AP Board 9th Class Telugu Solutions Chapter 7 ఆడినమాట

AP State Syllabus AP Board 9th Class Telugu Textbook Solutions Chapter 7 ఆడినమాట Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Telugu Solutions 7th Lesson ఆడినమాట

9th Class Telugu 7th Lesson ఆడినమాట Textbook Questions and Answers

చదవండి-ఆలోచించండి-చెప్పండి

ఒక అడవిలో వేటగాడు వేటకోసం వచ్చి చెట్లను, పొదలను తొ! శిస్తున్నాడు. ఆ పొదల్లోంచి ఒక పాము బయటకు వచ్చి చెట్లను నరకవద్దు నీకు సహాయం చేస్తానని చెప్పి ఒక రత్నం ఇచ్చింది. దాన్ని అతడు ఎక్కువ ధరకు అమ్మి ధనవంతుడయ్యాడు. చేసిన మేలు మరచి అతడు పాముకు ఇన్ని మణులెక్కడివని ఆలోచించి పుట్టను కనుక్కొని అందులో ఎండు గడ్డి వేసి మంటపెట్టాడు. ఆ మంటలకు పాము చనిపోయింది. మణుల కోసం పుట్టను తవ్వుతుండగా మిగతా పాములు కరచి అతడు చనిపోయాడు. ‘కృతజ్ఞత’ లేని నరుడు క్రూరమైనవాడు కదా !

ప్రశ్నలు జవాబులు

ప్రశ్న 1.
చెట్లను నరక వద్దని పాము అనడానికి కారణమేమిటి?
జవాబు:
ఆ చెట్ల మధ్య, పొదల మధ్య ఆ పాము పెట్టిన పుట్ట ఉంది. ఆ పాము, ఆ పుట్టలో నివసిస్తోంది. తనక. నివసించడానికి పుట్ట లేకుండా పోతుందనే భయంతో పాము వేటగాడిని చెట్లను నరక వద్దని చెప్పింది.

ప్రశ్న 2.
వేటగాడు పామును ఎందుకు చంపాడు?
జవాబు:
వేటగాడికి పాము ఒక రత్నాన్ని ఇచ్చింది. దాన్ని అమ్మి వేటగాడు ధనవంతుడయ్యాడు. పాము పుట్టలో ఇంకా మరెన్నో రత్నాలు ఉంటాయని వేటగాడు ఆశించాడు. అందుకే వేటగాడు పుట్టను కనిపెట్టి ఎండుగడ్డితో దానిపై మంట వేసి పామును చంపాడు.

AP Board 9th Class Telugu Solutions Chapter 7 ససేమిరా

ప్రశ్న 3.
వేటగాడి స్వభావం ఎలాంటిది? ఇలాంటిదే మరో కథ తెలుసా మీకు?
జవాబు:
వేటగాడు, చేసిన మేలు మరచిపోయే స్వభావం కలవాడు. అనగా కృతజ్ఞత లేనివాడు. దురాశాపరుడు. పాము తనకు చేసిన మేలును మరచి, ఆ పాము పుట్టనే మంట పెట్టి ఆ పామును చంపాడు. ఈ వేటగాడు కృతఘ్నుడు. ఇలాంటి కథ మరొకటి నాకు తెలుసు.

కృతఘ్నతగల మరో జంతువు (పులి) కథ :
పూర్వము ఒక పులి, అడవిదున్నపోతును చంపి తింది. అప్పుడు పులి దవడలో ఒక ఎముక గ్రుచ్చుకుంది. పులి ఎంత విదల్చినా ఆ ఎముక ఊడి రాలేదు. పులి బాధతో విలవిలలాడింది. అప్పుడు ఆ పులి ఒక సూచీ ముఖ పక్షి దగ్గరకు వెళ్ళి, తన నోట్లో దిగిన ఎముకను లాగి తనకు సాయం చేయమని కోరింది. ఆ పక్షి, పులి మాటలు నమ్మి ఆ ఎముకను తన ముక్కుతో లాగింది. పులి బాధ తీరిపోయింది. తరువాత పులి, ఆ పక్షి స్నేహం కొనసాగించాయి. అప్పుడప్పుడు ఆ పక్షి, పులి నోట్లో గుచ్చుకున్న ఎముకలను లాగి ఉపకారం చేస్తూ ఉండేది. ఒక రోజున ఆ పులికి ఆహారం ఎక్కడా దొరకలేదు. పులి, పక్షి దగ్గరకు వెళ్ళి, తన నోట్లో దిగిన ఎముకను లాగమని చెప్పింది. పక్షి పులిమాటలు నమ్మి, పులి నోట్లో దూరి ఎముకను లాగుదామని చూస్తుండగా పులి ఆ పక్షిని కఱచి చంపింది. ఆ పులికి కృతజ్ఞత లేదు.

ఇవి చేయండి

I. అవగాహన – ప్రతిస్పందన

అ) కింది అంశాల ఆధారంగా మాట్లాడండి.

ప్రశ్న 1.
పాఠంలో ఆవు మాట్లాడిన విషయాన్నీ, పద్యాలనూ రాగయుక్తంగా పాడండి. వాటి భావం చెప్పండి.
జవాబు:
ఆవు మాట్లాడిన పద్యములు ఇవి. 1, 2, 4, 9, 10 వీటి భావాలను “పద్యాలు – ప్రతిపదార్థాలు – భావాలు”లో చూడండి.

ప్రశ్న 2.
అట్లాగే పులి మాట్లాడిన విషయాలున్న పద్యాలను రాగంతో పాడండి. వాటి భావం చెప్పండి.
జవాబు:
పులి మాట్లాడిన పద్యములు : 3, 13, 14
ఈ పద్యాల భావాలు “ప్రతిపదార్థాలు – భావాలు” వద్ద చూడండి.

ప్రశ్న 3.
క్రింది వాటిలో ఏదైనా ఒకదాన్ని సమర్థిస్తూ సరైన కారణాలతో మాట్లాడండి.
అ) “ఆడినమాట తప్పని ఆవు చాలా గొప్పది” – ఎందుకంటే …….
జవాబు:
ఆవు, పులికి మాట ఇచ్చిన విధంగా తన పుత్రునికి పాలిచ్చి, తనను తినివేయమని పులి వద్దకు తిరిగి వచ్చింది. అందుకే ఆవు గొప్పది.

AP Board 9th Class Telugu Solutions Chapter 7 ససేమిరా

ఆ) స్వభావరీత్యా పులి క్రూరమైన జంతువు. అయినా ఇచ్చిన మాట ప్రకారం వచ్చిన ఆవును చూసి, మారిన పులి ఇంకా గొప్పది. ఎందుకంటే ………
జవాబు:
పులి సహజంగా మాంసం తినే జంతువు. అయినా ఆడినమాట తప్పని ఆవును చంపలేదు. ఆవు వంటి మహాత్ముణ్ణి చంపితే తనకు అంతులేని పాపం వస్తుందని పులి చెప్పింది. ఆవును తిరిగి తన దూడవద్దకు పంపించింది. కాబట్టి పులి ఇంకా గొప్పది.

ఇ) ‘ఆడిన మాట ప్రకారం వచ్చిన ఆవు, మారిన పులి రెండూ గొప్పవే’. ఎందుకంటే ……….
జవాబు:
ఆవు ఆడిన మాటను నిలబెట్టుకుంది. కనుక ఆవు గొప్పది. పులి హింసా ధర్మాన్ని మాని, ఆడిన మాట తప్పని ఆవును చంపకుండా దయతో విడిచి పెట్టింది. కాబట్టి పులి గొప్పది.

AP Board 9th Class Telugu Solutions Chapter 7 ససేమిరా

ఆ) కింది మాటలు ఎవరు ఎవరితో అన్నారు?

అ) చెప్పేవారు చెప్పినా, వినేవారికి వివేకముండాలి.
జవాబు:
“చెప్పెడువారు చెప్పినన్ వినియెడువారి కించుక వివేకము పుట్టదె?” ఈ మాటలను పులి, ఆవుతో అంది.

ఆ) నా మనసు అసలే మెత్తనిది. దాన్నింకా పరీక్షించాలనుకోకు.
జవాబు:
“మెత్తని మనసే నాయది యెత్తి యిటులు చూడనేల”? ఈ మాటలను ఆవు తనను తినమని, పులిని బ్రతిమలాడుతూ చెప్పినది.

ఇ) నీవు ధర్మం తెలిసినదానివి. నీకెవ్వరూ సాటిలేరు.
జవాబు:
నీవు ధర్మవిదురాలవు. నీకెన యెవ్వరు? ఈ మాటలను పులి, ఆవును ప్రశంసిస్తూ చెప్పింది.

ఈ) నిన్ను కన్నందుకు ఋణవశాన ఇన్ని రోజులు సాకి పాలు ఇచ్చాను.
జవాబు:
“నిన్ను గని యిన్ని దినములు చన్నిచ్చితి ఋణవశంబున” ఈ మాటలను గోవు తన దూడతో అంది.

ఉ) ఇంతమాత్రానికే నా, ప్రాణాలు పోతాయా?
జవాబు:
“ప్రాణములింతనె పోవుచున్నవే?” ఈ మాటలను పులి, ఆవుతో చెప్పింది.

AP Board 9th Class Telugu Solutions Chapter 7 ససేమిరా

ఇ) పాఠం ఆధారంగా కింద ప్రశ్నలకు జవాబులు రాయండి.

అ) పులిని ఆవు ఏమని వేడుకున్నది? ఎందుకు?
జవాబు:
పులిని ఆవు తనకు ఏడెనిమిది రోజుల క్రితమే పుట్టిన కుమారునకు పాలు ఇచ్చి వస్తానని వేడుకున్నది. తనకు కుమారుడు జన్మించి ఏడెనిమిది రోజులు మాత్రమే అయినది వానికి ఇంకా గడ్డి మేయుట చేతకాదని కావున వానికి పాలిచ్చి తగు జాగ్రత్తలు చెప్పిరావడానికి పులిని వేడుకున్నది. ఈ

ఆ) ఆవు మాటలు విన్న పులి ఏమన్నది? ఏం చేసింది?
జవాబు:
ఆవు మాటలు విన్న పులి, ఆవును అపహాస్యం చేసి ‘ఓ గోవా ! నీవు మాట్లాడుతున్నదేమిటి? నన్ను అమాయకుణ్ణి చేసి, నీ కొడుకు దగ్గరికి వెళ్ళి వస్తానంటున్నావు. ఇది సమంజసమేనా? చెప్పేవాడు చెప్పినా, వినేవాడికి వివేకం ఉండవద్దా? అన్నది.

ఇ) ఆవు తన కొడుకుకు ఏమని బుద్దులు చెప్పింది?
జవాబు:
ఎప్పుడూ అబద్దాలు మాట్లాడకు. అక్కరకు రాని వారితో కలిసి ఉండకు. ఇతరులెవరైనా నీకు కీడు కలిగించే మాటలు మాట్లాడితే భయపడకు. వినీ విననట్లుగా ఉండి ఎదురు జవాబు చెప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపో అని బుద్ధులు చెప్పింది.

ఈ) తిరిగి వచ్చిన ఆవును చూసి పులి ఏమన్నది?
జవాబు:
నీ వంటి మహాత్ములను చంపి, పాపాన్ని మూటకట్టుకోలేను. కావాలంటే నాకు మాంసం ఎక్కడైనా దొరుకుతుంది. ఈ పులి జాతిలో నన్ను పుట్టించిన ఆ దైవం నా చేత గడ్డి తినిపించునా? (పాపాన్ని ఎందుకు చేయిస్తాడు?) ఇంత మాత్రానికే ప్రాణాలు పోతాయా ఏం”? అని పులి తిరిగి వచ్చిన ఆవుతో పలికింది.

ఉ) తినడానికి నిరాకరించిన పులితో ఆవు ఏమన్నది?
జవాబు:
“ఓ పుణ్యాత్ముడా ! ఈ కథలన్నీ ఎందుకు ? నా మనసు అసలే మెత్తనిది. దాన్నింకా పరీక్షించాలనుకోకు. నేనీ శరీరాన్ని నీకు ఇస్తానని వాగ్దానం చేశాను కదా” అని తనను తినడానికి నిరాకరించిన పులితో ఆవు పలికింది.”

II. వ్యక్తీకరణ-సృజనాత్మకత

అ) ఈ కింది ప్రశ్నలకు ఆలోచించి ఐదేసి వాక్యాలలో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
ఆకలితో ఉన్న పులిని ఆవు తన ఇంటికి వెళ్ళి రావడానికి ఒప్పించింది కదా ! పులి ఆవును నమ్మడానికి గల కారణాలు ఏమిటి?
(లేదా)
పులిని ఆవు ఏ మాటలతో నమ్మించింది?
జవాబు:
తాను తిరిగిరాకపోతే – అబద్ధాలు మాట్లాడి పెద్దలకు బాధ కలిగించేవాడు, తండ్రికి, తల్లికి ఎదురుమాట్లాడేవాడు, ఆకలితో గట్ల వెంబడి గడ్డిని మేయుచున్న ఆవును వెళ్ళగొట్టేవాడు ఏ నరకాల్లో పడతారో, తిరిగి రాకుంటే తాను కూడా అదే నరకాలలో పడతానని శపథం (ప్రమాణం) చేస్తుంది. కావున ఆవు మాటలను పులి నమ్మినది.

ప్రశ్న 2.
ఆవు తాను తిరిగి అడవికి వెళ్ళేముందు అబద్దమాడకు, పనికిరానివాళ్లతో తిరగకు అని బుద్ధులు చెప్పింది కదా ! ఆవు తన బిడ్డకు ఇంకా ఏమేమి బుద్దులు చెప్పి ఉండవచ్చు?
జవాబు:

  1. పక్క వారితో విరోధాలు పెట్టుకోకు
  2. అందరితో స్నేహం చెయ్యి
  3. వేళకు మేత తిను
  4. మేత తిని చక్కగా కడుపు
    నిండా నీళ్లు తాగి హాయిగా పడుకో వంటి నీతులు ఆవు దూడకు చెప్పవచ్చు.

ప్రశ్న 3.
ఇతరులు ఎవరైనా కీడును కలిగించే మాటలు మాట్లాడితే భయపడకు. వినీ విననట్లు ఉండి, వెళ్ళమని ఆవు తన కొడుకుతో చెప్పింది కదా ! అలా అనడానికి కారణాలు ఏమై ఉంటాయి?
జవాబు:
ఇతరులు కీడు కలిగించే మాటలు, పొగరుబోతుతనంతో మాట్లాడవచ్చు. ఆ మాటలకు భయపడి కూర్చుంటే మనం సంఘంలో ఏమీ చేయలేము. ఎవరికీ భయపడరాదు. ధైర్యంగా ఉండాలి. ఇతరులు నిందిస్తే తిరిగి వారిని నిందించరాదు. అలా ఎదురు మాటలు మాట్లాడితే తగవులు వస్తాయి. అందుకే ఆవు “ఎవరు ఏమి అన్నా భయపడకు. వారి మాటలు
పట్టించుకోకు” అని తన కొడుకుకు చెప్పింది.

ప్రశ్న 4.
“ఈ కథలన్నీ ఎందుకు” ? అని ఆవు అన్నది కదా ! ఈ మాటలనే ఇప్పుడు కూడా వాడుతుంటారు. ఏ ఏ సందర్భాల్లో వాడుతుంటారు?
జవాబు:

  1. మనం ఎవరినైనా ఎక్కడకైనా ఏదో పనిమీద పంపిస్తే, వాడు ఆ పని చేయకుండా ఎక్కడో తిరిగి వస్తాడు. పని ఏమయిందిరా అని అడిగితే ఏవో కథలు చెపుతాడు.
  2. పరీక్షలో ఎందుకు మంచి మార్కులు రాలేదంటే ఏవేవో కారణాలు చెపుతాడు. అప్పుడు పెద్దలు వాడితో “ఏవేవో కథలు చెప్పకు” అంటారు.

AP Board 9th Class Telugu Solutions Chapter 7 ససేమిరా

ఆ) కింది ప్రశ్నలకు పదేసి వాక్యాలలో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
“ఆవు-పులి” వంటి స్వభావం ఉన్నవాళ్ళు సమాజంలో ఉంటారు కదా ! వీరి స్వభావం ఎలా ఉంటుంది?
జవాబు:
ఆవు వంటి స్వభావం ఉన్నవాళ్ళు మన సమాజంలో ఉంటారు. వారు ఇతరులకు కష్టం వస్తే చూసి సహించలేరు. తనకు కష్టం కలిగినా, ఇతరులకు మేలు చేయాలనే చూస్తారు. తనకు కడుపునిండా తిండి లేకపోయినా, ఇతరులు కషాల్లో ఉన్నప్పుడు తనకు ఉన్నదంతా ధారపోసి ఎదుటివారిని ఆదుకుంటారు. సమాజంలో ఉన్నవారినందరినీ తనలాగే చూస్తారు. తనకు కష్టం వస్తే ఎలాగుంటుందో, ఇతరులకూ అలాగే ఉంటుందని వారు అనుకుంటారు.

ఆవు వంటి స్వభావం కలవారు ఎన్నడూ అబద్ధం మాట్లాడరు. ఆడినమాట కోసం తమ ప్రాణాలనైనా ధారపోస్తారు.

పులి వంటి స్వభావం కలవాళ్ళు తమ స్వార్థం కోసం ఇతరులకు హాని చేస్తారు. ఇతరులు ఎంత నష్టపోయినా వీరు పట్టించుకోరు. తమకోసం, తమవారి కోసం ఎదుటివారిని కష్టపెట్టి తమ ప్రయోజనాన్ని సాధించుకుంటారు.

పులి వంటి స్వభావం కలవారు అసత్యాలు మాట్లాడుతారు. అధర్మంగా నడచుకుంటారు. ఇతరులకు హాని చేస్తారు. పక్కవారి మంచిచెడ్డలను పట్టించుకోరు. పులి వంటి స్వభావం కలవారు అవసరమైతే ఇతరులను హత్యలు చేస్తారు. చేయిస్తారు, హింసిస్తారు, దుర్మార్గంగా నడుస్తారు.

ప్రశ్న 2.
“ఆవు” గుణగణాలను గురించి రాయండి.
జవాబు:
ఆవు ఆడినమాట తప్పని గోమాత. తన చిన్న బిడ్డకు పాలిచ్చి వస్తానని, వెళ్ళిరావడానికి తనకు అనుమతి ఇమ్మని పులిని బ్రతిమాలింది. తన బిడ్డకు గుమ్మెడు పాలు చాలునని, పులికి తన మాంసం అంతా తింటే కాని ఆకలి తీరదని, కాబట్టి ముందు తన పిల్లవాడికి పాలివ్వడం ధర్మమని నచ్చచెప్పింది. తాను అబద్ధం ఆడనని శపథాలు కూడా మాట్లాడి పులిని నమ్మించింది.

ఇంటికి వెళ్ళి ప్రేమతో కుమారుడికి పాలిచ్చి బుద్దులు చెప్పింది. ఆవు చెప్పిన బుద్ధులను బట్టి ఆవు స్వభావం చాలా మంచిదని తెలుస్తుంది. జరిగింది చెప్పి, కొడుకును ఓదార్చి పులి వద్దకు తిరిగి వచ్చింది. తన మనస్సు అసలే మెత్తనిదనీ ఇంకా పరీక్షించవద్దనీ పులికి చెప్పి, తనను తినమని పులిని బ్రతిమాలింది. దేవతలు సైతం ఆవు సత్యవాక్యశుద్ధిని మెచ్చుకున్నారు.

ప్రశ్న 3.
కథలో ఆవు గొప్పదనాన్ని తెలిపే సంఘటన ఏది? అట్లాగే పులి గొప్పదనాన్ని తెలిపే సన్నివేశం ఏది?
జవాబు:
ఆవు గొప్పదనం :
ఆవు తిరిగి వచ్చి పులిని తనను తిని కడుపు నింపుకోమంది. పులి, ఆవును చంపితే తనకు పాపం వస్తుందని చెప్పింది. అప్పుడు ఆవు పులితో “తనది అసలే మెత్తని మనస్సు అనీ, తనను ఇంకా పరీక్షించవద్దని చెప్పింది. అలాగే దూడకు బుద్ధులు చెప్పిన సంఘటన కూడా ఆవు గొప్పదనాన్ని తెలుపుతుంది.

పులి గొప్పదనం :
ఆవు చేసిన శపథములు విని, ఆవు ధర్మాత్మురాలని మెచ్చుకొని ఆవును నమ్మి ఇంటికి పంపిన ఘట్టంలో పులి గొప్పదనం తెలుస్తుంది. తిరిగివచ్చిన ఆవును తింటే తనకు దోషమనీ, తనకు మాంసం ఎక్కడైనా దొరకుతుందనీ, తనను పుట్టించిన దేవుడే తనకు ఆహారం చూపిస్తాడనీ, పులి చెప్పిన మాటలు – పులి గొప్పదనాన్ని తెలుపుతాయి.

AP Board 9th Class Telugu Solutions Chapter 7 ససేమిరా

ఇ) సృజనాత్మకంగా రాయండి. .
“ఆవు – పులి” పాత్రల సంభాషణలు రాయండి. నాటకీకరణ చేయండి.
(లేదా)
క్రూర స్వభావం గల పులి, సాధు స్వభావం గల ఆవుల మధ్య జరిగిన సంభాషణను రాయండి.
(ఆవు-పులి)
జవాబు:
పులి : ఆగు ! ఆగు ! ఈ రోజు నువ్వు నాకు ఆహారం కావలసిందే.

ఆవు : పులిరాజా ! నేను చేసిన అపరాధమేమిటి?

పులి : (ఆవును పట్టుకొని) నాకు ఆకలిగా ఉంది. నిన్ను చంపి తింటాను.

ఆవు : అయ్యా ! పులిరాజా ! నాకు ఈ మధ్యే దూడ పుట్టింది. దానికి ఏడెనిమిది రోజులు ఉంటాయి. అది గడ్డి కూడా తినలేదు. దానికి పాలిచ్చి నీ దగ్గరికి వస్తా. నన్ను విడిచి పెట్టు.

పులి : అదేం కుదరదు. నీ మాటలు నేను నమ్మను.

ఆవు : వ్యాఘ్ర కులభూషణా ! నా మాట నమ్ము. నా బిడ్డకు గుమ్మెడు పాలతో కడుపు నిండుతుంది. నీకు నా మాంసం అంతా తింటే కాని తృప్తి తీరదు. ఈ రెండు పనుల్లో ఏది ముందు చేయాలో నీకు తెలుసు. నాకు అనుమతి ఇయ్యి. తొందరగా తిరిగి వస్తా.

పులి : (అపహాస్యంగా నవ్వి) ఓ గోవా ! ఇలా మాట్లాడుతున్నావేమిటి? నన్ను మోసపుచ్చి నీ కొడుకు దగ్గరికి వెళ్ళి , వస్తానంటున్నావు. ఇది సమంజసంగా ఉందా? ఎవరైనా నీ మాటలు నమ్ముతారా?

ఆవు : అయితే శపథం చేస్తా. అబద్దాలాడే వాడు, తల్లిదండ్రులకు ఎదురు చెప్పేవాడు, మేస్తోన్న ఆవును వెళ్ళగొట్టేవాడు ఏ దుర్గతికి పోతారో, నేను తిరిగి రాకపోతే అదే దుర్గతికి పోతా. నన్ను నమ్ము.

పులి : సరే. నేను నమ్మాను. వెళ్ళి త్వరగా రా.

ఆవు : (దూడకు పాలిచ్చి తిరిగి ఆవు పులి దగ్గరకు వచ్చి) పులిరాజా ! క్షమించు. నన్ను తిని నీ ఆకలి తీర్చుకో.

పులి : శభాష్ ! మాట నిలబెట్టుకున్నావు. నీవు ధర్మాత్మురాలవు. పాపం మూటకట్టుకోలేను. నాకు మాంసం ఎక్కడైనా దొరకుతుంది. నీవు వెళ్ళిరా.

ఆవు : పులిరాజా ! నా మనస్సు అసలే మెత్తనిది. దాన్ని ఇంకా పరీక్షించాలని అనుకోకు. నా శరీరాన్ని నీకు ముందే వాగ్దానం చేశాను. నా రక్త మాంసాలతో నీ ఆకలి తీర్చుకో.

పులి : వద్దు వద్దు. నిన్ను నేను తినలేను. నీవు సత్యమూర్తివి. నీ ధర్మం నిన్ను కాపాడింది. వెళ్ళిరా !

AP Board 9th Class Telugu Solutions Chapter 7 ససేమిరా

(లేదా)
“ఆవు – పులి” రెండింటినీ ఒక కుందేలు చూసింది. ఆ కుందేలు వీటిని చూసి గొప్పగా గౌరవభావంతో పొగిడింది. ఆ కుందేలు ఆవును ఏమని పొగిడి ఉంటుంది? అట్లాగే పులిని ఏమని పొగిడి ఉంటుంది? ఊహించి రాయండి.
జవాబు:
కుందేలు ఆవును పొగడడం :
శభాష్ గోవా ! నీ వంటి ధర్మాత్మురాలిని నేను ఎక్కడా చూడలేదు. నీవు ఆడినమాటను నిలబెట్టుకున్నావు. నీ చిన్ని బిడ్డపై నీకు ఎంతో ప్రేమ ఉన్నా, దానిని విడిచిపెట్టి, ఇచ్చిన మాటకోసం పులికి ఆహారం కావడానికి సిద్ధపడ్డావు. సత్యవాక్యపాలనలో నీవు సత్యహరిశ్చంద్రుణ్ణి, బలిచక్రవర్తినీ, కర్ణుడినీ మించిపోయావు. నీవు లేదు మహాత్ముడివి. నిజానికి నీవు ధర్మమూర్తివి. నీ ధర్మమే నిన్ను కాపాడింది. నీ సత్యవాక్యశుద్ధిని, మనుష్యులూ, జంతువులూ, దేవతలూ సహితం మెచ్చుకుంటారు. భేష్.

కుందేలు పులిని మెచ్చుకోవడం :
శభాష్ పులిరాజా ! నీవు నిజంగా వ్యాఘ్రకుల భూషణుడవు. ఆవు పలికిన శపథాలు విని, దానిని నమ్మి, అది తన దూడకు పాలు ఇచ్చి రావడానికి, దానిని విడిచి పెట్టావు. అంతేకాదు అన్నమాట ప్రకారం తిరిగి వచ్చిన గోవును మెచ్చుకొని దాన్ని చంపకుండా విడిచిపెట్టావు. నీవు దయామూర్తివి. కరుణా సముద్రుడివి. దేవతలు సహితం నిన్ను పొగడకుండా ఉండలేరు.

ఈ) ప్రశంసాత్మకంగా రాయండి.
ఆవు తన కొడుక్కి మంచి బుద్ధులు చెప్పింది కదా ! అట్లాగే పిల్లలకు తల్లి చెప్పే బుద్ధులు ఏవి? ఉపాధ్యాయుడు చెప్పే మంచి బుద్ధులేవో రాయండి.
జవాబు:
పిల్లలకు తల్లి చెప్పే మంచి బుద్ధులు :

  1. తోటి పిల్లలతో దెబ్బలాడవద్దు
  2. పక్క పిల్లలతో స్నేహంగా ఉండు
  3. బట్టలు మాపుకోకు
  4. పుస్తకాలు జాగ్రత్తగా చూసుకో
  5. ఉపాధ్యాయులు చెప్పేది విని శ్రద్ధగా రాసుకో
  6. అసత్యం మాట్లాడకు
  7. మధ్యాహ్నం భోజనం చెయ్యి
  8. చెడ్డవారితో స్నేహం చెయ్యకు – మొ||నవి.

ఉపాధ్యాయుడు చెప్పే మంచి బుద్ధులు :

  1. ఏ రోజు పాఠం ఆ రోజే చదువు
  2. ఇంటిపని శ్రద్ధగా పూర్తిచెయ్యి
  3. చదువుపై శ్రద్ధ పెట్టు
  4. ఆటలు ఆడుకో
  5. వ్యాయామానికై శ్రద్ధ పెట్టు
  6. తల్లిదండ్రులను, గురువులను గౌరవించు
  7. అసత్యం మాట్లాడకు
  8. తోటి బాలబాలికలను అన్నా చెల్లెళ్ళవలె ప్రేమగా గౌరవించు – మొ||నవి. “
ఆచరించాల్సినవిఆచరించాలని అనుకొన్నవినెల తరువాత
ఆడిన మాట తప్పకపోవడంఆడిన మాట తప్పకపోవడంలేదు
అబద్ధం ఆడకుండా ఉండడంఅబద్దం ఆడకుండా ఉండడంఅవును
సమయపాలన పాటించడంభయపడకుండా ఉండడంలేదు
ఎవరైనా మనను సహాయం కోరితే సహాయం చేయడంఏ రోజు పాఠాలు ఆ రోజు చదవడంఅవును
భయపడకుండా ఉండడంనిత్యం ఉదయం నడవడంలేదు
ఇంకేమైనాఆటలలో పాల్గొనడంఅవును

IV. ప్రాజెక్టు పని

1. “ఆడినమాట తప్పరాదు!”, “సత్యవాక్కు” …… ఇలాంటి నీతికథలను మరికొన్నింటిని సేకరించండి. వాటిని రాసి ప్రదర్శించండి.
జవాబు:
“బలిచక్రవర్తి – వామనుడి కథ” శ్రీమహావిష్ణువు వామనుడిగా పుట్టి, బలిచక్రవర్తి వద్దకు వచ్చి మూడు అడుగుల నేలను దానంగా అడిగాడు. ఇస్తానని బలి మాట ఇచ్చాడు. ఇంతలో బలి చక్రవర్తి గురువు శుక్రాచార్యుడు, వామనుడు శ్రీమహా విష్ణువని, బలిని మోసం చేయడానికే వచ్చాడని, దానం ఇయ్యవద్దని అడ్డు పెట్టాడు. ఆడినమాట తప్పని బలి, వామనుడికి మూడు అడుగుల నేలను దానం చేశాడు. వామనుడు రెండు అడుగులతో భూమినీ, ఆకాశాన్ని కొలిచి, మూడవ అడుగు బలి తలపై పెట్టి అతణ్ణి పాతాళంలోకి తొక్కాడు. ఈ విధంగా బలి ఆడిన మాట తప్పలేదు.
(లేదా)
2. ఈ పాఠ్యపుస్తకంలోని పాఠాలు ఏఏకవులు/ఏఏరచయితలు రాసినవి? వాటి వివరాలు చార్టు మీద రాసి ప్రదర్శించండి.
జవాబు:
AP Board 9th Class Telugu Solutions Chapter 7 ససేమిరా 3 AP Board 9th Class Telugu Solutions Chapter 7 ససేమిరా 4

III. భాషాంశాలు

పదజాలం

అ) కింది పదాలకు అర్థాలు రాసి సొంతవాక్యాలలో రాయండి.

అ. కడుపార (కడుపునిండుగా) : పసిపిల్లలు కడుపునిండుగా పాలు తాగితే ఏడవకుండా నిద్రపోతారు.
ఆ. సుకృతం (పుణ్యం) : మన గతజన్మ సుకృతమే నేడు మనము అనుభవించేది.
ఇ. బడబాగ్ని (సముద్ర జలములోని అగ్ని) : పేదల హృదయాలలో ఆకలి మంట, బడబాగ్నిలా విజృంభిస్తోంది.
ఈ. అపహాస్యం (ఎగతాళి) : పెద్దల హితవచనాలను ఎన్నడూ అపహాస్యం చేయరాదు.
ఉ. మెత్తని మనసు (మెత్తని గుండె) . : పేదలకు నా మిత్రుడు తన మెత్తని మనస్సుతో ఎప్పుడూ సాయం చేస్తూ ఉంటాడు.
ఊ. ప్రసన్నులైరి (సంతోషించారు) : మహర్షుల తపస్సులకు మెచ్చి దేవతలు ప్రసన్నులయ్యారు.
ఎ. గగనవీధి (ఆకాశవీధి) : హనుమ గగనవీధి గుండా ఎగిరి లంకకు చేరాడు.
ఏ. దుర్గతి (హీనదశ) : నేటి పేదల దుర్గతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి.

AP Board 9th Class Telugu Solutions Chapter 7 ససేమిరా

అ) కింది పదాలకు పర్యాయ పదాలు రాయండి.
అ) పూరి : గడ్డి, తృణం
ఆ) అగ్ని : శుచి, చిచ్చు, అగ్గి, మంట
ఇ) ప్రల్లదము : పరుషవాక్యం, కఠినపు మాట
ఈ) కొడుకు : కుమారుడు, సుతుడు, పుత్రుడు మజుడు
ఉ) సత్యం : నిజం, ఒట్టు
ఊ) సత్వరం : వెంటనే, త్వరితం, చయ్యన, త్వరగా
ఎ) పులి : శార్దూలం, వ్యాఘ్రం, పుండరీకం
ఏ) ఆవు : గోవు, ధేనువు, మొదవు

ఇ) కింది వాక్యాలలో భావాన్ని బట్టి గీత గీసిన పదాలకు గల వేరువేరు అర్థాలను గుర్తించి రాయండి.

1. అరణ్యంలో పుండరీకం గాండ్రించగానే చిన్న జంతువులు కకావికలం అయ్యాయి.
సూర్యరశ్మి సోకగానే సరస్సులో పుండరీకం వికసిస్తుంది.
జవాబు:
పుండరీకం = పులి, పద్మం

2. సీత గుణములు చెవిసోకగానే శివధనస్సుకు రాముడు గుణమును బిగించుటకు ప్రయత్నించాడు.
జవాబు:
గుణము – స్వభావం, అల్లెత్రాడు

3. అందమైన తమ కులములో తమ కులము వృద్ధి చెందాలని కోరుకుంటారు.
జవాబు:
కులము = ఊరు, వంశము, తెగ, ఇల్లు, శరీరం

4. కొందరు పలుకులు మిఠాయి పలుకులుగా ఉంటాయి.
జవాబు:
పలుకు = మాట, ముక్క

5. రమణీరత్నము తన ఉంగరములో రత్నమును ధరించింది.
జవాబు:
రత్నము = శ్రేష్ఠము, మణి

AP Board 9th Class Telugu Solutions Chapter 7 ససేమిరా

ఈ) ఈ క్రింది పట్టికలోని వాక్యాలకు సంబంధించిన వ్యుత్పత్తిపదాలను రాయండి.
వ్యుత్పత్తిపదాలు : వ్యాఘ్రము, ప్రదక్షిణ, ప్రాణం, ధర్మం, రక్తం

1. శరీరాన్ని నిలిపే వాయువు = ప్రాణం
2. జనులచేత పూనబడునది = ధర్మం
3. పొడలచేత నానావర్ణాలతో శరీరం కలది = వ్యాఘ్రం
4. ఎఱ్ఱని వర్ణము కలది = రక్తం
5. దేవతాదులనుద్దేశించి మూడుసార్లు కుడివైపుగా తిరగడం = ప్రదక్షిణ

వ్యాకరణం

అ) కింది సంధులకు సంబంధించిన ఉదాహరణలను పాఠంలో వెతికి రాయండి. సూత్రాలు కూడా రాయండి.

1. ఉత్త్వసంధి : ఉత్తునకు సంధి నిత్యము
ఉదా :
ఇట్లు + అని = ఇట్లని
నేను + ఇట్లు = నేనిట్లు
నీవు + ఎన్నడు = నీవెన్నెడు

2. జశ్వసంది :
పరుషములకు వర్గ ప్రథమ ద్వితీయాక్షరాలు – శ, ష, స లు తప్ప మిగిలిన హల్లులు కానీ, అచ్చులు కానీ పరమైతే వరుసగా సరళాలు ఆదేశంగా వస్తాయి.
ఉదా :
మత్ + రక్తమాంసములు = మద్రక్తమాంసములు
వాక్ + దత్తము = వాగ్దత్తము

3. గసడదవాదేశ సంధి :
ప్రథమము మీది పరుషములకు గసడదవలగు
ఉదా :
అడుగు + తిరుగక = అడుగుదిరుకగ
అన్యచిత్త + కాక = అన్యచిత్తగాక
సక్తమ్ము + చేసి = సక్తమ్ము సేసి

4. ఇత్వసంధి :
ఏమ్యాదుల ఇత్తునకు సంధి వైకల్పికముగానగు.
ఉదా :
అంటివి + ఇది = అంటివిది, అంటివియిది
వారికి + ఇంచుక = వారికించుక, వారికి యించుక

5. యడాగమ సంధి :
సంధి లేని చోట స్వరంబు కంటె పరంబైన స్వరంబునకు యడాగమంబగు.
ఉదా :
నీ + ఉదరాగ్ని = నీ యుదరాగ్ని
నా + అది = నాయది
హింస + ఒనర్చి = హింస యొనర్చి

త్రికసంధి

ఆ) ఆ, ఇ, ఏ అను సర్వనామాలను త్రికం అంటారు. క్రింది ఉదాహరణలను గమనించండి.
అప్పులి = ఆ + పులి

1. దీనిలో ‘ఆ’ అనేది ‘త్రికము’లలో ఒకటి. ఇది దీర్ఘాక్షరం.
2. అటువంటి త్రికమైన ‘ఆ’ మీద ఉన్న అసంయుక్త హల్లు అయిన ‘పు’ అనే అక్షరానికి ద్విత్వం వచ్చి ‘ప్పు’ అయింది. అప్పుడు ఆ + ప్పులి అయినది.
3. ద్విత్వమైన ‘ప్పు’ పరమైనందువల్ల అచ్చతెనుగు ‘ఆ’ ఇపుడు ‘అ’ అయినది.. అప్పుడు ‘అప్పులి’ అయినది.

సూత్రములు :
1. ఆ, ఈ, ఏలు త్రికమనబడును.
2. త్రికంబుమీది అంసయుక్త హల్లునకు ద్విత్వంబు బహుళంబుగానగు.
3. ద్విరుక్తంబగు హల్లు పరమగునపుడు ఆచ్ఛికమగు దీర్ఘమునకు హ్రస్వంబగు.

