AP SSC 10th Class Maths Solutions Chapter 1 Real Numbers InText Questions

AP State Syllabus SSC 10th Class Maths Solutions 1st Lesson Real Numbers InText Questions

AP State Board Syllabus AP SSC 10th Class Maths Textbook Solutions Chapter 1 Real Numbers InText Questions and Answers.

10th Class Maths 1st Lesson Real Numbers InText Questions and Answers

Do this

Question 1.
Find q and r for the following pairs of positive integers a and b, satisfying a = bq + r. (Page No. 3)
i) a = 13, b = 3
Answer:
13 = 3 × 4 + 1
here q = 4 ; r = 1
ii) a = 8, b = 80
Answer:
Take a = 80, b = 8
80 = 8 × 10 + 0 here q = 10 ; r = 0
iii) a = 125, b = 5
Answer:
125 = 5 × 25 + 0
here q = 25 ; r = 0
iv) a = 132, b = 11
Answer:
132 = 11 × 12 + 0
here q = 12 ; r = 0

AP SSC 10th Class Maths Solutions Chapter 1 Real Numbers InText Questions

Question 2.
Find the HCF of the following by using Euclid division lemma,
i) 50 and 70 (Page No. 4)
Answer:
For given two positive integers a > b;
there exists unique pair of integers q and r satisfying a = bq + r; 0≤r<b.
∴ 70 = 50 × 1 + 20
Here a = 70, b = 50, q = 1, r = 20.
Now consider 50, 20
50 = 20 × 2 + 10
Here a = 50, b = 20, q = 2, r = 10.
Now taking 20 and 10.
20 = 10 × 2 + 0
Here the remainder is zero.
∴ 10 is the HCF of 70 and 50.

ii) 96 and 72
Answer:
96 = 72 × 1 + 24
72 = 24 × 3 + 0
∴ HCF = 24

iii) 300 and 550
Answer:
550 = 300 × 1 + 250
300 = 250 × 1 + 50
250 = 50 × 5 + 0
∴ HCF = 50

iv) 1860 and 2015
Answer:
2015 = 1860 × 1 + 155
1860 = 155 × 12 + 0
∴ HCF = 155

AP SSC 10th Class Maths Solutions Chapter 1 Real Numbers InText Questions

Think & Discuss

Question 1.
From the above questions in ‘DO THIS’, what is the nature of q and r? (Page No. 3)
Answer:
Given: a = bq + r
q > 0 and r lies in between 0 and b
i.e. q > 0 and 0 ≤ r < b

Question 2.
Can you find the HCF of 1.2 and 0.12? Justify your answer. (Page No. 4)
Answer:
Given: 1.2 and 0.12
we have 1.2 = \(\frac{12}{10}\) = \(\frac{120}{100}\)
0.12 = \(\frac{12}{100}\)
Now considering the numerators 12 and 120, their HCF is 12.
∴ HCF of 1.2 and 0.12 is \(\frac{12}{100}\) = 0.12
i.e., if x is a factor of y then x is the HCF of x and y.

Question 3.
If r = 0, then what is the relationship between a, b and q in a = bq + r of Euclid divison lemma? (Page No. 6)
Answer:
Given: r = 0 in a = bq + r then a = bq
i.e., b divides a completely.
i.e., b is a factor of a.

AP SSC 10th Class Maths Solutions Chapter 1 Real Numbers InText Questions

Do this

Question 1.
Express 2310 as a product of prime factors. Also see how your friends have factorized the number. Have they done it as you ? Verify your final product with your friend’s result. Try this for 3 or 4 more numbers. What do you conclude? (Page No. 7)
Answer:
Given: 2310
2310 = 2 × 1155
= 2 × 3 × 385
= 2 × 3 × 5 × 77
2310 = 2 × 3 × 5 × 7 × 11
AP SSC 10th Class Maths Chapter 1 Real Numbers InText Questions 1
We notice that this prime factorization is unique.
And also notice that prime factorization of any number is unique i.e., every composite number can be expressed as a product of primes and this factorization is unique.
E.g: 144 = 2 × 72
= 2 × 2 × 36
= 2 × 2 × 2 × 18
= 2 × 2 × 2 × 2 × 9
= 2 × 2 × 2 × 2 × 3 × 3
= 24 × 32
320 = 2 × 160
= 2 × 2 × 80
= 2 × 2 × 2 × 40
= 2 × 2 × 2 × 2 × 20
= 2 × 2 × 2 × 2 × 2 × 10
= 2 × 2 × 2 × 2 × 2 × 2 × 5
= 26 × 5
125 = 5 × 25
= 5 × 5 × 5
= 53

Question 2.
Find the HCF and LCM of the following given pairs of numbers by prime factorization, (Page No. 8)
i) 120, 90
Answer:
We have 120 = 2 × 2 × 2 × 3 × 5
= 23 × 3 × 5
90 = 2 × 3 × 3 × 5
= 2 × 32 × 5
AP SSC 10th Class Maths Chapter 1 Real Numbers InText Questions 2
∴ HCF = 2 × 3 × 5 = 30
LCM = 2<sup>3</sup> × 3<sup>2</sup> × 5 = 360

ii) 50, 60
Answer:
We have
50 = 2 × 5 × 5 = 2 × 52
60 = 2 × 2 × 3 × 5 = 22 × 3 × 5
AP SSC 10th Class Maths Chapter 1 Real Numbers InText Questions 3
∴ HCF = 2 × 5 = 10
LCM = 22 × 3 × 52 = 300

iii) 37, 49
Answer:
We have
37 = 1 × 37
49 = 7 × 7 = 72
∴ HCF = 1
LCM = 37 × 72
Note: H.C.F. of two relatively prime numbers is 1 and LCM is equal to product of the numbers.

AP SSC 10th Class Maths Solutions Chapter 1 Real Numbers InText Questions

Try this

Question 1.
Show that 3n × 4m cannot end with the digit 0 or 5 for any natural numbers ‘n’ and’m’. (Page No. 8)
Answer:
Given number is 34 × 4m.
So the prime factors to it are 3 and 2 only.
I: but if a number want to be end with zero it should have 2 and 5 as its prime factors, but the given hasn’t ‘5’ as its prime factor.
So it cannot be end with zero.
II : now if a number went to be end with 5 it should have ‘5’ as its one of prime factors. But given 3n × 4m do not have 5 as a factor.
So it cannot be end with 5.
Hence proved.

Do this

Question 1.
Write the following terminating decimals in the form of p/q, q ≠ 0 and p, q are co-primes.
i) 15.265
ii) 0.1255
iii) 0.4
iv) 23.34
v) 1215.8
What can you conclude about the denominators through this process? (Page No. 10)
Answer:
i) 15.265
AP SSC 10th Class Maths Chapter 1 Real Numbers InText Questions 4
ii) 0.1255
AP SSC 10th Class Maths Chapter 1 Real Numbers InText Questions 5
iii) 0.4
0.4 = \(\frac{4}{10}\) = \(\frac{2}{5}\)
iv) 23.34
AP SSC 10th Class Maths Chapter 1 Real Numbers InText Questions 6
v) 1215.8
AP SSC 10th Class Maths Chapter 1 Real Numbers InText Questions 7
Two and five are the factors for the denominator.

AP SSC 10th Class Maths Solutions Chapter 1 Real Numbers InText Questions

Question 2.
Write the following rational numbers in the form of p/q, where q is of the form 2n.5m where n, m are non-negative integers and then write the numbers in their decimal form. (Page No. 11)
i) \(\frac{3}{4}\)
ii) \(\frac{7}{25}\)
iii) \(\frac{51}{64}\)
iv) \(\frac{14}{25}\)
v) \(\frac{80}{100}\)
Answer:
i) \(\frac{3}{4}\)
\(\frac{3}{4}\) = \(\frac{3}{2 \times 2}\) = \(\frac{3}{2^{2}}\)
AP SSC 10th Class Maths Chapter 1 Real Numbers InText Questions 8
Decimal form of \(\frac{3}{4}\) = 0.75

ii) \(\frac{7}{25}\)
\(\frac{7}{25}\) = \(\frac{7}{5 \times 5}\) = \(\frac{7}{5^{2}}\)
AP SSC 10th Class Maths Chapter 1 Real Numbers InText Questions 9
Decimal form of \(\frac{7}{25}\) = 0.28

iii) \(\frac{51}{64}\)
\(\frac{51}{64}\) = \(\frac{51}{2^{6}}\)
[∵ 64 = 2 × 32
= 22 × 16
= 23 × 8
= 24 × 4 = 25 × 2 = 26]
AP SSC 10th Class Maths Chapter 1 Real Numbers InText Questions 10
Decimal form of \(\frac{51}{64}\) = 0.796875

iv) \(\frac{14}{25}\)
AP SSC 10th Class Maths Chapter 1 Real Numbers InText Questions 11

v) \(\frac{80}{100}\)
\(\frac{80}{100}\) = \(\frac{80}{2^{2} \times 5^{2}}\) = \(\frac{80}{10^{2}}\) = 0.80

AP SSC 10th Class Maths Solutions Chapter 1 Real Numbers InText Questions

Question 3.
Write the following rational numbers as decimal form and find out the block of repeating digits in the quotient. (Page No. 11)
i) \(\frac{1}{3}\)
ii) \(\frac{2}{7}\)
iii) \(\frac{5}{11}\)
iv) \(\frac{10}{13}\)
Answer:
i) \(\frac{1}{3}\)
\(\frac{1}{3}\) = 0.3333…. = \(0 . \overline{3}\)
Block of digits, repeating in the quotient = period = 3.

ii) \(\frac{2}{7}\)
Decimal form of \(\frac{2}{7}\) = 0.285714….
Repeating part/period = 285714
∴ \(\frac{2}{7}\) = \(0 . \overline{285714}\)

iii) \(\frac{5}{11}\)
Period = 45
Decimal form of \(\frac{5}{11}\) = 0.454545.
= \(0 . \overline{45}\)

iv) \(\frac{10}{13}\)
Decimal form of \(\frac{10}{13}\) = 0.769230.
= \(0 . \overline{769230}\)
Period = 769230

Do this

Question 1.
Verify the statement proved above for p = 2, p = 5 and for a2 = 1, 4, 9, 25, 36, 49, 64 and 81. (Page No. 14)
Answer:
AP SSC 10th Class Maths Chapter 1 Real Numbers InText Questions 16
AP SSC 10th Class Maths Chapter 1 Real Numbers InText Questions 17
From the above we can conclude that if a prime number ‘p’ divides a2, then it also divides a.

AP SSC 10th Class Maths Solutions Chapter 1 Real Numbers InText Questions

Think and Discuss

Question 1.
Write the nature of y, a and x in y = ax. Can you determine the value of x for a given y? Justify your answer. (Page No. 17)
Answer:
y = ax here a ≠ 0
We can determine the value of ‘x’ for a given y.
for example y = 5, a = 2
We cannot express y = ax for y = 5, a = 2 and for y = 7, a = 3, we cannot express seven (7) as a power of 3.

Question 2.
You know that 21 = 2, 41 = 4, 81 = 8 and 101 = 10. What do you notice about the values of log2 2, log4 4, log8 8 and log10 10? What can you generalise from this?  (Page No. 18)
Answer:
From the graph log2 2 = log4 4 = log8 8 = log10 10 = 1
We conclude that loga a = 1 where a is a natural number.

Question 3.
Does log10 0 exist? (Page No. 18)
Answer:
No, log10 0 doesn’t exist, i.e ax ≠ 0 ∀ a, x ∈ N.

Question 4.
We know that, if 7 = 2x then x = log2 7. Then what is the value of \(2^{\log _{2} 7}\)? Justify your answer. Generalise the above by taking some more examples for \(\mathbf{a}^{\log _{\mathrm{a}} \mathbf{N}}\). (Page No. 21)
Answer:
We know that if 7 = 2x then x = log2 7
We want to find the value of \(2^{\log _{2} 7}\);
Now put log2 7 = x in the given
∴ \(2^{\log _{2} 7}\) = 2x = 7 (given)
∴ \(2^{\log _{2} 7}\) = 7
Thus \(\mathbf{a}^{\log _{\mathrm{a}} \mathbf{N}}\) = N

a) \(3^{\log _{3} 8}\)
Answer:
If x = \(3^{\log _{3} 8}\) then
log3 x = log3 8
⇒ x = 8

b) \(5^{\log _{5} 10}\)
Answer:
If y = \(5^{\log _{5} 10}\)
then log5 y = log5 10
⇒ y = 10

Do this

Question 1.
Write the powers to which the bases to be raised in the following.  (Page No. 18)
i) 64 = 2x
Answer:
64 = 2x
We know that
64 = 2 × 32
= 2 × 2 × 16
= 2 × 2 × 2 × 8
= 2 × 2 × 2 × 2 × 4
= 2 × 2 × 2 × 2 × 2 × 2
64 = 26
⇒ x = 6

AP SSC 10th Class Maths Solutions Chapter 1 Real Numbers InText Questions

ii) 100 = 5b
Answer:
Here also 100 cannot be written as any power of 5.
i.e., there exists no integer for b such that 5b = 100

iii) \(\frac{1}{81}\) = 3c
Answer:
We know that 81 = 3 x 27
= 3 × 3 × 9
= 3 × 3 × 3 × 3
= 34
∴ \(\frac{1}{81}\) = 3-4   [∵ a-m = \(\frac{1}{\mathrm{a}^{\mathrm{m}}}\)]
∴ c = – 4

iv) 100 = 10z
Answer:
100 = 102
z = 2

v) \(\frac{1}{256}\) = 4a
Answer:
We know that 256 = 4 × 64
= 4 × 4 × 16
= 4 × 4 × 4 × 4
∴ \(\frac{1}{256}\) = 4-4
∴ a = – 4

Question 2.
Express the logarithms of the following into sum of the logarithms.   (Page No. 19)
i) 35 × 46
Answer:
log xy = log x + log y
log1035 × 46 = log1035 + log1046

ii) 235 × 437
Answer:
log10235 × 437 = log10235 + log10437   [∵ log xy = log x + log y]

iii) 2437 × 3568
Answer:
log10 2437 × 3568 = log102437 + log103568   [∵ log xy = log x + log y]

Question 3.
Express the logarithms of the follow¬ing into difference of the logarithms.   (Page No. 20)
i) \(\frac{23}{34}\)
Answer:
log10 = \(\frac{23}{34}\) = log10 23 – log10 34
[∵ log \(\frac{x}{y}\) = log x – log y]

ii) \(\frac{373}{275}\)
Answer:
log10 = \(\frac{373}{275}\) = log10 373 – log10 275
[∵ log \(\frac{x}{y}\) = log x – log y]

iii) \(\frac{4525}{3734}\)
Answer:
log10 = \(\frac{4525}{3734}\) = log10 4525 – log10 3734
[∵ log \(\frac{x}{y}\) = log x – log y]

iv) \(\frac{5055}{3303}\)
Answer:
log10 = \(\frac{5055}{3303}\) = log10 5055 – log10 3303
[∵ log \(\frac{x}{y}\) = log x – log y]

AP SSC 10th Class Maths Solutions Chapter 1 Real Numbers InText Questions

Question 4.
By using the formula logaxn = n loga x, convert the following.   (Page No. 21)
i) log2 725
Answer:
log2 725 = 25 log2 7

ii) log5 850
Answer:
log5 850 = 50 log5 8 = 50 log5 23
= 3 × 50 log52 = 150 log52

iii) log 523
Answer:
log 523 = 23 log 5

iv) log 1024
Answer:
log 1024 = log 210 [∵ 1024 = 210]
= 10 log 2

Try this

Question 1.
Write the following relation in exponential form and find the values of respective variables.   (Page No. 18)
i) log232 = x
Answer:
log232 = x
⇒ log225 = x     [∵ 32 = 25]
⇒ 5 log22 = x     [∵ log am = m log a]
⇒ 5 × 1 = x      [∵ loga a = 1]
∴ x = 5

ii) log5625 = y
Answer:
log5625 = y
⇒ log54 = y    [∵ 625 = 54]
⇒ 4 log5 5 = y     [∵ log am = m log a]
⇒ 4 × 1 = y     [∵ loga a = 1]
∴ y = 4

AP SSC 10th Class Maths Solutions Chapter 1 Real Numbers InText Questions

iii) log1010000 = z
Answer:
log1010000 = z
=> log10104 = z     [∵ 10000 = 10 × 10 × 10 × 10 = 104]
=> 4 log1010 = z     [∵ log am = m log a]
=> 4 × 1 = z     [∵ loga a = 1]
∴ z = 4

iv) \(\log _{7} \frac{1}{343}\) = -a
Answer:
AP SSC 10th Class Maths Chapter 1 Real Numbers InText Questions 18

Question 2.
i) Find the value of log232. (Page No. 21)
Answer:
log2 32 = log2 25
[∵ 32 = 2 × 2 × 2 × 2 × 2 = 25]
= 5 log2 2 [∵ log am = m log a]
= 5 × 1 [∵ loga a = 1]
= 5

ii) Find the value of logc √c.
Answer:
AP SSC 10th Class Maths Chapter 1 Real Numbers InText Questions 19
= \(\frac{1}{2}\) × 1 [∵ loga a = 1]
= \(\frac{1}{2}\)

AP SSC 10th Class Maths Solutions Chapter 1 Real Numbers InText Questions

iii) Find the value of log100.001
Answer:
AP SSC 10th Class Maths Chapter 1 Real Numbers InText Questions 20

iv) Find the value of \(\log _{\frac{2}{3}} \frac{8}{27}\)
Answer:
AP SSC 10th Class Maths Chapter 1 Real Numbers InText Questions 21

AP SSC 10th Class Maths Solutions Chapter 1 Real Numbers Ex 1.2

AP State Board Syllabus AP SSC 10th Class Maths Textbook Solutions Chapter 1 Real Numbers Ex 1.2 Textbook Questions and Answers.

AP State Syllabus SSC 10th Class Maths Solutions 1st Lesson Real Numbers Exercise 1.2

10th Class Maths 1st Lesson Real Numbers Ex 1.2 Textbook Questions and Answers

Question 1.
Express each of the following numbers as a product of its prime factors.
i) 140
ii) 156
iii) 3825
iv) 5005
v) 7429
Answer:
i) 140
AP SSC 10th Class Maths Solutions Chapter 1 Real Numbers Ex 1.2 1
∴ 140 = 2 × 2 × 5 × 7 = 22 × 5 × 7

AP SSC 10th Class Maths Solutions Chapter 1 Real Numbers Ex 1.2

ii) 156
AP SSC 10th Class Maths Solutions Chapter 1 Real Numbers Ex 1.2 2
∴ 156 = 2 × 2 × 3 × 13 = 22 × 3 × 13

iii) 3825
AP SSC 10th Class Maths Solutions Chapter 1 Real Numbers Ex 1.2 3
∴ 3825 = 3 × 3 × 5 × 5 × 17 = 32 × 52 × 17

iv) 5005
AP SSC 10th Class Maths Solutions Chapter 1 Real Numbers Ex 1.2 4
∴ 5005 = 5 × 7 × 11 × 13

v) 7429
AP SSC 10th Class Maths Solutions Chapter 1 Real Numbers Ex 1.2 5
∴ 7429 = 17 × 19 × 23

AP SSC 10th Class Maths Solutions Chapter 1 Real Numbers Ex 1.2

Question 2.
Find the L.C.M and H.C.F of the following integers by the prime factorization method.
i) 12, 15 and 21
ii) 17, 23 and 29
iii) 8, 9 and 25
iv) 72 and 108
v) 306 and 657
Answer:
i) 12, 15 and 21
12 = 2 × 2 × 3 = 22 × 3
15 = 3 × 5
21 = 3 × 7
L.C.M = 22 × 3 × 5 × 7 = 420
H.C.F = 3

ii) 17, 23 and 29
The given numbers 17, 23 and 29 are all primes.
L.C.M = their product
= 17 × 23 × 29 = 11339
∴ H.C.F = 1

iii) 8, 9 and 25
8 = 2 × 2 × 2 = 23
9 = 3 × 3 = 32
25 = 5 × 5 = 52
L.C.M = 23 × 32 × 52 = 1800
(or)
8, 9 and 25 are relatively prime, therefore L.C.M is equal to their product,
(i.e.,) L.C.M = 8 × 9 × 25 = 1800
H.C.F = 1

iv) 72 and 108
AP SSC 10th Class Maths Solutions Chapter 1 Real Numbers Ex 1.2 6
72 = 23 × 32
108 = 22 × 33
L.C.M = 23 × 33 = 8 × 27 = 216
H.C.F = 22 × 32 = 4 × 9 = 36

AP SSC 10th Class Maths Solutions Chapter 1 Real Numbers Ex 1.2

v) 306 and 657
AP SSC 10th Class Maths Solutions Chapter 1 Real Numbers Ex 1.2 7
306 = 2 × 32 × 17
657 = 32 × 73
L.C.M = 2 × 32 × 17 × 73 = 22338
H.C.F = 32 = 9

Question 3.
Check whether 6n can end with the digit ‘0’ for any natural number n.
Answer:
Given number = 6n = (2 × 3)n
The prime factors here are 2 and 3 only.
To be end with 0; 6n should have a prime factor 5 and also 2.
So, 6n can’t end with zero.

Question 4.
Explain why 7 × 11 × 13 + 13 and 7 × 6 × 5 × 4 × 3 × 2 × 1 + 5 are composite numbers.
Answer:
Given numbers are 7 × 11 × 13
7 × 6 × 5 × 4 × 3 × 2 × 1 + 5
⇒ 13(7 × 11 + 1) and
5(7 × 6 × 4 × 3 × 2 × 1 + 1)
⇒ 13 K and 5 L, where K = 78 and L = 7 × 6 × 4 × 3 × 2 × 1 + 1 = 1009
As the given numbers can be written as product of two numbers, they are composite.

Question 5.
How will you show that (17 × 11 × 2) + (17 × 11 × 5) is a composite number? Explain.
Answer:
(17 × 11 × 2) + (17 × 11 × 5)
= (17 × 11) (2 + 5)
= (17 × 11) (7)
= 187 × 7
Now the given expression is written as a product of two integers and hence it is a composite number.

AP SSC 10th Class Maths Solutions Chapter 1 Real Numbers Ex 1.2

Question 6.
What is the last digit of 6100?
Answer: We know that
61 = 6
62 = 36
63 = 216
64 = 1296
65 = 7776
We see that 6n for any positive integer n ends is 6.
i.e., unit digit is always 6.
∴ Unit digit of 6100 is 6.

AP SSC 10th Class Maths Solutions Chapter 1 Real Numbers Ex 1.1

AP State Board Syllabus AP SSC 10th Class Maths Textbook Solutions Chapter 1 Real Numbers Ex 1.1 Textbook Questions and Answers.

AP State Syllabus SSC 10th Class Maths Solutions 1st Lesson Real Numbers Exercise 1.1

10th Class Maths 1st Lesson Real Numbers Ex 1.1 Textbook Questions and Answers

Question 1.
Use Euclid’s division algorithm to find the HCF of
i) 900 and 270
Answer:
900 = 270 × 3 + 90
270 = 90 × 3 + 0
∴ HCF = 90

ii) 196 and 38220
Answer:
38220 = 196 × 195 + 0
∴ 196 is the HCF of 196 and 38220.

iii) 1651 and 2032
Answer:
2032 = 1651 × 1 + 381
1651 = 381 × 4 + 127
381 = 127 × 3 + 0
∴ HCF = 127

AP SSC 10th Class Maths Solutions Chapter 1 Real Numbers Ex 1.1

Question 2.
Use Euclid division lemma to show that any positive odd integer is of the form 6q + 1 or 6q + 3 or 6q + 5, where q is some integers.
Answer:
Let ‘a’ be an odd positive integer.
Let us now apply division algorithm with a and b = 6.
∵ 0 ≤ r < 6, the possible remainders are 0, 1, 2, 3, 4 and 5.
i.e., ’a’ can be 6q or 6q + 1 or 6q + 2 or 6q + 3 or 6q + 4 or 6q + 5, where q is the quotient.
But ‘a’ is taken as an odd number.
∴ a can’t be 6q or 6q + 2 or 6q + 4.
∴ Any odd integer is of the form 6q + 1, 6q + 3 or 6q + 5.

Question 3.
Use Euclid’s division lemma to show that the square of any positive integer is of the form 3p, 3p + 1.
Answer:
Let ‘a’ be the square of an integer.
Applying Euclid’s division lemma with a and b = 3
Since 0 ≤ r < 3, the possible remainders are 0, 1, and 2.
∴ a = 3q (or) 3q + 1 (or) 3q + 2
∴ Any square number is of the form 3q, 3q + 1 or 3q + 2, where q is the quotient.
(or)
Let ‘a’ be a positive integer
So it can be expressed as a = bq + r (from Euclideans lemma)
now consider b = 3 then possible values of ‘r’ are ‘0’ or ‘1’ or 2.
then a = 3q + 0 = 3q (or) 3q + 1 or 3q + 2 now square of given positive integer (a2) will be
Case – I: a2 – (3q)2 = 9q2=3(3q2) = 3p (p = 3q2)
Case-II: a2 = (3q + l)2 = 9q2 + 6q+ 1
= 3[3q2 + 2q] + 1 = 3p+l (Where p = 3q2 + 2q) or
Case – III: a2 = (3q + 2)2 = 9q2 + 12q + 4 = 9q2 + 12q + 3 + 1
= 3[3q2 + 4q + 1] + 1
= 3p + 1 (where ‘p’ = 3q2 + 4q + 1)
So from above cases 1, 2, 3 it is clear that square of a positive integer (a) is of the form 3p or 3p + 1
Hence proved.

AP SSC 10th Class Maths Solutions Chapter 1 Real Numbers Ex 1.1

Question 4.
Use Euclid’s division lemma to show that the cube of a positive integer is of the form 9m, 9m + 1 or 9m + 8.
(OR)
Show that the cube of any positive integer is of form 9m or 9m + 1 or 9m + 8, where m is an integer.
Answer:
Let ‘a’ be positive integer. Then from Euclidean lemma a = bq + r;
now consider b = 9 then 0 ≤ r < 9, it means remainder will be 0, or 1, 2, 3, 4, 5, 6, 7, or 8
So a = bq + r
⇒ a = 9q + r (for b = 9)
now cube of a = a3 + (9q + r)3
= (9q)3 + 3.(9q)3r + 3. 9q.r + r3
= 93q3 + 3.92(q2r) + 3.9(q.r) + r3
= 9[92.q3 + 3.9.q2r + 3.q.r] + r3
a3 = 9m + r3 (where ‘m’ = 92q3 + 3.9.q2r + 3.q.r)
if r = 0 ⇒ r3 = 0 then a3 = 9m + 0 = 9m
and for r = 1 ⇒ r3 = l3 then a3 = 9m + 1
and for r = 2 ⇒ r3 = 23 then a3 = 9m + 8
for r = 3 ⇒ r3, = 33 ⇒ a3 = 9m + 27 = 9(m) where m = (9m +3)
for r = 4 ⇒ r3 = 43 ⇒ a3 = 9m + 64 = (9m + 63) + 1 = 9m + 1
for r = 5 ⇒ r3 = 125 ⇒ a3 = 9m + 125 = (9m + 117) + 8 = 9m + 8
for r = 6 ⇒ r3 — 216 ⇒ a3 = 9m + 216 = 9m + 9(24) = 9m
for r = 7 ⇒ r3 = 243
⇒ a3 = 9m + 9(27) = 9m
for r = 8 ⇒ r3 = 512
⇒ a3 = 9m + 9(56) + 8 = 9m + 8
So from the above it is clear that a3 is either in the form of 9m or 9m + 1 or 9m + 8.
Hence proved.

AP SSC 10th Class Maths Solutions Chapter 1 Real Numbers Ex 1.1

Question 5.
Show that one and only one out of n, n + 2 or n + 4 is divisible by 3, where n is any positive integer.
(Or)
Show that one and only one out of a, a + 2 and a + 4 is divisible by 3 where ‘a’ is any positive integer.
Answer:
Let ‘n’ be any positive integer.
Then from Euclidean’s lemma n = bq + r (now consider b = 3)
⇒ n = 3q + r (here 0 ≤ r < 3) which means the possible values of ‘r’ = 0 or 1 or 2
Now consider r = 0 then ‘n’ = 3q (divisible by 3)
and n + 2 = 3q + 2 (not divisible by 3)
n + 4 = 3q + 4 (not divisible by 3)
Case – II: For r = 1
n = 3q + 1 (not divisible by 3)
n + 2 = 3q + 1 + 2 = 3q + 3 = 3(q + l) divisible by 3
n + 4 = 3q + 1 + 4 = 3q + 5 not divisible by 3
Case – III: For r = 2,
n = 3q + 2 not divisible by 3
n + 2 = 3q + 2 + 2 = 3q + 4, not divisible by 3
n + 4 = 3q + 2 + 4 = 3q + 6 = 3(q + 2) divisible by 3
So in all above three cases we observe, only one of either (n) or (n + 1) or (n + 4) is divisible by 3.
Hence proved.

AP Board 10th Class Physical Science Solutions 10th Lesson విద్యుదయస్కాంతత్వం

SCERT AP 10th Class Physics Study Material Pdf 10th Lesson విద్యుదయస్కాంతత్వం Textbook Questions and Answers.

AP State Syllabus 10th Class Physical Science 10th Lesson Questions and Answers విద్యుదయస్కాంతత్వం

10th Class Physical Science 10th Lesson విద్యుదయస్కాంతత్వం Textbook Questions and Answers

అభ్యసనాన్ని మెరుగుపరుచుకోండి

ప్రశ్న 1.
అయస్కాంత బలరేఖలు సంవృతాలా? వివరించండి.
(లేదా)
అయస్కాంత బలరేఖలు ఎందుకు సంవృతాలో వివరించుము.
జవాబు:
AP Board 10th Class Physical Science Solutions 10th Lesson విద్యుదయస్కాంతత్వం 1
అయస్కాంత బలరేఖలు కచ్చితంగా సంవృతరేఖలే. ఎందుకనగా ఇవి ప్రక్కపటంలో చూపిన విధంగా అయస్కాంతమునకు బాహ్యంగా ఉత్తర ధ్రువాన్ని వదలి, దక్షిణ ధ్రువానికి చేరుతాయి. అంతరంగా ఇవి దక్షిణ ధ్రువం నుండి ఉత్తర ధ్రువానికి ప్రయాణిస్తాయి.

ప్రశ్న 2.
పటంలో చూపిన విధంగా అయస్కాంత రేఖలుంటే, తీగచుట్ట గుండా ఏ దిశలో విద్యుత్ ప్రవహిస్తుంది?
(లేదా)
ఇవ్వబడిన పటంలో గల అయస్కాంత రేఖలు, ఏ దిశలో తీగ గుండా విద్యుత్ ప్రవాహంను సూచించును?
AP Board 10th Class Physical Science Solutions 10th Lesson విద్యుదయస్కాంతత్వం 3
జవాబు:
ఈ కాగితం తలానికి లంబంగా బయటకు వస్తున్నట్లుగా తీగలో విద్యుత్ ప్రవహిస్తుంది. ఈ పేజీ గుండా నిటారుగా పై వైపునకు విద్యుత్ ప్రవహిస్తున్నదని ఊహించిన, అయస్కాంత బలరేఖలు ఇచ్చిన పటంలో చూపిన విధముగా అపసవ్యదిశలో ఏర్పడతాయి.

ప్రశ్న 3.
పటంలో చూపినట్లు ఒక దండాయస్కాంతం ఉత్తర ధృవంతో తీగ చుట్టవైపుగా కదులుతుంది. తీగచుట్ట గుండా పోయే అయస్కాంత అభివాహం ఏమవుతుంది?
AP Board 10th Class Physical Science Solutions 10th Lesson విద్యుదయస్కాంతత్వం 4
(లేదా)
పటంను గమనించగా దండయస్కాంతపు ఉత్తరధృవం తీగచుట్ట వైపు కలదు. తీగచుట్ట గుండా పోవు అయస్కాంత అభివాహ ఫలితం ఏమిటి?
జవాబు:
ఒక దండాయస్కాంతం ఉత్తర ధృవంతో చుట్టవైపుగా కదులుతున్నా, దాని గుండా పోయే అయస్కాంత అభివాహం విలువ గరిష్ఠము అగును.
Φ = BA cos θ (θ = 0° కావున cos θ = 1)
Φ = BA (గరిష్ఠము)

ప్రశ్న 4.
పటంలో తీగచుట్టలో విద్యుత్ ప్రవాహ దిశ చూపబడింది. మనం చూస్తున్న తలంవైపు ఏ ధృవం ఏర్పడుతుంది?
AP Board 10th Class Physical Science Solutions 10th Lesson విద్యుదయస్కాంతత్వం 6
జవాబు:
AP Board 10th Class Physical Science Solutions 10th Lesson విద్యుదయస్కాంతత్వం 7

  1. పటంలో చూపబడిన తీగచుట్టలో విద్యుత్ ప్రవాహ దిశ అపసవ్య దిశలో కలదు.
  2. మనకు ఎదురుగా ఉన్న తీగచుట్టలో విద్యుత్ అపసవ్యదిశలో ప్రవహిస్తే అది ఏర్పరచే అయస్కాంత క్షేత్ర దిశ మన వైపు దిశలో ఉంటుంది.
  3. అనగా మన వైపు ఉత్తర ధృవం ఏర్పడును.

AP Board 10th Class Physical Science Solutions 10th Lesson విద్యుదయస్కాంతత్వం

ప్రశ్న 5.
దండాయస్కాంతాన్ని టి.వి. తెరకు దగ్గరగా తెచ్చినపుడు చిత్రం ఆకారం ఎందుకు మారుతుంది? వివరించండి.
(లేదా)
నీవు ప్రసారంలో ఉన్న టి.వి. దగ్గరకు ఒక దండాయస్కాంతాన్ని తెచ్చినప్పుడు ఏమి గమనించావో వివరించుము.
జవాబు:
దండాయస్కాంతాన్ని CRT – TV దగ్గరకు తీసుకువచ్చిన, ఎలక్ట్రాన్ల కదలికపై దండాయస్కాంత ప్రభావం వలన తెరమీది చిత్రము విరూపితమగును. (ఆకారం మారుతుంది)

ప్రశ్న 6.
విద్యుత్ మోటర్ పనిచేసే విధానాన్ని పట సహాయంతో వివరించండి. లేదా విద్యుచ్ఛక్తిని యాంత్రిక శక్తిగా మార్చు పరికరమేది? దాని పనితీరును పటం ద్వారా క్లుప్తంగా వివరించుము.
జవాబు:
విద్యుచ్ఛక్తిని యాంత్రిక శక్తిగా మార్చే సాధనం విద్యుత్ మోటర్.
AP Board 10th Class Physical Science Solutions 10th Lesson విద్యుదయస్కాంతత్వం 8

పనిచేసే విధానం :

  1. పటంలో చూపిన విధంగా ఒక దీర్ఘచతురస్రాకార ABCD తీగచుట్టను సమ అయస్కాంత క్షేత్రంలో ఉంచామనుకొనుము.
  2. ఇప్పుడు విద్యుత్ వలయాన్ని స్విచ్ ఆన్ చేసి దీర్ఘచతురస్రాకారపు తీగచుట్టలో విద్యుత్ . ప్రవహించునట్లు చేయుము.
  3. తీగచుట్ట యొక్క AB, CD భుజాలు అయస్కాంత క్షేత్రంతో 90° కోణం చేస్తాయి.
  4. AB వద్ద అయస్కాంత బలం పేజీకి లోపలివైపుగా, CD వద్ద అయస్కాంత బలం పేజి నుండి బయటకు పనిచేస్తుంది.
  5. BC, DA లు అయస్కాంత క్షేత్రంతో చేసే కోణం మారుతూ ఉంటుంది.
  6. BC వద్ద అయస్కాంత బలం పై వైపుకు, DA వద్ద కిందివైపుకు పనిచేస్తుంది.
  7. AB, CD ల వద్ద పనిచేసే బలాల వల్ల తీగచుట్ట భ్రమణంలోకి వస్తుంది.
  8. కానీ తీగచుట్ట సగం భ్రమణం చెందాక AB, CD ల వద్ద పనిచేసే అయస్కాంత బలాలు వ్యతిరేక దిశలోకి మారడం వల్ల తీగచుట్ట తిరిగి వెనుకకు భ్రమణం చేస్తుంది.
  9. కనుక ప్రతి అర్ధ భ్రమణం తర్వాత తీగచుట్టలో ప్రవహించే విద్యుత్, దిశ వ్యతిరేక దిశలోకి మార్చితే తీగచుట్ట నిరంతరంగా ఒకే దిశలో భ్రమణం చేస్తుంది.
  10. దీని కొరకు పటంలో చూపినట్లు తీగచుట్ట రెండు కొనలకు C1C2 స్లిప్ రింగు ఏర్పాటు చేసి అవి B1B2 బ్రష్ లకు తాకే విధంగా అమర్చాలి.
  11. అప్పుడు తీగచుట్ట అయస్కాంత క్షేత్రంలో నిరంతరంగా ఒకే దిశలో భ్రమణం చేస్తూ విద్యుత్ శక్తిని యాంత్రిక శక్తిగా మారుస్తుంది.
  12. ఈ పరికరమే విద్యుత్ మోటార్.

AP Board 10th Class Physical Science Solutions 10th Lesson విద్యుదయస్కాంతత్వం 9

ప్రశ్న 7.
సమ అయస్కాంత క్షేత్రంలో అయస్కాంత క్షేత్ర ప్రేరణ విలువ 2T. క్షేత్రానికి లంబంగా ఉన్న 1.5 మీ². వైశాల్యం గుండా ప్రయాణించే అభివాహం ఎంత?
జవాబు:
అయస్కాంత క్షేత్ర ప్రేరణ విలువ = B = 2T
ఉపరితల వైశాల్యం = A = 1.5 మీ²
అయస్కాంత అభివాహ సాంద్రత (B) = \(\frac{\phi}{A}\)
అభివాహం = Φ = B.A. = 2T × 1.5 మీ² = 3 వెబర్

ప్రశ్న 8.
అయస్కాంత క్షేత్రానికి లంబంగా ఉంచిన 20 సెం.మీ. పొడవు గల దీర్ఘచతురస్ర విద్యుత్ వాహకంపై 8 న్యూటన్ల బలం పనిచేస్తుంది. వాహకంలో 40 ఆంపియర్ల విద్యుత్ ప్రవాహం ఉన్నప్పుడు ఏర్పడే అయస్కాంత ప్రేరితాన్ని లెక్కించండి. (జవాబు : 1 టెస్లా )
జవాబు:
విద్యుత్ వాహకంపై పనిచేయు బలం = F = 8N
వాహకం పొడవు = l = 20 సెం.మీ. = 20 × 10-7మీ||
విద్యుత్ ప్రవాహం = I = 40 ఆంపియర్లు
AP Board 10th Class Physical Science Solutions 10th Lesson విద్యుదయస్కాంతత్వం 10
∴ అయస్కాంత క్షేత్ర ప్రేరణ = (B) = 1 టెస్లా

ప్రశ్న 9.
విద్యుత్ ప్రవాహం గల తీగను అయస్కాంత క్షేత్రంలో ఉంచితే ఆ తీగపై ప్రయోగింపబడే బలాన్ని ప్రయోగపూర్వకంగా మీరెలా సూచిస్తారు? (కృత్యం – 8)
(లేదా)
విద్యుత్ ప్రవహిస్తున్న తీగను అయస్కాంత క్షేత్రంలో ఉంచిన దానిపై ప్రయోగింపబడు బలంను ప్రయోగపూర్వకంగా నిరూపించుము.
జవాబు:
AP Board 10th Class Physical Science Solutions 10th Lesson విద్యుదయస్కాంతత్వం 11
1) ఒక పలుచని చెక్కముక్కను తీసుకొని దానిపై రెండు కర్రముక్కలను అమర్చుము.
2) ఈ కర్రముక్కలకు. పై భాగాన చీలికలను ఏర్పరచుము.
3) ఒక రాగి తీగను చీలికల గుండా పంపి స్విచ్ మరియు 3 ఓల్టుల బ్యాటరీని శ్రేణిలో కలిపి వలయాన్ని పూర్తిచేయుము.
4) స్విచ్ వేసి వలయంలో విద్యుత్ ను ప్రవహింపజేయుము.
5) ఇప్పుడు రాగి తీగకు దగ్గరలో పటంలో చూపిన విధంగా ఒక గుర్రపునాడ అయస్కాంతాన్ని పెట్టుము.
6) తీగలో అపవర్తనాన్ని గమనించవచ్చును.
7) కుడిచేతి నిబంధనను ఉపయోగించి బలదిశను తెలుసుకొనవచ్చును.
8) గుర్రపునాడ అయస్కాంత ధ్రువాలను మరియు తీగలో విద్యుత్ ప్రవాహ దిశను మార్చి పదేపదే ఈ ప్రయోగాన్ని చేయుము.
AP Board 10th Class Physical Science Solutions 10th Lesson విద్యుదయస్కాంతత్వం 12
9) పక్కపటంలో గుర్రపునాడ ఉత్తర – దక్షిణ ధ్రువాల మధ్య ఉండే క్షేత్రాన్ని గమనించవచ్చును.
10) ఈ పేజీకి లంబంగా ఒక తీగ వెళ్తున్నట్లు ఊహించిన, దానిలో విద్యుత్ ప్రవాహం ఏర్పరచు అయస్కాంత క్షేత్రాన్ని పటంలో గమనించవచ్చును.
11) తీగలోని ప్రవాహం వలన ఏర్పడిన వలయాకారపు బలరేఖల పై భాగాలు గుర్రపునాడ అయస్కాంతం ఏర్పరచిన బలరేఖల దిశలోనూ వలయాకార లోపలికి ప్రవహించే విద్యుత్ బలరేఖల దిగువ భాగాలు గుర్రపునాడ అయస్కాంత బలరేఖల దిశకు వ్యతిరేక దిశలో ఉంటాయి. (పటంలో చూపినట్లుగా)
12) అందుచేత ఫలితక్షేత్రం పై భాగంలో బలంగానూ, కింది భాగంలో బలహీనంగానూ ఉంటుంది.
13) ఈ విధంగా విద్యుత్ ప్రవాహం గల తీగపై అయస్కాంత బలప్రభావాన్ని గమనించవచ్చును.

AP Board 10th Class Physical Science Solutions 10th Lesson విద్యుదయస్కాంతత్వం

ప్రశ్న 10.
ఫారడే విద్యుదయస్కాంత ప్రేరణ నియమాన్ని ఒక కృత్యం ద్వారా వివరించండి.
(లేదా)
ఒక కృత్యం ద్వారా ఫారడే విద్యుదయస్కాంత ప్రేరణ నియమమును వివరించుము.
జవాబు:
AP Board 10th Class Physical Science Solutions 10th Lesson విద్యుదయస్కాంతత్వం 13

  1. పటంలో చూపినట్లు ఒక తీగచుట్ట యొక్క రెండు చివరలను సునిశితమైన అమ్మీటరు లేదా గాల్వనోమీటరుకు కలపండి.
  2. ఇక్కడ ఎటువంటి విద్యుచ్చాలక బలం లేకపోవడం వలన సాధారణంగా మనం గాల్వనోమీటరు సూచికలో ఎటువంటి కదలికలు ఊహించము.
  3. ఒక దండాయస్కాంతాన్ని తీగచుట్ట వైపు తీసుకువస్తే ఒక ముఖ్య విషయాన్ని గమనించవచ్చును.
  4. దండాయస్కాంతాన్ని తీగచుట్ట వైపు కదిపినపుడు గాల్వనోమీటరు సూచికలో ఏర్పడిన అపవర్తనం తీగచుట్టలో విద్యుత్ ప్రవాహాన్ని తెలుపుతుంది.
  5. దండాయస్కాంతం స్థిరంగా ఉన్నప్పుడు గాల్వనోమీటరు సూచికలో ఎలాంటి అపవర్తనం ఉండదు.
  6. అయస్కాంతాన్ని తీగచుట్ట నుండి దూరంగా జరిపినప్పుడు కూడా గాల్వనోమీటరు సూచికలో కదలికను మనం పటంలో గమనించవచ్చు.
  7. కానీ ఈసారి సూచిక కదలిక వ్యతిరేక దిశలో ఏర్పడినట్లు గమనించగలము.
  8. అనగా తీగచుట్టలో ఇంతకు ముందు ఏర్పడిన దిశకు వ్యతిరేక దిశలో విద్యుత్ ప్రవాహం ఏర్పడిందని అర్థం.
  9. అయస్కాంత ఉత్తర ధ్రువానికి బదులుగా దక్షిణ ధ్రువాన్ని ఉపయోగించి పై ప్రయోగాన్ని చేసిన గాల్వనోమీటరు సూచికలో అపవర్తనాలు వ్యతిరేకదిశలలో ఉంటాయి.
  10. అయస్కాంతం తీగచుట్టవైపు కదిలినా/తీగచుట్ట అయస్కాంతం వైపు కదిలినా ఫలితాలలో మార్పుండదు.
  11. తీగచుట్టలో అయస్కాంత అభివాహాన్ని నిరంతరంగా మారుస్తూ ఉంటే ఆ తీగచుట్టలో విద్యుత్ ప్రవాహం ఏర్పడుతుందని గమనించగలము.
  12. ఈ విధంగా ఫారడే విద్యుదయస్కాంత ప్రేరణ నియమాన్ని వివరించగలము.

ప్రశ్న 11.
AC జనరేటర్ పనిచేయు విధానాన్ని పటం సహాయంతో వివరించండి.
(లేదా)
ఏకాంతర విద్యుత్ ప్రవాహాన్ని ఉత్పత్తి చేసే జనరేటర్ పనిచేయు భ్రమణం విధానంను పటం ద్వారా వివరించుము.
జవాబు:
పనిచేయు నియమము :
విద్యుదయస్కాంత ప్రేరణ నియమం ప్రకారం, తీగచుట్ట గుండా ప్రసరించే అయస్కాంత అభివాహం మారడం వల్ల తీగచుట్టలో విద్యుత్ ప్రేరేపింపబడుతుంది.
AP Board 10th Class Physical Science Solutions 10th Lesson విద్యుదయస్కాంతత్వం 14

పనిచేయు విధానము :

  1. మొదట తీగచుట్ట గుండా అయస్కాంత అభివాహం ప్రసరించే విధంగా తీగచుట్టను అమర్చుము.
  2. ఆ తీగచుట్ట నిశ్చలస్థితిలో ఉన్నప్పుడు దాని భుజం ‘A’ పై వైపునకు వేరొక భుజం B కింది వైపునకు ఉందనుకొనుము.
  3. ఈ స్థితిలో తీగచుట్టలో విద్యుత్ ప్రేరేపింపబడదు. కావున విద్యుత్ – ప్రవాహం శూన్యము.
  4. తీగచుట్టను సవ్యదిశలో త్రిప్పినపుడు దానిలో ప్రేరిత విద్యుత్ ప్రవాహం ఏర్పడి A నుండి Bకి ప్రవహిస్తుంది.
  5. తీగచుట్ట మొదటి పావుభాగం భ్రమణంలో విద్యుత్ ‘0’ నుండి గరిష్ఠ విలువకు పెరిగి తీగచుట్ట క్షితిజ సమాంతర స్థితిలోకి వచ్చే సరికి అందులో ప్రవహించు విద్యుత్ అత్యధిక విలువకు చేరుకుంటుంది.
  6. ఈ విధంగా పదే పదే తీగచుట్ట భ్రమణం చేయడం వలన విద్యుత్ ప్రవాహం మరల తగ్గి శూన్యానికి చేరుకుంటుంది.
  7. ఈ విధంగా పటంలో చూపినట్లుగా మొదటి, రెండవ అర్ధభాగాలలో కూడా విద్యుత్ ప్రవహిస్తుంది. కానీ దిశలు వేర్వేరుగా ఉంటాయి.
  8. ఇలా పొందిన విద్యుత్ పటంలో చూపినట్లు తీగచుట్ట ప్రతి అర్ధభ్రమణానికి తన దిశను మార్చుకొంటూ ఉంటుంది.
  9. ఈ విద్యుత్తును ‘ఏకాంతర విద్యుత్’ అంటాము.

AP Board 10th Class Physical Science Solutions 10th Lesson విద్యుదయస్కాంతత్వం 15

ప్రశ్న 12.
DC జనరేటర్ పనిచేయు విధానాన్ని పటం సహాయంతో వివరించండి.
(లేదా)
ఏక ముఖ విద్యుత్ ప్రవాహాన్ని ఉత్పత్తి చేసే జనరేటర్ పనితీరును పటం ద్వారా వివరింపుము.
జవాబు:
AP Board 10th Class Physical Science Solutions 10th Lesson విద్యుదయస్కాంతత్వం 16
పనిచేయు విధానం :

  1. ప్రక్క పటంలో చూపిన విధంగా రెండు స్లిప్ రింగ్ లను తీగచుట్ట రెండు చివరలలో కలిపితే AC జనరేటర్ DC జనరేటర్ గా కమ్యూటేటర్ పనిచేస్తూ DCని ఉత్పత్తి చేస్తుంది.
  2. తీగచుట్ట నిలువుగా ఉన్నప్పుడు మొదటి అర్ధ భ్రమణంలో – ప్రేరేపింపబడిన విద్యుత్ గరిష్ట విలువను చేరి మరలా శూన్యానికి వస్తుంది.
  3. తీగచుట్ట ఈ స్థితి నుండి తిరగడం వల్ల చుట్ట చివరలను తాకే స్లిప్ రింగ్ ల యొక్క స్థానాలు మారుతాయి.
  4. దీనివలన రెండవ అర్ధభ్రమణంలో విద్యుత్ ప్రవాహం దానంతట అదే తీగచుట్టలో వ్యతిరేకదిశలో ప్రవహించడం జరుగుతుంది.
  5. ఒక పూర్తి భ్రమణంలో పటంలో చూపిన విధంగా తీగచుట్ట రెండవ అర్ధభ్రమణంలో విద్యుత్ ప్రవాహం, మొదటి అర్ధభ్రమణంలోని DC విద్యుత్ లాగానే ఉంటుంది.
  6. ఈ విధంగా జనరేటర్ యాంత్రిక శక్తిని విద్యుచ్ఛక్తిగా మార్చుతుంది.

AP Board 10th Class Physical Science Solutions 10th Lesson విద్యుదయస్కాంతత్వం 17

ప్రశ్న 13.
అయస్కాంత బలరేఖలు వివృతాలు అని, అవి దండాయస్కాంత ఉత్తర ధృవం వద్ద ప్రారంభమై దక్షిణ ధృవం వద్ద ముగుస్తాయని రాజకుమార్ మీతో అన్నాడు. రాజకుమార్ వాదనను సవరిస్తూ బలరేఖలు సంవృతాలని చెప్పడానికి మీరు అతనిని ఏ ప్రశ్నలు అడుగుతారు?
జవాబు:

  1. అయస్కాంత బలరేఖలు సంవృతాలా? వివృతాలా?
  2. బలరేఖలకు ఆది, అంతాలు కలవా?
  3. దండాయస్కాంతానికి అంతరంగా, బాహ్యంగా బలరేఖల దిశలు ఎటువైపు ఉండును?
  4. బలరేఖలు సంవృతాలని చెప్పవచ్చా?

AP Board 10th Class Physical Science Solutions 10th Lesson విద్యుదయస్కాంతత్వం

ప్రశ్న 14.
విద్యుత్ ప్రవాహం గల తీగలో అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుందని ప్రయోగం ద్వారా ఎలా నిరూపించగలవు? (కృత్యం – 1)
(లేదా)
విద్యుత్ ప్రవాహం గల తీగ తన చుట్టూ అయస్కాంత క్షేత్రం ఏర్పరచునని ఒక కృత్యం ద్వారా నిరూపించుము.
జవాబు:
AP Board 10th Class Physical Science Solutions 10th Lesson విద్యుదయస్కాంతత్వం 18

  1. పటంలో చూపిన విధంగా ఒక థర్మాకోల్ షీట్ పై 1 సెం.మీ. ఎత్తున్న, పై అంచువద్ద చీలిక కలిగిన రెండు సన్నని కర్రముక్కలను అమర్చండి.
  2. పటంలో చూపినట్లు ఈ వలయంలో 3 ఓల్టుల బ్యాటరీ, స్విచ్ మరియు రాగి తీగ శ్రేణిలో కలపబడి ఉంచాలి.
  3. ఈ విధంగా అమర్చిన తీగ కింద ఒక అయస్కాంత దిక్సూచిని ఉంచాలి.
  4. వలయంలో స్విచ్ ను మూసిన విద్యుత్ ప్రవహించును.
  5. అయస్కాంత దిక్సూచిలోని సూచికలో కదలికలను గమనించవచ్చును.
  6. ఈ విధమైన కదలికలకు కారణమైన క్షేత్రబలాన్ని “అయస్కాంత క్షేత్రబలం” అంటారు.

ప్రశ్న 15.
ఎలక్ట్రిక్ మోటర్ పటం గీసి, భాగాలను గుర్తించండి.
(లేదా)
ఎలక్ట్రిక్ మోటారును పటం ద్వారా ప్రదర్శించుము, దాని భాగాలను వ్రాయుము.
(లేదా)
విద్యుత్ శక్తిని యాంత్రికశక్తిగా మార్చు పరికరం ఏది ? దాని పటం గీచి భాగాలు గుర్తించండి.
జవాబు:
AP Board 10th Class Physical Science Solutions 10th Lesson విద్యుదయస్కాంతత్వం 19

ప్రశ్న 16.
AC జనరేటర్ పటమును గీసి, భాగాలను గుర్తించండి.
(లేదా)
ఏకాంతర విద్యుత్ ప్రవాహం గల జనరేటర్ ను పటం ద్వారా ప్రదర్శించుము, దాని భాగాలను గుర్తించుము.
జవాబు:
AC జనరేటర్ :
AP Board 10th Class Physical Science Solutions 10th Lesson విద్యుదయస్కాంతత్వం 14

ప్రశ్న 17.
శక్తినిత్యత్వ నియమాన్ని ప్రతిబింబించే ఫారడే నియమాన్ని మీరెలా అభినందిస్తారు?
(లేదా)
ఫారడే విద్యుత్ నియమం ఏ విధముగా శక్తి నిత్యత్వ నియమమును పాటించునో తెలిపి, దానిని అభినందించుము.
జవాబు:
సందర్భం -1
1) ఒక దండాయస్కాంతం ఉత్తర ధ్రువాన్ని, తీగచుట్టకు అభిముఖంగా కదపడం వలన తీగచుట్ట ముందు భాగంలో ను ఉత్తర ధృవం ఏర్పడి పరస్పరం వికర్షణ బలం ఏర్పడును.
2) ఈ బలాన్ని అధిగమించేందుకు మనం కొంత పని చేయవలసి ఉంటుంది. ఆ పని విద్యుచ్ఛక్తిగా మారుతుంది.
3) ఈ విధంగా విద్యుత్ అయస్కాంత ప్రేరణలో శక్తి నిత్యత్వం జరుగును.

AP Board 10th Class Physical Science Solutions 10th Lesson విద్యుదయస్కాంతత్వం 20
సందర్భం – 2
4) అయస్కాంత ఉత్తర ధృవం తీగచుట్టకు అభిముఖంగా ఉండేటట్లు ఆ అయస్కాంతాన్ని తీగచుట్ట నుండి దూరంగా తీసుకెళ్ళిన, యాంత్రికశక్తి విద్యుత్ శక్తిగా మారును.
5) ఈ విధమైన కదలికల వలన ఉత్పత్తి అయిన విద్యుతను ప్రస్తుతం మనం వాడుకలో గమనిస్తున్నాము. మన నిత్యజీవితంలో ఉపయోగిస్తున్నాము. కావున శక్తినిత్యత్వ నియమాన్ని ప్రతిబింబించే ఫారడే నియమాన్ని అభినందిస్తున్నాను.

AP Board 10th Class Physical Science Solutions 10th Lesson విద్యుదయస్కాంతత్వం

ప్రశ్న 18.
నిత్యజీవితంలో ఫారడే నియమాల అనువర్తనాలను కొన్నింటిని తెలపండి.
(లేదా)
ఫారడే నియమాలు మన నిత్య జీవితంలో ఏ విధంగా ఉపయోగపడునో, ఆ ఉపయోగాలను వ్రాయుము.
జవాబు:
ఫారడే విద్యుదయస్కాంత ప్రేరణ నియమం యొక్క కొన్ని అనువర్తనాలు :

  1. షాపింగ్ మాల్స నందు, ఫంక్షన్ హాల్స నందు, బ్యాంకులందు, ఇతర ముఖ్య ప్రదేశాలలో సెక్యూరిటీ చెకింగ్ కోసం ఏర్పాటు చేసే పెద్ద ద్వారాల గుండా ఏవైనా ఇనుము లాంటి అయస్కాంత క్షేత్ర ప్రభావిత వస్తువును తీసుకొని వెళితే, విద్యుత్ ప్రవాహం ఉద్భవించడం వలన అలారం మోగుతూ హెచ్చరిస్తుంది.
  2. మనము పాటలు వినడానికి లేదా రికార్డు చేయడానికి ఉపయోగించే టేప్ రికార్డర్లు విద్యుదయస్కాంత ప్రేరణ నియమంపై ఆధారపడి పనిచేస్తాయి.
  3. ATM కార్డులో ఉండే అయస్కాంత పట్టీని ‘స్కానర్’ లో “స్వైప్” చేసినప్పుడు విద్యుదయస్కాంత ప్రేరణ సిద్ధాంతాన్ని వినియోగించుకొని పనిచేస్తుంది.
  4. ఇండక్షన్ స్టవ్ కూడా విద్యుదయస్కాంత ప్రేరణ నియమంపై ఆధారపడి పనిచేస్తుంది.
  5. జనరేటర్లు కూడా ఈ నియమంపై ఆధారపడి పనిచేస్తాయి.

ప్రశ్న 19.
ఏయే పద్ధతిలో విద్యుత్ ఉత్పాదన ద్వారా మనం ప్రకృతిని సంరక్షించుకోగలం? మీ సమాధానాన్ని సమర్థించే కొన్ని ఉదాహరణలివ్వండి.
జవాబు:
మనం కొన్ని ప్రత్యేక పద్ధతుల ద్వారా విద్యుత్ ను పొందగలము. ఈ పద్ధతులు మానవాళికి హేయమైనవి కావు. మరియు ప్రకృతిని కాలుష్యము చెందించవు. ఆ పద్దతులు :

  1. సౌరశక్తి,
  2. జలం ద్వారా,
  3. గాలి ద్వారా.

ప్రశ్న 20.
ఈ పేజీకి లంబంగా ఒక తీగచుట్ట ఉంది. పటంలో చూపిన విధంగా P వద్ద పేజీలోకి విద్యుత్ ప్రవహించి Q వద్ద బయటకు వస్తుంది. ఆ తీగ చుట్ట వల్ల ఏర్పడే అయస్కాంత క్షేత్ర దిశ ఏ విధంగా ఉంటుంది? (AS1)
AP Board 10th Class Physical Science Solutions 10th Lesson విద్యుదయస్కాంతత్వం 5
జవాబు:
1) విద్యుత్ ‘P’ వద్ద పేజీలోకి ప్రవహించి ‘Q’ వద్ద బయటకు ప్రవహిస్తున్నట్లు ఊహించిన “కుడిచేతి బొటనవేలు నిబంధన” ప్రకారము పటంలో చూపినట్లు అయస్కాంత N1S ధృవాలు ఏర్పడతాయి. తీగచుట్టవల్ల ఏర్పడే అయస్కాంత క్షేత్రదిశ ‘S’ నుండి ‘N’ వైపుగా సూచించే బాణం గుర్తు దిశలో ఉంది.
AP Board 10th Class Physical Science Solutions 10th Lesson విద్యుదయస్కాంతత్వం 21

ప్రశ్న 21.
‘X’ అనేది పేజీలోకి విద్యుత్ ప్రవాహాన్ని తెలుపుతుంది. క్షేత్రానికి లంబంగా విద్యుత్ ప్రవాహం గల తీగను పటంలో చూపిన విధంగా ఉంచుదాం. తీగపై క్షేత్రం చూపించే బల పరిమాణం ఎంత? అది ఏ దిశలో పనిచేస్తుంది? (AS1)
AP Board 10th Class Physical Science Solutions 10th Lesson విద్యుదయస్కాంతత్వం 22
జవాబు:
అయస్కాంత క్షేత్ర అభివాహ సాంద్రత = B
తీగలో విద్యుత్ ప్రవాహం = i
క్షేత్రంలో గల తీగ పొడవు = l అయితే
ఆ తీగపై క్షేత్రం కలిగించే బలం F = Bil

ప్రశ్న 22.
శక్తి నిత్యత్వ నియమం నుండి ఫారడే విద్యుదయస్కాంత ప్రేరణ నియమాన్ని ఉత్పాదించండి. (AS1)
(లేదా)
ఆ ఫారడే విద్యుదయస్కాంత ప్రేరణ నియమమును వ్రాసి, ఉత్పాదించుము.
జవాబు:
AP Board 10th Class Physical Science Solutions 10th Lesson విద్యుదయస్కాంతత్వం 23

  1. పటంలో చూపిన విధముగా పరికరాలను అమర్చండి.
  2. దీనియందు విద్యుత్ బంధక తొడుగు లేని రెండు సమాంతర వాహకాలు ‘l’ దూరంలో ‘B’ అభివాహ సాంద్రత గల ఏకరీతి అయస్కాంత క్షేత్రంలో ఉన్నాయి.
  3. ఈ రెండు సమాంతర తీగలను కలుపు విధముగా విద్యుత్ అభివాహ బంధక తొడుగులేని మరొక వాహకాన్ని పటంలో ప్రేరిత విద్యుత్ దిశ చూపినట్లు పట్టుకోవచ్చును.
  4. ఈ సమాంతర వాహకాల చివరలను ఒక గాల్వనో మీటరుకు కలిపి వలయాన్ని పూర్తి చేయండి.
  5. సమాంతర వాహకాలకు అడ్డంగా ఉంచిన వాహకాన్ని గాల్వనా ఎడమ వైపునకు జరిపితే గాల్వనోమీటరు ఒక దిశలో మీటర్ వైర్ కదలికను సూచించును.
  6. ఈ వాహకాన్ని కుడివైపునకు జరిపితే గాల్వనోమీటరు సూచిక మొదటి కదలికకు వ్యతిరేకదిశలో కదులును.
  7. ∆t కాలవ్యవధిలో అడ్డుతీగను ‘S’ దూరం కదిపితే వలయంలో గల విద్యుచ్ఛాలక బలం (ε) వలన విద్యుత్ ప్రవాహాన్ని గాల్వనోమీటరు సూచిస్తుంది.
  8. శక్తి తుల్యతానియమం ప్రకారం అడ్డు తీగను కదిలించడానికి మనం చేసిన పనివల్లనే విద్యుచ్ఛక్తి ఏర్పడుతుంది.
  9. ‘B’ అయస్కాంత అభివాహ సాంద్రత గల క్షేత్రంలో ‘l’ పొడవు గల అడ్డుతీగ గుండా I ఆంపియర్ల విద్యుత్ ప్రయోగించే బలం. F = BIl
  10. ఈ బలం మనం ప్రయోగించిన బలాన్ని వ్యతిరేకిస్తుంది.
  11. అడ్డుతీగను కదిలించడానికి మనం చేసిన పని తీగలో విద్యుత్ శక్తిగా మారింది.
    కావున జరిగిన పని W = Fs = Blls
  12. సమాంతర వాహకాలకు అడ్డంగా తీగనుంచినపుడు పూర్తి వలయం ఏర్పడి దీని చుట్టూ అయస్కాంత అభివాహం ఉండును.
  13. అడ్డుతీగను ఎడమవైపునకు జరిపితే సమాంతర వాహకాలు, అడ్డు తీగలచే ఏర్పడు వలయపు వైశాల్యం తగ్గును. దానితో పాటు దాని గుండా పోవు అభివాహం కూడా తగ్గును. ∆Φ = Bls
  14. వైశాల్యానికి క్షేత్రం అభిలంబంగా ఉండును. కావున, జరిగిన పని W = (∆Φ) 1
  15. ఈ సమీకరణాన్ని ∆t చే భాగించగా, \(\frac{\mathrm{W}}{\Delta \mathrm{t}}=\mathrm{I} \frac{\Delta \phi}{\Delta \mathrm{t}}\)
    విద్యుత్ ప్రవాహం మరియు విద్యుచ్ఛాలక బలం లేదా ఓల్టేజ్ ల లబ్దాన్ని విద్యుత్ సామర్థ్యం (P) అంటారు.
    ∴ \(\mathbf{P}=\mathrm{I} \frac{\Delta \phi}{\Delta \mathrm{t}}\)
  16. \(\varepsilon=\frac{\Delta \phi}{\Delta \mathrm{t}}\) ఈ అనునది ప్రేరిత విద్యుచ్ఛాలక బలం కావున సామర్థ్యం P = εI
  17. దీనిని బట్టి అడ్డు తీగను ఒక సెకను కాలంలో జరపడానికి వినియోగించిన యాంత్రికశక్తి విద్యుత్ సామర్థ్యంగా మారింది. కావున శక్తి నిత్యత్వ నియమం పాటింపబడింది.

