AP 9th Class Social Important Questions Chapter 6 భారతదేశంలో వ్యవసాయం

These AP 9th Class Social Important Questions 6th Lesson భారతదేశంలో వ్యవసాయం will help students prepare well for the exams.

AP Board 9th Class Social 6th Lesson Important Questions and Answers భారతదేశంలో వ్యవసాయం

9th Class Social 6th Lesson 1 Mark Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
జీవనాధార వ్యవసాయమునందు ఎన్ని పద్ధతులు కలవు? అవి ఏవి?
జవాబు:
జీవనాధార వ్యవసాయం నందు రెండు రకాల వ్యవసాయ పద్ధతులు కలవు. అవి

  1. సాధారణ జీవనాధార వ్యవసాయం,
  2. సాంద్ర జీవనాధార వ్యవసాయం.

ప్రశ్న 2.
సాధారణ జీవనాధార వ్యవసాయం ఎలాంటి వ్యవసాయ పద్ధతి?
జవాబు:
సాధారణ జీవనాధార వ్యవసాయం అంటే చిన్న కమతాలలో, పురాతన పనిముట్లు అయిన పార, గుల్లకర్ర సహాయంతో కుటుంబానికి మాత్రమే పరిమితమైన వ్యవసాయ పద్ధతి.

ప్రశ్న 3.
సాంద్ర జీవనాధార వ్యవసాయం ఎలాంటి వ్యవసాయ విధానం?
జవాబు:
సాంద్ర జీవనాధార వ్యవసాయం అంటే అధికంగా వ్యవసాయ శ్రామికులను, అత్యధిక జీవ రసాయనిక ఎరువులను, నీటిపారుదలను ఉపయోగించుకొని అధిక దిగుబడి సాధించే వ్యవసాయ విధానం.

AP 9th Class Social Important Questions Chapter 6 భారతదేశంలో వ్యవసాయం

ప్రశ్న 4.
వాణిజ్య వ్యవసాయం యొక్క ప్రధాన లక్షణం ఏమిటి?
జవాబు:
అధిక దిగుబడి కొరకు ఆధునిక ఉత్పాదకాలను విరివిగా ఉపయోగించడం దీని ప్రధాన లక్షణం.

ప్రశ్న 5.
వ్యవసాయ పంటలు వేటిపైన ఆధారపడి ఉంటాయి?
జవాబు:
వ్యవసాయ పంటలు ఋతువుల మీద, సహజ వనరులైన మృత్తికలు, నీరు, సూర్యరశ్మిపై ఆధారపడి ఉంటాయి.

ప్రశ్న 6.
భారతదేశంలో ఎన్ని రకాల పంట కాలాలు ఉన్నాయి? అవి ఏవి?
జవాబు:
భారతదేశంలో మూడు రకాల పంట కాలాలు కలవు. అవి రబీ, ఖరీఫ్, జయాద్.

ప్రశ్న 7.
రబీ పంటకాలం ఏది?
జవాబు:
రబీ పంటను శీతాకాలంలో అక్టోబర్ నుండి డిసెంబర్ మధ్యకాలంలో విత్తుతారు. ఏప్రిల్ నుండి జూన్ మధ్యకాలంలో పంటను కోస్తారు.

ప్రశ్న 8.
రబీ పంటలు కొన్నింటిని రాయండి.
జవాబు:
గోధుమ, బార్లీ, బఠాణి, శనగలు, ఆవాలు ముఖ్యమైనవి.

ప్రశ్న 9.
ఖరీఫ్ పంటకాలం ఏది?
జవాబు:
నైరుతి రుతుపవనాల రాకతో ప్రారంభమై సెప్టెంబర్ నుండి అక్టోబర్ మధ్యకాలంలో పంట కోతలు ప్రారంభమగును.

ప్రశ్న 10.
ఖరీలో పండించే కొన్ని పంటల పేర్లు రాయండి.
జవాబు:
వరి, మొక్కజొన్న, జొన్న, సజ్జ, కందులు, పెసలు, మినుములు, ప్రత్తి, జనుము, వేరుశనగ, సోయాబీన్ ముఖ్యమైన ఖరీఫ్ పంటలు.

