AP Board 8th Class Maths Solutions Chapter 1 అకరణీయ సంఖ్యలు Ex 1.1

SCERT AP 8th Class Maths Solutions Chapter 1 అకరణీయ సంఖ్యలు Ex 1.1 Textbook Exercise Questions and Answers.

AP State Syllabus 8th Class Maths Solutions 1st Lesson అకరణీయ సంఖ్యలు Exercise 1.1

ప్రశ్న 1.
కింది ఉదాహరణలలో ఉన్న ధర్మాలను గుర్తించి వ్రాయండి.
AP Board 8th Class Maths Solutions Chapter 1 అకరణీయ సంఖ్యలు Ex 1.1 1
సాధన.
AP Board 8th Class Maths Solutions Chapter 1 అకరణీయ సంఖ్యలు Ex 1.1 2

ప్రశ్న 2.
కింది వాటికి సంకలన మరియు గుణకార విలోమాలు వ్రాయండి.
(i) \(\frac {-3}{5}\)
(ii) 1
(iii) 0
(iv) \(\frac {7}{9}\)
(v) -1
సాధన.
AP Board 8th Class Maths Solutions Chapter 1 అకరణీయ సంఖ్యలు Ex 1.1 3

AP Board 8th Class Maths Solutions Chapter 1 అకరణీయ సంఖ్యలు Ex 1.1

ప్రశ్న 3.
కింది ఖాళీలను పూరించండి.
AP Board 8th Class Maths Solutions Chapter 1 అకరణీయ సంఖ్యలు Ex 1.1 4
సాధన.
AP Board 8th Class Maths Solutions Chapter 1 అకరణీయ సంఖ్యలు Ex 1.1 5
AP Board 8th Class Maths Solutions Chapter 1 అకరణీయ సంఖ్యలు Ex 1.1 6

ప్రశ్న 4.
\(\frac {2}{11}\) ను \(\frac {-5}{14}\) యొక్క గుణకార విలోమంతో గుణించండి.
సాధన. \(\frac {-5}{14}\) యొక్క గుణకార విలోమం = 14
AP Board 8th Class Maths Solutions Chapter 1 అకరణీయ సంఖ్యలు Ex 1.1 7
∴ \(\frac{2}{11} \times\left(\frac{-14}{5}\right)=\frac{-28}{55}\)

ప్రశ్న 5.
\(\frac{2}{5} \times\left[5 \times \frac{7}{6}\right]+\frac{1}{3} \times\left(3 \times \frac{4}{11}\right)\) యొక్క గణనలో ఏయే ధర్మాలను ఉపయోగిస్తాము ?
సాధన.
\(\frac{2}{5} \times\left[5 \times \frac{7}{6}\right]+\frac{1}{3} \times\left(3 \times \frac{4}{11}\right)\) యొక్క గణనలో
గుణకార సహచర ధర్మం
గుణకార విలోమం
గుణకార తత్సమాంశం
సంకలన సంవృతం అనే ధర్మాలను ఉపయోగిస్తాము.

AP Board 8th Class Maths Solutions Chapter 1 అకరణీయ సంఖ్యలు Ex 1.1

ప్రశ్న 6.
కింది సమానత్వాన్ని సరిచూడండి.
\(\left(\frac{5}{4}+\frac{-1}{2}\right)+\frac{-3}{2}=\frac{5}{4}+\left(\frac{-1}{2}+\frac{-3}{2}\right)\)
సాధన.
AP Board 8th Class Maths Solutions Chapter 1 అకరణీయ సంఖ్యలు Ex 1.1 8

ప్రశ్న 7.
\(\frac{3}{5}+\frac{7}{3}+\left(\frac{-2}{5}\right)+\left(\frac{-2}{3}\right)\) విలువను పదాల అమరికను మార్చి సూక్ష్మీకరించండి.
సాధన.
AP Board 8th Class Maths Solutions Chapter 1 అకరణీయ సంఖ్యలు Ex 1.1 9

ప్రశ్న 8.
కింది వాటిని వ్యవకలనం చేయండి.
(i) \(\frac {1}{3}\) నుండి \(\frac {3}{4}\)
(ii) 2 నుండి \(\frac {-32}{13}\)
(iii) \(\frac {-4}{7}\) నుండి -7
సాధన.
(i) \(\frac {1}{3}\) నుండి \(\frac {3}{4}\)
\(\frac{1}{3}-\frac{3}{4}=\frac{4-9}{12}=\frac{-5}{12}\)

(ii) 2 నుండి \(\frac {-32}{13}\)
2 – \(\frac {-32}{13}\)
= 2 + \(\frac {32}{13}\)
= \(\frac{26+32}{13}\)
= \(\frac {58}{13}\)

(iii) \(\frac {-4}{7}\) నుండి -7
\(\frac {-4}{7}\) – (-7)
= \(\frac {-4}{7}\) + 7
= \(\frac{-4+49}{7}\)
= \(\frac {45}{7}\)

AP Board 8th Class Maths Solutions Chapter 1 అకరణీయ సంఖ్యలు Ex 1.1

ప్రశ్న 9.
\(\frac {-5}{8}\) కు ఎంత కలిపిన \(\frac {-3}{2}\) వచ్చును ?
సాధన.
\(\left(\frac{-5}{8}\right)+x=\left(\frac{-3}{2}\right)\)
⇒ x = \(-\frac{3}{2}+\frac{5}{8}=\frac{-3 \times 4+5}{8}\)
= \(\frac{-12+5}{8}\)
x= \(\frac {-7}{8}\)
= \(\frac {45}{7}\)
∴ \(\frac {-5}{8}\) నకు (\(\frac {-7}{8}\)) కలిపిన \(\frac {-3}{2}\) వచ్చును.

ప్రశ్న 10.
రెండు అకరణీయ సంఖ్యల మొత్తం 8. వాటిలో ఒక సంఖ్య \(\frac {-5}{6}\) అయితే రెండవ సంఖ్య ఎంత ?
సాధన.
రెండవ సంఖ్య = x అనుకొనుము.
x + (\(\frac {-5}{6}\)) = 8 ⇒ x = 8 + \(\frac {5}{6}\)
= \(\frac{48+5}{6}\)
x = \(\frac {53}{6}\)

ప్రశ్న 11.
వ్యవకలనం దృష్ట్యా అకరణీయ సంఖ్యలు సహచర ధర్మాన్ని పాటిస్తాయా ? ఒక ఉదాహరణతో వివరించండి.
సాధన.
\(\frac{1}{2}, \frac{3}{4}, \frac{-5}{4}\) ఏవైనా 3 అకరణీయ సంఖ్యలు.
వ్యవకలన సహచర ధర్మం
⇒ a – (b – c) = (a – b) – c ను పాటిస్తుందో లేదో చూద్దాం.
AP Board 8th Class Maths Solutions Chapter 1 అకరణీయ సంఖ్యలు Ex 1.1 10
∴ L.H.S ≠ R.H.S
వ్యవకలనం దృష్ట్యా అకరణీయ సంఖ్యలు సహచర ధర్మాన్ని పాటించవు.
∴ a – (b – c) ≠ (a – b) – c

ప్రశ్న 12.
– (-x) = x ను కింది విలువలకు సరిచూడండి.
(i) x = \(\frac {2}{15}\)
(ii) x = \(\frac {-13}{17}\)
సాధన.
(i) x = \(\frac {2}{15}\)
⇒ -(-x) = -(\(\frac {-2}{15}\)) = \(\frac {2}{15}\) [∵ (-) × (-) = +]

(ii) x = \(\frac {-13}{17}\)
-(-x) = \(-\left[-\left(\frac{-13}{17}\right)\right]=-\left[\frac{13}{7}\right]=\frac{-13}{7}\) [∵ (-) × (+) = -]
∴ పై రెండు ఉదాహరణల నుండి ‘x’ విలువ ఏదైనప్పటికీ – (-x) = x అగును.

AP Board 8th Class Maths Solutions Chapter 1 అకరణీయ సంఖ్యలు Ex 1.1

ప్రశ్న 13.
కింది వానికి జవాబులు వ్రాయండి.
i) సంకలన తత్సమాంశం కలిగి వుండని సమితి ఏది ?
సాధన.
సంకలన తత్సమాంశం (0) కలిగి ఉండని సమితి N.
సహసంఖ్యా సమితిలో “సున్న” (0) ఉండదు.

ii) గుణకార విలోమం లేని అకరణీయ సంఖ్య ఏది ?
సాధన.
గుణకార విలోమం లేని అకరణీయ సంఖ్య ‘0’.
[∵ \(\frac {1}{0}\) ను నిర్వచించలేము కనుక]

iii) ఋణ అకరణీయ సంఖ్య యొక్క గుణకార విలోమం ?
సాధన.
ఋణ అకరణీయ సంఖ్య యొక్క గుణకార విలోమం
ఒక ఋణ అకరణీయ సంఖ్య అవుతుంది.
∵ \(\frac{-2}{5} \times\left(\frac{-5}{2}\right)=1\)

AP Board 8th Class Maths Solutions Chapter 7 Frequency Distribution Tables and Graphs Ex 7.3

AP State Syllabus AP Board 8th Class Maths Solutions Chapter 7 Frequency Distribution Tables and Graphs Ex 7.3 Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Maths Solutions 7th Lesson Frequency Distribution Tables and Graphs Exercise 7.3

AP Board 8th Class Maths Solutions Chapter 7 Frequency Distribution Tables and Graphs Ex 7.3

Question 1.
The following table gives the distribution of45 students across the different levels of intelligent Quotient. Draw the histogram for the data.
AP Board 8th Class Maths Solutions Chapter 7 Frequency Distribution Tables and Graphs Ex 7.3 1
Solution:
AP Board 8th Class Maths Solutions Chapter 7 Frequency Distribution Tables and Graphs Ex 7.3 2
Steps of construction:
1. Calculate the difference between mid values of two consecutive classes
∴ h = 75 – 65 = 10
∴ Class interval (C.I) = 10

2. Select such a right scale
on X-axis 1 cm = 10 units
on Y-axis 1 cm 1 student

3. Construct a histogram with C.Is as width and frequencies as lengths.

AP Board 8th Class Maths Solutions Chapter 7 Frequency Distribution Tables and Graphs Ex 7.3

Question 2.
Construct a histogram for the marks obtained by 600 students in the VII class annual
examinations.
AP Board 8th Class Maths Solutions Chapter 7 Frequency Distribution Tables and Graphs Ex 7.3 3

Solution:
Classes will be prepared on class marks.
Step – 1: Take the difference between the mid values of two consecutive classes.
∴ h = 400 – 360 = 40

Step – 2: Let the lower and upper boundaries be taken as x – \(\frac{h}{2}\) , x + \(\frac{h}{2}\)
∴ x – \(\frac{h}{2}\) = 360 – \(\frac{40}{2}\) = 360 – 20 = 340
x + \(\frac{h}{2}\) = 360 + \(\frac{40}{2}\) = 360 + 20 = 380

Step – 3 : Select the scale
on X-axis 1 cm = 1 C.I (mid values)
on Y-axis 1 cm = 20 students

Step – 4 : Take C.I’s as width, frequencies as lengths.
Then construct the histogram.

Class MarksClass IntervalFrequency
360340- 380100
400380- 420125
440420-460140
480460-50095
520500-54080
560540-58060

Scale : On Y – axis no. of students = 20, On X – axis take marks of students.
AP Board 8th Class Maths Solutions Chapter 7 Frequency Distribution Tables and Graphs Ex 7.3 4

AP Board 8th Class Maths Solutions Chapter 7 Frequency Distribution Tables and Graphs Ex 7.3

Question 3.
Weekly wages of 250 workers in a factory are given in the following table. Construct the histogram and frequency polygon on the same graph for the data given.
using the histogram. (Use separate graph sheets)
AP Board 8th Class Maths Solutions Chapter 7 Frequency Distribution Tables and Graphs Ex 7.3 5
Solution:

Class Interval
(Weekly wages)
Frequency
(No. of workers)
Mid values
500-55030525
550-60042575
600-65050625
650-70055675
700-75045725
750 -80028775
N = 250

Steps of constructIon:

  1. C.I. = Difference of two consecutive mid values = h = 575 – 525 = 50
  2. Scale : On X-axis 1 cm = ₹ 50
    On Y-axis 1 cm = lo members
  3. Take on X-axis width of C.I, on Y-axis frequncies.
  4. Keep points A, B, C, D, E, F, G, H on the mid points of rectangles.
  5. The area of a histogram is equal to the area of a polygon.

AP Board 8th Class Maths Solutions Chapter 7 Frequency Distribution Tables and Graphs Ex 7.3 6

AP Board 8th Class Maths Solutions Chapter 7 Frequency Distribution Tables and Graphs Ex 7.3

Question 4.
Ages of 60 teachers in primary schools of a Mandai are given in the following frequency distribution table. Construct the Frequency polygon and frequency curve for the data without using the histogram. (Use separate graph sheets)
AP Board 8th Class Maths Solutions Chapter 7 Frequency Distribution Tables and Graphs Ex 7.3 7
Solution:
Construction of frequency polygon:

  1. Class interval = The difference between two mid values of classes
    = 30 – 26 = 4
  2. Scale : On X-axis take the age of teachers
    On Y-axis take number of teachers.
  3. Scale: On X-axis 1 cm = 4units
    On Y- axis 1 cm = 2 units
  4. Take the widths of classes on X – axis. Frequencies on Y – axis.
  5. The points are formed on the graph sheet are joined by a scale then the required frequency polygon and if the points are joined by hand frequency curve will be formed.

AP Board 8th Class Maths Solutions Chapter 7 Frequency Distribution Tables and Graphs Ex 7.3 8

AP Board 8th Class Maths Solutions Chapter 7 Frequency Distribution Tables and Graphs Ex 7.3

Question 5.
Construct class intervals and frequencies for the foliowing distribution tabie. Also draw the ogive curves for the same.
AP Board 8th Class Maths Solutions Chapter 7 Frequency Distribution Tables and Graphs Ex 7.3 9
Solution:
Steps of constructIon:
Step – 1: If the given frequency distribution is in inclusive form, then convert it into an
exclusive form.

Step – 2: Calculate the less than cumulative frequency.

Step – 3: Mark the upper boundaries of the class intervals along X-axis and their corresponding cumulative frequencies along Y-axis.

Select the scale:
X – axis 1 cm = 1 class interval
Y – axis 1 cm = 10 students

Step – 4: Also, plot the lower boundary of the first class (upper boundary of the class previous to first class) interval with cumulative frequency 0.

Step – 5: Join these points by a free hand curve to obtain the required ogive.
Similarly we can construct ‘greater than cumulative frequency curve by taking greater than cumulative on Y – axis and corresponding ‘lower boundaries’ on the
X-axis.

AP Board 8th Class Maths Solutions Chapter 7 Frequency Distribution Tables and Graphs Ex 7.3 10

AP Board 8th Class Physical Science Important Questions Chapter 5 Metals and Non-Metals

AP State Syllabus AP Board 8th Class Physical Science Important Questions Chapter 5 Metals and Non-Metals

AP State Syllabus 8th Class Physical Science Important Questions 5th Lesson Metals and Non-Metals

8th Class Physical Science 5th Lesson Metals and Non-Metals 1 Mark Important Questions and Answers

Question 1.
What is meant by lustrous material?
Answer:
The material which show brightness on surface and reflect the light are called lustrous material.

Question 2.
What is malleability? Which materials have malleability?
Answer:
The property of material by which they can beaten into thin sheets is called malleability. Generally metals exhibit malleability property, e.g.: Iron, copper, etc.

AP Board 8th Class Physical Science Important Questions Chapter 5 Metals and Non-Metals

Question 3.
What is ductility? Which materials show ductility?
Answer:
The property of drawing materials to make fine wires is called ductility. Generally metals show ductility, e.g.: Gold, copper, etc.

Question 4.
Have you observed materials used to make school bell or bells in temple ?
Answer:
Generally they are made up of metals.

Question 5.
Why do wooden bells not used in temple?
Answer:
Wood does not give a ringing sound when it is hit with a hammer. That means it does not show sonorous property. So wooden bells are not used in temple.

Question 6.
What is meant by sonorous?
Answer:
The ability to material to produce a particular sound when it is dropped on the hard surface is called sonorous.

Question 7.
Is ductility is the only property to use them as connecting wires in electric circuits?
Answer:
No, it is one of the cause. The other thing is metals are very good conductors of electricity. So they easily allows the passage of current. So they are used as connecting wires.

AP Board 8th Class Physical Science Important Questions Chapter 5 Metals and Non-Metals

Question 8.
What does cooking appliances conduct?
Answer:
Cooking appliances conduct heat from heating device like gas stove or electric stove.

Question 9.
What is the nature of metallic and non-metallic oxides?
Answer:
Generally metallic oxides are basic in nature and non-metallic oxides are acidic in nature.

Question 10.
What happen when keep an iron rod in open place for one or two days?
Answer:
Rusting takes place on iron. The reason is iron react with air that contains oxygen and moisture forms a reddish brown coating (rust) due to formation of iron oxide.

Question 11.
Why do some metals do not get rust?
Answer:
Metal with very low reactivity do not react with air. So they do not get rust. They also called as noble metals, e.g.: Gold, platinum.

Question 12.
What happens when magnesium ribbon is exposed to air?
Answer:
It becomes dull when it is exposed to air due to formation of magnesium carbonate. That’s why magnesium ribbon should be cleaned with sand paper before any chemical reaction.

Question 13.
Why does silver objects and jewellery become black after sometime?
Answer:
Silver articles are black after sometime because they react with oxygen in air and form silver oxide.

Question 14.
Why statues and vessels made up of copper become dull green after certain time?
Answer:
The statues and vessels made up of copper became dull because they react with air and form copper hydroxide and copper carbonate which appears as dull green coating.

AP Board 8th Class Physical Science Important Questions Chapter 5 Metals and Non-Metals

Question 15.
What happens when non-metals are added to water?
Answer:
They do not react with water.

Question 16.
How do you test hydrogen gas?
Answer:
If we place a burning match stick near a test tube containing hydrogen gas it puts out the match stick with pop sound and the gas burns with blue flame.

Question 17.
What happens when acids are added to non-metals?
Answer:
Non-metals do not react with acids.

Question 18.
What is a displacement reaction?
Answer: A more reactive metal displace a less reactive metal from its compound in aqueous solution is called displacement reaction.

Question 19.
Which metal has highest ductility?
Answer:
Gold. One gram of gold can be drawn into a wire of length one kilometre.

Question 20.
Why sodium and potassium are stored in kerosene?
Answer:
Sodium and potassium are highly reactive. They react vigorously with oxygen and water. A lot of heat is generated in the reaction. Therefore these metals are stored in kerosene.

Question 21.
Is all metals are hard?
Answer:
No. Sodium and potassium are soft. So they can be cut with a knife.

Question 22.
Which non-metal has lustrous surface?
Answer:
Iodine has lustrous surface.

Question 23.
Which non-metal is extremely hard?
Answer:
Diamond (allotrope of carbon) is extremely hard.

AP Board 8th Class Physical Science Important Questions Chapter 5 Metals and Non-Metals

Question 24.
Why immersion rods for heating liquids are made up of metallic substances?
Answer:
Metals are good conductors of heat. So immersion rods for heating liquids are made
up of metals.

Question 25.
Why does copper cannot displace zinc from its salt solution?
Answer:
Copper is less reactive than zinc. So it cannot displace zinc from its salt solution.

Question 26.
Why does aluminium foils are used to wrap food items?
Answer:
It does not readily react with food items. So aluminium foils are used for wraping food items.

Question 27.
The doctor reported iron deficiency in my body. Where is iron in my body?
Answer:
Iron is present in haemoglobin. Which gives red colour to blood.

Question 28.
I heard that magnesium is found in plants. In what form is it found in them?
Answer:
Magnesium is present in chlorophill. It is in Mg(II) state.

AP Board 8th Class Physical Science Important Questions Chapter 5 Metals and Non-Metals

Question 29.
Gold jewellery does not become dull. Why?
Answer:
Gold and platinum does not react with components of air. So, gold and platinum does not rust. So gold jewellery does not become dull.

8th Class Physical Science 5th Lesson Metals and Non-Metals 2 Marks Important Questions and Answers

Question 1.
What are physical properties of non-metals?
Answer:
Physical properties of non-metals:

  1. They are non lustrous.
  2. They are non sonorous.
  3. They are soft.
  4. They does not show malleability and ductility.
  5. They are bad conductors of heat and electricity.

Question 2.
Is our body is a metal or a non-metal?
Answer:
Most of the human body is made of water (H2O). It is not surprising that majority of a human body’s mass is oxygen. Carbon, the basic unit of organic molecules is the second. 99% of human body is made up of just six elements. Oxygen (65%), carbon (18%), hydrogen (10%), nitrogen (3%), calcium (1.5%), phosphorous (1%). Which shows our body has almost 97% of non-metals. So we may consider our body as non-metal.

Question 3.
Draw a diagram which shows metals are good conductors of electricity.
Answer:
AP Board 8th Class Physical Science Important Questions Chapter 5 Metals and Non-Metals 1

AP Board 8th Class Physical Science Important Questions Chapter 5 Metals and Non-Metals

Question 4.
Draw a diagram which show metals are good conductors of heat.
Answer:
AP Board 8th Class Physical Science Important Questions Chapter 5 Metals and Non-Metals 2

Question 5.
Explain about ductility.
Answer:

  1. Some materials cannot be drawn into wires.
  2. Property of drawing a material to make fine wires is called ductility.
  3. Most metals are ductile.

Question 6.
How do you appreciate the efforts of man to use the Metals in making tools?
Answer:

  1. Early human beings made their tools from stone and wood.
  2. Later they used the bones of animals.
  3. Then they discovered metals like copper and iron.
  4. Tools made of copper and iron are much stronger than tools made of stone and wood.
  5. Metals had the advantage of not just being harder but they can be heated in a fire and moulder or cast into different shapes. So it became possible to make a wider range of tools with such metals.
  6. Hence the efforts of man to use the metals in making tools appreciated.

AP Board 8th Class Physical Science Important Questions Chapter 5 Metals and Non-Metals

Question 7.
You came to know that the Diamond is a hardest material and it is a non-metal and similarly Mercury is a soft material and it is a metal.Write down the questions raised in your mind.
Answer:

  1. Are all metals hard?
  2. Are there any non-metals hard like diamond?
  3. Are there any metals soft like mercury?
  4. What makes mercury so soft and diamond so hard?
  5. Can we distinguish those metals and non-metals depending on their opposite properties like these examples?

Question 8.
Taking the example of magnesium and sulphur explain how metals and non-metals produce with different characteristics.
Answer:

  1. Magnesium in the presence of oxygen burns to produce basic magnesium oxide. When it its added to water, it produces magnesium hydroxide, which turns the red litmus solution into blue.
  2. Sulphur combines with oxygen, it forms acidic oxide. It get changed into sulphurous acid when react with water. This turns the blue litmus solutions into red.

Question 9.
What happens when
a) Dilute sulphuric acid is poured on a copper plate?
b) Iron nails are placed in copper sulphate solution?
Answer:
a) Copper sulphate is formed and hydrogen gas is released.
copper + dilute sulphuric acid → copper sulphate + hydrogen gas
b) Brown coating is deposited on the Iron nails. This is because of displacement of copper from copper sulphate solution by Iron.
Iron + Copper sulphate(solution) → Iron sulphate(solution) + Copper

8th Class Physical Science 5th Lesson Metals and Non-Metals 4 Marks Important Questions and Answers

Question 1.
What happens when magnesium, sulphur burnt in the presence of oxygen ? Write the word equation.
Answer:
When magnesium is burnt in the presence of oxygen it burns brilliantly and forms white ashes of magnesium oxide.
AP Board 8th Class Physical Science Important Questions Chapter 5 Metals and Non-Metals 3
When sulphur is burnt in the presence of oxygen, it forms a yellowish gas called sulphur dioxide.
AP Board 8th Class Physical Science Important Questions Chapter 5 Metals and Non-Metals 4

AP Board 8th Class Physical Science Important Questions Chapter 5 Metals and Non-Metals

Question 2.
What are uses of various non-metals?
Answer:
Uses of non-metals:

  1. Oxygen is essential for all living beings.
  2. Nitrogen as fertilizer enhance the growth of plants.
  3. Chlorine is used to purify the water.
  4. Sulphur is used in making fire works, crackers, gun powder, match sticks and anticeptic ointments.
  5. Activated carbon is used as decolourising agent and also in water purification systems.
  6. Tincture iodine is used in medical purpose.

Question 3.
What are the uses of metals?
Answer:
Uses of metals:

  1. Gold, silver, copper are used in making jewellery.
  2. Silver foil is used in decoration of sweets.
  3. Aluminium foil is used in inner packing of food materials and toffees.
  4. Aluminium and copper mixture is used in currency coins, medals and statues.
  5. Zinc and iron mixture is used in making of iron sheet.
  6. Most of agricultural instruments are made by iron.
  7. Electrical appliances, automobiles, satellites, aeroplanes, cooking utensils, machinery decorative materials are made by metals.

Question 4.
Prepare a table of various metals and non-metals used in our daily life and their usage.
Answer:

Metals/non-metalsTheir usage
1) GoldJewellery
2) SilverJewellery
3) CopperJewellery, utensils, electrical appliances
4) AluminiumUtensils, packing of food, aeroplanes, satellites
5) IronUtensils, electric appliances, agricultural tools
6) IodineMedical purpose
7) ChlorinePurification of water
8) NitrogenFertilizers
9) SulphurGun powder, matchsticks, fire works, crackers, antiseptic ointments
10) OxygenEssential for all living things to live

AP Board 8th Class Physical Science Important Questions Chapter 5 Metals and Non-Metals

Question 5.
The nature of oxides helps to identify the metals and non-metals conduct an experi-ment to prove this and record the observations.
Answer:
I) Aim: The nature of oxides helps to identify the metals.
Material required : Magnesium sample, spirit lamp, red litmus paper.
Procedure:

  1. Take a small strip of magnesium and burn it and note the appearance after the reaction.
    Reaction: When we burn the sample of magnesium, it reacts with oxygen in air and form magnesium oxide.
    AP Board 8th Class Physical Science Important Questions Chapter 5 Metals and Non-Metals 5
  2. Take magnesium oxide solution and place red litmus in it. Red litmus turns to blue indicates the solution is basic in nature.

Result: Metallic oxides solutions are basic in nature. So if the oxide solution is basic then the oxide is formed by a metal.

II) Aim: The nature of oxides help to identify the non-metals.
Material required: Sulphur sample, spirit lamp, blue litmus paper, deflagrating spoon. Procedure:

  1. Take a small amount of sulphur powder in a deflagrating spoon and heat it.
  2. As soon as sulphur starts burning, introduce the spoon into glass jar or tumbler.
  3. Add small quantity of water into the tumbler and quickly replace the lid. Shake the tumbler well.
    Reaction: Sulphur burns and reacts with oxygen in air to give sulphur dioxide.
    AP Board 8th Class Physical Science Important Questions Chapter 5 Metals and Non-Metals 6
  4. Place blue litmus paper in the prepared solution it turns to red indicates the solution is acidic nature.

Result: Non-metallic oxides solution are acidic in nature. So if oxide solution turns blue litmus into red then the oxide is formed by a non-metal.

AP Board 8th Class Physical Science Important Questions Chapter 5 Metals and Non-Metals

Question 6.
Collect the information about metals which we Use in our daily life, and their uses. Write a report on it.
Answer:

  1. The special properties of metals help us in many ways.
  2. Metals are lustrous (shining). So, we make ornaments of gold and silver.
  3. Metals are sonorous. So, we make school bells, temple bells, gongs, etc.
  4. The malleability of metals help us to make sheets of iron, etc.
  5. Ductility is the special character of metals which help us in making wires.
  6. Metals conduct heat and electricity. Hence we make utensils for cooking and electrical wires etc.
  7. Metals react with oxygen and produce oxides of basic nature.
  8. Metals react with acids (dilute) and liberate hydrogen gas. So, in the preparation of hydrogen gas, metals come in use.
  9. Non-metal like sulphur is used in making fire works, crackers, gun powder, matchsticks and antiseptic ointments.

Question 7.
Give reasons for the following.
a) Aluminium foils are used to wrap food items.
b) Immersion rods for heating liquids are made up of metallic substances.
c) Copper cannot displace Iron from its salt solution.
d) Sodium and potassium are stored in Kerosene.
Answer:
a) Aluminium has high malleability. So it is very easy to make aluminium foil compared other metals.
b) Because metals are good conductors of electricity.
c) Iron has more reactivity than copper. So copper cannot displace Iron from its salt solution.
d) Sodium and potassium have high reactivity with water and an even they burn in the presence of air and water. So these metals are stored in Kerosene.

Question 8.
Give reasons for the following.
i) Silver is used in making mirrors.
ii) Aluminium is used to make electrical wires.
iii) Sour food substances should not be stored in aluminium utensils.
iv) Iron is used in constructing bridges and houses.
Answer:
i) Silver has high reflecting power.
ii) Aluminimum is good conductor of electricity.
iii) Sour substances contain acids which react with aluminimum utensils to form toxic substances.
iv) Iron is hard, strong and rigid material.

AP Board 8th Class Physical Science Important Questions Chapter 5 Metals and Non-Metals

Question 9.
Give some differences with examples between metals and non-metals with reference to their properties. Give one exception in each case.
Answer:
a) Lustrous: Metals have shining surfaces. So they are called Lustrous. Whereas non-metals have dull surface so they are non Lustrous.
One of the form of carbon is diamond has most shining look.
Iodine a non-metal also has lustrous surface.
b) Malleability: Metals can be beaten into sheets and non-metals cannot be beaten into sheets. But mercury is a metal which breaks into pieces when hammered.
c) Ductility: Metals are drawn into wires. Non-metals cannot be drawn into wires. Mercury does not show ductility.
d) Conductivity: Metals are good conductors of heat and electricity and non-metals are bad conductors of electricity and heat. Graphite is a non-metal which is good conductor of heat and electricity.
e) Hardness: Metals are usually hard and non-metals are soft. But sodium and potassium are quite soft, they can be cut by using a knife. Diamond is a non-metal which is the hardest substance.

8th Class Physical Science 5th Lesson Metals and Non-Metals Important Questions and Answers

Question 1.
Predict the reason behind gold and platinum jewellery does not become dull.
Answer:
Gold and platinum does not react with components of air. So, gold and platinum does not rust. So gold jewellery does not become dull.

AP Board 8th Class Physical Science Important Questions Chapter 5 Metals and Non-Metals

Question 2.
Write any two differences between electric conductors and insulators.
Answer:

Electric conductorsElectric insulators
1) Those substances through which electricity can flow are called conductors.1) Those substances through which electricity
cannot flow are called insulators.
2) Generally metals are conductors.
Eg: Silver, copper
2) Generally non-metals are insulators.
Eg: Rubber, plastic, glass

Question 3.
Write any four uses of metals in different situations.
Answer:
Uses of metals:

  1. Gold, silver, copper are used in making jewellery.
  2. Silver foil is used in decoration of sweets.
  3. Aluminium foil is used in inner packing of food materials and toffees.
  4. Aluminium and copper mixture is used in currency coins, medals and statues.
  5. Zinc and iron mixture is used in making of iron sheet.
  6. Most of agricultural instruments are made by iron.
  7. Electrical appliances, automobiles, satellites, aeroplanes, cooking utensils, machinery decorative materials are made by metals.

Question 4.
Explain the reaction of metals with acids.
Answer:
Aim: To find the reactivity of metals with acids.
Apparatus: Test tube, dilute hydrochloric acid, magnesium ribbon, spirit lamp. Procedure:

  1. Take a magnesium ribbon and rub with a sand paper.
  2. Put this ribbon into a test tube containing dilute hydrochloric acid.
  3. A gas is evolved from the test tube.
  4. Now bring a burning match stick near the mouth of the test tube.
  5. The gas puts off the match stick and produces a pop sound and gas burns with blue flame.
  6. Which indicates hydrogen gas is released.
  7. We will get same results with zinc, iron, copper also.
  8. Conclusion: Metal reacts with acid and produce hydrogen gas.

AP Board 8th Class Physical Science Important Questions Chapter 5 Metals and Non-Metals

Question 5.
Explain a procedure to do the experiment that magnesium ribbon allows the flow of current.
Answer:
Procedure:
AP Board 8th Class Physical Science Important Questions Chapter 5 Metals and Non-Metals 1

  1. Arrange ah electric circuit with a battery and bulb.
  2. Close the circuit using a magnesium ribbon.
  3. Observe whether the bulb is glow or not.

Observation: Bulb glows.
Conclusion: Magnesium ribbon allows the flow of current.

Question 6.
Suggest an activity to show that the magnesium ribbon reacts with Oxygen to form Magnesium Oxide, which is basic in nature.
Answer:
Aim: To know reaction of oxygen with metals.
Material required: Magnesium strip, spirit lamp or Bunsen burner and litmus papers, distilled water.
Procedure:

  1. Take a small strip of magnesium.
  2. Burn it with spirit lamp.
  3. It burns brilliantly and produce white ashes of magnesium oxide due to reaction between magnesium and oxygen.
  4. Collect the ash of magnesium in a watch glass and add some distilled water.
  5. Test the solution with red litmus paper and blue litmus paper.

Observation: Red litmus paper turns into blue in colour.
Conclusion: Metallic oxide solutions are basic in nature.

AP Board 8th Class Physical Science Important Questions Chapter 5 Metals and Non-Metals

Question 7.
Zinc, Copper, Sulphur, Carbon, Categories into these into metals and non-metals and write their uses.

S.No.NameMetal/Non-metalUse
1.

2.

3.

4.

Answer:

S.No.NameMetal/Non-metalUse
1.Zincmetalsheets, batteries
2.Coppermetalelectrical wires, jewellary, Utensils
3.Sulphurnon-metalGun powder, fireworks, ointments
4.Carbonnon-metalWater purifiers, fuel

Question 8.
You are given copper sulphate, Iron sulphate, an iron nail and copper wire. How do you test the reactivity of metals iron and copper Explain through an activity.
Answer:
Activity:

  1. Take two beakers ‘a’ and ‘b’.
  2. Take 50 ml of water in each.
    AP Board 8th Class Physical Science Important Questions Chapter 5 Metals and Non-Metals 7
  3. Dissolve some amount of copper sulphate in beaker ‘a’ and iron sulphate in beaker ‘b’.
  4. Drop iron nails in beaker ‘a’ and copper wire in beaker ‘b’.
  5. Leave the beakers for some hours.

Observations:
i) In beaker ‘a’ copper layer forms on the iron nails and blue colour of copper sulphate turns pale blue or white.
ii) No change in beaker ‘b’.
Conclusion:
i) Copper is displaced by iron in beaker ‘a’.
Copper Sulphate + Iron → Iron sulphate + Copper
ii) Iron is not displaced by copper in beaker ‘b’.
Hence iron reactivity is more than copper.

AP Board 8th Class Physical Science Important Questions Chapter 5 Metals and Non-Metals

Question 9.
Draw a diagram of an activity of heat conduction by metals. Why iron, copper and aluminium are used to prepare in the manufacturing of cooking vessels?
Answer:
AP Board 8th Class Physical Science Important Questions Chapter 5 Metals and Non-Metals 2
Iron, Copper and aluminium cooking vessels are preferred due to their high heat conductivity.

AP Board 8th Class Physical Science Solutions 1st Lesson బలం

SCERT AP Board 8th Class Physical Science Solutions 1st Lesson బలం Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Physical Science 1st Lesson Questions and Answers బలం

8th Class Physical Science 1st Lesson బలం Textbook Questions and Answers

అభ్యసనాన్ని మెరుగుపరుచుకోండి

ప్రశ్న 1.
బలం అంటే ఏమిటి? బలం వల్ల తీసుకురాగలిగే మార్పులేమిటి?
జవాబు:
వస్తువుల నిశ్చల స్థితినిగాని, సమవేగంతో ఋజుమార్గంలో పోయే స్థితినిగాని మార్చేదీ లేక మార్చడానికి ప్రయత్నించే దానిని బలం అంటారు. బలం సదిశరాశి. బలానికి ప్రమాణాలు MKS పద్ధతిలో న్యూటన్లు, CGS పద్ధతిలో డైన్లు.

బలం వల్ల తీసుకురాగలిగే మార్పులు :

  1. నిశ్చల స్థితిలో గల వస్తువును బల ప్రయోగం వలన గమనంలోనికి మార్చవచ్చును.
  2. గమనంలో ఉన్న వస్తువును బల ప్రయోగం వలన వడిని మార్చవచ్చును.
  3. గమనంలో ఉన్న వస్తువును బలప్రయోగం వలన నిశ్చల స్థితిలోకి మార్చవచ్చును.
  4. గమనంలో ఉన్న వస్తువును బలప్రయోగం వలన గమన దిశను మార్చవచ్చును.
  5. బల ప్రయోగం వలన వస్తువు యొక్క ఆకృతిని మార్చవచ్చును.
  6. బల ప్రయోగం వలన వస్తువు యొక్క పరిమాణాన్ని మార్చవచ్చును.

ప్రశ్న 2.
బలాన్ని ప్రయోగించడం ద్వారా జరిగే కింది సందర్భాలకు ఉదాహరణలు ఇవ్వండి. (AS1)
ఎ) వస్తువు వడిలో మార్పు బి) వస్తువు ఆకృతిలో మార్పు సి) వస్తువు కదిలే దిశలో మార్పు
జవాబు:
ఎ) వస్తువు వడిలో మార్పు :

  1. ఒక పిల్లవాడు రబ్బరు టైరును కర్రతో కొడుతూ ముందుకు పరిగెడుతున్నాడు.
  2. ఆ టైరు ఎక్కువ వడిగా వెళ్ళడానికి దానిని కర్రతో మళ్ళీ మళ్ళీ కొడుతూ (బలాన్ని ఇస్తూ) ఉన్నాడు. అనగా బలాన్ని పెంచితే వస్తువు వడి పెరుగుతుంది.

బి) వస్తువు ఆకృతిలో మార్పు :

  1. ఒక స్పాంజ్ డస్టర్‌ను బలం ప్రయోగించి పిండడం వలన ఆ స్పాంజ్ డస్టర్ యొక్క ఆకృతి మారును.
  2. రొట్టెలు తయారు చేయునప్పుడు పిండి ముద్దను రొట్టెలు తయారు చేయు కర్రతో బలం ప్రయోగించి పలుచని వృత్తాకార ఆకృతిలోకి మార్చినపుడు లేదా సాగదీసినపుడు పిండి ముద్దను కొద్దిగా మార్చవచ్చును.

సి) వస్తువు కదిలే దిశలో మార్పు :

  1. కేరమ్ కాయిన్ ను స్ట్రైకర్ తో కొట్టినప్పుడు కాయితో పాటు స్ట్రైకర్ కూడ దిశని మార్చుకుంటుంది.
  2. క్రికెట్ ఆటలో బౌలర్ వేసే బంతి యొక్క దిశను బ్యా ట్స్ మేన్ తన బ్యాట్ తో మార్చుతాడు.

AP Board 8th Class Physical Science Solutions 1st Lesson బలం

ప్రశ్న 3.
స్పర్శాబలం, క్షేత్రబలం మధ్యగల భేదాలను వివరించండి. (AS1)
(లేదా)
స్పర్శాబలం, క్షేత్రబలంతో ఏ విధంగా విభేదిస్తుంది?
జవాబు:

స్పర్శాబలంక్షేత్రబలం
1) రెండు వస్తువుల మధ్య ప్రత్యక్ష స్పర్శా సంబంధం ద్వారా పనిచేసే బలాలను స్పర్శా బలాలు అంటారు.1) రెండు వస్తువులు ఒక దానితో ఒకటి ప్రత్యక్ష స్పర్శలో లేకుండా వాటి మధ్య బలం ఉన్నట్లయితే అటువంటి బలాన్ని క్షేత్రబలం అంటారు.
2) కండర బలం, ఘర్షణ బలం, అభిలంబ బలం మరియు తన్యతా బలాలు స్పర్శా బలానికి ఉదాహరణలు.2) అయస్కాంత బలం, విద్యుత్ బలం మరియు గురుత్వాకర్షణ బలాలు క్షేత్ర బలానికి ఉదాహరణలు.
3) రెండు వస్తువుల మధ్య తాడనం వలన ఏర్పడుతుంది.3) రెండు వస్తువులు క్షేత్రంలో ఉన్నపుడు ఏర్పడును.
4) దీనిలో క్షేత్ర ప్రాంతం ఉండదు.4) దీనిలో క్షేత్రప్రాంతం ఉంటుంది.
5) స్పర్శాబలం చాలా వేగంగా పనిచేస్తుంది.5) క్షేత్రబలం కొద్ది నెమ్మదిగా పనిచేస్తుంది.
6) ఇది సదిశ రాశి.6) ఇది సదిశ క్షేత్రం.

ప్రశ్న 4.
స్పర్శాబలానికి, క్షేత్రబలానికి రెండేసి ఉదాహరణలు ఇవ్వండి. (AS1)
జవాబు:
స్పర్శాబలానికి ఉదాహరణలు :

  1. టూత్ పేస్ట్ ట్యూబ్ ను చేతి వేళ్ళతో నొక్కినపుడు టూత్ పేస్ట్ ట్యూబ్ నుండి టూత్ పేస్ట్ బయటకు రావడం.
  2. ఒక బంతిని నేలపై విసిరినపుడు కొంతదూరం వెళ్ళి ఆగిపోతుంది. నీరు, బంతి ఉపరితలాల మధ్య ఘర్షణ బలం స్పర్శాబలంగా పనిచేసింది.
  3. సైకిల్ తొక్కడం ఆపేస్తే క్రమంగా సైకిల్ వడి తగ్గిపోయి ఆగిపోతుంది. సైకిల్ టైర్లకు, నేలకు మధ్య ఘర్షణ బలం స్పర్శాబలంగా పనిచేసింది.

క్షేతబలానికి ఉదాహరణలు :

  1. రెండు అయస్కాంతాల మధ్య ఆకర్షణ లేదా వికర్షణ బలాలు.
  2. ఒక బెలూనను ఒక కాగితంతో బాగా రుద్ది కాగితం ముక్కల వద్దకు తీసుకువస్తే ఆ కాగితం ముక్కలను బెలూను ఆకర్షిస్తుంది.
  3. పైకి విసిరిన రాయి తిరిగి భూమి మీద పడడం.

ప్రశ్న 5.
కింద ఇవ్వబడ్డ వాక్యంలో తప్పును సరిదిద్ది రాయండి. (AS1)
“కారు నిశ్చల స్థితిలో ఉంది కాబట్టి దానిమీద ఎటువంటి బలాలు లేవు”
జవాబు:
“కారు నిశ్చల స్థితిలో ఉంది కాబట్టి దాని మీద పనిచేసే బలాల ఫలిత బలం శూన్యం”.

ప్రశ్న 6.
కోయడానికి ఉపయోగించే పరికరాల అంచులు పదునుగా ఉంటాయి. ఎందుకు? (AS1)
జవాబు:

  1. కోయడానికి ఉపయోగించే పరికరాల అంచులు పదునుగా ఉంటాయి.
  2. ఎందుకంటే పదును ఉన్నవైపు స్పర్శా వైశాల్యం తక్కువగా ఉంటుంది.
  3. బలాన్ని ప్రయోగించినపుడు పదునైన భాగం వైపు ఉపరితల వైశాల్యం తక్కువ కాబట్టి అధిక పీడనాన్ని కలుగచేస్తుంది. కాబట్టి సులభంగా కోయవచ్చును.

AP Board 8th Class Physical Science Solutions 1st Lesson బలం

ప్రశ్న 7.
“ఫలిత బలం వల్ల వస్తువుల గమన స్థితిలో మార్పు వస్తుంది” ఈ వాక్యం ద్వారా మీరు ఏం అర్థం చేసుకున్నారో వివరించండి. (AS1)
(లేదా)
ఫలిత బలం వస్తువులపై ప్రయోగించబడడం వల్ల వాటి యొక్క చలనస్థితి మారుతుంది. సరైన ఉదాహరణలతో వివరించండి.
జవాబు:

  1. ఒక వస్తువు పై పనిచేసే అన్ని బలాల బీజీయ మొత్తాన్ని ఫలిత బలం అంటారు.
  2. ఫలిత బలం శూన్యమైతే ఆ వస్తువు నిశ్చలస్థితిలో ఉంటుంది.
  3. ఫలిత బలం శూన్యం కాకుండా ఉంటే ఆ వస్తువు గమనంలో ఉంటుంది.
  4. ఫలిత బలం విలువ మారుతూ ఉంటే వస్తువు గమన స్థితిలో మార్పు వస్తుంది.

ప్రశ్న 8.
“ఒక బరువైన వస్తువుని, నీవు ఎంత బలంగా నెట్టినా అది కదలదు” దీనికి గల కారణాన్ని “ఫలిత బలం” అనే భావనతో వివరించండి. (AS1)
జవాబు:

  1. ఒక బరువైన వస్తువుని నీవు ఎంత బలంగా నెట్టినా అది కదలదు దీనికి గల కారణం దాని ఫలిత బలం శూన్యం అగుట.
  2. ఒక వస్తువులో కదలిక దాని ఫలిత బలంపై ఆధారపడి ఉంటుంది.
  3. ఫలిత బలం శూన్యం అయితే ఆ వస్తువు కదలదు.
  4. ఫలిత బలం శూన్యం కానట్లైతే ఆ వస్తువు కదులుతుంది.

