AP Board 9th Class Telugu Solutions Chapter 9 భూమి పుత్రుడు

AP State Syllabus AP Board 9th Class Telugu Textbook Solutions Chapter 9 భూమి పుత్రుడు Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Telugu Solutions 9th Lesson భూమి పుత్రుడు

9th Class Telugu 9th Lesson భూమి పుత్రుడు Textbook Questions and Answers

చదవండి-ఆలోచించండి-చెప్పండి

మనిషి జీవించడానికి ముఖ్యంగా కావలసినవి తినడానికి తిండి, కట్టుకోడానికి బట్ట, నివసించడానికి ఇల్లు – ఈ మూడు అవసరాలు తీరాలంటే ప్రకృతిలోని మొక్కలు, చెట్లే ఆధారం. అవి ఎక్కడెక్కడో చెల్లాచెదురుగా ఉంటే వాటి నుంచి తమ అవసరాలు తీర్చుకొనేవాడు ఆదిమానవుడు. కాలక్రమేణ మానవ అవసరాలు ఎక్కువ కావడంతో, ఆయా మొక్కలను, చెట్లను ప్రత్యేకంగా పెంచడం మొదలుపెట్టాడు. దానికి వ్యవసాయం అని పేరు పెట్టాడు. రాను రాను ఆ వ్యవసాయం ప్రధాన వృత్తిగా మారింది. దాని ఆధారంగా మానవుడి నాగరికత కూడా పెరిగింది.

ప్రశ్నలు జవాబులు

ప్రశ్న 1.
మనిషికి కావలసిన ముఖ్యావసరాలు ఏవి?
జవాబు:
మనిషికి ముఖ్యంగా కావలసినవి మూడు :

  1. తినడానికి తిండి
  2. కట్టుకోవడానికి బట్ట
  3. నివసించడానికి ఇల్లు.

ప్రశ్న 2.
ఆదిమానవుడు మొదట్లో తన అవసరాలను ఎలా తీర్చుకొనేవాడు?
జవాబు:
ప్రకృతిలో ఎక్కడెక్కడో చెల్లాచెదురుగా ఉండే మొక్కలు, చెట్ల నుండి ఆదిమానవుడు తన అవసరాలను తీర్చుకొనేవాడు.

ప్రశ్న 3.
వ్యవసాయం ఎలా మొదలయింది?
జవాబు:
మానవ అవసరాలు ఎక్కువ కావడంతో మానవుడు ఆయా చెట్లనూ, మొక్కలనూ ప్రత్యేకంగా పెంచడం మొదలుపెట్టాడు. దానికి ‘వ్యవసాయం’ అని పేరు పెట్టాడు. వ్యవసాయం ఆ విధంగా మొదలయ్యింది.

ప్రశ్న 4.
వ్యవసాయం వలన ఏమి పెరిగింది?
జవాబు:
వ్యవసాయం వలన మానవుడి ‘నాగరికత’ కూడా పెరిగింది.

AP Board 9th Class Telugu Solutions Chapter 9 భూమి పుత్రుడు

ప్రశ్న 5.
వ్యవసాయం చేసేవారిని ఏమని పిలుస్తారు?
జవాబు:
వ్యవసాయం చేసేవారిని కర్షకులు, రైతులు, సేద్యగాండ్రు అని పిలుస్తారు.

ఇవి చేయండి

I. అవగాహన – ప్రతిస్పందన

అ) కింది అంశాలను గురించి మాట్లాడండి.

ప్రశ్న 1.
పద్యాలను భావయుక్తంగా పాడండి.
జవాబు:
మీ గురువుల సాయంతో రాగయుక్తంగా, భావం తెలిసేటట్లు చదవడం నేర్చుకోండి.

ప్రశ్న 2.
ఈ పాఠానికి ‘భూమి పుత్రుడు’ అనే శీర్షిక తగినట్లు ఉన్నదా? ఎందుకు? చర్చించండి.
జవాబు:
సామాన్యంగా రచనలోని విషయాన్ని కొంతవరకు ఊహించగలిగిన విధంగా, వివరించగలిగిన దానిగా, ‘శీర్షిక’ ఉండాలి. శీర్షిక అంటే పాఠం పేరు. ఈ పాఠంలో రామిరెడ్డిగారు రైతును గురించి, అతడు భూమిని దున్ని చేసే వ్యవసాయం గురించి చర్చించారు. పుత్రుడు తండ్రి ఆస్తిని అనుభవించడానికి పూర్తి హక్కు కలిగి ఉంటాడు. భూమి పుత్రుడు అంటే కర్షకుడు లేక రైతు. భూమిని పూర్తిగా అనుభవించే అర్హత గలవాడు. రైతు పంటలు పండించి, సమాజంలోని ఇతర సోదరులు అందరికీ తిండి పెడుతున్నాడు కాబట్టి రైతులను గురించి చెప్పిన ఈ పాఠానికి “భూమి పుత్రుడు” అనే పేరు సరిపోతుంది.

ఆ) కింది ప్రశ్నలకు పాఠం ఆధారంగా ఐదు వాక్యాలలో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
తన పంచన చేరిన అతిథిని రైతు ఎలా ఆదరిస్తున్నాడు?
జవాబు:
రైతు తాను తిన్నా తినకపోయినా, తన పంచకు ఆకలితో వచ్చిన అతిథికి కడుపునిండా తిండి పెట్టి, త్రాగడానికి నీరు ఇస్తాడు. ఏ ఒక్క అతిథినీ రైతు నిరాశపరచడు.

AP Board 9th Class Telugu Solutions Chapter 9 భూమి పుత్రుడు

ప్రశ్న 2.
కవి రైతును ఏమి తెలుసుకోమంటున్నాడు?
జవాబు:
రైతు ఎప్పుడూ కష్టాల కన్నీళ్ళలో కూరుకుపోవాలని ఎవరూ శాసించలేరనీ, రైతుకు ఏమీ లోటు లేదనీ, రైతు గొప్పదనాన్ని రైతు తెలుసుకోవాలని రామిరెడ్డి గారు చెప్పారు. రైతు తన గొప్పదనాన్ని తాను తెలుసుకోవాలని చెప్పారు.

ప్రశ్న 3.
ఈ పాఠంలోని జాతీయాలను, సామెతలను గుర్తించి వివరించండి.
జవాబు:
ఈ పాఠంలో కింది జాతీయాలు, సామెతలు ఉన్నాయి.
1) పిండికొద్ది రొట్టె:
మనం చేసిన కృషికి తగిన విధంగానే ఫలితం ఉంటుందని భావం. మనం ఎక్కువ పిండి వేస్తే పెద్ద రొట్టె తయారవుతుంది. కొద్ది పిండి వేస్తే చిన్న రొట్టె తయారవుతుందని అర్థం.

2) బోడితలకు, మోకాళ్ళకు ముడులు పెట్టు :
ఏదో సంబంధం లేని మాటలు చెప్పడం అని అర్థం. వారు చెప్పే మాటల్లో పొంతన, అతుకు లేదని అర్థం. మోకాళ్ళమీద, బోడి తలమీద వెంట్రుకలు ఉండవు. నున్నని గుండుకూ, మోకాలికీ ముడివేయడం జరిగే పని కాదని అర్థం. అసంబద్ధమైన మాటలని సారాంశం.

3) చిటికెల పందిళ్ళు పన్ను :
ఇంత చేస్తాము అంత చేస్తాము అని అతిడంబపు మాటలు మాట్లాడడం అని అర్థం. తాము చిటికె చప్పుడు చేసే పని అయిపోతుందని గొప్పలు చెప్పడం అని భావం. మాటలతో మభ్యపెట్టడం అని అర్థం.

4) నేల నూతులకు ఉగ్గాలు నిలుపుట :
కొన్ని ప్రాంతాల్లో దిగుడు బావులు ఉంటాయి. దానిలోకి ప్రక్కనున్న మెట్ల ద్వారా దిగి, నీరు పైకి తెచ్చుకోవాలి. నేలనూతుల నుండి మామూలు నూతులలోకి వలె చేదకు త్రాడుకట్టి తోడుకోవడం సాధ్యం కాదు. కానీ కొందరు అసాధ్యమైన కార్యములు చేస్తామని గొప్పలు చెపుతారు. అలాంటి వారిని గూర్చి ఈ మాట అంటారు.

5) ఉత్తయాసలకన్న మేలుద్యమంబు :
అది కావాలి ఇది కావాలి అని కేవలం కోరుకుంటూ కూర్చోడం కన్న, ఆ కావలసిన వాటి కోసం, ‘ఉద్యమంబు’ అంటే ప్రయత్నం చేయడం మంచిదని భావం.

6) సిరియె భోగోపలకి ‘జీవగట్టి’ :
‘జీవగట్టు’ అన్నది జాతీయము. జీవన ఔషధం అని భావం. ‘అతిముఖ్యం’ అని సారాంశము. భోగాలు పొందాలంటే సిరిసలఎదలు ముఖ్యంగా కావాలని భావం.

AP Board 9th Class Telugu Solutions Chapter 9 భూమి పుత్రుడు

ప్రశ్న 4.
పాఠం ఆధారంగా రైతు గుణగణాలను రామిరెడ్డి గారు ఏయే విశేషణాలతో వర్ణించారో రాయండి.
జవాబు:
“రైతు”

  1. భారత క్ష్మాతల ఆత్మగౌరవ పవిత్రమూర్తి.
  2. శూరమణి
  3. ప్రొద్దుపొడిచినది మొదలుకొని ప్రొద్దు క్రుంకు వఱకూ కష్టిస్తాడు.
  4. ఇరుగు పొరుగు వారి సంపదకై ఈర్ష్య చెందడు
  5. పరుల కష్టార్జితానికి ఆశపడడు.
  6. తాను తిన్నా తినకున్నా, అతిథులకు లేదనకుండా తృప్తిగా పెడతాడు.
  7. సాంఘిక ఉత్కృష్ట సౌభాగ్య సౌఖ్యాలకు రైతు కారకుండు.
  8. తన కష్టాన్ని గుర్తించని కృతఘ్నులను రైతు పట్టించుకోడు.
  9. తన కాయకష్టాన్నే నమ్ముకొని, తన శరీర శ్రమతో లభించిన పట్టెడన్నాన్నే తింటాడు.

ఇ) పాఠం ఆధారంగా కింది పట్టికను పూరించండి.

అంశంచేపట్టిన పని / ఫలితం
సమాజ నిర్మాణం, సంక్షేమం కోసంవ్యవసాయ వృత్తిని చేపట్టడం. “లోకహితం” దాని  ఫలితం.
శ్రమ చేయడం వల్లఫలములు సిద్ధిస్తాయి.
పరిశ్రమలకు ప్రధాన వనరు“వ్యవసాయం”.
విజయం సాధించాలంటేశౌర్యము, విద్య, బుద్ధి, సత్యసంధత, ఆత్మ విశ్వాసం విడువరాదు.

ఈ) కింది పేరాను చదవండి. కారణాలు రాయండి.

“ఏటి కేతంపట్టి ఎయి పుట్లు పండించి ఎన్నడూ మెతుకెరుగరన్నా ! నేను గంజిలో మెతుకెరుగనన్నా!” అని ఒక కవి పాట రూపంలో రైతు దుస్థితిని తెలియజేశాడు. వ్యవసాయానికి కావలసిన ముఖ్యమైన వనరులు భూమి, నీరు, దానితోపాటు ఎరువులు, వాతావరణ పరిస్థితులు అనుకూలించడం కూడా అవసరమే. జనాభా పెరగకముందు పై వనరులన్నీ పుష్కలంగా ఉండేవి. రానురాను జనాభా పెరిగిపోయింది. మానవుడి అవసరాలూ పెరిగిపోయాయి. వీటన్నిటికీ భూమే ఆధారం. ఇతర అవసరాలకోసం భూమి వినియోగం ఎక్కువ కావడం లాంటి పరిస్థితులవల్లనే వ్యవసాయరంగానికి ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రైతులు ఎన్నో ఇబ్బందులను, సమస్యలను ఎదుర్కొంటున్నారు. వ్యవసాయ రంగానికి ఉన్న వనరుల కొరత, ఇబ్బందుల వల్ల దిగుబడి ఆశాజనకంగా లేదు.

1. కవి పాట రాయడానికి కారణం : రైతు దుస్థితిని తెలియజేయడానికి.
2. వ్యవసాయ వనరులు తగ్గడానికి కారణం : జనాభా పెరిగిపోవడం.
3. వ్యవసాయ రంగానికి ఇబ్బందులకు కారణం : ఇతర అవసరాల కోసం భూమి వినియోగం ఎక్కువ కావడం.
4. దిగుబడి తగ్గడానికి కారణం : వ్యవసాయ రంగానికి ఉన్న వనరుల కొరత. ఇబ్బందులు.

II. వ్యక్తీకరణ సృజనాత్మకత

అ) కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో సొంతమాటల్లో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
‘సుఖాల కన్నిటికీ ధనమే మూలం’ అని కవి ఎందుకన్నాడు?
జవాబు:
సుఖాలు పొందాలంటే ధనం ఉండాలని కవి చెప్పాడు. ‘సిరియె భోగోపలబ్దికి జీవగట్టు’ అన్నాడు. నిజమే ‘ధనమూలమ్ ఇదం జగత్’ – అని పెద్దలు చెప్పారు. ఈ లోకమంతా డబ్బుమూలంగానే నడుస్తుంది. మన దగ్గర ధనం ఉంటేనే కావలసిన టి.వి, ఫ్రిజ్, పట్టుబట్టలు, కారు, మోటారు సైకిలు వగైరా కొనుక్కుని సుఖంగా జీవించగలం. కావలసిన వస్తువులు కొని తినగలం. కాబట్టి కవి చెప్పినట్లు సుఖాలు పొందాలంటే ధనం అవసరం అన్నది సత్యం.

ప్రశ్న 2.
“పిండికొద్దీ రొట్టె” అనడంలో కవి ఉద్దేశమేమి?
జవాబు:
పిండి వాడిన దానిని బట్టి రొట్టె పరిమాణం ఉంటుంది. ఎక్కువ పిండి వేసి కాలిస్తే పెద్ద రొట్టె తయారవుతుంది. కొంచెమే పిండి వేస్తే చిన్న రొట్టె తయారవుతుంది. అలాగే, మనం పడిన శ్రమను బట్టి ఫలితాలు ఉంటాయి. శ్రమలు లేకుండా ఫలములు రావు. కష్టపడితే సుఖం కలుగుతుంది. మనం పడిన శ్రమను బట్టే మనకు వచ్చే ఫలితం ఆధారపడి ఉంటుంది అని భావం.

AP Board 9th Class Telugu Solutions Chapter 9 భూమి పుత్రుడు

ప్రశ్న 3.
‘రైతు హృదయం నిర్మలమైనది’ దీనిపై మీ అభిప్రాయం ఏమిటి?
జవాబు:
రైతు కేవలం తన నిత్యావసరాలు గడచిపోతే చాలని చూస్తాడు. అతడు తన ఊహలనూ, ఆలోచనలనూ, నైపుణ్యాన్ని అన్నింటినీ పంటలు పండించడానికే వినియోగిస్తాడు. రైతు రోజంతా కష్టపడతాడు – ప్రక్కవారి సంపదలను గూర్చి ఆశపడడు. రైతు తాను తిన్నా, తినకపోయినా తన ఇంటికి వచ్చిన అతిథికి కడుపునిండా తృప్తిగా పెడతాడు. పైన చెప్పిన రైతు గుణగణాలను చూస్తే అతడి హృదయం నిర్మలమైనదని నా అభిప్రాయం.

ప్రశ్న 4.
‘పాలనాదండం’ కంటే ‘హలం’ గొప్పదని కవి ఎందుకన్నాడు?
జవాబు:
దేశాన్ని పాలించే రాజు చేతిలో పాలనా దండం ఉంటుంది. భూమిని దున్ని పంటలు పండించే రైతు చేతిలో ‘హలం’ ‘అనగా ‘నాగలి’ ఉంటుంది. రాజు తన పాలనా దండంతో తప్పు చేసిన వారిని దండిస్తాడు. రైతు తన చేతిలోని నాగలితో పంటలు పండిస్తాడు. దేశ ప్రజలందరికీ రైతు తిండి పెడతాడు. కాబట్టి రాజు ప్రజలను శిక్షించడానికి ఉపయోగించే పాలనా దండము కన్నా, రైతు పంటలు పండించి పదిమందికీ కడుపు నింపేందుకు ఉపయోగించే హలం గొప్పది అని కవి అన్నాడు.

ఆ) కింది ప్రశ్నలకు పదిహేనేసి వాక్యాల్లో సొంతమాటల్లో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
కర్షకుని గొప్పతనాన్ని గురించి కవి ఏమని చెప్పాడు?
జవాబు:
వ్యవసాయ వృత్తి వృత్తులన్నిటిలో గొప్పది. కర్షకుడు భారతదేశ ఆత్మగౌరవాన్ని ప్రకటించే పవిత్రమూర్తి. రాజదండం కన్నా, రైతు చేతి హలం గొప్పది. కర్షకుడు నిత్యావసరాలు గడచిపోతే చాలని చూస్తాడు. అంతకు మించి ఆశలు పెట్టుకోడు. కర్షకుడు తన ఊహలనూ, ఆలోచనలనూ, నైపుణ్యాన్ని పంటలను పండించడానికే వినియోగిస్తాడు.

కర్షకుడు రోజంతా కష్టపడతాడే గాని, ప్రక్క వారి సంపదలను గూర్చి అసూయపడడు. కర్షకుని మనస్సు నిర్మలమైనది. తాను తిన్నా తినకున్నా ఇతరుల కష్టార్జితానికై ఆశపడడు. ఆకలితో తన ఇంటికి వచ్చిన అతిథికి కడుపునిండా పెడతాడు.

కర్షకుడు చేపట్టిన వ్యవసాయమే పరిశ్రమలన్నిటికీ మూలం. పరిశ్రమల వల్లనే సంపదలూ, సంపదల వల్లనే సుఖం లభిస్తుంది. సమాజం సుఖసంతోషాలతో ఉండడానికి కర్షకుడే కారణం.

కర్షకుని కష్టఫలితాన్ని ఇతరులు అనుభవించి సుఖపడుతున్నారు. కర్షకుడు తాను చేసిన మేలును మరచిన కృతఘ్నులను పట్టించుకోడు. వ్యవసాయం చేయడంలో తన శరీరం ఎముకల గూడుగా మారినా, వానలు ముంచెత్తినా, కరవులు వచ్చినా అతడు లెక్కచేయడు. తన కాయకష్టాన్నే నమ్ముకొంటాడు. అతడు తన శరీరశ్రమతో లభించిన పట్టెడన్నం తిని, తృప్తిపడతాడు.

AP Board 9th Class Telugu Solutions Chapter 9 భూమి పుత్రుడు

ప్రశ్న 2.
పాఠ్యభాగ సారాంశాన్ని రాయండి.
(లేదా)
భూమి పుత్రుడైన రైతు సుఖదుఃఖాలను కవి ఏ విధంగా విశ్లేషించారో మీ సొంతమాటల్లో రాయండి.
జవాబు:
వ్యవసాయము వృత్తులలోకెల్లా ఉత్తమమైనది. ప్రపంచానికి మేలు చేయడం కోసం, కర్షకులు వ్యవసాయం చేస్తున్నారు. కర్షకులకు ఎవరూ సాటిరారు. హాలికుడు భారతదేశం ఆత్మ గౌరవాన్ని తెలిపే పవిత్రుడు. రాజదండం కన్నా రైతు నాగలి గొప్పది. రైతు ఎక్కువగా ఆశించడు. రోజూ ఖర్చులు వెళ్ళిపోతే చాలు అనుకుంటాడు. కర్షకుడు ప్రక్కవారి సంపదలకు అసూయపడడు. రైతు మనస్సు స్వచ్ఛమైనది.

కర్షకుడు తాను తిన్నా తినకపోయినా, అతిథులకు తప్పక పెడతాడు. వ్యవసాయం వల్లనే, సంపదలు లభిస్తాయి. సమాజ సుఖసంతోషాలకు హాలికుడే కారణం. హాలికుని కష్ట ఫలితాన్ని ఇతరులు అనుభవిస్తున్నారు. రైతుకు మాత్రం తిండికీ, బట్టకూ ఎప్పుడూ కఱవే.

రైతు కష్టంతో భోగాలు అనుభవించే వారు రైతును కన్నెత్తియైనా చూడరు. కర్షకుడు అటువంటి కృతఘ్నులను పట్టించుకోడు. వ్యవసాయం చేయడంలో తన శరీరం ఎముకల గూడుగా మారినా, వర్షాలు వచ్చినా, కఱవు వచ్చినా పట్టించుకోడు. రైతు తన కాయకషాన్నే నమ్ముకొని, తన శరీర శ్రమతో లభించిన పట్టెడన్నాన్నే తింటాడు.

అందుకే కవి “ఓ కర్మకా! నీ గూర్చి నీవు తెలిసికోవాలి. శ్రమను నమ్ముకొన్నవాడు, ఎన్ని ఆటంకాలనైనా దాటుతాడు. జీవిత యుద్ధంలో విజయానికి శక్తి, తెలివి, చదువు, సత్యము, ఆత్మవిశ్వాసము అనే ఆయుధాలు ధరించి ముందుకు నడు” అని బోధిస్తున్నాడు.

ఇ) సృజనాత్మకంగా సమాధానం రాయండి.

*నేడు గ్రామాలలో వ్యవసాయం చేసేవారు తగ్గుతున్నారు. భవిష్యత్తులో పంటలు పండించేవారు కరువైతే, ఆహారం దొరకడం గగనమవుతుంది. కోటీశ్వరుడైనా ఆకలికి అన్నమే తింటాడు కాని బంగారాన్ని తినడు కదా ! కాబట్టి వ్యవసాయం చేసే రైతులకు కావలసిన విత్తనాలు, ఎరువులు, సాగుకవసరమైన ప్రత్యేక ఋణ సౌకర్యం సకాలంలో అందించే బాధ్యత చేపట్టాలని వ్యవసాయాధికారికి లేఖ రాయండి.
జవాబు:

మండపేట,
x x x x

జిల్లా వ్యవసాయాధికారి గార్కి,
ఆర్యా,

విషయం : రైతుల అవసరాలను తీర్చే బాధ్యత తీసుకోవాలని కోరిక.

మా మండపేట భూములలో ఏటా రెండు పంటలు పండుతాయి. మా తాత ముత్తాల నుండి మేము వ్యవసాయాన్నే నమ్ముకొని జీవిస్తున్నాము. క్రమక్రమంగా మా రైతుల జీవితం దుఃఖనిలయం అవుతోంది.

మాకు కావలసిన ఎరువులు, విత్తనాలు, పురుగుమందులు సక్రమమైన ధరలకు దొరకట్లేదు. స్థానిక వర్తకులు వాటిని దాచి, కృత్రిమంగా కొరతను సృష్టిస్తున్నారు. పండించిన ధాన్యాన్ని ఎవరూ కొనడం లేదు. ఇప్పుడు రెండవ పంటకు పెట్టుబడి దొరకడం లేదు. బ్యాంకులకు ఎన్నిసార్లు వెళ్ళినా మేము ఉత్త చేతులతో తిరిగి రావలసి వస్తోంది. విద్యుచ్ఛక్తి కనీసం మూడు గంటలయినా రావడంలేదు.

మేము పంటలు పండించకపోతే ప్రజలు పస్తులు ఉండాలి. ప్రజలకు చేతిలో ఎంత డబ్బు ఉన్నా తిండి గింజలే తింటారు కదా. మీరు శ్రద్ధ చూపించి, మాకు అప్పులు దొరికేలా, ఎరువులు, విత్తనాలు సరయిన ధరలకు దొరికేలా చర్యలు వెంటనే చేపట్టండి. వ్యవసాయాన్ని బ్రతికించండి. సెలవు.

నమస్కారములు.

ఇట్లు,
మీ విశ్వసనీయుడు,
ఎన్. శ్రీకాంత్,
మండపేట,
తూర్పుగోదావరి జిల్లా.

చిరునామా:
జిల్లా వ్యవసాయశాఖాధికారిగార్కి,
కాకినాడ,
తూ॥గో॥ జిల్లా.

AP Board 9th Class Telugu Solutions Chapter 9 భూమి పుత్రుడు

ఈ) ప్రశంసాపూర్వకంగా సమాధానం రాయండి.

రైతు కృషి వల్లనే మనకు ఆహారం లభిస్తున్నది కదా! రామయ్య ఆదర్శరైతు. ఆధునిక పద్ధతులతో, సేంద్రియ ఎరువులతోనే అధిక దిగుబడిని సాధించాడు. వ్యవసాయశాఖ తరఫున ఆయన్ను అభినందించాలనుకున్నారు. ఈ అభినందన సభ కోసం రామయ్యగారిని ప్రశంసిస్తూ అభినందన పత్రాన్ని తయారు చేయండి.
(లేదా)
ఆదర్శరైతు రామయ్యను ప్రశంసిస్తూ అభినందన పత్రం రాయండి.
జవాబు:

అభినందన పత్రం

అభ్యుదయ రైతురాజు రామయ్య మహాశయా!

మీకు అభినందన మందారాలు. భారతదేశ సౌభాగ్యం పల్లెలపై ఆధారపడియుంది. పల్లెల్లో రైతులు పండించే పంటలపైనే మన వర్తక పరిశ్రమలు ఆధారపడియున్నాయి. మేం కడుపునిండా అన్నం తింటున్నామంటే అది మీ వంటి కర్షకోత్తముల హస్తవాసి అనే చెప్పాలి.

కర్షకోత్తమా !
మీరు మన ప్రభుత్వ వ్యవసాయశాఖ వారు సూచించిన సూచనలను అందిపుచ్చుకొని, మీ పొలాల్లో ఈ సంవత్సరం ఎకరానికి 60 బస్తాల ధాన్యం పండించారు. చేల గట్లపై కంది మొక్కలు పాతి 20 పాల కందులు పండించారు. రసాయనిక ఎరువులు, పురుగుమందుల జోలికి పోకుండా, మీ తోటలో 10 గేదెలను పెంచి, పాడి పరిశ్రమను ప్రోత్సహిస్తూ, ఆ పశువుల పేడతో సేంద్రియ ఎరువుల్ని తయారు చేసి వాటినే ఉపయోగించి మంచి పంటలు పండించారు. మీ కృషికి ప్రభుత్వ పక్షాన అభినందనలు అందిస్తున్నాము.

రైతురత్న రామయ్య గారూ!
నమస్కారం. ప్రభుత్వం మీకు ‘రైతురత్న’ అనే బిరుదునిచ్చి సత్కరిస్తోంది. మీరే ఈ జిల్లాలో రైతులకు ఆదర్శం. మీరు వ్యవసాయంలో మరిన్ని నూతన పద్ధతులు పాటించి, మన జిల్లాలో, రాష్ట్రంలో రైతులకు ఆదర్శంగా నిలవాలని కోరుతున్నాము. ఈ సందర్భంగా మీకు మన ముఖ్యమంత్రిగారి తరఫున రూ. 25,000లు బహుమతి ఇస్తున్నాము. మీకు మా శుభాకాంక్షలు. మా నమస్సులు.
అభినందనములు.

ఇట్లు,
జిల్లా వ్యవసాయాధికారి,
ఏలూరు, పూగో॥ జిల్లా,

IV. ప్రాజెక్టు పని

మీ గ్రామంలోని మీకు తెలిసిన ఒక ఆదర్శరైతు వద్దకు లేదా వ్యవసాయ అధికారి వద్దకు వెళ్ళి ఆధునిక పద్ధతుల ద్వారా అధికోత్పత్తిని ఎలా సాధింపవచ్చో వివరాలు సేకరించండి. వివరాలు తరగతి గదిలో చదివి ప్రదర్శించండి.
జవాబు:
మీ గురువుల పర్యవేక్షణలో పై ప్రాజెక్టు పనిని నిర్వహించండి.

III. భాషాంశాలు

పదజాలం

అ) కింది ప్రకృతి వికృతులను జతపరచండి.

1. ఈర్ష్యఅ) కర్జం
2. విజ్ఞానంఆ) సత్తు
3. సుఖంఇ) ఆన
4. కార్యంఈ) ఈసు
5. ఆజ్ఞఉ) సుగం
6. సత్యముఊ) విన్నాణం

జవాబు:

1. ఈర్ష్యఈ) ఈసు
2. విజ్ఞానంఊ) విన్నాణం
3. సుఖంఉ) సుగం
4. కార్యంఅ) కర్జం
5. ఆజ్ఞఇ) ఆన
6. సత్యముఆ) సత్తు

ఆ) కింది వాక్యాలను అవగాహన చేసుకొని గీత గీసిన పదాలకు నానార్థాలు రాయండి.

1. ఉచితం కదా ! అని దేన్నీ వృథా చేయడం ఉచితం కాదు.
ఉచితం : (నానార్థాలు) 1) రుసుము లేనిది 2) తగినది

2. పండించిన ఫలానికి ధర ఉన్నప్పుడే రైతు ఫలం పొందగలడు.
ఫలం: (నానార్థాలు) 1) పండు 2) లాభం

3. నేడు ధరకు విపరీతంగా ధర పెరిగిపోయింది.
ధర : (నానార్థాలు ) 1) నేల 2) వెల.

4. ఆధునిక కాలంలో కృష్ణ చేయడానికి ఎవరూ కృష్ణ చేయడం లేదు.
కృషి : (నానార్థాలు) 1) వ్యవసాయం 2) ప్రయత్నము

5. వర్మం లేక ఈ వర్మం జలాశయాలు నిండలేదు.
వర్షం : (నానార్థాలు) 1) వాన 2) సంవత్సరము

AP Board 9th Class Telugu Solutions Chapter 9 భూమి పుత్రుడు

ఇ) కింది పదాలకు సమానార్థక పదాలను రాయండి. వాటిని సొంతవాక్యాలలో ఉపయోగించండి.
ఉదా: మహిళ = స్త్రీ, ఉవిద, నారి

వాక్య ప్రయోగం : ఉవిద తన హక్కుల కోసం పోరాటంలో భాగంగా నార్తీలోకాన్ని చైతన్యపరచి మహిళ అంటే ఏమిటో నిరూపించుకుంటున్నది.

1. హలం : 1) నాగలి, 2) సీరము
వాక్య ప్రయోగం : సీరము గుర్తుతో, నాగలిని భుజాన ధరించి రామయ్య పోటీ చేశాడు.

2. హాలికుడు : 1) రైతు 2) కర్పకుడు 4) సైరికుడు
వాక్య ప్రయోగం : రైతు బాంధవుడైన వ్యక్తిని కర్షకులు తమ నాయకుడిగా ఎన్నుకొంటే సైరికుల క్షేమానికి అతడు కృషి చేస్తాడు.

3. పొద్దు : 1) సూర్యుడు 2) దినము 3) వేళ
వాక్య ప్రయోగం : ఈ దినము సూర్యుడు మబ్బులలో మునిగి, భోజనం వేళ దాటాక కనబడ్డాడు.

4. వృక్షం : 1) చెట్టు 2) తరువు
వాక్య ప్రయోగం : ఈ తరువుకు కొమ్మలు లేవు కాని, వృక్షం నిండా పళ్ళు ఉండడం వల్ల చెట్టు మీద కోతులు చాలా ఉన్నాయి.

5. సత్యం : 1) నిజం 2) యథార్ధము
వాక్య ప్రయోగం : సత్యం కదా అని, నిజం చెపితే, యథార్థంగా వాడు చిక్కులలో పడతాడు.

6. సంగ్రామం : 1) యుద్ధము 2) రణము
వాక్య ప్రయోగం : యుద్ధములో పాల్గొన్న సైనికుడు, సంగ్రామంలో ఉత్సాహం చూపితే రణములో విజయం సిద్ధిస్తుంది.

7. అతిథి : 1) ఆవేశికుడు 2) ఆగంతువు
వాక్య ప్రయోగం : ఆవేశికుడైన మహర్షి. ఊరివారందరికీ అతిథిగా ఉంటూనే, ఆగంతువులా సన్మానం పొందాడు.

8. సౌఖ్యం : 1) సుఖం 2) హాయి
వాక్య ప్రయోగం : సౌఖ్యంగా ఉంటుందని హాయిగా షికారుకు వెడితే అక్కడ చలిగాలితో సుఖం మాయమయ్యింది.

9. నుయ్యి : 1) కూపం 2) బావి
వాక్య ప్రయోగం : నుయ్యి కన్నా బావి గొప్పదంటారు కానీ, కూపం మరింత గొప్పది.

వ్యాకరణం

అ) కింది సంధులకు ఉదాహరణలు రాసి, సూత్రాలు కూడా రాయండి.

1. వృద్ధి సంధి – సూత్రం :
అకారానికి ఏ, ఐ లు పరమైతే ఐకారమూ; ఓ, ఔలు పరమైతే ఔకారమూ ఏకాదేశంగా వస్తాయి.
ఉదా :
1) జీవనైకపరిపాలన – జీవన + ఏకపరిపాలన – వృద్ధి సంధి
2) మహైశ్వర్యము = మహా + ఐశ్వర్యము – వృద్ధి సంధి
3) వనౌషధి = వన + ఓషధి – వృద్ధి సంధి

2. త్రిక సంధి సూత్రం :
1) ఆ, ఈ, ఏ అనే సర్వనామాలు త్రికమనబడును.
2) త్రికము మీది అసంయుక్త హల్లునకు ద్విత్వంబు బహుళంబుగానగు.
3) ద్విరుక్తంబగు హల్లు పరమగునపుడు ఆచ్ఛిక దీర్ఘంబునకు హ్రస్వంబగు.
ఉదా :
1) ఎక్కాలము = ఏ + కాలము – త్రికసంధి
2) ఎవ్వారు = ఏ + వారు – త్రికసంధి
3) ఇమ్మహర్షి = ఈ + మహర్షి – త్రికసంధి
4) అమ్మధురత్వము = ఆ + మధురత్వము – త్రికసంధి

3. గుణసంధి – సూత్రం:
అకారానికి ఇ, ఉ, ఋలు పరమైనపుడు క్రమంగా ఏ, ఓ, అర్లు ఏకాదేశంబగు.
ఉదా :
1) భోగోపలబ్ధి = భోగ + ఉపలబ్ది – గుణసంధి
2) సాంఘికోత్కృష్ట = సాంఘిక + ఉత్కృష్ట – గుణసంధి
3) కష్టోత్కటము = కష్ట + ఉత్కటము – గుణసంధి
4) మహర్షి = మహా + ఋషి – గుణసంధి
5) మదేభము = మద + ఇభము – గుణసంధి

4. అత్వసంధి – సూత్రం:
అత్తునకు సంధి బహుళంబుగానగు.
ఉదా :
1) రామయ్య = రామ + అయ్య – అకారసంధి
2) పుట్టినిల్లు = పుట్టిన + ఇల్లు – అకారసంధి
3) సీతమ్మ = సీత + అమ్మ – అకార సంధి
4) మేనల్లుడు = మేన + అల్లుడు – అకారసంధి

5. ఇత్వసంధి – సూత్రం :
ఏమ్యాదుల ఇకారానికి సంధి వైకల్పికముగానగు.
ఉదా :
1) పొడిచినదాదిగా = పొడిచినది + ఆదిగా – ఇకార సంధి
2) ఆకలెత్తగ = ఆకలి + ఎత్తగ – ఇకారసంధి
3) అదేమి = అది + ఏమి – ఇకార సంధి
4) ఇదేమి = ఇది + ఏమి – ఇకార సంధి

AP Board 9th Class Telugu Solutions Chapter 9 భూమి పుత్రుడు

ఆ) కింది వాటికి విగ్రహవాక్యాలు రాసి, సమాసాలను గుర్తించండి.

సమాస పదాలువిగ్రహవాక్యంసమాసం పేరు
1) అమాంద్యంమాంద్యము కానిదినఞ్ తత్పురుష సమాసం
2) సచ్ఛీలురుమంచి శీలము కలవారుబహుబ్లి హి సమాసం
3) చిటికెల పందిళ్ళుచిటికెలతో పందిళ్ళుతృతీయా తత్పురుష సమాసం
4) భారత క్ష్మాతలంభారతము అనే భూభాగంసంభావనా పూర్వపద కర్మధారయ సమాసం
5) హృదయకళికహృదయము అనే కళికరూపక సమాసం

ఛందస్సు

I. తేటగీతి
1) నాలుగు పాదాలుంటాయి.
2) ప్రతి పాదానికి ఒక సూర్యగణం, రెండు ఇంద్రగణాలూ, రెండు సూర్యగణాలూ వరసగా ఉంటాయి.
3) నాలుగో గణం మొదటి అక్షరం యతిస్థానం. ప్రాసయతి చెల్లుతుంది.
4) ప్రాస నియమము లేదు.
1. AP Board 9th Class Telugu Solutions Chapter 9 భూమి పుత్రుడు 1
అభ్యాసం :
అలాగే మీరు ఈ పద్యానికి సంబంధించిన మిగతా పాదాలకు గణవిభజన చేయండి.
గణవిభజన (2వ పద్యం, 2వ పాదం)
AP Board 9th Class Telugu Solutions Chapter 9 భూమి పుత్రుడు 2

1) ఈ పాదంలో 1 సూర్యగణం, 2 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు వరుసగా వచ్చాయి. ఇది తేటగీతి పద్యపాదం, యతి నాల్గవ గణం మొదటి అక్షరం.
గణ విభజన (2వ పద్యం, 3వ పాదం)
AP Board 9th Class Telugu Solutions Chapter 9 భూమి పుత్రుడు 3
1) ఈ పాదంలో 1 సూర్యగణం, 2 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలున్నాయి. కావున తేటగీతి. యతి 4వ గణం మొదటి అక్షరం.
గణ విభజన (2వ పద్యం, 4వ పాదం)
AP Board 9th Class Telugu Solutions Chapter 9 భూమి పుత్రుడు 4

1) ఈ పాదంలో 1 సూర్యగణం, 2 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలున్నాయి. కావున తేటగీతి. యతి 4వ గణం మొదటి అక్షరం.

9th Class Telugu 9th Lesson భూమి పుత్రుడు కవి పరిచయం

శ్రీ దువ్వూరి రామిరెడ్డిగారు 09.11.1895న నెల్లూరు జిల్లాలో జన్మించారు. ఈయన 19వ ఏట సాహిత్యరంగంలో ప్రవేశించి నలజారమ్మ, వనకుమారి, కృషీవలుడు, జలదాంగన, యువకస్వప్నము, కడపటి వీడ్కోలు, పానశాల-కావ్యాలను, నక్షత్రశాల-నైవేద్యము, భగ్నహృదయము, పరిశిష్టము, ప్రథమకవిత్వము అనే ఖండకావ్యాలను రచించారు. సంస్కృతం, తెలుగు, ఇంగ్లీషు, ఫ్రెంచి, లాటిన్, జర్మన్, బెంగాలీ, పర్షియన్, ఉర్దూ, దువ్వూరి తమిళభాషలలో పండితులు. ఈయన 11.09. 1947 నాడు కన్నుమూశారు. వీరికి ‘కవికోకిల’ రామిరెడ్డి అను బిరుదు కలదు.

దువ్వూరివారి రచనాశైలి సరళసుందరంగా వుంటుంది. పాతకొత్తల, ప్రాక్పశ్చిమాల కలయికతో అందాన్ని సంతరించుకున్నది. విశ్వశాంతి, దేశభక్తి, మానవతావాదం, అభ్యుదయం ఈయన రచనలలో ప్రస్ఫుటంగా కనిపిస్తూ మనకు మేలుకొలుపు పాడుతూ ఉంటాయి.

పద్యాలు – ప్రతిపదార్థాలు-భావాలు

1వ పద్యం : కంఠస్థ పద్యం
*చం! మనుజసమాజనిర్మితి సమంబుగ నీకొక ముఖ్యమైన వృ
త్తి నియత, మట్టి ధార్మికవిధిం జిరకాలము గౌరవంబుతో
మనిచిరి నీ పితామహుల మాంద్యసుశీలురు సర్వవృత్తిపా
వన కృషి జీవనైక పరిపాలన లోకహితార్థకాంక్షులై.
ప్రతిపదార్థం :
మనుజసమాజనిర్మితి సమంబుగన్;
మనుజ = మానవుల యొక్క
సమాజ = సమాజాన్ని (సంఘాన్ని)
నిర్మితి = నిర్మాణంలో
సమంబుగన్ = సమత్వము కలిగేలా
నీకున్ = నీకు
ఒక = ఒక
ముఖ్య మైన = ప్రధానమైన
వృత్తి = వృత్తి
నియతము = నిర్ణయింపబడింది (నియమించబడింది.)
అట్టి = అటువంటి
ధార్మిక విధిన్ = ధర్మబద్ధమైన పనిని
చిరకాలము = చాలాకాలము
అమాంద్య సుశీలురు; అమాంద్య = సోమరితనంలేని
సుశీలురు = గొప్ప శీలవంతులు అయిన
నీ పితామహులు = నీ తండ్రి తాతలు
సర్వవృత్తి ……. లోకహితార్థకాంక్షులై;
సర్వవృత్తి = అన్ని వృత్తులలో
పావన = పవిత్రమైన
కృషి = వ్యవసాయాన్నే
జీవన + ఏక = ముఖ్య జీవనంగా
పరిపాలన = చక్కగా కాపాడుతూ
లోకహిత + అర్థ, కాంక్షులు + ఐ = ప్రపంచానికి మేలు చేయాలనే కోరిక కలవారై
గౌరవంబుతోన్ = గౌరవంగా
మనిచిరి నిర్మితి = రక్షించారు; పోషించారు.

భావం :
మానవ సమాజ నిర్మాణంలో భాగంగా, నీకొక ముఖ్యమైన వృత్తిని అప్పగించడం జరిగింది. అది వ్యవసాయ వృత్తి. ఇది వృత్తులలోకెల్లా పవిత్రమైనది. ప్రపంచానికి మేలు చేకూర్చాలనే కోరికతో, నీ పూర్వికులు ధర్మబుద్ధితో చాలాకాలంగా గౌరవంతో, వ్యవసాయ వృత్తిని నిర్వహిస్తూ వస్తున్నారు.

AP Board 9th Class Telugu Solutions Chapter 9 భూమి పుత్రుడు

2వ పద్యం :
తే॥ శ్రమలు లేకయె ఫలములు దుముకబోవు
పిండికొలదియె రొట్టె; యోపిన విధాన
కష్టపడుము కృషీవలా, కలుగు సుఖము
ఉత్తయాసలకన్న మే లుద్యమంబు
ప్రతిపదార్థం :
కృషీవలా – ఓ కర్షకుడా!
శ్రమలు లేకయె = శ్రమపడకుండా
ఫలములు = ఫలితాలు
దుముకబోవు = ఉట్టిపడవు (తమంతట తాముగా రావు)
పిండికొలది + ఎ = పిండిమేరకే
రొట్టె = రొట్టె తయారవుతుంది
ఓపిన విధాన = శక్తికి తగ్గట్టుగా (శక్తివంచన లేకుండా)
కష్టపడుము = కష్టపడు
సుఖము, కలుగున్ = నీకు సుఖం కలుగుతుంది
ఉత్త + ఆసలకన్నన్ = కేవలమూ ఆశలతో జీవించడం కన్నా
ఉద్యమంబు = ప్రయత్నం చేయడం
మేలు = మంచిది

భావం :
కృషీవలా! శ్రమ చేయకుండా, ఫలితాలు రావు. పిండి కొద్దీ రొట్టె కదా! శక్తివంచన లేకుండా కష్టపడు. నీకు సుఖం కలుగుతుంది. కేవలం ఉత్త ఆశలతో జీవించడం కన్నా, ప్రయత్నం చేయడం మంచిది.

3వ పద్యం
తే॥ వేలనూతుల కుగాలు నిలుపువారు,
బోడితలకు మోకాళ్ళకు ముడులువెట్టు
వారు, చిటికెల పందిళ్ళు పన్నువారు
నిన్నుఁ బోలరు, తమ్ముడా, యెన్నడైన
ప్రతిపదార్థం :
నేల నూతులకున్ = బావులకు (లోతుగా ఉండే దిగుడు బావులకు)
ఉగ్గాలు = చేదలు (చిన్న చెంబులు)
నిలుపువారు = ఏర్పాటు చేసేవారు
బోడితలకున్ = వెండ్రుకలు లేని తలకూ
మోకాళ్ళకున్ = మోకాళ్ళకూ
ముడులువెట్టువారు = ముళ్ళు వేసేవారు
చిటికెల పందిళ్ళు పన్నువారు = మాటలతో మభ్య పెట్టేవారు (ఇంత చేస్తాము, అంత చేస్తాము అని అతిడంబములు పలికి నమ్మించేవారు.)
తమ్ముడా = సోదరా !
ఎన్నడైనన్ = ఎప్పుడూ కూడా
పోలరు (నీకు) = సాటిరారు

భావం :
తమ్ముడా ! లోకంలో కొందరు చిత్రంగా ఉంటారు. వీరిలో కొంతమంది చిన్నతాడు కట్టిన చెంబుతో నేలనూతిలోని నీళ్ళుతోడుతారు. మరికొందరు గుండుకూ మోకాలికీ ముడి పెడతారు. ఇంకొందరు చిటికెలతో పందిళ్ళు వేస్తారు. చేతలతో సమాజసేవ చేస్తున్న నీకు, వారు ఎప్పుడూ సాటిరారు. (పైన చెప్పిన వారంతా కేవలం మాటల చమత్కారంతో, అరచేతిలో స్వర్గాన్ని చూపిస్తారు.)

4వ పద్యం :
తే|| సైరికా, నీవు భారతజ్మా తలాత్మ
గౌరవ పవిత్రమూర్తివి! శూరమణివి!
ధారుణీపతి పాలనదండ మెపుడు
నీహలంబు కన్నను బ్రార్థనీయమగునె?
ప్రతిపదార్థం :
సైరికా = సేద్యకాడా! (ఓ రైతా!)
భారత క్ష్మాతల = భారతదేశం యొక్క (భారత భూమండలం యొక్క)
ఆత్మగౌరవ = ఆత్మగౌరవాన్ని ప్రకటించే
పవిత్రమూర్తివి = పవిత్ర రూపుడవు
శూరమణివి = శూరులలో శ్రేష్ఠుడివి
ధారుణీపతి = భూమిని పాలించే రాజు యొక్క
పాలన దండము = పాలించే ధర్మదండము
ఎపుడున్ = ఎప్పుడునూ
నీ హలంబుకన్నను = నీ నాగలికంటె
ప్రార్థనీయము + అగునె = కోరదగినది అవుతుందా? (కాదు) (రాజు చేతిలోని ధర్మదండం కన్నా, నీ చేతి నాగలి గొప్పది అని భావము)

భావం :
హాలికుడా ! నీవు భారతదేశ ఆత్మగౌరవాన్ని తెలిపే పవిత్ర స్వరూపానివి. శూరులలో శ్రేష్ఠుడివి. రాజు చేతిలోని ధర్మదండం కన్నా, నీ చేతిలోని నాగలి గొప్పది. (రాజదండంలో దండించే గుణం ఉంది. నీ నాగలిలో పండించే గుణం ఉంది.)

AP Board 9th Class Telugu Solutions Chapter 9 భూమి పుత్రుడు

5వ పద్యం :
తే॥ దైనికావశ్యకమ్ముల దాటిపోవ
వెగుర టెక్కలురాని నీ యిచ్ఛలెపుడు;
పైరుపచ్చలె యవధిగా (బ్రాకుచుండు
నీ విచారము, సహయు, నిపుణతయును
ప్రతిపదార్థం :
ఎగురన్ = ఎగరడానికి
ఱెక్కలురాని = రెక్కలు లేని
నీ + ఇచ్చలు = నీ కోరికలు
ఎపుడు = ఎప్పుడూ
దైనిక + ఆవశ్యకములన్ = రోజురోజూ అవసరములయిన నిత్యావసర వస్తువులను
దాటిపోవవు = అతిక్రమింపవు
నీ విచారమున్ = నీ ఆలోచనయూ
ఊహయున్ = ఊహయూ
నిపుణతయును = నేర్పునూ
పైరుపచ్చలు + ఎ – పైరుపంటలే (పైరు పంటల్ని బాగా పెంచడం మీదే)
అవధిగాన్ = హద్దుగా
ప్రాకుచుండున్ = అల్లుకుంటాయి

భావం :
నీవు నిత్యావసరాలు గడచిపోతే చాలని చూస్తావు తప్ప, నీకు అంతకు మించిన కోరికలు లేవు. నీ ఊహలనూ, ఆలోచనలనూ, నైపుణ్యాలనూ అన్నింటినీ, పైరు పంటలను పండించడానికే వినియోగిస్తావు. (నీకు రోజు ఎలాగో గడచిపోతే చాలు. అది ఇది కావాలనీ, ఏదో సంపాదించేద్దామనీ నీవు కోరవు. నీ తెలివితేటలు అన్నింటినీ పైరుపంటలను బాగా పెంచడం మీద పెడతావు.)

6వ పద్యం :
తే॥ ప్రొద్దువొడిచిన దాదిగా ప్రొద్దుగ్రుంకు
వజకు కష్టింతువేగాని యిరుగుపొరుగు
వారి సంపదకై యీసు గూరబోవ
వెంత నిర్మలమోయి, నీ హృదయకళిక!
ప్రతిపదార్థం :
ప్రొద్దు + పొడిచినది = సూర్యుడు ఉదయించినది
ఆదిగా = మొదలుగా (తెల్లవారినప్పటి నుండి)
ప్రొద్దు + క్రుంకు వఱకు = సూర్యుడు అస్తమించే వజకూ
కష్టింతువే + కాని = కష్టపడతావే కానీ
ఇరుగుపొరుగు వారి = ప్రక్కన, దగ్గరగానూ ఉన్న వారి
సంపదకై = ఐశ్వర్యానికై
ఈసు + కూరబోవవు = అసూయ పొందవు
నీ హృదయ కళిక = నీ హృదయము అనే మొగ్గ
ఎంత నిర్మలము + ఓయి = ఎంత పవిత్రమైనదో కదా!

భావం :
తెల్లవారినప్పటి నుండి సాయంత్రం అయ్యే వఱకూ కష్టపడతావు. అంతేకాని ఇరుగు పొరుగు వారి సంపదలను గూర్చి అసూయపడవు. నీ మనస్సు ఎంతో స్వచ్ఛమైనది.

7వ పద్యం :
తే॥ ఉండి తిన్నను లేక పస్తున్న గాని
యాసచేయవు పరుల కష్టార్జితంబు!
నాకలెత్తగ నీ పంచ కరుగు నతిథి
తినక, త్రావకపోయిన దినములేదు
ప్రతిపదార్థం :
ఉండి = నీకు తినడానికి తిండి ఉండి
తిన్నను = నీవు తినినా
లేక = నీకు తినడానికి లేక
పస్తున్నగాని (పస్తు + ఉన్న + కాని) = ఉపవాసము ఉన్నా కాని
పరుల = ఇతరుల
కష్టార్జితంబున్ (కష్ట + ఆర్జితంబు) = కష్టించి సంపాదించిన దానిని
ఆసచేయవు = ఆశించవు
ఆకలి + ఎత్తగన్ = ఆకలివేయగా
నీ పంచకున్ = నీ ఇంటి దగ్గరకు
అరుగు = వెళ్ళే (వెళ్ళిన)
అతిథి = అతిథి (అతిథి, అభ్యాగతి మొదలయిన వారు)
తినక = కడుపు నిండా తినకుండా
త్రావక = కావలసిన మంచినీరు, మజ్జిగ మొదలయినవి త్రాగి దాహం తీర్చుకోకుండా
పోయిన = వెళ్ళిపోయిన
దినము లేదు = రోజు లేదు

భావం :
నీవు తిన్నా, తినకపోయినా ఇతరులు సంపాదించుకున్న సంపదలకు ఎప్పుడూ ఆశపడవు. ఆకలితో నీ ఇంటికి వచ్చిన అతిథి కడుపు నిండా తిని, తృప్తిగా తాగి వెడతాడు. (అంటే రైతు అతిథి అభ్యాగతులకు తిండి పెట్టి వారి దాహం తీరుస్తాడని భావం)

AP Board 9th Class Telugu Solutions Chapter 9 భూమి పుత్రుడు

8వ పద్యం :
తే॥ కృషి సకల పరిశ్రమలకు కీలుచీల ;
సత్పరిశ్రమ వాణిజ్య సాధనంబు,
అఖిల వాణిజ్యములు సిరికాటపట్లు
సిరియె గోపలబ్దికి జీవగఱ్ఱ
ప్రతిపదార్ధం :
కృషి = వ్యవసాయమే
సకల పరిశ్రమలకున్ = అన్ని పరిశ్రమలకూ
కీలుచీల = ముఖ్యమైన సీల (మూలము)
సత్పరిశ్రమ = మంచి పరిశ్రమయే
వాణిజ్య సాధనంబు = వ్యాపారానికి సాధనము
అఖిల వాణిజ్యములు= అన్ని వ్యాపారాలూ
సిరికి = సంపదకు
ఆటపట్లు = వాసస్థానము (నివసించే చోటు)
సిరియె = సంపదయే
భోగోపలబ్ధికిన్ (భోగ + ఉపలబ్ధికి) = సుఖాలను పొందడానికి
జీవగఱ్ఱ (జీవ + కఱ్ఱ) = బ్రతికించు మందు

భావం :
వ్యవసాయమే పరిశ్రమలన్నింటికీ మూలం. పరిశ్రమలు వ్యాపారానికి సహాయపడతాయి. వ్యాపారం వల్ల సంపద కలుగుతుంది. సంపద వల్ల సుఖం లభిస్తుంది.

9వ పద్యం :
తే|| కావున కృషీవలా, నీవె కారణమవు
సాంఘికోత్కృష్ట సౌభాగ్య సౌఖ్యములకు;
ఫల మనుభవించువారలు పరులు; నీకుఁ
గట్టఁ గుడువను కజవె యెక్కాలమందు !
ప్రతిపదార్థం :
కృషీవలా – ఓ హాలికా!
నుతులన్ = పొగడ్తలతో
సాంఘికోత్కృష్ట సౌభాగ్య సౌఖ్యములకు; సాంఘిక = సంఘమునకు సంబంధించిన (సమాజానికి చెందిన)
ఉత్కృష్ట = ఉప్పొంగిన
సౌభాగ్య = వైభవానికి
సౌఖ్యములకు = సుఖాలకు
నీవె (నీవు + ఎ) = నీవె
కారణమవు = కారకుడవు
తలపరు = జ్ఞప్తికి తెచ్చుకోరు
ఫలము + అనుభవించు వారలు = ఫలాన్ని అనుభవించేవారు
పరులు = ఇతరులు
నీకు = నీకు మాత్రం
కట్టన్ = కట్టుకొనే బట్టకూ
భుజించుచున్ = అనుభవిస్తూ
కుడువను = తినడానికీ (తిండికీ)
నినున్ = నిన్ను ఎక్కాలమందు
(ఏ + కాలమందు) = ఎప్పుడునూ
కఱవె (కఱవు + ఎ) = లోటే

భావం:
ఓ హాలికుడా ! సమాజం సుఖసంతోషాలతో ఉండడానికి నీవే కారణం. నీ కష్టఫలితాన్ని ఇతరులు అనుభవించి సుఖపడుతున్నారు. నీకు మాత్రం తిండికీ, బట్టకూ ఎప్పుడూ కొరతే (లోటే).

AP Board 9th Class Telugu Solutions Chapter 9 భూమి పుత్రుడు

10వ పద్యం : కంఠస్థ పద్యం
*మ|| ఫలము ల్మెక్కెడివారు తత్ఫల రసాస్వాద క్రియాలోలురై
పలుమాజమ్మధురత్వమున్నుతుల సంభావింతురేగాని, త
త్ఫల హేతుక్రమవృక్షముం దలపరెవ్వారైన, వట్లే రమా
కలితు ల్బోగములన్ భుజించుచు విమం గన్నెత్తియుం జూతురే?
ప్రతిపదార్థం :
ఫలముల్ = పండ్లను
మెక్కెడి వారు = తినేవారు
తత్ఫల రసాస్వాదక్రియాలోలురై ; తత్ + ఫల = ఆ పండ్ల యొక్క
రస = రసాన్ని
ఆస్వాదక్రియా = అనుభవించే పనిలో
లోలురు + ఐ = అత్యాసక్తి కలవారై
పలుమాఱు = చాలాసార్లు
అమ్మధురత్వమున్ (ఆ + మధురత్వమున్) = ఆ తీపిదనాన్ని
సంభావింతురేకాని = గౌరవిస్తారే కాని
తత్ఫలహేతుక్రమవృక్షముం; తత్ + ఫల = ఆ పండు రావడానికి
హేతుక్రమ = కారణభూతమైన
వృక్షముం = చెట్టును గూర్చి
ఎవ్వా రైన = ఎవ్వరునూ
అట్లే = ఆ విధముగానే
రమా కలితుల్ = లక్ష్మీ సంపన్నులు (ధనంతో కూడినవారు)
భోగములన్ = సుఖాలను
కన్నెత్తియున్ + చూతురే = కన్ను పైకెత్తి చూడరు. (పట్టించుకోరు)

భావం :
పండ్లను తినేవారు వాటి తియ్యదనాన్ని పొగడుతూ తింటారే కాని, ఆ పండ్లను ఇచ్చిన చెట్టును గూర్చి ఎప్పుడైనా ఆలోచిస్తారా ? అలాగే నీ కష్టంతో భోగభాగ్యాలను అనుభవించే లక్ష్మీ సంపన్నులు నిన్ను కన్నెత్తి కూడా చూడరు కదా !

11వ పద్యం :
ఉ॥ అట్టి కృతఘ్నులన్ మనమునందుఁ దలంపక సేద్యనాద్యఫున్
ఘట్టన వస్థిపంజరముగా తమవెండినగాని, వరముల్
నీవు పట్టినగాని, క్షామములు వచ్చినగాని శరీరసత్వమే
పట్టుగ స్వశ్రమార్జితము పట్టెడు నన్నము దిందు ఎప్పుడున్!
ప్రతిపదార్థం :
అట్టి = అటువంటి
కృతఘ్నులన్ = చేసిన మేలు మరచిపోయిన వారిని
మనమునందున్ = (నీ) మనస్సు నందు
తలంపక = పట్టించుకోక (భావింపక)
సేద్యనాద్యపుం ఘట్టనన్ ; సేద్యనాద్యము = వ్యవసాయ సంబంధమైన
ఘట్టనన్ = రాపిడితో (సేద్యంలో పడే కష్టంతో)
అస్థిపంజరముగా = ఎముకల గూడుగా
తనువు = (నీ) శరీరము
ఎండినగాని = ఎండిపోయినా
వర్షముల్ = వర్షాలు (అతివృష్టి
పట్టిన + కాని = వచ్చినా
క్షామములు = కఱవులు (అనావృష్టి వల్ల)
వచ్చిన + కాని = వచ్చినా
శరీరసత్త్వము + ఏ = (నీ) శరీరంలోని శక్తియే
పట్టుగ = ఊతగా (అవలంబముగా) స్వశ్రమ + ఆర్జితము = (నీ) శరీర శ్రమతో లభించిన
పట్టెడు + అన్నమున్ (పట్టు + ఎడు) = గుప్పెడు అన్నాన్ని
ఎప్పుడున్ = ఎప్పుడునూ
తిందువు = తింటావు

భావం :
చేసిన మేలును మరచిపోయేవారిని నీవు అసలు పట్టించుకోవు. వ్యవసాయాన్ని చేయడంలో నీ శరీరం ఎముకల గూడుగా మారినా, వానలు ముంచెత్తినా, కరవు పీడించినా వాటిని లెక్క చేయవు. నీ శరీర కష్టాన్నే నమ్ముకొని, నీ శరీర శ్రమతో లభించిన పట్టెడన్నమైనా సరే దాన్నే తింటావు.

AP Board 9th Class Telugu Solutions Chapter 9 భూమి పుత్రుడు

12వ పద్యం :
తే॥ ఓ కృషీవల ! నీవు కష్టోత్కటంపు
దుర్భరావస్థ యందె తోదోపువడగ
నెవరు శాసించువారు, నీకేమి కొదవ ?
ఆత్మవిజ్ఞానమయముగా నలవరింపు
ప్రతిపదార్థం :
ఓ కృషీవల = ఓ కర్షకుడా !
నీవు = నీవు
కష్టోత్కటంపు దుర్భరావస్థ + అందె; కష్ట + ఉత్కటము = పెద్ద కష్టంతో కూడిన
దుర్భర + అవస్థయందె = భరింపరాని స్థితియందే
తోదోపు + పడగన్ (తోపు + తోపు) = ఎక్కువగా రాపిడి పొందాలని
ఎవరు = ఎవరు
శాసించువారు = (నిన్ను) ఆజ్ఞాపిస్తారు
నీకున్ = నీకు
కొదవ = లోటు
ఏమి = ఏముంది?
ఆత్మ విజ్ఞానమయముగా = నిన్ను నీవు తెలిసికొనడం
అలవరింపు = నేర్చుకో

భావం :
ఓ కృషీవలా! నీవు పెద్ద కష్టాలలో కూరుకుపోవాలని నిన్ను శాసించేవారు ఎవరు ? నీకేమి తక్కువ ? నీ గొప్పతనాన్ని నీవు తెలుసుకో.

13వ పద్యం :
జీవనస్పర్థ సామాన్య చేష్టమైన
కాలమున వ్యక్తివాద మగ్రత వహించు
సత్యవిరహితు డన్యభోజ్యత నశించు
నరజీవియె యంతరాయముల దాటు
ప్రతిపదార్థం :
జీవన స్పర్ధ = బ్రతకడం విషయంలో పోటీ
సామాన్యచేష్ట = సహజమైన కార్యము
ఐన కాలమున = అయిన నేటి రోజుల్లో
వ్యక్తివాదము = ఆయా వ్యక్తుల తత్త్వము (వ్యక్తి యొక్క కృషి)
అగ్రత వహించు = ప్రాధాన్యాన్ని పొందుతుంది
సత్త్వ విరహితుడు = సత్తువ లేనివాడు
అన్యభోజ్యతన్ = ఇతరులు పెట్టే తిండిపై ఆధారపడడంతో
నశించు = నాశనం అవుతాడు
అర్హజీవి + ఎ = అర్హత గలవాడే
అంతరాయములన్ = విఘ్నములను
దాటున్ = దాటుతాడు

భావం :
బ్రతకడం కోసం పోటీతత్వం సహజమైన కాలం ఇది. ఈ పరిస్థితులలో వ్యక్తివాదం ప్రాధాన్యం వహిస్తుంది. ఏ ప్రయత్నమూ, ఏ పనీ చేయనివాడు ఇతరులపై ఆధారపడి జీవిస్తూ నాశనం అవుతాడు. కానీ శ్రమను నమ్ముకున్నవాడు, ఎలాంటి అడ్డంకులనయినా దాటగలడు.

AP Board 9th Class Telugu Solutions Chapter 9 భూమి పుత్రుడు

14వ పద్యం :
తే॥ కావ జీవనసంగ్రామ కార్యమందు
విజయి వగుటకు శౌర్యంబు, విద్య, బుద్ధి,
సత్యసంధత, యాత్మవిశ్వాస మనెడు
నాయుధంబుల విడవకు హలికవర్య
ప్రతిపదార్థం :
హలికవర్య = శ్రేష్ఠుఁడవైన ఓ రైతూ !
కానన్ = కాబట్టి
జీవన సంగ్రామ కార్యమందు జీవన = జీవితము అనే
సంగ్రామ కార్యమందు = యుద్ధంలో
విజయివి + అగుటకు = విజయం పొందడానికి
శౌర్యంబు = శక్తి
విద్య = చదువు
బుద్ధి = తెలివి
సత్యసంధత = సత్యవాక్కు
ఆత్మవిశ్వాసము = నీపై నీకు నమ్మకము
అనెడు = అనే
ఆయుధంబులన్ = ఆయుధాలను
విడవకు = విడిచిపెట్టవద్దు

భావం :
కాబట్టి – ఓ రైతు శ్రేష్ఠుడా! జీవితము అనే యుద్ధంలో విజయం పొందడానికి ‘శక్తి, చదువు, తెలివి, సత్యము, నీపై నీకు నమ్మకము’ అనే ఆయుధాలను విడువక ముందుకు నడువు.

AP Board 9th Class Telugu Solutions Chapter 4 ప్రేరణ

AP State Syllabus AP Board 9th Class Telugu Textbook Solutions Chapter 4 ప్రేరణ Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Telugu Solutions 4th Lesson ప్రేరణ

9th Class Telugu 4th Lesson ప్రేరణ Textbook Questions and Answers

చదవండి-ఆలోచించండి-చెప్పండి

ప్రజ్ఞ చాలా తెలివికలది. ఆమెకు శాస్త్రవేత్త కావాలని బలమైన కోరిక ఉంది. ప్రతీ దాన్ని పరిశీలన దృష్టితో చూస్తుంది. విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలో బహుమతులు కూడా గెల్చుకుంది. శాస్త్రవేత్తలకు సంబంధించిన పుస్తకాలను చదువుతుంది. సందేహ నివృత్తి కోసం ఉపాధ్యాయులను, పెద్దలను, అన్నయ్యను సంప్రదిస్తుంది. ఒకరోజున విజ్ఞానశాస్త్ర కార్యక్రమంలో పాల్గొనడానికి వారి గ్రామానికి ఒక శాస్త్రవేత్త రాగా, ప్రజ్ఞ వెళ్ళి కలుసుకున్నది.

ప్రశ్నలు జవాబులు

ప్రశ్న 1.
ప్రజ్ఞ శాస్త్రవేత్తను ఏమడిగి ఉంటుంది?
జవాబు:
నాకు శాస్త్రవేత్తలంటే చాలా ఇష్టం. నేను కూడా మీలా శాస్త్రవేత్తను కావాలంటే ఏమి చేయాలి?

ప్రశ్న 2.
శాస్త్రవేత్త ప్రజ్ఞకు ఏమి చెప్పి ఉంటాడు?
జవాబు:
“నువ్వు కూడా శాస్త్రవేత్తవు కావచ్చు. ముందు విజ్ఞాన శాస్త్రాన్ని బాగా చదువు. శాస్త్రంలోని ప్రాథమికాంశాలు బాగా అర్థమైతేనే పై తరగతుల్లో వచ్చే జటిలమైన విషయాలు అర్థమవుతాయి. కాబట్టి కష్టపడి కాక ఇష్టపడి చదువు” అని శాస్త్రవేత్త ప్రజ్ఞకు చెప్పి ఉంచాడు.

AP Board 9th Class Telugu Solutions Chapter 4 ప్రేరణ

ప్రశ్న 3.
ప్రజ్ఞ శాస్త్రవేత్త కావాలనుకుంది కదా! మీరేం కావాలనుకుంటున్నారు? ఇందుకోసం మీరేం చేస్తారు?
జవాబు:
నేను వైద్యుణ్ణి కావాలనుకుంటున్నాను. ఇందుకోసం విజ్ఞాన శాస్త్రాన్ని, ప్రత్యేకంగా ‘జీవశాస్త్రాన్ని’ ఇష్టంతో చదువుతాను. ఇంకా పెద్దల సలహా, సూచనల ప్రకారం నా అధ్యయనాన్ని కొనసాగిస్తాను.

ప్రశ్న 4.
అతిసామాన్య కుటుంబంలో జన్మించి, పరిశోధన సంస్థలకు ప్రాణం పోసి ‘భారతరత్న’ బిరుదు పొందిన శాస్త్రవేత్త ఎవరో తెలుసా?
జవాబు:
డాక్టర్|| ఏ.పి.జె. అబ్దుల్ కలామ్.

ఇవి చేయండి

I. అవగాహన – ప్రతిస్పందన

అ) కింది విషయాలను చర్చించండి.

ప్రశ్న 1.
ప్రేరణ అని ‘పాఠం’ పేరు వినగానే మీకేమనిపించింది?
జవాబు:
మాకేదో కొత్త అంశాన్ని నేర్చుకోవాలనే ఆసక్తిని ఈ పాఠం తప్పక కలిగిస్తుందనిపించింది. మహానుభావుల జీవితంలోని అనుభవాలను మాకిది అందిస్తుందనిపించింది. మాలో నిగూఢంగా ఉన్న కోరికలను, భావాలను తట్టిలేపేదిగా, వాటిని సాధించే దిశగా మమ్మల్ని సన్నద్దుల్ని చేసేదిగా ఈ పాఠంలోని అంశం ఉంటుందనిపించింది.

ప్రశ్న 2.
అబ్దుల్ కలామ్ చదువుకున్న రోజుల్లోని విద్యావిధానం గూర్చి మీ మిత్రులతో చర్చించండి.
జవాబు:
నాడున్న బ్రిటిష్ విద్యా విధానంపై భారతీయ విద్యార్థులకు సరైన అవగాహన లేదనిపిస్తుంది. పదవతరగతి పూర్తవగానే గుమస్తా ఉద్యోగాలను పొందడానికి అర్హత కలగడంతో ఎక్కువమంది చదువుకి అదే ముగింపు అయ్యేది. నాటి గురుశిష్య సంబంధం ఎంతో ఆత్మీయతతో కూడి ఉండేదని అన్పిస్తుంది. వృత్తివిద్యల మీద అవగాహన గలవారు తక్కువమంది. నాటి విద్యావిధానం నేటి విద్యావిధానానికి చాలా దగ్గరగా ఉంది. నేటికి వలెనే పదవతరగతి వరకు మాధ్యమిక విద్యగాను, ఇంటర్మీడియట్, డిగ్రీ చదువులు కళాశాల విద్యగాను, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉన్నత విద్యగా ఉంది. ఇంటర్మీడియట్ తరువాత ఇంజనీరింగ్ విద్యను అభ్యసించడానికి అవకాశాలున్నాయి. కానీ అలా వెళ్ళవచ్చనే విషయం నాటి విద్యార్థుల్లో ఎక్కువమందికి తెలియదు. ఉన్నత విద్యల్లోను, కళాశాల విద్యలోను ప్రతిభావంతులైన విద్యార్థులకు ప్రోత్సాహంగా కొంత డబ్బును (స్కాలర్ షిప్) ఇచ్చేవారని తెలుస్తోంది. నాడు పేద విద్యార్థులలో ఎక్కువ మందికి ఉన్నత విద్యను చదివే పరిస్థితులు లేవు.
అది చాలా ఖర్చుతో కూడి ఉండేది.

AP Board 9th Class Telugu Solutions Chapter 4 ప్రేరణ

ఆ) కింది వాక్యాలు పాఠంలో ఏ పేరాల్లో ఉన్నాయో గుర్తించండి. ఆ వాక్యాల కింద గీత గీయండి.