ప్రశ్న 11.
‘జయాద్’ అనగానేమి?
జవాబు:
ఖరీఫ్, రబీ పంట కాలాల మధ్య స్వల్ప వ్యవధి గల పంట ఋతువును ‘జయాద్’ అంటారు. పుచ్చకాయలు, కర్బూజ, దోసకాయ, కూరగాయలు, పశువుల మేత మొ||వాటిని జయాద్ కాలంలో పండిస్తారు.

ప్రశ్న 12.
HYVను విస్తరించండి.
జవాబు:
HYV – అధిక దిగుబడి విత్తనాలు – High Yielding Varieties.

AP 9th Class Social Important Questions Chapter 6 భారతదేశంలో వ్యవసాయం

ప్రశ్న 13.
జనుము ఉపయోగమేమి?
జవాబు:
జనుము ‘బంగారు పీచు’గా ప్రసిద్ధి. దీనిని గోనెసంచులు, చాపలు, తాళ్ళు, దారం, తివాచీలు మొ||నవి చేయడానికి ఉపయోగిస్తారు.

ప్రశ్న 14.
భారతదేశంలోని ఏవైనా రెండు పంటకాలాలు రాయండి.
జవాబు:
సాధారణంగా భారతదేశంలో 3 రకాల పంటకాలాలు కలవు. వానిలో ఖరీఫ్, రబీ అనేవి రెండు ముఖ్యమైన పంటకాలాలు. మూడవది జయాద్.

ప్రశ్న 15.
కింది పటంలో గుర్తించబడిన ప్రాంతాలలో పండే ప్రధాన పంట ఏది?
జవాబు:
వరిని ఈ ప్రాంతాలలో ప్రధాన పంటగా పండిస్తారు.

ప్రశ్న 16.
NABARD ను విస్తరించండి.
జవాబు:
NATIONAL BANK FOR AGRICULTURAL AND RURAL DEVELOPMENT.

AP 9th Class Social Important Questions Chapter 6 భారతదేశంలో వ్యవసాయం

ప్రశ్న 17.
MSP ను విస్తరింపుము.
జవాబు:
Minimum Support Price.

9th Class Social 6th Lesson 2 Marks Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
“హరిత విప్లవం వలన చాలా ప్రాంతాలలో భూముల సారం తగ్గి, రైతుల ఖర్చు పెరిగింది” – ఈ వ్యాఖ్యతో ఏకీభవిస్తారా? వివరించండి.
(లేదా)
“హరిత విప్లవం వల్ల అనేక ప్రాంతాలలో భూముల సారం తగ్గి రైతుల వ్యవసాయ పెట్టుబడి ఖర్చు కూడా పెరిగింది.” – పై వాక్యంతో మీరు ఏకీభవిస్తున్నారా? సరైన వివరణలతో మీ వాదనను సమర్థించుకొనండి.
జవాబు:
అవును, నేను పై వ్యాఖ్యతో ఏకీభవిస్తాను.

  1. రసాయన ఎరువులలో నీటిలో వెంటనే కరిగే ఖనిజాలు ఉండడం వలన మొక్కలకు పోషకాలు త్వరగా అందుతాయి. అయితే ఇవి ఎక్కువ కాలం నేలలో నిలవ ఉండవు.
  2. వీటివలన చెరువులు, నదులలోని నీరు, భూగర్భజలాలు కలుషితమవుతాయి.
  3. మట్టిలో ఉండే బ్యాక్టీరియా, ఇతర సూక్ష్మజీవులు చనిపోతాయి.
  4. దానితో కొంతకాలం తరువాత నేల మునుపటికంటే నిస్సారంగా తయారవుతుంది.
  5. నేలలో సూక్ష్మజీవుల ద్వారా అందే పోషకాలు అందకపోవడం వలన రైతు మరిన్ని ఎరువులు వాడవలసి ఉంటుంది.
  6. ఈ విధంగా హరిత విప్లవం వలన రైతుకి ఖర్చు పెరిగి భూములకి సారం తగ్గింది.