ప్రశ్న 9.
కింది పటాలలో ఫలిత బలాన్ని కనుక్కోండి. (AS5) (AS1)
AP Board 8th Class Physical Science Solutions 1st Lesson బలం 1
జవాబు:
AP Board 8th Class Physical Science Solutions 1st Lesson బలం 2
AP Board 8th Class Physical Science Solutions 1st Lesson బలం 3

ప్రశ్న 10.
భూమి మీద ఘర్షణ లేదని ఊహించండి. ఏం జరుగుతుందో వివరించండి. (AS2)
జవాబు:

  1. ఘర్షణ బలం లేకపోతే మనం నడవలేము.
  2. వాహనాలు జారిపడి పోయే ప్రమాదం గలదు.
  3. పెన్నుతో పేపరుపై వ్రాయలేము.
  4. అగ్గిపుల్లతో అగ్గి పెట్టె పై రుద్ది మంటను పుట్టించలేము.
  5. నల్లబల్లపై చాక్ పీతో వ్రాయలేము.
  6. బల్లపై ఉంచిన వస్తువులు జారిపడతాయి.
  7. రాక్స్ లేదా అల్మారాలో ఉంచిన వస్తువులు జారిపడిపోతాయి.
  8. గుర్రపు మరియు ఎద్దుల బండ్లను నడుపలేము.
  9. మేకులను గోడలో మరియు చెక్కలో దింపలేము.
  10. ఆహారాన్ని నమలలేము.
  11. ఏ వస్తువుకు నిశ్చలస్థితి ఉండదు.
  12. భవనాలు నిర్మించలేము.

ప్రశ్న 11.
కార్తీక్ టి.వి.లో “వన్డే క్రికెట్ మ్యాచ్” చూస్తున్నాడు. ఆట భోజన విరామంలో క్రికెట్ పిచ్ పై రోలర్‌ను దొర్లించడం గమనించాడు. ఆ రోలర్ దొర్లేటప్పుడు దానిపై పనిచేసే వివిధ బలాలు, ఫలిత బలం గురించి అతను ఆలోచించాడు. ఫలితబలం పనిచేసే దిశ గురించి అతని మదిలో అనేక ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. ఆ ప్రశ్నలేవో మీరు ఊహించగలరా? (AS2)
జవాబు:
AP Board 8th Class Physical Science Solutions 1st Lesson బలం 4

  1. బలం ప్రయోగించిన దిశలో రోలర్ ఎందుకు కదలలేదు?
  2. బలం ప్రయోగించిన దిశలో ఫలిత బలం ఎందుకు లేదు?
  3. బలం ప్రయోగించిన దిశకు కొంత కోణంలో ఫలిత బలం దిశ ఎందుకు ఉన్నది?
  4. ఫలిత బలం దిశలో రోలర్ కదిలితే పిచ్ ఎందుకు చదును అయినది?
  5. పిచ్ చదును అగుటకు ఏ బలం ఉపయోగపడినది?
  6. ఘర్షణ బలం ఏ దిశలో పని చేస్తుంది?

AP Board 8th Class Physical Science Solutions 1st Lesson బలం

ప్రశ్న 12.
ఎ. ఒకే విధమైన స్త్రాలు రెండు తీసుకుని, అందులో ఒక దానిని స్వేచ్ఛగా వేలాడదీయండి. రెండవ దానిని కాగితంతో రుద్ది వేలాడదీసిన స్ట్రా వద్దకు తీసుకురండి. ఈ కృత్యం ద్వారా మీరు ఏం గమనించారు? ఇవి ఏ రకమైన బలం? (AS3)
జవాబు:

  1. కాగితంతో రుద్దిన స్ట్రాను స్వేచ్ఛగా వేలాడదీసిన స్ట్రా వద్దకు తీసుకొని వచ్చినపుడు మొదట ఆకర్షించుకున్నది. ఆ తర్వాత వికర్షించుకున్నది.
  2. కాగితంతో రుద్దిన స్ట్రా మరియు స్వేచ్ఛగా వేలాడదీసిన స్ట్రాల మధ్య వికర్షణ బలం, స్థావర విద్యుత్ బలం ఏర్పడ్డాయి.

బి. పొడి జుట్టుని దువ్వెనతో దువ్వి ఆ దువ్వెనను చిన్న చిన్న కాగితపు ముక్కల దగ్గరకు తీసుకురండి. ఏం గమనించారు? వివరించండి. (AS3)
జవాబు:

  1. పొడిజుట్టుని దువ్వెనతో దువ్వి ఆ దువ్వెనను చిన్న చిన్న కాగితపు ముక్కల దగ్గరకు తీసుకువస్తే అది కాగితం ముక్కలను ఆకర్షిస్తుంది.
  2. పొడి జుట్టు దువ్వెనతో దువ్వడం వలన ఘర్షణ బలం వల్ల స్థావర విద్యుత్ ఆవేశాలు ఏర్పడ్డాయి.
  3. దువ్వెనకు గల స్థావర విద్యుత్ ఆవేశాలు కాగితం ముక్కలను ఆకర్షిస్తుంది.

ప్రశ్న 13.
స్పర్శాబలాలను, క్షేత్రబలాలను వివరించే చిత్రాలను వార్తాపత్రికలు, అంతర్జాలం మొదలైన వాటి నుండి సేకరించి నోట్ బుక్ లో – అంటించి ప్రదర్శించండి. (AS4)
జవాబు:
AP Board 8th Class Physical Science Solutions 1st Lesson బలం 5

ప్రశ్న 14.
పటంలో చూపిన విధంగా మెట్ల మీద ఒక కర్రని పెట్టారు . ఆ కర్ర మీద పనిచేసే అభిలంబ బలాలను గీయండి. (AS5)
AP Board 8th Class Physical Science Solutions 1st Lesson బలం 6
జవాబు:
AP Board 8th Class Physical Science Solutions 1st Lesson బలం 7

ప్రశ్న 15.
చెట్టు ఊడని పట్టుకొని ఒక కోతి నిశ్చలంగా వేలాడుతూ ఉందనుకోండి. ఆ కోతిపై పనిచేసే బలాలు ఏవి? (AS7)
జవాబు:
కోతిపై పనిచేసే బలాలు :

  1. కోతిపై గురుత్వ బలం భూమి వైపు పనిచేస్తుంది.
  2. కోతి నుండి పైవైపు ఊడ తన్యతాబలం పనిచేస్తుంది.

ప్రశ్న 16.
నిశ్చలంగా ఉన్న ఒక బరువైన వస్తువును కదల్చాలంటే నువ్వు దానిపై కొంత బలాన్ని ప్రయోగించాలి. అయితే ఒకసారి కదిలిన తరువాత, దానిని అదే గమనస్థితిలో ఉంచడానికి కొద్ది బలం ప్రయోగిస్తున్నా సరిపోతుంది. ఎందుకు? (AS1)
జవాబు:

  1. నిశ్చలస్థితి గల ఒక బరువైన వస్తువును గమన స్థితిలోకి మార్చుతూ ఉంటే సైతిక ఘర్షణబలం వ్యతిరేకిస్తుంది.
  2. గమనంలో ఉన్న వస్తువును జారుడు ఘర్షణ బలం నిశ్చలస్థితిలోకి మారుస్తుంది.
  3. సైతిక ఘర్షణ బలం కంటే జారుడు ఘర్షణ బలం చాలా తక్కువగా ఉంటుంది.
  4. కాబట్టి వస్తువు ఒకసారి కదిలిన తరువాత, దానిని అదే గమన స్థితిలో ఉంచడానికి కొద్దిగా బలం (జారుడు ఘర్షణ బలానికి సరిపడు) ప్రయోగిస్తే సరిపోతుంది.

ప్రశ్న 17.
కింది రెండు సందర్భాలలో పీడనాన్ని ఎలా పెంచగలవు? (AS1)
ఎ) వైశ్యాలంలో మార్పు లేనపుడు బి) బలంలో మార్పు లేనపుడు
జవాబు:
ఎ) వైశాల్యంలో మార్పు లేనపుడు :

  1. వైశాల్యం మార్పు లేనపుడు పీడనాన్ని పెంచాలంటే దానిపై బలాన్ని పెంచాలి.
  2. పీడనం బలానికి అనులోమానుపాతంలో ఉంటుంది.

బి) బలంలో మార్పు లేనపుడు :

  1. బలం మార్పు లేనపుడు పీడనాన్ని పెంచాలంటే స్పర్శావైశాల్యాన్ని తగ్గించాలి.
  2. పీడనము, స్పర్శా వైశాల్యానికి విలోమానుపాతంలో ఉంటుంది.

AP Board 8th Class Physical Science Solutions 1st Lesson బలం

ప్రశ్న 18.
ఘర్షణని తగ్గించడానికి కొన్ని మార్గాలను సూచించి, వాటిని పరీక్షించడానికి ప్రయోగాన్ని రూపకల్పన చేసి నిర్వహించండి.
జవాబు:
ఘర్షణని తగ్గించడానికి కొన్ని మార్గాలు :

  1. ఘర్షణను తగ్గించడానికి స్పర్శించుకొనే తలాలను నునుపుగా ఉంచాలి.
  2. ఘర్షణను తగ్గించడానికి స్పర్శించుకొనే తలాలకు కందెనలను, నూనెలను పూయాలి.
  3. యంత్రాలలో, చక్రాలలో ఘర్షణను తగ్గించడానికి బాల్ బేరింగ్ ను ఉపయోగించాలి.

నునుపైన తలాలు ఘర్షణ బలాలు తగ్గిస్తాయి అని ప్రయోగపూర్వకంగా నిరూపించుట :
1) ఉద్దేశ్యము : నునుపైన తలంపై ఘర్షణ తక్కువగా ఉంటుంది.

2) పరికరాలు : 1) నునుపుగా ఉండే పొడవైన చెక్క, 2) గరుకుగా ఉండే పొడవైన చెక్క, 3) రెండు గోళీలు.

3) ప్రయోగము :

  1. నునుపైన మరియు గరుకుగా ఉండే చెక్కలను ఒకదాని ప్రక్కన ఒకటి క్షితిజ సమాంతరంగా అమర్చాలి.
  2. ఒక్కొక్క చెక్కపై ఒక్కొక్క గోళీని ఉంచి ఒకే బలంతో రెండింటిని కదల్చండి.
  3. ఏ గోళీ ఎక్కువ దూరం కదిలినదో కనుగొనండి.
  4. నునుపైన చెక్క తలంపై గోళీ ఎక్కువ దూరం కదిలినది. కావున నునుపైన తలంపై ఘర్షణ బలం తక్కువగా ఉండుట వలన గోళీ ఎక్కువ దూరం కదిలినది అని తెలుస్తుంది.
  5. గరుకైన చెక్క తలంపై గోళీ తక్కువ దూరం కదిలినది. కావున గరుకు తలంపై ఘర్షణ బలం ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది.

పై ప్రయోగము వలన నునుపైన తలాలు తక్కువ ఘర్షణ బలాన్ని కల్గిస్తాయి అని తెలుస్తుంది.

ప్రశ్న 19.
క్రింది పటం పరిశీలించండి. అందులో ఘర్షణ బలం, అభిలంబ బలం ఏ దిశలో పనిచేస్తాయో తెలపండి. (AS5)
AP Board 8th Class Physical Science Solutions 1st Lesson బలం 8
జవాబు:
AP Board 8th Class Physical Science Solutions 1st Lesson బలం 9

ప్రశ్న 20.
సమతలంపై స్థిరంగా నిలబడ్డ వ్యక్తిపై ఏయే బలాలు పని చేస్తుంటాయి? అతనిపై పనిచేసే బలాలన్నింటిని సూచించే స్వేచ్ఛావస్తుపటాన్ని (FBD) గీయండి. (AS5)
జవాబు:
AP Board 8th Class Physical Science Solutions 1st Lesson బలం 10

ప్రశ్న 21.
నిత్య జీవితంలో మనం వివిధ కృత్యాలు చేయడానికి ఉపయోగపడే ఘర్షణ యొక్క పాత్రని నీవు ఏ విధంగా అభినందిస్తావు?
జవాబు:

  1. నడవడం, పరుగెత్తడం అనే కృత్యాలలో ఘర్షణ బలం ఉపయోగపడుతుంది.
  2. వాహనాలు నడపడానికి ఘర్షణ బలం ఉపయోగపడుతుంది.
  3. మేకులను చెక్కలోకి మరియు గోడలోనికి దించడానికి ఘర్షణ బలం ఉపయోగపడుతుంది.
  4. గుర్రపు బండ్లు మరియు ఎడ్ల బండ్లు నడపడానికి ఘర్షణబలం ఉపయోగపడుతుంది.
  5. కాగితంపై పెన్నుతో వ్రాయడానికి ఘర్షణ బలం ఉపయోగపడుతుంది.
  6. బోర్డ్ పై చాపీ తో వ్రాయడానికి ఘర్షణ బలం ఉపయోగపడుతుంది.
  7. భవన నిర్మాణములో ఘర్షణ బలం ఉపయోగపడుతుంది.
  8. వస్తువులను చేతితో పట్టుకోవడంలో ఘర్షణ బలం ఉపయోగపడుతుంది.
  9. వడ్రంగి చెక్క తలాలను నునుపు చేయుటకు ఘర్షణ బలం ఉపయోగపడుతుంది.

నిత్య జీవితంలో మనం వివిధ పనులు చేయడానికి ఉపయోగపడే ఘర్షణ యొక్క పాత్రను ఎంతగానో అభినందించ వలసిన అవసరం ఉన్నది.

8th Class Physical Science 1st Lesson బలం Textbook InText Questions and Answers

ఆలోచించండి – చర్చించండి

8th Class Physical Science Textbook Page No. 5

ప్రశ్న 1.
m ద్రవ్యరాశి గల క్రికెట్ బంతిని కొంత వేగంతో పైకి విసిరారనుకోండి. గాలి నిరోధాన్ని విస్మరిస్తే (ఎ) అది చేరుకునే గరిష్ఠ ఎత్తులో సగం ఎత్తు వద్ద (బి) గరిష్ఠ ఎత్తు వద్ద ఆ బంతిపై ఏ ఏ బలాలు పనిచేస్తుంటాయి?
జవాబు:
AP Board 8th Class Physical Science Solutions 1st Lesson బలం 11
(ఎ) గరిష్ఠ ఎత్తులో సగం ఎత్తు (h/2) వద్ద పనిచేసే బలాలు:

  1. గురుత్వ బలం (mg)
    విసిరిన బలంలో కొంత బలము.

(బి) గరిష్ఠ ఎత్తు (h) వద్ద పనిచేసే బలాలు:

  1. గురుత్వ బలం (mg)

8th Class Physical Science Textbook Page No. 6

ప్రశ్న 2.
ఒకే రంగు పూసిన రెండు లోహపు కడ్డీలు మీ వద్ద ఉన్నాయనుకోండి. అందులో ఒకటి ఉక్కుది, రెండవది అయస్కాంతం. అందులో ఏది అయస్కాంతమో, ఏది ఉక్కు కడ్డీయో మీరు ఏ విధంగా నిర్ణయిస్తారు? (నిబంధన : కడ్డీలను విరచరాదు)
జవాబు:
ఇనుప రజనును ఏ కడ్డీ ఆకర్షిస్తుందో ఆ కడ్డీ అయస్కాంతంగాను, ఇనుప రజనును ఆకర్షించని కడ్డీని ఉక్కు కడ్డీగా గుర్తించవచ్చును.

8th Class Physical Science Textbook Page No. 8

ప్రశ్న 3.
ఒక పుస్తకం బల్లపై నిశ్చలస్థితిలో ఉంది. ఆ పుస్తకంపై ఘర్షణ బలం పనిచేస్తున్నదా? లేదా? వివరించండి.
జవాబు:

  1. బల్లపై గల పుస్తకంపై ఘర్షణ బలం పనిచేస్తుంది.
  2. నిశ్చలస్థితిలో గల వస్తువులపై పనిచేసే ఘర్షణ బలాన్ని సైతిక ఘర్షణ బలం అంటారు.
  3. నిశ్చల స్థితిలో గల పుస్తకాన్ని చలన స్థితి పొందుటకు కావలసిన బలం కంటే తక్కువ బలం ప్రయోగించినపుడు పుస్తకం చలనంలో ఉండదు. కారణం ప్రయోగించిన బలాన్ని సైతిక ఘర్షణ బలం నిరోధిస్తుంది.

8th Class Physical Science Textbook Page No. 10

ప్రశ్న 4.
A మరియు B అనే వస్తువులతో కూడిన ఒక వ్యవస్థ ప్రక్క పటంలో చూపబడింది. A మరియు B వస్తువుల మీద ఏ ఏ బలాలు పనిచేస్తున్నాయో చెప్పండి.
AP Board 8th Class Physical Science Solutions 1st Lesson బలం 12
జవాబు:
A వస్తువుపై పనిచేసే బలాలు :

  1. గురుత్వ బలం
  2. అభిలంబ బలం
  3. B యొక్క భారం (B యొక్క గురుత్వబలం)

B వస్తువుపై పనిచేసే బలాలు :

  1. 1గురుత్వ బలం
  2. అభిలంబ బలం

AP Board 8th Class Physical Science Solutions 1st Lesson బలం

ప్రశ్న 5.
స్పర్శా బలాలను ఘర్షణ బలం, అభిలంబ బలం అని వేరుపరచి చూడాల్సిన అవసరం ఏమిటో రెండు కారణాలతో వివరించండి.
జవాబు:

  1. ఘర్షణ బలం, అభిలంబ బలాలు వేరువేరు దిశలలో పని చేయడం.
  2. ఘర్షణ బలం చలన దిశకు వ్యతిరేక దిశలో ఉండి, వస్తువు చలనాన్ని నిరోధిస్తుంది. కాని అభిలంబ బలాన్ని గురుత్వ బలం సమతుల్యం చేస్తుంది.

8th Class Physical Science Textbook Page No. 13

ప్రశ్న 6.
మీ స్నేహితునితో మోచేతి కుస్తీ (arm wrestling) ఆట ఆడండి. ఆటలో గెలుపుని ‘ఫలితబలం’ భావనతో వివరించండి. ఈ ఆట ఆడేటపుడు మీ మోచేతిపై పనిచేసే బలాల పేర్లు, వాటి దిశలను తెల్పండి. ఈ సన్నివేశానికి స్వేచ్ఛా వస్తుపటం (FBD) ను గీయడానికి ప్రయత్నించండి.
జవాబు:
AP Board 8th Class Physical Science Solutions 1st Lesson బలం 13
పటం – 1 లో స్వేచ్చా వస్తుపటం FBD :

F1, F2 లు → అభిలంబ బలాలు
Fg → గురుత్వబలం
Fm1 → మొదటి వ్యక్తి కండర బలం
Fm2 → రెండవ వ్యక్తి కండర బలం
X – అక్షం వెంట ఫలితబలం Fnet = Fm2 – Fm1
X – అక్షం వెంట ఫలిత బలం = Fg – (F1+ F2)

AP Board 8th Class Physical Science Solutions 1st Lesson బలం 14
పటం – 2 లో ఆటలో గెలుపును పొందిన భావనతో స్వేచ్ఛా వస్తుపటం

F1, F2 లు → అభిలంబ బలాలు
Fg → గురుత్వబలం
Fm1 → మొదటి వ్యక్తి కండర బలం
Fm2 → రెండవ వ్యక్తి కండర ,బలం
X – అక్షం వెంట ఫలిత బలం = (Fm1 + F1 + F2) – (Fg+ Fm1)

ప్రశ్న 7.
బలాలు ఏమి చేయగలవు?
జవాబు:

  1. నిశ్చలస్థితిలో గల వస్తువును గమన స్థితిలోకి మార్చగలవు.
  2. గమన స్థితిలో గల వస్తువుల వడిని పెంచగలవు.
  3. గమన స్థితిలో గల వస్తువుల వడిని తగ్గించగలవు.
  4. గమన స్థితిలో గల వస్తువులను నిశ్చలస్థితిలోకి మార్చగలవు.
  5. వస్తువుల ఆకృతిని మరియు ఆకారాన్ని మార్చగలవు.

8th Class Physical Science Textbook Page No. 16

ప్రశ్న 8.
పీడనానికి దిశ ఉంటుందా? వివరించండి.
జవాబు:

  1. పీడనం అదిశ రాశి. పీడనానికి పరిమాణం మాత్రమే ఉంటుంది. దిశ ఉండదు.
  2. మృదువైన పదార్థాలు మాత్రమే బలాన్ని ప్రయోగిస్తే పీడనాన్ని కలుగజేస్తాయి.
  3. దృఢమైన వస్తువులపై బలాన్ని ప్రయోగిస్తే బలం ప్రయోగించిన దిశలో వస్తువు కదులుతుంది.
  4. మృదువైన పదార్థాలపై బలాన్ని కలుగజేస్తే, ఆ పదార్థాలు అన్ని దిశలలో పీడనాన్ని కలుగజేస్తాయి.
    ఉదా : నీరు గల పాత్ర ; వాయువు గల వాయుపాత్ర మరియు గాలి గల బెలూను.

8th Class Physical Science Textbook Page No. 15

ప్రశ్న 9.
స్కూలు బ్యాగులు, షాపింగ్ బ్యాగులకు వెడల్పైన బెల్ట్ లు ఉండడానికి కారణమేమిటి?
జవాబు:
స్కూలు బ్యాగులు, షాపింగ్ బ్యాగులకు వెడల్పైన బెల్ట్ లు ఉండడానికి కారణము స్పర్శా బలం పెరిగి బల ప్రభావమును, పీడనమును తగ్గించుటకు.

ప్రశ్న 10.
అధిక బరువులు తీసుకువెళ్ళే లారీలకు ఎక్కువ సంఖ్యలో వెడల్పైన టైర్లు ఎందుకు ఉంటాయో తెల్పండి.
జవాబు:
అధిక బరువులు తీసుకువెళ్ళే లారీలకు ఎక్కువ సంఖ్యలో వెడల్పైన టైర్లు ఉంటాయి. ఎందుకంటే భూమిపైన పీడనమును తగ్గించుటకు.

పరికరాల జాబితా

స్ట్రా, డస్టరు, అయస్కాంతము, తాడు, టూత్ పేస్టు, మూతగల సీసా, కార్పెట్, గరుకు రోడ్డు, నున్నని గచ్చు, వివిధ దారాలు, సూది, థర్మోకోల్ బాల్స్, బెలూన్, కాగితపు ముక్కలు, డ్రాయింగ్ షీట్, టేబుల్, రబ్బరు బ్యాండ్, క్యారమ్ బోర్డు, స్పాంజ్, ప్లాస్టిక్ బాటిల్, అద్దము, పెన్సిల్, వాలుతలము, రూపాయి నాణెం, స్ప్రింగ్ త్రాసు, భారాలను తగిలించే కొక్కెం, భారాలు, దండాయస్కాంతం, ఇనుపరజను, పుట్ బాల్ (పెద్దబంతి), ప్లాస్టిక్ ట్రేలు, ఇటుకలు.

8th Class Physical Science 1st Lesson బలం Textbook Activities

కృత్యములు

కృత్యం -1

1. వివిధ పనులలో నెట్టడాన్ని, లాగడాన్ని గుర్తించడం :
ఈ క్రింది పట్టికలో వివిధ పనులు చేస్తున్న పటాలను పరిశీలించి నెట్టడాన్ని, లాగడాన్ని గుర్తించి పట్టికలో నమోదు చేయండి.
AP Board 8th Class Physical Science Solutions 1st Lesson బలం 15
జవాబు:
AP Board 8th Class Physical Science Solutions 1st Lesson బలం 16

కృత్యం – 2

2. అయస్కాంత బలాన్ని పరిశీలించుట :
ఒక సూదిని తీసుకోండి. ఒక దండయస్కాంతాన్ని తీసుకుని దానిపై ఒకే దిశలో అనేకసార్లు రుద్దండి. ఆ సూది అయస్కాంతంగా మారడం మీరు గమనించవచ్చు. దిక్సూచి సహాయంతో ఆ సూది యొక్క ఉత్తర, దక్షిణ ధృవాలను గుర్తించవచ్చు. దక్షిణ ధృవం ఉన్న వైపు ఒక చిన్న ఎరుపు బెండు బంతిని గుచ్చండి. ఉత్తర ధృవం వైపు ఒక తెల్ల బెండు బంతిని గుచ్చండి. ఇదే విధంగా ఇంకొక సూదిని తీసుకొని తయారుచేయండి. ఈ క్రింది విధంగా చేయండి.
AP Board 8th Class Physical Science Solutions 1st Lesson బలం 17

ఎ) ఒకే రంగు బంతులు కలిగిన సూదుల చివరలు ఎదురెదురుగా ఉండేలా ఆ సూదులను నీటిలో ఉంచండి. ఏం జరుగుతుంది?
జవాబు:
ఒకే రంగు బంతులు కలిగిన సూదుల చివరలు వికర్షించుకోవటం గమనించవచ్చును.

బి) వేర్వేరు రంగు బంతులు కలిగిన సూదుల చివరలు ఎదురెదురుగా ఉండేలా నీటిలో వదలండి. ఏం జరిగింది?
జవాబు:
వేరువేరు రంగు బంతులు కలిగిన సూదుల చివరలు ఆకర్షించుకోవడం గమనించవచ్చును.

సి) ఆ సూదులు ఒకదానికొకటి ఆకర్షించుకొంటే లేదా వికర్షించుకొంటే ఆ బలాన్ని ఏమంటారు?
జవాబు:
రెండు అయస్కాంతాల మధ్య కంటికి కనిపించకుండా పనిచేసే ఆకర్షణ లేదా వికర్షణ బలాన్ని అయస్కాంత బలం అంటారు.

AP Board 8th Class Physical Science Solutions 1st Lesson బలం

కృత్యం – 3

3. స్థావర విద్యుత్ బలాలను పరిశీలించుట :

ఒక బెలూనను ఊది దాని చివర ముడి వేయండి. ఒక కాగితాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి గచ్చుపై వేయండి. ఇప్పుడు బెలూనను ఒక కాగితంతో బాగా రుద్ది కాగితం ముక్కల వద్దకు తీసుకురండి.
AP Board 8th Class Physical Science Solutions 1st Lesson బలం 18

ఎ) ఏం జరిగింది? చిన్న చిన్న కాగితపు ముక్కలు బెలూన్ వైపుకి లాగబడ్డాయా?
జవాబు:
చిన్న చిన్న కాగితపు ముక్కలు బెలూన్ వైపుకి లాగబడ్డాయి.

బి) కాగితపు ముక్కలను బెలూన్ ఎందుకు ఆకర్షించింది?
జవాబు:
బెలూనను రుద్దడం వల్ల దానిపై విద్యుత్ బలం ఏర్పడడం వలన కాగితం ముక్కలు ఆకర్షింపబడినవి.

సి) కాగితపు ముక్కలకు బదులు ఉప్పు, మిరియాల పొడిని ఉపయోగించి చూడండి. ఏం జరుగుతుందో గమనించండి.
జవాబు:
ఉప్పు, మిరియాల పొడి బెలూన్ చే ఆకర్షింపబడవు.

కృత్యం – 4

4. అయస్కాంత క్షేత్రాన్ని పరిశీలించుట :

ఒక దండయస్కాంతాన్ని టేబుల్ పై పెట్టి దానిపై మందంగా ఉండే ఒక తెల్లకాగితాన్ని ఉంచండి. ప్రక్క పటంలో చూపిన విధంగా కాగితంపై ఇనుప రజను వెదజల్లండి. ఇపుడు టేబుల్ ని గానీ, కాగితాన్ని గానీ మెల్లగా పెన్ / పెన్సిల్ తో తట్టండి.
AP Board 8th Class Physical Science Solutions 1st Lesson బలం 19

ఎ) ఏం గమనించారు? ఇనుప రజను ఏదైనా ఒక ప్రత్యేక ఆకృతిలో అమరిందా?
జవాబు:

  1. దండయస్కాంతం యొక్క అయస్కాంత బలం ప్రభావం వల్ల ఇనుపరజను ఆ అయస్కాంతం చుట్టూ కొంత ప్రాంతంలో వక్రరేఖలుగా తమకు తాము సర్దుకోవడం గమనించాను.
  2. ఇనుపరజను దండయస్కాంతం యొక్క ఉత్తర ధృవం నుండి దక్షిణ , ధృవం వరకు వరుసగా వక్రరేఖ వలె అనేక రేఖలు ఏర్పడ్డాయి. ఈ వక్రరేఖలు దండయస్కాంతంకు ఇరువైపుల ఏర్పడ్డాయి. ఈ రేఖలు అయస్కాంత క్షేత్రం ఏర్పడిన ప్రాంతాన్ని అయస్కాంత క్షేత్రం అంటారు.

కృత్యం – 5

5. కండర బలాన్ని ఉపయోగించే సందర్భాల జాబితా తయారు చేయడం :

కండర బలాన్ని ఉపయోగించి పనిచేసే సందర్భాలను వ్రాయండి.

  1. సైకిల్ తొక్కడం
  2. ఈత కొట్టడం
  3. పరుగెత్తడం
  4. బరువులు మోయడం
  5. త్రవ్వడం
  6. స్ట్రాతో పానీయాన్ని తాగడం
  7. డస్టరుతో నల్లబల్లపై అక్షరాలను చెరపడం
  8. ఇల్లు ఊడ్చటం
  9. కొండరాళ్ళు కొట్టడం
  10. స్నానం చేయడం
  11. ఆటలు ఆడడం

కృత్యం – 6

6. పనిచేసేటప్పుడు ఏదేని కండరంలోని మార్పును పరిశీలించుట :
బంతిని విసిరినపుడు కండరంలోని మార్పును పరిశీలించి వ్రాయండి.
జవాబు:
బంతిని విసురుతున్నపుడు ఛాతి, భుజం ముందు భాగంలోని కండరాలు వ్యాకోచించి మన చేతిని ముందుకు లాగితే, భుజం వెనుక భాగంలోని కండరాలు సంకోచించి మన కదలికని నియంత్రిస్తాయి.

AP Board 8th Class Physical Science Solutions 1st Lesson బలం

కృత్యం – 7

7. వివిధ తలాలపై బంతి గమనాన్ని పరిశీలించుట :

కార్పెట్, గరుకుతలం, నున్నటి తలాలపై బంతి గమనాన్ని పరిశీలించి, బంతి గమనాన్ని ఏ తలం ఎక్కువగా నిరోధించునో, ఏ తలం తక్కువగా నిరోధించునో పరిశీలించి తెల్పండి.
జవాబు:

  1. కార్పెట్, గరుకు తలం మరియు నున్నటి తలాలపై ఒకే బలం ఉపయోగించి ఒక బంతిని కదిలేటట్లు చేసినాను.
  2. కార్పెట్ తలంపై బంతి తక్కువ దూరం ప్రయాణించినది.
  3. కార్పెట్ కంటె గరుకు తలంపై బంతి ఎక్కువ దూరం ప్రయాణించినది.
  4. కార్పెట్, గరుకు తలాల కంటె నున్నటి తలంపై బంతి ఎక్కువ దూరం ప్రయాణించింది.
  5. బంతి చలనాన్ని నిరోధించే క్రమము : కార్పెట్ తలం > గరుకుతలం > నున్నటి తలం
  6. బంతి కదిలిన దూరాల క్రమం : కార్పెట్ తలం – గరుకు తలం < నున్నటి తలం.

కృత్యం – 8

8. వాలుతలంపై వస్తువుల చలనాన్ని పరిశీలించుట :

ఒక ట్రేని తీసుకోండి. దానిమీద ఒక చివర అంచు దగ్గర చిన్న మంచు ముక్కను, ఎరేజర్ (రబ్బరు)ను మరియు ఒక రూపాయి బిళ్ళను ఒకే వరుసలో పెట్టండి. ఇపుడు ప్రక్క పటంలో చూపిన విధంగా ట్రేను అదే చివర పట్టుకొని నెమ్మదిగా పైకి ఎత్తి పరిశీలించండి.

ఈ క్రింది ప్రశ్నలకు జవాబులు వ్రాయండి.
AP Board 8th Class Physical Science Solutions 1st Lesson బలం 20

ఎ) ఈ మూడు వస్తువులలో ఏది మొదట కిందికి జారడం ప్రారంభించింది?
జవాబు:
ఈ మూడు వస్తువులలో మొదట జారిన వస్తువు మంచు ముక్క.

బి) అన్ని వస్తువులకు ఒకే పరిమాణంలో ఘర్షణ పనిచేస్తుందా?
జవాబు:
అన్ని వస్తువులకు ఘర్షణ, పరిమాణం వేరువేరుగా ఉన్నాయి.

సి) ఏ వస్తువుపై ఘర్షణ బలం ఎక్కువ? ఏ వస్తువుపై ఘర్షణ బలం తక్కువ?
జవాబు:
ఎరేజరు ఘర్షణ బలం ఎక్కువ. మంచు ముక్కకు ఘర్షణ బలం తక్కువ.

డి) ఈ మూడు వస్తువుల ఘర్షణ బలాల క్రమాన్ని వ్రాయండి.
జవాబు:
ఈ మూడు వస్తువుల ఘర్షణ బలాల క్రమం : ఎరేజర్ > రూపాయి బిళ్ళ > మంచు ముక్క

ప్రయోగశాల కృత్యం

AP Board 8th Class Physical Science Solutions 1st Lesson బలం 21
9. ఉద్దేశ్యం : దారం భరించగలిగే గరిష్ఠ బలాన్ని కనుగొనుట.
కావలసిన పరికరాలు : స్ప్రింగ్ త్రాసు, భారాలు, తేలిక దారాలు, భారాలు తగిలించే కొక్కెం (వెయిట్ హేంగర్)

నిర్వహణ పద్ధతి :
i) పరికరాలని పటంలో చూపిన విధంగా అమర్చండి.
ii) 50గ్రా.ల భారాన్ని వెయిట్ హేంగర్ కి వేలాడదీసి, స్ప్రింగ్ త్రాసులో రీడింగ్ గమనించండి.
iii) అలా దారం తెగిపోయేంత వరకు కొద్ది కొద్దిగా భారాలు పెంచుతూ స్ప్రింగ్ త్రాసులో రీడింగులు గమనిస్తూ ఉండండి.
iv) దారం తెగే దగ్గర రీడింగును గుర్తించండి.
v) వివిధ రకాల దారాలను ఉపయోగించి, అవి భరించగలిగే గరిష్టబలము యొక్క విలువలను క్రింది పట్టికలో నమోదు చేయండి.
AP Board 8th Class Physical Science Solutions 1st Lesson బలం 22
vi) ఈ మొత్తం వ్యవస్థని (అమరికని) సీలింగ్ నుంచి వేరుపరచి, మరల దారానికి భారాన్ని తగిలించే కొక్కెంను అమర్చి హేంగర్ పై తక్కువ భారం ఉండేలా చూసుకుని, చేతితో నెమ్మదిగా పైకి లేపండి.
vii) అలా పైకి ఎత్తుతున్నప్పుడు స్ప్రింగ్ త్రాసు రీడింగును గమనించండి.

అలాగే మెల్లగా కిందికి దించుతూ స్ప్రింగ్ త్రాసు రీడింగును గమనించండి.

ఎ) పైకి ఎత్తేటప్పుడు, కిందికి దించేటప్పుడు మీరు గమనించిన స్ప్రింగ్ త్రాసు రీడింగులను బట్టి మీరు ఏం చెప్పగలరు?
జవాబు:
స్ప్రింగ్ త్రాసులోని రీడింగులను బట్టి వేరొక బల ప్రభావం ఈ వ్యవస్థపై ఉందని తెలుస్తోంది.

బి) ఒక్కసారిగా మొత్తం అమరికని వేగంగా పైకి లేపితే దారం తెగిపోయిందా?
జవాబు:
ఒక్కసారిగా మొత్తం అమరికని వేగంగా, పైకిలేపితే దారం ఒక్కొక్కసారి తెగవచ్చు లేదా తెగకపోవచ్చు.

కృత్యం – 9

10. టేబుల్ పై ఫలితబలం ప్రభావం :

ఒక టేబుల్ ను ఇద్దరు విద్యార్థులు కింద పటంలో చూపిన విధంగా నెట్టుచున్నారు. ఆ పటాలను పరిశీలించి పటాల కింద గల ప్రశ్నలకు జవాబులు వ్రాయండి.
AP Board 8th Class Physical Science Solutions 1st Lesson బలం 23 AP Board 8th Class Physical Science Solutions 1st Lesson బలం 24 AP Board 8th Class Physical Science Solutions 1st Lesson బలం 25

ఎ) పటం -1 లో చూపిన విధంగా బరువైన టేబుల్ ను నెట్టడానికి ప్రయత్నించండి. కష్టంగా ఉంటుందా? సులభంగా ఉంటుందా?
జవాబు:
కష్టంగా ఉంటుంది.

బి) పటం – 3 లో టేబుల్ ఏ దిశలో కదిలింది?
జవాబు:
ఇద్దరు విద్యార్థుల బలం ప్రయోగించిన దిశలో కదిలింది.

సి) పటంలో – 3లో చూపిన విధంగా టేబుల్ ని ఇద్దరు విద్యార్థులు ఒకే వైపు నుండి నెట్టినారు. ఇపుడు సులభంగా ఉందా? ఉంటే ఏమిటి?
జవాబు:
సులభంగా కదిలింది. ఎందుకంటే ఇద్దరి బలాలు ఒకే దిశలో పనిచేయడం వల్ల, ఫలిత బలం పెరిగి ఆ టేబుల్ సులభంగా కదిలింది.

డి) పటం – 2లో చూపిన విధంగా విద్యార్థులు బలాన్ని ప్రయోగించినపుడు ఒకవేళ టేబులు కదలలేదు. ఎందుకు కదలలేదో వివరించండి.
జవాబు:
ఇద్దరు విద్యార్థులు రెండు వైపుల నుండి (వ్యతిరేక దిశలో) నెడుతున్నప్పుడు ఇద్దరి బలపరిమాణం సమానంగా ఉంటే ఫలితబలం శూన్యం అగును కాబట్టి,టేబులు కదలదు.

ఇ) పటం – 2 లో చూపిన విధంగా విద్యార్థులు బలాన్ని ప్రయోగించినపుడు ఒకవేళ టేబులు కదిలినది. ఎందుకు కదిలినదో వివరించండి. ఏ దిశలో కదులనో తెల్పుము.
జవాబు:
ఇద్దరు విద్యార్థులు రెండు వైపుల నుండి (వ్యతిరేక దిశలో) నెడుతున్నప్పుడు ఇద్దరి బలపరిమాణాలు సమానంగా లేకుంటే ఫలిత బలం శూన్యం కాదు కాబట్టి టేబులు కదులును. ఏ విద్యార్థి బలం పరిమాణం ఎక్కువ ఉన్నదో ఆ విద్యార్థి ప్రయోగించిన బలదిశలో టేబులు కదులుతుంది.

AP Board 8th Class Physical Science Solutions 1st Lesson బలం

కృత్యం – 10

11. చేతివేళ్ళపై సాగదీసిన రబ్బరుబ్యాండు ప్రభావం :

ఒక రబ్బరు బ్యాండుని తీసుకొని మీ చేతివేళ్ళతో సాగదీయండి. ఇలా సాగదీస్తున్నప్పుడు రబ్బరు బ్యాండు మీ వేళ్ళపై కలుగజేసే బలాన్ని మీరు అనుభవ పూర్వకంగా తెలుసుకుంటారు. ఇప్పుడు అలాంటిదే ఇంకొక రబ్బరు బ్యాండుని తీసుకుని, రెండింటిని కలిపి ఒకే పొడవుకి సాగదీయండి.
AP Board 8th Class Physical Science Solutions 1st Lesson బలం 26

ఎ) ఏం గమనించారు? ముందుకన్నా ఇప్పుడు మీ వేళ్ళపై కలుగజేయబడిన బలం అధికంగా ఉందా?
జవాబు:
ముందుకన్నా ఇప్పుడు వేళ్లపై కలుగజేయబడిన బలం అధికంగా ఉంది.

బి) ఇలాగే రబ్బరు బ్యాండ్ల సంఖ్య పెంచుతూ, అవి మీ వేళ్ళపై కలుగజేసే బలాన్ని పరిశీలించండి.
జవాబు:
రబ్బరు బ్యాండ్ల సంఖ్య పెరిగేకొలదీ అవి వేళ్ళపై కలుగజేసే బలం పెరుగుతుంది.

కృత్యం – 11

12. వస్తువు చలనదిశపై, స్థితిపై బల ప్రభావం : –
మీ పాఠశాలలో ఆటల పీరియడ్ నందు మైదానంలో ఫుట్ బాల్ ఆడినపుడు ఫుట్ బాల్ ను వివిధ రకాలుగా తన్నే ఉంటారు. ఫుట్ బాల్ ను తన్నినపుడు బాల్ గమనంలో జరిగే మార్పులను మీరు పరిశీలించిన వాటిని వ్రాయండి.
జవాబు:
AP Board 8th Class Physical Science Solutions 1st Lesson బలం 27
నేను ఫుట్ బాల్ ఆట ఆడినపుడు బాల్ లో కనిపించిన మార్పులు

  1. ఫుట్ బాల్ ను తన్నినపుడు బలప్రయోగం వల్ల నిశ్చల స్థితిలోని బాల్ గమన స్థితిలోకి మారినది.
  2. గమనస్థితి గల బాల్ పై బలప్రయోగం వల్ల వడిని పెంచవచ్చును.
  3. గమనస్థితిలో గల బాల్ పై బల ప్రయోగం వల్ల వడిని తగ్గించవచ్చును.
  4. గమన స్థితిలో గల బాల్ పై బల ప్రయోగం వల్ల గమన దిశను మార్చవచ్చును.
  5. గమన స్థితిలో గల బాల్ ను బల ప్రయోగం వల్ల నిశ్చల స్థితికి తీసుకు రావచ్చును.

కృత్యం – 12

13. వస్తువు దిశని మార్చడంలో ఫలితబల ప్రభావం :

ఒక కేరమ్ బోర్డు కాయిన్ ను స్టైకర్ తో కొట్టండి. మీ స్నేహితులని కూడా అలాగే కొట్టమని చెప్పండి. మీరు కొట్టిన ప్రతీసారీ కాయిన్ ఒకే దిశలో కదులుతుందా? లేదా? ఎందుకు? ఈ ఆటలో మీరు పరిశీలించిన పరిశీలనలను వ్రాయండి.
AP Board 8th Class Physical Science Solutions 1st Lesson బలం 28
జవాబు:

  1. ప్రతి సందర్భంలో కాయిన్ కదిలే దిశ మారుతుంది.
  2. కేరమ్ కాయినను స్టెతో కొట్టినప్పుడు కాయితో పాటు స్ట్రైకర్ కూడా దిశని మార్చుకుంటుంది.
  3. కాయిన్ లేదా స్ట్రైకర్ దిశ మారుతుంది. ఎందుకంటే ఫలిత బలం దిశలో కాయిన్ లేదా స్ట్రైకర్ కదులుట వలన.

కేరమ్ బోర్డ్ ఆటలో పరిశీలించిన పరిశీలనలు :

  1. ఫలిత బలం నిశ్చల స్థితిలో ఉండే కాయిన్లను గమనస్థితిలోకి మారుస్తుంది.
  2. ఫలిత బలం గమనస్థితిలో ఉండే స్ట్రైకర్ ను నిశ్చల స్థితిలోకి మారుస్తుంది.
  3. ఫలిత బలం స్ట్రైకర్ వడిని, దిశను మారుస్తుంది.

AP Board 8th Class Physical Science Solutions 1st Lesson బలం

కృత్యం – 13

14. వస్తువు ఆకారంపై బలం ప్రభావం :

ఈ క్రింది పట్టిక మొదటి వరుసలో ఇచ్చిన వివిధ సందర్భాలు వస్తువుపై బలం ప్రయోగించడానికి ముందు, బలం ప్రయోగించిన తర్వాత వస్తువు యొక్క ఆకారంలో మార్పు గమనించండి. ఆయా వస్తువు ఆకృతి తాత్కాలికంగా మారిందో, శాశ్వతంగా మారిందో గుర్తించి పట్టికలో నింపండి. తాత్కాలిక మార్పును “T’ తో, శాశ్వత మార్పును ‘P’తో సూచించండి.
జవాబు:

బలం ప్రయోగించు సందర్భంఆకారంలో మార్పు (తాత్కాలికం (1), శాశ్వతం(P))
రబ్బరు బ్యాండును సాగదీయడంT
స్పాంజ్ ని పిండటంT
కాగితాన్ని చింపడంP
ప్లాస్టిక్ బాటిల్ ని / గ్లాసును నలిపివేయడంP
రొట్టె చేయడంP
అద్దాన్ని పగలగొట్టడంP

కృత్యం -14

15. స్పర్శాతల వైశాల్యాన్ని బట్టి బల ప్రభావంలో మార్పు :

ఒక పెన్సిల్ ను తీసుకుని, పెన్సిల్ యొక్క వెనుకవైపు గుండ్రని చివరతో మీ అరచేతిపై నొక్కండి. తరవాత పెన్సిల్ యొక్క ముందువైపు అంటే మొనదేలి ఉన్న వైపు నుంచి మీ అరచేతిపై గుచ్చండి.
AP Board 8th Class Physical Science Solutions 1st Lesson బలం 29

ఈ రెండు సందర్భాలలో మీరు పొందిన అనుభూతిలో తేడా ఏమైనా ఉందా? ఎందుకు?
జవాబు:

  1. ఈ రెండు సందర్భాలలో మనము పొందే అనుభూతి తేడాగా ఉంటుంది. మొనదేలి ఉన్నవైపున గుచ్చుకొన్నట్లుగా ఉంటుంది. ఎందుకనగా పెన్సిల్ వెనకవైపు వైశాల్యము ఎక్కువ కనుక చేతిపై పీడనము తక్కువగా ఉంటుంది.
  2. పెన్సిల్ మొనదేలి ఉన్నవైపు వైశాల్యము తక్కువగా ఉంటుంది కనుక పీడనము ఎక్కువగా ఉంటుంది.

