AP Inter 1st Year Civics Study Material Chapter 8 పౌరసత్వం

Andhra Pradesh BIEAP AP Inter 1st Year Civics Study Material 8th Lesson పౌరసత్వం Textbook Questions and Answers.

AP Inter 1st Year Civics Study Material 8th Lesson పౌరసత్వం

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
పౌరసత్వాన్ని నిర్వచించి, పౌరసత్వ ఆర్జన పద్ధతులను వర్ణించండి. [Mar. ’16]
జవాబు:
పరిచయం: పౌరసత్వం అనేది ప్రజాస్వామ్య రాజ్యాలలో నివసించే వ్యక్తుల ప్రత్యేక హక్కు వ్యక్తులు తమ దేశంలో పౌరసత్వాన్ని కలిగి ఉండటాన్ని ప్రతిష్టాత్మకంగానూ, గర్వదాయకంగానూ భావిస్తారు. వాస్తవానికి రాజ్యంలోని పౌరులను వివిధ తరహాల వ్యక్తుల నుంచి విడదీసేందుకు పౌరసత్వం దోహదపడుతుంది. రాజ్యంలో సుఖ సంతోషాలు, సహృద్భావాలతో జీవనం కొనసాగించేందుకు పౌరసత్వం సాధనంగా ఉంటుందని ప్రజలు భావిస్తారు. ఒక్కమాటలో చెప్పాలంటే పౌరసత్వం ప్రజలలో దేశభక్తి, త్యాగనిరతి, విశాల దృక్పథం వంటి భావాలను పెంపొందిస్తుంది. పౌరసత్వం అనేది సాంప్రదాయాలు లేదా చట్టాల ద్వారా గుర్తించబడే వ్యక్తుల హోదాను సూచిస్తుంది. పౌరసత్వం గల వ్యక్తులనే పౌరులుగా వ్యవహరిస్తారు. అటువంటి పౌరులు రాజకీయ వ్యవస్థ అయిన రాజ్యం వ్యవహారాలలో పాల్గొంటారు. సాల్మండ్ ప్రకారం పౌరులు రాజ్య సభ్యులుగా ఉంటూ రాజ్యంలో వైయుక్తిక, శాశ్వతమైన సంబంధాలను కలిగి ఉంటారు. వారు అనేక హక్కులు, సౌకర్యాలను అనుభవిస్తారు. అటువంటి వాటిలో ఓటుహక్కు, ఆస్తిహక్కు, నివాసం వంటి హక్కులు ఉన్నాయి. అంతేకాకుండా పన్నులను చెల్లించడం, సైనికపరమైన సేవలను అందించడం వంటి కొన్ని బాధ్యతలు కూడా ప్రతి పౌరుడికి ఉంటాయి.

నిర్వచనాలు:

  1. అరిస్టాటిల్: “రాజ్య వ్యవహారాలలో ప్రత్యక్షంగా, చురుకైన పాత్ర కలిగిన వ్యక్తియే పౌరుడు”.
  2. ప్రొఫెసర్ లాస్కీ: “ప్రజాహితానికి వ్యక్తులు అందించే నిర్ణాయక సేవయే పౌరసత్వం”.
  3. టి.హెచ్.మార్షల్: “రాజకీయ సమాజంలో సంపూర్ణ సభ్యులుగా ఉండేవారికి కల్పించే హోదాయే పౌరసత్వం. అటువంటి హోదాగల వ్యక్తులు హక్కులు, బాధ్యతల విషయంలో సమాన హోదాను కలిగి ఉంటారు”.

పౌరసత్వ ఆర్జన పద్ధతులు (Methods of acquiring Citizenship): పౌరసత్వం రెండు పద్ధతుల ద్వారా సంక్రమిస్తుంది. అవి: A) సహజమైనది B) సహజీకృతమైనది. ఆ రెండు పద్ధతులను కింద అధ్యయనం చేయడమైంది.

A) సహజ పౌరసత్వం: అధికారులకు ఏ విధమైన విజ్ఞప్తి చేయకుండా లేదా ప్రత్యేక దరఖాస్తును పంపించకుండా వ్యక్తులకు సంక్రమించే పౌరసత్వాన్ని సహజ పౌరసత్వం అంటారు. సహజ పౌరసత్వంలో మూడు అంశాలు ఇమిడి ఉంటాయి. అవి:

  1. భూమి లేదా జన్మస్థలం (జస్ సోలి)
  2. బంధుత్వం లేదా రక్తసంబంధం (జస్ సాంగ్వినస్)
  3. మిశ్రమ అంశం

పైన పేర్కొన్న వాటిని కింది విధంగా వివరించవచ్చు.
1) జస్ సోలి – భూమి లేదా జన్మస్థలం (Jus soli – Land or Place of Birth): ‘జస్ సోలి’ అంటే భూమి లేదా జన్మస్థలం సూత్రం ఆధారంగా పౌరసత్వ సంక్రమణగా భావించవచ్చు. ఈ పద్ధతి ప్రకారం తల్లిదండ్రులను బట్టి కాకుండా పుట్టిన ప్రదేశం ప్రాతిపదికపై పౌరసత్వం నిర్ణయించడమవుతుంది. జన్మించిన ప్రదేశమే పౌరసత్వాన్ని నిర్ణయించడంలో కీలకపాత్రను పోషిస్తుంది. అయితే ఆధునిక కాలంలో ఈ రకమైన పద్ధతి అంతగా ప్రాచుర్యం పొందలేదు. భూమితో సంబంధం గల మధ్యయుగంలో ఈ రకమైన పౌరసత్వం ఎంతో ప్రసిద్ధిగాంచింది. వర్తమాన కాలంలో ఈ పద్ధతి అర్జంటీనాలో మాత్రమే పాటించబడుతున్నది.

2) జస్ సాంగ్వినిస్ – బంధుత్వం లేదా రక్తసంబంధం (Jus Sanguinis – Kinship or Blood Relationship): ‘జస్ సాంగ్వినస్’ అనేది బంధుత్వం లేదా రక్తసంబంధం ద్వారా పౌరసత్వం సంక్రమిస్తుందనే అంశాన్ని సూచిస్తుంది. ఈ పద్ధతి ప్రకారం ఒక శిశువు తాను జన్మించిన ప్రదేశంతో సంబంధం లేకుండానే తన తల్లిదండ్రుల పౌరసత్వాన్ని పొందుతుంది. ఇక్కడ బంధుత్వం లేదా రక్తసంబంధం ఒక్కటే పౌరసత్వ ఆర్జనను నిర్ణయిస్తుంది. ఉదాహరణకు భారతీయ తల్లిదండ్రులకు జన్మించిన శిశువు జన్మస్థలంతో నిమిత్తం లేకుండా భారత పౌరుడిగానే పరిగణించడమవుతుంది. ఈ రకమైన పౌరసత్వం అనేది ప్రాచీనకాలంలో ఎంతగానో ప్రాచుర్యం పొందింది. ఇప్పటికీ ఈ పద్ధతిని ప్రపంచంలోని అనేక రాజ్యాలు అనుసరిస్తున్నాయి. ఈ రకమైన పౌరసత్వ సంక్రమణం అనేది సహజమైనదిగానూ, హేతుబద్ధమైనదిగానూ భావించబడింది. మొత్తం మీద జర్మనీ, నార్వే, ఇటలీ, స్వీడన్ వంటి అనేక రాజ్యాలలో ఈ రకమైన పౌరసత్వ పద్ధతి అమలులో ఉంది.

3) మిశ్రమ సూత్రం (Mixed Principle): ఈ సూత్రాన్ని అనుసరించి రక్తసంబంధంతో పాటు జన్మస్థల సంబంధమైన సూత్రం ప్రకారం పౌరసత్వాన్ని ప్రసాదించడమైంది. అనేక రాజ్యాలు ఈ సూత్రాన్ని అనుసరిస్తున్నాయి. ఉదాహరణకు బ్రిటన్, ఫ్రాన్స్, అమెరికా సంయుక్త రాష్ట్రాలు రక్తసంబంధంతో పాటుగా జన్మస్థల సంబంధమైన అంశం ద్వారా పౌరసత్వాన్ని ప్రసాదిస్తున్నాయి. అయితే ఈ సందర్భంలో పౌరసత్వాన్ని ప్రసాదించడంలో పైన పేర్కొన్న రెండు సూత్రాలను పాటించడంతో ఒకే సమయంలో రెండు దేశాల పౌరసత్వం లభించే అవకాశం ఉంది. ఉదాహరణకు బ్రిటిష్ తల్లిదండ్రులకు శిశువు అమెరికాలో జన్మిస్తే జన్మస్థల సంబంధమైన పద్ధతి ప్రకారం అమెరికా పౌరసత్వం లభిస్తుంది. అదే శిశువు రక్తసంబంధమైన పద్ధతిని అనుసరించి బ్రిటిష్ పౌరసత్వం పొందుతుంది. అటువంటి సందర్భంలో కొన్ని సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. అప్పుడు ఆ శిశువుకు యుక్తవయస్సు వచ్చిన తరువాత తన ఇష్టం వచ్చిన రాజ్య పౌరసత్వాన్ని ఎంపిక చేసుకొనే స్వేచ్ఛ ఉంటుంది.

B. సహజీకృత పౌరసత్వం (Naturalised Citizenship): సహజ పౌరసత్వం లేని వ్యక్తి సహజీకృత పద్ధతి ద్వారా రాజ్య పౌరసత్వాన్ని పొందే అవకాశం ఉంటుంది. ఈ పద్ధతి ద్వారా విదేశీయులు కొన్ని షరతులకు లోబడి రాజ్య పౌరసత్వాన్ని పొందవచ్చు. అటువంటి షరతులు అన్ని రాజ్యాలలో ఒకే విధంగా ఉండవు. వాటిలో కొన్నింటిని కింద పేర్కొనడమైంది.

1) నివాసం (Residence): విదేశీయుడు తాను నివసిస్తున్న రాజ్యంలో పౌరసత్వాన్ని పొందేందుకు నిర్ణీత కాలం పాటు నివసించాలి. అతడు ఆ దేశంలోని ఏదో ఒక ప్రాంతంలో తప్పనిసరిగా నివసించాల్సి ఉంటుంది. ఆ పరిమితి అన్ని రాజ్యాలలో ఒకే రకంగా లేదు. ఉదాహరణకు ఆ కాలపరిమితి బ్రిటన్, అమెరికాలలో 5 సంవత్సరాలు కాగా, ఫ్రాన్సులో 10 సంవత్సరాలుగా నిర్ణయించడమైంది.

2) ఎంపిక (Choice): విదేశీ తల్లిదండ్రులకు జన్మించిన పిల్లలు యుక్తవయస్సు వచ్చిన తరువాత తమ ఇష్టం వచ్చిన రాజ్య పౌరసత్వాన్ని ఎంపిక చేసుకొని పొందవచ్చు.

3) దరఖాస్తు (Application): విదేశీయుడు తాను కోరుకున్న రాజ్యంలో పౌరసత్వం పొందడానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ రాజ్యానికి చెందిన ప్రభుత్వం విధించే షరతులను సంతృప్తిపరచాల్సి ఉంటుంది. ఆ వ్యక్తి పౌరసత్వం కోసం చేసుకున్న దరఖాస్తు యోగ్యతను రాజ్యం పరిశీలించి ఆమోదించినట్లయితే అతనికి పౌరసత్వం లభిస్తుంది. నిర్దిష్ట కాలం పాటు నివాసం, సత్ప్రవర్తన, ఆర్థిక సామర్థ్యం, రాజ్యంలోని ఏదైనా ఒక జాతీయ భాషను అవగాహన చేసుకోవడం వంటి షరతులను ఆయా విదేశీయులు ఆమోదించాల్సి ఉంటుంది. పై వాటితో పాటుగా తాము పౌరసత్వం పొందగోరే రాజ్యానికి విధేయతను కలిగి ఉంటామనే లిఖితపూర్వక ప్రమాణం చేయడం ద్వారా విదేశీయులు పౌరసత్వాన్ని
పొందగలుగుతారు.

4) స్థిరాస్తులు (Fixed Assets): భూమి, ఇళ్ళు వంటి స్థిరాస్తులను సంపాదించుకోవడం ద్వారా రాజ్య పౌరసత్వాన్ని విదేశీయులు పొందగలుగుతారు.

5) సేవలు (Services) (ప్రభుత్వ లేదా ప్రైవేటు): ప్రభుత్వం లేదా గుర్తింపు పొందిన ప్రైవేటు సంస్థలలో సేవలను అందించడం ద్వారా విదేశీయుడు పౌరసత్వాన్ని పొందవచ్చు. అధికారిక సంస్థలలో పనిచేసినప్పుడే ఈ నియమం వర్తిస్తుంది. విదేశీ పౌరుడు ప్రతిభావంతమైన సేవలను అందించడం ద్వారా తాను కోరుకున్న దేశం పౌరసత్వాన్ని పొందవచ్చు.

6) వివాహం (Marriage): వివాహం వల్ల పౌరసత్వం లభించవచ్చు. కొన్ని దేశాలలో అన్య దేశీయుని వివాహమాడిన “స్త్రీకి తన భర్త రాజ్యంలో పౌరసత్వం పొందవచ్చు. మరికొన్ని దేశాలలో పౌరులు విదేశ వనిత లేదా విదేశీ పురుషుడిని గానీ వివాహం చేసుకొంటే, వారికి భర్త లేదా భార్యకు చెందిన రాజ్య పౌరసత్వం లభిస్తుంది. ఉదాహరణకు ఒక బ్రిటిష్ దేశస్థురాలు భారతీయుడిని వివాహమాడితే ఆమెకు భారతదేశ పౌరసత్వమివ్వడం జరుగుతుంది. విదేశస్థుడిని వివాహం చేసుకొన్నప్పటికీ జపాన్ దేశస్థురాలు తన స్వదేశీ పౌరసత్వాన్ని కలిగి ఉంటుంది. అంతేకాకుండా జపాన్ దేశస్థురాలిని వివాహమాడిన విదేశీయునికి కూడా జపాన్ పౌరసత్వం ఇవ్వబడుతుంది.

ప్రశ్న 2.
మంచి పౌరుడి వివిధ లక్షణాలను వివరించండి.
జవాబు:
పౌరుడు: “రాజ్య వ్యవహారాలలో ప్రత్యక్షంగా, చురుకైన పాత్ర కలిగిన వ్యక్తియే పౌరుడు” – అరిస్టాటిల్.

మంచి పౌరుడి లక్షణాలు (Qualities of a Good Citizen): అరిస్టాటిల్ ఉద్దేశ్యంలో మంచి పౌరులు రాజ్యాన్ని మంచి రాజ్యాన్ని నిర్మించగలుగుతారు. వారు ఆదర్శ గుణాలను కలిగి ఉండటమే అందుకు కారణం. ఈ సందర్భంలో లార్డ్ బ్రైస్ మంచి పౌరుడి లక్షణాలలో మూడింటిని పేర్కొన్నాడు.

అవి: 1) అంతరాత్మ ప్రకారం వ్యవహరించడం ii) తెలివితేటలను కలిగి ఉండటం iii) ఆత్మ నిగ్రహాన్ని పాటించడం. మొత్తం మీద మంచి పౌరుడు కింది లక్షణాలను కలిగి ఉంటాడని చెప్పవచ్చు.

1) మంచి ప్రవర్తన (Good Character): మంచి పౌరుడు మంచి ప్రవర్తనను కలిగి ఉండాలి. అతడు ధైర్యం, న్యాయబుద్ధి, సహాయధోరణి, ఉదార స్వభావం, సానుభూతి, సత్యభాషణ, నిజాయితీ వంటి గుణాలను త్రికరణ శుద్ధిగా కలిగి ఉండాలి.

2) సంపూర్ణ ఆరోగ్యం (Sound Health): మంచి పౌరుడు సంపూర్ణ ఆరోగ్యాన్ని, శక్తిని కలిగి ఉండాలి. ఆరోగ్యవంతులైన పౌరులే ఆరోగ్యకరమైన జాతిని నిర్మిస్తారు. ఎందుకంటే మంచి ఆలోచనలు గల వ్యక్తులే మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉంటారు. అటువంటి పౌరులు అనేక రంగాలలో రాజ్య ప్రగతికి దోహదపడతారు.

3) తెలివితేటలు, విద్య (Intelligence and Education): తెలివితేటలు, విద్య అనేవి పౌరుడికి గల మరొక లక్షణంగా పరిగణించవచ్చు. ప్రతి పౌరుడు తన హక్కులు, బాధ్యతల పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలి. వివిధ సంఘటనల పరిశీలనలో ఎటువంటి ఆవేశాలకు లోనుకారాదు. ఈ సందర్భంలో సరైన విద్యను అభ్యసించిన వారు సమాజంలో తగిన పాత్రను పోషించగలుగుతారు. తెలివితేటలు గల పౌరులు రాజ్యం ఎదుర్కొనే సమస్యలను సరైన రీతిలో అవగాహన చేసుకుంటారు.

4) ఆత్మ నిగ్రహం (Self Control): ఆత్మ నిగ్రహం అనేది మంచి పౌరుడి లక్షణాలలో ఒకటిగా భావించవచ్చు. మంచి పౌరుడు రాగ ద్వేషాలకు గురయ్యే స్వభావాన్ని కలిగి ఉండరాదు. ప్రజా వ్యవహారాలలో అతడు ఆత్మ నిగ్రహాన్ని ప్రదర్శించాలి. ఆత్మ నిగ్రహం, ఆత్మ విశ్వాసం అనేవి అతడిని క్రమశిక్షణతో కూడిన జీవనాన్ని గడిపేందుకు దోహదపడతాయి. అట్లాగే మంచి పౌరుడనే వ్యక్తి అమానవీయ కార్యక్రమాలలో పాల్గొనరాదు.

5) ప్రజాస్ఫూర్తి (Public Spirit): మంచి పౌరుడు విశాలమైన, ఉదారమైన దృక్పథాలను కలిగి ఉండాలి. ప్రజా వ్యవహారాలలో అతడు క్రియాశీలక పాత్రను పోషించేందుకు సిద్ధంగా ఉండాలి. తన హక్కులు, బాధ్యతల వినియోగంలో తెలివితేటలతో వ్యవహరించాలి. అట్లాగే సామాజిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనాలి. ప్రజా సేవాభావాన్ని కలిగి ఉంటూ సమాజ సమిష్టి సంక్షేమానికి తన సేవలను అందించేందుకు సదా సంసిద్ధుడై ఉండాలి.

6) స్వార్థ పరిత్యాగం (Self-Sacrifice): మంచి పౌరుడు స్వార్థాన్ని పరిత్యజించాల్సి ఉంటుంది. అతడు తన స్వార్థ ప్రయోజనాలను సమాజ ప్రయోజనాల కోసం విస్మరించాలి. సేవాతత్పరతతో పాటుగా సమాజం, ప్రభుత్వం, రాజ్యం పట్ల అంకిత భావాలను కలిగి ఉండాలి.

7) నిజాయితీతో ఓటుహక్కు వినియోగం (Honest exercise of franchise): ఓటుహక్కును నిజాయితీతో వినియోగించడం అనేది మంచి పౌరుడి మరొక లక్షణంగా పేర్కొనవచ్చు. స్వార్థబుద్ధి, వర్గం, కులం, మతం వంటి అంశాలు ఈ సందర్భంలో మంచి పౌరసత్వానికి ప్రతిబంధకాలుగా ఉంటాయి.

8) బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వహించడం (Sincere Performance of Obligations): మంచి పౌరుడు తన బాధ్యతలను చిత్తశుద్ధితో, విశ్వాసపాత్రుడిగా నిర్వహిస్తాడు. ఈ విషయంలో అతడు సంబంధిత అధికారులకు తగిన సహకారాన్ని అందిస్తాడు. అట్లాగే వివిధ ప్రభుత్వ సంస్థలకు చెల్లించాల్సిన పన్నులను సకాలంలో సరియైన రీతిలో చెల్లిస్తాడు.

9) క్రమానుగత విధేయతలు (Right Ordering of Loyalties): మంచి పౌరుడు తన కుటుంబం, వర్గం, కులం, కార్మిక సంఘం, ప్రాంతం, జాతి పట్ల క్రమానుగత విధేయతలను చూపుతాడు. వివిధ సంస్థల పట్ల క్రమానుగత విధేయతలను చూపుతూ, వాటి మధ్య ఘర్షణలు తలెత్తకుండా చూస్తాడు. విశాల ప్రయోజనాల కోసం స్వప్రయోజనాలను త్యాగం చేస్తాడు. తాను నివసించే కుటుంబం, ప్రాంతాల మధ్య ఘర్షణలు తలెత్తినచో, కుటుంబ ప్రయోజనాలను త్యాగం చేయాల్సి ఉంటుంది.

ప్రశ్న 3.
మంచి పౌరసత్వానికి గల వివిధ అవరోధాలను వర్ణించండి.
జవాబు:
మంచి పౌరసత్వ వికాసానికి అనేక అవరోధాలు ఉంటాయి. అటువంటి వాటిలో కులవ్యవస్థ, మతతత్త్వం, అజ్ఞానం, నిరక్షరాస్యత, పేదరికం, సామాజిక వివక్షతలు వంటివి ఉన్నాయి. మంచి పౌరసత్వానికి గల అవరోధాలను క్రింది విధంగా చర్చించవచ్చు.

1) సోమరితనం (Laziness): సోమరితనం పౌరులను ఉత్తమ పౌరులుగా రూపొందించకుండా నిరోధిస్తుంది. ప్రజాస్వామ్య ప్రభుత్వం విజయవంతం కావాలంటే పౌరులు రాజకీయంగా చైతన్యవంతులై ఉండాలి. సోమరితనం పౌరులకు సామాజిక, రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనకుండా చేస్తుంది.

2) అజ్ఞానం, నిరక్షరాస్యత (Ignorance and Illiteracy): మంచి పౌరసత్వానికి అజ్ఞానం, నిరక్షరాస్యతలనేవి గొప్ప ఆటంకాలుగా భావించవచ్చు. అజ్ఞానులు నిరక్షరాస్యులైన ప్రజలు తమ హక్కులను, బాధ్యతలను గురించి సరైన రీతిలో తెలుసుకోలేరు.

3) పేదరికం (Poverty): పేదరికం అన్ని రకాల అనర్థాలకు మూలకారణంగా పరిగణించవచ్చు. సంపదపరమైన అసమానతలు ఉన్న దేశంలో మంచి పౌరసత్వం పెంపొందదు. పేదరికం వల్ల ప్రజా జీవనం పట్ల ప్రజలలో నిరాసక్తత, అలసత్వం నెలకొంటాయని ఈ సందర్భంలో గుర్తుంచుకోవాలి.

4) అనారోగ్యం (Ill-Health): మంచి పౌరసత్వానికి మరొక ఆటంకమే అనారోగ్యం. ఎందుకంటే అనారోగ్యంపాలైన పౌరులు రాజ్యం, సమాజ శ్రేయస్సుకు తమ సేవలను అందించలేరు.

5) సంకుచిత రాజకీయ ప్రయోజనాలు (Narrow Political Interests): రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్య వ్యవస్థకు అత్యంత ఆవశ్యకమైనవి. అవి మంచి పౌరసత్వ ఆదర్శాలను పెంపొందిచడంలో కీలక పాత్రను పోషిస్తాయి. అయితే రాజకీయ పార్టీలకు చెందిన అనేకమంది జాతి లేదా సమాజం కొరకు కాకుండా పార్టీ ప్రయోజనాలకే పనిచేస్తున్నారు. అనేక పార్టీలకు చెందిన నాయకులు అధికారాన్ని చేజిక్కించుకొనే విషయంపై తమ దృష్టిని సారించారు. దాంతో ప్రజా శ్రేయస్సును పెంపొందించడం పట్ల పెద్దగా శ్రద్ధ వహించరు. కొన్ని రాజకీయ పార్టీలైతే ప్రజలలో శతృత్వాలు, వైరుధ్యాలను సృష్టించేందుకు ప్రయత్నిస్తాయి. కొన్ని సమయాలలో అవి పార్టీ ప్రయోజనాలకై సమాజ ప్రయోజనాలను పరిత్యజించడం సర్వసాధారణమైంది.

6) కుల, మతతత్త్వాలు (Casteism and Communalism): మంచి పౌరసత్వ సాధనలో కుల, మతతత్త్వాలు అనేవి రెండు ముఖ్యమైన ఆటంకాలుగా పేర్కొనవచ్చు. కుల వ్యవస్థ, వర్గ వ్యత్యాసాలు కూడా ప్రజల మధ్య ద్వేషాన్ని కలిగించటంలో ప్రత్యేకమైన పాత్రను పోషిస్తున్నాయి. రాజ్యంలో సామాజిక, రాజకీయ సంఘీభావాలకు అవి ఆటంకాన్ని కలిగిస్తున్నాయని చెప్పవచ్చు.

7) స్వార్థపరత్వం (Selfishness): మంచి పౌరసత్వం, స్వార్థపరత్వం ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉంటాయి. స్వార్ధబుద్ధి గల పౌరులు స్వీయ ప్రయోజనాల సాధనకే తమ ఆలోచనలు, చర్యలను పరిమితం చేస్తారు. తోటివారితో పాటుగా మాతృభూమి పట్ల తమ శక్తియుక్తులను కేటాయించలేరు.

8) ఉదాసీనత(Indifference): ఉదాసీనత అనేది పౌరులను మందబుద్ధులు, సోమరులుగా మార్చి, మంచి పౌరసత్వానికి ఆటంకంగా నిలుస్తుంది. ఉదాసీనులైన పౌరులు సమకాలీన సంఘటనల పట్ల ఏ మాత్రం పట్టించుకోరు. రాజ్య యంత్రాంగ నిర్మాణ నిర్వహణలలో పాల్గొనరు.

ప్రశ్న 4.
పౌరసత్వం ఎన్ని రకాలుగా ఉంటుందో వివరంగా తెలపండి.
జవాబు:
పౌరసత్వాన్ని మూడు రకాలుగా పేర్కొనవచ్చు. అవి:

  1. ఏక పౌరసత్వం
  2. ద్వంద్వ పౌరసత్వం
  3. విశ్వ పౌరసత్వం.

i) ఏక పౌరసత్వం (Single Citizenship): ఏక పౌరసత్వం అంటే రాజ్యంలో పౌరులు ఒకే రకమైన పౌరసత్వాన్ని కలిగి ఉండడంగా పేర్కొనవచ్చు. అట్లాగే ఒకే రకమైన హక్కులు, సౌకర్యాలు, రక్షణలు పౌరులకు ఏకపౌరసత్వ పద్ధతిలో ఉంటాయి. ఈ రకమైన పౌరసత్వం ఆధునిక ప్రపంచంలోని అనేక రాజ్యాలలో వాడుకలో ఉంది. ఉదాహరణకు భారత రాజ్యాంగం భారత పౌరుల జన్మస్థలం, నివాసం వంటి అంశాలతో సంబంధం లేకుండా ఏక పౌరసత్వాన్ని ప్రసాదించింది.

ii) ద్వంద్వ పౌరసత్వం (Double Citizenship): పౌరులకు రెండు రాజ్యాలలో పౌరసత్వం ఉండడాన్ని ద్వంద్వ పౌరసత్వంగా వ్యవహరిస్తారు. ఈ రకమైన పౌరసత్వం అనేక అభివృద్ధి చెందిన, వర్థమాన దేశాలలో వాడుకలో ఉంది. ఉదాహరణకు అమెరికన్ పౌరులకు విదేశాలలో జన్మించిన పిల్లలకు రెండు రాజ్యాల్లోనూ పౌరసత్వం పొందే అవకాశం ఉంది. ఆ రెండింటిలో ఒకటి మాతృదేశ పౌరసత్వం కాగా రెండోది తాము జన్మించిన రాజ్య పౌరసత్వానికి సంబంధించినవై ఉంటాయి. అయితే ద్వంద్వ పౌరసత్వం గల వ్యక్తులకు ఎటువంటి ప్రత్యేక సౌకర్యాలు ఉండవు. వారు రెండు రాజ్యాల చట్టాలకు విధేయులై ఉంటారు. ద్వంద్వ పౌరసత్వం అనేది యుక్తవయస్సు వచ్చే వరకు పిల్లలకు ఉంటుంది. ఆ తరువాత వారు రెండు రాజ్యాలలోని ఏదో ఒకదానిలో పౌరసత్వాన్ని ఎంపిక చేసుకొంటారు.

iii) విశ్వ పౌరసత్వం (Universal Citizenship): అంతర్జాతీయ, జాతీయ రాజకీయాలలో ఇటీవలి కాలంలో ఆవిష్కృతమైన భావనయే విశ్వ పౌరసత్వం. 1980, 1990 దశకాలలో సంభవించిన నాటకీయ పరిణామాలు విశ్వవ్యాప్తంగా శాస్త్ర, సాంకేతిక, కమ్యూనికేషన్లు వంటి రంగాలలో ఏర్పడిన పురోగతి మానవ జీవనాన్ని అద్భుతమైన రీతిలో మార్చివేసింది. సామాన్యులలో అతి సామాన్యులు సైతం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన వివిధ సాధనాలను వినియోగించుకొని సౌకర్యవంతమైన, సౌఖ్యప్రదమైన, ఆర్థిక ప్రయోజనాలను పొందగలిగారు. అట్లాగే సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ వల్ల కలిగే ఫలితాలు వారికి వరప్రదాయినిగా పరిగణించబడినాయి.

అభివృద్ధి చెందిన దేశాలతో పాటుగా తృతీయ ప్రపంచ దేశాలలోని ప్రభుత్వాలు రక్షణ రంగం నుంచి సామాన్య ప్రజల సంక్షేమం దిశగా తమ ప్రాధాన్యతలను నిర్ణయించుకొన్నాయి. వివిధ రంగాలకు చెందిన మేధావులు విదేశాలకు వెళ్ళి, అశేష ప్రయోజనాలను పొందే విషయంలో ఆసక్తిని ప్రదర్శించసాగారు. ఈ ప్రక్రియలో భాగంగా వారు స్వదేశంతో పాటుగా, తాము పనిచేసే విదేశాలలో సైతం పౌరసత్వాన్ని పొందేందుకు ప్రయత్నించారు. ఇటువంటి సందర్భాలలో కొన్ని రాజ్యాలు ఇతర పౌరులకు తమ రాజ్య పౌరసత్వాన్ని ప్రసాదించే దిశగా అడుగులు వేశాయి. ఈ భావనే విశ్వ పౌరసత్వానికి ప్రాతిపదిక అయింది.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
సహజ పౌరసత్వం ఆర్జనకు సంబంధించిన రెండు పద్ధతులను రాయండి. [Mar. 2018]
జవాబు:
సహజ పౌరసత్వం: అధికారులకు ఏ విధమైన విజ్ఞప్తి చేయకుండా లేదా ప్రత్యేక దరఖాస్తును పంపించకుండా వ్యక్తులకు సంక్రమించే పౌరసత్వాన్ని సహజ పౌరసత్వం అంటారు. సహజ పౌరసత్వంలో మూడు అంశాలు ఇమిడి ఉంటాయి. అవి:

  1. భూమి లేదా జన్మస్థలం (జన్ సోలి)
  2. బంధుత్వం లేదా రక్త సంబంధం (జస్ సాంగ్వినస్)
  3. మిశ్రమ అంశం

పైన పేర్కొన్న వాటిని కింది విధంగా వివరించవచ్చు.

1) జసోసోలి – భూమి లేదా జన్మస్థలం (Jus soli – Land or Place of Birth): ‘జస్ సోలి’ అంటే భూమి లేదా జన్మస్థలం సూత్రం ఆధారంగా పౌరసత్వ సంక్రమణగా భావించవచ్చు. ఈ పద్ధతి ప్రకారం తల్లిదండ్రులను బట్టి కాకుండా పుట్టిన ప్రదేశం ప్రాతిపదికపై పౌరసత్వం నిర్ణయించడమవుతుంది. జన్మించిన ప్రదేశమే పౌరసత్వాన్ని నిర్ణయించడంలో కీలకపాత్రను పోషిస్తుంది. అయితే ఆధునిక కాలంలో ఈ రకమైన పద్దతి అంతగా ప్రాచుర్యం పొందలేదు. భూమితో సంబంధం గల మధ్యయుగంలో ఈ రకమైన పౌరసత్వం ఎంతో ప్రసిద్ధిగాంచింది. వర్తమాన కాలంలో ఈ పద్ధతి అర్జంటీనాలో మాత్రమే పాటించబడుతున్నది.

2) జన్ సాంగ్వినిస్ – బంధుత్వం లేదా రక్తసంబంధం (Jus Sanguinis – Kinship or Blood Relationship): ‘జస్ సాంగ్వినస్’ అనేది బంధుత్వం లేదా రక్తసంబంధం ద్వారా పౌరసత్వం సంక్రమిస్తుందనే అంశాన్ని సూచిస్తుంది. ఈ పద్ధతి ప్రకారం ఒక శిశువు తాను జన్మించిన ప్రదేశంతో సంబంధం లేకుండానే తన తల్లిదండ్రుల పౌరసత్వాన్ని పొందుతుంది. ఇక్కడ బంధుత్వం లేదా రక్తసంబంధం ఒక్కటే పౌరసత్వ ఆర్జనను నిర్ణయిస్తుంది. ఉదాహరణకు భారతీయ తల్లిదండ్రులకు జన్మించిన శిశువు జన్మస్థలంతో నిమిత్తం లేకుండా భారత పౌరుడిగానే పరిగణించడమవుతుంది. ఈ రకమైన పౌరసత్వం అనేది ప్రాచీనకాలంలో ఎంతగానో ప్రాచుర్యం పొందింది. ఇప్పటికీ ఈ పద్ధతిని ప్రపంచంలోని అనేక రాజ్యాలు అనుసరిస్తున్నాయి. ఈ రకమైన పౌరసత్వ సంక్రమణం అనేది సహజమైనదిగానూ, హేతుబద్ధమైనదిగానూ భావించబడింది. మొత్తం మీద జర్మనీ, నార్వే, ఇటలీ, స్వీడన్ వంటి అనేక రాజ్యాలలో ఈ రకమైన పౌరసత్వ పద్ధతి అమలులో ఉంది.

ప్రశ్న 2.
పౌరుడు, విదేశీయుడి మధ్య ఉన్న వ్యత్యాసాలు ఏవి ?
జవాబు:
పౌరుడు: అరిస్టాటిల్ ప్రకారం “రాజ్య వ్యవహారాలలో ప్రత్యక్షంగా, చురుకైన పాత్ర కలిగిన వ్యక్తి”.
విదేశీయుడు: “ఒక రాజ్యానికి చెందిన వ్యక్తి ఇతర రాజ్యంలో నివసించినట్లయితే అతనిని విదేశీయుడు అంటారు. పౌరుడు, విదేశీయునికి మధ్యగల వ్యత్యాసాలు (Differences between Citizen and Alien):
పౌరుడు (Citizen)

  1. రాజ్యంలో పౌరుడు శాశ్వత ప్రాతిపదికన నివసిస్తాడు.
  2. పౌరుడు తాను నివసించే రాజ్యం పట్ల పూర్తి విధేయతను చూపుతాడు.
  3. పౌరుడికి పౌర, రాజకీయ హక్కులు ఉంటాయి.
  4. ప్రభుత్వ విధానాలు, కార్యక్రమాలను పౌరుడు విమర్శించవచ్చు.
  5. పౌరుడికి హక్కులు, బాధ్యతలు రెండూ ఉంటాయి.

విదేశీయుడు (Alien)

  1. రాజ్యంలో విదేశీయుడు తాత్కాలిక ప్రాతిపదికన నివసిస్తాడు.
  2. విదేశీయుడు తాను ప్రస్తుతం నివసించే రాజ్యం పట్ల కాకుండా తన మాతృదేశం పట్ల విధేయతను ప్రదర్శిస్తాడు.
  3. విదేశీయుడికి పౌరహక్కులు మాత్రమే ఉంటాయి.
  4. విదేశీయుడు ప్రభుత్వ విధానాలు, కార్యక్రమాలను విమర్శించకూడదు.
  5. విదేశీయుడికి హక్కుల కంటే బాధ్యతలే ఎక్కువగా ఉంటాయి.

ప్రశ్న 3.
సహజీకృత పౌరసత్వం ఏ విధంగా సంక్రమిస్తుంది ? [Mar. 2017]
జవాబు:
సహజీకృత పౌరసత్వం (Naturalised Citizenship): సహజ పౌరసత్వం లేని వ్యక్తి సహజీకృత పద్ధతి ద్వారా రాజ్య పౌరసత్వాన్ని పొందే అవకాశం ఉంటుంది. ఈ పద్ధతి ద్వారా విదేశీయులు కొన్ని షరతులకు లోబడి రాజ్య పౌరసత్వాన్ని పొందవచ్చు. అటువంటి షరతులు అన్ని రాజ్యాలలో ఒకే విధంగా ఉండవు. వాటిలో కొన్నింటిని కింద పేర్కొనడమైంది.

1) నివాసం (Residence): విదేశీయుడు తాను నివసిస్తున్న రాజ్యంలో పౌరసత్వాన్ని పొందేందుకు నిర్ణీత కాలం పాటు నివసించాలి. అతడు ఆ దేశంలోని ఏదో ఒక ప్రాంతంలో తప్పనిసరిగా నివసించాల్సి ఉంటుంది. ఆ పరిమితి అన్ని రాజ్యాలలో ఒకే రకంగా లేదు. ఉదాహరణకు ఆ కాలపరిమితి బ్రిటన్, అమెరికాలలో 5 సంవత్సరాలు కాగా, ఫ్రాన్స్లో 10 సంవత్సరాలుగా నిర్ణయించడమైంది.

2) ఎంపిక (Choice): విదేశీ తల్లిదండ్రులకు జన్మించిన పిల్లలు యుక్తవయస్సు వచ్చిన తరువాత తమ ఇష్టం వచ్చిన రాజ్య పౌరసత్వాన్ని ఎంపిక చేసుకొని పొందవచ్చు.

3) దరఖాస్తు (Application): విదేశీయుడు తాను కోరుకున్న రాజ్యంలో పౌరసత్వం పొందడానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ రాజ్యానికి చెందిన ప్రభుత్వం విధించే షరతులను సంతృప్తిపరచాల్సి ఉంటుంది. ఆ వ్యక్తి పౌరసత్వం కోసం చేసుకున్న దరఖాస్తు యోగ్యతను రాజ్యం పరిశీలించి ఆమోదించినట్లయితే అతనికి పౌరసత్వం లభిస్తుంది. నిర్దిష్ట కాలం పాటు నివాసం, సత్ప్రవర్తన, ఆర్థిక సామర్థ్యం, రాజ్యంలోని ఏదైనా ఒక జాతీయ భాషను అవగాహన చేసుకోవడం వంటి షరతులను ఆయా విదేశీయులు ఆమోదించాల్సి ఉంటుంది. పై వాటితో పాటుగా తాము పౌరసత్వం పొందగోరే రాజ్యానికి విధేయతను కలిగి ఉంటామనే లిఖితపూర్వక ప్రమాణం చేయడం ద్వారా విదేశీయులు పౌరసత్వాన్ని పొందగలుగుతారు.

4) స్థిరాస్తులు (Fixed Assets): భూమి, ఇళ్ళు వంటి స్థిరాస్తులను సంపాదించుకోవడం ద్వారా రాజ్య పౌరసత్వాన్ని విదేశీయులు పొందగలుగుతారు.

5) సేవలు (Services) (ప్రభుత్వ లేదా ప్రైవేటు): ప్రభుత్వం లేదా గుర్తింపు పొందిన ప్రైవేటు సంస్థలలో సేవలను అందించడం ద్వారా విదేశీయుడు పౌరసత్వాన్ని పొందవచ్చు. అధికారిక సంస్థలలో పనిచేసినప్పుడే ఈ నియమం వర్తిస్తుంది. విదేశీ పౌరుడు ప్రతిభావంతమైన సేవలను అందించడం ద్వారా తాను కోరుకున్న దేశం పౌరసత్వాన్ని పొందవచ్చు.

6) వివాహం (Marriage): వివాహం వల్ల పౌరసత్వం లభించవచ్చు. కొన్ని దేశాలలో అన్య దేశీయుని వివాహమాడిన స్త్రీకి తన భర్త రాజ్యంలో పౌరసత్వం పొందవచ్చు. మరికొన్ని దేశాలలో పౌరులు విదేశ వనిత లేదా విదేశీ పురుషుడిని కానీ వివాహం చేసుకొంటే, వారికి భర్త లేదా భార్యకు చెందిన రాజ్య పౌరసత్వం లభిస్తుంది. ఉదాహరణకు ఒక బ్రిటిష్ దేశస్థురాలు భారతీయుడిని వివాహమాడితే ఆమెకు భారతదేశ పౌరసత్వమివ్వడం జరుగుతుంది. విదేశస్తుడిని వివాహం చేసుకొన్నప్పటికీ జపాన్ దేశస్థురాలు తన స్వదేశీ పౌరసత్వాన్ని కలిగి ఉంటుంది. అంతేకాకుండా జపాన్ దేశస్తురాలిని వివాహమాడిన విదేశీయునికి కూడా జపాన్ పౌరసత్వం ఇవ్వబడుతుంది.

ప్రశ్న 4.
పౌరసత్వం ఏ విధంగా కోల్పోబడుతుంది ?
జవాబు:
పౌరసత్వం అనేక విధాలుగా రద్దవుతుంది. పౌరసత్వం ఏ షరతుల వల్లనయితే లభించిందో ఆ షరతులు ఉల్లంఘించినచో అది రద్దవుతుంది. పౌరసత్వం రద్దు కావటానికి గల కారణాలను ఈ కింది విధంగా వివరించవచ్చు.

1) పౌరసత్వ త్యాగం (Renunciation of Citizenship): ఒక వ్యక్తి వేరొక రాజ్య పౌరసత్వాన్ని పొందినట్లయితే తన రాజ్యంలో పౌరసత్వాన్ని కోల్పోతాడు. సహజీకృత పౌరసత్వ పద్ధతి ద్వారా వేరే దేశ పౌరసత్వం కనుక లభించినట్లయితే అతడు మాతృదేశ పౌరసత్వాన్ని కోల్పోతాడు. భారత రాజ్యాంగం ప్రకారం భారతీయ పౌరులు ఇతర రాజ్యాలలో పౌరసత్వాన్ని పొందినట్లయితే భారతదేశ పౌరులుగా పరిగణించబడరు.

2) వివాహం (Marriage): విదేశీ పురుషుడిని వివాహం చేసుకొన్న మహిళ తన దేశ పౌరసత్వాన్ని కోల్పోయి, తన భర్తకు చెందిన రాజ్య పౌరసత్వాన్ని పొందుతుంది. అయితే కొన్ని రాజ్యాలు ఈ విషయంలో మినహాయింపును ఇచ్చి, ఏ రాజ్య పౌరసత్వం కావాలనే విషయాన్ని ఆ మహిళకే వదిలివేయడమైంది. ఉదాహరణకు బ్రిటన్ యువతికి అటువంటి ఎంపిక సదుపాయాన్ని ఇవ్వడమైంది.

3) విదేశాలలో ఉద్యోగం (Accepting Foreign Service): విదేశాలలో ప్రభుత్వ ఉద్యోగాన్ని శాశ్వత ప్రాతిపదికపై చేపట్టే వ్యక్తి, తన దేశానికి దూరంగా విదేశాలలో దీర్ఘకాలం గడిపిన వ్యక్తి మాతృదేశ పౌరసత్వాన్ని కోల్పోతాడు.

4) విదేశీ బిరుదుల స్వీకారం (Obliging foreign Tiles): స్వదేశీ ప్రభుత్వానుమతి లేకుండా విదేశీ బిరుదులను అంగీకరించిన లేదా స్వీకరించిన పౌరులు పౌరసత్వం రద్దవుతుంది.

5) ఎక్కువ కాలం దేశంలో లేకపోవడం (Prolonged Absence): ఒక రాజ్యంలో ఎక్కువ కాలం నివసించని వారు పౌరసత్వాన్ని కోల్పోతారు. కాలపరిమితి విషయంలో వివిధ రాజ్యాలు భిన్నమైన చట్టాలను రూపొందించాయి. ఫ్రాన్స్, జర్మనీలాంటి రాజ్యాలలో పది సంవత్సరాలకు మించి నివాసం లేని పౌరుల పౌరసత్వం రద్దు చేయడం
జరుగుతుంది.

6) దేశద్రోహం (Treason): కొన్ని దేశాలలో అత్యంత దారుణమైన నేరాలకు పాల్పడిన వ్యక్తులు, రాజ్యానికి వ్యతిరేకంగా కుట్రలు పన్నిన వ్యక్తుల పౌరసత్వం రద్దు చేయబడతుంది. అంటే దేశద్రోహం వంటి నేరాలకు పాల్పడిన ప్రభుత్వమే వారి పౌరసత్వాన్ని ప్రభుత్వం తొలగిస్తుంది.

7) సైన్యం నుంచి పారిపోవడం (Desertion from Army): సైన్యం నుంచి పారిపోయిన వ్యక్తుల పౌరసత్వం రద్దవుతుంది. అనేక రాజ్యాలలో దీనికి సంబంధించిన ప్రత్యేక చట్టాలను రూపొందించటమైంది.

ప్రశ్న 5.
సహజీకృత పౌరసత్వాన్ని పొందేందుకు గల మూడు పరిస్థితులను వివరించండి.
జవాబు:
1) నివాసం (Residence): విదేశీయుడు తాను నివసిస్తున్న రాజ్యంలో పౌరసత్వాన్ని పొందేందుకు నిర్ణీత కాలం పాటు నివసించాలి. అతడు ఆ దేశంలోని ఏదో ఒక ప్రాంతంలో తప్పనిసరిగా నివసించాల్సి ఉంటుంది. ఆ పరిమితి అన్ని రాజ్యాలలో ఒకే రకంగా లేదు. ఉదాహరణకు ఆ కాలపరిమితి బ్రిటన్, అమెరికాలలో 5 సంవత్సరాలు కాగా, ఫ్రాన్స్లో 10 సంవత్సరాలుగా నిర్ణయించడమైంది.

2) ఎంపిక (Choice): విదేశీ తల్లిదండ్రులకు జన్మించిన పిల్లలు యుక్తవయస్సు వచ్చిన తరువాత తమకు ఇష్టం వచ్చిన రాజ్య పౌరసత్వాన్ని ఎంపిక చేసుకొని పొందవచ్చు.

3) దరఖాస్తు (Application): విదేశీయుడు తాను కోరుకున్న రాజ్యంలో పౌరసత్వం పొందడానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ రాజ్యానికి చెందిన ప్రభుత్వం విధించే షరతులను సంతృప్తిపరచాల్సి ఉంటుంది. ఆ వ్యక్తి పౌరసత్వం కోసం చేసుకున్న దరఖాస్తు యోగ్యతను రాజ్యం పరిశీలించి ఆమోదించినట్లయితే అతనికి పౌరసత్వం లభిస్తుంది. నిర్దిష్ట కాలం పాటు నివాసం, సత్ప్రవర్తన, ఆర్థిక సామర్థ్యం, రాజ్యంలోని ఏదైనా ఒక జాతీయ భాషను అవగాహన చేసుకోవడం వంటి షరతులను ఆయా విదేశీయులు ఆమోదించాల్సి ఉంటుంది. పై వాటితో పాటుగా తాము పౌరసత్వం పొందగోరే రాజ్యానికి విధేయతను కలిగి ఉంటామనే లిఖితపూర్వక ప్రమాణం చేయడం ద్వారా విదేశీయులు పౌరసత్వాన్ని పొందగలుగుతారు.

ప్రశ్న 6.
విశ్వ పౌరసత్వం గురించి సంగ్రహంగా వర్ణించండి.
జవాబు:
విశ్వ పౌరసత్వం (Universal Citizenship): అంతర్జాతీయ, జాతీయ రాజకీయాలలో ఇటీవలి కాలంలో ఆవిష్కృతమైన భావనయే విశ్వ పౌరసత్వం. 1980, 1990 దశకాలలో సంభవించిన నాటకీయ పరిణామాలు విశ్వవ్యాప్తంగా శాస్త్ర, సాంకేతిక, కమ్యూనికేషన్లు వంటి రంగాలలో ఏర్పడిన పురోగతి మానవ జీవనాన్ని అద్భుతమైన రీతిలో మార్చివేసింది. సామాన్యులలో అతి సామాన్యులు సైతం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన వివిధ సాధనాలను వినియోగించుకొని సౌకర్యవంతమైన, సౌఖ్యప్రదమైన, ఆర్థిక ప్రయోజనాలను పొందగలిగారు. అట్లాగే సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ వల్ల కలిగే ఫలితాలు వారికి వరప్రదాయినిగా పరిగణించబడినాయి. అభివృద్ధి చెందిన దేశాలతో పాటుగా తృతీయ ప్రపంచ దేశాలలోని ప్రభుత్వాలు రక్షణ రంగం నుంచి సామాన్య ప్రజల సంక్షేమం దిశగా తమ ప్రాధాన్యతలను నిర్ణయించుకొన్నాయి. వివిధ రంగాలకు చెందిన మేధావులు విదేశాలకు వెళ్ళి, అశేష ప్రయోజనాలను పొందే విషయంలో ఆసక్తిని ప్రదర్శించసాగారు. ఈ ప్రక్రియలో భాగంగా వారు స్వదేశంతో పాటుగా, తాము పనిచేసే విదేశాలలో సైతం పౌరసత్వాన్ని పొందేందుకు ప్రయత్నించారు. ఇటువంటి సందర్భాలలో కొన్ని రాజ్యాలు ఇతర పౌరులకు తమ రాజ్య పౌరసత్వాన్ని ప్రసాదించే దిశగా అడుగులు వేశాయి. ఈ భావనే విశ్వ పౌరసత్వానికి ప్రాతిపదిక అయింది.

ప్రశ్న 7.
ఉత్తమ పౌరసత్వానికి గల ఆటంకాలను, తొలగించే నివారణలను సూచించండి.
జవాబు:
మంచి పౌరసత్వానికి గల అవరోధాలను అధిగమించేందుకై రాజకీయ పార్టీలు, ప్రజలు, పత్రికలు, రాజ్యాలతో పాటు అందరి సమిష్టి కృషి అవసరం. ఈ సందర్భంలో లాస్కీ పండితుడు “ప్రజాహితానికి వ్యక్తి తీర్పు ద్వారా అందించే సేవయే పౌరసత్వమని” పేర్కొన్నాడు. కింద పేర్కొన్న కొన్ని మార్గాల ద్వారా ఉత్తమ పౌరసత్వానికి గల అవరోధాలను అధిగమించవచ్చు.

1) ప్రజల విజ్ఞప్తుల పరిష్కారం (Solving People’s Grievances): మంచి పౌరసత్వ సాధనకు ప్రభుత్వం ప్రజల కనీస విజ్ఞప్తుల పట్ల స్పందించాల్సిన తక్షణ ఆవశ్యకత ఎంతైనా ఉంది. పేదరికం, నిరుద్యోగిత వంటి సమస్యలను మిక్కిలి అంకిత భావంతో పరిష్కరించాలి. ప్రజల తక్షణ అవసరాలను తీర్చనిది మంచి పౌరసత్వం సాధ్యం కాదు.

2) విద్య, అవగాహన (Education and Awareness): ఈనాడు అత్యంత ఆవశ్యకమైన విద్యకు విశేషమైన ప్రాధాన్యతను ఇవ్వాల్సి ఉంటుంది. ప్రజలలో విద్య, అవగాహనలను పెంపొందించేందుకై చర్యలు గైకొనాలి. మానవ జీవనాన్ని అవగాహన చేసుకొనేందుకై అవసరమైన విద్యను పౌరులకు అందించాల్సి ఉంటుంది. నిత్య జీవనంలో ప్రజల కనీస అవసరాలు తీరనిచో, మంచి పౌరసత్వాన్ని పొందడం సాధ్యం కాదు.

3) నాయకుల కృషి (Efforts of Leaders): ప్రభుత్వమే ప్రతి సందర్భంలో తమకు సహాయపడదనే అభిప్రాయాన్ని పౌరులు కలిగి ఉండాలి. వివిధ స్థాయిలలోని నాయకులు ప్రభుత్వానికి సహకారం అందించడం ద్వారా మంచి పౌరసత్వాన్ని పెంపొందించేందుకు కృషి చేయాల్సి ఉంటుంది.

మొత్తం మీద మంచి పౌరసత్వ ఆటంకాలను అధిగమించేందుకై లార్డ్ బ్రైస్ రెండు రకాల నివారణ మార్గాలను సూచించాడు. అవి:

  1. యాంత్రికపరమైనవి
  2. నైతికపరమైనవి.

మొదటివి రాజ్య చట్టాలకు సంబంధించినవి కాగా రెండోవి పౌరుల ప్రవర్తన గురించి ప్రస్తావించాయి. యాంత్రికపరమైన నివారణ చర్యలు రాజ్య యంత్రాంగాన్ని మెరుగుపరచడమేగాక అవి ప్రజలకు మిక్కిలి ఉపయోగకరంగా ఉండేటట్లు తీర్చిదిద్దుతాయి. అట్లాగే సామాజిక వ్యవస్థను సమానత్వం, న్యాయం, ప్రజాస్వామ్య సూత్రాల ప్రాతిపదికపై రూపొందించాల్సి ఉంటుంది. తమ పౌర, రాజకీయ హక్కులను పౌరులు గరిష్ట స్థాయిలో వినియోగించేందుకు అనుమతించాల్సి ఉంటుంది.

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
పౌరసత్వ నిర్వచనం
జవాబు:

  1. అరిస్టాటిల్: “రాజ్య వ్యవహారాలలో ప్రత్యక్షంగా, చురుకైన పాత్ర కలిగిన వ్యక్తియే పౌరుడు”,
  2. ప్రొఫెసర్ లాస్కీ: “ప్రజాహితానికి వ్యక్తులు అందించే నిర్ణాయక సేవయే పౌరసత్వం”.
  3. టి. హెచ్.మార్షల్: “రాజకీయ సమాజంలో సంపూర్ణ సభ్యులుగా ఉండేవారికి కల్పించే హోదాయే పౌరసత్వం. అటువంటి హోదాగల వ్యక్తులు హక్కులు, బాధ్యతల విషయంలో సమాన హోదాను కలిగి ఉంటారు”.

ప్రశ్న 2.
జస్ సాంగ్వినస్ అంటే ఏమిటి ?
జవాబు:
‘జస్ సాంగ్వినస్’ అంటే ‘బంధుత్వం’ లేదా ‘రక్తసంబంధం’ అని అర్థం. బంధుత్వం లేదా రక్తసంబంధం ద్వారా పౌరసత్వం సంక్రమిస్తుందని జస్ సాంగ్వినస్ భావం. ఈ పద్దతి ప్రకారం ఒక శిశువు తాను జన్మించిన ప్రదేశంతో సంబంధం లేకుండానే తన తల్లిదండ్రుల పౌరసత్వాన్ని పొందుతుంది.

ప్రశ్న 3.
జస్ సోలి అంటే ఏమిటి ? [Mar. ’17, ’16]
జవాబు:
జస్ సోలి అంటే భూమి లేదా జన్మస్థలం అని అర్థం. భూమి లేదా పుట్టిన ప్రదేశం ప్రాతిపదికగా పౌరసత్వం సంక్రమించే పద్ధతినే జస్ సోలి అని అంటారు. ఈ పద్ధతి ప్రకారం శిశువుకు తన తల్లిదండ్రులను బట్టి కాకుండా, పుట్టిన ప్రదేశం ప్రాతిపదికగా పౌరసత్వం లభిస్తుంది. ప్రస్తుతం ఈ పద్దతి అర్జంటీనాలో అమలులో ఉన్నది.

ప్రశ్న 4.
విదేశీయుడంటే ఎవరు ?
జవాబు:
ఒక రాజ్యానికి చెందిన వ్యక్తి ఏదైనా కారణంచేత ఇతర రాజ్యములో నివసిస్తున్నట్లయితే ఆ వ్యక్తిని ‘విదేశీయుడు’ అని అంటారు. విదేశీయులు తాము నివసిస్తున్న రాజ్యంలోని చట్టాలలో పేర్కొన్న హక్కులు, బాధ్యతలను కలిగి ఉంటారు. విదేశీయులకు ఆయా రాజ్య చట్టాల ప్రకారం రక్షణ కల్పించబడుతుంది. అయితే విదేశీయులకు రాజకీయ హక్కులు ఉండవు.

ప్రశ్న 5.
సహజ పౌరసత్వాన్ని పొందే ఏవైనా రెండు పరిస్థితులను వ్రాయండి.
జవాబు:
అధికారులకు ఏ విధమైన విజ్ఞప్తి చేయకుండా లేదా ప్రత్యేక దరఖాస్తును పంపించకుండా వ్యక్తులకు సహజ సిద్ధంగా సంక్రమించే పౌరసత్వాన్ని సహజ పౌరసత్వం అంటారు. సహజ పౌరసత్వాన్ని పొందేందుకు మూడు అంశాలు తోడ్పడతాయి. అవి:

  1. జస్ సోలి అనగా పుట్టిన ప్రదేశ ప్రాతిపదికగా పౌరసత్వం లభిస్తుంది.
  2. జస్ సాంగ్వినస్ అనగా బంధుత్వం లేదా రక్త సంబంధం ప్రాతిపదికగా పౌరసత్వం లభించటం.
  3. మిశ్రమ అంశం. అనగా పై రెండు పద్ధతులలో ఏ పద్ధతి ప్రాతిపదికగానైనా పౌరసత్వం లభిస్తుంది.

ప్రశ్న 6.
పౌరసత్వాన్ని కోల్పోయే ఏవైనా రెండు పరిస్థితులను ఉదహరించండి.
జవాబు:
1) పౌరసత్వ త్యాగం (Renunciation of Citizenship): ఒక వ్యక్తి వేరొక రాజ్య పౌరసత్వాన్ని పొందినట్లయితే తన రాజ్యంలో పౌరసత్వాన్ని కోల్పోతాడు. సహజీకృత పౌరసత్వ పద్దతి ద్వారా వేరే దేశ పౌరసత్వం కనుక లభించినట్లయితే అతడు మాతృదేశ పౌరసత్వాన్ని కోల్పోతాడు. భారత రాజ్యాంగం ప్రకారం భారతీయ పౌరులు ఇతర రాజ్యాలలో పౌరసత్వాన్ని పొందినట్లయితే భారతదేశ పౌరులుగా పరిగణించబడరు.

2) వివాహం (Marriage): విదేశీ పురుషుడిని వివాహం చేసుకొన్న మహిళ తన దేశ పౌరసత్వాన్ని కోల్పోయి, తన భర్తకు చెందిన రాజ్య పౌరసత్వాన్ని పొందుతుంది. అయితే కొన్ని రాజ్యాలు ఈ విషయంలో మినహాయింపును ఇచ్చి, ఏ రాజ్య పౌరసత్వం కావాలనే విషయాన్ని ఆ మహిళకే వదిలివేయడమైంది. ఉదాహరణకు బ్రిటన్ యువతికి అటువంటి ఎంపిక సదుపాయాన్ని ఇవ్వడమైంది.

ప్రశ్న 7.
మంచి పౌరుడి లక్షణాలలో రెండింటిని ఉదహరించండి.
జవాబు:
1) మంచి ప్రవర్తన (Good Character): మంచి పౌరుడు మంచి ప్రవర్తనను కలిగి ఉండాలి. అతడు ధైర్యం, న్యాయబుద్ధి, సహాయధోరణి, ఉదార స్వభావం, సానుభూతి, సత్యభాషణ, నిజాయితీ వంటి గుణాలను త్రికరణ శుద్ధిగా కలిగి ఉండాలి.

2) సంపూర్ణ ఆరోగ్యం (Sound Health): మంచి పౌరుడు సంపూర్ణ ఆరోగ్యాన్ని, శక్తిని కలిగి ఉండాలి. ఆరోగ్యవంతులైన పౌరులే ఆరోగ్యకరమైన జాతిని నిర్మిస్తారు. ఎందుకంటే మంచి ఆలోచనలు గల వ్యక్తులే మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉంటారు. అటువంటి పౌరులు అనేక రంగాలలో రాజ్య ప్రగతికి దోహదపడతారు.

ప్రశ్న 8.
పౌరసత్వ ప్రాధాన్యతను వివరించండి.
జవాబు:
రాజ్యాంగంలో ఉదహరించబడిన ప్రాథమిక హక్కులు పౌరులందరికీ అందుబాటులోకి వచ్చినట్లయితే పౌరసత్వం ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది. అంతేకాకుండా పౌరులు అనేక రాజకీయ హక్కులకు అనుభవించేందుకు పౌరసత్వం దోహదపడుతుంది. పౌరసత్వం గలవారు వివిధ ప్రాతినిధ్య సంస్థలకు జరిగే ఎన్నికలలో ఓటుహక్కును వినియోగిస్తారు. శాసననిర్మాణ సంస్థల సభ్యత్వానికి వారు పోటీ చేయగలుగుతారు. అన్నింటికీ మించి రాజ్యంలోని అత్యున్నత పదవులైన దేశాధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, సుప్రీంకోర్టు, హైకోర్టుల న్యాయమూర్తులు వంటి ఎన్నో పదవులను అలంకరించుటకు అర్హతను పొందుతారు. పై హక్కులతో పాటుగా పన్నుల చెల్లింపు, అవసరమైతే దేశ రక్షణకు దోహద పడడం వంటి కొన్ని నిర్దిష్ట బాధ్యతలను కూడా పౌరులు నిర్వర్తించాల్సి ఉంటుంది.

ప్రశ్న 9.
అజ్ఞానం, నిరక్షరాస్యతలనేవి ఏ విధంగా ఉత్తమ పౌరసత్వానికి ఆటంకాలుగా ఉంటాయి ?
జవాబు:
మంచి పౌరసత్వానికి అజ్ఞానం, నిరక్షరాస్యతలనేవి గొప్ప ఆటంకాలుగా భావించవచ్చు. వీరు తమ హక్కులను, బాధ్యతలను సరైన రీతిలో తెలుసుకోలేరు. ప్రజా వ్యవహారాలలో నైపుణ్యంగా వ్యవహరించలేరు. అజ్ఞానులు, నిరక్షరాస్యుల చేతిలో ప్రజాస్వామ్య ప్రభుత్వం మూకపాలనకు దారితీసే ప్రమాదం ఉంది.

ప్రశ్న 10.
మంచి పౌరసత్వానికి గల ఆటంకాలను అధిగమించేందుకు లార్డ్ బ్రైస్ చేసిన సూచనలు ఏవి ?
జవాబు:
మంచి పౌరసత్వానికి గల ఆటంకాలను అధిగమించేందుకు లార్డ్ బ్రైస్ రెండు సూచనలు చేయటం జరిగింది. అవి: 1) యాంత్రికపరమైనవి 2) నైతికపరమైనవి. మొదటిది రాజ్య చట్టాలకు సంబంధించినది కాగా రెండవ సూచన రాజ్య యంత్రాంగాన్ని మెరుగుపరచేందుకు తోడ్పడుతుంది.

ప్రశ్న 11.
ద్వంద్వ పౌరసత్వం గురించి సంగ్రహంగా రాయండి.
జవాబు:
ద్వంద్వ పౌరసత్వం (Double Citizenship): పౌరులకు రెండు రాజ్యాలలో పౌరసత్వం ఉండడాన్ని ద్వంద్వ పౌరసత్వంగా వ్యవహరిస్తారు. ఈ రకమైన పౌరసత్వం అనేక అభివృద్ధి చెందిన, వర్ధమాన దేశాలలో వాడుకలో ఉంది. ఉదాహరణకు అమెరికన్ పౌరులకు విదేశాలలో జన్మించిన పిల్లలకు రెండు రాజ్యాల్లోనూ పౌరసత్వం పొందే అవకాశం ఉంది. ఆ రెండింటిలో ఒకటి మాతృదేశ పౌరసత్వం కాగా రెండోది తాము జన్మించిన రాజ్య పౌరసత్వానికి సంబంధించినవై ఉంటాయి. అయితే ద్వంద్వ పౌరసత్వం గల వ్యక్తులకు ఎటువంటి ప్రత్యేక సౌకర్యాలు ఉండవు. వారు రెండు రాజ్యాల చట్టాలకు విధేయులై ఉంటారు. ద్వంద్వ పౌరసత్వం అనేది యుక్తవయస్సు వచ్చే వరకు పిల్లలకు ఉంటుంది. ఆ తరువాత వారు రెండు రాజ్యాలలోని ఏదో ఒకదానిలో పౌరసత్వాన్ని ఎంపిక చేసుకొంటారు.

AP Inter 1st Year Civics Study Material Chapter 7 న్యాయం

Andhra Pradesh BIEAP AP Inter 1st Year Civics Study Material 7th Lesson న్యాయం Textbook Questions and Answers.

AP Inter 1st Year Civics Study Material 7th Lesson న్యాయం

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
న్యాయం అంటే ఏమిటో నిర్వచించి, న్యాయం రకాలను వర్ణించండి.
జవాబు:
పరిచయం: రాజనీతిశాస్త్ర అధ్యయనంలో న్యాయం ఒక ముఖ్యమైన భావన. సమకాలీన సమాజంలో దాదాపు ప్రపంచ రాజ్యాలన్నీ తమ రాజకీయ, ఆర్థిక సిద్ధాంతాల వైరుధ్యాలతో సంబంధం లేకుండా మానవ సమాజంలో న్యాయం చేకూర్చి కొనసాగేందుకు కృషి చేస్తున్నాయి.

అర్థం: న్యాయం (Justice) అనే ఇంగ్లీష్ పదం “జస్” (Jus) అనే లాటిన్ పదం నుంచి ఉద్భవించింది. లాటిన్ భాషలో “జస్” అంటే “బంధించి ఉండటం” లేదా “కలిపి ఉంచడం” అని అర్థం.

  1. నిర్వచనాలు:
    ప్లేటో: “వ్యక్తి తన పని తాను చేసుకుంటూ, ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడమే న్యాయం”;
  2. అరిస్టాటిల్: “న్యాయం అంటే సమాజంలో ప్రతి వ్యక్తీ తన నైతిక బాధ్యతలను నిర్వర్తించడం తప్ప మరేదీకాదు”.
  3. కెఫాలస్: “న్యాయం అంటే ప్రతి ఒక్కరూ సత్యాన్ని పలకడం, ఇతరులకు ఇవ్వాల్సింది ఇవ్వడం”.

న్యాయం రకాలు (Types of Justice): న్యాయం అనేక రకాలుగా ఉంటుంది. ఇది సహజ, ఆర్థిక, సామాజిక, రాజకీయ, చట్టబద్ధమైన పార్శాలకు సంబంధించినది. న్యాయభావనలోని వివిధ రకాలను కింది పట్టిక ద్వారా తెలుసు కోవచ్చు.

1) సహజ న్యాయం (Natural Justice): ప్రపంచంలో లభించే సహజ వనరులను ప్రతి ఒక్కరూ వినియోగించు కోవచ్చుననే సూత్రం ఆధారంగా ప్రతిపాదించబడినదే సహజ న్యాయం. భూమిపై నివసించే ప్రతి ఒక్కరికీ సహజ వనరులు జీవన ఆధారంగా ఉంటాయి. మానవులు ఒక్కరే హేతుబద్ధమైన జీవనం గడపటం వల్ల, సహజ వనరులను న్యాయబద్ధంగా వినియోగించుకోవాల్సిన బాధ్యత వారిపై ఉంది. ఈ సందర్భంలో మానవులు భవిష్యతరాల అవసరాలను దృష్టిలో ఉంచుకోవాలి.

AP Inter 1st Year Civics Study Material Chapter 7 న్యాయం

2) సామాజిక న్యాయం (Social Justice): సామాజిక న్యాయం అనేది వ్యక్తుల హక్కులు, సమాజం నియంత్రణల మధ్య చక్కని సమతౌల్యాన్ని నెలకొల్పేందుకు ఉద్దేశించింది. వర్తమాన చట్టాలకు లోబడి వ్యక్తుల న్యాయబద్ధమైన ఆకాంక్షలను నెరవేర్చుకొనేందుకు ఈ రకమైన న్యాయం వీలు కల్పిస్తుంది. చట్టం దృష్టిలో అందరూ సమానులే అనే సూత్రాన్ని సామాజిక న్యాయం నమ్ముతుంది, సామాజిక అనర్థాలైన పేదరికం, నిరుద్యోగం, అనారోగ్యం, ఆకలి వంటి వాటిని అధిగమించేందుకు సామాజిక న్యాయం హామీ ఇస్తుంది. సమాజంలోని నిమ్నవర్గాలు, బడుగు, బలహీన వర్గాలకు రక్షణ కల్పిస్తుంది. అంతిమంగా వ్యక్తుల సంపూర్ణ వ్యక్తిత్వ వికాసానికి అవసరమైన పరిస్థితులను కల్పిస్తుంది.

3) రాజకీయ న్యాయం (Political Justice): రాజకీయ న్యాయం అనేది రాజకీయ సమానత్వాన్ని సూచిస్తుంది. రాజ్యంలోని వయోజనులైన పౌరులకు రాజకీయ హక్కులను ఈ రకమైన న్యాయం ప్రతిపాదిస్తుంది. దేశ పాలనలో పౌరులు స్వేచ్ఛగానూ, నిర్భయంగానూ పాల్గొనేందుకు వీలు కల్పిస్తుంది. ఎన్నికల సమయంలో రాజకీయ న్యాయ భావన విశేష ప్రాధాన్యాన్ని సంతరించుకొంటుంది. రోజువారి పాలనలో పౌరులు చురుకుగా పాల్గొనేందుకు రాజకీయ న్యాయం సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తుంది. ప్రతి ఒక్కరూ ఇతరులతో పాటుగా సమానులేనని, ఏ ఒక్కరూ ఇతరుల కంటే ఏ విషయంలోనూ అధికులు కారనీ, ఎటువంటి ప్రత్యేకతలు కలిగి ఉండరనే సూత్రంపై ఈ భావన రూపొందింది. రాజ్యంలో రాజకీయ న్యాయం ఉండాలంటే కింద పేర్కొన్న పరిస్థితులు నెలకొనాలి.

  1. సమన్యాయ పాలన
  2. స్వతంత్ర న్యాయశాఖ
  3. ప్రాతినిధ్య సంస్థలకు ఎన్నికలు
  4. రాజకీయ పార్టీలు
  5. పత్రికా స్వాతంత్ర్యం
  6. ప్రజాస్వామ్య పాలన మొదలైనవి.

4) ఆర్థిక న్యాయం (Economic Justice): వ్యక్తుల మధ్య నిర్హేతుకమైన, ప్రకృతి విరుద్ధమైన వ్యత్యాసాలు లేని పరిస్థితినే ఆర్థికన్యాయంగా పేర్కొనవచ్చు. ఆదాయం, ద్రవ్యం, సంపద, ఆస్తివంటి వ్యత్యాసాలు లేకుండా వ్యక్తులందరికీ సమానమైన ఆదరణ కల్పించేందుకు ఆర్థికన్యాయం ఉద్దేశించింది. సానుకూల దృష్టిలో ఆర్థిక న్యాయం అనేది శ్రామికులకు చాలినంత వేతనాలను చెల్లించేందుకు దోహదపడుతుంది. సంపద, ఆదాయంలో విపరీతమైన అంతరాలను తొలగించేందుకు కృషి చేస్తుంది. బడుగు బలహీనవర్గాలు దోపిడీకి గురికావడాన్ని ఎట్టి పరిస్థితులలో ఈ న్యాయం అనుమతించదు. ప్రతి ఒక్కరూ కనీస ప్రాథమికావసరాలను పొందేందుకు ఎదురయ్యే ఆటంకాలను తొలగిస్తుంది. ప్రతి ఒక్కరూ కూడు, గుడ్డ, వసతి వంటి ప్రాథమిక అవసరాలు కలిగి ఉండేందుకు చర్యలు తీసుకొంటుంది. సమాజంలో న్యాయబద్ధమైన ఆర్థిక వ్యవస్థాపనకు తోడ్పడుతుంది. “ప్రతి ఒక్కరూ వారి సామర్ధ్యాన్ని బట్టి ఉపాధి పొందడం, అవసరాన్ని బట్టి ఆర్థిక వనరులను వినియోగించుకోవడం” అనే భావనను ఆర్థికన్యాయం బలపరుస్తుంది.

5) చట్టబద్ధమైన న్యాయం (Legal Justice): చట్టబద్ధమైన న్యాయం అనేది రాజ్యాంగ శాసనాల ద్వారా వెల్లడి అవుతుంది. సమాజంలో ఎంతోకాలంగా ప్రాచుర్యంలో ఉన్న ఆచార సంప్రదాయాలతో ఈ రకమైన న్యాయం సంబంధాన్ని కలిగి ఉంటుంది. రాజ్యంలోని రాజ్యాంగం, ఇతర శాసనచట్టాల రూపంలో అది వ్యక్తమవుతుంది. న్యాయం చట్టబద్ధమైన పరిమితులను నిర్ణయిస్తుంది. చట్టబద్ధమైన న్యాయంలో రెండు అంశాలు ఇమిడి ఉంటాయి. అవి:

1. సమాజంలో చట్టాలన్నీ సమన్యాయ పాలన సూత్రంపై ఆధారపడి రూపొందితమై, అమలులో ఉంటాయి.
2. చట్టాలన్నీ సహజ న్యాయసూత్రాలకు అనుగుణంగా రూపొందుతాయి. మొత్తం సమాజ సంక్షేమాన్ని చట్టాలు ఆకాంక్షిస్తాయి. అయితే చట్టబద్ధమైన న్యాయం అనేది పూర్తిగా న్యాయంగా పరిగణితం కాదు. ఈ సందర్భంలో న్యాయం అంటే న్యాయం ప్రకారం చట్టం అని ఎర్నస్ట్ బార్కర్ పేర్కొన్నాడు. చట్టబద్ధమైన న్యాయం అనేది న్యాయాన్ని ప్రసాదించేందుకు ఉద్దేశించిందని కొందరు పేర్కొన్నారు. మొత్తం మీద చట్టం అనేది న్యాయానికి కొంతమేరకు ప్రత్యామ్నాయంగా ఉంటుందని మరికొందరు భావించారు.

AP Inter 1st Year Civics Study Material Chapter 7 న్యాయం

ప్రశ్న 2.
న్యాయం అంటే ఏమిటి ? న్యాయం ఏ విధంగా పరిణామం చెందింది ?
జవాబు:
పరిచయం: రాజనీతి శాస్త్ర అధ్యయనంలో న్యాయం ఒక ముఖ్యమైన భావన. సమకాలీన సమాజంలో దాదాపు ప్రపంచ రాజ్యాలన్నీ తమ రాజకీయ, ఆర్థిక సిద్ధాంతాల వైరుధ్యాలతో సంబంధం లేకుండా మానవ సమాజంలో న్యాయం చేకూర్చి కొనసాగేందుకు కృషి చేస్తున్నాయి.

అర్థం: న్యాయం (Justice) అనే ఇంగ్లీష్ పదం “జస్” (Jus) అనే లాటిన్ పదం నుంచి ఉద్భవించింది. లాటిన్ భాషలో “జస్” అంటే “బంధించి ఉండటం” లేదా “కలిపి ఉంచడం” అని అర్థం.

న్యాయం – పరిణామం: ప్రాచీన భారతదేశంలో న్యాయం అనేది ధర్మంతో ముడిపడి ఉంది. అటువంటి ధర్మం గురించి ప్రాచీన హిందూ స్మృతులలో ప్రస్తావించడమైంది. వాటి ప్రకారం రాజు కర్తవ్యాలలో న్యాయం ఒకటి. ధర్మం ప్రాతిపదికపై న్యాయబద్ధమైన సామాజిక వ్యవస్థను ఏర్పరచి, నిర్వహించేందుకు రాజు కృషి చేసేవాడు. ప్రఖ్యాత చైనా తత్త్వవేత్త అయిన కన్ఫ్యూసియస్ రాజు, ప్రధాన కర్తవ్యం చెడు పనులకు పాల్పడే వారిని శిక్షించడం మంచి వ్యక్తులకు బహుమానాలిచ్చి ప్రోత్సహించడంగా పేర్కొన్నాడు.

సాధారణంగా న్యాయమంటే ఇతరులకు ఇవ్వాల్సింది ఇవ్వడమే. అయితే న్యాయభావన అర్థం వ్యక్తులను బట్టి మారుతుంది. ప్రతి ఒక్క వ్యక్తికి సంబంధించిన మానవీయ దృక్కోణంలో న్యాయాన్ని అవగాహన చేసుకోవాల్సి ఉంటుంది. జర్మనీ తత్త్వవేత్త ఇమ్మాన్యుయల్ కాంట్ ప్రకారం మానవులందరూ గౌరవాన్ని కలిగి ఉంటారు. వ్యక్తులందరికీ గౌరవం లభించినట్లయితే వారంతా శక్తి సామర్థ్యాలను వినియోగించుకొని తమ లక్ష్యాల సాధనకై చాలినన్ని అవకాశాలను పొందగలుగుతారు. అందువల్ల న్యాయభావన ప్రకారం ప్రతి ఒక్క వ్యక్తికీ సమానమైన గుర్తింపు, గౌరవం ఇవ్వడమైంది.

ప్లేటో వల్ల ప్రభావితుడైన సెయింట్ ఆగస్టీన్ అనే మధ్యయుగ రాజనీతి తత్త్వవేత్త న్యాయభావనను వివరించాడు. సమాజం సరైన రీతిలో కొనసాగేందుకు వ్యక్తుల మధ్య సౌహార్ధ సంబంధాల గురించి అతడు ప్రముఖంగా ప్రస్తావించాడు. ఆ తరువాత న్యాయాన్ని మతం నుంచి వేరుచేసిన వారిలో ప్రథముడిగా మరొక మధ్యయుగ రాజనీతి తత్త్వవేత్త థామస్ ఆక్వినాసన్ను పరిగణించవచ్చు.

పదహారవ శతాబ్దంనాటికి న్యాయభావన పూర్తిగా లౌకిక భావాల చేత మార్పులకు గురయ్యింది. థామస్ హాబ్స్ వంటి సామాజిక ఒడంబడిక సిద్ధాంతకర్తలు న్యాయభావనను సార్వభౌమాధికారి ఆజ్ఞగా పరిగణించారు. ఆ తరువాత జాన్లాక్, రూసో, ఇమ్మాన్యుయల్ కాంట్ వంటివారు న్యాయమంటే స్వేచ్ఛ, సమానత్వ భావనల సమ్మేళనంగా పరిగణించారు. సహజ న్యాయ సిద్ధాంత ప్రతిపాదకులు వైయక్తిక న్యాయభావనను అభివృద్ధి చేశారు. సామ్యవాదులు న్యాయభావనను ఆర్థిక దృక్కోణం నుంచి అవలోకించారు. వేరొకవైపు సాంప్రదాయక రాజనీతి తత్వవేత్తలు న్యాయ భావనను వ్యక్తిపరంగా వివరించారు. ఆధునిక రాజనీతి శాస్త్రవేత్తలు ఆ భావనను సామాజిక దృక్కోణంలో పరిశీలించారు.

ప్రశ్న 3.
సామాజిక న్యాయం గురించి వ్యాసాన్ని వ్రాయండి.
జవాబు:
సామాజిక న్యాయం అనేది సాధారణంగా సమానత్వ భావనగా పరిగణించడమైంది. అలాగే సామాజిక న్యాయంలో సమానత్వం అనేది అంతర్లీనమైన, వివాదరహితమైన అంశం. సామాజిక న్యాయం (Social Justice) అనే పదానికి విస్తృతమైన అర్థం ఉంది. సమాజంలో నిష్పాక్షికత, పరస్పర కర్తవ్యం వంటి బాధ్యతలను ఇది సూచిస్తుంది. ప్రతి ఒక్కరూ ఇతరులకు బాధ్యత వహించాలని అది విశ్వసిస్తుంది. ప్రతి ఒక్కరికీ చాలినంత అవకాశాలు కల్పించాలని కోరుతుంది. క్లుప్తంగా చెప్పాలంటే అన్యాయాన్ని పారద్రోలి న్యాయబద్ధమైన సమాజ సాధనకు సామాజిక న్యాయం సంకల్పిస్తుంది. సమాజంలో లభించే వస్తుసేవలను పంచుకోవాలనే నమ్మకం ప్రజలలో ఉన్నప్పుడు సామాజిక న్యాయం నెలకొంటుంది. ప్రజలందరికీ సమానమైన ఆదరణ, మానవ హక్కులను కల్పించి ఉమ్మడి వనరులను నిష్పక్షపాతమైన రీతిలో ప్రతి ఒక్కరూ వ్యవహరించినప్పుడే సామాజిక న్యాయాన్ని సాధించడం సులభమవుతుంది.

ఈ సందర్భంలో జాన్రాల్స్, డేవిడ్ మిల్లర్ వంటి ఆధునిక రాజనీతి శాస్త్రవేత్తలు రెండు ముఖ్యమైన ప్రకటనలు చేశారు. జాన్ రాల్స్ సామాజిక న్యాయం అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. అతడు ఈ సిద్ధాంతాన్ని న్యాయం లేదా ‘నిష్పాక్షికత’ అని సాధారణంగా వ్యవహరించడమైంది. అతడి ప్రకారం ‘సామాజిక న్యాయం’ అనేది ప్రతి ఒక్కరికీ స్వేచ్ఛ హక్కులు, ఇతర అవకాశాలు కల్పించడానికి సంబంధించినది. అలాగే సమాజంలో నిరాదరణకు గురైన వర్గాల ప్రయోజనాల గురించి శ్రద్ధ వహించడానికి ఉద్దేశించింది. వ్యక్తుల కార్యకలాపాల ప్రయోజనాన్ని బట్టి వ్యక్తుల మంచి చెడులను నిర్ణయించవచ్చనీ అతడు పేర్కొన్నాడు. సామాజిక న్యాయం ద్వారా వ్యక్తులు సుఖ సంతోషాలతో కూడిన జీవనాన్ని గడిపేందుకు అవకాశం ఉంటుందన్నాడు. సామాజిక న్యాయం భావన వ్యాప్తి ద్వారా నిరాదరణకు గురైన వ్యక్తుల గురించి పట్టించుకోవడం సాధ్యం అవుతుందని ఉద్ఘాటించాడు.

పైన పేర్కొన్న జాన్రాల్స్ సిద్ధాంతం సామాజిక ఒడంబడిక భావన ఆధారంగా రూపొందింది. ఆ భావన ప్రకారం ప్రజలందరూ ఒకానొక ఒప్పందంపై సంతకం చేస్తారు. తద్వారా మెరుగైన సమాజ స్థాపనకై వారంతా కొన్ని నియమ నిబంధనలను అనుసరించి వాటికి విధేయత చూపించేందుకు సంసిద్ధంగా ఉంటారు. అటువంటి నియమ నిబంధనలు కొన్ని మౌలిక హక్కులు, కర్తవ్యాలను నిర్దేశిస్తాయి. సామాజిక, రాజకీయ సంస్థలలో ప్రజలే సభ్యులుగా అంతిమంగా కొనసాగుతారు. సామాజిక సహకారం ద్వారా ప్రజలకు ఎన్నో ప్రయోజనాలు లభిస్తాయి.

AP Inter 1st Year Civics Study Material Chapter 7 న్యాయం

డేవిడ్ మిల్లర్ సామాజిక న్యాయం అనేది సమాజంలో మంచి చెడుల పంపిణీకి సంబంధించినది. మంచి ఎన్నో ప్రయోజనాలు, చెడు ద్వారా ఎన్నో నష్టాలు ప్రజలకు ఒనగూరుతాయి. సామాజిక రాజకీయ సంస్థలు ఏ విధంగా ప్రజల మధ్య వనరుల పంపిణీకి చర్యలు తీసుకొంటాయనే విషయాన్ని సామాజిక న్యాయం సూచిస్తుందని మిల్లర్ పేర్కొన్నాడు. సామాజిక న్యాయం ద్వారా ప్రజలు విద్య, ఉపాధి, ఆరోగ్యం, సంపద, సంక్షేమం, రవాణా వంటి రంగాలలో అనేక ప్రయోజనాలను పొందుతారని ఉద్ఘాటించాడు. అయితే సామాజిక న్యాయం వల్ల కొన్ని దుష్ఫరిణామాలు ఎదురవుతాయని అతడు హెచ్చరించాడు. వ్యక్తుల స్వీయ వ్యవహారాలలో రాజ్యం జోక్యం, వ్యక్తులు నిర్బంధంగా సైనిక పరమైన సేవలను అందించడం వంటి దుష్ఫరిణామాలు ఉంటాయని పేర్కొన్నాడు.

మిల్లర్ సిద్ధాంతం ప్రభుత్వ, ప్రైవేటురంగాలు రెండింటికీ వర్తిస్తుంది. అతడి సిద్ధాంతం ప్రకారం సామాజిక న్యాయం అనేది సామాజిక సుగుణంగా భావిస్తుంది. వ్యక్తులు సమాజంలో వేటిని కలిగిఉంటారో, సమాజానికి వారు అందించాల్సినవి ఏమిటో అనే విషయాన్ని ఇతడి సిద్ధాంతం ప్రస్తావించింది.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
న్యాయం యొక్క ముఖ్య భావనలను వివరించండి.
జవాబు:
అర్థం: న్యాయం (Justice) అనే ఇంగ్లీష్ పదం “జస్” (Jus) అనే లాటిన్ పదం నుంచి ఉద్భవించింది. లాటిన్ భాషలో “జస్” అంటే “బంధించి ఉండటం” లేదా “కలిపి ఉంచడం” అని అర్థం.

నిర్వచనాలు:
1. ప్లేటో: “వ్యక్తి తన పని తాను చేసుకుంటూ, ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడమే న్యాయం”. 2. అరిస్టాటిల్: “న్యాయం అంటే సమాజంలో ప్రతి వ్యక్తీ తన నైతిక బాధ్యతలను నిర్వర్తించడం తప్ప మరేదీకాదు”. 3. కెఫాలస్: “న్యాయం అంటే ప్రతి ఒక్కరూ సత్యాన్ని పలకడం, ఇతరులకు ఇవ్వాల్సింది ఇవ్వడం”. న్యాయం ముఖ్య భావనలు: న్యాయం ప్రధానంగా రెండు ముఖ్య భావనలను కలిగివుంది. అవి: 1) సంఖ్యాత్మక భావన (Numerical concept) 2) క్షేత్రగణిత భావన (Geometrical concept). వీటిని ఈ క్రింది విధంగా వివరించవచ్చు.

1) సంఖ్యాత్మక భావన (Numerical concept): సంఖ్యాత్మక భావన ప్రకారం సామాజిక వ్యవహారాలలో ప్రతి ఒక్కరికీ సమానమైన వాటా, భాగస్వామ్యం, ప్రమేయం ఉంటాయి. ప్రాచీన గ్రీకునగర రాజ్యాలు ప్రజలకు సంబంధించిన వ్యవహారాల నిర్వహణలో ఈ రకమైన భావనను అనుసరించాయి. ఆనాటి పాలకులు ప్రభుత్వంలోని వివిధ పదవుల భర్తీ విషయంలో సమానత్వ భావనను అమలులో ఉంచేందుకు శాయశక్తులా కృషి చేశారు. ప్రభుత్వ పదవులను చేపట్టి, వాటిని నిర్వహించే విషయంలో ప్రత్యేక పరిజ్ఞానం, అర్హతలను పరిగణనలోకి నగర రాజ్యాలు తీసుకోలేదు. ఆధునిక కాలంలో ప్రముఖ బ్రిటిష్ రాజనీతి తత్త్వవేత్త జెరిమీ బెంథామ్ ఈ రకమైన భావనను ప్రతిపాదించాడు. ప్రతి ఒక్కరూ ఒకరుగానే పరిగణించబడతారనీ, ఏ ఒక్కరూ ఒకరి కంటే అధికంగా పరిగణించబడరనీ అతడు ఈ సందర్భంలో ప్రకటించాడు. ఆధునిక కాలంలో అనేక ఉదారవాద రాజ్యాలు ఈ భావన ప్రాతిపదికపై పనిచేయటం ప్రారంభించాయి.

2) క్షేత్రగణిత భావన (Geometrical concept): క్షేత్రగణిత (Geometrical) భావన నైష్పత్తిక సమానత్వ సూత్రంపై ఆధారపడి రూపొందింది. సమానులకు సమానమైన భాగస్వామ్యం, అసమానులకు అసమానమైన భాగస్వామ్యం కల్పించాలనే సూత్రాన్ని ఈ భావన ప్రతిపాదిస్తుంది. వ్యక్తుల అర్హత, యోగ్యత లేదా వారు అందించే సేవల ప్రాతిపదికపై ప్రభుత్వ పదవులు, అధికారాన్ని పంపిణీ చేయాల్సి ఉంటుందని ఈ భావన పేర్కొంటుంది. ప్లేటో, అరిస్టాటిల్ వంటి ప్రముఖ ప్రాచీన రాజనీతి తత్త్వవేత్తలు ఈ భావన పట్ల సుముఖత వ్యక్తం చేశారు. అరిస్టాటిల్ ఈ భావన గురించి వివరిస్తూ క్రింది విధంగా ప్రకటించాడు. “వేణువులను పంపిణీ చేయాలంటే, వాటిని వాయిద్యాలుగా ఉపయోగించే సామర్థ్యం గల వారికే అందించాల్సి ఉంటుందని” అతడు పేర్కొన్నాడు. ఈ భావన ప్రకారం గ్రహీతల యోగ్యతను బట్టి సౌకర్యాలు, ప్రయోజనాలను సమాన ప్రాతిపదికపై పంపకం చేసేందుకై ప్రత్యేక కృషి జరపాల్సి ఉంటుంది.

ప్రశ్న 2.
న్యాయం ఏ విధంగా పరిణామం చెందింది ?
జవాబు:
న్యాయం – పరిణామం: ప్రాచీన భారతదేశంలో న్యాయం అనేది ధర్మంతో ముడిపడి ఉంది. అటువంటి ధర్మం గురించి ప్రాచీన హిందూ స్మృతులలో ప్రస్తావించడమైంది. వాటి ప్రకారం రాజు కర్తవ్యాలలో న్యాయం ఒకటి. ధర్మం ప్రాతిపదికపై న్యాయబద్ధమైన సామాజిక వ్యవస్థను ఏర్పరచి, నిర్వహించేందుకు రాజు కృషి చేసేవాడు. ప్రఖ్యాత చైనా తత్త్వవేత్త అయిన కన్ఫ్యూసియస్ రాజు ప్రధాన కర్తవ్యం చెడు పనులకు పాల్పడే వారిని శిక్షించడం మంచి వ్యక్తులకు బహుమానాలిచ్చి ప్రోత్సహించడంగా పేర్కొన్నాడు.

AP Inter 1st Year Civics Study Material Chapter 7 న్యాయం

సాధారణంగా న్యాయమంటే ఇతరులకు ఇవ్వాల్సింది ఇవ్వడమే. అయితే న్యాయభావన అర్థం వ్యక్తులను బట్టి మారుతుంది. ప్రతి ఒక్క వ్యక్తికి సంబంధించిన మానవీయ దృక్కోణంలో న్యాయాన్ని అవగాహన చేసుకోవాల్సి ఉంటుంది. జర్మనీ తత్త్వవేత్త ఇమ్మాన్యుయల్ కాంట్ ప్రకారం మానవులందరూ గౌరవాన్ని కలిగి ఉంటారు. వ్యక్తులందరికీ గౌరవం లభించినట్లయితే వారంతా శక్తి సామర్థ్యాలను వినియోగించుకొని తమ లక్ష్యాల సాధనకై చాలినన్ని అవకాశాలను పొందగలుగుతారు. అందువల్ల న్యాయభావన ప్రకారం ప్రతి ఒక్క వ్యక్తికీ సమానమైన గుర్తింపు, గౌరవం ఇవ్వడమైంది.

ప్లేటో వల్ల ప్రభావితుడైన సెయింట్ ఆగస్టీన్ అనే మధ్యయుగ రాజనీతి తత్త్వవేత్త న్యాయభావనను వివరించాడు. సమాజం సరైన రీతిలో కొనసాగేందుకు వ్యక్తుల మధ్య సౌహార్ద్ర సంబంధాల గురించి అతడు ప్రముఖంగా ప్రస్తావించాడు. ఆ తరువాత న్యాయాన్ని మతం నుంచి వేరుచేసిన వారిలో ప్రథముడిగా మరొక మధ్యయుగ రాజనీతి తత్త్వవేత్త థామస్ ఆక్వినాన్ను పరిగణించవచ్చు.

పదహారవ శతాబ్దంనాటికి న్యాయ భావన పూర్తిగా లౌకిక భావాల చేత మార్పులకు గురయ్యింది. థామస్ హాబ్స్ వంటి సామాజిక ఒడంబడిక సిద్ధాంతకర్తలు న్యాయభావనను సార్వభౌమాధికారి ఆజ్ఞగా పరిగణించారు. ఆ తరువాత జాన్లాక్, రూసో, ఇమ్మాన్యుయల్ కాంట్ వంటివారు న్యాయమంటే స్వేచ్ఛ, సమానత్వ భావనల సమ్మేళనంగా పరిగణించారు. సహజ న్యాయ సిద్ధాంత ప్రతిపాదకులు వైయక్తిక న్యాయ భావనను అభివృద్ధి చేశారు. సామ్యవాదులు న్యాయభావనను ఆర్థిక దృక్కోణం నుంచి అవలోకించారు. వేరొకవైపు సాంప్రదాయక రాజనీతి తత్వవేత్తలు న్యాయ భావనను వ్యక్తిపరంగా వివరించారు. ఆధునిక రాజనీతి శాస్త్రవేత్తలు ఆ భావనను సామాజిక దృక్కోణంలో పరిశీలించారు.

ప్రశ్న 3.
న్యాయంలోని మూడు రకాలను వర్ణించండి. [Mar. ’16]
జవాబు:
న్యాయం రకాలు (Types of Justice): న్యాయం అనేక రకాలుగా ఉంటుంది. ఇది సహజ, ఆర్థిక, సామాజిక, రాజకీయ, చట్టబద్ధమైన పార్శాలకు సంబంధించినది. న్యాయభావనలోని వివిధ రకాలను కింది పట్టిక ద్వారా తెలుసుకోవచ్చు.

1) సహజ న్యాయం (Natural Justice): ప్రపంచంలో లభించే సహజ వనరులను ప్రతి ఒక్కరూ వినియోగించకోవచ్చుననే సూత్రం ఆధారంగా ప్రతిపాదించబడినదే సహజ న్యాయం. భూమిపై నివసించే ప్రతి ఒక్కరికీ సహజ వనరులు జీవన ఆధారంగా ఉంటాయి. మానవులు ఒక్కరే హేతుబద్ధమైన జీవనం గడపటం వల్ల, సహజ వనరులను న్యాయబద్ధంగా వినియోగించుకోవాల్సిన బాధ్యత వారిపై ఉంది. ఈ సందర్భంలో మానవులు భవిష్యతరాల అవసరాలను దృష్టిలో ఉంచుకోవాలి.

2) సామాజిక న్యాయం (Social Justice): సామాజిక న్యాయం అనేది వ్యక్తుల హక్కులు, సమాజం నియంత్రణల మధ్య చక్కని సమతౌల్యాన్ని నెలకొల్పేందుకు ఉద్దేశించింది. వర్తమాన చట్టాలకు లోబడి వ్యక్తుల న్యాయబద్ధమైన ఆకాంక్షలను నెరవేర్చుకొనేందుకు ఈ రకమైన న్యాయం వీలు కల్పిస్తుంది. చట్టం దృష్టిలో అందరూ సమానులే అనే సూత్రాన్ని సామాజిక న్యాయం నమ్ముతుంది, సామాజిక అనర్థాలైన పేదరికం, నిరుద్యోగం, అనారోగ్యం, ఆకలి వంటి వాటిని అధిగమించేందుకు సామాజిక న్యాయం హామీ ఇస్తుంది. సమాజంలోని నిమ్నవర్గాలు, బడుగు, బలహీన వర్గాలకు రక్షణ కల్పిస్తుంది. అంతిమంగా వ్యక్తుల సంపూర్ణ వ్యక్తిత్వ వికాసానికి అవసరమైన పరిస్థితులను కల్పిస్తుంది.

3) రాజకీయ న్యాయం (Political Justice): రాజకీయ న్యాయం అనేది రాజకీయ సమానత్వాన్ని సూచిస్తుంది. రాజ్యంలోని వయోజనులైన పౌరులకు రాజకీయ హక్కులను ఈ రకమైన న్యాయం ప్రతిపాదిస్తుంది. దేశ పాలనలో పౌరులు స్వేచ్ఛగానూ, నిర్భయంగానూ పాల్గొనేందుకు వీలు కల్పిస్తుంది. ఎన్నికల సమయంలో రాజకీయ న్యాయ భావన విశేష ప్రాధాన్యాన్ని సంతరించుకొంటుంది. రోజువారి పాలనలో పౌరులు చురుకుగా పాల్గొనేందుకు రాజకీయ న్యాయం సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తుంది. ప్రతి ఒక్కరూ ఇతరులతో పాటుగా సమానులేనని, ఏ ఒక్కరూ ఇతరుల కంటే ఏ విషయంలోనూ అధికులు కారనీ, ఎటువంటి ప్రత్యేకతలు కలిగి ఉండరనే సూత్రంపై ఈ భావన రూపొందింది. రాజ్యంలో రాజకీయ న్యాయం ఉండాలంటే కింద పేర్కొన్న పరిస్థితులు నెలకొనాలి.

  1. సమన్యాయ పాలన
  2. స్వతంత్ర న్యాయశాఖ
  3.  ప్రాతినిధ్య సంస్థలకు ఎన్నికలు
  4. రాజకీయ పార్టీలు
  5. పత్రికా స్వాతంత్య్రం
  6. ప్రజాస్వామ్య పాలన మొదలైనవి.

AP Inter 1st Year Civics Study Material Chapter 7 న్యాయం

ప్రశ్న 4.
న్యాయానికి గల మూడు ఆధారాలను పేర్కొనండి. [Mar. ’18, ’17]
జవాబు:
న్యాయం – నిర్వచనాలు:

  1. ప్లేటో: “వ్యక్తి తన పని తాను చేసుకుంటూ, ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడమే న్యాయం”.
  2. అరిస్టాటిల్: “న్యాయం అంటే సమాజంలో ప్రతి వ్యక్తీ తన నైతిక బాధ్యతలను నిర్వర్తించడం తప్ప మరేదీకాదు”.
  3. కెఫాలస్: “న్యాయం అంటే ప్రతి ఒక్కరూ సత్యాన్ని పలకడం, ఇతరులకు ఇవ్వాల్సింది ఇవ్వడం”. న్యాయం ఆధారాలు: ఎర్నస్ట్ బార్కర్ న్యాయానికి నాలుగు ఆధారాలున్నాయని పేర్కొన్నాడు. అవి: 1) ప్రకృతి 2) నైతికత 3) మతం 4) ఆర్థిక అంశాలు. వాటిని క్రింది విధంగా వివరించవచ్చు.

1) ప్రకృతి (Nature): గ్రీకు యధేచ్ఛావాదులు (Stoics) ప్రకృతిని న్యాయం ఆధారాలలో ఒకటిగా భావించారు. వారి దృష్టిలో ప్రకృతి అనేది నైతిక తాత్వికత, మత విశ్వాసాల సమ్మేళనం. ప్రకృతి, దైవం, హేతువులనేవి అవిభాజ్యాలు. ప్రకృతి నియమాల ప్రకారం జీవనం సాగించే వ్యక్తులు భగవంతుడు, హేతువులపట్ల ఒకే విధమైన భావాలను కలిగి ఉంటారని వారు ఉద్ఘాటించారు. ప్రకృతి మూడు ప్రధాన అంశాలను సూచిస్తుందని వారు పేర్కొన్నారు. అవి: 1) మానవుడికి స్వాతంత్ర్యం ఉండాలి. 2) మానవులందరూ సమానమైన గుర్తింపును కలిగి ఉండాలి. 3) మానవులందరూ తోటి మానవులతో హేతువు ఆధారంగా స్నేహ సంబంధాలను కలిగి ఉండాలి. పైన పేర్కొన్న మూడు అంశాలు కాలక్రమేణా స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే మూడు భావనలకు ఆధారాలయ్యాయి.

2) నైతికత (Ethics): ఆదర్శవాదులైన ప్లేటో, ఎమ్మాన్యుయెల్ కాంట్, థామస్ హిల్లీ గ్రీన్, ఎర్నెస్ట్ బార్కర్లు న్యాయం అనేది నైతిక సూత్రాల అవలంబన ద్వారా అవతరించిందని ఉద్ఘాటించారు. కాలానుగుణంగా సమాజం |ఆమోదం పొందిన విలువలే సంవర్ధక న్యాయభావన (Concept of Positive Justice) కు ఆధారమయ్యాయని వారు పేర్కొన్నారు. తరువాత కాలంలో రాజ్యం సంవర్ధక న్యాయాన్ని అమలులో ఉంచేందుకు చర్యలు తీసుకొన్నదన్నారు.

3) మతం (Religion): న్యాయానికి గల మరొక ఆధారమే మతం. మధ్యయుగం నుంచి మతం న్యాయానికి ఆధారంగా కొనసాగుతూ వచ్చింది. న్యాయం, మంచి, చెడులకు సంబంధించిన భావనలను భగవంతుడు ప్రవచించాడని క్రైస్తవమతాధిపతులు పేర్కొన్నారు. మతం ద్వారా న్యాయభావనలకు అంకురార్పణ చేసి, బలవంతుడే రాజ్య పాలకుడిగా ఉంటాడనీ వారు ఉద్ఘాటించారు. థామస్ అక్వినాస్ అనే మతాచార్యుడిగా మారిన తత్వవేత్త మతాన్ని క్రైస్తవచర్చికి ప్రతిరూపంగా విశ్వసించాడు. ఇతని ప్రకారం చట్టం ఆధారంగా కొనసాగే జీవనం ఉత్తమమైందిగా భావించాడు. రాజు ఎల్లప్పుడు ప్రజలను సన్మార్గంలో నడిపించాలన్నారు. రాజు తన అధికారాలను మతాధిపతి ఆధిపత్యానికి బద్ధుడై వినియోగించాలన్నాడు.

ప్రశ్న 5.
సామాజిక న్యాయాన్ని ఏ విధంగా పొందవచ్చు ?
జవాబు:
సామాజిక న్యాయం (Social Justice): సామాజిక న్యాయం అనేది వ్యక్తుల హక్కులు, సమాజం నియంత్రణల మధ్య చక్కని సమతౌల్యాన్ని నెలకొల్పేందుకు ఉద్దేశించింది. వర్తమాన చట్టాలకు లోబడి వ్యక్తుల న్యాయబద్ధమైన ఆకాంక్షలను నెరవేర్చుకొనేందుకు ఈ రకమైన న్యాయం వీలు కల్పిస్తుంది. చట్టం దృష్టిలో అందరూ సమానులే అనే సూత్రాన్ని సామాజిక న్యాయం నమ్ముతుంది, సామాజిక అనర్థాలైన పేదరికం, నిరుద్యోగం, అనారోగ్యం, ఆకలి వంటి వాటిని అధిగమించేందుకు సామాజిక న్యాయం హామీ ఇస్తుంది. సమాజంలోని నిమ్నవర్గాలు, బడుగు, బలహీన వర్గాలకు రక్షణ కల్పిస్తుంది. అంతిమంగా వ్యక్తుల సంపూర్ణ వ్యక్తిత్వ వికాసానికి అవసరమైన పరిస్థితులను కల్పిస్తుంది.