కింది మాటలను విడదీసి రాయండి.
1. ఇచ్చోట – ఈ + చోట
2. అక్కడ – ఆ + కడ
3. ఎక్కడ – ఏ + కడ

AP Board 9th Class Telugu Solutions Chapter 7 ససేమిరా

ఇ) పాఠంలోని సమాస పదాల ఆధారంగా కింది పట్టికలోని ఖాళీ గళ్ళను పూరించండి.

సమాసంవిగ్రహవాక్యంసమాసం పేరు
1. నా సుతుడునా యొక్క సుతుడుషష్ఠీ తత్పురుష సమాసం
2. ధేనురత్నమురత్నము వంటి ధేనువురూపక సమాసం
3. ధర్మవిదుడుధర్మమును తెలిసినవాడుద్వితీయ తత్పురుష సమాసం
4. గంభీరరవముగంభీరమైన రవమువిశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
5. నాలుగు చన్నులునాలుగు సంఖ్యగల చన్నులుద్విగు సమాసము
6. అసత్యముసత్యము కానిదినఞ్ తత్పురుష సమాసం
7. తల్లిదండ్రులుతల్లి, తండ్రిద్వంద్వ సమాసం

ఈ) బహుబ్లిహీ సమాసం

కింది ఉదాహరణను గమనించండి.
చక్రపాణి – చక్రం పాణియందు (చేతిలో) కలవాడు – విష్ణువు అని అర్థం. దీంట్లో సమాసంలోని రెండు పదాలకు (చక్రానికి గాని పాణికి గాని) ప్రాధాన్యం లేకుండా ఆ రెండూ మరో అర్థం ద్వారా విష్ణువును సూచిస్తున్నాయి. ఇలా సమాసంలో ఉన్న పదాల అర్థానికి ప్రాధాన్యం లేకుండా అన్యపద అర్థాన్ని స్ఫురింపజేస్తే దాన్ని బహుప్రీహి సమాసం అంటారు. అన్యపదార్థ ప్రాధాన్యం కలది బహుజొహి సమాసం.

కింది పదాలకు విగ్రహవాక్యాలు రాయండి.
1. ముక్కంటి : మూడు కన్నుల కలవాడు (శివుడు)
2. శోభనాంగి : చక్కని అవయవములు కలది (స్త్రీ)
3. మహాత్ముడు : గొప్ప ఆత్మకలవాడు (మహానుభావుడు)
4. అన్యచిత్త : వేరు ఆలోచన కలది / కలవాడు
5. చతుర్ముఖుడు : నాలుగు ముఖములు కలవాడు (బ్రహ్మ)
6. నీలాంబరి : నల్లని వస్త్రాలు ధరించినది

ఓ) ఛందస్సు

కింది పద్య పాదాలకు గణవిభజన చేసి లక్షణాలు రాయండి.

1. ఇట్టి మహానుభావులకు హింసయొనర్చి దురంత దోషముల్
జవాబు:
AP Board 9th Class Telugu Solutions Chapter 7 ససేమిరా 1
పద్యం : ఉత్పలమాల
యతిస్థానం : 1, 10 అక్షరాలు
ప్రాస : 2వ అక్షరం
గణాలు : భ, ర, న, భ, భ, ర, వ

2. పులికి ప్రదక్షిణించి తలపుం బలుకున్ సదృశంబుగాగన (స్థలిత)
జవాబు:
AP Board 9th Class Telugu Solutions Chapter 7 ససేమిరా 2
పద్యం : చంపకమాల
యతిస్థానం : 1, 10 అక్షరాలు
ప్రాస : 2వ అక్షరం
గణాలు : న, జ, భ, జ, జ, జ, ర

ఊ) అలంకారాలు

7వ పద్యంలోని అలంకారాన్ని కనుక్కొని పేరు రాసి లక్షణాలతో సరిపోల్చండి.

రూపకాలంకారం : పాషాణ ధేనువు
ఇచట ఉపమేయమైన ధేనువును, ఉపమానమైన పాషాణానికే అభేదం చెప్పబడింది. కనుక ఇది రూపకాలంకారము. ఉపమాన ఉపమేయములకు అభేదము చెప్పుట రూపకాలంకారం.

ఋ) స్వభావోక్తి

“మునుమునుబుట్టె ………………… దయాగుణముల్లసిల్లగన్”
పద్యంలో గోవు యొక్క కొడుకు మొన్నమొన్ననే పుట్టాడని, ముద్దుముద్దుగా ఉంటాడని, ఏడెనిమిది రోజుల వయస్సు కలవాడని, కొద్దిగా గడ్డిని కూడా తినలేడని – ఉన్నది ఉన్నట్లుగా చక్కని పదజాలంతో వర్ణించారు. కనుక ఇది స్వభావోక్తి అలంకారం. ఇలా ఏదైనా విషయాన్ని ఉన్నది ఉన్నట్లుగా వర్ణిస్తే దానిని స్వభావోక్తి అలంకారం అంటారు.
ఉదా :
జింకలు బిత్తర చూపులు చూస్తూ చెవులు నిగిడ్చి చెంగుచెంగున గెంతుతున్నాయి.

స్వభావోక్తి అలంకారానికి రెండు ఉదాహరణలు రాయండి.

  1. ఆ తోటలోని చిలుకలు పచ్చని రెక్కలతో, ఎఱ్ఱని ముక్కుతో పండు తినుచున్నది.
  2. ఆమె ముఖము కాటుక కళ్ళతో, చిరునగవు పెదవులతో చూపురులను ఆకర్షిస్తున్నది.

9th Class Telugu 7th Lesson ఆడినమాట కవి పరిచయం

కవిపేరు : అనంతామాత్యుడు (అనంతుడు)
కాలం : 15వ శతాబ్దం
జన్మస్థలం : శ్రీకాకుళక్షేత్ర సమీపంలోని పెనుమకూరు
రచనలు : భోజరాజీయం – 2092 పద్యాల ప్రబంధ గ్రంథం. ఛందోదర్పణం – ఛందశ్శాస్త్ర గ్రంథము (నాలుగు ఆశ్వాసాల గ్రంథం) రసాభరణం – అలంకారశాస్త్ర గ్రంథము (నాలుగు ఆశ్వాసాలతో 344 గద్య పద్యాలు కలవు.)
కవితాదృక్పథం : ప్రతికథలోను నైతికత, సత్యం, త్యాగం అను సుగుణాలు ఉంటాయి.

పద్యాలు – ప్రతి పదార్థాలు-భావాలు

1వ పద్యం : కంఠస్థ పద్యం
*చ. మునుమును బుట్టె నాకు నొక ముద్దులపట్టి, యతండు పుట్టి యే
డెనిమిది నాళ్లపాటి గలఁడింతియ, పూరియు మేయనేరఁ డేఁ
జని, కడుపారం జన్గుడిపి చయ్యన వచ్చెద, నన్నుఁ బోయి ర
మ్మని సుకృతంబు గట్టికొనవన్న ! దయాగుణ ముల్లసిల్లఁగన్.
ప్రతిపదార్థం :
నాకున = నాకు
మునుమును = ముందుగా (తొలి సంతానంగా)
ఒక ముద్దుల పట్టి = ఒక ముద్దు బిడ్డ
పుట్టెన్ = పుట్టాడు
అతండు, పుట్టి = ఆ బిడ్డ పుట్టి
ఏడు + ఎనిమిది నాళ్లపాటి
గలడు = ఎనిమిది రోజులయింది
ఇంతియ = ఇంకా
పూరియున్ = గడ్డి కూడా
మేయనేరడు = తినడం చేతకాదు
ఏన్ + చని = నేను వెళ్ళి
కడుపారన్ = బిడ్డకు కడుపునిండా
చనుడిపి = పాలిచ్చి
చయ్యనన్ = వెంటనే
వచ్చెదన్ = తిరిగివస్తాను
దయాగుణము + ఉల్లసిల్లగన్ = దయాగుణం వెల్లడి అయ్యేటట్లు
నన్నున్ = నన్ను
పోయిరమ్ము + అని = వెళ్ళి రమ్మని చెప్పి
సుకృతంబు = పుణ్యము
కట్టికొనవన్న (కట్టికొనుము + అన్న) = కూడగట్టుకోవయ్యా!

భావం :
అయ్యా ! నాకు తొలి సంతానంగా పుట్టిన ముద్దుల బిడ్డ వయస్సు డెనిమిది రోజులు మాత్రమే. వాడికింకా గడ్డి మేయడం కూడా రాదు. వాడికి కడుపు నిండా పాలిచ్చి వెంటనే వస్తాను. దయతో నేను వెళ్ళిరావడానికి అంగీకరించి పుణ్యం కట్టుకో అని ఆవు పులితో చెప్పింది.

AP Board 9th Class Telugu Solutions Chapter 7 ససేమిరా

2వ పద్యం :
ఉ. గుమ్మెడు పాల నా సుతునకుం బరితృప్తి జనించుఁగాని, మాం
సమ్ము సమస్తముం గొనక చాలదు నీ యుదరాగ్ని కైన, ని
కుమ్ముగ నిందులోఁబ్రథమ కార్య వినిర్గతి నీ వెఱుంగవే,
పొమ్మన వన్న ! వ్యాసకులభూషణ! చయ్యనఁ బోయి వచ్చెదన్.
ప్రతిపదార్థం :
నా సుతునకున్ = నా బిడ్డకు
గుమ్మెడు పాలన్
(గుమ్మ + ఎడు = గుమ్మెడు) = ఒక పాలధారతో
పరితృప్తి = సంతృప్తి
జనించున్ = కలుగుతుంది
కాని = కానీ
నీ + ఉదర + అగ్నికిన్ + ఐనన్ = (నీయుదరాగ్నికైనన్) = నీ కడుపు మంటకు అయితే
మాంసమ్ము సమస్తమున్ = నా మాంసాన్ని అంతా
కొనక = తినక
చాలదు = సరిపోదు
నిక్కమ్ముగ = నిజంగా
ఇందులోన్ = ఈ విషయంలో
ప్రథమ కార్య వినిరతి = ముందుగా చేయవలసిన పని
నీవు + ఎరుంగవే = నీకు తెలియదా?
వ్యాఘ్రకుల భూషణ – పులుల వంశంలో శ్రేష్ఠుడా!
పొమ్మనవన్న = (పొమ్మనుము + అన్న) వెళ్ళు అని చెప్పవయ్యా!
చయ్యనన్ = వెంటనే
పోయి వచ్చెదన్ = వెళ్ళి తిరిగివస్తాను.

భావం :
ఓ పులివంశంలో శ్రేష్ఠుడా ! గుమ్మెడు పాలతో నా కుమారునకు తృప్తి కలుగుతుంది. నా మాంసము అంతా తింటే కాని నీ ఆకలి మంట చల్లారదు. అయినా నిజంగా దేనికి ప్రాధాన్యం ఇవ్వాలో నీకు తెలియదా? నాకు అనుమతి ఇయ్యి. తొందరగా వెళ్ళివస్తాను.

3వ పద్యం :
చ. అనవుడు పుండరీక మపహాస్యముచేసి ‘యిదేమి గోవ! యి
ట్లనియెదు, నన్ను బేల్పఱచి యాత్మజుఁ దున్నెడ కేగి సత్వరం|
బునఁ జనుదెంతు నంటి విది పోలునె, చెప్పెడువారు చెప్పినన్
వినియెదువారి కించుక వివేకము పుట్టదె, యింత యేటికిన్.
ప్రతిపదార్థం :
అనవుడు = (ఆవు) అట్లనగా
పుండరీకము = పెద్దపులి
అపహాస్యము చేసి = ఎగతాళి చేసి
గోవ = ఓ ఆవా !
ఇదేమి = ఇది + ఏమి ఇదేమిటి?
ఇట్లు + అనియెదు = ఇలా అంటున్నావు
నన్నున్ = నన్ను
బేల్పఱచి = అమాయకుని చేసి
ఆత్మజుడు = నీ కొడుకు
ఉన్నెడకున్ (ఉన్న+ఎడకున్) = ఉన్న చోటుకు
ఏగి = వెళ్ళి
సత్వరంబునన్ = త్వరగా
చనుదెంతున్ = తిరిగి వస్తాను
అంటివి = అన్నావు
ఇది, పోలునె = ఇది తగినదా? (ఇలా అనడం బాగుందా?)
చెప్పెడువారు = చెప్పేవారు
చెప్పినన్ = చెప్పినా
వినియెడువారికిన్ = వినే వారికి
ఇంచుక = కొంచెము
వివేకము = ఆలోచన (తెలివి)
పుట్టదె (పుట్టదు + ఎ) = పుట్టవద్దా
ఇంత + ఏటికిన్ = ఇదంతా ఎందుకు?

భావం :
ఆవు అట్లా అనగానే పులి అపహాస్యం చేసి, ‘ఓ గోవా ! ఇదేమిటి? ఇలా మాట్లాడుతున్నావు? నన్ను అమాయకుణ్ణి చేసి, నీ కొడుకు దగ్గరికి వెళ్ళి వస్తానంటున్నావు. ఇది బాగుందా? చెప్పేవాడు చెప్పినా వినేవాడికి కొంచెం వివేకం ఉండవద్దా ! ఇదంతా ఎందుకు?’ అన్నది.

AP Board 9th Class Telugu Solutions Chapter 7 ససేమిరా

4వ పద్యం : కంఠస్థ పద్యం
ఉ. ప్రల్లదమాడి పెద్దలకు బాధ యొనర్చునతండు, తండ్రికిం
దల్లికి మాజుపల్కెడు నతండును, నాఁకొని వచ్చి మొడ్లచే
సుల్ల మెలర్ప మేయఁజనుచున్న వృషంబు నదల్చునాతఁడు
ద్రెళ్ళాడు నట్టిదుర్గతులఁ దెళ్ళుదు నేనిటు రాక తక్కినన్.
ప్రతిపదార్థం :
ప్రల్లదము + ఆడి = కఠినమైన మాట మాట్లాడి
పెద్దలకు = పెద్దవారికి
బాధ + ఒనర్చు + అతండు = బాధ కలిగించేవాడూ
తండ్రికిన్ = తండ్రికిని
తల్లికిన్ = తల్లికి
మాఱు పల్కెడు + అతండును = ఎదురు తిరిగి మాట్లాడేవాడునూ
ఆ కొని వచ్చి = ఆకలితో వచ్చి
ఒడ్ల (ఒడ్డుల) = గట్లపై గల
చేను = సస్యము
ఉల్లము + ఎలర్బన్ = మనస్సునకు సంతోషము కలిగేటట్లు
మేయన్ = మేయడానికి
చను చున్న (చనుచున్ + ఉన్న) = వెళుతున్న
వృషంబున్ = ఎద్దును
అదల్చునాతడున్ (అదల్చు + ఆతడున్) = బెదరించేవాడునూ
త్రెళ్ళెడునట్టి = పడేటటువంటి
దుర్గతులన్ = నరకాలలో
నేను = నేను
ఇటురాక = తిరిగి ఇటువైపురాక
తక్కినన్ = మానేస్తే
తెళ్ళుదున్ = పడతాను

భావం :
కఠినమైన మాటలు మాట్లాడి పెద్దలకు బాధ కలిగించేవాడూ, తండ్రికీ, తల్లికీ ఎదురు మాట్లాడే వాడూ, ఆకలితో గట్ల వెంబడి గడ్డిని మేస్తున్న పశువును (ఎద్దును) వెళ్ళగొట్టేవాడూ, ఏ నరకాలలో పడతారో, తిరిగి నేను నీ దగ్గరికి రాకపోతే నేను ఆ నరకాలలో పడతాను.

5వ పద్యం :
క. అని శపథంబులు పలికిన
విని వ్యాఘ్రము – “నీవు ధర్మవిదురాలవు నీ
కెన యెవ్వరు, ధేనువ ! యే
నిను నమ్మితిఁ బోయి రమ్మ” నినఁ బటుబుద్దిన్,
ప్రతిపదార్థం :
అని = అట్లని
శపథంబులు పలికినన్ = శపథాలు మాట్లాడగా, (ఒట్లు పెట్టగా)
వ్యాఘ్రము = పులి
విని = విని
నీవు = నీవు
ధర్మవిదురాలవు = ధర్మం తెలిసిన దానవు
నీకున్ = నీకు
ఎవ్వరు = ఎవరు
ఎన = సాటి వస్తారు
ధేనువ = ఓ గోవా !
ఏన్ = నేను
నినున్ = నిన్ను
నమ్మితిన్ = నమ్మాను
పోయి రమ్ము =
అనినన్ = అని పులి అనగా
పటు బుద్దిన్ = (ఆవు) మంచి బుద్ధితో

భావం :
అని ఆవు పలికిన శపథాలు విన్న ఓ గోవా ! నీవు ధర్మం తెలిసిన దానవు. నీకెవ్వరూ సాటిరారు. నేను నిన్ను నమ్మాను. నీవు వెళ్ళిరా” అని చెప్పింది. ఆవు అప్పుడు చక్కని బుద్ధితో.

AP Board 9th Class Telugu Solutions Chapter 7 ససేమిరా

6వ పద్యం :
చ. పులికిఁ బ్రదక్షిణించి తలఁపుంబలుకున్ సదృశంబు గాఁగ, న
సలిత విలాసయాన మెసంగం బురికేఁగెఁ జతుస్తనంబులుం
బలసి పొదుంగు బ్రేఁగుపఱుపంగ గభీర రవంబుతోడ వీ
థుల నడయాడు బాలకులు దోరపు భీతిఁ దొలంగి పాఱఁగన్
ప్రతిపదార్థం :
పులికిన్ = పులికి
ప్రదక్షిణించి = ప్రదక్షిణము చేసి
తలపున్ = ఆలోచనయూ
పలుకున్ = మాటయూ
సదృశంబు = సమానము
కాగన్ = కాగా
చతుస్తనంబులున్ = నాలుగు చన్నులునూ
బలసి = పుష్టిపొంది
పొదుంగు = పొదుగు
త్రేగు పఱుపంగన్ = చేపగా
అస్ఖలిత = తొట్రుపాటు లేని
విలాసయానము = విలాసపు నడక
ఎసగన్ = అతిశయింపగా
గంభీరవంబుతోడన్ = గంభీరమైన ధ్వనితో
వీథులన్ = వీధులలో
నడయాడు = సంచరించే
బాలకులు = పిల్లలు
తోరపు భీతిన్ (తోరము + భీతిన్) = పెద్ద భయంతో
తొలంగి = ప్రక్కకు తప్పుకొని
పాఱగన్ = పరుగెత్తగా
పురికేగెన్ (పురికిన్ + ఏగెన్) = తన నివాస స్థలానికి వెళ్ళింది

భావం :
ఆవు, పులికి ప్రదక్షిణము చేసింది. తన బిడ్డకు సంబంధించిన ఆలోచనలూ, మాటలూ ఏకమయ్యాయి. స్తనములు లావెక్కి పొదుగు చేపుకు వచ్చింది. ఆవు గంభీర ధ్వని చేసింది. వీధులలో తిరిగే పిల్లలు పెద్ద భయంతో ప్రక్కకు తప్పుకొని పారిపోతుండగా ఆవు విలాసంగా నడుస్తూ, తన నివాసానికి వెళ్ళింది.
పురాతన

7వ పద్యం :
చ. కొడుకు చనుగ్రోలుచున్నంత దదవుఁ దల్లి
యడుగు దిరుగక కదలక యన్యచిత్త
గాక పై నీఁగ సోఁకినఁ గదలకుండా
నెమ్మిఁ బాషాణధేనువు నిలిపినట్లు.
ప్రతిపదార్థం :
కొడుకు = తన దూడ
చనుగ్రోలు చున్న = పాలు త్రాగుచున్న
అంతతడవు = అంత సేపూ
తల్లి = తల్లియైన ఆ ఆవు
అడుగు + తిరుగక = (తన) కాలు మరలింపక
కదలక = కదలకుండా
అన్యచిత్త + కాక = వేరు ఆలోచన లేక
పైన్ = తనపైన
ఈగ సోకినన్ = ఈగ వాలినా
పాషాణ ధేనువున్ = రాతి ఆవును
నిలిపినట్లు = నిలబెట్టినట్లు
నెమ్మి = దూడపై ప్రేమతో
కదలకుండె (కదలక + ఉండె) = కదలకుండా నిలబడింది.

భావం :
కొడుకు పాలు తాగుతున్నంత సేపూ ఒక్క అడుగు కూడా కదల్చకుండా, తన ఆలోచనంతా బిడ్డపైనే ఉంచి, తన మీద ఈగ వాలినా కూడా కదలకుండా, ప్రేమతో రాతి ప్రతిమలా ఆవు నిలిచి ఉంది.

8వ వచనం:
వ. అయ్యవసరంబున
(ఆ + అవసరంబున) = ఆసమయంలో
తా॥ ఆ సమయంలో

AP Board 9th Class Telugu Solutions Chapter 7 ససేమిరా

9వ పద్యం :
క. ‘నిన్నుఁ గని యిన్ని దినములు
చన్నిచ్చితి నేను ఋణవశంబున. నిఁక నీ
వెన్నఁడు నన్నుఁ దలంపకు ,
మన్న ! మమత్వంబు విడువు మన్న, మనమునన్’
ప్రతిపదార్థం :
నిన్నున్ + కని = నిన్ను నా పుత్రునిగా కని;
ఋణవశమునన్ = ఋణానుబంధం వల్ల
ఇన్ని దినములు = ఇన్ని రోజులూ
చన్నిచ్చితి (చన్ను + ఇచ్చితి) = పాలు ఇచ్చాను
అన్న = నాయనా
ఇఁకన్ = ఇంకముందు
నీవు = నీవు
ఎన్నడున్ = ఎప్పుడూ
నన్నున్ = నన్ను గూర్చి
తలంపకుము = ఆలోచించకు
అన్న = నాయనా
మనమునన్ = మనస్సులో
మమత్వంబు మమకారము (నా తల్లియనే అభిమానము)
విడువుము = విడిచిపెట్టు.

భావం :
నిన్ను కన్నాను. నీకూ నాకూ మధ్య ఉన్న ఋణానుబంధం చేత ఇన్ని రోజులూ నీకు పాలు ఇచ్చాను. ఇంక నీవు నన్ను ఎప్పుడూ తలంపవద్దు. నీ మనస్సులో ఇంక అమ్మ అనే భావాన్ని రానీయకు.

10వ పద్యం :
క. ఆడకు మసత్యభాషలు
కూడకు గొఱగానివాని గొంకక యొరు లె
గాడిన నెదు రుత్తరమీల
జూడకు విని విననివాని చొప్పునఁ జనుమీ.
ప్రతిపదార్థం :
అసత్య భాషలు = అబద్దపు మాటలు
ఆడకుము = మాట్లడకుము
కొఱగాని వానిన్ = పనికి మాలినవాడిని
కూడకు = చేరకు (పొందుచేయకు)
ఒరులు = ఇతరులు
ఎగ్గాడినన్ (ఎగు. + ఆడినన్) = నిందించినా
కొంకక = జంకక
ఎదురు + ఉత్తరము = ఎదురు జవాబు (తిరిగి సమాధానము)
ఈఁజూడకు (ఈన్ + చూడకు) = ఇయ్యాలని చూడవద్దు
విని = అవతలి వారి మాటలు విని కూడా
విననివాని చొప్పునన్ = విననట్టి వాడివలె
చనుమీ = వెళ్ళు

భావం :
అసత్యపు మాటలు మాట్లాడకు. అక్కరకు రాని వారితో కలసి ఉండకు. ఇతరులు ఎవరైనా నీకు కీడు కలిగించే మాటలు మాట్లాడితే, తిరిగి ఎదురు జవాబు చెప్పకు. విని కూడా వినని వాడివలె అక్కడి నుండి వెళ్ళిపో.

11వ పద్యం :
కం. చులుకన జలరుహతంతువు
చులుకన తృణకణము దూది చుల్కనసుమ్మీ !
యిలనెగయు ధూళిచులను
చులకనమరి తల్లిలేని సుతుడు కుమారా!
ప్రతిపదార్థం :
కుమారా ! = ఓ కుమారా ! (గోవత్సమా !)
ఇలనే = ఈ భూమిపై
జలరుహతంతువు = తామరతూడు
చులకన = లోకువ
తృణకణము = గడ్డిపరక
చులకన = లోకువ
దూది = ప్రత్తి
చుల్కన = తేలిక
ఎగయు = ఎగురుతున్న
ధూళి = దుమ్ముకూడా
చులకన = తేలిక
మఱి = అదేవిధంగా
తల్లిలేని = తల్లి లేని అనాధ ఐన
సుతుడు = కుమారుడు కూడా
చులకన సుమ్మీ = లోకువగా చూడబడతాడు కదా!

భావం :
ఈ లోకంలో తామరతూడు, గడ్డి పరక, ప్రత్తి, దుమ్ములను తేలికభావంతో చూస్తారు కదా ! అలాగే తల్లి లేని పిల్లలను కూడా అందరూ లోకువగా చూస్తారు. అని ఆవు తన కుమారునికి చెప్పింది.

12వ వచనం :
వ. అని గడుపాఱఁ బాలు కుడిచి తనిసిన కొడుకునకుం గడచిన
వృత్తాంతం బంతయు నెఱింగించి, పెద్దగా నేడ్చు కొడుకు నెట్టకేల
కోదార్చి, తగ బుద్ధి చెప్పి యా మొదవు పులియున్న వనంబునకు
మగిడి వచ్చిన …..
ప్రతిపదారం :
అని = అని ఆవు దూడకు చెప్పి
మును = ముందు
పుట్టగన్ + చేసిన + అట్టి = పుట్టించినట్టి
దైవము = భగవంతుడు
ఈ పట్టునన్ = ఈ సమయములో
పూరిన్ = గడ్డిని
మేపెడినే = (నాచే) తినిపిస్తాడా?
ప్రాణములు = నా ప్రాణాలు
ఇంతనె = నీ మాంసము మాత్రము చేత
పోవుచున్నవే = పోతాయా?

భావం :
అని ఆవు బుద్దులు చెప్పి, తనివి తీరా పాలు త్రాగిన కొడుకును చూసి జరిగిన సంగతి అంతా చెప్పింది. అది విని గట్టిగా ఏడుస్తున్న కొడుకును ఎట్లో ఓదార్చి, తగిన బుద్ధులు చెప్పి, ఆవు తిరిగి ఆ పులి ఉన్న అడవికి తిరిగి వచ్చింది. అప్పుడు పులి ఆవుతో ఇలా అంది.

AP Board 9th Class Telugu Solutions Chapter 7 ససేమిరా

13వ పద్యం : కంఠసపద్యం
*ఉ. ఇట్టి మహానుభావులకు హింస యొనర్చి దురంత దోషముల్
గట్టికొనంగఁజాల, మటి కల్గవె మాంసము లొండుచోట, నీ
పుట్టువునందు నన్ను మును పుట్టఁగఁ జేసినయట్టి దైవ మీ
పట్టునఁ బూరి మేపెడినే ! ప్రాణములింతనె పోవుచున్నవే !
ప్రతిపదార్థం :
ఇట్టి మహానుభావులకున్ = ఇంత గొప్ప ఔదార్య బుద్దిగల నీ వంటి వారికి
హింస + ఒనర్చి = హింసించి (చంపి)
దురంత దోషముల్ = అంతులేని పాపములను
కట్టికొనంగన్ + చాలన్ = మూట కట్టుకోలేను
ఒండు చోటన్ = మరోచోట
మాంసములు = మాంసములు
కల్గవె = లభింపవా!
ఈ పుట్టువునందు = ఈ జన్మమునందు
నన్నున్ = నన్ను
కడుపాఱన్ = కడుపు నిండా
పాలుకుడిచి = పాలు త్రాగి
తనిసిన = తృప్తి పడిన
కొడుకునకున్ = తన పుత్రునకు
కడచిన వృత్తాంతంబు + అంతయున్ = జరిగిన సంగతినంతా
ఎఱింగించి = తెలిపి
పెద్దగాన్ + ఏడ్చు, కొడుకున్ = పెద్దగా ఏడుస్తున్న పుత్రుని
ఎట్టకేలకున్ + ఓదార్చి = చిట్టచివరకు ఓదార్చి
తగన్ = తగు విధంగా
బుద్ధి చెప్పి = బుద్ధులు చెప్పి
ఆ మొదవు = ఆ ఆవు
పులి = పులి
ఉన్న వనంబునకున్ = ఉన్న అడవికి
మగిడి = తిరిగి
వచ్చినన్ = రాగా

భావం :
ఇటువంటి మహాత్ములను హింసించి అంతులేని పాపాల్ని మూటకట్టుకోలేను. మాంసాలు నాకు మరొక చోట దొరకవా ! ఈ పులి జాతిలో నన్ను పుట్టించిన ఆ దైవం, నాచే గడ్డి తినిపిస్తాడా? ఇంత మాత్రానికే నా ప్రాణాలు పోతాయా?” అని పులి ఆవుతో అన్నది.

14వ పద్యం : కంఠస్థ పద్యం
మ. అని యా ధేనువుఁ జూచి-నీ విమల సత్య ప్రొధికిన్ మెచ్చు వ
చ్చె, నినుం జంపఁగఁ జాల, నీదు తలగాచెన్ ధర్మ మీ ప్రొద్దు, పొ
మ్ము నిజావాసము చేర, నీ సఖులు సమ్మోదంబునుం బొంద నీ
తనయుం డత్యనురాగముం బొరయఁ జిత్త ప్రీతిమై నొందఁగన్
ప్రతిపదార్థం :
అని = పులి ఆ విధంగా ఆవుతో అని
ఆ ధేనువున్ = ఆ ఆవును
చూచి = చూచి
నీ = నీ యొక్క
విమల = నిర్మలమైన
సత్యప్రౌఢికిన్ = సత్యము యొక్క గొప్పతనానికి
మెచ్చు = ప్రీతి (సంతోషము)
వచ్చెన్ = కల్గింది
నినున్ = నిన్ను
చంపగన్ + చాలన్ = చంపజాలను
ఈ ప్రొద్దు = ఈ వేళ
ధర్మము = నీ ధర్మగుణము
నీదు = నీయొక్క
తల + కాచెన్ = తలను రక్షించింది
నీ సఖులు = నీ తోడి గోవులు
సమ్మోదంబునున్ + పొందన్ = మిక్కిలి సంతోషాన్ని పొందేటట్లు
నీ తనయుండు = నీ కుమారుడు
అత్యనురాగమున్ = మిక్కిలి ప్రేమను
పొరయన్ = అనుభవించేటట్లు
చిత్తప్రీతి = (నీ) మనస్సులో సంతోషము
మైనొందగన్ = కలిగేటట్లుగా
నిజావాసము (నిజ + ఆవాసము) = నీ యొక్క నివాస స్థానమును
చేరన్ + పొమ్ము = చేరడానికి వెళ్ళు. (సమీపించుము)

భావం :
పులి ఆవుతో అట్లు చెప్పి, ఆ ఆవును చూచి “నీవు మాట నిలబెట్టినందుకు నాకు సంతోషము కలిగింది. నిన్ను నేను చంపలేను. నీ ధర్మము ఈ రోజు నిన్ను రక్షించింది. నీ తోడివారు సంతోషించేటట్లు, నీ కొడుకు నీ ప్రేమను పొందేటట్లు, నీ మనస్సుకు ప్రీతి కలిగేటట్లు, నీ ఇంటికి నీవు వెళ్ళు” అని చెప్పింది.

AP Board 9th Class Telugu Solutions Chapter 7 ససేమిరా

15వ వచనం :
వ. అనిన నప్పులికి న మ్మొద విట్లనియె
ప్రతిపదార్థం :
అనినన్ = పులి అట్లనగా
అప్పులికిన్ = (ఆ + పులికిన్) ఆ పులితో
అమ్మొదవ = (ఆ + మొదవు) ఆ ఆవు
ఇట్లనియె = (ఇట్లు + అనియె) ఇలా అంది

భావం :
పులి చెప్పిన మాటలు విని, ఆవు పులితో ఇలా చెప్పింది.

16వ పద్యం :
క. ‘మెత్తని మనసే నాయది
యెత్తి యిటులు చూడనేల ? యో పుణ్యుడ ! నే’
నిత్తనువు నీకు మును వా
గ్దత్తము చేసినది కాదె ! కథ లేమిటికిన్.
ప్రతిపదార్థం :
ఓ పుణ్యుడా = ఓ పుణ్యాత్ముడా ! (ఓ పులి రాజా !)
కథలు + ఏమిటికిన్ = ఈ కథలు అన్నీ ఇప్పుడు ఎందుకు?
నా + అది = నాయది; (కాపాడింది)
మెత్తని మనసు + ఏ = అసలే మెత్తని మనస్సు
ఒత్తి = గట్టిగా నొక్కి
ఇటులు = ఈ విధంగా
చూడన్ + ఏల = పరీక్షించి చూడడం ఎందుకు?
నేను = నేను
ఇతనువు (ఈ + తనువు) = ఈ శరీరం
నీకున్ = నీకు
మును = ముందుగానే
వాగ్దత్తము (వాక్ + దత్తము) = మాటతో ఇచ్చినది
కాదె = కాదా?

భావం :
ఓ పుణ్యాత్ముడా ! “ఈ కథలన్నీ ఎందుకు? నా మనసు అసలే మెత్తనిది. దాన్ని ఇంకా పరీక్షించాలని అనుకోవద్దు. నేను నా శరీరాన్ని ఇస్తానని నీకు ముందే వాగ్దానం చేశాను కదా”.

AP Board 9th Class Telugu Solutions Chapter 7 ససేమిరా

17వ వచనం :
వ. కావున పగలించి యుపవాసభారం బంతయుఁ
బోవునట్లు మద్రక్తమాంసములతో సక్తమ్ము సేసి
నాకుఁ బుణ్యమ్ము ప్రసాదింపుము.
ప్రతిపదార్థం :
కావున = కాబట్టి
పగలించి = చీల్చి
ఉపవాస భారంబు = నీ ఉపవాస భారాన్ని; (తిండి లేకుండా ఉన్న నీ కష్టమును)
అంతయున్ = అంతా
పోవునట్లు = పోయేటట్లు
మద్రక్త మాంసమ్ములతోన్ మత్ = నా యొక్క
రక్తమాంసములతోన్ = రక్తంతో, మాంసంతో
సక్తమ్ము + చేసి = ఆరగించి
నాకున్ = నాకు
పుణ్యమ్ము = పుణ్యమును
ప్రసాదింపుము = అనుగ్రహింపుము

భావం :
“కాబట్టి నన్ను చీల్చి, నీ ఉపవాస భారము అంతా పోయేటట్లు, నా రక్తమాంసాలు ఆరగించి, నాకు పుణ్యం ప్రసాదించు.

18వ పద్యం :
క. అని గంగడోలు బిగియఁగఁ
దన మెడ యెత్తుకొని కపిల దగ్గఱఁ జనుదెం
చినఁ జూచి పుండరీకము
వెనువెనుకకె పోవు గాని విజువదు దానిన్.
ప్రతిపదార్థం :
అని = అట్లని
కపిల = ఆ కపిల ధేనువు
గంగడోలు = తన మెడ కింద ఉండే తోలు
బిగియగన్ = బిగించి
తనమెడ = తన మెడ
ఎత్తుకొని = పైకి ఎత్తి
దగ్గఱన్ = (పులికి) దగ్గరగా
చనుదెంచినన్ = రాగా
చూచి = ఆవును చూచి
పుండరీకము = పులి
వెనువెనుక = వెనుకకు వెనుకకే
పోవున్ + కాని – పోతోంది కానీ
దానిన్ = ఆవును
విఱువదు = (పైనబడి) చీల్చదు.

భావం :
అని చెప్పి ఆవు తన గంగడోలు బిగించి, తన మెడ ఎత్తి, పులి దగ్గరకు వెళ్ళగా, ఆ పులి వెనుక వెనుకకే వెడుతోంది. కానీ ఆవును చంపడానికి ముందుకు రాలేదు.