AP Board 10th Class Physical Science Solutions 10th Lesson విద్యుదయస్కాంతత్వం

ప్రశ్న 23.
విద్యుత్ ప్రవాహం గల తీగ అయస్కాంత క్షేత్రాన్ని ఏర్పరుస్తుందని ఏవేని రెండు కృత్యాల ద్వారా వివరించండి. (కృత్యం – 5)
(లేదా)
విద్యుత్ ప్రవాహం గల తీగ అయస్కాంత క్షేత్రాన్ని ఏర్పరచునని నీవెలా పరీక్షించెదవో వ్రాయుము. (AS1)
(లేదా)
అయస్కాంత బలరేఖలు “సంవృత వలయాలు” అని ప్రయోగ పూర్వకంగా ఎలా నిరూపిస్తారు?
జవాబు:
మొదటి కృత్యం :
AP Board 10th Class Physical Science Solutions 10th Lesson విద్యుదయస్కాంతత్వం 25

  1. ఒక పలుచని చెక్కముక్క తీసుకొనుము.
  2. ఆ చెక్కముక్కపై తెల్లకాగితాన్ని అంటించుము.
  3. పటంలో చూపినట్లు చెక్కపీటలా తయారు చేయుము.
  4. దానిపైన నిర్ణీత దూరంలో రెండు రంధ్రాలను చేయుము.
  5. ఆ రంధ్రాల గుండా విద్యుత్ బంధక పొర కలిగిన రాగి తీగను కలపడం నాలుగైదు చుట్లు చుట్టండి.
  6. తీగచుట్ట చివరలను స్విచ్ సహాయంతో బ్యాటరీకి కలిపి వలయంలో విద్యుత్ ను ప్రవహింపజేయుము.
  7. తీగచుట్ట మధ్యలో చెక్కముక్కపై ఒక అయస్కాంత దిక్సూచిని ఉంచండి.
  8. దిక్సూచి సూచిక నిలకడగా ఉన్నప్పుడు సూచిక దిశను తెలిపే విధంగా రెండు బిందువులను కాగితంపై గుర్తించండి.
  9. ఆ బిందువులలో ఏదో ఒకదానిపై దిక్సూచిని ఉంచి, సూచిక దిశను మరలా గుర్తించుము.
  10. ఈ విధంగా చెక్కముక్క అంచుల వరకు బిందువులను గుర్తించండి.
  11. ఈ విధంగా కేంద్రం నుంచి తీగచుట్ట రెండోవైపునకు కూడా బిందువులను గుర్తించండి.
  12. అన్ని బిందువులను కలుపుతూ రేఖను గీస్తే తీగచుట్ట యొక్క అయస్కాంత బలరేఖ ఏర్పడును.
  13. ఈ విధంగా వేర్వేరు బిందువుల వద్ద నుంచి అయస్కాంత బలరేఖలను, గీయుము.
  14. తీగచుట్టకు మధ్యలో దిక్సూచినుంచిన దాని సూచిక దిగ్విన్యాసాన్ని గమనించవచ్చును.
  15. తీగచుట్టకు మధ్యలో దిక్సూచి ఉన్నప్పుడు దిక్సూచి దిశ తీగచుట్ట యొక్క అయస్కాంత క్షేత్ర దిశను సూచిస్తుంది. ఈ దిశ తీగచుట్ట ఉన్న తలానికి లంబదిశలో అయస్కాంత క్షేత్ర దిశ ఉంటుంది.
  16. ఈ విధంగా ఒక విద్యుత్ ప్రవాహం గల తీగ (తీగచుట్ట) అయస్కాంత క్షేత్రాన్ని ఏర్పరచింది.

రెండవ కృత్యం : (కృత్యం – 4)
AP Board 10th Class Physical Science Solutions 10th Lesson విద్యుదయస్కాంతత్వం 26

  1. ఒక చెక్కముక్కను తీసుకొని దానికి పటంలో చూపిన విధముగా రంధ్రం చేయండి.
  2. ఈ చెక్కముక్కను ఒక పెద్ద బల్లపై ఉంచి దానిపై పటంలో చూపిన ఈ విధముగా రిటార్ట్ స్టాండును అమర్చుము.
  3. చెక్కముక్క రంధ్రం గుండా, రిటార్టు స్టాండ్ క్లాంప్ గుండా పోయే ఆ సూచి విధంగా రాగి తీగను నిలువుగా అమర్చండి.
  4. ఈ తీగకు రిటార్టు స్టాండ్ ఇతర భాగాలు తగలకుండా జాగ్రత్త చెక్కముక్క వహించండి.
  5. తీగచుట్ట రెండు చివరలను స్విచ్ సహాయంతో 3V బ్యాటరీకి కలపండి.
  6. చెక్కముక్కకు గల రంధ్రాన్ని కేంద్రంగా తీసుకొని గీసిన ఒక వృత్తంపై 6 నుండి 10 అయస్కాంత దిక్సూచీలను అమర్చండి.
  7. స్విచ్ ఆన్ చేసి వలయంలో విద్యుత్ ను ప్రవహింపజేయుము.
  8. సూచీలన్నీ వృత్తం యొక్క స్పర్శరేఖ దిశలను, సూచిస్తూ నిలకడలోకి రావడాన్ని మనము గమనించవచ్చును.
  9. తీగ చుట్టూ ఉన్న అయస్కాంత బలరేఖ వృత్తాకారంలో ఉంటుంది.
  10. దీనిని బట్టి విద్యుత్ ప్రవాహం గల సరళరేఖ వంటి తీగ వలన బలరేఖలు పటంలో చూపినట్లుగా ఏర్పడటం గమనించవచ్చును.
  11. వలయంలో విద్యుత్ ప్రవహిస్తున్నపుడు తీగ చుట్టూ అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుందని గమనించగలము.

AP Board 10th Class Physical Science Solutions 10th Lesson విద్యుదయస్కాంతత్వం 27

ప్రశ్న 24.
పటంలో చూపినట్లు దండాయస్కాంతం, తీగచుట్ట ఒకే దిశలో కదులుతూ ఉన్నాయి. ఈ సందర్భంలో అభివాహంలో మార్పులేదని మీ స్నేహితురాలంది. ఆమెతో మీరు ఏకీభవిస్తారా? అభివాహ మార్పునకు సంబంధించి మీకు గల సందేహాలను నివృత్తి చేసుకోవడానికి కొన్ని ప్రశ్నలను తయారు చేయండి. (AS2)
AP Board 10th Class Physical Science Solutions 10th Lesson విద్యుదయస్కాంతత్వం 28
జవాబు:

  1. అయస్కాంతము మరియు తీగచుట్ట ఒకే దిశలో కదిలిన ఏమగును?
  2. అయస్కాంతము మరియు తీగచుట్ట రెండు వేర్వేరు దిశలలో కదిలిన ఏమగును?
  3. పై సందర్భాల్లో తీగచుట్టలో విద్యుత్ దిశ ఏమిటి?
  4. తీగచుట్ట వైపునకు ఉత్తర ధ్రువాన్ని కదిలించిన చుట్టలో ఏర్పడు విద్యుత్ ప్రవాహదిశ ఎటువైపునకు ఉండును?

ప్రశ్న 25.
ఫారడే నియమాలను అర్థం చేసుకోడానికి మీరు ఏ ప్రయోగాన్ని సూచిస్తారు? దానికి ఏ ఏ పరికరాలు కావాలి ? ప్రయోగ ఫలితాలు సరిగ్గా పొందడానికి సూచనలివ్వండి. తీసుకోవలసిన ముందు జాగ్రత్తలను కూడా తెలపండి. (AS3)
జవాబు:
ఫారడే నియమాలను అర్థం చేసుకోవడానికి నేను ఈ కింది ప్రయోగాన్ని సూచిస్తాను.

ఉద్దేశ్యం :
తీగచుట్టలో అయస్కాంత అభివాహాన్ని నిరంతరంగా మారుస్తూ ఉంటే ఆ తీగచుట్టలో విద్యుత్ ప్రవాహం ఏర్పడుట.

కావలసిన పరికరాలు :
1) తీగచుట్ట 2) గాల్వనోమీటరు 3) దండాయస్కాంతం
AP Board 10th Class Physical Science Solutions 10th Lesson విద్యుదయస్కాంతత్వం 13

ప్రయోగ పద్ధతి :

  1. పటంలో చూపినట్లు ఒక తీగచుట్ట యొక్క రెండు చివరలను సునిశితమైన అమ్మీటరు లేదా గాల్వనోమీటరుకు కలపండి.
  2. ఇక్కడ ఎటువంటి విద్యుచ్ఛాలక బలం లేకపోవడం వలన సాధారణంగా మనం గాల్వనోమీటరు సూచికలో ఎటువంటి కదలికలు ఊహించము.
  3. ఒక దండాయస్కాంతాన్ని తీగచుట్ట వైపు తీసుకువస్తే ఒక ముఖ్య విషయాన్ని గమనించవచ్చును.
  4. దండాయస్కాంతాన్ని తీగచుట్టవైపు కదిపినప్పుడు గాల్వనోమీటరు సూచికలో ఏర్పడిన అపవర్తనం తీగచుట్టలో విద్యుత్ ప్రవాహాన్ని తెలుపుతుంది.
  5. దండాయస్కాంతం స్థిరంగా ఉన్నప్పుడు గాల్వనోమీటరు సూచికలో ఎలాంటి అపవర్తనం ఉండదు.
  6. అయస్కాంతాన్ని తీగచుట్ట నుండి దూరంగా జరిపినప్పుడు కూడా గాల్వనోమీటరు సూచికలో కదలికను మనం పటంలో గమనించవచ్చును.
  7. కానీ ఈసారి సూచిక కదలిక వ్యతిరేక దిశలో ఏర్పడినట్లు గమనించగలము.
  8. అనగా తీగచుట్టలో ఇంతకు ముందు ఏర్పడిన దిశకు వ్యతిరేక దిశలో విద్యుత్ ప్రవాహం ఏర్పడిందని అర్థం.
  9. అయస్కాంత ఉత్తర ధ్రువానికి బదులుగా దక్షిణ ధ్రువాన్ని ఉపయోగించి ప్రయోగాన్ని చేస్తే గాల్వనోమీటరు సూచికలో అపవర్తనాలు వ్యతిరేక దిశలలో ఉంటాయి.
  10. అయస్కాంతం తీగచుట్టవైపు కదిలినా, తీగచుట్ట అయస్కాంతం వైపు కదలినా ఫలితాలలో మార్పుండదు.
  11. తీగచుట్టలో అయస్కాంత అభివాహాన్ని నిరంతరంగా మారుస్తూ ఉంటే ఆ తీగచుట్టలో విద్యుత్ ప్రవాహం ఏర్పడుతుందని గమనించగలము.

సలహాలు / జాగ్రత్తలు :

  1. అధిక ప్రేరిత విద్యుత్ ను పొందేందుకు తీగచుట్టలోని చుట్ల సంఖ్యను పెంచాలి.
  2. తీగచుట్ట వైశాల్యాన్ని పెంచాలి.
  3. తీగచుట్ట వైపునకు, బయటకు దండాయస్కాంతాన్ని తీసుకువెళ్ళే వేగాన్ని పెంచాలి.

ప్రశ్న 26.
ఫారడే నియమాన్ని ఉపయోగించి విద్యుత్ ను ఉత్పత్తి చేసే పద్ధతికి సంబంధించి సమాచారాన్ని సేకరించండి.
(లేదా)
విద్యుత్ ను ఉత్పత్తిచేయు పద్ధతికి సంబంధించిన సమాచారంను సేకరించి, ఒక లఘు వ్యాఖ్యను వ్రాయుము. (AS4)
జవాబు:
AP Board 10th Class Physical Science Solutions 10th Lesson విద్యుదయస్కాంతత్వం 14

  1. ఫారడే విద్యుదయస్కాంత ప్రేరణ నియమాన్ని అనుసరించి AC, DC ఎలక్ట్రిక్ జనరేటర్లు పనిచేస్తాయి.
  2. జనరేటర్ నందు సమ అయస్కాంత క్షేత్రంలో ఒక తీగచుట్టను నిరంతరంగా తిరిగేటట్లు చేయడం వలన విద్యుత్ ను ఉత్పత్తి చేయవచ్చును.
    దీనియందు పటంలో చూపిన విధంగా వక్రంగా ఉన్న స్థిర అయస్కాంత ధ్రువాల మధ్య ఒక దీర్ఘచతురస్రాకార తీగచుట్ట ఆ స్లిప్ రింగ్స్ ఉందనుకొనుము.
  3. తీగచుట్ట భ్రమణం చెందితే తీగచుట్ట గుండా ప్రసరించే అభివాహం మారుతుంది.
  4. ఈ సందర్భంలో విద్యుదయస్కాంత ప్రేరణ నియమం ప్రకారం బ్రషెస్ / తీగచుట్టలో విద్యుత్ ప్రేరేపింపబడును.
  5. పటంలో చూపిన విధంగా తీగచుట్ట రెండు చివర్లు స్లిప్ రింగ్ లకు కలుపబడి ఉంటాయి.
  6. ఈ స్లిప్ రింగ్ లను అదిమి పట్టి వాటి నుండి విద్యుత్తును పొందు విధంగా రెండు, బ్రష్ లు అమర్చబడి ఉంటాయి.
  7. ఈ బ్రషన్లను టెలివిజన్, రేడియో వంటి విద్యుత్ పరికరాలకు కలిపినపుడు వాని గుండా విద్యుత్ ప్రవహించడం వల్ల అవి పనిచేస్తాయి.
  8. ఈ విధంగా జనరేటర్ ‘ నుండి విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేసే పద్ధతిని కనుగొన్నందుకు ఫారడే వంటి శాస్త్రవేత్తలకు మనం కృతజ్ఞులమై ఉన్నాం.

AP Board 10th Class Physical Science Solutions 10th Lesson విద్యుదయస్కాంతత్వం

ప్రశ్న 27.
ఇంటర్నెట్ ద్వారా సులభ పద్ధతిలో విద్యుత్ మోటర్‌ను తయారుచేసే విధానానికి, దానికి కావలసిన పరికరాలకు సంబంధించిన సమాచారం తెలుసుకొని ఒక నివేదిక తయారు చేయండి. (AS4)
(లేదా)
నీ స్వతహాగా విద్యుత్ మోటారును ఏ విధముగా సులభ పద్ధతిలో తయారుచేయ వచ్చునో, అంతర్జాలంనుపయోగించి సమాచారం కనుగొని ఒక నివేదికను తయారు చేయుము.
జవాబు:
ఉద్దేశ్యం :
సులభ పద్ధతిలో విద్యుత్ మోటర్‌ను తయారుచేయుట.

కావలసిన వస్తువులు :
15 సెం.మీ. పొడవున్న తీగ, 1.5V బ్యాటరీ, ఇనుప సీల, బలమైన అయస్కాంతం, పేపర్ క్లిప్.
AP Board 10th Class Physical Science Solutions 10th Lesson విద్యుదయస్కాంతత్వం 29

పద్దతి :

  1. ఇనుపసీల తలభాగంలో అయస్కాంతమును అతికించవలెను.
  2. అయస్కాంతము యొక్క రెండవ చివర పేపర్ క్లిప్ ను జతచేయవలెను.
  3. సీల యొక్క రెండవ చివరను అంటే ఖాళీగా ఉన్న చివరను బ్యాటరీ లు యొక్క ధనాత్మక టెర్మినలు కలపవలెను.
  4. ఇప్పుడు బ్యాటరీ యొక్క ఋణాత్మక టెర్మినల్ ను తీగ ద్వారా సీల యొక్క తలభాగముతో కలవలెను. పరిశీలన : ఇప్పుడు పేపర్ క్లిప్ తిరగడాన్ని మనము గమనించవచ్చు.

ప్రశ్న 28.
ఫారడే నిర్వహించిన ప్రయోగాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించండి. (AS4)
(లేదా)
ఆ ఫారడే ఏ రకపు ప్రయోగాలను నిర్వహించారో ఒక సమాచార నివేదికను వ్రాయుము.
జవాబు:

  1. ఫారడే అను శాస్త్రవేత్త విద్యుత్ అయస్కాంత ప్రేరణ నియమమునే గాక, కొన్ని విద్యుత్ విశ్లేషణ నియమాలను కూడా ప్రతిపాదించారు.
  2. ఈ విద్యుద్విశ్లేషణ నియమాలను :
    a) లోహసంగ్రహణలో లోహాలను శుద్ధి చేయుటకు
    b) ఎలక్ట్రో ప్లేటింగ్ పద్ధతిలో
    c) ఎలక్ట్రో టైపింగ్ నందు ఉపయోగిస్తారు.

ప్రశ్న 29.
మానవ జీవన విధానాన్ని మార్చివేసిన అయస్కాంత క్షేత్రం, విద్యుత్ ప్రవాహాల మధ్య గల సంబంధాన్ని మీరేవిధంగా ప్రశంసిస్తారు? (AS6)
(లేదా)
అయస్కాంత, విద్యుత్ ప్రవాహంల మధ్య గల సంబంధం మానవాళి జీవన విధానం మార్చిన తీరును అభినందించుము.
జవాబు:

  1. విద్యుత్ ప్రవహించు తీగ లేక వాహకం తన చుట్టూ అయస్కాంత క్షేత్రాన్ని ఏర్పరచును.
  2. దీనికి కారణం చలించు విద్యుదావేశాలు అయస్కాంత క్షేత్రాన్ని ఏర్పరచడం. దీనిని మనం ప్రయోగాల ద్వారా ఆ అవగాహన చేసుకున్నాము.
  3. ఈ విధమైన అయస్కాంత, విద్యుదావేశాల మధ్య గల సంబంధం వలన మానవుని నిజ జీవితంలో అనేక ప్రయోజనాలు కలవు.
  4. మానవుని నిత్యజీవితంలో వాడు విద్యుత్ పరికరాలు అయిన రేడియో, టి.వి., ఎలక్ట్రిక్ క్రేన్, ఎలక్ట్రిక్ బెల్, టెలిఫోన్, లౌడ్ స్పీకర్ మొదలైనవి విద్యుత్ అయస్కాంత క్షేత్రాల ప్రభావంతో పనిచేస్తున్నాయి.
  5. ఇవేకాక మనం నిత్యం వాడు ATM కార్డుల వినియోగంలో, సెక్యూరిటీ చెకట్లలో ఈ ప్రభావం చోటు చేసుకుంది. అలాగే టేప్ రికార్డరులు, ఇండక్షన్ స్టన్లు, జనరేటర్లు, విద్యుత్ మోటారులు మొ||నవి విద్యుత్ అయస్కాంత క్షేత్ర ప్రభావంతో పనిచేయుచున్నవి.
  6. ఈ విధంగా మానవుని జీవన విధానశైలిని మార్చివేసిన అయస్కాంత క్షేత్రం, విద్యుత్ ప్రవాహాల మధ్య గల సంబంధాన్ని అభినందిస్తున్నాను.

ఖాళీలను పూరించండి

1. అయస్కాంత క్షేత్ర ప్రేరణకు SI ప్రమాణం (వెబర్ /మీ (లేదా) టెస్లా)
2. అయస్కాంత అభివాహాన్ని అయస్కాంత క్షేత్ర ప్రేరణ మరియు ……….. లబ్ధంగా చెప్పవచ్చు. (వైశాల్యాల)
3. అయస్కాంత క్షేత్రానికి సమాంతరంగా కదులుతున్న ఆవేశంపై పనిచేసే బలం ………….. (సున్న)
4. B అయస్కాంత అభివాహ సాంద్రత గల సమ అయస్కాంత క్షేత్రానికి లంబంగా L పొడవు గల తీగలో I విద్యుత్ ప్రవాహం ఉంది. ఆ తీగపై గల ఏకరీతి అయస్కాంత బలం ………… (F = ILB)
5. ఫారడే విద్యుదయస్కాంత ప్రేరణ నియమం …………… కు మరో రూపం. (శక్తి రూపాంతరత)

సరైన సమాధానాన్ని ఎన్నుకోండి

1. విద్యుత్ శక్తిని యాంత్రికశక్తిగా మార్చేది
A) మోటర్
B) బ్యాటరీ
C) జనరేటర్
D) స్విచ్
జవాబు:
A) మోటర్

2. యాంత్రికశక్తిని విద్యుత్ శక్తిగా మార్చేది
A) మోటర్
B) బ్యాటరీ
C) జనరేటర్
D) స్విచ్
జవాబు:
C) జనరేటర్

AP Board 10th Class Physical Science Solutions 10th Lesson విద్యుదయస్కాంతత్వం

3. ఒక సమ అయస్కాంత క్షేత్రానికి లంబంగా ఉన్న విద్యుత్ ప్రవాహం గల తీగపై పనిచేసే బలం
A) 0
B) ILB
C) 2ILB
D) ILB/2
జవాబు:
B) ILB

10th Class Physical Science 10th Lesson విద్యుదయస్కాంతత్వం Textbook InText Questions and Answers

10th Class Physical Science Textbook Page No. 216

ప్రశ్న 1.
విద్యుత్ మోటర్, జనరేటర్, కాలింగ్ బెల్, విద్యుత్ క్రేన్ వంటి అనేక విద్యుత్ పరికరాలు ఎలా పని చేస్తాయి?
జవాబు:
ఈ విద్యుత్ పరికరాలలో కొన్ని యాంత్రిక శక్తిని, విద్యుత్ శక్తిగా మారుస్తాయి. మరికొన్ని విద్యుత్ శక్తిని యాంత్రిక శక్తిగా, అయస్కాంత శక్తిగా మారుస్తాయి.

ప్రశ్న 2.
విద్యుత్ కు, అయస్కాంతత్వానికి ఏమైనా సంబంధం ఉన్నదా?
జవాబు:
ఉన్నది, ఒక వాహకంలో విద్యుత్ ప్రవహిస్తున్న దాని చుట్టూ అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుందని ఆయిర్ స్టెడ్ నిరూపించెను.

ప్రశ్న 3.
విద్యుత్ ద్వారా అయస్కాంతత్వాన్ని ఉత్పత్తి చేయగలమా?
జవాబు:
ఒక వాహకం ద్వారా విద్యుత్ ప్రవాహం జరిగితే దానిలో అయస్కాంతత్వాన్ని మనము ఉత్పత్తి చేయగలము.

10th Class Physical Science Textbook Page No. 218

ప్రశ్న 4.
అయస్కాంత క్షేత్రం ఎలా ఏర్పడింది?
జవాబు:
వాహకం ద్వారా విద్యుత్ ప్రవహించడం వలన, దాని చుట్టూ అయస్కాంత బలరేఖల సముదాయం వలన అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుంది.

AP Board 10th Class Physical Science Solutions 10th Lesson విద్యుదయస్కాంతత్వం

ప్రశ్న 5.
దండాయస్కాంతం యొక్క అయస్కాంత క్షేత్రాన్ని మనం గమనించగలమా?
జవాబు:
దిక్సూచిని ఉపయోగించి దండాయస్కాంత క్షేత్రాన్ని గమనించగలము.

10th Class Physical Science Textbook Page No. 219

ప్రశ్న 6.
క్షేత్ర బలాన్ని, క్షేత్ర దిశను ఎలా కనుగొనగలము?
జవాబు:
అయస్కాంత దిక్సూచిని ఉపయోగించి క్షేత్ర దిశను, బలరేఖల సముదాయాన్ని బట్టి క్షేత్ర బలాన్ని కనుగొనవచ్చును.

పేజి నెం. 220

ప్రశ్న 7.
బలరేఖలు సంవృత వక్రాలా? వివృత వక్రాలా?
జవాబు:
బాహ్యంగా బలరేఖలు దండాయస్కాంత ఉత్తర ధ్రువాన్ని విడిచి, దక్షిణ ధృవం వద్ద లోనికి వెళతాయి. అంతరంగా దక్షిణ ధృవం నుండి ఉత్తర ధృవానికి చేరతాయి. కావున బలరేఖలు సంవృత వక్రాలు.

ప్రశ్న 8.
అయస్కాంత క్షేత్రంలో ప్రతి బిందువు వద్ద క్షేత్రానికి ఏవైనా విలువను ఆపాదించగలమా?
జవాబు:
ప్రతి బిందువు గుండా పోయే బలరేఖల సంఖ్యను బట్టి ఆ బిందువు వద్ద క్షేత్ర బలాన్ని అంచనా వేయగలము.

10th Class Physical Science Textbook Page No. 221

ప్రశ్న 9.
క్షేత్రానికి లంబంగా ఉన్న ప్రమాణ వైశాల్యం గుండా అభివాహం ఎంత?
జవాబు:
క్షేత్రానికి లంబంగా ఉన్న ప్రమాణ వైశాల్యం గుండా అభివాహాన్ని అభివాహసాంద్రతగా లెక్కిస్తాము. అది Φ/A కు సమానం.

ప్రశ్న 10.
తలం దిగ్విన్యాసం ఏ విధంగా ఉన్నా అభివాహ సూత్రాన్ని సాధారణీకరించగలమా?
జవాబు:
క్షేత్రానికి కొంత కోణంతో ప్రమాణ వైశాల్యాన్ని పరిగణించిన Φ = BA cos θ ను సాధారణీకరించగలము.

AP Board 10th Class Physical Science Solutions 10th Lesson విద్యుదయస్కాంతత్వం

ప్రశ్న 11.
అయస్కాంత క్షేత్రాన్ని పొందాలంటే అయస్కాంతాలు కాకుండా వేరే ఏదైనా మార్గం ఉందా?
జవాబు:
అవును, మరొక మార్గం కలదు. విద్యుత్ వాహకం గుండా విద్యుత్ ను ప్రవహింపజేసిన దాని చుట్టూ అయస్కాంత క్షేత్రం ఏర్పడును.

10th Class Physical Science Textbook Page No. 225

ప్రశ్న 12.
అయస్కాంత క్షేత్రం B దిశకు ఆవేశ వేగం v దిశ మధ్య 9 కోణం ఉండే సందర్భానికి F = qvB సమీకరణాన్ని సాధారణీకరించగలమా?
జవాబు:
కదిలే ఆవేశానికి, అయస్కాంత క్షేత్రానికి మధ్య కోణం ి ఉన్నట్లయితే ఆ ఆవేశంపై పనిచేసే అయస్కాంత బలాన్ని F= qvB sineθ తో సూచించవచ్చని ప్రయోగపూర్వకంగా నిరూపించవచ్చును.

ప్రశ్న 13.
అయస్కాంత క్షేత్ర దిశకు సమాంతరంగా కదిలే ఆవేశంపై పనిచేసే అయస్కాంత బలం ఎంత?
జవాబు:
అయస్కాంత క్షేత్రానికి సమాంతరంగా కదిలే ఆవేశంపై పనిచేసే అయస్కాంత బలం విలువ శూన్యమవుతుంది.
θ = 0 అయిన sin θ = 0 అగును.

10th Class Physical Science Textbook Page No. 226

ప్రశ్న 14.
విద్యుత్ ప్రవహించే తీగను అయస్కాంత క్షేత్రంలో ఉంచితే ఏం జరుగుతుంది?
జవాబు:
అయస్కాంత క్షేత్రంలో ఉంచిన విద్యుత్ ప్రవాహ తీగ కూడా అయస్కాంత బలానికి లోనవుతుంది.

10th Class Physical Science Textbook Page No. 227

ప్రశ్న 15.
Q/t అనే విలువ దేనికి సమానము?
జవాబు:
Q/t అనునది విద్యుత్ ప్రవాహం (I) కి సమానం.

AP Board 10th Class Physical Science Solutions 10th Lesson విద్యుదయస్కాంతత్వం

ప్రశ్న 16.
అయస్కాంత క్షేత్రంలో విద్యుత్ ప్రవాహం గల తీగ ‘θ’ కోణం చేస్తే దానిపై పనిచేసే బలం ఎంత?
జవాబు:
అయస్కాంత క్షేత్ర దిశకు, విద్యుత్ ప్రవాహ దిశకు మధ్య కోణం θ అయిన విద్యుత్ ప్రవాహం గల తీగపై అయస్కాంత క్షేత్రం వల్ల పనిచేసే బలం F = ILB sin θ

10th Class Physical Science Textbook Page No. 228

ప్రశ్న 17.
విద్యుత్ ప్రవాహం గల తీగపై పనిచేసే బలదిశను ఎలా కనుగొనగలం?
జవాబు:
విద్యుత్ ప్రవాహం గల తీగపై పనిచేసే బలదిశను కుడిచేతి నిబంధనను ఉపయోగించి కనుగొనవచ్చును.

10th Class Physical Science Textbook Page No. 229

ప్రశ్న 18.
అయస్కాంత క్షేత్రంలో AB మరియు CDలు చేసే కోణం ఎంత?
జవాబు:
అయస్కాంత క్షేత్రంలో AB మరియు CDలు 90° ల కోణం చేస్తాయి.

10th Class Physical Science Textbook Page No. 230

ప్రశ్న 19.
AB మరియు CD భుజాలపై పనిచేసే అయస్కాంత బలదిశను మీరు గీయగలరా?
జవాబు:
AP Board 10th Class Physical Science Solutions 10th Lesson విద్యుదయస్కాంతత్వం 8

ప్రశ్న 20.
BC మరియు CDల పైన బలాల దిశలు ఏ విధంగా ఉంటాయి?
జవాబు:
BC మరియు CDలపైన బలాలు దిశలు ఒకదానితో ఒకటి వ్యతిరేకదిశలో ఉంటాయి.

ప్రశ్న 21.
దీర్ఘచతురస్రాకార తీగచుట్టపై ఫలిత బలం ఎంత?
జవాబు:
దీర్ఘచతురస్రాకార తీగచుట్టపై ఫలిత బలం శూన్యము.

ప్రశ్న 22.
తీగచుట్టపై ఫలిత బలం శూన్యమైనప్పటికీ అది ఎలా భ్రమణంలోకి వస్తుంది?
జవాబు:
వ్యతిరేక దిశలలో పనిచేసే సమాన బలాలు తీగచుట్ట రెండు అంచుల మీద పనిచేయడం వలన తీగచుట్ట కూడా భ్రమణంలోకి వస్తుంది.

ప్రశ్న 23.
తీగచుట్టలో విద్యుత్ ప్రవాహ దిశ మారకపోతే ఏం జరుగుతుంది?
జవాబు:
తీగచుట్టలో విద్యుత్ ప్రవాహ దిశ మారకపోతే బాహ్య అయస్కాంత క్షేత్ర దిశకు లంబంగా తీగచుట్ట తలం వచ్చే వరకు తీగచుట్ట భ్రమణం చెంది, తిరిగి అపసవ్యదిశలో భ్రమణం చెందడం ప్రారంభిస్తుంది.

ప్రశ్న 24.
తీగచుట్ట ఆగకుండా తిరుగుతూ ఉండాలంటే ఏం చేయాలి?
జవాబు:
తీగచుట్ట మొదటి భ్రమణం తర్వాత దానిలోని విద్యుత్ ప్రవాహ దిశను వ్యతిరేక దిశలోకి మార్చినట్లయితే తీగచుట్ట ఆగకుండా నిరంతరంగా తిరుగుతుంది.

10th Class Physical Science Textbook Page No. 231

ప్రశ్న 25.
తీగచుట్టలో విద్యుత్ ప్రవాహ దిశను మనం ఎలా మార్చగలము?
జవాబు:
అర్ధభ్రమణం పూర్తయిన తర్వాత బ్రష్ ను తాకే స్లిప్ రింగ్ స్థానాలు పరస్పరం మార్చడం వలన తీగచుట్టలో విద్యుత్ ప్రవాహ దిశ అంతకుముందున్న దిశకు వ్యతిరేకదిశలోకి మారుతుంది.

ప్రశ్న 26.
విద్యుత్ ప్రవాహం లేని తీగచుట్టను అయస్కాంత క్షేత్రంలో తిరిగేటట్లు చేస్తే ఏం జరుగుతుంది?
జవాబు:
విద్యుత్ ప్రవాహం లేని తీగచుట్టను అయస్కాంత క్షేత్రంలో తిరిగేటట్లు చేస్తే తీగచుట్టలో అభివాహం మార్పువలన విద్యుత్ ప్రేరింపబడుతుంది.

AP Board 10th Class Physical Science Solutions 10th Lesson విద్యుదయస్కాంతత్వం

ప్రశ్న 27.
మనం విద్యుత్ ను ఎలా ఉత్పత్తి చేస్తాం?
జవాబు:
మనం విద్యుత్ ను సౌరశక్తి ద్వారా, జలం, బొగ్గు, వాయువుల ద్వారా మరియు జనరేటర్ ద్వారా ఉత్పత్తి చేయగలం.

10th Class Physical Science Textbook Page No. 232

ప్రశ్న 28.
గురుత్వాకర్షణకు వ్యతిరేకంగా రింగు గాలిలో పైకి లేవడానికి ఏ బలాలు దానికి సహాయం చేస్తాయి?
జవాబు:
ఇనుపకడ్డీకి చుట్టిన తీగచుట్ట (సోలినాయిడ్) యొక్క ప్రతి వరుసకు పైభాగంలో ఏర్పడే అయస్కాంత ధృవం మరియు రింగులో ప్రేరిత విద్యుత్ వల్ల రింగ్ కింది భాగంలో ఏర్పడే ధృవం రెండూ సజాతి ధృవాలు కావడం వల్ల వాటి మధ్య ఉండే “వికర్షణ బలం” రింగు గాలిలో లేవడానికి సహాయం చేస్తుంది.

ప్రశ్న 29.
ఏకముఖ విద్యుత్ (DC)ను ఉపయోగిస్తే ఆ రింగు తేలియాడుతుందా?
జవాబు:
DCని వినియోగిస్తే రింగు ఒక్కసారి పైకి కదిలి మరలా యథాస్థానానికి చేరుకుంటుంది.

10th Class Physical Science Textbook Page No. 234

ప్రశ్న 30.
ప్రేరిత విద్యుత్ ప్రవాహ దిశ ఏమిటి?
జవాబు:
ప్రేరిత విద్యుత్ ప్రవాహ దిశ వలయానికి దగ్గరగా తీసుకువెళ్ళిన దండాయస్కాంత క్షేత్రం వల్ల కలిగే అభివాహ మార్పును వ్యతిరేకించే దిశలో ఏర్పడును. ఒకవేళ ఉత్తర ధృవాన్ని తీసుకువెళ్ళిన అపసవ్య దిశలో, దక్షిణ ధృవమును తీసుకువెళ్ళిన సవ్యదిశలో ప్రేరిత విద్యుత్ ప్రవాహ దిశ ఉండును.

10th Class Physical Science Textbook Page No. 238

ప్రశ్న 31.
సమ అయస్కాంత క్షేత్రంలో ఒక తీగచుట్ట నిరంతరంగా తిరిగేటట్లు చేస్తే ఏమవుతుంది?
జవాబు:
సమ అయస్కాంత క్షేత్రంలో ఒక తీగచుట్ట నిరంతరంగా తిరిగేటట్లు చేస్తే విద్యుత్ ఉత్పత్తి అవుతుంది.

AP Board 10th Class Physical Science Solutions 10th Lesson విద్యుదయస్కాంతత్వం

ప్రశ్న 32.
తీగచుట్టలో ప్రేరేపించబడిన విద్యుత్ స్థిరంగా ఉంటుందా? లేదా దాని దిశ మారుతూ ఉంటుందా?
జవాబు:
తీగచుట్టలో ప్రేరేపించబడిన విద్యుత్ శూన్యం నుండి గరిష్ఠ విలువల మధ్య మారుతూ, దాని దిశ కూడా మారుతూ ఉంటుంది.

10th Class Physical Science Textbook Page No. 239

ప్రశ్న 33.
ఇలాంటి విద్యుత్ ను మనం ఉపయోగించుకోగలమా? ఎలా?
జవాబు:
ఈ విధంగా పొందిన విద్యుత్ ను టెలివిజన్, రేడియో వంటి విద్యుత్ పరికరాలు పనిచేయటానికి వినియోగిస్తాము.

10th Class Physical Science Textbook Page No. 240

ప్రశ్న 34.
AC జనరేటర్ ను DC జనరేటర్ గా మార్చాలంటే ఎలాంటి మార్పులు చేయాలి?
జవాబు:
AC జనరేటర్ లో తీగచుట్ట రెండు చివరలను రెండు అర్దస్లిప్ రింగ్ ర్లకు కలిపితే DC జనరేటర్ గా పనిచేస్తూ DCని ఉత్పత్తి చేస్తుంది.

10th Class Physical Science Textbook Page No. 225

ప్రశ్న 35.
అయస్కాంత క్షేత్రంలో కదిలే ఆవేశంపై పనిచేసే అయస్కాంత బలాన్ని మనం కొలవగలమా?
జవాబు:
పటంలో చూపిన విధంగా ‘q’ ఆవేశం ‘v’ వేగంతో అయస్కాంత క్షేత్రం ‘B’ కు లంబంగా కదులుతున్న ఆ ఆవేశంపై పనిచేసే అయస్కాంత బలాన్ని ప్రయోగపూర్వకంగా F = qvB గా రాయవచ్చు.

10th Class Physical Science Textbook Page No. 226

ప్రశ్న 36.
క్షేత్రంలో కదిలే ఋణావేశంపై బలం ఏ దిశలో పని చేస్తుంది?
జవాబు:
కుడి చేతి నిబంధన ప్రకారం మొదట ఆ క్షేత్రంలో కదిలే ధనావేశంపై పనిచేసే బలదిశను కనుగొంటే ఆ దిశకు వ్యతిరేకదిశ మనకు కావలసిన ఋణాత్మక ఆవేశంపై పనిచేసే అయస్కాంత బలదిశను సూచిస్తుంది.

పరికరాల జాబితా

అయస్కాంత దిక్సూచి, బ్యాటరీ, తీగలు, కీ, దండాయస్కాంతం, ఇనుపరజను, స్టాండు, తీగ, బ్యాటరీ, వాహక తీగ, రాగి తీగలు, గుర్రపు నాదా అయస్కాంతం, స్థూపాకారపు ఇనుపదిమ్మె, చెక్క ముక్క రింగు, రాగి తీగ

10th Class Physical Science 10th Lesson విద్యుదయస్కాంతత్వం Textbook Activities

కృత్యములు

కృత్యం – 2

ప్రశ్న 1.
దండాయస్కాంతము యొక్క అయస్కాంత క్షేత్రాన్ని ఏ విధంగా గమనించవచ్చును? దాని క్షేత్ర లక్షణాలను ఏ విధంగా తెలుసుకొనవచ్చునో ప్రయోగ పూర్వకముగా తెల్పుము.
జవాబు:

  1. ఒక బల్లపై తెల్ల కాగితాన్ని ఉంచుము.
  2. కాగితం మధ్యలో ఒక దండాయస్కాంతాన్ని ఉంచుము.
  3. ఈ దండాయస్కాంతానికి దగ్గరగా ఒక అయస్కాంత దిక్సూచిని ఉంచండి.
  4. దిక్సూచిలోని సూచిక ఒక స్థిర దిశను సూచించును.
  5. నిలకడగా ఉన్న సూచిక అంచులను తెలిపే విధంగా పెన్సిల్ తో కాగితంపై రెండు బిందువులను గుర్తించుము.
  6. గుర్తించిన రెండు బిందువులను కలుపుతూ రేఖాఖండము గీయుము.
  7. సూచిక దక్షిణ ధృవం నుంచి ఉత్తర ధృవం వైపు సూచించేటట్లు ఒక బాణం గుర్తును గీయుము.
  8. దిక్సూచిని కాగితంపై వివిధ ప్రాంతాల్లో ఉంచి ఇదే పద్ధతిని కొనసాగించండి.
  9. అయస్కాంత దిక్సూచి సూచిక విభిన్న ప్రదేశాలలో, విభిన్న దిశలలో ఉండటం గమనిస్తాము.
  10. దిక్సూచిని దండాయస్కాంతానికి బాగా దూరంగా వేర్వేరు ప్రదేశాలలో ఉంచి, సూచిక కదలికలను పరిశీలించిన, అది దాదాపు ఉత్తర – దక్షిణ దిక్కులను సూచిస్తుంది.
  11. దిక్సూచి సూచిక కదలిక ద్వారా దండాయస్కాంతానికి చుట్టూ అన్ని దిశలలో క్షేత్రం ఉందని నిర్ధారితమగును.
  12. దీనిని బట్టి అయస్కాంత క్షేత్రం త్రిమితీయమైనదని, దీనికి దిశ, బలం అనే లక్షణాలు గలవు అని నిర్ధారించుకోవచ్చును.

కృత్యం – 3

ప్రశ్న 2.
అయస్కాంత క్షేత్ర బలాన్ని చూపు కృత్యాలను రాయుము.
జవాబు:
AP Board 10th Class Physical Science Solutions 10th Lesson విద్యుదయస్కాంతత్వం 1

  1. ఒక తెల్లకాగితాన్ని బల్లపై ఉంచి, దాని మధ్యలో ఒక అయస్కాంత దిక్సూచిని ఉంచుము.
  2. దిక్సూచిలోని సూచిక కొనలను సూచించు రెండు బిందువులను గుర్తించుము.
  3. దిక్సూచిని తీసి, గుర్తించిన రెండు బిందువులను కలుపుతూ ఒకే సరళరేఖను గీయుము. ఇది ఉత్తర – దక్షిణ దిక్కులను సూచించును.
  4. ఆ రేఖపై దండాయస్కాంతపు ఉత్తర ధృవం, భూమి ఉత్తర దిక్కువైపు సూచించునట్లు అమర్చుము.
  5. ఇప్పుడు దండాయస్కాంత ఉత్తర ధ్రువానికి దగ్గరగా అయస్కాంత దిక్సూచిని ఉంచండి.
  6. దిక్సూచి సూచిక నిలకడ స్థితిలో ఉన్నప్పుడు దాని ఉత్తర దిశను సూచించు విధంగా కాగితంపై ఒక బిందువును గుర్తించుము.
  7. దిక్సూచిని అక్కడ నుండి తీసి గుర్తించిన బిందువు వద్ద ఉంచుము.
  8. ఈ సందర్భంలో సూచిక మరొక దిశను సూచించును.
  9. మరలా సూచిక ఉత్తర దిశను సూచించు విధంగా వేరొక బిందువును గుర్తించుము.
  10. ఈ విధముగా దిక్సూచి దండాయస్కాంత దక్షిణ ధ్రువానికి చేరే వరకు చేయుము.
  11. ఇపుడు దండాయస్కాంత ఉత్తర ధృవం నుంచి దక్షిణ ధృవం వరకు మనము గుర్తించిన బిందువులన్నీ కలుపుము.
  12. ఈ బిందువులను కలుపగా ఒక వక్రరేఖ ఏర్పడును.
  13. ఇప్పుడు దండాయస్కాంత ఉత్తర ధ్రువం వద్ద మరో బిందువును తీసుకొని పై ప్రక్రియను కొనసాగించుము. మనకు అనేక వక్రరేఖలు ఏర్పడతాయి.
  14. ఈ వక్రరేఖలను అయస్కాంత బలరేఖలని అంటారు. ఇవి ఊహాత్మకమైనవి.
  15. దీనిని మనము పరిశీలించగా బలరేఖల మధ్య ఖాళీ స్థలము అనునది కొన్నిచోట్ల అధికంగాను, కొన్నిచోట్ల అల్పముగాను కలదు.
  16. ఈ పటం ద్వారా బలరేఖలు దట్టమైన సమూహంగా ఉన్న చోట క్షేత్రం బలంగా ఉందని, దూరం దూరంగా విస్తరించినట్లు ఉన్నచోట క్షేత్రం బలహీనంగా ఉందని చెప్పవచ్చును.

కృత్యం – 6

ప్రశ్న 3.
సోలినాయిడ్ వల్ల ఏర్పడే అయస్కాంత క్షేత్రంను కృత్యం ద్వారా వివరించుము.
జవాబు:
AP Board 10th Class Physical Science Solutions 10th Lesson విద్యుదయస్కాంతత్వం 24

  1. ఒక చెక్కపీటను తీసుకొని దానికి తెల్ల కాగితం అంటించుము.
  2. పటంలో చూపినట్లుగా దాని ఉపరితలంపై సమాన దూరంలో రంధ్రాలు చేయుము.
  3. ఆ రంధ్రాల గుండా పటంలో చూపినట్లు రాగి తీగను పంపుము.
  4. ఇది తీగచుట్ట వలె ఉంటుంది.
  5. తీగచుట్ట చివరలను స్విచ్, బ్యాటరీలతో వలయంలో శ్రేణిలో కలుపుము.
  6. స్విచ్ ఆన్ చేయగానే తీగ గుండా విద్యుత్ ప్రవహిస్తుంది.
  7. ఇప్పుడు తీగ చుట్టూ కొంత ఇనుపరజను చల్లి మెల్లగా పీటను తట్టుము.
  8. ఇనుప రజను ఒక క్రమ పద్ధతిలో అమరడాన్ని గమనించవచ్చును.
  9. సోలినాయిడ్ ఏర్పరచిన, బలరేఖలు దండాయస్కాంత బలరేఖలను పోలి ఉన్నవి కావున సోలినాయిడ్ దండాయస్కాంతంలా ప్రవర్తిస్తుందని తెలుస్తుంది.
  10. ఈ పొడవైన తీగచుట్టను సోలినాయిడ్ అంటాము.
  11. సోలినాయిడ్ ఏర్పరిచే క్షేత్ర దిశను కుడిచేతి నిబంధనతో తెలుసుకోవచ్చును.
  12. సోలినాయిడ్ రెండు చివరలలో ఒకటి ఉత్తర ధృవంగా, మరొకటి దక్షిణ ధృవంగా ప్రవర్తిస్తున్నాయి.
  13. సోలినాయిడ్ బయట బలరేఖల దిశ ఉత్తరం నుంచి దక్షిణం వైపు, లోపలి బలరేఖల దిశ దక్షిణం నుంచి ఉత్తరానికి ఉంటుంది.
  14. దీనిని బట్టి సోలినాయిడ్ వల్ల ఏర్పడే బలరేఖలు దండాయస్కాంతంతో ఏర్పడిన బలరేఖల వలె సంవృత వలయాలని గమనించవచ్చును.
  15. ఈ విధంగా సోలినాయిలో విద్యుత్ ప్రవాహం వలన అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుందని నిరూపితమైనది.

AP Board 10th Class Physical Science Solutions 10th Lesson విద్యుదయస్కాంతత్వం

కృత్యం – 7

ప్రశ్న 4.
చలనంలో ఉన్న ఆవేశం మరియు విద్యుత్ ప్రవాహం గల తీగలపై అయస్కాంత క్షేత్ర బలాన్ని కృత్యం ద్వారా వివరించండి.
జవాబు:
AP Board 10th Class Physical Science Solutions 10th Lesson విద్యుదయస్కాంతత్వం 30

  1. CRT – TV కి దగ్గరగా నిలబడి స్విచ్ ఆన్ చేయుము.
  2. మన చర్మంపై స్పర్శానుభూతి కలుగుతుంది.
  3. దీనికి కారణం TV తెరపై ఎలక్ట్రానుల కదలికయే.
  4. ఇప్పుడొక దండాయస్కాంతాన్ని TV తెర దగ్గరకు లంబంగా తీసుకురండి.
  5. తెరమీద ఆకారం విరూపితమవ్వడం గమనించవచ్చును.
  6. దండాయస్కాంతాన్ని తెర నుండి దూరంగా జరుపుము.
  7. ఇప్పుడు తెరపై చిత్రం సరిగా ఉండటం గమనించవచ్చును.
  8. మరొకసారి దండాయస్కాంతాన్ని టీవీ దగ్గరగా తీసుకువచ్చిన, కదిలే ఎలక్ట్రాన్లపై V లేదా I అయస్కాంత క్షేత్రం బలమును ప్రయోగించడం వలన ఆకారం మారింది.
  9. ఈ విధంగా కదిలే ఆవేశంపై అయస్కాంత బలదిశ ఏ విధంగా ఉంటుందో B పేపర్ / తెలుసుకునేందుకు కుడిచేతి నిబంధన వివరిస్తుంది.
  10. కుడిచేతి నిబంధన ఆవేశ వేగదిశ, క్షేత్ర దిశ పరస్పరం లంబంగా ఉంటేనే పనిచేయును.
  11. పటంలో చూపిన విధంగా కుడిచేతి బొటనవేలు, చూపుడువేలు, మధ్యవేలును ఒకదానికొకటి పరస్పరం లంబంగా ఉంచితే చూపుడు వేలు ఆవేశ వేగదిశను (విద్యుత్ ప్రవాహం I), మధ్యవేలు క్షేత్రదిశ (B) ను, బొటనవేలు బలం (F) దిశను సూచిస్తాయి.
    ∴ ఆవేశ కణంపై పనిచేసే బలం F = qvB.

AP Board 10th Class Physical Science Solutions 10th Lesson విద్యుదయస్కాంతత్వం

కృత్యం – 9

ప్రశ్న 5.
విద్యుత్ అయస్కాంత ప్రేరణను కృత్యం ద్వారా నిరూపించుము.
జవాబు:
AP Board 10th Class Physical Science Solutions 10th Lesson విద్యుదయస్కాంతత్వం 31

  1. పటంలో చూపిన విధంగా ఒక చెక్కముక్కను తీసుకొనుము.
  2. దానిపై మెత్తని ఇనుముతో చేసిన ఒక స్థూపాకారపు దిమ్మెను బిగించండి.
  3. ఆ స్థూపాకారపు దిమ్మెకు రాగి తీగను చుట్టుము.
  4. దిమ్మె వ్యాసం కన్నా కాస్త ఎక్కువ వ్యాసమున్న ఒక లోహపు రింగును తీసుకొని స్థూపాకారపు దిమ్మెకు అమర్చండి.
  5. రాగి తీగ రెండు చివరలను ఏకాంతర విద్యుత్ జనకానికి (AC) కలిపి, తీగలోకి విద్యుత్ ను ప్రవహింపజేయుము.
  6. లోహపు రింగు తీగచుట్ట వెంబడి కొద్ది ఎత్తులో తేలియాడడం గమనించవచ్చును.
  7. విద్యుత్ ప్రవాహాన్ని ఆపివేస్తే ఆ రింగు స్థూపాకారపు దిమ్మె నుండి గాలిలో పైకి ఎగురుతుంది.
  8. ఇపుడు AC కి బదులుగా DC ని ఉపయోగించిన రింగు ఒక్కసారి పైకి కదిలి మరలా యథాస్థితికి చేరుకుంటుంది.
  9. ఈ విధంగా లోహపు రింగులో విద్యుత్ ప్రేరేపింపబడటం (విద్యుత్ అయస్కాంత ప్రేరణ) గమనించవచ్చు.

AP Board 10th Class Maths Solutions Chapter 14 సాంఖ్యకశాస్త్రం Exercise 14.4

SCERT AP 10th Class Maths Textbook Solutions Chapter 14 సాంఖ్యకశాస్త్రం Exercise 14.4 Textbook Exercise Questions and Answers.

AP State Syllabus 10th Class Maths Solutions 14th Lesson సాంఖ్యకశాస్త్రం Exercise 14.4

ప్రశ్న 1.
50 మంది శ్రామికుల దినసరి భత్యములు క్రింది పౌనఃపున్య విభాజనములో ఇవ్వబడ్డాయి.

AP Board 10th Class Maths Solutions Chapter 14 సాంఖ్యకశాస్త్రం Exercise 14.4 1

ఈ దత్తాంశమునకు ఆరోహణ సంచిత పౌనఃపున్యములను తయారు చేసి, ఓజీవ్ వక్రము గీయండి.
సాధన.

AP Board 10th Class Maths Solutions Chapter 14 సాంఖ్యకశాస్త్రం Exercise 14.4 2

ఓజీవ్ వక్రం కొరకు X-అక్షంపై ఎగువ హద్దులు, Y-అక్షంపై ఆరోహణ సంచిత పౌనఃపున్యాలు తీసుకొనవలెను. పై పట్టిక నుండి కావలసిన క్రమయుగ్మాలు = {(300, 12), (350, 26), (400, 34), (450, 40), (500, 50)}

AP Board 10th Class Maths Solutions Chapter 14 సాంఖ్యకశాస్త్రం Exercise 14.4 3

AP Board 10th Class Maths Solutions 14th Lesson సాంఖ్యకశాస్త్రం Exercise 14.4

ప్రశ్న 2.
ఒక పాఠశాలలో జరిగిన వైద్య పరీక్షలలో తరగతిలోని 35 మంది విద్యార్థుల బరువులు క్రింది పట్టికలో ఇవ్వబడ్డాయి.

AP Board 10th Class Maths Solutions Chapter 14 సాంఖ్యకశాస్త్రం Exercise 14.4 4

ఆరోహణ సంచిత పౌనఃపున్య వక్రము గీచి దాని నుండి మధ్యగతమును గుర్తించండి. ఈ దత్తాంశమునకు సూత్ర సహాయంతో మధ్యగతము కనుగొని రెండు విలువలు సరిచూడండి..
సాధన

AP Board 10th Class Maths Solutions Chapter 14 సాంఖ్యకశాస్త్రం Exercise 14.4 5

⇒ \(\frac{n}{2}=\frac{35}{2}\) = 17.5
∴ మధ్యగతం = l + \(\left(\frac{\frac{\mathrm{n}}{2}-\mathrm{c} \cdot \mathrm{f}}{\mathrm{f}}\right)\) × h
l = 46, \(\frac{n}{2}\) = 17.5, cf = 14, f = 14, h = 2.
∴ మధ్యగతం = 46 + \(\frac{17.5-14}{14}\) × 2
= 46 + \(\frac{7}{14}\)
= 46 + 0.5
46.5 కి.గ్రా.
∴ ఓజీవ్ వక్రం మరియు సహజ పద్ధతి ద్వారా విద్యార్థుల బరువుల మధ్యగతం 46.5 కే.జీగా సరిచూడటమైనది.

AP Board 10th Class Maths Solutions 14th Lesson సాంఖ్యకశాస్త్రం Exercise 14.4

(లేదా)

AP Board 10th Class Maths Solutions Chapter 14 సాంఖ్యకశాస్త్రం Exercise 14.4 6

∴ ఓజివ్ వక్రం కొరకు X-అక్షంపై ఎగువ హద్దులు, Y-అక్షంపై ఆరోహణ సంచిత పౌనఃపున్యాలు తీసుకొనవలెను.
∴ కావలసిన క్రమయుగ్మాల సమితి = {(38, 0), (40, 3), (42, 5), (44, 9), (46, 14), (48, 28), (50, 32) (52, 35)}
∴ ఓజీవ్ వక్రానికి = \(\frac{n}{2}=\frac{35}{2}\) = 17.5 వద్ద లంబాన్ని గీయగా అది X – అక్షం పై చేయు నిరూపకమే దాని మధ్యగతం అగును.
∴ 35 మంది పిల్లల బరువుల మధ్యగతం = 46.5 కి.గ్రా.

AP Board 10th Class Maths Solutions Chapter 14 సాంఖ్యకశాస్త్రం Exercise 14.4 7

AP Board 10th Class Maths Solutions 14th Lesson సాంఖ్యకశాస్త్రం Exercise 14.4

ప్రశ్న 3.
ఒక గ్రామములోని 100 మంది రైతులు పొలములలో హెక్టారుకు దిగుబడి ధాన్యము క్రింది విభాజనము నందు ఇవ్వబడింది.

AP Board 10th Class Maths Solutions Chapter 14 సాంఖ్యకశాస్త్రం Exercise 14.4 8

ఈ దత్తాంశమునకు అవరోహణ సంచిత పౌనఃపున్యము తయారుచేసి ఓజీవ్ వక్రము గీయండి.
సాధన.

AP Board 10th Class Maths Solutions Chapter 14 సాంఖ్యకశాస్త్రం Exercise 14.4 9

∴ ఓజీవ్ వక్రం కొరకు X-అక్షంపై తరగతి దిగువ హద్దులు, Y-అక్షంపై అవరోహణ సంచిత పౌనఃపున్యాలు.
∴ కావలసిన క్రమయుగ్మాల సమితి = {(50, 100), (55, 98), (60, 90), (65, 78), (70, 54), (75, 16)}

AP Board 10th Class Maths Solutions Chapter 14 సాంఖ్యకశాస్త్రం Exercise 14.4 10

AP Board 10th Class Physical Science Solutions 12th Lesson కార్బన్ – దాని సమ్మేళనాలు

SCERT AP 10th Class Physical Science Guide 12th Lesson కార్బన్ – దాని సమ్మేళనాలు Textbook Questions and Answers.

AP State Syllabus 10th Class Physical Science 12th Lesson Questions and Answers కార్బన్ – దాని సమ్మేళనాలు

10th Class Physical Science 12th Lesson కార్బన్ – దాని సమ్మేళనాలు Textbook Questions and Answers

అభ్యసనాన్ని మెరుగుపరుచుకోండి

ప్రశ్న 1.
ఒక సాధారణ హైడ్రోకార్బన్ పేరు చెప్పండి. (AS1)
జవాబు:
సాధారణ హైడ్రోకార్బన్ మీథేన్ (CH4).

ప్రశ్న 2.
ఆల్కేన్లు, ఆల్కీన్లు, ఆల్కైల సాధారణ అణు ఫార్ములా ఏమిటి? (AS1)
జవాబు:
ఆల్కేనులు, ఆల్కీనులు, ఆల్కెనుల సాధారణ అణు సాంకేతికములు :

  1. ఆల్కేనులు – CnH2n+2
  2. ఆల్కీనులు – CnH2n
  3. ఆల్కైనులు – CnH2n-2

ప్రశ్న 3.
ఇథనాలను గాలిలో దహనం చేసినపుడు నీరుతో పాటుగా ఏర్పడే ఇతర ఉత్పన్నమేమిటి? (AS1)
(లేదా)
ఇథనాలను గాలిలో మండించినపుడు నీటితో పాటుగా విడుదలగు వాయువు ఏది?
జవాబు:
ఇథనాల్ ను గాలిలో మండించినపుడు నీటితో పాటు ఏర్పడే మరొక ఉత్పన్నం కార్బన్ డై ఆక్సైడ్ (CO2).

ప్రశ్న 4.
ఈ క్రింది సమ్మేళనాల యొక్క IUPAC పేర్లు రాయండి. ఒకవేళ ఒకటి కంటే ఎక్కువ సమ్మేళనాలు వస్తే వాటి అన్నిటి పేర్లను రాయండి. (AS1)
i) ఈథేన్ నుండి ఏర్పడిన ఆల్డిహైడ్
ii) బ్యూటేన్ నుండి పొందిన కీటోన్
iii) ప్రొపేన్ నుండి ఏర్పడిన క్లోరైడ్
iv) పెంటేన్ నుండి ఏర్పడిన ఆల్కహాల్
జవాబు:
i) ఈథేన్ నుంచి ఏర్పడిన ఆల్డిహైడ్ ఇథనాల్ (CH3CHO).
ii) బ్యూటేన్ నుండి పొందిన కీటోన్ బ్యూటనోన్ లేదా బ్యూటాన్-2 – ఓన్ (CH3COCH2CH3).
iii) ప్రొపేన్ నుండి ఏర్పడిన క్లోరైడ్ 2 రకాలు :
AP Board 10th Class Physical Science Solutions 12th Lesson కార్బన్ – దాని సమ్మేళనాలు 1

iv) పెంటేస్ నుంచి వచ్చే ఆల్కహాలు మూడు రకాలు. అవి :
1) 1 – పెంటనోల్ : CH3CH2CH2CH2CH2OH
2) 2 – పెంటనోల్ : CH3CH2CH2CH (OH) CH3 లేదా పెంటాన్- 2 – ఓల్
3) 3 – పెంటనోల్ లేదా పెంటాస్ – 3 – ఓల్. CH3CH2CH (OH) CH2CH3

AP Board 10th Class Physical Science Solutions 12th Lesson కార్బన్ – దాని సమ్మేళనాలు

ప్రశ్న 5.
ఒక సాధారణ కీటోన్ పేర్కొని, దాని అణుఫార్ములా రాయండి. (AS1)
(లేదా)
ఏదైనా సాధారణ కీటోన్ ను ఉదహరించి, దాని అణుఫార్ములాను వ్రాయుము.
జవాబు:
సాధారణ కీటోన్ : డై మిథైల్ కీటోన్ లేదా ప్రొపనోన్.

దీని ఫార్ములా : CH3COCH3.

ప్రశ్న 6.
కార్బన్ పరమాణువు మరొక కార్బన్ పరమాణువుతో కలిసి బంధాలనేర్పరచుకునే ధర్మాన్ని ఏమంటారు? (AS1)
జవాబు:
కర్బన పరమాణువులు ఒకదానితో మరొకటి స్వయంగా కలిసి, గొలుసు వంటి పెద్ద అణువును ఏర్పరచే ధర్మాన్ని కాటనేషన్ లేక శృంఖల ధర్మం అంటారు.

ప్రశ్న 7.
ఇథనోలను 443Kల వద్ద గాఢ సల్ఫ్యూరిక్ ఆమ్లం (H2SO4)తో కలిపి వేడిచేయుట వలన ఏర్పడే సమ్మేళనం పేరు ఏమిటి? (AS1)
జవాబు:
ఇథనోలను 443K వద్ద అధిక గాఢ సల్ఫ్యూరిక్ ఆమ్లంతో చర్య జరిపితే నిర్జలీకరణ చర్య జరిగి ఇథిలీన్ లేదా ఈథేన్ ఏర్పడుతుంది.
AP Board 10th Class Physical Science Solutions 12th Lesson కార్బన్ – దాని సమ్మేళనాలు 2

ప్రశ్న 8.
ఎస్టరిఫికేషన్ చర్యకు ఒక ఉదాహరణ ఇవ్వండి. (AS1)
(లేదా)
ఎస్టరీకరణముపై లఘు వ్యాఖ్య వ్రాయుము.
జవాబు:
కార్బాక్సిలిక్ ఆమ్లం, గాఢ సల్ఫ్యూరిక్ ఆమ్ల సమక్షంలో ఆల్కహాల్ తో చర్య జరిపి తియ్యని వాసన గల ఎస్టర్ అనే సమ్మేళనాన్ని ఏర్పరచే చర్యను ఎస్టరీకరణ చర్య అంటారు.
ఉదా :
ఎసిటిక్ ఆమ్లం (ఇథనోయిక్ ఆమ్లం) గాఢ సల్ఫ్యూరిక్ ఆమ్లం సమక్షంలో ఇథైల్ ఆల్కహాల్ (ఇథనోల్) తో చర్య జరిపి ఇథైల్ ఎసిటేట్ (ఇథైల్ ఇథియోనేట్) ను ఏర్పరుస్తుంది.
AP Board 10th Class Physical Science Solutions 12th Lesson కార్బన్ – దాని సమ్మేళనాలు 3

ప్రశ్న 9.
ఈథేన్ నుండి ఇథనాల్ ను తయారుచేసే చర్యను చూపే రసాయన సమీకరణాన్ని రాయండి. (AS1)
(లేదా)
ఇథనాలను, ఈథేన్ నుండి తయారుచేయుటను సూచించు రసాయన సమీకరణమును వ్రాయుము.
జవాబు:
ఈథేన్ ను గాలి లేకుండా వేడిచేస్తే ఈ థీన్ లేక ఇథిలీన్ ఏర్పడుతుంది. దీనిని P2O5 లేక టంగ్స్టన్ ఆక్సెడ్ ఉత్ర్పేరక సమక్షంలో అధిక ఉష్ణోగ్రత పీడనాలకు గురిచేసి నీటిఆవిరితో చర్య జరపడం ద్వారా ఇథనోల్ ఏర్పడుతుంది.
AP Board 10th Class Physical Science Solutions 12th Lesson కార్బన్ – దాని సమ్మేళనాలు 4

ప్రశ్న 10.
కర్బన సమ్మేళనాల సమజాత శ్రేణులను నిర్వచించండి. సమజాత శ్రేణుల ఏవేని రెండు లక్షణాలను తెల్పండి. (AS1)
జవాబు:
ఒకే ప్రమేయ సమూహాలున్న కర్బన సమ్మేళనాలను సమజాతీయ శ్రేణులు అంటారు.
ఉదా : ఆల్కేనులు, ఆల్కీనులు, ఆల్కెనులు, హాలో ఆల్కేనులు మొదలైనవి.