సామాజిక న్యాయాన్ని క్రింది విధంగా పొందవచ్చు (లేదా) సాధించవచ్చు సమాజంలోని విభిన్న వర్గాల మధ్య విపరీతమైన వ్యత్యాసాలు ఉన్నప్పుడు సామాజిక న్యాయం అనేది భ్రాంతిగా మిగిలిపోతుంది. ఈ సందర్భంలో సామాజిక న్యాయాన్ని ఖచ్ఛితంగా అవగాహన చేసుకోవడం అంత తేలికైన విషయం కాదు. ఆధునిక సమాజంలో సమానత్వంతో పాటుగా న్యాయాన్ని కలిగి ఉండటం అనేది ప్రతి ఒక్కరి ఆకాంక్ష. అనైతిక, అన్యాయ, పక్షపాత ధోరణులు ఆధిపత్యం వహించినంత కాలం సమాజంలో ప్రగతిని సాధించడం సాధ్యం కాదు. అటువంటి సమాజంలో నిరాదరణ, అసౌకర్యాలకు గురైన వర్గాలు దైనందిన జీవనంలో నిరాశా నిస్పృహలకు లోనవుతాయి. అటువంటి పరిస్థితులలో అత్యధిక సంఖ్యలో ఉన్న పేద ప్రజానీకానికి, కొద్ది సంఖ్యలో ఉన్న సంపన్న వర్గానికి మధ్య ఘర్షణలు నెలకొంటాయి. కాబట్టి కనీస సౌకర్యాలు, సంతోషం భద్రతతో కూడిన న్యాయమైన సమాజం ఆవశ్యకత ఎంతైనా అవసరం. అప్పుడే సమాజంలోని విభిన్న వర్గాలకు చెందిన ప్రజలు తమ లక్ష్యాలను చేరుకొనేందుకు ప్రయత్నిస్తారు.

AP Inter 1st Year Civics Study Material Chapter 7 న్యాయం

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
న్యాయాన్ని నిర్వచించండి. [Mar. ’17, ’16]
జవాబు:
నిర్వచనాలు:

  1. ప్లేటో: “వ్యక్తి తన పని తాను చేసుకుంటూ, ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడమే న్యాయం”.
  2. అరిస్టాటిల్: “న్యాయం అంటే సమాజంలో ప్రతి వ్యక్తీ తన నైతిక బాధ్యతలను నిర్వర్తించడం తప్ప మరేదీకాదు”.
  3. కెఫాలస్: “న్యాయం అంటే ప్రతి ఒక్కరూ సత్యాన్ని పలకడం, ఇతరులకు ఇవ్వాల్సింది ఇవ్వడం”.

ప్రశ్న 2.
వితరణశీల న్యాయం అంటే ఏమిటి ?
జవాబు:
వ్యక్తుల మధ్య యోగ్యత ప్రాతిపదికపై వస్తు సంపదను రాజ్యం పంపిణీ చేయడాన్ని వితరణశీల న్యాయం అని అంటారు. న్యాయమంటే ఒక రకమైన వితరణ పద్దతి అని అరిస్టాటిల్ పేర్కొన్నాడు. న్యాయాన్ని విప్లవాలకు వ్యతిరేకంగా వినియోగించే సాధనమని అరిస్టాటిల్ ఉద్దేశ్యం.

ప్రశ్న 3.
సరియైన న్యాయం అనగానేమి ?
జవాబు:
ఇతరుల చర్యల కారణంగా కోల్పోయిన హక్కులను ఒక వ్యక్తికి అప్పగించడాన్ని సరైన న్యాయం అంటారు. ఈ రకమైన న్యాయాన్ని అరిస్టాటిల్ నిషేధాత్మక న్యాయంగా భావించాడు. ఈ రకమైన న్యాయం కొన్ని రకాల వ్యాపార లావాదేవీలకు సంబంధించినదై ఉంటుంది.

ప్రశ్న 4.
ఆర్థిక అంశాలను ఏ విధంగా న్యాయానికి ఆధారంగా పరిగణించవచ్చు ?
జవాబు:
ఆర్థిక అంశాలను కూడా న్యాయానికి మరొక ఆధారంగా పరిగణించవచ్చు. పారిశ్రామిక విప్లవ ఫలితంగా ఆర్థిక అంశాలకు ప్రాధాన్యం పెరిగింది. కారల్మార్క్స్, ఫ్రెడరిక్ ఏంగిల్స్ వంటి విప్లవాత్మక సామ్యవాదులు న్యాయానికి ఆర్థిక అంశాలే ఆధారాలుగా ఉంటాయని గట్టిగా విశ్వసించారు. వర్గరహిత సమాజ స్థాపన ద్వారా ఆర్థిక సమానత్వం సాధించినపుడే న్యాయం ఆచరణ సాధ్యమని వారి విశ్వాసం.

ప్రశ్న 5.
రాజకీయ న్యాయం అనగానేమి ? [Mar. 16]
జవాబు:
రాజకీయ న్యాయం (Political Justice): రాజకీయ న్యాయం అనేది రాజకీయ సమానత్వాన్ని సూచిస్తుంది. రాజ్యంలోని వయోజనులైన పౌరులకు రాజకీయ హక్కులను ఈ రకమైన న్యాయం ప్రతిపాదిస్తుంది. దేశ పాలనలో, పౌరులు స్వేచ్ఛగానూ, నిర్భయంగానూ పాల్గొనేందుకు వీలు కల్పిస్తుంది. ఎన్నికల సమయంలో రాజకీయ న్యాయ భావన విశేష ప్రాధాన్యాన్ని సంతరించుకొంటుంది. రోజువారి పాలనలో పౌరులు చురుకుగా పాల్గొనేందుకు రాజకీయ న్యాయం సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తుంది. ప్రతి ఒక్కరూ ఇతరులతో పాటుగా సమానులేనని, ఏ ఒక్కరూ ఇతరుల కంటే ఏ విషయంలోనూ అధికులు కారనీ, ఎటువంటి ప్రత్యేకతలు కలిగి ఉండరనే సూత్రంపై ఈ భావన రూపొందింది. రాజ్యంలో రాజకీయ న్యాయం ఉండాలంటే కింద పేర్కొన్న పరిస్థితులు నెలకొనాలి.

AP Inter 1st Year Civics Study Material Chapter 7 న్యాయం

ప్రశ్న 6.
సామాజిక న్యాయం అనగానేమి ? [Mar. ’17]
జవాబు:
సామాజిక న్యాయం (Social Justice): సామాజిక న్యాయం అనేది వ్యక్తుల హక్కులు, సమాజం నియంత్రణల మధ్య చక్కని సమతౌల్యాన్ని నెలకొల్పేందుకు ఉద్దేశించింది. వర్తమాన చట్టాలకు లోబడి వ్యక్తుల న్యాయబద్దమైన ఆకాంక్షలను నెరవేర్చుకొనేందుకు ఈ రకమైన న్యాయం వీలు కల్పిస్తుంది. చట్టం దృష్టిలో అందరూ సమానులే అనే సూత్రాన్ని సామాజిక న్యాయం నమ్ముతుంది, సామాజిక అనర్థాలైన పేదరికం, నిరుద్యోగం, అనారోగ్యం, ఆకలి వంటి వాటిని అధిగమించేందుకు సామాజిక న్యాయం హామీ ఇస్తుంది. సమాజంలోని నిమ్నవర్గాలు, బడుగు, బలహీన వర్గాలకు రక్షణ కల్పిస్తుంది. అంతిమంగా వ్యక్తుల సంపూర్ణ వ్యక్తిత్వ వికాసానికి అవసరమైన పరిస్థితులను కల్పిస్తుంది.

ప్రశ్న 7.
చట్టబద్ధమైన న్యాయంలోని పర్యవసానాలు ఏవి ?
జవాబు:
చట్టబద్ధమైన న్యాయం రాజ్యాంగ శాసనాల ద్వారా వెల్లడి అవుతుంది. రాజ్యంలోని రాజ్యాంగం, ఇతర శాసన చట్టాల రూపంలో ఇది వ్యక్తమవుతుంది. న్యాయం చట్టబద్ధమైన పరిమితులను నిర్ణయిస్తుంది. చట్టబద్ధమైన న్యాయంలో రెండు అంశాలు ఇమిడి ఉంటాయి. అవి:

  1. సమాజంలో చట్టాలన్నీ సమన్యాయ పాలన సూత్రంపై ఆధారపడి రూపొందించబడి, అమలు చేయబడతాయి.
  2. చట్టాలన్నీ సహాయ న్యాయ సూత్రాలకు అనుగుణంగా రూపొందించబడతాయి.

ప్రశ్న 8.
సామాజిక న్యాయంపై జాన్రాల్స్ అభిప్రాయాలను తెల్పండి. [Mar. ’18]
జవాబు:
జాన్ రాల్స్ ‘సామాజిక న్యాయం’ అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఈ సిద్ధాంతాన్ని ‘న్యాయం’ లేదా ‘నిష్పాక్షికత’ అని జాన్రాల్స్ పేర్కొన్నాడు. సామాజిక న్యాయం అంటే ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ, హక్కులను, ఇతర అవకాశాలను కల్పించటం అని ఆయన భావన. సామాజిక న్యాయం ద్వారానే వ్యక్తులు సుఖసంతోషాలతో కూడిన జీవనాన్ని పొందుతారని జాన్ రాల్స్ పేర్కొన్నాడు.

ప్రశ్న 9.
స్వేచ్ఛాయుత మార్కెట్ యంత్రాంగ సమర్థకుల అభిప్రాయాలు ఏమిటో పేర్కొనండి.
జవాబు:
స్వేచ్ఛాయుత మార్కెట్ యంత్రాంగ సమర్థకుల అభిప్రాయం ప్రకారం రాజ్యంలో వ్యక్తులందరూ సంపూర్ణమైన ఆర్థిక స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలను కలిగి ఉండాలి. ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి కారకాల మధ్య స్వేచ్ఛాయుత పోటీ ఉండాలి. ఆస్తిహక్కు, ఒప్పందాల స్వేచ్ఛ, ఆర్థిక వ్యవహారాలలో భాగస్వామ్యం ఏర్పరచుకొనే స్వాతంత్ర్యం ప్రతి వ్యక్తి కలిగి ఉండాలి అని స్వేచ్ఛాయుత మార్కెట్ యంత్రాంగ సమర్థకులు భావిస్తారు.

AP Inter 1st Year Civics Study Material Chapter 7 న్యాయం

ప్రశ్న 10.
మతాన్ని ఏ విధంగా న్యాయానికి ఆధారంగా పరిగణించవచ్చు ?
జవాబు:
మతం (Religion): న్యాయానికి గల మరొక ఆధారమే మతం. మధ్యయుగం నుంచి మతం న్యాయానికి ఆధారంగా కొనసాగుతూ వచ్చింది. న్యాయం, మంచి, చెడులకు సంబంధించిన భావనలను భగవంతుడు ప్రవచించాడని క్రైస్తవమతాధిపతులు పేర్కొన్నారు. మతం ద్వారా న్యాయభావనలకు అంకురార్పణ చేసి, బలవంతుడే రాజ్య పాలకుడిగా ఉంటాడనీ వారు ఉద్ఘాటించారు. థామస్ అక్వినాస్ అనే మతాచార్యుడిగా మారిన తత్వవేత్త మతాన్ని క్రైస్తవచర్చికి ప్రతిరూపంగా విశ్వసించాడు. ఇతని ప్రకారం చట్టం ఆధారంగా కొనసాగే జీవనం ఉత్తమమైందిగా భావించాడు. రాజు ” ఎల్లప్పుడు ప్రజలను సన్మార్గంలో నడిపించాలన్నారు. రాజు తన అధికారాలను మతాధిపతి ఆధిపత్యానికి బద్ధుడై వినియోగించాలన్నాడు.

AP Inter 1st Year Civics Study Material Chapter 6 హక్కులు – బాధ్యతలు

Andhra Pradesh BIEAP AP Inter 1st Year Civics Study Material 6th Lesson హక్కులు – బాధ్యతలు Textbook Questions and Answers.

AP Inter 1st Year Civics Study Material 6th Lesson హక్కులు – బాధ్యతలు

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
హక్కులను నిర్వచించి పౌర, రాజకీయ హక్కులను వర్ణించండి. [Mar. ’17, ’16]
జవాబు:
పరిచయం: రాజనీతిశాస్త్ర అధ్యయనంలో హక్కుల భావనకు చాలా ప్రాముఖ్యత ఉంది. సామాజిక జీవనానికి హక్కులనేవి అత్యంత ఆవశ్యకమైనవి. సామాజిక సంక్షేమ సాధనగా హక్కులు పరిగణించబడినాయి. హక్కులను వినియోగించుకోవటం ద్వారానే రాజ్యంలోని పౌర వ్యక్తిత్వం వికసిస్తుంది. సమాజంలోనూ, రాజ్యంలోనూ సంపూర్ణ వ్యక్తిత్వ వికాసానికి హక్కులు అవసరమవుతాయి. రాజ్యం పౌరులకు ప్రసాదించే హక్కుల ద్వారానే దాని ఔన్నత్యం గుర్తించబడుతుందని హెచ్.జె. లాస్కి పేర్కొన్నాడు. సాధారణంగా ప్రతి రాజ్యం తన పౌరులకు వివిధ రంగాలలో అనేక హక్కులను ప్రసాదిస్తుంది.

హక్కులనేవి రాజ్యం, సమాజంచేత గుర్తించబడే కనీస పరిస్థితులు, అవకాశాలుగా పరిగణించవచ్చు. వాటిని రాజ్యంలోని వివిధ చట్టాలు పరిరక్షిస్తాయి. ఆధునిక రాజ్యాలు తమ రాజ్యాంగం, చట్టాల ద్వారా పౌరుల వికాసానికి అనేక ఏర్పాట్లుగావించాయి. ఇక హక్కులు, బాధ్యతలు అనేవి వ్యక్తుల సంపూర్ణ వికాసానికి అత్యంత ఆవశ్యకమైనవి.

AP Inter 1st Year Civics Study Material Chapter 6 హక్కులు – బాధ్యతలు

అర్థం: “హక్కు” అంటే “కలిగి ఉండటము” అని అర్థం. సమాజ సంక్షేమం కోసం, ప్రగతి కోసం వ్యక్తులందరూ పాటించవలసిన బాధ్యతల రూపమే హక్కులు. హక్కులు మానవునకు స్వేచ్ఛను ఇచ్చి, వికాసానికి తోడ్పడతాయి. హక్కుల నిర్వచనాలు: రాజనీతి శాస్త్రవేత్తలు హక్కు అనే పదాన్ని అనేక విధాలుగా నిర్వచించారు. వాటిలో కొన్నింటిని కింద వివరించడమైనది.

  1. ఎర్నెస్ట్ బార్కర్: “వ్యక్తి మూర్తిమత్వ సామర్థ్యాన్ని పెంపొందించేందుకు అవసరమైన బాహ్యపరమైన పరిస్థితులే హక్కులు”.
  2. బొసాంకే: “సమాజం చేత గుర్తించబడి, రాజ్యంచేత అమలులో ఉంచబడే అధికారాలే హక్కులు”.
  3. టి.హెచ్. గ్రీన్: “ఉమ్మడి శ్రేయస్సుకు దోహదపడే వాటిని కోరేందుకు, గుర్తించేందుకు ఉండే అధికారాలే హక్కులు.”
  4. హెచ్.జె. లాస్కి: “హక్కులనేవి మానవుల సామాజిక జీవనానికి అవసరమైనవి. అవి లేకుండా ఏ ఒక్కరూ సాధారణంగా అత్యుత్తమమైన వ్యక్తిగా రూపొందటం సాధ్యం కాదు.”

పౌరహక్కులు: నాగరిక జీవనాన్ని గడపటానికి అవసరమయ్యే హక్కులనే పౌరహక్కులు అంటారు. అన్ని రాజ్యాలు తమ ప్రజలకు ఈ హక్కులను ఇస్తున్నాయి. ఈ హక్కులపై అనేక మినహాయింపులు ఉంటాయి. ముఖ్యమైన పౌర హక్కులు ఏమనగా:

1. జీవించే హక్కు (Right to life): జీవించే హక్కు అనేది పౌరహక్కులలో అత్యంత ముఖ్యమైనదని టి.హెచ్. గ్రీన్ భావించాడు. ఈ హక్కు వ్యక్తుల జీవనానికి భద్రతను కల్పిస్తుంది. ఈ హక్కు లేనట్లయితే వ్యక్తులు తమ జీవనాన్ని గడిపేందుకు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటారు. ప్రతి వ్యక్తికీ ఈ హక్కు ఎంతో విలువైనదే కాకుండా, సమాజం, రాజ్యం మొత్తానికి కూడా ఎంత విలువైనదనే ప్రమేయంపై ఈ హక్కు ఆధారపడి ఉంది. అందువల్ల ఈ హక్కు ద్వారా రాజ్యం వ్యక్తుల జీవనానికి ఎంతగానో రక్షణను కల్పిస్తుంది. అయితే ఈ హక్కును అనుభవించే విషయంలో వ్యక్తులపై రాజ్యం కొన్ని సహేతుకమైన ఆంక్షలను విధించవచ్చు. ఈ సందర్భంలో రాజ్యం ఏ వ్యక్తినైనా జాతి ప్రయోజనం కోసం ఎటువంటి త్యాగానికైనా సిద్ధంగా ఉండాలని ఆజ్ఞాపించవచ్చు. ఈ హక్కులలో ఆత్మరక్షణ హక్కు కూడా ఇమిడి ఉంది.

2. స్వేచ్ఛా హక్కు (Right to Liberty): స్వేచ్ఛా హక్కు వ్యక్తులకు అనేక రంగాలలో స్వాతంత్ర్యాన్ని ప్రసాదిస్తుంది. ఈ హక్కు వారి జీవనాన్ని అర్థవంతం చేస్తుంది. వ్యక్తులు అనేక రంగాలలో వారి వ్యక్తిత్వాన్ని వికసింపచేసుకొనేందుకు వీలు కల్పిస్తుంది. సంచరించే హక్కు, వాక్ స్వాతంత్ర్యపు హక్కు, భావవ్యక్తీకరణ హక్కు, ఆలోచనా హక్కు, నివసించే హక్కు మొదలైనవి ఇందులో ఉన్నాయి.

3. సమానత్వ హక్కు (Right to Equality): సమానత్వ హక్కు అంటే చట్టం దృష్టిలో అందరూ సమానులే అని అర్థంగా చెప్పవచ్చు. వ్యక్తుల మధ్య కులం, వర్ణం, పుట్టుక, మతం, ప్రాంతం, సంపద, విద్యలాంటి పలురకాల విచక్షణలను ఈ హక్కు నిషేధిస్తుంది. అందరినీ ఒకే రకంగా ఆదరిస్తుంది. రాజ్యంలో చట్టాలను ఒకే విధంగా వర్తించుటకు ఈ హక్కు ఉద్దేశించింది. సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాలలో వ్యక్తులందరికీ సమానమైన అవకాశాలను ఈ హక్కు కల్పిస్తుంది.

4. ఆస్తి హక్కు (Right to Property): ఈ హక్కు ప్రకారం ప్రతి వ్యక్తి ఆస్తిని సంపాదించేందుకు, అనుభవించేందుకు, దానధర్మాలకు వినియోగించుకొనేందుకు లేదా వారసత్వంగా పొందేందుకు వీలుంటుంది. ప్రతి వ్యక్తి ఉన్నత ప్రమాణాలతో జీవనాన్ని కొనసాగించేందుకు ఈ హక్కు అవసరమవుతుంది. అలాగే వ్యక్తి మూర్తిమత్వ వికాసానికి ఇది ఎంతో కీలకమైనది.

5. కుటుంబ హక్కు (Right to Family): కుటుంబం అనేది ఒక ప్రాథమిక, సామాజిక వ్యవస్థ. కుటుంబ ” హక్కు సమాజంలో వ్యక్తులకు కుటుంబపరమైన సంబంధాలను ఏర్పరచుకొనేందుకు వీలు కల్పిస్తుంది. పర్యవసానంగా ఈ హక్కు ద్వారా వ్యక్తులు తమకు నచ్చినవారిని వివాహం చేసుకొనే స్వేచ్ఛను కలిగి ఉంటారు. అలాగే సంతానాన్ని పొందేందుకు, పిల్లలను పోషించేందుకు వారికి పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. అయితే జాతీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఈ హక్కుపై రాజ్యం కొన్ని నిర్దిష్టమైన ఆంక్షలను విధించవచ్చు. ఉదాహరణకి ఇటీవలి కాలం వరకు చైనా ప్రభుత్వం అక్కడి పౌరుల కుటుంబసభ్యుల సంఖ్యపై కఠిన ఆంక్షలను విధించింది. ఇప్పుడిప్పుడే ఈ రాజ్యం పైన పేర్కొన్న విషయంలో కొన్ని సవరణలు చేస్తున్నది.

6. మత హక్కు (Right to Religion): ఈ హక్కు ప్రకారం వ్యక్తులు తమకు ఇష్టమైన మతాన్ని స్వీకరించేందుకు, ప్రచారం చేసేందుకు, ప్రభోదించేందుకు స్వేచ్ఛను కలిగి ఉంటారు. వారు ఈ విషయంలో సంపూర్ణమైన స్వాతంత్ర్యాన్ని కలిగి ఉంటారు. ముఖ్యంగా లౌకికరాజ్యాలు తమ పౌరులకు విశేషమైన మత స్వాతంత్ర్యాలను ప్రసాదించాయి.

AP Inter 1st Year Civics Study Material Chapter 6 హక్కులు – బాధ్యతలు

7. ఒప్పందం హక్కు (Right to Contract): ఒప్పందం హక్కు ప్రకారం వ్యక్తులు తమ జీవనం, ఆస్తి, ఉపాధి వంటి విషయాలలో చట్టబద్ధమైన ఏర్పాట్లను చేసుకొనేందుకు లేదా ఒప్పందాలను కుదుర్చుకొనేందుకు స్వాతంత్ర్యాన్ని కలిగి ఉంటారు. ఈ విషయంలో ఈ హక్కు ప్రకారం సంబంధిత వ్యక్తులు స్పష్టమైన నియమ నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. రాజ్యం వ్యక్తుల శ్రేయస్సును పెంపొందించే ఒప్పందాలను మాత్రమే ఈ సందర్భంలో గుర్తిస్తుంది.

8. విద్యా హక్కు (Right to Education): ఆధునిక కాలంలో విద్యాహక్కు అనేది ప్రతి వ్యక్తికి అత్యంత ఆవశ్యకమైనదిగా పరిగణించబడింది. విద్యలేనివారు, అమాయకులు ప్రభుత్వ వ్యవహారాలలో చురుకుగా పాల్గొనలేరు. అలాగే నిరక్షరాస్యులు తమ శక్తి సామర్థ్యాలను పూర్తిగా వినియోగించుకోలేరు. అందుచేత విద్య, అక్షరాస్యత అనేవి సమాజంలో వివిధ సామాజిక సమస్యలను అవగాహన చేసుకొనేందుకు, ప్రభుత్వ విధానాలను తెలుసుకొనేందుకు దోహదపడతాయి. ప్రజాస్వామ్య రాజ్యాలలో ఈ హక్కు ప్రతి పౌరుడికి కనీస స్థాయి విద్యను అందించేందుకు హామీ ఇస్తుంది.

9. సంస్థలు, సంఘాలను ఏర్పాటు చేసుకునే హక్కు (Right to form Associations and Unions): ఈ హక్కు ప్రకారం వ్యక్తులు తమకు ఇష్టమైన సంస్థలు, సంఘాలను నెలకొల్పుకొని, కొన్ని నిర్దిష్ట లక్ష్యాలను నెరవేర్చుకొనేందుకు వీలుంటుంది. వ్యక్తులు ఈ హక్కును వినియోగించుకోవటం ద్వారా తమ అభీష్టం ప్రకారం వివిధ సంస్థలు, సంఘాలలో సభ్యులుగా చేరేందుకు, కొనసాగేందుకు మరియు సభ్యత్వాలను ఉపసంహరించుకొనేందుకు పూర్తి స్వేచ్ఛను కలిగి ఉంటారు. అయితే ఒకవేళ వ్యక్తులు జాతి శ్రేయస్సును విస్మరించి సంస్థలను స్థాపించి నిర్వహించినచో, రాజ్యం వారి చర్యలపై కొన్ని ఆంక్షలను విధించవచ్చు.

10. రాజ్యాంగ పరిహారపు హక్కు (Right to Constitutional Remedies): వ్యక్తి హక్కుల పరిరక్షణకు ఈ హక్కు అత్యంత ఆవశ్యకమైనది. ఈ హక్కు లేనిచో పౌరహక్కులనేవి అర్థరహితమవుతాయి. ఈ హక్కు ప్రకారం ఇతరుల జోక్యం లేదా దాడి ఫలితంగా నష్టం పొందిన వ్యక్తి తన స్వాతంత్ర్యాన్ని కోల్పోయినచో, తగిన ఉపశమనాన్ని, న్యాయాన్ని న్యాయస్థానాల ద్వారా పొందుతాడు. ఈ సందర్భంలో ఉన్నత న్యాయస్థానాలు, అనేక ఆజ్ఞలను (writs) జారీ చేస్తాయి. అటువంటి వాటిలో హెబియస్ కార్పస్, మాండమస్, ప్రొహిబిషన్, కో వారంటో, సెర్షియోరరి లాంటివి ఉన్నాయి.

రాజకీయ హక్కులు: ప్రజాస్వామ్య దేశాలలో ప్రభుత్వ వ్యవహారాలలో పౌరులు పాల్గొనటానికి అవకాశం కల్పించబడింది. ఈ అవకాశాలనే రాజకీయ హక్కులు అందురు. రాజకీయ హక్కులు ముఖ్యంగా 5 అవి:

1. ఓటు హక్కు (Right to Vote): ఆధునిక ప్రజాస్వామ్య రాజ్యాలలో పౌరులు అనుభవించే అతి ముఖ్యమైన రాజకీయ హక్కు ఓటు హక్కు వయోజన పౌరులు ఈ హక్కును వివిధ శాసన నిర్మాణ సంస్థలలో తమ ప్రతినిధులను ఎన్నుకొనేందుకు శక్తివంతమైన ఆయుధంగా వినియోగిస్తారు. ఈ హక్కు వారిని నిజమైన సార్వభౌములుగా రూపొందిస్తుంది. వయోజన పౌరులందరూ వర్ణం, పుట్టుక, భాష, తెగ, మతం, ప్రాంతం వంటి తారతమ్యాలు లేకుండా ఈ హక్కును కలిగి ఉంటారు. అయితే విదేశీయులు, మైనర్లకు ఈ హక్కు వర్తించదు.

2. ఎన్నికలలో అభ్యర్థిగా పోటీచేసే హక్కు (Right to Contest in Elections): రాజ్యంలో పౌరులు వివిధ శాసన నిర్మాణ సంస్థలకు అభ్యర్థులుగా పోటీచేసేందుకు ఈ హక్కు అధికారమిస్తుంది. రాజకీయ సామర్థ్యం ఆసక్తి, శక్తివంతమైన నాయకత్వం వంటి లక్షణాలు గల పౌరులు రాజ్యానికి సంబంధించిన రాజకీయ యంత్రాంగ నిర్వహణలలో చురుకుగా పాల్గొనేందుకు వీలు కల్పిస్తుంది. దాంతో ఈ హక్కు పౌరులలో విశేషమైన రాజకీయ పరిజ్ఞానాన్ని, ఆసక్తిని పెంపొందిస్తుంది. ఈ హక్కు ప్రజాస్వామ్య రాజ్యానికి ప్రధాన ప్రాతిపదికగా ఉంటుంది.

3. ప్రభుత్వ పదవులను చేపట్టే హక్కు (Right to Hold Public Offices): పౌరులు వివిధ రకాల ప్రభుత్వ పదవులను చేపట్టి, నిర్వహించేందుకు ఈ హక్కు అనేక అవకాశాలను కల్పిస్తుంది. ఈ హక్కు ప్రకారం ఏ ఒక్క పౌరుడు ఇతరులతో పోల్చినచో ఎటువంటి ప్రత్యేకమైన సౌకర్యాలను కానీ, మినహాయింపులు కానీ పొందేందుకు వీలులేదు. ప్రభుత్వాధికారాన్ని ఎంతో హుందాగా నిర్వహించేందుకు ఈ హక్కు పౌరులకు సహాయకారిగా ఉంటుంది.

4. విజ్ఞాపన హక్కు (Right to Petition): పౌరులు తమ అవసరాలు లేదా సమస్యలను ప్రభుత్వ దృష్టికి విజ్ఞప్తుల ద్వారా తెచ్చేందుకు ఈ హక్కు దోహదపడుతుంది. ఆధునిక రాజ్యంలో ఈ హక్కు ఎంతో ప్రాధాన్యత గల రాజకీయ హక్కుగా పరిగణించబడింది. ఈ హక్కు ద్వారా పౌరులు ఎంతో కాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చి, తగిన పరిష్కారాలను పొందుతారు. అలాగే ప్రభుత్వాధికారులు ప్రజా సమస్యలను తెలుసుకొని, వాటిని సకాలంలో పరిష్కరించేటట్లు ఈ హక్కు సహాయపడుతుంది.

5. విమర్శించే హక్కు (Right to Criticism): ఈ హక్కు ప్రభుత్వానికి సంబంధించిన అనేక విధానాలు, కార్యక్రమాలను విమర్శించేందుకు పౌరులకు అవకాశం ఇస్తుంది. అలాగే వివిధ స్థాయిలలో నాయకులు, పరిపాలన సిబ్బంది పాల్పడే అవకతవకలను బహిర్గతం చేసేందుకు ఇది తోడ్పడుతుంది. అంతేకాకుండా కాలానుగుణంగా ప్రభుత్వం అనుసరించే విధానాలపై పౌరులు సహేతుకమైన, నిర్మాణాత్మకమైన విమర్శలను చేసేందుకు అవకాశమిస్తుంది. ఈ హక్కు అంతిమంగా పరిపాలనాధికారులు, విధాన రూపకర్తలు తమ విద్యుక్త ధర్మాలను ఎంతో అప్రమత్తంగా, జాగ్రత్తగా నిర్వహించేటట్లు చూస్తుంది.

AP Inter 1st Year Civics Study Material Chapter 6 హక్కులు – బాధ్యతలు

ప్రశ్న 2.
హక్కుల పరిరక్షణ అంశాలను గుర్తించండి. [Mar. 2018]
జవాబు:
పరిచయం: రాజనీతిశాస్త్ర అధ్యయనంలో హక్కుల భావనకు చాలా ప్రాముఖ్యత ఉంది. సామాజిక జీవనానికి హక్కులనేవి అత్యంత ఆవశ్యకమైనవి. సామాజిక సంక్షేమ సాధనగా హక్కులు పరిగణించబడినాయి. హక్కులను వినియోగించుకోవటం ద్వారానే రాజ్యంలోని పౌర వ్యక్తిత్వం వికసిస్తుంది. సమాజంలోనూ, రాజ్యంలోనూ సంపూర్ణ వ్యక్తిత్వ వికాసానికి హక్కులు అవసరమవుతాయి. రాజ్యం పౌరులకు ప్రసాదించే హక్కుల ద్వారానే దాని ఔన్నత్యం గుర్తించబడుతుందని హెచ్.జె. లాస్కి పేర్కొన్నాడు. సాధారణంగా ప్రతి రాజ్యం తన పౌరులకు వివిధ రంగాలలో అనేక హక్కులను ప్రసాదిస్తుంది.

హక్కులనేవి రాజ్యం, సమాజంచేత గుర్తించబడే కనీస పరిస్థితులు, అవకాశాలుగా పరిగణించవచ్చు. వాటిని రాజ్యంలోని వివిధ చట్టాలు పరిరక్షిస్తాయి. ఆధునిక రాజ్యాలు తమ రాజ్యాంగం, చట్టాల ద్వారా పౌరులు వికాసానికి అనేక ఏర్పాట్లు గావించాయి. ఇక హక్కులు, బాధ్యతలు అనేవి వ్యక్తుల సంపూర్ణ వికాసానికి అత్యంత ఆవశ్యకమైనవి.

అర్థం: “హక్కు” అంటే “కలిగి ఉండటము” అని అర్థం. సమాజ సంక్షేమం కోసం, ప్రగతి కోసం వ్యక్తులందరూ పాటించవలసిన బాధ్యతల రూపమే హక్కులు. హక్కులు మానవునకు స్వేచ్ఛను ఇచ్చి, వికాసానికి తోడ్పడతాయి. హక్కుల నిర్వచనాలు: రాజనీతి శాస్త్రవేత్తలు హక్కు అనే పదాన్ని అనేక విధాలుగా నిర్వచించారు. వాటిలో కొన్నింటిని కింద వివరించడమైనది.

  1. ఎర్నెస్ట్ బార్కర్: “వ్యక్తి మూర్తిమత్వ సామర్థ్యాన్ని పెంపొందించేందుకు అవసరమైన బాహ్యపరమైన పరిస్థితులే హక్కులు”.
  2. బొసాంకే: “సమాజం చేత గుర్తించబడి, రాజ్యంచేత అమలులో ఉంచబడే అధికారాలే హక్కులు”.
  3. టి.హెచ్. గ్రీన్: “ఉమ్మడి శ్రేయస్సుకు దోహదపడే వాటిని కోరేందుకు, గుర్తించేందుకు ఉండే అధికారాలే హక్కులు.”
  4. హెచ్.జె. లాస్కి: “హక్కులనేవి మానవుల సామాజిక జీవనానికి అవసరమైనవి. అవి లేకుండా ఏ ఒక్కరూ సాధారణంగా అత్యుత్తమమైన వ్యక్తిగా రూపొందటం సాధ్యం కాదు.”

హక్కుల పరిరక్షణలు (Safeguards of Rights): హక్కులను రాజ్యం పరిరక్షించినప్పుడే వ్యక్తులు వాటిని అనుభవించగలుగుతారు. ఈ సందర్భంలో కింది అంశాలు హక్కుల పరిరక్షణకు దోహదపడతాయి.

1. ప్రజాస్వామ్య పాలన (Democratic Rule): ప్రజాస్వామ్య పాలన ప్రజల హక్కులను పరిరక్షించుటలో ఎంతగానో కృషిచేస్తుంది. ఒక్క ప్రజాస్వామ్య రాజ్యాలలోనే తమ హక్కులను స్వేచ్ఛగా సంపూర్ణంగా అనుభవిస్తారు. ఎందుకంటే ప్రజాస్వామ్య వ్యవస్థ వారి హక్కులకు రాజ్యాంగబద్ధమైన, చట్టబద్ధమైన నియమనిబంధనల ద్వారా రక్షణలు కల్పిస్తుంది.

2. లిఖిత, దృఢ రాజ్యాంగం (Written and Rigid Constitution): లిఖిత రాజ్యాంగం ప్రభుత్వ అధికారాలు, కర్తవ్యాలను స్పష్టంగా నిర్వచిస్తుంది. అలాగే ఇది ప్రభుత్వాధికారానికి గల వివిధ పరిమితులను వివరిస్తుంది. అంతేకాకుండా ప్రజల హక్కులకు హామీ ఇస్తుంది. ఈ రాజ్యాంగాన్ని చిన్న కారణాలతో పాలకులు, శాసనసభ్యులు సవరించేందుకు అనుమతించదు.

3. ప్రాథమిక హక్కులను పొందుపరచుట (Incorporation of Fundamental Rights): ప్రాథమిక హక్కులను రాజ్యాంగంలో పొందుపరచడం ద్వారా వ్యక్తుల హక్కులను ప్రభుత్వం అతిక్రమించకుండా చూడవచ్చు. ఇటువంటి ఏర్పాటు వ్యక్తుల హక్కులను ఎంతగానో కాపాడుతుంది.

4. అధికారాల వేర్పాటు (Separation of Powers): హక్కుల పరిరక్షణకు అధికారాలు వేర్పాటు ఎంతో అవసరం. అధికారాలన్నీ ప్రభుత్వంలోని మూడు శాఖల మధ్య వేర్పాటు చేసినప్పుడే వ్యక్తి స్వేచ్ఛ కాపాడబడుతుంది. అప్పుడు మాత్రమే ఒక శాఖ నియంతృత్వాన్ని వేరొక శాఖ నివారించగలుగుతుంది.

5. అధికారాల వికేంద్రీకరణ (Decentralisation of Powers): ప్రభుత్వాధికారాలు వికేంద్రీకృతం అయినప్పుడే వ్యక్తులు హక్కులను అనుభవిస్తారు. అందుకోసం అధికారాలన్నీ జాతీయ, ప్రాంతీయ, స్థానిక స్థాయిలలో వికేంద్రీకరణం కావాలి. అటువంటి ఏర్పాటు ప్రాదేశిక లేదా కర్తవ్యాల ప్రాతిపదికపై జరుగుతుంది.

6. సమన్యాయపాలన (Rule of Law): చట్టం ముందు అందరూ సమానులే అనే అర్థాన్ని సమన్యాయపాలన సూచిస్తుంది. అంతేకాకుండా పౌరులందరికీ చట్టాలు సమానంగా వర్తిస్తాయని దీని అర్థం. చట్టం పౌరుల మధ్య ప్రాంతం, కులం, మతం, వర్ణం, తెగ వంటి తారతమ్యాలను చూపదు. అప్పుడు మాత్రమే వ్యక్తులందరూ హక్కులను అనుభవిస్తారు.

7. స్వతంత్ర, నిష్పాక్షిక న్యాయశాఖ (Independent and Impartial Judiciary): వ్యక్తుల పరిరక్షణకు తోడ్పడే మరో ముఖ్య అంశమే స్వతంత్ర, నిష్పాక్షిక న్యాయశాఖ. ఉన్నత న్యాయస్థానాలలోని న్యాయమూర్తులు నిష్పక్షపాతంతో, స్వతంత్ర వైఖరితో తీర్పులను అందించాల్సి ఉంటుంది. ఆ ప్రక్రియలో భాగంగా వారు వ్యక్తుల హక్కులను తక్షణమే పరిరక్షించేందుకై కొన్ని రిట్లను (Writs) మంజూరు చేస్తారు.

AP Inter 1st Year Civics Study Material Chapter 6 హక్కులు – బాధ్యతలు

8. స్వతంత్ర పత్రికలు (Independent Press): వ్యక్తుల హక్కుల పరిరక్షణకు దోహదపడే మరొక అంశమే స్వతంత్ర పత్రికలు. స్వతంత్ర దృక్పథం గల పత్రికలు వార్తలు, అభిప్రాయాలను నిష్పక్షపాతంగా, రాగద్వేషాలకు అతీతంగా ప్రజలకు తెలియజేస్తాయి. ఈ విషయంలో రాజ్యం పత్రికలపై ఎటువంటి ఆంక్షలను విధించేందుకు లేదా పత్రికలను అడ్డుకునేందుకు ప్రయత్నించరాదు. అప్పుడు మాత్రమే వ్యక్తులు తమ హక్కులను సంపూర్ణంగా అనుభవిస్తారు.

9. సాంఘిక, ఆర్థిక సమానత్వాలు (Social and Economic Equalities): సాంఘిక, ఆర్థిక సమానత్వాలు అనేవి వ్యక్తులకు హక్కులను అనుభవించేందుకు ఎంతగానో అవసరమవుతాయి. రాజ్యంలో సాంఘిక, ఆర్థిక సమానత్వాలు నెలకొన్నప్పుడే వ్యక్తులు తమ హక్కులను సక్రమంగా, సంవర్ధక రీతిలో అనుభవిస్తారు. కులతత్త్వం, మతత్త్వం, భాషాతత్త్వం వంటి సాంఘిక అనర్థాలు, ఆర్థిక అసమానతలు, దోపిడీని పెంచినప్పుడు సాంఘిక, ఆర్థిక సమానత్వాలను సాధించలేము.

10. నిరంతర అప్రమత్తత (Eternal Vigilance): వ్యక్తుల హక్కులను పరిరక్షించటంలో నిరంతర అప్రమత్తత అనేది అత్యంత ముఖ్యమైన అంశంగా చెప్పవచ్చు. వ్యక్తులు ఎప్పటికప్పుడు ప్రభుత్వ విధానాలపట్ల అప్రమత్తతతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రభుత్వం కనక నియంతృత్వ ధోరణులను అనుసరిస్తే, వాటిని ప్రజాస్వామ్య, రాజ్యాంగ పద్ధతుల ద్వారా వ్యతిరేకించాలి. వారు ఎట్టి పరిస్థితులలోనూ అధికారం కోసం ఆరాటపడే స్వార్థపరులైన నాయకులను ప్రోత్సహించరాదు. అంతేకాకుండా న్యాయసమీక్ష (Judicial Review), పునరాయనం (Recal), దృఢమైన ప్రతిపక్షంలాంటి ఇతర అంశాలు కూడా వ్యక్తుల హక్కులను పరిరక్షించేందుకు దోహదపడతాయి.

ప్రశ్న 3.
మానవ హక్కులపై ఒక వ్యాసాన్ని రాయండి.
జవాబు:
భావం: మానవుల ప్రాథమిక జీవనానికి అత్యంత ఆవశ్యకమైనవే మానవ హక్కులు. మానవులందరూ ఈ హక్కులను కుల, మత, ప్రాంత, వర్ణ, వర్గ తారతమ్యాలు లేకుండా అనుభవిస్తారు. ప్రజాస్వామ్య రాజ్యాలలోని రాజ్యాంగ, సాధారణ చట్టాలు ఇటువంటి హక్కులను గుర్తిస్తాయి. అలాగే ఈ హక్కులను ప్రజలకు అందించేందుకై ప్రజాస్వామ్య రాజ్యాలలోని వివిధ ప్రభుత్వాలు అనేక చర్యలను తీసుకొంటాయి.

మానవ హక్కుల ఆవిర్భావం: ఒకానొక సమయంలో ప్రాచీన, మధ్యయుగ సమాజాలలో ఎవరో కొన్ని వర్గాలు మాత్రమే మానవ హక్కులను అనుభవించేవారు. దాంతో మెజార్టీ ప్రజలు ఆ హక్కులను నోచుకోలేకపోయారు. వారు హక్కుల సాధనకై అవిశ్రాంతంగా ప్రయత్నించారు.

మానవ హక్కుల సాధనకై ప్రయత్నాలు జరిపిన వారిలో గ్రీకు పాలకులను మొదటిసారిగా పేర్కొనవచ్చు. గ్రీకు పాలకులు మానవ వ్యక్తిత్వ వికాసానికి ఆరోగ్యం, దేహదారుఢ్యం తప్పనిసరిగా ఉండాలని గుర్తించారు. అలాగే జాతి అభివృద్ధిలో మానవ హక్కులు అత్యంత కీలకమైన పాత్రను పోషిస్తాయనే విషయాన్ని పేర్కొన్నారు. అయితే దురదృష్టం కొద్దీ కొందరు పాలకులు అణచివేత, స్వార్థబుద్ధి కారణంగా ప్రజలలో మతతత్త్వం బాగా వ్యాప్తి చెందింది. ఈ పరిస్థితులలో ‘మానవ హక్కులు కనుమరుగయ్యాయి.

మానవ హక్కుల సాధనలో ఇంగ్లాండులోని మాగ్నా కార్టా (Magna Carta) అనేది మానవ హక్కుల సాధనలో, చేసిన మొదటి ప్రయత్నంగా చరిత్రకారులు భావించారు. మాగ్నా కార్టా ప్రజల స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలను వీలు కల్పించింది. చరిత్రకారులు దానిని బ్రిటీషు రాజ్యంగపు ‘బైబిల్’గా వర్ణించారు.
మానవ హక్కుల ఆశయాలు:

  1. ప్రజలందరికీ ఎటువంటి వివక్షత లేని స్వాతంత్ర్యాన్ని అందించటం.
  2. పేదరికం నుండి విముక్తి.
  3. వ్యక్తులలో నిబిడీకృతమై ఉన్న సామర్థ్యాలను వినియోగించుకొనే స్వేచ్ఛ.
  4. భయం నుండి విముక్తి.
  5. రక్షణ పొందే స్వేచ్ఛ.
  6. అన్యాయానికి వ్యతిరేకంగా స్వేచ్ఛ.
  7. వాక్ స్వాతంత్ర్యం, భావ ప్రకటనా స్వాతంత్య్రం.
  8. సంస్థలను ఏర్పరచుకొనే స్వేచ్ఛ.
  9. గౌరవప్రదంగా వ్యక్తి తన కార్యకలాపాలు నిర్వర్తించుకొనే స్వేచ్ఛ.
  10. దౌర్జన్యాన్ని నిరోధించి వ్యతిరేకించే స్వేచ్ఛ.

AP Inter 1st Year Civics Study Material Chapter 6 హక్కులు – బాధ్యతలు

ఐక్యరాజ్యసమితి సాధారణ సభ 1995 – 2005 దశకాన్ని అంతర్జాతీయ మానవ హక్కుల దశాబ్దిగా ప్రకటించింది. తద్వారా ప్రపంచవ్యాప్తంగా నివసించే ప్రజలందరికీ మానవ హక్కులను ప్రసాదించే ఉద్దేశంతో ఈ కాలంలో అనేక చర్యలను గైకొన్నది.

మానవ హక్కుల వర్గీకరణ: మానవ హక్కులను స్థూలంగా రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి (1) పౌర, రాజకీయ హక్కులు (ii) సాంఘిక, ఆర్థిక, సాంస్కృతిక హక్కులు. సమాజంలో పౌరహక్కులు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకొన్నాయి. జీవించే హక్కు, స్వేచ్ఛ హక్కు, వ్యక్తుల భద్రత హక్కు, బానిసత్వం లేదా వెట్టిచాకిరి నుంచి విముక్తి పొందే హక్కు వంటి అనేక హక్కులు పౌరహక్కులలో పేర్కొనడమైంది. చట్టం నుంచి సమానంగా రక్షణ పొందేహక్కు, బలవంతంగా నిర్భందించడం నుంచి రక్షణ పొందే హక్కు, నిష్పాక్షికంగా విచారణ పొందే హక్కు, ఆస్తి హక్కు, వివాహపు హక్కు వంటి ఇతర హక్కులు కూడా పౌరహక్కులలో ఇమిడి ఉన్నాయి.

ప్రశ్న 4.
“హక్కులు, బాధ్యతలు అవినాభావ సంబంధాన్ని కలిగి ఉన్నాయి” విశ్లేషించండి.
జవాబు:
హక్కులు: “హక్కు” అంటే “కలిగి ఉండటము” అని అర్థం. సమాజ సంక్షేమం కోసం, ప్రగతి కోసం వ్యక్తులందరూ పాటించవలసిన బాధ్యతల రూపమే హక్కులు. హక్కులు మానవునకు స్వేచ్ఛను ఇచ్చి, వికాసానికి తోడ్పడతాయి.

బాధ్యతలు: సమాజంలో నివశించే వ్యక్తులు ఇతర వ్యక్తుల పట్ల నిర్వర్తించే అంశాలనే బాధ్యతలు అంటారు. బాధ్యతలు అనేవి ఇతరుల పట్ల ఒక వ్యక్తి కలిగి ఉండే కర్తవ్యం, విధి అని అర్థం.

హక్కులు, బాధ్యతల మధ్య సంబంధం (Relationship between Rights and Responsibilities): హక్కులు, బాధ్యతల మధ్య సన్నిహిత సంబంధముంది. అవి రెండూ ఒకే నాణానికి ఉన్న బొమ్మా, బొరుసులాంటివి. హక్కులు లేని బాధ్యతలు, బాధ్యతలు లేని హక్కులు అర్థరహితం. హక్కులలో బాధ్యతలు ఇమిడి ఉంటాయి. అలాగే బాధ్యతలనేవి హక్కులతో సంబంధం కలిగి ఉంటాయి. ఈ రెండూ విడదీయరానివి. వీటిని మానవుల ఉచ్ఛ్వాస నిశ్ఛ్వాసాలతో పోల్చవచ్చు.

1. హక్కులు – బాధ్యతలు సామాజిక జీవనానికి అత్యంత అవసరం: అనేకమంది రాజనీతిశాస్త్ర రచయితలు హక్కులు, బాధ్యతలను సామాజిక జీవనపు రెండు ఆవశ్యక నియమాలుగా వర్ణించారు. వీటిని రాజ్యానికి కవచకుండలాలుగా పరిగణించారు. ప్రతి ఒక్క హక్కుకు సంబంధించిన బాధ్యత కూడా ఉంటుంది. అలాగే ప్రతి ఒక్క బాధ్యతకు సంబంధించిన హక్కు కూడా ఉంటుంది. ఈ రెండూ సమాజంలో వ్యక్తులు సంతోషకరమైన, గౌరవప్రదమైన, సమన్వయమైన, సౌభాగ్యమైన జీవనాన్ని గడిపేందుకు దోహదపడతాయి. ఉదాహరణకు మతహక్కు అనేది ప్రతి ఒక్క వ్యక్తి తన ఇష్టం వచ్చిన మతాన్ని స్వీకరించి అనుసరించేందుకు అవకాశమిస్తుంది. అలాగే సమాజంలో తన మత విశ్వాసాలను ప్రబోధించి, ప్రచారం చేసేందుకు వీలు కల్పిస్తుంది. అదే సమయంలో ఆ వ్యక్తి మత వ్యవహారాలకు సంబంధించిన బాధ్యతను కూడా కలిగి ఉంటాడు. అతడు తన మతహక్కును తోటి పౌరుల మత విశ్వాసాలకు భంగం కలగని రీతిలో అనుభవించాల్సిన బాధ్యతను కలిగి ఉంటాడు. ఎట్టి పరిస్థితుల్లోను ఇతర మతస్థుల వ్యవహారాలలో జోక్యం చేసుకోరాదు. ఇతర మతస్థుల విశ్వాసాలకు భంగం కలిగించరాదు. వేరొక మాటలో చెప్పాలంటే ప్రతి వ్యక్తి ఇతరులను గౌరవించటం ద్వారానే గౌరవం పొందుతాడు. కాబట్టి హక్కులు, బాధ్యతలు అనేవి సమ్మిళితాలు. హక్కులు లేకుండా బాధ్యతలను గాని, బాధ్యతలను నిర్వహించకుండా హక్కులను గాని ఏ ఒక్కరూ ఆశించరాదు.

2. హక్కులు – బాధ్యతలు సమాజ ప్రగతికి అత్యంత అవసరం: సమాజ ప్రగతికి దోహదపడే విధంగా ప్రతి ఒక్కరూ తమ కార్యక్రమాలను నిర్వహించుకుంటూ హక్కులను అనుభవించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రతి ఒక్కరూ తమ హక్కుల పట్ల అవగాహన కలిగి ఉండి, తమ బాధ్యతలను న్యాయమైన రీతిలో నిర్వహించాలి. ప్రతి ఒక్కరూ సామాజిక ప్రగతిని పెంపొందించే అంతిమ ఆశయంతో తమ కార్యక్రమాలను నిర్వహించుకోవాలి.

హక్కులు, బాధ్యతలు మధ్యగల సంబంధం రాజ్యంలోని శాంతి భద్రతలకు సంబంధించినదిగా పేర్కొనవచ్చు. సమాజంలో శాంతియుత వాతావరణానికి భంగం కలిగించే విధంగా ఏ ఒక్కరూ వ్యవహరించకుండా తమ హక్కులను వినియోగించుకోవాలి. అట్లాగే ప్రభుత్వ సంస్థలు రూపొందించి, అమలుచేసే నియమ నిబంధనలు తప్పకుండా పాటించాలి. సమాజంలో ఇతరుల హక్కులకు భంగం కలగని విధంగా వివిధ రంగాలలో తమ కార్యక్రమాలను నిర్వహించుకోవాల్సి ఉంటుంది. దీని అర్థం ప్రతి ఒక్కరూ తమ హక్కులను అనుభవిస్తూనే, ఇతరులను గౌరవించే బాధ్యతలను కలిగి ఉంటారని చెప్పవచ్చు. ఎట్టి పరిస్థితులలోనూ ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోరాదు.
హక్కులు, బాధ్యతలు అనేవి వేరువేరుగా ఉంటూ భిన్నమైన లక్ష్యాలను కలిగి ఉండవు. అవి రెండూ మనిషి శరీరం, నీడవలె కలిసి ఉంటాయి.

ఒకరి హక్కు వేరొకరి బాధ్యతగాను, వేరొకరి బాధ్యత ఒకరి హక్కుగాను పరిగణించవచ్చు. ఈ రెండూ అంటే హక్కులు, బాధ్యతలు కలిసినప్పుడే వ్యక్తి ఉత్తమ పౌరుడిగా రూపొందుతాడు.

AP Inter 1st Year Civics Study Material Chapter 6 హక్కులు – బాధ్యతలు

ప్రశ్న 5.
జాతీయ మానవ హక్కుల కమీషన్ గురించి వ్యాసాన్ని రాయండి.
జవాబు:
పరిచయం: ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశం మానవ హక్కులను తన పౌరులకు అందించేందుకు విశేషమైన కృషిచేస్తుంది. మానవ హక్కుల పట్ల ప్రజలలో తగిన అవగాహనను కలిగించేందుకు, మానవ హక్కుల అతిక్రమణ ప్రయత్నాలను నివారించేందుకు దేశంలో కొన్ని చట్టాలు చేయబడినాయి. ఇందులో భాగంగా భారత పార్లమెంటు 1993 లో మానవ హక్కుల పరిరక్షణ చట్టాన్ని ఆమోదించింది. ఫలితంగా జాతీయ మానవ హక్కుల కమీషన్ ఏర్పాటు చేయబడింది.

జాతీయ మానవ హక్కుల కమీషన్ నిర్మాణం: జాతీయ మానవ హక్కుల కమీషన్ బహుసభ్య సంస్థ. దానిలో ఈ క్రిందివారు సభ్యులుగా ఉంటారు.

సభ్యులు:

  1. సుప్రీంకోర్టు మాజీ ప్రధానన్యాయమూర్తి అధ్యక్షులుగా వ్యవహరిస్తారు.
  2. సుప్రీంకోర్టు ప్రస్తుత (లేదా) మాజీన్యాయమూర్తి.
  3. హైకోర్టు ప్రస్తుతన్యాయమూర్తి (లేదా) మాజీ ప్రధాన న్యాయమూర్తి.
  4. మానవ హక్కుల కార్యకలాపాలకు సంబంధించిన ఇద్దరు వ్యక్తులు, వీరితోపాటు
  5. జాతీయ షెడ్యూల్డ్ కులాల, తెగల కమీషన్, ఛైర్మన్.
  6. జాతీయ మైనారిటీల కమీషన్ ఛైర్మన్.
  7. జాతీయ మహిళల కమీషన్ ఛైర్మన్లు పదవీరీత్యా సభ్యులుగా ఉంటారు.
  8. ఈ కమీషన్ సభ్య కార్యదర్శిగా కేంద్ర ప్రభుత్వంలో సెక్రటరీ జనరల్ హోదాగల అధికారి వ్యవహరిస్తారు.

నియామకం: జాతీయ మానవ హక్కుల కమీషన్ ఛైర్మన్ మరియు సభ్యులను భారతరాష్ట్రపతి నియమిస్తారు.

పదవీకాలం: ఛైర్మన్ మరియు సభ్యుల పదవీ కాలం 5 సంవత్సరాలు లేదా 70 ఏళ్ళు నిండే వరకు పదవిలో కొనసాగుతారు.

కమీషన్ విధులు: జాతీయ మానవ హక్కుల కమీషన్ కింద పేర్కొన్న ముఖ్య విధులను నిర్వహిస్తోంది.

  1. ప్రభుత్వాధికారులు మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడినట్లు ఆరోపణలు వస్తే, వాటిపై జాతీయ మానవ హక్కులు కమీషన్ విచారణ జరిపిస్తుంది.
  2. న్యాయస్థానాలు అనుమతించిన మేరకు మానవ హక్కుల ఉల్లంఘన ఉదంతాలపై విచారణ జరుపుతుంది.
  3. మానవ హక్కుల అమలుకు సంబంధించిన వివిధ చట్టబద్ధమైన చర్యలను సమీక్షిస్తుంది.
  4. మానవ హక్కులకు భంగం కలిగించే టెర్రరిస్టుల కార్యకలాపాలను నివారించేందుకై సలహాలు ఇస్తుంది.
  5. మానవ హక్కులకు సంబంధించిన విషయాలపై పరిశోధనలను కొనసాగిస్తుంది.
  6. మానవ హక్కుల పట్ల ప్రజలలో అవగాహనను పెంపొందించేందుకై తగిన చర్యలను తీసుకొంటుంది.
  7. మానవ హక్కులను పరిరక్షించే స్వచ్ఛంద సంస్థలకు తగిన ప్రోత్సాహకాలను అందిస్తుంది.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
హక్కుల లక్షణాలేవి ? [Mar. 2016]
జవాబు:
హక్కులు-నిర్వచనం: “హక్కులనేవి మానవుల సామాజిక జీవనానికి అవసరమైనవి. అవి లేకుండా ఏ ఒక్కరూ సాధారణంగా అత్యుత్తమమైన వ్యక్తిగా రూపొందటం సాధ్యం కాదు” అని హెచ్.జె. లాస్కి పేర్కొన్నారు.

హక్కుల లక్షణాలు (Features of Rights): హక్కులు కింద పేర్కొన్న లక్షణాలను కలిగి ఉంటాయి.

1. సమాజంలోనే సాధ్యం (Possible only in Society): హక్కులు సమాజంలోనే ఉద్భవిస్తాయి. మానవుల సామాజిక జీవనానికి ప్రతీకగా ఉంటాయి. సమాజం వెలుపల అవి ఉండవు.

2. సామాజిక స్వభావం (Social Nature): హక్కులను వ్యక్తుల కోర్కెలుగా భావించవచ్చు. అటువంటి కోర్కెలు సమాజంలోనే నెరవేరుతాయి. రాజ్యం వాటిని గుర్తించి పెంపొందించేందుకు దోహదపడుతుంది. కాబట్టి హక్కులనేవి సామాజిక స్వభావమైనవని చెప్పవచ్చు.

3. ప్రకృతిసిద్ధమైనవి (Natural): హక్కులనేవి మానవుల సామాజిక ప్రవృత్తికి నిదర్శనంగా ఉంటాయి. ఈ విషయాన్ని సామాజిక ఒడంబడిక సిద్ధాంతకర్తలు ప్రకటించారు. వారి భావాలను ఆధునిక కాలంలో కొంతమేరకు ఆమోదించడమైనది.

4. రాజ్యంచే అమలై రక్షించబడటం (Enforced and Protected by state): హక్కులనేవి రాజ్యంచేత అమలుచేయబడి రక్షించబడతాయి. రాజ్యంలోని వివిధ ఉన్నత న్యాయసంస్థలు వాటికి సంరక్షకులుగా వ్యవహరిస్తాయి. వేరొక రకంగా చెప్పాలంటే ఉన్నత న్యాయస్థానాలు హక్కులను కాపాడతాయి. మరొక విషయం ఏమిటంటే హక్కులను ఒక్క ప్రజాస్వామ్య రాజ్యాలలోని పౌరులు మాత్రమే అనుభవిస్తారు.

AP Inter 1st Year Civics Study Material Chapter 6 హక్కులు – బాధ్యతలు

5. నిరపేక్షమైనవి కావు (Not Absolute): హక్కులు నిరపేక్షమైనవి కావు. వాటి వినియోగంపై రాజ్యం, సమాజం కొన్ని ఆంక్షలను విధిస్తుంది. అటువంటి ఆంక్షలు సమాజంలో శాంతి భద్రతల నిర్వహణకు ఉద్దేశించినవి. అంతేకాకుండా హక్కులనేవి సామాజిక శ్రేయస్సు, భద్రతలను పెంపొందించేందుకు దోహదపడతాయని చెప్పవచ్చు.

6. సంబంధిత బాధ్యతలు (Corresponding Responsibilities): హక్కులు, బాధ్యతలు ఒకదానికొకటి పరస్పర ఆధారాలుగా ఉంటాయి. ప్రతి హక్కు ఒక బాధ్యతను కలిగి ఉంటుంది. అందుచేత సమాజంలో నివసించే ప్రతి వ్యక్తి తనకు గల హక్కులనే తోటివారు కూడా కలిగి ఉంటారని గ్రహించాలి. అట్లాగే తోటివారు కూడా వారి హక్కులను వినియోగించుకోవటంలో ప్రతి వ్యక్తికి తగిన సహకారాన్ని అందించాలి. హక్కులు లేని బాధ్యతలు లేదా బాధ్యతలు లేని హక్కులు అనేవి నాగరిక సమాజంలో ఉండవు. హక్కులు, బాధ్యతలు రెండూ వ్యక్తుల ప్రశాంత సామాజిక జీవనానికి ఎంతగానో ఆవశ్యకమైనవి.

7. విశ్వవ్యాప్తమైనవి (Universal): హక్కులనేవి విశ్వవ్యాప్తమైన స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఇవి అందరికి వర్తిస్తాయి. వీటిని ప్రజలందరు ఎటువంటి తారతమ్యాలు లేకుండా అనుభవిస్తారు.

8. మార్పులకు అవకాశం (Scope for changes): హక్కులనేవి కాలానుగుణంగా ప్రజల అవసరాలను బట్టి మారుతుంటాయి. అట్లాగే దేశ కాలపరిస్థితులలో వచ్చే మార్పులనుబట్టి అభివృద్ధి చెందుతాయి. గతంలో లేని కొన్ని హక్కులు వర్తమాన కాలంలో ప్రజలకు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. మొత్తం మీద సామాజిక, ఆర్థిక, | రాజకీయ, సాంస్కృతిక పరిస్థితులు వ్యక్తుల హక్కులపై విశేషమైన ప్రభావాన్ని చూపుతాయి.

9. రాజ్యం కంటే ముందుగా ఉండటం (Precede the State): చరిత్ర ఫలితాలే హక్కులు. హక్కులు కాలక్రమేణా ఒక క్రమానుగత రీతిలో ఆవిర్భవించాయని విశ్వసించారు. రాజ్యం ఆవిర్భావానికి ముందే హక్కులు ఉన్నాయి. అయితే ఆ తరువాత వాటిని రాజ్యం గుర్తించింది.

10. ఉమ్మడి శ్రేయస్సు (Common Good): హక్కులనేవి ఎల్లప్పుడూ ఉమ్మడి శ్రేయస్సును పెంపొందించేందుకై ఏర్పడి వికసించాయి. సమాజం, రాజ్యం చేత గుర్తింపు పొంది, ఉమ్మడి శ్రేయస్సును పెంపొందించే హక్కులను మాత్రమే వ్యక్తులు అనుభవిస్తారు. వ్యక్తులు సుఖసౌభాగ్యవంతమైన జీవనాన్ని గడిపేందుకు హక్కులు అవసరమవుతాయి.

ప్రశ్న 2.
రాజకీయ హక్కులను వివరించండి. [Mar. 2018]
జవాబు:
ప్రజాస్వామ్య దేశాలలో ప్రభుత్వ వ్యవహారాలలో పౌరులు పాల్గొనటానికి అవకాశం కల్పించబడింది. ఈ అవకాశాలనే రాజకీయ హక్కులు అందురు. రాజకీయ హక్కులు ముఖ్యంగా 5 అవి:
1. ఓటు హక్కు (Right to Vote): ఆధునిక ప్రజాస్వామ్య రాజ్యాలలో పౌరులు అనుభవించే అతి ముఖ్యమైన రాజకీయ హక్కు ఓటు హక్కు వయోజన పౌరులు ఈ హక్కును వివిధ శాసన నిర్మాణ సంస్థలలో తమ ప్రతినిధులను ఎన్నుకొనేందుకు శక్తివంతమైన ఆయుధంగా వినియోగిస్తారు. ఈ హక్కు వారిని నిజమైన సార్వభౌములుగా రూపొందిస్తుంది. వయోజన పౌరులందరూ వర్ణం, పుట్టుక, భాష, తెగ, మతం, ప్రాంతం వంటి తారతమ్యాలు లేకుండా ఈ హక్కును కలిగి ఉంటారు. అయితే విదేశీయులు, మైనర్లకు ఈ హక్కు వర్తించదు.

2. ఎన్నికలలో అభ్యర్థిగా పోటీచేసే హక్కు (Right to Contest in Elections): రాజ్యంలో పౌరులు వివిధ శాసన నిర్మాణ సంస్థలకు అభ్యర్థులుగా పోటీచేసేందుకు ఈ హక్కు అధికారమిస్తుంది. రాజకీయ సామర్థ్యం ఆసక్తి, శక్తివంతమైన నాయకత్వం వంటి లక్షణాలు గల పౌరులు రాజ్యానికి సంబంధించిన రాజకీయ యంత్రాంగ నిర్వహణలలో చురుకుగా పాల్గొనేందుకు వీలు కల్పిస్తుంది. దాంతో ఈ హక్కు పౌరులలో విశేషమైన రాజకీయ పరిజ్ఞానాన్ని, ఆసక్తిని పెంపొందిస్తుంది. ఈ హక్కు ప్రజాస్వామ్య రాజ్యానికి ప్రధాన ప్రాతిపదికగా ఉంటుంది.

3. ప్రభుత్వ పదవులను చేపట్టే హక్కు (Right to Hold Public Offices): పౌరులు వివిధ రకాల ప్రభుత్వ పదవులను చేపట్టి, నిర్వహించేందుకు ఈ హక్కు అనేక అవకాశాలను కల్పిస్తుంది. ఈ హక్కు ప్రకారం ఏ ఒక్క పౌరుడు ఇతరులతో పోల్చినచో ఎటువంటి ప్రత్యేకమైన సౌకర్యాలను కానీ, మినహాయింపులు కానీ పొందేందుకు వీలులేదు. ప్రభుత్వాధికారాన్ని ఎంతో హుందాగా నిర్వహించేందుకు ఈ హక్కు పౌరులకు సహాయకారిగా ఉంటుంది.

4. విజ్ఞాపన హక్కు (Right to Petition): పౌరులు తమ అవసరాలు లేదా సమస్యలను ప్రభుత్వ దృష్టికి విజ్ఞప్తుల ద్వారా తెచ్చేందుకు ఈ హక్కు దోహదపడుతుంది. ఆధునిక రాజ్యంలో ఈ హక్కు ఎంతో ప్రాధాన్యత గల రాజకీయ హక్కుగా పరిగణించబడింది. ఈ హక్కు ద్వారా పౌరులు ఎంతో కాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చి, తగిన పరిష్కారాలను పొందుతారు. అలాగే ప్రభుత్వాధికారులు ప్రజా సమస్యలను తెలుసుకొని, వాటిని సకాలంలో పరిష్కరించేటట్లు ఈ హక్కు సహాయపడుతుంది.

AP Inter 1st Year Civics Study Material Chapter 6 హక్కులు – బాధ్యతలు

5. విమర్శించే హక్కు (Right to Criticism): ఈ హక్కు ప్రభుత్వానికి సంబంధించిన అనేక విధానాలు, కార్యక్రమాలను విమర్శించేందుకు పౌరులకు అవకాశం ఇస్తుంది. అలాగే వివిధ స్థాయిలలో నాయకులు, పరిపాలన సిబ్బంది పాల్పడే అవకతవకలను బహిర్గతం చేసేందుకు ఇది తోడ్పడుతుంది. అంతేకాకుండా కాలానుగుణంగా ప్రభుత్వం అనుసరించే విధానాలపై పౌరులు సహేతుకమైన, నిర్మాణాత్మకమైన విమర్శలను చేసేందుకు అవకాశమిస్తుంది. ఈ హక్కు అంతిమంగా పరిపాలనాధికారులు, విధాన రూపకర్తలు తమ విద్యుక్త ధర్మాలను ఎంతో అప్రమత్తంగా, జాగ్రత్తగా నిర్వహించేటట్లు చూస్తుంది.

ప్రశ్న 3.
మానవ హక్కుల లక్షణాలేవి ? [Mar. 2017]
జవాబు:
మానవుల ప్రాథమిక జీవనానికి అత్యంత ఆవశ్యకమైనవే మానవ హక్కులు. మానవులందరూ ఈ హక్కులను కుల, మత, ప్రాంత, వర్ణ, వర్గ తారతమ్యాలు లేకుండా అనుభవిస్తారు. ప్రజాస్వామ్య రాజ్యాలలోని రాజ్యాంగ, సాధారణ చట్టాలు ఇటువంటి హక్కులను గుర్తిస్తాయి. అలాగే ఈ హక్కులను ప్రజలకు అందించేందుకై ప్రజాస్వామ్య రాజ్యాలలోని వివిధ ప్రభుత్వాలు అనేక చర్యలను తీసుకొంటాయి.

రోనాల్డ్ డార్విన్ (Ronald Darwin) అనే శాస్త్రవేత్త మానవ హక్కులనేవి వ్యక్తులకు సంరక్షక కవచాలుగా దోహదపడతాయని భావించాడు. ఎప్పుడైనా రాజ్యం వ్యక్తుల పౌర స్వాతంత్ర్యాలలో జోక్యం చేసుకుంటే ఇటువంటి హక్కుల ద్వారా వ్యక్తులు తమ ప్రయోజనాలను కాపాడుకొంటారని చెప్పారు. జాన్ డోస్కీ (John Dowski) మానవ హక్కులను నాగరికతకు సంబంధించిన నూతన ప్రమాణాలుగా వర్ణించాడు.

మానవ హక్కుల లక్షణాలు (Features of Human Rights): మానవ హక్కులు కొన్ని మౌలికమైన లక్షణాలను కలిగి ఉన్నాయి. వాటిని కింద పేర్కొన్నవిధంగా చెప్పవచ్చు.

  1. ఎటువంటి వివక్షత లేకుండా ప్రజలందరూ హక్కులను కలిగి ఉంటారు.
  2. ఇవి సార్వజనీనమైంది.
  3. ఇవి ప్రజలందరిని సమానంగా పరిగణిస్తాయి.
  4. వ్యక్తులను మౌలికంగా ఇవి మానవులుగా భావిస్తాయి.
  5. మానవత్వానికి చెందిన ప్రాథమిక సూత్రాలను పరిగణనలోనికి తీసుకుంటాయి.
  6. వీటిని భౌగోళిక సరిహద్దులు పరిమితం చేయలేవు.

ఐక్యరాజ్యసమితిలోని సభ్యరాజ్యాలన్నీ సిద్ధాంతపరంగా పైన పేర్కొన్న మానవ హక్కులను అమలుపరుస్తాయి.

ప్రశ్న 4.
మానవ హక్కుల ఆశయాలను, వర్గీకరణను రాయండి.
జవాబు:
మానవ హక్కుల ఆశయాలు (Objectives of Human Rights): మానవ హక్కుల ఆశయాలను కింది విధంగా పేర్కొనవచ్చు.

  1. ప్రజలందరికీ ఎటువంటి వివక్షత లేని స్వాతంత్ర్యాన్ని అందించటం.
  2. పేదరికం నుండి విముక్తి.
  3. వ్యక్తులలో నిబిడీకృతమై ఉన్న సామర్థ్యాలను వినియోగించుకొనే స్వేచ్ఛ.
  4. భయం నుండి విముక్తి.
  5. రక్షణను పొందే స్వేచ్ఛ.
  6. అన్యాయానికి వ్యతిరేకంగా స్వేచ్ఛ.
  7. వాక్ స్వాతంత్ర్యం, భావ ప్రకటనా స్వాతంత్ర్యం.
  8. సంస్థలను ఏర్పరచుకొనే స్వేచ్ఛ.
  9. గౌరవప్రదంగా వ్యక్తి తన కార్యకలాపాలు నిర్వర్తించుకొనే స్వేచ్ఛ.
  10. దౌర్జన్యాన్ని నిరోధించి వ్యతిరేకించే స్వేచ్ఛ.

ఐక్యరాజ్యసమితి సాధారణ సభ 1995-2005 దశకాన్ని అంతర్జాతీయ మానవ హక్కుల దశాబ్దిగా ప్రకటించింది. తద్వారా ప్రపంచవ్యాప్తంగా నివసించే ప్రజలందరికీ మానవ హక్కులను ప్రసాదించే ఉద్దేశంతో ఈ కాలంలో అనేక చర్యలను గైకొన్నది.

మానవ హక్కుల వర్గీకరణ: మానవ హక్కులను స్థూలంగా రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి:

  1. పౌర, రాజకీయ హక్కులు
  2. సాంఘిక, ఆర్థిక, సాంస్కృతిక హక్కులు.

AP Inter 1st Year Civics Study Material Chapter 6 హక్కులు – బాధ్యతలు

1. A. పౌరహక్కులు: సమాజంలో పౌరహక్కులు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకొన్నాయి. పౌరహక్కులకు
ఉదాహరణలు.

  1. జీవించే హక్కు
  2. స్వేచ్ఛ హక్కు
  3. వ్యక్తుల భద్రత హక్కు
  4. వెట్టిచాకిరి నుంచి విముక్తి పొందే హక్కు
  5. చట్టం నుంచి సమానంగా రక్షణ పొందే హక్కు
  6. బలవంతంగా నిర్భందించడం నుంచి రక్షణ పొందే హక్కు
  7. నిష్పాక్షికంగా విచారణ పొందే హక్కు
  8. ఆస్తి హక్కు
  9. వివాహపు హక్కు
  10. వాక్ స్వాతంత్య్రపు హక్కు
  11. భావ ప్రకటన హక్కు
  12. సంస్థలను, సంఘాలను స్థాపించుకునే హక్కు
  13. సభలు, సమావేశాలు నిర్వహించుకునే హక్కు
  14. స్వేచ్ఛగా సంచరించే హక్కు

1.B. రాజకీయ హక్కులు:

  1. ఓటు హక్కు
  2. ఎన్నికలలో పోటీచేసే హక్కు
  3. అధికారం పొందే హక్కు
  4. విమర్శించే హక్కు
  5. విజ్ఞాపన హక్కు

2.A. సాంఘిక హక్కులు:

  1. విద్యా హక్కు
  2. ఆరోగ్య హక్కు
  3. వినోదపు హక్కు మొదలైనవి

2.B. ఆర్థిక హక్కులు:

  1. పని హక్కు
  2. సమానమైన పనికి సమానమైన వేతనం పొందే హక్కు
  3. కార్మిక సంఘాలను ఏర్పాటు చేసుకునే హక్కు
  4. సంతృప్తికరమైన జీవనస్థాయిని కలిగి ఉండే హక్కు

2.C. సాంస్కృతిక హక్కులు:

  1. నాగరికత
  2. కళలు
  3. సంస్కృతిని గౌరవించడం వంటి అంశాలు.

ప్రశ్న 5.
వివిధ రకాలైన బాధ్యతలను చర్చించండి.
జవాబు:
బాధ్యతలు: సమాజంలో నివశించే వ్యక్తులు ఇతర వ్యక్తుల పట్ల నిర్వర్తించే అంశాలనే బాధ్యతలు అంటారు. బాధ్యతలు అనేవి ఇతరుల పట్ల ఒక వ్యక్తి కలిగి ఉండే కర్తవ్యం, విధి అని అర్థం.

బాధ్యతల రకాలు (Types of Responsibilities): బాధ్యతలు స్థూలంగా రెండు రకాలుగా చెప్పవచ్చు. అవి: (i) నైతిక బాధ్యతలు (ii) చట్టబద్ధమైన బాధ్యతలు. ఈ రెండింటిని కింది విధంగా వివరించవచ్చు.

(i) నైతిక బాధ్యతలు (Moral Responsibilities): నైతిక బాధ్యతలు అనేవి నైతిక అంశాల ప్రాతిపదికపై వ్యక్తులు నిర్వహించాల్సిన కర్తవ్యాలను సూచిస్తాయి. వీటకి రాజ్యంచేత రూపొందించబడే చట్టాలు మద్దతు ఇవ్వవు, బలపరచవు. ఇవి ప్రజల నైతిక విశ్వాశాలపై ఆధారపడి రూపొందుతాయి. సమాజంలోని కొన్ని ఆచార సాంప్రదాయాలు వాడుకల ఆధారంగా ఇవి ఏర్పడతాయి. వీటి ఉల్లంఘన ఎటువంటి శిక్షకు దారితీయదు. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవటం, అస్వస్థులకు సహాయపడటంలాంటివి నైతిక బాధ్యతలకు కొన్ని ఉదాహరణలుగా పేర్కొనవచ్చు.

(ii) చట్టబద్ధమైన బాధ్యతలు (Legal Responsibilities): చట్టబద్ధమైన బాధ్యతలనేవి న్యాయస్థానాలు, చట్టాల మద్దతుతో అమలులోకి వస్తాయి. వీటికి శాసనాత్మక ప్రాముఖ్యత ఉంటుంది. ఇవి ఎంతో స్పష్టమైనవి, ఖచ్చితమైనవి. ఇవి నిర్బంధమైన, శిక్షాత్మకమైన స్వభావాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి వీటిని ఉల్లంఘించినవారు శిక్షకు పాత్రులవుతారు. రాజ్య చట్టాలకు విధేయత చూపటం, పన్నులు చెల్లించటం, శాంతి భద్రతల నిర్వహణలలో అధికారులకు సహాయం అందించటంలాంటివి చట్టబద్దమైన బాధ్యతలలో ముఖ్యమైనవి.

AP Inter 1st Year Civics Study Material Chapter 6 హక్కులు – బాధ్యతలు

చట్టబద్ధమైన బాధ్యతలు మరలా రెండు రకాలుగా వర్గీకరించబడినాయి. అవి: 1. సంవర్ధక బాధ్యతలు 2. సంరక్షక బాధ్యతలు.
1. సంవర్థక బాధ్యతలు (Positive Responsibilities): సంవర్దక బాధ్యతలనేవి సమాజ ప్రగతి, సంక్షేమాల’ సాధన, పటిష్టతలకై ఉద్దేశించబడినవి. రాజ్య చట్టాల పట్ల విధేయత, దేశ రక్షణ, పన్నుల చెల్లింపులాంటివి ఈ రకమైన బాధ్యతలకు ఉదాహరణలు చెప్పవచ్చు. ఇటువంటి బాధ్యతలు రాజ్య ఆశయాలను నెరవేర్చడంలో ప్రభుత్వానికి ప్రజలు సహకారాన్ని అందించేందుకు ఉద్దేశించినాయి.

2. సంరక్షక బాధ్యతలు (Negative Responsibilities): చట్టం నిషేధించిన కార్యక్రమాలను చేపట్టకుండా వ్యక్తులు దూరంగా ఉండేందుకు పేర్కొన్నవే సంరక్షక బాధ్యతలు. ఈ రకమైన బాధ్యతలు ప్రజలను కొన్ని నిర్ధిష్టమైన కార్యక్రమాలలో పాల్గొనకుండా ఉంచుతాయి. రాజ్యం తరపున ప్రభుత్వం ఈ సందర్భంలో కొన్ని నియమ నిబంధనలను రూపొందించి అమలుచేస్తుంది.

ప్రశ్న 6.
ప్రాథమిక హక్కుల లక్షణాలేవి ?
జవాబు:
వ్యక్తుల మూర్తిమత్వాన్ని పెంపొందించేందుకు ప్రాథమికహక్కులు అత్యంత ఆవశ్యకమైనవి. ప్రాథమికహక్కులు ఈనాటి ప్రజాస్వామ్య రాజ్యాంగాలలో పొందుపరచబడ్డాయి. ఈ విషయంలో ప్రజాస్వామ్యం, వ్యక్తి స్వాతంత్ర్యాలు, మైనార్టీల ప్రయోజనాలు, మానవ జీవనంలో స్వేచ్ఛా, ఆస్తులకు విశేష ప్రాముఖ్యతలాంటి అనేక అంశాలు ప్రాథమిక హక్కులను రాజ్యాంగంలో పొందుపరచడానికి దోహదపడ్డాయి.

ప్రాథమిక హక్కుల లక్షణాలు (Characteristics of Fundamental Rights): ప్రాథమిక హక్కులు దిగువ పేర్కొన్న లక్షణాలను కలిగి ఉంటాయి.

  1. ప్రాథమిక హక్కులు నిర్దిష్టమైనవి, స్పష్టమైనవి మరియు ఖచ్చితమైనవి.
  2. ఇవి రాజ్యాంగబద్ధమైన, చట్టబద్ధమైన స్వభావాన్ని కలిగి ఉంటాయి.
  3. ఇవి స్వభావరీత్యా శిక్షాత్మకమైనవి.
  4. ఇవి పౌరులకు మాత్రమే ఇవ్వబడినాయి.
  5. ఇవి రాజ్యాలనుబట్టి మారుతుంటాయి.
  6. వీటిని కొన్ని ప్రత్యేక పరిస్థితులలో సవరించవచ్చు.

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
హక్కులను నిర్వచించండి. [Mar. 2016]
జవాబు:

  1. “వ్యక్తి మూర్తిమత్వ సామర్థ్యాన్ని పెంపొందించేందుకు అవసరమైన బాహ్యపరమైన పరిస్థితులే హక్కులు” అని బార్కర్ పేర్కొన్నాడు.
  2. “హక్కులనేవి మానవుల సామాజిక జీవనానికి అవసరమైనవి. అవి లేకుండా ఏ ఒక్కరూ సాధారణంగా అత్యుత్తమమైన వ్యక్తిగా రూపొందటం సాధ్యం కాదు” అని హెచ్.జె. లాస్కి పేర్కొన్నాడు.

ప్రశ్న 2.
హక్కులను వర్గీకరించండి.
జవాబు:
హక్కులను విస్తృత ప్రాతిపదికపై మూడు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి: 1) సహజ హక్కులు 2) నైతిక హక్కులు 3) చట్టబద్ధమైన హక్కులు. చట్టబద్ధమైన హక్కులు మరలా మూడు రకాలుగా వర్గీకరింపబడినాయి. అవి: 1) పౌర హక్కులు 2) రాజకీయ హక్కులు 3) ఆర్థిక హక్కులు.

AP Inter 1st Year Civics Study Material Chapter 6 హక్కులు – బాధ్యతలు

ప్రశ్న 3.
పౌర హక్కులేవి ?
జవాబు:
నాగరిక జీవనాన్ని గడపటానికి అవసరమయ్యే హక్కులనే పౌరహక్కులు అంటారు. అన్ని రాజ్యాలు తమ ప్రజలకు ఈ హక్కులను ఇస్తున్నాయి. ఈ హక్కులపై అనేక మినహాయింపులు ఉంటాయి. ముఖ్యమైన పౌరహక్కులు ఏమనగా: (i) జీవించే హక్కు (ii) స్వేచ్ఛ హక్కు (iii) సమానత్వపు హక్కు (iv) ఆస్తి హక్కు (v) కుటుంబపు హక్కు (i) విద్యా హక్కు మొదలైనవి.

ప్రశ్న 4.
సహజ హక్కులు.
జవాబు:
మానవులు జన్మతః అనుభవించే హక్కులే సహజ హక్కులుగా పరిగణించడమైనది. నాగరిక సమాజ ఆవిర్భావానికి ముందే ఈ హక్కులను మానవులు అనుభవించారు. సమాజం, రాజ్యం వీటిని గుర్తించి, గౌరవించాయి. సహజ హక్కుల సిద్ధాంత ప్రతిపాదకుడైన జాన్ లాక్ హక్కులనేవి సమాజం, రాజకీయ వ్యవస్థలు ఏర్పడక ముందే ఉన్నాయన్నాడు. జీవించే హక్కు, స్వాతంత్ర్యాన్ని అనుభవించే హక్కు, ఆస్తి హక్కు వంటివి ప్రధానమైన సహజ హక్కులకు ఉదాహరణలుగా పేర్కొన్నాడు. మానవులకు గల ఈ హక్కులను రాజ్యం తిరస్కరించరాదన్నాడు.

ప్రశ్న 5.
నైతిక హక్కులు. [Mar. ’18, ’17]
జవాబు:
నైతిక హక్కులు సమాజంలోని నైతిక సూత్రాలు ఆధారంగా రూపొందాయి. సమాజంలో నివసించే వ్యక్తులకు నైతికపరమైన అవగాహనను కలిగించేందుకు ఈ రకమైన హక్కులను ఇవ్వటమైనది. సమాజంలోని నైతిక సూత్రాలే ఇటువంటి హక్కులకు ప్రాతిపదికగా ఉన్నాయి. ప్రజల ఆచారాలు, సాంప్రదాయాలు, వాడుకలు కూడా వీటికి ఆధారంగా ఉంటాయి. ఇవి ప్రజల అంతరాత్మకు సంబంధించినవి. పౌర సమాజంలోని వ్యక్తులు వీటిని అనుభవిస్తారు. వీటికి చట్టపరమైన మద్దతు లేనప్పటికి సమాజం వీటిని బలపరుస్తుంది. అందుచేత వీటి ఉల్లంఘన ఏ రకమైన శిక్షకు దారితీయదు.

ప్రశ్న 6.
రాజకీయ హక్కులేవి ? [Mar. ’16]
జవాబు:
రాజ్యము యొక్క ప్రభుత్వము యొక్క కార్యకలాపాలలో పాల్గొనేందుకై ప్రజలకు పూర్తి అవకాశాలను కల్పించే హక్కులనే రాజకీయ హక్కులని అంటారు. ఉదాహరణకు ఓటు హక్కు, ఎన్నికలలో అభ్యర్థిగా పోటీచేసే హక్కు, ప్రభుత్వ పదవులు చేపట్టే హక్కు, విజ్ఞాపన హక్కు, విమర్శించే హక్కు మొదలగునవి.

ప్రశ్న 7.
మానవ హక్కుల ఆశయాలేవి ?
జవాబు:
మానవ హక్కులు కింది ఆశయాలను కలిగి ఉంటాయి.

  1. ప్రజలందరికీ ఎటువంటి వివక్షత లేని స్వాతంత్ర్యాన్ని అందించటం.
  2. పేదరికం నుండి విముక్తి.
  3. వ్యక్తులలో నిబిడీకృతమై ఉన్న సామర్థ్యాలను వినియోగించుకొనే స్వేచ్ఛ.
  4. భయం నుండి విముక్తి.

ప్రశ్న 8.
మానవ హక్కులు ఎన్ని రకాలు ? వాటిని తెలపండి.
జవాబు:
మానవ హక్కులను స్థూలంగా రెండు రకములుగా వర్గీకరించవచ్చు. అవి 1) పౌర, రాజకీయ హక్కులు 2) సాంఘిక, ఆర్థిక సాంస్కృతిక హక్కులు.

AP Inter 1st Year Civics Study Material Chapter 6 హక్కులు – బాధ్యతలు

ప్రశ్న 9.
మానవ హక్కుల ప్రాముఖ్యత.
జవాబు:
మానవుల ప్రాథమిక జీవనానికి అత్యంత ఆవశ్యకమైనవే మానవ హక్కులు. మానవులందరూ ఈ హక్కులను కుల, మత, ప్రాంత, వర్గ, వర్ణ తారతమ్యం లేకుండా అనుభవిస్తారు. మానవ హక్కుల సాధనలో ఇంగ్లాండులోని ‘మాగ్నా కార్టా’ అనేది మొదటి ప్రయత్నంగా చెప్పవచ్చు. ఐక్యరాజ్యసమితి కృషి వలన మానవ హక్కులను ప్రపంచ వ్యాప్తంగా దాదాపు అన్ని దేశాలలో ప్రజలు అనుభవిస్తున్నారు.

ప్రశ్న 10.
బాధ్యతల వర్గీకరణ. [Mar. ’18, ’17]
జవాబు:
బాధ్యతలను స్థూలంగా రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి 1) నైతిక బాధ్యతలు 2) చట్టబద్ధమైన బాధ్యతలు. చట్టబద్ధమైన బాధ్యతలను రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి 1) సంవర్థక బాధ్యతలు 2) సంరక్షక బాధ్యతలు.

ప్రశ్న 11.
నైతిక బాధ్యతలు.
జవాబు:
నైతిక బాధ్యతలు నైతిక అంశాల ప్రాతిపదికపై వ్యక్తులు నిర్వహించాల్సిన కర్తవ్యాలను సూచిస్తాయి. వీటికి చట్టపరమైన ఆంక్షలు ఉండవు. ఇవి ప్రజల నైతిక విశ్వాసాలపై ఆధారపడి రూపొందుతాయి. సమాజంలోని ఆచారాలు, సాంప్రదాయాలు, వాడుక పద్ధతుల ఆధారంగా ఇవి ఏర్పడతాయి. వీటికి ఉదాహరణ ఆపదలో ఉన్నవారిని ఆదుకోవటం, అస్వస్థులకు సహాయపడటం మొదలైనవి.

AP Inter 1st Year Civics Study Material Chapter 6 హక్కులు – బాధ్యతలు

ప్రశ్న 12.
బాధ్యతలకు ఉదాహరణలను ఇవ్వండి. [Mar. 2016]
జవాబు:
రాజ్యంలో నివసించే ప్రతి పౌరుడు కొన్ని ముఖ్యమైన బాధ్యతలను నిర్వర్తించాలి. వాటిలో ముఖ్యమైనవి:

  1. రాజ్యవిధేయత
  2. చట్టాల విధేయత
  3. పన్నులను నిజాయితీగా చెల్లించటం
  4. ఓటుహక్కును వినియోగించుకొనటం, ప్రభుత్వ పదవుల నిర్వహణలో నిజాయితీ
  5. శాంతి భద్రతల నిర్వహణలో సహకారం
  6. ఇతర బాధ్యతలు.

AP Inter 1st Year Civics Study Material Chapter 5 స్వేచ్ఛ – సమానత్వం

Andhra Pradesh BIEAP AP Inter 1st Year Civics Study Material 5th Lesson స్వేచ్ఛ – సమానత్వం Textbook Questions and Answers.

AP Inter 1st Year Civics Study Material 5th Lesson స్వేచ్ఛ – సమానత్వం

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
స్వేచ్ఛను నిర్వచించీ, వివిధ రకాల స్వేచ్ఛలను వర్ణించండి.
జవాబు:
పరిచయం: స్వేచ్ఛ అనేది రాజనీతిశాస్త్ర అధ్యయనంలో ఒక ముఖ్యమైన భావన. వ్యక్తులకు గల స్వేచ్ఛపైనే రాజకీయ వ్యవస్థ విజయం ఆధారపడి ఉంటుంది. వ్యక్తులు తమ సర్వతోముఖాభివృద్ధి కోసం స్వేచ్ఛను వాంఛిస్తారు. సామాజిక స్థితిగతులను మెరుగుపరచుకోవడంలో వ్యక్తులకు స్వేచ్ఛ తగిన శక్తిని ప్రసాదిస్తుంది. జె. ఎస్. మిల్, హెర్బర్ట్ స్పెన్సర్, మాంటెస్క్యూ, హెచ్. జె. లాస్కీ, సీలీ లాంటి రాజనీతి శాస్త్రవేత్తలు స్వేచ్ఛను పెంపొందించటంలో ప్రధాన పాత్రను పోషించారు.

అర్థం: స్వేచ్ఛను ఇంగ్లీషులో ‘లిబర్టీ’ (LIBERTY) అంటారు. లిబర్టీ (LIBERTY) అనే ఇంగ్లీషు పదం “లిబర్” (LIBER) అనే లాటిన్ పదం నుంచి ఆవిర్భవించింది. లాటిన్ భాషలో “లిబర్” అనే పదానికి అర్థం “ఆంక్షల నుంచి విముక్తి”.

నిర్వచనాలు:

  1. హెచ్.జె.లాస్కీ: “వ్యక్తులు వారంతటవారు ఉత్తమమైన అవకాశాలను పొందగలిగి, నిర్వహించుకోగల వాతావరణమే స్వేచ్ఛ”.
  2. మాంటెస్క్యూ: “వ్యక్తులు సంకల్పించుకొని, సాధించగలిగే శక్తియే స్వేచ్ఛ.”
  3. జె.ఆర్. సీలీ: “మితిమీరిన ప్రభుత్వానికి వ్యతిరేకమైనదే స్వేచ్ఛ.”

స్వేచ్ఛ రకములు: స్వేచ్ఛ ఐదు రకాలు. అవి 1) సహజ స్వేచ్ఛ 2) పౌర స్వేచ్ఛ 3) ఆర్థిక స్వేచ్ఛ 4) రాజకీయ స్వేచ్ఛ. ‘5) జాతీయ స్వేచ్ఛ. వీటిని గురించి ఈ కింద పేర్కొన్న విధంగా విపులీకరించవచ్చు.
1) సహజ స్వేచ్ఛ (Natural Liberty): సహజ స్వేచ్ఛ అనేది ఎటువంటి ఆంక్ష లేకుండా ఏదైనా చేయడాన్ని సూచిస్తుంది. ఇది ఎలాంటి జోక్యానికి లేదా నిర్భంధాలకు తావివ్వదు. వ్యక్తులు తమ ఇచ్ఛానుసారం చేయదలచిన దాన్ని సుసాధ్యం చేస్తుంది. అయితే, నిర్నిబంధమైన స్వేచ్ఛ వ్యక్తుల స్వేచ్ఛలను హరిస్తుంది. నేటి సమాజంలో సహజ స్వేచ్ఛ అనేది కనిపించదు. ఇది అన్యాయం అరాచకత్వాలకు పర్యాయపదమైనది. సహజ స్వేచ్ఛగల చోట స్వాతంత్ర్యం మృగ్యమవుతుంది. ఆదిలో రోమన్ రాజనీతి తత్త్వవేత్తలు ఈ భావనను సమర్థించారు. ఎటువంటి అవధుల్లేని ప్రాకృతిక వ్యవస్థలోని మానవులు అపరిమితమైన స్వేచ్ఛను అనుభవించారన్నారు. అటువంటి స్వేచ్ఛ- రాజ్యం, సమాజాల అవిర్భావానికి ముందు మాత్రమే ఉనికిలో ఉండేది.

AP Inter 1st Year Civics Study Material Chapter 5 స్వేచ్ఛ - సమానత్వం

2) పౌర స్వేచ్ఛ (Civil Liberty): పౌరస్వేచ్ఛను వ్యక్తిగత స్వేచ్ఛ అని కూడ అంటారు. ఇది సామాజిక సంస్థలోని సభ్యుడైన వ్యక్తి జీవనంలోని స్వాతంత్ర్యాన్ని తెలియజేస్తుంది. పౌరస్వేచ్ఛలో కింద పేర్కొన్న మూడు అంశాలు ఇమిడి ఉంటాయని బార్కర్ పేర్కొన్నాడు. i) సంచార స్వేచ్ఛను సూచించే భౌతిక స్వాతంత్ర్యం ii) ఆలోచన, అభివ్యక్తి, విశ్వాసాన్ని కలిగి ఉండే భౌద్ధిక స్వాతంత్య్రం iii) నిజజీవితంలోని ఆచరణాత్మక ఐచ్ఛిక స్వాతంత్ర్యం. పౌరస్వేచ్చ అనేది మిగతా స్వేచ్ఛలకు ప్రాతిపదికగా ఉంటుంది. సహజ స్వేచ్ఛకు ఇది విరుద్ధమైంది. సమాజంలోని పౌరులు దానిని అనుభవిస్తారు. ఒంటరిగా ఉంటున్న వ్యక్తులకిది ఆవశ్యకమైనది సమాజంలోని ప్రతిఒక్కరూ ప్రాపంచిక విషయాలను ‘ఉమ్మడిగా అనుభవించగలిగినప్పుడే పౌర స్వేచ్ఛ వాస్తవమవుతుంది.

“రాజ్యం చేత గుర్తించబడి అమలయ్యే హక్కుల సముదాయమే పౌర స్వేచ్ఛ” అని గెటిల్ పేర్కొన్నాడు. పౌరస్వేచ్ఛ అనేది అనేక హక్కుల రూపంలో ఉంటుంది. అవి (i) జీవించే హక్కు (ii) పనిచేసే హక్కు (iii) ఆస్తిహక్కు (iv) వాక్ స్వాతంత్య్రం, భావవ్యక్తీకరణ, సమావేశ, సంచార, స్థిర నివాసపు హక్కులు మొదలైనవి.

3) ఆర్థిక స్వేచ్ఛ (Economic Liberty): ఆర్థిక స్వేచ్ఛ అంటే ప్రతి ఒక్కరూ తమ జీవనోపాధిని తామే సంపాదించుకోగలగడం. ఒక వ్యక్తి తన రోజువారీ ఆహారాన్ని హేతుబద్ధంగా సంపాదించుకొనే భద్రమైన అవకాశమే ఆర్థికస్వేచ్ఛగా లాస్కీ అభివర్ణించాడు. కోరిక – భయము, ఆకలి – పస్తులు, నిరద్యోగం – అసంపూర్ణతల నుంచి విముక్తి కలిగించేదే ఆర్థిక స్వేచ్ఛ. ఇది ఆర్థిక సంబంధమైన లేమి లేదా అభద్రతల నుంచి స్వాతంత్ర్యాన్ని సూచిస్తుంది. ఆర్థిక స్వేచ్ఛలేని ప్రజాస్వామ్యం అర్థరహితమైంది.

ఈ దిగువ పేర్కొన్న చర్యల అమలు ద్వారా ఆర్థిక స్వేచ్ఛను పొందవచ్చు.

  1. కనీస వేతనాలను అందించడం.
  2. పనిహక్కుకు భరోసా కల్పించడం.
  3. నిరుద్యోగం, అనారోగ్యం వంటి వివిధ రకాల అభద్రతల నుంచి కార్మికులను రక్షించడం
  4. తగినంత విశ్రాంతిని కల్పించడం.
  5. పరిశ్రమల యాజమాన్యంలో కార్మికులకు ప్రాతినిధ్యం కల్పించడం.

4) రాజకీయ స్వేచ్ఛ (Political Liberty): రాజకీయ స్వేచ్ఛ పౌరులు రాజకీయాంశాలలో పాల్గొనేందుకు వీలు కల్పిస్తుంది. ఈ రకమైన స్వేచ్ఛ పౌరులకు రాజ్య కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొనే శక్తినిస్తుందని లాస్కీ పరిగణించాడు. రాజకీయ స్వేచ్ఛను ప్రజాస్వామ్యానికి పర్యాయపదంగా గిల్ క్రిస్ట్ భావించాడు. రాజకీయ స్వేచ్ఛ అంటే ఎవరికి వారు తమ ప్రభుత్వాన్ని ఎంపిక చేసుకొనే రాజ్యాంగ స్వేచ్ఛగా లీకాక్ వర్ణించాడు. రాజకీయ స్వేచ్ఛ పౌరులకు మాత్రమే పరిమితమైంది. అది సంవర్ధక స్వభావాన్ని కలిగి ఉంటుంది. రాజకీయ స్వేచ్ఛ పౌరులకు రాజకీయాంశాలలో వివిధ హక్కులను కల్పిస్తుంది. అటువంటి వాటిలో i) ఓటు వేసే హక్కు ii) ఎన్నికలలో అభ్యర్థులుగా పోటీ చేసే హక్కు iii) ప్రభుత్వ పదవులను చేపట్టే హక్కు iv) విమర్శించే హక్కువంటివి ఉన్నాయి. విద్య, నిజాయితీ, నిష్పక్షపాతమైన పత్రికలు మొదలైనవి ఉన్నప్పుడే రాజకీయ స్వేచ్ఛ వాస్తవం అవుతుందని లాస్కీ నొక్కి చెప్పాడు.

5) జాతీయ స్వేచ్ఛ (National Liberty): జాతీయ స్వేచ్ఛ అంటే రాజ్యం – స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను కలిగి ఉండడంగా పేర్కొనవచ్చు. రాజ్యపు సార్వభౌమత్వాన్ని అది సూచిస్తుంది. ప్రతి రాజ్యం ఈ స్వేచ్ఛను అనుభవిస్తూ ఇతర రాజ్యాల ఆధిపత్యానికి లోనుకాకుండా ఉంటుంది. అన్ని రంగాలలో జాతి అభివృద్ధికి ఈ స్వేచ్ఛ ఆవశ్యకమైంది. ప్రాచీన కాలం నుంచి అనేక దేశాల్లో ఇది విశదమైంది. ఈ రకమైన స్వేచ్ఛను పొందడం కోసం అనేక దేశాలు ఎంతగానో ప్రయత్నించాయి. గతంలో టర్కీ ప్రజలకు వ్యతిరేకంగా గ్రీకులు స్వాతంత్య్ర సమరం సాగించారు. అట్లాగే మహాత్మాగాంధీ నాయకత్వంలో భారత ప్రజలు బ్రిటిష్ పాలన నుంచి స్వాతంత్ర్యం కోసం అహింసాయుత పోరాటం చేశారు. జాతీయ స్వేచ్ఛ ఎంతో విలువైంది.

AP Inter 1st Year Civics Study Material Chapter 5 స్వేచ్ఛ - సమానత్వం

ప్రశ్న 2.
స్వేచ్ఛ అంటే ఏమిటి ? స్వేచ్ఛ సంరక్షణలను పేర్కొనండి.
జవాబు:
పరిచయం: స్వేచ్ఛ అనేది రాజనీతి శాస్త్ర అధ్యయనంలో ఒక ముఖ్యమైన భావన. వ్యక్తులకు గల స్వేచ్ఛపైనే రాజకీయ వ్యవస్థ విజయం ఆధారపడి ఉంటుంది. వ్యక్తులు తమ సర్వతోముఖాభివృద్ధి కోసం స్వేచ్ఛను వాంఛిస్తారు. సామాజిక స్థితిగతులను మెరుగుపరచుకోవడంలో వ్యక్తులకు స్వేచ్ఛ తగిన శక్తిని ప్రసాదిస్తుంది. జె. ఎస్. మిల్, హెర్బర్ట్ స్పెన్సర్, మాంటెస్క్యూ, హెచ్. జె. లాస్కీ, సీలీ లాంటి రాజనీతిశాస్త్రవేత్తలు స్వేచ్ఛను పెంపొందించటంలో ప్రధాన పాత్రను పోషించారు.

అర్థం: స్వేచ్ఛను ఇంగ్లీషులో ‘లిబర్టీ’ (LIBERTY) అంటారు. లిబర్టీ (LIBERTY) అనే ఇంగ్లీషు పదం “లిబర్” (LIBER) అనే లాటిన్ పదం నుంచి ఆవిర్భవించింది. లాటిన్ భాషలో “లిబర్” అనే పదానికి అర్థం “ఆంక్షల నుంచి విముక్తి”.

నిర్వచనాలు:

  1. హెచ్.జె.లాస్కీ: “వ్యక్తులు వారంతటవారు ఉత్తమమైన అవకాశాలను పొందగలిగి, నిర్వహించుకోగల వాతావరణమే స్వేచ్ఛ”.
  2. మాంటెస్క్యూ: “వ్యక్తులు సంకల్పించుకొని, సాధించగలిగే శక్తియే స్వేచ్ఛ.” 3) జె.ఆర్. సీలీ: “మితిమీరిన ప్రభుత్వానికి వ్యతిరేకమైనదే స్వేచ్ఛ.”

స్వేచ్ఛ సంరక్షణలు (లేదా) పరిరక్షణ మార్గాలు:
స్వేచ్ఛ అనేది మానవుల పాలిట అత్యంత విలువైన ఆదర్శం. కాబట్టి దానిని సమాజ, రాజ్య విస్తృత ప్రయోజనాల దృష్ట్యా పరిరక్షించుకోవాలి. ఈ సందర్భంగా స్వేచ్ఛ పరిరక్షణలో కిందివాటిని పేర్కొనవచ్చు.
1. ప్రజాస్వామ్య వ్యవస్థ (Democratic Rule): ప్రజాస్వామ్య వ్యవస్థ వ్యక్తి స్వేచ్ఛను పరిరక్షిస్తుంది. ప్రజాస్వామ్యం అంటే ప్రజల ప్రభుత్వం. ఎన్నికైన ప్రతినిధులు ప్రజల స్వేచ్ఛను నిరంతరం కాపాడుతుంటారు. కేవలం ప్రజాస్వామ్య సంస్థలు మాత్రమే స్వేచ్ఛను పరిరక్షించగలవు.

2. లిఖిత మరియు ధృడ రాజ్యాంగం (Written and Rigid Constitution): వ్యక్తి స్వేచ్ఛకు లిఖిత, ధృడ . రాజ్యాంగాన్ని వేరొక ముఖ్య లక్షణంగా భావించవచ్చు. ఇటువంటి రాజ్యాంగం అనేక నిబంధనలలో వ్యక్తి స్వాతంత్ర్యాలను పేర్కొంటుంది. ప్రజల స్వేచ్ఛ, హక్కులకు అది రక్షకురాలిగా వ్యవహరిస్తుంది. ప్రభుత్వాంగాల చర్యలకు అది హద్దులను ఏర్పరుస్తుంది. ప్రభుత్వాధికారులు లేదా మరెవరి చేతనైనా ప్రజల స్వాతంత్ర్యాలు ఉల్లంఘించబడినప్పుడు చేపట్టవలసిన వివిధ చర్యలను వివరిస్తుంది. తమ సంకుచిత ప్రయోజనాల కోసం రాజ్యాంగంలోని అంశాలను సవరించేందుకు ప్రయత్నించే పార్టీలపై ఆంక్షలను విధిస్తుంది.