ప్రశ్న 1.
కలామ్ తత్వశాస్త్ర గ్రంథాలు చదవడం.
జవాబు:
“నేను సెంట్ జోసెఫ్ లో నా చివరి సంవత్సరంలో ఉన్నప్పుడు ఇంగ్లీషు సాహిత్యం పట్ల మక్కువ పెంచుకున్నాను. ఇంగ్లీషులోని సర్వశ్రేష్ఠ కృతుల్ని చదువుతుండేవాణ్ణి. టాల్ స్టాయ్, స్కాట్, హార్డీల పట్ల ప్రత్యేక ఆసక్తి ఉండేది. అప్పుడప్పుడు తత్త్వశాస్త్ర గ్రంథాలు చదువుతుండేవాణ్ణి. దాదాపుగా ఆ సమయంలోనే భౌతికశాస్త్రం పట్ల నాకు అమితమైన ఆసక్తి ఏర్పడింది.”

ప్రశ్న 2.
విజయానికి సూత్రాలు మూడు.
జవాబు:
“నేను రామనాథపురంలో ఉన్న కాలంలో మా అనుబంధం గురుశిష్య బంధాన్ని దాటి వికసించింది. ఆయన సాహచర్యంలో ఒకరి జీవిత గమనాన్ని ఎవరైనా ఏ మేరకు ప్రభావితం చేయగలరో తెలుసుకున్నాను. ఇయదురై సోలోమోన్ అంటూండేవారు – “జీవితంలో విజయం పొందడానికీ, ఫలితాలు సాధించడానికి నువ్వు మూడు అంశాల మీద పట్టు సాధించాల్మి
ఉంటుంది – అవి “కోరిక”, “నమ్మకం”, “ఆశ పెట్టుకోవడమూను.”

ప్రశ్న 3.
సోదరి సహాయం.
జవాబు:
“ప్రవేశానికి ఎంపికైతే అయ్యాను గానీ అటువంటి ప్రతిష్టాత్మక సంస్థలో చదవడమంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. దాదాపు వెయ్యి రూపాయలన్నా అవసరమవుతాయి. కానీ అది నా తండ్రికి తలకు మించిన విషయం. అప్పుడు నా సోదరి జొహారా నాకు తోడు నిలబడింది. తన బంగారు గాజులు, గొలుసు కుదువబెట్టి ఆమె నాకు సహాయం చేసింది. నేను చదువుకోవాలన్న ఆమె ఆకాంక్ష, నా సామర్థ్యంపై ఆమె నమ్మకం నన్ను గాఢంగా చలింపచేశాయి. నేను నా సొంత సంపాదన మీదనే ఆమె గాజుల్ని విడిపిస్తానని ఒట్టు పెట్టుకున్నాను. అప్పుడు నాకు సంపాదించడానికున్న ఏకైక మార్గం కష్టపడి చదువుకుని స్కాలర్ షిప్ సంపాదించుకోవడమే.

ప్రశ్న 4.
ప్రొఫెసర్ పక్కన కూర్చొని ఫొటో దిగడం.
జవాబు:
“ఎమ్. ఐ.టి.కి సంబంధించిన ఆత్మీయమైన జ్ఞాపకం ప్రొఫెసర్ స్పాండర్ కి సంబంధించిందే. వీడ్కోలు సమావేశంలో భాగంగా మేము గ్రూప్ ఫోటో కోసం నిలబడ్డాము. ప్రొఫెసర్లు ముందు కూర్చొని ఉండగా గ్రాడ్యుయేట్ విద్యార్థులమంతా మూడు వరుసల్లో వెనుక నిల్చొన్నాము. హఠాత్తుగా ప్రొఫెసర్ స్పాండర్ లేచి నిల్చొని, నాకోసం కలియచూశాడు. నేను మూడో వరుసలో నిల్చున్నాను. ‘రా నాతో పాటు ముందు కూర్చో’ అన్నాడు. నేను ప్రొఫెసర్ స్పాండర్ ఆహ్వానానికి నిరాంతపోయాను. ‘నువ్వు నా బెసు స్టూడెంట్ వి.’ నీ పరిశ్రమ నీ ఉపాధ్యాయులకి భవిష్యతులో మంచి పేరు తేవడానికి ఉపకరిస్తుంది అన్నాడు. ఆ ప్రశంసకి సిగ్గుపడాను. అదే సమయంలో నాకు లభించిన గుర్తింపుకు గర్విస్తూ నేను ప్రొఫెసర్ స్పాండర్తో కలిసి ఫోటోగ్రాఫ్ కోసం కూచున్నాను. ‘దేవుడే నీ ఆశా, ఆశ్రయమూ, మార్గదర్శి కాగలడు. భవిష్యత్ లోకి నీ ప్రయాణానికి ఆయనే దారి చూపే దీపం కాగలడు’ అన్నాడు ఆ మహామేధావి నాకు వీడ్కోలు పలుకుతూ.

AP Board 9th Class Telugu Solutions Chapter 4 ప్రేరణ

ఇ) కింది పేరా చదవండి. తప్పు ఒప్పులను గుర్తించండి.

“భారత జాతీయోద్యమ నాయకుల్లో బిపిన్ చంద్రపాల్ ఒకడు. ప్రస్తుతం బంగ్లాదేశ్ లో ఉన్న సైబెల్ లో జన్మించాడు. సహాయ నిరాకరణోద్యమానికి పిలుపునిచ్చాడు. దేశ స్వాతంత్ర్యం కోసం, అభ్యుదయం కోసం పాటుపడ్డాడు. కవులను, పండితులను, తత్త్వవేత్తలను, వక్తలను, నాయకులను, సాధారణ ప్రజలనూ అందరినీ ఆహ్వానించాడు. ఈ విధంగా దేశానికి సేవ చేయడానికి ఒక్కొక్కరు ఒక్కొక్క రంగాన్ని ఎంచుకొని ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు.
1. బిపిన్ చంద్రపాల్ జాతీయోద్యమ నాయకుడు. (✓)
2. బిపిన్ చంద్రపాల్ సహాయ నిరాకరణోద్యమానికి వ్యతిరేకి. (✗)
3. బిపిన్ చంద్రపాల్ కవులను, పండితులను స్వాతంత్ర్యోద్యమంలోకి ఆహ్వానించాడు. (✓)
4. బిపిన్ చంద్రపాల్ కి స్వాతంత్ర్యోద్యమ కాంక్ష ఉంది. (✓)
5. బిపిన్ చంద్రపాల్ ప్రజల గుండెల్లో నిలిచిపోయిన జాతీయ నాయకుడు. (✓)

ఈ) పాఠం ఆధారంగా ప్రశ్నలకు జవాబులు రాయండి.

ప్రశ్న 1.
అబ్దుల్ కలాం దారి తప్పినప్పుడు ఆయన తండ్రి మాటలు అతన్ని దారిలో పెట్టేవి కదా ! ఆ మాటలు ఏవి?
జవాబు:
ఆ ఉత్తేజకరమైన మాటలివి – “ఇతరుల్ని అర్థం చేసుకున్నవాడు విజ్ఞాని. కానీ తనని తాను తెలుసుకున్నవాడే వివేకి. వివేకం లేని విజ్ఞానం ప్రయోజన శూన్యం.”

ప్రశ్న 2.
కలాం బాల్యంలో వేటిని పరిశీలించేవాడు ? వాటి ద్వారా ఏ స్పూర్తిని పొందాడు?
జవాబు:
కలాం బాల్యంలో పక్షుల ప్రయాణాన్ని గమనించేవాడు. ఆకాశంలో విహారించాలంటే అమితాసక్తి. కొంగలూ, సముద్రపు గువ్వలూ ఎగురుతుండడం గమనిస్తూ తాను కూడా ఎగరాలనే స్ఫూర్తిని పొందేవాడు. ఆకాశ రహస్యాలను కనుక్కోవాలనే కోరిక పెంచుకున్నాడు.

ప్రశ్న 3.
మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ప్రవేశానికి ఆర్థిక సహాయం చేసిందెవరు?
జవాబు:
మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ప్రవేశానికి ఆర్థిక సహాయం చేసినది కలాం సోదరి జొహారా. ఆమె తన బంగారు గాజులూ, గొలుసూ కుదువ పెట్టి వచ్చిన డబ్బుని కలాంకు ఇచ్చింది.

ప్రశ్న 4.
వీడ్కోలు సమావేశంలో ఏం జరిగింది?
జవాబు:
వీడ్కోలు సమావేశంలో భాగంగా కలాం, ఇతర విద్యార్థులు వాళ్ళ ప్రొఫెసర్లతో కలిసి గ్రూప్ ఫొటో కోసం నిలబడ్డారు. ప్రొఫెసర్లు ముందు కూర్చొని ఉండగా గ్రాడ్యుయేట్ విద్యార్థులంతా మూడు వరుసల్లో వెనుక నిలుచున్నారు. హఠాత్తుగా ప్రొఫెసర్ స్పాండర్ లేచి నిల్చొని కలాం కోసం కలియచూశాడు. కలాం మూడోవరుసలో నిల్చున్నాడు. కలాంతో ‘రా………. నాతోపాటు ముందు కూర్చో’ అని పిలిచాడు. కలాం ప్రొఫెసర్ గారి ఆహ్వానానికి నిర్ఘాంతపోయాడు. ‘నువ్వు నా బెస్ట్ స్టూడెంట్ వి. నీ పరిశ్రమ నీ ఉపాధ్యాయులకి భవిష్యత్తులో మంచి పేరు తేవడానికి ఉపకరిస్తుంది’ అని అన్నాడు ప్రొఫెసర్. ఆ ప్రశంసకి కలాం సిగ్గుపడ్డాడు. తనకు లభించిన గుర్తింపునకు గర్విస్తూ ప్రొఫెసర్ స్పాండర్తో కలిసి ఫోటోకోసం కూర్చున్నాడు. దేవుడే కలాం ఆశ, ఆశ్రయం, మార్గదర్శి కాగలడని, భవిష్యత్తులో కలాం ప్రయాణానికి దారి చూపే దీపం కాగలడని ప్రొఫెసర్ వీడ్కోలు పలికాడు.

AP Board 9th Class Telugu Solutions Chapter 4 ప్రేరణ

ప్రశ్న 5.
ప్రొఫెసర్ శ్రీనివాసన్ అప్పగించిన పనిని కలాం ఎలా పూర్తి చేశాడు?
జవాబు:
కోర్సు పూర్తి చేయగానే కలాం తన నలుగురు సహచరులతో కలసి ఒక చిన్నతరహా యుద్ధ విమానం డిజైన్ చేసే బాధ్యత చేపట్టాడు. అందులో ఏరోడైనమిక్ డిజైన్ రూపకల్పన బాధ్యత కలాంది. చోదనం, నిర్మాణం, అదుపు, ఉపకరణ సామాగ్రికి సంబంధించిన రూపకల్పనను ఇతర మిత్రులు తీసుకున్నారు. ఒకరోజు వాళ్ళ డిజైనింగ్ ప్రొఫెసరైన శ్రీనివాసన్ వాళ్ళ ప్రగతిని సమీక్షించి ఏమీ పురోగతి లేదని తేల్చాడు. కలాం ఎన్ని సాకులు చెప్పినప్పటికీ ఆయన ఒప్పుకోలేదు. ఆ పనిని పూర్తి చెయ్యడానికి ఒక నెలరోజుల వ్యవధి కోరినా మూడు రోజులు మాత్రమే గడువిచ్చాడు. సోమవారం ఉదయానికి విమాన నిర్మాణం డ్రాయింగ్ పూర్తికాకపోతే స్కాలర్షిప్ ని ఆపెయ్యవలసివస్తుందని హెచ్చరించాడు.

కలాం రాత్రి భోజనం మానేసి, డ్రాయింగ్ బోర్డు దగ్గరే పనిలో నిమగ్నుడైనాడు. మర్నాడు ఉదయం ఒక గంట మాత్రమే విరామం తీసుకొని, ఏదో తిన్నాడనిపించి మళ్ళీ పనిలో పడ్డాడు. ఆదివారం ఉదయానికి దాదాపుగా పని పూర్తి చేశాడు. ప్రొఫెసర్ ఆప్యాయంగా కావలించుకొని ప్రశంసాత్మకంగా వెన్ను తట్టాడు.

II. వ్యక్తీకరణ-సృజనాత్మకత

అ) కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో సొంతమాటల్లో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
‘ఇతరుల్ని అర్థం చేసుకున్నవాడు జ్ఞాని’ ఈ వాక్యంపై మీ అభిప్రాయం రాయండి.
(లేదా)
ఇతరులను అర్థం చేసుకున్నవాడు జ్ఞాని అన్న కలాం తండ్రి మాటలపై మీ అభిప్రాయం చెప్పండి.
జవాబు:
మనిషి సంఘజీవి. ప్రతి మనిషికీ తన పరిసరాలకు సంబంధించిన జ్ఞానం చాలా అవసరం. తనే గాక తన చుట్టు . ప్రక్కలవారి బాగోగులను గమనించాల్సిన బాధ్యత, తోటి మనిషికి సహాయపడాల్సిన బాధ్యత ప్రతి మనిషికి ఉంది. తన ఇంట్లోనే గాక తన ఇంటి చుట్టుప్రక్కల చక్కని స్నేహపూర్వక వాతావరణాన్ని ఏర్పరచుకోవాలి. తనకు ఉన్నదాంట్లోనే తోటి వారికి సహాయపడాలి. అలా ఇతరుల కష్టసుఖాలను అర్థం చేసుకున్నవాడే జ్ఞాని.

ప్రశ్న 2.
‘కోరిక, నమ్మకం, ఆశపెట్టుకోవడం’ అనే మూడు అంశాల మీద ఎందుకు పట్టు సాధించాలి?
జవాబు:
కలాం పాఠశాల ఉపాధ్యాయుడైన ఇయదురై సోలోమోన్ ఈ విజయ సూత్రాన్ని బోధించాడు. మనకేదన్నా సంభవించాలని అనుకుంటే ముందు దాన్ని గట్టిగా కోరుకోవాలి. అది తప్పక జరిగి తీరుతుందని నమ్మాలి. ఆ కోరిక ఎన్ని ఇబ్బందులెదురైనా జరిగి తీరుతుందనే ఆశను ఎన్నటికీ విడిచిపెట్టకూడదు. ఇలా చేయడం ద్వారా కోరిక తీరాక మన సంకల్పబలం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. ఆశావహ జీవనం అలవడుతుంది. తద్వారా నిరాశానిస్పృహలను జయించవచ్చు. ఆత్మన్యూనతను గెలవవచ్చు. అందుకనే కోరిక – నమ్మకం – ఆశ పెట్టుకోవడం అనే మూడు అంశాల మీద ప్రతి ఒక్కరు పట్టు సాధించాలి.

ప్రశ్న 3.
“తమ విద్యార్థుల జ్ఞానతృష్ణను తమ చైతన్యంతో, అకుంఠిత సంకల్పంతో సంతృప్తిపరచడమే!” ఈ మాటలు ఎవరి నుద్దేశించినవి? దీనిపై మీ అభిప్రాయం ఏమిటి?
జవాబు:
కలాం ఎమ్.ఐ.టి.లో తన ప్రొఫెసర్లు అయిన స్పాండర్, కే.ఏ.వి. పండలై, నరసింగరావుగార్ల గురించి చెప్పిన మాటలివి. ఇందులో ప్రతి అక్షరం సత్యమే అని నా కనిపిస్తుంది. విద్యార్థులకు ప్రతి విషయాన్ని తెలుసుకోవాలనే ఆసక్తి ఎక్కువ. ఉపాధ్యాయుడు విసుక్కోకుండా ఓపికతో వివరించినప్పుడే విద్యార్థి మేధస్సు వికసిస్తుంది. ఉపాధ్యాయుడు నిరంతర విద్యాన్వేషి కావాలి. విద్యార్థుల ప్రశ్నలను పిచ్చివని కొట్టిపారేయకుండా, విజ్ఞానాత్మకంగా ఆలోచించి సమాధానాలను చెప్పాలి. అప్పుడే విద్యార్థుల జ్ఞానతృష్ణ సంతృప్తిపడుతుంది. లేకుంటే తెలివైన విద్యార్థి వేరొకరిని ఆశ్రయించడం ద్వారా తన విజ్ఞాన తృష్ణను తీర్చుకోగలడు. సాధారణ విద్యార్థులు దాన్ని అంతటితో విడిచిపెట్టడం ద్వారా నష్టపోతారు. కాబట్టి ఉపాధ్యాయుడు నిరంతరం చైతన్యశీలిగా ఉండాలి. అకుంఠిత సంకల్పంతో విద్యార్థుల జ్ఞానతృష్ణను సంతృప్తి పరచాలి.

AP Board 9th Class Telugu Solutions Chapter 4 ప్రేరణ

ప్రశ్న 4.
ప్రొఫెసర్ శ్రీనివాసన్ అప్పగించిన పనిని పూర్తి చేసే సమయంలో కలాం స్థానంలో మీరుంటే ఏం చేసేవారు?
జవాబు:
కలాం స్థానంలో నేనుంటే ముందు కంగారు పడే మాట వాస్తవం. క్రమంగా విచక్షణతో ఆలోచిస్తాను. అవసరాన్ని బట్టి మిత్రుల సహాయం తీసుకుంటాను. “అవసరమే అన్ని ఆవిష్కరణలకు జనని” అనే సామెతను గుర్తుకు తెచ్చుకొని నా అవసరం కూడా ఒక నూతనావిష్కరణకు దారితీయాలని దృఢంగా సంకల్పించుకుంటాను. తగినట్లు కష్టపడతాను. వీలైనంత త్వరగా పనిని పూర్తిచేసి, గురువుల మన్ననలందుకుంటాను.

ఆ) కింది ప్రశ్నలకు పదిహేనేసి వాక్యాలలో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
కలాం తన ఆశయ సాధనలో ఎలా కృతకృత్యుడయ్యారు? మీ సొంతమాటల్లో రాయండి.
(లేదా)
ప్రతి వ్యక్తికి ఆశయం ఉంటుంది. అది సఫలం చేసుకోవడానికి అందరూ కృషి చేస్తుంటారు. అదే విధంగా కలాం తన ఆశయ సాధన విషయంలో ఎలా కృతకృత్యుడయ్యాడో వివరించండి.
జవాబు:
రామనాథపురంలోని హైస్కూల్లో చేరిన కలాంకు ఉపాధ్యాయుడైన ఇయదురై సోలోమోన్ ఆదర్శపథ నిర్దేశకుడయ్యాడు. క్రమంగా వారి అనుబంధం గురుశిష్యబంధాన్ని దాటి వికసించింది. జీవితంలో విజయం పొందాలన్నా, మంచి ఫలితాలు సాధించాలన్నా మూడు అంశాల మీద పట్టు సాధించాల్సి ఉంటుంది. అవి కోరిక – నమ్మకం – ఆశ అని సోలోమోన్ చెప్పే మాటలు కలాంపై బాగా ప్రభావం చూపాయి. “విశ్వాసంతో నువ్వు నీ విధిని కూడా తిరిగిరాయగలవు” – అనే గురువు గారి మాట కలాంలో ఆత్మవిశ్వాసాన్ని రేకెత్తించింది. సాధారణ గ్రామీణ బాలుడైన్పటికీ తాను కూడా ఏదో ఒక రోజు ఆకాశంలో విహరించగలడనే నమ్మకం బలంగా కలిగింది.

స్క్వారాట్ పాఠశాలలో చదువు పూర్తిచేసుకునేటప్పటికీ జీవితంలో విజయం సాధించాలనే దృఢసంకల్పం రెట్టింపయింది. ఆ రోజుల్లో వృత్తి విద్యాకోర్సుల గురించి ఊహ కూడా లేకపోవడంతో, ఉన్నత విద్య అంటే అప్పటికి కాలేజీ చదువే కావడంతో ట్రిచీ సెంట్ జోసఫ్ కాలేజీలో చేరాడు. గణితశాస్త్ర ప్రొఫెసర్లైన తోతత్రి అయ్యంగార్, సూర్యనారాయణ శాస్త్రి గార్లతో సన్నిహిత సంబంధాన్ని ఏర్పరచుకున్నాడు. ఇంటర్మీడియట్ పూర్తిచేశాడు. సెంట్ జోసఫ్ కాలేజీలో బి.ఎస్.సి. డిగ్రీ కోర్సులో చేరి పూర్తి చేశాక గాని తన కిష్టమైన భౌతికశాస్త్రంలో తానేమీ చేయలేదని గుర్తించాడు. తన కలలు నిజం చేసుకోవాలంటే ఇంజనీరింగ్ చదవాల్సి ఉంటుందని గ్రహించాడు. తర్వాత “మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ”లో ప్రవేశానికి ఎంపిక అయ్యాడు. ఇక్కడే అసలు కష్టం మొదలైంది. ఆ సంస్థలో చేరాలంటే దాదాపు వేయి రూపాయలన్నా అవసరమవుతాయని తెలిసింది. అది తన తండ్రికి అసాధ్యమైన పని. అప్పుడే కలాం సోదరి జొహారా తన బంగారు గాజులు, గొలుసు కుదువబెట్టి ధన సహాయం చేసింది. తన సొంత సంపాదనతోనే ఆమె గాజుల్ని విడిపించాలని నిశ్చయించుకున్నాడు కలాం. డబ్బు సంపాదించాలంటే అతనికున్న ఒకే ఒక మార్గం స్కాలర్ షిప్ సంపాదించడం.

ఎమ్. ఐ. టి లో (కలాంను) అతణ్ణి అన్నిటికన్నా మిన్నగా ఆకర్షించింది అక్కడ ప్రదర్శనగా ఉంచిన రెండు పాత విమానాల యంత్రాలు. వాటి పట్ల ఎంత ఆకర్షితుడైనాడంటే మిగిలిన విద్యార్థులంతా హాస్టలుకు వెళ్ళాక కూడా చాలా సేపు వాటి దగ్గరే కూర్చొనేవాడు. పక్షిలా ఆకాశంలో విహరించాలన్న తన కాంక్షని ఆరాధిస్తూ గడిపేవాడు. మొదటి సంవత్సరం పూర్తిచేశాక ఒక ప్రత్యేక విషయాన్ని ఎంపిక చేసుకోవాల్సి వచ్చినప్పుడు మరేమీ ఆలోచించకుండా ఏరోనాటికల్ ఇంజనీరింగ్ ను ఎంచుకున్నాడు. ఎలాగైనా విమానాల్ని నడపాలనే తన కోరికకు సాధారణ కుటుంబ నేపథ్యమేమీ అడ్డుకాలేదని భావించాడు.

అప్పుడే వివిధ రకాల వ్యక్తులతో పరిచయాలు పెరిగాయి. అప్పుడే కొన్ని వైఫల్యాలు, ఆశాభంగాలు చవిచూడాల్సి వచ్చింది. దారితప్పే పరిస్థితులు ఏర్పడ్డాయి. కానీ తన తండ్రి మాటలు ఎప్పుడూ చెవులలో మారుమ్రోగుతూ సరైన మార్గంలో నడిపాయి. కలాం ఆలోచనల్ని ముగ్గురు ఉపాధ్యాయులు మలచారు. వారే ప్రొఫెసర్స్ స్పాండర్, కే.ఏ.వి. పండలై, నరసింగరావు గార్లు. తమ నిశిత బోధనల ద్వారా ఏరోనాటిక్స్ పట్ల కలాంలోని కోరికను మేల్కొల్పారు. వారి మేధస్సు, ఆలోచనా స్పష్టత, కలాం శ్రద్ధను బలోపేతం చేశాయి. కోర్సు పూర్తిచేశాక నలుగురు సహచరులతో కలసి ఒక చిన్నతరహా యుద్ధవిమానం డిజైన్ చేసే బాధ్యత చేపట్టాడు. అందులో ఏరోడైనమిక్ డిజైన్ రూపకల్పన బాధ్యత కలాంది. కాగా ప్రొఫెసర్ శ్రీనివాసన్ వారి పురోగతేమీ లేదని తేల్చి మూడు రోజుల్లోనే డిజైన్ పూర్తిచేయకుంటే స్కాలర్షిప్ ఆపేస్తామని హెచ్చరించాడు. దానితో కలాం నిద్రాహారాలు మాని రెండు రోజుల్లోనే దానిని పూర్తిచేసి ప్రొఫెసర్ శ్రీనివాస గారి మన్ననలే గాక ఇతర అధ్యాపకుల ప్రశంసలందుకున్నాడు. ‘మన విమానాన్ని మనమే తయారు చేసుకుందాం’ అని ఒక వ్యాసాన్ని తమిళంలో రాసి ఎమ్.ఐ.టి. తమిళ సంఘంవారు నిర్వహించిన వ్యాసరచన పోటీకి పంపాడు. ప్రథమ బహుమతిని పొందాడు.

ఎమ్.ఐ.టి. నుంచి బెంగళూరులోని హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ లో ట్రైనీగా చేరాడు. అక్కడ ఒక టీంలో భాగంగా ఇంజన్ ఓవర్ హాలింగ్ లో పనిచేశాడు. పిస్టన్, టర్బయిన్ ఇంజన్లు రెండింటి ఓవరాలింగ్ మీద పనిచేశాడు. వాయు పదార్థాల డైనమిక్స్ లోని ఎన్నో అంశాలు అవగతం చేసుకున్నాడు. గ్రాడ్యుయేట్ ఏరోనాటికల్ ఇంజనీర్ గా హెచ్.ఏ.ఎల్. నుండి బయటికి వచ్చాడు. అప్పుడు వైమానిక దళంలో ఉద్యోగం, రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే సాంకేతిక అభివృద్ధి ఉత్పాదక డైరెక్టరేట్ లో ఉద్యోగ రూపంలో కలాం చిరకాల స్వప్నాన్ని నిజం చేసే రెండు ఉపాధి అవకాశాలు లభించాయి. రామేశ్వరం నుంచి ఆకాశయానం చేసిన మొదటి బాలుడు కూడా కలామే.

ప్రశ్న 2.
కలాం విద్యాభ్యాసం ఏ విధంగా కొనసాగిందో మీ సొంతమాటల్లో రాయండి.
జవాబు:
రామనాథపురంలో హైస్కూల్ లో చేరాడు కలాం. జిజ్ఞాసియైన కలాంకు ఇయదురై సోలోమోన్ అనే ఉపాధ్యాయుడు మార్గదర్శియై నిలిచాడు. ఆయన తరగతి గదిలోని విద్యార్థుల్ని ఉత్సాహపరిచేవాడు. కోరిక – నమ్మకం – ఆశపెట్టుకోవడం అనే మూడు అంశాల ద్వారా జీవితంలో విజయం సాధించవచ్చని, మంచి ఫలితాలను పొందవచ్చని ఇయదురై బోధించేవాడు. “విశ్వాసంతో నీ విధిని కూడా తిరిగి రాయగలవు” – అనే సోలోమోన్ మాటలు కలాంపై బాగా ప్రభావం చూపాయి. కలాంకు చిన్నప్పటి నుండీ ఆకాశపు రహస్యాలన్నా, పక్షుల ప్రయాణమన్నా ఆసక్తి ఎక్కువ. కొంగలూ, సముద్రపు గువ్వలూ ఎగురుతుండడం చూస్తూ తాను కూడా ఎగరాలని కోరుకునేవాడు. సోలోమోన్ బోధనలతో ఎగరాలనే కోరిక పెంచుకున్నాడు. ఎగురుతానని గట్టిగా నమ్మాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆశవీడలేదు. కాబట్టే రామేశ్వరం నుండి ఆకాశయానం చేసిన మొదటి బాలుడతడే అయ్యాడు.

స్క్వారాట్ పాఠశాలలో చదువు పూర్తిచేసుకున్నాడు. వృత్తి విద్యాకోర్సుల గురించి అవగాహన లేకపోవడంతో ట్రిచీలోని సెంట్ జోసెఫ్ కాలేజీలో ఇంటర్మీడియట్ లో చేరాడు. పరీక్షల గ్రేడుల ప్రకారం చూస్తే ఏమంత తెలివైన విద్యార్థి కాడు కలాం. కళాశాలలో గణితశాస్త్రంలో ప్రొఫెసర్స్ అయిన తోతత్రి అయ్యంగార్, సూర్యనారాయణ శాస్త్రి గార్ల ప్రేమకు పాత్రుడైనాడు. అక్కడే ఇంగ్లీషు సాహిత్యం పట్ల మక్కువ ఎక్కువ అయింది. టాల్ స్టాయ్, స్కాట్, హార్డీల రచనల పట్ల ప్రత్యేకాసక్తి కలిగింది. ఉత్తమ రచనలన్నీ చదివాడు. అప్పుడప్పుడు తత్వశాస్త్ర గ్రంథాలు కూడా చదివేవాడు. అప్పుడే భౌతికశాస్త్రం పట్ల విశేషమైన ఆసక్తి కలిగింది. ఇంటర్మీడియట్ పూర్తిచేశాడు.

సెంట్ జోసెఫ్ కాలేజీలో బి.ఎస్.సి. డిగ్రీ కోర్సులో చేరాడు. నాటికి ఇంజనీరింగ్ విద్య గురించి అవగాహన కలాంకు లేదు. బి. ఎస్.సి. పూర్తిచేశాక గాని భౌతికశాస్త్రం తన ప్రధాన విషయం కాదని తెలియలేదు. తన కలల్ని నెరవేర్చుకోవడం కోసం ఇంజనీరింగ్ లో చేరాలనుకున్నాడు. మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ప్రవేశానికి ఎంపికయ్యాడు. కానీ అసలు కష్టం అప్పుడే మొదలైంది. అతడా సంస్థలో చేరాలంటే దాదాపు వేయి రూపాయల దాకా కావాలి.

అప్పుడు కలాం సోదరి జొహారా తన బంగారు గాజుల్ని, గొలుసును కుదువబెట్టి ధనసహాయం చేసింది. తన సొంత డబ్బుతోనే వాటిని విడిపించాలని కలాం నిర్ణయించుకున్నాడు. చదువుకునే తనకి డబ్బు సంపాదించే ఒకే ఒక మార్గం కష్టపడి చదివి స్కాలర్ షిప్ సంపాదించడం.

మొదటి సంవత్సరం పూర్తయ్యాక ఒక ప్రత్యేక విషయాన్ని ఎంపిక చేసుకోవాల్సి వచ్చింది. ఇంకేమీ ఆలోచించకుండా కలాం ఏరోనాటికల్ ఇంజనీరింగ్ ని ఎన్నుకున్నాడు. ఎలాగైనా తాను విమానాల్ని నడపాలనే బలమైన కోరిక అందుకు కారణమైంది. అక్కడే చాలా రకాల వ్యక్తులతో పరిచయాలు పెరిగాయి. దారితప్పే పరిస్థితులేర్పడ్డాయి. తండ్రి మాటలే కలాంని సరైన మార్గంలో నిలిపాయి. ప్రొఫెసర్స్ స్పాండర్, కే.ఏ.వి పండలై, నరసింగరావుగార్లు ఎమ్.ఐ.టి. లో కలాంపై ప్రభావం చూపిన గురువులు. తమ నిశిత బోధనల ద్వారా వారు ఏరోనాటిక్స్ పట్ల కలాంలో తృష్ణని రేకెత్తించారు. పరిజ్ఞానం పెరగడం మొదలైంది. వివిధ రకాల ఏరోప్లేన్ల నిర్మాణాంశాల ప్రాముఖ్యం తెలిసింది. కోర్సు పూర్తి అయింది. కోర్సులో భాగంగా నలుగురు సహచరులతో కలసి ఒక చిన్నతరహా యుద్ధవిమానం డిజైన్ చేసే బాధ్యత చేపట్టాడు. అందులో ఏరోడైనమిక్ డిజైన్ రూపకల్పన కలాం బాధ్యత కాగా చోదనం, నిర్మాణం, అదుపు, ఉపకరణ సామాగ్రికి సంబంధించిన రూపకల్పనలు అతని మిత్రుల బాధ్యత.

ఒకరోజు వాళ్ళ డైరెక్టర్, డిజైనింగ్ ప్రొఫెసర్ అయిన శ్రీనివాసన్ గారు వాళ్ళ ప్రగతిని చూసి, పురోగతి లేదని తేల్చేశాడు. పనిలో జాప్యానికి కలాం ఎన్ని కారణాలు చూపినా ఆయన అంగీకరించలేదు. చివరికి ఒక నెలరోజుల వ్యవధి కోరగా, నేటి నుండి మూడో రోజున డిజైన్ పూర్తిచేసి చూపాలని, లేకుంటే స్కాలర్ షిప్ ఆపేస్తామని నిరంకుశంగా చెప్పాడు. స్కాలర్ షిప్పే కలాంకు ఆధారం. మూడు రోజుల్లో పూర్తి చేయడం తప్ప మరో మార్గం లేదు. నిద్రాహారాలు మాని డ్రాయింగ్ కు పూనుకున్నాడు. రెండవ రోజు ఉదయానికల్లా డిజైన్ పూర్తిచేసి గురువుల ప్రశంసలందుకున్నాడు.

ఎమ్.ఐ.టి. లో కోర్సు పూర్తిచేసుకొని, బెంగళూరులోని హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ లో ట్రైనీగా చేరాడు. అక్కడ విమానాల ఇంజన్ ఓవరాలింగు చేశాడు. వాయుపదార్థాల డైనమిక్స్ లోని ఎన్నో అంశాలను అవగతం చేసుకున్నాడు. గ్రాడ్యుయేట్ ఏరోనాటికల్ ఇంజనీర్ గా హెచ్.ఏ.ఎల్. నుండి బయటికి వచ్చాడు.

AP Board 9th Class Telugu Solutions Chapter 4 ప్రేరణ

ప్రశ్న 3.
‘మనమే విమానాన్ని తయారుచేసుకుందాం’ అన్న వ్యాసంలో అబ్దుల్ కలాం ఏమి రాసి ఉంటారు?
జవాబు:
కలాంకి చిన్నప్పటినుండి పక్షిలా ఆకాశంలో ఎగరడమంటే ఇష్టం. ఇలాంటి కోరికతోనే మొదటిసారిగా యంత్రాన్ని నిర్మించి, ఆకాశంలో ఎగిరిన వారు రైట్ సోదరులు. కలాం తన ఇంజనీరింగ్ విద్యలో భాగంగా వివిధ విమాన యంత్రాలను నిశితంగా పరిశీలించాడు. ఇతర భాగాలను శ్రద్ధగా గమనించాడు. విమానాన్ని పూర్తిగా ఏ భాగానికి ఆ భాగం విడదీయడం, విడి భాగాలను కలిపి విమానాన్ని తయారు చేయడంలో ప్రజ్ఞ గడించాడు. తన ప్రొఫెసర్ శ్రీనివాసన్ గారి పుణ్యమా అని సొంతంగా విమానయంత్రాన్ని డిజైన్ చేశాడు.

‘మనమే విమానాన్ని తయారుచేసుకుందాం’- అనే వ్యాసంలో కలాం తన అనుభవాలను, విజ్ఞానాన్ని రంగరించి విమానాన్ని సులభంగా ఎలా తయారుచేయవచ్చో నిరూపించి ఉంటాడని అన్పిస్తుంది. ఇంకా వీలైనంత తక్కువ ఖర్చుతో దాన్ని తయారుచేయగల మార్గాలను సూచించి ఉంటాడు. ముందుగా చిన్న చిన్న యంత్రాలను తయారుచేయడం, వాటిని విమానం బొమ్మలకు అనుసంధానించడం వంటి విషయాలను ఆసక్తి గల బాలల కొరకు వివరించి ఉంటాడు. వివిధ రకాల విమాన యంత్రాలకు ఉపకరించే లోహాలను, వాటి స్వరూపాలను తెలిపి ఉంటాడు. సాధారణ యంత్రాలకు కొద్దిపాటి మార్పులు చేయడం ద్వారా విమాన యంత్రాలుగా ఎలా మార్చవచ్చో నిరూపించి ఉంటాడు.

ఇ) సృజనాత్మకంగా రాయండి.
పాఠంలోని మూడవ పేరాను చదవండి. కలాం తన కోరికను గురించి చెప్పాడు కదా! అలాగే మీరు కూడా మీ కోరికను చిన్న కవిత రూపంలో రాయండి.
జవాబు:
“నాకూ రెక్కలు ఉంటే
నీలాకాశంలో విహరిస్తా
అవని అందాలను పరికిస్తా
చందమామను పలకరిస్తా
తారామండలానికి వెళ్ళిస్తా
గ్రహగతుల్ని వీక్షిస్తా
ఖగోళపు వింతల్ని పరిశీలిస్తా
విశ్వరహస్యాన్ని ఛేదిస్తా
గ్రహాంతర వాసులతో చెలిమిచేస్తా
భూగోళపు గొప్పదనం తెలియజేస్తా”
(లేదా)
ఈ పాఠం స్ఫూర్తితో మీరే అబ్దుల్ కలాం అయితే నేటి విద్యార్థులకు ఏం చెపుతారు? సందేశమివ్వండి. ఏకపాత్రాభినయం చెయ్యండి.
జవాబు:
కలాం సందేశం :
ప్రియ విద్యార్థులారా! భారత భవిష్య నిర్ణేతలారా!

మీ ఉత్సాహం, మీ ఆసక్తి చూస్తుంటే నాకు నా బాల్యం గుర్తొస్తుంది. ఆ ధైర్యం, ఆ ఆత్మవిశ్వాసం గమనిస్తే మీరంతా నా ప్రతిబింబాలలాగే ఉన్నారు. ఇప్పుడు వయసు ఉడిగి వృద్దుడినైనా మానసికంగా ఉత్సాహంగా, బలంగానే ఉన్నా. నా ఈ స్థితికి కారణం నా గురువుల సందేశాలే. మనం ఏదైనా సాధించాలంటే దాన్ని గురించిన కోరిక బలంగా ఉండాలి. సాధించగలననే అచంచలమైన విశ్వాసం ఉండాలి. ఎలాంటి పరిస్థితులెదురైనా ఆశను వీడకూడదు. అప్పుడే మనం దాన్ని సాధించగలం. జీవితంలో ఏరకమైన లక్ష్యాన్నైనా సాధించాలంటే ఇదే సులభమైన మార్గం. ముందు మీ కోరిక ఏదనే దానిపై ఒక స్పష్టత కలిగి ఉండండి. దాన్ని సాధించగలననే విశ్వాసాన్ని పెంచుకోండి. లక్ష్యం చేరేవరకు నిరాశను దగ్గరకు రానివ్వవద్దు. “విశ్వాసంతో మనం మన విధిని కూడా తిరిగి రాయగలం”. ఇది నిజం.

చిన్నారులారా! ఇతురుల్ని బాగా అర్థం చేసుకున్నవాడే విజ్ఞాని. తన గూర్చి తాను తెలుసుకున్నవాడే వివేకి. కానీ వివేకం లేని విజ్ఞానం ఏమాత్రం ప్రయోజనం లేనిది. నేడు విజ్ఞానాన్ని సంపాదిస్తున్నారు గాని వివేకాన్ని కోల్పోతున్నారు. అందువల్లే చాలా దేశాల మధ్య పరస్పర ద్వేషాలు రగులుతున్నాయి. యుద్ధాలకు కారణాలవుతున్నాయి. మారణహోమాన్ని సృష్టిస్తున్నాయి. కాబట్టి మనిషి విజ్ఞాని, వివేకి కావాలి.

ఏకపాత్రాభినయం :
తేది: 17 – 05 – 1974.
రంగం : ఢిల్లీ నగరంలోని కలాం వసతి గృహంలో ప్రయోగశాల.
సమయం : రాత్రి 11.00
సన్నివేశం : ఏకాంతంగా ప్రయోగశాలలో సంచరిస్తూ, ఆలోచిస్తున్న సన్నివేశం.

కలాం అంతరంగ మథనం :
(దీర్ఘంగా నిట్టూర్చి) ఏమిటీ వింత స్థితి? ఎన్నడూ నా జీవితంలో లేదే ఈ పరిస్థితి? ఎందుకు నా హృదయస్పందన నాకే తెలుస్తోంది నా శరీరావయవాల కంపం ఆగటంలేదెందుకు? అవునులే! రేపు జరగబోయేదేమన్నా చిన్నకార్యమా? యావత్ ప్రపంచం విస్తుపోయే కార్యం! పొరుగుదేశాలే కాక, అవకాశం కోసం పొంచి ఉన్న గుంటనక్కల లాంటి పాకిస్థాన్, చైనా వంటి దేశాలకు కన్నుకుట్టే సన్నివేశం. భారతీయులంతా సగర్వంగా తలలెత్తుకొని ఆనందంగా “వందేమాతరమ్” అని ఎలుగెత్తి నినదించే ఘటన. అమెరికా, బ్రిటన్ వంటి అగ్రరాజ్యాలు కుళ్ళుకొని కుమిలిపోయే సంఘటన. నేపాల్, రష్యా వంటి మిత్రదేశాలు “శెహభాష్” అని ప్రశంసల జల్లు కురిపించే పని. టెక్నాలజీలో తామే గొప్పని విర్రవీగే జపాన్, జర్మనీ వంటి దేశాలు సిగ్గుతో చిమిడిపోయే ఘనకార్యం. అవును ఆ విషయాన్ని తలుచుకుంటేనే ఒళ్ళు పులకరించిపోతుంది. మనస్సు ఉప్పొంగిపోతుంది. ఆనందంతో శరీరం గాలిలో తేలుతున్నట్లుంది.

నా దేశం, నా భారతదేశం రేపు మొట్టమొదటిసారిగా అణు పరీక్షను జరపబోతోంది. తన అణుసామర్థ్యాన్ని ప్రదర్శించబోతోంది. పాక్, చైనా వంటి దేశాలు ఇక కవ్వింపు చర్యలాపి, తోక ముడవాల్సిందే. భారతమాత శక్తి యుక్తులను తలచి మోకరిల్లాల్సిందే. అగ్రరాజ్యాలిక ఆగ్రహాన్ని నిగ్రహించుకోవాల్సిందే. నేపాల్, భూటాన్, బర్మా వంటి చిన్న దేశాలు భారతదేశం పంచన చేరాల్సిందే. ఇంతవరకూ శాంతికి ప్రతీకగా నిలిచింది నా దేశం. కానీ శాంతిని కోరడం చేతకానితనంగా భావించింది ప్రపంచం. తనకై తాను కయ్యానికి కాలు దువ్వనని, తన జోలికి వస్తే మాత్రం తాట తీయకుండా వదలనని ప్రపంచానికి చాటి చెపుతుంది నా దేశం.

కానీ ఇవన్నీ జరగాలంటే రేపటి అణుపరీక్ష విజయవంతం కావాలి. లేకుంటే ………… (చెవులు మూసుకొన్నట్లు నటించి), అపహాస్యాన్ని, ఎగతాళిమాటలను ………….. భరించాలి. నో………. అలా జరగడానికి వీలులేదు. దేశాన్ని అవమానాలపాలు చేయడం కంటే ఆత్మాహుతి మేలు.

మానవ ప్రయత్నంలో ఎటువంటి లోపం లేదు. కార్మికుని నుండి కార్యదర్శి దాకా అందరం కలిసికట్టుగా దేశ భవిష్యత్తును కోరి కష్టపడ్డాం. అయినా మానవాతీతమైనది కదా దైవం. దైవం ధర్మానికి బద్ధుడని భారతీయ తత్త్వశాస్త్రం ఘోషిస్తోంది. మేము మా ధర్మానికి కట్టుబడే ఈ ప్రయత్నం చేశాం. భారతదేశం కూడా ఆత్మరక్షణ కోసమే అణ్వాయుధాన్ని తయారుచేసుకుంది తప్ప వేరే దేశాలకు హానిచేయడం కోసం కాదు. కాబట్టి దైవం తప్పక భారతదేశానికి సహకరిస్తాడు.

అవును, నా మనస్సు దృఢంగా నమ్ముతోంది. రేపు తప్పక విజయం లభిస్తుంది. భారతదేశమంతా ఆనందం వెల్లివిరుస్తుంది. ఆ చక్కని సన్నివేశాన్ని ఇప్పుడు దర్శిస్తా. రేపు కళ్ళతో చూసి హర్షిస్తా. ఇక విశ్రమిస్తా. (నిద్రకు ఉపక్రమిస్తాడు)

AP Board 9th Class Telugu Solutions Chapter 4 ప్రేరణ

ఈ) ప్రశంసాత్మకంగా రాయండి.

కలాం గురించి చాలా విషయాలు ఈ పాఠం ద్వారా తెలుసుకున్నారు కదా! కలాం జీవితం నుండి మనం నేర్చుకోదగిన మంచి విషయాలేమిటి? వీటిలో మీరు వేటిని ఆచరణలో పెడతారు?
జవాబు:
కలాం జీవితం నుండి మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చు. దృఢమైన సంకల్పం, ఆత్మవిశ్వాసం, ఎన్ని కష్టాలు వచ్చినా మొదలు పెట్టిన పనిని పూర్తిచేయడం వంటి ఎన్నో మంచిగుణాలు కలాంలో ఉన్నాయి. వీటిల్లో ఆయన ఆత్మ విశ్వాసాన్ని, కష్టాల్లో కూడా లక్ష్యాన్ని విడిచి పెట్టకపోవడాన్ని నేను ఆచరణలో పెడదామనుకుంటున్నాను. ఇలాగే జీవిత లక్ష్యానికి సంబంధించిన దాన్ని మనస్సులో బలంగా కోరుకోవడం, కోరుకున్నదాన్ని సాధించగలనని విశ్వసించడం, ఎన్ని అడ్డంకులెదురైనా ఆశ వీడకపోవడం అనే దాన్ని కూడా ఆచరణలో పెడతాను.

IV. ప్రాజెక్టు పని

* మీకు నచ్చిన శాస్త్రవేత్తను గురించి వారెలా ప్రేరణ పొందారో, ఏ కొత్త విషయాలు కనుకున్నారో వివరాలు సేకరించి వ్యాసం రాయండి.
జవాబు:
నాకు నచ్చిన శాస్త్రవేత్త జగదీష్ చంద్రబోస్. భౌతికశాస్త్రంలోను, జీవశాస్త్రంలోను భారతదేశం గర్వించదగిన శాస్త్రవేత్త. ఈయన స్వేచ్ఛగా సంచరించే మనుషులకు, ఇతర జంతుజాలానికే కాక కదలని చెట్టుచేమలకు కూడా ప్రాణం ఉందని నిరూపించిన గొప్ప శాస్త్రవేత్త.

ఈయన చెట్టు, తీగలకు ప్రాణం ఉందని నిరూపించడంలో, మహాభారతంలోని శాంతిపర్వంలో భరద్వాజ – భృగుమహర్షుల సంభాషణ ఆయనకు మంచి ప్రేరణ ఇచ్చిందని ఆయన తాత్త్వికత గురించి తెలిసిన పెద్దలు చెప్తారు. ఆ సంభాషణ ఇది –
భృగుమహర్షి : బ్రహ్మ ఈ సృష్టి అంతటిని పంచమహాభూతాల సమ్మేళనంతో చేశాడు.

భరద్వాజ మహర్షి : స్థావరజంగమములలో ఈ పంచభూత ధాతువులు కనిపించడం లేదు గదా మహాత్మా ! అవి వినలేవు – చూడలేవు – వాసనను గ్రహించలేవు – స్పర్శలేదు గదా !

భృగుమహర్షి : బలమైన గాలులకు, అగ్నికి, ఉరుములకు, పిడుగులకు, ఫలాలు, పుష్పాలు చెదిరిపోతాయి. అంటే వాటినుండి వచ్చే ధ్వనిని గ్రహించే అవి అలా అవుతున్నాయి. కాబట్టి అవి వినగలుగుతున్నట్లే గదా!

“వాయ్వగ్యశని నిర్దోషైః ఫలం పుష్పం విశీర్యతే|
శ్రోత్రేణ గృహ్యతే శబ్దః తస్మాత్ శ్రుణ్వంతి పాదపాః ||

(అధ్యాయం – 184, శ్లో|| 12)
తీగలు చెట్లను అల్లుకొని పై పైకి పాకుతాయి. కొమ్మలు ఎటు వ్యాపించాయో చూడకుండా అవి అలా పాకలేవు గదా! కాబట్టి అవి చూడగలవు.

“వల్లీ వేష్టయతే వృక్షం సర్వతః చైవ గచ్ఛతి!
న హి అదృష్టశ్చ మార్గో 2 స్తి తస్మాత్ పశ్యంతి పాదపా?”|| (అ|| 184 – శ్లో|| 13)
చెట్లకు వచ్చే రకరకాల తెగుళ్ళను పోగొట్టడానికి సుగంధమైన, దుర్గంధమైన రకరకాల ధూపాలను వేస్తాం. అప్పుడు ఆ తెగుళ్ళు పోయి అవి పుష్పిస్తాయి. అంటే అవి వాసనను గ్రహించగలిగినట్లే గదా!

“పుణ్యాపుడ్యైః తథా గంధైః ధూ పైశ్చ వివిధైరపి
అరోగాః పుష్పితాః సంతి తస్మాత్ జిఝంతి పాదపాః”|| (అ|| 184 – శ్లో|| 14)
చెట్లు నీటిని స్వీకరిస్తున్నాయి. వాటికి వచ్చే రోగాలకు ఔషధాలు ఇవ్వడం ద్వారా నయం చేయగలుగుతున్నాము. కొమ్మను నరికేశాక కొన్నాళ్ళకు మళ్ళీ చిగుళ్ళు వస్తున్నాయి. అవి కూడా సుఖదుఃఖాలకు స్పందిస్తున్నాయి. వాటికి జీవం ఉన్నట్లే కదా!

భారతీయ గ్రంథాలను ‘వైజ్ఞానిక దృష్టితో పరిశోధించే సుభాష్ చంద్రబోస్ మహాశయుణ్ణి ఈ సంభాషణ బాగా ఆకర్షించింది. తన పరిశోధనను ఈ వైపుగా కొనసాగించి క్రెస్కోగ్రాఫ్ ను ఆవిష్కరించాడు. దీని సహాయంతో మొక్కలకు జీవం ఉందని, తీవ్రమైన కాంతికి, ధ్వనికి అవి స్పందిస్తాయని, వాటిలో జీవలక్షణమైన పెరుగుదల ఉందని ఆధునిక ఆధును. ప్రపంచానికి మొదటిసారిగా తెలియజేశాడు. వృక్ష శరీర ధర్మశాస్త్ర పితామహునిగా కీర్తించబడినాడు.
(లేదా)
* శాస్త్రవేత్తల గురించి పత్రికల్లో వచ్చిన అంశాలను సేకరించండి.
జవాబు:
పైన చెప్పిన పని మీరు మిత్రులతో కలసి పూర్తిచేయండి.

III. భాషాంశాలు

పదజాలం

అ) కింద గీత గీసిన పదాలకు అర్థాలను రాసి ఆ పదాలను సొంతవాక్యాలలో రాయండి.
ఉదా :
వివేకానందుడు రామకృష్ణుని పథంలో పయనించాడు.
పథం = మార్గం
మహాత్ములు చూపిన మార్గంలో పయనించాలి.

1. ఔత్సాహికుడైన వ్యక్తి ఏ రంగంలోనైనా రాణిస్తాడు.
జవాబు:
ఔత్సాహికుడు = ఉత్సాహం గలవాడు – ఉత్సాహం గలవాడికే ఉన్నత స్థితి త్వరగా లభిస్తుంది.

2. జిజ్ఞాసువు కొత్త విషయాలను తెలుసుకుంటాడు.
జవాబు:
జిజ్ఞాసువు = తెలుసుకోవాలనే కోరిక గలవాడు.
జగదీష్ చంద్రబోస్ కొత్త విషయాలను తెలుసుకోవాలనే కోరిక గలవాడు.

3. బందు కారణంగా పనులు నిలిచిపోకుండా యాజమాన్యం ప్రత్యామ్నాయపు ఏర్పాట్లు చేసింది.
జవాబు:
ప్రత్యామ్నాయము = ఇతర సౌకర్యం
నేడు మా నగరానికి గవర్నర్ వస్తున్న కారణంగా ట్రాఫిక్ జామ్ కాకుండా పోలీసులు తగిన ఇతర సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నారు.

4. వివేకానందుని ఉపన్యాసాలు ఎందరినో ప్రభావితం చేశాయి.
జవాబు:
ప్రభావితం చేయు = ప్రేరణ కలిగించు, ప్రకాశింపజేయు.
కలాం బోధనలు యువతలో ప్రేరణ కలిగించాయి.

5. సుస్మితకు డాక్టరుగా ఎదగాలని ఆకాంక్ష.
జవాబు:
ఆకాంక్ష = కోరిక
నేను ఇంజనీర్ ను కావాలని మా తల్లిదండ్రుల కోరిక.

6. అభ్యర్థులు ఎన్నికల సమయంలో వాగ్దానాలు చేస్తారు.
జవాబు:
వాగ్దానం = మాట ఇవ్వడం
మాట ఇవ్వగానే సరికాదు, దాన్ని నిలుపుకోగలగాలి.

AP Board 9th Class Telugu Solutions Chapter 4 ప్రేరణ

ఆ) పాఠం చదివి కింది పదాలను వివరించి రాయండి.
1. ఆకాశయానం : ఆకాశంలో ప్రయాణించడం, విమానాల్లో తిరగడం.
2. అణు భౌతికశాస్త్రం : అణువులు, వాటి విచ్ఛేదనం వలన ఉత్పన్నమయ్యే శక్తి మొదలైన వాటిని గురించి వివరించే శాస్త్రం.
3. సాంకేతిక విద్య : సాంకేతికత (Technology) ను బోధించే విద్యను సాంకేతిక విద్య అంటారు.
ఉదా :
పాలిటెక్నిక్, ఇంజనీరింగ్
4. ప్రొఫెషనల్ చదువు : వృత్తికి సంబంధించిన చదువు.
5. జ్ఞానతృష్ణ : తృష్ణ అంటే కోరిక. జ్ఞానాన్ని సంపాదించాలనే కోరికను జ్ఞానతృష్ణ అంటారు.

ఇ) ఈ పాఠంలో శాస్త్ర సంబంధ పదాలున్నాయి. వాటిని పట్టికగా రాయండి.
ఉదా : ఎరోనాటికల్ ఇంజనియర్
1) ప్రొఫెషనల్
2) ఫిజిక్స్
3) ఇంజనీరింగ్
4) ఏరోనాటికల్ ఇంజనీరింగ్
5) ఏ ప్లేన్
6) డిజైన్
7) ఏరోడైనమిక్ డిజైన్
8) చోదనం
9) నిర్మాణం
10) అదుపు
11) ఉపకరణ సామాగ్రి
12) రూపకల్పన
13) డ్రాయింగ్
14) డ్రాయింగ్ బోర్డ్
15) ప్రాజెక్ట్
16) ఇంజన్ ఓవరహాలింగ్
17) విమానాల ఓవరాలింగ్
18) ప్రాక్టికల్
19) పిస్టన్
20) టర్బయిన్
21) ఇంజన్
22) వాయుపదార్థాల డైనమిక్స్

ఈ) కింది వాక్యాలలో గీత గీసిన పదాలు సమానార్థాన్ని ఇస్తాయి. ఆ పదాలతో కొత్త వాక్యాలు రాయండి.

1. ఆకాశంలో చుక్కలు మెరుస్తున్నాయి. ఆ గగనంలోనే చంద్రుడు కాంతులీనుతున్నాడు. అందుకే నింగి అంటే నాకెంతో – ఇష్టం.
జవాబు:
ఆకాశంలో విమానాలు వెళతాయి. ఆ గగనంలోకే రాకెట్లు దూసుకెళతాయి. ఉపగ్రహాలన్నీ నింగి లోనే సంచరిస్తాయి.

2. భూమిమీద ఎన్నో జీవరాశులున్నాయి. వసుధలో నిధి నిక్షేపాలుంటాయి. ధరణికి వృక్షాలు అందాన్నిస్తాయి.
జవాబు:
భూమి మానవునికి నివాసం. వసుధ గురించి మానవుడెంతో తెలుసుకోవాల్సింది ఉంది. ఈ ధరణిని నిర్లక్ష్యం చేస్తే మనుగడే ఉండదు.

3. ఆయనకు సుమారు ముప్పై ఏళ్ళు. ఉద్యోగంలో చేరి ఇంచుమించు ఆరు సంవత్సరాలయింది. నెలకు దాదాపు నలభై వేలు సంపాదిస్తున్నాడు.
జవాబు:
మన భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి సుమారు 66 సంత్సరాలు. మన రాజ్యాంగం అమలులోకి వచ్చి ఇంచుమించు 63 సంవత్సరాలు. మన పంచవర్ష ప్రణాళికలను అమలు చేయడం మొదలు పెట్టి దాదాపు 63 సంవత్సరాలు.

AP Board 9th Class Telugu Solutions Chapter 4 ప్రేరణ

ఉ) కింది వాక్యాలు చదవండి. ప్రతి వాక్యంలోనూ ప్రకృతి – వికృతి పదాలున్నాయి. వాటిని గుర్తించి పట్టికగా రాయండి. వాటితో కొత్త వాక్యాలు తయారుచేయండి.
1) ఆకాశం మేఘావృతమైనది. ఆకసం నిండా మబ్బులున్నాయి.
2) మా ఉపాధ్యాయుడు పాఠాలు బాగా చెప్తారు. అందుకే మా ఒజ్జ అంటే మాకిష్టం.
3) అగ్ని దగ్గర జాగ్రత్త అవసరం. అగ్గితో ఆటలాడగూడదు.
4) సముద్రంలో గవ్వలుంటాయి. సంద్రంలో అలలు వస్తుంటాయి.
5) ఆకాశంలో పక్షి ఎగురుతోంది. పక్కిలా ఎగరటమంటే పవన్ కు ఎంతో సరదా.
జవాబు:
ప్రకృతి-వికృతి పదముల పట్టిక :
1. ఆకాశం – ఆకసం
2. ఉపాధ్యాయుడు – ఒజ్జ
3. అగ్ని – అగ్గి
4. సముద్రం – సంద్రం
5. పక్షి – పక్కి

కొత్త వాక్యాలు :

  1. ఆకసంలో చందమామ వెలిగిపోతున్నాడు. ఆకాశంలో తారకల అందానికి మరేదీ పోటీ కాదు.
  2. బాల్యంలో కలాం వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దిన ఉపాధ్యాయుడు ఇయదురై సోలోమోన్. ఆ ఒజ్జను 82 సం||ల వయస్సులో కూడా సంస్మరిస్తాడు కలాం.
  3. ఎండాకాలంలో అగ్ని ప్రమాదాలు ఎక్కువ. ఈ కాలంలో అగ్గిని ఆపాలంటే ఎక్కువ కష్టపడాలి.
  4. భారతదేశానికి దక్షిణాన హిందూమహాసముద్రం ఉంది. ఆ సంద్రం ఒడ్డున సూర్యాస్తమయ సన్నివేశాన్ని చూడటానికి యాత్రికులు పోటీపడతారు.
  5. మా బడి దగ్గర తుమ్మచెట్టుకు గిజిగాడు పక్షిగూడు వేలాడుతోంది. పక్కి ఆ గూటిని ఎంతో అందంగా నిర్మించింది.

వ్యాకరణం

అ) పాఠంలోని ప్రత్యక్ష కథనంలోని వాక్యాలు గుర్తించండి. వాటిని పరోక్ష కథనంలోకి మార్చి రాయండి.

1. “మా అన్నయ్య ముస్తఫాకమల్ కి స్టేషన్ రోడ్ లో ఒక కిరాణా దుకాణం ఉండేది” అన్నారు కలామ్.
జవాబు:
తన అన్నయ్య ముస్తఫాకమల్ కి స్టేషన్ రోడ్లో ఒక కిరాణా దుకాణం ఉండేదని కలామ్ అన్నారు.

2. “నేను రామనాథపురం హైస్కూల్లో స్థిరపడగానే నాలోని పదిహేనేళ్ళ జిజ్ఞాసువు మేల్కొన్నాడు” చెప్పాడు కలాం.
జవాబు:
తాను రామనాథపురం హైస్కూల్లో స్థిరపడగానే తనలోని పదిహేనేళ్ళ జిజ్ఞాసువు మేల్కొన్నాడని కలాం చెప్పాడు.

3. “నా ఉపాధ్యాయుడు ఇయదురై సోలోమోన్ ఆదర్శ పథ నిర్దేశకుడయ్యాడు” చెప్పాడు కలాం.
జవాబు:
తన ఉపాధ్యాయుడు ఇయదురై సోలోమోన్ ఆదర్శ పథ నిర్దేశకుడయ్యాడని కలాం చెప్పాడు.

4. “నేను రామనాథపురంలో ఉన్న కాలంలో మా అనుబంధం గురుశిష్య బంధాన్ని దాటి వికసించింది” చెప్పాడు కలాం.
జవాబు:
తాను రామనాథపురంలో ఉన్న కాలంలో తమ అనుబంధం గరుశిష్య బంధాన్ని దాటి వికసించిందని కలాం చెప్పాడు.

5. “జీవితంలో విజయం పొందడానికీ, ఫలితాలు సాధించడానికి నువ్వు మూడు అంశాల మీద పట్టు సాధించాలి” చెప్పాడు సోలోమోన్.
జవాబు:
జీవితంలో విజయం పొందడానికీ, ఫలితాలు సాధించడానికీ అతడు మూడు అంశాల మీద పట్టు సాధించాలని సోలోమోన్ చెప్పాడు.

6. “నా జీవితం నుంచి ఒక ఉదాహరణ ఇస్తాను” చెప్పాడు కలాం.
జవాబు:
తన జీవితం నుంచి ఒక ఉదాహరణ ఇస్తానని కలాం చెప్పాడు.

7. “నాకు చిన్నప్పటి నుంచి ఆకాశపు రహస్యాలన్నా, పక్షుల ప్రయాణమన్నా అమితాసక్తి” కలాం చెప్పాడు.
జవాబు:
తనకు చిన్నప్పటి నుంచి ఆకాశపు రహస్యాలన్నా, పక్షుల ప్రయాణమన్నా అమితాసక్తని కలాం చెప్పాడు.

8. “కొంగలూ, సముద్రపు గువ్వలూ ఎగురుతుండటం చూస్తూ, నేను కూడా ఎగరాలని కోరుకునేవాణ్ణి” చెప్పాడు కలాం.
జవాబు:
కొంగలూ, సముద్రపు గువ్వలూ ఎగురుతుండటం చూస్తూ, తాను కూడా ఎగరాలని కోరుకునేవాణ్ణని కలాం చెప్పాడు.

AP Board 9th Class Telugu Solutions Chapter 4 ప్రేరణ

9. ”నేను కూడా ఏదో ఒకరోజు ఆకాశంలో విహరించగలనని ఎంతగానో నమ్మాను” అన్నాడు కలాం.
జవాబు:
తాను కూడా ఏదో ఒకరోజు ఆకాశంలో విహరించగలనని ఎంతగానో నమ్మానని కలాం అన్నాడు.

10. “విశ్వాసంతో నువ్వు నీ విధిని కూడా తిరిగి రాయగలవు” అనేవాడు సోలోమోన్.
జవాబు:
విశ్వాసంతో అతడు తన విధిని కూడా తిరిగి రాయగలడని సోలోమోన్ అనేవాడు.

11. “నేను రామేశ్వరం వెళ్ళినప్పుడల్లా నన్ను సాయం చేయమంటూ పిలిచి, షాపులో కూర్చోబెట్టేవాడు మా అన్నయ్య” చెప్పాడు కలాం.
జవాబు:
తాను రామేశ్వరం వెళ్ళినప్పుడల్లా తనను సాయం చేయమంటూ పిలిచి, షాపులో కూర్చోబెట్టేవాడు తన అన్నయ్య అని చెప్పాడు కలాం.

12. “నేను అక్కడ ఆ షాపుని కనిపెట్టుకు కూచొని బియ్యం , నూనె, ఉల్లిపాయలు ఒకటేమిటి అన్నీ అమ్ముతుండేవాణ్ణి” అన్నాడు కలాం.
జవాబు:
తాను అక్కడ ఆ షాపుని కనిపెట్టుకు కూచొని బియ్యం, నూనె, ఉల్లిపాయలు ఒకటేమిటి అన్నీ అమ్ముతుండేవాణ్ణి అని కలాం అన్నాడు.

13. “మా అన్నయ్య ముస్తఫా నన్ను వదిలిపెట్టగానే మా తమ్ముడు కాశిం మహమ్మద్ నన్ను తన ఫ్యాన్సీ షాపులో కూర్చోబెట్టడానికి సిద్ధంగా ఉండేవాడు” చెప్పాడు కలాం.
జవాబు:
తన అన్నయ్య ముస్తఫా తనను వదలిపెట్టగానే తన తమ్ముడు కాశిం మహమ్మద్ తనని అతని ఫ్యాన్సీ షాపులో కూర్చోబెట్టడానికి సిద్ధంగా ఉండేవాడని కలాం చెప్పాడు.

14. “నేను సెంట్ జోసెఫ్ లో నా చివరి సంవత్సరంలో ఉన్నప్పుడు ఇంగ్లీషు సాహిత్యం పట్ల మక్కువ పెంచుకున్నాను” అన్నాడు కలాం.
జవాబు:
తాను సెంట్ జోసె లో తన చివరి సంవత్సరంలో ఉన్నప్పుడు ఇంగ్లీషు సాహిత్యం పట్ల మక్కువ పెంచుకున్నానని కలాం అన్నాడు.

15. “దాదాపుగా ఆ సమయంలోనే భౌతికశాస్త్రం పట్ల నాకు అమితమైన ఆసక్తి ఏర్పడింది” చెప్పాడు కలాం.
జవాబు:
దాదాపుగా ఆ సమయంలోనే భౌతికశాస్త్రం పట్ల తనకు అమితమైన ఆసక్తి ఏర్పడిందని కలాం చెప్పాడు.

16. “నాకయితే సైన్స్ ఎప్పుడూ ఆధ్యాత్మిక ఉన్నతికి, ఆత్మ సాక్షాత్కారానికి మార్గంగానే ఉంటూ వచ్చింది” అన్నాడు కలాం.
జవాబు:
తనకయితే సైన్స్ ఎప్పుడూ ఆధ్యాత్మిక ఉన్నతికి, ఆత్మ సాక్షాత్కారానికి మార్గంగానే ఉంటూ వచ్చిందని కలాం అన్నాడు.

17. “ఒక సైన్స్ విద్యార్థికి ఉన్న భవిష్య అవకాశాల గురించిన సమాచారం కూడా నాకేమీ తెలియదు” చెప్పాడు కలాం.
జవాబు:
ఒక సైన్స్ విద్యార్థికి ఉన్న భవిష్య అవకాశాల గురించిన సమాచారం కూడా తనకేమీ తెలియదని కలాం చెప్పాడు.

18. “బి.ఎస్.సి. డిగ్రీ పూర్తి చేశాకే భౌతికశాస్త్రం నా సబ్జెక్ట్ కాదని గ్రహించాను” అన్నాడు కలాం.
జవాబు:
బి.ఎస్.సి. డిగ్రీ పూర్తి చేశాకే భౌతికశాస్త్రం తన సబ్జెక్ట్ కాదని గ్రహించానని కలాం అన్నాడు.

19. “నా కలలు నిజం కావాలంటే నేను ఇంజనీరింగ్ చదవవలసి ఉంటుందని తెలుసుకున్నాను” చెప్పాడు కలాం.
జవాబు:
తన కలలు నిజం కావాలంటే తాను ఇంజనీరింగ్ చదవవలసి ఉంటుందని తెలుసుకున్నానని కలాం చెప్పాడు.

20. “ఇంటర్మీడియెట్ అయిన తరువాతనే నేను నేరుగా ఇంజనీరింగ్ లో చేరి ఉండవచ్చు” అన్నాడు కలాం.
జవాబు:
ఇంటర్మీడియెట్ అయిన తరువాతనే తాను నేరుగా ఇంజనీరింగ్ లో చేరి ఉండవచ్చని కలాం అన్నాడు.

AP Board 9th Class Telugu Solutions Chapter 4 ప్రేరణ

21. “అప్పుడు నా సోదరి ఊహారా నాకు తోడు నిలబడింది” చెప్పాడు కలాం.
జవాబు:
అప్పుడు తన సోదరి జొహారా తనకు తోడు నిలబడిందని కలాం చెప్పాడు.

22. “నేను చదువుకోవాలన్న ఆమె కాంక్ష, నా సామర్థ్యంపై ఆమె నమ్మకం నన్ను గాఢంగా చలింపచేశాయి” అన్నాడు కలాం.
జవాబు:
తను చదువుకోవాలన్న ఆమె కాంక్ష, తన సామర్థ్యంపై ఆమె నమ్మకం తనను గాఢంగా చలింపచేశాయని కలాం అన్నాడు.

23. “నేను నా సొంత సంపాదన మీదనే ఆమె గాజుల్ని విడిపిస్తానని ఒట్టు పెట్టుకున్నాను” పేర్కొన్నాడు కలాం.
జవాబు:
తాను తన సొంత సంపాదన మీదనే ఆమె గాజుల్ని విడిపిస్తానని ఒట్టు పెట్టుకున్నానని కలాం పేర్కొన్నాడు.

24. “నా మొదటి సంవత్సరం పూర్తయ్యాకజకు ప్రత్యేక విషయాన్ని పంపిక చేసుకోవాల్సి వచ్చినప్పుడు మరేమీ ఆలోచించకుండా ఏరోనాటికల్ ఇంజనీరింగ్ ని ఎంచుకున్నాను” చెప్పాడు కలాం.
జవాబు:
తన మొదటి సంవత్సరం పూర్తయ్యాక ఒక ప్రత్యేక విషయాన్ని ఎంపిక చేసుకోవాల్సి వచ్చినప్పుడు మరేమీ ఆలోచించకుండా ఏరోనాటికల్ ఇంజనీరింగ్ ని ఎంచుకున్నానని కలాం చెప్పాడు.

25. “లక్ష్యం నా మనస్సులో స్పష్టంగానే ఉండింది” అన్నాడు కలాం.
జవాబు:
లక్ష్యం తన మనస్సులో స్పష్టంగానే ఉండిందని అన్నాడు కలాం.

26. “ఎమ్.ఐ.టి. లో నా విద్యాభ్యాసంలో నా ఆలోచనని ముగ్గురు ఉపాధ్యాయులు తీర్చిదిద్దారు” పేర్కొన్నాడు కలాం.
జవాబు:
ఎమ్.ఐ.టి. లో తన విద్యాభ్యాసంలో తన ఆలోచనని ముగ్గురు ఉపాధ్యాయులు తీర్చిదిద్దారని కలాం పేర్కొన్నాడు.

27. “విస్తృత పరిజ్ఞానం నా మనసులో నెమ్మదిగా సమీకరింపబడటం మొదలయ్యింది” చెప్పాడు కలాం.
జవాబు:
విస్తృత పరిజ్ఞానం తన మనసులో నెమ్మదిగా సమీకరింపబడటం మొదలయ్యిందని కలాం చెప్పాడు.

28. “ఒక రోజు మా డైరెక్టర్, మాకు డిజైనింగ్ ఉపాధ్యాయుడూ అయిన ప్రొఫెసర్ శ్రీనివాసన్ మా పనిలో ప్రగతిని సమీక్షించి, ఏమీ పురోగతి లేదని తేల్చేశారు” అన్నాడు కలాం.
జవాబు:
ఒకరోజు తమ డైరెక్టర్, తమకు డిజైనింగ్ ఉపాధ్యాయుడూ అయిన ప్రొఫెసర్ శ్రీనివాసన్ తమ పనిలో ప్రగతిని సమీక్షించి, ఏమీ పురోగతి లేదని తేల్చేశారని కలాం అన్నాడు.