లక్షణాలు :

  1. ఇవి ఒకే సాధారణ ఫార్ములా కలిగి ఉంటాయి.
    ఉదా : ఆల్కేనుల సాధారణ ఫార్ములా CnH2n+2
  2. వరుస సమ్మేళనాల మధ్య తేడా -CH2 ఉంటుంది.
  3. ఒకే ప్రమేయ సమూహాన్ని కలిగి ఉండటం వలన ఒకే రసాయన ధర్మాలు కలిగి ఉంటాయి.
  4. భౌతిక ధర్మాలలో ఒక క్రమపద్ధతిలో పెరుగుదల కనబడుతుంది.

ప్రశ్న 11.
క్రింది ప్రమేయ సమూహాల పేర్లను రాయండి. (AS1)
(a) -CHO (b) -C=0
(లేదా)
ఇవ్వబడిన ప్రమేయ సమూహాలను కలిగి ఉన్న కర్బన సమ్మేళనాలను ఉదహరించుము.
జవాబు:
a) -CHO ప్రమేయ సమూహం పేర్లు ఆల్డిహైడ్.
b) – C = O ప్రమేయ సమూహం పేరు కీటోన్.

AP Board 10th Class Physical Science Solutions 12th Lesson కార్బన్ – దాని సమ్మేళనాలు

ప్రశ్న 12.
కార్బన్ ప్రధానంగా సమయోజనీయ బంధాలను ఎందుకు ఏర్పరుస్తుంది? (AS1)
జవాబు:

  1. కార్బన్ నవీన ఆవర్తన పట్టికలోని IVA లేదా 14వ గ్రూప్ కు చెందిన మూలకం.
  2. కార్బన్ C6 యొక్క ఎలక్ట్రానిక్ విన్యాసం 1s²2s²2p². ఇది ‘తన సమీప జడవాయువైన నియాన్ విన్యాసం పొందుటకు 4 ఎలక్ట్రానులు స్వీకరించాలి లేదా హీలియం విన్యాసం పొందుటకు 4 ఎలక్ట్రానులను కోల్పోవాలి.
  3. కార్బన్ కేంద్రకంలో 6 ప్రోటానులు ఉంటాయి. కాబట్టి అదనంగా 4 ఎలక్ట్రానులను స్వీకరిస్తే 6 ప్రోటానులు, 10 ఎలక్ట్రానులను బంధించవలసి వస్తుంది. కాబట్టి C4- సాధారణంగా ఏర్పడదు.
  4. ఇదే విధంగా 4 ఎలక్ట్రానులను కోల్పోతే C4+ అయాన్ ఏర్పడుతుంది. ఇలా ఏర్పడుటకు అధిక మోతాదులో శక్తి అవసరం. కాబట్టి ఇది కూడా దాదాపుగా ఏర్పడదు.
  5. కాబట్టి కార్బన్ తన చతుస్సంయోజకతను ఎలక్ట్రాన్ జంటను పంచుకోవడం ద్వారా సంతృప్తపరుచుకోవాలి.
  6. కాబట్టి కార్బన్ ఇతర కార్బన్ పరమాణువులతోకాని, ఇతర మూలకాల పరమాణువులతో కాని నాలుగు సంయోజనీయ బంధాలు ఏర్పరుస్తుంది.

ప్రశ్న 13.
ఇథనోల్ నుండి సోడియం ఇథాక్సెడ్ ఎలా తయారుచేయబడుతుంది? రసాయన సమీకరణంతో వివరించండి. (AS1)
జవాబు:
ఇథనోల్, సోడియం లోహంతో చర్య జరిపి సోడియం ఇథాక్సెడ్ ను ఏర్పరుస్తుంది. ఈ చర్యలో హైడ్రోజన్ వాయువు విడుదలవుతుంది.
AP Board 10th Class Physical Science Solutions 12th Lesson కార్బన్ – దాని సమ్మేళనాలు 5

ప్రశ్న 14.
ఇథనాల్ నుంచి ఇథనోయిక్ ఆమ్లం ఏ విధంగా ఏర్పడుతుందో రసాయన సమీకరణము ద్వారా వర్ణించండి. (AS1)
జవాబు:
క్షారీకృత పొటాషియం పర్మాంగనేట్ లేదా ఆఫీకృత పొటాషియం డై క్రోమేట్ సమక్షంలో ఆల్కహాలు ఆక్సీకరణానికి గురి అయ్యి కార్బాక్సిలిక్ ఆమ్లములను ఏర్పరుస్తాయి.

ఉదాహరణకు ఇథనాల్ లేదా ఇథైల్ ఆల్కహాల్ ఆల్కలైన్ పొటాషియం పర్మాంగనేట్ లేదా ఆమీకృత పొటాషియం డై క్రోమేట్ నుంచి ఆక్సిజన్‌ను గ్రహించి, ఆక్సీకరణ ప్రక్రియ ద్వారా ఇథనోయిక్ ఆమ్లం లేదా ఎసిటిక్ ఆమ్లంను ఏర్పరుస్తుంది.
AP Board 10th Class Physical Science Solutions 12th Lesson కార్బన్ – దాని సమ్మేళనాలు 7

ప్రశ్న 15.
సబ్బు యొక్క శుభ్రపరిచే చర్యను వివరించండి. (AS1)
(లేదా)
బట్టలను శుభ్రపరచుటలో సబ్బు యొక్క పనితీరును వివరించుము.
(లేదా)
బట్టలను సబ్బుతో శుభ్రపరచే క్రమములో మిసిలి యొక్క పాత్రను పట సహాయంతో వివరించుము.
జవాబు:
1) సబ్బులు, డిటర్జెంట్లు బట్టలలో ఉన్న నూనె మరియు మలినాలను నీటిలోకి వచ్చేటట్లు చేస్తాయి. దానివలన బట్టలు శుభ్రపరచబడతాయి.
AP Board 10th Class Physical Science Solutions 12th Lesson కార్బన్ – దాని సమ్మేళనాలు 8
2) సబ్బుకు ఒక వైపు కార్బాక్సల్ (ధృవ) కొన, మరొక వైపు హైడ్రోకార్బన్ గొలుసు (అధృవ) కొన ఉంటాయి.
3) ధృవపు చివర హైడ్రోఫిలిక్ గా ఉంటుంది. అనగా ఇది నీటిని ఆకర్షిస్తుంది.
4) అధృవపు చివర హైడ్రో- బిక్ గా ఉంటుంది. కాబట్టి బట్టలలోని గ్రీజు లేదా నూనెను ఆకర్షిస్తుంది. కాని నీటిని ఆకర్పించదు.
5) సబ్బును నీటిలో కరిగించినపుడు హైడ్రోఫోబిక్ చివర తనంతటతాను మలినాలతో కలిసిపోయి బట్టలలోని మలినాలను తొలగిస్తుంది. దీనిని పక్కన ఇవ్వబడ్డ పటంలో గమనించవచ్చు.
6) సబ్బులోని హైడ్రోఫోబిక్ ‘చివర మలినాలు లేక గ్రీజువైపుకు ఆకర్షించబడుతుంది.
7) హైడ్రోఫోబిక్ చివర మలినాలతో కలిసిపోయి మలిన కణాలను బట్టల నుంచి బయటకు లాగటానికి ప్రయత్నిస్తాయి.
8) సబ్బు అణువులు మలిన కణాల చుట్టూ చేరి ఒక గోళాకృత నిర్మాణాన్ని ఏర్పరుస్తాయి. దీనిని మిసిలి అంటారు.
AP Board 10th Class Physical Science Solutions 12th Lesson కార్బన్ – దాని సమ్మేళనాలు 9
9) ఈ మిసిలిలు కొల్లాయిడల్ ద్రావణంలోని కణాల లాగ నీటి అడుగున ఉండిపోతాయి.
10) వివిధ రకాల మిసిలిలు ఒకదానితో ఒకటి అయాన్-అయాన్ బలాలచే వికర్షించబడటం వలన అవక్షేపాన్ని ఏర్పరచవు.
11) కాబట్టి మిసిలిలలో ఉన్న మలిన పదార్థాలను ఉతకటం ద్వారా తేలికగా తొలగించవచ్చు.
12) ఈ విధంగా సబ్బు మిసిలిలు నీటిలో కరిగి బట్టలలోని మలినాలను తొలగిస్తాయి.

ప్రశ్న 16.
కార్బన్ సమ్మేళనాల ఎస్టరిఫికేషన్ మరియు సపోనిఫికేషన్ చర్యల మధ్య భేదాన్ని వివరించండి. (AS1)
(లేదా)
కర్బన సమ్మేళనాల యొక్క ఎస్టరిఫికేషన్ మరియు సఫోనిఫికేషన్ చర్యల మధ్యగల భేదంను వివరించుము.
జవాబు:
AP Board 10th Class Physical Science Solutions 12th Lesson కార్బన్ – దాని సమ్మేళనాలు 10 AP Board 10th Class Physical Science Solutions 12th Lesson కార్బన్ – దాని సమ్మేళనాలు 11

ప్రశ్న 17.
గ్రాఫైట్ నిర్మాణాన్ని బంధాలు ఏర్పడుట దృష్ట్యా వివరించండి. దాని నిర్మాణంపై ఆధారపడిన ఒక ధర్మాన్ని తెల్పండి. (AS1)
జవాబు:

  1. గ్రాఫైట్ ద్విమితీయ పొరల నిర్మాణాన్ని C – C బంధాలు అను ఈ పొరలలోనే కలిగి ఉంటుంది. ఈ పొరల మధ్య , బలహీన బలాలు పనిచేస్తాయి.
  2. ఈ పొరలు సమతల త్రిభుజీకరణ నిర్మాణాన్ని కలిగి ఉంటాయి.
  3. ఈ పొరలలో ప్రతి కార్బన్ sp² సంకరీకరణాన్ని కలిగి ఉంటుంది.
  4. ఈ sp² ఆర్బిటాళ్ళు అతిపాతం చెందడం వల్ల C- C బంధాలు ఏర్పడతాయి.
  5. ప్రతి కార్బన్ పరమాణువులో సంకరీకరణంలో పాల్గొనని ఒక p ఆర్బిటాల్ మిగిలిపోతుంది.
  6. ఈ అసంకరీకరణ p ఆర్బిటాళ్ళు ఒకదానితో ఒకటి అతిపాతం చెంది మొత్తం పొరపై కేంద్రీకృతమయ్యే π వ్యవస్థను ఏర్పరుస్తాయి.
  7. రెండు పొరల. మధ్య బలహీన ఆకర్షణ బలాలు లేక వాండర్ వాల్ బలాలు 3.35Å దూరంతో వేరుచేయబడతాయి.
  8. ఈ బలాలు నీటి సమక్షంలో మరింత బలహీనపడతాయి. కాబట్టి గ్రాఫైట్ లోని బలాలు విచ్ఛిన్నం చేయుట తేలిక.
  9. అందువలన గ్రాఫైట్ ను కందెనగాను మరియు పెన్సిల్ లో లెడ్ గాను ఉపయోగిస్తున్నారు.

AP Board 10th Class Physical Science Solutions 12th Lesson కార్బన్ – దాని సమ్మేళనాలు

ప్రశ్న 18.
వెనిగర్ లో ఉండే ఆమ్లం పేరు ఏమిటి? (AS1)
(లేదా)
వెనిగర్ కలిగి ఉండు ఆమ్లంను తెలుపుము.
జవాబు:

  1. 5 – 8% ఎసిటిక్ ఆమ్ల ద్రావణాన్ని వెనిగర్ అంటారు.
  2. కాబట్టి వెనిగర్ లో ఉన్న ఆమ్లం ఇథనోయిక్ లేదా ఎసిటిక్ ఆమ్లం (CH3COOH).

ప్రశ్న 19.
ఇథనోల్ లో చిన్న సోడియం ముక్కను వేస్తే ఏమి జరుగుతుంది? (AS2)
(లేదా)
సోడియంను ఇథనోలకు కల్పిన ఏమగును?
జవాబు:
ఇథనోల్ లో సోడియం ముక్కను వేస్తే బుసలు పొంగుతూ హైడ్రోజన్ వాయువు వెలువడుతుంది మరియు ఈ ప్రక్రియలో సోడియం ఇథాక్సెడ్ కూడా ఏర్పడుతుంది.
AP Board 10th Class Physical Science Solutions 12th Lesson కార్బన్ – దాని సమ్మేళనాలు 12

ప్రశ్న 20.
A, B అనే రెండు కర్బన సమ్మేళనాల అణుఫార్ములాలు వరుసగా C3H8 మరియు C3H6 అయితే ఆ రెండింటిలో ఏది సంకలన చర్యలను ప్రదర్శిస్తుంది? మీ సమాధానాన్ని ఎలా సమర్థించుకుంటారు? (AS2)
జవాబు:
a) C3H8 అనేది ఆల్కేనుల సమజాత శ్రేణికి చెందిన సమ్మేళనము. కాబట్టి ఇది ఒక సంతృప్త హైడ్రోకార్బన్ కాబట్టి సంకలన చర్యలో పాల్గొనదు.
b) C3H6 అనగా ఇది ఆల్కీనుల సమజాత శ్రేణికి చెందిన సమ్మేళనము. ఇది ఒక ద్విబంధాన్ని కలిగి ఉంటుంది కాబట్టి అసంతృప్త హైడ్రోకార్బన్. కావున ఇది సంకలన చర్యలో పాల్గొని ఆల్కేనులను ఏర్పరుస్తుంది
AP Board 10th Class Physical Science Solutions 12th Lesson కార్బన్ – దాని సమ్మేళనాలు 13

ప్రశ్న 21.
నీటి కాఠిన్యతను పరిశీలించుటకు ఏదైన ఒక పరీక్షను సూచించండి మరియు దానిని సోదాహరణంగా వివరించండి. (AS3)
(లేదా)
నీటి యొక్క కఠినత్వంను తెలుసుకొనుటకు ఒక సాధారణ కృత్యంను వివరించుము.
జవాబు:
నీటి యొక్క కాఠిన్యతను ఒక నాణ్యమైన సబ్బు ద్వారా పరీక్షించవచ్చు.
పరీక్ష విధానము:

  1. సాలుగు పరీక్షనాళికలు తీసుకొని వాటికి A, B, C, D అనే లేబుల్స్ అంటించవలెను.
  2. వీటిలో ఒక్కొక్క దాంట్లో 50 మి.లీల చొప్పున వరుసగా కుళాయి, బావి, సరస్సు, చెరువు, నదిలోని నీటిని తీసుకొనవలెను.
  3. ఒక్కొక్క పరీక్ష నాళికలో 1 గ్రా. చొప్పున నాణ్యమైన సబ్బును కలపండి.
  4. పరీక్షనాళికలను బిరడాలతో బిగించండి.
  5. A పరీక్షనాళికను 15 సెకండ్ల పాటు తీవ్రంగా కుదిపి 30 సెకండ్ల పాటు కదలకుండా ఉంచాలి. నురగ ఎత్తును కొలవాలి. దానిని నోట్ బుక్ లో నమోదు చేసుకోవాలి.
  6. ఇదే పరీక్షను ప్రతి పరీక్షనాళికలోని నీటితో చేసి పరిశీలనలను నోట్ బుక్ లో నమోదుచేసుకోవాలి. ఏ పరీక్షనాళికలోని నీరు తక్కువ నురగ ఎత్తును ఇస్తుందో అది కఠిన నీరు.

ప్రశ్న 22.
‘X’ అనే ఒక సమ్మేళనం C2H6O అనే అణుఫార్ములాను కలిగి ఉండి KMnO4 ఆమ్ల సమక్షంలో ఆక్సీకరణ చర్యలో పాల్గొని ‘Y’ అనే సమ్మేళనాన్ని ఏర్పరిచింది. దాని అణుఫార్ములా C2H4O2 అయినా
a) X మరియు Y ని కనుక్కోండి. (AS3)
b) ‘X’అనే సమ్మేళనం ‘Y’ తో చర్య జరిపినపుడు ఏర్పడే సమ్మేళనం పచ్చళ్ళ నిల్వకోసం ఉపయోగించేది. అయితే ఏర్పడే సమ్మేళనంకు సంబంధించిన మీ పరిశీలనలను నమోదు చేయండి.
జవాబు:
a) X: C2H6O – ఇథనోల్
Y: C2H4O2

ఇథనోయిక్ ఆమ్లం. ఇథనోలను క్షారీకృత KMnO4 తో ఆక్సీకరణం చెందిస్తే ఇథనోయిక్ ఆమ్లం ఏర్పడుతుంది.
AP Board 10th Class Physical Science Solutions 12th Lesson కార్బన్ – దాని సమ్మేళనాలు 14

ఇథనోయిక్ ఆమ్లంను ఊరగాయలు ఎక్కువ కాలం నిల్వ ఉంచడానికి ఉపయోగిస్తారు.

b) ఇథనోల్ (X)ను గాఢ సల్ఫ్యూరిక్ ఆమ్ల సమక్షంలో ఇథనోయిక్ (Y) ఆమ్లంతో చర్య జరిపితే మంచి సువాసన గల ఇథైల్ విసిటేట్ (ఎస్టర్) అనే సమ్మేళనం ఏర్పడుతుంది.
AP Board 10th Class Physical Science Solutions 12th Lesson కార్బన్ – దాని సమ్మేళనాలు 15

ప్రశ్న 23.
పండ్లను కృత్రిమంగా పక్వం చేయుటకు ఇథిలీన్ ఉపయోగించటం గురించిన సమాచారాన్ని సేకరించండి. ఒక నివేదిక తయారు చేయండి. (AS4)
(లేదా)
కృత్రిమముగా మనము నిజ జీవితంలో వాడు పండ్లను పక్వము చెందించుటకు ఇథిలీస్ ఏ విధంగా ఉపయోగపడునో, సమాచారాన్ని సేకరించుము.
జవాబు:
మొదటి పద్ధతి :

  1. కాయలను పెద్ద పెద్ద చెక్క పెట్టెలలో (క్రేట్) భద్రపరుస్తారు. ఈ పెట్టెలను మండుతున్న వంట చెరుకుపైన ఏర్పాటు చేస్తారు.
  2. ఈ పొగలో ఇథిలీన్ మరియు ఎసిటిలీన్ వాయువులు ఉంటాయి. ఇవి కాయలు పండ్లుగా మారడానికి ఉపయోగపడతాయి.

రెండవ పద్ధతి :

  1. కాయలను ఇథిలీన్ లేదా ఎసిటిలీన్ వాయువులు ఉన్న గదిలో ఉంచుతారు.
  2. వాటివల్ల కాయలు కృత్రిమంగా పళ్లవలే మారుతాయి.

మూడవ పద్ధతి :
ఈ పద్ధతిలో కాయలపై కాల్షియం కార్బైడ్ ను రాస్తారు. ఇది గాలిలోని తేమతో చర్య పొంది ఎసిటిలీన్ వాయువును విడుదల చేస్తుంది. అది కాయలు కృత్రిమంగా పండ్లుగా మారుటకు తోడ్పడుతుంది.

ప్రశ్న 24.
ఈథేన్ అణువు యొక్క ఎలక్ట్రాన్ బిందు నిర్మాణాన్ని గీయండి. (AS5)
జవాబు:
AP Board 10th Class Physical Science Solutions 12th Lesson కార్బన్ – దాని సమ్మేళనాలు 16

ప్రశ్న 25.
C2H4O2 అణుఫార్ములా కలిగిన ఒక కర్బన సమ్మేళనం, సోడియం కార్బొనేట్/బైకార్బోనేట్ కలయికతో మంచి సువాసన గల వాయువును ఇస్తుంది. కింది ప్రశ్నలకు సమాధానాలివ్వండి.
a) ఆ కర్బన సమ్మేళనం ఏమై ఉంటుంది? (AS1)
జవాబు:
ఆ కర్బన సమ్మేళనం ఇథనోయిక్ ఆమ్లం (CH3COOH).

b) వెలువడిన వాయువు పేరేమిటి? (AS1)
జవాబు:
విడుదలయిన వాయువు కార్బన్ డై ఆక్సెడ్ (CO2).

c) వెలువడిన వాయువును ఎలా పరీక్షిస్తారు? (AS2)
జవాబు:
1) విడుదలయిన వాయువును సున్నపుతేట గుండా పంపితే అది తెల్లని పాలవలె మారుతుంది.
2) ఒక మండుతున్న అగ్గిపుల్లను ఈ వాయువు వద్దకు తీసుకొని వస్తే అది దానిని ఆర్పివేస్తుంది.

d) పై చర్యకు తగిన సమీకరణం వ్రాయండి. (AS3)
జవాబు:
2CH3COOH + Na2CO3 → 2CH3COONa + H2O + CO2
CH3COOH + NaHCO3 → CH3COONa + H2O + CO2

e) పై కర్బన సమ్మేళనం యొక్క రెండు ముఖ్యమైన ఉపయోగాలు రాయండి. (AS1)
జవాబు:

  1. ఊరగాయలు ఎక్కువ కాలం నిల్వ ఉండడానికి ఇథనోయిక్ ఆమ్లాన్ని ఉపయోగిస్తారు.
  2. దీనిని శుభ్రపరిచే కారకంగా కూడా ఉపయోగిస్తారు.

AP Board 10th Class Physical Science Solutions 12th Lesson కార్బన్ – దాని సమ్మేళనాలు

ప్రశ్న 26.
నిల్వచేయుటకు ఉపయోగించే కార్బాక్సిలికామ్లము పేరు ఏమిటి? (AS1)
(లేదా)
ఆహార నిల్వకై ఉపయోగించు ఆమ్లమును వ్రాయుము.
జవాబు:
ఆహారం నిల్వ చేయడంలో ఉపయోగపడే ఆమ్లం ఎసిటిక్ ఆమ్లం (ఇథనోయిక్ ఆమ్లం).

ప్రశ్న 27.
వెల్డింగ్ చేయుటకు ఇథైన్, ఆక్సిజన్స్ మిశ్రమాన్ని మండిస్తారు. ఇజైన్ మరియు గాలిని ఎందుకు ఉపయోగించరో చెప్పగలరా? (AS1)
(లేదా)
వెల్డింగ్ చేయుటలో ఇథైన్ మరియు ఆక్సిజన్లను మాత్రమే ఉపయోగించుటకు గల కారణమేమి?
జవాబు:

  1. ఇథైన్ ను మండించడం ఒక దహనచర్యకు ఉదాహరణ. అనగా ఇది ఆక్సిజన్ సమక్షంలో జరుగుతుంది.
  2. కాని గాలి N2, CO2, O2 వంటి అనేక వాయువుల మిశ్రమం.
  3. కాబట్టి ఈ వాయువుల మిశ్రమ సమక్షంలో దహనచర్య సరిగా జరగకపోవడం వల్ల విడుదలయ్యే ఉష్ణశక్తి తక్కువగా ఉంటుంది.
  4. కావున వెల్డింగ్ నందు ఇథైన్ ను ఆక్సిజన్ సమక్షంలో మండిస్తారు.

ప్రశ్న 28.
వనస్పతి తయారీలో సంకలన చర్యను ఎలా ఉపయోగిస్తారో రసాయన సమీకరణం సహాయంతో వివరించండి. (AS1)
(లేదా)
వనస్పతి తయారీలో హైడ్రోజనీకరణం ఏ విధముగా ఉపయోగపడునో, రసాయన సమీకరణం ద్వారా వివరింపుము.
జవాబు:
నికెల్ ఉత్ప్రేరక సమక్షంలో అసంతృప్త నూనెలను హైడ్రోజన్ వాయువుతో సంకలన చర్యకు గురిచేయడం ద్వారా వనస్పతిని తయారు చేస్తారు.
AP Board 10th Class Physical Science Solutions 12th Lesson కార్బన్ – దాని సమ్మేళనాలు 17

ప్రశ్న 29.
A) ఒక సమ్మేళనం అణుఫార్ములా C3H6O. ఈ అణుఫార్ములాతో రాయగలిగిన వివిధ నిర్మాణాలను రాయండి. (AS1)
B) మీరు రాసిన సమ్మేళనాల IUPAC పేర్లను సూచించండి.
C) ఈ సమ్మేళనాలలోని పోలికలు ఏమిటి?
జవాబు:
A) C3H6O అణుఫార్ములాకు సంబంధించిన వివిధ నిర్మాణాత్మక ఫార్ములాలు : –
1) CH3CH2CHO
2) CH3COCH3

B) పైన తెల్పిన సమ్మేళనాల IUPAC పేర్లు మరియు వాటి నిర్మాణాలు.
AP Board 10th Class Physical Science Solutions 12th Lesson కార్బన్ – దాని సమ్మేళనాలు 18

C) ఈ రెండు సమ్మేళనాల అణుఫార్ములా ఒకటే.

ప్రశ్న 30.
క్రోమిక్ ఎన్ హైడ్రైడ్ లేదా ఆమీకృత పొటాషియం పర్మాంగనేట్ లలో ఏదేని ఒకదానితో ఇథనాల్ ను ఆక్సీకరణ చెందిస్తే ఏర్పడే ఉత్పన్నం ఏమిటి? (AS1)
జవాబు:
ఇథనోల్ ను క్రోమిక్ ఎన్ హైడ్రైడ్ లేక ఆల్కలైన్ పొటాషియం పర్మాంగనేట్ సమక్షంలో ఆక్సీకరణం చెందిస్తే మొదట. ఇథనాల్ లేదా ఎసిటాల్డి హైడ్ ఏర్పడుతుంది. చివరకు ఎసిటిక్ ఆమ్లం లేదా ఇథనోయిక్ ఆమ్లం ఏర్పడుతుంది.
AP Board 10th Class Physical Science Solutions 12th Lesson కార్బన్ – దాని సమ్మేళనాలు 19

ప్రశ్న 31.
సమజాత శ్రేణిలో CH3OHCH2CH3 కి తరువాత వచ్చే సమ్మేళనం యొక్క IUPAC పేరును రాయండి. (AS1)
జవాబు:
CH3OHCH2CH3 అనగా 2-ప్రొపనోల్ లేదా ప్రొపాన్-2-ఓల్. దీని తరువాత వచ్చే సమజాతీయ సమ్మేళనం CH3CH2OHCH2CH3. దీని IUPAC పేరు 2-బ్యుటనోల్ లేదా బ్యూటాన్-2-ఓల్.

ప్రశ్న 32.
మూలకాలు, సమ్మేళనాలు లేదా మిశ్రమాలు ఏవి రూపాంతరత అనే ధర్మాన్ని చూపుతాయి ? సరైన ఉదాహరణలతో వివరించండి. (AS1)
(లేదా)
కర్బన సమ్మేళనాలలో రూపాంతరత ధర్మం యొక్క ప్రాధాన్యతను ఉదహరించుము.
జవాబు:
రూపాంతరతను మూలకాలు ప్రదర్శిస్తాయి.

రూపాంతరత :
ఒక మూలకం వివిధ రూపాలలో లభ్యమవుతూ దాదాపు ఒకే రసాయన ధర్మాలను ప్రదర్శిస్తూ, వేరువేరు భౌతిక, ధర్మాలను కలిగి ఉండడాన్ని రూపాంతరత అంటారు. కార్బన్ అనేక రూపాంతరాలను కలిగి ఉంటుంది.

1) అస్ఫటిక రూపం : కోక్, కోల్, కొయ్యబొగ్గు.
2) స్ఫటిక రూపం : వజ్రం, గ్రాఫైట్, బక్ మిస్టర్ ఫుల్లరిన్, నానోట్యూబులు.

AP Board 10th Class Physical Science Solutions 12th Lesson కార్బన్ – దాని సమ్మేళనాలు

ప్రశ్న 33.
ఇథనోల్ మరియు ఇథనోయిక్ ఆమ్లాల మధ్య భేదాన్ని చూపించే ఒక రసాయన చర్యను వర్ణించండి. (AS3)
జవాబు:

  1. రెండు వేరు వేరు పరీక్షనాళికలలో ఇథనోల్ మరియు ఇథనోయిక్ ఆమ్లములను తీసుకొనండి.
  2. ఈ రెండు పరీక్షనాళికలకు సుమారు 18 గ్రాముల సోడియం బై కార్బోనేట్ (NaHCO3) ను కలపండి.
  3. ఇథనోయిక్ ఆమ్లం ఉన్న పరీక్షనాళికలో అసంఖ్యాకమైన బుడగలు మరియు నురగను గమనించవచ్చు. ఎందువలన అనగా దీనిలో CO2 వాయువు వెలువడింది.
    NaHCO3 + CH3COOH → CH3COONa + H2O + CO2
  4. ఇథనోల్ ఉన్న పరీక్షనాళికలో ఎటువంటి నురగ, బుడగలు ఏర్పడవు. కారణం ఇథనోల్ సోడియం బై కార్బోనేట్ తో చర్య పొందదు.
    ఈ విధంగా ఇథనోల్, ఇథనోయిక్ ఆమ్లంను వేరుచేయవచ్చు.

ప్రశ్న 34.
మీథేన్, ఈథేన్, ఈథేన్ మరియు ఈథైన్ అణువుల నమూనాలను బంకమట్టి మరియు అగ్గిపుల్లలతో తయారు చేయండి. (AS4)
జవాబు:
విద్యార్థులు తమ సొంత నమూనాలను ఈ విధంగా తయారు చేసుకోవచ్చు.

  1. బంకమన్ను, బంతులను కర్బన పరమాణువులకు ఉపయోగించవచ్చు.
  2. అగ్గిపుల్లలోని పుల్లను బంధాన్ని సూచించుటకు, తలను హైడ్రోజన్ పరమాణువులను సూచించుటకు ఉపయోగిస్తారు.

ప్రశ్న 35.
రోజువారీ జీవితంలో ఎస్టర్ల పాత్రను నీవు ఎలా ప్రశంసిస్తావు? (AS6)
(లేదా)
నిజ జీవితంలో మనము ఎస్టర్లను ఏ విధంగా వినియోగిస్తామో ప్రశంసించుము.
జవాబు:
ఎస్టర్లు ప్రత్యేక సువాసన కలిగిన సమ్మేళనాలు. కాబట్టి వీటిని

  1. సెంట్లు, సబ్బులు, నెయిల్ పాలిష్ మొదలైన సౌందర్యాత్మక సాధనాలలో ఉపయోగిస్తారు.
  2. ఆల్కహాళ్ళు, ఫాటీ ఆమ్లాల తయారీలో ఉపయోగిస్తారు.
  3. పువ్వులు, పండ్లు ప్రత్యేక వాసన కలిగి ఉండడానికి వాటిలోని ఎస్టర్లు తోడ్పడుతున్నాయి.
  4. ఎస్టర్లను కొన్ని ప్రత్యామ్నాయ మందులుగాను, విటమిన్లలోను ఉపయోగిస్తున్నారు.

ఈ విధంగా అనేక నిత్యజీవిత అంశాలలో ఎస్టర్లు ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి. కాబట్టి వాటి పాత్ర ఎంతో అభినందనీయం.

ప్రశ్న 36.
సమాజంలో కొంతమంది ఆల్కహాల్ త్రాగడాన్ని ఒక అలవాటుగా కలిగి ఉంటారు. దీనిని నీవు ఎలా ఖండిస్తావు? (AS7)
(లేదా)
“మద్యం సేవనం ఒక దుర్వ్యసనము” నీవు దీనిని ఎలా సమర్థిస్తావు?
జవాబు:

  1. ఆల్కహాల్ ను వివిధ పానీయాలుగా సేవించడం ఆరోగ్యానికి హానికరం.
  2. అది రక్త ప్రసరణ వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది.
  3. ఆల్కహాల్ కు బానిస కావడం వలన గుండెకు సంబంధించిన వ్యాధులు వస్తాయి. అంతేకాకుండా కాలేయం పాడయిపోతుంది.
  4. చిన్న ప్రేగులలో ఆమ్లత్వం పెరగడం వల్ల పుండ్లు ఏర్పడతాయి. జీర్ణవ్యవస్థను దెబ్బ తీస్తుంది.
  5. కొన్ని ప్రాంతాలలో మిథైల్ ఆల్కహాల్ సేవించుట వలన గుడ్డితనం ఏర్పడటమే కాక ప్రాణాలకు కూడా హాని ఏర్పడుతుంది.
  6. కాబట్టి ఆల్కహాల్ వినియోగాన్ని ప్రతి ఒక్కరు అరికట్టవలసి ఉన్నది. ఎందువలన అనగా దాని ప్రభావం సమాజంపై తీవ్రస్థాయిలో ఉన్నది.

ప్రశ్న 37.
1మి.లీ గ్లేసియల్ ఎసిటిక్ ఆమ్లము మరియు 1 మి.లీ. ఇథనాలను ఒక పరీక్ష నాళికలో తీసుకొని, దానికి కొన్ని చుక్కల గాఢ సల్ఫ్యూరిక్ ఆమ్లమును కలిపి ఆ మిశ్రమాన్ని వెచ్చటి నీటిలో 5 నిమిషాల పాటు ఉంచారు.
ఈ క్రింది ప్రశ్నలకు సమాధానాలు తెల్పండి.
ఎ) చర్యానంతరం ఏర్పడే ఫలిత సమ్మేళనం ఏమిటి? (AS2)
జవాబు:
ఏర్పడే ఫలిత సమ్మేళనం పేరు ఇథైల్ ఎసిటేట్ (CH3COOC2H5).

బి) పై చర్యను రసాయన సమీకరణంతో సూచించండి. (AS1)
జవాబు:
AP Board 10th Class Physical Science Solutions 12th Lesson కార్బన్ – దాని సమ్మేళనాలు 20

సి) పై చర్యను పోలిన చర్యలను సూచించుటకు ఉపయోగించే పదమేమిటి? (AS1)
జవాబు:
పైన ఏర్పడ్డ చర్యను, ఎస్టరీకరణం అంటారు.

డి) ఏర్పడిన సమ్మేళనమునకు ఉండే ప్రత్యేక లక్షణాలేమిటి? (AS1)
జవాబు:
ఏర్పడే సమ్మేళనం తియ్యని వాసనను కలిగి ఉంటుంది.

ఖాళీలను పూరించండి

1. ద్విబంధం మరియు త్రిబంధాలను కలిగి ఉండే కర్బన సమ్మేళనాలను ………….. అంటారు. (అసంతృప్త హైడ్రోకార్బన్లు)
2. దగ్గుటానిలో ముఖ్య అనుఘటకంగా ఉండే సమ్మేళనం ……………… (ఇథనోల్)
3. ఇథనోయిక్ ఆమ్లం యొక్క చాలా విలీనపరచిన ద్రావణం …………. (వెనిగర్)
4. ఆల్కహాల్, కార్బాక్సిలిక్ ఆమ్లాల చర్య వలన ఏర్పడే తియ్యని వాసన గల పదార్థం ……………… (ఎస్టర్)
5. ఇథనాల్ లో సోడియం లోహాన్ని జారవిడిస్తే ………… వాయువు వెలువడుతుంది. (హైడ్రోజన్)
6. మిథనాల్ లోని ప్రమేయ సమూహం ……………… (ఆల్కహాల్)
7. 3 కర్బన పరమాణువులను కలిగి ఉన్న ఆల్కేన్ యొక్క IUPAC నామము ………… (ప్రొపీన్)
8. ఆలైన్ సమజాతశ్రేణిలోని మొదటి సమ్మేళనం ………. (ఇథైన్)
9. గాఢ సల్ఫ్యూరికామ్లంలో ఇథనాల్ యొక్క నిర్జలీకరణ చర్య కారణంగా …….. ఏర్పడుతుంది. (ఈథేన్)
10. అమ్మోనియాలోని ఏక సమయోజనీయ బంధాల సంఖ్య ……………. (3)
11. ఆల్కేన్లు ………… చర్యలలో పాల్గొంటాయి. (ప్రతిక్షేపణ చర్యలు)

సరైన సమాధానాన్ని ఎన్నుకోండి

1. విలీన ఎసిటికామ్లాన్ని కింది రసాయనాలను కలిగి ఉన్న 4 పరీక్షనాళికలలో కలిపారు.
i) KOH
ii) NaHCO3
iii) K2CO3
iv) NaCl
ఏ పరీక్షనాళికలో సువాసనగల వాయువు ఏర్పడుతుంది?
A) i & ii
B) ii & iii
C) i & iv
D) ii &.in
జవాబు:
B) ii & iii

AP Board 10th Class Physical Science Solutions 12th Lesson కార్బన్ – దాని సమ్మేళనాలు

2. కింది సూచించిన శాతాలలో ఏ శాతపు ఎసిటికామ్లాన్ని నీటితో కలిపి పచ్చళ్ళను నిల్వచేసే వెనిగర్ వాడుతారు?
A) 5-10%
B) 10-15%
C) 20-130%
D) 100%
జవాబు:
A) 5-10%

3. ఆల్డిహైడ్ పేరును రాయడానికి ఉపయోగించే పరపదం ఏమిటి?
A) ఓల్ – ol
B) ఆల్ – al
C) ఓన్ – one
D) ఈన్ – ene
జవాబు:
B) ఆల్ – al

4. ఎసిటికామ్లాన్ని నీటిలో కలిపినపుడు అది ద్విగతంగా అయాలుగా విడిపోతుంది. ఎందుకంటే అది ఒక
A) బలహీన ఆమ్లం
B) బలమైన ఆమ్లం
C) బలహీన క్షారం
D) బలమైన క్షారం
జవాబు:
A) బలహీన ఆమ్లం

5. కింది ఏ హైడ్రోకార్బన్ అణు సాదృశ్యాన్ని ప్రదర్శిస్తుంది?
A) C2H4
B) C2H6
C) C3H8
D) C4H10
జవాబు:
D) C4H10

6. సాధారణంగా హైడ్రోకార్బన్ల దహనంతో పాటు సాధారణంగా ఏర్పడునవి ……….
A) వేడి
B) కాంతి
C) వేడి, కాంతి రెండూ
D) విద్చుచ్ఛక్తి
జవాబు:
C) వేడి, కాంతి రెండూ

7. A, B, C అనే మూడు పరీక్షనాళికలను తీసుకొని, 2 మి.లీ. ఇథనోయిక్ ఆమ్లాన్ని ప్రతిదాంట్లోనూ తీసుకొని వాటికి 2 మి.లీ., 4 మి.లీ. మరియు 8 మి.లీ. నీటిని కలిపారు. ఏ పరీక్షనాళికల్లో స్పష్టమైన ద్రావణం (Clear Solution) ఏర్పడుతుంది?
A) పరీక్షనాళిక Aలో మాత్రమే
B) పరీక్షనాళికలు A, B లలో మాత్రమే
C) పరీక్షనాళికలు B, C లలో మాత్రమే
D) అన్ని పరీక్ష నాళికలలో
జవాబు:
D) అన్ని పరీక్ష నాళికలలో

8. 5 మి.లీ. నీటికి 2 మి.లీ. ఎసిటికామ్లాన్ని చుక్కలు చుక్కలుగా కలిపినపుడు దీనిని గమనించవచ్చు.
A) నీటి పైన ఒక ప్రత్యేక పొరగా ఆమ్లం ఏర్పడడం
B) నీరు, ఆమ్లంపైన ఒక ప్రత్యేక పొరగా ఏర్పడడం
C) స్పష్టమైన సజాతీయ ద్రావణం ఏర్పడడం
D) పింక్ రంగులోనున్న స్పష్టమైన ద్రావణం ఏర్పడడం
జవాబు:
C) స్పష్టమైన సజాతీయ ద్రావణం ఏర్పడడం

9. ఘన సోడియం కార్బోనేట్ కు కొన్ని చుక్కల ఇథనోయిక్ ఆమ్లాన్ని కలిపినపుడు కింది చర్య జరుగుతుంది.
A) వేగంగా బుడగలుగా వాయువు వెలువడుతుంది.
B) గోధుమ రంగు పొగలు వెలువడుతాయి.
C) సువాసనగల వాయువు వెలువడుతుంది.
D) కుళ్ళిన వాసనగల వాయువు వెలువడుతుంది.
జవాబు:
A) వేగంగా బుడగలుగా వాయువు వెలువడుతుంది.

AP Board 10th Class Physical Science Solutions 12th Lesson కార్బన్ – దాని సమ్మేళనాలు

10. ఎసిటికామ్లం , ఇథైల్ ఆల్కహాల్ తో చర్య జరుపునపుడు దానికి గాఢ సల్ఫ్యూరిక్ ఆమ్లంగా కలుపుతాం. అది ……. వలె ఉపయోగపడుతుంది. ఈ ప్రక్రియను …………….. అంటాం.
A) ఆక్సీకారిణి, సఫోనిఫికేషన్
B) నిర్జలీకారిణి, ఎస్టరిఫికేషన్
C) క్షయకారిణి, ఎస్టరిఫికేషన్
D) ఆమ్లం, ఎస్టరిఫికేషన్
జవాబు:
B) నిర్జలీకారిణి, ఎస్టరిఫికేషన్

10th Class Physical Science 12th Lesson కార్బన్ – దాని సమ్మేళనాలు Textbook InText Questions and Answers

10th Class Physical Science Textbook Page No. 287

ప్రశ్న 1.
జంతు సంబంధమైన కొవ్వులను వంటకు ఉపయోగించకూడదంటారు ఎందుకు?
జవాబు:

  1. జంతువుల కొవ్వు సంతృప్త ఫాటీ ఆమ్లాలను కలిగి ఉంటుంది. అవి హృద్రోగాలకు కారణం అవుతున్నాయి.
  2. జంతువుల కొవ్వు అధికంగా స్వీకరించడం వలన ఊబకాయం కూడా ఏర్పడుతుంది.

ప్రశ్న 2.
వంట చేయుటకు ఏ నూనెలు మంచివి? ఎందుకు?
జవాబు:

  1. కనోల మొక్క యొక్క విత్తనాలను పిండి చేయగా కనోల నూనె తయారగును.
  2. ఇది అన్నింటికన్నా ఆరోగ్యవంతమైన వంటనూనెగా పరిగణించబడుతున్నది. దీనికి కారణం ఇది తక్కువ సంతృప్త ఫాటీ ఆమ్లాలను కలిగి ఉంటుంది. అంతేకాకుండా మోనోసాచురేటెడ్ కొవ్వు మరియు ఎక్కువ ఒమేగా – 3 మరియు ఒమేగా కొవ్వులను కలిగి ఉంటుంది.
  3. కాబట్టి కనోల నూనెను వంట చేయుటకు ఉపయోగించుట ఉత్తమం.

10th Class Physical Science Textbook Page No. 261

ప్రశ్న 3.
కార్బన్ తన బాహ్య క్యలో నాలుగు ఎలక్ట్రాన్లను కోల్పోయి, హీలియం ఎలక్ట్రాన్ విన్యాసాన్ని పొందగలదా?
జవాబు:

  1. కార్బన్ బాహ్య కర్పరం నాలుగు ఎలక్ట్రానులను కోల్పోతే అది C4+ ఏర్పరచాలి.
  2. కాని దీనికి అధిక మొత్తంలో శక్తి అవసరం. కాని సాధారణ పరిస్థితులలో ఈ శక్తి అందుబాటులో ఉండదు.
  3. కాబట్టి C4+ ఏర్పడటం దాదాపు అసంభవం.
    కాబట్టి కార్బన్ C4+ అయాన్లను ఏర్పరచదు.

10th Class Physical Science Textbook Page No. 262

ప్రశ్న 4.
కార్బన్ పరమాణువులు పైన సూచించిన విధంగా అనేక రకాల బంధాలను ఏవిధంగా ఏర్పరచగలుగుతాయి?
జవాబు:
వేలన్సీ బంధ సిద్ధాంతం ప్రకారం కార్బన్ యొక్క నాలుగు సంయోజక ఎలక్ట్రానులు (ఒంటరి ఎలక్ట్రానులు) కార్బన్ పరమాణువులు వివిధ రకాల బంధాలు ఏర్పరచడానికి కారణం.

10th Class Physical Science Textbook Page No. 263

ప్రశ్న 5.
ఎలక్ట్రాన్ ను ఉత్తేజపరిచే ఈ శక్తి ఎక్కడి నుండి వస్తుంది?
జవాబు:

  1. సాధారణంగా కార్బన్ పరమాణువు భూస్థాయిలోనే ఉంటుంది.
  2. కాని వేరే పరమాణువులతో బంధమేర్పరచాలనుకొన్నప్పుడు ఉత్తేజిత స్థాయికి చేరడానికి కావలసిన శక్తిని కార్బన్ మరియు ఇతర పరమాణువుల మధ్య బంధం ఏర్పడినపుడు విడుదలయ్యే శక్తిని వినియోగించుకొంటుంది.

10th Class Physical Science Textbook Page No. 264

ప్రశ్న 6.
కార్బన్ యొక్క నాలుగు ఒంటరి ఎలక్ట్రాన్లను కలిగి ఉన్న ఆర్బిటాళ్ళు, శక్తి రీత్యా సమానంగా మారుతాయని ఎలా వివరించగలం?
జవాబు:
‘సంకరీకరణం’ అనే దృగ్విషయం ద్వారా దీనిని వివరించవచ్చు.

10th Class Physical Science Textbook Page No. 267

ప్రశ్న 7.
CH4, C2H4 మరియు C2H2 అణువులలోని \(\text { HĈH }\) బంధ కోణములు ఎంతెంత?
జవాబు:
CH4 లోని \(\text { HĈH }\) బంధ కోణం 109.5°. C2H4 లోని \(\text { HĈH }\) బంధ కోణం 120°.
C2H4 లోని \(\text { HĈH }\) బంధ కోణం 180°.

10th Class Physical Science Textbook Page No. 273

ప్రశ్న 8.
హైడ్రోకార్బన్లు అంటే ఏమిటి?
జవాబు:
కార్బన్, హైడ్రోజన్లను మాత్రమే కలిగియున్న సమ్మేళనాలను హైడ్రోకార్బన్లు అంటారు.

10th Class Physical Science Textbook Page No. 274

ప్రశ్న 9.
అన్ని కర్బన సమ్మేళనాలలో సమాన సంఖ్యలో కార్బన్ (C) మరియు హైడ్రోజన్ (H) పరమాణువులు కలిగి ఉన్నాయా?
జవాబు:
ఉండవు.

AP Board 10th Class Physical Science Solutions 12th Lesson కార్బన్ – దాని సమ్మేళనాలు

10th Class Physical Science Textbook Page No. 277

ప్రశ్న 10.
కార్బన్ ఇతర మూలకాలతో బంధాన్ని ఏర్పరచగలదా?
జవాబు:
కార్బన్ ఇతర మూలక పరమాణువులైన హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్, సల్ఫర్, పాస్ఫరస్, హాలోజన్లతో బంధాలు ఏర్పరుస్తుంది.

10th Class Physical Science Textbook Page No. 287

ప్రశ్న 11.
ఉత్ప్రేరకం అంటే ఏమిటో తెలుసా?
జవాబు:
రసాయన చర్యలో పాల్గొనకుండా రసాయన చర్యా వేగాన్ని నియంత్రించే పదార్థాలను ఉత్ప్రేరకాలు అంటారు.

10th Class Physical Science Textbook Page No. 290

ప్రశ్న 12.
ఎస్టర్లు అంటే ఏమిటి?
జవాబు:
ప్రమేయ సమూహం కలిగిన సమ్మేళనాలను ఎస్టర్లు అంటారు.
వీటి సాధారణ ఫార్ములా. R – COO – R’
AP Board 10th Class Physical Science Solutions 12th Lesson కార్బన్ – దాని సమ్మేళనాలు 26

10th Class Physical Science Textbook Page No. 292

ప్రశ్న 13.
నిజ ద్రావణం (true solution) అంటే ఏమిటి?
జవాబు:
1nm కంటే తక్కువ వ్యాసం గల ద్రావిత కణాలు ద్రావణంలో విక్షేపణం చెందడం వల్ల ఏర్పడే ద్రావణాన్ని నిజ ద్రావణం అంటారు.

10th Class Physical Science Textbook Page No. 262

ప్రశ్న 14.
కార్బన్ పరమాణువు యొక్క ఉత్తేజస్థితిలోని జతకూడని 4 ఒంటరి ఎలక్ట్రాన్లు ఎలా ఉంటాయి?
జవాబు:
AP Board 10th Class Physical Science Solutions 12th Lesson కార్బన్ – దాని సమ్మేళనాలు 27

10th Class Physical Science Textbook Page No. 263

ప్రశ్న 15.
మీథేన్ అణువు (CH4) లో కార్బన్ – హైడ్రోజన్ బంధాలు నాలుగూ ఒకేరకమైనవి మరియు \(\text { HĈH }\) బంధకోణం 109°28′. దీనిని మనం ఎలా వివరించగలం?
జవాబు:
కార్బన్ ఉత్తేజిత స్థాయిలో p- ఆర్బిటాల్ లో మూడు ఒంటరి ఎలక్ట్రానులు మరియు S- ఆర్బిటాల్ లో ఒక ఒంటరి ఎలక్ట్రానను కలిగి ఉంటుంది. ఈ నాలుగు వేలన్సీ ఆర్బిటాళ్ళు వివిధ శక్తులను కలిగి ఉంటాయి. కాబట్టి ఈ ఆర్బిటాళ్ళు సంకరీకరణం చెంది నాలుగు సర్వసమాన ఆర్బిటాళ్లను ఏర్పరుస్తాయి. నాలుగు హైడ్రోజన్ పరమాణువులు కార్బతో కలిసి నాలుగు సర్వసమాన C – H బంధాలను ఏర్పరుస్తాయి. మరియు ఈ బంధాల మధ్య బంధకోణం 109°28′ ఉంటుంది. (అత్యల్ప వికర్షణ కొరకు)

ప్రశ్న 16.
మీథేన్ అణువులో శక్తిరీత్యా అసమానమైన సంయోజనీయత గల ఎలక్ట్రాన్లు సమానమైన నాలుగు సమయోజనీయతా బంధాలను ఏ విధంగా ఏర్పరుస్తాయి? ఇది ఎలా జరుగుతుంది?
జవాబు:

  1. బంధాలు ఎక్కువ ఏర్పడే కొద్ది శక్తి ఎక్కువ అవడం వలన ఆ అణువు స్థిరంగా ఉంటుంది.
  2. కార్బన్ నాలుగు బంధాలను ఏర్పరిస్తే రెండు బంధాలు ఏర్పడటం కంటే ఎక్కువ శక్తి విడుదలవ్వడం వలన అధిక స్థిరత్వం పొందుతుంది.
  3. 28 ఆర్బిటాల్ మరియు 2p ఆర్బిటాలకు మధ్య శక్తి తేడా తక్కువగా ఉంటుంది. కార్బన్ బంధాన్ని ఏర్పరచాలనుకొన్నపుడు బంధ శక్తి నుంచి లభించే కొద్దిగా శక్తి 28 లోని ఎలక్ట్రాన ను 2p లోకి పంపిస్తుంది. ఈ విధంగా నాలుగు ఒంటరి ఎలక్ట్రానులు ఏర్పడతాయి.
  4. ఈ S మరియు p ఆర్బిటాళ్ళు సంకరీకరణం చెంది నాలుగు సర్వసమాన ఆర్బిటాళ్ళను ఏర్పరుస్తాయి. కాబట్టి వివిధ శక్తులు కలిగిన వేలన్సీ ఎలక్ట్రానులు సంకరీకరణం వలన నాలుగు సర్వసమాన బంధాలను మీథేన్ లో ఏర్పరుస్తాయి.

10th Class Physical Science Textbook Page No. 269

ప్రశ్న 17.
పెన్సిల్ లో పేపర్ పై చేసే గుర్తులను (రాతను) మీరు ఏవిధంగా అర్థం చేసుకొంటారు?
జవాబు:

  1. పేపర్ పై పెన్సిల్ తో రాసినపుడు గ్రాఫైట్లో గల లోపలి పొరల మధ్య ఆకర్షణ బలాలు విచ్ఛిన్నం అవుతాయి. కాబట్టి విడిపడిన గ్రాఫైట్ పొరలు పేపర్‌పై ఉండిపోతాయి.
  2. అంతేకాకుండా ఈ పెన్సిల్ మార్కింగ్ లను ఎరేజర్ ద్వారా తేలికగా తొలగించవచ్చు. ఎందువలన అనగా గ్రాఫైట్ పొరలు పేపరును గట్టిగా అంటిపెట్టుకొని ఉండవు.

10th Class Physical Science Textbook Page No. 272

ప్రశ్న 18.
రసాయన శాస్త్రంలో కార్బన్, దాని సంయోగ పదార్థాలకు ప్రత్యేకంగా ఒక శాఖను కేటాయించడం సమంజసమేనా? మరే విధమైన మూలకానికి ఇటువంటి ప్రత్యేక శాఖ కేటాయించబడలేదు. దీనిని ఎలా సమర్థిస్తావు?
జవాబు:

  1. మనము జీవించడానికి అవసరమయ్యే పదార్థాలయిన కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, న్యూక్లియిక్ ఆమ్లాలు, లిపిడ్లు, హార్మోన్లు మరియు విటమిన్లు అన్నీ కార్బనను కలిగి ఉన్నాయి.
  2. మన శరీరంలో జరిగే జీవక్రియలలో కూడా కర్బన సమ్మేళనాలు ప్రధానపాత్ర వహిస్తున్నాయి.
  3. మనకు ప్రకృతి నుంచి లభించే ఆహారము; అనేక మందులు, నూలు, ఉన్ని వంటి వస్త్రాలు, పెట్రోలియం, సహజ వాయువు వంటి ఇంధనాలు అన్నీ కర్బన సమ్మేళనాలు.
  4. కృత్రిమ వస్త్రాలు, ప్లాస్టిక్ లు, కృత్రిమ రబ్బరు అన్నీ కర్బన సమ్మేళనాలు.
  5. ఈ విధంగా ఇన్ని రంగాలలో ఉపయోగపడుతున్న కార్బన్ సమ్మేళనాలకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పరచుట ఖచ్చితంగా సరియైన నిర్ణయం

AP Board 10th Class Physical Science Solutions 12th Lesson కార్బన్ – దాని సమ్మేళనాలు

10th Class Physical Science Textbook Page No. 276

ప్రశ్న 19.
కింద ఇవ్వబడిన రెండు. హైడ్రోకార్బన్స్ నిర్మాణాలను పరిశీలించండి.
AP Board 10th Class Physical Science Solutions 12th Lesson కార్బన్ – దాని సమ్మేళనాలు 28
i) పై నిర్మాణాలలో ఏం తేడాను గమనించారు?
జవాబు:
ఆ రెండు వేరు వేరు సమ్మేళనాలు. (a) బ్యూటేన్ (b) 2-మిథైల్ ప్రోపేన్ లేదా ఐసో బ్యూటేన్.

ii) (a) మరియు (b) నిర్మాణాలలో ఎన్ని కార్బన్, హైడ్రోజన్ పరమాణువులు ఉన్నాయి ?
జవాబు:
(a) మరియు (b) నిర్మాణాలలో నాలుగు కార్బన్, పది హైడ్రోజన్ పరమాణువులు కలవు.

iii) (a) మరియు (b) ల అణుఫార్ములా రాయండి. అవి ఒకే విధంగా ఉన్నాయా?
జవాబు:
C4H10 అవును. ఒకే విధంగా ఉన్నాయి.

10th Class Physical Science Textbook Page No. 285

ప్రశ్న 20.
ఏదేని సమ్మేళనం పేరును చెబితే, దాని నిర్మాణాన్ని మనం గీయగలమా?
జవాబు:

  1. రూట్ పదం నుంచి ప్రధాన గొలుసులో కర్బన పరమాణువులను రాసుకోవాలి.
  2. ఇచ్చిన పేరు ఆధారంగా ఎడమ నుంచిగాని కుడి నుంచి గాని కర్బన పరమాణువులను లెక్కించాలి.
  3. ప్రతిక్షేపకాలను పేరులో ఇచ్చిన విధంగా కర్బన పరమాణువులపై ప్రతిక్షేపించుకోవాలి.
  4. ప్రమేయ సమూహం ఫార్ములాలు ఇచ్చిన పేరు బట్టి రాసుకోవాలి.
  5. కార్బన్ యొక్క చతుర సంయోజకత దృష్టిలో పెట్టుకొని వాటి యొక్క సంయోజకతను హైడ్రోజన్లతో సంతృప్తి పరచాలి.

10th Class Physical Science Textbook Page No. 286

ప్రశ్న 21.
అప్పుడప్పుడు గ్యాసు లేదా కిరోసిన్ స్టవ్ పైన వంట చేస్తున్నప్పుడు వంట పాత్రలపై నల్లని మసి ఏర్పడుతుంది. ఎందుకు?
జవాబు:
బర్నర్ లేదా స్టవ్ కు సంబంధించిన గాలి రంధ్రాలు మలినాలతో మూసుకొని పోవడం వలన ఇంధన వాయువులు పూర్తిగా మండవు. అందువలన పూర్తిగా మండని కార్బన్ వంట పాత్రలపై ఏర్పడటం వలన వంటపాత్రలు నల్లగా అవుతాయి.

10th Class Physical Science Textbook Page No. 288

ప్రశ్న 22.
వాహనాలు నడిపే వ్యక్తులు మద్యం తీసుకొన్నారా లేదా అని పోలీసులు ఎలా కనుగొంటారో మీకు తెలుసా?
జవాబు:

  1. పోలీస్ అధికారి అనుమానిత డ్రైవర్‌ను పొటాషియం డై క్రోమేట్ (K2Cr2O7) స్ఫటికాలు కలిగిఉన్న ఒక ప్లాస్టిక్ సంచిలోకి, ఒక గుర్తించగల పరికరం యొక్క మౌత్ పీస్ ద్వారా ఊదమంటారు.
  2. అతను ఊదిన గాలిలో ఇథనోల్ ఉంటే అది K2Cr2O7 మంచి ఆక్సీకరణి అవుటచే వెంటనే ఇథనాల్ మరియు ఇథనోయిక్ ఆమ్లంగా మారిపోతుంది.
  3. అంతేకాకుండా నారింజరంగులోని Cr2O72- అయాన్ ఈ ఆక్సీకరణ ప్రక్రియ వలన ఆకుపచ్చని Cr3+ అయాన్లుగా మారుతుంది.
  4. గొట్టంలో ఎంతభాగం ఆకుపచ్చని రంగులో మారుతుందో దాని ఆధారంగా సేవించిన ఆల్కహాల్ పరిమాణాన్ని లెక్కిస్తారు.
  5. ఇంతేకాకుండా పోలీసులు IR వర్ణపటాల ద్వారా C – OH, C – H మరియు CH3 – CH2 – OH బంధాలను లెక్కించడం ద్వారా కూడా ఆల్కహాల్ పరిమాణాన్ని కనుగొంటారు.

10th Class Physical Science Textbook Page No. 266

ప్రశ్న 23.
ఒక ఏకబంధం మరియు ఒక త్రిబంధం ఏర్పరచగల కార్బన్ సామర్థ్యాన్ని మీరేవిధంగా వివరిస్తారు?
జవాబు:
1) ఈజైన్ ఎసిటిలీన్ (C2H2) అణువును ఉదాహరణ తీసుకొని ఒక ఏకబంధం మరియు ఒక త్రిబంధాన్ని కార్బన్ ఎలా ఏర్పరుస్తుందో వివరించవచ్చు.
2) ఎసిటిలీన్ అణువులోని రెండు కార్బన్ పరమాణువుల మధ్య ఒక త్రిబంధం ఉంటుంది.
3) పరమాణువు యొక్క చతుర సంయోజనీయతను సంతృప్తపరచడానికి ప్రతి కార్బన్ పరమాణువు ఒక హైడ్రోజన్ తో బంధాన్ని ఏర్పరుస్తుంది
(H – C ≡ C – H).
AP Board 10th Class Physical Science Solutions 12th Lesson కార్బన్ – దాని సమ్మేళనాలు 29

4) ఎసిటిలీన్ (C2H2) అణువులో రెండు కార్బన్, రెండు హైడ్రోజన్ పరమాణువులున్నాయి.
5) ఉత్తేజిత స్థితిలో ప్రతి కార్బన్ పరమాణువులో ఒక S – ఆర్బిటాల్ (2s) మరియు ఒక p – ఆర్బిటాల్ (2px) కలవటం వలన sp సంకరీకరణం జరిగి రెండు సర్వసమానమైన sp ఆర్బిటాళ్ళు ఏర్పడతాయి.
6) ప్రతి కార్బన్ పరమాణువు రెండు సంకరీకరణం చెందని p – ఆర్బిటాళ్ళు (2px, 2py) కలిగి ఉంటుంది.
AP Board 10th Class Physical Science Solutions 12th Lesson కార్బన్ – దాని సమ్మేళనాలు 30
7) ఒక కార్బన్ లోని sp సంకర ఆర్బిటాల్ మరో కార్బన్ లోని sp సంకర ఆర్బిటాల్ తో అతిపాతం చెందటం వలన sp – sp సిగ్మా బంధం ఏర్పడుతుంది.
8) కార్బన్లో గల మరో sp ఆర్బిటాల్, హైడ్రోజన్ పరమాణువు యొక్క S – ఆర్బిటాల్ లో అతిపాతం చెందడం వలన రెండు S – sp సిగ్మా బంధాలు ఏర్పడతాయి.
9) కార్బన్ పరమాణువులో ఉండే సంకరీకరణం చెందని p ఆర్బిటాల్, వేరొక కార్బన్ పరమాణువులోని p ఆర్బిటాల్ లో అతిపాతం చెందడం వలన రెండు π బంధాలు ఏర్పడతాయి. ( πpy – py మరియు πpz – pz).
10) అందుచేత ఈథేన్ పరమాణువు (H – C = C – H) లో 3 సిగ్మా బంధాలు, రెండు IT బంధాలు ఉంటాయి.

10th Class Physical Science Textbook Page No. 267

ప్రశ్న 24.
AP Board 10th Class Physical Science Solutions 12th Lesson కార్బన్ – దాని సమ్మేళనాలు 31
క్రమంలో కార్బన్ పరమాణు కేంద్రకాల మధ్యగల బంధ దూరాన్ని, బంధ శక్తులను ఊహించగలరా? వివరించండి.
జవాబు:
AP Board 10th Class Physical Science Solutions 12th Lesson కార్బన్ – దాని సమ్మేళనాలు 32
AP Board 10th Class Physical Science Solutions 12th Lesson కార్బన్ – దాని సమ్మేళనాలు 33

10th Class Physical Science Textbook Page No. 293

ప్రశ్న 25.
జిడ్డుగా నున్న బట్టపై సబ్బు కణాలు జరిపే చర్య ఏమిటి?
జవాబు:

  1. సబ్బు లేదా డిటర్జెంట్లు నూనె మరియు మలినాలను నీటిలోకి వచ్చేటట్లు చేస్తాయి. ఈ విధంగా బట్టలను శుభ్రపరుస్తాయి.
  2. సబ్బులో ఒక చివర ధృవంగా, మరొక చివర ధృవరహితంగాను ఉంటుంది.
  3. ధృవపు చివర హైడ్రోఫిలిక్ గాను, ధృవరహిత చివర హైడ్రోఫోబి గాను ఉంటుంది.
  4. ధృవరహిత చివర హైడ్రోఫోబిక్ గా ఉండటం వలన ఇది గ్రీజు లేదా నూనె చేత ఆకర్షించబడుతుంది.
  5. సబ్బుని నీటిలో కరిగిస్తే హైడ్రోఫోబిక్ చివర మలినాలు గ్రీజు లేక మలినాలను అతుక్కొని వాటిని నీటి నుంచి తొలగిస్తాయి.
  6. హైడ్రోఫోబిక్ చివర మరియు గ్రీజు కణాల వైపుకు కదులుతాయి.
  7. హైడ్రోఫోబిక్ చివర మలిన కణాలకు అతుక్కొని మలిన కణాలను బయటకు లాగడానికి ప్రదర్శిస్తాయి.
  8. సబ్బు అణువులు మలిన కణాల చుట్టూ చేరి గోళాకృత నిర్మాణాన్ని ఏర్పరుస్తాయి. దీనిని మిసిలి అంటారు.
  9. ఈ మిసిలిలు కొల్లాడయిల్ ద్రావణంలోని కణాలలాగ నీటి అడుగున ఉండి పోతాయి.
  10. వివిధ రకాల మిసిలిలు ఒకదానిలో ఒకటి అయాన్ – అయాన్ బలాల చేత వికర్షించబడటం వలన అవక్షేపాన్ని ఏర్పరచవు.
  11. కాబట్టి మిసిలిలో ఉన్న మలిన పదార్థాలను తేలికగా తొలగించవచ్చు.
  12. ఈ విధంగా సబ్బు మిసిలిలు నీటిలో కరిగి బట్టలలోని మలినాలను తొలగిస్తాయి.