3. స్వతంత్ర న్యాయవ్యవస్థ (Independent Judiciary): పౌరుల స్వేచ్ఛా పరిరక్షణకు స్వయం ప్రతిపత్తి ఉన్న నిష్పాక్షిక న్యాయ వ్యవస్థ తప్పనిసరి. దేశంలో స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న న్యాయస్థానాలు ఉన్నప్పుడే అవి శాసనసభ చేయగల ప్రజావ్యతిరేక చట్టాలను, కార్యనిర్వహక శాఖ అమలుపరచగల ప్రజావ్యతిరేక విధానాలను ఆపగలవు.

4. సమన్యాయపాలన (Rule of Law): స్వేచ్ఛకున్న వేరొక పరిరక్షణయే సమన్యాయపాలన. బ్రిటన్, ఇండియా, అమెరికా సంయుక్తరాష్ట్రాలు వంటి అనేక దేశాల్లో ఇది అమలులో ఉంది. వ్యక్తుల స్వేచ్ఛలను సమన్యాయపాలన మూడు విధాలుగా పరిరక్షిస్తుంది. అవి (i) ఇది వ్యక్తులందరినీ సమానంగా చూస్తుంది. (ii) రాజ్యమంతటా ఒకే విధమైన చట్టాలు అమలయ్యేటట్లు చేస్తుంది. (iii) కార్యనిర్వాహకవర్గపు నిరంకుశాధికారాలపైన తగిన ఆంక్షలను విధిస్తుంది.

5. ప్రాథమిక హక్కులు (Fundamental Rights): ప్రాథమిక హక్కులనేవి వ్యక్తి స్వేచ్ఛలను చాలావరకు పరిరక్షిస్తాయి. ప్రాథమిక హక్కులను రాజ్యాంగంలో పొందుపరచడం వల్ల ఎటువంటి ఆంక్షలు లేకుండా ప్రజలు స్వేచ్ఛలను పొందుతారు. పౌరులలో నిబిడీకృతమైన నైపుణ్యాలను అభివృద్ధిపరచుటకు, విభిన్న రంగాలలో వారు తమ ప్రతిభను చాటుకొనేందుకు ప్రాథమిక హక్కులు దోహదపడతాయి.

6. ఆర్థిక సమానత్వం (Economic Equality): వ్యక్తుల స్వేచ్ఛా పరిరక్షణలో ఆర్థిక సమానత్వం కూడా ప్రధానమైంది. ఆకలి, పేదరికం, నిరుద్యోగం వంటి దుష్ప్రభావాల నుంచి బయటపడేందుకు వ్యక్తులకు చాలినన్ని అవకాశాలను కల్పించాలనే భావన ఇందులో ఇమిడి ఉంది. ఆర్థిక సమానత్వం నెలకొన్నప్పుడే స్వేచ్ఛ సాధ్యమవుతుంది. ఆర్థిక సమానత్వంలో ఆర్థిక న్యాయం అంతర్భాగంగా ఉంటుంది. దీనిని రాజ్యం ప్రసాదిస్తుంది.

7. అధికారాల వికేంద్రీకరణ (Decentralisation of Powers): అధికారాలు వికేంద్రీకరణ ద్వారా స్వేచ్ఛను మెరుగైన రీతిలో పరిరక్షించవచ్చు. ప్రభుత్వాధికారాల కేంద్రీకరణ నుంచి దేశానికి విముక్తి కలిగినప్పుడే వ్యక్తులు స్వేచ్ఛను అనుభవించగలరు. కేంద్రం రాష్ట్రాలు, స్థానిక ప్రభుత్వాల మధ్య అధికారాలను కేటాయించినప్పుడు నిరంకుశత్వానికి, వ్యక్తి స్వేచ్ఛల హరింపునకు తావుండదు లేనిచో రాజ్యాంగంలో పొందుపరచిన హక్కులను అనుభవించటమన్నది ప్రజలకు కష్టమవుతుంది.

8. పత్రికాస్వాతంత్ర్యం (Independent Press): ప్రజాస్వామ్యాన్ని కొందరు వ్యక్తి స్వేచ్ఛా పరిరక్షణ కవచంగా భావించారు. తమ పనితీరులో చాలినంత స్వతంత్ర ప్రతిపత్తిని పత్రికలు, ఇతర మాధ్యమాలు కలిగి ఉన్నప్పుడే వ్యక్తులు స్వేచ్ఛలను అనుభవించగలరు. ప్రజాభిప్రాయాన్ని ఏర్పరచి, సంఘటితపరచి, వ్యక్తీకరించడంలో పత్రికలు ముఖ్యమైన వాహకంగా వ్యవహరిస్తాయి. అవి తమ నిష్పాక్షిక సంపాదకీయాలు, సత్య సమ్మతమైన వార్తలు, అభిప్రాయాల ద్వారా వ్యక్తి స్వేచ్ఛలను పరిరక్షించగలుగుతాయి.

AP Inter 1st Year Civics Study Material Chapter 5 స్వేచ్ఛ - సమానత్వం

9. బలమైన ప్రతిపక్షం (Strong Opposition): వ్యక్తి స్వేచ్ఛను పెంపొందించేందుకు బలమైన ప్రతిపక్షం అవసరమవుతుంది. ఒకవిధంగా వ్యక్తి స్వేచ్ఛకు ప్రతిపక్షం కాపలాదారుడిగా పనిచేస్తుంది. అధికారంలో ఉన్న పార్టీ లేదా ప్రభుత్వంలో ఉన్నత స్థానంలోని వ్యక్తులు నిరంకుశ చట్టాల అమలుద్వారా సామాన్యుల స్వేచ్ఛలకు హద్దులు గీసి హరించి వేసినపుడు, ప్రతిపక్షం అట్టి చర్యలను తీవ్రంగా అడ్డుకుంటుంది. అంతిమంగా, అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడం ద్వారా వ్యక్తుల స్వేచ్ఛలను కాపాడుతుంది.

10. ప్రజల అప్రమత్తత (People vigilance): స్వేచ్ఛకు అన్నింటికన్నా ముఖ్యమైంది ప్రజల అప్రమత్తత. స్వేచ్ఛ పరిరక్షణకు ప్రజలు నిరంతరం అప్రమత్తతతో ఉండాలి. తమ స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు పరిరక్షించుకోవాలనే ఆకాంక్ష, స్ఫూర్తి, పట్టుదల పౌరస్వేచ్ఛకు శక్తివంతమైన రక్షణ కవచంగా పనిచేస్తాయి.

ప్రశ్న 3.
సమానత్వం అంటే ఏమిటి ? సమానత్వమందలి రకాలు ఏవి ?
జవాబు:
సమానత్వం ఆధునికకాలంలో ఒక ప్రధాన ఆశయం. అది ప్రజాస్వామ్య ఆదర్శం. మానవులంతా పుట్టుకతో సమానులని కొందరు నమ్మారు. సాంఘిక, ఆర్థిక, రాజకీయ వ్యవహారాలలో ప్రజలందరికి జాతి, మత, కుల, లింగ, భాషా, ప్రాంతీయ, వర్ణ, వర్గ భేదాలు లేకుండా సమానావకాశాలుండటమే సమానత్వము. సమానత్వం అంటే (i) ఏ అడ్డంకులూ లేకుండా ప్రతి వ్యక్తీ వికాసం పొందడం (ii) శాసనాలు పాలనలలో వ్యక్తుల మధ్య భేదం లేకుండా చేయడం (iii) చట్టం ప్రకారం లభించే హక్కులు సమానంగా లభించడం.

నిర్వచనం: “సమానత్వం అంటే సమాజంలో కొందరికి మాత్రమే ప్రత్యేకమైన హక్కులు, అవకాశాలు కాకుండా అందరికీ సమానావకాలు ఉండటమే” అని లాస్కీ నిర్వచించాడు. పుట్టుక, కులం, మతం, ఆస్తి వంటి అర్హతలనుబట్టి వ్యక్తులకు అవకాశాలు కలుగజేస్తే సమానత్వం లభించదు. అందరికీ సమానఆదరణ ఉండటమే సమానత్వానికి అవసరం. సమానత్వ సిద్ధాంతం ప్రకారం చట్టం ముందు అంతా సమానులే. ఆధునిక రాజ్యం ప్రజలందరికీ సాంఘిక, రాజకీయ, ఆర్థిక రంగాలలో సమానావకాశాలు కల్పించాలి.

సమానత్వం – రకాలు: సమానత్వం ప్రధానంగా ఐదు రకాలు. అవి 1) సహజ సమానత్వం 2) సాంఘిక సమానత్వం 3) ఆర్థిక సమానత్వం 4) రాజకీయ సమానత్వం 5) అంతర్జాతీయ సమానత్వం. వీటిని గురించి ఈ కింద పేర్కొన్న విధంగా విపులీకరించవచ్చు.

1. సహజ సమానత్వం (Natural Equality): సహజ సమానత్వం అంటే అన్ని రకాల అవరోధాలు, సాంఘిక కట్టుబాట్ల నుంచి స్వాతంత్ర్యాన్ని పొందడం. దీని అర్థం వ్యక్తిపరిధిలో ఎటువంటి ఆంక్షలు ఉండకపోవడం. సహజ సమానత్వం గురించి థామస్ హాబ్స్ ప్రతిపాదించిన సామాజిక ఒడంబడిక సిద్ధాంతంలో పేర్కొనడమైంది. పౌర సమాజం ఆవిర్భవించక ముందే ప్రజలు ప్రాకృతిక వ్యవస్థలో జీవించారని ఈ సిద్ధాంతం పేర్కొన్నది. అసమానతలు, బంధనాలకు నాగరికత దారితీసిందని హాబ్స్ ఉద్ఘాటించాడు. గ్రీకు రోమన్ రాజకీయ తత్త్వవేత్తల రచనలలో ఈ భావం కనపడుతుంది.

2. సాంఘిక సమానత్వం (Social Equality): వర్గ వ్యత్యాసాలు లేకపోవడం, సమానమైన హోదాలు కలిగి ఉండటాన్ని సాంఘిక సమానత్వం సూచిస్తుంది. ఏ వ్యక్తి మతం, వర్గం, వర్ణ, లింగం, పుట్టుక వంటి అంశాల ఆధారంగా వివక్షతకు గురికాకుండా ఉంటే సాంఘిక సమానత్వం నెలకొంటుంది.

ఉదాహరణకు భారతరాజ్యాంగం కుల, వర్గపరమైన వ్యత్యాసాలను నిషేధించింది. వాస్తవానికి అస్త్రశ్యతను అది వ్యతిరేకించింది. పౌరులందరూ సాంఘిక సమానత్వాన్ని అనుభవించినప్పుడు, ఏ ఒక్కరు ఇతరులతో పోల్చినచో కులం, వర్గం, వర్ణం, పుట్టుక, తెగ, జన్మస్థలం వంటి అంశాలపై ఏ విధమైన వివక్షతకు గురికారు. సందర్భంలో క్రింద పేర్కొన్న అంశాలు సాంఘిక సమానత్వ సాధన, కొనసాగింపులకు సహాయపడతాయని చెప్పవచ్చు.

  1. రాజ్యం ఏ ఒక్క పౌరుడికి ప్రత్యేక సౌకర్యాలను అనుమతించరాదు.
  2. విద్య, ఉపాధి, పరిపాలన, శాసన నిర్మాణం వంటి రంగాలలో ప్రభుత్వం ఒకే విధానాన్ని పాటించి, అమలు చేయాలి..
  3. సాంఘిక, మతపరమైన వ్యవహారాలలో ప్రజలు సహనం, త్యాగం, నిజాయితీ వంటి లక్షణాలతో కూడిన విశాల దృక్పథాన్ని కలిగి ఉండాలి.
  4. రాజ్యంలోని పౌరులు తోటి పౌరులతో సహృద్భావ సంబంధాలను ఏర్పరచుకొని కొనసాగించుకోవాలి.
  5. తమ విజ్ఞాపనలను పంపించేటప్పుడు కులం, తెగ, లేక మతం వంటి వాటిని సూచించే పేర్లను ప్రజలు ఉపయోగించరాదు.
  6. కులాంతర వివాహాలను ప్రోత్సహించాలి.

3. ఆర్థిక సమానత్వం (Economic Equality): ఆర్థిక సమానత్వాన్ని సాంఘిక, రాజకీయ సమానత్వాలకు పునాదిగా పరిగణించడమైంది. ఆధునిక రాజ్యకార్యకలాపాల వెనుక అదొక ముఖ్యమైన చోదకశక్తిగా పనిచేస్తుంది. ఆర్థిక సమానత్వమంటే ఆదాయం, ఆస్తి, సంపదలలో విపరీతమైన వ్యత్యాసాలు లేకుండా చేయడంగా పేర్కొనవచ్చు. ఎర్నెస్ట్ బార్కర్ దృష్టిలో ఆర్థిక సమానత్వం అనేది హోదాకు, పాక్షికంగా ఆస్తి-ఆదాయాలకు సంబంధించిన అంశం. ఆర్థిక సమానత్వాన్ని “సంపదకు చెందిన వ్యత్యాసాలను తొలగించి ప్రయత్నంగా, ప్రాపంచిక వస్తువులను స్త్రీ, పురుషుల మధ్య సమానంగా పంపిణీ చేయాల్సిన ప్రయత్నం”గా లార్డ్స్ భావించాడు. ప్రొఫెసర్ లాస్కీ “పారిశ్రామిక ప్రపంచంలో విశృంఖలమైన, బాధ్యతారహిత ఇచ్ఛను నిషేధించడాన్ని ఆర్థిక సమానత్వం”గా భావించాడు.

AP Inter 1st Year Civics Study Material Chapter 5 స్వేచ్ఛ - సమానత్వం

4. రాజకీయ సమానత్వం (Political Equality): రాజకీయ సమానత్వం రాజకీయ కార్యకలాపాలలో ప్రజలకు చాలినన్ని అవకాశాలను కల్పించేందుకు అనుకూల పరిస్థితులను సూచిస్తుంది. రాజ్యంలోని పౌరులకు వివిధ రకాల రాజకీయ హక్కులను ప్రసాదించడం ద్వారా ఆ రకమైన సమానత్వాన్ని సాధించవచ్చు. ఈ సందర్భంలో రాజకీయ సమానత్వాన్ని పౌరులు మాత్రమే అనుభవిస్తారనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. రాజ్యంలో నివసించే అన్యులు, విదేశీయులకు ఇది వర్తించదు. ప్రజాస్వామ్యాన్ని విజయవంతం చేసేందుకు రాజకీయ సమానత్వమన్నది అత్యంత ఆవశ్యకమైంది. వివిధ రాజకీయ హక్కులను ప్రసాదించినప్పుడే పౌరులు రాజకీయ స్వేచ్ఛను అనుభవిస్తారు. అంటే, రాజకీయ సమానత్వమనేది రాజకీయ స్వేచ్ఛకు పర్యాయపదంగా భావించవచ్చు.

5. అంతర్జాతీయ సమానత్వం (International Equality): అంతర్జాతీయ సమానత్వమంటే భౌగోళిక, ఆర్థిక లేదా సైనికపరమైన అంశాలతో నిమిత్తం లేకుండా అన్ని రాజ్యాలనూ సమానంగా చూడటంగా పేర్కొనవచ్చును. ఈ విధమైన సమానత్వం ద్వారా ప్రపంచంలోని చిన్న, పెద్ద రాజ్యాలన్నీ సమానమవుతాయి. ఉదాహరణకు ఐక్యరాజ్యసమితి తన చార్టర్ లో అన్ని రాజ్యాలకు సమానమైన గౌరవం, హోదాలను కల్పించింది. అంతర్జాతీయ సమానత్వం మానవీయ లక్షణాలను ప్రతిబింబిస్తుంది. రాజ్యాల మధ్య ఉత్పన్నమయ్యే వివాదాలను శాంతియుతంగా పరిష్కారం చేసుకోవాలని నొక్కిచెబుతుంది. అంతర్జాతీయ న్యాయానికి గౌరవం లోపించినప్పుడు మూడో ప్రపంచ యుద్ధం సంభవించవచ్చని కొందరు హెచ్చరించారు.

ప్రశ్న 4.
స్వేచ్ఛ, సమానత్వం మధ్యగల సంబంధాన్ని గురించి వివరించండి.
జవాబు:
వ్యక్తులకు గల స్వేచ్ఛ – సమానత్వాలపైనే రాజకీయ వ్యవస్థ విజయం ఆధారపడి ఉంటుంది. రాజనీతి శాస్త్ర అధ్యయనంలో ఈ రెండు అంశాలు విశేషమైన ప్రాముఖ్యతను సంతరించుకొన్నాయి. వ్యక్తులు తమ సర్వ సమగ్రమైన అభివృద్ధి కోసం స్వేచ్ఛ, సమానత్వాలను వాంఛిస్తారు.

స్వేచ్ఛ, సమానత్వం మధ్య సంబంధం (Relationship between Liberty and Equality): స్వేచ్ఛ సమానత్వం మధ్యగల సంబంధం గురించి రాజనీతి తత్త్వవేత్తలు రెండు భిన్న అభిప్రాయాలను వెల్లడించారు. ఆ రెండింటి భావనలు రాజనీతిశాస్త్రం అధ్యయనంలో ముఖ్యమైనవిగా వారు అంగీకరించారు. అయితే కొందరు ఆ రెండింటి మధ్య సంబంధం ఉందని పేర్కొనగా, మరికొందరు అవి ఒకదానికొకటి వ్యతిరేకమైనవిగా పరిగణించారు.

స్వేచ్ఛ, సమానత్వం పరస్పర సంబంధం కలిగి ఉంటాయనే భావనను రాజనీతి తత్త్వవేత్తలైన రూసో, టానీ, లాస్కీ, జి.డి. హెచ్. కోల్ వంటివారు ప్రతిపాదించారు. ఇక స్వేచ్ఛ, సమానత్వం అనేది పరస్పర వ్యతిరేకమైన భావనలని పేర్కొన్న వారిలో లార్డ్ మాధ్యూ, ఆర్నార్డ్, లార్డ్ ఆక్టన్, డి టాక్విల్లీ వంటి రాజనీతితత్వవేత్తలు ఉన్నారు. పైన పేర్కొన్న రెండు వాదనల గురించి కింది విధంగా తెలపడమైంది.

1) స్వేచ్ఛ, సమానత్వం పరస్పర పోషకాలు:

  1. వ్యక్తి శ్రేయోవాదులు, అరాచకవాదులు, కమ్యూనిస్టుల దృష్టిలో స్వేచ్ఛ, సమానత్వం పరస్పర పోషకాలు.
  2. సమానత్వం లేని స్వేచ్ఛ అర్థరహితం, ‘సమానత్వం’ నెలకొల్పబడిన తరువాతే స్వేచ్ఛను గురించి ఆలోచించాలని కమ్యూనిస్టులు భావిస్తారు.
  3. సక్రమమైన, ఆదర్శమైన రాజ్యం స్థాపించబడాలంటే తప్పనిసరిగా సమానత్వ ప్రాతిపదికగా ప్రజలకు స్వేచ్ఛను ప్రసాదించాలి. ఈ రెండు విస్తృత పరిధిలో చూడబడాలి.
  4. స్వేచ్ఛ, సమానత్వం – ఈ రెండింటిలో దేన్నీ త్యాగం చేయడానికి ప్రయత్నించరాదు. సమానత్వం, స్వేచ్ఛ లోపించినట్లయితే అరాచకత్వం ప్రబలుతుంది. కావున ప్రభుత్వం శాసనాల ద్వారా ప్రజలందరికి ఎటువంటి జాతి, మత, కుల, వర్గ, వర్ణ, లింగ భేదము లేకుండా సమానంగా ‘స్వేచ్ఛను’ ప్రసాదించాలి.
  5. రాజకీయ స్వేచ్ఛ ద్వారా భావ ప్రకటనా స్వాతంత్ర్యం, ఓటుహక్కు, అర్హత ప్రాతిపదికగా పదవులకు పోటీచేసే హక్కు లభిస్తాయి. సాంఘిక, ఆర్థిక, రాజకీయ సమానత్వాలను ప్రజలందరూ కలిగి ఉండాలంటే వారందరూ స్వేచ్ఛను పొంది ఉండాలి. అందువలనే స్వేచ్ఛ లేకుండా సమానత్వం, సమానత్వం లేకుండా స్వేచ్ఛ ఉండవు.
  6. ఏ రాజ్యంలో ప్రజలు ఆర్థిక, సాంఘిక, రాజకీయ రంగాలలో స్వేచ్ఛ, సమానత్వాలను సమానంగా పొంది ఉంటారో ఆ రాజ్యం బహుముఖంగా త్వరితగతిన అభివృద్ధి చెందుతుందని పరిశీలకులు భావిస్తారు.

AP Inter 1st Year Civics Study Material Chapter 5 స్వేచ్ఛ - సమానత్వం

2) స్వేచ్ఛ-సమానత్వాలు పరస్పర విరుద్ధాలు: స్వేచ్ఛ, సమానత్వం పరస్పర శత్రువులు అని పేర్కొన్న వారిలో లార్డ్ ఆక్టన్ ముఖ్యుడు. రాజ్యముగాని, వ్యక్తులుగాని సమానత్వానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తే స్వేచ్ఛ మరుగున పడిపోతుంది అని ఆక్టన్ మహాశయుడు వాదిస్తాడు. ‘మితిమీరని ప్రభుత్వ పరిపాలననే స్వేచ్ఛ’ అని సీలీ మహాశయుడు పేర్కొన్నాడు. ప్రభుత్వ అధికారాలు మితిమీరడమంటే ప్రజలు తమ స్వేచ్ఛాస్వాతంత్ర్యాలను కోల్పోవటమేనని వీరు భావిస్తారు. ప్రజల వ్యక్తిగత వ్యవహారాలలో, కార్యకలాపాలలో ప్రభుత్వము జోక్యం కల్పించుకోరాదు అని ఆక్టన్ అభిప్రాయం. ప్రజలందరికి ఆర్థిక స్వేచ్ఛను ప్రసాదించినట్లయితే శక్తిసామర్థ్యాలు, తెలివితేటలు, విద్యా పరిజ్ఞానం కలిగినవారు అపారమైన సంపదను కూడబెడితే, అమాయకులు, నిరక్షరాస్యులు, సోమరిపోతులు తమతమ కనీస అవసరాలను కూడా సమకూర్చుకోలేరు. ఇది సమాజములో ఆర్థిక అసమానత్వానికి, వర్గతత్వానికి దారితీస్తుంది. కావున స్వేచ్ఛ-సమానత్వం పరస్పరం శతృ సంబంధాన్ని కలిగి ఉంటాయి. “ఎక్కడ స్వేచ్ఛ ఉంటుందో, అక్కడ సమానత్వం ఉండదు. ఎక్కడ సమానత్వం ఉంటుందో, అక్కడ స్వేచ్ఛ ఉండదు. స్వేచ్ఛ-సమానత్వం రెండు కత్తుల వంటివి. అవి ఒక ఒరలో ఇమడవు” అని ‘లార్డ్ ఆక్టివ్’, ‘డి టాక్వెల్లీ’, ‘సీలీ’ మొదలగు రాజనీతిజ్ఞులు వాదిస్తారు.

పైన పేర్కొన్న రెండు రకాల వాదనలు పూర్తిగా నిజమైనవికావు. వాస్తవ అంశం ఆ రెండింటికీ మధ్య ఉంటుంది. స్వేచ్ఛ, సమానత్వాలు రెండూ ఒకదానికొకటి పరస్పర పోషక, పరస్పర వ్యతిరేక స్వభావాన్ని కలిగి ఉండవు. ఈ సందర్భంలో ఆ రెండు భావనల మధ్య ఉండే వాస్తవిక సంబంధాన్ని క్రింది విధంగా వివరించడమైంది.

సమానత్వానికి స్వేచ్ఛ అవసరం (Liberty is essential for Equality):
i) స్వేచ్ఛ అంటే నిరపేక్షమైనదికాదు. దానికి కొన్ని పరిమితులు ఉంటాయి. కొన్ని నిబంధనలకు లోబడి సామాజిక సంక్షేమాన్ని సాధించేందుకై ఈ స్వేచ్ఛ అందరికీ అందుబాటులో ఉంటుంది.

ii) స్వేచ్ఛ అంటే ఏ ఒక్కవ్యక్తి లేదా వ్యక్తుల సముదాయపు గుత్తాధికారంగా భావించరాదు.

iii) ఒకానొక వ్యక్తి స్వేచ్ఛను అనుభవించడమనేది ఇతరులకు స్వేచ్ఛకు భంగం కలిగించేదిగా ఉండకూడదనే ఈ సూత్రాన్ని ఆమోదించారు. సమానత్వ సూత్రాన్ని గౌరవించవలసి ఉంటుంది. దాని అర్థం స్వేచ్ఛా ఫలాలు సమానత్వమనే వృక్షానికి చెందిన శాఖలలో ఉంటాయని పేర్కొనవచ్చు. కాబట్టి స్వేచ్ఛ, సమానత్వాలు ఒకదానికొకటి పరస్పర పోషకాలుగా భావించడమైంది. సమానత్వ సూత్రం ఆధారంగా స్వేచ్ఛను వర్తింపజేస్తే, స్వేచ్ఛాలక్ష్యం వాస్తవానికి నెరవేరినట్లవుతుంది.

స్వేచ్ఛకు సమానత్వం అవసరం (Equality is essential for Liberty): సమానత్వం అంటే ఒకే విధమైన ఆదరణ అని అర్థం కాదు. ఎందుకంటే అటువంటి సమానత్వం పౌర సమాజంలో సాధ్యంకాదు. అందుకు బదులుగా ఒకేరకమైన పరిస్థితులలో సమానమైన ఆదరణయే సమానత్వంగా పేర్కొనవచ్చు. పౌర సమాజంలో కొందరు ఇతరులతో సమానమైన హోదాను కలిగి ఉండరు. అయితే వారికి తమ వ్యక్తిత్వం, హోదాలను పెంపొందించుకొనేందుకై కొన్ని పరిస్థితులు, అవకాశాలను కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రజలందరూ సమానంగా ఉన్నప్పుడు స్వేచ్ఛా, ఫలాలను వారందరూ అనుభవిస్తారని చెప్పవచ్చు.

పైన పేర్కొన్న విధంగా స్వేచ్ఛ, సమానత్వం ఒకదానికొకటి పరస్పర పోషకాలుగా ఉంటాయి. ఆ రెండు భావనలు ఒకే ఉమ్మడి లక్ష్యాన్ని కలిగి ఉంటాయి. సమానత్వాన్ని విస్మరించినందునే స్వేచ్ఛ అనే అరాచకం, నియంతృత్వాలకు దారితీస్తుంది. అట్లాగే స్వేచ్ఛను పట్టించుకోకుండా, సమానత్వానికి ప్రాధాన్యత ఇస్తే, బానిసత్వం ఏర్పడే ప్రమాదం ఉంది. కాబట్టి వ్యక్తి, సమాజాల ఔన్నత్యానికి ఆ రెండు భావనలు ఆవశ్యకమైనవిగా పేర్కొనవచ్చు.

AP Inter 1st Year Civics Study Material Chapter 5 స్వేచ్ఛ - సమానత్వం

ప్రశ్న 5.
సమానత్వమనే పదాన్ని నిర్వచించి, సాంఘిక, ఆర్థిక సమానత్వాల గురించి రాయండి.
జవాబు:
సమానత్వం ఆధునికకాలంలో ఒక ప్రధాన ఆశయం. అది ప్రజాస్వామ్య ఆదర్శం. మానవులంతా పుట్టుకతో సమానులని కొందరు నమ్మారు. సాంఘిక, ఆర్థిక, రాజకీయ వ్యవహారాలలో ప్రజలందరికి జాతి, మత, కుల, లింగ, భాషా, ప్రాంతీయ, వర్ణ, వర్గ భేదాలు లేకుండా సమానావకాశాలుండటమే సమానత్వము. సమానత్వం అంటే (i) ఏ అడ్డంకులూ లేకుండా ప్రతి వ్యక్తీ వికాసం పొందడం (ii) శాసనాలు పాలనలలో వ్యక్తుల మధ్య భేదం లేకుండా చేయడం (iii) చట్టం ప్రకారం లభించే హక్కులు సమానంగా లభించడం.

నిర్వచనం: “సమానత్వం అంటే సమాజంలో కొందరికి మాత్రమే ప్రత్యేకమైన హక్కులు, అవకాశాలు కాకుండా అందరికీ సమానావకాశాలు ఉండటమే” అని లాస్కీ నిర్వచించాడు. పుట్టుక, కులం, మతం, ఆస్తి వంటి అర్హతలనుబట్టి వ్యక్తులకు అవకాశాలు కలుగజేస్తే సమానత్వం లభించదు. అందరికీ సమానఆదరణ ఉండటమే సమానత్వానికి అవసరం. సమానత్వ సిద్ధాంతం ప్రకారం చట్టం ముందు అందరు సమానులే. ఆధునిక రాజ్యం ప్రజలందరికీ సాంఘిక, రాజకీయ, ఆర్థిక రంగాలలో సమానావకాశాలు కల్పించాలి.

సాంఘిక సమానత్వం (Social Equality): వర్గ వ్యత్యాసాలు లేకపోవడం, సమానమైన హోదాలు కలిగి ఉండటాన్ని సాంఘిక సమానత్వం సూచిస్తుంది. ఏ వ్యక్తి మతం, వర్గం, వర్ణ, లింగం, పుట్టుక వంటి అంశాల ఆధారంగా వివక్షతకు గురికాకుండా ఉంటే సాంఘిక సమానత్వం నెలకొంటుంది.

ఉదాహరణకు భారతరాజ్యాంగం కుల, వర్గపరమైన వ్యత్యాసాలను నిషేధించింది. వాస్తవానికి అస్త్రశ్యతను అది వ్యతిరేకించింది. పౌరులందరూ సాంఘిక సమానత్వాన్ని అనుభవించినప్పుడు, ఏ ఒక్కరు ఇతరులతో పోల్చినచో కులం, వర్గం, వర్ణం, పుట్టుక, తెగ, జన్మస్థలం వంటి అంశాలపై ఏ విధమైన వివక్షతకు గురికారు. ఈ సందర్భంలో క్రింద పేర్కొన్న అంశాలు సాంఘిక సమానత్వ సాధన, కొనసాగింపులకు సహాయపడతాయని చెప్పవచ్చు.

  1. రాజ్యం ఏ ఒక్క పౌరుడికి ప్రత్యేక సౌకర్యాలను అనుమతించరాదు.
  2. విద్య, ఉపాధి, పరిపాలన, శాసన నిర్మాణం వంటి రంగాలలో ప్రభుత్వం ఒకే విధానాన్ని పాటించి, అమలు చేయాలి.
  3. సాంఘిక, మతపరమైన వ్యవహారాలలో ప్రజలు సహనం, త్యాగం, నిజాయితీ వంటి లక్షణాలతో కూడిన విశాల దృక్పథాన్ని కలిగి ఉండాలి.
  4. రాజ్యంలోని పౌరులు తోటి పౌరులతో సహృద్భావ సంబంధాలను ఏర్పరచుకొని కొనసాగించుకోవాలి.
  5. తమ విజ్ఞాపనలను పంపించేటప్పుడు కులం, తెగ, లేక మతం వంటి వాటిని సూచించే పేర్లను ప్రజలు ఉపయోగించరాదు.
  6. కులాంతర వివాహాలను ప్రోత్సహించాలి.

ఆర్థిక సమానత్వం (Economic Equality): ఆర్థిక సమానత్వాన్ని సాంఘిక, రాజకీయ సమానత్వాలకు పునాదిగా పరిగణించడమైంది. ఆధునిక రాజ్యకార్యకలాపాల వెనుక అదొక ముఖ్యమైన చోదకశక్తిగా పనిచేస్తుంది. ఆర్థిక సమానత్వమంటే ఆదాయం, ఆస్తి, సంపదలలో విపరీతమైన వ్యత్యాసాలు లేకుండా చేయడంగా పేర్కొనవచ్చు. ఎర్నెస్ట్ బార్కర్ దృష్టిలో ఆర్థిక సమానత్వం అనేది హోదాకు, పాక్షికంగా ఆస్తి-ఆదాయాలకు సంబంధించిన అంశం. ఆర్థిక సమానత్వాన్ని “సంపదకు చెందిన వ్యత్యాసాలను తొలగించి ప్రయత్నంగా, ప్రాపంచిక వస్తువులను స్త్రీ, పురుషుల మధ్య సమానంగా పంపిణీ చేయాల్సిన ప్రయత్నం”గా లార్డ్ బ్రైస్ భావించాడు. ప్రొఫెసర్ లాస్కీ “పారిశ్రామిక ప్రపంచంలో విశృంఖలమైన, బాధ్యతారహిత ఇచ్ఛను నిషేధించడాన్ని ఆర్థిక సమానత్వం”గా భావించాడు.

AP Inter 1st Year Civics Study Material Chapter 5 స్వేచ్ఛ - సమానత్వం

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
స్వేచ్ఛను నిర్వచించి, ఏవైనా మూడు రకాలైన స్వేచ్ఛలను వర్ణించండి. [Mar. ’18, ’16]
జవాబు:
పరిచయం: స్వేచ్ఛ అనేది రాజనీతి శాస్త్ర అధ్యయనంలో ఒక ముఖ్యమైన భావన. వ్యక్తులకు గల స్వేచ్ఛపైనే రాజకీయ వ్యవస్థ విజయం ఆధారపడి ఉంటుంది. వ్యక్తులు తమ సర్వతోముఖాభివృద్ధి కోసం స్వేచ్ఛను వాంఛిస్తారు. సామాజిక స్థితిగతులను మెరుగుపరచుకోవడంలో వ్యక్తులకు స్వేచ్ఛ తగిన శక్తిని ప్రసాదిస్తుంది. జె. ఎస్. మిల్, హెర్బర్ట్ స్పెన్సర్, మాంటెస్క్యూ, హెచ్. జె. లాస్కీ, సీలీ లాంటి రాజనీతి శాస్త్రవేత్తలు స్వేచ్ఛను పెంపొందించటంలో ప్రధాన పాత్రను పోషించారు.

అర్థం: స్వేచ్ఛను ఇంగ్లీషులో ‘లిబర్టీ’ (LIBERTY) అంటారు. లిబర్టీ (LIBERTY) అనే ఇంగ్లీషు పదం “లిబర్” (LIBER) అనే లాటిన్ పదం నుంచి ఆవిర్భవించింది. లాటిన్ భాషలో “లిబర్” అనే పదానికి అర్థం “ఆంక్షల నుంచి విముక్తి.

నిర్వచనాలు:

  1. హెచ్.జె.లాస్కీ: “వ్యక్తులు వారంతటవారు ఉత్తమమైన అవకాశాలను పొందగలిగి, నిర్వహించుకోగల వాతావరణమే స్వేచ్ఛ”.
  2. మాంటెస్క్యూ: “వ్యక్తులు సంకల్పించుకొని, సాధించగలిగే శక్తియే స్వేచ్ఛ.”
  3. జె.ఆర్. సీలీ: “మితిమీరిన ప్రభుత్వానికి వ్యతిరేకమైనదే స్వేచ్ఛ.”

1) సహజ స్వేచ్ఛ (Natural Liberty): సహజ స్వేచ్ఛ అనేది ఎటువంటి ఆంక్ష లేకుండా ఏదైనా చేయడాన్ని సూచిస్తుంది. ఇది ఎలాంటి జోక్యానికి లేదా నిర్భంధాలకు తావివ్వదు. వ్యక్తులు తమ ఇచ్ఛానుసారం చేయదలచిన దాన్ని సుసాధ్యం చేస్తుంది. అయితే, నిర్నిబంధమైన స్వేచ్ఛ వ్యక్తుల స్వేచ్ఛలను హరిస్తుంది. నేటి సమాజంలో సహజ స్వేచ్ఛ అనేది కనిపించదు. ఇది అన్యాయం, అరాచకత్వాలకు పర్యాయపదమైనది. సహజ స్వేచ్ఛగల చోట స్వాతంత్య్రం మృగ్యమవుతుంది. ఆదిలో రోమన్ రాజనీతి తత్త్వవేత్తలు ఈ భావనను సమర్థించారు. ఎటువంటి అవధుల్లేని ప్రాకృతిక వ్యవస్థలోని మానవులు అపరిమితమైన స్వేచ్ఛను అనుభవించారన్నారు. అటువంటి స్వేచ్ఛ-రాజ్యం, సమాజాల అవిర్భావానికి ముందు మాత్రమే ఉనికిలో ఉండేది.

2) పౌర స్వేచ్ఛ (Civil Liberty): పౌరస్వేచ్ఛను వ్యక్తిగత స్వేచ్ఛ అని కూడ అంటారు. ఇది సామాజిక సంస్థలోని సభ్యుడైన వ్యక్తి జీవనంలోని స్వాతంత్ర్యాన్ని తెలియజేస్తుంది. పౌరస్వేచ్ఛలో కింద పేర్కొన్న మూడు అంశాలు ఇమిడి ఉంటాయని బార్కర్ పేర్కొన్నాడు. i) సంచార స్వేచ్ఛను సూచించే భౌతిక స్వాతంత్య్రం. ii) ఆలోచన, అభివ్యక్తి, విశ్వాసాన్ని కలిగి ఉండే భౌద్ధిక స్వాతంత్ర్యం iii) నిజజీవితంలోని ఆచరణాత్మక ఐచ్ఛిక స్వాతంత్ర్యం. పౌర స్వేచ్ఛ అనేది మిగతా స్వేచ్ఛలకు ప్రాతిపదికగా ఉంటుంది. సహజ స్వేచ్ఛకు ఇది విరుద్ధమైంది. సమాజంలోని పౌరులు దానిని అనుభవిస్తారు. ఒంటరిగా ఉంటున్న వ్యక్తులకిది ఆవశ్యకమైనది. సమాజంలోని ప్రతిఒక్కరూ ప్రాపంచిక విషయాలను ఉమ్మడిగా అనుభవించగలిగినప్పుడే పౌర స్వేచ్ఛ వాస్తవమవుతుంది.

“రాజ్యం చేత గుర్తించబడి అమలయ్యే హక్కుల సముదాయమే పౌరస్వేచ్చ” అని గెటిల్ పేర్కొన్నాడు. పౌరస్వేచ్ఛ అనేది అనేక హక్కుల రూపంలో ఉంటుంది. అవి (i) జీవించే హక్కు (ii) పనిచేసే హక్కు (iii) ఆస్తిహక్కు iv) వాక్ స్వాతంత్ర్యం, భావవ్యక్తీకరణ, సమావేశ, సంచార, స్థిరనివాసపు హక్కులు మొదలైనవి.

3) ఆర్థిక స్వేచ్ఛ (Economic Liberty): ఆర్థిక స్వేచ్ఛ అంటే ప్రతిఒక్కరూ తమ జీవనోపాధిని తామే సంపాదించుకోగలగడం. ఒక వ్యక్తి తన రోజువారీ ఆహారాన్ని హేతుబద్ధంగా సంపాదించుకొనే భద్రమైన అవకాశమే | ఆర్థికస్వేచ్ఛగా లాస్కీ అభివర్ణించాడు. కోరిక – భయము, ఆకలి – పస్తులు, నిరద్యోగం – అసంపూర్ణతల నుంచి విముక్తి కలిగించేదే ఆర్థిక స్వేచ్ఛ. ఇది ఆర్థిక సంబంధమైన లేమి లేదా అభద్రతల నుంచి స్వాతంత్ర్యాన్ని సూచిస్తుంది. ఆర్థిక స్వేచ్ఛలేని ప్రజాస్వామ్యం అర్థరహితమైంది.

AP Inter 1st Year Civics Study Material Chapter 5 స్వేచ్ఛ - సమానత్వం

ఈ దిగువ పేర్కొన్న చర్యల అమలు ద్వారా ఆర్థిక స్వేచ్ఛను పొందవచ్చు.

  1. కనీస వేతనాలను అందించడం.
  2. పనిహక్కుకు భరోసా కల్పించడం.
  3. నిరుద్యోగం, అనారోగ్యం వంటి వివిధ రకాల అభద్రతల నుంచి కార్మికులను రక్షించడం.
  4. తగినంత విశ్రాంతిని కల్పించడం.
  5. పరిశ్రమల యాజమాన్యంలో కార్మికులకు ప్రాతినిధ్యం కల్పించడం.

ప్రశ్న 2.
స్వేచ్ఛకు గల ఏవైనా మూడు పరిరక్షణలను వివరించండి. [Mar. 2017]
జవాబు:
1. ఆర్థిక సమానత్వం (Economic Equality): వ్యక్తుల స్వేచ్ఛా పరిరక్షణలో ఆర్థిక సమానత్వం కూడా ప్రధానమైంది. ఆకలి, పేదరికం, నిరుద్యోగం వంటి దుష్ప్రభావాల నుంచి బయటపడేందుకు వ్యక్తులకు చాలినన్ని అవకాశాలను కల్పించాలనే భావన ఇందులో ఇమిడి ఉంది. ఆర్థిక సమానత్వం నెలకొన్నప్పుడే స్వేచ్ఛ సాధ్యమవుతుంది. ఆర్థిక సమానత్వంలో ఆర్థిక న్యాయం అంతర్భాగంగా ఉంటుంది. దీనిని రాజ్యం ప్రసాదిస్తుంది.

2. అధికారాల వికేంద్రీకరణ (Decentralisation of Powers): అధికారాల వికేంద్రీకరణ ద్వారా స్వేచ్ఛను మెరుగైన రీతిలో పరిరక్షించవచ్చు. ప్రభుత్వాధికారాల కేంద్రీకరణ నుంచి దేశానికి విముక్తి కలిగినప్పుడే వ్యక్తులు స్వేచ్ఛను అనుభవించగలరు. కేంద్రం రాష్ట్రాలు, స్థానిక ప్రభుత్వాల మధ్య అధికారాలను కేటాయించినప్పుడు నిరంకుశత్వానికి, వ్యక్తి స్వేచ్ఛల హరింపునకు తావుండదు, లేనిచో రాజ్యాంగంలో పొందుపరచిన హక్కులను అనుభవించటమన్నది ప్రజలకు కష్టమవుతుంది.

3. పత్రికాస్వాతంత్ర్యం (Independent Press): ప్రజాస్వామ్యాన్ని కొందరు వ్యక్తి స్వేచ్ఛా పరిరక్షణ కవచంగా భావించారు. తమ పనితీరులో చాలినంత స్వతంత్ర ప్రతిపత్తిని పత్రికలు, ఇతర మాధ్యమాలు కలిగి ఉన్నప్పుడే వ్యక్తులు స్వేచ్ఛలను అనుభవించగలరు. ప్రజాభిప్రాయాన్ని ఏర్పరచి, సంఘటితపరచి, వ్యక్తీకరించడంలో పత్రికలు ముఖ్యమైన వాహకంగా వ్యవహరిస్తాయి. అవి తమ నిష్పాక్షిక సంపాదకీయాలు, సత్య సమ్మతమైన వార్తలు, అభిప్రాయాల ద్వారా వ్యక్తి స్వేచ్ఛలను పరిరక్షించగలుగుతాయి.

ప్రశ్న 3.
స్వేచ్ఛ లక్షణాలేవి ?
జవాబు:
పరిచయం: స్వేచ్ఛ అనేది రాజనీతి శాస్త్ర అధ్యయనంలో ఒక ముఖ్యమైన భావన. వ్యక్తులకు గల స్వేచ్ఛపైనే రాజకీయ వ్యవస్థ విజయం ఆధారపడి ఉంటుంది. వ్యక్తులు తమ సర్వతోముఖాభివృద్ధి కోసం స్వేచ్ఛను వాంఛిస్తారు. సామాజిక స్థితిగతులను మెరుగుపరచుకోవడంలో వ్యక్తులకు స్వేచ్ఛ తగిన శక్తిని ప్రసాదిస్తుంది. ‘జె. ఎస్. మిల్, హెర్బర్ట్ స్పైన్సర్, మాంటెస్క్యూ, హెచ్. జె. లాస్కీ, సీలీ లాంటి రాజనీతి శాస్త్రవేత్తలు స్వేచ్ఛను పెంపొందించటంలో ప్రధాన పాత్రను పోషించారు.

అర్థం: స్వేచ్ఛను ఇంగ్లీషులో ‘లిబర్టీ’ (LIBERTY) అంటారు. లిబర్టీ (LIBERTY) అనే ఇంగ్లీషు పదం “లిబర్” (LIBER) అనే లాటిన్ పదం నుంచి ఆవిర్భవించింది. లాటిన్ భాషలో “లిబర్” అనే పదానికి అర్థం “ఆంక్షల నుంచి విముక్తి”.
నిర్వచనాలు:

  1. హెచ్.జె.లాస్కీ: “వ్యక్తులు వారంతటవారు ఉత్తమమైన అవకాశాలను పొందగలిగి, నిర్వహించుకోగల వాతావరణమే స్వేచ్ఛ”.
  2. మాంటెస్క్యూ: “వ్యక్తులు సంకల్పించుకొని, సాధించగలిగే శక్తియే స్వేచ్ఛ.”
  3. జె.ఆర్. సీలీ: “మితిమీరిన ప్రభుత్వానికి వ్యతిరేకమైనదే స్వేచ్ఛ.”

AP Inter 1st Year Civics Study Material Chapter 5 స్వేచ్ఛ - సమానత్వం

స్వేచ్ఛ లక్షణాలు (Characteristics of Liberty): స్వేచ్ఛ ముఖ్య లక్షణాలను కింద పేర్కొనడమైనది.

  1. స్వేచ్ఛ ఒక శక్తివంతమైన భావన. దాని వ్యాఖ్యానమనేది స్థలం, కాలం, ప్రాంతం, ప్రజల ఆకాంక్షలను బట్టి ఉంటుంది.
  2. రాజకీయంగా లోబరచుకోవడం, బానిసలుగా మార్చటాన్ని స్వేచ్ఛ ఎల్లప్పుడూ వ్యతిరేకిస్తుంది.
  3. వ్యక్తుల ఆకాంక్షలను సదా వాస్తవం చేయడమే స్వేచ్ఛలక్ష్యం అవుతుంది.
  4. నిర్హేతుకమైన ఆంక్షలకు బదులు నిరంతరం సానుకూల పరిస్థితులను కలిగి ఉండటమే స్వేచ్ఛ. 5. ఇది హక్కుల ఫలం.
  5. మానవీయ వ్యక్తిత్వాల సాధనకు అత్యంత ఆవశ్యకమైంది.
  6. ప్రజాస్వామ్య రాజ్యాలలోనే ఇది కనిపిస్తుంది.
  7. హక్కుల రూపంలో ఇది సాకారమవుతుంది.
  8. స్వేచ్ఛ అంటే ఏ ఒక్కరు యధేచ్ఛగా వ్యవహరించడం కాదు. ఇది ఎన్నో పరిమితులతో కూడుకొని ఉంటుంది.

ప్రశ్న 4.
స్వేచ్ఛకు గల వివిధ ధృక్కోణాలను తెలపండి.
జవాబు:
అర్థం: స్వేచ్ఛను ఇంగ్లీషులో ‘లిబర్టీ’ (LIBERTY) అంటారు. లిబర్టీ (LIBERTY) అనే ఇంగ్లీషు పదం “లిబర్” (LIBER) అనే లాటిన్ పదం నుంచి ఆవిర్భవించింది. లాటిన్ భాషలో “లిబర్” అనే పదానికి అర్థం “ఆంక్షల నుంచి విముక్తి”.
నిర్వచనాలు:

  1. హెచ్.జె.లాస్కీ: “వ్యక్తులు వారంతటవారు ఉత్తమమైన అవకాశాలను పొందగలిగి, నిర్వహించుకోగల వాతావరణమే స్వేచ్ఛ”.
  2. మాంటెస్క్యూ: “వ్యక్తులు సంకల్పించుకొని, సాధించగలిగే శక్తియే స్వేచ్ఛ.”
  3. జె.ఆర్. సీలీ: “మితిమీరిన ప్రభుత్వానికి వ్యతిరేకమైనదే స్వేచ్ఛ.”

స్వేచ్ఛ ధృక్కోణాలు (Aspects of Liberty): స్వేచ్ఛకు రెండు ధృక్కోణాలు ఉంటాయి. అవి 1. సకారాత్మకమైన ధృక్కోణం 2. నకారాత్మకమైన ధృక్కోణం.

1. సకారాత్మక ధృక్కోణం (Positive Aspect): సకారాత్మక ధృక్కోణంలో స్వేచ్ఛ అనేది వ్యక్తి తన అభీష్టం మేరకు నడుచుకుంటూ ఇతరులు కూడా తనవలె నడుచుకోవాలనే పరిస్థితిని సూచిస్తుంది. వేరొక మాటలో చెప్పాలంటే, ఇతరులకు హాని కలిగించని అధికారమే స్వేచ్ఛ అనే ధృక్కోణాన్ని సూచిస్తుంది. టి.హెచ్. గ్రీన్ అనే ఆదర్శ తత్త్వవేత్త ఈ రకమైన స్వేచ్ఛా ధృక్కోణాన్ని ప్రతిపాదించాడు. “ఇతరులతో సమానంగా ఆనందంతో ఏదైనా చేసి అనుభవించేందుకు గల అధికారమే స్వేచ్ఛ” గా అతడు భావించాడు.

2. నకారాత్మక ధృక్కోణం (Nagative Aspect): నకారాత్మక ధృక్కోణంలో స్వేచ్ఛ అంటే ఎటువంటి ఆంక్షలు లేకపోవడం. తమ స్వాతంత్ర్యాల మీద ఎలాంటి ఆంక్షలు లేనప్పుడే వ్యక్తులు స్వాతంత్ర్యాన్ని పొందగలరు. అయితే, కొందరు దీన్ని వాస్తవ విరుద్ధమైనదిగా భావించారు. రాజ్యం ఆవిర్భావానికి పూర్యం మాత్రమే వ్యక్తులకు ఆంక్షలు లేని, స్వేచ్ఛ ఉందన్నారు. వారి ప్రకారం అటువంటి రాజ్యం అసాధ్యమైందే కాకుండా, ఆధునిక కాలంలో వ్యక్తులు స్వాతంత్ర్యాన్ని అనుభవించే వీలులేనిది కూడా అవుతుంది.

ప్రశ్న 5.
పౌర స్వేచ్ఛ అంటే ఏమిటి ?
జవాబు:
పౌర స్వేచ్ఛ (Civil Liberty): పౌరస్వేచ్ఛను వ్యక్తిగత స్వేచ్ఛ అని కూడ అంటారు. ఇది సామాజిక సంస్థలోని సభ్యుడైన వ్యక్తి జీవనంలోని స్వాతంత్ర్యాన్ని తెలియజేస్తుంది. పౌరస్వేచ్ఛలో కింద పేర్కొన్న మూడు అంశాలు ఇమిడి | ఉంటాయని బార్కర్ పేర్కొన్నాడు. i) సంచార స్వేచ్ఛను సూచించే భౌతిక స్వాతంత్ర్యం ii) ఆలోచన, అభివ్యక్తి, విశ్వాసాన్ని కలిగి ఉండే భౌద్ధిక స్వాతంత్ర్యం, iii) నిజజీవితంలోని ఆచరణాత్మక ఐచ్ఛిక స్వాతంత్య్రం. పౌర స్వేచ్ఛ అనేది మిగతా స్వేచ్ఛలకు ప్రాతిపదికగా ఉంటుంది. సహజస్వేచ్ఛకు ఇది విరుద్ధమైంది. సమాజంలోని పౌరులు దానిని అనుభవిస్తారు. ఒంటరిగా ఉంటున్న వ్యక్తులకిది ఆవశ్యకమైనది సమాజంలోని ప్రతిఒక్కరూ ప్రాపంచిక విషయాలను ఉమ్మడిగా అనుభవించగలిగినప్పుడే పౌరస్వేచ్ఛ వాస్తవమవుతుంది.

AP Inter 1st Year Civics Study Material Chapter 5 స్వేచ్ఛ - సమానత్వం

“రాజ్యం చేత గుర్తించబడి అమలయ్యే హక్కుల సముదాయమే పౌర స్వేచ్ఛ” అని గెటిల్ పేర్కొన్నాడు. పౌరస్వేచ్ఛ అనేది అనేక హక్కుల రూపంలో ఉంటుంది. అవి (i) జీవించే హక్కు (ii) పనిచేసే హక్కు (iii) ఆస్తిహక్కు (iv) వాక్ స్వాతంత్య్రం, భావవ్యక్తీకరణ, సమావేశ, సంచార, స్థిర నివాసపు హక్కులు మొదలైనవి.

ప్రశ్న 6.
వ్యక్తి స్వేచ్ఛలను ఆటంకపరిచే ఏవైనా రెండు అంశాలను సూచించండి.
జవాబు:
అర్థం: స్వేచ్ఛను ఇంగ్లీషులో ‘లిబర్టీ’ (LIBERTY) అంటారు. లిబర్టీ (LIBERTY) అనే ఇంగ్లీషు పదం “లిబర్” (LIBER) అనే లాటిన్ పదం నుంచి ఆవిర్భవించింది. లాటిన్ భాషలో “లిబర్” అనే పదానికి అర్థం “ఆంక్షల నుంచి విముక్తి”.

నిర్వచనాలు:

  1. హెచ్.జె.లాస్కీ: “వ్యక్తులు వారంతటవారు ఉత్తమమైన అవకాశాలను పొందగలిగి, నిర్వహించుకోగల వాతావరణమే స్వేచ్ఛ”.
  2. మాంటెస్క్యూ “వ్యక్తులు సంకల్పించుకొని, సాధించగలిగే శక్తియే స్వేచ్ఛ.”
  3. జె.ఆర్. సీలీ: “మితిమీరిన ప్రభుత్వానికి వ్యతిరేకమైనదే స్వేచ్ఛ.”

ఆధునిక కాలంలో వ్యక్తిస్వేచ్ఛకు కింద పేర్కొన్న అంశాలు భంగం కలిగిస్తాయి.
1. రాజ్యాధికార పెరుగుదల (Enhancement of State Authority): ఆధునిక ప్రజాస్వామ్యరాజ్యం సంక్షేమ సిద్ధాంతం పేరుతో అనిర్వచనీయమైన అధికారాలను సంతరించుకుంది. దాంతో అది ప్రజలకు సంబంధించిన ప్రతి కార్యక్రమంలో జోక్యం చేసుకోవడం మొదలుపెట్టింది. జనాభా నియంత్రణ పేరుతో అది కుటుంబ విషయాలలో కూడా జోక్యం చేసుకుంటున్నది. అట్లాగే ఆర్థిక వ్యవస్థ, సంస్కృతి, కళలు, శాస్త్రవిజ్ఞాన రంగాలలో సైతం రాజ్యం జోక్యం పెరిగింది. పైన పేర్కొన్న అంశాలన్నీ ప్రభుత్వ వ్యవహారాలలో రాజ్యం జోక్యానికి నిదర్శనంగా నిలిచాయి. దాంతో వ్యక్తిస్వేచ్ఛకు చెప్పుకోదగిన రీతిలో ఆటంకాలు ఏర్పడినాయి.

2. మితిమీరిన చట్టాలు (Too many Laws): ఆధునిక కాలంలో ప్రభుత్వం అనేక సదుపాయాలను కల్పించడం ద్వారా తమను ఆదుకోవలసి ఉంటుందని ప్రజలు భావిస్తున్నారు. అటువంటి భావన ప్రజల వ్యవహారాలలో ప్రభుత్వం జోక్యం చేసుకునేందుకు కారణమైంది. ఆ ప్రక్రియలో అనేక చట్టాలు అమలులోకి రావడం ఈనాడు సర్వసాధారణమైంది. చట్టాలు విస్తృతమయ్యేకొద్దీ వ్యక్తి స్వేచ్ఛలు క్రమేణ తగ్గిపోతూ వచ్చాయి.

3. ప్రతికూల ధోరణి (Negative Attitude): ప్రజాస్వామ్య ప్రభుత్వం ప్రజాభిప్రాయానికి అనుగుణంగా స్పందిస్తూ ప్రజలకు తన విధానాలను తెలియజేస్తుంది. ఆ ప్రక్రియలో భాగంగా ప్రభుత్వంలో సంబంధిత వ్యక్తులు ప్రజాభిప్రాయాన్ని వక్రీకరించేందుకు ప్రయత్నించే అవకాశం ఏర్పడింది. అటువంటి ధోరణి వర్తమాన ప్రపంచంలో ఇండియాతో సహా అనేక రాజ్యాలలో మనం గమనించవచ్చు.

4. మెజారిటీ నియంతృత్వం (Tyranny of Majority): వ్యక్తి స్వేచ్ఛ మెజారిటీ నియంతృత్వంచే అణచివేతకు గురవుతుంది. శాసనసభలో మెజారిటీ సభ్యులు మద్దతును కలిగి ఉండడం ద్వారా అధికారపక్షం ప్రజల అభిప్రాయాలు, ఆకాంక్షలను పట్టించుకోకుండా చట్టాలను రూపొందిస్తుంది. అటువంటప్పుడు అధికారపక్ష వైఖరితో వ్యక్తిస్వేచ్ఛకు ప్రమాదం ఏర్పడుతుంది. అటువంటి పార్టీకి అధికారంలో కొనసాగేందుకు లేదా ప్రతిపక్షంగా వ్యవహరించేందుకు అవకాశాన్నివ్వకుండా పౌరులు రాబోయే ఎన్నికలలో ఓటు హక్కుద్వారా అప్రమత్తంగా వ్యవహరించాలి.

AP Inter 1st Year Civics Study Material Chapter 5 స్వేచ్ఛ - సమానత్వం

ప్రశ్న 7.
స్వేచ్ఛ అంటే ఏమిటి ?
జవాబు:
ఏది లేకుండా మానవుడు తన మూర్తిమత్వాన్ని అభివృద్ధి చేసుకోలేడో, అటువంటి అనివార్యమైన నిబంధనే స్వేచ్ఛ. నిజానికి స్వేచ్ఛకు తగిన అర్థాన్ని ఇవ్వటమన్నది బహుకష్టమైన పని. ఎందుకంటే, దీనిని విభిన్న వర్గాలకు చెందినవారు విభిన్నమైన అర్థాలతో సంబోధించారు.

Liberty అనే ఇంగ్లీషు పదం ‘లిబర్’ అనే లాటిన్ పదం నుంచి ఆవిర్భవించింది. లాటిన్ భాషలో ‘లిబర్’ అనే పదానికి అర్థం ‘ఆంక్షల నుంచి విముక్తి. రాజకీయపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో వ్యక్తులు పాల్గొనుటకు ఉండే హక్కులు, బాధ్యతల సాధనమే స్వేచ్ఛ అని ప్రాచీన గ్రీకు రాజనీతి తత్త్వవేత్తలు భావించారు. నిఘంటువులలో స్వేచ్ఛపదాన్ని వివిధ రకాలుగా ప్రస్తావించడమైంది. కొలంబియా విజ్ఞాన సర్వస్వంలో వ్యక్తుల వాక్ స్వాతంత్ర్యం, ఆత్మరక్షణ హక్కు వంటి విభిన్న స్వాతంత్ర్యాలను వర్ణించేందుకై ‘స్వేచ్ఛ’ అనే పదాన్ని ఉపయోగించడమైనది. వాస్తవానికి వ్యక్తి తన ఇష్టానుసారం, ఏదిపడితే అది చేయటానికి స్వేచ్ఛ అనుమతినివ్వదు. సమాజం నియంత్రించిన కొన్ని సాంఘిక, నైతిక ఆంక్షలకు లోబడి వ్యక్తులు గౌరవప్రదమైన జీవితాన్ని గడిపేందుకు స్వేచ్ఛను వినియోగించుకోవాలి. ఇతరులకు హాని కలిగించని వ్యక్తి ప్రవర్తనే స్వేచ్ఛ పరమార్థంగా పేర్కొనవచ్చు.

ప్రశ్న 8.
స్వేచ్ఛకు గల ఏవైనా మూడు ధృక్కోణాలను పేర్కొనండి.
జవాబు:
స్వేచ్ఛకు రెండు ధృక్కోణాలు ఉంటాయి. అవి 1. సకారాత్మకమైన ధృక్కోణం 2. నకారాత్మకమైన ధృక్కోణం.

1. సకారాత్మక ధృక్కోణం (Positive Aspect): సకారాత్మక ధృక్కోణంలో స్వేచ్ఛ అనేది వ్యక్తి తన అభీష్టం మేరకు నడుచుకొంటూ ఇతరులు కూడా తనవలె నడుచుకోవాలనే పరిస్థితిని సూచిస్తుంది. వేరొక మాటలో చెప్పాలంటే, ఇతరులకు హాని కలిగించని అధికారమే స్వేచ్ఛ అనే ధృక్కోణాన్ని సూచిస్తుంది. టి.హెచ్. గ్రీన్ అనే ఆదర్శ తత్త్వవేత్త ఈ రకమైన స్వేచ్ఛా ధృక్కోణాన్ని ప్రతిపాదించాడు. “ఇతరులతో సమానంగా ఆనందంతో ఏదైనా చేసి అనుభవించేందుకు గల అధికారమే స్వేచ్ఛ” గా అతడు భావించాడు.

2. నకారాత్మక ధృక్కోణం (Nagative Aspect): నకారాత్మక ధృక్కోణంలో స్వేచ్ఛ అంటే ఎటువంటి ఆంక్షలు లేకపోవడం. తమ స్వాతంత్ర్యాల మీద ఎలాంటి ఆంక్షలు లేనప్పుడే వ్యక్తులు స్వాతంత్ర్యాన్ని పొందగలరు. అయితే, కొందరు దీన్ని వాస్తవ విరుద్ధమైనదిగా భావించారు. రాజ్యం ఆవిర్భావానికి పూర్యం మాత్రమే వ్యక్తులకు ఆంక్షలేని, స్వేచ్ఛ ఉందన్నారు. వారి ప్రకారం అటువంటి రాజ్యం అసాధ్యమైందే కాకుండా, ఆధునిక కాలంలో వ్యక్తులు స్వాతంత్య్రాన్ని అనుభవించే వీలు లేనిది కూడా అవుతుంది.

ప్రశ్న 9.
సమానత్వం అంటే ఏమిటి ? ఏవైనా మూడు రకాల సమానత్వాలను వివరించండి.
జవాబు:
సమానత్వం ఆధునికకాలంలో ఒక ప్రధాన ఆశయం. అది ప్రజాస్వామ్య ఆదర్శం. మానవులంతా పుట్టుకతో సమానులని కొందరు నమ్మారు. సాంఘిక, ఆర్థిక, రాజకీయ వ్యవహారాలలో ప్రజలందరికి జాతి, మత, కుల, లింగ, | భాషా, ప్రాంతీయ, వర్ణ, వర్గ భేదాలు లేకుండా సమానావకాశాలుండటమే సమానత్వము. సమానత్వం అంటే (i) ఏ అడ్డంకులూ లేకుండా ప్రతి వ్యక్తీ వికాసం పొందడం, (ii) శాసనాలు పాలనలలో వ్యక్తుల మధ్య భేదం లేకుండా చేయడం (iii) చట్టం ప్రకారం లభించే హక్కులు సమానంగా లభించడం.

నిర్వచనం: “సమానత్వం అంటే సమాజంలో కొందరికి మాత్రమే ప్రత్యేకమైన హక్కులు, అవకాశాలు కాకుండా అందరికీ సమానావకాలు ఉండటమే” అని లాస్కీ నిర్వచించాడు. పుట్టుక, కులం, మతం, ఆస్తి వంటి అర్హతలనుబట్టి వ్యక్తులకు అవకాశాలు కలుగజేస్తే సమానత్వం లభించదు. అందరికీ సమానఆదరణ ఉండటమే సమానత్వానికి అవసరం. సమానత్వ సిద్ధాంతం ప్రకారం చట్టం ముందు అంతా సమానులే. ఆధునిక రాజ్యం ప్రజలందరికీ సాంఘిక, రాజకీయ, ఆర్థిక రంగాలలో సమానావకాశాలు కల్పించాలి.

AP Inter 1st Year Civics Study Material Chapter 5 స్వేచ్ఛ - సమానత్వం

1. సహజ సమానత్వం (Natural Equality): సహజ సమానత్వం అంటే అన్ని రకాల అవరోధాలు, సాంఘిక కట్టుబాట్ల నుంచి స్వాతంత్ర్యాన్ని పొందడం. దీని అర్థం వ్యక్తి పరిధిలో ఎటువంటి ఆంక్షలు ఉండకపోవడం. సహజ సమానత్వం గురించి థామస్ హాబ్స్ ప్రతిపాదించిన సామాజిక ఒడంబడిక సిద్ధాంతంలో పేర్కొనడమైంది. పౌర సమాజం ఆవిర్భవించక ముందే ప్రజలు ప్రాకృతిక వ్యవస్థలో జీవించారని ఈ సిద్ధాంతం పేర్కొన్నది. అసమానతలు, బంధనాలకు నాగరికత దారితీసిందని హాబ్స్ ఉద్ఘాటించాడు. గ్రీకు రోమన్ రాజకీయ తత్త్వవేత్తల రచనలలో ఈ భావం కనపడుతుంది.

2. సాంఘిక సమానత్వం (Social Equality): వర్గ వ్యత్యాసాలు లేకపోవడం, సమానమైన హోదాలు కలిగి ఉండటాన్ని సాంఘిక సమానత్వం సూచిస్తుంది. ఏ వ్యక్తి మతం, వర్గం, వర్ణ, లింగం, పుట్టుక వంటి అంశాల ఆధారంగా వివక్షతకు గురికాకుండా ఉంటే సాంఘిక సమానత్వం నెలకొంటుంది.

ఉదాహరణకు భారతరాజ్యాంగం కుల, వర్గపరమైన వ్యత్యాసాలను నిషేధించింది. వాస్తవానికి అస్త్రశ్యతను అది వ్యతిరేకించింది. పౌరులందరూ సాంఘిక సమానత్వాన్ని అనుభవించినప్పుడు, ఏ ఒక్కరు ఇతరులతో పోల్చినచో కులం, వర్గం, వర్ణం, పుట్టుక, తెగ, జన్మస్థలం వంటి అంశాలపై ఏ విధమైన వివక్షతకు గురికారు. ఈ సందర్భంలో క్రింద పేర్కొన్న అంశాలు సాంఘిక సమానత్వ సాధన, కొనసాగింపులకు సహాయపడతాయని చెప్పవచ్చు.

  1. రాజ్యం ఏ ఒక్క పౌరుడికి ప్రత్యేక సౌకర్యాలను అనుమతించరాదు.
  2. విద్య, ఉపాధి, పరిపాలన, శాసన నిర్మాణం వంటి రంగాలలో ప్రభుత్వం ఒకే విధానాన్ని పాటించి, అమలు చేయాలి.
  3. సాంఘిక, మతపరమైన వ్యవహారాలలో ప్రజలు సహనం, త్యాగం, నిజాయితీ వంటి లక్షణాలతో కూడిన విశాల దృక్పథాన్ని కలిగి ఉండాలి.
  4. రాజ్యంలోని పౌరులు తోటి పౌరులతో సహృద్భావ సంబంధాలను ఏర్పరచుకొని కొనసాగించుకోవాలి.
  5. తమ విజ్ఞాపనలను పంపించేటప్పుడు కులం, తెగ, లేక మతం వంటి వాటిని సూచించే పేర్లను ప్రజలు ఉపయోగించరాదు.
  6. కులాంతర వివాహాలను ప్రోత్సహించాలి.

3. ఆర్థిక సమానత్వం (Economic Equality): ఆర్థిక సమానత్వాన్ని సాంఘిక, రాజకీయ సమానత్వాలకు పునాదిగా పరిగణించడమైంది. ఆధునిక రాజ్యకార్యకలాపాల వెనుక అదొక ముఖ్యమైన చోదకశక్తిగా పనిచేస్తుంది. ఆర్థిక సమానత్వమంటే ఆదాయం, ఆస్తి, సంపదలలో విపరీతమైన వ్యత్యాసాలు లేకుండా చేయడంగా పేర్కొనవచ్చు. ఎర్నెస్ట్ బార్కర్ దృష్టిలో ఆర్థిక సమానత్వం అనేది హోదాకు, పాక్షికంగా ఆస్తి-ఆదాయాలకు సంబంధించిన అంశం. ఆర్థిక సమానత్వాన్ని “సంపదకు చెందిన వ్యత్యాసాలను తొలగించి ప్రయత్నంగా, ప్రాపంచిక వస్తువులను స్త్రీ, పురుషల మధ్య సమానంగా పంపిణీ చేయాల్సిన ప్రయత్నం”గా లార్డ్స్ భావించాడు. ప్రొఫెసర్ లాస్కీ “పారిశ్రామిక ప్రపంచంలో విశృంఖలమైన, బాధ్యతారహిత ఇచ్ఛను నిషేధించడాన్ని ఆర్థిక సమానత్వం”గా భావించాడు.

ప్రశ్న 10.
రాజకీయ సమానత్వం అంటే ఏమిటో రాయండి.
జవాబు:
రాజకీయ సమానత్వం (Political Equality): రాజకీయ సమానత్వం రాజకీయ కార్యకలాపాలలో ప్రజలకు చాలినన్ని అవకాశాలను కల్పించేందుకు అనుకూల పరిస్థితులను సూచిస్తుంది. రాజ్యంలోని పౌరులకు వివిధ రకాల రాజకీయ హక్కులను ప్రసాదించడం ద్వారా ఆ రకమైన సమానత్వాన్ని సాధించవచ్చు. ఈ సందర్భంలో రాజకీయ సమానత్వాన్ని పౌరులు మాత్రమే అనుభవిస్తారనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. రాజ్యంలో నివసించే అన్యులు, విదేశీయులకు ఇది వర్తించదు. ప్రజాస్వామ్యాన్ని విజయవంతం చేసేందుకు రాజకీయ సమానత్వమన్నది అత్యంత ఆవశ్యకమైంది. వివిధ రాజకీయ హక్కులను ప్రసాదించినప్పుడే పౌరులు రాజకీయ స్వేచ్ఛను అనుభవిస్తారు. అంటే, రాజకీయ సమానత్వమనేది రాజకీయ స్వేచ్ఛకు పర్యాయపదంగా భావించవచ్చు. రాజకీయ హక్కులను పౌరులు సక్రమంగా వినియోగించుకొన్నప్పుడే రాజకీయ సమానత్వం ఆచరణలో ఉన్నట్లుగా పేర్కొనవచ్చు. దూరదృష్టి, చిత్తశుద్ధి, నిజాయితీలు గల మంచి ఆదర్శప్రాయమైన అభ్యర్థులను ఎన్నుకొనేందుకు పౌరులు తమ రాజకీయ హక్కులను సద్వినియోగపరచుకోవాలి. ఓటు హక్కును వినియోగించుకొనేటప్పుడు వారు ఎటువంటి బహుమానాలు లేదా ప్రలోభాలకు లోనుకాకూడదు. దేశప్రగతి కోసం గట్టిగా కృషి చేసేవారికే వారు తమ మద్దతు ప్రకటించాలి. కనీస విద్య, అక్షరాస్యత, ఆర్ధిక స్వయంసమృద్ధి, రాజకీయ అవగాహనలను వారు కలిగి ఉండాలి. తమ అభీష్టానికి విరుద్ధంగా వ్యవహరించే పాలన, కార్య- నిర్వహణాధికారులు, శాసనసభ్యుల విధానాలను విమర్శించేందుకు వారు సందేహించరాదు. అయితే అటువంటి విమర్శలు రాజ్యాంగ అంశాల పరిధిలోనే జరగాలి. శాంతియుత మార్గాల ద్వారా తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలి. ప్రభుత్వాధికారాన్ని చేపట్టే అవకాశం ఉన్నప్పుడు ఎంతో హేతువు, బాధ్యత, విశ్వసనీయతలతో వారు తమ అధికారాలను నిర్వహించాలి. అటువంటప్పుడే రాజ్యంలో రాజకీయ సమానత్వం ఉనికిలో ఉంటుందని చెప్పవచ్చు.

AP Inter 1st Year Civics Study Material Chapter 5 స్వేచ్ఛ - సమానత్వం

రాజకీయ సమానత్వం అనేది ప్రజాస్వామ్య రాజ్యంలో మాత్రమే అమలులో ఉంటుంది. రాజరికం, కులీన పాలన వంటి ఇతర ప్రభుత్వ రకాలలో అది కానరాదు. ఎందుకంటే రాజకీయ వ్యవహారాలలో పౌరులకు ఆ ప్రభుత్వాలు సమానావకాశాలను కల్పించవు.

ప్రశ్న 11.
ఆర్థిక సమానత్వం ప్రాధాన్యత గురించి చర్చించండి.
జవాబు:
ఆర్థిక సమానత్వం (Economic Equality): ఆర్థిక సమానత్వాన్ని సాంఘిక, రాజకీయ సమానత్వాలకు | పునాదిగా పరిగణించడమైంది. ఆధునిక రాజ్య కార్యకలాపాల వెనుక అదొక ముఖ్యమైన చోదకశక్తిగా పనిచేస్తుంది. ఆర్థిక సమానత్వమంటే ఆదాయం, ఆస్తి, సంపదలలో విపరీతమైన వ్యత్యాసాలు లేకుండా చేయడంగా పేర్కొనవచ్చు. ఎర్నెస్ట్ బార్కర్ దృష్టిలో ఆర్థిక సమానత్వం అనేది హోదాకు, పాక్షికంగా ఆస్తి – ఆదాయాలకు సంబంధించిన అంశం. ఆర్థిక సమానత్వాన్ని “సంపదకు చెందిన వ్యత్యాసాలకు తొలగించి ప్రయత్నంగా, ప్రాపంచిక వస్తువులను స్త్రీ పురుషుల మధ్య సమానంగా పంపిణీచేయాల్సిన ప్రయత్నంగా లార్డ్స్ భావించాడు. ఇక ప్రొఫెసర్ లాస్కి “పారిశ్రామిక ప్రపంచంలో విశృంఖలమైన, బాధ్యతారహిత ఇచ్ఛను భావించాడు. అదేసమయంలో ఆర్థిక సమానత్వమనేది సమాన ఆదరణ, ప్రతిఫలంగా భావించరాదు. వ్యక్తులు తగిన పనిని పొందే అవకాశం ద్వారా జీవనభృతిని సంపాదించుకొని, తమ ఆర్థిక హోదాను పెంపొందించుకొనేందుకు అది సంకేతంగా ఉంటుంది. అనేక సామ్యవాద దేశాలు ఆర్థిక సమానత్వ సాధనకు ప్రయత్నించి పాక్షికంగా విజయవంతమైనాయి.

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
స్వేచ్ఛకు చెందిన ఏవైనా రెండు నిర్వచనాలను పేర్కొనండి.
జవాబు:

  1. హెచ్.జె.లాస్కీ: “వ్యక్తులు వారంతటవారు ఉత్తమమైన అవకాశాలను పొందగలిగి, నిర్వహించుకోగల వాతావరణమే స్వేచ్ఛ”.
  2. మాంటెస్క్యూ: “వ్యక్తులు సంకల్పించుకొని, సాధించగలిగే శక్తియే స్వేచ్ఛ.”

ప్రశ్న 2.
స్వేచ్ఛ యొక్క సకారాత్మక ధృక్పథాన్ని తెలపండి.
జవాబు:
సకారాత్మక ధృక్కోణం (Positive Aspect): సకారాత్మక ధృక్కోణంలో స్వేచ్ఛ అనేది వ్యక్తి తన అభీష్టం మేరకు నడుచుకొంటూ ఇతరులు కూడా తనవలె నడుచుకోవాలనే పరిస్థితిని సూచిస్తుంది. వేరొక మాటలో చెప్పాలంటే, ఇతరులకు హాని కలిగించని అధికారమే స్వేచ్ఛ అనే ధృక్కోణాన్ని సూచిస్తుంది. టి.హెచ్. గ్రీన్ అనే ఆదర్శ తత్త్వవేత్త ఈ రకమైన స్వేచ్ఛా ధృక్కోణాన్ని ప్రతిపాదించాడు. “ఇతరులతో సమానంగా ఆనందంతో ఏదైనా చేసి అనుభవించేందుకు గల అధికారమే స్వేచ్ఛ” గా అతడు భావించాడు.

ప్రశ్న 3.
స్వేచ్ఛకు చెందిన ఏవైనా నాలుగు లక్షణాలను పేర్కొనండి.
జవాబు:

  1. మానవీయ వ్యక్తిత్వాల సాధనకు అత్యంత ఆవశ్యకమైంది.
  2. స్వేచ్ఛ ఒక శక్తిమంతమైన భావన. దాని వ్యాఖ్యానమనేది స్థలం, కాలం, ప్రాంతం, ప్రజల ఆకాంక్షలను బట్టి ఉంటుంది.
  3. వ్యక్తుల ఆకాంక్షలను సదా వాస్తవం చేయడమే స్వేచ్ఛలక్ష్యం అవుతుంది.
  4. నిర్హేతుకమైన ఆంక్షలకు బదులు నిరంతరం సానుకూల పరిస్థితులను కలిగి ఉండటమే స్వేచ్ఛ.

AP Inter 1st Year Civics Study Material Chapter 5 స్వేచ్ఛ - సమానత్వం

ప్రశ్న 4.
స్వేచ్ఛలోని నాలుగు రకాలను ఉదహరించండి.
జవాబు:
స్వేచ్ఛలోని నాలుగు రకాలు:

  1. సహజ స్వేచ్ఛ
  2. పౌర స్వేచ్ఛ
  3. రాజకీయ స్వేచ్ఛ
  4. ఆర్థిక స్వేచ్ఛ.

ప్రశ్న 5.
పౌర స్వేచ్ఛ అంటే ఏమిటి ? [Mar. 2017]
జవాబు:
పౌర స్వేచ్ఛ (Civil Liberty): పౌరస్వేచ్ఛను వ్యక్తిగత స్వేచ్ఛ అని కూడ అంటారు. ఇది సామాజిక సంస్థలోని సభ్యుడైన వ్యక్తి జీవనంలోని స్వాతంత్య్రాన్ని తెలియజేస్తుంది. పౌరస్వేచ్ఛలో కింద పేర్కొన్న మూడు అంశాలు ఇమిడి ఉంటాయని బార్కర్ పేర్కొన్నాడు. 1) సంచార స్వేచ్ఛను సూచించే భౌతిక స్వాతంత్ర్యం ii) ఆలోచన, అభివ్యక్తి, విశ్వాసాన్ని కలిగి ఉండే భౌద్ధిక స్వాతంత్ర్యం, iii) నిజజీవితంలోని ఆచరణాత్మక ఐచ్ఛిక స్వాతంత్య్రం. పౌర స్వేచ్ఛ అనేది మిగతా స్వేచ్ఛలకు ప్రాతిపదికగా ఉంటుంది. సహజ స్వేచ్ఛకు ఇది విరుద్ధమైంది. సమాజంలోని పౌరులు దానిని అనుభవిస్తారు. ఒంటరిగా ఉంటున్న వ్యక్తులకిది ఆవశ్యకమైనది సమాజంలోని ప్రతిఒక్కరూ ప్రాపంచిక విషయాలను ఉమ్మడిగా అనుభవించ గలిగినప్పుడే పౌర స్వేచ్ఛ వాస్తవమవుతుంది.

“రాజ్యం చేత గుర్తించబడి అమలయ్యే హక్కుల సముదాయమే పౌర స్వేచ్ఛ” అని గెటిల్ పేర్కొన్నాడు.

పౌర స్వేచ్ఛ అనేది అనేక హక్కుల రూపంలో ఉంటుంది. అవి (i) జీవించే హక్కు (ii) పనిచేసే హక్కు (iii) ఆస్తి హక్కు (iv) వాక్ స్వాతంత్య్రం, భావవ్యక్తీకరణ, సమావేశ, సంచార, స్థిర నివాసపు హక్కులు మొదలైనవి.

ప్రశ్న 6.
రాజకీయ స్వేచ్ఛ గురించి రాయండి.
జవాబు:
రాజకీయ స్వేచ్ఛ (Political Liberty): రాజకీయ స్వేచ్ఛ పౌరులు రాజకీయాంశాలలో పాల్గొనేందుకు వీలు కల్పిస్తుంది. ఈ రకమైన స్వేచ్ఛ పౌరులకు రాజ్య కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొనే శక్తినిస్తుందని లాస్కీ పరిగణించాడు. రాజకీయ స్వేచ్ఛను ప్రజాస్వామ్యానికి పర్యాయపదంగా గిల్ క్రిస్ట్ భావించాడు. రాజకీయ స్వేచ్ఛ అంటే ఎవరికి వారు
తమ ప్రభుత్వాన్ని ఎంపిక చేసుకొనే రాజ్యాంగ స్వేచ్ఛగా లీకాక్ వర్ణించాడు. రాజకీయ స్వేచ్ఛ పౌరులకు మాత్రమే పరిమితమైంది. అది సంవర్ధక స్వభావాన్ని కలిగి ఉంటుంది. రాజకీయ స్వేచ్ఛ పౌరులకు రాజకీయాంశాలలో వివిధ హక్కులను కల్పిస్తుంది. అటువంటి వాటిలో 1) ఓటు వేసే హక్కు ii) ఎన్నికలలో అభ్యర్థులుగా పోటీ చేసేహక్కు iii) ప్రభుత్వ పదవులను చేపట్టే హక్కు iv) విమర్శించే హక్కువంటివి ఉన్నాయి. విద్య, నిజాయితీ, నిష్పక్షపాతమైన పత్రికలు మొదలైనవి ఉన్నప్పుడే రాజకీయ స్వేచ్ఛ వాస్తవం అవుతుందని లాస్కీ నొక్కి చెప్పాడు.

AP Inter 1st Year Civics Study Material Chapter 5 స్వేచ్ఛ - సమానత్వం

ప్రశ్న 7.
సంపూర్ణ ఆర్థిక స్వేచ్చ సాధన సాధ్యమేనా అన్న విషయాన్ని తెలపండి.
జవాబు:
సంపూర్ణ ఆర్థిక స్వేచ్ఛసాధన ఈ క్రింది చర్యల ద్వారా సాధ్యమవుతుంది. అవి 1) కనీస వేతనాలను అందించటం 2) పనిహక్కుకు భరోసా కల్పించటం 3) నిరుద్యోగం, అనారోగ్యం వంటి అభద్రతల నుండి కార్మికులను రక్షించటం 4) తగినంత విశ్రాంతిని కల్పింటం 5) పరిశ్రమల యాజమాన్యంలో కార్మికులకు ప్రాతినిధ్యం కల్పించటం.

ప్రశ్న 8.
ఆర్థిక స్వేచ్ఛ అంటే ఏమిటి ? [Mar. 2016]
జవాబు:
ఆర్థిక స్వేచ్ఛ (Economic Liberty): ఆర్థిక స్వేచ్ఛ అంటే ప్రతిఒక్కరూ తమ జీవనోపాధిని తామే సంపాదించుకోగలగడం. ఒక వ్యక్తి తన రోజువారీ ఆహారాన్ని హేతుబద్ధంగా సంపాదించుకొనే భద్రమైన అవకాశమే ఆర్థికస్వేచ్ఛగా లాస్కీ అభివర్ణించాడు. కోరిక – భయము, ఆకలి – పస్తులు, నిరద్యోగం – అసంపూర్ణతల నుంచి విముక్తి కలిగించేదే ఆర్థిక స్వేచ్ఛ. ఇది ఆర్థిక సంబంధమైన లేమి లేదా అభద్రతల నుంచి స్వాతంత్ర్యాన్ని సూచిస్తుంది. ఆర్థిక స్వేచ్ఛలేని ప్రజాస్వామ్యం అర్థరహితమైంది.

ఈ దిగువ పేర్కొన్న చర్యల అమలు ద్వారా ఆర్థిక స్వేచ్ఛను పొందవచ్చు.

  1. కనీస వేతనాలను అందించడం.
  2. పనిహక్కుకు భరోసా కల్పించడం.
  3. నిరుద్యోగం, అనారోగ్యం వంటి వివిధ రకాల అభద్రతల నుంచి కార్మికులను రక్షించడం.
  4. తగినంత విశ్రాంతిని కల్పించడం.
  5. పరిశ్రమల యాజమాన్యంలో కార్మికులకు ప్రాతినిధ్యం కల్పించడం.

ప్రశ్న 9.
జాతీయ స్వేచ్ఛ గురించి తెలపండి.
జవాబు:
జాతీయ స్వేచ్ఛ (National Liberty): జాతీయ స్వేచ్ఛ అంటే రాజ్యం – స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను కలిగి ఉండడంగా పేర్కొనవచ్చు. రాజ్యపు సార్వభౌమత్వాన్ని అది సూచిస్తుంది. ప్రతి రాజ్యం ఈ స్వేచ్ఛను అనుభవిస్తూ ఇతర రాజ్యాల ఆధిపత్యానికి లోనుగాకుండా ఉంటుంది. అన్ని రంగాలలో జాతి అభివృద్ధికి ఈ స్వేచ్ఛ ఆవశ్యకమైంది. ప్రాచీనకాలం నుంచి అనేక దేశాల్లో ఇది విశదమైంది. ఈ రకమైన స్వేచ్ఛను పొందడం కోసం అనేకదేశాలు ఎంతగానో ప్రయత్నించాయి. గతంలో టర్కీ ప్రజలకు వ్యతిరేకంగా గ్రీకులు స్వాతంత్య్ర సమరం సాగించారు. అట్లాగే మహాత్మాగాంధీ నాయకత్వంలో భారత ప్రజలు బ్రిటిష్ పాలన నుంచి స్వాతంత్ర్యం కోసం అహింసాయుత పోరాటం చేశారు. జాతీయ స్వేచ్ఛ ఎంతో విలువైంది.

AP Inter 1st Year Civics Study Material Chapter 5 స్వేచ్ఛ - సమానత్వం

ప్రశ్న 10.
స్వేచ్ఛకు గల ఏవైనా నాలుగు పరిరక్షణలను పేర్కొనండి.
జవాబు:
స్వేచ్ఛకు గల నాలుగు పరిరక్షణలు

  1. ప్రజాస్వామ్య పాలన
  2. లిఖిత మరియు దృఢ రాజ్యాంగం
  3. స్వతంత్ర న్యాయవ్యవస్థ
  4. సమన్యాయపాలన.

ప్రశ్న 11.
స్వేచ్ఛా పరిరక్షణగా స్వతంత్ర న్యాయశాఖను గురించి వ్రాయండి.
జవాబు:
వ్యక్తి స్వేచ్ఛకు పరిరక్షణయే స్వతంత్ర, నిష్పాక్షిక న్యాయవ్యవస్థ. న్యాయవ్యవస్థ రాజ్యాంగాన్ని సమర్థించి, ప్రభుత్వం ప్రజలకు బాధ్యత వహించేటట్లు చూస్తుంది. పౌరుల ప్రాథమిక హక్కులను కాపాడేందుకు వివిధ రక్షణలను సూచిస్తుంది. కావున స్వేచ్ఛ పరిరక్షించబడటానికి స్వతంత్ర న్యాయశాఖ అత్యంత అవసరం అని రాజనీతిజ్ఞులు భావిస్తారు.

ప్రశ్న 12.
సమానత్వం అంటే ఏమిటి ?
జవాబు:
సమానత్వం ఆధునిక కాలంలో ఒక ప్రథాన ఆశయం. అది ప్రజాస్వామ్య ఆదర్శం. మానవులంతా పుట్టుకతో సమానులని కొందరు నమ్మారు. సాంఘిక, ఆర్థిక, రాజకీయ వ్యవహారాలలో ప్రజలందరికి జాతి, మత, కుల, లింగ, భాష, ప్రాంతీయ, వర్ణ, వర్గ భేదాలు లేకుండా సమానావకాశాలు ఉండటమే సమానత్వము. సమానత్వం అంటే (i) ఏ అడ్డంకులు లేకుండా ప్రతి వ్యక్తి వికాసం పొందడం (ii) శాసనాలు పాలనలలో వ్యక్తుల మధ్య భేదం లేకుండా చేయడం (iii) చట్ట ప్రకారం లభించే హక్కులు సమానంగా లభించడం.

ప్రశ్న 13.
సమానత్వంలోని వివిధ సూచితార్థాలను పేర్కొనండి.
జవాబు:

  1. ఏ వ్యక్తికి లేదా వ్యక్తుల సమూహానికి ఎటువంటి అదనపు సౌకర్యాలు ఉండరాదు.
  2. తమ వ్యక్తిత్వాలను అభివృద్ధి చేసుకొనుటకు సరిపడినన్ని అవకాశాలు వ్యక్తులకు ఉండాలి.
  3. వ్యక్తుల మధ్య కులం, మతం, రంగు, జన్మస్థలం వంటి వివక్షలు ఉండరాదు. అయితే కొన్ని న్యాయ సమ్మతమైన కారణాల వల్ల రక్షిత వివక్షను పాటించవచ్చు.

AP Inter 1st Year Civics Study Material Chapter 5 స్వేచ్ఛ - సమానత్వం

ప్రశ్న 14.
సంపూర్ణ సమానత్వపు దృక్పథాలేవి ?
జవాబు:
సంపూర్ణ సమానత్వానికి రెండు దృక్పథాలున్నాయి. అవి 1) సకారాత్మక దృక్పథం 2) నకారాత్మక దృక్పథం. సమానత్వం అంటే అందరికి తగినన్ని అవకాశాలను కల్పించాలి అని సకారాత్మక దృక్పథం సూచిస్తుంది. కులం, మతం, రంగు, పుట్టుక, ప్రాంతం వంటి కృత్రిమ కారణాలతో ఎటువంటి వివక్షతను పాటించరాదని నకారాత్మక దృక్పథం సూచిస్తుంది.

ప్రశ్న 15.
సమానత్వం లక్షణాలలో రెండింటిని గురించి రాయండి.
జవాబు:

  1. సమానత్వం ప్రకృతి ప్రసాదించింది కాదు. తిరుగులేని సమాతన్వం ఎక్కడా కనిపించదు.
  2. సమానత్వం నిరపేక్షమైనదికాదు. నిరపేక్ష సమానత్వం సాకారమయ్యేదికాదు. అభిలాషించేదికాదు. చరిత్రలో ఏ కాలంలోనూ వ్యక్తులు తిరుగులేని సమానత్వాన్ని కోరలేదు. కాబట్టి సమానత్వానికి అర్థం ఏకరూపత కాదు.

ప్రశ్న 16.
సమానత్వపు వివిధ రకాలను తెలపండి.
జవాబు:
సమానత్వపు వివిధ రకాలు

  1. సహజ సమానత్వం
  2. సాంఘిక సమానత్వం
  3. ఆర్థిక సమానత్వం
  4. రాజకీయ సమానత్వం
  5. అంతర్జాతీయ సమానత్వం.

ప్రశ్న 17.
సహజ సమానత్వాన్ని వివరించండి. [Mar. 2016]
జవాబు:
సహజ సమానత్వం (Natural Equality): సహజ సమానత్వం అంటే అన్ని రకాల అవరోధాలు, సాంఘిక కట్టుబాట్ల నుంచి స్వాతంత్ర్యాన్ని పొందడం. దీని అర్థం వ్యక్తి పరిధిలో ఎటువంటి ఆంక్షలు ఉండకపోవడం. సహజ సమానత్వం గురించి థామస్ హాబ్స్ ప్రతిపాదించిన సామాజిక ఒడంబడిక సిద్ధాంతంలో పేర్కొనడమైంది. పౌర సమాజం ఆవిర్భవించక ముందే ప్రజలు ప్రాకృతిక వ్యవస్థలో జీవించారని ఈ సిద్ధాంతం పేర్కొన్నది. అసమానతలు, బంధనాలకు నాగరికత దారితీసిందని హాబ్స్ ఉద్ఘాటించాడు. గ్రీకు రోమన్ రాజకీయ తత్త్వవేత్తల రచనలలో ఈ భావం కనపడుతుంది.

ప్రశ్న 18.
సాంఘిక సమానత్వం అంటే ఏమిటి ? [Mar. 2017]
జవాబు:
వర్గ వ్యత్యాసాలు లేకపోవడం, సమానమైన హోదాను కలిగి ఉండటాన్ని సాంఘిక సమానత్వం సూచిస్తుంది. ఏ వ్యక్తి మతం, వర్గం, వర్ణం, లింగం, పుట్టుక మొదలగు అంశాల ఆధారంగా వివక్షతకు గురికాకుండా ఉంటే సాంఘిక సామానత్వం నెలకొంటుంది. సమాజంలో పౌరులందరినీ సమానమైనవారుగా సాంఘిక సమానత్వం భావిస్తుంది. పౌరులందరూ సమానమైన సాంఘిక, రాజకీయ, ఆర్థిక, చట్టపరమైన హక్కులను అనుభవించేందుకు వీలు కల్పించే సమానత్వాన్నే సాంఘిక సమానత్వం అని అంటారు.

AP Inter 1st Year Civics Study Material Chapter 5 స్వేచ్ఛ - సమానత్వం

ప్రశ్న 19.
రాజకీయ సమానత్వం అంటే ఏమిటి ? [Mar. 2018]
జవాబు:
రాజకీయ సమానత్వం (Political Equality): రాజకీయ సమానత్వం రాజకీయ కార్యకలాపాలలో ప్రజలకు చాలినన్ని అవకాశాలను కల్పించేందుకు అనుకూల పరిస్థితులను సూచిస్తుంది. రాజ్యంలోని పౌరులకు వివిధ రకాల రాజకీయ హక్కులను ప్రసాదించడం ద్వారా ఆ రకమైన సమానత్వాన్ని సాధించవచ్చు. ఈ సందర్భంలో రాజకీయ సమానత్వాన్ని పౌరులు మాత్రమే అనుభవిస్తారనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. రాజ్యంలో నివసించే అన్యులు, విదేశీయులకు ఇది వర్తించదు. ప్రజాస్వామ్యాన్ని విజయవంతం చేసేందుకు రాజకీయ సమానత్వమన్నది అత్యంత ఆవశ్యకమైంది. వివిధ రాజకీయ హక్కులను ప్రసాదించినప్పుడే పౌరులు రాజకీయ స్వేచ్ఛను అనుభవిస్తారు. అంటే, రాజకీయ సమానత్వమనేది రాజకీయ స్వేచ్ఛకు పర్యాయపదంగా భావించవచ్చు.

ప్రశ్న 20.
ఆర్థిక సమానత్వ సాధనకై చేపట్టే చర్యలను పేర్కొనండి.
జవాబు:
ఈ దిగువ పేర్కొన్న చర్యలను చేపట్టడం ద్వారా ఆర్థిక సమానత్వాన్ని సాధించవచ్చు.

  1. ఆస్తి, సంపద మరియు ఆదాయాలలో ఉన్న విపరీతమైన వ్యత్యాసాలను తొలగించాలి.
  2. ప్రాపంచిక వస్తువులను స్త్రీ, పురుషుల మధ్య సమానంగా పంపిణీ చేయాలి.
  3. వ్యక్తులకు వారికి తగిన పనిని పొంది, జీవనభృతిని సంపాదించుకొని, తమ ఆర్థిక హోదాను పెంపొందించుకొనేలా అవకాశాలను కల్పించాలి.

AP Inter 1st Year Zoology Study Material Chapter 8 జీవావరణం – పర్యావరణం

Andhra Pradesh BIEAP AP Inter 1st Year Zoology Study Material 8th Lesson జీవావరణం – పర్యావరణం Textbook Questions and Answers.

AP Inter 1st Year Zoology Study Material 8th Lesson జీవావరణం – పర్యావరణం

అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
జీవావరణాన్ని నిర్వచించండి. (జీవావరణ శాస్త్రం నిర్వచించండి)
జవాబు:
జీవావరణ శాస్త్రం (Ecology) అనేపదం గ్రీకు భాషనుండి గ్రహించబడినది.

జీవులకు, పరిసరాలకు మధ్యగల సంబంధాన్ని తెలిపే విజ్ఞాన శాస్త్ర విభాగాన్ని జీవావరణశాస్త్రం’ అని ఎర్నెస్ట్వెక్ల్ నిర్వచించారు.

ప్రశ్న 2.
జీవావరణ జనాభా అంటే ఏమిటి?
జవాబు:
ఒక నిర్ధిష్ట ప్రదేశంలో నివసించే ఒకేజాతికి చెందిన జీవుల సమోహాన్ని ఒక ‘జీవావరణ జనాభా’ అంటారు.

ప్రశ్న 3.
జీవ సమాజాన్ని నిర్వచించండి.
జవాబు:
ఒక ప్రాంతంలో ఉంటే వివిధ జాతుల జనాభాను మొత్తాన్ని జీవ సమాజంగా చెప్పవచ్చును. దీనిలో ఉత్పత్తి దారులు, వినియోగదారులు, విచ్ఛినకారులు అందరు చర్య ప్రతిచర్య జరుపుతూ జీవిస్తారు.

ప్రశ్న 4.
జీవావరణ వ్యవస్థ అంటే ఏమిటి?
జవాబు:
జీవ సమాజం తరువాత స్థాయి జీవావరణ వ్యవస్థ (Ecosystem) ఇది జీవగోళం యొక్క క్రియాత్మక ప్రమాణం దీనిలో జీవులు ఒక వైపు తమలో తాము, మరొకవైపు పరిసరాలతోను అంతరచర్యలు జరుపుతాయి.

ప్రశ్న 5.
జీవావరణ వ్యవస్థ, జీవ మండలాల మధ్య వ్యత్యాసాన్ని చూపండి.
జవాబు:

జీవావరణ వ్యవస్థజీవ మండలం
ఇది ఒక నిర్ధిష్ట ప్రాంతానికి చెందని జీవవ్యవస్థ. దీనిలో జీవ జాతులు, భౌగోళిక పరిస్థితులు నిర్ధిష్టంగా ఉంటాయి.ఇది భూతల ప్రకృతి భౌమిక ప్రమాణంగానే సహజ సరిహద్దులతో కూడిన వివిధ రకాల జీవావరణ వ్యవస్థలను కలిగి ఉంటుంది.

AP Inter 1st Year Zoology Study Material Chapter 8 జీవావరణం – పర్యావరణం

ప్రశ్న 6.
జీవ మండలం అంటే ఏమిటి? మీరు చదివిన ఏవైనా రెండు జీవ మండలాల పేర్లు రాయండి.
జవాబు:
ఒక విశాల ప్రాంతంలో జీవించే మొక్కలు, జంతువులు సమూహాన్ని జీవమండలం అంటారు.
ఉదా : ఉష్ణమండల వర్ష అరణ్యాలు, ఎడారులు, కోనిఫెరస్ అరణ్యాలు, టండ్రాలు మొదలగునవి.

ప్రశ్న 7.
జీవ గోళం అంటే ఏమిటి?
జవాబు:
భూమండలంలోని అన్ని రకాల ఆవాసప్రాంతాలన్నీ సంయుక్తంగా జీవ గోళం లేదా ఇకోస్ఫియర్ లేదా బయోస్ఫియర్ అంటారు.

ప్రశ్న 8.
ఒక జీవి ఆవాసం, నిచేల మధ్య భేదాన్ని తెలపండి.
జవాబు:
ఆవాసం ఒక జీవి నివసించే ఒక నిర్థిష్ట ప్రాంతాన్ని ఆవాసం అంటారు. నిచే ఒక సమాజంలో జీవులు నిర్వహించే క్రియాత్మక పాత్రను నిచే (Niche) అంటారు.

ప్రశ్న 9.
జీవసమాజంలో కంటే జనాభాలో జన్యు సారూప్యం గల జీవులు అధికంగా ఉంటాయి. వివరించండి.
జవాబు:
జీవ సమాజం అనగా ఒక నిర్ధిష్ట ప్రాంతంలో వివిధ జాతుల జీవులు కలిసి జీవించడాన్ని జీవ సమాజంఅంటారు. దీనిలో జీవ జాతులు చాలా వైవిధ్యాలు కలిగి ఉంటాయి.

జనాభా :
ఒక నిర్దిష్ట ప్రాంతంలో నివసించే ఒక జాతి జీవుల సమూహాన్ని ఆ జాతి జనాభా అంటారు. ఒకజాతి ఒకేరకమైన జన్యువులను పంచుకుంటాయి.

ప్రశ్న 10.
అంటార్కిటిక్ జలాలలోని చేపలు తమ జీవ ద్రవాలను గడ్డకట్టకుండా ఏవిధంగా చూసుకొంటాయి?
జవాబు:
మిలియన్ల కొద్ది జరిగిన జీవ పరిణామక్రమంలో చేపల వంటి జీవులు అననుకూల పరిస్థితులలో (నీరు గడ్డకట్టినపుడు) కూడా జీవించడానికి అనుకూలంగా తమ దేహ బాహ్య, అంతర రూపాలలో అనుకూలతను సాధించాయి. జీవరసాయన అనకూలత వల్ల మరియు మంచు పొరక్రియ బొరియలు చేసుకుని సుప్తావస్థలో గడుపుతాయి.

ప్రశ్న 11.
ఎత్తైన పర్వతాలను ఎక్కినపుడు మీ శరీరం ఆల్టిట్యూడ్ సిక్నెస్ సమస్యను ఏవిధంగా పరిష్కరిస్తుంది?
జవాబు:
ఎత్తైన పర్వతాలను ఎక్కినపుడు ఏర్పడే ఆల్టిట్యూడ్ సిక్నెస్ సమస్య శరీరం ఎర్రరక్తకణాలపై ఉత్పత్తిని పెంచడం, శ్వాసక్రియా రేటుపెంచడం మరియు హీమోగ్లోబిన్ బంధన సామర్థ్యాన్ని కణ స్థాయిలలో తగ్గించడం ద్వారా తక్కువ ఆక్సిజన్ లభ్యతను భర్తీచేస్తుంది.

ప్రశ్న 12.
జంతువుల వర్ణకాలపై కాంతి ప్రభావం ఏమిటి?
జవాబు:
జంతువుల దేహరణంపై కాంతి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. తక్కువ కాంతిలో నివసించే జంతువులు లేత వర్ణంలోను, ఎక్కువ కాంతిలో నివసించే జంతువు గాఢ వర్ణంలో ఉంటాయి.

ప్రశ్న 13.
కాంతి గతిక్రమం, (Phototaxis) కాంతి అనుగమనం (Photokinesis) మధ్య భేదాలను తెలపండి.
జవాబు:
కాంతి గతిక్రమం :
కాంతి గతిక్రమం లేదా కాంతి అనుచలనం, కాంతి మార్గానికి అనుగుణంగా లేదా వ్యతిరేకదిశలో జీవులు చూపే దిగ్విన్యాసాన్ని కాంతి అనుచలనం అంటారు.
ఉదా : యుగ్లీనా ధనాత్మక అనుక్రియ.

కాంతి అనుగమనం :
జీవుల నిర్ధిష్ట చలనం మీద కాంతి కలుగజేసే ప్రభావాన్ని కాంతి అనుగమనం అంటారు.
ఉదా : మాసెల్ పీత డింభకాల చలనం కాంతి తీవ్రత వలన వేగవంతమవుతుంది.

AP Inter 1st Year Zoology Study Material Chapter 8 జీవావరణం – పర్యావరణం

ప్రశ్న 14.
సర్కేడియన్ లయలు అంటే ఏమిటి?
జవాబు:
24 గం|| కాలచక్రంలో ఏర్పడే జీవలయలను సర్కేడియన్ లయలు అంటారు.

ప్రశ్న 15.
కాంతి ఆవర్తిత్వం అంటే ఏమిటి?
జవాబు:
ఒక రోజులో లభించే కాంతి కాలాన్ని కాంతి వ్యవధి అంటారు. కాంతి వ్యవధికి అనుగుణంగా జీవి చూపే స్పందన చర్యలను కాంతి కాలావధి లేదా కాంతి ఆవర్తిత్వం అంటారు.

ప్రశ్న 16.
ఫోటోపీరియడ్, సందిగ్ధ(కీలక) ఫోటోపీరియడ్ మధ్యభేదాలను రాయండి.
జవాబు:
పోటోపీరియడ్ :
ఒకరోజులో లభించే కాంతి బలాన్ని ఫోటోపీరియడ్ లేదా కాంతివ్యవధి అంటారు.

సందిగ్ధ పోటోపీరియడ్ :
వివిధ ఋతువులలో జీవులలో కలిగే సంఘటనలు ప్రేరేపించడానికి అవసరమయ్యే కాంతి వ్యవధిని సందిగ్ధ కాంతి కాలం లేదా సందిగ్ధ పోటోపీరియడ్ అంటారు.

ప్రశ్న 17.
కొన్ని UV కిరణాల వల్ల మనం పొందే లాభాలు తెలపండి. [Mar. ’14]
జవాబు:
కొన్ని అతినీలలోహిత కిరణాలు (UV కిరణాలు) జంతువుల దేహం పైగల సూక్ష్మజీవులను నశింపజేస్తాయి. కొన్ని UV కిరణాలు క్షీరదాలు చర్మంలో గల స్టిరాల్స్న విటమిన్ D గా మార్చడంలో సహాయపడతాయి.