కృత్యం – 15

16. బలం ప్రభావాన్ని గుర్తించుట :

రెండు ట్రేలు తీసుకుని వాటిని పొడి సున్నంతో లేదా మెత్తని ఇసుకతో నింపండి. ఒకే ఆకారం, ఒకే ద్రవ్యరాశి గల రెండు ఇటుకలు తీసుకోండి. ప్రక్కపటంలో చూపిన విధంగా ఒక ఇటుకని మొదటి ట్రేలో నిలువుగా, రెండవ దానిని వేరొక ట్రేలో అడ్డంగా పెట్టండి. రెండు ఇటుకలు సున్నంలోకి ఒకే లోతుకి దిగాయా పరిశీలించి ఈ క్రింది ప్రశ్నలకు జవాబులు వ్రాయండి.
AP Board 8th Class Physical Science Solutions 1st Lesson బలం 30

ఎ) ఏ ట్రేలోని ఇటుక ఎక్కువ లోతు సున్నంలోకి దిగినది? కారణం ఏమిటి?
జవాబు:
మొదటి ట్రే (ఎ) లోని ఇటుక ఎక్కువ లోతు సున్నంలోకి దిగినది. కారణం, మొదటి ట్రేలో సున్నంపై తాకే నిలువుగా పెట్టిన ఇటుక యొక్క స్పర్శా వైశాల్యం తక్కువగా ఉండుట.

బి) ఏ ట్రేలోని ఇటుక తక్కువ లోతు సున్నంలోకి దిగినది? కారణం ఏమిటి?
జవాబు:
రెండవ ట్రే (బి) లోని ఇటుక తక్కువ లోతు సున్నంలోకి దిగినది. కారణం, రెండవ ట్రేలో సున్నంపై తాకే అడ్డంగా పెట్టిన ఇటుక యొక్క స్పర్శా వైశాల్యం ఎక్కువగా ఉండుట.

సి) ఈ కృత్యం వల్ల నీవు పరిశీలించినది ఏమిటి?
జవాబు:
ప్రయోగించిన బలం ఒకటే అయినప్పుడు తక్కువ స్పర్శా వైశాల్యం గల వస్తువు ఎక్కువ పీడనాన్ని కలుగజేస్తుంది.

AP Board 8th Class Maths Solutions Chapter 6 Square Roots and Cube Roots Ex 6.2

AP State Syllabus AP Board 8th Class Maths Solutions Chapter 6 Square Roots and Cube Roots Ex 6.2 Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Maths Solutions 6th Lesson Square Roots and Cube Roots Exercise 6.2

AP Board 8th Class Maths Solutions Chapter 6 Square Roots and Cube Roots Ex 6.2

Question 1.
Find the square roots of the following numbers by Prime factorization method.
(1) 441
(ii) 784
(iii) 4096
(iv) 7056
Solution:
AP Board 8th Class Maths Solutions Chapter 6 Square Roots and Cube Roots Ex 6.2 1

AP Board 8th Class Maths Solutions Chapter 6 Square Roots and Cube Roots Ex 6.2

Question 2.
Find the smallest number by which 3645 must be multiplied to get a perfect square.
Solution:
The prime factorization of 3645
= (3 × 3) × (3 × 3) (3 × 3) × 5
∴ Deficiency of one ‘5’ is appeared in the above product.
∴ 3645 is multiplied with 5 then we will get a perfect square.
AP Board 8th Class Maths Solutions Chapter 6 Square Roots and Cube Roots Ex 6.2 2

Question 3.
Find the smallest number by which 2400 is to be multiplied to get a perfect square and also find the square root of the resulting number.
Solution:
The prime factorization of 2400
=(2 × 2) × (2 × 2) × 2 × (5 × 5) × 3
∴ 2,3 are needed to form a pair
∴ 2 × 3 = 6
∴ 6 should be multiplied with 2400 then we will get a perfect square number.
∴ 2400 × 6 = 14400
∴ \(\sqrt{14400}\) = 120
AP Board 8th Class Maths Solutions Chapter 6 Square Roots and Cube Roots Ex 6.2 3

AP Board 8th Class Maths Solutions Chapter 6 Square Roots and Cube Roots Ex 6.2

Question 4.
Find the smallest number by which 7776 is to be divided to get a perfect square.
Solution:
AP Board 8th Class Maths Solutions Chapter 6 Square Roots and Cube Roots Ex 6.2 4
The prime factorization of 7776
=(2 × 2) × (2 × 2) × 2 × (3 × 3) × (3 × 3) × 3
∴ 2, 3 are needed to form a pair
∴ 2 × 3 = 6
∴ 7776 should be divided by 6 then we will get a perfect square number.

AP Board 8th Class Maths Solutions Chapter 6 Square Roots and Cube Roots Ex 6.2

Question 5.
1521 trees are planted in a garden in such a way that there are as many trees in each row as there are rows in the garden. Find the number of rows and number of trees in each row.
Solution:
Let the no. of trees planted in a garden for each row = x say.
No. of rows in the garden = x
∴ Total no. of trees in the garden = x × x = x2
According to the sum x2 = 1521
x = \(\sqrt{1521}=\sqrt{39 \times 39}\) = 39
∴ No. of trees for each row = 39
No. of rows in the garden = 39

Question 6.
A school collected ₹ 2601 as fees from its students. If fee paid by each student and number students in the school were equal, how many students were there in the school?
Solution:
Let the no. of students in a school = x say
The (amount) fee paid by each student = ₹ x
Amount collected by all the students
= x × x = x2
According to the sum
∴ x2 = 2601
x = \(\sqrt{2601}=\sqrt{51 \times 51}\) = 51
∴ x = 51
∴ No. of students in the school = 51

Question 7.
The product of two numbers is 1296. If one number is 16 times the other, find the two numbers?
Solution:
Given that the product of two numbers = 1296.
Let the second number = x say
Then first number = 16 × x = 16x
∴ The product of two numbers
= x × 16x= 16x2
According to the sum
16x2 = 1296
⇒ x2 = \(\frac { 1296 }{ 16 }\) = 81
⇒ x2 = 81
⇒ x = \(\sqrt{8} \overline{1}=\sqrt{9 \times 9}\) = 9
⇒ x = 9
∴ The first number = 16x
= 16 × 9
=144
The second number = x = 9

AP Board 8th Class Maths Solutions Chapter 6 Square Roots and Cube Roots Ex 6.2

Question 8.
7921 soldiers sat in an auditorium in such a way that there are as many soldiers in a row as there are rows in the auditorium. How many rows are there in the auditorium’?
Solution:
Let the number of soldiers sat in an auditorium for each row = x say
∴ No. of rows in an auditorium = x
∴ Total no. of soldiers = x × x = x2
According to the sum,
x2 = 7921
x = \(\sqrt{7921}=\sqrt{89 \times 89}\) = 89
∴ No. of rowS in an auditorium = 89

Question 9.
The area of a square field is 5184 m2. Find the area of a rectangular field, whose perimeter is equal to the perimeter of the square field and whose length is twice of its breadth.
Solution:
Area of a square field = 5184 m2
A = s2 = 5184
:. s = \(\sqrt{5184}=\sqrt{72 \times 72}\) = 72
∴ s = 72
∴ Perimeter of the square field = 4 × s
= 4 × 72
= 288 m
According to the sum,
Perimeter of a rectangular field
= Perimeter of a square field = 288 m
Let the breadth of a rectangular field
= x m say
∴ Length = 2 × x = 2 × m
∴ Perimeter of the rectangular field
= 2 (1 + b)
= 2 (2x + x)
= 2 × 3x
= 6x
∴ 6x = 288 .
x = \(\frac { 288 }{ 6 }\)
x = 48
∴ Breadth of the rectangular field
= x = 48 m
Length of the rectangular field = 2x
= 2 × 48
=96m
∴ Area of the rectangular field
= l × b
= 96 × 48
= 4608 m2

AP Board 8th Class Biology Solutions Chapter 9 జంతువుల నుండి ఆహారోత్పత్తి

SCERT AP 8th Class Biology Study Material Pdf 9th Lesson జంతువుల నుండి ఆహారోత్పత్తి Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Biology 9th Lesson Questions and Answers జంతువుల నుండి ఆహారోత్పత్తి

8th Class Biology 9th Lesson జంతువుల నుండి ఆహారోత్పత్తి Textbook Questions and Answers

ప్రశ్న 1.
ఒక తేనెపట్టులో వివిధ రకాల తేనెటీగలు ఉంటాయి ? అవి ఏవి ? అవి ఒకదానికంటే మరొకటి ఎలా భిన్నంగా ఉంటాయి ?
జవాబు:
ఒక తేనెపట్టులో 3 రకాల తేనెటీగలు ఉంటాయి. అవి ఒకదాని కంటే మరొకటి ఎలా భిన్నంగా ఉంటాయి. అంటే
కూలీ ఈగలు : కొన్ని తేనెటీగలు వేల సంఖ్యలో ఉంటాయి. ఇవి కూలీ ఈగలు. తేనెపట్టు పెట్టి, తేనెటీగల పిల్లలను పోషించి, తేనెను సేకరించును. రాణి ఈగ : తేనెటీగల సమూహంలో ఒక్క రాణి ఈగ ఉంటుంది. ఇది ప్రతిరోజు 800-1200 గుడ్లను పెడుతుంది.
డ్రోన్ ఈగలు : ఇవి కొన్ని వందల సంఖ్యలో ఉంటాయి. వీటిని మగ ఈగలు అంటారు. ఇవి సోమరులు.

AP Board 8th Class Biology Solutions Chapter 9 జంతువుల నుండి ఆహారోత్పత్తి

ప్రశ్న 2.
మీ గ్రామంలో అధిక పాలనిచ్చే గేదెల లక్షణాలను రాయండి.
జవాబు:
మా గ్రామంలో అధిక పాలనిచ్చే గేదెల లక్షణాలు :

  1. చక్కని శరీర నిర్మాణం కలిగి ఉంటాయి.
  2. శరీర బరువు ఎక్కువగా ఉంటుంది.
  3. అధికంగా ప్రత్యుత్పత్తి సామర్థ్యం కలిగి ఉంటాయి.
  4. మంచి ఆరోగ్యం కలిగి ఉంటాయి.
  5. శారీరక రోగాలు కలిగి ఉండవు.
  6. గేదెల చూపు చక్కగా ఉంటుంది.
  7. గేదెలు చక్కని పొదుగు నిర్మాణం ఉండి మరియు పాలు తీయుటకు తేలికగా ఉండును.
  8. ఆహారం (మేత) ఎక్కువగా తీసుకొనును.
  9. సన్నని మెడ కలిగి ఉంటాయి.

ప్రశ్న 3.
గ్రామీణ ప్రాంతాలలో గుడ్లను పొదిగే విధానాన్ని వివరించండి.
జవాబు:
గ్రామాలలో గుడ్లను పొదిగించడం ఆసక్తికరమైన పని. గ్రామాలలో కోళ్ళకు పొదిగే కాలం రాగానే ఒక పెద్ద గంపలో గడ్డి పరచి దానిమీద గుడ్లు ఉంచితే కోళ్ళు గుడ్లపై కూర్చొని గుడ్లను పొదుగుతాయి.

ప్రశ్న 4.
పశువుల పెంపకంలో అనుబంధ ఉత్పత్తులు, పరిశ్రమల గురించి రాయండి.
జవాబు:
పశువుల పెంపకంలో అనుబంధ ఉత్పత్తులు :
మాంసం, పేడ, తోళ్ళు, ఎముకలు, చర్మం, వాటి కొమ్ములు.
పరిశ్రమలు :

  1. డైరీ పరిశ్రమ : దీనిలో పాలు, పాల ఉత్పత్తులు చేస్తారు.
  2. కబేల (పశువధశాల) : ఎద్దు మాంసం ఇక్కడ తయారుచేస్తారు.
  3. తోళ్ళ పరిశ్రమ : ఇక్కడ తోళ్లను శుభ్రపరిచి పర్సులు, బెల్ట్ లు, చెప్పులు తయారుచేస్తారు.
  4. ఎరువుల పరిశ్రమ : పేడను ఉపయోగించి బయోగ్యాస్ తయారుచేస్తారు.
  5. బయోగ్యాస్ పరిశ్రమ : పశువుల ఎముకలను ఎరువుల కర్మాగారాలలో వాడతారు.
  6. వస్తువులు తయారుచేసే పరిశ్రమ : పశువుల చర్మం, కొమ్ములను ఉపయోగించి వివిధ రకాల ఆట మరియు అలంకార వస్తువులు తయారుచేస్తారు.

AP Board 8th Class Biology Solutions Chapter 9 జంతువుల నుండి ఆహారోత్పత్తి

ప్రశ్న 5.
మీ గ్రామంలో ఎక్కడైనా కోళ్ళ ఫారం ఉందా ? గ్రుడ్లను ఎలా మార్కెట్ కి ఎగుమతి చేస్తారు ? ప్యాకింగ్ కు ఏ రకమైన పదార్థాలను వాడతారు ?
జవాబు:
మా గ్రామంలో కోళ్ళ ఫారం ఉంది. గ్రుడ్లు, మార్కెట్ కి ఎగుమతి చేయుటకు 30 గ్రుడ్లు పట్టే ట్రేలో ఉంచుతారు. ఇలాంటి 10 ట్రేలను ఒక అట్టపెట్టిలో పెట్టి దూరంను బట్టి లారీ కాని, ఆటో కాని లేదా రిక్షాలో కాని పెడతారు. ఈ ట్రేలో గ్రుడ్లు ఆకారంలో గుంటలు ఉంటాయి. ప్యాకింగ్ కు కాగితం, వేస్ట్ ప్లాస్టిక్, అట్టలు (మొక్కజొన్న ఆకుల నుండి తయారు చేస్తారు) వంటివి వాడతారు.

ప్రశ్న 6.
నదీముఖ ద్వారాలు అనగానేమి ? అవి సముద్రపు మరియు నీటి చేపలు నివసించటానికి ఎలా అనువుగా ఉంటాయి ?
జవాబు:
నదీముఖ ద్వారాలు అనగా నదులు సముద్రంలో కలిసే చోటు. నదీముఖ ద్వారాలలో సముద్రపు మరియు మంచినీటి చేపలు నివసించటానికి ఎలా అనువుగా ఉంటుంది అంటే ఈ ప్రాంతాలలో నివసించే చేపలు లవణీయత వ్యత్యాసాన్ని తట్టుకొనే శక్తిని కలిగి ఉంటాయి.

ప్రశ్న 7.
అక్టోబర్, నవంబర్ మాసాలలో చికెన్ మరియు గుడ్ల రేట్లు తగ్గుతాయి ? ఎందుకు ? కారణాలను చర్చించి రాయండి.
జవాబు:
1. ఈ నెలలందు తయారు అయిన గుడ్లు పొదగటానికి ఉపయోగించరు. కారణం ఉష్ణోగ్రత 38.39°C ఉండదు.
2. వాతావరణంలో ఉష్ణోగ్రత తక్కువ కాబట్టి గ్రుడ్లు చెడిపోవు.
3. అంతేకాక అక్టోబర్ లో సాధారణంగా దసరా మరియు దీపావళి పండుగలు వచ్చును. నవంబర్ కార్తీకమాసం ప్రభావం వలన ఎక్కువమంది మాంసాహారాన్ని తినరు. పై కారణాల వలన అక్టోబర్, నవంబర్ మాసాలలో చికెన్ మరియు గుడ్ల రేట్లు తగ్గుతాయి.

ప్రశ్న 8.
ఈ క్రింది పదాలను గురించి రాయండి.
శ్వేత విప్లవం, నీలి విప్లవం, ఎపిస్ టింక్చర్, హాల్ స్టీన్.
జవాబు:
శ్వేత విప్లవం : పాల ఉత్పత్తిని పెంచటం. పాల నుండి లభించే ఇతర పదార్థాల నాణ్యతని, పరిమాణాన్ని పెంచి, సాధ్యమైనంత తక్కువ ధరలో అందరికీ అందించటానికి జరిగిన ప్రయత్నమే శ్వేత విప్లవం అంటారు.
నీలి విప్లవం : చేపల పెంపకం. దిగుబడి పెంచటానికి, నాణ్యత అధికం చేయుటకు జరిగిన ప్రయత్నమే నీలి విప్లవం అంటారు. ఎపిస్ టింక్చర్ : తేనెటీగల విషంతో తయారుచేయబడిన హోమియో మందుని ఎపిస్ టింక్చర్ అంటారు.
హాల్ స్టీన్ : ప్రతిరోజు 25 లీటర్ల పాలు ఇచ్చే డెన్మార్క్ దేశానికి చెందిన ఆవు జాతి పేరు.

AP Board 8th Class Biology Solutions Chapter 9 జంతువుల నుండి ఆహారోత్పత్తి

ప్రశ్న 9.
చేపలను నిలవ చేయడంలో పాటించే పద్ధతులను వివరించండి.
జవాబు:
చేపలు నిలువ చేయడంలో పాటించే పద్ధతులు

  1. ఎండలో ఎండబెట్టడం
  2. పాక్షికంగా ఎండబెట్టడం
  3. పొగ బెట్టడం
  4. ఉప్పులో ఊరబెట్టడం

ప్రశ్న 10.
పాలశీతలీకరణ కేంద్రాన్ని పరిశీలించినప్పుడు నీవు ఏ రకమైన అనుమానాలు నివృత్తి చేసుకుంటావు ? వాటి జాబితా తయారుచేయండి.
జవాబు:
పాలశీతలీకరణ కేంద్రాన్ని పరిశీలించినప్పుడు నేను ఈ అనుమానాలు నివృత్తి చేసుకొనుటకు తయారుచేసిన జాబితా.
అవి:

  1. పాలశీతలీకరణ కేంద్రాలలో ఉన్న పాలు ఎందుకు తొందరగా పాడు అవ్వవు?
  2. పాశ్చరైజేషన్ ఎలా చేస్తారు ?
  3. పాల కేంద్రాలలో పాల శుద్ధితో పాటు ఇతర పదార్థాలు ఏవైనా తయారుచేస్తారా ?
  4. శీతాకాలంలో అధికంగా వచ్చిన పాలను ఏమి చేస్తారు ?
  5. పాలపొడి ఎలా చేస్తారు?
  6. పాలను, పాల పొడిని ఎందుకు సూక్ష్మజీవ రహిత ప్లాస్టిక్ కవరులలోను, డబ్బాలలో నిల్వచేస్తారు ?

ప్రశ్న 11.
కోళ్ళ/ఈము/చేపల/పశువుల/తేనెటీగల పెంపకంలో ఏదో ఒకదానిని సందర్శించి, అక్కడి రైతులనడిగి యాజమాన్య పద్ధతులపై ఒక నివేదిక తయారుచేయండి.
జవాబు:
నేను మాకు దగ్గరలో ఉన్న కోళ్ళ పరిశ్రమను సందర్శించాను. కోళ్ళ పెంపక విధానంలో యాజమాన్యం తగు జాగ్రత్తలు తీసుకోవటం గమనించాను.

  1. నేల క్రింది భాగంలో తడి, తేమను నివారించటానికి, నేలను పొట్టుతో కప్పారు.
  2. నేల సహజత్వాన్ని కాపాడటానికి సున్నం చల్లుతున్నారు. ఇది వ్యర్థాల వలన ఏర్పడే ఆమ్లత్వాన్ని నివారించటానికి తోడ్పడుతుంది.
  3. నీరు, ఆహారం వృధా కాకుండా తొట్టెలను ఎత్తులో అమర్చారు.
  4. రాత్రివేళలో సరైన ఉష్ణోగ్రతను నెలకొల్పటానికి విద్యుత్ దీపాలను ఉంచారు.
  5. కోడిపిల్లలు పొడుచుకోకుండా, డీబికింగ్ (ముక్కు కత్తిరించటం) చేస్తున్నారు.
  6. రోజు ఆహారాన్ని నిర్ణీత మోతాదులో నిర్ణీత వేళకు అందిస్తున్నారు.
  7. వేడిని నివారించటానికి, కోళ్ళ షెడ్ ను కొబ్బరి మట్టలతో కప్పారు. పరిసరాలలో చెట్ల పెంపకానికి ప్రాధాన్యత ఇచ్చారు.
  8. కోడి వయస్సును బట్టి ఆహార మోతాదు మార్చి అందిస్తున్నారు. మూడు నెలల వయస్సు నుండి కోళ్ళ పెరుగుదల అధికంగా ఉంటుంది కావున పౌష్ఠిక ఆహారం అందిస్తున్నారు.

AP Board 8th Class Biology Solutions Chapter 9 జంతువుల నుండి ఆహారోత్పత్తి

ప్రశ్న 12.
వార్తాపత్రికల నుండి పాల ఉత్పత్తికి, పాలలో కలుషితాలకు సంబంధించిన వార్తను సేకరించి నివేదికను తయారుచేసి గోడపత్రికపై ప్రదర్శించండి.
జవాబు:
పాల ఉత్పత్తికి తీసుకోవలసిన చర్యలు :

  1. రైతులు ముందుగా మంచి పాలు ఇచ్చే పశువులను ఎంచుకోవాలి.
  2. పచ్చిమేత 20 కేజీల వరకు రోజూ పెట్టాలి.
  3. ఆ పశువులు పాలిచ్చే దానిని బట్టి దాణా పెట్టాలి. సుమారుగా ప్రతి పది లీటర్ల పాలకు నాలుగు కిలోల మిశ్రమ దాణా పెట్టాలి.
  4. పశువులు నివసించే ప్రదేశాన్ని శుభ్రంగా ఉంచాలి.
  5. కాలం బట్టి వచ్చే వ్యాధులు నివారించుటకు టీకాలు ఇప్పించాలి.

పాలలో కలుషితాలకు సంబంధించిన నివేదిక :

  1. పాలలో ఈ క్రింది పేర్కొన్న కలుషితాలు కలుపుతున్నారు.
  2. సోడియం బై కార్బొనేట్, గంజిపిండి, సబ్బునీళ్ళు, యూరియా, హైడ్రోజన్ పెరాక్సైడ్, మెలనిన్.
  3. కొన్ని ప్రాంతాలలో కలుషితమైన ఆహారము పశువులకు పెట్టుట వలన పాలు కలుషితం అవుతున్నాయి.
    ఉదా : మెలనిన్ ఉన్న పాలు త్రాగుట వలన పిల్లలు చనిపోవుదురు. కొందరిలో మూత్రపిండాలు చెడిపోవును.

ప్రశ్న 13.
సముద్రపు కలుపుమొక్కలకు సంబంధించిన సమాచారాన్ని మీ పాఠశాల గ్రంథాలయం నుంచి సేకరించండి. ఉదాహరణలతో వివరించండి.
జవాబు:

  1. సముద్రపు కలుపు మొక్కలు గోధుమవర్ణ శైవలాలకు చెందినవి.
  2. సముద్రంలో ఇవి అతిపెద్ద పరిమాణంలో తుట్టలు తుట్టలుగా, సమూహంగా పెరుగుతాయి.
  3. వీటిని కెర్బ్స్ అంటారు. వీటివలనే అనేక ఉపయోగాలు ఉన్నాయి.
    • పశువుల మేతగా ఉపయోగపడును (సముద్రపు కలుపుమొక్క)
    • బయోగ్యాస్ ఉత్పత్తికి ఉపయోగపడును (సముద్రపు కలుపు మొక్క)
    • పైకో కొల్లాయిడ్ ఉపయోగపడును (సముద్రపు కలుపు మొక్క అగార్ – అగార్)
      పొగ పెట్టించి ఈగలను ప్రక్కకు మళ్ళించి తేనెపట్టును జాగ్రత్తగా కత్తిరించి తేనె తీస్తారు.

ప్రశ్న 14.
సాధారణంగా ఏ కాలంలో తేనెపట్టునుండి తేనెను సేకరిస్తారు. తేనెను సేకరించడానికి తియ్యడానికి అనుసరించే విధానాన్ని రాయండి.
జవాబు:
సాధారణంగా మా గ్రామంలో తేనెపట్టును పువ్వులు బాగా పూసే కాలమైన అక్టోబరు / నవంబరు మరియు ఫిబ్రవరి / జూన్ సీజన్లో చూస్తాము. తేనెపట్టు నుంచి తేనెను తీయడానికి అనుసరించే విధానము :
పొగ పెట్టించి ఈగలను ప్రక్కకు మళ్ళించి తేనెపట్టును జాగ్రత్తగా కత్తిరించి తేనె తీస్తారు.

ప్రశ్న 15.
ఎండిన తేనెపట్టును పరిశీలించండి. అది ఎలా నిర్మితమైనదో పరిశీలించి, బొమ్మను గీయండి.
జవాబు:
AP Board 8th Class Biology Solutions Chapter 9 జంతువుల నుండి ఆహారోత్పత్తి 1
ఎండిన తేనెపట్టును పరిశీలించితిని. అది అనేక చిన్న చిన్న గదులతో విభజింపబడి ఉండును. తేనెపట్టు మైనపు పధార్థం వలన చిన్నచిన్న గదులు ఏర్పడుటకు సహాయపడును. ఈ మైనం కూలీ ఈగలు స్రవించి తయారుచేస్తాయి.

AP Board 8th Class Biology Solutions Chapter 9 జంతువుల నుండి ఆహారోత్పత్తి

ప్రశ్న 16.
పశువులు మన ఆహారం కొరకే కాదు. వాటి విసర్జితాలు (వ్యర్థ పదార్థాలు) కూడా మనకు ఉపయోగపడతాయి. ఈ వినూత్న విషయాన్ని ఎలా అభినందిస్తారు ?
జవాబు:
పశువులు మన ఆహారం కొరకే కాదు. వాటి విసర్జితాలు పేడ మనకు బాగా ఉపయోగపడును. దీనిని ఎరువుగా పొలంలో వేయవచ్చు. పూర్వపు రోజులలో పిడకల కోసం పేడను ఉపయోగించేవారు. ఇప్పుడు ఆ పేడను కుళ్ళబెట్టి బయోగ్యాస్ తయారుచేస్తున్నారు. దానితో ఇంధన కొరత కొంత వరకు అధిగమించవచ్చు మరియు కాలుష్యం కొంతవరకు తగ్గుతుంది. అంతేకాక విద్యుత్ శక్తి కూడా ఉత్పత్తి చేయవచ్చు.

ఆహారంతో పాటు కాలుష్యాన్ని, ఇంధన కొరతలను తగ్గించిన పశువులను చూస్తే నాకు చాలా ఆనందంగా, కొంత ఆశ్చర్యంగాను ఉంది. అందుకే కొంతమంది వాటికి ప్రేమతో పేర్లు కూడా పెట్టి పిలుస్తారు.

ప్రశ్న 17.
రాజు పశుపోషణకు, వ్యవసాయానికి సంబంధం ఉంది అని తెలిపాడు. నీవు అతడిని ఎలా సమర్థిస్తావు?
జవాబు:

  1. పశుపోషణకు, వ్యవసాయానికి చాలా దగ్గర సంబంధం ఉంది.
  2. ఈ రెండూ పరస్పరం ఆధారనీయమైనవే గాక, ఒకే నాణేనికి బొమ్మా బొరుసూ వంటివి.
  3. వ్యవసాయ ఉత్పత్తులైన గడ్డి, ధాన్యం వంటి పదార్థాలు పశుపోషణలో ఆహారంగా ఉపయోగపడతాయి.
  4. జంతువుల వ్యర్థాలైన పేడ, మూత్రం వ్యవసాయ రంగంలో ఎరువులుగా వాడతారు.
  5. ఎద్దులు, దున్నల వంటి జంతువుల ఆధారంగా చాలా వ్యవసాయపనులు జరుగుతుంటాయి.
  6. దుక్కిదున్నటం, చదునుచేయటం, రవాణా వంటి వ్యవసాయ పనులకు నేడు ఇంకా జంతువులను ఉపయోగిస్తున్నారు.
  7. తేనెటీగల పరిశ్రమ ప్రధానంగా వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉంటుంది. మొక్కలు బాగా పుష్పించినపుడే తేనెటీగలు తేనెను బాగా ఉత్పత్తి చేయగలవు.
  8. తేనెటీగలు మొక్కలలో ఫలదీకరణ రేటును పెంచి పంట దిగుబడిని పెంచుతాయి. కావున వ్యవసాయానికి, పశుపోషణకు చాలా దగ్గర సంబంధం ఉంది.

ప్రశ్న 18.
వ్యవసాయం, పశుపోషణ నాణానికి ఇరువైపులా ఉన్న అంశాలు. దీనిని నీవు ఎలా సమర్థిస్తావు ?
జవాబు:
వ్యవసాయం, పశుపోషణ నాణానికి ఇరువైపులా ఉన్న అంశాలు. ఎందుకంటే వ్యవసాయంలోని పచ్చగడ్డి, ఎండిన పశు గ్రాసం, ధాన్యం ఇంకా ఇతర ఉత్పత్తులు పశువుల దాణాగా ఉపయోగిస్తారు. అదే విధంగా పశువులను ముఖ్యంగా ఎద్దులను నేల దున్నుటకు, నూర్పిడిలోను, పశువుల పేడను ఎరువుగాను, పండిన పంటను కూడా ఇంటికి చేర్చుటకు ఎద్దులను ఉపయోగిస్తారు. ఈ రెండింటిలో ఏ ఒకటి లేకపోయిన రెండోది లేదు. కాబట్టి వ్యవసాయం, పశుపోషణ నాణానికి ఇరువైపులా ఉన్న అంశాలు.

ప్రశ్న 19.
పంట పొలాలను చేపకుంటలుగా మార్చటం వలన పర్యావరణం చెడిపోతుంది. ఆహారపు కొరతను ఎదుర్కోవాల్సి వస్తుంది? ఈ సమస్యపై చర్చలో పాల్గొనటానికి మీ అభిప్రాయాలను తెల్పండి.
జవాబు:
పంట పొలాలను చేపకుంటలుగా మార్చటం వలన పర్యావరణం చెడిపోతుంది మరియు ఆహారపు కొరతను ఎదుర్కొంటాము. అందుకు నా అభిప్రాయాలు ఈ విధంగా ఉన్నాయి.
1. పొలంలో వరి మొక్కలు ఉంటే కిరణజన్య సంయోగక్రియ జరిగి వాతావరణంలోనికి ఆక్సిజన్ విడుదల అవుతుంది. కాని చేపకుంట వలన ఆ విధంగా జరగదు.
2. చేపలు కూడా నీటిలోకి CO2 విడుదల చేస్తాయి. దాని వలన వాతావరణంలో కార్బన్ డై ఆక్సైడ్ పెరుగును.
3. చేప కుంటలో ఎక్కువగా చేపల కోసం వేసిన ఆహారం వలన, వాటి రక్షణకు ఉపయోగించే రసాయనాల వలన నీటి కాలుష్యం, భూకాలుష్యం వచ్చును.
4. చేపల కుంటలుగా మార్చుట వలన ముఖ్యంగా వరి పంట దెబ్బతిని ఆహారపు కొరత వచ్చును.

8th Class Biology 9th Lesson జంతువుల నుండి ఆహారోత్పత్తి InText Questions and Answers

కృత్యములు

1. పశువుల పెంపకం :

(a) తరగతిలో ఐదుగురు విద్యార్థుల చొప్పున కొన్ని జట్లుగా ఏర్పడండి. రైతులు పశువులను ఎందుకు పెంచుతారో, కారణాలు చర్చించి రాయండి. మీరు పరిశీలించిన అంశాలను నోటు పుస్తకంలో రాయండి.
జవాబు:
రైతులు పశువులను పెంచుటకు కారణాలు :
1. వారికి పశువులను పెంచుట వలన కొంత ఆదాయం వచ్చును.
2. వారికి వ్యవసాయంలో సహాయపడును. (దున్నుటకు, నూర్పిడులకు)
3. వ్యవసాయంలో లభించిన పశుగ్రాసం తిరిగి పశువుల మేతగా వాడుటకు.

(b) మీ గ్రామంలో పశువులను ఎక్కడికి తోలుకుపోతారు. పశువులను పెంచే వ్యక్తితో మాట్లాడి పశువుల పెంపకానికి సంబంధించిన సమాచారాన్ని సేకరించండి. ఈ క్రింది ప్రశ్నల సహాయంతో

(ఎ) ఇక్కడ ఏ ఏ రకాల పశువులను పెంచుతారు ?
జవాబు:
ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు మొదలైన పశువులు పెంచుతారు.

(బి) పశుగ్రాసం ఉన్న ప్రాంతాలు. ఎక్కడ ఉన్నాయి ?
జవాబు:
ఊరికి చివర ఉన్న పొలాలు, పచ్చిక బయళ్ళ దగ్గర ఉన్న ప్రాంతాలలో ఉన్నాయి.

(సి) నీరు ఉన్న ప్రాంతం ఎక్కడ ఉన్నది ?
జవాబు:
పొలాలకు దగ్గరగా.

(డి) ఆవు, గేదెలు, మేక, గొర్రెల పెంపకంలో ఏమైనా తేడాలున్నాయా ?
జవాబు:
ఆవు, గేదెలు, ఎండిన గడ్డితో పాటు పచ్చిగడ్డి తింటాయి. మేకలు చెట్ల ఆకులను, పచ్చిగడ్డిని ఆహారంగా తీసుకొంటాయి. గొర్రెలు పచ్చిగడ్డిని, నూకలను ఆహారంగా తీసుకుంటాయి.

(ఇ) పశువులను పెంచేవారు సాధారణంగా ఎదుర్కొనే సమస్యలేవి ?
జవాబు:
అనావృష్టి పరిస్థితులలో పశుగ్రాసం కొరత పశువులు పెంచేవారు సాధారణంగా ఎదుర్కొనే సమస్య.

(c) పశువైద్యుని దగ్గరకు వెళ్ళి పశువులకు వచ్చే సాధారణ వ్యాధుల సమాచారాన్ని తెలుసుకుని ఒక నివేదిక తయారుచేయండి.
జవాబు:
AP Board 8th Class Biology Solutions Chapter 9 జంతువుల నుండి ఆహారోత్పత్తి 2

AP Board 8th Class Biology Solutions Chapter 9 జంతువుల నుండి ఆహారోత్పత్తి

పాఠ్యాంశములోని ప్రశ్నలు

ప్రశ్న 1.
ఆదిమానవుడు కొన్ని జంతువులను మాత్రమే ఎందుకు మచ్చిక చేసుకున్నాడు ? (పేజి.నెం. 141)
జవాబు:
ఆదిమానవుడు కొన్ని జంతువులు (ఉదా : కుక్క, పిల్లి, పశువులు, పక్షులు, కోళ్ళు, చిలుక మొదలైన) వాటివలన తనకు కలుగు ఉపయోగాలు గ్రహించి వాటిని మచ్చిక చేసుకున్నాడు. అందువలన ఆదిమానవుడు కొన్ని జంతువులనే మచ్చిక చేసుకున్నాడు.

ప్రశ్న 2.
ఏనుగు, పులి, సింహం వంటి జంతువులను గ్రద్ధ, గుడ్లగూబ వంటి పక్షులను ఎందుకు మచ్చిక చేసుకోలేకపోయాడు ? (పేజి.నెం.141)
జవాబు:
ఏనుగు, పులి, సింహం వంటి జంతువులను గ్ర, గుడ్లగూబ వంటి పక్షులను ఆదిమానవుడు ఎందుకు మచ్చిక చేసుకోలేకపోయాడు అంటే ఏనుగు, పులి, సింహం క్రూరజంతువులు మరియు ఆ పక్షుల వలన లాభాల కన్నా నష్టాలు ఎక్కువ ఉన్నాయి.

ప్రశ్న 3.
జంతువులను మచ్చిక చేసుకోవడానికి ఆనాటి మానవుడు ఏ ఏ విధానాలను పాటించి ఉంటాడో జట్లలో చర్చించి రాయండి. (పేజి.నెం. 142)
జవాబు:

  1. జంతువులు మచ్చికకు అలవాటు పడతాయి.
  2. మచ్చిక చేసుకొనుటకు పట్టుకాలం
  3. మచ్చిక వలన ఆ జంతువుకు అయ్యే ఖర్చు
  4. మచ్చిక చేసుకున్నాక అతనికి వచ్చే లాభం మొదలైన అంశాలను ఆనాటి మానవుడు జంతువులను మచ్చిక చేసుకొనేటపుడు పాటించిన పద్దతులు.

ప్రశ్న 4.
వ్యవసాయం చేసే వాళ్ళందరూ పశువులను పెంచుతారా ? (పేజి.నెం. 142)
జవాబు:
ఇంచుమించు వ్యవసాయం చేసే వాళ్ళందరూ పశువులను పెంచుతారు.

AP Board 8th Class Biology Solutions Chapter 9 జంతువుల నుండి ఆహారోత్పత్తి

ప్రశ్న 5.
వ్యవసాయానికి, పశుపోషణకు ఏమైనా సంబంధం ఉందా ? (పేజి.నెం. 142)
జవాబు:
వ్యవసాయానికి, పశుపోషణకు చాలా దగ్గర సంబంధం ఉంది.

ప్రశ్న 6.
ఎద్దులను, దున్నపోతులను ఉపయోగించి ఏమేమి వ్యవసాయ పనులు చేస్తారో రాయండి. (పేజి.నెం. 143)
జవాబు:
1. ఎద్దులను ఉపయోగించి పొలం, దుక్కి దున్నుతారు. పంట నూర్పిడి సమయంలో కూడా ఎద్దులను ఉపయోగిస్తారు.
2. దున్నపోతులను ప్రాచీన పద్ధతులలో నీటి పారుదలకు, పంట నూర్పిడి యందు ఉపయోగిస్తారు.

ప్రశ్న 7.
మీ ప్రాంతంలో పశువైద్యశాల ఎక్కడ ఉంది ? (పేజి.నెం. 143)
జవాబు:
మా ప్రాంతంలో పంచాయతీ రాజ్ ఆఫీసుకు దగ్గరగా ఉంది.
గమనిక : ఎవరి ప్రాంతంలో ఎక్కడ ఉంటే అక్కడే పేరు వ్రాసుకోవాలి.

ప్రశ్న 8.
అక్కడ (పశు వైద్యశాలలో) ఎవరు పనిచేస్తున్నారు ? ఏ పని చేస్తారు ? (పేజి.నెం. 143)
జవాబు:
అక్కడ (పశు వైద్యశాలలో) పశువైద్యులు పనిచేస్తారు. పశువుల వైద్యం, ఆరోగ్యం గురించి చూస్తారు.

ప్రశ్న 9.
మనకు పాల ఉత్పత్తి ఎక్కువగా ఎక్కడి నుండి వస్తుంది ? (పేజి.నెం. 144)
AP Board 8th Class Biology Solutions Chapter 9 జంతువుల నుండి ఆహారోత్పత్తి 3
జవాబు:
మనకు పాల ఉత్పత్తి ఎక్కువగా గ్రామాల నుండి వస్తుంది.

AP Board 8th Class Biology Solutions Chapter 9 జంతువుల నుండి ఆహారోత్పత్తి

ప్రశ్న 10.
ఒంటె పాలను ఏ ప్రాంతంవారు ఉపయోగిస్తారు ? (పేజి.నెం. 144)
జవాబు:
ఎడారి ప్రాంతంవారు ఒంటె పాలను ఉపయోగిస్తారు.

ప్రశ్న 11.
గాడిద పాలను ఉపయోగించటం చూశారా ? (పేజి.నెం. 144)
జవాబు:
గాడిద పాలను ఉపయోగించటం చూడలేదు.
గమనిక : ఈ మధ్య గాడిద పాలు తాగితే ఆరోగ్యంగా ఉంటాము అని పుకార్లు బాగా వచ్చినాయి. పుకార్లు అని ఎందుకు అన్నాము అంటే శాస్త్రవేత్తలు ఎవరూ అవి మంచివి అని చెప్పలేదు కాబట్టి.

ప్రశ్న 12.
మీ గ్రామంలో రైతులు ఏ రకమైన పశుగ్రాసాన్ని వాడతారు ? (పేజి.నెం. 144)
జవాబు:
మా గ్రామంలో రైతులు వరిగడ్డి, జొన్న, సజ్జ, మొక్కజొన్న, ఉలవలు మొదలైనవి పశుగ్రాసంగా వాడతారు.

ప్రశ్న 13.
పంటకోత కోసిన తరువాత పశుగ్రాసాన్ని ఎలా భద్రపరుస్తారు ? (పేజి.నెం. 144)
జవాబు:
పంటకోత కోసిన తరువాత దానిని రెండు లేక మూడు రోజులు ఎండలో ఆరబెట్టి ధాన్యాన్ని నూర్పిడి చేసి వచ్చిన గడ్డి కట్టలు క్రింద కట్టి ఇంటికి తీసుకువచ్చి గడ్డివాముగా వేసి భద్రపరుస్తారు.

ప్రశ్న 14.
క్రింది గ్రాఫ్ ను పరిశీలించండి. ఇది వివిధ దేశాలలో పాల ఉత్పత్తిని సూచిస్తుంది. మనదేశంలో పాల ఉత్పత్తిని పరిశీలించండి. మిగతా దేశాలతో పోల్చినప్పుడు పాల ఉత్పత్తిలో మనము ఎందుకు వెనుకబడి ఉన్నామో జట్లలో చర్చించండి. (పేజి.నెం. 144)
జవాబు:
AP Board 8th Class Biology Solutions Chapter 9 జంతువుల నుండి ఆహారోత్పత్తి 4
1. పాల ఉత్పత్తిలో ఇజ్రాయిల్ అగ్రస్థానంలో ఉంది.
2. మన ఇండియా అన్నింటికన్నా దిగువస్థానంలో ఉంది.
కారణాలు :

  1. మనదేశంలో పాడిపరిశ్రమ ఇంకా గ్రామీణ కుటీర పరిశ్రమగానే ఉంది.
  2. పాడి పరిశ్రమను ఒక వ్యాపారాత్మకంగా లాభసాటిగా భావించటం లేదు.
  3. కేవలం వ్యవసాయంలో అంతర్భాగంగానే, పాడిపరిశ్రమ నడుస్తుంది.
  4. దేశీయ గేదెలనే ఎక్కువ ప్రాంతాలలో మేపుతున్నారు.
  5. పశువుల పెంపకంలో మెలకువలకు, పోషణ విధానంపై సరైన అవగాహన లేదు.
  6. వ్యాధుల విషయంలో రైతులకు పరిజ్ఞానం లేదు.

ప్రశ్న 15.
మీ గ్రామంలో పాల సేకరణ కేంద్రం ఉందా ? (పేజి.నెం. 145)
జవాబు:
మా గ్రామంలో పాల సేకరణ కేంద్రం ఉంది.

AP Board 8th Class Biology Solutions Chapter 9 జంతువుల నుండి ఆహారోత్పత్తి

ప్రశ్న 16.
పాలను సేకరించి ఎలా ఎగుమతి చేస్తారు ? (పేజి.నెం. 145)
జవాబు:
పాలను పాలు సేకరించు కేంద్రం నుంచి 40 లీటర్ల క్యాన్ నింపి వాటిని పాల శీతలీకరణ కేంద్రంనకు ఎగుమతి చేస్తారు.

ప్రశ్న 17.
పాలధరను ఎలా నిర్ణయిస్తారు ? (పేజి.నెం. 145)
జవాబు:
పాలధరను పాల శీతలీకరణ కేంద్రం యొక్క చైర్మన్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు పాలలో గల వెన్న శాతాన్ని బట్టి పాల ధరను నిర్ణయిస్తారు.

ప్రశ్న 18.
మీ ప్రాంతంలో పాల శీతలీకరణ కేంద్రం ఎక్కడ ఉంది ? (పేజి.నెం.145)
జవాబు:
మా ప్రాంతంలో పాల శీతలీకరణ కేంద్రం విజయవాడలో ఉంది :
గమనిక : మీ ప్రాంతంలో ఇంకా దగ్గరలో ఏది, ఉంటే అది వ్రాయాలి.

ప్రశ్న 19.
పాల ఉత్పత్తి ఏ నెలలో అధికంగా ఉంటుందో చెప్పగలరా ? (పేజి.నెం. 145)
జవాబు:
పాల ఉత్పత్తి నవంబరు నెలలో అధికంగా ఉంటుంది.