29. “ఆ రాత్రి నేను భోజనం మానేసి డ్రాయింగ్ బోర్డ్ దగ్గరే పనిలో నిమగ్నుణ్ణిపోయాను” చెప్పాడు కలాం.
జవాబు:
ఆ రాత్రి తాను భోజనం మానేసి డ్రాయింగ్ బోర్డ్ దగ్గరే పనిలో నిమగ్నుణ్ణిపోయానని కలాం చెప్పాడు.

30. “నేను ఎమ్. ఐ.టి. తమిళ సంఘం వారు నిర్వహించిన వ్యాసరచన పోటీలో పాల్గొన్నాను” అన్నాడు కలాం.
జవాబు:
తాను ఎమ్. ఐ.టి. తమిళ సంఘం వారు నిర్వహించిన వ్యాసరచన పోటీలో పాల్గొన్నానని కలాం అన్నాడు.

31. “రా నాతోపాటు ముందు కూర్చో” అన్నాడు ప్రొఫెసర్ స్పాండర్.
జవాబు:
తనతో పాటు ముందు కూర్చొనుటకు రమ్మని ప్రొఫెసర్ స్పాండర్ అన్నాడు.

32. “నువ్వు నా బెస్టు స్టూడెంట్ వి. నీ పరిశ్రమ నీ ఉపాధ్యాయులకి భవిష్యత్తులో మంచిపేరు తేవడానికి ఉపకరిస్తుంది” అన్నాడు ప్రొఫెసర్ స్పాండర్.
జవాబు:
అతడు తన బెస్టు స్టూడెంట్ అని, అతని పరిశ్రమ అతని ఉపాధ్యాయులకి భవిష్యత్తులో మంచి పేరు తేవడానికి ఉపకరిస్తుందని ప్రొఫెసర్ స్పాండర్ అన్నాడు.

AP Board 9th Class Telugu Solutions Chapter 4 ప్రేరణ

ఆ) క్రియను మార్చి వ్యతిరేకార్థక వాక్యాలు రాయండి.

1. పుస్తక రచనను పూర్తి చేయడానికి ఒక నెల రోజుల వ్యవధి కావాలి.
జవాబు:
పుస్తక రచనను పూర్తి చేయడానికి ఒక నెలరోజుల వ్యవధి అవసరం లేదు.

2. నా మాతృభూమి విస్తృతి ఎంతో తెలుసుకోలేకపోయాను.
జవాబు:
నా మాతృభూమి విస్తృతి ఎంతో తెలుసుకోగలిగాను.

ఇ) కర్తరి వాక్యాలు, కర్మణి వాక్యాలు

1. కర్తరి వాక్యం :
క్రియ చేత కర్త చెప్పబడితే ఆ వాక్యాన్ని కర్తరి వాక్యం అంటారు. ఇది సూటిగా అర్థమవుతుంది. ఇది తెలుగు భాషకు సహజసిద్ధమైంది.
ఉదా :
జిడ్డు కృష్ణమూర్తి గారు ఎన్నో మంచి విషయాలను చెప్పారు.

2. కర్మణి వాక్యం :
క్రియ చేత కర్మ చెప్పబడితే ఆ వాక్యాన్ని కర్మణి వాక్యం అంటారు. ఇది కాస్త చుట్టు తిప్పి చెప్పినట్లుంటుంది. ఈ వాక్యాలు సంస్కృత భాషా ప్రభావం వల్ల తెలుగులో ఏర్పడ్డాయి. ఇంగ్లీషులో ఇటువంటి వాక్య పద్ధతి ఉంది.
ఉదా :
ఎన్నో మంచి విషయాలు జిడ్డు కృష్ణమూర్తి గారి చేత చెప్పబడ్డాయి.

AP Board 9th Class Telugu Solutions Chapter 4 ప్రేరణ

ఇలాగే మీరు మార్చండి.
1. రమేష్ భారతాన్ని చదివాడు. (కర్తరి వాక్యం)
జవాబు:
భారతం రమేష్ చే చదవబడింది. (కర్మణి వాక్యం)

2. నేనెన్నో పుస్తకాలు రాశాను. (కర్తరి వాక్యం)
జవాబు:
నా చేత ఎన్నో పుస్తకాలు రాయబడ్డాయి. (కర్మణి వాక్యం)

9th Class Telugu 4th Lesson ప్రేరణ రచయిత పరిచయం

ఆ అందరూ ఏ.పి.జె. అబ్దుల్ కలామ్ అని పిలిచే డాక్టర్ అవుల్ ఫకీర్ జైనులాద్దీన్ అబ్దుల్ కలామ్ 1931 అక్టోబర్ 15 న తమిళనాడులోని రామేశ్వరం దగ్గర ఉన్న ధనుష్కోటిలో పుట్టారు. సామాన్య కుటుంబంలో పుట్టిన ఆయన పట్టుదల, క్రమశిక్షణ, జ్ఞాన జిజ్ఞాసతో ఇంజనీరుగా, శాస్త్రవేత్తగా, భారత రాష్ట్రపతిగా తన సేవలను ఈ జాతికి అందించారు. “ఒక విజేత ఆత్మకథ” (ఇగ్నైటెడ్ మైండ్స్, ద వింగ్స్ ఆఫ్ ఫైర్ – యాన్ ఆటోబయోగ్రఫీ) వంటి రచనలు చేశారు.

శాస్త్రరంగంలో విశేష కృషి చేసినందుకు గాను పద్మభూషణ్, పద్మవిభూషణ్ తో పాటు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్నతోను భారత ప్రభుత్వం సత్కరించింది. దేశ విదేశాల్లోని | విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్లతో ఆయనను గౌరవించాయి.

కఠిన పదాలకు అర్థాలు

జిజ్ఞాసి = తెలిసికోవాలనే కోరిక కలవాడు
మేల్కొను = ముందు జాగ్రత్తపడు
జీవితావకాశాలు = జీవితంలో వచ్చే అవకాశాలు
ప్రత్యామ్నాయాలు = బదులుగా చేసే పనులు
ఔత్సాహికుడు = ఉత్సాహం కలవాడు
ఆదర్శపథము = ఆదర్శ మార్గం
నిర్దేశకుడు = ఉపదేశించేవాడు ; చూపించేవాడు
ఉదార = గొప్పదైన
దృక్పథము = ఆలోచనా ధోరణి లేదా సరళి
అనుబంధం = సంబంధం
గురుశిష్య బంధము = గురుశిష్యుల సంబంధం
సాహచర్యం = కలిసి ఉండడం
జీవిత గమనం = జీవితం నడవడి
ప్రభావితం = ప్రభావము పడినది
పట్టు = ఊత
ఆశ పెట్టుకోవడం = కోరిక కలిగి ఉండడం
సంభవించాలని = జరగాలని ; కలగాలని
ఆకాంక్షించాలని = కోరాలని
ప్రగాఢంగా = మిక్కిలి అధికంగా
విశ్వసించాలి = నమ్మాలి
అమితాసక్తి (అమిత+ఆసక్తి) = అంతులేని ఆసక్తి
స్పృహ = ఇచ్ఛ, కోరిక
విధిని = భాగ్యమును (విధి రాతను)
దృఢ సంకల్పం = గట్టి లక్ష్యము
ఇనుమడించింది = రెట్టింపు అయ్యింది
ప్రొఫెషనల్ చదువులు = వృత్తి విద్యలు
క్లుప్తంగా = సంక్షిప్తంగా
అదృశ్యం = కనబడనిది
కష్టార్జితం (కష్ట + ఆర్జితం) = కష్టంతో సంపాదింపబడినది
కంచి పరమాచార్య = కంచిలో గల చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామీజీ శంకర మఠం అధ్యక్షులు)
అనుచరులు = సహాయకులు
త్యాగనిరతి = దానము చేయుటయందు మిక్కిలి ఆసక్తి
కేంపస్ = ప్రాంగణం
దృశ్యం = చూడదగినది
ఉద్వేగభరితుణ్ణి = కలతతో నిండినవాణ్ణి
మక్కువ = ప్రేమ
సర్వశ్రేష్ఠకృతుల్ని = అన్నింటికంటె గొప్ప కావ్యాల్ని
అంశము = విషయం
విజ్ఞానశాస్త్ర పథం = సైన్సు మార్గం
భవిష్య అవకాశాలు = రాబోయే కాలంలో వచ్చే అవకాశాలు
సమాచారం = వార్త
సబ్జెక్ట్ (subject) = విషయం
సాంకేతిక విద్య = యాంత్రిక విద్య
తలమానికం = శిరోరత్నం
దరఖాస్తు = అభ్యర్థన పత్రం
ఎంపిక = ఎన్నుకొను
ప్రతిష్టాత్మక సంస్థ = పేరుపొందిన సంస్థ
తలకు మించిన విషయం = తన వల్ల కాని విషయం
తోడు నిలబడింది = సహాయంగా నిలబడింది (సాయం చేసింది)
కుదువబెట్టి = తాకట్టుపెట్టి
ఆకాంక్ష = గాఢమైన కోరిక
చలింపచేశాయి = కదిలించాయి
స్కాలర్‌షిప్ = ఉపకార వేతనం (scholarship)
మిన్నగా = అధికంగా
ఆరాధిస్తూ = పూజిస్తూ (గౌరవిస్తూ)
ఏరోనాటికల్ ఇంజనీరింగు = విమానాలను నడపడానికి సంబంధించిన ఇంజనీరింగు
లక్ష్యం = గురి
సాధ్యము = సిద్ది
నేపథ్యం = తెరవెనుక విషయము (పూర్వ రంగం)
వైఫల్యాలు = ప్రయత్నము జయప్రదం కాకుండా పోవడం, (Failures)
ఆశాభంగాలు = కోరిక భగ్నం కావడాలు
ఉత్తేజకరము = ప్రేరణను ఇచ్చేది
వివేకి = విచారణ చేయువాడు
ప్రయోజన శూన్యం = ఉపయోగం లేనిది
వ్యక్తిత్వం = వ్యక్తికి సంబంధించిన స్వభావం
ఆశయము = అభిప్రాయం
జ్ఞానతృష్ణ = జ్ఞాన సంపాదనమందు ఆసక్తి
చైతన్యం = జ్ఞానం (తెలివి)
అకుంఠిత సంకల్పం = మొక్కవోని కోరిక (తిరుగులేని అభిప్రాయం)
ఉవ్విళ్ళూరించే = మిక్కిలి ఆశించే ; (త్వరపడే)
వ్యత్యాసము = భేదం
నిశిత బోధన = మెఱుగు పెట్టబడిన బోధన
ఏరోనాటిక్స్ = వైమానిక సంబంధమైనది
తృష్ణ = పేరాస
జాగరితం = మేల్కొనడం
మేధాగరిమ = గొప్ప తెలివి

AP Board 9th Class Telugu Solutions Chapter 4 ప్రేరణ

సమగ్రత = సంపూర్ణం
బలోపేతం = బలంతో కూడినది
సమీకరింపబడటం = ఒకటిగా చేయబడటం
ఏరోప్లేన్ = విమానం (Aeroplane)
సమగ్రవంతం = సంపూర్ణము కావడం
సహకరించారు = సాయం చేశారు
కోర్సు (course) = పాఠ్య ప్రణాళిక
డిజైన్ (design) = నమూనా, ప్రణాళిక (Design)
ప్రగతి = అభివృద్ధి
సమీక్షించి = పరామర్శించి
పురోగతి = ముందుకు నడచుట
నిరాశాజనకం = నిరాశను పుట్టించేది
సాకులు = వంకలు
వ్యవధి = మేర,ఎడమ
భాగ్య రేఖ = అదృష్ట రేఖ
నిమగ్నుడు = మునిగినవాడు
కావలించుకొని = ఆలింగనం చేసుకొని
ప్రశంసాత్మకంగా = పొగడబడే విధంగా
వెన్నుతట్టు = ధైర్యము చెప్పు
నెడుతున్నాను = గెంటుతున్నాను
ఆసక్తి = అపేక్ష
మార్గదర్శి = మార్గాన్ని చూపేవాడు
మహామేధావి = గొప్ప తెలివి కలవాడు
వీడ్కోలు = పోవడానికి అంగీకారం తెల్పడం
ఇంజన్ ఓవర్ హాలింగ్ = ఇంజనను పరిశుభ్రం చేయడం
ప్రాక్టికల్స్ (practicals) = ప్రయోగాలు
ఉద్వేగాన్ని = కలతచెందిన మనస్సును
పసిగట్టడం = సూచనగా తెలిసికొను
డైనమిక్స్ = ఇది ఫిజిలో ఒక భాగం ప్రతిభ = తెలివి
అంశాలు = విషయాలు
బోధపడ్డాయి = అర్థమయ్యాయి
గ్రాడ్యుయేట్ (graduate)=పట్టభద్రుడు
చిరకాల స్వప్నం = చాలాకాలం నుండి ఉన్న కల
ఉపాధి అవకాశాలు = బ్రతుకు తెరువుకు దారులు
ఆధ్వర్యం = పెత్తనం
కాల్ లెటర్లు (call letters) = రమ్మని పిలిచే ఉత్తరాలు
కోరమాండల్ తీరం = భారతదేశానికి తూర్పు వైపున క్రింది భాగాన ఉన్న సముద్ర తీరాన్ని కోరమాండల్ తీరం అంటారు.

కోరమాండల్ తీరబాలుడు అంటే తూర్పు సముద్ర తూర్పు తీరాన పుట్టిన ‘కలాం’

AP SSC 10th Class Telugu Important Questions Chapter 12 చిత్రగ్రీవం

AP State Board Syllabus AP SSC 10th Class Telugu Important Questions Chapter 12 చిత్రగ్రీవం

AP State Syllabus SSC 10th Class Telugu Important Questions 12th Lesson చిత్రగ్రీవం

10th Class Telugu 12th Lesson చిత్రగ్రీవం 2 Marks Important Questions and Answers

ఈ క్రింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాల్లో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
చిత్రగ్రీవంలో ఆశ్చర్యకరమైన విషయాలు ఏమి ఉన్నాయి?
జవాబు:
చిత్రగ్రీవం తనకు మూడువారాల వయస్సు ఉన్నప్పుడు అది తన గూట్లోకి వచ్చిన నల్లచీమను, తన ముక్కుతో పొడిచి చంపింది. అయితే ఆ చీమ దానికి తినడానికి పనికి రానిది. చీమ పావురాల జాతికి స్నేహితుడు. చీమను తినే వస్తువని భావించి చిత్రగ్రీవం దాన్ని పొడిచి చంపింది. తరువాత తాను చేసిన పని తప్పని చిత్రగ్రీవం పశ్చాత్తాపపడి ఉంటుంది.

అందుకేనేమో చిత్రగ్రీవం, మళ్ళీ ఎప్పుడూ తన జీవితంలో మరోసారి చీమను చంపలేదు – తాను చేసిన తప్పును గ్రహించిన చిత్రగ్రీవం, తిరిగి ఎప్పుడూ ఆ తప్పు చేయకపోడం, ఆశ్చర్యకరమైన విషయం.

ప్రశ్న 2.
మానవులకు, పావురాలకూ స్నేహం ఉందని ఎలా చెప్పగలవు?
జవాబు:
ఏనుగులు, పావురాలు తమ యజమానుల పట్ల ఎక్కువగా విశ్వాసాన్ని కనబరుస్తాయి. అడవులలోని ఏనుగులు, నగరాల్లోని పావురాలు, తమ యజమానులంటే ప్రాణం ఇస్తాయి. రోజంతా ఎక్కడ ఎక్కడ తిరిగినా, చివరికి పావురాలు తమకు గల అద్భుతమైన దిశాపరిజ్ఞానంతో, అంతః ప్రేరణా బలంతో తమకు మిత్రుడూ, సహచరుడూ అయిన మానవుడి పంచకు చేరతాయి.

దీనినిబట్టి పావురాలకూ, మానవులకూ స్నేహం ఉందని చెప్పగలము.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 12 చిత్రగ్రీవం

ప్రశ్న 3.
చిత్రగ్రీవం పాఠ్య రచయితను గురించి వ్రాయండి.
జవాబు:
చిత్రగ్రీవం పాఠ్యాంశం ‘చిత్రగ్రీవం – ఓ పావురం కథ’ అనే పుస్తకం నుండి గ్రహించబడింది. దీనిని ధనగోపాల్ ముఖర్జీగారు రచించారు. దానిని దాసరి అమరేంద్రగారు తెలుగులోనికి అనువదించారు.

దీనిని నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా సంస్థ ప్రచురించింది. ధనగోపాల్ ముఖర్జీ తన 19వ ఏటనే అమెరికా వెళ్ళారు. కాలిఫోర్నియా, స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయాలలో చదువుకొన్నారు. రచనలు చేయడం, ఉపన్యాసాలు ఇవ్వడం ఆయన ప్రవృత్తి. కలకత్తాలో జన్మించారు.

వీరు 1890 నుండి 1936 వరకు జీవించారు.

ప్రశ్న 4.
ధనగోపాల్ ముఖర్జీ సాహిత్య సేవను వివరించండి.
జవాబు:
ధనగోపాల్ ముఖర్జీగారు జంతువులకు సంబంధించి తొమ్మిది రచనలు చేశారు.

1922లో ఆయన వ్రాసిన ‘కరి ది ఎలిఫెంట్’ ప్రసిద్ధమైన రచన, 1924లో ‘హరిశా ది జంగిల్ ల్యాండ్’, 1928లో ‘గోండ్ ది హంటర్’ చాలా ప్రసిద్ధమైన రచనలు.

1928లో అమెరికన్ లైబ్రరీ అసోసియేషన్ వారు ‘న్యూ బెరీ మెడల్’ బహుమతిని అందించారు. ఈ బహుమతిని గెల్చుకున్న భారతీయ రచయిత ధనగోపాల్ ముఖర్జీ మాత్రమే.

10th Class Telugu 12th Lesson చిత్రగ్రీవం 4 Marks Important Questions and Answers

ఈ క్రింది ప్రశ్నలకు 10 లేక 12 వాక్యాల్లో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
చిత్రగ్రీవం యొక్క సొగసులను, చేష్టలను వర్ణించండి.
జవాబు:
‘చిత్రగ్రీవం’ అనేది ఒక పావురం. దానిని తల్లిపక్షి, తండ్రిపక్షి కలిసి అనురాగంగా పెంచాయి. తల్లిదండ్రుల శ్రమ, శ్రద్ధ వల్ల చిత్రగ్రీవం మహా ఏపుగా పెరిగింది. క్రమంగా దాని గులాబీ రంగు మారి తెలుపురంగు వచ్చింది. ముళ్ళపందిలాంటి ఈకలు వచ్చాయి. దాని కళ్ల దగ్గర, నోటి దగ్గర ఉన్న, పసుపు పచ్చని చర్మాలు రాలిపోయాయి. పొడవాటి, గట్టిపాటి సూదిలాంటి ముక్కు ఏర్పడింది.

పుట్టిన ఐదోవారానికి చిత్రగ్రీవం గూడు నుండి బైటికి గెంతి, మూకుళ్లలో నీరు త్రాగేది. చిత్రగ్రీవం మందకొడిగా ఉండేది. మూడు నెలల వయస్సు రాగానే, దాని ఒళ్ళంతా సముద్రపు నీలిరంగు ఈకలు ధగధగా మెరిశాయి. దాని మెడ ప్రాంతం, సూర్యకాంతిలో ఇంద్రధనుస్సు వర్ణాల పూసల గొలుసులా శోభిల్లింది. తండ్రిపక్షి చిత్రగ్రీవానికి ఎగరడం బలవంతంగా నేర్పింది. ఎగరడంలో అలసిన చిత్రగ్రీవాన్ని తల్లిపక్షి లాలించింది.

చిత్రగ్రీవానికి నిండుగా ఈకలు పెరిగాయి. ఆ ఈకలు అతి సుందరమైన రంగులతో నిండాయి. అందుకే, చిత్రగ్రీవానికి సాటిరాగల మరో పావురం లేదని రచయిత చెప్పాడు.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 12 చిత్రగ్రీవం

ప్రశ్న 2.
పావురాల నుండి మానవులు నేర్చుకోవలసిన విషయాలు ఏవి?
జవాబు:
1) పావురాలు తమ యజమానులపై మంచి విశ్వాసాన్నీ, ప్రేమనూ చూపించి, యజమానులంటే ప్రాణం పెడతాయి. మానవులలో కొందరు యజమానుల పట్ల విశ్వాసం లేకుండా ఉంటారు. అది తప్పు, తమకు అన్నం పెట్టే యజమానిపై విశ్వాసం ఉండాలి. కాబట్టి పావురాల నుండి మానవులు యజమానులపై విశ్వాసాన్ని చూపడం అనే మంచి గుణం నేర్చుకోవాలి.

2) చిత్రగ్రీవం అనే పావురము ఒకసారి తన గూటికి వచ్చిన నల్లచీమను చూసి, తాను తినే వస్తువు అనుకొని దానిని ముక్కుతో పొడిచి చంపింది. తరువాత చీమను పావురాలకు స్నేహితుడిగా అది తెలిసికొంది. తిరిగి అది తన జీవితంలో చీమను చంపలేదు. చిత్రగ్రీవం తన తప్పును తెలిసికొని పశ్చాత్తాప పడింది. చేసిన తప్పు అది తిరిగి చేయలేదు.

మనిషి మాత్రం చేసిన తప్పునే తిరిగి తిరిగి చేస్తాడు. కాబట్టి మానవులు పావురాల నుండి, చేసిన తప్పును తిరిగి చేయకపోడం అనే మంచి గుణాన్ని తప్పక నేర్చుకోవాలి.

ప్రశ్న 3.
పక్షులను, జంతువులను పెంచడం వల్ల ఉపయోగాలు ఏవి?
జవాబు:
పక్షుల పెంపకం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. మనము కోడి, నెమలి, చిలుక వంటి పక్షులను పెంచుతాము. కోడి, గ్రుడ్లు పెడుతుంది. ఆ గుడ్లు మంచి పోషకాహారము. గుడ్లు, సంపూర్ణమైన బలమైన ఆహారం క్రిందికి వస్తాయి. కోళ్ళను పెంచి గుడ్లను అమ్మితే మంచి లాభాలు వస్తాయి. తాము తినడానికి పనికి వస్తాయి. పక్షుల మాంసం ఆహారంగా ఉపయోగిస్తుంది. చిలుక చక్కగా కబుర్లు చెపుతుంది. కాబట్టి పక్షులను పెంచాలి.

జంతువుల పెంపకం వల్ల చాల లాభాలు ఉన్నాయి. ఆవు, గేదె వంటి జంతువులు పాలను ఇస్తాయి. పాలు సంపూర్ణ ఆహారం. పాలనూ, పాల ఉత్తతులనూ అమ్మి లాభాలు తీస్తారు. వాటి పేడతో గ్యాస్ ఉత్పత్తి చేసుకోవచ్చు. ఎరువులు తయారు చేయవచ్చు. పందులు వంటి వాటిని పెంచి వాటిని అమ్మి లాభాలు గడించవచ్చు. మేకలు, గొట్టెలు వల్ల పాలే కాకుండా, దాని బొచ్చు వల్ల ఉపయోగాలు ఉన్నాయి. గొట్టె బొచ్చుతో కంబళ్ళు చేయవచ్చు. వాటి మాంసం తినవచ్చు. ఎద్దులు, దున్నలు వ్యవసాయానికి పనికివస్తాయి. వాటితో బళ్ళు కట్టి సరకులను రవాణా చేయవచ్చు. కుక్క కాపలా కాస్తుంది. ఈ విధంగా పక్షులు, జంతువుల పెంపకం వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 12 చిత్రగ్రీవం

ప్రశ్న 4.
కింది పాత్రల స్వభావాలను రాయండి.
జవాబు:
చిత్రగ్రీవం :
తెలివైనది. చురుకైనది. చిన్నతనంలో మందకొడి. తల్లిదండ్రుల అభిమానాన్ని, అనురాగాన్ని పూర్తిగా అనుభవించింది. తన చిలిపి చేష్టలతో రచయితను అలరించింది. తన అందంతో చూపరులను మైమరపింపజేస్తుంది. . తండ్రి పక్షి : గ్రుడ్డును పొదగాలనే ఆత్రుత ఎక్కువ. ఇది గిరికీల మొనగాడు. వేగం, చురుకుదనం, సాహసం కలది. రచయిత ముఖంపై కొట్టి ఒక గ్రుడ్డు చితికిపోవడానికి కారణమయ్యింది. తొందర ఎక్కువ. చిత్రగ్రీవానికి ఎగరడం నేర్పింది.

తల్లి పక్షి :
తెలివైన పావురం. గ్రుడ్డులోంచి పిల్ల బయటికి వచ్చే సమయాన్ని కచ్చితంగా అంచనా వేయగలదు. చిత్రగ్రీవాన్ని కంటికి రెప్పలా కాపాడింది. ఆహారం, భద్రత కల్పించింది. మేలుజాతి పావురాన్ని ప్రపంచానికి అందించిన ధన్యజీవి.

రచయిత :
పక్షి ప్రేమికుడు. పక్షుల పెంపకం అంటే చాలా ఇష్టం. వ్యక్తిగత శ్రద్ధతో పావురాలను పెంచుతాడు. జంతువులను కూడా పెంచుతాడు. ప్రతి చిన్న విషయాన్ని పరిశీలిస్తాడు. పక్షులకు చిన్న గాయమైనా తట్టుకోలేడు. గ్రుడ్డు పగిలిపోయినందుకు చాలా బాధపడ్డాడు. సున్నిత స్వభావి.

ప్రశ్న 5.
శిశువుల పెంపకంలో పక్షుల దగ్గర నుంచి మనుషులు నేర్చుకోవలసిన విషయాలు ఉన్నాయా? “చిత్రగ్రీవం” పాఠం ఆధారంగా చర్చించండి.
జవాబు:
శిశువుల పెంపకంలో పక్షుల దగ్గర నుంచి మనుషులు నేర్చుకోవలసిన విషయాలు ఉన్నాయి.

  1. చిత్రగ్రీవాన్ని తల్లి పక్షి, తండ్రి పక్షి కలిసి అనురాగంతో పెంచాయి. దీన్నిబట్టి తల్లిదండ్రులు తమ పిల్లలను అనురాగంతో పెంచాలనే విషయాన్ని వాటి నుండి నేర్చుకోవాలి.
  2. పక్షి తన పిల్లలకు గూటిలో సుఖ సౌకర్యంగా ఉండే ఏర్పాట్లు చేస్తుంది. అదే విధంగా మనుషులు తమ పిల్లలకు పక్క ఏర్పాట్లలో శ్రద్ధ వహించాలనే విషయాన్ని గ్రహించాలి.
  3. పక్షి పిల్లల నోటికి తల్లి పక్షి, తండ్రి పక్షి ఆహారాన్ని అందించి వాటి పెరుగుదలకు సహాయపడతాయి. మనుషులు కూడా తమ చంటిపిల్లల నోటికి ఆహారాన్ని అందించి వారి ఎదుగుదలకు పాటుపడాలి.
  4. చిత్రగ్రీవం తల్లిదండ్రులు చిత్రగ్రీవం దగ్గరనే ఉండి, దాన్ని లాలిస్తూ, దాని బాగోగులు చూస్తూ ఉండేవి. అలాగే మనుషులు కూడా పిల్లలను లాలిస్తూ వారి బాగోగులను గురించి పట్టించుకోవాలి.

10th Class Telugu 12th Lesson చిత్రగ్రీవం Important Questions and Answers

ప్రశ్న 1.
పక్షులను, జంతువులను సంరక్షించవలసిన అవసరం గురించి తెలియజేస్తూ మీ మిత్రునకు లేఖ వ్రాయండి.
జవాబు:

లేఖ

రాజమండ్రి,
x x x x x

ప్రియమైన మిత్రుడు శంకరు,
నీ మిత్రుడు శ్రీనివాస్ వ్రాయు లేఖ.

ఇక్కడంతా క్షేమం. అక్కడ మీరంతా క్షేమమని తలచెదను.

మా తెలుగు పాఠ్యపుస్తకంలో ‘చిత్రగ్రీవం’ పాఠం చదువుకొన్నాం. దానిని ధనగోపాల్ ముఖర్జీగారు రచించారు. దాసరి అమరేంద్రగారు తెలుగులోనికి అనువదించారు. ఆ పాఠం ఒక పావురం గురించి, నాకు చాలా బాగా నచ్చింది.

ఈ మధ్య రేడియేషన్ ప్రభావం వల్ల చాలా పక్షిజాతులు అంతరించిపోతున్నాయని మా సైన్సు మాష్టారు చెప్పారు. గ్లోబల్ వార్మింగ్ వలన కూడా చాలా రకాల జంతుజాతులు అంతరించి పోతున్నాయట. అడవులు విచక్షణా రహితంగా నరికేయడం వల్ల కూడా జంతువులకు రక్షణ పోయింది.

పక్షులు, జంతువులను సంరక్షించుకొంటేనే మన మనుగడకు మంచిది. మనకు గ్రుడ్లు, మాంసమే కాక మానసిక ఆనందాన్ని కల్గించే అందమైన పక్షులను, జంతువులను కోల్పోకూడదు. ఈ విషయంలో అందరినీ చైతన్యపరచాలి. మానవజాతికి విశ్వాస పాత్రంగా సేవలు చేసేవి పక్షులు, జంతువులే కద. మన ప్రగతికి మూలం అవే, మన వంతు ప్రయత్నం మనం చేద్దాం.

మీ అమ్మగారికి, నాన్నగారికి నా నమస్కారాలు.

ఇట్లు,
నీ చెలికాడు,
ఆర్. శ్రీనివాస్.

ప్రశ్న 2.
జంతు సంరక్షణ గురించి వ్యాసం రాయండి.
జవాబు:
జంతు సంరక్షణ

సైన్సు ప్రకారం మానవుడిని కూడా జంతువుగానే పరిగణిస్తారు. కాని, జంతువులకు లేని ‘మాట’ మనిషికి ఉంది. ఆలోచన మొదలైనవన్నీ జంతువులకూ, మానవులకూ సమానమే.

కాని, మన ఆలోచన, తెలివి తేటలు మొదలైన వాటి వలన జంతులోకానికి తీరని నష్టం కలుగుతోంది. ఆది మానవుడు జంతువులకు భయపడ్డాడు. పులులు, సింహాలు, ఏనుగులు మొదలైనవి ఆధునిక మానవుని చేతిలో అంతరించి పోతున్నాయి.

అడవి జంతువుల చర్మాలు, పులిగోళ్లు, ఏనుగు దంతాలు మొదలైనవి ఇతర దేశాలకు అమ్ముకొని సొమ్ము చేసుకొనేందుకు అడవి జంతువులను చంపుతున్నారు. వీరప్పన్ వంటి స్మగ్లర్ల వలన ఎన్నో ఏనుగులు, పులులు నశించిపోయాయి. అటువంటి వారి పట్ల ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరించాలి. అటువంటి విషయాలు ఎవరికి తెలిసినా వెంటనే పోలీసులకు, అటవీశాఖాధికారులకు తెలియజేయాలి.

పెంపుడు జంతువులను కబేళాలకు తరలించడం కూడా పెరిగిపోయింది. దీనిని కూడా అరికట్టాలి.

వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలను గ్రామగ్రామాన నెలకొల్పి జంతువులను కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వానిదే. ఈ విషయంలో ప్రజలంతా సహకరించాలి.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 12 చిత్రగ్రీవం

ప్రశ్న 3.
జంతువులను, పక్షులను కాపాడమని కోరుతూ ఒక కరపత్రం తయారుచెయ్యండి.
జవాబు:
జంతు పక్షి రక్షణ

సోదరులారా! భగవంతుడు 84 కోట్ల జీవరాశులను సృష్టి చేశాడట. భగవంతుడు సృష్టించిన జీవరాశులు అన్నీ ఉపయోగకరమైనవే. అందులో ముఖ్యంగా జంతువులను మనం రక్షించుకోవాలి. సాధుజంతువులయిన ఆవు, మేక, గేదె, గొట్టె వంటి వాటినే కాదు. అడవి జంతువులయిన సింహం, పులి, మొదలయిన వాటిని కూడా మనం రక్షించుకోవాలి.

వన్య జంతురక్షణను మనం ఉద్యమంగా చేపట్టాలి. అడవులలోని పులి, సింహం వంటి వాటిని వేటాడి చంపడం వల్ల పాపం వస్తుంది. అంతేకాదు అడవులకు రక్షణ పోతుంది. దానితో అడవులు తగ్గి వర్షాలు రాకుండా పోతాయి. మనకు కావలసిన కలప వగైరా రాకుండా పోతాయి.

ముఖ్యంగా మనం చల్లే క్రిమి సంహారక మందుల వల్ల ఎన్నో పక్షులు చచ్చిపోతున్నాయి. మొక్కలకు పట్టే చీడపురుగుల్ని ఎన్నింటినో పక్షులు తిని మొక్కలను కాపాడతాయి. దానివల్ల చీడపీడలు రాకుండా పోతాయి. సీతాకోకచిలుకల వల్లనే మొక్కల్లో పరపరాగ సంపర్కం జరిగి, అవి కాయలు కాస్తున్నాయి. పక్షులు మానవజాతికి స్నేహితులు, వాటిని రక్షించుకుందాం.

ఆవులు, గేదెలు వంటి వాటిని రక్షించుకుంటే, మంచి పాలు ఉత్పత్తి అవుతాయి. మంచి పాలు వల్ల మనకు ఆరోగ్యం వస్తుంది. కాబట్టి ఆవులు, గేదెలు, మొ|| వాటిని మాంసం కోసం చంపకండి. పాడి పశువులను పెంచుకుంటే రైతులకు మంచి లాభాలు వస్తాయి. సేంద్రియ ఎరువులు లభిస్తాయి. రండి. కదలండి. ఉద్యమించండి. జంతు పక్షి రక్షణకు నడుం బిగించండి.

ఇట్లు,
పశుపక్షి రక్షణ సంస్థ,
కర్నూలు.

ప్రశ్న 4.
చిత్రగ్రీవం, తల్లిదండ్రుల సంభాషణను ఊహించి రాయండి.
జవాబు:
(పాత్రలు : 1. చిత్రగ్రీవం 2. తల్లిపక్షి 3. తండ్రిపక్షి)
తండ్రిపక్షి : చూశావా భార్యామణీ! మన చిత్రగ్రీవం ఎంత అందంగా ఉందో!

తల్లిపక్షి : మన చిత్రగ్రీవం అంత అందాలరాశి, ఈ కలకత్తాలోనే లేదు.

తండ్రిపక్షి : బాగుంది. కానీ మన చిత్రగ్రీవానికి ఎగరడం ఇంకా రాలేదు. దీనికి బద్దకం ఎక్కువ.

తల్లిపక్షి : నేనూ అదే అనుకుంటున్నా. నేర్చుకుంటుంది లెండి.

తండ్రిపక్షి : ఏమిరా చిత్రగీవా! నీకు మూడునెలలు నిండాయి. బడుద్దాయిలా ఉన్నావు. ఎగిరే ప్రయత్నం ఏమీ చెయ్యవా ?

చిత్రగ్రీవం : ప్రయత్నం చేస్తా నాన్నా!

తండ్రిపక్షి : చిత్రగ్రీవా! నీవు అసలు పావురానివా? వానపామువా? (చిత్రగ్రీవాన్ని తండ్రి పక్షి, గోడపై నుండి క్రిందికి త్రోసింది)

తల్లిపక్షి : ఏమిటి? చిత్రగ్రీవాన్ని అలా తోస్తున్నారు?

తండ్రిపక్షి : ఇలా చేస్తేగాని వీడికి ఎగరడం రాదు.

తల్లిపక్షి : చాల్లెండి. వాడికి దెబ్బ తగులుతుంది. నేనే వాడిని పట్టుకుంటాను. చూడండి.

చిత్రగ్రీవం : అమ్మా! నువ్వు నన్ను బాగానే పట్టుకొన్నావు. లేకపోతే పడిపోదును.

తల్లిపక్షి : నాయనా! ఆయాసం వచ్చిందా? ఫర్వాలేదులే నా దగ్గరగా రా!

చిత్రగ్రీవం : అమ్మయ్యా! కొద్దిగా ఎగరడం వచ్చింది.

తండ్రిపక్షి : అంతే! నీవూ ఎగురగలవు. సరేనా ? ధైర్యం వచ్చింది కదూ!

తల్లిపక్షి : ఇంక ఎప్పుడూ ఇలా చేయకండి. చిత్రగ్రీవం చిన్నపిల్లాడు.

తండ్రిపక్షి : నేర్పితే గాని ఏ విద్యా రాదు. మన చిత్రగ్రీవానికి కొంచెం బద్దకం ఎక్కువ కదా! అందుకే అలాచేశా.

చిత్రగ్రీవం : చూడు నాన్నా! రేపటి నుండి నేను కూడా ఎగిరి గింజలు తెచ్చుకొని తింటా.

తల్లిపక్షి, తండ్రిపక్షి : సెభాష్! చిత్రగ్రీవా! హాయిగా ఎగురు. నీకు ఏమీ కాదు. మేముంటాం.

10th Class Telugu 12th Lesson చిత్రగ్రీవం 1 Mark Bits

1. “శ్రీమంత్ చొక్కా మల్లెపూవులా తెల్లగా ఉంది” – ఇందులోని అలంకారం (March 2017)
A) రూపకం
B) ఉపమ
C) ఉత్ప్రేక్ష
D) యమకం
జవాబు:
B) ఉపమ

2. చిత్రగ్రీవం చిన్నతనంలో చురుకుగా ఉండేది కాదు – గీత గీసిన పదానికి వ్యుత్పత్యర్థం గుర్తించండి. (June 2018)
A) చిత్రమైన వర్ణాలతో కూడిన కంఠం గలది.
B) చిత్రమైన ముక్కు గలది.
C) చిత్రమైన శరీరం గలది.
D) చిత్రమైన చూపులు గలది.
జవాబు:
A) చిత్రమైన వర్ణాలతో కూడిన కంఠం గలది.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 12 చిత్రగ్రీవం

3. “అంధకారమనే అజ్ఞానమును పోగొట్టువాడు” – అనే వ్యుత్పత్త్యర్థం గల పదాన్ని గుర్తించండి. (June 2018)
A) మిత్రుడు
B) ఈశ్వరుడు
C) గురువు
D) పుత్రుడు
జవాబు:
C) గురువు

4. “భ, జ, స, నల, గగ” అనే గణాలతో కూడిన పద్యం పేరును గుర్తించండి. (June 2018)
A) సీసము
B) కందము
C) మత్తేభము
D) శార్దూలము
జవాబు:
B) కందము

5. “నాకు ఎగరడం తెలుసును” అని చిత్రగ్రీవం అన్నది – దీనికి పరోక్ష కథనం గుర్తించండి. (March 2018)
A) ‘నాకు తెలుసును ఎగరడం’ అని చిత్రగ్రీవం అన్నది.
B) ‘నాకు తెలియదు ఎగరడం’ అని చిత్రగ్రీవం అన్నది.
C) తనకు ఎగరడం తెలుసునని చిత్రగ్రీవం అన్నది.
D) తనకు ఎగరడం తెలుసునని చిత్రగ్రీవం అనలేదు.
జవాబు:
C) తనకు ఎగరడం తెలుసునని చిత్రగ్రీవం అన్నది.

చదవండి – తెలుసుకోండి

విశ్వకవి “గీతాంజలి”

సాహిత్య సృజనలో అంతర్జాతీయ కీర్తినందుకొన్న మహాకవి రవీంద్రనాథ్ ఠాగూర్. కవిగా, రచయితగా, తత్త్వవేత్తగా, సంగీతజ్ఞుడిగా, చిత్రకారుడిగా బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించారు. వీరి పేరు వినగానే చప్పున స్ఫురించేవి “జనగణమన” గీతం, “గీతాంజలి”. “జనగణమన” గీతం భారత జాతీయ గీతంగా గుర్తింపబడింది. బంగ్లాదేశ్ జాతీయ గీతం కూడా వీరి లేఖిని నుండి వెలువడినదే. ఇలా రెండు జాతీయ గీతాలనందించిన కవిగా అపూర్వ చరిత్రను సృష్టించారు. “శాంతినికేతన్” పేరున ఆదర్శ విద్యాలయాన్ని స్థాపించి “గురుదేవుడు”గా కీర్తింపబడ్డారు. ఈ సంస్థ ద్వారా సంస్కారయుక్తమైన విద్యనందించారు.

కవిగా వీరికి ప్రపంచవ్యాప్త గుర్తింపును తెచ్చిన రచన “గీతాంజలి” 1913లో దీనికి “నోబెల్ సాహిత్య పురస్కారం” దక్కింది. నోబెల్ బహుమతిని అందుకున్న తొలి భారతీయుడిగా ఠాగూర్ అరుదైన గౌరవాన్ని పొందారు. “గీతాంజలి” భారతీయ భాషల్లోకి మాత్రమేకాక విదేశీయ భాషలెన్నింటిలోకి అనువాదమయింది. ఒక్క తెలుగు భాషలోనే దాదాపు 50 దాకా అనువాదాలొచ్చాయంటే దీని గొప్పదనమేమిటో ఊహించవచ్చు. తాత్త్విక, సామాజిక అంశాలను స్పృశిస్తూ సాగిన ఈ రచన పాఠకుని హృదయాన్ని కదిలిస్తుంది.

“గీతాంజలి” లోని రెండు అనువాద కవితా ఖండికలను ఇప్పుడు చూద్దాం.

1. ఎక్కడ మనసు నిర్భయంగా ఉంటుందో
ఎక్కడ మనుషులు తలెత్తి తిరుగుతారో
ఎక్కడ జ్ఞానం విరివిగా వెలుస్తుందో
సంసారపు గోడలమధ్య ఎక్కడ భాగాల కింద ప్రపంచం విడిపోలేదో
ఎక్కడ సత్యాంతరాళంలోంచి పలుకులు బైలు వెడలతాయో
ఎక్కడ అలసటనెరగని శ్రమ తన బాహువుల్ని పరిపూర్ణతవైపు జాస్తుందో
ఎక్కడ నిర్జీవమైన ఆచారపుటెడారిలో స్వచ్ఛమైన బుద్ధి ప్రవాహం ఇంకిపోకుండా ఉంటుందో
ఎక్కడ మనసు నిరంతరం వికసించే భావాలలోకీ, కార్యాలలోకీ నీచే నడపబడుతుందో
ఆ స్వేచ్ఛా స్వర్గానికి, తండ్రీ, నా దేశాన్ని మేల్కొలుపు. – చలం

2. నా హృదయంలోని పేదరికాన్ని సమూలంగా తొలగించు ప్రభూ – ఇదే నా ప్రార్థన.
నా సుఖదుఃఖాలను తేలికగా భరించగలిగే శక్తిని నాకు ప్రసాదించు.
సేవలోనే నా ప్రేమను ఫలింపజేసుకొనే శక్తిని అందజేయి.
పేదలను కాదనకుండా, అధికార దర్పానికి దాసోహమనకుండా ఉండే శక్తిని ప్రసాదించు.
దైనందిన అల్పవిషయాలకు అతీతంగా బుద్ధిని నిలుపుకోగల శక్తిని ప్రసాదించు.
నీ అభీష్టానికి ప్రేమతో నా శక్తిని అర్పించుకోగలిగే శక్తి నివ్వు. – డా॥ జె భాగ్యలక్ష్మి

AP Board 9th Class Telugu Solutions ఉపవాచకం Chapter 6 ధృవతారలు

AP State Syllabus AP Board 9th Class Telugu Textbook Solutions ఉపవాచకం Chapter 6 ధృవతారలు Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Telugu Solutions ఉపవాచకం 6th Lesson ధృవతారలు

9th Class Telugu ఉపవాచకం 6th Lesson ధృవతారలు Textbook Questions and Answers

కింది ప్రశ్నలకు పదిహేను వాక్యాలకు మించని సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
వైద్యరంగంలో డా॥ నోరి దత్తాత్రేయుడు గారు చేసిన కృషిని గురించి రాయండి.
జవాబు:
ప్రపంచస్థాయి వైద్యునిగా గుర్తింపు పొందిన డా|| నోరి దత్తాత్రేయుడు మన తెలుగువాడు కావడం మన అదృష్టం. సరైన వైద్యం లేకపోవడం వలనే తండ్రిని కోల్పోయామని తల్లి ద్వారా తెలుసుకొన్న నోరి ప్రభావితుడై వైద్యుడు అవ్వాలని చిన్నతనంలోనే నిర్ణయించుకున్నాడు.

ఉస్మానియా విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న రేడియం ఇనిస్టిట్యూట్ అండ్ కాన్సర్ హాస్పటల్ లో రెసిడెంట్ వైద్యునిగా సేవలందించారు. వ్యాధి సరైన సమయంలో గుర్తించలేకపోవడం, వైద్యం చాలా భారమైనదిగా ఉండడం, మందులు అందుబాటులో లేకపోవడం మొదలైన కారణాల వల్ల ఎందరో వ్యాధిగ్రస్తులు మరణం తప్ప మరొక శరణ్యం లేదని కుమిలిపోవడం ఆయనను ఎంతగానో కలచివేసింది. క్యాన్సర్ పై పరిశోధనలకు కంకణం కట్టుకున్నారు. 1977వ సం||లో కాన్సర్ పై పరిశోధన చేయడానికి అమెరికా వెళ్ళారు.

పరిశోధనల్లో ఎన్నో వైఫల్యాలు ఎదుర్కొన్నాడు. ఎక్కడా నిరాశ చెందలేదు. తాననుకున్నది సాధించే వరకు నిరంతరం కృషి చేస్తూ విజయాన్ని చేజిక్కించుకున్నాడు. ముఖ్యంగా మహిళలకు వచ్చే కాన్సర్ వ్యాధుల్ని నివారించటం కొరకు విశేషమైన కృషి చేసాడు. 1979 నుండి బ్రాకి థెరపి అనే వైద్య ప్రక్రియలో పరిశోధనలు జరిపి అత్యంత నైపుణ్యం గల వైద్యుడిగా అనేక వేల మంది కాన్సర్ రోగులకు నయం చేశారు. వైద్యవృత్తిలో అడుగుపెట్టి భయంకరమైన క్యాన్సర్ పై పరిశోధనలు చేస్తూ వ్యాధిగ్రస్తుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న ప్రపంచ ప్రసిద్ధ రేడియో అంకాలజిస్ట్ డా|| నోరి దత్తాత్రేయుడు గారు “వైద్యోనారాయణా హరిః” అన్న మాటకు నిలువుటద్దం. నిజమైన ధృవతార.

ప్రశ్న 2.
డా|| నోరి దత్తాత్రేయుడు ఆంధ్రప్రదేశ్ లో వైద్య సేవలందించడానికి కారణాలు ఏమిటి?
జవాబు:
వైద్యవృత్తిలో కాలుమోపి భయంకరమైన క్యాన్సర్ పై పరిశోధనలు చేస్తూ వ్యాధిగ్రస్తుల జీవితాలలో వెలుగులు నింపిన నోరి దత్తాత్రేయుడు నిజమైన ధృవతార. చిన్నతనంలోనే వైద్యుడవ్వాలని నిర్ణయించుకొని అనతి కాలంలోనే మంచి విద్యార్థిగా పేరుపొందారు. ఉస్మానియా యూనివర్సిటీ నుండి ఎం.డి.లో ఉత్తీర్ణత పొందాడు. కాన్సర్ వ్యాధిగ్రస్తుల బాధలను చూసి చలించి 1977లో క్యాన్సర్ పై పరిశోధన చేయడానికి అమెరికా వెళ్ళారు. బ్రాక్ థెరపి వైద్య ప్రక్రియలో పరిశోధనలు చేసి వేలమంది క్యాన్సర్ రోగులకు నయం చేసాడు.

అమెరికాలోని మెమోరియల్ స్టోన్ కేటరింగ్ ఆసుపత్రిలో క్యాన్సర్ విభాగానికి అధిపతిగా పనిచేస్తున్నప్పుడు అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి యన్.టి. రామారావు గారి సతీమణి బసవతారకం గారికి క్యాన్సర్ వ్యాధికి చికిత్స చేశారు. ఆ సందర్భంలో యన్.టి. రామారావుగారు సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఆంధ్రప్రదేశ్ లో క్యాన్సర్ హాస్పిటల్ నిర్మించమని డా|| నోరికి ఒక విజ్ఞాపన చేశారు. అప్పుడు డా|| నోరి తనకూ సొంతగడ్డపై కాన్సర్ హాస్పిటల్ నిర్మించి సేవలందించాలనే తలంపు ఉన్నట్లు మనసులో మాట వెల్లడించారు. వెంటనే ముఖ్యమంత్రి ఏడెకరాల భూమిని క్యాన్సర్ హాస్పిటల్ నిర్మించడం కోసం కేటాయించారు. ఈ విధంగా యన్.టి.రామారావుగారి కోరిక మేరకు, తన నేలతల్లిపై గల మమకారం వల్ల డా|| నోరి దత్తాత్రేయుడు గారు ఆంధ్రప్రదేశ్ లో వైద్య సేవలు అందించేందుకు ముందుకు వచ్చారు.

AP Board 9th Class Telugu Solutions ఉపవాచకం Chapter 6 ధృవతారలు

ప్రశ్న 3.
సర్దేశాయి తిరుమలరావు జీవితం సైన్స్ కూ, సాహిత్యానికీ మధ్య గల సంబంధాన్ని ఎలా తెలియజేస్తుందో రాయండి.
జవాబు:
సైను, సాహిత్యాన్ని సమపాళ్ళలో రంగరించి జీవితాన్ని సుసంపన్నం చేసుకున్న అసలు సిసలు తెలుగు శాస్త్రవేత్త, భాషావేత్త సర్దేశాయి తిరుమలరావుగారు. సైన్స్ కూ, సాహిత్యానికి అగాథం పూడ్చాలని ఆయన పదేపదే చెప్పేవారు. ఆయన తన రచనలలో సైనూ, సాహిత్యానికి ఉండే తేడాను, అనుబంధాన్ని బాగా విశ్లేషించేవారు. ఇవి రెండూ కూడా సమాజ హితాన్ని కోరేవిగా ఉండాలని ఆయన భావించేవారు.

మనిషిని స్వావలంబునిగా, సమాజ శ్రేయస్సు కోరి పనిచేసే వ్యక్తిగా ప్రేరేపించగలిగే ఉదాత్త భావమే కవిత్వమని ఆయన ఉద్దేశ్యం. ఆసక్తులను శక్తులుగా మార్చగలిగేదే కవిత్వం అని ఆయన చెప్పేవారు. కవిత్వం ఒక స్ప్రింగ్ బోర్డు వంటిది. దానిమీద నిలబడి మనిషి ప్రగతి పథానికి ఎగురగల్గి ఉండాలి అని ఆయన చెప్పేవారు.

కవిత్వాన్ని రసాయన ప్రక్రియ లాగా ఎలా విశ్లేషించారో చూడండి – “పెద్దబండలో అనవసరమైన రాతి పదార్థాన్ని చెక్కి పారవేసి శిల్పి చక్కని విగ్రహాన్ని తయారుచేస్తాడు. రసాయన శాస్త్రవేత్త వంటి కవి వస్తు భావాలకు ప్రతిభా పాండిత్యాలని, రసాయన ప్రేరకాలని చేర్చి, మేధస్సు’ అనే క్రియా కలశంలో చర్య జరిపి, ఫలితాలను విచక్షణ అనే జల్లెడలో వడబోసి, వచ్చిన కవితా సారాన్ని మనకు అందిస్తాడు” అని చెప్పేవారు. ఋషితుల్యుడైన ఆయన ఆలోచనలు ఏక కాలంలో సంక్లిష్టములు, సరళములు.

9th Class Telugu ఉపవాచకం 6th Lesson ధృవతారలు Important Questions and Answers

I. అవగాహన – ప్రతిస్పందన

ఈ క్రింది వాక్యాలను సంఘటనలు ఆధారంగా వరుసక్రమంలో అమర్చి రాయండి.

ప్రశ్న 1.
అ) తైల సాంకేతిక పరిశోధనా సంస్థలో రీసర్చి కెమిస్టుగా చేరి, వివిధ హోదాల్లో పనిచేసి ఆ సంస్థ డైరెక్టరుగా 1989లో పదవీ విరమణ చేశారు.
ఆ) అనంతపురం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో బి.ఎస్సీ . చేశారు.
ఇ) డా|| సర్దేశాయి తిరుమలరావు 1928లో కర్నూలు జిల్లా జోరాపురంలో జన్మించారు.
ఈ) రాజస్థాన్ లోని బిట్స్ పిలానిలో ఎం.ఎస్సీ. రసాయన శాస్త్రం చదివారు.
జవాబు:
ఇ) డా|| సర్దేశాయి తిరుమలరావు 1928లో కర్నూలు జిల్లా జోరాపురంలో జన్మించారు.
ఆ) అనంతపురం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో బి. ఎస్సీ, చేశారు.
ఈ) రాజస్థాన్ లోని బిట్స్ పిలానిలో ఎం. ఎస్సీ, రసాయన శాస్త్రం చదివారు.
అ) తైల సాంకేతిక పరిశోధనా సంస్థలో రీసర్చి కెమిస్టుగా చేరి, వివిధ హోదాల్లో పనిచేసి ఆ సంస్థ డైరెక్టరుగా 1989లో పదవీ విరమణ చేశారు.

ప్రశ్న 2.
అ) పిలానీలో చదివేటప్పుడు గాంధీజీకి నిరాహార దీక్ష సరిపోయినపుడు, పొట్టి శ్రీరాములుకు ఎందుకు సరిపోదని హిందూస్థాన్ టైమ్సుకు లేఖ రాశారు.
ఆ) సర్దేశాయి తిరుమల రావుగారు 1928 నవంబరు 28న ఛత్రపతి శివాజీ పుట్టిన రోజునాడు జన్మించారు.
ఇ) అనంతపురంలో ఒక సంవత్సరం ఉపాధ్యాయుడుగా పనిచేశారు.
ఈ) అనంతపురం ఓ.టీ.ఆర్.ఐ (తైల సాంకేతిక పరిశోధనా సంస్థ)లో చేరి, ఆ సంస్థ డైరెక్టరుగా పదవీ విరమణ చేశారు.
జవాబు:
ఆ) సర్దేశాయి తిరుమల రావుగారు 1928 నవంబరు 28న ఛత్రపతి శివాజీ పుట్టిన రోజునాడు జన్మించారు.
అ) పిలానీలో చదివేటప్పుడు గాంధీజీకి నిరాహార దీక్ష సరిపోయినపుడు, పొట్టి శ్రీరాములుకు ఎందుకు సరిపోదని హిందూస్థాన్ టైమ్సుకు లేఖ రాశారు.
ఇ) అనంతపురంలో ఒక సంవత్సరం ఉపాధ్యాయుడుగా పనిచేశారు.
ఈ) అనంతపురం ఓ.టీ.ఆర్.ఐ (తైల సాంకేతిక పరిశోధనా సంస్థ)లో చేరి, ఆ సంస్థ డైరెక్టరుగా పదవీ విరమణ చేశారు.

AP Board 9th Class Telugu Solutions ఉపవాచకం Chapter 6 ధృవతారలు

ప్రశ్న 3.
అ) సర్దేశాయి తిరుమల రావుగారు 1994 మే 10వ తేదీన గతించారు.
ఆ) ఆదోని, అనంతపురంలలో తిరుమలరావుగారి హైస్కూలు చదువు సాగింది.
ఇ) 1991లో జే.జే కాణీ పురస్కారం అందుకున్నారు.
ఈ) అనంతపురంలోని తైల పరిశోధనా సంస్థ డైరెక్టరుగా పదవీ విరమణ చేశారు.
జవాబు:
ఆ) ఆదోని, అనంతపురంలలో తిరుమలరావుగారి హైస్కూలు చదువు సాగింది.
ఈ) అనంతపురంలోని తైల పరిశోధనా సంస్థ డైరెక్టరుగా పదవీ విరమణ చేశారు.
ఇ) 1991లో జే.జే కాణ్ పురస్కారం అందుకున్నారు.
అ) సర్దేశాయి తిరుమల రావుగారు 1994 మే 10వ తేదీన గతించారు.

ప్రశ్న 4.
అ) 1977వ సంవత్సరంలో క్యాన్సర్ పై పరిశోధన చేయడానికి అమెరికాకు వెళ్లారు.
ఆ) భారత ప్రభుత్వం 2015వ సంవత్సరంలో ‘పద్మశ్రీ’ బిరుదుతో సత్కరించింది.
ఇ) కృష్ణాజిల్లా ‘మంటాడ’ గ్రామంలో నోరి సత్యనారాయణ, కనకదుర్గ దంపతులకు దత్తాత్రేయుడు జన్మించాడు.
ఈ) కర్నూలు వైద్యకళాశాలలో ఎమ్.బి.బి.యస్ లో చేరారు.
జవాబు:
ఇ) కృష్ణాజిల్లా ‘మంటాడ’ గ్రామంలో నోరి సత్యనారాయణ, కనకదుర్గ దంపతులకు దత్తాత్రేయుడు జన్మించాడు.
ఈ) కర్నూలు వైద్యకళాశాలలో ఎమ్. బి. బి.యస్ లో చేరారు.
అ) 1977వ సంవత్సరంలో క్యాన్సర్ పై పరిశోధన చేయడానికి అమెరికాకు వెళ్లారు.
ఆ) భారత ప్రభుత్వం 2015వ సంవత్సరంలో ‘పద్మశ్రీ’ బిరుదుతో సత్కరించింది.

II. వ్యక్తీకరణ – సృజనాత్మకత

క్రింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
డా॥ నోరి చిన్నతనంలోనే వైద్యుడవ్వాలని ఎందుకు నిర్ణయించుకొన్నారు?
జవాబు:
కృష్ణాజిల్లా ‘మంటాడ’ గ్రామంలో నోరి సత్యనారాయణ, కనకదుర్గ దంపతుల పదవ సంతానం దత్తాత్రేయుడు. ఈయన ఐదవ యేటనే తండ్రి మరణించాడు. సరైన వైద్య సదుపాయం లేకపోవడం వలన, వైద్యం ఖరీదైనది కావడం వల్లనే తండ్రి మరణించాడని ఇలాగ ఎందరో జీవితాలను కోల్పోతున్నారని తల్లి తరచుగా చెబుతుండేది. ఈ మాటలు దత్తాత్రేయ మీద ఎంతగానో ప్రభావితం చూపాయి. అందుచేత చిన్నతనంలోనే వైద్యుడవ్వాలని నిర్ణయించుకున్నారు.

ప్రశ్న 2.
డా॥ నోరి విద్యాభ్యాసం గూర్చి రాయండి.
జవాబు:
1947 అక్టోబరు 21న కృష్ణాజిల్లా ‘మంటాడ’ గ్రామంలో దత్తాత్రేయుడు జన్మించారు. చిన్నతనంలోనే తండ్రి మరణించడంతో ‘ తల్లి పెంపకంలో పెరిగాడు. బందరులోని ప్రభుత్వ పాఠశాలలో ప్రాథమిక, ప్రాథమికోన్నత విద్యను పూర్తి చేశాడు. తర్వాత పి.యు.సి., బి.యస్సీ డిగ్రీని బందరు జాతీయ కళాశాలలో చదివి ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణత సాధించారు. వీరి పెద్దమ్మ జొన్నలగడ్డ సుందరమ్మ అతడి చదువుకు కావలసిన సహాయసహకారాలందించింది. కర్నూలు వైద్యకళాశాలలో యం.బి.బి.యస్ చదివి ప్రథముడిగా (1971లో) ఉత్తీర్ణులయ్యారు. ఉస్మానియా యూనివర్సిటీ నుండి యమ్.డి.లో ఉత్తీర్ణత సాధించారు.

AP Board 9th Class Telugu Solutions ఉపవాచకం Chapter 6 ధృవతారలు

ప్రశ్న 3.
డా॥ నోరి అందుకున్న అవార్డులు, పొందిన గౌరవాలు తెల్పండి.
జవాబు:
విద్యార్థి దశలో ప్రతి తరగతిలోనూ ప్రథముడిగా నిలిచి ఉపకార వేతనాలు, బహుమతులు అందుకున్న డా|| నోరి వైద్యునిగా చేస్తున్న విశేషమైన సేవలకు గుర్తింపుగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అనేక పురస్కారాలు పొందారు. 1984లో అమెరికన్ క్యాన్సర్ సొసైటీవారు క్లినికల్ ఫెలోషిప్ ఫ్యాక్టరీ అవార్డు ఇచ్చారు. 1990లో అమెరికన్ కాలేజీ ఆఫ్ రేడియేషన్ ఫెలోషిప్ కు ఎంపికయ్యారు. 1994లో అలుమిని సొసైటీ, మెమోరియల్ ప్లాన్, కేటరింగ్ క్యాన్సర్ సెంటర్ డిస్టింగ్విఫ్ట్ అలుమినస్ అవార్డు అందుకున్నారు. 1995లో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ గోల్డ్ మెడల్ అందుకున్నారు. 2003లో అమెరికన్ కాలేజీ ఆఫ్ రేడియేషన్ అంకాలజీ ఫెలోషిప్ అందుకున్నాడు. అమెరికన్ క్యాన్సర్ సొసైటీ “ట్రిబ్యూట్ టు లైఫ్” గౌరవాన్ని బహుకరించింది. భారత ప్రభుత్వం 2015 సం||లో డా|| నోరిని “పద్మశ్రీ ” బిరుదుతో సత్కరించింది.

ప్రశ్న 4.
డా॥ నోరి ప్రస్తుతం నిర్వర్తిస్తున్న పదవులేవి?
జవాబు:
తల్లి మాటలతో ప్రభావితుడై వైద్యవృత్తిని ఎంచుకొని, దానిలో తనకంటూ ఒక స్థానం పొందారు డా|| నోరి దత్తాత్రేయుడు. ఆయన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వైద్య సలహామండలి సభ్యులుగా కొనసాగుతున్నారు. హైదరాబాద్ లోని “బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్” నిర్వహణ బాధ్యతల్ని చేపట్టి వైద్య సేవలందిస్తున్నారు. క్యాన్సర్ వ్యాధి గురించి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే కార్యక్రమాలూ నిర్వహిస్తున్నారు.

సైనూ సాహిత్యానికి వారధి సర్దేశాయి తిరుమలరావు

ప్రశ్న 1.
……… నేను ఇప్పటికీ స్వచ్చమైన పరిశోధకుడినే !” అని సర్దేశాయి గారి మాటల్లో ఉద్దేశ్యం ఏమిటి?
జవాబు:
1991 సెప్టెంబరులో జే.జే. కాణ్ పురస్కారం అందుకున్న సందర్భంలో చేసిన స్మారక ప్రసంగంలో అన్న మాటలివి. నేను ఇప్పటికీ స్వచ్ఛమైన పరిశోధకుడినే ! కలుషితం కాలేదు. పరిశోధన, పరిశోధకుడు అంటే గిరి గీసుకొని దానిలోనే తిరుగుతూ, వెతుకుతూ ఉండడం కాదు. సహజమైన ఆసక్తి, ఇష్టం చేసే ప్రతి పనీ ఒక పరిశోధనే. అలాంటివాడు పరిశోధకుడే అని వారి భావన అయి ఉండవచ్చు.

ప్రశ్న 2.
సర్దేశాయిగారి వ్యక్తిత్వం ఎటువంటిది?
జవాబు:
“ఎవరూ రాకపోయినా, ఒక్కడవే, ఒక్కడవే, పదవోయి” అనే ఠాగూర్ గీతం స్ఫూర్తితో చివరికంటా ఒంటరి పోరాటం చేసిన మహోన్నతుడు సర్దేశాయి. మొహమాటం, కపటం, ఆయనకు తెలియవు. ముక్కుసూటి మనిషి. అందువల్లనే ఆయన పరిశోధన తీక్షణంగా ఉంటుంది. విమర్శ తీవ్రంగా ఉంటుంది. ఎలాంటి మొహమాటాలు లేవు కనుకనే ఆయన మాట కటువుగా ఉంటుంది. సంగీతం అంటే మక్కువ. వారి వద్ద అపురూపమైన గ్రంథాలయం ఉంది. వ్యక్తిగా ఎందరికో స్ఫూర్తినిచ్చారు. సంస్థలో ఎంత చిన్నస్థానంలో పనిచేసే వ్యక్తినైనా ఉత్తేజితుని చేసేవారు. విద్యావేత్తలతో, వ్యవసాయదారులతో, పారిశ్రామిక వేత్తలతోను ఒకే విధమైన మాట తీరుతో మాట్లాడేవారు.

ప్రశ్న 3.
మామిడి టెంకలపై సర్దేశాయి పరిశోధనను గూర్చి రాయండి.
జవాబు:
ఒకసారి అనంతపురంలో రోడ్డు మీద నడచి వెళుతూ, తిని పడవేసిన మామిడి టెంకలు విపరీతంగా ఉండటం గమనించారు సర్దేశాయి. వీటిమీద ఆలోచన మొదలైంది. ప్రపంచంలో తొలిసారిగా వీటిమీద పరిశోధనలు చేసారు. గొప్ప ఫలితాలు సాధించారు. ఇపుడు మామిడిటెంక నుండి తీసిన పదార్థం నుండి తయారుచేసిన నూనెను పాశ్చాత్య దేశాల్లో మేలురకం చాక్ లెట్లలో వాడతారు. ఫలితంగా ఇపుడు మనకు విదేశీమారక ద్రవ్యం లభిస్తోంది. అదీ సర్దేశాయి పరిశోధనాంశాన్ని ఎంచుకునే విధానం.

AP Board 9th Class Telugu Solutions ఉపవాచకం Chapter 6 ధృవతారలు

ప్రశ్న 3.
సర్దేశాయి విద్యాభ్యాసం, ఉద్యోగం గూర్చి రాయండి.
జవాబు:
1928 నవంబరు 28 కర్నూలు జిల్లా, ఆలూరు తాలుకా, జోరాపురంలో జన్మించారు సర్దేశాయి తిరుమలరావు. వీరి మాతృభాష కన్నడం. అయినా సంస్కృతం, తెలుగు, ఇంగ్లీషు భాషలలో మంచి దిట్ట. అనంతపురంలో హైస్కూల్ చదువు, బి.ఎస్సీ. పూర్తి చేశారు. రాజస్థాన్ లోని బిట్స్ – పిలానిలో ఎం.ఎస్సీ. రసాయన శాస్త్రం చదివారు. తర్వాత అనంతపురంలో ఒక సంవత్సరం ఉపాధ్యాయుడుగా పనిచేశారు. 1954లో అనంతపురంలోని తైల సాంకేతిక పరిశోధనా సంస్థలో రీసెర్చి కెమిస్టుగా చేరి, వివిధ హోదాల్లో పనిచేశారు. 1989లో ఆ సంస్థ డైరెక్టరుగా పదవీ విరమణ చేశారు.

ప్రశ్న 5.
తిరుమలరావు పరిశోధనాంశాలు ఏవి?
జవాబు:
డా|| తిరుమలరావు గారి పరిశోధనాంశాలు పరిశీలిస్తే ‘కాదేది పరిశోధనకు అనర్హం’ అని వ్యాఖ్యానించాలనిపిస్తుంది. బియ్యపు పొట్టు, కొబ్బరి, పట్టు పురుగు గుడ్డు, వాడిన కాఫీ పొడి, పత్తి విత్తనాలు, ఆముదాలు, వేరుశనగ గింజలు, పొగాకు విత్తనాలు, వేపగింజలు, మిరప విత్తనాలు, సీతాఫలం గింజలు, సూర్యకాంతి విత్తనాలు, జీడిమామిడి, మిల్క్ డైరీ అవక్షేపం, అరటితొక్కలు, నారింజ తొక్కలు, టమోట విత్తనాలు, దవనం, పుదీనా, మరువం, రోసాగడ్డి – ఇలా ఆయన దృష్టి పడని అంశం లేదు అనిపిస్తుంది. ఇంకా నువ్వులు, మొక్కజొన్నలు, కుసుములు, ఇప్పపువ్వు ఇలా ఎన్నింటి నుండో నూనె తీయవచ్చునని పరిశోధించారు.

ప్రశ్న 6.
డా|| తిరుమలరావు గారిలోని సాహిత్య కోణాన్ని గమనించండి.
జవాబు:
కావ్యాలలో ‘శివభారతం’, నాటకాలలో ‘కన్యాశుల్కం’, ‘నవలల్లో’, ‘మాలపల్లి’ చాలా గొప్పవని డా|| తిరుమలరావు తరచు చెప్పేవారు. ‘సాహిత్య తత్వం – శివభారత – దర్శనం’, ‘కన్యాశుల్కం – నాటక కళ’ అనే పేరుతో విమర్శనాత్మక గ్రంథాలు రాసారు. మేఘసందేశంలోని మేఘుని మార్గము, భౌగోళిక వాతావరణ విశేషాలు, అలెగ్జాండర్ పోపు – వేమన, ప్రపంచాన్ని మార్చిన శాస్త్రీయ సంఘటనలు మొదలైన గ్రంథాలు రచించారు. అలాగే సాహిత్య విమర్శలు, పరిశోధనా పత్రాలు అనేకం వీరి అమృత లేఖిని నుండి జాలువారాయి.

AP Board 9th Class Telugu Solutions Chapter 2 స్వభాష

AP State Syllabus AP Board 9th Class Telugu Textbook Solutions Chapter 2 స్వభాష Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Telugu Solutions 2nd Lesson స్వభాష

9th Class Telugu 2nd Lesson స్వభాష Textbook Questions and Answers

ఆలోచించండి-చెప్పండి

ప్రశ్నలు జవాబులు

AP Board 9th Class Telugu Solutions Chapter 2 స్వభాష 1
ప్రశ్న 1.
జంఘాలశాస్త్రి దేన్ని గురించి ఉపన్యసించి ఉంటాడని మీరనుకుంటున్నారు?
జవాబు:
తెలుగుభాష గొప్పతనాన్ని గురించి ఉపన్యసించి ఉంటాడని అనుకుంటున్నాను.

ప్రశ్న 2.
ఎదుటి వ్యక్తి ప్రశంసిస్తున్నా, జంఘాలశాస్త్రి నిర్ఘాంతపోవడానికి కారణమేమై ఉంటుంది?
జవాబు:
తన ఉపన్యాస సారాంశాన్ని ఏ మాత్రం గ్రహించకుండా తనని ఆంగ్ల భాషలో పొగిడినందుకు.

ప్రశ్న 3.
జంఘాలశాస్త్రి అంటే ఎవరో మీకు తెలుసా?
జవాబు:
పానుగంటి లక్ష్మీనరసింహారావు గారు రచించిన ‘సాక్షి వ్యాస సంకలనం’ లోని ఒక పాత్ర.