ప్రశ్న 18.
భ్రమణ రూప విక్రియ (Cyclomorphosis) అంటే ఏమిటి? డాఫ్నియాలో దాని ప్రాముఖ్యం వివరించండి.
జవాబు:
కొన్ని జంతువులలో రుతువులను బట్టి వాటి శరీర ఆకృతిలో మార్పులు ఏర్పడతాయి. ఈ దృగ్విషయాన్ని భ్రమణ రూప విక్రియ అంటారు.

డాఫ్నియా (వాటర్ ఫ్లీ) లో ఈ విషయాన్ని గమనించవచ్చు. దీని తలపై రుతువులకు అనుగుణంగా హెల్మెట్ వంటి నిర్మాణం అభివృద్ధి చెందటం తగ్గి పోవడం జరుగుతుంది. ఇది సరస్సులోని నీటి సాంద్రతలో సంభవించే మార్పులకు అనుగుణంగా జరుగుతుందని భావిస్తారు.

AP Inter 1st Year Zoology Study Material Chapter 8 జీవావరణం – పర్యావరణం

ప్రశ్న 19.
నియంత్రకాలు (Regulators) అంటే ఏమిటి?
జవాబు:
జీవులు శరీరధార్మిక చర్యల ద్వారా సమస్థితిని సాధించి, దేహ ఉష్ణోగ్రతను, ద్రవాభిసరణ గాఢతలను స్థిరంగా ఉంచుకుంటాయి. వీటినే నియంత్రకాలు అంటారు.
ఉదా : క్షీరదాలు, పక్షులు

ప్రశ్న 20.
ద్రవాభిసరణ అనువర్తనకారులు (Conformers) అంటే ఏమిటి?
జవాబు:
జలచర జీవులలో పరిసర ప్రాంత నీటి గాఢతను బట్టి శరీర ద్రవాల ద్రవాభిసరణ గాఢత మారుతుది. అటువంటి జీవులను ద్రవాభిసరణ అనువర్తకాలు లేదా ద్రవాభిసరణ అనురూపకాలు అంటారు.

ప్రశ్న 21.
సహభోజకత్వాన్ని (Commensalism) నిర్వచించండి. ఒక ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
రెండు వేర్వేరు జాతుల జీవుల మధ్య ఏర్పడే సన్నిహిత సంబంధం (అంతరచర్యలు) లో ఒక జీవి లాభం పొందుతుంది. రెండవ జీవి దానికి లాభం కాని, నష్టం కాని ఉండదు. ఇటువంటి అంతర చర్యలను సహభోజకత్వం అంటారు.
ఉదా : బర్నాకిల్ అనే చిన్న చేప తిమింగలంపై అంటుకొని ప్రయాణిస్తుంది. దీనివలన తిమింగలానికి లాభం కాని, నష్టంకాని లేదు.

ప్రశ్న 22.
అన్యోన్యాశ్రయ సహజీవనాన్ని (Mutualism) నిర్వచించండి. ఒక ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
వేరువేరు జాతి జీవుల మధ్య సహజీవనం (అంతర చర్యలు)లో రెండు జీవులు లబ్ధిపొందుతాయి. ఇటువంటి సహజీవనాన్ని ‘అన్యోన్యాశ్రయ సహజీవనం’అంటారు.
ఉదా : లైకెన్స్ – దానిలో ఫంగస్ ఆల్గె సహజీవన చేస్తాయి.
ఉదా : చెదపురుగు జీర్ణవ్యవస్థ ట్రైకోనిఫా. ప్రోటోజోవన్ అంతర పరాన్నజీవిగా ఉంటుంది. ఇది చెదపురుగులో సెల్యులోజ్న జీర్ణం చేస్తుంది. చెదపురుగు దీనికి ఆశ్రయమిస్తుంది.

ప్రశ్న 23.
ఎమెన్సాలిజమ్ (Amensalism) అంటే ఏమిటి? ఒక ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
ఎమెన్సాలిజమ్ అనేఅంతర చర్యల వల్ల ఒకజీవి నష్టపోతుంది. రెండవజీవిపై ఎటువంటి ప్రభావం ఉండదు.

ప్రశ్న 24.
జాత్యంతర పోటీ (Interspecific competition) అంటే ఏమిటి? ఒక ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
భిన్నజాతుల జీవుల మధ్య అందుబాటులోగల ఒకే రకమైన వనరుకోసం పోటీ ఉంటుంది. ఇటువంటి పోటీని జాత్యంతర పోటీ అంటారు. ఉదాహరణ : దక్షిణ అమెరికాలోని లోతు తక్కువగా ఉండే సరస్సులకు తరచుగా వేచే ఫ్లెమింగో పక్షులకు, అక్కడి చేపలకు ఒకే రకమైన ఆహారం జంతుప్లవకాల కోసం పోటీ ఉంటుంది.

ప్రశ్న 25.
కమోఫ్లేజ్ (Camouflage) అంటే ఏమిటి? దాని ప్రాముఖ్యం ఏమిటి?
జవాబు:
కొన్ని కీటకాలు, కప్పలు పరిసరాల రంగుతో సరిపోయేలా దేహపు రంగును మార్చుకుంటూ పరభక్షకాల నుండి రక్షించుకుంటాయి. దీనినే కమోప్లేజ్ అంటారు.

AP Inter 1st Year Zoology Study Material Chapter 8 జీవావరణం – పర్యావరణం

ప్రశ్న 26.
గాసె సూత్రం (Gause’s Principle) అంటే ఏమిటి? దాన్ని ఎప్పుడు అన్వయించవచ్చు?
జవాబు:
గాసె సూత్రం :
వనరులు తక్కువగా ఉన్నప్పుడు పోటీతత్వంలో బలమైన జీవులు మిగిలిన జాతులను నిర్మూలిస్తాయి. దీనిని ప్రయోగశాలలో సులువుగా నిరూపించవచ్చును.

ప్రశ్న 27.
మైకోరైజాలో ఉండే సహవాసం ఏమిటి?
జవాబు:
మైకోరైజాలో సహవాసం అన్యోన్యాశ్రయ సహజీవనం కనిపిస్తుంది.

ప్రశ్న 28.
స్థిరజల (Lentic), ప్రవాహజల (Lotic) ఆవాసాల మధ్య భేదాలను తెలపండి.
జవాబు:
స్థిర జల ఆవాసం :
నీరు నిలకడగా ఉండే స్థితిలోని జలాశయంను స్థిర జల (Lentic) జలావాసం అంటారు.
ఉదా : చెరువులు, కొలనులు.

ప్రవాహజల ఆవాసం :
ప్రవహించే స్థితిలోని జలవాసంను ప్రవాహజల (Lotic) జలావాసం అంటారు.
ఉదా : నదులు, కాలువలు

ప్రశ్న 29.
నీటి ఆవరణ వ్యవస్థలో ప్రతీకరణ మండలం (Compensation Zone) అంటే ఏమిటి?
జవాబు:
నీటి ఆవరణ వ్యవస్థలో తీరానికి దూరంగా కాంతి సమర్ధవంతంగా నీటిలోకి ప్రసరించగలిగే ప్రాంతంను ప్రతీకరణ లేదా ప్రతీహర మండలం అంటారు.

ప్రశ్న 30.
వృక్ష ప్లవకాలు, జంతు ప్లవకాల మధ్య భేదాలు రాయండి.
జవాబు:
వృక్ష ప్లవకాలు :
నీటిలో అవలంబితమై ఉండే వృక్ష సంబంధ సూక్షజీవులను వృక్ష ప్లవకాలు అంటారు. ఇవి స్వయం పోషకాలు. తమంత తాము చలించలేవు.
ఉదా : డయాటమ్స్ శైవలాలు, యుగ్లీనాయిడ్స్

జంతు ప్లవకాలు :
నీటిలో అవలంబితమై ఉండే సూక్ష్మ జంతుసంబంధ జీవులను జంతుప్లవకాలు అంటారు. ఇవి కొలనులో ప్రథమ వినియోగదారులు.
ఉదా : డాఫ్నియా, అమీబా, పేరమీషియం.

AP Inter 1st Year Zoology Study Material Chapter 8 జీవావరణం – పర్యావరణం

ప్రశ్న 31.
నెక్టాన్ (Nekton), న్యూస్టాన్ (Neuston) ల మధ్య భేదాలను రాయండి.
జవాబు:
నెక్టాన్ :
నీటిలో తమంత తాము చలించగలిగే జీవులను నెక్టాన్ అంటారు. ఉదా : చేపలు, తాబేళ్ళు, కప్పలు, నీటి తేళ్ళు.

న్యూస్టాన్ :
కొలను ఉపరితంలో నీరు, గాలి కలిసేస్థానంలో ఉండే జీవులను న్యూస్టాన్ అంటారు. ఉదా : వాటర్ స్పైడర్స్, బీటిల్స్, దోమ డింబకాలు.

ప్రశ్న 32.
పెరిఫైటాన్ అంటే ఏమిటి?
జవాబు:
జలావరణంలో నీటి మొక్కలను అంటిపెట్టుకొని లేదా పాకుతున్న జీవులకు పెరిఫైటాన్ అంటారు.
ఉదా : హైడ్రాలు, బ్రయోజోవన్స్, టర్బల్లేరియన్స్, కొన్ని కీటక డింబకాలు.

ప్రశ్న 33.
మానవ నిర్మిత (man-made) జీవావరణ వ్యవస్థలకు మూడు ఉదాహరణలు రాయండి.
జవాబు:
మానవ నిర్మిత జీవావరణం:
పంటభూమి జీవావర్ణం, జలసంవర్ధన చెరువులు, ఎక్వేరియం.

ప్రశ్న 34.
ద్రవాభిసర పోషణ అంటే ఏమిటి?
జవాబు:
ముందుగా జీర్ణమైన ఆహారాన్ని శరీర ఉపరితలం ద్వారా తీసుకోవడాన్ని ద్రవాభిసర పోషణ (Osmotrophic Nutrition) అంటారు.

ప్రశ్న 35.
విక్షాళన (Leaching) ప్రక్రియను వివరించండి.
జవాబు:
నీటిలో కరిగే అకర్బన పోషక పదార్థాలు నేలలోకి ఇంకి లభ్యంకాని (వినియోగపడని) లవణ అవక్షేపాలుగా ఏర్పడతాయి. దీనినే విక్షాళనం (Leaching) అంటారు.

AP Inter 1st Year Zoology Study Material Chapter 8 జీవావరణం – పర్యావరణం

ప్రశ్న 36.
PAR అంటే ఏమిటి?
జవాబు:
PAR :
మొక్కలు కిరణజన్య సంయోగ క్రియకు వినియోగార్హమైన వికిరణాన్ని లేదా సౌరశక్తిని PAR అంటారు.

ప్రశ్న 37.
పతన సౌర వికిరణంలో PAR శాతం ఎంత?
జవాబు:
పతన సౌర వికిరణంలో PAR శాతం 50% కంటే తక్కువ.

ప్రశ్న 38.
ఎంట్రోపీని నిర్వచించండి.
జవాబు:
ఉష్ణగతిక శాస్త్రం రెండవ సూత్రం ప్రకారం ఒక వ్యవస్థలోశక్తి మార్పిడికి లోనయ్యే ఏ ప్రక్రియ కూడా శక్తి నష్టం లేకుండా సహజంగా జరగదు. ఈ విధంగా కొంత శక్తి పనిచేయడానికి అందుబాటులో లేని ఉష్ణశక్తి రూపంలో వెలువడుతుంది. దీనినే ఎంట్రోపీ అంటారు.

ప్రశ్న 39.
స్టాండింగ్ క్రాప్ (Standing Crop) అంటే ఏమిటి?
జవాబు:
ఒక నిర్ణీత కాలంలో ప్రతి పోషక స్థాయిలో నిర్ణీత జీవపదార్థ ద్రవ్యరాశి ఉంటుంది. దీనిని స్టాండింగ్ క్రాప్ (Standing Crop) అంటారు.

ప్రశ్న 40.
GPP, NPP పదాలను వివరించండి.
జవాబు:
GPP – Gross primary productivity స్థూల ప్రాథమిక ఉత్పాదకత
NPP – Net Primary Porductivity నికర ప్రాథమిక ఉత్పాదకత.

AP Inter 1st Year Zoology Study Material Chapter 8 జీవావరణం – పర్యావరణం

ప్రశ్న 41.
నిటారు, తిరగబడిన జీవావరణ పిరమిడ్ల మధ్య తేడా తెలపండి.
జవాబు:

నిటారు పిరమిడ్స్తిరగబడిన పిరమిడ్స్
1. ఈ పిరమిడ్స్ ఉత్పత్తిదారుల స్థాయి నుండి శక్తి తరువాత స్థాయిలైన వినియోగదారులకు ప్రవాహాన్ని తెలియజేస్తాయి.1. ఇక్కడ ఉత్పత్తి దారులు లేదా ప్రథమస్థాయి వారి సంఖ్య తక్కువగా ఉంటుంది.
2. ఉత్పత్తిదారుల నుండి వినియోగదారుల సంఖ్య ‘తగ్గుతూ పోతుంది.
ఉదా : మేసే ఆహారపు గొలుసు
2. ఇది ప్రథమస్థాయి నుండి పైకి పోయిన కొలది జీవుల సంఖ్య పెరగడాన్ని చూసిస్తుంది.
ఉదా : పరాన్నజీవుల ఆహారపు గొలుసు

ప్రశ్న 42.
ఆహారగొలుసు, ఆహార జాలకాల మధ్య భేదాలు తెలపండి.
జవాబు:
ఆహారపు గొలుసు :
ఆహారశక్తి ఒక పోషణస్థాయి (ఉత్పత్తిదారులు) నుండి మరొక పోషణస్థాయి (వినియోగదారులకు) బదిలీ అయ్యే మార్గాన్ని నిలువుగా తీసుకుంటే వీటి మధ్యసంబంధాలు ఒక గొలుసులా ఉంటాయి. దీనిని ఆహారపు గొలుసు అంటారు.
ఉదా : మేసే ఆహారపు గొలుసు

ఆహార జాలకం :
ఆహారశక్తి ఒక పోషణ స్థాయినుండి (ఉత్పత్తిదారులు) నుండి మరొక పోషణ స్థాయికి (వినియోగదారులు) బదిలీ అయ్యే మార్గంలో వివిధ పోషణ స్థాయిలలోని జీవులు వేరు వేరు ఆహారపు అలవాట్లను కలిగి ఉంటే ఆహార శక్తి ప్రసరణ మార్గాన్ని తెలిపే రేఖాచిత్రం ఒక వలలా ఉంటుంది. దీనినే ఆహార జాలకం అంటారు.

ప్రశ్న 43.
లిట్టర్, డెట్రిటన్ల మధ్య భేదాలు తెలపండి.
జవాబు:
లిట్టర్ :
లిట్టర్ అంటే మృతజీవులు దేహ పదార్థంతో ఏర్పడిన ఒక రకమైన కర్బన సంబంధ ఎరువు. ఇది డెట్రయిటస్ ఆహారపు గొలుసులో ప్రధాన ఆహార వనరుగా ఉంటుంది.

డెట్రిటస్ :
ఇది కుళ్ళుతున్న కర్బన సంబంధ పదార్థం. ఇది విచ్ఛిన్న కారులచే విచ్ఛిన్నం చేయబడుతుంది.

ప్రశ్న 44.
ప్రాథమిక, ద్వితీయ ఉత్పాదకత మధ్య భేదాలను తెలపండి.
జవాబు:
ప్రాథమిక ఉత్పాదకత :
నిర్ణీత కాలంలో, నిర్ణీత వైశాల్యంలో మొక్కలలో ఉత్పత్తి చేయబడిన కర్బన పదార్థాన్ని లేదా జీవ ద్రవ్యరాశి మొత్తాన్ని ప్రాథమిక ఉత్పాదకత అంటారు.

ద్వితీయ ఉత్పాదకత :
ఉత్పత్తిదారుల నుండి గ్రహించిన పదార్థాలనుండి వినియోగదారులు కొత్తగా కర్బన పదార్థాలను ఏర్పరచే రేటును ద్వితీయ ఉత్పాదకత అంటారు.

ప్రశ్న 45.
ఆమ్ల వర్షాలకు కారకాలైన వాయు కాలుష్యాలు ఏమిటి?
జవాబు:
వాయు కాలుష్యకారకాలైన సల్ఫర్ డై ఆక్సైడ్ (SO2), నత్రజని ఆక్సైడ్ (NO2)లు ఆమ్లవర్షాలకు కారణమయ్యే వాయు కాలుష్యాలు.

ప్రశ్న 46.
BOD అంటే ఏమిటి?
జవాబు:
BOD – బయలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ (Biological Oxygen Demand), ఇది మురుగు నీటిలోని నిర్థిష్ట/ఉష్ణోగ్రత కాలవ్యవధిలో సేంద్రియ పదార్థాలను విచ్ఛిన్నం చేయడానికి కావలసిన వాయు సహిత జీవులకు అవసరం అయ్యే ఆక్సిజన్ స్థాయిని చూసిస్తుంది. దీనిలో పెరిగే ఆ నీరు కలుషితమైనదిగా భావించవచ్చును.

AP Inter 1st Year Zoology Study Material Chapter 8 జీవావరణం – పర్యావరణం

ప్రశ్న 47.
జీవావర్ధనం అంటే ఏమిటి?
జవాబు:
నీటి ఆహారపు గొలుసులో కాలుష్యం లేదా విషపదార్థ గాఢత ఒక పోషకస్థాయి నుంచి వేరొక పోషక స్థాయికి పెరుగుతూపోతే దాన్ని ‘జీవావర్ధనం’ అంటారు.

ప్రశ్న 48.
ఆసుపత్రులలో భస్మీకరణ యంత్రాలను ఎందుకు వాడతారు?
జవాబు:
ఆసుపత్రుల నుండి వెలువడే వ్యర్థాలలో ప్రమాదకర రసాయనాలు, వ్యాధికారక సూక్ష్మజీవులు ఉంటాయి. కనుక వీటిని వెంటనే కాల్చివేయవలెను. ఇలాకాల్చివేయడానికి భస్మీకరణ యంత్రాలను ఉపయోగిస్తారు.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
జీవికి స్థిర అంతర వాతావరణం వల్ల లాభాల దృష్ట్యా ‘అనుకారులు క్రమతాకారులుగా ఎందుకు పరిణామం చెందలేదు’ అని ఎందుకు అడుగుతాం?
జవాబు:
అనేక జంతువులు ఒక స్థిరమైన అంతర వాతావరణాన్ని కలిగి ఉండలేవు. పరిసరాలలోని ఉష్ణోగ్రతను బట్టి దేహ ఉష్ణోగ్రత మారుతుంది. జలచర జీవులలో పరిసర ప్రాంత నీటి గాఢతను బట్టి శరీరద్రవాల ద్రవాభిసరణ గాఢత మారుతుంది. అటువంటి జీవులను అనురూపకాలు (Conformers) అంటారు.

ఒంటెలాంటి జంతువులు ఒక స్థాయి వరకు ఉష్ణోగ్రత అనురూపకాలుగా, తరువాత నియంత్రకాలుగా ఉంటాయి. అందువల్ల వీటిని పాక్షిక నియంత్రకాలు (Partial regulators) లేదా పాక్షిక అనురూపకాలు (Partial conformers) అంటారు.

అనేక జంతువులలో శక్తి రీత్యా ఉష్ణ నియంత్రణ ‘ఖరీదైంది’. ఇది చిన్న జంతువులైన చుంచెలుకలు, హమ్మింగ్ పక్షులలో మరింత స్పష్టంగా కనిపిస్తుంది. ఉష్ణాన్ని గ్రహించడం, కోల్పోవడం అనేది ఉపరితల వైశాల్యంపై ఆధారపడుతుంది. చిన్న జంతువులలో ఉపరితల వైశాల్యం వాటి ఘనపరిమాణం కంటే ఎక్కువగా ఉండటం వల్ల బయట చల్లగా ఉన్నప్పుడు దేహం నుంచి ఉష్ణాన్ని త్వరగా కోల్పోతాయి. ఫలితంగా ఆ జీవులలో జీవక్రియ ద్వారా అత్యంత శక్తిని ఉపయోగించి ఉష్ణాన్ని ఉత్పత్తి చేసుకోవాలి. అందువల్ల ధృవ ప్రాంతాలలో చిన్న పరిమాణం గల జీవులు చాలా అరుదుగా ఉంటాయి. జీవపరిణామం జరుగుతున్న సందర్భాలలో స్థిర అంతర వాతావరణ నిర్వహణ జమ ఖర్చులను ప్రధానంగా పరిగణనలోకి తీసుకొంటారు. కొన్ని జాతులు వాతావరణ స్థితిగతులకు కొంతమేర నియంత్రణ సామర్థ్యాన్ని పెంపొందించుకున్నాయి. అది సాధ్యం కాకపోతే అనురూపకాలుగా ఉండిపోతాయి.

ప్రశ్న 2.
మంచులో దీర్ఘకాలం కూరుకుపోయిన వారిని పునరుద్ధరించడం సాధ్యమేనా? వివరించండి.
జవాబు:
వాతావరణంలోని ఉష్ణోగ్రత ఋతువులకు అనుగుణంగా మారుతూ ఉంటుంది. ఈ ఉష్ణోగ్రతా వ్యత్యాసాల వలన నీటిలో ఉష్ణస్థరాలు ఏర్పడతాయి. దీనినే ఉష్ణ స్థరీభవనం అంటారు. నీరు 4°C వద్ద అత్యధిక సాంద్రతను కలిగి ఉంటుంది. సాధారణంగా శీతాకాలంలో నీరు బాగా చల్లబడి 0°C కు చేరినప్పుడు ఉపరితల నీరు గడ్డకట్టి ఉపరితలంలో మంచుపొర ఏర్పడుతుంది. పైనున్న మంచుపొర క్రింద చల్లని నీరు 4°C తో ఉండి సరస్సును ఆక్రమిస్తుంది. మంచు పొరకు దిగువన జీవులు నివసించడానికి ఆవాసయోగ్యంగా ఉంటుంది. తక్కువ ఉష్ణోగ్రత వద్ద బాక్టీరియా క్రియాశీలత జంతువులలో ఆక్సిజన్ వినియోగం రేటు తగ్గుతుంది. అందువలన ఘనీభవనం చెందిన దిగువ ప్రాంతంలోని ఉపరితల నీటిలో హైపోక్సియా (ఆక్సిజన్ అందుబాటు తక్కువగా ఉన్నా) స్థితికి గురికాకుండా జీవులు మనుగడ సాగిస్తాయి.

పై విషయం ఆధారంగా మంచులో కూరుకుపోయిన జీవులు కొంతకాలం మంచుక్రింద (జలజీవులు) మనుగడ సాగించే అవకాశం ఉంది.

AP Inter 1st Year Zoology Study Material Chapter 8 జీవావరణం – పర్యావరణం

ప్రశ్న 3.
గ్రీష్మకాల స్థరీభవనం (Summer stratification) అంటే ఏమిటో వివరించండి.
జవాబు:
గ్రీష్మకాల స్థరీభవనం :
సమశీతోష్ణ సరస్సులలో గ్రీష్మకాలంలో ఉష్ణోగ్రత (21 – 25°C) కు పెరగడం వల్ల ఉపరితల నీటి సాంద్రత తగ్గుతుంది. సరస్సులోని ఉపరితంలో గల ఈ వెచ్చని నీటిపొరను ఎపిలిమ్నియాస్ (Epilimnion) అంటారు. ఎపిలిమ్నియాస్ కింద థర్మోక్లైన్ (Thermocline) లేదా మెటాలిమ్నియాస్ మండలం ఉంటుంది. ఈ నీటిలో లోతుకు వెళ్ళినకొద్దీ మీటరుకు 1°C చొప్పున ఉష్ణోగ్రత తగ్గుతుంది. సరస్సులో అడుగు పొరను హైపోలిమ్నియాన్ (Hypolimnion) అంటారు. ఈ ప్రాంతంలోని నీరు చల్లగా, నిలకడగా ఉండి, ఆక్సిజన్ శాతం బాగా తక్కువగా ఉంటుంది. (కిరణజన్య సంయోగక్రియ చర్య లేకపోవడం వల్ల).

AP Inter 1st Year Zoology Study Material Chapter 8 జీవావరణం – పర్యావరణం 1
శరదృతువు (ఆకురాలే కాలం) రాగానే ఉపరితల ఎపిలిమ్నియాన్లో నీరు చల్లబడి 4°C కు ఉష్ణోగ్రత చేరగానే, నీటి బరువు అధికమైన పైనున్న పొర సరస్సు కిందకు కుంగుతుంది. నీరు తారుమారవడం ద్వారా ఈ కాలంలో సరస్సంతా ఒకే రకమైన ఉష్ణోగ్రత ఏర్పడుతుంది. శరదృతువులో జరిగే ఈ నీటి ప్రసరణను ఆకురాలే కాల తారుమారు లేదా శరదృతువు తారుమారు (Autumn overturn) అంటారు. అధిక ఆక్సిజన్ గల ఉపరితల నీరు హైపోలిమ్నియాన్ చేరి అధిక పోషక పదార్థాలు గల అడుగు భాగం నీరు ఉపరితలాన్ని చేరుతుంది. అందువల్ల సరస్సులో పోషక పదార్థాలు, ఆక్సిజన్ సమంగా విస్తరిస్తాయి.

ప్రశ్న 4.
సరస్సులలో స్తరీభవనం ప్రాముఖ్యత ఏమిటి?
జవాబు:
సమశీతోష్ణ ప్రాంతాలలో ఋతువులు మారుతున్నప్పుడు ఉష్ణోగ్రతా వ్యత్యాసాల కారణంగా నీటిలో ఉష్ణస్తరాలు ఏర్పడతాయి. దీనినే ఉష్ణ స్తరీభవనం అంటారు.

శీతాకాలంలో వాతావరణం చల్లబడటం వలన ఉపరితల జలం చల్లబడి 4°C ఉష్ణోగ్రతను చేరగానే అధిక సాంద్రతను పొంది సరస్సులో అడుగుకు చేరుతుంది. నీరు తారుమారు అవడం వలన ఈ కాలంలో సరస్సంతా ఒకే రకమైన ఉష్ణోగ్రత ఏర్పడుతుంది. శరదృతువులో జరిగే ఈ నీటి ప్రసరణను శరదృతు ఓవర్ టర్న్ అంటారు. అధిక ఆక్సిజన్ గల నీరు హైపొలిమ్నియాన్ చేరడం వలన అధిక పోషక పదార్థాలు గల అడుగు భాగం నీరు ఉపరితలాన్ని చేరుతుంది. అందువలన సరస్సులో పోషక పదార్థాలు, ఆక్సిజన్ సమంగా విస్తరిస్తాయి.

AP Inter 1st Year Zoology Study Material Chapter 8 జీవావరణం – పర్యావరణం 2
వసంతకాలంలో ఉష్ణోగ్రత పెరగడం ప్రారంభం అవుతుంది. ఉష్ణోగ్రత 4°C వద్దకు చేరగానే నీటి సాంద్రత అధికమై, బరువెక్కి, అడుగు భాగంలోకి కుంగిపోతూ అధిక ఆక్సిజన్ గల నీటిని అడుగు భాగానికి చేరవేస్తుంది. ఉపరితల ప్రాంతంలోని అధిక ఆక్సిజన్ గల నీరు కిందికి కుంగుతూ, అడుగుభాగాన గల ‘పోషక పదార్థాలు గల నీటిని’ ఉపరితల ప్రాంతానికి చేరవేస్తుంది. దీన్నే వసంత ఋతు తారుమారు (Spring overturn) అంటారు. సంవత్సరానికి రెండుసార్లు సరస్సులోని నీరు తారుమారు కావడం వల్ల వీటిని ‘డైమిక్క్ సరస్సులు’ అంటారు. ఈ విధమైన స్తరీభవనాలు సరస్సులోని అన్ని స్థాయిలలో జీవుల మనుగడకు తోడ్పడతాయి.

ప్రశ్న 5.
వాస్ట్ హాఫ్ సూత్రాన్ని వివరించండి.
జవాబు:
జీవులలో చాలా జీవక్రియలు వివిధ రకాల ఎంజైముల నియంత్రణలో ఉంటాయి. ఈ ఎంజైములు ఉష్ణోగ్రత వల్ల ప్రభావితమవుతాయి. ఉష్ణోగ్రత పెరుగుదలతో బాటు ఎంజైముల చర్యకూడా పెరుగుతుంది. దీనివలన జీవక్రియ రేటు పెరుగుతుంది. అస్థిర ఉష్ణోగ్రత జంతువులలో జీవక్రియలపై ఉష్ణోగ్రతా ప్రభావం స్థిరోష్ణ జీవులతో పోల్చితే తక్కువగా ఉంటుంది. దీని ప్రకారం ప్రతి 10°C ల ఉష్ణోగ్రత పెంచితే జీవక్రియా రేటు రెట్టింపవుతుంది. దీనినే ‘వాస్ట్ హాఫ్’ సూత్రం అంటారు.

ఒక రసాయన చర్యారేటు మీద ఉష్ణోగ్రతా ప్రభావాన్ని ‘ఉష్ణోగ్రతా కోఎఫిషియంట్’ లేదా Q10 తో తెలుపుతారు. అంటే 10°C ఉష్ణోగ్రత పెరుగుదల వల్ల జీవక్రియా రేటులో పెరుగుదలను ఇది తెలుపుతుంది. Q10 విలువను X°C, X 10°C వద్ద చర్యా రేటు నిష్పత్తి ఆధారంగా అంచనా వేస్తారు. జీవ వ్యవస్థలలో Q10 విలువ దాదాపు 2గా ఉంటుంది.

ప్రశ్న 6.
ఉష్ణోగ్రతా మార్పులను క్షీరదాలు సహించినట్టు సరీసృపాలు సహించలేవు. అవి ఎడారిలో సార్థక జీవనానికి పరిస్థితులకు అనుగుణంగా ఏవిధంగా మార్పు చేసుకొంటాయి?
జవాబు:
ఉష్ణోగ్రతలో మార్పులను క్షీరదాలు సహించినట్లుగా సరీసృపాలు సహించవు. ఇవి ఎడారిలో సార్థక జీవనానికి, పరిస్థితులకు అనుగుణంగా అనేక రకాల మార్పులను ఏర్పరచుకుంటాయి.

ఎడారి బల్లులు వాటి ప్రవర్తనా పద్ధతుల ద్వారా శరీర ఉష్ణోగ్రతను స్థిరంగా ఉంచుకుంటాయి. అవి వాటికి అనువైన దానికంటే శరీర ఉష్ణోగ్రత ఎక్కువైతే అవి ఎండలోకి వెళ్ళి సూర్యరశ్మి సోకేటట్లు వాటి శరీరాన్ని ఉంచి ఉష్ణాన్ని గ్రహిస్తాయి. ఉష్ణోగ్రత ఎక్కువ అయితే నీటిలోకి తిరిగి వెళతాయి. కొన్ని జంతువులు వాతావరణంలో గల అధిక వేడిని తట్టుకోవడానికి నేలలో బొరియలు చేసుకొని జీవిస్తాయి.

AP Inter 1st Year Zoology Study Material Chapter 8 జీవావరణం – పర్యావరణం

ప్రశ్న 7.
భౌమ్య జీవులు నిర్జలీకరణ (Dehydration) ప్రమాదాల నుండి ఏవిధంగా రక్షించుకొంటాయి?
జవాబు:
భూమిపై నివసించే జీవులు నిర్జలీకరణం (దేహంలో నీటిని కోల్పోవడం) ప్రమాదం నుండి తప్పించుకోవడానికి, నీటి నష్టాన్ని తగ్గించడానికి అనేక అనుకూలనాలను కలిగి ఉంటాయి.

  1. బొరియలలో నివసించే జీవులు ఉష్ణోగ్రత తక్కువగా ఉన్నప్పుడు, రాత్రి వేళలో బయటకు వస్తాయి.
  2. ఎడారి జీవులకు నీటి సంరక్షణ అతి ముఖ్యమైనది. ఎడారిలో నివసించే కంగారు ఎలుక అతి గాఢత కలిగిన మూత్రాన్ని విసర్జిస్తుంది.
  3. కీటకాలు యూరికామ్ల రూపంలో, ఆహార విసర్జితాలతో కలిపి ఘనరూపంలో నత్రజని సంబంధ విసర్జకాలను విసర్జిస్తాయి. దేహంపై గట్టి కైటిన్ నిర్మిత పెంకును కలిగి స్వేదన క్రియ ద్వారా నీటి వృధాను అరికడతాయి.
  4. వానపాములు వేసవికాలంలో అధిక ఉష్ణోగ్రతను తట్టుకోవడానికి నేలలో లోతుగా బొరియలు చేసుకొని, కనిష్ట స్థాయిలో వాటిని వినియోగిస్తూ జీవిస్తాయి.
  5. ఒంటె శరీరం బరువులో 40 శాతం నీరు నష్టపోయినప్పటికీ జీవించగలదు. ఇతర జంతువులు జీవించలేవు.

పై విధంగా భూచర జీవులు నిర్జలీకరణాన్ని అరికట్టి తమని తాము రక్షించుకుంటాయి.

ప్రశ్న 8.
సముద్ర జంతువులు అధిక గాఢత జలానికి ఏ విధంగా అనుకూలనం ఏర్పరచుకొంటాయి?
జవాబు:
సముద్ర ఆవాసాల్లో అనుకూలనాలు :
సముద్రపు నీటిలో లవణ గాఢత దేహద్రవ్యాల గాఢత కంటే ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా సముద్ర జంతువుల దేహం నుంచి నిరంతరం బాహ్య ద్రవాభిసరణ (exosmosis) ద్వారా నీరు వెలుపలికి వెళ్ళడం ద్వారా దేహం నిర్జలీకరణకు గురవుతుంది. ఇలాంటి నీరు కోల్పోయే సమస్య నుంచి బయటపడటానికి సముద్ర చేపలలో వృక్క ప్రమాణాలు తక్కువగానున్న రక్తకేశనాళికా, గుచ్చరహిత మూత్రపిండాలు (algomerular kidneys, ఉంటాయి. ఇవి మూత్రం ద్వారా విసర్జింపబడే నీటిని తగ్గిస్తాయి.

కోల్పోయిన నీటిని భర్తీ చేయడానికి సముద్ర చేపలు ఎక్కువగా నీటిని లోనికి తీసుకోవడం వల్ల, లవణాలు దేహద్రవ్యాలతో కలిసి అంతర సమతుల్యతలో అస్థిరత ఏర్పడుతుంది. దేహంలో లవణ సమస్థితి (Salt homeostasis) నియంత్రించడంలో లవణాలను స్రవించే క్లోరైడ్ కణాలు మొప్పలలో ఉంటాయి. సాగర పక్షులైన సీ గల్స్ (Sea gulls), పెంగ్విన్ (Penguin) పక్షుల నాసికానాళాల నుంచి లవణద్రవం చుక్కలుగా వెలువడుతుంది. తాబేళ్లలో (Turtles) నేత్రాల సమీపంలో క్లోరైడ్ స్రవించే గ్రంథినాళాలు తెరచుకొని ఉంటాయి. కొన్ని మృదులాస్థి చేపలలో యూరియా, ట్రైమిథైల్ అమైన్ ఆక్సైడ్ (TMO) రక్తంలో ఉండి, దేహ ద్రవ్యాలను సాగరనీటితో సమగాఢతలో ఉండచంలో, బాహ్య ద్రవాభిసరణతో జరిగే నిర్జలీకరణం జరగకుండా ఆపుతుంది.

ప్రశ్న 9.
స్వాదుజల జీవుల అనుకూలనాల రకాలను తెలపండి.
జవాబు:
మంచినీటిలో నివసించే జంతువులు అంతర ద్రవాభిసరణ (osmosis) సమస్యను ఎదుర్కోవాలి. మంచినీటిలో ద్రవాభిసరణ పీడనం తక్కువగా ఉంటుంది, జంతుదేహంలోని ద్రవాలలో ద్రవాభిసరణ పీడనం అధికంగా ఉండటం వల్ల, వెలుపలి ప్రాంతపు నీరు జీవి శరీరంలోకి అంతర ద్రవాభిసరణం ద్వారా ప్రవేశిస్తుంది. మంచినీటి జీవులు దేహంలోని నీటి సమతుల్యతను నిర్వహించడానికి అనేక అనుకూలనలు పొందాయి. అవి : మంచినీటి ప్రోటోజోవా జీవులలో సంకోచరిక్తికలు, చేపలలో పెద్ద రక్తకేశనాళికా గుచ్ఛ మూత్రపిండాలు (Glomelular kidneys) మొదలైనవి. ఇవి దేహం నుంచి అధిక మొత్తంలో విసర్జించే మూత్రంలో కొన్ని లవణాలను కూడా కోల్పోతాయి.

దేహం నుంచి కోల్పోయిన లవణాలను భర్తీ చేయడానికి, మంచినీటి చేపలు వాటి మొప్పలలో లవణాలను గ్రహించే క్లోరైడ్ కణాలు (chloride cells) కలిగి ఉంటాయి. మంచినీటి చెరువులలో ప్రధాన సమస్య ఏమిటంటే ఎండాకాలంలో అనేక కుంటలు ఎండిపోతాయి. ఇటువంటి సమస్య నుంచి రక్షణ కోసం మంచినీటి ప్రొటిస్టా జీవులు కోశీభవన (Encystment) ప్రక్రియను ప్రదర్శిస్తాయి. ఎండాకాలంలో ప్రతికూల సమస్యల నుంచి రక్షణ కోసం మంచినీటి స్పంజికలు అలైంగికోత్పత్తి నిర్మాణాలైన జెమ్యూల్స్న ఏర్పరుస్తాయి. ఎండాకాలంలో మనుగడ కోసం “ఆఫ్రికన్ ఊపిరితిత్తి చేప” (African lugn fish) ప్రోటాక్టిరస్ (Protopterus) బురద మట్టిలో బొరియలు చేసుకొని, దేహం చుట్టూ జిగట పదార్థ కోశాన్ని ఏర్పరచుకుంటుంది.

ప్రశ్న 10.
మంచినీటి, సముద్రనీటి జీవనానికి జంతువులు ఏ విధంగా అనుకూలనాలను పోల్చండి.
జవాబు:

మంచినీటి జీవనానికి అనుకూలనంసముద్ర జీవనానికి అనుకూలనం
1. మంచినీటి చేపలు మూత్రపిండాలలో అధిక గ్లోమరాలత్ను కలిగిన వృక్కాలను కలిగి ఉంటాయి.1. సముద్రజల చేపలు గ్లోమరూలస్ లేకుండా తక్కువ సంఖ్యలో వృక్కాలు గల మూత్రపిండాలను కలిగి ఉంటాయి.
2. విసర్జన ద్వారా అధిక నీటిని బయటకు పంపిస్తాయి.2. మూత్రాంత్రం ద్వారా తక్కువ నీటిని విసర్జిస్తాయి.
3. మూత్రం ద్వారా కోల్పోయిన లవణాలను భర్తీ చేయడానికి మొప్పలలో ఉండే క్లోరైడ్ కణాలు తిరిగి నీటి నుండి లవణాలను గ్రహిస్తాయి.3. దేహంలో చేరిన అధిక లవణాలను మొప్పలలో క్లోరైడ్ కణాల ద్వారా బయటకు విసర్జిస్తాయి.
4. వేసవికాలంలో దేహంలోని నీటిని రక్షించుకోడానికి కొన్ని ప్రొటిస్టా జీవులు కోశీభవనాన్ని ప్రదర్శిస్తాయి.4. మృదులాస్థి చేపలలో యూరియా TMO రూపంలో నిలువ చేయబడుతుంది. ఇది దేహ ద్రవ్యాలను సాగర జలాలతో సమగాఢతలో ఉంచడానికి తోడ్పడుతుంది.

ప్రశ్న 11.
యూరి హైలిన్, స్టీనో హైలిన్ జంతువుల మధ్య తేడాలను వివరించండి.
జవాబు:
యూరి హైలిన్ :
అధిక మొత్తంలో నీటిలో కరిగే లవణీయత మార్పును తట్టుకునే జీవులను యూరిహైలిన్ జీవులంటారు. ఉదా : సాల్మన్ చేపలు, ఈల్ చేపలు.

స్టీనోహైలిన్ :
తక్కువ మొత్తంలో మాత్రమే నీటిలో కలిగే లవణీయత మార్పులను తట్టుకోగలిగిన జీవులను స్టీనో హైలిన్ జంతువులు అంటారు.
ఉదా : Armatic insects.

AP Inter 1st Year Zoology Study Material Chapter 8 జీవావరణం – పర్యావరణం

ప్రశ్న 12.
అధిక ఎత్తు గల హిమాలయ ప్రాంతాలలో నివసించే అనేక తెగలలో మైదానాలలో నివసించేవారిలో కంటే సాధారణంగా ఎర్ర రక్తకణాలు లేదా హిమోగ్లోబిన్ మోతాదు అధికంగా ఉంటుంది. వివరించండి.
జవాబు:
సాగర మట్టం నుండి అత్యంత ఎత్తయిన ప్రదేశాలు హిమాలయ ప్రాంతాలలో పర్యటనకు వెళ్ళిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఆల్టిట్యూడ్ సిక్నెస్కు లోనవుతారు. వీటి లక్షణం నాసియా, అలసట, అసాధారణ హృదయస్పందన మొదలగునవి. దీనికి కారణం ఎత్తైన ప్రదేశాలలో అతి తక్కువ స్థాయిలో వాతావరణ పీడనం, శరీరానికి కావలసినంత ఆక్సిజన్ లభించకపోవడం.

ఎత్తైన హిమాలయ ప్రాంతాలలో నివసించే అనేక తెగల జనాభాలో ఆల్టిట్యూడ్ సిక్నెస్ ను తట్టుకోవడానికి అనుకూలనాలు ఉంటాయి. వీరు క్రమంగా వాతావరణానుకూలత ద్వారా అధిగమించవచ్చు. శ్వాసక్రియ రేటును పెంచడం ద్వారా, హిమోగ్లోబిన్ బంధన సామర్థ్యాన్ని కణస్థాయిలో తగ్గించడం ద్వారా శరీరం తక్కువ ఆక్సిజన్ లభ్యతను భర్తీ చేస్తుంది.

ప్రశ్న 13.
ఒక మామిడి చెట్టుకు, దానిపై పెరిగే ఆర్కిడ్ మొక్క మధ్య పరస్పర చర్యను వివరించండి.
జవాబు:
మామిడిచెట్టుపై ఆర్కిడ్ మొక్క పరాన్నజీవిగా జీవించే సహజీవనంలో ఆర్కిడ్ మొక్క సూర్యరశ్మిని పొందే విధంగా మామిడి శాఖలపై పెరుగుతుంది. కనుక ఆర్కిడ్ మొక్క ఇది లాభదాయకం. కాని ఈ విషయంలో మామిడిచెట్టుకు గమనించదగిన లాభం గాని, నష్టం కాని జరగలేదు. కనుక ఇటువంటి సహజీవనాన్ని సహభోజకత్వ చర్యగా భావించవచ్చును.

ప్రశ్న 14.
జాతుల వైవిధ్యాన్ని నిర్వహించడంలో పరజీవ భక్షణ ప్రాముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. వివరించండి.
జవాబు:
సమాజంలో జాతుల వైవిధ్యాన్ని నిర్వహించడంలో పరభక్షకాలు ప్రాముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. అమెరికా పసిఫిక్ తీర ప్రాంతంలోని రాతిమయ అల తీరప్రాంతం (Rocky intertidal region) సమాజంలో సముద్ర నక్షత్రం పిసాస్టర్ ఒక ముఖ్యమైన పరభక్షకి. ఒక క్షేత్ర పరిశోధనలో ఒక నిర్దిష్ట తీరప్రాంతంలోని సముద్ర నక్షత్రాలన్నింటిని వేరుచేసినప్పుడు, ఒక సంవత్సర కాలంలో 10 జాతుల కంటే ఎక్కువ అకశేరుకాలు అంతరించిపోవడానికి కారణం జాత్యంతర జీవుల మధ్య పోటీ పెరగడమే.

పై విషయ సందర్భం ఆధారంగా జాతుల వైవిధ్యాన్ని నిర్వహించడంలో పరజీవ భక్షణ ప్రాముఖ్యమైనదిగా భావించవచ్చును.

ప్రశ్న 15.
వినాశకర కీటకాల జీవ నియంత్రణ పద్ధతి వెనుక ఉన్న జీవ సూత్రం ఏమిటి?
జవాబు:
ఆకులు, ముళ్ళు లేని నిర్మాణం కలిగిన పియర్ కాక్టస్ మొక్కలను 1920లో ఆస్ట్రేలియాలో ప్రవేశపెట్టారు. ఫలితంగా అది అతివేగంగా అభివృద్ధి చెంది మిలియన్ల హెక్టార్ల భూమి (సహజ గడ్డిభూములు)లో వ్యాపించి అస్థవ్యస్థ పరిస్థితి కలిగించింది. చివరకు అపాయకరంగా వ్యాపిస్తున్న కాక్టస్ను నియంత్రించడానికి కాక్టస్ను ఆహారంగా తీసుకొనే పరభక్షి (మిడత)ను ఆ దేశంలో ప్రవేశపెట్టారు. తరువాత పరిస్థితి చక్కబడింది.

ఆహార జీవి జనాభాను నియంత్రించే భక్షక జీవుల సామర్థ్యాన్ని ఆధారంగా చేసుకొని వ్యవసాయ చీడల నియంత్రణలో జీవ నియంత్రణ పద్ధతులను వినియోగిస్తున్నారు.

ప్రశ్న 16.
పోటీ బహిష్కరణను చర్చించండి.
జవాబు:
ప్రకృతిలో పోటీతత్వ విధానానికి లభించిన మరొక నిదర్శనం పోటీతత్వాన్ని విడుదల చేయడం లేదా బహిష్కరించడం. నిర్దిష్ట ప్రదేశం నుంచి పోటీపడే రెండు జాతులలో ఒక జాతి జీవులను వేరు చేయడం ద్వారా వాటి జనాభా పరిమితిని తగ్గించే ఒక కారకం నుంచి రెండవ జాతి జీవులకు పోటీతత్త్వ విడుదల లభిస్తుంది. పోటీతత్వం గల ఉన్నత జాతుల జనాభా ఉండటం వల్ల చిన్న భౌగోళిక ప్రాంతానికి మాత్రమే విస్తరించిన ఒక జాతి, ప్రయోగాత్మకంగా పోటీతత్వ జాతులను నిర్మూలించడం ద్వారా అవి

వాటి విస్తరణ పరిధిని పెంచుకోవడం గమనించవచ్చు. ఇది పోటీతత్వ విడుదల అనే దృగ్విషయం వల్ల జరుగుతుంది. కొన్నెల్ (Connel) క్షేత్ర పరిశోధనల్లో స్కాట్లాండ్లోని సాగర రాతి తీర ప్రాంతాలలో గల బర్నాకిల్ బెలానస్ అలల మధ్య ప్రాంతంలో పోటీతత్త్వంలో బలంగా ఉండి చిన్న బర్నాకిల్ అయిన కెథామలన న్ను ఆ ప్రాంతం నుంచి లేకుండా చేస్తాయి. ప్రయోగాత్మకంగా బలంగా ఉన్న జీవులను వేరుచేస్తే చిన్నజీవుల జనాభా బాగా వృద్ధి చెందుతుంది. సాధారణంగా, మాంసాహారుల కంటే శాకాహారజీవులు, మొక్కలు ఎక్కువగా పోటీతత్వ ప్రభావానికి లోనవుతాయి.

AP Inter 1st Year Zoology Study Material Chapter 8 జీవావరణం – పర్యావరణం

ప్రశ్న 17.
పరాన్నజీవుల అనుకూలనాల మీద సంక్షిప్త వ్యాఖ్య రాయండి.
జవాబు:
పరాన్నజీవనం విజయవంతంగా ఉండటానికి పరాన్నజీవులు ప్రత్యేకమైన అనుకూలనాలు ఏర్పరచుకొన్నాయి. అవి :
ఎ. జ్ఞానావయవాలు కోల్పోవడం (అధికశాతం పరాన్నజీవులకు అవసరం లేదు).

బి. సంసజనక అవయవాలను కలిగి ఉండటం. అంటే చూషకాలు, కొక్కేలు మొదలైనవి అతిథేయి దేహ భాగాలను అంటిపెట్టుకోడానికి తోడ్పడతాయి.

సి. జీర్ణవ్యవస్థ లేకపోవడం, అధిక ప్రత్యుత్పత్తి సామర్థ్యం కలిగి ఉండటం.

డి. పరాన్నజీవుల జీవితచరిత్రలు చాలా సంక్లిష్టమైనవి. వీటిలో ఒకటి లేదా రెండు మాధ్యమిక అతిథేయిలు లేదా వాహకాలు పరాన్నజీవనాన్ని వాటి ప్రాథమిక అతిథేయికి చేరడానికి మార్గం సుగమం చేస్తాయి.
ఉదా 1 : మానవ లివర్ ఫ్లూక్ రెండు మాధ్యమిక (ద్వితీయ) అతిథేయిలలో (నత్త, చేప) జీవితచరిత్రను పూర్తి చేస్తాయి.
ఉదా 2 : మలేరియా పరాన్నజీవికి మరొక అతిథేయికి వ్యాప్తి చేయడానికి వాహకం (దోమ) అవసరం.

అధిక శాతం పరాన్నజీవులు అతిథేయికి హాని కలుగజేస్తాయి; అతిథేయిలో మనుగడ, పెరుగుదల, ప్రత్యుత్పత్తి క్షీణిస్తాయి. వీటితోపాటు జనాభా సాంద్రత తగ్గుతుంది. పరాన్నజీవి బాగా వృద్ధి చెందుతూ పరభక్షత్వానికి వీలుగా అతిథేయిని బలహీనపరుస్తుంది.

ప్రశ్న 18.
గుడ్లకోశ (Brood) పరాన్నజీవనం గురించి సోదాహరణగా వివరించండి.
జవాబు:
కొన్ని పక్షులు ప్రత్యేకమైన పరాన్నజీవనానికి మంచి ఉదాహరణలుగా ఉంటాయి. పరాన్న జీవ పక్షి వాటి గుడ్లను అతిథేయి పక్షి గూటిలో ఉంచి అతిథేయిచే గుడ్లను పొదిగిస్తాయి. పరిణామ క్రమంలో పరాన్నజీవ పక్షిగుడ్లు, అతిథేయి జీవి గుడ్లు పరిమాణం, వర్ణం ఒకే విధంగా ఉండేటట్లు అభివృద్ధి చెందటం వల్ల, పరాన్నజీవ పక్షి గుడ్లను అతిథేయి గుర్తు పట్టలేకపోవడం వల్ల, గుడ్లు గూటి నుండి వెలికితీయబడకుండా పొదగబడతాయి.
ఉదా : కోయిల, కాకి పక్షుల కదలికలను మనం దగ్గర పరిసరాలనుండి పరిశీలిస్తే సంపర్క కాలంలో గర్భకోశ లేదా గుడ్లకోశ పరాన్నజీవ చర్యలను గమనించవచ్చును.

ప్రశ్న 19.
పరజీవ భక్షక జీవులు జీవ నియంత్రణకారులుగా ఎలా పనిచేస్తాయి?
జవాబు:
ఆకులు, ముళ్ళు లేని నిర్మాణం కలిగిన పియర్ కాక్టస్ మొక్కలను 1920లో ఆస్ట్రేలియాలో ప్రవేశపెట్టారు. ఫలితంగా అది అతివేగంగా అభివృద్ధి చెంది మిలియన్ల హెక్టార్ల భూమి (సహజ గడ్డిభూములు)లో వ్యాపించి అస్థవ్యస్థ పరిస్థితి కలిగించింది. చివరకు అపాయకరంగా వ్యాపిస్తున్న కాక్టస్ ను నియంత్రించడానికి కాక్టస్ను ఆహారంగా తీసుకొనే పరభక్షి (మిడత)ను ఆ ప్రదేశంలో ప్రవేశపెట్టారు. తరువాత పరిస్థితి చక్కబడింది.

ఆహార జీవి జనాభాను నియంత్రించే భక్షక జీవుల సామర్థ్యాన్ని ఆధారంగా చేసుకొని వ్యవసాయ చీడల నియంత్రణలో జీవ నియంత్రణ పద్ధతులను వినియోగిస్తున్నారు.

ప్రశ్న 20.
జీవావరణ వ్యవస్థ నిర్మాణం, విధులను వివరించండి.
జవాబు:
జీవావరణ వ్యవస్థ ప్రకృతిలో క్రియాత్మక ప్రమాణం. దీనిలో నివసించే జీవులు తమలో తాము అంతర చర్యలు జరపడమే కాకుండా వాటి చుట్టూ గల భౌతికపరమైన పరిసరాలతో అంతర చర్యలు జరుపుతూ ఉంటాయి. జీవావరణ వ్యవస్థ పరిమాణం చిన్న సరస్సు నుంచి అత్యంత పెద్ద అరణ్యాలు లేదా సముద్రాల వరకు కూడా విస్తరిస్తుంది. అనేకమంది జీవావరణ శాస్త్రవేత్తలు యావత్తు జీవగోళాన్ని ఒక ప్రపంచ జీవావరణ వ్యవస్థగా చెప్తూ అది భూమండలంపై గల అన్ని రకాల జీవావరణవ్యవస్థల సమ్మేళనమేనని అభివర్ణించారు.

ఈ వ్యవస్థ పెద్దది, సంక్లిష్టమైంది కావడం వల్ల ఒక్కసారే అధ్యయనం చేయడం కష్టం కాబట్టి సౌకర్యం కోసం రెండు ప్రాథమిక స్థాయి విభాగాలుగా విభజించారు. అవి, సహజ జీవావరణవ్యవస్థ, కృత్రిమ జీవావరణ వ్యవస్థ. సహజ జీవావరణ వ్యవస్థలో జలజీవావరణ వ్యవస్థ, భూమికి సంబంధించిన భూచర జీవావరణ వ్యవస్థ ఉన్నాయి. సహజ, కృత్రిమ జీవావరణ వ్యవస్థలలో పలు రకాలైన ఉప విభాగాలు ఉన్నాయి.

ఇవి సహజసిద్ధంగా ఏర్పడే జీవావరణవ్యవస్థలు. వీటి ఏర్పాటులో మానవుడికి ఎలాంటి పాత్ర లేదు. ప్రధానంగా వీటిలో రెండు రకాలు ఉన్నాయి. అవి – జల జీవావరణ వ్యవస్థ, భూచర జీవావరణ వ్యవస్థ.

AP Inter 1st Year Zoology Study Material Chapter 8 జీవావరణం – పర్యావరణం

ప్రశ్న 21.
వివిధ రకాల జల జీవావరణ వ్యవస్థలను వివరించండి.
జవాబు:
జల జీవావరణవ్యవస్థలు (Aquatic Ecosystems) : నీటి లవణీయతను ఆధారంగా చేసుకొని జీవావరణవ్యవస్థలను మూడు రకాలుగా విభజించారు. అవి – సముద్రనీటి జీవావరణ వ్యవస్థ, నదీముఖద్వార జీవావరణవ్యవస్థ, మంచినీటి జీవావరణవ్యవస్థ.

1. సముద్రనీటి జీవావరణవ్యవస్థ (The Marine Ecosystem) :
జీవావరణవ్యవస్థలన్నింటిలోనూ సముద్రనీటి జీవావరణవ్యవస్థ అతిపెద్దది. ఇది అత్యంత స్థిరమైన జీవావరణవ్యవస్థగా చెప్పబడింది.

2. నదీముఖద్వార జీవావరణవ్యవస్థ (Estuarine Ecosystem) :
ఏ ప్రాంతంలో నది సముద్రం కలుస్తుందో దాన్ని నదీముఖద్వారం అంటారు. సముద్రపు నీరు రోజుకు రెండుసార్లు నదీ నీటిలోకి ప్రవేశిస్తుంది. (అలల ఆటుపోట్లు ప్రభావంవలన) నదీముఖ ద్వారంలోని నీటి లవణీయత స్థాయి రుతువులపై ఆధారపడి ఉంటుంది. వానాకాలంలో అధిక వర్షపాత ప్రభావంచేత నదీముఖద్వారంలోని నీరు బయటికి వెళ్ళడం వల్ల లవణీయత స్థాయి తగ్గుతుంది. ఎండాకాలంలో దీనికి వ్యతిరేకంగా జరగడం వలన అంటే లవణీయత స్థాయి పెరుగుతుంది. నదీముఖద్వార జీవులు లవణీయతలోని హెచ్చుతగ్గులను తట్టుకొనే సామర్థ్యాన్ని ఉంటాయి.

3. మంచినీటి జీవావరణవ్యవస్థ (The Fresh water Ecosystem) :
మంచినీటి జీవావరణవ్యవస్థ జలచర జీవావరణవ్యవస్థలో అతి చిన్నది. దీనిలో నదులు, సరస్సులు, చెరువులు (నీటి కుంట) మొదలైనవి ఉంటాయి. ఇది రెండు గ్రూపులుగా విభజింపబడింది. అవి 1. స్థిర జల జీవావరణవ్యవస్థ (Lentic Ecosystem), 2. ప్రవాహ జల జీవావరణవ్యవస్థ (Lotic Ecosystem). నిశ్చలమైన నీరు అంటే, చెరువులు, సరస్సులు, జలాశయాలు మొదలైనవి స్థిర జలజీవావరణవ్యవస్థ కిందికి వస్తాయి. సెలయేర్లు, నదులు ప్రవహించే నీటి కాలువలు ప్రవాహ జల జీవావరణ వ్యవస్థ కిందికి వస్తాయి. పైన పేర్కొన్న రెండురకాల సమాజాలు స్థిరజల సమాజం, ప్రవాహజల సమాజంగా చెప్పబడినాయి. మంచినీటి (స్వాదుజల) జీవావరణంను, అధ్యయనంచేసే శాస్త్రాన్ని లిమ్నాలజీ అంటారు.

ప్రశ్న 22.
వివిధ రకాల భౌమ్య జీవావరణ వ్యవస్థలను వివరించండి.
జవాబు:
భూచర జీవావరణ వ్యవస్థలు (The Terrestrial Ecosystems) :
భూమిపై ఉన్న జీవావరణవ్యవస్థలను భూచర జీవావరణవ్యవస్థలని అంటారు. భూచర జీవావరణ వ్యవస్థలకు కొన్ని ఉదాహరణలుగా అరణ్యాలు, పచ్చికబయలు, ఎడారులు ఉన్నాయి.

i) అరణ్య జీవావరణవ్యవస్థలు (The forest Ecosystem) :
భారతదేశంలో రెండు ప్రధానమైన అరణ్యాలు-1. వర్షాధార ఉష్ణమండల అడవులు (Tropical Rain forest), 2. ఆకురాల్చే ఉష్ణమండల అడవులు (Tropical Deciduous forests) ఉన్నాయి.

ii) పచ్చికబయలు జీవావరణవ్యవస్థలు (The grassland Ecosystem) :
భారతదేశంలో హిమాలయ ప్రాంతాలలో ఉంటాయి. ఇవి పశ్చిమ రాజస్థాన్ ప్రాంతంలోని విశాల ఇసుక నేల ప్రాంతాలను ఉప్పునేల ప్రాంతాలను ఆవరించి ఉంటాయి.

iii) ఎడారి జీవావరణ వ్యవస్థలు :
ఒక సంవత్సరానికి 25 సెం.మీ. కంటే తక్కువ వర్షపాతం గల వర్ష ప్రాంతాలను ఎడారులు అంటారు. వీటిలో ప్రత్యేకమైన మొక్కలు, జంతువులు ఉంటాయి. ఎడారులు రెండు రకాలు. ఉష్ణ ఎడారులు, శీతల ఎడారులు. ఉష్ణ ఎడారికి ఉదాహరణ రాజస్థాన్లోని ‘థార్’ ఎడారి (Thar Desert). శీతల ఎడారి ‘లడక్’లో చూడవచ్చు.

ప్రశ్న 23.
మహాసముద్రాలలో అల్ప ఉత్పాదకతకు ముఖ్య కారణాన్ని చర్చించండి.
జవాబు:
సముద్ర జలావరణంలో ప్రాథమిక ఉత్పాదకత భౌమ్య ఆవరణ వ్యవస్థతో పోల్చితే చాలా తక్కువగా ఉంటుంది.

భౌమ్య జీవావరణంతో అనేక రకాల వృక్షజాతులు ప్రాథమిక ఉత్పాదకతలో పాల్గొంటాయి. సముద్ర జీవావరణంలో ప్రాథమిక ఉత్పాదకత ప్రధానంగా వృక్షప్లవకాల పైనే ఆధారపడి ఉంటుంది. లిటరల్ జాన్లో నివసించే ఆల్గి జాతులైన సముద్ర కలుపు మొక్కలు, సూక్ష్మ ఆలు మొదలైనవి మాత్రమే కనిపిస్తాయి.

సముద్రజలాల్లో కాంతి ప్రసరించే ప్రాంతాన్ని ఫోటిక్ మండలం లేదా యూఫోటిక్ మండలం అంటారు. ఇది సాధారణంగా ఉపరితలం నుండి సుమారు 10 నుండి 100 మీ లోతు కలిగి, కిరణజన్యసంయోగక్రియకు అవసరమైన సూర్యరశ్మిని కలిగి ఉండే ప్రాంతం. కాంతి కిరణాలు నీటి లోతులలోకి ప్రసరించే సమయంలో నీటిచే శోషించబడి, కొంత లోతుకు పోయినప్పుడు అసలు కాంతి లేకుండా అవుతుంది. కనుక కాంతి ప్రసరించే ఫోటిక్ మండలం లేదా దాని దిగువన కొద్ది లోతులో మాత్రమే కిరణజన్య సంయోగక్రియకు అవకాశం ఉంటుంది. ఇటీవల పరిశోధనల ఆధారంగా తెలిసిన విషయం ఏమంటే సముద్రజలాల్లో ఇనుపధాతువు తక్కువగా ఉంటుంది. ఇది కూడా ప్రాథమిక ఉత్పాదకతపై ప్రభావం చూపిస్తుంది. కనుక సముద్ర అగాధ జలాల్లో కాంతి ప్రసరణకు అవకాశం లేదు కనుక ప్రాథమిక ఉత్పాదకత ఉండదు. కనుక మహాసముద్రాలలో ప్రాథమిక ఉత్పాదకత తక్కువగా ఉంటుంది.

ప్రశ్న 24.
పూతికాహార జీవులు, డెట్రిటివోర్లు, ఖనిజీకర జీవుల (Mineralizers)ను వివరించండి.
జవాబు:
పూతికాహరులు :
మృతజీవుల దేహంపై ఆహారం కోసం ఆధారపడే బాక్టీరియా, ఫంగై వంటి సూక్ష్మజీవులను పూతికాహారులు అంటారు.

డెట్రిటివోర్సు :
మృతజీవుల నుండి ఆహారాన్ని గ్రహించి, ఆహారపు గొలుసులలోకి శక్తిని తిరిగి ప్రవేశపెట్టే మృతజీవుల దేహాలను కుళ్ళింపచేస్తాయి.

ఖనిజీకరణ జీవులు :
ఇవి కూడా ఒక రకంగా డెట్రిటీజీవులే. ఇవి ఖనిజ లవణాలను మృతజీవుల నుండి విచ్ఛిన్నం చేయడం వలన తిరిగి మట్టిలో కలిసిపోయేలాగున చేస్తాయి.

ప్రశ్న 25.
విచ్ఛిన్నతను ప్రభావితం చేసే కారకాలను చర్చించండి.
జవాబు:
విచ్ఛిన్నకారులు సంక్లిష్ట కర్బన పదార్థాలను కార్బన్ డైఆక్సైడ్, నీరు, పోషకాల లాంటి సరళ అకర్బన పదార్థాలుగా విడగొడతాయి. ఈ ప్రక్రియను విచ్ఛిన్నక్రియ అంటారు.

విచ్ఛిన్నతను ప్రభావితం చేసే కారకాలు :

  1. డెట్రిటస్లోని రసాయన సంఘటన, శోతోష్ణస్థితి కారకాలు విచ్ఛిన్నక్రియ రేటును నియంత్రిస్తాయి.
  2. నిర్ణీత వాతావరణ పరిస్థితులలో డెట్రిటస్లో లిగ్నిన్, కైటిన్ అధికంగా ఉండే విచ్ఛిన్నక్రియా రేటు నెమ్మదిగా ఉంటుంది.
  3. అధిక నైట్రోజన్, నీటిలో కరిగే పదార్థాలైన చక్కెరలు ఉన్నట్లయితే డెట్రిటస్ విచ్ఛిన్నక్రియా రేటు వేగంగా ఉంటుంది.
  4. శీతోష్ణస్థితి కారకాలలో ఉష్ణోగ్రత, నేలలోని తేమ ప్రధానమైనవి. ఇవి నేలలోని సూక్ష్మజీవులపై ప్రభావం చూపి విచ్ఛిన్నక్రియను క్రమపరుస్తాయి.
  5. వేడిగా, తేమగా ఉన్న పరిసరాలు విచ్ఛిన్నక్రియకు ఉపకరిస్తాయి.
  6. తక్కువ ఉష్ణోగ్రత, అవాయు పరిసరాలు విచ్ఛిన్నక్రియను నిరోధించి కర్బనపదార్థాల నిర్మాణం జరుపుతాయి.

AP Inter 1st Year Zoology Study Material Chapter 8 జీవావరణం – పర్యావరణం

ప్రశ్న 26.
DFC గురించి రాసి, భౌమ్య జీవావరణ వ్యవస్థలో దాని ప్రాముఖ్యాన్ని వివరించండి.
జవాబు:
డెట్రిటస్ ఆహార గొలుసు (Detritus Food Chain) : డెట్రిటస్ ఆహార గొలుసు (DFC) మృత కర్బన పదార్థాల (అంటే కుళ్ళిన ఆకులు, మృతిచెందిన జీవుల కళేబరాలు) తో మొదలవుతుంది. పరపోషకాలైన శిలీంధ్రాలు, బాక్టీరియాలు. డెట్రిటస్ను విచ్ఛిన్నం చేసి దాని నుంచి శక్తి, పోషక అవసరాలు గ్రహిస్తాయి. వీటిని పూతికాహారులు అని కూడా అంటారు. ఇవి జీర్ణక్రియా ఎంజైములను స్రవించి, మృత పదార్థాలను, వ్యర్థ పదార్థాలను (మలపదార్థాలను) సరళమైన శోషణకు అనుగుణమైన పదార్థాలుగా విచ్ఛిన్నం చేస్తాయి.

డెట్రిటస్ ఆహార గొలుసుకు ఉదాహరణలు :

  1. డెట్రిటస్ (కుళ్ళిన ఆకుల ద్వారా ఏర్పడింది). → వానపాములు → కప్పలు → సర్పాలు.
  2. మృతిచెందిన జీవులు → ఈగలు, మాగట్స్ → కప్పలు → సర్పాలు.

జల జీవావరణవ్యవస్థలో మేసేజీవుల ఆహార గొలుసు, శక్తి ప్రసరణకు ప్రధాన మార్గంగా పనిచేస్తుంది. దీనికి వ్యతిరేకంగా భూచర జీవావరణవ్యవస్థలో, మేసే జీవుల ఆహార గొలుసు కంటే డెట్రిటస్ ఆహార గొలుసు ద్వారా అధిక భాగం శక్తి ప్రసరణ జరుగుతుంది. డెట్రిటస్ ఆహారగొలుసు కొన్ని స్థాయిలలో మేసే ఆహార గొలుసుతో సంబంధం కలిగి ఉండవచ్చు. డెట్రిటస్ ఆహార గొలుసులోని కొన్ని జీవులు, మేసే జీవుల ఆహార గొలుసులోని కొన్ని జీవులకు ఆహారంగా ఉంటాయి. ఉదా : పైన చూపిన డెట్రిటస్ ఆహారగొలుసులోని వానపాములు మేసే జీవుల ఆహారగొలుసులోని పక్షులకు ఆహారంగా ఉంటాయి. ఈ విధంగా పరిశీలిస్తే ఆహార గొలుసులు ఒకదానితో ఒకటి కలిసి ఉంటాయని తెలుస్తుంది.

ప్రశ్న 27.
ప్రాథమిక ఉత్పాదకత అంటే ఏమిటి? దానిని ప్రభావితం చేసే కారకాలను క్లుప్తంగా వివరించండి.
జవాబు:
జీవద్రవ్యరాశి ఉత్పత్తి రేటును ఉత్పాదకత అంటారు. దీనిని ప్రాథమిక, ద్వితీయ ఉత్పాదకత అని రెండు రకాలుగా వర్గీకరిస్తారు.

1) ప్రాథమిక ఉత్పాదకత (Primary Productivity) :
మొక్కల కిరణజన్యసంయోగక్రియ ద్వారా నిర్ణీత కాలంలో నిర్దిష్టమైన వైశాల్యంలో ఉత్పత్తి చేసిన కర్బన పదార్థాన్ని లేదా జీవద్రవ్యరాశి మొత్తాన్ని ప్రాథమిక ఉత్పాదకత అని నిర్వచిస్తారు. దీన్ని స్థూల ప్రాథమిక ఉత్పాదకత (Gross Primary Productivity, (GPP)) నికర ప్రాథమిక ఉత్పాదకత (Net Primary Productivity, (NPP)) గా విభజించవచ్చు.

ఎ) స్థూల ప్రాథమిక ఉత్పాదకత :
జీవావరణ వ్యవస్థలో కిరణజన్యసంయోగక్రియలో కర్బన పదార్థ ఉత్పత్తి రేటును స్థూల ప్రాథమిక ఉత్పాదకత అంటారు. GPPలో కొంత మొత్తాన్ని మొక్కలు శ్వాసక్రియలో వినియోగించుకొంటాయి.

బి) నికర ప్రాథమిక ఉత్పాతకత :
స్థూల ప్రాథమిక ఉత్పాదకత నుంచి శ్వాసక్రియలో కోల్పోయినది (R) తీసివేయగా మిగిలినదాన్ని నికర ప్రాథమిక ఉత్పాదకత (NPP) అంటారు. స్థూల ప్రాథమిక ఉత్పాదకత (GPP)లో సగటున 20-25 శాతం విచ్ఛిన్నక్రియ (శ్వాసక్రియ) లో ఉపయోగించబడుతుంది.

GPP-R NPP
నికర ప్రాథమిక ఉత్పాదకత అంటే పరపోషకాలు (శాకాహారులు, విచ్ఛిన్నకారులు) ఉపయోగించుకోవడానికి అందుబాటులో ఉన్న జీవద్రవ్యరాశి.

ప్రశ్న 28.
జీవావరణ పిరమిడ్లను నిర్వచించి, సంఖ్యా పిరమిడ్లు, జీవరాశి పిరమిడ్లను సోదాహరణంగా వివరించండి.
జవాబు:
జీవావరణంలో పోషక స్థాయిలను, వాటి స్థాయిని రేఖీయంగా వివరించే నిర్మాణాలు పిరమిడ్ ఆకృతిలో ఉంటాయి. ప్రతి పిరమిడ్ పీఠ భాగంలో ఉత్పత్తిదారులు లేదా ప్రాథమిక పోషక స్థాయి, శిఖర భాగంలో తృతీయ లేదా ఉన్నతస్థాయి వినియోగదారులు ఉంటాయి. జీవావరణ పిరమిడ్లు మూడు రకాలు. 1) సంఖ్యా పిరమిడ్లు, 2) ద్రవ్యరాశి పిరమిడ్లు, 3) శక్తి పిరమిడ్లు. ఈ పిరమిడ్లను మొదటిసారిగా వివరించినవారు ఎల్టన్. అందువలన వీటిని ఎల్టోనియన్ పిరమిడ్స్ లేదా జీవావరణ పిరమిడ్లు అంటారు.
AP Inter 1st Year Zoology Study Material Chapter 8 జీవావరణం – పర్యావరణం 3

ఒక పోషకస్థాయిలో శక్తి మోతాదు, జీవద్రవ్యరాశి, జీవుల సంఖ్య మొదలైనవి లెక్కించవలసి వచ్చినప్పుడు ఆ పోషక స్థాయిలోని జీవులను అన్నింటినీ పరిగణనలోకి తీసుకోవలసి ఉంటుంది. కొన్ని జీవులను మాత్రమే లెక్కలోకి తీసుకొని సాధారణీకరణాలను చేస్తే అది సవ్యం కాదు. అనేక జీవావరణవ్యవస్థలలో సంఖ్యా, శక్తి, జీవద్రవ్యరాశుల పిరమిడ్లన్నీ నిటారుగా ఉంటాయి. అంటే ఉత్పత్తిదారులు శాకాహారుల కంటే సంఖ్యలోను, జీవద్రవ్యరాశిలోను అధికంగా ఉంటాయి. శాకాహారులు మాంసాహారుల కంటే జీవ ద్రవ్యరాశి సంఖ్యలోను ఎక్కువగా ఉంటాయి. శక్తి (అందుబాటులో ఉన్నది) కింది పోషకస్థాయిలో కంటే పై పోషక స్థాయిలో ఎప్పుడూ అధికంగా ఉంటుంది.

ఈ సాధారణీకరణానికి కొన్ని మినహాయింపులు ఉన్నాయి. పరాన్నజీవుల ఆహార గొలుసులో సంఖ్యా పిరమిడ్ తలకిందులుగా ఉంటుంది. ఒక పెద్ద వృక్షం (ఏకైక ఉత్పత్తిదారి), ఫలాలను తినే ఉడుతలు, పక్షులు లాంటి అనేక శాకాహారులకు ఆహారాన్ని ఇస్తుంది. వీటిపై పలు బాహ్య పరాన్నజీవులు, అంటే గోమార్లు (Ticks), పిడుదులు (Mites), తలలో పేను (Lice) లాంటివి. (ద్వితీయ వినియోగదారులు) నివసిస్తాయి. ఈ ద్వితీయ వినియోగదారులు అనేక పైస్థాయి వినియోగదారులకు, ఇంకా అథిపరాన్నజీవులకు ఊతమిస్తాయి. ఈ విధంగా ప్రతి పోషకస్థాయిలో కింది నుంచి పై వరకు, జీవుల సంఖ్య పెరుగుతుంది. ఫలితంగా సంఖ్యా పిరమిడ్ తలకిందులుగా ఉంటుంది.

ప్రశ్న 29.
స్ట్రాటోస్ఫియర్లో ఓజోన్ క్షీణత వల్ల వచ్చే దుష్ప్రభావాలు ఏమిటి?
జవాబు:
ఓజోన్ విచ్ఛిన్నత అంటార్కిటికా ప్రాంతంలో గమనించదగిన ప్రమాదకర పరిస్థితిలో ఉంది. అందువల్ల అక్కడి ఓజోన్ పొర మందం క్షీణించింది. దీనిని సామాన్యంగా ఓజోన్ రంధ్రం అంటారు.

ఓజోన్ పొర పటిష్టంగా ఉంటే UV-B కంటే తక్కువ తరంగదైర్ఘ్యం గల UV-కిరణాలు దాదాపు సంపూర్ణంగా భూవాతావరణంలో శోషణ చెందుతాయి. UV-B కిరణాలు DNA ని దెబ్బతీసి, ఉత్పరివర్తనాలకు దారితీయవచ్చు. వాటి వల్ల చర్మంపై ముడతలు, చర్మ కణాలు దెబ్బతినడం, వివిధ రకాల చర్మ క్యాన్సర్లు కలుగుతాయి. మన కంటిలోని కార్నియా UV-B కిరణాలను శోషించుకుంటుంది. అధిక మోతాదు వల్ల కార్నియా దెబ్బతిని, స్నోబ్లైండ్నెస్, కాటరాక్ట్ లాంటి సమస్యలు వస్తాయి. ఇది కార్నియాను శాశ్వతంగా దెబ్బతీయవచ్చును.

AP Inter 1st Year Zoology Study Material Chapter 8 జీవావరణం – పర్యావరణం

ప్రశ్న 30.
‘హరిత గృహ ప్రభావం’ గురించి రాయండి. [Mar. ’14]
జవాబు:
హరిత గృహ ప్రభావం, భూతాపం (Global warning) :
హరిత గృహంలో ఏర్పడే ఒక దృగ్విషయం నుంచి హరిత గృహ ప్రభావం అనే పదం గ్రహించబడింది. ప్రత్యేకించి శీతాకాలంలో మొక్కలను పెంచడానికి నిర్మించే గాజు గృహాలను (Glass houses) హరిత గృహాలంటారు. గాజు పలకల నుంచి కాంతి లోపలికి వెళ్లే వీలుంది. కానీ ఉష్ణం మాత్రం లోపలే బంధించ బడుతుంది. తత్ఫలితంగా కొద్ది గంటలు ఎండలో అద్దాలు మూసి పార్క్ చేసిన కారులో లాగా హరిత గృహం లోపల వేడిగా ఉంటుంది.

భూమి మీద కూడా హరిత గృహ ప్రభావం సహజంగా సంభవిస్తూ, ఉపరితల వాతావరణాన్ని వేడెక్కిస్తుంది. విశేషమేమిటంటే, హరిత గృహ ప్రభావం లేకపోతే భూఉపరితల సగటు ఉష్ణోగ్రత -18°C ఉంటుంది. ప్రస్తుత సగటు ఉష్ణోగ్రత 15°C.

సూర్యకాంతి వాతావరణ బాహ్య పొరను చేరగానే మేఘాలు, వాయువుల వల్ల దాదాపు పావు వంతు సౌరవికిరణం పరావర్తనం చెందుతుంది. కొంత పీల్చుకోబడుతుంది. మొత్తం సౌర వికిరణంలో కొద్ది భాగం పరావర్తనం చెందితే సగానికవ పైగా భూమిపై పడి భూగోళాన్ని వేడెక్కిస్తుంది. భూఉపరితలం పరారుణ వికిరణం (Infra red radiation) రూపంలో ఉష్ణాన్ని తిరిగి అంతరిక్షంలోకి పంపివేస్తుంది. కానీ అందులో అధిక భాగాన్ని వాతావరణంలోని వాయువులు (ఉదా : కార్బన్ డైఆక్సైడ్, మీథేన్ మొదలైనవి) పీల్చుకొంటాయి. ఈ వాయువు అణువులు ఉష్ణశక్తిని తిరిగి భూమి మీదకు విడుదల చేసి, భూఉపరితలాన్ని మళ్ళీ వేడెక్కిస్తాయి. పైన పేర్కొన్న కార్బన్ డైఆక్సైడ్, మీథేన్ వాయువులు హరిత గృహ ప్రభావాన్ని (Green House Effect) కలిగిస్తున్నందువల్ల వాటిని హరిత గృహ వాయువులు అంటారు.

ప్రశ్న 31.
కింది వాటిని క్లుప్తంగా చర్చించండి.
ఎ) హరిత గృహ వాయువులు, బి) శబ్ద కాలుష్యం, సి) సేంద్రియ వ్యవసాయం, డి) మున్సిపల్ ఘన వ్యర్థాలు.
జవాబు:
ఎ) హరిత గృహ వాయువులు :
కార్బన్ డైఆక్సైడ్ వంటి కొన్ని వాయువులు భూవాతావరణంలో ఉష్ణోగ్రతను బంధించి ఉంచి భూవాతావరణం యొక్క వేడిని పెంచుతున్నాయి. దీనినే హరిత గృహ ప్రభావం అంటారు. కార్బన్ డైఆక్సైడ్, మీథేన్లు, హరిత గృహ ప్రభావాన్ని కలుగజేసే వాయువులు. దీనివలన జీవుల మనుగడ ప్రశ్నార్ధకం కావచ్చును.

బి) శబ్ద కాలుష్యం :
ఆవశ్యకం కాని పెద్ద శబ్దాలు శబ్ద కాలుష్యం క్రిందకు వస్తాయి. శబ్దాన్ని డెసిబిల్స్ (dB) ప్రమాణంతో కొలుస్తారు. మనిషి చెవులు 0 – 180 dB మధ్య శబ్దాన్ని మాత్రమే గ్రహించగలుగుతాయి. 120 dB దాటిన శబ్దాలు చెవిలో నొప్పి కలిగించే స్పర్శ ప్రేరణకు హద్దు. 120 dB దాటిన ఏ శబ్దమైనా శబ్ద కాలుష్యంగా పరిగణించబడుతుంది. ఉదా : జెట్ విమానాలు ఎగిరేటప్పుడు 120 dB దాటిన శబ్దం విడుదలవుతుంది. ఇది కర్ణభేరిని నాశనం చేసి శాశ్వతంగా వినికిడి లోపాన్ని కలిగించవచ్చు. పట్టణాలలో తక్కువ స్థాయి శబ్దాలు కూడా దీర్ఘ కాలం వినినట్లయితే వినికిడి కోల్పోయే స్థితి రావచ్చును. అధిక శబ్దాలు అలసటను, తలనొప్పిని, ఆత్రుతను, నిద్రలేమిని కలుగజేస్తాయి. హృదయస్పందన రేటును పెంచుతాయి. వీటివలన మానవులు తీవ్రమైన ఒత్తిడికి గురవుతారు.

సి) సేంద్రియ వ్యర్థాలు :
సమగ్ర సేంద్రియ వ్యవసాయంలో వ్యర్థ పదార్థాల పునశ్చక్రీయం సమర్థవంతంగా జరగడం వల్ల అది శూన్యవ్యర్థ (zero-waste) ప్రక్రియ. ఒక ప్రక్రియలో ఉత్పన్నమైన వ్యర్థ పదార్థాలు వేరొక ప్రక్రియలో పోషకాలుగా వినియోగించబడతాయి. దీనివల్ల వనరుల వినియోగం గరిష్ఠంగా పెరిగి, ఉత్పాదకత సామర్థ్యం అధికమవుతుంది. హర్యానాలోని సోనిపత్కు చెందిన రమేష్చంద్ర దాగర్ అనే రైతు అవలంబించిన పద్ధతి ఇందుకు మంచి ఉదాహరణ. అతను తేనెటీగల పెంపకం, పాడి పశువుల నిర్వహణ, వాననీటి సంరక్షణ, కంపోస్టింగ్ ఒక గొలుసు ప్రక్రియలుగా సమీకృతం చేశాడు. ఈ కార్యక్రమాలన్నీ ఒకదానికి ఒకటి సహాయపడుతూ పొదుపుగా, దీర్ఘకాలం నిలిచి ఉండే ప్రక్రియగా రూపొందింది. పంటల వ్యర్థాలు, పశువుల విసర్జకాలు (పేడ) కంపోస్టు చేయడానికి ఉపయోగపడతాయి. కంపోస్టు సహజ ఎరువుగా ఉపయోగపడుతుంది. ఈ ప్రక్రియలో ఉత్పన్నమయ్యే బయోగ్యాస్ వ్యవసాయక్షేత్ర ఇంధన అవసరాలకు సరిపోతుంది. సమగ్ర సేంద్రియ వ్యవసాయాన్ని వ్యాప్తి చేసేందుకు, దాని వివరాలను తెలియజేసేందుకు దాగర్ హర్యానా కిసాన్ వెల్ఫేర్ క్లబ్ను స్థాపించాడు.

డి) మున్సిపల్ ఘన వ్యర్థాలు :
ఏదైనా పదార్థం / వస్తువులు ఘనరూపంలో ఉన్న వ్యర్థాలను బయటకు పారవేసినట్లయితే వాటి ఘనవ్యర్థాలు అంటారు. ఇవి గృహాలు, హోటళ్ళు, రెస్టారెంట్లు, టీ దుకాణాలు మొ॥ వాటి నుండి వస్తాయి.

నగరపాలక సంస్థలు సేకరించే ఘనవ్యర్థాలు సాధారణంగా కాగితం, ఆహార పదార్థాలు, ప్లాస్టిక్, గ్లాస్, లోహాలు, రబ్బర్, తోలు, బట్టలు మొ||నవి ఈ వ్యర్థాల మొత్తాలను తగ్గించడానికి వాటిని తగులబెడతారు. అయితే అవి పూర్తిగా కాలకపోవడం వల్ల బహిరంగ డంప్లు గాలి పరిసరాల కాలుష్యానికి దారితీస్తుంది. అనారోగ్యాలు ప్రబలుతాయి.

ఈ సమాజంలో అవగాహన కలిగించడం ద్వారా వ్యర్థాల తొలగింపుకు ఉత్తమ పరిష్కారం. ఇటువంటి మున్సిపల్ ఘనవ్యర్థాలను పునశ్చక్రీయ ప్రక్రియ ద్వారా తిరిగి వినియోగంలోకి తీసుకువచ్చినట్లయితే పరిసరాల కాలుష్యాన్ని అరికట్టవచ్చును.

ప్రశ్న 32.
భూతాప కారణాలను, ప్రభావాలను చర్చించండి. భూతాపాన్ని నియంత్రించడానికి ఏ చర్యలు చేపట్టాలి?
జవాబు:
హరితగృహ వాయువుల స్థాయి పెరగడం వల్ల భూమి ఉష్ణోగ్రత గణనీయంగా పెరిగి భూతాపం (Global Warming)కు దారితీస్తుంది. గత శతాబ్ద కాలంలో భూతాపం 0.6°C వరకు పెరిగింది. అందులో అధిక భాగం చివరి మూడు దశాబ్దాలలోనే పెరిగింది. ఈ ఉష్ణోగ్రత పెరుగుదల భూవాతావరణంలో తీవ్ర మార్పులు కలిగిస్తుందని శాస్త్రజ్ఞులు భావిస్తున్నారు. అందువల్ల తీవ్ర వాతావరణ మార్పులు (ఎల్నినో (ELNINO)) లాంటి), ధ్రువ ప్రాంతాలలోను, హిమాలయాల లాంటి పర్వతాల పైన ఉన్న మంచు కరగడంలాంటివి సంభవిస్తాయి. తత్ఫలితంగా కాలక్రమేణా సముద్ర మట్టం పెరిగి, తీరప్రాంతాలు మునిగిపోయే ప్రమాదం ఉంది. గ్లోబల్ వార్మింగ్ కలిగించే అపార దుష్పరిమాణాల అధ్యయనం కొనసాగుతోంది.

గ్లోబల్ వార్మింగ్ – నియంత్రణా పద్ధతులు :

  1. శిలాజ ఇంధనాల వాడకం తగ్గింపు
  2. శక్తి (energy) వినియోగ సామర్థ్యత పెంపు
  3. అడవుల నరికివేత ఆపడం, వృక్షాలు పెంచడం
  4. మానవ జనాభా పెరుగుదల వేగాన్ని తగ్గించడం

ప్రశ్న 33.
కింది వాటికి క్లుప్తంగా, విమర్శనాత్మక వివరణ ఇవ్వండి.
ఎ) యూట్రోఫికేషన్
బి) జీవ ఆవర్థనం
సి) భూగర్భ జల క్షీణత, వాటి పరిపుష్టతకు మార్గాలు.
జవాబు:
AP Inter 1st Year Zoology Study Material Chapter 8 జీవావరణం – పర్యావరణం 4
ఎ) యూట్రోఫికేషన్ (Eutrophication) :
నీటిలో పోషక పదార్థాలు పెరిగిపోవడం వల్ల సరస్సులో ఏర్పడే సహజమైన వార్ధక్యాన్ని యూట్రోఫికేషన్ అంటారు. కొత్తగా ఏర్పడిన సరస్సులలో నీరు చల్లగాను, తేటగాను ఉండటం వల్ల ప్రాణులకు ఆధారంగా ఉండదు. కాలానుగుణంగా నైట్రేట్స్, ఫాస్ఫేట్స్ లాంటి పోషక పదార్థాలు పిల్ల కాలువల ద్వారా సరస్సులలోకి నెమ్మదిగా చేరతాయి. ఇవి నీటిలో శైవలాలు, ఇతర మొక్కల పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. తదనుగుణంగా జంతువులు వృద్ధి చెందుతాయి. కర్బన పదార్థాలు సరస్సు అడుగు భాగంలో చేరి పేరుకుపోతాయి. కొన్ని శతాబ్దాల తరువాత సిల్ట్ (silt), కర్బన డెబ్రిస్ పేరుకుపోయి సరస్సు లోతు తగ్గిపోయి వేడిగా మారుతుంది. దాని ఫలితంగా శీతల వాతావరణంలో జీవించే జీవుల స్థానంలో నెమ్మదిగా ఉష్ణనీటి జీవుల ప్రతిస్థాపన జరుగుతుంది.

బి) జీవ ఆవర్థనం (Bio-magnification) :
నీటి ఆహారపు గొలుసులో కాలుష్యం లేదా విషపదార్థ గాఢత ఒక పోషక స్థాయి నుంచి వేరొక పోషక స్థాయికి పెరుగుతూపోతే దాన్ని జీవ ఆవర్థనం అంటారు. జీవుల్లో ప్రవేశించిన విష పదార్థం జీవక్రియ లేదా విసర్జన ప్రక్రియల వల్ల క్షీణించకుండా తరువాతి పోషణ స్థాయికి వెళ్ళి అక్కడ విష పదార్థాలు పేరుకుపోయే పరిస్థితులలో జీవ ఆవర్ధనం జరుగుతుంది. DDT, పాదరస కాలుష్యం విషయంలో ఈ దృగ్విషయం బాగా తెలుస్తుంది.

సి) భూగర్భ జల క్షీణత, వాటి పరిపుష్టతకు మార్గాలు :
వర్షం కురిసిన తరువాత కొంత నీరు భూమిలోనికి ఇంకిపోయి భూమి పొరల మధ్య, మట్టి రేణువులతో కూడి ఉంటుంది. అలాగే జలాశయాల నుండి, ఇతర జలవనరుల నుండి కూడా భూమి పొరలలోకి నీరు ఇంకిపోతుంది. ఇలా ఇంకిన నీటిని భూగర్భజలం అంటారు. భూగర్భ జలాలు ప్రధానంగా వృక్షజాతికి జీవనాధారం. అలాగే మానవులు భూమి నుండి బావులు, బోరుబావుల ద్వారా నీటిని బయటకు తీసి వాడుకుంటారు.

ఇటీవల కాలంలో పర్యావరణ కాలుష్య కారణంగా, ఇతర పరిస్థితుల ప్రభావం వలన వర్షపాతంలో తరుగుదల కనిపిస్తుంది. దీనివలన భూగర్భజల స్థాయి పడిపోతుంది. కనుక ఇంకుడు గుంటలను, చిన్నచిన్న జలవనరులను ఏర్పర్చి, ఎక్కడి నీటిని అక్కడే భూమిలోకి ఇంకిపోయేటట్లు చేసి జీవజాతిని రక్షించుకోవాలి.

దీర్ఘ సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ఉష్ణోగ్రత ఒక జీవావరణ కారకం అనే విషయంపై వ్యాసం రాయండి.
జవాబు:
వేడి తీవ్రతను తెలియజేసే ప్రమాణం ఉష్ణోగ్రత. భూమిపై ఉష్ణశక్తికి మూలాధారం సూర్యుడు. భూమిపై ఉష్ణోగ్రత ఆయా ఋతువులు, భౌగోళిక ప్రాంతాలపై ఆధారపడి ఉంటుంది. భూమధ్యరేఖ నుండి ధృవాల వైపుకు ప్రయాణించేటప్పుడు ఉష్ణోగ్రత క్రమేణా తగ్గుతుంది. భూఉపరితలం నుండి పర్వతాల పైకి వెళుతున్నప్పుడు క్రమేణా తగ్గుతుంది. భూమిపై గల ఉష్ణోగ్రతా వ్యత్యాసాలు జలావాసాలలోని ఉష్ణోగ్రతా వ్యత్యాసాలతో పోలిస్తే ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే నీటి కంటే నేల త్వరితంగా వేడెక్కుతుంది, చల్లబడుతుంది.

జీవావర్ణంలో జీవులపై, నిర్జీవులపై ఉష్ణోగ్రతా ప్రభావం అధికంగా ఉంటుంది. ఉష్ణోగ్రత ఒక జీవావరణ కారకం.

సరస్సులలో ఉష్ణోగ్రతా ప్రభావం :
సమశీతోష్ణ ప్రాంతాలలో ఋతువులు మారుతున్నప్పుడు ఉష్ణోగ్రత వ్యత్యాసాలు ఏర్పడతాయి. దీని కారణంగా సరస్సు ఆవరణంలో ఉష్ణస్తరాలు ఏర్పడతాయి. దీనినే ఉష్ణస్తరీభవనం అంటారు. ఉష్ణస్తరీభవనం వలన ఋతువులకు అనుగుణంగా సరస్సులో నీరు కలియబెట్టబడుతుంది. వీటిని ఋతువులకు అనుగుణంగా గ్రీష్మకాల స్తరీభవనం, శీతాకాల స్తరీభవనంగా వివరించవచ్చును. ఈ విధమైన స్తరీభవనాలు లోతైన సరస్సులో అన్ని స్థాయిల జీవుల మనుగడకు దోహదపడతాయి.

ఉష్ణోగ్రత సహనం :
ప్రకృతిలో కొన్ని జీవులు అత్యధిక ఉష్ణోగ్రత మార్పులను తట్టుకునే అనుకూలనాలను కలిగివుంటాయి. వీటిని యూరీథర్మల్ జీవులు అంటారు. అనేక జీవులు అత్యల్ప ఉష్ణోగ్రత మార్పులను మాత్రమే తట్టుకునే అనుకూలనాలను కలిగి ఉంటాయి. వీటిని స్టీనోథర్మల్ జీవులు అంటారు. వివిధ జీవ జాతులలో ఉష్ణోగ్రత సహనస్థాయి వాటి భౌగోళిక విస్తరణను నిర్ణయిస్తాయి.

ఉష్ణోగ్రత – జీవక్రియలు :
ఉష్ణోగ్రతా ప్రభావం జీవులలోని ఎంజైముల చర్యలపై, తద్వారా ఆధార జీవక్రియలపై, జీవుల శరీరధర్మ క్రియలపై, నిర్మాణంపై పడుతుంది. జీవులు ఏ ఉష్ణోగ్రత వద్ద తమ జీవక్రియలను పతాకస్థాయిలో నిర్వర్తించగలుగుతాయో ఆ ఉష్ణోగ్రతను యుక్తతమ ఉష్ణోగ్రత అంటారు. ఉష్ణోగ్రత పెరిగినకొద్దీ జీవక్రియా రేటు పెరుగుతుంది. ఉష్ణోగ్రతకు జీవక్రియ రేటుకు మధ్యగల సంబంధాన్ని వాస్టాఫ్ సూత్రం వివరిస్తుంది. జీవులు నిరంతరంగా లేదా దీర్ఘకాలికంగా జీవించగల కనిష్ట ఉష్ణోగ్రతను కనిష్ట ప్రభావ ఉష్ణోగ్రత అంటారు.

కొన్ని జంతువులలో ఋతువులనుబట్టి వాటి శరీర ఆకృతిలో మార్పులు ఏర్పడతాయి. దీనినే భ్రమణ రూపవిక్రియ అంటారు.
ఉదా : డాఫ్నియా.
AP Inter 1st Year Zoology Study Material Chapter 8 జీవావరణం – పర్యావరణం 5

జీవులలో ఉష్ణోగ్రతా అనుకూలనాలు :
జీవులు తమ దేహంలో బాహ్యంగా, అంతరంగా పరిసర ఉష్ణోగ్రతా ప్రభావాలకు కొన్ని అనుకూలనాలను సంతరించుకొంటాయి. వాటిని మూడు రకాలుగా చెప్పవచ్చును.

  1. ప్రవర్తన అనుకూలనాలు,
  2. స్వరూప, అంతర్నిర్మాణ అనుకూలనాలు,
  3. శరీరధర్మ అనుకూలనాలు.

1) ప్రవర్తన అనుకూలనాలు :
పరిసరాలలోని ఉష్ణోగ్రత భేదాలను ఎదుర్కొనే వీలుగా ఎడారి బల్లి వంటి జీవులు అనేక ప్రవర్తనా పద్ధతులను అవలంబిస్తాయి. పరిసర ఉష్ణోగ్రత దేహ ఉష్ణోగ్రత కంటే తగ్గితే ఎండలోకి వెళ్ళి సూర్యరశ్మి సోకేవిధంగా తమ దేహాన్ని ఉంచి ఉష్ణోగ్రతను పొందుతాయి. అలాగే బాహ్యఉష్ణోగ్రత పెరిగితే నీడలోకి కాని, బొరియలలోకి కాని వెళతాయి.

2) స్వరూప, అంతర్నిర్మాణ అనుకూలనాలు :
ధృవ ప్రాంత సముద్రాలలో నివసించే సీలాంటి జలక్షీరదారులలో చర్మానికి క్రింద మందమైన కొవ్వుపొర (బ్లబ్బర్) ఏర్పరచబడి ఉంటుంది. అది శరీరం నుండి ఉష్ణం వెలుపలకు వెళ్ళకుండా ఉష్ణబంధకంగా పనిచేస్తుంది. సాధారణంగా శీతల ప్రాంతంలో నివసించే జీవుల దేహాలు విశాలంగా, పెద్దవిగా ఉంటాయి. ఉష్ణ ప్రాంతంలో నివసించే జీవుల దేహాలు చిన్నవిగా ఉంటాయి.

3) శరీరధర్మ అనుకూలనాలు :
చాలా జంతువులలో శరీరధర్మ క్రియలు యుక్తతమ ఉష్ణోగ్రతా శ్రేణిలో నిర్వహించబడతాయి. మానవ శరీర ఉష్ణోగ్రత 37°C. పరిసర ఉష్ణోగ్రత అధికమైనపుడు దేహం చెమట పట్టించడం, చెమట ఆవిరిగా మారిన ఫలితంగా ఏర్పడిన చల్లదనం వల్ల శరీర ఉష్ణోగ్రత నియంత్రించబడుతుంది. పరిసర ఉష్ణోగ్రత తగ్గినప్పుడు దేహం ఉష్ణోగ్రతను ఉత్పన్నం చేసి జీవి కాపాడబడుతుంది. మొక్కలలో ఈవిధంగా అంతర ఉష్ణోగ్రతను ఏర్పరచే యంత్రాంగం లేదు.

అనేక జంతువులు ఒక స్థిరమైన అంతర ఉష్ణోగ్రతను క్రమపరచే యంత్రాంగమును కలిగి లేవు. ఇవి పరిసరాలకు అనుగుణంగా తమ దేహ ఉష్ణోగ్రతను మార్చుకుంటాయి. వీటిని బాహ్య ఉష్ణజీవులు లేదా అనురూపకాలు అంటారు.

ఉష్ణోగ్రతా ఒత్తిడిని తట్టుకోవడానికి కొన్ని జంతువులు తాత్కాలికంగా తమ నివాస ప్రాంతాలు వదిలి అనుకూల ప్రదేశాలలో నివసిస్తాయి. ఉదా : మన రాష్ట్రంలో కొల్లేటి ప్రాంతానికి వలస వచ్చే పక్షులు. కొన్ని జీవులు ప్రతికూల ఉష్ణోగ్రత సమయంలో జీవన చర్యలను నిమ్న స్థాయిలో నిర్వహించుకుంటూ సుప్తావస్థలోకి వెళతాయి. కొన్ని కోశాలను ఏర్పరచుకుంటాయి.

కొన్ని జంతువులు అననుకూల ఉష్ణోగ్రతా స్థితిలో పిండాభివృద్ధి తాత్కాలికంగా నిలిపివేస్తాయి. దీనినే డయాపాస్ అంటారు.

పై విధంగా జీవావరణంలో ఉష్ణోగ్రత జీవావరణం కారకంగా పనిచేస్తుంది.

AP Inter 1st Year Zoology Study Material Chapter 8 జీవావరణం – పర్యావరణం

ప్రశ్న 2.
నీరు జీవావరణంలో ఒక కారకం అనే విషయాన్ని సవివరంగా రాయండి.
జవాబు:
జంతువుల జీవనశైలిపై ప్రభావం చూపే ఒక ప్రధాన కారకం నీరు. నీరు లేనిదే జీవం నిలువలేదు. ఎడారులలో నీటి లభ్యత చాలా తక్కువగా ఉండటం వల్ల ప్రత్యేకమైన అనుకూలనాలను ఏర్పరచుకోవడం ద్వారా ఆ ప్రాంతాలలో నివసించడం సాధ్యమైంది. సముద్రాలు, నదులు, సరస్సులలో నివసించే జంతువులకు నీటి సంబంధ సమస్యలే ఉండవని అనుకోవచ్చు. కాని ఇది నిజం కాదు. జలచర జీవులకు నీటి నాణ్యత (రసాయన సంఘటన, pH మొదలైనవి) అత్యంత ప్రధానమైంది. మంచినీటి లవణ గాఢత 5% కంటే తక్కువగాను, సాగరనీటిలో 30-35% గాను ఉంటుంది.

కొన్ని అధిక లవణీయత గల లాగూన్స్లలో 100% ఉంటుంది. కొన్ని జంతువులు ఎక్కువ మేర లవణీయతలో అనుకూలనాలను ప్రదర్శిస్తాయి. (వ్యాపిత లవణీయత- Euryhaline), మిగిలినవి తక్కువ మేర లవణీయతలో అనుకూలనాలను కలిగి ఉంటాయి. (మిత లవణీయత – Stenohaline). అనేక మంచినీటి చేపలు ద్రవాభిసరణ సమస్యలు ఎదుర్కోలేక ఎక్కువ కాలం సముద్రంలో నివసించలేవు. అదేవిధంగా సముద్రచేపలు మంచినీటిలో నివసించలేవు.

మంచినీటి ఆవాసాల్లో అనుకూలనాలు :
మంచినీటిలో నివసించే జంతువులు అంతర ద్రవాభిసరణ (Osmosis) సమస్యను ఎదుర్కోవాలి. మంచినీటిలో ద్రవాభిసరణ పీడనం తక్కువగా ఉంటుంది. జంతుదేహంలోని ద్రవాలలో ద్రవాభిసరణ పీడనం అధికంగా ఉండటం వల్ల వెలుపలి ప్రాంతపు నీరు జీవి శరీరంలోకి అంతర ద్రవాభిసరణం ద్వారా ప్రవేశిస్తుంది. మంచినీటి జీవులు దేహంలోని నీటి సమతుల్యతను నిర్వహించడానికి అనేక అనుకూలనాలు పొందాయి. అవి : మంచినీటి ప్రోటోజోవా జీవులలో సంకోచరిక్తికలు, చేపలలో పెద్ద రక్తకేశ నాళికాగుచ్ఛ మూత్రపిండాలు (Glomelular kidneys) మొదలైనవి. ఇవి దేహం నుంచి అధిక మొత్తంలో విసర్జించే మూత్రంలో కొన్ని లవణాలను కూడా కోల్పోతాయి.

దేహం నుంచి కోల్పోయిన లవణాలను భర్తీ చేయడానికి, మంచినీటి చేపలు వాటి మొప్పలలో లవణాలను గ్రహించే క్లోరైడ్ కణాలు (Chloride cells) కలిగి ఉంటాయి. మంచినీటి చెరువులలో ప్రధాన సమస్య ఏమిటంటే ఎండాకాలంలో అనేక కుంటలు ఎండిపోతాయి. ఇటువంటి సమస్య నుంచి రక్షణ కోసం మంచినీటి ప్రొటిస్టా జీవులు కోశీభవన (Encystment) ప్రక్రియను ప్రదర్శిస్తాయి. ఎండాకాలంలో ప్రతికూల సమస్యల నుంచి రక్షణ కోసం మంచినీటి స్పంజికలు అలైంగికోత్పత్తి నిర్మాణాలైన జెమ్యూల్స్న ఏర్పరుస్తాయి. ఎండాకాలంలో మనుగడ కోసం “ఆఫ్రికన్ ఊపిరితిత్తి చేప” (African lung fish) ప్రోటాక్టిరస్ (Protopterus) బురద మట్టిలో బొరియలు చేసుకొని, దేహం చుట్టూ జిగట పదార్థ కోశాన్ని ఏర్పరచుకొంటుంది.

