటారు.

ఈ) రెండూ లఘువులే గల గణాన్ని – ‘లలము’ అంటారు.

అభ్యాసం :
రెండక్షరాల గణాలు నాలుగు రకాలు ఉన్నాయి కదా ! ఒక్కొక్క దానికి 4 పదాల చొప్పున రాయండి.

3) మూడు అక్షరాల గణాలు :
మూడేసి అక్షరాలు గల గణాలు ఎనిమిది. పట్టికలో చూడండి, మరికొన్ని పదాలు రాయండి.

వ్యాకరణంపై అదనపు సమాచారం

పర్యాయపదాలు

కరి : ఏనుగు, హస్తి, గజము, ఇభము
భూరి : బంగారం, హేమం, సువర్ణం
మిత్రుడు : స్నేహితుడు, సఖుడు, చెలికాడు
పుష్పము : పూవు, సుమము, కుసుమము
ధనము : సంపద, ఐశ్వర్యము, డబ్బు
కొండ : అద్రి, పర్వతం, నగము
భాస్కరుడు : రవి, సూర్యుడు, ప్రభాకరుడు
మర్త్యుడు : మానవుడు, నరుడు
వాణి : వాక్కు మాట
జలము : నీరు, వారి, ఉదకము
లక్ష్మి : శ్రీ, రమ, కమలాలయ

వ్యుత్పత్యర్థాలు

కేశము – శిరస్సున ఉండేది. (వెంట్రుక)
ధరణి – సమస్తాన్ని ధరించునది (భూమి)
భాస్కరుడు – కాంతిని కలుగజేయువాడు (సూర్యుడు)
కరి – తొండము గలది (ఏనుగు)
దాశరథి – దశరథుని కుమారుడు (శ్రీరాముడు)
మిత్రుడు – సర్వప్రాణులందు సమభావన కలవాడు (సూర్యుడు)
మర్త్యుడు – మరమున (భూ లోకమున) పుట్టినవాడు (నరుడు)

AP Board 8th Class Telugu Solutions Chapter 3 నీతి పరిమళాలు

నానార్థాలు

ఎద = హృదయం, భయం
ఫలము = పండు, ప్రయోజనం
గుణము = స్వభావము, అల్లెత్రాడు
అమృతం = పాలు, నీరు, సుధ
మిత్రుడు = సూర్యుడు, స్నేహితుడు
సుధ = అమృతం, పాలు, నీరు
చీరము = వస్త్రము, గోచి, రేఖ
రాజు = ప్రభువు, చంద్రుడు
శ్రీ = సంపద, లక్ష్మి, సాలెపురుగు
సత్త్వము = బలము, సామర్థ్యము, శక్యము
ఇనుడు = సూర్యుడు, ప్రభువు, పోషకుడు
కోటి = సమూహం, వందలక్షలు, అగ్రభాగం
చవి = రుచి, సౌఖ్యము, దీవి

సంధులు

సవర్ణదీర్ఘ సంధి
సూత్రం : అ, ఇ, ఉ, ఋ లకు అవే (సవర్ణ) అచ్చులు పరమైనప్పుడు వానికి దీర్ఘములు ఏకదేశమగును.
భూరిమయాంగద = భూరిమయ + అంగద – సవర్ణదీర్ఘ సంధి
లక్ష్మీశ = లక్ష్మి + ఈశ – సవర్ణదీర్ఘ సంధి
జలాభిషేకం = జల + అభిషేకం – సవర్ణదీర్ఘ సంధి
శీతామృత = శీత + అమృత – సవర్ణదీర్ఘ సంధి
కాళహస్తిశ్వర = కాళహస్తి + ఈశ్వర – సవర్ణదీర్ఘ సంధి
చీరానీకం = చీర + నీకం – సవర్ణదీర్ఘ సంధి

గుణసంధి
సూత్రం : అకారమునకు ఇ, ఉ, ఋ లు పరమగునపుడు క్రమముగా ఏ, ఓ, అర్లు ఆదేశమగును.
వేంకటేశ = వేంకట + ఈశ – గుణసంధి
వీధులందు = వీధులు + అందు -గుణసంధి

AP Board 8th Class Telugu Solutions Chapter 3 నీతి పరిమళాలు

ఉత్వసంధి
సూత్రం : ఉత్తునకు అచ్చు పరమగునపుడు సంధి.
సంయుతులెవ్వరు = సంయుతులు + ఎవ్వరు – ఉత్వసంధి
భారమైన = భారము + ఐన – ఉత్వసంధి
జనులెల్ల = జనులు + ఎల్ల – ఉత్వసంధి

సరళాదేశ సంధి
సూత్రం :1) ద్రుతప్రకృతికము మీది పరుషములకు, సరళములగు.
2) ఆదేశ సరళములకు ముందున్న ద్రుతమునకు బిందుసంశ్లేషలు విభాషనగు.
తనఁజుట్టు = తనన్ + చుట్టు – సరళాదేశ సంధి
కీర్తిఁగోరు = కీర్తిన్ + గోరు – సరళాదేశ సంధి

ఆమ్రేడిత సంధి
సూత్రం : అచ్చునకు ఆమ్రేడితం పరమైతే తరచుగా సంధి అవుతుంది.
ఊరూర = ఊరు + ఊరు – ఆమ్రేడిత సంధి

అత్వసంధి
సూత్రం : అత్తునకు సంధి బహుళంబుగానగు.
చాలకున్న = చాలక + ఉన్న – అత్వసంధి

సమాసాలు

సమాస పదంవిగ్రహవాక్యంసమాసం పేరు
ఘనగుణముఘనమైన గుణమువిశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
పవిత్రవాణిపవిత్రమైన వాణివిశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
సుభూషణముమంచిదైన భూషణమువిశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
సర్వ కార్యములుసమస్తములైన కార్యములువిశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
మంచికూరమంచిదైన కూరవిశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
మృదు పుష్పముమృదువైన పుష్పమువిశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
లోకహితంలోకము కొరకు హితంచతుర్థి తత్పురుష సమాసం
గుణసంయుతుడుగుణములతో సంయుతుడుతృతీయా తత్పురుష సమాసం
జలాభిషేకముజలముతో అభిషేకముతృతీయా తత్పురుష సమాసం
లక్ష్మిశలక్ష్మికి ఈశుడుషష్ఠీ తత్పురుష సమాసం
సహస్ర ముఖములుసహస్ర సంఖ్యగల ముఖములుద్విగు సమాసం
వాగ్భూషణమువాక్కు అనెడి భూషణమురూపక సమాసం
కేశపాశముకేశముల యొక్క పాశముషష్ఠీ తత్పురుష సమాసం
నలపాకమునలుని యొక్క పాకముషష్ఠీ తత్పురుష సమాసం

ప్రకృతి – వికృతులు

పుష్పం – పూవు
కార్యం – కర్జం
శ్రీ – సిరి
లక్ష్మి – లచ్చి
రాజు – రాట్టు
కార్యం – కర్జము
గుణము – గొనము
చరిత్ర – చరిత
గౌరవం – గారవం
ముఖం – మొగము
వీధి – వీది
కీర్తి – కీరితి

శతక కవుల పరిచయం

కవుల పేర్లుకాలంశతకం
మారద వెంకయ్య17వ శతాబ్దిభాస్కర శతకం
మూలం – భర్తృహరి7వ శతాబ్దిసుభాషిత త్రిశతి
అనువాదం-ఏనుగు లక్ష్మణకవి18వ శతాబ్దిసుభాషిత రత్నావళి
కంచర్ల గోపన్న (రామదాసు)17వ శతాబ్దిదాశరథీ శతకం
మూలం – నీలకంఠ దీక్షితులు17వ శతాబ్దిసభారంజన శతకం
అనువాదం -ఏలూరిపాటి అనంతరామయ్య20వ శతాబ్ది
ధూర్జటి16వ శతాబ్దిశ్రీకాళహస్తీశ్వర శతకం
తాళ్ళపాక పెద్ద తిరుమలాచార్యులు16వ శతాబ్దివేంకటేశ శతకం
కొండూరు వీర రాఘవాచార్యులు20వ శతాబ్దిమిత్ర సాహఠి

పద్యాలు – ప్రతి పదార్థాలు – భావాలు

1వ పద్యము (కంఠస్థ పద్యం)

*చ. తనకు ఫలంబు లేదని యెదం దలపోయఁడు కీర్తిఁ గోరు నా
ఘనగుణశాలి లోకహితకార్యము మిక్కిలి భారమైన మే
లనుకొని పూను శేషుఁడు సహస్రముఖంబుల గాలి గ్రోలి తా
ననిశము మోవఁడే మణి మహాభరమైన ధరిత్రి భాస్కరా !
(భాస్కర శతకం)
ప్రతిపదార్థాలు:
భాస్క రా = సూర్య భగవానుడా !
కీర్తిన్ = యశమును
కోరు = అపేక్షించునట్టి
ఆ ఘనగుణశాలి = ఆ గొప్ప గుణములచే ఒప్పువాడు
తనకున్ = తనకు
ఫలంబు = లాభము
లేదు + అని = లేదని
ఎదన్ = మనస్సులో
తలపోయడు = ఆలోచింపడు
లోకహిత కార్యము; లోక = లోకమునకు
హిత = మేలయిన
కార్యము = పని
మిక్కిలి భారము + ఐనన్ = చాలా కష్టమైనా
మేలు = మంచిది అని
అనుకొని = భావించి
పూనున్ = ప్రయత్నిస్తాడు
శేషుడు = ఆదిశేషుడు
సహస్రముఖంబులన్ = (తన) వేయినోళ్ళతోనూ
గాలి = గాలిని
క్రోలి = పీల్చి (మేసి)
తాన్ = తాను
మహాభరము = మిక్కిలి బరువు
ఐన = అయిన
ధరిత్రిన్ = భూమిని
అనిశమున్ = ఎల్ల కాలమును
మోవడే (మోవడు + ఏ) : మోయడం లేదా ! (మోస్తున్నాడు)

భావం :
భాస్కరా ! ఎంత చదువు చదివినా, అందులోని అంతరార్థాన్ని, మనోజ్ఞతను గ్రహించే శక్తి లేనప్పుడు ఆ చదువు వ్యర్ధము. దాన్ని గుణవంతులు ఎవరూ మెచ్చుకోరు. ఎన్ని పదార్థాలు వేసి నలపాకంగా వంట చేసినా దానిలో తగినంత ఉప్పు లేకపోతే అది రుచించదు కదా !

నీతి : గుణవంతుడు ఎపుడూ లోకానికి మేలు జరిగే పనులు చేస్తాడు.

AP Board 8th Class Telugu Solutions Chapter 3 నీతి పరిమళాలు

2వ పద్యము – (కంఠస్థ పద్యం)

*చ. చదువది యెంతగల్గిన రసజ్ఞత యించుక చాలకున్న నా
చదువు నిరర్థకంబు గుణసంయుతులెవ్వరు మెచ్చ రెచ్చటం
బదనుగ మంచి కూర నలపాకము చేసిననైన నందు నిం
పొదవెడు నుప్పులేక రుచి పుట్టఁగ నేర్చునటయ్య భాస్కరా!
(భాస్కర శతకం)
ప్రతిపదార్థాలు:
భాస్కరా = ఓ సూర్య భగవానుడా !
చదువు = చదువు
అది = అది
ఎంత కల్గినన్ = ఎంత ఉన్నప్పటికీ
రసజ్ఞత = అందులోని సారాన్నీ, మనోజ్ఞతనూ గ్రహించే నేర్పు
ఇంచుక = కొంచెము
చాలకున్నన్ (చాలక + ఉన్నన్) : లేకపోతే
ఆ చదువు = ఆ పాండిత్యము
నిరర్ధకంబు = పనికిమాలినది అవుతుంది
ఎచ్చటన్ = ఎక్కడైనా
గుణసంయుతులు = మంచి గుణములు గలవారు
ఎవ్వరు = ఎవరూ
మెచ్చరు = ఆ చదువును మెచ్చుకోరు
(ఎట్లన) = (అదెలా గంటే)
మంచికూరన్ = మంచి కూరను
నలపాకము = నల చక్రవర్తి చేసే పాకము వంటి పాకమును
చేసినన్ = చేసినప్పటికీ
అందున్ = ఆ కూరలో
ఇంపు + ఒదవెడు = చక్కని రుచిని పుట్టించే
ఉప్పు లేక = ఉప్పు లేకపోతే
రుచి = (ఆ కూరకు) రుచి
పుట్టగన్ + నేర్చును + అటయ్య = కలుగుతుందా ? (కలుగదు)

భావం :
భాస్కరా ! కీర్తిని కోరే గుణవంతుడు తనకు ఎలాంటి లాభాలు కావాలని ఆశించడు. లోకానికి మేలు జరిగే పని ఎంత భారమైనా ఆ పనిని చేయడానికి పూనుకుంటాడు. సర్పరాజయిన ఆదిశేషుడు తన వేయి పడగల మీద ఈ పెద్ద భూభారాన్ని ఎప్పుడూ మోస్తున్నాడు కదా !

AP Board 8th Class Telugu Solutions Chapter 3 నీతి పరిమళాలు

3వ పద్యము (కంఠస్థ పద్యం)

*ఉ. భూషలు గావు మర్త్యులకు భూరిమయాంగద తారహారముల్
భూషిత కేశపాశ మృదుపుష్ప సుగంధజలాభిషేకముల్
భూషలు గావు పూరుషుని భూషితుఁ జేయుఁ బవిత్రవాణి, వా
గ్భూషణమే సుభూషణము, భూషణముల్ నశియించు నన్నియున్
(సుభాషిత రత్నావళి)
ప్రతిపదార్థాలు:
మర్త్యులకున్ = మానవులకు
భూరిమయాంగద తారహారముల్ ; భూరిమయ = బంగారు వికారమైన
అంగద = కేయూరములునూ
తారహారముల్ = ముత్యాల హారాలునూ
భూషలు + కావు = అలంకారములు కావు
భూషిత కేశపాశ ………. జలాభిషేకముల్; భూషిత = అలంకరింపబడిన
కేశపాశ = వెంట్రుకల సమూహమునూ
మృదుపుష్ప = మంచి పుష్పములునూ
సుగంధ, జల + అభిషేకముల్ సుగంధ జల = మంచి వాసనగల నీటితో (పన్నీటితో)
అభిషేకముల్ = స్నానములునూ
భూషలు + గావు = అలంకారములు కావు
పూరుషునిన్ = మనుష్యుని
పవిత్రవాణి = పవిత్రమైన వాక్కు
భూషితున్ + చేయున్ = అలంకరిస్తుంది
వాగ్భూషణమే ; వాక్ + భూషణము + ఏ= వాక్కు అనెడి అలంకారమే
సుభూషణము = మంచి అలంకారము
భూషణముల్ = మిగిలిన అలంకారములు
అన్నియున్ = అన్నీ
నశియించున్ = నశిస్తాయి.

భావం :
బంగారు ఆభరణాలు ధరించడం, కొప్పులో పువ్వులు పెట్టుకోవటం, సుగంధ ద్రవ్యాలను వాడటం, పన్నీరుతో స్నానాలు చేయటం మొదలైనవి మానవులకు నిజమైన అలంకారాలు కావు. సంస్కారవంతమైన మాటయే నిజమైన అలంకారం. మిగిలిన అలంకారాలు అన్నీ నశించిపోయేవే.

4వ పద్యము (కంఠస్థ పద్యం)

*చ. వనకరి చిక్కె మైనసకు, వాచవికిం జెడిపోయె మీను, తా
వినికికిఁజిక్కెఁజిల్వ గనువేదురుఁ జెందెను లేళ్ళు, తావినో
మనికి నశించెఁ దేటి, తరమా యిరుమూటిని గెల్వ వైదుసా
ధనముల నీవె గావఁదగు దాశరథీ కరుణాపయోనిధీ ! (దాశరథీ శతకం)
ప్రతిపదార్థాలు :
దాశరథీ = దశరథుని పుత్రుడవైన రామా!
కరుణాపయోనిధీ ! = కరుణకు సముద్రము వంటివాడా!
వనకరి = అడవి ఏనుగు
మైనసకున్ = శరీరపు దురదకు (దేహము నందలి చాపల్యమునకు)
చిక్కెన్ = చిక్కుపడింది
మీను = చేప
వాచవికిన్ = నోటివాపిరితనమునకు ; (నోటి రుచికి) గాలమునందు గుచ్చిన ఎఱ్ఱ రుచికి
బిల్వ = పాము
తాన్ = తాను
వినికికిన్ = వినడానికి (పాములవాడు ఊదే స్వరాన్ని వినడానికి)
చిక్కెన్ = చిక్కుపడుతుంది
లేళ్ళు = లేళ్ళు
కనువేదురున్ = కంటి పిచ్చిని
చెందున్ = పొందుతాయి (చక్షురింద్రియానికి లోనయి చిక్కువడుతాయి)
తేటి = తుమ్మెద
తావిలో = వాసనలో
మనికిన్ = ఉండడం చేత
నశించెన్ = నశించింది
ఇరుమూటిని = ఐదింటినీ (ఐదు ఇంద్రియాలనూ)
గెల్వన్ = జయించడానికి
తరమా = శక్యమా
ఐదు సాధనములన్ = పంచవిధములైన ఉపాయాల చేత
నీవె = నీవే
కావదగున్ = రక్షించాలి

భావం :
తన దురదను పోగొట్టుకోవడానికి ఏనుగు, నోటి రుచిని ఆశించి చేప, రాగానికి లొంగి పాము, అందానికి బానిసయై జింక, పూల వాసనలకు మైమరచి తుమ్మెదలు బందీలవుతున్నాయి. ఇలా ఒక్కొక్క ప్రాణీ ఒక్కొక్క ఇంద్రియ చపలత్వం వల్లనే నశిస్తున్నాయి. ఈ పంచేంద్రియ చాపల్యం గల నేను ఎలా బయటపడగలను? ఓ రామా ! కరుణా సాగరా ! నీవే నన్ను కాపాడాలి.

AP Board 8th Class Telugu Solutions Chapter 3 నీతి పరిమళాలు

5వ పద్యము – (కంఠస్థ పద్యం)

*ఆ.వె. క్షమను కడఁక నెవరు గాపాడుకొందులో
క్షమను చిరము వారు కావ గలరు
కదలకుండ నెవరికడ క్షమయుండునో
సర్వకార్యములకు క్షములు వారు
(సభారంజన శతకం)
ప్రతిపదార్థాలు :
ఎవరు = ఎవరు
కడకన్ = ప్రయత్నంతో
క్షమను = ఓర్పును (ఓరిమిని)
కాపాడుకుందురో = కాపాడుకుంటారో
వారు = వారు
క్షమను = భూమిని
చిరము = చాలాకాలము
కావగలరు = రక్షింపగలరు
కదలకుండ = నిశ్చలంగా
దుమ్ము = ధూళిని (దుమ్మును)
ఎత్తి = పైకి ఎత్తి
చల్లినన్ = చల్లితే
తనపైనే = తన మీదనే
పడుగాక = పడుతుంది కాని
దానికేమి = దానికిన్ + ఏమి = సూర్యునికి ఏమవుతుంది?
కొండతోన్ = కొండతో (పర్వతంతో)
తగరు = పొట్టేలు
ఢీకొని = ఎదుర్కొని
ఎంత తాకినన్ = ఎంతగా పోరాడినా
తల = పొట్టేలు తల
ప్రక్కలు + అగున్ + కాక = ముక్కలు ఔతుంది కాని
దానికిన్ + ఏమి = ఆ కొండకు ఏమవుతుంది? (ఏమీకాదు)
మిడతలు = ‘మిడతలు’ అనే ఎగిరే పురుగులు
చిచ్చుపై = నిప్పుపై
వడిన్ = వేగంగా
ఎంత + ఎగసినన్ = ఎంతగా ఎగిరినా (వ్యాపించినా)
తామె (తాము + ఎ) = తామే (మిడతవే మాడిపోతాయి)
పొక్కెడున్ + కాక = పరితపిస్తాయి కాని
దానికిన్ + ఏమి = ఆ నిప్పుకు ఏమి బాధ ఉంటుంది?
వలన్ + పడ్డ = వలలో చిక్కుపడిన
మీను = చేప
ఎంత వడిదాక = ఎంత సేపటి వరకు
పొరలిన = అటునిటూ దొర్లినా
చుట్టుకొనున్ + కాక = చుట్టుకుపోతుంది కాని
దానికేమి (దానికిన్ + ఏమి) : ఆవలకు ఏమౌతుంది? (ఏమీకాదు)
ఎదిరిసత్త్వంబు = ఎదుటి వాడి బలము
తన సత్త్వము = తన బలము
ఎఱుగలేక = తెలిసికోలేక
పోరువాడు = యుద్ధానికి దిగేవాడు
అవివేకబుద్ధి = వివేకములేని బుద్ధిగలవాడని
= అంటారు

భావం :
ఓ వేంకటేశ్వరా ! నీవు లక్ష్మీ సమేతుడవు. లోకమంతటా నిండియున్నవాడవు. కోటి సూర్యుల తేజస్సు కలవాడవు. లోకంలో ఎవరైనా దుర్మార్గుడై సూర్యుని మీద దుమ్మెత్తి పోస్తే అది వాడి మీదే పడుతుంది. కొండతో పొట్టేలు ఢీకొంటే దాని తలే బద్దలౌతుంది. మిడతల గుంపు మంటలపైకి ఎగిసిపడితే అవే మాడిపోతాయి. వలలో చిక్కుకున్న చేప ఎంత పొరలాడినా మరింతగా బందీ అవుతుంది. ఇలా ఎదుటివాడి బలం తెలియకుండా యుద్ధానికి దిగితే వాడిని అవివేకి అంటారు.

AP Board 8th Class Telugu Solutions Chapter 3 నీతి పరిమళాలు

8వ పద్యము

ఆ.వె. చదువు జీర్ణమైన స్వాంతంబు పండును
తిండి జీర్ణమైన నిండు బలము
చెఱుపు గూర్చు రెండు జీర్ణముల్ గాకున్న
విశ్వహితచరిత్ర వినర మిత్ర -(మిత్ర సాహఠి)
ప్రతిపదార్థాలు :
మిత్ర = లోకక్షేమాన్ని కోరే మిత్రమా ! (స్నేహితుడా !)
విను = ఒక మాట విను
చదువు = చదువు
జీర్ణమైన (జీర్ణము + ఐన) = జీర్ణించుకుంటే (ఆకళింపు చేసుకుంటే)
స్వాంతంబు = మనస్సు
పండును = పరిపక్వము అవుతుంది
తిండి = తిన్న తిండి
జీర్ణమైన (జీర్ణము + ఐన)= జీర్ణించుకుంటే = తనను
బలము, నిండున్ = బలం, అతిశయిస్తుంది
జీర్ణముల్ + కాకున్నన్ = జీర్ణములు కాకపోతే (ఒంట బట్టకపోతే)
రెండు = చదివిన చదువు, తిన్న తిండి అనే రెండూ కూడా
చెఱుపు = కీడు
కూర్చున్ = కలిగిస్తాయి

భావం :
లోకక్షేమాన్ని కోరే మిత్రమా ! ఒక మాట విను. చదివిన చదువును జీర్ణించుకుంటే మనస్సు పరిపక్వమవుతుంది. తిన్న తిండి జీర్ణమైతే బలం కలుగుతుంది. ఆ రెండూ జీర్ణం కాకపోతే చెరుపు చేస్తాయి.

AP Board 8th Class Telugu Important Questions Chapter 10 సంస్కరణ

AP State Syllabus AP Board 8th Class Telugu Important Questions Chapter 9 సందేశం.

AP State Syllabus 8th Class Telugu Important Questions 9th Lesson సందేశం

8th Class Telugu 9th Lesson సందేశం Important Questions and Answers

I. అవగాహన – ప్రతిస్పందన

అ) కింది అపరిచిత గద్యం చదవండి. ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

1. కింది పేరా చదివి, ఇచ్చిన ప్రశ్నలకు సమాధానములు రాయండి.

పరశురాముడు దుష్టులైన క్షత్రియులను చంపుటకు పుట్టినవాడు. అతని చేతిలో ఎందరో రాజులు మరణించారు. ఒక్క శ్రీరాముడు మాత్రమే అతనిని ఓడించాడు. అప్పటి నుండి యుద్దాలు మానేసి, మహేంద్రపర్వతం మీద తపస్సు చేసుకుంటున్నాడు. అటువంటివాడు గంగ కోరిక పై భీష్మునికి యుద్ధవిద్యలు నేర్పాడు. భీష్ముడు పరశురాముని శిష్యుడు కనుక గురువు ఆజ్ఞాపించిన కార్యమును శిరసావహించి తీరతాడని అంబ నమ్మింది. ఏదో విధంగా పరశురాముని అనుగ్రహం సంపాదించి, భీష్ముని సాధించవచ్చని ఊహించింది.
ప్రశ్నలు :
1. గురు, శిష్యులెవరు?
జవాబు:
పరశురాముడు, భీష్ముడు.

2. ఎవరి ఆజ్ఞను శిరసావహించాలి?
జవాబు:
గురువు యొక్క ఆజ్ఞను.

3. రాజులు ఎందుకు మరణించారు?
జవాబు:
దుష్టత్వము వలన.

4. పరశురాముడిని శ్రీరాముడు ఎందుకు ఓడించగలిగాడు?
జవాబు:
శ్రీరామునిలో దుష్టత్వము లేకపోవటం వలన.

2. కింది పేరా చదివి, ఇచ్చిన ప్రశ్నలకు సమాధానములు రాయండి.

ప్రపంచంలో మొట్టమొదట విడుదల చేయబడిన తపాళాబిళ్ళ అతికించే రకం కాదు. అది రెండు అణాల ఖరీదు కలిగిన కాపర్ టికెట్. ఈస్టిండియా కంపెనీ అధికారానికి లోబడిన వందమైళ్ళ లోపు చిరునామాకు దాని ద్వారా ఒక కవరును పంపవచ్చును. ఆ కవరును డాక్ రన్నర్ తీసుకువెడతాడు. ఈ కాపర్ టోకెన్ ప్రప్రథమంగా 1774 మార్చి 31వ తేదీన పాట్నాలో విడుదల చేయబడింది. 1852లో సింధు ప్రావిన్స్ కమిషనర్ సర్ బార్టీల్ ఫైర్ ఆసియాలో మొట్టమొదట తపాలాబిళ్ళను తీసుకువచ్చాడు. అందులో ఈస్టిండియా కంపెనీ ముద్ర ఉండేది. దానిని సింధు లోపల ఉత్తరాలు పంపడానికి ఉపయోగించేవారు. దీనిని సింధ్ డాక్ అనేవారు.
ప్రశ్నలు :
1. డాక్ రన్నర్ అంటే ఎవరు?
జవాబు:
తపాలా బంట్రోతు

2. సింధు ప్రావిన్స్ ఎవరి పరిపాలనలో ఉంది?
జవాబు:
ఈస్టిండియా కంపెనీ.

3. అణా అంటే ఎన్ని పైసలు?
జవాబు:
ఆరు పైసలు.

4. సింధ్ డాక్ అంటే ఏమిటి?
జవాబు:
సింధు ప్రావిన్స్ లోని కాపర్ టికెట్.

AP Board 8th Class Telugu Important Questions Chapter 10 సంస్కరణ

3. కింది పేరా చదివి, ఇచ్చిన ప్రశ్నలకు సమాధానములు రాయండి.

అక్టోబర్ 16వ తేదీని ప్రపంచ ఆహార దినోత్సవంగా జరుపుకుంటున్నాము. నిజానికి ఆహారధాన్యాల కొరత లేకపోయినా ప్రపంచంలోని చాలా ప్రాంతాలలో ప్రజలు తిండి లేక చనిపోవటం దారుణసత్యం. దీనికి కారణాలు అనేకం. అందులో ఆహార పదార్థాలను వృథా చేయటం. మనం ఆహారాన్ని వృథా చేస్తున్నామంటే అది అందవలసిన వారికి అందకుండా అడ్డపడుతున్నామన్నమాట. ఇలా వృథా అవుతున్న ఆహారంలో సగానికి సగం మామూలుగా పిల్లలు తినే కంచాలలోనే వృథా అవుతున్నది. తల్లిదండ్రులే దీనికి పూర్తి బాధ్యత వహించాలి. పిల్లలు ఇష్టపడే ఆరోగ్యకరమైన, పుష్టికరమైన ఆహారాన్ని వారికి ఇవ్వాలి. వారు దాన్ని వృథా చేయకుండా తినేలా చూడటం తల్లిదండ్రుల బాధ్యత.
ప్రశ్నలు :
1. పిల్లల పట్ల ఎవరు బాధ్యతగా ఉండాలి?
జవాబు:
తల్లిదండ్రులు.

2. ప్రపంచ ఆహారదినోత్సవం ఎప్పుడు జరుపుకుంటున్నాం?
జవాబు:
అక్టోబరు 16వ తేదీ.

3. సరిపడ ఆహారమున్నా కొందరికి ఎందుకు తిండిలేదు?
జవాబు:
కొంతమంది ఆహారాన్ని వృథా చేయడం వలన.

4. మనం వృథా చేసేవాటిలో ఇంకొకటి ఏమిటి?
జవాబు:
నీరు

4. కింది పేరా చదివి, ఇచ్చిన ప్రశ్నలకు సమాధానములు రాయండి.

ఈ పురాతనమైన ఏడు ప్రపంచ అద్భుతాలలో ప్రధానమైనవి ఈజిప్టులోని పిరమిడ్లు. మిగిలిన ఆరు అద్భుతాలు కాలగర్భంలో కలిసిపోయాయి. లేదా శిథిలావస్థను చేరుకున్నాయి. విలక్షణమయిన ఆకారంతో భూమ్యాకర్షణ శక్తికి తట్టుకుని నిలబడడం వలన పిరమిడ్లు ఈనాటికీ నిలిచి ఉన్నాయి. పిరమిడ్ ఆకారంలో ఇళ్ళు నిర్మించడానికి ఇప్పటి వరకు ఎవరూ ప్రయత్నించలేదు. అయినా కలపతో, గాజుతో చేసిన పిరమిడ్ ప్రతిరూపాలు ఫ్యూరియోలుగా ప్రాచుర్యంలో ఉన్నాయి. భవిష్యత్ లో సుప్రీం కౌన్సిల్ ఆఫ్ యాంటీ క్విటీస్ ఆఫ్ ఈజిప్ట్ సంస్థ అనుమతి పొందకుండా వీటి రెప్లికాలు తయారుచేయడానికి వీలుకాదు.
ప్రశ్నలు:
1. ప్రపంచంలోని వింతలెన్ని?
జవాబు:
ఏడు

2. కాలగర్భంలో కలిసిపోవడమంటే ఏమిటి?
జవాబు:
నశించిపోవడం.

3. “శిథిలావస్థ” – దీనిలో ఏ సంధి ఉంది?
జవాబు:
సవర్ణదీర్ఘ సంధి

4. ఎవరి అనుమతితో పిరమిడ్ ఆకారం తయారుచేయాలి?
జవాబు:
సుప్రీం కౌన్సిల్ ఆఫ్ యాంటీక్విటీస్ ఆఫ్ ఈజిప్టు

AP Board 8th Class Telugu Important Questions Chapter 10 సంస్కరణ

5. కింది పేరా చదివి, ఇచ్చిన ప్రశ్నలకు సమాధానములు రాయండి.

ఒకప్పుడు మానవజాతి ప్రగతికి సంకేతాలుగా భావించిన సాంకేతిక అద్భుతాలు ఈవేళ పర్యావరణానికి పెద్ద ప్రమాదాలుగా పరిణమిస్తున్నాయి. మన పరిశ్రమలు, కర్మాగారాలు, వాహనాలు, రకరకాల విద్యుత్ పరికరాలు పర్యావరణ కాలుష్యానికి ముఖ్యమైన కారణాలుగా ఉంటున్నాయి. వాతావరణంలో బొగ్గుపులుసు వాయువులు, గ్రీన్‌హౌజ్ వాయువులు ఎక్కువవుతున్నాయి. వీటి వలన తీవ్రమయిన పర్యావరణ సమస్యలు ఏర్పడతాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. 2050 నాటికి 15 మించి 35 శాతం జంతువులు నశించిపోయే ప్రమాదముందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.
ప్రశ్నలు :
1. వాతావరణ కాలుష్యానికి కారణమయిన వాయువేది?
జవాబు:
బొగ్గుపులుసు వాయువు

2. జంతువులు ఎందుకు నశించిపోతాయి?
జవాబు:
వాతావరణ కాలుష్యం వలన

3. మానవులు ఉపయోగించే వాహనాలలో కాలుష్యం కలిగించనిదేది?
జవాబు:
సైకిలు

4. వాతావరణ కాలుష్య నివారణకు ఏం చేయాలి?
జవాబు:
చెట్లను ఎక్కువగా పెంచాలి.

6. కింది అపరిచిత గద్యం చదివి, ప్రశ్నలకు సమాధానాలు రాయండి. (S.A. III – 2016-17)

ప్రతి జీవికి ఆహారం అవసరం. అందుకే “అన్నం పరబ్రహ్మ స్వరూపం” అన్నారు. అన్నం దొరకని వారికి ఆకలి బాధ ఎలా ఉంటుందో తెలుస్తుంది. అప్పుడు అన్నం విలువ ఏమిటో తెలుస్తుంది. చాలా మంది అన్నాన్ని వృథాగా పడేస్తుంటారు. అలా పడేసే ముందు వారు అన్నం దొరకక అల్లాడిపోయే పేదవారి గురించి ఆలోచిస్తే ఎంతో బాగుంటుంది.
ప్రశ్నలు:
1. పూర్వులు అన్నాన్ని దేని స్వరూపంగా భావించారు?
జవాబు:
అన్నం పరబ్రహ్మ స్వరూపం.

2. అన్నం విలువ ఎప్పుడు తెలుస్తుంది?
జవాబు:
ఆకలితో ఉన్నప్పుడు

3. అన్నం వృథాగా పడేసే ముందు ఎవరి గురించి ఆలోచించాలి?
జవాబు:
అన్నం దొరకని పేదవారిని గురించి

4. పై పేరా ఆధారంగా ఒక ప్రశ్న తయారుచేయండి.
జవాబు:
ప్రతి జీవికి అవసరమైనదేది?

II. వ్యక్తీకరణ – సృజనాత్మకత

అ) కింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాల్లో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
సంపాదకీయ వ్యాసం ప్రక్రియను వివరించండి.
జవాబు:
ఆధునిక తెలుగు సాహిత్య ప్రక్రియల్లో సంపాదకీయ వ్యాసం ముఖ్యమైనది. సమకాలీన సంఘటనలలో ముఖ్యమైన వాటిని తీసుకుని పత్రికల్లో వ్యాఖ్యానురూపంగా పూర్వాపరాలను పరామర్శిస్తూ సాగేరచన సంపాదకీయ వ్యాసం. దీన్ని పత్రికా సంపాదకులు గానీ, ప్రత్యేక వ్యాసకర్తలు గానీ రాస్తూ ఉంటారు. తక్కువ మాటల్లో పాఠకులను ఆకట్టుకునేటట్లు, ఆలోచించేటట్లు చేయగలగడం మంచి సంపాదకీయ లక్షణం. ఇవి తత్కాలానికి సంబంధించినవే అయినా ఒక్కొక్క సందర్భంలో విభిన్న కాలాలకూ వర్తిస్తుంటాయి.

AP Board 8th Class Telugu Important Questions Chapter 10 సంస్కరణ

ప్రశ్న 2.
‘సంస్కరణ’ – పాఠ్యభాగ రచయితను గురించి రాయండి.
(లేదా)
సంస్కరణ’ పాఠ్యభాగ రచయిత ‘నండూరి రామమోహనరావు’గారి రచనా విశేషాలు రాయండి. (S.A. II – 2017-18)
జవాబు:
‘సంస్కరణ’ అనే పాఠ్యభాగ రచయిత శ్రీ నండూరి రామమోహనరావుగారు. తెలుగు పాత్రికేయులలో సుప్రసిద్ధులైన నండూరి రామమోహనరావు (1927 – 2011) కృష్ణాజిల్లా విస్సన్నపేటలో జన్మించారు. జ్యోతి, ఆంధ్రజ్యోతి, బాలజ్యోతి, వనితాజ్యోతి మొదలైన పత్రికల్లో సంపాదకులుగా పనిచేసారు. విశ్వరూపం, నరావతారం, విశ్వదర్శనం వీరి ప్రముఖ రచనలు. నండూరి వారి సంపాదకీయ వ్యాసాలు అయిన “అనుపల్లవి”, ‘చిరంజీవులు”, “నండూరి రామమోహనరావు వ్యాఖ్యావళి” పేరిట సంకలనాలుగా వచ్చాయి. పిల్లలకోసం కొన్ని ఇంగ్లీషు నవలలను తెలుగులో రాశారు. “చిలకచెప్పిన రహస్యం”, “మయూరకన్య” పిల్లల నవలలు, “హరివిల్లు” పేరిట పిల్లలగేయాలు వ్రాశారు.

తెలుగు విశ్వవిద్యాలయం వీరికి గౌరవ డాక్టరేటు ఇచ్చి గౌరవించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తమ పాత్రికేయుడు అవార్డుతో సత్కరించింది.

ప్రశ్న 3.
సమాజంలో దురాచారాలపట్ల ప్రజల్లో ఏహ్యభావం కల్పించడం ద్వారా, వాటిని నిర్మూలించవచ్చని నండూరి వారన్నారు కదా ! దీనిని సమర్థిస్తూ రాయండి.
జవాబు:
మద్యం తాగడం, మత్తు పదార్థాలు సేవించడం, పటేలో అర్ధనగ్ననృత్యాలు వంటి దురాచారాల పట్ల వ్యతిరేక ప్రచారం ద్వారా, ఆ దురాచారాల వల్ల నష్టపోయిన వారి కథల ప్రచారం ద్వారా, అప్పటి వారి రూపాల ఫొటోలను వారికి చూపడం ద్వారా, వారికి ఆ దురాచారాల పట్ల ఏహ్యభావం కల్పించాలి.

వరకట్నం తీసికోవడం అంటే, తమ సంతానాన్ని సంతలో పశువుల్లా అమ్మడమే అని, వారికి తెలియజెప్పాలి. కట్నం తీసికొన్న మగవాడు సంతలో అమ్మబడ్డ పశువు అని అతడికి తెలియజెప్పాలి. కట్నం పుచ్చుకున్న వాడిని పెళ్ళాడిన స్త్రీ, పశువును పెళ్ళాడినట్లే అని కన్యలకు చెప్పాలి.

ఈ విధంగా దురాచారాలపట్ల ఏహ్యభావం కల్పిస్తే క్రమంగా ఆ దురాచారం రూపుమాసిపోతుంది అన్నమాట సత్యం. క్లబ్బులో సగం బట్టలతో నాట్యం చేసిన తన ఫొటోను చూసిన ఆడది తిరిగి ఎన్నడూ, ఆ పని చేయదు. ఆ దుస్తుల్లో తన భార్య ఫొటోను చూసిన భర్త ఇంక ఎప్పుడూ భార్యను పట్లకు పంపడు. కాబట్టి నండూరి వారి మాట సమర్థింపదగినది.

ఆ) కింది ప్రశ్నలకు 10 లేక 12 వాక్యాల్లో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
‘సంస్కరణ’ పాఠ్యభాగ సారాంశం రాయండి.
జవాబు:
సమాజంలో ఎన్నో సాంఘిక దురాచారాలు ఉన్నాయి. వాటిలో బాల్యవివాహాలు, వరకట్నం, మద్యపానం మొదలైన వాటిని ప్రముఖంగా చెప్పవచ్చు. బాల్యవివాహాలను నిర్మూలించడానికి శారదా చట్టం వంటిది వచ్చింది. అయినా ఎంతోమంది సంఘసంస్కర్తల ప్రయత్నాల మూలంగా బాల్యవివాహాలు తగ్గుముఖం పట్టాయి. ఈనాడు ‘వరకట్నం’ అనే సాంఘిక దురాచారం పెనుభూతంలా మారింది.

ఒకప్పటి ఒరిస్సా ముఖ్యమంత్రి నందినీ శతపథి స్త్రీల అభ్యున్నతికి అవరోధాలుగా విద్యావిహీనత, వరకట్నం అనే ఈ రెండూ ప్రధానమని చెప్పారు. జనాభాలో నూటికి 70 మంది నిరక్షరాస్యులు ఉన్నారు. ప్రజలు కూడా వరకట్న నిర్మూలనకు సిద్ధంగా లేరని తెలుస్తున్నది. వరకట్నం ఇవ్వడం, తీసుకోవడం అనేది సంఘంలో గౌరవానికి చిహ్నంగా మారింది.

ఈనాడు వివాహాలు కూడా ఆర్భాటంగా జరుగుతున్నాయి. వివాహాల్లో వృథా వ్యయం అవుతున్నది. ఈ దురాచారాలకు శాసనాల అవసరం ఉంది. అయినా అంతకంటే ముఖ్యంగా ఈ దురాచారాలపట్ల ప్రజల్లో ఏహ్యభావం కలిగించాలి. యువతీయువకులు కూడా దురాచారాలను ఎదిరించాలి. అప్పుడే దురాచారాల నిర్మూలన జరుగుతుంది.

AP Board 8th Class Telugu Important Questions Chapter 10 సంస్కరణ

ప్రశ్న 2.
సమాజంలో దురాచారాలపట్ల ప్రజల్లో అసహ్యభావం కలిగించడం ద్వారా వాటిని నిర్మూలించవచ్చని నండూరివారు అన్నారు కదా! దీన్ని సమర్థిస్తూ రాయండి.
జవాబు:
నండూరి రామమోహనరావు గారు ‘సంస్కరణ’ అనే పాఠ్యభాగాన్ని రచించారు. ఈ పాఠంలో కవి సంఘ సంస్కరణాభిలాషను, దాని ఆవశ్యకతను లోకానికి చాటి చెప్పాడు. ప్రస్తుత సమాజంలో సంఘ దురాచారాల పట్ల ప్రజల్లో ఏహ్యభావం కలిగించడం ద్వారా వాటిని నిర్మూలించవచ్చని తెలియజేశారు. ఈ విషయం అక్షరాల సత్యం.

కేవలం చట్టాలు చేసినంత మాత్రాన సాంఘిక దురాచారాలను నిర్మూలించలేము. వరకట్నం లాంటి దురాచారాల నిర్మూలకు ఎన్నో చట్టాలు వచ్చాయి. అయినా ప్రజల్లో మార్పు రాలేదు. బాల్యవివాహాల నిర్మూలనకు శారదా చట్టం వచ్చింది. అంతమాత్రాన బాల్యవివాహాలు ఆగడం లేదు. సంఘసంస్కర్తలు అలుపెరగని ఎన్నో ఉద్యమాలు చేశారు. అయినా ఆశించినంత ఫలితం రాలేదు. కాని చివరకు ప్రజల్లో ఇప్పుడిప్పుడే మూఢనమ్మకాల మీద, దురాచారాల మీద ఏహ్యభావం కలుగుతుంది. ఇది మరింతగా పెరగాలి. అప్పుడే సంఘ దురాచారాలు పూర్తిగా తొలిగిపోతాయి. ప్రజల జీవితాల్లో చైతన్యం కలుగుతుంది.