ప్రశ్న 20.
ఏ నెలల్లో పాల ఉత్పత్తి ఎందుకు అధికంగా ఉంటుందో కారణాలను మీ తరగతిలో చర్చించండి. (పేజి.నెం. 145)
జవాబు:
అక్టోబరు, నవంబరు, డిసెంబరు నెలల్లో పాల ఉత్పత్తి అధికంగా ఉంటుంది. ఈ నెలల్లో పాల ఉత్పత్తి అధికంగా ఉండుటకు కారణాలు :
1. గేదెలు జులై నుంచి సెప్టెంబరు మధ్య ఎక్కువగా ఈనుతాయి. ఈనిన మొదటి మూడు నెలల్లో పాలు ఎక్కువ ఇస్తాయి.
2. పచ్చిమేత ఎక్కువగా అందుబాటులో ఉండును.
3. వాతావరణం కూడా పశువుల పెరుగుదలకు, ఈనుటకు, మేతను ఎక్కువగా తీసుకొనుటకు చాలా అనుకూలంగా ఉండును.

ప్రశ్న 21.
పౌల్టీలలో పెంచే కోళ్ళు, గ్రామాలలో పెంచే దేశీయ కోళ్ళు ఒకే రకంగా ఉంటాయా ? (పేజి.నెం. 148)
జవాబు:
పౌల్టీలలో పెంచే కోళ్ళు, గ్రామాలలో పెంచే దేశీయ కోళ్ళు ఒకే రకంగా ఉండవు.

AP Board 8th Class Biology Solutions Chapter 9 జంతువుల నుండి ఆహారోత్పత్తి

ప్రశ్న 22.
జన్యుపరంగా మార్పు చెందిన ఆహారం వాడటం మంచిదా ? కాదా ? ఆలోచించండి. (పేజి.నెం. 148)
జవాబు:
జన్యుపరంగా మార్పు చెందిన ఆహారం వాడటం మంచిది కాదు.

ప్రశ్న 23.
చికెన్-65 అంటే ఏమిటో తెలుసా ? అలా ఎందుకు అంటారు ? (పేజి.నెం. 148)
జవాబు:
చికెన్ – 65 అంటే అదో వంటకం పేరు. అలా ఎందుకు అంటారు అంటే దీనిని 1965వ సంవత్సరంలో చెన్నైలోని బుహారి హోటల్ లో మొదటగా తయారుచేస్తారు.

ప్రశ్న 24.
కోడిగుడ్లు పొదగటానికి పట్టేకాలం ఎంతో మీకు తెలుసా ? (పేజి. నెం. 149)
జవాబు:
కోడిగుడ్లు పొదగటానికి పట్టేకాలం 21 రోజులు అని నాకు తెలుసు.

ప్రశ్న 25.
మీ గ్రామాలలో గుడ్లను పొదిగే విధానంపై నివేదిక తయారుచేయండి. బొమ్మలు కూడా గీయండి. (పేజి.నెం. 149)
జవాబు:
మా గ్రామాలలో పొదిగే కాలం రాగానే గంపలో గడ్డిపరచి దానిమీద గుడ్లు ఉంచితే కోళ్ళు గుడ్లపై కూర్చొని గుడ్లన పొదుగుతాయి. . విద్యార్థి స్వయంకృత్యం

ప్రశ్న 26.
పరాగ సంపర్కానికి తేనెటీగలు ఎలా తోడ్పడతాయి ? (పేజి.నెం. 150)
జవాబు:
తేనెటీగలు మకరందం కోసం ఒక పువ్వుపై వాలుతాయి. అప్పుడు దాని శరీరానికి పరాగరేణువులు అంటుకొని ఉంటాయి. అది తర్వాత వేరే పుష్పంపై మకరందం కోసం వెళితే ఆ పరాగరేణువులు ఆ పుష్పంలోని కీలాగ్రంపై చేరును.
ఈ విధంగా తేనెటీగలు పరాగసంపర్కానికి సహాయపడును.

AP Board 8th Class Biology Solutions Chapter 9 జంతువుల నుండి ఆహారోత్పత్తి

ప్రశ్న 27.
మీ పరిసరాలలో తేనెపట్టును ఎక్కడ గమనించారు ? (పేజి.నెం. 152)
జవాబు:
మా పరిసరాల్లో పెద్ద పెద్ద చెట్లకు మరియు పెద్ద పెద్ద భవనాలకు తేనెపట్టు ఉండటం గమనించాం.

ప్రశ్న 28.
తేనెపట్టును ఏ కాలంలో ఎక్కువగా చూడవచ్చు ? (పేజి.నెం. 152)
జవాబు:
తేనెపట్టు ఏ కాలంలో అయితే ఎక్కువగా మొక్కలకు పూలు పూస్తాయో ఆ కాలంలో చూస్తాము. అది వర్షాకాలం, ఎండకాలానికి ముందు (శిశిర ఋతువు) పూలు బాగా పూస్తాయి.

ప్రశ్న 29.
తేనెపట్టు నుంచి తేనె సేకరించడం జాగ్రత్తగా చేసే పని. తేనెపట్టు నుంచి తేనె ఎలా సేకరిస్తారో, సేకరించేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారో రాయండి. (పేజి.నెం. 152)
జవాబు:
తేనెపట్టు ఉన్న చోట పొగ పెట్టించి ఈగలను ప్రక్కకు మళ్లించి తేనె తీయడం “జరుగును. ఈగలు ప్రక్కకు వెళ్ళిన ఆ తరువాత తేనెపట్టును జాగ్రత్తగా కత్తిరించి తేనెను తీస్తారు. తేనె తీసే మనిషి గోనె సంచి ఒంటినిండా కప్పుకుంటారు.

ప్రశ్న 30.
కృత్రిమ మరియు సహజ తేనెపట్టుల మధ్య గల వ్యత్యాసాలను గురించి చర్చించండి. (పేజి.నెం. 152)
జవాబు:
AP Board 8th Class Biology Solutions Chapter 9 జంతువుల నుండి ఆహారోత్పత్తి 5

ప్రశ్న 31.
తేనెటీగల మైనం యొక్క ఉపయోగాలు వ్రాయండి. (పేజి.నెం. 152)
జవాబు:
తేనెటీగల మైనంతో అలంకరణ సామగ్రి, గోళ్ళ రంగు, కొవ్వొత్తులు, చెప్పుల పాలిష్ మొదలైనవి తయారుచేస్తారు.

AP Board 8th Class Biology Solutions Chapter 9 జంతువుల నుండి ఆహారోత్పత్తి

ప్రశ్న 32.
మీ చుట్టుపక్కల దొరికే వివిధ రకాల చేపల జాబితాను తయారుచేయండి. స్థానిక పేర్లను మాత్రమే రాయండి. (పేజి.నెం. 153)
జవాబు:
మా చుట్టుపక్కల దొరికే వివిధ రకాల చేపల స్థానిక పేర్లు :

  1. బొచ్చె
  2. రాహు, ఎర్రగండు
  3. రాగండి
  4. ఎర్రమోసు
  5. పెద్ద బొచ్చె
  6. వాలుగ
  7. మట్ట గిడస
  8. పులస
  9. సొర

ప్రశ్న 33.
మీకు కొలనులో చేపలను ఎలా పట్టాలో తెలుసా ? (పేజి.నెం. 153)
జవాబు:
తెలుసు, మేము కొలనులో చేపలను పట్టుటకు ఫిషింగ్ నెట్స్, ఫిషింగ్ రాడ్స్ ఉపయోగిస్తాము.

ప్రశ్న 34.
అధిక మొత్తంలో చేపలను పట్టడానికి ఏం చేస్తారు ? (పేజి.నెం. 153)
జవాబు:
అధిక మొత్తంలో చేపలు పట్టడానికి ఈ క్రింది విధంగా చేస్తాము.
1. అధిక మొత్తంలో చేపలు పట్టుకొనుటకు నైలాన్ వలలు ఉపయోగిస్తారు. .
2. పెద్ద వలలను, మోటార్ పడవలను ఉపయోగిస్తారు.

ప్రశ్న 35.
మర పడవలు ఉపయోగించి చేపలు పట్టడాన్ని నిరంతరంగా కొనసాగిస్తే ఏం జరుగుతుంది ? (పేజి.నెం. 153)
జవాబు:
మర పడవలు ఉపయోగించి చేపలు పట్టడాన్ని నిరంతరం కొనసాగిస్తే

  1. సహజ వనరుల దుర్వినియోగం జరుగును.
  2. కొన్ని చేపల జాతులు అంతరించును.
  3. చేపలను ఆహారంగా తినే ఇతర జీవులకు హాని కలుగును.
  4. ఆహారపు గొలుసు, ఆవరణ వ్యవస్థ అస్తవ్యస్థం అగును.

ప్రశ్న 36.
ఆలుచిప్పలు వలన కలిగే ఉపయోగాలను మీ ఉపాధ్యాయుడిని అడిగి తెలుసుకోండి. (పేజి.నెం.153)
జవాబు:

  1. ఆలుచిప్పలు విటమిన్ – డి, కాల్షియం, విటమిన్ – బి, ప్రొటీన్లు, మంచి కొలెస్ట్రాల్, ఇనుమును కలిగి ఉంటాయి.
  2. నీటిని వడకట్టి శుభ్రపరుస్తాయి.
  3. ఆలుచిప్పలు తినుటవలన లైంగిక సామర్థ్యం పెరుగును.
  4. కొన్ని ఆలుచిప్పలు ముత్యాల తయారీలో ఉపయోగపడును.

AP Board 8th Class Biology Solutions Chapter 9 జంతువుల నుండి ఆహారోత్పత్తి

ప్రశ్న 37.
మన సముద్ర జలాలలో “టూనా” అనే ముఖ్యమైన చేప లభిస్తుంది. టూనా చేపకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి గోడ పత్రికలో ప్రదర్శించండి. (పేజి.నెం. 153).
జవాబు:
టూనా చేప 1 నుంచి 10 అడుగుల వరకు పెరుగును. 600 కేజీల బరువు ఉండును. 70 కి.మీ. వేగంతో ఈదును. 26°C ఉష్ణోగ్రత వద్ద నివసించును. దీనిలో ముఖ్యంగా 3 ఓమెగో కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. కార్బోహైడ్రేట్స్ అసలు ఉండవు. క్రొవ్వులు కూడా తక్కువగా (8 గ్రాములు) ఉండును. ప్రొటీన్స్ ఎక్కువగా ఉండును.
ఈ “టూనా” చేపల ఉపయోగాలు :

  1. గుండెపోటు రాకుండా చేయును.
  2. పిల్లలలోను ఆస్మా తగ్గించును.
  3. మానసిక ఒత్తిడులను తగ్గించును.
  4. కీళ్ళ నొప్పులను తగ్గించును.
  5. పక్షవాతం నుంచి వ్యక్తి తొందరగా కోలుకొనుటకు సహాయపడును.

ప్రశ్న 38.
నీలి విప్లవం అనగానేమి ? దాని ప్రభావాన్ని తరగతి గదిలో ఉపాధ్యాయునితో చర్చించండి. (పేజి.నెం. 154)
జవాబు:
చేపల పెంపకం, దిగుబడి పెంచటానికి, నాణ్యత అధికం చేయుటకు జరిగిన ప్రయత్నమే నీలి విప్లవం అంటారు.
నీలి విప్లవం ప్రభావం :

  1. పెరుగుతున్న జనాభా అవసరానికి సరిపోవును.
  2. ఎగుమతులకు సరిపోయినన్ని చేపలు లభించును.
  3. సముద్రాలలో ఆవరణ వ్యవస్థ అంతగా పాడవదు.
  4. వ్యవసాయదారులకు రెండవ పంటగా ఉపయోగపడును.

ప్రశ్న 39.
మీ ప్రాంతంలో చేపలను నిల్వచేసే పద్ధతుల జాబితా రాయండి. (పేజి.నెం. 155)
జవాబు:
మా ప్రాంతంలో చేపలను క్రింది పద్ధతుల్లో నిల్వ చేస్తారు.

  1. ఎండలో ఎండబెట్టడం
  2. పాక్షికంగా ఎండబెట్టడం
  3. ఉప్పులో ఊరబెట్టడం
  4. పొగబెట్టడం

AP Board 8th Class Social Solutions Chapter 24 విపత్తులు – నిర్వహణ

SCERT AP 8th Class Social Study Material Pdf 24th Lesson విపత్తులు – నిర్వహణ Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Social Solutions 24th Lesson విపత్తులు – నిర్వహణ

8th Class Social Studies 24th Lesson విపత్తులు – నిర్వహణ Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
మీ ప్రాంతంలో సంభవించిన లేదా టీవీలో చూసిన ప్రకృతి వైపరీత్యాలను, జరిగిన నష్టాన్ని చెప్పండి. నష్టాన్ని తగ్గించాలంటే ఏ ఏ చర్యలు చేపట్టాలో తెల్పండి. (AS4)
జవాబు:
ఇటీవల మా ప్రాంతంలో విపరీతమైన వర్షాల కారణంగా వరదలు వచ్చాయి. మా ఇళ్ళు, పొలాలు అన్నీ నీట మునిగాయి. మా ప్రాంతంలో 8 మంది వరద ఉధృతికి నీట మునిగి కొట్టుకుపోయారు. చేలు మునగటం వలన వరి పంట మొత్తం నాశనమయ్యింది. పశువులు మేతలేక, నీట మునిగి మరణించాయి.

కృష్ణానదికి అడ్డుకట్ట వేసి నీటిని మళ్ళిస్తే ఈ వరదను అరికట్టవచ్చు. లోతట్టు ప్రాంతాల వారిని వర్షం ఉధృతంగా ఉన్నప్పుడే అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. దాతలను ప్రోత్సహించి వారికి ఉచిత ఆహార, వైద్య సదుపాయాలు కల్పించాలి. ఈ విధంగా చేయటం వల్ల నష్టాన్ని తగ్గించవచ్చు.

ప్రశ్న 2.
వైపరీత్యాలను ఎలా నివారించవచ్చు? ఎలా ఎదుర్కోవచ్చు? (AS1)
జవాబు:
సృష్టిలో మనిషి తప్ప మిగతా ప్రాణులన్నీ ప్రకృతికి అనుగుణంగా జీవిస్తాయి. మనిషి మాత్రం ప్రకృతిని తనకు అనుగుణంగా మలుచుకుంటున్నాడు. ఇలాకాక మానవుడు ప్రకృతికి అనుగుణంగా జీవించాలి. అంతేకాక మడచెట్ల పెంపకం, భద్రమైన ప్రదేశాలలోకి గ్రామాలను మార్చటం, తుపానులను, భూకంపాలను తట్టుకునే విధంగా భవన నిర్మాణాలను ప్రోత్సహించడం మొదలైన వాటితో నష్టాలను నివారించవచ్చు.

వైపరీత్య బృందాలను ఏర్పాటు చేసి శిక్షణనివ్వటం, షెల్టర్లు, దిబ్బలు ఏర్పాటు చేయడం మొదలైన వాటితో వీటిని ఎదుర్కోవచ్చు.

ప్రశ్న 3.
వైపరీత్యాలకు సంబంధించి పెద్దవాళ్ల అనుభవాలు, వాటిని ఎలా ఎదుర్కొన్నారో తెలుసుకుని వాటి గురించి రాయండి. (AS3)
జవాబు:
ఒకసారి హైదరాబాదులో భూకంపం వచ్చిందట. వేసవికాలం రాత్రిపూట అందరూ ఆరు బయట పడుకుని ఉండగా వచ్చిందట. ముందు మా బామ్మగారు ఏదో కుక్క మంచాన్ని కదుపుతోంది అనుకున్నారట. ఈలోగా చుట్టు ప్రక్కల వాళ్లు ‘భూకంపం’ అని కేకలు వేయడం వినిపించిందట. అంతే అందరూ ఒక్క ఉదుటున లేచి వీధిలోకి పరిగెత్తారట. చూస్తుండగానే రోడ్డు చివర ఒక ఎత్తైన భవనం కూలిపోయిందట. ఇళ్ళల్లోని సామానులన్నీ క్రిందపడిపోయాయట. చాలామంది ఇళ్ళ గోడలు పగుళ్లు వచ్చాయట. ఆ రాత్రి నుంచి తెల్లారే వరకు 5, 6 సార్లు భూమి కంపించిందట. మా వాళ్ళు అలాగే రోడ్ల మీద కూర్చుని ఉన్నారట కానీ ఇళ్ళల్లోకి వెళ్ళలేదట. తెల్లారాక భయం లేదని నమ్మకం కలిగాక ఇళ్ళలోకి వెళ్లి పని పాటలు మొదలు పెట్టారట.

AP Board 8th Class Social Solutions Chapter 24 విపత్తులు – నిర్వహణ

ప్రశ్న 4.
ప్రజలు విపత్తులను ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలను సూచించండి. (AS4)
జవాబు:
ప్రకృతి విపత్తులను ముందే ఊహించి కొన్ని విషయాలలో జాగ్రత్తలు తీసుకోవాలి.

  1. సులువుగా తప్పించుకునే మార్గం ముందే ఆలోచించి ఉంచుకోవాలి.
  2. అవసరమైన సామగ్రిని ఒక బ్యాగులో సర్దుకుని ఉంచుకోవాలి.
  3. నీటికి సంబంధించిన విపత్తు అయితే ఎత్తైన ప్రాంతాలకు ముందే చేరుకోవాలి.
  4. నిల్వ చేసుకునే ఆహార పదార్థాలను సేకరించి ఉంచుకోవాలి.
  5. అత్యవసరమైన మందులను దగ్గరుంచుకోవాలి.
  6. ఇతరులకు అవకాశమున్నంతమేర సాయం చేయాలి.

ప్రశ్న 5.
కరవు ప్రభావాలను పేర్కొనండి. (AS1)
జవాబు:
కరవు ప్రభావం :
కరవు ప్రభావం మెల్లగా తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది.

  1. భూగర్భజల నీటిమట్టం పడిపోవటం, తాగునీటి కొరత.
  2. పంటల విస్తీర్ణం తగ్గటం.
  3. వ్యవసాయం కుంటు పడటంతో వ్యవసాయ రంగంలో ఉపాధి తగ్గిపోవటం.
  4. వ్యవసాయ, అనుబంధ రంగాలలోని ప్రజల కొనుగోలు శక్తి పడిపోవటం.
  5. ఆహారధాన్యాల కొరత.
  6. పశుగ్రాస కొరత.
  7. పశువులు చనిపోవటం.
  8. పోషకాహార లోపం, ప్రత్యేకించి చిన్న పిల్లల్లో
  9. అతిసారం, విరేచనాలు, కలరా వంటి రోగాలు, అనారోగ్యం విస్తరించటం, ఆకలికి గురికావటం వల్ల కంటి చూపులో లోపం ఏర్పడటం.
  10. నగలు, ఆస్తులు వంటివి తప్పనిసరయ్యి తాకట్టు పెట్టటం లేదా అమ్మటం.
  11. పని కోసం వెతుక్కుంటూ ప్రజలు వలస వెళ్లటం.

ప్రశ్న 6.
నీటి వృథా జరిగే సందర్భాలను పేర్కొని, దాని నివారణకు మార్గాలను సూచించండి. (AS6)
జవాబు:
నీరు వృథా జరిగే సందర్భాలు దాని నివారణకు మార్గాలు :

  1. పట్టణ, గ్రామ ప్రాంతాలలోని మంచినీటి కుళాయిలకు హెడ్లు సరిగ్గా లేకపోవడం- దీనిని ఎప్పటికప్పుడు సరిచేయాలి.
  2. టూత్ బ్రష్, షేవింగ్ చేయునపుడు కొలాయిని వృథాగా వదలరాదు.
  3. మంచినీటి పైపుల లీకేజీని నివారించాలి.
  4. కాలువల ద్వారా పంటపొలాలకు నీటిని అవసరం మేరకు వదలాలి.
  5. నీటికొరత సమయాలలో గృహ అవసరాల కొరకు పరిమితంగా నీరు వాడాలి.
  6. బిందు సేద్యం వంటి వ్యవసాయ పద్ధతులు ఉపయోగించాలి.
  7. వర్షపు నీరు వృథాకాకుండా చెరువులకు మళ్ళించాలి.
  8. ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గొయ్యి త్రవ్వి వర్షపునీటి భూమిలో ఇంకేటట్లు చూడాలి.

ప్రశ్న 7.
ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించిన చిత్రాలతో ఆల్బమ్ తయారు చేయండి. (AS3)
జవాబు:
AP Board 8th Class Social Solutions Chapter 24 విపత్తులు – నిర్వహణ 1

8th Class Social Studies 24th Lesson విపత్తులు – నిర్వహణ InText Questions and Answers

8th Class Social Textbook Page No.254

ప్రశ్న 1.
విపత్తులలో రకాలు ఏవి? వాటిని వివరించండి.
జవాబు:
విపత్తులలో రకాలు :
విపత్తులు ఏర్పడటానికి గల కారణాలను బట్టి, అది సంభవించే వేగాన్ని బట్టి వీటిని అనేక రకాలుగా విభజించవచ్చు.
1. సంభవించే వేగాన్ని బట్టి నిదానంగా వచ్చే, వేగంగా వచ్చే విపత్తులని రెండుగా విభజించవచ్చు.

ఎ) నిదానంగా సంభవించే విపత్తులు :
అనేక రోజులు, నెలలు, ఒక్కొక్కసారి సంవత్సరాలపాటు సంభవించే కరువు, పర్యావరణ క్షీణత, పురుగుల తాకిడి, కాటకం వంటివి నిదానంగా సంభవించే విపత్తులకు ఉదాహరణలు.

బి) వేగంగా సంభవించే విపత్తులు :
తృటి కాలంలో సంభవించే విపత్తు విభ్రాంతికి గురి చేస్తుంది. ఇటువంటి విపత్తుల ప్రభావం కొద్ది కాలం ఉండవచ్చు. లేదా ఎక్కువ రోజులు ఉండవచ్చు. భూకంపాలు, తుపాను, ఆకస్మిక వరదలు, అగ్ని పర్వతాలు బద్దలవటం వంటివి వేగంగా సంభవించే విపత్తులకు ఉదాహరణలు.

2. కారణాలను బట్టి ప్రకృతి, సహజ, మానవ నిర్మిత విపత్తులని రెండు రకాలుగా విభజించవచ్చు.
ఎ) ప్రకృతి విపత్తులు :
ప్రకృతి సహజ కారణాల వల్ల ఇటువంటి విపత్తులు ఏర్పడి మానవ, భౌతిక, ఆర్ధిక, పర్యావరణ నష్టాలకు దారితీస్తాయి. ప్రకృతి విపత్తులలో రకాలు :
అ) భూకంపాలు
ఆ) తుపానులు
ఇ) వరదలు
ఈ) కరవు
ఉ) సునామీ
ఊ) కొండ చరియలు విరిగి పడటం
ఋ) అగ్నిపర్వతాలు, మొ||నవి

బి) మానవ నిర్మిత విపత్తులు :
మానవ కారణంగా సంభవించే విపత్తుల వల్ల సాధారణ జీవితం అస్తవ్యస్తమవుతుంది. ప్రాణ, ఆస్తి, ఆర్థిక, పర్యావరణ నష్టం కలుగుతుంది. వీటికి గురయ్యే ప్రజలు ఈ సమస్యలను ఎదుర్కోగల స్థితిలో ఉండరు. 1984 భోపాల్ గ్యాస్ విషాదం, 1997లో ఢిల్లీలో ఉపహార్ సినిమాహాలులో అగ్ని ప్రమాదం, 2002లో రాజధాని ఎక్స్ ప్రెస్ రైలు పట్టాలు తప్పటం, 2003లో కుంభకోణం (తమిళనాడు)లో పాఠశాలలో అగ్ని ప్రమాదం, 2008లో జైపూర్‌లో వరుస పేలుళ్లు వంటివి దీనికి ఉదాహరణలు.

AP Board 8th Class Social Solutions Chapter 24 విపత్తులు – నిర్వహణ

ప్రశ్న 2.
విపత్తుల యాజమాన్యం అంటే ఏమిటి?
జవాబు:
విపత్తులపై / అత్యవసర పరిస్థితులపై నియంత్రణ సాధించటం, విపత్తుల ప్రభావాన్ని నివారించటానికి, తగ్గించటానికి, లేదా వాటి నుంచి కోలుకోవటానికి దోహదం చేసే విధానాలను అందించే దానిని విపత్తుల యాజమాన్యం అంటారు. ఈ కార్యక్రమాలు సంసిద్ధతకు, తీవ్రతను తగ్గించటానికి, అత్యవసర స్పందనకు, సహాయానికి, కోలుకోటానికి (పునర్నిర్మాణం, పునరావాసం) సంబంధించినవి కావచ్చు.

8th Class Social Textbook Page No.256

ప్రశ్న 3.
సునామీలు అంటే ఏమిటో మీకు తెలుసా? అవి ఎలా ఏర్పడతాయి? వాటిని ముందుగా ఎలా ఊహించవచ్చు? రాష్ట్రంలోని కోస్తా జిల్లాల్లో నివసిస్తున్నట్లయితే సునామీ సంభవించినపుడు మిమ్మల్ని ఎలా రక్షించుకుంటారు?
జవాబు:
జపాన్ భాషలో ‘సు’ అంటే రేవు’, ‘నామె’ అంటే ‘అలలు’ అని అర్థం. ఈ రెండూ కలిసి ‘సునామీ’ అన్న పదం ఏర్పడింది. సముద్రంలోని భూకంపాలు, అగ్నిపర్వతాలు పేలటం, లేదా కొండచరియలు విరిగి పడటం వల్ల పెద్ద పెద్ద అలలు చెలరేగి తీరప్రాంతాలను అతలాకుతలం చేయటాన్ని ‘సునామీ’ అంటారు. దగ్గరలోని భూకంపాల వల్ల ఉత్పన్నమైన సునామీ అలలు కొద్ది నిమిషాలలోనే తీరాన్ని తాకుతాయి. ఈ అలలు తక్కువలోతు నీటిని చేరినప్పుడు చాలా అడుగుల ఎత్తు, అరుదుగా పదుల అడుగుల ఎత్తు పైకెగసి తీరప్రాంతాన్ని విధ్వంసకర శక్తితో తాకుతాయి. ఒక పెద్ద భూకంపం తరువాత సునామీ ముప్పు చాలా గంటలపాటు ఉండవచ్చు.

ఉపగ్రహ సాంకేతిక విజ్ఞానంతో సునామీలను పసికట్టవచ్చు. సునామీలు వచ్చినపుడు వాతావరణశాఖ హెచ్చరికల ద్వారా తెలుసుకుని, ముందే సురక్షిత ప్రాంతాలకు చేరుకుని మమ్మల్ని మేము రక్షించుకుంటాము.

ప్రశ్న 4.
సునామీ ముందు ఏం చేయాలి?
జవాబు:

  1. సునామీ ముప్పుకి గురయ్యే ప్రాంతంలో మీ ఇల్లు, బడి, పని ప్రదేశం, తరచు సందర్శించే ప్రదేశాలు ఏమైనా ఉన్నాయేమో తెలుసుకోవాలి.
  2. సునామీ సంభవించినప్పుడు మీరు ఉండటానికి అవకాశం ఉన్న ఇల్లు, బడి, పని ప్రదేశం, ఇతర ప్రదేశాల నుంచి తప్పించుకునే మార్గం గురించి ముందే తెలుసుకుని ఉండాలి.
  3. తప్పించుకునే మార్గాల ద్వారా క్షేమంగా ఉండే ప్రాంతాలను చేరుకోటాన్ని సాధన చేస్తూ ఉండాలి.
  4. అత్యవసర పరిస్థితుల్లో ఉంచుకోవలసిన సామగ్రితో సిద్ధంగా ఉండాలి.
  5. సునామీ గురించి మీ కుటుంబంతో చర్చిస్తూ ఉండాలి.

ప్రశ్న 5.
సునామీ గురించి రాయండి.
జవాబు:

  1. సునామీలో అనేక అలలు ఉంటాయి. మొదటి అల అన్నిటికంటే పెద్దది కాకపోవచ్చు. మొదటి అల తరవాత అనేక గంటలపాటు పెద్ద అలలు తాకే ప్రమాదముంటుంది.
  2. మైదాన ప్రాంతంలో సునామీ మనిషికంటే వేగంగా, అంటే గంటకి 50 కి.మీ. వేగంతో పయనించగలదు.
  3. సునామీ పగలు కానీ, రాత్రి కానీ ఏ సమయంలోనైనా సంభవించవచ్చు.

ప్రశ్న 6.
సునామీ పై మరింత సమాచారం, చిత్రాలు సేకరించండి. తరగతి గదిలో చర్చించండి. సమాచారంను నోటీస్ బోర్డులో ప్రదర్శించండి.
జవాబు:
AP Board 8th Class Social Solutions Chapter 24 విపత్తులు – నిర్వహణ 3
విద్యార్థులు స్వయంగా చర్చ నిర్వహించి, సమాచారంను నోటీసు బోర్డులో ప్రదర్శించాలి.

  1. తేదీ : 00.58.83 26.12.2004.
  2. మాగ్నిట్యూడ్ : 9.1 – 9.3 mw
  3. లోతు : 30 km (19 mi)
  4. భూకంప నాభి : 3.316°N-95.854°E
  5. రకం : సముద్రంలో
  6. దేశాలు లేదా ప్రాంతాలు : ఇండోనేషియా, శ్రీలంక, ఇండియా, థాయ్ లాండ్, మాల్దీవులు, ఆఫ్రికా తూ|| తీరం (సోమాలియా)
  7. మరణాలు : 230,210 – 280,000

8th Class Social Textbook Page No.259

ప్రశ్న 7.
కరవు గురించి మీకు తెలిసింది రాయండి.
జవాబు:
కరువు అన్నది వర్మపాత లోపం వల్ల ఏర్పడే ప్రకృతి వైపరీత్వం. ఒక ప్రాంతంలో సాధారణంగా పడవలసినంతగా వర్షం పడకపోతే దానిని అనావృష్టి (Meteorological drought) అంటారు. ఒక సంవత్సరంలో వర్షం సాధారణంగానే ఉండవచ్చు. కానీ రెండు వానల మధ్య వ్యవధి చాలా ఎక్కువగా ఉండి వర్షాధార పంటలు దెబ్బతినవచ్చు. దీనిని వ్యవసాయ కరువు (Agricultural drought) అంటారు. కాబట్టి ఎంత వర్షం అన్నదే కాకుండా, ఎప్పుడెప్పుడు పడిందన్నది కూడా ముఖ్యమవుతుంది.

అధిక లేదా తక్కువ వర్షపాతం అన్నది (70-100 సంవత్సరాల) సగటు సాధారణ వర్షపాతంతో పోల్చి ఈ విధంగా చెబుతారు.
అధిక + సగటు వర్షపాతం కంటే 20 శాతం లేదా అంతకంటే ఎక్కువ.
సాధారణ + సగటు వర్షపాతం కంటే 19 శాతం ఎక్కువ నుంచి 19 శాతం తక్కువ వరకు.
తక్కువ – సగటు వర్షపాతం కంటే 20 శాతం నుంచి 59 శాతం తక్కువ వరకు,
బాగా తక్కువ – సగటు వర్షపాతం కంటే 60 శాతం కంటే తక్కువ.

కొన్ని ప్రాంతాలు అవి ఉన్న భౌగోళిక స్థితుల వల్ల తక్కువ వర్షపాతం పడటానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. వీటిని ‘కరవు పీడిత’ ప్రాంతాలు అంటారు.

8th Class Social Textbook Page No.260

ప్రశ్న 8.
వాటర్ షెడ్ అభివృద్ధి పథకం అంటే ఏమిటి? దీని ఉద్దేశ్యమేమి?
జవాబు:
కరవు ప్రభావాలను తగ్గించటానికి ప్రభుత్వం కరువు పీడిత ప్రాంతాలలో సమగ్ర వాటర్ షెడ్ యాజమాన్య పథకాలను (IWMP) అమలు చేస్తోంది. దీని ప్రధాన ఉద్దేశ్యం ప్రజలలో నైపుణ్యాలను పెంపొందించి ప్రకృతి వనరులను సమర్థంగా ఉపయోగించుకునేలా చేయటం, సామర్థ్యాన్ని బట్టి నేలను ఉపయోగించుకోవటం ద్వారా నేల, నీటి వనరులను బాగా వినియోగించుకోవచ్చు. వాటి దురుపయోగాన్ని అరికట్టవచ్చు. వాటర్ షెడ్ కార్యక్రమంలో చేపట్టే ముఖ్యమైన పనులు పొలాల్లో వాననీటి సంరక్షణ, అడవుల పెంపకం, తక్కువ నీళ్లు అవసరమయ్యే చెట్లు / పంటలను ప్రోత్సహించటం, ప్రత్యామ్నాయ జీవనోపాధులు మొదలైనవి.

AP Board 8th Class Social Solutions Chapter 24 విపత్తులు – నిర్వహణ

ప్రశ్న 9.
కరవును ఎదుర్కోవటం ఎలా?
జవాబు:
ఒక్కసారిగా సంభవించే ప్రమాదం మాదిరి కాకుండా కరువు మెల్లగా సంభవిస్తుంది కాబట్టి మనం దానికి సంసిద్ధతగా ఉండటానికి, ప్రతిస్పందించటానికి, దాని ప్రభావాన్ని తగ్గించటానికి తగినంత సమయం ఉంటుంది. పర్యవేక్షణ, ముందుగా జారీచేసే హెచ్చరికలవల్ల అన్నిస్థాయిల్లో నిర్ణయాత్మక బాధ్యతలు ఉన్నవాళ్లు సకాలంలో స్పందించవచ్చు. కరవుకు గురయ్యే ప్రాంతాల్లో నీటి సంరక్షణా విధానాలు వంటి అంశాలపై ప్రభుత్వం అవగాహన కల్పించాలి.

ప్రశ్న 10.
వర్షపు నీటిని పట్టణ ప్రాంతాలలో ఎలా నిల్వ చేయాలి?
జవాబు:
వర్షపు నీటి నిల్వ :
పట్టణ ప్రాంతాల్లో ఇంటి పైకప్పుపై పడే వర్షపు నీటినంతా జాగ్రత్తగా నిలువ చేయాలి. ఈ వాన నీటినంతా ఇంకుడు గుంతలలోకి మళ్లించటం అన్నింటికంటే తేలికైన పని. ప్రత్యేకించి కట్టిన ట్యాంకులు, సంపు (sump)ల లోకి వాన నీటిని మళ్లించి రోజువారీ అవసరాలకు ఉపయోగించుకోవచ్చు. కొన్ని ప్రాంతాల్లో తేలికైన వడపోత విధానాలతో తాగటానికి అత్యంత శుద్ధమైన నీటిని పొందవచ్చు.

8th Class Social Textbook Page No.261

ప్రశ్న 11.
మీరు నీటిని ఆదా చేసేవారా, వృథా చేసేవారా?
జవాబు:
AP Board 8th Class Social Solutions Chapter 24 విపత్తులు – నిర్వహణ 2
మీరు వాడుతున్న నీటిని పట్టికలో నింపి మొత్తం కూడండి, మీరు ఏ స్థానంలో ఉన్నారో తెలుసుకోండి.
– 200 లీటర్ల కంటే తక్కువ – పర్యావరణ హీరో
– 201 – 400 లీటర్లు – నీటి పొదుపరి
– 401 – 600 లీటర్లు – నీటి ఖర్చుదారు
– 600 లీటర్ల కంటే ఎక్కువ – నీటి విలన్
జవాబు:
నేను పర్యావరణ హీరో స్థానంలో ఉన్నాను.

ప్రశ్న 12.
ఆ వైపరీత్యాన్ని ఎలా ఎదుర్కొన్నారు?
జవాబు:
స్థానిక ప్రభుత్వం వారు చాలా వరకు వరద ముప్పున్న ప్రాంతాల ప్రజలను ఊళ్ళోని పాఠశాలలకు, కమ్యూనిటీహాలుకు తరలించారు. వారికి ఆహార పొట్లాలు, త్రాగునీరు అందించారు. కొందరు తమ దుప్పట్లు, కట్టుకోవడానికి వస్త్రాలు అవీ దానంగా యిచ్చారు. ఈ విధంగా వైపరీత్యాన్ని ఎదుర్కొన్నారు.

ప్రశ్న 13.
మీ ప్రాంతంలో ఏదైనా వైపరీత్యాన్ని చూశారా? వివరించండి.
జవాబు:
మా ఇంటి దగ్గర ‘స్పాంజి డస్టర్లు’ తయారుచేసే చిన్న కంపెనీ ఒకటున్నది. అనుకోకుండా ఒక రోజు సాయంత్రం అక్కడ అగ్ని ప్రమాదం జరిగింది. పనిచేసేవారు జాగ్రత్తపడే లోపలే లోపలున్న ‘స్పాంజి’ మొత్తం కాలిపోయింది. పనివారికి కూడా ఒళ్ళు కాలి గాయాలయ్యాయి. దాదాపు రూ. 3,50,000 నష్టం వాటిల్లిందని దాని యాజమానులు చెప్పగా విన్నాము.

AP Board 8th Class Social Solutions Chapter 24 విపత్తులు – నిర్వహణ

ప్రశ్న 14.
కింది పేరాను చదివి అడిగిన ప్రశ్నలకు జవాబులివ్వండి.
సునామీల గురించి ముందుగా పసిగట్టడం :

సునామీకి కారణమయ్యే భూకంపాల గురించి ఉపగ్రహ సాంకేతిక విజ్ఞానంతో దాదాపు వెనువెంటనే హెచ్చరికలు జారీచేయవచ్చు. సునామీ కేంద్రం నుంచి తీరం ఎంత దూరం అన్నదాన్ని బట్టి హెచ్చరిక ఎంత ముందుగా చేయవచ్చన్నది ఆధారపడి ఉంటుంది. హెచ్చరికలో ఏ ఏ తీర ప్రాంతాన్ని ఎంత సమయంలో సునామీ తాకవచ్చో చెబుతారు.

తీరప్రాంత అలల కొలతల పరికరాలు సునామీలను తీరం దగ్గరగా గుర్తించగలవు కానీ సముద్రంలోపల ఇవి ఉపయోగపడవు. సముద్రం లోపలి కేబుళ్ల ద్వారా భూమికి అనుసంధానం చేసిన సునామీ డిటెక్టర్లు సముద్రంలో 50 కి.మీ. లోపలికి ఉంటాయి. సునామీ మీటర్లు సముద్ర ఉపరితలంపై అలజడులను గుర్తించి వాటిని ఉపగ్రహాలకు ప్రసారం చేస్తాయి.
1. సునామీకి కారణం ఏమిటి?
జవాబు:
భూకంపం.

2. హెచ్చరికలు ఎలా సాధ్యం?
జవాబు:
ఉపగ్రహ సాంకేతిక విజ్ఞానంతో సాధ్యం

3. హెచ్చరికలో ఏమి చెబుతారు?
జవాబు:
హెచ్చరికలో ఏ ఏ తీర ప్రాంతాన్ని ఎంత సమయంలో సునామీ తాకవచ్చో చెబుతారు.

4. సునామీ డిటెక్టర్లు ఎక్కడ ఉంటాయి?
జవాబు:
సముద్రంలో 50 కి.మీ. లోపలికి ఉంటాయి.

5. సునామీ మీటర్లు ఏం చేస్తాయి?
జవాబు:
సముద్ర ఉపరితలంపై అలజడులను గుర్తించి వాటిని ఉపగ్రహాలకు ప్రసారం చేస్తాయి.

ప్రశ్న 15.
కింది పేరాను చదివి అడిగిన ప్రశ్నలకు జవాబులివ్వండి.

టీచర్లు, విద్యార్థులు ఒక ప్రాంత జనాభాలో సమగ్రభాగం. విపత్తులకు సంసిద్ధంగా ఉండటంలో వీళ్లకు ముఖ్యమయిన పాత్ర ఉంది. తల్లిదండ్రులు, ఇతర ప్రజలలో అవగాహన కల్పించటంలో విద్యార్థులు ముఖ్య పాత్ర పోషించవచ్చు. ఈ విషయంలో విద్యార్థులకు మార్గదర్శనం చేయటం ఉపాధ్యాయుల గురుతరమైన బాధ్యత.
1. టీచర్లు, విద్యార్థులు ఎవరు?
జవాబు:
వీరు ఒక ప్రాంత జనాభాలో సమభాగం.

2. దేనిలో వీరికి ముఖ్య మైన పాత్ర ఉంది?
జవాబు:
విపత్తులకు సంసిద్ధంగా ఉండటంలో వీళ్ళకు ముఖ్యమైన పాత్ర ఉంది.

3. విద్యార్థులు ఎవరికి అవగాహన కల్పిస్తారు?
జవాబు:
తల్లిదండ్రులకు, ఇతర ప్రజలకు.

4. విద్యార్థులకు ఎవరు మార్గదర్శనం చేస్తారు.
జవాబు:
ఉపాధ్యాయులు.

ప్రశ్న 16.
‘వాటర్ షెడ్ అభివృద్ధి’ పేరాను చదివి, రెండు ప్రశ్నలను తయారు చేయుము.
జవాబు:

  1. IWMP ని ఎవరు అమలు చేస్తున్నారు?
  2. ఏవేనీ రెండు ప్రత్యామ్నాయ జీవనోపాధుల పేర్లు రాయండి.

పట నైపుణ్యాలు

AP Board 8th Class Social Solutions Chapter 24 విపత్తులు – నిర్వహణ 4
ప్రశ్న 17.
సునామీ ఏయే ప్రాంతాలను తాకింది?
జవాబు:
అలప్పుజా, కొల్లం, కన్యాకుమారి, కడలూర్, నాగపట్నం, చైన్నై, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, పశ్చిమ బెంగాల్ తీరప్రాంతం మరియు అండమాన్ నికోబార్ దీవులు.

ప్రశ్న 18.
ఇవి ఏ తీరంలో ఉన్నాయి?
జవాబు:
ఎక్కువ ప్రదేశాలు తూర్పు తీరంలో, కొన్ని దక్షిణ తీరంలోనూ ఉన్నాయి.

ప్రశ్న 19.
కరవు అంటే ఏమిటి?
జవాబు:
కరవు అన్నది వర్షపాత లోపం వల్ల ఏర్పడే ప్రకృతి విపత్తు. ఒక ప్రాంతంలో సాధారణంగా పడవలసినంతగా వర్షం పడకపోతే దానిని వాతావరణ కరవు అంటారు.

AP Board 8th Class Social Solutions Chapter 24 విపత్తులు – నిర్వహణ

ప్రశ్న 20.
ప్రకృతి విపత్తులలో రకాలేవి?
జవాబు:

  1. భూకంపాలు
  2. తుపానులు
  3. వరదలు
  4. కరవు
  5. సునామి
  6. కొండచరియలు విరిగిపడటం
  7. అగ్నిపర్వతాలు
    బ్రద్దలవటం మొదలైనవి.

AP Board 8th Class Social Solutions Chapter 23 క్రీడలు : జాతీయత, వాణిజ్యం

SCERT AP 8th Class Social Study Material Pdf 23rd Lesson క్రీడలు : జాతీయత, వాణిజ్యం Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Social Solutions 23rd Lesson క్రీడలు : జాతీయత, వాణిజ్యం

8th Class Social Studies 23rd Lesson క్రీడలు : జాతీయత, వాణిజ్యం Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
తప్పు వాక్యాలను సరిచేయండి : (AS1)
1. తమ పాలనలో ఉన్న దేశాల మధ్య పోటీలు నిర్వహించటానికి క్రికెట్ ను వలస పాలకులు ప్రోత్సహించారు.
2. పాశ్చాత్యీకరణ చెందటానికి ప్రజలు ఈ ఆటను నేర్చుకోసాగారు.
3. భారతీయ గ్రామస్తులు క్రికెట్ ఆడేవాళ్లు.
4. మంచి నడవడిక అలవాటు చేయటానికి ఈ ఆటను పాఠశాలల్లో ప్రవేశపెట్టారు.
జవాబు:
2. ఈ ఆటను అభిమానించి ప్రజలు నేర్చుకోసాగారు.
3. ఇంగ్లాండు గ్రామస్థులు క్రికెట్టు ఆడేవాళ్లు.

ప్రశ్న 2.
క్రికెట్టు, ఇతర ఆటలపై గాంధీజీ దృక్పథం గురించి కొన్ని వాక్యాలు రాయండి. (AS1)
జవాబు:
శరీరం, మనసు మధ్య సమతుల్యానికి క్రీడలు అవసరమని మహాత్మాగాంధి నమ్మాడు. అయితే క్రికెట్, హాకీ వంటి ఆటలు బ్రిటిషు వాళ్ల ద్వారా భారతదేశంలోకి దిగుమతి చేసుకోబడి సంప్రదాయ ఆటలను కనుమరుగు చేస్తున్నాయని అతడు తరచు విమర్శించేవాడు. ఇది వలస పాలిత మనస్తత్వాన్ని చూపిస్తోంది. చేనులో పనిచేయడం ద్వారా పొందే వ్యాయామంతో పోలిస్తే ఈ ఆటల వల్ల విద్యాప్రయోజనం చాలా తక్కువ.