ప్రశ్న 2.
భారతదేశంలో పంటకాలాలు పేర్లు రాసి, అవి ఏయే నెలల మధ్య ఉంటాయో రాయండి.
జవాబు:
భారతదేశంలో మూడు పంటకాలాలు కలవు. అవి ఖరీఫ్, రబీ, జయాద్.

నైఋతీ రుతుపవనాల రాకతో అనగా జూన్ నెలలో దాదాపు దేశమంతటా ఖరీఫ్ కాలం ప్రారంభమై సెప్టెంబర్ నుండి అక్టోబరు మధ్యకాలంలో పంటకోతలు ప్రారంభమగును.

రబీ పంటను శీతాకాలంలో అక్టోబరు నుండి డిసెంబర్ మధ్య కాలంలో విత్తుతారు. ఏప్రిల్ నుండి జూన్ మధ్య కాలంలో పంటకోతలు ప్రారంభమగును. – ఖరీఫ్, రబీ పంట కాలాల మధ్య స్వల్ప వ్యవధి గల పంట రుతువును జయాద్ అంటారు. ఇది ఏప్రిల్, మే నెలలో ఉంటుంది.

ప్రశ్న 3.
వ్యవసాయ దారులు, వ్యవసాయ కూలీలకు సంబంధించిన బార్ గ్రాఫ్ ను పరిశీలించండి. దీని ఆధారంగా మీ పరిశీలనను రాయండి.
AP 9th Class Social Important Questions Chapter 6 భారతదేశంలో వ్యవసాయం
జవాబు:
పై బార్ గ్రాఫ్ 1951 నుండి 2001 వరకు భారతదేశంలో వ్యవసాయ కూలీలు ఎందరు మరియు వ్యవసాయదారులు ఎంతశాతం అనేది తెలియచేస్తుంది.

వ్యవసాయకూలీలు % వ్యవసాయదారులు %
1951 28% 72%
1961 24% 76%
1971 38% 62%
1981 37% 63%
1991 40% 60%
2001 46% 54%

పై బార్ గ్రాఫ్ పరిశీలిస్తే వ్యవసాయదారుల సంఖ్య తగ్గిపోతూ వ్యవసాయ కూలీల సంఖ్య గణనీయంగా పెరుగుతూ వచ్చింది.

ప్రశ్న 4.
కింది పట్టికలో ఇవ్వబడిన సమాచారాన్ని బార్ గ్రాఫ్ లో చూపి నీ యొక్క పరిశీలనను రాయుము.

సంవత్సరం ఆహారధాన్యాల ఉత్పత్తి (మి. టన్నులలో)
1980 – 81 130
1990 – 91 176
2000 – 01 197
2010 – 11 242

జవాబు:
AP 9th Class Social Important Questions Chapter 6 భారతదేశంలో వ్యవసాయం 1
పై బార్ గ్రాఫ్ ని పరిశీలించినట్లయితే 1980-81 సం|| నుండి 2010 – 11 సం||రాల మధ్య ఆహార ధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెరుగుతూ వచ్చింది. దీనిని గమనించినట్లయితే పెరుగుతున్న జనాభాకు మనం ఆహారధాన్యాల సరఫరాను సక్రమంగా అందించగలం.

ప్రశ్న 5.
నేడు భారతదేశపు దిగుమతులలో ఆహార వస్తువులు కేవలం మూడు శాతం మాత్రమే. ఈ ఘనత సాధనలో హరిత విప్లవం యొక్క ప్రాధాన్యతను వివరింపుము.
జవాబు:
గడచిన ఏడు దశాబ్దాలలో ఆహార ధాన్యాల ఉత్పత్తి 51 మిలియన్ టన్నుల నుండి 242 మిలియన్ టన్నులకు పెరిగింది. అంటే సుమారుగా 5 రెట్లు.