ఆధునిక కాలంలో వరకట్నం తీవ్రంగా వేధిస్తున్న ఒక సంఘ దురాచారం. ఎన్నో కాపురాలు దీని మూలంగా కూలిపోతున్నాయి. చట్టాలు ఎన్నో వచ్చాయి. అయినా ప్రజల్లో ఇప్పటికీ మార్పు రాలేదు. ఇప్పటికైనా రావాలి. స్త్రీ విద్యపై కూడా ఇంకా ప్రజల్లో దురభిప్రాయం ఉంది. అది కూడా తొలగిపోవాలి. సమభావన కలగాలి. ప్రజల్లో సాంఘిక దురాచారాల పట్ల ఏహ్యభావం కలిగినప్పుడే సమాజానికి మేలు కలుగుతుంది.

ఇ) క్రింది అంశం గురించి సృజనాత్మకంగా ప్రశంసిస్తూ రాయండి.

ప్రశ్న 1.
‘సంఘ సంస్కర్త’ ను గూర్చి వివరిస్తూ చెల్లికి లేఖ :
జవాబు:

నర్సాపురం,
x x x x x x x x

ప్రియమైన చెల్లెలు సుజాతకు,

ఆశీస్సులు. నేను బాగా చదువుతున్నాను. నీవు కూడా బాగా చదువుతున్నావని తలుస్తాను. నేను ముఖ్యంగా ఈ లేఖలో గొప్ప సంఘ సంస్కర్తయగు కందుకూరి వీరేశలింగం పంతులుగారిని గూర్చి నీకు తెలియజేయ తలచాను.

వీరేశలింగం పంతులుగారు కవిగా సంపాదించిన కీర్తి కంటె సంఘసంస్కర్తగా ఎనలేని ఖ్యాతి గడించారు. ఆయన బాల్య వివాహాలను నిరసించారు. వితంతు వివాహాలను, స్త్రీ విద్యను ప్రోత్సహించారు. హితకారిణి సమాజాన్ని స్థాపించి దాని ద్వారా అనాథ స్త్రీ ఉద్ధరణకు పాటుపడ్డారు. సంఘంలోని అనేక దురాచారాలను, మూఢాచారాలను ఖండించారు. అందుకే కందుకూ 3 వీరేశలింగం పంతులుగారు తెలుగుజాతి గర్వించతగ్గ గొప్ప సంఘసంస్కర్త అని నా అభిప్రాయం.

ఇట్లు,
మీ సోదరుడు,
x x x x x

చిరునామా :
పి. సుజాత, 8వ తరగతి,
ఎస్. ఆర్. హైస్కూలు,
గూడూరు, నెల్లూరు జిల్లా.

ప్రశ్న 2.
సంఘసంస్కరణ ఆవశ్యకతను, సంఘ దురాచారాలను నిర్మూలించాలని కోరుతూ కొన్ని నినాదాలు రాయండి.
జవాబు:
అంటరానితనం వద్దు. మానవత్వమే ముద్దు.
మూఢాచారాలను దూరం చేయి. ప్రగతి సాధించు.
కులం కన్న గుణం మిన్న.
కులమతాలు వద్దు. ఆత్మీయతే ముద్దు.
మూఢనమ్మకాలపై అలుపెరగని పోరాటం చేయాలి.
స్త్రీలను గౌరవించు – ఆదర్శంగా జీవించు.
స్త్రీల ప్రగతే – దేశానికి గౌరవం.
బహుజన హితాయ – బహుజన సుఖాయ.

AP Board 8th Class Telugu Important Questions Chapter 10 సంస్కరణ

ప్రశ్న 3.
మహిళల పట్ల చూపుతున్న వివక్షలను, వారి మీద జరుగుతున్న దాడులను ఖండిస్తూ, మహిళలందరూ ధైర్యంగా మెలగాలని తెలియజేసేలా ఒక కరపత్రాన్ని తయారు చేయండి.
జవాబు:

కరపత్రం

“ధైర్యే సాహసే లక్ష్మీ”

మహిళామణులారా! ‘పదండి ముందుకు, పదండి తోసుకు పోదాం పోదాం, పైపైకి’ అన్న శ్రీశ్రీ మాట మరచిపోకండి. ఈనాడు మనపట్ల సంఘం ఎంతో వివక్షత చూపిస్తోంది. ఆడపిల్ల గర్భాన పడిందని తెలిస్తే, తల్లిదండ్రులు విలవిల లాడుతున్నారు. కొందరు భ్రూణహత్యలకు దిగుతున్నారు.

తండ్రి ఆస్తిలో స్త్రీలకు మగవారితో సమాన వాటాలు ఇవ్వడం లేదు. పేపరు తిరగవేస్తే, స్త్రీల మానభంగాల వార్తలు, టి.వి. పెడితే స్త్రీలకు జరిగిన అన్యాయాలు, అత్తవారింట స్త్రీల కష్టాలు, వరకట్నాల చావులు కనబడతాయి. వినబడతాయి. పసిపిల్లల నుండి పండు ముదుసళ్ళు వరకు అత్యాచారాలకు గురి అవుతున్నారు.

స్త్రీలంతా కరాటే నేర్చుకోవాలి. అల్లరి చేసే మగవారి చెంపలు పగుల కొట్టాలి. నిర్భయంగా పోలీసు వారికి రిపో , చెయ్యాలి. మీరు పొరపాటున అన్యాయానికి గురి అయితే, సిగ్గుతో చితికిపోవద్దు. ధైర్యంగా నిలవండి. అన్యాయాన్ని ఎదిరించి పోరాడండి. బాగా చదవండి. ఉద్యోగాలు చేయండి. మనం ఈ దురాచారాల్ని ఖండిద్దాం.

అన్యాయం జరిగిన తోటి స్త్రీలకు, మనం అండగా నిలవాలి. ఆడపిల్ల ఇంటికి మహాలక్ష్మి అని, ఆనందించే రోజు రావాలి. అందుకు మనమంతా చేయి చేయి కలిపి పోరాడుదాం. ఝాన్సీ లక్ష్మీబాయిలా, సరోజినీ దేవిలా, దుర్గాబాయమ్మలా తలలెత్తి నిల గాం. ధైర్యమే మనకు శ్రీరామరక్ష.

ఇట్లు,
వనితా సంఘం.

ప్రశ్న 4.
వరకట్న సమస్యపై పదివాక్యాల్లో వ్యాసం రాయండి.
(లేదా)
నేటికీ వరకట్న మరణాల గురించి ప్రసార మాధ్యమాల్లో ఎన్నో వార్తలు వస్తున్నాయి. ఈ దురాచారాన్ని గురించి వ్యాసం రాయండి. (S.A. III – 2016-17)
జవాబు:
వరునికిచ్చు కట్నం వరకట్నం. దాని వల్ల సమాజంలో ఏర్పడే సమస్యని వరకట్న సమస్య అంటారు. వరకట్నం కేవలం ఆడపిల్ల తల్లిదండ్రులకే కాదు కుటుంబం మొత్తానికి కూడా అదొక దుర్భర సమస్యగా తయారైంది. అసలు కట్నం అంటే కానుక. పెళ్ళి సందర్భంగా ఇచ్చే కానుక క్రమక్రమంగా కట్నమైంది. పూర్వకాలంలో కన్యాశుల్కం ఉండేది. డబ్బు ఇచ్చి కన్యల్ని కొనుక్కొనేవాళ్ళు. ఆధునిక కాలంలో దాని స్థానంలో వరకట్నం వచ్చింది. ఇప్పుడు పెళ్ళి సమయంలో పెళ్ళికూతురు తల్లిదండ్రులు పెళ్ళికొడుక్కి ఇచ్చే ధనం లేదా సంపదని వరకట్నం అంటున్నారు. కొందరు డబ్బు కట్నంగా ఇస్తే మరికొందరు భూములు ఇస్తారు.

వరకట్నం తీసుకోవడం గానీ, ఇవ్వడం గానీ నేరమని చట్టం ఉంది. కానీ ఆ చట్టాన్ని పాటిస్తున్నదెవరు ? చట్టాన్ని కాపాడవలసిన అధికారులే వరకట్నం ఇస్తున్నారు – తీసుకుంటున్నారు. కంచే చేను మేస్తోంది ! వరకట్నం ఇవ్వనని ఎవరైనా శపథం చేస్తే అమ్మాయికి పెళ్ళికాని పరిస్థితి కూడా ఏర్పడుతోంది ! ఆశ్చర్యం ఏమిటంటే అమ్మాయికి కట్నం ఇవ్వలేక నానా బాధలు పడ్డవారే, అబ్బాయి పెళ్ళి దగ్గరికి వచ్చేటప్పటికి కట్నం ఇవ్వాలని పట్టుబడతారు.

వరకట్న నిర్మూలనం సాధ్యమవ్వాలంటే ముందుగా పెద్దలలో మార్పురావాలి. . శాఖాంతర, కులాంతర, ప్రేమ వివాహాలను ప్రోత్సహించాలి. యువతీయువకులు ఆదర్శాలతో ఈ వరకట్నమనే దురాచారాన్ని రూపుమాపాలి. అమ్మాయికి ఇవ్వటం, అబ్బాయికి తీసుకోవటం రెండూ అక్రమమేనన్న ఆలోచన కలగాలి. కట్నం అనేది బానిసవ్యాపారమన్న ప్రచారం సాగాలి. రేడియోలు, టీ.వీ.లు, సాహిత్యం ద్వారా వరకట్న దురాచారం గురించి ప్రజలకి తెలియజెయ్యాలి. వరకట్న నిషేధ చట్టాన్ని ప్రజలు అమలుపరచాలి. అప్పుడే పెళ్ళి నూరేళ్ళ పంట అవుతుంది లేదా ‘తంటా’ అవుతుంది !

ప్రశ్న 5.
స్త్రీలపై జరుగుతున్న అత్యాచారాలను ఖండిస్తూ వారిని గౌరవించాలని తెలుపుతూ, ఒక కరపత్రం తయారు చేయండి.
జవాబు:
స్త్రీలపై అత్యాచారాలను అరికట్టండి’

సోదరులారా!
మీకు ఒక విన్నపం. ఈ రోజుల్లో మనం చూస్తున్నాం . పేపరు తెరిస్తే, టివి పెడితే, ఎక్కడో ఒకచోట మన కన్నతల్లులకు, మనకు పాలిచ్చి పెంచిన స్త్రీమూర్తులకు అవమానం జరిగిందని వార్త చూస్తాం. మనం మానవులం. రాక్షసులం కాదు.

పసిపాపలపై అత్యాచారాలు, వృద్ధ స్త్రీలపై అత్యాచారాలు, తోడి విద్యార్థినులపై, పొరుగున ఉన్న ఇల్లాలిపై అత్యాచారాలు. వెంటనే అత్యాచారాలను అరికట్టండి.

దేవతలవంటి స్త్రీలపై అత్యాచారం చేయడం రాక్షసత్వం. స్త్రీలందరూ నీకు కన్నతల్లుల వంటివారు, అక్కచెల్లెళ్ళ వంటి వారు. స్త్రీలను గౌరవించాలి, పూజించాలి.

నిర్భయ చట్టం వచ్చింది. జాగ్రత్త. స్త్రీలను అగౌరవపరిస్తే నడిరోడ్డుపైననే మిమ్మల్ని కాల్చి చంపుతారు. చట్టం పదును ఎక్కింది.

జాగ్రత్త. స్త్రీమూర్తులను పవిత్రభావంతో చూడండి. వారిని గౌరవించండి. వారికి సాయపడండి. అన్యాయం మీ కంట పడితే ఉగ్రనరసింహునిలా విజృంభించండి.

మీరు తోటి స్త్రీలను గౌరవిస్తే, దుర్గాదేవికి లక్ష కుంకుమపూజ చేసినట్లే. లలితాసహస్రం పారాయణం చేసినట్లే. గుర్తుంచుకోండి. స్త్రీలు భారత భాగ్య కల్పలతలు.

ఇట్లు,
x x x x

AP Board 8th Class Telugu Important Questions Chapter 10 సంస్కరణ

ప్రశ్న 6.
తోటి స్త్రీలను సోదరీమణుల్లా, మాతృమూర్తుల్లా భావించాలని గుర్తు చేస్తూ నీ మిత్రునికి లేఖ రాయండి.
జవాబు:

లేఖ

రాజమండ్రి,
x x x x x x x x

ప్రియ మిత్రుడు అఖిలేశ్ కు,

నేను బాగా చదువుతున్నాను. నీవు కూడా బాగా చదువుతున్నావని భావిస్తాను. ఈ లేఖలో తోటి స్త్రీలను సోదరీమణుల్లా, మాతృమూర్తుల్లా భావించాలని గుర్తు చేస్తూ రాస్తున్నాను.

స్త్రీలు భూమి మీద తిరిగే పుణ్యదేవతలు. వారికి అపచారం చేసేవారు ధ్వంసమైపోతారు. సమూలంగా వారి వంశం నశిస్తుంది. స్త్రీలు పూజింపదగినవారు. వారికి ఎటువంటి అవమానం జరుగకుండా చూడాలి. తోటి స్త్రీలను సోదరీమణుల్లా, మాతృమూర్తుల్లా భావించి వారికి తగిన గౌరవం ఇవ్వాలని కోరుతున్నాను.

ఇట్లు,
నీ ప్రియ మిత్రుడు,
రాజేష్,

చిరునామా :
పి. అఖిలేష్,
8వ తరగతి, యం.వి.ఆర్. హైస్కూలు,
కుప్పం, చిత్తూరు జిల్లా.

8th Class Telugu 10th Lesson సంస్కరణ 1 Mark Bits

1. చైత్రశుద్ధనవమినాడు సీతారాములపరిణయం జరుగును. (పర్యాయపదాలు గుర్తించండి) (S.A. II – 2017-18)
ఎ) పుట్టినరోజు, జన్మదినం
బి) సంబరం, సంతోషం
సి) పుంసవనం, సీమంతం
డి) పెళ్లి, కళ్యాణం
జవాబు:
డి) పెళ్లి, కళ్యాణం

2. విద్దె లేని వాడు వింత పశువు (ప్రకృతి గుర్తించండి) (S.A. II – 2017-18)
ఎ) విధి
బి) విదియ
సి) విదె
డి) విద్య
జవాబు:
డి) విద్య

3. నిజమే ! నాకీ సంగతి తెలీదు. (సంధిని గుర్తించండి.) (S.A.III – 2016-17)
ఎ) అకారసంధి
బి) ఉకారసంధి
సి) యడాగమసంధి
డి) ఇకార సంధి
బి) విదియ
జవాబు:
బి) ఉకారసంధి

భాషాంశాలు – పదజులం

అర్థాలు:

4. సంఘనిర్మూలన ఆవశ్యకత ఉంది – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) అనాదరం
బి) అవసరం
సి) అవకాశం
డి) అనంతం
జవాబు:
బి) అవసరం

AP Board 8th Class Telugu Important Questions Chapter 10 సంస్కరణ

5. అధర్మాన్ని నిర్మూలన చేయాలి – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) ప్రగతి
బి) తిరోగతి
సి) తొలగించడం
డి) ఏవగించడం
జవాబు:
సి) తొలగించడం

6. అభ్యున్నతి సాధించాలి – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) ప్రగతి
బి) సాధికారత
సి) నేర్పరి
డి) గుర్తించు
జవాబు:
ఎ) ప్రగతి

7. దురాచారం తొలగాలి – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) సదాచారం
బి) చెడు ఆచారం
సి) గొప్పదైన
డి) కనబరచు
జవాబు:
బి) చెడు ఆచారం

8. చైతన్యం రావాలి – గీత గీసిన పదానికి అర్థం పదాలు రాయండి.
ఎ) కదలిక
బి) మదలిక
సి) అవరోధం
డి) సాధికారత
జవాబు:
ఎ) కదలిక

9. విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) వినోదం
బి) ఆనందం
సి) విషాదం
డి) విచారం
జవాబు:
బి) ఆనందం

10. ప్రగతి ప్రస్ఫుటించింది – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) తెల్లారు
బి) అవసరము
సి) కనబరచు
డి) అసహ్యించు
జవాబు:
సి) కనబరచు

11. ఇతరులను అసహ్యించుకోరాదు – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) పెద్ద భూతం
బి) అక్కడక్కడ
సి) తొలగించు
డి) ఏవగించుకొను
జవాబు:
డి) ఏవగించుకొను

12. ధనం సంపాదించాలి – గీత గీసిన పదానికి అర్థాలు గుర్తించండి.
ఎ) సంపద, సాగరం
బి) విత్తం, ద్రవ్యం
సి) జలధి, హలం
డి) దండనం, దాపరికం
జవాబు:
బి) విత్తం, ద్రవ్యం

పర్యాయపదాలు :

13. స్త్రీ ప్రగతి సాధించాలి – గీత గీసిన పదానికి పర్యాయ గుర్తించండి.
ఎ) మహిళ, జామాత
బి) ద్రవ్యం, పైకం
సి) మహిళ, వనిత
డి) చట్టం, ఉత్తరువు
జవాబు:
సి) మహిళ, వనిత

14. ఇనుడు ప్రకాశించాడు- గీత గీసిన పదానికి పర్యాయ పదాలు గుర్తించండి.
ఎ) ప్రభాకరుడు, చందురుడు
బి) జాబిల్లి, అంతరంగం
సి) శాసనం, ధనము
డి) సూర్యుడు, రవి
జవాబు:
డి) సూర్యుడు, రవి

AP Board 8th Class Telugu Important Questions Chapter 10 సంస్కరణ

15. కార్యం ఘనంగా ఉంది – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
ఎ) ఢంక, దాపు
బి) గొప్ప, శ్రేష్ఠం
సి) ఆనందం, శ్రేష్ఠం
డి) గోప్ప, ఘనసారం
జవాబు:
సి) ఆనందం, శ్రేష్ఠం

16. కృషి చేయాలి – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
ఎ) సేద్యం, సాగరం
బి) ప్రయత్నం, పరిశ్రమ
సి) గొప్ప, దాపరికం
డి) అసహ్యం, వ్యవసాయదారుడు
జవాబు:
బి) ప్రయత్నం, పరిశ్రమ

17. హర్షం పొందాలి – గీత గీసిన పదానికి సమానార్థకాలు గుర్తించండి.
ఎ) హారం, మనోహరం
బి) ఆనందం, సంతోషం
సి) సంతసం, సంతాపం
డి) సాగరం, జలధి
జవాబు:
బి) ఆనందం, సంతోషం

18. శాసనం తిరుగులేనిది-గీత గీసిన పదానికి సమానార్థకాలు గుర్తించండి.
ఎ) ఉత్తరువు, ఉత్తమం
బి) చట్టం, ఉత్తరువు
సి) అవేశం, ఆక్రందన
డి) అనువు, అరమరిక
జవాబు:
బి) చట్టం, ఉత్తరువు

19. స్త్రీ గౌరవనీయురాలు – గీత గీసిన పదానికి వికృతి పదం ఏది?
ఎ) ఇంతి
బి) సింది
సి) శీరి
డి) గిరి
జవాబు:
ఎ) ఇంతి

20. దూరం ఉంది – గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.
ఎ) దేరం
బి) దవ్వు
సి) దాపు
డి) దాగరం
జవాబు:
బి) దవ్వు

21. నిక్కం పలకాలి – గీత గీసిన పదానికి ప్రకృతి పదం ఏది?
ఎ) నిజం
బి) నైజం
సి) నాగరం
డి) నైరాశ్యం
జవాబు:
ఎ) నిజం

22. విషయం తెలియాలి – గీత గీసిన పదానికి వికృతి పదం ఏది?
ఎ) వివేకం
బి) విసయం
సి) విసురం
డి) విసెరం
జవాబు:
బి) విసయం

23. గౌరవం చూపాలి – గీత గీసిన పదానికి వికృతి పదం ఏది?
ఎ) గారవం
బి) గార్దభం
సి) శాస్త్రం
డి) గేరవం
జవాబు:
ఎ) గారవం

24. రూపం మనోహరం – గీత గీసిన పదానికి వికృతిని గుర్తించండి.
ఎ) రూపు
బి) రోపు
సి) రేసు
డి) వైపు
జవాబు:
ఎ) రూపు

25. అందరు నిద్య చదవాలి – గీత గీసిన పదానికి వికృతి పదం ఏది?
ఎ) వద్దె
బి) వెద్దె
సి) వొద్దె
డి) విద్దె
జవాబు:
డి) విద్దె

26. అచ్చెరువు పొందాము – గీత గీసిన పదానికి ప్రకృతి పదం ఏది?
ఎ) ఆశ్చర్యం
బి) అక్కరువు
సి) ఆదరువు
డి) ఆవాసం
జవాబు:
ఎ) ఆశ్చర్యం

27. మంతిరి వచ్చాడు – గీత గీసిన పదానికి ప్రకృతి పదం గుర్తించండి.
ఎ) మంత్రి
బి) మంతెరి
సి) మబెరి
డి) మంచరి
జవాబు:
ఎ) మంత్రి

28. వివాహం జరిగింది – గీత గీసిన పదానికి వికృతి పదం ఏది?
ఎ) వేసహం
బి) వియ్యము
సి) వివాహం
డి) విసహం
జవాబు:
బి) వియ్యము

29. కృషి అవసరం – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
ఎ) సేద్యం, ప్రయత్నం
బి) సేద్యం, సాగరం
సి) పరిశ్రమ, పరిశీలన
డి) ప్రగతి, చైతన్యం
జవాబు:
ఎ) సేద్యం, ప్రయత్నం

AP Board 8th Class Telugu Important Questions Chapter 10 సంస్కరణ

30. జగతిన ప్రజలు వర్ధిల్లాలి – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
ఎ) జాతి, వందనం
బి) సంతానం, జనం
సి) జాగృతి, అభ్యున్నతి
డి) శీలన, శిబిరం
జవాబు:
బి) సంతానం, జనం

31. చైతన్యం వెల్లివిరియాలి – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
ఎ) చిరాకు, విరోగతి
బి) అధోగతి, అభ్యున్నతి
సి) ప్రాణం, తెలివి
డి) తపన, తామరసం
జవాబు:
సి) ప్రాణం, తెలివి

32. కళ్యాణం జరిగింది – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
ఎ) పరిశీలన, ప్రగతి
బి) పెండ్లి, బంగారం
సి) అక్షతలు, ఆకాశం
డి) అనంతం, అంతరంగం
జవాబు:
బి) పెండ్లి, బంగారం

33. ఘనం కురిసింది – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
ఎ) ఘనసారం, శబ్దం
బి) గొప్ప, మేఘం
సి) శరీరం, తనువు
డి) పుట్టుట, ప్రగతి
జవాబు:
బి) గొప్ప, మేఘం

34. సత్యం జయించాలి – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
ఎ) నిజం, పూజ్యము
బి) నైజం, గుణం
సి) తపన, తాత్సారం
డి) పూజ్యం, పుణ్యము
జవాబు:
ఎ) నిజం, పూజ్యము

వ్యుత్పత్యర్థాలు :

35. నీటిని ధరించునది – అనే వ్యుత్పత్త్యర్థం గల పదం ఏది?
ఎ) జలధి
బి) కాసారం
సి) క్షీరం
డి) దాస్యం
జవాబు:
ఎ) జలధి

36. సత్పురుషులయందు పుట్టినది – అనే వ్యుత్పత్తి గల ఏది?
ఎ) అసహ్యం
బి) కులం
సి) దుఃఖం
డి) సత్యం
జవాబు:
డి) సత్యం

37. సమస్త ప్రాణులయందు సమభావన కలవాడు – అనే వ్యుత్పత్తి గల పదం ఏది?
ఎ) మిత్రుడు
బి) వైరి
సి) పగతుడు
డి) కృతజ్ఞుడు
జవాబు:
ఎ) మిత్రుడు

AP Board 8th Class Telugu Important Questions Chapter 10 సంస్కరణ

38. శాసనం పాటించాలి – గీత గీసిన పదానికి వ్యుత్పత్తిని గుర్తించండి.
ఎ) అందరికి ఆమోదయోగ్యమైంది
బి) దీని చేత రక్షింపబడును
సి) దాని చేత కొనబడును
డి) అందరి చేత పొందబడును
జవాబు:
బి) దీని చేత రక్షింపబడును

వ్యాకరణాంశాలు

సంధులు :

39. కింది వానిలో బహుళ సంధిని గుర్తించండి.
ఎ) అత్వసంధి
బి) గుణసంధి
సి) వృద్ధి సంధి
డి) విసర్గ సంధి
జవాబు:
ఎ) అత్వసంధి

40. చేసినంత పని – గీత గీసిన పదాన్ని విడదీసి, గుర్తించండి.
ఎ) చేసిన + ఎంత
బి) చేసిన + అంత
సి) చేసినా + యంత
డి) చేసినే + యంత
జవాబు:
బి) చేసిన + అంత

41. కారణమని – ఇది ఏ సంధికి ఉదాహరణయో గుర్తించండి.
ఎ) ఉత్వసంధి
బి) గుణసంధి
సి) యణాదేశ సంధి
డి) వృద్ధి సంధి
జవాబు:
ఎ) ఉత్వసంధి

42. వ్యతిరేకాభిప్రాయం – ఇది ఏ సంధికి ఉదాహరణ?
ఎ) వృద్ధి సంధి
బి) త్రికసంధి
సి) సవర్ణదీర్ఘ సంధి
డి) అత్వసంధి పదం
జవాబు:
సి) సవర్ణదీర్ఘ సంధి

AP Board 8th Class Telugu Important Questions Chapter 10 సంస్కరణ

43. సరిగదా – దీన్ని విడదీసిన పదం గుర్తించండి.
ఎ) సరి + కదా
బి) సరి + గదా
సి) సరి + అదా
డి) సరే + కదా
జవాబు:
ఎ) సరి + కదా

44. క్రింది వానిలో వికల్ప సంధిని గుర్తించండి.
ఎ) అత్వసంధి
బి) గసడదవాదేశ సంధి
సి) ఇత్వసంధి
డి) వృద్ధి సంధి
జవాబు:
బి) గసడదవాదేశ సంధి

45. వివాహాలు – దీనిని విడదీస్తే
ఎ) వివాహా + ఆలు
బి) వివాహము + లు
సి) వివ + అహములు
డి) వివాహ + ములు
జవాబు:
బి) వివాహము + లు

46. కింది వానిలో యణాదేశ సంధికి ఉదాహరణను గుర్తించండి.
ఎ) అత్తమ్మ
బి) ఏమిచ్చెను
సి) అభ్యున్నతి
డి) సరాగాలు
జవాబు:
సి) అభ్యున్నతి

సమాసాలు :

47. ఉత్తర పదార్థ ప్రాధాన్యం గల సమాసం ఏది?
ఎ) తత్పురుష
బి) బహుజొహి
సి) అవ్యయీభావం
డి) కర్మధారయం
జవాబు:
ఎ) తత్పురుష

48. విద్యాహీనత – ఈ పదానికి విగ్రహవాక్యం గుర్తించండి.
ఎ) విద్యకు హీనత
బి) విద్యయందు హీనత
సి) విద్యచేత హీనత
డి) విద్య కొరకు హీనత
జవాబు:
డి) విద్య కొరకు హీనత

49. కింది వానిలో తృతీయా తత్పురుషకు ఉదాహరణ
ఎ) శక్తిహీనత
బి) ఆరోగ్య భయం
సి) గురుదక్షిణ
డి) పతిభిక్ష
జవాబు:
ఎ) శక్తిహీనత

AP Board 8th Class Telugu Important Questions Chapter 10 సంస్కరణ

50. వరుని కొరకు కట్నం-దీన్ని సమాసపదంగా గుర్తించండి.
ఎ) వరకట్నం
బి) పరకట్నం
సి) అనువరకటనం
డి) ప్రతికట్నం
జవాబు:
ఎ) వరకట్నం

51. విద్యావ్యాప్తి – ఇది ఏ సమాసం?
ఎ) విద్య చేత వ్యాప్తి
బి) విద్య వలన వ్యాప్తి
సి) విద్య యొక్క వ్యాప్తి
డి) విద్యను వ్యాప్తి
జవాబు:
సి) విద్య యొక్క వ్యాప్తి

52. అసత్యం – దీనికి విగ్రహవాక్యం గుర్తించండి.
ఎ) సత్యమే అగుపించునది
బి) సత్యము కానిది
సి) ధర్మము కానిది
డి) సత్యముతో కూడినది
జవాబు:
బి) సత్యము కానిది

53. పూర్వకాలము – ఇది ఏ సమాసం?
ఎ) షష్ఠీ తత్పురుష
బి) పంచమీ తత్పురుష
సి) అవ్యయీభావం
డి) ప్రథమా తత్పురుష
జవాబు:
డి) ప్రథమా తత్పురుష

వాక్యాలు :

54. అంటరానితనం వద్దు – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) నిషేధాక వాక్యం
బి) అష్యర్థక వాక్యం
సి) ముక్తపదగ్రస్తం
డి) నిదర్శనాలంకారం
జవాబు:
ఎ) నిషేధాక వాక్యం

AP Board 8th Class Telugu Important Questions Chapter 10 సంస్కరణ

55. రమ అల్లరి చేస్తూ ఆడుతున్నది – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) భావార్థకం
బి) తుమున్నర్థకం
సి) అప్యర్థకం
డి) శత్రర్థకం
జవాబు:
డి) శత్రర్థకం

56. రామకృష్ణ పరమహంస, వివేకానందులు గురుశిష్యులు – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) నిషేధార్థక వాక్యం
బి) సంయుక్త వాక్యం
సి) అభ్యర్థక వాక్యం
డి) హేత్వర్థక వాక్యం
జవాబు:
బి) సంయుక్త వాక్యం

57. బాగా చదవడం వల్ల మార్కులు వచ్చాయి – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) హేత్వర్థక వాక్యం
బి) సంయుక్త వాక్యం
సి) విధ్యర్థక వాక్యం
డి) నిశ్చయాత్మక వాక్యం
జవాబు:
ఎ) హేత్వర్థక వాక్యం

58. మీరు ఆటలు ఆడవచ్చు – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) అనుమత్యర్థకం
బి) అభ్యర్థకం
సి) హేత్వర్థకం
డి) నిషేధాకం
జవాబు:
ఎ) అనుమత్యర్థకం

59. జగతి వర్ధిల్లాలి – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) సంయుక్త
బి) ఆశీర్వచనార్థకం
సి) అప్యర్థకం
డి) హేత్వర్ధకం
జవాబు:
ఎ) సంయుక్త

60. వర్తమానకాల అసమాపక క్రియను గుర్తించండి.
ఎ) శత్రర్థకం
బి) ఆశ్చర్యార్థకం
సి) క్వార్థకం
డి) అప్యర్థకం
జవాబు:
ఎ) శత్రర్థకం

గణవిభజన:

61. IUI – ఇది ఏ గణము?
ఎ) జ గణం
బి) త గణం
సి) మ గణం
డి) స గణం
జవాబు:
ఎ) జ గణం

62. జలజా – ఇది ఏ గణము?
ఎ) భ గణం
బి) స గణం
సి) న గణం
డి) మ గణం
జవాబు:
బి) స గణం

AP Board 8th Class Telugu Important Questions Chapter 10 సంస్కరణ

63. IIUI – ఇది ఏ గణము?
ఎ) స న
బి) న గ
సి) న ల
డి) స ల
జవాబు:
డి) స ల

అలంకారాలు :

64. అర్థభేదం లేకపోయినా తాత్పర్య భేదం ఉండునట్లుగా ఒక పదం వెంటవెంటనే రావడం
ఎ) లాటానుప్రాస
బి) యమకం
సి) ముక్తపదగ్రస్తం
డి) ఉపమ
జవాబు:
ఎ) లాటానుప్రాస

65. కింది వానిలో పొసగని అలంకారం గుర్తించండి. రకమైన వాక్యం?
ఎ) రూపక
బి) యమకం
సి) అతిశయోక్తి
డి) ఉత్ప్రేక్ష
జవాబు:
బి) యమకం

66. ఉపమానోపమేయాలకు అభేదం చెప్పే అలంకారం ఏది?
ఎ) రూపక
బి) అతిశయోక్తి
సి) ముక్తపదగ్రస్తం
డి) అంత్యానుప్రాస
జవాబు:
ఎ) రూపక

67. ఉత్ప్రేక్ష – అనగా
ఎ) ఊహ
బి) ఆశ
సి) పల్లవి
డి) పోలిక
జవాబు:
ఎ) ఊహ

AP Board 8th Class Telugu Important Questions Chapter 10 సంస్కరణ

68. మానవా ! నీ ప్రయత్నం మానవా ! – ఇది ఏ అలంకారం?
ఎ) యమకం
బి) ముక్తపదగ్రస్తం
సి) లాటానుప్రాస
డి) ఉపమ
జవాబు:
బి) ముక్తపదగ్రస్తం

సొంతవాక్యాలు :

69. అవరోధాలు : కార్యసాధనలో అవరోధాలు తొలగించుకోవాలి.

70. ఆశ్చర్యం : ఇంద్రజాల ప్రదర్శన నాకు ఆశ్చర్యం కలిగిస్తుంది.

71. నిరాడంబరం : మహాత్ములు ఎంతో నిరాడంబరంగా జీవిస్తారు.

72. ఆవశ్యకత : సంఘసంస్కరణల ఆవశ్యకత ఎంతో ఉంది.

73. దురాచారం : సమాజంలో దురాచారాలను నిర్మూలించాలి.

74. ప్రతిష్ఠ : భారతదేశ సమున్నత ప్రతిష్ఠ విశ్వవ్యాప్తం అయింది.

AP Board 8th Class Telugu Important Questions Chapter 7 హరిశ్చంద్రుడు

AP State Syllabus AP Board 8th Class Telugu Important Questions Chapter 7 హరిశ్చంద్రుడు.

AP State Syllabus 8th Class Telugu Important Questions 7th Lesson హరిశ్చంద్రుడు

8th Class Telugu 7th Lesson హరిశ్చంద్రుడు Important Questions and Answers

I. అవగాహన- ప్రతిస్పందన

అ) కింది అపరిచిత పద్యాలను చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి.

1. కింది పద్యాన్ని చదివి, దాని కింద ఇచ్చిన నాలుగు ప్రశ్నలకు జవాబులు రాయండి.

కలహపడునింట నిలువదు
కలుముల జవరాలు కానఁ గలకాలం బే
కలహములులేక సమ్మతి
మెలఁగంగా నేర్చెనేని మేలు కుమారీ !
ప్రశ్నలు :
1. కలహపడే ఇంట్లో ఏం నిలువదు?
జవాబు:
కలహపడే ఇంట్లో లక్ష్మి (సంపద) నిలువదు.

2. కలకాలం ఎలా మెలగాలి?
జవాబు:
కలకాలం ఏ విధమైన కలహాలు లేకుండా మెలగాలి.

3. ఈ పద్యం ఎవరిని సంబోధిస్తూ చెప్పబడింది?
జవాబు:
ఈ పద్యం కుమారిని సంబోధిస్తూ అంటే ఆడ పిల్లలను సంబోధిస్తూ చెప్పబడింది.

4. ఈ పద్యానికి శీర్షికను సూచించండి.
జవాబు:
ఈ పద్యానికి శీర్షిక ‘కలహం – నష్టం’.

2. కింది పద్యాన్ని చదివి, దాని క్రింద ఇచ్చిన నాలుగు ప్రశ్నలకు జవాబులు రాయండి.

తనిసిరే వేల్పు లుదధి రత్నముల చేత?
వెఱచిరే ఘోర కాకోల విషము చేత?
విడిచిరే యత్న మమృతంబు వోడుముదనుక?
నిశ్చితార్థంబు వదలరు నిపుణమతులు.
ప్రశ్నలు :
1. ఉదధి రత్నముల చేత తృప్తి చెందని వారెవరు?
జవాబు:
వేల్పులు, ఉదధి రత్నములచేత తృప్తి చెందలేరు.

2. నిపుణమతులు ఎటువంటివారు?
జవాబు:
నిపుణమతులు తాము అనుకున్న కార్యం నెరవేరే వరకు తమ ప్రయత్నాన్ని వదలరు.

3. వేల్పులు దేన్ని చూసి భయపడలేదు?
జవాబు:
వేల్పులు ఘోర కాకోల విషాన్ని చూసి భయపడలేదు.

4. ఈ పద్యానికి శీర్షికను సూచించండి.
జవాబు:
ఈ పద్యానికి శీర్షిక “నిపుణమతుల పట్టుదల”.

AP Board 8th Class Telugu Important Questions Chapter 7 హరిశ్చంద్రుడు

3. కింది పద్యాన్ని చదివి, దాని కింద ఇచ్చిన నాలుగు ప్రశ్నలకు జవాబులు రాయండి.

విద్యచే భూషితుండయి వెలయుచున్నఁ
దొడరి వర్జింపనగుఁ జుమీ దుర్జనుండు
చారు మాణిక్య భూషిత శస్త మస్త
కంబయిన పన్నగము భయంకరము గాదె.
ప్రశ్నలు :
1. చదువుకున్నప్పటికీ విడువదగినవాడు ఎవరు?
జవాబు:
దుర్జనుడు చదువుకున్నప్పటికీ విడువదగినవాడు.

2. ఎటువంటి పాము భయంకరమైనది?
జవాబు:
తలపై మణులచేత అలంకరింపబడినా పాము భయంకరమైనది.

3. ఈ పద్యంలోని దుర్జనుడు దేనితో పోల్చబడ్డాడు?
జవాబు:
ఈ పద్యంలో దుర్జనుడు, పాముతో పోల్చబడ్డాడు.

4. ఈ పద్యానికి శీర్షికను సూచించండి.
జవాబు:
ఈ పద్యానికి శీర్షిక ‘దుర్జనుడితో స్నేహం పనికి రాదు.’

4. కింది పద్యాన్ని చదివి, దాని కింద ఇచ్చిన నాలుగు ప్రశ్నలకు జవాబులు రాయండి.

రాజు చేతి కత్తి రక్తంబు వర్ణించు
సుకవి చేతి కలము సుధలు కురియు
ఆత డేల గలుగు యావత్ప్రపంచంబు
నీత డేల గలుగు ఇహము పరము
ప్రశ్నలు:
1. రాజు చేతి కత్తి దేన్ని వర్షిస్తుంది?
జవాబు:
రాజు చేతి కత్తి రక్తాన్ని వర్షిస్తుంది.

2. సుధలు కురిపించునది ఏది?
జవాబు:
సుకవి చేతి కలము, సుధలు కురిపిస్తుంది.

3. యావత్ప్రపంచాన్ని పరిపాలించగలిగింది ఎవరు?
జవాబు:
రాజు యావత్ప్రపంచాన్ని పరిపాలించగలడు.

4. ఈ పద్యానికి శీర్షికను సూచించండి. –
జవాబు:
ఈ పద్యానికి శీర్షిక ‘రాజు – సుకవి’.

II. వ్యక్తీకరణ – సృజనాత్మకత

అ) కింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాల్లో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
‘హరిశ్చంద్రుడు’ పాఠ్యభాగ రచయితను గురించి రాయండి.
(లేదా)
ద్విపదకు జీవంపోసిన గౌరన 15వ శతాబ్దికి చెందినవాడు. ఆయన కవిత్వం నిండా అచ్చతెలుగు పలుకుబళ్ళు జాలువారుతుంటాయి. హరిశ్చంద్రుడు అనే పాఠం రాసిన ఆయన గురించి రాయండి. (S.A. III – 2016-17)
జవాబు:
‘హరిశ్చంద్రుడు’ పాఠ్యాంశ రచయిత గౌరన. ఈయన 15వ శతాబ్దికి చెందినవాడు. వీరు హరిశ్చంద్రోపాఖ్యానం, నవనాథ చరిత్ర రచించాడు. సంస్కృతంలో లక్షణ దీపిక అనే గ్రంథాన్ని రచించారు. ఈయనకు ‘సరస సాహిత్య విచక్షణుడు’ అనే బిరుదు ఉంది. ఈయన శైలి మనోహరమైనది. సామెతలు, జాతీయాలతో కవిత్వం అందరిని అలరిస్తుంది. అచ్చతెలుగు పలుకుబడులు కవిత్వం నిండా పుష్కలంగా ఉంటాయి.

AP Board 8th Class Telugu Important Questions Chapter 7 హరిశ్చంద్రుడు

ప్రశ్న 2.
‘ద్విపద’ ప్రక్రియను వివరించండి.
జవాబు:
తెలుగు సాహిత్య ప్రక్రియల్లో ద్విపద ఒకటి. ఇందులో రెండు పాదాలు ఉంటాయి. ప్రతిపాదంలోను నాలుగు గణాలు ఉంటాయి. ప్రతి పాదంలోను మూడు ఇంద్రగణాలు, ఒక సూర్య గణం ఉంటుంది. 1-4 గణాల మొదటి అక్షరానికి యతి చెల్లుతుంది. యతి కుదరనప్పుడు ప్రాసయతి వేయవచ్చు. ప్రాస నియమం లేని ద్విపదను మంజరీ ద్విపద అని అంటారు.

ప్రశ్న 3.
హరిశ్చంద్రుని పాత్ర స్వభావం రాయండి.
జవాబు:
పురాణ పురుషుల్లో హరిశ్చంద్రుడు ప్రసిద్ధుడు. ఈయన షట్చక్రవర్తులలో గొప్పవాడు. ఆడినమాట తప్పని స్వభావం కలవాడు. సత్యం కోసం ఎన్నో కష్టాలను అనుభవించాడు. రాజ్యాన్ని, సంపదను కోల్పోయాడు. అయినా తాను నమ్మిన సత్యమునకే కట్టుబడి ఉన్నాడు. అందరికి ఆదర్శంగా నిలిచాడు.

ఆ) కింది ప్రశ్నకు 10 లేక 12 వాక్యాల్లో సమాధానం రాయండి.

ప్రశ్న 1.
హరిశ్చంద్రుడు పాఠ్యభాగ సారాంశాన్ని సొంతమాటల్లో రాయండి.
(లేదా)
“బ్రహ్మ రాత మారవచ్చు ….. తూర్పున సూర్యుడు అస్తమించవచ్చు కానీ హరిశ్చంద్రుడు మాట తప్పడు” అని తెలిపే హరిశ్చంద్రుని కథను రాయండి. (S.A. II – 2017-18)
జవాబు:
సాటిలేని విజ్ఞానఖనియైన వశిష్ఠుడు ఇంద్రుడితో ఇలా అన్నాడు. ఓ దేవేంద్రా ! ఈ ప్రపంచంలో మహా పరాక్రమవంతుడు హరిశ్చంద్రుడు. ఇతడు పదహారు రకాల దానాలు చేస్తూ ఆనందిస్తాడు. వినయమే అలంకారంగా కలవాడు. వివేకమే సంపదగా కలవాడు. మంచి కీర్తి వైభవాలు కలవాడు. ధనుర్వేద విద్యలో ఆరితేరినవాడు. మేఘంలా గంభీరమైనవాడు. దయకు సముద్రుని వంటివాడు. పుణ్యాత్ముడు.