సముద్ర ఆవాసాల్లో అనుకూలనాలు :
సముద్రపు నీటిలో లవణ గాఢత దేహద్రవ్యాల గాఢత కంటే ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా సముద్ర జంతువుల దేహం నుంచి నిరంతరం బాహ్యద్రవాభిసరణ (Exosmosis) ద్వారా నీరు వెలుపలికి వెళ్ళడం ద్వారా దేహం నిర్జలీకరణకు గురవుతుంది. ఇలాంటి నీరు కోల్పోయే సమస్య నుంచి బయటపడటానికి సముద్రచేపలలో వృక్క ప్రమాణాలు (Nephrons) తక్కువగానున్న రక్తకేశనాళికాగుచ్ఛరహిత మూత్రపిండాలు (Aglomerular kidneys) ఉంటాయి. ఇవి మూత్రం ద్వారా విసర్జింపబడే నీటిని తగ్గిస్తాయి. కోల్పోయిన నీటిని భర్తీ చేయడానికి సముద్రచేపలు ఎక్కువగా నీటిని లోనికి తీసుకోవడం వల్ల, లవణాలు దేహద్రవ్యాలతో కలిసి అంతర సమతుల్యతలో అస్థిరత ఏర్పడుతుంది.

దేహంలో లవణ సమస్థితి (Salt homeostasis) నియంత్రించడంలో లవణాలను స్రవించే క్లోరైడ్ కణాలు మొప్పలలో ఉంటాయి. సాగర పక్షులైన సీగల్స్ (Sea gulls), పెంగ్విన్ (Penguin) పక్షుల నాసికానాళాల నుంచి లవణద్రవం చుక్కలుగా వెలువడుతుంది. తాబేళ్లలో (Turtles) నేత్రాల సమీపంలో క్లోరైడ్ స్రవించే గ్రంథినాళాలు తెరచుకొని ఉంటాయి. కొన్ని మృదులాస్థి చేపలలో యూరియా, ట్రైమిథైల్ అమైన్ ఆక్సైడ్ (TMO) రక్తంలో ఉండి, దేహద్రవ్యాలను సాగరనీటితో సమగాఢతలో ఉంచడంలో, బాహ్యద్రవాభిసరణతో జరిగే నిర్జలీకరణ జరగకుండా అవుతుంది.

ఉప్పునీటికయ్య జంతువులలో నీటి సంబంధ అనుకూలనాలు :
ఉప్పునీటికయ్య జంతువులు స్థూల లవణీయత మార్పులను ఎదుర్కోవడానికి అనుకూలనాలను కలిగివుంటాయి. అటువంటి జంతువులను వ్యాపిత లవణీయ (Euryhaline) జంతువులని, అటువంటి వ్యత్యాసాలకు తట్టుకోలేనివాటిని మిత లవణీయత జీవులు (Stenohaline) అంటారు. సాల్మన్, హిల్సా చేపలను అనాడ్రామస్ చేపలు అంటారు. ఇవి ప్రజననం కోసం సముద్రపు నీటి నుంచి మంచినీటిలోకి వలస వెళ్తాయి. ఆంగ్విల్లా బెంగాలెన్సిస్ ఒక కెటాడ్రామస్ చేప. ఇది ప్రజననం కోసం నదుల నుంచి సముద్రాలలోకి వలస వెళ్తుంది.

నీటి లవణీయ మార్పులకు అనుగుణంగా ఈ చేపలలోని రక్తకేశనాళికాగుచ్ఛ మూత్రపిండాలు (Glomerular kidneys) సర్దుబాటు చేసుకొంటాయి. క్లోరైడ్ కణాలు పరిస్థితినిబట్టి లవణాలను విసర్జించే లేదా గ్రహించే అనుకూలనం చెంది ఉంటాయి. నదులలోకి ప్రవేశించగానే సాల్మన్ చేపలు ఎక్కువ నీటిని తాగడం ద్వారా వాటి దేహ ద్రవ్యాలు గాఢత పరిసర నీటి గాఢతతో సమానంగా ఉంటుంది.

భూచర జీవనానికి నీటి సంబంధ అనుకూలనాలు :
బాహ్యంగా లభించే నీటివనరులు లభ్యం కాకపోతే, ఉత్తర అమెరికా ఎడారులలోని కంగారు ఎలుక కావలసిన నీటి అవసరాన్ని దేహంలోని కొవ్వుని ఆక్సీకరణ చేయడం ద్వారా తీర్చుకుంటుంది. ఈ క్రియలో నీరు ఒక ఉపఉత్పాదితం. అంతేకాకుండా కంగారు ఎలుక అతి గాఢత కలిగిన మూత్రాన్ని విసర్జిస్తుంది. ఈ చర్య వల్ల విసర్జనక్రియ ద్వారా నీరు వృధా కాకుండా అది సంరక్షించుకుంటుంది.

ప్రశ్న 3.
సరస్సుని జీవావరణ వ్యవస్థగా వివరిస్తూ, అందులో వివిధ మండలాలను, జీవ సంఘటకాలను సోదాహరణంగా వివరించండి.
జవాబు:
సరస్సు జీవావరణ వ్యవస్థ (Lake Ecosystem) :
జలచర జీవావరణవ్యవస్థను గురించిన ప్రాథమిక అవగాహన కోసం ‘సరస్సు’ అధ్యయనాన్ని ఉదాహరణగా తీసుకొందాం. ఇది స్వతంత్ర జీవనాధార ప్రామాణికంగా పరిగణించవచ్చు. దీని సహాయంతో జలచర జీవావరణవ్యవస్థలోని సంక్లిష్ట అంతరచర్యలన్నీ కూడా అధ్యయనం చేయవచ్చు.
AP Inter 1st Year Zoology Study Material Chapter 8 జీవావరణం – పర్యావరణం 6

సరస్సులు సముద్ర తీరప్రాంతానికి దూరంగా ఉన్నా చుట్టూ భూమి (inland) ఉండి, పెద్ద స్థిర జల ప్రాంతాలుగా నిశ్చలమైన / స్థిరమైన నీటిని కలిగి ఉంటాయి. (గుర్తు తెచ్చుకోండి : స్థిర జల సమాజం). ఇవి చెరువుల కంటే లోతుగా ఉంటాయి. అత్యధిక సరస్సులలో సంవత్సరమంతా నీరు ఉంటుంది. లోతైన సరస్సులో కాంతి 200 మీ. కంటే ఎక్కువ లోతుకు చొచ్చుకొని పోలేదు. కాంతి తీవ్రత, ఉష్ణోగ్రత, పీడనాలను ఆధారం చేసుకొని సరస్సును నిలువుగా స్తరీకరించారు. లోతైన నీటి సరస్సులలో మూడు నిర్దిష్ట ప్రాంతాలు ఉన్నాయి. అవి :

  1. వేలాంచల మండలం (Littoral zone),
  2. లిమ్నెటిక్ మండలం (Limnetic zone)
  3. ప్రొఫండల్ మండలం (Profundal zone).

వేలాంచల మండలం (Littoral zone) :
తీరానికి దగ్గరగా ఉండి, లోతు తక్కువగా ఉన్న ప్రాంతాన్ని వేలాంచల మండలం అంటారు. కాంతి అడుగు భాగం వరకు ప్రసరిస్తుంది.

లిమ్నెటిక్ మండలం(Limnetic zone) :
ఇది తీరానికి దగ్గరగా ఉండే జలాశయ ప్రాంతం. కాంతి సమర్థవంతంగా లోపలికి చొరబడగలిగే ప్రాంతం వరకు కొనసాగుతుంది.

ప్రొఫండల్ మండలం (Profundal zone) :
ఇది లిమ్నెటిక్ మండలానికి కింద ఉన్న లోతైన నీటి ప్రదేశం. దీనిలో కాంతి ఉండదు. కిరణజన్య సంయోగక్రియ జీవులుండవు. ఈ నీటిలో ఆక్సిజన్ తక్కువ స్థాయిలో ఉంటుంది. దీనిలో అవాయు శ్వాసక్రియ జరిపి కుళ్ళిన ఆహార పదార్థాలను తినే డెట్రిటస్ జీవులు ఉంటాయి.

స్థిర జల ఆవాసంలో ఉన్న జీవులను పిడానిక్ రూపాలు, లిమ్నెటిక్ రూపాలుగా విభజించారు. వీటిలో సరస్సు అడుగుభాగంలో గల జీవులను పిడానిక్ (pedonic form) రూపాలుగా, సరస్సు పై భాగంలో తీరం దగ్గర ఉన్న మొక్కలకు దూరంగా ఉన్న జీవులను లిమ్నెటిక్ రూపాలని (Limnetic forms) అంటారు.

వేలాంచల మండలంలోని జంతు వృక్ష జీవం (బయోటా) :
ఈ మండలంలో కాంతి ప్రవేశించు స్థాయి వరకు పిడానిక్ మొక్కలు ఎక్కువగా ఉంటాయి. తీరప్రాంతంలో ఉద్భవించిన మొక్కల సమూహం (Emergent vegetation) ఉంటుంది. ఈ మొక్కల వేళ్ళు నీటి అడుగు భాగంలోనూ, కొమ్మలు, ఆకులు వీటి ఉపరితలంపైన ఉంటాయి. ఇవి ఉభయచర మొక్కలు (Amphibious plants). వేలాంచల మండలంలోని మొక్కల వేర్లు బహిర్గతంగా కనిపిస్తాయి.

క్యాట్ టెయిల్స్ (టైఫా), బలషస్ (స్కిర్పస్) ఆరోహెడ్స్ (సాజిట్టేరియా) మొదలైనవి. కొద్దిగా లోతుగా ఉన్నవి వేళ్ళు కలిగి, నీటిలో తేలియాడుతూన్న పత్రాలు కలిగిన, మొక్కలు నీటి లిల్లీలు (నింఫియా), నెలుంబో, ట్రాపా మొదలైనవి. ఇంకా లోతుగా ఉన్నవి నీటిలో పూర్తిగా మునిగిన మొక్కలైన హైడ్రిల్లా, కారా, పొటామోజిటాన్ మొదలైనవి. స్వేచ్ఛగా తేలియాడే మొక్కల సమూహంలో పిస్టియా, ఉల్ఫియా, లెమ్నా, (డక్వోడ్) ఎజొల్లా, ఐకార్నియా మొదలైనవి ఉంటాయి.

వేలాంచల మండలంలోని వృక్ష ప్లవకాలలో డయాటమ్స్ (కొసినోడిస్కస్, నిట్సియా మొదలైనవి), ఆకుపచ్చ శైవలాలు (వాల్వాక్స్, స్పైరోగైరా మొదలైనవి), యూగ్లినాయిడ్స్ (యూగ్లీనా, ఫాకస్ మొదలైనవి), డైనోఫ్లాజెల్లేట్స్ (జిమ్నోడినియమ్, సిస్టోడినియమ్ మొదలైనవి) ఉన్నాయి.

సరస్సులో వేలాంచల మండలంలో వినియోగదారులైన జంతువులు అధికసంఖ్యలో ఉంటాయి. జంతుప్లవకాలు, న్యూస్టాస్, క్టాన్, పెరీఫైటాన్, బెన్డోస్లుగా వర్గీకరించారు. వేలాంచల మండలంలోని జంతు ప్లవకాలలో వాటర్ ప్లీస్ (Water fleas) అయిన డాఫ్నియా, రోటిఫర్లు, ఆస్ట్రకాడ్స్ ఉన్నాయి.

నీటి ఉపరితలంలో గాలీ నీరు కలిసేచోట ఉండే జంతువులను న్యూస్టాన్ అంటారు. ఇవి రెండు రకాలు. 1. ఎపిన్యూస్టాన్, 2. హైపోన్యూస్టాన్. ఎపిన్యూస్టాన్ / సుప్రాన్యూస్టాన్లో వాటర్ స్టైడర్స్ (గెర్రిస్), బీటిల్స్, వాటర్ బగ్స్ (డైన్యూట్స్) ఉంటాయి. హైపోన్యూస్టాన్ / ఇన్ఫ్రాన్యూస్టాన్లో దోమ డింభకాలు మొదలైనవి ఉంటాయి.

నీటిలో ఈదుతూ జీవించే చేపలు, ఉభయచరాలు, నీటి సర్పాలు, టెర్రాపిన్స్ (తాబేళ్ళు), కీటకాలైన నీటి తేలు (రనత్రా), నోటోనెక్టా (వెనుకకు ఈదే జీవి), డైవింగ్ బీటిల్స్ (డైటిస్కస్) మొదలైన వాటిని నెక్టాన్ అంటారు.

నీటి మొక్కలపై అంటిపెట్టుకొని లేదా పాకుతున్న జంతువులు. నీటినత్తలు, కీటకాల డింభకాలు (Nymphs of Insects), బ్రయోజోవన్స్, టర్బల్లేరియన్స్, హైడ్రాలు మొదలైనవి పెరిఫైటాన్ గా చెప్పబడతాయి.

సరస్సు అడుగుభాగంలో విశ్రాంతి తీసుకొనే లేదా చరించే జీవులను బెన్డోస్ (Benthos) అంటారు. ఉదా : ఎర్రటి, అనెలిడ్లు, కైరొనోమిడ్ డింభకాలు, క్రే చేపలు, కొన్ని ఐసోపోడ్స్, ఆంఫిపోడ్స్, క్లామ్స్ మొదలైనవి.

లిమ్నెటిక్ మండలంలోని బయోటా (Biota of the Limnetic zone) :
సరస్సులో అతిపెద్ద మండలం లిమ్నెటిక్ మండలం. ఈ మండలంలో సమయానుకూలంగా నీటిస్థాయి, ఉష్ణోగ్రత, ఆక్సిజన్ లభ్యత మొదలైనవి వేగవంతంగా మారతాయి. లిమ్నెటిక్ మండలంలో స్వయంపోషకాలు అధికంగా ఉంటాయి. (కిరణజన్యసంయోగక్రియ మొక్కలు). ఈ ప్రాంతంలోని ముఖ్యమైన స్వయంపోషకాలు వృక్ష ప్లవకాలైన యూగ్లినాయిడ్స్, డయాటమ్స్, సైనోబాక్టీరియా, డైనోఫ్లాజెల్లేట్లు, ఆకుపచ్చని శైవలాలు ఉన్నాయి. లిమ్నెటిక్ మండలంలోని వినియోగదారులు జంతు ప్లవకాలు, ఉదా: కోపిపోడ్స్, చేపలు, కప్పలు, నీటి సర్పాలు మొదలైనవి. లిమ్నెటిక్ నెక్టాన్గా పిలవబడతాయి.

ప్రొఫండల్ మండలంలోని బయోటా (Biota of the Profoundal zone) :
ఈ ప్రాంతంలోని జీవులు విచ్ఛిన్నకారులు (బాక్టీరియా), కైరొనొమిడ్ డింభకాలు, చావోబోరస్ (ఫాంటమ్ డింభకాలు), ఎర్ర అనలిడ్డు, క్లామ్స్ (clams) మొదలైనవి తక్కువ స్థాయిలో ఆక్సిజన్ ఉన్నప్పటికీ జీవిస్తాయి. ఈ మండలంలోని విచ్ఛిన్నకారులు, చనిపోయిన మొక్కలు, జంతువులను విచ్ఛిన్నం చేసి అందులో గల పోషక పదార్థాలను విడుదల చేస్తాయి. వాటిని వేలాంచల మండలం, లిమ్నెటిక్ మండలాలలోని జీవసమాజాలు వినియోగించుకుంటాయి.

సరస్సు జీవావరణవ్యవస్థ ఒక ఉన్నత స్థాయి జీవావరణవ్యవస్థ లేదా జీవగోళం నిర్వహించే విధులన్నిటినీ నిర్వహిస్తుంది. వికిరణ సౌరశక్తి సహాయంతో స్వయంపోషకాలు అకర్బన పదార్థాలను కర్బన పదార్థాలుగా మార్చడం, పరపోషకాలతో విచ్ఛిన్నకారులలో స్వయంపోషకాల వినియోగం అనగా చనిపోయిన జీవులను విచ్ఛిన్నం చేసి పోషక పదార్థాలు, ఖనిజాలు విడుదల చేయడం, అవి తిరిగి స్వయంపోషకాల చేత వినియోగింపబడడం (ఖనిజాలు పునఃవలయం) మొదలైన క్రియలు ఇందులో జరుగుతాయి.

ప్రశ్న 4.
జీవావరణ వ్యవస్థలో కనిపించే వివిధ ఆహార గొలుసులను వివరించండి. [Mar. ’14]
జవాబు:
సూర్యుడి నుండి శక్తి జీవావరణవ్యవస్థలోకి కిరణజన్య సంయోగక్రియ ద్వారా ప్రసరిస్తుంది. జీవావరణ వ్యవస్థలో అనేక స్థాయిలుంటాయి. వీటిని పోషకస్థాయిలు అంటారు.

ఆహార పదార్థాలలోని శక్తి క్రింది పోషక స్థాయి నుంచి పై పోషక స్థాయికి బదిలీ చేయబడుతుంది. ఆహారశక్తి మార్గాన్ని నిలువు వరుసగా తీసుకుంటే, వీటిలోని అనుఘటకాలు ఒకదానితో ఒకటి గొలుసు లింకులలాగా ఉండటం వల్ల దీనిని ‘ఆహార గొలుసు’ గా పిలుస్తారు. సాధారణంగా ఆహార గొలుసు ఉత్పత్తిదారులైన వృక్ష జాతులలో మొదలై విచ్ఛిన్నకారులతో అంతమవుతుంది. జీవావరణవ్యవస్థలో మూడు రకాల ప్రధానమైన ఆహారగొలుసులు ఉన్నాయి. అవి :

  1. మేసే జీవుల ఆహార గొలుసు,
  2. పరాన్న జీవుల ఆహార గొలుసు,
  3. డెట్రిటస్ ఆహార గొలుసు.

AP Inter 1st Year Zoology Study Material Chapter 8 జీవావరణం – పర్యావరణం 7
1. మేసే జీవుల ఆహార గొలుసు (Predatory food chain) :
దీన్ని పరభక్ష ఆహార గొలుసు అని కూడా అంటారు. ఈ ఆహార గొలుసు ఆకుపచ్చని మొక్కలతో (ఉత్పత్తిదారులు) మొదలై ద్వితీయ, తృతీయ, చతుర్థ పోషక స్థాయిలలో వరుసగా శాకాహారులు. ప్రాథమిక మాంసాహారులు, ద్వితీయ మాంసాహారులు ఉంటాయి. కొన్ని రకాల ఆహార గొలుసులో మరొక పోషకస్థాయి (పరాకాష్ట మాంసాహారులు Climax carnivores) ఉంటుంది. ఆహార గొలుసులో సాధారణంగా 3 నుంచి 5 వరకు పోషక స్థాయిలు ఉంటాయి. మేసే జీవుల ఆహార గొలుసు (GFC) సంబంధిత ఉదాహరణలు కింద పట్టికలో ఇవ్వడం జరిగింది.
AP Inter 1st Year Zoology Study Material Chapter 8 జీవావరణం – పర్యావరణం 8

2. పరాన్నజీవుల ఆహార గొలుసు (Parasitic food chain) :
కొంతమంది శాస్త్రవేత్తలు పరాన్నజీవుల ఆహార గొలుసును మేసే జీవుల ఆహార గొలుసు కింద చేర్చారు. మేసే జీవుల ఆహార గొలుసు లాగా ఇది కూడా (ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఉత్పత్తిదారులైన మొక్కలతో ప్రారంభమవుతుంది. కాని, పరాన్నజీవుల ఆహార గొలుసులో పోషకశక్తి స్థూలజీవుల నుంచి చిన్న పరిమాణం గల జీవులకు బదిలీ చేయబడుతుంది. ఉదాహరణకు ప్రాథమిక పోషక స్థాయిని ఆక్రమించే వృక్షం, అనేక పక్షులకు ఆవాసాన్ని, ఆహారాన్ని అందజేస్తుంది. ఈ పక్షులు అనేకమైన బాహ్యపరాన్నజీవులకు, అంతఃపరాన్నజీవులకు ఆతిథ్యమిస్తాయి.

3. డెట్రిటస్ ఆహార గొలుసు (Detritus food chain) :
డెట్రిటస్ ఆహార గొలుసు (DFC) మృత కర్బన పదార్థాల (అంటే కుళ్ళిన ఆకులు, మృతి చెందిన జీవుల కళేబరాలు) తో మొదలవుతుంది. పరపోషకాలైన శిలీంధ్రాలు, బాక్టీరియాలు. డెట్రిటసు విచ్ఛిన్నం చేసి దాని నుంచి శక్తి, పోషక అవసరాలు గ్రహిస్తాయి. వీటిని పూతికాహారులు అని కూడా అంటారు. ఇవి జీర్ణక్రియా ఎంజైములను స్రవించి, మృత పదార్థాలను, వ్యర్థపదార్థాలను (మలపదార్థాలను) సరళమైన శోషణకు అనుగుణమైన పదార్థాలుగా విచ్ఛిన్నం చేస్తాయి. డెట్రిటస్ ఆహార గొలుసుకు
ఉదాహరణలు :

  1. డెట్రిటస్ (కుళ్ళిన ఆకుల ద్వారా ఏర్పడింది) – → వానపాములు → కప్పలు సర్పాలు
  2. మృతిచెందిన జీవులు ఈగలు, మాగట్స్ → కప్పలు → సర్పాలు.

జల జీవావరణవ్యవస్థలో మేసేజీవుల ఆహార గొలుసు, శక్తి ప్రసరణకు ప్రధాన మార్గంగా పనిచేస్తుంది. దీనికి వ్యతిరేకంగా భూచర జీవావరణవ్యవస్థలో, మేసే జీవుల ఆహారగొలుసు కంటే డెట్రిటస్ ఆహార గొలుసు ద్వారా అధిక భాగం శక్తి ప్రసరణ జరుగుతుంది. డెట్రిటస్ ఆహార గొలుసు కొన్ని స్థాయిలలో మేసే ఆహారగొలుసుతో సంబంధం కలిగి ఉండవచ్చు. డెట్రిటస్ ఆహార గొలుసులోని కొన్ని జీవులు, మేసే జీవుల ఆహారగొలుసులోని కొన్ని జీవులకు ఆహారంగా ఉంటాయి. ఉదా : పైన చూపిన డెట్రిటస్ ఆహారగొలుసులోని వానపాములు మేసే జీవుల ఆహారగొలుసులోని పక్షులకు ఆహారంగా ఉంటాయి. ఈ విధంగా పరిశీలిస్తే ఆహార గొలుసులు ఒక దానితో ఒకటి కలిసి ఉంటాయని తెలుస్తుంది.

AP Inter 1st Year Zoology Study Material Chapter 8 జీవావరణం – పర్యావరణం

ప్రశ్న 5.
జీవావరణ వ్యవస్థలో శక్తి ప్రవాహాన్ని వివరించండి.
జవాబు:
శక్తి ప్రసరణ :
లోతైన సాగర జలోష్ణ జీవావరణవ్యవస్థ (Hydrothermal ecosystem)’ లో తప్ప, మిగతా అన్నింటిలోనూ సూర్యుడే శక్తి మూలం. భూమికి చేరే సూర్యరశ్మిలో 50% కంటే తక్కువ భాగం మాత్రమే క్రియాశీల కిరణజన్యసంయోగక్రియ ఉపయోగపడుతుంది. మొక్కలు మరియు కిరణజన్యసంయోగక్రియ జరిపే బాక్టీరియా సూర్యుని వికిరణశక్తిని వినియోగించి సాధారణ అకర్బనపదార్థాల నుంచి ఆహారాన్ని సంశ్లేషిస్తాయి. మొక్కలు కిరణజన్య సంయోగక్రియకు వినియోగార్హమైన సౌర వికిరణాన్ని లేదా సౌరశక్తి (PAR) ని 2-10% మాత్రమే వినియోగించుకుంటాయి. ఈ కొద్ది శక్తే మొత్తం జీవప్రపంచాన్ని నిలబెడుతుంది. మొక్కలు గ్రహించిన సౌరశక్తి జీవావరణవ్యవస్థలోని వివిధ జీవుల ద్వారా ఎలా ప్రసరిస్తుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. అన్ని పరపోషకాలు (heterotrophs) ఆహారం కోసం ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ ఉత్పత్తిదారులపై ఆధారపడతాయి. ఉష్ణగతిక శాస్త్రం (Thermo dynamics) లో మొదటి సూత్రం శక్తి నిత్యత్వసూత్రంగా చెప్పబడుతుంది. దీని ప్రకారం శక్తి ఒక రూపం నుంచి మరొక రూపంలోకి మార్చబడుతుందే కానీ సృష్టించబడదు, నాశనం చేయబడదు.

జీవావరణవ్యవస్థలో జీవనాధారానికి శక్తి బదిలీ చాలా అవసరం. శక్తి బదిలీ లేకుండా జీవం, జీవావరణ వ్యవస్థ లేదు. జీవుల సహజవృద్ధి నిరంతర శక్తి ప్రసరణపై ఆధారపడి ఉంటుంది.

జీవావరణవ్యవస్థలకు ఉష్ణగతిక శాస్త్ర రెండవ సూత్రం నుంచి మినహాయింపు లేదు. ఈ సూత్రం ప్రకారం ఒక వ్యవస్థలో శక్తి మార్పిడికి లోనయ్యే ఏ ప్రక్రియ కూడా శక్తి నష్టం లేకుండా సహజంగా జరగదు. ఈ విధంగా కొంత శక్తి పనిచేయడానికి అందుబాటులో లేని ఉష్ణశక్తి రూపంలో వెలువడుతుంది. దీనినే ఎంట్రోపి (Entropy) అంటారు.

AP Inter 1st Year Zoology Study Material Chapter 8 జీవావరణం – పర్యావరణం 9
జీవులు వివిధ రకాల పనులు నిర్వర్తించడానికి నిరంతరంగా శక్తి సరఫరా జరగాలి. జీవులు ఈ శక్తిని ఆహార రూపంలో గ్రహిస్తాయి. శక్తి ఉత్పత్తిదారుల నుంచి వినియోగదారులకు ఆహారగొలుసు ద్వారా బదిలీ చేయబడుతుంది. దీనినే శక్తి ప్రసరణ అంటారు. ఏ జీవావరణవ్యవస్థ అయినా క్రియత్మకంగా 3వ పోషక స్థాయి పని చేయడానికి ప్రాథమికంగా అవసరమైనది నిరంతర సౌరశక్తి. ముఖ్యంగా గమనించవలసిన అంశం ఏమిటంటే అందుబాటులో ఉండే శక్తి అనుక్రామిక (వరసక్రమ) పోషక స్థాయిలలో క్రమేణా తగ్గుతుంది. జీవి చనిపోయిన తరవాత అది డెట్రైటస్/మరణ జీవద్రవ్యరాశిగా ఏర్పడి విచ్ఛిన్నకారులకు శక్తివనరులగా ఉపయోగపడుతుంది. ప్రతి పోషకస్థాయిలోని జీవులు వాటికి కావలసిన మేరకు శక్తి కోసం కింది పోషక స్థాయిలోని జీవులపై ఆధారపడి ఉంటాయి.

ఒక నిర్ణీతకాలంలో ప్రతి పోషక స్థాయిలో నిర్ణీత జీవపదార్థ ద్రవ్యరాశి ఉంటుంది. దాన్ని స్టాండింగ్ క్రాప్ (Standing crop) అంటారు. ఒక నిర్ణీత వైశాల్యంలోని జీవుల ద్రవ్యరాశి (జీవ ద్రవ్యరాశి – దేహం పూర్తి బరువు) లేదా జీవుల సంఖ్య ఆధారంగా స్టాండింగ్ క్రాప్ను లెక్కిస్తారు. ఒక జాతిలోని జీవుల ద్రవ్యరాశిని స్వచ్ఛమైన లేదా పొడిబరువు ద్వారా ప్రకటిస్తారు. పొడిబరువు చాలా ఖచ్ఛితమైంది. ఎందుకంటే తడి బరువులోని నీటిలో ఉపయోగార్హమైన శక్తి ఉండదు కాబట్టి.

10 శాతం సూత్రం (The 10 per cent law) :
లిండేమన్ (Lindeman) 10 శాతం సూత్రాన్ని ప్రతిపాదించాడు (లిండేమన్ ఆధునిక జీవావరణ వ్యవస్థ / జీవావరణశాస్త్ర స్థాపకుడు). ఈ సూత్రం ప్రకారం ఒక పోషకస్థాయి నుంచి మరొక పోషకస్థాయిలోకి శక్తి బదిలీ చెందేటప్పుడు 10% శక్తి మాత్రమే శరీర ద్రవ్యరాశి (జీవ ద్రవ్యరాశి) గా నిల్వ ఉంటుంది లేదా మార్చబడుతుంది. మిగిలిన శక్తి బదిలీ చెందే సమయంలో కోల్పోబడుతుంది లేదా విచ్ఛిన్నక్రియలో (శ్వాసక్రియ) వెలువడుతుంది. దీనినే లిండేమన్ పోషక సామర్థ్యతా సూత్రం అంటారు. ఇది జీవావరణ వ్యవస్థ సామర్థ్యాన్ని తెలుసుకోవడానికి ఉపయోగించేవాటిలో మొదటిది, ప్రధానమైనది. ఉదా : మొక్కలో NPP (Net Primary Product నికర ప్రాథమిక ఉత్పాదకత) 100 KJ అయితే, వాటిని ఆహారంగా తీసుకునే శాకాహారుల్లో కర్బన పదార్థం శరీరద్రవ్యరాశిగా మారేది 10 KJ మాత్రమే. అదే విధంగా మాంసాహారులు -1 లో శరీర ద్రవ్యరాశి గా మారేది 1 KJ మాత్రమే.

ప్రశ్న 6.
ముఖ్యమైన వాయు కాలుష్యకాలను తెలిపి, మానవులపై వాటి ప్రభావాల గురించి రాయండి.
జవాబు:
Undesirable changes in our environment is known as pollution.
వాయుకాలుష్యం :
భూమి అనేక వాయువులతో కూడిన గాలితో కప్పబడి ఉంటుంది. దానినే వాతావరణ అంటారు. వాతావరణ వాయువుల దుప్పటిగా ఏర్పడి ఉష్ణ నిరోధకంగా పనిచేస్తుంది. వాతావరణ సూర్యవికిరణం ద్వారా వచ్చే అతి నీలలోహిత కిరణాలను వరణాత్మకంగా శోషించుకొని ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది.

పొడిగాలిలో ఉండే ప్రధాన వాయువుల ఘటకాల ఘనపరిమాణాలు ఈవిధంగా ఉంటాయి. నత్రజని 78.09%, ఆక్సిజన్ 20.94%, ఆర్గాన్ 0.93%, కార్బన్ డై ఆక్సైడ్ 0.03%. ఆక్సిజన్ లేకుండా భూమి మీద జీవం ఉండలేదు. వాయు కాలుష్యకాలు అన్ని జీవులకు హాని కలిగిస్తాయి. అవి పంటల పెరుగుదల, ఉత్పత్తిని తగ్గిస్తాయి. వాయు కాలుష్యకాలు మానవులు, జంతువులు శ్వాసవ్యవస్థకు హాని కలిగిస్తాయి. కాలుష్యాల సాంద్రత ఎక్కువైనా, దానికి గురి అయ్యే అవధి ఎక్కువైనా జీవులపై చాలా దుష్ఫలితాలుంటాయి.

ప్రధాన వాయు కాలుష్యకాలు :
1. కార్బన్ మోనాక్సైడ్ (CO):
కార్బన్ మోనాక్సైడ్ ప్రధానంగా అసంపూర్తిగా మండించబడిన శిలాజ ఇంధనాల (fossil fuels) నుంచి ఉత్పత్తి అవుతుంది. పెద్ద పెద్ద నగరాలు, పట్టణాలలో వాహనాలు కార్బన్ మోనాక్సైడ్ కాలుష్యానికి ముఖ్యమైన కారణం. వాహనాల నుంచి, ఫ్యాక్టరీల నుంచి వెలువడే పొగ, పవర్ ప్లాంట్స్ విడుదల చేసే ఉద్గారాలు, అడవులు తగలబడటం, వంటచెరకు తగలబెట్టడం లాంటివి కూడా CO కాలుష్యానికి కారణమవుతాయి. హీమోగ్లోబిన్కు CO తో బలమైన బంధక బలం (Affinity) ఉంటుంది. దానివల్ల CO ఆక్సిజన్ రవాణాలో తీవ్రంగా ప్రభావం చూపుతుంది. తక్కువ గాఢతలో CO తలనొప్పి, మసకబారిన దృష్టిని కలుగచేస్తుంది. ఎక్కువ గాఢతలో ఇది కోమాకు దారి తీసి చివరికి మరణం సంభవిస్తుంది.

2. కార్బన్ డై ఆక్సైడ్ (CO2):
గ్లోబల్ వార్మింగ్క ముఖ్య కాలుష్యకారకం కార్బన్ డై ఆక్సైడ్. మొక్కలు కిరణజన్య సంయోగక్రియలో CO2 ను వినియోగించుకొంటాయి. అన్ని జీవులు శ్వాసక్రియ జరిపేటప్పుడు CO2 ను విడుదల చేస్తాయి. వేగంగా పెరిగిపోతున్న పట్టణీకరణ, వాహనాలు, విమానాలు, విద్యుత్ ప్లాంట్స్, గాసోలిన్ లాంటి శిలాజ ఇంధనాన్ని మండించడం వంటి మానవ చర్యల ద్వారా ఏర్పడే కార్బన్ డై ఆక్సైడ్ (CO2) ఆందోళన కలిగించే కాలుష్యకారకంగా ఉంది.

3. సల్ఫర్ డై ఆక్సైడ్ (SO2):
ఇది ప్రధానంగా శిలాజ ఇంధనాన్ని మండించడం ద్వారా ఉత్పత్తి అవుతుంది. సల్ఫర్ ముడి ఖనిజాన్ని కరిగించడం ఇంకొక ముఖ్యమైన మూలం. లోహాల ప్రగలనం, ఇతర పారిశ్రామిక ప్రక్రియలు కూడా (SO2) కాలుష్యానికి తోడ్పడతాయి. సల్ఫర్ డై ఆక్సైడ్ (SO2), నత్రజని ఆక్సైడ్లు (NO2), ఆమ్ల వర్షాలకు (Acid Rains) ప్రధాన కారణాలు. దాని వల్ల మృత్తికలు, సరస్సులు, కాలువలు అన్నీ ఆమ్లయుతంగా మారతాయి. అంతేకాకుండా భవనాలు, చారిత్రక కట్టడాలు త్వరగా శిథిలమవుతాయి. ఉబ్బసం వ్యాధికి గురైన పిల్లలు, పెద్దల్లో SO2 అధిక సాంద్రత వల్ల శ్వాస సంబంధమైన సమస్యలు తలెత్తుతాయి. ఎక్కువ రోజులు సల్ఫర్ డై ఆక్సైడ్ (SO,) కాలుష్యానికి గురికావడం వల్ల శ్వాస వ్యాధులు, ఊపిరితిత్తుల రోగ నిరోధకతలో మార్పులు, ఏవైనా హృదయానికి సంబంధించిన సమస్యలుంటే అవి ఎక్కువ కావడం జరుగుతుంది.

4. నైట్రోజన్ ఆక్సైడ్లు :
నైట్రోజన్ ఆక్సైడ్లు ముఖ్యమైన ప్రాథమిక కాలుష్యకారకాలుగా పరిగణించబడ్డాయి. నైట్రోజన్ ఆక్సైడ్లు ప్రధానంగా ఆటోమొబైల్ ఉద్గారకాల ద్వారా వెలువడతాయి. నైట్రోజన్ ఆక్సైడ్ వాయు కాలుష్యం మానవులకు, జంతువులకే కాకుండా మొక్కలకు కూడా హానికరం. నైట్రోజన్ ఆక్సైడ్ కాలుష్యం ఆమ్ల వర్షానికీ, కాంతి రసాయన పొగమంచు ఏర్పడటానికీ కారణం అవుతుంది. నైట్రోజన్ ఆక్సైడ్స్ ప్రభావం వల్ల మొక్కల్లోని ఆకులపై భాగంలో కణజాలక్షయ మచ్చలు (Necrotic spots) ఏర్పడతాయి. దీని ప్రభావం వల్ల పంటపొలాల్లో కిరణజన్య సంయోగక్రియ దెబ్బతిని ఉత్పత్తి తగ్గుతుంది. నైట్రోజన్ ఆక్సైడ్లు కాంతిచర్య ద్వారా బాష్పశీలి కర్బన పదార్థాలతో చర్య జరిపి పెరాక్సీ ఎసిటైల్ నైట్రేట్ (PAN) లాంటి ద్వితీయ కాలుష్య కారకాలను ఏర్పరుస్తాయి. ఇవి ప్రత్యేకంగా కాంతి రసాయన పొగమంచు (smog) లో ఉంటాయి. ఇది శ్వాసనాళానికి, కళ్లకు తీవ్రమైన మంటను కలగజేస్తుంది.

5. రేణురూప (Particulate) పదార్థాలు / ఎరోసాల్స్ :
వాయువులు లేదా ద్రవాల్లో తేలియాడే ఘన పదార్థ రేణువులను ‘రేణురూప పదార్థాలు’ అంటారు. రేణువులు లేదా ద్రవ బిందువులు, వాయువులు అన్నీ కలిసి ఏర్పడే మిశ్రమాన్ని ‘ఎరోసాల్స్’ (వాయువుల్లో విక్షేపణం (disperse) చెందిన కొల్లాయిడల్ రేణువుల వ్యవస్థ) అంటారు. ‘శిలాజ ఇంధనాన్ని’ మండించడం (పెట్రోల్, డీజిల్ మొదలైనవి) థర్మల్ విద్యుత్ ప్లాంట్లలో ఏర్పడే బూడిద (Fly Ash), అడవులు తగలబడటం, సిమెంట్ కర్మాగారాలు, ఆస్బెస్టాస్ మైనింగ్ మరియు తయారీ యూనిట్లు, స్పిన్నింగ్, జిన్నింగ్ మిల్స్ మొదలైనవి ప్రధాన రేణుపదార్థాల కాలుష్యానికి మూలాలు. కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు (CPCB) సూచన ప్రకారం 2.5 మైక్రోమీటర్ల లేదా అంతకంటే తక్కువ వ్యాసార్ధం ఉన్న రేణువులు మానవుడికి, ఇతర గాలి పీల్చే జంతువులకు చాలా హానికరం.

AP Inter 1st Year Zoology Study Material Chapter 8 జీవావరణం – పర్యావరణం

ప్రశ్న 7.
జల కాలుష్యానికి కారణాలు వివరించి, దాని నివారణ పద్ధతులను సూచించండి.
జవాబు:
Undesirble changes in our environment is known as pollution.
భూగోళంపై లభ్యమవుతున్న నీటిలో 3% మాత్రమే మంచినీరుగా ఉండి మనం ఉపయోగించుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. మిగిలిన 97% సముద్రజలాలు. మానవ వినియోగానికి పనికిరాదు.

ప్రస్తుతం ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలలో నీటికాలుష్యం ఒకటిగా ప్రస్తావించ బడుతుంది.

నీరు ప్రధానంగా గృహసంబంధ మురుగుతో, పారిశ్రామిక వ్యర్థాలతో, వ్యవసాయ రసాయన పెర్టిలైజర్స్, ఫెస్టిసైడ్తో కలుషితమై మంచినీటి జలవనరులు వినియోగానికి పనికి రాకుండా, విషతుల్యమై పనికి రాకుండా పోతున్నాయి.

గృహసంబంధ మురుగు :
పెద్ద పెద్ద నగరాలు, పట్టణాలలో నీటికాలుష్యానికి ప్రధాన కారణం మురుగు. ఇందులో ముఖ్యంగా మానవ, జంతువుల విసర్జితాలు. గృహాలనుండి విడుదలవుతున్న వంటింటి వ్యర్థాలు, స్నానాలు, బట్టలు శుభ్రపరిచినప్పుడు విడుదలయ్యే డిటర్జెంట్స్ మొదలైన వ్యర్థాలుంటాయి. ఇటువంటి మురుగునీరు కేవలం 1% మంచినీటి జలవనరులలో కలిసినా అది మానవ వినియోగానికి పనికిరాదు. ఈ మురుగు ఆక్సీకరణ తొట్టెలలో పంపండం వలన మురుగులోని వివిధరకాల మలినాలు (నీటిలో కరగని, కరిగిన) వేరుపరచి మాత్రమే జలవనరులలోకి విడుదల చేయవచ్చును.

బయలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ (BOD) :
ఇది మురుగు నీటిలోని జీవక్షయమయ్యే మలినాలను కొలిచే సూచిక. నీటిగుంటలలో ఉండే సేంద్రియ పదార్థాలను జీవక్షయం చేయడానికి సహాయపడే సూక్ష్మజీవులు చాలా ఎక్కువ ఆక్సిజన్ ను వినియోగించుకుంటాయి. దానిఫలితంగా ఆక్సిజన్ తగ్గిపోయి అక్కడ జీవించే చేపలు, నీటి జంతువులు చనిపోయే అవకాశం ఉంది.

శైవల మంజరులు (Algal Blooms):
గృహవర్గాలలో చాలా సేంద్రియ పదార్థాలుంటాయి. నీటిలో ఎక్కువ స్థాయిలో సేంద్రీయ పోషకాలు ఉన్నట్లయితే వృక్షప్లవ శైవలాలు చాలా ఎక్కువ మొత్తంలో, చాలా వేగంగా పెరుగుతాయి. వీటినే శైవలమంజరులు అంటారు. ఇలా జలవనరులలో శైవలాల తెట్టులు ఏర్పడినట్లయితే ఆ జలవనరు మురుగునీటితో కలుషితమైనదని చెప్పవచ్చును. ఇలా అధిక పోషకాలు కలిగిన మురుగు జలవనరులో చేరటం వలన ఒక్కసారిగా శైవలాల పెరుగుదల పెరగడాని ‘యూట్రిఫికేషన్’ అంటారు.

గృహాలనుండి, ఆస్పత్రుల నుండి మురుగులో అవాంచిత సూక్ష్మజీవులు ఉంటాయి. ఒకవేళ వీటిని శుద్ధిచేయకుండా నీటి ఆవాసాలలోకి విడుదల చేసినట్లయితే అతిసారం, టైఫాయిడ్, పచ్చకామెర్లు, కలరా, మొదలైన వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది.

పారిశ్రామిక వ్యర్థాలు :
కర్మాగారాలనుండి శుద్ధిచేయబడని వ్యర్థాలను నీటి అవాసాలలోకి విడుదల చేయడం వల్ల మంచినీటి కాలువలు, జలాశయాలు కలుషితమవుతున్నాయి. పారిశ్రామిక వ్యర్థాలలో వివిధరకాల, చాలా ప్రమాదకరమైన రసాయన వ్యర్థాలుంటాయి. వీటిని తప్పని సరిగా ప్రమాదరహితమైన పదార్థాలుగా మార్చి మాత్రమే జలవనరులలోకి విడుదల చేయాలి. (హైదరాబాద్లోని పటాన్ చెరువును బాబా గారు సందర్శించి – ఇది భూలోకంలో నరకం అని వర్ణించారు). ఈ పారిశ్రామిక వ్యర్ధాలలో చాలా ప్రమాదకారాలైన అర్సెనిక్, కాడ్మియం, కాపర్, క్రోమియం, పాదరసం, జింక్, నికెల్ మొదలైన భారలోహకాలుష్యకాలు ఉంటాయి.

జీవ ఆవర్ధనం (Bio-Magnification) :
నీటి ఆహారపు గొలుసులో కాలుష్యం లేదా విషపదార్థాల గాఢత ఒక పోషణ స్తాయి నుంచి వేరొక పోషణ స్థాయికి పెరుగుతూపోతే దాన్ని జీవ ఆవర్ధనం అంటారు. ఉదా : ఆస్ట్రేలియాలో సంభవించిన మినీమెటావ్యాధికి – పాదరస ఉత్పనాలు కారణం.

వ్యవసాయ కాలుష్యం :
వ్యవసాయదారులు తెలిసి తెలియక పంట పొలాలకు ఎక్కువ మోతాదులో వినియోగించే ఎరువులు, క్రిమిసంహారిణులు, వర్షం కురిసినప్పుడు ప్రవాహ జలాలతో కలిసి, జలవనరులలోకి ప్రవేశిస్తుంది. ఇటువంటి విషపదార్థాల వలన జంతువుల మరణం, మానవులకు ప్రమాదాలు సంభవిస్తాయి.

AP Inter 1st Year Civics Study Material Chapter 4 చట్టం

Andhra Pradesh BIEAP AP Inter 1st Year Civics Study Material 4th Lesson చట్టం Textbook Questions and Answers.

AP Inter 1st Year Civics Study Material 4th Lesson చట్టం

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
చట్టం అంటే ఏమిటో నిర్వచించి, చట్టానికి గల వివిధ ఆధారాలను వివరించండి. (లేదా)
ప్రశ్న 2.
చట్టం అంటే ఏమిటి ? చట్టానికి గల వివిధ ఆధారాలను చర్చించండి.
జవాబు:
పరిచయం : రాజనీతిశాస్త్ర అధ్యయనంలో చట్టం అనేది ఒక ముఖ్యమైన భావన.

రాజ్యం శాసనాల ద్వారా ప్రజలను పరిపాలిస్తుంది. శాసనాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. రాజ్య సార్వ భౌమాధికారం శాసనాల ద్వారా వ్యక్తమవుతుంది. రాజ్యం ఆశించే సాంఘిక, ఆర్థిక, రాజకీయ మార్పులు శాసనం ద్వారానే సాధించగలవు. మానవుని బాహ్య ప్రవర్తనను క్రమబద్ధం చేసే నియమాలే శాసనాలు. వ్యక్తులు రాజ్యంలో చేయవలసినవి, చేయకూడనివి శాసనం చెబుతుంది. ప్రభుత్వంలోని శాసనశాఖ శాసనాలు చేస్తుంది.

అర్థం : శాసనాన్ని ఆంగ్లంలో ‘లా’ అంటారు. ‘లాగ్’ అనే ట్యూటానిక్ పదం నుండి ‘లా’ అనే మాట వచ్చింది. ‘లాగ్’ అంటే ‘సమమైన’ లేదా ‘స్థిరమైన’ అని అర్థం. శాసనాలు స్థిరమైన నిబంధనలు.

నిర్వచనాలు :
1) “సార్వభౌముడి ఆదేశమే చట్టం. ప్రజలందరూ సార్వభౌముడికి విధేయులుగా ఉండేందుకు చట్టం కొన్ని ఉమ్మడి నియమాలను రూపొందిస్తుంది” అని జాన్ ఎరిస్కిన్ పేర్కొన్నాడు.

2) “రాజకీయాధికారాన్ని పొందిన సార్వభౌముడిచే అమలు చేసే బాహ్య చర్యలకు సంబంధించిన సాధారణ నియమమే చట్టం” అని టి. ఇ. హాలండ్ పేర్కొన్నాడు.

3) న్యాయపాలనలో రాజ్యం ఉపయోగించే సూత్ర సముదాయమే చట్టం” అని జాన్ సాల్మండ్ పేర్కొన్నాడు.

శాసనానికి ఆధారాలు : హాలెండ్ అనే రచయిత సంప్రదాయాలు, మతము, ధర్మబద్ధత (సమత), న్యాయమూర్తుల తీర్పులు, శాస్త్రీయ వ్యాఖ్యానాలు, శాసనశాఖ అనేవి శాసనాలకు ఆధారాలని చెప్పాడు. శాసనాలు వివిధ రంగాలలో క్రమంగా రూపొందుతాయి. అనేక అంశాల ప్రభావం వాటిపై ఉంటుంది. రాజనీతి శాస్త్రజ్ఞులు చెప్పిన శాసనాల ఆధారాలు ఈ క్రింది విధంగా చెప్పవచ్చు.

1) ఆచార, సంప్రదాయాలు, వాడుకలు (Customs) : ఇవి శాసనానికి తొలి ఆధారాలు. ప్రజల ఆచారాలు, వాడుకలు, సంప్రదాయాలు శాసనాలకు మూలాధారము. సంప్రదాయాలు సంఘంలో ఒక అలవాటుగా, క్రమంగా రూపొందుతాయి. పూర్వం సంప్రదాయాలే సమాజ జీవితాన్ని క్రమబద్ధం చేసేవి. రాజ్యం వీటిని గుర్తించి, వాటిని ఆధారం చేసుకొని కొన్ని శాసనాలను రూపొందిస్తుంది. రాజకీయ ఆచారాలు కూడా రాజ్యంచే గుర్తించబడి అమలు చేయబడితే అవి శాసనాలవుతాయి. బ్రిటన్లో ‘సామాన్య న్యాయం’ సంప్రదాయబద్ధమైన శాసనానికి ఉదాహరణ. అదే విధంగా భారతదేశంలో వివాహ చట్టాలు, ఆస్తి పంపిణీ చట్టాలు మొదలగునవి సంప్రదాయాలు ఆధారంగా చేయబడ్డాయి.

AP Inter 1st Year Civics Study Material Chapter 4 చట్టం

2) మతం (Religion) : ఆచారానికి మతం సమాజాన్ని విపరీతంగా ప్రభావితం చేసే వ్యవస్థ. సంఘ జీవితం మత నియమాలకు అనుగుణంగా జరుపుకుంటారు. పూర్వం మతాధిపతులు చెప్పే నియమాలు శాసనాల వలె చెలామణి అయ్యేవి. ఆధునిక కాలంలో కూడా శాసనాలు చేయడానికి మతం ఒక ఆధారం. వారసత్వం, వివాహం, కుటుంబ ఆస్తి మొదలైన వాటి శాసనాలు మతం ఆధారంగా చేయబడ్డాయి. హిందువులు, క్రైస్తవులు, ముస్లిములకు గల శాసనాలు వారి మతాలు ఆధారంగా రూపొందాయి. ఇరాన్, పాకిస్థాన్ వంటి మత ప్రమేయ దేశాలలో సంఘ జీవనానికి మత నియమాలే ఆధారం.

3) న్యాయస్థానాల తీర్పులు (Judicial Decisions) : న్యాయస్థానాలలో న్యాయమూర్తులు ఇచ్చే తీర్పులు శాసన నిర్మాణానికి ఆధారాలు. న్యాయస్థానాలు చట్టాలను వ్యాఖ్యానిస్తాయి. ఈ విధి నిర్వహణలో న్యాయమూర్తులు తీర్పులిచ్చేటప్పుడు క్రొత్త న్యాయ సూత్రాలను సృష్టిస్తారు. ఈ తీర్పులు అదే విధమైన వివాదాలు తలెత్తినప్పుడు న్యాయసూత్రల వలె వర్తింపచేస్తారు. నేడు న్యాయమూర్తుల నిర్ణయాలు శాసనాలలో అంతర్భాగమవుతున్నాయి. ఉదా : భారతదేశంలో సుప్రీంకోర్టు తీర్పులిచ్చిన గోలక్నాథ్ కేసు, కేశవానంద భారతి కేసు, మినర్వామిల్స్ కేసు.

4) శాస్త్రీయ వ్యాఖ్యానాలు (Scientific commentories) : ప్రముఖ న్యాయశాస్త్ర కోవిదులు, రచయితలు, విమర్శకులు చేసే వ్యాఖ్యానాలు శాసన నిర్మాణానికి ఆధారమవుతాయి. ఇవి న్యాయస్థానాలలో న్యాయమూర్తుల వ్యాఖ్యానాలు, | వివరణలు, శాసనాలు చేయటానికి ప్రభుత్వానికి ఉపయోగిస్తాయి. న్యాయమూర్తుల నిర్ణయాలు, తీర్పులు, భవిష్యత్లో శాసన నిర్మాణానికి తోడ్పడతాయి. ఇంగ్లండ్లో కోక్, బ్లాక్టన్, అమెరికాలో స్టోరీ, కెంట్, భారతదేశంలో విజ్ఞానేశ్వర, ఆపరార్క వంటి వారి వ్యాఖ్యానాలు శాసన నిర్మాణానికి ఆధారాలు.

5) సమత లేదా సమబద్ధత (Equity) : ‘సమత’ అనే పదానికి నిష్పక్షపాతం, న్యాయంలాంటి సూత్రాలను పర్యాయపదాలుగా వాడుతున్నారు. సమత అంటే సహజన్యాయం. అమలులో ఉన్న చట్టాలు వివాదాల పరిష్కారానికి సరిపడని సందర్భాలలో న్యాయమూర్తులు తమ విజ్ఞతతో, సక్రమ అవగాహన ద్వారా వివాదాల పరిష్కారంలో కక్షిదారులకు
న్యాయం చేకూర్చేందుకు ప్రయత్నిస్తారు. సమత అనేది సహజన్యాయ భావన ద్వారా రూపొందింది. దానినే న్యాయమూర్తులచే నిర్మితమైన చట్టాలుగా పరిగణించడమైంది. ఈ సందర్భంలో హెన్రీమెయిన్ అనే పండితుడు సహజన్యాయం గురించి ప్రస్తావిస్తూ అది కొన్ని ప్రత్యేక సూత్రాల ఆధారంగా రూపొంది పౌరన్యాయంతో కూడిన నియమాల సముదాయంగా పేర్కొన్నాడు. పౌరన్యాయం కంటే సమత అనేది ఉన్నతమైనది. సమదృక్పథం, సహజన్యాయం లాంటి సూత్రాల ఆధారంగా పాత చట్టాల స్థానంలో కొత్త చట్టాలను రూపొందించే సాంప్రదాయకమైన పద్ధతికి సమత సంకేతంగా ఉంటుంది.

6) శాసనసభ (Legislature) : ప్రజాస్వామ్యంలో శాసన నిర్మాణశాఖ చట్టం ఆధారాలలో ముఖ్యమైనదిగా భావిస్తారు. ప్రభుత్వ సంస్థలలో ఒకటైన శాసనసభ, చట్టాలను ఆమోదిస్తుంది. అందుచేత శాసననిర్మాణ శాఖను చట్టం ఆధారాలలో ప్రత్యక్షమైన అంశంగా గుర్తించడమైంది. ఆధునిక కాలంలో చట్టాల రూపకల్పనలో శాసనసభలు ప్రముఖమైనవిగా భావించడమైంది. చట్ట నిర్మాణంలో శాసనసభలు సాధారణ ప్రజానీకం ఆకాంక్షలకు ప్రతీకగా ఉంటాయి. | శాసనసభలోని అధికార, ప్రతిపక్షాలు రెండూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వ్యవహరిస్తాయి.

ప్రశ్న 3.
మేకైవర్ పేర్కొన్న చట్టాల వర్గీకరణను వివరించండి.
జవాబు:
అర్థం : శాసనాన్ని ఆంగ్లంలో ‘లా’ అంటారు. ‘లాగ్’ అనే ట్యూటానిక్ పదం నుండి ‘లా’ అనే మాట వచ్చింది. ‘లాగ్’ అంటే ‘సమమైన’ లేదా ‘స్థిరమైన’ అని అర్థం. శాసనాలు స్థిరమైన నిబంధనలు.

నిర్వచనాలు :

  1. “సార్వభౌముడి ఆదేశమే చట్టం. ప్రజలందరూ సార్వభౌముడికి విధేయులుగా ఉండేందుకు చట్టం కొన్ని ఉమ్మడి నియమాలను రూపొందిస్తుంది” అని జాన్ ఎరిస్కిన్ పేర్కొన్నాడు.
  2. “రాజకీయాధికారాన్ని పొందిన సార్వభౌముడిచే అమలు చేసే బాహ్య చర్యలకు సంబంధించిన సాధారణ నియమమే చట్టం” అని టి. ఇ. హాలండ్ పేర్కొన్నాడు.
  3. న్యాయపాలనలో రాజ్యం ఉపయోగించే సూత్ర సముదాయమే చట్టం” అని జాన్ సాల్మండ్ పేర్కొన్నాడు.

చట్టం వర్గీకరణ : చట్టం వర్గీకరణ గురించి అనేకమంది రాజనీతి తత్త్వవేత్తలు భిన్నమైన ప్రతిపాదనలను చేశారు. అటువంటి వారిలో మేకైవర్ ప్రతిపాదించిన చట్ట వర్గీకరణ ప్రముఖమైనదిగా పరిగణించవచ్చు.

మేకైవర్ ప్రకారం చట్టం ప్రధానంగా రెండు రకాలుగా ఉంటుంది. అవి : 1) సహజ చట్టం (Natural Law), 2) సహేతుక చట్టం (Positive Law).

సహేతుక చట్టాన్ని (Positive Law), జాతీయ చట్టం (National Law), అంతర్జాతీయ చట్టం (International Law) అని రెండు రకాలుగా వర్గీకరించారు.

AP Inter 1st Year Civics Study Material Chapter 4 చట్టం

జాతీయ చట్టాన్ని (National Law), మరల రెండు రకాలుగా వర్గీకరించారు. అవి : రాజ్యాంగ చట్టం (Constitutional Law), సాధారణ చట్టం (Ordinary Law).

సాధారణ చట్టం (Ordinary Law), అనేది పబ్లిక్ చట్టం (Public Law), ప్రైవేట్ చట్టం (Private Law) అని రెండు రకాలుగా విభజించారు.

పబ్లిక్ చట్టాన్ని (Public Law), పరిపాలన చట్టం (Administrative Law), సార్వత్రిక చట్టం (General Law) అని తిరిగి రెండు రకాలుగా వర్గీకరించబడింది.

సార్వత్రిక చట్టాన్ని (General Law), శాసనాత్మక చట్టం (Statutory Law), ఉమ్మడి చట్టం (Common Law) అని రెండు రకాలుగా విభజించారు. పైన పేర్కొన్న వివిధ రకాల చట్టాలను కింది విధంగా వివరించవచ్చు.

1) సహజ చట్టం (Natural Law) : సహజచట్టాన్ని దైవిక న్యాయంగా కూడ వ్యవహరిస్తారు. సహజచట్టం అనేది ఏ ఒక్కరిచేత రూపొందినది కాదు. అది భౌతికశక్తి ఆధారంగా ప్రకృతిచేత ప్రసాదితమైనది. మానవ స్వభావాన్ని విశ్లేషించేందుకు హేతువును వినియోగించడాన్ని సహజ చట్టంగా పేర్కొనవచ్చు. భగవంతుని స్వహస్తాలతో మానవుల హృదయాలలో లిఖించబడినదే సహజ చట్టంగా కొందరు వర్ణించారు.

2) సహేతుక చట్టం (Positive Law) : మానవ సంస్థలచే రూపొందించబడేదే సహేతుక చట్టం. ఈ చట్టాన్ని రాజకీయ చట్టం అని కొందరు పేర్కొన్నారు. వర్తమాన, సామాజిక, రాజకీయ పరిస్థితుల ఆధారంగా ఈ చట్టం నిర్మితమైంది. సార్వభౌమత్వ రాజకీయ అధికారి ఈ చట్టానికి అనుమతిస్తాడు. ఈ చట్టాన్ని అతిక్రమించినవారు శిక్షకు గురి అవుతారు. ఈ చట్టాన్ని తిరిగి జాతీయ చట్టమని, అంతర్జాతీయ చట్టమని రెండు రకాలుగా పేర్కొన్నారు.

జాతీయ చట్టాన్ని మున్సిపల్ చట్టం లేదా రాజ్యచట్టం అని కూడ వ్యవహరిస్తారు.

జాతీయ చట్టం, రాజ్య భౌగోళిక ప్రదేశానికి పరిమితమవుతుంది. సార్వభౌమాధికారి ద్వారా అది అమలులోకి వస్తుంది. రాజ్యంలోని ప్రజలందరికీ వర్తిస్తుంది. ఇక అంతర్జాతీయ చట్టమనేది వివిధ రాజ్యాల మధ్య సౌహార్ధ సంబంధాలను నెలకొల్పి, నియంత్రణ చేసేందుకు ఉద్దేశించింది. అయితే ఈ రకమైన చట్టానికి వ్యక్తులను శిక్షించే అధికారం ఉండదు. ఐక్యరాజ్యసమితి ఆమోదించిన అంతర్జాతీయ చట్టాలు ఇందుకు ఉదాహరణలుగా పేర్కొనవచ్చు. అంతర్జాతీయ శాంతిభద్రతలను పెంపొందించేందుకై సభ్య రాజ్యాలచే పాటించబడే నియమనిబంధనల సముదాయమే అంతర్జాతీయ చట్టంగా పరిగణించవచ్చు.

జాతీయ చట్టాన్ని మరల రెండు రకాలుగా వర్గీకరించారు. అవి : 1) రాజ్యాంగ చట్టం 2) సాధారణ చట్టం. 3) రాజ్యాంగ చట్టం (Constitutional Law): రాజ్యాంగ చట్టమనేది సాధారణ చట్టం కంటే భిన్నంగా ఉంటుంది. రాజ్యంలో ఈ రకమైన చట్టం అత్యున్నతమైనది. ప్రభుత్వ నిర్మాణానికి ఇది వీలు కల్పిస్తుంది. ప్రభుత్వాంగాల మధ్య సంబంధాన్ని వివరిస్తుంది. ప్రభుత్వాంగాల అధికార పరిధిని నిర్ణయిస్తుంది. ఈ రకమైన చట్టం లిఖిత పూర్వకంగా ఉంటుంది. రాజ్యంలో నివసించే పౌరుల హక్కులు, బాధ్యతల గురించి వివరిస్తుంది. ప్రజాస్వామ్యంలో ఈ చట్టానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ఇది ప్రజాభీష్టానికి ప్రతీకగా ఉంటుంది.

4) సాధారణ చట్టం (Ordinary Law) : సాధారణ చట్టం అనేది రాజ్యాంగ చట్టానికి అనుగుణంగా ఉంటుంది. రాజ్యంలో నిర్దిష్ట అధికారాలు గల సంస్థచే రూపొందించబడి అమలవుతుంది. పౌరులకు సమాజం, ప్రభుత్వం, రాజ్యాలతో ఉండే సంబంధాలను అది వివరిస్తుంది. ఆచారాలు, సంప్రదాయాలు, మతం అనేవి ఈ రకమైన చట్టానికి ప్రాతిపదికగా ఉంటాయి. శాసనసభ అటువంటి చట్టాలను రూపొందించి, అవసరమైతే సవరణలు చేస్తుంది. సాధారణ చట్టాన్ని మరల పబ్లిక్ చట్టం, ప్రైవేట్ చట్టం అని రెండు రకాలుగా వర్గీకరించడమైంది.

5) పబ్లిక్ చట్టం (Public Law) : పబ్లిక్ చట్టం, రాజ్యం వ్యక్తుల మధ్య సంబంధాలను నియంత్రిస్తుంది. రాజ్యానికి సంబంధించిన మౌలిక నిర్మితి, విధులను పబ్లిక్ చట్టం వివరిస్తుంది. రాజ్యపు మితిమీరిన జోక్యానికి వ్యతిరేకంగా వ్యక్తులకు అవసరమైన హక్కులను అందిస్తుంది. పౌరులందరు ఈ చట్టాన్ని అనుసరించాల్సి ఉంటుంది. ఈ చట్టాన్ని అతిక్రమించడం శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తారు.

6) ప్రైవేట్ చట్టం (Private Law) : ప్రైవేట్ చట్టం వ్యక్తుల మధ్య సంబంధాలను నియంత్రిస్తుంది. సమాజంలో వ్యక్తుల ప్రవర్తనలను క్రమబద్దీకరిస్తుంది. వ్యక్తులందరూ తమ హక్కులను అనుభవించేందుకు తగిన హామీ ఇస్తుంది. ప్రైవేట్ చట్టాన్ని కొన్నిసార్లు సివిల్ చట్టంగా వ్యవహరిస్తారు. వ్యక్తుల మధ్య ఉత్పన్నమయ్యే వివాదాలు విచారణలో దేశంలోని వివిధ న్యాయస్థానాలు ప్రైవేట్ చట్టాన్ని పరిగణనలోకి తీసుకుంటాయి.

AP Inter 1st Year Civics Study Material Chapter 4 చట్టం

పబ్లిక్ చట్టాన్ని పరిపాలన చట్టం, సార్వత్రిక చట్టం అని రెండు రకాలుగా వర్గీకరించడమైంది.

7) పరిపాలక చట్టం (Administrative Law) : పరిపాలన నిర్విఘ్నంగానూ, ప్రశాంతంగానూ కొనసాగే విషయంలో చట్టం కీలకపాత్రను పోషిస్తుంది. ప్రజలకు ప్రభుత్వాధికారులకు మధ్య సంబంధాలను ఈ రకమైన చట్టం నియంత్రిస్తుంది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన సంస్కరణలను తీసుకురావడంలో ఇది దోహదపడుతుంది. పరిపాలక చట్టాలను అనుసరించడం ద్వారా ఈనాటి రాజ్యాలు అనేక దశలుగా శీఘ్రగతిన అభివృద్ధిని సాధించాయి. ప్రభుత్వ సిబ్బంది క్రమశిక్షణతో పనిచేసేటట్లు పరిపాలక చట్టం దోహదపడుతుంది.

8) సార్వత్రిక చట్టం (General Law) : రాజ్యం, సాధారణ పౌరుల మధ్య సంబంధాన్ని సార్వత్రిక చట్టం నిర్ణయిస్తుంది. ఈ చట్టం రాజ్యానికి – వ్యక్తులకు మధ్య ఉండే వ్యవహారాలకు సంబంధించినదై ఉంటుంది. వివాహం, విడాకులు, ఒప్పందాలు వంటి అనేక విషయాలకు సంబంధించిన వాటిని ఈ రకమైన చట్టాలకు ఉదాహరణగా పేర్కొనవచ్చు. సార్వత్రిక చట్టం తిరిగి శాసనాత్మక చట్టం, సామాన్య చట్టం అని రెండు రకాలుగా వర్గీకరించడమైంది.

9) శాసనాత్మక చట్టం (Statutory Law) : ఆధునిక చట్టంలోని అధిక భాగాన్ని శాసనాత్మక చట్టం అని పిలుస్తారు. దైనందిన పరిపాలన నిమిత్తమై రాజ్యంలోని శాసనసభ ఇటువంటి చట్టాన్ని రూపొందిస్తుంది. భారతదేశంలో పార్లమెంటు, అమెరికాలో కాంగ్రెసు, బ్రిటన్లో పార్లమెంటు ఈ రకమైన చట్టాన్ని రూపొందిస్తాయి.

10) సామాన్య చట్టం (Common Law) : సామాన్య చట్టాన్ని సంప్రదాయక చట్టంగా కొందరు వ్యవహరించారు. ప్రజానీకంలో బహుళవ్యాప్తి చెందిన ఆచార సంప్రదాయాల ఫలితమే సామాన్య చట్టం. ఈ రకమైన చట్టాన్ని న్యాయవ్యవస్థలో | భాగంగా న్యాయస్థానాలు తగిన గుర్తింపునిస్తాయి.

ప్రశ్న 4.
చట్టాన్ని నిర్వచించి, చట్టం – స్వేచ్ఛ మధ్య సంబంధాన్ని వర్ణించండి.
జవాబు:
నిర్వచనాలు :
1) “సార్వభౌముడి ఆదేశమే చట్టం. ప్రజలందరూ సార్వభౌముడికి విధేయులుగా ఉండేందుకు చట్టం కొన్ని ఉమ్మడి నియమాలను రూపొందిస్తుంది” అని జాన్ ఎరిస్కిన్ పేర్కొన్నాడు.

2) రాజకీయాధికారాన్ని పొందిన సార్వభౌముడిచే అమలుచేసే బాహ్య చర్యలకు సంబంధించిన సాధారణ నియమమే చట్టం” అని టి. ఇ. హాలండ్ పేర్కొన్నాడు.

చట్టం – స్వేచ్ఛ మధ్య సంబంధం (Relation between Law and Liberty) : రాజనీతి శాస్త్రంలో చట్టం, నైతికత అనేవి రెండు ప్రధాన భావనలు. రాజ్యం, ప్రభుత్వాలు పనిచేసేందుకు చట్టం ప్రాతిపదికగా ఉంటుంది. కొన్ని నియమ నిబంధనలను సూచించడం ద్వారా సమాజానికి స్థిరమైన పునాదిని చట్టం ఏర్పరుస్తుంది. చట్టం, స్వేచ్ఛ రెండూ పరస్పర ఆధారిత భావనలు. అయితే ఈ రెండు భావనల మధ్య ఉండే సంబంధం విషయంలో రాజనీతి శాస్త్రవేత్తల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. ఈ విషయంలో రాజనీతి శాస్త్రవేత్తలు రెండు విభిన్నమైన అభిప్రాయాలను వెల్లడించారు. వారిలో కొందరు ఈ రెండు భావనలు ఒకదానికొకటి పరస్పర విరుద్ధమైనవిగా పేర్కొన్నారు. మరి కొందరు ఈ రెండు భావనలు ఒకదానికొకటి సన్నిహిత సంబంధంగలవిగా భావించారు. ఈ రెండు భావనల గురించి కింది విధంగా వివరించవచ్చు.

1) చట్టం, స్వేచ్ఛ పరస్పరం విరుద్ధమైనవి (Law and Liberty are Antithetical) : చట్టం ఎల్లప్పుడు మానవుల కార్యకలాపాలపై నిర్బంధాలు విధిస్తుందని వ్యక్తి స్వేచ్ఛను సమర్థించేవారు భావిస్తారు. జె.ఎస్. మిల్, హెర్బర్ట్ స్పెన్సర్, ఆడమ్ స్మిత్, మార్షల్ వంటి వ్యక్తి స్వేచ్ఛావాదులు, ప్రౌధాన్, బకూనిస్, క్రొపోట్కిన్ వంటి అరాచకవాదుల ప్రకారం వ్యక్తి స్వేచ్ఛకు చట్టం ఆటంకాలను సృష్టిస్తుంది. వారి దృష్టిలో రాజ్యం వ్యక్తుల స్వేచ్ఛలకు భంగం కలిగించే ప్రధాన సాధనం. చట్టం అనేది ఎల్లప్పుడు వ్యక్తుల స్వేచ్ఛపై ఆంక్షలు విధిస్తుంది. రాజ్యం, ప్రభుత్వాలకు సంబంధించిన వ్యవహారాలలో వ్యక్తులు పాల్గొనేందుకు చట్టం అనుమతించదు. అలాగే రాజ్యానికి సంబంధించిన ఆర్థిక కార్యకలాపాల నిర్వహణలో చట్టం ఆటంకంగా పరిణమిస్తుంది. అయితే ఇటీవలి కాలంలో అనేక రాజ్యాలలో అమలులో ఉన్న సరళీకృత ఆర్థిక విధానాలు ఆ దేశాల ఆర్థిక వ్యవస్థలు శీఘ్రగతిన ప్రగతి దిశలో పయనించేందుకు అనుకూలంగా ఉన్నాయని చెప్పవచ్చు. ఈ విధానాలు ఆర్థిక వ్యవహారాలలో ప్రజలు స్వేచ్ఛగా పాల్గొనేందుకు వీలు కల్పించాయి. అవి జాతీయ, అంతర్జాతీయ మార్కెట్ల మధ్య ఏ విధమైన కఠినమైన ఆర్థిక చట్టాలతో ప్రమేయం లేకుండా పోటీకి అవకాశం ఏర్పరచాయి. రాజ్యమనేది ‘ఒక అవసరమైన చెడు’ (State is a necessary evil) గా వ్యక్తి స్వేచ్ఛావాదులు విశ్వసించారు. ఏ ప్రభుత్వమైతే అతి తక్కువగా పాలనగావిస్తుందో అదియే ఉత్తమమైన ప్రభుత్వంగా వారు వివరించారు. చట్టం వ్యక్తుల కార్యకలాపాలపై కొన్ని ఆంక్షలు విధిస్తుందని వారు పేర్కొన్నారు. అటువంటి ఆంక్షలు లేనప్పుడే వ్యక్తులు స్వీయవ్యక్తిత్వ వికాసానికి కృషి చేయగలుగుతారు. కాబట్టి చట్టం, స్వేచ్ఛ, ఒకదానికొకటి పరస్పరం విరుద్ధమైనవి.

AP Inter 1st Year Civics Study Material Chapter 4 చట్టం

2) చట్టం, స్వేచ్ఛ పరస్పర పోషకాలు (Law and Liberty are Complimentary) : సామ్యవాదులు, కమ్యూనిస్టుల ప్రకారం చట్టం, స్వేచ్ఛ ఒకదానికొకటి పరస్పర పోషకాలు. వారి దృష్టిలో రాజ్యం అనేది ఒక సంక్షేమ సంస్థ. రాజ్యం తన చట్టబద్ధమైన యంత్రాంగం ద్వారా మెరుగైన, న్యాయంతో కూడిన సామాజిక వ్యవస్థను సాధించవచ్చు. సామాజిక సంక్షేమానికి అవసరమైన ఆంక్షలను చట్టం విధిస్తుంది. పెట్టుబడిదారీవర్గం కార్మికవర్గాన్ని దోపిడీకి గురి చేస్తుందనే విషయం వాస్తవం. అటువంటి నేపథ్యంలో రాజ్యం దోపిడికి సంబంధించిన వర్గాలపై ఆంక్షలు విధించగలుగుతుంది. స్వేచ్ఛ అనేది అపరిమితమైనది కాదు. హక్కులను అనుభవించే రాజ్యం ప్రజలపై కొన్ని అవసరమైన ఆంక్షలను విధించేందుకు అధికారం కలిగి ఉంటుంది. ఈ సందర్భంలో లాస్కి కింది విధంగా పేర్కొన్నాడు. “మానవులు సామూహిక నాగరిక జీవనాన్ని గడిపేందుకు అవసరమైన ప్రవర్తనా నియమావళిని రూపొందించే విషయంలో చట్టం స్వేచ్ఛతో సన్నిహిత సంబంధం కలిగి ఉంటుంది. “రాజ్యాన్ని ఒక నైతిక సంస్థగా ఆదర్శవాదులు విశ్వసించారు. రాజ్యం సమాజంలోని జనేచ్ఛకు ప్రతీకగా ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ చట్టాలను విధిగా పాటించవలసి ఉంటుంది. వ్యక్తులు రాజ్యానికి, చట్టాలకు విధేయత చూపడం ద్వారా స్వేచ్ఛగా జీవించగలుగుతారు. చట్టం, స్వేచ్ఛల మధ్య సంబంధం గురించి ఫాసిస్టులు ఆచరణాత్మకమైన సంబంధాన్ని వెల్లడించారు. రాజ్యానికి వ్యతిరేకంగానూ, విరుద్ధంగానూ ఏదీ ఉండదన్న నినాదాన్ని ముస్సోలిని ఈ సందర్భంగా ఇవ్వడమైంది. రాజ్యం ఎల్లప్పుడూ ప్రజా ప్రయోజనాలను పరిరక్షిస్తుంది కాబట్టి చట్టం, స్వేచ్ఛ అనే రెండు భావనలు పరస్పర పోషకాలని చెప్పవచ్చు.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
చట్టాన్ని నిర్వచించి, చట్టం లక్షణాలను పేర్కొనండి.
జవాబు:
పరిచయం : రాజనీతిశాస్త్ర అధ్యయనంలో చట్టం అనేది ఒక ముఖ్యమైన భావన.

రాజ్యం శాసనాల ద్వారా ప్రజలను పరిపాలిస్తుంది. శాసనాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. రాజ్య సార్వ భౌమాధికారం శాసనాల ద్వారా వ్యక్తమవుతుంది. రాజ్యం ఆశించే సాంఘిక, ఆర్థిక, రాజకీయ మార్పులు శాసనం ద్వారానే సాధించగలవు. మానవుని బాహ్య ప్రవర్తనను క్రమబద్ధం చేసే నియమాలే శాసనాలు. వ్యక్తులు రాజ్యంలో చేయవలసినవి, చేయకూడనివి శాసనం చెబుతుంది. ప్రభుత్వంలోని శాసనశాఖ శాసనాలు చేస్తుంది.

అర్థం : శాసనాన్ని ఆంగ్లంలో ‘లా’ అంటారు. ‘లాగ్’ అనే ట్యూటానిక్ పదం నుండి ‘లా’ అనే మాట వచ్చింది. ‘లాగ్’ అంటే ‘సమమైన’ లేదా ‘స్థిరమైన’ అని అర్థం. శాసనాలు స్థిరమైన నిబంధనలు.

నిర్వచనాలు :
1) “సార్వభౌముడి ఆదేశమే చట్టం. ప్రజలందరూ సార్వభౌముడికి విధేయులుగా ఉండేందుకు చట్టం కొన్ని ఉమ్మడి నియమాలను రూపొందిస్తుంది” అని జాన్ ఎరిస్కిన్ పేర్కొన్నాడు.

2) “రాజకీయాధికారాన్ని పొందిన సార్వభౌముడిచే అమలు చేసే బాహ్య చర్యలకు సంబంధించిన సాధారణ నియమమే చట్టం” అని టి.ఇ. హాలండ్ పేర్కొన్నాడు.

3) న్యాయపాలనలో రాజ్యం ఉపయోగించే సూత్ర సముదాయమే చట్టం” అని జాన్ సాల్మండ్ పేర్కొన్నాడు.

శాసనానికి ఆధారాలు : హాలెండ్ అనే రచయిత సంప్రదాయాలు, మతము, ధర్మబద్ధత (సమత), న్యాయమూర్తుల తీర్పులు, శాస్త్రీయ వ్యాఖ్యానాలు, శాసనశాఖ అనేవి శాసనాలకు ఆధారాలని చెప్పాడు. శాసనాలు వివిధ రంగాలలో క్రమంగా రూపొందుతాయి. అనేక అంశాల ప్రభావం వాటిపై ఉంటుంది. రాజనీతి శాస్త్రజ్ఞులు చెప్పిన శాసనాల ఆధారాలు ఈ క్రింది విధంగా చెప్పవచ్చు.

AP Inter 1st Year Civics Study Material Chapter 4 చట్టం

చట్టం ముఖ్య లక్షణాలు (Features of Law) : చట్టానికి కింద పేర్కొన్న లక్షణాలు ఉన్నాయి.

  1. సార్వభౌముడు ఆమోదించిన నియమ నిబంధనల సముధాయమే చట్టం.
  2. చట్టాన్ని రాజ్యం అమలుపరుస్తుంది. రాజ్యం అనుమతి పొందడంతో చట్టాన్ని యోగ్యమైందిగా పరిగణించవచ్చు.
  3. చట్టం నిర్దిష్టమైనది, ఖచ్చితమైనది, విశ్వవ్యాప్తమైనది.
  4. చట్టం ప్రజల అభీష్టాన్ని ప్రతిబింబిస్తుంది.
  5. చట్టం ఉల్లంఘన శిక్షకు దారితీస్తుంది.
  6. చట్టాలు నిర్బంధమైన, శిక్షాత్మక స్వభావాన్ని కలిగి ఉంటాయి.
  7. చట్టం వైయుక్తిక, సాధారణ సంక్షేమాన్ని సంరక్షించే ఉద్దేశ్యాన్ని కలిగి ఉంటుంది.
  8. చట్టం ప్రజల అవసరాల మేరకు మార్చబడుతుంది.

ప్రశ్న 2.
వివిధ రకాల చట్టాలను తెలపండి.
జవాబు:
చట్టం వర్గీకరణ : చట్టం వర్గీకరణ గురించి అనేకమంది రాజనీతి తత్త్వవేత్తలు భిన్నమైన ప్రతిపాదనలను చేశారు. అటువంటి వారిలో మేకైవర్ ప్రతిపాదించిన చట్ట వర్గీకరణ ప్రముఖమైనదిగా పరిగణించవచ్చు.

మేకైవర్ ప్రకారం చట్టం ప్రధానంగా రెండు రకాలుగా ఉంటుంది. అవి : 1) సహజ చట్టం (Natural Law), 2) సహేతుక చట్టం (Positive Law).

సహేతుక చట్టాన్ని (Positive Law), జాతీయ చట్టం (National Law), అంతర్జాతీయ చట్టం (International Law) అని రెండు రకాలుగా వర్గీకరించారు.

జాతీయ చట్టాన్ని (National Law), మరల రెండు రకాలుగా వర్గీకరించారు. అవి : రాజ్యాంగ చట్టం (Constitutional Law), సాధారణ చట్టం (Ordinary Law).

సాధారణ చట్టం (Ordinary Law), అనేది పబ్లిక్ చట్టం (Public Law), ప్రైవేట్ చట్టం (Private Law) అని రెండు రకాలుగా విభజించారు.

పబ్లిక్ చట్టాన్ని (Public Law), పరిపాలన చట్టం (Administrative Law), సార్వత్రిక చట్టం (General Law) అని తిరిగి రెండు రకాలుగా వర్గీకరించబడింది.

సార్వత్రిక చట్టాన్ని (General Law), శాసనాత్మక చట్టం (Statutory Law), ఉమ్మడి చట్టం (Common Law) అని రెండు రకాలుగా విభజించారు. పైన పేర్కొన్న వివిధ రకాల చట్టాలను కింది విధంగా వివరించవచ్చు.

1) సహజ చట్టం (Natural Law) : సహజచట్టాన్ని దైవిక న్యాయంగా కూడ వ్యవహరిస్తారు. సహజచట్టం అనేది ఏ ఒక్కరిచేత రూపొందినది కాదు. అది భౌతికశక్తి ఆధారంగా ప్రకృతిచేత ప్రసాదితమైనది. మానవ స్వభావాన్ని విశ్లేషించేందుకు హేతువును వినియోగించడాన్ని సహజ చట్టంగా పేర్కొనవచ్చు. భగవంతుని స్వహస్తాలతో మానవుల హృదయాలలో లిఖించబడినదే సహజ చట్టంగా కొందరు వర్ణించారు.

2) సహేతుక చట్టం (Positive Law) : మానవ సంస్థలచే రూపొందించబడేదే సహేతుక చట్టం. ఈ చట్టాన్ని రాజకీయ చట్టం అని కొందరు పేర్కొన్నారు. వర్తమాన, సామాజిక, రాజకీయ పరిస్థితుల ఆధారంగా ఈ చట్టం నిర్మితమైంది. సార్వభౌమత్వ రాజకీయ అధికారి ఈ చట్టానికి అనుమతిస్తాడు. ఈ చట్టాన్ని అతిక్రమించినవారు శిక్షకు గురి అవుతారు. ఈ చట్టాన్ని తిరిగి జాతీయ చట్టమని, అంతర్జాతీయ చట్టమని రెండు రకాలుగా పేర్కొన్నారు.

జాతీయ చట్టాన్ని మున్సిపల్ చట్టం లేదా రాజ్య చట్టం అని కూడ వ్యవహరిస్తారు.

జాతీయ చట్టం, రాజ్య భౌగోళిక ప్రదేశానికి పరిమితమవుతుంది. సార్వభౌమాధికారి ద్వారా అది అమలులోకి వస్తుంది. రాజ్యంలోని ప్రజలందరికీ వర్తిస్తుంది. ఇక అంతర్జాతీయ చట్టమనేది వివిధ రాజ్యాల మధ్య సౌహార్ధ సంబంధాలను నెలకొల్పి, నియంత్రణ చేసేందుకు ఉద్దేశించింది. అయితే ఈ రకమైన చట్టానికి వ్యక్తులను శిక్షించే అధికారం ఉండదు. ఐక్యరాజ్యసమితి ఆమోదించిన అంతర్జాతీయ చట్టాలు ఇందుకు ఉదాహరణలుగా పేర్కొనవచ్చు. అంతర్జాతీయ శాంతిభద్రతలను పెంపొందించేందుకై సభ్య రాజ్యాలచే పాటించబడే నియమనిబంధనల సముదాయమే అంతర్జాతీయ చట్టంగా పరిగణించవచ్చు.

AP Inter 1st Year Civics Study Material Chapter 4 చట్టం

ప్రశ్న 3.
చట్టానికి గల మూడు ఆధారాలను రాయండి. [Mar. ’18, ’17]
జవాబు:
1) ఆచార, సంప్రదాయాలు, వాడుకలు (Customs) : ఇవి శాసనానికి తొలి ఆధారాలు. ప్రజల ఆచారాలు, వాడుకలు, సంప్రదాయాలు శాసనాలకు మూలాధారము. సంప్రదాయాలు సంఘంలో ఒక అలవాటుగా, క్రమంగా రూపొందుతాయి. పూర్వం సంప్రదాయాలే సమాజ జీవితాన్ని క్రమబద్ధం చేసేవి. రాజ్యం వీటిని గుర్తించి, వాటిని ఆధారం చేసుకొని కొన్ని శాసనాలను రూపొందిస్తుంది. రాజకీయ ఆచారాలు కూడా రాజ్యంచే గుర్తించబడి అమలు చేయబడితే అవి శాసనాలవుతాయి. బ్రిటన్లో ‘సామాన్య న్యాయం’ సంప్రదాయబద్ధమైన శాసనానికి ఉదాహరణ. అదే విధంగా భారతదేశంలో వివాహ చట్టాలు, ఆస్తి పంపిణీ చట్టాలు మొదలగునవి సంప్రదాయాలు ఆధారంగా చేయబడ్డాయి.

2) మతం (Religion) : ఆచారానికి మతం సమాజాన్ని విపరీతంగా ప్రభావితం చేసే వ్యవస్థ. సంఘ జీవితం మత నియమాలకు అనుగుణంగా జరుపుకుంటారు. పూర్వం మతాధిపతులు చెప్పే నియమాలు శాసనాల వలె చెలామణి అయ్యేవి. ఆధునిక కాలంలో కూడా శాసనాలు చేయడానికి మతం ఒక ఆధారం. వారసత్వం, వివాహం, కుటుంబ ఆస్తి మొదలైన వాటి శాసనాలు మతం ఆధారంగా చేయబడ్డాయి. హిందువులు, క్రైస్తవులు, ముస్లిములకు గల శాసనాలు వారి మతాలు ఆధారంగా రూపొందాయి. ఇరాన్, పాకిస్థాన్ వంటి మత ప్రమేయ దేశాలలో సంఘ జీవనానికి మత నియమాలే ఆధారం.

3) న్యాయస్థానాల తీర్పులు (Judicial Decisions) న్యాయస్థానాలలో న్యాయమూర్తులు ఇచ్చే తీర్పులు శాసన నిర్మాణానికి ఆధారాలు. న్యాయస్థానాలు చట్టాలను వ్యాఖ్యానిస్తాయి. ఈ విధి నిర్వహణలో న్యాయమూర్తులు తీర్పులిచ్చేటప్పుడు క్రొత్త న్యాయ సూత్రాలను సృష్టిస్తారు. ఈ తీర్పులు అదే విధమైన వివాదాలు తలెత్తినప్పుడు న్యాయసూత్రల వలె వర్తింపచేస్తారు. నేడు న్యాయమూర్తుల నిర్ణయాలు శాసనాలలో అంతర్భాగమవుతున్నాయి. ఉదా : భారతదేశంలో సుప్రీంకోర్టు తీర్పులిచ్చిన గోలక్నాథ్ కేసు, కేశవానంద భారతి కేసు, మినర్వామిల్స్ కేసు.

4) శాస్త్రీయ వ్యాఖ్యానాలు (Scientific commentories) : ప్రముఖ న్యాయశాస్త్ర కోవిదులు, రచయితలు, విమర్శకులు చేసే వ్యాఖ్యానాలు శాసన నిర్మాణానికి ఆధారమవుతాయి. ఇవి న్యాయస్థానాలలో న్యాయమూర్తుల వ్యాఖ్యానాలు, వివరణలు, శాసనాలు చేయటానికి ప్రభుత్వానికి ఉపయోగిస్తాయి. న్యాయమూర్తుల నిర్ణయాలు, తీర్పులు, భవిష్యత్లో శాసన నిర్మాణానికి తోడ్పడతాయి. ఇంగ్లండ్లో కోక్, బ్లాక్టన్, అమెరికాలో స్టోరీ, కెంట్, భారతదేశంలో విజ్ఞానేశ్వర, అపరార్క వంటి వారి వ్యాఖ్యానాలు శాసన నిర్మాణానికి ఆధారాలు.

ప్రశ్న 4.
చట్టం, నైతికత మధ్య వ్యత్యాసాలను తెలపండి.
జవాబు:
చట్టం, నైతికతల మధ్య వ్యత్యాసాలను క్రింది విధంగా పేర్కొనవచ్చు.
చట్టం (Law)

  1. చట్టం వ్యక్తుల బాహ్య ప్రవర్తనకు సంబంధించినది.
  2. చట్టం రాజ్యానికి సంబంధించినది.
  3. చట్టం రాజ్యాధికారపు నిర్భంధిత శక్తిచే ముడిపడి ఉంటుంది.
  4. చట్టం నిర్దిష్టమైంది, ఖచ్చితమైంది.
  5. రాజ్య భూభాగంలో మాత్రమే చట్టం వర్తిస్తుంది.
  6. చట్టాన్ని ఒక నిర్దిష్ట లక్ష్యంతో రూపొందించడం అవుతుంది.
  7. సార్వభౌమాధికారి చట్టానికి అనుమతి ఇస్తాడు.
  8. చట్టం అనేది రాజనీతిశాస్త్ర విషయ పరిధిలోకి వస్తుంది.
  9. చట్ట అతిక్రమణ శిక్షకు దారితీస్తుంది.
  10. చట్టాన్ని రూపొందించి అమలులో ఉంచేందుకు యంత్రాంగం ఉంటుంది.

AP Inter 1st Year Civics Study Material Chapter 4 చట్టం

నైతికత (Morality)

  1. నైతికత అనేది వ్యక్తుల మొత్తం జీవనానికి సంబంధించినది.
  2. నైతికత వ్యక్తి అంతరాత్మకు సంబంధించినది.
  3. నైతికతకు ప్రజాభిప్రాయం, వ్యక్తుల అంతరాత్మలు ఆలంబనగా ఉంటాయి.
  4. నైతికత అస్పష్టమైంది, అనిశ్చితమైంది.
  5. నైతిక సూత్రాలు విశ్వ వ్యాప్తమైన స్వభావాన్ని కలిగి ఉంటాయి.
  6. నైతిక సూత్రాలు సమాజంలో అంతర్లీనంగా ఉంటాయి.
  7. సమాజం నైతిక సూత్రాలను ఆమోదిస్తుంది.
  8. నైతిక సూత్రాలనేవి నీతిశాస్త్రం పరిధిలోకి వస్తాయి.
  9. నైతిక సూత్రాల అతిక్రమణ ఎటువంటి శిక్షకు దారితీయదు.
  10. నైతిక సూత్రాల అమలుకు ఎటువంటి ప్రత్యేక రాజ్య యంత్రాంగం ఉండదు.

ప్రశ్న 5.
“చట్టం, స్వేచ్ఛ పరస్పర విరుద్ధాలు” విశ్లేషించండి.
జవాబు:
చట్టం, స్వేచ్ఛ పరస్పరం విరుద్ధమైనవి (Law and Liberty are Antithetical) : చట్టం ఎల్లప్పుడు మానవుల కార్యకలాపాలపై నిర్బంధాలు విధిస్తుందని వ్యక్తి స్వేచ్ఛను సమర్థించేవారు భావిస్తారు. జె.ఎస్. మిల్, హెర్బర్ట్ స్పెన్సర్, ఆడమ్ స్మిత్, మార్షల్ వంటి వ్యక్తి స్వేచ్ఛావాదులు, ప్రాధాన్, బకూనిన్, క్రొపోట్కిన్ వంటి అరాచకవాదుల ప్రకారం వ్యక్తి స్వేచ్ఛకు చట్టం ఆటంకాలను సృష్టిస్తుంది. వారి దృష్టిలో రాజ్యం వ్యక్తుల స్వేచ్ఛలకు భంగం కలిగించే ప్రధాన సాధనం. చట్టం అనేది ఎల్లప్పుడు వ్యక్తుల స్వేచ్ఛపై ఆంక్షలు విధిస్తుంది. రాజ్యం, ప్రభుత్వాలకు సంబంధించిన వ్యవహారాలలో వ్యక్తులు పాల్గొనేందుకు చట్టం అనుమతించదు. అలాగే రాజ్యానికి సంబంధించిన ఆర్థిక కార్యకలాపాల నిర్వహణలో చట్టం ఆటంకంగా పరిణమిస్తుంది. అయితే ఇటీవలి కాలంలో అనేక రాజ్యాలలో ‘అమలులో ఉన్న సరళీకృత ఆర్థిక విధానాలు ఆ దేశాల ఆర్థిక వ్యవస్థలు శీఘ్రగతిన ప్రగతి దిశలో పయనించేందుకు అనుకూలంగా ఉన్నాయని చెప్పవచ్చు. ఈ విధానాలు ఆర్థిక వ్యవహారాలలో ప్రజలు స్వేచ్ఛగా పాల్గొనేందుకు వీలు కల్పించాయి. అవి జాతీయ, అంతర్జాతీయ మార్కెట్ల మధ్య ఏ విధమైన కఠినమైన ఆర్థిక చట్టాలతో ప్రమేయం లేకుండా పోటీకి అవకాశం ఏర్పరచాయి. రాజ్యమనేది ‘ఒక అవసరమైన చెడు’ (State is a necessary evil) గా వ్యక్తి స్వేచ్ఛావాదులు విశ్వసించారు. ఏ ప్రభుత్వమైతే అతి తక్కువగా పాలనగావిస్తుందో అదియే ఉత్తమమైన ప్రభుత్వంగా వారు వివరించారు. చట్టం వ్యక్తుల కార్యకలాపాలపై కొన్ని ఆంక్షలు విధిస్తుందని వారు పేర్కొన్నారు. అటువంటి ఆంక్షలు లేనప్పుడే వ్యక్తులు స్వీయ ‘ వ్యక్తిత్వ వికాసానికి కృషి చేయగలుగుతారు. కాబట్టి చట్టం, స్వేచ్ఛ, ఒకదానికొకటి పరస్పరం విరుద్ధమైనవి.

ప్రశ్న 6.
చట్టం, స్వేచ్ఛ ఏ విధంగా పరస్పర పోషకాలో వివరించండి.
జవాబు:
చట్టం, స్వేచ్ఛ పరస్పర పోషకాలు (Law and Liberty are Complimentary) : సామ్యవాదులు, కమ్యూనిస్టుల ప్రకారం చట్టం, స్వేచ్ఛ ఒకదానికొకటి పరస్పర పోషకాలు. వారి దృష్టిలో రాజ్యం అనేది ఒక సంక్షేమ సంస్థ. రాజ్యం తన చట్టబద్దమైన యంత్రాంగం ద్వారా మెరుగైన, న్యాయంతో కూడిన సామాజిక వ్యవస్థను సాధించవచ్చు.
సామాజిక సంక్షేమానికి అవసరమైన ఆంక్షలను చట్టం విధిస్తుంది. పెట్టుబడిదారీవర్గం కార్మికవర్గాన్ని దోపిడీకి గురి చేస్తుందనే విషయం వాస్తవం. అటువంటి నేపథ్యంలో రాజ్యం దోపిడికి సంబంధించిన వర్గాలపై ఆంక్షలు విధించగలుగుతుంది. స్వేచ్ఛ అనేది అపరిమితమైనది కాదు. హక్కులను అనుభవించే రాజ్యం ప్రజలపై కొన్ని అవసరమైన ఆంక్షలను విధించేందుకు అధికారం కలిగి ఉంటుంది. ఈ సందర్భంలో లాస్కి కింది విధంగా పేర్కొన్నాడు. “మానవులు సామూహిక నాగరిక జీవనాన్ని గడిపేందుకు అవసరమైన ప్రవర్తనా నియమావళిని రూపొందించే విషయంలో చట్టం స్వేచ్ఛతో సన్నిహిత సంబంధం కలిగి ఉంటుంది. “రాజ్యాన్ని ఒక నైతిక సంస్థగా ఆదర్శవాదులు విశ్వసించారు. రాజ్యం సమాజంలోని జనేచ్ఛకు ప్రతీకగా ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ చట్టాలను విధిగా పాటించవలసి ఉంటుంది. వ్యక్తులు రాజ్యానికి, చట్టాలకు విధేయత చూపడం ద్వారా స్వేచ్ఛగా జీవించగలుగుతారు. చట్టం, స్వేచ్ఛల మధ్య సంబంధం గురించి ఫాసిస్టులు ఆచరణాత్మకమైన సంబంధాన్ని వెల్లడించారు. రాజ్యానికి వ్యతిరేకంగానూ, విరుద్ధంగానూ ఏదీ ఉండదన్న నినాదాన్ని ముస్సోలిని ఈ సందర్భంగా ఇవ్వడమైంది. రాజ్యం ఎల్లప్పుడూ ప్రజా ప్రయోజనాలను పరిరక్షిస్తుంది కాబట్టి చట్టం, స్వేచ్ఛ అనే రెండు భావనలు పరస్పర పోషకాలని చెప్పవచ్చు.

AP Inter 1st Year Civics Study Material Chapter 4 చట్టం

ప్రశ్న 7.
చట్టం, నైతికతల మధ్య ఎటువంటి సంబంధం ఉంది ?
జవాబు:
చట్టం – నైతికత అనేవి సామాజిక సంస్థలకు ప్రధాన మూలాధారాలుగా పరిగణించవచ్చు. సమాజంలో శాంతి భద్రతల నిర్వహణలోనూ, ప్రగతి సాధనలోనూ ఈ రెండు అంశాలు ఎంతో కీలకపాత్రను పోషిస్తాయి. ఈ రెండు అంశాలు వేర్వేరు దృక్పథాలను కలిగి ఉన్నప్పటికీ ఒకే లక్ష్యాన్ని కలిగి ఉన్నాయి. అవి ఒకదానికొకటి పరస్పర సంబంధం కలిగి ఉంటూ పరస్పర ఆధారితాలుగా ఉంటాయి. కొందరు రాజనీతి తత్త్వవేత్తలు ఈ రెండింటినీ ఒకటిగా పరిగణించారు. ఈ సందర్భంలో ఆర్.జి.గెటిల్ కింది విధంగా ప్రకటించాడు. “చట్టం – నైతికత రెండూ ఒకే విధమైనవి. అవి రెండూ ప్రాచీన సామాజిక జీవనపు అలవాట్లు, అనుభవాల నుంచి ఉద్భవించాయి. ప్రాచీన సమాజంలో వ్యక్తుల నైతిక, సామాజిక వ్యవహారాలు అవిభాజ్యాలుగా ఉండేవి”. ఈ రెండింటి మధ్య కొన్ని నిర్దిష్టమైన వ్యత్యాసాలు ఉన్నప్పటికీ, శాసనం, నైతికత రెండూ ఉమ్మడి సంక్షేమాన్ని ఉద్దేశించి వాడుకలోకి వచ్చాయి.

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
చట్టం పదవృత్తాంతాన్ని వివరించండి.
జవాబు: ‘చట్టం’ అనే పదం టైటానిక్ భాష (జర్మన్) లోని ‘లాగ్’ అనే పదం నుండి గ్రహించబడింది. లాగ్ అనగా ‘స్థిరంగా ఉండటం’ అని అర్థం. పద అర్థాన్ని బట్టి సార్వభౌమత్వ రాజకీయ అధికారిచే ప్రతిపాదించబడి, అమల్లోకి వచ్చిన ప్రవర్తనా నియమావళియే చట్టం అని భావించవచ్చు. మరికొందరు రాజనీతిజ్ఞులు ‘చట్టం’ అనే పదం లాటిన్ భాషలోని ‘జస్’, ‘జంగేరి’ అనే రెండు పదాల నుండి గ్రహించబడిందని పేర్కొన్నారు. లాటిన్ భాషలోని ఈ రెండు పదాలకు ‘బంధం’ అనే అర్థం ఉంది.

ప్రశ్న 2.
చట్టానికి గల రెండు నిర్వచనాలను తెలపండి.
జవాబు:

  1. “రాజకీయాధికారాన్ని పొందిన సార్వభౌముడిచే అమలుచేసే బాహ్య చర్యలకు సంబంధించిన సాధారణ నియమమే చట్టం” అని టి. ఇ. హాలండ్ పేర్కొన్నాడు.
  2. “న్యాయపాలనలో రాజ్యం ఉపయోగించే సూత్ర సముదాయమే చట్టం” అని జాన్ సాల్మండ్ పేర్కొన్నాడు.

ప్రశ్న 3.
చట్టం లక్షణాలు ఏవీ ?
జవాబు:
చట్టం ఈ క్రింది ముఖ్య లక్షణాలను కలిగి ఉంటుంది.

  1. సార్వభౌముడు ఆమోదించిన నియమ నిబంధనల సముదాయమే చట్టం.
  2. చట్టం నిర్దిష్టమైనది, ఖచ్చితమైనది మరియు విశ్వవ్యాప్తమైనది.
  3. చట్టం ప్రజాభిప్రాయానికి అనుకూలంగా ఉంటుంది.
  4. చట్టం ఉల్లంఘన శిక్షకు దారితీస్తుంది.

AP Inter 1st Year Civics Study Material Chapter 4 చట్టం

ప్రశ్న 4.
సమన్యాయపాలన అంటే ఏమిటి ? [Mar. ’16, ’17 ]
జవాబు:
సమన్యాయపాలన అంటే చట్టం ఆధిక్యత అని అర్థం. సమన్యాయపాలన అమలులో ఉన్న దేశాలలో ప్రభుత్వాధికారాలు చట్టాల ద్వారా నిర్ణయించబడతాయి. ప్రభుత్వ చర్యలన్నింటికి చట్టసమ్మతి ఉండాలి. చట్టాన్ని ఉల్లంఘించినపుడు మాత్రమే వ్యక్తి శిక్షింపబడతాడు. ధనిక, పేద అనే విచక్షణ లేకుండా చట్టం అందరినీ సమానంగా చూస్తుంది. చట్ట ఆధిక్యత లేదా సమన్యాయ పాలన ఉండటం వలన వ్యక్తులకు స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలు లభిస్తాయి.

ప్రశ్న 5.
సహజ చట్టం అంటే ఏమిటి ?
జవాబు:
సహజ చట్టం (Natural Law) : సహజచట్టాన్ని దైవిక న్యాయంగా కూడ వ్యవహరిస్తారు. సహజచట్టం అనేది ఏ ఒక్కరిచేత రూపొందినది కాదు. అది భౌతికశక్తి ఆధారంగా ప్రకృతిచేత ప్రసాదితమైనది. మానవ స్వభావాన్ని విశ్లేషించేందుకు హేతువును వినియోగించడాన్ని సహజ చట్టంగా పేర్కొనవచ్చు. భగవంతుని స్వహస్తాలతో మానవుల హృదయాలలో లిఖించబడినదే సహజ చట్టంగా కొందరు వర్ణించారు.

ప్రశ్న 6.
పరిపాలక చట్టం అంటే ఏమిటో తెలపండి. (లేదా) పరిపాలక న్యాయం గురించి నీకేమి తెలియును ?
జవాబు:
పరిపాలక చట్టం (Administrative Law) : పరిపాలన నిర్విఘ్నంగానూ, ప్రశాంతంగానూ కొనసాగే విషయంలో చట్టం కీలకపాత్రను పోషిస్తుంది. ప్రజలకు ప్రభుత్వాధికారులకు మధ్య సంబంధాలను ఈ రకమైన చట్టం నియంత్రిస్తుంది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన సంస్కరణలను తీసుకురావడంలో ఇది దోహదపడుతుంది. పరిపాలక చట్టాలను అనుసరించడం ద్వారా ఈనాటి రాజ్యాలు అనేక దశలుగా శీఘ్రగతిన అభివృద్ధిని సాధించాయి. ప్రభుత్వ సిబ్బంది క్రమశిక్షణతో పనిచేసేటట్లు పరిపాలక చట్టం దోహదపడుతుంది.

ప్రశ్న 7.
చట్టానికి గల ఏ మూడు ఆధారాలనైనా రాయండి.
జవాబు:
చట్టానికి గల మూడు ఆధారాలు : i) ఆచారాలు ii) మతం iii) శాసనసభ.

ప్రశ్న 8.
రాజ్యాంగ చట్టం అంటే ఏమిటి ? [Mar. ’18]
జవాబు:
రాజ్యాంగ చట్టం (Constitutional Law): రాజ్యాంగ చట్టమనేది సాధారణ చట్టం కంటే భిన్నంగా ఉంటుంది. రాజ్యంలో ఈ రకమైన చట్టం అత్యున్నతమైనది. ప్రభుత్వ నిర్మాణానికి ఇది వీలు కల్పిస్తుంది. ప్రభుత్వాంగాల మధ్య సంబంధాన్ని వివరిస్తుంది. ప్రభుత్వాంగాల అధికార పరిధిని నిర్ణయిస్తుంది. ఈ రకమైన చట్టం లిఖిత పూర్వకంగా ఉంటుంది. రాజ్యంలో నివసించే పౌరుల హక్కులు, బాధ్యతల గురించి వివరిస్తుంది. ప్రజాస్వామ్యంలో ఈ చట్టానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ఇది ప్రజాభీష్టానికి ప్రతీకగా ఉంటుంది.