AP Board 8th Class Social Solutions Chapter 23 క్రీడలు : జాతీయత, వాణిజ్యం

ప్రశ్న 3.
కింది వాటిని కుషంగా వివరించండి. (AS2)
• భారతదేశంలో క్రికెట్ క్లబ్ ఏర్పాటు చేయటంలో పార్శీలు మొదటివాళ్లు.
• ఐసిసి ప్రధాన కార్యాలయం లండన్ నుంచి దుబాయికి మారటంలోని ప్రాముఖ్యత.
జవాబు:
భారతీయ క్రికెట్ అంటే భారతీయులు ఆడిన క్రికెట్టు బొంబాయిలో పుట్టింది. ఈ ఆటను మొదట చేపట్టిన వాళ్లు తక్కువ సంఖ్యలో ఉన్న పార్శీలు. తమ వ్యాపారాల వల్ల బ్రిటిషువాళ్లతో మొదట పరిచయం అయింది పార్శీ సమాజానికి, మొదట పాశ్చాత్యీకరణ చెందింది వీళ్లే. భారతదేశ మొదటి క్రికెట్టు క్లబ్బును వీళ్లు 1848లో బొంబాయిలో స్థాపించారు, దాని పేరు ఓరియంటల్ క్రికెట్ క్లబ్. పార్శీ వ్యాపారస్తులైన టాటాలు, వాడియాలు పార్శీ క్రికెట్ క్లబ్బులకు నిధులు సమకూర్చారు, వాటికి ప్రాయోజకులుగా ఉన్నారు. అయితే భారతదేశంలోని శ్వేతజాతీయ కులీనులు ఈ ఆటలో ఆసక్తి కనబరుస్తున్న పార్శీలకు ఏ విధంగానూ సహాయపడలేదు. వాస్తవానికి తెల్లజాతివాళ్లకే పరిమితమైన బాంబే – జింఖానాలో పార్కింగ్ ప్రదేశం వినియోగించుకోవటంలో పార్శీ క్రికెటర్లతో తెల్లజాతి వాళ్లు గొడవపడ్డారు.

వలస పాలకులు శ్వేత జాతీయుల పట్ల పక్షపాతం వహిస్తారని నిర్ధారణ కావటంతో క్రికెట్టు ఆడటానికి పార్శీలు తమ సొంత జింఖానా ఏర్పాటు చేసుకున్నారు. పార్శీలకు, జాతి వివక్షత ప్రదర్శించిన బాంబే జింఖానాకు మధ్య వైరుధ్యంలో భారతీయ తొలి క్రికెట్టు ఆటగాళ్లకు తీయని విజయం లభించింది. 1885లో భారత జాతీయ కాంగ్రెసు ఏర్పడిన నాలుగు సంవత్సరాలకు అంటే 1889లో క్రికెట్టులో బాంబే జింఖానాని ఒక పార్శీ బృందం ఓడించింది.

సిడ్నీలో జరిగే మ్యాచులు నేడు సూరత్ లో ప్రత్యక్ష ప్రసారంగా చూడవచ్చు. ఈ చిన్న వాస్తవం క్రికెట్ అధిపత్యంలోని సమీకరణలను మార్చివేసింది. బ్రిటిషు సామ్రాజ్యం అంతరించిపోవటంతో మొదలైన ప్రక్రియ ప్రపంచీకరణతో దాని తార్కిక ముగింపుకి చేరుకుంది. క్రికెట్ ఆడే దేశాలలో అత్యధిక ప్రేక్షకులు భారతదేశంలో ఉన్నందువల్ల, క్రికెట్‌కు ప్రపంచంలో అతి పెద్ద మార్కెట్ ఉన్నందువల్ల దీని కేంద్రం దక్షిణాసియాకు మారింది. ఐసిసి ప్రధాన కార్యాలయం లండన్ నుంచి పన్నులు లేని దుబాయికి మారటం ఈ మార్పును సంకేతంగా సూచిస్తోంది.

ప్రశ్న 4.
ఏదైనా ఒక స్థానిక ఆట చరిత్ర తెలుసుకోండి. మీ తల్లిదండ్రులను, తాతా, అవ్వలను వాళ్ల బాల్యంలో ఈ ఆటను ఎలా ఆడేవాల్లో అడగండి. ఇప్పుడు కూడా ఆ ఆటను అలాగే ఆడుతున్నారా? మార్పులకు కారణమైన చారిత్రక శక్తులు ఏమై ఉంటాయో ఆలోచించండి. (AS3)
జవాబు:
‘కబడ్డీ’ అంటే ‘కూత’ అని అర్థం. ఇది కౌరవులు, పాండవుల కాలం నాటి నుండి మన దేశంలో ఉన్నది. దీన్ని కొన్ని ప్రాంతాల్లో ‘చిక్ చిక్’ అని, కొన్ని ప్రాంతాల్లో ‘చెడుగుడు’ అని అంటారు. మా ప్రాంతంలో దీనిని ‘కబడ్డీ – కబడ్డీ! అంటారు. ఇది రెండు జట్ల మధ్య జరిగే పోటీ. జట్టుకు 12 మంది సభ్యులుంటారు. కాని జట్టుకు 7 మంది మాత్రమే ఆటలో పాల్గొంటారు.

ఈ ఆటలో కొన్ని నియమాలు :

  1. నిర్ణీత కాలవ్యవధిలో ఆడే ఆట.
    15 నిమిషాలు – 5 నిమిషాలు విశ్రాంతి – 15 నిమిషాలు.
  2. ‘అవుట్’ అయిన వాళ్లు బరి నుండి బయటకు వెళ్ళాలి.
  3. ‘పాయింట్’ వచ్చినపుడు లోపలికి రావాలి.
  4. ‘7 గురు’ అవుట్ అయితే ‘లోనా’ అంటారు.
  5. ‘లోనా’కి అదనంగా 2 పాయింట్లు వస్తాయి.

దీని యొక్క నియమాలు ‘కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా’ వారు రూపొందిస్తారు. రాష్ట్రస్థాయిలో కూడా ఈ సంస్థ ఉన్నది.

ఈ ఆట అనేక మార్పులకు, చేర్పులకు లోనయింది. ఇటీవలి కాలంలో ‘బోనస్ లైన్ పాయింట్’ ను ఇవ్వడం మొదలు పెట్టారు. అంటే 6 లేదా 7 గురు క్రీడాకారులు బరిలో ఉండగా వారి బోనస్ లైన్ ను తాకి వచ్చిన వారికి ఒక పాయింట్ అదనంగా వస్తుంది. అయితే ఆటలో కూత మాత్రం ఆపరాదు.

ప్రశ్న 5.
సాంకేతిక విజ్ఞానంలో, ప్రత్యేకించి టెలివిజన్ సాంకేతిక విజ్ఞానంలో మార్పులు ప్రస్తుత క్రికెట్ ను ఏ రకంగా ప్రభావితం చేసాయి? (AS4)
జవాబు:
రంగు రంగుల బట్టలు, రక్షణ హెల్మెట్లు, క్షేత్ర రక్షణలో పరిమితులు, దీప కాంతులలో క్రికెట్టు వంటివి పాకర్ అనంతర ఆటలో ప్రామాణికంగా మారాయి. అన్నిటికీమించి క్రికెట్టును సొమ్ము చేసుకోగల ఆటగా, పెద్ద ఎత్తున ఆదాయాలు సమకూర్చే ఆటగా పాకర్ దానికి గుర్తింపు తెచ్చాడు. టెలివిజన్ కంపెనీలకు ప్రసార హక్కులు అమ్ముకోవటం ద్వారా క్రికెట్టు బోర్డులు విపరీతంగా డబ్బును సంపాదించాయి. టీ.వీకి అతుక్కుపోయిన క్రికెట్టు అభిమానులకు వాణిజ్య ప్రకటనలు జారీ చేయటానికి వివిధ కంపెనీలు పెద్ద ఎత్తున డబ్బును ఖర్చు చేయసాగాయి. టెలివిజన్లో నిరంతర ప్రసారాల వల్ల క్రికెట్టు ఆటగాళ్లు హీరోలైపోయారు. క్రికెట్టు బోర్డు వీళ్లకి చెల్లించే మొత్తం గణనీయంగా పెరిగింది. అంతేకాదు టైర్ల నుంచి శీతల పానీయాల వరకు వివిధ వస్తువులకు వాణిజ్య ప్రకటనలలో పాల్గొనటం ద్వారా క్రికెట్టు ఆటగాళ్లు ఇంకా ఎక్కువ మొత్తంలో డబ్బు సంపాదించసాగారు. టెలివిజన్ ప్రసారాలు క్రికెట్ ఆటను మార్చివేశాయి. చిన్న చిన్న పట్టణాలు, గ్రామాలలో సైతం ప్రసారం చేయటం ద్వారా క్రికెట్ ప్రేక్షకుల సంఖ్య గణనీయంగా పెరిగింది. క్రికెట్ ఆడే వాళ్ల సామాజిక నేపథ్యాన్ని కూడా విస్తరింపచేసింది. పెద్ద పట్టణాల్లో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచు చూసే అవకాశం లేని పిల్లలు ఇప్పుడు తమ అభిమాన క్రీడాకారులను అనుకరించి, ఆట నేర్చుకోగలిగారు. ఉపగ్రహ టెలివిజన్ సాంకేతిక విజ్ఞానం వల్ల, బహుళజాతి టెలివిజన్ కంపెనీల వల్ల, క్రికెట్ కి అంతర్జాతీయ మార్కెట్టు ఏర్పడింది.

ఈ రకంగా టెలివిజన్ సాంకేతిక విజ్ఞానంలో మార్పులు ప్రస్తుత క్రికెట్ ను ప్రభావితం చేసాయి.

AP Board 8th Class Social Solutions Chapter 23 క్రీడలు : జాతీయత, వాణిజ్యం

ప్రశ్న 6.
క్రికెట్టు వాణిజ్య క్రీడగా మారటం వల్ల సంభవించిన పరిణామాలపై ఒక కరపత్రం తయారు చేయండి. (AS6)
జవాబు:
కరపత్రం

సిడ్నీలో జరిగే మ్యాచులు నేడు సూరత్ లో ప్రత్యక్ష ప్రసారంగా చూడవచ్చు. ఈ చిన్న వాస్తవం క్రికెట్ అధిపత్యంలోని సమీకరణలను మార్చివేసింది. బ్రిటిషు సామ్రాజ్యం అంతరించిపోవటంతో మొదలైన ప్రక్రియ ప్రపంచీకరణతో దాని తార్కిక ముగింపుకి చేరుకుంది. క్రికెట్టు ఆడే దేశాలలో అత్యధిక ప్రేక్షకులు భారతదేశంలో ఉన్నందువల్ల, క్రికెట్ కు ప్రపంచంలో అతి పెద్ద మార్కెట్ ఉన్నందువల్ల దీని కేంద్రం దక్షిణాసియాకు మారింది. ఐసిసి ప్రధాన కార్యాలయం లండన్ నుంచి పన్నులు లేని దుబాయికి మారటం ఈ మార్పును సంకేతంగా సూచిస్తోంది.

పాత ఆంగ్ల-ఆస్ట్రేలియా, అక్షం నుంచి క్రికెట్టు కేంద్రం మారిందనటానికి మరొక ముఖ్య సంకేతంగా చెప్పవచ్చు: క్రికెట్ పద్ధతుల్లో వినూత్న ప్రయోగాలు ఉపఖండ దేశాలైన భారత, పాకిస్తాన్, శ్రీలంక వంటి క్రికెట్లు దేశాల నుంచి వచ్చాయి. బౌలింగ్ లో రెండు గొప్ప పరిణామాలకు పాకిస్తాన్ బీజం వేసింది : ‘దూస్‌రా’, ‘రివర్స్ స్వింగ్’. ఈ రెండు నైపుణ్యాలు కూడా ఉపఖండంలోని స్థితులకు అనుగుణంగా రూపొందాయి. బరువైన ఆధునిక బ్యాటులతో దుందుడుకు ఆటగాళ్ళు ‘ఫింగర్ స్పిన్’కి చరమగీతం పాడుతున్న పరిస్థితుల్లో ‘దూరా’ ముందుకొచ్చింది. నిర్మలమైన ఆకాశం కింధ, వికెట్టుపడని దుమ్ము పరిస్థితులలో బంతిని కదిలించటానికి ‘రివర్స్ స్వింగ్’ వచ్చింది. మొదట్లో ఈ రెండు పద్ధతులను బ్రిటన్, ఆస్ట్రేలియా వంటి దేశాలు అనుమానంతో చూశాయి. క్రికెట్టు నియమాలను అక్రమంగా మారుస్తున్నారని ఇవి ఆరోపించాయి. బ్రిటిషు, ఆస్ట్రేలియాలోని ఆట పరిస్థితులకు అనుగుణంగా మాత్రమే క్రికెట్లు నియమాలను రూపొందించటం సాధ్యం కాదని కాలక్రమంలో రుజువయ్యింది, ప్రపంచవ్యాప్తంగా బౌలర్లు అందరూ ఉపయోగించే పద్ధతిగా ఇవి మారాయి.

నూటయాభై సంవత్సరాల క్రితం భారతదేశంలో మొదటి క్రికెట్టు ఆటగాళ్లిన పార్టీలు ఆడటానికి ఖాళీ ప్రదేశం కోసం పోరాడవలసి వచ్చింది. ఈనాడు ప్రపంచమార్కెటు ఫలితంగా భారతీయ ఆటగాళ్లకు అత్యధికంగా డబ్బులు చెల్లిస్తున్నారు, అత్యధిక ప్రజాదరణ కూడా వీళ్లకే ఉంది. ప్రపంచమంతా వీళ్లకి వేదికగా మారింది. ఎన్నో చిన్న చిన్న మార్పుల కారణంగా ఈ చారిత్రక మార్పులు సంభవించాయి. సరదా కోసం ఆడే పెద్దమనుషుల స్థానాన్ని, వృత్తిగా డబ్బు కోసం ఆడే క్రీడాకారులు తీసుకున్నారు. ప్రజాదరణలో టెస్టు మ్యాచ్ స్థానాన్ని ఒక రోజు మ్యాచు ఆక్రమించాయి. సాంకేతిక విజ్ఞానంలో, ప్రపంచ వాణిజ్యంలో గణనీయమైన మార్పులు వచ్చాయి. మారుతున్న కాలంతో మారటమే వ్యాపార చరిత్ర అవుతుంది.

ప్రశ్న 7.
ప్రపంచ పటంలో క్రికెట్ ఆడే ఐదు దేశాలను గుర్తించండి. (AS5)
జవాబు:
AP Board 8th Class Social Solutions Chapter 23 క్రీడలు జాతీయత, వాణిజ్యం 1

8th Class Social Studies 23rd Lesson ఆధునిక కాలంలో కళలు – కళాకారులు InText Questions and Answers

8th Class Social Textbook Page No.246

ప్రశ్న 1.
మీకు ఆటలు ఆడటం అంటే ఇష్టమా?
జవాబు:
అవును

– ఏ ఆటలు ఆడతారు?
జవాబు:
ఖో ఖో, వాలీబాల్, బాడ్మింటన్

– ఏ ఆట అంటే మీకు ఎక్కువ ఇష్టం?
జవాబు:
బాడ్మింటన్

– కేవలం ఆడపిల్లలు లేదా కేవలం మగపిల్లలు ఆడే ఆటలు పేర్కొనండి.
జవాబు:
కేవలం ఆడపిల్లలు ఆడే ఆట : తొక్కుడు బిళ్ళ
కేవలం మగపిల్లలు ఆడే ఆట : గోళీలు.

– కొన్ని ఆటలను కేవలం పల్లెల్లోనే ఆడతారా?
జవాబు:
అవును. ఉదా : చెడుగుడు

– కొన్ని ఆటలను కేవలం బాగా డబ్బు ఉన్న వాళ్లే ఆడతారా?
జవాబు:
అవును. ఉదా : గోల్ఫ్

AP Board 8th Class Social Solutions Chapter 23 క్రీడలు : జాతీయత, వాణిజ్యం

ప్రశ్న 2.
మీరు ఎందుకు ఆడతారు?
కింద ఇచ్చిన కారణంతో మీరు అంగీకరిస్తే (✓) టిక్కు పెట్టండి. అంగీకరించకపోతే (✗) గుర్తు పెట్టండి. మీకు అదనంగా తోచిన కారణాలను జాబితాకు చేర్చండి.

ఆటలు ఆడటం తేలిక.
ఆటలు ఆడటం సరదాగా ఉంటుంది.
తల్లిదండ్రులు, టీచర్లు, స్నేహితులు మెచ్చుకుంటారు.
ఆటలు సవాళ్లను విసురుతాయి.
ఆటల వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.
సచిన్, సానియా వంటి అభిమాన క్రీడాకారులను అనుకరించే అవకాశం.
చదువుల కంటే ఆటలు తేలిక.
టెలివిజన్లో కనపడతాం.
ఆటలలో రాత పరీక్షలు, ఇతర పరీక్షలు ఉండవు.
అంతర్జాతీయ పోటీలలో పతకాలు పొందవచ్చు.
దేశానికి ఖ్యాతి తీసుకురావటానికి
పేరు, డబ్బు, ఖ్యాతి గడించటానికి

ప్రశ్న 3.
తరగతిలోని విద్యార్థులందరి అభిప్రాయలను క్రోడీకరించి ఏ కారణాన్ని వారు ముఖ్యమైనదిగా భావిస్తున్నారో తెలుసుకోండి.
జవాబు:
మా తరగతిలో అందరూ ఆటల వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుందని భావిస్తున్నారు.

ప్రశ్న 4.
వెండీస్ అన్న పేరు గల ఒక దేశం ఏదీ లేదన్న విషయం గుర్తించారా? బాగా వేగంగా పరిగెత్తే క్రీడాకారుడు ఏ. దీవులలో ఏ దీవి నుంచి వచ్చాడో గుర్తించండి.
జవాబు:
వెస్టండీస్ అనేవి కరేబియన్ దీవులు. ఇవి ఈ పేరు మీద 1958 నుండి 1962 వరకు మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతం ఇవి కొన్ని సార్వభౌమ దీవులుగాను, కొన్ని సెయింట్ కిట్స్, నివీలో భాగాలుగానూ, యు.కే. మీద ఆధారపడి కొన్ని, – డచ్ ఆధారితాలుగా కొన్ని, యు.యస్. మీద ఆధారపడి ఒకటి ఉన్నాయి. కాబట్టి ఈ పేరుమీద ఏ దేశం లేదు.

ఈ దీవులలో బాగా వేగంగా పరిగెత్తే క్రీడాకారుడు ‘ఉసియన్ బోల్ట్’ జమైకా దీవుల నుండి వచ్చాడు.

8th Class Social Textbook Page No.249

ప్రశ్న 5.
క్రికెట్టుకీ, పాశ్చాత్య సంస్కృతిని ప్రోత్సహించటానికీ మధ్య సంబంధం ఏమిటి?
జవాబు:
క్రికెట్టు ఇంగ్లాండులో పుట్టింది, పెరిగింది. ఇది ఇంగ్లాండు వలస దేశాలలో రాణించింది. మార్పులు, చేర్పులు అన్నీ వీరి స్థాయిలోనే జరుగుతాయి. కాబట్టి క్రికెట్టుని ప్రోత్సహించడం అంటే పాశ్చాత్య సంస్కృతిని ప్రోత్సహించడమే. ఇదే వాటి మధ్యనున్న సంబంధం.

ప్రశ్న 6.
ఇక్కడ ఆటలు ఆడటానికి వివిధ క్రీడా పరికరాలు ఉన్నాయి. మీకు స్థానికంగా దొరికే వాటితో పోలిస్తే వీటి నాణ్యత తేడాగా ఉందని మీరు గమనించి ఉంటారు. డబ్బుకోసం వృత్తి క్రీడాకారులు ఉపయోగించే ఈ పరికరాలను సరదా కోసం ఆదుకునే పిల్లలు కొనగలుగుతారా?
AP Board 8th Class Social Solutions Chapter 23 క్రీడలు జాతీయత, వాణిజ్యం 2
జవాబు:
ఇవి చాలా ఖరీదైన ఆట వస్తువులు. వీటిని మామూలు స్థాయివారు కొనలేరు. సరదా కోసం ఆడేవారు అసలే కొనలేరు. వృత్తి క్రీడాకారులు డబ్బు సంపాదిస్తారు, అదీగాక వీరిని పెద్ద పెద్ద కంపెనీలు స్పాన్సర్ చేస్తాయి. కాబట్టి కొనగలుగుతారు.

8th Class Social Textbook Page No.250

ప్రశ్న 7.
టెస్టు క్రికెట్టు ప్రాముఖ్యత అంతరించటం వల్ల సంభవించిన మార్పుల జాబితా తయారు చేయండి.
జవాబు:

  1. 1970వ దశకంలో క్రికెట్ మారుతున్న ప్రపంచానికి అనువుగా మారటం మొదలెట్టింది.
  2. టెస్ట్ క్రికెట్ ప్రాముఖ్యత తగ్గి ఒకరోజు అంతర్జాతీయ పోటీ మొదలయ్యింది. ఇది జనాదరణ పొందింది.
  3. రెండు సంవత్సరాలు పాకర్ ‘సర్కస్’ అద్భుతంగా నిర్వహించబడింది.
  4. రంగు రంగుల బట్టలు, రక్షణ హెల్మెట్లు, క్షేత్ర రక్షణలో పరిమితులు, దీపకాంతులలో క్రికెట్టు మొదలగునవి ప్రామాణికంగా మారాయి.
  5. క్రికెట్టు సొమ్ము చేసుకోగల ఆటగా మారింది.
  6. క్రికెట్టు బోర్డులు విపరీతంగా డబ్బును సంపాదించాయి.
  7. వాణిజ్య ప్రకటనలకు వివిధ కంపెనీలు పెద్ద ఎత్తున డబ్బును ఖర్చు చేసాయి.
  8. క్రికెట్ ఆటగాళ్ళు హీరోలైపోయారు. వీరు అనేక మార్గాలలో ఆదాయాన్ని సంపాదించుకుంటున్నారు.
  9. టెలివిజన్ ప్రసారాలు క్రికెట్టు ఆటను మార్చేశాయి. పల్లెల్లో సైతం ప్రేక్షకులు పెరిగారు.
  10. పట్టణాల్లో పిల్లలు తమ అభిమాన ఆటగాళ్ళ .ఆటను అనుకరించి, ఆట నేర్చుకుంటున్నారు.
  11. క్రికెట్టుకు అంతర్జాతీయ మార్కెట్టు ఏర్పడింది.

8th Class Social Textbook Page No.251

ప్రశ్న 8.
క్రికెట్టు గురించి కొంచెం సేపు ఆలోచించిన తరవాత వినాయక్ ఇంగ్లీషులోనే ఉన్న పదాలను కొన్నింటిని రాశాడు – ‘బౌండరీ’, ‘ఓవరు’, ‘వికెట్’. వీటికి తెలుగు పదాలు ఎందుకు లేవో అతడికి వివరించండి.
జవాబు:
క్రికెట్ అచ్చంగా ఇంగ్లీషు దేశంలో పుట్టింది. కాబట్టి దానికి సంబంధించిన పదాలన్నీ ఆ భాషలోనే ఉన్నాయి. వాటికి తెలుగు అనువాదాలు చేయటం కుదరదు. అందువలన అవి తెలుగులో లేవు.
ఉదా :
‘కబడ్డీ’ని అన్ని భాషలలో మనం కబడ్డీ అనే అంటాము. అనువాదం చేయలేము.

ప్రశ్న 9.
కింది పేరాను చదివి, అడిగిన ప్రశ్నలకు జవాబులు ఇవ్వండి.

క్రికెట్ మ్యాచ్ చూడటం అంటే ఏదో ఒక పక్షానికి మద్దతు కవ్వటం అని అభిమానులకు తెలుసు. రంజీ ట్రోఫీలో ఢిల్లీ, ముంబయి తలపడుతుంటే అభిమానులు ఏ పట్టణం నుంచి వచ్చారు. దీనికి మద్దతునిస్తారు అన్నదాన్ని బట్టి ఒక పక్షం వహిస్తారు. భారతదేశం, ఆస్ట్రేలియాల మధ్య క్రికెట్టు మ్యాచ్ జరుగుతుంటే హైదరాబాదు లేదా చెన్నెలలో టీ.వీలో మ్యాచ్ చూస్తున్న వాళ్లు భారతీయులుగా తమ దేశం వైపున నిలబడతారు. అయితే భారతదేశ తొలి రోజులలో బృందాలు ప్రాంతీయ ప్రాతిపదికన ఏర్పడలేదు. 1932 దాకా టెస్ట్ మ్యాచ్ లో భారతదేశ బృందానికి అవకాశం ఇవ్వలేదు. మరి బృందాలను ఎలా ఏర్పాటు చేసేవాళ్లు? ప్రాంతీయ, జాతీయ బృందాలు లేనప్పుడు అభిమానులు తమ మద్దతు తెలపటానికి బృందాన్ని దేని ప్రాతిపదికగా ఎంచుకునేవాళ్లు?
1. అభిమానులకు ఏమి తెలుసు?
జవాబు:
క్రికెట్ మ్యాచ్ చూడటం అంటే ఏదో ఒక పక్షానికి మద్దతు ఇవ్వటం అని అభిమానులకు తెలుసు.

2. రంజీ ట్రోఫీ దేనికి సంబంధించిన పోటీ?
జవాబు:
క్రికెట్‌కు సంబంధించినది.

3. భారతదేశానికి టెస్ట్ మ్యా చ్ లో అవకాశం ఎప్పటి దాకా రాలేదు.
జవాబు:
1932 దాకా.

4. అభిమానులు ఎవరికి మద్దతు తెలియచేస్తారు?
జవాబు:
అభిమానులు తమ ప్రాంతం వారికి మద్దతు తెలియచేస్తారు.

AP Board 8th Class Social Solutions Chapter 23 క్రీడలు : జాతీయత, వాణిజ్యం

ప్రశ్న 10.
కింది పేరాను చదివి, అడిగిన ప్రశ్నలకు జవాబులు ఇవ్వండి.

‘మీ బాలురకు ఎటువంటి ఆటలు లేవంటే నాకు బాధతో కూడిన ఆశ్చర్యం కలుగుతుంది. జాతీయ క్రీడలు, సంప్రదాయ ఆటలను పునరుద్ధరించటంలో మీ సంస్థ ముందు ఉండాలి. మనదేశంలో ఎన్నో సంప్రదాయ ఆటలు ఉన్నాయి. ఇవి ఆసక్తికరమూ, ఉత్సాహభరితంగా ఉండటమే కాకుండా వీటికి అయ్యే ఖర్చు చాలా తక్కువ.’

– మహీంద్ర కళాశాలలో 1927 నవంబరు 24న ఇచ్చిన ఉపన్యాసం, మహాత్మాగాంధీ సంకలిత రచనలు.

‘ఆరోగ్యకరమైన శరీరం అంటే మనసుకి తగినట్టుగా ఉండి, ఎల్లప్పుడూ దాని సేవకు సిద్ధంగా ఉండేది. నా దృష్టిలో ఇటువంటి శరీరాలు ఫుట్ బాల్ మైదానంలో తయారుకావు. అవి మొక్కజొన్న, పంటపొలాల్లో తయారవుతాయి. దీని గురించి ఆలోచిస్తే, ఇందుకు రుజువుగా మీకు అనేక ఉదాహరణలు దొరుకుతాయి. వలస పాలకుల మోజులో ఉన్న భారతీయులకు ఫుట్ బాల్, క్రికెట్టు పిచ్చి పట్టుకుంది. కొన్ని సందర్భాలలో ఈ ఆటలకు చోటు ఉండవచ్చు… శారీరకంగా, మానసికంగా చురుకుగా ఉండే మానవాళిలోని అధికశాతం రైతులకు ఈ ఆటలు తెలియవన్న వాస్తవాన్ని ఎందుకు పరిగణనలోకి తీసుకోవటం లేదు … ?’

– లాజరస్ కి లేఖ, 1915 ఏప్రిల్ 17, మహాత్మాగాంధీ సంకలిత రచనలు, సంపుటి 14.
1. ఉపన్యాసం ఎవరు, ఎక్కడ ఇచ్చారు?
జవాబు:
ఉపన్యాసం మహీంద్ర కళాశాలలో గాంధీజీ ఇచ్చారు.

2. మన దేశంలో ఏ ఆటలు ఉన్నాయి?
జవాబు:
మన దేశంలో ఎన్నో సాంప్రదాయ ఆటలున్నాయి.

3. ఆరోగ్యకరమైన శరీరం అంటే ఏమిటి?
జవాబు:
ఆరోగ్యకరమైన శరీరం అంటే మనసుకు తగినట్టుగా ఉండి, ఎల్లప్పుడూ దాని సేవకు సిద్ధంగా ఉండేది.

4. ఆరోగ్యకరమైన శరీరాలు ఎక్కడ తయారు అవుతాయి?
జవాబు:
మొక్కజొన్న, పంట పొలాల్లో తయారు అవుతాయి.

5. ఈ లేఖ ఎవరికి రాశారు?
జవాబు:
లాజరు రాశారు.

పట నైపుణ్యాలు

ప్రశ్న 11.
మీ అట్లా లో క్రికెట్ ఆడే దేశాలను గుర్తించండి. /Page No.247)

ప్రశ్న 12.
ప్రపంచ పటంలో ఈ క్రింది వాటిని గుర్తించండి.
దక్షిణాఫ్రికా, జింబాబ్వే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, వెస్ఎండీస్.
జవాబు:
AP Board 8th Class Social Solutions Chapter 23 క్రీడలు జాతీయత, వాణిజ్యం 3

ప్రశ్న 13.
క్రీడలను, వాటిని ప్రోత్సహించే వారిని ప్రశంసించండి.
జవాబు:
క్రీడలు మానసిక వికాసంతోపాటు శారీరకాభివృద్ధిని పెంపొందిస్తాయి. పాఠశాల స్థాయి నుండే పిల్లల్లోని క్రీడాసక్తిని, అభిరుచిని గుర్తించి, ప్రోత్సహించడానికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు రూపొందించి అమలు చేస్తుంది. ప్రభుత్వం వ్యవస్థాపరంగా, మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ అధ్వర్యంలో క్రీడాశాఖ దేశంలో క్రీడారంగం అభివృద్ధికి, అంతర్జాతీయ స్థాయిలో రాణించడానికి శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తుంది. పాఠశాల స్థాయి నుండే ప్రతిభావంతులైన బాలబాలికలను గుర్తించి క్రీడామండలుల ద్వారా ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు ఏర్పరుస్తుంది. అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించే క్రీడలతోపాటు స్థానిక క్రీడాంశాలు మండల, డివిజన్, జిల్లా, రాష్ట్ర, జోనల్, జాతీయ స్థాయిలో పోటీలు నిర్వహిస్తూ విజేతలను ప్రోత్సహిస్తూ క్రీడాకారులకు మెరుగైన శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేకంగా కోన్లను ఏర్పాటు చేయడం జరుగుతుంది. క్రీడలు, క్రీడల పట్ల అభిరుచిని పెంపొందించడంతోపాటు అంతర్జాతీయంగా సాంస్కృతిక వికాసానికి, అవగాహనకు తోడ్పడి విశ్వ మానవ సౌభ్రాతృత్వాన్ని పెంపొందిస్తాయి. భిన్న సంస్కృతులు కలిగిన మన దేశానికి జాతీయ సమైక్యతను పెంపొందించడానికి క్రీడలు ఇతోధికంగా దోహదం చేస్తున్నాయి.

ప్రశ్న 14.
భారతదేశ మొదటి క్రికెట్ క్లబ్బును పార్నీలు ఎప్పుడు, ఎక్కడ స్థాపించారు?
జవాబు:
భారతదేశ మొదటి క్రికెట్ క్లబ్బును పార్శీలు 1848లో బొంబాయిలో స్థాపించారు.

ప్రశ్న 15.
రంజీ ట్రోఫీ దేనికి సంబంధించిన పోటీ?
జవాబు:
రంజీ ట్రోఫీ క్రికెట్ కు సంబంధించిన పోటీ.

ప్రశ్న 16.
భారతదేశానికి టెస్ట్వ్య లో అవకాశం ఎప్పటిదాకా రాలేదు?
జవాబు:
భారతదేశానికి టెస్ట్ మ్యాచ్ లో అవకాశం 1952 దాకా రాలేదు.

ప్రశ్న 17.
ఏ దశకంలో క్రికెట్ మార్పులకు గురయ్యింది.
జవాబు:
1970 దశకంలో క్రికెట్ మార్పులకు గురయ్యింది?

AP Board 8th Class Social Solutions Chapter 23 క్రీడలు : జాతీయత, వాణిజ్యం

ప్రశ్న 18.
1980ల వరకు అంతర్జాతీయ హాకీ రంగంలో ఏ దేశానిది పైచేయి?
జవాబు:
1980ల వరకు అంతర్జాతీయ హాకీ రంగంలో భారత్ దే పైచేయి.

ప్రాజెకు

ఏదైనా ఒక క్రీడ గురించి సమాచారాన్ని సేకరించి, ఆ క్రీడా చరిత్రను నివేదిక రూపంలో రాయండి.
జవాబు:
కబడ్డీ :
మన భారతదేశానికి చెందిన ఒక సాంప్రదాయ క్రీడ – కబడ్డీ. ఈ కబడ్డీ మొదట దక్షిణ భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలో ఆవిర్భవించింది. ఒక గ్రూపు వాళ్ళు వేటాడుతుంటే మిగతావారు వారిని కాపాడుకోవడం అనే దాని నుండి ఆవిర్భవించింది.

మనదేశానికి చెందిన ప్రాచీన క్రీడ ఇది. ఈ క్రీడను వివిధ దేశాలలో వివిధ పేర్లతో పిలుస్తారు.
బంగ్లాదేశ్ లో – హుదుదు అని
మాల్దీవులలో – బైబాల అని
ఆంధ్రప్రదేశ్ లో – చెడుగుడు అని
తమిళనాడులో – సడుగుడు అని
మహారాష్ట్రలో – హుటుటు అని. ప్రాంతీయ పేర్లతో పిలుస్తారు.

ఇది భారతదేశంలో తమిళనాడు, మహారాష్ట్ర, బీహార్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు పంజాబు రాష్ట్రాలకు రాష్ట్ర క్రీడగా వ్యవహరించడం జరుగుతుంది. ఈ 1936లో జరిగిన బెర్లిన్ ఒలంపిక్స్ లో ఈ ఆటకు అంతర్జాతీయ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది.

1938లో కలకత్తాలో జరిగిన భారతదేశ జాతీయ క్రీడలలో దీనికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది.

1950లో All India కబడ్డీ ఫెడరేషన్ అనే దానిని స్థాపించి ఈ క్రీడకు నియమ నిబంధనలను రూపొందించడం జరిగింది.

ప్రస్తుతం స్త్రీల కబడ్డీ పోటీలు కూడా జరుగుతున్నాయి. భారతదేశంలో ప్రో కబడ్డీ పేరిట ప్రతి సంవత్సరం అన్ని రాష్ట్రాల ‘జట్ల మధ్య పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఈ క్రీడను ఆసియా క్రీడలలో కూడా చేర్చడం జరిగింది.

AP Board 8th Class Social Solutions Chapter 22 సినిమా – ముద్రణా మాధ్యమాలు

SCERT AP 8th Class Social Study Material Pdf 22st Lesson సినిమా – ముద్రణా మాధ్యమాలు Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Social Solutions 22nd Lesson సినిమా – ముద్రణా మాధ్యమాలు

8th Class Social Studies 22nd Lesson సినిమా – ముద్రణా మాధ్యమాలు Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
సినిమాలకు, నాటకాలకు ఉన్న మూడు తేడాలను పేర్కొనండి. (AS1)
జవాబు:

సినిమాలునాటకాలు
1. ఎక్కువ ఖర్చుతో కూడుకున్నవి.1. తక్కువ ఖర్చుతో కూడుకున్నవి.
2. ఒకేసారి అనేక చోట్ల ప్రదర్శించబడతాయి.2. ఒక్కసారీ ఒక్కచోట మాత్రమే ప్రదర్శించగలుగుతారు.
3. అనేక ప్రాంతాలలో చిత్రీకరిస్తారు.3. ఒక్క స్టేజీపైనే అన్నీ చూపించటానికి ప్రయత్నిస్తారు.

ప్రశ్న 2.
మీ తెలుగు పాఠ్యపుస్తకంలోని ఏదైనా కథను లేదా పాటను చిన్న సినిమాగా తీయవచ్చా? దీని ఆధారంగా సినిమా తీయటానికి ఎవరెవరు అవసరమో జాబితా తయారుచేయండి. (AS1)
జవాబు:
తీయవచ్చును. దీనికి నిర్మాత, దర్శకుడు, ఎడిటరు, కెమెరామెన్, నటీనటులు, జూనియర్ ఆర్టిస్టులు, గాయకులు, మ్యూజీషియన్లు ఇంకా ఇతర పనివారు కావాలి.

AP Board 8th Class Social Solutions Chapter 22 సినిమా – ముద్రణా మాధ్యమాలు

ప్రశ్న 3.
“సమాజాన్ని మార్చటానికి సినిమా ఒక బలమైన ఆయుధం,” అని కొంతమంది వాదిస్తారు, “సినిమా ప్రభావం చెడుగా ఉంటుంది,” అని మరికొంతమంది అంటారు. మీరు ఎవరితో ఏకీభవిస్తారు? ఎందుకు? (AS4)
జవాబు:
“సమాజాన్ని మంచిగా కాని, చెడుగా కాని మార్చటానికి సినిమా ఒక బలమైన ఆయుధం” – అని నేను భావిస్తాను. అంటే మార్పు ఎటువంటిదైనాకాని, సినిమాకు ఆ శక్తి ఉన్నది.

కారణం :
సినిమా ఒక విలువైన మాధ్యమం. వినోదం కోసం వీటిని చూసినా కొన్ని విషయాలు మనసుకు హత్తుకుంటాయి. చిన్న చిన్న విషయాలే మనుషుల ప్రవర్తనను మారుస్తుంటాయి.

ఉదా :

  1. ‘పోకిరి’ సినిమా చూసిన తరువాత మగ పిల్లలందరూ రెండు షర్టులు ధరించడం మొదలు పెట్టారు.
  2. పూర్వం కొన్ని సినిమాలలో హీరోకు కాన్సర్ వ్యాధి రావటం, రక్తం కక్కుకుని మరణించటం తరుచుగా జరిగేవి. కాని “గీతాంజలి’ అనే సినిమాలో కాన్సరు వచ్చిన హీరో తనలాంటి మరో రకం వ్యాధిగ్రస్తురాలిని ప్రేమిస్తాడు. తరువాత కాన్సరు వ్యాధితో హీరో మరణించిన సినిమాలు రాలేదు. అంటే ప్రేక్షకులు వాటిని ఆశించలేదు అని అర్ధం.

ఈ విధంగా సినిమా నిజంగా ఒక బలమైన ఆయుధం అని చెప్పవచ్చు.

ప్రశ్న 4.
ముందుకాలం సినిమాల్లోని అంశాలు ఏమిటి? మీరు చూసిన సినిమాలు, గతంలోని సినిమాలలోని అంశాలకు తేడాలు, పోలికలు ఏమిటి? (AS1)
జవాబు:
ముందుకాలం నాటి సినిమాలు ఎక్కువగా కుటుంబ కథా చిత్రాలుగా ఉండేవి. కొన్ని సమాజానికి సందేశాత్మకంగా ఉండే చిత్రాలు ఉండేవి. మరికొన్ని పౌరాణికాలు ఉండేవి. నేను చూసిన సినిమాలు, గతంలోని సినిమాలలోని అంశాలకు పోలికలు.

  1. రెండు ఎక్కువగా కుటుంబ ప్రధాన చిత్రాలు.
  2. రెంటిలోనూ పౌరాణికాలు ఉన్నాయి.
  3. రెంటిలోనూ మంచి నటీనట వర్గం ఉంది.

తేడాలు :

నేను చూసిన సినిమాలుగతంలోని సినిమాలు
1. ఇవి ఎక్కువ పాటల ప్రధానమైనవి.1. ఇవి ఎక్కువ ఫైటింగున్నవి.
2. ఇవి ఎక్కువ బడ్జెట్ చిత్రాలు.  2. ఇవి తక్కువ బడ్జెట్ చిత్రాలు.
3. ఇవి ప్రేమ ప్రధానమైనవి.3. ఇవి విలువలు ప్రధానమైనవి.
4. ఇవి కొంచెం అభ్యంతరకరంగా ఉంటున్నాయి.4. ఇవి అందరిచే ఆమోద యోగ్యాలు.
5. హాస్యం అపహాస్యం అవుతోంది.5. హాస్యం సున్నితంగా ఉండేది.

ప్రశ్న 5.
స్వాతంత్ర్యోద్యమంలో దినపత్రికలు ప్రధాన పాత్ర ఎలా పోషించాయి? (AS6)
జవాబు:
సాంస్కృతిక చైతన్యం, జాతీయోద్యమంలో దిన పత్రికల పాత్ర :
బ్రిటీషు పాలనలో సంఘ సంస్కర్తలు సమాజంలో మార్పుల కోసం ఉద్యమించారు. హిందూమతంలో సంస్కరణలు, ‘సతి’ని నిషేధించటం, విధవా పునర్ వివాహాన్ని ప్రోత్సహించటం వంటివి ముఖ్యమైన సంస్కరణలు. ఈ సంస్కర్తలతో ప్రేరణ పొంది దేశ వివిధ ప్రాంతాల నుంచి పలు పత్రికలు ప్రచురితం కాసాగాయి.

భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమంలో పోరాడిన అనేకమంది నాయకులు పత్రికా సంపాదకులు. ‘అమృత్ బజార్ పత్రిక’ (1868లో మొదలయ్యింది) సంపాదకుడు శిశిర కుమార్ ఘోష్, ‘బెంగాలీ’ (1833లో మొదలు) సంపాదకుడు సురేంద్రనాథ్ బెనర్జీ, ‘ది హిందూ’ (1878లో మొదలు) సంపాదకుడు జి. సుబ్రహ్మణ్యం అయ్యర్, ‘కేసరి’ (1881లో మొదలు) సంపాదకుడు బాలగంగాధర తిలక్ ఇందులో చెప్పుకోదగిన వాళ్లు. ఈ పత్రికల సంపాదకులు తమ భావాలను, దృక్పథాలను ఈ పత్రికల ద్వారా ప్రచారం చేసేవారు. భారతీయులలో జాతీయతా భావాన్ని పెంపొందించటంలో వార్తా పత్రికలు ప్రముఖ పాత్ర పోషించాయి. ముట్నూరి కృష్ణారావు సంపాదకత్వంలో కృష్ణా పత్రిక నిర్వహించబడింది.

మహాత్మా గాంధీ 1918లో ‘యంగ్ ఇండియా’ అనే పత్రిక బాధ్యత చేపట్టాడు. ఆ తరువాత గుజరాతీలో ‘నవజీవన్’ అనే పత్రికను స్థాపించాడు. మహాదేవ్ దేశాయి సంపాదకత్వంలోని ‘హరిజన్’ అనే పత్రికకు విరివిగా వ్యాసాలు రాసేవాడు. ఇలా గాంధీగారు పత్రికలకు బాగా విస్తృతంగా రాసేవాడు.

ఈ విధంగా స్వాతంత్ర్యోద్యమంలో దినపత్రికలు ప్రధాన పాత్ర పోషించాయి.

AP Board 8th Class Social Solutions Chapter 22 సినిమా – ముద్రణా మాధ్యమాలు

ప్రశ్న 6.
తాజా అంశాలను తెలియచేసే వార్తలను దినపత్రికల నుంచి సేకరించి తరగతి గదిలో ప్రదర్శించండి. (AS1)
జవాబు:
తాజా అంశం: నేడు ఎంసెట్ ఫలితాలు

సాయంత్రం 4.30 గంటలకు విడుదలు

ఈనాడు-హైదరాబాద్ : ఎంసెట్-2013 ఫలితాలు బుధవారం విడుదలకానున్నాయి. సాయంత్రం 4.30 గంటలకు ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ వీటిని విడుదల చేయనున్నారు. ఈ ఫలితాల విడుదల కార్యక్రమం హైదరాబాద్ లోని జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైనార్జ్ విశ్వవిద్యాలయ ఆవరణలో జరగనుంది. ఫలితాల్లో మార్కులతో సహా ర్యాంకులను కూడా ప్రకటిస్తామని ఎంసెట్ కన్వీనర్ డాక్టర్ రమణారావు మంగళవారం వెల్లడించారు. ఫలితాలు విడుదలైన వెంటనే వాటిని విద్యార్థుల సెల్ ఫోన్ నంబర్లకు తెలియజేసే ఏర్పాట్లు కూడా చేశారు. ఫలితాలు వెల్లడించే వెబ్ సైట్లు : Www.eenadu.net, apeamcet.org, educationandhra.com, vidyavision.com, manabadi.com, schools9.com, nettlinxresults.net, iitjeefoum.com, aksharam.in., resumedropbox.com etc.
ఈ ఉదాహరణ ప్రకారం తాజా వార్తలను సేకరించండి.