పండితులచే ప్రశంసలు పొందువాడు. సర్వశాస్త్రాలసారం తెలిసినవాడు. గర్వించిన శత్రురాజులనే ఏనుగుల పాలిట సింహం వంటివాడు. షట్చక్రవర్తులలో ఒకడు. నీతిమంతమైన పాలన చేసేవాడు. సత్యం తప్పనివాడు. మహాజ్ఞాని. సత్యవాక్పరిపాలకుడు.

సూర్యవంశస్థుడయిన త్రిశంకుని కుమారుడు. సాటిలేని విజ్ఞానం కలవాడు. సూర్యవంశమనే పాలసముద్రానికి చంద్రుని వంటివాడు. ఆడినమాట తప్పనివాడు. దేవేంద్రా ! రెండువేల నాలుకలు గల ఆదిశేషునికైనా ఈ హరిశ్చంద్రుని గుణగణాలు కీర్తించడం సాధ్యం కాదు. అతను సత్యస్వరూపుడు. అతని ఆలోచనలు కరుణతో నిండి ఉంటాయి. హరిశ్చంద్రుడు ధర్మతత్పరుడు. ఆయన ప్రియంగా మాట్లాడతాడు. అబద్ధమనేది ఆయనకు తెలియదు.

ఇన్ని మాటలు చెప్పడం ఎందుకు ? బ్రహ్మరాత తప్పినా, సూర్యుడు తూర్పున ఆస్తమించినా, మేరుపర్వతం భూమిలో కుంగినా, ఆకాశం ఊడి కిందపడినా, భూగోళం తలక్రిందులైనా, సముద్రాలు ఇంకిపోయినా, వజ్రాయుధం పదును తగ్గినా హరిశ్చంద్రమహారాజు మాత్రం ఆడిన మాట తప్పడు.

ప్రశ్న 2.
సత్యాన్ని పలుకడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించండి.
జవాబు:
మానవులు ఎన్నో ఉత్తమ గుణాలను అలవరచుకోవాలి. వాటిలో సత్యమును మాట్లాడడం మంచిది. సత్యమును మాట్లాడడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. వాటిలో కొన్ని :

  • ప్రజల్లో విశ్వసనీయత పెరుగుతుంది.
  • నైతిక విలువలు సమున్నతంగా వృద్ధి చెందుతాయి.
  • సమాజంలో ధర్మతత్పరతకు అవకాశం కలుగుతుంది.
  • సమాజంలో ఉన్నతమైన గౌరవ మర్యాదలు కలుగుతాయి.
  • మరణించినా శాశ్వతమైన కీర్తిని పొందుతాడు.
  • అందరికి ఆదర్శంగా నిలిచే అవకాశం కలుగుతుంది.
  • సమాజంలో మంచి గుణాలు చిరస్థాయిగా నిలుస్తాయి.

ఈ విధంగా సత్యాన్ని పలకడం వల్ల మానవులకు ఎన్నో ఉపయోగాలు కలుగుతాయి.

ఇ) కింది అంశం గురించి సృజనాత్మకంగా / ప్రశంసిస్తూ రాయండి.

ప్రశ్న 1.
నీకు నచ్చిన పురాణ పురుషుని ప్రశంసిస్తూ మిత్రునికి లేఖ రాయండి.
జవాబు:

శ్రీశైలం,
x x x x x

ప్రియమైన మిత్రురాలు విజయలక్ష్మికి,

నీ మిత్రురాలు వ్రాయునది. నేను బాగా చదువుతున్నాను. నీవు కూడా బాగా చదువుతున్నావని ఆశిస్తున్నాను. ముఖ్యముగా రాయునది మన పురాణ పురుషుల్లో నాకు ఎంతోమంది నచ్చారు. వారిలో హరిశ్చంద్రుడు ముఖ్యుడు. ఆయన సత్యానికి కట్టుబడి ఉన్నాడు. కార్యానికి రాజ్యాన్ని, సంపదను కోల్పోయాడు. అయినా సత్యవాక్య పరిపాలనకు కట్టుబడి ఉన్నాడు. అందరికి ఆదర్శంగా నిలిచాడు. అందుకే నాకు హరిశ్చంద్రుడు అంటే ఇష్టం. నీకు నచ్చిన పురాణ పురుషుని గురించి వివరంగా నాకు తెలియజేయి.

ఇట్లు,
నీ ప్రియ మిత్రురాలు,
x x x x x x x x.

చిరునామా :
పి.విజయలక్ష్మి,
ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల,
మార్కాపురం,
ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్.

ప్రశ్న 2.
హరిశ్చంద్రుడు పాఠ్యభాగం ఆధారంగా కొన్ని నినాదాలు రాయండి.
జవాబు:

  • సత్యం పలకండి. ఆదర్శవంతంగా జీవించండి.
  • సత్యమే జయిస్తుంది.
  • సత్యం మీరని ధర్మమే నిలబడుతుంది.
  • సత్యమే ధర్మం. సత్యమే తపస్సు.
  • భారతీయ అంతరాత్మ సత్యమే.
  • నిజం నిలకడమీద నిలుస్తుంది.
  • నిజం నిప్పులాంటిది.
  • నిజం దేవుడెరుగు. నీరు పల్లమెరుగు.
  • నిజం నిప్పులాంటిది. అది కాల్చక మానదు.

AP Board 8th Class Telugu Important Questions Chapter 7 హరిశ్చంద్రుడు

ప్రశ్న 3.
సత్యహరిశ్చంద్రుని గురించి తెలుసుకున్నారు కదా ! అతని గుణాలు తెలుసుకున్నారు కదా! తల్లిదండ్రులు, అట్లే ఉపాధ్యాయులు చెప్పే మంచి నీతి వాక్యాలను రాయండి.
జవాబు:
పిల్లలకు తల్లి చెప్పే మంచి బుద్ధులు :

  1. తోడి పిల్లలతో దెబ్బలాడవద్దు
  2. పక్క పిల్లలతో స్నేహంగా ఉండు
  3. బట్టలు మాపుకోకు
  4. పుస్తకాలు జాగ్రత్తగా చూసుకో
  5. ఉపాధ్యాయులు చెప్పేది విని శ్రద్దగా రాసుకో
  6. అసత్యం చూట్లాడకు
  7. మధ్యాహ్నం భోజనం చెయ్యి
  8. చెడ్డవారితో స్నేహం చెయ్యకు – మొదలయినవి.

ఉపాధ్యాయుడు చెప్పే మంచి బుద్ధులు :

  1. ఏ రోజు పాఠం ఆ రోజే చదువు
  2. ఇంటిపని శ్రద్ధగా పూర్తిచెయ్యి
  3. చదువుపై శ్రద్ధ పెట్టు
  4. ఆటలు ఆడుకో
  5. వ్యాయామానికై శ్రద్ధ పెట్టు
  6. తల్లిదండ్రులను, గురువులను గౌరవించు
  7. అసత్యం మాట్లాడకు
  8. తోటి బాలబాలికలను అన్నాచెల్లెళ్ళవలె, ప్రేమగా గౌరవించు – మొదలయినవి.

ప్రశ్న 4.
మీకు పద్యాలు తెలుసు కదా ! ఈ పాఠం ద్వారా ద్విపదను కూడా తెలుసుకున్నారు కదా ! ఇతర పద్యాలకూ, ద్విపదకూ మధ్య ఉండే వ్యత్యాసాన్ని వివరించి మీకు నచ్చినదాన్ని ప్రశంసిస్తూ రాయండి.
జవాబు:
‘ద్విపద’ పద్యంలో రెండే, పాదాలుంటాయి. పాదానికి నాలుగు గణాలు ఉంటాయి. ప్రతి పాదంలోనూ మూడేసి ఇంద్రగణాలు, ఒక సూర్య గణం ఉంటాయి. మూడవ గణం మొదటి అక్షరానికి యతి ఉంటుంది. ప్రాస నియమం ఉండాలి. ప్రాస నియమంలేని ద్విపదను ‘మంజరీ ద్విపద’ అంటారు.

‘ద్విపద’ పద్యం అచ్చమైన తెలుగు ఛందస్సు. దీనిని తెలుగులో రాసిన మొదటి దేశీయకవి ‘పాల్కురికి సోమనాథుడు’. ఈయన ద్విపదలో బసవపురాణాన్ని రాశాడు.

తెలుగులో ఇతర ఛందస్సులైన వృత్త పద్యాలలో ఒక విధమైన అందమైన నడక ఉంది. అవి చదవడానికి వినసొంపుగా ఉంటాయి. ఇక ‘సీస’ పద్యాల్లో ఒక విధమైన “తూగు” ఉంది. ఉయ్యాలలో ఊగుతున్నట్లు ఉంటుంది. ఏ ఛందస్సు అందం దానిదే. మనోహరమైన “ద్విపద” కూడా మన తెలుగు వారి ఛందస్సు. ఈ ఛందస్సుల్లో మహాకవియైన గౌరన హరిశ్చంద్రోపాఖ్యానం రాశాడు. ద్విపద దేశీయ ఛందస్సు. వృత్తములు సంస్కృత ఛందస్సులు.

8th Class Telugu 7th Lesson హరిశ్చంద్రుడు 1 Mark Bits

1. భానుడు ప్రపంచానికి వెలుగునిస్తున్నాడు. ఆదిత్యుడు జగానికి మిత్రుడు. (సమానార్ధక పదాన్ని గుర్తించండి) (S.A.I – 2018-19)
ఎ) ఇందుడు
బి) సోముడు
సి) ఆదిత్యుడు
డి) రేరాజు
జవాబు:
సి) ఆదిత్యుడు

2. ఈ క్రిందివానిలో క్వార్థక వాక్యము గుర్తించండి. (S.A.II – 2018-19)
ఎ) హరిశ్చంద్రుడు సత్యమాడి స్వర్గమునకు వెళ్లాడు
బి) హరిశ్చంద్రుడు సత్యమాడుచున్నాడు స్వర్గానికి
సి) హరిశ్చంద్రుడు సత్యమాడితే స్వర్గానికి వెళతాడు
డి) హరిశ్చంద్రుడు సత్యముతో స్వర్గానికి వెళ్లాలి.
జవాబు:
ఎ) హరిశ్చంద్రుడు సత్యమాడి స్వర్గమునకు వెళ్లాడు

3. దేవతల రాజు సురేంద్రుడు ఐరావతంపై ఊరేగాడు. (అర్థాన్ని గుర్తించండి) (S.A.II – 2017-18)
ఎ) ఇంద్రుడు
బి) అగ్నిదేవుడు
సి) వాయుదేవుడు
డి) వరుణుడు
జవాబు:
ఎ) ఇంద్రుడు

AP Board 8th Class Telugu Important Questions Chapter 7 హరిశ్చంద్రుడు

4. నాకు అడవిలో కంఠీరవాన్ని చూస్తే భయం. కానీ మా గోడమీద వాలే కంఠీరవాన్ని మాత్రం ప్రేమగా నిమురుతాను. (నానార్థాలు గుర్తించండి.) (S.A.III – 2016-17)
ఎ) పులి – కాకి
బి) ఏనుగు – దున్న
సి) సింహం – పావురం
డి) జిరాఫీ – కోకిల
జవాబు:
సి) సింహం – పావురం

5. భానుడు ప్రపంచానికి వెలుగును, వేడిని ఇస్తున్నాడు. (S.A.III – 2015-16)
ఎ) సూర్యుడు
బి) చంద్రుడు
సి) ఇంద్రుడు
డి) ధర్ముడు వెళ్లడానికి
జవాబు:
ఎ) సూర్యుడు

6. చంద్రశేఖర్ ఎప్పుడూ చిటపటలాడు తుంటాడు. (S.A.III. 2015-16)
ఎ) నవ్వుతుంటాడు
బి) కోపపడుతుంటాడు
సి) మెల్లగా నడుస్తుంటాడు
డి) పరిగెత్తుతుంటాడు
జవాబు:
బి) కోపపడుతుంటాడు

7. వాక్యంలో అలంకారాన్ని గుర్తించండి. ఆమె కడవతో వడివడి అడుగులతో గడపదాటింది. (S.A.III – 2015-16)
ఎ) లాటానుప్రాస
బి) యమకం
సి) ఛేకానుప్రాస
డి) వృత్త్యనుప్రాస
జవాబు:
డి) వృత్త్యనుప్రాస

భాషాంశాలు – పదజాలం

అర్థాలు :

8. దురితం దూరం చేసుకోవాలి – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) దుష్టం
బి) పాపం
సి) పుణ్యం
డి) దుర్మతి
జవాబు:
బి) పాపం

9. బుధులు గౌరవనీయులు – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) అంతరంగాలు
బి) మూర్ఖులు
సి) పండితులు
డి) పామరులు
జవాబు:
సి) పండితులు

10. రిపువును దూరంగా ఉంచాలి – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) మిత్రుడు
బి) గురువు
సి) విశ్వము
డి) శత్రువు
జవాబు:
డి) శత్రువు

11. శరధిలో జలం ఉంటుంది – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) కొలను
బి) ఝరి
సి) సముద్రం
డి) బావి
జవాబు:
సి) సముద్రం

12. నిత్యం సత్యం పలకాలి – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) అప్పుడు
బి) ఎల్లప్పుడు
సి) కొంత
డి) ఎప్పుడు
జవాబు:
బి) ఎల్లప్పుడు

13. తనువును రక్షించుకోవాలి – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) శరీరం
బి) జిహ్వ
సి) నాశిక
డి) కర్ణం
జవాబు:
ఎ) శరీరం

14. మదిలో మంచి ఉండాలి – గీత గీసిన పదానికి అర్ధం గుర్తించండి.
ఎ) మనసు
బి) నాలుక
సి) శరీరం
డి) తనువు
జవాబు:
ఎ) మనసు

AP Board 8th Class Telugu Important Questions Chapter 7 హరిశ్చంద్రుడు

15. ఎల్లప్పుడు బొంకు పలుకరాదు – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) వాస్తవికం
బి) అబద్ధం
సి) నృతం
డి) నుతం
జవాబు:
బి) అబద్ధం

16. పయోనిధిలో రత్నాలు ఉంటాయి – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) ఉదకం
బి) క్షీరం
సి) సముద్రం
డి) వారి
జవాబు:
సి) సముద్రం

17. ఆయన విజ్ఞానానికి నిధి – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) నిలయం
బి) కొలను
సి) కోవెల
డి) మందారం
జవాబు:
ఎ) నిలయం

పర్యాయపదాలు :

18. రాజు పరిపాలించాడు – గీత గీసిన పదానికి పర్యాయ పదాలు గుర్తించండి.
ఎ) ఉమాపతి, గురుపతి
బి) నృపతి, పృథ్వీపతి
సి) నరపతి, అసురపతి
డి) వంద్యుడు, పశుపతి
జవాబు:
బి) నృపతి, పృథ్వీపతి

AP Board 8th Class Telugu Important Questions Chapter 7 హరిశ్చంద్రుడు

19. నందనుడు కార్యసమరుడు – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
ఎ) కుమారుడు, సుతుడు
బి) విశ్వము, జగము
సి) జలము, పుత్రిక
డి) చామంత, చాగరిత
జవాబు:
ఎ) కుమారుడు, సుతుడు

20. వారిధిలో రత్నములు ఉండును – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
ఎ) సముద్రం, జలధి
బి) వారి, మధుజ
సి) వారిజం, వారుణి
డి) పయోధరం, అవనిధి
జవాబు:
ఎ) సముద్రం, జలధి

21. కంఠీరవం గుహలో ఉంది – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
ఎ) కుక్కురం, పంచాస్యం
బి) సింహం, కేసరి
సి) పుండరీకం, శృగాలం
డి) ఖరం, శునకం
జవాబు:
బి) సింహం, కేసరి

22. బొంకు పలుకరాదు – గీత గీసిన పదానికి పర్యాయ పదాలు గుర్తించండి.
ఎ) బాష్పం, అనృతం
బి) శ్రుతం, వాచం
సి) అబద్ధం, అసత్యం
డి) నృతం, వాగ్మి
జవాబు:
సి) అబద్ధం, అసత్యం

23. మిన్ను విరిగి పడింది – గీత గీసిన పదానికి పర్యాయ పదాలు గుర్తించండి.
ఎ) ఆకాశం, నింగి
బి) నభం, నాకం
సి) గగనం, నగం
డి) నగరం, ప్రాంతం
జవాబు:
ఎ) ఆకాశం, నింగి

24. ఘనము వర్షించు – గీత గీసిన పదానికి పర్యాయ పదాలు గుర్తించండి.
ఎ) రవం, ధరణి
బి) మేఘము, పయోధరం
సి) గిరి, నఖము
డి) నభం, ధర
జవాబు:
బి) మేఘము, పయోధరం

25. గిరి పై నదులు ఉన్నాయి – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
ఎ) గిరిజ, గిరిక
బి) కొండ, అది
సి) అచలం, ఆధారం
డి) అధరం, జలధరం
జవాబు:
బి) కొండ, అది

ప్రకృతి – వికృతులు

26. విద్య నేర్పాలి – గీత గీసిన పదానికి వికృతి పదం ఏది?
ఎ) విద్దె
బి) విద్యా
సి) వేద్య
డి) విత్తు
జవాబు:
ఎ) విద్దె

27. మానవులకు గరువము పనికిరాదు – గీత గీసిన పదానికి ప్రకృతి పదం గుర్తించండి.
ఎ) అహంకారం
బి) దుర్మతి
సి) గర్వము
డి) గెర్వము
జవాబు:
సి) గర్వము

28. అబ్బురం చూపాలి – గీత గీసిన పదానికి ప్రకృతి పదం గుర్తించండి.
ఎ) అంతరంగం
బి) అద్భుతం
సి) ఆశ్చర్యం
డి) ఆహార్యం
జవాబు:
బి) అద్భుతం

29. విజ్ఞానం అర్పించాలి – గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.
ఎ) విరుదం
బి) విజానం
సి) విజ్ఞానం
డి) విన్నానం
జవాబు:
డి) విన్నానం

30. సత్యం పలకాలి – గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.
ఎ) శిత్తు
బి) సత్తు
సి) సత్తె
డి) సిత్త
జవాబు:
బి) సత్తు

AP Board 8th Class Telugu Important Questions Chapter 7 హరిశ్చంద్రుడు

31. గుణము పొందాలి – గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.
ఎ) గోరము
బి) గొనము
సి) గునము
డి) గొరము
జవాబు:
బి) గొనము

32. చట్టం తెలియాలి – గీత గీసిన పదానికి ప్రకృతి పదం గుర్తించండి.
ఎ) సస్త్రం
బి) శాస్త్రం
సి) శేస్త్రం
డి) శస్త్రం
జవాబు:
బి) శాస్త్రం

నానార్థాలు :

33. రాజు కువలయానందకరుడు – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
ఎ) చంద్రుడు, ప్రభువు
బి) సింహం, కేసరి
సి) కెరటం, వీచిక
డి) చంద్రుడు, బుధుడు
జవాబు:
ఎ) చంద్రుడు, ప్రభువు

34. అందరు ధర్మం ఆచరించాలి – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
ఎ) పుణ్యం, న్యాయం
బి) తనువు, తరుణి
సి) తాపసి, ధరణి
డి) వసుధ, పుణ్యం
జవాబు:
ఎ) పుణ్యం, న్యాయం

AP Board 8th Class Telugu Important Questions Chapter 7 హరిశ్చంద్రుడు

35. గుణం పొందాలి – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
ఎ) రోదరం, గుణము
బి) గురువు, గోపురం
సి) స్వభావం, వింటినారి
డి) జలజం, జలధరం
జవాబు:
సి) స్వభావం, వింటినారి

36. బుధుడు వంద్యుడు – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
ఎ) పండితుడు, బుధగ్రహం
బి) ఒకయతి, మూర్యుడు
సి) పండితుడు, పచనుడు
డి) పరవశుడు, పండితుడు
జవాబు:
ఎ) పండితుడు, బుధగ్రహం

37. పాకం రుచిగా ఉండాలి – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
ఎ) జలధి, గారె
బి) వంట, కావ్యపాకం
సి) తంట, తరుణి
డి) తాపసం, పార్థుడు
జవాబు:
ఎ) జలధి, గారె

వ్యుత్పత్తర్థాలు :

38. వారిజం సుమనోహరం – గీత గీసిన పదానికి వుత్పత్తి ఏది?
ఎ) నీటి నుండి పుట్టినది
బి) క్షీరము నండి పుట్టినది
సి) పయోధరం నుండి పుట్టినది
డి) వాసన నుంచి పుట్టినది
జవాబు:
ఎ) నీటి నుండి పుట్టినది

39. శరములకు నిలయమైనది – అనే వ్యుత్పత్యర్థం గల పదం ఏది?
ఎ) ధరణి
బి) శరధి
సి) క్షీరధి
డి) అవని
జవాబు:
బి) శరధి

40. రంజింపచేయువాడు అనే వ్యుత్పత్యర్థం గల పదం ఏది?
ఎ) నాకము
బి) సూత్రధారుడు
సి) రాజు
డి) నారదుడు
జవాబు:
సి) రాజు

41. పద్మము నుండి పుట్టినవాడు – ఈ వ్యుత్పత్తికి తగిన పదం ఏది?
ఎ) వారిధం
బి) పయోధరం
సి) క్షీరోనిది
డి) వారిజగర్భుడు
జవాబు:
డి) వారిజగర్భుడు

42. భాస్కరుడు – ఈ పదానికి వ్యుత్పత్తిని గుర్తించండి.
ఎ) కాంతిని కలుగజేయువాడు
బి) చీకటిని కలుగజేయువాడు
సి) అంతరంగం చూచువాడు
డి) అవనిని దర్శించువాడు
జవాబు:
ఎ) కాంతిని కలుగజేయువాడు

వ్యాకరణాంశాలు

సంధులు :

43. తలపెల్ల – ఈ పదాన్ని విడదీసి గుర్తించండి.
ఎ) తలపో + ఎల్ల
బి) తలపె + ఎల్ల
సి) తలప + యెల్ల
డి) తలపు + ఎల్ల
జవాబు:
బి) తలపె + ఎల్ల

44. గుణసంధిలో ఏకాదేశంగా వచ్చేవి
ఎ) గ, జ, డ, ద, లు
బి) ఏ, ఓ, అర్
సి) ఐ, ఔ
డి) య, వ, ర, ల
జవాబు:
బి) ఏ, ఓ, అర్

45. గసడదవాదేశ సంధికి ఉదాహరణను గుర్తించండి.
ఎ) తల్లిదండ్రులు
బి) శీతోష్ణములు
సి) ఎత్తుపల్లాలు
డి) మృదుమధురములు
జవాబు:
ఎ) తల్లిదండ్రులు

46. విద్యాధికుడు వర్ధిల్లాలి – గీత గీసిన పదాన్ని విడదీసి గుర్తించండి.
ఎ) విద్ది + ధికుడు
బి) విద్యా + అధికుడు
సి) విద్యే + అధికుడు
డి) విద్య + ఆధికుడు
జవాబు:
బి) విద్యా + అధికుడు

AP Board 8th Class Telugu Important Questions Chapter 7 హరిశ్చంద్రుడు

47. క్రింది వానిలో సరళములు గుర్తించండి.
ఎ) గ, జ, డ, ద, బ
బి) పర్గ, స, ల
సి) క, చ, ట, త, ప
డి) జ్ఞ, ఇ, న, ణ, మ
జవాబు:
ఎ) గ, జ, డ, ద, బ

48. క్రింది వానిలో వికల్ప సంధిని గుర్తించండి.
ఎ) వృద్ధి సంధి
బి) గుణసంధి
సి) ఉత్వసంధి
డి) ఇత్వతసంధి
జవాబు:
డి) ఇత్వతసంధి

49. క్రింది వానిలో ఇత్వసంధికి ఉదాహరణను గుర్తించండి.
ఎ) వానికైన
బి) ముందడుగు
సి) అత్తమ్మ
డి) అమ్మహిమ
జవాబు:
ఎ) వానికైన

50. తనువెల్ల రక్షించి – గీత గీసిన పదం ఏ సంధి?
ఎ) పడ్వాది సంధి
బి) ఉత్వ సంధి
సి) అత్వ సంధి
డి) రుగాగమ సంధి
జవాబు:
బి) ఉత్వ సంధి

51. కింది వానిలో గుణసంధికి ఉదాహరణను గుర్తించండి.
ఎ) వంటాముదం
బి) దేవేంద్ర
సి) దివిజాగ్రజుడు
డి) ముందడుగు
జవాబు:
సి) దివిజాగ్రజుడు

52. శాస్త్రార్థం – ఇది ఏ సంధి?
ఎ) గుణసంధి
బి) విసర్గ సంధి
సి) సవర్ణదీర్ఘ సంధి
డి) అత్వసంధి
జవాబు:
సి) సవర్ణదీర్ఘ సంధి

సమాసాలు :

53. మహాభాగ్యం – ఈ పదానికి విగ్రహవాక్యాన్ని గుర్తించండి.
ఎ) గొప్ప యొక్క భాగ్యం
బి) గొప్పదైన భాగ్యం
సి) భాగ్యము యొక్క గొప్ప
డి) భాగ్యము నందలి గొప్పదనం
జవాబు:
బి) గొప్పదైన భాగ్యం

AP Board 8th Class Telugu Important Questions Chapter 7 హరిశ్చంద్రుడు

54. సప్తమీ తత్పురుషకు ఉదాహరణను గుర్తించండి.
ఎ) విచార కోవిదుడు
బి) సత్మీర్తి
సి) వారిజగర్భుడు
డి) శాస్త్రార్ధము
జవాబు:
ఎ) విచార కోవిదుడు

55. వినయభూషితుడు – ఈ పదానికి విగ్రహవాక్యం గుర్తించండి.
ఎ) వినయమునందు భూషితుడు
బి) వినయము కొరకు భూషితుడు
సి) వినయము చేత భూషితుడు
డి) వినయము వలన భూషితుడు
జవాబు:
సి) వినయము చేత భూషితుడు

56. విద్యాసంపన్నుడు – ఇది ఏ సమాసము?
ఎ) కర్మధారయం
బి) ద్వంద్వ
సి) తృతీయా తత్పురుషం
డి) బహువ్రీహి
జవాబు:
సి) తృతీయా తత్పురుషం

57. వారిజగర్భుడు – ఇది ఏ సమాసమో గుర్తించండి.
ఎ) ద్విగువు
బి) బహువ్రీహి
సి) కర్మధారయం
డి) ద్వంద్వ
జవాబు:
బి) బహువ్రీహి

58. ఉత్తర పదార్థ ప్రాధాన్యం గల సమాసం ఏది?
ఎ) తత్పురుష
బి) ద్వంద్వ
సి) బహుబ్లిహి
డి) ద్విగువు
జవాబు:
ఎ) తత్పురుష

59. విజ్ఞానమునకు నిధి – ఈ పదానికి సమాసపదం గుర్తించండి.
ఎ) ప్రతి విజ్ఞానం
బి) విజ్ఞాన నిధి
సి) నిధి విజ్ఞానం
డి) అవిజ్ఞాన నిధి
జవాబు:
బి) విజ్ఞాన నిధి

60. రిపుగణము- ఈ పదానికి విగ్రహవాక్యం గుర్తించండి.
ఎ) రిపువు అనెడి గణము
బి) రిపువు చేత గణము
సి) రిపువు నందలి గణము
డి) రిపువు వలన గణము
జవాబు:
ఎ) రిపువు అనెడి గణము

61. సంఖ్యా శబ్దం పూర్వంగా కలిగిన సమాసం గుర్తించండి.
ఎ) ద్విగువు
బి) రూపకం
సి) అవ్యయీభావం
డి) తత్పురుష
జవాబు:
ఎ) ద్విగువు

62. సత్కీర్తి – ఇది ఏ సమాసం?
ఎ) అవ్యయీభావ సమాసం
బి) విశేషణ పూర్వపద కర్మధారయం
సి) బహున్రీహి సమాసం
డి) ద్వంద్వ సమాసం
జవాబు:
బి) విశేషణ పూర్వపద కర్మధారయం

గణవిభజన:

63. ద్విపదలో ఎన్ని పాదాలు ఉంటాయి?
ఎ) రెండు
బి) మూడు
సి) నాలుగు
డి) ఆరు
జవాబు:
డి) ఆరు

64. ద్విపదలో పాదానికి గల గణాలు ఎన్ని?
ఎ) 3
బి) 4
సి) 8
డి) 6
జవాబు:
బి) 4

65. ద్విపదలో పాదానికి గణాలు ఏవి?
ఎ) మూడు సూర్య గణాలు, రెండు ఇంద్ర గణాలు
బి) నాలుగు ఇంద్ర గణాలు
సి) మూడు ఇంద్ర గణాలు, ఒక సూర్య గణం
డి) నాలుగు సూర్య గణాలు
జవాబు:
సి) మూడు ఇంద్ర గణాలు, ఒక సూర్య గణం

66. గర్విత – ఈ పదానికి గణాలు గుర్తించండి.
ఎ) UII
బి) IUU
సి) UIU
డి) III
జవాబు:
బి) IUU

AP Board 8th Class Telugu Important Questions Chapter 7 హరిశ్చంద్రుడు

67. IIIU – ఇది ఏ గణం?
ఎ) జ గణం
బి) ఇంద్ర గణం
సి) సూర్య గణం
డి) భ గణం
జవాబు:
సి) సూర్య గణం

వాక్యాలు :

68. రామలక్ష్మణులు అన్నదమ్ములు – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) కర్మణి వాక్యం
బి) కర్తరి వాక్యం
సి) సంయుక్త వాక్యం
డి) సంక్లిష్ట వాక్యం
జవాబు:
సి) సంయుక్త వాక్యం

69. చదివితే ర్యాంకు వస్తుంది – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) అవర్ధక వాక్యం
బి) తద్ధర్మార్థక వాక్యం
సి) చేదర్థక వాక్యం
డి) శత్రర్థక వాక్యం
జవాబు:
సి) చేదర్థక వాక్యం

70. భూతకాల అసమాపక క్రియను ఏమంటారు?
ఎ) అప్యర్థకం
బి) తద్ధర్మార్థకం
సి) శత్రర్థకం
డి) క్వార్థం
జవాబు:
డి) క్వార్థం

71. హరిశ్చంద్రునిచేత సత్యం పలుకబడింది – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) ధాత్వర్థక వాక్యం
బి) కర్మణి వాక్యం
సి) కర్తరి వాక్యం
డి) హేత్వర్థక వాక్యం
జవాబు:
బి) కర్మణి వాక్యం

72. ఊరికి వెళ్ళవద్దు – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) అనుమత్యర్థక వాక్యం
బి) ఆశీర్వార్ధకం
సి) విధ్యర్థక వాక్యం
డి) నిషేధార్థక వాక్యం
జవాబు:
డి) నిషేధార్థక వాక్యం

AP Board 8th Class Telugu Important Questions Chapter 7 హరిశ్చంద్రుడు

73. నీరు పల్లంగా ప్రవహించును – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) హేత్వర్థక వాక్యం
బి) కర్మణి వాక్యం
సి) నిశ్చయాత్మక వాక్యం
డి) తద్ధర్మార్థక వాక్యం
జవాబు:
డి) తద్ధర్మార్థక వాక్యం

అలంకారాలు :

74. చిటపట చినుకులు టపటప పడెను – ఇందులోని అలంకారం ఏది?
ఎ) వృత్త్యనుప్రాస
బి) లాటానుప్రాస
సి) యమకం
డి) ముక్తపదగ్రస్తం
జవాబు:
బి) లాటానుప్రాస

75. నీకు వంద వందనాలు – ఇది ఏ అలంకారం?
ఎ) వృత్త్యనుప్రాస
బి) ఛేకానుప్రాస
సి) లాటానుప్రాస
డి) యమకం
జవాబు:
బి) ఛేకానుప్రాస

76. అర్థ భేదంతో కూడిన హల్లుల జంట వెంటవెంటనే ప్రయోగింపబడితే – అది ఏ అలంకారం?
ఎ) ఛేకానుప్రాస
బి) యమకం
సి) ముక్తపదగ్రస్తం
డి) అంత్యానుప్రాస
జవాబు:
ఎ) ఛేకానుప్రాస

AP Board 8th Class Telugu Important Questions Chapter 7 హరిశ్చంద్రుడు

77. నగజ గజముపై వెళ్ళింది – ఇందులోని అలంకారం ఏది?
ఎ) ముక్తపదగ్రస్తం
బి) ఛేకానుప్రాస
సి) యమకం
డి) అంత్యానుప్రాస
జవాబు:
బి) ఛేకానుప్రాస

సొంతవాక్యాలు :

78. మిన్నంటు : నిత్యావసర వస్తువుల ధరలు మిన్నంటాయి.

79. ఉన్నతుడు : మహానీయుడు ఉన్నతుడిగా జీవిస్తాడు.

80. దురితం : పుణ్యకార్యాలతో దురితం దూరం అవుతుంది.

81. గుణములు : మానవులు మంచి గుణములను అలవరచుకోవాలి.

82. పరాక్రమం : యుద్ధంలో పరాక్రమం చూపాలి.

విశేషాంశాలు

1. వజ్రాయుధము : ఇది ఇంద్రుని ఆయుధం. మిక్కిలి శక్తివంతమైంది.

2. వారిజగర్భుడు : 1. తామరపూవు జన్మస్థానము (పుట్టు నెలవు) గా కలవాడు – బ్రహ్మ
2. తామరపూవు గర్భము నందు కలవాడు – విష్ణువు వారిజగర్భుడు – కమలగర్భుడు – వనజగర్భుడు – పద్మగర్భుడు – తమ్మిచూలి – పర్యాయపదములు.

3. వారిజాప్తుడు : తామర పూలకు చుట్టము – సూర్యుడు
వారిజాప్తుడు – కమలాప్తుడు – తామరసాప్తుడు – పద్మ బాంధవుడు – తమ్మి చుట్టము – పర్యాయపదములు.

4. షట్చక్రవర్తులు : ఆరుగురు చక్రవర్తులు.
1. హరిశ్చంద్రుడు 2. నలుడు 3. పురుకుత్సుడు 4. పురూరవుడు, 5. సగరుడు, 6. కార్తవీర్యార్జునుడు.

5. సప్తమహర్షులు : ఏడుగురు మహర్షులు.
1. వశిష్ఠుడు 2. అత్రి 3. గౌతముడు 4. కశ్యపుడు 5. భరద్వాజుడు 6. జమదగ్ని 7. విశ్వామిత్రుడు.

6. సప్తసముద్రములు : ఏడు సముద్రాలు
1. లవణ, 2. ఇక్షు, 3. సురా, 4. సద్వి, 5. దధి, 6. క్షీర, 7. జల.

7. షోడశ మహాదానములు : (పదహారు గొప్పదానములు)
1. గోదానము 2. భూదానము 3. తిలదానము 4. హిరణ్యదానము 5. రత్నదానము 6. విద్యాదానము 7. కన్యాదానము 8. దాసీదానము 9. శయ్యాదానము 10. గృహదానము 11. అగ్రహారదానము 12. రథదానము 13. గజదానము 14. అశ్వదానము 15. ఛాగ (మేక) దానము 16. మహిష (దున్నపోతు) దానము

AP Board 8th Class Telugu Solutions ఉపవాచకం Chapter 4 మధుపర్కాలు

AP State Syllabus AP Board 8th Class Telugu Textbook Solutions ఉపవాచకం Chapter 4 మధుపర్కాలు Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Telugu Solutions ఉపవాచకం 4th Lesson మధుపర్కాలు

8th Class Telugu ఉపవాచకం 4th Lesson మధుపర్కాలు Textbook Questions and Answers

I. అవగాహన-ప్రతిస్పందన

కింది పరిచిత గద్యాలను చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

1. పుట్టన్నది రెండు నిట్టాళ్ళపాక. అవి నెత్తిమీద నీడకోసం వేసుకున్న నిట్టాళ్ళు, అసలా ఇంటికి నిట్టాళ్ళు ఆ దంపతులే. పుట్టన్నా, సీతమ్మా ఒక్కటే ఎత్తు. భౌతికంగానే కాదు… ఆత్మలో కూడా సమానమైన ఎత్తులోనే ఉంటారు. ఒకటిగా ఉన్న ఆత్మను రెండుచేసి, రెండింటికి రెండు శరీరాలు కల్పించి, భూలోకంలో కొన్నాళ్ళు ఆడుకురండని ఆ విధాత పంపాడా, అనిపిస్తుంది వారిని చూస్తే.

పుట్టన్న వృత్తి బట్టలనేత. రోజుకు ఏ నాలుగుగంటలో తప్ప, చేతిలో కండెను పడుగులో నుంచి అటూ యిటూ గిరాటువేస్తూ, వస్త్రం నేస్తూనే ఉంటాడు. సీతమ్మ రాట్నం దగ్గర నుంచి లేవదు. వడివడిగా చిలపలు తోడటం, కండెలు చుట్టడం, పడుగు వేసినప్పుడు భర్తతోపాటు గంజిపెట్టడం, కుంచె తీయడం ఆమె విధులు. ఏ సమయంలో కూడా | వారు ‘కాయకష్టం చేస్తున్నాం’ అనే భావాన్ని బయట పెట్టేవారు కాదు. అదో యజ్ఞంగానే చూసుకునేవారు. ఒక్క కండె చుడితే సీతమ్మ కళ్ళు పువ్వులయ్యేవి. ఒక జానెడునేస్తే పుట్టన్న పెదవుల మీద పొట్లపువ్వులు పూచేవి.
ప్రశ్నలు :
1. పుట్టన్న వృత్తి ఏది?
జవాబు:
పుట్టన్న వృత్తి బట్టలనేత వృత్తి.

2. సీతమ్మ ఎక్కడి నుండి లేవదు?
జవాబు:
సీతమ్మ రాట్నం దగ్గర నుండి లేవదు.

3. పుట్టన్న దంపతులు దేనిని యజ్ఞంగా భావించేవాళ్ళు?
జవాబు:
పుట్టన్న దంపతులు వృత్తిని యజ్ఞంగా భావించేవాళ్ళు.

4. ఎప్పుడు సీతమ్మ కళ్ళు పువ్వులయ్యేవి?
జవాబు:
ఒక్క కండె చుడితే సీతమ్మ కళ్ళు పువ్వులయ్యేవి.

AP Board 8th Class Telugu Solutions ఉపవాచకం Chapter 4 మధుపర్కాలు

2. పుణ్యం, ధర్మం జీవితానికి పెట్టని కోటలుగా భావిస్తూ జీవిస్తున్న పుట్టన్నకు, ధనం మీద ఆశలేదు. మూడు పూటలా కడుపును గంజితో నింపడం ఒక్కటే అతని ఆశయం. సీతమ్మ కూడా అంతకుమించి ఏమీ కోరదు. కాకపోతే గోవుకు మేత ఒకటి కావాలి. కాని, కొమ్ము చెంబులతో పాలకు వచ్చేవారంతా, చిట్టూ, తవుడూ, తెలకపిండి చెక్కలు, కానుకలుగా తెస్తూనే ఉంటారు. ఊరి ఆసామి …… కుప్ప నూర్పిళ్ళ కాలంలో అడక్కుండానే వరిగడ్డి తెచ్చి అతని దొడ్లో వామి పెట్టి పోతారు. జనపకట్టలు తెచ్చి ఇంటిమీద ఎండేసి పోతారు. పుట్టన్న వద్దని బ్రతిమాలినా వినరు. “నీ గోవు కామధేనువు పుట్టన్నా” అని వారు నవ్వుకొని వెళ్ళి పోతారు.
ప్రశ్నలు :
1. జీవితానికి పెట్టని కోటలు ఏవి?
జవాబు:
పుణ్యం ధర్మం అనేవి జీవితానికి పెట్టని కోటలు.

2. పుట్టన్నకు దేని మీద ఆశ లేదు?
జవాబు:
పుట్టన్నకు ధనం మీద ఆశ లేదు.

3. ఊరి ప్రజలు పుట్టన్నను ఏమని ప్రశంసించేవారు?
జవాబు:
ఊరి ప్రజలు పుట్టన్నను ‘నీ గోవు కామధేనువు పుట్టన్నా” అని ప్రజలు ప్రశంసించేవారు.

4. పుట్టన్న ఆశయం ఏమిటి
జవాబు:
మూడు పూటలా కడుపును గంజితో నింపడం ఒక్కటే పుట్టన్న ఆశయం.

3. అప్పుడే సందెవెలుగులు దూసుకువస్తున్నాయి. గానుగచెట్టు చిటారు కొమ్మకు అతికించినట్లుగా నెలవంక కనిపిస్తున్నాడు. పుట్టన్న వాకిట్లోకి రాగానే ఆవు “అంబా” అని అరిచింది. పుట్టన్నకు పట్టరాని దుఃఖం వచ్చింది. వెళ్ళి దాని మెడ కౌగలించుకొన్నాడు. “నా మీద కోపం వచ్చిందా ? అమ్ముతున్నానని బాధపడుతున్నావా ? ఏం చెయ్యను, ఆచారం కోసం అమ్ముకోవలసి వచ్చింది. నువ్వెక్కడున్నా ప్రతిరోజూ వచ్చి చూస్తా……. నిన్ను దైవం లాగా కొలుస్తున్నా. నువ్వు కాపాడకపోతే ఎవరు కాపాడుతారు నన్ను?” అని మెడ వదలి ఉత్తరీయంతో దాని ఒళ్ళంతా తుడిచాడు. దానిని
విడవలేక విడవలేక ఊళ్లోకి వెళ్ళాడు.
ప్రశ్నలు :
1. నెలవంక ఎలా కనిపిస్తున్నాడు?
జవాబు:
నెలవంక గానుగచెట్టు చిటారుకొమ్మకు అతికించి నట్లుగా కనిపిస్తున్నాడు.

2. పట్టరాని దుఃఖం ఎవరికి వచ్చింది?
జవాబు:
పట్టరాని దుఃఖం పుట్టన్నకు వచ్చింది.

3. పుట్టన్న వాకిట్లోకి రాగానే అరిచింది ఏది?
జవాబు:
పుట్టన్న వాకిట్లోకి రాగానే గోవు “అంబా” అని ముద్ర వేసింది.

4. పుట్టన్న దేనిని అమ్ముకోవలసి వచ్చింది?
జవాబు:
పుట్టన్న గోవును అమ్ముకోవలసి వచ్చింది.