ఇవి చేయండి

I. అవగాహన – ప్రతిస్పందన
అ) కింది వాటి గురించి సొంతమాటల్లో చెప్పండి.

ప్రశ్న 1.
మాతృభాషలోనే మాట్లాడితే కలిగే ప్రయోజనాలేమిటి?
జవాబు:
మాతృభాషలోనే మాట్లాడటం వలన అనేక ప్రయోజనాలున్నాయి. మాతృభాషలో మన భావాలను సూటిగా, స్పష్టంగా చెప్పగలము. పరభాషలను ఎంతోకాలంగా అభ్యసించినప్పటికి అటువంటి సౌలభ్యాన్ని పొందలేము. పరభాషలలో ఉపన్యసించగల శక్తి గలవారైనా, గ్రంథాలను రచించగల సమర్థులైనా, ఆయా భాషలు మాతృభాషలుగా గలవారి ముందు దిగదుడుపే గదా ! ఆంగ్ల సాహిత్యంలో సుప్రసిద్ధుడైన ‘మిల్టన్’ మహాశయుడు లాటిన్ భాషలో పద్యాలను రాశాడు. లాటిన్ భాష మాతృభాషగాగల కవులలో తక్కువ స్థాయిగల కవులు రాసిన పద్యాలకంటే ‘మిల్టన్’ మహాకవి పద్యాలు తక్కువ స్థాయికి చెందినవని పరిశోధకులు చెబుతుంటే ఇక సామాన్యుల సంగతి చెప్పేదేముంది ?

పరభాషాపదాలకర్థం తెలుసుకున్నంతమాత్రాన అందు పండితులమయ్యామనుకోకూడదు. ఆయా భాషలలోని జీవాన్ని, తత్త్వాన్ని, కళను కనిపెట్టగలగాలి. అది ఆయా భాషలు మాతృభాషలుగా గలవారికే సాధ్యము. ఇతరులకది ఎన్ని సంవత్సరాలు అభ్యసించినా అసాధ్యమే. మాతృభాషలోనే మాట్లాడటం వలన ఆ భాషలోని జాతీయాలు, నుడికారాలు, పలుకుబళ్ళు, సామెతలు, జీవాన్ని పొంది భాషకు జీవాన్ని, బలాన్ని కలిగిస్తాయి. మనోభావాలను ఆవిష్కరించడానికి భాషకై వెదుక్కోవాల్సిన పని ఉండదు. ఎదుటివారికి కూడా మనం చెప్పదలచిన విషయాన్ని సందేహరహితంగా, నిర్దోషంగా సవివరంగా చెప్పగలము. ఈ సౌలభ్యం ఒక్క మాతృభాషవల్లే సాధ్యం.

AP Board 9th Class Telugu Solutions Chapter 2 స్వభాష

ప్రశ్న 2.
ఈ కింది అంశం గురించి విభేదిస్తూ లేదా సమర్థిస్తూ మాట్లాడండి. “మాతృభాషలో విద్య”
జవాబు:
“మాతృభాషలో విద్య” విభేదించడం లేక ఖండన :

నేటి సమాజం శరవేగంతో ప్రయాణిస్తోంది. ప్రపంచం మొత్తం “గ్లోబలైజేషన్” పుణ్యమా అని కుగ్రామమైపోయింది. ఇటువంటి పరిస్థితులలో విద్యార్థులు ఎన్ని ఎక్కువ భాషలు అధ్యయనం చేస్తే అంత త్వరగా పోటీ ప్రపంచంలోకి దూసుకుపోవచ్చు. చిన్నప్పటినుండే ఆంగ్లభాషా మాధ్యమంలో విద్యార్థులు విద్యను అభ్యసించినట్లైతే ఉన్నత విద్యలకు వెళ్లేటప్పటికి ఆ భాషపై పట్టు, సాధికారతను సాధించవచ్చు. నేటి ఆధునిక సౌకర్యాలన్నింటిని ఉపయోగించుకోవాలంటే ఆంగ్ల భాషే శరణ్యం. ఉదాహరణకు కంప్యూటర్ ప్రవేశించని రంగమంటూ నేడు లేదు. దాన్ని సమర్థతతో నిర్వహించాలంటే ఆంగ్ల భాషాజ్ఞానమెంతో ఆవశ్యకం.

కాదు, కూడదని మాతృభాషలో విద్యనభ్యసిస్తే దాని ప్రభావం నుండి బయటపడటానికి చాలాకాలం పడుతుంది. ఆంగ్లం మొదలైన భాషలను అభ్యసించేటప్పుడు ఇది ఇబ్బందికరమవుతుంది. వేరే భాషలలో మాట్లాడాల్సివచ్చినప్పుడు మనస్సులో మాతృభాషలో ఆలోచించుకొని దాన్ని ఆయా భాషలలోనికి అనువదించినప్పుడు ఆ సంభాషణ చాలా కృతకం గాను, అసహజంగాను, హాస్యాస్పదంగాను తయారవుతుంది. ఇదే ఆయా భాషలలోనే ఆలోచించినట్లైతే సంభాషణ నిర్దోషంగాను, సహజ సుందరంగాను, ఆకర్షణీయంగాను ఉంటుంది. ఇది సాధించాలంటే చిన్నప్పటి నుండి ఆయా భాషలను శ్రద్ధతో అభ్యసించాల్సి ఉంటుంది. దీనిని గుర్తించే మన ప్రభుత్వం ప్రాథమిక విద్య నుంచే ఆంగ్ల మాధ్యమాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి మండల ప్రాథమిక పాఠశాలలలో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టింది. దీనివలన ప్రైవేటు పాఠశాలలలో ఖర్చుల కోర్చి చదవలేని పేద విద్యార్థులు సైతం లబ్ధి పొందవచ్చు.

శాస్త్ర సంబంధిత సాంకేతిక పదాలను, అంశాలను, మాతృభాషలోనికి అనువదించుట సాధ్యం కాదు. ఒక్కోసారి అలా అనువదించడం వలన విపరీతార్థాలు ఏర్పడే ప్రమాదం కూడా లేకపోలేదు. కాబట్టి మూలభాషలో తగినంత పరిజ్ఞానాన్ని సంపాదించడం ద్వారా ఆయాశాస్త్రాలను చక్కగా అధ్యయనం చేయవచ్చు. తద్వారా ప్రపంచవ్యాప్త గుర్తింపును పొందవచ్చు. ఇవన్నీ సాధించబడాలంటే “మాతృభాషలో విద్య” బోధించబడకూడదు.

సమర్దన:
మాతృభాషలో విద్యాబోధన ద్వారా అనేక లాభాలున్నాయి. చిన్న వయస్సులో విద్యార్థుల బుద్ధివికాసం తక్కువగా ఉంటుంది. ఇటువంటి స్థితిలో వారు మాతృభాషలో బోధించిన అంశాలను సులభంగా గ్రహించగలుగుతారు. కంఠస్థం చేయాల్సిన పనిలేకుండా ఆయా అంశాలను అవగతం చేసుకోవడం ద్వారా ఎక్కువ కాలం గుర్తుంచుకోగలుగుతారు. అన్యభాషలను సైతం ప్రాథమిక దశలో మాతృ భాష ద్వారా బోధించడం వలన ఆయా భాషలపై విద్యార్థులు ఒక అవగాహనకు రాగలుగుతారు. వాటి పై భయాన్ని వీడి అభ్యసించడానికి సంసిద్ధులవుతారు.

మాతృభాషలో విద్యను బోధించడం వలన విద్యార్థుల మనోవికాసం ఎక్కువగా ఉంటుందని మానసిక శాస్త్రవేత్తలు కూడా నిరూపించారు. కఠిన శాస్త్రాలను అభ్యసించేటప్పుడు భాష కూడా కొత్తదైనట్లైతే కొద్ది సేపటికే విషయం అర్థంకాక, విసుగు కలిగి, ఆయా శాస్త్రాలపై శాశ్వతంగా అనిష్టత పెరిగే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి మాతృభాషలో బోధన ద్వారా ఈ ఇబ్బందిని దాటవచ్చు. ఇతర భాషలలోని ఆయా అంశాలను, సాంకేతికపదాలను, మాతృభాషలోకి ఉన్నవి ఉన్నట్లుగా తీసుకొని రాలేకపోవచ్చు. ఇటువంటివి చాలా కొద్దివి మాత్రమే కష్టంగా అన్పిస్తాయి. అంతమాత్రాన మొత్తం ఆయా భాషలలోనే బోధించాలనుకోవటం ఎంత బుద్ధి తక్కువ పనో విజ్ఞులు గ్రహింతురు గాక !

మన పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కేరళ, ఒడిశా మొదలైన రాష్ట్రాలు మాతృభాష గొప్పతనాన్ని గుర్తించి దాన్ని కాపాడుకొనే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇక మనం “పొరుగింటి పుల్లకూర రుచి” అన్న చందంగా మన మాతృభాష తప్ప తక్కినవన్నింటిని తలపై పెట్టుకొంటున్నాం. త్వరలో అంతరించే భాషల్లో మన తెలుగు కూడా ఉందని తెలుసుకొని ఇప్పుడు బాధపడుతున్నాం. “చేతులు కాలాక ఆకులు పట్టుకొని లాభం లేదు” కదా !

ఇక ‘మాతృభాషలో అన్నింటినీ బోధించడం సాధ్యం కాదు’ అనే మాట ఒట్టిమాటే. మాతృభాషాభిమానం లేనివారు సాకుగా చెప్పేమాటిది. తమిళనాడు రాష్ట్రంలో సాంకేతికశాస్త్ర విద్య (ఇంజనీరింగ్), వైద్య విద్య (మెడిసన్) లు సైతం మాతృభాషలో బోధించబడుతున్నాయి. న్యాయాలయాలలో వాద ప్రతివాదాలు, వివిధ ప్రభుత్వ కార్యాలయాల ఉత్తర ప్రత్యుత్తరాలు, అనుమతులు మొదలైనవన్నీ మాతృభాషలోనే కొనసాగుతున్నాయి. వీటి అన్నింటికీ కారణం మాతృభాషలో విద్యాబోధనే. కాబట్టి మనం కూడ బుద్ధి తెచ్చుకొని ఇప్పటికైనా మాతృభాష గొప్పదనాన్ని గుర్తించి, దానిలో విద్యాబోధన ద్వారా భాషను బతికించుకొందాం. విజ్ఞానాన్ని అందిపుచ్చుకుందాం.

AP Board 9th Class Telugu Solutions Chapter 2 స్వభాష

ఆ) పాఠం చదవండి. కింది అంశాలను గుర్తించండి.

ప్రశ్న 1.
ఆంగ్లభాష గురించి ప్రస్తావించిన అంశాలు.
జవాబు:
పరాయి భాష ఎప్పటికీ పరాయి భాషే. అందులో ఎంతోకాలం కష్టపడి ఎంత జ్ఞానమార్జించినా ఆ భాష మాతృభాషగా గలవారి ముందు ఈ పాండిత్యం దిగదుడుపే. ఆంగ్లభాషలో ఎన్ని గ్రంథాలు రాసినా, ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చినా అవి స్వతంత్రత లేనివే. ఆ భాషలో పూర్వులు చెప్పినవే. వాటిలో సహజత లేదు. ఆంగ్లేయ భాషలో వ్యాసరచనలో ఉత్తమోత్తముడని అనిపించుకున్న “మిల్టన్” మహాశయుడు లాటిన్ భాషలో కొన్ని పద్యాలను రచించాడు. లాటిన్ మాతృభాషగాగల పండితులు వాటిని చదివి, లాటిన్ భాషలో ఇంతకన్నా అథమమైన పద్యాలు లేనేలేవని నిగ్గుతేల్చారు.

“కన్నింగ్ హామ్స్ ఎవిడెన్సు యాక్ట్”ను చదువుట వలన న్యాయవాదిగా మన కడుపును నింపుకోగలం కాని కంకంటి పాపరాజు ఉత్తర రామాయణం చదవడం వలన మన మనస్సు సంతోషంతో నిండుతుంది.

ప్రశ్న 2.
పాఠంలోని ఆంగ్లపదాలు.
జవాబు:

  1. ఎం.ఏ.,బి.యల్. పరీక్షలో ఉత్తీర్ణుడైనాడు.
  2. విల్ ఎనీ జెంటిల్మన్ కం ఫార్వర్డు టు స్పీక్
  3. బర్కు, సిసిరో, డెమా సైనీసు, గ్లాడ్ట్స్
  4. ఇంగ్లీషు మీడియం
  5. ఒరిజినాలిటీ
  6. మిల్టన్
  7. లాటిన్
  8. ప్యారడైజు లాస్ట్
  9. కాలేజీ
  10. వర్నాక్యులర్ సూపరింటెండెంట్
  11. అయాంబికుమీటరు
  12. ది వెల్ నోన్ తెలుగు స్కాలర్
  13. బ్రౌను
  14. ఇన్ మెమోరియం
  15. మ్యూజిక్
  16. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్
  17. ట్రాన్స్ ఫర్ ఆఫ్ ప్రాపర్టీ
  18. కన్నింగ్ హామ్స్ ఎవిడెన్స్
  19. జస్టిస్ హాలోవే
  20. సివిల్ ప్రొసీజర్ కోడ్
  21. ఇంగ్లీషు
  22. పార్టీ
  23. బాయ్ రూమ్, పాట్, రైస్, కెన్ డ్లీ గెటిట్ హియర్
  24. థ్యాంక్యూ
  25. ఇన్ ఆంటిసిపేషన్
  26. డియర్ ఫ్రెండ్
  27. యువర్సు ట్రూలీ

ప్రశ్న 3.
జంఘాలశాస్త్రి సందేశ వాక్యాలు.
జవాబు:
ఆంధ్రదేశంలో ఆంధ్రులైన తల్లిదండ్రులకు పుట్టి ఆంధ్రభాష రాదని చెప్పడం ఎంతో హస్యాస్పదం. మ్యావుమని కూయ లేని పిల్లి, కిచకిచలాడలేని కోతి ఎక్కడా ఉండవు. పుట్టగానే క్యారుమనలేని బిడ్డ చచ్చినదనుటకు సందేహించాలా? ఆంధ్రదేశంలో పుట్టి తక్కువలో తక్కువగా ఆరు సంవత్సరాల వరకైనా ఆంధ్రంలో మాట్లాడి, ఆంగ్లేయ భాషను అభ్యసించినంత మాత్రాన తెలుగు రాదనుట ఎంత ఆశ్చర్యకరం? ఆంగ్లంలో ఎన్ని గ్రంథాలు రాసినా, ఎన్ని ఉపన్యాసాలిచ్చినా అందు భాషా సౌకర్యం ఏమీ ఉండదు. ఆంగ్లం మాతృభాషగా గలిగిన వ్యక్తికి గల సౌలభ్యం 50 సంవత్సరములు ఆంగ్లభాషను అభ్యసించిన మనకు కలుగదు గదా ! సంపూర్ణ భాషోచ్చారణ పట్టువడదు కదా ! ఇట్లే ఆంగ్లేయుడు 18 సంవత్సములు సంస్కృత భాషను నిరంతర దీక్షతో నేర్చుకున్నా, నేర్చుకున్నంత కాలమూ మనస్సులో మననం చేసినా “హగుం సశ్యుచిషత్” అనే ఉపనిషత్ మంత్రాన్ని సరైన ఉచ్చారణతో పలకలేడు. ఇక మనం 24 సంవత్సరాలు ఆంగ్లభాషను నేర్చుకున్నా “ఇన్ మెమోరియం” లో ఉన్న సంగీతాన్ని కనిపెట్టలేం. పరభాషా పదాలకు అర్థం తెలిసినంత మాత్రాన పరభాషా పాండిత్యం లభించినట్లు కాదు. భాషలోని కళను, ప్రాణాన్ని, ఆత్మను కనిపెట్టగలగాలి. అది మాతృభాషలోనే సాధ్యం.

పొలాలను అమ్మి, అమ్మ మెడలోని పుస్లెపూసలమ్మి, ఇంట్లో సామానులమ్మి, దైన్యంగా ముష్టియెత్తి సంపాదించిన ఆంగ్లేయ భాషా పాండిత్యం వలన మనకేమి ఒరిగింది ? అటు స్వభాషకు దూరమై, పరభాషను సంపూర్ణంగా నేర్చుకోలేక రెండింటికి చెడుతున్నాం. పరభాషకై వెచ్చించిన ధనంలో పడిన శ్రమలో, ఉపయోగించిన కాలంలో, పొందిన బాధలో 14వ వంతైనా అవసరం లేకుండా స్వభాషలో పండితులు కావచ్చు. అక్షరాభ్యాసం నుండే మన స్వభాషను అభ్యసిస్తున్నాం అనుకోనక్కరలేదు. నిజానికి తల్లి కడపులో ఉన్నప్పుడే నేర్చుకోవడం మొదలుపెట్టాం. ఉపాధ్యాయుడైనా అవసరం లేకుండా గ్రంథాలను ఊరకనే చదువుకుంటూ పోయినా కూడా భాషాజ్ఞానాన్ని సంపాదించవచ్చు.

తెలుగుభాష అసలు రానివానితోనే ఆంగ్లభాషలో మాట్లాడండి. మీ స్నేహితులకు ఉత్తరాలు రాసేటప్పుడు ‘డియర్ ఫ్రెండ్’ అని మొదలు పెట్టి ‘యువర్స్ ట్రూలీ’ అని ముగించవద్దు. ‘బ్రహ్మశ్రీ’ అనో ‘మహారాజ శ్రీ’ అనో మొదలుపెట్టి ‘చిత్తగింపవలయును’ అని ముగించండి. ఇక తెలుగుభాష అసలు తెలియని వానికే ఆంగ్లంలో ఉత్తరం రాయండి. కొత్తగా వస్తున్న ఆంధ్ర పుస్తకములను విమర్శన బుద్ధితో చదవండి. తొందరపడి నిందించవద్దు. శనివారం మరియు ఆదివారం రాత్రిపూట తప్పకుండా రెండు గంటలు పురాణాలను చదవండి. తెలుగు భాషలోని వివిధ పత్రికలను చదవండి. ఆంగ్లేయ భాషా గ్రంథాలను చదివేటప్పుడు వాటిల్లో మన భాషకు పనికివచ్చే అంశాలను తదేక దృష్టితో వెతకండి. వాటిని గుర్తుంచుకోండి. ఇలా నియమంగా పట్టుదలతో ఉన్నప్పుడే కేవలం పుట్టుక చేత ఆంధ్రులం అనిగాక, బుద్ధిచేత, స్వభావం చేత, యోగ్యతచేత కూడా ఆంధ్రులమని అనిపించుకొంటాం.

AP Board 9th Class Telugu Solutions Chapter 2 స్వభాష

ఇ) పాఠం చదివి కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
జంఘాలశాస్తి ఎవరు?
జవాబు:
పానుగంటి లక్ష్మీనరసింహారావు గారు ‘సాక్షి’ అనే పేరుతో అనేక సంఘ సంస్కరణ వ్యాసాలను రాశారు. అందులో జంఘాలశాస్త్రి, బొర్రయ్య సెట్టి, కాలాచార్యులు, సాక్షి వంటివి కొన్ని పాత్రలు. స్వభాష గొప్పదనాన్ని జంఘాలశాస్త్రి చేత ఉపన్యాసరూపంగా ఈ వ్యాసంలో పేర్కొన్నారు.

ప్రశ్న 2.
జంఘాలశాస్త్రి ఆవేదనతో పలికిన మాటలేవి?
జవాబు:
హరహరా ! మహాదేవ శంభూ ! మహాదేవ శంభూ ! ఎంతమాట? ఎంతమాట? మీరు కూడా విన్నారా? నేనొక్కడినే విన్నానా? ఏదో విని ఇంకేదో అని భ్రమపడ్డానా ? భ్రమపడితే అదృష్టవంతుడినే ! నేనొక్కడనే కాదు ఆంధ్రులందరూ అదృష్టవంతులే ! కాని అంతటి అదృష్టమెక్కడిది? ఆంధ్రదేశంలో, ఆంధ్రులైన తల్లిదండ్రులకు పుట్టి, ఆంధ్ర సంప్రదాయాల్ని నేర్చుకొని, ఆంధ్ర జాతీయతత్త్వ సంపదచే అభివృద్ధి పొంది, ఆంధ్రభాషలో పండితులై, గ్రంథములను రచించి, భాషకు చక్కని అలంకారాలుగా అర్పించిన, సేవించిన తమ శరీరాల్ని, ప్రాణాల్ని, ఆత్మల్ని పవిత్రంగా చేసుకుని ప్రాణాలు విడిచి స్వర్గాన్ని చేరిన ప్రాచీనులైన ఆంధ్రులందరూ అదృష్టవంతులే ! అయ్యయ్యో ! అంత అదృష్టం పట్టునా? పట్టదు. విన్నాను. నిజంగానే విన్నాను. నాది భ్రమ కాదు. నాతోపాటు మీరూ విన్నారు. వినక చెవులేమైనా చిల్లులు పడ్డాయా ? బుద్ధి తక్కువైందా? గుండెలు పగిలేలా విన్నాం. మనస్సు మండేలా విన్నాం. సిగ్గుపోయేలా విన్నాం. ప్రాణాలు పోతుండగా విన్నాం. బతికి ఉంటే ఎన్నటికైనా సుఖాలు పొందవచ్చని కవి చెప్పాడే. జీవించి ఉన్నందుకు మనకిదే ఫలమా? ఇదే సుఖమా?

ఆహాహ ! మన అధ్యక్షులవారు చెప్పినదేమి? వారి శ్రీ సూక్తి ఏమిటి? వారి నోటి నుండి వెలువడ్డ సూత్రం ఏమిటి? చెప్పేదా? తెలుగువాడు చెప్ప గూడనిదే ! చెప్పక తప్పదు గదా ! మన అధ్యక్షుల వారికి తెలుగుభాష రాదట. ఆయన తెలుగులో మాట్లాడలేరట. వారేమీ మూగవారు కారే. నత్తిగా మాట్లాడేవారు కారే. ఆంగ్లేయ భాషలో పండితులే. బర్కు, సిసిరో, డెమోస్టెనీసు, గ్లాడ్స్ వంటి గొప్ప ఉపన్యాసకుల ఉపన్యాస వైభవాన్ని అర్థం చేసుకొనడమే గాక, ఒంటబట్టించు కున్నవారే. బి.ఎల్. పరీక్షలో ఉత్తీర్ణులై నల్లని కోటు ధరించి, న్యాయమూర్తుల ఎదుట కాకిని గట్టిగాను, గద్దను కాకిగాను నిరూపించగల, సమ్మోహనం చేయగల సంభాషణ గలవారే. అటువంటి వారు తెలుగులో మాట్లాడలేకపోవడం ఏమిటి? తెలుగుదేశంలో పుట్టిన పక్షుల సైతం నిరంతరం వినడం వలన తెలుగు మాట్లాడుతుంటే అయ్యయ్యో ! మనుషుడై తెలుగువారికి పుట్టి, తెలుగు ప్రాంతపు నీరు, ఆహారం, గాలి స్వీకరిస్తున్నవాడే. తక్కువలో తక్కువగా ఆరు సంవత్సరాల వరకైనా తెలుగులో మాట్లాడినవాడే. అట్టివాడు ఆంగ్లేయ భాషను నేర్చుకున్నంతమాత్రాన ఇప్పుడు తెలుగులో మాట్లాడలేనంటున్నాడే? ఎంత ఆశ్చర్యం ! నమ్మదగని విషయం. పెద్ద అబద్ధం.

తెలుగులో అతణ్ణి మాట్లాడకుండా చేసింది అశక్తి కాదు. అనిష్టత, అసహ్యం. ఇది రాతితో చెక్కిన మాట. ఎందుకని ఇష్టం లేదు? తెలుగు భాషలాంటి దిక్కుమాలిన భాషలేదని ఇతని నమ్మకం. పద్దతి తెలియనివాడు, చదువుకోనివాడు, గౌరవం లేనివాడు, గతిలేనివాడు, తెలివి తక్కువవాడు, దిక్కుమాలినవాడు- ఇలాంటివారే తెలుగులో మాట్లాడతారని ఇతని అభిప్రాయం కాకుంటే ఎందుకు మాట్లాడడు? అయ్యయ్యో ! తెలుగులో మాట్లాడడం అంత చేయగూడని పనా? మకరంద బిందువులను స్రవించే సుందరమైన భాషే. ఇట్టి భాషను విడచి పరభాషను ఆశ్రయిస్తున్నారే.

పోనీ పరభాషలో సాధించిన పాండిత్యమేమైనా గొప్పదా అంటే ఆయా భాషలు మాతృభాషలుగా గలవారి ముందు నిలువలేకుందే ! మన రాజధానిలో ఉన్న ఒక కాలేజీలో ‘వర్నాక్యులర్ సూపరింటెండెంటు’ గా ఒక సంస్కృత భాషా పండితుడగు ఆంగ్లేయుడున్నాడు. అతడు ‘యం బ్రహ్మ వేదాంత’ మొదలైన శ్లోకాలను చదివాడు. ఆ సంగతి చెప్పనక్కరలేదు. అలాగే గొప్ప తెలుగు పండితునిగా పేరొందిన బ్రౌను దొరగారు ఆంధ్రభాషలో ఏమాత్రం పండితులో మనకు తెలియకపోయినా నాటి ఆంధ్రులకు తెలియదా?

ఇలా పరభాషా వ్యా మోహంతో స్వభాషకు దూరమై “రెంటికీ చెడ్డ రేవడి”లా తయారవుతున్నాం. ఈ విధంగా జంఘాలశాస్త్రి ఆవేదనతో పల్కాడు.

AP Board 9th Class Telugu Solutions Chapter 2 స్వభాష

ప్రశ్న 3.
జంఘాలశాస్త్రి ఎవరిని అదృష్టవంతులంటున్నాడు?
జవాబు:
సభాధ్యక్షుడు పలికిన తనకు తెలుగులో మాట్లాడటం రాదనే మాట ఒకవేళ భ్రమైతే తాను అదృష్టవంతుణ్ణి అని అన్నాడు. ఇంకా ఆంధ్రులంతా అదృష్టవంతులని చెప్పాడు. ఆంధ్రదేశం కూడా అదృష్టవంతమైనదని భావించాడు. తెలుగు ప్రాంతంలో పుట్టినవారు, తెలుగు తల్లిదండ్రులకు పుట్టినవారు, ఆంధ్ర జాతీయతత్త్వ సంపదచే అభివృద్ధి చెందినవారు అదృష్టవంతులని పేర్కొన్నాడు. ఆంధ్రభాషలో పండితులై, ఆంధ్రభాషలో గ్రంథాలను రచించి, ఆంధ్రభాషా దేవికి వెలకట్టలేని అలంకారాభరణాలుగా సమర్పించినవారు అదృష్టవంతులని చెప్పాడు. ఆంధ్రదేశ సేవచేసి- తమ శరీరాలను, ప్రాణాలను, ఆత్మలను పవిత్రులుగా జేసుకున్న వారిని అదృష్టవంతులన్నాడు. ప్రాణాలు విడచి పరమపదాన్ని చేరిన పూర్వకాలపు ఆంధ్రులందరూ కూడా అదృష్టవంతులే అని సంభావించాడు.

ఈ) కింది అంశానికి భావం ఏమిటి? దీన్ని ఏ సందర్భంలో మాట్లాడాడు?
ప్రశ్న 1.
“కావు కావుమని యనవలసిన కాకులన్నిటిలో నొక కాకికొక్కొరోకోయని యఱచిన యెడల మిగిలిన కాకులు దానిని ముక్కుతో బొడిచివేయక మానునా?”
జవాబు:
భావం :
కాకులు, సహజంగా కావు కావుమని అరుస్తాయి. ఇది వాటి జాతి లక్షణం. కాకులలో ఉన్న ఒక కాకి అలా అరవక కోడిలా ‘కొక్కొరోకో’ అని అరిస్తే మిగిలిన కాకులు దాన్ని కాకిగా భావించక, వేరే పక్షి తమలో చేరిందని భావించి కోపంతో పొడిచి చంపేస్తాయి గదా ! అని భావం.

సందర్భం :
ఈ వాక్యాన్ని జంఘాలశాస్త్రి సభాధ్యక్షుణ్ణి ఉద్దేశించి మాట్లాడాడు. అందరూ తెలుగు మాట్లాడవలసిన చోట, ఇంతమందిలో నీవొక్కడివే ఇంగ్లీషులో మాట్లాడావు. మేము నీలాంటి వారిని చాలామందిని చూశాము. ఇటువంటి పరిస్థితులకు అలవాటు పడ్డాం గనుక సరిపోయింది. లేకుంటే కాకులన్నీ కలిసి తోటికాకిని పొడిచినట్లు నిన్ను హింసించక విడిచేవారమా? అని పల్కాడు.

AP Board 9th Class Telugu Solutions Chapter 2 స్వభాష

ప్రశ్న 2.
“మకరంద బిందుబృందరస స్యందన మందరమగు మాతృభాషయే”.
భావం :
తేనె బిందువులను కార్చే మందర పర్వతమువంటిదైన స్వభాష.

సందర్భం :
సభాధ్యక్షుడు ఆంగ్లంలోనే సంభాషించుటకు గల కారణాలను వెదుకుతూ జంఘాలశాస్త్రి ఈ వాక్యాన్ని పల్కాడు. తెలుగులో మాట్లాడేవాడు పద్ధతి తెలియనివాడు. చదువుకోనివాడు. గౌరవం లేనివాడు. దిక్కులేనివాడు. తెలివి తక్కువవాడు అని అధ్యక్షుల వారి అభిప్రాయం. కాబట్టే తేనె లాంటి మధురభాషను విడచి పరభాషలో ఉపన్యసిస్తున్నాడు.

II. వ్యక్తీకరణ-సృజనాత్మకత

అ) కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాలలో సొంతమాటల్లో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
కావ్యభాష, వ్యావహారిక భాషలంటే ఏమిటి? వీటి మధ్య భేదాలు ఏమిటి?
గ్రాంథికభాష, వ్యావహారిక భాషలంటే ఏమిటి? వాటి మధ్య తేడాలను వివరించండి.
జవాబు:
కావ్యభాష :
కావ్యాలలోను, గ్రంథాలలోను ఉపయోగించే, వ్యాకరణంతో గూడిన భాషను ‘కావ్యభాష’ అంటారు.

వ్యావహారికభాష :
రోజువారీ వ్యవహారాలను జరుపుకోవడానికి ఉపయోగించే భాషను ‘వ్యావహారిక భాష’ అంటారు. ఇందులో భావానికే ప్రాధాన్యం. వ్యాకరణ నియమాలను పెద్దగా పట్టించుకోనవసరం లేదు.

భేదాలు :

కావ్యభాషవ్యావహారికభాష
1. ఈ భాష జాతి-కుల-మత – ప్రాంతాలకు అతీతంగా అందరిచే ఒకేలా ప్రయోగించబడుతుంది.1. ఈ భాష జాతి-కుల-మత – ప్రాంతాలను బట్టి అనేక విధాలుగా మారిపోతుంది.
2. దీనిలో మార్పులు చేరవు. ఎప్పటికీ ఒకేలా నిలచి ఉంటుంది.2. దీనిలో మార్పులు సహజం. కాలం, ప్రాంతం, జనాల అవసరాలను బట్టి ఇది పలు రకాలుగా మారిపోతుంది.
3. నన్నయ-తిక్కన -ఎర్రనలు రాసిన భారతాన్ని ఇంకా ఇతర ప్రబంధ కవులు రాసిన కావ్యాలను గ్రంథాలను నేటికీ చదివి అర్థం చేసుకోగలుగుతున్నా మంటే కారణం కావ్యభాషలో ఉండటం.3. ఇది ఆయా ప్రాంతాల వర్ణాల వారి స్వభావాన్ని, సహజతను తెలుపుతుంది. కాబట్టే అన్నమయ్య సంకీర్తనలలో చాలావరకు రాయలసీమ ప్రాంతపు యాస వాడబడినా “అన్నమయ్య పదసర్వస్వం” వంటి గ్రంథాల ద్వారా ఆయన సంకీర్తన సౌరభాలను ఆస్వాదించగలుగు తున్నాం.

ప్రశ్న 2.
జంఘాలశాస్త్రి మంచి వక్త అని ఎలా చెప్పగలవు?
జవాబు:
మంచివక్తకు ప్రధానంగా సభలో పిరికితనం పనికిరాదు. కొత్త ప్రదేశమైనా, కొత్త మనుషులైనా చొరవగా చొచ్చుకుపోగలగాలి. వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోగల నేర్పు ఉండాలి. జంఘాలశాస్త్రికి అటువంటి చొరవ, నేర్పు ఉన్నాయి. చెప్పదలచుకొన్న అంశం పై సాధికారత ఉండాలి. సందర్భానుగుణంగా మాట్లాడే ఇతర అంశాలపై కూడా పట్టు ఉండాలి. భావానుగుణంగా భాష తడబాటు లేకుండా నదీ ప్రవాహంలా ఉరకలెత్తాలి. చెప్పదలచుకొన్న విషయాన్ని పక్షపాతం చూపకుండా నిర్భయంగా, స్పష్టంగా చెప్పగలగాలి. ఈ గుణాలన్నీ జంఘాలశాస్త్రిలో పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి జంఘాలశాస్త్రి మంచి వక్త అని చెప్పవచ్చు.

ప్రశ్న 3.
సభాధ్యక్షుడు తెలుగు మాట్లాడకపోవడానికి కారణం ఏమై ఉంటుంది?
జవాబు:
తెలుగులో అతడు మాట్లాడలేకపోవడానికి కారణం శక్తి లేకపోవడం కాదు. ఇష్టం లేకపోవడం. తెలుగంటే చులకన భావం. తెలుగు భాషకన్నా దిక్కుమాలిన భాషలేదని అతని నమ్మకం. తెలుగులో మాట్లాడేవాడు పద్ధతి తెలియనివాడు, చదువుకోనివాడు, గౌరవం లేనివాడు, గతిలేనివాడు, తెలివి తక్కువవాడు, ఇంకా దిక్కు మాలినవాడని అతని అభిప్రాయమై ఉంటుంది. తెలుగులో మాట్లాడటం సిగ్గుచేటని అతని విశ్వాసం కాబోలు. సభాధ్యక్షుడు తెలుగులో మాట్లాడకపోవడానికి ఇవన్నీ కారణాలై ఉంటాయి.

ఆ) కింది ప్రశ్నలకు పదిహేనేసి వాక్యాలలో సొంతమాటల్లో రాయండి.

ప్రశ్న 1.
జంఘాలశాస్త్రి గురించి సొంతమాటల్లో రాయండి.
జవాబు:
జంఘాలశాస్త్రికి మాతృభాషపై మక్కువ ఎక్కువ. ఆంగ్లవిద్యను అభ్యసించినా అత్యవసర పరిస్థితుల్లో తప్ప దాన్ని వాడడానికి ఇష్టపడడు. తెలుగును ఎవరైనా కించపరిచేలా మాట్లాడినా, ప్రవర్తించినా సహించలేనివాడు. తోటి తెలుగువారైనా సరే చీల్చి చెండాడుతాడు. భాషను కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను గూర్చి ప్రచారం చేయడానికి ఉద్యమించాడు. మంచి వక్త, ఏ సభలోకైనా దూసుకొని వెళ్ళే స్వభావం కలవాడు. ప్రాచీన శాస్త్రాలను , నవీన శాస్త్రాలను కూడా ఒంటబట్టించుకున్నవాడు. వ్యంగ్యంగా మాట్లాడటంలో నేర్పరి. ఎదుటివారి మనసులోకి దూసుకొని వెళ్లేలా సూటిగా, స్పష్టంగా మాట్లాడగలడు. చిన్న తప్పును సైతం సహించలేని స్వభావం గలవాడు.

ప్రత్యేకించి తెలుగులో విద్యనభ్యసించేవారిని, తెలుగు సంభాషించేవారిని, తెలుగుదనం కోరేవారిని అభిమానిస్తాడు. ఇతని ఉపన్యాసం ద్వారా ఇతనికి ఆధునిక న్యాయశాస్త్రంపై చక్కని అవగాహన ఉందని తెలుస్తుంది. ఆధునిక ఆంగ్ల సాహిత్యం పై కూడా మంచిపట్టు ఉంది. నిష్కర్షగా, నిర్మొహమాటంగా, నిజాయితీగా మాట్లాడతాడు. చక్కని ఉదాహరణలతో మనసుకు హత్తుకునేలా విషయాన్ని వివరించగల నేర్పు, ఓర్పు గలవాడు. తెలుగు, సంస్కృత భాషలను అనర్గళంగా మాట్లాడగలవాడు. పురాణ పరిజ్ఞానం, నవీన విజ్ఞానం, ఆంధ్ర సాహిత్య జ్ఞానం సమపాళ్లలో గల మేధావి. ప్రాచీనతను ఆధునికతతో మేళవించగలిగిన వ్యవహారదక్షుడు. శ్రోతలను మంత్రముగ్ధులను చేయగల వాగ్దాటి గలవాడు.

AP Board 9th Class Telugu Solutions Chapter 2 స్వభాష

ప్రశ్న 2.
“ఆంగ్లభాషయే కాదు. ఇంకననేక భాషలు కూడా నేర్చుకొనుము. నీవు సంపాదించిన పరభాషా జ్ఞానమంతయు నీ భాషను అభివృద్ధిపరచడానికే ఈ వాక్యాల ద్వారా మీరేం గ్రహించారు ? దీనిపై మీ అభిప్రాయం రాయండి.
జవాబు:
ఆధునిక కాలంలో కేవలం మాతృభాషాధ్యయనం వలన అన్నీ సాధించుకోలేం. కాబట్టి అన్యభాషలను అధ్యయనం చేయక తప్పదు. దేశీయ భాషలనే కాక అంతర్జాతీయ భాషలైన ఆంగ్లం, ఫ్రెంచ్ వంటి వాటిని సైతం నేర్చుకోక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. కానీ పరభాషల మత్తులో పడి మాతృభాషను మరువకూడదు. ఒకే మాతృభాష మాట్లాడేవారున్నచోట పరభాషలో మాట్లాడకూడదు. ఇంకా పరభాషలను అధ్యయనం చేసి, ఆయా భాషలలోని పదాలను మాతృభాషలోకి తీసుకువచ్చి స్వభాషలోని పదసంపదను పెంపొందించుకోవాలి. పరభాషలలోని గ్రంథాలలో ఉన్న ఉత్తమాభిప్రాయాలను, భావాలను గ్రహించి మాతృభాషలో వాటిని వినియోగించుట ద్వారా మాతృభాషకు వన్నె పెట్టుకోవాలి.

ఇతర భాషలలోని ఉత్తమ గ్రంథాలను, కవితా సంపుటాలను మాతృభాషలోకి అనువదించుట ద్వారా వాటి సౌందర్యాన్ని తోటివారికి పరిచయం చేసి ఆనందం కలిగించవచ్చు. స్వభాషను పరిపుష్టం చేసుకోవచ్చు. పరాయి భాషలలోని నూతన సాహిత్యపు పోకడలను, కొత్తగా పుడుతున్న శాస్త్రాలను, పారిభాషిక పదాలను స్వీయభాషలోకి తర్జుమా చేయడం ద్వారా సాహిత్య శాస్త్ర సంపదలను అభివృద్ధి చేసుకోవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్న విజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు అందిపుచ్చుకోవడం ద్వారా మాతృభాషను కలకాలం నిలిచి ఉండేలా చేసుకోవచ్చు. అన్య భాషా గ్రంథాలను అభ్యసించేటప్పుడు మన భాషకు ఉపయోగపడే అంశాలేమైనా ఉన్నాయా అని తదేక దృష్టితో గమనించాలి. అట్టి వాటిని జాగ్రత్తగా గుర్తుంచుకొని అవసరమైన చోట వినియోగించాలి.

ఇలా పరభాషా జ్ఞానాన్ని స్వభాషాభివృద్ధికి నిరంతరం వినియోగించడం ద్వారా భాష జీవత్వాన్ని కోల్పోదు. జవసత్వాలను కోల్పోదు. తద్వారా అమృతభాషయై నిలుస్తుంది.

ప్రశ్న 3.
తెలుగు భాష వచ్చి కూడా కావాలని ఆంగ్లంలో మాట్లాడేవారు ఎదురై, మీతో ఆంగ్లంలోనే మాట్లాడితే, మీకెలా ఉంటుంది? మీరేం చేస్తారు?
జవాబు:
నేడు ఆంగ్లంలో సంభాషించడం నాగరికతకు గుర్తుగా భావిస్తున్నారు. మాతృభాషలో మాట్లాడడం మొరటైపోయింది. దూరదర్శన్లలోను, చలన చిత్రాలలోను ఆంగ్లభాషా ప్రభావం అధికంగా కన్పిస్తుంది. రోజువారీ వ్యవహారాలలోను ఆంగ్ల పదాలు చోటుచేసుకుంటున్నాయి. తెలుగుభాష క్రమక్రమంగా కృంగి కృశించిపోతోంది. చాలామంది తెలుగు భాష వచ్చి కూడా కావాలని ఆంగ్లంలో మాట్లాడుతున్నారు. అలాంటి వారు నాకు ఎదురై ఆంగ్లంలో మాట్లాడితే నాకు ఎక్కడలేని చిరాకు వస్తుంది. ఏం రోగం చక్కగా తెలుగులో మాట్లాడవచ్చు కదా అని అన్పిస్తుంది. “పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంద’నే సామెత గుర్తుకు వచ్చి నవ్వు వస్తుంది. భాషపై ఉన్న నిర్లక్ష్య భావానికి కోపం వస్తుంది.

నేను మాత్రం తప్పక తెలుగులోనే మాట్లాడతాను. వాళ్ళు ఆంగ్లంలో మాట్లాడినదానికి తగ్గట్లు సందర్భోచితంగా తెలుగులో మాట్లాడతాను. దానివల్ల నాకు కూడా ఆంగ్ల పరిజ్ఞానం తగినంత ఉందని, కావాలనే నేను తెలుగులో మాట్లాడుతున్నానని వాళ్లు గ్రహించేలా చేస్తాను. తెలుగులో మాట్లాడటం తక్కువతనమేమీ కాదని నిరూపిస్తాను. ఏయే భావాలను, పదాలను తెలుగులో మాట్లాడలేమని కేవలం ఆంగ్లంలోనే మాట్లాడగలమని భావిస్తారో అటువంటి వాటిని మాతృభాషోపాధ్యాయుని సాయంతో, ఇతర పెద్దల సాయంతో తెలుగులో మాట్లాడి చెప్పుతో కొట్టినట్లు చేస్తాను. తెలుగు భాష సత్తాను చాటిచెపుతాను. తెలుగులో మాట్లాడటం వలన కలిగే సౌలభ్యాన్ని తెలియజేస్తాను. తద్వారా ప్రభావితులై కొంతమందైనా తెలుగులో మాట్లాడటానికి ప్రాధాన్యం ఇచ్చేలా చూస్తాను.

ఇ) సృజనాత్మకంగా రాయండి.

జంఘాలశాస్త్రి పాత్రను ఏకపాత్రాభినయం చేయండి.
జవాబు:
చెవులు మూసుకున్నట్లు అభినయిస్తూ ….

“హరహరా ! మహాదేవ శంభూ ! మహాదేవ శంభూ ! ఎంతమాట విన్నాను ! ఎంతమాట విన్నాను ! సరిగ్గానే విన్నానా? లేక ఏదో విని మరేదో అని భ్రమపడ్డానా? ఇది భ్రమే అయితే అంతకన్నా అదృష్టమేముంది ? నేనొక్కడినే కాదు యావదాంధ్రులూ అదృష్టవంతులే గదా ! ఆంధ్ర భాషా యోష (స్త్రీ) ను తమ గ్రంథాలచే అలంకరించిన పూర్వులందరూ అదృష్టవంతులే. అయ్యో ! అయ్యయ్యో ! అంతటి అదృష్టం కూడానా? ఇది భ్రమకాదు నిజమే. వినకపోవడమేమి? చెవులేమైనా చిల్లులు పడ్డాయా? గుండెలు పగిలేలా విన్నాను. మనస్సు మండేలా విన్నా ! సిగ్గు చిమిడిపోయేలా విన్నా? ప్రాణాలు ఎగిరిపోయేలా విన్నా ! “జీవన్ భద్రాణి పశ్యతి” – బతికి ఉంటే ఎప్పటికైనా సుఖాలు బడయవచ్చని కదా ఆదికవి వాల్మీకి వాక్యం. ఇంకా బతికి ఉన్నందుకు ఇదా ఫలం ! ఇదా సుఖం !!

ఆహాహా! ఏమి ? అతని ఆలాపకలాపం? ఏమా శ్రీసూక్తి? అతని వదనం నుండి వెలువడిన వాగమృతమేమి? ఆంధ్రుడు చెప్పదగినదికాదే? ఆలోచనలలో సైతం అనుకోకూడనిదే? కాని …… (సాలోచనగా) అంత నిర్లజ్జగా ఎలా చెప్పగలిగాడు తనకాంధ్రభాష రాదని ! తాను తెలుగులో మాట్లాడలేనని ! కృష్ణాతీరంలో ఆంధ్రులైన దంపతులకు పుట్టి, తక్కువలో తక్కువగా ఆరు సంవత్సరాలైనా తెలుగులో మాట్లాడి, ఏమ్.ఏ.,బి.ఎల్. చేసి, న్యాయవాద వృత్తిని నిరాఘాటంగా, నిరంకుశంగా నిర్వహిస్తున్నవాడే. కాలాంబర కవచధారియై న్యాయమూర్తుల ఎదుట గ్రద్దను కాకిగాను, కాకిని గ్రద్దగాను నిరూపించగల కర్కశతర్కంతో, వాగ్విలాసంతో సర్వులనూ సమ్మోహితుల్ని జేయజాలినవాడే. అట్టివాడు ఆంగ్లభాషను అభ్యసించినంతమాత్రాన ఇప్పుడు తెలుగులో మాట్లాడలేడా ? మూగవాడేమీకాదే – నంగి నంగి మాటలాడువాడు కాదే? మెమ్మెపెప్పె అనేవాడు కాదే ? మాట్లాడలేకపోవటం అంటే నాకేమీ బోధపడటం లేదు. మ్యావుమని అరవని పిల్లెక్కడైనా ఉంటుందా ? కిచకిచలాడని కోతినెక్కడైనా చూశామా? తెలుగు గడ్డపై పుట్టిన పక్షులు సైతం అనవరత శ్రవణం వల్ల తెలుగులో మాట్లాడుతుంటే మనిషై పుట్టి, అందునా ఆంధ్రుడిగా పుట్టి తెలుగు ప్రాంతమందలి నీటిని, గాలిని, ఆహారాన్ని వినియోగించుకుంటూ, ఆ మాత్రం విశ్వాసం కూడా చూపక నీచాతినీచంగా తెలుగురాదని అంటాడా ? ఇంతకన్నా విశ్వాసఘాతుకం ఉందా?

హా ! తెలిసింది! ఇప్పటికి కారణం దృగ్గోచరమైంది. తెలుగులో అతణ్ణి మాట్లాడకుండా జేసింది అశక్తి కాదు. అనిష్టత – అహ్యతత – ఇది శిలాక్షరమైన మాట. తెలుగు బాసంత దిక్కుమాలిన బాసే లేదని ఈతని అభిప్రాయం. తెలుగులో మాట్లాడేవాడు పద్ధతి తెలియనివాడు. చదువుకోనివాడు. గౌరవము లేనివాడు. గతిలేనివాడు. బుద్ధిమాలినవాడు. తెలుగులో మాట్లాడుట సిగ్గుసిగ్గు. ఇది ఇతని అభిప్రాయం మాత్రమే కాదు. ఏ కొద్దిపాటి ఆంగ్లం అభ్యసించిన తెలుగువారందరి అభిప్రాయమని కూడా తోస్తుంది.

తెలుగులో మాట్లాడటం అంత సిగ్గుమాలిన పనా ? అయ్యో ! మన భాషకు, మకరంద బిందు బృందరస స్యందన మందరమగు మాతృభాషకు, తేనెలూరు తేట తెలుగుకు ఎంతటి దురావస్థ పట్టింది ? మాన్యాలమ్ముకొని, సొమ్ము వ్యయపరచి, ఎంతోమందిని ఆశ్రయించి, ఎన్నో బాధలుపడి దైన్యంతో సంపాదించిన ఆంగ్లభాష వలన ఒరిగినదేమున్నది ? అర్ధ శతాబ్దం ఆంగ్లభాషను అభ్యసించినా సంపూర్ణ భాషోచ్చారణా సౌష్ఠవం పట్టుపడ్డదా ? భాషా సౌలభ్యం అలవడిందా? లేదే ! గ్రంథజ్ఞాన శూన్యుడైన జన్మమాత్రాంగ్లేయునికి ఉన్న సౌలభ్యంలో సాబాలైనా సిద్ధించలేదే ? ఇక సంస్కృతాంధ్రాలను అభ్యసించిన ఆంగ్లేయులు వేదమంత్రాలను, చిత్ర కావ్యాలలోని శ్లోకాలను, తెలుగు జానపద గీతాలను చక్కగా ఆలపించగలరా? ఎన్నటికి చేయలేరు గదా ! పరభాషా పదాలకు అర్థాలు తెలిసినంతమాత్రాన పండితులమయ్యామనుకుంటే ఎలా ? ఆ భాషలోని కళను, ప్రాణాన్ని, తత్వాన్ని, ఆత్మని కనిపెట్టాలి. అది ఆ భాష మాతృభాషగా గలవారికి మాత్రమే సాధ్యం. మిగతా వారందరికీ అది నేల విడిచిన సామే. స్వభాషను విడిచి పరభాషకై పాకులాడటం వలన రెండింటికి చెడ్డ రేవడిలా అయింది.

స్వభాషను నేర్చుకోవటంలో కష్టమేముంది ? నిజానికి ఇష్టం లేదుగాని. విద్యాభ్యాసానికి ముందే తల్లి కడుపులో ఉన్నప్పుడే నేర్చుకోవటం మొదలైంది గదా ! పరభాషకై వెచ్చించిన ధనంలో, పడిన శ్రమలో, వ్యర్థపరచిన కాలంలో, పొందిన దైన్యంలో, ఏడ్చిన ఏడ్పులో 14వ వంతైన అక్కరలేకుండా మాతృభాషలో పండితులమవుతాం గదా ! ఈ వాస్తవాన్ని నా తెలుగు వారెన్నటికి గ్రహిస్తారో గదా ! నా తెలుగు ఎన్నటికి మహోన్నత వైభవాన్ని పొందుతుందో గదా !! (భారంగా నిట్టూరుస్తాడు.)

అయినా నా భావాలను ఆలోచనల రూపంలో మాత్రమే ఉంచితే లాభం లేదు. తెలుగు భాషోన్నతికై నడుం బిగించి ఉద్యమించాలి. యావదాంధ్రదేశంలో సంచరిస్తూ, మాతృభాషా విషయమై జాగరూకుల్ని చేయాలి. ఇదే కర్తవ్యం. అవును. ఇదే తక్షణ కర్తవ్యం.

AP Board 9th Class Telugu Solutions Chapter 2 స్వభాష

ఈ) ప్రశంసాత్మకంగా రాయండి.

మీ స్నేహితులలో కేవలం తెలుగులోనే ఒక రోజంతా మాట్లాడగలిగే వారెవరో గుర్తించి, వారిని అభినందిస్తూ కేవలం తెలుగుపదాలతో ఒక అభినందన పత్రం రాయండి.
అభినందన పత్రం
జవాబు:
ప్రియమైన మిత్రులకు,

శుభాభినందనలు. నేను చాలా రోజులుగా మిమ్మల్ని గమనిస్తున్నాను. మీరు తెలుగులో మాట్లాడటం నన్ను బాగా ఆకర్షించింది. నిజానికి మనం రోజూవాడే మాటలలో కొన్ని ఆంగ్ల పదాలకు తెలుగు పదాలే లేవని నేను అనుకొన్నాను.

నా ఊహ తప్పని మీరు నిరూపించారు. తరగతి గది, తుడుపు గుడ్డ, సుద్దముక్క, ఉపస్థితి పట్టిక వంటి చక్కని తెలుగు పదాలను ఉపయోగిస్తూ తెలుగు వాతావరణాన్ని ఏర్పరచారు. మీలాంటి వారు నా మిత్రులని చెప్పుకోవడం నాకు చాలా గర్వంగా ఉంది.

మీ వలన నేను తెలుగు భాష గొప్పదనాన్ని, మాధుర్యాన్ని గుర్తించాను. ఇంతకుముందు నేను తెలుగు మాధ్యమంలో చదువుతున్నందుకు సిగ్గుపడ్డాను. కాని నేడెంతో గర్వపడుతున్నాను. తెలుగుని అభిమాన విషయంగా చదువుతున్నాను. పద్యాలను రాగయుక్తంగా, భావయుక్తంగా చదివే ప్రయత్నం చేస్తున్నాను. గేయాలను చక్కగా గానం చేయడానికి కృషి చేస్తున్నాను. రోజువారీ వ్యవహారంలో మనం ఉపయోగించే ఆంగ్ల పదాలకు సరైన తెలుగు పదాలను మాతృభాషోపాధ్యాయుని సహాయంతో, ఇతర పెద్దల సహాయంతో సేకరించి, తగినచోట్ల వినియోగిస్తున్నాను. వీటి అన్నింటికి ప్రేరకులు మీరే. ధన్యవాదాలు.

ఇలా తెలుగులో నా కార్యకలాపాలకు తగిన భాషను వినియోగిస్తున్నందుకు నాకెంతో ఆనందంగా ఉంది. ఇంట్లోని పెద్దవారు కూడా ఎంతో ప్రోత్సహిస్తున్నారు. మా తాతయ్య – నాయనమ్మల ఆనందానికి అవధులు లేవు. “నీలా నీ మిత్రులందరూ, రాష్ట్రంలోని విద్యార్థులందరూ తెలుగును అభిమానిస్తూ తెలుగు భాషనే వినియోగిస్తూ ఉంటే మన తెలుగుభాష అమృత భాషగా నిలుస్తుంది. మీ వలన పెద్దలలో కూడా తప్పక మార్పు వస్తుంది. ఇది ఒక శుభపరిణామం. నీలో మార్పునకు కారకులైన నీ స్నేహితులకు శుభాశీస్సులు. వీలైతే ఎప్పుడైనా వారిని మనింటికి అతిథులుగా తీసుకొనిరా” అని చెప్పారు. తప్పక మీరు మా ఆతిథ్యం స్వీకరించాలి. మీ రాకకై మేమందరం ఎదురు చూస్తున్నాం. మీకు మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.

AP Board 9th Class Telugu Solutions Chapter 2 స్వభాష

(లేదా)
పాఠంలోని ఏవైనా రెండు పేరాలను వ్యవహార భాషలోకి మార్చి రాయండి.
1. గ్రాంథికములో ఉన్న పాఠ్యపుస్తకంలోని 4వ పేరా :
“స్వభాష యిదివఱకు మీచేతఁజావనే చచ్చినది. మీగతి యెంత యుభయభ్రష్టమైనదో చూచుకొంటిరా? మీరు వెచ్చించిన ధనములోఁ బడిన శ్రమములో వినియోగపఱచిన కాలములోఁ, బొందిన దైన్యములో, నేడ్చిన యేడ్పులలోఁ, బదునాలవవంతైన నక్కఱలేకుండ మీరు దేశభాషా పండితులై యుందురు. స్వభాషను మీరు నేర్చుకొనుటకే మంత శ్రమమున్నది ? అక్షరాభ్యాస దినమునుండియే మీరు స్వభాష నభ్యసించుచున్నారని యనుకొనవలదు. మీ తల్లి కడుపులో నున్నప్పుడే నేర్చుకొనుట మొదలు పెట్టినారు.
పై పేరా వ్యవహారభాషలో రాయడం :
జవాబు:
స్వభాష ఇదివరకే మీ చేతిలో చచ్చింది. మీ గతి ఎలా ఉభయభ్రష్టమైందో చూసుకున్నారా ? మీరు వెచ్చించిన ధనంలో, పడ్డ శ్రమలో, వినియోగించిన కాలంలో, పొందిన దైన్యంలో, ఏడ్చిన ఏడ్పుల్లో పద్నాలుగవ వంతైనా అక్కర్లేకుండా, మీరు దేశభాషలో పండితులయ్యేవారు. స్వభాషను మీరు నేర్చుకోడానికి ఏమంత శ్రమ ఉంది ? అక్షరాభ్యాస దినం నుంచే మీరు స్వభాషను అభ్యసిస్తున్నారని అనుకోవద్దు. మీ తల్లి కడుపులో ఉన్నప్పుడే నేర్చుకోడం (మొదలెట్టారు.) మొదలుపెట్టారు.

2. గ్రాంథికములో ఉన్న పాఠ్యపుస్తకంలోని 7వ పేరా :
“నాయనలారా ! మీ సభా కార్యక్రమము నంతయుఁ జెడఁగొట్టితిని. నన్ను మీరు క్షమింపవలయును. మఱి యెప్పుడైన నీసభ తిరుగఁజేసికొనుడు. (‘అప్పుడు మీరధ్యక్షులుగా రావలయును’ కేకలు) నాయనలారా ! అటులే-మీరంత యాంధ్రభాషాభిమానంతోఁ బ్రవర్తించుచున్నప్పుడు నా చేతనైన సేవను నేను జేయనా? ఇఁక నాలుగు మాటలు మాత్రము చెప్పుదును. ఆంధ్రభాష బొత్తిగ రానివానితోడనే కాని మీరాంధ్యమున నెన్నఁడు మాటాడవలదు.
వ్యవహారభాషలో పై పేరాను రాయడం :
జవాబు:
నాయనారా ! మీ సభా కార్యక్రమాన్నంతా చెడగొట్టాను. నన్ను మీరు క్షమించాలి. మరెప్పుడైనా ఈ సభ తిరిగి చేసికోండి. (అప్పుడు మీరధ్యక్షులుగా రావాలి. సభలో కేకలు …) నాయనారా ! అలాగే, మీరంత ఆంధ్రభాషాభిమానంతో ప్రవర్తిస్తున్నప్పుడు నా చేతనైన సేవను నేను చేయనా ? ఇక నాలుగు మాటలు మాత్రం చెప్తాను. ఆంధ్రభాష బొత్తిగా, రానివాడితో కాని, మీరాంగ్లంలో ఎన్నడూ మాట్లాడొద్దు.

IV. ప్రాజెక్టు పని

తెలుగు భాష గొప్పదనాన్ని వివరించే వ్యాసాలను, పద్యాలను సేకరించండి. వాటి గురించి తరగతిలో చర్చించండి.
జవాబు:
తెలుగదేలయన్న దేశంబు తెలుగేను
తెలుగువల్లభుండ తెలుగొకండ
ఎల్లనృపులు గొలువ నెఱుగవే బాసాడి
దేశభాషలందు తెలుగు లెస్స.

III. భాషాంశాలు

పదజాలం

అ) కింద గీత గీసిన పదాలకు అర్థాలు రాసి, ఆ పదాలను ఉపయోగిస్తూ సొంతవాక్యాలు రాయండి.

1. శిశువుల మాటలు చిలుక పలుకుల్లా ఉంటాయి.
జవాబు:
చిలుక పలుకులు – అర్థం తెలియకుండా అనే మాటలు.
వాక్యప్రయోగం :
మా తమ్ముడు హిందీ వ్యాసాన్ని చదువుతుంటే అర్థం తెలియకుండా అనే మాటల్లా ఉంది.

2. తొందరపడి ఎవరినీ అధిక్షేపించ గూడదు.
జవాబు:
అధిక్షేపించుట = ఎగతాళి చేయుట
వాక్య ప్రయోగం :
వికలాంగులను (దివ్యాంగులను) చూసి ఎగతాళి చేయగూడదు.

ఆ) కింది పట్టికలో ప్రకృతి వికృతుల పదాలున్నాయి. వాటిని గుర్తించి రాయండి.
AP Board 9th Class Telugu Solutions Chapter 2 స్వభాష 2
జవాబు:

ప్రకృతి – వికృతి

1. భాష – బాస
2. పక్షి – పక్కి
3. విద్య – విద్దె
4. రాత్రి – రాతిరి
5. ఆశ్చర్యము – అచ్చెరువు
6. గృధ్రము – గద్ద

వ్యాకరణం

అ) రెండు గాని, అంతకంటే ఎక్కువగాని వాక్యాలలోని సమాపక క్రియలను అసమాపక క్రియలుగా మార్చి, ఆ వాక్యాలను ఒకే వాక్యంగా రాస్తే దాన్ని ‘సంక్లిష్ట వాక్యం’ అంటారని మీరు తెలుసుకున్నారు కదా !
అభ్యాసం :
కింది సామాన్య వాక్యాలను సంక్లిష్ట వాక్యాలుగా మార్చి రాయండి.

1. ఆంగ్లేయ గ్రంథములెన్నియో వ్రాయుచున్నారు.
ఆంగ్లేయ ఉపన్యాసములెన్నియో ఇచ్చుచున్నారు.
జవాబు:
ఆంగ్లేయ గ్రంథములెన్నియో వ్రాస్తూ, ఆంగ్లేయ ఉపన్యాసములెన్నియో ఇచ్చుచున్నారు.

2. నన్ను మీరు క్షమింపవలయును.
మఱి యెప్పుడైన ఈ సభ తిరుగ జేసికొనుడు.
జవాబు:
నన్ను మీరు క్షమించి, మఱి యెప్పుడైన ఈ సభ తిరుగజేసికొనుడు.

AP Board 9th Class Telugu Solutions Chapter 2 స్వభాష

ఆ) సమాన ప్రాధాన్యం గల సామాన్యవాక్యాలు కలిసి ఒక వాక్యంగా ఏర్పడితే దాన్ని సంయుక్తవాక్యమంటారని తెలుసుకున్నారు కదా!
కింది సామాన్య వాక్యాలను సంయుక్త వాక్యాలుగా మార్చి రాయండి.

1. ఆయన ఆంధ్రుడు. ఆయన కృష్ణాతీరమున పుట్టినవాడు.
జవాబు:
ఆయన ఆంధ్రుడు మరియు కృష్ణాతీరమున పుట్టినవాడు.

2. మోహిని కూచిపూడి నృత్యం నేర్చుకొంది. భావన భరతనాట్యం నేర్చుకొంది.
జవాబు:
మోహిని కూచిపూడి నృత్యం మరియు భావన భరతనాట్యం నేర్చుకొన్నారు.

క్వార్థకం :
భూతకాలంలోని అసమాపక క్రియను ‘క్త్వార్థకం’ అంటారు. ‘క్వా’ అనే సంస్కృత ప్రత్యయం యొక్క అర్థమే క్వార్థకం.
ఉదా :
వచ్చి, తిని

చేదర్థకం :
సంస్కృతంలో ‘చేత్’ అనే ప్రత్యయానికి ‘అయితే’ అని అర్థం. ఇలా తెలుగులో అదే ప్రత్యయం ఏ పదానికి చేరితే దాన్ని ‘చేదర్థకం’ అంటారు.
ఉదా :
కురిస్తే

శత్రర్థకం :
‘శత్రచ్’ అనే సంస్కృత ప్రత్యయం యొక్క అర్థం శత్రర్థకం. ‘శతృ’ ప్రత్యయం వర్తమానకాలమందలి అసమాపక క్రియకు చేరుతుంది. కాబట్టి వీటిని శత్రర్థకాలు అంటారు.
ఉదా :
చేస్తూ, తింటూ

ఇ) కింది వాక్యాలు చదవండి. వీటిలో క్వార్థకం, చేదర్థకం, శత్రర్థకం ఉన్న అసమాపక క్రియలున్న వాక్యాలను గుర్తించండి.

1. వర్షాకాలంలో వానలు పడితే పంటలు పండుతాయి. – చేదర్థకం
2. కవిత గ్రంథాలయానికి వెళ్ళి పుస్తకాలు తెచ్చింది. – క్వార్థకం
3. సుగుణ వంట చేస్తూ పాటలు వింటోంది. – శత్రర్థకం
4. సరిగ్గా మందులు వాడితే జబ్బు తగ్గుతుంది. – చేదర్థకం
5. రంగయ్యకు రెక్కాడితే కాని డొక్కాడదు. – చేదర్థకం
6. మాధవి ఉద్యోగం చేస్తూ చదువుకొంటున్నది. – శత్రర్థకం

ఈ) కింది పేరాలో అవసరమైనచోట తగిన విరామచిహ్నాలు ఉంచండి.
మనము చూడనే లేదయ్యా మన జంఘాలశాస్త్రియే యయ్యా యని వారిలో వారనుకొనుచు ఎప్పుడు వచ్చినారు ఎక్కడి నుండి వచ్చినారు మీరు సభకు వచ్చిన తరువాతనైనను మాకు తెలియజేయనక్కల లేదా ఏమి న్యాయమయ్యా యని యేవేవో అసందర్భములాడి నన్నుపన్యాసరంగము నొద్దకు తీసికొనిపోయిరి.
జవాబు:
విరామచిహ్నములతో వ్రాయుట :
‘మనము చూడనేలేదయ్యా. మన జంఘాలశాస్త్రియేయయ్యా’, యని వారిలో వారనుకొనుచు, “ఎప్పుడు వచ్చినారు? ఎక్కడి నుండి వచ్చినారు? మీరు సభకు వచ్చిన తరువాతనైనను మాకు తెలియజేయనక్కఱలేదా ? ఏమి న్యాయమయ్యా?”, యని యేవేవో అసందర్భములాడి, నన్నుపన్యాసరంగము నొద్దకు తీసికొనిపోయిరి.

AP Board 9th Class Telugu Solutions Chapter 2 స్వభాష

ఉ) ప్రత్యక్ష, పరోక్ష కథనాలు
ప్రత్యక్ష కథనం :
ఒక వ్యక్తి చెప్పిన మాటలను అలాగే ఉన్నది ఉన్నట్లుగా (ఉద్ధరణ చిహ్నాలలో ఉంచి) చెప్పడాన్ని ప్రత్యక్ష కథనం అంటారు.

కింది వాక్యాలు చదవండి.
1) “నాయనలారా ! నేను మీ సభా కార్యక్రమమునంతయు జెడగొట్టితిని.”
2) “నన్ను మీరు క్షమింపవలయును.”

పై వాక్యాలన్నీ జంఘాలశాస్త్రి నేరుగా చెబుతున్నట్లు ఉన్నాయి కదా !
నేను, మేము, …….. ఇలా ఉండే వాక్యాలు అనగా ఉత్తమ పురుషలోని వాక్యాలు సాధారణంగా, ప్రత్యక్షంగా చెబుతున్నట్లుగా ఉంటాయి. అట్లే కింది వాక్యాలను చదవండి.
1) “నేనొక్కడినే అదృష్టవంతుడినా?” అన్నాడు జంఘాలశాస్త్రి.
2) “నేను రాను” అని నరేశ్ రఘుతో అన్నాడు.
(లేదా )
“నేను రా” నని నరేశ్ రఘుతో అన్నాడు.

పై వాక్యాలలో గీత గీసిన మాటలను ఎవరు అన్నారు ?
మొదటి దాంట్లో జంఘాలశాస్త్రి అన్న మాటల్ని, రెండవదాంట్లో నరేష్ అన్న మాటల్ని “ఉద్ధరణ చిహ్నాలు” (ఇన్వర్టడ్ కామాలు) ఉంచి చెప్పినప్పుడు వారే ప్రత్యక్షంగా చెప్పినట్లుగా ఉంటుంది. దీన్నే ప్రత్యక్ష కథనం అంటారు.

పాఠం చదవండి. ప్రత్యక్ష కథనంలో ఉన్న వాక్యాలను గుర్తించండి. వాటి కింద గీత గీయండి.

  1. “బ్రతికి యుండిన సుఖములు పడయవచ్చు” నని కవి చెప్పినాడే.
  2. “నాయనలారా ! మీరు కూడా వింటిరి కాదా ! నేనొక్కడినే వింటినా? ఏదో విని మటియేదో యని భ్రమపడితినా?”
  3. ‘నేనొక్కడను మాత్రమే యదృష్టవంతుడనా ? ఆంధ్రులందఱదృష్టవంతులే కదా!”
  4. “నాది భ్రమము కాదు. తాత్కాలికోన్మాదము కాదు.”
  5. “మన యగ్రాసనాధిపతి దేవుని కాంధ్రభాష రాదట.”
  6. “అబ్బా ! మీరే ప్రయత్నము చేసినారని రాదనుచున్నారు?”
  7. “మా భాష మాకు రాదు.” 8. “ఆంగ్లేయభాష యేల చదువుకొంటివని నే నధిక్షేపింపను.”
  8. “ఇక నాలుగు మాటలు మాత్రము చెప్పుదును.”
  9. “మన భాష కక్కఱకు వచ్చు నంశము లేమియా” యని తదేక దృష్టితో జూడండి.

పరోక్ష కథనం :
ఒకరు చెప్పిన మాటలను యథాతథంగా అట్లే చెప్పక ఇంకొకరు చెపుతున్నట్లుగా చెప్పడాన్నే పరోక్ష కథనం అంటారు. ఇందులో వాక్యాలు ఉత్తమ పురుషలో ఉండవు. ఉద్ధరణ చిహ్నాల అవసరమూ ఉండదు.

కింది వాక్యాలు చదవండి.

  1. నరేష్ తాను రానని రఘుతో అన్నాడు.
  2. ప్రధానోపాధ్యాయుడు చెప్పినట్లుగా చేస్తామని పిల్లలు అన్నారు.
  3. తనను క్షమించమని రాజు తన మిత్రుడితో అన్నాడు.

పాఠం చదవండి. పరోక్ష కథనంలోని వాక్యాలను గుర్తించండి. వాటి కింద గీత గీయండి.
పాఠంలో గుర్తించిన పరోక్ష కథనంలోని వాక్యాలు :

  1. ఆయన యాంధ్రుడు. కృష్ణాతీరమున బుట్టినవాడు.
  2. న్యాయవాద వృత్తిని నిరాఘాటముగా, నిరంకుశముగా నిర్వర్తించుచున్నవాడు.
  3. ఆయన ఆంధ్రమున మాటలాడనేలేరట.

ప్రత్యక్ష కథనంలో ఉన్న వాటిని పరోక్ష కథనంలోకి మార్చేటప్పుడు జరిగే మార్పులు

  1. ప్రత్యక్ష కథనంలోని మాటల/వాక్యాల భావం మాత్రమే పరోక్ష కథనంలో తీసుకొనబడుతుంది.
  2. ఉద్దరణ చిహ్నాలు తొలగించబడతాయి పరోక్ష కథనంలో.
  3. ‘అని’ అనే పదం పరోక్ష కథనంలో చేరుతుంది.
  4. ప్రత్యక్ష కథనంలోని ఉత్తమ పురుష పదాలైన – నేను – మేము – మన – మా వంటి పదాలు – తాను – తాము – తమ – అనే పదాలుగా పరోక్ష కథనంలో మారుతాయి.