AP Board 10th Class Physical Science Solutions 12th Lesson కార్బన్ – దాని సమ్మేళనాలు

పరికరాల జాబితా

పరీక్షనాళికలు, నీటి తొట్టె, బున్సెన్ బర్నర్, ఇథనోల్, ఎసిటికామ్లం , గాఢ సల్ఫ్యూరికామ్లం, బంతి-పుల్లల నమూనాలు

10th Class Physical Science 12th Lesson కార్బన్ – దాని సమ్మేళనాలు Textbook Activities

కృత్యములు

కృత్యం – 1

ప్రశ్న 1.
కింది నిర్మాణాత్మక ఫార్ములాలను పరిశీలించి, వాటి పేర్లను మీ నోట్ బుక్ లో రాయండి.
1) CH3 – CH2 – CH = CH2
జవాబు:
బ్యూట్-1-ఈన్

2)
AP Board 10th Class Physical Science Solutions 12th Lesson కార్బన్ – దాని సమ్మేళనాలు 21
జవాబు:
2-మిథైల్ బ్యూటేన్

3) CH3 – CH2 – CH2 – CH2 – CH2 – CH3
జవాబు:
హెక్సేన్

4)
AP Board 10th Class Physical Science Solutions 12th Lesson కార్బన్ – దాని సమ్మేళనాలు 22
జవాబు:
3-మిథైల్, బ్యూట్-1-ఈన్

5) CH3 – C ≡ CH
జవాబు:
ప్రొప్-1-ఐన్

కృత్యం – 2

ప్రశ్న 2.
కింది కర్బన సమ్మేళనాల పేర్లను చదివి, వాటి నిర్మాణాత్మక ఫార్ములాలను మీ నోటు పుస్తకంలో రాయండి.
AP Board 10th Class Physical Science Solutions 12th Lesson కార్బన్ – దాని సమ్మేళనాలు 23

కృత్యం – 3

ప్రశ్న 3.
ఎస్టరీకరణ చర్యను కృత్యం ద్వారా వివరించండి.
జవాబు:
AP Board 10th Class Physical Science Solutions 12th Lesson కార్బన్ – దాని సమ్మేళనాలు 24

  1. ఒక పరీక్షనాళికలో 1 మి.లీ ఇథనోలు (అబ్సల్యూట్ ఆల్కహాల్) మరియు 1 మి.లీ. గడ్డకట్టిన ఎసిటిక్ ఆమ్లం (glacial acetic acid) అలాగే కొన్ని చుక్కల గాఢ సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని తీసుకోండి.
  2. నీటితొట్టిలో వేడి చేయండి లేదా వేడి నీటిని కలిగి ఉన్న బీకర్ లో కనీసం 5 నిమిషాలు పటంలో చూపిన విధంగా ఉంచండి.
  3. 20-50 మి.లీ. నీరుగల బీకరులోనికి వెచ్చగా ఉండే ఈ ద్రావణాన్ని కలపండి.

గమనించినది :
ఒక మంచి తియ్యని వాసనగల ద్రావణం ఏర్పడటం గమనించవచ్చు.

ఫలితం :
ఏర్పడిన పదార్థమే ఎస్టరు. ఈ చర్యనే ఎస్టరీకరణ చర్య అంటారు.

కృత్యం – 4

ప్రశ్న 4.
మిసిలీ తయారీ విధానమును వివరించుము.
జవాబు:
AP Board 10th Class Physical Science Solutions 12th Lesson కార్బన్ – దాని సమ్మేళనాలు 25

  1. 10 మి.లీ. ల చొప్పున నీటిని రెండు పరీక్షనాళికలలో తీసుకొనుము.
  2. రెండింటిలోను ఒక చుక్క వంటనూనెను కలిపి వాటికి A మరియు B అనే లేబుల్స్ అంటించవలెను.
  3. B పరీక్షనాళికకు కొన్ని చుక్కల సబ్బు ద్రావణాన్ని కలపవలెను.
  4. రెండు పరీక్షనాళికలను కొంత సమయం పాటు తీవ్రంగా కుదపవలెను.
  5. కుదపడం ఆపిన వెంటనే రెండు పరీక్షనాళికలలో నూనె, నీటి పొరలు ఏర్పడవు.
  6. కొంతసేపు పరీక్షనాళికలను కదపకుండా ప్రక్కన ఉంచండి.
  7. B పరీక్షనాళికలో నూనె పొర వేరు చేయబడుతుంది. దీనికి కారణం, దానిలో సబ్బు ద్రావణం ఉండటం.

AP Board 10th Class Social Solutions Chapter 19 రాజకీయ ధోరణుల ఆవిర్భావం : 1977-2000

SCERT AP 10th Class Social Study Material Pdf 19th Lesson రాజకీయ ధోరణుల ఆవిర్భావం : 1977-2000 Textbook Questions and Answers.

AP State Syllabus 10th Class Social Solutions 19th Lesson రాజకీయ ధోరణుల ఆవిర్భావం : 1977-2000

10th Class Social Studies 19th Lesson రాజకీయ ధోరణుల ఆవిర్భావం : 1977-2000 Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
కింది వాటిని జతపరచండి : (AS1)

1) సరళీకృత ఆర్థిక విధానంa) విదేశీ దిగుమతులపై పన్నుల మీద పరిమితులు
2) ఇష్టమొచ్చినట్లు తొలగించటంb) కేంద్ర ప్రభుత్వం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు
3) ఇతరుల తొలగింపుc) తమ కంటే భిన్నంగా ఉన్న ప్రజలకు
4) సమాఖ్య సిద్ధాంతంd) రాష్ట్ర ప్రభుత్వాలకు మరింత స్వయం ప్రతిపత్తి

జవాబు:

1) సరళీకృత ఆర్థిక విధానంa) విదేశీ దిగుమతులపై పన్నుల మీద పరిమితులు
2) ఇష్టమొచ్చినట్లు తొలగించటంb) కేంద్ర ప్రభుత్వం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు
3) ఇతరుల తొలగింపుc) తమ కంటే భిన్నంగా ఉన్న ప్రజలకు
4) సమాఖ్య సిద్ధాంతంd) రాష్ట్ర ప్రభుత్వాలకు మరింత స్వయం ప్రతిపత్తి

ప్రశ్న 2.
స్వాతంత్ర్యానంతర రెండవ దశలో పార్టీ వ్యవస్థలో ప్రధాన మార్పులను గుర్తించండి. (AS1)
జవాబు:

  1. 1976-85 మధ్యకాలం భారతదేశ ప్రజాస్వామ్యానికి పరీక్షాకాలం వంటిది.
  2. మౌలిక ప్రజాస్వామిక హక్కులను తిరస్కరించిన అత్యవసర పరిస్థితితో మొదలై, రాజీవ్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ చారిత్రాత్మక ఎన్నికల విజయంతో ముగిసింది.
  3. ఈ కాలం కాంగ్రెస్ పార్టీ పాలనతోనే మొదలై ముగిసినప్పటికీ కేంద్రంలోనూ, రాష్ట్రాలలోనూ కాంగ్రెస్ కి ప్రత్యామ్నాయాలు రూపొందాయి.
  4. ఈ కాలం భారతదేశం ఏకపార్టీ ప్రజాస్వామ్యంలోకి జారిపోకుండా సమర్థవంతంగా నివారించింది.
  5. పోటీదారు ప్రత్యామ్నాయాలు ఏర్పడటంతో భారతీయ ఓటర్లకు ఎంచుకోవటానికి అవకాశం లభించింది.
  6. దీనివల్ల రాష్ట్ర జాతీయస్థాయి రాజకీయాలలో విభిన్న రాజకీయ దృక్పథాలకు, వర్గ ప్రయోజనాలకు అవకాశం లభించింది.
  7. సోషలిస్టులు, హిందూ జాతీయతావాదులు, కమ్యూనిస్టుల వంటి రాజకీయ దృక్పథాలు, రైతులు, దళితులు, వెనుకబడిన కులాలు, ప్రాంతాల వంటి వర్గ ప్రయోజనాలు కూడా ముందుకు వచ్చి తమ హక్కుల కోసం పోరాడసాగారు.
  8. ఇదే సమయంలో పర్యావరణ ఉద్యమం, స్త్రీవాద ఉద్యమం, పౌరహక్కుల ఉద్యమం, సాహిత్య ఉద్యమం వంటి ఉద్యమాలు మొదలై సామాజిక మార్పునకు బలమైన చోదకశక్తులుగా మారాయి.
  9. రాజకీయ పార్టీలు మారిన పరిస్థితులకనుగుణంగా తమ మ్యానిఫెస్టోలను మార్చుకోవలసి వచ్చింది.

AP Board 10th Class Social Solutions Chapter 19 రాజకీయ ధోరణుల ఆవిర్భావం : 1977-2000

ప్రశ్న 3.
కేంద్ర, రాష్ట్ర స్థాయిలలో వివిధ ప్రభుత్వాల ప్రధాన ఆర్థిక విధానాలలో వేటిని గురించి ఈ అధ్యాయంలోనూ, ఇంతకు ముందు అధ్యాయాలలోనూ చర్చించారు ? వాటిల్లో పోలికలు, తేడాలు ఏమిటి? (AS1)
జవాబు:
పోలికలు:

  1. హరిత విప్లవాన్ని రాష్ట్రాల సహకారంతో కేంద్రం అమలుచేసింది.
  2. వి.పి.సింగ్ ప్రభుత్వం ప్రకటించిన ‘ఓబిసి’లకు రిజర్వేషన్లు అప్పటికే అనేక రాష్ట్రాలలో అమలు చేస్తున్నారు.

కేంద్ర, రాష్ట్ర స్థాయిలలో వివిధ ప్రభుత్వాల ఆర్థిక విధానాల మధ్య తేడాలు :

కేంద్రస్థాయి ఆర్థిక విధానాలురాష్ట్రస్థాయి ఆర్థిక విధానాలు
1. ప్రణాళికాబద్ధ అభివృద్ధి ద్వారా కులం, మతం, ప్రాంతం వంటి విభజన ధోరణులు తగ్గి భారతదేశం బలమైన దేశంగా ఎదుగుతుందని భావించి నెహ్రూ ప్రణాళికా సంఘాన్ని ఏర్పాటు చేశాడు. మొదటి పంచవర్ష ప్రణాళిక వ్యవసాయానికి ప్రాధాన్యతనిచ్చింది.1. పశ్చిమబెంగాల్ :
1977లో సిపిఎంకి చెందిన “జ్యోతిబసు” ప్రభుత్వం ఏర్పడింది. ఈ ప్రభుత్వం రాష్ట్రంలో అసంపూర్తిగా ఉన్న భూసంస్కరణలను చేపట్టింది.
ఎ) 1978 లో పశ్చిమ బెంగాల్ లో కౌలుదార్ల పేర్లను నమోదుచేసింది.
బి) వాళ్ల హక్కులను కాపాడటానికి “ఆపరేషన్ బర్గా” ను చేపట్టింది. (కౌలుదార్లను బెంగాలీలో బర్గాదార్లు అంటారు.)
సి) ఆపరేషన్ బర్గా ఫలితంగా కౌలుదార్లను భూస్వాములు బలవంతంగా తొలగించటానికి వీలులేకుండా పోయింది.
డి) కౌలుదార్ల హక్కును వారసత్వం చేసి అది కొనసాగేలా చూశారు.
ఇ) పంటలో, పెట్టుబడి కౌలుదారు పెడితే 75%, భూస్వామి పెడితే 50% కౌలుదారుకి దక్కేలా ప్రభుత్వం చూస్తుంది.
2. నెహ్రూ భూసంస్కరణలు, వ్యవసాయ సహకార సంఘాలు, స్థానిక స్వపరిపాలన అనే మూడు రకాల భూసంస్కరణలను ప్రతిపాదించారు.
3. జమీందారీ వ్యవస్థ రద్దు, కౌలు విధానాల సంస్కరణ, భూపరిమితి విధానాలను నెహ్రూ ప్రవేశపెట్టారు.
4. 1964-67 మధ్య ఆహార ఉత్పత్తిని పెంచడానికి ‘హరిత విప్లవం’ను మొదలు పెట్టారు.
5. 1971 తరువాత ఇంధిరాగాంధీ ప్రైవేటు బ్యాంకులను జాతీయం చేసింది. రాజభరణాలను రద్దు చేసింది.
6. 1985లో రాజీవ్ గాంధీ ప్రభుత్వం సరళీకృత విధానాలవైపు మొగ్గు చూపింది.2. ఆంధ్రప్రదేశ్ :
1982 లో ఆంధ్రప్రదేశ్ లో “నందమూరి తారక రామారావు” నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. చిన్న వర్గ ప్రజలను ఆకర్షించడానికి కొన్ని సంక్షేమ పథకాలను ప్రకటించింది.
ఎ) రెండు రూపాయలకు బియ్యం
బి) ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం
సి) మద్యపాన నిషేధం.
డి) పేదవారికి, రైతులకు బ్యాంకుల ద్వారా రుణాలు
7. వెనుకబడిన తరగతుల ప్రజలకి కూడా అవకాశాలు కల్పించుటకై ‘పి సింగ్’ ప్రభుత్వం, ప్రభుత్వ ఉద్యోగాలలోను, విద్యాసదుపాయాలలోను రిజర్వేషన్లు ప్రకటించింది. అనేక సమస్యలను ఎదుర్కొన్నది.
8. తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించడానికి 1992లో పి.వి. నరసింహారావు’ ప్రభుత్వం అంతర్జాతీయ ద్రవ్య నిధితో సంప్రదింపులు నిర్వహించింది. అది కొన్ని తీవ్ర షరతులతో భారతదేశం సరళీకృత ఆర్థిక విధానాలను అవలంభించేలా చేసింది.
9. దీనివల్ల విదేశీ కంపెనీలు భారతదేశంలో పరిశ్రమలను నెలకొల్పాయి. వ్యాపారాలు మొదలు పెట్టాయి. స్వదేశీ కర్మాగారాలు మూతపడ్డాయి.
10. భారతదేశం ప్రపంచ మార్కెట్ లోకి లాగబడింది. విద్య, ఆరోగ్యం, రవాణా వంటి అనేక ప్రభుత్వ సదుపాయాలు ప్రైవేటీకరణకు దారితీశాయి.

ప్రశ్న 4.
ప్రాంతీయ ఆకాంక్షలు ప్రాంతీయ పార్టీల ఏర్పాటుకు ఎలా దారితీశాయి ? రెండు దశలలోని పోలికలు, తేడాలను వివరించండి. (AS1)
జవాబు:
ప్రాంతీయ ఆకాంక్షల ఆవిర్భావం :
1) భారతదేశంలోని విభిన్న ప్రాంతాల్లో మరింత స్వయం ప్రతిపత్తి కోసం విభిన్న ఉద్యమాలు జరిగాయి.

2) ఆంధ్రప్రదేశ్ :
ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రులను కేంద్ర కాంగ్రెస్ నాయకత్వం తరచు మారుస్తుండటం, పై నుంచి నాయకులను రుద్దటం ఇక్కడి ప్రజలకు నచ్చలేదు.

  • జాతీయ కాంగ్రెస్ నాయకత్వం నుంచి ఆంధ్రప్రదేశ్ నాయకత్వానికి తగినంత గౌరవం లభించటం లేదని బావించసాగారు.
  • తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి అవమానం జరిగిందని భావించసాగారు.

3) అసోం :
స్వయం ప్రతిపత్తికి ఇదోరకమైన బలమైన ఉద్యమం.

  • బ్రిటిష్ పాలన నాటి నుండి రాష్ట్ర పాలనలోని కింది, మధ్య స్థాయి ఉద్యోగాలలో బెంగాలీలు ఉండేవారు.
  • బెంగాలీ అధికారులు తమని సమానులుగా కాకుండా 2వ తరగతి పౌరులుగా చూస్తున్నారని అస్సోమీయులు భావించేవారు.
  • స్వాతంత్ర్యం తరువాత బెంగాలీ మాట్లాడే ప్రజలు పెద్ద సంఖ్యలో అసోంలో సిరపడసాగారు.
  • ఇవన్నీ చాలవన్నట్లు సరిహద్దు ఆవల బంగ్లాదేశ్ నుంచి ఎంతోమంది వలస రాసాగారు.
  • దీంతో స్థానిక ప్రజలు తమ సాంస్కృతిక మూలాలు కోల్పోతామనీ, బయటివాళ్ళు ఎక్కువై తమ జనాభా తగ్గుతుందనీ భయపడసాగారు.

4) పంజాబ్ :
ఇక్కడ అత్యధిక శాతం ప్రజలు మాట్లాడే భాష, మతము ఆధారంగా ప్రజల సమీకరణ జరిగింది.

  • దేశాభివృద్ధిలో రాష్ట్రం పాత్రను విస్మరిస్తున్నారన్నదే పంజాబ్ ఆరోపణ.
  • రాష్ట్రం ఏర్పడినపుడు వారికి అన్యాయం జరిగిందని, రాజధాని ప్రాంతం చండీగఢ్ కేంద్రపాలిత ప్రాంతంగా కాక తమకే చెందాలనీ, భాక్రానంగల్ ఆనకట్ట నుంచి ఎక్కువ నీళ్ళు కావాలనీ, సైన్యంలోకి ఎక్కువమంది సిక్కులను తీసుకోవాలని కోరారు.

పోలికలు :

  1. తమ ఉనికిని గుర్తించాలనీ
  2. తమకు స్వయం ప్రతిపత్తి కల్పించాలనీ
  3. తమ జాతిమీద వేరొకరి ప్రభావం ఉండకూడదనీ
  4. తమకు అన్ని అవకాశాలు కల్పించాలనీ

తేడాలు:

  1. ఆంధ్రప్రదేశ్ లో తమ జాతి అవమానించబడుతోందనీ
  2. అసోంలో తమ సాంస్కృతిక మూలాలు కోల్పోతామనీ, తమ జనాభా తగ్గిపోతుందనీ
  3. పంజాబ్ లో తమకే మేలు జరగాలనీ ప్రాంతీయ ఉద్యమాలు వచ్చాయి.

AP Board 10th Class Social Solutions Chapter 19 రాజకీయ ధోరణుల ఆవిర్భావం : 1977-2000

ప్రశ్న 5.
ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యాలంటే రాజకీయ పార్టీలు సమాజంలోని భిన్న వర్గాల ప్రజలను ఆకర్షించాలి. స్వాతంత్ర్యానంతర రెండవ దశలో ఈ పనిని వివిధ రాజకీయ పార్టీలు ఎలా చేశాయి? (AS1)
జవాబు:

  1. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే రాజకీయ పార్టీలు సమాజంలోని భిన్న వర్గాల ప్రజలను ఆకర్షించాలి.
  2. స్వాతంత్ర్యానంతర రెండవ దశలో ఈ పనిని అన్ని రాజకీయ పార్టీలు అవలంబిస్తున్నాయి.
  3. సమాజంలోని రైతులు, దళితులు, వెనుకబడిన కులాలు, ప్రాంతాల వంటి వర్గ ప్రయోజనాలను కాపాడవలసిన అనసరం ఏర్పడింది.
  4. వారి అవసరాలను తీర్చటానికి ప్రభుత్వాలు అనేక సంక్షేమ కార్యక్రమాలను ఏర్పాటుచేయడం జరిగింది.
  5. పర్యావరణాన్ని పరిరక్షించే చర్యలు.
  6. స్త్రీ ప్రాధాన్యతను పెంచే చర్యలు.
  7. పౌరహక్కుల పరిరక్షణ కొరకు అనేక చర్యలు.
  8. సాహిత్యాన్ని రక్షించుటకు కొన్ని చర్యలను చేపట్టడం జరిగింది.
  9. పై చర్యలను చేపట్టడానికి, ఓటర్లను ఆకర్షించడానికి రాజకీయ పార్టీలు పోటీపడుతున్నాయి.

ప్రశ్న 6.
భారతీయ పరిపాలనా విధానంలో అందరినీ కలుపుకునే స్వభావం బలహీన పడటానికి కారణమైన పరిణామాలు ఏమిటి? వివిధ ప్రజలను, రాజకీయ ఆకాంక్షలను కలుపుకుని వెళ్లగల సామర్థ్యం ఏ విధంగా దెబ్బతింటోంది? (AS1)
జవాబు:
భారతీయ పరిపాలనా విధానంలో అందరినీ కలుపుకునే స్వభావం బలహీన పడటానికి కారణమైన పరిణామాలు :

  1. అనేక ప్రజా ఉద్యమాలు చెలరేగడం
  2. సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడటం
  3. సమాఖ్య వ్యవస్థను దెబ్బతీయాలని అనుకోవడం
  4. వేర్పాటువాదం తలెత్తడం
  5. ప్రాంతీయ, భాషా మతాభిమానాలు పెరిగిపోవడం
  6. సమర్థవంతమైన నాయకత్వం లోపించడం
  7. ప్రజల మనోభావాలను సంతృప్తి పరచలేకపోవడం
  8. విభిన్న భావాలు గల రాజకీయ నాయకులు సంతృప్తి పడకపోవడం

వివిధ ప్రజలను, రాజకీయ ఆకాంక్షలను కలుపుకుని వెళ్లగల సామర్థ్యం ఏ విధంగా దెబ్బతింటుంది అనగా –

  1. వివిధ ప్రజలకు, ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహించే ప్రాంతీయ పార్టీలు ఆవిర్భవించడం
  2. వారి ప్రాంతీయ ప్రయోజనాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం
  3. ప్రాంతీయ, కుల, మత ప్రయోజనాలను రెచ్చగొట్టి అత్యధికంగా ఓట్లు పొందాలని చూడటం
  4. స్వలాభం కొరకు జాతీయాభిమానాన్ని తాకట్టుపెట్టడం
  5. రాజకీయ ప్రయోజనాలతో సమాజ ప్రయోజనాలను దెబ్బతీయడం వంటి అంశాల వల్ల వివిధ ప్రజలను, రాజకీయ ఆకాంక్షలను కలుపుకుని వెళ్లగల సామర్థ్యం దెబ్బతింటోంది.

ప్రశ్న 7.
వివిధ ప్రాంతీయ ఆకాంక్షలు సాంస్కృతిక, ఆర్థిక కోణాలను ఏ విధంగా ఉపయోగించుకుంటాయి? (AS1)
జవాబు:
వివిధ ప్రాంతీయ ఆకాంక్షలు సాంస్కృతిక, ఆర్థిక కోణాలను కింది విధంగా ఉపయోగించుకుంటాయి.

  1. సంస్కృతిని, సంప్రదాయాలను పెంపొందిస్తాయి. వాటికి ప్రాధాన్యతను ఇస్తాయి.
    2
  2. భాషాభిమానాన్ని కలిగి ఉండి భాషాభివృద్ధికి దోహదం చేస్తాయి.
    ఉదా : ఆంధ్రప్రదేశ్ లో తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి అవమానం జరిగిందని భావించిన ఎన్.టి. రామారావు ప్రాంతీయ పార్టీని స్థాపించాడు.
  3. అంతేకాక పేదలకు రెండు రూపాయలకు కిలో బియ్యం, ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం, మద్యపాన నిషేధం వంటి ఆర్థిక సంక్షేమ పథకాలకు ప్రాధాన్యం ఇచ్చారు.
  4. అసోంలోని వ్యాపారం, ఇతర సంస్థలు అస్సోమేతర ప్రజల చేతుల్లో ఉన్నాయని, వాటిని ఇతరుల నుండి తొలగించి తమకు చెందేలా చేసుకోవాలని అసోం ప్రజలు భావించారు.
  5. అలాగే పంజాబ్ ప్రజలు రాజధాని నగరమైన చండీగఢ్ కేంద్రపాలిత ప్రాంతంగా కాక తమ రాష్ట్రానికే చెందాలనీ, భాక్రానంగల్ ఆనకట్ట నుంచి ఎక్కువ నీళ్ళు కావాలని, సైన్యంలోకి ఎక్కువ మంది సిక్కులను తీసుకోవాలని కోరడం మొదలగునవి ప్రాంతీయ పార్టీల ఆవిర్భావానికి దోహదం చేశాయి.

ప్రశ్న 8.
భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత తొలి సగంలో ప్రణాళికాబద్ధ అభివృద్ధికి ప్రాధాన్యతనిచ్చారు. రెండవ సగంలో సరళీకృత ఆర్థిక విధానానికి ప్రాధాన్యతను ఇచ్చారు. ఇవి రాజకీయ భావాలను ఎలా ప్రతిబింబించాయో చర్చించండి. (AS1)
జవాబు:
భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత తొలి సగంలో ప్రణాళికాబద్ధ అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడానికి, రెండవ సగంలో సరళీకృత ఆర్థిక విధానానికి ప్రాధాన్యత ఇవ్వడానికి ప్రధాన కారణాలు :

  1. స్వాతంత్ర్యం వచ్చిన ప్రారంభంలో భారతదేశంలో పేదరికాన్ని తొలగించడానికి బ్రిటిష్ వారు ప్రవేశపెట్టిన వలస ఆర్థిక విధానం నుండి మన ఆర్థిక వ్యవస్థను రూపొందించుటకు ప్రణాళికాబద్ద ఆర్థికవ్యవస్థను ప్రవేశపెట్టారు.
  2. వ్యవసాయ రంగాన్ని, పారిశ్రామిక రంగాన్ని, సేవారంగాలను అంచెలంచెలుగా అభివృద్ధి చేయడానికి ప్రణాళికలను అమలుచేశారు.
  3. సుస్థిరంగా, సమర్ధవంతంగా, వేగవంతంగా అభివృద్ధికి సంబంధించిన ప్రణాళికలను రూపొందించారు.
  4. అయితే వాటి వలన ప్రభుత్వ వ్యయం విపరీతంగా పెరిగిపోవడం వలన రెండవ సగంలో సరళీకృత ఆర్థిక విధానాన్ని అవలంబించారు. ఈ విధానం వలన –
    i) ప్రభుత్వ ఖర్చును తగ్గించుకోవటం అనగా రైతులకు ఇచ్చే సబ్సిడీలలో కోత, ప్రజాసేవలు, ఆరోగ్యం వంటి వాటిల్లో ప్రభుత్వ ఖర్చును తగ్గించటం.
    ii) విదేశీ పెట్టుబడులపై పరిమితులను తగ్గించుకోవటం.
    iii) విదేశీ సరుకుల దిగుమతుల మీద పరిమితులను, పన్నులను తగ్గించటం.
    iv) ఆర్థికరంగంలోని అనేక రంగాలలో ప్రైవేటు పెట్టుబడిదారులకు అవకాశం కల్పించటం వంటి చర్యల ద్వారా భారత ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడం జరిగింది.

AP Board 10th Class Social Solutions Chapter 19 రాజకీయ ధోరణుల ఆవిర్భావం : 1977-2000

ప్రశ్న 9.
సంకీర్ణ ప్రభుత్వం వల్ల విధానాలలో మధ్యేమార్గాన్ని అవలంబించటానికి సంకీర్ణ ప్రభుత్వంలోని వివిధ రాజకీయ పార్టీలు తమ ప్రాంతీయ కోరికలను సాధించుకునే విధానానికి ఉదాహరణలను వార్తాపత్రికలు, వార పత్రికలు చదవటం ద్వారా గుర్తించండి. (AS3)
జవాబు:

  1. 1990ల కాలంలో స్వాతంత్ర్యానంతర భారతదేశంలో చాలా కీలకమైన మార్పులు చోటుచేసుకున్నాయి.
  2. పోటీతో కూడిన బహుళపార్టీ వ్యవస్థకు మార్పుతో మెజారిటీ స్థానాలు గెలిచి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే స్థితి ఏ ఒక్క పార్టీకీ లేదు.
  3. 1989 నుంచి జాతీయస్థాయిలో ఏర్పడిన ప్రభుత్వాలన్నీ సంకీర్ణ మైనారిటీ ప్రభుత్వాలే.
  4. కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యడానికి అనేక జాతీయ, ప్రాంతీయ పార్టీలు కలవవలసి వచ్చింది.
  5. అలాంటి సమయంలో ప్రాంతీయ పార్టీలు ఆయా ప్రాంతాలకు, ప్రజలకు అద్దంపడుతూ వాటి అభివృద్ధికి కృషిచేయడం జరుగుతుంది.

10th Class Social Studies 19th Lesson రాజకీయ ధోరణుల ఆవిర్భావం : 1977-2000 InText Questions and Answers

10th Class Social Textbook Page No.272

ప్రశ్న 1.
ఈ రెండు సమస్యలతో ప్రభుత్వం వ్యవహరించిన తీరు మన ప్రజాస్వామిక రాజతంత్రాన్ని బలపరిచిందా, బలహీన పరిచిందా?
జవాబు:
ఈ రెండు సమస్యలు చాలా జటిలమై, ప్రభుత్వానికే సవాల్ గా నిలిచాయి. అయినప్పటికి ఈ సమస్యలలో ప్రభుత్వం వ్యవహరించిన తీరు వలన ప్రజాస్వామిక రాజతంత్రాన్ని బలపరచిందనే చెప్పాలి.

10th Class Social Textbook Page No.274

ప్రశ్న 2.
ప్రధానమంత్రి క్షమాపణ

రాజ్యసభలో డా|| మన్మో హన్ సింగ్ ప్రకటన –
………… 1984లో జరిగిన ఈ మహా జాతీయ విపతులో నాలుగు వేలమంది చంపబడ్డారు. ఒకే దేశంగా కలిసి పనిచేస్తున్న సందర్భంలో ఇటువంటి ఘోర విషాదాలు దేశంలో తిరిగి ఎన్నడూ జరగకుండా కొత్త దారులు కనుక్కోటానికి ప్రయత్నించాలి. ……. ఒక్క సిక్కు ప్రజలకే కాకుండా మొత్తం భారతదేశానికి క్షమాపణలు చెప్పటానికి నేను తటపటాయించను, ఎందుకంటే 1984లో జరిగింది మన రాజ్యాంగంలో పొందుపరిచిన దానికి, జాలి అన్న భావనకు పూర్తి వ్యతిరేకమయినది. మా ప్రభుత్వం తరపున, ప్రజలందరి తరపున ఇటువంటి ఘటన జరిగినందుకు నేను సిగ్గుతో తల వంచుకుంటున్నాను. అయితే దేశ వ్యవహారాల్లో శిఖరాలూ ఉంటాయి, లోయలు ఉంటాయి. గతం మనతో ఉంది, దానిని తిరగరాయలేం. కానీ మానవులుగా మనందరికీ మెరుగైన భవిష్యత్తును రూపొందించగల సామర్థ్యం , దృఢ చిత్తత మనకి ఉన్నాయి.
(pmindia mic co/Rs%20 speech.pdf) – 2005 ఆగస్టు 11.

పై సమాచారాన్ని చదివి క్రింది ప్రశ్నలకు జవాబులు వ్రాయండి.
1) ఈ ఉపన్యాసంలోని ప్రధాన సందేశం ఏమిటి?
జవాబు:

  1. 1984లో జరిగిన ఘోర విషాదాలు దేశంలో తిరిగి ఎన్నడూ జరగకుండా కొత్త దారులు కనుక్కోటానికి ప్రయత్నించాలి.
  2. 1984లో జరిగిన ఘోరానికి నేను క్షమాపణ తెలియచేస్తున్నాను అని మన్మోహన్ సింగ్ ప్రకటించారు.

2) ఈ ఉపన్యాసం ఏ సంకేతాలను పంపిస్తోంది?
జవాబు:

  1. దేశ వ్యవహారాలలో శిఖరాలు ఉంటాయి, లోయలు ఉంటాయి. కొన్నిసార్లు కొన్ని రకాలైన పనులు చేయవలసి వస్తుంది.
  2. గతాన్ని తిరగ రాయలేం. కానీ మానవులం కనుక మెరుగైన భవిష్యత్తును రూపొందించగల సామర్థ్యం, దృఢ చిత్తం మనకున్నాయని సంకేతాలిస్తుంది.

3) ప్రధానమంత్రి ఈ ఉపన్యాసం చెయ్యటంలోని ప్రాముఖ్యత ఏమిటి?
జవాబు:

  1. 1984లో జరిగినది మన రాజ్యాంగంలో పొందుపరచిన దానికి, జాతి అన్న భావనకు పూర్తి వ్యతిరేకమయినది.
  2. మా ప్రభుత్వం తరుపున, ప్రజల తరుపున ఇటువంటి ఘటన జరిగినందుకు నేను సిగ్గుపడుతున్నానని తెలియచేశారు.

10th Class Social Textbook Page No.265

ప్రశ్న 3.
పలు పార్టీల ప్రజాస్వామ్యంతో పోలిస్తే ‘ఏక పార్టీ ప్రజాస్వామ్యం’ మెరుగైన ప్రత్యామ్నాయంగా ఉండేదా?
జవాబు:
పలు పార్టీల ప్రజాస్వామ్యంతో పోలిస్తే ఏక పార్టీ ప్రజాస్వామ్యం మెరుగైన ప్రత్యామ్నాయంగా ఉండేది కాదు.

ఎందుకనగా:

  1. ఏకపార్టీ ప్రజాస్వామ్యం వలన నియంతృత్వ ధోరణి పెరుగుతుంది.
  2. మార్పులకు అవకాశం ఉండదు.
  3. అందరి క్షేమానికి అవకాశం ఉండేది కాదు.
  4. ఉద్యమాలు తలెత్తవు. ఉద్యమాలు తలెత్తకపోతే భిన్నాభిప్రాయాలకు ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉండదు.

AP Board 10th Class Social Solutions Chapter 19 రాజకీయ ధోరణుల ఆవిర్భావం : 1977-2000

10th Class Social Textbook Page No.270

ప్రశ్న 4.
ప్రజలు స్వేచ్ఛగా సంచరించే విధానం ఉంటే బయటి నుంచి వచ్చిన ధనిక, శక్తిమంతులైన వాళ్ళు భూమి, వనరులు మొత్తాన్ని కొనేసి అసలు ఆ ప్రాంతంలోని వాళ్లను పేదలు, నిర్భాగ్యులుగా మిగులుస్తారా?
జవాబు:
మిగల్చరు. కారణం భూమి, వనరులు అమ్మితే కొంటారు కాని అమ్మకపోతే కొనరు కదా. ఒకవేళ అమ్మినా ఎక్కువ రేటు వస్తుంది. దానితో పేదవారు ధనికులు కావడానికి అవకాశం ఉంటుంది. మరియు ధనికులు వచ్చి అక్కడ పరిశ్రమల లాంటివి స్థాపించితే దానిలో ఉపాధి లభిస్తుంది. కాబట్టి అక్కడ పేదలు నిర్భాగ్యులుగా మిగలరు.

10th Class Social Textbook Page No.273

ప్రశ్న 5.
ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే రాజీవ్ గాంధీ దేశానికి ఒనగూర్చిన శాశ్వత ప్రయోజనాలు ఏమిటి?
జవాబు:

  1. శాంతి ప్రక్రియలు మొదలు పెట్టారు.
  2. పేదవారికి ఉద్దేశించిన పథకాలను వారికి అందేటట్లు ఏర్పాట్లు చేశారు.
  3. అధికార వికేంద్రీకరణకు రాజ్యాంగం ద్వారా చట్టబద్ధత కల్పించారు.
  4. ఆర్థిక రంగంలో సరళీకృత ఆర్థికవ్యవస్థను ప్రవేశపెట్టారు.
  5. సాంకేతిక విజ్ఞానాన్ని భారతదేశం అవలంబించాలని ‘టెలికం విప్లవం’ ఆరంభించారు.

10th Class Social Textbook Page No.273

ప్రశ్న 6.
తమకోసం ఉద్దేశించిన పథకాల వల్ల పేద ప్రజలు తరచు ఎందుకు ప్రయోజనం పొందటం లేదో తరగతిలో చర్చించండి. ఇటువంటి ప్రయోజనాలు నిజంగా పేదవాళ్లకు చేరాలంటే ఏ దీర్ఘకాల చర్యలు తీసుకోవాలి?
జవాబు:

  1. ప్రభుత్వ శాఖలలో పేరుకుపోయిన అవినీతి
  2. ప్రజలు నిరక్షరాస్యత మూలంగా ప్రభుత్వం తమకోసం చేపట్టిన పథకాలను పొందలేకపోతున్నారు.
  3. అమాయకత్వం వలన కూడా పేదప్రజలు ప్రయోజనం పొందటం లేదు.

తీసుకోవాల్సిన దీర్ఘకాల చర్యలు:

  1. అక్షరాస్యతను పెంచాలి.
  2. ప్రభుత్వ పథకాల గురించి ప్రజలకు తెలిసేలా చేయాలి.
  3. ప్రభుత్వోద్యోగులు నిజాయితీతో పనిచేస్తూ ఈ పథకాలు ప్రజలకు అందేలా చర్యలు తీసుకోవాలి.

10th Class Social Textbook Page No.273

ప్రశ్న 7.
మీ పాఠశాల విద్యార్థులకు అందవలసిన ప్రయోజనాల జాబితా తయారుచెయ్యండి. ఇవి వాళ్లకు సరిగా అందుతున్నాయా? తరగతి గదిలోనూ, బయట క్రీడా మైదానాలలోనూ, ఇంటివద్ద చర్చించండి.
జవాబు:
పాఠశాల విద్యార్థులకు అందవలసిన ప్రయోజనాలు :

  1. మధ్యాహ్న భోజన పథకం
  2. ఉచిత పుస్తకాల పంపిణీ
  3. ఉచిత యూనిఫారం
  4. స్కాలర్షిప్లు
  5. లైబ్రరరి సౌకర్యాలు
  6. ఆటస్థలం
  7. ప్రయోగశాలలు

వీటన్నింటినీ విద్యార్ధులు పొందేలా చర్యలు తీసుకోవాలి. వీటి మీద విద్యార్ధులకు అవగాహన కలిగించాలి.

AP Board 10th Class Social Solutions Chapter 19 రాజకీయ ధోరణుల ఆవిర్భావం : 1977-2000

10th Class Social Textbook Page No.264

ప్రశ్న 8.
గత అధ్యాయంలో చర్చించిన స్వతంత్ర భారతదేశంలోని రాజకీయ ఘటనల గురించి క్లుప్తంగా రాయండి.
జవాబు:
స్వతంత్ర భారతదేశంలో రాజకీయ ఘటనలు :

  1. 1952, 1957, 1962లలో జరిగిన ఎన్నికలలో భారత జాతీయ కాంగ్రెస్ అఖండ విజయాలు సాధించింది. ఏకపార్టీ ఆధిపత్యం కొనసాగింది.
  2. భాషా ప్రాతిపదికన రాష్ట్రాల ఏర్పాటు కొరకు అనేక ఉద్యమాలు ఆవిర్భవించాయి. చివరికి 1956లో భాషాప్రాతిపదిక రాష్ట్రాలు ఏర్పడ్డాయి.
  3. ప్రచ్ఛన్న యుద్ధం మొదలయ్యి ప్రపంచమంతా రష్యా కూటమి (USSR) లేదా అమెరికా కూటమి (USA) గా విడిపోయింది. ఇటువంటి నేపథ్యంలో నెహ్రూ, మన దేశం ఈ రెండు శిబిరాలలో చేరకుండా విదేశీ విధానంలో స్వతంత్రంగా ఉంటూ, అలీన విధానమును మన విదేశీ విధానంగా స్వీకరించారు.
  4. చైనాతో నెహ్రూ పంచశీల సూత్రాల ఒప్పందం చేసుకున్నాడు.
  5. 1962లో చైనాతో మన దేశం యుద్ధం చేయవలసి వచ్చింది.
  6. 1965లో భారతదేశం పాకిస్థాన్‌తో యుద్ధం చేసింది.
  7. జాతీయ భాష అయిన హిందీకి వ్యతిరేకంగా తమిళనాడులో ఉద్యమం జరిగింది.
  8. 1967 ఎన్నికలలో కాంగ్రెస్ ఘోర పరాజయానికి గురైంది. అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓడిపోయి, ప్రాంతీయ పార్టీలు ప్రభుత్వాలను ఏర్పాటు చేశాయి.
  9. 1969లో మేఘాలయ రాష్ట్రం ఏర్పడింది.
  10. దేశంలోని చాలా రాష్ట్రాలలో అనేకాంశాల మీద ఉద్యమాలు లేచాయి.
  11. 1971లో బంగ్లాదేశ్ స్వతంత్ర పోరాటంలో భారత్- పాకిస్తాన్ తో ప్రత్యక్ష యుద్ధానికి దిగింది. బంగ్లాదేశ్ స్వాతంత్ర్యం పొందింది.
  12. 1971 ఎన్నికలలో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది.
  13. 1973లో అరబ్- ఇజ్రాయిల్ మధ్య యుద్ధంతో చమురు ధరలు పెరగడంతో ద్రవ్యోల్బణం పెరిగింది.
  14. జయప్రకాశ్ నారాయణ్ నేతృత్వంలో ఐక్యమైన ప్రతిపక్షాలు దేశంలోని పలు ప్రాంతాలలో కాంగ్రెస్ కి, ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా ఉద్యమించాయి. ఈ ఉద్యమం తీవ్రతరం కావడంతో ప్రభుత్వం దేశంలో “అత్యవసర పరిస్థితి”ని విధించింది.

10th Class Social Textbook Page No.265

ప్రశ్న 9.
నిరసన, మార్పులకు సంబంధించి సామాజిక ఉద్యమాలకు అనువైన పరిస్థితులను పలు పార్టీల ప్రజాస్వామ్యం ఎలా దోహదం చేస్తుంది?
జవాబు:

  1. పోటీదారు ప్రత్యామ్నాయాలు ఏర్పడటంతో భారతీయ ఓటర్లకు ఎంచుకోటానికి అవకాశం లభించింది.
  2. దీనివల్ల రాష్ట్రస్థాయి, జాతీయస్థాయి రాజకీయాలలో విభిన్న రాజకీయ దృక్పథాలకు, వర్గ ప్రయోజనాలకు అవకాశం లభించింది.
  3. సోషలిస్టులు, హిందూ జాతీయతావాదులు, కమ్యూనిస్టుల వంటి రాజకీయ దృక్పథాలు, రైతులు, దళితులు, వెనుకబడిన కులాలు, ప్రాంతాల వంటి వర్గప్రయోజనాలు కూడా ముందుకొచ్చి తమ హక్కుల కోసం పోరాడసాగారు.
  4. ఈ సమయంలో పర్యావరణ ఉద్యమం, స్త్రీవాద ఉద్యమం, పౌరహక్కుల ఉద్యమం, సాహిత్య ఉద్యమం వంటి ఉద్యమాలు మొదలై సామాజిక మార్పునకు బలమైన చోదకశక్తిగా మారాయి.

10th Class Social Textbook Page No.267

ప్రశ్న 10.
రాష్ట్రాలలో వేరే రాజకీయ పార్టీలకు చెందిన ప్రభుత్వాలు ఉన్నప్పుడు కేంద్రప్రభుత్వం వాటిని తొలగించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ప్రజాస్వామిక సూత్రాలకు ఇది ఎలా భంగం కలిగిస్తోందో చర్చించండి.
జవాబు:

  1. ప్రపంచంలోనే విశాలమైన ప్రజాస్వామ్య దేశం భారతదేశం. ప్రజలచే ప్రత్యక్షంగా ఎన్నుకోబడిన ప్రభుత్వాలను తొలగించడమనేది ప్రజాస్వామ్య మౌలిక సూత్రాలకు విరుద్ధం.
  2. జనతాపార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు తీసుకున్న చర్యలు సమాఖ్య సూత్రాలను బలహీనపరచి, అధికార కేంద్రీకరణకు మద్దతునిచ్చాయి.
  3. ప్రజాస్వామ్యాన్ని, స్వేచ్ఛని పునరుద్ధరిస్తామన్న వాగ్దానంతో జనతాపార్టీ అధికారంలోకి వచ్చి, ప్రజాస్వామ్యాన్ని, స్వేచ్ఛని నామరూపాల్లేకుండా చేసింది.
  4. ఇటువంటి చర్యలు కేంద్రం యొక్క ఆధికత్యను తెలుపుతూ, ప్రాథమిక హక్కులను భంగకరమవుతాయి.
  5. ఇటువంటి చర్యలు కొనసాగుతూనే ఉన్నట్లయితే భారతదేశం ఏకకేంద్ర రాజ్యంగా మారిపోతుంది.

10th Class Social Textbook Page No.268

ప్రశ్న 11.
ఎన్.టి.ఆర్ రాజకీయాలలో ఈ దిగువ అంశాల ప్రాముఖ్యతను చర్చించండి.
i) సినీ హీరోగా ఉన్న నేపథ్యం
ii) రాష్ట్ర ఆత్మగౌరవం కోసం పోరాటం
iii) పేదలకు జనాకర్షక సంక్షేమ పథకాలు
iv) ఇతర ప్రాంతీయ పార్టీలతో సంబంధాలు
జవాబు:
i) సినీ హీరోగా ఉన్న నేపథ్యం :
ఎన్.టి.ఆర్ తెలుగు సినిమారంగంలో అనేక జానపద, పౌరాణిక, సాంఘిక చిత్రాలలో నటించి తన నటనా శైలితో అశేష ఆంధ్ర ప్రజానీకాన్ని మెప్పించి, వారి అభిమాన నటుడై, ఆదరాభిమానాలు పొందాడు.

ii) రాష్ట్ర ఆత్మగౌరవం కోసం పోరాటం:

  1. ఎన్.టి.ఆర్ ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రులను కేంద్ర కాంగ్రెస్ నాయకత్వం తరచూ మారుస్తుండటం చూశారు.
  2. పై నుంచి నాయకులను రుద్దటం ఇక్కడి ప్రజలకు నచ్చలేదు.
  3. జాతీయ కాంగ్రెస్ నాయకత్వం నుంచి ఆంధ్రప్రదేశ్ నాయకత్వానికి తగినంత గౌరవం లభించటం లేదని భావించసాగారు.
  4. తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి అవమానం జరిగిందని భావించసాగారు.
  5. తెలుగువారి ఆత్మగౌరవం కోసం తె.దే.పా కృషి చేస్తుందని ఆయన చెప్పారు.

iii) పేదలకు జనాకర్షక సంక్షేమ పథకాలు :
తెలుగుదేశం పార్టీ చేపట్టిన సంక్షేమ పథకాలు :

  1. పేదలకు రెండు రూపాయలకు కిలో బియ్యం.
  2. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం.
  3. మద్యపాన నిషేధం.

iv) ఇతర ప్రాంతీయ పార్టీలతో సంబంధాలు :

  1. 1984లో ఆపరేషన్ కోసమని అమెరికాకు వెళ్ళినప్పుడు గవర్నర్ ఆయన ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేశారు.
  2. తె.దే.పా నుంచి కాంగ్రెస్ కి పార్టీ ఫిరాయించిన ఎన్. భాస్కరరావుని ముఖ్యమంత్రిగా గవర్నర్ ఆహ్వానించారు.
  3. అమెరికా నుంచి తిరిగి వచ్చిన ఎన్.టి.ఆర్ గవర్నర్ చర్యను సవాలుచేస్తూ శాసనసభ్యులలో మెజారిటీ మద్దతు తనకే ఉందని నిరూపించారు.
  4. తన ప్రభుత్వాన్ని అకారణంగా తొలగించటంపై చేసిన పోరాటంలో ఎన్.టి.ఆర్ కి ఇతర రాష్ట్రాలలో అధికారంలో ఉన్న సిపిఐ(ఎం), డి.ఎం.కె., ఎస్.ఎ.డి., నేషనల్ కాన్ఫరెన్స్ వంటి అనేక పార్టీలు మద్దతు నిచ్చాయి.

10th Class Social Textbook Page No.270

ప్రశ్న 12.
ఆంధ్రప్రదేశ్ లో ఎన్.టి.ఆర్ ఉద్యమానికి, అసోం ఉద్యమానికి పోలికలు, తేడాలు ఏవి?
జవాబు:
ఆంధ్రప్రదేశ్ లో ఎన్.టి.ఆర్ ఉద్యమానికి, అసోం ఉద్యమానికి పోలికలు :

  1. స్వయం ప్రతిపత్తి కావాలని కోరుకోవడం.
  2. ఆత్మ గౌరవాన్ని పరిరక్షించుకోవడం.

తేడాలు:

  1. తెలుగు ప్రజలు తమ ఆత్మగౌరవానికి అవమానం జరిగిందని భావించారు.
  2. అసోం ప్రజలు తమ సాంస్కృతిక మూలాలు కోల్పోతామనీ, బయటివాళ్ళు ఎక్కువైపోయి జనాభాలో తమ సంఖ్య తగ్గుతుందని భయపడసాగారు.
  3. ఆంధ్రప్రదేశ్ ఉద్యమంలో ఆర్థిక కోణం లేదు. అసోం ఉద్యమంలో ఆర్థిక కోణం కలదు.
  4. ఆంధ్రప్రదేశ్ ఉద్యమంలో మతపరమైన అంశం లేదు. అసోం ఉద్యమంలో మతపరమైన అంశం కలదు.
  5. ఆంధ్రప్రదేశ్ ఉద్యమంలో భారతదేశ వ్యతిరేకత లేదు. అసోం ఉద్యమంలో భారతదేశ వ్యతిరేకత వచ్చింది.

AP Board 10th Class Social Solutions Chapter 19 రాజకీయ ధోరణుల ఆవిర్భావం : 1977-2000

10th Class Social Textbook Page No.270

ప్రశ్న 13.
ఈ అంశాలపై మీ తరగతిలో చర్చ నిర్వహించండి.
ఒక ప్రాంతంలో ఒక సమూహానికి చెందిన ప్రజలు ఉండాలి, అన్ని ఉద్యోగాలు, అన్ని వ్యాపారాలు ఆ సమూహానికి చెందిన ప్రజల చేతిలోనే ఉండాలి. లేదా భారతదేశ ప్రజలందరూ ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి స్వేచ్ఛగా వెళ్ళగలగాలి. తాము ఎంచుకున్న ప్రాంతంలో స్థిరపడటానికి, పని చెయ్యటానికి అవకాశం ఉండాలి.
జవాబు:
ఒక ప్రాంతంలో ఒకే సమూహానికి చెందిన ప్రజలు ఉండాలి అనేది అంత సమర్థనీయం కాదు. ఎందువల్ల అనగా భారతదేశం ఏక పౌరసత్వ విధానాన్ని అనుసరిస్తుంది కాబట్టి, మరియు ఆర్టికల్ 19 ప్రకారం ఆరు రకాల స్వేచ్చలు ఉన్నాయి కాబట్టి అందులో ఒకటి ఏ భారతీయుడైనా భారతదేశంలో ఎక్కడైనా స్వేచ్ఛగా జీవించవచ్చు.

ఉద్యోగ, ఉపాధి అవకాశాలలో స్థానికతకు కొంత ప్రాధాన్యత ఇచ్చినా వ్యాపారం విషయంలో, ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి స్వేచ్ఛగా వెళ్ళే విషయంలో, తాము ఎంచుకున్న ప్రాంతంలో స్థిరపడే విషయంలో, పనిచేసే విషయంలో పూర్తి స్వేచ్ఛ ఉండాలి.

10th Class Social Textbook Page No.272

ప్రశ్న 14.
సిక్కుల వేర్పాటువాదం, తీవ్రవాదాలను ప్రేరేపించటంలో 1984 లో ఢిల్లీలో చోటుచేసుకున్న సిక్కు వ్యతిరేక అల్లర్ల పాత్ర ఏమిటి?
జవాబు:

  1. పంజాబ్ రాష్ట్రంలో స్వయం ప్రతిపత్తికి ఒక ఉద్యమం రూపుదిద్దుకుంది.
  2. ఇక్కడ అత్యధిక శాతం ప్రజలు మాట్లాడే భాష, మతమూ ఆధారంగా ప్రజల సమీకరణ జరిగింది.
  3. రాజధాని నగరమైన చండీగఢ్ తమకే చెందాలని, భాక్రానంగల్ నుంచి ఎక్కువ నీరు రావాలని, సైన్యంలోకి ఎక్కువ మంది సిక్కులను తీసుకోవాలని కోరారు.
  4. 1980లో అకాలీ ప్రభుత్వాన్ని రద్దుచేసి తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం రావటంతో సిక్కులు వివక్షతకు గురవుతున్నారన్న భావన పెరిగింది.
  5. తీవ్రవాద సిక్కుల బృందానికి నాయకుడిగా ఉన్న భింద్రేన్ వాలా వేర్పాటువాదాన్ని ప్రచారం చేస్తూ సిక్కులకు ప్రత్యేక దేశం ఖలిస్తాన్ కావాలని కోరసాగాడు.
  6. తీవ్రవాదులు సిక్కుల మీదే కాకుండా పంజాబ్ లోని ఇతర మత ప్రజలపై కూడా సంప్రదాయ ఛాందసవాద జీవన విధానాన్ని అమలు చేయడానికి ప్రయత్నించారు.
  7. ఈ ఘర్షణ మతపరమైన రంగును కూడా సంతరించుకుంది.
  8. సిక్కు మతానికి చెందని ప్రజలపై దాడులు జరిగాయి.
  9. వీటన్నింటి అంతిమ పర్యవసానంగా సిక్కు వేర్పాటు బృందాలు సిక్కుల పవిత్ర స్థలమైన గోల్డెన్ టెంపుల్ ని అక్రమించుకోగా వాళ్ళని అక్కడ నుంచి ఖాళీ చేయటానికి సైన్వం జోక్యం చేసుకోవలసి వచ్చింది.
  10. దీంతో తమ పుణ్యస్థలం అపవిత్రమైందని సిక్కులు భావించటంతో వాళ్ల విజాతి భావం మరింత తీవ్రమైంది.
  11. వీటన్నింటి కారణంగా 1984లో ప్రధానమంత్రి ఇందిరాగాంధీ హత్యకు గురయ్యింది.
  12. దీని తరువాత అల్లర్లు చెలరేగి, ప్రత్యేకించి ఢిల్లీలో వేలాదిమంది సిక్కులపై దాడులు చేసి, వాళ్ళ ఆస్తులను విధ్వంసం చేసి, హత్య చేశారు.
  13. ఈ హింసను ఆపటానికి పాలనాయంత్రాంగం స్పందించినట్లు అనిపించలేదు.
  14. రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి అయ్యాక కొంత శాంతి చర్చలు ప్రారంభమయ్యాయి.

10th Class Social Textbook Page No.272

ప్రశ్న 15.
అసోం, పంజాబ్ ఉద్యమాల మధ్య పోలికలు, తేడాలను పేర్కొనండి. మన రాజకీయ వ్యవస్థకు అవి ఎటువంటి సవాళ్లను విసిరాయి?
జవాబు:

అసోం ఉద్యమంపంజాబ్ ఉద్యమం
1. బ్రిటిష్ పాలన నాటి నుండి అసోంలో బెంగాలీలు ఉండేవాళ్లు. బెంగాలీ అధికారులు తమని సమానులుగా కాకుండా రెండవ తరగతి పౌరులుగా చూస్తున్నారని అస్సామీయులు భావించేవాళ్లు.1. పంజాబ్ రాష్ట్రంలో స్వయం ప్రతిపత్తి కావాలని ఉద్యమం జరిగింది.
2. స్వాతంత్ర్యం తరువాత బెంగాలీ మాట్లాడే ప్రజలు పెద్ద సంఖ్యలో అసోంలో స్థిరపడసాగారు. బంగ్లాదేశ్ నుండి ఎంతోమంది వలసవచ్చి స్థానికులకు ఇబ్బంది కలిగించసాగారు. స్థానిక ప్రజలు తమ సాంస్కృతిక మూలాలు కోల్పోతామనీ, అంతే కాకుండా ‘బయటివాళ్లు’ ఎక్కువైపోయి జనాభాలో తమ సంఖ్య తగ్గుతుందని భయపడసాగారు.2. దేశాభివృద్ధిలో రాష్ట్రం పాత్రను విస్మరిస్తున్నారన్నదే పంజాబ్ ఆరోపణ. రాష్ట్రం ఏర్పడినప్పుడు తమకు అన్యాయం జరిగిందని వాళ్లు భావిస్తున్నారు.
3. ప్రజలలో ఉన్న ఈ అసంతృప్తి 1970లలో సామాజిక ఉద్యమంగా మారింది.|3. చండీగఢ్ తమ రాష్ట్రానికి చెందాలని కోరసాగారు.
4. అఖిల అసోం విద్యార్థి సంఘం (ఎఎఎను) ఈ ఉద్యమానికి ముందు నిలిచింది.4. ఈ ఉద్యమం కొరకు 1978లో అకాలీదల్ ఏర్పడింది.
5. ఎఎయు ఉద్యమకారుల కోరికలు :
ఎ) బయటివాళ్లను తీసెయ్యాలని చేశారు.
బి) ఉపాధిలో స్థానిక ప్రజలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని
సి) వనరులను స్థానిక ప్రజల ప్రయోజనం కోసం వినియోగించమని కోరారు.
5. అకాలీదళ్ కోరికలు:
ఎ) రాజ్యాంగాన్ని సవరించి అధికార వికేంద్రీకరణ చేయాలి.
బి) రాష్ట్రాలకు ఎక్కువ అధికారాలు ఇవ్వాలి.
సి) భాక్రానంగల్ ఆనకట్ట నుంచి ఎక్కువ నీళ్లు కావాలని, ఎక్కువ మంది సిక్కులను తీసుకోవాలని కోరసాగారు.
6. ఈ ఉద్యమం తీవ్రరూపం దాల్చింది. ఇక్కడ శాంతిని నెలకొల్పడానికి ఈ ప్రాంతాలలో సాయుధ బలగాలను కేంద్రప్రభుత్వం పెద్ద ఎత్తున నియమిం చింది. దీనితో పౌరహక్కులు, స్వేచ్ఛ రద్దయ్యా యి. సైన్యానికి అసాధారణ అధికారాలు కట్టబెట్టారు.6. ఉద్యమకారులు సిక్కుల మీదే కాకుండా ఇతరమత ప్రజలపై కూడా ఘర్షణలకు కారణమయ్యారు.
7. తీవ్రవాదులు గోల్డెన్ టెంపుల్ ని ఆక్రమించుకోగా వాళ్లని అక్కడ నుండి ఖాళీ చేయించటానికి సైన్యం జోక్యం చేసుకోవలసి వచ్చింది. వారి పవిత్ర దేవాలయం అపవిత్రమైనదని భావించిన సిక్కుల కారణంగా 1984లో ఇందిరాగాంధీ హత్యకు గురయ్యింది.
8. పంజాబ్ లో తీవ్రవాదాన్ని అణచివెయ్యటానికి ప్రభుత్వం అనేక కఠినతర పద్ధతులను ఉపయోగించింది. వీటిలో అనేకం పౌరుల రాజ్యాంగ హక్కులకు భంగం కలిగించాయని భావించారు.

సవాళ్లు :

  1. ఈ రెండు సమస్యలు దేశ సమగ్రతను దెబ్బతీసే విధంగా పరిణమించాయి. పంజాబ్ స్వయం ప్రతిపత్తిని కోరుట అనేది ఏర్పాటు వాదానికి నిదర్శనం.
  2. ఈ సమస్యలు మత ఘర్షణలకు దారితీశాయి.

10th Class Social Textbook Page No.276

ప్రశ్న 16.
సంకీర్ణ రాజకీయాల వల్ల ప్రభుత్వం బలహీనపడిందని కొంతమంది భావిస్తుండగా, దానివల్ల ఏ ఒక్క పార్టీ తన విధానాన్ని దేశం మీద రుద్దకుండా చేసిందని కొంతమంది భావిస్తారు. దీనిని ఉదాహరణలతో చర్చించండి.
జవాబు:

  1. సంకీర్ణ ప్రభుత్వాలలో అనేక జాతీయ, ప్రాంతీయ పార్టీలు కలవవలసి వచ్చేది. దాంతో ఏ ఒక్క పార్టీ తన విధానాలను కొనసాగించటానికి వీలులేకపోతుంది.
  2. దీనివల్ల రాజకీయాలు, విధానాలలో అనేక దృష్టి కోణాల పట్ల కేంద్ర ప్రభుత్వాలు సున్నితత్వంలో వ్యవహరించవలసి వచ్చింది.
  3. సంకీర్ణ ప్రభుత్వాల వల్ల ఎంతో అస్థిరత కూడా నెలకొంది.
  4. చిన్న పార్టీలు కూడా తమ మద్దతు ఉపసంహరించుకుంటే ప్రభుత్వం పారిపోతుంది కాబట్టి ఎక్కువ ప్రయోజనాలు రాబట్టుకోటానికి ప్రయత్నించాయి.
  5. కొన్నిసార్లు “విధాన పక్షపాతం” అనగా ఏదో ఒక భాగస్వామ్య పార్టీ తన మధతు ఉపసంహరించుకుంటుందన్న భయంతో తీవ్ర మార్పులను తెచ్చే విధానాలను అమలు చెయ్యటానికి సంకీర్ణ ప్రభుత్వం భయపడేది.
    ఉదా: మన్మో హన్‌సింగ్ ప్రభుత్వం

10th Class Social Textbook Page No.277

ప్రశ్న 17.
పశ్చిమ బెంగాల్ లోని భూ సంస్కరణలను చైనాలోని, లేదా వియత్నాంలోని భూసంస్కరణలతో పోల్చండి. వీటిల్లో పోలికలు, తేడాలు గుర్తించండి.
జవాబు:
పోలికలు :

పశ్చిమ బెంగాల్ లోని భూ సంస్కరణలువియత్నాంలోని భూ సంస్కరణలు
1. కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలోకి వచ్చాక భూసంస్కరణలను అమలు చేసింది.1. కమ్యూనిస్ట్ పార్టీయే భూసంస్కరణలను అమలు చేసింది.
2. ఈ భూసంస్కరణలు ఎంతో కాలం నుండి గ్రామాలలో కొనసాగుతున్న సంప్రదాయాలను రూపుమాపాయి.2. వియత్నాంలో కూడా సంప్రదాయక వ్యవసాయ విధానాన్ని, భాగస్వామ్య వ్యవస్థను రద్దు చేయడం జరిగింది.

తేడాలు :

పశ్చిమబెంగాల్వియత్నాం
1. “ఆపరేషన్ బర్గా” ప్రకారం గ్రామాలలో సమావేశాలు నిర్వహించి, భూస్వాముల సమక్షంలోనే కౌలుదారుల జాబితాను తయారుచేసి, సరిచూసేవాళ్లు, అన్ని చట్ట సంబంధ కాగితాలు తయారుచేసి వెంటనే పంచి పెట్టేవాళ్లు.1. భూమి లేని చిన్న రైతులకు భూమి మీద హక్కు కల్పించటం ముఖ్య ఉద్దేశం.
2. కౌలుదార్లను భూస్వాములు బలవంతంగా తొలగించ టానికి వీలులేదు. కౌలుదార్ల హక్కును వారసత్వం చేశారు. పంటలో, కౌలుదారు పెట్టుబడి పెడితే 75%, భూస్వామి పెడితే 50% కౌలుదారుకు దక్కేలా చట్టం చేశారు.2. వియత్నాంలో భూస్వాముల నుండి భూమిని సేకరించి భూమిలేని పేద రైతులకు భూమిని పునఃపంపిణీ చేయటం జరిగింది.
3. అన్ని రాష్ట్రాలలో కాకుండా పశ్చిమబెంగాల్ లో మరియు దేశంలో పాక్షికంగా భూసంస్కరణలు అమలయ్యాయి.3. వియత్నాంలోని ఉత్తర భాగానికి ఈ భూసంస్కరణ లను అమలు చేయడం జరిగింది.

AP Board 10th Class Social Solutions Chapter 19 రాజకీయ ధోరణుల ఆవిర్భావం : 1977-2000

10th Class Social Textbook Page No.277

ప్రశ్న 18.
కౌలుదార్లకు రక్షణ లభించటం వల్ల ఉత్పత్తి ఎందుకు పెరిగింది?
జవాబు:

  1. కౌలుదార్లకు రక్షణ లభించటం వల్ల తమను కౌలు నుండి తీసేస్తారేమో అనే భయాలు తొలగిపోయాయి. కావున ధైర్యంగా మరియు స్వంత భూమి అనే భావనతో పూర్తి శ్రమను ఉపయోగించి సాగుచేయడం మూలంగా పంట పెరిగింది.
  2. రక్షణ లభించడం మూలంగా పొలం మీద అవసరం అయిన పెట్టుబడి పెట్టి మంచి ఎరువులు, పురుగుమందులను ఉపయోగించడం మూలంగా కూడా పంట పెరిగింది.
  3. కౌలుదార్లు పాత కాలంలో పంటసరిగా పండినా, పండకపోయినా భూస్వాములకు కౌలు మొత్తం చెల్లించవలసి వచ్చేది. కానీ కౌలుదార్లకు రక్షణ లభించటం వల్ల కేవలం పంట పండిన దానిని ఆధారంగా చేసుకొని కౌలు చెల్లించటం వల్ల కూడా ఉత్పత్తి పెరిగింది.
  4. భూసంస్కరణల మూలంగా కౌలుదారు, భూస్వామికి ఎంత పంట చెల్లించాలనేది స్పష్టంగా తెలియటంతో కౌలుదారుకి మిగులు ఎక్కువగా ఉండి, ఇంకా అధికోత్పత్తిని సాధించాలని ఆశపడేవాడు.