4. ఆ రోజే బయలుదేరి బస్తీకి వెళ్ళాడు. నూలు తెచ్చాడు. ఆ నాలుగు రోజులు అతడు మగ్గం గోతిలో నుంచి లేవలేదు. సీతమ్మ రాట్నం వదలలేదు. నాలుగురోజులు గడిచాయి. తెల్లారే లగ్నం ….. ఆ సందెవేళ ఆముదం దీపాలు – అటూఇటూ పెట్టి నేత నేస్తున్నాడు పుట్టన్న. ఇంతట్లోనే చెరువుగట్టున మేళాలు మ్రోగినాయి. “పెళ్ళివారు దిగారు” అంది సీతమ్మ. “ఇంకొక్క ఘడియలో నేత పూర్తి అవుతుంది” అన్నాడు పున్న. మరి కాసేపటికి పల్లకి, దాని వెంట బళ్ళూ ఆ వీధినే వచ్చాయి. సీతమ్మ చూడటానికి బైటికి వెళ్ళింది. ఇలాయి బుడ్ల వెలుతుర్లో పెళ్ళికొడుకును చూచింది. వెంట ఇరవై బళ్లున్నాయి. అన్నీ వాళ్ళ ఇల్లు దాటిపోయేదాకా నిలబడి చూచి ఇంట్లోకి వచ్చింది సీతమ్మ “పెళ్ళికొడుకు కళ్ళూ, ముఖం బాగానే ఉన్నాయి. పాతికేళ్ళుంటాయి. అయినా ఫరవాలా! ఈడుగానే ఉంటాడు. పార్వతి మాత్రం ఒడ్డూ పొడుగూ లేదూ” అంది.
ప్రశ్నలు :
1. ఇలాయి బుడ్ల వెలుతురులో ఎవరిని చూసింది?
జవాబు:
ఇలాయి బుడ్ల వెలుతురులో పెండ్లి కొడుకును చూసింది

2. పుట్టన్న బస్తీకి వెళ్ళి ఏమి తెచ్చాడు?
జవాబు:
పుట్టన్న బస్తీ నుండి నూలు తెచ్చాడు.

3. చెరువు గట్టున ఏవి మ్రోగాయి?
జవాబు:
చెరువు గట్టున మేళాలు మ్రోగాయి.

4. సీతమ్మ దేనిని వదలలేదు?
జవాబు:
సీతమ్మ రాట్నం వదలలేదు.

AP Board 8th Class Telugu Solutions ఉపవాచకం Chapter 4 మధుపర్కాలు

5. తెల్లవారింది. పాపయ్యగారింట్లో పెళ్ళి వైభవంగా జరుగుతోంది. అర ఎకరం పందిరి వేసినా జనం పట్టక కిటకిటలాడిపోతున్నారు. ఒక పందిరి గుంజనానుకొని సీతమ్మ నిలబడింది, ఆవిడకు కొంచెం పక్కగా పుట్టన్న ఉన్నాడు. నూతన దంపతులు తలంబ్రాలు పోసుకుంటున్నారు. సన్నాయిపాట సాగిపోతోంది, సంతోష తరంగాలుగా. పిల్ల తల్లితండ్రులు ఒకరినొకరు ఎరగనంత క్రొత్తగా చూచుకుంటున్నారెందుకో. పుట్టన్న తన ధర్మం నెరవేర్చుకొన్నానన్న ఆనందంలో మునిగిపోయాడు. లగ్నం అయింది. ‘అందరు భోజనాలకు పదండి’ అన్న కేకలు నాలుగువైపుల నుంచి వినిపించాయి. అంతా వెళ్ళినా పుట్టన్న, సీతమ్మ గోడ ప్రక్కగా నిలబడి – ఏదో చెప్పుకొని నవ్వుతున్నారు. పాపయ్య చూశాడు వారిని. “ఏం అక్కా నువ్విక్కడే ఉన్నావు – బావయ్య అలిగాడా? కలిగిందేదో పెడతాం. అంత అలిగితే ఎలా బావా” అన్నాడు.
ప్రశ్నలు :
1. ఎవరి ఇంట్లో పెండ్లి వైభవంగా జరిగింది?
జవాబు:
పాపయ్య గారి ఇంట్లో పెండ్లి వైభవంగా జరిగింది.

2. సీతమ్మ ఎలా నిలబడింది?
జవాబు:
సీతమ్మ పందిరి గుంజకు ఆనుకొని నిలబడింది.

3. నూతన దంపతులు వేటిని పోసుకున్నారు?
జవాబు:
నూతన దంపతులు తలంబ్రాలు పోసుకున్నారు.

4. నలువైపులా ఏ కేకలు వినిపించాయి?
జవాబు:
నలువైపులా “భోజనానికి పదండి” అనే కేకలు వినిపించాయి.

6. మధుపర్కాలు తీసుకొని వెళ్ళి ఇచ్చిందాక ఒక దీక్షతో ఉన్నారు పుట్టన్న దంపతులు. ఆ కార్యం నెరవేరింది. వారి మనసులో బరువు తగ్గింది. తగ్గిన తర్వాత ఆవు మీద బెంగ అధికమైంది. ఎలాగో మనస్సుకు సంతృప్తి తెచ్చుకొని నిద్రపోయారు. కాని నిద్రలో వారికాగోమాత ప్రత్యక్షమైంది. పుట్టన్నకు ఆవు ‘అంబా’ అని అరుస్తూన్నట్లు వినిపించింది. దిగ్గునలేచి వెళ్ళి ఇంటి మీద ఉన్న జనప కట్ట తీసుకుని గానుగచెట్టు దగ్గరికి వెళ్ళాడు. బిక్కు బిక్కు మంటూ కట్టుకొయ్య కనిపించింది. అతడి మనస్సు చిట్లి, కొన్ని బెల్లులూడిపోయినట్లయింది. తిరిగివచ్చి ఇంట్లో పడుకొన్నాడు. నిద్ర రావడం లేదు. ఆవు ముట్టెతెచ్చి అతని పొట్టమీద నెట్టి గోకమన్నట్లుగా తోచింది. గభాలున లేచి కూర్చున్నాడు. చూపు చూరులోకీ, మనస్సు శూన్యంలోకి చొచ్చుకుపోతోంది. “నువ్వు పోసిన పాలు త్రాగి పసి పిల్లలు గుక్కలు మాని నిద్రపోతున్నారు.” అని పూజారి అన్నమాటలు వినిపించినాయి. ఆ భావాన్ని తరుముకొంటూ వెనకనుంచి పసిపిల్లల ఏడ్పులు వినిపించినాయి. చెవులు గట్టిగా మూసుకొని “సీతా” అని పిలిచాడు. ఆమె లేచింది. తన అనుభూతి అంతా చెప్పాడు.
ప్రశ్నలు :
1. పుట్టన్న దంపతులకు దేని మీద బెంగ పెరిగింది?
జవాబు:
పుట్టన్న దంపతులకు ఆవుమీద బెంగ పెరిగింది.

2. నిద్రలో ఏది ప్రత్యక్షమైంది?
జవాబు:
నిద్రలో గోమాత ప్రత్యక్షమయింది.

3. శూన్యంలోనికి ఏది చొచ్చుకొని పోయింది?
జవాబు:
శూన్యంలోనికి మనస్సు చొచ్చుకొని పోయింది.

4. ఎవరు గుక్కలు మాని నిద్రపోతున్నారు?
జవాబు:
పసిపిల్లలు గక్కలు మాని నిద్రపోతున్నారు.

AP Board 8th Class Telugu Solutions ఉపవాచకం Chapter 4 మధుపర్కాలు

7. ఈ కింది పరిచిత గద్యాన్ని చదివి, ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.

దీనితో ముడిపడిన సమస్య అసలు వివాహాలను జరిపే తీరు ఎంతవైభవంగా, ఎంత ధనవ్యయం చేసి జరిపిస్తే అంత ఘనతగా పరిగణించడం మన సమాజంలో పరిపాటి. నిరాడంబరంగా వివాహం జరపడానికి సంఘం హర్షించదు. ఇందువల్ల ఎంత శక్తిహీనుడైనా అప్పో సప్పో చేసి ఘనంగా వివాహం జరిపినట్టు అనిపించుకోవలసి వస్తున్నది. అంతేకాదు, వివాహ సమయంలో బంధువులు, మిత్రులు, వధూవరులకు చదివించే కానుకల హెచ్చుతగ్గులు కూడా ప్రతిష్ఠకు సంబంధించిన విషయంగా పట్టించుకునే స్థితికి మన సంఘం దిగజారిపోయింది. ఈ దురాచారాల నిర్మూలనకు శాసనాలు అవసరమే కావచ్చు కానీ అంతకంటే ముఖ్యంగా వీటి పట్ల ఏహ్యభావాన్ని ప్రజలలో కలిగించడం ముఖ్యం.
ప్రశ్నలు :
1. వివాహం ఎలా జరగడాన్ని సంఘం హర్షించదు?
జవాబు:
వివాహం నిరాడంబరంగా జరగడాన్ని సంఘం హర్షించదు.

2. ‘వధూవరులు” అనేది జంట పదం. అలాంటి జంటపదం పై పేరాలో ఉంది గుర్తించి రాయండి.
జవాబు:
హెచ్చుతగ్గులు

3. శక్తికి మించి వివాహాలు ఘనంగా జరిపించడం, విలువైన బహుమతులివ్వడం వంటివి ఎటువంటివని రచయిత ఉద్దేశ్యం?
జవాబు:
దురాచారాలని రచయిత ఉద్దేశ్యం

4. పై పేరా ఆధారంగా ఒక ప్రశ్న తయారుచేయండి.
జవాబు:
ఈ పేరా దేని గురించి చెపుతుంది?

II వ్యక్తీకరణ – సృజనాత్మకత

కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
పుట్టన్న దంపతుల ఆచారమేమిటి ? దాన్ని కొనసాగించడానికి ఆయన చేసిన త్యాగమేమి?
జవాబు:
పుట్టన్న వృత్తి బట్టలు నేయటము. అతని భార్య సీతమ్మ రాట్నం వడికేటప్పుడు భర్తకు సహాయపడేది. తరతరాలుగా వచ్చే బాంధవ ముద్ర చెరిగిపోకుండా కాపాడుకోవడం అతని ముఖ్య ఆశయం.

ఆ గ్రామంలో ఏ ఇంట్లో పెళ్ళి జరిగినా పుట్టన్న స్వయంగా నేసి, మధుపర్కాలు పంపిస్తాడు. అది ఆ పుట్టన్న దంపతుల ఆచారం. మధుపర్కాలకు వారు పైకం ఏమీ తీసుకోరు. ఆ మధుపర్కాలు కట్టుకొని కొత్త దంపతులు పీటల మీద కూర్చుని, తలంబ్రాలు పోసుకోవడం – దానిని పుట్టన్న దంపతులు చూడడం మామూలు.

క్రమంగా పుట్టన్న దంపతులు అలా ఉచితంగా మధుపర్కాలు ఇవ్వడంతో బీదవారయ్యారు. ఆ గ్రామంలో పెద్దకాపు పాపయ్య గారింట్లో వారి అమ్మాయి పార్వతికి పెళ్ళి కుదిరింది. పాపయ్య ఆ విషయం సీతమ్మకు చెప్పి, పుట్టన్నకు చెప్పమన్నాడు. మధుపర్కాలు నేయడానికి పుట్టన్న వద్ద నూలు లేదు. పుట్టన్న దగ్గర ఒక ఆవు ఉంది. దాని పాలు పితికి రోజూ గ్రామంలో చంటి పిల్లలకు ఉచితంగా వారు పాలు పోసేవారు. నూలు కొనడం కోసం అప్పుచెయ్యడం పుట్టన్నకు ఇష్టం లేక, ఆ ఆవును అచ్చన్నగారికి అమ్మేశాడు. ఈ విధంగా తమ ఆచారం కొనసాగించడానికి పుట్టన్న ఆవును అమ్మి త్యాగం చేశాడు.

AP Board 8th Class Telugu Solutions ఉపవాచకం Chapter 4 మధుపర్కాలు

ప్రశ్న 2.
ఈ కథవల్ల పల్లెటూళ్ళలోని మనుషుల మధ్య ఆత్మీయతానుబంధాలు ఎలా ఉన్నాయని మీకనిపించింది?
జవాబు:
పల్లెటూళ్ళలోని వారు ఎప్పుడూ కలసిమెలసి జీవిస్తారు. ఒకరిపట్ల ఒకరు ఆత్మీయతానుబంధాలు కలిగి ఉంటారు. ఇతరులను మోసం చేయటం, వారిపట్ల ఈర్ష్యాద్వేషాలు కలిగి ఉండటం చేయరు. ఎదుటివారికి సంతోషం వచ్చినా, దుఃఖం కలిగినా అన్నిట్లో పాలుపంచుకుంటారని అనిపించింది.

పుట్టన్న దంపతులు తమ ఆవుపాలు పిల్లలకు పాలకోసం వచ్చే వారికి ఉచితంగా పోసేవారు. ఆ గ్రామంలో ఏ ఇంట్లో పెళ్ళి జరిగినా వారు ఆ నూతన దంపతులకు స్వయంగా నేసి మధుపర్కాలు ఇస్తారు. దాని కోసం పైకం ఏమీ తీసుకోరు. అలాగే వారింటికి పాలకోసం వచ్చేవారంతా చిట్టు, తవుడు, తెలగపిండి, చెక్కలు కానుకలుగా వీరికి ఇచ్చేవారు. కుప్పనూర్పిళ్ళ కాలంలో వరిగడ్డి తెచ్చి పుట్టన్న దొడ్డిలో మేత వేసేవారు.

గ్రామంలో పురుషులు ఆడవారిని అక్కలుగా, చెల్లెళ్ళుగా పిలిచేవారు. పురుషులు వరుసలు కలిపి ‘బావ’ అని పిలిచేవారు. పాపయ్య కాపు పుట్టన్నను “బావా” అని, సీతమ్మను “అప్పా” అని పిలుస్తాడు.

మధుపర్కాలు ఉచితంగా ఇచ్చే తన ఆచారం కోసం పుట్టన్న తనకు ఇష్టమైన ఆవును సైతం అమ్మివేశాడు. ఆవును అమ్మివేశాక పుట్టన్న ఇంటికి పాలకోసం వచ్చిన పూజారి, పుట్టన్నను “ఋషి” వంటివాడని మెచ్చుకున్నాడు.

మధుపర్కాలు పుట్టన్న ఇంటి నుండి పట్టుకు వెళ్ళడానికి మేళతాళాలతో రావడం, సీతమ్మకు కుంకం పెట్టి తాంబూలం ఇవ్వడం, పెళ్ళి భోజనాల దగ్గర పాపయ్య, పుట్టన్న దంపతుల పరిహాసం మాటలూ, ఆ గ్రామ ప్రజల మధ్యన ఉన్న అనుబంధాలకు నిదర్శనాలు. పాపయ్యగారి అల్లుడు తనకు మామగారిచ్చిన మాన్యాన్ని, పుట్టన్న దంపతులకు మధుపర్కాల మాన్యంగా ఇవ్వడం, అందుకు పాపయ్య అంగీకరించడం, ఆ గ్రామ ప్రజల మధ్యగల ఆత్మీయతానుబంధాలను గుర్తు చేస్తున్నాయి.

ప్రశ్న 3.
పుట్టన్న దంపతుల మంచితనాన్ని వర్ణిస్తూ పది వాక్యాలు రాయండి.
(లేదా)
మధుపర్కాలను ఉచితంగా పంపే ఆచారాన్ని కాపాడుకునేందుకు పుట్టన్న దంపతులు అష్టకష్టాలు పడ్డారు. వారి మంచితనాన్ని తెలిపేలా పది వాక్యాలు రాయండి.
జవాబు:
పుట్టన్న దంపతులు ఆదర్శదంపతులు. మంచితనం మూర్తీభవించిన వారు. పుట్టన్న చేసే ప్రతి మంచిపనికి సహకరిస్తూ, అతనికి చేదోడువాదోడుగా ఉండే ఉత్తమ ఇల్లాలు సీతమ్మ.

పుట్టన్న దంపతులు చేనేత వృత్తిగా జీవించేవారు. వారి గ్రామం పాలవెల్లి. అందులో వారు పువ్వుల వంటివారు. ఆ గ్రామంలో పెళ్ళిళ్ళు అయిన కొత్త దంపతులందరికీ ఉచితంగా ఆ దంపతులు మధుపర్కాలను వేసి ఇచ్చే మహాదాతలు. పుట్టన్న దంపతులు శారీరకంగానే కాక, మానసికంగా కూడా వారి మనస్సులు ఒకటే. వారికి ఒక ఆవు ఉండేది. దానిని మేపి, దాని పాలు చంటిపిల్లల కోసం కొమ్ముచెంబులతో వచ్చే ఊరి వారికి ఉచితంగా పోసేవారు. అందరికీ పాలు పోశాక అతనికి ఖాళీ చెంబు మిగిలేది.

ఆ గ్రామంలో ఏ పెళ్ళి జరిగినా ఆ దంపతులకు మధుపర్కాలు నేసి ఇవ్వడం ఆ దంపతులకు ఆచారం. క్రమంగా ఉచితంగా ఇచ్చే మధుపర్కాలతో వారి సంపాదన హరించింది. పాపయ్య కాపు గారి అమ్మాయి పెళ్ళికి మధుపర్కాలు నేసి ఇయ్యడానికి నూలు లేక తమకు ఎంతో ఇష్టమైన ఆవును సైతం ఆ దంపతులు అమ్ముకున్నారు. తరతరాలుగా వచ్చే ఆచారాన్ని పోగొట్టుకోవడం కన్నా, గోవును వదులుకోవడం మంచిదని వారు నిర్ణయించారు. అప్పుచేయడం పుట్టన్నకు అసలు ఇష్టం లేదు. ఇక ఉచితంగా మధుపర్కాలు అందించలేక గ్రామం నుండి వెళ్ళిపోడానికి కూడా వారు సిద్ధం అయ్యారు.

పాపయ్య గారి అల్లుడు పుట్టన్న మంచితనం గుర్తించి వారికి ఆవును తిరిగి ఇప్పించి, రెండెకరాల మధుపర్కాల మాన్యం ఇచ్చాడు. దీని ద్వారా మంచి చేసేవారికి ఎప్పుడూ మంచే జరుగుతుందని తెలుస్తోంది.. తాము మంచిగా ఉంటూ, ఎదుటివారు మంచిగా మెలిగేలా ఆదర్శప్రాయమైన జీవనం సాగించిన పుట్టన్న దంపతులు మంచిక మారురూపాలు.

ప్రశ్న 4.
ఈ పాఠంలోని అల్లుడు గారి పాత్ర ద్వారా ఎలాంటి ఆదర్శాన్ని గ్రహించారు?
జవాబు:
పాఠంలో పాసయ్య కాపు గారి అల్లుడు చాలా మంచివాడు. ధనవంతుడు, తన పెళ్ళికి మధుపర్కాలు ఉచితంగా నేసి ఇచ్చిన పుట్టన్న దంపతులు నూలు కోసం తమ ఆవును అమ్ముకున్నారని, వారు ఆ గ్రామంలోని పసిపాపకు ఆ ఆవుపాలను ఉచితంగా పోసేవారని తెలిసికొన్నాడు. పుట్టన్న ఆవును అచ్చన్నకు అమ్మేశాడని తెలుసుకొని, పుట్టన్నకు అచ్చన్న ఇచ్చిన డబ్బును, అచ్చన్నకు తిరిగి ఇచ్చివేశాడు. ఆవును పుట్టన్న ఇంటి దగ్గర తిరిగి కట్టివేయనునీ అచ్చన్నకు చెప్పాడు.

అంతేకాకుండా, తనకు మామగారు కానుకగా ఇచ్చిన రెండెకరాల మాన్యాన్ని పుట్టన్న దంపతుల పేర రాయించే ఏర్పాటు చేశాడు. ఆ డబ్బుతో వారు గ్రామస్థులకు ఉచితంగా మధుపర్కాలు శాశ్వతంగా ఇచ్చే ఏర్పాటును చేశాడు. ఆవునూ, మాన్యాన్ని తీసుకోడానికి, పుట్టన్నను ఒప్పించాడు.

ఈ పాత్ర ద్వారా మంచిపనులు చేసేవారికి మనం సాయంచేయాలని, మనకు దేవుడిచ్చిన సంపదను మంచికార్యాలు చేయడానికి, మంచికార్యాలు చేసేవారికి సాయం చేయడానికి వినియోగించాలని గ్రహించాము.

AP Board 8th Class Telugu Solutions ఉపవాచకం Chapter 4 మధుపర్కాలు

ప్రశ్న 5.
మధుపర్కాలు పాత్రలలో ఆచారాలు పాటించడంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న పుట్టన్న పొరుగూరికి వెళ్లిపోదాం అనుకున్నాడు కదా ! దీనిపై నీ అభిప్రాయం ఏమిటి?
జవాబు:
పుట్టన్న దంపతులు ఆదర్శ దంపతులు. మంచితనం మూర్తీభవించిన వారు. పుట్టన్న చేసే ప్రతి మంచి పనికి సహకరిస్తూ అతనికి చేదోడు వాదోడుగా ఉండే ఉత్తమ ఇల్లాలు సీతమ్మ. పున్న దంపతులు చేనేత వృత్తిగా జీవించేవారు. ఆ గ్రామంలో పెళ్ళిళ్ళు అయిన కొత్త దంపతులందరికీ ఉచితంగా పుట్టన్న దంపతులు మధుపర్కాలను వేసి ఇచ్చే మహాదాతలు. క్రమంగా ఉచితంగా ఇచ్చే మధుప్కూలతో వారి సంపాదన హరించింది. పాపయ్య కాపు కూతురి పెళ్ళి మధుపర్కాలు నేసి ఇవ్వడానికి నూలు లేక ఇంట్లో ఉన్న అవును అమ్ముకున్నారు పుట్టన్న దంపతులు. అప్పుచేయడం ఇష్టంలేని ఆ దంపతులు ఊరు విడిచి వెళ్ళిపోదామనుకున్నారు. ఆ సమయంలో ఎవరున్నా ఇలాగే ఆలోచించేవారు.

“తనకు మాలిన ధర్మం పనికిరాదన్నది” పెద్దల మాట. కానీ పుట్టన్న దంపతులు తాగడానికి గంజినీళ్ళే అయినా దానధర్మాలు విడువలేదు మాట తప్పి, పూర్వపు ఆచారాన్ని విడిచి ఆ వూరిలో బ్రతకలేమని భావించి, పొరుగూరు వెళదామన్నాడు. అలా అనడంలో కూడా అయిష్టమే ఉంది కాని సంతోషం లేదు. బాధలో అన్న మాటే గాని, నిజంగా వెళ్ళాలని కాదు అని నా అభిప్రాయం.

AP Board 8th Class Telugu Important Questions Chapter 1 అమ్మకోసం

AP State Syllabus AP Board 8th Class Telugu Important Questions Chapter 1 అమ్మకోసం.

AP State Syllabus 8th Class Telugu Important Questions 1st Lesson అమ్మకోసం

8th Class Telugu 1st Lesson అమ్మకోసం Important Questions and Answers

I. అవగాహన – ప్రతిస్పందన

అ) కింది చుక్కగుర్తు గల పద్యాలకు భావాలను రాయండి.

1) ఉ. ఆయతపక్ష తుండహతి నక్కులతైలము లెల్ల నుగ్గుగాఁ
జేయు మహాబలంబును బ్రసిద్ధియునుం గల నాకు నీపనిం
బాయక వీపునం దవడుఁబాముల మోవను, వారికిం బనుల్
సేయను నేమి కారణము సెప్పుము దీనిఁ బయోరుహాననా!

భావం:
పద్మం వంటి ముఖం గల తల్లీ ! విశాలమైన నా రెక్కలతో వాడి అయిన ముక్కుతో కుల పర్వతాలనన్నిటినీ పిండిగా చేయగల గొప్పబలం, కీర్తి నాకు ఉన్నాయి. అటువంటి నేను నీచమైన పాములను ఎల్లకాలం వీపు మీద మోయడానికీ, వాటికి సేవలు చేయడానికీ, గల కారణం ఏమిటో చెప్పు.

2) చ. అమితపరాక్రమంబును, రయంబును, లావును గల్గు ఖేచరో
త్తముఁడవు నీవు; నీదయిన దాస్యము వాపికొనంగ నీకుఁ జి
త్తము గలదేని, భూరిభుజదర్పము శక్తియు నేర్పడంగ మా
కమృతముఁ దెచ్చియి’ మ్మనిన నవ్విహాగేంద్రుఁడు సంతసంబునన్

భావం:
“నీవు అంతులేని విక్రమం, వేగం, బలం కలిగిన పక్షి శ్రేష్ఠుడివి. నీకు దాస్యం పోగొట్టు కోవాలనే అభిప్రాయం ఉంటే నీ భుజబలం, సామర్థ్యం తెలిసేలా, మాకు అమృతాన్ని తెచ్చి ఇయ్యి” అని పాములు చెప్పగా, గరుత్మంతుడు అప్పుడు సంతోషంతో.

AP Board 8th Class Telugu Important Questions Chapter 1 అమ్మకోసం

3) మ. వితతోల్కాశనిపుంజ మొక్కొ యనఁగా విన్వీథి విక్షిప్ర ప
క్షతి వాతాహతిఁ దూలి, తూల శకలాకారంబు లై వారిద
ప్రతతుల్ సాల్పడి నల్గడం జెదరఁగాఁ బాటెన్ మనోవేగుఁడై
పతగేంద్రుం డమృతాంతికంబునకుఁ దల్పాలుర్ భయం బందఁగన్.

భావం:
పక్షిరాజు మనోవేగంతో బయలు దేరాడు. అప్పుడతడు నిప్పు కణాలతో కూడిన తోక చుక్కలా ఉన్నాడు. ఆకాశంలో కదలుతూ ఉన్నప్పుడు, అతని రెక్కల గాలి వల్ల మేఘాలు దూది పింజలై చెదరిపోతున్నాయి. అమృతాన్ని రక్షిస్తున్నవారు భయపడేటట్లుగా, గరుత్మంతుడు మనోవేగంతో అమృతం ఉన్నచోటికి వెళ్ళాడు.

ఆ) కింది అపరిచిత పద్యాలను చదివి, ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.

1. కింది పద్యాన్ని చదివి, దాని కింద ఇచ్చిన నాలుగు ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

తలనుండు విషము ఫణికిని
వెలయంగాఁ దోఁక నుండు వృశ్చికమునకున్
దల తోఁక యనక యుండును
ఖలునకు నిలువెల్ల విషము గదరా సుమతీ !
ప్రశ్నలు:
1. ఫణికి విషం ఎక్కడ ఉంటుంది?
జవాబు:
ఫణికి విషం తలలో ఉంటుంది.

2. దేనికి విషం తోకలో ఉంటుంది?
జవాబు:
వృశ్చికానికి (తేలుకు) విషం తోకలో ఉంటుంది.

3. ఖలునకు విషం ఎక్కడ ఉంటుంది?
జవాబు:
ఖలునకు విషం నిలువెల్లా (శరీరమంతా) ఉంటుంది.

4. ఈ పద్యం ద్వారా మనకు ఏం తెలుస్తోంది?
జవాబు:
ఈ పద్యం ద్వారా మనకు ఖలుని స్వభావం తెలుస్తోంది.

2. కింది పద్యాన్ని చదివి, దాని కింద ఇచ్చిన నాలుగు ప్రశ్నలకు జవాబులు రాయండి.
చిన్న చిన్న రాళ్ళు చిల్లర దేవుళ్ళు
నాగులేటి నీళ్ళు నాపరాళ్ళు
సజ్జ జొన్న కూళ్ళు సర్పంబులు, దేళ్ళు
పల్లెనాటి సీమ పల్లెటూళ్ళు.
ప్రశ్నలు :
1. నాగులేరు ఏ సీమలో ప్రవహిస్తున్నది?
జవాబు:
నాగులేరు పల్నాటి సీమలో ప్రవహిస్తున్నది.

2. పల్నాటిసీమ ప్రజల ఆహారం ఏది?
జవాబు:
పల్నాటి సీమ ప్రజల ఆహారం సజ్జ, జొన్నకూళ్ళు.

3. ఈ పద్యానికి శీర్షికను సూచి.డి.
జవాబు:
ఈ పద్యానికి ‘పల్నాటి పల్లెటూళ్ళు’ అని పేరు పెట్టవచ్చు.

4. ఈ పద్యంలోని శబ్దాలంకారమేమిటో రాయండి.
జవాబు:
ఈ పద్యంలోని శబ్దాలంకారం వృత్త్యనుప్రాసం.

AP Board 8th Class Telugu Important Questions Chapter 1 అమ్మకోసం

3. కింది పద్యాన్ని చదివి, దాని కింద ఇచ్చిన నాలుగు ప్రశ్నలకు జవాబులు రాయండి.
అక్షరంబు వలయు కుక్షి జీవనులకు
నక్షరంబు జిహ్వ కిక్షు రసము
అక్షరంబు తన్ను రక్షించు గావున
నక్షరంబు లోక రక్షితంబు.
ప్రశ్నలు:
1. మానవులకు ఏం కావాలి?
జవాబు:
మానవులకు అక్షరం (విద్య) కావాలి.

2. అక్షరం జిహ్వకు ఎటువంటిది?
జవాబు:
అక్షరం జిహ్వకు చెరకురసం వంటిది.

3. అక్షరము దేనిని రక్షిస్తుంది?
జవాబు:
అక్షరము తనను (చదువుకున్నవానిని) రక్షిస్తుంది.

4. ఈ పద్యానికి శీర్షికను సూచించండి.
జవాబు:
ఈ పద్యానికి శీర్షిక ‘అక్షర మహిమ.’

4. కింది పద్యాన్ని చదివి, దాని కింద ఇచ్చిన నాలుగు ప్రశ్నలకు జవాబులు రాయండి.
కందుకము వోలె సుజనుడు
క్రిందంబడి మగుడ మీదికి న్నెగయుఁ జుమీ
మందుడు మృత్పిండమువలె
గిందంబడి యడగియుండుఁ గృపణత్వమునన్.
ప్రశ్నలు:
1. సుజనుడు ఎట్లు ఉంటాడు?
జవాబు:
సుజనుడు కందుకంలా ఉంటాడు.

2. మందుడు ఎలా ఉంటాడు?
జవాబు:
మందుడు మృత్పిండంలా ఉంటాడు.

3. సుజనుని కవి దేనితో పోల్చాడు?
జవాబు:
సుజనుని కవి బంతితో పోల్చాడు.

4. ఈ పద్యంలోని అలంకారమేమి?
జవాబు:
ఈ పద్యంలో ఉపమాలంకారం ఉంది.

II. వ్యక్తీకరణ – సృజనాత్మకత

అ) కింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాల్లో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
‘అమ్మకోసం’ పాఠ్యభాగ రచయితను గురించి రాయండి.
(లేదా)
తెలుగులో ఆదికవిగా పేరుపొందిన నన్నయ గురించి పరిచయం చేయండి. (S.A.III – 2015-16)
జవాబు:
‘అమ్మకోసం’ అనే పాఠ్యభాగ రచయిత నన్నయభట్టు. ఈయన 11వ శతాబ్దికి చెందినవాడు. రాజరాజనరేంద్రుని ఆస్థానకవి. సంస్కృత మహాభారతాన్ని ఆంద్రీకరించిన కవిత్రయంలో నన్నయ మొదటివాడు. ఈయనకు ఆదికవి, శబ్దశాసనుడు అనే బిరుదులు ఉన్నాయి. భారతంలోకి ఆది, సభా పర్వాలను పూర్తిగాను, అరణ్య పర్వంలోని సగభాగాన్ని అనువదించారు.

అక్షరమ్యత, ప్రసన్నకథా కలితార్థయుక్తి, నానారుచిరార్థ సూక్తినిధిత్వం నన్నయ కవిత్వంలోని ప్రధాన లక్షణాలు. అనువాద పద్ధతిలో, శైలిలో తరువాతి కవులకు మార్గదర్శకుడయ్యాడు నన్నయ.

AP Board 8th Class Telugu Important Questions Chapter 1 అమ్మకోసం

ప్రశ్న 2.
‘ఇతిహాసం’ ప్రక్రియను వివరించండి.
జవాబు:
ప్రాచీన తెలుగు సాహిత్య ప్రక్రియల్లో ‘ఇతిహాసం’ అనే ప్రక్రియ ముఖ్యమైనది. ఇలా జరిగింది అని చెప్పేది ఇతిహాసం. ఇతిహాసంలో కథకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. ఇతిహాసాలు గ్రంథస్థం కాకముందు ఆశురూపంలో ఉండేవి. ఇందులో కథ, కథనానికి ప్రాధాన్యం ఎక్కువ ఉంటుంది. రామాయణ, మహాభారతాలను ఇతిహాసాలు అని అంటారు.

ప్రశ్న 3.
గరుత్మంతుని స్వభావాన్ని వివరించండి.
జవాబు:
‘అమ్మకోసం’ అనే పాఠ్యభాగంలో గరుత్మంతుని పాత్ర ప్రముఖమైనది. తల్లి పట్ల అపరిచితమైన భక్తి విశ్వాసాలు కలవాడు. తల్లిదాస్యాన్ని గూర్చి తెలుసుకున్నాడు. ఆమె దాస్యాన్ని తొలగించడానికి ప్రయత్నించాడు. అమృతభాండాన్ని తీసుకొని వచ్చి తల్లికి దాస్యవిముక్తిని కలిగించాడు.

గరుత్మంతుని వేగం అసమానమైంది. అంతులేని పరాక్రమం, గరుత్మంతునికే సొంతం. తల్లికి దాస్యవిముక్తిని కల్గించాడు. తల్లి ఆశలను నెరవేర్చాడు. పిల్లలందరు తనలాగే ఉండాలని లోకానికి తెలియజేసిన మహనీయుడు గరుత్మంతుడు.

ఆ) కింది ప్రశ్నకు 10 లేక 12 వాక్యాల్లో సమాధానం రాయండి.

ప్రశ్న 1.
గరుత్మంతుడు తల్లికి దాస్య విముక్తిని కల్గించి ఉత్తమునిగా కీర్తి పొందాడు కదా ! అట్లే నీ తల్లికి నీవు ఎలా సేవలు చేస్తావు? ఆమెకు ఎలాంటి ఆనందాన్ని కల్గిస్తావు?
జవాబు:
గరుత్మంతుడు తల్లిని సేవించాడు. ఆమెకు దాస్యవిముక్తిని కలిగించాడు. సమాజానికి ఆదర్శంగా నిలిచాడు. గరుత్మంతుడినే నేను ఆదర్శంగా తీసుకున్నాను. మాతృదేవోభవ, పితృదేవోభవ అని పెద్దలు అంటారు. తల్లిదండ్రుల ఋణాన్ని పిల్లలు తీర్చుకోవాలి. వారికి అండగా ఉండాలి.

తల్లిదండ్రులకు ఇంటి పనుల్లోను, బయట పనుల్లోను చేదోడువాదోడుగా ఉంటాను. తల్లిదండ్రులు పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం నిరంతరం కష్టపడతారు. తల్లిదండ్రులకు ఇబ్బందులు కలిగినపుడు వారికి అండగా ఉంటాను. తల్లిదండ్రుల కష్టాలను తొలగించేందుకు కృషి చేస్తాను.

పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు పుట్టినప్పుడు కలుగదు. ఆ పుత్రుని పదిమంది మెచ్చుకొంటున్నప్పుడు కలుగుతుంది. ధృతరాష్ట్రునకు నూరుమంది కొడుకులు పుట్టారు. వారి వల్ల ఆయనకు కష్టాలే వచ్చాయి గాని సుఖం కలుగలేదు. వారందరూ అధర్మ మార్గాన నడిచారు. పాండు పుత్రులు ఐదుగురైనా ధర్మమార్గాన నడిచి కీర్తి ప్రతిష్ఠలు సంపాదించారు. పెద్దయిన తరువాత మా తల్లిదండ్రుల కష్టాలు తీర్చాలని మేము బాగా చదువుతున్నాము. నేను, మా చెల్లి మా తల్లిదండ్రుల్ని ప్రత్యక్షదైవాలుగా చూసుకొంటున్నాము. మా చదువులు పూర్తయ్యే వరకు మా తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా ఉండి, ఉద్యోగాలు సంపాదించి తల్లిదండ్రుల కష్టాలు తొలగిస్తాము.

ఇ) కింది అంశం గురించి సృజనాత్మకంగా ప్రశంసిస్తూ రాయండి.

ప్రశ్న 1.
తల్లిని గౌరవించాలని తెలియజేసే విధంగా కొన్ని నినాదాలు రాయండి.
జవాబు:

  • తల్లిని గౌరవించు. ఆదర్శంగా జీవించు.
  • మాతృమూర్తి రూపమిచ్చిన అమృతమూర్తి,
  • సకల పుణ్యతీర్థాలు తల్లిలో ఉన్నాయి. ఆ తల్లిని మించిన దైవం లేదు.
  • కొట్టినా పెట్టేది తల్లి. పెట్టినా కొట్టేది కొడుకు.
  • కష్టబెట్టబోకు కన్నతల్లి మనసు.
  • కన్నతల్లి కంటే ఘనదైవంబు లేదు.
  • అంతులేని ప్రేమ తల్లి మనసు.
  • త్యాగానికి మరోరూపు తల్లి.

AP Board 8th Class Telugu Important Questions Chapter 1 అమ్మకోసం

ప్రశ్న 2.
తల్లిదండ్రులను గౌరవించాలని తెలుపుతూ మిత్రునికి లేఖ రాయండి.
జవాబు:

పొదిలి.
x x x x x x x

ప్రియమైన మిత్రుడు శరత్ కు,

నీ మిత్రుడు రాయునది. నేను బాగా చదువుతున్నాను. నీవు కూడా బాగా చదువుతున్నావని ఆశిస్తున్నాను. ముఖ్యముగా వ్రాయునది మన కన్న తల్లిదండ్రులు దైవంతో సమానం. వారిని గౌరవించడం మన ధర్మం. పుట్టినప్పటి నుంచి మన బాధ్యతలను తల్లిదండ్రులు చూస్తారు. వారు ఎన్నో కష్టాలను అనుభవిస్తూ పిల్లల అభివృద్ధి కోసం నిరంతరం ప్రయత్నిస్తారు. తల్లిదండ్రులను గౌరవించాలి. వారు చెప్పినట్లు మంచి మార్గంలో నడవాలి. అందరికి ఆదర్శంగా నిలవాలి. వృద్ధాప్యంలో తల్లిదండ్రులను దూరంగా విడిచిపెట్టకుండా తమ దగ్గరే ఉంచుకొని, వారి యోగక్షేమాలను చూచుకోవాలి. నీవు నా (అభిప్రాయంతో ఏకీభవిస్తావని ఆశిస్తున్నాను. పెద్దలందరికీ నా నమస్కారాలు తెలుపగలవు.)

ఇట్లు
నీ మిత్రుడు,
x x x x x x x

చిరునామా :
పి.శరత్, 8వ తరగతి,
ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల,
జిల్లెళ్ళమూడి, బాపట్ల మండలం,
గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్.

ప్రశ్న 3.
ప్రాచీన సాహిత్యంలోని ముఖ్యమైన గ్రంథాలేమిటో మీ పాఠ్యపుస్తకం ఆధారంతో రాసి – వాటిని చదవడం వల్ల ప్రజలకు ఎలాంటి మేలు జరుగుతుందో తెలియజేయండి. (S.A. III – 2015-16)
జవాబు:
సమాజ హితమే సాహిత్యం , సంఘంలోని ప్రజలకు మంచి చెడులను తెలియచెప్పేవి గ్రంథాలు. అందులో ప్రాచీన సాహిత్యంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి రామాయణం, భారతం, భాగవతాదులు. మన పాఠ్యాంశాలలో అమ్మకోసం (ఆంధ్రమహాభారతం), హరిశ్చంద్రుడు (హరిశ్చంద్రోపాఖ్యానం) అనేవి ప్రాచీన సాహిత్య గ్రంథాలు.

ఈ గ్రంథాలు చదవడం ద్వారా ప్రజలకు అన్ని విధాల మంచి జరుగుతుంది. మాతృభక్తి, విలువలు ఒకటి చెబుతుంటే, మరొకటి వ్యక్తిత్వ విలువలు నేర్పుతుంది. తల్లిదండ్రుల పట్ల పిల్లల వైఖరి ఎలా ఉండాలో భారతం చెబుతుంది. ఇంకా ఒక సమాజానికి నిలువుటద్దంగా నిలిచింది. అందుకే ‘వింటే భారతం వినాలి’ అంటారు. అనగా సమాజంలోని వ్యక్తులకు అద్దం పట్టే విధంగా భారతం తీర్చిదిద్దబడింది. అన్ని రకాల వ్యక్తిత్వాలు భారతంలో మనం చూడవచ్చు. ధర్మం ఎవరి వైపు ఉంటుందో, వారి వైపే విజయం ఉంటుంది అని తెలుస్తుంది. హరిశ్చంద్రుడు సత్యవాక్పరిపాలన పాటించి సత్యహరిశ్చంద్రుడు అయ్యాడు. ఎన్ని కష్టాలు వచ్చినా అబద్ధం ఆడలేదు. మహాత్మగాంధీకి సత్యమార్గాన్ని చూపిన వ్యక్తి, ఈ మహనీయుడు. ఈయన కథను చదవడం ద్వారా విశ్వసనీయత, నైతిక విలువలు పెరుగుతాయి. ధర్మతత్పరతకు అవకాశం కల్గుతుంది. ‘సత్యమేవ జయతే’ అన్న సూక్తికి రూపం హరిశ్చంద్రుడు. పై గ్రంథములను చదవడం వల్ల ప్రజలకు ఎన్నో ఉపయోగాలు కలుగుతాయి.