AP Inter 1st Year Civics Study Material Chapter 4 చట్టం

ప్రశ్న 9.
పబ్లిక్ చట్టాన్ని నిర్వచించండి.
జవాబు:
పబ్లిక్ చట్టం (Public Law) : పబ్లిక్ చట్టం, రాజ్యం వ్యక్తుల మధ్య సంబంధాలను నియంత్రిస్తుంది. రాజ్యానికి సంబంధించిన మౌలిక నిర్మితి, విధులను పబ్లిక్ చట్టం వివరిస్తుంది. రాజ్యపు మితిమీరిన జోక్యానికి వ్యతిరేకంగా వ్యక్తులకు అవసరమైన హక్కులను అందిస్తుంది. పౌరులందరు ఈ చట్టాన్ని అనుసరించాల్సి ఉంటుంది. ఈ చట్టాన్ని అతిక్రమించడం శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తారు.

ప్రశ్న 10.
జస్, జంగేరి పదవృత్తాంతాలను వివరించండి.
జవాబు:
కొంతమంది రాజనీతిజ్ఞుల ప్రకారం ‘చట్టం’ అనే పదం లాటిన్ భాషలోని ‘జస్’, ‘జంగేరి’ అనే రెండు పదాల నుండి ఉద్భవించింది. లాటిన్ భాషలో ఈ రెండు పదాలకు ‘బంధం’ అనే అర్థం ఉంది. సాధారణంగా చట్టం అనేది రాజకీయ సార్వభౌమాధికారిచే వ్యక్తుల బాహ్య ప్రవర్తనను నియంత్రించేందుకై రూపొందించబడిన నియమావళి అని పేర్కొనవచ్చు.

ప్రశ్న 11.
చట్టం అధ్యయనానికి గల దృక్పథాలు ఏవి ?
జవాబు:
చట్టం అధ్యయనానికి గల ప్రధాన దృక్పథాలు నాలుగు. అవి : 1) నైతిక దృక్పథం 2) రాజకీయ దృక్పథం 3) శాస్త్రీయ దృక్పథం 4) సాంఘిక లేదా సామాజిక దృక్పథం.

ప్రశ్న 12.
సమత అంటే ఏమిటో నిర్వచించండి. [Mar. ’16]
జవాబు:
‘సమత’ అనే పదానికి నిష్పక్షపాతం, న్యాయం లాంటి సూత్రాలను పర్యాయపదాలుగా వాడుతున్నారు. సమత అంటే సహజ న్యాయం. అమలులో ఉన్న చట్టాలు వివాదాల పరిష్కారానికి సహాయపడిన సందర్భాలలో న్యాయమూర్తులు తమ విజ్ఞత, విచక్షణతో వివాదాలను పరిష్కరిస్తారు. ఈ పరిష్కారాలే రాజ్యముచేత గుర్తించబడి చట్టాలుగా ప్రకటించబడతాయి.

ప్రశ్న 13.
శాస్త్రవేత్తల వ్యాఖ్యానాలు అంటే ఏవి ?
జవాబు:
శాస్త్రవేత్తల వ్యాఖ్యానాలు చట్టానికి మరొక ముఖ్యమైన ఆధారం. ప్రఖ్యాత న్యాయమూర్తులు, న్యాయవాదులు వెల్లడించే అభిప్రాయాలు ఎనలేని ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. న్యాయవేత్తలు తమ వ్యాఖ్యానాల ద్వారా చట్టంలోని దోషాలను గుర్తించి, వాటి నివారణకు కొన్ని సూచనలు చేస్తారు. కాలక్రమంలో ఈ సూచనలే చట్ట నిర్మాణానికి ప్రధాన ఆధారాలవుతాయి.

AP Inter 1st Year Civics Study Material Chapter 4 చట్టం

ప్రశ్న 14.
శాసన నిర్మాణ ప్రక్రియలో శాసనసభ పాత్ర ఏమిటి ?
జవాబు:
ప్రజాస్వామ్యంలో శాసనసభ శాసన నిర్మాణ ప్రక్రియలో ప్రధానపాత్ర పోషిస్తుంది. కావున శాసనసభను చట్టం యొక్క ప్రత్యక్ష ఆధారంగా పేర్కొంటారు. చట్ట నిర్మాణంలో శాసనసభలు ప్రజానీకం ఆకాంక్షలకు ప్రతీకగా ఉంటాయి. శాసనసభలోని అధికార, ప్రతిపక్షాలు రెండూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వ్యవహరిస్తాయి.

AP Inter 2nd Year Civics Study Material Chapter 8 రాష్ట్ర న్యాయశాఖ

Andhra Pradesh BIEAP AP Inter 2nd Year Civics Study Material 8th Lesson రాష్ట్ర న్యాయశాఖ Textbook Questions and Answers.

AP Inter 2nd Year Civics Study Material 8th Lesson రాష్ట్ర న్యాయశాఖ

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
హైకోర్టు అధికార విధులను వివరించండి.
జవాబు:
భారత రాజ్యాంగం ప్రతి రాష్ట్రానికి ఒక హైకోర్టును ఏర్పాటు చేసింది. 1956వ సంవత్సరములో చేపట్టిన 7వ రాజ్యాంగ సవరణను అనుసరించి 2 లేదా 3 రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఉమ్మడి హైకోర్టును ఏర్పరిచేందుకు పార్లమెంటుకు అధికారం కల్పించబడింది. దేశంలోని చాలా రాష్ట్రాలలో హైకోర్టులు కలిగియున్నాయి.

భారత రాజ్యాంగంలోని ఆరో భాగంలో 214 నుండి 231 వరకు గల నిబంధనలు రాష్ట్ర హైకోర్టు నిర్మాణం, న్యాయమూర్తుల అర్హతలు, నియామకం, స్వతంత్ర ప్రతిపత్తి, న్యాయపరిధి, అధికారాలు, ప్రక్రియల గురించి పేర్కొన్నాయి. నిర్మాణం: ప్రతి హైకోర్టులో ఒక ప్రధాన న్యాయమూర్తి, కొందరు ఇతర న్యాయమూర్తులుంటారు. వీరిని భారత రాష్ట్రపతి నియమిస్తారు.

న్యాయమూర్తుల అర్హతలు: హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించబడుటకు రాజ్యాంగంలో నిర్ధేశించిన విధంగా క్రింది అర్హతలు కలిగి వుండాలి.

  1. భారతీయ పౌరుడై వుండాలి.
  2. భారతదేశంలో కేంద్ర, రాష్ట్ర న్యాయ సర్వీసులలో కనీసం 10 సంవత్సరాలు న్యాయాధికారిగా అనుభవం కలిగి ఉండాలి. లేదా
  3. రెండుగాని అంతకన్నా ఎక్కువ హైకోర్టులలో 10 సంవత్సరాలు న్యాయవాదిగా అనుభవముండాలి.

AP Inter 2nd Year Civics Study Material Chapter 8 రాష్ట్ర న్యాయశాఖ

హైకోర్టు న్యాయమూర్తుల నియామకానికి రాజ్యాంగంలో ఎటువంటి కనీస వయోపరిమితి ప్రస్తావన లేదు. జీతభత్యములు: హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి నెలసరి వేతనంగా 90,000/- ఇతర న్యాయమూర్తులకు 3 80,000/- లభిస్తాయి. వేతనంతో పాటు వారికి ఉచిత నివాస సౌకర్యం, వైద్యం, టెలిఫోన్, కారు సౌకర్యాలు మరియు ఇతర అలవెన్సులు ఉంటాయి.

ప్రమాణ స్వీకారం: హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తులు సంబంధిత రాష్ట్ర గవర్నర్ సమక్షంలో పదవీ ప్రమాణ స్వీకారం చేస్తారు.

పదవీ కాలం: హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తులు 62 సంవత్సరముల వయస్సు నిండే వరకు పదవిలో కొనసాగుతారు.

తొలగింపు విధానం: హైకోర్టు న్యాయమూర్తుల నిరూపించబడిన అధికార దుర్వినియోగం, అవినీతి, అసమర్థత, అనైతిక ప్రవర్తనల ఆధారంగా భారత రాష్ట్రపతి సుప్రీంకోర్టు న్యాయమూర్తులను తొలగించే విధంగా హైకోర్టు న్యాయమూర్తులను తొలగిస్తారు.

హైకోర్టు అధికారాలు విధులు: భారత రాజ్యాంగం ప్రకారం హైకోర్టు ఈ క్రింది పేర్కొన్న అధికారాలను, విధులను కల్గి ఉంది. అవి:
1) ప్రారంభ అధికార పరిధి: భారతదేశంలోని ప్రతి హైకోర్టుకు క్రింది విషయాలలో ప్రారంభ అధికార పరిధిని భారత రాజ్యాంగం కల్పించింది. వాటిలో వీలునామా, వివాహము, విడాకులు, కంపెనీ చట్టము, కోర్టు ధిక్కరణ, రెవెన్యూ వివాదాలు మొదలైనవి ఉన్నాయి. ప్రతి హైకోర్టు కొన్ని సూచనలను, ఆదేశాలను లేదా ఆజ్ఞలను (రిట్) ప్రాథమిక హక్కుల అమలుకు జారీచేస్తుంది. పార్లమెంటు సభ్యుల, రాష్ట్ర శాసన సభ్యుల ఎన్నికల వివాదాలు హైకోర్టు పరిధిలోనే పరిష్కరించబడతాయి.

2) అప్పీళ్ళ విచారణ పరిధి: సబార్డినేట్ కోర్టు తీర్పులపై వచ్చే అప్పీళ్ళపై హైకోర్టుకు విచారణ చేసే అధికారముంది. హైకోర్టు సివిల్, క్రిమినల్ వివాదాలపై వచ్చే అప్పీళ్ళను విచారిస్తుంది.

సివిల్ కేసులు: హైకోర్టుకు వచ్చే సివిల్ వివాదాలు మొదటి అప్పీలు లేదా రెండవ అప్పీలుగా ఉంటాయి. సివిల్ వివాదాలలో హైకోర్టుకు వచ్చే అప్పీళ్ళు జిల్లా కోర్టు నిర్ణయంపై ఆధారపడి ఉంటాయి. ఏదైనా వివాదం విలువ కౌ 5,00,000/- లు లేదా అంతకు మించివుంటే అటువంటి వివాదాలపై సబార్డినేటు కోర్టులు ఇచ్చిన తీర్పులపై వచ్చే అప్పీళ్ళను హైకోర్టు విచారణకు స్వీకరిస్తుంది.

క్రిమినల్ కేసులు: జిల్లా సెషన్స్ కోర్టులు ఏడు సంవత్సరాల పైబడి కారాగార శిక్ష విధించిన సందర్భాలలో వచ్చే అప్పీళ్ళను హైకోర్టు విచారణకు స్వీకరిస్తుంది. అలాగే మరణ శిక్ష విధించిన జిల్లా సెషన్స్ కోర్టు తీర్పులన్నీ హైకోర్టు పరిశీలనకు, అంతిమ ఆమోదం కొరకు నివేదించబడతాయి.

3) కోర్టు ఆఫ్ రికార్డ్: రాష్ట్ర హైకోర్టు ‘కోర్ట్ ఆఫ్ రికార్డ్’గా వ్యవహరిస్తుంది. వ్యక్తులు గానీ, సంస్థలు కానీ, కోర్టు ధిక్కారానికి పాల్పడితే, హైకోర్టు వారిని విచారించి శిక్షిస్తుంది. హైకోర్టు ఇచ్చిన తీర్పులు, వెలువరించిన నిర్ణయాలు రికార్డుల రూపంలో భద్రపరుస్తుంది. ఆ రికార్డులకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. హైకోర్టు ఇచ్చిన తీర్పులు రాష్ట్రంలోని క్రింది న్యాయస్థానాలకు మార్గదర్శకాలుగా ఉంటాయి.

4) న్యాయ సమీక్ష: సుప్రీంకోర్టు వలే హైకోర్టుకు న్యాయ సమీక్ష అధికారం ఉంటుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించిన చట్టాలు లేదా జారీ చేసే ఆదేశాలు రాజ్యాంగ మూల సూత్రాలకు విరుద్ధంగా ఉంటే అవి చెల్లవని (Ultra vires) ప్రకటించే అధికారం హైకోర్టుకు ఉంటుంది.

5) సర్టిఫికేషన్ అధికారం: హైకోర్టు ఇచ్చిన తీర్పుల పట్ల సంతృప్తి చెందని వారు సుప్రీంకోర్టుకు అప్పీలు చేసుకోవచ్చు. అటువంటి అప్పీళ్ళను సర్టిఫై చేసే అధికారం హైకోర్టుకు ఉంది. కనుక సుప్రీంకోర్టుకు అప్పీలు చేసుకొనే వ్యక్తులందరూ చాలావరకు హైకోర్టు ధృవీకరణను తీసుకోవాల్సి ఉంటుంది.

6) సలహాపూర్వక విధులు: హైకోర్టు న్యాయసంబంధ విషయాలలో గవర్నరుకు సలహాలిస్తుంది. జిల్లా న్యాయమూర్తుల నియామకం, పదోన్నతి, బదిలీలు మొదలగు అంశాల విషయములో కూడా సలహాలు ఇస్తుంది. జిల్లా న్యాయస్థానాలలో జిల్లా జడ్జి మినహా ఇతర పదవులలో ఏర్పడే ఖాళీల భర్తీ విషయంలో రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్తో పాటు హైకోర్టు గవర్నర్కు సలహా ఇస్తుంది.

7) పరిపాలనా సంబంధమైన విధులు: హైకోర్టు తన ప్రాదేశిక పరిధిలో కొన్ని పాలనా సంబంధమైన విధులను నిర్వహిస్తుంది. అవి:

  • 227వ ప్రకరణను అనుసరించి హైకోర్టు రాష్ట్రంలోని అన్ని న్యాయస్థానాలు, ట్రిబునల్స్పై (మిలిటరీ కోర్టులు మినహా) పర్యవేక్షణాధికారాన్ని కలిగి ఉంటుంది.
  • దిగువ కోర్టులు సమర్థవంతంగా పనిచేయడానికి అవసరమైన నియమనిబంధనలను రూపొందించడంలో కీలక పాత్ర వహిస్తుంది.
  • రాజ్యాంగంలోని 228వ ప్రకరణ ప్రకారం హైకోర్టు కొన్ని ప్రత్యేక పరిస్థితులలో కేసులను ఒక కోర్టు నుండి మరొక కోర్టుకు బదిలీ చేస్తుంది.

ప్రశ్న 2.
జిల్లాస్థాయి న్యాయ వ్యవస్థలపై ఒక వ్యాసం రాయండి.
జవాబు:
ప్రతి రాష్ట్రంలో హైకోర్టుకు దిగువన సబార్డినేట్ కోర్టుల వ్యవస్థ ఉంటుంది. భారత రాజ్యాంగం అధీన న్యాయవ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తిని కాపాడుతుంది. రాజ్యాంగంలోని VIవ భాగంలో 233 నుండి 237 వరకు గల ప్రకరణలు సబార్డినేట్ కోర్టుల గురించి పేర్కొన్నాయి. 233వ ప్రకరణ రాష్ట్రంలోని జిల్లా జడ్జిల నియామకం, పదోన్నతి మొదలగు అంశాలను వివరిస్తుంది.

రాష్ట్రంలో రెండు రకాల సబార్డినేట్ కోర్టులుంటాయి. అవి:

  1. సివిల్ కోర్టులు
  2. క్రిమినల్ కోర్టులు

AP Inter 2nd Year Civics Study Material Chapter 8 రాష్ట్ర న్యాయశాఖ

1) సివిల్ కోర్టులు: సివిల్ సంబంధమైన వివాదంతో ముడిపడిన వివాహాలు, విడాకులు, వారసత్వం, వ్యాపారం మొదలగు సివిల్ కేసులను సివిల్ కోర్టులు విచారణకు స్వీకరిస్తాయి. జిల్లా అంతటికి జిల్లా కోర్టుంటుంది. జిల్లా జడ్జి సివిల్ కోర్టుకు అధిపతిగా వ్యవహరిస్తారు. జిల్లాలోని అన్ని సివిల్ కోర్టులపై జిల్లా జడ్జి నియంత్రణ, పర్యవేక్షణా అధికారాలను కలిగి ఉంటాడు. జిల్లా సివిల్ కోర్టుకు దిగువన సీనియర్ సివిల్ జడ్జి కోర్టులు ఉంటాయి. వీటితో పాటు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులు ఉంటాయి. సబార్డినేట్ కోర్టులలోని క్రింద పేర్కొన్న న్యాయాధికారులు ఉంటారు.

  1. ప్రిన్సిపల్ జిల్లా జడ్జి.
  2. కుటుంబ కోర్టు జడ్జి.
  3. యస్.సి & యస్. టి. చట్టం కోర్టు జడ్జి.
  4. సీనియర్ సివిల్ కోర్టు జడ్జి
  5. జూనియర్ సివిల్ కోర్టు జడ్జి.

< 10 లక్షల అంతకు మించిన ఆస్థి విలువ కలిగిన వివాదాలపై ప్రిన్సిపల్ జిల్లాకోర్టు విచారణ జరిపి తీర్పునిస్తుంది. ప్రిన్సిపల్ జిల్లా జడ్జిని ప్రత్యక్ష భర్తీ విధానం లేదా పరోక్ష భర్తీ విధానం (పదోన్నతి) ద్వారా నియమించబడతారు. జిల్లా జడ్జి కేడర్ కలిగిన న్యాయాధికారులు కుటుంబ కోర్టులకు న్యాయమూర్తులుగా వ్యవహరిస్తారు.

సీనియర్ సివిల్ జడ్జి కోర్టులు లక్ష రూపాయలకు పైబడి పదిలక్షలలోపు ఆస్థి విలువ గల కేసులను విచారించి తీర్పునిస్తాయి. లక్ష రూపాయలలోపు ఆస్థివిలువ గల కేసులను జూనియర్ సివిల్ జడ్జి కోర్టు విచారించి తీర్పునిస్తుంది. స్థానిక న్యాయ వివాదాలను పరిష్కరించేందుకు జిల్లాలో క్రింది స్థాయిలో న్యాయ పంచాయితీలు, గ్రామ కచేరీలు, అదాలత్ పంచాయితీలు ఉంటాయి.

2) క్రిమినల్ కోర్టులు: జిల్లాలో సెషన్స్ కోర్టు అత్యున్నత క్రిమినల్ కోర్టు. క్రిమినల్ వివాదాలను జిల్లాస్థాయిలో విచారించేందుకు సెషన్స్ కోర్టు అత్యున్నత న్యాయస్థానంగా వ్యవహరిస్తుంది. ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లోని అంశాల ఆధారంగా సెషన్స్ జడ్జి తీర్పునిస్తాడు. జిల్లాస్థాయిలో క్రింద పేర్కొన్న న్యాయమూర్తులు క్రిమినల్ కేసులను విచారిస్తారు.

  1. జిల్లా సెషన్స్ జడ్జి.
  2. సీనియర్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి.
  3. జూనియర్ సివిల్ జడ్జి.
  4. స్పెషల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్.

ప్రిన్సిపల్ జిల్లా న్యాయమూర్తే జిల్లా సెషన్స్ జడ్జిగా వ్యవహరించి హత్య, మోటారు వాహనాల చట్ట ఉల్లంఘన కేసులను విచారించి, దోషులకు జీవిత ఖైదు లేదా మరణశిక్ష విధిస్తాడు. అయితే అటువంటి శిక్షలను హైకోర్టు ధృవీకరించాల్సి ఉంటుంది. సీనియర్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి కేసు స్వభావాన్ని బట్టి ఐదు నుండి ఏడు సంవత్సరాల | వరకు కారాగార శిక్షను విధించవచ్చు.

జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఏదైనా పట్టణములో ఉన్నట్లయితే ఆ కోర్టు సివిల్ మరియు క్రిమినల్ కోర్టుగా వ్యవహరించి సంబంధిత కేసులను విచారించి మూడు సంవత్సరాలలోపు కారాగార శిక్ష విధించవచ్చు. సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులు ఐదు వందల రూపాయల వరకు పెనాల్టీని లేదా ఒక సంవత్సరం కారాగార శిక్షను లేక రెండింటిని విధించవచ్చు.

స్పెషల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టును ప్రతి పట్టణములోను ఏర్పాటు చేయవచ్చు. ఇవి చిల్లర (పెట్టీ) కేసులను విచారించి ఐదు వందల రూపాయలలోపు జరిమానా, ఆరునెలలలోపు కారాగార శిక్షను విధించవచ్చు.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
హైకోర్టు నిర్మాణాన్ని గూర్చి సంక్షిప్తంగా వివరించండి.
జవాబు:
ప్రతి హైకోర్టులో ఒక ప్రధాన న్యాయమూర్తి, కొందరు ఇతర న్యాయమూర్తులుంటారు. వీరిని భారత రాష్ట్రపతి సందర్భానుసారంగా నియమిస్తాడు. హైకోర్టు న్యాయమూర్తి తాత్కాలికంగా శెలవుపై ఉన్నా లేదా విధులను నిర్వహించలేని పరిస్థితిలో ఉన్నా అతడు తన బాధ్యతలను తిరిగి చేపట్టేంతవరకు తాత్కాలిక న్యాయమూర్తిని రెండు సంవత్సరాల పదవీకాలానికి మించకుండా భారత రాష్ట్రపతి నియమించవచ్చు.

రాజ్యాంగం హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్యపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఉదా: అలహాబాద్ హైకోర్టులో అత్యధికంగా 48మంది న్యాయమూర్తులు ఉండగా గౌహతి హైకోర్టులో అతి తక్కువగా 5గురు న్యాయమూర్తులు ఉన్నారు. రాష్ట్రపతి విచక్షణపై, హైకోర్టుల పనిభారాన్ని దృష్టిలోవుంచుకొని రాష్ట్రపతి కాలానుగుణంగా హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను నిర్ణయిస్తాడు.

ప్రశ్న 2.
రాష్ట్ర హైకోర్టు ఏవైనా రెండు అధికార విధులను గూర్చి రాయండి. [Mar. 16]
జవాబు:
1) ప్రారంభ అధికార పరిధి: భారతదేశంలోని ప్రతి హైకోర్టుకు క్రింది విషయాలలో ప్రారంభ అధికార పరిధిని భారత రాజ్యాంగం కల్పించింది. వాటిలో వీలునామా, వివాహము, విడాకులు, కంపెనీ చట్టము, కోర్టు ధిక్కరణ, రెవెన్యూ వివాదాలు మొదలైనవి ఉన్నాయి. ప్రతి హైకోర్టు కొన్ని సూచనలను, ఆదేశాలను లేదా ఆజ్ఞలను (రిట్) ప్రాథమిక హక్కుల అమలుకు జారీచేస్తుంది. పార్లమెంటు సభ్యుల, రాష్ట్ర శాసన సభ్యుల ఎన్నికల వివాదాలు హైకోర్టు పరిధిలోనే పరిష్కరించబడతాయి.

226వ ప్రకరణను అనుసరించి ప్రాథమిక హక్కుల పరిరక్షణకు ఐదు రకాల రిట్లను హైకోర్టు జారీచేసే అధికారం కలిగి ఉంది. అవి హెబియస్ కార్పస్, సెర్షియోరరీ, మాండమస్, కో-వారంటో, ఇంజక్షన్ మొదలైనవి.

2) అప్పీళ్ళ విచారణ పరిధి: సబార్డినేట్ కోర్టు తీర్పులపై వచ్చే అప్పీళ్ళపై హైకోర్టుకు విచారణ చేసే అధికారముంది. హైకోర్టు సివిల్, క్రిమినల్ వివాదాలపై వచ్చే అప్పీళ్ళను విచారిస్తుంది.

సివిల్ కేసులు: హైకోర్టుకు వచ్చే సివిల్ వివాదాలు మొదటి అప్పీలు లేదా రెండవ అప్పీలుగా ఉంటాయి. సివిల్ వివాదాలలో హైకోర్టుకు వచ్చే అప్పీళ్ళు జిల్లా కోర్టు నిర్ణయంపై ఆధారపడి ఉంటాయి. ఏదైనా వివాదం విలువ 5,00,000/- లు లేదా అంతకు మించివుంటే అటువంటి వివాదాలపై సబార్డినేటు కోర్టులు ఇచ్చిన తీర్పులపై వచ్చే అప్పీళ్ళను హైకోర్టు విచారణకు స్వీకరిస్తుంది.

క్రిమినల్ కేసులు: జిల్లా సెషన్స్ కోర్టులు ఏడు సంవత్సరాల పైబడి కారాగార శిక్ష విధించిన సందర్భాలలో వచ్చే అప్పీళ్ళను హైకోర్టు విచారణకు స్వీకరిస్తుంది. అలాగే మరణ శిక్ష విధించిన జిల్లా సెషన్స్ కోర్టు తీర్పులన్నీ హైకోర్టు పరిశీలనకు, అంతిమ ఆమోదం కొరకు నివేదించబడతాయి.

AP Inter 2nd Year Civics Study Material Chapter 8 రాష్ట్ర న్యాయశాఖ

ప్రశ్న 3.
హైకోర్టు పాలన విధులను వివరించండి.
జవాబు:
హైకోర్టు తన ప్రాదేశిక పరిధిలో కొన్ని పాలనా సంబంధమైన విధులను నిర్వహిస్తుంది. అవి:
ఎ) 227వ ప్రకరణను అనుసరించి హైకోర్టు రాష్ట్రంలోని అన్ని న్యాయస్థానాలు, ట్రిబునల్స్పై (మిలిటరీ కోర్టులు మినహా) పర్యవేక్షణాధికారాన్ని కలిగి ఉంటుంది.

బి) దిగువ కోర్టులు సమర్థవంతంగా పనిచేయడానికి అవసరమైన నియమ నిబంధనలను రూపొందించడంలో కీలక పాత్ర వహిస్తుంది.

సి) రాజ్యాంగంలోని 228వ ప్రకరణ ప్రకారం హైకోర్టు కొన్ని ప్రత్యేక పరిస్థితులలో కేసులను ఒక కోర్టు నుండి మరొక కోర్టుకు బదిలీ చేస్తుంది.

డి) దిగువ న్యాయస్థానాల రికార్డులను, సంబంధిత పత్రాలను తనిఖీ చేసే అధికారం హైకోర్టుకు కలదు.

ఇ) హైకోర్టు తన పరిధిలోని పాలనాపరమైన ఉద్యోగులను నియమించి వారి జీతభత్యాలను నిర్ణయించే అధికారంతో పాటు దిగువ న్యాయస్థానాలలోని ఉద్యోగుల సర్వీసు నిబంధనలను రూపొందించే అధికారాన్ని కలిగి ఉంటుంది.

ఎఫ్) రాజ్యాంగ వ్యాఖ్యానానికి సంబంధించిన ఎటువంటి వివాదంపై విచారణ కొనసాగించేందుకు లేదా నిలిపివేసేందుకు అధికారాన్ని కలిగి ఉంటుంది.

జి) రాష్ట్రంలో హైకోర్టు అత్యున్నత న్యాయ వ్యవస్థ. రాష్ట్రంలోని అన్ని కోర్టులు, ట్రిబునల్స్ (మిలటరీ కోర్టులు మినహా) హైకోర్టు ప్రత్యక్ష పర్యవేక్షణ, నియంత్రణలో పనిచేస్తాయి.

ప్రశ్న 4.
జిల్లా కోర్టు అధికార విధులను వివరించండి.
జవాబు:
భారతదేశంలో రాష్ట్ర న్యాయ వ్యవస్థలో హైకోర్టుకు దిగువన సబార్డినేట్ కోర్టులు లేదా జిల్లా కోర్టులు ఉంటాయి. జిల్లా స్థాయి న్యాయపాలనలో జిల్లాకోర్టులు ప్రధానమైన పాత్రను పోషిస్తాయి. జిల్లాకోర్టులో జిల్లా జడ్జి, ఇతర జడ్జిలు ఉంటారు. వారు జిల్లాస్థాయిలోను, పట్టణ, మేజర్ పంచాయితీల స్థాయిలో అనేక కర్తవ్యాలను, బాధ్యతలను నిర్వహిస్తూ సివిల్, క్రిమినల్ కేసులను విచారిస్తారు. జిల్లా కోర్టులు పాలనా వ్యవహారాలలో రాష్ట్ర ప్రభుత్వ అధికారానికి, నియంత్రణకు లోబడి పనిచేస్తాయి. న్యాయ విషయాలలో హైకోర్టుకు లోబడి పనిచేస్తాయి.

రాష్ట్రంలో రెండు రకాల సబార్డినేట్ కోర్టులుంటాయి. అవి: 1) సివిల్ కోర్టులు 2) క్రిమినల్ కోర్టులు

1) సివిల్ కోర్టులు: సివిల్ సంబంధమైన వివాదంతో ముడిపడిన వివాహాలు, విడాకులు, వారసత్వం, వ్యాపారం మొదలగు సివిల్ కేసులను సివిల్ కోర్టులు విచారణకు స్వీకరిస్తాయి. జిల్లా అంతటికి జిల్లా కోర్టుంటుంది. జిల్లా జడ్జి సివిల్ కోర్టుకు అధిపతిగా వ్యవహరిస్తారు. జిల్లాలోని అన్ని సివిల్ కోర్టులపై జిల్లా జడ్జి నియంత్రణ, పర్యవేక్షణా అధికారాలను కలిగి ఉంటాడు. జిల్లా సివిల్ కోర్టుకు దిగువన సీనియర్ సివిల్ జడ్జి కోర్టులు ఉంటాయి. వీటితో పాటు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులు ఉంటాయి. సబార్డినేట్ కోర్టులలోని క్రింద పేర్కొన్న న్యాయాధికారులు ఉంటారు.

  1. ప్రిన్సిపల్ జిల్లా జడ్జి.
  2. కుటుంబ కోర్టు జడ్జి.
  3. యస్.సి & యస్. టి. చట్టం కోర్టు జడ్జి.
  4. సీనియర్ సివిల్ కోర్టు జడ్జి.
  5. జూనియర్ సివిల్ కోర్టు జడ్జి.

< 10 లక్షల అంతకు మించిన ఆస్థి విలువ కలిగిన వివాదాలపై ప్రిన్సిపల్ జిల్లాకోర్టు విచారణ జరిపి తీర్పునిస్తుంది. ప్రిన్సిపల్ జిల్లా జడ్జిని ప్రత్యక్ష భర్తీ విధానం లేదా పరోక్ష భర్తీ విధానం (పదోన్నతి) ద్వారా నియమించబడతారు.

జిల్లా జడ్జి కేడర్ కలిగిన న్యాయాధికారులు కుటుంబ కోర్టులకు న్యాయమూర్తులుగా వ్యవహరిస్తారు. ఈ కోర్టు హిందూ వివాహ చట్టానికి సంబంధించి విడాకులు, మధ్యంతర భరణం, పిల్లల సంరక్షణలకు సంబంధించిన కేసులను విచారిస్తుంది. షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగల వారి హక్కులను కాపాడటానికి యస్. సి & యస్. టి. చట్టాన్ని తు.చ. తప్పకుండా అమలు చేయుటకు జిల్లా మొత్తానికి ఒక న్యాయస్థానం ఉంటుంది.

సీనియర్ సివిల్ జడ్జి కోర్టులు లక్ష రూపాయలకు పైబడి పదిలక్షలలోపు ఆస్థి విలువ గల కేసులను విచారించి తీర్పునిస్తాయి. లక్ష రూపాయలలోపు ఆస్థివిలువ గల కేసులను జూనియర్ సివిల్ జడ్జి కోర్టు విచారించి తీర్పునిస్తుంది. స్థానిక న్యాయ వివాదాలను పరిష్కరించేందుకు జిల్లాలో క్రింది స్థాయిలో న్యాయ పంచాయితీలు, గ్రామ కచేరీలు, అదాలత్ పంచాయితీలు ఉంటాయి.

2) క్రిమినల్ కోర్టులు: జిల్లాలో సెషన్స్ కోర్టు అత్యున్నత క్రిమినల్ కోర్టు. క్రిమినల్ వివాదాలను జిల్లాస్థాయిలో విచారించేందుకు సెషన్స్ కోర్టు అత్యున్నత న్యాయస్థానంగా వ్యవహరిస్తుంది. ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లోని అంశాల ఆధారంగా సెషన్స్ జడ్జి తీర్పునిస్తాడు. జిల్లాస్థాయిలో క్రింద పేర్కొన్న న్యాయమూర్తులు క్రిమినల్ కేసులను విచారిస్తారు.

  1. జిల్లా సెషన్స్ జడ్జి.
  2. సీనియర్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి.
  3. జూనియర్ సివిల్ జడ్జి.
  4. స్పెషల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్.

ప్రిన్సిపల్ జిల్లా న్యాయమూర్తే జిల్లా సెషన్స్ జడ్జిగా వ్యవహరించి హత్య, మోటారు వాహనాల చట్ట ఉల్లంఘన కేసులను విచారించి, దోషులకు జీవిత ఖైదు లేదా మరణశిక్ష విధిస్తాడు. అయితే అటువంటి శిక్షలను హైకోర్టు ధృవీకరించాల్సి ఉంటుంది. సీనియర్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి కేసు స్వభావాన్ని బట్టి ఐదు నుండి ఏడు సంవత్సరాల వరకు కారాగార శిక్షను విధించవచ్చు.

AP Inter 2nd Year Civics Study Material Chapter 8 రాష్ట్ర న్యాయశాఖ

జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఏదైనా పట్టణములో ఉన్నట్లయితే ఆ కోర్టు సివిల్ మరియు క్రిమినల్ కోర్టుగా వ్యవహరించి సంబంధిత కేసులను విచారించి మూడు సంవత్సరాలలోపు కారాగార శిక్ష విధించవచ్చు. సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులు ఐదు వందల రూపాయల వరకు పెనాల్టీని లేదా ఒక సంవత్సరం కారాగార శిక్షను లేక రెండింటిని విధించవచ్చు.

స్పెషల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టును ప్రతి పట్టణములోను ఏర్పాటు చేయవచ్చు. ఇవి చిల్లర (పెట్టీ కేసులను విచారించి ఐదు వందల రూపాయలలోపు జరిమానా, ఆరునెలలోపు కారాగార శిక్షను విధించవచ్చు.

ప్రశ్న 5.
రాష్ట్ర అడ్వకేట్ జనరల్ అధికార విధులను గూర్చి చర్చించండి. [Mar. ’17]
జవాబు:
భారత యూనియన్లో ప్రతి రాష్ట్రంలో ఒక అడ్వకేట్ జనరల్ పదవి ఏర్పాటైంది. ఆ పదవి భారత అటార్నీ జనరల్ పదవిని పోలి ఉంటుంది. అందుచేత రాష్ట్ర అడ్వకేట్ జనరల్ భారత అటార్నీ జనరల్ నిర్వహించే విధులను కలిగి ఉంటాడు. అతడు రాష్ట్రంలో ఉన్నత న్యాయ అధికారిగా వ్యవహరిస్తారు.

నియామకం:
రాజ్యాంగంలోని 165వ ప్రకరణ అనుసరించి రాష్ట్ర అడ్వకేట్ జనరల్ను గవర్నరు నియమిస్తాడు. అడ్వకేట్ జనరల్ నియమించబడే వ్యక్తి ఈ క్రింది అర్హతలను కలిగి ఉండాలి.

  • భారత పౌరుడై ఉండాలి.
  • ఏదైనా న్యాయ వ్యవస్థలో ముఖ్య పదవిలో 10 సంవత్సరముల అనుభవం కలిగి వుండాలి. లేదా ఏదైనా హైకోర్టులో 10 సంవత్సరాల న్యాయవాదిగా పనిచేసియుండాలి.
  • హైకోర్టు న్యాయమూర్తిగా నియమింపబడుటకు కావలసిన అర్హతలను కలిగి ఉండవలెను.

అధికారాలు – విధులు:
రాష్ట్ర ప్రభుత్వ అత్యున్నత న్యాయాధికారి అయిన అడ్వకేట్ జనరల్ క్రింది విధులను నిర్వహిస్తాడు.

  1. గవర్నరు కోరిక మేరకు న్యాయపరమైన అంశాలపై రాష్ట్ర ప్రభుత్వానికి సలహాలిస్తాడు.
  2. న్యాయ సంబంధమైన ఇతర విధులను గవర్నరు కోరిక మేరకు నిర్వర్తిస్తాడు.
  3. రాజ్యాంగం నిర్దేశించిన విధులను నిర్వహిస్తాడు.
  4. తన బాధ్యతల నిర్వహణలో భాగంగా రాష్ట్రంలోని ఏ న్యాయ స్థానంలోనైనా అడ్వకేట్ జనరల్ రాష్ట్ర ప్రభుత్వం తరపున హాజరవుతాడు.
  5. రాష్ట్ర శాసనసభా కార్యక్రమాలలో పాల్గొని మాట్లాడే హక్కు అడ్వకేట్ జనరల్ కు కలదు. అయితే అతడికి సభలో బిల్లులపై ఓటింగ్ లో పాల్గొనే హక్కు మాత్రం లేదు.
  6. రాష్ట్ర శాసనసభ స్థాయీసంఘాల సమావేశాలకు హాజరవుతాడు.

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
హైకోర్టు జడ్జీల నియామకం. [Mar 17]
జవాబు:
సంబంధిత రాష్ట్ర గవర్నర్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సంప్రదించిన తరువాత భారత రాష్ట్రపతి రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని, ఇతర న్యాయమూర్తులను నియమిస్తాడు. అదేవిధంగా ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తులను నియమించేందుకు సంబంధిత రాష్ట్రాల గవర్నర్లను సంప్రదిస్తాడు.

ప్రశ్న 2.
హైకోర్టు జడ్జీల అర్హతలు.
జవాబు:

  1. భారతీయ పౌరుడై ఉండాలి. [Mar. 16]
  2. భారతదేశంలో కేంద్ర, రాష్ట్ర న్యాయ సర్వీసులలో కనీసం 10 సంవత్సరములు న్యాయాధికారిగా అనుభవం కలిగి ఉండాలి.
  3. రెండు కాని లేదా అంతకన్నా ఎక్కువ హైకోర్టులలో కాని 10 సంవత్సరాలు న్యాయవాదిగా అనుభవం

ప్రశ్న 3.
హైకోర్టు కోర్టు ఆఫ్ రికార్డు.
జవాబు:
రాష్ట్ర హైకోర్టు కోర్టు ఆఫ్ రికార్డుగా వ్యవహరిస్తుంది. వ్యక్తులుకాని, సంస్థలు కానీ కోర్టు ధిక్కారానికి పాల్పడితే, హైకోర్టు వారిని విచారించి శిక్షిస్తుంది. హైకోర్టు ఇచ్చిన తీర్పులు, వెలువరించిన నిర్ణయాలు రికార్డుల రూపంలో భద్రపరుస్తుంది. ఈ రికార్డు దిగువ న్యాయస్థానాలకు మార్గదర్శకంగా పనిచేస్తుంది.

AP Inter 2nd Year Civics Study Material Chapter 8 రాష్ట్ర న్యాయశాఖ

ప్రశ్న 4.
హైకోర్టు సలహా రూపక విధులు.
జవాబు:
హైకోర్టు న్యాయ సంబంధ విషయాలలో గవర్నర్కు సలహాలిస్తుంది. జిల్లా న్యాయమూర్తుల నియమకం, పదోన్నతి, బదిలీలు మొదలగు అంశాలలో కూడా సలహాలిస్తుంది. జిల్లా న్యాయస్థానాలలో జిల్లా జడ్జి మినహా ఇతర పదవులలో ఏర్పడే ఖాళీల భర్తీ విషయంలో రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమీషన్ తోపాటు, హైకోర్టు గవర్నర్కు సలహా ఇస్తుంది.

AP Inter 2nd Year Civics Study Material Chapter 7 రాష్ట్ర శాసననిర్మాణ శాఖ

Andhra Pradesh BIEAP AP Inter 2nd Year Civics Study Material 7th Lesson రాష్ట్ర శాసననిర్మాణ శాఖ Textbook Questions and Answers.

AP Inter 2nd Year Civics Study Material 7th Lesson రాష్ట్ర శాసననిర్మాణ శాఖ

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
విధానసభ నిర్మాణం, అధికారాలు, విధులను వివరించండి.
జవాబు:
రాష్ట్ర శాసననిర్మాణ శాఖలో దిగువ సభను విధానసభ అంటారు. విధానసభ సభ్యులను యం.యల్.ఎ. (Members of Legislative Assembly) లు అని అంటారు. భారత రాజ్యాంగంలోని 170వ ప్రకరణ ప్రకారం రాష్ట్ర విధానసభలో సభ్యుల సంఖ్య 500కు మించకుండా 60కి తగ్గకుండా ఉండాలి. విధానసభ సభ్యుల సంఖ్య ఆ రాష్ట్ర జనాభాపైన మరియు విస్తీర్ణం పైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి చిన్న రాష్ట్రాలైన గోవా, మిజోరామ్లలో 40 మంది, సిక్కింలో 32 మంది సభ్యులు ఉండుటకు అవకాశం కల్పించబడింది.

నిర్మాణం: ప్రతి రాష్ట్రంలోను విధానసభ సభ్యులు వయోజన ఓటర్లు ద్వారా ప్రాదేశిక నియోజక వర్గాల వారీగా ప్రత్యక్షంగా ఎన్నకోబడతారు. విధానసభలో ఆంగ్లో-ఇండియన్ వర్గానికి తగిన ప్రాతినిధ్యం లేదని రాష్ట్ర గవర్నరు భావించినపుడు ఆ వర్గానికి చెందిన ఒకరిని విధానసభ సభ్యునిగా నియమిస్తారు. విధానసభ నియోజక వర్గాల సంఖ్య రాష్ట్ర జనాభా నిష్పత్తికి తగిన విధంగా ఉంటుంది.

విధానసభలో కొన్ని స్థానాలు షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగల ప్రతినిధులకు కేటాయించబడినవి. దేశంలోని రాష్ట్రాలలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అత్యధికంగా 404 మంది శాసనసభ్యులను కలిగి ఉండగా, సిక్కింలాంటి చిన్న రాష్ట్రాలలో అతి తక్కువ 32 మంది సభ్యులను కలిగి ఉన్నది. రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ విధానసభ సభ్యుల సంఖ్య 175 మందిగా నిర్ణయించడమైంది.

సభ్యుల అర్హతలు: విధానసభ సభ్యుడిగా పోటీచేయు వారికి క్రింద పేర్కొన్న అర్హతలను కలిగి ఉండాలి.

  1. భారతీయ పౌరుడై ఉండాలి.
  2. 25 సంవత్సరాల వయస్సు నిండి ఉండాలి.
  3. పార్లమెంట్ నిర్ణయించిన ఇతర అర్హతలు కలిగి ఉండాలి.
  4. పార్లమెంట్, రాష్ట్ర శాసనసభలలో ఒక వ్యక్తి ఒకేసారి రెండింటిలో సభ్యుడిగా వుండరాదు.

పదవీకాలము: విధానసభ సాధారణ కాల పరిమితి 5 సంవత్సరాలు. అయితే 5 సంవత్సరాలకు ముందుగానే అర్థాంతరంగా రద్దుచేయవచ్చు. రాజ్యాంగం 356వ ప్రకరణ ప్రకారం రాష్ట్రపతి జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటించిన సందర్భంలో విధానసభ కాలపరిమితిని గరిష్టంగా ఒక సంవత్సరము పొడిగించవచ్చును. అత్యవసర పరిస్థితిని తొలగించిన ఆరు నెలలలోగా విధానసభకు ఎన్నికలు జరిపించాలి.

విధానసభ అధికారాలు – విధులు

ఎ) శాసన నిర్మాణ అధికారాలు విధులు: విధానసభ అనేది ప్రధానమైన శాసన రూపకల్పనా విభాగము. విధానసభకు రాష్ట్ర జాబితాలోని అన్ని అంశాలపై చట్టాలను రూపొందించేందుకు అధికారముంది. అంతేగాకుండా అది ఉమ్మడి జాబితాలోని అంశాలపై కూడా చట్టాలను రూపొందించవచ్చు. అయితే ఒకవేళ విధానసభ ఉమ్మడి జాబితాలోని అంశాలపై చట్టాలు రూపొందిస్తే ఆ చట్టం పార్లమెంటు రూపొందించిన చట్టాలకు భిన్నంగా ఉండకూడదు.

ఒకవేళ భిన్నంగా ఉన్నట్లయితే పార్లమెంటు రూపొందించిన చట్టం మాత్రమే అమలులో ఉంటుంది. విధానసభ సమావేశంలో లేని కాలంలో గవర్నరు జారీచేసే ఆర్డినెన్స్లను విధానసభ ఆమోదిస్తుంది.

బి) కార్యనిర్వాహక అధికారాలు విధులు: విధానసభకు రాష్ట్ర మంత్రిమండలిని నియంత్రించే అధికారం ఉంది. ముఖ్యమంత్రి నాయకత్వంలోని రాష్ట్ర మంత్రిమండలి విధానసభకు వ్యక్తిగతంగాను, సమిష్టిగాను బాధ్యత వహిస్తుంది. విధానసభ విశ్వాసం ఉన్నంతవరకే రాష్ట్ర మంత్రిమండలి అధికారంలో కొనసాగుతుంది. విధానసభ రాష్ట్ర మంత్రిమండలిని అనేక విధాలుగా నియంత్రిస్తుంది. అవి: సావధాన తీర్మానం, వాయిదా తీర్మానం, ప్రశ్నోత్తరాలు, అనుబంధ ప్రశ్నలు, కోత తీర్మానం, అవిశ్వాస తీర్మానం. ఈ సందర్భంలో విధానసభ, విధానపరిషత్ కంటే ఎక్కువ అధికారాలను చెలాయిస్తుంది.

సి) ఆర్థిక అధికారాలు – విధులు: విధానసభకు కొన్ని నిర్దిష్టమైన ఆర్థిక సంబంధమైన అధికారాలు ఉంటాయి. విత్త సంబంధమైన నిధులను కేటాయించడానికి, ఆమోదించడానికి దానికి అధికారమున్నది. విత్తం లేకుండా ప్రభుత్వం ఏ రకమయిన విధులను నిర్వహించలేదు. ఎందుకంటే పాలనాయంత్రాంగానికి విత్తం అనేది ఇంధనం వంటిది. ద్రవ్య సంబంధమైన బిల్లులను విధానసభలోనే ప్రవేశపెట్టాలి. విధానసభ ఆర్థిక బిల్లును తిరస్కరిస్తే మంత్రిమండలి రాజీనామా చేయాల్సి ఉంటుంది.

డి) రాజ్యాంగ సంబంధమైన అధికారాలు: రాజ్యాంగ సవరణ విషయంలో విధానసభ ద్వితీయ పాత్రను పోషిస్తుంది. రాజ్యాంగ సవరణ ప్రక్రియలో విధానసభ ఎటువంటి చొరవ చూపదు. అయినప్పటికీ ముఖ్యమైన రాజ్యాంగ సవరణలన్నింటికి సగానికిపైగా రాష్ట్రాల శాసనసభల ఆమోదం అవసరం. ఏదైనా ఒక రాష్ట్రం సరిహద్దులను మార్చవలసివస్తే పార్లమెంటు సంబంధిత విధానసభ అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకొని రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది.

ఇ) ఎన్నికల సంబంధమైన విధులు: విధానసభ సభ్యులు భారత రాష్ట్రపతి పదవికి జరిగే ఎన్నికలలో పాల్గొంటారు. సంబంధిత రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించే రాజ్యసభ సభ్యులను విధాన సభ సభ్యులు పరోక్ష ఎన్నిక పద్ధతిలో ఎన్నుకుంటారు. విధానపరిషత్తు సభ్యులలో 1/3వ వంతు సభ్యులను విధానసభ సభ్యులు ఎన్నుకొంటారు.
ఎఫ్) ఇతర విధులు: విధానసభ ప్రజాభిప్రాయాన్ని వ్యక్తీకరించే వేదికగా పనిచేస్తుంది. నూతనంగా ఎన్నుకోబడిన సభ్యులకు శిక్షణాసంస్థగా వ్యవహరిస్తుంది. రాష్ట్రంలో విధానపరిషత్తు ఏర్పాటు చేయుటకు లేదా రద్దుచేయుటకు ఒక తీర్మానం ద్వారా పార్లమెంటుకు నివేదిస్తుంది.

ప్రశ్న 2.
విధానపరిషత్తు నిర్మాణం, అధికారాలు, విధులను క్లుప్తముగా రాయండి.
జవాబు:
విధానపరిషత్తు లేదా విధానమండలి అనేది రాష్ట్ర శాసన నిర్మాణ శాఖలో ఎగువ సభ. విధానపరిషత్తు సభ్యులను యం.యల్.సి. (మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్)లు అంటారు. భారతదేశంలో ఏడు రాష్ట్రాలలో విధాన పరిషత్తులు ఉన్నాయి. విధానపరిషత్తు సభ్యుల సంఖ్య కనీసం 40 మందికి తగ్గకుండా, విధానసభ సభ్యులు సంఖ్యలో 1/3వ వంతుకు మించకుండా ఉండాలి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ విధానపరిషత్లో 58 మంది సభ్యులు ఉన్నారు. విధానపరిషత్ కొనసాగింపు విషయంలో విధాన సభ అభీష్టంతో పాటుగా పార్లమెంట్ సాధారణ మెజారీటీతో ఆమోదం తెలపాలి. సంబంధిత శాసనసభ తీర్మానం మేరకు విధానపరిషత్ ఏర్పాటుకు లేక తొలగింపు పార్లమెంట్ తన ఆమోదాన్ని తెలియజేస్తే విధానపరిషత్ ఏర్పాటు లేదా రద్దు అవుతుంది.

నిర్మాణం: విధానపరిషత్తులో కొందరు ఎన్నిక ద్వారా మరికొందరు నియామకం ద్వారా సభ్యత్వం పొందుతారు. వారు పరోక్ష ఎన్నిక ద్వారా నైష్పత్తిక ప్రాతినిధ్య ఓటు పద్ధతిద్వారా ఎన్నుకోబడతారు.

విధానపరిషత్ సభ్యులు ఐదు విధాలుగా ఎన్నుకోబడతారు.

  1. మొత్తం సభ్యులలో 1/3వ వంతు మంది సభ్యులను రాష్ట్రంలోని స్థానిక సంస్థలైన పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థలు, జిల్లాపరిషత్తులు మొదలగు సంస్థల ప్రతినిధులు ఎన్నుకొంటారు.
  2. 1/3వ వంతు మంది సభ్యులను విధానసభ సభ్యులు ఎన్నుకొంటారు.
  3. 1/12వ వంతు మంది సభ్యులను రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాల పట్టభద్రులు ఎన్నుకొంటారు.
  4. 1/12వ వంతు మంది సభ్యులను రాష్ట్రంలోని సెకండరీ పాఠశాల స్థాయికి తగ్గకుండా కనీసం మూడేళ్ళపాటు పనిచేసిన ఉపాధ్యాయులు ఎన్నుకొంటారు.
  5. మిగిలిన 1/6 వంతు మంది సభ్యులను సాహిత్యం, కళలు, సహకారోద్యమం, సామాజిక సేవలకు సంబంధించి ప్రత్యేక పరిజ్ఞానం కలవారిని గవర్నర్ నియామకం చేస్తాడు.

సభ్యుల అర్హతలు: విధానపరిషత్తు సభ్యునిగా పోటీ చేయుటకు ఈ దిగువ తెలిపిన అర్హతలు కలిగి ఉండవలెను.

  • భారత పౌరుడై ఉండవలెను.
  • 30 సం||ల వయస్సు నిండి యుండాలి.
  • పార్లమెంటు చట్టం ద్వారా నిర్ణయించే ఇతర అర్హతలు కలిగి ఉండాలి.

పదవీకాలం: విధానపరిషత్తు శాశ్వత సభ. అయితే మొత్తం సభ్యులలో 1/3వ వంతు సభ్యులు ప్రతి రెండు సంవత్సరములకు ఒకసారి పదవీ విరమణ చేస్తారు. ఇది శాశ్వతసభ కాబట్టి పదవీ విరమణ చేసిన సభ్యుల స్థానంలో నూతన సభ్యులు ఎన్నుకోబడతారు. ఒక్కొక్క సభ్యుడి పదవీకాలం 6 సం॥లు. సంవత్సరానికి కనీసం రెండుసార్లు ఈ సభ సమావేశమౌతుంది.

విధానపరిషత్తు అధికారాలు విధులు

ఎ) శాసన నిర్మాణ అధికారాలు విధులు: రాష్ట్ర విధానసభతో పోల్చినప్పుడు విధానపరిషత్తుకు తక్కువ అధికారాలు ఉంటాయి. విధానపరిషత్తు అధికారాలు హుందాతనంతో కూడుకున్నట్టివి మాత్రమే. సాధారణ బిల్లులను విధానపరిషత్తులో కూడా ముందుగా ప్రవేశపెట్టవచ్చును. ఉభయ సభల ఆమోదంతోనే అటువంటి బిల్లులను గవర్నర్ | ఆమోదం కొరకు పంపుతారు. విధానసభ ఆమోదించిన సాధారణ బిల్లులను విధానపరిషత్తు తిరస్కరించడానికి లేదా | పునఃపరిశీలనకు పంపడానికి అధికారం కలదు.

బి) కార్యనిర్వాహక అధికారాలు విధులు: విధానసభ అధికారాలతో పోలిస్తే విధానపరిషత్తుకు పరిమితమైన కార్యనిర్వాహక అధికారాలు ఉంటాయి. ముఖ్యమంత్రి నాయకత్వంలోని రాష్ట్ర మంత్రిమండలి విధానసభకే బాధ్యత వహిస్తుంది. విధానపరిషత్తు మంత్రిమండలి భవిష్యత్తును నిర్ధారించలేదు. అయినప్పటికీ ప్రభుత్వ విధానాలు, కార్యక్రమాలను ప్రశ్నలు, అనుబంధ ప్రశ్నలు, సావధాన తీర్మానం ద్వారా అది మంత్రిమండలిని ప్రభావితం చేస్తుంది కాని మంత్రిమండలిని పదవి నుండి తొలగించే అధికారం మాత్రం విధానపరిషత్తుకు లేదు.

సి) ఆర్థిక అధికారాలు విధులు: ఆర్థికాధికారాల విషయంలో విధానపరిషత్తుకు పరిమితమైన అధికారాలు మాత్రమే ఉంటాయి. ఆర్థిక బిల్లులను విధానపరిషత్తులో ముందుగా ప్రవేశపెట్టకూడదు. ఆర్థిక బిల్లులను తిరస్కరించే అధికారం విధానపరిషత్తుకు లేదు. విధానసభ ఆమోదించిన ఆర్థిక బిల్లులను 14 రోజుల వ్యవధిలోగా విధానపరిషత్తు ఆమోదించాల్సి ఉంటుంది.

డి) ఎన్నికల సంబంధమైన విధులు: విధానపరిషత్తు సభా కార్యక్రమాలను హుందాగా నిర్వహించేందుకు తమలో ఒకరిని చైర్మన్గాను, వేరొకరిని డిప్యూటీ చైర్మన్ గానూ ఎన్నుకొంటుంది. సభా సంఘాలైన ప్రభుత్వ ఖాతాల సంఘం, ప్రభుత్వరంగ సంస్థల సంఘాల సభ్యులను ఎన్నుకుంటుంది.

ఇ) ఇతర విధులు: ప్రజాభిప్రాయాన్ని సేకరించి, సంఘటిత పరచి వ్యక్తీకరించేందుకు విధానపరిషత్తు ఒక వేదికగా పనిచేస్తుంది. కళలు, సాహిత్యం, సామాజిక సేవ మరియు సహకారోద్యమంకు చెందిన వివిధ రంగాల ప్రముఖులకు సభ్యత్వం కల్పించడం ద్వారా విధానపరిషత్తు శాసన నిర్మాణంలో వారి సేవలను వినియోగించుకొంటుంది.

ప్రశ్న 3.
విధానసభ స్పీకరు బాధ్యతలను, పాత్రను వివరించండి.
జవాబు:
సభా కార్యక్రమాల నిర్వహణ కొరకు విధానసభ సభ్యులు తమలో ఒకరిని స్పీకరుగా ఎన్నుకొంటారు. స్పీకరు పదవీకాలం 5 సంవత్సరములు.

విధానసభ స్పీకరు అధికారాలు – విధులు: విధానసభ స్పీకరు అధికారాలు – విధులు లోక్సభ స్పీకరు యొక్క అధికారాలు విధులను పోలిఉంటాయి. స్పీకరు అధికారాలు విధులు ఈ క్రింది విధముగా వివరింపవచ్చు.

  1. స్పీకరు విధానసభ సమావేశాలకు అధ్యక్షత వహిస్తాడు. సభా కార్యక్రమాలను అత్యంత హుందాగా, ప్రశాంతంగా, సమర్థవంతంగా నిర్వహిస్తాడు.
  2. సభా కార్యక్రమాల నిర్వహణలో వివిధ అంశాలపై చర్చించుటకు తగిన సమయాన్ని కేటాయిస్తాడు.
  3. సభలో నియమ నిబంధనల గూర్చి వివరిస్తాడు.
  4. వివిధ బిల్లులపై ఓటింగ్ నిర్వహించి ఫలితాలు ప్రకటిస్తాడు.
  5. ఏదైనా ఒక బిల్లు ఆమోదం విషయంలో ప్రతిష్టంబన ఏర్పడితే, తన నిర్ణాయక ఓటు (కాస్టింగ్ ఓటు)ను వినియోగించి బిల్లు భవితవ్యాన్ని నిర్ణయిస్తాడు.
  6. బిల్లులపై చర్చ సందర్భంగా అనేక తీర్మానాలను, పాయింట్ ఆఫ్ అర్డర్లను ప్రతిపాదించడానికి సభ్యులకు అనుమతినిస్తాడు.
  7. కోరమ్లోని సందర్భంలో సభా కార్యక్రమాలను వాయిదా వేస్తాడు.
  8. సభలో సభ్యుల గౌరవానికి భంగం కలిగించే అనుచిత వ్యాఖ్యలను రికార్డుల నుండి తొలగిస్తాడు.
  9. సభలో సభ్యులు ప్రసంగించేందుకు అవకాశం కల్పిస్తాడు.
  10. సభా కార్యక్రమాల నిర్వహణకు భంగం కలిగించే సభ్యులను సభనుండి బయటకు వెళ్ళమని ఆదేశిస్తాడు.
  11. సభలో గందరగోళ పరిస్థితులు ఏర్పడినప్పుడు సభను వాయిదావేసే అధికారం స్పీకరుకు ఉంటుంది.
  12. సభ్యుల రాజీనామాలను ఆమోదించుటకు లేదా తిరస్కరించుటకు స్పీకరుకు అధికారముంది. ఒకవేళ రాజీనామాలను ఆమోదించదలచుకుంటే, అవి నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయో లేదో పరిశీలిస్తారు.
  13. శాసనసభా కమిటీల ఛైర్మన్లను నియమించి వాటి పనితీరును పర్యవేక్షిస్తాడు. శాసనసభ వ్యవహారాల కమిటీ, రూల్స్ కమిటీ, సాధారణ ప్రయోజన కమిటీలకు ఛైర్మన్ గా వ్యవహరిస్తాడు.
  14. సభలో ప్రవేశపెట్టే బిల్లు సాధారణ బిల్లా ? లేక ఆర్థిక బిల్లా ? అని నిర్ణయించడంలో అంతిమ నిర్ణయాధికారాన్ని కలిగి ఉంటాడు.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
విధానసభ గురించి క్లుప్తంగా తెలపండి.
జవాబు:
రాజ్యాంగంలో 6వ భాగం 3వ అధ్యాయంలో రాష్ట్ర శాసన నిర్మాణశాఖను గురించి పేర్కొనబడింది. రాష్ట్ర శాసన నిర్మాణ శాఖ గవర్నర్, రెండు సభలు లేదా ఒక సభతో కూడి ఉండును. విధానసభనే శాసనసభ అని కూడా అంటారు. రెండు సభలుంటే ఒకటి విధానసభ, రెండవది విధాన పరిషత్తు.

విధానసభ లేదా శాసనసభ నిర్మాణము:
సభ్యుల సంఖ్య: విధానసభ ప్రజాప్రతినిధుల సభ. రాష్ట్ర శాసనసభలో ఇది దిగువసభ. దీని సభ్యుల సంఖ్య 500కి మించరాదు. 60కి తగ్గకూడదు. ఈ సభలోని సభ్యులను వయోజనులైన ఓటర్లు ఎన్నుకుంటారు. ఒక ఆంగ్లో – ఇండియన్ సభ్యుడిని అవసరమని భావిస్తే గవర్నర్ నామినేట్ చేస్తాడు. విధానసభ సభ్యులను M.L.A. లు (మెంబర్ ఆఫ్ ది లెజిస్లేటివ్ అసెంబ్లీ) అని అంటారు.

సభ్యుల అర్హతలు: విధానసభ సభ్యులు 1) భారతీయ పౌరులై ఉండాలి. 2) 25 సం||ల వయస్సు నిండినవారై ఉండాలి. 3) ఆదాయాన్నిచ్చే ప్రభుత్వ ఉద్యోగంగాని, లాభసాటి వ్యాపారం గాని చేయకూడనివారై ఉండాలి.

సభ్యుల పదవీకాలం: విధానసభ సభ్యుల పదవీకాలం 5 సంవత్సరాలు. ముఖ్యమంత్రి సలహాపై గవర్నర్ కాలపరిమితికి ముందే రద్దు చేయవచ్చు.

సభాపతి – ఉపసభాపతి (స్పీకర్ అండ్ డిప్యూటీ స్పీకర్): విధానసభ సభ్యులు తమలో ఒకరిని సభాపతిగాను, మరొకరిని ఉపసభాపతిగాను ఎన్నుకుంటారు. వీరు సభా కార్యక్రమాలు నిర్వహిస్తారు.

ప్రశ్న 2.
అంచనాల కమిటీ గురించి రాయండి.
జవాబు:
విధానసభ నియమనిబంధనలు, సభావ్యవహారాల నిర్వహణ ప్రకారం అంచనాల కమిటీలో 20 మంది సభ్యులుంటారు. వీరిలో విధానసభ నుండి 15 మంది, విధానపరిషత్తు నుండి 5గురు సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తారు. సభ్యుల పదవీకాలం ఒక సంవత్సరము. వీరు పరోక్ష ఎన్నిక ద్వారా ఎన్నుకోబడతారు. ఈ కమిటీ చైర్మన న్ను స్పీకరు నియమిస్తాడు. అధికార పక్షానికి చెందిన సభ్యుడు చైర్మన్ గా నియమించబడుతారు.

అంచనాల కమిటీ విధులు: అంచనాల కమిటీ విధులు లోక్సభ అంచనాల కమిటీ విధులను పోలివుంటాయి. అవి:

  1. ప్రభుత్వ వ్యయాన్ని నియంత్రించడం.
  2. ప్రభుత్వ అంచనాల విషయంలో విత్త సంస్కరణలను, పరిపాలనా సామర్థ్యం పెంపుదలకు తగిన సూచనలను అందించడం.
  3. ప్రభుత్వ పాలనా సామర్థ్యాన్ని, ఆదాను పెంపొందించడానికి ప్రత్యామ్నాయ విధానాలను సూచించడం.
  4. విధానాల పరిధిలో వివిధ మంత్రిత్వ శాఖల అంచనాల పరిధిని పరీక్షించడం.
  5. విధానసభకు అంచనాలను సమర్పించే పద్ధతిపై సలహాలివ్వడం.

ప్రశ్న 3.
ప్రభుత్వ ఖాతాల కమిటీ గురించి నీకేమి తెలియును ? [Mar. ’17]
జవాబు:
ఈ కమిటీలో 20 మంది సభ్యులు ఉంటారు. వారిలో 15 మంది విధానసభ సభ్యులు, 5గురు విధానపరిషత్తు సభ్యులు. వారు నైష్పత్తిక ప్రాతినిధ్య ఓటు ద్వారా ఒక సంవత్సర పదవీకాలానికి ఎన్నుకోబడతారు. ప్రభుత్వ ఖాతాల |కమిటీ చైర్మన్ గా ప్రతిపక్ష పార్టీకి చెందిన సభ్యుడు స్పీకర్చే నియమింపబడతాడు. ఈ కమిటీలో మంత్రులు సభ్యులుగా
ఉండరాదు.

ప్రభుత్వ ఖాతాల కమిటీ విధులు:
ప్రభుత్వ ఖాతాల కమిటీ ఈ క్రింది విధులను నిర్వర్తిస్తుంది.

  1. ఈ కమిటీ ప్రభుత్వ ఖాతాలను పరిశీలించి ఆయా శాఖలకు బడ్జెట్ ద్వారా కేటాయించిన నిధులు సక్రమంగా వినియోగించినది, లేనిది నిర్ధారిస్తుంది.
  2. కంప్టోలర్ & ఆడిటర్ జనరల్ సమర్పించిన వార్షిక నివేదికలోని అంశాలను, రాష్ట్ర ప్రభుత్వ ఉపకల్పనా ఖాతాలను తనిఖీ చేయడం.
  3. ఈ కమిటీ ప్రభుత్వ ఖాతాల నిర్వహణలో ఏవైనా లోపాలు ఉన్నట్లయితే వాటిని విధానసభ దృష్టికి తెస్తుంది.
  4. రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలు, ఆదాయ వ్యయాలు, లాభనష్టాలకు సంబంధించిన అంశాలను పరిశీలిస్తుంది.
  5. ప్రభుత్వ ఖాతాలు మరియు తనిఖీ పద్ధతులు ప్రక్రియలకు సంబంధించిన అంశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తుంది.
  6. వివిధ శాఖలు చేసిన వ్యయాన్ని, విధానాల అమలుకు సంబంధించిన విషయాలను దర్యాప్తు చేస్తుంది.

ప్రశ్న 4.
విధానసభ స్పీకరుకు గల అధికారాలు – విధులను తెలపండి. [Mar. ’16]
జవాబు:

  1. స్పీకరు విధానసభ సమావేశాలకు అధ్యక్షత వహిస్తాడు. సభా కార్యక్రమాలను అత్యంత హుందాగా, ప్రశాంతంగా, సమర్థవంతంగా నిర్వహిస్తాడు.
  2. సభా కార్యక్రమాల నిర్వహణలో వివిధ అంశాలపై చర్చించుటకు తగిన సమయాన్ని కేటాయిస్తాడు.
  3. సభలో నియమనిబంధనల గూర్చి వివరిస్తాడు.
  4. వివిధ బిల్లులపై ఓటింగ్ నిర్వహించి ఫలితాలు ప్రకటిస్తాడు.
  5. ఏదైనా ఒక బిల్లు ఆమోదం విషయంలో ప్రతిష్టంభన ఏర్పడితే, తన నిర్ణాయక ఓటు (కాస్టింగ్ ఓటు)ను వినియోగించి బిల్లు భవితవ్యాన్ని నిర్ణయిస్తాడు.
  6. బిల్లులపై చర్చ సందర్భంగా అనేక తీర్మానాలను, పాయింట్ ఆఫ్ ఆర్డర్లను ప్రతిపాదించడానికి సభ్యులకు అనుమతినిస్తాడు.
  7. కోరమ్లని సందర్భంలో సభా కార్యక్రమాలను వాయిదా వేస్తాడు.
  8. సభలో సభ్యుల గౌరవానికి భంగం కలిగించే అనుచిత వ్యాఖ్యలను రికార్డులనుండి తొలగిస్తాడు.
  9. సభలో సభ్యులు ప్రసంగించేందుకు అవకాశం కల్పిస్తాడు.

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
విధానసభ సభ్యుడి అర్హతలు.
జవాబు:

  1. భారతీయ పౌరుడై ఉండాలి.
  2. 25 సంవత్సరముల వయస్సు నిండి ఉండాలి.
  3. పార్లమెంటు నిర్ణయించిన ఇతర అర్హతలు కలిగి ఉండాలి.
  4. పార్లమెంటు, రాష్ట్రశాసన సభలలో ఒక వ్యక్తి ఒకేసారి రెండింటిలో సభ్యుడిగా ఉండరాదు.

ప్రశ్న 2.
విధానపరిషత్తు సభ్యుడి అర్హతలు.
జవాబు:

  1. భారతీయ పౌరుడై ఉండాలి.
  2. 30 సంవత్సరాల వయస్సు నిండి ఉండాలి.
  3. పార్లమెంటు చట్టం ద్వారా నిర్ణయించే ఇతర అర్హతలు కలిగి ఉండాలి.

ప్రశ్న 3.
కోరమ్. [Mar. ’17]
జవాబు:
విధానసభ కార్యక్రమాల నిర్వహణకు హాజరు కావలసిన కనీస సభ్యుల సంఖ్యను కోరమ్ అంటారు. భారత రాజ్యాంగంలోని 188వ ప్రకరణ ప్రకారం విధానసభ కోరమ్ సభ్యుల సంఖ్య 1/10వ వంతు.

ప్రశ్న 4.
రాష్ట్ర శాసనసభ్యుల జీతభత్యాలు.
జవాబు:
ఆంధ్రప్రదేశ్ విధానసభ సభ్యులు ఒక్కొక్కరు నెలకు 90,000/-ల జీతభత్యాలను పొందుతారు. అందులో వేతనం 15,000/-లు, నియోజకవర్గ అలవెన్సుగా 75,000/- లు చెల్లించబడతాయి. రాష్ట్రప్రభుత్వం నివాస వసతి కల్పించకపోతే అందుకుగాను ఇంటి అద్దె అలవెన్సుగా నెలకు 10,000/-లు చెల్లించటం జరుగుతుంది. శాసనసభ సమావేశాలకు హాజరైన సభ్యులకు రోజుకు 3 800/-లు దినసరిభత్యం ఇవ్వబడుతుంది.

ప్రశ్న 5.
రాష్ట్రశాసన సభ విశేషాధికారాలు.
జవాబు:
విధానసభ సభ్యులకు విధి నిర్వహణలో కల్పించిన ప్రత్యేక హక్కులే వారికి విశేషాధికారాల రూపంలో ఉంటాయి. ఈ అధికారాలు లేకుంటే విధానసభ హుందాగా, గౌరవప్రదంగా నిర్వహించబడదు. విశేషాధికారాలు రెండు రకాలు. అవి. 1. సమిష్టి విశేషాధికారాలు. 2. వ్యక్తిగత విశేషాధికారాలు. శాసనసభ్యుల ప్రసంగాలు, చర్చలను ఇతరులు ప్రచురించకుండా నిరోధించే హక్కును కల్గి ఉంటారు. శాసన సభ సమావేశాలకు 40 రోజుల ముందు గానీ సమావేశాలనంతరం 40 రోజుల వరకు గానీ సభ్యులను అరెస్టు చేయరాదు.

ప్రశ్న 6.
ఆంధ్రప్రదేశ్ శాసనసభ సంక్షిప్త చరిత్ర. [Mar. ’17]
జవాబు:
ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుండి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో వున్న 13 జిల్లాల ప్రాంతం కర్నూలు రాజధానిగా 1953 సంవత్సరం అక్టోబరు 1వ తేదీన ఆంధ్రరాష్ట్రం అవతరించింది. అప్పుడు ఆంధ్రరాష్ట్ర శాసనసభలో 140 మంది సభ్యులు ఉన్నారు. 1956 నవంబరు 1వ తేదీన ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ శాసనసభలో 245 మంది సభ్యులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం ఆంధ్రప్రదేశ్ను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలుగా 2014 జూన్ 2వ తేదీన విభజించడమైంది.

ప్రశ్న 7.
విధానపరిషత్తు చైర్మన్. [Mar, ’16]
జవాబు:
విధాన పరిషత్తు సమావేశాలను నిర్వహించటానికి ఒక చైర్మన్ మరియు ఒక డిప్యూటీ చైర్మన్ ఉంటారు. విధాన పరిషత్ చైర్మన్ అధికారాలు విధానసభ స్పీకర్ అధికారాలతో పోలి ఉంటాయి. కాని ఏది ఆర్థిక బిల్లో ? ఏది సాధారణ బిల్లో నిర్ణయించే విశిష్ట అధికారం స్పీకరు కల్గి ఉన్నాను. చైర్మన్కు ఆ అధికారం లేదు.

ప్రశ్న 8.
డిప్యూటీ స్పీకర్.
జవాబు:
సభ కార్యక్రమాల నిర్వహణకు విధానసభ సభ్యులు తమలో ఒకరిని స్పీకరుగాను మరొకరిని డిప్యూటీ స్పీకర్గాను ఎన్నుకొంటారు. స్పీకర్ సమావేశాలకు హాజరుగాని సమయంలో డిప్యూటీ స్పీకర్ సభా కార్యక్రమాలు నిర్వహిస్తాడు. ఇటువంటి సందర్భంలో స్పీకర్ అధికారాలన్ని డిప్యూటీ స్పీకరుకు వర్తిస్తాయి.

ప్రశ్న 9.
విధానపరిషత్తు డిప్యూటీ చైర్మన్.
జవాబు:
విధానపరిషత్తు సమావేశాలను నిర్వహించటానికి సభలోని సభ్యులు తమలో నుంచి ఒకరిని చైర్మన్గాను మరొకరిని డిప్యూటీ చైర్మన్ గాను ఎన్నుకొంటారు. చైర్మన్ పదవి ఖాళీ అయిన సందర్భంలోనూ, లేక చైర్మన్ సభకు హాజరు కాని సమయంలోను డిప్యూటీ చైర్మన్ సభా కార్యక్రమాలను నిర్వహిస్తారు.

ప్రశ్న 10.
కమిటీల రకాలు.
జవాబు:
రాజ్యాంగ నిర్మాతల ఆశయాలకనుగుణంగా పార్లమెంటు, రాష్ట్ర శాసనసభలలో వివిధ రకాల కార్యక్రమాల నిర్వహణ కొరకు కమిటీలు ఏర్పడినాయి. స్థూలంగా కమిటీలు రెండు రకాలు. అవి:

  1. స్థాయి సంఘాలు.
  2. తాత్కాలిక సంఘాలు.

AP Inter 2nd Year Civics Study Material Chapter 6 రాష్ట్ర కార్యనిర్వాహక శాఖ

Andhra Pradesh BIEAP AP Inter 2nd Year Civics Study Material 6th Lesson రాష్ట్ర కార్యనిర్వాహక శాఖ Textbook Questions and Answers.

AP Inter 2nd Year Civics Study Material 6th Lesson రాష్ట్ర కార్యనిర్వాహక శాఖ

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
రాష్ట్ర గవర్నర్ అధికారాలు – విధులను చర్చించండి.
జవాబు:
గవర్నర్ రాజ్యాంగం ఏర్పాటు చేసిన రాష్ట్ర అధినేత. అతను రాజ్యాంగం యొక్క ప్రతినిధి. కేంద్ర ప్రభుత్వ నియమితుడు. మన రాజ్యాంగం రాష్ట్ర స్థాయిలో గవర్నర్ పదవికి అవకాశం కల్పించింది. ప్రతి రాష్ట్రానికి ఒక గవర్నర్ ఉండాలని రాజ్యాంగంలోని 153వ ప్రకరణ తెలుపుతున్నది. అయితే రాజ్యాంగ (7వ సవరణ) చట్టం, 1956 ఒక వ్యక్తిని రెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు గవర్నర్ నియమించడానికి వీలు కల్పించింది. ఈ చట్టం ప్రకారమే ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఒకే వ్యక్తి గవర్నర్ గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం బీహార్ – పశ్చిమ బెంగాల్, మణిపూర్ – మేఘాలయ, త్రిపుర – నాగాలాండ్ రాష్ట్రాలకు కూడా ఉమ్మడి గవర్నర్లు ఉన్నారు.

అర్హతలు: రాజ్యాంగంలోని 157వ ప్రకరణ ప్రకారం గవర్నర్ గా నియమింపబడే వ్యక్తికి క్రింది పేర్కొన్న అర్హతలు ఉండాలి.

  1. భారతీయ పౌరుడై ఉండాలి.
  2. 35 సంవత్సరాల వయసు నిండి ఉండాలి.

అలాగే గవర్నర్గా నియమితుడయ్యే వ్యక్తి 158వ ప్రకరణ ప్రకారం క్రింద తెలిపిన షరతులను నిర్దేశించింది.

  1. పార్లమెంట్లో ఏ సభలోనూ లేదా రాష్ట్ర శాసన నిర్మాణశాఖలోని ఏ సభలోనూ సభ్యుడై ఉండకూడదు.
  2. ఎటువంటి లాభదాయకమైన పదవిని నిర్వహించకూడదు.
  3. కోర్టు ద్వారా దివాళా తీసిన వ్యక్తిగా ప్రకటింపబడి ఉండకూడదు.

AP Inter 2nd Year Civics Study Material Chapter 6 రాష్ట్ర కార్యనిర్వాహక శాఖ

నియామకం : రాజ్యాంగ ప్రకరణ 155 ప్రకారం రాష్ట్రపతి ప్రధానమంత్రి సలహా ప్రకారం గవర్నర్ను నియమిస్తాడు. గవర్నర్ నియామక విషయంలో రాష్ట్రపతి క్రింది రెండు సంప్రదాయాలను పాటిస్తాడు.

  1. సంబంధిత రాష్ట్ర ముఖ్యమంత్రితో సంప్రదించడం.
  2. సంబంధిత రాష్ట్రానికి చెందని ప్రముఖ వ్యక్తిని గవర్నర్ గా నియమించడం.

జీతభత్యములు:- ప్రస్తుతం గవర్నర్కు నెలకు రూ. 1,10,000 లు జీతం లభిస్తుంది. “రాజభవన్” అనే ఉచిత అధికార గృహంలో నివసిస్తాడు. వీటితోపాటు అనేక ఇతర భత్యాలు, సౌకర్యాలు, మినహాయింపులు గవర్నర్కు లభిస్తాయి. పదవీ ప్రమాణ స్వీకారం: రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవర్నర్ చేత పదవీ ప్రమాణ స్వీకారం చేయిస్తాడు.
పదవీకాలం: గవర్నర్ పదవిని స్వీకరించిన నాటినుండి 5 సంవత్సరాలు పదవిలో ఉండటం సాంప్రదాయం. అయితే రాష్ట్రపతి విశ్వాసాన్ని పొందినంతకాలం గవర్నర్ పదవిలో కొనసాగగలడు. వాస్తవానికి ఆచరణలో రాష్ట్రపతి విశ్వాసం అనేది ప్రధానమంత్రి అభిప్రాయంపైన ఆధారపడి ఉంటుంది. అంటే ప్రధానమంత్రి దృష్టిలో సదభిప్రాయం పొందినంతకాలం పదవిలో ఉండగలరు.

అధికారాలు – విధులు:
రాజ్యాంగం ప్రకారం గవర్నర్ రాజ్యాంగబద్ధమైన అధినేత. గవర్నర్ కొన్ని ముఖ్యమైన అధికారాలను, విధులను నిర్వర్తిస్తాడు. వాటిని క్రింది విధంగా పేర్కొనవచ్చు.

  1. కార్యనిర్వాహణ అధికారాలు విధులు
  2. శాసననిర్మాణ అధికారాలు – విధులు
  3. న్యాయాధికారాలు – విధులు
  4. ఆర్థికాధికారాలు – విధులు
  5. ఇతర అధికారాలు – విధులు
  6. వివేచనాధికారాలు

1) కార్యనిర్వాహణాధికారాలు – విధులు: రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాలను స్వయంగా సాగించడానికి అవసరమైన నియమ నిబంధనలను గవర్నర్ రూపొందిస్తాడు. అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ విధివిధానాలను సక్రమంగా నిర్వహించి అమలు చేయడానికి అనుకూలంగా రాష్ట్ర స్థాయిలో రాజ్యాంగ ఉన్నత పదవులలో కొన్నింటికి ప్రత్యక్షంగా నియామకాలు జరుపుతాడు. అందులో ముఖ్యమైనవి.

  1. గవర్నర్ ముఖ్యమంత్రిని నియమిస్తాడు. ముఖ్యమంత్రి సలహా మేరకు మంత్రులను నియమిస్తాడు.
  2. మంత్రులకు మంత్రిత్వ శాఖలను కేటాయించడం లేదా మంత్రివర్గ నిర్మాణంలో మార్పులు చేయడం, మంత్రుల శాఖలలో మార్పులు చేయడం వంటి విధులను నిర్వహిస్తాడు.
  3. ముఖ్యమంత్రి సూచనలపై మంత్రులను పదవుల నుండి తొలగిస్తాడు.
  4. రాష్ట్ర విశ్వ విద్యాలయాలకు ఉపకులపతులను నియమించడమే గాక కులపతిగా కూడా వ్యవహరిస్తాడు.
  5. రాష్ట్ర ముఖ్య కార్యదర్శి మరియు అడ్వకేట్ జనరల్ను నియమిస్తాడు.

2) శాసననిర్మాణ అధికారాలు విధులు: గవర్నర్ రాష్ట్ర శాసనసభలో సభ్యుడు కాదు. కాని అందులో ఒక అంతర్భాగంగా 168వ ప్రకరణ వర్ణిస్తుంది. ఆ స్థాయిలో శాసన నిర్మాణశాఖకు సంబంధించిన కొన్ని విధులను, అధికారాలను గవర్నర్ నిర్వహిస్తాడు.

  1. విధానసభ సాధారణ ఎన్నికల తరువాత మొదటి సమావేశాన్ని ఆవిష్కరిస్తాడు.
  2. విధానసభ మొదటి సమావేశానికి (బడ్జెట్ సమావేశం) ప్రారంభ ఉపన్యాసం చేస్తాడు.
  3. విధానసభకు సాధారణ ఎన్నికల అనంతరం ప్రొటెం స్పీకర్ను నియమించి, స్పీకర్ ఎన్నికకు మార్గం సుగమం చేస్తాడు.
  4. శాసన నిర్మాణశాఖలోని సభా సమావేశాలకు ఆదేశించడం లేదా వాయిదా వేసే అధికారం గవర్నర్కు కలదు.

3) న్యాయాధికారాలు విధులు: రాష్ట్ర గవర్నరు న్యాయ సంబంధమైన కొన్ని ముఖ్య అధికార విధులను నిర్వర్తిస్తాడు.

  1. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, న్యాయమూర్తుల నియామక ప్రక్రియలో రాష్ట్రపతి కోరినచో సలహా ఇస్తాడు.
  2. రాష్ట్ర అడ్వకేట్ జనరల్ న్ను నియమిస్తాడు.
  3. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించి జిల్లా జడ్జీల నియామకం, పోస్టింగులు, పదోన్నతులు వంటి విషయాలలో అధికారాలను చెలాయిస్తాడు.
  4. రాష్ట్ర హైకోర్టు (జిల్లా జడ్జీలను మినహాయించి) రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ సూచనలపై రాష్ట్రంలోని అధీన న్యాయస్థానాల (Sub-ordinate courts) లోని న్యాయ సిబ్బందిని నియమిస్తాడు.
  5. సంబంధిత రాష్ట్ర హైకోర్టు విధించిన శిక్షను తగ్గించడానికి, క్షమాభిక్ష పెట్టడానికి లేదా శిక్షను పూర్తిగా రద్దు చేయడానికి రాష్ట్ర గవర్నర్కు అధికారం ఉంటుందీ.

4) ఆర్థికాధిరాలు – విధులు:

  1. ప్రతి ఆర్థిక సంవత్సరములో రాష్ట్రవార్షిక ఆర్థిక నివేదికను (బడ్జెట్ను) విధాన సభలో సమర్పించే విధంగా చూస్తాడు.
  2. గవర్నర్ ముందస్తు అనుమతి ద్రవ్య బిల్లులను శాసనసభలో ప్రవేశపెట్టరాదు.
  3. గవర్నరు అనుమతి లేకుండా రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక గ్రాంట్లకు సంబంధించిన ఏ సిఫార్సులనైనా విధానసభలో ప్రవేశపెట్టడానికి వీలులేదు.
  4. రాష్ట్ర ప్రభుత్వ ఆగంతుక నిధి (Contingency fund) ని నిర్వహించడం, అనుకోని వ్యయాన్ని భరించడానికి ఆ నిధి నుండి నిధులను విడుదలచేసే అధికారం గవర్నర్కే ఉంది.

AP Inter 2nd Year Civics Study Material Chapter 6 రాష్ట్ర కార్యనిర్వాహక శాఖ

5) ఇతర అధికారాలు, విధులు:

  1. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ సమర్పించిన వార్షిక నివేదికను గవర్నర్ మంత్రిమండలి పరిశీలనకు పంపుతాడు. తరువాత ఆ నివేదికను, దానిపై మంత్రిమండలి సూచనలను రాష్ట్ర అసెంబ్లీకి పంపించి, దానిపై చర్చ జరిగేటట్లు చర్యలు తీసుకుంటాడు.
  2. రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల ఆదాయ వ్యయాల గురించి ఆడిటర్ జనరల్ పంపించిన నివేదికలను గవర్నర్ స్వీకరిస్తాడు. గవర్నర్ ఆ నివేదికను కూడా మంత్రి మండలికి, ఆ తరువాత శాసనసభకు పంపడానికి చర్యలు తీసుకుంటాడు.

6) వివేచనాధికారాలు: రాజ్యాంగంలోని 163(1) అధికరణ రాష్ట్ర గవర్నర్కు కొన్ని వివేచనాధికారాలను ప్రసాదించింది. ఈ విధులను మంత్రిమండలి సహాయ సలహాలతో నిమిత్తం లేకుండా గవర్నర్ తన వివేచన, విజ్ఞతలను ఉపయోగించి నిర్వహిస్తాడు. గవర్నరుకు క్రింద పేర్కొన్న వివేచనాధికారాలు ఉంటాయి.

  1. ఏ పార్టీకి పూర్తి మెజార్టీ లేని పరిస్థితులలో కొత్త ముఖ్యమంత్రిని ఎంపికచేయడం. ఈ సందర్భంలో గవర్నరు చాలా చురుకైన పాత్రను నిర్వహిస్తాడు.
  2. మెజార్టీ సభ్యుల మద్దతు కోల్పోయిన మంత్రి మండలి రాజీనామా చేయడానికి నిరాకరించినపుడు ఆ మంత్రిమండలిని రద్దుచేయడం.
  3. మంత్రిమండలి శాసనసభలో మెజారిటీ సభ్యుల విశ్వాసం కోల్పోయినపుడు, ముఖ్యమంత్రి సలహామేరకు శాసనసభను రద్దు చేయవచ్చు.
  4. రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగం విఫలమైనప్పుడు రాజ్యాంగ అత్యవసర పరిస్థితిని (రాష్ట్రపతిపాలన) విధించాల్సిందిగా రాష్ట్రపతిని కోరడం.
  5. విధానసభ ఆమోదించిన బిల్లులను రాష్ట్రపతి పరిశీలన కోసం నిలుపుదల చేయడం.

ప్రశ్న 2.
ముఖ్యమంత్రి అధికారాలు – విధులను వివరించండి.
జవాబు:
రాష్ట్ర ప్రభుత్వ రథసారథి ముఖ్యమంత్రి. అతడు ప్రభుత్వాధిపతి. మంత్రిమండలికి నాయకుడు. అధికార పక్షానికి నాయకుడు. గవర్నర్కు, మంత్రిమండలికి మధ్య వారధి వంటివాడు. ఈయన సమర్థతపై ఆధారపడి రాష్ట్ర పరిపాలన నడుస్తుంది. కేంద్రంలో ప్రధాని వలె, రాష్ట్రంలో ముఖ్యమంత్రి స్థానం ఉంటుంది.

నియామకం: సాధారణ ఎన్నికల తరువాత మెజారిటీ పార్టీ నాయకుడు గవర్నర్చే ముఖ్యమంత్రిగా నియమింపబడతాడు. ఆయన సలహాపై ఇతర మంత్రులను గవర్నర్ నియమిస్తాడు.

పదవీకాలం: రాజ్యాంగరీత్యా ముఖ్యమంత్రి గవర్నర్ విశ్వాసం పొందగలిగినంత కాలం పదవిలో ఉంటాడు. వాస్తవానికి అసెంబ్లీలో (విధానసభ) మెజారిటీ నిలుపుకొన్నంత కాలమే పదవిలో కొనసాగుతాడు.

అర్హతలు:

  1. భారతీయ పౌరుడై ఉండాలి.
  2. శాసనసభలో సభ్యుడై ఉండాలి. కాకపోతే 6 నెలల్లో శాసనసభా సభ్యత్వం పొందాలి. లేకుంటే పదవి పోతుంది.

ముఖ్యమంత్రి అధికారాలు

విధులు:
1) మంత్రిమండలి ఏర్పాటు: తన అభీష్టం మేరకు మంత్రిమండలిని ఏర్పాటుచేయడం ముఖ్యమంత్రి మొదటి ప్రధాన విధి. సాధారణంగా మంత్రివర్గ సభ్యుల ఎంపిక, నియామకాలలో ముఖ్యమంత్రికి పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. తన పార్టీలో లేదా సంకీర్ణ ప్రభుత్వమైతే భాగస్వామ్య పార్టీలలోని కొందరు సభ్యులను ఎంపిక చేసుకొని వారి పేర్లను గవర్నర్కు సిఫారసు చేసి మంత్రులుగా వారు నియమితులయ్యేటట్లు చూస్తాడు.

2) మంత్రిమండలి నాయకుడు: ముఖ్యమంత్రి రాష్ట్ర మంత్రిమండలి నాయకుడు. ఆ హోదాలో అత్యున్నత, అసామాన్యమైన అధికార స్థానాన్ని ముఖ్యమంత్రి అలంకరిస్తాడు. అతడు కేబినేట్ ఛైర్మన్ గా ఉంటూ, కేబినేట్ సమావేశ చర్చనీయాంశాలు (అజెండా), ప్రదేశం, సమయాలను నిర్ణయిస్తాడు. కేబినేట్ సమావేశాలకు అధ్యక్షత వహించి, అందులో చర్చలు సజావుగా, అర్థవంతంగా జరిగేందుకు మార్గనిర్దేశం చేస్తాడు.

3) గవర్నర్ – మంత్రిమండలి మధ్య వారధి: ముఖ్యమంత్రి, గవర్నర్ – మంత్రిమండలికి మధ్య ప్రధాన సమాచార మార్గంగానూ, వారధిగానూ పనిచేస్తాడు. మంత్రిమండలి సమావేశాలలో తీసుకున్న నిర్ణయాలను గవర్నర్కు తెలియజేయవలసిన బాధ్యత ముఖ్యమంత్రికి ఉంటుంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న పాలనా నిర్ణయాలు, చేపట్టిన శాసనప్రతిపాదనల గురించి గవర్నర్కు తెలియజేస్తాడు.

AP Inter 2nd Year Civics Study Material Chapter 6 రాష్ట్ర కార్యనిర్వాహక శాఖ

4) విధానసభ నాయకుడు: విధానసభలోని మెజార్టీ సభ్యుల విశ్వాసం, మద్దతులు ముఖ్యమంత్రికి ఉంటాయి. అందుచేత విధానసభకు నాయకుడుగా వ్యవహరిస్తాడు. సభా వ్యవహారాలను సజావుగా, సక్రమంగా నడుపుటకు సభాధ్యక్షునికి (Presiding Officer) పూర్తి సహకారాన్ని అందిస్తాడు.

5) రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి: ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం తరపున అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తాడు. ప్రభుత్వం ముఖ్య విధానాలు, నిర్ణయాలు, కార్యక్రమాలను అధికారికంగా ప్రకటిస్తాడు. కొన్ని సందర్భాలలో రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై ముఖ్యమంత్రి వివరణ ఇవ్వాలని, విస్పష్ట ప్రకటన చేయాలని విధానసభలో సభ్యులు పట్టుబట్టినప్పుడు ముఖ్యమంత్రి సభకు వచ్చి ఆమేరకు ప్రభుత్వ విధానం గురించి ప్రకటన చేస్తాడు.

6) అధికార పార్టీ నాయకుడు: రాష్ట్రంలో ముఖ్యమంత్రి అధికార పార్టీ నాయకుడిగా వ్యవహరిస్తాడు. తన పార్టీ ఏర్పాటు చేసిన సమావేశాలలో పాల్గొంటాడు. అధికార పార్టీ ఇచ్చిన ఎన్నికల హామీలను నెరవేర్చుటకు ప్రభుత్వం చేపట్టిన చర్యలు, అమలు చేస్తున్న కార్యక్రమాలను పార్టీ సభ్యులకు వివరిస్తాడు.

7) ప్రజల నాయకుడు: ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజల ఆలోచనలు, ఆశయాలు, ఆకాంక్షలను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు. అందుకొరకు తరచుగా వివిధ ప్రాంతాలలో పర్యటించి, ప్రజా సమూహాలను ఉద్దేశించి ప్రసంగిస్తాడు.. ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించి, వారి సమస్యలను, అభ్యర్థనలను ఓర్పుగా ఆలకిస్తాడు.

8) గవర్నర్కు ముఖ్య సలహాదారు: రాష్ట్ర గవర్నర్ విధి నిర్వహణలో ముఖ్య సలహాదారుడిగా వ్యవహరించాల్సిన రాజ్యాంగబద్ధమైన బాధ్యత ముఖ్యమంత్రికి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అన్ని అంశాలపై గవర్నర్కు ముఖ్యమంత్రి సలహాలు, సహాయం అందిస్తాడు.

9) కేంద్ర ప్రభుత్వంతో సుహృద్భావ సంబంధాలు కేంద్ర ప్రభుత్వంతో సుహృద్భావ సంబంధాలను కొనసాగించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వ వాస్తవ కార్యనిర్వాహక అధిపతిగా ముఖ్యమంత్రిపై ఉంటుంది. ప్రధానమంత్రి, అతని మంత్రివర్గ సభ్యులతో స్నేహపూర్వక సంబంధాలను పెంపొందించుకోవాలి. కేంద్ర మంత్రులతో సముచిత సంబంధాలను ఏర్పరచుకోవాలి.

10) ప్రతిపక్ష పార్టీతో సంబంధాలు: ముఖ్యమంత్రి ప్రతిపక్షాలకు చెందిన పార్టీ అధ్యక్షులు, సభా నాయకులు, శాసన సభ్యులతో మంచి సంబంధాలను కొనసాగించాలి. తరచుగా కలవడం, ఆరోగ్యకరమైన సంబంధాలు, ఉత్సాహంతో కూడిన స్నేహ పూర్వక దృక్పథం వంటి చర్యల ద్వారా ప్రతిపక్షాల నుంచి నిర్మాణాత్మక సహకారాన్ని పొందవచ్చు.

11) రాజ్యాంగ సంబంధ విధులు: భారత రాజ్యాంగం రాష్ట్రంలో వాస్తవ కార్య నిర్వాహణ అధికారాలన్నింటిని ముఖ్యమంత్రిపై ఉంచింది. ముఖ్యమంత్రి పదవి, స్థాయి రాజ్యాంగం నుంచి ఏర్పడతాయి. ముఖ్యమంత్రి తన అధికారాలను చెలాయించడంలోనూ, బాధ్యతలను నిర్వర్తించడంలోనూ రాజ్యాంగ సూత్రాలకు కట్టుబడి, రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలి.

ప్రశ్న 3.
రాష్ట్ర మంత్రిమండలి అధికారాలు – విధులను పేర్కొనండి.
జవాబు:
రాజ్యాంగంలోని 163(1)వ ప్రకరణ ప్రకారం ప్రతి రాష్ట్రంలో ఒక రాష్ట్ర మంత్రిమండలి ఉంటుంది. రాష్ట్ర గవర్నర్ రాష్ట్ర పాలన నడపడంలోనూ, అధికారాలను నిర్వహించడంలోనూ తగిన సలహాను ఇచ్చి, సహాయం అందించేందుకై ముఖ్యమంత్రి అధ్యక్షతన ఒక మంత్రిమండలి ఉండాలని పై ప్రకరణ నిర్దేశిస్తుంది.

నిర్మాణం: సాధారణంగా రాష్ట్ర మంత్రిమండలి అనేది మూడంచెల వ్యవస్థ. అందులో 1) కేబినెట్ హోదా మంత్రులు 2) స్టేట్ హోదా మంత్రులు 3) డిప్యూటీ మంత్రులు ఉంటారు. అరుదైన సందర్భాలలో కొన్ని రాష్ట్రాలలో పార్లమెంటరీ సెక్రటరీలను నియమిస్తారు. వీరు మంత్రిమండలిలో నాల్గవ శ్రేణిలో ఉంటారు.

1) కేబినెట్ మంత్రులు: రాష్ట్ర ప్రభుత్వంలోని హోం, ఆర్థిక, ప్రణాళిక, పరిశ్రమలు, గనులు భూగర్భ వనరులు వంటి ప్రధాన మంత్రిత్వశాఖకు అధిపతులుగా కేబినెట్ మంత్రులుంటారు. వీరు తమ మంత్రిత్వ శాఖలకు సంబంధించిన నిర్ణయాలను తీసుకొని అమలు చేయడంలో స్వతంత్రంగా వ్యవహరిస్తారు. కేబినెట్ సమావేశాలలో కేవలం వీరు మాత్రమే పాల్గొంటారు.

2) స్టేట్ హోదా మంత్రులు: కేబినెట్ మంత్రులతో పోల్చితే తక్కువ ప్రాధాన్యం గల శాఖలకు వీరు ఆధ్వర్యం వహిస్తారు. మంత్రిత్వ శాఖలకు వీరిని అనుసంధానం చేయవచ్చు లేదా స్వతంత్రంగా వ్యవహరించవచ్చు. వీరు నేరుగా ముఖ్యమంత్రికి జవాబుదారులుగా ఉంటారు. వీరిపై కేబినెట్ మంత్రుల అజమాయిషీ ఉండదు.

3) డిప్యూటీ మంత్రులు: డిప్యూటీ మంత్రులను కేబినెట్ మంత్రులకు అనుబంధంగా నియమిస్తారు. వీరు కేబినెట్ మంత్రులు తమకు అప్పగించిన విధులను మాత్రమే నిర్వహిస్తారు. మంత్రిత్వ శాఖకు సంబంధించిన శాసన, పరిపాలనా వ్యవహారాలలో కేబినెట్ మంత్రులకు వీరు సహాయపడతారు. అందుకే వీరిని సహాయ మంత్రులు అని కూడా పిలుస్తారు.

అర్హతలు: ఒక వ్యక్తి మంత్రిగా నియమించబడాలంటే ఈ క్రింది అర్హతలు కలిగి ఉండాలి.

  1. ఆ వ్యక్తి శాసన నిర్మాణ శాఖలోని ఏదో ఒక సభలో సభ్యుడై ఉండాలి. (ద్విసభా విధానం అయినట్లయితే)
  2. ఒకవేళ ఏ సభలోనూ సభ్యులు కానివారు మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన 6 నెలల వ్యవధిలోగా విధానసభ సభ్యులుగా ఎన్నిక కావలసి ఉంటుంది. లేకుంటే వారు మంత్రి పదవిని కోల్పోతారు.
  3. పార్లమెంటు నిర్దేశించే ఇతర అర్హతలను కలిగిఉండాలి.

నియామకం: రాజ్యాంగంలోని 164వ ప్రకరణ ప్రకారం మంత్రులందరినీ గవర్నర్ ముఖ్యమంత్రి సలహా మేరకు నియమిస్తాడు. విధాన సభలోని తన పార్టీకి (లేదా భాగస్వామ్య పార్టీలకు చెందిన కొందరు సభ్యులను ఎంపిక చేసుకొని వారి పేర్లను గవర్నరు నివేదించి, వారిని మంత్రులుగా నియమించాల్సిందిగా ముఖ్యమంత్రి గవర్నర్కు సిఫారసు చేస్తాడు. ముఖ్యమంత్రి సూచనల ప్రకారం గవర్నర్ మంత్రులను నియమించి వారికి శాఖలను కేటాయిస్తాడు.

AP Inter 2nd Year Civics Study Material Chapter 6 రాష్ట్ర కార్యనిర్వాహక శాఖ

పదవీ కాలం: గవర్నర్ మంత్రుల విధి నిర్వాహణ పట్ల సంతోషంగా ఉన్నంతకాలం మంత్రులు తమ పదవిలో కొనసాగగలరని రాజ్యాంగంలో 164(2)వ ప్రకరణ తెలియజేస్తుంది. 164(3)వ ప్రకరణ ప్రకారం మంత్రిమండలి విధానసభకు సమిష్టిగా బాధ్యత వహించాలి. కాబట్టి మంత్రులు ఈ క్రింద చూపిన నియమాలను అనుసరించి పదవిలో
కొనసాగుతారు. అవి:

  1. గవర్నర్ సంతోషంగా ఉన్నంతకాలం.
  2. విధానసభకు సమిష్టి బాధ్యతను నెరవేర్చుతూ ఆ సభ విశ్వాసాన్ని పొందినంతకాలం.

రాష్ట్ర మంత్రిమండలి అధికారాలు
విధులు:
1) విధానాల రూపకల్పన: ప్రజా ప్రగతికి, రాష్ట్ర అభివృద్ధికి అవసరం అయిన విధానాలను రాష్ట్ర మంత్రిమండలి రూపొందిస్తుంది. ఇది ఎంతో శ్రమతో కూడిన మేథోపరమైన విధి. మంత్రిమండలి సభ్యులు ముఖ్యంగా కేబినెట్ మంత్రులు ముఖ్యమంత్రి నాయకత్వాన తరచుగా సమావేశమై రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాల నిర్వహణ కోసం అన్ని అంశాలపై కూలంకషంగా చర్చిస్తారు.

2) చట్టాలను రూపొందించటం: రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన వివిధ అంశాలపై చట్టాలను రూపొందించే అధికారం, బాధ్యత రాష్ట్ర మంత్రిమండలిపై ఉంది. అందుకై చొరవ తీసుకొని ముసాయిదా బిల్లును రూపొందించి ఖరారు చేస్తుంది. మంత్రిమండలి ఆమోదం పొందిన తరువాత సంబంధిత మంత్రి ముసాయిదా బిల్లును విధానసభలో ప్రవేశపెట్టి, విధానసభ ఆమోదం పొందేటట్లు ప్రతి స్థాయిలో కృషి చేస్తాడు.

3) సుపరిపాలనను అందించడం: రాష్ట్ర మంత్రిమండలి రాష్ట్ర వాస్తవ కార్యనిర్వాహక అధిపతి. ప్రజలకు సుపరిపాలన అందించే బాధ్యతను మంత్రిమండలిపై ఉంచి ఓటు ద్వారా వారికి అధికారాన్ని అప్పగించారు. రాజ్యాంగ మూలసూత్రాలకు, ప్రజాస్వామ్య సిద్ధాంతాలకు అనుగుణంగా మంత్రిమండలి రాష్ట్ర పాలనను సాగించాలి.

4) ప్రభుత్వ కార్యక్రమాల సమన్వయం: వివిధ ప్రభుత్వ విభాగాల కార్యక్రమాలను, సమన్వయం చేసే అధికారం, బాధ్యత రాష్ట్ర మంత్రిమండలికి ఉంటుంది. మంత్రిత్వశాఖల మధ్య సమన్వయం లేకుండా రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన సంఘం కాజాలదు.

5) నియామక అధికారాలు: రాష్ట్ర ప్రభుత్వంలోని అన్ని ముఖ్యమైన ఉన్నత పదవుల నియామకంలో మంత్రిమండలి అత్యంత కీలక పాత్రను పోషిస్తుంది. ఉన్నతాధికారులందరినీ మంత్రిమండలి గవర్నర్ పేరుతో నియమిస్తుంది. ఈ విషయంలో ముఖ్యమంత్రి అభీష్టం చెల్లుబాటు అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, అడ్వకేట్ జనరల్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ముఖ్య కార్యదర్శులు, ఇతర కార్యదర్శులు, డిపార్ట్మెంట్ అధిపతులు మొదలగువారు మంత్రిమండలిచే నియమించబడతారు.

6) ఆర్థిక అధికారాలు – విధులు: రాష్ట్ర ఆర్థిక వనరులపై మంత్రిమండలి నియంత్రణ కలిగి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వ ద్రవ్య విధానాన్ని నిర్ణయించి అమలు చేస్తుంది. రాష్ట్ర మంత్రిమండలి ప్రభుత్వ రాబడి, వ్యయం, పెట్టుబడులు, ఆడిట్ వంటి అంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహించి, ఆయా అంశాలలో మెరుగైన ఫలితాల కోసం చర్యలను తీసుకుంటుంది.. రాష్ట్ర వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలను రూపొందించి విధానసభ పరిశీలన, ఆమోదాలకు సమర్పిస్తుంది.