AP Board 9th Class Telugu Solutions Chapter 2 స్వభాష

1) పాఠంలోని ప్రత్యక్ష కథనంలోని వాక్యాలను గుర్తించండి. వాటిని పరోక్ష కథనంలోకి మార్చి రాయండి.

1. “బ్రతికి యుండిన సుఖములు పడయవచ్చు” నని కవి చెప్పినాడు.
జవాబు:
బ్రతికి యుండిన సుఖములు పడయవచ్చు అని కవి చెప్పినాడు.

2. “మీరు కూడ వింటిరి కాదా? నేనొక్కడనే వింటినా? ఏదో విని మఱియేదో యని భ్రమపడితినా?” అన్నాడు జంఘాలశాస్త్రి.
జవాబు:
మీరు కూడ వింటిరి కాదా? తానొక్కడే విన్నాడా? ఏదో విని మటియేదో యని భ్రమపడినాడా? అని జంఘాలశాస్త్రి అన్నాడు.

3. “నేనొక్కడనే అదృష్టవంతుడనా? ఆంధ్రులంద అదృష్టవంతులే కదా ! ” అన్నాడు జంఘాలశాస్త్రి.
జవాబు:
తానొక్కడే అదృష్టవంతుడా ? ఆంధ్రులందరు అదృష్టవంతులే కదా ! అని అన్నాడు జంఘాలశాస్త్రి.

4. “నాది భ్రమము కాదు. తాత్కాలికోన్మాదము కాదు” అన్నాడు జంఘాలశాస్త్రి.
జవాబు:
తనది భ్రమము కాదని, తాత్కాలికోన్మాదము కాదని అన్నాడు జంఘాలశాస్త్రి.

5. “మన యగ్రాసనాధిపతి దేవుని కాంధ్రభాష రాదట ” అన్నాడు జంఘాలశాస్త్రి.
జవాబు:
తమ యగ్రాసనాధిపతి దేవుని కాంధ్రభాష రాదట అని అన్నాడు జంఘాలశాస్త్రి.

6. “అబ్బా ! మీరే ప్రయత్నము చేసినారని రాదనుచున్నారు?” అన్నాడు శాస్త్రి.
జవాబు:
అబ్బా ! మీరే ప్రయత్నము చేసినారని రాదనుచున్నారని అన్నాడు శాస్త్రి.

7. “మా భాష మాకు రాదు” ఇలా అనకూడదేవరు.
జవాబు:
తమ భాష తమకు రాదని అనకూడదెవరు.

8. “ఆంగ్లేయభాష యేల చదువుకొంటివని నేధిక్షేపింపనా” అన్నాడు జంఘాలశాస్త్రి.
జవాబు:
ఆంగ్లేయభాష యేల చదువుకొంటివని తానధిక్షేపింపనని అన్నాడు జంఘాలశాస్త్రి.

9. “ఇక నాలుగు మాటలు మాత్రము చెప్పుదును” అన్నాడు జంఘాలశాస్త్రి.
జవాబు:
ఇక నాలుగు మాటలు మాత్రము చెప్పెదనని అన్నాడు జంఘాలశాస్త్రి.

10. “మన భాషకక్కఱకు వచ్చు నంశము లేమియా’యని తదేక దృష్టి జూడుడి” అన్నాడు జంఘాలశాస్త్రి.
జవాబు:
తమ భాష కక్కల వచ్చు నంశము లేమియాయని తదేక దృష్టి జూడండని అన్నాడు జంఘాలశాస్త్రి.

AP Board 9th Class Telugu Solutions Chapter 2 స్వభాష

2) మీరే మరికొన్ని ప్రత్యక్ష కథనంలోని వాక్యాలు రాయండి. వాటిని పరోక్ష కథనంలోకి మార్చండి.
1. “నేను బాగా చదువుతాను” అన్నాడు రఘు, రాజుతో.
జవాబు:
తాను బాగా చదువుతానని రఘు రాజుతో అన్నాడు.

2. “నేను అందగత్తెనని” చెప్పింది రాణి.
జవాబు:
తాను అందగత్తెనని రాణి చెప్పింది.

3. “మేము రేపు ఊరికి వెళ్ళుతున్నాం”చెప్పాడు విష్ణు.
జవాబు:
తాము రేపు ఊరికి వెళ్ళుతున్నామని విష్ణు చెప్పాడు.

4. “మన మందరం అమెరికా వెళ్తున్నాం” ఆనందంగా చెప్పింది రోజి.
జవాబు:
తామందరం అమెరికా వెళ్తున్నారని రోజి ఆనందంగా చెప్పింది.

5. ” మా అక్కయ్యకు మెడిసిన్లో సీటు వచ్చింది” అన్నాడు రాము నిఖిల్ తో సంతోషంగా.
జవాబు:
తన అక్కయ్యకు మెడిసిన్లో సీటు వచ్చిందని రాము నిఖిల్ తో సంతోషంగా అన్నాడు.

6. “మా ఇల్లు చాలా విశాలంగా ఉంటుంది” అని మేరి రమణతో అంది.
జవాబు:
తమ ఇల్లు చాలా విశాలంగా ఉంటుందని మేరి రమణతో అంది.

7. “మా అన్నయ్య కవితలు బాగా రాస్తాడు” అంది సుమ రమతో.
జవాబు:
తన అన్నయ్య కవితలు బాగా రాస్తాడని సుమ రమతో అంది.

8. “మా చెల్లెలు బాగా పాటలు పాడుతుంది” అన్నాడు రమేష్.
జవాబు:
తన చెల్లెలు బాగా పాటలు పాడుతుందని రమేష్ అన్నాడు.

9. “నేను మా తమ్ముడితో ఆటలు ఆడను” తెగేసి చెప్పింది వాణి.
జవాబు:
తాను తమ తమ్ముడితో ఆటలు ఆడనని వాణి తెగేసి చెప్పింది.

10. “మా అబ్బాయి చదరంగం బాగా ఆడతాడు” చెప్పింది గిరిజ నీరజతో.
జవాబు:
తమ అబ్బాయి చదరంగం బాగా ఆడతాడని గిరిజ నీరజతో చెప్పింది.

9th Class Telugu 2nd Lesson స్వభాష రచయిత పరిచయం

పానుగంటి లక్ష్మీ నరసింహారావుగారు 11.2.1865లో రాజమండ్రి – సీతానగరంలో 1 జన్మించారు. వీరి తల్లిదండ్రులు రత్నమాంబ, వేంకటరమణయ్య. ఉన్నత విద్య వరకూ | రాజమండ్రిలోనే విద్యాభ్యాసం చేశారు. బళ్ళారి జిల్లాలోని ఆనెగొంది సంస్థానంలో దివానుగా | కొంతకాలం చేసి, తరువాత పిఠాపురం సంస్థానంలో ఆస్థానకవిగా స్థిరపడ్డారు.

సారంగధర, ప్రచండ చాణక్యము, విప్రనారాయణ, కంఠాభరణం, పూర్ణిమ, సరస్వతి, సరోజని, సాక్షి మొ||వి వీరి ప్రసిద్ధ రచనలు. వీరి శైలి అద్భుతమైన గ్రాంథిక భాషా ప్రవాహంతో | సున్నితమైన వ్యంగ్యంతో, చురుక్కుమనే హాస్యంతో అలరారుతుంది.

సమకాలీన సమస్యలపై తీవ్రంగా స్పందించి, సంఘ సంస్కరణకు నడుం కట్టి, తన రచనల ద్వారా ప్రజల్లో ఆలోచనలు రేకెత్తించిన పానుగంటివారు చిరస్మరణీయులు. వారి రచనలు ఈనాటి పరిస్థితులకు కూడా అద్దం పడుతున్నాయి. వీరు 1-1-1940 న పరమపదించారు.

కఠిన పదాలకు అర్థాలు

1వ పేరా :
హరహరా = ఈశ్వరా ! ఈశ్వరా !
శంభూ = ఓ శివా !
భ్రమపడితిని = భ్రాంతి చెందితిని
ఆంధ్ర మాతాపితలు = తెలుగువారైన తల్లిదండ్రులు
ఉద్భవించి = పుట్టి
అభ్యసించి = నేర్చి
అమూల్య + అలంకారములు = విలువ కట్టరాని అలంకారాలు
అర్పించి = ఇచ్చి
ఆచరించి = చేసి
అంగములు = అవయవాలు
అసువులు = ప్రాణాలు
పాసి = విడిచి
పరమ పదము = వైకుంఠము లేక కైలాసము
తాత్కాలికోన్మాదము (తాత్కాలిక + ఉన్మాదము) = అప్పుడు మాత్రమే ఉండిన వెఱ్ఱి
చెవులు చిల్లులుపడు = పెద్ద ధ్వనిచే చెవులు చిల్లులు పడినట్లగుట

AP Board 9th Class Telugu Solutions Chapter 2 స్వభాష

2వ పేరా :
ఆలాప కలాపము = మాటల సమూహం
సాయించిన = చెప్పిన
శ్రీ సూక్తి = మంగళకరమైన నీతివాక్యము
ఆస్యగహ్వరము = గుహ వంటి నోరు
అవతరించిన = పుట్టిన
ఆగమ సూత్రము = వేద సూత్రం
వచింపదగినది = చెప్పదగినది
అగ్రాసనాధిపతి (అగ్ర + ఆసన + అధిపతి) = అధ్యక్షుడు
ఆంగ్లేయ భాషా పండిత + అగ్రణులు = ఇంగ్లీషు భాషా పండితులలో శ్రేష్ఠుడు
వక్తృ, వావదూకతా వైభవము = మాటలాడే వ్యక్తి యొక్క ఉపన్యాస వైభవం
కబళించి = ముద్దగా మ్రింగి
కడతేఱ్ఱి = కృతార్థులయి
కాలాంబర కవచధారి = నల్లని వస్త్రాన్ని కవచంగా ధరించినవాడు (నల్లకోటు ధరించిన వకీలు)
కర్కశ తర్క వాగ్వాహినీ = కఠినమైన తర్కవాక్కుల ప్రవాహం
మోహినీకరణ దక్షులు = ‘మోహింపజేయడంలో సమర్థులు
వాగ్దోరణీ ధీరులు = మాట్లాడే తీరులో గొప్పవారు
అనవరత శ్రవణము = ఎల్లప్పుడూ వినడం
మనుజుడు = మనిషి
వాయునీరాహారపారణము = గాలిని, నీటినీ ఆహారంగా తినడం
ఒనర్చినవాడు = చేసినవాడు
అవిశ్వసనీయము = నమ్మదగనిది

3వ పేరా :
అనిష్టత = ఇష్టము లేకపోవడం
శిలాక్షరము (శిల + అక్షరము) = రాతిపై చెక్కిన అక్షరం (శాశ్వతం)
ఆంగ్లేయ తేజస్సు = ఇంగ్లీషు ప్రకాశం
అకార్యకరణము = చేయరాని పనిని చేయడం
మకరంద, బిందు, బృంద, రస = పూదేనె, బిందువుల యొక్క సమూహం యొక్క రసం
స్యందన మందరము = స్రవించే మందారము అనే కల్పవృక్షం
మాతృభాష = తల్లి భాష
పరిత్యజించి = విడిచి
పఠించినవారు = చదివినవారు
మాన్యములు = శ్రీమంతులు పన్నులు లేకుండా గౌరవం కోసం పూజ్యులకు ఇచ్చే పొలాలు
వ్యయపఱచి = ఖర్చు చేసి
చిత్తక్లేశము = మనస్సునకు కష్టం
సౌలభ్యము = సులభత్వము
గ్రంథజ్ఞాన శూన్యుడు = పుస్తక జ్ఞానం లేనివాడు
సాబాలు = సగము
అర్ధశతాబ్దము = ఏబది సంవత్సరాలు
అలవడినది = అబ్బినది
భాషోచ్చారణ (భాషా + ఉచ్చారణ) = భాషను పలుకుట
సౌష్ఠవము = నిండుదనం
విశేషజ్ఞులము = బాగా తెలిసినవారం
ఉపజ్జా సహితములు = ఇతరుల ఉపదేశం లేకుండానే, మొట్టమొదటనే కలిగే జ్ఞానము ‘ఉపజ్ఞ’ – దానితో కూడినవి.
వాగ్దోరణులు = మాటతీరులు
చిలుక పలుకులు = సొంతముగా ఆలోచింపక పలుకు మాటలు
ఒరిజినాలిటీ (originality) = ఉపజ్ఞ, నవీన కల్పనాశక్తి
ధీమంతులు = బుద్ధిమంతులు
వ్యాసపీఠాధిపత్యము = వ్యాసరచన పీఠానికి అధికారిత్వము

AP Board 9th Class Telugu Solutions Chapter 2 స్వభాష

4వ పేరా :
ఈనాము = బహుమానంగా ఇచ్చిన భూభాగం, మాన్యం
దైన్యపడి = దీనత్వమును పొంది

5వ పేరా :
ఉభయభ్రష్టము = రెండిటికీ చెడినది

6వ పేరా :
కంఠోక్తి (కంఠ + ఉక్తి) – = గట్టిగా చెప్పడం
అనర్హవాక్యము = తగని మాట
అనుచిత వాక్యము = ఉచితము కాని మాట
నిస్సందేహము = సందేహము లేకుండా
అవకతవక = అసందర్భం

7వ పేరా :
ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ = ఆస్తులను బదలాయించే చట్టం
యథార్థము (యథా + అర్థము) = సరియైనది
రవంత (రవ + అంత) = రేణువు అంత
క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ = నేరాలకు శిక్షించు విధిని నిర్ణయించు గ్రంథం

8వ పేరా:
ఎవిడన్సు యాక్ట్ = సాక్ష్య చట్టం
లేటెస్టు ఎడిషన్ = కడపట అచ్చువేసిన ప్రతి
జడ్జిమెంటు = తీర్పు

9వ పేరా :
అధిక్షేపించు = ఆక్షేపించు
ప్రశస్తము = మేలయినది
వన్నెపెట్టుట = మెఱుగు పెట్టుట
అక్కఱములు = అక్షరములు
ఉపచరింపదలచితివి = సేవింపదలచితివి
బాయ్ ! రూములోనున్న పాట్ లో = అబ్బాయీ ! గదిలోని కుండలో
రైస్ = బియ్యం
క్రైండ్లీ గెటిట్ హియర్ = దయతో ఇక్కడకు వాటిని తెండి
థాంక్ యూ ఇన్ ఆంటిసిపేషన్ = ముందుగా కృతజ్ఞతలు

AP Board 9th Class Telugu Solutions Chapter 2 స్వభాష

10వ పేరా:
డియర్ ఫ్రెండ్ = ప్రియమైన స్నేహితుడా !
యువర్సు ట్రూలీ = మీ విశ్వసనీయమైన
అక్కఱ = అవసరం
తదేకదృష్టి (తత్ + ఏక దృష్టి) = అది ఒక్కటే చూపు
మెదటిలో = మెదడులో
పదిలపటపుడు = స్థిరపరచండి

AP Board 9th Class Telugu Solutions ఉపవాచకం Chapter 5 ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి

AP State Syllabus AP Board 9th Class Telugu Textbook Solutions ఉపవాచకం Chapter 5 ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Telugu Solutions ఉపవాచకం 5th Lesson ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి

9th Class Telugu ఉపవాచకం 5th Lesson ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి Textbook Questions and Answers

కింది ప్రశ్నలకు పదిహేను వాక్యాలకు మించని సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
భద్రిరాజు కృష్ణమూర్తి గారు నిర్వహించిన బాధ్యతలు పేర్కొనండి.
జవాబు:
భాషా క్షేత్రంలో చెరగని మైలురాళ్ళను నిలిపి, తరగని కీర్తిని ఆర్జించినవారు శ్రీ ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి. ఎందరో కాకలు తీరిన భాషా యోధులకు సర్వ సైన్యాధ్యక్షుడి లాంటి గురువు ఈయన. గత శతాబ్దిలో అంతర్జాతీయ స్థాయిలో గొప్ప భాషా శాస్త్రవేత్తల్లో భారతదేశానికి చెందిన ఇద్దరిలో ఒకరు ఈయన.

మొదట ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ట్యూటర్ గా పనిచేసిన కృష్ణమూర్తిగారు తర్వాత ఉస్మానియా, వేంకటేశ్వర విశ్వ విద్యాలయాల్లో ఆచార్యులుగా సేవలందించి, చివరన హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఉపకులపతిగా (వైస్ ఛాన్సలర్) పదవీ బాధ్యతలు నిర్వహించారు. సందర్శకాచార్యులు (విజిటింగ్ ప్రొఫెసర్) గా మిచిగాన్, కార్నెల్ టోక్యో, హవాలీ, టెక్సాస్ వంటి ప్రసిద్ధిగాంచిన విదేశీ విశ్వవిద్యాలయాల్లో భాషాశాస్త్రాన్ని వివిధ దేశాల విద్యార్థులకు బోధించారు. గిడుగు రామమూర్తి పంతులు ప్రవేశపెట్టిన వ్యవహార భాషోద్యమ స్రవంతి ఆగిపోకుండా, కుంటు పడకుండా, మరింత ఉధృతంగా ముందుకు నడిపించే బాధ్యతను తన భుజాలకెత్తుకొని విజయవంతంగా నిర్వహించారు.

ప్రశ్న 2.
భద్రిరాజు కృష్ణమూర్తిగారు గొప్ప పరిశోధకులు; ఆచార్యులు; దీక్షాదక్షులు; పరిపాలకులు – అని సమర్థించండి.
జవాబు:
దక్షిణాసియా దేశాలన్నిటిలోనూ, మనదేశంలో, మనరాష్ట్రంలో మొట్టమొదటి వృత్తి పదకోశాన్ని తయారు చేసినవారు కృష్ణమూర్తిగారు. విద్యాబోధనలో వాడుకభాష వినియోగం గురించి గిడుగు, గురజాడల తర్వాత అంతటి కృషిచేసిన మహనీయుడు భద్రిరాజు కృష్ణమూర్తి.

వర్ణనాత్మక, చారిత్రాత్మక, తులనాత్మక భాషాధ్యయనశీలిగా; నిబద్ధత, నిశిత పరిశీలన, మొక్కవోని దీక్ష గల్గిన సుప్రసిద్ధ పరిశోధకుడిగా, శిష్యుల పట్ల అపార వాత్సల్యాదులు కల్గిన ఉత్తమ ఆచార్యుడిగా; ఏ నిర్ణయానికైనా వెరవని పాలనాదక్షుడిగా, నిరంతర శోధన, ఆదర్శవంతమైన బోధన, అగాధమైన విజ్ఞానం, సహృదయత మూర్తీభవించిన మహోన్నత వ్యక్తిగా అంతర్జాతీయ కీర్తి గడించిన మన తెలుగు తేజం ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తిగారు.

సంప్రదాయ వ్యాకరణం నేర్చుకున్న కృష్ణమూర్తిగారు ఆధునిక భాషా, వ్యాకరణాంశాల మీద దృష్టి సారించడం తెలుగువాళ్ళ అదృష్టం. అనేక జాతీయ, అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల్లో ట్యూటర్ గా, ఆచార్యులుగా, ఉపకులపతిగా, సందర్శకాచార్యులుగా భాషా శాస్త్రాన్ని విద్యార్థులకు బోధించారు.

గిడుగు రామమూర్తి పంతులుగారు ప్రవేశపెట్టిన వ్యవహారిక భాషా ఉద్యమాన్ని ముందుకు నడిపించే బాధ్యతను తీసుకొని, భాషకు మాండలిక ఆవశ్యకతను గుర్తించి, వృత్తి పదకోశాల నిర్మాణాన్ని తన శిష్యుల సహకారంతో విజయవంతంగా నిర్వహించారు. తొలి ప్రయత్నంగా వ్యవసాయ, చేనేత వృత్తి పదకోశాలను అందించారు.

కృష్ణమూర్తిగారి భాషా పరిశోధన ఫలాలు తెలుగువాళ్ళకు మాత్రమే పరిమితం కావు. వారి ఆంగ్ల రచనలు ఇతర భాషల వాళ్ళు చేయవలసిన కృషికి ప్రేరణనిచ్చేవి, ఒరవడి పెట్టేవి. కాలిఫోర్నియాలో ఎం.బి.ఎమినో గారి శిష్యరికంలో ధ్వని, పదాంశ, వాక్యశాఖల్లో లోతైన పరిశోధనలు చేశారు.

AP Board 9th Class Telugu Solutions ఉపవాచకం Chapter 5 ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి

ప్రశ్న 3.
భాషా పరిశోధనకు ఉద్యమించక మునుపు భద్రిరాజు కృష్ణమూర్తి జీవితం ఎలా సాగిందో వివరించండి.
జవాబు:
తిక్కన, శ్రీనాథుల సంప్రదాయ కవిత్వాన్ని ఆరాధించి, వాళ్ళకు దీటుగా ఛందోబద్ధ కవితా రచనతో సాహితీరంగంలో ప్రవేశించారు భద్రిరాజు కృష్ణమూర్తి. ప్రకాశం జిల్లా ఒంగోలులో ఒక సాధారణ కుటుంబంలో జన్మించిన ఈయన ‘చిన్నారి పొన్నారి చిరుత కూకటి నాడె….’ శ్రీనాథుని ప్రౌఢశైలిని తలపిస్తూ క్విట్ ఇండియా ఉద్యమ నేపథ్యంగా రచన చేసిన పెద్దల మన్ననలను పొందారు. ప్రౌఢత, ప్రసాదగుణం కలిగిన పద్యాలు అలవోకగా, రాయడమే గాక కృష్ణమూర్తి అవధానం కూడా చేసేవారు.

శ్రీగంటి జోగి సోమయాజులు గారి వద్ద సంప్రదాయ వ్యాకరణం నేర్చుకున్నారు ఈయన. ఆంధ్ర, ఉస్మానియా, వేంకటేశ్వర విశ్వవిద్యాలయాల్లో ట్యూటర్ గా, ఆచార్యులుగా, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఉపకులపతిగా పనిచేసారు. ప్రసిద్ధిగాంచిన విదేశీ విశ్వవిద్యాలయాల్లో సందర్శకాచార్యులుగా ఉన్నారు. తాను స్వయంగా రచించినవీ, సంపాదకత్వం వహించినవీ ఎన్నో గ్రంథాలు వెలుగులోనికి వచ్చాయి.

భాషా పరిశోధనకు ఉద్యమించక మునుపు భద్రిరాజు కృష్ణమూర్తిగారు ప్రొడత, ఆర్ధత కల్గిన కవిగా, అవధానిగా, సంప్రదాయ వ్యాకరణ అభ్యాసకునిగా, ట్యూటర్ గా, ఆచార్యునిగా, ఉపకులపతిగా, సందర్శకాచార్యులుగా, సంపాదకుడిగా ఇలా భిన్న పార్శ్వా లలో దర్శనమిస్తారు.

ప్రశ్న 4.
భద్రిరాజు కృష్ణమూర్తి భాషాసేవను గురించి రాయండి.
జవాబు:
భాషాక్షేత్రంలో చెరగని మైలురాళ్ళను, తరగని కీర్తి శిఖరాలను నిలిపారు భద్రిరాజు కృష్ణమూర్తిగారు. భాషా శాస్త్రాన్ని, భాషా చరిత్రనూ విశ్వవేదిక మీద నిలబడి నినదించి, తెలుగుజాతి కీర్తి కిరీటాన్ని రెపరెపలాడించిన వారు కృష్ణమూర్తిగారు. అంతేకాదు తెలుగు పుట్టు పూర్వోత్తరాల గురించి నిర్దుష్ట సమాచారాన్నందించిన వారు ఈయన. దక్షిణాసియా దేశాలన్నింటిలోనూ ప్రప్రథమంగా వృత్తి పదకోశాన్ని తయారుచేసినవారు భద్రిరాజు కృష్ణమూర్తి. గత శతాబ్దిలో అంతర్జాతీయ స్థాయిలో గొప్ప భాషా శాస్త్రవేత్తలలో భారతదేశానికి చెందిన ఇద్దరిలో కృష్ణమూర్తిగారొకరు.

భాషకు మాండలిక ఆవశ్యకతను గుర్తించి, వృత్తి పదకోశాల నిర్మాణాన్ని తన శిష్యుల సహకారంతో నిర్వహించారు. తొలి ప్రయత్నంగా వ్యవసాయ, చేనేత వృత్తి పదకోశాలను అందించారు. వీరి పరిశోధన తెలుగులోనే కాక “ద్రవిడియన్ లాంగ్వేజ్, కంపేరిటివ్ ద్రవిడియన్ లింగ్విస్టిక్ ……” వంటి రచనల ద్వారా ఇతర భాషలవాళ్ళు చేయవలసిన కృషికి ప్రేరణగా నిలిచాయి.

వయోజన విద్యావ్యాప్తి కోసం ‘జనవాచకం’, ‘తేలిక’ తెలుగువాచకం ఈయన రచించారు. శ్రీ పి. శివానందశర్మతో కలిసి ఇంగ్లీష్ ద్వారా తెలుగు నేర్చుకొనే వారికోసం ‘ఏ బేసిక్ కోర్స్ ఇన్ మోడ్రన్ తెలుగు’ రచించారు. ధ్వని, పదాంశ, వాక్యశాఖల్లో లోతైన పరిశోధనలు చేశారు. తన సిద్ధాంత గ్రంథం “తెలుగు వెర్బల్ బేసెస్’, ‘ద్రవిడ భాషల తులనాత్మక అధ్యయనం’ గ్రంథాల ద్వారా విశేష ఖ్యాతిని పొందారు. ఈ విధంగా భాష, భాషోత్పత్తి, లిపి, ప్రాచీనత, వైవిధ్యత, రూప పరిణామ క్రమం తదితర అనేకానేక అంశాలను విస్తృతంగా పరిశోధించి, ప్రామాణిక రచనలను ప్రకటించి ప్రపంచ భాషాభిమానుల, పరిశోధకుల గుండెల్లో చెరగని ముద్ర వేశారు భద్రిరాజు కృష్ణమూర్తి.

9th Class Telugu ఉపవాచకం 5th Lesson ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి Important Questions and Answers

I. అవగాహన – ప్రతిస్పందన

ఈ క్రింది వాక్యాలను సంఘటనలు ఆధారంగా వరుసక్రమంలో అమర్చి రాయండి.

ప్రశ్న 1.
అ) శ్రీ గంటి జోగి సోమయాజులు గారి వద్ద సంప్రదాయ వ్యాకరణం నేర్చుకున్నారు.
ఆ) ప్రకాశం జిల్లా ఒంగోలులో కృష్ణమూర్తి గారు 1928 జూన్ 19న జన్మించారు.
ఇ) 2012 ఆగస్టు 11న స్వల్ప అస్వస్థతతో దేహయాత్ర చాలించారు.
ఈ) ఆంధ్ర విశ్వవిద్యాలయంలో కృష్ణమూర్తి గారు ట్యూటర్‌గా పనిచేశారు.
జవాబు:
ఆ) ప్రకాశం జిల్లా ఒంగోలులో కృష్ణమూర్తి గారు 1928 జూన్ 19న జన్మించారు.
అ) శ్రీ గంటి జోగి సోమయాజులు గారి వద్ద సంప్రదాయ వ్యాకరణం నేర్చుకున్నారు.
ఈ) ఆంధ్ర విశ్వవిద్యాలయంలో కృష్ణమూర్తి గారు ట్యూటర్ గా పనిచేశారు.
ఇ) 2012 ఆగస్టు 11న స్వల్ప అస్వస్థతతో దేహయాత్ర చాలించారు.

AP Board 9th Class Telugu Solutions ఉపవాచకం Chapter 5 ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి

ప్రశ్న 2.
అ) వ్యవసాయ చేనేత వృత్తి పదకోశాలను అందించారు.
ఆ) 300 వృత్త పద్యాల్లో ‘మాతృ సందేశం’ అనే కావ్యం రచించి పెద్దల మన్ననలు పొందారు.
ఇ) హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఉపకులపతిగా పదవీ బాధ్యతలు నిర్వహించారు.
ఈ) కాలిఫోర్నియాలో ఎం.బి.ఎ.మినో గారి శిష్యరికంలో ధ్వని, పదాంశ, వాక్యశాఖల్లో పరిశోధనలు చేశారు.
జవాబు:
ఆ) 300 వృత్త పద్యాల్లో ‘మాతృ సందేశం’ అనే కావ్యం రచించి పెద్దల మన్ననలు పొందారు.
అ) వ్యవసాయ చేనేత వృత్తి పదకోశాలను అందించారు. ఈ) కాలిఫోర్నియాలో ఎం.బి.ఎ.మినో గారి శిష్యరికంలో ధ్వని, పదాంశ, వాక్యశాఖల్లో పరిశోధనలు చేశారు.
ఇ) హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఉపకులపతిగా పదవీ బాధ్యతలు నిర్వహించారు.

II. వ్యక్తీకరణ – సృజనాత్మకత

కింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
తెలుగుభాషకు వివిధ అంశాలలో సేవలు చేసిన మీకు తెలిసిన మహనీయుల పేర్లను రాయండి.
జవాబు:
భాషాశాస్త్రంలో దేశవిదేశాల్లో పేరెన్నికగన్నవారు చేకూరి రామారావుగారు. పాఠ్యగ్రంథ రచనల్లో బాగా పేరుగాంచిన రచయిత – ఆచార్య కె.కె. రంగనాధాచార్యులు. తెలుగు లిపి గురించి, పదప్రయోగాల గురించి అనేక అంశాలు సమగ్రంగా రచించినవారు – డా|| బూదరాజు రాధాకృష్ణగారు. తెలుగు అక్షర నిర్మాణం గురించి, ప్రత్యయాదుల ఉత్పాదకత గురించి ప్రయత్నించినవారు – డా|| ఉమామహేశ్వరరావు. మన రాష్ట్ర మాండలికాల్లో మధ్యమండలం కాక, మిగతా మూడు మాండలికాల్లో నవలా రచన చేసినవారు డా|| పోరంకి దక్షిణామూర్తిగారు. వీరంతా కాకలు తీరిన భాషా యోధులు.

ప్రశ్న 2.
భద్రిరాజు కృష్ణమూర్తిగారు విశిష్ట వ్యక్తి అని తెలుసుకున్నాం కదా ! క్లుప్తంగా వారి గురించి రాయండి.
జవాబు:
సంప్రదాయ కవిత్వంతో పాటు ఆధునిక ప్రామాణిక భాషా విషయంలో తెలుగుభాషకు అనన్య సామాన్యమైన సేవలందించిన విశిష్ట వ్యక్తి భద్రిరాజు కృష్ణమూర్తి. ఈయన గురించి – భాషాశాస్త్రాన్ని, భాషా చరిత్రనూ విశ్వ వేదిక మీద నిలబడి నినదించారు. తెలుగుజాతి కీర్తి కిరీటాన్ని రెపరెపలాడించారు. ద్రవిడ భాషల తీరు తెన్నుల గురించి తులనాత్మకంగా చర్చించి, భాషా పరిశోధకులకు కరదీపికగా నిలచారు. తెలుగు పుట్టుపూర్వోత్తరాల గురించి నిర్దుష్ట సమాచారాన్ని అందించినారు. వృత్తి పదకోశాన్ని అందించిన దక్షిణాసియా దేశాల్లో ప్రప్రథముడు. గత శతాబ్దిలో అంతర్జాతీయ స్థాయిలో గొప్ప భాషాశాస్త్రవేత్తలలో మనదేశానికి చెందిన ఇద్దరిలో ఒకరు. విద్యాబోధనలో వాడుకభాష వినియోగం గూర్చి గిడుగు, గురజాడల తర్వాత అంతటి కృషి చేసిన మహనీయులు. ఇలా ఎన్నో అంశాలు స్పృశించి, తెలుగువారి గుండెలలో సుస్థిర స్థానం పొందారు.

AP Board 9th Class Telugu Solutions ఉపవాచకం Chapter 5 ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి

ప్రశ్న 3.
భద్రిరాజు కృష్ణమూర్తిగారి వ్యక్తిత్వాన్ని క్లుప్తంగా రాయండి.
జవాబు:
తిక్కన, శ్రీనాథుల సంప్రదాయ కవిత్వాన్ని ఆరాధించి, వాళ్ళకు దీటుగా ఛందోబద్ధ కవితా రచన చేసారు కృష్ణమూర్తిగారు. నిబద్ధత, నిశిత పరిశీలన, మొక్కవోని దీక్ష ఆయనను సుప్రసిద్ధ పరిశోధకునిగా నిలబెట్టాయి. శిష్యుల పట్ల అపార వాత్యల్యాదరాలు చూపే ఉత్తమ ఆచార్యుడాయన. ఏ నిర్ణయానికైనా వెరవని పాలనాదక్షుడు. నిండైన ఆత్మవిశ్వాసం, ఆదర్శవంతమైన బోధన ఆయనకున్న రెండు కళ్ళు. అందరినీ ప్రేమించే సహృదయత మూర్తీభవించిన మహోన్నత వ్యక్తి భద్రిరాజు కృష్ణమూర్తిగారు.

ప్రశ్న 4.
భద్రిరాజు కృష్ణమూర్తిగారి రచనల పేర్లు రాయండి.
జవాబు:
‘చిన్నారి పొన్నారి చిరుత కూకటి నా……..’ శ్రీనాథుని ప్రొడశైలిని తలపిస్తూ ‘మాతృసందేశం’ 300 వృత్త పద్యాల్లో క్విట్ ఇండియా ఉద్యమ నేపథ్యంగా రచించి పెద్దల మన్ననలు పొందారు. ‘పితృస్మృతి’ వారి మరో గ్రంథం. మాండలిక వృత్తి పదకోశాలు, ద్రవిడియన్ లాంగ్వేజెస్, కం పేరిటివ్ ద్రవిడియన్ లింగ్విస్టిక్స్, కరెంట్ పర్స్ పెక్టివ్స్, లాంగ్వేజ్ – ఎడ్యుకేషన్ అండ్ సొసైటీ అనునవి ఇతర రచనలు. వీరి సిద్ధాంత గ్రంథం ‘తెలుగు వెర్బల్ బేసెస్’ ప్రపంచ ఖ్యాతినార్జించి పెట్టింది. ‘ద్రవిడ భాషల తులనాత్మక అధ్యయనం’ కాల్వెల్డ్ రచనకు దీటైనది.

AP Board 9th Class Telugu Solutions Chapter 3 శివతాండవం

AP State Syllabus AP Board 9th Class Telugu Textbook Solutions Chapter 3 శివతాండవం Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Telugu Solutions 3rd Lesson శివతాండవం

9th Class Telugu 3rd Lesson శివతాండవం Textbook Questions and Answers

చదవండి-ఆలోచించండి-చెప్పండి

నా గానపు స్వరలయలకు శివుడు తాండవించాడట నా గానపు గతికి జతికి గణపతి నర్తించాడట నా గానపు మధురిమలకు కృష్ణమురళి మోగిందట నా గానపు రసఝరిలో ప్రకృతి నాట్య మాడిందట

ప్రశ్నలు జవాబులు

ప్రశ్న 1.
ఈ పంక్తులు దేని గురించి చెబుతున్నాయి?
జవాబు:
గాన మహిమ గురించి చెబుతున్నాయి.

ప్రశ్న 2.
ఈ పంక్తులలోని ముఖ్యమైన పదాలేవి?
జవాబు:
తాండవం, నర్తించడం, నాట్యమాడటం.

ప్రశ్న 3.
ఈ పంక్తులు వింటున్నప్పుడు లేదా చదువుతున్నప్పుడు మీరు పొందిన అనుభూతి ఏమిటి?
జవాబు:
గానం యొక్క గొప్పదనానికి ఒళ్ళు పులకరించింది.

AP Board 9th Class Telugu Solutions Chapter 3 శివతాండవం

ప్రశ్న 4.
ఇలాంటి గేయం మీకు తెలుసా?
జవాబు:
పుట్టపర్తి నారాయణాచార్యులు గారు “శివతాండవం” గేయం రాశారనీ, అందులో గేయ పంక్తులు ఇలాగే ఉంటాయనీ మా గురువులు చెప్పగా విన్నాను. శివతాండవంలోని కొన్ని గేయ పంక్తులు ఇవి.
ఉదా :
1) బంగరు పులుగుల వలె మబ్బులు విరిసినవి.
2) వియచ్చర కాంతలు జలదాంగనలై వచ్చిరొయేమో.
3) అలలై బంగరు కలలై.

ఇవి చేయండి

I. అవగాహన – ప్రతిస్పందన

అ) కింది అంశాలను గురించి మాట్లాడండి.

ప్రశ్న 1.
మీకు తెలిసిన నాట్యరీతుల గురించి చెప్పండి.
జవాబు:
కూచిపూడి, భరతనాట్యం, కథక్, కథాకళి, మోహినీ అట్టం.

ప్రశ్న 2.
‘శివతాండవం’ గేయాన్ని లయబద్దంగా పాడండి. ఇది వింటున్నప్పుడు మీకు ఎలా అనిపించిందో చెప్పండి.
జవాబు:
అచ్చ తెలుగు పదాల అందం తెలిసింది. గేయం వినసొంపుగా ఉండి, తెలియని ఆనందం కలుగుతుంది.

ప్రశ్న 3.
పుట్టపర్తి నారాయణాచార్యులు శివతాండవాన్ని “నల్లకలువలు విచ్చుకొన్నట్లు, నల్లని కొండలు పగిలినట్లు, చీకట్లు వ్యాపించినట్లు” – ఇలా ఎన్నో అంశాలతో పోల్చారు కదా ! ఇలాంటి పోలికల ద్వారా మీరేం గ్రహించారు?
జవాబు:
ప్రకృతిని కవి చక్కగా వర్ణించాడు. ఈ వర్ణన ద్వారా శివుని తాండవాన్ని మన కన్నులకు కట్టేలా చూపగలిగాడు.

AP Board 9th Class Telugu Solutions Chapter 3 శివతాండవం

ఆ) గేయంలో అంత్యప్రాస పదాలు ఏమున్నాయి? పాఠ్యభాగంలో గుర్తించి కింద గీత గీయండి.
జవాబు:
శివుడు భవుడు; పూయ ఘోయ; విధాన; అట్లు

ఇ) కింది గద్యం చదివి, ప్రశ్నలకు జవాబులివ్వండి.

మహాశివుడు ఆనందంతో నాట్యం చేస్తూ తన చేతిలోని డమరుకాన్ని 14 మార్లు మోగించాడు. ఆ ధ్వని విశ్వవ్యాప్తమైంది. పాణిని అలా వెలువడ్డ శబ్దాలను స్వీకరించి సంస్కృత భాషలో సూత్రమయమైన వ్యాకరణాన్ని రచించాడు. “అ ఇ ఉణ్, ఋ, ఇక్ ……. అంటూ 14 మాహేశ్వర సూత్రాలతో తన వ్యాకరణ రచన ఆరంభించాడు. ప్రపంచ వాజ్మయంలో పాణిని సంస్కృత వ్యాకరణం సర్వోత్తమమైనది.

ప్రశ్న 1.
శివుడు డమరుకం ఎందుకు మోగించాడు?
జవాబు:
శివుడు ఆనందంతో నాట్యం చేస్తూ తన చేతిలోని డమరుకాన్ని మోగించాడు.

ప్రశ్న 2.
పాణిని వ్యాకరణం గొప్పతనం ఏమిటి?
జవాబు:
ప్రపంచ వాజ్మయంలో పాణిని సంస్కృత వ్యాకరణం సర్వోత్తమమైనది.

ప్రశ్న 3.
పై సన్నివేశం దేనికి ప్రారంభంగా చెప్పవచ్చు?
జవాబు:
పాణిని సంస్కృత వ్యాకరణ రచనకు ప్రారంభంగా చెప్పవచ్చు.

ఈ) కింది ప్రశ్నలకు పాఠ్యాంశం నుండి సంక్షిప్తంగా సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
పాఠంలో గేయంలోని మొదటి చరణం చదవండి. శివతాండవాన్ని కవి ఎలా వర్ణించాడో రాయండి.
జవాబు:
స్వచ్ఛమైన వెన్నెల విరబూసినట్లుగా, అందమైన పూలను కుప్పపోసినట్లుగా, తెల్లని విబూదితో పూత పెట్టినట్లుగా, మంచు కుప్పలుగా పేర్చినట్లుగా, మంచి ముత్యాలను ఏర్చికూర్చినట్లుగా, సరిపోల్చలేని అమృతాన్ని పంచి పెట్టినట్లుగా, పచ్చ కర్పూరాన్ని తెచ్చి కలియజల్లినట్లుగా, మనసులోని ఆనందమంతా కళ్ళ నుండి వెలువడినట్లుగా, చురుకైన నీలపు కళ్ళలో కాంతులు వెల్లివిరిసేలా, ఘల్లు ఘల్లుమని చిలిపి గజ్జెలు మోగుతుండగా ఆడుతూ పాడుతున్నాడు శివుడు.

AP Board 9th Class Telugu Solutions Chapter 3 శివతాండవం

ప్రశ్న 2.
‘తమ్ములై’ – అంటూ సాగిన గేయంలో శివుని నాట్యాన్ని కవి కొన్ని పూలతో పోల్చాడు. వాటిని తెలపండి.
జవాబు:
శివుని తాండవం తామరపూలు విప్పారినట్లుంది. శుభాలనిచ్చేదిగా ఉంది. అప్పుడే విచ్చిన తాజా పూమొగ్గల్లా, వికసించిన పూలలా ఉంది. తుమ్మెదలచే కప్పబడిన తామరలా ఉంది. కొత్త రత్నాల్లాగా ఉంది.

ప్రశ్న 3.
తెల్లదనాన్ని తెలిపే కొన్ని అంశాలతో శివతాండవాన్ని పోల్చారు. ఉదాహరణకు ‘వెన్నెల కురుస్తున్నట్టు’ మొదలైనవి. ఇలాంటి అంశాలను కొన్నింటిని రాయండి.
జవాబు:
శివుని తాండవం స్వచ్ఛమైన వెన్నెల విరబూసినట్లు, తెల్లని విబూదితో పూత పెట్టినట్లు ఉంది. జాజిపూలను కుప్పలుగా పోసినట్లు, మంచును కుప్పలుగా పేర్చినట్లుంది. మంచి ముత్యాలను ఏర్చికూర్చినట్లు, పచ్చ కర్పూరం కలియజల్లినట్లుగా ఉంది. ఇంకా ఆనందం కన్నుల నుండి కారుతున్నట్లుగా, అమృతాన్ని పంచినట్లుగా ఉంది.

ప్రశ్న 4.
శివుని నాట్యాన్ని వర్ణించే కొన్ని పంక్తులను రాసి, వాటిని వివరించండి.
జవాబు:
మబ్బుగము లుబ్బికొని ప్రబ్బికొన్న విధాన
అబ్బురపు నీలములు లిబ్బి సేరు విధాన
నల్లకలువలు దిక్కులెల్ల విచ్చు విధాన
మొల్లముగ దుమ్మెదలు మొనసికొన్న విధాన
నగలు కాటుకకొండ పగిలి చెదరు విధాన
తగిలి చీకటులు గొప్పగ గప్పెడు విధాన
తనలోని తామసము కనుల జారు విధాన
తనలోని వక్రతయె కనుల దీరు విధాన
కులుకు నీలపు గండ్ల దళుకు జూపులు బూయ
ఘలు ఘల్లుమని కాళ్ళ జిలిపి గజ్జెలు మ్రోయ
ఆడెనమ్మా ! శివుడు!
పాడెనమ్మా! భవుడు

శివుని తాండవం మబ్బులన్నీ నీటి ఆవిరితో కూడి, అలముకొన్నట్లుగా ఉంది. అద్భుతమైన నీలమణులను ఒకే చోట పేర్చినట్లుగా, నల్లకలువలు దిక్కులంతా వికసించినట్లుగా ఉంది. తుమ్మెదలు ఒక చోట చేరి ముసిరి ఉన్నట్లుగా అందంగా ఉంది. కాటుక కొండ పగలగా కాటుకంతా చెదరిపోయినట్లుగా ఉంది. చీకట్లు ఒక్కసారిగా కమ్ముకున్నట్లుగా శోభాయమానంగా ఉంది. తనలోని అజ్ఞానమంతా కళ్ళనుంచి కారిపోతున్నట్లుగా, మనస్సులోని వంకరలన్నీ కళ్ళలో కనిపిస్తున్నట్లుగా ఉంది. చురుకు నీలపు కళ్ళలో కాంతులు వికసిస్తుండగా పాదాలకున్న గజ్జెలు మోగుతుండగా ఆడుతూ పాడుతున్నాడు శివుడు.

ఇందులో నలుపే ఎక్కువగా వర్ణించబడింది. సాధారణంగా, నలుపును అశుభసూచకంగా లోకం భావిస్తుంది. కానీ నలుపు కూడా దైవ స్వరూపమే అని కవి చెప్పడం వలన లోకంలో దైవ స్వరూపం కానిదేదీ లేదనే భావన కలుగుతుంది.

II. వ్యక్తీకరణ-సృజనాత్మకత

అ) కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాలలో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
వసంతశోభ ఎలా కమ్ముకుందో సొంతమాటల్లో రాయండి.
జవాబు:
వసంత ఋతువు ఆరంభం కాగానే ఎండిన చెట్లకు జీవం వచ్చి క్రమంగా లేజిగురాకులు రాసాగాయి. చెట్లు, తీగలు, పూలతో నిండి కొత్త శోభను వెదజల్లుతున్నాయి. లేజిగురాకుల ఎర్రని సోయగం వింత కాంతిని విరజిమ్ముతుంది. ఎక్కడ చూసినా పచ్చదనంతో ఆహ్లాదకరంగా ఉంది. పూలపై నుంచి వచ్చే పరిమళాలతో కూడిన గాలులు జనాలను ఉత్సాహ పరుస్తున్నాయి. మామిడి చిగుళ్ళను తిని మదించిన కోయిలల కుహూ రాగాలతో ఆనందకర వాతావరణం ఏర్పడుతుంది.

AP Board 9th Class Telugu Solutions Chapter 3 శివతాండవం

ప్రశ్న 2.
ఈ పాఠ్యభాగంలోని కవి వర్ణనల్లో మీకు బాగా నచ్చిన అంశమేది? అది ఎందుకు నచ్చింది? వివరించండి.
జవాబు:
పాఠ్యభాగంలోని కవి వర్ణనల్లో నాకు బాగా నచ్చిన అంశం ఏమిటంటే – శివుని తాండవం అలలు కదలినట్లుగా, చిరుగాలికి ఆకులు కదలినట్లుగా ఉంది. తామర పూలు కదలినట్లు, పూలలోని సువాసనలు గాలిలో వ్యాపించినట్లుంది. తెరపై బొమ్మలు నటనను ప్రదర్శించినట్లుంది. కమ్మని కస్తూరి పరిమళ వీణలు మోగినట్లు, నెమలి అందమైన తన పింఛాన్ని విప్పినట్లుంది. గాలికి చిగురాకులు ఒయ్యారంగా కదిలినట్లు, నవ్వులో లేత వలపు జాలువారినట్లుంది. చురుకైన నీలపు కళ్ళలో కాంతులు విరబూస్తుండగా, ఘల్లు ఘల్లుమని పాదాలకున్న చిలిపి గజ్జెలు మోగేలా శివుడు ఆడుతూ పాడుతున్నాడు. నెమలి పురివిప్పి ఆడడం, అలలు కదలడం, సువాసనలు వ్యాపించడం, గాలికి ఆకులు కదలడం, తెరపై బొమ్మలు నటించడం, నవ్వులో ప్రేమ ఒలకపోయడం ఇవన్నీ నిత్య జీవితంలో మన కెదురయ్యే అనుభవాలు. ఇలాంటి వాటితో శివతాండవాన్ని పోల్చడం వలన అది మన కనుల ముందు కన్పిస్తున్న భావన కలుగుతుంది. అందువలన ఈ భాగం నాకు బాగా నచ్చింది.

ప్రశ్న 3.
“శివుని తాండవం కర్పూరం చల్లినట్లుంద”ని కవి భావించాడు. దాని ఆంతర్యాన్ని మీరు ఏమని భావిస్తున్నారు?
జవాబు:
పచ్చకర్పూరం తెల్లగా ప్రకాశిస్తుంది. చల్లదనాన్ని కలిగిస్తుంది. ఇంతేగాక వింత పరిమళాన్ని వెదజల్లుతుంది. శివతాండవాన్ని కవి పచ్చకర్పూరంతో పోల్చడం వలన తెల్లదనం ఎలా అంతా వ్యాపిస్తుందో అలా తాండవం దిక్కులంతా వ్యాపించింది. ఎంతసేపు చూసినా కళ్ళకు అలసట కలుగకుండా చల్లదనాన్ని కలిగిస్తుంది. తాండవ సమయంలో శివుని ఒంటికి పూసుకున్న విబూది ఆ ప్రాంతమంతా రాలిపడడం వలన కవి దాన్ని ‘ఘనసారం’ తో పోల్చి ఉంటాడు.

ఆ) కింది ప్రశ్నలకు పదిహేనేసి పంక్తుల్లో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
శివతాండవం గేయ సారాంశాన్ని సొంతమాటల్లో రాయండి.
(లేదా)
సత్వరజస్తమీగుణ ప్రధానంగా సాగిన శివతాండవాన్ని మీ సొంతమాటల్లో వివరించండి.
(లేదా)
పుట్టపర్తి వారు శివుని తాండవాన్ని ఏ విధంగా వర్ణించారో మీ సొంతమాటల్లో రాయండి.
జవాబు:
స్వచ్ఛమైన వెన్నెల విరియబూసినట్లుగా, అందమైన జాజిపూలను కుప్పలుగా పోసినట్లుగా, తెల్లని విభూతి పొరలు పొరలుగా ఉన్నట్లు మంచి ముత్యాలను ఏరి కూర్చినట్లుగా, మంచు కుప్పలుగా పేర్చినట్లుగా, సరిపోల్చలేని అమృతాన్ని పంచిపెట్టినట్లుగా, పచ్చకర్పూరాన్ని తెచ్చి కల్లాపు జల్లినట్లుగా శివతాండవం ఉంది. మనసులోని ఆనందమంతా కళ్ళ నుండి వెలువడినట్లుగా, చురుకైన నీలపు కళ్ళలో కాంతులు విరిసేలా, ఘల్లు ఘల్లుమని చిలిపి గజ్జెలు మోగుతుండగా శివుడు ఆడుతూ పాడుతున్నాడు.

శివుని తాండవం మబ్బులన్నీ నీటిఆవిరితో కూడి అలముకొన్నట్లుగా ఉంది. అద్భుతమైన నీలమణులను ఒకేచోట పేర్చినట్లుగా, నల్ల కలువలు దిక్కులంతా వికసించినట్లుగా ఉంది. తుమ్మెదలు ఒకచోట చేరి ముసిరికొన్నట్లుగా అందంగా ఉంది. కాటుక కొండ పగలగా కాటుకంతా చెదరిపోయినట్లుగా ఉంది. చీకట్లు ఒక్కసారిగా కమ్ముకొన్నట్లు శోభాయమానంగా ఉంది. తనలోని అజ్ఞానమంతా కళ్ళ నుంచి కారిపోతున్నట్లుగా ఉంది. మనస్సులోని వంకరలన్నీ కళ్ళలో కన్పిస్తున్నట్లుంది.

తామరపూలు విప్పారినట్లుంది. పూర్వజన్మ పుణ్యం ఆకారం దాల్చినట్లుంది. శాస్త్ర సంపదను పెంచేదై ఉంది. అప్పుడే వికసించిన పూలలా ఉంది. తుమ్మెదలు ముసిరిన పద్మాలలా ఉంది. చక్కని హావ భావాలతో కూడి ఉంది. కొత్త హారాలలాగా, మంచి నవ్వులాగా ఉంది. కనుకొలకుల సోకులా ఉంది. ఎర్రని లేజిగురాకులా ఉంది. అనురాగపు గుర్తులతో కూడి ఉంది. మైమరపును (తంద్రను) కలిగించేదిగా ఉంది.

ఇంకా శివుడు అలలు కదలినట్లుగా, చిరు గాలికి ఆకులు కదిలినట్లుగా పాడుతూ తాండవం చేస్తున్నాడు. శివతాండవం తామర పూలు కదలినట్లు, పూల సువాసనలు గాలిలో వ్యాపించినట్లుంది. కమ్మని కస్తూరి పరిమళాలు వెల్లివిరిసినట్లుంది. నెమలి పురివిప్పి ఆడినట్లుంది. గాలికి చిగురాకులు ఒయ్యారంగా కదలినట్లు, నవ్వులో ప్రేమంతా ఒలకబోసినట్లుంది.

AP Board 9th Class Telugu Solutions Chapter 3 శివతాండవం

ప్రశ్న 2.
శివుడు నర్తించిన విధానంలో ప్రత్యేకతలు ఏమున్నాయి? (లేదా) త్రిగుణాలను తన నాట్యంలో ఆవిష్కరించినట్లు పుట్టపర్తివారిచే వర్ణించబడిన శివతాండవాన్ని గూర్చి రాయండి.
జవాబు:
శివుడు చేసిన ఆనంద తాండవంలో ప్రత్యేకతలను కవి సంకేతాలతో సూచించాడు. ఆ వెన్నెల విరబూసినట్లుందన్నాడు. కాంతికి, చల్లదనానికి ఇది సంకేతం. జాజిపూలు పరిమళానికి, విబూది స్వచ్ఛతకు గుర్తులు. మంచు నిర్మలత్వానికి, మంచి ముత్యాలు అందానికి చిహ్నాలు. పచ్చకర్పూరం రోగనిర్మూలనం కోసం వాడతాం. అమృతం దైవత్వానికి గుర్తు. ఇక -ఇవన్నీ తెల్లదనాన్ని కలిగి ఉన్నాయి. తెలుపు సత్వగుణానికి గుర్తుగా ఆధ్యాత్మికవేత్తలు చెప్తారు.

తామరలలో కొన్ని ఎర్రవి ఉంటాయి. చిగురాకులు ఎర్రగా ఉంటాయి. కనుకొలకులు ఎర్రగా ఉంటాయి. మాణిక్యాల వంటి రత్నాలు ఎర్రగా ఉంటాయి. అనురాగం (ప్రేమ) వలన ముఖంలోని బుగ్గలు వంటి భాగాలు ఎర్రబడతాయి. వీటినే “రక్తిచిహ్నాలు” అని అంటారు. తండ్రి అంటే బద్దకంతో కూడిన మైమరపు. ఇది రజోగుణ సంబంధమైనది. ఎరుపు రజోగుణానికి గుర్తు. తాండవం క్రమంగా ఉదృతంగా మారుతుందని చెప్పడం దీని ప్రత్యేకత.

నల్లని మబ్బులు కమ్ముకొన్నట్లుగా, నీలమణులను ఒకేచోట పేర్చినట్లుగా, నల్లకలువలు దిక్కులంతా వికసించినట్లుగా, తుమ్మెదలు ఒకే చోట చేరినట్టుగా తాండవం ఉంది. కాటుక కొండ పగిలిపోగా కాటుకంతా చెదరిపోయినట్లుగా చీకట్లు ఒక్కసారిగా కమ్మినట్లు, అజ్ఞానం కన్నుల నుండి కారినట్లుంది. ఇంకా మనస్సులోని వంకరలు కళ్ళలో కనిపించినట్లుంది. ఇవన్నీ నల్లదనాన్ని కలిగి ఉన్నాయి. నలుపు తమోగుణానికి గుర్తు.

సత్వ – రజ – తమోగుణాల కలయిక వలన సృష్టి ఏర్పడింది. పరమాత్మ పరమశివుడు గనుక ఆయన తాండవంలో ఈ మూడు గుణాలు వ్యక్తమైనట్లు వర్ణించబడటం ఒక ప్రత్యేకతను సంతరించుకొంది.

ప్రశ్న 3.
పాఠం ఆధారంగా కవి శివుని నాట్యాన్ని ఏయే ప్రకృతి అంశాలతో పోల్చాడో వివరంగా రాయండి.
జవాబు:
కవి శివుని నాట్యాన్ని చాలా ప్రకృతి అంశాలతో అందంగా పోల్చాడు. స్వచ్ఛమైన వెన్నెల విరబూసినట్లుగా ఉందన్నాడు. జాజిపూలను కుప్పలుగా పేర్చినట్లు, మంచును కుప్పలుగా చేసినట్లుందన్నాడు. మబ్బులన్నీ నీటి ఆవిరితో కూడి ఆకాశమంతా పరచుకొన్నట్లు, నల్ల కలువలు దిక్కులంతా .వికసించినట్లుందన్నాడు. తుమ్మెదలన్నీ ఒకే చోట ముసిరికొన్నట్లు, కాటుక కొండ పగిలినట్లుందన్నాడు. .చీకట్లు ఒక్కసారిగా కమ్ముకొచ్చినట్లు శోభాయమానంగా ఉందన్నాడు. తామరలు విప్పారినట్లు, అప్పుడే వికసించిన పూలలా ఉందన్నాడు. తుమ్మెదలు ముసిరిన పద్మాలలాగా, ఎర్రని లేజిగురాకులాగా ఉందన్నాడు. సముద్రంలో అలలు కదిలినట్లు, చిరుగాలికి ఆకులు కదలినట్లుందన్నాడు. తామరపూలు కదలినట్లు, పూల సువాసనలు గాలిలో వ్యాపించినట్లుందన్నాడు. కమ్మని కస్తూరి పరిమళంలా, నెమలి అందంగా తన పింఛాన్ని విప్పినట్లుందన్నాడు. గాలికి చిగురాకులు ఒయ్యారంగా కదలినట్లుందన్నాడు.

AP Board 9th Class Telugu Solutions Chapter 3 శివతాండవం

ఇ) సృజనాత్మకంగా రాయండి.

ప్రశ్న 1.
ఈ గేయంలో “పొరలు లేచినయట్లు”, “విరులు కదలినయట్లు” మొదలైన అంత్యప్రాసలున్నాయి కదా ! ఇవి చదువుతుంటే లయాత్మకంగా ఉండడం వల్ల ఆనందం కలుగుతుంది. ఇలాంటి వాటిని కొన్నింటిని గ్రహించి వాటితో చిన్న కవిత గాని, గేయం గాని రాయండి.
జవాబు:
కవిత :
తెలుగుభాషా భవిష్యత్తు

తెలుగు భాషా భవిష్యత్తు
చేస్తుందోయి కసరత్తు
ఇతర భాషల సరసన
చూపుతుందా తన సత్తు
పోషకులే కరువై
పీక్కుంటుందా తన జుత్తు
తెలుగు బాలల సహకారంతో
వదిలిస్తుందా పరభాషల మత్తు
చేస్తుందా ఎన్నటికైనా
అన్యభాషలను చిత్తు
కోరుతున్నా దేవుణ్ణి
చేయాలని ఈ గమ్మత్తు!! – యస్. కె. చక్రవర్తి.

గేయం :
(హెచ్చరిక!!)
హెచ్చరిక! ఆంధ్రుడా హెచ్చరిక!
వినకుంటే నీ మనుగడ సాగదిక!
తల్లిపాలను నేలపాలు చేస్తూ
దాదిపాలకై అర్రులు చాపావంటే
నీ భాషా సంస్కృతులను విస్మరిస్తూ
పరభాషా సంస్కృతులకై పరుగులిడినావంటే
|| హెచ్చరిక||

నీ మాన ప్రాణాలను పణంగా పెడుతూ
పరులను పరమోన్నతులుగా పరిగణిస్తే
నీ భాషా జాతులను పరాభవిస్తూ
పరుల పదోన్నతికై పరిశ్రమిస్తే
నీ భాషా జాతీయాలను నట్టేట కలుపుతూ
అన్యభాషా సంస్కృతులతో అద్వైతసిద్ధి సాధిస్తే
|| హెచ్చరిక||

నిన్ను నీవే నిన్నాకరిస్తూ
పరసేవా పరాయణుడవైతే
నీ నీతి నీ జాతిరీతులను నిప్పుల గుండంలో నిలిపితే
నీవనేదీ నీదనేదీ నీకేదీ మిగలదిక || 2 ||
విన్నపము నీకిదే వినుమో వివేక శూన్యుడా !
వినకుంటే నీకిదే మరణశాసన మాంధ్రుడా !!
– యస్. కె. చక్రవర్తి.

AP Board 9th Class Telugu Solutions Chapter 3 శివతాండవం

ఈ) ప్రశంసాత్మకంగా రాయండి.

ప్రశ్న 1.
పుట్టపర్తి నారాయణాచార్యులు గారు అంత్యప్రాసలతో శివతాండవాన్ని, దాని సౌందర్యాన్ని వర్ణిస్తూ రాసిన విధానాన్ని చూశారు కదా ! దీనివల్ల మీరు పొందిన అనుభూతిని మీ ‘దినచర్య’ లో రాయండి. ఉపాధ్యాయులకు చూపండి.
జవాబు:
ఈ రోజు పాఠశాలలో “శివతాండవం” – అనే పాఠం చెప్పారు. పుట్టపర్తి నారాయణాచార్యులు గారు “శివతాండవం” అనే గేయకావ్యాన్ని రచిస్తే దానిలో కొద్ది భాగం మాకు పాఠ్యాంశంగా ఉంచారని తెలుగు భాషోపాధ్యాయులు గారు చెప్పారు. గేయాన్ని లయబద్దంగా పాడుతూ మాచేత కూడా పాడించారు.

ఈ గేయం నన్నెంతగానో ఆకట్టుకుంది. ఇందులో వాడిన అచ్చ తెలుగు పదాలు ఊరిన మాగాయ ముక్కల్లా రసవత్తరంగా, రుచికరంగా ఉన్నాయి. ఇందులోని పదాలలో నేను చదవని కొత్త పదాలే ఎక్కువ. కానీ విచిత్రంగా పదాల అర్థం తెలియకపోయినా భావం అర్థమవుతూ తెలియని ఆనందాన్ని కలిగిస్తుంది. సత్త్వ – రజ – తమో గుణాలకు చిహ్నాలైన తెలుపు – ఎరుపు – నలుపు రంగులను తాండవానికి అన్వయిస్తూ చెప్పిన తీరు ఎంతో ఆకర్షణీయంగా ఉంది. “తమ్ములై, ఘటిత మోదమ్ములై” – వంటి అనుప్రాసలతో కూడిన పదాలు గేయానికి ఒక కొత్త ఊపును ఇచ్చాయి.

అలలు కదలినట్లు, చిరుగాలికి ఆకులు కదలినట్లు, తామరపూలు కదలినట్లు, సువాసన వ్యాపించినట్లు, తెరపై బొమ్మలు నటించినట్లు, చిగురాకులు ఒయ్యారంగా కదలినట్లు, నవ్వులో ప్రేమ జాలువారినట్లు – ఇలాంటి ఉపమానాలు మన రోజువారీ జీవితంలో కనిపించేవే, మనల్ని తెలియని లోకాలకు తీసుకెళ్ళేవే. మన శ్రమని, కాలాన్ని మరచేలా చేసేవే. ఇలాంటి వాటితో ‘శివతాండవాన్ని’ పోల్చడం వల్ల మన ఊహకు అందేలా, మనో నేత్రాలకు కనిపించేలా కవి చేయగలిగాడు. ఈ గేయం చదివినప్పుడూ, మిత్రులు చదువుతుంటే విన్నప్పుడూ, శివునిలా తాండవం చేయలేకపోయినా, కనీసం చిందువేయాలనైనా మనస్సుకు బలంగా అనిపిస్తుంది. ఒక చిన్న గేయభాగమే వినే వారిలో లేక చదివే వారిలో ఇలాంటి కదలిక తీసుకురాగలిగిందంటే, వింతైన అనుభూతిని కలిగించిందంటే కవి ఎంతటి ఆనందాన్ని అనుభవిస్తూ రాశాడో అని అన్పిస్తున్నది.

కవికి తెలుగు పదాల మీద మంచి పట్టు ఉంది. అచ్చ తెలుగు పదాలతో ఆయన గేయాన్ని నడిపించిన తీరు ‘శివతాండవాన్ని’ తలపిస్తుంది. అందుకనే ఆ మహానుభావుణ్ణి “సరస్వతీ పుత్రుడు” అనే బిరుదుతో గౌరవించారేమో పెద్దలు. ఈ గేయం చదివాక నాలో తెలియకుండానే ప్రకృతి ప్రేమ, తెలుగు భాషాభిరుచి పెరిగాయి. చక్కని పదాలతో గేయాలు అల్లాలనే ఉత్సుకత ఉరకలేస్తున్నది.

IV. ప్రాజెక్టు పని

మీ గ్రామంలో/ పట్టణంలో రకరకాల కళాకారులుంటారు. ఒగ్గు కథ చెప్పేవాళ్ళు, బుర్రకథలు చెప్పేవాళ్ళు, చిందు భాగవతులు, హరికథలు చెప్పేవారు…… ఇలాంటి వారి వివరాలు సేకరించండి. వారి ప్రదర్శనల గురించి వివరాలు అడిగి తెలుసుకోండి, రాయండి.
జవాబు:
1) బుర్రకథలు :
బుర్రకథలను తంబుర కథలని, డక్కీ కథలని వివిధ పేర్లతో పిలుస్తారు. వీటిలో వీరగాథలకు సంబంధించిన కథలే ఎక్కువ ఉంటాయి. బుర్రకథను చెప్పడానికి ముగ్గురు వ్యక్తులు కావాలి. మధ్య వ్యక్తి కథ చెపుతూ తంబురా వాయిస్తాడు. ఆయనకు రెండు ప్రక్కలా నిలబడి గొంతు కలిపేవాళ్ళను ‘వంతలు’ అని అంటారు. వంతలు డక్కీలు వాయిస్తారు. కథకునికి ఒక ప్రక్క వ్యక్తి హాస్యంగా మాట్లాడుతుంటే, రెండవవైపు వ్యక్తి కథకు తగిన వివరణ చెపుతుంటాడు.

బుర్రకథలో మొదట కథకుడు సరస్వతిని, మహాలక్ష్మిని, దుర్గనూ ప్రార్థిస్తాడు. దీనిలో సాధారణంగా ‘వినరా భారత వీరకుమారా విజయం మనదేరా ……. తందాన తాన, తందాన, తానే తందనాన’ అంటూ వంతలు పాడుతారు. కథ పూర్తి అయ్యాక మంగళం పాడతారు. బుర్రకథలలో అల్లూరి సీతారామరాజు – ఝాన్సీ లక్ష్మీబాయి – బాలచంద్రుడు మొదలైన కథలు ప్రసిద్ధి పొందాయి. ‘నాజర్’ బుర్రకథా పితామహుడుగా ప్రసిద్ధి చెందాడు.

జానపదకళల్లో బుర్రకథ ఎంతో ప్రాచుర్యాన్ని పొందింది. ముఖ్యంగా స్వాతంత్ర్యోద్యమ పోరాట సమయంలో బుర్రకథ ప్రజలను చైతన్యపరచింది.

2) తోలుబొమ్మలాట :
ఈ ఆటను ఊరి బయట వేదిక పైన రాత్రి సమయంలో ప్రారంభించి తెల్లవారే వరకు ఆడతారు. మూడు వైపుల మూసి ఉన్న పందిరి వేస్తారు. ముందువైపు తెల్లని తెర లాంటి పల్చని గుడ్డను కడతారు. పూర్వం ఈ ఆటలాడేటప్పుడు తెరవెనుక ఆముదపు దీపాలు వెలిగించేవారు. తరువాత పెట్రోమాక్స్ దీపాలు, విద్యుద్దీపాలు వచ్చాయి. ఈ దీపాల కాంతి వల్ల చీకటిలో కూర్చున్న వారికి తోలుబొమ్మలు సజీవంగా ఉన్నట్లు కనబడతాయి.

పురుష పాత్రల వెనుక మగవారు, స్త్రీ పాత్రల వెనుక ఆడవారు ఉండి పాత్రలకు అనుగుణంగా మాట్లాడతారు. రామాయణం, భారతం కథలను ప్రదర్శిస్తారు. ప్రేక్షకుల నిద్రమత్తు పోవడానికి ఆట మధ్యలో హాస్యగాళ్ళు అయిన జుట్టుపోలిగాడు, బంగారక్క, కేతిగాడు పాల్గొని ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తారు.

ఈ బొమ్మలను తెరమీద సులభంగా ఆడించేందుకు సన్నటి వెదురు బద్దలను బొమ్మల మధ్యలో కడతారు. బొమ్మల సంభాషణకు తగినట్లుగా ఆడించాలంటే ఆ వెదురు బద్దే ఆధారం. ఆ బద్ద సహాయంతో బొమ్మలను అటు ఇటు తిప్పుతూ ఆడిస్తారు.

ముఖ్యంగా ఈ బొమ్మలను తయారు చేసేటప్పుడు రాముడు, కృష్ణుడు, సీత వంటి పవిత్రమైన పాత్రలకు ఒక రకమైన చర్మాన్ని; రావణాసురుడు, కంసుడు వంటి ప్రతినాయక పాత్రలకు వేరొక రకమైన చర్మాన్ని ఉపయోగిస్తారు. ఈ తోలుబొమ్మలాటలు ఆడేవారిని ‘దేశదిమ్మరులు’ అంటారు. వీరు దేశమంతా తిరుగుతూ ప్రదర్శనలు ఇస్తారు. ‘రామాయణ, మహాభారతాలకు సంబంధించిన కథలనే ఎక్కువగా ప్రదర్శిస్తారు. మన రాష్ట్రంలో తూర్పు గోదావరి జిల్లా తోలుబొమ్మలాటకు ప్రసిద్ధి చెందింది. కానీ నేడు ఈ జానపదకళ కనుమరుగైందనే చెప్పవచ్చు.

3) హరికథ :
హరికథ అంటే విష్ణుకథ. హరికథలు భక్తికి సంబంధించినవి. ఈ కథ చెప్పేవారిని భాగవతార్ అని, హరిదాసని పిలుస్తారు. హరికథ చెప్పేవారు పట్టుపంచె కట్టుకొని నుదుట నామం, మెడలో పూలదండ వేసుకుంటారు. చేతిలో చిడతలు పట్టుకొని, కాళ్ళకు గజ్జెలు కట్టుకుంటారు. నడుముకు ఉత్తరీయం బిగించుకుంటారు. “శ్రీమద్రమారమణ గోవిందోహరి” అని గోవింద కొట్టించి కథ ప్రారంభిస్తారు. ఎన్నో గంటల పాటు కథకుడు అన్ని పాత్రలలో జీవిస్తూ, అభినయం చేస్తూ ప్రేక్షకులు విసుగు చెందకుండా మధ్యమధ్య పిట్టకథలు చెప్తూ హరికథా గానం చేస్తాడు.

ఆదిభట్ల నారాయణదాసు గారిని “హరికథా పితామహుడ”ని అంటారు.

III. భాషాంశాలు

పదజాలం

అ) కింది పదాలకు సమానార్ధక పదాలను పాఠం నుండి గ్రహించి రాయండి. వాటితో వాక్యాలు రాయండి.
1. తామరలై : తమ్ములై, తమ్మివిరులై
1) పగడాలతో చేసిన ఆభరణాలు తమ్ములై (పద్మాలై) భాసిస్తున్నాయి.
2) ఈత కొలనులో అందం కోసం ఉంచిన ప్లాస్టిక్ పూలు నిజమైన తమ్మివిరులై శోభిస్తున్నాయి.