AP Board 10th Class Social Solutions Chapter 22 పౌరులు, ప్రభుత్వాలు

SCERT AP 10th Class Social Study Material Pdf 22th Lesson పౌరులు, ప్రభుత్వాలు Textbook Questions and Answers.

AP State Syllabus 10th Class Social Solutions 22th Lesson పౌరులు, ప్రభుత్వాలు

10th Class Social Studies 22th Lesson పౌరులు, ప్రభుత్వాలు Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
కింది కథనం ఆధారంగా సమాచార హక్కు చట్టం నేపథ్యంలో వివిధ ప్రభుత్వ శాఖల, పౌరుల పాత్రలను వివరించండి. సమాచార హక్కు చట్టం వల్ల ప్రభుత్వ పని మరింత పారదర్శకంగా ఎలా అవుతుందో రాయండి. (AS2)
కింద పేర్కొన్న ఘటన మెదక్ జిల్లాలోని చిన్న శంకరం పేటలో జరిగింది. స్వయం సహాయక బృందాల సభ్యులు రాష్ట్ర ప్రభుత్వ గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వశాఖ పథకాలైన అభయహస్తం, ఆమ్ ఆద్మీలలో చేరారు. ఈ పథకం కింద 9 నుంచి 12 తరగతులు చదువుతున్న పిల్లలకు 1200 రూపాయల స్కాలర్షిప్ పొందడానికి అర్హత ఉంది. అయితే 2008-11 మధ్య మూడు సంవత్సరాల పాటు విద్యార్థులకు స్కాలర్షిప్ మొత్తం అందలేదు. విద్యార్థులు ఇందిరా క్రాంతి పథకం (IKP) కార్యాలయానికి వెళ్లి అడిగారు. కానీ అక్కడి అధికారులు వాళ్లను పట్టించుకోలేదు.

ఇది స్థానిక దినపత్రికల దృష్టికి వచ్చింది. ఆమోదించిన స్కాలర్షిప్పుల వివరాలు ఇవ్వమంటూ వాళ్లు సంబంధిత అధికారుల వద్ద దరఖాస్తు చేశారు. 2008-09, 2009-10, 2010-11 సంవత్సరాలలో లబ్ధిదారుల సంఖ్య, మంజూరు చేసిన మొత్తం ఎంత అని అడిగారు. వాళ్లకు ఒక వారంలోపు సమాచారం వచ్చింది. మొత్తం ఏడు లక్షల రూపాయలు మంజూరయ్యాయి. సమాచార హక్కు ద్వారా అందిన వివరాలను బట్టి డబ్బు మంజూరయ్యింది కానీ, దానిని పంచలేదని తెలిసింది. ఈ విషయం వార్తాపత్రికలలో ప్రచురితం కాగానే 15 రోజుల లోపు 1167 విద్యార్థులకు స్కాలర్షిప్ అందజేశారు.
జవాబు:
సమాచార హక్కు చట్టం ప్రయోజనాలు ప్రజలకు అందాలంటే రెండు పాత్రలు తమ విధులను సక్రమంగా నిర్వర్తించాలి.

  1. ప్రభుత్వ శాఖలు
  2. పౌరులు

ఏ ప్రజాస్వామిక వ్యవస్థలోనైనా ప్రభుత్వాలు ప్రజలకు బాధ్యత వహించి వారికి జవాబుదారీగా ఉండాలి.

1) ప్రభుత్వశాఖల పాత్ర :
పై ఘటనలో ఉన్న ప్రభుత్వ శాఖలు – రాష్ట్ర ప్రభుత్వ గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వశాఖ పథకాలైన అభయహస్తం, ఆమ్ ఆద్మీ, ఇందిరా క్రాంతి పథం. ఈ సంస్థలు వాటి యొక్క విధులను సక్రమంగా నిర్వర్తించాలి. అంటే 9 నుండి 12 తరగతులు చదువుతున్న విద్యార్థులకు 1200 రూపాయల స్కాలర్షిప్ అందజేయాలి. కాని 2008-11 మధ్య మూడు సంవత్సరాలపాటు పిల్లలకు స్కాలర్షిప్ అందచేయలేదు. ఆ విషయాలు పట్టించుకోలేదు. చివరికి విద్యార్థులే సమాచారహక్కును ఉపయోగించి వివరాలు కనుక్కోవలసి వచ్చింది. ఈ విషయమంతా వార్తాపత్రికలలో కూడా వచ్చింది. దీనితో 15 రోజులలోపు 1167 మంది విద్యార్థులకు స్కాలర్షిప్ అందచేశారు. అయితే ఈ సంస్థల నిర్లక్ష్యం, జాప్యం అనేవి ప్రజలు, వార్తాపత్రికల దృష్టికి వెళ్ళింది. ప్రభుత్వ సంస్థలు సక్రమంగా పనిచేయట్లేదంటూ మాట్లాడారు. కావున ప్రభుత్వ సంస్థలు నిరంతరం మెలకువతో ఉండి, తమ వద్ద ఏ ఫైల్ను ఆపకుండా సకాలంలో పనిచేయాలి.

2) పౌరుల పాత్ర :
అభయహస్తం, ఆమ్ ఆద్మీ, ఇందిరా క్రాంతి పథం వంటి సంస్థలు వాటి విధులు మరిచిపోయాయి. కాని విద్యార్థులు వదలకుండా సమాచార హక్కు చట్టంను ఉపయోగించి వాస్తవాలు తెలుసుకున్నారు. ఈలోగా ఈ విషయాలన్నీ వార్తాపత్రికలో వచ్చాయి. అప్పుడు హడావుడిగా ఆ సంస్థలు విద్యార్థులకు డబ్బును అందించారు. ఇందులో పౌరులు వారి విధులను సక్రమంగా నిర్వర్తించినారని తెలుస్తుంది.

AP Board 10th Class Social Solutions Chapter 22 పౌరులు, ప్రభుత్వాలు

ప్రశ్న 2.
సమాచార హక్కు చట్టం వల్ల ప్రభుత్వం పనిని మెరుగుపరచటం, పర్యవేక్షించటం ఎలా సాధ్యమవుతుంది? (AS4)
జవాబు:
మెరుగుపరచటం :
1) ప్రజాస్వామిక వ్యవస్థలలో ప్రభుత్వాలు ప్రజలకు బాధ్యత వహించి వారికి జవాబుదారీగా ఉండాలి. ఏ విషయం మీదైనా ప్రజలు సమాచారం అడగవచ్చు. కనుక ఎల్లప్పుడూ ప్రభుత్వ సంస్థలు తమ విధులను సక్రమంగా నిర్వర్తించాలి.
2) ప్రతి ప్రభుత్వ శాఖ కొన్ని నియమ నిబంధనల ఆధారంగా పనిచేస్తుంది. కొన్ని రికార్డులను నిర్వహించాలి. తీసుకున్న నిర్ణయాల వివరణ ఉండాలి. దీని కొరకు రికార్డులను, రిజిష్టర్లను, నివేదికలను, డాక్యుమెంట్లను నిర్వహించాలి.
3) ప్రతి వ్యవస్థ, తన విధి నిర్వహణలో ఎటువంటి అవకతవకలు జరగకుండా చూసుకోవలసిన బాధ్యత వహించాలి. విధులను సక్రమంగా నిర్వర్తించాలి.
4) సమాచార హక్కు చట్టం వలన ఇప్పుడు ప్రతి ప్రభుత్వశాఖ రికార్డులను నిర్వహించి, వాటిని అడిగిన పౌరులకు అందుబాటులో ఉంచాలి.

పర్యవేక్షణ :
5) ప్రతి ప్రభుత్వ శాఖలో ఒక పౌర సమాచార అధికారి ఉంటాడు. అదే శాఖలో ఒక అప్పిలేట్ అధికారి ఉంటారు.
6) అన్ని శాఖల అప్పిలేట్ అధికారులు, పౌర సమాచార అధికారులు రాష్ట్ర పౌర సమాచార కార్యాలయానికి జవాబుదారీగా ఉంటారు.
7) రాష్ట్ర సమాచార కమిషనర్లు ఉంటారు. కేంద్ర సమాచార కమిషనర్లు ఉంటారు.

మనం సమాచారం కొరకు దరఖాస్తు చేసినపుడు ఆయా సమాచార అధికారులు సమాచారం ఇవ్వని పక్షంలో రాష్ట్ర, కేంద్ర సమాచార కమిషనర్లు జవాబుదారీగా ఉంటారు. అవసరం అయితే వీరు ఆ సమాచార అధికారికి జరిమానా కూడా విధించవచ్చు.

ప్రశ్న 3.
సమాచారం అని దేనిని అంటారు? ఇది ప్రభుత్వ శాఖలలో ఎలా ఉత్పన్నమవుతుంది? పై అధికారి, కింది అధికారి మధ్య జరిగే మౌఖిక సంభాషణ సమాచారం అవుతుందా? (AS1)
జవాబు:
ప్రతి ప్రభుత్వ శాఖ కొన్ని నియమనిబంధనల ఆధారంగా పనిచేస్తుంది.
ఉదా :

  1. ఆరోగ్యశాఖలో ఆసుపత్రిలో డాక్టర్లు, నర్సుల ఎంపిక, నియామకం, బదిలీలకు సంబంధించి లేదా మందుల కొనుగోలు, పంపిణీలకు సంబంధించి నియమనిబంధనలు ఉంటాయి.
  2. అందువల్ల ప్రతి సంస్థ కొన్ని రికార్డులను నిర్వహించాలి. తీసుకున్న నిర్ణయాల వివరణ ఉండాలి. వీటి కారణంగా వ్యవస్థలో అనేక రాత పత్రాలు రూపొందుతాయి. ఇవి ఈ క్రింది రూపాలలో ఉండవచ్చు.
  3. రికార్డులు, డాక్యుమెంట్లు, మెమోలు, ఈ-మెయిల్స్, అభిప్రాయాలు, సలహాలు, పత్రికా ప్రకటనలు, సర్క్యులర్లు, ఆదేశాలు, లాగ్ పుస్తకాలు, ఒప్పందాలు, నివేదికలు, పత్రాలు, నమూనాలు, మోడల్స్ వంటి రూపాలలో ఉన్న మెటీరియల్, ఏ ఎలక్ట్రానిక్ రూపంలోనైనా ఉన్న గణాంకాలు, అమలులో ఉన్న ఇతర చట్టాల కింద ప్రభుత్వ అధికారి అనుమతి పొందిన ప్రైవేటు సంస్థకు సంబంధించిన సమాచారం.
  4. సమాచార హక్కు చట్టం వల్ల ఇప్పుడు ప్రతి ప్రభుత్వ శాఖకు రికార్డులను నిర్వహించి, వాటిని అడిగిన పౌరులకు అందుబాటులో ఉంచాలి.
  5. పై అధికారి, కింది అధికారి మధ్య జరిగే మౌఖిక సంభాషణ సమాచారం అవదు.

AP Board 10th Class Social Solutions Chapter 22 పౌరులు, ప్రభుత్వాలు

ప్రశ్న 4.
రాష్ట్ర, కేంద్ర సమాచార కార్యాలయాలకు స్వయంప్రతిపత్తి ఎందుకు ఇచ్చారు? (AS4)
జవాబు:

  1. ప్రతి ప్రభుత్వ శాఖలో ఒక పౌర సమాచార అధికారి ఉంటారు. అదే శాఖలో ఒక అప్పిలేట్ అధికారి ఉంటారు.
  2. అన్ని శాఖల పౌర సమాచార అధికారులు, అప్పిలేట్ అధికారులు రాష్ట్ర పౌర సమాచార కార్యాలయానికి జవాబుదారీగా ఉంటారు.
  3. దీనికి రాష్ట్ర సమాచార కమిషనర్లు ఉంటారు. ఏదైనా ప్రభుత్వశాఖ కేంద్రప్రభుత్వం కిందికి వస్తే కేంద్ర సమాచార కమిషనర్లతో కూడిన సమాచార కార్యాలయానికి జవాబుదారీగా ఉంటారు.
  4. ఈ సమాచార కార్యాలయాలు స్వయంప్రతిపత్తి కలిగి ఉంటాయి. ఎందుకనగా మనం ఏదైనా ఒక కార్యాలయంలో సమాచారం కోసం దరఖాస్తు చేస్తే, వారు మనల్ని వేరే కార్యాలయం నుండి సమాచారం పొందమని చెప్పడానికి లేదు.
  5. ఒకవేళ మనమడిగిన సమాచారం వారి దగ్గర లేనట్లయితే సమాచారం ఉన్న అధికారి నుంచి సమాచారం పొంది దానిని అందజేయటం వాళ్ళ బాధ్యత.
  6. ఈ అంశాల మూలంగా ఈ సమాచార కార్యాలయాలు స్వయంప్రతిపత్తి కలిగి ఉంటాయని తెలుస్తుంది. మరియు ఇతరుల ప్రభావానికి లోను కాకుండా ఉండాలంటే స్వయంప్రతిపత్తి ఉండాలి.

ప్రశ్న 5.
సమాచార హక్కు చట్టం ప్రజాస్వామ్యానికి ఉన్న అసలైన స్ఫూర్తిని తెలియచేస్తుంది. దీనిని మీరు ఎలా సమర్థిస్తారు? (AS6)
జవాబు:

  1. ప్రజాస్వామ్యమంటేనే ప్రజల ప్రభుత్వమని అర్థం. ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులచే ప్రభుత్వాలను ఏర్పాటుచేస్తారు. కావున ప్రభుత్వ కార్యక్రమాలను తెలుసుకునే హక్కు ప్రజలకు ప్రభుత్వమే కల్పించింది.
  2. ప్రజాస్వామ్య ప్రభుత్వాలు శ్రేయో రాజ్యాలు. ప్రజల కొరకు అనేక సంస్కరణలు చేస్తున్నాయి. ప్రభుత్వాలు చేసే పనులు ప్రజలకు తెలియచేయడానికే ఈ సమాచార హక్కును కల్పించింది.
  3. ప్రజలు ప్రభుత్వాలకు చెల్లిస్తున్న పన్నులు మరియు ఇతర రుసుములన్నింటిని ప్రభుత్వం ఏ విధంగా ఉపయోగిస్తుందో తెలుసుకునే అవకాశం ఈ సమాచార హక్కు కల్పిస్తుంది.
  4. సమాచారంలో పారదర్శకత ఉండాలి. ఇది ప్రభుత్వ సంస్థలలో అవినీతిని అరికట్టడానికి దోహదపడుతుంది.
  5. ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఒక పౌరునికి కూడా జవాబుదారీగా ఉంటాయి.
  6. ఈ సమాచార హక్కు ద్వారా ప్రభుత్వ అధికారులను, ప్రజా ప్రతినిధులను, వారి విధులను, కార్యకలాపాలను నియంత్రణ చేయవచ్చు.
  7. ఈ సమాచార హక్కును ప్రజాస్వామ్య రాజ్యాలే ఇచ్చాయి. ఇది వ్యక్తి యొక్క అభివృద్ధికి ఎంతో తోడ్పడుతుంది.
  8. ప్రభుత్వ ఆఫీసులలోని కార్యక్రమాల పట్ల ఇంతకుముందున్న అస్పష్టత ఈ హక్కు మూలంగా పోయింది.

కావున ఈ సమాచార హక్కు చట్టం ప్రజాస్వామ్యానికి ఉన్న అసలైన స్ఫూర్తిని తెలియచేస్తుంది.

ప్రశ్న 6.
దేశంలోని వివిధ ప్రభుత్వ శాఖల నుంచి ఏ పౌరుడికైనా సమాచారం అందుబాటులో ఉండేలా చెయ్యటానికి ఎటువంటి చర్యలు తీసుకున్నారు? (AS4)
జవాబు:
సమాచార హక్కు చట్టం, 2005 ప్రకారం ప్రభుత్వ సంస్థలు
అ) కంప్యూటరైజ్డ్ రూపంలో సమాచారాన్ని భద్రపరచాలి,
ఆ) దానికి సంబంధించిన సమాచారాన్ని ముందస్తుగానే వెల్లడి చెయ్యాలి. సమాచార హక్కు చట్టం ఇలా పేర్కొంటోంది:

1) ప్రతి ప్రభుత్వ సంస్థ :
అ) తనకు సంబంధించిన అన్ని రికార్డులను… ఇటువంటి రికార్డులను తేలికగా బయటకు తీయటానికి వీలుగా వర్గీకరించి, సూచికలతో నిర్వహించాలి.
ఆ) ప్రతి సంస్థ ఈ దిగువ సమాచారాన్ని ప్రచురించాలి.
i) సంస్థ వివరాలు, విధులు, బాధ్యతలు.
ii) సంస్థలోని అధికారులు, ఉద్యోగస్తుల అధికారాలు, విధులు :
iii) నిర్ణయాలు తీసుకోవటంలో అనుసరించే విధానం, పర్యవేక్షణ, జవాబుదారీ విధానాలను కూడా పేర్కొనాలి.
iv) సంస్థకు ఉండే లేదా దాని నియంత్రణలో ఉండే లేదా తమ విధులను నిర్వర్తించటంలో ఉద్యోగస్తులు ఉపయోగించే నియమాలు, నిబంధనలు, ఆదేశాలు, మార్గదర్శకాలు, రికార్డులు.
v) సలహా ఇవ్వటం కోసం ఏర్పాటు చేసి …. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ సభ్యులు ఉన్న బోర్డులు, సమితులు, సంఘాలు, ఇతరాల వివరాలు:
vi) ఆ కార్యాలయంలోని అధికారులు, ఉద్యోగస్తుల వివరాలు :
vii) అధికారులు, ఉద్యోగస్తులకు ఇస్తున్న నెలసరి జీతం, నియమాల ప్రకారం చేసే ఇతర చెల్లింపులు
viii) తన ప్రతి ఒక్క ఏజెన్సీకి కేటాయించిన బడ్జెటు
ix) సబ్సిడీ పథకాల అమలు విధానం దానికి కేటాయించిన నిధులు.
x) దాని ద్వారా రాయితీలు, పర్మిట్లు, లేదా అధీకృత పత్రాలు పొందిన వాళ్ల వివరాలు
xi) పౌర సమాచార అధికారుల పేర్లు, హోదాలు, ఇతర వివరాలు.

ఇ) ముఖ్యమైన విధానాలు రూపొందించేటప్పుడు లేదా ప్రజలను ప్రభావితం చేసే నిర్ణయాలను ప్రకటించేటప్పుడు సంబంధిత అన్ని వాస్తవాలను వెల్లడి చేయాలి.
ఈ) ప్రభావిత వ్యక్తికి పరిపాలన సంబంధ లేదా న్యాయ స్వరూపం గల నిర్ణయాలకు కారణాలను తెలియచెయ్యాలి.

2) పై సమాచారమంతటినీ ఎవరూ అడగకుండానే ప్రభుత్వ సంస్థలు వెల్లడి చేయాలి.
3) ఇది అందరికీ తేలికగా అందుబాటులో ఉండాలి.
4) ఇది స్థానిక భాషలో ఉండాలి, దీనికి ఏదైనా డబ్బు చెల్లించాల్సి ఉంటే అది ప్రజలకు భారం కాకుండా ఉండాలి.

AP Board 10th Class Social Solutions Chapter 22 పౌరులు, ప్రభుత్వాలు

ప్రశ్న 7.
న్యాయ సహాయం ఆశించే ప్రజలకు న్యాయ సేవల ప్రాధాన్యత సంస్థ ఏ విధంగా దోహదపడుతుంది? (AS1)
జవాబు:

  1. ప్రజలకు ఉచిత న్యాయసేవలు అందించటానికి మన దేశంలో ఒక విధానం ఉంది.
  2. న్యాయసేవల ప్రాధికార సంస్థ (సవరణ) చట్టం, 2002 ప్రకారం సమాజంలోని బలహీన వర్గాలకు ఉచిత న్యాయ సేవలు అందించటానికి న్యాయ సేవా పీఠాలను ఏర్పాటు చేస్తారు.
  3. ఆర్థిక లేక ఏ ఇతర కారణాల వల్లనైనా ఏ పౌరుడికి కూడా న్యాయం లభించకుండా ఉండకూడదన్న ఉద్దేశంతో వీటిని ఏర్పాటు చేశారు.
  4. దీనివల్ల న్యాయవ్యవస్థ సమాన అవకాశాల ప్రాతిపదికన అందరికీ న్యాయాన్ని అందిస్తుంది.

ప్రశ్న 8.
లోక్ అదాలత్ ఉద్దేశం ఏమిటి? (AS1)
జవాబు:

  1. సమాన అవకాశాల ప్రాతిపదికన న్యాయాన్ని అందించేలా న్యాయవ్యవస్థ పనిచేసేలా చూడటానికి లోక్ అదాలలను ఏర్పాటుచేశారు.
  2. లోక్ అదాలత్ లను “న్యాయసేవల పీఠాల చట్టం 1987″ని 1994లోను తిరిగి 2002లోను సవరించారు. ఈ సవరణ ప్రకారం లోక్ అదాలలను ఏర్పాటుచేశారు.
  3. లోక్ అదాలత్ అంటే ప్రజాస్వామ్య పీఠాలు. వీటి ద్వారా న్యాయకోవిదులు, అధికారులు, అనధికార ప్రముఖుల సమక్షంలో, సుహృద్భావ వాతావరణంలో పరస్పర అంగీకారంతో తగాదాలు, వివాదాలు పరిష్కరించుకోవచ్చు.
  4. ఖర్చు లేకుండా, త్వరితగతిన న్యాయం పొందటానికి లోక్ అదాలలు ప్రజలకు ఉపయోగపడుతున్నాయి.
  5. కోర్టులలో దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న కేసులను ఎటువంటి ఖర్చు లేకుండా వెంటనే పరిష్కరించుకోటానికి లోక్ అదాలత్ సహాయపడుతుంది.

ప్రశ్న 9.
ఈ చట్టం కింద చేపట్టే కేసులు, ఉచిత న్యాయసేవలు పొందటానికి పేర్కొన్న అర్హతలపై మీ అభిప్రాయం ఏమిటి? (AS2)
జవాబు:
I. ఉచిత న్యాయసేవలు పొందటానికి అర్హతలు :

  1. షెడ్యూల్డ్ కులాలు లేదా షెడ్యూల్డ్ జాతులకు చెందిన వ్యక్తులు ఉచిత న్యాయ సహాయానికి అర్హులు.
  2. అక్రమ రవాణా బాధితులైన వ్యక్తులు, బిక్షాటకులు.
  3. స్త్రీలు, పిల్లలు.
  4. మతిస్థిమితం లేనివారు లేదా అంగవైకల్యం ఉన్నవారు.
  5. పెను విపత్తు, జాత్యాహంకార హింస, కుల వైషమ్యాలు, వరదలు, కరవులు, భూకంపాలు, పారిశ్రామిక విపత్తులకు గురైనవారు.
  6. పారిశ్రామిక కార్మికులు.
  7. వ్యభిచార వృత్త (నివారణ) చట్టం, 1956లో సెక్షన్ 2, క్లాజు (జి) ప్రకారం రక్షణ గృహం, లేదా బాల నేరస్తుల న్యాయ చట్టం, 1986లోని సెక్షన్ 2, క్లాజు (జె) ప్రకారం బాల నేరస్తుల గృహం లేదా మానసిక ఆరోగ్య చట్టం 1987లో సెక్షన్ 2, క్లాజు (జి) ప్రకారం మానసిక వ్యాధి చికిత్సాలయం లేదా మానసిక రోగుల సంరక్షణాలయంలో నిర్బంధంలో ఉన్న వ్యక్తులు.
  8. లక్ష రూపాయలలోపు వార్షిక ఆదాయం ఉన్న వ్యక్తులు.

పైన పేర్కొన్న వారిలో ఏ వ్యక్తులైనా సహాయం పొందటానికి అర్హులని సంబంధిత న్యాయమూర్తి సంతృప్తి చెందితే వారు తగిన న్యాయ సేవలు పొందవచ్చు.

II. లోక్ అదాలత్ పరిధిలోకి వచ్చే కేసులు :

  1. వైవాహిక విభేదాలు.
  2. భరణానికి సంబంధించిన కేసులు.
  3. భర్త, అత్తవారింటి వేధింపులకు సంబంధించిన కేసులు.
  4. గృహ హింస కేసులు.
  5. అన్ని రకాల సివిల్ కేసులు భూ వివాదాలు.
  6. చట్టరీత్యా రాజీకి అర్హమైన అన్ని రకాల క్రిమినల్ కేసులు వంటి వాటిని ఇది చేపట్టవచ్చు.

III.నా అభిప్రాయం :
సమాజంలో వెనుకబడినవారు, పేదవారు, ఏ విధమైన సహాయ సహకారాలు లభించని వారికి ఈ లోక్ అదాలత్ సహాయపడుట చాలా మంచిదని నా అభిప్రాయం. స్త్రీలకు సంబంధించిన కేసులలో సరైన న్యాయం లభించుటలేదు. ఇటువంటి నేపథ్యంలో లోక్ అదాలత్ లు స్త్రీల వేధింపులకు సంబంధించిన కేసులను విచారించి, పరిష్కరించడమనేది అభినందనీయమే.

AP Board 10th Class Social Solutions Chapter 22 పౌరులు, ప్రభుత్వాలు

ప్రశ్న 10.
గ్రామ పెద్దలు, కోర్టులు వివాదాలు తగాదాలను పరిష్కరించే విధానాలను పోల్చండి. మీరు దేనిని ఇష్టపడతారు, ఎందుకు? (AS2)
జవాబు:

గ్రామ పెద్దలుకోర్టులు
1) గ్రామాలలో ప్రజల తగాదాలను తీర్చడానికి అన్ని విషయాలను, అంశాలను గ్రామ/తెగ పెద్దల ముందు చర్చించి ప్రశాంతంగా అందరికీ ఆమోదయోగ్యంగా పరిష్కరించటం మనదేశంలో అనాదిగా జరుగుతోంది.1) కోర్టులు ముఖ్యంగా లోక్ అదాలత్ ల ద్వారా న్యాయ కోవిదులు, అధికారులు, అనధికార ప్రముఖుల సమక్షంలో, సుహృద్భావ వాతావరణంలో, పరస్పర అంగీకారంతో తగాదాలు వివాదాలను పరిష్కరించుకోవచ్చు.
2) తగాదాలు, వివాదాల స్వభావం వాటి మూలాలు సాధారణంగా స్థానిక ప్రజలకు, గ్రామ పెద్దలకు తెలుస్తాయి.2) ఖర్చులేకుండా, త్వరితగతిన న్యాయం పొందటానికి ప్రజలకు ఇప్పుడు లోక్ అదాలత్ లు ఉపయోగపడుతున్నాయి.
3) దీనివల్ల ఆ తగాదాలను, వివాదాలను గ్రామ ప్రజలు చర్చించటానికి వీలు కలిగి, పారదర్శక పద్ధతిలో అందరికీ ఆమోదయోగ్యంగా పరిష్కారాన్ని కనుగొనటం సాధ్యమవుతుంది.3) కోర్టులలో దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న కేసులను ఎటువంటి ఖర్చు లేకుండా వెంటనే పరిష్కరించుకోటానికి లోక్ అదాలత్ లు సహాయపడుతున్నాయి.

నా అభిప్రాయం :
ప్రస్తుత ప్రజాస్వామ్య దేశాలలో జరిగే కార్యక్రమాలన్నింటికి రికార్డులు, రుజువులు, సాక్ష్యాలు ఉండాలి. తీసుకున్న నిర్ణయాల వివరాలను రికార్డు చేయాలి. కోర్టుల తీర్పులను ఎవరైనా పాటించకపోతే న్యాయస్థానాలు వారి మీద చర్యలు తీసుకొని, వాటిని పాటించేలా చేస్తాయి.

కాని గ్రామాలలో జరిగే తీర్పులను ప్రజలు అమలుచేయకపోతే అటువంటి వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకునే అధికారం గ్రామపెద్దలకు ఉండదు. కావున గ్రామాలలో నిర్వహించే కార్యక్రమాల కంటే కోర్టుల ద్వారా వచ్చే తీర్పులే మంచివని నా అభిప్రాయం.

10th Class Social Studies 22th Lesson పౌరులు, ప్రభుత్వాలు InText Questions and Answers

10th Class Social Textbook Page No.320

ప్రశ్న 1.
కోర్టు ఫీజులు, ఇతర ఖర్చులు భరించలేని పేద ప్రజలకు మనదేశంలో ఉచిత న్యాయసేవలకు ఎటువంటి అవకాశాలు ఉన్నాయి?
జవాబు:

  1. ప్రజలకు ఉచిత న్యాయసేవలు అందించటానికి మన దేశంలో ఒక విధానం ఉంది.
  2. న్యాయ సేవల ప్రాధికార సంస్థ (సవరణ) చట్టం, 2002 ప్రకారం సమాజంలోని బలహీన వర్గాలకు ఉచిత న్యాయ సేవలు అందించటానికి న్యాయ సేవా పీఠాలను ఏర్పాటు చేస్తారు.
  3. ఆర్థిక లేక ఏ ఇతర కారణాల వల్లనైనా ఏ పౌరుడికి కూడా న్యాయం లభించకుండా ఉండకూడదన్న ఉద్దేశంతో వీటిని ఏర్పాటుచేశారు.
  4. దీనివల్ల న్యాయవ్యవస్థ సమాన అవకాశాల ప్రాతిపదికన అందరికీ న్యాయాన్ని అందిస్తుంది.

10th Class Social Textbook Page No.320

ప్రశ్న 2.
ఉచిత న్యాయసేవల ద్వారా ఎటువంటి కేసులు, తగాదాలను చేపట్టవచ్చు?
జవాబు:

  1. లోక్ అదాలల ద్వారా న్యాయ సేవల ప్రాధికార సంస్థ దీర్ఘకాలంగా కోర్టుల్లో ఉన్న కేసులను తక్కువ కాలంలో, ఎటువంటి ఖర్చు లేకుండా పరిష్కరిస్తుంది.
  2. వైవాహిక విభేదాలు, భరణానికి సంబంధించిన కేసులు, భర్త, అత్తవారింటి వేధింపులకు సంబంధించిన కేసులు, గృహ హింస కేసులు.
  3. అన్ని రకాల సివిల్ కేసులు భూ వివాదాలు, చట్టరీత్యా రాజీకి అర్హమైన అన్ని రకాల క్రిమినల్ కేసులు వంటి వాటిని ఇది చేపట్టవచ్చు.

AP Board 10th Class Social Solutions Chapter 22 పౌరులు, ప్రభుత్వాలు

10th Class Social Textbook Page No.320

ప్రశ్న 3.
కోర్టుల బయట తగాదాల పరిష్కారానికి ప్రత్యామ్నాయ విధానం ఏదైనా ఉందా?
జవాబు:
ప్రాచీన కాలం నుండి ఒక విధానం అమలులో ఉంది. అదేమనగా :

  1. గ్రామాలలో ప్రజల తగాదాలను తీర్చడానికి అన్ని విషయాలను, అంశాలను గ్రామ/తెగ పెద్దల ముందు చర్చించి ప్రశాంతంగా అందరికీ ఆమోదయోగ్యంగా పరిష్కరించటం మన దేశంలో అనాదిగా జరుగుతోంది.
  2. తగాదాలు, వివాదాల స్వభావం, వాటి మూలాలు సాధారణంగా స్థానిక ప్రజలకు, గ్రామ పెద్దలకు తెలుస్తాయి.
  3. దీనివల్ల ఆ తగాదాలను / వివాదాలను గ్రామ ప్రజలు చర్చించటానికి వీలు కలుగుతుంది.
  4. పారదర్శక పద్దతిలో అందరికీ ఆమోదయోగ్య పరిష్కారాన్ని కనుగొనటం సాధ్యమవుతుంది.

10th Class Social Textbook Page No.316

ప్రశ్న 4.
టీచరుకు హెడ్ మాష్టారు ఇచ్చే మౌఖిక ఆదేశం సమాచారం కాకపోవటానికి కారణం ఏమిటో చర్చించండి.
జవాబు:
సమాచార హక్కు చట్టంలో పేర్కొన్న ప్రకారం సమాచారం ఈ క్రింది వాటి రూపంలో ఉండాలి.

  1. రికార్డులు, డాక్యుమెంట్లు, మెమోలు, ఈ-మెయిల్స్, అభిప్రాయాలు, సలహాలు, పత్రికా ప్రకటనలు, సర్క్యులర్లు, ఆదేశాలు, లాగ్ పుస్తకాలు, ఒప్పందాలు, నివేదికలు, పత్రాలు, నమూనాలు, మోడల్స్ వంటి రూపాలలో ఉన్న మెటీరియల్.
  2. ఏ ఎలక్ట్రానిక్ రూపంలోనైనా ఉన్న గణాంకాలు, అమలులో ఉన్న ఇతర చట్టాల కింద ప్రభుత్వ అధికారి అనుమతి పొందిన ప్రైవేటు సంస్థకు సంబంధించిన సమాచారం.
  3. కావున మౌఖిక ఆదేశాలు సమాచారంలోకి రావని తెలుస్తుంది.
  4. హెడ్ మాష్టారు ఆదేశాలను రాత పూర్వకంగా ఇవ్వలేదు. కావున హెడ్ మాష్టారు టీచరుకు ఇచ్చిన మౌఖిక ఆదేశాలు సమాచారం క్రిందకు రావని చెప్పవచ్చు.

10th Class Social Textbook Page No.316

ప్రశ్న 5.
సిఫారసు చేసిన విధంగా నియమ, నిబంధనలను పాటించినట్లయితే ప్రభుత్వ శాఖలు మరింత జవాబుదారీతనాన్ని ఎలా కనబరుస్తాయో ఊహించండి.
జవాబు:

  1. ప్రతి ప్రభుత్వశాఖ కొన్ని నియమ నిబంధనల ఆధారంగా పనిచేస్తుంది. మరియు సమాచార హక్కు చట్టం ప్రకారం సమాచారాన్ని తయారుచేసి తయారుగా పెట్టుకోవాలి.
  2. ప్రజాస్వామ్య దేశాలలో ప్రభుత్వ శాఖలు ప్రజలకు బాధ్యత వహిస్తాయి. కావున ప్రభుత్వ సంస్థలన్నీ నిరంతరం మెలకువగా ఉండి, తమ విధులను నిర్వర్తించాలి.
  3. ప్రతి ప్రభుత్వ శాఖ నియమ నిబంధనలకు లోబడి పని చేసినప్పుడు పనిలో పారదర్శకత ఏర్పడి ప్రజల నియంత్రణలో ఉంటుంది.
  4. ఎవరైనా వ్యక్తులు, ఏదైనా విషయం మీద, ఏ సంస్థనైనా సమాచారం అడగవచ్చు. కావున ప్రతి సంస్థ తన విధి నిర్వహణలో అవినీతికి పాల్పడకుండా ఈ చట్టం నియంత్రిస్తుంది.
  5. ఈ సమాచార హక్కు చట్టం అనేది అన్ని ప్రభుత్వ శాఖల మీద పర్యవేక్షణ అధికారిగా పనిచేస్తుంది.

AP Board 10th Class Social Solutions Chapter 22 పౌరులు, ప్రభుత్వాలు

10th Class Social Textbook Page No.318

ప్రశ్న 6.
ఈ చట్టం ప్రకారం ఏ సమాచార అధికారి అయినా సమాచారం ఇవ్వకపోతే వాళ్లు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. మీరు దీనితో ఏకీభవిస్తారా? ఎందుకని?
జవాబు:
ఏకీభవిస్తాను. ఎందుకనగా :

  1. సమాచార అధికారులు పౌరులు అడిగిన సమాచారాన్ని అందివ్వని పక్షంలో జరిమానా కట్టవలసిందే.
  2. ఎప్పుడైతే ఆ అధికారి జరిమానా చెల్లిస్తాడో, తాను చేసిన పని పట్ల సిగ్గుపడతాడు. ఇంకెప్పుడు ఇటువంటి పొరపాటు చేయకూడదని భావిస్తాడు.
  3. ఒక అధికారి జరిమాన చెల్లించడం ద్వారా ఇంకొకసారి ఇటువంటి పరిస్థితి తెచ్చుకోకూడదని భావించి, మరింత బాధ్యతగా పనిచేస్తాడు. పనిలో పారదర్శకత ఉండేలా చూసుకుంటాడు.
  4. జరిమానా కట్టుట మూలంగా, ఆ విషయం ఆ కార్యాలయంలో అందరికి తెలిసిపోతుంది. దీని పట్ల అతను సిగ్గుపడడమే కాకుండా అవినీతికి పాల్పడకుండా జాగ్రత్తగా ఉంటాడు.
  5. సమాచారాన్ని అందివ్వకపోతే జరిమానా కట్టవలసి వస్తుంది. కావున ఇంకెప్పుడు అటువంటి పొరపాటు చేయకుండా సమాచారాన్ని అడిగిన వారందరికి అందిస్తాడు.

10th Class Social Textbook Page No.318

ప్రశ్న 7.
ఏ రకమైన సమాచారం ప్రజలకు అందుబాటులో లేదు? దీనికి మద్దతు తెలిపిన వాదన ఏది?
జవాబు:
కొంత సమాచారాన్ని ప్రభుత్వం వెల్లడి చేయకుండా ఉండే అవకాశాన్ని చట్టం కల్పించింది. ఆ అంశాలు :

  1. భారతదేశ సార్వభౌమత్వం, సమగ్రతలను ప్రభావితం చేసే సమాచారం, విదేశీ శక్తుల సందర్భంలో కీలక ఆర్థిక, శాస్త్రీయ ప్రయోజనాలు కలిగి ఉండే అంశాలు.
  2. పార్లమెంటు లేదా రాష్ట్ర శాసనసభల హక్కులకు భంగం కలిగించే సమాచారం.
  3. గోప్యంగా ఉంచుతారన్న భావనతో విదేశ ప్రభుత్వాల నుంచి అందిన సమాచారం.
  4. ఒక వ్యక్తి జీవితానికి లేదా భౌతిక భద్రతకు భంగం కలిగించే సమాచారం.
  5. (అంతిమ నిర్ణయం తీసుకోటానికి ముందు) మంత్రుల లేదా సెక్రటరీల బృందం ముందు ఉంచే క్యాబినెట్ పత్రాలు లేదా రికార్డులు.
  6. మన సైనిక దళాలు, భద్రతా సంస్థలు చాలా వరకు సమాచార కమిషన్ల పరిధిలోకి రావు.

ఈ చట్టానికి మద్దతుగా చేసిన వాదన :
ఈ చట్టం చేసిన తరువాత దీనిలోని పలు అంశాలను అనేక సందర్భాలలో వివిధ శాఖలు ప్రశ్నించాయి. అవసరమనిపిస్తే ఈ చట్టానికి పార్లమెంటు సవరణలు చేయవచ్చు. అయితే రాజ్యాంగం అర్థం చేసుకుని నిర్వచించిన దానికి మద్దతుగా, సమాచారానికి ఉన్న మౌలిక హక్కుకు భంగం కలిగించేలా ఇది ఉండకూడదు.

AP Board 10th Class Social Solutions Chapter 22 పౌరులు, ప్రభుత్వాలు

10th Class Social Textbook Page No.320

ప్రశ్న 8.
లోక్ అదాలత్ ను మీరు సమర్థిస్తారా?
జవాబు:
అవును సమర్థిస్తాను. ఎందుకనగా :

  1. సమాన అవకాశాల ప్రాతిపదికన న్యాయాన్ని అందించేలా న్యాయవ్యవస్థ పనిచేసేలా చూడటానికి లోక్ అదాలత్ లను ఏర్పాటు చెయ్యటం జరిగింది.
  2. ఖర్చు లేకుండా లోక్ అదాలత్ న్యాయాన్ని అందిస్తుంది.
  3. త్వరితగతిన న్యాయం పొందటానికి ప్రజలకు లోక్ అదాలత్ ఉపయోగపడుతుంది. విధానాలలో వెసులుబాటు ఉంటుంది.
  4. కోర్టులలో దీర్ఘకాలంగా పరిష్కారానికి నోచుకోని కేసులకు లోక్ అదాలత్ లో పరిష్కారం దొరుకుతుంది.
  5. ఎటువంటి కోర్టు రుసుము ఉండదు, ఒకవేళ కోర్టు రుసుము అప్పటికీ చెల్లించి ఉంటే లోక్ అదాలత్ లో కేసు పరిష్కరింపబడినప్పుడు నియమాలకు లోబడి రుసుమును తిరిగి చెల్లిస్తారు.
  6. తమ సలహాదారు ద్వారా వివాదంలోని కక్షిదారులు నేరుగా జడ్జితో సంభాషించవచ్చు. ఇది సాధారణ న్యాయ స్థానాలో సాధ్యంకాదు.
  7. లోక్ అదాలత్ ఇచ్చే తీర్పును వాది, ప్రతివాదులు గౌరవించాలి. సివిల్ కోర్టు ఇచ్చే తీర్పుకి ఉండే విలువ దీనికి కూడా ఉంటుంది.
  8. అడ్వకేట్ల ద్వారా ఉచిత న్యాయసలహా అందిస్తారు. కోర్టులలో కేసును వాదించటానికి అడ్వకేట్లను నియమిస్తారు. ఉచిత న్యాయ సేవలు, మద్దతుకి అర్హులైన వ్యక్తులకు సంబంధించిన కోర్టు కేసులలో కోర్టు ఖర్చులను భరిస్తారు, తీర్పు నకళ్లను ఉచితంగా అందచేస్తారు.

AP Board 10th Class Social Solutions Chapter 21 సమకాలీన సామాజిక ఉద్యమాలు

SCERT AP 10th Class Social Study Material Pdf 21th Lesson సమకాలీన సామాజిక ఉద్యమాలు Textbook Questions and Answers.

AP State Syllabus 10th Class Social Solutions 21th Lesson సమకాలీన సామాజిక ఉద్యమాలు

10th Class Social Studies 21th Lesson సమకాలీన సామాజిక ఉద్యమాలు Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
సామాజిక ఉద్యమాలపై ఒక పట్టిక తయారు చెయ్యటానికి ఇక్కడ కొన్ని అంశాలు ఉన్నాయి. వీటి ఆధారంగా పట్టిక తయారుచేసి వివిధ ఉద్యమాల మధ్య పోలికలు, తేడాలను గుర్తించండి.
ఉద్యమం దృష్టి పెట్టిన ప్రధాన అంశం; ఎక్కడ జరిగింది; ప్రధాన కోరికలు; నిరసన తెలియచేసిన పద్ధతులు; ముఖ్యమైన నాయకులు, ప్రభుత్వం స్పందించిన తీరు; సమాజంపై ఉండే ప్రభావం. (AS3)
జవాబు:

ప్రశ్న 2.
కన్నయ్య, రమ్య, సల్మా ఒక విషయాన్ని చర్చిస్తున్నారు. వాళ్ల కోరికలు వేరు. మానవ హక్కుల కోణం నుంచి మీరు ఎవరితో ఏకీభవిస్తారో పేర్కొని మీ కారణాలను తెలియచెయ్యండి.
ప్రజలు పేదరికంలో మగ్గకుండా చూడాలి, అందుకు అవసరమైతే పత్రికా స్వేచ్ఛను కొంతవరకు నియంత్రించినా ఫర్వాలేదని రమ్య అంటుంది. ఆహారం ఒక్కటే ఉంటే చాలదని, పత్రికా స్వేచ్ఛ కూడా ఉండటం ముఖ్యమని లేకపోతే దేశ వివిధ ప్రాంతాలలో మానవ హక్కులు ఎక్కడైనా ఉల్లంఘింపబడుతున్నాయేమో తెలిసే మార్గమే ఉండదన్నది సల్మా వాదన. పత్రికలు ధనికులు, శక్తిమంతుల చేతుల్లో ఉన్నప్పుడు ప్రయోజనం ఏమిటి, అవి సాధారణ ప్రజలకు సంబంధించిన అంశాలను ఎందుకు ప్రచురిస్తాయని కన్నయ్య అంటాడు. (AS2)
జవాబు:
నేను సల్మా వాదనతో ఏకీభవిస్తాను. ఎందుకనగా

  1. ప్రతివ్యక్తికి ఆహారం ముఖ్యమే, అయినా స్వేచ్ఛ కూడా ముఖ్యమే.
  2. పత్రికా స్వేచ్ఛ అనేది ప్రతి వ్యక్తికి అవసరమే. పత్రికా స్వేచ్ఛ అనగా, భావ ప్రకటన స్వేచ్ఛ. ఇది ఒక ప్రాథమిక హక్కు
  3. ప్రతీ వ్యక్తికి ప్రాథమిక హక్కులు అవసరం. ప్రజలకు ఆహారం ఒక్కటే ముఖ్యం కాదు. పత్రికా స్వేచ్ఛతో ప్రపంచం నలుమూలలా ఏం జరిగినా తెలుసుకోగలుగుతారు. అదే విధంగా మానవ హక్కులు ఎక్కడైనా ఉల్లంఘించ బడుతున్నాయేమో తెలుసుకోవచ్చు.
  4. ప్రపంచీకరణ జరుగుతున్న నేపథ్యంలో పత్రికా స్వేచ్ఛ చాలా అవసరం.
  5. సమాజంలో జరిగే విషయాలు తెలుసుకొని, పాల్గొనడానికి పత్రికా స్వేచ్ఛ ఉండాలి.
  6. మానవ హక్కులకు రక్షణ చాలా అవసరం.

AP Board 10th Class Social Solutions Chapter 20 ప్రపంచ యుద్దాల తరువాత ప్రపంచం, భారతదేశం

ప్రశ్న 3.
సామాజిక ఉద్యమాల మౌలిక అంశాలు ఏమిటి?
జవాబు:

  1. వివక్షతతో కూడిన చట్టాలను శాంతియుతంగా ఉల్లంఘించడం.
  2. ప్రజలకు స్వేచ్ఛాపూరిత, భావ ప్రకటన వంటివి.
  3. పర్యావరణ ఉద్యమాలలో – నష్టపరిహారం, పునరావాసం.
  4. సారా వ్యతిరేక ఉద్యమాలు.
  5. మైరా పైబీ ఉద్యమంలో సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని రద్దుచేయాలని కోరటం జరిగింది.
  6. సామాజిక ఉద్యమాలన్నీ రాజకీయ పార్టీలకు దూరంగా ఉండి ఒక ఆశయం కోసం పనిచేస్తాయి.
  7. కొన్ని సందర్భాలలో తమపై రుద్దిన మార్పులను ఈ ఉద్యమాలు ప్రతిఘటించాయి.
  8. మార్టిన్ లూథర్ కింగ్, మైరా పైబీ వంటి కొన్ని ఉద్యమాలు మార్పును కోరుకున్నాయి.

ప్రశ్న 4.
పైన ఇచ్చిన ఉదాహరణలో సాధారణ ప్రజల పాత్రను ఎలా పేర్కొన్నారు?
జవాబు:

  1. సాధారణ ప్రజలు ముందుగా వారి సమస్యల పరిష్కారం కోసం ఆలోచిస్తారు.
  2. ప్రభావిత ప్రజలు, వారి సమస్యలను తీర్చే నాయకుల వద్ద వెలిబుచ్చుతారు.
  3. ప్రజలు, వారి అభిప్రాయాలను ప్రజా ప్రతినిధుల ద్వారా వినిపిస్తారు.
  4. ప్రజలు వారి నాయకులు ప్రారంభించిన ఉద్యమాలు, ఊరేగింపులు, ప్రదర్శనలు, పికెటింగ్ వంటి వాటిలో ఎంతో ఉత్సాహంతో పాల్గొంటారు.
  5. ఈ మధ్యకాలంలో ప్రజలు, ఇంటర్నెట్, సాంఘిక ప్రచార సాధనాల వల్ల చైతన్యవంతులవుతున్నారు. వారి సమస్యల సాధన కొరకు పోరాడుతున్నారు.
  6. ప్రస్తుత కాలంలో ప్రజలు వారి సమస్యలే కాకుండా సమాజ సమస్యలు అనగా పర్యావరణం, కాలుష్యం, పునరావాసం, నష్టపరిహారం వంటి సమస్యల పట్ల మరియు మానవ హక్కులు ఉల్లంఘన జరుగుతున్న ప్రజలకు కూడా సహకారం అందిస్తూ, ఆయా ఉద్యమాలలో భాగస్వాములు అవుతున్నారు.
  7. సామాన్య ప్రజల సహకారం, భాగస్వామ్యం లేనిదే సాంఘిక ఉద్యమాలు విజయం సాధించలేవు.

ప్రశ్న 5.
అమెరికాలోని నల్లజాతీయులు, మైరా పైబీ ఉద్యమాల మధ్య పోలికలు, తేడాలు ఏమిటి? (AS1)
జవాబు:
అమెరికాలోని నల్లజాతీయులు, మైరా పైబీ ఉద్యమాల మధ్య ఉన్న తేడాలు :

అమెరికాలోని నల్లజాతీయులుమైరా పైబీ ఉద్యమం
1) ఉపాధి కల్పనకు కార్యక్రమాలు పూర్తి న్యాయమైన ఉపాధి.1) సాయుధ ధళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని రద్దు చెయ్యాలని మైరా పైబీ ఉద్యమం కోరుతుంది.
2) మంచి గృహ వసతి.2) మహిళలు మాత్రమే ఉద్యమంలో పాల్గొన్నారు.
3) స్త్రీ, పురుషులందరూ పాల్గొన్నారు.3) ఎన్నికలను బహిష్కరించారు.
4) ఓటు హక్కు4) వీరు కేవలం కిరోసితో తడిపి వెలిగించిన కాగడాలు మాత్రమే ఉపయోగించారు.
5) శ్వేతజాతి, నల్లజాతి పిల్లలు కలిసి చదువుకునే విద్యా సదుపాయాలు వంటివి నల్లజాతీయుల కోరికలు.5) రాత్రిళ్లు కాపలా కాసేవారు.
6) ప్రదర్శనలు, నిరసనలు, ఊరేగింపుల ద్వారా ఉద్యమాన్ని నడిపారు.

పోలికలు:

అమెరికాలోని నల్లజాతీయులుమైరా పైబీ ఉద్యమం
1) పౌరహక్కుల చట్టాన్ని చేయవల్సిందిగా కోరారు.1) మానవ హక్కుల ఉద్యమంగా మారింది.
2) తమను పట్టించుకొనుటలేదని మహిళలు భావించారు.2) మహిళలు మాత్రమే ఉద్యమం చేశారు.
3) మానవ హక్కుల ఉల్లంఘన జరిగింది.3) మానవ హక్కుల ఉల్లంఘన జరిగింది.

ప్రశ్న 6.
ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక రాజకీయ వ్యవస్థలుగా ప్రజాస్వామ్యాలే ఉన్నాయి. ఇవి ప్రజల ఆకాంక్షలకు పూర్తి న్యాయం చేశాయా? ఈ అధ్యాయంలో ఇచ్చిన ఉదాహరణల ఆధారంగా ‘ప్రజాస్వామ్యం సామాజిక ఉద్యమాలు’ అన్న అంశంపై చిన్న వ్యాసం రాయండి. (AS4)
AP Board 10th Class Social Solutions Chapter 21 సమకాలీన సామాజిక ఉద్యమాలు 1
జవాబు:
“ప్రజాస్వామ్యం – సామాజిక ఉద్యమాలు” :
ప్రపంచంలో చాలా దేశాలలో ప్రజాస్వామ్య ప్రభుత్వాలే ఉన్నాయి. ఇవి ప్రజల ఆకాంక్షలను పూర్తిగా న్యాయం చేయలేదనడానికి నిదర్శనమే సామాజిక ఉద్యమాలు. ప్రజాస్వామ్య ప్రభుత్వాలే ప్రజలను వివక్షతతో చూస్తున్నాయి. కొందరికి మానవ హక్కులను – ఉల్లంఘిస్తున్నాయి, సామాజిక న్యాయాన్ని చేకూర్చుట లేదు.
ఉదా :
అమెరికా పౌరహక్కుల ఉద్యమం. (నల్లజాతి వారిని ప్రభుత్వం వివక్షతతో చూడడం) దక్షిణాఫ్రికాలోని జాతి వివక్షత చాలాకాలం సమాన హక్కులకు దూరంగా ఉన్నవారు సామాజిక ఉద్యమాలను లేవనెత్తుతారు. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత వలస పాలన నుండి అనేక దేశాలు స్వాతంత్ర్యాన్ని సంపాదించుకున్నాయి. ఇటువంటి దేశాల ప్రజలు వలస పాలనతో ఇబ్బందులను అనుభవించి, తమ కష్టాలను తీర్చే ప్రభుత్వాలను ఆశించారు. కాని ఆ తరువాత వచ్చిన ప్రభుత్వాలు కూడా ప్రజల ఆశలను పరిగణనలోకి తీసుకోకుండా అణుయుద్ధాలు చేశాయి. ఆయుధసమీకరణ చేసి, ప్రపంచాన్ని భయాందోళనలకు గురిచేశాయి. ప్రచ్ఛన్న యుద్ధం తరువాత అణ్వాయుధాలను నిషేదించినప్పటికి ప్రజలకు శాంతి, భద్రతలను కల్పించలేకపోయాయి. ఇటువంటి తరుణంలోనే ప్రజలు ప్రభుత్వాలను వ్యతిరేకించారు. అనేక ఉద్యమాలను లేవదీశారు. ముఖ్యంగా పర్యావరణ కాలుష్యం, సామాజిక న్యాయం కల్పించకపోవడం, వివక్షతను పాటించటం వంటి సమస్యలు ఉద్యమాలకు కారణాలని చెప్పవచ్చు. ఇటువంటి సమస్యల సాధనలో ప్రజాస్వామ్య ప్రభుత్వాలు విఫలం అయ్యాయని చెప్పవచ్చు.

AP Board 10th Class Social Solutions Chapter 20 ప్రపంచ యుద్దాల తరువాత ప్రపంచం, భారతదేశం

ప్రశ్న 7.
భోపాల్ గ్యాస్ దుర్ఘటన వంటి వాటి నేపథ్యంలో నిరసనలు, ఉద్యమాలకు ప్రపంచ వ్యాప్తంగా ప్రజలను ఎలా సమీకరిస్తారో తెలుసుకుని, చర్చించండి. (AS3)
జవాబు:
వివిధ ఉద్యమాలలో ప్రజలను వివిధ రకాలుగా సమీకరించుట జరిగింది. వాటిలో నుండి కొన్ని :
1) భోపాల్ గ్యాస్ దుర్ఘటన చాలా తీవ్రమైనది. ఇది భోపాల్ లోని యూనియన్ కార్బైడ్ కంపెనీ తరువాత దీనిని ‘డౌ’ కంపెనీకి అమ్మేశారు. ఏమీ తెలియని ప్రజలు ప్రశాంతంగా నిద్రపోతుంటే ఒకరాత్రి కంపెనీ నుండి విషవాయువు వెలువడి వేలాదిమంది చనిపోయారు. దాని ప్రభావం వల్ల ఇప్పటికి వేలాది మంది బాధపడుతున్నారు. అయితే ఈ కంపెనీ బహుళజాతి కంపెనీ. ఇది అమెరికాలో ఉంది. ఈ దుర్ఘటనలో బాధితులకు సరైన నష్టపరిహారం, వైద్య సదుపాయాలు కల్పించలేదు. ఈ కంపెనీ మీద పోరాటానికి అంతర్జాతీయ చట్టాలను ఉపయోగిస్తున్నారు. లండన్ ఒలింపిక్స్ క్రీడలకు ‘ఔ’ కంపెనీ స్పోన్సరు చెయ్యటానికి వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా ప్రజల సంతకాలు సేకరిస్తున్నారు.

2) ‘నర్మదా బచావో’ ఉద్యమంలో నిర్వాసితులైన ప్రజలకోసం ఉద్యమ నాయకులు. ‘బావా మహలియా’, మేధాపాట్కర్ వంటి నాయకులు పోరాడుతూ ప్రజలను చైతన్యవంతులను చేసి ఉద్యమంలోకి భాగస్వాములను చేశారు. దీని కొరకు తీవ్ర నిరసనలు, ప్రదర్శనలు, నిరాహారదీక్షలు అంతర్జాతీయ ఉద్యమాల ద్వారా ప్రజలను సమీకరించారు.

3) కేరళలోని ‘సైలెంట్ వ్యాలీ’ ఉద్యమం విషయంలో అరుదైన జంతువులు, మొక్కలు అంతరించిపోతాయని అనేకమంది విద్యావంతులు గ్రహించారు. వీటి రక్షణ కొరకు పెద్ద ఉద్యమం ఏర్పడింది. ప్రజలలో విజ్ఞాన శాస్త్ర ప్రచారానికీ, విద్యకోసం పనిచేస్తున్న కేరళ శాస్త్ర సాహిత్య పరిషత్ (కెఎఎపి) రాష్ట్రవ్యాప్తంగా ప్రజలను సమీకరించింది.

4) అమెరికా పౌరహక్కుల ఉద్యమంలో వివక్షతకు గురి అవుతున్న నల్లజాతీయులే ఈ ఉద్యమాన్ని లేవదీసారు.

5) యూరపులో గ్రీన్ పీస్ ఉద్యమంలో అణు పరీక్షలకు వ్యతిరేకంగా ఈ గ్రీన్ పీస్ ఉద్యమం ప్రారంభమైనది. దీనిలో స్వచ్ఛంద కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ ఉద్యమం 40 దేశాలకు విస్తరించింది.

6) సారా వ్యతిరేక ఉద్యమంలో పేదవారు, ఈ సమస్యకు ప్రభావితమవుతున్నా మహిళలు పాల్గొన్నారు. ‘సాక్షరతా’ పుస్తకాల ద్వారా ఉద్యమ విషయాలు తెలుసుకుని అనేక గ్రామాలలోని మహిళలు ఈ ఉద్యమంలోకి వచ్చారు.

7) మైరా పైబీ ఉద్యమం తీసుకువచ్చింది మణిపూర్ మహిళలు. సాయుధ దళాలకు ఉన్న ప్రత్యేక అధికారాల చట్టం మూలంగా తరచు మానవహక్కుల ఉల్లంఘన జరుగుతుంది. మహిళలు లైంగిక వేధింపులకు గురి అవుతున్నారు. ఇందుకు నిరసనగా సాయుధ దళాలకు ప్రత్యేక అధికార చట్టాలను రద్దుచేయాలని మహిళలు స్వచ్ఛందంగా ఉద్యమంలో పాల్గొన్నారు.

8) ప్రస్తుత కాలంలో నిరసనలు, ఉద్యమాలకు ప్రజలను ఫేస్ బుక్, ట్విట్టర్, ఇ-మెయిల్, ఇంటర్నెట్, వార్తాపత్రికలు వంటి వాటి ద్వారా సమీకరిస్తున్నారు.

10th Class Social Studies 21th Lesson సమకాలీన సామాజిక ఉద్యమాలు InText Questions and Answers

10th Class Social Textbook Page No.300

ప్రశ్న 1.
గ్రీన్‌పీస్ ఉద్యమం వెబ్ సైట్ చూసి (http:/www.greenpeace.org/international) అది పనిచేస్తున్న అంశాల గురించి, ఎంచుకున్న పోరాట పద్ధతుల గురించి తెలుసుకోండి. ఈ ఉద్యమంపై ఉన్న చర్చలు, విమర్శల గురించి కూడా తెలుసుకోండి.
జవాబు:

10th Class Social Textbook Page No.302

ప్రశ్న 2.
పెంటగావ్ వద్ద కాపలా ఉన్న సైనికుడికి నిరసనకారులలోని ఒక మహిళ ఒక పువ్వు ఇస్తోంది. ఈ బొమ్మలోని భావనలను చర్చించండి.
AP Board 10th Class Social Solutions Chapter 21 సమకాలీన సామాజిక ఉద్యమాలు 2
జవాబు:
అమెరికా, వియత్నాంతో అన్యాయంగా యుద్ధం చేస్తుందనే భావన అమెరికా సైనికులలో, ప్రజలలో ఉంది. ఆ యుద్ధాన్ని నిరసిస్తూ ప్రజలు ఉద్యమం కూడా చేశారు. అయితే అమెరికా చేస్తున్న యుద్ధం పట్ల వ్యతిరేకత సైనికులలో గమనించిన, నిరసన తెలియజేయడానికి వచ్చిన వారిలో నుండి ఒక మహిళ ఆ సైనికుడిని అభినందిస్తూ ఒక పువ్వును ఇస్తుందని పై చిత్రం ద్వారా తెలుస్తుంది.

AP Board 10th Class Social Solutions Chapter 20 ప్రపంచ యుద్దాల తరువాత ప్రపంచం, భారతదేశం

10th Class Social Textbook Page No.299

ప్రశ్న 3.
డా|| మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ దా! కింగ్ ఇచ్చిన ఈ ప్రఖ్యాత ఉపన్యాసాన్ని చదివి, అమెరికా సమాజానికి అతడు.. ఉంచిన ఆదర్శాల గురించి, వాటిని సాధించటానికి అతడు రూపొందించుకున్న ప్రణాళిక గురించి ఒక వ్యాసం రాయంది.
AP Board 10th Class Social Solutions Chapter 21 సమకాలీన సామాజిక ఉద్యమాలు 3
జవాబు:
ఉద్యమాలలో అమెరికాలోని పౌరహక్కుల ఉద్యమం చాలా ముఖ్యమైనది. ఈ ఉద్యమాన్ని డా|| మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ డా॥ కింగ్ ముందుకు నడిపించారు. అయితే ఈ ఉద్యమమనేది “పౌర నిరాకరణ” ధ్యేయంగా నడిచింది. (వివక్షతతో కూడిన చట్టాలను శాంతియుతంగా ఉల్లంఘించటం). డా॥ కింగ్ అమెరికా సమాజంపై ఉంచిన ఆదర్శాలు. పాఠశాలల్లో, బస్సుల్లో, బహిరంగ ప్రదేశాలలో నల్లజాతి వారిని వేరుగా ఉంచడానికి, ఉద్యోగాలలో, గృహవసతిలో, ఓటు హక్కులలో నల్లవారిని వివక్షతతో చూడకుండా వీరికి కూడా తెల్లవారితో సమానంగా హక్కులు కల్పించాలి.

ఒక సంవత్సరం పాటు డా॥ కింగ్ అధ్యక్షతన మాంటగోయెరిలో నల్లజాతీయులు బస్సులను బహిష్కరించారు. ఈయన పౌరహక్కుల చట్టాన్ని చేయాల్సిందిగా కోరారు. ఉపాధి కల్పనకు కార్యక్రమాలు పూర్తి న్యాయమైన ఉపాధి, మంచి గృహవసతి, ఓటు హక్కు శ్వేతజాతి, నల్లజాతి పిల్లలు కలిసి చదువుకునే సమ్మిళిత విద్యా సదుపాయాలు కావాలని కోరాడు. మనుషులను శరీర రంగును బట్టి కాకుండా వాళ్ల వ్యక్తిత్వ లక్షణాలను బట్టి అంచనావేసే దేశంగా అమెరికా మారాలని డా॥ కింగ్ తన ఉపన్యాసంలో తెలియచేశాడు.

10th Class Social Textbook Page No.300

ప్రశ్న 4.
పౌర హక్కుల ఉద్యమ కోరికల జాబితా తయారుచేసి, వాటికి మీరు సూచించే పరిష్కారాలు ఏమిటో రాయండి.
జవాబు:
పౌరహక్కుల ఉద్యమంలోని కోరికలు, వాటికి నేను సూచించే పరిష్కారాలు

పౌరహక్కుల ఉద్యమ కోరికలుపరిష్కార సూచనలు
1) ఉపాధి కల్పనకు కార్యక్రమాలు1) ప్రభుత్వమే వివిధ పరిశ్రమలను స్థాపించాలి, సమానత్వాన్ని పాటించాలి.
2) పూర్తి న్యాయమైన ఉపాధి కల్పించడం.2) తెల్లవారు, నల్లవారు అనే విచక్షణ చూపించకుండా అందరికీ సమాన ఉపాధి కల్పించాలి.
3) మంచి గృహవసతి3) ప్రభుత్వం గృహవసతి కల్పించాలి. లేదా నల్లవారు ఇళ్లు కట్టుకోవడానికి సహాయం చేయాలి.
4) ఓటు హక్కు కల్పించాలి.4) తెల్లవారితో సమానంగా నల్లవారందరికీ ఓటు హక్కు కల్పించాలి.
5) శ్వేతజాతి, నల్లజాతి పిల్లలు కలిసి చదువుకునే సమ్మిళిత విద్యా సదుపాయాలు.5) నల్లవారు కూడా తెల్లవారితో కలిసి చదువుకునేలా చట్టాలు చేయాలి. వాటిని సక్రమంగా అమలుచేయాలి.
6) పౌర హక్కుల చట్టాన్ని చేయాలి.6) పౌరహక్కుల ఉద్యమంలోని కోరికలు అమలు జరగాలంటే పౌరహక్కుల చట్టాన్ని చేయాలి, చట్టం అమలు కొరకు యంత్రాంగాన్ని కూడా నియమించాలి.