8th Class Social Studies 22nd Lesson సినిమా – ముద్రణా మాధ్యమాలు InText Questions and Answers

8th Class Social Textbook Page No.239

ప్రశ్న 1.
మీ తల్లిదండ్రులను వారి బాల్యంలోని నాటకాల గురించి అడిగి తెలుసుకోండి.
జవాబు:
మా తల్లిదండ్రుల కాలంలో భువన విజయం, చింతామణి, కన్యాశుల్కం, రక్త కన్నీరు మొదలైన నాటకాలు బాగావేసేవారు.

ప్రశ్న 2.
కాలక్రమంలో నాటకాలలో ఎటువంటి మార్పులు వచ్చాయి?
జవాబు:
పూర్వకాలం నాటకాలు ఎక్కువగా పౌరాణికాలు ఉండేవి. నేడు సాంఘిక నాటకాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఆనాటి వేదిక అలంకరణ నేడు ఆధునికంగా మారింది. నాడు నటుల గాత్రానికి చాలా విలువనిచ్చేవారు. నేడు వారు గట్టిగా మాట్లాడలేకపోయినా, మైకు వారికి సహకరిస్తున్నాయి. నాడు ఉన్న ఆదరణ నేడు లేదనే చెప్పవచ్చు.

8th Class Social Textbook Page No.240

ప్రశ్న 3.
నాటక ప్రదర్శనకు, సినిమాకు మధ్య తేడాలు ఏమిటి? పోలికలు, తేడాలతో ఒక పట్టిక తయారు చేయండి.
జవాబు:

పోలికలు :

  1. రెండూ వినోద మాధ్యమాలే.
  2. రెంటిలోనూ నటులే నటిస్తారు.
  3. రెండూ ప్రజాదరణ పొందాయి.

తేడాలు :

నాటకాలు :
ఇవి వేదికపై సజీవంగా ప్రదర్శించబడతాయి. ప్రదర్శన సమయంలో తప్పులు జరిగే అవకాశం ఉంటుంది. నటులు తమ స్వరాన్ని, ముఖ కవళికల్ని, ప్రేక్షకులు గ్రహించేలా అభినయించాలి. నటులు కొన్ని నెలలు ఈ నాటకాలని రిహార్సల్ చేయాల్సి ఉంటుంది. వీటిలో నటించడానికి నటీనటులకు ఆడిషన్ టెస్టులు కేవలం రెండు వారాలలో పూర్తి అవుతాయి.

సినిమాలు :
ఇవి రికార్డు చేయబడినవి. చేసిన పొరపాట్లను సరిదిద్దుకునే అవకాశం ఉంది. సినిమా తీసేముందు కేవలం కొన్ని నిమిషాలు మాత్రం రిహార్సల్ చేసుకుంటే సరిపోతుంది. దీనిని చిత్రీకరించడానికి నెలలు, సంవత్సరాలు పట్టవచ్చు. ఆడిషన్ టెస్టు నెలలు పడతాయి.

AP Board 8th Class Social Solutions Chapter 22 సినిమా – ముద్రణా మాధ్యమాలు

ప్రశ్న 4.
నాటకాల నుండి సినిమాలకు మారటం వల్ల కళాకారులు జీవనోపాధి పొందే అవకాశాలలో ఎటువంటి మార్పులు వచ్చాయో మీ టీచరు సహాయంతో చర్చించండి.
జవాబు:
నాటకాలకు ఎక్కువగా మంచి వాక్కు ఉన్నవాళ్ళను నటులుగా ఆదరించేవారు. వీరు సినిమాలకు మారటం వలన వీరి హావభావ ప్రదర్శన, శారీరకమైన అందచందాలు కూడా పరిగణనలోనికి వచ్చాయి. సినిమాల్లో అవకాశాల కోసం రంగస్థల కళాకారులు స్టూడియోల చుట్టూ తిరగటం ప్రారంభించారు. అదృష్టంతోనో, అండదండలతోనో ఈ రంగంలో రాణించినవారు మంచి జీవనోపాధిని, ఆదాయాన్ని పొందారు. లేనివారు కొంతమంది బికారులైన ఉదాహరణలు కూడా ఉన్నాయి.

ప్రశ్న 5.
అయిదు నిమిషాలపాటు ఎటువంటి మాటలు లేకుండా మూకాభినయం చేయండి. ఒక అయిదు నిమిషాల నాటకం వేయండి. ఈ రెండింటిలో నటనలో సౌలభ్యం, ఎంచుకోగల అంశాలు, ప్రేక్షకులకు అర్థం కావటం వంటి విషయాలను పోల్చండి. Page No.240
జవాబు:
విద్యార్థులు ఎవరికి వారుగా మూకాభినయం చేయండి. గ్రూపులవారీగా నాటకాలు వేయండి.
పోల్చుట

అంశాలుమూకాభినయంనాటకం
1. నటనలో సౌలభ్యంఇది నటించడం కష్టం.ప్రయత్నిస్తే తేలిక.
2. ఎంచుకోగల అంశాలుచిన్న, చిన్న అంశాలు, సామాజికమైనవి ఎంచుకోవాలి.సామాజికమైన విషయాలు, పౌరాణిక , అంశాలు, హాస్యభరితమైనవి ఎంచుకోవాలి.
3. ప్రేక్షకులకు అర్ధం కావటంప్రేక్షకులు మొదలైన కొద్ది సేపటికి అర్థం చేసుకోగలుగుతారు.డైలాగ్ చెప్పిన తరువాత అర్థం అవుతుంది.

8th Class Social Textbook Page No.241

ప్రశ్న 6.
మీ ఊళ్లో, పట్టణంలో గల వినోద సాధనాల జాబితా తయారుచేయండి. వాటి జనాదరణను ఎలా అంచనా వేస్తారు? కాలక్రమంలో వాటిలో వస్తున్న మార్పులు ఏమిటి?
జవాబు:
మా ఊళ్ళో సినిమా హాళ్ళు, కళాక్షేత్రం మరియు రాజీవ్ గాంధీ పార్కు ఉన్నాయి. వీటిలో సినిమాహాళ్ళు సినిమాలు బాగుంటే లాంటివి ఎప్పుడూ నిండుగానే ఉంటాయి. కళాక్షేత్రంలో మంచి మంచి నాటకాలు, నృత్యాలు మొదలైనవి ఉంటాయి. వాటికి హాలు సగం, సగానికి పైన నిండుతుంది. రాజీవ్ గాంధీ పార్కుకు ఆదివారాలు, శెలవు దినాలు, వేసవి సాయంకాలాలు జనులు ఎక్కువగా వస్తారు.

ఈ మధ్యకాలంలో వీటన్నిటి కన్నా టీవీలకు, క్రికెట్ మ్యాచ్ లకు ఎక్కువ ఆదరణ పెరిగింది. పెద్దవాళ్ళు, ఆడపిల్లలు టీవీల ముందు, మగపిల్లలు క్రికెట్ మ్యాచ్ ల్లోనూ లీనమై ఉంటున్నారు.

8th Class Social Textbook Page No.242

ప్రశ్న 7.
జాతీయోద్యమానికి సంబంధించి తీసిన మరో రెండు సినిమాలు చెప్పండి.
జవాబు:
భగత్ సింగ్, మంగళ్ పాండే.

ప్రశ్న 8.
తెలుగు సినిమాలలోని దేశభక్తి గీతాలను సేకరించండి.
జవాబు:
1. “భారతయువతా కదలిరా ||
నవయువ భారత విధాయకా.
“భారతయువతా కదలిరా ||”

2. “మేరీ దేశ్ కీ ధరతీ
సోనా ఉగలే ఉగలే హిరీమోతీ ||

3. “నా జన్మభూమి ఎంత అందమైన దేశము.
నా యిల్లు అందులోన కమ్మని ప్రదేశము.”

4. “పుణ్యభూమి నా దేశం నమోనమామి
ధన్యభూమి నా దేశం సదాస్మరామి”

8th Class Social Textbook Page No.243

ప్రశ్న 9.
రెండు బృందాలుగా ఏర్పడి అభిమాన సంఘాల వల్ల ప్రయోజనాలు, సమస్యల గురించి చర్చించండి.
జవాబు:
ప్రయోజనాలు : అభిమాన సంఘాలు వారి అభిమాన హీరోలు, హీరోయిన్లను ఆకాశానికెత్తుతాయి. వారికి ఉచితంగా అడ్వర్టయిజ్ మెంటు ఇస్తారు. సినిమా 100 రోజులు ఆడటానికి విశ్వప్రయత్నం చేస్తారు. అంతేకాక వారు సంఘపరంగా సేవాకార్యక్రమాలను చేపడతారు.
ఉదా :
రక్తదాన శిబిరాలు, ఐ క్యాంపులు మొదలగునవి.

సమస్యలు :
విపరీతమైన అభిమానం వలన సంఘాల మధ్య తీవ్రమైన పోటీ ఉంటుంది. ఇది తీవ్రమైతే అనారోగ్యకరమైన పోటీ అవుతుంది. ఒకోసారి, వీరు సినిమా గురించి అబద్దపు అభిప్రాయాలను వెలిబుచ్చుతారు. ఇవి సినీ అభిమానులను నిరాశపరుస్తాయి.

AP Board 8th Class Social Solutions Chapter 22 సినిమా – ముద్రణా మాధ్యమాలు

ప్రశ్న 10.
మీరు ఇటీవల చూసిన సినిమాలోని కథ, సన్నివేశాలు మీబోటి పిల్లలపై ఎటువంటి ప్రభావం చూపుతాయో విశ్లేషించండి. Page No.243)
జవాబు:
నేను ఇటీవల ‘బాషా’ సినిమా చూశాను. ఈ సినిమాలో హీరో ఒక పోలీసు ఆఫీసరు. కానీ అతను అండర్ కవర్ లో ఉంటాడు. ఇందులో సన్నివేశాలు ఒక పోలీసు ఆఫీసరు యిలా ఉంటారా అనిపించేటట్లు ఉన్నాయి. ఇవి మా బోటి పిల్లలకు పోలీసులపై ఉన్న గౌరవాన్ని తగ్గిస్తాయి.

కేవలం ‘బాషా’ మాత్రమే కాదు. అన్ని సినిమాలు యిదే రీతిగా ఎవరినో ఒకరిని కించపరిచే విధంగా ఉంటున్నాయి.

ప్రశ్న 11.
గత నెలలో వివిధ విద్యార్థులు చూసిన సినిమాల జాబితా తయారు చేయండి. వీటిల్లో హింసను బట్టి 0-5 మార్కులు వేయండి. ఏ మాత్రం హింసలేని సినిమాలకు 5 మార్కులు, ఏహ్యత పుట్టించే తీవ్ర హింస ఉన్న సినిమాలకు 0 మార్కులు వేయాలి.
జవాబు:
ఉదా : 1. శతమానం భవతి – 5
2. గౌతమీపుత్ర శాతకర్ణి – 3
3. ఖైదీ నెంబర్ – 150 – 3
4. …………………..
5. …………………..
6. …………………..

8th Class Social Textbook Page No.244

ప్రశ్న 12.
మీ ప్రాంతంలో దొరికే వివిధ రకాల దిన పత్రికలను తరగతికి తీసుకురండి. ఎన్ని పత్రికలు ఉన్నాయో అన్ని బృందాలుగా ఏర్పడండి. వార్తలు, విశేషాలు ఎలా పొందుపరిచారో (ఏ పేజీలో ఏముంది) విశ్లేషించండి.
జవాబు:
మా గ్రామంలోకి ఈనాడు, సాక్షి అనే రెండు పత్రికలు వస్తాయి. –

మా తరగతిలోని వారందరమూ 2 బృందాలుగా ఏర్పడ్డాము.

ఈనాడు బృందం :
దేశానికి సంబంధించిన ముఖ్య వార్త. తరువాత పేజీల వార్తలు సంక్షిప్తంగా మొదటి పేజీలో, సంపాదకీయం. 4 పేజీలకు వసుంధర అనే పేరుతో స్త్రీలకు సంబంధించిన విషయాలు. ఆటలకు ఒక పేజీ, బిజినెస్ గురించి, అన్ని ప్రకటనలు, సినిమాల గురించి వెండితెర గురించి, టీ.వీ గురించి వివరాలు.

జిల్లా పేపర్ :
దీనిలో జిల్లాకు సంబంధించిన అన్ని రకాల వార్తలు ఉంటాయి.

సాక్షి బృందం : సాక్షి పేపర్ 14 పేజీలు + జిల్లా పేపర్…

మొదటి పేజీలోనే దాదాపుగా ఆ రోజుకు ముఖ్యమైన వార్త అది దేశవ్యాప్తమైనది అవుతుంది. తరువాత పేజీల్లో వచ్చే ముఖ్య వార్తల్ని మొదటి పేజీలో చిన్న చిన్న వ్యాఖ్యలతో ఇచ్చి పేజీ నెంబరు ఇస్తారు. అది ఒక ఉపయోగం. తరువాత ఆ వార్తల్ని వివరంగా ఇస్తారు. టెండర్ల గురించి ప్రకటనలు. ఇక తరువాత ఫ్యామిలీ అనే పేరుతో 4 పేజీల పేపర్ ఉంటుంది. దానిలో ఒక గొప్ప వ్యక్తితో (ఏ రంగమైన) పరిచయం లేదా ఏదైనా మంచిపని చేసేవాళ్ళతో పరిచయం. పిల్లలకు కథలు, అన్నీ అంటే సోషల్ సైన్స్ మొ|| వాటిలో పిల్లలకు తెలియని విషయాలు, భక్తికి సంబంధించిన సందేశాలు, సినిమా కబుర్లు ఉంటాయి.

ఉద్యోగ అవకాశాలు, ఇంకా సంక్షిప్త వార్తలు, బిజినెస్ కు ఒక పేజీ, సెన్సెక్స్. తరువాత ఆటలకు ఒక పేజీ, చివరలో మిగిలిన అన్ని వార్తలు చాలాసార్లు ఫోటోలతో సహా జిల్లా పేపర్ లో మొదటి ముఖ్యవార్త, టెండర్, క్రైమ్, వెండితెర (సినిమా) – బుల్లితెర (ఆరోజు ప్రసారాలు) తరువాత మూడు పేజీల్లో స్థానిక వార్తలు, క్లాసిఫైడ్ (ప్రకటనలు) తరువాత విద్య (ఎంసెట్, బి.ఎడ్ మొ||) తరువాత స్థానిక వార్తలు 2 పేజీల్లో ఉంటాయి.

ప్రశ్న 13.
పైన పేర్కొన్న దిన పత్రికల సంచికలను వరుసగా వారం రోజులపాటు సేకరించండి. పై బృందాలలో ఒక్కొక్క పత్రికలో ఏ ఏరోజున ఏ ప్రత్యేక అంశాలు ప్రచురితమౌతాయో తెలుసుకోండి. ఆ వివరాలను తరగతి గదిలో పంఛుకోండి. దినపత్రికలలో ఇటువంటి అంశాలు ఎందుకు ప్రచురిస్తున్నారో కారణాలను పేర్కొనండి.

ప్రశ్న 14.
వివిధ విషయాలపై రకరకాల పత్రికలు ఉన్నాయి. మీ ఊరు / పట్టణంలో దొరికే పత్రికల పాత సంచికల నుంచి కరకాలున్నాయి ముఖచిత్ర పేజీలను సేకరించండి. వీటిని విషయాల వారీగా వర్గీకరించండి. వీటిని ఇంకే రకంగానైనా వర్గీకరించవచ్చా?
జవాబు:
AP Board 8th Class Social Solutions Chapter 22 సినిమా – ముద్రణా మాధ్యమాలు 1

ఇంకా ఇలాంటివి అనేక రకాలు ఉన్నాయి. వీటిని భాషనుబట్టి, కాలాన్ని బట్టి, అంశాలను బట్టి వర్గీకరించవచ్చు.

ప్రశ్న 15.
కింది పేరా చదివి, ప్రశ్నలకు జవాబులివ్వండి.

సినిమా – వినోదరూపం :
సినిమా కంటే ముందు జానపద కళలు, జానపద నృత్యాలు, సాంప్రదాయ నృత్యాలు, సంగీతం, నాటకం వంటి అనేక వినోద రూపాలు ఉండేవి. కాలక్రమంలో వినోదానికి సినిమా ప్రధాన రూపంగా మారింది. సినిమాలో పాటలకు తగినంత ప్రత్యేక ప్రజాదరణ ఉంది. ఇంతకు ముందు రేడియో, ఇప్పుడు టీవి సినిమా పాటలను విడిగా ప్రసారం చేస్తున్నాయి. సినీనటులంటే ప్రజల్లో ఎంతో అభిమానముంది, అభిమాన సంఘాలు ఏర్పడ్డాయి. సినిమాల్లోని జనాదరణ పొందిన సంభాషణలు రోజువారీ జీవితంలో భాగమయ్యాయి. నటీనటుల వేషధారణ, కేశాలంకరణలను ప్రజలు అనుకరిస్తున్నారు. టెలివిజన్ రాకతో సినిమాలు చూడటానికి సినిమాహాళ్ళకే వెళ్లవలసిన పనిలేకుండా పోయింది. సినిమాలు, సినిమా పాటలు, సినిమా వార్తలు ప్రసారం చేయటానికి ప్రత్యేక ఛానళ్లు లేదా ప్రత్యేక కార్యక్రమాలు ఉన్నాయి.
1. సినిమా కంటే ముందున్న వినోద రూపాలు ఏవి?
జవాబు:
సినిమా కంటే ముందు జానపద కళలు, జానపద నృత్యాలు, సాంప్రదాయ నృత్యాలు, సంగీతం, నాటకం వంటి అనేక వినోద రూపాలు ఉండేవి.

2. సినిమా పాటలకున్న ప్రత్యేకత ఏమిటి?
జవాబు:
వీటికి తగినంత ప్రజాదరణ ఉంది. రేడియోలు, టీవీలు వీటిని ప్రసారం చేస్తున్నాయి.

3. అభిమాన సంఘాలు ఎందుకు ఏర్పడ్డాయి?
జవాబు:
సినీనటులంటే ప్రజల్లో ఎంతో అభిమానముంది. అందుకే అభిమాన సంఘాలు ఏర్పడ్డాయి.

4. ప్రజలు వేటిని అనుకరిస్తున్నారు?
జవాబు:
ప్రజలు నటీనటుల వేషధారణ, కేశాలంకరణలను అనుకరిస్తున్నారు.

5. సినిమాహాళ్ళకు వెళ్ళవలసిన పని ఎందుకు లేదు?
జవాబు:
సినిమాలు, సినిమా పాటలు, సినిమా వార్తలు ప్రసారం చేయటానికి ప్రత్యేక ఛానళ్ళు, ప్రత్యేక కార్యక్రమాలు ఉన్నాయి.

ప్రశ్న 16.
కింది పేరా చదివి, ప్రశ్నలకు జవాబులివ్వండి.

1938, 1939 లో విడుదలైన ‘మాలపిల్ల’, ‘రైతుబిడ్డ’ సినిమాల గురించి రంగయ్య మాటల్లో ఆనాటి ఉత్సాహం ఈనాటికీ కనపడుతోంది. అంటరానితనం, దళితుల ఆలయ ప్రవేశం ‘మాలపిల్ల’లో ప్రధాన అంశం. దీంట్లోని కథానాయకుడు చౌదరయ్య గాంధేయవాది. అతడు ఉన్నత కులాల వాళ్లకు తమ పద్ధతులను మార్చుకోమనీ, నిమ్న కులాల వాళ్లకు తాగుడు మానెయ్యమనీ, చదువుకోమనీ చెబుతుంటాడు. పూజారి కొడుకు దళిత అమ్మాయితో ప్రేమలో పడతాడు. పూజారి భార్య మంటల్లో చిక్కుకుంటే ఒక దళితుడు ఆమెను కాపాడతాడు. ఈ ఘటనతో అంటరానితనం ఉండగూడదని పూజారి గుర్తిస్తాడు. దీంతో అతడు దళితులకు ఆలయ ప్రవేశం కల్పిస్తాడు. పూజారి కొడుకు, దళిత అమ్మాయి పెళ్ళిని అందరూ ఆశీర్వదిస్తారు.
1. ‘మాలపిల్ల’లో ప్రధాన అంశాలు ఏమిటి?
జవాబు:
అంటరానితనం, దళితుల ఆలయ ప్రవేశం.

2. కథానాయకుడు ఎవరు?
జవాబు:
చౌదరయ్య.

3. ఆయన ఎవరికి మంచి చెప్పాడు?
జవాబు:
నిమ్న కులాల వాళ్ళకు.

4. ఎవరు మంటల్లో చిక్కుకున్నారు?
జవాబు:
పూజారి భార్య.

5. పూజారి ఏమి గుర్తిస్తాడు?
జవాబు:
అంటరానితనం ఉండరాదని పూజారి గుర్తిస్తాడు.

6. ఎవరికి ఆలయ ప్రవేశం జరిగింది?
జవాబు:
దళితులకు

7. ఎవరెవరికి పెళ్లి జరిగింది?
జవాబు:
పూజారి కొడుకుకి, దళిత అమ్మాయికి పెళ్లి జరిగింది.

ప్రశ్న 17.
ప్రస్తుత నాటకాలు కనుమరుగయ్యాయి. కారణం ఏమిటి?
జవాబు:
ప్రస్తుతం నాటకాలు కనుమరుగవటానికి కారణాలు :

  1. సినిమాలు చూచుటకు అలవాటు పడిన ప్రజలు నాటకాలు, చూడడానికి ఆసక్తి చూపడం లేదు.
  2. టీ.వీల్లో సినిమాలు, సీరియల్స్ కు అలవాటు పడిన ప్రజలకు నాటకాలు రుచించడం లేదు.
  3. సత్యహరిశ్చంద్ర, శ్రీకృష్ణ రాయభారం, చింతామణి వంటి పేరెన్నిక గల నాటకాలు నేటితరం యిష్టపడటం లేదు.
  4. ఈతరం యువత ఈ పద్య నాటకాలను అభ్యసించడం లేదు.
  5. ప్రజాదరణ లేకపోవడంతో నాటక సమాజాలు అంతరించిపోతున్నాయి.

AP Board 8th Class Social Solutions Chapter 22 సినిమా – ముద్రణా మాధ్యమాలు

ప్రశ్న 18.
‘అల్లూరి సీతారామరాజు’ సినిమాను ప్రశంసించండి.
జవాబు:
1882లో బ్రిటిషు వాళ్లు అటవీ చట్టం చేసి గిరిజనులు అడవులలో స్వేచ్ఛగా తిరగకుండా, పోడు వ్యవసాయం చేయకుండా అడ్డుకోసాగారు. బ్రిటిషువాళ్ల వేధింపులకు వ్యతిరేకంగా గిరిజనుల ఆందోళనలకు సీతారామరాజు నాయకత్వం వహించాడు. 1922 రంపా తిరుగుబాటుగా ఖ్యాతిగాంచిన పోలీసు స్టేషనులపై దాడి చేశారు. గిరిజనులు తమ సాంప్రదాయ ఆయుధాలతోనూ, స్వాధీనం చేసుకున్న ఆయుధాలతోనూ పోరాటం చేయసాగారు. ఈ ఉద్యమాన్ని అణచివేయడానికి బ్రిటిషు పాలకులు రూథర్ ఫోర్డ్ నాయకత్వంలో అస్సాం రైఫిల్స్ ను పంపించింది. ఘంటం దొర వంటి గిరిజన నాయకులందరినీ చంపేశారు. చివరికి సీతారామరాజుని కూడా కాల్చి చంపేశారు. ఈ సినిమా వ్యాపార పరంగా ఎంతో లాభాలు ఆర్జించి పెట్టింది. దీంట్లోని ‘తెలుగు వీర లేవరా …’ పాటకి జాతీయ ఉత్తమ గీతం బహుమతి లభించింది. ఈ పాటని శ్రీశ్రీగా ప్రఖ్యాతిగాంచిన శ్రీరంగం శ్రీనివాసరావు రాశాడు.

AP Board 8th Class Social Solutions Chapter 21 ఆధునిక కాలంలో కళలు – కళాకారులు

SCERT AP 8th Class Social Study Material Pdf 21st Lesson ఆధునిక కాలంలో కళలు – కళాకారులు Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Social Solutions 21st Lesson ఆధునిక కాలంలో కళలు – కళాకారులు

8th Class Social Studies 21st Lesson ఆధునిక కాలంలో కళలు – కళాకారులు Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
తప్పు వాక్యాలను సరిచేయండి. (AS1)
అ) అన్ని నృత్య రూపాలు భక్తిలో భాగంగా రూపుదిద్దుకున్నాయి.
ఆ) చారిత్రాత్మకంగా కళాకారులను పెద్ద పెద్ద జమిందారులు పోషించారు.
ఇ) ప్రజలను చైతన్యపరచటానికి బుర్రకథను ఉపయోగించుకున్నారు.
ఈ) ప్రస్తుతం భరతనాట్యాన్ని ప్రధానంగా నట్టువనార్లు నేర్పుతున్నారు.
జవాబు:
సరియైనవి
అ) అన్ని వృత్య రూపాలు భక్తిలో భాగంగా రూపుదిద్దుకున్నాయి.
ఆ) చారిత్రాత్మకంగా కళాకారులను పెద్ద పెద్ద జమిందారులు పోషించారు.
ఇ) ప్రజలను చైతన్యపరచటానికి బుర్రకథను ఉపయోగించుకున్నారు.
ఈ) ప్రస్తుతం భరతనాట్యాన్ని ప్రధానంగా నట్టువనార్లు నేర్పుతున్నారు.

ప్రశ్న 2.
గత 50 సం||రాలలో జానపద కళాకారుల జీవితాల్లో వచ్చిన మార్పులను చర్చించండి. (AS1)
జవాబు:
సినిమాలు, టెలివిజన్ వంటి ఆధునిక సమాచార, వినోద రూపాలు అందుబాటులోకి రావటంతో సంప్రదాయ ప్రదర్శన కళలకు ప్రజల ఆదరణ తగ్గిపోతూ ఉంది. అంతేకాకుండా గతంలోమాదిరి గ్రామ పెద్దలు, భూస్వాములు ఈ కళాకారులకు పోషకులుగా ఉండటం లేదు. ఈ కారణంగా జానపద కళలు క్షీణించిపోతున్నాయి. కళాకారులు జీవనోపాధి సమస్యను ఎదుర్కొంటున్నారు. వీళ్లు సంచార కళాకారులు కావటం వల్ల వాళ్ళ పిల్లలు ఆధునిక పాఠశాలల్లో చదువుకునే అవకాశం లేదు. ఇక వాళ్ళకు మిగిలింది నైపుణ్యంలేని కూలిపని చేయటమే.

ప్రభుత్వ కార్యక్రమాలను ప్రచారం చేయటానికి ఈ కళారూపాలను ఎంచుకోవటం ద్వారా ప్రభుత్వం కొంతమేరకు సహాయపడుతోంది. పారిశుద్ధ్యం, ఆరోగ్య సేవలు, ఆడపిల్లల చదువులు, కుటుంబ నియంత్రణ, పర్యావరణం వంటి అంశాలపై అనేక సంప్రదాయ బృందాలు ప్రదర్శనలు ఇస్తున్నారు. ఇటువంటి ప్రదర్శనలలో చెప్పాల్సిన అంశాన్ని ఈ ప్రదర్శనలకు ప్రాయోజకులైన ప్రభుత్వమే అందచేస్తుంది.

AP Board 8th Class Social Solutions Chapter 21 ఆధునిక కాలంలో కళలు – కళాకారులు

ప్రశ్న 3.
జానపద కళలు క్షీణతకు గురి అవుతున్నాయా? దీనివల్ల మన సంస్కృతికి ఎటువంటి నష్టం జరుగుతుంది? (AS4)
జవాబు:
జానపద కళలు క్షీణతకు గురి అవుతున్నాయి. దీనివల్ల మన సంస్కృతి, సాంప్రదాయాలు, వారసత్వాన్ని కోల్పోతాయి. తరువాత తరాల వారికి వీటి గురించి తెలియకుండా పోతుంది. సాంస్కృతిక వారసత్వం ఒక దేశం యొక్క ఉనికిని నిలబెడుతుంది. అది లేకపోతే దాని ఉనికే ఉండదు.

ప్రశ్న 4.
ఆధునిక జీవితంలోని కొత్త అవసరాలకు అనుగుణంగా జానపద కళలను మలిచి వాటిని పునరుద్ధరించటం సాధ్యమవుతుందా? (AS4)
జవాబు:
సాధ్యమవదనే చెప్పాల్సి వస్తుంది. నేటి జీవనం చాలా వేగంగా ఉన్నది. టీవీలు, కంప్యూటర్లు మొదలైన వాటికి ఇంట్లో కూర్చుని చూడటానికి అలవాటు పడ్డవారు ఈ జానపద కళలను ఖర్చు పెట్టి చూస్తారా అన్నది అనుమానస్పదమే. విద్యుత్తు, ఫ్యానులు వచ్చాక విసనకర్ర అవసరం తగ్గిపోయింది. పవర్ కట్ వచ్చాక మళ్ళీ విసనకర్రలు అందరిళ్ళల్లో కనబడుతున్నాయి. అటువంటి పరిస్థితులు ఏమన్నా ఏర్పడితే తప్ప వీటికి మళ్ళీ పూర్వపు వైభవాన్ని తేలేము.

ప్రశ్న 5.
సదిర్ నాటినుంచి భరతనాట్యంలో చోటుచేసుకున్న ముఖ్యమైన మార్పులు ఏమిటి? (AS1)
జవాబు:

  1. సదిర్ నాటి తమిళనాట ఉన్న నృత్య సాంప్రదాయం.
  2. దీనిని ఆరాధనలలో భాగంగా దేవదాసీలు దేవాలయాలలో ప్రదర్శించేవారు.
  3. నట్టువనార్లు వీరికి నాట్యం నేర్పి, ప్రక్కవాయిద్యకారులుగా ఉండి అనేక రకాలుగా సహకరించేవారు.
  4. బ్రిటిషు వారి ప్రభావంతో చదువుకున్న భారతీయులు దీనిని చిన్న చూపు చూడసాగారు.
  5. తరువాత దేవదాసీ విధానం సామాజిక దురాచారంగా మారి నిషేధించబడి, అంతమైపోయింది.
  6. ఆ విధంగా 20వ శతాబ్దం ప్రారంభంనాటికి ఈ సాంప్రదాయ నృత్య రూపం అంతరించి పోయింది.
  7. లాయరు, స్వాతంత్ర్య పోరాట యోధుడు అయిన ఇ కృష్ణ అయ్యర్, రుక్మిణీదేవి ఈ నాట్యానికి పూర్వవైభవం తీసుకుని వచ్చారు.
  8. దేవదాసీల కుటుంబాలవారైన, తంజావూరుకు చెందిన సుబ్బరామన్ నలుగురు కుమారులు ముత్తుస్వామి దీక్షితార్ గారి సంగీతంతో కలిపి దీనిని సదిర్ నుండి భరత నాట్యంగా మార్చారు.

ప్రశ్న 6.
కింద పేర్కొన్న వాళ్ళలో దేవదానీ వ్యవస్థను సమర్థించినవాళ్లు, వ్యతిరేకించినవాళ్లు, అందులో సంస్కరణలు చేయాలన్న వాళ్లు ఎవరు? (AS1)
బాల సరస్వతి, రుక్మిణీ దేవి, వీరేశలింగం, భాగ్యరెడ్డి వర్మ, కృష్ణ అయ్యర్, బెంగుళూర్ నాగరత్నమ్మ.
జవాబు:
సమర్థించినవాళ్లు : బాల సరస్వతి , బెంగుళూరు నాగరత్నమ్మ.
వ్యతిరేకించినవాళ్లు. : వీరేశలింగం, భాగ్యరెడ్డి వర్మ
సంస్కరణలు చేయాలన్న వాళ్లు : రుక్మిణీదేవి, కృష్ణ అయ్యర్

ప్రశ్న 7.
తమ కళ ద్వారా జీవనోపాధి పొందటం కళాకారులకు ఎప్పుడూ కట్టుగా ఉండేది. దీనిపై మీ అభిప్రాయం ఏమిటి? (AS1)
జవాబు:

  1. ప్రస్తుతం కళాకారులు జీవనోపాధి సమస్యను ఎదుర్కొంటున్నారు.
  2. వీళ్ళు సంచార కళాకారులు కావటం వల్ల వాళ్ళ పిల్లలు ఆధునిక పాఠశాలల్లో చదువుకునే అవకాశం లేదు.
  3. చివరకు వారు వారికి అలవాటులేని పనిమీద ఆధారపడి బ్రతుకుతున్నారు.

వారికి ప్రభుత్వం మద్దతును కల్పించాలి.

  1. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రచారం చేయడానికి ఈ కళారూపాలను ఎంచుకోవడం ద్వారా కొంత సహాయం చేయవచ్చు.
  2. ప్రస్తుతం టెక్నాలజీకి అలవాటు పడిన ప్రజలు ఈ కళల గురించి తెలియని వారు చాలామంది ఉన్నారు. అందుకోసం పారిశుద్ధ్యం, ఆరోగ్యం, ఆడపిల్లల చదువులు, కుటుంబ నియంత్రణ, పర్యావరణం వంటి అనేక అంశాలపై ప్రభుత్వం ప్రకటనలను ఇవ్వడం జరుగుతుంది. ఆ ప్రకటనలను ప్రభుత్వం ఈ కళారూపాల ద్వారా టెలివిజన్లలో ఇప్పించడం ద్వారా ప్రభుత్వం వారికి ఉపాధిని కల్పించవచ్చు. అంతేకాకుండా ప్రభుత్వం ఏవైనా మీటింగులు, బహిరంగ సభల సమయంలో ఈ కళాకారుల ద్వారా స్టేజిషోలు ఇప్పించడం వలన వారికి కొంతమేలు జరుగుతుంది. వారికి నిరుద్యోగ భృతిని కల్పించవచ్చు. అంతరించిపోతున్న కళలను కాపాడవచ్చు. తోలుబొమ్మలాట, బుర్రకథ ఒగ్గునృత్యం ఇలాంటి వాటి ప్రభుత్వ మరియు ప్రయివేటు పాఠశాలల్లో నెలకు ఒకసారి ఈ కళా ప్రదర్శనలను నిర్వహించడం వలన వారికి ఉపాధిని కల్పించడం జరుగుతుంది.

ప్రశ్న 8.
జానపద కళలను పునరుద్ధరించడానికి కళాక్షేత్ర వంటి సంస్థలు దోహదం చేయగలవా? (AS6)
జవాబు:
చేయగలవు. కాని యివి డబ్బున్నవారికి, ఆసక్తి ఉన్నవారికి మాత్రమే ఈ కళను అందివ్వగలవు. కాని యదార్థ వారసులకు మాత్రం అందివ్వలేవు. ఈ విధంగా కళాక్షేత్రం వంటి సంస్థలు మిశ్రమ ఫలితాలు యివ్వగలవు.

AP Board 8th Class Social Solutions Chapter 21 ఆధునిక కాలంలో కళలు – కళాకారులు

ప్రశ్న 9.
మీ ప్రాంతంలోని కళాకారులను కలిసి, వారు ప్రదర్శించే నాటకాలు, కళారూపాలతో పట్టిక తయారుచేయండి. (AS3)
జవాబు:

నాటకాలు, కళారూపాలుఅంశం
పక్షివలస పక్షుల జీవనం
అంతం – అంతం – అంతం (నాటిక)ఎయిడ్స్ పై అవగాహన
ఫోర్త్ మంకీ (నాటిక)ఉగ్రవాదంపై అవగాహన
తోలు బొమ్మలాటప్రాచీన కళారూపం
బుర్రకథప్రాచీన కళారూపం
చికాగో అడ్రస్ (నాటిక)స్వామి వివేకానంద పరిచయం

8th Class Social Studies 21st Lesson ఆధునిక కాలంలో కళలు – కళాకారులు InText Questions and Answers

8th Class Social Textbook Page No.227

ప్రశ్న 1.
ప్రదర్శన కళల ఫోటోలు ఇక్కడ కొన్ని ఉన్నాయి. వాటిలో ఎన్నింటిని మీరు గుర్తించగలుగుతారు? ఫోటోల కింద వాటి పేర్లు రాయండి.
జవాబు:
AP Board 8th Class Social Solutions Chapter 21 ఆధునిక కాలంలో కళలు – కళాకారులు 2

ప్రశ్న 2.
వీటిలో ఏదైనా మీ ఊళ్లో ప్రదర్శింపబడటం చూశారా? మీ అనుభవాన్ని తరగతిలో పంచుకోండి.
జవాబు:
ఒకసారి శ్రీరామనవమికి మా ఊరి పందిట్లో భారతి అనే ఒక స్త్రీ భారత నాట్యాన్ని ప్రదర్శించారు. అది చూడటానికి ఎంతో అద్భుతంగా ఉన్నది. ఆమె ముఖకవళికలు, అలంకరణ నాకు ఎంతో నచ్చాయి.

ప్రశ్న 3.
ప్రత్యేక సందర్భాలలో కుటుంబ సభ్యులు పాడేపాటలు, చేసే నాట్యాల గురించి మీ తల్లిదండ్రులతో, తాత, అవ్వలతో మాట్లాడి తెలుసుకోండి. సందర్భం, నమూనా పాటలతో ఒక జాబితా తయారు చేయండి. ఇటీవల కాలంలో ఈ ప్రదర్శనల్లో ఎటువంటి మార్పులు వచ్చాయి? మీరు తెలుసుకున్న విషయాలు తరగతిలో మిగిలిన విద్యార్థులతో పంచుకోండి?
జవాబు:

సందర్భంనమూనా పాట
1. సంక్రాంతి, గొబ్బిళ్ళు1. కొలను దోపరికి గొబ్బియల్లో యదుకుల సామికి గొబ్బియల్లో
2. బతుకమ్మ పండుగకు1. బతుకమ్మ ఉయ్యాలో బంగారు గౌరమ్మ ఉయ్యాలు ఆనటి కాలన ఉయ్యాలు
2. కలవారి కోడలు కలికి సుందరి కడుగు చుంది పప్పు – కడవలో పోసి వచ్చిరి వారన్నలు – వనములుదాటి
3. అట్లతద్దె, ఉండ్రాళ్ళ తద్దెఒప్పులగుప్ప, ఒయ్యారిభామ సన్నబియ్యం – చాయపప్పు అట్లతద్దె ఆరట్లోయ్ ముద్దుపప్పు మూడట్లోయ్
4. హారతి పాటలుగైకొనవే హారతీ – గౌరీ పాహి అమ్మనాదుమనవి ఆలకించవమ్మా ఆ అర్ధనారీశ్వరి, అభయము నీయవే
5. దీపావళి1. అమ్మా ! సౌభాగ్యలక్ష్మీ రావమ్మా
2. దుబ్బు, దుబ్బు, దీపావళి, మళ్ళీ వచ్చే నాగులచవితి
6. దసరాదాండియా నృత్యం
7. భోగిమంటలుమంటచుట్టూ చప్పట్లు కొడుతూ నాట్యం , పాట ‘గోగులపూచే, గోగులుకాచే ఓ లచ్చా గుమ్మాడి పుత్తడి వెలుగులు చక్కగా విరిసే ఓ లచ్చా గుమ్మాడి.”

ఇటీవల కాలంలో చాలామంది వీటిని మోటుగా భావించి ఆచరించటం లేదు. కాని యింకా యివి మన రాష్ట్రంలో సజీవంగానే ఉన్నాయని చెప్పవచ్చును.

8th Class Social Textbook Page No.229

ప్రశ్న 4.
ఊరూరూ తిరిగే కళాకారులు ప్రదర్శించేవాటిని మీరు ఏమైనా చూశారా? వాళ్లు ఎవరు, ఏం చేశారు, ప్రేక్షకులు వాళ్లపట్ల ఎలా వ్యవహరించారు వంటి వివరాలను తోటి విద్యార్థులతో పంచుకోండి.
జవాబు:
మా ఊరిలో శివరాత్రికి కళ్యాణం చేసి తొమ్మిది రోజులు ఉత్సవాలు జరుపుతారు. అందులో భాగంగా రామాయణంలో ‘లంకా దహనం’ ను తోలుబొమ్మలాటలో ప్రదర్శించారు. హనుమంతుడు ఎగురు తున్నట్లు, లంకను తగులబెట్టినట్లు, రావణుడి పదితలకాయలు, చెట్టుకింద సీతమ్మ తల్లి, ఎంత బాగా చూపించారో?

ప్రేక్షకులు అంతా నవ్వుతూ చప్పట్లు కొడుతూ ఆనందించారు. తోలు బొమ్మలను ఆడించినవారు ఒక గుంపుగా మా ఊరికొచ్చారు. 2 రోజులున్నారు. 7 గురు పెద్దవాళ్ళు 3 గురు పిల్లలు వచ్చారు. మా ఊరి వాళ్ళు వాళ్ళని ఆదరంగా చూశారు. కొందరు బియ్యం, పప్పులు, కూరగాయలు, కొందరు పాత బట్టలు, కొందరు డబ్బులు ఇచ్చారు. తరువాత వాళ్ళు మా పొరుగురుకు వెళ్ళారని మా అమ్మ చెప్పింది.

AP Board 8th Class Social Solutions Chapter 21 ఆధునిక కాలంలో కళలు – కళాకారులు

ప్రశ్న 5.
అటువంటి కళాకారులు దగ్గరలో నివసిస్తూ ఉంటే వాళ్ళని కలుసుకొని వాళ్ల కళలు, జీవితాల గురించి తెలుసుకోండి.
జవాబు:
మా యింటి దగ్గర గంగాధరం గారి కుటుంబం నివసిస్తోంది. వాళ్ళయింట్లో గంగాధరం గారు, ఆయన కొడుకు బావమరిది ముగ్గురు బుర్రకథలు చెపుతారు. చుట్టుపక్కల ఊర్లలో ఏవైనా కార్యక్రమాలు జరిగినప్పుడు ప్రభుత్వం వారు వీరిని పిలిపిస్తారు. దీని మీద వీరికొచ్చే ఆదాయం వీరికి సరిపోదు. అందుకని సంవత్సరం పొడుగునా వ్యవసాయ కూలీలుగా పని చేస్తారు. మధ్యలో కార్యక్రమాలున్నప్పుడు వాటికి వెళతారు. వీరు వీరగాథలు, అక్షరాస్యతమీద, కుటుంబ నియంత్రణ మీద బుర్రకథలు చెబుతారు.

8th Class Social Textbook Page No.233

ప్రశ్న 6.
జాతీయ ఉద్యమకాలంలో కళాకారుల పరిస్థితులలో, వాళ్ళు ఇచ్చే ప్రదర్శనలలోని అంశాల్లో ఎటువంటి మార్పులు చోటు చేసుకున్నాయి?
జవాబు:
జాతీయ ఉద్యమం తరువాత స్వాతంత్ర్య భారతంలో వీరి పరిస్థితి దయనీయంగా మారింది. ఈ కళలను ఆదరించేవారు కరువయ్యారు. రాజులు, జమీందారులు లేకపోవటం మూలనా వీరు అనాథలయ్యారు. ప్రజలకు అనేక రకాలైన వినోదాలు అందుబాటులోకి రావడం మూలంగా వీరి ప్రదర్శనలకి గిరాకీ తగ్గింది.

బుర్రకథ :
వీరు జాతీయోద్యమ కాలంలో అనేక వీరగాథలు, బ్రిటిషువారి అకృత్యాలు కంటికి కనబడేలా తెలియ చేసేవారు. కాని నేడు యివి ప్రభుత్వ ఆదరణలో అక్షరాస్యత, ఎయిడ్స్ వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.

తోలు బొమ్మలాట :
వీరు పురాణ గాథలను ఎంచుకుని ప్రదర్శించేవారు. ప్రస్తుతం ప్రభుత్వ కార్యక్రమాలను ప్రచారం చేస్తున్నారు. ఈ విధంగా కళాకారులలోను, కళా ప్రదర్శనలలోను అనేక మార్పులు చోటు చేసుకున్నాయి.
AP Board 8th Class Social Solutions Chapter 21 ఆధునిక కాలంలో కళలు – కళాకారులు 1

ప్రశ్న 7.
టీ.వీ, సినిమాలు ప్రధాన వినోద సాధనాలుగా మారుతున్న పరిస్థితుల్లో సంప్రదాయ జానపద కళలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందా? కారణాలు పేర్కొనండి.
జవాబు:
అవసరం ఉంది. మన పూర్వీకుల నుండి సంస్కృత, సంప్రదాయాలు మనకు వారసత్వంగా వచ్చాయి. ముఖ్యంగా జానపద కళల రూపంలో, అనేక వినోద సాధనాలు మన జీవితాల్లోకి వచ్చిన నేపథ్యంలో మనం వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. జానపద కళలు, మన జాతికి గర్వకారణాలు కాబట్టి వానిని కూడా కాపాడుకోవాలి.

ప్రశ్న 8.
జాతీయవాదులు, కమ్యూనిస్టులు జానపద కళలను పునరుద్ధరించడానికి ఎందుకు ప్రయత్నించారు?
జవాబు:
జాతీయవాదం, సామ్యవాదం వంటి కథలను ఇతివృత్తాలను వారు చేపట్టడం వల్ల వారిని బ్రిటిషు వారు, నిజాం ప్రభువులు వేధించారు. పరదేశ కళలను వ్యతిరేకించి స్వదేశీ కళలను పునరుద్ధరించే ఉద్దేశ్యంతో జాతీయవాదులు కమ్యూనిస్టులు వీటిని ప్రోత్సహించారు.