2. సంతోషాలై : సంతసములై, మోదమ్ములై
1) మా ఊరి యువకుడు కలెక్టరుగా ఉద్యోగాన్ని పొందడం, అతడు మా పాఠశాల పూర్వ విద్యార్థి కావడం సంతస – (కారణ) ములైనాయి.
2) అన్నయ్య ప్రభుత్వోద్యోగాన్ని పొందడం, అక్కకు మెడిసిన్లో సీటు రావడం అమ్మానాన్నలకు మోదమ్ములైనాయి.

3. మొగ్గలై : నవకోరకమ్ములై, కోరకములై
1) మల్లె చెట్టుపై ఉన్న మంచు బిందువులు నవకోరకమ్ములై రాజిల్లుతున్నాయి.
2) ప్లాస్టిక్ జాజి తీగకు ఉన్న మొగ్గలు సహజమైన కోరకములై శోభిస్తున్నాయి.

4. హొయల నడకలై : వగలువోయినట్లు
1) గాలికి చిగురుటాకులు వగలు వోయినట్లుగా ఉంది.

AP Board 9th Class Telugu Solutions Chapter 3 శివతాండవం

ఆ) కింది వాక్యాల్లో ఒకే అర్థానిచ్చే పదాల్ని గుర్తించి, వేరు చేసి రాయండి.

1. వెన్నెల విరగకాస్తే హాయి కలుగుతుంది. ఆ కౌముది చల్లదనాన్నిస్తుంది. మన కవులు అనేకులు తమ కావ్యాల్లో చంద్రికల్ని వర్ణించారు.
జవాబు:
వెన్నెల విరగకాస్తే హాయి కలుగుతుంది. ఆ కౌముది చల్లదనాన్ని ఇస్తుంది. మన కవులు. అనేకులు తమ కావ్యాల్లో చంద్రికల్ని వర్ణించారు.
వెన్నెల – కౌముది – చంద్రికలు

2. సూర్యుడు అస్తమించగానే అంధకారం అలముకుంది. ఆ కమస్సు భయం కలిగిస్తుంది. అందుకే చీకట్లో ప్రయాణం మంచిది కాదంటారు పెద్దలు.
జవాబు:
సూర్యుడు అస్తమించగానే అంధకారం అలముకుంది. ఆ తమస్సు భయం కలిగిస్తుంది. అందుకే చీకట్లో ప్రయాణం మంచిది కాదంటారు పెద్దలు.
అంధకారం – తమస్సు – చీకటి.

3. ఆహా ! ఏమి తావి! బహుశా ఈ పరిమళం గులాబీతోట నుండి కాబోలు! భగవంతుడు పుష్పాలకు మంచి సౌరభాన్ని కూడా అందించి గొప్ప పని చేశాడు.
జవాబు:
ఆహా ! ఏమి తావి ! బహుశా, ఈ పరిమళం గులాబీతోట నుండి కాబోలు! భగవంతుడు పుష్పాలకు మంచి సౌరభాన్ని కూడా అందించి గొప్ప పని చేశాడు.
తావి – పరిమళం – సౌరభము

ఇ) కింది పదాలకు పాఠం ఆధారంగా వికృతి పదాల్ని గుర్తించి రాయండి.
1) అపూర్వం – అబ్బురం
2) మౌక్తికం – ముత్తెం
3) సంతోషం – సంతసం

ఈ) కింది పదాలకు అదే అర్థం వచ్చే మరి రెండు పదాలను రాయండి.
1) చలికొండ – మంచుకొండ, హిమవత్పర్వతం
2) పుష్పం – విరి, కుసుమం, సుమం, పువ్వు
3) మోదం – సంతోషం, ఆనందం, ప్రమోదం
4) కిసలయం – చిగురాకు, లేతాకు
5) తరగలు – అలలు, తరంగాలు

వ్యాకరణం

ఆ) కింది సంధులకు సంబంధించిన ఉదాహరణలను పాఠంలో వెతికి రాయండి. విడదీసి, సంధి సూత్రం రాయండి.

1. ఉత్వసంధి:
ఆడెను + అమ్మా = ఆడెనమ్మా
పాడెను + అమ్మా = పాడెనమ్మా
1) మబ్బుగములు + ఉబ్బికొని = మబ్బుగములుబ్బికొని
2) తమ్ములు + ఐ = తమ్ములై
3) మోదమ్ములు + ఐ = మోదమ్ములై
4) రూపమ్ములు + ఐ = రూపమ్ములై
5) భాగ్యమ్ములు + = భాగ్యమ్ములై
6) కోరకమ్ములు + ఐ = కోరకమ్ములై
7) పుష్పమ్ములు + ఐ = పుష్పమ్ములై
8) మంద్రమ్ములు + ఐ = మంద్రమ్ములై
9) ఫుల్లమ్ములు + ఐ = ఫుల్లమ్ము
10) హారమ్ములు + ఐ = హారమ్ములై
11) హాసమ్ములు + ఐ = హాసమ్ములై
12) సొమ్ములు + ఐ = సొమ్ములై
13) కిసలమ్ములు + ఐ = కిసలమ్ములై
14) చిహ్నమ్ములు + ఐ = చిహ్నమ్ములై
15) గమనమ్ములు + ఐ = గమనమ్ములై
16) దిక్కులు + ఎల్ల = దిక్కులెల్ల

ఉత్వ సంధి సూత్రం:
హ్రస్వమైన ఉకారానికి అచ్చు పరమైతే సంధి జరుగుతుంది.

AP Board 9th Class Telugu Solutions Chapter 3 శివతాండవం

2. సరళాదేశ సంధి:
1) పూతన్ + పెట్టుట = పూతఁబెట్టుట
2) కనులన్ + జారు = కనులజారు
3) ఘనసారమును + తెచ్చి = ఘనసారమునుదెచ్చి
4) కలయ + చల్లు = కలయజల్లు
5) కనులన్ + తీరు = కనులఁదీరు
6) కండ్లన్ + తళుకు = కండ్లఁదళుకు
7) తళుకున్ + చూపులు = తళుకుఁజూపులు
8) కాళ్ళన్ + చిలిపి = కాళ్ళఁజిలిపి
9) మొల్లముగన్ + తుమ్మెదలు = మొల్లముగఁదుమ్మెదలు
10) గొప్పగన్ + కప్పెడు = గొప్పగఁగప్పెడు
11) కనులన్ + తీరు = కనులఁదీరు
12) గెడన్ + కూడి = గెడఁగూడి
13) తరగలను + చిరుగాలి = తరగలఁజిరుగాలి
14) చిరుగాలిలోన్ + తమ్మివిరులు = చిరుగాలిలోఁదమ్మివిరులు
15) కన్ + కొనల = కల్గొనల

సరళాదేశ సంధి సూత్రం :
1) ద్రుత ప్రకృతికం మీది పరుషాలకు సరళాలు వస్తాయి.
2) ఆదేశ సరళాలకు ముందున్న ద్రుతానికి బిందు, సంశ్లేషలు విభాషగా వస్తాయి.

3. యడాగమ సంధి :
1) వక్రత + ఎ = వక్రతయె
2) లేచిన + అట్లు = లేచినయట్లు
3) కదలిన + అట్లు = కదలినయట్లు
4) పరిఢవించిన + అట్లు = పరిఢవించినయట్లు
5) విరిసిన + అట్లు = విరిసినయట్లు
6) విప్పిన + అట్లు = విప్పినయట్లు
7) పోయిన + అట్లు = పోయినయట్లు
8) జారిన + అట్లు = జారినయట్లు

యడాగమ సంధి సూత్రం :
1) సంధి జరగని చోట అచ్చు కంటె పరమైన అచ్చుకు యడాగమం వస్తుంది.

AP Board 9th Class Telugu Solutions Chapter 3 శివతాండవం

4. గసడదవాదేశ సంధి :
1) పూత + పెట్టుట = పూతబెట్టుట
2) దెట్టులు + కట్టిన = దెట్టులుగట్టిన
3) కుప్పలు + కూర్చిన = కుప్పలుగూర్చిన
4) చూపులు + పూయ = చూపులుబూయ
5) విరులు + కదలిన = విరులుగదలిన
6) వీణా + కడగి = వీణెగడగి
7) నెమ్మి + తన = నెమ్మిదన
8) వగలు + పోయిన = వగలు వోయిన

గసడదవాదేశ సంధి సూత్రం :
1) ప్రథమము మీది పరుషములకు గసడదవలగు.

ఆ) టుగాగమ సంధి : కింది పదాలను పరిశీలించండి.
ఉదా :
1) నిలువు + అద్దం = నిలువుటద్దం
2) తేనె + ఈగ = తేనెటీగ
3) పల్లె + ఊరు = పల్లెటూరు

గమనిక :
వీటిలో సంధి జరిగినపుడు ‘ట్’ అదనంగా వచ్చి చేరుతుంది. ఇలా ‘ట్’ వర్ణం వచ్చే సంధిని ‘టుగాగమ సంధి’ అంటారు.

అట్లే కింది పదాలను కూడా పరిశీలించండి.
చిగురు + ఆకు = చిగురుటాకు / చిగురాకు
పొదరు + ఇల్లు = పొదరుటిల్లు / పొదరిల్లు

వీటిలో ‘ట్’ అనే వర్ణం సంధి జరిగినపుడు రావచ్చు, రాకపోవచ్చు. ‘ట్’ వస్తే టుగాగమం అవుతుంది. ‘ట్’ రాకుంటే ఉత్వసంధి అవుతుంది.

సూత్రం :
కర్మధారయములందు ఉత్తునకు అచ్చు పరమగునప్పుడు టుగాగమంబగు. కింది పదాలను విడదీసి రాయండి.
1) పడకటిల్లు = పడక + ఇల్లు
2) కరకుటమ్ము = కరకు + అమ్ము
3) నిక్కంపుటుత్తర్వు = నిక్కంపు + ఉత్తర్వు
4) నిగ్గుటద్దం = నిగ్గు + అద్దం

ఇ) లు,ల,న, ల సంధి :
లు – ల – న – లకు జరిగే సంధిని లు, ల, న, ల సంధి అంటారు.

సూత్రం :
లు, ల, న లు పరమైనపుడు, ఒక్కొక్కప్పుడు ము వర్ణానికి లోపమూ, దాని పూర్వ స్వరానికి దీర్ఘమూ విభాషగా వస్తాయి.
ఉదా :
1) పుస్తకము + లు = పుస్తకాలు
2) దేశము + ల = దేశాల
3) జీవితము + న = జీవితాన
4) గ్రంథము + లు = గ్రంథాలు
5) రాష్ట్రము + ల = రాష్ట్రాల
6)వృక్షము + న = వృక్షాన

మరి కొన్ని ఉదాహరణలు :
1) వజ్రము + లు = వజ్రాలు
2) రత్నము + ల = రత్నాల
3) వాచకము + ల = వాచకాల
4) కేసరము + లు = కేసరాలు
5) గ్రంథము + లు = గ్రంథాలు
6) హారము + న = హారాన
7) విషయము + లు = విషయాలు
8) చుట్టము + లు = చుట్టాలు

ఈ) విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
విశేషణ పూర్వపద కర్మధారయ సమాసానికి సంబంధించిన ఉదాహరణలు ప్రస్తుత పాఠంలో వెతికి రాయండి.

కర్మధారయ సమాసం :
విశేషణానికి, విశేష్యానికి (నామవాచకానికి) చేసే సమాసాన్ని కర్మధారయ సమాసం అంటారు.
ఉదా :
నల్లకలువ

విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం :
కర్మధారయ సమాసంలో పూర్వ (మొదటి) పదం విశేషణమైతే దాన్ని విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అంటారు.
ఉదా :
చిలిపి గజ్జెలు – చిలిపివైన గజ్జెలు – చిలిపి (విశేషణం) – గజ్జెలు (నామవాచకం)

ప్రస్తుత పాఠంలోని ఉదాహరణలు :
1) తరితీపు వెన్నెలలు – తరితీపులైన వెన్నెలలు
2) నెరజాజులు – నెరయైన జాజులు
3) తెలిబూది – తెల్లనైన బూది
4) చలికొండ – చల్లనైన కొండ
5) ఘనసారము – ఘనమైన సారము
6) నీలపుగండ్లు – నీలమైన కండ్లు
7) అబ్బురపు నీలములు – అబ్బురమైన నీలములు
8) నల్లకలువలు – నల్లనైన కలువలు
9) లేవలపు – లేతయైన వలపు
10) నవకోరకమ్ములు – నవమైన కోరకమ్ములు
11) వికచపుష్పములు – వికచములైన పుష్పములు
12) నూత్నహారమ్ములు – నూతనమైన హారమ్ములు
13) వల్గుహాసమ్ములు – వల్గులైన హాసమ్ములు
14) రక్తకిసలయములు – రకములైన (ఎర్రనైన) కిసలయములు
15) తంద్రగమనమ్ములు – తంద్రమైన గమనమ్ములు
16) చిరుగాలి – చిరుత (కొంచమైన) యైన గాలి
17) కమ్మకస్తురి – కమ్మనైన కస్తురి
18) చిగురుటాకులు – చిగురులైన ఆకులు

AP Board 9th Class Telugu Solutions Chapter 3 శివతాండవం

ఉ) సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం :
‘సంభావన’ అంటే ‘సంజ్ఞ’ అని అర్థం. అంటే పేరు మొదలైనవి. కర్మధారయ సమాసంలో మొదటి పదం ‘సంజ్ఞా వాచకమైనట్లైతే దాన్ని సంభావనా పూర్వపదకర్మధారయ సమాసం’ అంటారు.

‘తమ్మి విరులు’ అనే సమాసంలో మొదట పదమైన ‘తమ్మి ‘ ఏ రకం విరులో (తామరపూలు) తెలియజేస్తుంది. ఇలా పూర్వపదం నదులూ, వృక్షాలూ, ప్రాంతాలూ మొదలైన వాటి పేర్లను సూచిస్తే దాన్ని ‘సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం’ అంటారు.
ఉదా :
1) మర్రిచెట్టు – మర్రి అనే పేరుగల చెట్టు
2) గంగానది – గంగా అనే పేరుగల నది
3) భారతదేశం – భారతం అనే పేరు గల దేశం

సంభావనా పూర్వపద కర్మధారయ సమాసానికి మరికొన్ని ఉదాహరణలు.
1. వింధ్య పర్వతం – వింధ్య అనే పేరు గల పర్వతం
2. కృష్ణానది – కృష్ణ అనే పేరు గల నది
3. అరేబియా సముద్రం ‘అరేబియా’ అనే పేరు గల సముద్రం
4. విజయవాడ నగరం – విజయవాడ అనే పేరు గల నగరం
5. తెలుగుభాష – తెలుగు అనే పేరు గల భాష
6. హిమాలయ పర్వతం – హిమాలయమనే పేరు గల పర్వతం అని
7. నర్మదానదం – నర్మద అనే పేరు గల నదం.

9th Class Telugu 3rd Lesson శివతాండవం కవి పరిచయం

పుట్టపర్తి నారాయణాచార్యులు (1914 – 1990) స్వస్థలం అనంతపురం జిల్లా చియ్యేడు గ్రామం. 14 భాషల్లో ప్రవీణులు. 8 భాషల్లో కవిత్వం చెప్పగల దిట్ట. సంగీత, నాట్య శాస్త్రాల్లో సంపూర్ణ పాండిత్యం కలవారు. “సరస్వతీ పుత్ర” వీరి బిరుదు. శివతాండవం, మేఘదూతం, షాజీ, కావ్యమాల, జనప్రియ రామాయణం, పండరీ భాగవతం, సాక్షాత్కారం మొదలైన రచనలు చేశారు. ‘లీవ్స్ ఇన్ ద విండ్’ అనే ఆంగ్ల కావ్యం కూడా వీరి రచనే! వీరు రాసిన శివతాండవం సంగీత సాహిత్య నాట్య సంకేతాల సమ్మేళనం. పుట్టపర్తి రచనల్లో దేశభక్తి, సాంస్కృతిక విలువలు, జాతీయ భావాలు, మానవీయ విలువలు తొణికిసలాడతాయి.

గేయాలు – ప్రతి పదార్థాలు-భావాలు

1వ గేయం :
ఆడెనమ్మా ! శివుడు
పాడెనమ్మా ! భవుడు
తరితీపు వెన్నెలలు విరిసికొన్న విధాన
నెరజాజులవి కుప్ప నెరసికొన్న విధాన
తెలిబూది పూత చెట్టులు గట్టిన విధాన
చలికొండ మంచు కుపులు గూర్చిన విధాన
పొసగ ముత్తెపు సరుల్పోహళించు విధాన
అసదృశము నమృతంబు నామతించు విధాన
ఘనసారమును దెచ్చి కలయజల్లు విధాన
మనసులో సంతసము గనుల జారు విధాన
కులుకు నీలపుగండ్ల దళుకు జూపులు బూయ
ఘలు ఘల్లుమని కాళ్ళ జిలిపి గజ్జెలు మ్రోయ
ఆడెనమ్మా ! శివుడు !
పాడెనమ్మా ! భవుడు
ప్రతిపదార్థం :
తరితీపు = స్వచ్ఛమైన
వెన్నెలలు = చంద్రుని తెల్లని కాంతులు
విరిసికొన్న విధాన = ఉప్పొంగినట్లు (కురిసినట్లు)
నెరజాజులు + అవి = ఆ అందమైన జాజిపూలు
కుప్ప నెరసికొన్న విధాన = కుప్పలు పోసినట్లుగా
తెలిబూదిపూత = తెల్లని విభూతి (విబూది) పూత
దెట్టులు + కట్టిన విధాన = అతిశయించిన విధంగా (మిక్కిలి ఎక్కువగా ఉన్నట్లు)
చలికొండ = హిమాలయము ( హిమగిరి)న
మంచు = మంచును
కుప్పలు + కూర్చిన విధాన = ప్రోగులు పెట్టినట్లు
పొసగన్ = సరిపడేటట్లు (పొత్తుగా, తగిన విధంగా)
ముత్తెము + సరుల్ = ముత్యాలహారాలు
పోహళించు విధాన = కూర్చినట్లుగా
అసదృశమున్ = అనన్య సామాన్యమైన
అమృతంబున్ = అమృతమును
ఆమతించు విధాన = విందు చేసినట్లు (పంచినట్లు)గా
ఘనసారమును + తెచ్చి = పచ్చ కర్పూరమును తెచ్చి
కలయన్ + చల్లు విధాన = అంతటా చల్లే రీతిగా
మనసులోన = మనస్సులో గల
సంతసము = సంతోషం (ఆనందం)
కనులన్ + జారువిధాన = కన్నుల నుండి జారుతున్నట్లుగా
కులుకు = ఒప్పెన (చురుకైన)
నీలపు గండ్ల (నీలము +కండ్ల) = నీలవర్ణము గల కన్నుల యొక్క
తళుకు + చూపులు = మెఱసే చూపుల కాంతులు
పూయన్ = విరబూయగా
ఘల్లుఘల్లుమని = ఘల్లుఘల్లుమని
కాళ్ళ = కాళ్ళకు కట్టుకొన్న
చిలిపి గజ్జెలు = చిరుగజ్జెలు; (చిన్నగజ్జెలు)
మ్రోయన్ = ధ్వనింపగా
ఆడెనమ్మా శివుడు = శివుడు ఆడుతున్నాడు
పాడెనమ్మా భవుడు = శివుడు పాడుతున్నాడు

భావం :
నిర్మలమైన వెన్నెల కురుస్తున్నట్లుగా, అందమైన జాజిపూలు కుప్పపోసినట్లుగా, తెల్లని విబూది చెట్టులు కట్టి నట్లుగా, మంచుకొండపై మంచు కుప్పలు పోసినట్లుగా, మృదువైన ముత్యాల హారాలను కూర్చినట్లుగా, అనన్య సామాన్యమైన అమృతాన్ని విందు చేసినట్లుగా (పంచినట్లుగా), పచ్చ కర్పూరాన్ని తెచ్చి అన్ని వైపులా చల్లినట్లుగా, మనస్సులోని సంతోషం కళ్ళల్లోంచి జారునట్లుగా, చురుకైన నీలపు కన్నుల తళుకు చూపుల కాంతులు విరబూసినట్లుగా, ఘల్లు ఘల్లుమని చిరుగజ్జెలు మోగుతుండగా శివుడు ఆడుతున్నాడు. శివుడు పాడుతున్నాడు.

విశేషం :
దీనిలో చెప్పిన పోలికలన్నీ తెల్లదనాన్ని ప్రతిబింబిస్తున్నాయి. తెలుపు యొక్క సంకేతం స్వచ్ఛతకూ, పవిత్రతకూ నిదర్శనం. శివుడి తాండవం వల్ల ఆనందం అంతటా నిండిందని కవి తలంపు. శివునిలో సత్త్వగుణం వెల్లివిరిసిందని భావం. సత్త్వగుణం. తెలుపు రంగును సూచిస్తుంది.

AP Board 9th Class Telugu Solutions Chapter 3 శివతాండవం

2వ గేయం :
మబ్బుగము లుబ్బికొని ప్రబ్బి కొన్న విధాన
అబ్బురపు నీలములు లిబ్బిసేరు విధాన
నల్లకలువలు దిక్కులెల్ల విచ్చు విధాన
మొల్లముగ దుమ్మెదలు మొనసికొన్న విధాన
నగలు కాటుకకొండ పగిలి చెదరు విధాన
తగిలి చీకటులు గొప్పగ గప్పెడు విధాన
తనలోని తామసము కనుల జారు విధాన
తనలోని వక్రతయె కనుల దీరు విధాన
కులుకు నీలపు గండ్ల దళుకు జూపులు బూయ
ఘలు ఘల్లుమని కాళ్ళ జిలిపి గజ్జెలు మ్రోయ
ఆడెనమ్మా ! శివుడు!
పాడెనమ్మా! భవుడు
ప్రతిపదార్థం :
మబ్బుగములు = మేఘాల యొక్క సమూహాలు
ఉబ్బికొని = అతిశయించి (దట్టముగా)
ప్రబ్బికొన్న విధాన = అలముకొన్న విధంగా
అబ్బురము + నీలములు = అపూర్వమైన ఇంద్రనీలమణులు
లిబ్బి + చేరు విధాన = కుప్ప పోసినట్లుగా (ఒకదానిపై ఒకటి పేర్చినట్లుగా)
నల్ల కలువలు = నల్ల కలువపూలు
దిక్కులు + ఎల్ల = దిక్కులంతటా
విచ్చు విధాన = విచ్చుకున్నట్లుగా (విరిసిన విధంగా)
మొల్లముగ = గుంపుగా (ముసురుకొని)
తుమ్మెదలు = తుమ్మెదలు
మొనసికొన్న విధానన్ = శోభిల్లిన విధంగా
అగలు = పగిలే
కాటుక కొండ = నల్లని కొండ
పగిలి, చెదరు విధాన = బ్రద్దలయి, చెల్లాచెదరయినట్లు
తగిలి = సంభవించి (కలిగి)
చీకటులు = చీకట్లు
గొప్పగ = అధికంగా
కప్పెడు విధాన = వ్యాపించినట్లుగా
తనలోనన్ = తనలోనున్న
తామసము = తమస్సు అనే గుణము
కనులన్ = కన్నుల నుండి
జారువిధాన = జారే విధంగా
తనలోని వక్రతయె (వక్రత + ఎ) = తనలోనున్న వక్రత్వములే
కనులన్ + తీరువిధాన = కళ్ళల్లో కన్పిస్తున్నట్లుగా
కులుకు నీలము + కండ్లన్ = ఒప్పెన (చురుకైన), నీలవర్ణముగల కన్నుల యొక్క
తళుకు + చూపులు = మెఱసే చూపుల కాంతులు
పూయన్ = విరబూయగా
ఘలు ఘల్లుమని = ఘల్లు ఘల్లుమని
కాళ్ళ = కాళ్ళకున్న
చిలిపి గజ్జెలు = చిరుగజ్జెలు
మ్రోయన్ = ధ్వనింపగా
ఆడెనమ్మా శివుడు = శివుడు ఆడుతున్నాడు
పాడెనమ్మా భవుడు = శివుడు పాడుతున్నాడు

భావం :
మేఘాలన్నీ ఒక్కసారిగా అలముకున్నట్లుగా, అద్భుతమైన నీలమణులు ఒకచోట పేర్చినట్లుగా, నల్లకలువలు దిక్కులన్నిటా విచ్చుకున్నట్లుగా, తుమ్మెదలు ముసురుకొని శోభిస్తున్నట్లుగా, నల్లని కొండలు పగిలి ముక్కలయినట్లుగా, ఒక్కసారి చీకట్లు వ్యాపించినట్లుగా, తనలోని తమస్సు కళ్ళల్లోంచి జారుతున్నట్లుగా, తనలోని వక్రతలు కళ్ళల్లో కన్పిస్తున్నట్లుగా, చురుకైన నీలపు కళ్ళలో కాంతులు విరబూయగా, పాదాల గజ్జెలు ఘల్లుఘల్లుమని మోగుతుండగా శివుడు ఆడుతున్నాడు. శివుడు పాడుతున్నాడు.

విశేషం :
ఇందులో వర్ణించబడినవి అన్నీ నీలవర్ణము గలవి. సృష్టిలో నలుపురంగు కూడా అద్భుతమైనదని కవి చెప్పారు. శివునిలో తమోగుణం (నల్లనిది) వ్యాపించిందని భావం.

3వ గేయం :
తమ్ములై, ఘటిత మోదమ్ములై, సుకృత రూ
పమ్ములై, శాస్త్ర భాగ్యమ్ములై, నవకోర
కమ్ములై, వికచ పుష్పమ్ములై, తుమ్మెదల
తమ్ములై, భావ మంద్రమ్ములై, హావపు
ల్లమ్ములై, నూత్నహారమ్ములై, వల్గు
హాసమ్ములై, కనల సొమ్ములై, విశ్రాంతి
దమ్ములై, రక్త కిసలమ్ములై, రక్తి చి
హ్నమ్ములై, తంద్ర గమనమ్ములై, గెడగూడి
కులుకు నీలపు గండ్ల దళుకు జూపులు బూయ
ఘలు ఘల్లుమని కాళ్ళ జిలిపిగజ్జెలు మ్రోయ
ఆడెనమ్మా ! శివుడు !
పాడెనమ్మా! భవుడు
ప్రతిపదార్థం :
తమ్ములు + ఐ = తామర పూలై
ఘటిత మోదమ్ములు + ఐ = కలిగింపబడిన, సంతోషము కలవై (సంతోషాన్ని కలించేవై)
సుకృత రూపమ్ములు + ఐ = మంగళప్రదమైన రూపము కలవై
శాస్త్ర భాగ్యమ్ములు + ఐ = శాస్త్రంలో చెప్పబడిన విధంగా సంపదతో నిండినవై
నవ కోరకమ్ములు + ఐ = క్రొత్త పూలమొగ్గలై
వికచ పుష్పమ్ములు + ఐ = వికసించిన పుష్పముల వలెనై
తుమ్మెదల తమ్ములు + ఐ = తుమ్మెదలు వాలిన తామరలై
భావ మంద్రమ్ములు+ ఐ = భావ గంభీరములై
హావ ఫుల్లమ్ములు + ఐ = వికసించిన శృంగార భావము కలవై
నూత్న హారమ్ములు + ఐ = క్రొత్త హారాలై
వల్గు హాసమ్ములై = చక్కని నవ్వులై
కల్గొనల సొమ్ములై = కంటికొలకుల సోకులై
విశ్రాంతి దమ్ములై = విశ్రాంతి నిచ్చేవై
రక్త కిసలమ్ములై = ఎఱ్ఱని చివుళ్ళె
రక్తి చిహ్నమ్ములై = అనురాగానికి గుర్తులై
తంద్ర గమనమ్ములై = తూగు నడకలు కలవై
కెడగూడి = జతగూడి
కులుకు నీలపుగండ్ల = చురుకైన, నీలవర్ణంగల కన్నుల
తళుకుచూపులు + పూయ – తళతళ కాంతులు విరబూయగా
ఘలు ఘల్లుమని = ఘల్లు ఘల్లుమని
కాళ్ళ చిలిపి గజ్జెలు మ్రోయ = కాళ్ళకున్న చిరుగజ్జెలు ధ్వని చేస్తుండగా
ఆడెనమ్మా! శివుడు = శివుడు ఆడుతున్నాడు
పాడెనమ్మా! భవుడు = శివుడు పాడుతున్నాడు

భావం :
శివుని నాట్యం తామరపూవులవలె గొప్ప సంతోషాన్ని చేకూర్చింది. ఆ నాట్యం శుభప్రదరూపంతో, శాస్త్రీయ సంపదతో నిండి ఉంది. కొత్త పూల మొగ్గల్లా, వికసించిన పువ్వుల్లా, తుమ్మెదలు వాలిన తామరల్లా, భావ గంభీరములై, వికసించిన హావభావములై, కొత్త హారములై, చక్కని నవ్వులై, కనుగొలకుల సోకులై; విశ్రాంతి నిచ్చేవై, ఎఱ్ఱని చిగురులై, అనురాగ చిహ్నాలై, తూగు నడకలతో జతగలసి, చురుకైన నీలపు కన్నుల కాంతులు విరబూయగా, ఘల్లు ఘల్లుమని పాదాలకు ఉన్న చిరు గజ్జెలు మ్రోగుతుండగా శివుడు ఆడుతున్నాడు. శివుడు పాడుతున్నాడు.

విశేషం : ఈ గేయంలో వర్ణించబడినవన్నీ ఎఱుపు రంగుతో నిండినవి. అనగా శివుడు చేసే తాండవ నృత్యం రానురానూ ఉద్ధృతమై, ఆనందాన్ని ఇస్తోందని వర్ణించడం ఈ వర్ణనలోని ప్రత్యేకత. ఎఱుపు రజోగుణానికి ప్రతీక. కవి శివునిలో రజోగుణ ఉద్ధృతిని ఇక్కడ వర్ణించారు.

AP Board 9th Class Telugu Solutions Chapter 3 శివతాండవం

4వ గేయం:
తరగలను జిరుగాలి పొరలు లేచిన యట్లు
చిరుగాలిలో దమ్మి విరులు గదలిన యట్లు
విరులలో నును తావి తెరలు లేచినయట్లు
తెరలపై చిత్రాలు పరిఢవించిన యట్లు
కమ్మ కస్తురి వీణె గడగి విరసిన యట్లు
నెమ్మి దన పింఛమ్ము నెమ్మి విప్పిన యట్లు
చిగురుటాకులు గాలి వగలు వోయిన యట్లు
నగవులో లేవలపు బిగువు జారినయట్లు
కులుకు నీలపు గండ్ల దళుకు జూపులు బూయ
ఘలు ఘల్లుమని కాళ్ళ జిలిపి గజ్జెలు మ్రోయ
ఆడెనమ్మా ! శివుడు !
పాడెనమ్మా! భవుడు
ప్రతిపదార్థం :
తరగలను = అలలలో (కెరటములలో నుండి)
చిరుగాలి = నెమ్మదిగా గాలి
పొరలు లేచిన + అట్లు = పొరలు పొరలుగా పైకి లేచిన విధంగా
చిరుగాలిలో = మంద వాయువులో
తమ్మి విరులు = పద్మములు (తామర పద్మములు అనే పూలు)
ఘలు ఘల్లుమని = ఘల్లు ఘల్లుమని
కాళ్ళ = కాళ్ళకు కట్టబడిన
చిలిపి గజ్జెలు = చిరు గజ్జెలు
తెరలు లేచిన + యట్లు = తెరలు తెరలుగా వ్యాపించినట్లు
తెరలపై = తెరలపై
చిత్రాలు = బొమ్మలు
పరిఢవించిన + అట్లు = అతిశయించిన విధంగా
కమ్మ కస్తురి వీణా = శ్రావ్యమైన పరిమళ వీణ
కడగి విరసిన + అట్లు = మ్రోగిన విధంగా
నెమ్మి = నెమలి
తన పింఛమ్మున్ = తన పింఛాన్ని
నెమ్మి = ప్రీతితో (సంతోషంతో)
విప్పిన + అట్లు = విప్పిన విధంగా
చిగురుటాకులు (చిగురు + ఆకులు) = చిగురాకులు (త ఆకులు)
గాలిన్ = గాలికి
వగలు + పోయిన + అట్లు = ఒయ్యారాలు పోయిన విధంగా
నగవులో = నవ్వులో
లేవలపు = లేత కోరిక
బిగువుజారిన + అట్లు = బింకము తగ్గిన విధంగా
కులుకు = చురుకైన
నీలపుగండ్ల (నీలము +కండ్ల) = నీలికన్నుల
తళుకు + చూపులు = తళతళ కాంతులు
పూయన్ = విరబూయగా
కదలిన + అట్లు = కదలిన విధంగా
విరులలో = పూలలో
నునుతావి = చిరు సువాసన
మ్రోయన్ = ధ్వనిస్తుండగా
ఆడెనమ్మా శివుడు = శివుడు ఆడుతున్నాడు
పాడెనమ్మా భవుడు = శివుడు పాడుతున్నాడు

భావం :
అలలపై చిరుగాలి పొరలు లేచినట్లు, చిరుగాలికి పద్మములు కదలినట్లు, పూలలో నుండి సువాసనలు తెరలు తెరలుగా పైకి వ్యాపించినట్లు, తెరలపై బొమ్మలు నటనను ప్రదర్శించినట్లు, శ్రావ్యమైన పరిమళ వీణలు మ్రోగినట్లు, నెమలి తన అందమైన పింఛాన్ని విప్పినట్లు, గాలికి చిగురుటాకులు ఒయ్యారాలు పోయినట్లు, లేత నవ్వులు ఒలికినట్లు, చురుకైన నీలపు కళ్ళు కాంతులు విరబూయగా, ఘల్లు ఘల్లుమని పాదాలకు ఉన్న చిరుగజ్జెలు మ్రోగుతుండగా శివుడు ఆడుతున్నాడు. శివుడు పాడుతున్నాడు.

విశేషం :
శివతాండవంలో అలలు కదలడం అనేది గంభీరతకు గుర్తు. పరిమళాలు వ్యాపించడం, నెమలి నాట్యం చేయడం, చిగురాకుల ఒయ్యారాలూ సౌకుమార్యానికి ప్రతిబింబాలు. శివుని తాండవంలో గంభీరత, సౌకుమార్యమూ కలగలసి అద్భుతంగా అందాన్ని ఆవిష్కరించడమే ఇక్కడి విశేషం. మొత్తంగా శివతాండవంలో ప్రకృతి ప్రతిబింబించింది. ప్రకృతి వర్ణన పదాల కూర్పు, అలంకారాలతో కూడి మరింత సౌందర్యాన్ని చేకూర్చింది.

AP Board 9th Class Telugu Solutions ఉపవాచకం Chapter 4 గిడుగు వెంకట రామమూర్తి

AP State Syllabus AP Board 9th Class Telugu Textbook Solutions ఉపవాచకం Chapter 4 గిడుగు వెంకట రామమూర్తి Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Telugu Solutions ఉపవాచకం 4th Lesson గిడుగు వెంకట రామమూర్తి

9th Class Telugu ఉపవాచకం 4th Lesson గిడుగు వెంకట రామమూర్తి Textbook Questions and Answers

కింది ప్రశ్నలకు పదిహేను వాక్యాలకు మించని సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
గిడుగు వెంకట రామమూర్తి గారి జీవిత విశేషాలను సంక్షిప్తంగా రాయండి.
(లేదా)
వ్యావహారిక భాష కోసం ఉద్యమం చేపట్టి సవరభాషకు ఎంతో సేవ చేసిన గిడుగు రామమూర్తి పంతులు గారి జీవిత విశేషాలను వివరించండి.
జవాబు:
గిడుగు వెంకట రామమూర్తిగారు వీర్రాజు, వెంకమాంబ పుణ్య దంపతులకు 29-8-1863న జన్మించారు. విజయ నగరం జిల్లా పర్వతాలపేటలో వీరి పాఠశాల విద్య సాగింది. వారణాసి గున్నయ్యశాస్త్రిగారు ఈయనకు రాయడం, చదవడం నేర్పారు. తండ్రిగారు భారత, భాగవత పద్యాలు నేర్పారు.

ఈయన మెట్రిక్ లో పాసై, పర్లాకిమిడిరాజా వారి మిడిల్ స్కూలు టీచరుగా చేరారు. ఎఫ్.ఎ అయ్యాక హైస్కూలు టీచరు అయ్యారు. రామమూర్తి గారికి 16వ ఏట అన్నపూర్ణతో వివాహం అయ్యింది. రామమూర్తి గార్కి 1885లో పుత్రుడు సీతాపతిగారు పుట్టారు.

ఈయన ముఖ్య స్నేహితుడు గురజాడ వెంకట అప్పారావుగారు. ఈయన 1892లో సవర భాష నేర్చుకున్నారు. సవరలకు బడులు పెట్టించడానికి కృషి చేశారు.

తెలుగు – సవర నిఘంటువులు రచించారు. సొంత ధనంతో సవరల కోసం బడి పెట్టించి, 30 సంవత్సరాలు కృషి చేశారు. వీరిని 1913లో ‘రావుసాహెబ్’ బిరుదుతోను 1934లో కైజర్-ఇ-హిందీ అనే సువర్ణ పతాకంతోను బ్రిటిష్ ప్రభుత్వం గౌరవించింది.

విద్యార్థులకు శిష్ట వ్యావహారికమే బోధనా భాషగా ఉండాలని ఈయన జయప్రదమైన ఉద్యమం చేశారు. 1930లో సవర భాషకు వర్ణనాత్మక వ్యాకరణం రచించారు. 1940 జనవరి 22వ తేదీన మరణించారు.

AP Board 9th Class Telugu Solutions ఉపవాచకం Chapter 4 గిడుగు వెంకట రామమూర్తి

ప్రశ్న 2.
రామమూర్తి పంతులు గారి రచనలను గురించి తెల్పండి.
జవాబు:
రామమూర్తి పంతులుగారు సవరభాషపై కృషి చేసి, “తెలుగు – సవర నిఘంటువు”ను రచించారు. సవరపాటలూ, సవర కథలూ కొన్ని సవర భాషలోనే రాసి పెట్టుకున్నారు. సవర భాషకు వ్యాకరణం రచించడానికి కృషి చేశారు. ఈ పనిలో ఈయనకు “మామిడల్లం కుమారస్వామి పంతులుగారు” సహకరించారు.

రామమూర్తిగారు పర్లాకిమిడిలో తెలుగు పత్రికను ఒక సంవత్సరం పాటు నిర్వహించారు. 1930లో సవర భాషకు వర్ణనాత్మక వ్యాకరణం రచించారు. ఇది అంతర్జాతీయ ధ్వని లిపితో రాయబడిన మొదటి వ్యాకరణం అని (ప్రొఫెసర్ డేవిడ్ సొంపే తెలిపారు. 1913లో ఈయన ప్రకటించిన A Memorandum on Modern Telugu అనే ఆంగ్ల రచన ద్వారా, నాటి భాషా స్థితి పైనా, విద్యా విధానం పైనా రామమూర్తి గారి దృష్టి మనకు స్పష్టమౌతుంది.

పాఠశాల పుస్తకాల్లోనే కాకుండా ప్రభుత్వం ప్రజలతో జరిపే ఉత్తర ప్రత్యుత్తరాలలో కూడా వాడుక భాషే వాడాలని రామమూర్తి గారు సూచించారు. రామమూర్తిగారు గొప్ప గ్రంథ పరిష్కర్త. పత్రికా రచయిత. విద్యావేత్త.

ప్రశ్న 3.
రామమూర్తిగారు బహుముఖ ప్రజ్ఞాశాలి’ అనే వాక్యాన్ని మీరెలా సమర్థిస్తారు?
(లేదా)
‘గిడుగు రామ్మూర్తి పంతులుగారు బహుముఖ ప్రజ్ఞాశాలి’ సమర్థించండి.
జవాబు:
గిడుగు రామమూర్తిగారు బహుముఖ ప్రజ్ఞాశాలి. వీరిది మహోన్నత వ్యక్తిత్వం. ఈయనకు సాటిలేని మానవతా దృష్టి ఉంది. ఈయన చరిత్ర భావితరాలకు మార్గదర్శనం చేస్తుంది. ఈయన. గొప్ప అంతర్జాతీయ భాషా శాస్త్రవేత్త. ఈయన డేనియల్ జోన్స్ వంటి బ్రిటిష్ ధ్వని శాస్త్రవేత్తలతో చర్చలూ, ఒట్టోజెన్ పర్సన్ వంటి వ్యాసకర్తలతో ఉత్తర ప్రత్యుత్తరాలూ జరిపిన గొప్ప అంతర్జాతీయ భాషా శాస్త్రవేత్త.

ఈయన గొప్ప కావ్య భాషా పరిశోధకుడు. శాస్త్ర పరిశోధకుడు. ఈయన థర్స్టన్ రచించిన సంపుటాలలో సవర జాతికి చెందిన అంశాలపై పరిశోధక రచనలు చేసిన శాస్త్రవేత్త.

1930లో సవర భాషకు వర్ణనాత్మక వ్యాకరణం రచించాడు. ఇది అంతర్జాతీయ ధ్వని లిపితో రాయబడిన మొదటి వ్యాకరణం అని, ప్రొఫెసర్ డేవిడ్ స్టాంపే తెలిపాడు. సవర భాష నేర్చుకొని, వారికి తన సొంత ధనంతో బడిపెట్టి 30 సంవత్సరాల పాటు నిర్వహించారు.

1913లో ఈయన ప్రకటించిన A Memorandum on Modern Telugu అనే ఆంగ్ల రచన ద్వారా నాటి భాషా స్థితి పైన, విద్యా విధానంపైన వీరి దృక్పథం వెల్లడవుతుంది. పాఠశాల పుస్తకాల్లోనే కాకుండా, ప్రభుత్వం ప్రజలతో జరిపే • ఉత్తర ప్రత్యుత్తరాల్లో కూడా వాడుక భాషే వాడాలని ఈయన సూచించారు.

వ్యావహారిక భాషోద్యమాన్ని విజయవంతంగా నిర్వహించిన బహుముఖ ప్రజ్ఞాశాలి రామమూర్తిగారు.

ప్రశ్న 4.
వ్యావహారిక భాషావాదం వల్ల విద్యార్థులకు మేలే జరుగుతుందని మీరనుకుంటున్నారా? కారణాలు రాయండి.
జవాబు:
వ్యావహారిక భాషావాదం వల్ల విద్యార్థులకు మంచి మేలు జరిగింది. వాళ్ళు తాము మాట్లాడే భాషలోనే జవాబులు రాయగలుగుతున్నారు. గ్రాంథిక భాష అయితే అరసున్నాలు, శకట రేఫములు రాయాలి. వ్యాకరణ యుక్తంగా రాయాలి. మాట్లాడే భాష ఒకటి. వాళ్ళు రాసే భాష ఒకటి కావడంతో వాళ్ళు చిక్కులు ఎదుర్కొనేవారు.

వ్యావహారిక భాష అయితే వాళ్ళు పేపర్లలో చదివే భాషలోనే జవాబులూ, వ్యాసాలు రాయవచ్చు. గ్రాంథిక భాష కృత్రిమ భాష. వ్యావహారిక భాష, వారు చిన్ననాటి నుండి, తల్లిదండ్రుల నుండి నేర్చుకొన్న భాష. ప్రక్కవారితో మాట్లాడే భాష. కాబట్టి విద్యార్థులకు సులభంగా ఉంటుంది.

ఈ వ్యావహారిక భాషావాదం వల్లనే 1969లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగు అకాడమీని స్థాపించింది. పాఠ్యపుస్తకాలు వ్యావహారిక భాషలో ప్రచురిస్తున్నారు. పి. హెచ్.డి విద్యార్థులు సైతం తమ పరిశోధనా వ్యాసాలను, వ్యావహారికంలో రాయడానికి, మొదట్లో వేంకటేశ్వర విశ్వవిద్యాలయము అంగీకరించింది. ఆంధ్రా విశ్వవిద్యాలయం 1973 నుండి వ్యావహారికంలో పరిశోధక వ్యాసాలు రాయడానికి అనుమతిస్తోంది.

నేడు క్రమంగా అన్నిచోట్లా వ్యావహారిక భాష చెలామణీ అవుతోంది. అందువల్ల విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతోంది.

AP Board 9th Class Telugu Solutions ఉపవాచకం Chapter 4 గిడుగు వెంకట రామమూర్తి

ప్రశ్న 5.
గురజాడ అప్పారావు గారిని గురించి రాయండి.
జవాబు:
గురజాడ అప్పారావు గారు గిడుగు వెంకటరామమూర్తిగారూ మంచి మిత్రులు. వారిద్దరూ ఒకే ఏడాది ఒకే బడిలో చదువుకున్నారు.

శ్రీ గురజాడ అప్పారావు గారు మెట్రిక్యులేషన్ పరీక్షల్లో ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. ఆయన అప్పటికే కవిత్వం రాయడం ప్రారంభించారు. అప్పారావు గారి తొలికథ ‘దిద్దుబాటు’ సాటిలేని మేటి కథ. ఇది 1910లో “ఆంధ్రభారతి” మాసపత్రికలో తొలిసారిగా అచ్చయ్యింది. ఆ కథను చదివి రసికులు పరవశులయ్యారు.

గురజాడ రచనల్లో కన్యాశుల్కం, కొండుభట్టీయం, బిల్హణీయం, నాటకాలు, వారికి మంచి కీర్తిని తెచ్చిపెట్టాయి. అప్పారావు గారి మార్గం నవీనము. ఆయన ప్రతిభ సాటిలేనిది. ఆయన భాష సజీవమైనది. ఈయన భావాలు సంచలనం.

అందుకే మహాకవి శ్రీశ్రీ “ఆది కాలంలో తిక్కన, మధ్య కాలంలో వేమన, ఆధునిక కాలంలో గురజాడ, మహాకవులు” అని చెప్పారు. గురజాడ రాసిన గేయాలు సుమారు ఇరవై ఉంటాయి. ఆ గేయాలే గురజాడను మహాకవిని చేశాయి.

‘గురజాడ వారి “ముత్యాల సరాలు”, ప్రభావం, అన్గండర కవుల మీద బాగ్హా ప్రసరించింది.

9th Class Telugu ఉపవాచకం 4th Lesson గిడుగు వెంకట రామమూర్తి Important Questions and Answers

I. అవగాహన – ప్రతిస్పందన

అ) ఈ క్రింది వాక్యాలను సంఘటనలు ఆధారంగా వరుసక్రమంలో అమర్చి రాయండి.

ప్రశ్న 1.
అ) 1940 జనవరి 22వ తేదీన, గిడుగు రామమూర్తి పంతులుగారు కోట్లాది తెలుగు ప్రజల నుండి శాశ్వతంగా దూరమయ్యారు.
ఆ) గిడుగు రామమూర్తి పంతులుగారికి 1913లో బ్రిటిష్ ప్రభుత్వం రావుసాహెబ్ బిరుదును ఇచ్చింది.
ఇ) గిడుగువారికి 16వ యేట అన్నపూర్ణతో వివాహం జరిగింది.
ఈ) గిడుగు వీర్రాజు, వెంకమాంబ పుణ్యదంపతులకు రామమూర్తిగారు జన్మించారు.
జవాబు:
ఈ) గిడుగు వీర్రాజు, వెంకమాంబ పుణ్యదంపతులకు రామమూర్తిగారు జన్మించారు.
ఇ) గిడుగువారికి 16వ యేట అన్నపూర్ణతో వివాహం జరిగింది.
ఆ) గిడుగు రామమూర్తి పంతులుగారికి 1913లో బ్రిటిష్ ప్రభుత్వం రావుసాహెబ్ బిరుదును ఇచ్చింది.
అ) 1940 జనవరి 22వ తేదీన, గిడుగు రామమూర్తి పంతులుగారు కోట్లాది తెలుగు ప్రజల నుండి శాశ్వతంగా దూరమయ్యారు.

ప్రశ్న 2.
అ) 1934లో కైజర్ – ఇ – హింద్ సువర్ణ పతకాన్ని బ్రిటిష్ ప్రభుత్వం, రామమూర్తిగారికి బహుమతిగా ఇచ్చింది.
ఆ) ఇందుకోసం 1892లో రామమూర్తిగారు సవరభాష నేర్చుకోడం ప్రారంభించారు.
ఇ) కొండ కోనల్లో సవర భాషా, సవర పాటలు నేర్చుకుందామని తిరగడంతో, రామమూర్తిగారికి మలేరియా జ్వరం వచ్చింది.
ఈ) సవర భాషపై కృషి చేసి, తెలుగు – సవర నిఘంటువును రచించారు.
జవాబు:
ఆ) ఇందుకోసం 1892లో రామమూర్తిగారు సవరభాష నేర్చుకోడం ప్రారంభించారు.
ఇ) కొండ కోనల్లో సవర భాషా, సవర పాటలు నేర్చుకుందామని తిరగడంతో, రామమూర్తిగారికి మలేరియా జ్వరం వచ్చింది.
ఈ) సవర భాషపై కృషి చేసి, తెలుగు – సవర నిఘంటువును రచించారు.
అ) 1934లో కైజర్ – ఇ – హింద్ సువర్ణ పతకాన్ని బ్రిటిష్ ప్రభుత్వం, రామమూర్తిగారికి బహుమతిగా ఇచ్చింది.

AP Board 9th Class Telugu Solutions ఉపవాచకం Chapter 4 గిడుగు వెంకట రామమూర్తి

ప్రశ్న 3.
అ) 1907 నుండి 1910 వరకు జరిగిన సమావేశాల్లో, పాఠశాలల్లో, బోధనా భాషగా శిష్ట వ్యావహారికమే ఉండాలని, రామమూర్తిగారు ప్రసంగించేవారు.
ఆ) 1969లో వేంకటేశ్వర విశ్వవిద్యాలయం, 1973లో ఆంధ్ర విశ్వవిద్యాలయం, పి.హెచ్.డి విద్యార్థులు వ్యావహారికంలో తమ పరిశోధనా వ్యాసాలు రాయడానికి ఆమోదించాయి.
ఇ) 1933లో అభినవాంధ్ర కవి పండిత సభ కూడా ఆధునిక వ్యావహారికమే, బోధనా భాషగా ఉండాలని తీర్మానించింది.
ఈ) విశ్వవిద్యాలయము వాడుక భాషను ఆమోదించడం ఆలస్యమైనా, పత్రికలు, రేడియోలు, సినిమాలు వ్యావహారిక భాషను ముందే ఆమోదించాయి.
జవాబు:
అ) 1907 నుండి 1910 వరకు జరిగిన సమావేశాల్లో, పాఠశాలల్లో, బోధనా భాషగా శిష్ట వ్యావహారికమే ఉండాలని, రామమూర్తిగారు ప్రసంగించేవారు.
ఇ) 1933లో అభినవాంధ్ర కవి పండిత సభ కూడా ఆధునిక వ్యావహారికమే, బోధనా భాషగా ఉండాలని తీర్మానించింది.
ఈ) విశ్వవిద్యాలయము వాడుక భాషను ఆమోదించడం ఆలస్యమైనా, పత్రికలు, రేడియోలు, సినిమాలు వ్యావహారిక భాషను ముందే ఆమోదించాయి.
ఆ) 1969లో వేంకటేశ్వర విశ్వవిద్యాలయం, 1973లో ఆంధ్ర విశ్వవిద్యాలయం, పి. హెచ్.డి విద్యార్థు వ్యావహారికంలో తమ పరిశోధనా వ్యాసాలు రాయడానికి ఆమోదించాయి.

ప్రశ్న 4.
అ) 1940 జనవరి 22వ తేదీన రామమూర్తి పంతులుగారు, తెలుగు ప్రజల నుండి శాశ్వతంగా దూరమయ్యారు.
ఆ) రామమూర్తి గారి తండ్రి వీర్రాజుగారు, 1830 లోనే ఉద్యోగం కోసం విజయనగరం వలస వెళ్ళారు.
ఇ) రామమూర్తి పంతులు గారికి పుత్రుడు జన్మించాడు. ఆయన పేరు వెంకట సీతాపతి.
ఈ) కందికొండ రామదాసు పంతులు గారి కుమార్తె అన్నపూర్ణతో రామమూర్తిగారికి వివాహం జరిగింది.
జవాబు:
ఆ) రామమూర్తి గారి తండ్రి వీర్రాజు గారు, 1830 లోనే ఉద్యోగం కోసం విజయనగరం వలస వెళ్ళారు.
ఈ) కందికొండ రామదాసు పంతులు గారి కుమార్తె అన్నపూర్ణతో రామమూర్తిగారికి వివాహం జరిగింది.
ఇ) రామమూర్తి పంతులు గారికి పుత్రుడు జన్మించాడు. ఆయన పేరు వెంకట సీతాపతి.
అ) 1940 జనవరి 22వ తేదీన రామమూర్తి పంతులుగారు, తెలుగు ప్రజల నుండి శాశ్వతంగా దూరమయ్యారు.

ప్రశ్న 5.
అ) 1940 జనవరి 22వ తేదిన శ్రీ గిడుగు రామమూర్తిగారు పరమపదించారు.
ఆ) శ్రీ గిడుగు రామమూర్తిగారు 1936 వరకు పర్లాకిమిడిలోనే స్థిర నివాసం ఏర్పరచుకున్నారు.
ఇ) శ్రీ వీర్రాజు వెంకమాంబ పుణ్య దంపతులకు ది. 09.08.1863న రామమూర్తిగారు జన్మించారు.
ఈ) 1879లో శ్రీరామమూర్తి గారికి 16వ ఏట వివాహం జరిగింది.
జవాబు:
ఇ) శ్రీ వీర్రాజు వెంకమాంబ పుణ్య దంపతులకు ది. 09.08. 1863న రామమూర్తిగారు జన్మించారు.
ఈ)1879లో శ్రీరామమూర్తి గారికి 16వ ఏట వివాహం జరిగింది.
ఆ) శ్రీ గిడుగు రామమూర్తిగారు 1936 వరకు పర్లాకిమిడిలోనే స్థిర నివాసం ఏర్పరచుకున్నారు.
అ) 1940 జనవరి 22వ తేదిన శ్రీ గిడుగు రామమూర్తిగారు పరమపదించారు.

II. వ్యక్తీకరణ – సృజనాత్మకత

అ) క్రింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
సవరల అభివృద్ధికై గిడుగువారి కృషిని తెల్పండి.
జవాబు:
ఆదివాసీల అక్షర శిల్పి గిడుగు రామమూర్తి. ఆదిమ సవర జాతి గిరిజనుల భాషకు లిపిని, నిఘంటువును రూపొందించిన మహనీయుడు గిడుగు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలోని కొండ ప్రాంతాల్లో అనేకమంది సవరలు నివసిస్తున్నారు. వారు ఆదిమ నివాసులు. అక్షర జ్ఞానం, బాహ్య సమాజం అంటే తెలియని అమాయకులు. గతంలో ఎంతో ఉన్నతంగా విలువలతో జీవించిన సవరలు ఆధునిక సమాజంలో వెనుకబడి ఉండటం రామమూర్తిని బాధించింది. వీరికి చదువు చెప్పి విజ్ఞానవంతులను చేయగలిగితే వారి బతుకులు బాగుపడతాయని గిడుగు సవర భాషను నేర్చుకున్నారు. వాచకాలు, కథలు, పాటలు పుస్తకాలు, తెలుగు – సవర, సవర – తెలుగు నిఘంటువులను తయారు చేసారు. 1930లో సవరభాషలో “ఎ మాన్యువల్ ఆఫ్ సవర లాంగ్వేజ్” అనే వర్ణనాత్మక వ్యాకరణాన్ని రాశారు.

AP Board 9th Class Telugu Solutions ఉపవాచకం Chapter 4 గిడుగు వెంకట రామమూర్తి

ప్రశ్న 2.
వ్యావహారిక భాషోద్యమం – ‘గిడుగు’ అడుగు రాయండి.
జవాబు:
‘గిడుగు పిడుగు’. తెలుగు భాషాబోధనలో, వ్యాసాలూ, వార్తల రచనల్లో కథా కథనంలో గ్రాంథికం గాక, వాడుకలో ఉన్న పదాలతో ఎలా సామాన్యంగా మాట్లాడతామో అలా తెలుగు వాక్యాలను వ్రాయాలని ప్రతిపాదించి, ప్రయోగించి, ఉద్యమించి వాడుక తెలుగుభాషకు మాన్యతను తెచ్చిన ధీరుడు, పండితుడు కీ.శే. గిడుగు రామమూర్తి పంతులుగారు. వాడుక భాషను వ్యతిరేకించిన పండితుల రచనలలోని వ్యాకరణ విరుద్ధ ప్రయోగాలను ఎత్తి చూపుతూ 1911-12 మధ్య “ఆంధ్ర పండిత భిషక్కుల భాషా భేషజం” అనే గ్రంథం రాసారు.

1919లో గిడుగు ‘తెలుగు’ మాసపత్రికను స్థాపించి తన శాస్త్రీయ వ్యాసాలతో, ఉపన్యాస పాఠాలతో అవిశ్రాంతంగా పోరాటం సాగించారు. వీరేశలింగం అధ్యక్షులుగా గిడుగు కార్యదర్శిగా “వర్తమానాంధ్ర భాషా ప్రవర్తక సమాజం” స్థాపించారు. వ్యావహారిక భాషను ప్రతిష్ఠించడంలో విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వం వెనుకంజ వేసినా పత్రికలు మాత్రం గిడుగు వారి వాదానికి పూర్తి సహకారం ఇచ్చాయి. గిడుగు వారిచేత ఉత్తేజితులైన పలువురు రచయితలు వాడుక భాషలో గ్రంథాలు రచించి వాడుక భాష గొప్పదనాన్ని ఋజువు చేశారు. “గ్రాంథిక భాషను ఎవ్వరూ చదువకూడదా ? అని ప్రశ్న వేస్తే, “నేను గ్రాంథిక భాషకు వ్యతిరేకిని కాదు. ప్రజలకు ఉపయోగపడే గ్రంథాలను కృతక భాషలో రచించి భేషజాన్ని ప్రదర్శించవద్దంటాను” అని గిడుగువారు అంటారు. 1911లో రామమూర్తి పంతులు గారు ప్రారంభించిన ఈ ఉద్యమం 1973 నాటికి గాని విజయవంతం కాలేదు.

AP Board 9th Class Telugu Solutions Chapter 8 చూడడమనే కళ

AP State Syllabus AP Board 9th Class Telugu Textbook Solutions Chapter 8 చూడడమనే కళ Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Telugu Solutions 8th Lesson చూడడమనే కళ

9th Class Telugu 8th Lesson చూడడమనే కళ Textbook Questions and Answers

చదవండి-ఆలోచించండి-చెప్పండి

పూర్వం ఒక రాజుగారికి ఇద్దరు మంత్రులు ఉండేవారు. రాజు అన్ని విషయాల్లో పెద్దమంత్రినే సలహా అడిగేవాడు. అది చిన్నమంత్రికి నచ్చేది కాదు. అతనికి పెద్దమంత్రి గొప్పదనాన్ని తెలియజెప్పాలనుకున్నాడు. మక ఒకరోజు తన ఇంటి వెనుక హడావుడి ఏమిటో చూసి రమ్మని చిన్నమంత్రితో రాజు అన్నాడు. చూసివచ్చి ‘కుక్క ఈనిందన్నాడు చిన్నమంత్రి పిల్లలెన్ని’ అన్నాడు రాజు. మళ్ళీ వెళ్ళివచ్చి ‘నాలుగు’ అన్నాడు. ఏ రంగులో ఉన్నాయన్నాడు రాజు. మళ్ళీ వెళ్ళివచ్చి రెండు నలుపూ, రెండు గోధుమరంగు’లో ఉన్నాయన్నాడు. ఇంతలో పెద్దమంత్రి వచ్చాడు. అతన్ని కూడా అడిగితే ఒకేసారి చూసి వచ్చి, రాజు అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానమిచ్చాడు. పెద్దమంత్రి గొప్పతనం అర్థమైన చిన్నమంత్రి సిగ్గుపడ్డాడు.

ప్రశ్నలు జవాబులు

ప్రశ్న 1.
చిన్నమంత్రి ఒక్కొక్కసారి ఒక సమాధానాన్నే ఎందుకు చెప్పాడు?
జవాబు:
చిన్నమంత్రి విషయాన్ని పూర్తిగా పరిశీలించి చూడడం, వినడం అనే కళ తెలిసినవాడు కాడు. కేవలము, రాజు తనను అడిగిన విషయాన్ని మాత్రమే చూచి వచ్చి, ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రశ్నకే సమాధానాన్ని చెప్పగలిగాడు.

ప్రశ్న 2.
పెద్దమంత్రి ఒకేసారి అన్ని విషయాలు చెప్పడానికి కారణమేమిటి?
జవాబు:
పెద్దమంత్రి దగ్గర పరిశీలనగా విషయాన్ని సంపూర్తిగా వినడం, చూడడమనే కళ ఉంది. కాబట్టి రాజు తనను చూచి రమ్మన్నపుడు విషయాన్ని అంతా పరిశీలించి వచ్చి, అన్ని విషయాలు చెప్పగలిగాడు.

ప్రశ్న 3.
ఇద్దరిలో పరిశీలనా శక్తి ఎవరికి ఎక్కువగా ఉంది?
జవాబు:
మంత్రులు ఇద్దరిలో పెద్దమంత్రికి పరిశీలనా శక్తి ఎక్కువగా ఉంది.

AP Board 9th Class Telugu Solutions Chapter 8 చూడడమనే కళ

ప్రశ్న 4.
మనం వేటి వేటిని జాగ్రత్తగా పరిశీలించాలి? ఎందుకు?
జవాబు:
మనం జాగ్రత్తగా వినాలి. జాగ్రత్తగా చూడాలి. జాగ్రత్తగా పరిశీలించాలి. శ్రద్ధ చూపాలి. మనం చూసిన దాన్ని గురించి ఎవరు ఏమడిగినా దాన్ని గూర్చి చెప్పగలగాలి.

ఇవి చేయండి

1. అవగాహన – ప్రతిస్పందన

అ) కింది అంశాల ఆధారంగా మాట్లాడండి.

ప్రశ్న 1.
సూర్యోదయ సమయంలో మీ చుట్టూ ఉన్న ప్రకృతి ఎలా ఉంటుంది?
జవాబు:
సూర్యోదయ సమయంలో పక్షులు కిలకిల ధ్వనులు చేస్తూ ఉంటాయి. ఆవులూ, దూడలూ అంబా అని అరుస్తూ ఉంటాయి. పూలు వికసించి పరిమళిస్తూ ఉంటాయి. నిద్ర నుండి మనుషులు లేచి తమ తమ పనులకోసం సిద్ధం అవుతూ ఉంటారు. కాలకృత్యాలు తీర్చుకుంటూ ఉంటారు. రైతులు పొలాలకు వెడుతూ ఉంటారు. జంతువులు నిద్ర నుండి లేస్తాయి. మంచు తెరలు తెరలుగా విడిపోతుంది. సూర్యకిరణాలు వెచ్చవెచ్చగా వ్యాపిస్తాయి.

ప్రశ్న 2.
శ్రద్ధ చూపడం అంటే ఏమిటి?
జవాబు:
శ్రద్ధ చూపడం అంటే మనుషుల పట్ల, జంతువుల పట్ల, మొక్కల పట్ల, వస్తువుల పట్ల స్పందన ఉండటం. శ్రద్ధ అంటే, ప్రేమ అనే దానిలో ఒక లోతైన భాగం. చిన్న చిన్న విషయాల పట్ల శ్రద్ధ చూపడంతో ఇది ప్రారంభం అవుతుంది. శ్రద్ధ చూపడం అంటే పెంపుడు జంతువును బాగా చూడడం, బట్టల్ని శుభ్రంగా ఉంచుకోవడం, శుభ్రంగా స్నానం చేసి మిమ్మల్ని మీరు పరిశుభ్రంగా ఉంచుకోవడం, మీరు పాతిన మొక్కకు నీరు పోసి, ఎరువు వేసి చక్కగా పెంచడం, మీరు పెంచుకొనే కుక్కకు సరైన ఆహారాన్ని ఇచ్చి, దాన్ని ఆరోగ్యంగా పెంచడం వంటి పనులు.

AP Board 9th Class Telugu Solutions Chapter 8 చూడడమనే కళ

ప్రశ్న 3.
ఎలా వినాలి? ఎలా మాట్లాడాలి?
జవాబు:
పరిశీలించడం, వినడం అన్న పనులు రెండూ, నిజానికి ఒకటే. ఇదంతా ఒకే పని కాబట్టి మనచుట్టూ ఉన్నవాటిని గురించి తెలిసికోవాలి. ఆ పని మనల్ని సున్నితంగా చేస్తుంది. మనం పరిశీలిస్తే, వింటే, అప్పుడు తక్షణమే క్రియ జరుగుతుంది. పరిశీలించినప్పుడే, విన్నప్పుడే చర్య తీసుకుంటారు. వినడం ఎలాగో తెలిస్తే, ఉన్నదాన్నంతటినీ మీరు గ్రహిస్తారు. ” ఎలా చూడాలో, ఎలా వినాలో, ఎలా మాట్లాడాలో తెలిస్తే, అదంతా మీ కళ్ళలోనే, చెవులలోనే, మీ నాలుకమీదనే ఉన్నదని అర్థం అవుతుంది. వినడంపై స్పష్టమైన అవగాహన ఉండాలి.

ఆ) కింది వాక్యాలు పాఠ్యాంశంలో ఎక్కడ వచ్చాయో గుర్తించి వాటి భావం రాయండి.

ప్రశ్న 1.
బిడ్డను ప్రేమించడం అంటే ఆ బాబు, పాప సరయిన విద్యను పొందేటట్లు చూడడం.
జవాబు:
ఈ వాక్యం, మా పాఠ్యాంశంలో ఎక్కడా లేదు.

ప్రశ్న 2.
పరిశీలించకపోతే మీరు ‘ప్రజ్ఞావంతంగా’ ఉండలేరు.
జవాబు:
మనం, మన చుట్టూ ఉన్న పక్షుల్నీ, చెట్లనూ, బీదవారినీ, మురికి రోడ్లనూ, ఆశ్రయం లేని ఆవులనూ, ఆకలితో, జబ్బుతో ఉన్న కుక్కల్ని పరిశీలించాలనీ, లేకపోతే మనం ప్రజ్ఞావంతంగా అంటే తెలివిగలవారుగా ఉండలేమని రచయిత చెప్పిన సందర్భంలోనిది.

ప్రశ్న 3.
ప్రతిదాన్నీ ఉన్నది ఉన్నట్లుగా చూడడం ఒక కళ.
జవాబు:
లెక్కలు, చరిత్ర, భూగోళశాస్త్రం నేర్చుకోవడం ఎంత కష్టమో, ఉన్నవాటిని ఉన్నట్లుగా చూడడం కూడా అంతే కష్టం అని, ప్రతి వస్తువునూ ఉన్నదానిని ఉన్నట్లుగా చూడడం అనేది ఒక విద్య అని, రచయిత జిడ్డు కృష్ణమూర్తి గారు చెప్పిన సందర్భంలోనిది.

ప్రశ్న 4.
“నా అంతట నేనే తెలుసుకోబోతున్నాను” అని చెప్పే సమయం మీకుండదు.
జవాబు:
మనం ఎవరో ఒకరు చెప్పింది వినడానికి అలవాటు పడిపోయాము. మనకు తల్లిదండ్రులూ, గురువులూ, పత్రికలూ, రేడియోలూ, టీవీలు చెపుతూ ఉంటాయి. అలా ఇతరులు చెప్పింది వినడమే కాని, మనంతట మనం తెలుసుకోబోతున్నామని చెప్పే సమయం మనకు ఉండదని రచయిత చెప్పిన సందర్భంలోని వాక్యమిది.

ప్రశ్న 5.
ఆ చిన్నపాపకు అలా చేయమని ఎవరూ చెప్పలేదు.
జవాబు:
స్విట్జర్లాండులో ఒక అమ్మాయి తాను సైకిలు మీద వెడుతూ, అకస్మాత్తుగా సైకిలు దిగి, రోడ్డుమీద ఉన్న కాగితం ముక్కను తీసి దగ్గరగా ఉన్న చెత్తకుండీలో వేసిందనీ, ఆ చిన్నపాపకు అలా చేయమని ఎవరూ చెప్పలేదనీ, రచయిత స్విట్జర్లాండులో మిత్రునితో పాటు కారులో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు జరిగిన ఆ సంఘటనను గూర్చి చెప్పిన సందర్భంలోనిది.

AP Board 9th Class Telugu Solutions Chapter 8 చూడడమనే కళ

ఇ) కింది పేరాను చదవండి. సమాధానాలు రాయండి.

“సర్ జగదీశ్ చంద్రబోస్” బెంగాల్ లోని విక్రంపూర్ అనే గ్రామంలో 1858 నవంబరు 30న జన్మించారు. మొక్కలమీదా, జంతువులమీదా గాఢమైన ఆసక్తిని పెంచుకున్నారు. భౌతికశాస్త్రం అభ్యసించినప్పటికీ జీవశాస్త్రం అంటే ఆసక్తి ఎక్కువ. సొంతంగా ప్రయోగశాలను ఏర్పాటు చేసుకొని అనేక పరిశోధనలు చేశారు. మొక్కలను, జంతువులను నిశితంగా పరిశీలించారు. మొక్కలకు కూడా ప్రాణం ఉందని కనుక్కొన్నారు. చెట్లు అర్థరాత్రి నిద్రిస్తాయని, ఉదయం 8 గంటల ప్రాంతంలో నిద్రలేస్తాయని చెప్పారు. మత్తుపదార్థాల ప్రభావం చెట్లపై కూడా ఉంటుందని నిర్ధారించారు.

ప్రశ్న 1.
జగదీశ్ చంద్రబోస్ ఎప్పుడు, ఎక్కడ జన్మించారు?
జవాబు:
జగదీశ్ చంద్రబోస్ బెంగాల్ లోని విక్రంపూర్ అనే గ్రామంలో 1858 నవంబరు 30న జన్మించారు.

ప్రశ్న 2.
జగదీశ్ చంద్రబోసు జీవశాస్త్రం అంటే ఎందుకు ఆసక్తి ?
జవాబు:
జగదీశ్ చంద్రబోస్ మొక్కలు, జంతువులపై గాఢమైన ఆసక్తి పెంచుకున్నారు. ఆయన భౌతికశాస్త్రం నేర్చుకొన్నప్పటికీ, జీవశాస్త్రం అంటే ఎక్కువ ఆసక్తిని పెంచుకున్నారు.

ప్రశ్న 3.
చంద్రబోస్ తన పరిశోధనలో ఏమి కనుక్కొన్నారు?
జవాబు:
చంద్రబోస్ తన పరిశోధనలలో మొక్కలకు కూడా ప్రాణం ఉందని కనుక్కొన్నారు.