రైతులు అధిక మొత్తంలో ఆహారధాన్యాల, ఆహారేతర పంటలను ఒకే పొలంలో సాగుచేయడానికి హరిత విప్లవం దోహదపడింది. అయితే వ్యవసాయ సాగుభూమి విస్తీర్ణంలో పెద్దగా పెరుగుదల లేదు. 1960లో ఒక రైతు ఎకరాభూమిలో 287 కిలోల ఆహారధాన్యాలను పండించగా ప్రస్తుతం అదే రైతు ఒక ఎకరా సాగు భూమిలో 800 కిలోల ఆహార ధాన్యాలను పండిస్తున్నాడు. ఈ పెరుగుదల హరిత విప్లవం వలన జరిగింది. దానివలన మనం ఆహారధాన్యాల దిగుమతిని తగ్గించుకున్నాం. ఎందుకనగా హరిత విప్లవం వలన మనకు అవసరమైన ఆహారధాన్యాల ఉత్పత్తి జరుగుచున్నది.

హరిత విప్లవం ప్రాధాన్యత :

  1. హైబ్రిడ్ విత్తనాల వాడకం
  2. ఎరువుల వాడకం
  3. క్రిమిసంహారక మందుల వినియోగం
  4. సరియైన నీటి పారుదల సౌకర్యాల కల్పన.

9th Class Social 6th Lesson 4 Marks Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
గ్రాఫ్ ను పరిశీలించి, కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
AP 9th Class Social Important Questions Chapter 6 భారతదేశంలో వ్యవసాయం 2
అ) వ్యవసాయదారునికి, వ్యవసాయ కూలీకి మధ్యగల భేదం ఏమిటి?
ఆ) 1971 సం||లో వ్యవసాయదారుల శాతం ఎంత?
ఇ) భూమిలేని వ్యవసాయ కూలీల కోసం ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలను సూచించండి.
ఈ) ఏ సంవత్సరంలో అత్యధిక వ్యవసాయదారుల శాతం నమోదయింది?
జవాబు:
అ) స్వంత పొలం కలిగినవారిని వ్యవసాయదారులు గానూ, ఇతరుల పొలాలలో పనిచేసేవారిని వ్యవసాయకూలీలు గానూ పిలుస్తారు.
ఆ) 62%
ఇ) పాడి పశువుల పెంపకం, కూరగాయల అమ్మకం, ఇటుక బట్టీలలో పనిచేయడం.
ఈ)1961.

ప్రశ్న 2.
ప్రస్తుతం భారతదేశ వ్యవసాయరంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి మీరు చేసే సూచనలేవి?
జవాబు:

  1. మంచి విత్తనాలను మాత్రమే వినియోగించాలి. ప్రభుత్వంచే గుర్తించబడిన విత్తనాలను మాత్రమే వాడాలి.
  2. సేంద్రియ ఎరువులను ఎక్కువగా వినియోగించాలి.
  3. ఆ ప్రాంతంలో దొరికే నీటి మీద ఆధారపడి పంటలు పండించాలి.
  4. ప్రభుత్వం కూడా ప్రజలకు ఎక్కువ సబ్సిడీలను ఇవ్వాలి.
  5. వాతావరణ విశేషాలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం రైతులకు తెలియచేయాలి.
  6. ప్రభుత్వం రైతులకు ధాన్యాలను నిల్వ ఉంచడానికి అవసరమైన గిడ్డంగుల సదుపాయాలను ఉచితంగా అందించాలి.
  7. ఆహార పంటల పెంపకానికి అనువుగాని ప్రదేశాలలో ప్రభుత్వం రైతులకు శిక్షణ ఇచ్చి వాణిజ్య పంటలను లేదా పశువుల పెంపకానికి అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం అవసరమైతే సబ్సిడీలను ఇవ్వాలి.