8th Class Social Textbook Page No.234

ప్రశ్న 9.
దేవదాసీ వ్యవస్థను వ్యతిరేకించేవాళ్లు, సమర్థించేవాళ్ల మధ్య చర్చ జరుగుతోందని ఊహించుకోండి. ఇరువర్గాలు చేసే . వాదనలను పేర్కొనంది. ఈ చర్యతో ఒక చిన్న రూపకం తయారు చేయండి.
జవాబు:
రామప్ప పంతులు :
అయ్యో ! యిదేం వింత? తగుదునమ్మా అని ఈ వీరేశలింగం పంతులు గారు అన్ని విషయాల్లో చేసుకుంటున్నారు? ఏమండోయ్ గిరీశంగారు ! ఇది మహాచెడ్డ కాలం సుమండీ! లేకపోతే శుభప్రదంగా భగవంతునికి దాస్యం చేయడానికి జీవితాన్ని అంకితం చేస్తుంటే దాన్ని అమానుషం అంటారేంటండి? మీరైనా చెప్పండి ! యిలా ఈ దేవదాసీ విధానాన్ని ఆపడం పాపం కదండీ!

గిరీశం : ఏమండోయ్ రామప్ప పంతులుగారు ! నేను కూడా యాంటి-నాచ్చిలో ఉన్నానండోయ్ అది సరేగాని అదే పుణ్యమైతే మరి అందరి ఆడపిల్లల్ని పంపరేంటంట. యిది ఒక కులం వాళ్ళని, వాళ్ళ బలహీనతని భగవంతుడి పేరు చెప్పి ఉపయోగించుకోవడం అని మా అభిప్రాయం.

రామప్ప పంతులు :
అయితే మధురవాణి సంగతేంటంట? ఆమెనయితే నీవు …..

మధురవాణి : హ్పప్పు………. ఏం పంతులు బావగారు ! మధ్యలో నా పేరెత్తు తున్నారు. ఏంటి సంగతి. గిరీశం గారితో మళ్ళీ ఏవైనా గొడవలాంటిది.

రామప్ప పంతులు :
అబ్బెబ్బై … అహహ…. లేదు, లేదు మధురవాణి గిరీశం గారు యాంటి- నాచ్చి అంటుంటేనూ.

మధురవాణి : అవునండి ! గిరీశం బావగారు ఈ మధ్య మారిపోయారు. దేవదాసి విధానం మంచిది కాదని, దాని రద్దు చేయాలని, ప్రభుత్వానికి అర్టీలు కూడా పంపించారు. నిజంగానే దాని మూలంగా చాలామంది ఆడవాళ్ళు అజ్ఞాతంగా ఏడుస్తున్నారు. కాబట్టి నేను కూడా దీనిని వ్యతిరేకిస్తున్నాను. మీ సంగతేమిటి?

రామప్ప పంతులు : అది నిజమే అనుకో. కానీ ……..

గిరీశం : డామిట్ ! కథ మళ్ళీ మొదటికే వచ్చింది. కానీ లేదు గీనీ లేదు. మళ్ళీ కనిష్టీబు గారిని పిలవమందురా?

రామప్ప పంతులు : హాహా బలే వాడివోయ్ గిరీశం నేనేదో ఆలోచిస్తూ కానీ అన్నాను. ఇంతమంది స్త్రీలు బాధపడితే నేను మాత్రం ఎలా సహిస్తాను. రేపటి నుంచి నేను కూడా మీతోపాటు యాంటి-నాచ్చి లోనే….

మధురవాణి : మంచిది బావగారు ఇకనుంచైనా ఇతరుల మేలుకోరి బతకండి.

రామప్ప పంతులు : అదే మరి … ఇక నుంచి నన్ను బావగారు అనకు మధురవాణి.

మధురవాణి : సరే సరే …
జై కందుకూరి – జైజై కందుకూరి

8th Class Social Textbook Page No.235

ప్రశ్న 10.
దేవదాసీ జీవితం గడపటం ఇష్టం లేని ఆ కుటుంబంలో పుట్టిన అమ్మాయి కష్టాలు ఊహించుకోండి. ఆమె తన మిత్రురాలికి తన వ్యధను వ్యక్తపరుస్తూ ఉత్తరం రాసినట్టు ఊహించుకుని ఆ ఉత్తరం మీరు రాయండి.
జవాబు:
ప్రియమైన మీనాక్షి,

ఎలా ఉన్నావు? ఇక్కడ నేను పూర్తిగా అయోమయంలో ఉన్నాను. ఇంతవరకు నువ్వు నాకు తోడున్నావు. యిపుడేమో ఈ కష్ట సమయంలో వేరే ఊరు వెళ్ళిపోయావు. అందుకే ఉత్తరం ద్వారా నా బాధ నీకు తెలియపరుస్తాను.

నీకు తెలుసుగా చిన్నప్పటి నుండి నాకు చదువంటే ఎంతో యిష్టమని. ఈ మధ్య నేను చదువుకో కూడదని అమ్మా, నాన్న చాలాసార్లు అంటుండడం విన్నాను. కానీ కారణం యిపుడు తెలిసింది. నన్ను దేవదాసిని చేస్తారట. మా యిలవేల్పు అయిన ఎల్లమ్మ తల్లి ! కి నన్ను యిచ్చేస్తారుట. మా సాంప్రదాయాన్ని అనుసరించి నేను నృత్యం నేర్చుకుని దేవాలయంలో గజ్జ కట్టాలిట. నేను పెళ్ళి చేసుకోకూడదట. నన్ను ఎవరు కోరుకుంటే వారితోనే ఆ రోజు జీవితం గడపాలిట. నాకు బిడ్డలు పుడితే వారు కూడా యిలా గడపాల్సిందేట. ఇదంతా ఎందుకు చేస్తున్నారో తెలుసా మీనా ! నీకు తెలుసుగా నాకు ఇద్దరు చెల్లెళ్లు. అన్నలు, తమ్ములు లేరు. మేం అందరం పెళ్ళి చేసుకుని వెళ్ళిపోతే మా అమ్మా, నాన్నలను ఎవరు చూస్తారు. అందుకని పెళ్ళి చేయకుండా ఇలాచేస్తే వారి ముసలితనంలో వాళ్ళని నేను ఆదుకుంటానని వారి ఆశ.

నేను చదువుకుని ఉద్యోగం చేసి సంపాదించి చూస్తానని చెప్పినా వాళ్ళు వినటం లేదు. వచ్చే నెల మొదటి గురువారం ఉదయం ముహూర్తం పెట్టారు.

మీనా నాకు యిది యిష్టం లేదు. మీ మావయ్య పోలీసుగా పనిచేస్తున్నారుగా ! నాకు సాయం చేయవూ ! ప్లీజ్ ! ఆయన్ని తీసుకుని వచ్చి మా వాళ్లకి చెప్పి భయపెట్టవూ ! లేకుంటే నువ్వు సరేనని ఉత్తరం రాయి. బస్సెక్కి నీ దగ్గరకు వచ్చేస్తా, ఏదైనా హాస్టలులో ఉండి చదువుకుంటాను. ప్లీజ్ నాకు సహాయం చేయవూ !
ఇట్లు కన్నీళ్ళతో,
నీ నేస్తం,
అరుంధతి.

8th Class Social Textbook Page No.236

ప్రశ్న 11.
ఈ నాట్యాన్ని గౌరవ ప్రదమైనదిగా చేయటానికి అందులో ఎటువంటి మార్పులు చేసి ఉంటారు?
జవాబు:
ఈ నాట్యాన్ని గౌరవ ప్రదమైనదిగా చేయటానికి చేసిన మార్పులు :

  1. ఈ నాట్యాన్ని మొదటిగా మార్చినవారు తంజావూరుకు చెందిన నట్టువనార్ సుబ్బరామన్ కుమారులు నలుగురు. వీరు ముత్తుస్వామి దీక్షితర్ వారి సహకారంతో సాదిరను భరతనాట్యంగా మార్చారు.
  2. ఇది విద్యాధికులు, బ్రాహ్మణులచే కూడా నేర్వబడింది.
  3. దీని ప్రదర్శనలో ఉన్న అసభ్యకరమైన అంశాలన్నింటినీ మార్పు చేసి ఉంటారు.
  4. దీనిని ముఖ్యంగా భక్తి పూరితంగా ప్రదర్శించి ఉంటారు.
  5. దేవదాసీలు పూర్వం వలే వ్యభిచారంతో సంబంధం లేకుండా కళాకారులుగా నాట్యాన్ని ప్రదర్శించి ఉంటారు.
  6. మహిళలకు బదులు పురుషులు ఎక్కువ దీనిని నేర్చుకుంటారు.
  7. మ్యూజిక్ అకాడమీ వేదిక మీద చోటు దొరకటం దీనికి మరింత గౌరవాన్ని ఆపాదించింది.

AP Board 8th Class Social Solutions Chapter 21 ఆధునిక కాలంలో కళలు – కళాకారులు

ప్రశ్న 12.
ఈ నాట్యాన్ని పునరుద్ధరించడానికి ఇతర కులాలవాళ్లు దాన్ని హస్తగతం చేసుకోవటం ఎందుకు ముఖ్యమయ్యింది?
జవాబు:

  1. ఈ నాట్యం దేవదాసీలది.
  2. ఇది కొంత అసభ్యతతో కూడుకున్నది.
  3. తరువాత కాలంలో దేవదాసీ వ్యవస్థతోపాటు నాట్యం కూడా దురాచారంగా చూడబడింది.
  4. అందువల్ల దేవదాసీ నిషేధంతో ఈ కళ కూడా తుడిచిపెట్టుకుపోయింది.

ఈ వ్యతిరేక పరిణామాలన్నీ పక్కన పెట్టి నాట్యాన్ని కళగా చూడటానికి, ప్రదర్శించడానికి, అందరి ఒప్పుకోలు పొందడానికి ఇతర కులాలవాళ్ళు దాన్ని హస్తగతం చేసుకోవటం ముఖ్యమైంది.

ప్రశ్న 13.
ఒక వైపున సంప్రదాయంగా ఈ నాట్యం చేస్తున్న వాళ్లని దాంట్లో కొనసాగనివ్వలేదు. ఇంకోవైపున దానిని గౌరవప్రదంగా మార్చటానికి ఇతర కులాల వాళ్లు దానిని చేజిక్కించుకున్నారు. ఈ మార్పులలో ఏదైనా అన్యాయం జరిగిందా?
జవాబు:
నిజం చెప్పాలంటే భారతదేశంలో దేవదాసీ వ్యవస్థను నిర్మూలించినా అది ఇంకా అనధికారికంగా కొనసాగుతూనే ఉంది.

ప్రభుత్వం ఈ సంప్రదాయంలోని చెడుని నిషేధించి కళను కొనసాగించేలా వారిని ప్రోత్సహిస్తే బాగుండేది. కాని యిపుడు వ్యవస్థ మారలేదు, వారికున్న కళావారసత్వం మాత్రం దూరమయ్యింది. మరి ఈ మార్పులలో అన్యాయమే జరిగిందని చెప్పవచ్చు.

8th Class Social Textbook Page No.237

ప్రశ్న 14.
నట్టువనార్ల ప్రత్యేక పాత్ర ఏమిటి? వాళ్ల పాత్రను నాట్యం చేసే వాళ్లే చేపడితే భరతనాట్యం మీద ఎటువంటి ప్రభావం ఉంటుంది?
జవాబు:
నట్టువనార్లు దేవదాసీలకు పుట్టిన మగ సంతానంవారే తరవాతి తరం దేవదాసీలకు గురువులయ్యే వారు. వీరు తరతరాలుగా తమ సాంప్రదాయాలను కాపాడుకుంటే వచ్చారు. పునరుద్ధరణ సమయంలో ఇతర కులాల నుండి వచ్చిన వాళ్ళకు కూడా దేవదాసీలు, నట్టువనార్లే శిక్షణ నిచ్చారు. నట్టువనార్లు తమ శిక్షణ కార్యకలాపాలను మళ్ళీ ప్రారంభించగలిగారు. వీరి గ్రామాల పేర్లతో ప్రఖ్యాతి గాంచిన వైవిధ్య భరిత నాట్యరీతులు గుర్తింపు పొందాయి.

కాని ప్రస్తుత కాలంలో ఈ కళారూపానికి నట్టువనార్లు కాక నాట్యం చేసే వాళ్ళే సంరక్షకులుగా మారారు. దీనివలన నాట్య నాణ్యత బోధన దెబ్బ తింటోంది. నట్టువనార్ల వారసత్వం దెబ్బ తింటోంది. అంతేకాక నాట్యంలో అనేక కొత్త మార్పులు చోటు చేసుకున్నాయి. చేసుకుంటున్నాయి. ఇది నాణ్యతను ప్రాచీనతను దెబ్బ తీస్తోంది.

ప్రశ్న 15.
కళాక్షేత్ర వంటి ఆధునిక సంస్థలను ఏర్పాటు చేయటం వల్ల కళపైన, కళాకారులపైన ఎటువంటి ప్రభావం పడింది?
జవాబు:
కళాక్షేత్ర వంటి ఆధునిక సంస్థలను ఏర్పాటు చేయడం వలన కళకున్న అభ్యంతరాలన్నీ తొలగిపోయి అది జనాధారణ పొందింది. ఇది కళాకారులను, వాద్యకారులను ఆకర్షించింది. నాట్యం వినోదం స్థాయినుండి విద్య స్థాయికి ఎదిగింది.

కళాకారులు దీనికి ఆకర్షితులయ్యారు. కులంతో సంబంధం లేకుండా కళాభిరుచి ఉన్నవారందరూ అనేక ప్రదర్శనలు యిచ్చి కళకు ప్రాచుర్యం కల్పిస్తున్నారు. అంతేకాక తిరిగి వీరు శిక్షకులుగా మారి దీనిని, ముందుతరాలకు తీసుకుని వెళ్ళుచున్నారు.

ప్రశ్న 16.
భరతనాట్యానికి వచ్చిన విపరీత ప్రజాదరణ దానికి ఎలా తోడ్పడింది? ఏ కొత్త సమస్యలకు కారణమయ్యింది?
జవాబు:
తోడ్పాటు :
ఈ కళా రూపానికి నట్టువనార్లు కాకుండా నాట్యం చేసేవాళ్లు సంరక్షకులుగా మారారు. పునరుద్ధరణ కాలంలో నాట్యంలో శిక్షణనిచ్చిన నట్టువనార్లే ఆ వారసత్వానికి చెందిన ఆఖరి తరం. నాట్యం నేర్చుకోవాలని చాలామంది కోరుకుంటూ ఉండటం వల్ల శిక్షణ కేవలం నట్టువనార్లకు పరిమితం కాలేదు. కళాక్షేత్ర వంటి సంస్థలలో శిక్షకులుగా శిక్షణ పొందిన అనుభవజ్ఞులైన నాట్యకారులు ముందుతరాలకు దీనిని నేర్పిస్తున్నారు. అంతేకాదు చాలామంది విద్యార్థులు నాట్యకారుల నుంచి వ్యక్తిగతంగా కూడా దీనిని నేర్చుకుంటున్నారు. ప్రదర్శనలలో నట్టువనార్లు పోషించిన పాత్రను ప్రత్యేక శిక్షణ పొందిన సంగీత వాయిద్యకారులు. నాట్యకారులు తీసుకున్నారు.

సమస్యలు :
భరతనాట్య ప్రదర్శనలో ఖర్చులు తగ్గించడానికి చాలామంది రికార్డు చేసిన సంగీతాన్ని ఉపయోగించాల్సి వస్తోంది. ప్రదర్శనల ద్వారా నేడు నాట్యకారులు జీవనోపాధిని సాధారణంగా పొందలేరు. కొన్ని మినహాయింపులు తప్పించి భరతనాట్యం ఈనాడు కుటుంబ మద్దతు ఉన్నవారికి రెండవ ఉపాధిగానే ఉంది. కొంతమంది మాత్రమే ఈ నాట్యం నేర్చుకోటానికి, నాట్యకారులుగా ఎదగటానికి తమ జీవితమంతా అంకితం చేయగలుగుతున్నారు. డబ్బులు సంపాదించటానికి నాట్యకారులు తమ వృత్తి జీవిత తొలి సంవత్సరాలలోనే దీనిని ఇతరులకు నేర్పటం మొదలు పెడుతున్నారు. ఇది వారి నాట్య నాణ్యతనే కాకుండా వారి బోధనను కూడా ప్రభావితం చేస్తుంది.

నట్టువనార్లు లేకుండా మరింతమంది నాట్యకారులు బోధకులుగా మారటంతో తరతరాలుగా సంప్రదాయంగా నాట్యరూపాన్ని కాపాడుతూ వచ్చిన వారసత్వానికి తెరపడింది. కొంతమంది శిక్షకుల చేతిలో కాకుండా అనేకమంది నాట్యకారులు భరతనాట్యాన్ని బోధించటం వల్ల దీంట్లో కొత్త కొత్త మార్పులు వచ్చే అవకాశాలు పెరిగాయి.

ప్రశ్న 17.
1986లో నాజర్ వలీకి వచ్చిన బిరుదు ఏది?
జవాబు:
1986లో నాజర్ వలీకి వచ్చిన బిరుదు పద్మశ్రీ .

ప్రశ్న 18.
నాజర్ వలీ ఎవరు?
జవాబు:
నాజర్ వలీ బుర్రకథకుడు.

ప్రశ్న 19.
నాజర్ వలీ జీవిత చరిత్ర ఏ పేరుతో విడుదలైంది?
జవాబు:
నాజర్ వలీ జీవిత చరిత్ర ‘పింజారి’ పేరుతో విడుదలైంది.

AP Board 8th Class Social Solutions Chapter 21 ఆధునిక కాలంలో కళలు – కళాకారులు

ప్రశ్న 20.
బుర్రకథను కోస్తా ఆంధ్రలో ఏమంటారు?
జవాబు:
బుర్రకథను కోస్తా ఆంధ్రలో జంగమకథ అంటారు.

ప్రశ్న 21.
నాట్యశాస్త్ర రచయిత ఎవరు?
జవాబు:
నాట్యశాస్త్ర రచయిత భరతుడు.

AP Board 8th Class Social Solutions Chapter 20 లౌకికత్వం – అవగాహన

SCERT AP 8th Class Social Study Material Pdf 20th Lesson లౌకికత్వం – అవగాహన Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Social Solutions 20th Lesson లౌకికత్వం – అవగాహన

8th Class Social Studies 20th Lesson లౌకికత్వం – అవగాహన Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
మీ పరిసర ప్రాంతాలలో వివిధ మత ఆచారాల జాబితా తయారుచేయండి – రకరకాల ప్రార్థనలు, దేవుడిని కొలిచే విధానాలు, పవిత్ర స్థలాలు, భక్తి పాటలు, సంగీతం మొదలైనవి. మత ఆచరణ స్వేచ్ఛను ఇది సూచిస్తోందా? (AS3)
జవాబు:
AP Board 8th Class Social Solutions Chapter 20 లౌకికత్వం – అవగాహన 1

ప్రశ్న 2.
మా మతం శిశుహత్యలను అనుమతిస్తుంది అని ఒక మత ప్రజలు అంటే ప్రభుత్వం అందులో జోక్యం చేసుకుంటుందా? మీ సమాధానానికి కారణాలు పేర్కొనండి. (AS1)
జవాబు:
చేసుకుంటుంది అని కచ్చితంగా చెప్పవచ్చు.
కారణాలు :

  1. భారతదేశ లౌకికవిధానం మతాలలో జోక్యం చేసుకుంటుంది.
  2. ఈ జోక్యం రాజ్యాంగంలోని ఆదర్శాలకు అనుగుణంగా ఉంటుంది.

ప్రశ్న 3.
ఒకే మతంలో భిన్న దృక్పథాలకు సంబంధించి కొన్ని ఉదాహరణలను సేకరించండి. (AS1)
జవాబు:
మనం దీనికి ఉదాహరణగా బౌద్ధమతంను తీసుకుందాము.

బుద్ధుని బోధనలను అనుసరించేవారిని బౌద్ధులు అని అంటాము. వీరు ఆచరించే విధానాలను బౌద్ధమతం అని చెప్పుకుంటాము. అయితే దీనిలో 3 రకాల దృక్పథాలు ఉన్నాయి.

  1. తేరవాదం
  2. మహాయానం
  3. వజ్రయానం

1) తేరవాదం :
తేరవాదులు ఎవరికి వారే ఆత్మసాక్షాత్కారాన్ని పొందాలని నమ్ముతారు.

2) మహాయానం :
వీరు ఆత్మ సాక్షాత్కారానికి ప్రయత్నిస్తూనే ఇతరులకు కూడా ఆ స్థాయి రావడానికి సహాయం చేయాలని భావిస్తారు.

3) వజ్రయానం :
ఇతరులకు సహాయం చేయటమేకాక వారిని ఆ స్థాయికి తేవడానికి తగిన శక్తిని కలిగి ఉండాలని భావిస్తారు.

ఈ విధంగా ఒకే మతంలో విభిన్న దృక్పథాలు ఉంటాయి.

AP Board 8th Class Social Solutions Chapter 20 లౌకికత్వం – అవగాహన

ప్రశ్న 4.
భారత రాజ్యం మతానికి దూరంగా ఉంటుంది. మతంలో జోక్యం చేసుకుంటుంది. ఈ భావన గందరగోళం సృష్టించవచ్చు. ఈ అధ్యాయంలో ఇచ్చిన ఉదాహరణలతో పాటు మీకు అనుభవంలోకి వచ్చిన / తెలిసిన ఇతర ఉదాహరణలతో దీనిని మరోసారి చర్చించండి. (AS1)
జవాబు:
భారత రాజ్యాంగం లౌకిక విధానాన్ని అవలంబిస్తూనే మత విధానాలలో జోక్యం చేసుకుంటుంది. ఈ జోక్యం రాజ్యాంగంలోని ఆదర్శాలకు అనుగుణంగా ఉంటుంది.
ఉదా :

  1. హిందూమతంలోని ‘అంటరానితనాన్ని’ నిషేధించింది.
  2. భారతదేశ ముస్లిం మహిళలు వారి మతధర్మం ప్రకారం విడాకులు పొందినా, భారతదేశంలో కోర్టుకు వెళ్ళినట్లయితే వారికి భరణం ఇవ్వాల్సిందిగా నిర్దేశించినది. (షాబానోకేసు)
  3. శిశు విద్యా మందిరం, ఆర్.సి.యం పాఠశాలలు, ఉర్దూ పాఠశాలలు మొదలగునవి మతపరమైన విద్యాలయాలు అయినా వాటికి ప్రభుత్వం ఆర్ధిక మద్దతు అందిస్తుంది.
  4. అదే విధంగా వారసత్వంలో సమాన ఆస్తిహక్కును కాపాడటానికి ప్రజల మత ఆధారిత పౌర చట్టాలలో రాజ్యం జోక్యం చేసుకోవలసిరావచ్చు.
  5. మన ప్రభుత్వం తరఫున ఒంటిమిట్ట రాములవారి కళ్యాణానికి ప్రభుత్వ లాంఛనాలతో ముత్యాలు, పట్టువస్త్రాలు మొదలైనవి పంపుతారు. వీటిని ముఖ్యమంత్రి లేదా ఒక మంత్రిస్థాయిలోని వారు తీసుకుని వెళతారు.
  6. రంజాన్ మాసంలో ప్రభుత్వ శాఖలలో పనిచేసే ముస్లింలకు నమాజుకు ప్రభుత్వం సమయం కేటాయిస్తూ పనివేళలు మారుస్తుంది.

ఈ విధంగా మన రాజ్యాంగం లౌకికంగానే ఉంటూ మతపరమైన విషయాలలో జోక్యం చేసుకుంటుంది.

ప్రశ్న 5.
లౌకికవాదం అంటే ఏమిటి ? అన్న భాగం చదివి దానిపై వ్యాఖ్యానించండి. (AS2)
జవాబు:

  1. ప్రభుత్వంలో మతవరమైన జోక్యం లేకపోవడాన్ని లౌకికవాదం అంటారు.
  2. భారతదేశం లౌకికంగా ఉండాలని రాజ్యాంగం నిర్దేశిస్తోంది.
  3. అందుచే అది మతానికి దూరంగా ఉంటుంది.
  4. ఆధిపత్య నివారణకు, జోక్యం చేసుకోకుండా ఉండటం అన్న విధానాన్ని అనుసరిస్తుంది.
  5. అవసరమైతే భారత రాజ్యం మతంలో జోక్యం చేసుకుంటుంది.

8th Class Social Studies 20th Lesson లౌకికత్వం – అవగాహన InText Questions and Answers

8th Class Social Textbook Page No.223

ప్రశ్న 1.
ఈ అధ్యాయానికి పైన ఉన్న పరిచయాన్ని మరొకసారి చదవండి. ఈ సమస్యకు ప్రతీకార చర్య సరైనది ఎందుకు కాదు? వివిధ బృందాలు ఈ పద్ధతిని అనుసరిస్తే ఏమవుతుంది?
జవాబు:
పై పేరాను చదివిన తర్వాత ప్రతీకార చర్య సరైనది కాదు. ఎందుకంటే భారతదేశం ప్రజాస్వామిక, లౌకికవాద దేశం. సంస్కృతి, సాంప్రదాయాలకు, మత సామరస్యానికి ప్రతీక. అలా చేయడం వలన మత విద్వేషాలు పెరుగుతాయి. అధికులు ఎక్కువగా ఉన్న మతవాదులు, అల్పజన మతంపై దాడులు చేస్తే మత స్వేచ్ఛకు భంగం కలిగి, భారతదేశం లాంటి శాంతి కాముక దేశ ఆదర్శవాదం దెబ్బతింటుంది.

8th Class Social Textbook Page No.224

ప్రశ్న 2.
ఒకే మతంలో భిన్న దృక్పథాలు ఉండవచ్చా ? తరగతిలో చర్చించండి.
జవాబు:
ఒకే మతంలో భిన్న దృక్పథాలు ఉండవచ్చు. ప్రపంచంలో చాలా మతాలలో భిన్న దృక్పథాలు ఉన్నవే ఉన్నాయి.
ఉదా :
వీటినన్నింటిని పరిశీలించినట్లయితే అన్ని ముఖ్యమైన మతాలలో భిన్న దృక్పథాలు ఉన్నాయని తెలుస్తోంది.

8th Class Social Textbook Page No.225

ప్రశ్న 3.
ఇతర ప్రజాస్వామిక దేశాలతో పోలిస్తే భారత లౌకికవాదం ఏ విధంగా భిన్నమైనది?
జవాబు:
ఇతర ప్రజాస్వామిక దేశాలతో పోలిస్తే ప్రభుత్వాలు మతంతో ఏమాత్రం జోక్యం చేసుకోవు. కానీ భారత లౌకిక విధానం మతాలతో జోక్యం చేసుకుంటుంది. ఈ విధంగా ఇది ఇతర ప్రజాస్వామిక దేశాలతో భిన్నమైనది.

8th Class Social Textbook Page No.226

ప్రశ్న 4.
ఇటీవల కాలంలో భారతదేశంలో ఏ ప్రాంతంలోనైనా, రాజ్యాంగంలోని లౌకిక ఆదర్శాలు ఉల్లంఘింపబడిన ఘటనలు విన్నారా? మతం కారణంగా వ్యక్తులు వేధింపబడి, చంపబడిన ఘటనలు విన్నారా?
జవాబు:
ఇటీవల కాలంలో అంటే 11 సంవత్సరాల క్రితం 2002 లో ఇటువంటి ఘటనలు జరిగాయని మా పెద్దలు చెప్పుకోగా విన్నాము.

ఫిబ్రవరి 22వ తేదీ, 2002 ….

కొంతమంది రామభక్తులు అయోధ్య వెళ్ళి తిరిగి వస్తున్నారు. గుజరాత్ లో ‘గోద్రా’ రైల్వే స్టేషన్‌కు సమీపంలోనే వీరి భోగీలపై ఒక ముస్లింల గుంపు దాడిచేసి కంపార్టుమెంటును తగులబెట్టారు.

ఇందులో 58 మంది హిందువులు ఉన్నారు. వీరిలో 25 మంది స్త్రీలు, 15 మంది పిల్లలు ఉన్నారు. వీరందరూ మరణించారు. ఇది ముందే ప్లాన్ చేయబడినదని తరువాత జరిగిన విచారణలు తెలియచేశాయి.

దీని కారణంగా హిందూ – ముస్లింల మధ్య అనేక మతపరమైన అల్లర్లు జరిగాయి. వీటి మూలంగా 790 మంది ముస్లింలు, 254 మంది హిందువులు చనిపోగా ఎంతోమంది ఇళ్ళనూ, ఆస్తులనూ కోల్పోయారు.

అయితే ఈ సంఘటనలో చెప్పుకోదగిన విశేషమేమిటంటే రాజ్యాంగంలోని ఆదర్శాలను గౌరవించాల్సిన మునిసిపల్ కౌన్సిలర్, మునిసిపల్ ప్రెసిడెంట్ ఇరువురూ కూడా ఈ గుంపు మధ్యలో ఉండి ఈ మారణకాండను నడిపించారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.

ఈ సంగతి విని మేము చాలా బాధపడ్డాము. ఇది మనదేశ లౌకికత్వానికి మాయని మచ్చ.

AP Board 8th Class Social Solutions Chapter 20 లౌకికత్వం – అవగాహన

ప్రశ్న 5.
ఈ క్రింది పేరాను చదివి రెండు ప్రశ్నలను తయారు చేయండి.

లౌకికవాదంలో ముఖ్యమైన అంశం ప్రభుత్వ అధికారం నుంచి మతాన్ని వేరుచేయటం. ఒక దేశం ప్రజాస్వామికంగా పనిచేయాలంటే ఇది ముఖ్యం. ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాల్లో ఒకటికంటే ఎక్కువ మతాల ప్రజలు నివసిస్తుంటారు. ఈ మతాలలో ఏదో ఒకటి అధిక ప్రజలను కలిగి ఉంటుంది. అధిక సంఖ్యలో ఉన్న మత బృందం ప్రభుత్వాధికారంలోకి వస్తే, ఈ అధికారాన్ని, ఆర్థిక వనరులను వినియోగించుకుని ఇతర మతాలకు చెందిన వ్యక్తులను వేధించవచ్చు, వివక్షతకు గురిచేయవచ్చు. అధిక సంఖ్యాకుల ఆధిపత్యం వల్ల ఈ అల్పసంఖ్యాక ప్రజలు వివక్షత, ఒత్తిడికి గురికావచ్చు. ఒక్కొక్కసారి చంపబడవచ్చు. అధిక సంఖ్యలో ఉన్నవాళ్లు తేలికగా తక్కువ సంఖ్యలో ఉన్నవాళ్ళని వాళ్ల మతాన్ని పాటించకుండా చేయవచ్చు. మతంలో సంబంధం లేకుండా ప్రతి వ్యక్తికీ ప్రజాస్వామిక సమాజం ఇచ్చే హక్కులు మత ఆధిపత్యం వల్ల ఉల్లంఘింపబడతాయి. అంటే అధిక సంఖ్యాకుల పెత్తనాన్ని ప్రాథమిక హక్కులు ఉల్లంఘింపబడకుండా” చూడాలన్నా ప్రజాస్వామిక సమాజాలలో ప్రభుత్వాధికారం నుంచి మతాన్ని వేరుచేయటం చాలా ముఖ్యమవుతుంది.

వ్యక్తులకు వారి మతాన్ని విడిచిపెట్టి మరొక మతాన్ని స్వీకరించడానికి, మత బోధనలను భిన్నంగా విశ్లేషించ డానికి, స్వేచ్ఛను కాపాడటానికి కూడా ప్రజాస్వామ్య సమాజంలో ప్రభుత్వాధికారం నుంచి మతాన్ని వేరుచేయటం ముఖ్యమవుతుంది.
జవాబు:

  1. మత మార్పిడులు ‘అధిక సంఖ్యాకుల మతం నుండి ఎక్కువగా ఉన్నాయా? అల్ప సంఖ్యాకుల మతం నుండి ఎక్కువగా ఉన్నాయా?
  2. ప్రభుత్వాధికారం నుండి మతాన్ని వేరు చేయటం ఎందుచే ముఖ్యమవుతుంది?

ప్రశ్న 6.
ఈ క్రింది పేరాను చదివి ప్రశ్నలకు జవాబులిమ్ము.

2004 ఫిబ్రవరిలో ముస్లిం ఆడపిల్లలు కట్టుకునే తలగుడ్డ, యూదుల టోపీ, క్రైస్తవ శిలువలు వంటి మత, రాజకీయ చిహ్నాలను పాఠశాల విద్యార్ధులు ధరించకుండా ఫ్రాన్స్ ఒక చట్టం చేసింది. ఫ్రాన్స్ కింద ఒకప్పుడు వలస దేశాలుగా ఉన్న అల్జీరియా, ట్యునీసియా, మొరాకో దేశాల నుంచి వచ్చి ఫ్రాన్స్ లో నివసిస్తున్న వాళ్లు ఈ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. 1960లలో ఫ్రాన్స్ లో కార్మికుల కొరత తీవ్రంగా ఉండటంతో ఆ దేశాల నుంచి వలస వచ్చి పనిచేయటానికి వీసాలు ఇచ్చింది. ఈ వలస కుటుంబాల ఆడపిల్లలు బడికి వెళ్లేటప్పుడు తలకి గుడ్డ కట్టుకుంటారు. ఈ చట్టం చేసిన తరువాత తలకి గుడ్డ కట్టుకున్నందుకు ఈ పిల్లలు బడి నుంచి బహిష్కరించబడ్డారు.
అ) ఫ్రాన్స్ ఏమి చట్టం చేసింది?
జవాబు:
మత, రాజకీయ చిహ్నాలను పాఠశాల విద్యార్థులు ధరించకుండా ఫ్రాన్స్ ఒక చట్టం చేసింది.

ఆ) ఈ చట్టాన్ని ఎవరు వ్యతిరేకించారు?
జవాబు:
ఫ్రాన్సుకు వలస వచ్చినవారు దీనిని తీవ్రంగా వ్యతిరేకించారు.

ఇ) చట్టం ఎప్పుడు చేయబడింది?
జవాబు:
2004 ఫిబ్రవరిలో

ప్రశ్న 7.
లౌకికవాదం అంటే ఏమిటి?
జవాబు:
ప్రభుత్వంలో మతపరమైన జోక్యం లేకపోవడాన్ని లౌకికవాదం అంటారు.

ప్రశ్న 8.
ఇతర ప్రజాస్వామిక దేశాలతో పోలిస్తే లౌకికవాదం ఏ విధంగా భిన్నమైనది?
జవాబు:
ఇతర ప్రజాస్వామిక దేశాలతో పోలిస్తే ప్రభుత్వాలు మతంతో ఏమాత్రం జోక్యం చేసుకోవు. కానీ భారత లౌకిక విధానం మతాలతో జోక్యం చేసుకుంటుంది. ఈ విధంగా ఇది ఇతర ప్రజాస్వామిక దేశాలతో భిన్నమైనది.

ప్రశ్న 9.
బౌద్ధమతంలో ఎన్ని రకాల దృక్పథాలు ఉన్నాయి? అవి ఏవి?
జవాబు:
బౌద్ధమతంలో 3 రకాల దృక్పథాలు ఉన్నాయి. అవి

  1. తేరవాదం
  2. మహాయానం
  3. వజ్రాయానం

AP Board 8th Class Social Solutions Chapter 20 లౌకికత్వం – అవగాహన

ప్రశ్న 10.
ఏ దేశంలో ముస్లింలు కానివాళ్ళను దేవాలయాలు, ప్రార్థనా మందిరాలు కట్టుకోవడానికి అనుమతించరు?
జవాబు:
సౌదీ అరేబియాలో ముస్లింలు కానివాళ్ళను దేవాలయాలు, ప్రార్ధనా మందిరాలు కట్టుకోవడానికి అనుమతించరు.

AP Board 8th Class Social Solutions Chapter 19 సాంఘిక, మత సంస్కరణోద్యమాలు

SCERT AP 8th Class Social Study Material Pdf 19th Lesson సాంఘిక, మత సంస్కరణోద్యమాలు Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Social Solutions 19th Lesson సాంఘిక, మత సంస్కరణోద్యమాలు

8th Class Social Studies 19th Lesson సాంఘిక, మత సంస్కరణోద్యమాలు Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
“పాశ్చాత్య విద్య, క్రైస్తవ మత ప్రచారాలు భారతదేశంలోని సామాజిక మత సంస్కరణ ఉద్యమాన్ని ప్రభావితం చేశాయి” – దీనితో నీవు ఏకీభవిస్తావా? ఎందుకు? (AS2)
జవాబు:
ఏకీభవిస్తున్నాను ఎందుకనగా :
యూరోపియన్ కంపెనీలతో పాటు అనేకమంది క్రైస్తవ మత ప్రచారకులు భారతదేశంలో క్రైస్తవ మతాన్ని బోధించటానికి వచ్చారు. అప్పటి స్థానిక మత ఆచరణలను, నమ్మకాలను వాళ్లు తీవ్రంగా విమర్శించి క్రైస్తవ మతం పుచ్చుకోమని ప్రజలకు బోధించసాగారు. అదే సమయంలో వాళ్లు అనేక విద్యాసంస్థలు, ఆసుపత్రులు నెలకొల్పారు. పేదలకు, అవసరమున్న ప్రజలకు సేవ చేసే ఉద్దేశంతో దాతృత్వపనులు చేపట్టారు. ఇది ప్రజలలో కొత్త ఆలోచనలు రేకెత్తడానికి దోహదపడింది.

అనతి కాలంలోనే ఈ మత ప్రచారకులకూ, హిందూ, ఇస్లాం మతనాయకులకూ మధ్య తమతమ మత భావనలను సమర్థించుకునే చర్చలు మొదలయ్యాయి. ఈ చర్చల వల్ల ప్రజలకు ఎదుటివాళ్ల ఆలోచనలు తెలియటమే కాకుండా తమ తమ మతాలలోని మౌలిక సూత్రాలను తరచి చూసేలా చేసింది. అనేక యూరోపియన్ పండితులు భారతదేశ ప్రాచీన సాహిత్యాన్ని చదివి, అనువదించి, పుస్తకాలుగా ప్రచురించారు. ప్రాచ్య దేశాల పుస్తకాలు చదివారు. పురాతన సంస్కృత, తమిళ, తెలుగు, పర్షియన్, అరబిక్ పుస్తకాలు ఐరోపా భాషలలోకి అనువదించడంతో దేశ సంపన్న, వైవిధ్యభరిత సాంస్కృతిక వారసత్వాన్ని అందరూ గుర్తించారు. వారి మతాలలోని తమ భావనలను కొత్తగా వ్యాఖ్యానించడానికి వీలు కలిగింది.

ప్రశ్న 2.
సంస్కరణ ఉద్యమం బలోపేతం కావటంలో ముద్రణాయంత్రం ప్రాముఖ్యత ఏమిటి? (AS1)
జవాబు:
యూరోపియన్లు భారతదేశంలోకి అచ్చు యంత్రాన్ని ప్రవేశపెట్టారు. దీనివల్ల ఎన్నో వార్తాపత్రికలు, ఇతర పత్రికలు ప్రచురించబడ్డాయి. అనేక భారతీయ భాషలలో సైతం పుస్తకాలు ప్రచురితమయ్యాయి. దీని ఫలితంగా చాలా తక్కువ ధరకు పుస్తకాలు అనేకమందికి అందుబాటులోకి వచ్చాయి. ఈ వార్తాపత్రికలు, పుస్తకాలు ప్రజలలో చర్చలకు, వాదోపవాదాలకు దోహదపడ్డాయి. పత్రికలు, పుస్తకాలు అధిక సంఖ్యాక ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. ఈ విధంగా సంస్కరణ ఉద్యమం బలోపేతం కావటంలో ముద్రణాయంత్రం ప్రముఖ పాత్ర వహించింది.

AP Board 8th Class Social Solutions Chapter 19 సాంఘిక, మత సంస్కరణోద్యమాలు

ప్రశ్న 3.
అనేక దేవుళ్లను ఆరాధించటం, విగ్రహారాధన, సంక్లిష్ట సంప్రదాయాలు వంటి వాటిని మాన్పించటానికి మత సంస్కరణలు ప్రయత్నించాయి. ఈ సంస్కరణలను ప్రజలు ఆమోదించారా? మీ సమాధానానికి కారణాలు పేర్కొనండి. (AS2)
జవాబు:
అనేక దేవుళ్ళు, దేవతలను, గుడిలో విగ్రహాలను ఆరాధించటం, బ్రాహ్మణ పూజారులను పూజించటం, బలులు ఇవ్వటం, హిందూమతంలోని మౌడ్యం, మూఢాచారాలను వదలి పెట్టడానికి మతసంస్కరణ ఉద్యమాలు ప్రయత్నించి ఫలితాలు సాధించాయి. సనాతన, సాంప్రదాయ ఆచారాలు, పద్ధతులు వదలి పెట్టడానికి ప్రజలు ఒప్పుకోలేదు సరికదా అనేక దాడులకు దిగారు. ముస్లింలలో కూడా సంస్కరణలకు అంగీకరించక, సనాతన మతాచారాలు కొనసాగించారు. ఆధునిక విజ్ఞానం, తత్వశాస్త్రాలను బోధించే ఆంగ్ల విద్యను సైతం మౌఖ్యాలు తిరస్కరించారు.

కాని తదనంతర కాలంలో చర్చోపచర్చలు ఒకరి అభిప్రాయాలు, ఆలోచనలు పంచుకున్నాక, యూరోపియన్ సంస్కృతిలో మంచి అంశాలైన స్వేచ్ఛ, మహిళలపట్ల గౌరవం, పనితత్వం, సాంకేతిక విజ్ఞానం, ఆంగ్లవిద్య ఆవశ్యకతను తెలుసుకున్న ప్రజలు మార్పును అంగీకరించి తమ జీవితంలో కొత్త కోణం ఆలోచించారు.

ప్రశ్న 4.
రమాబాయి వంటి వ్యక్తులు వితంతువుల పరిస్థితిపై ప్రత్యేక కృషి ఎందుకు చేశారు? (AS1)
జవాబు:
రమాబాయి, సావిత్రీబాయి ఫూలే వంటి వ్యక్తులు మహిళలకు ప్రత్యేకించి వితంతువులకు సహాయపడటానికి జీవితాలను అంకితం చేసారు. వితంతు మహిళలపై సమాజం చాలా చిన్న చూపు చూసింది. సమాజంలో అపశకునంగా, దుశ్శకునంగా భావించి, బయట తిరగనిచ్చేవారు కాదు. తెల్లచీర కట్టి, గుండు చేయించి, పెళ్ళిళ్ళకు, శుభకార్యాలకు సుమంగళులైన ఇతర మహిళలు వెళ్ళే కార్యక్రమాలకు వెళ్ళకూడదు. భర్త చనిపోవడమే ఆమె దురదృష్టం. ఆమె నుదుట మీద అనేక కష్టాలు ఉన్నాయి, ఇంకా ఈ కట్టుబాట్లు పేరుతో వితంతువులను హింసించడం సామాజిక దుశ్చర్యగా రమాబాయి వంటి సంస్కర్తలు ప్రతిఘటించారు. ఆత్మస్టెర్యం పెంచి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్లు సమాజం మెచ్చేటట్లు వితంతువులు బ్రతికేందుకుగాను వృత్తి విద్యలు, స్వయం ఉపాధి పథకాలు అందించారు. వితంతువులు విద్యావంతులైతే మార్పు వస్తుందని భావించి, బొంబాయి లాంటి పట్టణాలలో “శారదాసదన్” వంటి పాఠశాలలు, ఆశ్రమాలు ఏర్పరిచి, ఆత్మ విశ్వాసం పెంచేటట్లు కృషి చేసారు.

ప్రశ్న 5.
భారతదేశంలో, 19వ శతాబ్దంలో సంఘ సంస్కర్తగా రాజా రాంమోహన్ రాయ్ పాత్ర వివరించండి. (AS1)
జవాబు:
భారతదేశంలో, 19వ శతాబ్దంలో సంఘ సంస్కర్తగా రాజా రాంమోహన్ రాయ్ పాత్ర :

  1. రాజారాంమోహన్ రాయ్ బెంగాల్ లో 1772లో జన్మించాడు.
  2. అనేక మత సిద్ధాంతాలను చదివాడు. అన్నింటిలోని సారం ఒకటేనని గ్రహించాడు.
  3. ఇతరుల మతాలను విమర్శించవద్దన్నాడు.
  4. హేతు బద్ధంగా ఉన్న, ప్రయోజనకరమైన మత భావనలను అంగీకరించమన్నాడు.
  5. అనేక రచనలు చేసి ప్రజల్లో తన భావజాలాన్ని నింపాడు.
  6. ‘బ్రహ్మసమాజం’ను స్థాపించాడు.
  7. ‘సతి’ ని నిర్మూలించడానికి తోడ్పడ్డాడు.
  8. స్త్రీ జనోద్ధరణకు పాటుపడ్డాడు.