AP Board 9th Class Telugu Solutions Chapter 7 ససేమిరా

19వ పద్యం :
సీ. ‘కుడువంగ ర’ మ్మని తొడరి చుట్టముఁ బిల్వ
నాఁకలి గా దొల్ల ననుచుఁ బెనఁగు
నతఁడును బోలె నాతతశోభనాంగియై
తనరు నా ధేనురత్నంబు దన్ను
భక్షింపు మని పట్టుపటుప, సద్యోజ్ఞాన
శాలియై పరగు శార్దూలవిభుఁడు
దా నొల్ల నని పల్కఁ దమలోన నొక కొంత
దడవు ముహుర్భాషితంబు లిట్లు
ఆ. జరుగుచుండ గోవుసత్యవాక్శుద్ధికిఁ,
బులి కృపాసమగ్రబుద్ధికిని బ్ర
సన్ను లైరి సురలు; సాధువాదము లుల్ల
సిల్లె గగనవీథి నెల్లయెడల.
ప్రతిపదార్థం :
కుడువంగన్ = తినడానికి
రమ్మని = రమ్మని
తొడరి = పూనుకొని
చుట్టమున్ = బంధువును
పిల్వన్ = పిలువగా
ఆకలి + కాదు = ఆకలిగా లేదు
ఒల్లన్ + అనుచున్ = ఇష్టము లేదని (వద్దని)
పెనుగు+అతడును+పోలెన్ = పెంకితనము చేసే వాడిలా (మొరాయించే వాడిలా)
ఆతత శోభ నాంగియై ఆతత = విస్తృతమైన (అధికమైన)
శోభన+అంగి+ఐ = చక్కని అవయవములు గలదై
తనరు = ఒప్పునట్టి
ఆ ధేనురత్నంబు = ఆ రత్నము వంటి ఆవు
తన్నున్ = తనను
భక్షింపుము + అని = తినుమని
పట్టు పఱుపన్ = పులిని లొంగ దీయు చుండగా (బ్రతిమాలుచుండగా)
సద్యోజ్ఞానశాలియై = అప్పుడే కలిగిన జ్ఞానముతో కూడినదై
పరగు = ఒప్పునట్టి
శార్దూల విభుడు = పులిరాజు
తాను = తాను
ఒల్లను + అని = అంగీకరించనని (తిననని)
పల్కన్ = చెప్పగా
తమలోనన్ = ఆ పులికీ, ఆవుకూ మధ్య
ఒక కొంత తడవు = ఒక కొంచెం సేపు
ముహుః + భాషితంబులు = మాటి మాటికీ అవసరం లేక పోయినా మాట్లాడే మాటలు
ఇట్లు = ఈ విధంగా
జరుగుచుండన్ = సాగుచుండగా
గోవు సత్యవాక్శుద్ధికిన్ = ఆవు యొక్క సత్య వాక్యము యొక్క పవిత్రతకూ
పులి = పులి యొక్క
కృపా సమగ్ర బుద్ధికిని; కృపా = దయతో
సమగ్ర = నిండిన
బుద్ధికిని = బుద్ధికీ
సురలు = దేవతలు
ప్రసన్నులు + ఐరి = సంతుష్టులైరి
గగన వీధిన్ = ఆకాశ వీధిలో
ఎల్లయెడలన్ = అన్ని చోట్ల
సాధువాదములు = భళీ బాగు, సాధు అనే మాటలు
ఉల్లసిల్లెన్ = కలిగాయి. (పుట్టాయి, వినిపించాయి)

భావం :
తినడానికి రమ్మని బంధువును పిలిస్తే ఆకలిగా లేదు వద్దని పేచీ పెట్టే వాడిలా, చక్కని అవయవములతో ఒప్పిన ఆ శ్రేష్ఠమైన ఆవు తనను తినమని పులిని బ్రతిమాలంగా, జ్ఞానము కల్గిన ఆ పులిరాజు తాను తిననని చెప్పాడు. ఇలా వారు మాటిమాటికీ మాట్లాడుతున్నారు. అప్పుడు దేవతలు గోవు యొక్క సత్యవాక్య పవిత్రతకూ, పులి యొక్క దయతో నిండిన బుద్ధికీ సంతోషించారు. ఆకాశ వీధిలో అన్ని దిక్కులలో భళీ, బాగు అనే మాటలు వినిపించాయి.

కఠిన పదాలకు అర్థాలు

గుమ్మ = పాలు పితికేటప్పుడు వచ్చేధార
సుతుడు = కుమారుడు
పరితృప్తి = సంతోషం
ఉదరాగ్ని = కడుపులో మంట, ఆకలిమంట
వినిర్గతం = బయలు వెడలినది
వ్యాఘ్రము = పెద్దపులి
కులభూషణుడు = కులం మొత్తానికి అలంకారం వంటి వాడు, గొప్పవాడు
ఆత్మజుడు = కొడుకు
సత్వరం = వెంటనే
పాషాణము = రాయి
అసత్యభాషలు = అబద్దాలు
శార్దూలము = పెద్దపులి

AP Board 9th Class Telugu Solutions Chapter 11 ధర్మదీక్ష

AP State Syllabus AP Board 9th Class Telugu Textbook Solutions Chapter 11 ధర్మదీక్ష Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Telugu Solutions 11th Lesson ధర్మదీక్ష

9th Class Telugu 11th Lesson ధర్మదీక్ష Textbook Questions and Answers

చదవండి-ఆలోచించండి-చెప్పండి

వారణాసిని బ్రహ్మదత్తుడు పరిపాలిస్తున్నప్పుడు బోధిసత్వుడు ఐదువందల మంది శిష్యులతో హిమాలయాల్లో ఉండేవాడు. ఒకసారి ఎండలు బాగా కాసి అన్ని చోట్లా నీరు ఎండిపోయింది. జంతువులు నీళ్ళు దొరక్క అల్లాడిపోయాయి. శిష్యులలో ఒకడు వాటి దప్పిక తీర్చడంకోసం ఒక తొట్టి తయారుచేసి, దూరంగా ఉన్న నీళ్ళను తెచ్చి ఆ తొట్టెలో పోసేవాడు. జంతువులు గుంపులు గుంపులుగా వచ్చి ఆ నీరు తాగుతుండటంతో శిష్యుడికి పండ్లు తెచ్చుకోవడానికి గూడా తీరిక చిక్కలేదు. తనేమీ తినకుండానే ఆ జంతువులకు నీళ్ళు పోసేవాడు. ఇది చూసి జంతువులన్నీ మోయగలిగినన్ని పళ్ళు తెచ్చి ఇతనికివ్వాలని నిర్ణయించుకుంటాయి. అవన్నీ కలిపితే రెండువందల యాభై బండ్లు నిండాయి. వాటిని అక్కడి ఐదువందలమంది శిష్యులు తృప్తిగా తినేవాళ్ళు.

ప్రశ్నలు జవాబులు

ప్రశ్న 1.
జంతువులు ఎందుకు అల్లాడిపోయాయి?
జవాబు:
ఎండలు బాగా కాసి అన్నిచోట్లా నీరు ఎండిపోయింది. జంతువులు నీళ్ళు దొరక్క అల్లాడిపోయాయి.

ప్రశ్న 2.
వాటి బాధ ఎలా తీరింది?
జవాబు:
బోధిసత్వుని శిష్యులలో ఒకడు, జంతువుల దప్పిక తీర్చడం కోసం ఒక తొట్టి తయారుచేసి, దూరంగా ఉన్న నీళ్ళను తెచ్చి ఆ తొట్టిలో పోసేవాడు. జంతువులు వచ్చి ఆ నీటిని త్రాగుతూ ఉండేవి. ఆ విధంగా వాటి దాహ బాధ తీరింది.

ప్రశ్న 3.
ఈ కథ ద్వారా మీరు గ్రహించిందేమిటి?
జవాబు:
మనం తోటి ప్రాణులకు సహాయం చేస్తే, ఆ ప్రాణులు తిరిగి మనకు సహాయం చేస్తాయి. మనం తోటి మానవులకే కాక పరిసరాల్లో ఉన్న జంతువులకు సహితం సాయం చేయాలి. వాటిపై దయ చూపాలి. మనం సాయం చేస్తే జంతువులు సహితం మనకు సాయం చేస్తాయని ఈ కథ ద్వారా మనం గ్రహించగలం. మన పని మనం చేస్తే, మంచి ఫలితాలు దానంతట అవే వస్తాయని ఈ కథ తెలుపుతుంది.

AP Board 9th Class Telugu Solutions Chapter 11 ధర్మదీక్ష

ప్రశ్న 4.
జీవకారుణ్యం అంటే ఏమిటి?
జవాబు:
‘జీవకారుణ్యం’ అంటే ప్రాణులపై దయ అని అర్థం. తోటి మనుష్యుల పైననే కాకుండా, ప్రాణం గల జంతువులన్నింటి మీద కూడా దయ గలిగి ఉండాలి. దానినే ‘జీవకారుణ్యం’ అంటారు.

ప్రశ్న 5.
‘కర్తవ్య నిర్వహణ’ అంటే మీరేమని భావిస్తున్నారు?
జవాబు:
‘కర్తవ్యం’ అంటే ‘ప్రతి జీవి పాటించి తీరవలసిన నిష్ఠ’ అని అర్థం. ప్రతి వ్యక్తికి తాను చేయవలసిన ముఖ్యమైన పనులు ఉంటాయి. చేయవలసిన పనిని వదలకుండా ఆ పనిని చేయడాన్ని ‘కర్తవ్య నిర్వహణ’ అంటారని నేను భావిస్తున్నాను.

ఇవి చేయండి

I. అవగాహన – ప్రతిస్పందన

అ) కింది అంశాల గురించి తెలపండి.

ప్రశ్న 1.
ఈ కథను మీ సొంతమాటల్లో చెప్పండి.
జవాబు:
“ధర్మదీక్ష”

ఆళవీ గ్రామంలో నందగోపాలుడు అనే ఆవులను పెంచే గోపాలకుడు ఉండేవాడు. ఒకరోజు సాయంత్రం ఆవులు అన్నీ మేతమేసి, ఇంటికి తిరిగి వచ్చాయి. ఒక్క ఆవు రాలేదు. దాని దూడ దాని తల్లి కోసం అంబా అంటూ అరుస్తోంది. నందగోపుడికి ఆ ఆవు పులివాత పడిందేమో అని భయం వేసింది.

మరునాడు తెల్లవారకుండానే అతడు ఆవును వెదకడానికి బయలుదేరాడు. నందగోపుడు అడవిలోని ఆవును వెదకడానికి వెడుతున్నాడు. పొరుగూరి జనం అంతా తీర్థ ప్రజలా ఆళవీ గ్రామానికి వస్తున్నారు. కారణం ఏమిటని నందగోపాలుడు అడిగితే ఆ రోజు గౌతమ బుద్ధుడు ఆళవీ గ్రామానికి వస్తున్నాడనీ, మధ్యాహ్నభిక్ష తరువాత శ్రావస్తీ నగరానికి ఆయన వెడతాడనీ ఒక ముసలితాత నందగోపుడికి చెప్పాడు.

నందగోపుడు తాను తప్పిపోయిన ఆవును వెదకడానికి వెడుతున్నానని అతనితో చెప్పాడు. ఆవు కోసం వెతుకుతూ ఉంటే, బుద్ధుని దర్శనం తనకు కాదేమో అని నందుడికి భయం పట్టుకుంది. వెనకడుగు వేశాడు. కానీ అతనికి ఆవు దూడ అరచినట్లనిపించింది. నందుడు మధ్యాహ్నం వరకూ అడవిలో ఆవుకోసం వెదికాడు. ఇంతలో మిట్టమధ్యాహ్నవేళలో ఆవు ఆర్తనాదం వినిపించింది. అతి కష్టంపై ఆవును పట్టుకొని నందగోపుడు అన్నపానాలకు అలమటిస్తూనే ఆళవీ గ్రామానికి బయలుదేరాడు.

ఆళవీ గ్రామానికి బుద్ధుడు భిక్షువులతో వచ్చి గ్రామస్థుల విందును ఆరగించాడు. పొరుగూరి జనం ఎందరో బుద్ధుని ధర్మబోధలు విందామని వచ్చారు. మధ్యాహ్నం 3 గంటలు కాబోతోంది. బుద్ధుడు ఇంకా బోధలు మొదలు పెట్టలేదు. ఎవరికోసమో ఆయన తలఎత్తి చూస్తున్నాడు. ఇంతలో ఆలస్యమయిపోతోందని నందగోపాలుడు సరాసరి బుద్ధుడు విడిది చేసిన వటవృక్షం దగ్గరకు ఆవుతో వెళ్ళాడు. బుద్ధునికి నమస్కరించాడు. తనకు బుద్ధ దర్శనం అయ్యిందని నందుడు సంతోషించాడు.

బుద్దుడు లేచి, నందగోపాలుడికి దగ్గరుండి భోజనం పెట్టించాడు. అతని ఆవు దగ్గరకు దాని దూడ వచ్చి పాలు తాగుతోందని, దానికోసం బెంగ పెట్టుకోవద్దనీ నందుణ్ణి బుద్ధుడు ఊరడించాడు. నందుడి దగ్గర గోసాముద్రిక రహస్యాలను బుద్ధుడు తెలుసుకొన్నాడు.

తరువాత బుద్ధుడు అష్టాంగ ధర్మాన్ని బోధించాడు. ప్రజలంతా ఆనందంలో మునిగితేలారు. నందగోపుడికి బుద్ధుడు ధర్మదీక్ష ఇచ్చాడు. భిక్షువులంతా బుద్ధుడు నందగోపాలునిపై చూపిస్తున్న ఆదరానికి ఆశ్చర్యపడ్డారు. బుద్ధుడు వారికి తాను నందగోపాలుని కోసమే, ఆళవీ గ్రామానికి వచ్చానని తెలియ చెప్పాడు. అది విన్న భిక్షువులు, నందగోపాలుని గౌరవభావంతో చూశారు. నందగోపాలుడు మాత్రం ఆ లేగ దూడవల్లే తనకు బుద్ధుని దర్శనం లభించిందని, దూడను ముద్దు పెట్టుకున్నాడు.

ప్రశ్న 2.
ఈ పాఠానికి ‘ధర్మదీక్ష’ అనే పేరు సరైందేనా? ఎందుకు?
జవాబు:
ఈ పాఠమునకు ధర్మదీక్ష అని పేరు పెట్టారు. ఈ పేరు కొంతవరకు సరిపోతుంది. గోవులను పోషిస్తూ జీవించే నందగోపాలుడికి గౌతమ బుద్ధుడు ధర్మదీక్షను అనుగ్రహించాడు. కాబట్టి ధర్మదీక్ష అనే పేరు సరయినదే. అయితే ఈ పాఠంలో నందగోపాలుడి గోవాత్సల్యం సంపూర్తిగా కనిపిస్తుంది. అతడు బుద్ధుడి ధర్మ బోధనను వినాలనుకున్నా, దానికంటే ముందుగా తనకు గల గోవాత్సల్యానికే ప్రాధాన్యం ఇచ్చాడు. నందగోపాలుడు ఆకలి దప్పులను లెక్కచేయక ఆకలితో నకనకలాడుతూనే గోవును వెదకి పట్టుకున్నాడు. బుద్ధ దర్శనం కాదేమో అనే భయంతో నేరుగా బుద్ధుడు విడిది చేసిన వటవృక్షం వద్దకు వచ్చాడు. ఎందరో భక్తులు, బుద్ధుడు అనుగ్రహించే ధర్మదీక్ష కోసం ఎదురుచూస్తూ ఉంటారు. అటువంటి ధర్మదీక్షను స్వయంగా బుద్ధుడే నందగోపుడికి అనుగ్రహించాడు.

కాబట్టి ధర్మదీక్ష అనే పేరు ఈ పాఠానికి సరిపోతుంది.

AP Board 9th Class Telugu Solutions Chapter 11 ధర్మదీక్ష

ఆ) కింది మాటలు ఎవరు ఎవరితో అన్నారు? ఎందుకన్నారు?

ప్రశ్న 1.
ఆళవికి పోతున్నాను బాబూ!
జవాబు:
ఆవును వెతకడానికి నందగోపాలుడు అడవికి పోతున్నాడు. ఆళవీ గ్రామానికి బుద్ధ బోధనలు వినడానికి ఎందరో
వస్తున్నారు. అందులో ఒక ముసలివాడితో, “ఎక్కడికి తాత ! ఈ ప్రయాణం !” అని నందగోపుడడిగాడు. ఆ ప్రశ్నకు జవాబుగా ముసలి తాత నందగోపుడితో “ఆళవికి పోతున్నాను బాబూ” అన్నాడు.

ప్రశ్న 2.
నీకింకా తెలియదా?
జవాబు:
“ఎక్కడికి తాతా! ఈ ప్రయాణం!” అని నందగోపుడు ఆళవీ గ్రామానికి బుద్ధ బోధనలు వినడానికి వస్తున్న తాతను అడిగాడు. ఆళవికి వెడుతున్నానని తాత చెప్పాడు. అప్పుడు ఆ తాత, నందగోపాలుణ్ణి బుద్ధుడు వస్తున్నాడని “నీకింకా తెలియదా?” అని ప్రశ్నించాడు.

ప్రశ్న 3.
ఇంకా భోజన పదార్థాలేమైనా మిగిలి ఉన్నాయా?
జవాబు:
నందగోపుడు తప్పిపోయిన ఆవును పట్టుకొని ఎలాగో శ్రమపడి మధ్యాహ్నం మూడుగంటల సమయంలో బుద్ధుని వద్దకు వచ్చి నమస్కరించాడు. అప్పుడు బుద్ధుడు లేచి నిలబడి అక్కడ ఉన్న తన శిష్యులతో “ఇంకా భోజన పదార్ధములు ఏమైనా మిగిలి ఉన్నాయా” అని ప్రశ్నించాడు.

ప్రశ్న 4.
ఆనందగోపాలుని కోసమే !
జవాబు:
బుద్ధుడు తన వద్దకు వచ్చిన నందగోపాలునికి భోజనం పెట్టించి, ఆదరంతో చూసి ధర్మబోధచేసి, ధర్మదీక్షను అనుగ్రహించాడు. బుద్ధుడు నందగోపాలునిపై చూపిస్తున్న ఆదరాభిమానాలను చూచి మిగిలిన భిక్షువులు గుసగుసలు మాట్లాడుకున్నారు. బుద్ధదేవుడు నందగోపాలుని గోవాత్సల్యాన్ని మెచ్చుకొని, కేవలం నందగోపాలుణ్ణి చూడడం కోసమే తాను ఆళవీ గ్రామానికి వచ్చానని శిష్యులతో అన్నాడు.

ప్రశ్న 5.
బాబూ నేనేమీ ఎరగని వట్టి అమాయకుణ్ణి.
జవాబు:
బుద్ధుడు నందగోపాలకుడి కోసమే, తాను ఆళవీ గ్రామానికి వచ్చానని చెప్పాడు. బౌద్ధ భిక్షువులు నందగోపాలుని గౌరవించి నిలబడ్డారు. అప్పుడు నందగోపాలుడు లేచి నిలబడి, “బాబూ నేనేమీ ఎరగని వట్టి అమాయకుణ్ణి అని, భిక్షువులతో అమాయకంగా మాట్లాడాడు.

AP Board 9th Class Telugu Solutions Chapter 11 ధర్మదీక్ష

ఇ) కింది పేరా చదవండి. ఖాళీలు వివరించండి.

‘కర్తవ్యం. ………… ప్రతి జీవీ పాటించి తీరవలసిన నిష్ఠ. ఒక వానపాము ఎంత అల్పజీవి! మట్టిలో పుడుతుంది. మట్టి తింటుంది. మట్టిల్ మరణిస్తుంది. మరెందుకు అది జన్మ తీసుకుంటుంది. విచిత్రమైన విషయం ఏమిటంటే మట్టేదాని జీవనాధారమూ, జీవితమూ అయినా మట్టికీ దాని అవసరం ఉంది. అది మట్టిని తలకిందులు చేస్తుంది. గుల్లగుల్ల చేస్తుంది. గునపాలు చేయలేని ఆ సున్నితమైన వ్యవసాయాన్ని, సుకుమారమైన శరీరంతో శ్రద్ధగా అదే దాని జీవిత లక్ష్యం అన్నంత కర్తవ్యనిష్ఠతో చేస్తుంది. మనిషి మాత్రం అల్పజీవుల అవసరం ఏమిటన్న తేలికభావంతో ఉదాసీనత ప్రదర్శిస్తున్నాడు.
1. కర్తవ్యం అంటే ప్రతి జీవీ పాటించవలసిన నిష్ఠ.
2. వానపాము జీవనాధారం మట్టి.
3. మనిషి ఉదాసీనత చూపించేది అల్పజీవులయందు.
4. పై పేరాకు శీర్షిక ‘కర్తవ్య నిష్ఠ’.
5. పై పేరాలోని ముఖ్యమైన ఐదు పదాలు : 1) కర్తవ్యం 2) అల్పజీవి 3) జీవనాధారము 4) ఉదాసీనత 5) కర్తవ్య నిష్ఠ

ఈ) పాఠం ఆధారంగా కింది ప్రశ్నలకు జవాబులు రాయండి.

ప్రశ్న 1.
నందగోపుడు ఆరాటపడడానికి కారణం ఏమిటి?
జవాబు:
నందగోపుడి గోవులన్నీ సాయంత్రం తిరిగి వచ్చాయి. ఒక్క ఆవు మాత్రం రాలేదు. ఆ ఆవు దూడ ‘అంబా’ ‘అంబా’ అంటూ అరుస్తోంది. ఆ దూడ పుట్టినప్పటి నుండి నందగోపాలుని ఇల్లంతా పాడిపంటలతో కళకళలాడింది. అందుకే ఆ ఆవన్నా, ఆ దూడన్నా నందగోపాలుడికి ఎంతో ఇష్టం. దూడ తల్లి కోసం అదే పనిగా అరుస్తూ ఉండటంతో నందగోపుడికి అన్నం సయించలేదు. రాత్రి తెల్లవార్లూ, నందగోపుడు ఆవు ఏమైపోయిందో అని ఆరాటపడుతూనే ఉన్నాడు.

ప్రశ్న 2.
నందగోపునికి ఆ ఆవంటే ఎందుకంత ఇష్టం?
జవాబు:
ఆ ఆవు నందగోపాలుడి ఇంట్లోనే పుట్టి అతని పాపలతో పాటు పెరిగి పెద్దదయ్యింది. అతని పాపలందరూ ఆ ఆవు పాలు తాగి క్రమంగా పెరిగి పెద్దవారయ్యారు. నందుడు కూడా వారితో బాటే ఆ ఆవు పాలు తాగి పెద్దవాడయ్యాడు.

ఈ మధ్యనే దానికి ఒక కోడె దూడ పుట్టింది. కోడె పుట్టిన వేళ మంచిది. ఆనాటి నుండీ, నందగోపుని ఇల్లంతా పసిపాప నవ్వులతో కళకళలాడింది. అందుకే ఆ ఆవు అంటే నందగోపాలునికి బాగా ఇష్టం.

ప్రశ్న 3.
గ్రామస్థులు బౌద్ధ భిక్షువులకు ఏయే ఏర్పాట్లు చేశారు?
జవాబు:
ఆళవీ గ్రామస్థులు బౌద్ధ భిక్షువులకు ఎదురేగి, అతిథి సత్కారాలతో ఎంతో ఆప్యాయంగా ఆదరించారు. విశాలమైన మఱ్ఱిచెట్టు నీడలో వారికి విడుదులు ఏర్పాటు చేశారు.

తరువాత తాము ప్రత్యేకంగా భిక్షువులకు విందు చేస్తామనీ, విందు ఆరగించవలసిందనీ వారిని బ్రతిమాలారు. ఈ విధంగా బౌద్ధ భిక్షువులకూ, బుద్ధునికీ గ్రామస్థులు విందు ఏర్పాట్లు చేశారు.

ప్రశ్న 4.
గౌతమ బుద్ధుడు నందగోపుణ్ణి ఏమేం అడిగాడు?
జవాబు:
గౌతమ బుద్ధుడు నందుణ్ణి గోవును గురించీ, కోడె దూడను గురించి ఎన్నో కుశల ప్రశ్నలు వేశాడు. నందగోపుడు, తను కోడె దూడ నుదుటిపై నల్లని మచ్చలను గురించి, ఒంటిమీద సుడులను గురించి, ఎవరికీ తెలియని రహస్య సాముద్రిక విషయాలను చెప్పాడు. తాను వంశపారంపర్యముగా గ్రహించిన కొన్ని గోసాముద్రిక రహస్యాలను నందగోపుడు బుద్ధునికి తెలిపాడు. గౌతమబుద్ధుడు అడిగిన కొన్ని కొన్ని చిన్న సందేహాలను నందగోపుడు గౌతమునకు తెలిపాడు.

AP Board 9th Class Telugu Solutions Chapter 11 ధర్మదీక్ష

ప్రశ్న 5.
నందగోపుడు తన ధర్మాన్ని నిర్వర్తించాడని ఎలా చెప్పగలవు?
జవాబు:
నందగోపుడు సరళవర్తనం, సాధు స్వభావం కలవాడు. అతన్ని ఎంతగా ఆకలిమంట బాధించినా, అతడు తన గోపాలక ధర్మాన్ని మరువలేదు. అతనికి గోవులపై గల వాత్సల్యం అపారము. ముప్ఫై క్రోశాల దూరం నడిచి, ఎంతో శ్రమపడి అందుకే బుద్ధుడు నందగోపుణ్ణి చూడటానికి ఆళవీ గ్రామానికి వచ్చాడు.

ఆవు తప్పిపోయిందని తెలియగానే నందగోపుడు ఎంతో ఆరాటపడ్డాడు. అతనికి అన్నం సహించలేదు. మర్నాడు మిట్ట మధ్యాహ్నం దాటిపోయే వరకు తనను ఆకలి దహించి వేస్తున్నా, తనకు దాహం వేస్తున్నా ఆవును అతడు వెతికి పట్టుకున్నాడు. ఈ సంఘటన నందగోపునికి గల గోవాత్సల్యాన్నీ, అతని ధర్మ నిర్వహణనూ తెలియపరుస్తుంది.

II. వ్యక్తీకరణ-సృజనాత్మకత

అ) కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
‘గోధూళివేళ అంటే ఏ సమయం? ఆ సమయంలో గ్రామంలో వాతావరణం ఎలా ఉంటుంది?
జవాబు:
గోధూళి వేళ అంటే సాయం సమయం, అది ఆవులు మేతకు వెళ్ళి, ఇంటికి తిరిగి వచ్చే సమయం. ఆవులు మెడలో కట్టిన గంటలు చప్పుడు చేస్తూ, ఇంటి ముఖం పడతాయి. వాతావరణం చల్లగా ఉంటుంది. సూర్యుడు అస్తమిస్తూ ఉంటాడు. ఆకాశంలో ఎఱ్ఱగా కుంకుమ ఆరపోసినట్లుగా ఉంటుంది. కొందరు ఆవులను త్రాళ్ళకు కట్టివేస్తూ ఉంటారు. కొందరు చుంద్ చుంయ్ అంటూ పాలు పితుకుతూ ఉంటారు. సాయంత్రం పైరుగాలి వీస్తూ ఉంటుంది. ఆవుల కాపరులు ఆవులను వేగంగా ఇళ్ళకు తోలుకు వస్తూ ఉంటారు. ఆవులు, గేదెలు ఆనందంగా గంతులు వేస్తూ ఇళ్ళకు వస్తూ ఉంటాయి.

ప్రశ్న 2.
“ప్రజానీకం ముఖాలన్నీ అరుణోదయకాంతులతో, నూతనానందావేశాలతో కలకలలాడుతున్నాయి”. ఈ వాక్యాన్ని మీ సొంతమాటలలో వివరించండి.
జవాబు:
ప్రజల ముఖాలు సంతోషంతో నిండిపోయాయి. వారందరిలో ఆనందం పొంగుకు వచ్చింది. ముఖాలు మిలమిలా మెరిసిపోతున్నాయి. వారు సంతోషంతో కేరింతలు కొడుతున్నారు. ఉత్సాహం వారిలో ఉరకలు వేస్తోంది. అప్పుడే సూర్యుడు ఉదయించినట్లుగా, వారి ముఖాలు ఎర్రగా కళకళలాడుతున్నాయి. బుద్ధునికీ, భిక్షువులకూ ఎదురేగి, వారు జయజయధ్వానాలు చేస్తూ ఊరేగింపుగా బుద్ధుణ్ణి గ్రామంలోకి తీసుకువచ్చారు.

ప్రశ్న 3.
జిజ్ఞాస రేకెత్తడమంటే ఏమిటి? ఏ అంశాల పట్ల మీకు జిజ్ఞాస ఉంటుంది?
జవాబు:
జిజ్ఞాస అంటే తెలుసుకోవాలనే కోరిక. జిజ్ఞాస రేకెత్తించడం అంటే, తెలుసుకోవాలనే కోరిక కలిగించడం. పిల్లలకు కొత్త కథలు, వింతలు, ఇంద్రజాల విద్యలు వగైరా చిత్రాలను గూర్చి తెలుసుకోవాలని ఉంటుంది. సినిమా కథలను తెలుసుకోవాలని ఉంటుంది. ప్రక్క విద్యార్థులు ఏవైనా ప్రయోగాలు చేసి నూతన విషయాలను కనుక్కొంటే తాను కూడా వాటిని తెలుసుకోవాలని పిల్లలకు కుతూహలం ఉంటుంది. ఆకాశంలో పక్షులు ఎలా ఎగురుతున్నాయో, తూనీగలు ఎలా ఎగురుతున్నాయో, రైలు ఎలా నడుస్తోందో, యంత్రాలు ఎలా తిరుగుతున్నాయో వగైరా విషయాలను తెలుసుకోవాలనే కోరిక పిల్లలకు ఉంటుంది.

ప్రశ్న 4.
ఎదురేగి అతిథి సత్కారాలతో ఎవరెవరిని ఆప్యాయంగా పలకరిస్తారు?
జవాబు:
సన్యాసులను, మఠాధిపతులను ఎదురేగి, అతిథి సత్కారాలు చేసి గౌరవిస్తారు. గురువులను, పూజ్యులను, అతిథులను ఎదురేగి సత్కరిస్తారు. లోనికి రండని, స్వాగతం చెప్పి వారిని లోపలకు తీసుకువస్తారు. మంత్రులనూ, గౌరవనీయులనూ ఎదురేగి స్వాగత సత్కారాలు చేసి ఆహ్వానిస్తారు.

దేవాలయాలకు ట్రస్టీలనూ, చైర్మన్లనూ నియమించినపుడు వారిని ప్రజలు గౌరవంతో ఎదురేగి స్వాగతం చెప్పి ఆహ్వానిస్తారు. తల్లిదండ్రులను, తాత ముతాతలను, పెద్దలను వారు మన ఇంటికి వచ్చినపుడు గౌరవంగా ఎదురేగి సత్కరించి ఆహ్వానించాలి. మగ పెళ్ళివారికి ఆడపెళ్ళివారు ఎదురేగి అతిథి సత్కారాలతో ఆహ్వానించాలి.

ప్రశ్న 5.
బుద్ధుని ఆప్యాయతను చూసేసరికి నందగోపాలుడి హృదయం ద్రవించి నీరైపోయింది. “హృదయం ద్రవించి నీరైపోవడం ” అంటే ఏమిటి? దీన్ని ఇంకా ఏయే సందర్భాలలో వాడతారు?
జవాబు:
హృదయం ద్రవించి నీరైపోవడం అంటే, మనస్సు ప్రేమతో తడిసి ముద్దవడం అని అర్థం. జాలి, కరుణ, ఆర్ధత అనే గుణాలు మనస్సులో నిండడం. మనస్సు జాలితో, కరుణతో నిండిపోవడం అని అర్థం.

ఎవరైనా ఆపదలో ఉంటే, ఆ సంఘటనను చూసి జాలితో మనస్సు కరిగిపోతుంది. ఏదైనా బస్సు, ఆటో వంటి వాటికి ప్రమాదం సంభవించినపుడు, అందులోని ప్రయాణికుల కాళ్ళూచేతులు తెగితే, లేక గాయాలయితే, వారి రక్తం రోడ్డుపై ప్రవహిస్తే, అవయవాలు దెబ్బ తింటే ఆ సంఘటనను చూస్తే మనస్సు కరిగి ప్రవహిస్తుంది. మనశక్తి కొద్దీ, వారికి సాయం చేద్దామనుకుంటాం.

అగ్ని ప్రమాదాలు సంభవించినపుడు, ప్రకృతి బీభత్సాలు సంభవించినపుడు బాధలు పడ్డ ప్రజలను చూస్తే మనస్సులు అలాగే ద్రవిస్తాయి.

AP Board 9th Class Telugu Solutions Chapter 11 ధర్మదీక్ష

ప్రశ్న 6.
ఏ సమయాన్ని గోధూళివేళ యంటారు? అలా అనడానికి కారణమేమిటి?
జవాబు:
గోధూళి వేళ అంటే సాయం సమయం. ఇది ఆవులు మేతకు వెళ్ళి, ఇంటికి తిరిగి వచ్చే సమయం. పొద్దుగుంకే సమయం. అని నిఘంటువు అర్థం. ఉదయం మేతకై వెళ్ళిన ఆవులమంద, కడుపునిండినవై, బిడ్డల కడుపు నింపడానికి సంతోషంగా ఇంటికి వస్తున్నప్పుడు గోవుల కాళ్ళతో రేగిన దుమ్ము ఇక్కడ గోధూళిగా చెప్పవచ్చు. గోవులు ఇంటికి వచ్చే సమయం గోధూళి వేళగా ‘రూఢి’ అయింది. (ఉదయం బిడ్డలను విడిచి వెళ్ళే గోవులు మందగమనంతో ఉంటాయి. సాయంత్రం బిడ్డలను చూడాలనే ఆతురతతో గోమాతలు నడుస్తాయి. అందువల్ల దుమ్ము రేగుతుంది.

ఆ) కింది ప్రశ్నలకు పదిహేనేసి వాక్యాలలో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
నందగోపాలుడి గుణగణాలను వర్ణించండి.
జవాబు:
నందగోపాలుడు ఆవులను మేపుతాడు. తనకిష్టమైన ఆవు రాత్రి ఇంటికి రాకపోతే నందగోపాలుడికి అన్నం సయించలేదు. రాత్రంతా ఆవుకు ఏమవుతుందో అని ఆరాటపడుతూనే ఉన్నాడు. ఆవుపై ప్రేమతో మరునాడుదయమే నందుడు దాన్ని వెతకడానికి అడవికి వెళ్ళాడు. ఆకలి దహించి వేస్తున్నా, నాలుక పిడచగట్టుకు పోతూ ఉన్నా, నందుడు పట్టువిడవకుండా, ఆవును వెతికి పట్టుకున్నాడు.

బుద్ధుడు తన గ్రామానికి వస్తున్నాడని తెలిసి, ఆయన ధర్మబోధ వినలేకపోయినా, ఆయన దర్శనం చేసుకుందామని నందుడు ఆవును తీసుకొని సరాసరి బుద్ధుడు ఉన్న మజ్జి చెట్టు దగ్గరకు వచ్చి బుద్ధునకు నమస్కరించాడు.

నందగోపాలుడి ధర్మకార్యనిర్వహణకు తృప్తిపడిన గౌతమ బుద్ధుడు నందగోపాలునికి దగ్గరుండి భోజనం పెట్టించాడు. నందగోపాలుడికి, గోసాముద్రిక రహస్యాలు, కోడె దూడల లక్షణాలు, వంశపారంపర్యంగా తెలుసు. బుద్ధుడికి, నందుడు ఆ రహస్యాలను చెప్పాడు. నందుడు వచ్చిన తర్వాత కాని ఆనాడు బుద్ధుడు ధర్మబోధ ప్రారంభించలేదు. బుద్ధుడు స్వయంగా నందగోపాలునికి ధర్మదీక్షను ఇచ్చాడు.

నందగోపాలుడు బుద్దుని అనుగ్రహాన్ని పొందిన భక్తుడు. నందగోపాలుడిని చూడడానికే తాను ఆళవీ గ్రామానికి వచ్చానని బుద్ధుడు శిష్యులకు చెప్పిన మాట గుర్తు పెట్టుకోదగినది.

గౌతమ బుదుడు చెప్పినట్లు నందగోపాలుని సరళవర్తనం, సాధు స్వభావం ప్రసిద్ధమైనవి. ఎంత ఆకలి మంట అతణ్ణి వేధిస్తున్నా, అతడు తన గోపాలక ధర్మాన్ని విడిచిపెట్టలేదు. బౌద్ధభిక్షువులందరూ నందుని గౌరవభావంతో నిలబడి చూశారు. తాను వట్టి అమాయకుణ్ణని, నందగోపాలుడు అమాయకంగా వినయంతో వారికి చెప్పాడు. నందగోపాలుడు, సజ్జనుడైన ఆలకాపరి.

ప్రశ్న 2.
గౌతమబుద్ధుడు నందగోపాలుడిపై వాత్సల్యాన్ని ఎలా చూపించాడు? దానికి కారణాలు ఏమిటి?
జవాబు:
నందగోపాలుడి ధర్మ నిర్వహణ పట్ల, కర్తవ్యం పట్ల, అతనికి గల గోవాత్సల్యం పట్ల కరుణామూర్తియైన బుద్ధుడు ఆనందించాడు. నందగోపాలుడిని చూడాలని శిష్యులతో 30 క్రోశాల దూరం నడచి, నందగోపాలుడి ఆళవీ గ్రామానికి వచ్చాడు. నందగోపాలుడు వచ్చే వరకూ బుద్ధుడు తన ధర్మ ప్రసంగాన్ని ప్రారంభించలేదు.

నందగోపాలుడు మధ్యాహ్నము 3 గంటలకు తన ఆవుతో సహా బుద్దుడి వద్దకు వచ్చాడు. ఇంతలో ఆవు దూడ అరుపు గుర్తుకు వచ్చి అతడు ఇంటికి బయలుదేరబోయాడు. దూడ తాడు ట్రెంపుకొని తల్లి వద్ద పాలు తాగుతోందని, స్వయంగా బుద్దుడు నందుడికి చెప్పి, నందుడికి దగ్గరుండి కడుపు నిండా భోజనం పెట్టించాడు.

నందగోపాలుడి భోజనం పూర్తి అయ్యాక బుద్దుడు నందుణ్ణి తనతో తీసుకొని వెళ్ళి ధర్మబోధ ప్రారంభించాడు. బుద్ధుని ధర్మబోధ కోసం ఎంతోమంది ఎదురు చూస్తున్నా బుద్ధుడు నందుడు వచ్చేవరకూ బోధ ప్రారంభించలేదు.

మధ్యాహ్నమే శ్రావస్తీ నగరానికి వెళ్ళవలసియున్నా నందగోపాలుడు వచ్చే వరకూ బుద్ధుడు తన ప్రయాణాన్ని ఆపుకున్నాడు. నందగోపాలుడికి తాను ప్రక్కన కూర్చుండి కడుపునిండా భోజనం పెట్టించాడు. నందుడికి ధర్మదీక్షను ఇచ్చాడు. నందుడు సరళవర్తనం, సాధు స్వభావం కలవాడనీ, గోపాలక ధర్మాన్ని నిర్వర్తించిన సజ్జనుడనీ శిష్యులకు బుద్దుడు చెప్పి నందగోపాలకుని మెచ్చుకున్నాడు.