ప్రశ్న 3.
కింది పట్టికను పరిశీలించి కింది ప్రశ్నలకు జవాబులు రాయండి.
AP 9th Class Social Important Questions Chapter 6 భారతదేశంలో వ్యవసాయం 3
ఎ) పై పట్టికను అనుసరించి ఎవరు పెద్ద రైతులుగా పరిగణించబడతారు?
బి) ఏ రకమైన రైతుల సంఖ్య ఎక్కువగా ఉంది?
సి) భారతదేశంలో రైతులచే సాగుచేయబడుతున్న మొత్తం భూమి ఎంత?
డి) ఉపాంతర రైతులచే సాగుచేయబడుతున్న సగటు భూమి విస్తీర్ణం ఎంత?
జవాబు:
ఎ) 25 ఎకరాల కంటే ఎక్కువ భూమిని కలిగియుండి మరియు సాగుచేసే రైతులు పెద్ద రైతులుగా పరిగణించబడతారు.
బి) ఉపాంత రైతుల సంఖ్య ఎక్కువగా ఉంది.
సి) 3932 లక్షల ఎకరాల విస్తీర్ణం గల భూమి రైతులచే సాగు చేయబడుతుంది.
డి) ఉపాంత రైతులచే సాగుచేయబడుతున్న సగటు భూమి విస్తీర్ణం 0.95 ఎకరాలు.

ప్రశ్న 4.
“వర్షాధార ప్రాంతంలో పడిన వర్షపాతాన్ని సంరక్షించుకోవటం మొదటి బాధ్యత. పడిన వర్షపు నీరు వేగంగా ప్రవహించ నీయకుండా చూడగలగాలి. దీనివలన నీరు భూమిలోకి ఇంకటానికి అవకాశం లభించి భూగర్భజలం వృద్ధి చెందుతుంది.”
ప్రశ్న : వర్షాధార ప్రాంతాలలోని భూగర్భజల వృద్ధి కార్యక్రమాల గురించి వ్యాఖ్యానించండి.
జవాబు:
వర్షాధార ప్రాంతాలలో భూగర్భజల వృద్ధి కార్యక్రమాలు :

  1. మొదటగా ఖాళీ ప్రదేశాలలో మొక్కలు నాటి వర్షం పడినప్పుడు నీటిని భూమిలోపలికి ఇంకేలా చేయాలి.
  2. కెమికల్ (రసాయన) వ్యర్థ పదార్థాలను భూమి లోపలికి పంపించకూడదు.
  3. రసాయన వ్యర్థ పదార్థాల విడుదలలో, సరియైన విధానాలను పాటిస్తే భూగర్భజలం కాలుష్యానికి గురికాకుండా ఉంటుంది.
  4. మనం ప్రతిరోజూ ఉపయోగించే నీరు వృథా చేయకుండా జాగ్రత్త వహించాలి.
  5. భూగర్భ జల వినియోగం ప్రాముఖ్యత గురించి మనం తెలుసుకోవడమే కాకుండా మిగతా వారికి కూడా తెలియచేయాలి.
  6. ఇంకుడు గుంతల కార్యక్రమం మరియు వాటర్ షెడ్ నిర్మాణాల ద్వారా భూగర్భజలాన్ని వృద్ధి చేయాలి.
  7. భూగర్భ జలం తక్కువగా ఉన్న ప్రాంతాలలో నీరు ఎక్కువగా వినియోగించే పంటలను పండించకూడదు.

ప్రశ్న 5.
ఒకదేశ ఆహారభద్రత ఆ దేశపు వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉంటుంది. భారతీయ వ్యవసాయ రంగమును గూర్చి వివరింపుము.
జవాబు:
దేశ ఆహారభద్రతకు వ్యవసాయరంగం భరోసానిస్తుంది.

  1. భారతదేశ వ్యవసాయ రంగం ఆహారభద్రతకు భరోసా ఇవ్వడమే కాకుండా పరిశ్రమలకు కావలసిన ముడి పదార్థములను అందిస్తుంది.
  2. లక్షల మంది ప్రజలకు భారతీయ వ్యవసాయం ఉపాధిని కల్పిస్తుంది.
  3. మన దేశం యొక్క శ్రామికులలో సగం మందికి పైగా వ్యవసాయం, దాని అనుబంధ కార్యకలాపాలలో పనిచేస్తున్నారు.
  4. వ్యవసాయరంగంలో దాదాపుగా 70% మహిళా శ్రామికులు ఉపాధిని పొందుతున్నారు.
  5. భారతీయ వ్యవసాయం హరిత విప్లవం వలన అభివృద్ధి చెంది ఆహారభద్రతను పెంపొందించగలుగుతోంది.
  6. దీని వలన మనం ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకునే ఆహార ఉత్పత్తుల సంఖ్య తగ్గినది.

