Andhra Pradesh AP Board 5th Class Maths Solutions 7th Lesson దత్తాంశ నిర్వహణ Textbook Exercise Questions and Answers.
AP State Syllabus 5th Class Maths Solutions Chapter 7 దత్తాంశ నిర్వహణ
ప్రశ్న 1.
గణన చిహ్నాలు :
ఒక రోజు 5వ తరగతి క్లాస్ టీచర్ లక్ష్మీ ఎవరెవరికి ఏఏ పువ్వు ఇష్టమో అడిగారు. ఒక్కొక్కరు చెప్పిన దానిని బోర్డు పై కింది విధంగా ఒక విద్యార్థి రాశాడు.
గులాబి, గులాబి, బంతి, మల్లె, గులాబి, బంతి, గులాబి, లిల్లీ, గులాబి, మల్లె, గులాబి, బంతి, మల్లె, గులాబి, మల్లె, బంతి, మల్లె, గులాబి, గులాబి, మల్లె, గులాబి, బంతి, గులాబి, బంతి, బంతి, గులాబి, బంతి, గులాబి, లిల్లీ, గులాబి.
పై దత్తాంశం ఆధారంగా కింది పట్టికను పూర్తి చేయండి.
జవాబు.
కింది ప్రశ్నలకు జవాబులు రాయండి.
ప్రశ్న 1.
ఎక్కువ మంది విద్యార్థులు ఏ పువ్వును ఇష్ట పడుతున్నారు ?
జవాబు.
గులాబి పువ్వును ఎక్కువమంది ఇష్టపడుతున్నారు.
ప్రశ్న 2.
గులాబీ పువ్వును ఇష్టపడే విద్యార్థులు ఎందరు ?
జవాబు.
14 మంది విద్యార్థులు
ప్రశ్న 3.
ఏ పువ్వును తక్కువ మంది విద్యార్థులు ఇష్టపడుతున్నారు ?
జవాబు.
లిల్లీపువ్వును తక్కువ మంది విద్యార్థులు ఇష్ట పడుతున్నారు.
II. క్రింది పటచిత్రాన్ని గమనించండి మరియు పట్టికను పూరించండి. = 5 గురు
జవాబు.
క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
అ. కబడ్డీ ఆడే ఆటగాళ్ళు ఎందరు ?
జవాబు.
20 మంది ఆటగాళ్ళు కబడ్డీ ఆడుతున్నారు.
ఆ. ఏ ఆటను ఎక్కువ ఆటగాళ్ళు ఆడారు ?
జవాబు.
ఖోఖో ఆటను ఎక్కువ ఆటగాళ్ళు ఆడారు.
ఇ. ఆ ఆటను 10 మంది మాత్రమే ఆడారు ?
జవాబు.
టెన్నికాయిట్ ఆటను 10 మంది మాత్రమే ఆడారు.
III. పోచయ్య, సాల్మన్, లింగయ్య, కరీం మరియు వీరేశంలు తెల్లరేవు గ్రామంలో మత్స్యకారులు. వారు పట్టే చేపల సంఖ్య కింది పట్టికలో ఇవ్వబడింది. కింది దత్తాంశానికి సరిపడే పటచిత్రాన్ని గీయుము.
= 10 చేపలు అనగా ఒక చేప బొమ్మ 10 చేపలను సూచిస్తుంది.
జవాబు.
ఇప్పుడు కింది ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వండి.
అ) లింగయ్య కన్నా పోచయ్య ఎన్ని ఎక్కువ చేపలు పట్టాడు ?
జవాబు.
పోచయ్య పట్టిన చేపలు = 90
లింగయ్య పట్టిన చేపలు = 80
భేదం = 10
∴ పోచయ్య లింగయ్య కన్నా 10 చేపలు ఎక్కువగా పట్టెను.
ఆ) లింగయ్య పట్టిన చేపల సంఖ్య, కరీం మరియు వీరేశం కలిపి పట్టిన చేపలసంఖ్యకు సమానమా?