8th Class Telugu 1st Lesson అమ్మకోసం 1 Mark Bits

1. అమిత పరాక్రమంబును “రయంబు”ను (అర్థాన్ని గుర్తించండి) (S.A. I. 2019-20)
ఎ) బలము
బి) వేగము
సి) దుమ్ము
డి) రజను
జవాబు:
బి) వేగము

2. మెరుపులతో పాటు కులిశములు రాలాయి (పర్యాయ పదాలు గుర్తించండి) (SA. I. 2018-19)
ఎ) పన్నగం, పిడుగు
బి) అశని, పిడుగు
సి) అశని, ఫణి
డి) గగనం, సర్పం
జవాబు:
బి) అశని, పిడుగు

3. ఆయత పక్షతుండహతి. పక్షము అనే పదానికి నానార్థాలు గుర్తించండి. (S.A. I – 2018-19)
ఎ) వైపు, రెక్క
బి) రెక్క వారం
సి) పులుగు, పక్షి
డి) ఖగం , పక్షి
జవాబు:
ఎ) వైపు, రెక్క

4. “అచ్చునకు ఆమ్రేడితంబు పరంబగునపుడు సంధియగు” ఈ సూత్రం వర్తించే సంధి పదాన్ని గుర్తించండి. (S.A. I – 2018-19)
ఎ) నెగడెందమములు
బి) అత్యుగ్ర
సి) ఔరౌర
డి) వంటాముదం
జవాబు:
సి) ఔరౌర

5. గరుత్మంతుని పక్షములు చాలా అందమైనవి (నానార్థాలు గుర్తించండి) (S.A. II – 2018-19)
ఎ) రెక్కలు, 15 రోజుల కాలం
బి) పాలు, అమృతము
సి) పృథ్వీ, ధర
డి) ఆకాశము, అంబరం
జవాబు:
ఎ) రెక్కలు, 15 రోజుల కాలం

6. గీత బజారుకు వెళ్లి కూరగాయలు కొన్నది (ఏ వాక్యమో గుర్తించండి) (S.A. II – 2018-19)
ఎ) శత్రర్థకం
బి) సంక్లిష్ట
సి) సంయుక్త
డి) సామాన్య
జవాబు:
బి) సంక్లిష్ట

AP Board 8th Class Telugu Important Questions Chapter 1 అమ్మకోసం

7. మహాభారతమును తెలుగులో మొట్టమొదటగా నన్నయ రాశారు. (సంధి పేరు గుర్తించండి) (SA. II – 2017-18)
ఎ) ఆమ్రేడిత
బి) గుణ
సి) అకార
డి) త్రిక
జవాబు:
ఎ) ఆమ్రేడిత

8. అశని ధ్వని వింటే నాకు భయంగా ఉంటుంది. (సమానార్థక పదాలు గుర్తించండి.) (S.A. III – 2016-17)
ఎ) పిడుగు – కులిశం
బి) అల – గోల
సి) తరంగం – అల
డి) సరస్సు – శిరస్సు
జవాబు:
ఎ) పిడుగు – కులిశం

9. “నాయకులు పిల్లలతో అరగంట కాలం గడిపారు” ఇది ఏ రకమైన వాక్యం (S.A. III – 2015-16)
ఎ) కర్తరి వాక్యం
బి) సంయుక్త వాక్యం
సి) సామాన్య వాక్యం
డి) సంక్లిష్ట వాక్యం
జవాబు:
సి) సామాన్య వాక్యం

భాషాంశాలు – పదజాలం

ఆర్థాలు :

10. విద్యార్థులకు అభీష్టం చదువుపట్లే ఉండాలి – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) కోరిక
బి) అమరిక
సి) తపన
డి) అంతరంగం
జవాబు:
ఎ) కోరిక

11. గగనంలో చంద్రుడు ఉదయించాడు – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) త్రిదిపం
బి) ఆకాశం
సి) దరి
డి) దారి
జవాబు:
బి) ఆకాశం

12. ఈ సంవత్సరంలో వృష్టి కురిసింది – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) క్షేత్రం
బి) నింగి
సి) వాన
డి) క్షీరం
జవాబు:
సి) వాన

13. దివాకరుడు వెలుగును ఇచ్చాడు – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) శుక్రుడు
బి) తపన
సి) పాంథము
డి) సూర్యుడు
జవాబు:
డి) సూర్యుడు

14. పుట్టలో ఉదగం ఉంది – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) భుజం
బి) భుజగం
సి) శీర్షం
డి) ఉదరం
జవాబు:
బి) భుజగం

15. కుశమును కోయడం చాలా కష్టం – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) దర్భ
బి) ధర
సి) ధరణి
డి) వసుధ
జవాబు:
ఎ) దర్భ

16. అనిమిషనాథుడు వయుధం ధరించాడు – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) శని
బి) కుబేరుడు
సి) ఇంద్రుడు
డి) వాయువు
జవాబు:
సి) ఇంద్రుడు

AP Board 8th Class Telugu Important Questions Chapter 1 అమ్మకోసం

17. అమరులు అమృతం త్రాగారు – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) కిన్నెరులు
బి) రాక్షసులు
సి) గంధర్వులు
డి) దేవతలు
జవాబు:
డి) దేవతలు

పర్యాయపదాలు :

18. తల్లి పుత్రుని రక్షించు – గీత గీసిన పదానికి పర్యాయ పదాలు గుర్తించండి.
ఎ) అంబ, అంబాలిక
బి) మాత, జనని
సి) అమ్మ, అమృతం
డి) వనిత, మాత
జవాబు:
బి) మాత, జనని

19. దినకరుడు అస్తమించాడు – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
ఎ) జలధి, జలజం
బి) రజనీశ్వరుడు, రాతిరి
సి) సూర్యుడు, ఆదిత్యుడు
డి) మారుతి, ఇనుడు
జవాబు:
సి) సూర్యుడు, ఆదిత్యుడు

20. ఖగము గగనంపై విహరించింది – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) పుండరీకం, శృంగాలం
బి) నక్క, కాకి
సి) బకము, వింజామరం
డి) పక్షి, పులుగు
జవాబు:
డి) పక్షి, పులుగు

21. శైలంబుపై ఝరి ప్రవహించింది – గీత గీసిన పదానికి సమానార్థక పదం గుర్తించండి.
ఎ) అది
బి) తరువు
సి) నగరం
డి) పథము
జవాబు:
ఎ) అది

22. ఆననం పై కుంకుమ బొట్టు ఉంది – గీత గీసిన పదానికి సమానార్థకం గుర్తించండి.
ఎ) కరం
బి) ముఖం
సి) నాశిక
డి) కర్ణం
జవాబు:
బి) ముఖం

ప్రకృతి – వికృతులు :

23. హృదయం నిర్మలంగా ఉండాలి – గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.
ఎ) ఎద
బి) హేయం
సి) హాయం
డి) హంస
జవాబు:
ఎ) ఎద

24. శక్తి మించి పని చేయరాదు – గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి. పదానికి అర్థం గుర్తించండి.
ఎ) సత్తి
బి) సెత్తి
సి) సొత్తి
డి) మిత్తి
జవాబు:
ఎ) సత్తి

25. కులము కంటే గుణము మిన్న – గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.
ఎ) కొలము
బి) గొలము
సి) కెలము
డి) కిలము
జవాబు:
ఎ) కొలము

26. అగ్ని మండును – గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.
ఎ) అగ్గే
బి) అగ్గి
సి) అగ్గి
డి) అచ్చి
జవాబు:
బి) అగ్గి

27. ప్రజలు సంతోషం పొందాలి – గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.
ఎ) సంతషం
బి) సెంతసం
సి) సొంతసం
డి) సంతసం
జవాబు:
డి) సంతసం

AP Board 8th Class Telugu Important Questions Chapter 1 అమ్మకోసం

28. మానవుడు ముతి పొందాలి – గీత గీసిన పదానికి ప్రకృతి పదం గుర్తించండి.
ఎ) ముగిచె
బి) ముక్తి
సి) ముత్తె
డి) ముచ్చ
జవాబు:
బి) ముక్తి

నానార్థాలు :

29. అన్నింట అర్థం అవసరం – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
ఎ) కారణం, కాసర
బి) సంపద, శబ్దార్థం
సి) శ్రీ, గానుగ
డి) లక్ష్మి, అరమరిక
జవాబు:
బి) సంపద, శబ్దార్థం

30. పక్షి రయమున వెళ్ళె – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
ఎ) వనము, వేగము
బి) వేదం, వెల్లువ
సి) వేగం, వేకువు
డి) వేకువ, వరద
జవాబు:
బి) వేదం, వెల్లువ

31. దేవతలు సుధను త్రాగారు – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
ఎ) అమృతం, పాలు
బి) నీరు, నాలుక
సి) జలం, వారి
డి) క్షీరం, సున్నం
జవాబు:
ఎ) అమృతం, పాలు

32. పక్షి పక్షములతో ఎగిరింది – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
ఎ) 15 రోజులకాలం
బి) క్షీరం
సి) జలధి
డి) ఉదధి
జవాబు:
ఎ) 15 రోజులకాలం

33. సరస్సులో వారి ఉంది – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
ఎ) లావు
బి) సరస్వతి
సి) సామర్థ్యం
డి) లక్ష్మి
జవాబు:
బి) సరస్వతి

వ్యుత్పత్తర్థాలు :

34. దేవతలు అమృతం త్రాగారు – గీత గీసిన పదానికి వ్యుత్పత్త్యర్థం గుర్తించండి.
ఎ) మృతి కావాలనేది
బి) మరణము పొందింపనిది
సి) మరణం కానిది
డి) మరణం చెందేది
జవాబు:
బి) మరణము పొందింపనిది

35. పున్నామ నరకం నుండి రక్షించువాడు-అనే వ్యుత్పత్త్యర్థం గల పదం ఏది?
ఎ) పుత్రుడు
బి) భూమాత
సి) జనకుడు
డి) పురం
జవాబు:
ఎ) పుత్రుడు

36. అనిమిషనాథుడు దివి యందు ఉండె – గీత గీసిన పదానికి వ్యుత్పత్యర్థం గుర్తించండి.
ఎ) దేవతలకు ప్రభువు
బి) రాక్షసులకు రాజు
సి) దేవతలకు గురువు
డి) దేవతలకు సేనాని
జవాబు:
ఎ) దేవతలకు ప్రభువు

37. వెనతేయుడు బుధిమంతుడు – గీత గీసిన పదానికి వ్యుత్పత్తిని గుర్తించండి.
ఎ) వినత యొక్క అల్లుడు
బి) వినత యొక్క కుమారుడు
సి) వినత యొక్క మామ
డి) వినత యొక్క ఆశయం
జవాబు:
బి) వినత యొక్క కుమారుడు

AP Board 8th Class Telugu Important Questions Chapter 1 అమ్మకోసం

38. భుజంగము – దీనికి వ్యుత్పత్తి ఏది?
ఎ) వేగంగా పోవునది
బి) మంధముగా పోవునది
సి) కుటిలముగా పోవునది
డి) గగనంపై వెళ్ళునది
జవాబు:
సి) కుటిలముగా పోవునది

39. ఖేచరం విహరించును – గీత గీసిన పదానికి వ్యుత్పత్తిని గుర్తించండి.
ఎ) సర్వత్ర తినునది
బి) ఆకాశమున సంచరించునది
సి) ఆకాశంచేత పయనించునది
డి) స్వర్గంపై తిరిగేది
జవాబు:
బి) ఆకాశమున సంచరించునది

వ్యాకరణాంశాలు

సంధులు :

40. అత్యుగ్రం – దీన్ని విడదీయడం గుర్తించండి.
ఎ) అతో + అగ్రము
బి) అతీ + అగ్రము
సి) అతే + అగ్రం
డి) అతి + ఉగ్రము
జవాబు:
డి) అతి + ఉగ్రము

41. దధ్యోదనం – ఇది ఏ సంధి?
ఎ) సునీతి పరిమళాలు
బి) నీతి పరిమళాలు
సి) పరిమళనీతులు
డి) అపరిమళనీతులు
జవాబు:
ఎ) సునీతి పరిమళాలు

42. చిట్టచివర ఉన్నాను – దీనిని విడదీయడం గుర్తించండి.
ఎ) చిట్టి + చివర
బి) చివర + చివర
సి) చిట్ట + చివర
డి) చిరు + చివర
జవాబు:
బి) చివర + చివర

43. ద్విరుక్తము యొక్క పరరూపాన్ని ఏమంటారు?
ఎ) ఆమ్రేడితం
బి) త్రికము
సి) ఉత్వ
డి) శత్రర్థకం
జవాబు:
ఎ) ఆమ్రేడితం

44. వృద్ధులు అనగా ఏవి?
ఎ) ఆ, ఈ, ఏ
బి) ఉ, ఋ, ఎ
సి) య, వ, ర, ల
డి) ఐ, ఔ
జవాబు:
డి) ఐ, ఔ

AP Board 8th Class Telugu Important Questions Chapter 1 అమ్మకోసం

45. దేశోన్నత్యం పెరగాలి – ఇది ఏ సంధి?
ఎ) అత్వసంధి
బి) వృద్ధిసంధి
సి) త్రికసంధి
డి) యణాదేశ సంధి
జవాబు:
బి) వృద్ధిసంధి

46. క్రింది వానిలో పొసగని సంధి ఏది?
ఎ) ఇత్వసంధి
బి) ఉత్వసంధి
సి) త్రికసంధి
డి) అత్వసంధి
జవాబు:
సి) త్రికసంధి

47. మనోవేగంతో వెళ్ళాడు – గీత గీసిన పదం ఏ సంధి?
ఎ) త్రికసంధి
బి) విసర్గసంధి
సి) గుణసంధి
డి) వృద్ధి సంధి
జవాబు:
బి) విసర్గసంధి

సమాసాలు :

48. సంఖ్యా శబ్దం కలిగిన సమాసమును గుర్తించండి.
ఎ) ద్వంద్వ సమాసం
బి) ద్విగు సమాసం
సి) షష్ఠీ తత్పురుష
డి) తృతీయా తత్పురుష
జవాబు:
బి) ద్విగు సమాసం

49. వనకరి – ఇది ఏ సమాసము?
ఎ) ద్వితీయా తత్పురుష
బి) చతుర్థి తత్పురుష
సి) సప్తమీ తత్పురుష
డి) అవ్యయీభావ సమాసం
జవాబు:
సి) సప్తమీ తత్పురుష

50. గుణసంయుతులు – దీనికి విగ్రహవాక్యం గుర్తించండి.
ఎ) గుణమునందు సంయుతులు
బి) గుణము యొక్క సంయుతులు
సి) గుణములతో సంయుతులు
డి) గుణం వల్ల సంయుతులు
జవాబు:
బి) గుణము యొక్క సంయుతులు

51. నీతి యొక్క పరిమళాలు – దీనికి సమస్త పదం గుర్తించండి.
ఎ) యణాదేశ సంధి
బి) గుణసంధి
సి) త్రికసంధి
డి) సవర్ణదీర్ఘ సంధి
జవాబు:
బి) గుణసంధి

52. సూర్యుని దెస – దీనికి విగ్రహవాక్యం గుర్తించండి.
ఎ) దెస సూర్యుడు
బి) సూర్యదేస
సి) అసూర్యదెస
డి) సూర్యుని యొక్క దెస
జవాబు:
డి) సూర్యుని యొక్క దెస

AP Board 8th Class Telugu Important Questions Chapter 1 అమ్మకోసం

53. దినము దినము – దీన్ని సమాసపదంగా గుర్తించండి.
ఎ) యథాదినం
బి) ప్రతిదినం
సి) దినంప్రతి
డి) అనుదినం
జవాబు:
బి) ప్రతిదినం

54. తల్లిదండ్రులు – ఇది ఏ సమాసం?
ఎ) ద్వంద్వ సమాసం
బి) అవ్యయీభావం
సి) కర్మధారయం
డి) ద్విగు సమాసం
జవాబు:
ఎ) ద్వంద్వ సమాసం

55. అన్య పదార్థ ప్రాధాన్యం గల సమాసాన్ని గుర్తించండి.
ఎ) బహుజొహి
బి) కర్మధారయం
సి) అవ్యయీభావం
డి) తత్పురుష
జవాబు:
ఎ) బహుజొహి

గణవిభజన:

56. రగణం – దీనికి గణాలు గుర్తించండి.
ఎ) UUI
బి) UUU
సి) UIU
డి) IUU
జవాబు:
సి) UIU

57. వితతోల్కాశనిపుంజ మొక్క యనఁగా విన్వీథి విక్షిప్త ప – ఇది ఏ పద్యపాదమో గుర్తించండి?
ఎ) చంపకమాల
బి) ఉత్పలమాల
సి) మత్తేభం
డి) శార్దూలం
జవాబు:
సి) మత్తేభం

58. క్షతి వాతాహతి దూలి, తూల శకలాకారంబు లై వారిద – ఇది ఏ పద్యపాదమో తెల్పండి.
ఎ) చంపకమాల
బి) మత్తేభం
సి) శార్దూలం
డి) ఉత్పలమాల
జవాబు:
బి) మత్తేభం

AP Board 8th Class Telugu Important Questions Chapter 1 అమ్మకోసం

59. ఘోరవికార సన్నిహిత కోపముఖంబులు, దీప్తవిద్యుడు – ఇది ఏ పద్యపాదమో గుర్తించండి.
ఎ) ఉత్పలమాల
బి) చంపకమాల
సి) శార్దూలం
డి) మత్తేభం
జవాబు:
ఎ) ఉత్పలమాల

60. UUU – ఇది ఏ గణం?
ఎ) మ గణం
బి) య గణం
సి) త గణం
డి) స గణం
జవాబు:
ఎ) మ గణం

61. ఆటవెలదిలోని రెండు, నాలుగు పాదాల్లో ఉండే గణాలు గుర్తించండి.
ఎ) 3 ఇంద్రగణాలు 2 సూర్యగణాలు
బి) 5 సూర్యగణాలు
సి) 2 సూర్యగణాలు 3 ఇంద్రగణాలు
డి) 5 ఇంద్రగణాలు
జవాబు:
బి) 5 సూర్యగణాలు

వాక్య రకాలు :

62. రాము తప్పక వస్తాడు – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) విధ్యర్థక వాక్యం
బి) ఆనంతర్యార్థక వాక్యం
సి) నిశ్చయార్థక వాక్యం
డి) అప్యర్థక వాక్యం
జవాబు:
సి) నిశ్చయార్థక వాక్యం

63. రవి పాఠం విని నిద్రపోయాడు – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) విధ్యర్థక వాక్యం
బి) సంక్లిష్ట వాక్యం
సి) సంయుక్త వాక్యం
డి) సామాన్య వాక్యం
జవాబు:
బి) సంక్లిష్ట వాక్యం

64. “నాకు ఆటలంటే ఇష్టం” అని రవి అన్నాడు – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) కర్తరి వాక్యం
బి) ప్రత్యక్ష కథన వాక్యం
సి) పరోక్ష కథన వాక్యం
డి) కర్మణి వాక్యం
జవాబు:
బి) ప్రత్యక్ష కథన వాక్యం

AP Board 8th Class Telugu Important Questions Chapter 1 అమ్మకోసం

65. మీకు మేలు కలుగుగాక – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) చేదర్థకం
బి) ఆశీరార్థకం
సి) అభ్యర్థకం
డి) ధాత్వర్ధకం
జవాబు:
ఎ) చేదర్థకం

66. బాగా చదివితే మార్కులు వస్తాయి – ఇది ఏ రకమైన సంక్లిష్ట వాక్యం?
ఎ) హేత్వర్థక వాక్యం
బి) తర్థర్మార్థక వాక్యం
సి) చేదర్థక వాక్యం
డి) అభ్యర్థక వాక్యం
జవాబు:
బి) తర్థర్మార్థక వాక్యం

67. గరుత్మంతుడు దాస్యం తొలగించాడు – దీనికి కర్మణి వాక్యం గుర్తించండి.
ఎ) గరుత్మంతునిచేత దాస్యం తొలగించబడింది
బి) గరుత్మంతుని వల్ల దాస్యం చేరింది
సి) గరుత్మంతునికి దాన్యం తొలగాలి
డి) దాస్యంచేత గరుత్మంతుడు తొలగించాడు
జవాబు:
ఎ) గరుత్మంతునిచేత దాస్యం తొలగించబడింది

68. రైలు వచ్చింది గాని చుట్టాలు రాలేదు – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) విధ్యర్థక వాక్యం
బి) హేత్వర్థక వాక్యం
సి) అప్యర్థక వాక్యం
డి) సంయుక్త వాక్యం
జవాబు:
డి) సంయుక్త వాక్యం

AP Board 8th Class Telugu Important Questions Chapter 1 అమ్మకోసం

69. గరుత్మంతుడు ఎగిరి వెళ్ళాడు – దీనికి వ్యతిరేకార్థక వాక్యం ఏది?
ఎ) గరుత్మంతుడు ఎగిరి వెళ్ళియుండకూడదు
బి) గరుత్మంతుడు ఎగిరి వెళ్ళలేదు
సి) గరుత్మంతుడు ఎగిరి వెళ్ళవచ్చు
డి) గరుత్మంతుడు ఎగిరి వెళ్ళకూడదు
జవాబు:
బి) గరుత్మంతుడు ఎగిరి వెళ్ళలేదు

సొంతవాక్యాలు :

70. అన్యులు : కుటుంబ విషయాలను అన్యులకు చెప్పరాదు.

71. గుప్తము : విద్య మానవునికి గుప్తమగు ధనము.

72. ఉత్తముడు : శ్రీరాముడు మానవులలో పరమ ఉత్తముడు.

73. కరుణ : పేదప్రజలపై ధనవంతులు కరుణ చూపాలి.

74. సమర్థులు : సమర్థులు మాత్రమే అసాధ్యములైన పనులు చేస్తారు.

75. ప్రసిద్ధికెక్కు : అమరావతి చారిత్రాత్మకంగా మిక్కిలి ప్రసిద్ధికెక్కింది.

76. ఉపాయము : ఉపాయముతో అపాయాన్ని తొలగించుకోవచ్చు.

78. దాస్యము : విదేశీయుల పాలనలో భారతీయులు దాస్యము అనుభ వించారు.

79. విముక్తులు : ఖైదీలు సత్ప్రవర్తనతో జైలు నుండి విముక్తులయ్యారు.

80. దీవెనలు : తల్లిదండ్రులు తమ పిల్లలకు దీవెనలు అందజేస్తారు.

AP Board 8th Class Telugu Important Questions Chapter 3 నీతి పరిమళాలు

AP State Syllabus AP Board 8th Class Telugu Important Questions Chapter 3 నీతి పరిమళాలు.

AP State Syllabus 8th Class Telugu Important Questions 3rd Lesson నీతి పరిమళాలు

8th Class Telugu 3rd Lesson నీతి పరిమళాలు Important Questions and Answers

I. అవగాహన – ప్రతిస్పందన

అ) కింది చుక్కగుర్తు గల పద్యాలకు భావాలను రాయండి.

1) చ. తనకు ఫలంబు లేదని యెదం దలపోయఁడు కీర్తిఁ గోరు నా
ఘనగుణశాలి లోకహితకార్యము మిక్కిలి భారమైన మే
లనుకొని పూను శేషుఁడు సహస్రముఖంబుల గాలి గ్రోలి తా
ననిశము మోవఁడే మణి మహాభరమైన ధరిత్రి భాస్కరా ! – (భాస్కర శతకం)

భావం :
భాస్కరా ! కీర్తిని కోరే గుణవంతుడు, తనకు ఎలాంటి లాభమునూ ఆశింపడు. లోకానికి మేలు జరిగే కార్యము ఎంత భారమైనా, చేయడానికి పూనుకుంటాడు. ఆదిశేషుడు గాలిని మాత్రమే మేస్తూ, తన వేయి పడగల మీద ఈ పెద్ద భూభారాన్ని నిత్యం మోస్తున్నాడు కదా !

2) చ. చదువది యెంతగల్గిన రసజ్ఞత యించుక చాలకున్న నా
చదువు నిరర్ధకంబు గుణసంయుతులెవ్వరు మెచ్చ రెచ్చటం
బదనుగ మంచి కూర నలపాకము చేసిననైన నందు నిం
పొదవెడు నుప్పులేక రుచి పుట్టఁగ నేర్చునటయ్య భాస్కరా ! – (భాస్కర శతకం)

భావం:
భాస్కరా ! ఎంత చదువు చదివినా అందులోని అంతరార్థాన్ని, మనోజ్ఞతనూ గ్రహింప లేనప్పుడు, ఆ చదువు వ్యర్థం. దాన్ని గుణవంతులు ఎవరూ మెచ్చుకోరు. ఎన్ని పదార్థాలు వేసి నలపాకంగా, వంట చేసినా, దానిలో తగిన ఉప్పు వేయకపోతే అది రుచించదు కదా?

AP Board 8th Class Telugu Important Questions Chapter 3 నీతి పరిమళాలు

3) ఉ. భూషలు గావు మర్త్యులకు భూరిమయాంగద తారహారముల్
భూషిత కేశపాశ మృదుపుష్ప సుగంధజలాభిషేకముల్
భూషలు గావు పూరుషుని భూషితుఁ జేయుఁ బవిత్రవాణి, వా
గ్భూషణమే సుభూషణము, భూషణముల్ నశియించు నన్నియున్ – (సుభాషిత రత్నావళి)

భావం :
మానవులకు బంగారు కేయూరాలు, ముత్యాలహారాలు అలంకారాలు కావు. జుట్టు దువ్వుకోవడం, పువ్వులు పెట్టుకోవడం, పన్నీటితో స్నానం చేయడం మానవుడికి అలంకారాలు కావు. పవిత్రమైన వాక్కు, పురుషుని అలంకరిస్తుంది. సంస్కారవంతమైన మాటయే, నిజమైన అలంకారము. మిగిలిన అలంకారాలు, నశించి పోయేవే.

4) చ. వనకరి చిక్కె మైనసకు, వాచవికిం జెడిపోయె మీను, తా
వినికికి (జిక్కె (జిల్వ గనువేదురుఁ జెందెను లేళ్ళు, తావినో
మని నశించెఁ దేటి, తరమా యిరుమూటిని గెల్వ వైదుసా
ధనముల నీవె గావఁదగు దాశరథీ కరుణాపయోనిధీ ! – (దాశరథీ శతకం)

భావం :
దయా సముద్రుడవైన ఓ రామా ! తన దురదను పోగొట్టుకోవడానికి ఏనుగూ ; నోటి రుచిని ఆశించి చేప, సంగీతానికి లొంగి పామూ, అందానికి బానిసయై జింక, పూలవాసనకు మైమరచి తుమ్మెదలూ, బందీలవుతున్నాయి. ఇలా ఒక్కొక్క ప్రాణి, ఒక్కొక్క ఇంద్రియ చపలత్వం వల్లనే నశిస్తున్నాయి. ఈ పంచేంద్రియములందూ చాపల్యం గల నేను, ఎలా బయటపడగలను? ఓ దశరథ పుత్రా! కరుణాసాగరా ! రామా ! నీవే నన్ను కాపాడాలి.

5) ఆ.వె. క్షమను కడఁక నెవరు గాపాడుకొందుఱో
క్షమను చిరము వారు కావ గలరు
కదలకుండ నెవరికడ క్షమయుండునో
సర్వకార్యములకు క్షములు వారు – (సభారంజన శతకం)

భావం :
ఎవరు ప్రయత్నంతో క్షమను (ఓరిమిని) కాపాడుకుంటారో, వారు క్షమను’ (భూమిని) కాపాడతారు. ఎవరిలో క్షమ (సహనం) నిశ్చలంగా ఉంటుందో, వారు అన్ని పనుల్లోనూ క్షములై (సమర్థులై) ఉంటారు.

6) శా. ఊరూరం జనులెల్ల క్షమిడరో, యుండం గుహలలవో
చీరానీకము వీధులం దొరకదో శీతామృత స్వచ్ఛ వాః
పూరం బేరుల బారదో తపసులం బ్రోవంగ నీవోపవో
చేరంబోవుదు రేల రాజుల జనుల్ శ్రీకాళహస్తీశ్వరా! – (శ్రీకాళహస్తీశ్వర శతకం)

భావం :
శ్రీకాళహస్తీశ్వరా ! తినడానికి భిక్షం అడిగితే ప్రతి గ్రామంలోనూ ప్రజలు భిక్షం పెడతారు. నివసించడానికి గుహలు ఉన్నాయి. వస్త్రాలు వీధుల్లో దొరుకుతాయి. తాగడానికి నదుల్లో చల్లని అమృతం లాంటి తియ్యని నీరు ఉంది. తపస్సు చేసుకొనే మనుష్యులను కాపాడడానికి నీవున్నావు. ఈ ప్రజలు రాజులను ఎందుకు ఆశ్రయిస్తున్నారో తెలియడం లేదు.

AP Board 8th Class Telugu Important Questions Chapter 3 నీతి పరిమళాలు

ఆ) కింది అపరిచిత పద్యాలను చదివి, ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.

1. కింది పద్యాన్ని చదివి, దాని కింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి
కం|| “ఇందుగలడందులేడని
సందేహము వలదు చక్రి సర్వోపగతుం
డెందెందు వెదకి చూచిన
నందందే కలడు దానవాగ్రణి వింటే”
ప్రశ్నలు :
1. సర్వోపగతుండెవరు?
జవాబు:
సర్వోపగతుండు ‘చక్రి’. చక్రి అనగా చక్రమును ధరించే శ్రీమహావిష్ణువు.

2. చక్రి ఎక్కడున్నాడు?
జవాబు:
చక్రి అన్ని చోట్లా ఉంటాడు.

3. ఈ పద్యం ఎవరిని సంబోధిస్తుంది?
జవాబు:
ఈ పద్యం, దానవాగ్రణిని అంటే రాక్షసరాజు హిరణ్యకశిపుని సంబోధిస్తుంది.

4. ఈ పద్యం ఏ గ్రంథంలోనిది .? (రామాయణం, భారతం, భాగవతం)
జవాబు:
ఈ పద్యం భాగవతం లోనిది.

2. కింది పద్యాన్ని చదివి, కింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

“కమలములు నీట బాసిన
కమలాప్తుని రశ్మిసోకి కమలిన భంగిన్
తమ తమ నెలవులు దప్పిన
తమ మిత్రులె శత్రులగుట తథ్యము సుమతీ”
ప్రశ్నలు :
1. కమలములు ఎపుడు వాడిపోతాయి?
జవాబు:
కమలములు నీటిలో నుండి బయటకు వస్తే సూర్యుని కాంతి తాకి వాడిపోతాయి.

2. మిత్రులు శత్రువులు ఎపుడు అవుతారు?
జవాబు:
తమ తమ స్థానాలను కోల్పోతే మిత్రులు శత్రువులు అవుతారు.

3. ఈ పద్యానికి మకుటమేది?
జవాబు:
సుమతీ

4. పై పద్యం ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి.
జవాబు:
రశ్మి అనగా ఏమిటి?

3. కింది పద్యమును చదివి, కింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానములు రాయండి

అనగ ననగ రాగ మతిశయిల్లుచు నుండు
తినగ తినగ వేము తీయనుండు
సాధనమున పనులు సమకూరు ధరలోన
విశ్వదాభిరామ ! వినురవేమ!
ప్రశ్నలు :
1. అంటూ ఉంటే అతిశయిల్లేది ఏది?
జవాబు:
అంటూ ఉంటే అతిశయిల్లేది రాగము.

2. తింటూ ఉంటే తీయనయ్యేది ఏది?
జవాబు:
తింటూ ఉంటే తీయనయ్యేది వేము.

3. సాధనతో సమకూరేవి ఏవి?
జవాబు:
సాధనమున పనులు సమకూరు ధరలోన

4. ఈ పద్యానికి మకుటం ఏమిటి?
జవాబు:
విశ్వదాభిరామ ! వినురవేమ !

AP Board 8th Class Telugu Important Questions Chapter 3 నీతి పరిమళాలు

4. కింది పద్యాన్ని చదివి, దాని కింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాన్ని గుర్తించండి.
చేతులారంగ శివుని పూజింపడేని
నోరునొవ్వంగ హరికీర్తినుడువడేని
దయయుసత్యంబులోనుగా దలపడేని
కలుగనేటికి తల్లులు కడుపుచేటు
ప్రశ్నలు :
1. “కడుపుచేటు” అనే మాటకు అర్థం
ఎ) చెడ్డకడుపు
బి) పుట్టుక దండగ
సి) తల్లులకు బాధ
జవాబు:
బి) పుట్టుక దండగ

2. శివపూజ ఎలా చేయమంటున్నాడు కవి?
ఎ) ఆరు చేతులతో
బి) చేతులు నొప్పి పుట్టేటట్లు
సి) చేతులతో తృప్తి కలిగేటట్లు
జవాబు:
సి) చేతులతో తృప్తి కలిగేటట్లు

3. దయను, సత్యాన్ని రెండింటిలో మనిషి వేటిని తలచాలి?
ఎ) దయను మాత్రమే
బి) సత్యాన్ని మాత్రమే
సి) దయను, సత్యాన్ని రెండింటిని
జవాబు:
సి) దయను, సత్యాన్ని రెండింటిని

4. నోరారా హరి కీర్తిని………….
ఎ) పిలవాలి
బి) పలకాలి
సి) అరవాలి
జవాబు:
బి) పలకాలి

5. కింది పద్యాన్ని చదివి, ప్రశ్నలకు సరైన సమాధానాలు రాయండి
చిన్న చిన్న రాళ్ళు చిల్లర దేవుళ్ళు
నాగులేటి నీళ్ళు నాపరాళ్ళు
సజ్జ జొన్న కూళ్ళు సర్పంబులు, దేళ్ళు
పల్లెనాటి సీమ పల్లెటూళ్ళు.
ప్రశ్నలు :
1. నాగులేరు ఏ సీమలో ప్రవహిస్తున్నది?
జవాబు:
నాగులేరు పల్నాటి సీమలో ప్రవహిస్తున్నది.

2. పల్నాటిసీమ ప్రజల ఆహారం ఏది?
జవాబు:
పల్నాటి సీమ ప్రజల ఆహారం సజ్జ, జొన్నకూళ్ళు.

3. ఈ పద్యానికి శీర్షికను సూచించండి.
జవాబు:
ఈ పద్యానికి ‘పల్నాటి పల్లెటూళ్ళు’ అని పేరు పెట్టవచ్చు.

4. ఈ పద్యంలోని శబ్దాలంకారమేమిటో రాయండి.
జవాబు:
ఈ పద్యంలోని శబ్దాలంకారం వృత్త్యనుప్రాసం.

6. ఈ కింది అపరిచిత పద్యాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.
చీమలు పెట్టిన పుట్టలు
పాముల కిరవైనయట్లు పామరుడుదగన్
హేమంబు కూడబెట్టిన
భూమీశుల పాలజేరు భువిలో సుమతీ !
ప్రశ్నలు:
1. చీమలు పెట్టిన పుట్టలు వేటికి స్థానమవుతాయి?
జవాబు:
పాములకు

2. పై పద్యంలో కవి పామరుడిని ఎవరితో పోల్చాడు?
జవాబు:
చీమలతో

3. ‘బంగారం’ అనే అర్థం వచ్చే పదం పై పద్యంలో ఉంది. గుర్తించి రాయండి.
జవాబు:
హేమము

4. పై పద్యం ఆధారంగా ఒక ప్రశ్న తయారుచేయండి.
జవాబు:
‘భూమీశుడు’ అనగా ఎవరు?

7. ఈ కింది అపరిచిత పద్యాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.
అల్పుడెప్పుడు పల్కు నాడంబరముగాను
సజ్జనుండు బల్కు జల్లగాను
కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా
విశ్వదాభిరామ ! వినురవేమ !
ప్రశ్నలు :
1. అల్పుని మాటలు ఎలా ఉంటాయి?
జవాబు:
ఆడంబరంగా

2. ఆహ్లాదకరంగా మాట్లాడువారు ఎవరు?
జవాబు:
సజ్జనుడు

3. కవి ఈ పద్యంలో ఏ రెండు లోహాలను పోల్చారు?
జవాబు:
కంచు, బంగారం

4. పై పద్యం ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి.
జవాబు:
దీనిలోని మకుటం ఏది?

AP Board 8th Class Telugu Important Questions Chapter 3 నీతి పరిమళాలు

8. కింది అపరిచిత పద్యాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.
ఆచార్యున కెదిరింపకు
బ్రోచిన దొరనింద సేయ బోకుము కార్యా
లోచనము లొంటి జేయకు
మాచారము విడువ బోకుమయ్య ! కుమారా !
ప్రశ్నలు :
1. ఒంటరిగా చేయకూడనిది ఏది?
జవాబు:
కార్యాలోచనము.

2. వేటిని విడిచి పెట్టకూడదు?
జవాబు:
ఆచారములు.

3. “తనని పోషించిన యజమానిని నిందించరాదు” అనే భావం వచ్చే పద్యపాదాన్ని గుర్తించి రాయండి.
జవాబు:
బ్రోచిన దొర నింద సేయబోకుము.

4. పై పద్యం ఆధారంగా ఒక ప్రశ్న తయారుచేయండి.
జవాబు:
ఈ పద్యా నికి మకుటం ఏమిటి?
(లేదా)
ఈ పద్యాన్ని రాసినది ఎవరు?

II. వ్యక్తీకరణ – సృజనాత్మకత

అ) కింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాల్లో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
‘శతకం’ అనే ప్రక్రియను వివరించండి. (S.A. I – 2018-19)
జవాబు:
ప్రాచీన తెలుగు సాహిత్య ప్రక్రియల్లో ‘శతకం’ అనే ప్రక్రియ ఒకటి. ఇందులో నూరు పద్యాలు ఉంటాయి. కొన్ని శతకాల్లో నూరుకు పైగా పద్యాలు ఉంటాయి. శతకంలో మకుటం ప్రధానంగా ఉంటుంది. కొన్ని శతకాల్లో మకుటం లేకుండా పద్యాలు ఉంటాయి. నీతి, ధర్మం, భక్తి, వైరాగ్యం మొదలైన అంశాలను శతకపద్యాలు బోధిస్తాయి. శతక పద్యాలు సమాజంలో నైతిక విలువలను, ఆధ్యాత్మిక భావనను, సత్ప్రవర్తనను కల్గిస్తాయి. సమాజంలో మూఢాచారాలను. తొలగించడానికి సహకరిస్తాయి.

ప్రశ్న 2.
సంస్కారం అంటే ఏమిటి? దాని గురించి నీవు ఏమనుకున్నావో రాయండి.
జవాబు:
సంస్కారం అంటే సంస్కరించడం. అంటే చక్కజేయడం. సాంఘికం, రాజకీయం, పరిపాలన, న్యాయవ్యవస్థ వంటి రంగాల్లో ఉన్న లోపాలను సవరించి, మంచి మార్గంలో పెట్టడం “సంస్కారం”. అలా సంస్కారం చేసిన వారిని “సంస్కర్త” అంటారు. పెద్దలు చెప్పిన మంచిదారిలో నడవడం “సంస్కారం”.

వీరేశలింగం గారు తన కాలం నాటి సంఘంలోని లోపాలను ఎత్తిచూపి, ప్రజలను మంచిదారిలో పెట్టడానికి కృషి చేశాడు. అందుకే ఆయన గొప్ప “సంఘసంస్కర్త” అయ్యాడు.

రాజకీయాలలోని లోపాలను సవరించడానికి ‘అన్నాహజారే’ వంటివారు లోక్ పాల్ బిల్లుకోసం ప్రయత్నించి విజయం సాధించారు. అన్నాహజారే “రాజకీయ సంస్కర్త”.

పూర్వకాలంలో శంకరాచార్యులవారు వేదమతాచారంలోని లోపాలను సంస్కరించి, అద్వైతమతాన్ని స్థాపించారు. ఆయన “మత సంస్కర్త”.

ఇటువంటి సంస్కరణల వల్ల మనిషిలో పెంపొందే ఉత్తమ గుణమే “సంస్కారం”.

AP Board 8th Class Telugu Important Questions Chapter 3 నీతి పరిమళాలు

ప్రశ్న 3.
ఏనుగు లక్ష్మణకవి “వాగ్భూషణమే సుభూషణం” అని చెప్పాడు కదా ! దీనిని మీరు సమర్థిస్తారా? ఎందుకు?
జవాబు:
ఏనుగు లక్ష్మణకవి వాగ్భూషణమే సుభూషణం అని చెప్పాడు. ఇది నిజమే. ఈ మాట అందరినీ ఆలోచింపచేసేదిగా ఉంది. మంచి మాటకున్న శక్తిని లోకానికి చాటాడు. ఇది విద్యార్థులకు ప్రయోజనకరంగా ఉంటుంది.

మంచి వాక్కు వల్ల విద్యార్థుల్లో అంతర్లీనంగా ఉన్న వాక్ శక్తిని పెంపొందించుకొనగలుగుతారు. నాయకత్వ లక్షణాలను అభివృద్ధి చేసుకుంటారు. ఈ వాక్ శక్తి వల్ల ఎంతటి వారినైనా చక్కగా ఆకట్టుకొనగలుతారు. హేతువాద దృష్టిని అలవరుచుకొనగలుగుతారు. – చక్కని విషయ పరిజ్ఞానాన్ని పెంపొందించుకుంటారు. వాక్ శక్తి వల్ల అనేకములైన ప్రయోజనాలు కలుగుతాయని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

ప్రశ్న 4.
పాఠంలోని పద్యాల్లో ఉన్న నీతిని సొంతమాటల్లో రాయండి.
జవాబు:

  1. గొప్ప గుణవంతుడు, లోకానికి హితమైన కార్యాన్ని ఎంత భారమైనా చేయడానికి పూనుకుంటాడు.
  2. ఉప్పులేని కూరవలె రసజ్ఞత లేని చదువు వ్యర్థం.
  3. సంస్కారవంతమైన మాటయే నిజమైన అలంకారం.
  4. మానవులను పంచేంద్రియ చాపల్యం నుండి భగవంతుడే కాపాడాలి.
  5. క్షమాగుణం కలవాడే అన్ని కార్యములకు సమర్థుడు.
  6. మానవులు రాజులను ఆశ్రయించడం వ్యర్థం.
  7. ఎదుటి వాడి బలాన్ని తెలుసుకోకుండా అతడితో పోరాడడం అవివేకం.
  8. జీర్ణం కాని చదువూ, తిండి చెరుపు చేస్తాయి.

ఆ) కింది ప్రశ్నకు 10 లేక 12 వాక్యాల్లో సమాధానం రాయండి.

ప్రశ్న 1.
‘నీతి పరిమళాలు’ పాఠ్యభాగం ఆధారంగా నీవు గ్రహించిన విషయాలను సొంతమాటల్లో రాయండి.
జవాబు:
‘నీతి పరిమళాలు’ అనే పాఠ్యభాగంలో శతక కవులు చక్కని నీతులను చెప్పారు. ఆ నీతులు సమాజానికి ఎంతగానో సహకరిస్తాయి. జగతిని జాగృతం చేస్తాయి. సారం లేకుండా చదివే చదువు ఉప్పులేని కూర వంటిది. మానవునికి బంగారు ఆభరణాలు, పుష్పాలు, సుగంధద్రవ్యాలు, పన్నీటి స్నానాలు అలంకారాలు కావు. సంస్కారవంతమైన వాక్కు మాత్రమే మానవులకు నిజమైన అలంకారం.

మానవుడు పంచేంద్రియాలను అదుపులో ఉంచుకోవాలి. అప్పుడే ఏదైనా సాధించగలడు. పంచేంద్రియాలకు బానిసలైతే పతనాన్ని పొందుతారు. మానవులకు ఓర్పు గొప్ప అలంకారం. ఓర్పుతో అసాధ్యమైన పనులను కూడా సాధించగలడు.

గొప్పవారితో తలపడడం మంచిది కాదు. శక్తిసామర్థ్యాలను గుర్తించకుండా ఎదుటివారితో తలపడితే పరాభవం కలుగక మానదు. గొప్పవారితో పోరాడటం వల్ల వారికేమీ నష్టం కలుగదనే సత్యాన్ని గ్రహించాలి. ఇలాంటి నీతులు అనేకం అనేది పాఠ్యభాగం ద్వారా గ్రహించాను.