10th Class Social Textbook Page No.300

ప్రశ్న 5.
ప్రజాస్వామిక దేశమని అమెరికా చెప్పుకుంటుంది. కానీ గత శతాబ్దం మధ్యకాలం వరకు కొంతమంది ప్రజలను వేరుగా ఉంచింది. భారతదేశ నేపథ్యంలో ప్రజాస్వామ్య భావన అందరినీ కలుపుకునేలా ఎలా ఉండాలో చర్చించండి.
జవాబు:
భారతదేశ నేపధ్యంలోని ప్రజాస్వామ్యం వలె అమెరికాలో ప్రజాస్వామ్యం అమలు కావాలంటే ఈ క్రింది విధంగా చేయాలి.

  1. జాతి, మత, వర్గ విచక్షణ, పేద, ధనిక అనే తారతమ్యాలు ప్రత్యేకించి నల్లవారు, తెల్లవారు అనే విచక్షణ చూపకుండా అందరినీ సమాన ప్రాతిపదికన చూడాలి.
  2. మన దేశంలో స్త్రీ, పురుష, జాతి, వర్గ, కుల, మత, భాషా తారతమ్యాలు పాటించకుండా అందరికీ ఓటు హక్కును కల్పించినట్లు అమెరికా కూడా దేశంలోని ప్రజలందరికీ ఓటు హక్కు కల్పించాలి.
  3. మనదేశంలో అల్పసంఖ్యాకులకు రాజ్యాంగ పరంగా రక్షణ కల్పించినట్లు అమెరికా కూడా అల్పసంఖ్యాకులైన నల్లవారికి కూడా రాజ్యాంగ పరంగా రక్షణ కల్పించాలి.
  4. భారత రాజ్యాంగం ప్రకారం మనదేశ పౌరులందరికీ పౌరసత్వం ఉన్నట్లే అమెరికాలో కూడా నల్లవారనే తేడాలు లేకుండా అందరికీ పౌరసత్వం ఇవ్వాలి.
  5. భారత ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరునికి స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలు ఉన్నట్లు అమెరికాలో కూడా ప్రతి పౌరునికి స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలను కల్పించాలి.
  6. మనదేశంలో పౌరుల శరీర రంగుకు ప్రాధాన్యత లేనట్లే అమెరికాలో కూడా నల్లవారిని రంగును బట్టి విచక్షణ చూపరాదు.

AP Board 10th Class Social Solutions Chapter 20 ప్రపంచ యుద్దాల తరువాత ప్రపంచం, భారతదేశం

10th Class Social Textbook Page No.300

ప్రశ్న 6.
ఒక ఉద్యమంలో భిన్న గొంతుకలు ఎందుకు వినపడుతుంటాయి ? వాటిల్లోని అభిప్రాయభేదాలను గుర్తించండి.
జవాబు:
అమెరికాలో పౌరహక్కుల చట్టం కోసం ఉద్యమం బలపడుతున్న సమయంలో భిన్నభిన్న అభిప్రాయాలు వెలుగులోకి వచ్చాయి. అందులో కొన్ని :

  1. చాలామంది శాంతియుత మార్గాల ద్వారా ప్రజలందరికి సమానత్వం సాధించటం వీలవుతుందని అన్నారు. అందుకు అవసరం అయిన చట్టాలు ప్రభుత్వం చేసేలా చెయ్యవచ్చని అనేకమంది మరియు డా|| కింగ్ కూడా అన్నారు.
  2. “మాల్కం ఎక్స్” వంటి వారు అనేకమంది నల్లవాళ్లు వేరేజాతి అని శ్వేత జాతీయుల పాలన నుంచి స్వాతంత్ర్యం కోసం పోరాడాలని భావించారు.
  3. అధికారాన్ని చేజిక్కించుకోటానికి సాయుధ ఘర్షణలతో సహా అన్ని మార్గాలను వినియోగించుకోవాలని ‘మాల్కం ఎక్స్’ వంటివారు భావించారు.
  4. ఈ ఉద్యమంలో పురుషుల ఆధిపత్యం ఉందని, తమని ఎవరూ పట్టించుకోవటం లేదని నల్లజాతి మహిళలు భావించసాగారు.
    ఈ విధంగా అభిప్రాయభేదాలు వెలువడ్డాయి.

10th Class Social Textbook Page No.300

ప్రశ్న 7.
అమెరికా, యుఎస్ఎస్ఆర్‌లోని రాజకీయ వ్యవస్థలో పోలికలు, తేడాలు గుర్తించండి. ప్రజల హక్కులకు అవి ఎలా స్పందించాయి?
జవాబు:
అమెరికా, యుఎస్ఎస్ఆర్‌లోని రాజకీయ వ్యవస్థలోని పోలికలు, తేడాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
తేడాలు :

అమెరికా రాజకీయ వ్యవస్థయుఎస్ఎస్ఆర్ లోని రాజకీయ వ్యవస్థ
1) సెన్సారు లేని స్వేచ్ఛాపూరిత పత్రికలున్నాయి.1) సెన్సారులేని స్వేచ్ఛాపూరిత పత్రికలు లేవు.
2) స్వేచ్ఛాపూరిత ప్రసార సాధనాలను అనుమతించారు.2) స్వేచ్ఛాపూరిత ప్రసారసాధనాలను అనుమతించలేదు.
3) సాధారణ ప్రజల స్వేచ్ఛాపూరిత భావ ప్రకటనలను అనుమతించలేదు.3) సాధారణ ప్రజల స్వేచ్ఛాపూరిత భావ ప్రకటనలను అనుమతించారు.
4) ప్రజల కదలికలు, చర్యల మీద పూర్తి స్వేచ్చ ఉంది. నియంత్రణ లేదు.4) ప్రజల కదలికలు, చర్యల మీద స్వేచ్ఛ లేదు. నిరంతరం ప్రజల చర్యల మీద నియంత్రణ ఉంది.
5) ప్రజాస్వామ్య ప్రభుత్వం ఉంది.5) సోషలిస్ట్ ప్రభుత్వం ఉంది.
6) నల్లవారు, తెల్లవారనే విచక్షణ చాలాకాలం పాటించారు.6) ఎటువంటి విచక్షణ లేదు. అందరూ సమానమే అనే భావన ఉంది.
7) పౌరహక్కుల చట్టంను అనుమతించారు. సక్రమంగా అమలుచేయుట జరుగుతుంది.7) గోర్బచేవ్ ప్రజలకు స్వేచ్ఛను కల్పించటానికి “గ్లాస్ నోస్” అనే సంస్కరణలు చేశాడు.

పోలికలు :
ఈ రెండు దేశాలలో మానవ హక్కుల కోసం ఉద్యమాలు జరిగాయి.

10th Class Social Textbook Page No.301

ప్రశ్న 8.
వీళ్లు దేశభక్తి లేని వాళ్లని కొంతమంది భావించగా, అన్యాయమైన యుద్ధంలో పాల్గొనాలనుకోకపోవటం సమర్ధనీయమే అని మరికొంతమంది భావించారు. ఈ రెండు దృష్టి కోణాలను తరగతిలో చర్చించి మీ దృష్టికోణంతో పాటు రెండు వైపుల వాదనలను క్లుప్తంగా రాయండి.
జవాబు:

  1. అమెరికాలోని చట్టం ప్రకారం సైన్యంలో చేరే వయసున్న యువకులందరూ కొంతకాలం సైన్యంలో పనిచేయాలనేది చట్టం. చట్టంను అందరూ పాటించాలి. అయినప్పటికీ వారు, మేము సైన్యంలో చేరం, అని సైన్యంలో చేరడానికి నిరాకరించడమనేది చట్ట వ్యతిరేకం అవుతుంది.
  2. వియత్నాం ‘ యుద్ధంలో వియత్నాంకి చెందిన 8,00,000 సైనికులు, 30,00,000 పౌరులు కాకుండా అధిక సంఖ్యలో కంబోడియన్లు, లావోషియన్లు చనిపోయారు. అమెరికాకు ఎటువంటి పౌరనష్టం జరగలేదు.
  3. అమాయకులైన వియత్నాం ప్రజలపై బాంబులు వేసి, చంపడం అనేది అన్యాయం, అమానుషం. ఇటువంటి అన్యాయానికి పూనుకున్న అమెరికా సైన్యంలో చేరకపోవడం సమర్థనీయమే అని చాలామంది భావించారు.

అమాయకులైన వియత్నాం ప్రజల చావుకు కారణమవుతున్న అమెరికా సైన్యంలో యువకులు చేరకపోవడం సమర్థనీయమే అని నా అభిప్రాయం.

AP Board 10th Class Social Solutions Chapter 20 ప్రపంచ యుద్దాల తరువాత ప్రపంచం, భారతదేశం

10th Class Social Textbook Page No.303

ప్రశ్న 9.
ఆయుధీకరణకు వివిధ రకాల స్పందనలు ఏమిటి?
జవాబు:
అమెరికా, యుఎస్ఆర్, బ్రిటన్, ఫ్రాన్స్ వంటి అగ్రరాజ్యాలు ఇతర దేశాలు అణుబాంబులను ఉపయోగించకుండా నిరోధిస్తుందన్న నమ్మకంతో అణ్వాయుధాల నిల్వలను పెంచుకుంటూ పోయాయి. ఈ విధంగా పెంచుకోవడానికి ఆ – దేశాలు రకరకాల కారణాలు తెలియచేశాయి.

  1. అణ్వాయుధాల నిల్వలలో పోటీ తీవ్రరూపం దాల్చింది.
  2. ఆయుధాలను ఉత్పత్తిచేసే కంపెనీలు (వీటిని సైనిక పారిశ్రామిక కంపెనీలంటారు). ప్రభుత్వాలు సాధారణ ప్రజలలో యుద్ధ భయాన్ని కలిగించి, అణ్వాయుధాల మీద డబ్బును మరింతగా ఖర్చు పెట్టటానికి మద్దతు పొందేవి.
  3. ప్రజా నిరసనల మూలంగా అమెరికా 1975లో వియత్నాంతో యుద్ధాన్ని ఆపేసి, వియత్నాం నుంచి బయటకు వచ్చేసింది.
  4. యూరపులో అనేకమంది ప్రజలు యుద్ధం గురించి భయపడసాగారు.
  5. ఆయుధపోటీ వల్ల ప్రపంచమంతా ముప్పులో పడుతుందని, ప్రపంచమంతా నాశనమయ్యే యుద్ధం సంభవించవచ్చని గుర్తించసాగారు.
  6. పెద్ద ఎత్తున ప్రజా నిరసనలు చోటుచేసుకున్నాయి.
  7. ఇతర దేశాల ప్రభుత్వాలతో అణ్వాయుధాల నిల్వలను తగ్గించుకోవటానికి, శాంతి దిశగా కృషి చెయ్యటానికి చర్చలు ప్రారంభించవలసిందిగా ప్రజలు ఒత్తిడి చెయ్యసాగారు.

10th Class Social Textbook Page No.303

ప్రశ్న 10.
పరస్పర విధానాలను ఆయా దేశాల ప్రభుత్వాలు నిర్ణయించటం మాత్రమే కాక వివిధ దేశాల ప్రజలు ఒకరినొకరు కలుస్తుంటే యుద్ధ అవకాశాలు తక్కువగా ఉంటాయి. దీంతో మీరు ఏకీభవిస్తారా? మీ సమాధానానికి కారణాలు పేర్కొనండి.
జవాబు:
దీంతో నేను ఏకీభవించను. కారణాలేమిటనగా …… .

  1. ప్రతి దేశానికి స్వంత ప్రభుత్వ విధానం ఉంటుంది.
  2. వివిధ దేశాల ప్రజలు ఒకరినొకరు కలుస్తుంటే సంస్కృతి వ్యాప్తి చెందుతుంది. అంతేకాని ప్రజలు యుద్ధాలు జరగకుండా ఆపలేరు.
  3. ప్రపంచంలోని చాలా దేశాలు ప్రజాస్వామ్య దేశాలు, కావున ప్రజాస్వామ్యబద్దంగా కార్యక్రమాలు నిర్వహిస్తాయి.
  4. అణుశక్తిని ఉపయోగించటంలోని ప్రమాదాలు ప్రజలకు తెలిశాయి. ప్రజాక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని దేశాలు నిరాయుధీకరణకు ముందుకు వచ్చి, యుద్ధ భయాన్ని తగ్గించాయి.

10th Class Social Textbook Page No.303

ప్రశ్న 11.
అణు కర్మాగారాలను, కాలుష్య పరిశ్రమలను ఎక్కడ పెట్టాలన్న నిర్ణయాలతో సంబంధం లేని దేశాల ప్రజలు కూడా పర్యావరణ కాలుష్య ప్రభావానికి ఎలా గురవుతారో వివరించండి. ఇటువంటి పరిస్థితులను ఎలా పరిష్కరించాలి?
జవాబు:
కాలుష్య ప్రభావం:

  1. కొన్ని సమయాలలో అణు కర్మాగారాలలో ప్రమాదాలు జరిగి కార్మికులు పెద్ద సంఖ్యలో చనిపోతారు.
    ఉదా : రష్యాలోని చెర్నోబిల్ అణుకర్మాగార ప్రమాదం.
  2. యూరప్లో అణు కర్మాగారాలు ఎక్కువవటం వలన యూరప్లో అధిక ప్రాంతం అణు కాలుష్యానికి కారణమయి, ప్రజలను కాలుష్యానికి గురిచేశాయి.
  3. కాలుష్య పరిశ్రమల స్థాపన మూలంగా అమాయకులైన ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు.
    ఉదా : భోపాల్ లో ఒకరాత్రి యూనియన్ కార్బైడ్ కంపెనీ నుండి విషవాయువు వెలువడింది. దీనివల్ల వేలాదిమంది చనిపోయారు. చాలా మంది ఇంకా బాధపడుతున్నారు.
  4. కాలుష్యం మూలంగా ఓజోను పొర దెబ్బతింటుంది.
  5. భూగోళం వేడెక్కుతుంది. తద్వారా ధృవాల వద్ద ఉన్న మంచు కరిగి సముద్రాలలోని నీటిమట్టం పెరిగి తీరప్రాంతాలు ముంపుకు గురి అవుతాయి.

కాలుష్య పరిస్థితుల పరిష్కారానికి సూచనలు :

  1. అణు కర్మాగారాలను ప్రభుత్వాలు నిషేధించాలి. ప్రజాక్షేమాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అణు కాలుష్యానికి గురైన ప్రజలకు ప్రభుత్వాలు సరైన వైద్య సదుపాయాలు కల్పించాలి.
  2. పరిశ్రమల స్థాపనలో ప్రభుత్వం మెలకువగా ఉండి, కాలుష్యానికి కారణమయ్యే పరిశ్రమలకు అనుమతులు ఇవ్వకూడదు.
  3. కాలుష్యానికి గురయ్యే ప్రజలకు ప్రభుత్వం ప్రాతినిధ్యం వహించి, ఆయా పరిశ్రమల నుండి ప్రజలకు పరిహారాలు ఇప్పించాలి.
  4. ఆయా పరిశ్రమలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి.

AP Board 10th Class Social Solutions Chapter 20 ప్రపంచ యుద్దాల తరువాత ప్రపంచం, భారతదేశం

10th Class Social Textbook Page No.307

ప్రశ్న 12.
రైతులను, గిరిజనులను నిర్వాసితులను చెయ్యకుండా కర్మాగారాలు కట్టడం, గనుల తవ్వకం, విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాలను చేపట్టడం సాధ్యంకాదా? ఎటువంటి ప్రత్యామ్నాయాలు ఉన్నాయి? ఈ అంశాలపై మీ ఇంటిలోనూ, తరగతిలోనూ చర్చించండి.
జవాబు:

  1. కర్మాగారాలు నిర్మించడానికి అనువైన పరిస్థితులు ఉన్నప్పుడు అనగా ముడిసరుకులు అందుబాటులో ఉన్న ప్రాంతాలలోనే కర్మాగారాలు నిర్మిస్తారు. ఈ పరిస్థితులలో ప్రజల గురించి ఆలోచించలేకపోతున్నారు.
  2. గనుల తవ్వకం వల్ల దేశం అభివృద్ధి చెందుతుంది మరియు గనులు ఉన్నచోటులో ఉన్న ప్రజలకు ప్రభుత్వం పునరావాసం కల్పించాలి.
  3. విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాలు కూడా ముడి సరుకులు (నీరు, బొగ్గు) లభించే ప్రాంతాలలోనే, నిర్మించవలసి వస్తుంది.
  4. అయితే ఆనకట్టల నిర్మాణంలో మాత్రం, ఆనకట్టల నిర్మాణం మూలంగా వచ్చే ఉపయోగం, నష్టాలను అంచనా వేసుకుని ఆనకట్టలను నిర్మించవచ్చు. లేదా ఆపివేయవచ్చు.
    ఉదా : కేరళలోని సైలెంట్ వ్యాలీలోని ఆనకట్ట (1973-83)

10th Class Social Textbook Page No.308

ప్రశ్న 13.
సామాజిక ఉద్యమాలు ఉపయోగించిన వివిధ’ వ్యూహాలను పేర్కొనండి.
జవాబు:

  1. అమెరికా పౌరహక్కుల ఉద్యమంలో నల్లజాతి ప్రజలు నిరసన తెలుపుతూ ఒక సంవత్సరం పాటు ‘బస్సులను’ బహిష్కరించారు.
  2. యుఎస్ఎస్ఆర్ లో గోర్బచేవ్, ప్రజలకు మరింత స్వేచ్ఛను కల్పించటానికి “గ్లాస్ నోస్తే” అన్న సంస్కరణల ప్రక్రియను ఆరంభించాడు.
  3. వియత్నాంతో యుద్ధం చేస్తున్న అమెరికా సైన్యంలోకి అమెరికా పౌరులు చాలామంది “మేము వెళ్లం” అని సైన్యంలో చేరడానికి నిరాకరించి, నిరసన తెలియచేశారు.
  4. అణ్వాయుధాల ఉత్పత్తిని తగ్గించుకొమ్మని, శాంతి దిశగా ప్రయాణం చేయమని అనేకమంది సైంటిస్టులు, ప్రజలు, అధికారులు చేసిన ఒత్తిడి కారణంగా అణ్వాయుధాలను తగ్గించుకోవడానికి స్ట్రాటెజిక్ ఆర్ట్స్ రిడక్షన్ ట్రీటి (START) మీద సంతకాలు చేశారు.
  5. గ్రీన్ పీస్ ఉద్యమం అనగా అలస్కా దగ్గర సముద్రంలో అమెరికా 1971లో చేపట్టిన అణు పరీక్షలకు వ్యతిరేకంగా నిరసనకర్తలు ఒక చిన్న పడవలో ప్రయోగశాలకు బయలుదేరినారు. ఆ పడవ పేరు “గ్రీన్ పీస్”. ఆ పడవ పేరు మీదుగా ఆ ఉద్యమానికి గ్రీన్ పీస్ అని పేరు వచ్చింది.
  6. సమానత్వం కోసం అమెరికాలో మహిళలు ఉద్యమం చేశారు.
  7. భోపాల్ గ్యాస్ దుర్ఘటనలో నష్టపోయిన కార్మికులు, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటం చెయ్యటానికి అంతర్జాతీయ చట్టాలను ఉపయోగించవలసి వచ్చింది.
  8. ‘నర్మదా బచావో’ ఆందోళనలో ఆనకట్టల నిర్మాణాన్నే వ్యతిరేకించారు.
  9. సర్దార్ సరోవర్ ఆనకట్ట నిర్మాణ సమయంలో చేసిన ఉద్యమంలో తీవ్ర నిరసనలు, ప్రజల సమీకరణ, ప్రదర్శనలు, నిరాహార దీక్షలు, అంతర్జాతీయ ఉద్యమాలు చేయుట జరిగింది.
  10. “నర్మదా బచావో” ఉద్యమంలో – మూలవాసీ ప్రజల ఉద్యమం, సయా – ఉదారవాద విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమం, పట్టణీకరణకు ఆనకట్టలు, పరిశ్రమలు, గనులు వంటి వాటికోసం భూములు లాక్కోబడుతున్న నేపధ్యంలో తమ భూములు కాపాడుకొనుటకు రైతులు చేస్తున్న ఉద్యమాలు మొదలైన వ్యూహాలు ఉపయోగించబడ్డాయి.

10th Class Social Textbook Page No.308

ప్రశ్న 14.
పునరావాసాన్ని కల్పిస్తామన్న వాగ్దానాలను ఉద్యమంలోని ప్రజలు ఎలా పరిగణిస్తున్నారు?
జవాబు:
పథకాల వల్ల నిర్వాసితులయ్యే ప్రజలు సరైన పునరావాసం కల్పించాలని కోరసాగారు. అయితే త్వరలోనే ప్రజలు కొన్ని విషయాలు గుర్తించారు. అవి :

  1. భూమి కోల్పోయిన వారికి నష్టపరిహారంగా భూమిని ఇవ్వటానికి తగినంత భూమి లేదు.
  2. నిర్వాసితులైన ప్రజలందరికీ సరైన పునరావాసం కల్పించటం సాధ్యం కాదు అని తెలుసుకున్నారు.
  3. ఇది నష్టపరిహారం, పునరావాసానికి సంబంధించిన సమస్యకాక అభివృద్ధికి సంబంధించిన లోపభూయిష్ట దృక్పథమని ప్రజలు గుర్తించసాగారు.
  4. ఈ రకమైన అభివృద్ధి వ్యవసాయాన్ని, గిరిజన ప్రజలను పణంగా పెట్టి పరిశ్రమలు, వాణిజ్య వ్యవసాయ క్షేత్రాలను ఏర్పాటు చేయటం, సహజ వనరులను సుస్థిరంకాని పద్ధతులలో వినియోగించటం పైన ఆధారపడి ఉంది.
  5. ఇది పేద రైతులు, గిరిజనుల జీవన ప్రమాణాన్ని ఏ రకంగాను మెరుగుపరచకుండా వాళ్లని నైపుణ్యం లేని కూలీలుగా మారుస్తుంది.

AP Board 10th Class Social Solutions Chapter 20 ప్రపంచ యుద్దాల తరువాత ప్రపంచం, భారతదేశం

10th Class Social Textbook Page No.310

ప్రశ్న 15.
ఇటీవల కాలంలో పశ్చిమబెంగాల్ (నందిగ్రాం), ఒడిశా (నియమగిరి), ఆంధ్రప్రదేశ్ (పోలవరం, సోంపేట, మొదలైనవి)లో జరిగిన ఇటువంటి పోరాటాల గురించి మరింత తెలుసుకోండి. ఈ పోరాటాల్లో ముఖ్యమైన అంశాలను వివరిస్తూ ఒక పోస్టరు తయారు చేయండి
జవాబు:
ఇటీవల కాలంలో కట్టబడిన ఆనకట్టల సందర్భాలలో ఎన్నో పోరాటాలు జరిగాయి. అటువంటి పోరాటాలలో కొన్ని నందిగ్రాం – పశ్చిమ బెంగాల్, నియమగిరి – ఒడిశా, పోలవరం, సోంపేట – ఆంధ్రప్రదేశ్,

1. నందిగ్రాం (పశ్చిమ బెంగాల్) :
ఎ) ఇది హాల్దియాలోది. కోల్ కతాకు దూరంగా ఉంటుంది.
బి) పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం 2001 మార్చిలో ఈ స్థలాన్ని ప్రత్యేక ఆర్థిక స్థలంగా ప్రకటించింది.
సి) నందిగ్రాం ప్రజలకు కోపం వచ్చి ఊరేగింపులు నిర్వహించారు. పోరాటం చేశారు. ఈ పోరాటంలో 14 మంది చనిపోయారు.

2. నియమగిరి (ఒడిశా):
ఎ) ఒడిశాలో ఈ నియమగిరి కొండలు బాక్సైట్ నిల్వలకు ప్రఖ్యాతిగాంచాయి.
బి) బ్రిటిష్ మైనింగ్ కంపెనీకి, ఒడిశా ప్రభుత్వం బాక్సైట్ ను వెలికి తీయడానికి అనుమతినిచ్చింది.
సి) ప్రజలు ఆగ్రహించి ముఖ్యంగా గిరిజనులు అనేక ఊరేగింపులు నిర్వహించారు. కోర్టుకు కూడా ఫిర్యాదు చేసినారు. న్యాయస్థానం స్పందించి బ్రిటిష్ కంపెనీకి ఇచ్చిన అనుమతిని జనవరి, 2014లో రద్దు చేసింది.

3. సోంపేట (శ్రీకాకుళం – ఆంధ్రప్రదేశ్) : .
ఎ) సోంపేట అనేది ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లాలోని మండలం.
బి) ఇక్కడ ఒక విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నిర్మించుటకు ప్రభుత్వం “నాగార్జున కంపెనీ లిమిటెడ్”కు అనుమతినిచ్చింది.
సి) రాజకీయ పార్టీల అండతో ప్రజలు దీనిని వ్యతిరేకించి ఆందోళనలు చేస్తూనే ఉన్నారు.

4. పోలవరం (ఆంధ్రప్రదేశ్) :
ఎ) పోలవరం ప్రాజెక్టు గోదావరి నదిమీద నిర్మించబడుతుంది.
బి) ఈ ప్రాజెక్టు పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి మరియు ఖమ్మం జిల్లాలకు వ్యాపించి ఉంది.
సి) ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వం 2006లో అనుమతినిచ్చింది.
డి) దీని మూలంగా ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా ఛత్తీస్ గఢ్, ఒడిశాలలోని ప్రాంతాలు కూడా ముంపుకు గురి అవుతాయి. అందువల్ల ఈ ప్రాజెక్టు పూర్తి కావడానికి అనేక ఆటంకాలు ఏర్పడుతున్నాయి.

AP Board 10th Class Social Solutions Chapter 20 ప్రపంచ యుద్దాల తరువాత ప్రపంచం, భారతదేశం

10th Class Social Textbook Page No.310

ప్రశ్న 16.
మానవ హక్కులలోని కొన్ని అధికరణాలు కింద ఉన్నాయి. ఈ భాగాన్ని రెండుసార్లు చదవంది. మొదటిసారి అంతా చదివి మానవులందరికీ, ఉండాల్సిన మానవ హక్కులను గుర్తించండి. తరువాత కింద ఇచ్చిన మానవ హక్కుల ఉల్లంఘన గురించి ఏ పేరా, ఏ వాక్యంలో ఉందో గుర్తించండి. (ప్రతిదానికి దొరకక పోవచ్చు, దానిని ఖాళీగా ఉంచెయ్యండి.)
అధికరణం 3 : ప్రతి ఒక్కరికీ జీవితం, స్వేచ్ఛ, వ్యక్తిగత భద్రతలకు హక్కు ఉంది. పేరా …………. వాక్యం ………….
అధికరణం 5 : ఎవరిని హింసకు లేదా క్రూర, అమానవీయ, అవమానకర వ్యవహారానికి లేదా శిక్షకు గురిచేయ్యకూడదు. పేరా ………….. వాక్యం ………….
అధికరణం 7 : చట్టం ముందు అందరూ సమానులే, ఎటువంటి వివక్షతకు లోనుకాకుండా అందరికి చట్టం ద్వారా సమాన రక్షణ లభించాలి. ఈ ప్రకటనకు భంగం కలిగిస్తూ వివక్షతకు గురికాకుండా అందరికీ సమాన రక్షణ లభించాలి, ఇటువంటి వివక్షతకు రెచ్చగొట్టబడటం నుంచి కూడా రక్షణ లభించాలి. పేరా ………. వాక్యం …………..
అధికరణం 9 : ఎవరినీ అకారణంగా అరెస్టు చెయ్యకూడదు, నిర్బంధించకూడదు, బహిష్కరించగూడదు. పేరా ………….. వాక్యం ……………….
అధికరణం 10 : ఒక వ్యక్తిపై మోపబడిన నేరాలకు అతడు / ఆమె హక్కులు, బాధ్యతలు నిర్ణయించటానికి స్వతంత్ర, నిష్పక్షపాత ట్రిబ్యునల్ ద్వారా బహిరంగ విచారణకు పూర్తి సమానతతో కూడిన హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. పేరా – ………….. వాక్యం ………..
అధికరణం 12 : అకారణంగా ఎవరి ఏకాంతానికి, కుటుంబానికి, నివాసానికి లేదా ఉత్తర ప్రత్యుత్తరాలకు అడ్డుపడకూడదు, జోక్యం చేసుకోకూడదు, వ్యక్తి పరువు, మర్యాదలకు భంగం కలిగించకూడదు. ఈ విధమైన దాడుల, జోక్యం చేసుకోవడాలకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరికీ చట్టం ద్వారా రక్షణ పొందే హక్కు ఉంటుంది. పేరా ……………. వాక్యం …………..
అధికరణం 13 : (1) దేశ సరిహద్దులకు లోబడి ప్రతి ఒక్కరికీ స్వేచ్ఛగా సంచరించే హక్కు, నివాసం ఏర్పరుచుకునే హక్కు ఉంటాయి. పేరా …………… వాక్యం …………..
(2) ప్రతి ఒక్కరికీ సొంత దేశంతో సహా ఏ దేశాన్నైనా వీడే హక్కు తిరిగి సొంత దేశానికి చేరే హక్కు ఉంటాయి. పేరా ……….. వాక్యం ……………
జవాబు:
అధికరణం 3 : ప్రతి ఒక్కరికీ జీవితం, స్వేచ్ఛ, వ్యక్తిగత భద్రతలకు హక్కు ఉంది. పేరా 3 వాక్యం 13
అధికరణం 5 : ఎవరిని హింసకు లేదా క్రూర, అమానవీయ, అవమానకర వ్యవహారానికి లేదా శిక్షకు గురిచెయ్యకూడదు. పేరా 3 వాక్యం 6 మరియు 7.
అధికరణం 9 : ఎవరినీ అకారణంగా అరెస్టు చెయ్యకూడదు, నిర్బంధించకూడదు, బహిష్కరించగూడదు. పేరా 3 వాక్యం 4.
అధికరణం 12 : అకారణంగా ఎవరి ఏకాంతానికీ, కుటుంబానికి, నివాసానికి లేదా ఉత్తర ప్రత్యుత్తరాలకు అడ్డుపడకూడదు, జోక్యం చేసుకోకూడదు, వ్యక్తి పరువు, మర్యాదలకు భంగం కలిగించకూడదు. ఈ విధమైన దాడుల, జోక్యం చేసుకోవడాలకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరికీ చట్టం ద్వారా రక్షణ పొందే హక్కు ఉంటుంది. పేరా 3 వాక్యం 10.

AP Board 10th Class Social Solutions Chapter 20 ప్రపంచ యుద్దాల తరువాత ప్రపంచం, భారతదేశం

SCERT AP 10th Class Social Study Material Pdf 20th Lesson ప్రపంచ యుద్దాల తరువాత ప్రపంచం, భారతదేశం Textbook Questions and Answers.

AP State Syllabus 10th Class Social Solutions 20th Lesson ప్రపంచ యుద్దాల తరువాత ప్రపంచం, భారతదేశం

10th Class Social Studies 20th Lesson ప్రపంచ యుద్దాల తరువాత ప్రపంచం, భారతదేశం Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ప్రచ్ఛన్న యుద్ధం గురించి కింద ఉన్న వ్యాఖ్యావాలలో ఏది సరైనది కాదు?
అ) అమెరికా, యుఎస్ఎస్ఆర్ మధ్య విరోధం.
ఆ) అమెరికా, యుఎస్ఎస్ఆర్లు ప్రత్యక్ష యుద్ధంలో పాల్గొనటం
ఇ) ఆయుధ పోటీకి కారణం అవ్వటం
ఈ) రెండు అగ్రరాజ్యాల మధ్య సైద్ధాంతిక పోరు (AS1)
జవాబు:
ఆ) అమెరికా, యుఎస్ఎస్ఆర్లు ప్రత్యక్ష యుద్ధంలో పాల్గొనటం

ప్రశ్న 2.
కింద పేర్కొన్న వాటిల్లో ఏది పశ్చిమ ఆసియా సంక్షోభంలో లేదు? అ) ఈజిప్టు ఆ) ఇండోనేషియా ఇ) బ్రిటన్ ఈ) ఇజ్రాయెల్ (AS1)
జవాబు:
ఆ) ఇండోనేషియా

ప్రశ్న 3.
రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ప్రపంచ అధికారంలో ఎటువంటి మార్పులు వచ్చాయి? (AS1)
జవాబు:
రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ప్రపంచ అధికారంలో చాలా మార్పులు వచ్చాయి.

  1. యుద్ధరంగాలకు దూరంగా ఉన్నందున అమెరికా శక్తిమంతమైన దేశంగా ఆవిర్భవించింది.
  2. అన్ని దేశాలలో శాంతి, అభివృద్ధి వెల్లివిరిసేలా ఒక ప్రపంచసంస్థ అనగా ఐక్యరాజ్య సమితి ఏర్పాటు.
  3. బ్రిటన్, ఫ్రాన్స్ వంటి దేశాలు తమ వలస పాలనలను వదులుకోవలసి వచ్చింది. ఇవి రాజకీయంగా ఆర్థికంగా బలహీనమయ్యాయి.
  4. రెండవ ప్రపంచ యుద్ధానంతర కాలంలో రెండు ప్రధాన సైద్ధాంతిక, రాజకీయ శిబిరాలు ఏర్పడ్డాయి. అవి యుఎస్ఎస్ఆర్ నేతృత్వంలో కమ్యూనిస్టు శిబిరం; అమెరికా నేతృత్వంలో ప్రజాస్వామిక – పెట్టుబడిదారీ శిబిరం. ప్రపంచం మొత్తం ఈ రెండు కూటాలుగా విడిపోయింది. ఈ రెండు కూటాల మధ్య చాలాకాలం ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగింది.

AP Board 10th Class Social Solutions Chapter 20 ప్రపంచ యుద్దాల తరువాత ప్రపంచం, భారతదేశం

ప్రశ్న 4.
ప్రపంచంలో శాంతి నెలకొల్పటానికి ఐక్యరాజ్య సమితి నిర్వహించే వివిధ పాత్రలు ఏమిటి? (AS1)
జవాబు:
ఐక్యరాజ్య సమితి 1945, అక్టోబరు 24న ఏర్పడింది. ఇది ఆరు వేరు వేరు సంస్థల ద్వారా పనిచేస్తుంది.

ఐక్యరాజ్యసమితి నిర్వహించే విధులు:

1) శాంతి భద్రతలను కాపాడటం :
అంతర్జాతీయ శాంతిని, ప్రాదేశిక సమగ్రతలను పరిరక్షిస్తుంది. దీని కొరకు “భద్రతా మండలి” అనే సంస్థను ఏర్పాటు చేసింది.

2) విద్య, ఆరోగ్య సదుపాయాలను మెరుగుపరచటం :
ఐక్యరాజ్య సమితి, అంతర్జాతీయ ఆర్థిక, సామాజిక సమస్యలను చర్చిస్తుంది. ఈ అంశాలపై పరిశోధనలు చేసి ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, విద్యా, ఆరోగ్య సంబంధమైన విధానాలను సిఫారసు చేస్తుంది. ఈ విధుల నిర్వహణ కోసం ఐక్యరాజ్య సమితి, ఆర్థిక, సామాజిక మండలిని ఏర్పాటు చేసింది. ఆర్థిక సంఘం జెనీవాలో ఉంది.

3) పేదరికాన్ని నిర్మూలించటం :
ప్రపంచ దేశాలలోని పేదరికాన్ని నిర్మూలించాలని సంకల్పించి, దీని కొరకు ఆర్థిక, సామాజిక మండలిని స్థాపించింది.

4) అంతర్జాతీయ నేరాల నేపథ్యంలో న్యాయాన్ని అందించటం వంటి విధులను ఐక్యరాజ్య సమితి నిర్వహిస్తుంది. దీని కొరకు అంతర్జాతీయ న్యాయస్థానం “హేగ్”లో ఉంది.

5) ఐక్యరాజ్య సమితి విద్య, విజ్ఞానశాస్త్ర, సాంస్కృతిక సంస్థ పారిలో ఉంది.

6) బాలల కొరకు ఒక అత్యవసర నిధి సంస్థను న్యూయార్క్ లో స్థాపించింది.

ప్రశ్న 5.
ప్రజాస్వామ్య భావన నేపథ్యంలో నిర్ణయాలు తీసుకోవటంలో కొన్ని దేశాలకు ప్రత్యేక అధికారాలు ఉండటం సరైనదేనా? (AS2)
జవాబు:
ప్రపంచమంతా ప్రజాస్వామ్య భావనలోకి వెళుతున్న నేపథ్యంలో ప్రపంచసంస్థ అయిన ఐక్యరాజ్య సమితిలో కొన్ని దేశాలకు మాత్రమే ప్రత్యేక అధికారాలు ఉండటం సరైనది కాదని చెప్పవచ్చు. ఇది ప్రజాస్వామ్య భావనకు వ్యతిరేకం.

ప్రశ్న 6.
సైనిక ఒప్పందాలతో అగ్రరాజ్యాలు ఎలా లాభపడ్డాయి? (AS1)
జవాబు:
సైనిక ఒప్పందాల ద్వారా అగ్రరాజ్యాల పరిధి పెరిగి వాటికి కింద పేర్కొన్నవి అందుబాటులోకి వచ్చి లాభపడ్డాయి.

  1. చమురు, ఖనిజాలు వంటి కీలక వనరులు
  2. తమ ఉత్పత్తులకు మార్కెటు, తమ పెట్టుబడులు పెట్టటానికి ప్రమాదంలేని ప్రదేశాలు
  3. తమ సైనికులను, ఆయుధాలను ఉపయోగించటానికి సైనిక స్థావరాలు
  4. తమ భావజాల వ్యాప్తి
  5. పెద్ద మొత్తంలో సైనిక ఖర్చుకి ఆర్ధిక మద్దతు.

ప్రశ్న 7.
ప్రచ్ఛన్న యుద్ధం వల్ల ఆయుధ పోటీ, ఆయుధ నియంత్రణ రెండూ ఎలా జరిగాయి? (AS1)
జవాబు:
1) ఆయుధ పోటీ :
ఆయుధ పరిశోధనల పైనా, ఖండాంతర క్షిపణులు, విధ్వంసకర అణ్వాయుధాల నిల్వలపైనా అమెరికా, రష్యాలు పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేశాయి. ఈ రెండు దేశాలలో ఒక్కొక్క దాని దగ్గర ప్రపంచాన్ని పలుమార్లు మట్టుపెట్టగల అణ్వాయుధాలు ఉన్నాయి. కాలక్రమంలో వాటి మిత్రదేశాలైన బ్రిటన్, ఫ్రాన్స్, చైనాలు కూడా అణ్వాయుధాలను సమకూర్చుకున్నాయి. గూఢచర్యంలోనూ, క్షిపణులను నిర్దేశించటంలోనూ ఉపగ్రహాలు . దోహదం చేయటంతో ఇప్పుడు పోటీ అంతరిక్షంలోకి కూడా విస్తరించింది.

2) ఆయుధ నియంత్రణ :
కాలం గడుస్తున్న కొద్దీ ఆయుధ పోటీని తగ్గించి, అణ్వాయుధాలను నాశనం చేయవలసిందిగా యుఎస్ఎస్ఆర్, అమెరికాలపై ప్రజలు తీవ్ర ఒత్తిడి చేయసాగారు. దీని ఫలితంగా ఈ రెండు దేశాలు సంప్రదింపులు జరిపి ఆయుధ పోటీని, నిల్వలను తగ్గించుకోవలసి వచ్చింది. చివరికి 1985-1991 మధ్య అణు పరీక్షలపై నిషేధం విధించారు.

AP Board 10th Class Social Solutions Chapter 20 ప్రపంచ యుద్దాల తరువాత ప్రపంచం, భారతదేశం

ప్రశ్న 8.
ప్రపంచంలో ఘర్షణలకు కేంద్రంగా పశ్చిమ ఆసియా ఎందుకు మారింది? (AS1)
జవాబు:
పశ్చిమ ఆసియా ఘర్షణలకు ముఖ్య కారణాలు :
1) యూరపు, ఆసియా మధ్య ప్రాంతాన్ని పశ్చిమ ఆసియా అంటారు. ఇదే ప్రాంతాన్ని మధ్యప్రాచ్యం అని కూడా అంటారు. అరబ్బులు, యూదుల మధ్య ఏర్పడిన ఘర్షణలను పశ్చిమ ఆసియా సంక్షోభమని అంటారు. ఇది ప్రధానంగా పాలస్తీనా ఆక్రమణకు సంబంధించినది. అరబ్బులు నివాసముంటున్న పాలస్తీనా రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు బ్రిటిష్ నియంత్రణలో ఉండేది. అక్కడ ఉన్న జెరూసలెం యూదులు, క్రైస్తవులు, ముస్లిములందరికీ పవిత్రస్థలం.

2) యూదులు పాలస్తీనాని తమ ‘వాగ్రత్త భూమి’గా పరిగణిస్తారు. ప్రాచీన కాలంలో అక్కడి నుంచి వాళ్లను నిర్వాసితులను చేయడంతో వారు యూరపు, ఆసియా అంతటా వలసలు పోయారు.

3) ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూదులను ఏకం చేసి, తమ మాతృభూమి అయిన పాలస్తీనాను తిరిగి పొంది, యూడులకు ప్రత్యేక దేశాన్ని నిర్మించటానికి యూదులలో ‘జియానిస్ట్ ఉద్యమం’ మొదలయ్యింది. 1945లో దీనికి పాశ్చాత్య శక్తుల మద్దతు కూడా లభించింది. అయితే అప్పటికే పాలస్తీనియన్లు (వీళ్లల్లో ఎక్కువమంది అరబ్బు ముస్లిములు) అక్కడ నివసిస్తున్నారు. దీంతో ఆ ప్రాంతం కోసం ఇరు ప్రజల మధ్య ఘర్షణ మొదలయ్యింది.

4) మధ్య ప్రాచ్యంలో, ప్రత్యేకించి అరబ్బు ద్వీపఖండంలో పెద్ద ఎత్తున చమురు నిల్వలను కనుగొనటంతో సమస్య మరింత సంక్లిష్ట రూపం దాల్చింది. అమెరికా, రష్యాలు ఈ ప్రాంతాన్ని తమ ప్రాభవంలోకి తీసుకోవాలని ప్రయత్నించాయి. ఇతర దేశాలు దానిపై నియంత్రణ సాధించకుండా అడ్డుకున్నాయి.

ప్రశ్న 9.
20వ శతాబ్దం చివరి నాటికి ఒక్క దేశమే ప్రపంచం మీద పెత్తనం వహిస్తోంది. ఈ నేపథ్యంలో అలీనోద్యమం పాత్ర ఏమై ఉంటుంది? (AS1)
జవాబు:
ప్రస్తుత కాలంలో అలీనోద్యమం నిర్వహిస్తున్న పాత్ర :

  1. ప్రపంచం ఏకధృవంగా ఉన్న నేపథ్యంలో చైనా కూడా మరో ధృవంగా ఎదుగుతోంది. రష్యా తన పూర్వ వైభవాన్ని తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఈ రెండు దేశాలు కలిసి ఐక్యరాజ్య సమితిలో తమ వీటో అధికారం ద్వారా అమెరికాను నియంత్రిస్తున్నాయి.
  2. ఇటీవలి సంవత్సరాలలో పోర్టారికో మరియు పశ్చిమ సహారా ప్రాంతాల గురించి అమెరికా వైఖరిని తప్పుబట్టాయి. ఈ దేశాల మధ్య సహకారాన్ని పెంపొందించడానికి అలీనోద్యమం కృషి చేస్తుంది.
  3. మానవ హక్కుల పరంగా బాగా వెనుకబడిన తమ సభ్య దేశాలలో మానవ హక్కుల ఉద్దరణకు అలీనోద్యమం కృషి చేయవలసిన అవసరం ఉంది.
  4. అగ్ర దేశాలు కలుగచేసుకోలేని కొన్ని సమస్యలున్న దేశాల సమస్యలను అలీనోద్యమం పరిష్కరించవచ్చు.
    ఉదా : పాలస్తీనా, సోమాలియా, సూడాన్.
    ఈ విధంగా అలీనోద్యమం తన పాత్రను నిర్వహించవచ్చు.

ప్రశ్న 10.
“కేవలం సైనిక ఒప్పందాల నేపథ్యంలోనే కాకుండా ఆర్థిక విధానాల నేపథ్యంలో కూడా అలీనోద్యమం ఏర్పడింది”. దీనిని సమర్ధించండి. (AS1)
జవాబు:
ఆసియా, ఆఫ్రికా, ఆ తరువాత లాటిన్ అమెరికాలో కొత్తగా స్వాతంత్ర్యం పొందిన దేశాల మధ్య సాంస్కృతిక, ఆర్థిక సహకారాన్ని ప్రోత్సహించటానికి అంతర్జాతీయ సంస్థగా అలీనోద్యమం రూపొందింది. అలీన రాజ్యాల శిఖరాగ్ర సమావేశాలలో ఆర్థిక సమస్యల గురించి చర్చించడం జరిగింది.

  1. 1961 బెల్ గ్రేడ్ సమావేశంలో ప్రతి దేశానికి ఆర్థిక సమానత్వం ఉండాలని సూచించింది. అభివృద్ధి చెందుతున్న దేశాలకు సహాయం కోసం ఐక్యరాజ్య సమితి ఒక ప్రత్యేక ద్రవ్యనిధిని ఏర్పాటుచేయాలని సూచించింది.
  2. 1970 లుసాకా సమావేశంలో రాజకీయ విషయాలతో బాటు ఆర్థిక విషయాలకు కూడా ప్రాముఖ్యం ఇవ్వాలని, త్వరితగతిని ఆర్థికాభివృద్ధికి సహకరించే అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థను నెలకొల్పాలని, ఆర్థికాభివృద్ధిని అంతర్జాతీయ సమతాదృక్పథంతో పరిశీలించాలని ఐక్యరాజ్య సమితి కోరింది.
  3. 1973 అల్జీర్స్ సమావేశంలో అలీన దేశాల ఆర్థికాభివృద్ధికి, పునర్నిర్మాణానికి, ఐదు రకాల విధులు ఏర్పాటు చేయడానికి తీర్మానం జరిగింది.
  4. 1979 హవానా సమావేశంలో ధనిక, పేద దేశాల మధ్య అంతరాలను తగ్గించాలని సూచించింది.
  5. 1992 జకార్తా సమావేశం అలీనోద్యమం తన దృష్టిని G7 మరియు యూరోపియను యూనియన్ల వైపు దృష్టి సారించాయి.

ఈ విధంగా అనేక అలీనరాజ్యా ల శిఖరాగ్ర సమావేశాలలో ఆర్థిక సమస్యల పరిష్కారం కొరకు వివిధ సూచనలను చేసింది.

AP Board 10th Class Social Solutions Chapter 20 ప్రపంచ యుద్దాల తరువాత ప్రపంచం, భారతదేశం

ప్రశ్న 11.
భారతదేశానికి పొరుగుదేశాలతో ఈ దిగువ అంశాలతో సంబంధాన్ని చూపటానికి ఒక పట్టిక తయారుచెయ్యండి. ఘర్షణకు కారణమైన అంశాలు; యుద్ధ సంఘటనలు; సహాయ, సహకార ఘటనలు. (AS3)
జవాబు:
భారతదేశానికి పొరుగున ఉన్న దేశాలతో ఘర్షణలు, యుద్ధ సంఘటనలు, సహాయ సహకారాలు ఏ విధంగా ఉన్నాయనేది ఈ క్రింది పట్టికలో చూపబడినాయి.

మన పొరుగు దేశాలతో ఘర్షణకు కారణమైన అంశాలుయుద్ధ సంఘటనలుసహాయ, సహకార ఘటనలు
1) టిబెట్లో జరిగిన తిరుగుబాటును చైనా అణిచివేసింది. ఆ సమయంలో దలైలామాతో సహా వేలాది టిబెటన్లు భారతదేశంలో ఆశ్రయం తీసుకున్నారు. దీంతో భారత్-చైనాల మధ్య వైరుధ్యం మొదలైంది. లడక్ ప్రాంతంలోని ఆక్సాయ్-చిన్ సరిహద్దు వివాదం, అరుణాచల్ ప్రదేశ్ లోని చాలా ప్రాంతం తమదని చైనా పేర్కొంది.1) 1962 అక్టోబరులో భారతదేశంపై చైనా దండెత్తింది. భారతదేశం తీవ్ర నష్టాలు ఎదుర్కొవలసి వచ్చింది.1) శాంతిపట్ల తన నిబద్ధతను చాటటానికి జవహర్‌లాల్ నెహ్రూ తన పంచశీల సూత్రాలను ప్రతిపాదించాడు. ఈ పంచశీల ఒప్పందంపై చైనా-భారత్లు 1954 ఏప్రిల్ 29న సంతకాలు చేశాయి.
2) పాకిస్తాన్-భారతదేశం మత ప్రాతిపదికన విడిపోయాయి. అయితే ఈ రెండు దేశాల మధ్య కాశ్మీర్‌కు సంబంధించిన వివాదం కొనసాగుతుంది. సరిహద్దు రాష్ట్రాలలో వేర్పాటు ఉద్యమాలకు పాకిస్తాన్ సహకరిస్తుందనే ఆరోపణలున్నాయి.2) కాశ్మీర్ కోసం, పాక్-భారత్ ల మధ్య మొదటిసారి 1947-48 మధ్య జరిగింది. రెండోసారి 1965లో పాక్-భారత్ ల మధ్య యుద్ధం జరిగింది. బంగ్లాదేశ్ కు సహకారంగా 1971లో భారతదేశం పాకిస్తాన్ తో యుద్ధం చేసింది. బంగ్లాదేశ్ స్వతంత్ర దేశం అయింది. కార్గిల్ యుద్ధం ఇరుదేశాల మధ్య జరిగింది2) 1966లో తాష్మెంట్ లో భారత్-పాకు ఒక ఒప్పందం చేసుకున్నాయి. 1971లో కూడా సిమ్లా ఒప్పందం చేసుకున్నాయి. ప్రస్తుతం వాణిజ్యం, క్రీడలు, సినిమాలు, పర్యటన, సాంస్కృతిక అనుసంధానాల ద్వారా స్నేహ సంబంధాలు నిర్మించడానికి ప్రయత్నిస్తున్నారు.
3) బ్రహ్మపుత్ర, గంగానదీ జలాల పంపకం వంటి అంశాలపై బంగ్లాదేశ్ భారత మధ్య విభేదాలున్నాయి. బంగ్లాదేశ్ నుంచి ప్రజలు పెద్ద ఎత్తున చట్ట విరుద్దంగా భారతదేశంలోకి రాకుండా తీసుకున్న భారతదేశ చర్యలు బంగ్లాదేశ్ అభ్యంతర పెట్టింది.3) 1971లో బంగ్లాదేశ్ పాకిస్తాన్ తో యుద్ధానికి దిగినపుడు భారతదేశం సహాయపడుతూ, పాకిస్తాన్ తో యుద్ధం చేయవలసి వచ్చింది.3) 1971లో పాకిస్తాన్‌తో యుద్ధం చేసి బంగ్లాదేశ్ స్వతంత్ర దేశం కావటానికి – భారత్ సహకరించింది. 25 సంవత్సరాల శాంతి ఒప్పందం చేసుకున్నాయి. ఆర్థిక రంగంలో ఈ రెండు దేశాలు సహకరించు కుంటున్నాయి.
4) శ్రీలంకలో తమిళం మాట్లాడే అల్ప సంఖ్యాక ప్రజల పట్ల శ్రీలంక ప్రభుత్వం వ్యవహరించిన తీరు భారత్-శ్రీలంకల మధ్య ముల్లు మాదిరి తయారయ్యింది. శ్రీలంక తమిళ కాందిశీకులు పెద్ద సంఖ్యలో భారతదేశంలోకి రావటం ప్రత్యేక సమస్యగా మారింది.4) శ్రీలంకలో శాంతి నెలకొల్పటానికి భారతదేశం తన సైన్యాన్ని పంపింది. దీనికి ప్రతీకారంలో తమిళ తీవ్రవాదులు మన ప్రధానమంత్రి రాజీవ్ గాంధీని చంపినారు.4) క్రీడలు, పర్యాటక రంగం వాణిజ్యం ద్వారా భారత్, శ్రీలంకల మధ్య స్నేహ సంబంధాలు కొనసాగుతున్నాయి.

ప్రశ్న 12.
“శ్రీలంకలో జాతి వైరుధ్యాలు భారతదేశంతో దాని సంబంధాలను ప్రభావితం చేశాయి.” వివరించండి. (AS1)
జవాబు:

  1. పురాణ కాలం నుండి భారతదేశానికి, శ్రీలంకకు మధ్య ఆర్థిక, సాంస్కృతిక, జాతిపరమైన సంబంధాలున్నాయి.
  2. శ్రీలంకలో అల్పసంఖ్యాకులైన తమిళం మాట్లాడే ప్రజలపట్ల ప్రభుత్వం అవలంబించిన వైఖరియే ఈ రెండు జాతుల మధ్య వైరుధ్యానికి కారణం.
  3. వీరిలో చాలామంది భారతదేశానికి శరణార్థులుగా రావడంతో భారతదేశానికి అది సమస్యగా పరిణమించింది.
  4. ఈ సమస్య పరిష్కారం కోసం భారతదేశం ఒక అడుగు ముందుకు వేసి శ్రీలంకతో ఒక ఒప్పందం చేసుకొన్నది. దాని ప్రకారం ఈ సమస్య పరిష్కారం కోసం “భారత శాంతి సేన” ను శ్రీలంకకు పంపింది.
  5. ఈ చర్యకు ప్రతిగా తమిళ తీవ్రవాదులు ఎట్టిఇ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీని హతమార్చారు.

ఈ కారణంగా సింహళీయులు, తమిళుల మధ్య ప్రారంభమైన పౌర సంఘర్షణలు ఒక వైపు రక్తపాతానికి దారితీయగా మరోవైపు శ్రీలంక భారత సంబంధాలపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి.

10th Class Social Studies 20th Lesson ప్రపంచ యుద్దాల తరువాత ప్రపంచం, భారతదేశం InText Questions and Answers

10th Class Social Textbook Page No.294

ప్రశ్న 1.
దలైలామాకి, అతని టిబెట్ అనుచరులకు భారతదేశం ఆశ్రయం ఇవ్వటం సరైనదేనా?
జవాబు:
దలైలామాకి, అతని టిబెట్ అనుచరులకు భారతదేశం ఆశ్రయం ఇవ్వటం సరైనదే.

10th Class Social Textbook Page No.294

ప్రశ్న 2.
టిబెట్ ని నియంత్రించాలని చైనా అనుకోవటం సరైనదేనా?
జవాబు:
టిబెట్ ని నియంత్రించాలని చైనా అనుకోవటం సరైనది కాదు.

AP Board 10th Class Social Solutions Chapter 20 ప్రపంచ యుద్దాల తరువాత ప్రపంచం, భారతదేశం

10th Class Social Textbook Page No.283

ప్రశ్న 3.
వలసపాలన నుంచి విముక్తి అంటే ఏమిటి?
జవాబు:
సామ్రాజ్యకాంక్ష కలిగిన బలవంతమైన దేశాలు వెనుకబడిన ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలను ఆక్రమించి వారి ఆధిపత్యంలో ఉంచుకున్నారు. ఈ దేశాలలోని ప్రజలు జాతీయోద్యమాలు చేసి వారి పాలిత దేశాల నుండి స్వాతంత్ర్యాన్ని సంపాదించుకొనుటనే వలసపాలన నుంచి విముక్తి అంటారు.

10th Class Social Textbook Page No.283

ప్రశ్న 4.
రెండు అగ్రరాజ్యాల మధ్య పోటీతో కొత్తగా స్వాతంత్ర్యం పొందిన దేశాలు ఏ విధంగా ప్రభావితం అయ్యాయి?
జవాబు:

  1. కొత్తగా స్వాతంత్ర్యం పొందిన దేశాలు పెట్టుబడిదారీ విధానం – కమ్యూనిజం మధ్య (అమెరికా – రష్యాల మధ్య) విభజింపబడిన ప్రపంచాన్ని ఎదుర్కొనవలసి వచ్చింది.
  2. ఈ దేశాలు తమ అభివృద్ధికి సొంతమార్గం అనుసరించనివ్వకుండా ఏదో ఒక శిబిరాన్ని ఎంచుకోమని ఒత్తిడి చేయసాగాయి.
  3. ఈ రెండు అగ్రరాజ్యాల మధ్య విభేదాలను కొన్ని దేశాలు తమకు సానుకూలంగా వాడుకున్నాయి.

10th Class Social Textbook Page No.284

ప్రశ్న 5.
యుద్ధాలకూ, పేదరికం, సమాన అభివృద్ధి లేకపోవటం, దేశాల మధ్య సాంస్కృతిక అనుసంధానానికీ మధ్య సంబంధం. ఏమైనా ఉందా?
జవాబు:
బలవంతమైన దేశాలు సామ్రాజ్య కాంక్షతో అనేక చిన్న దేశాలపై దాడులు చేశాయి. అధికార కాంక్షతో కూడా దేశాల మధ్య యుద్ధాలు జరిగాయి. అనేక దేశాలలో పేదరికం మరియు దేశాలన్నీ సమాన అభివృద్ధి సాధించకుండా కొన్ని దేశాలు ఆర్థికంగా, సాంస్కృతికంగా వెనకబడి ఉండడం వంటి కారణాలతో అభివృద్ధిని సాధించిన దేశాలు, అభివృద్ధి చెందని దేశాలపై దాడిచేసి, యుద్ధాలు చేసి ఆ దేశాలను వలసలుగా ఏర్పరచుకున్నాయి.

10th Class Social Textbook Page No.284

ప్రశ్న 4.
అయిదు దేశాలకు ఇచ్చిన ప్రత్యేక అధికారాలు అప్రజాస్వామికం కాబట్టి వాటిని రద్దు చేయాలని కొంతమంది వాదిస్తుంటారు. అయితే ఈ దేశాలకు ప్రత్యేక అధికారాలు లేకపోతే ఐక్యరాజ్య సమితి సాఫీగా పనిచేయలేదని కొంతమంది అంటారు. చర్చించండి.
జవాబు:
ప్రపంచంలో చాలా దేశాలు ప్రజాస్వామిక దేశాలు, ఇటువంటి నేపథ్యంలో కొన్ని దేశాలకు ప్రత్యేక అధికారాలు ఉండడం సరైనది కాదు. మరియు ఈ ప్రత్యేక వీటో అధికారంతో ఆ దేశాలు ఐక్యరాజ్య సమితి విధులకు అడ్డు పడుతున్నాయి.. ఐక్యరాజ్య సమితి నిష్పక్షపాతంగా పనిచేయకుండా ఈ వీటో అధికారం ఉన్న దేశాలు అంతరాయం కలిగిస్తున్నాయని చెప్పవచ్చు.

AP Board 10th Class Social Solutions Chapter 20 ప్రపంచ యుద్దాల తరువాత ప్రపంచం, భారతదేశం

10th Class Social Textbook Page No.289

ప్రశ్న 5.
1955 బాండుంగ్ సమావేశ ముఖ్య ఉద్దేశం ఏమిటి?
జవాబు:
అగ్రరాజ్యాల మధ్య పోటీ వల్ల ఇటీవల వలసపాలన నుంచి విముక్తి పొందిన దేశాల సమస్యలేవీ పరిష్కారం కాలేదు. మరియు కొత్తగా స్వాతంత్ర్యం పొందిన దేశాల అభద్రతాభావంతో కూడిన పరిస్థితుల నుంచి మార్పు కావాలని కోరుకున్నాయి. ఇదే 1955లో ఇండోనేషియాలోని బాండుంగ్ సమావేశ ముఖ్య ఉద్దేశం.

10th Class Social Textbook Page No.289

ప్రశ్న 6.
అలీనోద్యమ సూత్రాలకు అగ్రరాజ్యాలు ఎలా స్పందించాయి?
జవాబు:

  1. రెండు అగ్రరాజ్యాలు అలీనోద్యమాన్ని అనుమానపు దృష్టితో చూశాయి.
  2. అంతర్జాతీయ అంశాలపై అలీనోద్యమం రష్యాకి దగ్గరగా ఉందని అమెరికా భావించేది.
    ఉదా : ఆఫ్ఘనిస్థాన్ పై నిష్పక్ష సిద్ధాంతాలకు భిన్నంగా ఉందని అమెరికా విమర్శించింది.

10th Class Social Textbook Page No.289

ప్రశ్న 7.
అలీనోద్యమ దేశాలను మూడవ ప్రపంచ దేశాలని ఎందుకంటారు?
జవాబు:

  1. రెండవ ప్రపంచయుద్ధం తరువాత ప్రపంచం రెండు అధికార కూటములుగా విడిపోయింది. అవే రష్యా, అమెరికాలు. ఆ దేశాలు ప్రపంచంలో అగ్రశ్రేణి శక్తులుగా అవతరించాయి.
  2. అయితే రెండవ ప్రపంచ యుద్ధం తరువాత చాలా ఆసియా, ఆఫ్రికా దేశాలు స్వాతంత్ర్యం సంపాదించుకొని, ఈ రెండు అగ్రరాజ్యాల శక్తి కూటములలో చేరలేదు. ఈ దేశాలు చాలావరకు అలీనోద్యమ విధానాన్ని స్వీకరించాయి.
  3. ఈ దేశాలు పెద్ద రాజ్యాల విధానాల మీద తమదైన రీతిలో ప్రభావం చూపాయి. వీటి విస్తీర్ణం, జనాభా వ్యూహాత్మకమైన, కీలకమైన స్థానాల కారణంగా ఇవి మూడవ ప్రపంచదేశాలని పేరు తెచ్చుకున్నాయి.

10th Class Social Textbook Page No.291

ప్రశ్న 8.
ఘర్షణలలో పాలస్తీనియన్లకు ఈజిప్టు ఎందుకు మద్దతు నిచ్చింది?
జవాబు:

  1. పాలస్తీనా పట్ల ఇజ్రాయెల్ దేశం అవలంబించిన విధానాలు విద్వేషాలను మరింత రెచ్చగొట్టాయి. అరబ్బులు తమ ఆస్తులు, ఇళ్లు వదిలి వెళ్లి ఇతర అరబ్బు దేశాలలో కాందిశీకులుగా ఆశ్రయం పొందారు. ఈ అరబ్బులందరినీ ఏకం చేయాలని ఈజిప్టు అధ్యక్షుడు గమల్ అబ్జెల్ నాసర్ ప్రయత్నించి పాలస్తీనియన్లకు మద్దతు ఇచ్చాడు.
  2. ఈజిప్టుకు ఇజ్రాయెల్ కు మధ్యన ఉన్న వైరం మూలంగా ఇజ్రాయెల్ శత్రుదేశమైన ‘పాలస్తీనాకు ఈజిప్టు మద్దతు ఇచ్చిందని అనుకోవచ్చు.

AP Board 10th Class Social Solutions Chapter 20 ప్రపంచ యుద్దాల తరువాత ప్రపంచం, భారతదేశం

10th Class Social Textbook Page No.290

ప్రశ్న 9.
శరణార్థుల శిబిరాలలో ఉంటూ నిరంతరం యుద్ధభయమూ, పేదరికాన్ని ఎదుర్కొంటున్న పాలస్తీనియన్ల జీవన పరిస్థితుల గురించి తెలుసుకోండి.
జవాబు:

  1. ప్రజలందరూ పేదవారు. నిరక్షరాస్యులు ఎక్కువ.
  2. నిరంతర యుద్ధాల వల్ల ప్రజలు శరణార్థుల శిబిరాలలో నివసించవలసి వచ్చింది.
  3. నిరంతరం యుద్ధభయం కారణంగా ప్రజలు ప్రశాంత జీవితాన్ని కోల్పోయారు.
  4. ఇతర జీవనాధారాలు లేక ప్రజలు పేదరికంలో మగ్గిపోసాగారు.

ఈ విధంగా ఆనాడు పాలస్తీనియన్లు దుర్భర జీవితాన్ని గడపవలసి వచ్చింది.