జవాబు.
అవును, లింగయ్య ‘పట్టిన చేపల సంఖ్య, కరీం మరియు వీరేశం కలిపి పట్టిన చేపల సంఖ్యకు సమానము..
ఇ) వీరేశం కోసం నీవు ఎన్ని చేప బొమ్మలు గీస్తావు? ఎందుకు ?
జవాబు.
వీరేశం కోసం 5 చేప బొమ్మలు గీస్తాను. ఎందుకనగా ప్రతీ చేప బొమ్మ, 10 చేపలకు సమానము కాబట్టి.
ఈ) 100 చేపలకు సరిపడే చేప బొమ్మల సంఖ్య ఎంత?
జవాబు.
100 చేపలు = 10 చేప బొమ్మలకు సమానం
IV. 5వ తరగతి విద్యార్థులు రెండు గ్రూపులుగా ఏర్పడి తమ పాఠశాలలలో రకరకాల ఆటలు ఆడే ఆటగాళ్ళ దత్తాంశం కింది విధంగా నమోదు చేశారు.
ఈ దత్తాంశాన్ని నిలువు మరియు అడ్డు కమ్మీ చిత్రాలుగా చూపించవచ్చు.
కింది ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వండి.
అ) 5వ తరగతిలో ఎంతమంది ఆటగాళ్ళు ఉన్నారు ?
జవాబు.
మొత్తం 100 + 100 = 200 మంది ఆటగాళ్ళు కలరు.
ఆ) ఖో ఖో మరియు టెన్నికాయిట్ ఆటగాళ్ళ సంఖ్యల భేదానికి సరిపోయే ఆటగాళ్ళు ఏ ఆటలో ఉన్నారు?
జవాబు.
ఖోఖో ఆడువారి సంఖ్య = 40
టెన్ని కాయిట్ ఆడువారి సంఖ్య = 10
భేదము = 30
ఇ) 40 మంది విద్యార్థులు ఏ ఆటను ఆడుతున్నారు?
జవాబు.
ఖో ఖో ను 40 మంది విద్యార్థులు ఆడుతున్నారు.
ఈ) టెన్నికాయిట్ ఆటగాళ్ళు సంఖ్యకు కబడ్డీ ఆటగాళ్ళ సంఖ్య ఎన్ని రెట్లు ?
జవాబు.
టెన్నికాయిట్ ఆటగాళ్ళు సంఖ్యకు కబడ్డీ ఆటగాళ్ళు సంఖ్య 4 రెట్లు.
V. రజని తన పొడవును తన తోటి నలుగురు స్నేహితులతో పోల్చుకోవాలనుకుంది. ఆమె వారి అందరి పొడవులను కొలిచి కింది విధంగా నమోదు చేసింది.
రజని – 120 సెం.మీ.
రఫీ – 160 సెం.మీ.
రమేష్ – 140 సెం.మీ.
రోజీ – 140 సెం.మీ.
రాణి – 160 సెం.మీ.
కమ్మీ రేఖా చిత్రం గీయటంలో రజనికి సహాయం చేయండి.
జవాబు.
కింది ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వండి.
అ) పొట్టివారు ఎవరు ?
జవాబు.
రజని పొట్టి ఆమె
ఆ) రఫీ కన్నా రజని ఎత్తు. ఎంత తక్కువ ?
జవాబు.
రఫీ ఎత్తు = 160 సెం.మీ.
రజని ఎత్తు = 120 సెం.మీ
భేదం = 40. సెం.మీ
రఫీ కన్నా రజని 40 సెం.మీ. ఎత్తు ఎక్కువ.
ఇ) రజనికి సమాన పొడవు గల వారు ఎవరు ?
జవాబు.
రజనికి సమాన పొడవు ‘గల వారు లేరు.