ప్రశ్న 4.
చెట్లమీద పరిశోధన చేసి నిర్ధారించిన విషయమేమిటి?
జవాబు:
చెట్లకు ప్రాణం ఉంటుంది. అవి ఉదయం 8 గంటల ప్రాంతంలో నిద్రలేస్తాయి. మత్తు పదార్థాల ప్రభావం చెట్లపై ఉంటుందని నిర్ధారించారు.

II. వ్యక్తీకరణ-సృజనాత్మకత

అ) క్రింది ప్రశ్నలకు ఐదేసివాక్యాలలో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
“ఎవరయినా దేన్నయినా నిజంగా పట్టించుకుంటున్నారో, ఏదో తెచ్చిపెట్టుకున్న మర్యాద ప్రదర్శిస్తున్నారో మనం చూస్తూ తెలుసుకోవచ్చు” అని జిడ్డు కృష్ణమూర్తిగారు, అన్నారు. తెచ్చిపెట్టుకున్న మర్యాద అంటే ఏమిటి?
జవాబు:
తెచ్చిపెట్టుకున్న మర్యాద అంటే కృత్రిమ మర్యాద. మనస్సు లోపల ఎదుటివారి పై గౌరవం లేకపోయినా, పైకి చిరునవ్వు చిందిస్తూ, ఎదుటివారిని గౌరవించడం, వారికి మర్యాదచేయడం వంటి పనులను ‘తెచ్చి పెట్టుకున్న మర్యాద’ అని అంటారు. సాధువులూ, సన్యాసులూ వంటి వారికి మంత్రులు స్వాగత సత్కారాలు చేయడం, మగ పెళ్ళి ‘వారికి ఆడ పెళ్ళివారు చేసే మర్యాదలూ తెచ్చి పెట్టుకొన్న మర్యాదలే. అత్తగారిపై మనస్సులో ప్రేమ, గౌరవాలు లేకపోయినా, ఉన్నట్లు నటించడాన్ని తెచ్చిపెట్టుకొన్న మర్యాద అంటారు.

AP Board 9th Class Telugu Solutions Chapter 8 చూడడమనే కళ

ప్రశ్న 2.
పరిశీలనకు, ప్రజ్ఞకు గల సంబంధాన్ని తెలపండి. (లేదా) పరిశీలన, ప్రజ్ఞ ఒకదానికొకటి విడదీయలేనివనే విషయం వివరించండి.
జవాబు:
మన చుట్టూ ఉన్న ప్రతిదాన్నీ అంటే పక్షుల్నీ, చెట్లనూ, పేదవారినీ, మురికి రోడ్లనూ, ఆశ్రయంలేని ఆవులనూ, ఆకలితో, జబ్బుతో ఉన్న కుక్కల్నీ. బాగా పరిశీలించాలి. అలా పరిశీలించకపోతే, ప్రజ్ఞ కలవారిగా ఉండలేము. అలా చుట్టూ ఉన్నవాటిని పరిశీలించకపోతే, హృదయంలో ప్రేమ లేకుండా పెరుగుతారు.

జీవితంలో ప్రతిదాన్నీ ఊరకే గమనించాలి. గమనింపులో నుండి ప్రజ్ఞ ఉదయిస్తుంది. గమనించడం ఎలాగో తెలిస్తే తత్వం , మతం వంటివాటికి సంబంధించిన గ్రంథాలు చదవనవసరం లేదు. ఎలా చూడాలో, ఎలా వినాలో, ఎలా మాట్లాడాలో తెలిస్తే, అదంతా మీ కళ్ళలోనే, చెవులలోనే, మీ నాలుక మీదనే ఉన్నదని అర్థం అవుతుంది.

ప్రశ్న 3.
‘వల్లించడం’ అంటే ఏమిటి? అది విద్యార్థికి ఉపయోగపడుతుందా, కాదా? ఎందువల్ల?
జవాబు:
‘వల్లించడం’ అంటే నోటికి వచ్చేలా, వేదాలు మొదలయిన వాటిని మరలా మరలా చదవడం. విద్యార్థులు చిన్నతనంలో పద్యాలనూ, గేయాలనూ, ఎక్కాలనూ, ముఖ్యమైన లెక్కలు, సైన్సు సూత్రాలనూ వల్లిస్తారు. ఆ వల్లించే విషయానికి వారికి అర్థం తెలియదు. అయినా వల్లెవేస్తారు. ఆ పద్యాలూ, ఆ ఎక్కాలూ వగైరా వారికి పెద్ద అయ్యాక సులభంగా జ్ఞప్తికి వస్తాయి. క్రమంగా వారికి అర్థజ్ఞానం కలుగుతుంది.

అందుకే సుమతీ శతకం, కృష్ణశతకం, దాశరథి శతకం వంటి శతకాలలోని పద్యాలను పిల్లలు వల్లిస్తారు. అవి వారికి జీవితాంతం గుర్తుంటాయి. అవి విద్యార్థికి ఉపయోగిస్తాయి.

కాని విద్యార్థి పెద్దవాడు అయ్యాక వల్లించడం మంచి పద్దతి కాదు. విషయం గ్రహించి సొంతంగా రాయగలగాలి. వల్లించిన మాటలు చిలుక పలుకులులా ఉంటాయి. పెద్దవారయిన విద్యార్థులకు వల్లించడం ఉపయోగకరం కాదు.

AP Board 9th Class Telugu Solutions Chapter 8 చూడడమనే కళ

ప్రశ్న 4.
ప్రవర్తన అంటే ఏమిటి? అది ఎలా ఉండాలి?
జవాబు:
ప్రవర్తన అంటే నడవడి. పరిశుభ్రతకు ప్రాధాన్యాన్ని ఇవ్వాలి. క్రమశిక్షణాయుతమైన జీవితాన్ని గడపాలి. ఎదుటివారిని విమర్శించరాదు. విమర్శించకుండా, అంచనా వేయకుండా ఊరకనే గమనించాలి. మరింత జాగ్రత్తగా ఉండాలి. అశుభ్రతను, అశ్రద్ధను తగ్గించుకోవాలి. సహజమైన క్రమశిక్షణలో ఉండాలి. క్రమశిక్షణ, సున్నితత్వం కలసి ఉంటాయి. పరిశీలిస్తూ వింటూ ఉంటే, స్వతస్సిద్ధంగా, ఒత్తిడి లేకుండా అక్కడ ఒక క్రమత, సమన్వయత, క్రమశిక్షణ సంభవిస్తుంది.

ప్రశ్న 5.
శ్రద్ద చూపడం అంటే ఏమిటి? విద్యార్థులు వాటి పట్ల శ్రద్ధ చూపాలి?
జవాబు:
శ్రద్ధ చూపడం అంటే ఇతరులను బాగా చూసుకోవడం. దయగా ఉండడం, వారిపట్ల క్రూరంగా ప్రవర్తించకుండా చూసుకోవడం.

విద్యార్థులు తమ పాఠ్యగ్రంథములలోని విషయాల పట్ల శ్రద్ధ చూపాలి. గురువులను, తల్లిదండ్రులను గౌరవ భావంతో చూడాలి. తాము చదవవలసిన విషయాలపై లక్ష్యం ఉండాలి. సోదర విద్యార్థులను దయతో చూడాలి. తల్లిదండ్రులను, గురువులను ప్రేమగా చూడాలి. వారిపట్ల క్రూరంగా ఉండరాదు. గురువులు చెప్పిన దానిని సరిగా వినాలి. సరిగా పరిశీలించాలి.

విద్యార్థులు రోడ్డుపై నడిచి వెళ్ళేటప్పుడు పేదల అశుభ్రతనూ, రోడ్డు మీది బురదనూ, జబ్బుచేసిన జంతువులనూ ప్రేమతో శ్రద్ధగా చూడాలి.

ఆ) క్రింది ప్రశ్నలకు పదిహేనేసి వాక్యాల్లో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
జీవితంలో క్రమశిక్షణ అవసరం. ఎందుకో వివరించండి.
(లేదా)
క్రమశిక్షణ గురించి జిడ్డు కృష్ణమూర్తిగారి అభిప్రాయంతో మీరు ఏకీభవిస్తారా? వివరించండి.
(లేదా)
క్రమశిక్షణ లేని జీవితం చుక్కాని లేని నావ వంటిది. ఈ అంశాన్ని సమర్థిస్తూ క్రమశిక్షణ ఆవశ్యకతను విశ్లేషిస్తూ రాయండి.
జవాబు:
క్రమశిక్షణ గురించి జిడ్డు కృష్ణమూర్తి గారి అభిప్రాయంతో నేను ఏకీభవిస్తాను.

‘క్రమశిక్షణ’ అంటే ప్రతి పనినీ, సక్రమమయిన పద్దతిలో సకాలంలో నెరవేర్చడం. పెద్దల పట్ల, గురువుల పట్ల, గౌరవనీయుల పట్ల వినయ విధేయతలు కలిగియుండడం. జీవితంలో ఉదయం లేచినప్పటి నుండి నిద్రించే వరకూ చేయవలసిన పనులను, వేళతప్పకుండా చేయడం క్రమశిక్షణ. మన శరీరానికి అవసరమయిన పోషకపదార్థాలను అందించే ఆహార పదార్థాలను సరయిన రీతిలో తినడం కూడా క్రమశిక్షణయే.

క్రమశిక్షణ లేని జీవితము చుక్కాని లేని పడవ వంటిది. క్రమశిక్షణ అనే పేరుతో బలవంతంగా పనులు చేయరాదు. స్వతస్సిద్ధంగా ఒత్తిడి లేకుండా పనులు చేయాలి. అప్పుడే ఒక క్రమత, సమన్వయత, ఒక క్రమశిక్షణ సంభవిస్తుంది.

జీవితంలో క్రమశిక్షణగా పాఠాలు చదవాలి. ఇంటిపని పూర్తిచేయాలి. ఏ వృత్తిలో ఉన్నవారయినా సరే, క్రమశిక్షణగా వారి వృత్తిధర్మాలను పూర్తిచేయాలి. అప్పుడే జీవితంలో మంచి ఫలితాలు సాధింపవచ్చు. క్రమశిక్షణగా వ్యాయామం చేస్తే ఆరోగ్యం లభిస్తుంది. ఆటలు ఆడితే శరీరానికి పుష్టి చేకూరుతుంది. ఏ రోజు పాఠాలు ఆ రోజు చదివితే విద్యార్థులు విజయం సాధిస్తారు. క్రమశిక్షణగా పొదుపు చేస్తే వారు ధనవంతులవుతారు. వారికి డబ్బు చిక్కులు రావు.

జీవితంలో క్రమశిక్షణ పాటించిన వారు ఉన్నత స్థానాన్ని అందుకుంటారు. క్రమశిక్షణతో విద్యాభ్యాసం కొనసాగిస్తే చక్కని విజయాన్ని సొంతం చేసుకుంటారు.

ప్రశ్న 2.
ప్రపంచంలో శాంతి’ ఉండాలంటే ఏం చేయాలి? మీ అభిప్రాయం రాయండి.
జవాబు:
ప్రపంచంలో శాంతి ఉండాలంటే, ప్రజలు తమలో తాము శాంతిగా ఉండాలి. మనది పోటీ ప్రపంచం. ఈ పోటీ ప్రపంచంలో ఆనందంగా జీవించడం కోసం, ముందు మనలో మనం పోటీపడడం ఆపాలి. మన పనిని మనం ప్రేమిస్తూ చేయాలి. మన పనిని మనం ప్రేమిస్తూ ఉంటే, మన కంటే ముందుకు ఎవరు వెళ్ళారో, వెనుక ఎవరు ఉన్నారో మనం పట్టించుకోము. మన సామర్థ్యాన్ని అంతా, అంటే మన మనస్సునూ, మన శరీరాన్నీ, మన హృదయాన్ని అంతా వెచ్చించి పనిచేస్తాము. హృదయం లోపల, మనిషిలో సమూలమైన పరివర్తన కలిగితే శాంతి వర్ధిల్లుతుంది.

ప్రపంచంలో ఇప్పటికి రెండు ప్రపంచయుద్ధాలు జరిగాయి. దీనికి కారణం, దేశాల మధ్య పోటీ మనస్తత్వం. ఒకరి కంటే ఒకరు ఆయుధ సంపత్తిని పెంచుకోవాలని పోటీ పడుతున్నారు. ఒకరి కంటే ఒకరు ఆర్థికంగా, బలమైన దేశంగా ఉండాలని పోటీ పడుతున్నారు. అమెరికా, రష్యా, బ్రిటన్, చైనా వంటి దేశాలు నేటికీ తమలో తాము పోటీ పడుతున్నాయి. ఆయుధాలను భారీగా పోగుచేస్తున్నాయి. ఇందువల్లనే యుద్దాలు సంభవిస్తున్నాయి.

అలాగే మతం కూడా కొన్ని దేశాల మధ్య యుద్ధానికి కారణం అవుతున్నది. కాబట్టి మత సామరస్యం ఉండాలి. ఒక దేశానికి మరోదేశం సహకారం అందించాలి. మిత్రరాజ్య సమితిని మరింత శక్తి సంపన్నంగా చేయాలి. అగ్రరాజ్యాలవారు, బీద దేశాల వ్యవహారాలలో తలదూర్చరాదు. వారు ఆయుధాలను అమ్మి, దేశాల మధ్య పోటీ పెంచరాదు. మనిషిలో సమూలమైన మార్పు రావాలి. ప్రపంచదేశాల మధ్య మరింత సమన్వయం అవసరం. శాంతి తత్త్వాన్ని, ప్రేమ తత్త్వాన్ని ” ప్రజలలో పెంచి పోషించాలి. విశ్వమానవ సౌభ్రాతృత్వము ప్రజలలో వెల్లివిరిస్తే, ప్రపంచ శాంతి పుష్పం నిండుగా వికసిస్తుంది. ప్రపంచ ప్రజలు పరస్పరం ప్రేమాభిమానాలు పెంపొందించుకోవాలి.

ప్రశ్న 3.
చిన్నతనంలో ఉన్న ఊహాశక్తి, పెద్దవారవుతున్న కొద్దీ ఎందుకు పోతుంది? ఆలోచించి రాయండి.
జవాబు:
చిన్నతనంలో మానవులలో అసాధారణమైన ఊహాశక్తి ఉంటుంది. మనిషి పెరుగుతున్న కొద్దీ ఆ శక్తి పోతుంది. చిన్నతనంలో నదిని చూస్తూ ఉంటే ఆ నదిలోని పడవలో మనం ఉన్నట్లూ, భయంకర తుఫానుల మధ్య చిక్కుకున్నట్లు ఊహిస్తాము. మేఘాన్ని మనం చూస్తే, మనకు అది మేడలా కన్పిస్తుంది. ఆ మేడలో మనం ఉన్నట్లు భావిస్తాము. గాలి శబ్దం వింటే సంగీతాన్ని విన్నట్లు భావిస్తాము. ఒక పెద్ద పక్షిని చూస్తే, మనం దానివీపుపై ఎక్కి ప్రపంచాన్ని చుట్టి వచ్చినట్లు తలపోస్తాము.

అలాగే మనకు బాగా డబ్బు ఉన్నట్లూ, మంచి పేరు ఉన్నట్లూ, అందరూ మెచ్చుకొనే అద్భుతమైన వ్యక్తి మనం అన్నట్లు మనం భావిస్తాము. మనం ఏదైనా చరిత్ర చదివితే, దాన్ని గూర్చి ఆలోచించేటప్పుడు ఏవేవో కల్పించుకొని ఊహిస్తాము.

పెద్దవారయిన కొద్దీ మన కలలూ, ఊహలూ ఆవిరి అవుతాయి. జీవిత యధార్థ దృశ్యం మన కన్నుల ముందు సాక్షాత్కరిస్తుంది. చిన్నప్పుడు మనం మహారాజు కావాలనీ, అయినట్లూ ఊహిస్తాము. కానీ చదువు రాక, ఉద్యోగం లేక, నిరుద్యోగిగా మిగిలినప్పుడు ఇంక ఊహలు ఉండవు. విద్యార్థి దశలో శిష్యులకు ఎన్నో సందేహాలూ, ఎన్నో ప్రశ్నలూ ఉంటాయి. సామాన్యంగా గురువులు వాటిని తీర్చకుండా, వారిపై కోపపడి వారి జిజ్ఞాసపై నీళ్ళు చల్లుతారు. తల్లిదండ్రులు పిల్లల ప్రశ్నలకు ఓపికగా జవాబులు చెప్పరు. క్రమంగా పిల్లల్లో తెలిసికోవాలనే కోరిక అడుగంటుతుంది. జీవితంలో స్థిరత్వం వచ్చాక, తాను దేవేంద్రలోకంలో అప్సరసల మధ్య ఉన్నట్లు కలలు కనడు – తన నిజ స్థితిని తాను గుర్తిస్తాడు.

AP Board 9th Class Telugu Solutions Chapter 8 చూడడమనే కళ

ఇ) సృజనాత్మకంగా స్పందించండి.

ప్రశ్న 1.
పాఠంలోని మొదటిపేరా ఆధారంగా చిత్రాన్ని గీయండి. దాని గురించి వర్ణించండి.
జవాబు:
విద్యార్థి కృత్యం.
(లేదా )

ప్రశ్న 2.
మీ పాఠశాలలో ‘ప్రపంచశాంతి’ అనే అంశంపై మండలస్థాయి వ్యాసరచన పోటీ నిర్వహించాలని అనుకున్నారు. విద్యార్థులను ఆహ్వానిస్తూ కరపత్రం తయారుచేయండి.
జవాబు:

(వ్యాసరచన పోటీ)

కొవ్వూరు మండల విద్యార్థులకు ఒక శుభవార్త. దివి x x x x వ తేదీ సోమవారం, కొవ్వూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో “ప్రపంచశాంతి” అనే విషయమై వ్యాసరచన పోటీ నిర్వహిస్తున్నాము. ఈ పోటీలో కొవ్వూరు మండలంలోని . ప్రభుత్వ గుర్తింపు గల ఉన్నత పాఠశాలల విద్యార్థులందరూ పాల్గొనవచ్చును. పోటీలో పాల్గొనే విద్యార్థులు తమ ప్రధానోపాధ్యాయుని వద్ద నుండి గుర్తింపు పత్రం తీసుకురావాలి.

వ్యాసరచనకు సమయం 30 నిమిషాలు ఇవ్వబడుతుంది. వ్యాసాలు రాయడానికి కాగితాలు ఇవ్వబడతాయి. ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు ఇవ్వబడతాయి. ఈ పోటీ కొవ్వూరు మండల డెవలప్ మెంట్ ఆఫీసరు గారి పర్యవేక్షణలో సాగుతాయి.

వ్యాసరచన విషయం : “ప్రపంచశాంతి”

ఎక్కువమంది విద్యార్థినీ విద్యార్థులు ఈ పోటీలో పాల్గొని జయప్రదం చేయగోరిక. ప్రధానోపాధ్యాయులు అందరూ ఈ పోటీని జయప్రదం చేయడానికి సహకారం అందించగోరుతున్నాను.
దివి x x x x x.

మండల డెవలప్ మెంటు ఆఫీసర్,
కొవ్వూరు,
పశ్చిమ గోదావరి జిల్లా,

ఈ) ప్రశంసాత్మకంగా రాయండి.

మీ పాఠశాలలో ఒక విద్యార్థి రాష్ట్రస్థాయి స్కౌట్స్ అండ్ గైడ్స్ జంబోరీలో పాల్గొని, ముఖ్యమంత్రి చేతులమీదుగా బహుమతినందుకున్నాడు. అతణ్ణి అభినందిస్తూ పదివాక్యాలు రాయండి.
జవాబు:

అభినందన పత్రం

మిత్రుడు రవికాంత్ కు,
నీవు రాష్ట్రస్థాయి స్కౌట్స్ అండ్ గైడ్స్ జంభోరీలో పాల్గొని, మన ముఖ్యమంత్రి గారి చేతులమీదుగా ఉత్తమ స్కౌటుగా మొదటి బహుమతిని అందుకున్నావని తెలిసింది. ఇది మన పాఠశాల విద్యార్థులందరికీ గర్వకారణము. మన పాఠశాల పేరును నీవు రాష్ట్రస్థాయిలో నిలబెట్టావు. నీకు మన విద్యార్థులందరి తరఫునా నా శుభాకాంక్షలు, అభినందనలు.

నీవు మొదటి నుండి చదువులోనూ, ఆటపాటలలోనూ ఉత్తమ విద్యార్థిగా పేరు తెచ్చుకుంటున్నావు. ఈ రోజు ఇంత ఉన్నతమైన బహుమతిని అందుకున్నావు. నీవు మన పాఠశాల విద్యార్థులందరికీ ఆదర్శప్రాయుడవు. నీవు సాధించిన ఈ విజయాన్ని మన విద్యార్థినీ విద్యార్థులంతా హార్దికంగా అభినందిస్తున్నారు. నీకు మా అందరి జేజేలు.
ఉంటా.

ఇట్లు,
కె. శ్రీకాంత్ రవివర్మ,
9వ తరగతి,
మునిసిపల్ హైస్కూలు,
కాకినాడ.

(లేదా)
మీ జిల్లాలో ఒక విద్యార్థి వ్యర్థంగా పారవేసిన వస్తువులతో అద్భుతంగా కళాఖండాలు తయారుచేశాడు. ఆ వార్తను మీరు పత్రికల్లో చూశారు. అతణ్ణి ప్రశంసిస్తూ పత్రికకు లేఖ రాయండి.
జవాబు:

వాకాడు,
x x x x

కె. రాజా రవివర్మ,
9వ తరగతి,
వాకాడు జిల్లా పరిషత్ హైస్కూలు,
నెల్లూరు జిల్లా,

ఈనాడు పత్రికా సంపాదకులకు,
సోమాజీగూడ, హైదరాబాదు.

ఆర్యా,
ఈ రోజు మీ పత్రికలో మా నెల్లూరు జిల్లా గూడూరు విద్యార్థి కె. రవిరాజు, వీధుల్లో పారవేసే ప్లాస్టిక్ కాగితాలు, బాటరీలు, అగ్గిపెట్టెలు వగైరా వ్యర్థ పదార్థాలతో చార్మినార్, తాజ్ షుహల్ వంటి కళాఖండాల నమూనాలను అద్భుతంగా తయారు చేశాడని చదివాను. ఆ కళాఖండాలను చూసి మా జిల్లా విద్యాశాఖాధికారి గారు, మా కలెక్టరు గారు, స్థానిక మంత్రిగారు ఆ విద్యార్థిని ప్రశంసించినట్లు చదివాను.

రవిరాజులోని కళాతృష్ణనూ, కళాచాతుర్యాన్ని నేను మనసారా ప్రశంసిస్తున్నాను. మా నెల్లూరు జిల్లా విద్యార్థి యొక్క కళాపిపాసనూ, అతనిలోని సృజనాత్మక శక్తినీ నేను మనసారా మెచ్చుకుంటున్నాను. మీ పత్రిక ద్వారా నా అభినందనలను మా సోదరుడు రవిరాజుకు అందజేయండి. భవిష్యత్తులో అతడు ఉత్తమ కళాకారుడు కావాలని నేను కోరుకుంటున్నాను.

ఇట్లు,
కె. రాజా రవివర్మ,
జిల్లా పరిషత్ హైస్కూలు,
వాకాడు.

చిరునామా :
సంపాదకులు,
ఈనాడు దినపత్రిక,
సోమాజీగూడ,
హైదరాబాదు.

IV. ప్రాజెక్టు పని

* మనచుట్టూ ఉండే ప్రతి ప్రాణిలో ఏదో ఒక గొప్పదనం ఉంటుంది. మీరు చూసిన పక్షులు, జంతువుల లక్షణాలను, ప్రత్యేకతలను పట్టిక రూపంలో రాసి ప్రదర్శించండి.

పక్షులు/జంతువులులక్షణాలుప్రత్యేకత
కుక్కవాసన పసిగట్టడంవిశ్వాసము కలది
కోడిగుడ్లు పెట్టుటకోడికూత
ఆవుసాధు జంతువుమచ్చిక చేసిన పాలు ఇస్తుంది.
సింహంక్రూరమైనదిమృగరాజు
ఏనుగుఎత్తైనదిబరువులు ఎత్తుట
పావురంపెంపుడు పక్షిసమాచారం చేరవేయుట

III. భాషాంశాలు

పదజాలం

అ) ఇచ్చిన వాక్యాలు ఆధారంగా కింద గీత గీసిన పదాలకు అర్థాలను గ్రహించి, మరో వాక్యం రాయండి.

1. ఇంద్రధనుస్సులో రంగులను చూస్తే, విస్మయం కలుగుతుంది.
అర్థాలు : ఇంద్రధనుస్సు = హరివిల్లు; విస్మయం = ఆశ్చర్యం
వాక్యప్రయోగం : హరివిల్లు ఆకాశంలో కనబడితే, పిల్లలకు ఆశ్చర్యము కలుగుతుంది.

2. మనం ప్రతిరోజు ప్రాతఃకాలంలో నిద్రలేవాలి.
అర్థం : ప్రాతఃకాలము = తెల్లవారే సమయము.
వాక్యప్రయోగం : పక్షులు తెల్లవారే సమయములో కిలకిలారావములు చేస్తాయి.

3. వెన్నను చేతితో తాకితే మృదువుగా ఉంటుంది.
అర్థం : మృదువు = మెత్తనిది
వాక్యప్రయోగం : పూలు మెత్తగా, సున్నితంగా ఉంటాయి.

4. ప్రవర్తన సరిగా లేనివారు జీవితంలో కష్టాల్లో పడతారు.
అర్థం : ప్రవర్తన = నడవడి
వాక్యప్రయోగం : మనిషి జీవితాన్ని వారి నడవడి నిర్ణయిస్తుంది.

5. ఆదర్శానికి, ఆచరణకు సమన్వయం ఉండడం వాంఛనీయం.
అర్థం : సమన్వయం = సరియైన క్రమము
వాక్యప్రయోగం : ధర్మార్థములకు సరియైన క్రమము అవసరము.

AP Board 9th Class Telugu Solutions Chapter 8 చూడడమనే కళ

ఆ) కింది వాటిలో ఆత్మవిశ్వాసం ప్రకటించడానికి ఉపయోగపడే పదాలున్నాయి. వాటిని వేరుచేసి వాక్యాలు రాయండి.
తనంతట తాను, దురదృష్టం, కాఠిన్యం, తెలుసుకోడం, క్లిష్టం. నిజం చెప్పడం, పలు అసాధారణం, పనిని ఇష్టపడడం, స్వతస్సిద్ధం.
జవాబు:
ఆత్మవిశ్వాసం ప్రకటించడానికి ఉపయోగపడే పదాలు

  1. తనంతట తాను
  2. స్వతస్సిద్ధం
  3. నిజం చెప్పడం
  4. తెలుసుకోడం
  5. పనిని ఇష్టపడడం

వాక్య ప్రయోగాలు :

  1. తనంతట తాను . ఇతరుల సాయం లేకుండానే రవిబాబు తనంతట తానుగా ఆ కార్యం నెరవేర్చాడు.
  2. స్వతస్సిద్ధం గోపాల్ బాబు స్వతస్సిద్ధంగా గొప్ప కార్యసాధకుడు.
  3. నిజం చెప్పడం . ఏమైనా సరే, నిజం చెప్పడం మనిషి కర్తవ్యం అని బాబు నమ్ముతాడు.
  4. తెలుసుకోడం : తన శక్తిని తాను తెలుసుకోడం, కార్యసాధకుని మొదటి లక్షణం.
  5. పనిని ఇష్టపడడం : పనిని ఇష్టపడడం అన్నది యోగ్యుని లక్షణం అని చెప్పాలి.

ఇ) కింది వాక్యాలలో ప్రకృతి పదాలను గుర్తించండి. వాటి ఎదురుగా వికృతులను ఎంపిక చేసుకొని రాయండి.
1) ఆకాశంలో మబ్బులను చూశారా?
జవాబు:
ఆకాశం

2) సరైన ఆహారాన్ని తీసుకోవాలి.
జవాబు:
ఆహారం

3) నెమలి జాతీయ పక్షి.
జవాబు:
పక్షి

4) ఉపాధ్యాయుడు బడిలో పాఠాలతో పాటు క్రమశిక్షణ నేర్పుతాడు.
జవాబు:
ఉపాధ్యాయుడు

AP Board 9th Class Telugu Solutions Chapter 8 చూడడమనే కళ

వికృతి పదాలు : ఓగిరం, సంద్రం, పక్కి, దెస, ఒజ్జ, గారవం, ఆకసం, బాస, సాకిరి
జవాబు:
ప్రకృతి – వికృతి
1) ఆకాశం – ఆకసం
2) ఆహారం – ఓగిరం
3) పక్షి – పక్కి
4) ఉపాధ్యాయుడు – ఒజ్జ

వ్యాకరణం

ఈ) కింది వాక్యాన్ని పరిశీలించి, అది ఏ రకమైన వాక్యమో గుర్తించండి. క్రియా భేదాలను కూడా గుర్తించండి.
1) రమ రోడ్డుమీద ఉన్న ఒక కాగితం ముక్కను తీసి, దగ్గరలో నున్న చెత్తకుండీలో వేసి, మళ్ళీ సైకిలెక్కి వెళ్ళిపోయింది.
అ) సామాన్య
ఆ) సంయుక్త
ఇ) సంక్లిష్ట
జవాబు:
సంక్లిష్ట వాక్యం

పై వాక్యంలో ఉన్న అసమాపక క్రియలను రాయండి.
అసమాపక క్రియలు : 1) తీసి 2) వేసి 3) ఎక్కి అనేవి. ఇవి క్వార్థకములు అనే అసమాపక క్రియలు.

2) ఎక్కడ? ఎప్పుడు? ఎందుకు? ఎవరు? ఏమిటి? అనే పదాలను ఉపయోగించి, ప్రశ్నార్థక వాక్యాలు తయారుచేయవచ్చునని మీకు తెలుసు. వాక్యం చివరలో ‘ఆ’ అనే ప్రత్యయాన్ని చేర్చి కూడా ప్రశ్నవాక్యంగా మార్చవచ్చు. ఇలాంటి ప్రశ్నావాక్యాలను రకానికి ఒకటి చొప్పున, మీ పాఠ్యపుస్తకం నుంచి ఉదాహరణలు వెతికి రాయండి.
ఉదా : దైన్యస్థితిని చూస్తారు + ఆ = దైన్యస్థితిని చూస్తారా?
జవాబు:
ప్రశ్నార్థక వాక్యాలు :

  1. మీరెప్పుడయినా గమనించారా? (గమనించారు + ఆ)
  2. మీరు గమనిస్తారా? (గమనిస్తారు + ఆ)
  3. వీటిని మీరు చూస్తారా? (చూస్తారు + ఆ)
  4. నిజంగా మీరు చూస్తుంటారా? (చూస్తుంటారు + ఆ)
  5. శ్రద్ధ చూపడం అంటే ఏమిటో మీకు తెలుసా? (తెలుసు + ఆ)
  6. పెద్దవారయిన కొద్దీ పోతుంది. ఎందువల్ల?
  7. పెరుగుతున్నప్పుడు ఎందుకు పోగొట్టుకుంటారు?
  8. ఇంట్ల కెట్ల ఆ పిల్లగాడు వొచ్చిండో? (వొచ్చిండు + ఓ)
  9. పిరికిదనం గల్గియున్నచో నట్టి ప్రసిద్ధములైన కార్యముల జేయగలిగెడి వారేనా? (వారేను + ఆ)

3) ఒక వస్తువు స్వభావాన్ని / ధర్మాన్ని తెలిపే క్రియలను, నిత్య సత్యాలను తెలిపే వాటిని “తద్ధర్మ” క్రియలు అంటారు.
ఉదయిస్తాడు, అస్తమిస్తాడు, ఎగురుతుంది మొదలైనవి. ఇలాంటి క్రియలను మీ పాఠంలో వెతికి రాయండి.
జవాబు:
నడుస్తారు, ఉదయిస్తుంది, పారిపోతారు, చూస్తారు, ఊహిస్తారు, గ్రహిస్తారు, చదువుతారు, చేస్తారు మొ||నవి.

ఉ) రుగాగమ సంధి :
పేద + ఆలు = పేద + ర్ + ఆలు = పేదరాలు.

గమనిక :
పై రెండు పదాలకు మధ్య ‘5’ అనేది వచ్చి, ప్రక్కనున్న ‘ఆ’ అనే అచ్చుతో కలిస్తే ‘రా’ అయింది. పై రెండు పదాలకు మధ్య ‘5’ అనేది వచ్చి ప్రక్కనున్న ‘ఆ’ అనే శబ్దం పరమైతే అదెలా వస్తుందంటే, పేద, బీద, బాలింత ఇలాంటి పదాలకు ‘ఆలు’ అనే శబ్దం పరమైతే ఇలా రుగాగమం ‘5’ వస్తుంది. రెండు పదాలలో ఏ అక్షరాన్ని కొట్టివేయకుండా, కొత్తగా అక్షరం వస్తే ‘ఆగమం’ అంటారు.

సూత్రం 1 :
పేదాది శబ్దాలకు ‘ఆలు’ శబ్దం పరమైతే కర్మధారయంలో రుగాగమం వస్తుంది.
పేద (విశేషణం) – ఆలు (స్త్రీ) (నామము)
విశేషణం – నామం
మనుమ + ఆలు = మనుమరాలు
బాలింత + ఆలు = బాలింతరాలు

సూత్రం 2 :
కర్మధారయంలో తత్సమపదాలకు ఆలు శబ్దం పరమైతే, పూర్వపదం చివర ఉన్న అత్వానికి ఉత్వమూ, రుగాగమమూ వస్తాయి.
ఉదా :
ధీరురాలు = ధీర . + ఆలు
(ధీర + ఉ + ర్ + ఆలు) = ధీరురాలు
గుణవంత + ఆలు = గుణవంత + ఉ + ర్ + ఆలు = గుణవంతురాలు

మరికొన్ని ఉదాహరణలు రాయండి.
1) విద్యావంతురాలు : విద్యావంత + ఉ + ర్ + ఆలు = విద్యావంతురాలు
2) అసాధ్యురాలు : అసాధ్య + ఉ + ర్ + ఆలు = అసాధ్యురాలు
3) పవిత్రురాలు – పవిత్ర + ఉ + ర్ + ఆలు = పవిత్రురాలు
4) ధైర్యవంతురాలు : ధైర్యవంత + ఉ + ర్ + ఆలు = ధైర్యవంతురాలు

9th Class Telugu 8th Lesson చూడడమనే కళ రచయిత పరిచయం

జిడ్డు కృష్ణమూర్తిగారు మే 12, 1895న ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా మదనపల్లెలో – జన్మించారు. వీరు ఆంగ్లములో ధ్యానం, స్వేచ్ఛ, నీవే ప్రపంచం, గరుడయానం మొదలైన రచనలు | చేశారు. కృష్ణమూర్తిగారు ప్రపంచ ప్రఖ్యాత తత్త్వవేత్త.

మనిషి తనంతట తానుగా భయం, కట్టుబాట్లు, అధికారం, మూఢవిశ్వాసాల నుండి విముక్తి చెందాలని బోధించారు. అసలైన విప్లవం రావలసినది హృదయపు లోతులలో.

ఆ మనిషిలో సమూలమైన పరివర్తన కలగకపోతే ఈ యుద్ధాలు, ఈ హింసాకాండ, ఈ జిడ్డు కృష్ణమూర్తి విధ్వంసం ఇట్లాగే కొనసాగుతూ ఉంటాయి. తనను తాను పూర్తిగా అవగాహన చేసుకుంటూ హృదయంతో స్పందిస్తూ జీవించటంలోనే పరివర్తన సాధ్యమౌతుంది అని తన రచనల ద్వారా, ప్రవర్తన ద్వారా నిరూపించారు.

AP Board 9th Class Telugu Solutions Chapter 8 చూడడమనే కళ

కఠిన పదాలకు అర్థాలు

సూర్యోదయము (సూర్య + ఉదయము) = సూర్యుడు ఉదయించడం
సూర్యాస్తమయము (సూర్య + అస్తమయము) = సూర్యుడు అస్తమించడం
విస్మయపరచు = ఆశ్చర్యము కలుగజేయు
గమనించు = గ్రహించు
ప్రతిబింబించు= ప్రతిఫలించు
ప్రాతఃకాల భానుడు = ఉదయకాల సూర్యుడు
వెండితునక = వెండి ముక్క
మాలిన్యాన్ని = మురికిని
హీనస్థితి = దారిద్ర్య స్థితి
మన్నన = గౌరవము
కాఠిన్యం = కఠినత్వము
మృదుస్వభావం = మెత్తని స్వభావము
స్పందన = కదలిక
ఆరంభము = ప్రారంభము (మొదలు)
ఆశ్రయము = ఆధారము
ప్రజ్ఞావంతముగా = తెలివి కలవారుగా
హృదయం = మనస్సు
చింత = ఆలోచన
అంతరంగం = హృదయము
నిరుత్సాహం = ఉత్సాహం లేకపోవడం
ప్రతిస్పందించు = తిరిగి కదలడం
గమనించు = గ్రహించడం
క్లిష్టమైన = కఠినమైన
అసాధారణం = విశేషము
ప్రజ్ఞ = తెలివి, అప్పటికప్పుడు పుట్టే ప్రతిభ
ఆప్యాయత = ప్రీతి
లక్ష్యపెట్టు = పట్టించుకొను
లక్ష్యం = శ్రద్ధ (గురి)
సాక్షులు = కంటితో చూచినవారు
అశుభ్రత = శుభ్రత లేకపోవడం
దైన్యాన్ని = దీనత్వాన్ని
చర్య = నడవడి, అనుష్ఠానము
సంఘర్షణ = ఒరపిడి
మిత్రునితో = స్నేహితునితో
ప్రాధాన్యత = ప్రాముఖ్యము
అస్తిత్వం = ఉండడం
స్వతస్సిద్ధంగా = తనంతట తానుగా సిద్ధించినది (సహజంగా)
శ్రవణానందము (శ్రవణ + ఆనందము) = చెవులకు ఆనందము
నిరపేక్ష = అపేక్ష లేకపోవడం (కోరికలేమి)
బెస్తవారు = పడవలను నడిపే, చేపలు పట్టుకొనే వారు
విమర్శ = తఱచి మంచిచెడ్డలను చెప్పడం

AP Board 9th Class Telugu Solutions ఉపవాచకం Chapter 3 నేనెరిగిన బూర్గుల

AP State Syllabus AP Board 9th Class Telugu Textbook Solutions ఉపవాచకం Chapter 3 నేనెరిగిన బూర్గుల Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Telugu Solutions ఉపవాచకం 3rd Lesson నేనెరిగిన బూర్గుల

9th Class Telugu ఉపవాచకం 3rd Lesson నేనెరిగిన బూర్గుల Textbook Questions and Answers

కింది ప్రశ్నలకు పదిహేను వాక్యాలకు మించని సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
డా. రామకృష్ణారావుగారు అవసరం వచ్చినప్పుడు వామనమూర్తివలే ముల్లోకాలు ఆక్రమించి విరాడ్రూపాన్ని ప్రదర్శించేవారు అని పి.వి. నరసింహారావుగారు ఎందుకు అన్నారు?
(లేదా)
అవసరమైతే విరాడ్రూపాన్ని ప్రదర్శించే వారని బూర్గుల వారి గురించి పి.వి. గారు ఎందుకు అన్నారో వివరించండి.
జవాబు:
డా|| రామకృష్ణారావు అవసరం వచ్చినపుడు వామన మూర్తివలే ముల్లోకాలు ఆక్రమించి విరాడ్రూపాన్ని ప్రదర్శించేవారు అని పి.వి. నరసింహారావుగారు అనడంలో నూటికి నూరుపాళ్ళు నిజముంది. రామకృష్ణారావు గారి పొట్టితనం కొంతవరకు వారిని మరుగుపరుస్తూ ఉండేదని అప్పట్లో కొందరి భావన. నిజానికి ఒడ్డూ, పొడుగూ ఉన్న చాలామంది కంటే కూడా వారు అతి చక్కగా గుర్తింపబడుతూ ఉండేవారు. చిన్నమూర్తిలో ఇమిడి ఉన్న వారి బహుముఖ ప్రతిభాయుత మూర్తిమత్త్వం అవసరం వచ్చినప్పుడు తమ మహోన్నత రూపంలో ప్రదర్శితం కావడం, అవసరం తీరగానే తిరిగి స్వస్వరూపంలో ఇమిడిపోవడం అనేది వారి స్వభావంలోనే ఉంది.

న్యాయవాద వృత్తిలో డా|| రామకృష్ణారావుగారు సునిశిత మేథా సంపత్తిని ప్రదర్శించేవారు. కాని వారి వద్దకు వచ్చే క్లయింట్లలో చాలామందికి ఒక రకమైన మిశ్రమభావం ఉండేది. న్యాయవాదిగా వారి శక్తి సామర్థ్యాలపై సంపూర్ణ విశ్వాసమున్నప్పటికీ రాజకీయ వ్యగ్రత (తొందరపాటు, కంగారు) వలన కేసుపై ధ్యాస ఉంచలేరేమో అని క్లయింట్స్ మనస్సులో ఉండేది.

నిజానికి రామకృష్ణారావుగారికి కేసును క్షుణ్ణంగా చదివి తయారవడానికి అవకాశమే ఉండేది కాదు. కేసు చేపట్టేటప్పుడు వారు విషయమంతా శ్రద్ధగా విని ఆ కేసు తాలూకు ఫైలు వెనుక అస్పష్టమైన నోటులను కొన్ని రేఖా మాత్రంగా వ్రాసి పెట్టుకొనేవారు. నిజానికి వాటిని కేసుకు తయారీ అనడానికి వీలు లేదు. కాని కోర్టులో ఆ రేఖా మాత్రపు నోట్సే డా. రామకృష్ణారావుగారి జాజ్జ్వల్యమానమైన ప్రతిభా విశేషతతో ఎదుటి న్యాయవాదుల వాదనా ఘాతములకు దుర్భేద్యమైన కంచుగోడలుగా నిలవడం పి.వి.గారు ప్రత్యక్షంగా చూసారు. అందుకే వారిని వామన మూర్తివలే ముల్లోకాలు ఆక్రమించి విరాట్ రూపాన్ని ప్రదర్శించారని అన్నారు.

AP Board 9th Class Telugu Solutions ఉపవాచకం Chapter 3 నేనెరిగిన బూర్గుల

ప్రశ్న 2.
సామ్యవాద వ్యవస్థ కోసం డా. రామకృష్ణారావుగారు చేసిన కృషి ఏమిటి?
(లేదా)
చెప్పడం తేలిక, చెయ్యడం కష్టం. డా|| రామకృష్ణారావుగారు కౌలుదారీ చట్టాన్ని తయారుచేసి సామ్యవాద వ్యవస్థకు మార్గదర్శకులయ్యారు. దీని గురించి వివరించండి.
జవాబు:
రాజకీయాలలో డా. రామకృష్ణారావుగారి సమ్యక్ దృష్టికోణం సంకుచిత సైద్ధాంతిక అరలకు తావివ్వలేదు. ఆయన పుట్టింది జాగీర్ దారీ కుటుంబంలో అయినప్పటికీ పూర్వపు హైదరాబాద్ సంస్థానంలో తరతరాల నుండీ వస్తున్న జాగీర్దారీ వ్యవస్థను రూపుమాపడానికి వెనుకాడలేదు. వారి స్నేహ కోటిలో పెద్ద పెద్ద భూస్వాములు చాలామంది ఉండేవారు. అయినప్పటికీ వారు పూర్వపు హైదరాబాద్ రాష్ట్రంలో దున్నేవానికి భూమి హక్కు నిచ్చే కౌలుదారీ చట్టాన్ని తయారు చేసి, దేశంలో సామ్యవాద వ్యవస్థకు మార్గదర్శకులైనారు. ఆ చట్టాన్ని అమలు పరచడానికి వారు ఎంపిక చేసిన జిల్లాల్లో ఎక్కువగా నష్టపోయింది వారి బంధువులూ, రాజకీయ సహచరులే.

పూర్వపు హైదరాబాద్ సంస్థాన విచ్ఛిత్తి తన రాజకీయ ప్రాబల్యానికి స్వస్తి వాచకం పలుకుతుందని వారికి ముందే తెలుసు. అయినప్పటికీ తనకు నష్టం, ఇతరులకు మేలు చేకూర్చే నిర్ణయాలు తీసుకొంటూ తన రాజకీయ జీవితాన్నంతా ఆత్మ పరిత్యాగానికి, చివరకు సక్రియ రాజకీయాల నుండి తన నిష్క్రమణకు దారితీసే పరిస్థితులకు, సామ్యవాద వ్యవస్థకోసం అన్నింటిని వీరివలె అంకితం చేసుకొనే రాజనీతి విశారదులు బహు అరుదు.

ప్రశ్న 3.
డా.రామకృష్ణారావుగారు నిర్వహించిన పదవులు ఏవి?
(లేదా)
బహుభాషావేత్తగా, పేరు పొందిన డా.రామకృష్ణారావు గారు నిర్వహించిన పదవులు ఏవి?
(లేదా)
స్థిత ప్రజ్ఞుడుగా పేరు పొందిన డా॥ రామకృష్ణారావుగారు నిర్వహించిన పదవులేవి?
జవాబు:
తెలుగుజాతి సగర్వంగా చెప్పుకోగలిగిన మహాపురుషులలో బూర్గుల రామకృష్ణారావుగారు అగ్రేసరులు. ఒక హైస్కూలులో పర్షియన్ బోధించే ఉపాధ్యాయుడిగా పనిచేసిన ఆంధ్రుడు బహుశా ఈయన ఒక్కరేనేమో. 1923లో హైదరాబాదు నగరంలో న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. 1929లో ఏర్పడ్డ పౌరహక్కుల పరిరక్షణ సంఘానికి రామకృష్ణారావు అధ్యక్షులుగా పనిచేసారు. రెండవ ఆంధ్ర మహాసభకు (1931లో) ఈయన అధ్యక్షత వహించారు. 1950 జూన్ 12న మంత్రిగా పదవి చేపట్టారు. 1952 మార్చి 6న హైదరాబాదు ముఖ్యమంత్రిగా బూర్గులవారు పదవీ స్వీకారం చేశారు. ఆయన హైదరాబాదు రాష్ట్రానికి ప్రజాప్రతినిధులచే ఎన్నోకోబడిన తొలి ముఖ్యమంత్రి, పర్షియన్ ట్యూటర్ గా, న్యాయవాదిగా, స్టేట్ కాంగ్రెస్ నాయకులుగా, మంత్రిగా, ముఖ్యమంత్రిగా, కేరళ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల గవర్నరుగా, రాజ్యసభ సభ్యులుగా ఇలా ఎన్నో పదవులు చేపట్టి, స్థితప్రజ్ఞతను ప్రదర్శించారు.

ప్రశ్న 4.
జీవితంలో ఒడిదుడుకులను ఎదుర్కోవడానికి డా.రామకృష్ణారావుగారు అనుసరించిన పద్ధతి ఏమిటి?
(లేదా)
జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ధైర్యంగా ఎదుర్కొన్న బూర్గుల రామకృష్ణారావుగారి స్వభావాన్ని వివరించండి.
జవాబు:
డా|| రామకృష్ణారావు గారిది పెద్ద కుటుంబం. ఆ కుటుంబానికి వారొక ఆత్మీయులైన తండ్రి. ఆ కుటుంబానికే కాదు, … ప్రతిచోటా ఆత్మీయుడైన తండ్రిగానే ఉంటూ ఉండేవారు. వారి ఉదార ప్రవృత్తి వల్ల న్యాయముగా ఎక్కువ ధ్యానముంచవలసిన పనులకంటే. శక్తిని. సమయాన్ని వ్యక్తపరిచే పనులకు అప్పుడప్పుడు వారు ప్రాధాన్యమివ్వడం జరుగుతుండేది.

వారి సామాజిక యాత్ర ఎప్పుడూ సాఫీగా జరుగులేదు. రకరకాలైన ఒడిదుడుకులను వారు ఎదుర్కొనవలసివచ్చేది. చాలా సందర్భాలలో విపత్కర పరిస్థితులు సేనావాహినిలా వచ్చి చుట్టుముట్టేవి. అయినప్పటికీ వారు చలించేవారు కాదు. మన సైర్యాన్ని, సమచిత్తతను వారు ఎన్నడూ విడనాడేవారు కాదు. విజయాలు లభించినపుడు సంతోషంతో ఉప్పొంగనూ లేదు, కష్టాలు సంభవించినపుడు అధైర్యంతో క్రుంగిపోనూ లేదు. స్నేహితులు ద్రోహం తలపెట్టినపుడుకాని, ప్రత్యర్థులు దూషించినపుడు వారనేదల్లా ఒకటే – “సరే – అవన్నీ ఆటలో ఉండేవేగా” అని.

జీవితంలో ఒడిదుడుకులు సహజం. వాటిని చూసి భయపడటం, పారిపోవడం, ఇంకా ఏవేవో చేయడం మనలోని అసమర్థతను తెలుపుతాయి. బూర్గుల వారిలో స్థితప్రజ్ఞత అనుసరణీయం.

9th Class Telugu ఉపవాచకం 3rd Lesson నేనెరిగిన బూర్గుల Important Questions and Answers

I. అవగాహన – ప్రతిస్పందన

ఈ క్రింది వాక్యాలను సంఘటనలు ఆధారంగా వరుసక్రమంలో అమర్చి రాయండి.

ప్రశ్న 1.
అ) నేను వారివద్ద అందరికంటే జూనియర్ న్యాయవాదిగా ఉండేవాడిని.
ఆ) నేను నాకు కావలసిన కేసులను – ముఖ్యంగా జూనియర్లకు కొరుకుడు పడని చిక్కు కేసులను స్వయంగా ఏరుకొని చదువుతూ ఉండేవాడిని.
ఇ) ఒకసారి డా|| రామకృష్ణారావు గారు దానిని గమనించి తమ ఆమోదముద్ర వెయ్యడంతో ఆ కారాల మిరియాల ప్రకరణం ముగిసింది.
ఈ) నా ఈ చొరవ వారి సీనియర్ గుమస్తాకు కోపకారణమై ఆయన నా మీద కారాలు మిరియాలు నూరుతూ ఉండేవాడు.
జవాబు:
అ) నేను వారివద్ద అందరికంటె జూనియర్ న్యాయవాదిగా ఉండేవాడిని.
ఆ) నేను నాకు కావలసిన కేసులను – ముఖ్యంగా జూనియర్లకు కొరుకుడు పడని చిక్కు కేసులను స్వయంగా ఏరుకొని చదువుతూ ఉండేవాడిని.
ఈ) నా ఈ చొరవ, వారి సీనియర్ గుమస్తాకు కోపకారణమై ఆయన నా మీద కారాలు మిరియాలు నూరుతూ ఉండేవాడు.
ఇ) ఒకసారి డా|| రామకృష్ణారావు గారు దానిని గమనించి తమ ఆమోదముద్ర వెయ్యడంతో ఆ కారాల మిరియాల ప్రకరణం ముగిసింది.

AP Board 9th Class Telugu Solutions ఉపవాచకం Chapter 3 నేనెరిగిన బూర్గుల

ప్రశ్న 2.
అ) వారు రాగానే “సోదర సోదరీమణులారా !” నేను అలవాటు ప్రకారం నేడు కూడా ఆలస్యంగానే వచ్చాను.
ఆ) రామకృష్ణారావుగారిది పెద్ద కుటుంబం. ఆ కుటుంబానికే కాదు ఆయన ప్రతిచోటా ఆత్మీయుడైన తండ్రిగానే ఉంటూ ఉండేవారు.
ఇ) దారిలో వారిని ఎవరైనా, ఎక్కడైనా ఆపి కష్టసుఖాలు చెప్పుకోవచ్చు.
ఈ) అందుచేత వారు ప్రతిదానికీ ఆలస్యంగా రావడానికి పేరుపడ్డారు. అయినా మిత్రులు, సహచరులు ఎంతో ఓర్పుతో గంటల తరబడి వారి కోసం వేచి ఉండేవారు.
జవాబు:
ఆ) రామకృష్ణారావుగారిది పెద్ద కుటుంబం. ఆ కుటుంబానికే కాదు ఆయన ప్రతిచోటా ఆత్మీయుడైన తండ్రిగానే ఉంటూ ఉండేవారు.
ఇ) దారిలో వారిని ఎవరైనా, ఎక్కడైనా ఆపి కష్టసుఖాలు చెప్పుకోవచ్చు.
ఈ) అందుచేత వారు ప్రతిదానికీ ఆలస్యంగా రావడానికి పేరుపడ్డారు. అయినా మిత్రులు, సహచరులు ఎంతో ఓర్పుతో గంటల తరబడి వారి కోసం వేచి ఉండేవారు.
అ) వారు రాగానే “సోదర సోదరీమణులారా !” నేను అలవాటు ప్రకారం నేడు కూడా ఆలస్యంగానే వచ్చాను.

ప్రశ్న 3.
అ) ఆ చట్టాన్ని అమలు పరచడానికి వారు ఎంపిక చేసిన జిల్లాల్లో ఎక్కువగా నష్టపోయినవారు వారి బంధువులూ, రాజకీయ సహచరులే.
ఆ) వారు పుట్టింది జాగీర్దారీ కుటుంబంలో అయినా, జాగీర్ దారీ వ్యవస్థను రూపుమాపడానికి వెనుకాడలేదు.
ఇ) అయినా వారు పూర్వపు హైదరాబాద్ రాష్ట్రంలో దున్నేవానికి భూమిహక్కు నిచ్చే కౌలుదారీ చట్టాన్ని తయారుచేసి, సామ్యవాద వ్యవస్థకు మార్గదర్శకులైనారు.
ఈ) వారి స్నేహ కోటిలో పెద్ద పెద్ద భూస్వాములు చాలామంది ఉండేవారు.
జవాబు:
ఆ) వారు పుట్టింది జాగీర్ దారీ కుటుంబంలో అయినా, జాగీర్ దారీ వ్యవస్థను రూపుమాపడానికి వెనుకాడలేదు.
ఈ) వారి స్నేహ కోటిలో పెద్ద పెద్ద భూస్వాములు చాలామంది ఉండేవారు.
ఇ) అయినా వారు పూర్వపు హైదరాబాద్ రాష్ట్రంలో దున్నేవానికి భూమిహక్కునిచ్చే కౌలుదారీ చట్టాన్ని తయారుచేసి, సామ్యవాద వ్యవస్థకు మార్గదర్శకులైనారు.
అ) ఆ చట్టాన్ని అమలు పరచడానికి వారు ఎంపిక చేసిన జిల్లాల్లో ఎక్కువగా నష్టపోయినవారు వారి బంధువులూ, రాజకీయ సహచరులే.

II. వ్యక్తీకరణ – సృజనాత్మకత

అ) క్రింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
“డా.రామకృష్ణారావు గారి విశేష నైపుణ్యానికి నేను ఎల్లప్పుడూ జోహారులర్పిస్తూనే ఉంటాను” – అని పి.వి.గారు అనడంలోని ఆంతర్యాన్ని తెల్పండి.
జవాబు:
సీనియర్ న్యాయవాదిగా బూర్గుల వారిదొక ప్రత్యేక తరహా. వారివద్ద అనేకమంది జూనియర్లు ఉండేవారు. తల్లికి తన కడగొట్టు బిడ్డపై ఎటువంటి విశేష మమకారం ఉంటుందో అటువంటి మమకారమే డా.రామకృష్ణారావుగారికి పి.వి. గారి మీద ఉండేది. చొరవగా, నిరాఘాటంగా తిరగడం, కొరుకుడుపడని చిక్కు కేసులను స్వయంగా ఏరుకొని చదివే పి.విగారిని చూసి, అక్కడున్న సీనియర్ గుమాస్తాకు కోపకారణమైంది. దానిని గమనించిన బూర్గులవారు నా చేష్టపై ఆమోదముద్ర వేసి, వారిరువురి మధ్య దూరం తగ్గి నిష్కాపట్యంతో కూడిన సమాన స్థాయి చర్చా సంబంధం ప్రారంభమైంది. పి.వి. లోని శక్తి సామర్థ్యాలను వెలికి తీసి, అతనిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించారు. తనను తాను నిరూపించుకొనేందుకు డా. రామకృష్ణారావుగారి విశేష నైపుణ్యానికి పి.వి. ఎల్లప్పుడూ జోహారులర్పిస్తూనే ఉంటాను అనడంలోని ఆంతర్యం ఇదే.

AP Board 9th Class Telugu Solutions ఉపవాచకం Chapter 3 నేనెరిగిన బూర్గుల

ప్రశ్న 2.
“బూర్గుల వారు సౌజన్యానికి మారుపేరు” వివరించండి.
జవాబు:
మత దురభిమానాన్ని పెంపొందిస్తూ రాజ్యమేలుతున్న ఆనాటి నిజాంకు బద్ధ వ్యతిరేకి బూర్గులవారు. కానీ అక్కడి ముస్లింలందరికీ మిక్కిలి ఆప్తులు. అతి నిరాడంబరంగా వారు మతాతీత స్థితిని పాటించేవారు. వారి డ్రాయింగ్ రూమ్ లో ఆనాటి హైదరాబాద్ ప్రభుత్వ పెద్దలు, మౌల్వీలు, ముల్లాలు, పండితులు, మహా మహోపాధ్యాయులు, గాంధీ టోపీలవారు, ఖద్దరుదారులు, అధునాతన టెరిలిన్ యువకులు ఒక్క మాటలో చెప్పాలంటే డా. రామకృష్ణారావుగారు మూడు విభిన్న తరాల చివరి వారిధిలా కన్పించేవారు. అవసరమైనపుడు ఆయన ప్రత్యర్థులను చీల్చి చెండాడేవారు. కాని అలా చేయడంలో ప్రత్యర్థుల కంటి నుండి ఒక్క కన్నీటి బొట్టు పడటం కాని, వారి హృదయాలకు రవ్వంత నొప్పి తగలడం కాని జరిగేది కాదు.

ఇలా ఎన్నో విషయాలు ఆయన సౌజన్యానికి ప్రతీకలుగా నిలిచేవి.

ప్రశ్న 3.
‘బూర్గుల బహుభాషావేత్త’ అని ఎలా చెప్పగలవు?
జవాబు:
బూర్గుల వారు చాలా ప్రతిభావంతులైన భాషావేత్తలనే విషయం అందరికీ తెలిసినది. వారు చదువుకున్న చాలా భాషలు వాటి యందలి అభిరుచులచే ప్రయివేటుగా చదువుకొన్నవే. తెలుగు, ఉర్దూ, ఇంగ్లీషు, హిందీ, సంస్కృత భాషలలో రచనలు చేసారు. 1919 – 20 ప్రాంతంలో “కన్నె కన్నులు” అనే ఖండ కృతి రచించారు. మరియు కృష్ణ శతకం, సంస్కృతంలో శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం, శ్రీకృష్ణాష్టకం, ఉమర్‌య్యూం రుబాయీలను ఫారసీ భాష నుంచే 101 రుబాయీలను తెలుగు పద్యాలుగా అనువదించారు. శంకరాచార్యులవారి సౌందర్యలహరిని వీరు 1962లో తెనిగించారు. అలాగే కనకధారాస్తవాన్ని ఆంధ్రానువాదం (1964) చేసారు. “సారస్వత వ్యాసముక్తావళి” అనే పేరుతో పరిశీలనాత్మక సాహిత్య వ్యాసాలు (1926) వ్రాసారు. ఈ వ్యాసాలు మహాకవి శ్రీశ్రీనే ఆకట్టుకొన్నాయంటే వాటి విలువ ఏమని చెప్పాలి. దాశరథి గారి ‘గాలిబ్ గీతాలు’ వంటి అనేక పుస్తకాలకు పీఠికలు వ్రాసారు. ఈయన అన్ని భాషలలో రచనలు చేయకుండా, ఏ ఒక్క భాషలోనో కృషి చేసి ఉంటే ఆ భాషా రంగంలో జాతిరత్నం వలె ప్రకాశించేవారేమో!

AP Board 9th Class Telugu Solutions ఉపవాచకం Chapter 3 నేనెరిగిన బూర్గుల

ఆ) కింది ప్రశ్నలకు పదిలేక పన్నెండు వాక్యాలలో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
డా. రామకృష్ణారావు గారిని గూర్చి పి.వి. నరసింహారావుగారు ఏమి చెప్పారో రేఖామాత్రంగా రాయండి.
(లేదా)
“బూర్గుల వారిని పూర్ణ పురుషులు” అని పి.వి. అన్నారు కదా ! వివరించండి.
జవాబు:
సమాజంలో కొద్దిమందే ప్రభావశక్తి సంపన్నులు ఉంటారు. వీరి సాంగత్యం పొందినా, వీరి గురించి తెలుసుకొన్నా స్ఫూర్తి కలుగుతుంది. మంచిమార్గంలో నడవడానికి అవకాశం కలుగుతుంది. ఇలా స్ఫూర్తిదాయకమైన వారిలో ఒకరు కీ.శే. బూర్గుల రామకృష్ణారావు గారు. వీరి గురించి మరొక మహోన్నత వ్యక్తి, బహుఖ ప్రజ్ఞాశాలి కీ.శే. పి.వి. నరసింహారావు గారు బూర్గులవారి మహోన్నత వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించేలా ఈ వ్యాసాన్ని రాసారు.

బూర్గుల వారి గురించి ఎప్పుడు, ఎక్కడ పుట్టారు, విద్యాభ్యాసం, మంత్రి, ముఖ్యమంత్రి ఇలా అనేక అంశాలను స్పృశించినంత మాత్రాన వారి వ్యక్తిత్వం తెలియదంటారు పి.వి. ప్రతి వ్యక్తిలోను సామాన్యంగా ఉన్నదానికంటే ఎక్కువ తన గురించి అనుకొనే స్వభావం ఉంటుంది. తాను ఇతరులకంటే గొప్పవాడనిపించుకోవాలనే కోరిక ఒకరినొకరు కించపరుచుకుంటూ, తమ శక్తిని, సమయాన్ని వృధా చేసుకుంటారు. కాని ఇందుకు భిన్నంగా ఉండే బూర్గుల వారిని గూర్చి ఎంత చెప్పినా తకు నే అవుతుంది. వారి బహుముఖ ప్రతి నియుత మూర్తిమత్త్వం అవసరం వచ్చినప్పుడు తమ మహోన్నత రూపంలో ప్రదర్శితం కావడం, అవసరం తీరగానే “రిగి పూర్వ రూపంలో ఇమిడిపోవడం అనేది వారి స్వభావంలోనే ఉందని పి.వి. అంటారు.

క్లయింట్లు చెప్పే విషయాన్ని శ్రద్ధగా విని ఆ కేసు తాలుకు ఫైలు వెనుక నోటులను రేఖామాత్రంగా రాసి, కోర్టులో తన ప్రతి విశేషతతో ఎదుటి న్యాయవాదులకు కొరకరాని కొయ్యగా మారేవారు. ఆయన వద్ద జూనియర్ గా చేరిన సి వి.గారిని తాను సీనియర్ ని అనిగాక, నిష్కాపట్యంతో కూడిన సమానస్థాయిని ప్రదర్శించేవారు. తాను పుట్టింది జాగీర్ దార్ కుటుంబంలో అయినప్పటికీ పూర్వం నుంచి వస్తున్న జాగీర్ దారీ వ్యవస్థను రూపుమాపడానికి వెనుకాడలేదు. బూర్గులవారు ఏ నిర్ణయం తీసుకొన్నా దానిని అన్ని విధాలైన జాగ్రత్తలతోను, వ్యవహార దక్షతతోను తీసుకొనేవారు.

సౌజన్యానికి మారుపేరు రామకృష్ణారావుగారు. నిజాం నవాబుకు బద్ధ వ్యతిరేకి అయినప్పటికీ అక్కడి ముస్లింలందరికీ మిక్కిలి ఆప్తులు. ఆయనను గూర్చి ఒక్కమాట చెప్పాలంటే మూడు విభిన్న తరాల చివరి వారధిలా కన్పించేవారి పి.వి. తెలిపారు. ఆనాటి శాసనసభా నాయకులుగా ఉండి అవసరమైనపుడు ప్రత్యర్థులను చీల్చి చెండాడేవారు. కాని అలా చేయడంలో వారి హృదయాలకు రవ్వంత నొప్పి తగిలేది కాదు. ముఖ్యమంత్రి అయిన రోజుల్లో బూర్గులవారు ప్రతిరోజూ అర్థరాత్రి వరకు ఆఫీసు ఫైళ్ళు చూసుకొని, ఆ కర్వాత నమ్మశక్యం గాని ఉత్సాహంతో తెలుగు, సంస్కృత, ఉర్దూ, ఇంగ్లీష్, హిందీ ఇలా అనేక గ్రంథాలను చదివేవారు.

బూర్గుల వారి సామాజిక యాత్ర ఎప్పుడూ సాఫీగా సాగలేదు. అనేక ఒడిదుడుకులను వారు ఎదుర్కొన్నారు విజయాలకు పొంగలేదు. కష్టాలకు కుంగనూలేదు. ప్రత్యర్థులు దూషించినా “సరే – ఇవన్నీ ఆటలో ఉండేవేగా” అని అనేవారు. ఆయన గురించి ఒక్కమాటలో చెప్పాలంటే వారు పూర్ణపురుషులు” అని పి.వి. గుర్తు చారు.

AP Board 9th Class Telugu Solutions ఉపవాచకం Chapter 2 నేనూ సావిత్రీబాయిని

AP State Syllabus AP Board 9th Class Telugu Textbook Solutions ఉపవాచకం Chapter 2 నేనూ సావిత్రీబాయిని Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Telugu Solutions ఉపవాచకం 2nd Lesson నేనూ సావిత్రీబాయిని

9th Class Telugu ఉపవాచకం 2nd Lesson నేనూ సావిత్రీబాయిని Textbook Questions and Answers

కింది ప్రశ్నలకు పదిహేను వాక్యాలకు మించని సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
సావిత్రీబాయి కాలంలో స్త్రీల పరిస్థితులు ఎలా ఉండేవి?
జవాబు:
సావిత్రీబాయి కాలంలో ఆడవాళ్ళు గడప దాటకూడదు. ఆడదంటే వంటింటికీ, వంటింట్లో పొయ్యికి కట్టుబడి ఉండాలి. ఆడపిల్ల నియమాలను ఎంతమాత్రం దాటరాదు.

ఆ రోజుల్లో పొయ్యిలో కర్రలూ, పొయ్యి ఊదే గొట్టం ఆడపిల్ల చేతిలో ఎప్పుడూ ఉండాల్సిందే. ఆడపిల్ల ఆ గొట్టంతో పొయ్యిని ఊదుతూ ఉండాల్సిందే. ఆడపిల్ల భర్తనూ, అత్తమామల్ని సేవించుకోవాలి. ఇప్పుడు రెండవతరగతి చదివే వయస్సులోనే ఆనాడు ఆడపిల్లలు అత్తవారింట్లో ఉండేవారు. అత్తవారి ఇల్లే ఆడపిల్ల అసలు ఇల్లని ఆ రోజుల్లో ఆడపిల్లలకు తల్లిదండ్రులు నొక్కి చెప్పేవారు.

ఆ రోజుల్లో ఆడపిల్లలకు చదువు పనికిరాదు. చదువుకున్న ఆడది చెడిపోతుందని, బుద్ధిలేనిది అవుతుందని అప్పటివారు నమ్మేవారు. ఆనాడు సావిత్రి ఆడపిల్లలకు చదువు చెప్పడానికి బడికి పోతూంటే, జనం కిటికీల వెనుక నిలబడి తిట్టేవారు. శాపనార్థాలు పెట్టేవారు. నీచమైన మాటలు అనేవారు.

ప్రశ్న 2.
సేజ్ అంటే ఎవరు? ఆయన వ్యక్తిత్వాన్ని గురించి వివరించండి.
జవాబు:
పేజీ అంటే సావిత్రీబాయి భర్త “జ్యోతీరావ్ ఫూలే”. ఫూలే సేజ్, పూనాలో ఉండే ఫూలే కుటుంబంలో పుట్టాడు. సేజీకి ఎప్పుడూ బడి, పుస్తకాలు, చదువు అంటే ఇష్టం. సావిత్రీబాయి, జ్యోతీరావ్ ఫూలేని సేజ్ అనే పిలిచేది.

మనిషి మంచివాడయితే, అతడు మనదేశం వాడయినా, విదేశీయుడయినా సరే, ఆయన జీవితం, వ్యక్తిత్వం విలువలూ అన్నీ తెలుసుకోవాలి అనేవాడు సేజ్. శివాజీ, వాషింగ్టన్ వంటి వారి జీవిత చరిత్రలు అన్నీ ఆయన చదివాడు. థామస్ పెన్ రాసిన “మానవుని హక్కులు” పుస్తకం చదివి మనిషికి ఉన్న హక్కులూ, బాధ్యతలూ చక్కగా తెలిసికొన్నాడు.

మన కులవ్యవస్థ, మన సమాజాన్ని నాశనం చేస్తోందని పేర్జీ చెప్పేవాడు. ఒకప్పుడు మంచిగా ఉన్న మన మతం మూర్ఖపు ఆచారాల్లో చిక్కుకుందనీ, వాటిని రూపుమాపాలనీ అనేవాడు. సేజ్, కబీర్, తుకారాం వంటి భక్తుల సాహిత్యాన్ని, మత సంస్కర్తల రచనల్నీ చదివాడు. ఆ కాలంలోని శూద్ర, అతిశూద్ర కులాల గొడవలు, విద్య వల్లే పోతాయనీ, విద్యే మన ధ్యేయం కావాలనీ సేజ్ చెప్పేవాడు. సేజ్, విద్య అనే తపన వహించిన మహావృక్షం వంటివాడు.

ఆడమనిషి చదువుకుంటేనే కుటుంబం బాగుపడుతుందని, భార్య సావిత్రికి చదువు చెప్పి, ఆమెను మొదటి పంతులమ్మగా చేశాడు. తక్కువ కులాల ఆడపిల్లల కోసం సొంత ధనంతో బడి పెట్టాడు.

మానవులందరూ పుట్టుకతో సమానులనీ, వాళ్ళు ఒకరినొకరు సమానులుగా చూసుకోవాలనీ సేజ్ చెప్పేవాడు. ఆడపిల్లలకు చదువు చెపుతున్నందుకు కోపంతో కొందరు సేజీని చంపబోయారు. బీదవాళ్ళకు సాయం చెయ్యడమే తన జీవితాశయం అనీ, వాళ్ళ చేతుల్లో చావటానికి కూడా తాను సిద్ధం అని చెప్పి, హంతకుల మనస్సును సేర్ జీ మార్చాడు.

శిశు హత్యలకు వ్యతిరేకంగా మొదటి ఆశ్రమం స్థాపించాడు. “దేవుడు ఒక్కడే. మనందరం ఆయన పిల్లలం. మనిషిని గొప్పవాడిగా చేసేది అతని గుణమే కాని, కులంకాదు.” అనే సిద్ధాంతాలతో “సత్యశోధక సమాజాన్ని” స్థాపించాడు.