ప్రశ్న 2.
“నోరు మంచిదైతే – ఊరు మంచిదౌతుంది” – దీన్ని సమర్థిస్తూ మాట్లాడండి.
జవాబు:
ఈ సమస్త చరాచర ప్రకృతిలో అన్నిటికన్నా అద్వితీయమైంది మానవ జన్మ. అది ఎంతో విశిష్టమైంది, విలక్షణమైంది. మమతలు పంచుకుంటూ, మంచిని పెంచుకుంటూ, మానవతకు మారాకులు తొడుగుతూ, ఇలాతలంపై చిరునవ్వుల సిరివెన్నెలలు చిలికించగల శక్తి ఒక్క మానవుడికి మాత్రమే వుంది. అయితే, ఆ మానవుడికి నిజమైన ఆభరణం ఏమిటి? పూసుకునే అత్తరులా? వేసుకునే వస్త్రాలా? చేసుకునే సింగారాలా? ఇది ఒక మహత్తరమైన ప్రశ్న. మనసుపెట్టి ఆలోచిస్తే ఇవేవీ అసలైన ఆభరణాలు కావని ఇట్టే తెలిసిపోతుంది. ఇవన్నీ చెరిగిపోయేవి, వన్నె తరిగిపోయేవి. అలా కాకుండా, మానవుడికి ఎన్నటికీ చెరగని, తరగని ఆభరణంలా నిలచేది మధురమైన వాక్కు ఒక్కటే. మృదువైన భాషణంతో మనిషి అందరినీ ఆకర్షించగలుగుతాడు. శత్రువులను కూడా మిత్రులుగా మార్చుకోగలుగుతాడు. తన పనులను విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతాడు. దీనికి భిన్నంగా పరుషమైన, కఠినమైన వాక్కు కలిగివుంటే ఆత్మీయులు కూడా ఆగర్భ శత్రువులుగా మారిపోతారు. అంతేకాదు, విరసమైన వాక్కు వలన జరిగే పనులు కూడా చెడిపోతాయి.

ఇ) కింది అంశం గురించి సృజనాత్మకంగా / ప్రశంసిస్తూ రాయండి.

ప్రశ్న 1.
‘నీతి పరిమళాలు’ పాఠం ఆధారంగా ఏయే మంచి గుణాలను అలవరచుకున్నారో పట్టిక తయారు చేయండి.
జవాబు:

  • మానవులకు బంగారు ఆభరణాలు అలంకారాలు కాదు.
  • సంస్కారవంతమైన వాక్కు మాత్రమే నిజమైన అలంకారం.
  • రసజ్ఞత లేని చదువు ఉప్పులేని కూరవంటిది.
  • గుణవంతుడు లోకానికి మేలు కలిగే కార్యక్రమమంత భారమైనా చేయడానికి ప్రయత్నిస్తాడు.
  • మానవుడు పంచేంద్రియాలను అదుపులో ఉంచుకోవాలి.
  • ఓర్పును మించిన ఆభరణం మరొకటి లేదు. ఓర్పుతో అసాధ్యములైన పనులను సాధంపవచ్చు.
  • రాజులను సేవించడం కంటే దేవదేవుడిని సేవించడం మిన్న.
  • శక్తియుక్తులు తెలుసుకోకుండా తోటివారితో పోరాడకూడదు.
  • అర్థం చేసుకొని చదవాలి. అవసరమైనంత మాత్రమే భుజించాలి.

AP Board 8th Class Telugu Important Questions Chapter 3 నీతి పరిమళాలు

ప్రశ్న 2.
నీకు నచ్చిన శతక కవిని గురించి మిత్రునికి లేఖ రాయండి.
జవాబు:

పొదిలి,
x x x x x

ప్రియమైన మిత్రుడు రాధాకృష్ణకు,

నీ మిత్రుడు రాయునది నేను బాగా చదువుతున్నాను. నీవు కూడా బాగా చదువుతున్నావని ఆశిస్తున్నాను. ముఖ్యముగా రాయునది మన తెలుగు సాహిత్యంలో ఎందరో శతకకవులు ఉన్నారు. వారిలో నాకు భాస్కర శతక రచయిత మారద వెంకయ్య బాగా నచ్చారు. వారు జీవిత సత్యాలను చక్కగా ఆవిష్కరించారు. ప్రతి పద్యంలోను, దృష్టాంతంలో చెప్పిన విధం ఆకట్టుకుంది, అన్ని రంగాలమీద తన అభిప్రాయాలను, ముఖ్యంగా చదువు, వినయం మొదలైన విషయాల మీద చక్కని పద్యాలను రచించారు. భాస్కరా అనే మకుటంతో పద్యాలు రచించారు. వీరి శైలి కూడా లలితంగా ఉంటుంది. అట్లే నీకు నచ్చిన శతక కవిని గురించి వివరంగా నాకు తెలియజేయి. పెద్దలందరికి నా నమస్కారాలు తెలుపగలవు.

ఇట్లు,
నీ మిత్రుడు,
x x x x x x

చిరునామా :
టి. రాధాకృష్ణ, 10వ తరగతి,
జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల,
పెదనందిపాడు, గుంటూరు జిల్లా,
ఆంధ్రప్రదేశ్.

ప్రశ్న 3.
పాఠంలోని పద్యభాగాల ఆధారంగా విద్యార్థులలో నైతిక విలువల పట్ల అవగాహన పెంచడానికై ఒక కరపత్రాన్ని తయారుచేయండి.
జవాబు:
శతకపద్యాలు చదవండి

ప్రియమైన విద్యార్థులారా ! మన తెలుగు సాహిత్యంలో శతక గ్రంథాలకు ప్రత్యేక స్థానం ఉన్నది. ఎందరో మహాకవులు తమ జీవిత అనుభవసారాన్ని రంగరించి చిన్న చిన్న పద్యాలతో మనకు అందించారు. విలువైన అంశాలను చిన్నపద్యాల్లో చిరస్థాయిగా గుర్తుపెట్టుకోనే విధంగా అందించారు. దీన్ని మనం మరువకూడదు. వేమన, వీరబ్రహ్మం వంటి ప్రజా కవులు సమాజంలోని సాంఘిక దురాచారాలను తూర్పారబట్టారు. నైతిక విలువల్ని, మనోధైర్యాన్ని పెంచడానికి కృషి చేశారు. ఆ మహనీయుల పద్యరత్నాలను అందరూ చదవండి. వాటిని ఆచరించండి. లోకానికి ఆదర్శంగా నిలువండి.
ఇట్లు,
తెలుగు భాషా సేవా కమిటి.

ప్రశ్న 4.
పాఠశాలలో జరిగే భాషోత్సవాన్ని తిలకించడానికి ప్రముఖ శతకకవులు వచ్చారు. వారి ద్వారా శతకాల గురించి, వారి రచనలను గురించి తెలుసుకోవడానికి పిల్లలు ఇంటర్వ్యూ చేయాలనుకున్నారు. మీరైతే ఏమని ఇంటర్వ్యూ చేస్తారు ? ఇంటర్వ్యూకు అవసరమైన ప్రశ్నావళిని రూపొందించండి.
జవాబు:
ఇంటర్వ్యూ ప్రశ్నావళి

  1. శతక కవులకు స్వాగతం. ‘శతకాలు’ ఎన్ని రకాలు?
  2. తెలుగులో మొదటి శతకకర్త ఎవరు?
  3. శతకాల్లో ఎన్ని రకాలున్నాయి?
  4. మకుటం లేని శతకాలు ఏమైనా ఉన్నాయా?
  5. నీతి శతకాల ప్రాముఖ్యత ఏమిటి?
  6. భక్తి శతకాలు మీరు ఏమైనా రాశారా?
  7. ‘కాళహస్తీశ్వర శతకం’లో భక్తి ఎక్కువగా ఉందా? రాజదూషణ ఉందా?
  8. వసురాయకవి గారి భక్త చింతామణి శతకం గూర్చి చెప్పండి.
  9. ‘సుమతి శతకం’ ప్రత్యేకత. ఎటువంటిది?
  10. మీకు నచ్చిన శతకం ఏమిటి?
  11. ఛందోబద్ధం కాని శతకాలు ఏమైనా ఉన్నాయా?
  12. మీరు మాకు ఇచ్చే సందేశం ఏమిటి?

8th Class Telugu 3rd Lesson నీతి పరిమళాలు 1 Mark Bits

1. తావినికికి జిక్కెం “జిల్వ” (అర్థాన్ని గుర్తించండి) (S.A. I – 2018-19)
ఎ) చేప
బి) పాము
సి) ఏనుగు
డి) తేనెటీగ
జవాబు:
బి) పాము

2. “రాముడు” ఇది ఏ గణం? (S.A. I – 2018-19)
ఎ) ర గణం
బి) జ గణం
సి) డ గణం
డి) న గణం
జవాబు:
సి) డ గణం

AP Board 8th Class Telugu Important Questions Chapter 3 నీతి పరిమళాలు

3. మూడూ లఘువులు గల గణం ఏది?
ఎ) స గణం
బి) న గణం
సి) ర గణం
డి) మ గణం
జవాబు:
బి) న గణం

4. కరుణా పయోనిధి గాంభీర్య ఘనుడు (అర్థాన్ని గుర్తించండి) (S.A. II – 2018-19)
ఎ) నది
బి) లోయ
సి) తటాకం
డి) సముద్రము
జవాబు:
డి) సముద్రము

5. ఏనుగుల బలము చాలా ఎక్కువ. (గురులఘువులు గుర్తించండి) (S.A. II – 2018-19)
ఎ) UIU
బి) III
సి) IIU
డి) UUI
జవాబు:
బి) III

6. రాజు బడికి వెళ్ళాలని తొందర పడుతున్నాడు. (సంధి విడదీయండి) (S.A. II – 2017-18)
ఎ) వెళ్ళా + లని
బి) వెళ్ళాల + అని
సి) వెళ్ళాలి + అని
డి) వెళ్ళా + అని
జవాబు:
సి) వెళ్ళాలి + అని

7. మూడూ గురువులే ఉండే గణం ఏది? (S.A. I – 2019-20)
బి) ర గణం
ఎ) న గణం
సి) జ గణం
డి) మ గణం
జవాబు:
డి) మ గణం

భాషాంశాలు – పదజాలం

అర్ధాలు :

8. విద్యార్థులకు క్షమ అవసరం – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) దారి
బి) ధనం
సి) ఓర్పు
డి) వినయం
జవాబు:
సి) ఓర్పు

9. శత్రువులకు కూడా చెఱుపు తల పెట్టకూడదు – గీత గీసిన పదానికి గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) వారి
బి) కీడు
సి) అగ్ని
డి) జలధి
జవాబు:
బి) కీడు

AP Board 8th Class Telugu Important Questions Chapter 3 నీతి పరిమళాలు

10. సరస్సులో మీనం ఉంది – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) ఎలుక
బి) చేప
సి) కప్పు
డి) పాము
జవాబు:
బి) చేప

11. చిరకాలం జీవించాలి – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) గతకాలం
బి) మంచి కాలం
సి) విద్యా కాలం
డి) చాలా కాలం
జవాబు:
డి) చాలా కాలం

12. ధరిత్రి పై శాంతి నిలవాలి – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) భూమి
బి) జలధి
సి) సాగరం
డి) వనం
జవాబు:
ఎ) భూమి

13. ఇంచుక జ్ఞానం అవసరం – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) తపన
బి) కొంచెము
సి) అధికము
డి) చాతుర్యం
జవాబు:
బి) కొంచెము

14. పయోధిలో రత్నాలు ఉంటాయి – గీత అర్థం గుర్తించండి.
ఎ) అవని
బి) పాపము
సి) సముద్రం
డి) భూషణము
జవాబు:
సి) సముద్రం

పర్యాయపదాలు :

15. భాస్కరుడు గొప్ప కాంతివంతుడు – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
ఎ) సూర్యుడు, రజనీకరుడు
బి) రవి, ప్రభాకరుడు
సి) ఆదిత్యుడు, చంద్రుడు
డి) రవి, కువలయానందకరుడు
జవాబు:
బి) రవి, ప్రభాకరుడు

AP Board 8th Class Telugu Important Questions Chapter 3 నీతి పరిమళాలు

16. విద్యార్థులు కీర్తి పొందాలి – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
ఎ) తపస్సు, ఉషస్సు
బి) రోచస్సు, ధనుస్సు
సి) యశస్సు, ఖ్యాతి
డి) ధరణి, వర్చస్సు
జవాబు:
సి) యశస్సు, ఖ్యాతి

17. అమృతం సేవిస్తారు దేవతలు – గీత గీసిన పదానికి సమానార్థక పదం గుర్తించండి.
ఎ) క్షీరం
బి) నారం
సి) వారి
డి) సుధ
జవాబు:
డి) సుధ

18. దివిపై తారలు ఉదయించాయి – గీత గీసిన పదానికి సమానార్థక పదం గుర్తించండి.
ఎ) చుక్కలు, నక్షత్రాలు
బి) దినకరాలు, అరవిందాలు
సి) కుముదాలు, కలువలు
డి) నిలయాలు, కిసలయాలు
జవాబు:
ఎ) చుక్కలు, నక్షత్రాలు

19. సింహం వడిగా వెళ్ళింది – గీత గీసిన పదానికి సమానార్థకం గుర్తించండి.
ఎ) వాయువు
బి) వేగం
సి) మందం
డి) దురంతం
జవాబు:
బి) వేగం

20. రాజు ప్రజలను పాలించు – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
ఎ) నీరపతి, జలనిధి
బి) గతనందనుడు, దాశరథి
సి) నృపతి, క్షితిపతి
డి) అంబుధి, సచివుడు
జవాబు:
సి) నృపతి, క్షితిపతి

ప్రకృతి – వికృతులు :

21. లక్ష్మి సంపదలను ఇచ్చు – గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.
ఎ) లెచ్చి
బి) లచ్చి
సి) లచ్చ
డి) లక్కి
జవాబు:
బి) లచ్చి

AP Board 8th Class Telugu Important Questions Chapter 3 నీతి పరిమళాలు

22. గుణమును ఆశ్రయించాలి – గీత గీసిన పదానికి వికృతిని గుర్తించండి.
ఎ) గెనము
బి) గనము
సి) గృనము
డి) గొనము
జవాబు:
డి) గొనము

23. దేశ చరిత్ర ఉన్నతమైంది – గీత గీసిన పదానికి వికృతిని గుర్తించండి.
ఎ) చోరిత
బి) చరిత
సి) చారిత్ర
డి) చెరిత్ర
జవాబు:
బి) చరిత

24. అగ్గిలో పడితే కాలుతుంది – గీత గీసిన పదానికి వికృతి పదం ఏది?
ఎ) అగ్న
బి) అగ్ని
సి) అగ్గి
డి) అగ్లీ
జవాబు:
బి) అగ్ని

25. హృదయం నిర్మలంగా ఉండాలి – గీత గీసిన పదానికి వికృతిని గుర్తించండి.
ఎ) ఎద
బి) హేవయం
సి) హోదయం
డి) హదయం
జవాబు:
ఎ) ఎద

26. శ్రీ కావాలి – గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.
ఎ) సరి
బి) సెరి
సి) శీరి
డి) సిరి
జవాబు:
డి) సిరి

27. నీకు కర్ణం చేయాలి – గీత గీసిన పదానికి వికృతిని గుర్తించండి.
ఎ) కార్యం
బి) కర్రమ
సి) కారం
డి) పని
జవాబు:
ఎ) కార్యం

నానార్థాలు :

28. ఆకాశంలో మిత్రుడు ప్రకాశిస్తున్నాడు – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
ఎ) వారిధి, వార్షికం
బి) సూర్యుడు, స్నేహితుడు
సి) రవి, శని
డి) గురువు, వారిధి
జవాబు:
బి) సూర్యుడు, స్నేహితుడు

AP Board 8th Class Telugu Important Questions Chapter 3 నీతి పరిమళాలు

29. సుధను దేవతలు త్రాగుతారు – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
ఎ) దధి, క్షీరం
బి) ఘృతం, వారి
సి) అమృతం, పాలు
డి) నీరు, లవణం
జవాబు:
డి) నీరు, లవణం

30. రాజు కువలయానందకరుడు – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
ఎ) ఉదధి, వారిదం
బి) నృపతి, చంద్రుడు
సి) శుక్రుడు, వాచస్పతి
డి) వారిధి, అంబుధి
జవాబు:
బి) నృపతి, చంద్రుడు

31. సూర్యుని కరం కాంతివంతం – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
ఎ) కిరణం, వాయువు
బి) జలధి, ఉదధి
సి) వారిదం, కీడు
డి) చేయి, తొండము
జవాబు:
డి) చేయి, తొండము

వ్యుత్పత్త్యర్థాలు :

32. దాశరథి రక్షించుగాక – గీత గీసిన పదానికి వ్యుత్పత్త్యర్థం గుర్తించండి.
ఎ) దశరథుని కుమారుడు
బి) దాశరథికి తమ్ముడు
సి) దశరథుని చేత తమ్ముడు
డి) దశరథునికి ఆత్మీయుడు
జవాబు:
ఎ) దశరథుని కుమారుడు

33. పయోధి – ఈ పదానికి వ్యుత్పత్తి గుర్తించండి.
ఎ) నీటికి చెందునది
బి) నీటిలో రత్నాలు కలది
సి) నీటిని ధరించునది
డి) నీటి కొరకు ఆనందము
జవాబు:
సి) నీటిని ధరించునది

34. విశ్వమును ధరించునది – అనే వ్యుత్పత్త్యర్థం గల పదం ఏది?
ఎ) భూషితం
బి) ధరణి
సి) జలధి
డి) వారిధి
జవాబు:
బి) ధరణి

AP Board 8th Class Telugu Important Questions Chapter 3 నీతి పరిమళాలు

35. ‘కరి’ దీనికి వ్యుత్పత్త్యర్థం గుర్తించండి.
ఎ) అంకుశం కలది
బి) కరము కలది
సి) నీరము కలది
డి) క్షీరము కలది
జవాబు:
బి) కరము కలది

36. సర్వభూతములయందు సమభావన కలవాడు – అనే వ్యుత్పత్త్యర్థం గల పదం ఏది?
ఎ) వారి
బి) జలధి
సి) మిత్రుడు
డి) శత్రువు
జవాబు:
సి) మిత్రుడు

37. పాపములను తొలగించువాడు – అనే వ్యుత్పత్త్యర్థం గల పదం ఏది?
ఎ) ఈశుడు
బి) విధాత
సి) వేంకటేశుడు
డి) శంకరుడు
జవాబు:
సి) వేంకటేశుడు

వ్యాకరణాంశాలు

సంధులు :

38. శివునికి జలాభిషేకం చేశారు – గీత గీసిన పదాన్ని విడదీయండి.
ఎ) జన + అభిషేకం
బి) జల + అభిషేకం
సి) జలే + అభిషేకం
డి) జలా + ఆభిషేకం
జవాబు:
బి) జల + అభిషేకం

AP Board 8th Class Telugu Important Questions Chapter 3 నీతి పరిమళాలు

39. వేంకటేశ నమోనమః – గీత గీసిన పదాన్ని విడదీయండి.
ఎ) వేంకట + ఈశ
బి) వేంకట్ + ఈశు
సి) వెంకట + ఆశ
డి) వేంక + టేశ
జవాబు:
డి) వేంక + టేశ

40. వీటిలో ఆమ్రేడిత సంధికి ఉదాహరణను గుర్తించండి.
ఎ) పల్లెటూరు
బి) ముందడుగు
సి) ఊరూరు
డి) చిగురుటాకు
జవాబు:
సి) ఊరూరు

41. చాలకున్న – ఇది ఏ సంధి పదమో గుర్తించండి.
ఎ) ఉత్వసంధి
బి) ఇత్వసంధి
సి) అత్వసంధి
డి) ఆమ్రేడిత సంధి
జవాబు:
సి) అత్వసంధి

42. కీర్తిఁగోరుట మంచిది – గీత గీసిన పదం ఏ సంధి?
ఎ) ఉత్వసంధి
బి) సరళాదేశ సంధి
సి) త్రికసంధి
డి) అత్వసంధి
జవాబు:
బి) సరళాదేశ సంధి

AP Board 8th Class Telugu Important Questions Chapter 3 నీతి పరిమళాలు

43. లక్ష్మీ నీవే నాకు రక్ష – గీత గీసిన పదం ఏ సంధి?
ఎ) సవర్ణదీర్ఘ సంధి
బి) త్రికసంధి
సి) ఆమ్రేడిత సంధి
బి) పడ్వాదిసంధి
జవాబు:
ఎ) సవర్ణదీర్ఘ సంధి

44. దానికేమి? ఎక్కడ ఉన్నావు? – గీత గీసిన పదానికి సంధిని గుర్తించండి.
ఎ) యడాగమ సంధి
బి) సరళాదేశ సంధి
సి) ఇత్వసంధి
డి) అత్వసంధి
జవాబు:
సి) ఇత్వసంధి

45. శ్రీకాళహస్తీశ్వరా – దీనిని విడదీయండి.
ఎ) శ్రీ + కాళహస్తీశ్వరా
బి) శ్రీకాళహస్తి + ఈశ్వరా
సి) శ్రీకాళహస్తి + ఏశ్వరా
డి) శ్రీకాళ + హస్తీశ్వరా
జవాబు:
బి) శ్రీకాళహస్తి + ఈశ్వరా

గణ విభజన

46. ‘ఉత్పలమాల’ – దీనికి గల గణాలను గుర్తించండి.
ఎ) భ, ర, న, భ, భ, ర, వ
బి) మ, స, జ, స, త, త, గ
సి) స, భ, ర, న, మ, య, వ
డి) న, జ, భ, జ, జ, జ, ర
జవాబు:
ఎ) భ, ర, న, భ, భ, ర, వ

47. UUU – ఇది ఏ గణము?
ఎ) న గణం
బి) మ గణం
సి) త గణం
డి) భ గణం
జవాబు:
బి) మ గణం

48. చంపకమాల – వృత్తంలోని పాదానికి అక్షరాల సంఖ్య
ఎ) 21
బి) 20
సి) 19
డి) 22
జవాబు:
ఎ) 21

49. ‘భూషలు’ – ఇది ఏ గణము?
ఎ) త గణం
బి) మ గణం
సి) భ గణం
డి) య గణం
జవాబు:
సి) భ గణం

50. క్షమను చిరమువారు కావగలదు – ఇది ఏ పద్య పాదము?
ఎ) మత్తేభం
బి) ఆటవెలది
సి) తేటగీతి
డి) కందం
జవాబు:
బి) ఆటవెలది

వాక్యాలు

51. అల్లరి చేయవద్దు – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) విధ్యర్ధక వాక్యం
బి) తద్ధర్మార్థక వాక్యం
సి) అప్యర్థక వాక్యం
డి) నిషేధార్థక వాక్యం
జవాబు:
డి) నిషేధార్థక వాక్యం

AP Board 8th Class Telugu Important Questions Chapter 3 నీతి పరిమళాలు

52. మీకు మేలు కలుగుగాక ! – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) నిషేధాక వాక్యం
బి) అభ్యర్థక వాక్యం
సి) ఆశీరార్థక వాక్యం
డి) విధ్యర్థక వాక్యం
జవాబు:
సి) ఆశీరార్థక వాక్యం

53. వాడు వస్తాడో రాడో? – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) కర్మణి వాక్యం
బి) సందేహార్థక వాక్యం
సి) అద్యర్థక వాక్యం
డి) ధాత్వర్థక వాక్యం
జవాబు:
బి) సందేహార్థక వాక్యం

54. తప్పక అందరు రావాలి – దీనికి వ్యతిరేకార్థక వాక్యం గుర్తించండి.
ఎ) తప్పక అందరు రాకూడదు
బి) తప్పక కొందరు రాకూడదు
సి) తప్పక కొందరు రాకపోవచ్చు
డి) అందరు తప్పక రాలేకపోవచ్చు
జవాబు:
బి) తప్పక కొందరు రాకూడదు

55. అందరు కలలు కనాలి – దీనికి వ్యతిరేకార్థక వాక్యం గుర్తించండి.
ఎ) అందరు కలలు కనలేకపోవచ్చు.
బి) అందరు కలలు కని తీరాలి.
సి) అందరు కలలు కనకూడదు.
డి) కొందరు కలలు కనాలి.
జవాబు:
సి) అందరు కలలు కనకూడదు.

56. రమ తెలివైనది, అందమైనది – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) సంక్లిష్ట వాక్యం
బి) కర్తరి వాక్యం
సి) కర్మణి వాక్యం
డి) సంయుక్త వాక్యం
జవాబు:
డి) సంయుక్త వాక్యం

AP Board 8th Class Telugu Important Questions Chapter 3 నీతి పరిమళాలు

57. ధూర్జటి శతకం రచించాడు – దీనికి కర్మణి వాక్యం గుర్తించండి.
ఎ) ధూర్జటి యందు శతకం రాశాడు.
బి) ధూర్జటి చేత శతకం రచింపబడింది.
సి) ధూర్జటి వల్ల శతకం రాశాడు.
డి) ధూర్జటికి శతకం రాయవచ్చు.
జవాబు:
బి) ధూర్జటి చేత శతకం రచింపబడింది.

58. అల్లరి చేస్తే శిక్ష తప్పదు – ఇది ఏ రకమైన సంక్లిష్ట వాక్యం?
ఎ) చేదర్థకం
బి) అప్యకం
సి) శత్రర్థకం
డి) క్వార్ధకం
జవాబు:
ఎ) చేదర్థకం

అలంకారాలు

59. విష్ణు రోచిష్ణు జిష్ణు సహిష్టు – ఇందలి అలంకారాన్ని గుర్తించండి.
ఎ) ఉపమ
బి) వృత్త్యనుప్రాస
సి) లాటానుప్రాస
డి) యమకం
జవాబు:
బి) వృత్త్యనుప్రాస

AP Board 8th Class Telugu Important Questions Chapter 3 నీతి పరిమళాలు

60. వీరు పొమ్మనువారు కాదు పొగబెట్టువారు – ఇందులోని అలంకారాన్ని గుర్తించండి.
ఎ) అంత్యానుప్రాస
బి) వృత్త్యనుప్రాస
సి) యమకం
డి) లాటానుప్రాస
జవాబు:
బి) వృత్త్యనుప్రాస

సొంతవాక్యాలు :

61. లోకహితం : మహనీయులు లోకహితం కోసం నిరంతరం ప్రయత్నిస్తారు.

62. సత్త్వము : పాండవులు యుద్ధంలో తమ సత్త్వమును ప్రదర్శించారు.

63. క్షమ : విద్యార్థులకు అన్ని రంగాల్లోను క్షమ మిక్కిలి అవసరం.

64. పవిత్రవాణి : సజ్జనులు సభల్లో తమ పవిత్ర వాణిని వినిపిస్తారు.

65. నలపాకము : వివాహ విందులోని వంటకాలు నలపాకమువలె రుచికరంగా ఉన్నాయి.

66. అనిశం : భారత సైనికులు సరిహద్దుల్లో అనిశం రక్షణ బాధ్యతలను చూస్తారు.

67. రసజ్ఞత : కవులు సందర్భానుగుణంగా రసజ్ఞతతో మాట్లాడుతారు.

68. భూషణము : విద్వాంసులకు వినయమే గొప్ప భూషణము.

69. నిరర్థకము : నిరర్థకంగా సంపదను, కాలాన్ని వృథా చేయకూడదు.

70. స్వచ్ఛము : మా చెరువులోని నీరు స్వచ్ఛముగా ఉన్నది.

AP Board 8th Class Telugu Important Questions Chapter 5 ప్రతిజ్ఞ

AP State Syllabus AP Board 8th Class Telugu Important Questions Chapter 5 ప్రతిజ్ఞ.

AP State Syllabus 8th Class Telugu Important Questions 5th Lesson ప్రతిజ్ఞ

8th Class Telugu 5th Lesson ప్రతిజ్ఞ Important Questions and Answers

I. అవగాహన – ప్రతిస్పందన

అ) కింది అపరిచిత పద్యాలు చదివి, ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.

1. మేడిపండు జూడ మేలిమై యుండును
పొట్టవిప్పిచూడ పురుగులుండు
పిరికివాని మదిని బింకమీలాగుర
విశ్వదాభిరామ వినురవేమ!
ప్రశ్నలు :
1. పిరికివాడు దేనితో పోల్చబడినాడు?
జవాబు:
పిరికివాడు మేడిపండుతో పోల్చబడినాడు.

2. మేడిపండు పైకి ఏ విధంగా ఉంటుంది?
జవాబు:
మేడిపండు పైకి చక్కగా ఉంటుంది.

3. మేడిపండు లోపల ఎలా ఉంటుంది?
జవాబు:
మేడిపండు లోపల పురుగులతో కూడి ఉంటుంది.

4. ఈ పద్యం వల్ల తెలిసిందేమిటి?
జవాబు:
ఈ పద్యంవల్ల పిరికివాని స్వభావం తెలుస్తోంది.

2. ధనము కూడబెట్టి ధర్మంబు సేయక
తాను తినక లెస్స దాచుగాక
తేనెటీగ గూర్చి తెరువరి కీయదా
విశ్వదాభిరామ వినురవేమ !
ప్రశ్నలు :
1. తేనెటీగ తేనెను ఎవరికి ఇస్తున్నది?
జవాబు:
తేనెటీగ తేనెను తెరువరికి (బాటసారికి) ఇస్తున్నది.

2. తాను తినక, కూడబెట్టువారి నేమందురు?
జవాబు:
తాను తినక, కూడబెట్టువారిని పిసినారి అంటారు.

3. పై పద్యము నందలి భావమేమి?
జవాబు:
కూడబెట్టిన ధనం సద్వినియోగం చేయకపోతే వృథా అవుతుంది.

4. కూడబెట్టిన ధనము ఎట్లు సద్వినియోగమగును?
జవాబు:
కూడబెట్టిన ధనం దానం చేసినా లేదా తాను అనుభవించినా సద్వినియోగం అవుతుంది.

AP Board 8th Class Telugu Important Questions Chapter 5 ప్రతిజ్ఞ

3. అనగ ననగ రాగ మతిశయిల్లుచు నుండు
తినగ తినగ వేము తీయనుండు
సాధనమున పనులు సమకూరు ధరలోన
విశ్వదాభిరామ వినురవేమ !
ప్రశ్నలు :
1. అంటూ ఉంటే అతిశయిల్లేది ఏది?
జవాబు:
అంటూ ఉంటే రాగం అతిశయిల్లుతుంది.

2. తింటూ ఉంటే తీయనయ్యేది ఏది?
జవాబు:
తింటూ ఉంటే వేపాకు తీయనవుతుంది.

3. సాధనతో సమకూరేవి ఏవి?
జవాబు:
సాధనతో పనులు సమకూరుతాయి.

4. ఈ పద్యానికి మకుటం ఏది?
జవాబు:
‘విశ్వదాభిరామ వినురవేమ’ అనేది ఈ పద్యానికి మకుటం.

4. మేరు నగము వంటి ధీరత కలిగియు
పరమశివుడు తనదు పదములంట
ఇంచుకంత చంచలించె పర్వతరాజు
దేవదేవుడన్న భావనమున.
ప్రశ్నలు:
1. పర్వతరాజు ఎటువంటి ధీరత గలవాడు?
జవాబు:
పర్వతరాజు మేరు నగము వంటి ధీరత గలవాడు.

2. పర్వతరాజు పాదాలకు నమస్కరించ వచ్చినదెవరు?
జవాబు:
పర్వతరాజు పాదాలకు నమస్కరించ వచ్చినది పరమ శివుడు.

3. ఇంచుకంత చలించినది ఎవరు?
జవాబు:
ఇంచుకంత చలించినది పర్వతరాజు.

4. పర్వతరాజు శివుని ఎట్లా భావించాడు?
జవాబు:
పర్వతరాజు శివుని దేవదేవుడుగా భావించాడు.

5. ఆత్మ శుద్ధి లేని ఆచారమదియేల?
భాండ శుద్ధి లేని పాకమేల?
చిత్త శుద్ధి లేని శివపూజలేలరా?
విశ్వదాభిరామ వినురవేమ !
ప్రశ్నలు :
1. పాకమునకు దేని శుద్ధి అవసరం?
జవాబు:
పాకమునకు భాండశుద్ధి అవసరం.

2. చిత్తశుద్ధి లేకుండా దేనిని చేయకూడదు?
జవాబు:
చిత్తశుద్ధి లేకుండా శివపూజలు (దైవపూజలు) చేయకూడదు.

3. ఈ పద్యానికి శీర్షికను నిర్ణయించండి.
జవాబు:
ఈ పద్యానికి శీర్షిక ‘శుద్ధి’ (నిర్మలత్వం) అని పెట్టవచ్చు.

4. ఈ పద్యాన్ని రాసిన కవి ఎవరు?
జవాబు:
ఈ పద్యాన్ని రాసిన కవి వేమన.

AP Board 8th Class Telugu Important Questions Chapter 5 ప్రతిజ్ఞ

6. మఱవవలెఁ గీడు నెన్నఁడు
మఱవంగా రాదు మేలు మర్యాదలలోఁ
దిరుగవలె సర్వజనములం
దరిఁప్రేమన్ మెలగవలయుఁ దరుణి కుమారీ !
ప్రశ్నలు :
1. దేనిని మరచిపోవాలి?
జవాబు:
కీడును మరచిపోవాలి.

2. దేనిని మరువరాదు?
జవాబు:
మేలును మరువరాదు.

3. అందరి ఎడల ఎట్లా మెలగాలి?
జవాబు:
అందరి యెడల మర్యాదలతోను, ప్రేమతోను మెలగాలి.

4. ఈ పద్యం ఏ శతకం లోనిది?
జవాబు:
ఈ పద్యం ‘కుమారీ శతకం’ లోనిది.

7. ఈ కింది పరిచిత గేయాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.
శ్రమైక జీవన సౌందర్యానికి
సమానమైనది లేనే లేదని
కష్టజీవులకు, కర్మవీరులకు
నిత్యమంగళం నిర్దేశిస్తూ,
స్వస్తి వాక్యములు సంధానిస్తూ,
స్వర్ణ వాద్యములు సంరావిస్తూ,
వ్యథార్త జీవిత యథార్థ దృశ్యం
పునాదిగా ఇక జనించబోయే
భావివేదముల జీవనాదములు
జగత్తుకంతా చవులిస్తానోయ్.
ప్రశ్నలు:
1. భావివేదములు, జీవనాదములు దేనినుండి పుడతాయి?
జవాబు:
బాధచే పీడింపబడిన జీవితం.

2. భక్తి, ముక్తి, రక్తి వంటి పదాలు వాక్యం చివర ఉంటే దానిని ‘అంత్యప్రాస’ అంటారు. అటువంటి మూడు పదాలు పై గేయంలో ఉన్నాయి వెతికి రాయండి.
జవాబు:
నిర్దేశిస్తూ, సంధానిస్తూ, సంరావిస్తూ.

3. ఏ సౌందర్యం గొప్పదని కవి ఉద్దేశం?
జవాబు:
శ్రమైక జీవన సౌందర్యం

4. పై గేయం ఆధారంగా ఒక ప్రశ్న తయారుచేయండి.
జవాబు:
పై మాటలు ఎవరివి ?

8. ఈ కింది గేయం చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.
త్రిలోకాలలో, త్రికాలాలలో
శ్రమైక జీవన సౌందర్యానికి
సమానమైనది లేనే లేదని
కష్ట జీవులకు కర్మ వీరులకు
నిత్య మంగళం నిర్దేశిస్తూ
స్వస్తి వాక్యములు సంధా నిస్తూ
స్వర్ణ వాద్యములు సంరాలిస్తూ
వ్యథార్త జీవిత యథార్థ దృశ్యం
ప్రశ్నలు
1. కవి ఎవరికి మంగళం నిర్దేశించారు?
జవాబు:
కష్టజీవులకు, కర్మవీరులకు

2. దేనికి సమానమైనది లేదని చెప్పినారు?
జవాబు:
శ్రమైక జీవన సౌందర్యానికి

3. ఈ గేయం రచయిత ఎవరు?
జవాబు:
శ్రీరంగం శ్రీనివాసరావు (శ్రీ.శ్రీ)

4. పై గేయం ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి.
జవాబు:
‘సంరావిస్తూ’ అనగానేమి?

AP Board 8th Class Telugu Important Questions Chapter 5 ప్రతిజ్ఞ

9. కింది అపరిచిత గేయం చదవండి. ప్రశ్నలకు సరైన సమాధానాలు రాయండి. (S.A.III-2016-17)
అడవిలేక అవని లేదు – చెట్టులేక చెలిమి లేదు
మొక్క మానై ఎదగకుంటే – జీవకోటికి బతుకు లేదు
చెట్టు చేమను రక్షించుకుంటూ – బతుకుదీపం కాపాడుకుంటూ
తోడుగుందామా అడవికి ఊపిరౌదామా – తోడుగుందామా అడవికి ఊతమౌదామా
ప్రశ్నలు
1. అవని అంటే అర్థం ఏమిటి?
జవాబు:
భూమి

2. జీవకోటి బతకాలంటే ఏమేమి కావాలి?
జవాబు:
చెట్లు, ఆహారం

3. చెట్లను రక్షించడం వల్ల ప్రయోజనాలు ఏవి?
జవాబు:
గాలి, ఆహారం దొరుకుతాయి.

4. పై గేయం ఆధారంగా ప్రశ్న తయారుచేయండి.
జవాబు:
‘మాను’ అంటే ఏమిటి?

II. వ్యక్తీకరణ – సృజనాత్మకత

అ) కింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాల్లో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
‘ప్రతిజ్ఞ’ పాఠ్యభాగ రచయితను గురించి రాయండి. (S.A. I – 2019-2017)
జవాబు:
‘ప్రతిజ్ఞ’ పాఠ్యభాగ రచయిత శ్రీశ్రీ. ఈయన పూర్తి పేరు శ్రీరంగం శ్రీనివాసరావు. వీరు 1910వ సంవత్సరంలో విశాఖపట్టణంలో జన్మించారు. తన పద్దెనిమిదవ సంవత్సరంలోనే ‘ప్రభవ’ కావ్యాన్ని రచించాడు. వీరి రచనల్లో ‘మహాప్రస్థానం’ మిక్కిలి ప్రసిద్ధి చెందింది. వీరు ఎన్నో నాటకాలు, రేడియో నాటికలు, నవలలు రచించారు. వీరి ఆత్మకథ పేరు ‘అనంతం’. కార్మికకర్షక లోకానికి ప్రతీకగా ఈ మహాకవి నిలిచారు. అభ్యుదయ కవిత్వానికి నాంది పలికారు.

ప్రశ్న 2.
శ్రీశ్రీ గారి అభ్యుదయ దృక్పథాన్ని వివరించండి.
జవాబు:
తెలుగు సాహిత్య చరిత్రలో శ్రీశ్రీ గారికి సమున్నతమైన స్థానం ఉంది. కార్మికకర్షక జీవితాలను, వారి బాధలను కళ్ళకు కట్టినట్టుగా వర్ణించారు. అభ్యుదయ కవిత్వానికి వారధిగా నిలిచారు. కార్మికుల కష్టానికి తగిన ప్రతిఫలం రావడం లేదని నినదించారు. అక్షరాలను ఆయుధాలుగా చేసుకున్నారు. పదునైన వాగ్భాణాలను సమాజంపై సంధించారు. ప్రజాకవిగా తెలుగు సాహిత్య చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు. భావి కవులకు మార్గదర్శకంగా నిలిచారు.

ఆ) కింది ప్రశ్నకు 10 లేక 12 వాక్యాల్లో సమాధానం రాయండి.

ప్రశ్న 1.
ఈ కవిత మీకు ఎందుకు నచ్చిందో సొంతమాటల్లో రాయండి.
జవాబు:
ఈ కవితలో శ్రీశ్రీగారు కార్మికులను, కర్షకులను నాయకులుగా చూపుతూ రాయటం నాకు చాలా నచ్చింది. బాగా ఆలోచించి చూస్తే కర్షకులు, కార్మికులూ ప్రపంచ సౌభాగ్యం కోసం, ఎంత కష్టపడుతున్నారో, ఎంతగా చెమటను చిందిస్తున్నారో, ఎంతగా త్యాగం చేస్తున్నారో మనకు అర్థం అవుతుంది.

రైతులు పంటలు పండించకపోతే, మనకు తిండి దొరికేది కాదు అని అనుకున్నప్పుడు, రైతులు గొప్ప త్యాగమూర్తులనీ, నిజంగానే వారి చెమటకు విలువ కట్టలేమని అనిపిస్తుంది.

అలాగే కార్మికులు తాము కష్టించి మనకు కావలసిన వస్తువులను తయారుచేసి ఇస్తున్నారు. వారి కళ్ళల్లోని అగ్నికీ, కన్నీటికీ విలువ కట్టలేమని శ్రీశ్రీ చెప్పిన మాట, ఎంతో సత్యమనిపించింది. అందుకే ఈ కవిత నచ్చింది. తాను రాసిన కవితను శ్రీశ్రీ కార్మికలోకపు కళ్యాణానికి, శ్రామికలోకపు సౌభాగ్యానికి అంకితమివ్వడం నాకు నచ్చింది.

ఈ కవితలోని అంత్యప్రాసలూ, అనుప్రాసలూ గేయరచనకు ఎంతో అందాన్ని ఇస్తున్నాయి.

గేయంలోని కవి ఆవేశం, ఆయనకు కర్షక కార్మికులపై గల అనురాగం ఎంతో నచ్చింది. తన నవ్య కవిత్వానికి వృత్తి పనివారల చిహ్నాలే భావం, భాగ్యం, ప్రణవం అని చెప్పిన మాట, కవిగారి కార్మిక ప్రేమకు నిదర్శనం. ఈ గేయంలోని మాత్రాఛందస్సు, ఎంతో అందంగా చెవులకు ఇంపుగా, పాడుకోవడానికి వీలుగా ఉంది.

ఇ) కింది సృజనాత్మకత ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
నీకు నచ్చిన కవిని గురించి నీ మిత్రునికి లేఖ రాయండి.
జవాబు:

గుడివాడ,
x x x x x

ప్రియమిత్రుడు రామారావు,
నీ మిత్రుడు రాయునది. నేను బాగా చదువుతున్నాను. ముఖ్యముగా వ్రాయునది. మన తెలుగు సాహిత్యంలో ఎందరో మహాకవులు ఉన్నారు. వారిలో శ్రీశ్రీ గారు. ప్రముఖులు. ఈయన ప్రజాకవి గాను, అభ్యుదయ కవిత్వానికి పితామహుడిగా గుర్తింపు పొందారు. కార్మిక కర్షక లోకానికి స్ఫూర్తిదాతగా నిలిచాడు. ప్రజల సమస్యలను తన సమస్యలనుగా? తీసుకొని రచనలు చేశారు. వీరు రచించిన మహాప్రస్థానం విశేషఖ్యాతిని పొందింది. వీరి శైలి మధురంగా ఉంటుంది అందుకే నాకు శ్రీ శ్రీ గారంటే చాలా ఇష్టం. నీకు నచ్చిన కవిని గూర్చి నాకు తెలియజేయి. పెద్దలందరికీ నమస్కారాలు తెలుపగలవు.

ఇట్లు,
నీ ప్రియ మిత్రుడు,
x x x x x x x x

చిరునామా :
పి. రామారావు,
8వ తరగతి,
ప్రభుత్వ ఉన్నత బాలుర పాఠశాల,
నందిగామ,
కృష్ణాజిల్ల.