10th Class Social Textbook Page No.294

ప్రశ్న 10.
సరిహద్దులకు సంబంధించి గత వైరుధ్యాలను మరచి రెండు దేశాలు ఎంత వరకు అర్థవంత సహకారాన్ని, మిత్రత్వాన్ని సాధించగలవని అనుకుంటున్నారు?
జవాబు:
ప్రస్తుతం రెండు దేశాలు ఆసియాలో బలపడుతున్న శక్తులుగా, ఆర్థికంగా ఉన్నత స్థానంలో ఉన్నవిగా గుర్తింపబడుతున్నాయి. ఈ ప్రపంచంలోనే ముఖ్య ఆర్థిక, రాజకీయ శక్తిగా ఎదగాలన్న కోరిక ప్రస్తుతం రెండు దేశాలకూ ఉంది. దాంతో ఇవి ఒకదానిని ఒకటి రాజకీయ, ఆర్థిక పోటీదారుగా కూడా పరిగణిస్తున్నాయి. సరిహద్దుల వద్ద చెదురుమదురు ఘటనలు జరుగుతున్నప్పటికీ శాంతి, సామరస్యాలు నెలకొనేలా ఇరు ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి.

10th Class Social Textbook Page No.291

ప్రశ్న 11.
అరబ్బులు, పాలస్తీనియన్ల మధ్య ఘర్షణలకు కారణాలు ఏమిటి?
జవాబు:
అరబ్బులు, పాలస్తీనియన్ల మధ్య ఘర్షణలకు ఇవి కారణాలు :

  1. పాలస్తీనా యూదులు, క్రైస్తవులు, ముస్లిములందరికీ పవిత్ర స్థలం, అరబ్బులు, ఇజ్రాయెల్ ని చట్టబద్ద దేశంగా గుర్తించటానికి తిరస్కరించారు.
  2. యూదులు పాలస్తీనాని తమ వాగత భూమిగా పరిగణిస్తారు.
  3. ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూదులను ఏకం చేసి, తమ మాతృభూమి అయిన పాలస్తీనాను తిరిగి పొంది, యూదులకు ప్రత్యేక దేశాన్ని నిర్మించటానికి యూదులలో ‘జిమానిస్ట్ ఉద్యమం’ మొదలయ్యింది. దీనికి పాశ్చాత్య శక్తుల మద్దతు కూడా లభించింది.
  4. అయితే అప్పటికే పాలస్తీనియన్లు (ఎక్కువమంది అరబ్బు, ముస్లిములు) అక్కడ నివసిస్తున్నారు. దీంతో ఆ ప్రాంతం కోసం అరబ్బులు, పాలస్తీనియన్ల మధ్య ఘర్షణ మొదలయ్యింది.
  5. అరబ్బు ద్వీపఖండంలో పెద్ద ఎత్తున చమురు నిల్వలు కనుగొనటంతో ఇరువర్గాల మధ్యే కాకుండా అమెరికా, రష్యాలు కూడా ఈ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకోవాలని ప్రయత్నించడం ఘర్షణలకు కారణాలయ్యాయి.

10th Class Social Textbook Page No.291

ప్రశ్న 12.
కొంతమంది పాలస్తీనియన్లు ఉగ్రవాద పంథాని ఎందుకు ఎంచుకున్నారు? దాని ఫలితాలు ఏమిటి?
జవాబు:
1964లో జోర్డాన్లో “పాలస్తీనా విముక్తి సంఘం” (పిఎల్‌ఓ) ఆవిర్భవించింది. దీని ముఖ్య ఉద్దేశం అరబ్బు బృందాలన్నింటిని ఏకం చేయడం, కోల్పోయిన భూమిని శాంతియుతంగా తిరిగిపొందటం. దీని నాయకుడు “యాసర్ అరాఫత్”.

ఇది ఉగ్రవాద పంథాని ఎంచుకోవడానికి కారణం :

  1. 1967లో పాలస్తీనా విముక్తి సంఘం (పిఎల్ఓ)- ఇజ్రాయెల్ పై దాడి చెయ్యాల్సిందిగా అరబ్బు దేశాలపై ఒత్తిడి పెట్టసాగింది. దీనికి అయితే అరబ్బు దేశాలు అంత ఉత్సాహం చూపలేదు.
  2. అరబ్బు దేశాల సహకారం లేకపోవడంతో పాలస్తీనా విముక్తి సంఘంలో నుంచి ఒక వర్గం అరాఫత్ నేతృత్వంలో చీలి ఉగ్రవాద పంథాని ఎంచుకున్నది.

దీని వల్ల ఫలితాలు :

  1. దాడులు, ప్రతిదాడులతో నిత్యం యుద్ధ వాతావరణంతోటి, ఉగ్రవాదుల దాడులతోటి ఉండేది.
  2. పిఎల్‌ఓ పరస్పరం ఘర్షణకు పాల్పడే అనేక చిన్న వర్గాలుగా చీలిపోయింది.
  3. చివరకు అరాఫత్ ఉగ్రవాదాన్ని విడిచిపెట్టి ఇజ్రాయెల్‌ను గుర్తించటం ద్వారా శాంతియుత పరిష్కారం కనుగొనటానికి అంగీకరించాడు.
  4. దీర్ఘకాల యుద్ధాన్ని ముగించటానికి అతడు ఇజ్రాయెల్ తో సంప్రదింపులు జరిపి పాలస్తీనియన్ల స్వయం పాలనకు సంబంధించి అనేక ఒప్పందాలు కుదుర్చుకున్నాడు.

AP Board 10th Class Social Solutions Chapter 20 ప్రపంచ యుద్దాల తరువాత ప్రపంచం, భారతదేశం

10th Class Social Textbook Page No.292

ప్రశ్న 13.
అరబ్బు సోషలిస్టు జాతీయతావాదానికీ, మతపర జాతీయతావాదానికీ మధ్య తేడాలు ఏమిటి?
జవాబు:
అరబ్బు సోషలిస్టు జాతీయవాదానికీ, మతపర జాతీయవాదానికీ మధ్య తేడాలు.

సోషలిస్టు జాతీయవాదంమతపర జాతీయవాదం
1) సోషలిజం అంటే అరబ్బుల ఉద్దేశంలో చమురు వనరుల జాతీయకరణ చేయడం.1) అనేక ప్రాంతాలలో అమెరికాకు, అమెరికా మద్దతు ఇచ్చిన ప్రభుత్వాలకు వ్యతిరేకత, మతపరమైన రంగు సంతరించుకుంది.
2) చమురు నుంచి వచ్చే ఆదాయాన్ని పౌరుల సంక్షేమ చర్యల కోసం ప్రభుత్వం ఖర్చుచేయటం.2) సంపదను, అవకాశాలను అందరికీ సమంగా పంచాలన్న భావనకు జాతీయవాద శక్తులు రాకుండా ఆయా దేశాలలో మత ఛాందసవాదులు అధికారంలోకి రావడానికి మద్దతునిచ్చాయి.
ఉదా : ఆఫ్ఘనిస్తాన్ లో సోవియట్ సైనికులు తిరిగి వెళ్లిపోయిన తరువాత ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్లు అధికారంలోకి వచ్చి తీవ్రవాద ఇస్లామిక్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.

10th Class Social Textbook Page No.292

ప్రశ్న 14.
ఇరాన్ లోనూ, తాలిబన్ల కింద ఉన్న ఆఫ్ఘనిస్థాన్ లోనూ సంభవించిన పరిణామాలను తెలుసుకుని మతపర ప్రభుత్వాలు పనిచేసే విధానాన్ని అర్థం చేసుకోండి.
జవాబు:
1) ఇరాన్ :
1979లో ఇరాన్లో విప్లవం సంభవించి, ఇరాన్ రాజుని తొలగించి, షియా ఇస్లామిక్ మత గురువులు, ప్రజాస్వామికంగా ఎన్నికైన నాయకులు కలసి నిర్వహించే కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు.

2) ఆఫ్ఘనిస్తాన్ :
ఆఫ్ఘనిస్తాన్లో సోవియట్ సైనికులు తిరిగి వెళ్లిపోయిన తరువాత ఆఫ్ఘనిస్థాన్లో తాలిబన్లు అధికారంలోకి వచ్చి తీవ్రవాద ఇస్లామిక్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.

మతపర ప్రభుత్వాల పని విధానం :

  1. ఆఫ్ఘనిస్థాన్లో తాలిబన్లు మత గ్రంథాలలో ఉన్న నియమాలను కచ్చితంగా పాటించాలని ప్రజలను బలవంతం చేయసాగారు.
  2. దీని మూలంగా మహిళలకు, మతపర అల్ప సంఖ్యాక ప్రజలకు మౌలిక స్వేచ్ఛ, సమానత్వం లేకుండా పోయాయి.
  3. అరబ్బులలో అసంతృప్తి పెరిగింది. ఫలితంగా మతపర ఉగ్రవాదం అధికమైంది. కొంత మంది అరబ్బు ఉగ్రవాదులు అమెరికాకు చెందిన రెండు విమానాలను హై జాక్ చేసి వాటితో న్యూయార్క్ లోని ప్రపంచ వాణిజ్య కేంద్రంలోకి దూసుకెళ్ళడంతో ఆ భవనాలు కూలి కొన్ని వేలమంది మరణించారు. ఈ విధంగా మతపరప్రభుత్వాల మూలంగా అనేక విధ్వంపాలు జరుగుతున్నాయని అర్థం అవుతుంది.

10th Class Social Textbook Page No.293

ప్రశ్న 15.
రెండు ధృవాల, ఏకధృవ ప్రపంచం అన్న పదాలను వివరించండి.
జవాబు:
1) రెండు ధృవాల ప్రపంచం :
రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ప్రపంచంలో రెండు ప్రధాన సైద్ధాంతిక, రాజకీయ శిబిరాలు ఏర్పడ్డాయి. యుఎస్ఎస్ఆర్ నేతృత్వంలో కమ్యూనిస్ట్ శిబిరం, అమెరికా నేతృత్వంలో ప్రజాస్వామిక పెట్టుబడిదారి శిబిరం. ఈ రెండు దేశాలను ‘రెండు ధృవాల’ ప్రపంచమని అంటారు.

2) ఏకధృవ ప్రపంచం :
1991 అధ్యక్ష ఎన్నికలలో గోర్బచెవ్ గెలుపొంది, యుఎస్ఎస్ఆర్ ని రద్దుపరుస్తున్నట్లు ప్రకటించాడు. పాత యుఎస్ఎస్ఆర్ లోని రాజ్యాలు స్వతంత్ర దేశాలు అయ్యాయి. యుఎస్ఎస్ఆర్’ కుప్పకూలటంతో ప్రపంచ రాజకీయాలలో కొత్త యుగం ఆరంభమయ్యింది. దీనినే ఏకధృవ ప్రపంచం అని అంటాము.

AP Board 10th Class Social Solutions Chapter 20 ప్రపంచ యుద్దాల తరువాత ప్రపంచం, భారతదేశం

10th Class Social Textbook Page No.296

ప్రశ్న 16.
రెండు దేశాల మధ్య శాశ్వత శాంతి నెలకొనటానికి భారతదేశం, పాకిస్తాన్లు ఏ చర్యలు తీసుకోవాలి?
జవాబు:
భారతదేశం, పాకిస్తాన్ల మధ్య శాంతి నెలకొనడానికి ఈ కింది చర్యలు తీసుకోవచ్చు.

  1. పాకిస్తాన్ కూడా లౌకిక రాజ్యం కావాలి. మతతత్వ భావనను విడనాడాలి.
  2. పాకిస్తాన్ మత ఛాందసవాదాన్ని విడిచి పెట్టి ప్రజలకు స్వేచ్ఛను కలిగించాలి. దీని వల్ల ఇరు రాజ్యా లూ మత ప్రసక్తి లేని వాతావరణంలో సంప్రదింపులు జరుపుకోవచ్చు.
  3. రెండు దేశాల మధ్య రవాణా సౌకర్యాలు పెంచాలి.
  4. రెండు దేశాల ప్రజలలో సామరస్య దోరణులు కలిగేలా చర్యలు తీసుకోవాలి.
  5. తాము ఉపఖండ దేశాలమని, భారతదేశం, పాకిస్తాన్ దేశాలు కలసి కొన్ని వందల సంవత్సరాలు సహజీవనం సాగించామని గుర్తుకు తెచ్చుకోవాలి.
  6. క్రీడలు, సినిమాలు, వాణిజ్యం, పర్యటన, సాంస్కృతిక సంబంధాలు, వివాహ సంబంధాలతో ఇరు దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలను పెంచవచ్చు.

10th Class Social Textbook Page No.296

ప్రశ్న 17.
భారతదేశం, పాకిస్తాన్ల అభివృద్ధికి రెండు దేశాల మధ్య శాంతి అవసరం ఏమిటి?
జవాబు:
భారతదేశం, పాకిస్తాన్‌ అభివృద్ధికి రెండు దేశాల మధ్య శాంతి అవసరమే. ఎందుకనగా………
1) యుద్ధ ఖర్చు :
ఈ రెండు దేశాల మధ్య నిరంతరం ఘర్షణలు కొనసాగుతుండడంతో ఇరు దేశాలు ఆయుధాలను, సైనికసంపత్తిని సమీకరించుకొనుటకు అధిక ధనాన్ని వెచ్చిస్తున్నారు. ఈ రెండు దేశాల మధ్య శాంతి నెలకొంటే యుద్ధ ఖర్చు తగ్గుతుంది.

2) ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది :
ఇరు దేశాల మధ్య యుద్ధ భయం లేకపోతే ఇరు దేశాల ప్రజలు శాంతి, సుఖ సంతోషాలతో జీవిస్తారు.

3) సరిహద్దు రాష్ట్రాలలో యుద్ధభీతి తగ్గుతుంది :
సరిహద్దు రాష్ట్రాల వాళ్లు యుద్ధ భయం లేకుండా ప్రశాంత జీవనం సాగించవచ్చు.

4) సంస్కృతి, నాగరికతలను పంచుకున్న సుదీర్ఘ చరిత్ర ఇరుదేశాలకూ ఉండటంతో ఇరు దేశాల మధ్య స్నేహం, శాంతి నెలకొనవలసిన అవసరం ఎంతైనా ఉంది.

10th Class Social Textbook Page No.296

ప్రశ్న 18.
పొరుగునున్న పెద్ద దేశాలు ‘పెద్దన్న లాగా’ వ్యవహరిస్తున్నాయని అనేక దేశాలు ఆరోపిస్తూ ఉంటాయి. దీని అర్థం ఏమై ఉంటుంది?
జవాబు:

  1. భారతదేశపు పొరుగు దేశాలలో చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి పెద్ద దేశాలు, నేపాల్, భూటాన్, శ్రీలంక వంటి చిన్న దేశాలు ఉన్నాయి.
  2. భారతదేశం విశాలమైన దేశమైనందున పొరుగు దేశాలు మన పట్ల అపోహలు పెంపొందించుకోవడం, మన చర్యలను అపార్థం చేసుకోవడం జరుగుతుంది.
  3. చిన్న దేశాలు, పెద్ద దేశమైన భారతదేశం తమ మీద ఆధిపత్యం చేస్తుందని, భారతదేశం “పెద్దన్న పాత్ర” పోషిస్తుందని అంటున్నాయి.
    ఉదా : బంగ్లాదేశ్ నుంచి ప్రజలు పెద్ద ఎత్తున చట్ట విరుద్ధంగా భారతదేశంలోకి రాకుండా కొన్ని సరిహద్దు ప్రాంతాలలో భారతదేశం కంచె నిర్మించటాన్ని బంగ్లాదేశ్ అభ్యంతర పెట్టింది. తీరప్రాంతాలలో భారతదేశం ‘పెద్దన్న పాత్ర’ పోషిస్తుందని బంగ్లాదేశ్ భావిస్తుంది.

AP Board 10th Class Social Solutions Chapter 20 ప్రపంచ యుద్దాల తరువాత ప్రపంచం, భారతదేశం

10th Class Social Textbook Page No.296

ప్రశ్న 19.
భారతదేశం, బంగ్లాదేశ్ ఉన్న పటం చూసి రెండు దేశాల మధ్య సహకారం ఆ రెండింటికీ ఎందుకు కీలకమైనదో పేర్కొనండి.
జవాబు:
భారత్ – బంగ్లాదేశ్ ల మధ్య సహకారం ఆ రెండు దేశాలకూ చాలా కీలకమైనది. ఎందుకనగా

  1. బంగ్లాదేశ్ చుట్టూ సరిహద్దుగా భారతదేశ రాష్ట్రాలున్నాయి. ఈ సరిహద్దు రాష్ట్రాలలో బంగ్లాదేశ్ ఏమైనా అసాంఘిక చర్యలు చేపట్టినట్లయితే భారతదేశ జాతీయ సమైక్యతకు ముప్పు వాటిల్లుతుంది. కావున ఇటువంటి ప్రమాదాలు సంభవించకుండా ఇరు దేశాల మధ్య స్నేహ సంబంధాలు అవసరం.
  2. బ్రహ్మపుత్ర, గంగానదీ జలాల విషయం ఇరుదేశాలకు సంబంధించింది. కావున జలాల పంపిణీ సక్రమంగా, సమస్యలు లేకుండా జరగాలన్నా ఇరు దేశాల మధ్య స్నేహ, సహకారాలు అవసరమే.
  3. బంగ్లాదేశ్ తో మనకు స్నేహ, సహకారాలు లోపిస్తే బంగ్లాదేశ్ ఇతర అగ్ర రాజ్యాల ఆధిపత్యంలోకి వెళ్లిపోయే ప్రమాదం ఉంది. తద్వారా మనకు ప్రమాదం పొంచి ఉంటుంది. కావున బంగ్లాదేశ్, భారతదేశాల మధ్య సహకారం చాలా కీలకమైనదని చెప్పవచ్చు.

10th Class Social Textbook Page No.297

ప్రశ్న 20.
బంగ్లాదేశ్ కి భారతదేశం ఇచ్చిన మద్దతుని, శ్రీలంకలో దాని పాత్రని పోల్చండి. రెండు దేశాలలో పరిస్థితి ఒకే రకంగా ఉందా, తేడాలు ఉన్నాయా?
జవాబు:
బంగ్లాదేశ్ కి భారతదేశం ఇచ్చిన మద్దతు వేరు. శ్రీలంక పరిస్థితి వేరు.

  1. బంగాదేశ్ భారతదేశ సహాయంతో పాకిస్తాన్ నుంచి విముక్తి పొందింది. భారతదేశంతో 25 సంవత్సరాల శాంతి ఒప్పందం చేసుకుంది.
  2. శ్రీలంక కూడా వలసపాలన నుంచి 1948లో స్వాతంత్ర్యం పొందింది. అయితే శ్రీలంకలో తమిళం మాట్లాడే అల్ప సంఖ్యాక ప్రజల పట్ల శ్రీలంక ప్రభుత్వం చిన్నచూపు మూలంగా తమిళుల్లో తాము వేరు అన్న భావన ఏర్పడింది. దీనికి ప్రభుత్వమే కారణం.
  3. శ్రీలంక తమిళ కాందిశీకులు పెద్ద సంఖ్యలో భారతదేశంలోకి రావటం ప్రత్యేక సమస్యగా మారింది. దీంతో శ్రీలంకలో శాంతిని నెలకొల్పటానికి భారతదేశం తన సైన్యాన్ని పంపించినందుకు తమిళ తీవ్రవాదులు ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీని చంపారు. కావున బంగ్లాదేశ్ కి మనమిచ్చే మద్దతు వేరు. శ్రీలంకకు మనమిచ్చిన మద్దతు వేరు.

AP Board 10th Class Social Solutions Chapter 18 స్వతంత్ర భారతదేశం (మొదటి ముప్ఫై సంవత్సరాలు-1947-1977)

SCERT AP 10th Class Social Study Material Pdf 18th Lesson స్వతంత్ర భారతదేశం (మొదటి ముప్ఫై సంవత్సరాలు-1947-1977) Textbook Questions and Answers.

AP State Syllabus 10th Class Social Solutions 18th Lesson స్వతంత్ర భారతదేశం (మొదటి ముప్ఫై సంవత్సరాలు-1947-1977)

10th Class Social Studies 18th Lesson స్వతంత్ర భారతదేశం (మొదటి ముప్ఫై సంవత్సరాలు-1947-1977) Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
బ్రాకెట్టు ముందున్న వ్యాఖ్యానానికి సంబంధించి అనువైన వ్యాఖ్యానం / వ్యాఖ్యానాలను బ్రాకెట్టు లోపల ఉన్నవాటి నుంచి గుర్తించండి. (AS1)
అ) రాజకీయ సమానత్వాన్ని దీనితో గుర్తించవచ్చు (ఏ పాఠశాలలోనైనా ప్రవేశం పొందే హక్కు, ఒక వ్యక్తి – ఒక ఓటు అన్న సూత్రం, దైవారాధన ప్రదేశంలోకి ప్రవేశించే హక్కు)
ఆ) భారతదేశ విషయంలో అందరికీ వయోజన ఓటు హక్కు అంటే (అందరినీ ఏదో ఒక రాజకీయ పార్టీకి ఓటు వెయ్యటానికి అనుమతించటం, అందరినీ ఎన్నికలలో ఓటు వెయ్యటానికి అనుమతించటం, అందరినీ కాంగ్రెస్ పార్టీకి ఓటు వెయ్యటానికి అనుమతించటం)
ఇ) కాంగ్రెస్ ఆధిపత్యం దీని వల్ల సాధ్యమయ్యింది (విభిన్న సిద్ధాంతాలు ఉన్న వాళ్లని ఆకర్షించగలగటం, ఎన్నికల తరువాత అత్యధిక శాసన సభా స్థానాలను గెలుచుకోగలగటం, ఎన్నికలలో పోలీసు బలగాన్ని ఉపయోగించుకోగలగటం)
ఈ) అత్యవసర పరిస్థితి ఫలితంగా (ప్రజల హక్కులకు పరిమితులు విధింపబడ్డాయి. పేదరికం తొలగింపబడింది. అన్ని రాజకీయ పార్టీల ఆమోదం పొందింది)
జవాబు:
అ) ఒక వ్యక్తి – ఒక ఓటు అన్న సూత్రం
ఆ) అందరినీ ఎన్నికలలో ఓటు వెయ్యటానికి అనుమతించటం
ఇ) విభిన్న సిద్ధాంతాలు ఉన్న వాళ్లని ఆకర్షించగలగటం
ఈ) ప్రజల హక్కులకు పరిమితులు విధింపబడ్డాయి.

AP Board 10th Class Social Solutions Chapter 18 స్వతంత్ర భారతదేశం (మొదటి ముప్ఫై సంవత్సరాలు-1947-1977)

ప్రశ్న 2.
స్వాతంత్ర్యం వచ్చిన తొలి సంవత్సరాలలో సామాజిక-ఆర్థిక మార్పు తీసుకురావటానికి ఏ చర్యలు చేపట్టారు? (AS1)
జవాబు:
రాజ్యాంగ సభ సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని, హోదా, అవకాశాలలో సమానత్వాన్ని కోరుకుంది. కొత్త రాజ్యాంగాన్ని ఆవిష్కరించిన నెల రోజులకు ప్రణాళికా సంఘాన్ని ఏర్పరిచారు. మొదటి పంచవర్ష ప్రణాళిక వ్యవసాయం మీద కేంద్రీకరించి ఆహార ఉత్పత్తిని పెంచడానికి ఉద్దేశించబడింది. వ్యవసాయ రంగంలోని మార్పును నెహ్రూ కేవలం ఆర్ధిక అంశంగా చూడలేదు, దానిని గ్రామీణ రంగ రాజకీయ, సామాజిక, ఆర్ధిక మార్పుగా పరిగణించాడు. కావున సామాజిక – ఆర్థిక మార్పు తీసుకురావడానికి నెహ్రూ ఈ క్రింది చర్యలను చేపట్టినాడు. ప్రధానంగా మూడు అంశాలున్నాయి.
అవి :

  1. భూసంస్కరణలు
  2. వ్యవసాయ సహకార సంఘాలు
  3. స్థానిక స్వపరిపాలన

1) భూసంస్కరణలు :
మూడు రకాలైన భూసంస్కరణలను నెహ్రూ ప్రతిపాదించాడు.
ఎ) జమిందారీ వ్యవస్థ రద్దు
బి) కౌలు విధానాల సంస్కరణ
సి) భూ పరిమితి విధానాలు

ఈ మూడు సంస్కరణల ముఖ్య ఉద్దేశం దున్నే వానికి, భూమి చెందేలా చూసి మరింత ఉత్పత్తి చెయ్యటానికి ప్రోత్సహించటం.

2) వ్యవసాయ సహకార సంఘాలు :
సహకార సంఘాల ద్వారా ఆర్థికంగా లాభసాటి పరిమాణాన్ని చేరుకోవటమే కాకుండా విత్తనాలు, ఎరువులు, రసాయనాలు వంటి విలువైన ఉత్పాదకాలను అందించాలి.

3) స్థానిక స్వపరిపాలన :
భూసంస్కరణలు అమలు అయ్యేలా చూసి, గ్రామ ఉమ్మడి ప్రయోజనాలకు అనుగుణంగా సహకార సంఘాలు నడిచేలా చూస్తాయి.

మొదటి పంచవర్ష ప్రణాళికలో పెద్ద ఆనకట్టలు కట్టి విద్యుత్తు ఉత్పత్తి, సాగునీటి కల్పనల ద్వారా వ్యవసాయాన్ని వృద్ధి చేయుటపై దృష్టి సారించారు. ఆనకట్టల వల్ల వ్యవసాయ, పారిశ్రామిక రంగాలు వృద్ధి చెందాయి. దేశం ప్రగతి సాధించాలంటే పరిశ్రమలను అభివృద్ధి చేసి, ఎక్కువ మంది కర్మాగారాలలోనూ, సేవారంగంలోనూ పనిచేసేలా మళ్లించాల్సిన అవసరం ఉందని ప్రణాళిక కర్తలు గుర్తించి, రెండవ పంచవర్ష ప్రణాళిక నుంచి ప్రాధాన్యత పరిశ్రమల వైపునకు మళ్లించారు.

ప్రశ్న 3.
ఒక పార్టీ ఆధిపత్యం అంటే ఏం అర్థం చేసుకున్నారు? అది ఎన్నికలలో మాత్రమే ఆధిపత్యమా, లేక సిద్ధాంత భావజాలంలో కూడా ఆధిపత్యమా? మీ కారణాలను పేర్కొంటూ చర్చించండి. (AS1)
జవాబు:
భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చాక 1952, 1957, 1962 లలో జరిగిన మొదటి మూడు సార్వత్రిక ఎన్నికలలో భారత జాతీయ కాంగ్రెస్ అఖండ విజయం సాధించింది. భారతదేశానికి జవహర్‌లాల్ నెహ్రూ మొదటి ప్రధానమంత్రి అయ్యాడు. ఇతర పార్టీలలో ఏ ఒక్క పార్టీకి కూడా 11% మించి ఓట్లు రాలేదు. కాంగ్రెస్ 70% పైగా స్థానాలను గెలుచుకుంది. ఈ విధంగా కాంగ్రెస్ ఆధిపత్యం ఒక ఎన్నికలలోనే కాదు, సిద్ధాంత, భావజాలంలో కూడా కొనసాగుతుంది.

కాంగ్రెస్ ఆధిపత్యానికి కారణాలు :

  1. 1952, 1957, 1962 లలో జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ 45% ఓట్లతో విజయం సాధించి అనేక రాష్ట్రాలలో ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది.
  2. స్వాతంత్ర్యానికి ముందు కాంగ్రెస్ నాయకత్వం మితవాదుల చేతులలో ఉండేది. తరువాత అతివాదులు, చిట్ట చివరికి గాంధీజీ నాయకత్వంలో భారత జాతీయ కాంగ్రెస్ పనిచేసింది. జాతీయోద్యమ కాలంలో కాంగ్రెస్ లక్ష్యం దేశ స్వాతంత్ర్యం అవటం వల్ల ఈ సంస్థలో విభిన్న సిద్ధాంతాలు ఉన్న వ్యక్తులందరూ పనిచేశారు. అందువల్ల ఈ సంస్థకు బహుతావాద దృక్పథం ఏర్పడింది.
  3. స్వాతంత్ర్యం తరువాత రాజకీయ పార్టీగా మారిన వాతావరణంలో కూడా ఈ బహుతావాద దృక్పథాన్ని కాంగ్రెస్ వదులుకోలేక పోయింది. ఇందులో వామపక్షవాదులు, సంప్రదాయవాదులు, మితవాదులు అందరూ ఉన్నారు. విభిన్న శక్తులకు ఆశ్రయం కల్పించింది.
  4. కాంగ్రెస్ లో ఎల్లప్పుడూ అంతర్గతంగా చిన్నచిన్న బృందాలు ఉండేవి. ఈ బృందాలు నాయకుల మధ్య పోటీ కారణంగా ఏర్పడ్డాయి. పార్టీ లక్ష్యాలతో వీళ్లు ఏకీభవించినప్పటికీ కొన్ని విధానాల విషయంలో విభేదాలు ఉండేవి.
  5. సభ్యుల ప్రయోజనాలను బట్టి ఈ బృందాలు వివిధ అంశాలపై వేరు వేరుగా స్పందించేవి. దీనివల్ల కాంగ్రెస్ పార్టీ విభిన్న దృక్పథాలు, ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నట్లుగా కనిపించేది. కొన్ని సందర్భాలలో ఈ బృందాలు ఇతర రాజకీయ పార్టీలతో కలిసి నాయకత్వం మీద ఒత్తిడి తీసుకురావటానికి ప్రయత్నించేవి.
  6. ఏకపార్టీ ఆధిపత్యంలో ఉన్న పరిస్థితిలో కూడా కాంగ్రెస్ పార్టీ లోపలే రాజకీయ పోటీ ఉంటూ ఉండేది. అయితే ఇతర పార్టీలు పోటీ చేశాయి. కానీ కాంగ్రెస్ ను సవాలు చేయగలిగే సంఖ్యలో స్థానాలను గెలుచుకోలేకపోయాయి.

ఇతర రాజకీయ పార్టీలు క్రమేపి బలం పుంజుకుని రెండు దశాబ్దాల కాలంలో అధికారానికి పోటీదారుగా ఎదిగాయి.

ప్రశ్న 4.
ఐక్యత సాధించే అంశంగానో లేక విభజించే దానిగానో భారతదేశ రాజకీయాలలో భాష కేంద్ర బిందువుగా అనేకసార్లు తెరమీదకు వచ్చింది. ఈ ఘటనలను గుర్తించి వాటిని వివరించండి. (AS1)
జవాబు:
కొత్తగా ఏర్పడిన దేశం ఎదుర్కొన్న మొదటి సవాళ్లలో భాషా ప్రాతిపదికన రాష్ట్రాలను పునర్వ్యవస్థీకరించాలన్న కోరిక ఒకటి మరియు 1963లో అధికార భాషా చట్టాన్ని ఆమోదించినప్పుడు హిందీకి వ్యతిరేకంగా తమిళనాడు ఉద్యమాన్ని చేపట్టింది. ఈ విధంగా భాష అనేది భారతదేశంలో అనేక సందర్భాలలో కీలకమైన పాత్ర వహించింది.
1) బ్రిటిష్ కాలంలో దేశం ప్రెసిడెన్సీలు (కలకత్తా, మద్రాస్, బాంబే)గానూ, సెంట్రల్ ప్రావిన్సెస్, బీదర్ వంటి అనేక పెద్ద రాష్ట్రాలుగానూ విభజింపబడి ఉండేది. దేశంలో అధికభాగం అనేక సంస్థానాల కింద ఉంది. ఈ రాష్ట్రాలలో పలు భాషలు మాట్లాడే ప్రజలు కలసి జీవిస్తున్నారు. ఒకే భాషను మాట్లాడుతూ పక్క పక్క ప్రాంతాల్లో ఉంటున్న ప్రజలంతా ఒక రాష్ట్రంగా సంఘటితపరచాలంటూ కోరసాగారు. వీటితో సంయుక్త కర్ణాటక (మద్రాసు, మైసూరు, బాంబే, హైదరాబాదులలో కన్నడ మాట్లాడే ప్రజలను కలుపుతూ) సంయుక్త మహారాష్ట్ర, మహా గుజరాత్ ఉద్యమం, ట్రావెన్ కోర్-కొచ్చిన్ సంస్థానాల విలీనం, సిక్కులకు పంజాబ్ రాష్ట్రం వంటి కోరికలు ఉండేవి. అయితే మతం ఆధారంగా దేశ విభజన జరగడంతో నాయకులు ఆ భాషా ప్రాతిపదిక రాష్ట్రాలను పున్వ్యవస్థీకరిస్తే దేశం ముక్కలు కావటానికి దారితీస్తుందని భయపడసాగారు.

2) తెలుగు మాట్లాడే ప్రజలు అన్నిటికంటే తీవ్రంగా ఉద్యమాన్ని చేపట్టారు. భాషా ప్రాతిపదికన రాష్ట్రాలకు అనుగుణంగా కాంగ్రెస్ చేసిన తీర్మానాన్ని అమలు చెయ్యాలని వాళ్లు పట్టుపట్టారు. బ్రిటిష్ పాలనలో కూడా ఆంధ్ర మహాసభ క్రియాశీలంగా ఉండి మద్రాస్ ప్రెసిడెన్సీలోని తెలుగు మాట్లాడే ప్రజలను ఒక్క తాటి కిందకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేసింది. ఈ ఉద్యమం స్వాతంత్ర్యం తరువాత కూడా కొనసాగింది. విన్నపాలు, దరఖాస్తులు, వీధులలో కవాతులు, నిరాహారదీక్షలు వంటి పద్ధతులను ఇందుకు ఉపయోగించారు.

3) 1963లో అధికార భాషా చట్టాన్ని ఆమోదించినప్పుడు హిందీని మిగిలిన దేశం మీద రుద్దడానికి ఎత్తుగడగా భావించి, డి.ఎం.కె తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా హిందీకి వ్యతిరేకంగా ఉద్యమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా సమ్మెలు, ధర్నాలు, హర్తాళ్ లు నిర్వహించారు. దిష్టిబొమ్మలు, హిందీ పుస్తకాలు, చివరికి రాజ్యాంగంలోని పేజీలను కూడా తగలబెట్టారు. ‘సైన్ బోర్డులలో హిందీలో ఉన్న దాని మీద చాలా చోట్ల నలుపు రంగు పూశారు. పోలీసులు, ఆందోళనకారుల మధ్య ఘర్షణలు జరిగాయి. కేంద్ర ప్రభుత్వం ఈ అల్లర్లను పరిగణనలోకి తీసుకోవాల్సి వచ్చింది.

ఈ విధంగా జనాదరణ పొందిన ఈ భాషా ఉద్యమాల వల్ల ప్రభుత్వం తన అధికారిక స్థానాన్ని పునః సమీక్షించుకోవలసి వచ్చింది. భాషా ప్రయుక్త రాష్ట్రాలు, హిందీ వ్యతిరేక ఉద్యమాలలో ప్రధానమంత్రులు పరిస్థితులు చేజారిపోకుండా తమ దృక్పథాన్ని మార్చుకున్నారు. సమస్యలను పరిష్కరించడం జరిగింది.

AP Board 10th Class Social Solutions Chapter 18 స్వతంత్ర భారతదేశం (మొదటి ముప్ఫై సంవత్సరాలు-1947-1977)

ప్రశ్న 5.
1967 ఎన్నికల తరువాత రాజకీయ వ్యవస్థలో వచ్చిన ముఖ్యమైన మార్పులు ఏవి? (AS1)
జవాబు:
భారతదేశ చరిత్రలో 1967 ఎన్నికలు చాలా కీలకమైనవి. ఎన్నికలను ప్రజలు అత్యంత ప్రధానమైనవిగా పరిగణిస్తున్నారని, వాటికి తమదైన ఉనికి ఉందని ఈ ఎన్నికలు రుజువు చేశాయి.

ముఖ్యమైన మార్పులు:

  1. స్వాతంత్ర్యం తరువాత కాంగ్రెస్ తక్కువ ఆధిక్యత (284 స్థానాలు) తో ఎన్నికయింది. కాంగ్రెస్ పార్టీ అంతకు ముందెన్నడూ చవిచూడని ఫలితాలను చవిచూసింది.
  2. బీహార్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్, పశ్చిమబెంగాల్, ఒడిశా, మద్రాస్, కేరళ శాసనసభలలో కాంగ్రెస్ ఓటమి పాలయ్యింది.
  3. తమిళనాడు, కేరళలో కూడా కాంగ్రెస్ ఘోర పరాజయం పాలైంది. తమిళనాడులో డి.ఎం.కె. ఘనవిజయం సాధించింది. ప్రజాదరణ ఉన్న సినిమా హీరో ఎం.జి. రామచంద్రన్ మద్దతును డి.ఎం.కె. ఉపయోగించుకుంది.
  4. పశ్చిమబెంగాల్, ఒరిస్సాలో కూడా కాంగ్రెస్ ఓడిపోయింది.
  5. ఈ ఓటములతో కాంగ్రెస్ ఆంతరంగికంగా బలహీనపడింది. ఉత్తరాది రాష్ట్రాలలో స్వల్ప విజయాలు పొందిన చోట్ల దాని ప్రతినిధులు ప్రతిపక్షాలకు ఫిరాయించారు. ఫలితంగా కాంగ్రెస్ పడిపోయి ‘సంయుక్త విధాయక దళ్ (ఎస్వీడి) ప్రభుత్వాలు ఏర్పడ్డాయి.
  6. భారత రాజకీయ చరిత్రలో ఈ కొత్త ప్రభుత్వాలు ఒక మైలురాయిగా ఉంటాయి. ఒక విధంగా ప్రజాస్వామిక తిరుగుబాటును ఇది సూచిస్తుంది. మధ్యస్థాయి కులాలు భూసంస్కరణల వల్ల ప్రయోజనం పొంది, ఆర్ధికంగా లాభపడి, మొదటిసారిగా రాజకీయ అధికారాన్ని పొందాయి.
    ఉదా : హర్యానా, ఉత్తరప్రదేశ్ లో జాట్, బీహార్ లో కుర్మి, ఆంధ్రప్రదేశ్ లో రెడ్డి, కమ్మ. ఈ కులాలు ఆయా రాష్ట్రాలలో ఆధిపత్య కులాలు.
  7. దేశంలో వివిధ రాష్ట్రాలలో ప్రాంతీయ భావాలు తిరిగి ఊపందుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది. దీనికి ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు నాయకత్వం వహించారు.
  8. 1969లో అసోంలోని ఖాసి, జైంతియా, గారో గిరిజన ప్రాంతాలలో ‘మేఘాలయ’ అన్న కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటుచేశారు.
  9. 1966లో ఏర్పడిన పంజాబ్, హర్యానాలకు ఉమ్మడి రాజధానిగా చండీఘర్ ని తమకు ఇమ్మని 1968-69లలో పంజాబ్ ప్రజలు ఆందోళనలు చేశారు.
  10. మహారాష్ట్రలో బొంబాయి మహారాష్ట్ర వాసులకే చెందాలన్న వింత వాదన మొదలయ్యింది. దీనికి ‘శివసేన’ నాయకత్వం వహించింది.
  11. బీహార్, గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ లలో అనేక సమస్యలు తలెత్తాయి.

1967 ఎన్నికల తరువాత, పార్టీ లోపలి, పార్టీ బయట నుండి వచ్చే సమస్యలను ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఎదుర్కొంది.

ప్రశ్న 6.
రాష్ట్రాలను ఏర్పరచటానికి మరొక ఆధారం ఏమైనా ఉందా? భాష ఆధారంగా పునఃవ్యవస్థీకరణ కంటే అది ఏ విధంగా మెరుగైనదిగా ఉండేది? (AS1)
జవాబు:
రాష్ట్రాలను ఏర్పరచటానికి భాష కాకుండా “భౌగోళికంగా” పునర్వ్యవస్థీకరిస్తే బాగుండేదని నా అభిప్రాయం. ఎందుకనగా –
1) భాష ఆధారంగా పునర్వ్యవస్థీకరణ మూలంగా ఇటీవలి కాలంలో అనేక సమస్యలను ఎదుర్కొంటున్నాం.
ఉదా : తెలంగాణ ఉద్యమం. భాషా ప్రాతిపదికగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటికి తెలంగాణా వాదులు మాకు ప్రత్యేక తెలంగాణ కావాలని ఉద్యమం చేస్తున్నారు.

2) భౌగోళికంగా రాష్ట్రాలను విభజించినట్లయితే భాషాపరంగా వచ్చే సమస్యలు వచ్చేవి కావు. భౌగోళికంగా విభజించినప్పుడు ఆ ప్రాంతంలో వివిధ కులాలు, వివిధ మతాలు, వివిధ భాషలు మాట్లాడే ప్రజలుంటారు. కావున ప్రత్యేకంగా ఒక అంశం ఆధారంగా ఉద్యమాలు జరగకపోవచ్చు.

కావున నా అభిప్రాయం ప్రకారం రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ భాషాపరంగా, కులాల, మతాల ప్రాతిపదికగా కాకుంటే, భౌగోళికంగా జరిగివుంటే బాగుండేది.

ప్రశ్న 7.
ఇందిరాగాంధి తీసుకున్న ఏ చర్యలను ‘వామపక్ష పంథా వైపు మళ్లించటం’గా పేర్కొన్నారు? అందుకు ముందు దశాబ్దాల విధానాలతో పోలిస్తే ఇవి ఏ విధంగా భిన్నమైనవి? ఆర్థికశాస్త్ర అధ్యాయాల ఆధారంగా ప్రస్తుత విధానాలకూ, వాటికీ తేడా ఏమిటో పేర్కొనండి. (AS1)
జవాబు:
1971లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ రికార్డు స్థాయిలో విజయం సాధించింది. “గరీబీ హటావో” అన్న జనాకర్శక నినాదంతో ఇందిరాగాంధీకి ప్రజాదరణ మరింత పెరిగింది. ప్రతిపక్షం అన్నది లేకుండా పోయింది. కాని ఇందిరాగాంధీ చేపట్టిన కొన్ని చర్యల మూలంగా వామపక్ష పంథావైపు మళ్లించటమనేది జరిగింది.

  1. 1973లో అరబ్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధంలో చమురు ధరలు ఎన్నడూ లేనంతగా పెరగటంతో ప్రభుత్వంపై ఒత్తిడి తీవ్రంగా పెరిగింది.
  2. ద్రవ్యోల్బణం, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, ఆహార కొరత, నిరుద్యోగం వంటివి ప్రభావం చూపసాగాయి.
  3. సామాజిక, ఆర్ధికమార్పు సాధించాలన్న లక్ష్యంతో అనేక ప్రైవేటు బ్యాంకులను జాతీయం చేస్తూ, చేసిన చట్టం, రాజ భరణాలను రద్దు చేస్తూ చేసిన చట్టాల విషయంలో, సామాజిక, ఆర్ధిక మార్పు అన్న పేరుతో రాజ్యాంగాన్ని తరచు సవరిస్తున్నారని, అది వాస్తవానికి దాని స్వరూపాన్ని మార్చివేస్తుందని, భిన్న వ్యవస్థాగత నిర్మాణాల మధ్య ప్రస్తుతం ఉన్న సమతౌల్యం దెబ్బతింటోందని సుప్రీంకోర్టు చారిత్రక తీర్పును ఇచ్చింది. దీని మూలంగా రాజ్యాంగ సవరణకు ప్రభుత్వానికి ఉన్న అధికారాలకు కొంతవరకు పరిమితులు విధింపబడ్డాయి.
  4. ప్రజలలో అధికశాతం సంతోషంగా లేరు. దీంతో ప్రతిపక్షాలకు అవకాశం దొరికింది. దేశ వివిధ ప్రాంతాలలోని అసంతృప్తిని ఆసరా చేసుకోసాగారు. జయప్రకాశ్ నారాయణ్ నేతృత్వంలో ఐక్యమైన ప్రతిపక్షాలు దేశంలోని పలు ప్రాంతాలలో కాంగ్రెస్ కి ప్రత్యేకించి ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా ఉద్యమించాయి.

1971 సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ రికార్డుస్థాయిలో విజయం సాధించింది. ఇందిరాగాంధీకి ప్రజాదరణ పెరిగింది. పేదలు, అట్టడుగు ప్రజలతో తాను, తమ పార్టీ మమేకం కావటం ద్వారా పార్టీకి కొత్త సామాజిక మద్దతులను కూడగట్టటానికి ఆమె ప్రయత్నించింది. 1971 ఎన్నికలలో అధికారంలోకి వచ్చిన తరువాత ఇందిరాగాంధీ అటు పార్టీలోనూ, ఇటు ప్రభుత్వంలోనూ అంచెలంచెలుగా అధికార కేంద్రీకరణ గావించింది. ఇది వామపక్షాల ఆవిర్భావానికి కారణమైంది.

AP Board 10th Class Social Solutions Chapter 18 స్వతంత్ర భారతదేశం (మొదటి ముప్ఫై సంవత్సరాలు-1947-1977)

ప్రశ్న 8.
భారత ప్రజాస్వామ్యాన్ని అత్యవసర పరిస్థితి ఏ విధంగా వెనక్కి తీసుకుపోయింది? (AS1)
జవాబు:
అత్యవసర పరిస్థితిలో శాంతిని కాపాడే పేరుతో పౌరహక్కులకు భంగం కలిగేలా ప్రభుత్వం అనేక తీవ్రమైన చట్టాలను చేసింది.

  1. దేశంలో శాంతి, భద్రతలకు అవసరమంటూ ప్రభుత్వం అనేక అణిచివేత చర్యలకు పాల్పడింది.
  2. అనేక ప్రాథమిక హక్కులను నిలిపివేశారు.
  3. ఏ కారణం లేకుండా అరెస్టు చెయ్యటం, హింసించటం, పౌర హక్కులకు భంగం కలిగించటం వంటి అనేక ఘటనలు చోటు చేసుకున్నాయి.
  4. అత్యవసర పరిస్థితి కాలంలో ధరల నియంత్రణ, నల్లబజారు, వెట్టిచాకిరీలకు వ్యతిరేకంగా సాగే ఉద్యమాలను ప్రజలు స్వాగతించారు.
  5. ఈ కాలంలో చేపట్టిన మురికివాడల తొలగింపు, జనాభా నియంత్రణ పేరుతో బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించటం వంటి కార్యక్రమాలు ప్రజల కోపానికి కారణమయ్యాయి. అయితే పౌరహక్కులు లేనందు వల్ల ప్రజలు తమ అసంతృప్తిని వెల్లడి చేసే మార్గాలు లేకపోయాయి. దాంతో దిద్దుబాటు చర్యలు చేపట్టే అవకాశం ప్రభుత్వానికి లేకుండా పోయింది.

శాంతి, భద్రతలు నెలకొల్పటానికి, దేశ సమగ్రతను కాపాడటానికి అత్యవసర పరిస్థితి అవసరమయ్యిందని ప్రభుత్వం సమర్థించుకుంది.

ప్రశ్న 9.
అత్యవసర పరిస్థితి కాలంలో ఏ విధమైన వ్యవస్థాగత మార్పులు వచ్చాయి? (AS1)
జవాబు:
అత్యవసర పరిస్థితి కాలంలో కొన్ని వ్యవస్థాగత మార్పులు జరిగినాయి. అవి :

1) రాజ్యాంగానికి 42 వ సవరణ జరిగింది. ఈ సవరణ అనేక మార్పులను తీసుకువచ్చింది. ఈ సవరణలోని అంశాలు:
ఎ) ఎన్నికల వివాదాలలో న్యాయస్థానాలకు చోటు లేకుండా చెయ్యటం.
బి) రాష్ట్ర ప్రభుత్వాలతో పోలిస్తే కేంద్ర ప్రభుత్వాన్ని బలపరచటం.
సి) సామాజిక, ఆర్థిక మార్పునకు ఉద్దేశించిన చట్టాలకు న్యాయస్థానాల నుంచి సాధ్యమైనంత రక్షణను కల్పించటం.
డి) న్యాయవ్యవస్థ పార్లమెంటుకు లోబడి ఉండేలా చేయటం.

2) ఈ 42 వ సవరణతో “లౌకిక, సామ్యవాద” అనే పదాలను రాజ్యాంగ ప్రవేశికలో చేర్చడం జరిగింది. తద్వారా భారతదేశం మత ప్రమేయం లేని దేశమని, సామ్యవాద దేశమని ప్రకటించడం జరిగింది.

3) ఈ సవరణ ఉద్దేశాలుగా దేశ సమైక్యతను బలపరచటం, సామాజిక, ఆర్థిక అభివృద్ధిని న్యాయస్థానాల నుంచి కాపాడటం వంటి వాటిని పేర్కొన్నప్పటికీ వాస్తవంలో దీని వల్ల దేశ ప్రజాస్వామ్య స్వభావం బలహీనపడిందని చెప్పవచ్చు.

10th Class Social Studies 18th Lesson స్వతంత్ర భారతదేశం (మొదటి ముప్ఫై సంవత్సరాలు-1947-1977) InText Questions and Answers

10th Class Social Textbook Page No.249

ప్రశ్న 1.
ప్రజలందరికీ ఓటు హక్కు లేకపోతే మనది ప్రజాస్వామిక దేశమని చెప్పుకోటానికి వీలు ఉండేదా?
జవాబు:
ప్రజలందరికీ ఓటు హక్కు లేకపోతే మనది ప్రజాస్వామిక దేశమని చెప్పడానికి వీలు లేదు. ఎందుకంటే ప్రజాస్వామ్యానికి మూలం ఎన్నికలు, అందరికీ ఓటు హక్కు ఉండడం. కావున ఓటు హక్కు లేకపోతే మనది ప్రజాస్వామ్యమని చెప్పలేము.

AP Board 10th Class Social Solutions Chapter 18 స్వతంత్ర భారతదేశం (మొదటి ముప్ఫై సంవత్సరాలు-1947-1977)

10th Class Social Textbook Page No.253

ప్రశ్న 2.
భారతదేశంలో ప్రస్తుతం ఎన్ని రాష్ట్రాలు, ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి?
జవాబు:
భారతదేశంలో ప్రస్తుతం 29 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలున్నాయి.

10th Class Social Textbook Page No.253

ప్రశ్న 3.
మీరు గ్రామీణ ప్రాంతంలో నివసిస్తున్నట్లయితే 1970 లకి ముందు సహకార సంఘాల వంటి సంస్థలను స్థాపించారేమో తెలుసుకోండి. దాంట్లో సభ్యులుగా ఎవరు ఉన్నారో తెలుసుకోండి.
జవాబు:
మా గ్రామంలో 1970కి ముందు “వ్యవసాయ సహకార సమితి” ఉంది. అందులో సభ్యులుగా గ్రామంలో ఉన్నత కుటుంబాలకు చెందినవారు ఉండేవారని మా తాత గారిని అడిగి తెలుసుకున్నాను.

10th Class Social Textbook Page No.256

ప్రశ్న 4.
జాతీయభాష అవసరం ఉందా?
జవాబు:
అవును. జాతీయ భాష అవసరం ఉంది.

10th Class Social Textbook Page No.256

ప్రశ్న 5.
అన్ని భాషలకు సమాన హోదా ఉండాలా?
జవాబు:
అవును. అన్ని భాషలకూ సమాన హోదా ఉండాలి.

10th Class Social Textbook Page No.248

ప్రశ్న 6.
సామాజిక సమానత్వాన్ని సాధించామని మీరు అనుకుంటున్నారా? సామాజిక సమానత్వాన్ని, అసమానత్వాన్ని సూచించే మీకు ఎదురైన ఉదాహరణలను పేర్కొనండి.
జవాబు:

  1. కుల, మత, వర్గ, స్త్రీ పురుష, ధనిక, పేద వంటి తారతమ్యాలు లేకుండా అందరికి సమాన న్యాయం, స్వాతంత్ర్యం స్వేచ్ఛలను రాజ్యాంగం కల్పించింది. ఇది సమసమాజాన్ని చూపిస్తుంది.
  2. ప్రభుత్వ అవకాశాలలో కుల, మత, స్త్రీ, పురుష, ధనిక, పేద భేదాలు చూపకుండా అందరికి సమాన అవకాశాలున్నాయి. స్త్రీ, పురుష ఉద్యోగులకు ప్రభుత్వం సమాన వేతనాలు చెల్లిస్తుంది. ఎటువంటి విచక్షణ చూపదు. ఇది సమానత్వాన్ని సూచిస్తుంది.
  3. అయినప్పటికీ కూడా ఇంకా కుల వ్యవస్థకు సంబంధించి గ్రామాలలో వివక్ష ఎక్కువగా కనిపిస్తుంది. లింగ వివక్ష కూడా కొనసాగుతున్నది. ఇది అసమానత్వాన్ని సూచిస్తుంది.

10th Class Social Textbook Page No.249

ప్రశ్న 7.
ఎన్నికలను, ప్రత్యేకించి ప్రజలు తమ ఓటుహక్కును వినియోగించుకోవటాన్ని నిరక్షరాస్యత ఎలా ప్రభావితం చేస్తుంది? ఈ సమస్యను ఎలా పరిష్కరించవచ్చు?
జవాబు:

  1. పాశ్చాత్య దేశాలలో ప్రజలు ఓటుహక్కును దశలవారీగా పొందారు. మన దేశంలో 1935 లో కేవలం 10% ప్రజలకే “ఓటు హక్కు ఉండేది. అయితే స్వాతంత్ర్యం తరువాత భారతదేశం ప్రజాస్వామ్య దేశం కాబట్టి వయోజనులందరికీ ఓటు హక్కును కల్పించడం జరిగింది.
  2. కానీ నిరక్షరాస్యత మూలంగా మొదటి సాధారణ ఎన్నికలు ప్రభుత్వానికి సవాలుగా పరిణమించాయి.
  3. నిరక్షరాస్యత సమస్యను అధిగమించడానికి ఎన్నికల సంఘం రాజకీయపార్టీ అభ్యర్థులను సూచించేలా రోజువారీ జీవితం నుండి కొన్ని గుర్తులను ఉపయోగించుట జరిగింది. ప్రజలు తమకు నచ్చిన గుర్తు ఉన్న డబ్బాలో తమ ఓటును వేశారు. ఈ రకంగా ఎన్నికల సంఘం నిరక్షరాస్యతను అధిగమించింది.

10th Class Social Textbook Page No.253

ప్రశ్న 8.
భాషాప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడి ఉండకపోతే దేశ ఐక్యతకు మరింత మేలు జరిగి ఉండేదా?
జవాబు:
అవును, భాషాప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడకపోతే ఆయా ప్రాంతాలలో అనేక భాషలు మాట్లాడేవారు, అనేక కులాలు, మతాల ప్రజలు ఉండేవారు. అందరూ కలసిమెలసి జీవించటం మూలంగా వారిలో ఐకమత్యం కలిగేది. తమకు ప్రత్యేక ప్రాంతం కావాలని, ప్రత్యేక రాష్ట్రం కావాలని, ప్రత్యేక దేశం కావాలని పోరాటాలు, ఉద్యమాలు జరిగేవి కాదు. తద్వారా దేశ ఐక్యతకు మేలు జరిగేదని నా అభిప్రాయం.

AP Board 10th Class Social Solutions Chapter 18 స్వతంత్ర భారతదేశం (మొదటి ముప్ఫై సంవత్సరాలు-1947-1977)

10th Class Social Textbook Page No.253

ప్రశ్న 9.
ఆ సమయంలో గిరిజన భాషలను ఎందుకు పట్టించుకోలేదు?
జవాబు:

  1. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ అనేది అనేక భాషోద్యమాల ఫలితంగా జరిగింది. కావున భాషాప్రాతిపదిక రాష్ట్రాలు ఏర్పడ్డాయి.
  2. గోండి, సంథాలి లేదా ఒరావన్ వంటి భాషలను గిరిజన ప్రజలు మాట్లాడతారు. సమాజంలో అట్టడుగు స్థానంలో ఉన్న గిరిజనుల భాషను పరిగణనలోకి తీసుకోవలసిన అవసరం లేదనుకొని ఉంటారు.
  3. సమాజంలో శక్తిమంత ప్రజానీకం మాట్లాడే తమిళం, తెలుగువంటి భాషలను పరిగణనలోకి తీసుకున్నారు.

10th Class Social Textbook Page No.253

ప్రశ్న 10.
భారతదేశంలో ఇటీవల ఏర్పడిన కొత్త రాష్ట్రాలు ఏవి, అవి ఎప్పుడు ఏర్పడ్డాయి?
జవాబు:
ఈ మధ్య కాలంలో భారతదేశంలో నాలుగు రాష్ట్రాలు ఏర్పడ్డాయి. అవి –

  1. ఛత్తీస్ గఢ్ : ఇది 01-11-2000 న రాష్ట్రంగా ఏర్పడింది.
  2. ఉత్తరాంచల్ : ఇది 09-11-2000 న రాష్ట్రంగా ఏర్పడింది. (ఇది ప్రస్తుతం ఉత్తరాఖండ్ గా వ్యవహరించబడుతోంది.)
  3. జార్ఖండ్ : ఇది 15-11-2000 న రాష్ట్రంగా ఏర్పడింది.
  4. తెలంగాణ : ఇది 02-6-2014 న 29వ రాష్ట్రంగా ఏర్పడింది.

10th Class Social Textbook Page No.256

ప్రశ్న 11.
భాషా విధానం జాతి ఐక్యత, సమగ్రతలకు ఎలా దోహదపడింది?
జవాబు:
భారతదేశం విశాలమైనది. ఇక్కడ వివిధ జాతులు, వివిధ మతాలు, వివిధ కులాలు, వివిధ భాషలు మాట్లాడే ప్రజలున్నారు. ఆ కావున వారందరికి, స్వంత సంస్కృతి, స్వంత భాష ఉండడం మూలంగా, తాము ప్రత్యేక జాతి అనే భావన రావచ్చు. కానీ జాతీయ భాష ఉన్నట్లయితే దేశంలో ఉండే ప్రజలందరికి ఆ భాష వర్తిస్తుంది. కాబట్టి తామంతా ఒకటే అని, ఒకే జాతి అనే భావన కలిగి దేశ సమగ్రతకు, ఐక్యతకు దోహదపడుతుంది.

10th Class Social Textbook Page No.249

ప్రశ్న 12.
మహిళలలో అక్షరాస్యత తక్కువగా ఉన్న నేపథ్యంలో వాళ్లకు ఓటు హక్కు కల్పించకుండా ఉంటే అది మన విధానాలను – ఎలా ప్రభావితం చేసి ఉండేది?
జవాబు:
మహిళలకు ఓటు హక్కు కల్పించకుండా ఉంటే అది మన విధానాలను చాలా ప్రభావితం చేసి ఉండేది.

అవి :

  1. స్త్రీ, పురుష వివక్ష చూపించినట్లు కనిపించేది. అప్పుడు రాజ్యాంగ మౌలిక సూత్రమైన సమానత్వానికి అర్థంలేదని అన్పించేది.
  2. అందరికీ ఓటు హక్కు లేకపోతే ప్రజాస్వామ్యానికి అర్థం లేదు. మనది ప్రజాస్వామ్యమని చెప్పలేము.
  3. స్త్రీలకు ఓటు లేకపోతే వారికి ‘రాజకీయ హక్కు లేనట్లే’ ఇది ప్రాథమిక హక్కులకు భంగం కలగడమే. మన దేశ పౌరులందరికి, వారి సర్వతోముఖాభివృద్ధికి ప్రాథమిక హక్కులను కల్పించామని చెప్పుకోవడానికి వీలు లేదు.
  4. సామ్యవాద దేశమని చెప్పుకోవడానికి వీలు లేదు.

10th Class Social Textbook Page No.249

ప్రశ్న 13.
క్రమం తప్పకుండా ఎన్నికలను నిర్వహించటం అన్నది ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పామనటానికి స్పష్టమైన సంకేతం. ఈ వ్యాఖ్యానంతో మీరు ఏకీభవిస్తారా? కారణాలను పేర్కొనండి.
జవాబు:
అవును. ఏకీభవిస్తాను. అందుకు కారణాలు :

  1. మన దేశంలో ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి సాధారణ ఎన్నికలు నిర్వహిస్తున్నాం. ప్రజాప్రతినిధులు ఎవరైనా రాజీనామా చేసినా లేదా ఇంకే కారణాల వలన అయినా వారి స్థానాలు ఖాళీ అయితే ఆరు నెలల లోపు తిరిగి ఎన్నికలు నిర్వహించి ఆ స్థానాలను భర్తీ చేస్తున్నారు.
  2. భారతదేశంలో జాతి, మత, కుల, వర్గ, స్త్రీ, పురుష, ధనిక, పేద అనే విచక్షణ లేకుండా వయోజనులైన ప్రజలందరికీ ఓటు హక్కు కల్పించారు. కాబట్టి మనది ప్రజాస్వామ్యమే.
  3. ఎన్నికల ద్వారా ఎక్కువ మంది మద్దతు ఉన్న ప్రజాప్రతినిధులచే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాం. కావున మనది

10th Class Social Textbook Page No.251

ప్రశ్న 14.
రాజకీయ వ్యవస్థలో కాంగ్రెసు ఆధిపత్యానికి దోహదం చేసిన కారణాలను క్లుప్తంగా వివరించండి.
జవాబు:

  1. స్వతంత్ర సమర పార్టీ కాంగ్రెస్. స్వతంత్రం తరువాత కూడా కాంగ్రెస్ కు ప్రాధాన్యత కొనసాగింది.
  2. కాంగ్రెస్ లో విభిన్న సిద్ధాంతాలు ఉన్న వ్యక్తులందరూ పనిచేశారు. అందువల్ల కాంగ్రెస్ కు బహుతావాద దృక్పథం ఏర్పడింది.
  3. బహుతావాదం మూలంగా వామపక్షవాదులు, సంప్రదాయవాదులు, మితవాదులు, ప్రతిపక్ష, అధికార పార్టీలు ఉన్నాయి. అందువల్ల అత్యధిక మందిని ఆకర్షించి ఆధిపత్య పార్టీగా కొనసాగింది.
  4. 1952, 1957, 1962 ఎన్నికలలో కాంగ్రెస్ ఘనవిజయం సాధించి, మిగతా పార్టీలను నామమాత్రమైన వాటిగా చేసి, ఏకపార్టీగా నిలిచింది.
  5. మిగతా పార్టీలు కాంగ్రెస్ దరిదాపుల్లోకి కూడా వెళ్ళలేకపోయాయి. మొదటి మూడు సాధారణ ఎన్నికలలో కాంగ్రెస్ కు 45% ఓట్లు రాగా, ప్రతిపక్షాలకు 11% ఓట్లు మాత్రమే వచ్చాయి. దాంతో కాంగ్రెస్ కు ఎదురులేకుండా పోయింది.

AP Board 10th Class Social Solutions Chapter 18 స్వతంత్ర భారతదేశం (మొదటి ముప్ఫై సంవత్సరాలు-1947-1977)

10th Class Social Textbook Page No.254

ప్రశ్న 15.
తొలి దశాబ్దాల నాటి వయోజన విద్యాతరగతులకు సంబంధించిన ఫోటో. ఈ పథకాలతో సమాజంలో అభివృద్ధి లేదా మార్పులకు సంబంధించిన భావాలు ఎలా వ్యక్తం అవుతున్నాయో చర్చించండి.
AP Board 10th Class Social Solutions Chapter 18 స్వతంత్ర భారతదేశం (మొదటి ముప్ఫై సంవత్సరాలు-1947-1977) 1
జవాబు:

  1. నిరక్షరాస్యత యొక్క సమస్యను ఎదుర్కొనుటకు ఆ రోజుల్లోనే ప్రభుత్వం వయోజన విద్యా తరగతులను నిర్వహించేదని తెలుస్తుంది.
  2. మొదటి సార్వత్రిక ఎన్నికలలో నిరక్షరాస్యత మూలంగా ఎదుర్కొన్న సమస్యలు మళ్ళీ ఎదుర్కోకూడదని, తాము చదువు నేర్చుకోవాలి అనే పట్టుదల వారిలో కనిపిస్తుంది.
  3. నిరక్షరాస్యత మూలంగా తాము ఎదుర్కొంటున్న సమస్యలు తమ పిల్లలు ఎదుర్కోకూడదని తమ పిల్లలకు చదువు నేర్పిస్తున్నట్లు తెలుస్తుంది.

10th Class Social Textbook Page No.255

ప్రశ్న 16.
భారతదేశంలో చేపట్టిన భూసంస్కరణలను చైనాలోనూ, వియత్నాంలోనూ చేపట్టిన వాటితో పోల్చండి.
జవాబు:
భారతదేశంలోని భూసంస్కరణలు, వియత్నాంలోని భూసంస్కరణలు ఈ కింది విధంగా ఉన్నాయి.