AP Board 9th Class Telugu Solutions Chapter 11 ధర్మదీక్ష

ప్రశ్న 3.
మానవులుగా పుట్టినందుకు మనం ఎవరిపట్ల, వేటిపట్ల మన కర్తవ్యాన్ని నిర్వహించాలి? ఎందుకని?
జవాబు:
మానవులుగా పుట్టినందుకు తోడి ప్రాణులపట్ల జాలి, దయ, సానుభూతి, అనుకంపలను మనం చూపించాలి. మానవులం కాబట్టి మనలో దానవత్వం ఉండరాదు. తోడి మానవుల యందు, ప్రకృతిలోని పశుపక్ష్యాదులయందు, కరుణ చూపించాలి. జీవహింస చేయరాదు.

మనకు ముల్లు గుచ్చుకుంటే మనం బాధపడతాము. అలాగే జంతువులు కూడా తమకు బాధ కలిగితే అవి సహించలేవు. ఏడుస్తాయి. మనము దయతో ఆ జంతువులకు కావలసిన ఆహారము, నీరు అందించాలి. కొందరు సత్పురుషులు పశు అశ పక్ష్యాదుల తిండికి, నీరు త్రాగడానికి ఏర్పాట్లు చేస్తారు. తాను అన్నం తినే ముందు, ఒకటి రెండు ముద్దలు కాకులకో, కుక్కలకో, జంతువులకో పెడతారు. అదే జీవకారుణ్యము. కొన్ని ప్రాంతాల్లో జీవకారుణ్య సంఘాలు ఉంటాయి.

తోటి ప్రాణులను, నీ ప్రాణం లాగే చూడాలి. సర్వప్రాణి సమానత్వం ఉండాలి. అల్ప ప్రాణులయిన సీతాకోక చిలుక, మిడత, దోమ, నల్లి వంటి వాటిని కూడా చంపరాదు. సర్వజీవ సమానత్వం మనందరం అలవరచుకోవలసిన మంచిగుణం. అది ముఖ్య కర్తవ్యం.

ఇ) సృజనాత్మకంగా రాయండి.

* ఇది ఎందుకూ పనికిరాదు. దీన్ని కబేళాకు తీసుకొనిపోండి – అన్న యజమాని మాటలకు ఆ ఎద్దు గుండె గుభేలుమంది. తన గంతులేసే బాల్యం, అప్పటి నుండి తన యజమానికి చేసిన సేవ గుర్తుకు వచ్చాయి. బాధగా మూలిగింది – ఇలాంటి ఎద్దు ఆత్మకథను ఊహించి రాయండి.
జవాబు:
అవును. నేను ఇప్పుడు ముసలిదాన్నయ్యాను. నన్ను కర్కశంగా చంపి తినేయడానికి కబేళాకు అమ్మేస్తారా ? ఎంత దారుణం!

నేను ఎంత బాగా పెరిగాను | మా అమ్మ, రోజూ నాకు తన పొదుగులో దాచి, అర్థశేరు పాలు ఇచ్చేది. అవి తాగి, లేత పచ్చి గడ్డి తిని ఎంతో బాగా గంతులు వేసేదాన్ని. నా మెడలో గంటలు కట్టి నన్ను పరుగు పెట్టించి, పిల్లలు నా వెనుక పరుగుపెట్టేవారు. ఆ రోజులే రోజులు !

నేను పెద్దయ్యాక, మా యజమాని నాగలిని ఎన్నోసార్లు లాగాను. పొలాలు దున్నాను. నా తోడి ఎదు రాముడుతోపాటు మా యజమాని బండి లాగాను. ఎంత బరువు వేసినా కాదనలేదు. ఇంతే కాదు. అందాల ఎద్దుల పోటీలో నేను నాలుసార్లు మొదటి బహుమతులు తెచ్చి మా యజమానికి ఇచ్చాను. ఎడ్ల పందేలలో మా యజమానికి మూడుసార్లు గెలుపు సాధించి పెట్టాను. బండ చాకిరీ చేశాను. ఇప్పుడు నేను పనికిరాని దాననయ్యాను.

ఈ మానవులకు జాలి లేదు. నాకు పెట్టే తిండి తగ్గించేశారు. చివరకు నన్ను కబేళాకు అమ్మేస్తున్నారు. ఇంత కృతఘ్నతా? ఈ విషయంలో మనుషుల కంటె, మా జంతువులే నయమేమో ! సరే అన్నింటికీ ఆ దేవుడే ఉన్నాడు. ఏం చేస్తాము ? మా యజమాని బహుశః వాళ్ళ అమ్మా నాన్నలనూ రేపో మాపో కబేళాకు తోలేస్తాడేమో ! భగవాన్ ! మా యజమానికి కొంచెం కరుణా బుద్ధి ప్రసాదించు.

(లేదా )

* ఈ రోజుల్లో కాలుష్యం, ఇతర కారణాల వల్ల కొన్ని పక్షులు, జంతువులు, కనుమరుగయే ప్రమాదం ఏర్పడింది. వీటిని కాపాడుకోవలసిన ఆవశ్యకతను వివరిస్తూ కింది వాటిలో ఒకదాన్ని తయారుచేయండి.
i) పోస్టర్ ii) కరపత్రం iii) ప్రసంగ పాఠం
జవాబు:
ii) జంతు రక్షణ చర్యలు (కరపత్రం) :
ఈ రోజుల్లో మనం ఎక్కువగా క్రిమిసంహారక మందులను పంట పొలాల్లో, పెరట్లోని మొక్కల పై, ఇంట్లో వస్తువులపై చల్లుతున్నాము. ముఖ్యంగా పుష్పాలు పూసి ఫలదీకరణ చెందాలంటే సీతాకోక చిలుకల వంటి పక్షులు ఒక పరాగాన్ని పుష్పానుండి మరొక పుష్పానికి తమ రెక్కలతో చేర్చాలి. పురుగులను కొన్ని పక్షులు తమ ముక్కులతో పొడిచి చంపాలి.

అలాగే మనం చల్లే ఎండ్రిన్ వల్ల భూమిని సారవంతం చేసే, గుల్లబార్చే వానపాములు ఎన్నో చస్తున్నాయి. మామూలు పాములు, ఎలుకలు వగైరా ఎన్నో జంతువులు చస్తున్నాయి. ఆ జంతువులు, పక్షులూ మన పంటలకు చేసే మేలును మనం కోల్పోతున్నాం. అదీగాక పురుగు మందుల అవశేషాలు పంటలపై మిగిలిపోవడంతో వాటికి ధరలు పలకటం లేదు. క్రిమి సంహారక మందుల అవశేషాలు మిగిలిన పంట గింజలను మనం తినడంతో కేన్సర్, టి.బి., గుండె జబ్బులు వస్తున్నాయి.

ప్రకృతి సహజంగా మనకు ఇచ్చిన రక్షణ కవచం ఈ పురుగులు, జంతువులు. “అవి ఒకదానిపై ఒకటి ఆధారపడి జీవిస్తాయి. అందువల్ల మన పంటలు హాయిగా పెరుగుతాయి. మనం భగవంతుడు మనకిచ్చిన సహజ ప్రకృతిని కాపాడుకుందాం. ఆరోగ్యంగా జీవిద్దాం. మన చుట్టూ ఉన్న పక్షులను, జంతువులను రక్షిద్దాం.

AP Board 9th Class Telugu Solutions Chapter 11 ధర్మదీక్ష

ఈ) ప్రశంసాత్మకంగా రాయండి.

* సామ్య తొమ్మిదో తరగతి చదువుతున్నది. ఆమెకు పిచ్చుకలంటే మహా ప్రేమ. వాటికోసం అపార్టుమెంటు బాల్కనీలోనే కుండీల్లో చెట్లు పెంచింది. కొన్నాళ్ళకు ఆ పూలచెట్ల మధ్యే పిచ్చుకలు గూళ్ళు కట్టుకున్నాయి. గుడ్లు పెట్టాయి. పొదిగాయి. సౌమ్య గింజలు చల్లి, నీళ్లు పెట్టి వాటి ఆలనాపాలనా చూస్తుండేది.
ఆమె ప్రయత్నాన్ని అభినందిస్తూ పదివాక్యాలు రాయండి.
జవాబు:
స్నేహశీలి సౌమ్యకు శుభాభినందనలు.

ఈ రోజుల్లో జంతు ప్రేమికులు ఎక్కువగా ఉన్నారు. నీకు పిచ్చుకలంటే ఇష్టమనీ, నీకు పెద్దగా సావకాశం లేకపోయినా, మీ బాల్కనీ కుండీల్లో పెరిగిన మొక్కల మధ్య పిచ్చుకలను పెంచుతున్నావని తెలిసింది. చాలా సంతోషం.

నిజానికి పిచ్చుకలు చాలా అందంగా, ముద్దు వస్తుంటాయి. నీవు వాటిని రోజూ ఏమి వేసి పెంచుతున్నావు? మనతోటి జంతువులను ప్రేమించి, రక్షించడం మంచి అలవాటు. నాకు కూడా కుక్కలంటే ఇష్టం. మా ఇంట్లో నాలుగు రకాల జాతుల కుక్కల్ని పెంచుతున్నాను. సోనియాగాంధీ తోడి కోడలికి కూడా జంతువులంటే గొప్ప ఇష్టం. నీ పక్షి ప్రేమకు, నా మనఃపూర్వక అభినందనచందనం. నాకు కూడా చిలుకల్ని పెంచాలని ఉంది. పక్షుల పెంపకంలో నీ సలహాలు నాకు చాలా అవసరం. – ఉంటా. బై.బై.

IV. ప్రాజెక్టు పని

* మీ పాఠ్యాంశంలోని జాతీయాలను సేకరించండి. వాటితోపాటు మరికొన్ని జాతీయాలను సేకరించండి. వివరించండి. ప్రదర్శించండి.
జవాబు:
విద్యార్థి కృత్యం.

III. భాషాంశాలు

పదజాలం

అ) పేరా చదివి గీత గీసిన పదాలను ఏ అర్థంలో వాడారో రాయండి.
నందగోపునికి అన్నం కంటపడగానే పంచప్రాణాలూ లేచి వచ్చాయి. గతరాత్రినించి ఆ క్షణం వరకూ అతడాకటితో నకనకలాడుతున్నాడు. ఆకలితో నవనాడులు కుంగిపోతున్నాయి.

1. పంచప్రాణాలూ లేచి రావడం
జవాబు:
శరీరంలో తిరిగి సత్తువ రావడం

2. ఆకలితో నకనకలాడటం
జవాబు:
ఆకలితో నీరసపడడం

3. నవనాడులు కుంగిపోవడం
జవాబు:
బాగా దిగాలు పడడం

ఆ) కింది పదాలకు సమానార్థకాలు రాయండి.
1) గోధూళి వేళ = సాయం సమయం (ఆవులు ఇళ్ళకు తిరిగి వచ్చే సమయం)
2) ఆలమంద = ఆవుల గుంపు
3) తీర్థప్రజ = తీర్థమునకు వచ్చిన జనం
4) గాలించు = వెదుకు
5) విడిది = అతిథుల వసతి గృహం
6) ఉవ్విళ్లూరు = బాగా కోరుకొను
7) అనతిదూరం = కొద్ది దూరం

ఇ) వాక్యాన్ని చదివి, జాతీయాల అర్థాన్ని ఊహించి రాయండి.

1) మీ ఆప్యాయతకు నా హృదయం కరిగిపోయింది.
జవాబు:
హృదయం కరిగిపోయింది = ద్రవించింది

2) మేధావులందరూ చర్చలలో తలమునకలయ్యారు.
జవాబు:
తలమునకలయ్యారు = మునిగిపోవు

3) ఆవు అరుపు విన్నాక నందగోపాలుడికి బుద్ధుడి దగ్గరకు వెళ్ళడానికి కాలుసాగలేదు.
జవాబు:
కాలుసాగలేదు = ముందడుగు పడలేదు.

వ్యాకరణం

అ) కింది వానికి వ్యతిరేకార్థక వాక్యాలు రాయండి.
1. ఒకే ఒక్క ఆవు తిరిగి రాలేదు. .
జవాబు:
ఒకే ఒక్క ఆవు తిరిగి వచ్చింది.

2. రాత్రి తెల్లవార్లూ నందగోపుడు ఆరాటపడ్డాడు.
జవాబు:
రాత్రి తెల్లవార్లూ నందగోపుడు ఆరాటపడలేదు.

3. నందుడతనికి తన ప్రయాణ కారణం తెలియజేశాడు.
జవాబు:
నందుడతనికి తన ప్రయాణ కారణం తెలియజేయలేదు.

4. ఒక్క పలుకైనా ఆయన నోటినుండి వెలువడలేదు.
జవాబు:
ఒక్క పలుకైనా ఆయన నోటినుండి వెలువడింది.

AP Board 9th Class Telugu Solutions Chapter 11 ధర్మదీక్ష

ఆ) కింది వాటిని సంయుక్త వాక్యాలుగా రాయండి.

1. బుద్ధదేవుడు, వటవృక్షచ్ఛాయకు వచ్చాడు. వెంటనే అష్టాంగ ధర్మప్రవచనం ప్రారంభమైంది.
జవాబు:
బుద్ధదేవుడు వటవృక్షచ్ఛాయకు వచ్చిన వెంటనే అష్టాంగ ధర్మప్రవచనం ప్రారంభమైంది. (సంయుక్త వాక్యం)

2. లేగ మూలంగా నందగోపునికి అదృష్టం కలిగింది. లేగదూడను నందగోపుడు ముద్దుపెట్టుకొన్నాడు.
జవాబు:
లేగ మూలంగా నందగోపునికి అదృష్టం కలిగింది కాన లేగదూడను నందగోపుడు ముద్దు పెట్టుకొన్నాడు. (సంయుక్త వాక్యం)

ఇ) విరామ చిహ్నాలు గుర్తించండి.
నాయనా నందగోపాలకుని సరళ వర్తనం సాధుస్వభావం మీరెరుగరు ఎంతగా ఆకటి చిచ్చు వేధించినా అతడు తన గోపాలక ధర్మం విస్మరించలేదు అతని గోవాత్సల్యం అపారం ముప్పయి క్రోశాల దూరం నడిచి ఇంతగా శ్రమపడి ఈ ఆళవీ గ్రామానికెందుకు వచ్చానో మీరెవరైనా ఎరుగుదురా
జవాబు:
“నాయనా! నందగోపాలుని సరళవర్తనం, సాధుస్వభావం మీరెరుగరు. ఎంతగా ఆకటి చిచ్చు వేధించినా, అతడు తన గోపాలక ధర్మం విస్మరించలేదు ! అతని గోవాత్సల్యం అపారం ! ముప్పయి క్రోశాల దూరం నడిచి, ఇంతగా శ్రమపడి ఈ ఆళవీ గ్రామానికెందుకు వచ్చానో మీరెవరైనా ఎరుగుదురా?”

ఈ) పాఠంలోని పది సమాస పదాలను రాయండి. వాటికి విగ్రహవాక్యాలు రాయండి. ఏ సమాసమో తెలపండి.
1) భాను బింబం = భానుని యొక్క బింబం – షష్ఠీ తత్పురుష సమాసం
2) ధర్మబోధ = ధర్మము యొక్క బోధ షష్ఠీ తత్పురుష సమాసం
3) విశాలనేత్రాలు = విశాలమైన నేత్రాలు విశేషణ పూర్వపద కర్మధారయం
4) వృక్షచ్ఛాయ = వృక్షము యొక్క ఛాయ షష్ఠీ తత్పురుష సమాసం
5) పంచప్రాణాలు = పంచ సంఖ్య గల ప్రాణాలు ద్విగు సమాసం
6) నవనాడులు = నవ సంఖ్య గల నాడులు – ద్విగు సమాసం
7) అన్నపానాలు = అన్నమును, పానమును ద్వంద్వ సమాసం
8) ముప్పయి క్రోశాలు = ముప్పది సంఖ్యగల క్రోశాలు – ద్విగు సమాసం
9) ఆనంద తరంగాలు = ఆనందము అనెడి తరంగాలు – రూపక సమాసం
10) ప్రశాంత స్వరం = ప్రశాంతమైన స్వరం – విశేషణ పూర్వపద కర్మధారయం
11) క్షుధార్తుడు = క్షుధతో ఆర్తుడు – తృతీయా తత్పురుషం

AP Board 9th Class Telugu Solutions Chapter 11 ధర్మదీక్ష

ఉ) మీరు తెలుసుకున్న అలంకారాలు ఏవి? ఈ పాతంలో వాటికి సంబంధించిన ఉదాహరణలు ఉన్నాయా? వాటిని రాయండి. లేని వాటికి మీరే సొంతంగా రాయండి.

1) ఉపమాలంకారం :
ఉపమానోపమేయాలకు చక్కని పోలిక చెప్పడం.
పాఠంలోని ఉదాహరణ :
1) గౌతమదేవుని ముఖ జ్యోతి అప్పుడప్పుడే ఉదయిస్తున్న భాను బింబంలా మెరిసింది.
2) వారి మనస్సు అప్పుడే తీసిన వెన్నపూస లాంటిది. అతంతు

2) రూపకాలంకారం :
ఉపమాన, ఉపమేయాలకు అభేదం చెప్పడం.
పాఠంలో ఉదాహరణ:
1) ముఖజ్యోతి (ముఖం అనెడి జ్యోతి) (రూపకాలంకారము)
2) ఆనంద తరంగాలలో తలమునకలైనారు (రూపకాలంకారము)

3) దృష్టాంతాలంకారం :
ఉపమానోపమేయాలు వేరైనా బింబ ప్రతిబింబ భావంతో నిర్దేశించడం,
ఉదాహరణ :
ఓ రాజా ! నీవే కీర్తిమంతుడవు. చంద్రుడే కాంతిమంతుడు.

4) స్వభావోక్తి అలంకారం :
ఉన్నది ఉన్నట్లు రమణీయంగా వర్ణించడం.
ఉదాహరణ :
లేళ్ళు బిత్తరి చూపులు చూస్తూ, చెవులు రిక్కించి ఎగిరి ఎగిరి గంతులు వేస్తున్నాయి.

5) ఉత్ప్రేక్షాలంకారం :
ఉపమేయాన్ని చూసి ఉపమానంగా ఊహించడం.
ఉదాహరణ :
మా ఇంటి ముందు ఉన్న పెద్ద కుక్కను చూసి, సింహమేమో అని భయపడ్డాను.

6) వృత్త్యనుప్రాస అలంకారం :
ఒకే అక్షరం, అనేకసార్లు రావడాన్ని వృత్త్యనుప్రాస అంటారు.
ఉదాహరణ :
నాయనా ! నేను నిన్నేమన్నా అన్నానా? నీవు నన్నేమన్నా అన్నావా?

7) అంత్యాను ప్రాసాలంకారం :
ఒక అక్షరం, లేదా రెండుమూడు అక్షరాలు, వాక్యం చివర మాటిమాటికీ వస్తే దాన్ని అంత్యానుప్రాసాలంకారం అంటారు.
ఉదాహరణ :
భాగవతమున భక్తి
భారతములో యుక్తి
రామకథలో రక్తి – ఓ కూనలమ్మా !

8) లాటాను ప్రాసాలంకారం :
అర్థభేదము లేకపోయినా, తాత్పర్యభేదం కల పదాలు ఒకదానివెంట మరొకటి రావడం.
ఉదాహరణ :
కమలాక్షునర్చించు కరములు కరములు.

9) ఛేకానుప్రాసాలంకారం :
అర్థభేదం గల జంటపదాలు వెంటవెంటనే రావడం ఛేకానుప్రాసాలంకారం,
ఉదాహరణ :
వందవందనాలు.

9th Class Telugu 11th Lesson ధర్మదీక్ష కవి పరిచయం

పిలకా గణపతిశాస్త్రి 1911 ఫిబ్రవరి 24న జన్మించారు. తూర్పుగోదావరి జిల్లాలోని కట్టుంగ వీరి స్వస్థలం. విజయనగరంలో విద్యనభ్యసించారు. సాహిత్య విద్యా ప్రవీణ, ఉభయభాషా ప్రవీణ పూర్తిచేశారు. రత్నాపహారం వీరి తొలిరచన. మణిదీపిక, ప్రాచీన గాథాలహరి, విశాలనేత్రాలు, కాశ్మీర పట్టమహిషి, నాగమల్లిక, అందని చందమామ వీరి ఇతర రచనలు. సంస్కృతం, బెంగాలీ భాషల నుంచి అనేక అనువాదాలు చేశారు. సరళమైన అలంకారిక శైలిలో వీరి రచన సాగింది.

కలిన పదాలకు అర్థాలు

గోధూళి వేళ = సాయం సమయం ; ఆవులు ఇళ్ళకు తిరిగి వచ్చే సమయం
ఆలమంద = ఆవుల గుంపు
గోవత్సాలు = ఆవు దూడలు
కుడుచుకుంటున్నాయి = చప్పరించుచున్నాయి (త్రాగుచున్నాయి)
కలకలలాడింది = ఆనందంగా ఉంది
సయించలేదు = ఇష్టం కాలేదు
ఆరాటపడు = ఆత్రపడు
= సంతాపము నొందు
అరుణోదయ కాంతులు (అరుణ +ఉదయ కాంతులు) = సూర్యోదయ కాంతులు
నూతనానందావేశాలు (నూతన+ఆనంద+ఆవేశాలు) = కొత్త ఆనందము యొక్క ఉద్రేకాలు
హృదయాంతరాళం (హృదయ+అంతరాళం) = హృదయం మధ్య చోటు
సందర్శనభాగ్యం = చూచే అదృష్టం
నిట్టూర్పు = దీర్ఘ నిశ్వాసము
వాలకం = రూపు
పులివాత = పులినోట్లో
ఆరాటం = ఆవుల పాక
తథాగతుడు = బుద్ధుడు
పాపలు = చిన్న పిల్లలు
కోడెదూడ = మగ ఆవుదూడ
పెయ్యదూడ = ఆడ దూడ

AP Board 9th Class Telugu Solutions Chapter 11 ధర్మదీక్ష

గౌతమదేవుడు = బుద్ధుడు
అధమ పక్షం = (మిక్కిలి చెడ్డ పక్షం) కనీసం
అంగలు = చాచివేసిన రెండు అడుగులు చోటులు
మిట్ట మధ్యాహ్నం = మధ్యాహ్న కాలము
దహించి వేయు = కాల్చు
పిడచగట్టుకుపోవు = నోరు ఎండిపోవు
స్పురించింది = తోచింది
ఆర్తనాదం = బాధతో అరిచే అరుపు
పెన్నిధి = పెద్ద నిధి
తికమకలు = బాధలు (తొట్రుపాటులు)
పొలిమేర = సరిహద్దు
సంకల్పం = ఉద్దేశ్యం
అధమం = కనీసం
మహామహుడు = గొప్పవాడు
ఉవ్విళ్ళూరిపోవు = బాగా కోరుకొను
శిష్యగణం = శిష్యుల సమూహం
విశ్రమించిన = ఆయాసం తీర్చుకొనిన
వటవృక్షం = మజ్జిచెట్టు
కాషాయాంబరధారులు = కాషాయ వస్త్రాన్ని ధరించినవారు.
భిక్షుకులు = సన్యాసులు
ముఖజ్యోతి = ముఖ ప్రకాశము
భాను బింబము = సూర్య బింబము
విడుదులు = అతిథుల వసతి గృహాలు
ఆసన్నము+అగు = సమీపించడం ; దగ్గరికి రావడం
వంశపారంపర్యత: = వంశములో ఒకరి తరువాత ఒకరుగా
అనుమతించలేదు = అంగీకరించలేదు
ప్రాధేయపడ్డారు = వేడుకున్నారు
విసర్జించు = విడుచు
అనుజ్ఞ = అంగీకారము
శ్రమణకులు = బౌద్ధ ధర్మాన్ని పాటిస్తూ బుద్ధుడి శిష్యులుగా ఉండేవారు.
వట తరుచ్ఛాయ = మట్టిచెట్టు నీడ
సమాసీనులు = చక్కగా కూర్చున్నవారు
యామాలకాలం = జాముల కాలం ; యామము అంటే 3 గంటలు
సుఖాసనం (సుఖ +ఆసనం) = సుఖమైన ఆసనం
అవలోకిస్తున్నాడు = చూస్తున్నాడు
ఆలకించు = విను
ఉత్కంఠ = ఇష్టవస్తు ప్రాప్తికై వేగిరపాటు
తహతహలాడిపోవు = వేగిరపడు
పలుకు = మాట
నేత్రాలు = కన్నులు
నిరీక్షించు = ఎదురుచూచు
స్ఫురిస్తున్నాయి = తోస్తున్నాయి
నిరీక్షణ = ఎదురుచూపు
అవగాహన = తెలిసికొనడం
అనతిదూరం = కొద్ది దూరం
పరికిస్తున్నాయి = పరీక్షిస్తున్నాయి
ఆత్రంగా = తొందరగా
ఆగమనము = రాక
సాగిలపడ్డాడు = సాష్టాంగ నమస్కారం చేశాడు
దోసిలి ఒగ్గి = చేతులు జోడించి
ఆత్రం = తొందర
పంచప్రాణాలు = ఐదు ప్రాణాలు 1) ప్రాణము 2) అపానము 3) వ్యానము 4) ఉదానము 5) సమానము
నవనాడులు = తొమ్మిది నాడులు (నాడులు అన్నీ)
నకనకలాడు = ఆకలిచే బాధపడు
పలుపు = పశువుల మెడకు కట్టు త్రాడు
ఆప్యాయత = ప్రేమ ప్రత్యక్షము = ఎదుట ఉన్నది
ద్రవించి = కరగి
కుశల ప్రశ్నలు = క్షేమ సమాచారాలను గూర్చి ప్రశ్నలు
సాముద్రిక విషయాలు = హస్తరేఖాది లక్షణాలను బట్టి శుభా శుభాలు తెలిపే శాస్త్ర విషయాలు
ఆచార్యదేవుడు = గురువు
సందేహాలు = అనుమానాలు
అభ్యర్థించారు = కోరారు
చనువు = ప్రేమ
ఉపదేశించు = బోధించు
ప్రసంగాలు = ఉపన్యాసాలు
విడ్డూరము = ఆశ్చర్యము
అష్టాంగ ధర్మ ప్రవచనం = ఎనిమిది అంగములైన ధర్మాలు చెప్పడం: 1) సమ్యక్ దృష్టి 2) సమ్యక్ వాక్కు 3) సమ్యక్ కర్మ 4) సమ్యక్ సంకల్పం లక్ష్యం 5) సమ్యక్ చేతన, మనస్తత్వం 6) సమ్యక్ జీవనం 7) సమ్యక్ వ్యాయామం 8) సమ్యక్ భావన

AP Board 9th Class Telugu Solutions Chapter 11 ధర్మదీక్ష

ఆనందతరంగాలు = సంతోషపు కెరటాలు
తలమునకలగు = ఎక్కువగు
అలవోకగా = అప్రయత్నముగా ; (లీలగా)
ప్రవచనం = చక్కగా మాట్లాడడం
నిగ్రహం = సంయమనం
శ్రమణకులు = బౌద్ధ భిక్షువులు
గుసగుసలు = రహస్యం మాటలు
ఉపేక్షించి = అశ్రద్ధ చేసి
పక్షపాతం = ఒకదానియందభిమానం
సమ్యక్ సంబుద్ధుడు = బుద్ధుడు
స్వరం = ధ్వని
క్షుధార్తుడు = ఆకలితో బాధపడేవాడు
క్షుధ = ఆకలి
దుస్సహము = సహింపరానిది
యాతన = తీవ్రవేదన
సమ్యగుృద్ధి (సమ్యక్ + బుద్ధి) = సరియైన బుద్ధి
నిర్వాణం = మోక్షం
కరతలామలకం (కరతల+ ఆమలకం) – బాగా తెలిసినది (అరచేతిలో ఉసిరిక)
పశ్చాత్తప్తులు = తాముచేసింది తప్పని తెలిసి, అలా చేశామే అని బాధపడేవారు
ఆకటిచిచ్చు = ఆకలి మంట
గోవాత్సల్యం = ఆవుపై ప్రేమ
అపారం = అంతులేనిది
గో, గోవత్సాలు = ఆవు, ఆవు దూడలు
మంద = ఆవులు మొదలైన పశువుల గుంపు
అన్నపానాలు = అన్నము, పానము (తిండి, నీరు)
తాండవించాయి. = కదలియాడాయి
మురిసిపోయాడు = సంతోషించాడు
కుడుచుకొని = చప్పరించి, త్రాగి

AP Board 9th Class Telugu Solutions Chapter 6 ప్రబోధం

AP State Syllabus AP Board 9th Class Telugu Textbook Solutions Chapter 6 ప్రబోధం Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Telugu Solutions 6th Lesson ప్రబోధం

9th Class Telugu 6th Lesson ప్రబోధం Textbook Questions and Answers

చదవండి-ఆలోచించండి-చెప్పండి

గాంధీజీ ఒక సభలో ఇలా సందేశమిచ్చారు. ‘స్వరాజ్య సాధన స్త్రీల చేతుల్లోనే ఉంది. మీమీ పనుల్లో మీరు నిష్ణాతులు కండి. స్త్రీలు పిరికివారు, బలహీనులు అనే సామాన్యుల వాదాలు మిథ్య అని రుజువు చేయండి. స్త్రీలకు సామాజిక స్పృహ ఉండాలి. వారికున్న నైతికబలం సామాన్యమైంది కాదు. ఈ ‘అంతశ్శక్తి’ పై ఆధారపడ్డప్పుడు ప్రపంచంలో ఏ శక్తీ కూడా ఆమెను ఓడించలేదు”.

ప్రశ్నలు జవాబులు

ప్రశ్న 1.
‘స్వరాజ్య సాధన’ ఎందుకు అవసరం?
జవాబు:
భారతదేశం స్వతంత్ర్యాభివృద్ధిని సాధించడం కోసం ‘స్వరాజ్య సాధన’ అవసరం.

ప్రశ్న 2.
సామాన్యుల మిథ్యావాదం ఏమిటి?
జవాబు:
స్త్రీలు పిరికివారు, బలహీనులు అనేది సామాన్యుల మిథ్యావాదం.

ప్రశ్న 3.
స్త్రీలలో ఉన్న “అంతశ్శక్తి” ఏది?
జవాబు:
వారి నైతికతే వారి “అంతశ్శక్త.”

AP Board 9th Class Telugu Solutions Chapter 6 ప్రబోధం

ప్రశ్న 4.
స్త్రీల గురించి గాంధీజీ కి ఉన్న అభిప్రాయాలు ఏమిటి?
జవాబు:
స్వరాజ్య సాధన స్త్రీల చేతుల్లోనే ఉంది. వారి పనుల్లో వారు నిష్ణాతులు కావాలి.

ఇవి చేయండి

I. అవగాహన – ప్రతిస్పందన

అ) కింది అంశాల ఆధారంగా మాట్లాడండి.

ప్రశ్న 1.
‘స్త్రీల విద్యాభివృద్ధికి బాల్య వివాహాలు ప్రతిబంధకములు’ దీనిపై మీ అభిప్రాయం తెలపండి.
జవాబు:
చిన్న వయస్సులోనే వివాహం చేయటం వల్ల స్త్రీల విద్యాభివృద్ధి కుంటుపడుతుంది. పెళ్ళైన పిల్లల్ని పాఠశాలకు పంపడానికి పెద్దలు ఇష్టపడేవారు కాదు. పెళ్ళి కుదిరిన తరువాత ఆడపిల్లలు చదువుకు స్వస్తి పలికేవారు.

ప్రశ్న 2.
“స్వశక్తిచేత” ఏ పనులనైనా సాధించవచ్చు? నిజమా ? కాదా ? వివరించండి.
జవాబు:
స్వశక్తితో ఏ పనులనైనా సాధించవచ్చు. ఇది నిజమే ఇతరులపై ఆధారపడితే వారికి అవకాశం ఉన్నప్పుడే మన పనుల్ని చేసుకోగలం.

ఆ) పాఠం ఆధారంగా కింది వాటికి సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
‘లేఖ’ ను ఎవరు రాశారు? ఎవరికి రాశారు?
జవాబు:
లేఖను ‘శారద’ అనే పేరుతో కనుపర్తి వరలక్ష్మమ్మ గారు రాశారు. కల్పలత అనే ఆమెకు రాస్తున్నట్లుగా ‘గృహలక్ష్మి’ పత్రికకు రాశారు.

ప్రశ్న 2.
సభలో ఉపన్యసించిన వారెవరు? సభకు అధ్యక్షురాలు ఎవరు?
జవాబు:
సభలో ఉపన్యసించినది శ్రీమతి సరోజినీ దేవిగారు. సభకు అధ్యక్షురాలుగా నెమలి పట్టాభి రామారావు పంతులుగారి కుమార్తె శ్రీమతి పద్మావతిదేవి గారు.

AP Board 9th Class Telugu Solutions Chapter 6 ప్రబోధం

ప్రశ్న 3.
ఢిల్లీ మహిళాసభవారు చేసిన తీర్మానాలు ఏవి?
జవాబు:
ఢిల్లీ మహిళాసభవారు స్త్రీలకు సంబంధించిన పెక్కు తీర్మానాలు చేశారు. వాటిలో కొన్ని బాలబాలికలకు విధిగా విద్య నేర్పించాలి. స్త్రీలకు నియోజక, నియోజిత స్వాతంత్ర్యము సాధించుట. అతి బాల్య వివాహము అనర్థకమని ప్రచారం చేయుట.

ప్రశ్న 4.
స్త్రీలకు ఎన్నిక హక్కులు లభించడం వల్ల కలిగిన ఫలితాలేవి?
జవాబు:
స్త్రీలకు ఎన్నిక హక్కులు లభించడం వల్ల మదరాసు రాష్ట్ర శాసనసభకు ఒక స్త్రీ డిప్యూటీ ప్రెసిడెంటుగా ఎన్నుకొనబడింది. తిరువాన్కూరులో ఒక స్త్రీ మంత్రిణిగా నియమింపబడింది. సమర్థురాలుగా పేరుపొందింది. ఇంకా చాలా స్థానిక సభల్లో, విద్యా సంఘాల్లో స్త్రీలు సభ్యులుగా నియమించబడుతున్నారు.

ప్రశ్న 5.
తనువే పుణ్యక్షేత్రముగా చేసుకొనవచ్చునని సరోజినీదేవి చెప్పిన అంశాలేవి?
జవాబు:
భూతదయ కలిగిఉండటం. చేసిన తప్పుకు పశ్చాత్తాపపడటం. జాతిమత భేదాలు పాటించక విశ్వ మానవులందరిని సోదరులుగా భావించడం, అకల్మషమైన హృదయాన్ని కలిగి ఉండటం. వీటి వల్ల మన శరీరాన్నే పుణ్యక్షేత్రంగా చేసుకోవచ్చు. నిజానికి జీవితమే ఒక యాత్ర. సంస్కరించబడని మనస్సుతో ఎన్ని యాత్రలు చేసినా ఫలితం ఉండదు.

ఇ) కింది పేరాను చదివి ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

మలాలా యూసుఫ్ జాయ్ ఈ తరం బాలికల నూతన స్ఫూర్తికి ప్రతినిధి. మలాలా పాకిస్థాన్ లోని స్వాత్ లోయ మింగోరా పట్టణంలో 12 జులై, 1997లో జన్మించింది.

చిన్నప్పటి నుంచి చదువంటే చాలా ఆసక్తిగల మలాలా తమ ప్రాంతంలోని ప్రతికూల పరిస్థితులకు ఎదురు నిలిచి పోరాడింది. అక్కడి ప్రభుత్వంపై ఆధిపత్యం వహిస్తున్న తాలిబాన్ ఛాందసవాదులు బాలికలు పాఠశాలకు వెళ్ళడం, చదువుకోవడంపై నిషేధం విధించారు. మలాలా ఏ మాత్రం భయపడకుండా చదువుకొంటూనే తన తోటి బాలికలకు చదువుపై ఆసక్తిని పెంచి పాఠశాలకు వెళ్ళేటట్లుగా ప్రోత్సహించింది. దీంతో ఆగ్రహించిన తాలిబాన్లు మలాలాపై 9 అక్టోబర్ 2012న కాల్పులు జరిపారు. ఆమె తీవ్రంగా గాయపడింది. ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళిపోయింది. ప్రపంచవ్యాప్తంగా మలాలాపై సానుభూతి వెల్లువెత్తింది. అందరూ ఆమె కోలుకోవాలని కోరుకున్నారు.

ఆమె ప్రాణాపాయ స్థితి నుండి బయటికి వచ్చింది. మలాలా చైతన్యానికి, సాహసానికి, ఆత్మ సైర్యానికి ముగ్ధులైన ఐక్యరాజ్య సమితి ఆమె జన్మదినాన్ని (జూలై 12ను) ‘మలాలా రోజు’ (Malala Day) గా జరుపుకోవాలని ప్రకటించింది. ప్రతీ బాలిక చదువుకోవడం ఒక ప్రాథమిక హక్కుగా గుర్తించింది. మలాలాను ‘ఇంటర్నేషనల్ చిల్డ్రన్ పీస్ ప్రైజ్’కు నామినీగా స్వీకరించింది.

AP Board 9th Class Telugu Solutions Chapter 6 ప్రబోధం

అ) మలాలా జన్మించిన ప్రాంతంలోని పరిస్థితులు ఏమిటి?
జవాబు:
చిన్నప్పటి నుండి చదువంటే ఆసక్తిగల మలాలాకు తన ప్రాంతంలో బాలికల చదువుకు వ్యతిరేక పరిస్థితులున్నాయి.

ఆ) తాలిబాన్ ఛాందసవాదులు దేన్ని నిషేధించారు?
జవాబు:
తాలిబాన్ ఛాందసవాదులు బాలికలు పాఠశాలకు వెళ్ళడం, చదువుకోవడంపై నిషేధం విధించారు.

ఇ) మలాలా బాలికలను ఏ విధంగా ప్రోత్సహించింది?
జవాబు:
మలాలా తాలిబాన్లకు ఏమాత్రం భయపడకుండా చదువుకొంటూనే తన తోటి బాలికలకు చదువుపై ఆసక్తిని పెంచింది. వారు కూడా పాఠశాలలకు వెళ్ళేటట్లుగా ప్రోత్సహించింది.