AP Board 8th Class Telugu Important Questions Chapter 5 ప్రతిజ్ఞ

ప్రశ్న 2.
శ్రీశ్రీ గారి కవిత్వాన్ని ప్రశంసిస్తూ ఒక వ్యాసం రాయండి.
జవాబు:
“ఏ దేశ చరిత్ర చూచినా – ఏమున్నది గర్వకారణం !
నరజాతి చరిత్ర సమస్తం – పరపీడన పరాయణత్వం”

అని కొత్తగా గళమెత్తి సంచలనం రేకెత్తించిన మహాకవి శ్రీశ్రీ. శ్రీశ్రీ అనే రెండక్షరాలు తెలుగు కవిత్వంలో విప్లవం సృష్టించాయి. కలం పేరు శ్రీశ్రీ కాగా, అసలు పేరు శ్రీరంగం శ్రీనివాసరావు. “అనితరసాధ్యం నా మార్గం” అని చాటిన ప్రకవి శ్రీశ్రీ భావకవిత్వంపై తిరుగుబాటు బావుటా ఎగురవేసి అభ్యుదయ ఉద్యమానికి నాంది పలికాడు. ఆ తర్వాత విప్లవ కవిత్వోద్యమానికి స్ఫూర్తినిచ్చాడు.

కాని శ్రీశ్రీ ప్రపంచాన్ని పరిశీలించిన కొద్దీ, పుస్తక పఠనం ఎక్కువైన కొద్దీ కొత్త దారులు తొక్కాలని ఉవ్విళ్ళూరాడు. తానే ప్రపంచాగ్నిగా మారాడు.

తాను కొత్త శైలిని ఎన్నుకొన్నాడు. “ఈ యుగం నాది” అని ఎలుగెత్తి చాటాడు. “సామాజిక దృక్పథాన్ని జాతీయస్థాయి నుంచి అంతర్జాతీయస్థాయికి తీసుకువెళ్ళిన నాయకుడాయనే. శ్రీశ్రీ “మహాప్రస్థానం” అనే గొప్పకావ్యం రాశాడు. మహాప్రస్థానం అంటే గొప్ప ప్రయాణం అని అర్థం. కమ్యూనిస్టు భావాలు గల శ్రీశ్రీ ఎర్రబావుటా ఎగరేస్తూ మరో ప్రపంచానికి పదండి అని మేల్కొలుపు పాడుతూ ఇలా పాడాడు.

సామాజంలోని ఎక్కువ తక్కువల్నీ, బలవంతుల – ధనవంతుల అన్యాయాల్ని ఎదిరించిన శ్రీశ్రీ కర్మ సిద్ధాంతాన్ని తిరస్కరించాడు.

“దేశ చరిత్రలు” అనే ఖండిక చారిత్రక వాస్తవికత స్పష్టీకరిస్తుంది. “తాజ్ మహల్ నిర్మాణానికి – రాళ్ళెత్తిన కూలీ లెవరు? ప్రభువెక్కిన పల్లకి కాదోయ్ – అది మోసిన బోయీలెవ్వరు?” అని మొట్టమొదటిగా శ్రామికశక్తిని గుర్తించి సామ్యవాద సిద్ధాంతాన్ని ప్రకటించినవాడు శ్రీశ్రీ.

“కదిలేదీ కదిలించేదీ
మారేదీ మార్పించేదీ
మునుముందుకు సాగించేదీ” కవిత్వమని శ్రీశ్రీ కొత్త నిర్వచనం ఇచ్చాడు.

ఆయన సమకాలీన సమాజాన్ని హేళన చేస్తూ సిరిసిరిమువ్వా అనే శతకం రాశాడు. కథలూ, నాటికలూ, వ్యాసాలూ, పీఠికలూ… ఏది రాసినా శ్రీశ్రీ ముద్ర గాఢంగా కనిపిస్తూనే ఉంటుంది.

సమాజాన్ని చైతన్యపరిచి, అభ్యుదయ కవిత్వానికి యుగకర్తగా ఉండి, కొత్త తరానికి బాటలు వేసి, తెలుగు కవిత్వంలో – సంతకంగా నిలిచిన శ్రీశ్రీ ప్రజాకవి, సమాజకవి.

8th Class Telugu 5th Lesson ప్రతిజ్ఞ 1 Mark Bits

1. వికారినామ వర్మంలో ఆషాఢంలో మొదటి వరం కురిసింది. (నానార్థాలు గుర్తించండి) (S.A. I – 2019-20)
ఎ) వాన, జడి
బి) సంవత్సరం, వాన
సి) వయస్సు, మొదట
డి) మార్గం, దారి
జవాబు:
బి) సంవత్సరం, వాన

2. “చేసినంత” (పదాన్ని విడదీయండి) (S.A. I – 2019-20)
ఎ) చేసిన + యంత
బి) చేసి + అన్నంత
సి) చేసిన + అంత
డి) చేసినన్ + యంత
జవాబు:
సి) చేసిన + అంత

3. కోటిరత్నాలు (సమాసం పేరు గుర్తించండి) (S.A. I – 2019-20)
ఎ) ద్వంద్వ
బి) బహువ్రీహి
సి) అవ్యయీభావ
డి) ద్విగు
జవాబు:
డి) ద్విగు

AP Board 8th Class Telugu Important Questions Chapter 5 ప్రతిజ్ఞ

4. నా కరములో ఉన్న అరటి పండును కరి కరముకు అందించాను. నానార్థాలు గుర్తించండి) (S.A. I – 2018-19)
ఎ) చేయి, హస్తము
బి) హస్తము, కేలు
సి) చేయి, ఏనుగు
డి) చేయి, తొండము
జవాబు:
డి) చేయి, తొండము

5. ప్రాణమున్నంత వరకూ నిజాయితీగా బతకాలి (వికృతి గుర్తించండి) (S.A. I – 2018-19)
ఎ) పానము
బి) ప్రానము
సి) పాణము
డి) పాణం
జవాబు:
ఎ) పానము

6. రాజు కొలువుసేసి ప్రజలతో పలికెను (పదాన్ని విడదీయండి) (S.A. I – 2018-19)
ఎ) కొలువు + జేసి
బి) కొలువు + చేసి
సి) కొలువున్ + జేసి
డి) కొలువుం + చేసెన్
జవాబు:
బి) కొలువు + చేసి

7. కింది వానిలో తృతీయా తత్పురుష సమాసపదాన్ని గుర్తించండి. (S.A. I – 2018-19)
ఎ) కాలుసేతులు
బి) నాలుగుదిక్కులు
సి) బుద్ధిహీనుడు
డి) షడ్రుచులు
జవాబు:
సి) బుద్ధిహీనుడు

8. శ్రామిక శక్తితో ప్రపంచం అభివృద్ధి చెందుతోంది. (వికృతి పదం గుర్తించండి) (S.A. II – 2017-18)
ఎ) శత్రు
బి) సత్తు
సి) సుత్తి
డి) సత్తి
జవాబు:
డి) సత్తి

9. రావణుడు తన గుణముల చేత హీనుడయ్యాడు. (విభక్తిని గుర్తించండి) (S.A. II – 2017-18)
ఎ) ప్రథమ
బి) తృతీయా
సి) పంచమీ
డి) సప్తమీ
జవాబు:
డి) సప్తమీ

10. రామరాజ్యంలో నెలకు ఆనాడు వానలు ప్రతి సంవత్సరం కురిసేవి. గీత గీసిన పదానికి నానార్థ పదాన్ని గుర్తించండి. (S.A. III – 2015-16)
ఎ) ఘర్షణ
బి) కర్షకుడు
సి) హర్షం
డి) వర్షం
జవాబు:
డి) వర్షం

11. ఎప్పటికైనా దమ్మమే జయిస్తుంది. గీత గీసిన పదానికి ప్రకృతి పదాన్ని గుర్తించండి. (S.A. III – 2015-16)
ఎ) శౌర్యం
బి) యుద్ధం
సి) అధర్మం
డి) ధర్మం
జవాబు:
డి) ధర్మం

12. “ఋగ్యజుస్సామ అధర్వణాలు నాలుగువేదాలు” గీత గీసిన పదం ఏ సమాసం? (S.A. III – 2015-16)
ఎ) ద్విగు సమాసం
బి) బహువ్రీహి సమాసం
సి) తత్పురుష సమాసం
డి) కర్మధారయ సమాసం
జవాబు:
ఎ) ద్విగు సమాసం

AP Board 8th Class Telugu Important Questions Chapter 5 ప్రతిజ్ఞ

13. “ఆ ఊళ్లో దొంగభయం ఎక్కువ” గీత గీసిన పదానికి సరైన విగ్రహవాక్యాన్ని గుర్తించండి. (S.A. III – 2015-16)
ఎ) దొంగ యందు భయం
బి) దొంగ వలన భయం
సి) దొంగ యొక్క భయం
డి) దొంగ కొరకు భయం
జవాబు:
బి) దొంగ వలన భయం

14. క్రింది వాక్యాలలో గీతగీసిన పదానికి సమానార్థకం కాని పదాన్ని గుర్తించండి. సీత హేమాభరణాలు ధరించింది. (S.A. III – 2015-16)
ఎ) అంగారం
బి) బంగారం
సి) స్వర్ణం
డి) పుత్తడి
జవాబు:
ఎ) అంగారం

భాషాంశాలు – పదజాలం

15. ఘర్మజలం విలువ తెలియాలి – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి. (S.A. II – 2017-18)
ఎ) విషాదాశ్రువులు
బి) చెమటనీరు
సి) కన్నీరు
డి) ఆనందబాష్పాలు
జవాబు:
బి) చెమటనీరు

16. ధరిత్రిపై శాంతి నిలవాలి – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) జలధి
బి) వారిధి
సి) భూమి
డి) వనజం
జవాబు:
సి) భూమి

17. హేమంతో ఆభరణాలు చేస్తారు – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) రజితం
బి) కాంశ్యం
సి) అయస్సు
డి) బంగారం
జవాబు:
డి) బంగారం

18. జలం జీవనాధారం – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) పీయూషం
బి) నీరు
సి) క్షీరం
డి) సుధ
జవాబు:
బి) నీరు

AP Board 8th Class Telugu Important Questions Chapter 5 ప్రతిజ్ఞ

19. కర్షకులు పంటలు పండిస్తారు – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) పురోహితులు
బి) రైతులు
సి) ఆత్మజులు
డి) అనంతులు
జవాబు:
బి) రైతులు

పర్యాయపదాలు :

20. బంగారంతో ఆభరణాలు చేస్తారు – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
ఎ) హేమం, హిమం
బి) పుత్తడి, హేమం
సి) కాంచనం, రజితం
డి) అభ్రకం, అయస్సు
జవాబు:
బి) పుత్తడి, హేమం

21. హలంతో పొలం దున్నాలి – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
ఎ) నాగలి, నీరు
బి) నాగము, నభము
సి) నరము, నారి
డి) వయము, వయసు
జవాబు:
ఎ) నాగలి, నీరు

22. ధ్వని వచ్చింది – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
ఎ) రవం, రాగి
బి) శబ్దం, రవం
సి) రసం, రంజని
డి) రతనం, వదనం
జవాబు:
బి) శబ్దం, రవం

23. అగ్ని ప్రకాశించింది – గీత గీసిన పదానికి పర్యాయ పదాలు గుర్తించండి.
ఎ) చిచ్చు, నిప్పు
బి) నిబం, నింబం
సి) అగ్గి, అశనం
డి) అద్రి, సభం
జవాబు:
ఎ) చిచ్చు, నిప్పు

24. ఇలపై కొంతి వికసించాలి – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
ఎ) ధరణి, వాకిలి
బి) పయస్సు, ధారుణి
సి) జగం, జలధి
డి) భూమి, వసుధ
జవాబు:
డి) భూమి, వసుధ

ప్రకృతి – వికృతులు :

25. మనం ప్రతిజ్ఞ చేయాలి – గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.
ఎ) ప్రయాస
బి) ప్రకాస
సి) పదెన
డి) ప్రతిన
జవాబు:
డి) ప్రతిన

26. ధరం ఆచరించాలి – గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.
ఎ) దరమం
బి) దమ్మం
సి) దశమం
డి) దరన
జవాబు:
బి) దమ్మం

27. న్యాయం పాటించాలి – గీత గీసిన పదానికి దీనికి వికృతి పదం ఏది?
ఎ) నైయం
బి) నాయం
సి) నేయం
డి) నోయం
జవాబు:
బి) నాయం

28. ప్రాణం తిపి – గీత గీసిన పదానికి వికృతి పదం ఏది?
ఎ) పారం
బి) పానం
సి) పాయం
డి) సాయం
జవాబు:
బి) పానం

AP Board 8th Class Telugu Important Questions Chapter 5 ప్రతిజ్ఞ

29. శ్రీ వెల్లి విరియాలి – గీత గీసిన పదానికి వికృతిని గుర్తించండి.
ఎ) శీరి
బి) సిరి
సి) శ్రీరి
డి) చిరి
జవాబు:
బి) సిరి

30. అగ్గి చల్లారింది – గీత గీసిన పదానికి ప్రకృతి పదం గుర్తించండి.
ఎ) అగ్లో
బి) అగ్ని
సి) అగ్గి
డి) అగా
జవాబు:
బి) అగ్ని

31. బాగెము పండాలి – గీత గీసిన పదానికి ప్రకృతి పదం గుర్తించండి.
ఎ) భాగ్యము
బి) భాసము
సి) సంపద
డి) భోగ్యము
జవాబు:
ఎ) భాగ్యము

32. కరంతో పని చేయాలి – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
ఎ) చేయి, తొండం, కిరణం
బి) హస్తం, పాదం, నఖము
సి) నది, ఝరి, సాగరం
డి) కరం, చదరం, చందనం
జవాబు:
ఎ) చేయి, తొండం, కిరణం

33. భూత కాలంలో తిరిగిరావు – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
ఎ) జరిగిపోయినది, ప్రాణి
బి) భూమి, జలధి
సి) ధర్మం, వసుధ
డి) నీరు, ఉదధి
జవాబు:
ఎ) జరిగిపోయినది, ప్రాణి

34. ఆయన కాలం చెందాడు – గీత గీసిన పనికి నానార్థాలు గుర్తించండి.
ఎ) భరతం, భాగ్యం
బి) సమయం, మరణం
సి) సమయం, కన్ను
డి) భాగ్యం, బానిస
జవాబు:
బి) సమయం, మరణం

35. బలం చూపాలి – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
ఎ) లావు, సామర్థ్యం
బి) మరణం, జననం
సి) చక్రం, వాన
డి) అదృష్టం, పర్జన్యం
జవాబు:
ఎ) లావు, సామర్థ్యం

36. కన్ను రక్షణీయం – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
ఎ) బలం, సామర్థ్యం
బి) నయనం, బండిచక్రం
సి) నేత్రం, కాలం
డి) వాన, నీరు
జవాబు:
బి) నయనం, బండిచక్రం

37. భాగ్యం పండాలి – గీత గీసిన పదానికి నానార్థాలు రాయండి.
ఎ) వర్షం, నీరు
బి) అదృష్టం, సంపద
సి) అవకాశం, అనంతం
డి) అకాలం, అనాగరికం
జవాబు:
బి) అదృష్టం, సంపద

వ్యుత్పత్తర్థాలు :

38. దుఃఖం వల్ల కన్నుల నుండి కారే నీరు – అనే వ్యుత్పత్తి గల పదం ఏది?
ఎ) అశ్రువులు
బి) ఆశ్రమం
సి) అరణి
డి) వసుధ
జవాబు:
ఎ) అశ్రువులు

39. ధర్మము – దీనికి వ్యుత్పత్తిని గుర్తించండి.
ఎ) ధరకు లొంగేది
బి) ధరించబడేది
సి) ధరచేత కూడినది.
డి) ధరణమును పొందునది
జవాబు:
బి) ధరించబడేది

వ్యాకరణాంశాలు

సంధులు :

40. కూరగాయలు తెచ్చారు – గీత గీసిన పదాన్ని విడదీయండి.
ఎ) కూరె + కాయ
బి) కూర + కాయ
సి) కూర + గాయ
డి) కూర + ఆయ
జవాబు:
బి) కూర + కాయ

AP Board 8th Class Telugu Important Questions Chapter 5 ప్రతిజ్ఞ

41. పాలుదాగి – ఇందులోని సంధిని గుర్తించండి.
ఎ) గుణసంధి
బి) గసడదవాదేశ సంధి
సి) సవర్ణదీర్ఘ సంధి
డి) పూర్వరూప సంధి
జవాబు:
బి) గసడదవాదేశ సంధి

42. పరుషములు అనగా –
ఎ) క చ ట త ప
బి) గ జ డ దలు
సి) న జ బ జ న
డి ) ప ద ని స
జవాబు:
ఎ) క చ ట త ప

43. క్రింది వానిలో సవర్ణదీర్ఘ సంధికి ఉదాహరణను గుర్తించండి.
ఎ) గుళోన్నతి
బి) విలాపాగ్నులు
సి) ఏకైక
డి) తల్లిదండ్రులు
జవాబు:
సి) ఏకైక

44. శ్రమైక జీవనం – గీత గీసిన పదాన్ని విడదీసి గుర్తించండి.
ఎ) శ్రమ + ఔక
బి) శ్రమ + ఏక
సి) శ్రమ + ఐక
డి) శ్రమ + ఓక
జవాబు:
బి) శ్రమ + ఏక

సమాసాలు :

45. రాజపూజితుడు పండితుడు – గీత గీసిన పదానికి విగ్రహవాక్యం గుర్తించండి.
ఎ) రాజుకు పూజితుడు
బి) రాజునందు పూజితుడు
సి) రాజువలన పూజితుడు
డి) రాజుచేత పూజితుడు
జవాబు:
డి) రాజుచేత పూజితుడు

46. పేదలకు అన్యాయం జరుగకూడదు – గీత గీసిన పదం ఏ సమాసం?
ఎ) న్యాయం కావాలి
బి) న్యాయం కానిది
సి) న్యాయమందు కూడినది
డి) న్యాయం కొరకు కానిది
జవాబు:
బి) న్యాయం కానిది

47. శివుడు జటాధారి – గీత గీసిన పదం ఏ సమాసమో గుర్తించండి.
ఎ) పంచమీ తత్పురుష
బి) షష్ఠీ తత్పురుష
సి) చతుర్డీ తత్పురుష
డి) ద్వితీయా తత్పురుష
జవాబు:
డి) ద్వితీయా తత్పురుష

AP Board 8th Class Telugu Important Questions Chapter 5 ప్రతిజ్ఞ

48. రాజభటుడు వెళ్ళాడు – గీత గీసిన పదం ఏ సమాసం?
ఎ) ప్రథమా తత్పురుష
బి) చతుర్డీ తత్పురుష
సి) షష్ఠీ తత్పురుష
డి) తృతీయా తత్పురుష
జవాబు:
సి) షష్ఠీ తత్పురుష

49. చతుర్దీ తత్పురుషకు ఉదాహరణను గుర్తించండి.
ఎ) తిండిగింజలు
బి) పాపభీతి
సి) విద్యాహీనుడు
డి) శాస్త్ర నిపుణుడు
జవాబు:
ఎ) తిండిగింజలు

50. అగ్నిభయం ఎక్కువ – గీత గీసిన పదానికి విగ్రహవాక్యం గుర్తించండి.
ఎ) అగ్ని కొరకు భయం
బి) అగ్ని వలన భయం
సి) అగ్నిచేత భయం
డి) అగ్నియందు భయం
జవాబు:
బి) అగ్ని వలన భయం

51. ఉత్తర పద ప్రాధాన్యం గల సమాసం గుర్తించండి.
ఎ) ద్వంద్వం
బి) షష్ఠీ తత్పురుష
సి) అవ్యయీభావ
డి) తత్పురుష
జవాబు:
డి) తత్పురుష

52. పంచమీ విభక్తి ప్రత్యయాలను గుర్తించండి.
ఎ) డు, ము, వు, లు
బి) వలన, కంటె, పట్టు
సి) కొరకు, కై
డి) అందు, న
జవాబు:
బి) వలన, కంటె, పట్టు

ణవిభజన :

53. మాత్రా ఛందస్సు గల సాహితీ ప్రక్రియ ఏది?
ఎ) దండకం
బి) గద్యం
సి) గేయం
డి) పద్యం
జవాబు:
సి) గేయం

54. UIU- ఇది ఏ గణం?
ఎ) త గణం
బి) ర గణం
సి) న గణం
డి) మ గణం
జవాబు:
సి) న గణం

వాక్యాలు :

55. ఆయన సంస్కృతం, తెలుగు, ఆంగ్లం నేర్చుకున్నాడు – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) సంక్లిష్ట వాక్యం
బి) కర్మణి వాక్యం
సి) సంయుక్త వాక్యం
డి) సామాన్య వాక్యం
జవాబు:
సి) సంయుక్త వాక్యం

AP Board 8th Class Telugu Important Questions Chapter 5 ప్రతిజ్ఞ

56. కృష్ణ బొబ్బిలి వెళ్ళి ఇల్లు కట్టాడు – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) విధ్యర్థక వాక్యం
బి) సంక్లిష్ట వాక్యం
సి) సంయుక్త వాక్యం
డి) కర్మణి వాక్యం
జవాబు:
బి) సంక్లిష్ట వాక్యం

57. రమ అందమైనది. రమ తెలివైనది – ఈ వాక్యాలను సంయుక్త వాక్యంగా గుర్తించండి.
ఎ) రమ తెలివైనది కావడంతో అందమైనది.
బి) రమ అందమైనది, తెలివైనది.
సి) రమ తెలివైనది, అందమైనది.
డి) రమ అందమైనది కావడంతో తెలివైనది.
జవాబు:
బి) రమ అందమైనది, తెలివైనది.

58. అందరు బడికి వెళ్ళాలి – దీనికి వ్యతిరేకార్థక వాక్యం గుర్తించండి.
ఎ) కొందరు బడికి వెళ్ళలేకపోవచ్చు.
బి) అందరు బడికి వెళ్ళకూడదు.
సి) అందరు బడికి వెళ్ళియుండవచ్చు.
డి) అందరు బడికి వెళ్ళి తీరాలి.
జవాబు:
బి) అందరు బడికి వెళ్ళకూడదు.

59. దొంగతనం చేయవద్దు – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) తద్ధర్మార్థక వాక్యం
బి) విధ్యర్థక వాక్యం
సి) నిషేధార్థక వాక్యం
డి) అభ్యర్థక వాక్యం
జవాబు:
సి) నిషేధార్థక వాక్యం

60. భవిష్యత్కాల అసమాపక క్రియను గుర్తించండి.
ఎ) అప్యర్థకం
బి) క్యార్థకం
సి) శత్రర్థకం
డి) చేదర్థకం
జవాబు:
డి) చేదర్థకం

61. దయతో అనుమతించండి – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) శత్రర్థక వాక్యం
బి) అభ్యర్థక వాక్యం
సి) ప్రార్థనార్థక వాక్యం
డి) హేత్వర్థక వాక్యం
జవాబు:
సి) ప్రార్థనార్థక వాక్యం

62. వానలు కురిస్తే పంటలు పండుతాయి – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) అభ్యర్థక వాక్యం
బి) శత్రర్థక వాక్యం
సి) కర్మణి వాక్యం
డి) చేదర్థక వాక్యం
జవాబు:
డి) చేదర్థక వాక్యం

అలంకారాలు :

63. పొలాలు దున్నీ – హలాలు దున్ని – ఇందులోని అలంకారం గుర్తించండి.
ఎ) ఉపమ
బి) వృత్త్యనుప్రాస
సి) యమకం
డి) లాటానుప్రాస
జవాబు:
బి) వృత్త్యనుప్రాస

AP Board 8th Class Telugu Important Questions Chapter 5 ప్రతిజ్ఞ

64. కింది అలంకారాలలో పొసగని అలంకారం గుర్తించండి.
ఎ) ముక్తప్రదగ్రస్తం
బి) రూపక
సి) అంత్యానుప్రాస
డి) యమకం
జవాబు:
బి) రూపక

సొంతవాక్యాలు :

65. కార్మిక లోకం : సమస్త కార్మిక లోకం దేశ సౌభాగ్యం కోసం కృషి చేస్తుంది.

66. నవ్యకవిత్వం : శ్రీ శ్రీ గారు నవ్య కవిత్వం రాయడానికి సిద్ధపడినారు.

67. దాస్యం : బ్రిటిషు ప్రభుత్వంలో మనం దాస్యం అనుభవించాము.

68. కర్షక వీరులు : సమాజంలో కర్షకవీరులు నిరంతరం శ్రమిస్తారు.

69. విరామం : నిరంతరం పనిచేసేవారికి విరామం పొందాలి.

70. ఖరీదు : వస్తువుల ఖరీదు అధికంగా ఉన్నది.

71. ప్రపంచ భాగ్యం : ప్రపంచ భాగ్యం వెల్లి విరియడానికి మనం కృషి చేయాలి.

72. స్వర్ణవాయిద్యములు : తిరుమలలో స్వామివారికి స్వర్ణ వాయిద్యములు మ్రోగిస్తారు.

73. చిహ్నం : ఎన్నికల్లో అభ్యర్థులకు చిహ్నం ఇస్తారు.

74. ప్రణవం : వేదాల్లో ప్రణవం అతి ప్రధానమైనది.

AP Board 8th Class Telugu Solutions Chapter 2 ఇల్లు – ఆనందాల హరివిల్లు

AP State Syllabus AP Board 8th Class Telugu Textbook Solutions Chapter 2 ఇల్లు – ఆనందాల హరివిల్లు Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Telugu Solutions 2nd Lesson ఇల్లు – ఆనందాల హరివిల్లు

8th Class Telugu 2nd Lesson ఇల్లు – ఆనందాల హరివిల్లు Textbook Questions and Answers

చదవండి – ఆలోచించండి – చెప్పండి
AP Board 8th Class Telugu Solutions Chapter 2 ఇల్లు – ఆనందాల హరివిల్లు 1

ప్రశ్నలు జవాబులు

ప్రశ్న 1.
మొదటి చిత్రంలో ఎవరెవరున్నారు? ఏం జరుగుతున్నది? ఏం మాట్లాడుతున్నారు?
జవాబు:
ఇంట్లో తాతగారు, మనవరాలికి పుస్తకం చూసి, పాఠం చెబుతున్నారు. మనవడు తాతగారితో ఆడుకుంటున్నాడు. తాతగారి అబ్బాయి, తాతగారి కోడలికి ఇంటి పనులలో సాయం చేస్తున్నాడు. వాళ్ళు తమ ఇంటి విశేషాల గురించి మాట్లాడుతున్నారు.

ప్రశ్న 2.
రెండవ చిత్రంలో ఎవరెవరున్నారు? ఏం జరుగుతున్నది? ఏం మాట్లాడుతున్నారు?
జవాబు:
రెండవ చిత్రంలో ఇంటి యజమాని లోపలకు వచ్చే వేళకు, అతని భార్య సోఫాలో కూర్చుని, టి.వి. చూస్తోంది. వారి పిల్లవాడు కంప్యూటర్ లో ఆటలు ఆడుకుంటున్నాడు. ఆ పిల్లవాడు పుస్తకాల సంచి ఒక ప్రక్కన పడవేశాడు. వాళ్ళు టి.వి.లో చూస్తున్న విషయాన్ని గురించి మాట్లాడుతున్నారు.

AP Board 8th Class Telugu Solutions Chapter 2 ఇల్లు – ఆనందాల హరివిల్లు

ప్రశ్న 3.
మీ కుటుంబంలో ఎవరెవరు ఉంటారు?
జవాబు:
మా కుటుంబంలో నేను, మా అమ్మ, మా నాన్న, మా అన్నయ్య ఉంటాము.

ప్రశ్న 4.
మీ ఇంటి వాతావరణం ఎలా ఉంటుంది?
జవాబు:
మా ఇంటి వాతావరణం చాలా ఆహ్లాదంగా ఉంటుంది. ఇంటి ముందు పూలమొక్కలు, ఆకుకూరలు, కూరగాయల మొక్కలు ఉన్నాయి. మా నాన్నగారు హైస్కూలు ప్రధానోపాధ్యాయుడు. మా అమ్మగారు గృహిణి. నేను జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థిని. మా అన్నయ్య ఇంజనీరింగ్ చదువుతున్నాడు. మా నాన్నగారు పొరుగూరు స్కూలుకు బండిమీద వెళ్ళాలి. మా అమ్మ మా అందరికీ వంట చేసి పెట్టాలి. నేనూ అన్నయ్యా ఇంటి పనులలో సహాయం చేస్తాము.

ఇవి చేయండి

I. వినడం – మాట్లాడడం

ప్రశ్న 1.
కుటుంబం ఎలా ఉండాలి? మీ కుటుంబం గురించి చెప్పండి.
జవాబు:
“ఒకే గొడుగు నీడలో ఉంటూ, మానసిక, ఆర్థిక సహాయ సహకారాలు అందుకుంటూ, సహజ ఆమోదయోగ్యమైన సంబంధాలు ఉన్న స్త్రీ, పురుషులు, వారి పిల్లలూ ఉన్న ఈ సమూహాన్నే “కుటుంబం” అంటారు.

కుటుంబం ఒక హరివిల్లులా, అంటే ఇంద్రధనుస్సులా ఉండాలి. ఆ హరివిల్లులో తల్లి, తండ్రి, పిల్లలు, తాతయ్య నాన్నమ్మలు ఒక భాగం. అప్పుడు ఆనందం తాండవిస్తుంది. కుటుంబం అనే భావన తియ్యనిది. ఆ మాట గుర్తుకు రాగానే, ఏదో తియ్యని, తెలియని హాయి కలగాలి. తీపి జ్ఞాపకాలు గుర్తుకు రావాలి.

మా ఇంట్లో అమ్మా, నాన్న, నేనూ, మా అన్నయ్య కలిసి ఉంటాము.

ప్రశ్న 2.
మీకు తెలిసిన సమష్టి కుటుంబాన్ని గురించి మాట్లాడండి.
జవాబు:
మా చిన్న తాతగారు పల్లెటూళ్ళో ఉంటారు. వారి ఇంట్లో తాతగారు, మామ్మ, బాబాయి, పిన్ని ఉంటారు. మా బాబాయికి ఒక ఆడపిల్ల, ఒక అబ్బాయి ఉన్నారు. ఆడపిల్ల ఇంటరు చదువుతోంది. పిల్లవాడు 8వ తరగతి చదువుతున్నాడు.

వాళ్ళు ఆరుగురే కలిసి ఉంటారు. వారికి వ్యవసాయం ఉంది. పాడి పశువులు ఉన్నాయి. కొబ్బరి తోటలున్నాయి. – మా తాతగారు, బాబాయి పౌరోహిత్యం చేసి సంపాదిస్తారు. అందరూ కలిసి అన్ని పనులూ చేసుకుంటారు.

వారిది పెద్ద ఇల్లు, పెద్ద ఖాళీస్థలం. వారి ఖాళీ స్థలంలో అన్ని రకాల కూరగాయలు పండిస్తారు. నాలుగు గేదెలను పెంచుతారు. కావలసిన పాలు వాడుకొని, మిగిలినవి అమ్ముతారు. వారి జీవితం ఆనందంగా సాగుతోంది.

ఒకరి అవసరానికి మరొకరు సంతోషంగా సాయపడతారు. వారిది చక్కని సమష్టి కుటుంబం.

AP Board 8th Class Telugu Solutions Chapter 2 ఇల్లు – ఆనందాల హరివిల్లు

ప్రశ్న 3.
కుటుంబంలో ‘మన’ అనే భావన లేకపోతే ఎలా ఉంటుంది?
జవాబు:
కుటుంబంలో ‘మన’ అనే భావన కుటుంబ సభ్యులందరికీ ఉండాలి. అప్పుడే అందరూ కలసిమెలసి, కుటుంబం అభివృద్ధికి పాటుపడతారు. అందరూ సంపాదిస్తారు. ఒకరి అవసరాలకు మరొకరు సాయపడతారు.

‘మన’ అనే భావన లేకపోతే సమష్టి కుటుంబం అనేది సక్రమంగా నడువదు. స్వార్థపరత్వం పెరుగుతుంది. పరస్పరం పోటీ, ద్వేషం, ఈర్ష్య, అసూయ, తగవులు వస్తాయి. అప్పుడు అందరూ కలసిమెలసి ఉండలేరు. ఎవరిమట్టుకు వార్కి తమకు, తమ పిల్లలకు అనే భావనలు వస్తాయి.

II. చవదవడం, అవగాహన చేసుకోవడం

1. కింది పదాలను పాఠంలో గుర్తించండి. ఆ వాక్యాలను చదవండి. వాటి గురించి చెప్పండి.

ఆశ్రమధర్మాలు, గృహస్థాశ్రమం, జీవితపథం, గార్హస్య జీవితం, సమాజ స్థితిగతులు, సంఘీభావం, సమష్టి వ్యవస్థ, ఆర్థిక స్వాతంత్ర్యం, విశ్వసనీయత, సమగ్రత.
జవాబు:
ఆశ్రమధర్మాలు :
‘గృహస్థాశ్రమ ధర్మం ద్వారా ఇతర ఆశ్రమధర్మాలు సక్రమంగా కొనసాగుతాయి. ” ఆశ్రమాలు నాలుగు రకాలు –
1. బ్రహ్మచర్యాశ్రమం
2. గృహస్థాశ్రమం
3. వాసప్రస్థాశ్రమం
4. సన్యాసాశ్రమం

గృహస్థాశ్రమం :- “అంతేగాక, ఆనాటి సమాజంలో ఉన్న నాలుగు ఆశ్రమాల్లోనూ గృహస్థాశ్రమానికి అత్యంత ప్రాధాన్యం ఉంది.”

గృహస్థాశ్రమం అంటే పెళ్ళి చేసుకొని భార్యాబిడ్డలతో సంసారం చేసుకుంటూ, సుఖంగా జీవించే కాలం.

జీవితపథం :
“ఈ విధమైన జీవన విధానం వల్ల జీవితపథ నిర్దేశం జరిగేది”

జీవితపథం అంటే జీవనమార్గం. అంటే ఎలా జీవించాలో తెలిపే పూర్గం. పెద్దలను చూసి వారిలాగే పిల్లలు జీవించే పద్ధతి.

గార్హస్య జీవితం :
“అందుకే ‘గార్హస్థ జీవితం’ అతిసుందరమని వారి భావన.”

గార్హస్య జీవితం అంటే, పెళ్ళి చేసుకొని పిల్లలతో సుఖంగా జీవించడం. అతిథులకు, అభ్యాగతులకు కావలసిన సదుపాయాలు చేయడం, తల్లిదండ్రులను సేవించుకుంటూ దైవారాధన చేయడం.

సమాజ స్థితిగతులు :
“సమాజ స్థితిగతులనూ, ఆచారవ్యవహారాలనూ, సంస్కృతి సంప్రదాయాలనూ పిల్లలు ప్రత్యక్షంగా విని ఆకళింపు చేసుకోనేవారు.”

సమాజ స్థితిగతులు అంటే, సంఘంలోని నేటి పరిస్థితులు, మంచి చెడ్డలు.

సంఘీభావం :
“ఈ సంఘీభావమే, దేశానికి వెన్నెముక అయ్యింది. ”

సంఘీభావం అంటే సంఘంలో ఉండే ప్రజలంతా ఏకమై తామంతా ఒకటే అన్న భావం. కలిసిమెలసి కష్టసుఖాలు పంచుకోవడం.

సమష్టి వ్యవస్థ :
“మన ఇతిహాసాలైన రామాయణ భారతాలు ఈ సమష్టి కుటుంబ వ్యవస్థను ప్రతిబింబిస్తాయి.”

‘సమష్టివ్యవస్థ’ అంటే కలసిమెలసి జీవించడం. – రామాయణంలో రాముని సోదరులు, లక్ష్మణభరతశత్రుఘ్నులు రామునితోనే కలసి ఉన్నారు. అలాగే పాండవులూ, కౌరవులూ సోదరులంతా సమష్టి కుటుంబంగానే జీవించారు.

ఆర్థిక స్వాతంత్ర్యం :
“ఉమ్మడి కుటుంబం, వ్యష్టి కుటుంబాల మేలు కలయికతో సమానత్వం, ఆర్థిక స్వాతంత్ర్యం, వ్యక్తి స్వేచ్ఛలకు భంగం కలగకుండా … ఒక కొత్త కుటుంబవ్యవస్థ రూపుదిద్దుకోవాలి.”

‘ఆర్థిక స్వాతంత్ర్యం’ అంటే డబ్బును స్వేచ్ఛగా వాడుకొనే హక్కు కలిగియుండడం, తనకు కావలసిన ధనాన్ని తాను ఇతరులను అడగకుండానే ఖర్చు పెట్టుకోగలగడం.

విశ్వసనీయత :
“విశ్వసనీయత, సమగ్రత, ఏకత అనే మూడు స్తంభాల మీద మన కుటుంబ వ్యవస్థ ఆధారపడి ఉంది.”

‘విశ్వసనీయత’ అంటే ఒకరిపై మరొకరికి నమ్మకం. కుటుంబంలో ఒకరిపై ఒకరికి నమ్మకం చాలా ముఖ్యం. కుటుంబం చక్కగా నడవడానికి కావలసిన వాటిలో విశ్వసనీయత ఒకటి.

సమగ్రత :
“విశ్వసనీయత, సమగ్రత, ఏకత అనే మూల స్తంభాల మీద మన కుటుంబ వ్యవస్థ ఆధారపడి ఉంది.”

‘సమగ్రత’ అంటే ‘సంపూర్ణత’ – సమష్టి కుటుంబానికి కావలసిన మూడింటిలో ‘సమగ్రత’ ఒకటి.

AP Board 8th Class Telugu Solutions Chapter 2 ఇల్లు – ఆనందాల హరివిల్లు

2. పాఠం చదివి సరైన సమాధానాలను గుర్తించండి.
1) ఇల్లు అంటే ఇలా ఉండాలి.
అ) అందమైన భవనం
ఆ) అంతస్తుల భవనం
ఇ) ప్రేమానురాగాల నిలయం
ఈ) ఇవేవీ లేనిది
జవాబు:
ఇ) ప్రేమానురాగాల నిలయం

2) వేదకాలం అంటే
అ) రామాయణ భారతాల తరువాతికాలం
ఆ) రామాయణ భారతాల మధ్యకాలం
ఇ) రామాయణ భారతాల ముందుకాలం
ఈ) కలియుగ కాలం
జవాబు:
ఆ) రామాయణ భారతాల మధ్యకాలం

3) ఇంటికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడంలో ఉండాల్సింది.
అ) భార్యాభర్తలకు సమప్రాధాన్యం
ఆ) భార్యకే ఎక్కువ ప్రాధాన్యం
ఇ) భర్తకే ఎక్కువ ప్రాధాన్యం
ఈ) పిల్లలకే ఎక్కువ ప్రాధాన్యం
జవాబు:
అ) భార్యాభర్తలకు సమప్రాధాన్యం

4) సంస్కృతి సంప్రదాయాలు ఎలా అలవడతాయి?
అ) కుటుంబం ద్వారా
ఆ) సమాజం ద్వారా
ఇ) పాఠశాల ద్వారా
ఈ) వీటన్నిటి ద్వారా
జవాబు:
అ) కుటుంబం ద్వారా

5) “అందరి సుఖంలో నా సుఖం ఉంది” దీనిలో ఏ భావన ఉంది?
అ) స్వార్థ భావన
ఆ) నిస్స్వా ర్థ భావన
ఇ) విశాల భావన
ఈ) సంకుచిత భావన
జవాబు:
ఆ) నిస్స్వా ర్థ భావన

3. కింది ప్రశ్నలకు పాఠం చదివి జవాబులు రాయండి.

అ) కుటుంబమంటే ఏమిటి?
జవాబు:
ఒకే గొడుగు నీడలో ఉంటూ, మానసిక, ఆర్థిక సహాయ సహకారాలు అందుకుంటూ, సహజ ఆమోదయోగ్యమైన ‘ సంబంధాలు ఉన్న స్త్రీ, పురుషులు, వారి పిల్లలూ ఉన్న ఈ సమూహాన్నే “కుటుంబం” అంటారు.

కుటుంబం అనేది ఒక హరివిల్లు. ఆ హరివిల్లులో అమ్మానాన్నలు, పిల్లలతో పాటు తాతయ్య నానమ్మలు ఒక భాగం. అలాంటి కుటుంబం అందంగా ఉండి ఆనందాన్ని ఇస్తుంది. ఆ ఇల్లే ఇలలో స్వర్గం అవుతుంది. సమాజానికి కుటుంబం వెన్నెముక వంటిది.

ఆ) భారతీయ సంస్కృతిలో స్త్రీకి ఉన్నత స్థానం ఇచ్చారు? ఎందుకు?
జవాబు:
కుటుంబంలో తల్లి పాత్ర అత్యంత కీలకమైనది. గౌరవప్రదమైనది. అందుకే ఒకప్పుడు మాతృస్వామ్య వ్యవస్థ ఏర్పడింది. “ఇంటికి దీపం ఇల్లాలు” అనే నానుడిని బట్టి భారతీయ సంస్కృతిలో స్త్రీకి ఉన్నత స్థానం ఇచ్చారు.

పిల్లల పెంపకం, కుటుంబ నిర్వహణ, సంతానాన్ని కనడం, గృహస్థాశ్రమ నిర్వహణ అనే వాటిలో స్త్రీకే ప్రాధాన్యం. అందువల్లే మన సంస్కృతిలో స్త్రీకి ప్రాధాన్యం ఇచ్చారు.

ఇ) వృష్టి కుటుంబం అంటే ఏమిటి? ఇవి ఎందుకు ఏర్పడుతున్నాయి?
జవాబు:
‘వ్యష్టి కుటుంబం’ అంటే భార్యాభర్తలూ, పిల్లలు మాత్రమే ఉన్న చిన్న కుటుంబం. ఆర్థిక స్వేచ్ఛ, సమానత్వం, వ్యక్తి స్వాతంత్ర్యం అనే మూడింటి పైనే, ‘వ్యష్టి కుటుంబం’ ఆధారపడి వుంటుంది. వ్యష్టి కుటుంబంలో వ్యక్తిగత గౌరవం, సమాజంలో ప్రత్యేక గుర్తింపు, నిర్ణయించుకొనే అధికారం లభిస్తాయి.

ఉమ్మడి కుటుంబంలో వ్యక్తి స్వేచ్ఛకూ, ఆర్థిక స్వాతంత్ర్యానికీ, సమానత్వానికి ప్రాధాన్యం లేకపోవడంవల్ల, స్వార్థం పెరిగిపోవడం వల్ల ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో మార్పులు వచ్చాయి. చిన్న కుటుంబం అనే భావం బలపడింది. అందువల్లనే వ్యష్టి కుటుంబాలు ఏర్పడుతున్నాయి.