సేజ్ అంటే జ్యోతీరావ్ ఫూలే. ఈయన స్త్రీ విద్యకూ, కులరహిత సమాజానికి కృషిచేసిన మహనీయుడు.

AP Board 9th Class Telugu Solutions ఉపవాచకం Chapter 2 నేనూ... సావితీబాయిని

ప్రశ్న 3.
జ్యోతీరావ్ ఫూలేని చంపడానికి వచ్చిన వాళ్ళు పరివర్తన చెందిన సంఘటనను తెలపండి.
(లేదా)
మంచితనంతో మూర్ఖుల మనసుకూడా మార్చవచ్చు అని నిరూపించారు సేజ్. జ్యోతీరావ్ పూలేని చంపడానికి వచ్చిన వాళ్ళు పరివర్తన చెందిన సంఘటన గురించి రాయండి.
జవాబు:
జ్యోతీరావ్ ఫూలే తక్కువ కులాల ఆడపిల్లల చదువులకై బడి పెట్టాడు. ఇది గిట్టని సంఘంలో కొందరు పెద్దమనుషులు ఫూలేని చంపమని దోండిరామ్, కుంబార్ రోడే అనే హంతకులను నియమించారు.

ఒకరోజు రాత్రి భోజనాలయ్యాక ఫూలే నిద్రపోడానికి సిద్ధమయ్యాడు. ఇంతలో ఫూలే పెరటి గుమ్మం తీసుకొని ఇద్దరు హంతకులు గొడ్డళ్ళతో నిశ్శబ్దంగా లోపలకు వచ్చారు. వాళ్ళ ముఖాలు భయంకరంగా ఉన్నాయి. వాళ్ళు ఫూలే భార్య సావిత్రికీ, ఫూలేకీ ముందు నిలబడి, ఫూలేని చంపడానికి గొడ్డళ్ళు పైకెతారు. వెంటనే ఫూలే భార్య “అన్నల్లారా ! ఆగండి. దయచేసి వెళ్ళిపొండి” అని బ్రతిమాలింది. ఎందుకు వచ్చారని ఫూలే వాళ్ళను అడిగాడు.

ఫూలే బడులు నడపడం ఇష్టంలేని కొందరు పెద్దలు, ఆయనను చంపడానికి తమకు కాంట్రాక్టు ఇచ్చారని, వాళ్ళు ఫూలేకు చెప్పారు.

అప్పుడు ఫూలే వాళ్ళతో – “నా చావు మీకు లాభం అయితే, నన్ను చంపండి. బీదవాళ్ళకు సాయం చెయ్యడమే, నా జీవితాశయం – బీదవారి చేతిలో చావడంలో తప్పులేదు. నన్ను చంపండి” అని మెడవంచి శాంతంగా చావుకు సిద్ధమయ్యాడు.

వెంటనే దోండిరామ్, కుంబార్ రోడేలు గొడ్డళ్ళు కిందపడేశారు. ఫూలే కాళ్ళమీద పడ్డారు. “మేము మిమ్మల్ని చంపం. మీరు మా తండ్రి వంటివారు. ఇప్పుడే వెళ్ళి మమ్మల్ని ఇక్కడకు పంపిన వాళ్ళను చంపుతాం” అన్నారు ఫూలే వాళ్ళను ఆపాడు. వారి ఆలోచన మారేదాకా వారితో మాట్లాడాడు.

వాళ్ళిద్దరూ ఫూలే రాత్రి బడిలో చేరారు. కుంబార్ రోడే ఫూలేకు బాడీగార్డుగా తయారయ్యాడు. కుంబార్ రోడే “వేదాచార్” అనే పుస్తకం రాసి, ఫూలే పనికి సాయం చేశాడు.

ప్రశ్న 4.
సావిత్రిబాయి ఫూలే పాత్రను ఏకపాత్రాభినయం చేయండి.
జవాబు:
“సావిత్రిబాయి ఫూలే” ఏకపాత్రాభినయం ; నేను సావిత్రిని.

ఈ రోజు మీతో మాట్లాడదామని మీ ముందుకు వచ్చా. మీరు, మేం మా కాలంలో ఎక్కడున్నామో అక్కడే నిలిచిపోయారా ? అని నాకు అనిపిస్తోంది. నేను మహారాష్ట్రలో సతారా జిల్లా, ఖండాలా తాలూకాలో నైగావ్ గ్రామంలో పాటిల్ గారి మొదటి సంతానంగా పుట్టా. చిన్నప్పుడు బాగా అల్లరి చేసేదాన్ని. చెట్లు ఎక్కి సీమ చింతకాయలు కోసుకు తినేదాన్ని.

నాకు ఏడవ సంవత్సరంలో పూనాలోని ఫూలే కుటుంబీకుడు జ్యోతిరావ్తో పెండ్లి జరిగింది. మా మామగారు మంచివారు. నా భర్తను నేను సేజ్ అని పిలిచేదాన్ని. సే జీకి చదువు అంటే ఇష్టం. నాకు ఆయన అన్నీ చదివి చెప్పేవారు. సేన్ జీ సాగర్ వెళ్ళారు. ఆడది చదువుకుంటేనే కుటుంబం బాగుపడుతుందని అక్కడ ఒక తెల్లజాతి మనిషి సేజీకి చెప్పింది.

సేజ్ నాకు చదువు చెప్పడం ప్రారంభించారు. మా మామగారు చదువుకుంటే ఆడది చెడిపోతుందని సేజీకి సలహా చెప్పారు. అయినా సేజ్ ఆ మాట వినలేదు. నా భర్త తక్కువ కులాల ఆడపిల్లల చదువులకు రెండు బడులు పెట్టారు. ఇంతలో ఆ స్కూలు నడిపే బడిపంతులు మానివేశాడు. దానితో ఫూలే బలవంతంపై, నేనే ఆ పిల్లలకు పంతులమ్మనయి, స్త్రీలకు చదువు చెప్పాను. ఆ పని చేయడం ఇష్టం లేని జనం నన్ను తిట్టేవారు. కిటికీలు మూసి నేను వారికి పాఠాలు చెప్పాను.

ఒక రోజున నేనూ, పేజీ నిద్రపోవడానికి సిద్ధంగా ఉండగా ఇద్దరు హంతకులు సేజీని చంపడానికి మా ఇంటికి వచ్చారు. సేజ్ తన్ను చంపండని తలవంచారు. హంతకుల మనస్సులు మారిపోయాయి. మేం ఓ పిల్లవాణ్ణి పెంచుకున్నాం. మా సొంతబిడ్డలాగే వాడిని చూసుకున్నాం. నేనే మొదటి పంతులమ్మను. శిశుహత్యలకు వ్యతిరేకంగా మేము ఒక ఆశ్రమం స్థాపించాము.

సత్యశోధక సమాజాన్ని స్థాపించాము. మేం సాధించిన విజయాలను, మా తర్వాత వచ్చిన ప్రజలు ముందుకు తీసుకెళ్ళాలి. పక్షవాతంతో సేర్జీ మరణించారు. 1897లో పూనాలో ప్లేగువ్యాధి వచ్చింది. ప్లేగు వ్యాధితో బాధపడే పసిపిల్లలను నేను చేరదీశాను. నేను కూడా ప్లేగు వ్యాధితోనే కన్నుమూశాను. మా ఆశయాలను ముందుకు తీసుకువెళ్ళండి. సెలవు.

9th Class Telugu ఉపవాచకం 2nd Lesson నేనూ… సావితీబాయిని Important Questions and Answers

I. అవగాహన – ప్రతిస్పందన

ఈ క్రింది వాక్యాలను సంఘటనలు ఆధారంగా వరుసక్రమంలో అమర్చి రాయండి.

ప్రశ్న 1.
అ) నేను ఆడపిల్లను కాదమ్మా ! ఇదిగో చూడు. ఈ సీమచింతకాయ ఎంత తియ్యగా ఉందో !
ఆ) నాన్న కిందకు దించాడు. అమ్మ మాత్రం ఆపలేదు.
ఇ) అమ్మా ! నా సీమ చింతకాయలు నేను, పడిపోతున్నా, కొమ్మ విరిగింది.
ఈ) చూడండి. మీ ముద్దుల కూతురు ఏంచేసిందో !
జవాబు:
ఇ) అమ్మా ! నా సీమచింతకాయలు, నేను, పడిపోతున్నా. కొమ్మ విరిగింది.
ఈ) చూడండి. మీ ముద్దుల కూతురు ఏంచేసిందో !
ఆ) నాన్న కిందకు దించాడు. అమ్మ మాత్రం ఆపలేదు.
అ) నేను ఆడపిల్లను కాదమ్మా ! ఇదిగో చూడు. ఈ సీమచింతకాయ ఎంత తియ్యగా ఉందో !

AP Board 9th Class Telugu Solutions ఉపవాచకం Chapter 2 నేనూ... సావితీబాయిని

ప్రశ్న 2.
అ) నా పుస్తకాల నేం చేస్తున్నావు ? పేజీలు పోగొడతావ్ జాగ్రత్త !
ఆ) ‘మీరు మీ ఆడవాళ్ళకు చదువు చెప్పించక పోవడం అన్యాయం’ అని ఆ తెల్లమనిషి సేజీతో అంది.
ఇ) జ్యోతి ! – సావిత్రి కెందుకు చదువు నేర్పుతున్నావు?
ఈ) ఈ సేజ్ ఎల్లా ఉంటాడబ్బా అనుకొనే దాన్ని. చింత చెట్లు ఎక్కుతాడా?
జవాబు:
ఈ) ఈ పేజీ ఎల్లా ఉంటాడబ్బా అనుకొనే దాన్ని. చింత చెట్లు ఎక్కుతాడా ?
అ) నా పుస్తకాల నేం చేస్తున్నావు ? పేజీలు పోగొడతావ్ జాగ్రత్త !
ఆ) ‘మీరు మీ ఆడవాళ్ళకు చదువు చెప్పించక పోవడం అన్యాయం’ అని ఆ తెల్లమనిషి సేజీతో అంది.
ఇ) జ్యోతి ! – సావిత్రి కెందుకు చదువు నేర్పుతున్నావు?

ప్రశ్న 3.
అ) నువ్వు చెప్తారు. అంతే ఎట్లా చెప్పాలో నేను నేర్పిస్తా.
ఆ) ఒక రోజు సాయంత్రం సేణీ ముఖం వేలాడేసుకొని వచ్చాడు.
ఇ) స్కూలు నడిపే పంతులుగారు బడిమానివేశారు. ఇప్పుడేం చెయ్యాలి?
ఈ) “నేను చదువు చెప్పటమా ? నా వల్లకాదు” నేను చెప్పేది వినకుండా సే జ్, భవాల్కర్ తో మాట్లాడడానికి వెళ్ళాడు.
జవాబు:
ఆ) ఒక రోజు సాయంత్రం సే జీ ముఖం వేలాడేసుకొని వచ్చాడు.
ఇ) స్కూలు నడిపే పంతులుగారు బడిమానివేశారు. ఇప్పుడేం చెయ్యాలి?
ఈ) “నేను చదువు చెప్పటమా? నా వల్లకాదు” నేను చెప్పేది వినకుండా సేజ్, భవాల్కర్ తో మాట్లాడడానికి వెళ్ళాడు.
అ) నువ్వు చెప్తావు. అంతే ఎట్లా చెప్పాలో నేను నేర్పిస్తా.

ప్రశ్న 4.
అ) “ఇప్పుడే వెళ్ళి మమ్మల్ని పంపినవాళ్ళని చంపి వస్తాం”.
ఆ) అన్నలారా – ఆపండి. దయచేసి వెళ్ళిపొండి. భయంతో వారిని ప్రార్థించాను.
ఇ) ‘కొందరు పెద్దలు నిన్ను చంపే కాంట్రాక్టు మాకిచ్చారు’.
ఈ) ‘అయితే మీరిక్కడికి యెందుకొచ్చారు ?” అని సేర్ జీ వారిని అడిగాడు.
జవాబు:
ఆ) అన్నలారా – ఆపండి. దయచేసి వెళ్ళిపొండి. భయంతో వారిని ప్రార్థించాను.
ఈ) ‘అయితే మీరిక్కడికి యెందుకొచ్చారు ?’ అని సేజ్ వారిని అడిగాడు.
ఇ) ‘కొందరు పెద్దలు నిన్ను చంపే కాంట్రాక్టు మాకిచ్చారు’.
అ) “ఇప్పుడే వెళ్ళి మమ్మల్ని పంపినవాళ్ళని చంపి వస్తాం”.

ప్రశ్న 5.
అ) నిప్పుల కుండను పట్టుకొని ‘సత్యమేవ జయతే’ అనుకుంటూ, ఆయన అంతిమయాత్రను నేనే నడిపించాను.
ఆ) సేర్జీ తన చుట్టూ జనాన్ని ఏడవొద్దని సైగచేసి, మమ్మల్ని అఖండ్ పాడమని సైగ చేశాడు.
ఇ) ‘మరీ అలసిపోవద్దు’ అని నేనంటే, సావిత్రీ ! చేయాల్సిందెంతో ఉంది. నేను వూరికే ఎట్లా కూర్చోను? అని సమాధానం వచ్చేది.
ఈ) ఆయన్ని చూడటానికి జనప్రవాహం ఎడతెగకుండా వచ్చేది.
జవాబు:
ఇ) ‘మరీ అలసిపోవద్దు’ అని నేనంటే, సావిత్రీ ! చేయాల్సిందెంతో ఉంది. నేను వూరికే ఎట్లా కూర్చోను? అని సమాధానం వచ్చేది.
ఈ) ఆయన్ని చూడటానికి జనప్రవాహం ఎడతెగకుండా వచ్చేది.
ఆ) సేజ్ తన చుట్టూ జనాన్ని ఏడవొద్దని సైగచేసి, మమ్మల్ని అఖండ్ పాడమని సైగ చేశాడు.
అ) నిప్పుల కుండను పట్టుకొని ‘సత్యమేవ జయతే’ అనుకుంటూ, ఆయన అంతిమయాత్రను నేనే నడిపించాను.

AP Board 9th Class Telugu Solutions ఉపవాచకం Chapter 2 నేనూ... సావితీబాయిని

ప్రశ్న 6.
అ) సావిత్రీబాయికి వాళ్ళ నాన్న పెళ్ళి ప్రయత్నాలు మొదలుపెట్టాడు.
ఆ) రేపట్నుంచి నువ్వు బడికొచ్చి పిల్లలకు చదువు చెప్పాలి అని అన్నాడు సేర్ జీ.
ఇ) సేత్ జీని చంపడానికి వచ్చిన ఆ ఇద్దరు మనుషులు గొడ్డళ్ళు కింద పారేశారు.
ఈ) సావిత్రీబాయి ఎక్కిన సీమచింత చెట్టు కొమ్మ విరిగింది.
జవాబు:
ఈ) సావిత్రీబాయి ఎక్కిన సీమచింత చెట్టు కొమ్మ విరిగింది.
అ) సావిత్రీబాయికి వాళ్ళ నాన్న పెళ్ళి ప్రయత్నాలు మొదలు పెట్టాడు.
ఆ) రేపట్నుంచి నువ్వు బడికొచ్చి పిల్లలకు చదువు చెప్పాలి అని అన్నాడు సేర్ జీ.
ఇ) సేర్ జీని చంపడానికి వచ్చిన ఆ ఇద్దరు మనుషులు గొడ్డళ్ళు కింద పారేశారు.

II. వ్యక్తీకరణ – సృజనాత్మకత

అ) క్రింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
‘సావిత్రీబాయి’ పాత్ర స్వభావం రాయండి.
జవాబు:
ఆధునిక భారతదేశంలో తొలి ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి ఫూలే. అంటరాని వాడల్లోని బాలికలకు చదువు చెప్పడమే కాక భర్త జ్యోతిబా ఫూలేతో కలిసి సామాజిక చైతన్యోద్యమానికి ఊపిరి పోసింది. అంటరాని పిల్లలకు చదువు చెప్పడానికి వెళుతున్నప్పుడు జనాల శాపనార్థాలకు, భర్తను చంపడానికి కిరాయి మనుష్యులు వచ్చిన సందర్భంలోను భయపడని ధీరురాలు సావిత్రీబాయి. ప్రాణాంతకమైన అంటువ్యాధి ‘ప్లేగు’తో బాధపడుతున్న పసిగుడ్డును రక్షించడానికి ప్రయత్నించిన కరుణామూర్తి సావిత్రీబాయి.

ప్రశ్న 2.
సావిత్రీబాయి వంటి స్త్రీలు సమాజానికి ఎంతవరకు అవసరం?
జవాబు:
ప్రతి వ్యక్తికి పుట్టింది మొదలు చచ్చేవరకు తోడు ఉండేది, బాధపడేది స్త్రీ మూర్తె. తల్లిగా, అక్కగా, చెల్లిగా, భార్యగా, కుమార్తెగా ఇలా అనేక రూపాలుగా ప్రతివ్యక్తి జీవితంలో తోడు ఉంటుంది. అటువంటి స్త్రీ ఎదుగుదలను కోరుకోవటం కృతజ్ఞత. ఎదగనీయకపోవటం కృతఘ్నత. నేటి సమాజంలో అక్షరాస్యత ఉంది. అంటరానితనం కూడా కొంత తొలగింది. అది సంపూర్ణత్వం సాధించడానికి సావిత్రీబాయి వంటి స్త్రీ మూర్తుల అవసరం ఎంతో ఉంది. నేటికాలంలో ప్రధానంగా ఉన్న సమస్యల పరిష్కారానికి కూడా మహిళల సాధికారత ఎంతో అవసరం.

AP Board 9th Class Telugu Solutions ఉపవాచకం Chapter 2 నేనూ... సావితీబాయిని

ప్రశ్న 3.
సావిత్రీబాయి చదువు, నేర్చుకునే విషయంలో మామగారి నుండి వచ్చిన విమర్శ ఏమిటి?
జవాబు:
జ్యోతిబాఫూలే ఫరార్ అనే ఆమె మాట ప్రకారం తన భార్య సావిత్రీబాయికి చదువు నేర్పుతున్నాడు. సావిత్రీబాయి మెల్లగా అచ్చులు, హల్లులు, మాటలు, వాక్యాలు నేర్చుకోసాగింది. ఆ సమయంలో జ్యోతిబాఫూలేను ఆయన తండ్రి, “సావిత్రి కెందుకు చదువు నేర్పుతున్నావు? అసలు మన కులం వాళ్ళమే చదువుకోకూడదు. అయినా నిన్ను చదివించాను. ఇప్పుడు నీవు నీ భార్యకు చదువు చెబుతున్నావు. ఆడదానికి చదువు పనికిరాదు. చదువుకున్న ఆడది చెడిపోతుంది. బుద్ధి లేనిదవుతుంది” అని అన్నారు. “నాన్నా ! సావిత్రి చదువుకుని ఆ మాటలు అబద్దాలని నిరూపిస్తుంది” అన్న జ్యోతిబాఫూలే మాటలకు ఏమీ చెప్పలేక అక్కడ నుండి ఆయన వెళ్ళిపోయారు.

ప్రశ్న 4.
సావిత్రీబాయి చేత మా ‘సేజ్ అని పిలిపించుకొన్న ‘సేజ్ వ్యక్తిత్వం వివరించండి.
జవాబు:
సావిత్రీబాయి భర్త పేరు మహాత్మ జ్యోతిరావ్ పూలే. సావిత్రి ఈయన్ని సేజ్ అని పిలిచేది. సావిత్రీబాయి దృష్టిలో భర్త అంటే “ఎప్పుడు బడి, పుస్తకాలు, చదువు ఇదే ప్రపంచం ఆయనకు” అంటుంది. సేజ్ కులాల గొడవలు విద్య వల్లే పోతాయనీ, విద్యే మన ధ్యేయం కావాలని చెప్పేవాడు.

సేర్ జీ విద్య అనే తపన వహించిన మహావృక్షం వంటివాడు. ఆడమనిషి చదువుకుంటేనే కుటుంబం బాగుపడుతుందని భార్యకు చదువు చెప్పించాడు. తక్కువ కులాల ఆడపిల్లల కోసం సొంతధనంతో బడి పెట్టాడు. మానవులంతా సమానులనీ, బీదలకు సాయం చేయడమే తన జీవితాశయమనీ చెప్పాడు. శిశుహత్యలకు వ్యతిరేకంగా మొదటి ఆశ్రమం స్థాపించాడు. ‘కులం కన్నా గుణం మిన్న’ అనే సిద్ధాంతంతో ‘సత్యశోధక సమాజాన్ని’ స్థాపించాడు. ఈయన స్త్రీ విద్యకూ, కుల రహిత సమాజానికి కృషి చేసిన మహనీయుడు.

ఆ) క్రింది ప్రశ్నలకు పదిలేక పన్నెండు వాక్యాలలో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
సావిత్రీబాయి పాత్ర స్వభావం రాయండి.
జవాబు:
సావిత్రీబాయి గొప్ప సంఘసేవకురాలు. ఈమె మహారాష్ట్రలో సతారా జిల్లాలో ఖండాలా తాలూకాలో నైగావ్ గ్రామంలో పాటిల్ గారింట్లో పెద్దకూతురిగా పుట్టింది. వెర్రిగా చేలల్లో పడి, పరిగెత్తేది. ముళ్ళూ గిళ్ళూ లెక్కచేసేది కాదు. చింతకాయలు కొట్టుకు తినడం, రేగుపళ్ళు కోసుకు తినడంలో సావిత్రీబాయిని మించినవారు లేరు. ఈమెకు చిన్నప్పుడే జ్యోతీరావ్ తో పెండ్లి అయ్యింది. అక్కడ భర్తనూ, అత్తమామల్నీ సేవిస్తూ వంట వండి పెట్టేది.

సావిత్రీబాయికి, ఆమె భర్త జ్యోతీరావు ఎన్నో విషయాలు చదివి చెప్పేవాడు. సావిత్రీబాయికి భర్త చదువు చెప్పాడు. భర్త నడిపే స్కూలులో పంతులుగారు మానివేస్తే, సావిత్రీబాయి అక్కడ పంతులమ్మగా పనిచేసింది. సావిత్రీబాయి పంతులమ్మ కావడం ఇష్టం లేని ప్రజలు సావిత్రీబాయిని తిట్టేవారు. శాపనార్ధాలు పెట్టారు. అయిన సావిత్రీబాయి బడి కిటికీ తలుపులు మూసి, పిల్లలకు పాఠాలు చెప్పింది. సావిత్రీబాయి భర్తకు చేదోడు వాదోడుగా ఉండేది. భర్తతో పాటు సత్యశోధక సమాజాన్ని స్థాపించింది. సావిత్రీబాయి ఆదర్శ స్త్రీ. భర్త పోయాక, ప్లేగు వ్యాధిగ్రస్తులకు సేవచేసింది. చివరకు ఆ ప్లేగు వ్యాధి సోకడంతో సావిత్రీబాయి కన్ను మూసింది.

ప్రశ్న 2.
బీదవాళ్ళకు సహాయం చెయ్యటమే నా జీవితాశయం – వాళ్ళచేతుల్లో చావటంలో తప్పేముంది? ‘చంపండి – రండి చంపండి’ అన్న పేజీ మాటలను బట్టి మీరు ఏమి గ్రహించారు?
జవాబు:
పేజీ తన జీవితాన్ని బీదవారికి సాయం చేయడానికే అంకితం చేశాడు. సే జీ తక్కువ కులాల ఆడపిల్లలకు బడులు పెట్టి చదువు చెప్పించాడు. భార్యకు తానే చదువు చెప్పి, ఆ బడిలో ఆమెను పంతులమ్మను చేశాడు.

అలాచేస్తే సంఘం పాడవుతుందని, కొందరు పెద్దలు సేజీని చంపమని ఇద్దరు హంతకులకు కాంట్రాక్టు ఇచ్చారు. ఆ వచ్చినవాళ్ళు తాము సేజీని చంపడానికి గల కారణాన్ని చెప్పారు.

బీదవాళ్ళ చేతుల్లో చావడం తనకు ఇష్టమే అని సేజ్ మెడవంచి నిలబడ్డాడు. దానితో ఆ హంతకులు మనసు మార్చుకొని, తమకు కాంట్రాక్టు ఇచ్చిన వారినే చంపడానికి సిద్ధపడ్డారు. దీనిని బట్టి సేజ్ త్యాగమూర్తి అని, భయం లేనివాడని, హంతకుల మనస్సును కూడా మార్చగల ఉత్తమ శీలం కలవాడని నేను అర్థం చేసుకున్నాను.

AP Board 9th Class Telugu Solutions ఉపవాచకం Chapter 2 నేనూ... సావితీబాయిని

ప్రశ్న 3.
‘అల్లరి చేయుట పిల్లల వంతు’ అన్నాడు ఒక కవి. సావిత్రీబాయి బాల్యం కూడా అల్లరి పనులతోనే గడిచింది. దానికి సంబంధించి ఒక సంఘటనను వివరించండి.
జవాబు:
అల్లరి చేయుట పిల్లలవంతు అన్న కవి మాటలు సావిత్రీబాయి బాల్యానికి సరితూగుతాయి. సావిత్రీబాయి మహారాష్ట్రలోని నైగావ్ లో పుట్టింది. చిన్నప్పటి నుండి అల్లరి పిల్లే. ఒకసారి సీమ చింతకాయలు చెట్టెక్కి కోస్తుంటే కొమ్మ విరిగి వ్రేలాడుతూ ఉంది. అప్పుడు ‘అమ్మా నా సీమచింతకాయలు, నేను పడిపోతున్నా, కొమ్మ విరిగింది, నేను పడిపోతున్నా’ అంటూ అరిచింది. వాళ్ళ నాన్న వచ్చి కిందికి దింపాడు. అమ్మ అరుస్తోంది. కాలో చెయ్యో విరిగితే ఎవరు చేసుకుంటారని. అమ్మతో ‘నేను ఆడపిల్లను కాదమ్మా’ అంటూ తల్లికి సీమచింతకాయ ఇచ్చి అక్కణ్ణుంచి పరుగుతీసింది.

ప్రశ్న 4.
‘ఇదిగో ఈ సీమ చింతకాయ చూడు ఎంత తియ్యగా ఉందో’ అని నోట్లో కుక్కుకుంటూ అమ్మకు ఒకటిచ్చి మళ్ళీ పరుగుతీసిన బాల సావిత్రీబాయి బాల్యం వివరించండి.
జవాబు:
పైగావ్ గ్రామంలో పాటిల్ గారి పెద్ద కూతురుగా పుట్టిన సావిత్రిబాయి బాల్యంలో చేలలోపడి పరిగెత్తుతూ, గులకరాళ్ళను, దుమ్మునూ తన్నుకుంటూ, కాళ్ళలో ముళ్ళు గుచ్చుకున్నా లెక్కచేయక, విరబోసుకున్న జుట్టుతో వెర్రిగా పరుగులు తీసేది. చింతకాయలు కొట్టుకు తినడం, రేగిపళ్ళు కోసుకుతినడం దినచర్య సావిత్రికి. ఒక రోజు సీమచింతకాయలు కోస్తూ కొమ్మ విరిగి కిందకు వేలాడుతూ దించమని అమ్మను పిలిస్తే ఆమె చివాట్లు పెట్టింది. తండ్రి వచ్చి కిందికి దించుతాడు. ఈ పిల్లకు తొందరగా పెళ్ళి చేయాలి. కాలో చెయ్యో విరిగితే ఎవరు చేసుకుంటారన్న తల్లి మాటలకు ‘నేను ఆడపిల్లను కాదమ్మా’ ఇదిగో ఈ సీమ చింతకాయ చూడు ఎంత తియ్యగా ఉందో అని నోట్లో కుక్కుకుంటూ అమ్మకు ఒకటిచ్చి మళ్ళీ పరుగుతీసింది గడుగ్గాయి సావిత్రి.

AP Board 9th Class Telugu Solutions ఉపవాచకం Chapter 1 స్వామి వివేకానంద

AP State Syllabus AP Board 9th Class Telugu Textbook Solutions ఉపవాచకం Chapter 1 స్వామి వివేకానంద Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Telugu Solutions ఉపవాచకం 1st Lesson స్వామి వివేకానంద

9th Class Telugu ఉపవాచకం 1st Lesson స్వామి వివేకానంద Textbook Questions and Answers

కింది ప్రశ్నలకు పదిహేను వాక్యాలకు మించని సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
నరేంద్రుని బాల్యం, విద్యాభ్యాసం గురించి రాయండి.
జవాబు:
నరేంద్రుడు ఆరవ ఏట విద్యాభ్యాసం మొదలుపెట్టాడు. మొదట్లో ఇంట్లోనే తల్లిదండ్రులు నియమించిన గురువు వద్ద చదువుకున్నాడు. గురువు ఒకసారి చెప్పగానే నేర్చుకొని, అప్పచెప్పగలిగేవాడు.

ఏడవ ఏట ఈశ్వరచంద్ర విద్యాసాగర్ స్థాపించిన మెట్రోపాలిటన్ ఇన్స్టిట్యూషన్లో చేరాడు. నరేన్ తెలివితో, చురుకుతో తోటి బాలురందరికీ నాయకుడయ్యాడు. నరేన్ కు ఆటలంటే ప్రాణం.

నరేనకు ఇష్టమైన ఆట “రాజు – దర్బారు”. ఇంటిలోనే సొంతంగా ఒక వ్యాయామశాల ఏర్పాటుచేశాడు. తర్వాత వ్యాయామశాలలో చేరి కర్రసాము, కత్తిసాము, గుర్రపుస్వారీ నేర్చాడు.

నరేను క్రమంగా పుస్తకాలు చదవడంపై ఆసక్తి పెరిగింది. తండ్రిగారు బదిలీ కావడంతో, రాయపూర్ వెళ్ళి తిరిగి కలకత్తా వచ్చి మూడేళ్ళ చదువు ఒక్క సంవత్సరంలోనే పూర్తి చేశాడు. ఆ పరీక్ష మొదటి శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడు. ఆ పాఠశాలలో ఆ శ్రేణిలో పాసైన ఏకైక విద్యార్థి నరేన్ ఒక్కడే.

తరువాత ప్రెసిడెన్సీ కాలేజీలోను, మరుసటి సంవత్సరం ఇప్పుడు స్కాటిష్ చర్చ్ అని పిలువబడే కళాశాలలోనూ చేరాడు. ప్రిన్సిపాలూ, గురువులూ నరేన్ ప్రతిభాపాటవాలకు ఆశ్చర్యపోయేవారు. నరేంద్రుడు ఎన్నో గ్రంథాలు చదివాడు. 1884లో బి.ఏ. పాసయ్యాడు.

ప్రశ్న 2.
వివేకానందుని అమెరికా పర్యటన విశేషాలు తెల్పండి.
(లేదా)
నరేంద్రుని అమెరికా పర్యటన విశేషాలను సొంతమాటల్లో రాయండి.
జవాబు:
స్వామీజీయైన నరేంద్రుడు అమెరికాలో జరుగబోయే సకల మతముల మహాసభకు వెళ్ళి, భారతదేశ ధర్మాన్ని ప్రపంచానికి తెలియపరుద్దామనుకున్నాడు. మద్రాసులో యువకులు అందుకు సహాయం చేశారు. ఖేత్రీ మహారాజు నరేంద్రునికి కెనడా వెళ్ళే ఓ ఓడలో టిక్కెట్టుకొని ఇచ్చాడు. నరేంద్రుడుని “వివేకానంద” అనే నామాన్ని స్వీకరింపమన్నాడు.

వివేకానందుడు 1893 మే 31న అమెరికాకు బయలుదేరాడు. ఓడ కెనడా దేశంలోని ‘వాంకోవర్’లో ఆగింది. అక్కడ నుండి రైలులో “షికాగో” నగరానికి వివేకానంద వెళ్ళాడు. రైల్లో ‘సాన్ బోర్న్’ అనే మహిళతో పరిచయం అయ్యింది. ఆమె వివేకానందుడు ‘బోస్టన్’ నగరానికి వచ్చినపుడు తన ఇంటికి రమ్మంది.

షికాగో ధనవంతుల నగరం. విశ్వమత మహాసభలకు ఇంకా రెండు నెలల వ్యవధి ఉంది. అదీగాక, ఆ సభలో మాట్లాడేందుకు వివేకానందుని వద్ద ధ్రువపత్రాలు లేవు. దానితో వివేకానందుడు ‘బోస్టన్’లో సాన్ బోర్న్ ఇంటికి వెళ్ళాడు. అక్కడ హార్వర్డ్ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ జే. హెచ్.రైట్ తో పరిచయమైంది. రైట్, వివేకానందుని విశ్వమత మహాసభలో హైందవ ధర్మం గురించి మాట్లాడమన్నాడు. తనవద్ద ధ్రువపత్రాలు లేవని వివేకానందుడు చెప్పాడు.

ఆ ప్రొఫెసర్ విశ్వమత మహాసభల అధ్యక్షుడికి వివేకానందుని గూర్చి అమెరికాలోని పండితులందరి కంటే వివేకానందుడు గొప్పవాడని రాశాడు. వివేకానందుడిని ఆ ప్రొఫెసర్ చికాగోకు పంపాడు. కానీ రైట్ ఇచ్చిన కాగితం కనబడలేదు. వివేకానందుడు చికాగోలో భిక్షాటన చేశాడు. చెట్టు కింద పడుకున్నాడు. జార్జ్. డబ్ల్యూ. హేల్ అనే ఆమె వివేకానందుడిని చూసి, విశ్వమత మహాసభలకు వచ్చిన భారతీయ సన్యాసి అని గౌరవించింది. ఆమె సాయంవల్లనే వివేకానందుడు విశ్వమత మహాసభలో మాట్లాడాడు.

సభలో వివేకానందుడు “నా అమెరికా దేశ సోదర సోదరీమణులారా ! అంటూ తన ఉపన్యాసం ప్రారంభించాడు. ఆ కమ్మని పిలుపుకు సభ్యులు ఆనందించి మూడు నిమిషాలపాటు లేచి చప్పట్లు కొట్టారు. వివేకానంద ఆ సభలో అన్ని ధర్మాల తరపునా మాట్లాడి, సర్వమత సామరస్యాన్ని చూపాడు. వివేకానందుని ఖ్యాతి దేశదేశాలకూ పాకింది.

AP Board 9th Class Telugu Solutions ఉపవాచకం Chapter 1 స్వామి వివేకానంద

ప్రశ్న 3.
వివేకానందుడు జాతికిచ్చిన సందేశమేమి?
జవాబు:
వివేకానందుని సందేశము :
“మన భారతదేశం పుణ్యభూమి. సంపద, అధికారం మన భారత జాతికి ఎప్పుడూ ఆదర్శాలు కాలేదు. భారతీయుడు ఎవరైనా సరే, జాతిమత తారతమ్యం లేకుండా, పేద, గొప్ప వివాదం లేకుండా, కుల వివక్షతను దగ్గరకు రానీయకుండా, అందరూ నా సహోదరులే అని చాటాలి. భారతదేశానికి అంతటికీ ఏది హితమో, అదే తనకు కూడా హితము అని ప్రకటించాలి.

భారతదేశానికి మంచి జరగాలంటే, స్త్రీ జనోద్దరణ, జన చైతన్యం ప్రధానంగా సంభవించాలి. పేద జనానికి ఆహారం ఇవ్వాలి. విద్యావ్యాప్తి సక్రమంగా జరగాలి. సర్వజనులకూ తగినంత ఆహారం, జీవనోపాధి అవకాశాలు కల్పించాలి.

వ్యావహారిక భాషలోనే కళాత్మకంగా, సహజంగా శాస్త్ర పాండిత్యం సాధించాలి. పరిశోధనలను కూడా వాడుక భాషలోనే నిర్వహించాలి. విద్య సమస్త సమస్యలను పరిష్కరించే మార్గం కావాలి.
వివేకానంద యువకులకు ఇలా సందేశం ఇచ్చారు – “మీకు ప్రేమ, నిజాయితీ, సహనం కావాలి. నిరుపేదలను, అమాయక ప్రజలను, అణగదొక్కబడిన వారిని ప్రేమించండి. వారి కొరకు పరితపించండి. పిరికితనాన్ని విడచి, ధైర్యంగా సమస్యలను ఎదుర్కోండి. దీనజనులను ఉద్ధరించండి. ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండి. ఓర్పుతో వ్యవహరిస్తే మంచి ఫలితాలు వస్తాయని మరువకండి. లేవండి ! మేల్కొనండి ! శ్రేష్ఠులైన ఆచార్యుల బోధనలు అనుసరించండి !”

ప్రశ్న 4.
వివేకానందుని సందేశాలు ఆధారంగా ఏకపాత్రాభినయం చేయండి.
జవాబు:
ఏకపాత్రాభినయం “వివేకానంద” :

నా భారతీయ సహోదరులారా !
మన భారతదేశం ఒక్కటే అసలైన పుణ్యభూమి, మన భారతజాతి శతాబ్దాలుగా శక్తిమంతమైన జాతి. ఐనా అది ఇతర రాజ్యా లపై దండయాత్ర చేయలేదు. మన భారతీయుడు ఎవరైనా సరే, జాతిమత భేదం, పేద – గొప్ప తేడా, కుల భేదం లేకుండా అందరూ నా సోదరులే అని చాటాలి. భారతీయ సమాజం నా బాల్యడోలిక, నా యౌవన ఉద్యానం, నా వార్ధక్యంలో వారణాసి. భారతీయ సమాజం నాకు స్వర్గతుల్యం.

మన భారతదేశానికి మంచి జరగాలంటే, స్త్రీ జనోద్దరణ, జనచైతన్యం ప్రధానంగా సంభవించాలి. నాకు ఈ లోకంలో సరిపడ తిండిని ప్రసాదించలేక, స్వర్గంలో ఆనందాన్నిచ్చే భగవంతుని నేను విశ్వసించలేను. ముందు కడుపునిండా తిండి. తర్వాతనే మతం.

మనం వ్యావహారిక భాషలోనే శాస్త్ర పాండిత్యం సాధించాలి. మన పరిశోధనలు వ్యావహారిక భాషలోనే నిర్వహించాలి.

సాహసం గల యువకులారా ! మీకు ప్రేమ, నిజాయితీ, సహనం కావాలి. నిరుపేదలను, అమాయకులను, అణగదొక్కబడిన వారిని ప్రేమించండి. దీనుల కోసం శ్రమించండి.

“ఉత్తిష్ఠత ! జాగ్రత ! ప్రాప్య వరాన్ నిబోధత !” లేవండి ! మేల్కొనండి ! శ్రేష్ఠులైన ఆచార్యుల బోధనలను అనుసరించండి!

ప్రశ్న 5.
‘శివా శివా’ అంటూ నెత్తిమీద చల్లనీళ్లు పోస్తే మాత్రం అల్లరంతా క్షణంలో తగ్గిపోయే నరేంద్రుడి బాల్యం గురించి రాయండి.
జవాబు:
విశ్వవిఖ్యాతి నొంది సింహసదృశమైన మనోబలానికి ప్రతిరూపమై భారతదేశ యువజనులందరికీ ఆదర్శమై నిలిచిన శ్రీ వివేకానంద చిన్నప్పుడు బాగా అల్లరివాడు. ఈ గడుగ్గాయిని పట్టుకోవడం తల్లియైన భువనేశ్వరిదేవికి గగనమైపోయేది. అల్లరి బాగా మితిమీరిపోయినపుడు ‘శివశివా’ అంటూ నెత్తిమీద చల్లని నీళ్ళు పోస్తే మాత్రం అల్లరంతా క్షణంలో తగ్గిపోయి శాంతపడిపోయేవాడు. బాలనరేంద్రుడు తన తల్లి వద్ద ఎన్నో విషయాలు (రామాయణ, భారత, భాగవతాలు) నేర్చుకున్నాడు. ముఖ్యంగా శ్రీరాముడి కథంటే నరేంద్రుడికి పంచప్రాణాలు. మట్టితో చేసిన సీతారాముల విగ్రహాన్ని తెచ్చి రకరకాల పూలతో పూజించేవాడు. రామ నామ జపం చేసే ఆంజనేయుడు అరటితోటల్లో ఉంటాడని ఎవరో చెప్పగా, ఆ మహావీరుణ్ణి చూడడానికై అక్కడి తోటల్లో వెతికేవాడు.

9th Class Telugu ఉపవాచకం 1st Lesson స్వామి వివేకానంద Important Questions and Answers

I. అవగాహన – ప్రతిస్పందన

అ) ఈ క్రింది వాక్యాలను సంఘటనలు ఆధారంగా వాక్యాలను వరుసక్రమంలో అమర్చి రాయండి. 4 మార్కులు

ప్రశ్న 1.
అ) నరేంద్రుడు బి.ఎ. పట్టా పొందాడు.
ఆ) ఏడేళ్ళ వయస్సులో నరేనను మెట్రోపాలిటన్ ఇన్స్టిట్యూషన్లో చేర్పించారు.
ఇ) 1897 మే నుండి 1898 జనవరి వరకు వివేకానందస్వామి ఉత్తర భారతదేశంలోని ఎన్నో నగరాలకు వెళ్ళారు.
ఈ) వివేకానందస్వామి చికాగోలో ప్రసంగించాడు.
జవాబు:
ఆ) ఏడేళ్ళ వయస్సులో నరేనను మెట్రోపాలిటన్ ఇన్స్టిట్యూషన్లో చేర్పించారు.
అ) నరేంద్రుడు బి.ఎ. పట్టా పొందాడు.
ఈ) వివేకానందస్వామి చికాగోలో ప్రసంగించాడు.
ఇ) 1897 మే నుండి 1898 జనవరి వరకు వివేకానందస్వామి ఉత్తర భారతదేశంలోని ఎన్నో నగరాలకు వెళ్ళారు.

AP Board 9th Class Telugu Solutions ఉపవాచకం Chapter 1 స్వామి వివేకానంద

ప్రశ్న 2.
అ) ఆరేళ్ళ వయస్సులో నరేంద్రుడు తన విద్యాభ్యాసం మొదలుపెట్టాడు.
ఆ) స్వామీజీ 1888లో కాశీకి ప్రయాణమయ్యారు.
ఇ) స్వామీజీ ఇక శాశ్వతంగా ఆ శరీరాన్ని వదిలేశారు.
ఈ) అయ్యా ! తమరు భగవంతుణ్ని చూశారా ! అని నరేంద్రుడు శ్రీరామకృష్ణులను అడిగారు.
జవాబు:
అ) ఆరేళ్ళ వయస్సులో నరేంద్రుడు తన విద్యాభ్యాసం మొదలు పెట్టాడు.
ఈ) అయ్యా ! తమరు భగవంతుణ్ని చూశారా ! అని నరేంద్రుడు శ్రీరామకృష్ణులను అడిగారు.
ఆ) స్వామీజీ 1888లో కాశీకి ప్రయాణమయ్యారు.
ఇ) స్వామీజీ ఇక శాశ్వతంగా ఆ శరీరాన్ని వదిలేశారు.

ప్రశ్న 3.
అ) ఆవిడ అతడికి ఎంతగానో కృతజ్ఞతలు తెలుపుకున్నది.
ఆ) బండిని గుర్రం తన బలమంతా ఉపయోగించి వెఢవేగంతో లాక్కెళ్ళుతోంది.
ఇ) బాలుడు బండిలోకి ఎక్కి పరుగెడుతున్న ఆ గుఱ్ఱపు కళ్ళెం చేజిక్కించుకొని, గుజ్రాన్ని శాంతపరచి ఆగిపోయేటట్లు చేశాడు.
ఈ) బండిలో పాపం ఒక మహిళ కూడా ఉంది. బండిని గట్టిగా పట్టుకుని ఆమె పడిపోకుండా ఉండడానికి ప్రయత్నిస్తోంది.
జవాబు:
ఆ) బండిని గుర్రం తన బలమంతా ఉపయోగించి వెట్టి వేగంతో లాక్కెళ్ళుతోంది.
ఈ) బండిలో పాపం ఒక మహిళ కూడా ఉంది. బండిని గట్టిగా పట్టుకొని ఆమె పడిపోకుండా ఉండడానికి ప్రయత్నిస్తోంది.
ఇ) బాలుడు బండిలోకి ఎక్కి పరుగెడుతున్న ఆ గుఱ్ఱపు కళ్ళెం చేజిక్కించుకొని, గుజ్రాన్ని శాంతపఱచి ఆగిపోయేటట్లు చేశాడు.
అ) ఆవిడ అతడికి ఎంతగానో కృతజ్ఞతలు తెలుపుకున్నది.

ప్రశ్న 4.
అ) ఎవరైనా సరే భగవంతుడి కోసం తీవ్ర వ్యాకులతతో విలపిస్తే ఆయన వారికి తప్పక దర్శనమిస్తాడు. ఇది నిజం. నా అనుభవం.
ఆ) ‘అయ్యా ! తమరు భగవంతుణ్ణి చూశారా?’ అని నరేన్ రామకృష్ణుడిని అడిగాడు.
ఇ) ‘ధన సంపాదన కోసం కడవల కొద్దీ కన్నీరు కారుస్తారు. భగవంతుడి కోసం ఎవరు విలపిస్తారు?’ రామకృష్ణుడు అన్నాడు.
ఈ) “ఓ చూశాను. కావాలంటే నీకు కూడా చూపించగలను’. రామకృష్ణుడు చెప్పాడు.
జవాబు:
ఆ) ‘అయ్యా ! తమరు భగవంతుణ్ణి చూశారా?’ అని నరేన్ రామకృష్ణుడిని అడిగాడు.
ఈ) ‘ఓ చూశాను. కావాలంటే నీకు కూడా చూపించగలను’. రామకృష్ణుడు చెప్పాడు.
ఇ) ‘ధన సంపాదన కోసం కడవల కొద్దీ కన్నీరు కారుస్తారు. భగవంతుడి కోసం ఎవరు విలపిస్తారు?’ రామకృష్ణుడు అన్నాడు.
అ) ఎవరైనా సరే భగవంతుడి కోసం తీవ్ర వ్యాకులతతో విలపిస్తే ఆయన వారికి తప్పక దర్శనమిస్తాడు. ఇది నిజం. నా అనుభవం.

ప్రశ్న 5.
అ) స్వామీజీ రెండు మూడడుగులు వేసి భయపెట్టగానే అవి పరుగులంకించుకున్నాయి.
ఆ) దుర్గా అమ్మవారి ఆలయానికి వెళ్ళి వస్తూ ఉంటే, ఒక కోతుల గుంపు కనిపించింది. అవి ఆయన వైపు తిరిగి పరుగెత్తసాగాయి.
ఇ) ఒక సన్యాసి గమనించి “ఆగు ! వెనుదిరిగి ఆ జంతువుల నెదుర్కో అని గట్టిగా అరిచాడు”.
ఈ) అవి కరుస్తాయనే తలంపుతో స్వామీజీ వెనుదిరిగి చిన్నగా పరుగెత్తనారంభించాడు.
జవాబు:
ఆ) దుర్గా అమ్మవారి ఆలయానికి వెళ్ళి వస్తూ ఉంటే, ఒక కోతుల గుంపు కనిపించింది. అవి ఆయన వైపు తిరిగి పరుగెత్తసాగాయి.
ఈ) అవి కరుస్తాయనే తలంపుతో స్వామీజీ వెనుదిరిగి చిన్నగా పరుగెత్తనారంభించాడు.
ఇ) ఒక సన్యాసి గమనించి “ఆగు ! వెనుదిరిగి ఆ జంతువుల నేదుర్కో అని గట్టిగా అరిచాడు”.
అ) స్వామీజీ రెండు మూడడుగులు వేసి భయపెట్టగానే అవి పరుగులంకించుకున్నాయి.

ప్రశ్న 6.
అ) జూలై నెల మధ్యలో స్వామీజీ షికాగో చేరుకున్నారు. అక్కడి భవంతులు, సాంకేతిక పరిజ్ఞానం చూసి, స్వామీజీ విస్తుపోయారు.
ఆ) ఖేత్రీ మహారాజు స్వామివారిని ఆహ్వానించి, కెనడా వెళ్ళే ఓడలో ప్రథమశ్రేణి టిక్కెట్టు కొని ఇచ్చారు.
ఇ) రైల్లో సాన్బోర్న్ “స్వామీజీ ! మీరెప్పుడైనా బోస్టన్ నగరానికి వస్తే దయచేసి మా ఇంటికి అతిథిగా వచ్చి మమ్మానందింప చేయండి” అని కోరింది.
ఈ) ఓడ కెనడా దేశంలోని వాంకోవర్ లో ఆగింది. స్వామీజీ అక్కడి నుండి షికాగోకి రైల్లో వెళ్ళారు.
జవాబు:
ఆ) ఖేత్రీ మహారాజు స్వామివారిని ఆహ్వానించి, కెనడా వెళ్ళే ఓడలో ప్రథమశ్రేణి టిక్కెట్టు కొని ఇచ్చారు.
ఈ) ఓడ కెనడా దేశంలోని వాంకోవర్ లో ఆగింది. స్వామీజీ అక్కడి నుండి షికాగోకి రైల్లో వెళ్ళారు.
ఇ) రైల్లో సాన్‌బోర్న్ “స్వామీజీ ! మీరెప్పుడైనా బోస్టన్ నగరానికి వస్తే దయచేసి మా ఇంటికి అతిథిగా వచ్చి మమ్మానందింప చేయండి” అని కోరింది.
అ) జూలై నెల మధ్యలో స్వామీజీ షికాగో చేరుకున్నారు. అక్కడి భవంతులు, సాంకేతిక పరిజ్ఞానం చూసి, స్వామీజీ విస్తుపోయారు.

ప్రశ్న 7.
అ) రాత్రికి రాత్రి స్వామీజీ ఖ్యాతి దేశమంతటా వ్యాపించింది. భారతీయ పత్రికలు కూడా ఈ వార్తను బాగా ప్రచురించాయి.
ఆ) సరస్వతీ దేవిని తలచుకొని, శ్రావ్యమైన కంఠంతో ” నా అమెరికా దేశ సోదర సోదరీమణులారా !” అని స్వామి మొదలు పెట్టారు.
ఇ) జన సముద్రమంతా లేచి నుంచొని పులకించిపోయి కరతాళ ధ్వనుల వర్షం కురిపించారు.
ఈ) నా మతమే గొప్పది. నా మతమే నిలవాలి అనుకొనేవారు బావిలో కప్ప వంటివారని స్వామీజీ తెలిపారు.
జవాబు:
ఆ) సరస్వతీ దేవిని తలచుకొని, శ్రావ్యమైన కంఠంతో “ నా అమెరికా దేశ సోదర సోదరీమణులారా !” అని స్వామి మొదలుపెట్టారు.
ఇ) జన సముద్రమంతా లేచి నుంచొని పులకించిపోయి కరతాళ ధ్వనుల వర్షం కురిపించారు.
ఈ) నా మతమే గొప్పది. నా మతమే నిలవాలి అనుకొనేవారు బావిలో కప్ప వంటివారని స్వామీజీ తెలిపారు.
అ) రాత్రికి రాత్రి స్వామీజీ ఖ్యాతి దేశమంతటా వ్యాపించింది. భారతీయ పత్రికలు కూడా ఈ వార్తను బాగా ప్రచురించాయి.

AP Board 9th Class Telugu Solutions ఉపవాచకం Chapter 1 స్వామి వివేకానంద

ప్రశ్న 8.
అ) స్వామీజీకి సపరివారంగా సాష్టాంగ నమస్కారం చేసి స్వయంగా తన రథంలో కూర్చుండపెట్టారు.
ఆ) తన పవిత్ర భారత భూమిపై కాలు పెట్టగలుగుతున్నానని స్వామీజీ మనస్సు పొంగిపోయింది.
ఇ) రామనాడుకి రాజైన భాస్కర సేతుపతి, స్వామీజీకి ఎదురుగా వెళ్ళి తన తలపై కాలుమోపి, దిగమని తలవంచి ప్రార్థించారు.
ఈ) స్వామీజీని స్వాగతించడానికి స్వాగత కమిటీలు ఏర్పడ్డాయి.
జవాబు:
ఆ) తన పవిత్ర భారత భూమిపై కాలు పెట్టగలుగుతున్నానని స్వామీజీ మనస్సు పొంగిపోయింది.
ఈ) స్వామీజీని స్వాగతించడానికి స్వాగత కమిటీలు ఏర్పడ్డాయి.
ఇ) రామనాడుకి రాజైన భాస్కర సేతుపతి, స్వామీజీకి ఎదురుగా వెళ్ళి తన తలపై కాలుమోపి, దిగమని తలవంచి ప్రార్థించారు.
అ) స్వామీజీకి సపరివారంగా సాష్టాంగ నమస్కారం చేసి స్వయంగా తన రథంలో కూర్చుండపెట్టారు.

ప్రశ్న 9.
ఈ కింది వాక్యాలను సంఘటనల ఆధారంగా వరుసక్రమంలో అమర్చి రాయండి.
అ) వివేకానంద స్వామి వారి ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింది.
ఆ) జూలై నెల మధ్యలో స్వామీజీ షికాగో చేరుకొన్నారు.
ఇ) ఆరేళ్ళ వయసులో నరేంద్రుడు తన విద్యాభ్యాసం మొదలుపెట్టాడు.
ఈ) శ్రీరామకృష్ణులను కలిస్తే తనకు సమాధానం దొరుకుతుందేమోననే ఆశతో నరేంద్రుడు ఇద్దరు ముగ్గురు స్నేహితులతో కలిసి ఆయన వద్దకు వెళ్లాడు.
జవాబు:
ఇ) ఆరేళ్ళ వయసులో నరేంద్రుడు తన విద్యాభ్యాసం మొదలు పెట్టాడు.
ఈ) శ్రీరామకృష్ణులను కలిస్తే తనకు సమాధానం దొరుకుతుందేమోననే ఆశతో నరేంద్రుడు ఇద్దరు ముగ్గురు స్నేహితులతో కలిసి ఆయన వద్దకు వెళ్లాడు.
ఆ) జూలై నెల మధ్యలో స్వామీజీ షికాగో చేరుకొన్నారు.
అ) వివేకానంద స్వామి వారి ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింది.

ప్రశ్న 10.
ఈ కింది వాక్యాలను సంఘటనల ఆధారంగా వరుసక్రమంలో అమర్చి రాయండి.
అ) తన పవిత్ర భారతభూమిపై కాలుమోపుతున్నానని స్వామీజీ పొంగిపోయాడు.
ఆ) తండ్రి మరణంతో నరేంద్రుని జీవితం తెగిన గాలిపటమైంది.
ఇ) ‘నా అమెరికా దేశ సోదర, సోదరీ మణులారా …..’ అని స్వామీజీ ఉపన్యాసం ప్రారంభించాడు.
ఈ) నరేన్ బాల్యంలో పరుగు పెడుతున్న గుర్రాన్ని అదుపు చేసి ఒక స్త్రీని రక్షించాడు.
జవాబు:
ఈ) నరేన్ బాల్యంలో పరుగు పెడుతున్న గుర్రాన్ని అదుపు చేసి ఒక స్త్రీని రక్షించాడు.
ఆ) తండ్రి మరణంతో నరేంద్రుని జీవితం తెగిన గాలిపటమైంది.
ఇ) ‘నా అమెరికా దేశ సోదర, సోదరీ మణులారా ……’ అని స్వామీజీ ఉపన్యాసం ప్రారంభించాడు.
అ) తన పవిత్ర భారతభూమిపై కాలుమోపుతున్నానని స్వామీజీ పొంగిపోయాడు.

II. వ్యక్తీకరణ – సృజనాత్మకత

అ) క్రింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
వివేకానందుడు ఎప్పుడు, ఎక్కడ జన్మించాడు? తల్లిదండ్రులెవరు?
జవాబు:
నరేన్ అని, నరేంద్రనాథ్ దత్తా అని పూర్వాశ్రమంలో పేర్కొనబడిన వివేకానంద స్వామి కలకత్తాలో 1863 జనవరి 12వ తేదీన భువనేశ్వరీ దేవి, విశ్వనాథ దత్తా దంపతులకు జన్మించారు. విశ్వనాథ దత్తా మంచి పేరున్న వకీలు. భువనేశ్వరీ దేవి రూపంలోను, ప్రవర్తనలోను ఒక రాణి వలె ఉండేది.

ప్రశ్న 2.
వివేకానందుడు తనకు తాను పెట్టుకొన్న నియమాలేవి?
జవాబు:
స్వామీజీ ఎన్నోసార్లు తనకోసం తాను కొన్ని నియమాలు పెట్టుకునేవారు. ఎవరైనా పిలిచి ఆపితే తప్ప ఆగకుండా యాత్ర సాగిస్తూనే ఉండాలని, ఎవరైనా పిలిచి భిక్ష ఇస్తే తప్ప ఆహారం తీసుకోకూడదని ఇలాంటి కఠిన నియామాలెన్నో పాటించేవారు.

ప్రశ్న 3.
వివేకానంద స్వామి కల ఏమిటి?
జవాబు:
అమెరికా, భారతదేశాల మధ్య ప్రాక్పశ్చిమ సంబంధాలు పెరిగి, భారతదేశం పశ్చిమ దేశాలకు ధర్మము, ఆధ్యాత్మికతను బోధించాలని, వాళ్ళు భారతీయులకు సైన్సు, సాంకేతికత సంస్థలుగా కలిసి ఒకటిగా పనిచేయడం వంటివి నేర్పించాలనేది ఆయన కల.

AP Board 9th Class Telugu Solutions ఉపవాచకం Chapter 1 స్వామి వివేకానంద

ప్రశ్న 4.
వివేకానందుని గురువైన శ్రీరామకృష్ణుల స్వభావాన్ని గురించి రాయండి. . .
జవాబు:
వివేకానందుని గురువైన శ్రీ రామకృష్ణులు మహాశక్తి సంపన్నులే కాదు, ఆయన జీవితం పవిత్రతకు ప్రతిరూపం. ఆయన ఏమి ఆలోచించేవారో అదే చెప్పేవారు, ఏం చెప్పేవారో అదే చేసేవారు. వీటన్నింటికీ మించి నరేంద్రుని అతని తల్లిదండ్రుల కంటే కూడా ఎక్కువగా ప్రేమించేవారు.

ప్రశ్న 5.
‘ఈ వ్యక్తి మేధస్సూ, పాండిత్యం మనదేశంలో గొప్ప గొప్ప పండితులందరి పాండిత్యాన్ని కలిపితే వచ్చే పాండిత్యం కన్న గొప్పది’ అని నరేంద్రుని గురించి ప్రొఫెసర్ జెహెచ్.రైట్ చెప్పిన విషయాన్ని బట్టి మీరేం గ్రహించారు?
జవాబు:
బోస్టన్లోని సాన్ బోర్న్ ఇంట్లో హార్వర్డ్ విశ్వవిద్యాలయ ప్రొఫెసరైన జె. హెచ్. రైట్ తో వివేకానందకు పరిచయమైంది. శాస్త్రీయమైన, తాత్త్వికమైన విషయాలెన్నో చర్చించుకున్నారు. వారిరువురు. షికాగో విశ్వమత మహాసభల అధ్యక్షుడికి వివేకానంద గూర్చి సిఫార్సు చేస్తూ “ఈ వ్యక్తి మేధస్సూ, పాండిత్యం మనదేశంలో గొప్ప గొప్ప పండితులందరి పాండిత్యాన్ని కలిపితే వచ్చే పాండిత్యం కన్న గొప్పది” అని రాశారు. ఈ మాటలను బట్టి వివేకానందుని పాండిత్య ప్రతిభ ప్రకటితం అవుతోంది. వివేకానంద శాస్త్రీయ, తాత్త్విక విషయ పరిజ్ఞానం గొప్పదని తెలుస్తోంది. ఇంకా ప్రొఫెసర్ రైట్ గొప్ప వ్యక్తిత్వం కూడా తెలుస్తోంది.

ఆ) క్రింది ప్రశ్నలకు పది లేక పన్నెండు వాక్యాలలో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
వివేకానందుడు, రామకృష్ణుల మధ్య జరిగిన తొలి సంభాషణను రాయండి.
జవాబు:
నరేంద్రునికి ఆధ్యాత్మికత ఇష్టం. మతం బోధించే చాలా విషయాల్లో అతడికి ఏది నమ్మాలో, ఏది నమ్మకూడదో స్పష్టంగా తెలియడం లేదు. స్నేహితుల సలహాతో శ్రీరామకృష్ణ పరమహంసను కలిశారు. తన సంశయాన్ని ప్రశ్నరూపంలో “అయ్యా! తమరు భగవంతుణ్ణి చూశారా?” అని అడిగాడు. దానికి సమాధానంగా “ఓ చూశాను. నిన్ను ఎంత స్పష్టంగా చూస్తున్నానో అంతకంటే స్పష్టంగా చూశాను. కావాలంటే నీకు కూడా చూపించగలను. కానీ, నాయనా ! భగవంతుడు కావాలని ఎవరు ఆరాటపడతారు ? భార్యాపిల్లలకోసం, ధన సంపాదన కోసం కడవల కొద్దీ కన్నీరు కారుస్తారు. భగవంతుడి కోసం ఎవరు విలపిస్తారు? ఎవరైనా సరే భగవంతుడి కోసం తీవ్ర వ్యాకులతతో విలపిస్తే ఆయన వారికి తప్పక దర్శనమిస్తాడు. ఇది నిజం. నా అనుభవం” – అని గుండె పై చేయి వేసుకొని శ్రీరామకృష్ణులు సమాధానమిచ్చారు. ఇలా వారి తొలి సంభాషణ జరిగింది.

ప్రశ్న 2.
షికాగో విశ్వమత మహాసభల్లో స్వామి వివేకానంద చేసిన తొలి ప్రసంగం గూర్చి రాయండి.
జవాబు:
1893 సెప్టెంబరు 11వ తేదీన విశ్వమత మహాసభలు మొదలైనాయి. కొలంబస్ హాల్ అనే పెద్ద భవనంలో అవి జరిగాయి. వివేకానంద స్వామి ఇతర వ్యక్తులతో పాటు వేదికపై ముందు వరుసలో కూర్చున్నారు. స్వామివారిని పిలిచేసరికి లేచారు. సరస్వతీ దేవిని తలచుకొని, శ్రావ్యమైన ఆయన కంఠంతోను, అంతకంటే మధురమూ, పరమ పవిత్రమూ అయిన ఆయన హృదయాంతరాళాలలో నుండి వచ్చిన విశ్వమాన సౌభ్రాత్ర భావనతోను “నా అమెరికా దేశ సోదర సోదరీమణులారా ……..” అని మొదలుపెట్టాడు. దాంతో ఆ జనసముద్రమంతా ఒక్కసారిగా లేచి నుంచొని కమ్మని ఆ పిలుపుకీ, ఇంద్రియగ్రహణము కాకపోయినా తమముందు మూర్తీభవించిన ఆ పవిత్రతకూ, ఏ నాగరికత పరిపూర్ణతకైనా చిహ్నమైన ఆ సన్యాస స్ఫూర్తికీ తమకు తెలియకనే పులకించిపోయి కరతాళ ధ్వనుల వర్షం కురిపించారు.

AP Board 9th Class Telugu Solutions ఉపవాచకం Chapter 1 స్వామి వివేకానంద

ప్రశ్న 3.
షికాగో నగరంలో ప్రముఖులు, ధనవంతులు స్వామీజీకి ఆతిథ్యం ఇచ్చిన సందర్భంలో ఆయన మానసిక స్థితిని రాయండి.
జవాబు:
షికాగో నగరంలో వివేకానంద స్వామీజీకి ఇచ్చిన వసతులు ఆయనకు తృప్తినివ్వకపోగా గుండెను ఎవరో రంపంతో కోసినట్లయింది. “అయ్యో ! నా భారతదేశ ప్రజల్లో అధికభాగం తినడానికి తిండిలేక, కట్టుకోడానికి బట్టలేక అలమటిస్తూంటే ఇక్కడ వీళ్ళు డబ్బుల్ని నీళ్ళలా ఖర్చు పెడుతున్నారే ! వీరికి ఉన్న సదుపాయాల్లో కొన్నైనా నా వారికి లేవే! అటువంటప్పుడు నాకెందుకీ హంసతూలికా తల్పాలు? ఎవరిక్కావాలి ఈ ధనం, కీర్తి ప్రతిష్ఠ? అమ్మా జగజ్జననీ, నేనివేవీ అడగలేదే ? వాకివేవీ వద్దు. నా దేశ ప్రజల అన్నార్తినీ, జ్ఞానార్తినీ తీర్చు. వారిని మేల్కొలుపు. వారిని మనుష్యులను చేసి తమ కాళ్ళపై తాము నిలబడి తామూ ఏదైనా సాధించగలమనే విశ్వాసాన్ని కలుగజేయి అంటూ రోదిస్తూ నేలకు వాలి అక్కడే శయనించారు.

ప్రశ్న 4.
స్వామి వివేకానంద పాత్ర స్వభావాన్ని రాయండి.
జవాబు:
వివేకానందుడికి బాల్యంలో నరేంద్రుడు అని పేరు ఉండేది. వివేకానందుడు సాహసవంతుడైన బాలుడు. పరుగు పెడుతున్న బండిలోకి ఎక్కి ఒకసారి బండిలోని స్త్రీని రక్షించాడు. నరేంద్రుడు అల్లరి పిల్లవాడు. ‘శివశివా అంటూ నెత్తిపై నీళ్ళు పోస్తే శాంతించేవాడు.’

బాల్యంలో తల్లి నుండి భారత భాగవత రామాయణ కథలు విన్నాడు. రాముడన్నా, రామాయణమన్నా నరేంద్రుడికి ఎంతో ప్రేమ. ఆటలంటే బాగా ఇష్టం. మంచి జ్ఞాపకశక్తి కలవాడు. ‘రాజు – దర్బారు’ ఆట అంటే బాగా ఇష్టం. రామకృష్ణ పరమహంసను గురువుగా స్వీకరించి, సన్యాసం స్వీకరించాడు. భారతదేశమంతా పర్యటించాడు. వివేకానంద అనే పేరుతో అమెరికాలోని విశ్వమత మహాసభలో పాల్గొని, భారతీయ ధర్మం అన్ని మతాల్ని అంగీకరిస్తుందన్నారు.

వివేకానందుడి ఖ్యాతి ప్రపంచం అంతా వ్యాపించింది. విదేశాల నుండి తిరిగి వచ్చిన స్వామికి భారతదేశం బ్రహ్మరథం పట్టింది. వివేకానంద స్వామి యువకులకు సందేశం ఇచ్చాడు. యువకులకు ప్రేమ, నిజాయితీ, సహనం ముఖ్యమన్నారు.

లేవండి! మేల్కొనండి! శ్రేష్ఠులైన ఆచార్యుల బోధనలను అనుసరించండని వివేకానంద యువకులకు సందేశం ఇచ్చారు.

ప్రశ్న 5.
లేవండి ! మేల్కొనండి ! అంటూ జాతిని జాగృతం చేసిన వివేకానంద యువతకు ఇచ్చిన సందేశం ఏమిటి?
జవాబు:
ఇప్పటి యువకుల మీద, వారి ఆధునికత పైన పరిపూర్ణమైన విశ్వాసం ఉంది అంటూ వివేకానంద యువకులకు ఇలా సందేశం ఇచ్చారు. సాహసికులైన యువకులారా ! మీకు కావల్సినవి మూడే విషయాలు. అవి ప్రేమ, నిజాయితీ, సహనం. ప్రేమించలేని మానవుడు జీవన్మృతుని కింద పరిగణింపబడతాడు. నిరుపేదలను, అమాయక ప్రజలను, అణగదొక్కబడిన వారిని ప్రేమించండి. వారికొరకు వేదన చెందండి. పరితపించండి. పిరికితనాన్ని విడనాడండి. ధైర్యంగా సమస్యలను ఎదుర్కోండి. దీనజనుల కోసం శ్రమించండి. వారిని ఉద్దరించండి. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోండి. సహనంతో వ్యవహరించడమే సత్ఫలితాలను సాధిస్తుందని మరవకండి. లేవండి ! మేల్కొనండి ! శ్రేష్ఠులైన ఆచార్యుల బోధనలననుసరించండి.

AP Board 9th Class Telugu Solutions ఉపవాచకం Chapter 1 స్వామి వివేకానంద

ప్రశ్న 6.
వివేకానందుడు జాతికిచ్చిన సందేశాన్ని బట్టి మీరేం గ్రహించారు?
జవాబు:
“భారతీయ ధర్మం అన్ని మతాల్ని అంగీకరిస్తుంది, గౌరవిస్తుంది. అన్ని మతాలూ సత్యాలే, అవన్నీ భగవంతుని చేరుకోవడానికి మార్గాలు” అని స్వామీజీ చెప్పిన మాటలు అమెరికా ప్రజలనే కాదు యావత్ ప్రపంచాన్ని తనవైపు తిప్పుకున్నాయి. ఎవరూ మతం మార్చుకోనవసరం లేదనీ, నా మతం గొప్పది, నా మతమే నిలవాలి అనుకునేవారు బావిలో కప్ప వంటి వారనీ స్వామీజీ చెప్పిన మాటలు అక్షరసత్యాలు. మతం తల్లి లాంటిది. తల్లి మనసే అర్థం కానప్పుడు మనం మనుగడ ఎలా సాగిస్తాం ? ఇదేమి స్వార్ధ రాజకీయం కాదుగా ? కప్పలాగా అటూ ఇటూ గెంతడానికి.

సభలోని మిగతా వక్తలు తమతమ మతాలకు ప్రాతినిధ్యం వహిస్తే, స్వామీజీ మాత్రం అన్ని ధర్మాల తరుఫునా మాట్లాడి నిజమైన మత సామరస్యాన్ని చూపారు. సదస్యులందరికి స్వామీజీ ప్రసంగమే నచ్చింది. ఎక్కడైనా నలుగురి గురించి ఆలోచించేవారే మన్నన పొందుతారు అనడానికి ఇదే నిదర్శనం.

జాతి, మత తారతమ్యం కూడదనీ, ధనిక, పేద వివాదం లేకుండా అందరూ నా సహోదరులేనని చాటాలి, ప్రతి ఒక్కరూ తనకోసం కాక, దేశం గూర్చి ఆలోచించాలన్నారు. స్త్రీ జనోద్ధరణ, విద్యావ్యాప్తి సక్రమంగా సాగాలన్నారు. పరిశోధనలు కూడా వాడుకభాషలో నిర్వహించాలన్నారు. యువతకు ‘ప్రేమ, నిజాయితీ, సహనం’ కావాలన్నారు. పిరికితనం విడిచి ధైర్యంగా సమస్యలను ఎదుర్కోండి. దీన జనులను ఉద్దరించండి. ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండి. ఓర్పుతో వ్యవహరిస్తే మంచి ఫలితాలు వస్తాయని మరువకండి. శ్రేష్ఠులైన ఆచార్యుల బోధనలు అనుసరించండి” అంటూ ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని కల్గించే వివేకానందుని స్ఫూర్తిదాయకమైన మాటలు అప్పటికే కాదు ఇప్పటికీ ప్రేరణ కల్గించేవని నేను గ్రహించాను.