ఈ) మలాలా ప్రాణాపాయ స్థితిలోకి ఎందుకు వెళ్ళింది?
జవాబు:
తాలిబాన్లు మలాలాపై 9-అక్టోబర్-2012న కాల్పులు జరిపారు. దాంతో ఆమె తీవ్రంగా గాయపడి, ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళింది.

ఉ) ఐక్యరాజ్య సమితి మలాలాను ఏ విధంగా గౌరవించింది?
జవాబు:
మాలాలాను ‘ఇంటర్నేషనల్ చిల్డ్రన్ పీస్ ప్రైజ్’ కు నామినీగా తీసుకొంది. నవంబర్ 10వ తేదీన ‘మలాలా రోజు’గా ప్రకటించి ఆమెను గౌరవించింది.

ఈ) కింది వాక్యాలు పాఠంలో ఎక్కడ వచ్చాయో గుర్తించి వాటి సందర్భాన్ని బట్టి భావం రాయండి.

అ) నియోజిత, నియోజక స్వాతంత్ర్యం మన స్త్రీలకు శీఘ్రంగా లభించినది.
జవాబు:
భారతీయ స్త్రీలు తమకు తాము స్వతంత్రంగా ఎన్నికలలో పాల్గొనే హక్కును, తమకు నచ్చిన వారిని ఎన్నికలలో ఎన్నుకొనే హక్కును పొందారు. పాశ్చాత్య దేశాలలోని స్త్రీలు ఈ హక్కులను పొందడానికి ప్రత్యేకంగా పరిశ్రమ చేయాల్సి వచ్చింది. వారితో పోలిస్తే భారతీయ స్త్రీలు వీటిని చాలా త్వరగా పొందినట్లే అని సరోజినీదేవి చెప్పారు.

ఆ) మన తనువే పుణ్యక్షేత్రముగా చేసుకొనవచ్చును.
జవాబు:
మనం కాశీ – రామేశ్వరాది పుణ్యయాత్రలు చేయాలనుకుంటాం కాని భూతదయను కలిగిఉండటం, చేసిన తప్పులకు పశ్చాత్తాపపడటం, జాతి, మత భేదాలు లేకుండా అందరిని సోదరులలాగా చూడడం, అమలిన హృదయంతో ఉండటం వీటి ద్వారా మన శరీరాన్నే పుణ్యక్షేత్రంగా చేసుకోవచ్చు.

ఇ) చిత్త సంస్కారము లేని యాత్రల వలన ఫలము లేదు.
జవాబు:
నిజానికి జీవితమే తీర్థయాత్ర అన్నింటికి మనస్సే మూలం. మనసు సంస్కరించబడకుండా ఎన్ని యాత్రలు చేసినా ఫలితం ఉండదు.

II. వ్యక్తీకరణ-సృజనాత్మకత

అ) కింది వాటికి ఐదేసి వాక్యాల్లో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
ఇరుగుపొరుగు వారితో ఎలా ఉండాలో తెలపండి.
జవాబు:
సాధారణంగా తల్లి తన బిడ్డకు ఏదైనా ప్రమాదం వస్తే తన ప్రాణాలనైనా పణంగా పెట్టి బిడ్డను కాపాడుకోవడానికి సాహసిస్తుంది. అలాంటే ప్రేమను ఇరుగు పొరుగు వారిపై కూడా చూపాలి. ఇంకా, సర్వమతాల వారిపై చూపాలి. సర్వమానవుల్ని సొంతవారిగా భావించగలగాలి. అన్ని ప్రాణుల్ని సొంతబిడ్డలా ప్రేమించగలగాలి.

AP Board 9th Class Telugu Solutions Chapter 6 ప్రబోధం

ప్రశ్న 2.
మనిషికి నిజమైన సౌందర్యం ఏమిటి?
జవాబు:
మనిషి విలువైన ఆభరణాలు ధరిస్తే సౌందర్యం పెరుగుతుందని మనం భావిస్తాం. అది నిజం కాదు. నిర్మలమైన హృదయాన్ని కలిగి ఉండటం, కరుణతో ప్రవర్తించడం నిజమైన సౌందర్యం. అందరితో ప్రేమను పంచుకోవడమే సౌందర్యం. కాబట్టి సుగుణాలు కలిగి ఉండటమే సౌందర్యం. విలువైన ఆభరణాలు ధరించడం సౌందర్య హేతువు కాదని గ్రహించాలి.

ప్రశ్న 3.
‘స్త్రీ శక్తి స్వరూపం’ ఈ మాటను సమర్థిస్తూ రాయండి.
జవాబు:
స్త్రీ శక్తి స్వరూపం. ప్రధాన దేవతలైన సరస్వతి – లక్ష్మి – పార్వతులు స్త్రీలే. తమ సొంతశక్తితో విద్యను, సంపదలను పొందవచ్చు. పిరికితనాన్ని, బిడియాన్ని విడిచి పెట్టడం ద్వారా సాహస కార్యాల్ని చేయవచ్చు. వేదకాలం నాటి స్త్రీలు యజ్ఞయాగాల్ని నిర్వహించినట్టు, శాస్త్ర చర్చలలో పురుషులతో పోటీ పడినట్టు మన చరిత్ర చెపుతుంది. సంపదలను సాధించడంలో కూడా స్త్రీలు నైపుణ్యాన్ని ప్రదర్శించినట్టు తెలుస్తుంది. మహారాణి రుద్రమ, వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి వంటి సాహసం నేటికీ మరుపురానివే, స్త్రీలు తమ పని శక్తిస్వరూపాన్ని గుర్తించి, వెలికితీయడం ద్వారా ఉన్నత స్థితిని త్వరగా పొందవచ్చు.

ప్రశ్న 4.
ప్రతిబంధకాలు అంటే ఏమిటి? వాటిని ఎలా అధిగమించాలి?
జవాబు:
అభివృద్ధికి అడ్డంకి కలిగించే వాటిని ప్రతి బంధకాలు అంటారు. ప్రతి కార్యానికి ప్రతిబంధకాలు కలుగుతాయి. వాటిని అధిగమిస్తేనే కోరుకున్నదాన్ని సాధించగలం. అడ్డంకులు ఏర్పడగానే కంగారు పడిపోకూడదు. జాగ్రత్తగా ఆలోచించుకొని సమస్యను అధిగమించాలి. ఉద్రేకానికి లోను కాకూడదు. అవసరమైతే పెద్దవారి సలహాలను, స్నేహితుల సహకారాన్ని తీసుకోవాలి. తెలివిగా సమస్యలను సాధించుకోవడం నేర్చుకోవాలి.

ప్రశ్న 5.
‘సరస్వతీ ప్రసన్నత’ అంటే ఏమిటి? అది ఎప్పుడు లభిస్తుంది?
జవాబు:
‘సరస్వతీ ప్రసన్నత’ – అంటే ఉన్నత విద్యలను అభ్యసించగలగడం. ప్రాథమిక విద్యలను అభ్యసించకుండా, ఉన్నత విద్యలను అభ్యసించడం కుదరదు కాబట్టి ప్రాథమిక విద్యలను ముందు అభ్యసించి, అంతటితో ఆగిపోకూడదు. ఎన్ని ఇబ్బందులెదురైనా ఉన్నత విద్యలను అభ్యసించాలి. కష్టాలను ఎదిరించి ఇష్టతతో చదివేవారికి తప్పక సరస్వతీ ప్రసన్నత కలుగుతుంది. దానివల్ల సులువుగా ఉన్నత విద్యలను అభ్యసించగలుగుతాము.

ప్రశ్న 6.
బాలబాలికలకు విధిగా విద్య నేర్పాలని సరోజినీదేవి ఎందుకన్నది?
జవాబు:
దేశ భవిష్యత్తు బాలల పైనే ఆధారపడి ఉంటుంది. అందుకే “నేటి బాలలే రేపటి పౌరులు” అనే నానుడి ఏర్పడింది. బాలలందరూ విద్యావంతులైనప్పుడే సమాజం విద్యావంతమవుతుంది. విద్యావంతమైన సమాజం వల్లే దేశం పురోభివృద్ధిని సాధిస్తుంది. దేశం సర్వతోముఖాభివృద్ధిని త్వరగా సాధించాలంటే పౌరులందరూ ఉన్నత విద్యావంతులు కావాలి. కాబట్టే బాలబాలికలందరూ విధిగా విద్యనేర్చుకోవాలని సరోజినీదేవి కోరింది.

ఆ) కింది వాటికి పదిహేనేసి వాక్యాలలో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
సరోజినీదేవి ఉపన్యాసంలోని ముఖ్యాంశాలను సంక్షిప్తంగా రాయండి.
(లేదా)
స్త్రీ సమాజాభివృద్ధికై సరోజినీదేవి చేసిన ప్రసంగంలో ముఖ్యాంశాలేవి?
(లేదా)
సరోజినీదేవి స్త్రీలనుద్దేశించి చెప్పిన సందేశపు సారాంశాన్ని మీ మాటల్లో రాయండి.
(లేదా)
బాలబాలికలకు విధిగా విద్య నేర్వవలెను. అతిబాల్య వివాహాలు అనర్థదాయకాలు – అని సరోజనీ దేవిగారు స్త్రీ సామాజికాంశాలపై ఏ విధంగా స్పందించారో వివరించండి. ఆ
జవాబు:
శ్రీమతి సరోజినీదేవి గారి ఉపస్యౌసం మదనపల్లి యందు హిందూ సమాజం వారి యాజమాన్యంలో నిర్వహించబడింది. శ్రీమతి పద్మావతీదేవి గారు ఈ సభకు అధ్యక్షత వహించిరి. శ్రీమతి సరోజినీదేవి గారి ఉపన్యాస సారాంశం ఇట్లున్నది.

ఢిల్లీ మహిళా సభవారు స్త్రీలకు సంబంధించిన చాలా విషయాల్ని చర్చించారు. బాలలందరకూ తప్పక విద్య నేర్పించాలని అన్నారు. స్త్రీలకు నియోజక, నియోజిత స్వాతంత్ర్యం కావాలన్నారు. చిన్నవయస్సులోనే వివాహాలు చేయకూడదన్నారు. ఇతర దేశాల్లో స్త్రీలు ఎక్కువ కష్టం సాధించిన ఎన్నిక హక్కులు మనదేశంలోని స్త్రీలు పెద్దగా కష్టపడకుండానే సాధించారు. మద్రాసు రాష్ట్ర శాసనసభకు ఒక స్త్రీ డిఫ్యూటీ ప్రెసిడెంటుగా ఎన్నిక అయింది. తిరువాన్కూరులో ఒక స్త్రీ మంత్రి పదవిని పొందింది. ఇంకా చాలామంది మహిళలు స్థానిక సభల్లోను, విద్యాసంఘాల్లోను సభ్యులయ్యారు. ఈ స్వాతంత్ర్యపు హక్కుల్ని సమర్థతతో నిర్వహించాలంటే స్త్రీలు విద్యావంతులు కావాలి. కాని మన దేశంలో స్త్రీల విద్యాభివృద్ధికి బాల్య వివాహాలు అడ్డంకి అయ్యాయి. వాటిని రూపుమాపాలి.

స్త్రీ శక్తి స్వరూపం. ప్రధాన దేవతలైన సరస్వతి – లక్ష్మి – పార్వతులు స్త్రీలే. తమ సొంత శక్తితో విద్యను, సంపదలను పొందవచ్చు. పిరికితనాన్ని, బిడియాన్ని విడిచిపెట్టడం ద్వారా సాహసకార్యాల్ని చేయవచ్చు. కాని అట్టి శక్తి నేటి మహిళలలో స్తంభించిపోయింది. చాలామంది కాశీ రామేశ్వరాది పుణ్య యాత్రల్ని చేయాలనుకుంటారు. కాని సకల ప్రాణుల్ని ప్రేమించడం, చేసిన తప్పులకు పశ్చాత్తాపడటం, జాతి మత భేదాలు పాటించక విశ్వమానవులందరినీ సోదరులుగా భావించడం ద్వారా మన శరీరాన్నే పుణ్యక్షేత్రంగా చేసుకోవచ్చు. నిజానికి జీవితమే ఒక యాత్ర. సంస్కరింపబడని మనస్సుతో ఎన్ని యాత్రలు చేసినా ఫలితం ఉండదు. తోటివారిని అంటరాని వారిగా చూడడం తప్పు. స్త్రీలకు సౌందర్యం వెలలేని ఆభరణాలను ధరించడంలో లేదు. నిర్మలమైన ప్రేమను, కరుణను ఇరుగు పొరుగు వారిపై కలిగి ఉండాలి.

AP Board 9th Class Telugu Solutions Chapter 6 ప్రబోధం

ప్రశ్న 2.
‘స్త్రీ విద్య’ ఆవశ్యకతను వివరించండి.
జవాబు:
విద్యావంతురాలైన గృహిణి వలన ఎన్నో ప్రయోజనాలున్నాయి. గృహకార్యాలనే కాక బయటకు వెళ్ళి చేసుకోవలసిన పనులను కూడా చక్కగా నిర్వహించుకోగలదు. తన పిల్లలను చదివించడంలోను, వారికి వచ్చే సందేహాలను తీర్చడంలోనూ, విద్యావంతురాలే సమర్థురాలు. మూఢనమ్మకాలకు, మోసపు మాటలకు లొంగిపోకుండా వైజ్ఞానికంగా ఆలోచించగలగాలంటే గృహిణులు తప్పక విద్యావంతులు కావాలి ఒక్క ఇల్లాలు విద్యావంతురాలైతే ఆ ఇంటిని అనేక ఆపదల నుంచి రక్షిస్తుంది. కొబట్టే “ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు” అనే సామెత ఏర్పడింది. పిల్లలచే ఉన్నత విద్యలను అభ్యసింపజేయడంలో చదువుకున్న ఇల్లాలే చక్కని నిర్ణయాలు తీసుకోగలదు.

ఆడపిల్లల చదువు వల్ల చాలా అనర్థాలు దూరమవుతాయి. సమాజం విద్యావంతమవుతుంది. ఉత్తమ సమాజం వల్ల ఉత్తమ దేశం ఏర్పడుతుంది. మూఢవిశ్వాసాలు నశిస్తాయి. వైజ్ఞానిక దృక్పథం ఏర్పడుతుంది.

ప్రశ్న 3.
స్త్రీల చైతన్యానికి మహిళా సంఘాలు చేస్తున్న కృషిని వివరించండి.
జవాబు:
బాలికలు పాఠశాలలకు వెళ్ళి విద్యాభ్యాసం చేయడానికి మహిళా సంఘాలు పరిశ్రమించాయి. వయోజనులు, గృహిణులైన స్త్రీల కోసం వయోజన విద్యా సంఘాలను ఏర్పాటుచేశాయి. సమాజంలో స్త్రీల అణచివేతను అనేక ఉద్యమాలతో ఎదుర్కొన్నాయి చదువుకొనే ప్రదేశాల్లో, పనిచేసే చోట్ల మహిళలకు ఎదురయ్యే లైంగిక వేధింపులు, ఇతర సమస్యలను సమర్థవంతంగా తిప్పికొట్టడానికి మహిళా సంఘాలు కృషిచేస్తున్నాయి.

వివిధ రాష్ట్రాల మహిళా సంఘాల ఐక్య ఉద్యమాల ఫలితంగానే మహిళలకు ఓటు హక్కు, ఎన్నికలలో పాల్గొనే హక్కు లభించాయి. ఉన్నత కుటుంబాలలోని .ఆడపిల్లలు పాఠశాలలకు వచ్చి చదువుకోగలుగుతున్నారు. పరదాలమాటున, ఘోషాల చాటున మగ్గిన మహిళలు నేడు స్వేచ్ఛగా బయటికి వచ్చి తమ పనులు నిర్వహించుకోగలుగుతున్నారంటే వీటి వెనుక మహిళా సంఘాల కృషి ఎంతో ఉంది. నేటి సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న వరకట్న సమస్యలను, యాసిడ్ దాడులను దూరం చేయడంలో మహిళా సంఘాలు ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి. మహిళలకు అనుకూలంగా అనేక చట్టాలను తీసుకురావడంలో మహిళా సంఘాలు విజయాన్ని సాధించాయి. మహిళలపై లైంగిక దాడులకు వ్యతిరేకంగా ‘నిర్భయ్’ వంటి రక్షణను పొందడం (ఇందులో కొన్ని).

ఇ) కింద ఇచ్చిన వివరాలను విశ్లేషిస్తూ పది వాక్యాలు రాయండి.

అక్షరాస్యత – 2011 సం||జాతీయస్థాయిరాష్ట్రస్థాయి
పురుషుల అక్షరాస్యత82.14%75.56%
స్త్రీల అక్షరాస్యత70.04%59.74%
మొత్తం65.46%67.61%

జవాబు:

  1. భారతదేశంలో ప్రతి పది సంవత్సరాలకొకసారి జనాభాను లెక్కిస్తారు.
  2. ఈ మధ్యకాలంలో స్త్రీ – పురుష, చిన్న – పెద్ద తేడాలతో మాత్రమేగాక వివిధ కులాల, వర్గాల ప్రాతిపదికగా జనాభాను లెక్కించారు.
  3. 2001 వ సంవత్సరంలో జనాభాను లెక్కించాక తిరిగి పదేళ్ళ తర్వాత 2011వ సంవత్సరంలో జనాభా లెక్కలను భారత ప్రభుత్వం ప్రకటించింది.
  4. 2011 జనాభా లెక్కల ప్రకారం జాతీయస్థాయిలో పురుషుల అక్షరాస్యత 82.14%గా ఉంది.
  5. స్త్రీల అక్షరాస్యత 70.04% గా ఉంది.
  6. ఈ రెండింటి మధ్య తేడా 12.10. దీని ద్వారా పురుషుల కంటే స్త్రీల అక్షరాస్యతా సంఖ్య తక్కువ
  7. రాష్ట్రస్థాయిలో చూస్తే పురుషుల అక్షరాస్యతా శాతం 75.56% గా ఉంది.
  8. మహిళల అక్షరాస్యత 59.74% గా ఉంది.
  9. ఈ రెండింటి మధ్య తేడా 15.82%
  10. మన రాష్ట్రంలో మహిళల అక్షరాస్యతా శాతం ఇంకా పెరగాల్సి ఉంది.

AP Board 9th Class Telugu Solutions Chapter 6 ప్రబోధం

ఈ) సృజనాత్మకంగా రాయండి.

ప్రశ్న 1.
సునీతా విలియమ్స్ భారత సంతతికి చెందిన అమెరికా అంతరిక్ష పరిశోధకురాలు. ఆమెకు సంబంధించిన వివరాలు కింద ఉన్నాయి. వాటి ఆధారంగా ఆమె జీవిత విశేషాలను వర్ణనాత్మకంగా రాయండి. – పూర్తి పేరు సునీతా పాండ్యకృష్ణ – జననం 19 సెప్టెంబరు, 1965.
– అమెరికా అంతరిక్ష పరిశోధకురాలు
– అంతరిక్షంలో అత్యధిక సమయం నడిచిన తొలి మహిళ.
– ఎక్కువసార్లు అంతరిక్షయాత్ర చేసిన మహిళ
– 1998లో NASA చేత ఎంపిక.
– 2007లో భారత పర్యటన.
– గుజరాత్ లో స్వగ్రామం (జులాసన్), సబర్మతి సందర్శన
– విశ్వప్రతిభ అవార్డ్, ఫస్ట్ పర్సన్ ఆఫ్ ఇండియన్ డీసెంట్ అవార్డు.
– 4 అక్టోబర్ 2007లో “అమెరికన్ ఎంబసీ” లో ప్రసంగం.
– భారత ప్రధానితో సమావేశం.
– NASA లో డిప్యూటీ చీఫ్ గా 2008లో బాధ్యత.
జవాబు:
ప్రాచీన కాలపు భారతదేశ చరిత్రలో మహిళలు పురుషులతో పోటీపడటమే గాక, వారినధిగమించి తమ సత్తా చాటుకొన్న సందర్భాలు కోకొల్లలు. స్త్రీలు యజ్ఞ నిర్వాహకులుగా ఉన్నట్లు వేదమంత్రాల ద్వారా తెలుస్తుంది. గార్గియనే మహిళా శిరోమణి వేదవేదాంగాలలోను నిష్ణాతురాలు. తనను శాస్త్రవాదనలో ఓడించినవానినే వివాహం చేసుకుంటానని కఠోర ప్రతిజ్ఞ చేసింది. ఎందరో మహాపండితులను శాస్త్ర వాదనలో ఓడించింది. చివరకు యాజ్ఞవల్క్య మహర్షితో జరిగిన శాస్త్ర చర్చలో ఓడిపోయి, ఆ మహానుభావుణ్ణి వివాహం చేసుకొంది. తదనంతర కాలంలో భర్త ద్వారా బ్రహ్మవిద్యను పొంది మహా ప్రజ్ఞావంతురాలిగా పేరొందింది. తదనంతర కాలంలో మహిళలు తమ సామర్థ్యాన్ని విస్మరించి కష్టాల కడలిలో మునిగిపోయారు. కాని ఆధునిక కాలంలో మహిళలు ప్రతికార్యంలోనూ పురుషులతో పోటీపడుతున్నారు. తమ శక్తియుక్తులకు పదును పెడుతున్నారు. ఈ మధ్యకాలంలోనే భారతీయ మహిళ “కల్పనా చావ్లా” మొట్టమొదటిసారిగా అంతరిక్షంలో ప్రవేశించింది. మహిళల గొప్పదనాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటింది. కాని అంతటితో సంతృప్తి పడక స్వర్గలోకానికి కూడా ఆ కీర్తిని చాటాలని సంకల్పించి స్వర్గ సోపానాలను (మెట్లను) అధిరోహించింది.

కల్పనాచావ్లా లేని లోటును తాను భర్తీ చేస్తానని భారతీయులను ఊరడించింది శ్రీమతి సునీతా విలియమ్స్. సునీతా భారత సంతతికి చెందిన అమెరికా అంతరిక్ష పరిశోధకురాలు. ఈమె పూర్తి పేరు సునీతా పాండ్యకృష్ణ, ఈమె 19-9-1965న జన్మించింది. ప్రపంచవ్యాప్తంగా మహిళలందరూ గర్వించేలా అంతరిక్షంలో అత్యధిక సమయం నడిచిన తొలి మహిళగా గుర్తింపు పొందింది. 1998వ సంవత్సరంలో NASA చేత ఎంపిక చేయబడి అంతరిక్షయానం చేసింది. తన అనుభవాలను, అనుభూతులను భారతీయులతో పంచుకోదలచి 2007వ సంత్సరంలో భారతదేశంలో పర్యటించింది. గుజరాత్ రాష్ట్రంలో తన స్వగ్రామమైన జులాసనను, సబర్మతీ ఆశ్రమాన్ని సందర్శించింది. భారతీయుల ఆత్మీయతను, ఆప్యాయతను చవిచూసింది. వారు ప్రేమతో ఇచ్చిన ‘విశ్వ ప్రతిభ అవార్డు’ను, “ఫస్ట్ పర్సన్ ఆఫ్ ఇండియన్ డీసెంట్ అవార్డు’ను స్వీకరించి, గర్వంగా భావించింది. 4-10-2007వ తేదీన “అమెరికన్ ఎంబసీ’లో ప్రసగించింది. తర్వాత భారత ప్రధానితో సమావేశమై కృతజ్ఞతలు తెలిపింది. 2008వ సంవత్సరంలో NASA లో డిప్యూటీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించింది. ఒక మహిళ అందులోను భారతీయ సంతతి అలాంటి ఉన్నతపదవిని పొందడం అదే ప్రథమం.

AP Board 9th Class Telugu Solutions Chapter 6 ప్రబోధం

ఉ) ప్రశంసాత్మకంగా రాయండి. రాణి కుటుంబ ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవటం వల్ల 7వ తరగతి వరకు చదివి బడి మానేసింది. ఉపాధ్యాయురాలి ప్రోత్సాహంతో కస్తూర్బా పాఠశాలలో చేరి పదోతరగతి వరకు చదివి, పదోతరగతి పబ్లిక్ పరీక్షలో 9.7 పాయింట్స్ సాధించి కలెక్టర్ గారి చేతుల మీదుగా బహుమతినందుకున్నది. ఆమెను ప్రశంసిస్తూ లేఖ రాయండి.
జవాబు:

ప్రశంసా లేఖ

గుంటూరు,
x x x x

ప్రియమైన మిత్రురాలు రాణికి !

నీ స్నేహితురాలు కల్పన రాయునది. ఎవరీ కల్పన అని ఆలోచిస్తున్నావా? అట్టే శ్రమపడకు, నేను నీకు తెలియదు కాని నీ గురించి దిన పత్రికల్లో చదివి, ఆనందం ఆపుకోలేక నా ప్రశంసలు నీకు తెలియజేయాలని ఈ లేఖ రాస్తున్నాను.

మన రాష్ట్రంలో చాలామంది బాలికలు పేదరికం కారణంగా ప్రాథమిక స్థాయిలోనే చదువు ఆపేస్తున్నారు. అందరిలా నీవు కూడా ఏడవ తరగతితోనే చదువు ఆపి ఉంటే అది పెద్దవార్త అయ్యేదిగాదు. కాని నీ అదృష్టం కొద్దీ నీ ఉపాధ్యాయురాలు పాఠశాల మానిన నిన్ను కస్తూర్బా పాఠశాలలో చేర్పించింది. ఉచిత విద్యతోపాటు నివాసం, వస్త్రాలు, పుస్తకాలు, భోజన సౌకర్యాలు ఉచితంగా ఆడపిల్లలకు కల్పిస్తూ వారి కోసమే ప్రభుత్వం కస్తూర్బా పాఠశాలలను ఏర్పరచింది. ఈ పాఠశాలలు అందుబాటులో ఉన్నా ఎంతోమంది బాలికలు విద్యకు దూరమవుతున్నారు. వీటి గురించిన అవగాహన వారికి లేకపోవడమే ఇందుకు కారణం.

పాఠశాలలో చేరిన నువ్వు విద్యపైనే శ్రద్ధ పెట్టి బాగా చదవడం పదవతరగతి పబ్లిక్ పరీక్షలో 9.7 పాయింట్లు సాధించడం నిజంగా గొప్ప విషయం. చదువే లోకంగా ఉంటే తప్ప ఇది సాధ్యం కాదు. ఒక తపస్సులా విద్యాభ్యాసం సాగించిన నిన్ను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను. నువ్వు నా తోటి విద్యార్థినులకే గాక నాలా వార్తాపత్రికల ద్వారా, దూరదర్శన్ వంటి ప్రసార మాధ్యమాల ద్వారా తెలుసుకున్న అమ్మాయిలకు చాలామందికి ఆదర్శంగా నిలిచావు.

కలెక్టర్ గారు నిన్ను అభినందిస్తున్న దృశ్యం దూరదర్శన్ లో చూస్తుంటే నా ఒళ్ళు పులకరించి పోయిందనుకో. నాతో పాటు చదువుతూ, మధ్యలోనే చదువు మానేసిన నా స్నేహితురాళ్ళకు నీ గురించి చెప్పాను. ప్రముఖులందరూ నిన్ను ప్రశంసిస్తున్న దృశ్యాలను చూపాను. వారు కూడా ఎంతో సంతోషించారు. నువ్వు మా సోదరివైతే ఎంత బాగుణ్ణు అని ఎవరికి వారే అనుకున్నాం. ఇప్పుడైనా నువ్వు మా సోదరివే. నీ నుండి మేమెంతో స్ఫూర్తి పొందాం. పేదరికం విద్యకు అడ్డంకి కాలేదని నీవు నిరూపించాలని మన స్ఫూర్తిగా కోరుతున్నాను.
ధన్యవాదాల

ఇట్లు,
నీ మిత్రురాలు,
ఎ. కల్పన,
9వ తరగతి,
తెలుగుమాధ్యమం,
క్రమసంఖ్య – 18,
శారదానికేతన్ – బాలికోన్నత పాఠశాల,
బ్రాడీపేట 2/14, గుంటూరు.

చిరునామా :
పి. రాణి,
వెంకటేష్ నాయక్ గారి కుమార్తె,
రేగులగడ్డ గ్రామం,
మాచవరం మండలం,
గుంటూరు జిల్లా.

IV. ప్రాజెక్టు పని

వివిధ రంగాలలో ప్రసిద్ధులైన స్త్రీల పేర్లు సేకరించి వారు ఏ రంగంలో పేరు పొందారో పట్టికను రాసి ప్రదర్శించండి.
ఉదా :
క్రీడలకు సంబంధించిన వారు, రచయిత్రులు – మొదలయిన వారు.

పేరుప్రసిద్ధిగాంచిన రంగం
1. మొల్లకవయిత్రి
2. రంగాజమ్మకవయిత్రి
3. ఇందిరాగాంధీరాజకీయం
4. పి.టి. ఉషక్రీడలు
5. అశ్వని నాచప్పక్రీడలు
6. కల్పనాచావ్లావ్యోమగామి
7. సునీతా విలియమ్స్వ్యోమగామి
8. కిరణ్ బేడిరక్షణ విభాగం
9. మదర్ థెరిస్సాదీనజనసేన
10. డొక్కా సీతమ్మఅన్నదాత
11. శారదామాతఆధ్మాత్మిక రంగం
12. శకుంతలాదేవిగణితశాస్త్రం
13. యద్దనపూడి సులోచన రాణినవలా రచయిత్రి
14. ఐశ్వర్యారాయ్చలనచిత్రం
15. అరుంధతీరాయ్ఆంగ్ల సాహిత్య రచయిత్రి
16. శోభానాయుడునాట్యకారిణి
17. యమ్.యస్. సుబ్బులక్ష్మిసంగీతం
18. కిరణ్ మజుందార్ షావాణిజ్యం

III. భాషాంశాలు

పదజాలం

అ) కింది పట్టికలో సమానార్థక పదాలున్నాయి. వాటి నుండి పట్టిక కింద ఇచ్చిన పదాలకు పర్యాయపదాలు వెతికి రాయండి.
AP Board 9th Class Telugu Solutions Chapter 6 ప్రబోధం 1
1) వనిత, 2) లక్ష్మి, 3) కరుణ, 4) నెచ్చెలి, 5) శీఘ్రం, 6) అనిశం, 7) భ్రాత. 8) విక్రమం , 9) విదుషి
జవాబు:
1) వనిత : స్త్రీ, పడతి
2) లక్ష్మి : శ్రీ, రమ
3) కరుణ : దయ, జాలి
4) నెచ్చెలి : స్నేహితురాలు, ప్రాణసఖి
5) శీఘ్రం : వేగం, తొందర
6) అనిశం : ఎల్లప్పుడు, సదా
7) భ్రాత : సోదరుడు, సహోదరుడు
8) విక్రమం : పరాక్రమం, శౌర్యం
9) విదుషి : విద్వాంసురాలు, పండితురాలు

AP Board 9th Class Telugu Solutions Chapter 6 ప్రబోధం

ఆ) కింది వాటిలో ప్రకృతి, వికృతులు కలగలిసి ఉన్నాయి. వాటిని వేరుచేసి, ఎదురెదురుగా రాయండి.
ఫలము, లచ్చి, విద్దె, కృష్ణుడు, ఇంతి, లక్ష్మి, పండు, స్త్రీ, కన్నయ్య, విద్య, శక్తి,
జవాబు:
ప్రకృతి – వికృతి
ఫలము – పండు
లక్ష్మి – లచ్చి
విద్య – విద్దె
కృష్ణుడు – కన్నయ్య
స్త్రీ – ఇంతి
శక్తి – సత్తు

ఇ) కింది పదాలకు అర్థాలను గుర్తించి కింద గీత గీయండి. ఆ అర్థాన్ని ఉపయోగించి వాక్యాలు రాయండి.
ఉదా :
అనిశం = ఎల్లప్పుడు, అన్నము, గాలి
వాక్యం : సూర్యుడు ఎల్లప్పుడు తూర్పున ఉదయిస్తాడు.

1. విదుషీమణి అను విద్యావంతురాలు, నాయకురాలు, పండితురాలు.
వాక్యం : సరోజినీ నాయుడు ఆంగ్లభాషలో గొప్ప పండితురాలు.

2. నిర్మలం : స్వేచ్ఛ, స్వచ్ఛమైనది, భిన్నం కానిది.
వాక్యం : ఈ కొలను చాలా స్వచ్చమైనది.

3. కల్మషం : కలశం, కమలం, పాపం
వాక్యం : ఏ పాపం చేయని వారే తప్పు చేసిన వారిని శిక్షిం’ ‘లని ఏసుక్రీస్తు ప్రబోధించాడు.

4. ప్రతిబంధకం = ఎదిరించేది, అడ్డగించేది, తిరిగి బంధించేది.
వాక్యం : ముస్లిం స్త్రీల విద్యకు బురఖా పద్ధతి అడ్డంకిగా తయారయ్యింది.

ఈ) కింది పదాలకు ఎదురుగా వాటి నానార్థాలున్నాయి. వాటినుపయోగించి వాక్యాలు రాయండి.
ఉదా :
ఫలం (పండు) : నేను తిన్న ఫలం తీయగా ఉలు.
ప్రయోజనం : లక్ష్యం లేకుండా పనిచేస్తే ఫలం లభించదు.

1. పురము (పట్టణం) : గుంటూరు పురము విద్యలకు నెలవు.
(ఇల్లు) : మా పురము పేరు సౌదామిని.

2. నారి (స్త్రీ : బ్రిటిష్ అధికారులను ఎదిరించిన వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి.
(వింటితాడు) : అర్జునుడి నారి ధ్వనికే శత్రువులు భయపడిపోయేవారు.

వ్యాకరణం

అ) కింది కర్మణి వాక్యాలను కర్తరి వాక్యాలుగా మార్చండి.

1. కర్మణి వాక్యం : ఈ పురంలోని హిందూ సమాజంచారి యాజమాన్యంలో పై సభ జరుపబడింది.
కర్తరి వాక్యం : ఈ పురంలోని హిందూ సమాజం వారి యాజమాన్యంలో పై సభను జరిపారు.

2. కర్మణి వాక్యం : తిరువాన్కూరులో ఒక స్త్రీ మంత్రిణిగా నియమించబడింది.
కర్తరి వాక్యం : తిరువాన్కూరులో ఒక స్త్రీని మంత్రిణిగా నియమించారు.

3. కర్మణి వాక్యం : విద్యాసంఘాలలో స్త్రీలు సభ్యురాండ్రుగా నియమింపబడ్డారు.
కర్తరి వాక్యం : విద్యాసంఘాలలో స్త్రీలను సభ్యురాండ్రుగా నియమించారు.

ఆ) పడ్వాది సంధి :
భయము + పడు – భయపడు (మువర్ణానికి లోపం)
భయము + పడు – భయంపడు (బిందువు రావడం)

విడదీసిన పగాలకు, కలిపిన పదాలకు తేడా గమనించండి. కలిపిన పదంలో ‘ము’కు బదులుగా (0) వచ్చింది. ‘ము’ లోపించింది.

సూత్రం :
పడ్వాదులు పరమగునప్పుడు ‘ము’ వర్ణకానికి లోపమూ, పూర్ణబిందువూ (0) విభాషగా అవుతాయి.

పడ్వాదులు :
పడు, పట్టె, పాటు, పఱచు, పెట్టు మొదలగునవి.

AP Board 9th Class Telugu Solutions Chapter 6 ప్రబోధం

ఇ) కింది వాటిని గమనించండి :
1. తృప్తిగంటిని – తృప్తి పొందాను.
2. ఉపన్యసించిరి – ఉపన్యసించారు.
3. తీర్మానములు గావించియున్నారు – తీర్మానాలు చేశారు.
4. లభించినవి – లంచాయి.
5. చేయుదురు – చేస్తారు.

గమనిక :
మార్పు దాదాపు చివరి రెండు మూడు అక్షరాలలోనే రావడం గమనించండి. గ్రాంథిక భాషా పదాలు వ్యవహారభాషలోకి మార్చాలంటే – నిత్యం మనం మాట్లాడే భాషను బాగా పరిశీలించాలి.

కింది పదాలను వ్యవహారభాషలోకి మార్చండి.

గ్రాంథికమువ్యవహారభాష
1) చూడుడు1) చూడండి
2) సాహసించును2) సాహసిస్తుంది/సాహసిస్తాడు
3) కలిగియుండవలెను3) కలిగి ఉండాలి

9th Class Telugu 6th Lesson ప్రబోధం రచయిత్రి పరిచయం

కనుపర్తి వరలక్ష్మమ్మ గుంటూరు జిల్లా బాపట్లలో 6. 10. 1896న జన్మించారు. ఆమె భర్త కనుపర్తి హనుమంతరావు ప్రోత్సాహంతో సుమారు 50 కథలు, రెండు నవలలు రచించారు. భారతి, గృహలక్ష్మి, అనసూయ, వినోదవాణి, ఆనందవాణి మొదలయిన పత్రికలలో రచనలు చేశారు. గృహలక్ష్మి పత్రికలో సుమారు ఆరు సంవత్సరాలపాటు శారదలేఖలు ప్రచురణ అయ్యాయి. ‘లీలావతి’ అనే కలం పేరుతో ఆంధ్రపత్రికలో ‘మా చెట్టునీడ ముచ్చట్లు’ శీర్షికతో రచనలు చేశారు. ‘గాంధీ దండకం’ రచించారు. దేశభక్తిని, దైవభక్తిని ప్రబోధిస్తూ అనేక పాటలు, పద్యాలు, కనుపర్తి వరలక్ష్మమ్మ నాటికలు రచించారు.