ఈ) రజని కన్నా రోజీఎంత ఎత్తు ఎక్కువ ఉంది ?
జవాబు.
రజని కన్నా రోజీ 20 సెం.మీ. ఎత్తు ఎక్కువ.
VI. రాణి ఒక రోజున 5 ప్రధాన నగరాల ఉష్ణోగ్రతలను దినపత్రికల నుండి సేకరించింది. ఈ దత్తాంశానికి కమ్మీ రేఖాచిత్రాన్ని ‘గీచి, 4 ప్రశ్నలను దాని పై తయారుచేయండి.
అడ్డు కమ్మీ రేఖా చిత్రాన్ని తయారుచేయండి.
జవాబు.
1. ఏ పట్టణంలో తక్కువ ఉష్ణోగ్రత నమోదైనది.
2. ఉష్ణోగ్రతలో సమానంగా నమోదు చేసిన పట్టణాల పేర్లు వ్రాయుము.
3. కడపకు విజయవాడకు మధ్యన ఉష్ణోగ్రతలో ఎంత తేడా కలదు.
4. కర్నూలు కన్నా విజయవాడ : ఎంత ఉష్ణోగ్రత అధికంగా నమోదు చేయబడినది.
అభ్యాసం 1:
ప్రశ్న 1.
పార్వతి తన మిత్రులతో చర్చించి, పెంపుడు జంతువుల వివరాలు ఒక పట్టికలో నమోదు చేసింది. తరగతి గదిలో ఆ పట్టికను ఆమె ప్రదర్శించింది.
కింది ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వండి.
అ. ఏ పెంపుడు జంతువు సంఖ్య ఎక్కువగా ఉంది ?
జవాబు.
కోడి సంఖ్య ఎక్కువగా గలదు.
ఆ. ఏ పెంపుడు జంతువు సంఖ్య తక్కువగా ఉంది ?
జవాబు.
పిల్లి సంఖ్య తక్కువగా కలదు.
ఇ. ఎందరు విద్యార్థులు మేకను పెంపుడు జంతువుగా కలిగి ఉన్నారు?
జవాబు.
10 మంది మేకను పెంపుడు జంతువుగా కలిగి ఉన్నారు.
ఈ. ఎందరు విద్యార్థులు కుక్కను పెంపుడు జంతువుగా కలిగి ఉన్నారు ?
జవాబు.
6 గురు కుక్కను పెంపుడు జంతువుగా కలిగి వున్నారు.
ప్రశ్న 2.
కింది పట్టికలో టైల్స్ సంఖ్య మరియు వాటి రంగుల వివరాలు ఉన్నాయి.
పై సమాచారాన్ని ఆధారం చేసుకొని పట చిత్రాన్ని తయారుచేయండి. దీనిపై కొన్ని ప్రశ్నలు తయారుచేయండి. = 50 టైల్స్
జవాబు.
ప్రశ్నలు :
1. ఏ రకపు టైళ్ళు ఎక్కువగా కలవు ?
2. తెలుపు, నీలం రంగు టైళ్ళకు మధ్య గల భేదము ఎంత ?
3. ఏ రకపు టైళ్ళు తక్కువగా కలవు ?
ప్రశ్న 3.
రవి పార్వతీపురంలో ఒక కిరాణా దుకాణాన్ని నడుపుతున్నాడు. అతను ప్రతిరోజూ తన షాపులోని వివరాలు నమోదుచేస్తూ ఉంటాడు. ఒక రోజు ‘అతను బియ్యం, గోధుమలు, కందిపప్పు, పంచదారలను కింది విధంగా నమోదు చేసుకున్నాడు.
జవాబు.
ప్రశ్నలు :
1. ఏ రకపు సరుకులు ఎక్కువ మోతాదులో కలవు ?
2. ఏ రకపు సరుకులు తక్కువ మోతాదులో కలవు?
3. బియ్యం మరియు గోధుమల మధ్య గల భేదము ఎంత?