ప్రశ్న 1.
భారతీయ రైతులు ప్రధానంగా చిన్న కమతాలు కలిగి ఉన్నారు.
చిన్న కమతాలను కలిగి ఉండటం భారతీయ వ్యవసాయ రంగం యొక్క ప్రధాన లక్షణం. అనేక మంది రైతులు చిన్న చిన్న కమతాలలోనే సాగుచేస్తున్నారు. కింది పట్టికను గమనించండి.
పట్టిక – 1 భారతదేశంలోని రైతుల సంఖ్య, వారు కలిగి ఉన్న భూమి (2010 – 2011)
AP 9th Class Social Important Questions Chapter 6 భారతదేశంలో వ్యవసాయం 4
ఈ కింది వివరణ చదివి దాని కింద ఇవ్వబడిన ప్రశ్నలకు వివరణ ఇవ్వండి.
అత్యధికమైన రైతులు చిన్న కమతాలను నిర్వహిస్తున్నారు. భారతీయ రైతులకు సంకేతం లాంటి ఉపాంత రైతులకు 2.5 ఎకరాల సాగు భూమి కలదు. మొత్తం రైతులలో 924 లక్షల మంది ఉపాంత రైతులు, అంటే మొత్తం రైతులలో 67 శాతం మంది ఉపాంత రైతులే. ఉపాంత రైతులు, చిన్న రైతులను కలిపితే వీరి సంఖ్య మొత్తం రైతులలో 85 శాతం అవుతారు. పెద్ద, మధ్యతరహా రైతులు కలిసి తక్కువ శాతం ఉన్నప్పటికిని వారి ఆధీనంలో వాస్తవంగా ఉన్న కమతాల విస్తీర్ణం ఎక్కువ. 1760 లక్షల మంది రైతులు ఈ సమూహానికి చెంది ఉన్నారు. గ్రామీణ ప్రాంతంలో వీరు అత్యంత ప్రభావవంతంగా ఉన్నారు. ఈ సమూహంలోని రైతులు 32 శాతం వ్యవసాయ భూమిని సాగుచేస్తున్నారు. ఉదాహరణకు ప్రతి పెద్ద రైతుకు సగటున 42.9 ఎకరాల భూమిని సాగుచేస్తున్నారు. దీనితో పోల్చి చూస్తే ప్రతి ఉపాంత రైతుకు సగటున 0.94 ఎకరాలు మాత్రమే అందుబాటులో కలదు. భూమి పంపిణీలో అసమానతలు, రైతులు ఎదుర్కొంటున్న అవకాశాలలో అసమానతలు, పేదరికం, అభివృద్ధి అవకాశాలు మొదలైన అంశాలను వివరిస్తాయి.

1. మీ అభిప్రాయంలో వ్యవసాయదారుడు గౌరవనీయమైన ఆదాయాన్ని సంపాదించడానికి అతడికి “కనీస సాగుభూమి” ఎంత ఉండాలి. పై పట్టికలో ఎంతమంది రైతులు మీరు అంచనా వేసిన కనీస భూమిని కలిగి ఉన్నారు?
జవాబు:
నా అభిప్రాయంలో వ్యవసాయదారుడు గౌరవనీయమైన ఆదాయాన్ని సంపాదించటానికి అతడికి కనీస సాగుభూమి 2.6 నుండి 5 ఎకరాల వరకు ఉండాలి.

పై పట్టిక ప్రకారం ఇలాంటి రైతులు మనదేశంలో దాదాపు 454 లక్షలమంది ఉన్నారు.

2. కొద్దిమంది రైతులు ప్రభావవంతంగా ఉన్నారు ఎందుకు?
జవాబు:
924 లక్షలమంది గల ఉపాంత రైతుకు సగటున 2.5 ఎకరాలు మాత్రమే భూమి ఉంది. అందువలన మధ్యతరహా, పెద్ద రైతులు ప్రభావవంతంగా ఉన్నారు.