ధర్మము నా జీవము, నీతి నా మతము, సతీశ్రేయము నా లక్ష్యం అని ప్రకటించి, కలముపట్టి రచనలు చేసిన ‘విదుషీమణి’ కనుపర్తి వరలక్ష్మమ్మ. వీరి సాహిత్యకృషికి గుర్తింపుగా 1930లో గృహలక్ష్మి స్వర్ణపతకం, 1934లో ‘స్వర్ణకంకణం’ అందుకున్నారు. 1967లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి ఉత్తమ రచయిత్రి పురస్కారాన్ని అందించింది. గుడివాడలో జరిగిన సప్తతి మహోత్సవ సన్మానసభలో ‘కవితా ప్రవీణ’ బిరుదును పొందారు. 1975లో ప్రథమ ప్రపంచ తెలుగుమహాసభల స్వర్ణఫలకం, తామ్రపత్ర బహుమతి నందుకున్నారు.

కఠిన పదాలకు అర్థాలు

సౌభాగ్యవతి = ముత్తైదువ (శ్రీమతి)
నెచ్చెలి (నెఱు + చెలి) = ప్రాణ స్నేహితురాలు
శుభ, సమాచారము = మంచి, ముచ్చట
వనితామణి = స్త్రీ రత్నము
గంభీరోపన్యాసము = గంభీరమైన ఉపన్యాసము
ఆలింపవలెనని = వినాలని
స్తంభించిపోయినది = మొద్దువారినది
ఎల్లరు = అందరు
అనిశము = ఎల్లప్పుడు
ఉత్కంఠపడు = ఇష్టమైన వస్తువును పొంద డానికి తొందరపడు
కవయిత్రి = కవిత్వం అల్లే స్త్రీ
విదుషీమణి = గొప్ప విద్వాంసురాలు
నారీరత్నము = స్త్రీ రత్నము
మహత్తరోపన్యాసము = గొప్ప ఉపన్యాసము
లేఖామూలముగా = ఉత్తరం ద్వారా
కొమార్తె = కూతురు
అగ్రాసనాధిపురాలు = అధ్యక్షురాలు
ఆంగ్లభాష = ఇంగ్లీషుభాష
మహనీయుడు = గొప్పవాడు
సారాంశము = తాత్పర్యము
మహిళాసభ = స్త్రీ సభ
బాల్యవివాహము = చిన్నవారికి వివాహము
పడయజాలక = పొందలేక
తత్పలితము = దాని ఫలితము
మంత్రిణి = మంత్రిగా ఉన్న స్త్రీ
నిర్వహింపుచున్నది = నెరవేర్చుతుంది
సభ్యురాండ్రు = సభలోని స్త్రీలు
ప్రతిబంధకము = అడ్డగించునది
రూపుమాపవలెను = నశింపజేయాలి
లక్ష్మీప్రసన్నత = ధనము కలుగుట
సరస్వతీప్రసన్నత = చదువువచ్చుట
బిడియము = సిగ్గు
అశక్తలు = శక్తిలేని వారు
విదుషీమణులు = శ్రేష్ఠమైన విద్వాంసురాండ్రు
పశ్చాత్తాపము = తాను చేసింది తప్పు అని తెలిసినపుడు, అలా చేశానే అని తరువాత చింతించుట
విశ్వమానవ భ్రాతృత్వము = ప్రపంచ మానవ సోదరత్వము
అకల్మష హృదయము = పాపము లేని మనసు
తనువు = శరీరము
చిత్త సంస్కారము = మనస్సు శుద్ధి
అస్పృశ్యులు = అంటరానివారు
అర్పించుట = ఇచ్చుట
నిర్మలము = స్వచ్ఛము
కరుణాభరితము = దయతో కూడినది
ప్రేమ పూర్ణము = ప్రేమతో నిండినది
పడయగోరు = పొందగోరు
ముఖ్యాంశములు (ముఖ్య + అంశములు) = ముఖ్య విషయాలు

AP Board 9th Class Telugu Solutions Chapter 1 శాంతికాంక్ష

AP State Syllabus AP Board 9th Class Telugu Textbook Solutions Chapter 1 శాంతికాంక్ష Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Telugu Solutions 1st Lesson శాంతికాంక్ష

9th Class Telugu 1st Lesson శాంతికాంక్ష Textbook Questions and Answers

చదవండి-ఆలోచించండి-చెప్పండి

అది 1945 వ సంవత్సరం. రెండో ప్రపంచ యుద్ధంలో అమెరికా జపాన్ లోని హిరోషిమా అనే నగరం మీద అణుబాంబులతో దాడి చేసింది. దాని ఫలితంగా కొద్ది క్షణాల్లో అరవైఆరు వేలమంది ప్రాణాలు కోల్పోయారు. డెబ్బై వేలమంది క్షతగాత్రులయ్యారు. నిన్న మొన్నటి వరకూ అక్కడి ప్రజలకు అది పీడకలగా నిలిచిపోయింది.

ప్రశ్నలు జవాబులు

ప్రశ్న 1.
ఈ పేరా చదివాక మీకేమర్థమైంది?
జవాబు:
యుద్ధం వలన జననష్టం ఎక్కువగా జరుగుతుందని అర్థమైంది.

ప్రశ్న 2.
మానవ కళ్యాణానికి ఉపయోగపడాల్సిన సైన్సు దేనికి దారితీసింది?
జవాబు:
మానవ వినాశనానికి దారితీసింది.

AP Board 9th Class Telugu Solutions Chapter 1 శాంతికాంక్ష

ప్రశ్న 3.
ఆధునిక కాలంలో యుద్ధాలవల్ల ఎలాంటి నష్టాలు సంభవిస్తాయి?
జవాబు:
ఆధునిక కాలంలో యుద్ధాలలో రసాయనిక బాంబులను, అణుబాంబులను ఉపయోగించే ప్రమాదముంది. దీనివల్ల ప్రపంచపటంలోని కొన్ని దేశాలు కనుమరుగయ్యే అపాయం ఉంది.

ప్రశ్న 4.
యుద్ధాలను నివారించడానికి, శాంతిని నెలకొల్పడానికి ఏం చేయాలి?
జవాబు:
యుద్ధాలను నివారించడానికి, శాంతిని నెలకొల్పడానికి ప్రపంచదేశాలన్నీ అసమానతలను వీడాలి. సోదర భావంతో మెలగాలి.

ఇవి చేయండి

I. అవగాహన – ప్రతిస్పందన

అ) కింది అంశాలను గురించి చర్చించండి.

ప్రశ్న 1.
శ్రీకృష్ణుణ్ణి కష్టాలను తొలగించే వ్యక్తిగా ధర్మరాజు కీర్తించాడు గదా! అలా ఎందుకన్నాడో చర్చించండి.
జవాబు:
పాండురాజు మరణిస్తూ శ్రీకృష్ణుణ్ణి ఆశ్రయించమని పాండవులకు సూచించాడు. పాండవులను చిన్నప్పటి నుండి శ్రీకృష్ణుడు అనేక కష్టాల నుండి రక్షించాడు. లక్క ఇంటి ప్రమాదం నుండి, ద్రౌపది వస్త్రాపహరణ ఘట్టంలో, అరణ్యవాస సమయంలో, ఇలా పలు సందర్భాల్లో శ్రీకృష్ణుడు కాపాడటం ధర్మరాజుకు తెలుసు. ధర్మరాజు ధర్మాన్నే ఆశ్రయించినవాడు కాగా శ్రీకృష్ణుడు ధర్మపక్షపాతి. అందుకే ధర్మరాజు శ్రీకృష్ణుణ్ణి ఆశ్రయించాడు.

యుద్ధం లేకుండా, బంధునాశనం కాకుండా, తమ రాజ్యం తమకు రావాలని ధర్మరాజు కోరిక. దాన్ని నెరవేర్చగల సమర్థుడు శ్రీకృష్ణుడని అతని విశ్వాసం. ఒకవేళ యుద్ధం తప్పనిసరి అయితే దానికి కారకుడిగా దుర్యోధనుడినే లోకం నిందించాలి తప్ప తమని నిందించకూడదనేది ధర్మజుడి కోరిక. అలా “కర్ర విరగకుండా పాము చావకుండా” – కార్యం సాధించగల నేర్పరి శ్రీకృష్ణుడు. కాబట్టే కష్టాలను తొలగించే వ్యక్తిగా ధర్మరాజు కృష్ణుణ్ణి కీర్తించాడు.

ఎదుటివారి మనోభావాలను చక్కగా గ్రహించి, తదనుగుణంగా వ్యూహాన్ని పన్నగల మేధావి శ్రీకృష్ణుడు. దక్షుడు కాబట్టే ఈ అసాధ్య కార్యాన్ని సాధించగలడని, రాయబార సమయంలో దుర్యోధనాదులు ఏవైనా ఇబ్బందులు కలిగించినా తప్పుకొనిరాగల ధీరుడని ధర్మరాజు నమ్మకం. పాండవుల హృదయాల్ని లోకానికి తెలియబరచగలిగిన వాక్చాతుర్యం, అవసరమైతే తగిన సమాధానం చెప్పగల నేర్పు, తగినంత ఓర్పు గల మహానుభావుడు శ్రీకృష్ణుడు. అందుకనే శ్రీకృష్ణుణ్ణి కష్టాలను తొలగించే వ్యక్తిగా ధర్మరాజు కీర్తించాడు.

శ్రీకృష్ణుడు తాను చిన్నప్పటి నుండే మానవాతీత శక్తుల్ని ప్రదర్శించాడు. పూతన, శకటాసురుడు మొదలైన రాక్షసులను చంపడం, కాళీయుని పడగలపై నాట్యం చేయడం వంటి అతిమానుష శక్తుల్ని కలిగి ఉన్నాడు. గోవర్ధనగిరిని పైకిలేపుట వంటి కార్యాల ద్వారా తాను పరమాత్ముడనే సత్యాన్ని వెల్లడి చేశాడు. కుంతీదేవి కూడా కృష్ణుడిని మేనల్లునిగా గాక భగవంతునిగానే సంభావించింది. కష్టాల నుండి గట్టెక్కించేవాడు, ఎల్లప్పుడు శుభాలను కలిగించేవాడు భగవంతుడు ఒక్కడే. కాబట్టే కృష్ణునికి శరణాగతుడైనాడు ధర్మరాజు.

ప్రశ్న 2.
యుద్ధాల వల్ల కలిగే నష్టాలు, అనర్దాలు చెప్పండి.
జవాబు:
యుద్దాల వల్ల సంపదలు కలిగినా ప్రాణహాని కూడా జరుగుతుంది. బలహీనులు బలవంతుని చేతిలో చనిపోతారు. ఒక్కొక్కసారి బలవంతులు సైతం బలహీనుల చేతిలో సమసిపోతారు. యుద్ధంలో ఎవరు గెలుస్తారో, ఎవరు ఓడిపోతారో నిశ్చయించి చెప్పలేము. ఒకవేళ సంగ్రామంలో అపజయం కలిగితే అది చావు కంటే భయంకరమైనది. యుద్ధం అన్ని అనర్థాలకు మూలం. యుద్ధానికి మూలం పగ. పగ కారణంగానే యుద్ధజ్వాల రగులుతుంది. పగ తగ్గితే యుద్ధ ప్రవృత్తి సహజంగానే తొలగిపోతుంది.

ఒకసారి పగ సాధింపునకు దిగితే ఇక దయాదాక్షిణ్యాలు ఉండవు. సంధికి అవకాశం ఉండదు. దారుణమైన క్రూరవృత్తితో శత్రుసంహారమే కొనసాగుతుంది. లక్ష్యం కొద్దిమందికే అయినా ఎంతోమంది అమాయకులు ప్రాణాలు కోల్పోతారు. చాలామంది వికలాంగులవుతారు. భర్తలను కోల్పోయిన స్త్రీలు, వారి కుటుంబాలు వీధినబడతాయి. తమ పిల్లల్ని కోల్పోయిన వృద్ధులు అనాథలవుతారు. దేశంలో కరవుకాటకాలు విలయతాండవం చేస్తాయి.

పూర్వకాలంలోని యుద్ధాలకు నీతినియమాలుండేవి. కానీ ఆధునిక కాలంలో యుద్ధాలకు అవి వర్తించడం లేదు. పూర్వం యుద్ధాలు సూర్యోదయం తర్వాత ఆరంభమై సూర్యాస్తమయంతో ముగిసేవి. నేడు రాత్రివేళల్లో కూడా యుద్ధాలు జరుగుతున్నాయి. ఆధునిక కాలంలో మానవుని విజ్ఞానం బాగా పెరిగి, అణ్వాయుధాలు, రసాయనిక ఆయుధాలు కనుగొనబడి యుద్ధాల్లో ప్రయోగించబడుతున్నాయి. వీటివల్ల దేశాలకు దేశాలే ప్రపంచ పటం నుండి మాయమయ్యే పరిస్థితులేర్పడుతున్నాయి. యుద్ధంలో పాల్గొనే దేశాలకే కాక ఇతర ప్రపంచ దేశాలకు సైతం నేడు అనర్థాలు కలుగుతున్నాయి.

బాంబుల విస్ఫోటనాల వల్ల జలకాలుష్యం, వాయు కాలుష్యాలేర్పడి ప్రక్కనున్న దేశాలు కూడా నష్టమౌతున్నాయి. పరిసరాల కాలుష్యం వలన యుద్ధం జరిగి కొన్ని సంవత్సరాలైనా అక్కడి ప్రజలు ఇంకా కోలుకోని దుస్థితులేర్పడుతున్నాయి. గ్రామాలలో, కొండలలో నక్కిన శత్రువులను చంపడం కోసం చేసే వైమానిక దాడుల్లో ఎందరో అమాయక ప్రజలు, పశువులు ప్రాణాలు కోల్పోతున్నాయి. యుద్ధ సమయంలో అరబ్బు దేశాల్లో పెట్రోలు బావుల పై బాంబులు పడి మంటలు రేగి కలిగిన నష్టం ఎప్పటికీ తీర్చలేనిది.

AP Board 9th Class Telugu Solutions Chapter 1 శాంతికాంక్ష

ఆ) గుర్తున్న పద్యాలకు ప్రతిపదార్థాలు రాయండి.

శా|| ఆ దుర్యోధనుఁడంత మాత్రయును జేయంజాలఁడో కాని, పెం
పేదం గ్రూరత కోర్వరాదు, సిరి నాకేలందునే, గ్రాసవా
సోదైన్యంబులు వచ్చు నాయరయు నీ చుట్టాలకుం, గావునన్
మోదంబందుట గలుఁ గౌరవులు నేముం బొంది శ్రీనొందినన్.
ప్రతిపదార్థం :
ఆ దుర్యోధనుడు = ఆ సుయోధనుడు
అంతమాత్రయును = ఆ కొలదియైనను
చేయన్ = చేయడానికి
చాలడు + ఓ = ఇష్టపడడేమో
కాని = కాని
పెంపు = అభివృద్ధి
ఏదన్ = నశించునట్లుగా
క్రూరతకున్ = క్రౌర్యమునకు
ఓర్వరాదు = సహించగూడదు
సిరి = రాజ్యం (సంపద)
నాకున్ + ఏల = నాకెందుకు
అందున్ + ఏ =అని అందునా
నా + అరయు = నేను బాగోగులు చూసుకోవలసిన
ఈ చుట్టాలకున్ = ఈ ఆశ్రితులకు (పరివారానికి, బంధువులకు)
గ్రాస = తిండికి
వాసః = బట్టకు (నివాసానికి)
దైన్యంబులు = దురవస్థలు
వచ్చు = కల్గుతాయి
కావునన్ = కాబట్టి
కౌరవులున్ = కౌరవులును
ఏమున్ = మేమును
పొంది = సంధి చేసుకొని
శ్రీన్ = రాజ్యాన్ని
పొందినన్ = పొందినట్లైతే (పంచుకున్నట్లైతే)
మోదంబు = (అందరికీ) సంతోషం
అందుట = పొందుట
కల్గున్ = జరుగుతుంది
అని ధర్మరాజు శ్రీకృష్ణునితో అన్నాడు.

సూచన : పాఠంలోని పద్యాలు అన్నింటికీ ప్రతిపదార్థాలు, భావాలు ముందు ఇవ్వబడ్డాయి. * గుర్తుపెట్టిన పద్యాల ప్రతిపదార్థాలు చదవండి.

ఇ) కింది పేరాను చదివి ఎలా, ఎందుకు? అనే ప్రశ్న పదాలను మాత్రమే ఉపయోగించి కొన్ని ప్రశ్నలు తయారుచేయండి.
మనసుకు నచ్చిన పనులే పిల్లలు ఇష్టంగా చేస్తారు. కఠినంగా మాట్లాడితే పిల్లలకు నచ్చదు. కాబట్టి అలా మాట్లాడేవారికి దూరంగా ఉంటారు. పిల్లలు అద్భుతంగా ఆలోచిస్తారు. కొందరు తల్లిదండ్రులు పిల్లల్ని అర్థం చేసుకోలేక అనవసరంగా బాధపడుతుంటారు. తమకు స్వేచ్ఛ ఉన్నచోటనే నిర్భయంగా ప్రశ్నిస్తారు. భద్రత ఉందని భావిస్తేనే, స్వేచ్చగా ఉంటారు. మనసు విప్పి మాట్లాడతారు.

ప్రశ్నలు:
1. మనసుకు నచ్చిన పనులే పిల్లలు ‘ఎలా’ చేస్తారు?
2. కఠినంగా మాట్లాడితే పిల్లలకు ఎందుకు నచ్చదు?
3. కఠినంగా మాట్లాడే వారితో పిల్లలు ఎలా ఉంటారు?
4. పిల్లలు ‘ఏలా’ ఆలోచిస్తారు?
5. కొందరు తల్లిదండ్రులు ‘ఎందుకు’ బాధపడుతూ ఉంటారు?
6. ఎలా ఉన్నచోట పిల్లలు నిర్భయంగా ప్రశ్నిస్తారు?
7. ఎందుకు స్వేచ్ఛగా ఉంటారు?
8. స్వేచ్ఛ ఉన్నచోట పిల్లలు ఎలా మాట్లాడతారు?

ఈ) పాఠం చదవి కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
ధర్మరాజు రాజ్యసంపద దేనికోసం కోరాడు?
జవాబు:
క్షత్రియ ధర్మాన్ని పాటించడం ఎంతో కష్టం. అలాగని రాజు వేరే ధర్మాలను పాటించకూడదు. కాబట్టి ఆయుధాలను చేపట్టి రాజ్యసంపదను పొందాలి. పోనీ రాజ్యసంపద తనకెందుకని కౌరవులను అడగటం మానితే, తననే ఆశ్రయించుకొని ఉన్న తన తమ్ములకు, బంధుజనాలకు కూటికీ, గుడ్డకు సైతం ఇబ్బంది ఏర్పడుతుంది. కాబట్టే ధర్మరాజు రాజ్యసంపదను కోరాడు.

ప్రశ్న 2.
శత్రుత్వ భావనను కవి దేనితో పోల్చాడు?
జవాబు:
శత్రుత్వ భావనను కవి పామున్న ఇంటిలో కాపురం ఉండడంతో పోల్చాడు. అంటే పామున్న ఇంట్లో ఎలా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని జీవిస్తామో అలా శత్రుత్వమున్న చోట కూడా ఏ క్షణం ఏమి జరుగుతుందో అని ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని జీవించాలని కవి భావం.

AP Board 9th Class Telugu Solutions Chapter 1 శాంతికాంక్ష

ప్రశ్న 3.
చాకచక్యంగా మాట్లాడమంటూ శ్రీకృష్ణునికి ధర్మరాజు ఎలాంటి సలహా ఇచ్చాడు?
జవాబు:
కృష్ణా ! మా విషయంలో పక్షపాతం చూపించకు ! ధర్మం – నీతి వాటిననుసరించి ఇరుపక్షాలకూ మేలు, అభివృద్ధి జరిగేలా మాట్లాడు. విదురుడు మొదలైన సత్పురుషుల మనసులకు సమ్మతమయ్యేటట్లుగా తగినంత మెత్తదనంతోనూ, అవసరమైనచోట కఠినమైన మందలింపులతోను కురుసభలో రాజులందరూ గ్రహించేలా మాట్లాడు. న్యాయం పట్టించుకోకుండా దుర్యోధనుడు పరుష వాక్యాలు పలికితే సహించు. తొందరపాటుతో సభను విడిచిరాకు. పెద్దలమాటను సుయోధనుడు వినలేదనే నింద అతనికే ఉంచు. మనం గౌరవంగా పెద్దలమాటను, ఉద్దేశాన్ని సాగనిస్తున్నామని లోకులు మెచ్చుకునేలా చేయి.

ఆ ధృతరాష్ట్రుడు సుతపక్షపాతియై సూటిగా ఏ అభిప్రాయాన్ని చెప్పక, అవినీతితో ప్రవర్తిస్తే సంధి కుదరదని సాహసించి పలుకకు. సాహసం చేయాల్సివస్తే జనులంతా మెచ్చుకునేటట్లు ధర్మానికి నిలచి, మాకు విచారం లేకుండా చేయి. నీకంతా తెలుసు. నీకు ఉపాయాలు చెప్పడానికి నేనేమాత్రం వాణ్ణి ? హస్తినాపురానికి వెళ్ళిరా !

II. వ్యక్తీకరణ సృజనాత్మకత

అ) కింది ప్రశ్నలకు పదేసి వాక్యాలలో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
“పామున్న ఇంటిలో కాపురమున్నట్లే” అంటే ఏమిటి? ధర్మరాజు ఈ వాక్యాన్ని ఎందుకు చెప్పాడు?
జవాబు:
ఇంట్లో పాము ఎప్పుడు కాటువేసి ప్రాణాలు తీస్తుందో తెలియదు కాబట్టి ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని ప్రతిక్షణం భయంతో గడపాలి.

యుద్ధానికి మూలం పగ. ఎడతెగని పగే యుద్ధాన్మాదంగా మారుతుంది. మాయాద్యూతంలో మోసంతో, రాజ్యాన్ని కాజేశారనే పగతో పాండవులలో యుద్ధజ్వాల రగుల్కొంది. బలవంతులైన పాండవులు బతికి ఉంటే రాజ్యం దక్కదని అసూయాపరులైన కౌరవులు వారి మీద పగతో యుద్ధానికి సిద్ధపడ్డారు. పగ తగ్గితే యుద్ధం చేయాలనే కోరిక అణగారి పోతుంది. కానీ ఇక్కడ అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. శత్రుత్వం వలన ఎప్పుడూ అశాంతితో ఉండాల్సి వస్తుందని ధర్మరాజు ఈ వాక్యాన్ని చెప్పాడు.

ప్రశ్న 2.
“ఎవరితోనూ దీర్ఘకాలం విరోధం మంచిది కాదు” దీని మీద మీ అభిప్రాయం ఏమిటి?
జవాబు:
పగ ఒకసారి ప్రవేశిస్తే ఇక శాంతి ఉండదు. కాబట్టి దాన్ని తగ్గించడం, తొలగించడం తప్ప మరో మార్గం లేదు. ఎక్కువకాలం పగను మనసులో ఉంచుకోకుండా నిర్మూలించడమే మంచిది. ఎందుకంటే మనసు త్వరగా శాంతిస్తుంది. ఉద్వేగం లేకపోవడం వలన ఆరోగ్యం చక్కబడుతుంది. పగబట్టినవారు ప్రతిరోజూ దుఃఖంతోనే నిద్రిస్తారు. పగ లేకుంటే ప్రశాంత చిత్తంతో సుఖంగా నిద్రిస్తారు. పగ వలన సుఖంలేనివాడు తన సర్వస్వాన్నీ తానే నాశనం చేసుకుంటాడు. అంతకుముందున్న మంచిపేరు కూడా పోతుంది.

దీర్ఘకాల విరోధం వలన కుటుంబాలే గాక వంశాలు కూడా నశించే ప్రమాదం ఉంది. ఒకవేళ ఈ విరోధం రెండుగాని అంతకన్న ఎక్కువ దేశాల మధ్యగాని ఉండేటట్లయితే ప్రపంచశాంతికే భంగం కలుగుతుంది. ఆయా దేశాలు నిరంతరం అశాంతితో, ఉద్వేగంతో గడపాల్సి వస్తుంది. కాబట్టి ఎవరితోనూ దీర్ఘకాలిక వైరం మంచిది కాదు.

ప్రశ్న 3.
“కార్యసాధన” అంటే అనుకొన్న పనిని సాధించడం. ధర్మరాజు మాటల్ని బట్టి ఈ కార్యసాధనను మనం ఎలా సాధించాలి?
జవాబు:
కార్యాన్ని సాధించదలచుకున్నవాడికి ఎంతో ఓర్పు, తగిన నేర్పు ఉండాలి. ఇతరులను బాధించకుండా, తాను బాధపడకుండా తెలివిగా పనిని సాధించుకోవాలి. ఒకవేళ జనాలు విమర్శించే పని అయినట్లైతే ఆ నింద తనపై పడకుండా అందరూ ఎదుటి వారినే నిందించేలా పనిని చాకచక్యంగా నెరవేర్చుకోవాలి. ధర్మబద్ధంగా, న్యాయసమ్మతంగా కార్యాన్ని సాధించాలి. కోరిన ప్రయోజనాన్ని పాపం రాకుండా, కీర్తి కలిగేలా సాధించుకోవాలి.

ప్రశ్న 4.
మాట్లాడే విధానం అంటే ఏమిటి? కార్యసాధకుడికి ఉండాల్సిన లక్షణాలు ఏమిటి?
జవాబు:
స్ఫుటంగాను, స్పష్టంగాను, సూటిగాను మాట్లాడాలి. వాదాంశాన్ని క్రమంగా ప్రతిపాదించాలి. నాటకీయ ధోరణిలో మాట్లాడే విధంగా ఉంటే సహజంగా మనసుకు హత్తుకుంటుంది. ఇలా చక్కగా ఆకర్షించేలా పనిని సాధించుకునేలా మాట్లాడటాన్నే మాట్లాడే విధం అంటారు. ఇక కార్యసాధకుడైనవాడు తన శక్తిని, ఎదుటివారి శక్తిని చక్కగా అంచనా వేయగలిగి ఉండాలి. వినయంతో ఉంటూ అవసరమైనప్పుడు తన శక్తియుక్తుల్ని ప్రదర్శించాలి. సమయానుకూలంగా తనని తాను మలచుకోగలిగి ఉండాలి. ధననష్టం, ప్రాణనష్టం వంటివి జరగకుండా తన కార్యాన్ని నేర్పుగా చేయగలిగి
ఉండాలి.

ఆ) కింది ప్రశ్నలకు పదిహేనేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
ధర్మరాజు శాంతి వచనాలను సొంతమాటల్లో రాయండి.
(లేదా)
ప్రపంచ శాంతిని కాంక్షించడం అందరి కర్తవ్యం కదా ! అలాంటి శాంతిని కోరుతూ ధర్మజుడు ఏం చెప్పాడో మీ సొంతమాటల్లో రాయండి.
(లేదా)
ధర్మరాజు కృష్ణనుద్దేశించి శాంతి పట్ల తనకు గల ఆకాంక్షను ఏ విధంగా వెల్లడించాడో మీ స్వంత మాటల్లో రాయండి.
(లేదా )
శాంతిని కోరుకోవడం అందరికి అభిలాష మరి ధర్మజుడు శాంతిని కోరుతూ ఏ విధంగా శ్రీకృష్ణునితో చెప్పాడు?
జవాబు:
ఓ కృష్ణా ! అర్ధరాజ్యం బదులు ఐదూళ్ళు ఇచ్చినా చాలని – నీవు, బంధువులు ఆశ్చర్యపోయేటట్లుగా చెప్పాను. కానీ ఆ ఔదార్యం కూడా కౌరవుల వలన బూడిదలో పోసిన పన్నీరైంది. ఒకవేళ దుర్యోధనుడు ఐదూళ్ళు కూడా ఇవ్వకపోతే సిరిసంపదలకు నెలవైన రాజ్యం అసలు ఉండదు. పోనీ సిరిని కోరకుండా వైరాగ్యజీవితం గడపటానికి సిద్ధమైతే నన్నాశ్రయించుకున్న వారికి కనీస అవసరాలైన కూడు – గుడ్డ – గూడులకు చాలా ఇబ్బంది ఏర్పడుతుంది. అప్పుడు తప్పక యుద్ధం జరుగుతుంది. దానికి నా మనసు ఒప్పుకోవడం లేదు. చంపాల్సి వస్తే లోకంలో పరాయివారిని, శత్రువులను ఎన్నుకోవడం సహజం. అయినా వారిని కూడా రాజ్యం కొరకు చంపాలనుకోవడం అహింసా ధర్మం కాదు. అది యుద్ధనీతి అవుతుంది గాని ధర్మనీతి కాదు. ఇక బంధుమిత్రులను చంపటం న్యాయం కాదు గదా !

విజయం పొందని యుద్ధం కంటే చావే మేలు. కాని యుద్ధంలో జయాపజయాలను ఎవరూ నిశ్చయించలేము. యుద్ధం వలన అనేక నష్టాలు కలుగుతాయి. ఇక శత్రుత్వమే ఏర్పడితే పామున్న ఇంటిలో కాపురమున్నట్లే. మనశ్శాంతికి చోటే ఉండదు. కాబట్టి ఎవరితోనూ దీర్ఘకాల వైరం పనికిరాదు. విరోధాన్ని అణచివేయడం మంచిది. విరోధం వలన విరోధమెప్పుడూ సమసిపోదు. ఒకడు వైరంతో వేరొకరికి బాధ కలిగిస్తే బాధపడినవాడు ఊరుకోడు. అవకాశం రాగానే పగ సాధిస్తాడు. సాహసించి పగను నిర్మూలించదలిస్తే దారుణకార్యాలు చేయాల్సి వస్తుంది. పగ వలన కీడే గాని వేరొక ప్రయోజనం లేదు.

కృష్ణా ! సంపద కావాలనీ, యుద్ధం జరగకూడదని కోరుకుంటున్నాను. యుద్ధం వలన ధననష్టం, వంశ నాశనం జరుగుతుంది. ఈ రెండూ జరగని ఉపాయంతో ఎలాగైనా బాగుపడటం మంచిది కదా ! ధర్మం, నీతి – వాటిని బట్టి రెండు వర్గాల వారికీ మేలు, అభివృద్ధి జరిగేలా చూడు. విదురుడు మొదలైన మహానుభావులు సమ్మతించేలా తగినంత మెత్తదనంతోను, అవసరమైనచోట కఠిన మందలింపులతోను కురుసభలో రాజులందరూ గ్రహించేలా మాట్లాడు. ఒకవేళ ధృతరాష్ట్రుడు కుమారుడి మీది ప్రేమతో ఏ విషయం తేల్చి చెప్పకుంటే ధర్మబద్ధుడవై తగిన నిర్ణయం తీసుకో. మా ఇరువర్గాలకూ కావాల్సినవాడివి. నీతి తెలిసిన వాడివి, నీకు నేను చెప్పగలవాడినా ? హస్తినాపురానికి వెళ్ళిరా ! … అని ధర్మరాజు శ్రీకృష్ణుడితో శాంతి వచనాలను పలికాడు.

ప్రశ్న 2.
ధర్మరాజు యుద్ధం వల్ల కలిగే నష్టాలు చెప్పాడు గదా ! ఈ రోజుల్లో కూడా యుద్ధాలు జరుగుతున్నాయి. యుద్ధాలు రాకుండా ఉండడానికి చేపట్టాల్సిన చర్యలేమిటి?
జవాబు:
నేటి కాలంలో కూడా దారుణమైన యుద్ధాలు జరుగుతున్నాయి. మన భారతదేశంపై పాకిస్థాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. మన సరిహద్దు ప్రాంతాన్ని ఆక్రమించడంతో తప్పక “కార్గిల్ యుద్ధాన్ని” చేయాల్సి వచ్చింది. అయినా బుద్ధి తెచ్చుకోక పాకిస్థాన్ మన దేశంలో ఉగ్రవాద చర్యలకు సిద్ధపడుతున్నది. మరొక ప్రక్క చైనా కూడా యుద్ధాన్మాదంతో ఊగిపోతోంది. మన సరిహద్దు రాష్ట్రాలను ఆక్రమించాలని నిరంతరం ప్రయత్నిస్తోంది.

అమెరికా ధన మదంతో, అధికార దాహంతో యుద్ధానికి కాలు దువ్వుతుంది. ఐక్యరాజ్యసమితి మిగతా దేశాలను కొంతవరకు అదుపు చేయగలిగినా అగ్రరాజ్యా లైన అమెరికా, బ్రిటన్లకు సూచనలను చేయడానికి కూడా సాహసించలేని దుస్థితిలో ఉంది. తమ ఇష్టానుగుణంగా ప్రవర్తిస్తున్న అగ్రరాజ్యాల అహంకారం ముందు ప్రపంచశాంతి కోసం స్థాపించబడిన ఐక్యరాజ్యసమితి సైతం బానిసలాగా తలొంచుకొని నిలుచుందంటే ఇంతకన్నా సిగ్గుపడాల్సిన విషయం లేదు.

యుద్దాలను ఆపాలనుకొంటే ముందు ప్రపంచ దేశాలన్నీ చిత్తశుద్ధితో శాంతి ఒడంబడికలు చేసుకోవాలి. ఐక్యరాజ్యసమితి ఆదేశాలను అన్ని దేశాలూ శిరసావహించాలి. దేశాల మధ్య ఉన్న ఆర్థిక అసమానతలను, పరిగణించక సోదరులుగా భావించాలి. ఒకరికొకరు సహకరించుకుంటూ సమగ్రమైన అభివృద్ధికి అన్ని దేశాలూ సహకరించాలి. చిన్న దేశమైనా, పెద్ద దేశమైనా పొరుగుదేశం యొక్క ఆంతరంగిక విషయాల్లో కలుగజేసుకోకూడదు. ఇప్పటికే రగులుతున్న సమస్యలైన కాశ్మీర్ సమస్య, వివిధ దేశాల సరిహద్దు సమస్యలను శాంతియుతంగా పరస్పర చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి. సామ్యవాద భావనలు వెల్లివిరియాలి. స్వార్ధ భావాలను విడిచి పెట్టాలి. ప్రక్క దేశాలపై కవ్వింపు చర్యల్ని కూడా మానాలి. విశ్వశాంతికై చిత్తశుద్ధితో పాటుపడాలి.

AP Board 9th Class Telugu Solutions Chapter 1 శాంతికాంక్ష

ఇ) సృజనాత్మకంగా రాయండి.
పగ, ప్రతీకారం మంచివి కాదనీ, శాంతియుత జీవనం గొప్పదనీ మీ మిత్రునికి లేఖ రాయండి.
జవాబు:

గుంటూరు,
x x x x

ప్రియమైన మిత్రునకు / మిత్రురాలికి,

నేనిక్కడ క్షేమంగా ఉన్నాను. బాగా చదువుకుంటున్నాను. నీవు క్షేమమని, బాగానే చదువుకుంటున్నావని తలుస్తాను. ఈ మధ్యకాలంలో కుటుంబ కలహాలు, ఇతర వివాదాల వలన చాలామంది చనిపోతున్నారు. గ్రామాలలో కుల వివాదాలు, ఇతర పొలాలు, ఆస్తులకు సంబంధించిన వివాదాల వలన రక్తపాతాలు జరుగుతున్నాయి. వీటి వలన పెద్దవారు, పిల్లలు అనాథలవుతున్నారు.

వీటి అన్నింటికి మూలమైన పగ, ప్రతీకారాలు మంచివి కాదు. చదువుకున్నవారు, ఉన్నతస్థితులలో ఉన్నవారు సైతం వీటి ప్రభావానికి లోనవుతున్నారంటే, చదువుకున్న మూర్ఖులులా ప్రవర్తిస్తున్నారంటే ఇవి ఎంత చెడ్డవో తెలుస్తుంది. పగ, ప్రతీకారాల వల్ల ఎల్లప్పుడూ అశాంతితో, భయంతో, ఉద్వేగంతో గడపాల్సి వస్తుంది. వీటి ద్వారా ఆరోగ్యం దెబ్బతిని, చిన్నవయస్సులోనే మధుమేహ వ్యాధి (షుగర్) వంటి దీర్ఘకాలిక రోగాల బారినపడే ప్రమాదం ఎక్కువ. పూర్వకాలంలో సమాజాలలో అన్ని కులాలవారు, మతాలవారు ఒకరినొకరు బాబాయ్, చిన్నమ్మ, అన్నయ్య, తమ్ముడూ, చెల్లెమ్మ లాంటి వావి-వరుసలతో పిలుచుకుంటూ ఒకే కుటుంబంలా మెలగేవారు. ఒక్కడి కోసం అందరూ, అందరికోసం ఒక్కడుగా నిలచేవారు. అటువంటి స్థితి నేడు రావాలి. దానికి ఉమ్మడి కుటుంబాలు ఎంతో సహకరిస్తాయి. ఉమ్మడి కుటుంబ భావన అందరికీ కలిగించాలి.

నగరాలలో, పట్టణాలలో బహుళ అంతస్థుల భవనాలు (అపార్ట్ మెంట్స్) పెరిగిపోతున్నాయి. వీటిల్లో నివసించేవారు వేరు వేరు కుటుంబాల నుంచి, ప్రాంతాల నుంచి వస్తారు. కొన్నిచోట్ల వేరు వేరు భాషలు మాట్లాడేవారు సైతం ఒకచోట జేరతారు. అలాంటి చోట అన్ని మతాల పండుగలను అందరూ కలసి జరుపుకోవడం, వంటకాలను పరస్పరం ఇచ్చిపుచ్చుకోవడం వంటి వాటి ద్వారా కుటుంబ భావన పెరుగుతుంది. దాని ద్వారా పరమత సహనం అలవడుతుంది. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. శాంతియుత జీవనం కలుగుతుంది. మానసిక ఉద్వేగాలు అణగారి పోయి, రోగాలు తగ్గుతాయి. ఆరోగ్యం వలన ఆయువు పెరిగి సుఖశాంతులతో జీవించవచ్చు.

మీ అమ్మగారిని, నాన్నగారిని ఇతర కుటుంబ సభ్యులను అడిగినట్లు చెప్పు. శాంతియుత సమాజ నిర్మాణాన్ని గూర్చి నీ భావాలను నాకు లేఖ ద్వారా తెలియజేయి. నీ లేఖకై ఎదురుచూస్తూ ఉంటాను.