ఈ) కుటుంబ వ్యవస్థకు మూల స్తంభాలేమిటి?
జవాబు:
1) విశ్వసనీయత 2) సమగ్రత 3) ఏకత అనే మూడు మూల స్తంభాల మీదనే మన కుటుంబవ్యవస్థ ఆధారపడి ఉంది. ‘అందరి సుఖంలో నా సుఖం ఉంది. వారి కోసమే మన జీవితం’ అనే త్యాగ భావన, భారతీయ కుటుంబానికి ప్రాతిపదిక.

ఉ) తల్లిదండ్రులు పిల్లలకు వారసత్వంగా ఇవ్వాల్సిందేమిటి?
జవాబు:
తల్లిదండ్రులు పిల్లలకు వారసత్వంగా పిల్లల సంక్షేమమే తొలి ప్రాధాన్యంగా, ఆరోగ్యం, సంస్కారం, చదువు, విజ్ఞానం, మంచితనం, పరోపకారం వంటి గుణాలు ఇవ్వాలి.

III. స్వీయరచన

1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ) “దేశానికి కుటుంబ వ్యవస్థ వెన్నెముక” అనడానికి కారణాలు రాయండి.
జవాబు:
దేశానికి కుటుంబ వ్యవస్థ వెన్నెముక. మంచి కుటుంబం, మంచి సమాజం నుంచి మంచి దేశం ఏర్పడుతుంది. దేశం అంటే చక్కని కుటుంబాల సమాహారమే. కుటుంబాలు అన్నీ చక్కగా సిరిసంపదలతో ఉంటే, దేశం బాగా ఉన్నట్లే. కుటుంబ వ్యవస్థ వల్లే, దేశీయ జీవన సంస్కృతులు నిలుస్తున్నాయి. కాబట్టి దేశానికి కుటుంబ వ్యవస్థ వెన్నెముక.

ఆ) “అసలు కంటే వడ్డీయే ముద్దు” ఈ సామెతను పాఠం ఆధారంగా వివరించండి.
జవాబు:
ఉమ్మడి కుటుంబాలలో ఎప్పుడూ ఒకరి కష్టాలను ఒకరు పంచుకోవటం జరుగుతుంది. శుభకార్యాలకు ఒకరికి ఒకరు చేదోడువాదోడుగా ఉంటారు. అందరూ పెద్దవారి పట్ల భయభక్తులతో ఉంటారు. పిల్లలు ఏదైనా అల్లరి చేసినపుడు తల్లిదండ్రులు మందలించిన వెంటనే వారు తమ అమ్మమ్మ, నాయనమ్మల చెంత చేరతారు. వారు పిల్లలను ప్రేమతో దగ్గరకు తీసుకొని ముద్దాడతారు.

అందుకే “అసలు కంటె వడ్డీ ముద్దు” అనే సామెత పుట్టింది. అసలు అంటే తమకు పుట్టిన పిల్లలు, వడ్డీ అంటే తమ పిల్లలకు పుట్టిన పిల్లలన్నమాట. వడ్డీ వ్యాపారం చేసేవాళ్ళు కూడా, ఎక్కువ వడ్డీ ఇచ్చేవాళ్ళకే అప్పునిస్తారు. వాళ్ళకు అసలు కంటే వడ్డీయే ముద్దు ” తాము ఇచ్చిన అసలు అప్పు తీసుకున్నవాడు తీర్చగలడా? లేదా? అని కూడా చూడకుండా, వడ్డీపై ప్రేమతో వడ్డీ ఎక్కువ ఇస్తానన్నవాడికే వాళ్ళు అప్పు ఇస్తారు. అలాగే కుటుంబంలో పెద్దలు, కన్న పిల్లల కంటె, మనవల్నే ఎక్కువగా లాలిస్తారు అని భావం.

AP Board 8th Class Telugu Solutions Chapter 2 ఇల్లు – ఆనందాల హరివిల్లు

ఇ) ‘కలిసి ఉంటే కలదు సుఖం’ దీన్ని వివరించండి.
జవాబు:
ఉమ్మడి కుటుంబంలో ఉన్న ఆనందం చిన్న కుటుంబాలలో ఉండదు. చిన్న కుటుంబంలో సభ్యులందరూ సంతోషాలను, బాధలను ఒకరివి ఒకరు పరస్పరం పంచుకోలేరు. కుటుంబం అనే హరివిల్లులో అమ్మా నాన్నలు, పిల్లలతోపాటు తాతయ్య, నాన్నమ్మ కూడా కలిసి ఉంటే ఆనందం వెల్లివిరుస్తుంది. కలిసి ఉంటే పిల్లలకు మన సమాజ స్థితిగతులు, ఆచార వ్యవహారాలు తెలుస్తాయి. వారు కూడా ఉమ్మడి కుటుంబ వ్యవస్థనే కోరుకుంటారు. కలసిమెలసి తిరిగినపుడే ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకోగలరు. అలాగే ఇంటి వాతావరణం కూడా ఆహ్లాదకరంగా, సందడిగా ఉంటుంది. మన అనే బంధం పెరుగుతుంది. కుటుంబ సభ్యులు సంఘీభావంతో మెలుగుతారు. స్వార్థపరతకు తావు తక్కువగా ఉంటుంది. సత్ సాంప్రదాయాలు, కుటుంబపరమైన వారసత్వ భావనలు తరువాతి తరం వారికి అందుతాయి.

ఈ) యాంత్రిక జీవనం అంటే ఏమిటి?
జవాబు:
‘యాంత్రిక జీవనం’ అంటే మన జీవన విధానంలో మనం నిత్యం చేసుకొనే పనులకు యంత్రాలను ఉపయోగించడం. ఇప్పుడు వ్యష్టి కుటుంబ పద్దతిలో తమ పనులు తామొక్కరే పూర్తి చేసుకోలేకపోతున్నారు. అందువల్ల యంత్రశక్తి వినియోగం రోజు రోజుకీ పెరుగుతోంది.

నేడు బట్టలు నేయడం, నూనెలు తీయడం వంటివి లేవు. బట్టలు ఉతకటానికి, పిండి రుబ్బటానికి, నగల తయారీకి, నీళ్ళు తోడడానికి, పొలం దున్నటానికి, చెప్పులు కుట్టడానికి, గిన్నెలు కడగటానికి, కడిగిన చేతులు ఆరటానికి కూడా యంత్రశక్తినే వాడుతున్నారు. యంత్రశక్తి వాడటం వల్ల మనిషి బద్ధకస్తుడౌతున్నాడు. చలాకీతనాన్ని పోగొట్టుకొని రోగాలపాలు అవుతున్నాడు. ఈ యాంత్రిక జీవన విధానం వల్ల అందాలు, ఆనందాలు హరించిపోతున్నాయి.

ఉ) పిల్లలు సమాజంలో నిలదొక్కుకోవడానికి కుటుంబ నేపథ్యం ఎలా ఉపయోగపడుతుంది?
జవాబు:
మంచి కుటుంబంలో పెరిగిన పిల్లలు, తల్లిదండ్రుల నుండి క్రమశిక్షణ, ఇంట్లో పెద్దల నుండి ప్రేమానురాగాలు, నీతి, చక్కని నడవడి నేర్చుకుంటారు. వారు చక్కగా చదువుకొని, బాధ్యతతో పెరిగి పెద్దవారవుతారు. దేశ పౌరులుగా తమ తల్లిదండ్రుల పట్ల, దేశంపట్ల, సంఘం పట్ల, మంచి బాధ్యతతో క్రమశిక్షణ గలిగి, దేశభక్తితో నడచుకుంటారు. దేశపౌరులుగా తమ విధులను నెరవేరుస్తారు. ఈ విధంగా పిల్లలు సమాజంలో నిలదొక్కుకోవడానికి కుటుంబ నేపథ్యం ఉపయోగపడుతుంది.

AP Board 8th Class Telugu Solutions Chapter 2 ఇల్లు – ఆనందాల హరివిల్లు

2. కింది ప్రశ్నలకు పదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ) సమష్టి కుటుంబానికీ, వ్యష్టి కుటుంబానికీ మధ్య వ్యత్యాసమేమిటి? దాని పరిణామాలెలా ఉన్నాయి?
జవాబు:
సమష్టి కుటుంబంలో కుటుంబ వ్యవస్థ బలంగా ఉంటుంది. ఇంట్లో సభ్యులందరూ కలిసి ఉంటారు. సమష్టి కుటుంబంలో కష్టసుఖాల్ని అందరితో పంచుకొంటారు. ఆ విధంగా వారికి ఓదార్పు లభిస్తుంది.

ప్రతి పనిలోనూ సహాయ సహకారాలు, సూచనలూ లభిస్తాయి. ఒకరికి ఒకరు, చేదోడు వాదోడుగా నిలుస్తారు. ఆనందాలను అందరూ పంచుకొంటారు. పిల్లలు పెద్దల ఆలనాపాలనలో వాళ్ళ కమ్మని కబుర్లతో, కథలతో ఆరోగ్యంగా పెరుగుతారు. ఇంట్లో అందరికీ పెద్దలపట్ల భయభక్తులుంటాయి. తల్లిదండ్రుల సేవ, భగవంతుని సేవగా భావిస్తారు. ఈ జీవన విధానం వల్ల జీవిత మార్గం నిర్దేశింపబడుతుంది. పిల్లలు సమాజ స్థితిగతులనూ, ఆచార వ్యవహారాలనూ సంస్కృతీ సంప్రదాయాలనూ ప్రత్యక్షంగా ఏని, అర్థం చేసుకుంటారు.

కాని, ఉమ్మడి కుటుంబంలో వ్యక్తి స్వేచ్ఛకూ, ఆర్థిక స్వాతంత్ర్యానికీ, సమానత్వానికి ప్రాధాన్యం ఉండదు. స్వార్థం పెరిగిపోతుంది. అందువల్ల మార్పులు వచ్చాయి. చిన్నకుటుంబం అన్న భావన బలపడి వ్యష్టి కుటుంబవ్యవస్థగా మారింది.

ఆర్థిక స్వేచ్ఛ, సమానత్వం, వ్యక్తి స్వాతంత్ర్యం అనే మూడింటిపైనే, వృష్టి కుటుంబం ఆధారపడింది. ఈ వ్యష్టి కుటుంబంలో వ్యక్తిగత గౌరవం, సమాజంలో ప్రత్యేక గుర్తింపు, నిర్ణయాధికారం లభిస్తాయి. ఈ

కాని వ్యష్టి కుటుంబంవల్ల, వారసత్వ భావనలు అందవు. దేశీయ సాంస్కృతిక జీవన సంప్రదాయాలు నిలువవు. పిల్లలకు కంప్యూటర్లే ఆటపాటలవుతాయి. భావాలు సంకుచితమై, అనుభూతులు లోపిస్తున్నాయి. తల్లిదండ్రులు పిల్లలపై తగిన శ్రద్ధ చూపడం లేదు. అది, పిల్లల మనస్తత్వంపై విపరీత ప్రభావాన్ని చూపుతోంది. పెద్దవారు, వృద్ధాశ్రమాల్లో చేరవలసి వస్తోంది. యంత్రశక్తి వినియోగం పెరిగిపోతోంది. కుటుంబ సభ్యులు ఎవరికి వారే యమునా తీరేగా మెలుగుతున్నారు.

ఆ) కుటుంబవ్యవస్థ బాగా కొనసాగాలంటే మనమేం చేయాలి?
జవాబు:
ఉమ్మడి కుటుంబం, వృష్టి కుటుంబం మేలు కలయికతో సమానత్వం, ఆర్థిక స్వాతంత్ర్యం, వ్యక్తి స్వేచ్ఛకు భంగం రాని ఏడంగా, ఆధిపత్యాల పోరులేని విధంగా, ప్రేమానురాగాలు, విలువలు, మానవ సంబంధాలు అంతస్సూత్రంగా గల ఒక కొత్త కుటుంబ వ్యవస్థను తీర్చిదిద్దుకోవాలి.

ఏ కుటుంబంలో ఉన్నప్పటికీ కుటుంబ భావనలు, పిల్లలకు వివరించి చెప్పాలి. పెద్దల బలాన్ని పొందాలి. బలగాన్ని పెంపొందించుకోవాలి. యాంత్రికత తగ్గాలి. మానవ శక్తి, యుక్తి నైపుణ్యాలు మన వారసత్వ సంపదను పెంచేలా ఉపయోగపడాలి. సమస్యలను పరస్పరం ఆలోచించుకొని పరిష్కరించుకోవాలి. బాధ్యతలు పంచుకోవడం వల్ల యజమాని భారం తగ్గుతుంది. యంత్రశక్తి మీద ఆధారపడి బద్ధకస్తులు కాకూడదు.

కుటుంబ సభ్యులు సుఖాల్నీ, సంతోషాల్నీ, కష్టాల్నీ, బాధల్నీ పరస్పరం పంచుకోవాలి. ఆర్థిక సంబంధాలు, వ్యక్తిగత స్వార్థం, హక్కులు కంటె, మన బాధ్యతలు, మానవ సంబంధాలు ముఖ్యమనీ, అవి మన మనుగడకు ఆధారమనీ తెలుసుకోవాలి.

మనం చేసే పని ఏదయినా, మన సంస్కృతిని, వారసత్వాన్ని, దేశ ఔన్నత్యాన్నీ, ఇబ్బడి ముబ్బడిగా పెంచి, వారసులను ఉత్తేజితులను చేసే విధంగా ఉండాలి. అందుకు సమష్టి లేదా వ్యష్టి కుటుంబ వ్యవస్థలు దోహదం చేయాలి. ‘ఇల్లే ఇలలో స్వర్గం’ అని గుర్తించాలి. సమాజానికి కుటుంబం వెన్నెముక. మంచి కుటుంబ వ్యవస్థకై అందరూ కృషి చేయాలి.

IV. పదజాలం

1. కింది పదాలకు సాధారణ అర్థాలు ఉంటాయి. కాని పాఠంలో ఏ అర్థంలో ఉపయోగించారో వివరించండి.
( అ) పునాది ఆ) పెద్దమలుపు ఇ) అవధానం ఈ) మరుగునపడిపోవడం ఉ) కనుమరుగవడం )

ఆ) పునాది :
పిల్లల సమస్త సద్గుణాలకూ, గుర్గుణాలకూ ఇల్లే పునాది అన్నారు. అంటే ఇక్కడ మూలస్తంభం అనే అర్థంలో ఈ పునాడి పదాన్ని ఉపయోగించారు.

ఆ) పెద్దమలుపు :
నాగరికత మారిన తరువాత మానవుడు గుహల నుంచి గృహంలోకి మారాడు. అదే ఒక పెద్ద మలుపు అనే సందర్భంలో ఇది వాడారు. పెద్ద మలుపు అంటే పెద్ద మార్పు.

ఇ) అవధానం :
ఉమ్మడి కుటుంబాలలో పిల్లలందరికి ఒకేసారి భోజనాలు వడ్డించటం స్త్రీలకు అవధానం అవుతున్నది అని చెప్పు సందర్భంలో వాడతారు.
అవధానం = ఒకేసారి అన్నిటికి సమాధానాలు చెప్పటం

ఈ) మరుగునపడిపోవడం :
వ్యక్తి ప్రాధాన్యత పెరిగి సమాజంలో కుటుంబ వ్యవస్థ అనేది మరుగున పడిపోయింది అని చెప్పు సందర్భంలో వాడారు.
మరుగునపడిపోవడం = కనిపించకుండా మాయమైపోవడం

ఉ) కనుమరుగవడం :
సద్గుణాలకూ, దుర్గుణాలకూ ఇల్లే పునాది, కాని ఈ ఇల్లే ఇప్పుడు కనపడకుండా పోతోంది అనే సందర్భంలో వాడారు.
కనుమరుగవటం = కనిపించకుండా పోవడం

AP Board 8th Class Telugu Solutions Chapter 2 ఇల్లు – ఆనందాల హరివిల్లు

2. కింది జంట పదాలనుపయోగించి సొంతవాక్యాలు రాయండి.
అ) తల్లి-తండ్రి
జవాబు:
తల్లిదండ్రులు మనకు దైవాంశ సంభూతులు.

ఆ) ప్రేమ-అనురాగం
జవాబు:
వృద్ధాప్యంలో మనము పెద్దవారిపట్ల ప్రేమ-అనురాగాలు కలిగి ఉండాలి.

ఇ) అమ్మమ్మ-నాన్నమ్మ
జవాబు:
మేము ప్రతి పండుగరోజు అమ్మమ్మ-నాన్నమ్మలతో కలిసి ఆనందంగా గడుపుతాము.

ఈ) అందం – ఆనందం
జవాబు:
ఇంటి పెరట్లో పూల మొక్కలు పూస్తూ ఉంటే, అదే ‘అందం – ఆనందం’.

ఉ) అవస్థ – వ్యవస్థ
జవాబు:
మన అవస్థలు మారాలంటే, మన కుటుంబ వ్యవస్థలో మార్పులు రావాలి.

ఊ) హక్కులు – బాధ్యతలు
జవాబు:
ప్రతివ్యక్తి, తన హక్కులతో పాటు బాధ్యతలను కూడా తెలిసికోవాలి.

3. కింది మాటలకు వ్యతిరేక అర్థాన్నిచ్చే పదాలు గళ్ళల్లో ఉన్నాయి. వాటిని వెతికి, వాటినుపయోగించి వాక్యాలు రాయండి.
AP Board 8th Class Telugu Solutions Chapter 2 ఇల్లు – ఆనందాల హరివిల్లు 2
జవాబు:
AP Board 8th Class Telugu Solutions Chapter 2 ఇల్లు – ఆనందాల హరివిల్లు 3

అ. సహాయత × నిస్సహాయత
ఎందరో అనాథలు తమను పట్టించుకొనేవారు లేక నిస్సహాయతతో కాలం గడుపుచున్నారు.

ఆ. ఐక్యత × అనైక్యత
భారతీయ రాజుల అనైక్యత వల్లనే బ్రిటిష్ వారు మనదేశాన్ని స్వాధీనం చేసుకోగలిగారు.

ఇ. సమానత్వం × అసమానత్వం
ప్రపంచ దేశాల మధ్య ఆర్థికంగా అసమానత్వం ఉంది.

ఈ. ఉత్సాహం × నిరుత్సాహం
కొంతమంది ఎప్పుడూ నిరుత్సాహంగా ఉంటారు.

ఉ. ప్రాధాన్యం × అప్రాధాన్యం
మనం అప్రాధాన్య విషయాలపై సమయాన్ని వృథా చేయరాదు.

V. సృజనాత్మకత

* వేసవి సెలవుల్లో మీరు మీ స్నేహితుడి ఇంటికి వెళ్ళారు. ఆ కుటుంబం మిమ్మల్ని ఎంతో ప్రేమగా చూసుకుంది. ఇంటికి తిరిగి వచ్చాక మీ స్నేహితులకు కృతజ్ఞతలు తెలుపుతూ లేఖ రాయండి.
జవాబు:

విజయవాడ,
x x x x x x x

ప్రియమైన మిత్రుడు అఖిల్ కు,

నీ స్నేహితుడు వ్రాయు ఉత్తరం. ఇక్కడ నేను క్షేమం. అక్కడ నీవు కూడా అలాగే ఉంటావని ఆశిస్తున్నాను. ముఖ్యముగా ఉత్తరం వ్రాయుట ఏమనగా నేను ఇటీవల వేసవి సెలవులలో మీ ఇంటికి వచ్చాను కదా ! అప్పుడు మీ కుటుంబంలోని వారందరూ నన్ను ఎంతో ప్రేమగా చూసుకున్నారు. నన్ను మీలో ఒకరిగా చూశారు. ముఖ్యంగా మీ అమ్మమ్మ, తాతయ్య వాళ్ళు నన్ను ఆదరించిన విధానం నాకు చాలా నచ్చింది. నన్ను దిగుడు బావి దగ్గరకు తీసుకువెళ్ళి మీ మామయ్య చక్కగా 15 రోజులు ఈత నేర్పించారు. అలాగే మీ మామయ్య వాళ్ళ పిల్లలు, మనం కలిసి క్రికెట్, కబడ్డీ మొదలగు ఆటలు చక్కగా ఆడుకున్నాము. వారందరికీ నా కృతజ్ఞతలు తెలియచేయవలసినదిగా కోరుకుంటున్నాను. ఈసారి వేసవి సెలవులకు నీవు మా ఊరికి తప్పక రావాలి.

ఇట్లు,
మీ మిత్రుడు,
అఖిలేశ్వర్.

చిరునామా :
బి. అఖిల్,
S/0 బి. రంగనాథం,
7-8-63, 8/4,
నైనవరం, పశ్చిమగోదావరి జిల్లా.

(లేదా)
* తాతయ్య, నాన్నమ్మ, అమ్మానాన్నలు, పిల్లలూ అంతా కలిసి ఉంటేనే కుటుంబం అంటారు. కాని నేటికాలంలో ఎంతోమంది వృద్ధులను, వృద్ధాశ్రమాల్లో చేరుస్తున్నారు. ఇది సరికాదని ప్రజలందరికీ తెలియజేయడానికి కరపత్రం తయారుచేయండి.
(లేదా)
వృద్ధులను వృద్ధాశ్రమాల్లో చేర్చడం మంచిది కాదని తెలియజేస్తూ ప్రజలందరికీ తెలియజేయడానికి “కరపత్రం” తయారు చేయండి.
జవాబు:
కన్నవారిని కళ్ళల్లో పెట్టి చూసుకుందాం

సోదరసోదరీమణులారా! ఒక చిన్న విన్నపం. మనం ఇలా పెరిగి పెద్దవారమై, విద్యాబుద్ధులు నేర్చుకొని, ఉద్యోగాలు చేస్తూ, ఆస్తిపాస్తులు సంపాదించుకొని, సుఖంగా ఉండడానికి వెనుక కారణం ఎవరో, ఒకసారి ఆలోచించండి. గట్టిగా ఆలోచిస్తే, మనలను చేతులు పట్టుకు నడిపించి, బడిలో చేర్పించి, చదువులు చెప్పించి, గోరుముద్దలు తినిపించి, అవసరానికి ఆదుకొని, మనకోసం వారి సుఖ సంతోషాలన్నీ త్యాగం చేసిన, మన తల్లిదండ్రులే అని, మీకు గుర్తు వస్తుంది.

ఈ మధ్య చాలామంది తమ తల్లిదండ్రులను వృద్ధాశ్రమాల్లో చేరుస్తున్నారు. అక్కడ తిండి పెడతారు. వినోదాలు కూడా ఉండవచ్చు. కానీ అక్కడ తమ పిల్లలతో మనవలతో, కోడళ్ళతో తిరిగిన సుఖ సంతోషాలు, మమతానురాగాలు మన తల్లిదండ్రులకు దొరకవు. తమ పిల్లలు తమను పట్టించుకోవడంలేదనే బెంగతో, వారు క్రుంగిపోతారు.

మీ పిల్లలకు మంచి పురాణ కథలు చెప్పి ఆదరంగా చేరదీసే తాతామామ్మలు వారికి దొరకరు. కనుక మిమ్మల్ని కనిపెంచిన తల్లిదండ్రుల్ని ఆదరించండి. మీ ఇంట్లోనే వీరిని ఉంచుకోండి. నిరాదరణకు గురిచేసి, వృద్ధాశ్రమాలకు పంపకండి. మరువకండి. లేదా మీకు మీ పెద్దల గతే, అని గుర్తుంచుకోండి.
ఇట్లు,
జె.ఎమ్.ఎస్.యువజన చైతన్య సమితి.

VI. ప్రశంస

మీరు చూసిన లేదా మీకు తెలిసిన ఒక మంచి కుటుంబాన్ని గురించి మీ భావనలను తెలుపుతూ మీ స్నేహితుడికి/ తాతయ్యకు ఉత్తరం రాయండి.
జవాబు:

విజయవాడ,
x x x x x x x

ప్రియమైన మిత్రుడు రాకేష్ కు,

నేను క్షేమం, నీవు కూడా క్షేమమని తలుస్తాను. నేను ఇటీవల సెలవులలో మా అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళాను. అక్కడ మా అమ్మమ్మ కుటుంబం మొత్తం ఉమ్మడి కుటుంబం. నాకు అలాగే అందరూ కలిసి ఉండటం చాలా నచ్చింది. అక్కడ అందరూ పెద్దవారి మాటను అనుసరించి నడచుకుంటున్నారు. పెద్దల మాటలకు బాగా గౌరవం ఇస్తున్నారు. అలాగే పిల్లలపై పెద్దవారు చూపే ప్రేమాభిమానాలు, వారి మధ్యగల అనురాగాలు నాకు బాగా నచ్చాయి. అక్కడ నేను వారందరి మధ్య సంతోషంగా గడిపాను. నీవు కూడా మీ తాతయ్య వాళ్ళింటికి వెళ్ళావు కదా ! అక్కడి విషయాలు వివరిస్తూ లేఖ వ్రాయవలెను. ఉమ్మడి కుటుంబం వలన కలిగే ప్రయోజనాలు మనము మన స్నేహితులందరికి తెలియజేయాలి. అమ్మ, నాన్నగార్లకు నా నమస్కారాలు తెలుపవలెను.

ఇట్లు,
నీ మిత్రుడు,
రాజేష్,

చిరునామా :
కె.రాకేష్,
S/o కె. రామ్మూర్తి,
9/83-78-6,
తోట్లవారి వీధి,
వైజాగ్.

ప్రాజెక్టు పని

* ఈనాటి మానవ సంబంధాలపై వార్తా పత్రికల్లో అనేక వార్తలు, కథనాలు వస్తుంటాయి. వాటిని సేకరించి తరగతిలో వినిపించండి.
జవాబు:
వార్తలు :
1. 90 ఏళ్ళ వయస్సున్న అన్నపూర్ణమ్మను ఇద్దరు కొడుకులు ఇంటి నుండి పంపివేశారు. అన్నపూర్ణమ్మ చెట్టు కింద ఉంటోంది. గ్రామస్థులు పెట్టింది తింటోంది.

2. భుజంగరావు తన తలిదండ్రుల్ని వృద్ధాశ్రమంలో చేర్పించాడు. ఆ తల్లిదండ్రులు మనమల కోసం బెంగపెట్టుకున్నారు. అతని భార్య మాత్రం అత్తామామల రాకకు ఒప్పుకోలేదు.

VII. భాషాంశాలు

1) కింది సామాన్య వాక్యాలను సంక్లిష్ట వాక్యాలుగా మార్చండి.
ఉదా :
శర్వాణి పాఠం చదివింది. శర్వాణి నిద్రపోయింది.
శర్వాణి పాఠం చదివి, నిద్రపోయింది.

అ. మహతి ఆట ఆడింది. మహతి అన్నం తిన్నది.
జవాబు:
మహతి ఆట ఆడి, అన్నం తిన్నది.

ఆ. శ్రీనిధి జడవేసుకుంది. శ్రీనిధి పూలు పెట్టుకుంది.
జవాబు:
శ్రీనిధి జడవేసుకుని, పూలు పెట్టుకుంది.

ఇ. మాధవి పాఠం చదివింది. మాధవి పద్యం చెప్పింది.
జవాబు:
మాధవి పాఠం చదివి, పద్యం చెప్పింది.

ఈ. శివాని కళాశాలకు వెళ్ళింది. శివాని పాటల పోటీలో పాల్గొన్నది.
జవాబు:
శివాని కళాశాలకు వెళ్ళి, పాటల పోటీలో పాల్గొన్నది.

ఉ. నారాయణ అన్నం తింటాడు. నారాయణ నీళ్ళు తాగుతాడు.
జవాబు:
నారాయణ అన్నం తిని, నీళ్ళు తాగుతాడు.

ఊ. సుమంత్ పోటీలకు వెళ్ళాడు. సుమంత్ మంచి అలవాట్ల గురించి ప్రసంగించాడు.
జవాబు:
సుమంత్ పోటీలకు వెళ్ళి, మంచి అలవాట్ల గురించి ప్రసంగించాడు.

AP Board 8th Class Telugu Solutions Chapter 2 ఇల్లు – ఆనందాల హరివిల్లు

2) కింది సంక్లిష్ట వాక్యాలను సామాన్య వాక్యాలుగా రాయండి.
ఉదా :
శరత్ ఇంటికి వచ్చి, అన్నం తిన్నాడు.
శరత్ ఇంటికి వచ్చాడు. శరత్ అన్నం తిన్నాడు.

అ. కందుకూరి రచనలు చేసి సంఘ సంస్కరణ చేశాడు.
జవాబు:
కందుకూరి రచనలు చేశాడు. కందుకూరి సంఘ సంస్కరణ చేశాడు.

ఆ. రంగడు అడవికి వెళ్ళి కట్టెలు తెస్తాడు.
జవాబు:
రంగడు అడవికి వెళ్తాడు. రంగడు కట్టెలు తెస్తాడు.

ఇ. నీలిమ టి.వి. చూసి నిద్రపోయింది.
జవాబు:
నీలిమ టి.వి. చూసింది. నీలిమ నిద్రపోయింది.

ఈ. రజియా పాటపాడుతూ ఆడుకుంటున్నది.
జవాబు:
రజియా పాట పాడుతున్నది. రజియా ఆడుకుంటున్నది.

3) సంయుక్త వాక్యం
కింది వాక్యాలను గమనించండి.
విమల తెలివైనది. విమల అందమైనది.
విమల తెలివైనది, అందమైనది.
“ఇలా రెండు సామాన్య వాక్యాలు కలిసి ఒకే వాక్యంగా ఏర్పడటాన్ని సంయుక్త వాక్యం” అంటారు.

4) సంయుక్త వాక్యంగా మారేటప్పుడు వాక్యాల్లో వచ్చే మార్పులను గమనించండి.
అ) వనజ చురుకైనది. వనజ అందమైనది.
వనజ చురుకైనది, అందమైనది – రెండు నామపదాల్లో ఒకటి లోపించడం.

ఆ) అజిత అక్క శైలజ చెల్లెలు.
అజిత, శైలజ అక్కాచెల్లెళ్ళు – రెండు నామపదాలు ఒకచోట చేరి చివర బహువచనం చేరింది.

ఇ) ఆయన డాక్టరా? ఆయన ప్రొఫెసరా?
ఆయన డాక్టరా, ప్రొఫెసరా? – రెండు సర్వనామాలలో ఒకటి లోపించడం.

మరికొన్ని సంయుక్త వాక్యాలను రాయండి.

  1. ఆయనా, ఈయనా పెద్దవాళ్ళు.
  2. రవి కవిత్వమూ, కథలూ రాస్తాడు.
  3. అంబేద్కర్ కార్యవాది, క్రియాశీలి.
  4. శ్రీనిధి, రామూ బుద్ధిమంతులు.
  5. రాజా, గోపాలు అన్నాదమ్ములు.
  6. సీత యోగ్యురాలు, బుద్ధిమంతురాలు.

వ్యాకరణంపై అదనపు సమాచారం

పర్యాయపదాలు

అమ్మ : మాత, జనని, తల్లి
వివాహం : వివాహం, పరిణయం, ఉద్వాహం
స్వర్గం : త్రిదివం, నాకం, దివి
స్త్రీ : పడతి, స్త్రీ, ఇంతి
పక్షి : పిట్ట, పులుగు, విహంగం
వ్యవసాయం : సేద్యం, కృషి
సౌరభం : సువాసన, పరిమళం, తావి
నాన్న : జనకుడు, పిత, తండ్రి
ఇల : భూమి, వసుధ, ధరణి
పథం : దారి, మార్గం, త్రోవ
గృహం : ఇల్లు, సదనం, నికేతనం
భార్య : ఇల్లాలు, సతి, కులస్త్రీ

వ్యుత్పత్యర్థాలు

ఇతిహాసం – ఇలా జరిగిందని చెప్పేది (చరిత్ర)
మానవుడు – మనువు వల్ల పుట్టినవాడు (నరుడు)
పక్షి – పక్షములు కలది (పిట్ట)

నానార్థాలు

తాత = తండ్రి, తండ్రి తండ్రి, తల్లితండ్రి, బ్రహ్మ
గుణం = స్వభావం, అల్లెత్రాడు, ప్రయోజనం
వేదం = వెలివి, వివరణం
పాలు = క్షీరం, భాగం, సమీపం
సౌరభం = సువాసన, కుంకుమ, పువ్వు
వ్యవసాయం = కృషి, ప్రయత్నం , పరిశ్రమ
కాలం = సమయం, మరణం, నలుపు
దక్షిణం = ఒక దిక్కు సంభావన
ధర్మం = న్యాయం, ఆచారం, యజ్ఞం

సంధులు

సవర్ణదీర్ఘ సంధి :
సూత్రం : అ, ఇ, ఉ, ఋ లకు సవర్ణములైన అచ్చులు పరమైనప్పుడు వాని దీర్ఘములు ఏకదేశమగును.

గృహస్థాశ్రమం = గృహస్థ + ఆశ్రమం – సవర్ణదీర్ఘ సంధి
స్వావలంబన = స్వ + అవలంబన – సవర్ణదీర్ఘ సంధి
దేవాలయం = దేవ + ఆలయం – సవర్ణదీర్ఘ సంధి
వృద్ధాశ్రమం = వృద + ఆశ్రమం – సవర్ణదీర్ఘ సంధి
నిర్ణయాధికారం = నిర్ణయ + అధికారం – సవర్ణదీర్ఘ సంధి
కాలానుగుణం = కాల + అనుగుణం – సవర్ణదీర్ఘ సంధి

AP Board 8th Class Telugu Solutions Chapter 2 ఇల్లు – ఆనందాల హరివిల్లు

గుణసంధి :
సూత్రం : అకారమునకు ఇ, ఉ, ఋ లు పరమగునపుడు క్రమముగా ఏ, ఓ, అర్లు ఏకాదేశమగును.
పరోపకారం = పర + ఉపకారం – గుణసంధి
భావోద్వేగాలు = భావ + ఉద్వేగాలు – గుణసంధి

యణాదేశ సంధి :
సూత్రం : ఇ, ఉ, ఋలకు అసవర్ణములైన అచ్చులు పరమైనప్పుడు య, వ, ర లు ఆదేశమగును.
అత్యంత = అతి + అంత – యణాదేశ సంధి
అత్యున్నత = అతి + ఉన్నత – యణాదేశ సంధి
ప్రత్యక్షం = ప్రతి + అక్షం – యణాదేశ సంధి

వృద్ధి సంధి :
సూత్రం : అకారమునకు ఏ, ఐలు పరమగునపుడు ఐ కారమును, ఓ, ఔలు పరమగునపుడు ఔ కొరమును ఏకాదేశమగును.
మమైక = మమ + ఏక = వృద్ధి సంధి
దేశాన్నత్యం = దేశ + ఔన్నత్యం – వృద్ధిసంధి

అత్వసంధి :
సూత్రం : అత్తునకు సంధి బహుళంగా వస్తుంది.
అమ్మమ్మ = అమ్మ + అమ్మ – అత్వసంధి
నాన్నమ్మ = . నాన్న + అమ్మ – అత్వసంధి
తాతయ్య = – తాత + అయ్య – అత్వసంధి
పెద్దయిన = పెద్ద + అయిన = అత్వసంధి

ఇత్వసంధి (అ) :
సూత్రం : ఏమి మొదలైన పదాల్లోని ఇత్తునకు సంధి వైకల్పికంగా అవుతుంది.
మరెక్కడ = మరి + ఎక్కడ – ఇత్వసంధి
మనయ్యేది = పని + అయ్యేది – ఇత్వసంధి
ఏదైనా = ఏది + ఐనా – ఇత్వసంధి

ఇత్వసంధి (ఆ) :
సూత్రం : క్రియాపదాల్లో ఇత్తునకు సంధి వైకల్పికంగా అవుతుంది.
సాగిపోయిందని = సాగిపోయింది + అని – ఇత్వసంధి
ఉండేవని = ఉండేవి + అని – ఇత్వసంధి
ఉండేదని = ఉండేది + అని – ఇత్వసంధి

ఉత్వసంధి :
సూత్రం : ఉత్తునకు అచ్చు పరమైనపుడు సంధి అవుతుంది.
ఆకాశమంత =ఆకాశము + అంత – ఉత్వ సంధి
ఇల్లు + అంటే – ఉత్వసంధి
ఇల్లంటే = ఇల్లాలు = ఇల్లు – ఉత్వసంధి
వెన్నెముక = వెన్ను + ఎముక – ఉత్వసంధి

గసడదవాదేశ సంధి :
సూత్రం : ద్వంద్వ సమాసంలో మొదటి పదం మీద ఉన్న కచటతపలకు గసడదవలు క్రమంగా వస్తాయి.
తల్లిదండ్రులు = తల్లి + తండ్రి – గసడదవాదేశ సంధి
అన్నదమ్ములు = అన్న + తమ్ముడు – గసడదవాదేశ సంధి

సమాసాలు

సమాస పదంవిగ్రహవాక్యంసమాసం పేరు
అక్కాచెల్లెళ్ళుఅక్కయును, చెల్లెలునుద్వంద్వ సమాసం
తల్లిదండ్రులుతల్లియును, తండ్రియునుద్వంద్వ సమాసం
రామాయణ భారతాలురామాయణమును, భారతమునుద్వంద్వ సమాసం
ప్రేమానురాగాలుప్రేమయును, అనురాగమునుద్వంద్వ సమాసం
సిరిసంపదలుసిరియును, సంపదయునుద్వంద్వ సమాసం
స్త్రీ, పురుషులుస్త్రీయును, పురుషుడునుద్వంద్వ సమాసం
సహాయసహకారాలుసహాయమును, సహకారమునుద్వంద్వ సమాసం
ఆచార వ్యవహారాలుఆచారమును, వ్యవహారమునుద్వంద్వ సమాసం
భారతదేశంభారతము అను పేరుగల దేశముసంభావనా పూర్వపద కర్మధారయ సమాసం
ఆశ్రమధర్మాలుఆశ్రమము యొక్క ధర్మాలుషష్ఠీ తత్పురుష సమాసం
కుటుంబ వ్యవస్థకుటుంబము యొక్క వ్యవస్థషష్ఠీ తత్పురుష సమాసం
జీవనవిధానంజీవనము యొక్క విధానంషష్ఠీ తత్పురుష సమాసం
కుటుంబ జీవనంకుటుంబము యొక్క జీవనంషష్ఠీ తత్పురుష సమాసం
మంత్రశక్తిమంత్రము యొక్క శక్తిషష్ఠీ తత్పురుష సమాసం
మనోభావాలుమనస్సు యొక్క భావాలుషష్ఠీ తత్పురుష సమాసం
రైతు కుటుంబాలురైతుల యొక్క కుటుంబాలుషష్ఠీ తత్పురుష సమాసం
మంచి సమాజంమంచిదైన సమాజంవిశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
చిన్నపిల్లలుచిన్నవైన పిల్లలువిశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
ఉన్నతశ్రేణిఉన్నతమైన శ్రేణివిశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
మధురక్షణాలుమధురమైన క్షణాలువిశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
ప్రాథమిక లక్షణంప్రాథమికమైన లక్షణంవిశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
ప్రత్యక్షముఅక్షము యొక్క సమూహముఅవ్యయీభావ సమాసం
శ్రామికవర్గంశ్రామికుల యొక్క వర్గంషష్ఠీ తత్పురుష సమాసం
దుర్గుణములుదుష్టములైన గుణములువిశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
సద్గుణములుమంచివైన గుణములువిశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
ఆత్మీయబంధంఆత్మీయమైన బంధమువిశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
కొత్తధోరణులుకొత్తవైన ధోరణులువిశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
నాలుగు గోడలునాలుగు సంఖ్య గల గోడలుద్విగు సమాసం

ప్రకృతి – వికృతులు

పక్షి – పక్కి
ఆకాశం – ఆకసం
కార్యం – కర్ణం
సహజం – సాజము
వృద్ధ – పెద్ద
గర్వం – గరువము
శాస్త్రము – చట్టము
మర్యాద – మరియాద
నియమం – నేమం
గుణం – గొనం
విజ్ఞానం – విన్నానం
యంత్రం – జంత్రము
స్తంభము – కంబము
దీపము – దివ్వె
చరిత్ర – చారిత
స్త్రీ – ఇంతి
శాస్త్రం – చట్టం
రూపం – రూపు
అద్భుతము – అబ్బురము
గృహము – గీము
సంతోషం – సంతసము
ధర్మము – దమ్మము
దక్షిణం – దక్కనం
సుఖం – సుకం
త్యాగం – చాగం
స్తంభం – కంబం
భాష – బాస

AP Board 8th Class Telugu Solutions Chapter 2 ఇల్లు – ఆనందాల హరివిల్లు

పదాలు – అర్దాలు

లోగిలి = ಇಲ್ಲು
ఆమోదయోగ్యము = అంగీకారమునకు తగినది
వ్యవస్థ = ఏర్పాటు
ప్రాతిపదిక = మూలము
త్యాగభావన = విడిచిపెడుతున్నామనే ఊహ
కీలకము = ప్రధాన మర్మము
పునరుత్పత్తి = తిరిగి పుట్టించుట
విచక్షణ = మంచిచెడుల బేరీజు
సంస్కృతి = నాగరికత
సౌరభం = సువాసన
మక్కువ = ఇష్టము
వివేచన = మంచి చెడులను విమర్శించి తెలిసికోవడం
ఆదర్శం = ఇతరులు చూసి నేర్చుకోదగిన గుణం
నియమబద్ధం = నియమములతో కూడినది
నానుడి = సామెత
గృహస్థ + ఆశ్రమం = భార్యాభర్తలు పిల్లలతో తల్లిదండ్రులతో నివాసం
గార్హస్థ్య జీవితం = గృహస్తుగా జీవించడం
ఆలనా పాలనా = వినడం, కాపాడడం
జీవితపథ నిర్దేశం = జీవించే మార్గాన్ని చెప్పడం
ఆకళింపుచేసుకొను = అర్ధం చేసికొను
అవధానం = ఏకాగ్రత
అక్కర = అవసరం
స్వార్థపరత = తన బాగే చూసుకోవడం
తావు = స్థలము

AP Board 8th Class Telugu Solutions Chapter 2 ఇల్లు – ఆనందాల హరివిల్లు

సంఘీభావం = ఐకమత్యం
ఇతిహాసాలు = భారత రామాయణాలు (పరంపరగా చెప్పుకొనే పూర్వకథలు)
నమూనా = మాదిరి
స్వార్థం = స్వప్రయోజనం
అనివార్యము = నివారింపశక్యము కానిది
జీవన సరణి = జీవించే పద్ధతి
అనూహ్యము = ఊహింపరానిది
ధోరణులు = పద్దతులు
స్వావలంబన = తనపై తాను ఆధారపడడం
సంకుచితము = ముడుచుకున్నది
అనుభూతి = సుఖదుఃఖాదులను పొందడం
కనుమరుగు = కంటికి కనబడకుండా పోవుట
కేర్ టేకింగ్ సెంటర్లు = జాగ్రత్త తీసికొనే కేంద్రాలు
నేపథ్యం = తెరవెనుక ఉన్నది
అధిగమించి = దాటి
మనుగడ = జీవనం
విచ్ఛిన్నం = నాశనం
ఇబ్బడి ముబ్బడి = రెట్టింపు, మూడురెట్లు