7) ఇతర విధులు: రాష్ట్ర మంత్రిమండలి రాష్ట్ర సమగ్ర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని వ్యవసాయం, నీటి పారుదల, పరిశ్రమలు, రవాణా, విద్య, ప్రణాళికలు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజి వంటి రంగాలలో వ్యూహాలను ఖరారు చేసి అమలు చేస్తుంది. రాష్ట్ర శాసనసభ సమావేశాలు లేని సమయంలో గవర్నర్ పేరుతో అత్యవసర ఆజ్ఞలను (ఆరినెన్స్లను) జారీ చేస్తుంది.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
రాష్ట్ర గవర్నర్ ఏవైనా మూడు అధికారాలను వివరించండి.
జవాబు:
గవర్నర్ యొక్క అధికారాలు విధులు:
1) కార్యనిర్వాహణాధికారాలు – విధులు: రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాలను స్వయంగా సాగించడానికి అవసరమైన నియమ నిబంధనలను గవర్నర్ రూపొందిస్తాడు. అందులో భాగంగా రాష్ట్రప్రభుత్వ విధివిధానాలను సక్రమంగా నిర్వహించి అమలు చేయడానికి అనుకూలంగా రాష్ట్ర స్థాయిలో రాజ్యాంగ ఉన్నత పదవులలో కొన్నింటికి ప్రత్యక్షంగా నియామకాలు జరుపుతాడు. అందులో ముఖ్యమైనవి:

  1. గవర్నర్ ముఖ్యమంత్రిని నియమిస్తాడు. ముఖ్యమంత్రి సలహా మేరకు మంత్రులను నియమిస్తాడు.
  2. మంత్రులకు మంత్రిత్వ శాఖలను కేటాయించడం లేదా మంత్రివర్గ నిర్మాణంలో మార్పులు చేయడం, మంత్రుల శాఖలలో మార్పులు చేయడం వంటి విధులను నిర్వహిస్తాడు.
  3. ముఖ్యమంత్రి సూచనలపై మంత్రులను పదవుల నుండి తొలగిస్తాడు.
  4. రాష్ట్ర విశ్వ విద్యాలయాలకు ఉపకులపతులను నియమించడమే గాక కులపతిగా కూడా వ్యవహరిస్తాడు.
  5. రాష్ట్ర ముఖ్య కార్యదర్శి మరియు అడ్వకేట్ జనరల్ను నియమిస్తాడు.

AP Inter 2nd Year Civics Study Material Chapter 6 రాష్ట్ర కార్యనిర్వాహక శాఖ

2) శాసననిర్మాణ అధికారాలు విధులు: గవర్నర్ రాష్ట్ర శాసనసభలో సభ్యుడు కాదు. కాని అందులో ఒక అంతర్భాగంగా 168వ ప్రకరణ వర్ణిస్తుంది. ఆ స్థాయిలో శాసన నిర్మాణశాఖకు సంబంధించిన కొన్ని విధులను, అధికారాలను గవర్నర్ నిర్వహిస్తాడు.

  1. విధానసభ సాధారణ ఎన్నికల తరువాత మొదటి సమావేశాన్ని ఆవిష్కరిస్తాడు.
  2. విధానసభ మొదటి సమావేశానికి (బడ్జెట్ సమావేశం) ప్రారంభ ఉపన్యాసాన్ని చేస్తాడు.
  3. విధానసభకు సాధారణ ఎన్నికల అనంతరం ప్రోటెం స్పీకర్ను నియమించి, స్పీకర్ ఎన్నికకు మార్గం సుగమం చేస్తాడు.
  4. శాసన నిర్మాణశాఖలోని సభా సమావేశాలకు ఆదేశించడం లేదా వాయిదా వేసే అధికారం గవర్నర్కు కలదు.

3) న్యాయాధికారాలు – విధులు:

  1. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, న్యాయమూర్తుల నియామక ప్రక్రియలో రాష్ట్రపతి కోరినచో సలహా ఇస్తాడు.
  2. రాష్ట్ర అడ్వకేట్ జనరలున్ను నియమిస్తాడు.
  3. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించి జిల్లా జడ్జీల నియామకం, పోస్టింగులు, పదోన్నతులు వంటి విషయాలలో అధికారాలను చెలాయిస్తాడు.
  4. రాష్ట్ర హైకోర్టు (జిల్లా జడ్జీలను మినహాయించి) రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ సూచనలపై రాష్ట్రంలోని అధీన న్యాయస్థానాల (Sub-ordinate courts) లోని న్యాయ సిబ్బందిని నియమిస్తాడు.
  5. సంబంధిత రాష్ట్ర హైకోర్టు విధించిన శిక్షను తగ్గించడానికి, క్షమాభిక్ష పెట్టడానికి లేదా శిక్షను పూర్తిగా రద్దు చేయడానికి రాష్ట్ర గవర్నర్కు అధికారం ఉంటుంది.

ప్రశ్న 2.
రాష్ట్రపతి – గవర్నర్ పదవుల మధ్యగల వ్యత్యాసాలు ఏవి ?
జవాబు:
రాష్ట్రపతి – గవర్నర్ మధ్య గల వ్యత్యాసాలు:

రాష్ట్రపతి

  1. రాష్ట్రపతి ఎన్నుకోబడే వ్యక్తి.
  2. రాష్ట్రపతి పదవీకాలం సాధారణంగా 5 సం॥లు ఉంటుంది.
  3. రాష్ట్రపతి పదవి నుంచి తొలగించడానికి క్లిష్టమైన మహాభిశంసన తీర్మానం అవసరం.
  4. రాష్ట్రపతికి వివేచనాధికారాలు లేవు.
  5. రాష్ట్రపతికి సైనిక మరియు దౌత్య సంబంధమైన అధికారాలు ఉంటాయి.
  6. రాష్ట్రపతి క్షమాభిక్ష అధికారం పరిపూర్ణమైనది. మరణశిక్షను కానీ, సైనిక కోర్టులు విధించే శిక్షలను గానీ రద్దుచేసి క్షమించే అధికారం అతడికి ఉంది.
  7. రాష్ట్రపతికి మూడు రకాల అత్యవసర పరిస్థితులు ఉంటాయి.
  8. యూనియన్ పబ్లిక్ కమీషన్ ఛైర్మన్, ఇతర సభ్యులను రాజ్యాంగం నిర్దేశించిన కారణాల ప్రకారం తొలగించే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది.
  9. ఏ బిల్లునూ మరే ఇతర అధికారుల పరిశీలన కోసం రాష్ట్రపతి నిలుపుదల చేయవలసిన అవసరం లేదు.

గవర్నర్

  1. గవర్నర్ నియమింపబడే వ్యక్తి.
  2. గవర్నర్కు పదవీ కాల భద్రత లేదు. రాష్ట్రపతి సంతృప్తిపైన అతడి పదవీకాలం ఆధారపడి ఉంటుంది.
  3. గవర్నర్ను సులభంగా తొలగించవచ్చు.
  4. గవర్నర్కు వివేచనాధికారాలు ఉంటాయి.
  5. గవర్నర్కు సైనిక మరియు దౌత్య సంబంధమైన అధికారాలు ఉండవు.
  6. గవర్నర్ క్షమాభిక్ష అధికారాలు పరిమితమైనవి. మరణశిక్షను, సైనిక కోర్టులు విధించిన శిక్షను రద్దుచేసే అధికారం అతడికి లేదు.
  7. గవర్నర్కు ఎటువంటి అత్యవసర అధికారాలు ఉంటాయి.
  8. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ ఛైర్మన్, సభ్యులను తొలగించే అధికారం గవర్నర్కు లేదు.
  9. కొన్ని బిల్లులను, కొన్ని సమయాలలో రాష్ట్రపతి అనుమతి కోసం నిలుపుదల చేసే అధికారం గవర్నర్కు ఉన్నది.

ప్రశ్న 3.
రాష్ట్ర ప్రభుత్వంలో గవర్నర్ స్థానం, ప్రాముఖ్యతను పేర్కొనండి.
జవాబు:
రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాలలో గవర్నర్ స్థానం ఎంతో కీలకమైంది. గవర్నర్ ఒకవైపు తనను నియమించిన రాష్ట్రపతికి బాధ్యత వహిస్తూ, వేరొకవైపు ముఖ్యమంత్రి ఆధ్వర్యంలోని రాష్ట్ర మంత్రిమండలి సూచనల ప్రకారం తన అధికారాలను నిర్వహిస్తాడు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాస్తవ కార్యనిర్వాహక అధిపతులతో అతడు సుహృద్భావ సంబంధాలను కలిగి ఉంటాడు. అలాగే అతడు రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రభుత్వంలోని రాజకీయ, పరిపాలక అధిపతులు కృషి చేసేటట్లు చూస్తాడు. రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాలు రాజ్యాంగబద్ధంగా కొనసాగేటట్లు చూడవలసిన బాధ్యత కూడా గవర్నర్దే. రాజకీయ, పాలనాపరమైన ఒత్తిళ్ళకు లొంగి ఉండక, రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య సూత్రాలను రాష్ట్ర ప్రభుత్వ మంత్రులు, అధికార సిబ్బంది పాటించేటట్లు చూస్తాడు. క్రియాశీలక రాజకీయాలలో ఆసక్తి చూపించకుండా విస్తృత రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణకు కృషిచేస్తాడు. అందువల్ల గవర్నర్ గా నియమితులయ్యే వ్యక్తులకు సునిశిత బుద్ధి, లౌకిక దృక్పథం, మానవతా విలువలు, జాతీయ సమైక్యతా స్ఫూర్తి వంటి లక్షణాలు ఉండాలి. అధికార, ప్రతిపక్ష పార్టీల పట్ల సమదృక్పథం చూపించాలి. తన అధికార పరిమితులను, రాజ్యాంగ సంప్రదాయాలను గుర్తించి ప్రవర్తిస్తూ ప్రజల మన్ననలను పొందాలి.

AP Inter 2nd Year Civics Study Material Chapter 6 రాష్ట్ర కార్యనిర్వాహక శాఖ

సంకీర్ణ మంత్రివర్గాలు ఏర్పాటవుతున్న ప్రస్తుత తరుణంలో గవర్నర్లస్థానం, వారు నిర్వహించే అధికారాలు, విధులు ఆ పదవిలో ఉన్న వ్యక్తి తీరుకు పరీక్షగా పేర్కొనవచ్చు. నిష్కళంక ప్రవర్తన, నిష్పాక్షికత, రాజ్యాంగ సూత్రాల పట్ల నిబద్ధత, పారదర్శకత వంటి లక్షణాలను గవర్నర్లు కలిగి ఉండాలనీ, సామాన్య ప్రజలు, ముఖ్యంగా బలహీన వర్గాలు, మైనారిటీలకు చెందిన ప్రయోజనాలను పరిరక్షించడానికి వారు కృషి చేయవలసి ఉంటుందనీ పదకొండో రాష్ట్రపతి ఎ.పి.జె. అబ్దుల్ కలాం ఒక సందర్భంలో ఉద్భోదించారు.

2010 మే7న బి.పి. సింఘాల్ వర్సస్ యూనియన్ గవర్నమెంట్ వివాదంలో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం గవర్నర్ స్థానం గురించి చారిత్రాత్మక తీర్పునిచ్చింది. ఆ తీర్పులో గవర్నర్ అంకితభావంతో రాజ్యాంగబద్ధులై పనిచేయాలి. | ఏదైనా రాజకీయ పార్టీకి కాకుండా రాజ్యాంగానికి రక్షకుడిగా ఉండాలి. గవర్నర్ కేంద్రప్రభుత్వ ఏజెంట్ లేదా ఉద్యోగి కాదని పేర్కొంది. గవర్నర్ను చాలా అరుదైన, ప్రత్యేకమైన సందర్భాలలో కేంద్రం తొలగించవలసి ఉంటుందని ఉద్భోదించింది. సర్కారియా కమీషన్ కూడా 1947-1986 మధ్య 154 మంది గవర్నర్ల పదవీ కాలాలను పరిశీలించి వాటిలో 104 మంది పదవీకాలం అసంపూర్తిగా ముగిశాయని పేర్కొంది. 2004లో ఐక్య ప్రగతి కూటమి ప్రభుత్వం ఉత్తరప్రదేశ్, హర్యానా, గుజరాత్, గోవాలో గవర్నర్లను తొలగించడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. గతంలో గవర్నర్లుగా వ్యవహరించిన వారిలో సరోజినీనాయుడు (ఉత్తరప్రదేశ్), పద్మజానాయుడు (పశ్చిమబెంగాల్), విజయలక్ష్మి పండిట్ (మహారాష్ట్ర), శంకర్ దయాళ్ శర్మ, కృష్ణకాంత్ వంటి వారు తరువాత ఉపరాష్ట్రపతులుగానూ వ్యవహరించారు.

ప్రశ్న 4.
ముఖ్యమంత్రి అధికారాలు – విధులలో ఏవైనా మూడింటిని తెలపండి. [Mar. ’16]
జవాబు:
ముఖ్యమంత్రి తన అధికారాలను, విధులను నిర్వర్తించుటలో ఎంతో అధికార బాధ్యతతో వ్యవహరిస్తారు. అతడి అధికార బాధ్యతలను ఈ క్రింది శీర్షికల ద్వారా వివరించవచ్చు.
1) మంత్రిమండలి ఏర్పాటు: తన అభీష్టం మేరకు మంత్రిమండలిని ఏర్పాటు చేయడం ముఖ్యమంత్రి మొదటి ప్రధానవిధి. సాధారణంగా మంత్రివర్గ సభ్యుల ఎంపిక, నియామకాలలో ముఖ్యమంత్రికి పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. తన పార్టీలో లేదా సంకీర్ణ ప్రభుత్వమైతే భాగస్వామ్య పార్టీలలోని కొందరు సభ్యులను ఎంపిక చేసుకొని వారి పేర్లను గవర్నర్కు సిఫారసు చేసి మంత్రులుగా వారు నియమితులయ్యేటట్లు చూస్తాడు. వారికి మంత్రిత్వశాఖల కేటాయింపులో గవర్నరుకు సలహాలిస్తాడు. మంత్రిమండలి పరిమాణం కూడా ముఖ్యమంత్రి ఆలోచనల మేరకు ఉంటుంది.

2) మంత్రిమండలి నాయకుడు: ముఖ్యమంత్రి రాష్ట్ర మంత్రిమండలి నాయకుడు. ఆ హోదాలో అత్యున్నత, అసామాన్యమైన అధికార స్థానాన్ని ముఖ్యమంత్రి అలంకరిస్తాడు. అతడు రాష్ట్ర కేబినేట్ ఛైర్మన్ గా ఉంటూ, కాబినేట్ సమావేశ చర్చనీయాంశాలు (అజెండా), ప్రదేశం, సమయాలను నిర్ణయిస్తాడు. కేబినేట్ సమావేశాలకు అధ్యక్షత వహించి, అందులో చర్చలు సజావుగా, అర్థవంతంగా జరిగేందుకు మార్గనిర్ధేశం చేస్తాడు. మంత్రిమండలి విధానాలను ప్రభావితం చేస్తాడు. ఏదైనా అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనపుడు ముఖ్యమంత్రి చొరవ చూపి తగు సలహాలు, సూచనల ద్వారా ఏకాభిప్రాయ సాధన దిశ వైపు మంత్రిమండలిని నడిపిస్తాడు.

3) గవర్నర్ – మంత్రిమండలి మధ్య వారధి: ముఖ్యమంత్రి, గవర్నర్ – మంత్రిమండలికి మధ్య ప్రధాన సమాచార మార్గంగానూ, వారధిగా పనిచేస్తాడు. మంత్రిమండలి సమావేశాలలో తీసుకున్న నిర్ణయాలను గవర్నర్కు తెలియజేయవలసిన బాధ్యత ముఖ్యమంత్రికి ఉంటుంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న పాలనా నిర్ణయాలు, చేపట్టిన శాసన ప్రతిపాదనల గురించి గవర్నర్కు తెలియజేస్తాడు. మంత్రుల చర్యలకు సంబంధించిన సమాచారం కావాలని గవర్నర్ కోరితే సంబంధిత సమాచారాన్ని గవర్నరుకు పంపుతాడు. ముఖ్యమంత్రి ముందు అనుమతిలేనిదే మంత్రులు ఎవ్వరూ గవర్నర్ను కలిసి సంప్రదించకూడదు.

ప్రశ్న 5.
రాష్ట్ర మంత్రిమండలి నిర్మాణం గురించి తెలపండి.
జవాబు:
సాధారణంగా రాష్ట్ర మంత్రిమండలి అనేది మూడంచెల వ్యవస్థ. అందులో 1) కేబినెట్ హోదా మంత్రులు 2) స్టేట్ హోదా మంత్రులు 3) డిప్యూటీ మంత్రులు ఉంటారు. అరుదైన సందర్భాలలో కొన్ని రాష్ట్రాలలో పార్లమెంటరీ సెక్రటరీలను నియమిస్తాడు. వీరు మంత్రిమండలిలో నాల్గవ శ్రేణిలో ఉంటారు.

1) కేబినెట్ హోదా మంత్రులు: రాష్ట్ర ప్రభుత్వంలోని హోం, ఆర్థిక, ప్రణాళిక, పరిశ్రమలు, గనులు – భూగర్భ వనరులు వంటి ప్రధాన మంత్రిత్వశాఖలకు అధిపతులుగా కేబినెట్ మంత్రులుంటారు. వీరు తమ మంత్రిత్వ శాఖలకు సంబంధించిన నిర్ణయాలను తీసుకొని అమలు చేయడంలో స్వతంత్రంగా వ్యవహరిస్తారు.

AP Inter 2nd Year Civics Study Material Chapter 6 రాష్ట్ర కార్యనిర్వాహక శాఖ

2) స్టేట్ హోదా మంత్రులు: కేబినెట్ మంత్రులతో పోల్చితే తక్కువ ప్రాధాన్యం గల శాఖలకు వీరు ఆధ్వర్యం వహిస్తారు. మంత్రిత్వ శాఖలకు వీరిని అనుసంధానం చేయవచ్చు లేదా స్వతంత్రంగా వ్యవహరించవచ్చు. వీరు నేరుగా ముఖ్యమంత్రికి జవాబుదారులుగా ఉంటారు. వీరిపై కేబినెట్ మంత్రుల అజమాయిషీ ఉండదు.

3) డిప్యూటీ మంత్రులు: డిప్యూటీ మంత్రులను కేబినెట్ మంత్రులకు అనుబంధంగా నియమిస్తారు. వీరు కేబినెట్ మంత్రులు తమకు అప్పగించిన విధులను మాత్రమే నిర్వహిస్తారు. మంత్రిత్వ శాఖకు సంబంధించిన శాసన, పరిపాలనా వ్యవహారాలలో కేబినెట్ మంత్రులకు వీరు సహాయపడతారు. అందుకే వీరిని సహాయ మంత్రులు అని కూడా పిలుస్తారు.

AP Inter 2nd Year Civics Study Material Chapter 5 కేంద్ర న్యాయశాఖ

Andhra Pradesh BIEAP AP Inter 2nd Year Civics Study Material 5th Lesson కేంద్ర న్యాయశాఖ Textbook Questions and Answers.

AP Inter 2nd Year Civics Study Material 5th Lesson కేంద్ర న్యాయశాఖ

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
భారత సుప్రీంకోర్టు పై ఒక వ్యాసాన్ని రాయండి.
జవాబు:
భారతదేశంలో సుప్రీంకోర్టు సర్వోన్నత న్యాయస్థానం. మన పరిపాలనలో సుప్రీంకోర్టు ఎంతో ప్రాధాన్యత కలిగి ఉంది. ప్రజల ధన, మాన, ప్రాణ రక్షణచేసి, వారికి న్యాయం చేయడం దీని కర్తవ్యం. ప్రజల హక్కులు కాపాడటం, భారత సమాఖ్య వ్యవస్థను రక్షించడం, రాజ్యాంగాన్ని రక్షించి, శాసనాలను వ్యాఖ్యానించడం వంటి అత్యంత ముఖ్యమైన బాధ్యతలను సుప్రీంకోర్టు నెరవేరుస్తుంది. “ప్రపంచంలోని ఏ దేశపు సుప్రీంకోర్టుకు లేని అధికారాలు భారత సుప్రీంకోర్డుకు ఉన్నాయి” అని ప్రముఖ న్యాయవాది, రాజ్యాంగ నిర్మాణ సభ్యుడు శ్రీ అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ అభిప్రాయం. సుప్రీంకోర్టును 1950 జనవరి 26న దేశ రాజధాని కొత్తఢిల్లీలో నెలకొల్పడం జరిగింది.

నిర్మాణం: ప్రస్తుతం సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి గాక, 30 మంది ఇతర న్యామూర్తులు ఉన్నారు. అర్హతలు: సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించబడే వ్యక్తికి ఈ క్రింది అర్హతలు ఉండాలి.

  1. భారతీయ పౌరుడై ఉండాలి.
  2. ఏదైనా ఒకటి లేదా అంతకుమించిన హైకోర్టులలో నిరంతరాయంగా కనీసం అయిదేళ్ళపాటు న్యాయమూర్తిగా పనిచేసి ఉండాలి.
  3. ఏదైనా ఒకటి లేదా అంతకంటే ఎక్కువ హైకోర్టులలో నిరంతరాయంగా కనీసం పదేళ్ళపాటు న్యాయవాదిగా వ్యవహరించి ఉండాలి.
  4. రాష్ట్రపతి అభిప్రాయంలో న్యాయకోవిదుడై ఉండాలి.

నియామకం: ప్రధాన న్యాయమూర్తిని, ఇతర న్యాయమూర్తులను భారతరాష్ట్రపతి నియమిస్తారు.

AP Inter 2nd Year Civics Study Material Chapter 5 కేంద్ర న్యాయశాఖ

జీత, భత్యములు: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి నెలకు రూ.1,00,000/-, ఇతర న్యాయమూర్తులకు ఒక్కొక్కరికి రూ. 90,000/- వేతనంగా లభిస్తుంది.
వేతనంతోపాటు వారికి ఉచిత నివాసగృహం, కార్యాలయం, టెలిఫోన్ సదుపాయాలు మొదలగునవి కల్పిస్తారు. వారి వేతనాన్ని భారత సంఘటిత నిధి నుండి చెల్లిస్తారు. దానిపై పార్లమెంట్కు అదుపు లేదు.

ప్రమాణ స్వీకారం: న్యాయమూర్తులు తాము నిష్పక్షపాతంగా, నిర్భయంగా, అవినీతికి లోనుగాకుండా, విధి నిర్వహణ చేస్తామని, రాజ్యాంగాన్ని కాపాడతామని రాష్ట్రపతి సమక్షంలో ప్రమాణస్వీకారం చేస్తారు.

పదవీకాలం: న్యాయమూర్తులు 65 సం॥ల వయస్సు వచ్చేవరకు పదవిలో ఉంటారు. పదవీ విరమణ తరువాత వారు ఆదాయాన్నిచ్చే ప్రభుత్వోద్యోగం చేయరాదు.
అభిశంసన: సుప్రీంకోర్టు న్యాయమూర్తులను పార్లమెంట్ అభిశంసన ద్వారా రాష్ట్రపతి పదవి నుండి తొలగిస్తారు. అవినీతి, దుష్ప్రవర్తన, అసమర్థత, అధికార దుర్వినియోగం వంటి ఆరోపణలుంటే, పార్లమెంట్ ఉభయసభలు వేర్వేరుగా మొత్తం సభ్యులలో సగం మంది కంటే ఎక్కువమంది హాజరై, ఓటు చేసిన వారందరిలో 2/3 వంతు మెజారిటీతో తీర్మానం ఆమోదిస్తే న్యాయమూర్తులను తొలగించవచ్చు.

అధికారాలు: సుప్రీంకోర్టుకు ఈ దిగువ అధికారాలున్నాయి.
1. సహజ అధికారాలు లేదా ప్రారంభ విచారణాధికార పరిధి (Original Jurisdiction): వివాదాలను ముందుగా విని, నిర్ణయించే అధికారాన్ని ప్రారంభ అధికార పరిధి అంటారు. ఈ అధికారం ప్రకారం కొన్ని రకాల వివాదాలను క్రింది కోర్టులకు తీసుకెళ్ళకుండా నేరుగా సుప్రీంకోర్టు నిర్ణయానికి తీసుకెళ్ళవచ్చు. ఈ క్రింది పేర్కొన్న వివాదాలు సుప్రీంకోర్టు ప్రారంభ అధికార పరిధిలోకి వస్తాయి. అవి:

  1. కేంద్ర ప్రభుత్వం ఒకటి లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఏర్పడే వివాదాలు.
  2. కేంద్రప్రభుత్వం, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఒకవైపు, వేరొక వైపు మరికొన్ని రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఏర్పడే వివాదాలు,
  3. రెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల మధ్య ఏర్పడే వివాదాలు.
  4. సుప్రీంకోర్టు భారత సమాఖ్యను రక్షిస్తుంది.
  5. శాసనాలను వ్యాఖ్యానిస్తుంది.
  6. ప్రాథమిక హక్కుల రక్షణ కొరకై హెబియస్ కార్పస్, మాండమస్, కోవారెంటో వంటి రిట్లను జారీచేస్తుంది.

2) అప్పీళ్ళ విచారణాధికారం (Appelate Power) భారతదేశంలో సుప్రీంకోర్టు అత్యున్నతమైనది. హైకోర్టులిచ్చిన తీర్పులపై సుప్రీంకోర్టుకు కేసును పునర్విచారణ చేయమని అప్పీలు చేసుకోవచ్చు. అప్పీళ్ళు నాలుగు రకాలుగా ఉంటాయి. అవి:

  1. రాజ్యాంగ సంబంధమైన అప్పీళ్ళు
  2. సివిల్ అప్పీళ్ళు
  3. క్రిమినల్ అప్పీళ్ళు
  4. స్పెషల్ అప్పీళ్ళు.

3) సలహారూపక అధికార పరిధి (Advisory Function): రాష్ట్రపతి ఏదైనా విషయంలో న్యాయసంబంధమైన వివాదముందని భావించినప్పుడు సుప్రీంకోర్టు సలహాను కోరవచ్చు. అటువంటి సందర్భాలలో రాష్ట్రపతికి సుప్రీంకోర్టు సలహాను ఇచ్చును. ఆ సలహా రాష్ట్రపతి పాటించాలనే నియమం లేదు. 1978లో రాష్ట్రపతి శ్రీ నీలం సంజీవరెడ్డి, 1975లో ప్రవేశపెట్టిన అత్యవసర పరిస్థితిలో జరిగిన అధికార దుర్వినియోగంపై విచారణ జరపడానికి ప్రత్యేక న్యాయస్థానాల ఏర్పాటుపై సుప్రీంకోర్టును సలహా అడగటం జరిగెను.

4) కోర్ట్ ఆఫ్ రికార్డు (Court of Record): అనేక వివాదాలలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను, వాటికి సంబంధించిన రికార్డులను భద్రపరచడం జరుగుతుంది. అవి ఇతర కోర్టులకు, న్యాయవాదులకు మార్గదర్శకాలుగా ఉపకరిస్తాయి.

5) న్యాయ సమీక్షాధికారం (Judicial Review): భారత సుప్రీంకోర్టుకు న్యాయ సమీక్షాధికారం కలదు. రాజ్యాంగాన్ని రక్షించడం కోసం, చట్టాలకు అర్థవివరణ ఇస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన శాసనాలు రాజ్యాంగ విరుద్ధంగా ఉంటే చెల్లనేరవని కొట్టివేసే అధికారం సుప్రీంకోర్టుకు కలదు. దీనిని న్యాయ సమీక్ష అంటారు.

AP Inter 2nd Year Civics Study Material Chapter 5 కేంద్ర న్యాయశాఖ

6) తీర్పుల పునఃపరిశీలన (Reconsideration of Judgement): సుప్రీంకోర్టుకు గతంలో తాను ప్రకటించిన తీర్పులను పునఃపరిశీలించి, వాటిని ఆమోదించడానికి, తిరస్కరించడానికి అధికారం ఉంది. ఉదా: గోలక్నాథ్ – పంజాబ్ రాష్ట్రానికి మధ్య తలెత్తిన వివాదం విషయంలో సుప్రీంకోర్టు 1967లో తీర్పు చెబుతూ. భారత పౌరుల ప్రాథమిక హక్కులతో సహా ఏ రాజ్యాంగపరమైన అంశాన్నైనా సవరించేందుకు పార్లమెంటుకు అధికారం లేదని పేర్కొన్నది.

7) ఇతర అధికారాలు (Other Powers):

  1. సుప్రీంకోర్టు పనిచేయటానికి కావలసిన నియమావళి న్యాయమూర్తులే నిర్ణయిస్తారు.
  2. కోర్టు సిబ్బందిని నియమిస్తారు, సిబ్బందిని అదుపు చేస్తారు.
  3. కోర్టు ధిక్కరణ నేరం క్రింద ఏ వ్యక్తినైననూ శిక్షించవచ్చు.

సుప్రీంకోర్టు స్వతంత్ర ప్రతిపత్తి: సుప్రీంకోర్టు స్వతంత్రంగా వ్యవహరించటానికి కావలసిన అనుకూల పరిస్థితులు ఉన్నాయి. న్యాయమూర్తులకు ఉద్యోగ భద్రత, కార్యనిర్వాహకశాఖ నుండి న్యాయశాఖ వేరుచేయబడటం, న్యాయశాస్త్ర ప్రవీణులు న్యాయమూర్తులుగా నియమింపబడటం, వారికి మంచి వేతనాలుండటం వంటి పరిస్థితులున్నాయి. అయినా భారత సుప్రీంకోర్టు, అమెరికా సుప్రీంకోర్టు అంత శక్తివంతమైనది కాదని ఒక అభిప్రాయం కలదు.

ప్రశ్న 2.
భారత సుప్రీంకోర్టు అధికారాలు, విధులను రాయండి.
జవాబు:
భారతదేశంలో సుప్రీంకోర్టు సర్వోన్నత న్యాయస్థానం. మన పరిపాలనలో సుప్రీంకోర్టు ఎంతో ప్రాధాన్యత కలిగి ఉంది. ప్రజల ధన, మాన, ప్రాణ రక్షణచేసి, వారికి న్యాయం చేయడం దీని కర్తవ్యం. ప్రజల హక్కులు కాపాడటం, భారత సమాఖ్య వ్యవస్థను రక్షించడం, రాజ్యాంగాన్ని రక్షించి, శాసనాలను వ్యాఖ్యానించడం వంటి అత్యంత ముఖ్యమైన
బాధ్యతలను సుప్రీంకోర్టు నెరవేరుస్తుంది. “ప్రపంచంలోని ఏ దేశపు సుప్రీంకోర్టుకు లేని అధికారాలు భారత సుప్రీంకోర్టుకు “ఉన్నాయి” అని ప్రముఖ న్యాయవాది, రాజ్యాంగ నిర్మాణ సభ్యుడు శ్రీ అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ అభిప్రాయం. సుప్రీంకోర్టు దేశ రాజధాని ఢిల్లీలో కలదు.

నిర్మాణం: ప్రస్తుతం సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తిగాక, 30 మంది న్యాయమూర్తులు ఉన్నారు. అధికారాలు: సుప్రీంకోర్టుకు ఈ దిగువ అధికారాలున్నాయి.
1) సహజ అధికారాలు లేదా ప్రారంభ విచారణాధికార పరిధి (Original Jurisdiction): వివాదాలను ముందుగా విని, నిర్ణయించే అధికారాన్ని ప్రారంభ అధికార పరిధి అంటారు. ఈ అధికారం ప్రకారం కొన్ని రకాల వివాదాలను క్రింది కోర్టులకు తీసుకెళ్ళకుండా నేరుగా సుప్రీంకోర్టు నిర్ణయానికి తీసుకెళ్ళవచ్చు. ఈ క్రింది పేర్కొన్న వివాదాలు సుప్రీంకోర్టు ప్రారంభ అధికార పరిధిలోకి వస్తాయి. అవి.

  1. కేంద్ర ప్రభుత్వం ఒకటి లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఏర్పడే వివాదాలు.
  2. కేంద్ర ప్రభుత్వం, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఒక వైపు, వేరొక వైపు మరికొన్ని రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఏర్పడే వివాదాలు,
  3. రెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల మధ్య ఏర్పడే వివాదాలు.
  4. సుప్రీంకోర్టు భారత సమాఖ్యను రక్షిస్తుంది.
  5. శాసనాలను వ్యాఖ్యానిస్తుంది.
  6. ప్రాథమిక హక్కుల రక్షణకై హెబియన్ కార్పస్, మాండమస్, కోవారెంటో వంటి రిట్లను జారీ చేస్తుంది.

2) అప్పీళ్ళ విచారణాధికారం (Appelate Power): భారతదేశంలో సుప్రీంకోర్టు అత్యున్నతమైనది. హైకోర్టులిచ్చిన తీర్పులపై సుప్రీంకోర్టుకు కేసును పునర్విచారణ చేయమని అప్పీలు చేసుకోవచ్చు. అప్పీళ్ళు నాలుగు రకాలుగా ఉంటాయి. అవి:

  1. రాజ్యాంగ సంబంధమైన అప్పీళ్ళు
  2. సివిల్ అప్పీళ్ళు
  3. క్రిమినల్ అప్పీళ్ళు
  4. స్పెషల్ అప్పీళ్ళు.

AP Inter 2nd Year Civics Study Material Chapter 5 కేంద్ర న్యాయశాఖ

3) సలహారూపక అధికార పరిధి (Advisory Function): రాష్ట్రపతి ఏదైనా విషయంలో న్యాయసంబంధమైన వివాదముందని భావించినప్పుడు సుప్రీంకోర్టు సలహాను కోరవచ్చు. అటువంటి సందర్భాలలో రాష్ట్రపతికి సుప్రీంకోర్టు సలహాను ఇచ్చును. ఆ సలహా రాష్ట్రపతి పాటించాలనే నియమం లేదు. 1978లో రాష్ట్రపతి శ్రీ నీలం సంజీవరెడ్డి, 1975లో ప్రవేశపెట్టిన అత్యవసర పరిస్థితిలో జరిగిన అధికార దుర్వినియోగంపై విచారణ జరపడానికి ప్రత్యేక న్యాయస్థానాల ఏర్పాటుపై సుప్రీంకోర్టును సలహా అడగటం జరిగెను.

4) కోర్ట్ ఆఫ్ రికార్డు (Court of Record): అనేక వివాదాలలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను, వాటికి సంబంధించిన రికార్డులను భద్రపరచడం జరుగుతుంది. అవి ఇతర కోర్టులకు, న్యాయవాదులకు మార్గదర్శకాలుగా ఉపకరిస్తాయి.

5) న్యాయ సమీక్షాధికారం (Judicial Review) భారత సుప్రీంకోర్టుకు న్యాయ సమీక్షాధికారం కలదు. రాజ్యాంగాన్ని రక్షించడం కోసం, చట్టాలకు అర్థవివరణ ఇస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన శాసనాలు రాజ్యాంగ విరుద్ధంగా ఉంటే చెల్లనేరవని కొట్టివేసే అధికారం సుప్రీంకోర్టుకు కలదు. దీనిని న్యాయ సమీక్ష అంటారు.

6) తీర్పుల పునఃపరిశీలన (Reconsideration of Judgement): సుప్రీంకోర్టుకు గతంలో తాను ప్రకటించిన తీర్పులను పునఃపరిశీలించి, వాటిని ఆమోదించడానికి, తిరస్కరించడానికి అధికారం ఉంది. ఉదా: గోలక్నాథ్- పంజాబ్ రాష్ట్రానికి మధ్య తలెత్తిన వివాదం విషయంలో సుప్రీంకోర్టు 1967లో తీర్పు చెబుతూ, భారత పౌరుల ప్రాథమిక హక్కులతో సహా ఏ రాజ్యాంగపరమైన అంశాన్నైనా సవరించేందుకు పార్లమెంటుకు అధికారం లేదని పేర్కొన్నది.

7) ఇతర అధికారాలు (Other Powers):

  1. సుప్రీంకోర్టు పనిచేయటానికి కావలసిన నియమావళి న్యాయమూర్తులే నిర్ణయిస్తారు.
  2. కోర్టు సిబ్బందిని నియమిస్తారు, సిబ్బందిని అదుపు చేస్తారు.
  3. కోర్టు ధిక్కరణ నేరం క్రింద ఏ వ్యక్తినైననూ శిక్షించవచ్చు.
  4. రాజ్యాంగ సూత్రాల అంతిమ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తుంది.
  5. దేశంలోని న్యాయస్థానాలలో రికార్డుల నిర్వహణ, న్యాయవాదుల ప్రాక్టీస్కు సంబంధించిన నియమాలను రూపొందిస్తుంది.
  6. కొన్ని ప్రత్యేక పరిస్థితులలో భారత రాష్ట్రపతి పదవికి ఖాళీ ఏర్పడితే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరిస్తారు.

ప్రశ్న 3.
న్యాయ సమీక్షను వర్ణించండి.
జవాబు:
సుప్రీంకోర్టు అధికారాలన్నింటిలో న్యాయ సమీక్ష అత్యంత ముఖ్యమైనది. రాజ్యాంగ ఔన్నత్యాన్ని నిలబెట్టడమే న్యాయసమీక్ష ఉద్దేశ్యం. రాజ్యాంగంలో న్యాయసమీక్ష గురించి ఎక్కడా స్పష్టంగా పేర్కొనలేదు. భారత రాజ్యాంగ లిఖిత స్వభావాన్ని, భారతదేశ సమాఖ్య లక్షణాలను దృష్టిలో ఉంచుకొని అమెరికా రాజ్యాంగం నుండి ఈ న్యాయ సమీక్ష భావనను గ్రహించారు. శాసన నిర్మాణ శాఖ రూపొందించిన శాసనాలు, కార్యనిర్యాహక వర్గం చేపట్టిన చర్యలు రాజ్యాంగ బద్దంగా ఉన్నాయా ? లేదా ? అని సమీక్షించడానికి న్యాయస్థానాలకు గల అధికారాన్ని ‘న్యాయసమీక్ష’ అంటారు. ఒక వేళ శాసన సభ చట్టాలు, కార్యనిర్వహక వర్గం నిర్ణయాలు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉంటే వాటిని లోపభూయిష్టం, చెల్లుబాటుకావు. అని ప్రకటించవచ్చు. “శాసన నిర్మాణ. చట్టంలోని రాజ్యాంగ భద్రతను పరిశీలించి, నిర్ణయించి, ప్రకటించే సామర్థ్యాన్ని న్యాయస్థానానికి వుండటాన్ని న్యాయ సమీక్షగా ఎమ్.వి. పైలీ పేర్కొన్నాడు.

ప్రాథమిక హక్కులకు భంగం కలిగించే శాసనాలు లోపభూయిష్టమైనవి 13వ ప్రకరణం తెలియజేస్తుంది. కాబట్టి పౌరుల ప్రాథమిక హక్కుల సంరక్షకునిగా ప్రాథమిక హక్కులకు భంగం కలిగించే చట్టాలను, నిర్ణయాలను రాజ్యాంగ విరుద్ధమైనవనీ, అవి చెల్లవని సుప్రీంకోర్టు ప్రకటిస్తుంది. అంతేకాక కేంద్ర, రాష్ట్ర సంబంధాల విషయంలో కూడా సుప్రీం కోర్టు న్యాయసమీక్ష అధికారాన్ని వినియోగిస్తుంది. కేంద్ర రాష్ట్రాల మధ్య రాజ్యాంగం చేసిన అధికారాల పంపిణీకి భిన్నంగా ఉన్న ఏ శాసనాన్నైనా, కార్యనిర్వాహక వర్గ చర్యనైనా తన న్యాయ సమీక్ష అధికారాన్ని ఉపయోగించి సమీక్షిస్తుంది.

AP Inter 2nd Year Civics Study Material Chapter 5 కేంద్ర న్యాయశాఖ

క్రింది అంశాలను గమనించినట్లయితే సుప్రీంకోర్టుకు న్యాయ సమీక్షాధికారం అనివార్యమని తెలుస్తుంది. ఎ. ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు బి. సమాఖ్య విధానంలో అధికారాల పంపిణీకి విఘాతం కలిగినప్పుడు. సుప్రీంకోర్టు న్యాయ సమీక్ష అధికారాలు క్రింది వాటికి కూడా విస్తరించాయి.

  1. కేంద్ర, రాష్ట్ర శాసన సభలు రూపొందించిన శాసనాలకు.
  2. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్యనిర్వాహక చర్యలకు.
  3. ప్రభుత్వరంగ సంస్థల నిర్ణయాలకు.
  4. రాజ్యాంగ సవరణలకు సంబంధించిన అంశాలను.

సుప్రీంకోర్టు మొదటిసారిగా 1950లో న్యాయసమీక్ష అధికారాన్ని ఉపయోగించి నివారక నిర్భంద (ప్రివెంటివ్ డిటెన్షన్) చట్టం, 14వ సెక్షన్ రాజ్యాంగ విరుద్ధం అని ప్రకటించింది.

భారత సుప్రీంకోర్టు రాజ్యాంగ సవరణ చట్టాల జాబిత్యాన్ని నిర్ణయించే అధికారాన్ని వినియోగించడం ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఖ్యాతి చెందింది. ఏదేమైనప్పటికి ఈ క్రింది అంశాల వలన న్యాయసమీక్ష అవసరం తప్పనిసరని చెప్పవచ్చును.

  1. రాజ్యాంగ ఔన్నత్యాన్ని సమర్థించి నిలబెట్టడం
  2. సమాఖ్య వ్యవస్థ సమతౌల్యాన్ని కాపాడటం
  3. పౌరుల ప్రాథమిక హక్కులను పరిరక్షించడం

పై వాటితోబాటుగా న్యాయ సమీక్ష అధికారం అనేది రాజ్యాంగ పరిరక్షకురాలి హోదాలో సుప్రీంకోర్టుకు సంక్రమించిన అధికారంగా పేర్కొనవచ్చు. దాంతో రాజ్యాంగ అంతిమ వ్యాఖ్యాతగా సుప్రీంకోర్టు న్యాయసమీక్షాధికారం రాజ్యాంగంలోని అన్ని అంశాల పరిశీలనకు విస్తరించింది.

ప్రశ్న 4.
న్యాయశాఖ క్రియాశీలత అనగానేమి ? అందులోని గుణాలు, దోషాలు ఏవి ?
జవాబు:
న్యాయశాఖ క్రియాశీలతను కార్యనిర్వహకశాఖ, శాసన నిర్మాణశాఖల అధికార పరిధిలో జోక్యం చేసుకోవడానికి న్యాయవ్యవస్థ చూపే అత్యుత్సాహంగా భావిస్తారు. వాస్తవానికి న్యాయ వ్యవస్థ సాధారణ కార్యక్రమాలు, చర్యలకంటే న్యాయశాఖ క్రియాశీలత భిన్నమైనది కాదు. సాధారణ పరిభాషలో ‘క్రియాశీలత’ అంటే ‘చురుకుగా ఉండడం’ ‘నిర్ణయాలలో చర్యలు కొనసాగించడం’ ‘క్రియాశీలుడు’ అంటే ‘తన విధి పట్ల అత్యంత ఆసక్తి చూపేవాడు’. ఈ అర్థంలో ప్రతి న్యాయమూర్తి ఒక క్రియాశీలుడే. “ప్రతి న్యాయమూర్తి క్రియాశీలకంగా వుంటూ పురోగమన ధృక్పథంతో గాని లేదా మరొక విధంగా గాని తన విధులను నిర్వహిస్తాడ”ని జస్టిస్. కృష్ణయ్యర్ పేర్కొన్నాడు.

న్యాయవ్యవస్థ ఇంతవరకు తన ముందుకు వచ్చిన వివాదాలపట్ల మాత్రమే స్పందించే సాంప్రదాయ పద్ధతులను విడనాడి వార్తా పత్రికలలో వచ్చిన సమాచారం, పోస్ట్ ద్వారా అందే ఫిర్యాదుల పట్ల స్వయంగా స్పందించి అయా ఆంశాలను తనకు తాను (suo-moto) గా విచారణాంశాలుగా స్వీకరించి బాధితులకు సరియైన న్యాయం అందేటట్లు చర్యలు తీసుకోవడం ప్రారంభించినది. అయితే న్యాయశాఖ క్రియాశీలత ద్వారా చేపట్టిన వివాదాలలో అధిక భాగం ప్రజాప్రయోజన వాజ్యాల (PIL) ద్వారా అందినవే. మొత్తం మీద ప్రజారోగ్యం, బాలకార్మిక వ్యవస్థ, పర్యావరణం,. అవినీతి వంటి అనేక అంశాలపై దాఖలయ్యే ప్రజాప్రయోజన వ్యాజ్యాలు న్యాయశాఖ క్రియాశీలతను పెంచాయి. మొత్తం మీద న్యాయశాఖ అనేది న్యాయ వ్యవహారాలలో క్రియాశీలత అత్యంత ప్రజాధరణ పొందిన ప్రక్రియగా వర్ణించబడింది.

న్యాయశాఖ క్రియాశీలత – గుణాలు లేదా ప్రయోజనాలు:

  1. కేవలం వ్యక్తులకే పరిమితం కాకుండా, సమూహాలకు, న్యాయవ్యవస్థ ప్రజాస్వామ్యీకరించబడింది.
  2. అది కార్యనిర్వాహకవర్గం యొక్క జవాబుదారీతనాన్ని పటిష్ఠ పరచినది.
  3. ఎన్నికల వ్యవస్థను మరింత స్వేచ్ఛగా, స్వతంత్రంగా మార్చడానికి న్యాయక్రియాశీలత ప్రయత్నిస్తుంది.
  4. ఎన్నికలలో పోటీచేసే అభ్యర్థులు కోర్టు ఆదేశాన్ని అనుసరించి తమ ఆస్తులు, ఆదాయం, విద్యార్హతలు, నేరచరిత్ర వంటి అంశాలతో కూడిన అఫిడవిట్ (Affidavit) ను సమర్పిస్తున్నారు. దీని ద్వారా ఉత్తమ ప్రతినిధిని ఎన్నుకోవడానికి ప్రజలకు అవకాశం కల్పించింది.

న్యాయశాఖ క్రియాశీలత – దోషాలు లేదా నష్టాలు:

  1. శాసన, కార్యనిర్వాహకశాఖకు, న్యాయశాఖకు మధ్య ఉన్న అంతరాన్ని తొలగించింది.
  2. ప్రభుత్వంలోని మూడు అంగాల మధ్య సమతుల్యతను సంబంధాలను ఈ భావన దెబ్బతీసిందని కొందరు భావించారు.
  3. ప్రభుత్వ అంగాలలో ప్రతి ఒక్కటీ ఇతర అంగాల అధికారాలను, పరిధిని గౌరవించాలన్న సూత్రంపైన ప్రజాస్వామ్య ప్రభుత్వం ఆధారపడి ఉంటుంది. న్యాయక్రియాశీలత ఈ ప్రజాస్వామ్య సూత్రంను వక్రీకరించి నష్టపరచింది.

AP Inter 2nd Year Civics Study Material Chapter 5 కేంద్ర న్యాయశాఖ

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
సుప్రీంకోర్టు నిర్మాణం గురించి రాయండి.
జవాబు:
రాజ్యాంగంలోని 124వ నిబంధన సుప్రీంకోర్టు నిర్మాణం గురించి పేర్కొన్నది.
సుప్రీంకోర్టు ప్రారంభ సమావేశం 1950 జనవరి 28వ తేదీన పార్లమెంటు భవనంలోని ప్రిన్సెస్ ఛాంబర్లో జరిగింది. పూర్వ ఫెడరల్ కోర్టు చివరి ప్రధానన్యాయమూర్తిగానూ, సుప్రీంకోర్టు ప్రథమ ప్రధాన న్యాయమూర్తిగాను హరిలాల్ జె. కానియా వ్యవహరించాడు.

సుప్రీంకోర్టులో ఒక ప్రధాన న్యాయమూర్తి పార్లమెంటు చట్టం నిర్ణయించిన సంఖ్యలో ఇతర న్యాయమూర్తులు ఉంటారు. సుప్రీంకోర్టులోని న్యాయమూర్తుల సంఖ్యను నిర్ణయించే అధికారం పార్లమెంటుకు ఉన్నది. రాజ్యాంగం అమలులోకి వచ్చిన సమయంలో సుప్రీంకోర్టులో ఒక ప్రధాన న్యాయమూర్తి, ఏడుగురు ఇతర న్యాయమూర్తులు ఉండేవారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఒక ప్రధాన న్యాయమూర్తి, 30 మంది ఇతన న్యాయమూర్తులు ఉన్నారు. కొన్ని సందర్భాలలో మరికొంత మంది తాత్కాలిక న్యాయమూర్తులు, విశ్రాంత న్యాయమూర్తులు తాత్కాలిక ప్రాతిపదకన నియమించబడతారు.

అన్ని సాధారణ వివాదాలను ఇద్దరు లేదా అంతకన్నా ఎక్కువ న్యాయమూర్తులతో కూడిన డివిజన్ బెంచ్ విచారిస్తుంది. రాజ్యాంగ అంశాలు ఇమిడి ఉన్న వివాదాలను ఐదుగురు జడ్జిలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం పరిష్కరిస్తుంది. ప్రత్యేక వివాదాలను విచారించడానికి ఐదు లేదా అంతకంటే ఎక్కువ మంది న్యాయమూర్తులతో ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటు చేస్తారు.

ప్రశ్న 2.
సుప్రీంకోర్టు యొక్క రెండు అధికార పరిధులను తెలపండి.
జవాబు:
సుప్రీంకోర్టు భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానం. దాని తీర్పులు, నిర్ణయాలు అంతిమమైనవి. వాటిని మార్పుచేయడానికి లేదా సవరించడానికి కేవలం సుప్రీంకోర్టుకు మాత్రమే అధికారం ఉంది. సుప్రీంకోర్టుకు క్రింద అధికార విధులు ఉన్నాయి. అవి:

1) అప్పీళ్ళ విచారణాధికారం భారతదేశంలోని సుప్రీంకోర్టు అత్యున్నతమైనది. హైకోర్టులిచ్చిన తీర్పులపై సుప్రీంకోర్టుకు కేసును పునర్విచారణ చేయమని అప్పీలు చేసుకోవచ్చు. అప్పీళ్ళు నాలుగు రకాలుగా ఉంటాయి అవి: 1) రాజ్యాంగ సంబంధమైన అప్పీళ్ళు 2) సివిల్ అప్పీళ్ళు 3) క్రిమినల్ అప్పీళ్ళు 4) స్పెషల్ అప్పీళ్ళు. ఈ అప్పీళ్ళలో మొదటి మూడు విధాలైన వాటిలో హైకోర్టు సర్టిఫికేట్ ఇస్తే అప్పీల్ చేసుకోవచ్చు. 4వ దానికి సంబంధించిన అప్పీల్స్ను హైకోర్టు సర్టిఫికేట్ ఇవ్వడానికి నిరాకరిస్తే ఆ కేసుపై చేసిన అప్పీళ్ళను సుప్రీంకోర్టు స్వీకరించవచ్చు.

2) కోర్ట్ ఆఫ్ రికార్డు: రాజ్యాంగంలోని 141వ ప్రకరణ ప్రకారం సుప్రీంకోర్టు రికార్డులను భద్రపరిచే కోర్టుగా వ్యవహరిస్తుంది. కోర్ట్ ఆఫ్ రికార్డుగా వ్యవహరించే సుప్రీంకోర్టు, కోర్టు ధిక్కార నేరానికి పాల్పడే వ్యక్తులను దోషులుగా ప్రకటించి నిందుతులుగా నిలబెట్టవచ్చు. భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానం హోదాలో సుప్రీంకోర్టు తాను వివిధ వివాదాలను పరిష్కరించడంలో వెలువరించిన అభిప్రాయాలు, వ్యాఖ్యానాలు, తీర్పులు, ఇతర న్యాయసమాచార అంశాలన్నింటిని రికార్డు రూపంలో నమోదుచేసి భద్రపరుస్తుంది. భవిష్యత్తులో అదే రకమైన వివాదాలను పరిష్కరించడానికి దేశంలో అన్ని న్యాయస్థానాలకు అవి దిక్సూచిగానూ, మార్గదర్శకంగానూ, నమూనాగానూ ఉంటాయి.

AP Inter 2nd Year Civics Study Material Chapter 5 కేంద్ర న్యాయశాఖ

ప్రశ్న 3.
సుప్రీంకోర్టు విచారణ అధికారాలు ఏవి ?
జవాబు:
భారతదేశంలో అంతిమ అప్పీళ్ళ న్యాయస్థానంగా సుప్రీంకోర్టు వ్యవహరిస్తుంది. సుప్రీంకోర్టుకు గల అప్పీళ్ళ విచారణ పరిధిని మూడు శీర్షికల క్రింద విభజించవచ్చు. అవి:

  1. రాజ్యాంగ వ్యాఖ్యానంతో ముడిపడి ఉన్న వివాదాలు.
  2. సివిల్ వివాదాలు.
  3. క్రిమినల్ వివాదాలు.

రాజ్యాంగ వ్యాఖ్యానానికి సంబంధించిన అంశాలు ఇమిడి ఉన్న వివాదాలను సుప్రీంకోర్టు విచారిస్తుంది. అటువంటి కేసుల విచారణకు హైకోర్టు ధ్రువీకరణ పత్రాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాలలో రాజ్యాంగ వివరణకు సంబంధించిన అంశాలున్నాయని భావించిన వివాదాలను సుప్రీంకోర్టు స్వయంగా విచారిస్తుంది.

రాజ్యాంగ వ్యాఖ్యానంతో సంబంధంలేని వివాదాలను హైకోర్టు ధ్రువీకరణ పత్రం ప్రాతిపదికపై సుప్రీంకోర్టు విచారణను స్వీకరిస్తుంది. అటువంటి వివాదాల విషయంలో చట్టానికి సంబంధించిన అంశాలు ఉన్నాయని, సుప్రీంకోర్టు నిర్ణయం తప్పనిసరిగా అవసరం అని హైకోర్టు భావించాలి.

క్రిమినల్ వివాదాల విషయంలో, హైకోర్టు ప్రకటించిన తీర్పు, తుది ఆదేశం లేదా శిక్షలపై వచ్చే అప్పీళ్ళను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరిస్తుంది. ఈ రకమైన అప్పీళ్ళు రెండు రకాలు. అవి: 1) క్రింది న్యాయస్థానాలు ప్రకటించిన తీర్పులపై వచ్చిన అప్పీళ్ళను స్వీకరించి, క్రింది న్యాయస్థానాలు విముక్తి చేసిన నిందితునిపై తీర్పుకు వ్యతిరేకంగా మరణశిక్షను ప్రకటించడం 2) క్రింది న్యాయస్థానాల తీర్పులపై వచ్చే అప్పీళ్ళ విచారణను ప్రారంభించి, పునస్సమీక్షించి నిందితునికి మరణశిక్షను ఖరారు చేయడం.

హైకోర్టు ఇచ్చిన తీర్పుల పట్ల అసంతృప్తులైన వ్యక్తుల ప్రార్థనపై వారి వివాదం సుప్రీంకోర్టు పరిశీలించేందుకు అర్హలైందని హైకోర్టు పేర్కొన్న పక్షంలో, సుప్రీంకోర్టు అటువంటి వివాదాల విచారణకు ప్రత్యేక అనుమతిని మంజూరు చేస్తుంది. 136వ అధికరణం ప్రకారం సాధారణ చట్టం పరిధికి వెలుపల ఉండే వివాదాలను కూడా సుప్రీంకోర్టు విచారిస్తుంది.

ప్రశ్న 4.
సుప్రీంకోర్టు సలహాపూర్వక అధికార పరిధిని వివరించండి.
జవాబు:
ఏదైనా చట్ట సంబంధ విషయంలో లేదా ప్రజాప్రాముఖ్యం ఉన్న అంశాలపై తన అభిప్రాయం తెలుపవలసినదిగా రాష్ట్రపతి సుప్రీంకోర్టును కోరవచ్చు. ఆ అంశాన్ని పరిశీలించి సుప్రీంకోర్టు తన అభిప్రాయాన్ని తెలియజేయవచ్చు. రాజ్యాంగం అమలులోకి రాక పూర్వం కుదుర్చుకోబడిన ఒప్పందాలు, సంధులకు సంబంధించిన వివాదాల విషయంలో రాష్ట్రపతి సుప్రీంకోర్టు సలహాను కోరవచ్చు. ఈ వివాదాలు రాజ్యాంగం 131వ ప్రకరణ నుంచి మినహాయింపబడినవి.

అయితే రాష్ట్రపతి కోరిన అంశాలపై సుప్రీంకోర్టు తప్పనిసరిగా సలహా ఇవ్వాలనిగానీ, సుప్రీంకోర్టు అభిప్రాయాన్ని, సలహాను రాష్ట్రపతి విధిగా పాటించాలని గానీ నియమం ఏమిలేదు. అది వారి వివేచనకు వదిలివేయబడుతుంది. 1978లో రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి 1975లో ప్రవేశపెట్టిన అత్యవసర పరిస్థితిలో జరిగిన అధికార దుర్వినియోగంపై విచారణ జరపడానికి ప్రత్యేక న్యాయస్థానాల ఏర్పాటుపై సుప్రీంకోర్టును సలహా అడగటం జరిగింది. గతంలో కూడా ఆ విధంగా జరిగింది. యు.పి.యస్.సి. అధ్యక్షునిగా లేదా సభ్యులను అవినీతి, అక్రమాల ఆరోపణలపై నిర్బంధంగా పదవీ విరమణ చేయించదలిస్తే రాష్ట్రపతి సుప్రీంకోర్టు సలహా కోరవచ్చు. సుప్రీంకోర్టు సలహాలకు ప్రాధాన్యత ఉంటుంది. అమెరికా, ఆస్ట్రేలియాలలో ఈ అధికారం లేదు.

AP Inter 2nd Year Civics Study Material Chapter 5 కేంద్ర న్యాయశాఖ

ప్రశ్న 5.
రిట్ అధికార పరిధి గురించి రాయండి.
జవాబు:
రిట్ అనే పదానికి అర్థం ‘వ్రాతపూర్వక ఆదేశం’. రాజ్యాంగంలోని 32వ ప్రకరణ పౌరుల ప్రాథమిక హక్కులను అమలు చేయడానికి రిట్లను జారీ చేసే అధికారాన్ని సుప్రీంకోర్టుకు ఇచ్చింది. తన ప్రాథమిక హక్కులకు భంగం కలిగిన వ్యక్తి వాటి పరిరక్షణకై సుప్రీంకోర్టును నేరుగా ఆశ్రయించవచ్చు. ప్రాథమిక హక్కుల భంగం వాటిల్లినప్పుడు రాజ్యాంగ పరిహారంలో భాగంగా సుప్రీంకోర్టు 32వ ప్రకరణ ప్రకారం హెబియస్ కార్పస్, మాండమస్, ప్రొహిబిషన్, సెర్షియరరీ, కోవారెంటో వంటి రిట్లను ప్రాథమిక హక్కుల పునరుద్ధరణకు జారీ చేస్తుంది.

1) హెబియస్ కార్పస్: హెబియస్ కార్పస్ అనగా ‘వ్యక్తి శరీరాన్ని ప్రవేశపెట్టదు’ అని అర్థం. చట్ట వ్యతిరేకంగా నిర్బంధానికి గురైన వ్యక్తికి బంధ విముక్తి కలిగించడానికి ఈ రిట్ మంజూరు చేస్తారు. అక్రమంగా నిర్బంధించబడిన వ్యక్తిని కోర్టు ఎదుట హాజరుపరచండి అని సంబంధిత అధికారిని ఆదేశించడానికి హెబియస్ కార్పస్ రిట్ను సుప్రీంకోర్టు జారీ చేస్తుంది. ఆ ఆధికారి ఈ అదేశాన్ని పాటించనట్లయితే కోర్టు ధిక్కారనేరం క్రింద శిక్షార్హుడవు.

2) మాండమస్: మాండమస్ అనగా ‘మేము ఆజ్ఞాపిస్తున్నాము’ అని అర్థం. ఎవరైనా ప్రభుత్వ అధికారి, విధి నిర్వహణలో వైఫల్యం చెందినప్పుడు ఆ విధిని సక్రమంగా నిర్వర్తించమని ఆజ్ఞాపిస్తూ సుప్రీంకోర్టు ఈ రిట్ను జారీ చేస్తుంది. ప్రైవేట్ వ్యక్తులకు ఈ రిట్ను జారీ చేయబడదు.

3) ప్రొహిబిషన్: ‘నిషేదించుట’ అని దీని అర్థం. ఈ రిట్ను సుప్రీంకోర్టు క్రింది కోర్టులకు జారీ చేస్తుంది. ఏదైనా కేసు విచారణలో క్రింది కోర్టులు లేని అధికార పరిధిని అతిక్రమించి వ్యవహరించకుండా నిరోధించడానికి ఈరిట్ను జారీ చేస్తారు. దీనిని న్యాయ సంబంధిత సంస్థలకు మాత్రమే జారీచేస్తారు.

4) సెర్షియరరీ లాటిన్ లో దీని అర్థం ‘ధృవీకరించబడాలి’ లేదా ‘తెలియజేయుట’. క్రింది కోర్టులు వాటి పరిధిని అతిక్రమించి, వ్యవహరించినప్పుడు సుప్రీంకోర్టు, హైకోర్టులు ఈ రిట్ను జారీచేస్తాయి.

5) కో-వారెంటో: ‘ఏ అధికారంతో’ అని దీని అర్థం. ఒక వ్యక్తి తనకు అర్హత, అధికారం లేకపోయినా అధికార పదవిలో కొనసాగడాన్ని ప్రశ్నిస్తూ ఈ రిట్ను జారీచేస్తారు. ఏ అధికారంతో ఆ పదవి చేపట్టారో తెలియజేయమని సదరు వ్యక్తిని ఆదేశిస్తూ సుప్రీంకోర్టు ఈ రిట్లు జారీ చేస్తుంది. ఈ రిట్ను ప్రైవేట్ సంస్థలకు జారీచేయబడదు. వీటితోపాటుగా పౌరుల హక్కుల పరిరక్షణ కొరకు కొన్ని యంత్రాంగాలను ఏర్పాటుచేసారు. అవి జాతీయ మహిళా సంఘం, జాతీయ షెడ్యూల్డు కులాల, తెగల సంఘం, జాతీయ మానవ హక్కుల సంఘం మొదలైనవి.

ప్రశ్న 6.
భారతదేశంలో న్యాయశాఖ క్రియాశీలత గురించి తెలపండి.
జవాబు:
క్రియాశీలుడైన న్యాయమూర్తి రాజ్యాంగ స్వభావాన్ని అర్థం చేసుకొని వుండాలి. భారత రాజ్యాంగం కేవలం ఒక శాసన పత్రం కాదు. అది ప్రజల విలువలు, అభిలాషలను వ్యక్తీకరించే సామాజిక రాజకీయ పత్రం, సమసమాజాన్ని నిర్మించడమే రాజ్యాంగం యొక్క ప్రథమ లక్ష్యం. ఈ సందర్భంలో దేశంలోని పౌరలందరికి సమానహక్కులు హోదా, అవకాశాలు కల్పనే లక్ష్యంగా రాజ్యంగ ప్రవేశికలో స్పష్టంగా పేర్కొన్నారు. రాజ్యాంగ లక్ష్యాలను, గమ్యాన్ని సాధించడానికి ప్రజల ప్రాథమిక హక్కులకు హామీ ఇవ్వబడినది. రాజ్యపాలనలో ఆదేశక సూత్రాలు అతి ప్రధానమైనవిగా భావించడం జరిగింది, వివిధ చట్టాల తయారీలో ఆదేశక సూత్రాలను కాలానుగుణంగా పాటించాల్సిన బాధ్యత రాజ్యానికి ఉంటుంది.

రాజ్యాంగం యొక్క లక్ష్యాలను సాధించడం శాసననిర్మాణ శాఖ, కార్యనిర్వాహక వర్గం, న్యాయశాఖల యొక్క సమిష్టి బాధ్యత. మన రాజ్యాంగ ప్రధాన లక్ష్యమైన సామాజిక న్యాయాన్ని సాధించడంలో న్యాయశాఖ ప్రధాన పాత్రను పోషిస్తుంది. రాజ్యాంగం నిర్దేశించిన లక్ష్యాలను నెరవేర్చడానికి, సమాజంలో అణగారిన బడుగు, బలహీన వర్గాలు, పేదలకు కనీస జీవన అవసరాలను అందివ్వడానికి న్యాయశాఖ ప్రజాప్రయోజనాల వ్యాజ్యాన్ని స్వీకరిస్తున్నది. కార్యనిర్వాహక శాఖ, శాసన నిర్మాణ శాఖల మధ్యదూరాన్ని తగ్గించేందుకు, ప్రాథమిక హక్కుల పరిరక్షణకు సమున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు నూతన విధానాలను, పద్ధతులను అనుసరిస్తున్నది.

శాసన నిర్మాణశాఖ, కార్యనిర్వహకశాఖ, అశ్రద్ధ, అలసత్వం కారణంగా కొన్ని సందర్భాలలో సామాజిక దోపిడీకీ గురయ్యే వర్గాలకు సామాజిక న్యాయం అందివ్వడానికి సోషియల్ యాక్షన్ గ్రూపులు (Social Action Groups), పౌర స్వేచ్ఛా సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు ప్రజా ప్రయోజన వ్యాజ్యం న్యాయస్థానాల న్యాయసమీక్ష అధికారపరిధిని చెలాయించడంలో న్యాయ పరిమితులను ఎప్పటికప్పుడు విస్తృత పరిచింది. న్యాయస్థానాలకు విస్తరింపబడిన ఈ పాత్రను విమర్శించే వారు విస్తరించబడిన పాత్రకు ‘న్యాయశాఖ క్రియాశీలత’ అని పేరు పెట్టారు అని” జస్టిస్ ఎ.ఎస్.ఆనంద్ పేర్కొన్నారు.

న్యాయశాఖ క్రియాశీలతకు గల కారణాలు: ఈ క్రింద తెలిపిన అంశాలు భారతదేశంలో న్యాయశాఖ క్రియాశీలతను అనుసరించడానికి మూలకారణాలుగా పేర్కొనవచ్చు.

  1. పరిపాలనా ప్రక్రియలో విస్తరించిన ప్రజావినతుల స్వీకార పరిధి.
  2. అపరిమిత దత్తశాసనాధికారాలు.
  3. పరిపాలనపై న్యాయసమీక్ష.
  4. ప్రజా ప్రభుత్వం బాధ్యతల పెరుగుదల.
  5. కోర్టు అధికార పరిధిని విచక్షణా రహితంగా ఉపయోగించడం.
  6. లేని అధికారపరిధిని వినియోగించడం.
  7. సామాజిక, ఆర్థిక, విద్యాపరమైన లక్ష్యాల విషయంలో మితిమీరిన ప్రమాణిక నిబంధనల పెరుగుదల.
  8. ప్రభుత్వంలోని ఇతర యంత్రాంగాల విచ్ఛిత్తి.

AP Inter 2nd Year Civics Study Material Chapter 5 కేంద్ర న్యాయశాఖ

ప్రశ్న 7.
ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL) అనగా నేమి ? [Mar. ’17]
జవాబు:
ప్రజా ప్రయోజన వ్యాజ్యం అనే భావన 1960వ దశకంలో అమెరికాలో అవిర్భవించింది. న్యాయవ్యవస్థ యొక్క గుర్తించబడిన స్థాయి (Locus-standi) కి సంబంధించిన సరళీకృత నియమాలనుంచి పుట్టు కొచ్చినదే ప్రజాప్రయోజన వ్యాజ్యం లేదా సామాజిక చర్యా వ్యాజ్యం (Social action Litigation). ప్రభుత్వ అధికారం వలన ఏ వ్యక్తి తన చట్టబద్ధమైన హక్కులకు భంగం కలిగి నష్టపోయి గాయపడతాడో ఆవ్యక్తి మాత్రమే న్యాయపరిహారం (Judicial Remedy) కోసం న్యాయస్థానాలను ఆశ్రయించాలి అనే సూత్రం పైన సాంప్రదాయ ‘గుర్తింపబడిన స్థాయి’ (లోకస్ స్టాం) నియమంపై ఆధారపడి ఉంటుంది. ప్రజాప్రయోజన వ్యాజ్యం ఈ సాంప్రదాయ నియమాన్ని సరళీకరించదలచినది.

సరళీకృత నియమం ప్రకారం చట్టబద్ధమైన హక్కులను నష్టపోయిన లేదా అన్యాయానికి గురైన వ్యక్తి స్వయంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించలేనపుడు సామాజిక స్పృహ, చైతన్యం కలిగిన వ్యక్తుల సహాయంతో కోర్టుల ద్వారా న్యాయాన్ని అభ్యర్థించవచ్చు.

భారతదేశంలో ప్రజాప్రయోజనాల వ్యాజ్య ఉద్యమం, అత్యవసర పరిస్థితి అనంతర కాలంలో ప్రారంభమైనది. సామాజికంగా, ఆర్థికంగా అణగారిన వర్గాలకు న్యాయవ్యవస్థను అందుబాటులోకి తేవడానికి ఈ ఉద్యమం ఉద్దేశించింది. అనేక అంశాలలో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL) ద్వారా న్యాయశాఖ క్రియాశీలతను సంతరించుకున్నది. న్యాయస్థానాన్ని ఆశ్రయించడానికి అశక్తులు, అసమర్థులైన బాధితుడు లేదా బాధితుల తరుపున ఏ వ్యక్తి లేదా సంస్థ అయినా క్లేశనివారణ (Redressal of Grievances) కోసం ప్రజాప్రయోజన వ్యాజ్యం ద్వారా సుప్రీంకోర్టు లేదా హైకోర్టును ఆశ్రయించవచ్చు. ఈ ఏర్పాటు క్రింద పూర్తిగా అభాగ్యుడు, అనాథుడైనా వ్యక్తి కూడా న్యాయవ్యవస్థ యొక్క సాంప్రదాయ పద్ధతి జోలికి వెళ్ళకుండానే కేవలం ఒక ఉత్తరం ద్వారా కోర్టులో రిట్ పిటిషన్ వేయవచ్చు. రాజ్యాంగంలోని 32వ ప్రకరణ సూచించిన “తన బాధను కోర్టుకు వినిపించే హక్కు” (Right to be Heard) ద్వారా దీనికి అధీకృత నమ్మకత్వం (Authentica- tion) ఏర్పడుతుంది. పిల్ ద్వారా కోర్టును చేరుతున్న వ్యక్తి నిజాయితీగా సదుద్దేశ్యంతో వ్యవహరిస్తున్నాడు. తప్ప వ్యక్తి గత ప్రయోజనాలు, ప్రైవేట్ లబ్ది లేదా రాజకీయ లేదా మరి ఏ ఇతర నీతిబాహ్య లక్ష్యాల కోసం కాదు అని న్యాయస్థానం నిర్ధారించుకోవాలి. చట్టం చేత అనుమతింపబడిన, హేతుబద్దమై పాలనా చర్యలను ఆలస్యం చేయడానికో లేదా తమ రాజకీయ లక్ష్యాలను సాధించుకోవడానికో రాజకీయనాయకులు కానీ ఇతరులు కానీ ప్రజాప్రయోజనాల వ్యాజ్యాన్ని దుర్వినియోగం చేయడాన్ని కోర్టులు అనుమతించవు.

ప్రశ్న 8.
న్యాయశాఖ ప్రతిపత్తి అంటే ఏమిటి ? భారత రాజ్యాంగం దానిని ఏ విధంగా ఏర్పాటు చేసింది ?
జవాబు:
న్యాయశాఖ ప్రతిపత్తి – అర్థం: సమన్యాయ పాలనా సూత్రాన్ని కాపాడి అనుసరించడం, శాసన ఆధిక్యాన్ని, ఔన్నత్యాన్ని స్థాపించడం న్యాయశాఖ ప్రధాన విధి. న్యాయశాఖ చట్టం ప్రకారం వివాదాలను పరిష్కరించి వ్యక్తుల హక్కులను పరిరక్షిస్తుంది. ఎవరి నియంతృత్వానికి ప్రజాస్వామ్యం లోబడకుండా ఉండేటట్లు చూస్తుంది. ఈ బాధ్యతలను నెరవేర్చడానికి రాజకీయ ఒత్తిళ్ళకు అవకాశం లేని స్వతంత్ర న్యాయశాఖ అవసరం.

భారత రాజ్యంగంలో న్యాయశాఖ స్వతంత్ర ప్రతిపత్తిని ఏర్పాటు చేసేందుకు తీసుకున్న చర్యలు:
1) న్యాయమూర్తుల నియామకంలో శాసన నిర్మాణశాఖ పాల్గొనదు. అందువలన న్యాయమూర్తుల నియామక ప్రక్రియలో పార్టీ రాజకీయాలకు ఎటువంటి పాత్ర ఉండదని భావించవచ్చు.

2) న్యాయమూర్తులకు నిర్ణీత పదవీకాలం ఉన్నది. పదవీ విరమణ వయస్సు వచ్చేంతవరకు వారు పదవిలో కొనసాగవచ్చు. అరుదైన సందర్భాలలో రాజ్యాంగం నిర్దేశించిన పద్ధతి ప్రకారమే వారిని పదవి నుంచి తొలగించవచ్చు. ఈ చర్య వలన న్యాయమూర్తుల నిర్భీతిగా, స్వేచ్ఛగా పనిచేయగలరు.

3) న్యాయమూర్తుల జీతభత్యాల చెల్లింపునకు శాసన నిర్మాణశాఖ అనుమతి అవసరం లేకుండా రాజ్యాంగం ఏర్పాటు చేసింది. అందువలన న్యాయశాఖ అటు కార్యనిర్వాహక, శాసన నిర్మాణశాఖలపై ఆర్థిక విషయాలలో ఆధారపడదు.

4) వ్యక్తిగత విమర్శల నుండి న్యాయమూర్తుల నిర్ణయాలకు, చర్యలకు రాజ్యాంగం రక్షణ కల్పించింది. కోర్టు ధిక్కారం క్రింద దోషిగా గుర్తింపబడిన వ్యక్తులను శిక్షించే అధికారాన్ని న్యాయవ్యవస్థకు ఇవ్వబడింది. ఈ చర్య అనుచిత విమర్శల నుండి న్యాయమూర్తులను రక్షిస్తుంది.

5) న్యాయశాఖ అనేది శాసననిర్మాణ కార్యనిర్వాహకశాఖల యొక్క అనుబంధశాఖ కాదు. రాజ్యాంగంలో ఈ శాఖకు స్వతంత్ర్య వ్యవస్థగా గుర్తింపు ఉన్నది.

6) న్యాయమూర్తులకు రాజ్యాంగం నిర్దిష్టమైన, ఉన్నత అర్హతలను సూచించింది. అటువంటి నిర్దిష్ట అర్హతలు, అనుభవం ఉన్నవారు మాత్రమే న్యాయమూర్తులుగా నియమించబడతారు.

AP Inter 2nd Year Civics Study Material Chapter 5 కేంద్ర న్యాయశాఖ

ప్రశ్న 9.
భారత అటార్నీ జనరల్ అధికారాలు, విధులు ఏవి ? [Mar. ’16]
జవాబు:
భారత రాజ్యాంగంలోని 76వ ప్రకరణ భారత అటార్నీ జనరల్ పదవికి అవకాశం కల్పిస్తున్నది. ఈయన కేంద్ర ప్రభుత్వంలో అత్యున్నత న్యాయాధికారి. భారత అటార్నీ జనరల్ రాష్ట్రపతిచే నియమింపబడి, రాష్ట్రపతి సంతృప్తిని పొందినంత కాలం పదవిలో కొనసాగుతాడు. పార్లమెంటు సభ్యుడికి ఉన్న అన్ని ప్రత్యేక హక్కులు, రక్షణలను పొందడానికి అటార్నీ జనరల్ ఆర్హుడు. అతడు పార్లమెంట్ సమావేశాలకు హాజరైనప్పుడు ప్రభుత్వానికి కేటాయించిన స్థానాలలో (Government Benches) కూర్చుంటాడు.
అర్హతలు: అటార్నీ జనరల్గా నియమింపబడే వ్యక్తి సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు గల అర్హతలను కలిగిఉండాలి. అవి:

  1. భారత పౌరుడై ఉండాలి.
  2. హైకోర్టు న్యాయమూర్తిగా నిరంతరాయంగా కనీసం ఐదు సంవత్సరాలు పనిచేసి ఉండాలి.
  3. హైకోర్టు న్యాయవాదిగా నిరంతరాయంగా కనీసం పది సంవత్సరాలు వ్యవహరించాలి ఉండాలి.
  4. రాష్ట్రపతి దృష్టిలో న్యాయకోవిదుడై ఉండాలి.

జీతభత్యాలు: అటార్నీ జనరల్కు జీతం చెల్లించరు. రాష్ట్రపతి నిర్ణయించిన పారితోషికం మాత్రం చెల్లిస్తారు. అతడి పారితోషికాన్ని రాజ్యాంగం నిర్ణయించలేదు. అయితే అటార్నీ జనరల్ పారితోషికం సుప్రీంకోర్టు న్యాయమూర్తుల జీతాలతో సమానంగా ఉంటుంది.

తొలగింపు: సుప్రీంకోర్టు న్యాయమూర్తులను తొలగించే విధానము తొలగింపుకు వర్తిస్తుంది. రాష్ట్రపతికి రాజీనామా సమర్పించడం ద్వారా అతడు తన పదవి నుండి వైదొలగవచ్చు. నిరూపితమైన అనుచిత ప్రవర్తన లేదా అసమర్ధత వంటి అభియోగాలతో పార్లమెంటు ఉభయసభలు విడివిడిగా ఒక తీర్మానాన్ని మొత్తం సభ్యుల సంఖ్యలో సంపూర్ణ మెజారిటీతోనూ, ఓటింగ్ లో పాల్గొన్న వారిలో 2/3వ వంతు మెజారిటీతో ఆమోదించి రాష్ట్రపతికి పంపితే, ఆ తీర్మానం ఆధారంగా రాష్ట్రపతి అటార్నీ జనరల్ను పదవి నుండి తొలగిస్తాడు.

అధికారాలు
విధులు: భారత రాజ్యాంగం అటార్నీ జనరలు కొన్ని అధికారాలను దత్తత చేసి మరికొన్ని విధులను అప్పగించినది. అవి:

  1. రాష్ట్రపతి తన పరిశీలనకు పంపించిన చట్టపరమైన అంశాలపై అటార్నీ జనరల్ కేంద్ర ప్రభుత్వానికి సలహా ఇస్తాడు.
  2. రాష్ట్రపతి తనకు అప్పగించే న్యాయసంబంధమైన విధులను నిర్వహిస్తాడు.
  3. భారత రాజ్యాంగం కానీ, చట్టం కానీ తనపై ఉంచిన విధులను నిర్వర్తిస్తాడు.
  4. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అన్ని కేసులలోనూ ప్రభుత్వం తరపున న్యాయస్థానాలలో హాజరువుతాడు.
  5. రాష్ట్రపతి సుప్రీంకోర్టు పరిశీలనకు పంపిన ఏ అంశాల విషయంలోనయినా కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా వ్యవహరిస్తాడు.

అటార్నీ జనరల్ పార్లమెంటు సభ్యుడు కానప్పటికీ పార్లమెంటు సమావేశాలకు హాజరై చర్చలలో, సమావేశాలలో పాల్గొనవచ్చు. మాట్లాడవచ్చు. కానీ అతనికి తీర్మానాలపై ఓటుచేసే ఓటు హక్కు వుండదు.

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
సుప్రీంకోర్టు న్యాయమూర్తుల అర్హతలు.
జవాబు:

  1. భారతీయ పౌరుడై ఉండాలి.
  2. ఏదైనా ఒకటి లేదా అంతకు మించిన హైకోర్టులలో నిరంతరాయంగా కనీసం 5 సంవత్సరాల పాటు న్యాయమూర్తిగా పనిచేసి ఉండాలి.
  3. ఏదైనా ఒకటి లేదా అంతకుమించిన హైకోర్టులలో నిరంతరాయంగా కనీసం 10 సంవత్సరాల పాటు న్యాయవాదిగా వ్యవహరించి ఉండాలి.
  4. రాష్ట్రపతి అభిప్రాయంలో న్యాయకోవిదుడై ఉండాలి.

AP Inter 2nd Year Civics Study Material Chapter 5 కేంద్ర న్యాయశాఖ

ప్రశ్న 2.
సుప్రీంకోర్టు న్యాయమూర్తుల తొలగింపు.
జవాబు:
నిరూపితమైన అధికార దుర్వినియోగం, అశక్తత, అయోగ్యత, అసమర్థత మొదలైన కారణాల వలన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు తొలగించబడతారు. అటువంటి మహాభియోగాలతో కూడిన తీర్మానాన్ని పార్లమెంటులోని ఉభయసభలు విడివిడిగా ఆయాసభలలో హజరైన సభ్యులలో 2/3వ వంతు సభ్యులు ఆమోదించి ఆన్యాయమూర్తిని తొలగించమని రాష్ట్రపతిని కోరితే, రాష్ట్రపతి వారిని తొలగించవచ్చు.

ప్రశ్న 3.
న్యాయ సమీక్ష. [Mar. ’16]
జవాబు:
సుప్రీంకోర్టు అధికారాలన్నింటిలోకెల్లా న్యాయసమీక్ష అత్యంత ముఖ్యమైనది. శాసన నిర్మాణ శాఖ రూపొందించిన శాసనాలు, కార్యనిర్వాహిక వర్గం తీసుకున్న నిర్ణయాలు రాజ్యాంగబద్ధంగా ఉన్నాయా ? లేదా ? అని సమీక్షించడానికి న్యాయస్థానాలకు గల అధికారాన్నే ‘న్యాయ సమీక్ష’ అని అంటారు. ఒకవేళ శాసనసభ చట్టాలు, కార్యనిర్వాహక వర్గం నిర్ణయాలు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉంటే వాటిని లోపభూయిష్టం, చెల్లుబాటు కావని సుప్రీంకోర్టు ప్రకటిస్తుంది.

ప్రశ్న 4.
కోర్టు ఆఫ్ రికార్డ్.
జవాబు:
రాజ్యాంగంలోని 141వ ప్రకరణ ప్రకారం సుప్రీంకోర్టు రికార్డులను భద్రపరచే కోర్టుగా వ్యవహరిస్తుంది. కోర్టు ధిక్కారానికి పాల్పడే వ్యక్తులను దోషులుగా ప్రకటించి నిందితులుగా నిలబెట్టవచ్చు. సుప్రీంకోర్టు వివిధ సందర్భాలలో ప్రకటించే తీర్పులు దిగువ కోర్టులన్నింటికి మార్గదర్శకాలుగా పనిచేస్తాయి.

ప్రశ్న 5.
న్యాయశాఖ క్రియాశీలత.
జవాబు:
న్యాయశాఖ క్రియాశీలతను కార్యనిర్వాహకశాఖ, శాసన నిర్మాణశాఖల అధికార పరిధిలో జోక్యం చేసుకోవటానికి న్యాయవ్యవస్థ చూపే అత్యుత్సాహంగా భావిస్తారు. సాధారణ పరిభాషలో ‘క్రియాశీలత’ అంటే ‘చురుకుగా ఉండటం నిర్ణయాలలో చర్యలు కొనసాగించటం’. ప్రతి న్యాయమూర్తి క్రియాశీలకంగా వుంటూ పురోగమన దృక్పథంతోగాని లేదా మరొక విధంగా కాని తన విధులను నిర్వహిస్తాడని జస్టిస్. కృష్ణయ్యర్ పేర్కొన్నాడు.

ప్రశ్న 6.
ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం (PIL).
జవాబు:
చట్టబద్దమైన హక్కులను నష్టపోయినా లేదా అన్యాయానికి గురైన వ్యక్తి స్వయంగా న్యాయస్థానాన్ని | ఆశ్రయించలేనపుడు సామాజిక స్పృహ, చైతన్యం కలిగిన వ్యక్తుల సహాయంతో కోర్టుల ద్వారా న్యాయాన్ని అభ్యర్థించవచ్చు. సామాజికంగా, ఆర్థికంగా అణగారిన వర్గాలకు న్యాయవ్యవస్థను అందుబాటులోకి తేవటానికి ప్రజాప్రయోజన వ్యాజ్యం తోడ్పడుతుంది.

ప్రశ్న 7.
న్యాయశాఖ స్వతంత్ర ప్రతిపత్తి.
జవాబు:
న్యాయశాఖ చట్టం ప్రకారం వివాదాలను పరిష్కరించి వ్యక్తుల హక్కులను కాపాడుతుంది. ఎవరి నియంతృత్వానికి ప్రజాస్వామ్యం లోబడకుండా ఉండేటట్లు చూస్తుంది. ఈ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడానికి రాజకీయ ఒత్తిళ్ళకు అవకాశం లేని స్వతంత్ర న్యాయశాఖ అవసరం. భారతదేశంలో న్యాయశాఖ స్వతంత్ర ప్రతిపత్తిని కాపాడటానికి భారత రాజ్యాంగం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది.

AP Inter 2nd Year Civics Study Material Chapter 5 కేంద్ర న్యాయశాఖ

ప్రశ్న 8.
హెబియస్ కార్పస్.
జవాబు:
హెబియస్ కార్పస్ అనగా ‘వ్యక్తి శరీరాన్ని ప్రవేశ పెట్టడం’ అని అర్థం. చట్ట వ్యతిరేకంగా నిర్భంధానికి గురైన వ్యక్తికి బంధవిముక్తి కలిగించటానికి ఈ రిట్ను మంజూరు చేస్తారు. అక్రమంగా నిర్భంధించబడిన వ్యక్తిని కోర్టు ఎదుట హాజరు పరచండి అని సంబంధిత అధికారిని అదేశించడానికి హెబియస్ కార్పస్ రిట్ను సుప్రీంకోర్టు జారీచేస్తుంది.

ప్రశ్న 9.
సుప్రీంకోర్టు పీఠం. [Mar. ’17]
జవాబు:
సుప్రీంకోర్టు ప్రధాన కార్యాలయం న్యూఢీల్లిలో ఉంది. పూర్వపు ఫెడరల్ కోర్టు చివరి ప్రధాన న్యాయమూర్తి అయిన హెచ్.జె.కానియా సుప్రీంకోర్టు మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించారు. రాజ్యాంగ సంబంధమైన వివాదాలను ఐదురుగు జడ్జీలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం పరిష్కరిస్తుంది. ప్రత్యేక వివాదాలను విచారించడానికి ఐదు లేదా అంతకంటే ఎక్కువమంది న్యాయమూర్తులతో ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటు చేస్తారు.

ప్రశ్న 10.
రిట్లు (రిట్లు).
జవాబు:
రిట్ అనే పదానికి అర్థం ‘వ్రాతపూర్వక ఆదేశం’. రాజ్యాంగంలోని 32వ ప్రకరణ పౌరులు ప్రాథమిక హక్కులను |అమలు చేయటానికి రిట్లను జారీచేసే అధికారాన్ని సుప్రీంకోర్టు ఇచ్చింది. ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లినపుడు రాజ్యాంగ పరిహారంలో భాగంగా సుప్రీంకోర్టు హెబియస్ కార్పస్, మాండమస్, ప్రోహిబిషన్, సెర్షియోరరీ, కోవారంటో మొదలైన రిట్లను జారీ చేస్తుంది.

AP Inter 2nd Year Civics Study Material Chapter 4 కేంద్ర శాసననిర్మాణ శాఖ

Andhra Pradesh BIEAP AP Inter 2nd Year Civics Study Material 4th Lesson కేంద్ర శాసననిర్మాణ శాఖ Textbook Questions and Answers.

AP Inter 2nd Year Civics Study Material 4th Lesson కేంద్ర శాసననిర్మాణ శాఖ

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
పార్లమెంటు (కేంద్ర శాసన నిర్మాణ శాఖ) అధికారాలు, విధులను వివరించండి. [Mar. ’17, ’16]
జవాబు:
భారత పార్లమెంటు ద్వంద్వ శాసనసభ. దానిలో రెండు సభలు ఉన్నాయి. అవి: రాజ్యసభ, లోక్సభ. రాజ్యసభను ఎగువసభ అని అంటారు. లోక్సభను దిగువసభ అని అంటారు. రాజ్యసభ రాష్ట్రాలకు ప్రాతినిథ్యం వహించుటచే దానిని ‘హౌస్ ఆఫ్ స్టేట్స్’ (House of States) అని కూడా అంటారు. దీని గరిష్ఠ సంఖ్య 250. వీరిలో 238 మంది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహిస్తారు. 12 మందిని రాష్ట్రపతి నియమిస్తాడు. ఇది శాశ్వతసభ. సభ్యుల పదవీకాలం 6 సం॥లు. లోక్సభ ప్రజలకు ప్రాతినిధ్యం వహించుటచే అది ప్రజాప్రతినిధుల సభ. దానిని ఆంగ్లంలో ‘హౌస్ ఆఫ్ ది పీపుల్’ (House of the People) అని అంటారు. దీని గరిష్ఠ సంఖ్య 552. దీనిలో 530 మంది రాష్ట్రాల నుండి, 20 మంది కేంద్రపాలిత ప్రాంతాల నుండి ఎన్నుకోబడతారు. ఇద్దరు ఆంగ్లో-ఇండియన్లు రాష్ట్రపతిచే నియమింపబడతారు. కొన్ని విషయాలలో మినహా రెండు సభలకు సమానమైన అధికారాలున్నాయి. రెండు సభలలోని సభ్యులను పార్లమెంట్ సభ్యులనే అంటారు. పార్లమెంటుకు విశేషమైన అధికారాలు ఉన్నాయి.

పార్లమెంటు అధికారాలు: పార్లమెంటు విధులను, అధికారాలను ఈ క్రింది విధంగా వర్గీకరించవచ్చు.

1) శాసన నిర్మాణాధికారాలు: ప్రజాశ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని పరిపాలన నిర్వహించడానికి కావలసిన శాసనాలను తయారుచేయడం పార్లమెంటు ప్రధాన విధి. కేంద్ర మరియు ఉమ్మడి జాబితాలలోని అన్ని అంశాలపైన పార్లమెంటు శాసనాలు చేయవచ్చు. సాధారణంగా రాష్ట్ర జాబితాలోని అంశాలపై శాసనాలు చేసే అధికారం దానికి లేదు. కొన్ని ప్రత్యేక పరిస్థితులలో రాష్ట్ర జాబితాలోని అంశాలపై పార్లమెంటు శాసనాలు చేయవచ్చు. అవశిష్టాధికారాలపై (Residuary powers) శాసనాలు చేసే అధికారం పార్లమెంటుకు మాత్రమే కలదు.

2) కార్యనిర్వహణాధికారాలు: పార్లమెంటరీ విధానంలో మంత్రివర్గం తన చర్యలకు పార్లమెంట్ బాధ్యత వహిస్తుంది. పార్లమెంటు ఎన్నో విధాలుగా కార్యనిర్వహక వర్గాన్ని అదుపు చేస్తుంది. మంత్రులను ప్రశ్నలు అడగడం ద్వారాను, వారి పనులపై ఆక్షేపణ తీర్మానాలు ప్రవేశపెట్టడం ద్వారాను, ఆర్థికమంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్ను తిరస్కరించడం ద్వారాను, అవిశ్వాస తీర్మానాలు ఆమోదించడం ద్వారాను పార్లమెంటు మంత్రిమండలిని అదుపులో పెట్టగలుగుతుంది.

AP Inter 2nd Year Civics Study Material Chapter 4 కేంద్ర శాసననిర్మాణ శాఖ

3) ఆర్థికాధికారాలు: ఆర్థిక విషయాలలో పార్లమెంటుకు తిరుగులేని అధికారాలు ఉన్నాయి. పార్లమెంటు అనుమతి లేనిదే కొత్త పన్నులు విధించకూడదు. ప్రభుత్వ ఆదాయ వ్యయపట్టిక (బడ్జెట్ – Budget) పార్లమెంటు అనుమతితో అమలుపరచబడును. సాధారణ బడ్జెట్తో పాటు, రైల్వేబడ్జెట్ను కూడా ఆమోదించును. మనీబిల్లులను ఆమోదించడంలో రాజ్యసభ కంటే లోక్సభకే ఎక్కువ అధికారాలున్నాయి. లోక్సభ ఆమోదించిన తర్వాత మనీబిల్లులు రాజ్యసభకు పంపబడును. వాటిని రాజ్యసభ 14 రోజుల గడువులో తిరిగి లోక్సభకు పంపాలి. వివిధ కమిటీల నివేదికలను పార్లమెంట్ చర్చిస్తుంది.

4) రాజ్యాంగాన్ని సవరించే అధికారము: రాజ్యాంగాన్ని సవరించే అధికారాన్ని రాజ్యాంగం పార్లమెంటుకు ఇచ్చింది. రాజ్యాంగానికి సవరణలు ప్రతిపాదించే అధికారం రాష్ట్ర శాసనసభలకు లేదు. భారత రాజ్యాంగాన్ని సవరించడానికి రాజ్యాంగంలో మూడు పద్దతులు సూచించారు. ఆ పద్దతులననుసరించి పార్లమెంటు రాజ్యాంగాన్ని సవరిస్తుంది.

5) న్యాయాధికారాలు: భారత పార్లమెంటుకు కొన్ని న్యాయాధికారాలు కూడా ఉన్నాయి. అవి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతిపై వచ్చిన అభియోగాలను చర్చించి, 2/3వ వంతుమంది సభ్యుల ఆమోదంతో వారిని పదవుల నుండి తొలగించవచ్చు. సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను పెంచే అధికారం, వారిని పదవి నుండి తొలగించే అధికారం, అట్లాగే ఇతర ఉన్నతాధికారులను పదవి నుండి తొలగించమని రాష్ట్రపతికి సిఫారసు చేసే అధికారం, కొత్త హైకోర్టులను ఏర్పాటుచేసే అధికారం పార్లమెంటుకు ఉన్నాయి.

6) ఎన్నికల విధులు: రాజ్యసభకు మరియు లోక్సభకు ఎన్నికైన సభ్యులు అందరూ కలసి రాష్ట్రపతిని ఎన్నుకొనే నియోజకగణంలో భాగంగా ఉంటారు. ఉపరాష్ట్రపతిని పార్లమెంటులోని ఉభయసభల సభ్యులు కలసి ఎన్నుకొంటారు. వీరుగాక లోక్సభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్లను లోక్సభ సభ్యులు, రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ను రాజ్యసభ సభ్యులు ఎన్నుకొంటారు.

7) ప్రజాభిప్రాయ వేదిక: దేశ పరిపాలనకు సంబంధించిన అనేక విషయాలపైన, బిల్లులపైన పార్లమెంట్ సమావేశాలలో సభ్యులు స్వేచ్చగా తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తారు. పార్లమెంటు సభ్యులు ప్రజాప్రతినిధులు కాబట్టి, వారు దేశంలో వివిధ ప్రాంతాలకు చెందినవారు కాబట్టి వారి విమర్శలు, చర్చల ద్వారా ప్రజాభిప్రాయం వ్యక్తమవుతుంది.

8) ఇతర అధికారాలు: పార్లమెంటుకు రాష్ట్రాల సరిహద్దులు, శాసన మండలాల ఏర్పాటు లేదా రద్దు, రాష్ట్రాల పేర్లు మార్చే అధికారం ఉన్నది.
ముగింపు: పైన పేర్కొన్న అధికారాలను పరిశీలిస్తే రాజ్యాంగం, భారత పార్లమెంటుకు విశేషమైన అధికారాలను కల్పించినట్లు తెలియుచున్నది. కానీ న్యాయసమీక్ష, సమాఖ్య ప్రభుత్వ విధానం, లిఖిత రాజ్యాంగం, ప్రాథమిక హక్కులు మొదలగు లక్షణాలు పార్లమెంటు అధికారాలపై కొంత నియంత్రణ స్వభావాన్ని కలిగి ఉన్నాయి.

ప్రశ్న 2.
లోక్సభ స్పీకర్ అధికారాలు, విధుల గురించి వ్రాయండి.
జవాబు:
లోక్సభ స్పీకర్: భారత రాజ్యాంగంలోని 93 నుండి 97 వరకు గల ఐదు అధికరణాలు లోక్సభ స్పీకర్ గురించి పేర్కొన్నాయి. లోక్సభ ఎన్నికలు పూర్తయిన తరువాత రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు లోక్సభ మొదటి సమావేశం తేదీని ప్రకటించడం జరుగుతుంది. ఆ సమావేశానికి అధ్యక్షత వహించేందుకు రాష్ట్రపతి తాత్కాలిక స్పీకర్ (Protem |Speaker) ను నియమిస్తాడు. సాధారణంగా ఎన్నికైన సభ్యులలో అందరికంటే ఎక్కువసార్లు లోక్సభకు ఎన్నికైన సభ్యుడిని లేదా అందరికంటే వయస్సులో పెద్దవాడైన సభ్యుడిని లేదా సభా నియమాలపట్ల క్షుణ్ణమైన అవగాహన గల సభ్యుడిని రాష్ట్రపతి తాత్కాలిక స్పీకర్గా నియమిస్తాడు. తాత్కాలిక స్పీకర్ సభ్యులతో ప్రమాణస్వీకారం చేయిస్తాడు. సభ్యుల ప్రమాణస్వీకార కార్యక్రమం పూర్తయిన తరువాత స్పీకర్ ఎన్నిక జరుగుతుంది.

ఎన్నిక: లోక్సభ సభ్యులు తమలో ఒకరిని స్పీకర్గానూ, మరొకరిని డిప్యూటీ స్పీకర్ గానూ ఎన్నుకుంటారు. సాధారణంగా లోక్సభలో మెజారిటీ స్థానాలు గల అధికార పార్టీకి స్పీకర్ పదవి, భావసారూప్యత గల ఇతర పక్షాలలో ఒకదానికి డిప్యూటీ స్పీకర్ పదవి కేటాయించడం జరుగుతుంది. ఐతే అనేకసార్లు అందుకు భిన్నంగా రెండు పదవులను
|అధికారపక్షమే ఉంచుకోవడం జరిగింది. ఒకవేళ లోక్సభలో ఏ ఒక్క పార్టీకి సంపూర్ణ మెజారిటీ రానిపక్షంలో, సంకీర్ణ మంత్రిమండలి ఏర్పడిన సందర్భంలో స్పీకర్ పదవికి అభ్యర్థిని నిర్ణయించడంలో భాగస్వామ్య పక్షాలు ఒక అవగాహనకు వచ్చి తమలో తాము సర్దుబాటు చేసుకొని ఒకరికి ఆ పదవి వచ్చే విధంగా ప్రయత్నిస్తాయి. మరికొన్ని ప్రత్యేక పరిస్థితులలో భాగస్వామ్య పక్షాలు ఆ పదవిని తమ వెలుపలి నుంచి మద్దతు ఇస్తున్న పార్టీ ఎంపిక చేసిన సభ్యునికి కూడా ఇవ్వవచ్చు.

స్పీకర్ అధికారాలు – విధులు: స్పీకర్ అధికారాలు – విధులను సక్రమంగా, సమర్ధవంతంగా నిర్వహించేందుకై అతడికి భారత రాజ్యాంగం విశేషాధికారాలను సంక్రమింపజేసింది. అంతేగాకుండా పార్లమెంటు కార్యక్రమాల నిర్వహణకు సంబంధించిన నియమ నిబంధల చట్టం (Rules of procedures and conduct of Business in Parliament Act – 1956) లోక్ సభ స్పీకర్కు క్రింద పేర్కొన్న వైవిధ్యంతో కూడిన అధికారాలు విధులు ఉంటాయి.

1) లోకసభ సమావేశాలను స్పీకర్ అధ్యక్షత వహిస్తాడు. లోక్సభ సమావేశాలను ఎంతో హుందాతనం, భద్రత, సామర్ధ్యాలతో నిర్వహిస్తాడు. సభానాయకుడని సంప్రదించి అజెండాను నిర్ణయిస్తాడు.

2) బిల్లులపై సభ్యులు అభిప్రాయాలు తెలిపేందుకు తగిన సమాయాన్ని కేటాయిస్తాడు. బిల్లులపై అవసరమైతే ఓటింగ్ నిర్వహించి, ఫలితాలను ప్రకటిస్తాడు.

3) లోక్సభ ఆమోదించిన బిల్లులను రాజ్యసభకు పంపుతాడు. రాజ్యసభ పంపించిన బిల్లులను ధృవీకరించి, వాటిని రాష్ట్రపతి ఆమోదానికి పంపుతాడు.

4) లోక్సభ ప్రతినిధిగా వ్యవహరిస్తాడు.

5) లోక్సభ సభ్యుల హక్కులు, సౌకర్యాల పరిరక్షణకు అవసరమైన చర్యలను గైకొంటాడు. సభలో అధికారం, ప్రతిపక్ష పార్టీల సభ్యుల మధ్య సమానమైన, నిష్పాక్షిక వైఖరిని ప్రదర్శిస్తాడు. ‘సభలో ప్రతిష్టంభన ఏర్పడితే, తన రూలింగ్ ద్వారా సాధారణ పరిస్థితుల పునరుద్ధరణకు దోహదపడతాడు.

6) ఒక బిల్లు ఆర్థిక పరమైందా ? లేదా ? అనే అంశాన్ని నిర్ణయిస్తాడు. సభ ఆమోదించిన బిల్లులపై సంతకాలు చేస్తాడు.

7) ఎ) స్పీకర్ సభ్యులు
(1) బిలులపై పాయింట్ ఆఫ్ ఆర్డరు ప్రతిపాదించేందుకు
(2) ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు
(3) ముఖ్యమైన ప్రజా సమస్యలను ప్రస్తావించేందుకు
బి) లోక్సభ సమావేశాలను వాయిదా వేసేందుకు
సి) లోక్సభ సమావేశాల కోరమ్ నిర్ణయించేందుకు అధికారం ఉంది.

8) రాష్ట్రపతి ప్రసంగంపై ప్రవేశపెట్టే ధన్యవాద తీర్మానంపై సభ్యులు అభిప్రాయాలను వెల్లడించేందుకు అవకాశం ఇస్తాడు.

9) వివిధ సభా సంఘాలను ఏర్పరచి, వాటి చైర్మన్లు, సభ్యులను నియమిస్తాడు. సభా నియమాల కమిటీ, సభావ్యవహారాల కమిటీలకు పదవిరీత్యా చైర్మన్ గా వ్యవహరిస్తాడు.

10) పార్లమెంటు ఉభయసభల సంయుక్త సమావేశాలకు అధ్యక్షత వహిస్తాడు.

11) కామన్వెల్త్ స్పీకర్ల ఫోరమ్ సభ్యుడిగానూ, ఇండియన్ పార్లమెంటరీ గ్రూప్ చైర్మన్ గాను, లోక్సభ సచివాలయ అధిపతిగానూ వ్యవహరిస్తాడు.

12) లోక్సభలో కొత్తగా ఎన్నికైన సభ్యులవద్ద ఎన్నికల ధృవీకరణ పత్రాలను స్వీకరిస్తాడు. అట్లాగే సభ్యులు సమర్పించిన రాజీనామా పత్రాలపైన, లోక్సభలో పత్రికా విలేఖరులకు, సందర్శకులకు సీట్ల కేటాయింపు వంటి అంశాలపై నిర్ణయాలు తీసుకొంటాడు.

AP Inter 2nd Year Civics Study Material Chapter 4 కేంద్ర శాసననిర్మాణ శాఖ

13) లోక్సభలోను, లోక్సభ ప్రాంగణంలోనూ మార్షల్స్, ఇతర సిబ్బంది పనులను పర్వవేక్షిస్తారు.

14) ఒకానొక బిల్లుపై ఓటింగ్ విషయంలో ప్రతిష్టంభన ఏర్పడితే, ఆ బిల్లు భవితవ్యాన్ని నిర్ణయించేందుకై ఓటు వేస్తాడు.

15) డిప్యూటీ స్పీకర్ పదవిలో ఖాళీ ఏర్పడినచో, ఆ స్థానం భర్తీకి ఎన్నిక నిర్వహిస్తాడు.