ధన్యవాదములు

ఇట్లు,
నీ మిత్రుడు / మిత్రురాలు,
బి. రాజు | బి. రాణి,
9వ తరగతి, క్రమసంఖ్య – 12/6,
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,
రాజాగారి తోట,
గుంటూరు (పోస్టు) (మండలం), వేమవరం (పోస్టు),
గుంటూరు జిల్లా.

చిరునామా :
షేక్ రసూల్ / షేక్ రేష్మ,
తొమ్మిదవ తరగతి,
క్రమసంఖ్య – 18,
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,
మాచవరం (మండలం),
గుంటూరు జిల్లా.

(లేదా)
‘శాంతి’ ఆవశ్యకతను తెలియజేసేలా ఒక ‘కరపత్రాన్ని’ తయారుచేయండి.
(లేదా)
ధర్మరాజు లాగ శాంతిని కాంక్షించవలసిన ఆవశ్యకతను వివరిస్తూ ఒక కరపత్రం తయారుచేయండి.
జవాబు:
శాంతి నీవెక్కడ ? (కరపత్రం)

శాంతమే రక్ష
దయ చుట్టము
మనకి స్వాతంత్ర్యం వచ్చి ఆరు దశాబ్దాలు దాటినా, ఇంకా దేశంలో అశాంతి పూరిత, ఆందోళనకర వాతావరణమే నెలకొని ఉంది. అగ్రరాజ్యాలే నేటికీ అంతర్జాతీయ అంశాల్ని నిర్ణయించేవిగా ఉన్నాయి. ఉగ్రవాదం ఉరకలు వేస్తోంది. స్థానిక ఉద్యమాలు, కులమత లింగ వివక్షలు, ప్రజావిప్లవాలు దేశాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. స్వార్థపూరితమైన జీవనం, అనారోగ్యకరమైన పోటీతత్వం, ప్రపంచీకరణ విధానాలు అంటువ్యాధుల్లా ప్రజల్ని పట్టి పీడిస్తున్నాయి.

కేవలం మన దేశంలోనే గాక ప్రపంచవ్యాప్తంగా పలుదేశాల్లో ఇదే పరిస్థితి. ప్రపంచవ్యాప్తంగా యుద్ధమేఘాలు అలముకుంటున్నాయి. చాలా చోట్ల ప్రచ్ఛన్న యుద్ధాలు, ప్రత్యక్ష యుద్ధాలు చోటుచేసుకుంటున్నాయి. అణుబాంబుల్ని మించిన వినాశకర ఆయుధాలెన్నో అగ్రరాజ్యాలు సమకూర్చుకుంటున్నాయి. ప్రతి ప్రాంతంలోనూ అశాంతి, అభద్రత, అసంతృప్తి నెలకొంటున్నాయి. ప్రతివారి మనస్సు శాంతికోసం పరితపిస్తుంది. కానీ శాంతి ఎక్కడా కనిపించలేదు. ప్రపంచవ్యాప్తంగా అందరూ వెతుకుతున్నా ఎక్కడా కనిపించడం లేదు.

అవును, ఎక్కడని కనిపిస్తుంది? ‘శాంతిని’ మనమే చంపి, గోరీలు కూడా కట్టామాయె. ఇప్పుడు పరితపిస్తే మాత్రం ఎలా వస్తుంది? ఉన్నప్పుడు స్వార్థంతో, సామ్రాజ్యవాదంతో, మతోన్మాదంతో ఊపిరి సలపనీయకుండా చేశామాయె. ఇప్పుడు రమ్మంటే ఎక్కడి నుండి వస్తుంది? ఎలాగ వస్తుంది? ప్రపంచమంతా అశాంతితో నింపి, ఇప్పుడు శాంతి పాఠాలు వల్లిస్తే మాత్రం వస్తుందా? ‘శాంతి’ నీవెక్కడ ? అని ఆక్రోశిస్తే వచ్చేస్తుందా?

ఎప్పుడైతే మనం పరమత సహనాన్ని కలిగి ఉంటామో, ఎప్పుడైతే సోదరభావంతో అందరినీ కలుపుకుంటామో, ఎప్పుడైతే సహృదయతను, నిస్వార్థాన్ని అలవరచుకుంటామో, ఎప్పుడైతే పరోపకార పరాయణులమవుతామో, ఎప్పుడైతే పగ – ప్రతీకారాల్ని విడుస్తామో, అంతర్యుద్ధాలను అసహ్యించుకుంటామో, యుద్ధాలను విడిచి పెడతామో, ఆయుధాలను ప్రేమించడం మాని, మానవులను ఇష్టపడతామో, ప్రేమతత్వంతో మెలగుతామో అప్పుడు – సరిగ్గా అప్పుడు ‘శాంతి’ తన ఉనికిని చాటుకుంటుంది. మనం తనని మనస్ఫూర్తిగా కోరుతున్నామని నమ్మిన రోజున తనకైతానే ప్రత్యక్షమవుతుంది. అంతదాకా మానవజాతి అంతా ‘శాంతి’ నీవెక్కడా ? అని దీనంగా, హీనంగా విలపించక తప్పదు.

ఈ)
ప్రశంసాత్మకంగా రాయండి.

ప్రపంచశాంతి కోసం పాటుపడిన ‘నెల్సన్ మండేలా’, ‘గాంధీ’, ‘యాసర్ అరాఫత్’ వంటి వారి వివరాలు సేకరించి, వారిని అభినందిస్తూ ఒక వ్యాసం రాయండి. దాన్ని చదివి వినిపించండి.
జవాబు:
1) మహాత్మాగాంధీ :
మన దేశ ‘జాతిపిత’గా అందరిచే ప్రేమగా ‘బాపూజీ’ అని పిలవబడే మోహన్ దాస్ కరంచంద్ గాంధీ గుజరాత్ రాష్ట్రంలోని పోర్బందర్ పట్టణంలో 1869వ సంవత్సరం అక్టోబరు రెండవ తారీఖున జన్మించాడు. మెట్రిక్యులేషన్ పూర్తి చేశాక లండన్ వెళ్ళి బారిష్టరు పరీక్షలో ఉత్తీర్ణుడై తిరిగివచ్చాడు. 1893వ సంవత్సరంలో ఒక వ్యాజ్యం విషయంగా దక్షిణాఫ్రికా వెళ్ళాడు. అక్కడ భారతీయులు, ఇతర నల్ల జాతీయులు పడే అగచాట్లన్నీ గమనించాడు. రైళ్ళలో మొదటి తరగతిలో ప్రయాణం చేసేందుకు వీలులేదు. శ్వేత జాతీయులు, పెద్ద కుటుంబాలు ఉండే చోట్లకు భారతీయులను, ఇతర నల్లజాతి వారిని అనుమతించరు. చివరకు తలపై టోపీని ధరించి కోర్టులో వాదించడానికి కూడా అనుమతి లభించలేదు.

ట్రాముల్లోనూ, రైళ్ళలోనూ శ్వేత జాతీయులతో కలసి ప్రయాణించే యోగ్యత లేదు. బానిసలుగా చూస్తూ ‘కూలీ’ అని సంబోధించేవారు. ఈ దురాగతాలను ఆపడానికై గాంధీజీ ప్రయత్నించాడు. 1869వ సంవత్సరంలో ట్రాన్స్ వాల్ లో ఇంగ్లీషు, డచ్చి వారికి జరిగిన యుద్ధంలో గాయపడిన బ్రిటిషు వారిని వైద్యశాలలకు చేర్చి చికిత్స చేయించాడు. గాంధీ సేవను గుర్తించక వారు దక్షిణాఫ్రికా భారతీయులకు నాయకుడై, ప్రభుత్వ ఉత్తర్వులను ఎదిరిస్తున్నాడన్న వంకతో ఆయన్ని జైలుకు పంపి, వెట్టిచాకిరీ చేయించారు. కానీ శాంతి, ఓర్పు, అహింసలతో వాటిని ఎదుర్కొని ఐకమత్యంతోను, పత్రికల సహాయంతోను పోరాడి విముక్తిని సాధించాడు. దక్షిణాఫ్రికా వీడి వచ్చేటప్పుడు అక్కడి అభిమానులు తనకు ఇచ్చిన బహుమతులను, ధనాన్ని “దక్షిణాఫ్రికా భారతీయుల సంక్షేమ నిధి”గా ఏర్పాటుచేసిన నిస్వార్థపరుడు, పరోపకార పరాయణుడు, శాంతి కాముకుడు “గాంధీ మహాత్ముడు” !

భారతదేశానికి తిరిగి వచ్చాక భారతదేశ స్వాతంత్ర్యం కోసం అహర్నిశలు పాటుపడ్డాడు. ఉప్పు సత్యాగ్రహం, సహాయనిరాకరణోద్యమం, విదేశీ వస్తు బహిష్కరణోద్యమం, జైల్ బరో వంటి ఉద్యమాలను సమర్థతతో నిర్వహించి బ్రిటిష్ వారిని ముప్పుతిప్పలు పెట్టాడు. చివరికి వారు స్వాతంత్ర్యం ఇచ్చి వెళ్ళిపోవటం తప్ప మరో మార్గం లేకుండా చేశాడు. అలా భారతదేశం 1947వ సంవత్సరం, ఆగస్టు నెల 15వ తారీఖున స్వాతంత్ర్యాన్ని పొందింది. కానీ ఆ మహాత్ముడు, శాంతమూర్తి, అహింసా పరాయణుడు, నిరంతర కార్యశీలి స్వేచ్ఛావాయువులను పూర్తిగా ఆస్వాదించకుండానే 30-1-1948వ తారీఖున కీర్తిశేషుడయ్యాడు.

2) నెల్సన్ మండేలా :
నెల్సన్ మండేలా మొట్టమొదటి సారిగా దక్షిణాఫ్రికాకు ఎన్నికైన నల్లజాతికి చెందిన ప్రెసిడెంటు. ఈయన పూర్తి పేరు రోలిహలాహలా మండేలా. ‘నెల్సన్’ అనే పేరు ఆయన పాఠశాలలో జేరినప్పుడు ఆంగ్ల ఉపాధ్యాయురాలైన మిసెస్ మిడిగేన్ పెట్టినది. నాటి దక్షిణాఫ్రికాను పాలిస్తున్న బ్రిటిష్ వారి నియమాలలో పేరు మార్చడం ఒకటి. నల్ల జాతీయులను పాఠశాలలో చేర్చేటప్పుడు ఒక ఆంగ్లభాషా పేరు వారికి పెడతారు. ఇది బ్రిటిష్ వారి జాత్యహంకారానికి మచ్చుతునక.

మండేలా దక్షిణాఫ్రికాలోని ఆగ్నేయ ప్రాంతమైన ట్రాన్స్ కి ప్రాంతంలో 18-07-1918వ తేదీన టెంబు జాతికి చెందిన కుటుంబంలో జన్మించాడు. వీరి భాష హోసా. మండేలా పాఠశాల విద్యను పూర్తి చేసుకొని, కళాశాల విద్యకై ఆఫ్రికన్ నేటివ్ కళాశాలలో బి.ఎ. డిగ్రీ. ప్రథమ సంవత్సరంలో చేరాడు. కానీ విద్యార్థి సంఘాలలో చేరి తన ప్రవేశం అధికారులచే రద్దు చేయబడటంతో బయటకు వెళ్ళాల్సివచ్చింది. జోహన్స్ బర్గ్ ప్రాంతాన్ని చేరుకొని దూర విద్య ద్వారా చదివి బి.ఎ. డిగ్రీని పొందాడు. తర్వాత బారిష్టరు విద్య కోసం విశ్వవిద్యాలయంలో చేరాడు. అక్కడే ఆయన ఆఫ్రికా జాతీయ కాంగ్రెస్సులో (A.N.C.) సభ్యునిగా చేరాడు. తన మిత్రులైన వాల్టర్ సిస్లూ, ఆలివర్ టాంబో, విలియమ్ కోమో వంటి వారి సహాయంతో ఏ.ఎన్.సి. విస్తరించడం లోను, కార్యశీలకమైన సంస్థగా మలచడంలోను విశేష కృషి సల్పాడు.

దక్షిణాఫ్రికా ప్రభుత్వం ఆ దేశ పౌరులందరినీ మూడు వర్గాలుగా విభజించింది. శ్వేత జాతీయులు మొదటివరం. తల్లిదండ్రులలో ఒకరు శ్వేత జాతీయులు, వేరొకరు నల్లజాతీయులైన వారు రెండవ వర్గం. ఇక నల్ల జాతీయులు మూడవ వర్గం. మూడు వర్గాలకు ప్రత్యేకమైన వసతి ప్రదేశాలుంటాయి. ఎవరికి వారికే ప్రత్యేకమైన మరుగుదొడ్లు. ఉద్యానవనాలు, సముద్రతీర ప్రాంత విహారాలు, పాఠశాలలు, ఉద్యోగాలు ఉంటాయి. శ్వేతజాతీయులకే పూర్తి రాజకీయ అధికారాలుంటాయి. 1960 – 80 ల మధ్య ప్రభుత్వం శ్వేత జాతీయుల కోసం మిగిలిన రెండు వర్గాల వారిని ఖాళీ చేయించి మూరుమూల ప్రాంతాలకు పంపింది. ముప్పై లక్షలమంది తమ నివాస ప్రాంతాలను విడిచి మారుమూల ప్రాంతాలకు వెళ్ళాల్సి వచ్చింది.

ఈ దుశ్చర్యకు వ్యతిరేకంగా ఏ.ఎన్.సి. పోరాటానికి నడుం కట్టింది. ఐతే అహింసాయుత మార్గంలో సహాయనిరాకరణ, ధర్నాలు చేయటం, అధికారుల పట్ల అవిధేయతను ప్రదర్శించడం వంటి వాటి ద్వారా ఉద్యమించింది. పూర్తి పౌరసత్వాన్ని పొందడం, శాసనసభలో చోటు సంపాదించడం, మిగిలిన వర్గాలతో సమానమైన హక్కులను పొందడం లక్ష్యంగా నిరంతరం పోరాటం సల్పింది. మండేలా దేశమంతా సంచరిస్తూ న్యాయం కోసం పోరాడుతూ ఎంతోమంది మద్దతుదారులను కూడగట్టాడు. ప్రపంచ వ్యాప్తంగా మద్దతును సాధించగలిగాడు కూడా. దాని ఫలితంగా ప్రభుత్వం యొక్క ఆగ్రహానికి గురై 27 సంవత్సరాలు కఠిన కారాగారవాసాన్ని అనుభవించాడు.

చివరకు ప్రభుత్వం తలవొగ్గి ఏ.ఎన్.సి కోరిన వాటిని ఆమోదించింది. మండేలా దక్షిణాఫ్రికా అధ్యక్షుడైనాడు. 1993వ సంవత్సరంలో మండేలా, అతని సహచరుడైన డిక్లార్క్ లకు నోబెల్ శాంతి బహుమతి లభించింది. 1999 సంవత్సరం దాకా అధ్యక్షునిగా ఉండి, తర్వాత రాజకీయ సన్యాసం చేసి, స్వగ్రామానికి చేరుకున్నాడు. హెచ్.ఐ.వి. మరియు ఎయిడ్స్ రోగ విషయంలో తన వారిని జాగరూకులను చేయడానికి పెద్ద పెద్ద శిబిరాలను నడిపాడు. ప్రపంచవ్యాప్త సదస్సులలో పాల్గొన్నాడు.

దారుణమైన వర్ణ వివక్షకు లోనైనా, దృఢసంకల్పంతో ఎన్నో కష్టాలకు, కారాగారవాస శిక్షలకు ఓర్చి తోటివారికై పరిశ్రమించి కృతార్థుడైనాడు నెల్సన్ మండేలా మహాశయుడు.

3) యాసర్ అరాఫత్ :
యాసర్ అరాఫత్ గా ప్రసిద్ధిచెందిన ఆయన అసలు పేరు మొహమ్మద్ యాసర్ అబ్దుల్ రెహమాన్ అబ్దుల్ రౌఫ్ అరాఫత్ అల్ ఖుద్వా అల్ హుస్సేని. ఈయన 1929వ సంవత్సరం ఆగస్టు నెల 24వ తేదీన పాలస్తీనాలో జన్మించాడు. అరాఫత్ తన జీవితకాలంలో ఎక్కువ భాగం ఇస్రాయేల్ దేశీయులతో పాలస్తీనీయుల స్వీయ నిర్ధారణ అనే పేరుతో పోరాటం జరిపాడు.

పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ (P.L.O) కు చైర్మన్ గాను, పాలస్తీనియన్ నేషనల్ అథారిటీ (P.N.A) కి అధ్యక్షునిగాను, ఫాత్ రాజకీయ పార్టీ సభ్యునిగాను పనిచేశాడు. అరాఫత్ తన ఉద్యమాన్ని వివిధ అరబ్ దేశాల నుండి కూడా నిర్వహించాడు. ఇస్రాయేల్ దేశానికి ఇతని ఫాత్ పార్టీ ప్రధాన లక్ష్యం అయింది. ఇస్రాయేల్ దేశీయులు అతన్ని టెర్రరిస్టుగాను, బాంబు దాడులలో వందలమందిని చంపిన దుర్మార్గుడుగాను చిత్రీకరించారు. పాలస్తీనీయులతణ్ణి ఒక గొప్ప దేశభక్తునిగా సంభావించారు. అగ్రరాజ్యాల నెదిరించి, పాలస్తీనాకు సంపూర్ణ స్వేచ్చను సాధించిన ఘనత అరాఫత్ దే. పాలస్తీనాకు మొదటి అధ్యక్షుడుగా చేశాడు. 1994 వ సంవత్సరంలో అరాఫత్ కు నోబెల్ శాంతి బహుమతి లభించింది. శాంతి కోసం పోరాడిన ఈ యోధుడు 11 – 11 – 2004వ తేదీన 75 సంవత్సరాల వయస్సులో తీవ్ర అనారోగ్యానికి గురై కోమాలోకి వెళ్ళి మరణించాడు.

ఈ ముగ్గురు మహానుభావులను గమనించినట్లైతే నిస్వార్థంగా ప్రపంచశాంతికై కృషిచేశారని తెలుస్తుంది. కుల – మత – వర్ణ వివక్షలకు లోనైన ఎందరో సామాన్యులకు మానసిక స్టెర్యాన్ని కలిగించడమే కాకుండా వారిని ఆయా బంధనాల నుంచి విముక్తుల్ని చేసిన ఘనులని తెలుస్తుంది. తమ జాతీయుల స్వాభిమానాన్ని, పౌరుషాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయులు వీరు.

AP Board 9th Class Telugu Solutions Chapter 1 శాంతికాంక్ష

(లేదా)
మీ ఊరిలో ఏవైనా గొడవలు జరిగితే వెంటనే స్పందించి, గొడవలు వద్దు అని సర్ది చెప్పే పెద్ద వాళ్ళ గురించి, ‘నలుగురూ శాంతియుతంగా సహజీవనం చేయాలి’ అని ‘శాంతికోసం’ పాటుపడేవాళ్ళని గురించి అభినందిస్తూ కొన్ని వాక్యాలు రాయండి.
జవాబు:
మా ఊరిలో కుటుంబ కలహాలు గాని, చిన్న చిన్న తగాదాలు గాని, గొడవలు గాని జరిగితే మా ఊరి ప్రెసిడెంటు గారి వద్దకు తీసుకెళ్తారు. ఆయన ఇరుపక్షాల వారి వాదాలను ఓపికగా విని, నేర్పుగా ఎవరివైపు తప్పు ఉన్నదో గ్రహించి, వారి తప్పుని సున్నితంగా తెలియజేస్తారు. తగాదాలు మాని శాంతంగా ఉండాలని ఇద్దరికీ చెప్పి తగవు తీరుస్తారు. రామయ్య తాత ఊర్లో జరుపుకునే అన్ని మతస్థుల పండుగలకు అందరం పాల్గోవాలని, కులమత భేదాలు పట్టించుకోకుండా అందరం కలసి ఉండాలని చెపుతుంటాడు. అన్ని కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొని యువకుల్లో ఉత్సాహాన్ని కలిగిస్తాడు. అంజమ్మ అత్త మాలాంటి పిల్లలకు మంచి మంచి కథలు చెపుతూ ఉంటుంది.

ఆ కథల్లో ఎక్కువ శాంతికి సంబంధించినవే ఉంటాయి. మేము అందరం పాఠశాలలో మిగిలిన విద్యార్థులతో కలసిమెలసి మధ్యాహ్న భోజనం చేయాలని కోరుకుంటుంది. రహీమ్ బాబాయి వాళ్ళ పండుగలకు మాలాంటి పిల్లల్ని తన ఇంటికి తీసుకువెళ్ళి మిఠాయిలు పెడతాడు. ఊళ్ళోని ముస్లిం కుటుంబాలకు నాయకత్వం వహిస్తూ, హిందువులతోను, క్రైస్తవులతోను సన్నిహితంగా ఉంటాడు. తనవారు ఇతరులతో గొడవపడకుండా, ఇతరుల వలన తన వారికి ఇబ్బందిరాకుండా చూస్తూ ఉంటాడు. అలాంటివాడు ఉండబట్టే మా ఊళ్ళో కులాల పోర్లు లేవంటే అతిశయోక్తి ఏమీకాదు. ఇక డేవిడ్ అన్నయ్య మంచి ఆటగాడు. ఊళ్ళో పిల్లలందరినీ పోగుచేసి, సాయంత్రం పూట మంచి మంచి ఆటలు ఆడిస్తాడు. అందరూ ఒక్కటే. అందరం ఎప్పుడూ కలసి ఉండాలని దానికి ఆటలు ఎంతో సహకరిస్తాయని ఎప్పుడూ చెపుతుంటాడు. అతని వల్ల పిల్లలం అందరం ధనిక – పేద, కుల-మత, స్త్రీ-పురుష భేదాలు మరచి సంతోషంగా ఆటలు ఆడుతున్నాం . అతను లేకుంటే మాలో ఇలాంటి ఐకమత్యం వచ్చేది కాదు.

ప్రాజెక్టు పని

ప్రపంచశాంతి కోసం కృషిచేసిన వారి వివరాలు సేకరించండి. వారి గురించి ఒక నివేదిక తయారుచేసి ప్రదర్శించండి.
AP Board 9th Class Telugu Solutions Chapter 1 శాంతికాంక్ష 7

III. భాషాంశాలు

పదజాలం

అ) కింద గీత గీసిన పదాలకు అర్థాలు రాసి, వాక్యాల్లో ప్రయోగించండి.

1. గురువులు శుభంబైన వాటిని సమకూర్చెదరు.
జవాబు:
శుభంబైన = మంచిదైన
పెద్దలు మంచిదైన పనినే చేస్తారు.

2. దీర్ఘ వైరవృత్తి మంచిది కాదు.
జవాబు:
దీర్ఘ వైరవృత్తి : ఎక్కువ కాలం పగతో ఉండడం.
ఎక్కువకాలం పగతో ఉండడం వలన ఆరోగ్యం దెబ్బ తింటుంది.

3. శ్రీకృష్ణుడు అన్ని విషయాలు ఎఱుక గలవాడు.
జవాబు:
ఎఱుక = జ్ఞానం
రాముకు తెలుగుభాషా జ్ఞానం ఎక్కువ.

ఆ) కింది వాక్యాలను పరిశీలించి, గీత గీసిన పదాలకు నానార్థాలు రాయండి.
1. రెండు దిక్కుల న్యాయం చెప్పడానికి నీవే మాకు దిక్కు
దిక్కు: దిశ, శరణం

2. ఒక రాజు దివినేలు నొక రాజు భువినేలు నొక రాజు రాత్రిని యేలు నిజము.
రాజు : ఇంద్రుడు, టేడు, చంద్రుడు

3. వైరి పక్షములోని పక్షి, పక్షమునకు గాయమై, పక్షము రోజులు తిరుగలేకపోయెను.
పక్షము : ప్రక్క, టెక్క 15 రోజులు.

4. పాఠానికి సంబంధించిన మరికొన్ని పదాలకు నానార్థాలను నిఘంటువులో వెతికి, పై విధంగా వాక్యాలలో ప్రయోగించండి.

అ) సమయము లేకున్నా మనము సమయమించక తప్పదు. ఎందుకంటే ఇదే ధర్మమైన సమయము కాబట్టి.
సమయము : కాలము, శపథము, బుద్ధి.

ఆ) మనకు పూర్ణము లేకున్నా జలపాత్ర పూర్ణము ఐనది.
పూర్ణము : శక్తి నిండినది.

ఇ) తగవుకు పోతే తగవు కలిగి, తగవు జరగలేదు.
తగవు : తగిన, తగాదా, న్యాయం.

ఈ) నేను దోష సమయంలో కారులో ప్రయాణిస్తుంటే ఎదురుగా వచ్చేవాడి దోషానికి గాయమై, పెద్ద దోషం జరిగింది.
దోషము : రాత్రి, భుజము, తప్పు, పాపం.

ఉ) శరీరాన్ని పాముట వలన ఏర్పడిన మట్టి పాములా ఉంది.
పాము : రుద్దు, సర్పము.

AP Board 9th Class Telugu Solutions Chapter 1 శాంతికాంక్ష

ఇ) కింద గీత గీసిన పదాలకు పర్యాయ పదాలు రాసి, వాక్యాలలో ప్రయోగించండి.
ఉదా : ప్రేమ్, సంతోష్ ప్రాణ స్నేహితులు.

అ) స్రవంతికి సంగీత, రాధికలు మంచి నేస్తాలు.
ఆ) మిత్రులు ఆపద్బాంధవులు.

1. అనుకున్నది సాధించినపుడు మోదం కలుగుతుంది.
అ) పిల్లలు బహుమతులను పొందినప్పుడు ఎంతో ఆనందం కలుగుతుంది.
ఆ) పిల్లల సంతోషమే పెద్దలు కోరుకుంటారు.

2. ధరిత్రి పుత్రిక సీత.
అ) భూమి లాంటి నివాసయోగ్యమైన గ్రహం కోసం శాస్త్రవేత్తలు వెదకుతున్నారు.
ఆ) ధరకు ఉన్న ఒకే ఒక ఉపగ్రహం చంద్రుడు.

3. పోరితము నష్టదాయకం.
అ) తగాదాల వల్ల కుటుంబాలకు కుటుంబాలే నాశనమవుతాయి.
ఆ) యుద్ధం మూలంగా ధననష్టం, జననష్టం జరుగుతుంది.

వ్యాకరణం

అ) పాతం చదవండి. కింద తెల్సిన సంధులకు సంబంధించిన ఉదాహరణలను వెదికి రాయండి. సూత్రాలు కూడా రాయండి.
1) సవర్ణదీర్ఘ సంధి
2) సరళాదేశ సంధి
3) ఇత్వసంధి
4) యడాగమ సంధి

1. సవర్ణదీర్ఘ సంధి:
1) జనార్ధన : జన + అర్ధన
2) విదురాది : విదుర + ఆది

సూత్రం :అ, ఇ, ఉ, ఋ లకు, అవే అచ్చులు పరమైతే వాటి దీర్ఘాలు ఏకాదేశంగా వస్తాయి.

2. సరళాదేశ సంధి సూత్రం:
1) ద్రుతప్రకృతికము మీది పరుషములకు సరళములగు.
2) ఆదేశ సరళమునకు ముందున్న ద్రుతమునకు బిందు సంశ్లేషములు విభాషనగు.
ఉదాహరణలు :
1) చక్కన్ = చేయ = చక్కఁజేయ
2) ఇచ్చినను + చాలు = ఇచ్చిననుజాలు
3) చేయన్ + చాలడో = చేయంజాలడో
4) ఏమున్ + పొంది = ఏముంబొంది
5) ఒకమాటున్ + కావున = ఒకమాటుఁగావున
6) పగన్ + పగ = పగంబగ
7) కడున్ + తెగ = కడుందెగ
8) ఏమిగతిన్ + తలంచిన = ఏమిగతిఁదలంచిన
9) శాంతిన్ + పొందుట = శాంతిఁబొందుట
10) సొమ్ములున్ + పోవుట = సొమ్ములుంబోవుట
11) చక్కన్ + పడు = చక్కఁబడు
12) ఒప్పున్ + చుమీ = ఒప్పుఁజుమీ
13) మనమునన్ పక్షపాత = మనమునఁబక్షపాత
14) తగన్ + చెప్ప = తగంజెప్ప
15) తెగన్ + పాఱకు = తెగంబాఱకు

3. ఇత్వ సంధి సూత్రం :
సూత్రం – 1: ఏమ్యాదులందలి హ్రస్వమైన ఇకారానికి సంధి వైకల్పికంగా వస్తుంది.
సూత్రం – 2 : మధ్యమ పురుష క్రియలందలి హ్రస్వమైన ఇకారానికి సంధి వికల్పంగా జరుగుతుంది.

1) అదియొప్పది = అది + ఒప్పదె
2) ఊరడిల్లియుండు = ఊరడిల్లి + ఉండు
3) అదియజులు = అది + అట్టులు

4. యడాగమ సంధి సూత్రం :
సంధి జరగని చోట అచ్చు కంటె పరమైన అచ్చుకు యడాగమం వస్తుంది.
ఉదాహరణలు:
1) మా + అంశమగు = మాయంశమగు
2) నా + అరయు = నాయరయు
3) అది + ఒప్పదే = అదియొప్పది
4) పామున్న + ఇంటిలో = పామున్నయింటిలో
5) ఉన్న + అట్ల = ఉన్నయట్ల
6) పగ + అడగించుట = పగయడగించుట
7) పల్కక + ఉండగ = పల్కకయుండగ
8) అది + అట్టులుండె = అదియట్టులుండె
9) పల్కిన + ఏని = పల్కినయేని
10) పొంది + ఉండునట్లు = పొందియుండునట్లు

అ) కర్మధారయ సమాసం :
వివరణ :
‘నల్ల కలువ’ అనే సమాసపదంలో నల్ల, కలువ అనే రెండు పదాలున్నాయి. మొదటి పదం ‘నల్ల’ అనేది విశేషణం. రెండో పదం ‘కలువ’ అనేది నామవాచకం. ఈ విధంగా విశేషణానికీ, నామవాచకానికీ (విశేష్యానికీ) సమాసం జరిగితే దాన్ని ‘కర్మధారయ సమాసం’ అంటారు.

1) విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం.
విశేషణం పూర్వపదంగా (మొదటి పదంగా) ఉంటే ఆ సమాసాన్ని “విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం” అంటారు. ఉదా : తెల్లగుర్రం – తెల్లదైన గుర్రం తెల్ల – విశేషణం (పూర్వపదం – మొదటి పదం) గుర్రం – నామవాచకం (ఉత్తరపదం – రెండోపదం)

2) విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం.
‘మామిడి గున్న’ అనే సమాసంలో మామిడి, గున్న అనే రెండు పదాలున్నాయి. మొదటి పదం (పూర్వపదం) ‘మామిడి’ – నామవాచకం. రెండోపదం (ఉత్తరపదం) ‘గున్న’ విశేషణం. ఐతే విశేషణమైన ‘గున్న) ‘ఉత్తరపదం’గా (రెండోపదంగా) ఉండడం వల్ల దీన్ని ‘విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం’ అంటారు.

కింది పదాలు చదవండి. విగ్రహవాక్యాలు, ఏ సమాసమో రాయండి.
1) పుణ్యభూమి – పుణ్యమైన భూమి – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
2) మంచిరాజు – మంచివాడైన రాజు – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
3) కొత్త పుస్తకం – కొత్తదైన పుస్తకం – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
4) కార్మికవృద్ధుడు – వృద్ధుడైన కార్మికుడు – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
5) తమ్ముగుజ్జలు – తమ్మువైన గుజ్జలు విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం

ఇ) ఛందస్సు:
1. కింది పద్యపాదాలకు గణ విభజన చేసి, అవి ఏ పద్యపాదాలో తెల్పి, లక్షణాలను రాయండి.

i) కావున శాంతిఁబొందుటయ కర్జము దానది యట్టులుండె శ్రీ
AP Board 9th Class Telugu Solutions Chapter 1 శాంతికాంక్ష 1
ఇది “ఉత్పలమాల” పద్యపాదము.
ఉత్పలమాల – లక్షణం:

  1. ఈ పద్యానికి నాలుగు పాదములు ఉంటాయి.
  2. ప్రతి పాదములో భ-ర-న-భ-భ-ర-వ అనే గణాలు ఉంటాయి.
  3. ప్రతి పాదమందలి మొదటి అక్షరాలు పదవ అక్షరాలతో యతి మైత్రిని పొందుతాయి.
  4. ప్రాస నియమము ఉంది.
  5. ప్రతి పాదానికి 20 అక్షరాలు ఉంటాయి.

AP Board 9th Class Telugu Solutions Chapter 1 శాంతికాంక్ష

ii) పగయడగించు టెంతయు శుభం బదిలెస్సయడంగునే పగం
AP Board 9th Class Telugu Solutions Chapter 1 శాంతికాంక్ష 2
ఇది ‘చంపకమాల’ పద్యపాదం.
చంపకమాల – లక్షణం :

  1. చంపకమాల పద్యానికి నాలుగు పాదాలు ఉంటాయి.
  2. ప్రతిపాదములోనూ న-జ-భ-జ-జ-జ-ర అనే గణాలు ఉంటాయి.
  3. ప్రతి పాదమందలి మొదటి అక్షరాలు 11వ అక్షరాలతో యతి మైత్రిని పొందుతాయి.
  4. ప్రాస నియమం ఉంది.
  5. ప్రతి పాదానికి 21 అక్షరాలుంటాయి.

2. శార్దూలం:
AP Board 9th Class Telugu Solutions Chapter 1 శాంతికాంక్ష 3
పై గణవిభజనను పరిశీలించండి. ఇలా మ-స-జ-స-త-త-గ అనే గణాలు వరుసగా ప్రతి పాదంలోనూ వస్తే అది ‘శార్దూల’ పద్యం అవుతుంది. అన్ని వృత్త పద్యాలలాగా దీనికి ప్రాసనియమం ఉంటుంది. ‘యతి’ 13వ అక్షరానికి చెల్లుతుంది (ఆ-య).
మిగిలిన పాదాలకు గణ విభజన చేసి లక్షణాలను సరిచూడండి.

AP Board 9th Class Telugu Solutions Chapter 1 శాంతికాంక్ష 4
1) దీనిలో కూడా మ-స-జ-స-త-త-గ అనే గణాలున్నాయి.
2) ‘పే’ లోని ఏ కారానికి 13వ అక్షరమైన ‘కే’ లోని ఏ కారానికి యతి మైత్రి చెల్లింది.
3) ప్రాస నియమం ఉంది.
4) పాదానికి 19 అక్షరాలున్నాయి.

AP Board 9th Class Telugu Solutions Chapter 1 శాంతికాంక్ష 5
1) ఈ పాదంలో కూడా మ-స-జ-స-త-త-గ అనే గణాలున్నాయి.
2) ‘సో’ లోని ఓ కారానికి, 13వ అక్షరమైన ‘చు’ లోని ఉ కారానికి యతి మైత్రి చెల్లింది.
3) ప్రాస నియమం ఉంది
4) పాదానికి 19 అక్షరాలున్నాయి.

AP Board 9th Class Telugu Solutions Chapter 1 శాంతికాంక్ష 6
1) ఈ పాదంలో కూడా మ-స-జ-స-త-త-గ అనే గణాలున్నాయి.
2) ‘మో’లోని మకారానికి, 13 వ అక్షరమైన ‘ము’ లోని మ కారానికి యతి మైత్రి చెల్లింది.
3) ప్రాస నియమం ఉంది.
4) పాదానికి 19 అక్షరాలున్నాయి.

ఈ) అలంకారాలు :

I. ఇంతకుముందు తరగతులలో ‘ఉపమాలంకారం’ గురించి తెలుసుకున్నారు కదా ! ఈ పాఠంలోని ఉపమాలంకారానికి సంబంధించిన ఉదాహరణను రాసి, వివరించండి.
ఉపమాలంకార లక్షణం :
ఉపమానానికి, ఉపమేయానికి మనోహరమైన పోలిక వర్ణించినట్లైతే దాన్ని ఉపమాలంకారం అంటారు.
ఉదాహరణ :
పగ అంటూ ఏర్పడితే పామున్న ఇంట్లో కాపురమున్నట్లే.

సమన్వయం :
‘పగ’ ఉపమేయం. పామున్న ఇల్లు ఉపమానం ఉండటం సమాన ధర్మం. ఉపమావాచకం లోపించడం.

AP Board 9th Class Telugu Solutions Chapter 1 శాంతికాంక్ష

II. గతంలో తెలుసుకున్న ‘వృత్త్యనుప్రాస’ను గూర్చి ఆ అలంకార లక్షణం రాసి, ఉదాహరణలు రాయండి.

వృత్త్యనుప్రాసాలంకారం లక్షణము : ఒక పద్యంలో గాని, వాక్యంలో గాని ఒకే అక్షరం పలుమార్లు వచ్చేలా ప్రయోగించడాన్ని వృత్త్యనుప్రాసాలంకారం అంటారు.
ఉదాహరణ -1:
1) లక్ష భక్ష్యములు భక్షించు ఒక పక్షి కుక్షికి ఒక భక్ష్యము లక్ష్యమా?
పై వాక్యంలో ‘క్ష’ కారము ‘క్ష్య’ వర్ణము పలుమార్లు ప్రయోగించబడి ఒక అద్భుతమైన సౌందర్యము తీసుకురాబడినది కనుక ఇది వృత్త్యనుప్రాసాలంకారం.

ఉదాహరణ – 2:
2) కాకి కోకిల కాదు కదా !
పై వాక్యంలో ‘క’ కారం పలుమార్లు ప్రయోగించబడి, వినసొంపుగా ఉంది. కాబట్టి ఇది వృత్త్యనుప్రాసాలంకారం.