ప్రశ్న 6.
ఇంగ్లీషు విద్యను ప్రోత్సహించటంలో సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ప్రధాన ఉద్దేశం ఏమిటి? (AS1)
జవాబు:

  1. సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్’ ముస్లింలకు, బ్రిటిషు వారికి మధ్య నున్న శత్రుత్వం అంతం కావాలని భావించాడు.
  2. ప్రగతి సాధనకు ముస్లింలు ప్రభుత్వంలో పాల్గొంటూ, ప్రభుత్వ ఉద్యోగాలలో పెద్ద వాటా పొందాలని భావించాడు.
  3. ఆధునిక విద్య ద్వారా మాత్రమే ఇది సాధ్యమని భావించారు. అందుకే ఇంగ్లీషు విద్యను ప్రోత్సహించారు.

AP Board 8th Class Social Solutions Chapter 19 సాంఘిక, మత సంస్కరణోద్యమాలు

ప్రశ్న 7.
‘అంటరాని’ కులాలను మిగిలిన వాటితో సమానంగా చేయటానికి వివిధ నాయకులు వివిధ పద్ధతులను అనుసరించారు. ఫూలే, భాగ్యరెడ్డి వర్మ, నారాయణ గురు, అంబేద్కర్, గాంధీజీ వంటి నాయకులు సూచించిన చర్యల జాబితాను తయారు చేయండి. (AS3)
జవాబు:
అనాదిగా సమాజంలో అట్టడుగు వర్గాలైన శ్రామిక ప్రజలను శూద్రులుగా, అంటరాని వాళ్ళుగా చూపేవారు. బ్రాహ్మణులు, క్షత్రియులు వంటి వాళ్ళు, వీళ్ళను దేవాలయములోనికి ప్రవేశం కల్పించలేదు. అందరిలా నీళ్ళు తోడుకోవడానికి, చదవటం, రాయటం నేర్చుకోనిచ్చే వాళ్ళు కాదు. మత గ్రంథాలను చదవనివ్వలేదు. గ్రామాలలో రెండు గ్లాసుల పద్ధతి అమలయ్యేది. ఉన్నత కులాలకు ! సేవ చేయటమే వీళ్ళ పనని భావించారు. ఈ కుల వివక్షతకు వ్యతిరేకంగా జ్యోతిబాపూలే, భాగ్యరెడ్డి వర్మ, అంబేద్కర్, గాంధీజీ, నారాయణగురు వంటివారు పోరాడారు. వీళ్ళకై జీవితాలను అంకితం చేసారు.

జ్యోతిబాపూలే :
ఉన్నతులమని భావించే బ్రాహ్మణులు వంటి వారి వాదనను ఖండించాడు. శూద్రులు (శ్రామిక కులాలు), అతిశూద్రులు (అంటరానివాళ్ళు) కలసి కుల వివక్షతకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చాడు. సత్యం, సమానత్వం అన్న సూత్రాల ఆధారంగా నూతన సమాజాన్ని ఏర్పాటు చేయటానికి “సత్యశోధక సమాజ్” అన్న సంస్థను స్థాపించాడు. అంటరాని వాళ్ళుగా భావించే మహర్, మాంగ్ కులాలకు చెందిన వాళ్ళకొరకు పాఠశాలను స్థాపించి, తాను తన భార్య సావిత్రి పూలే కృషి చేసారు.

డా||బి. ఆర్. అంబేద్కర్ :
బాల్యంలోనే తానే స్వయంగా కుల వ్యవస్థను సంస్కరించడానికి నడుము కట్టాడు. 1927లో దళితులు హిందూ దేవాలయాల్లో ప్రవేశం కొరకు, ప్రభుత్వ తాగునీటి వనరుల నుంచి నీళ్ళు ఉపయోగించుకొనే హక్కుల కోసం ఉద్యమాలు చేపట్టాడు. “భారతదేశ రాజకీయ భవిష్యత్తు” సమావేశంలో సైతం దళితుల హక్కుల కొరకు కృషి చేసి, దళితులకు రిజర్వేషన్లు సాధించాడు. దళితుల సంక్షేమానికి “ఇండిపెండెంట్ లేబర్ పార్టీని” స్థాపించాడు. రాజ్యాంగ రచనలో, కూడా అంటరానితనాన్ని రూపు మాపడానికి అనేక అధికరణలు పొందుపరిచారు.

మహాత్మాగాంధీ :
మహాత్మాగాంధీ అంటరానితనం నిర్మూలన కొరకు విశేషంగా కృషి చేసారు. అంటరాని కులాల వాళ్ళకు గాంధీజీ ‘హరిజనులు’ అని నామకరణం చేసాడు. అంటే “దేవుడి ప్రజలు” అని పేరు పెట్టాడు. దేవాలయాలు, నీటి వనరులు, పాఠశాలలు వంటి వాటిల్లో ప్రవేశ హక్కులు, సమాన హక్కులు కల్పించాలని ఆశించాడు.

నారాయణగురు :
మనుషులందరిదీ “ఒకే కులం, ఒకే మతం, ఒకే దేవుడు అన్న భావనను ప్రచారం చేసిన మత గురువు నారాయణగురు. ఈయన కులవివక్షతను పాటించని దేవాలయాలను స్థాపించాడు. బ్రాహ్మణపూజారులు లేని పూజా విధానాన్ని అనుసరించాడు. “గుడులు కట్టటం కంటే బాలలకు బడులు కట్టటం ఎంతో ముఖ్యమని చెప్పాడు.

భాగ్యరెడ్డి వర్మ :
దళితుల సంక్షేమం, హక్కుల కొరకు విశేషంగా కృషి చేసినవాడు భాగ్యరెడ్డి వర్మ. దళితులే ఈ ప్రాంత , మూలవాసులని, ఉన్నత కులాలకు చెందిన ఆర్యులు దళితులను అణచివేసారని చెప్పాడు. కాబట్టి దళితులు “ఆది ఆంధ్రులు” అని పిలుచుకోవాలని చెప్పాడు. దళితులలో చైతన్యం నింపడానికి, 1906లో “జగన్ మిత్రమండలి భాగ్యరెడ్డి, ప్రారంభించాడు. దళిత బాలికలను దేవదాసీలు లేదా జోగినులుగా మార్చడాన్ని వ్యతిరేకించాడు.

ప్రశ్న 8.
ఈనాటికి కూడా కులం ఎందుకు వివాదాస్పద విషయంగా ఉంది? వలస పాలనలో కులానికి వ్యతిరేకంగా జరిగిన ముఖ్యమైన ఉద్యమం ఏది? (AS4)
జవాబు:
‘కులం’ అనేది వాస్తవానికి వ్యక్తిగతమయిన ఆచారం. ఇది వారి వారి ఆచార, వ్యవహారాల వరకు పాటించుకోవాలి. అంతేకాక ఎవరి కులం వారికే గొప్పగా అనిపిస్తుంది. కాబట్టి కొన్ని ముఖ్యమైన కుటుంబ కార్యక్రమాల్లో ‘కులం’ అనేది ఇప్పటికే పునాదిగా నిలబడి ఉంది. దీన్ని దాటడానికి అగ్ర వర్ణాలుగా పిలువబడేవాళ్ళు, నిమ్న కులాలుగా పిలువబడే వాళ్ళు, ఎవరు కూడా ఒప్పుకోరు. అయితే ఈ ‘కులాన్ని’ సంఘపరమైన విషయాలలోకి తేవడం మూలంగా ఇది వివాదాస్పద విషయంగా ఉంటోంది.
ఉదా :
ఇరువురు వ్యక్తుల మధ్య మనస్పర్ధలు వస్తే అది రెండు కులాల మధ్య వివాదం తెచ్చి పెడుతోంది.

వలస పాలనలో కులానికి వ్యతిరేకంగా జరిగిన ముఖ్యమైన ఉద్యమంగా ‘సత్యశోధక్ సమాజ్’ జరిపిన ఉద్యమం ముఖ్యమైన ఉద్యమంగా చెప్పుకోవచ్చు.

ప్రశ్న 9.
ఆలయ ప్రవేశ ఉద్యమం ద్వారా అంబేద్కర్ ఏమి సాధించదలుచుకున్నాడు? (AS1)
జవాబు:
ఆలయ ప్రవేశ ఉద్యమం ద్వారా అంబేద్కరు మానవులందరూ భగవంతుడి దగ్గర ఒక్కటేనని, భగవంతుడిపై అందరికీ సమాన హక్కులుంటాయని చెప్పదలచుకున్నాడు.

ప్రశ్న 10.
భారత సమాజంలోని సామాజిక మూఢాచారాలు లేకుండా చేయటంలో సంఘ సంస్కరణ ఉద్యమాలు ఏ విధంగా దోహదపడ్డాయి? ఈనాడు ఎటువంటి సామాజిక మూఢాచారాలు ఉన్నాయి? వీటిని ఎదుర్కోటానికి ఎటువంటి సంఘ సంస్కరణలు చేపట్టాలి? (AS4)
జవాబు:
భారత సమాజంలో పూర్వకాలం నుండి కూడా అనేక సామాజిక మూఢాచారలు కులవివక్ష, మతోన్మాదం, స్త్రీలపట్ల వివక్షత బాల్యవివాహాలు, సతీసహగమనం, పరదాపద్ధతి, వితంతు స్త్రీల జీవనం వంటి సామాజిక మూఢాచారలు ఉండేవి. అయితే రాజారామ్మోహన్ రాయ్ సనాతన ఆచారాలను తిరస్కరించడమే కాకుండా “సతీ” సతీసహగమనం లాంటి సాంఘిక దురాచారాలను దూరం చేసాడు. బ్రహ్మసమాజం ద్వారా విరివిగా కృషి చేసి, ప్రజలలో చైతన్యం తేవడానికి కంకణం కట్టుకున్నాడు. దయానంద సరస్వతి ఆర్యసమాజం ద్వారా అనేక దేవుళ్ళు, దేవతలను గుడిలో, విగ్రహారాధన, కుల వ్యవస్థను ఖండించాడు “సత్యార్థ ప్రకాష్” గ్రంథం ద్వారా ప్రజలను మేల్కొలిపాడు. ముస్లిం సమాజంలోని సనాతన మత దురాచారాలను రూపు మాపడానికి, ఆంగ్ల విద్య ద్వారా సంస్కరణ చేయాలని, పరదా పద్దతి వంటి దురాచారాలను దూరం చేయడానికి సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ “విజ్ఞాన శాస్త్ర సంఘం” ద్వారా కృషి చేసాడు. జ్యోతిబాపూలే, నారాయణగురు, కందుకూరి, రమాబాయి సరస్వతి వంటి సంస్కర్తలు అనేక ఉద్యమాలు ద్వారా కులవివక్ష, బాల్యవివాహాల నిషేదం, వితంతు పునర్వివాహం, వంటి వాటిని అణచడానికి కృషి చేసాడు.

ఈనాటికి కూడా మతోన్మాదం, కులవివక్ష స్త్రీలపై దాడులు, బాలికలకు విద్య లేకపోవడం వంటి సామాజిక నేరాలు మనం గమనించవచ్చు. వీటిని దూరం చేయడానికి ప్రజలలో మార్పు రావాలి. విద్యావంతులు కావాలి. చైతన్యవంతులు కావాలి. చట్టాలు, హక్కులు, న్యాయస్థానాలను గౌరవించాలి. స్త్రీలకు సమాన హోదా, కల్పించి, ప్రోత్సహించాలి. కులవివక్షతను రూపు మాపడానికి విద్యార్థి దశనుండే సమగ్రత భావాలు పెంపొందించాలి. అన్ని మతాల సారం ఒక్కటేనని వివరించి జాతీయ సమగ్రతను పెంచాలి.

ప్రశ్న 11.
బాలికల విద్య ప్రాధాన్యతను తెలిపే ఒక కరపత్రం తయారుచేయండి. (AS6)
జవాబు:
కరపత్రం
ఈనాడు సమాజంలో బాలురుతో పాటుగా బాలికలకు విద్య తక్కువగా అందిస్తున్నారు. కొన్ని కట్టుబాట్లు, ఆచారాలు పేరిట బాలికల విద్యను మధ్యలో మాన్పిస్తున్నారు. బయటకు తిరగనీయకుండా, పంపకుండా ఇంటికే పరిమితం చేస్తున్నారు. కాని ఇటీవల కాలంలో తల్లిదండ్రులలో కూడా మార్పు కన్పిస్తుంది. బాలురతో పాటుగా బాలికలను కూడా ప్రోత్సహిస్తూ విద్యను అందిస్తున్నారు.

బాల్యవివాహాలు, కులవివక్షతను పగడ్బందీగా అమలు చేస్తున్నారు. అక్కడక్కడ కులవివక్షత కన్పిస్తుంటే ప్రజలలో చైతన్యం కొరకు కౌన్సిలింగ్ చేస్తున్నారు. స్త్రీల పట్ల అనుచితంగా ప్రవర్తించే వారిపట్ల చట్టాలు కఠినంగా శిక్షిస్తున్నాయి. ‘యువతీయువకులలో సామాజిక అవగాహన కొరకు కృషిచేస్తున్నారు.

AP Board 8th Class Social Solutions Chapter 19 సాంఘిక, మత సంస్కరణోద్యమాలు

ప్రశ్న 12.
సంఘ సంస్కర్తల్లో నీకు నచ్చిన గుణాలు ఏవి? అవి ఎందుకు నచ్చాయి? (AS6)
జవాబు:
సంఘ సంస్కర్తలలో నాకు నచ్చిన గుణాలు – కారణాలు :

  1. సమాజంలోని దురాచారాలను రూపుమాపడానికి కృషి చేస్తారు. దీనివలన చాలాకాలంగా దురాచారాలతో వెనుకబడిన మనం ముందంజ వేయగలం.
  2. దురాచారాలను రూపుమాపే దిశగా ప్రజలను చైతన్యవంతులను చేస్తారు. తద్వారా ఈ అంశంపై ప్రజల్లో చర్చ జరుగుతుంది.
  3. వీటిలో భాగంగా వీరు అనేక సంస్థలను నెలకొల్పుతారు. ఉదా : బాలికల విద్య కొరకు పోరాటం జరిగినపుడు బాలికలకు ప్రత్యేక పాఠశాలలు నెలకొల్పారు.
  4. అవసరమైతే సనాతనవాదులనెదురొడ్డి పోరాడుతారు.
  5. ఉద్యమం ప్రారంభంలో సమాజం వెలివేసినంత పనిచేసినా, ధైర్యంగా ముందుకు సాగుతారు.
  6. నవసమాజాన్ని నిర్మిస్తారు.

8th Class Social Studies 19th Lesson సాంఘిక, మత సంస్కరణోద్యమాలు InText Questions and Answers

8th Class Social Textbook Page No.213

ప్రశ్న 1.
రాంమోహన్ రాయ్, స్వామి వివేకానందల దృక్పథాలలో పోలికలు, తేడాలు ఏమిటి?
జవాబు:
పోలికలు :

  1. వీరిరువురూ హిందూ ధర్మశాస్త్రాలను చదివారు.
  2. అన్ని మతాలలోని సారం ఒకటేనని విశ్వసించారు.
  3. వీరిరువురూ సమాజ సేవకు ప్రాధాన్యతనిస్తూ, దీనజనుల ఉద్ధరణకు, సంఘసేవకు ప్రాధాన్యత నిచ్చారు.

తేడాలు :

రామ్మోహన్ రాయ్స్వామి వివేకానందుడు
అన్ని మతాలు ఒకటేనని నమ్మాడు.హిందూమతం అన్ని మతాల కంటే గొప్పదన్నాడు.
బ్రహ్మసమాజాన్ని స్థాపించాడు.రామకృష్ణ మిషను స్థాపించాడు.
ఒకే ఒక్క దేవుడు అనే నమ్మకాన్ని కలిగి ఉండమన్నాడు.మూఢాచారాలు వదలి మత ధర్మాన్ని పాటించమన్నాడు.

ప్రశ్న 2.
యూరోపియన్ సంస్కృతి, క్రైస్తవ మతం వల్ల తొలితరం సంస్కర్తలు ఏవిధంగా ప్రభావితులయ్యారు?
జవాబు:

  1. ఆంగ్ల సంస్కృతిలో మంచి అంశాలైన స్వేచ్ఛ, మహిళల పట్ల గౌరవం, పనితత్వం, సాంకేతిక విజ్ఞానం వంటి వాటితో వీరు ప్రభావితులయ్యారు. అందువలన వీరు బాల్య వివాహాల నిషేధం, వితంతు పునర్వివాహాల ప్రోత్సాహం మొదలైన వాటిని అమలులోకి తెచ్చారు.
  2. వీరి మత బోధనలచే ప్రభావితులైన వారు ఏకేశ్వరోపాసనను ప్రబోధించారు.
  3. వీరు ఆంగ్ల విద్యను అభ్యసించారు. ఈ భాషతో అనేక గ్రంథాలను చదివి జ్ఞానార్జన చేశారు. అలా అందరూ అన్ని విషయాలు తెలుసుకోవాలని ఆంగ్ల విద్యను, పాఠశాలలను ప్రోత్సహించారు.

ఈ విధంగా తొలితరం సంస్కర్తలు అనేక విషయాలలో యూరోపియన్ సంస్కృతి, క్రైస్తవ మతం వల్ల ప్రభావితులయ్యారు.

AP Board 8th Class Social Solutions Chapter 19 సాంఘిక, మత సంస్కరణోద్యమాలు

ప్రశ్న 3.
రాంమోహన్ రాయ్, స్వామి వివేకానంద, దయానందల మత దృక్పథాలలో పోలికలు, తేడాలు ఏమిటి?
జవాబు:
పోలికలు :

  1. వీరు ముగ్గురూ హిందూ ధర్మశాస్త్రాలను విశ్వసించారు.
  2. ఇతర మతాలలోని మంచిని స్వీకరించి ఆచరించాలని చెప్పారు. ‘
  3. ముగ్గురూ సమాజసేవను ఆదర్శంగా తీసుకున్నారు.

తేడాలు :

దయానందుడురాంమోహన్ రాయ్వివేకానందుడు
1) సనాతన సాంప్రదాయాలతో కూడిన హిందూ మతాన్ని తిరస్కరించాడు.1) అన్ని మతాలు ఒకటేనని భావించాడు.1) హిందూమతం అన్ని మతాలలోకి గొప్పదని విశ్వసించాడు.
2) ఆర్యసమాజాన్ని స్థాపించాడు.2) బ్రహ్మ సమాజాన్ని స్థాపించాడు.2) రామకృష్ణ మిషను స్థాపించాడు.
3) అన్ని మతాలను తప్పు మతాలుగా తిరస్కరించి వేదాల ఆధారిత హిందూ మతంలోకి తిరిగి రావాలని ప్రజలకు పిలుపునిచ్చాడు.3) ఒకే ఒక్క దేవుడు అనే నమ్మకాన్ని కలిగి ఉండమని చెప్పాడు.3) మౌఢ్యాన్ని, మూఢాచారాల్ని వదిలి పెట్టి హిందు మత ధర్మాన్ని పాటించాలని చెప్పాడు.

ప్రశ్న 4.
ఈ కొత్త భావాల వ్యాప్తిలో ముద్రణ ఏ విధంగా ఉపయోగపడింది?
జవాబు:
యూరోపియన్లు భారతదేశంలోకి అచ్చు యంత్రాన్ని ప్రవేశపెట్టారు. దీనివల్ల ఎన్నో వార్తాపత్రికలు, ఇతర పత్రికలు ప్రచురించబడ్డాయి. అనేక భారతీయ భాషలలో సైతం పుస్తకాలు ప్రచురితమయ్యాయి. దీని ఫలితంగా చాలా తక్కువ ధరకు పుస్తకాలు అనేకమందికి అందుబాటులోకి వచ్చాయి. ఈ వార్తాపత్రికలు, పుస్తకాలు ప్రజలలో చర్చలకు, వాదోపవాదాలకు దోహదపడ్డాయి. పత్రికలు, పుస్తకాలు అధిక సంఖ్యాక ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. ఈ విధంగా కొత్త భావాల వ్యాప్తిలో ముద్రణ ఉపయోగపడింది.

ప్రశ్న 5.
మీరు DAV పాఠశాల, గురుకుల పాఠశాల, ప్రభుత్వం నడిపే పాఠశాలల్లో ఒక దానిని ఎంచుకోవాల్సి వస్తే దేనిని ఎంచుకుంటారు? కారణాలు తెల్పండి.
జవాబు:
నేను ప్రభుత్వం నడిపే పాఠశాలలను ఎంచుకుంటాను.
కారణాలు:

  1. ఇక్కడ లౌకిక దృక్పథంతో బోధన జరుగుతుంది.
  2. అందరు విద్యార్థుల్నీ సమాన దృష్టితో చూస్తారు.

8th Class Social Textbook Page No.214

ప్రశ్న 6.
1857 తరువాత ముస్లింలు – బ్రిటిష్ మధ్య శత్రుత్వం ఎందుకు ఏర్పడింది?
జవాబు:
సంస్కరణవాద హిందువులు సనాతన వాదులతో ఘర్షణపడాల్సి వచ్చినట్లే సంస్కరణవాద ముస్లింలు కూడా వారి సనాతన మతాచారాలతో తలపడాల్సి వచ్చింది. 1857 తిరుగుబాటు అణచివేత ముస్లింలు, ఆంగ్లేయుల మధ్య తీవ్ర విభేదాలు సృష్టించింది. ఇస్లామిక్ సూత్రాలకు విరుద్ధంగా ఉన్నాయి కాబట్టి ఆధునిక విజ్ఞానశాస్త్రం, తత్వశాస్త్రాలను బోధించే ఇంగ్లీషు విద్యను చాలామంది మౌల్వీలు తిరస్కరించారు.

ప్రశ్న 7.
DAV పాఠశాలలు, MAO కళాశాల మధ్య ఏమైనా తేడాలు ఉన్నాయా?
జవాబు:

DAV పాఠశాలMAO కళాశాల
1) దీనిని స్వామి దయానంద్ అనుచరులు స్థాపించారు.1) దీనిని సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ స్థాపించారు.
2) దీని ద్వారా ఆంగ్ల బోధనతో పాటు హిందూమతాన్ని, దాని సంస్కృతిని పునరుద్ధరించాలని భావించారు.2) ఇది ఇస్లామిక్ వాతావరణంలో ఇంగ్లీషు, విజ్ఞాన శాస్త్రాలను బోధించటానికి ప్రయత్నించింది.
3) చివరలో ఇది వేదమతాన్ని మాత్రమే బోధించేలా మారింది. హరిద్వార్‌లో గురుకుల కాంగ్రి విశ్వవిద్యాలయ స్థాపన జరిగింది.3) ఇది అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయంగా మారింది.

AP Board 8th Class Social Solutions Chapter 19 సాంఘిక, మత సంస్కరణోద్యమాలు

ప్రశ్న 8.
తమ సంస్కరణ’ భావాలను సమర్ధించుకోవటానికి సంస్కర్తలందరూ తమ తమ ప్రాచీన మత గ్రంథాలను కొత్త కోణంలో చూడటానికి ప్రయత్నించారన్న విషయాన్ని మీరు గమనించి ఉంటారు. ప్రముఖ సంస్కర్తల ఉదాహరణలను చూసి దీనిని వాళ్లు ఎలా చేశారో తెలుసుకోండి.
జవాబు:
1) రాజారాంమోహన్ రాయ్ :
ఇతడు హిందూ, ఇస్లాం, క్రైస్తవ, సూఫి వంటి అనేక మత సిద్ధాంతాలను చదివాడు. అనేక పుస్తకాలు చదవటం వల్ల అతడికి దేవుడు ఒక్కడే అన్న నమ్మకం కలిగింది. విగ్రహారాధన, బలులు ఇవ్వటం సరికాదని ఇతడికి అనిపించింది. అన్ని ప్రముఖ మతాలు ఒకే నమ్మకాలు కలిగి ఉన్నాయని, ఇతరుల మతాలను . విమర్శించటం సరికాదని అతడు భావించాడు. హేతుబద్దంగా ఉన్నప్పుడు, ప్రజలకు ప్రయోజనకరంగా ఉన్నప్పుడు మాత్రమే మత భావనలను అంగీకరించాలని కూడా అతడు భావించాడు. పూజారుల అధికారాన్ని తిరస్కరించి తమ మతంలోని మూల గ్రంథాలను చదవమని ప్రజలను అతడు కోరాడు. ముద్రణలోని కొత్త సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించుకుని అధిక సంఖ్యలో ప్రజలకు చేరటానికి అతడు తన భావాలను పత్రికల్లో, పుస్తకాలుగా ప్రచురించాడు.

2) స్వామి వివేకానంద :
హిందూమతం ఇతర మతాలకంటే గొప్పదని వివేకానంద భావించాడు. ఇతడు ఉపనిషత్తుల – బోధనలకు ప్రాధాన్యం ఇచ్చాడు. ఇవి అనువాదం అయ్యి, పెద్ద సంఖ్యలో ముద్రింపబడ్డాయి.

3) స్వామి దయానంద సరస్వతి :
అతడు వేదాలను చదివి నిజమైన మతం వాటిల్లోనే ఉందని సమ్మాడు. ఆ తరవాత హిందూ మతంలోకి వచ్చి చేరిన అనేక దేవుళ్ళను, దేవతలను, గుడిలో విగ్రహాల ఆరాధనను, బ్రాహ్మణ పూజారులను, కుల వ్యవస్థను అతడు తిరస్కరించాడు. సాధారణ పూజా విధానాలతో, వేద మంత్రాలతో ఒక్కడే దేవుడిని పూజించాలని అతడు ప్రచారం చేశాడు. మిగిలిన అన్ని మతాలను అతడు తప్పు మతాలుగా తిరస్కరించి, ఇతర మతాలకు మారిన హిందువులను షేధాల ఆధారంగా ఉన్న హిందూమతంలోకి తిరిగి రావాలని భావించాడు.

ప్రశ్న 9.
భక్తి ఉద్యమంలో భాగంకాని మత భావనలను సంస్కర్తలు ప్రచారం చేశారా?
జవాబు:
లేదు. సంస్కర్తలు అందరూ భక్తి ఉద్యమంలోని మత భావనలనే ఎక్కువగా ప్రచారం చేశారు.

8th Class Social Textbook Page No.215

ప్రశ్న 10.
సంఘసంస్కరణ కోసం ప్రభుత్వం చట్టాలు చేయటం ఎందుకు ముఖ్యమైంది?
జవాబు:
19వ శతాబ్దం ఆరంభం నాటికి బ్రిటిష్ అధికారులలో చాలామంది కూడా భారతీయ సంప్రదాయాలను, ఆచారాలను, విమర్శించసాగారు. రాజా రామ్మోహన్‌రాయ్ వాదాన్ని బ్రిటిష్ వాళ్ళు ఆలకించారు. ఆవిధంగా 1829లో ‘సతి’ ని నిషేధించారు. వితంతు పునర్వివాహా చట్టాన్ని 1855లో చేసారు. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా, బహుభార్యత్వాన్ని నిషేధిస్తూ అనేక చట్టాలు అవసరమని భావించారు.

ప్రశ్న 11.
వితంతు పునర్వివాహాన్ని సమర్ధించేవాళ్ళు, వ్యతిరేకించేవాళ్ళ మధ్య సంభాషణను ఊహించి రాయండి.
జవాబు:
1856 సం॥రం – మొదటి వితంతు పునర్వివాహం జరిగిన సందర్భం – ఊరు కలకత్తా.

శ్రీకాంత్ ఛటర్జీ :
వాహ్వా ! ఈ రోజు ఈ దేశ చరిత్రలో లిఖించదగ్గ రోజు. భారతదేశంలో మహిళల కష్టాలు కడతేరిన రోజు. ఆ భగవంతుని కృప వీరిపై సదా వర్పించుగాక.

ముఖేశ్ బందోపాధ్యాయ :
ఎంత నీచంగా మాట్లాడుతున్నావు శ్రీకాంత్ బాబూ ! ఇది మనని పరలోకంలో శిక్షలనుభవించేలా చేస్తుంది. విధవకు మళ్ళీ పెళ్ళి ! ఆమె వివాహం ద్వారా ఒక ఇంటికి గృహిణిగా వెళ్ళి అక్కడ వంశవృద్ధికి తోడ్పడుతుంది. అలాంటిది మరోసారి మరో ఇంటికా ! అయ్యో ! భగవంతుడా రక్షించు నా దేశాన్నీ, దేశవాసులనూ.

రాజ్యలక్ష్మి:
ఇది నిజంగా సుదినం శ్రీకాంత్ బాబూ ! మా ఆడవారికి చిన్నవయసులో వృద్దులతో వివాహం, వారి మరణంతో వీరు విధవలై, జీవితాంతం అత్త వారిళ్ళలో ఉచితంగా ఊడిగం చేయటం మాకు చాలా బాధ కలిగిస్తోంది. ఇది మంచి ఆరంభం. ఆ భగవంతునికి శతకోటి కృతజ్ఞతలు.

8th Class Social Textbook Page No.217

ప్రశ్న 12.
బాలుర మాదిరిగా బాలికల చదువులకు ఈనాడు సమాన ప్రాముఖ్యతను ఇస్తున్నారా? లేక బాలికలు వివక్షతకు, ‘గురవుతున్నారా?
జవాబు:
ఈనాడు బాలుర మాదిరిగా బాలికల చదువుకు సమాన ప్రాముఖ్యతను ఇస్తున్నారు. వాస్తవానికి చాలా పాఠశాలల్లో, కళాశాలల్లో బాలికల నమోదే ఎక్కువగా ఉంటోంది అని చెప్పవచ్చు. కానీ ఎక్కడో కొన్ని కుటుంబాల్లో మాత్రం బాలికలు వివక్షకు గురి అవుతున్నారని చెప్పవచ్చు. అంతేకాక కొన్ని వెనుకబడిన రాష్ట్రాలలో కూడా ఈ పరిస్థితి కనబడుతోంది.

AP Board 8th Class Social Solutions Chapter 19 సాంఘిక, మత సంస్కరణోద్యమాలు

ప్రశ్న 13.
చదువుకోటానికి బాలురు ఎదుర్కోనే ఏ కష్టాలను బాలికలు ఎదుర్కొంటున్నారు?
జవాబు:

  1. బాలికలు సాధారణంగా ఉన్నత విద్యను తక్కువగా అందుకుంటున్నారు.
  2. బాలురు చదువుకోసం ఎంత దూరమైనా వెళ్ళగలుగుతున్నారు. కానీ బాలికలకు అన్నిచోట్లకి అనుమతి దొరకటం లేదు.
  3. కొన్ని కోర్సులలో బాలికలకు అవకాశం ఉండటం లేదు.

ప్రశ్న 14.
వితంతువుల పట్ల వ్యవహరించే తీరు ఈనాడు ఎంతవరకు మారింది?
జవాబు:
వితంతువుల పట్ల ఈనాడు సమాజ దృక్పథం మారింది అని స్పష్టంగా చెప్పవచ్చును. నేటి సమాజంలో చాలావరకు – వీరిని అందరు ఇతర మహిళల లాగానే గుర్తిస్తున్నారు. వీరికి పెద్దలే మరలా వివాహాలు చేస్తున్నారు. చేసుకోవటానికి పురుషులు కూడా వారంతటవారే ముందుకు వస్తున్నారు. కొన్ని మతపరమైన ఆచారాలలో తప్ప వీరిని అన్నింటా ఇతరులతో సమానంగానే గౌరవిస్తున్నారు.

ప్రశ్న 15.
ఈనాటికీ దళిత బాలికలు, ముస్లిం బాలికలు చదువుకోటానికి ప్రత్యేక సమస్యలను ఎదుర్కొంటున్నారా?
జవాబు:
దళిత బాలికలు ఎక్కడో ఒకటి, రెండు చోట్ల ఇతర సమాజం నుండి సమస్యలు ఎదుర్కొంటున్నారని అప్పుడప్పుడు వార్తా పత్రికలలో వార్తలు వింటున్నాం. వీరు కూడా అందరితోపాటు సమానంగానే తరగతి గదుల్లో విద్యనభ్యసిస్తున్నారు. ముస్లిం బాలికలకు కూడా ప్రత్యేక పాఠశాలలు ఉన్నాయి. వీరు కూడా ఎటువంటి సమస్యలు లేకుండా చదువుకుంటున్నారు.

8th Class Social Textbook Page No.218

ప్రశ్న 16.
అంటరాని ప్రజలు అసలు చదువులేకుండా ఉండడం కంటే ఇది మెరుగని కొంతమంది భావించారు. మీరు వీళ్లతో ఏకీభవిస్తారా?
జవాబు:
అవును. నేను వాళ్ళతో ఏకీభవిస్తాను. జ్యోతిబా పూలే, అంబేద్కర్లు అటువంటి కష్టనష్టాల కోర్చి విద్యనభ్యసించారు కాబట్టే వారు భవిష్యత్ తరాలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయగలిగారు. లేకుంటే ఇప్పటికీ అదే పరిస్థితి ఉండి ఉండేది.

8th Class Social Textbook Page No.219

ప్రశ్న 17.
ఈనాటికీ జ్యోతిబా పూలే భావాలు అవసరమని మీరు భావిస్తున్నారా?
జవాబు:
అవసరం లేదని నేను భావిస్తున్నాను. ఎందుకంటే స్వతంత్రం వచ్చిన నాటి నుండి నిమ్నకులాల అభివృద్ధి కొరకు మన ప్రభుత్వాలు ‘రిజర్వేషన్లు’ అన్నిటా అమలు చేస్తున్నాయి. ఈ కులాల వారందరూ మిగతా అన్ని కులాల వారితో సమానంగా చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, రాజకీయంగా ఎదుగుతున్నారు. కాబట్టి ఆ భావాలు అవసరం లేదని నేను భావిస్తున్నాను.

ప్రశ్న 18.
నిమ్నకులాల విద్యార్థులకు ఆ కులాల ఉపాధ్యాయులే చదువు చెప్పాలని అతడు ఎందుకు అన్నాడు?
జవాబు:
శూద్రులు, అతిశూద్రులు కుల వివక్షతకు గురై పాఠశాలల్లో, కళాశాలల్లో అనేక అవమానాలకు గురౌతున్నారని అంతే కాకుండా అగ్రవర్ణాలకు చెందిన ఉపాధ్యాయులు, నిమ్నకులాల విద్యార్థులకు చదువు చెప్పకుండా వెలివేసే విధానంలో చదువు నేర్పిస్తున్నారని, కులవ్యవస్థను బానిసత్వంగా పరిగణిస్తూ అతడు దీనికి వ్యతిరేకంగా గులాంగిరి వంటి పుస్తకాలతో పాటు నిమ్నకులాల పిల్లలకోసం నిమ్న కులాల టీచర్లే చదువు చెప్పాలని తలంచాడు. దీని ద్వారా వారిలో ఆత్మవిశ్వాసం, ఆత్మ స్టైర్యం పెరుగుతుందని భావించాడు.

ప్రశ్న 19.
నారాయణ గురు, జ్యోతిబా పూలేల కృషిని పోల్చండి. వాళ్ళ మధ్య పోలికలు, తేడాలు ఏమిటి?
జవాబు:
పోలికలు:

  1. ఇరువురూ కులవ్యవస్థను ఖండించారు.
  2. ఇరువురూ అనేక పాఠశాలలను స్థాపించారు.
  3. ఇరువురూ బ్రాహ్మణాధిక్యతను తోసిరాజన్నారు.

తేడాలు :

నారాయణ గురుజ్యోతిబా పూలే
1) ఈయన ఒక మత గురువు.1) ఈయన ఒక సంఘసంస్కర్త.
2) కుల వివక్షత లేని దేవాలయాలను స్థాపించి, బ్రాహ్మణ పూజారులు లేని సామాన్య పూజా విధానాన్ని ప్రోత్సహించాడు.2) నిమ్న కులాల వారికి ప్రత్యేక పాఠశాలలు, కళాశాలలు ప్రారంభించాలని పిలుపునిచ్చాడు. వీటిలో నిమ్న కులాల ఉపాధ్యాయులే బోధించాలని చెప్పాడు.
3) కుల వివక్షతను ఖండించాడు. అన్ని రకాల కుల వివక్షతలకు స్వస్తి చెప్పాలని చెప్పారు.3) నిమ్న కులాలవారు బ్రాహ్మలు లేకుండా పెళ్ళిళ్ళు, శ్రాద్ధ కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చాడు.

8th Class Social Textbook Page No.220

ప్రశ్న 20
కులవ్యవస్థకు సంబంధించి బుద్ధుని బోధనలను గుర్తుకు తెచ్చుకోండి.
జవాబు:
బుద్ధుడు సర్వమానవ సమానత్వాన్ని చాటాడు. కుల,మత భేదాలను వ్యతిరేకించాడు. అందరినీ కలిసి ఉండమని బోధించాడు. తన పంథాను అనుసరించిన వారందరినీ సమానంగా చూశాడు.

ప్రశ్న 21.
ఆంధ్ర ప్రాంతంలో దళితులు మూలవాసులు అన్న భావన దళితుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి ఏవిధంగా దోహదపడింది?
జవాబు:
ఆంధ్ర ప్రాంతంలో దళితులు మూలవాసులు అన్న భావన దళితుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిందనే చెప్పాలి. దళితులే ఈ ప్రాంతపు మూలవాసులనీ, ఉన్నత కులాలకు చెందిన ఆర్యులు దళితులను బలంతో అణచివేసారని చెబుతారు. జనాదరణ పొందిన కళలను ఉపయోగించుకుని దళితులలో చైతన్యం కలిగించడానికి 1906లో ‘జగన్‌మిత్ర మండలి’ని
భాగ్యరెడ్డి వర్మ ప్రారంభించి ఆత్మస్టైర్యం పెంచారు. దళితులకు ప్రత్యేక నిధులు కేటాయించడం ద్వారా కూడా వాళ్ళలో చైతన్యం వెల్లివిరిసింది.

AP Board 8th Class Social Solutions Chapter 19 సాంఘిక, మత సంస్కరణోద్యమాలు

ప్రశ్న 22.
స్వతంత్ర భారతదేశంలో మహిళలందరికీ ఓటుహక్కు లభించిందా?
జవాబు:
సహాయ నిరాకరణ సత్యాగ్రహ ఉద్యమాల్లో పాల్గొనవలసిందిగా మహిళలను గాంధీజీ ఆశించి, ప్రోత్సహించారు. ఉప్పుసత్యాగ్రహం, అంటరానితనానికి వ్యతిరేకంగా ఉద్యమం, రైతాంగ ఉద్యమం వంటి వాటిలో మహిళలు పాల్గొని విజయవంతం చేయడం వల్ల స్వతంత్ర భారతదేశంలో మహిళలందరికు ఓటుహక్కు లభించింది.

ప్రశ్న 23.
స్వాతంత్ర్య పోరాటంలోని ముఖ్యమైన మహిళా నాయకుల గురించి తెలుసుకోండి – కల్పనాదత్, అరుణ అసఫ్ అలీ, కెప్టెన్ లక్ష్మీ సెహగల్, సరోజినీ నాయుడు, కమలాదేవి ఛటోపాధ్యాయ మొదలగువారు.
జవాబు:
AP Board 8th Class Social Solutions Chapter 19 సాంఘిక, మత సంస్కరణోద్యమాలు 1
1) కల్పనాదత్ :
ఈమెను తరువాత కాలంలో కల్పనాజోషి అని పిలిచేవారు. ఈమె చిటగాంగ్ రిపబ్లికన్ ఆర్మీలో సభ్యురాలు. పేరొందిన చిటగాంగ్ ఆయుధాల దోపిడీ కేసులో ఈమె కూడా పాల్గొన్నారు. తరువాత ఈమె కమ్యూనిస్టు పార్టీలో చేరారు.

AP Board 8th Class Social Solutions Chapter 19 సాంఘిక, మత సంస్కరణోద్యమాలు 2
2) అరుణా అసఫ్ అలీ :
ఈమె క్విట్ ఇండియా ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. ఈ కాలంలో అరుణ గొవాలియా మైదానంలో భారత జాతీయ జెండాను ఎగురవేసి యువతి గుండెల్లో స్ఫూర్తిని నింపారు. ఆమె ఈ కింది అవార్డులను పొందారు.
లెనిన్ ప్రైజ్ ఫర్ పీస్ – 1975
జవహర్లాల్ నెహ్రూ అవార్డు – 1991
భారతరత్న – 1998

AP Board 8th Class Social Solutions Chapter 19 సాంఘిక, మత సంస్కరణోద్యమాలు 3
3) కెప్టెన్ లక్ష్మీ సెహగల్ :
ఈమె 1943లో నేతాజీని సింగపూర్ లో కలిసే వరకు డాక్టరు వృత్తిలో కొనసాగారు. నేతాజీతో కలిసి మహిళా రెజిమెంట్ ను ప్రారంభిస్తామని చెప్పారు. వెంటనే ‘ఝాన్సీరాణి రెజిమెంట్’ను స్థాపించి కెప్టెన్‌గా మారారు. 1945 మేలో బ్రిటిషు వారు ఆమెను అరెస్టు చేశారు.

AP Board 8th Class Social Solutions Chapter 19 సాంఘిక, మత సంస్కరణోద్యమాలు 4
4) సరోజినీనాయుడు :
భారత జాతీయ కాంగ్రెస్ కు ద్వితీయ మహిళాధ్యక్షురాలు. ఆమెను నైటింగేలు ఆఫ్ ఇండియా అని పిలిచారు. ఆమె బెంగాలు విభజన కాలంలో ఉద్యమంలో చేరారు. అనేక కవితలు రాశారు. ఈమె జన్మదినాన్ని భారతదేశంలో మహిళా దినోత్సవంగా జరుపుతారు.

AP Board 8th Class Social Solutions Chapter 19 సాంఘిక, మత సంస్కరణోద్యమాలు 5
5) కమలాదేవి ఛటోపాధ్యాయ :
ఈమె స్వాతంత్ర్య పోరాటంలో 1923లో సహాయ నిరాకరణోద్యమంలో చేరారు. భారతదేశంలో మొట్టమొదట అరెస్ట్ అయిన మహిళ.

8th Class Social Textbook Page No.221

ప్రశ్న 24.
దళితుల పట్ల తమ దృక్పథంలో గాంధీజీ, అంబేద్కర్ మధ్య పోలికలు, తేడాలు ఏమిటి?
జవాబు:
పోలికలు:

  1. ఇరువురూ దళితుల కోసం పాటుపడ్డారు.
  2. ఇరువురూ కాంగ్రెస్ వాదులే.

తేడాలు :

గాంధీజీఅంబేద్కర్
1) ఈయన అగ్రవర్ణస్తుడై దళితుల కోసం పోరాడారు.1) ఈయన దళితుడిగా దళితుల కోసం పోరాడారు.
2) ఈయన దళిత అభ్యర్థులకు ఎన్నికలలో సీట్లు రిజర్వు చేయించారు.2) ఈయన దళితులకు, దళితులే వేరుగా ఓట్లు వేయాలని భావించారు.
3) ఈయన కాంగ్రెసులో ఉండే వారికోసం పనిచేశారు. ఈ పోరాటాన్ని కాంగ్రెస్ లో భాగంగా చేశారు.3) ఈయన దళితుల కోసం ఇండిఫెండెంట్ లేబర్ పార్టీని స్థాపించాడు.
4) ఈయన చివరి వరకు హిందూ మతంలోనే ఉండి దళితుల కోసం పోరాడారు.4) ఈయన హిందూమతాన్ని విశ్వసించలేక చివరలో బౌద్ధ మతానికి మారారు.

AP Board 8th Class Social Solutions Chapter 19 సాంఘిక, మత సంస్కరణోద్యమాలు

ప్రశ్న 25.
ఈనాడు దేవాలయాలు, నీటి వనరులు, పాఠశాలల్లో దళితులకు సమాన హక్కులు ఉన్నాయా? వాళ్లు ఇప్పటికీ ఎదుర్కొంటున్న సమస్యలు ఏవి?
జవాబు:
నేడు దేవాలయాల్లోకి అందరికీ ప్రవేశం లభ్యమే. నీటి వనరులు, పాఠశాలల్లో చెప్పుకోవాలంటే దళితులకు సమానహక్కులే కాక, రిజర్వేషన్లు కూడా ఉన్నాయి. అంటే అందరితో పాటు సమానంగా అన్ని ప్రభుత్వం వీరికి అందిస్తోంది. అంతేకాక కొన్ని వీరి కొరకు రిజర్వు చేసి అవి వారికి మాత్రమే అందిస్తుంది. వీరు ఎదుర్కొంటున్న సామాజిక సమస్యలు ఏమీ లేవనే చెప్పవచ్చు.

పట నైపుణ్యాలు

ప్రశ్న 26.
ఈ క్రింది బొమ్మలలో మత సంస్శలు సంఘ సంస్కర్తలను గుర్తించి, మీ ఉపాధ్యాయుల సహకారంతో వారి పేర్లు వ్రాయుము.
జవాబు:
AP Board 8th Class Social Solutions Chapter 19 సాంఘిక, మత సంస్కరణోద్యమాలు 6

ప్రశ్న 27.
వీరేశలింగం ఆంధ్రప్రదేశ్ లో ఏమి స్థాపించాడు?
జవాబు:
వీరేశలింగం ఆంధ్రప్రదేశ్ లో బ్రహ్మసమాజాన్ని స్థాపించాడు.