ప్రశ్న 3.
పార్లమెంటులోని ఆర్థిక సంఘాల పాత్రను అంచనా వేయండి.
జవాబు:
ఉపోద్ఘాతం: భారత పార్లమెంటులో ఆర్థిక సంఘాలు మూడున్నాయి. అవి:

  1. ప్రభుత్వ ఖాతాల సంఘం
  2. అంచనాల సంఘం
  3. ప్రభుత్వ ఉపక్రమాల సంఘం

1) ప్రభుత్వ ఖాతాల సంఘం: ప్రభుత్వ ఖాతాల సంఘం 1921లో ఏర్పాటైంది. దీనిలో 22 మంది సభ్యులు ఉంటారు. వారిలో 15 మంది లోక్సభ నుంచి, 7 గురు రాజ్యసభ నుంచి ఎన్నుకోబడతారు. వారి పదవీకాలం ఒక సంవత్సరం. వారందరూ నైష్పత్తిక ప్రాతినిధ్య పద్దతి ప్రకారం ‘ఏకోఓటుబదిలి’ సూత్రం ప్రకారం ఎన్నుకోబడతారు. లోక్సభ స్పీకర్ వారిలో ఒకరిని ఆ సంఘం అధ్యక్షుడిగా నియమిస్తాడు.

అధికారాలు, విధులు:

  1. భారత కంప్టోలర్ మరియు ఆడిటర్ జనరల్ వార్షిక గణాంక తనిఖీ నివేదికలను పరీక్షిస్తుంది.
  2. ప్రభుత్వ ఖర్చును న్యాయపరమైన, లాంఛనప్రాయమైన దృష్టితో చూసి, వాటిలో సాంకేతిక అభ్యంతరాలను పరీక్షిస్తుంది. ఆర్థిక పొదుపు, జ్ఞానం, సందర్భోచిత కోణములలో పరీక్షిస్తుంది.
  3. లోకసభలో ప్రవేశపెట్టిన వినియోగాధికార గణాంకాలు, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక గణాంకాలు, ఇతర గణాంకాలను పరిశీలించి వెల్లడిస్తుంది.
  4. ప్రభుత్వ నిధులు సక్రమంగా బట్వాడా చేయబడినవా, లేదా అనే అంశాన్ని పరీక్షిస్తుంది.
  5. కంట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ నిర్వహించిన గణాంకాలను తనిఖీ చేస్తుంది.

2) అంచనాల సంఘం: 1921లో ఆర్థిక స్థాయి సంఘంగా ఇది ఏర్పడింది. తర్వాత 1950 ఏప్రియల్లో అంచనాల సంఘంగా పేరు మారచ్చబడి పనిచేయడం ప్రారంభించింది. ఈ సంఘంలో లోక్సభ నుంచి 30 మంది సభ్యులు ఉంటారు. దీనిలో రాజ్యసభకు ప్రాతినిధ్యం లేదు. ప్రతి సంవత్సరం లోక్సభ సభ్యులు తమలో కొందరిని నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతి ప్రకారం ‘ఏకఓటుబదిలీ’ సూత్రం అనుసరించి ఈ సంఘం సభ్యులను ఎన్నుకొంటారు. ఈ సంఘం సభ్యులు ఒక ఏడాది పాటు పదవిలో ఉంటారు. లోక్సభ స్పీకర్ ఈ సంఘం అధ్యక్షుణ్ణి నియమిస్తాడు.

అధికారాలు, విధులు:

  1. కేంద్ర ప్రభుత్వం వ్యవస్థ సామర్థ్యాన్ని పెంచుకొనేందుకు, ఖర్చును తగ్గించుకొనేందుకు ఆర్థికపరమైన పొదుపును పాటించే విషయంలో సలహాలను ఇస్తుంది.
  2. ప్రభుత్వ నిధులు అంచనాలకు అనుగుణంగా బట్వాడా చేయబడినవా, లేదా అనే అంశాన్ని పరీక్షిస్తుంది.
  3. లోక్సభ స్పీకర్ అప్పగించిన విషయాలను పరీక్షిస్తుంది.
  4. అంచనాలలో చేర్చబడిన నిర్ణీత పరిధులకు లోబడి విధానాలు, వాటికి సంబంధించిన ధన సక్రమ వినియోగం గురించి పరీక్షిస్తుంది. కొందరు ఈ సంఘాన్ని నిరంతర ఆర్థిక సంఘంగా వర్ణించారు.

3) ప్రభుత్వ ఉపక్రమాల సంఘం: ఈ సంఘం 1964లో కృష్ణమీనన్ సంఘం సిఫార్సుల ప్రకారం ఏర్పాటైంది. దీనిలో 22 మంది సభ్యులుంటారు. 15 మంది లోక్సభ నుంచి 7 గురు రాజ్యసభ నుండి ఎన్నుకోబడతారు. వారిని ఎన్నుకొనేందుకు నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతి ప్రకారం ‘ఏకఓటు బదిలి’ సూత్రం అనుసరించబడుతుంది. వీరి పదవీ కాలం ఒక సంవత్సరం. ఈ సంఘం ముఖ్యోద్దేశం ఏమిటంటే ప్రభుత్వ ఖాతాల సంఘం పని భారాన్ని తగ్గించడం. ఈ సంఘం అధ్యక్షుడిగా లోక్సభ నుంచి ఎన్నికైన సభ్యులలో ఒకరిని స్పీకర్ నియమిస్తాడు. అంటే రాజ్యసభకు చెందిన సభ్యులెవరూ ఈ సంఘం అధ్యక్షుడిగా ఎన్నుకోబడరు.

అధికారాలు, విధులు:

  1. ప్రభుత్వ ఉపక్రమాల గణాంకాలను, నివేదికలను పరీక్షించడం.
  2. ప్రభుత్వ ఉపక్రమాలపై కంట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ నివేదికను పరీక్షించడం.
  3. ప్రభుత్వ ఉపక్రమ సంఘాలు మంచి వ్యాపార సూత్రాలను పాటిస్తూ వాటిని సక్రమంగా అమలుచేస్తున్నాయా లేదా, అనే విషయాన్ని పరీక్షించడం.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
లోక్సభ నిర్మాణం గురించి వ్రాయండి.
జవాబు:
లోక్సభ నిర్మాణం: లోక్సభ భారత పార్లమెంటులోని దిగువసభ. దీన్ని ఆంగ్లంలో “హౌస్ ఆఫ్ ది పీపుల్” అని పిలుస్తారు.

భారత రాజ్యాంగం 81వ అధికరణం లోక్సభ నిర్మాణాన్ని తెలియజేస్తుంది. ఆ అధికరణం ప్రకారం లోక్సభలో 552 మంది సభ్యులుంటారు. మొత్తం సభ్యులలో 530 మంది రాష్ట్రాలకు, 20 మంది కేంద్రపాలిత ప్రాంతాలకు చెందినవారుకాగా, మిగిలిన ఇద్దరు సభ్యులు ఆంగ్లో ఇండియన్ వర్గానికి చెందినవారు. లోక్సభలో ఆంగ్లో ఇండియన్లకు తగిన ప్రాతినిధ్యంలేదని రాష్ట్రపతి భావిస్తే, ఆ వర్గానికి చెందిన ఇద్దరు సభ్యులను రాష్ట్రపతి నామినేట్ చేస్తాడు. రాజ్యాంగం 81వ అధికరణం ప్రకారం లోక్సభలో రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహించే సభ్యులను ఆయా రాష్ట్రాలలోని రిజిష్టర్డ్ ఓటర్లు ఎన్నుకుంటారు. అట్లాగే కేంద్రపాలిత ప్రాంతాలలోని సభ్యులను ఆ ప్రాంతంలోని రిజిష్టర్డ్ ఓటర్లు ఎన్నుకుంటారు. ప్రత్యక్ష ప్రాతినిధ్య పద్ధతి ప్రకారం సభ్యుల ఎన్నిక జరుగుతుంది.

AP Inter 2nd Year Civics Study Material Chapter 4 కేంద్ర శాసననిర్మాణ శాఖ

ప్రశ్న 2.
సభాపతి (స్పీకర్) ఎన్నిక విధానమును వివరించండి.
జవాబు:
లోక్సభ సభ్యులు తమలో ఒకరిని స్పీకర్గానూ, వేరొకరిని డిప్యూటీ స్పీకర్గానూ ఎన్నుకుంటారు. సాధారణంగా లోక్సభలో మెజారిటీ స్థానాలుగల అధికార పార్టీకి స్పీకర్ పదవి, భావసారూప్యత గల ఇతర పక్షాలలో ఒక దానికి డిప్యూటీ స్పీకర్ పదవిని కేటాయించడం జరుగుతుంది. ఐతే కొన్నిసార్లు అందుకు భిన్నంగా రెండు పదవులను అధికార పక్షమే ఉంచుకోవడం జరిగింది. ఒకవేళ లోక్సభలో ఏ ఒక్క పార్టీకి సంపూర్ణ మెజారిటీ రాని పక్షంలో, సంకీర్ణ మంత్రిమండలి ఏర్పడిన సందర్భంలో స్పీకర్ పదవికి అభ్యర్థిని నిర్ణయించడంలో భాగస్వామ్య పక్షాలు ఒక అవగాహనకు వచ్చి తమలో తాము సర్దుబాటు చేసుకుని ఒకరికి ఆ పదవి వచ్చే విధంగా ప్రయత్నిస్తాయి. మరికొన్ని ప్రత్యేక పరిస్థితులలో భాగస్వామ్య పక్షాలు ఆ పదవిని తమకు వెలపలి నుంచి మద్దతు ఇస్తున్న పార్టీ ఎంపిక చేసిన సభ్యునికి కూడా ఇవ్వవచ్చు. ఇటువంటి పరిస్థితి 1998 మార్చిలో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ఎన్.డి.ఏ. ప్రభుత్వానికి ఎదురైంది. ప్రభుత్వానికి వెలుపలి నుంచి మద్దతునిచ్చే ప్రాంతీయ పార్టీ తెలుగుదేశానికి చెందిన జి.ఎమ్.సి. బాలయోగికి ఆ పదవి లభించింది. తరువాత ఆయన ఆకస్మిక మరణంవల్ల భాగస్వామ్య పక్షాలలో ఒకటైన శివసేనకు చెందిన మనోహర్ గజానన్ జోషి 2002 మే 10న ఆ పదవిని చేపట్టాడు. అలాగే పద్నాలుగో లోక్సభలో ఐక్యప్రగతి కూటమి (యుపిఎ) కి మద్దతుగా కేంద్ర ప్రభుత్వాన్ని వెలుపలి నుంచి బలపరుస్తున్న భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) కి చెందిన సోమనాథ్ చటర్జీ లోక్సభ స్పీకర్గా ఎన్నికయ్యారు.

స్పీకర్ ఎన్నికలో రెండు ఆసక్తికరమైన అంశాలు ఉంటాయి. అవి: (1) స్పీకర్గా ఎన్నికయ్యే వ్యక్తి తప్పనిసరిగా లోక్సభ సభ్యుడై ఉండాలి. (2) లోక్సభ రద్దయినప్పటికీ స్పీకర్ ఆ పదవిలో కొనసాగుతాడు. కొత్త లోక్సభకు ఎన్నికలు జరిగి నూతన స్పీకర్ ఎంపిక, పదవీ స్వీకారం వరకు స్పీకర్ అధికారంలో కొనసాగుతాడు.

ఒకవేళ స్పీకర్ సక్రమంగా, నిష్పక్షపాతంగా అధికార విధులను నిర్వహించనట్లయితే లోక్సభ సభ్యులు అభిశంసన తీర్మానం ద్వారా ఆయనను తొలగించవచ్చు. అటువంటి తీర్మానాన్ని 14 రోజుల ముందుగా సభకు సమర్పించాలి. ఆ గడువు ముగిసిన తరువాత ఏదో ఒకరోజున సభ ఆ తీర్మానంపై చర్చను ప్రారంభిస్తుంది. ఆ సమయంలో, ఆ తరువాత తీర్మానంపై ఓటింగ్ నిర్వహించేటప్పుడు స్పీకర్ అధ్యక్ష స్థానంలో ఉండటానికి ఓటింగ్లో పాల్గొనడానికి వీలులేదు. తన అభిప్రాయాలను సభలో వెల్లడించేందుకు ఆయనకు అవకాశం ఉంటుంది.

ప్రశ్న 3.
రాజ్య సభ నిర్మాణం, సభ్యుల అర్హతలు గురించి నీకు ఏమి తెలియునో పేర్కొనండి.
జవాబు:
రాజ్యసభ నిర్మాణం: రాజ్యసభలో సభ్యత్వం మొత్తం 250కు మించి ఉండదు. భారత ఉపరాష్ట్రపతి ఈ సభకు అధికార హోదా రీత్యా అధ్యక్షుడిగా వ్యవహరిస్తాడు. రాజ్యసభ సభ్యులు తమలో ఒకరిని రాజ్యసభ ఉపాధ్యక్షుడిగా ఎన్నుకొంటారు. ప్రస్తుతం రాజ్యసభలో 245 మంది సభ్యులు ఉన్నారు. వారిలో 233 మంది రాష్ట్రాల నుండి ఎన్నుకోబడగా, మిగిలిన 12మంది భారత రాష్ట్రపతిచే నియమితులవుతారు. మొత్తం సభ్యులలో 229 మంది 29 రాష్ట్రాల నుండి ఎన్నుకోబడగా, ముగ్గురు సభ్యులు జాతీయ దేశ రాజధాని ప్రాంతం ఢిల్లీ నుండి, ఒకరు కేంద్రపాలిత ప్రాంతం అయిన పుదుచ్చేరి నుండి ఎన్నుకోబడతారు. వివిధ రంగాల్లో నిష్ణాతులు మరియు విశిష్ట సేవ చేసిన 12 మంది ప్రముఖులను రాష్ట్రపతి రాజ్యసభకు సభ్యులుగా నియమిస్తాడు. సాధారణంగా వారు సాహిత్య, శాస్త్ర విజ్ఞానము, కథలు, సామాజిక రంగాలకు చెందినవారై ఉంటారు.

రాజ్యసభ సభ్యులకుండవలసిన అర్హతలు:

  1. అతడు భారత పౌరుడై ఉండాలి.
  2. అతడు కనీసం 30 సం|| వయస్సు కలిగి ఉండాలి.
  3. అతడు ఆ రాష్ట్రంలో కనీసం ఆరు నెలలు నివాసం ఉండి ఉండాలి.
  4. అతడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో ఆదాయాన్ని పొందే ఏ హోదాలోనూ పనిచేసి ఉండరాదు.
  5. అతడు మతిస్థిమితం లేనివాడు లేదా దివాళా కోరు కారాదు.
  6. అతడు పార్లమెంటుచే సూచించబడిన ఇతర అర్హతలు కూడా పొంది ఉండాలి.

AP Inter 2nd Year Civics Study Material Chapter 4 కేంద్ర శాసననిర్మాణ శాఖ

ప్రశ్న 4.
రాజ్యసభ ఛైర్మన్ మరియు డిప్యూటీ ఛైర్మన్ల గురించి వ్రాయండి.
జవాబు:
రాజ్యసభ చైర్మన్: రాజ్యసభ కార్యక్రమాలను నిర్వహించే వ్యక్తిని చైర్మన్ అంటారు. రాజ్యసభలో సభ్యుడు కాకపోయిప్పటికి భారత ఉపరాష్ట్రపతి అధికార హోదా రీత్యా రాజ్యసభకు చైర్మన్. పార్లమెంటు సభ్యులు అతడిని ఉపరాష్ట్రపతిగా 5సం|| కాలానికి ఎన్నుకొంటారు. దాని అర్థం లోక్సభ, రాజ్యసభల సభ్యులందరూ ఉపరాష్ట్రపతి ఎన్నికలలో
పాల్గొంటారు. ప్రస్తుతం రాజ్యసభ చైర్మను నెలకు జీతభత్యాల క్రింద 1,40,000/- రూపాయలు చెల్లించబడతాయి. భారత సంఘటిత నిధి నుండి ఆయన జీతభత్యాలు చెల్లించబడతాయి. భారత ఉపరాష్ట్రపతి పదవి నుండి తొలగించబడినప్పుడే ఆయన రాజ్యసభ చైర్మన్ పదవీ బాధ్యతల నుంచి తప్పుకొంటాడు.

డిప్యూటీ చైర్మన్: రాజ్యసభ సభ్యులు తమలో ఒకరిని డిప్యూటీ చైర్మన్ గా ఎన్నుకొంటారు. రాజ్యసభ డిప్యూటీ * చైర్మన్ నెలకు 90,000/- రూపాయలు జీతభత్యాలు పొందుతారు. రాజ్యసభ చైర్మన్ సభకు హాజరు కాని సమయాలలో డిప్యూటీ చైర్మన్ రాజ్యసభ సభా కార్యక్రమాలను నిర్వహిస్తాడు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవి ఖాళీ అయితే, ఆ ఖాళీ భర్తీ చేయుటకు సభ్యులు ఇంకొకరిని ఎన్నుకొంటారు.

ప్రశ్న 5.
భారత పార్లమెంటుకు గల ఏవైనా మూడు అధికార విధులను తెలపండి.
జవాబు:
1) శాసన సంబంధమైనవి (Legislative Powers): భారత పార్లమెంటు కేంద్ర జాబితా, ఉమ్మడి జాబితాల్లోని అంశాలపై బిల్లులను పరిశీలించి ఆమోదిస్తుంది. అలాగే (ఎ) జాతీయ అత్యవసర పరిస్థితి (బి) రాష్ట్రపతి పాలన అమలులో ఉన్నప్పుడు, (సి) రాజ్యసభ విజ్ఞప్తిపై (డి) కొన్ని రాష్ట్రాల అసెంబ్లీల అభ్యర్థన మేరకు రాష్ట్ర జాబితాలోని అంశాలపై బిల్లులను ఆమోదిస్తుంది. రాష్ట్రపతి జారీచేసే ఆర్డినెన్సుల స్థానంలో మంత్రులు ప్రతిపాదించే బిల్లులను కూడా ఆమోదిస్తుంది. సాధారణంగా పార్లమెంటు ఉభయసభల్లో దేనిలోనైనా బిల్లులను ప్రతిపాదించడం జరుగుతుంది. ప్రతి బిల్లును రెండు సభలు ఆమోదించిన తరవాతనే స్పీకర్ సంతకంతో వాటిని రాష్ట్రపతి పరిశీలన, ఆమోదాలకు పంపించడం జరుగుతుంది. కొన్ని అరుదైన సందర్భాలలో ఏదైనా ఒక బిల్లు ఆమోదం విషయంలో రెండు సభల మధ్య అభిప్రాయభేదాలు తలెత్తితే, రాష్ట్రపతి సూచనపై పార్లమెంటు ఉభయసభల సంయుక్త సమావేశం ఏర్పాటవుతుంది.

2) కార్యనిర్వాహక సంబంధమైనవి (కార్యవర్గంపై అజమాయిషీ) (Executive Powers-Control Over Executive): భారత పార్లమెంటుకు కేంద్ర కార్యనిర్వాహకశాఖ (కేంద్ర మంత్రిమండలి)పై అజమాయిషీ ఉంటుంది. ప్రధానమంత్రితో సహా కేంద్ర మంత్రిమండలి జట్టులోని సభ్యులందరూ వ్యక్తిగతంగానూ, ఉమ్మడిగానూ, సమిష్టి బాధ్యతతో తమ అధికార – బాధ్యతలు నిర్వహించేటట్లు పార్లమెంటు చూస్తుంది. పార్లమెంటు సభ్యులు ప్రశ్నలు, అనుబంధ ప్రశ్నలు, కోత తీర్మానాలు, చివరికి అవిశ్వాస తీర్మానం వంటి సాధనాల ద్వారా కార్యనిర్వాహక శాఖపై నియంత్రణ కలిగి ఉంటారు. ప్రధానమంత్రితో సహా మంత్రులందరూ పార్లమెంటు ఉభయ సభలలో సభ్యులు అడిగే ప్రశ్నలు, అనుబంధ ప్రశ్నలకు సరైన సమాధానాలను సకాలంలో, సక్రమరీతిలో ఇవ్వవలసి ఉంటుంది. ప్రతి ఏటా రాష్ట్రపతి చేసే ప్రసంగానికి, ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెటుకు ఆమోదం తెలిపే సందర్భాలలో పార్లమెంటు సభ్యులు కేంద్ర ప్రభుత్వం పనితీరును, గతంలో తీసుకున్న నిర్ణయాలను, అమలులో ఉన్న విధాన నిర్ణయాలను, వర్తమానంలో అనుసరించే ధోరణిని నిశితంగా సమీక్షిస్తారు. జీరో అవర్, కోత తీర్మానం, సభాహక్కుల తీర్మానం, ఓట్-ఆన్-అకౌంట్ వంటి సందర్భాలలో పార్లమెంటు సభ్యులకు కార్యనిర్వాహక వర్గంపై పూర్తి అజమాయిషీ ఉంటుంది.

3) ఆర్థిక సంబంధమైనవి (Financial Powers): భారత ప్రభుత్వ వ్యవహారాల నిర్వహణకు అవసరమైన ద్రవ్యాన్ని పార్లమెంటు మంజూరు చేస్తుంది. కేంద్ర మంత్రిమండలి ప్రతిపాదించే వార్షిక బడ్జెట్, రైల్వే బడ్జెట్లతో సహా అనేక ఆర్థిక బిల్లులను అది ఆమోదిస్తుంది. పార్లమెంటు ఆమోదంతోనే కేంద్ర ప్రభుత్వం కొత్త పన్నులను విధించేందుకు, పాత పన్నులను సవరించేందుకు లేదా రద్దు చేసేందుకు చర్యలు తీసుకోవాలి. అలాగే (ఎ) భారత కంప్టోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (బి) ఆర్థిక సంఘం (సి) ప్రభుత్వ ఖాతాల సంఘం (డి) అంచనాల సంఘం వంటి సభా సంఘాల నివేదికలను పార్లమెంటు పరిశీలించి ఆమోదిస్తుంది. ఈ విషయంలో రాజ్యసభకంటే లోక్సభకే ఎక్కువ అధికారాలు ఉన్నాయి.

ప్రశ్న 6.
బిల్లుల రకాలను వ్రాయండి.
జవాబు:
బిల్లులనేవి పార్లమెంటులో ప్రతిపాదించబడి, చర్చించబడి ఆమోదించబడే రాతపూర్వక ముసాయిదాలు. పార్లమెంటు ఉభయసభలు బిల్లులును ఆమోదించనిదే అవి చట్టంగా చెలామణి కావు. ఒకసారి ఉభయసభల ఆమోదం పొందినచో, బిల్లులు చట్టాలుగా రూపొందుతాయి. మొత్తంమీద పార్లమెంటులో ప్రవేశపెట్టబడే బిల్లులు రెండు రకాలుగా ఉంటాయి. అవి 1. పబ్లిక్ బిల్లులు (ప్రభుత్వ బిల్లులు) 2. ప్రైవేటు బిల్లులు, పబ్లిక్ బిల్లులనేవి పార్లమెంటులో మంత్రులచే ప్రవేశపెట్టబడేవి. ఇక మంత్రులు కాని సభ్యులు పార్లమెంటులో ప్రతిపాదించబడే వాటిని ప్రైవేటు బిల్లులుగా పరిగణించడమైంది. వేరొకవైపు పార్లమెంటులో ప్రతిపాదించబడే బిల్లుల స్వభావం ఆధారంగా వాటిని నాలుగు రకాలుగా వర్గీకరించవచ్చు.
అవి:

  1. సాధారణ బిల్లు
  2. ఆర్థిక బిల్లు
  3. ద్రవ్య బిల్లు
  4. రాజ్యాంగ సవరణ బిల్లు.

సాధారణ బిల్లులనేవి ఆర్థికేతర విషయాలకు సంబంధించినవి. ద్రవ్యబిల్లులనేవి పన్నులు, ప్రభుత్వ వ్యయంలాంటి అంశాలలో ముడిపడి ఉంటాయి. ఆర్థిక బిల్లులనేవి ద్రవ్య బిల్లుల కంటే భిన్నమైనవి. ప్రభుత్వ రెవెన్యూ వంటి విషయాలు వీటిలో ఇమిడి ఉంటాయి. చివరగా రాజ్యాంగ సవరణ బిల్లులు రాజ్యాంగంలోని వివిధ అంశాల సవరణకు ఉద్దేశించినవి.

AP Inter 2nd Year Civics Study Material Chapter 4 కేంద్ర శాసననిర్మాణ శాఖ

ప్రశ్న 7.
భారత పార్లమెంటులో శాసన నిర్మాణ ప్రక్రియ దశలను సంక్షిప్తంగా వివరించండి.
జవాబు:
పార్లమెంటులో సాధారణంగా చట్టంగా రూపొందక పూర్వం ప్రతి బిల్లు పార్లమెంటులో ఐదు దశలలో పయనిస్తుంది. అవి 1. బిల్లు ప్రతిపాదన 2. మూడు పఠనాలు 3. రెండో సభలో బిల్లు పరిశీలన 4. సంయుక్త సమావేశం 5. రాష్ట్రపతి ఆమోదం. పైన పేర్కొన్న ఐదు దశలను క్రింద వివరించడమైంది.

1) మొదటి దశ – బిల్లు ప్రతిపాదన: పార్లమెంటులో ఒకానొక బిల్లును ప్రవేశపెట్టాలనే ప్రతిపాదన వచ్చినపుడు, బిల్లుకు సంబంధించిన రాజకీయ, పాలనా అంశాల గురించి సంబంధిత మంత్రిత్వ శాఖ సమాచారాన్ని సేకరిస్తుంది. తరువాత ఆ మంత్రిత్వ శాఖ ఆ విషయాన్ని కేంద్ర కాబినెట్ దృష్టికి తీసుకువెళుతుంది. కేంద్ర కాబినెట్ కనుక ఆ బిల్లును ఆమోదిస్తే, సంబంధిత మంత్రి ఎనిమిది రోజుల వ్యవధిలో సభకు ఆ బిల్లును సమర్పిస్తాడు.

2) రెండో దశ – మూడు పఠనాలు: ఈ దశలో బిల్లు ప్రతిపాదన కర్త స్పీకర్ అనుమతితో ఒక నిర్ణీత రోజున బిల్లును సభలో ప్రవేశపెడతాడు. దీనినే ప్రథమ పఠనం అంటారు. రెండో పఠనంలో మరలా రెండు దశలుంటాయి. మొదటి దశలో బిల్లుపై సాధారణ చర్చ జరుగుతుంది. రెండవ దశలో బిల్లుకు అవసరమైన సవరణలు ప్రతిపాదించవచ్చు. మూడవ పఠనంలో బిల్లుకు సంబంధించిన షెడ్యూళ్ళు, క్లాజులను సభ పరిశీలించి ఓటింగ్ జరుగుతుంది.

3) మూడో దశ – రెండోసభలో బిల్లు పరిశీలన: మొదటి సభలో బిల్లును ఆమోదించిన తరువాత బిల్లు రెండో సభ పరిశీలనకు పంపించబడుతుంది. మొదటి సభవలె, రెండో సభ బిల్లును వివిధ దశలలో పరిశీలిస్తుంది. అప్పుడు రెండో సభ బిల్లును యధాతథంగా ఆమోదించుటకు, బిల్లులో కొన్ని సవరణలను ప్రతిపాదించుటకు లేదా బిల్లును పూర్తిగా తిరస్కరించేందుకు అధికారాన్ని కలిగి ఉంటుంది.

4) నాలుగోదశ సంయుక్త సమావేశం: ఒకానొక బిల్లు ఆమోదం విషయంలో రెండు సభల మధ్య ప్రతిష్టంభన ఏర్పడినపుడు రాష్ట్రపతి ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేస్తాడు. ఆ సమావేశానికి లోక్సభ స్పీకర్ అధ్యక్షత వహిస్తాడు. ఆ బిల్లులో ఏవైనా సవరణలను ప్రవేశపెట్టేందుకు సభ్యులకు అవకాశం ఉంటుంది.

5) ఐదోదశ – రాష్ట్రపతి ఆమోదం: ఒక బిల్లును రెండు సభలు ఆమోదించిన తరువాత స్పీకర్ ఆ బిల్లును రాష్ట్రపతి ఆమోదానికై పంపుతాడు. రాష్ట్రపతి బిల్లును ఆమోదిస్తే ఆ బిల్లు చట్టరూపంలో అమల్లోకి వస్తుంది.

ప్రశ్న 8.
ప్రభుత్వ ఖాతాల సంఘం గురించి నీకు ఏమి తెలియునో వ్రాయండి.
జవాబు:
ప్రభుత్వ ఖాతాల సంఘం 1921లో ఏర్పాటైంది. దీనిలో 22మంది సభ్యులు ఉంటారు. వారిలో 15 మంది లోక్సభనుంచి, 7 గురు రాజ్యసభనుంచి ఎన్నుకోబడతారు. వారి పదవీకాలం ఒక సంవత్సరం. వారందరూ నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతి ప్రకారం ‘ఏకఓటుబదిలీ’ సూత్రం ప్రకారం ఎన్నుకోబడతారు. లోక్సభ స్పీకర్ వారిలో ఒకరిని ఆ సంఘం అధ్యక్షుడిగా నియమిస్తాడు.

అధికారాలు, విధులు:

  1. భారత కంప్టోలర్ మరియు ఆడిటర్ జనరల్ వార్షిక గణాంక తనిఖీ నివేదికలను పరీక్షిస్తుంది.
  2. ప్రభుత్వ ఖర్చును న్యాయపరమైన, లాంభనప్రాయమైన దృష్టితో చూసి, వాటిలో సాంకేతిక అభ్యంతరాలను పరీక్షిస్తుంది. ఆర్థిక పొదుపు, జ్ఞానం, సందర్భోచిత కోణములలో పరీక్షిస్తుంది.
  3. లోకసభలో ప్రవేశపెట్టిన వినియోగాధికార గణాంకాలు, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక గణాంకాలు, ఇతర గణాంకాలను పరిశీలించి వెల్లడిస్తుంది.
  4. ప్రభుత్వ నిధులు సక్రమంగా బట్వాడా చేయబడినవా, లేదా అనే అంశాన్ని పరీక్షిస్తుంది.
  5. కంప్టోలర్ మరియు ఆడిటర్ జనరల్ నిర్వహించిన గణాంకాలను తనిఖీ చేస్తుంది.

ప్రశ్న 9.
అంచనాల సంఘం నిర్మాణము, విధులను వర్ణించండి.
జవాబు:
నిర్మాణం: 1921లో ఆర్థిక స్థాయి సంఘంగా ఇది ఏర్పడింది. తర్వాత 1950 ఏప్రియల్లో అంచనాల సంఘంగా పేరు మార్చబడి పనిచేయడం ప్రారంభించింది. ఈ సంఘంలో లోక్సభ నుంచి 30 మంది సభ్యులు ఉంటారు. దీనిలో రాజ్యసభకు ప్రాతినిధ్యం లేదు. ప్రతి సంవత్సరం లోక్సభ సభ్యులు తమలో కొందరిని నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతి ప్రకారం ‘ఏకఓటుబదిలీ’ సూత్రం అనుసరించి ఈ సంఘం సభ్యులను ఎన్నుకొంటారు. ఈ సంఘం సభ్యులు ఒక ఏడాది పాటు పదవిలో ఉంటారు. లోక్సభ స్పీకర్ ఈ సంఘం అధ్యక్షుణ్ణి నియమిస్తాడు.

విధులు:

  1. కేంద్ర ప్రభుత్వం వ్యవస్థ సామర్థ్యాన్ని పెంచుకొనేందుకు, ఖర్చును తగ్గించుకొనేందుకు ఆర్థికపరమైన పొదుపును పాటించే విషయంలో సలహాలను ఇస్తుంది.
  2. ప్రభుత్వ నిధులు అంచనాలకు అనుగుణంగా బట్వాడా చేయబడినవా, లేదా అనే అంశాన్ని పరీక్షిస్తుంది.
  3. లోక్సభ స్పీకర్ అప్పగించిన విషయాలను పరీక్షిస్తుంది.
  4. అంచనాలలో చేర్చబడిన నిర్ణీత పరిధులకు లోబడి విధానాలు, వాటికి సంబంధించిన ధన సక్రమ వినియోగం గురించి పరీక్షిస్తుంది. కొందరు ఈ సంఘాన్ని నిరంతర ఆర్థిక సంఘంగా వర్ణించారు.

AP Inter 2nd Year Civics Study Material Chapter 4 కేంద్ర శాసననిర్మాణ శాఖ

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
పార్లమెంటు నిర్మాణం.
జవాబు:
రాజ్యాంగం 79వ అధికరణం ప్రకారం కేంద్ర శాసన నిర్మాణ శాఖలో (ఎ) రాష్ట్రపతి, (బి) పార్లమెంటులోని ఉభయసభలు అంతర్భాగాలు. లోక్సభ అనేది పార్లమెంటులో దిగువసభ కాగా, రాజ్యసభ ఎగువసభ. రాష్ట్రపతికి ఉభయసభల సమావేశాలను ప్రారంభించేందుకు, వాయిదా వేసేందుకు అధికారం ఉంటుంది.

ప్రశ్న 2.
రాజ్యసభ సభ్యుల అర్హతలు.
జవాబు:

  1. భారతీయ పౌరుడై ఉండాలి.
  2. 30 సంవత్సరాలు వయస్సు నిండి ఉండాలి.
  3. ఏ రాష్ట్రం నుండి ఎన్నిక కాబడితే ఆ రాష్ట్రంలో కనీసం ఆరు నెలలు నివాసం ఉండి ఉండాలి.
  4. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో ఆదాయాన్ని పొందే ఏ హోదాలోను పనిచేసి ఉండరాదు.
  5. అతడు మతిస్థిమితం లేనివాడు లేదా దివాళాకోరు కారాదు.
  6. పార్లమెంటు సూచించిన ఇతర అర్హతలను కూడా కల్గి ఉండాలి.

ప్రశ్న 3.
లోక్సభలో కోరమ్. [Mar. ’16]
జవాబు:
లోక్సభ సమావేశాలను నిర్వహించేందుకు సభలో ఉండాల్సిన కనీస సభ్యుల సంఖ్యను ‘కోరమ్’ అంటారు. ఆ కనీస సంఖ్య మొత్తం సభ్యులలో 1/10వ వంతుగా నిర్ణయించబడింది.

ప్రశ్న 4.
లోక్సభ స్పీకర్.
జవాబు:
భారత రాజ్యాంగం లోక్సభలో స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవులను ఏర్పాటు చేసింది. లోక్సభ సభ్యులు తమలో ఒకరిని స్పీకర్గా ఎన్నుకొంటారు. స్పీకర్ లోక్సభ సమావేశాలను సక్రమంగా, సాఫీగా నిర్వహించే బాధ్యతను కల్గి ఉంటాడు. సభ్యుల సంరక్షకుడిగా, సభ ముఖ్య అధికార ప్రతినిధిగా ఉంటూ సభలో అత్యున్నత అధికారములు కల్గి ఉంటాడు.

ప్రశ్న 5.
లోక్సభ డిప్యూటీ స్పీకర్.
జవాబు:
భారత రాజ్యాంగంలోని 93వ ప్రకరణ ప్రకారం, లోక్సభ సమావేశాలను స్పీకర్ లేని సమయాలలో నిర్వహించేందుకు ఒక డిప్యూటీ స్పీకర్ ఉంటారు. లోక్సభ సభ్యులు తమలో ఒకరిని డిప్యూటీ స్పీకర్గా ఎన్నుకుంటారు. లోక్సభ సమావేశాలకు అధ్యక్షత వహించే సమయంలో స్పీకర్కుండే అధికారాలు, ప్రత్యేక హక్కులు అన్నీ డిప్యూటీ స్పీకర్కు ఉంటాయి.

AP Inter 2nd Year Civics Study Material Chapter 4 కేంద్ర శాసననిర్మాణ శాఖ

ప్రశ్న 6.
ప్రభుత్వ ఉపక్రమాల సంఘం. [Mar. ’17]
జవాబు:
ఈ సంఘం 1964లో కృష్ణమీనన్ సంఘం సిఫారసుల ప్రకారం ఏర్పాటైంది. దీనిలో 22 మంది సభ్యులుంటారు. వీరిలో 15 మంది లోక్సభ నుండి, 7 గురు రాజ్యసభ నుండి ఎన్నుకోబడతారు. వీరి పదవీకాలం ఒక సంవత్సరం. ఈ సంఘం ప్రభుత్వ ఉపక్రమాల గణాంకాలను, నివేదికలను పరీక్షిస్తుంది. ప్రభుత్వ ఖాతాల సంఘం, అంచనాల సంఘపు ఇతర విధులను నిర్వహిస్తుంది.

ప్రశ్న 7.
స్పీకర్ జాబితా.
జవాబు:
లోక్సభ స్పీకర్ లోక్సభలోని కొందరు సభ్యులతో కూడిన జాబితాలను తయారుచేసి ప్రకటిస్తాడు. ఈ జాబితాలో గరిష్ఠంగా పదిమంది సభ్యులుంటారు. లోక్సభ సమావేశాల సమయంలో స్పీకర్ మరియు డిప్యూటీ స్పీకర్ లేని సమయంలో ఈ జాబితాలో ఒకరు సభకు అధ్యక్షత వహించి సమావేశాలను నిర్వహిస్తారు.

ప్రశ్న 8.
తాత్కాలిక (ప్రోటెం) స్పీకర్.
జవాబు:
లోక్సభ సాధారణ ఎన్నికలు ముగిసిన తరువాత రాష్ట్రపతి ప్రొటెం స్పీకర్ను నియమిస్తాడు. ప్రోటెం స్పీకర్ లోక్సభ తొలి సమావేశానికి అధ్యక్షత వహిస్తాడు. సాధారణంగా రాష్ట్రపతి లోక్సభకు ఎన్నికైన సభ్యులందరిలో వయస్సులో పెద్దవాడైన వ్యక్తికి ప్రొటెం స్పీకర్గా నియమిస్తాడు. ప్రోటెం స్పీకర్ కొత్తగా ఎన్నికైన సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయిస్తాడు. ఆ తరువాత స్పీకర్ ఎన్నిక జరుగుతుంది. కొత్త స్పీకర్ ఎన్నికైన తరువాత ప్రొటెం స్పీకర్ పదవి రద్దవుతుంది.

ప్రశ్న 9.
ప్రశ్నా సమయం. [Mar. ’16]
జవాబు:
పార్లమెంటు సమావేశాలలో ప్రతిరోజు మొదటి గంట ప్రశ్నా సమయంకు కేటాయించబడుతుంది. సాధారణంగా ప్రశ్నాసమయం ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుంది. ఆ సమయంలో ప్రభుత్వ పాత్ర, ప్రజాసంబంధ విషయాలు, ప్రభుత్వ పాలన అసమర్థత మొదలగు అంశాలపై సభ్యులు ప్రశ్నల నోటీసులను స్పీకర్కు అందిస్తారు. ప్రశ్నలు మూడు రకాలు.

  1. నక్షత్ర ప్రశ్నలు
  2. నక్షత్రం లేని ప్రశ్నలు
  3. స్వల్ప వ్యవధి ప్రశ్నలు

ప్రశ్న 10.
వాయిదా తీర్మానం.
జవాబు:
పార్లమెంటు సమావేశాలలో ఒకానొక ప్రజా ప్రాధాన్యత అంశాన్ని సభ దృష్టికి తెచ్చేందుకై సభ్యులు ప్రవేశపెట్టే | తీర్మానాన్నే వాయిదా తీర్మానం అంటారు. ఈ తీర్మానాన్ని ప్రతిపాదించేందుకు కనీసం 50 మంది సభ్యుల యుద్ధము అవసరం. వాయిదా తీర్మానంపై రెండున్నర గంటల వ్యవధి తగ్గకుండా చర్చ జరుగుతుంది.

ప్రశ్న 11.
విప్. [Mar. ’17]
జవాబు:
పార్లమెంటు సమావేశాలకు హాజరవ్వాల్సిందిగా సభ్యులను కోరే అధికారం ఉండటాన్ని విప్ అంటారు. విపన్ను జారీ చేసే అధికారం అధికార పార్టీకి, ప్రతిపక్ష పార్టీకి ఉంటుంది. విప్లను ఆయా పార్టీల నాయకులు నియమిస్తారు. సభ్యులందరూ విప్ల ఆదేశాలను తప్పకుండా పాటించాలి. లేనట్లయితే వారిపై పార్టీ నాయకత్వం క్రమశిక్షణా చర్యలు తీసుకోవచ్చు.

AP Inter 2nd Year Civics Study Material Chapter 4 కేంద్ర శాసననిర్మాణ శాఖ

ప్రశ్న 12.
అవిశ్వాస తీర్మానం.
జవాబు:
అవిశ్వాస తీర్మానాన్ని లోక్సభలో ప్రతిపాదించేందుకు రాజ్యాంగంలోని 75వ ప్రకరణ వీలు కల్పించింది. అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపక్షపార్టీ సభ్యులు ప్రవేశపెడతారు. ఈ తీర్మానాన్ని ప్రతిపాదించాలంటే 50 మంది సభ్యుల మద్దతు అవసరం. అవిశ్వాస తీర్మానాన్ని లోక్సభ ఆమోదించినట్లయితే కేంద్ర కాబినెట్ రాజీనామా చేయాల్సి ఉంటుంది.

AP Inter 2nd Year Civics Study Material Chapter 3 కేంద్ర కార్యనిర్వాహక శాఖ

Andhra Pradesh BIEAP AP Inter 2nd Year Civics Study Material 3rd Lesson కేంద్ర కార్యనిర్వాహక శాఖ Textbook Questions and Answers.

AP Inter 2nd Year Civics Study Material 3rd Lesson కేంద్ర కార్యనిర్వాహక శాఖ

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
భారత రాష్ట్రపతి అధికారాలు, విధులను గూర్చి వివరించండి.
జవాబు:
భారత రాష్ట్రపతి రాజ్యాధినేత. రాజ్యాంగ నిర్మాతలు ఆయనను బ్రిటిష్ రాజుతో సమానుడుగా వర్ణించారు. దేశ ప్రథమ పౌరుడుగా, కార్యనిర్వహణాధిపతిగా, జాతి గౌరవ ప్రతిష్ఠలకు ఆయన ప్రతీక. రాజ్యాంగం ప్రకారం ఆయన అధీనంలో కార్య నిర్వహణాధికారం ఉంది. పార్లమెంటులో రాష్ట్రపతి అంతర్భాగం. దేశ పరిపాలన ఆయన పేరు మీదుగా జరుగుతుంది. అయితే నామమాత్రపు అధికారి కావడం వలన పార్లమెంటరీ సంప్రదాయాల ప్రకారం మంత్రిమండలి వాస్తవ అధికారాలను కలిగి ఉంటుంది. రాష్ట్రపతికి గల వివిధ అధికారాలు దిగువ పేర్కొనబడ్డాయి.

రాష్ట్రపతి అధికారాలు:
1) కార్యనిర్వహణాధికారాలు: అధ్యక్షుడు దేశానికి ప్రధాన కార్యనిర్వహణాధికారి. పరిపాలన ఆయన పేరు మీదనే జరుగుతుంది. రాష్ట్రపతి మంత్రిమండలి సలహా ప్రకారం వ్యవహరించాలి. డాక్టర్ రాజేంద్రప్రసాద్ అభిప్రాయం ప్రకారం అధ్యక్షుడు రాజ్యాంగానికి బద్ధుడు.

అధికారుల నియామకం: సాధారణ ఎన్నికల తరువాత లోక్సభలో మెజారిటీ పార్టీ నాయకుడిని ప్రధానమంత్రిగా నియమిస్తాడు. ఏ పార్టీకీ మెజారిటీ లభించకపోతే తనకు తోచిన వ్యక్తిని ప్రధానిగా నియమిస్తాడు. ప్రధాని సలహాపై ఇతర మంత్రుల చేత ప్రమాణ స్వీకారం చేయిస్తాడు. త్రివిధ బలగాల అధిపతులను, (సైన్యం, నౌకా, వైమానిక దళం) నియమిస్తాడు. రాష్ట్ర గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లు, రాయబారులు, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు, ఎన్నికల ప్రధానాధికారి, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ సభ్యులు, ఆర్థిక సంఘం సభ్యులు, కంప్టోలర్ మరియు ఆడిటర్ జనరల్ మొదలగువారిని రాష్ట్రపతి నియమిస్తాడు.

2) శాసనాధికారాలు:

  1. పార్లమెంట్ను సమావేశపరచడానికి, వాయిదా వేయడానికి, లోక్సభను రద్దు చేయడానికి రాష్ట్రపతికి అధికారాలున్నాయి.
  2. సాధారణ ఎన్నికల తరువాత ఉభయసభల సంయుక్త సమావేశంలో ప్రారంభోపన్యాసం చేస్తాడు.
  3. పార్లమెంట్కు సందేశాలు పంపవచ్చును.
  4. రాష్ట్రపతి సంతకం పొందిన తరువాతనే బిల్లులు చట్టాలవుతాయి. బిల్లులకు ఆమోదం తెలుపకుండా కొంతకాలం నిలపవచ్చు. కానీ రెండు సభలు తిరిగి ఆ బిల్లులను ఆమోదించి పంపితే, అధ్యక్షుడు తప్పనిసరిగా ఆమోదించాలి.
  5. పార్లమెంట్ సమావేశంలో లేనప్పుడు ఆర్డినెన్స్లను జారీ చేస్తాడు.
  6. ఆర్థిక బిల్లులు ఆయన అనుమతి లేనిదే పార్లమెంట్లో ప్రవేశపెట్టరాదు.
  7. ఆర్థిక సంఘం, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ వంటి సంస్థలు ఇచ్చిన నివేదికలను పార్లమెంట్కు పంపుతాడు.
  8. పార్లమెంట్ ఉభయసభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటుచేస్తాడు.
  9. రాజ్యసభకు 12 మందిని, లోక్సభకు ఇద్దరిని నియమిస్తాడు.

AP Inter 2nd Year Civics Study Material Chapter 3 కేంద్ర కార్యనిర్వాహక శాఖ

3) ఆర్థికాధికారాలు:

  1. రాష్ట్రపతి ఆమోదం లేనిదే ఆర్థిక బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెట్టకూడదు.
  2. కేంద్ర బడ్జెట్, అనుబంధ బడ్జెట్లు ఆయన అనుమతి లేనిదే పార్లమెంట్ ముందుంచరాదు.
  3. ఐదు సంవత్సరాలకొక పర్యాయం రాష్ట్రపతి ఆర్థిక కమీషన్ను ఏర్పాటు చేస్తాడు.
  4. కంప్టోలర్, ఆడిటర్ జనరల్ రూపొందించిన వార్షిక నివేదికను ఆయన పార్లమెంట్కు సమర్పిస్తాడు.

4) న్యాయాధికారాలు: రాష్ట్రపతి సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులను నియమిస్తాడు. కాని వారిని తొలగించే అధికారం ఆయనకు లేదు. తగిన కారణాలుంటే సుప్రీంకోర్టు విధించిన శిక్షలను తాత్కాలికంగా నిలిపి వేయవచ్చు. శిక్షలు అమలు కాకుండా వాయిదా వేయవచ్చు. ఒక రకమైన శిక్షను మరొక రకమైన శిక్షగా మార్చవచ్చు. శిక్షను పూర్తిగా రద్దు చేసి క్షమాభిక్ష పెట్టవచ్చు.

2) రాజ్యాంగపరమైన అత్యవసర పరిస్థితి (356వ ప్రకరణ): భారత రాజ్యాంగంలోని 356వ ప్రకరణ రాజ్యాంగపరమైన అత్యవసర పరిస్థితిని విధించే అధికారాన్ని రాష్ట్రపతికి కల్పించింది. ఆ రాష్ట్ర గవర్నర్ నుంచి గాని, మరొక విధంగా ఆ రాష్ట్రంలో రాజ్యాంగ సూత్రాల ప్రకారం పరిపాలన సాగించలేమనే పరిస్థితి ఏర్పడిందన్న నివేదిక తరువాత, రాష్ట్రంలో రాజ్యాంగపరమైన అత్యవసర పరిస్థితిని ప్రకటించే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. దీనినే రాష్ట్రపతి పాలన’ అంటారు.

రాష్ట్రపతి పాలన సమయంలో భారత రాజకీయ వ్యవస్థలో క్రింది మార్పులు సంభవిస్తాయి.

  1. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అన్ని లేదా ఏవైనా కొన్ని విధులను రాష్ట్రపతి స్వయంగా నిర్వహించవచ్చు. గవర్నరికి గానీ లేదా ఇతర కార్యనిర్వాహక అధికారికి గానీ అప్పగించవచ్చు.
  2. రాష్ట్ర శాసన నిర్మాణశాఖ అధికారాలను పార్లమెంటు వినియోగిస్తుందని ప్రకటించవచ్చు.
  3. అత్యవసర పరిస్థితి ప్రకటన ఉద్దేశాలకు అనుగుణమైన అంశాలను అమలులో ఉంచడానికి రాష్ట్రపతి తగిన ఆదేశాలను జారీ చేయవచ్చును.

3) ఆర్థిక అత్యవసర పరిస్థితి: భారతదేశం మొత్తానికి లేదా ఒక ప్రాంతం ఆర్థిక స్థిరత్వానికి లేదా పరపతికి ముప్పు వాటిల్లిన పరిస్థితి ఏర్పడినపుడు 360వ ప్రకరణ ప్రకారం రాష్ట్రపతి ఆర్థిక అత్యవసర పరిస్థితిని ప్రకటించవచ్చు. ఈ అత్యవసర పరిస్థితి ప్రకటనను రెండు నెలల లోగా పార్లమెంటు సాధారణ మెజారిటీతో ఆమోదించాలి. ఇప్పటివరకు ఇటువంటి అత్యవసర పరిస్థితిని మనదేశంలో విధించలేదు. ఆర్థిక అత్యవసర పరిస్థితి సమయంలో రాష్ట్రపతి, ప్రభుత్వ సిబ్బందితో సహా సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల జీతభత్యాలను తగ్గించవచ్చు.

ప్రశ్న 3.
భారత ప్రధానమంత్రి అధికారాలు, విధులను గూర్చి చర్చించండి. [Mar. ’16]
జవాబు:
భారత ప్రధాని పరిపాలనా యంత్రాంగంలోను, దేశంలోను అత్యంత ప్రముఖస్థానాన్ని కలిగి ఉంటాడు. పార్లమెంటరీ ప్రభుత్వ సంప్రదాయాల ప్రకారం, “ప్రధాని ప్రభుత్వానికి మకుటంలేని మహారాజు”. “మంత్రిమండలి అనుభవానికి పునాదివంటివాడు”. “సౌర కుటుంబంలో సూర్యునివలె మంత్రిమండలిలో ప్రకాశిస్తాడు”. అని ఐవర్ జెన్నింగ్స్ పేర్కొనెను.

నియామకం: సాధారణ ఎన్నికలు జరిగిన తరువాత లోక్సభలో మెజారిటీ పార్టీ నాయకుడిని, రాష్ట్రపతి ప్రధానిగా నియమిస్తాడు. ఏ పార్టీకి మెజారిటీ రాకపోతే తన వివేచన ఉపయోగించి రాష్ట్రపతి తగిన వ్యక్తిని ప్రధానిగా నియమిస్తాడు. తరువాత ప్రధానిగా నియమించబడిన వ్యక్తి లోక్సభలో మెజారిటీని నిరూపించుకోవాలి. ఉదా: 1978లో జనతా ప్రభుత్వం పడిపోయినపుడు, ఏ పార్టీకి మెజారిటీ లేదని భావించి అప్పటి అధ్యక్షుడు శ్రీ నీలం సంజీవరెడ్డి, చరణ్్సంగ్ను ప్రధానిగా నియమించి, ఒక నెలలోగా లోక్సభలో తన మెజారిటీని నిరూపించుకోమన్నాడు. ఈ విధమైన పరిస్థితులు ఈ మధ్యకాలంలో కూడా జరిగెను.

ప్రధానమంత్రి అధికారాలు, విధులు: ప్రధానమంత్రి కేంద్ర ప్రభుత్వ అధిపతి. ఆయన వాస్తవ కార్యనిర్వాహక అధికారి. ప్రధానమంత్రి లేకుండా కేంద్ర మంత్రిమండలి ఏర్పాటు కాదు. కేంద్ర ప్రభుత్వంలో ఆయన చాలా ముఖ్యమైన, శక్తివంతమైన, కీలకమైన అధినేత. అయితే దేశంలోని రాజకీయ పరిస్థితిని బట్టి ప్రధానమంత్రి చెలాయించే అధికారం ఆధారపడి ఉంటుంది. ప్రధానమంత్రి ఈ క్రింద పేర్కొన్న అధికారాలను, విధులను నిర్వహిస్తాడు.

1) కేంద్ర కేబినెట్ నాయకుడు: ప్రధానమంత్రి కేంద్ర కేబినెట్, కేంద్ర మంత్రిమండలికి నాయకుడు. తన పార్టీ లేదా సంకీర్ణ కూటమికి చెందిన పార్లమెంటు సభ్యులలో ప్రముఖమైన సభ్యులను ఎంపిక చేసి, వారు రాష్ట్రపతి చేత మంత్రులుగా నియమించబడేటట్లు చూస్తాడు. మంత్రులకు శాఖల కేటాయింపు, మంత్రివర్గంలో మార్పులు, చేర్పులు చేసేందుకు పూర్తి అధికారం ప్రధానమంత్రికి కలదు.

2) కేంద్ర ప్రభుత్వ నాయకుడు: ప్రధానమంత్రి కేంద్ర ప్రభుత్వ నాయకునిగా వ్యవహరిస్తాడు. కేంద్ర కార్యనిర్వాహక శాఖ కేంద్ర మంత్రిమండలి) వ్యవహారాలు ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారంతో మొదలవుతాయి. కేంద్ర మంత్రిమండలిలోని మంత్రులందరూ ప్రధానమంత్రితో పాటు తమ పదవులను స్వీకరించి, పదవీ బాధ్యతలను నిర్వహించే హోదాను పొంది ఉంటారు.

AP Inter 2nd Year Civics Study Material Chapter 3 కేంద్ర కార్యనిర్వాహక శాఖ

3) పార్లమెంటు నాయకుడు: ప్రధానమంత్రి పార్లమెంటు నాయకునిగా వ్యవహరిస్తాడు. ఆయన కూడా పార్లమెంటు సభ్యుడే. ఉభయ సభలు సాఫీగా జరిగేటట్లు సభాపతులకు తగిన సహకారాన్ని అందిస్తాడు. పార్లమెంటులో తమ పార్టీ సభ్యులను నియంత్రిస్తాడు. పార్లమెంటు సమావేశాల సమయంలో తమ పార్టీ సభ్యులు క్రమశిక్షణతో మెలిగేటట్లు చూస్తాడు.

4) రాష్ట్రపతి, కేంద్ర మంత్రిమండలి మధ్య వారధి: ప్రధానమంత్రి రాష్ట్రపతికి, కేంద్ర మంత్రిమండలికి మధ్య వారధి వలె వ్యవహరిస్తాడు. కేంద్ర మంత్రిమండలి తీసుకున్న నిర్ణయాలను రాష్ట్రపతికి తెలియజేయడం ప్రధానమంత్రి బాధ్యత. రాష్ట్రపతి అడిగినప్పుడు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని అందజేయవలసిన బాధ్యత ఆయనపై కలదు.

5) మెజారిటీ పార్టీ నాయకుడు: ప్రధానమంత్రి దిగువ సభలో మెజారిటీ పార్టీ లేదా వర్గానికి నాయకునిగా వ్యవహరిస్తాడు. ఆయన తమ పార్టీ సభ్యుల సమావేశాలలో పాల్గొని వారికి వివిధ అంశాలపై, పార్టీ చేసిన వాగ్దానాల అమలుకు తీసుకొన్న చర్యలను వివరిస్తాడు. ప్రభుత్వ పాలనలో పార్టీలోని పెద్దల సేవలను వినియోగించుకుంటాడు. ఆయన పార్టీకి, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటాడు.

6) జాతి నాయకుడు: ప్రధానమంత్రి జాతి నాయకుడిగా వ్యవహరిస్తాడు. ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించే | లోక్సభకు నాయకునిగా ఉండటం వలన ఆయన అభిప్రాయాలను మొత్తం జాతి అభిప్రాయాలుగా భావించడం జరుగుతుంది.

7) విదేశాంగ విధాన రూపకల్పన కర్త: ప్రధానమంత్రి భారతదేశ విదేశాంగ విధానాన్ని మరియు ఇతర దేశాలతో భారతదేశం యొక్క సంబంధాలను నిర్ణయించడంతో కీలకపాత్ర పోషిస్తాడు. అంతర్జాతీయ సంబంధాలు, దేశ గౌరవ ప్రతిష్టలను నిలబెట్టడంలో ముఖ్యమైన బాధ్యత వహిస్తాడు. ముఖ్యమైన అంతర్జాతీయ వేదికలపై దేశానికి ప్రాతినిధ్యం వహిస్తాడు.

8) నీతి అయోగ్ అధ్యక్షుడు: ప్రధానమంత్రి నీతి ఆయోగ్ అధ్యక్షుడు. నీతి ఆయోగ్ (NITI Aayog – భారత జాతీయ పరివర్తన సంస్థ) అనగా విధాన కమిటీ అని అర్థం. ఇది ప్రభుత్వంలోని మేధావులు, అనుభవజ్ఞులైన వారితో పూర్వపు ప్రణాళికా సంఘం స్థానంలో ఏర్పాటు చేయబడింది. దీని ముఖ్య ఉద్దేశం భారతదేశ ఆర్థిక ప్రణాళికలలో రాష్ట్రాలకు ప్రాతినిధ్యం కల్పించడం.

ప్రశ్న 4.
కేంద్ర మంత్రిమండలి నిర్మాణం, అధికారాలు, విధులను వివరించండి.
జవాబు:
కేంద్ర మంత్రిమండలి పరిపాలనలో కీలకమైన పాత్ర వహిస్తుంది. దీని సలహా ప్రకారం రాష్ట్రపతి తన విధులు నిర్వహిస్తాడు. “రాజ్యమనే నౌకకు మంత్రిమండలి చుక్కాని” వంటిదని రామ్సే మ్యూర్ అభిప్రాయం.

మంత్రులు ప్రధాని సలహాపై రాష్ట్రపతిచే నియమింపబడతారు. మంత్రిమండలి సభ్యులు సమిష్టిగాను, వ్యక్తిగతంగానూ లోక్సభకు బాధ్యత వహిస్తారు. రాజ్యాంగరీత్యా రాష్ట్రపతి విశ్వాసం పొందినంతవరకు పదవిలో ఉంటారు.

అర్హతలు:

  1. మంత్రులకు శాసన సభ్యత్వం అవసరం.
  2. పార్లమెంట్ ఉభయసభలలో ఏదో ఒక సభలో సభ్యత్వం ఉండాలి. ఒకవేళ సభ్యుడు కాకపోతే ఆరు నెలల లోగా ఏదో ఒక సభకు సభ్యుడిగా ఎన్నిక కావాలి.
  3. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో ఆదాయం పొందే ఉద్యోగంలో ఉండరాదు.

నిర్మాణం: కేంద్ర మంత్రిమండలిలో మూడు రకాల మంత్రులు ఉంటారు. వారు:

  1. కేబినెట్ మంత్రులు
  2. స్టేట్ మంత్రులు (స్వతంత్ర హోదా)
  3. డిప్యూటీ మంత్రులు (స్వతంత్ర హోదాలేని మంత్రులు).

1) కేబినెట్ మంత్రులు: కేంద్ర ప్రభుత్వంలో హోం, ఆర్థిక, రక్షణ, రైల్వేలు, విదేశీ వ్యవహారాలు, మానవ వనరుల అభివృద్ధి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, పట్టణాభివృద్ధి, పౌర విమానయానం, గనులు, ఉక్కు మొదలైన ముఖ్యమైన మంత్రిత్వ శాఖలకు కేబినెట్ హోదాగల మంత్రులు అధిపతులుగా వ్యవహరిస్తారు. వారు తమ మంత్రిత్వశాఖల పరిధిలో నిర్ణయాలు తీసుకోవడంలోను, వాటిని అమలు చేయడంలోనూ స్వతంత్రులు.

2) స్టేట్ మంత్రులు (స్వతంత్ర హోదా): కేంద్ర ప్రభుత్వంలో స్వతంత్ర హోదా కలిగిన స్టేట్ మంత్రులు ప్రధానమంత్రికి నేరుగా జవాబుదారిగా ఉంటూ కొన్ని ముఖ్యమైన మంత్రిత్వ శాఖలను నిర్వహిస్తారు. తమ మంత్రిత్వశాఖలో కేబినెట్ మంత్రుల అజమాయిషీ వారిపై ఉండదు. స్వతంత్ర హోదా కలిగిన స్టేట్ మంత్రులు తమ శాఖలో స్వతంత్ర నిర్ణయాలు తీసుకొనే అధికారం ఉంటుంది.

3) డిప్యూటీ మంత్రులు (స్వతంత్ర హోదాలేని మంత్రులు): స్వతంత్ర హోదాలేని మంత్రులను డిప్యూటీ మంత్రులు అంటారు. వారు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పరిపాలన, శాసన వ్యవహారాలలో కాబినెట్ మంత్రులకు సహాయంగా ఉంటారు. వారికి నిర్ణయాలు తీసుకొనే అధికారం ఉండదు.

AP Inter 2nd Year Civics Study Material Chapter 3 కేంద్ర కార్యనిర్వాహక శాఖ

అధికారాలు విధులు:
1) విధానాలను రూపొందించుట: దేశ పరిపాలనకు సంబంధించిన విధానాలను మంత్రివర్గం రూపొందిస్తుంది. విదేశాంగ విధానం, ఆంతరంగిక పరిపాలనా విధానం, ఆర్థిక విధానం మొదలగునవి.

2) పరిపాలనా నియంత్రణ: వివిధ శాఖలకు అధిపతులుగా ఉండే మంత్రులు తమ శాఖలపై నియంత్రణ చెలాయిస్తూ పరిపాలన సమర్థవంతంగా పనిచేసేటట్లు చూస్తారు.

3) శాసన విధులు: మంత్రులు పార్లమెంట్లో బిల్లులు ప్రవేశపెట్టి అవి చట్టాలుగా రూపొందించేటందుకు కృషి చేస్తారు.

4) నియోజిత శాసనాలు: మౌలిక శాసనాల పరిధిలో, తమ శాఖలు నిర్వహించడానికి కావలసిన నిబంధనలను మంత్రులు, కార్యదర్శుల సహకారంతో రూపొందిస్తారు.

5) ఆర్థికాధికారాలు: వార్షిక బడ్జెట్ను తయారుచేసి, లోక్సభ ఆమోదం పొందేటట్లు చూస్తారు. దేశ ఆర్థిక వ్యవహారాలను నియంత్రణ చేస్తారు.

6) సంక్షేమ పథకాలు: ప్రజల అభివృద్ధికి, సంక్షేమానికి పథకాలు రూపొందించి, అమలుచేయడం మంత్రివర్గం విధి. ఆర్థిక ప్రణాళికలు రూపొందించడం, ఆర్థిక సమస్యల పరిష్కారం, బలహీనవర్గాల రక్షణ, ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే సహాయం చేయడం మున్నగునవి మంత్రివర్గం యొక్క బాధ్యత.

7) శాంతిభద్రతల నిర్వహణ: దేశంలో అల్లర్లు జరగకుండా చూడటం, అందుకు కావలసిన పరిపాలనాపరమైన చర్యలు తీసుకోవడం మంత్రిమండలి విధి.

8) దేశ రక్షణ: రాజ్యాన్ని విదేశీ దురాక్రమణ నుండి కాపాడటం, సైన్యాన్ని సురక్షితం చేసి సరిహద్దుల రక్షణ, ఆయుధాల నిర్మాణం, రక్షక వూహ్యం, స్వాతంత్య్ర పరిరక్షణ, దేశ ప్రయోజనాలు కాపాడటం మంత్రివర్గం విధి. దేశాభివృద్ధి, పరిపాలనా సామర్థ్యం, ప్రజాశ్రేయస్సు మంత్రివర్గ సామర్థ్యంపై ఆధారపడి ఉంటాయి.

కేంద్ర కేబినెట్ పాత్ర: కేంద్ర ప్రభుత్వంలో విధాన నిర్ణయం, వాటి అమలులో కేబినెట్ చురుకైన, కీలకమైన పాత్రను పోషిస్తుంది.

  1. జాతీయస్థాయిలో కార్యనిర్వాహక చర్యలను నిర్ణయించే అత్యున్నత రాజకీయ వ్యవస్థగా కేబినెట్ వ్యవహరిస్తుంది.
  2. కేంద్ర మంత్రిమండలి తరపున అన్ని విధులను కేబినెట్ నిర్వహిస్తుంది.
  3. కేంద్ర కార్యనిర్వాహక, పరిపాలనా సిబ్బందిపై దానికి పూర్తి అజమాయిషీ ఉంటుంది.
  4. కేంద్ర కార్యనిర్వాహక అధికారులు తన అధీనంలో పనిచేసేటట్లు చూస్తుంది.

భారతదేశంలోని కేబినెట్, బ్రిటన్లోని కేబినెట్ను పోలి ఉంటుంది. “ప్రభుత్వ యంత్రాంగానికి మంత్రిమండలి జీవము”. సర్ జాన్ మేరియట్ మంత్రిమండలి గురించి ప్రస్తావిస్తూ “ప్రభుత్వ యంత్రాంగానికి మంత్రిమండలి కీటకం వంటిది అని, అది దాని చుట్టూ పరిభ్రమణ చేస్తూ ఉంటుంది” అని పేర్కొనెను.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
భారత రాష్ట్రపతి ఏ విధంగా ఎన్నిక అవుతాడు ?
జవాబు:
భారత రాష్ట్రపతి పదవికి పోటీచేసే వ్యక్తికి పేర్కొన్న అర్హతలు ఉండాలి.

  1. భారతీయ పౌరుడై ఉండాలి.
  2. 35 సంవత్సరాలు నిండి ఉండాలి.
  3. లోక్సభకు ఎంపిక కావడానికి కావలసిన అర్హతలుండాలి.
  4. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో ఆదాయాన్నిచ్చే పదవిలో ఉండరాదు.

ఎన్నిక: ఇవిగాక పార్లమెంట్ సమయానుకూలంగా నిర్ణయించే ఇతర అర్హతలు కలిగి ఉండాలి.

దేశాధ్యక్షునిగా పోటీచేసే వ్యక్తిని బలపరుస్తూ నామినేషన్ పత్రంపై కనీసం 50 మంది నియోజకులు సంతకం చేయాలి. రూ.15,000 ధరావతు చెల్లించాలి. ఎన్నికలలో 1/6వ వంతు కంటే తక్కువ ఓట్లు వస్తే ధరావతు (డిపాజిట్) కోల్పోతాడు.

పార్లమెంట్లోని రెండు సభల సభ్యులు, రాష్ట్ర శాసనసభలకు ఎన్నికైన సభ్యులు కలిసి ఒక ఎన్నికల గణంగా ఏర్పడి ఓటును బదిలీచేసే నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతి ప్రకారం ఎన్నుకుంటారు. రహస్య ఓటింగ్ విధానం అనుసరించబడుతుంది. ఎన్నికలలో పాల్గొనే ఓటరు విలువ ఈ దిగువ విధంగా నిర్ణయించబడుతుంది.
AP Inter 2nd Year Civics Study Material Chapter 3 కేంద్ర కార్యనిర్వాహక శాఖ 1

AP Inter 2nd Year Civics Study Material Chapter 3 కేంద్ర కార్యనిర్వాహక శాఖ

ప్రమాణ స్వీకారం: రాష్ట్రపతిగా ఎన్నికైన వ్యక్తి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి లేదా ఒక సీనియర్ న్యాయమూర్తి సమక్షంలో ప్రమాణం చేస్తాడు. పదవీకాలం 5 సంవత్సరాలు. పదవీకాలం పూర్తి కాకుండానే రాజీనామా చేయవచ్చు లేదా మహాభియోగం తీర్మానం వలన పదవీచ్యుతుడైనా కావచ్చును.

ప్రశ్న 2.
భారత రాష్ట్రపతి మహాభియోగ ప్రక్రియను గూర్చి క్లుప్తంగా వ్రాయుము.
జవాబు:
రాష్ట్రపతి పదవీకాలం ముగియక ముందే రాజీనామా చేయవచ్చు లేదా రాజ్యాంగాన్ని అతిక్రమిస్తే రాజ్యాంగంలోని 56, 61 అధికరణాల ప్రకారం పార్లమెంట్ మహాభియోగ తీర్మానం ద్వారా పదవి నుండి తొలగించవచ్చు. దానికి అనుసరించే పద్ధతి ఈ దిగువ వివరించిన విధంగా ఉంటుంది.

  1. పార్లమెంట్లో ఏదో ఒక సభలో 14 రోజుల వ్యవధితో ఒక నోటీసు జారీ చేసి మహాభియోగ తీర్మానాన్ని ప్రవేశపెట్టాలి. ఆ తీర్మానం మీద ఆ సభలోని సభ్యులలో 4వ వంతు సభ్యులు సంతకం చేయాలి.
  2. ఆ తీర్మానాన్ని చర్చించి ఆ సభ 2/3వ వంతు మెజారిటీతో ఆమోదించాలి.
  3. అలా ఆమోదించిన తీర్మానాన్ని రెండవ సభ ఒక కమిటీని ఏర్పరచి, ఆరోపణలపై విచారణ జరుపుతుంది.
  4. ఆరోపణలు రుజువైతే ఆ సభలో కూడా మొత్తం సభ్యులలో 2/3వ వంతు సభ్యులు ఆమోదిస్తే రాష్ట్రపతి పదవీచ్యుతుడౌతాడు.

ఇంతవరకు మహాభియోగ తీర్మానం ద్వారా ఏ రాష్ట్రపతి తొలగింపబడలేదు.

ప్రశ్న 3.
భారత రాష్ట్రపతికి గల ఏవైనా రెండు అత్యవసర అధికారాలను పేర్కొనండి.
జవాబు:
1) జాతీయ అత్యవసర పరిస్థితి (352వ ప్రకరణ): రాష్ట్రపతి ఈ రకమైన అత్యవసర పరిస్థితిని యుద్ధం, విదేశీ దండయాత్రలు, సాయుధ తిరుగుబాటు వంటి పరిస్థితులు ఏర్పడినపుడు వినియోగిస్తాడు. భారతదేశ సార్వభౌమత్వానికి, భద్రతకు లేక దేశంలోని ఏదో ఒక ప్రాంతానికి ముప్పు వాటిల్లిందని రాష్ట్రపతి భావించినపుడు ఇలాంటి అత్యవసర పరిస్థితిని ప్రకటిస్తాడు. అయితే ఇటువంటి అత్యవసర పరిస్థితి ప్రకటించాలంటే ప్రధానమంత్రి నేతృత్వంలో మంత్రిమండలి వ్రాతపూర్వకమైన సలహామేరకు మాత్రమే ప్రకటించాలని భారత రాజ్యాంగం 44వ సవరణ చట్టం 1978 స్పష్టం చేస్తుంది. జాతీయ అత్యవసర పరిస్థితి అమలులో ఉన్నప్పుడు మన రాజ్యాంగంలోని సమాఖ్య లక్షణాలు పనిచేయవు. అన్ని అధికారాలను కేంద్రమే చెలాయిస్తుంది. మన దేశంలో నాలుగు సందర్భాలలో జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించడం జరిగింది. అవి:

  1. చైనా దురాక్రమణ (1962)
  2. భారత్ – పాకిస్తాన్ యుద్ధం (1965)
  3. బంగ్లాదేశ్ విమోచన సందర్భంలో భారత్ – పాకిస్తాన్ యుద్ధం (1971)
  4. పార్లమెంటును స్తంభింపజేయాలన్న ప్రతిపక్షాల పిలుపు సందర్భంగా (1975)

2) రాజ్యాంగపరమైన అత్యవసర పరిస్థితి (356వ ప్రకరణ): భారత రాజ్యాంగంలోని 356వ ప్రకరణ రాజ్యాంగపరమైన అత్యవసర పరిస్థితిని విధించే అధికారాన్ని రాష్ట్రపతికి కల్పించింది. ఆ రాష్ట్ర గవర్నర్ నుంచి గాని, మరొక విధంగా ఆ రాష్ట్రంలో రాజ్యాంగ సూత్రాల ప్రకారం పరిపాలన సాగించలేమనే పరిస్థితి ఏర్పడిందన్న నివేదిక తరువాత, రాష్ట్రంలో రాజ్యాంగపరమైన అత్యవసర పరిస్థితిని ప్రకటించే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. దీనినే ‘రాష్ట్రపతి పాలన’ అంటారు.
రాష్ట్రపతి పాలన సమయంలో భారతీయ రాజకీయ వ్యవస్థలో క్రింది మార్పులు సంభవిస్తాయి.

  1. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అన్ని లేదా ఏవైనా కొన్ని విధులను రాష్ట్రపతి స్వయంగా నిర్వహించవచ్చు. అలాగే గవర్నర్కు గానీ లేదా ఇతర కార్యనిర్వాహణ అధికారికి గానీ అప్పగించవచ్చు.
  2. రాష్ట్ర శాసన నిర్మాణశాఖ అధికారాలను పార్లమెంటు వినియోగిస్తుందని ప్రకటించవచ్చు.
  3. అత్యవసర పరిస్థితి ప్రకటన ఉద్దేశాలకు అనుగుణమైన అంశాలను అమలులో ఉంచడానికి రాష్ట్రపతి తగిన ఆదేశాలను జారీ చేయవచ్చును.

AP Inter 2nd Year Civics Study Material Chapter 3 కేంద్ర కార్యనిర్వాహక శాఖ

ప్రశ్న 4.
కేంద్ర ప్రభుత్వంలో రాష్ట్రపతి పాత్ర, స్థానాన్ని వివరించండి.
జవాబు:
రాష్ట్రపతి పాత్ర: రాష్ట్రపతి పాత్ర – స్థానాల గురించి రాజ్యాంగ పరిషత్తు సమావేశాల సమయంలోనూ, తరువాత కాలంలోనూ విశేషమైన చర్చ జరిగింది. జవహర్లాల్ నెహ్రూ, అంబేద్కర్ వంటి ప్రసిద్ధ నాయకులు రాష్ట్రపతికి కేవలం నామమాత్రమైన అధికారాలు మాత్రమే ఉంటాయని భావించారు. అందుకు విరుద్ధంగా రాజేంద్రప్రసాద్, అలెన్ గ్లెడ్ల్, కె.ఎం. మునీ వంటి ప్రముఖులు కేంద్ర మంత్రిమండలి సలహాతో నిమిత్తం లేకుండా రాష్ట్రపతికి కొన్ని విచక్షణాధికారాలు ఉంటాయని పేర్కొన్నారు. రాష్ట్రపతికి విశేష అధికారాలు ఉన్నాయని వాదించేవారి ఉద్దేశంలో రాష్ట్రపతి తన పదవీ స్వీకార సమయంలో రాజ్యాంగాన్ని, చట్టాన్ని సంరక్షించి, పెంపొందిస్తాననీ, భారతదేశ ప్రజలసేవ, శ్రేయస్సులకోసం అంకితమవుతానని ప్రమాణం చేస్తాడని ఆ ప్రమాణం ప్రకారం రాష్ట్రపతికి స్వతంత్ర అధికారాలు ఉంటాయని వ్యాఖ్యానించారు.

లోక్సభలో ఏ పార్టీకీ మెజారిటీ రానప్పుడు లేదా కొన్ని పార్టీలు సంకీర్ణ మంత్రిమండలిని ఏర్పాటు చేయడం సాధ్యం కాదు. కేంద్ర ప్రభుత్వ వ్యవహారాలలో తనకు సలహా, సహాయాలు అందించడానికి అవసరమైన ప్రధానమంత్రి నియామకంలో రాష్ట్రపతి విచక్షణాధికారాలు వినియోగిస్తాడనేది నిజమే. అలాగే లోక్సభను రద్దుచేయాలనే ప్రధానమంత్రి సలహాను పాటించడానికి లేదా తిరస్కరించడానికి రాష్ట్రపతికి ఉన్న అధికారాన్ని న్యాయశాఖతో సహా ఎవరూ ప్రశ్నించడానికి వీలులేదు. ముఖ్యంగా, జాతీయస్థాయిలో రాజకీయ సంక్షోభం కొనసాగుతున్న సమయంలో రాష్ట్రపతి పాత్ర, స్థానం ఎంతో ప్రధానమైనవి, కీలకమైనవి కూడా. కేంద్రంలో ఆచరణ సాధ్యమైన, పనిచేయగలిగిన, సమర్థవంతమైన ప్రభుత్వాన్ని స్థాపించడానికి గల అన్ని అవకాశాలను రాష్ట్రపతి అన్వేషించాలి. మంత్రిమండలి సమర్థవంతంగా పనిచేయలేనప్పుడు, రాజ్యాంగపరమైన యంత్రాంగం అదుపు తప్పినప్పుడు రాష్ట్రపతి ఎంతో శక్తివంతమైన వ్యక్తిగా రూపొందుతాడు.

1997లో ఉత్తరప్రదేశ్లో రాష్ట్రపతి పాలన విధించాలని, ముఖ్యమంత్రి కళ్యాణ్సింగ్ ను తక్షణమే భర్తరఫ్ చేయాలని యునైటెడ్ ఫ్రంట్ నేతృత్వంలోని కేంద్ర మంత్రిమండలి సూచనను రాష్ట్రపతి కె.ఆర్. నారాయణన్ నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. పైగా అలాంటి సలహాను ఉపసంహరించుకోవలసిందిగా కేంద్ర మంత్రిమండలి కోరడం జరిగింది. అలాగే బీహార్ ఆర్.జె.డి. ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి, ఆ రాష్ట్రంలో రాష్ట్రపతిపాలన విధించాలని వాజ్పేయి ప్రభుత్వం చేసిన సూచనలను కూడా రాష్ట్రపతి కె.ఆర్. నారాయణన్ తిరస్కరించారు. అలాగే సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకం, కార్గిల్ యుద్ధంపై రాజ్యసభలో చర్చించాలనే ప్రతిపక్షాల డిమాండ్ను అధికారపక్షం విస్మరించడం, 1998లో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర క్యాబినెట్ ప్రసంగం బదులుగా ఒక పాత్రికేయునితో సంభాషణ ద్వారా జాతినుద్దేశించి మాట్లాడటం, 1999 ఆగస్టు – అక్టోబరుల మధ్య వాజ్పేయి ఆపద్ధర్మ ప్రభుత్వ నూతన టెలికాం విధానం, ఇండియన్ ఎయిర్లైన్స్న లాభాల బాటలో నడిపించడానికి రూ.125 కోట్ల ప్యాకేజి మొదలైన అంశాలపై రాష్ట్రపతి అభ్యంతరాలు తెలిపారు. అలాగే 1998లో జరిగిన పన్నెండో లోక్సభ ఎన్నికల్లో ఓటువేసి, ఓటుహక్కును వినియోగించుకున్న తొలి రాష్ట్రపతిగా ప్రజాస్వామ్య ప్రక్రియలో ఓటువేయడం పౌరుడి బాధ్యత అని, ఆ బాధ్యతను నిర్వర్తించానని ఆయన ఈ సందర్భంగా ప్రకటించారు.

భారత రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతిని అత్యవసర దీపం (Emergency lamp) గా రాష్ట్రపతి ఆర్. వెంకటరామన్ తన ‘మై ప్రెసిడెన్షియల్ ఇయర్స్’ (My Presidential Years) గ్రంథంలో వర్ణించారు. రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ తన పదవీ విరమణ సందర్భంలో ప్రసంగిస్తూ రాష్ట్రపతి నిష్పాక్షికత, రాజ్యాంగ ఔచిత్యం, పారదర్శకత అనే మూడు సూత్రాలను అనుసరించవలసి ఉంటుందని ఉద్ఘాటించారు. విభిన్న సందర్భాలలో నిష్పాక్షికంగా వ్యవహరించడానికి నిబంధనల గ్రంథాన్ని అనుసరించే లక్షణం సదా రాష్ట్రపతికి ఉండాలని ఆయన ప్రకటించారు.

ప్రశ్న 5.
భారత ఉపరాష్ట్రపతికి గల ఏవైనా రెండు అధికారాలను వ్రాయండి.
జవాబు:
1) రాజ్యసభకు పదవిరీత్యా అధ్యక్షుడిగా వ్యవహరించడం: ఉపరాష్ట్రపతి రాజ్యసభకు పదవిరీత్యా అధ్యక్షుడు. ఆయన రాజ్యసభ సమావేశాలకు అధ్యక్షత వహిస్తాడు. రాజ్యసభ సమావేశాలను ఎంతో గౌరవం, ఔచిత్యం, మర్యాదలతో నిర్వహిస్తాడు. వివిధ బిల్లులు, అంశాలపై సభ్యులు తమ అభిప్రాయాలను వెల్లడించడానికి అనుమతిస్తాడు. సమావేశాలలో అనేక విషయాలపై తన నిర్ణయాలను తెలుపుతాడు. బిల్లులపై చర్చలు పూర్తయిన తరువాత ఓటింగ్ జరిపి, ఫలితాలను ప్రకటిస్తాడు. రాజ్యసభ ఆమోదించిన బిల్లులపై సంతకం చేసి లోక్సభకు పంపుతాడు. దేశంలోని వివిధ కార్యనిర్వాహక, శాసన నిర్మాణ సంస్థలు, అధికారులతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుతాడు. రాజ్యసభ సభ్యుల ప్రత్యేక హక్కులు, సౌకర్యాలను కాపాడతాడు. లోక్ సభ స్వీకర్లాగే ఆయనకు అనేక అధికారాలుంటాయి. అయితే, ఒక బిల్లును ఆర్థిక బిల్లుగా ప్రకటించి దానిపై సంతకం చేయడానికి లేదా పార్లమెంటు ఉభయసభల సంయుక్త సమావేశాలకు అధ్యక్షత వహించడానికి ఆయనకు అధికారం లేదు. సభలో ఏదైనా ఒక బిల్లును ఆమోదించే విషయంలో సందిగ్ధత ఏర్పడితే, తన అంతిమ నిర్ణాయక ఓటును వినియోగించి బిల్లు భవితవ్యాన్ని నిర్ణయిస్తాడు. అయితే రాజ్యసభ సభ్యుడు కాకపోవడంవల్ల, సాధారణంగా ఆయన సభలోని బిల్లులపై జరిగే ఓటింగ్లో పాల్గొనడు.

2) రాష్ట్రపతిగా వ్యవహరించడం: రాష్ట్రపతి పదవిలో ఉండే వ్యక్తి మరణించినా, రాజీనామా చేసినా లేదా తొలగించబడినా లేదా మరొక కారణం వల్ల ఆ పదవిలో ఖాళీ ఏర్పడితే, ఉపరాష్ట్రపతి రాష్ట్రపతిగా వ్యవహరిస్తాడు. ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతిగా వ్యవహరించే కాలపరిమితి ఆరు నెలలకు మించకూడదు. కానీ, నూతన రాష్ట్రపతి పదవీ బాధ్యతలు చేపట్టేవరకు ఆయన రాష్ట్రపతిగా పదవిలో కొనసాగుతాడు. అలాగే, రాష్ట్రపతి అస్వస్థుడైన సందర్భంలో రాష్ట్రపతి తిరిగి ఆరోగ్యవంతుడై విధులను నిర్వహించేవరకు ఉపరాష్ట్రపతి రాష్ట్రపతిగా వ్యవహరిస్తాడు. ఉపరాష్ట్రపతి రాష్ట్రపతిగా వ్యవహరించే సమయంలో ఆయనకు రాష్ట్రపతికి గల జీతభత్యాలు, అధికారాలు, సౌకర్యాలన్నీ కల్పించడం జరుగుతుంది. ఈ విషయంలో పార్లమెంటు ఎప్పటికప్పుడు తగిన నిబంధనలను రూపొందిస్తుంది.

AP Inter 2nd Year Civics Study Material Chapter 3 కేంద్ర కార్యనిర్వాహక శాఖ

ప్రశ్న 6.
ప్రధానమంత్రి ఎలా నియమించబడతాడో తెలియజేయండి.
జవాబు:
ప్రధానమంత్రి నియామకం: మంత్రుల జట్టుతో కూడుకున్న ప్రధానమంత్రి రాష్ట్రపతికి కేంద్ర ప్రభుత్వ అధికార విధుల నిర్వహణలో సహాయకుడిగా, సలహాదారుడిగానూ వ్యవహరిస్తాడని భారత రాజ్యాంగం 74(1)వ అధికరణం స్పష్టం చేసింది. 75(1)వ అధికరణం ప్రకారం ప్రధానమంత్రిని రాష్ట్రపతి నియమిస్తాడు.

లోక్సభకు సార్వత్రిక ఎన్నికలు జరిగిన తరువాత, సభలో మెజారిటీ స్థానాలను గెలుచుకున్న పార్టీ నాయకుడిని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవలసిందిగా రాష్ట్రపతి ఆహ్వానిస్తాడు. ఒకవేళ లోక్సభలో ఏ ఒక్క పార్టీకీ మెజారిటీ స్థానాలు లభించని పక్షంలో, సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పరచడానికి గల అవకాశాలన్నింటినీ రాష్ట్రపతి అన్వేషిస్తాడు. సంకీర్ణమండలికి నాయకత్వం వహించిన వ్యక్తిని ప్రభుత్వం ఏర్పాటు చేయవలసిందిగా ఆహ్వానిస్తాడు. ఈ సందర్భంలో రాష్ట్రపతి తన విచక్షణాధికారాలను వినియోగిస్తాడు. సంకీర్ణమండలి నాయకుడికి ఆహ్వానం పంపేముందు రాష్ట్రపతి రాజకీయ స్థిరత్వం, మెజారిటీ సభ్యుల మద్దతు పొందగలిగిన సామర్థ్యం, రాజ్యాంగపరమైన, చట్టపరమైన అంతర్ధాలు, జాతీయ ప్రయోజనాలు, ప్రతిపక్షాల అభిప్రాయాలు మొదలైన అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుంటాడు. సంకీర్ణమండలికి చెందిన నాయకుడిని ప్రధానమంత్రిగా నియమించే సందర్భంలో, లోక్సభలో నిర్ణీత గడువులోగా మెజారిటీ సభ్యుల మద్దతును నిరూపించు కోవలసిందిగా రాష్ట్రపతి షరతును కూడా విధిస్తాడు. రాష్ట్రపతులు ఆర్. వెంకటరామన్, శంకర్ దయాళ్ శర్మ, కె.ఆర్. నారాయణన్లు పైన పేర్కొన్న షరతును విధించి, తమ హయాంలో ప్రధానమంత్రులను నియమించారు. ప్రధానమంత్రిగా ఎవరిని ఆహ్వానించాలి ? ఎవరిని ఎంపిక చేయాలి ? ఎవరిని నియమించాలి ? అనే వాటిపై రాష్ట్రపతికిగల అధికారాన్ని న్యాయస్థానంలో ప్రశ్నించే వీలు లేదు.

ప్రశ్న 7.
కేంద్ర ప్రభుత్వంలో ప్రధానమంత్రి పాత్రను వివరించండి.
జవాబు:
ప్రధానమంత్రి పాత్ర: కేంద్ర ప్రభుత్వ వ్యవహారాలలో ప్రధానమంత్రి ప్రబలమైన పాత్రను పోషిస్తాడు. కేంద్ర ప్రభుత్వ పాలనతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిపై ప్రధానమంత్రి చెరగని ముద్రవేస్తాడు. ఆయనను మంత్రివర్గ సభ్యులలో ప్రథముడిగా వర్ణించడం జరిగింది. కేంద్ర మంత్రిమండలి, కేంద్ర కాబినెట్, అధికారపార్టీ, లోక్సభ, కేంద్ర ప్రభుత్వం, దేశ ప్రజల నాయకుడిగానూ, కేంద్ర మంత్రిమండలి – రాష్ట్రపతికి, దేశ ప్రజల మధ్య సంధానకర్తగానూ ప్రధానమంత్రి విలక్షణమైన పాత్రను పోషిస్తాడు. ఆయన అత్యంత రాజకీయ శక్తిని, ప్రాపకాన్ని కలిగి ఉంటాడు. అయితే ప్రధానమంత్రిగా వ్యవహరించే వ్యక్తికి కేంద్ర ప్రభుత్వంలో ఉండే ప్రతిష్ట, పలుకుబడి, ఔన్నత్యం, వ్యక్తిత్వ స్థాయిలను బట్టి ఆయన పాత్ర ఆధారపడి ఉంటుంది.

జవహర్లాల్ నెహ్రూ, అంబేద్కర్ వంటి ప్రముఖ జాతీయోద్యమ నాయకులు, రాజ్యాంగ పరిషత్తు సభ్యులు ప్రధానమంత్రిని కేంద్ర ప్రభుత్వంలో ప్రధాన వ్యక్తిగానూ, మూలస్తంభంగానూ, ఇరుసు చీలగానూ వర్ణించారు. ఈ కారణంగానే “ప్రధానమంత్రిగా వ్యవహరించేవారికి హూందాతనం, అధికారం, నియంత్రించగల దృఢత్వం, ఒప్పించగల నేర్పరితనం, సమయస్ఫూర్తి, వాస్తవికత, నిశ్చయత్వం, నిష్పాక్షికత, ప్రశాంతత, ప్రజలకు అందుబాటు, వ్యక్తిగతంగా దయ, దూరదృష్టివంటి లక్షణాలు ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారని” విలియం హారొ ్కర్ట్ పేర్కొన్నాడు.

ప్రశ్న 8.
కేంద్ర మంత్రిమండలి నిర్మాణం మరియు అధికారాలను వర్ణించండి.
జవాబు:
మంత్రిమండలి నిర్మాణం: కేంద్ర మంత్రిమండలిలో మూడు రకాల మంత్రులు ఉంటారు. వారు:

  1. కేబినెట్ మంత్రులు
  2. స్టేట్ మంత్రులు
  3. డిప్యూటీ మంత్రులు. మంత్రులు సమిష్టి బాధ్యత, వ్యక్తిగత బాధ్యత అనే సూత్రాలపై పనిచేస్తారు. వీరిని ప్రధాని తొలగించవచ్చు లేక విశ్వాసరాహిత్య తీర్మానం వలన మొత్తం ప్రభుత్వమే మారవచ్చు.

అధికారాలు

విధులు:
1) విధానాలను రూపొందించుట: దేశ పరిపాలనకు సంబంధించిన విధానాలను మంత్రివర్గం రూపొందిస్తుంది. విదేశాంగ విధానం, ఆంతరంగిక పరిపాలనా విధానం, ఆర్థిక విధానం మొదలగునవి.

2) పరిపాలనా నియంత్రణ: వివిధ శాఖలకు అధిపతులుగా ఉండే మంత్రులు తమ శాఖలపై నియంత్రణ చెలాయిస్తూ పరిపాలన సమర్థవంతంగా పనిచేసేటట్లు చూస్తారు.

3) శాసన విధులు: మంత్రులు పార్లమెంట్ లో బిల్లులు ప్రవేశపెట్టి అవి చట్టాలుగా రూపొందించేటందుకు కృషి చేస్తారు.

4) నియోజిత శాసనాలు: మౌలిక శాసనాల పరిధిలో, తమ శాఖలు నిర్వహించడానికి కావలసిన నిబంధనలను మంత్రులు, కార్యదర్శుల సహకారంతో రూపొందిస్తారు.

AP Inter 2nd Year Civics Study Material Chapter 3 కేంద్ర కార్యనిర్వాహక శాఖ

5) ఆర్థికాధికారాలు: వార్షిక బడ్జెట్ను తయారుచేసి, లోక్సభ ఆమోదం పొందేటట్లు చూస్తారు. దేశ ఆర్థిక వ్యవహారాలను నియంత్రణ చేస్తారు.

6) సంక్షేమ పథకాలు: ప్రజల అభివృద్ధికి, సంక్షేమానికి పథకాలు రూపొందించి, అమలు చేయడం మంత్రివర్గం విధి. ఆర్థిక ప్రణాళికలు రూపొందించడం, ఆర్థిక సమస్యల పరిష్కారం, బలహీనవర్గాల రక్షణ, ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే సహాయం చేయడం మున్నగునవి మంత్రివర్గం యొక్క బాధ్యత.

7) శాంతిభద్రతల నిర్వహణ: దేశంలో అల్లర్లు జరగకుండా చూడటం, అందుకు కావలసిన పరిపాలనాపరమైన చర్యలు తీసుకోవడం మంత్రిమండలి విధి.

8) దేశ రక్షణ: రాజ్యాన్ని విదేశీ దురాక్రమణ నుండి కాపాడటం, సైన్యాన్ని సురక్షితం చేసి సరిహద్దుల రక్షణ, ఆయుధాల నిర్మాణం, రక్షక వూహ్యం, స్వాతంత్ర్య పరిరక్షణ, దేశ ప్రయోజనాలు కాపాడటం మంత్రివర్గం విధి. దేశాభివృద్ధి, పరిపాలనా సామర్థ్యం, ప్రజాశ్రేయస్సు మంత్రివర్గ సామర్థ్యంపై ఆధారపడి ఉంటాయి.

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
కేంద్ర కార్యనిర్వాహక శాఖ నిర్మాణం.
జవాబు:
భారత రాజ్యాంగం అయిదో భాగంలో 52 నుండి 78 వరకు ఉన్న ప్రకరణలు కేంద్ర కార్యనిర్వాహక శాఖను గురించి వివరించాయి. కేంద్ర కార్య నిర్వాహక శాఖ

  1. రాష్ట్రపతి
  2. ఉపరాష్ట్రపతి
  3. ప్రధానమంత్రి
  4. మంత్రిమండలితో కూడుకొని ఉంటుంది.

ప్రశ్న 2.
రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేయడానికి కావలసిన అర్హతలేవి ?
జవాబు:

  1. భారతీయ పౌరుడై ఉండాలి.
  2. 35 సం||ల వయస్సు నిండి ఉండాలి.
  3. లోక్సభ సభ్యుడిగా ఎన్నికయ్యేందుకు తగిన అర్హతలుండాలి.
  4. కేంద్ర, రాష్ట్ర, స్థానిక స్థాయిలలో ఏ ప్రభుత్వంలోనూ లాభసాటి పదవిలో కొనసాగుతూ ఉండరాదు.

ప్రశ్న 3.
భారత రాష్ట్రపతి ఎన్నిక.
జవాబు:
భారత రాష్ట్రపతి పరోక్ష పద్ధతిలో నైష్పత్తిక ప్రాతినిధ్య ఏక ఓటు బదిలీ సూత్ర ప్రాతిపదికగా ఎన్నికవుతాడు. భారత రాష్ట్రపతిని ‘ఎన్నికల గణం’ రహస్య బ్యాలెట్ విధానం ద్వారా ఎన్నుకొంటుంది. ఈ ఎన్నికల గణంలో పార్లమెంటు ఉభయ సభలకు ఎన్నికైన సభ్యులు, రాష్ట్ర విధాన సభలకు ఎన్నికైన సభ్యులు ఉంటారు.

ప్రశ్న 4.
రాష్ట్రపతిచే ముఖ్యమైన నియామకాలు.
జవాబు:
భారత రాష్ట్రపతి నియమించే ముఖ్యమైన నియామకాలలో కొన్ని ప్రధానమంత్రి, కేంద్ర మంత్రిమండలి, భారత అటార్నీ జనరల్, భారత కంప్టోలర్ మరియు ఆడిటర్ జనరల్, సుప్రీంకోర్టు, హైకోర్టుల ప్రధాన మరియు ఇతర న్యాయమూర్తులు, రాష్ట్రాల గవర్నర్లు, కేంద్రపాలిత ప్రాంత లెఫ్టినెంట్, పరిపాలకులు, ప్రధాన ఎన్నికల కమీషనర్లు.

AP Inter 2nd Year Civics Study Material Chapter 3 కేంద్ర కార్యనిర్వాహక శాఖ

ప్రశ్న 5.
రాష్ట్రపతి న్యాయాధికారాలు.
జవాబు:
కేంద్ర ప్రభుత్వ సలహామేరకు రాష్ట్రపతి న్యాయాధికారాలను చెలాయిస్తాడు. అవి:

  1. సుప్రీంకోర్టు, హైకోర్టు ప్రధాన మరియు ఇతర న్యాయమూర్తులను నియమించటం.
  2. ఏదైనా చట్టపరమైన విషయాలపై సుప్రీంకోర్టు సలహాను కోరటం.
  3. న్యాయస్థానాలు విధించిన శిక్షలను మార్చటం, తగ్గించటం, నిలుపుదల చేయటం, క్షమాభిక్ష ప్రసాదించటం.

ప్రశ్న 6.
352వ ప్రకరణ. [Mar. ’16]
జవాబు:
352వ ప్రకరణ ప్రకారం భారత రాష్ట్రపతి యుద్ధం, విదేశీ దండయాత్రలు, సాయుధ తిరుగుబాటు వంటి పరిస్థితులు తలెత్తినపుడు జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటిస్తారు. ఈ అత్యవసర పరిస్థితి అమలులో ఉన్నప్పుడు మన రాజ్యాంగంలోని సమాఖ్య లక్షణాలు పనిచేయవు. అన్ని అధికారాలను కేంద్ర ప్రభుత్వమే చెలాయిస్తుంది.

ప్రశ్న 7.
356వ ప్రకరణ.
జవాబు:
భారత రాజ్యాంగంలోని 356వ ప్రకరణ రాజ్యాంగపరమైన అత్యవసర పరిస్థితిని విధించే అధికారం రాష్ట్రపతికి కల్పించింది. ఏదైనా రాష్ట్ర గవర్నర్, ఆ రాష్ట్రంలో రాజ్యాంగ సూత్రాల ప్రకారం పరిపాలన సాగించలేమనే పరిస్థితి ఏర్పడింది అని నివేదిస్తే, రాష్ట్రపతి. ఆ రాష్ట్రంలో ‘రాజ్యాంగపరమైన అత్యవసర పరిస్థితి’ ప్రకటిస్తాడు. దీనినే ‘రాష్ట్రపతి పాలన’ అని కూడా అంటారు. రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన రాష్ట్రపతి ద్వారా నిర్వహించబడుతుంది.

ప్రశ్న 8.
ఆర్థిక అత్యవసర పరిస్థితి.
జవాబు:
భారతదేశం మొత్తానికి లేదా ఏదో ఒక ప్రాంతం ఆర్థిక స్థిరత్వానికి, లేదా పరపతికి ముప్పు వాటిల్లినపుడు 360వ ప్రకరణ ప్రకారం రాష్ట్రపతి ఆర్థిక అత్యవసర పరిస్థితిని ప్రకటించవచ్చు. ఈ పరిస్థితిని ప్రకటించినపుడు రాష్ట్రపతి ప్రభుత్వ సిబ్బంది మరియు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల జీతభత్యాలను తగ్గించవచ్చు.

ప్రశ్న 9.
జాతీయ అత్యవసర పరిస్థితి.
జవాబు:
జాతీయ అత్యవసర పరిస్థితి (352 ప్రకరణ): రాష్ట్రపతి ఈ రకమైన అత్యవసర పరిస్థితిని యుద్ధం, విదేశీ దండయాత్రలు, సాయుధ తిరుగుబాటు వంటి పరిస్థితులు ఏర్పడినపుడు వినియోగిస్తాడు. భారతదేశ సార్వభౌమత్వానికి, భద్రతకు లేక దేశంలో ఏదో ఒక ప్రాంతానికి ముప్పు వాటిల్లిందని రాష్ట్రపతి భావించినపుడు ఇలాంటి అత్యవసర పరిస్థితిని ప్రకటిస్తాడు. అయితే ఇటువంటి అత్యవసర పరిస్థితి ప్రకటించాలంటే ప్రధానమంత్రి నేతృత్వంలో మంత్రిమండలి వ్రాతపూర్వకమైన సలహామేరకు మాత్రమే ప్రకటించాలని భారత రాజ్యాంగం 44వ సవరణ చట్టం 1978 స్పష్టం చేస్తుంది.

ప్రశ్న 10.
ఉపరాష్ట్రపతిగా పోటీ చేయడానికి కావలసిన అర్హతలు.
జవాబు:

  1. భారతీయ పౌరుడై ఉండాలి.
  2. 35 సం||ల వయస్సు నిండి ఉండాలి.
  3. రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యేందుకు తగిన అర్హతలను కలిగి ఉండాలి.
  4. భారతదేశంలో కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలలో ఆదాయాన్నిచ్చే పదవిలో ఉండరాదు.

AP Inter 2nd Year Civics Study Material Chapter 3 కేంద్ర కార్యనిర్వాహక శాఖ

ప్రశ్న 11.
రాజ్యసభ అధ్యక్షుడు. [Mar. ’17]
జవాబు:
ఉపరాష్ట్రపతి పదవిరీత్యా రాజ్యసభ అధ్యక్షుడిగా వ్యవహరిస్తాడు. రాజ్యసభ సమావేశాలకు అధ్యక్షత వహిస్తూ, సమావేశాలు హుందాగా నిర్వహిస్తాడు. సమావేశాలలో తన నిర్ణయాలను వెల్లడిస్తాడు. వివిధ బిల్లులపై ఓటింగ్ జరిపి, ఫలితాలను వెల్లడిస్తాడు.

ప్రశ్న 12.
ప్రధానమంత్రి నియామకం.
జవాబు:
ప్రధానమంత్రిని రాష్ట్రపతి నియమిస్తాడు అని మన రాజ్యాంగం సూచించింది. లోక్సభ సాధారణ ఎన్నికలు జరిగిన తరువాత, ఆ సభలో మెజారిటీ పార్టీ నాయకుడిని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవలసిందిగా రాష్ట్రపతి ఆహ్వానిస్తాడు. ప్రధానమంత్రి ఎంపిక ఆహ్వానం, నియామక విషయాలలో రాష్ట్రపతి అధికారాలను న్యాయస్థానాలలో ప్రశ్నించేందుకు వీలు లేదు.

ప్రశ్న 13.
కేంద్ర మంత్రిమండలి రకాలు.
జవాబు:
కేంద్ర మంత్రిమండలిలో మూడు రకాల మంత్రులుంటారు. వారు:

  1. కేబినెట్ మంత్రులు.
  2. స్టేట్ మంత్రులు (స్వతంత్ర హోదా).
  3. డిప్యూటీ మంత్రులు (స్వతంత్ర హోదాలేని మంత్రులు).

ప్రశ్న 14.
కేంద్ర కేబినెట్ ఏవేని రెండు విధులు. [Mar. ’17]
జవాబు:

  1. కేంద్ర కేబినెట్ కేంద్ర ప్రభుత్వ విధానాలను రూపొందిస్తుంది. జాతి ఆంతరంగిక, విదేశీ విధానాలను సుదీర్ఘమైన, తీవ్రమైన సమాలోచనల తరువాత ఖరారు చేస్తుంది.
  2. కేంద్ర ప్రభుత్వ వ్యవహారాలన్నింటిలో రాష్ట్రపతికి సలహాలు అందిస్తుంది. రాష్ట్రపతికి తన విధుల నిర్వహణలో కేబినెట్ మార్గదర్శకంగా ఉంటుంది.

AP Inter 2nd Year Civics Study Material Chapter 3 కేంద్ర కార్యనిర్వాహక శాఖ

ప్రశ్న 15.
సమిష్టి బాధ్యత.
జవాబు:
పార్లమెంటరీ ప్రభుత్వ లక్షణాలలో ప్రధానమైనదే సమిష్టి బాధ్యత. భారత రాజ్యాంగ నిర్మాతలు ఈ సూత్రాన్ని బ్రిటిష్ రాజ్యాంగం నుంచి గ్రహించారు. రాజ్యాంగం 75(3)వ అధికరణం మంత్రిమండలి సమిష్టిగా లోక్సభకు బాధ్యత వహిస్తుందని ప్రకటించింది. కేంద్ర మంత్రిమండలి ప్రధానమంత్రి ఆధ్వర్యంలో ఒక జట్టుగా వ్యవహరిస్తుంది. కార్యనిర్వాహక శాఖలోని మంత్రులు అధికారంలో ఉండగా తమ చర్యలకు, కార్యకలాపాలకు, పార్లమెంటుకు సమిష్టిగా బాధ్యత వహించడాన్నే సమిష్టి బాధ్యత అంటారు.