భారతదేశంలో భూసంస్కరణలువియత్నాంలో భూసంస్కరణలు
1) భూసంస్కరణలకు సంబంధించిన ప్రస్తావన ముందుగా కమ్యూనిస్ట్ పార్టీ ప్రారంభించింది.1) వియత్నాంలో కూడా భూసంస్కరణలను కమ్యూనిస్ట్ పార్టీయే ప్రారంభించింది.
2) భారతదేశంలో భూసంస్కరణలను అమలుచేసి, అంతకు ముందు ఉన్న పాత విధానాలను (జమీందారీ, కౌలు) రద్దు పరచినారు.2) ప్రభుత్వం భూసేకరణ చేసి దానిని పేద రైతులకు పునః పంపిణీ చేసింది.
3) భూసంస్కరణలు భారతదేశం అంతటా అమలు జరిగాయి.3) వియత్నాంలో భూసంస్కరణలు కేవలం ఉత్తరభాగంలో మాత్రమే అమలు జరిగాయి.

AP Board 10th Class Social Solutions Chapter 17 స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణం

SCERT AP 10th Class Social Study Material Pdf 17th Lesson స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణం Textbook Questions and Answers.

AP State Syllabus 10th Class Social Solutions 17th Lesson స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణం

10th Class Social Studies 17th Lesson స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణం Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
విభిన్నంగా ఉన్నదానిని గుర్తించండి. (AS1)
ఎ) స్వాతంత్ర్య పోరాట అనుభవాల నుంచి భారత రాజ్యాంగం ఏర్పడింది.
బి) అప్పటికే ఉన్న రాజ్యాంగాల నుంచి భారత రాజ్యాంగం రూపొందింది.
సి) ముసాయిదా రాజ్యాంగాన్ని ఉన్నది ఉన్నట్టుగా ఆమోదించారు.
డి) దేశాన్ని పాలించటానికి రాజ్యాంగ సూత్రాలను, అంశాలను పేర్కొంది.
జవాబు:
సి) ముసాయిదా రాజ్యాంగాన్ని ఉన్నది ఉన్నట్టుగా ఆమోదించారు.

ప్రశ్న 2.
తప్పు వాక్యాలను సరిదిద్దండి : (AS1)
ఎ) రాజ్యాంగ సభ చర్చలలో కొన్ని అంశాలపై అందరూ ఒకటే భావాన్ని వ్యక్తం చేశారు.
బి) రాజ్యాంగ నిర్మాతలు దేశంలోని కొన్ని ప్రాంతాలకే ప్రాతినిధ్యం వహించారు.
సి) రాజ్యాంగంలోని అధికరణాలను సవరించటానికి అది అవకాశం కల్పించింది.
డి) రాజ్యాంగంలోని మౌలిక అంశాలను కూడా సవరించవచ్చని సుప్రీంకోర్టు చెప్పింది.
జవాబు:
డి) రాజ్యాంగంలోని మౌలిక అంశాలను ఎట్టి స్థితిలో సవరించకూడదని సుప్రీంకోర్టు కేశవానంద భారతి కేసులో తీర్పు చెప్పింది. కావున రాజ్యాంగంలోని మౌలిక అంశాలను ఎట్టి స్థితిలో మార్చకూడదు.

AP Board 10th Class Social Solutions Chapter 17 స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణం

ప్రశ్న 3.
రాజ్యాంగ సభ చర్చల నుంచి భారత ప్రభుత్వ ఏకీకృత, సమాఖ్య సూత్రాలను వివరించండి. (AS1)
జవాబు:
సమాఖ్య సూత్రాలు:

  1. కేంద్ర ప్రభుత్వంతో పాటు ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఉంటాయి.
  2. ఆ రాష్ట్రాలకు సర్వసత్తాక అధికారాలు ఉంటాయి.
  3. రాజ్యాంగం కేంద్ర, రాష్ట్రాల మధ్య అధికార పంపిణీ చేస్తుంది.

ఏకీకృత సూత్రాలు :

  1. కేంద్ర ప్రభుత్వం సర్వసత్తాకమైనది.
  2. రాష్ట్ర ప్రభుత్వాలు ఉండకపోవడం.
  3. ఒకే ప్రభుత్వం ఉంటుంది. కావున అధికార విభజన ఉండదు.

ప్రశ్న 4.
ఆనాటి రాజకీయ ఘటనలను రాజ్యాంగం ఎలా ప్రతిబింబిస్తోంది ? స్వాతంత్ర్య పోరాటానికి సంబంధించి ఇంతకు ముందు అధ్యాయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోండి. (AS1)
జవాబు:
ముందుగా భారతదేశంలో వివిధ రకాల ప్రజలు మెరుగైన సమాజాన్ని కోరుతూ చేసిన పోరాటాలు రాజ్యాంగ నిర్మాణానికి స్పూర్తినిచ్చాయి.

రాజ్యాంగంలో ప్రతిబింబించే వివిధ సంఘటనలు :

  1. దేశంలో అధికభాగం రాచరిక పాలనలో ఉండేది. సామాజిక, సాంస్కృతిక వైవిధ్యతలే కాకుండా ధనిక-పేద మధ్య, అగ్ర-కింది కులాల మధ్య, స్త్రీ-పురుషుల మధ్య చాలా తేడాలున్నాయి. ఈ సమస్యలను అధిగమించడానికి మన రాజ్యాంగంలో అందరికీ కొన్ని ప్రాథమిక హక్కులు ఉంటాయి.
  2. దీని ప్రకారం చట్టం ముందు ప్రజలందరూ సమానులుగా ఉంటారు. లింగ, కుల, మత, జాతి, సంపద భేదం లేకుండా “సార్వజనీన వయోజన ఓటు హక్కు” ద్వారా ఎన్నికలు నిర్వహించడం ద్వారా ప్రభుత్వం ఏర్పడుతుంది.
  3. ఫ్రెంచి విప్లవం ఆదర్శాలైన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వంను, అమెరికాలోని హక్కుల చట్టంను, రష్యా, చైనాలలో సోషలిస్ట్ విప్లవం ప్రకారం పేదరిక నిర్మూలన, అసమానతల తొలగింపు, సమన్యాయం వంటివి మన రాజ్యాంగంలో పొందుపరచడానికి కారణం అయ్యాయి. ఐర్లాండ్ నుండి ఆదేశిక సూత్రాలను పొందుపరుచుకున్నాం.
  4. పాశ్చాత్య ఉదార సంస్థలైన గణతంత్ర, ప్రజాస్వామ్య, ‘లౌకిక, సమాఖ్య, స్వతంత్ర్య న్యాయశాఖల వంటి సంస్థలను, ఎంతోకాలం వీటిని కొనసాగించిన బ్రిటిష్ పాలన మన దేశానికి తీసుకొచ్చింది.
  5. గాంధేయ ,తత్వాలు ఆదేశ సూత్రాల రూపంలో రాజ్యాంగంలో పొందుపరచబడ్డాయి.
  6. భారతదేశం మత ప్రాతిపదికన విభజింపబడినప్పటికి ఇంకా భారతదేశంలో అనేక మతాల ప్రజలు ఉన్నందున భారతదేశంలో “లౌకిక” అనే భావనను 1976లో 42వ సవరణ ద్వారా రాజ్యాంగంలో చేర్చినారు.
  7. భారతదేశంలో అల్పసంఖ్యాక ప్రజల రక్షణ కొరకు ప్రాథమిక హక్కులను రాజ్యాంగంలో పొందుపరచినారు.
  8. రైతులు, భూస్వాములకు వ్యతిరేకంగా వారి హక్కుల కొరకు చేసిన ఉద్యమాల నేపథ్యంగా ‘సామ్యవాదం’ అనే అంశాన్ని 1976లో 42వ సవరణ ద్వారా రాజ్యాంగంలో చేర్చుట జరిగింది.

ప్రశ్న 5.
రాజ్యాంగ సభను సార్వత్రిక వయోజన ఓటు హక్కుతో ఎన్నుకుని ఉంటే రాజ్యాంగాన్ని రూపొందించటంలో అది ఎటువంటి ప్రభావాన్ని చూపించి ఉండేది? (AS1)
జవాబు:

  1. రాజ్యాంగ సభకు రాష్ట్రాలకు, రాజసంస్థానాలకూ జనాభా ప్రాతిపదిక మీద ప్రాతినిధ్యం కల్పించారు. అదే విధంగా అనేక రంగాలలో నిష్ణాతులైన వారు రాజ్యాంగ సభకు ఎన్నికైనారు. అల్పసంఖ్యాక వర్గాల నుండి షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల నుండి కూడా సభ్యులు రాజ్యాంగ సభకు ఎన్నికైనారు. చైతన్యవంతులైనటువంటి నాయకులు రాజ్యాంగ సభకు ఎన్నికవడం మూలంగా, దేశంలోని ఏ వర్గ ప్రజలకు అన్యాయం జరగకుండా దేశ ప్రజలందరిని పరిగణనలోకి తీసుకొని ప్రజల అభివృద్ధిని కాంక్షిస్తూ రాజ్యాంగాన్ని రూపొందించారు.
  2. రాజ్యాంగ సభకు, వయోజన ఓటుహక్కు ద్వారా సభ్యులను ఎన్నుకున్నట్లయితే నిష్ణాతులైన, చైతన్యవంతులైన వారు ఎన్నిక కాకపోవచ్చు. తద్వారా అందరి ప్రయోజనాలకు అనుగుణమైన రాజ్యాంగం తయారై ఉండేది కాదు.
  3. వయోజన ఓటు హక్కు ద్వారా అన్ని వర్గాల నుండి, అన్ని ప్రాంతాల నుండి మరియు వయోజనులందరు ఎన్నికలో పాల్గొనే అవకాశం వచ్చేది.

AP Board 10th Class Social Solutions Chapter 17 స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణం

ప్రశ్న 6.
భారత రాజ్యాంగంలోని మౌలిక సూత్రాల గురించి చిన్న వ్యాసం రాయంది. (AS1)
జవాబు:
భారత రాజ్యాంగంలోని మౌలిక సూత్రాలు :
1) సార్వభౌమత్వం :
భారతదేశం అంతర్గతంగా, బాహ్యంగా స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలను కలిగి ఉన్నదని తెల్పుతున్నది.

2) సామ్యవాదం :
రాజ్యం క్రమేణా అవసరం అయిన మార్పులను తెచ్చి సమసమాజాన్ని స్థాపించడం అని అర్థం. ఈ సామ్యవాదం అనే పదంను 42వ సవరణ ద్వారా రాజ్యాంగంలో చేర్చారు.

3) పార్లమెంటరీ, ప్రజాస్వామ్య విధానం :
శాసన, కార్యనిర్వాహక శాఖల అధికారాల సమన్వయంపై ఆధారపడి ప్రభుత్వం ఉంటే అది “పార్లమెంటరీ విధాన”మని అంటాం. ప్రజలచేత, ప్రజల కోసం నడిచే ప్రభుత్వమే ప్రజాస్వామ్యం.

4) సమాఖ్య విధానం :
ప్రభుత్వాధికారాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య రాజ్యాంగబద్ధంగా పంపిణీ అయి ఉన్న ప్రభుత్వ విధానమే సమాఖ్య ప్రభుత్వం.

5) న్యాయం :
భారత రాజ్యాంగంలోని ఈ న్యాయం అనేది పౌరులకు రాజకీయ న్యాయం, ఆర్ధిక న్యాయం, సాంఘిక న్యాయం వంటి న్యాయాలను అందచేస్తుంది.

6) స్వేచ్ఛ, స్వాతంత్ర్యం :
ప్రతి వ్యక్తికి ఆలోచనా స్వేచ్ఛ, భావప్రకటన స్వేచ్ఛ, విశ్వాసం, మత స్వేచ్ఛ, ధర్మం మొదలైన స్వేచ్ఛలను రాజ్యాంగం కల్పిస్తుంది.

7) సమానత్వం :
అసమానత్వాన్ని రూపుమాపకుండా వ్యక్తుల హక్కులకు హామీ ఇవ్వడం నిరర్ధకం. ప్రతి వ్యక్తి తన్ను తాను పూర్తిగా అభివృద్ధి చేసుకొనుటకు సమానహోదా, అవకాశాలు కల్పించడం జరిగింది.

8) సంక్షేమ రాజ్యం :
ఆధునిక రాజ్యాలన్నీ సంక్షేమ రాజ్యాలే. ప్రజల సంక్షేమానికి అవసరమైన చట్టాలను చేయడానికి రాజ్యాంగం అవకాశం కల్పిస్తుంది.

ప్రశ్న 7.
దేశంలోని రాజకీయ వ్యవస్థలను రాజ్యాంగం ఎలా నిర్వచించింది, వాటిని ఎలా మార్చింది? (AS1)
జవాబు:
రాజకీయ వ్యవస్థలకు సంబంధించి ఇతర దేశాల అనుభవాలను తీసుకొని, వాటిని మనదేశ పరిపాలనకు అనుగుణంగా మార్చుకొనుట జరిగింది. అవి :

1) పార్లమెంటరీ వ్యవస్థ :
ఈ పార్లమెంటరీ విధానాన్ని మనం బ్రిటిష్ పరిపాలన నుండి నేర్చుకున్నాం. దాదాపు 200 సంవత్సరాలు వారిచే పరిపాలించబడుట వలన ఆ విధానం మనదేశానికి అనుకూలంగా ఉంటుందని రాజ్యాంగం భావించి, పార్లమెంటరీ విధానాన్ని మన రాజ్యాంగంలో పొందుపరుచుకున్నాం.

2) సమాఖ్య విధానం :
సమాఖ్య విధానం ప్రకారం అధికారాల విభజన అనేది మనం ‘కెనడా’ దేశం నుండి తీసుకున్నప్పటికీ, ఈ ‘అధికారాల విభజనకు మూలం అనేది “1935 భారత ప్రభుత్వ చట్టం” లోనే ఉంది. సమాఖ్య విధానం ప్రకారం కేంద్ర, రాష్ట్రాల మధ్య అధికారాల విభజన జరిగింది. ఈ రెండు కూడా వాటి పరిధిలో సర్వసత్తాకమైనవి. అయినప్పటికి భారత రాజ్యాంగం, ఈ సమాఖ్య విధానంలో కేంద్రాన్ని బలమైన సంస్థగా మార్చింది.

3) సమాఖ్య అధిపతిగా అధ్యక్షుడు ఉంటాడు. ఈ అధ్యక్ష విధానం, అమెరికా అధ్యక్ష విధానానికి వేరుగా ఉంటుంది. ” అమెరికా అధ్యక్షుడు వాస్తవాధికారి, కాని భారత అధ్యక్షుడు ఇంగ్లాండు రాజువలె నామమాత్ర అధ్యక్షుడు. వాస్తవాధికారిగా ప్రధానమంత్రి, అతని ఆధ్వర్యంలో ఇతర మంత్రులు ఉంటారు.

4) అధికారాల విభజనలో కెనడా రాజ్యాంగాన్ని మూలంగా తీసుకొని, మన దేశానికి అనుకూలంగా మార్చుకున్నాం. ఏ విధంగా అంటే కేంద్ర, రాష్ట్రాల మధ్య అధికారాల విభజన జరిగాక మిగిలిన “అవశేషాధికారాలను” రాజ్యాంగం కేంద్రానికే కట్టబెట్టి బలమైన కేంద్రంగా తయారవడానికి ప్రయత్నించింది.

5) అమెరికాలో వలె మనదేశంలో ద్వంద్వ పౌరసత్వం లేదు. భారతదేశంలో ఎక్కడ పుట్టినా, దేశ పౌరసత్వం లభిస్తుంది.

6) అమెరికాలో ద్వంద్వ న్యాయవ్యవస్థలున్నాయి. కాని మన సమాఖ్యలో ఏకీకృత న్యాయవ్యవస్థ మాత్రమే ఉంది.

ఈ విధంగా మన రాజ్యాంగం రాజకీయ వ్యవస్థలను నిర్వచించి, మన దేశానికి అనుగుణంగా వాటిని మార్చిందని చెప్పవచ్చు.

AP Board 10th Class Social Solutions Chapter 17 స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణం

ప్రశ్న 8.
రాజ్యాంగంలో, మౌలిక సూత్రాలు ఉంటాయి. అయితే ప్రజలు వ్యవస్థతో తలపడినప్పుడే సామాజిక మార్పు వస్తుంది. ఈ . వ్యాఖ్యతో మీరు ఏకీభవిస్తారా? మీ కారణాలను పేర్కొనండి. (AS1)
జవాబు:
ఏ దేశ రాజ్యాంగంలో అయిన కొన్ని మౌలిక సూత్రాలు ఉంటాయి. అయితే ప్రజలు వ్యవస్థతో తలపడినప్పుడే సామాజిక మార్పు వస్తుందనే వ్యాఖ్యతో నేను ఏకీభవిస్తాను.

కారణాలు:
1) భారతదేశం మత ప్రాతిపదికన 1947లో భారత్, పాలుగా విడిపోయింది. అయితే భారతదేశంలో వివిధ మతాల ప్రజలు ఉన్నారు. ముస్లిం దేశంగా పాకిస్థాన్ విడిపోయినప్పటికి ఇంకా ముస్లిం జనాభా భారత్ లో అధికంగానే ఉంది. యూరోపియన్లు పరిపాలించుట మూలంగా క్రైస్తవమతం, సిక్కులు, పార్శీలు అత్యధిక సంఖ్యలో హిందువులు ఉన్నారు. మత ఘర్షణల మూలంగా వస్తున్న ధన, ప్రాణ నష్టాలను అధిగమించడానికి “లౌకిక” వాదంను మన రాజ్యాంగంలోని ప్రవేశికలో చేర్చినాము. దీని మూలంగా భారతదేశం మత ప్రమేయం లేని దేశం అయింది.

2) షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ మతాలు, బడుగు, బలహీనవర్గాలు అనాదిగా ఎదుర్కొంటున్న అన్యాయాలను ఎదుర్కొనుటకు చేసిన పోరాటాల ఫలితంగా “సామ్యవాదం” ను 1976 లో రాజ్యాంగంలోని ప్రవేశికలో చేర్చినాము. అయినప్పటికి రాజ్యాంగ మౌలిక సూత్రాలకు భంగం కలగదు. సంక్షేమ రాజ్యమే ఆధునిక దేశాల లక్ష్యం. కాబట్టి సామ్యవాదాన్ని మన రాజ్యాంగంలో చేర్చుకొనుట జరిగింది.

3) తరతరాలుగా షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ మతాల ప్రజలు ఎదుర్కొంటున్న అన్యాయాలను పరిష్కరించటానికి వారికి రాజ్యాంగంలో రిజర్వేషన్లు కల్పించుట జరిగింది. ప్రాథమిక హక్కులను అందరూ పొందే విధంగా న్యాయస్థానాల ద్వారా రక్షణ కల్పించినారు.

4) ‘అంటరానితనం’ కు ప్రజలు బలికాకూడదని, అంటరానితనం నేరమని రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులలో 17వ ప్రకరణలో దానిని చేర్చినారు. ప్రాథమిక హక్కులలో చేర్చుట మూలంగా అంటరానితనం కొంతవరకు కనుమరుగైందని చెప్పవచ్చు.

5) భారత రాజ్యాంగం కల్పించిన అన్ని ప్రాథమిక హక్కులలో ఎక్కువ వివాదాస్పదమైనది ఆస్తి హక్కు. ఆస్తి హక్కును కొనసాగిస్తే సమానత్వాన్ని సాధించడం అసాధ్యమవుతుందని, దానిని తొలగించాలని సామ్యవాదులు భావించారు. ఆస్తి హక్కును పూర్తిగా తొలగించాలని కమ్యూనిస్టులు భావించారు. నిజమైన సామ్యవాద వ్యవస్థను స్థాపించడంలో ఆస్తి హక్కు అడ్డంకి కాకూడదని 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల నుండి తొలగించి చట్టబద్ధమైన హక్కుగా చేయుట జరిగింది.

10th Class Social Studies 17th Lesson స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణం InText Questions and Answers

10th Class Social Textbook Page No.232

ప్రశ్న 1.
భారత రాజ్యాంగానికి …………………………. ……… ప్రధానంగా దోహదం చేశారు.
జవాబు:
డా॥ బి.ఆర్. అంబేద్కర్, డా॥ బాబు రాజేంద్రప్రసాద్, మోతిలాల్ నెహ్రూ, బి.ఎన్.రావు.

10th Class Social Textbook Page No.233

ప్రశ్న 2.
లింగం అన్న పదాన్ని ఏ దేశ రాజ్యాంగ ప్రవేశిక పేర్కొంది?
జవాబు:
“లింగం” అన్న పదాన్ని “నేపాల్” దేశ రాజ్యాంగ ప్రవేశిక పేర్కొంది.

10th Class Social Textbook Page No.233

ప్రశ్న 3.
శాంతి కాముకతను ఏ దేశ రాజ్యాంగ ప్రవేశిక కనబరిచింది?
జవాబు:
జపాన్ “శాంతి కాముకత”ను ఆ దేశ రాజ్యాంగ ప్రవేశికలో కనబరిచింది.

AP Board 10th Class Social Solutions Chapter 17 స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణం

10th Class Social Textbook Page No.237

ప్రశ్న 4.
దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత సుమారు ………… రోజులకు ముసాయిదా సంఘాన్ని ఏర్పాటు చేశారు.
జవాబు:
14 (ఆగస్టు 29, 1947)

10th Class Social Textbook Page No.237

ప్రశ్న 5.
రాజ్యాంగ సభ ముందుగా …………………., ……….. …………………., …………………. వంటి ముఖ్యాంశాలపై ప్రత్యేక సంఘాలను నియమించింది.
జవాబు:

  1. యూనియన్ రాజ్యాంగ కమిటీ,
  2. కేంద్ర అధికారాల సంఘం,
  3. స్టీరింగ్ కమిటీ,
  4. రాష్ట్రాల రాజ్యాంగ సంఘం,
  5. ప్రాథమిక హక్కుల సంఘం.

10th Class Social Textbook Page No.237

ప్రశ్న 6.
ఈ కమిటీల నివేదికలను డా॥ అంబేద్కర్ అధ్యక్షతన ఉన్న …………………… చర్చించి, కీలకమైన నిర్ణయాలను తీసుకుంది.
జవాబు:
ముసాయిదా సంఘం

10th Class Social Textbook Page No.237

ప్రశ్న 7.
డా॥ అంబేద్కర్ అధ్యక్షతన …… కమిటీ తీసుకున్న నిర్ణయాలను ముసాయిదా రాజ్యాంగంలో చేర్చడం జరిగింది.
జవాబు:
డ్రాఫ్టింగ్,

AP Board 10th Class Social Solutions Chapter 17 స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణం

10th Class Social Textbook Page No.237

ప్రశ్న 8.
బ్రిటిష్ ప్రభుత్వం చేసిన …………….. అంశాలను కూడా ముసాయిదా తీసుకుంది.
జవాబు:
1935 భారత ప్రభుత్వ చట్టంలోని

10th Class Social Textbook Page No.237

ప్రశ్న 9.
ఆ తరువాత విమర్శలకు, సూచనలకు దీనిని ……… నెలల పాటు ప్రజల ముందు ఉంచారు.
జవాబు:
8 నెలలు

10th Class Social Textbook Page No.237

ప్రశ్న 10.
ముసాయిదా రాజ్యాంగంలో ……………. అధికరణలు, …………… షెడ్యూళ్లు ఉన్నాయి.
జవాబు:
315, 8

10th Class Social Textbook Page No.238

ప్రశ్న 11.
భారత అధ్యక్షునికి ఇచ్చిన అధికారాలు ……………. కి చెందిన ……………. కంటే …………….. కి చెందిన …………… అధికారాలకు దగ్గరగా ఉన్నాయి.
జవాబు:
అమెరికా, అధ్యక్షుడు, ఇంగ్లాండ్, రాజు

10th Class Social Textbook Page No.238

ప్రశ్న 12.
భారత అధ్యక్షుడు ………….. సలహాలను పాటించేలా రాజ్యాంగ సభ రూపొందించింది.
జవాబు:
తన మంత్రుల

10th Class Social Textbook Page No.239

ప్రశ్న 13.
సమాఖ్య రాజ్యతంత్రంలో ఒకటి కంటే ఎక్కువ ప్రభుత్వాలు ఉంటాయి, భారతదేశ విషయంలో అవి ….. – స్థాయిలలో ఉన్నాయి. మీరు …………. రాష్ట్రానికి, …………. దేశానికి చెందుతారు.
జవాబు:
కేంద్ర ప్రభుత్వం కేంద్రస్థాయిలో, రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, భారత

AP Board 10th Class Social Solutions Chapter 17 స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణం

10th Class Social Textbook Page No.239

ప్రశ్న 14.
ఏ రకమైన రాజ్యాంగం కింద కేంద్ర ప్రభుత్వానికి ఎక్కువ అధికారాలు ఉంటాయి?
జవాబు:
ఏకీకృత రాజ్యాంగం కింద కేంద్ర ప్రభుత్వానికి ఎక్కువ అధికారాలుంటాయి.

10th Class Social Textbook Page No.239

ప్రశ్న 15.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కచ్చితమైన అధికారాలను ఏ రకమైన రాజ్యాంగం ఇస్తుంది?
జవాబు:
సమాఖ్య విధాన రాజ్యాంగం,

10th Class Social Textbook Page No.239

ప్రశ్న 16.
భారతదేశ రాష్ట్రాలు ఏ విధంగా “కేంద్ర ప్రభుత్వ పాలనా అంగాల శాఖలు కావు”?
జవాబు:
భారతదేశంలో రెండు రకాలైన ప్రభుత్వాలు ఉంటాయి. అవి 1) కేంద్ర ప్రభుత్వం 2) రాష్ట్ర ప్రభుత్వం. ఈ రెండింటికి రాజ్యాంగం కేటాయించే రంగాలలో అవి సర్వసత్తాక అధికారాలను కలిగి ఉంటాయి. కావున భారతదేశ రాష్ట్రాలు కేంద్రప్రభుత్వ పాలన అంగాల శాఖలు కావు.

10th Class Social Textbook Page No.242

ప్రశ్న 17.
రాష్ట్రాలు తమ సొంత సివిల్ సర్వెంట్లను (అధికారులను) కలిగి ఉండే అధికారాన్ని భారత రాజ్యాంగం కల్పిస్తుందా?
జవాబు:
కల్పించుట లేదు. అఖిల భారత సివిల్ సర్వెంట్లను కేంద్రప్రభుత్వమే నియమిస్తుంది. రాష్ట్రాలకు ఆ అవకాశం రాజ్యాంగం కల్పించలేదు.

AP Board 10th Class Social Solutions Chapter 17 స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణం

10th Class Social Textbook Page No.242

ప్రశ్న 18.
ఒక రాష్ట్రంలోని అధికారులందరూ రాష్ట్ర సివిల్ సర్వీసెస్ నుండి నియమింపబడిన వాళ్లేనా?
జవాబు:
కాదు. రాష్ట్రంలోని అధికారులందరూ రాష్ట్ర సివిల్ సర్వీసెస్ నుండి నియమింపబడిన వారు కాదు. కొందరిని కేంద్ర ప్రభుత్వం నియామకం చేస్తుంది. అవి అఖిల భారత సర్వీస్ కమిషన్ ద్వారా.

10th Class Social Textbook Page No.232

ప్రశ్న 19.
భారత రాజ్యాంగ ప్రవేశికలో ఏ ఏ మౌలిక ఆదర్శాలు పొందుపరచబడ్డాయి?
జవాబు:
భారత రాజ్యాంగ ప్రవేశికలో ఈ క్రింది మౌలిక ఆదర్నాలు పొందుపరచబడ్డాయి. ఇవి పౌరులందరికి సమానంగా వర్తిస్తాయి.

1) న్యాయం :
“పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని అందించడం.”

2) స్వాతంత్ర్యం :
“ఆలోచన, భావ ప్రకటన, విశ్వాసం, ధర్మం, ఆరాధనలలో స్వాతంత్ర్యాన్ని అందరికి అందించడం.”

3) సమానత్వం :
“అంతస్తుల్లోను, అవకాశాల్లోను సమానత్వాన్ని చేకూర్చటం.”

4) స్వేచ్ఛ :
“పౌరులు స్వేచ్ఛాయుత జీవనం గడుపుటకు, ప్రతి వ్యక్తికి ఆలోచనా స్వేచ్ఛ, భావ ప్రకటన, సంఘాలు, పార్టీలుగా ఏర్పడటం వంటి స్వేచ్ఛలు అందరికీ అందించడం.

5) సౌభ్రాతృత్వం :
“పౌరులందరిలో వ్యక్తి గౌరవాన్ని, జాతీయ సమైక్యతను సంరక్షిస్తూ, సఖ్యత నేర్పరచుటకు సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడం.

10th Class Social Textbook Page No.234

ప్రశ్న 20.
రాజ్యాంగ ప్రవేశికలో ప్రజా ఉద్యమాలు ఎలా ప్రతిబింబించాయి?
జవాబు:
1) నేపాల్ రాజ్యాంగ ప్రవేశికలో, ఇప్పటివరకు ప్రజలు చేపట్టిన ఉద్యమాలు, చారిత్రక పోరాటాల ద్వారా ప్రజాస్వామ్యం, శాంతి, ప్రగతిలకు అనుకూలంగా ప్రజల అభీష్టాన్ని గౌరవిస్తూ వర్గ, జాతిమూలాలు, ప్రాంత, లింగ వంటి సమస్యలను పరిష్కరించి దేశాన్ని ప్రగతిశీలంగా పునః నిర్మించటానికి పూనుకుంటామని ప్రతిజ్ఞ చేశారు.

2) జపాన్ ప్రజా ఉద్యమాల మూలంగా ప్రజలకు శాంతి, సహకారాలు, స్వేచ్ఛ, యుద్ధభూములు లేని దేశాన్ని, సర్వసత్తాక అధికారం ప్రజలలో ఉంటుందని తెలియచేస్తూ రాజ్యాంగాన్ని ప్రకటించారు.

10th Class Social Textbook Page No.234

ప్రశ్న 21.
రాజకీయ వ్యవస్థ స్వరూపానికి సంబంధించి ఏ ఏ వాగ్దానాలు చేశారు?
జవాబు:

  1. భారతదేశంలో వయోజన ఓటుహక్కు ద్వారా రాజకీయ న్యాయం పొందవచ్చు. 18 సం||లు నిండిన ప్రతి పౌరుడు ఆస్తి, విద్య మరియు ఏ ఇతర అర్హతలతో నిమిత్తం లేక రాజ్యవ్యవస్థ నిర్మాణ ప్రక్రియలో పాల్గొనవచ్చు.
  2. నేపాల్ దేశంలో వయోజనులకు ఓటు హక్కు క్రమం తప్పకుండా ఎన్నికలు, రాచరిక పాలన రద్దు వంటి వాగ్దానాలు చేయబడినవి.
  3. రాజకీయ నైతికతకు సంబంధించిన చట్టాలు విశ్వజనీనమైనవి, తమ సర్వసత్తాకతను కొనసాగిస్తూ, ఇతర దేశాలతో సర్వసత్తాక సంబంధాలను సమర్థించుకుంటూ అన్ని దేశాలు ఈ చట్టాలను గౌరవించాలి. ప్రభుత్వ చర్యల ద్వారా ఎన్నడూ యుద్ధభయాలు తిరిగి దేశాన్ని కమ్ముకోవని జపాన్ దేశంలో వాగ్దానాలు చేశారు.

10th Class Social Textbook Page No.239

ప్రశ్న 22.
ఈ దేశాల పౌరులకు ఏ ఏ వాగ్దానాలు చేశారు?
జవాబు:
ఈ దేశాల పౌరులకు ఈ క్రింది వాగ్దానాలు చేశారు :
భారతదేశ పౌరులకు :
ప్రజలందరికి అన్ని రకాలైన న్యాయం, స్వాతంత్ర్యం, స్వేచ్ఛ, సమానత్వాలు, సౌభ్రాతృత్వం మొదలైనవి ప్రజలందరు అనుభవించుటకు వీలుగా “థమిక హక్కులను” కల్పించారు.

నేపాల్ పౌరులకు :
ప్రజలందరికి పౌరస్వేచ్ఛ, ప్రాథమిక హక్కులు, మానవ హక్కులు, వయోజనులకు ఓటుహక్కు, పత్రికా రంగానికి పూర్తి స్వేచ్ఛ, స్వతంత్ర న్యాయవ్యవస్థ వంటి వాగ్దానాలు నేపాల్ వారి పౌరులకు చేసింది.

జపాన్ పౌరులకు :
శాంతియుత సహకార ఫలాలు, యుద్ధభయం రాదని, సర్వసత్తాక అధికారం ప్రజలలో ఉంటుందని జపాన్, వారి పౌరులకు వాగ్దానం చేసింది.

10th Class Social Textbook Page No.236

ప్రశ్న 23.
“భారతదేశ ప్రజలమైన మేము….” అన్న పదాలతో భారతదేశ రాజ్యాంగం మొదలవుతుంది. భారతదేశ ప్రజలందరికి ప్రాతినిధ్యం వహిస్తున్నామని చెప్పుకోవటం సమర్ధనీయమేనా?
జవాబు:
సమర్థనీయమే, ఎందుకనగా “భారత ప్రజలమైన మేము” అనే భావన రాజ్యాంగానికి ప్రజలే ఆధారమని తెల్పును. రాజ్యాంగాన్ని “చర్చించి, శాసనం చేసుకొని, మాకు మేము” సమర్పించుకుంటున్నాము అనే భావన రాజ్యాంగ పరిషత్తు – ప్రజలకు ప్రాతినిధ్యం వహించిందని తెలియచేస్తుంది.

AP Board 10th Class Social Solutions Chapter 17 స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణం

10th Class Social Textbook Page No.236

ప్రశ్న 24.
పాఠశాల మొత్తానికి ఒక రాజ్యాంగాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటే ఎవరెవరు అందులో భాగస్వాములు కావాలి, ఎలా భాగస్వాములు కావాలి?
జవాబు:
1) భాగస్వాములుగా ఉండాల్సిన వారు :
పాఠశాల మొత్తానికి ఒక రాజ్యాంగాన్ని ఏర్పాటు చేయవలసి వస్తే, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయ వర్గం నుండి కొంతమంది, ఉపాధ్యాయేతర సిబ్బంది నుండి ఒకరు లేదా ఇద్దరు సభ్యులుగా ఉండి రాజ్యాంగాన్ని రూపొందించాలి.

2) భాగస్వామ్యం :
ఎ) ప్రధానోపాధ్యాయుడు
బి) సబ్జెక్టువారీగా, ప్రతి సబ్జెక్టు నుండి ఒక ఉపాధ్యాయుడు’
సి) ఉపాధ్యాయేతర సిబ్బంది నుండి ఒకరు చొప్పున భాగస్వాములుగా ఉండి రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలి.

10th Class Social Textbook Page No.238

ప్రశ్న 25.
బ్రిటన్ రాజు, భారత అధ్యక్షుడి స్థానాలలో తేడా ఏమిటి?
జవాబు:

భారత అధ్యక్షుడుబ్రిటన్ రాజు
1) భారత సమాఖ్య అధిపతిగా అధ్యక్షుడు ఉంటారు.1)రాజ్యా నికి అధిపతి, దేశానికి ప్రాతినిధ్యం వహిస్తాడు.
2) అధ్యక్షుని కింద పరిపాలనలో వివిధ శాఖలకు బాధ్యత వహిస్తూ మంత్రులు ఉంటారు.2) కార్యనిర్వాహక వర్గానికి అధిపతి కాదు. దేశాన్ని పాలించడు. అతడి స్థానం అలంకారప్రాయం.
3) భారత అధ్యక్షుడు తన మంత్రుల సలహాలకు కట్టుబడి ఉంటాడు.3)రాజు ముద్ర ద్వారా దేశ నిర్ణయాలను తెలియచేసారు.

10th Class Social Textbook Page No.239

ప్రశ్న 26.
భారత రాజ్యాంగ రూపకర్తలు ద్వంద్వ పౌరసత్వ (దేశ, రాష్ట్ర విధానాన్ని ఎందుకు తిరస్కరించారు?
జవాబు:
భారత రాజ్యాంగం ప్రకారం సమాఖ్య వ్యవస్థను మనం రూపొందించుకున్నప్పటికి కేంద్రానికి, రాష్ట్రానికి వేరువేరుగా రాజ్యాంగాలు లేవు. దేశానికంతటికి ఒకే రాజ్యాంగం, అదే విధంగా ఒకే పౌరసత్వాన్ని కల్పించుట జరిగింది. ఒకే పౌరసత్వం మూలంగా ప్రజలందరిలో ఐకమత్యం పెంపొందించడానికి వీలుంటుంది. దేశ సమగ్రత, దేశ సమైక్యత కూడా పటిష్ఠంగా ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదే ద్వంద్వ పౌరసత్వం ఉన్నట్లయితే ప్రజలు దేశ పౌరసత్వానికంటే తన రాష్ట్ర పౌరసత్వానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అందుకని రాజ్యాంగ రూపకర్తలు ద్వంద్వ పౌరసత్వాన్ని తిరస్కరించినారు.

AP Board 10th Class Social Solutions Chapter 17 స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణం

10th Class Social Textbook Page No.245

ప్రశ్న 27.
పై చర్చల్లో ఏ అభిప్రాయ భేదాలు వ్యక్తమయ్యా యి?
జవాబు:

  1. పై చర్చలో అంటరానితనానికి సంబంధించి భేదాలు వ్యక్తమయ్యాయి.
  2. ‘అంటరానితనం’ అనగా కొన్నిసార్లు ‘హరిజనులకు’ ఆలయ ప్రవేశం కల్పించటం అన్న అర్థంలో వాడతారు. కొన్నిసార్లు ‘ అది అన్ని కులాలు కలిసి భోజనం చెయ్యటంగా పరిగణించబడుతుంది.
  3. అంటరానితనం అనేది కులవ్యవస్థ అనే వ్యాధి యొక్క లక్షణం మాత్రమే.
    ఈ విధమైన అభిప్రాయ భేదాలు వ్యక్తమయ్యాయి.

10th Class Social Textbook Page No.245

ప్రశ్న 28.
ఈ చర్చలో పాల్గొనే అవకాశం మీకు లభిస్తే, మీరు ఏ పరిష్కారాన్ని సూచిస్తారు?
జవాబు:
ఈ చర్చలో పాల్గొనే అవకాశం నాకు లభిస్తే, ‘అంటరానితనం’ అనే పదం ఏ రూపంలో ఉన్నా నేరమని చెపుతాను. – అంటరానితనం, కులం అనే పదాలను సమూలంగా తొలగించాలంటాను. అంటరానితనం అనే దురాచారం తరతరాలుగా సమాజం నుండి అనేకమంది వెలివేయబడుతున్నారు. ఇది సమానత్వ హక్కుకు గొడ్డలిపెట్టు. కావున ఈ పదాలను పూర్తిగా నిర్మూలించాలి.

10th Class Social Textbook Page No.245

ప్రశ్న 29.
ఈ పదాన్ని రాజ్యాంగంలో నిర్వచించకుండా పొందుపరచడం ఒక మంచి ఆలోచన అని మీరు భావిస్తున్నారా ? మీ వాదనకు కారణాలను తెల్పండి.
జవాబు:
‘అంటరానితనం’ అనే పదాన్ని రాజ్యాంగంలో నిర్వచించకుండా, దానిని పొందుపరచడం మంచిదే అని నేను భావిస్తున్నాను. ఎందుకనగా విశాలమైన భారతదేశంలోని అనేక ప్రాంతాలలో రకరకాలైన అర్థాలున్నాయి. కావున అంటరానితనాన్ని నిర్వచించకపోవడమే సమంజసం. అయితే రాజ్యాంగంలోని 17వ ప్రకరణ- అంటరానితనం నేరమని తెలియచేస్తుంది.

10th Class Social Textbook Page No.245

ప్రశ్న 30.
‘కేవలం అంటరానితనమే కాకుండా రాజ్యాంగం కులవ్యవస్థకు సంబంధించిన అన్ని విషయాలకు అంతం పలికుండాల్సింది’ అనే విషయంతో మీరు ఏకీభవిస్తారా ? ఇది ఏ విధంగా చేసి ఉండాల్సిందని మీరు అనుకుంటున్నారు?
జవాబు:
కేవలం అంటరానితనమే కాకుండా రాజ్యాంగం కులవ్యవస్థకు సంబంధించిన అన్ని విషయాలకు అంతం పలికుండాల్సింది అనే విషయంతో నేను ఏకీభవిస్తాను. కులాల ప్రసక్తి లేకుండా వ్యక్తుల యొక్క ఆర్ధిక స్థితిగతుల ఆధారంగా ప్రజలను విభజించినట్లయితే బాగుండేదని నా అభిప్రాయం. దీనివల్ల సమాజం కులాల ప్రాతిపదికన విభజింపబడేది కాదు. కులాల ప్రసక్తి వచ్చేది కాదు.

AP Board 10th Class Social Solutions Chapter 17 స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణం

10th Class Social Textbook Page No.232

ప్రశ్న 31.
భారతదేశ రాజ్యాంగ ప్రవేశికతోపాటు కింద ఇచ్చిన రెండు దేశాల ప్రవేశికలను చదివి వాటిల్లో పోలికలు, తేడాలు పేర్కొనండి. తమ దేశం ఏర్పడటానికి దారితీసిన రాజకీయ ఘటనలను ప్రతిబింబించటానికి ప్రతి రాజ్యాంగమూ ప్రయత్నిస్తుందన్న విషయాన్ని గుర్తుంచుకోండి. రాజ్యాంగంలో చోటు చేసుకున్న వాటిని ప్రభావితం చేసిన రాజకీయ ఘటనలను గుర్తించటానికి ప్రయత్నించండి. జపాన్ నేపథ్యాన్ని అర్థం చేసుకోటానికి 13వ అధ్యాయంలో జపాను గురించి మరొకసారి చదవండి. నేపాల్ నేపథ్యాన్ని అర్థం చేసుకోవటానికి 234వ పేజీ చూడండి.
జవాబు:
భారతదేశం, నేపాల్, జపాన్ రాజ్యాంగాలలోని పోలికలు :
1) ప్రాథమిక హక్కులు, సర్వసత్తాక అధికారం ప్రజలలో ఉండడం, పౌర స్వేచ్ఛ, స్వతంత్ర న్యాయవ్యవస్థ, దేశ సమగ్రత, పౌరులకు స్వాతంత్ర్యం, ప్రజాస్వామిక గణతంత్ర రాజ్యంగా ప్రకటించడం వంటి లక్షణాలు భారతదేశం మరియు నేపాల్ రాజ్యాంగాలలో ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. జపాన్ రాజ్యాంగంలో సర్వసత్తాక అధికారం ప్రజలలో ఉంటుందనే లక్షణం మాత్రమే సారూష్యంగా కనిపిస్తుంది.

తేడాలు :

భారత రాజ్యాంగంనేపాల్ రాజ్యాంగంజపాన్ రాజ్యాంగం
భారత రాజ్యాంగం వ్యక్తికి స్వేచ్ఛ, న్యాయం, స్వాతంత్ర్యం, సమానత్వాన్ని, సౌభ్రాతృత్వాలను అన్ని రంగాలలో ఇస్తుంది.ప్రజలకు జాతి, వర్గ, ప్రాంత, లింగం అంశాలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి, రాచరిక పాలన రద్దు వంటివి నేపాల్ రాజ్యాంగం తెలుపుతుంది.జపాన్ రాజ్యాంగం, రానున్న తరాలకు వంటి యుద్ధ భయంలేని దేశాన్ని, శాంతిని, వాటి ఫలాలను అందించడానికి కృషి చేస్తామని తెలియచేస్తుంది.

10th Class Social Textbook Page No.233

ప్రశ్న 32.
ఈ దేశాల రాజకీయ నేపథ్యాలలో పోలికలు, తేడాలు ఏమిటి? అంతకు ముందు ఘటనలు ఏమిటి? అంతకు ముందు పాలకులు ఎవరు?
జవాబు:
భారతదేశం, నేపాల్, జపాన్ దేశాల రాజకీయ నేపథ్యంలో ఈ క్రింది పోలికలు, తేడాలు కనిపిస్తున్నాయి.
తేడాలు :

  1. భారతదేశం బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు చేసి స్వాతంత్ర్యాన్ని తెచ్చుకున్నది.
  2. నేపాల్ రాజరిక పాలనకు వ్యతిరేకంగా ప్రజల నిరంతర పోరాట ఫలితంగా రాచరికం రద్దయి, ప్రజాస్వామిక ప్రభుత్వం వచ్చింది.
  3. రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు జపాన్, సామ్రాజ్యకాంక్షతో యూరోపియన్ దేశాలతో పోటీ పడుతూ ఇతర స్వతంత్ర దేశాలను ఆక్రమించుకోవడానికి అనేక యుద్ధాలు చేసింది. జపాన్ ప్రజలకు యుద్ధభయాన్ని కలుగచేసింది. ఇటువంటి నేపథ్యంలో జపాన్, జపాన్ ప్రజలకు శాంతిని, యుద్ధభయం లేనటువంటి వాతావరణాన్ని కల్పించుకుంటామని జపాన్ రాజ్యాంగం తెల్పుతుంది.

పోలికలు:

  1. “ఈ మూడు దేశాల రాజ్యాంగాలను, ఆ దేశ ప్రజలు తమకు తామే ఇచ్చుకున్నాం” అనే పోలిక భారత్, నేపాల్, జపాన్ రాజ్యాంగాలలో కనిపిస్తుంది.
  2. భారత్, నేపాల్, జపాన్ దేశాలలోని ప్రజలు అనేక భయాలకు, కష్టాలకు, సమస్యలకు లోనయి ఉన్న నేపథ్యం కనిపిస్తుంది.

అంతకు ముందు ఘటనలు :

  1. 1947కు ముందు భారతదేశం బ్రిటీషు వారి పరిపాలనలో ఉంది. స్వాతంత్ర్యం కోసం అనేక ఉద్యమాలు జరిగాయి.
  2. నేపాల్ 2007కు ముందు రాచరికపాలనలో ఉంది. ప్రజాస్వామ్యం కొరకు అనేక ఉద్యమాలు జరిగాయి.
  3. 1945కు పూర్వం రాచరిక ప్రభుత్వాల వలన జపాన్ రెండు ప్రపంచయుద్ధాలలో పాల్గొని అపార నష్టాన్ని చవిచూసింది. – 1945లో రెండవ ప్రపంచయుద్ధం తరువాత జపాన్ ప్రజాస్వామ్య దేశమైనది.

అంతకు ముందు పాలకులు :
రాజ్యాంగాలను రూపొందించుకోవడానికి ముందు భారతదేశంలో బ్రిటిష్ వలస పాలన ఉంది. నేపాల్ లో నిరంకుశ రాచరికం ఉంది. జపాన్లో సామ్రాజ్యకాంక్ష ఉన్న నాయకత్వం ఉంది.

AP Board 10th Class Social Solutions Chapter 17 స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణం

10th Class Social Textbook Page No.234

ప్రశ్న 33.
గతం పట్ల సమీక్షలో వివిధ ప్రవేశికలలోని పోలికలు, తేడాలు ఏమిటి?
జవాబు:
భారతదేశం, నేపాల్, జపాన్ ప్రవేశికలలోని పోలికలు, తేడాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

పోలికలు :
భారతదేశం, నేపాల్, జపాన్ దేశాలలోని ప్రజలు తరతరాలుగా రాజరికం నిరంకుశ పాలనతో విసిగిపోయి ఉన్నారు. అయితే భారతదేశంలో రాచరికాలకు తోడు బ్రిటిష్ వలస పాలన కూడా తోడైంది. జపాన్లో షోగునేట్ పాలన అంతమవడంతో కొంత అభివృద్ధి జరిగింది.

తేడాలు :

  1. భారత్, నేపాల్, దేశాలలో రాచరికాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు జరిగాయి. భారతదేశంలో అయితే వలస పాలనకు వ్యతిరేకంగా ఉద్యమం జరిగింది.
  2. జపాన్ “మిజి”ల పరిపాలనలో అభివృద్ధి సాధించినప్పటికీ జపాన్ చేసిన యుద్దాల మూలంగా ప్రజలలో యుద్ధభయం, 2వ ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన అణుబాంబులు భయాన్ని పుట్టించాయి.

10th Class Social Textbook Page No.234

ప్రశ్న 34.
మూడు దేశాల్లో భవిష్యత్తు సమాజం గురించి ఎటువంటి వాగానాలు చేశారు?
జవాబు:
భారతదేశం, నేపాల్, జపాన్లలో భవిష్యత్తు సమాజం గురించి చేసిన వాగ్దానాలు :

1) భారతదేశం :
సార్వజనీన అక్షరాస్యత, విద్య, పర్యావరణ పరిరక్షణ, ఆదాయ అసమానతలను తగ్గించటం, ప్రాథమిక హక్కులను అందరికి వర్తింపచేయటం. “న్యాయం, స్వాతంత్ర్యం, సమానత్వం, సౌభ్రాతృత్వం వంటివి ప్రజలందరికి వర్తిస్తాయని వాగ్దానం చేసింది భారత ప్రభుత్వం.

2) నేపాల్ :
పౌరుల హక్కులు, బాధ్యతలు, ప్రభుత్వం దాని అంగాలైన కార్యనిర్వాహక, శాసన, న్యాయశాఖల వంటివాటి నిర్మాణం, అధికారాలను పేర్కొనటం, ప్రభుత్వమూ, సమాజమూ కలిసి నిర్మించాల్సిన భవిష్యత్తు సమాజ స్వభావాన్ని సూచించటం వంటి వాటిని నేపాల్ దేశం ప్రకటించింది.

3) జపాన్ :
రానున్న తరాలకు అన్ని దేశాలతో శాంతియుత సహకారం లభించాలని, ప్రభుత్వ చర్యల ద్వారా సహకారం లభించాలని, ప్రభుత్వ చర్యల ద్వారా ఎన్నడూ యుద్ధభయాలు తిరిగి దేశాన్ని కమ్ముకోవని, సర్వసత్తాక అధికారం ప్రజలలో ఉంటుందని జపాన్ తెలియచేస్తూ రాజ్యాంగాన్ని ప్రకటించింది.

10th Class Social Textbook Page No.236

ప్రశ్న 35.
దేశం మొత్తానికి రాజ్యాంగాన్ని రూపొందించటంలో భారతదేశ ప్రజలందరూ పాల్గొనగలరా ? ఈ ప్రక్రియలో క్రియాశీలంగా పాల్గొనాల్సిన అవసరం ప్రజలందరికీ ఉందా లేక కొంతమంది విజ్ఞులకు ఈ బాధ్యత అప్పగిస్తే సరిపోయేదా?
జవాబు:

  1. రాజ్యాంగ సభను వయోజనులందరికీ కల్పించిన సార్వత్రిక వయోజన ఓటుహక్కు ద్వారా ఎన్నుకోలేదు. అప్పట్లో జనాభాలో 10% ప్రజలకే ఓటుహక్కు ఉండేది.
  2. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగాన్ని ప్రజలు లేక వారి ప్రతినిధులు రూపొందిస్తారు. కావున మనదేశంలో ప్రజా ప్రతినిధులు రూపొందారు.
  3. ప్రజలందరూ రాజ్యాంగ రూపకల్పనలో క్రియాశీలంగా పాల్గొనవలసిన అవసరం లేదు. ప్రజలందరికి విద్య లేదు. విజ్ఞానం కూడా అందరికి ఉండదు. ఇటువంటి నేపథ్యంలో ప్రజాప్రతినిధులు శాస్త్ర, విజ్ఞాన, విద్యా రంగాల నిష్ణాతులుగా ప్రాతినిధ్యం వహిస్తారు. కావున ఇటువంటి విజ్ఞులు కొంతమందికి రాజ్యాంగ రూపకల్పన బాధ్యత అప్పగిస్తే సరిపోతుంది.

AP Board 10th Class Social Solutions Chapter 17 స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణం

10th Class Social Textbook Page No.242

ప్రశ్న 36.
భారతీయ సమాఖ్య వ్యవస్థకూ, అమెరికా సమాఖ్య వ్యవస్థకూ మధ్యగల ముఖ్యమైన తేడాలను పేర్కొనండి.
జవాబు:
భారత్, అమెరికాల సమాఖ్య వ్యవస్థలో ఈ క్రింది తేడాలున్నాయి.

భారత సమాఖ్య వ్యవస్థఅమెరికా సమాఖ్య వ్యవస్థ
1) పార్లమెంటరీ ప్రభుత్వాన్ని ప్రతిపాదిస్తుంది.1) అధ్యక్ష వ్యవస్థ ప్రభుత్వం అంటారు.
2) కేంద్రరాష్ట్రాలతో కూడిన ద్వంద్వ ప్రభుత్వాల విధానం ఉంటుంది. కార్యనిర్వాహక శాఖ శాసనశాఖలో అంతర్భాగం.2) ఫెడరల్ ప్రభుత్వమని, రాష్ట్ర ప్రభుత్వమని ద్వంద్వ ప్రభుత్వాలుంటాయి. కార్యనిర్వాహకశాఖ అనగా అధ్యక్షుడు, అతని సలహాదారులు. శాసననిర్మాణం శాఖలో అంతర్భాగం కాదు.
3) భారత సమాఖ్యలో అధ్యక్షుడు, రాజ్యా నికి అధిపతి, కాని పరిపాలన బాధ్యత ఉండదు.3) పరిపాలన బాధ్యత అంతా అధ్యక్షుడి క్రింద ఉంటుంది.
4) అధ్యక్షుని కింద పరిపాలనలో వివిధ శాఖలకు బాధ్యత వహిస్తూ మంత్రులు ఉంటారు.4) అధ్యక్షుని కింద వివిధ శాఖలకు బాధ్యత వహిస్తూ సెక్రటరీలు ఉంటారు.

10th Class Social Textbook Page No.242

ప్రశ్న 37.
అమెరికాలో కేంద్ర ప్రభుత్వ న్యాయవ్యవస్థ, రాష్ట్ర న్యాయవ్యవస్థ వేరు వేరు. భారతదేశంలో కేంద్ర, రాష్ట్రాల న్యాయవ్యవస్థలు సమగ్ర న్యాయవ్యవస్థలో ఒక భాగం – వివరించండి.
జవాబు:
అమెరికాలో సమాఖ్య న్యాయవ్యవస్థ, రాష్ట్ర న్యాయవ్యవస్థ రెండూ వేరు, వేటికవి స్వతంత్రమైనవి. అయితే భారత సమాఖ్యలో రాజ్యాంగం రెండు స్థాయిలలో న్యాయస్థానాలను ఏర్పాటు చేయలేదు. మనది ఏకీకృత, సమగ్ర న్యాయవ్యవస్థ.

  1. సుప్రీంకోర్టు విచారణ పరిధి కిందకు యావత్ దేశం వస్తుంది. కేంద్ర పార్లమెంట్, రాష్ట్ర శాసనసభలు ఆమోదించిన చట్టాల రాజ్యాంగబద్ధతను పరిశీలిస్తుంది.
  2. రాష్ట్రస్థాయిలో పనిచేసే హైకోర్టుకు కూడా శాసనసభ కార్యనిర్వాహక చర్యల రాజ్యాంగబద్ధతను పరిశీలించే అధికారం ఉంది.
  3. సుప్రీంకోర్టు, హైకోర్టులకు ‘రిట్’ లను జారీ చేసే అధికారం ఉంది.
  4. సుప్రీంకోర్టు, హైకోర్టు వాయమూర్తులను రాష్ట్రపతి నియమిస్తాడు.
  5. సుప్రీంకోర్టు నిర్ణయాలు యావత్ భారతదేశానికి వర్తిస్తాయి. అన్ని న్యాయస్థానాలు ఈ తీర్పులను పాటించాలి.
  6. హైకోర్టులు కింది న్యాయస్థానాలపై అజమాయిషీ చేస్తాయి.
  7. అదే విధంగా ఏ న్యాయస్థానం తీర్పునైనా తాత్కాలిక నిలుపుదల ఉత్తరువు ఇవ్వవచ్చు. దానిని పరిశీలించి తిరిగి విచారణ చేసే అధికారం సుప్రీంకోర్టుకు ఉంది.

ఉన్నత న్యాయవ్యవస్థ నిర్మాణం హైకోర్టులతో సహా కేంద్ర ప్రభుత్వ పరిధి కిందకు వస్తుంది. పార్లమెంటు హైకోర్టు అధికార పరిధిని పెంచవచ్చు. న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సును పెంచే అధికారం ఒక్క పార్లమెంటుకే ఉంది. వీటిని బట్టి మనకర్ధమవుతున్నదేమిటంటే భారత రాజ్యాంగం న్యాయవ్యవస్థ నిర్మాణంలో ఏకీకృత పద్ధతిని అనుసరించింది.

AP Board 10th Class Social Solutions Chapter 17 స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణం

10th Class Social Textbook Page No.242

ప్రశ్న 38.
సేథ్ అభిప్రాయాలు, ముసాయిదా రాజ్యాంగానికి మధ్య పోలికలు, తేడాలు ఏమిటి?
జవాబు:
సేథ్ అభిప్రాయాలు, ముసాయిదా రాజ్యాంగానికి మధ్య పోలికలు :

  1. రాజ్యాంగ సభ సభ్యులు వయోజన ఓటుహక్కు ద్వారా ఎన్నుకోబడలేదని సేథ్ వాదించారు. ముసాయిదా రాజ్యాంగ నిర్మాణ సభ సభ్యులు వయోజన ఓటుహక్కు ద్వారా ఎన్నుకోబడలేదు.
  2. ముసాయిదా రాజ్యాంగం సమాఖ్య విధానాన్ని ప్రతిపాదిస్తుంది. సేథ్ కూడా అధికార వికేంద్రీకరణ జరగాలన్నారు. అధికార కేంద్రీకరణ జరిగితే ఫాసిస్ట్ ఆదర్శాల వైపు నిరంకుశ అధికారంగా మారుతుందని అన్నాడు. మన రాజ్యాంగం కేంద్రరాష్ట్రాల మధ్య అధికారాన్ని వికేంద్రీకరించింది.
  3. గ్రామ పంచాయితీల గురించి ప్రస్తావన లేదని సేథ్ విమర్శించారు. ముసాయిదా రాజ్యాంగంలో గాంధీజీ కలలు కన్న గ్రామాల గురించి విస్మరించినారు.

తేడాలు :

  1. సేథ్ అధికార కేంద్రీకరణ జరిగిందని వాదించారు. వాస్తవానికి ముసాయిదా రాజ్యాంగంలో కేంద్ర, రాష్ట్రాల మధ్య అధికారం అనేది పంచబడింది.
  2. అధికార కేంద్రీకరణ ఎక్కువైతే ఫాసిజం వైపు మళ్ళుతుందని సేథ్ అన్నాడు. అయితే ముసాయిదా రాజ్యాంగంలో పార్లమెంటరీ సమాఖ్య విధానంతో ప్రజాస్వామ్యం వైపు వెళుతున్నామని తెలుస్తుంది.

10th Class Social Textbook Page No.242

ప్రశ్న 39.
రాజ్యాంగానికి 73వ సవరణ చేసిన తరువాత గ్రామాలకు ఎటువంటి స్వయంప్రతిపత్తి కల్పించారో తెలుసుకోండి.
జవాబు:
1992లో రాజ్యాంగానికి 73వ సవరణ చేయుట జరిగింది.

73వ సవరణతో గ్రామాలకు స్వయంప్రతిపత్తి :

  1. గాంధీజీ ఆశించిన గ్రామాలకు రాజ్యాంగంలో సరైన ప్రాతినిధ్యం దొరకలేదు. 1992లో రాజ్యాంగానికి 73వ సవరణ చేసి ఆర్టికల్ 40లో ఈ గ్రామపంచాయితీలను చేర్చారు.
  2. ఆర్టికల్ 40 నిర్దేశిక నియమాలలోనిది. గాంధీజీ ఆశించినట్లు ప్రతి గ్రామం “ఒక రామరాజ్యం ” కావాలని ఈ సవరణ చేసి గ్రామపంచాయితీలకు ప్రాధాన్యత కల్పించారు.
  3. ఈ 73వ సవరణ ప్రకారం గ్రామ పంచాయితీ సభ్యులు, అధ్యక్షుడు ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఎన్నిక కావాలి.
  4. గ్రామ పంచాయితీకి అవసరం అయిన నిధులు, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు సమకూరుస్తాయి.
  5. సర్పంచ్ వయోజనులచే ప్రత్యక్షంగా ఎన్నిక కావాలి.

10th Class Social Textbook Page No.249

ప్రశ్న 40.
AP Board 10th Class Social Solutions Chapter 17 స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణం 1
1950, జనవరి 26 నాటి వార్తాపత్రిక. ఈ పేజీలో ఏ ఏ అంశాలు ఉన్నాయో వ్యాఖ్యానించండి.
జవాబు:
ది స్టేట్స్మ న్ అనే వార్తాపత్రికలో క్రింది అంశాలు కనిపిస్తున్నాయి.

  1. భారతదేశం ఈ రోజు గణతంత్ర దేశంగా ఆవిర్భవించింది. ప్రజలందరు ఓర్పు, సహనాలను కలిగి ఐకమత్యంగా ఉండాలని నెహ్రూ ప్రజలకు పిలుపునిచ్చాడు. అన్ని దేశాలను స్నేహ సంబంధాల కొరకు ఆహ్వానించాడు.
  2. సుకర్నో భారత ఎం.పి.లను ఉద్దేశించి మాట్లాడినాడు. భారతదేశం కొత్త గణతంత్రదేశంగా ఆవిర్భవించినందుకు శుభాకాంక్షలు తెలిపినారు.
  3. భారత రాజ్యాంగంలోని “ప్రవేశిక” ను ప్రచురించినారు.
  4. కలకతాలో ఈ రోజు ప్రోగ్రాం అనే వార్తతో ఆ రోజు కార్యక్రమాలను ఇచ్చినారు.
  5. ఇరు దేశాల మధ్య సరిహద్దులను ఏర్పాటు చేసుకున్నారు.
  6. “హౌర” గ్రామంలో గన్‌మెన్, ఇద్దరు పోలీసులను చంపినాడు.
  7. “కలకతా నుండి గౌహతి” వెళుతున్న విమాన ప్రమాదంలో ఇద్దరు సిబ్బంది మరణించినారు.
  8. “ఇంపీరియల్ కెమికల్ ఇండియా” వారి ఫర్నీచర్‌కు సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ ప్రచురించబడింది.

AP Board 10th Class Social Solutions Chapter 17 స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణం

10th Class Social Textbook Page No.246

ప్రశ్న 41.
భారత రాజ్యాంగంలోని మౌలిక అంశాలకు సంబంధించి మీరు గుర్తించిన ఉదాహరణలు, వివరణలు పేర్కొనండి.
జవాబు:
రాజ్యాంగంలోని మౌలిక అంశాలకు సంబంధించి నేను గుర్తించిన అంశాలు :
1) వయోజనులందరికి ఓటుహక్కు ఉండడం, వారి ఓటుతో తమకు కావలసిన ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడం అనే సార్వభౌమాధికారం ప్రజలలో ఉందని తెలుపుతుంది.

2) “సామ్యవాదం” :
ప్రజలందరూ, సమానత్వాన్ని అనుభవించాలంటే ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల నుండి తొలగించి, దానిని సాధారణ, చట్ట హక్కుగా చేసినారు. ఇదంతా సామ్యవాద సమాజాన్ని స్థాపించుట కొరకే.

3) న్యాయం :
ప్రతి వ్యక్తికి రాజకీయ, ఆర్థిక, సాంఘిక న్యాయాలను రాజ్యాంగం కల్పించింది. దీని ప్రకారం ఏ వ్యక్తి అయిన వయోజనుడైతే ఎన్నికలలో పోటీచేయవచ్చు. పేదరిక నిర్మూలన సమాన ప్రాతిపదికపై సంపద పంపిణీ, కుల, మత, వర్గ, స్త్రీ, పురుష, అల్పసంఖ్యాకులనే భేదం లేకుండా అందరికి సమాన న్యాయం కల్పించబడింది.

4) స్వేచ్ఛ :
ప్రతి వ్యక్తి తన ఇష్టం వచ్చినట్లు జీవించవచ్చు. ప్రతి వ్యక్తికి భావప్రకటన తన ఇష్టం వచ్చిన మతాన్ని ఆరాధించడానికి స్వేచ్ఛ ఉన్నది.

5) ప్రాథమిక హక్కులు :
ప్రతి వ్యక్తి రాజ్యాంగం తనకు కల్పించిన ప్రాథమిక హక్కులు అనుభవించవచ్చు. ఏ కారణాల వలన అయిన తమ హక్కులకు భంగం కలిగినట్లైతే న్యాయస్థానానికి ఫిర్యాదు చేయవచ్చు.

న్యాయస్థానాలు వ్యక్తి యొక్క ప్రాథమిక హక్కులకు రక్షణ కల్పిస్తాయని నేను గమనించాను.