ఉదాహరణ – 3:
3) లచ్చి పుచ్చకాయ తెచ్చి ఇచ్చింది.
పై వాక్యంలో ద్విత్వచకారం పలుమార్లు అందంగా ప్రయోగింపబడినది. కాబట్టి ఇది వృత్త్యనుప్రాసాలంకారం.

9th Class Telugu 1st Lesson శాంతికాంక్ష కవిపరిచయం

మహాభారతాన్ని తెలుగులో కవిత్రయం వారు (ముగ్గురు కవులు) రచించారు. వారిలో తిక్కన రెండోవారు. వీరు 13వ శతాబ్దానికి చెందిన మహాకవి. నెల్లూరును పరిపాలించిన మనుమసిద్ధికి మంత్రిగా, ఆస్థానకవిగా ఉన్నారు. తిక్కన మొట్టమొదట ‘నిర్వచనోత్తర రామాయణము’ను రచించి మనుమసిద్ధికి అంకితం ఇచ్చారు. తిక్కన రెండో గ్రంథం ‘మహాభారతం’. విరాటపర్వం నుండి స్వర్గారోహణ పర్వం వరకు 15 పర్వాలు రచించి హరిహరనాథునికి అంకితం ఇచ్చారు.

మహాభారత రచనలో ఈయన తీర్చిదిద్దిన పాత్రలు సజీవంగా కనిపిస్తాయి. వీరి శైలిలో ‘నాటకీయత’ ఉంటుంది. సందర్భానుగుణంగా వీరు ప్రయోగించిన పదాలు సృష్టించిన సన్నివేశాలు రసాస్వాదన కలిగిస్తాయి. ఆ ఔచిత్యవంతంగా రసపోషణ చేయగలడాన్ని ‘రసాభ్యుచిత బంధం’ అంటారు. ఇందులో తిక్కన సిద్ధహస్తుడు. సంస్కృతాంధ్రాలలో కవిత్వం రాయగలిగిన ప్రతిభాశాలి కాబట్టి ‘ఉభయకవి మిత్రుడు’ అనీ, కేతనాది కవులకు ప్రేరణ కలిగించి మార్గదర్శకులుగా నిలిచినందుకు ‘కవి బ్రహ్మ’ అనీ బిరుదులు పొందారు.

పద్యాలు – ప్రతి పదార్థాలు-భావాలు

1వ పద్యం :
తే॥ సమయమిది మిత్రకార్యంబు చక్కఁజేయ
నీకతంబున నే మవినీతుఁడైన
యా సుయోధను తోడి పోరాట దక్కి
యనుభవింతుము మా యంశమగు ధరిత్రి.
ప్రతిపదార్థం :
మిత్రకార్యంబున్ = స్నేహితుల పనిని
చక్కన్ + చేయన్ = చక్కబెట్టడానికి
సమయము + ఇది = తగిన కాలమిది
నీ కతంబునన్ = నీ మూలంగా
ఏము = మేము
అవినీతుడు + ఐన = అయోగ్యుడైన
ఆ సుయోధను = ఆ దుర్యోధనునితో
తోడి పోరాట = యుద్ధం
తక్కి = మాని
మా + అంశము + అగు ధరిత్రిన్ = మా వంతు రాజ్యాన్ని
అనుభవింతుము = మేము అనుభవిస్తాము.

భావం :
కృష్ణా ! మిత్రులమైన మా పనిని చక్కబెట్టడానికి నీకు ఇదే తగిన కాలం. నువ్వే రాయబారానికి వెళితే, అయోగ్యు డయిన ఆ దుర్యోధనుడితో మేము యుద్ధం చేయవలసిన పని లేదు. మా వంతు రాజ్యం మాకు వస్తుంది.

AP Board 9th Class Telugu Solutions Chapter 1 శాంతికాంక్ష

2వ పద్యం :
కం॥ ఇచ్చటి బంధులు నీవును
నచ్చెరువడి వినుచునుండ నయిదూళ్ళును మా
కిచ్చినను జాలునంటిని
బొచ్చెముగా దింతపట్టు పూర్ణము సుమ్మీ !
ప్రతిపదార్ధం :
ఇచ్చటి = ఇక్కడ ఉన్న
బంధులు = చుట్టాలు
నీవును = నీవు కూడ
అచ్చెరువడి = ఆశ్చర్యంతో
వినుచున్ + ఉండన్ = వింటూ ఉండగా
మాకున్ = అన్నదమ్ములమైన మాకు
అయిదు + ఊళ్ళును = ఐదు గ్రామాలను
ఇచ్చినను = ఇచ్చినప్పటికీ
చాలున్ + అంటిని = సరిపోతాయని అన్నాను
పొచ్చెము + కాదు = తక్కువ కాదు
ఇంతవట్టు = నే పల్కిన ఈ మాట
పూర్ణము సుమ్మీ ! = సంపూర్ణమైనది (నిజమైనది) సుమా !

భావం :
ఓ కృష్ణా ! ఇక్కడున్న చుట్టాలూ, నీవూ ఆశ్చర్యంతో వింటూండగా, ‘సక్రమంగా మాకు అర్ధరాజ్యం ఇవ్వడానికి మా తండ్రికి మనసొప్పకపోతే మేముండటానికి ‘ఐదూళ్ళిచ్చినా చాలు’ అని సంజయుడితో నేనింతవరకూ చెప్పిన మాటలలో దాపరికం లేదు. అంతా నిజమే సుమా!

విశేషం :
పాండవులు కోరిన ఐదూళ్ళ పేర్లను సంస్కృత మహాభారత కర్త వ్యాసుడు ఇంద్రప్రస్థం, కుశస్థం, వృకస్థలం, వాసంతి, వారణావతం అని పేర్కొన్నాడు. కానీ తెలుగు మహాభారత కర్తలలో ఒకడైన తిక్కన అవస్థలం, వృక (కుశ) స్థలంగాను, మాకంది (వాసంతి), వారణావతంతో మరొక ఊరేదైనా పేర్కొన్నాడు. బహుశా తిక్కన కాలానికి ఆయా నగరాల పేర్లు మారి ఉండవచ్చు లేక ఇంకేదైనా కారణం ఉండవచ్చు.

3వ పద్యం : కంఠస్థ పద్యంలో
శా|| ఆ దుర్యోధనుఁడంత మాత్రమును జేయంజాలఁడో కాని, పెం
పేదం గ్రూరత కోర్వరాదు, పిరి నాకేలందునే, గ్రాసవా
సోదైన్యంబులు వచ్చు నాయరయు నీ చుట్టాలకుం, గావునన్
మోదంబందుట గలుఁ గౌరవులు నేముం బొంది శ్రీపొందివన్.
ప్రతిపదార్థం :
ఆ దుర్యోధనుడు = ఆ సుయోధనుడు
అంతమాత్రమును = అంతమాత్రమైనా (నే కోరిన ఐదూళ్ళనైనా)
చేయన్ + చాలండో = ఇస్తాడో, ఇవ్వడో
కాని = కాని
పెంపు + ఏదన్ = గౌరవం చెడేటట్లు
క్రూరతకున్ + ఓర్వన్ రాదు = క్రూరమైన పనులు చేయటాన్ని సహించలేను
సిరి = రాజ్యసంపద
నాకున్ + ఏల + అందునేన్ = నాకెందుకని విడిస్తే
నా + అరయు = నేను చూసే
ఈ చుట్టాలకున్ = ఈ బంధువులకు
గ్రాసవాసః + దైన్యంబులు= తిండికీ, బట్టకూ కరవు
వచ్చున్ = ఏర్పడుతుంది
కావునన్ = కాబట్టి
కౌరవులున్ = దుర్యోధనాదులు

భావం :
ఆ సుయోధనుడు అంతమాత్రమైనా (నే కోరిన ఐదూళ్ళనైనా) ఇస్తాడో ? ఇవ్వడో ? కాని గౌరవం చెడేటట్లు క్రూరమైన పనులు చేయటాన్ని సహించలేను. రాజ్యసంపద నాకెందుకని విడిస్తే నేను చూసే ఈ బంధువులకు తిండికీ, బట్టకూ కరవు ఏర్పడుతుంది. కాబట్టి దుర్యోధనాదులు, మేము కలిసి సంపదలను పొందితే సంతోషం కలుగుతుంది.

విశేషం :
తన కుమారుల, బంధువుల పోషణ, రక్షణ ధృతరాష్ట్రునికి ఎంతముఖ్యమో తన తమ్ముల, ఆశ్రయించిన వారి పోషణ, రక్షణ తనకు ముఖ్యం అని ధర్మరాజు గడుసుగా సమాధానమిచ్చాడు. ఈ పద్యంలో చక్కని మనోవిశ్లేషణ చేయబడింది.

4వ పద్యం : -కంగస్థ పద్యం
ఉ॥ అక్కట ! లాతులైనఁ బగజైనను జంపన కోరనేల ? యొం
డొక్క తెలుగు లేదె ? యది యొప్పదె ? బంధు సుహృజ్జనంబు లా
దిక్కున మన్నవారు, గణుతింపక సంపదకై వధించి దూ
ఱెక్కుట దోషమందుటను నీ దురవస్థల కోర్వవచ్చునే ?
ప్రతిపదార్థం :
అక్కట ! = అయ్యో !
లాంతులు + జనన్ = పరాయివారైనా
పగఱు + ఐనన్ = విరోధులైనా
చంపన్ + అ + కోరన్ + ఏల = చంపాలనే ఎందుకు కోరాలి?
ఒండు + ఒక్క + తెఱంగులేదే ? = మరొక మార్గం లేదా?
అది + ఒప్పదా? = ఆ మార్గం సరైంది కాదా ?
ఆ దిక్కునన్ = ఆ కౌరవులలో
బంధుసుహృద్ + జనంబులు = చుట్టాలు, మిత్రులు
ఉన్నారు = ఉన్నారు
గణుతింపక = ఆ వైపున ఉన్న మా బంధువులను లెక్కించక
సంపదకై = రాజ్య సంపద కోసం
వధించి = చంపి
దూఱు + ఎక్కుట = నిందల పాలవటం
దోషము + అందుట = పాపం పొందటం
అను = అనే
దుర్ + అవస్థలకున్ = చెడు స్థితిని
ఓర్వన్ + వచ్చునే – సహింపదగునా?

భావం :
అయ్యో ! పరాయివారైనా, విరోధులైనా చంపాలనే ఎందుకు కోరాలి ? మరొక మార్గం లేదా ? ఆ మార్గం సరైంది కాదా ? ఆ కౌరవులలో చుట్టాలు, మిత్రులు ఉన్నారు. ఆ వైపున ఉన్న బంధువులను లెక్కించక రాజ్యసంపద కోసం చంపి, నిందల పాలవటం, పాపం పొందడమనే చెడు స్థితిని సహింపదగునా ? (కూడదని భావం).

AP Board 9th Class Telugu Solutions Chapter 1 శాంతికాంక్ష

5వ పద్యం :
ఆ||వె|| పగయ కలిగినేనిఁ బామున్న యింటిలో
నున్న యట్ల కాక యూజడిల్లి
యుండునెట్లు చిత్త మొకమాటుగావున
వలవ దధిక దీర్ఘ వైరవృత్తి
ప్రతిపదార్థం :
పగ + అ + కలిగెనేనిన్ = శత్రుత్వమే ఏర్పడితే
పాము + ఉన్న + ఇంటిలోన్ = సర్పమున్న ఇంటిలో
ఉన్న + అట్ల + కాక – ఉన్నట్లే గాని
ఒక మాటున్ = ఒకసారి అయినా
చిత్తము = హృదయం
ఊఱడిల్లి = ఊరట పొంది
ఎట్లు + ఉండున్ = ఎట్లా ఉండగలదు?
కావునన్ = కాబట్టి
అధిక దీర్ఘ వైర వృత్తి = చిరకాల విరోధంతో మెలగటం
వలవదు. = కూడదు

భావం :
శత్రుత్వము ఏర్పడితే, పాము ఉన్న ఇంటిలో ఉన్నట్లే గాని, ఒకసారైనా హృదయం ఊరట పొందదు. కాబట్టి చిరకాలం విరోధంతో ఉండకూడదు.

6వ పద్యం : కంఠస్థ పద్యం
చం|| పగయడఁగించు టెంతయు శుభం, బది లెస్స, యడంగునే సగం
బగ ? పగగొన్న మార్కొనక పల్కక యుండగ వచ్చునే ? కడుం
చెగ మొదలెత్తి పోవఁ బగ దీర్పగ వచ్చినఁ శౌర్యమొందు, నే
మిగతిఁ దలంచినం బగకు మేలిమి లేమి ధ్రువంబు దేశవా!
ప్రతిపదార్థం :
కేశవా = శ్రీ కృష్ణా !
పగ + అడంగించుట = శత్రుత్వాన్ని అణచి వేయడం
ఎంతయున్ శుభంబు = ఎంతో మేలు
అది లెస్స = అదే మంచిది
పగన్ = పగతో
పగ + అడంగునే = పగ సమసిపోదు
పగ + గొన్నన్ = (ఒకరి) పగవలన (మరొకరు) బాధపడితే
మార్కొనక = అతడిని ఎదిరించక
పల్కక + ఉండగన్ = ఊరక ఉండడం
వచ్చునే = సాధ్యమా?
కడున్ + తెగన్ = గొప్ప సాహసంతో
మొదలు + ఎత్తిపోవన్ = తుదముట్టే విధంగా
పగన్ + తీర్పగన్ = విరోధాన్ని రూపుమాపడానికి
వచ్చినన్ = సిద్ధపడితే
క్రౌర్యము + ఒందున్ = దారుణమైన పనులు చేయాల్సివస్తుంది
ఏమిగతి + తలంచినన్ = ఏ విధంగా ఆలోచించినా
పగకున్ = విరోధం వలన
మేలిమిలేమి = మంచి జరగదు
ధ్రువంబు = ఇది నిజం

భావం :
శ్రీ కృష్ణా ! శత్రుత్వాన్ని అణచివేయడం ఎంతో మేలు. అదే మంచిది. పగతో పగ సమసిపోదు. ఒకరి పగ వలన మరొకరు బాధపడితే అతడిని ఎదిరించక ఊరకుండటం సాధ్యమా ? గొప్ప సాహసంతో తుదముట్టే విధంగా విరోధాన్ని రూపుమాపడానికి సిద్ధపడితే దారుణమైన పనులు చేయాల్సి వస్తుంది. ఏ విధంగా ఆలోచించినా విరోధం వలన మంచి జరగదు. ఇది నిజం.

AP Board 9th Class Telugu Solutions Chapter 1 శాంతికాంక్ష

7వ పద్యం : కంఠస్థ పద్యం
ఉ॥ కావున శాంతిఁ బొందుటయ కర్ణము, దా నది యట్టులుండె, శ్రీ
గావలెనంచు, బోరితము గామియుఁ గోరెద, మెల్ల సొమ్ములుం
బోవుటయుం గులక్షయము పుట్టుటయున్ వెలిగాఁగ నొండుమై
వేవిధినైనఁ జక్కఁబడు టెంతయు నొప్పుఁజుమీ జనార్థవా !
ప్రతిపదార్థం :
కావునన్ = కాబట్టి
శాంతిన్ = శాంతిని
పొందుట + అ = పొందుటే
కర్ణము = చేయాల్సిన పని
తాన్ + అది = ఆ విషయం
అట్టులు + ఉండెన్ = అలా ఉండనీ
శ్రీ = సంపద
కావలెన్ + అంచున్ = కావాలని
పోరితము = యుద్ధం
కామియున్ = వద్దని
కోరెదము = కోరుతున్నాం
ఎల్ల = అన్ని
సొమ్ములున్ = సంపదలు
పోవుటయున్ = నశించడం
కులక్షయము = వంశనాశనం
వుట్టుటయున్ = కలగడం
వెలికాగన్ = జరగకుండ
ఒండుమైన్ = వేరొకవిధంగా
ఏ విధిన్ + ఐనన్ = ఎలాగోలా
చక్కన్ + పడుట = బాగుపడుట
ఎంతయున్ = మిక్కిలి
ఒప్పున్ + చుమీ = తగినది గదా !

భావం :
కాబట్టి శాంతిని పొందుటీ చేయాల్సిన పని. ఆ విషయం అలా ఉండనీ. సంపద కావాలని, యుద్ధం వద్దని కోరుతున్నాం. అన్ని సంపదలు నశించడం, వంశ నాశనం కలగడం జరగకుండా వేరొక విధంగా ఎలాగోలా బాగుపడుట మిక్కిలి తగినది గదా!

8వ పద్యం : కంఠస్థ పద్యంగా
చం॥ మనమువఁ బక్షపాతగతి మాడెన మామము ధర్మనీతి వ
రవముల రెండు దిక్కుల హితంబును బెంపును గల్గునట్టి చొ
ప్పున విదురాది సజ్జనుల బుద్ధికి రామచితంబు తోడి మె
ల్పునఁ బరుసందనంబువను భూపతులెల్ల వెఱుంగ వాడుమీ !
ప్రతిపదార్థం :
మనమునన్ = నీ మనస్సులో
మాదెసన్ = మాపై
పక్షపాతగతిన్ = అభిమానం చూపడం
మానుము = విడిచిపెట్టు
ధర్మనీతివర్తనములన్ = ధర్మంతో, నీతితో కూడిన నడవడికతో
రెండు దిక్కులన్ = ఇరువురికి
హితంబును = మేలును
పెంపును = అభివృద్ధియు
కల్గునట్టి = కలిగే
చొప్పునన్ = విధంగా
విదుర + ఆది = విదురుడు మొదలయిన
సజ్జనుల = మంచివారి
బుద్ధికిన్ + రాన్ = మనస్సులకు అంగీకారమయ్యేలా
ఉచితంబు తోడి = అనువుగా
మెల్పునన్ = మెత్తగా
పరుసందనంబునన్ = పరుషంగా
భూపతులు = రాజులు
ఎల్లన్ = అందరూ
ఎఱుంగన్ = తెలుసుకొనేలా
ఆడుము = మాట్లాడు

భావం :
నీ మనస్సులో మాపై అభిమానం చూపడం విడిచి పెట్టు, ధర్మంతో, నీతితో కూడిన నడవడికతో ఇరువురికీ మేలు, అభివృద్ధి కలిగే విధంగా, విదురుడు మొదలైన మంచివారి మనస్సులకు అంగీకారమయ్యేలా అనువుగా, మెత్తగా, పరుషంగా రాజులందరూ తెలుసుకునేలా మాట్లాడు.

AP Board 9th Class Telugu Solutions Chapter 1 శాంతికాంక్ష

9వ పద్యం :
మ॥ సుతువాఁడై వినయంబు పేకొనక యే చొప్పుం దగం జెప్ప కా
ధృతరాష్ట్రుం డవినీతిఁ జేసినను సంధింపంగ రాదంచు వే
గ తెగంబాలకు చెంపు సేయునెడ లోకం బెల్ల మెచ్చం బ్రకా
శిత ధర్మస్థితి నొంది మా మనము నిశ్చింతంబుగాఁ జేయుమీ !
ప్రతిపదార్థం :
ఆ ధృతరాష్ట్రుండు = ఆ ధృతరాష్ట్ర మహారాజు
సుతువాడు + ఐ = కొడుకు మాటే వినేవాడై
వినయంబు = విధేయతను
చేకొనక = చూపక
ఏ చొప్పుం = ఏ మార్గాన్ని
తగన్ + చెప్పక = తేల్చి చెప్పక
అవినీతిన్ చేసినను = అవినీతితో ఉన్నట్లయితే
సంధింపగన్ = సంధి చేయటం
రాదు + అంచున్ = కుదరదని
వేగ = వెంటనే
తెగన్ + పాలుకు = సాహసించకు
తెంపు + చేయు + ఎడన్ = సాహసించాల్సి వస్తే
లోకంబు + ఎల్లన్ = లోకమంతా
మెచ్చన్ = మెచ్చుకునేలా
ప్రకాశిత ధర్మస్థితిన్ = ధర్మానికి నిలచి
మా మనమున్ = మా మనస్సుల్ని
నిశ్చింతంబుగాన్ = విచారం లేనట్టివిగా
చేయుమీ = చేయాల్సింది

భావం :
ధృతరాష్ట్ర మహారాజు కొడుకుమాటే వినేవాడై | విధేయతను చూపక, ఏ మార్గాన్ని తేల్చి చెప్పక, అవినీతితో – ఉన్నట్లయితే సంధిచేయటం కుదరదని వెంటనే సాహసించి వచ్చేయకు. సాహసించాల్సి వస్తే ధర్మానికి నిలచి లోకమంతా మెచ్చుకునేలా, మా మనస్సుల్ని విచార రహితంగా చేయి.

10వ పద్యం :
కం॥ మమ్మెఱుఁగు, దెదిరి నెఱుఁగుదు
నెమ్మి యెటుఁగు దగ్గ సిద్ది నెట్ యెటుఁగుదు నా
క్యమ్ముల పద్ధతి వెఱుఁగుదు
పొమ్మోవ్వఁడ నేను నీకు బుద్ధులు సెప్పవ్.
ప్రతిపదార్థం :

మమ్మున్ + ఎఱుఁగుదు = మేమెలాంటి వాళ్ళమో తెలిసినవాడవు
ఎదిరిన్ = కౌరవులను గూర్చి
ఎఱుఁగుదు = తెలిసినవాడవు
నెమ్మిన్ + ఎఱుఁగుదు : కూర్మి అంటే ఎలాంటిదో తెలిసినవాడవు
అర్ధ సిద్ధి నెటి + ఎఱుగుదు = కార్యసాధన పద్ధతి తెలిసినవాడవు
వాక్యమ్ముల పద్ధతిన్ = మాటలాడే విధం
ఎఱుఁగుదు = తెలిసినవాడవు
నీకున్ = నీకు
బుద్ధులు + చెప్పన్ = ఉపాయాలు చెప్పడానికి
నేను + ఎవ్వడన్ = నేనేమాత్రం వాడిని
పొమ్ము = హస్తినాపురానికి వెళ్ళిరా !

భావం:
మేమెలాంటి వాళ్ళమో తెలిసినవాడివి, కౌరవులను గూర్చి తెలుసు. కూర్మి అంటే ఏమిటో తెలుసు. కార్యసాధన పద్ధతి కూడా తెలుసు. మాటలాడే విధం తెలుసు. నీకు ఉపాయాలు చెప్పడానికి నేనేమాత్రం వాడిని ? హస్తినాపురానికి వెళ్ళిరా !

AP Board 9th Class Telugu Solutions Chapter 5 పద్యరత్నాలు

AP State Syllabus AP Board 9th Class Telugu Textbook Solutions Chapter 5 పద్యరత్నాలు Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Telugu Solutions 5th Lesson పద్యరత్నాలు

9th Class Telugu 5th Lesson పద్యరత్నాలు Textbook Questions and Answers

చదవండి-ఆలోచించండి-చెప్పండి

వినదగు నెవ్వరు చెప్పిన
వినినంతనె వేగపడక వివరింపదగున్
కని కల్ల నిజము తెలిసిన
మనుజుడెపో నీతిపరుడు మహిలో సుమతీ! – బద్దెన

ప్రశ్నలు జవాబులు

ప్రశ్న 1.
పద్యం భావం చెప్పండి.
జవాబు:
భావం:
ఓ వేమనా! ఎవరు చెప్పినా వినాలి. విన్న తరువాత తొందర పడకుండా ఆలోచించాలి. అది నిజమో, అబద్దమో తెలుసుకోవాలి. అలా తెలుసుకొన్న వాడినే లోకంలో నీతిపరుడు అంటారు.

ప్రశ్న 2.
ఇలాంటి పద్యాలను ఏమంటారు?
జవాబు:
నీతి పద్యాలు లేక సుభాషితాలు అని అంటారు.

AP Board 9th Class Telugu Solutions Chapter 5 పద్యరత్నాలు

ప్రశ్న 3.
మీకు తెలిసిన ఇతర శతక పద్యాలు చెప్పండి.

1) కం|| అక్కరకు రాని చుట్టము
మ్రొక్కిన వరమీని వేల్పు మోహరమున దా
నెక్కిన బారని గుఱ్ఱము
గ్రక్కున విడువంగవలయు గదరా సుమతీ ! – సుమతీ శతకం

2) కం|| కలకొలది ధర్మముండిన
గలిగిన సిరి కదలకుండు కాసారమునన్
గల జలము మడువు లేమిని
గొల గొల గట్టుతెగిపోదె గువ్వలచెన్నా ! – గువ్వలచెన్న శతకం

3) ఆ||వే|| పరుల కొఱకే నదులు ప్రవహించు గోవులు
పాలనిచ్చు చెట్లు పూలుపూచు
పరహితమ్ము కంటె పరమార్థమున్నదా ?
లలిత సుగుణజాల తెలుగుబాల ! – తెలుగుబాల శతకం

4) ఆ||వే|| జన్మభూమి కంటే స్వర్గంబు వేరేది?
మాతృభాష కంటె మధురమేది?
కన్నతల్లి కంటే ఘనదైవమింకేది?
తెలియుమయ్య నీవు తెలుగుబిడ్డ ! – తెలుగుబిడ్డ శతకం

5) తే॥॥ విద్యచే భూషితుండయి వెలయుచున్న
దొడరి వర్జింపనగుఁ జుమీ దుర్జనుండు
చారు మాణిక్యభూషిత శస్తమస్త
కంబయిన పన్నగము భయంకరముగాదె ! – భర్తృహరి సుభాషితం

6) ఉ॥ పండితులైనవారు దిగువం దగ నుండగ నల్పు డొక్కడు
దండత పీఠమెక్కిన బుధప్రకరంబుల కేమి యెగ్గగున్
కొండొక కోతి చెట్టు కొనకొమ్మలనుండగ క్రింద గండభే
రుండ మదేభ సింహనికురుంబములుండవె చేరి భాస్కరా! – భాస్కర శతకం

7) ||వే|| మేడిపండు చూడ మేలిమై యుండును
పొట్ట విచ్చిచూడ పురుగులుండు
పిరికివాని మదిని బింకమీలాగురా
విశ్వదాభిరామ వినురవేమ! – వేమన శతకం

8) ఆ॥వె॥ పుస్తకముల నీవు పూవు వోలెను చూడు
చింపఁబోకు మురికి చేయబోకు
పరుల పుస్తకముల ఎరువు తెచ్చితివేని
తిరిగి యిమ్ము వేగ తెలుగు బిడ్డ ! – తెలుగుపూలు శతకం

ప్రశ్న 4.
ఇలాంటి పద్యాలను కవులు ఎందుకు రాసి ఉంటారు?
జవాబు:
నీతిని బోధించడానికి, సమాజాన్ని సంస్కరించడానికి రాసి ఉంటారు.

ప్రశ్న 5.
వీటి వల్ల సమాజానికి ఏం మేలు జరుగుతుంది?
జవాబు:
వీటి వల్ల సమాజానికి ఏది నీతో, ఏది అవినీతో తెలుస్తుంది. ఉత్తమ సమాజం ఏర్పడటానికి ఇది దోహదం చేస్తుంది.

ఇవి చేయండి

I. అవగాహన – ప్రతిస్పందన

ఆ) కింది అంశాల గురించి మాట్లాడండి.

ప్రశ్న 1.
పాఠంలోని పద్యాలను రాగంతో భావయుక్తంగా పాడండి. భావాలు చెప్పండి.
జవాబు:
ఉపాధ్యాయుల సహాయంతో పద్యాలు చదవండి.
భావాలు :
1) శుభాలనిచ్చే రాజశేఖరుడా ! అల్పుడు, దుర్మార్గుడు, మోసకారిని ధనవంతుడు కదా అని కోరి చేరితే, కోరికలు నెరవేరకపోగా హాని కలుగుతుంది. విలువైన మణితో ఉంది కదా అని క్రూరమైన పాముతో కలిసి ఉండటానికి ఇష్టపడరు గదా !

2) ఓ సర్వేశ్వరా ! కుల పర్వతాలన్నీ చెల్లాచెదురై, నాశనమైపోయినా, సముద్రాలు తమ హద్దుల్ని దాటి పొంగుకు వచ్చినా; సూర్యచంద్రులు తమ గతుల్ని తప్పినా ; నీ భక్తుడు మాత్రం చలించడు, గర్వంతో వీడిపోడు. నీతిని, భక్తి మార్గాన్ని వీడిపోడు.

3) ఓ సర్వేశ్వరా ! సత్యవంతుడు, దురాచారుడు కానివాడు, విచక్షణతో మెలిగేవాడు, దుర్జనులతో స్నేహం చేయనివాడు, భక్తులతో స్నేహంగా ఉండేవాడు, కామాతురుడు గానివాడే ఈ మూడు లోకాల్లో నీకు నిజమైన సేవకుడు.

4) ఓ శివా ! పార్వతీపతీ ! గాజుపూస విలువైన రత్నం ఎప్పటికీ కాలేదు. కాకి హంసగాను, జోరీగ తేనెటీగ గాను, దున్నపోతు సింహంగాను, జిల్లేడు చెట్టు కల్పవృక్షంగాను ఎప్పటికి కాలేవు. అట్లే పిసినారి దుర్జనుడు రాజు కాలేడు.

5) ఆభరణాలతో ప్రకాశించేవాడా ! ధర్మపురి అనే గ్రామంలో వెలసినవాడా ! దుష్టులను చంపేవాడా ! పాపాలను దూరం చేసేవాడా ! ఓ నరసింహస్వామీ ! సాధువులతోను, మంచివారితోను తగాదా పెట్టుకుంటే కీడు కలుగుతుంది. కవులతో గొడవ పెట్టుకున్నా, దీనులను పట్టుకొని హింసించినా, బిచ్చగాళ్ళకు కష్టం కలిగించినా, నిరుపేదలను నిందించినా కీడు కలుగుతుంది. ఇంకా పుణ్యాత్ములను తిట్టినా, భక్తులను తిరస్కరించినా, గురువుల ధనాన్ని దోచుకున్నా హాని కలుగుతుంది.
6) ఓ నారాయణా ! నీ పేరును తలవనివాడు, నీ మీద భక్తి లేనివాడు ఎన్ని నదుల్లో స్నానం చేసినా అది ఏనుగు స్నానంలా వృథానే ! మౌనంగా మనస్సులో వేద మంత్రాలను చదివినా అది అరణ్యరోదనే. ఎన్ని హోమాలు చేసినా అది బూడిదలోన వేసిన నెయ్యి మాత్రమే అవుతుంది.

7) భద్రాదిపై వెలసిన ఓ స్వామీ ! దశరథుని కుమారుడైన ఓ రామా ! సముద్రమంత దయగలవాడా ! నీవు యుద్ధంలో శత్రువుల్ని నాశనం చేశావు. గరుత్మంతుణ్ణి వాహనంగా చేసుకున్నావు. కష్టాలనే కారుచీకట్లను తొలగించగల సూర్యుడవు. హృదయమంతా దయతో నింపుకున్నావు. సీతాదేవి హృదయ కమలానికి తుమ్మెదలాంటివాడవు. రాక్షసులనే కలువలను నాశనం చేయగల మదపుటేనుగువు. చక్కని శరీరం గల వాడవు.

8) శ్రీకాళహస్తి క్షేత్రంలో కొలువైన ఈశ్వరా ! నీ పేరును తలచుకోవడం వల్ల అన్నీ సాధ్యమవుతాయి. ఈ భూమిపై “శివ ! శివ !” అని ఉత్సాహంతో పలికేవాడికి వజ్రాయుధం పువ్వు అవుతుంది. నిప్పు మంచు అవుతుంది. సముద్రం కూడ గట్టినేలలా మారుతుంది. శత్రువు మంచి మిత్రుడవుతాడు. విషం అమృతమవుతుంది.

9) ఓ కుమారా ! చదువు చెప్పే గురువును ఎదిరించకు. పోషించే యజమానిని తిట్టకు. ఒక్కడివే పనికి సంబంధించిన ఆలోచనలను చేయవద్దు. మంచి నడవడికను విడవవద్దు.

10) ఓ సుమతీ ! ఉడుము వందేళ్ళు బతుకుతుంది. పాము వెయ్యేళ్ళు ఉంటుంది. చెరువుల దగ్గర కొంగ చాలాకాలం ఉంటుంది. వీటిలో ఎక్కువకాలం ఉండటం వలన ఉపయోగం లేదు. మంచి చేయాలనే ఆలోచనతోను, ధర్మార్థ కామ మోక్షాలను సాధించగలిగినవాడే ఉత్తముడు.

AP Board 9th Class Telugu Solutions Chapter 5 పద్యరత్నాలు

ప్రశ్న 2.
పాఠంలోని పద్యాలు ఆధారంగా కింది అంశాలను చరించండి.
జవాబు:
i) నడవడిక :
లోకం పట్ల మన ప్రవర్తననే నడవడిక అంటారు. లోకానికి అపకారం చేయకుండా మంచిగా ఉంటూ జీవితాన్ని గడపాలి. లేకుంటే మన వద్దకు ఎవరూ రారు. పాము తన తలపై ఎంత విలువైన మణిని కలిగి ఉన్నా దాని దగ్గరకు ఎవరూ వెళ్ళరు కదా ! ఎక్కడైనా, ఎన్నడైనా గాజుపూస విలువైన రత్నం కాలేదు. అట్లే కాకి హంసగాను, జోరీగ తేనెటీగ గాను, దున్నపోతు సింహంగాను మారలేదు. అలాగే పిసినారి రాజు కాలేడు. అంటే దానగుణం కలవాడు, సత్ప్రవర్తన కలవాడే లోకంలో ఎప్పటికైనా ఉన్నత స్థితిని పొందగలడు.

ii) గుణగణాలు :
కుల పర్వతాలన్నీ చెదురుమదురైనా, సముద్రాలు తమ ఎల్లలను దాటి పొంగుకు వచ్చినా, సూర్యచంద్రులు గతి తప్పినా భగవద్భక్తుడు మాత్రం చలించడు. గర్వించడు. నీతి మార్గాన్ని వీడడు. ఎందుకంటే తనను భగవంతుడు రక్షిస్తాడనే ధైర్యం. భగవంతుడు ధర్మాన్ని, ధర్మం ఆచరించేవారిని తప్పక కాపాడతాడు. తాను తన ధర్మాన్ని పాటిస్తున్నాడు గనుక భగవంతుడు తప్పక రక్షిస్తాడని భక్తుని విశ్వాసం.

సత్యాన్ని పాటించడం, మంచి నడవడిక కలిగి ఉండటం, దుష్టులతో స్నేహం వీడడం, భక్తులతో స్నేహం చేయడం, సంసారమోహంలో చిక్కుకోకపోవడం భగవంతుని సేవకుడి లక్షణాలు.

భక్తులు కాకపోయినా లోకంలో చాలామంది మంచి లక్షణాలను కలిగి ఉండవచ్చు. కానీ వాళ్ళు ఏదో ఒక సందర్భంలో లోభం వల్లగాని, భయం వల్లగాని, ప్రలోభాలకు లొంగికాని చెడుమార్గంలో ప్రవేశించడానికి అవకాశాలున్నాయి. భగవద్భక్తులు తమని భగవంతుడు రక్షిస్తాడని భావించడం వల్ల ధర్మానికి తప్ప వేటికీ భయపడరు. కాబట్టి జీవితాంతం సద్గుణాలతో శోభిస్తారు.

iii) మార్గదర్శకం :
లోకంలో మంచిని పాటించేవారు, చెడుని ఆచరించేవారు కోకొల్లలుగా ఉంటారు. అయితే మంచి కోసం ప్రాణం విడిచేవారు, ధర్మానికి కట్టుబడినవారు మిగతావారికి మార్గదర్శకులై నిలుస్తారు. కొన్ని సందర్భాల్లో చెడ్డవారిని చూసి ఎలా ఉండకూడదో కూడా లోకం తెలుసుకుంటుంది. ఉడుము వందేళ్ళు జీవిస్తుంది. పాము వెయ్యేళ్ళు వృథాగా పడి ఉంటుంది. కొంగ కూడా చెరువుల వద్ద వ్యర్థంగా కాలం గడుపుతుంది. ఇవి ఇలా ఎంతకాలం ఉన్నా లోకానికేమీ ప్రయోజనం ఉండదు. వీటిని చూసి మనం అందరికీ మంచిని చేయాలనే ఆలోచనను, ధర్మార్థ కామ
మోక్షాలను సాధించాలనే పట్టుదలను పెంచుకోవాలి. అలా చేయగలిగినవాడే ఉత్తముడు. అతడే మార్గదర్శి.

iv) నైతిక విలువలు :
నీతికి సంబంధించిన విషయం నైతికం. మానవులు పాటించాల్సిన కనీస ధర్మాలను విలువలంటారు. నీతికి సంబంధించి కనీసం పాటించాల్సిన విషయాలను నైతిక విలువలంటారు.

గురువులను ధిక్కరించకూడదు. వారి మాటలకు ఎదురు చెప్పకూడదు. అలానే తనను పోషిస్తున్న యాజమానిని తిట్టకూడదు. ఒక్కడే చాలా విషయాలు గురించి ఆలోచించకూడదు. పెద్దలు, అనుభవం గలవారి సలహాలనూ, సూచనలనూ తీసుకోవాలి.

ప్రశ్న 3.
పాఠంలో మీకు నచ్చిన పద్యాలేవి? ఎందుకో చెప్పండి.
జవాబు:
పాఠంలో నాకు నచ్చిన పద్యాలు
కం|| ఉడుముండదె నూడేండ్లునుఁ
ప్రోచినదొర నింద సేయఁ బోకుము కార్యా
లోచనము లొంటిఁ జేయకు
కడునిల( బురుషార్థపరుడు గావలె సుమతీ !

కం॥ ఆచార్యున కెదిరింపకు
బడియుండదె పేర్మిఁ బాము పదినూడేండ్లున్
మడువునఁ గొక్కెర యుండదె
మాచారము విడువఁ బోకుమయ్య కుమారా !

నేటి సమాజంలో కొందరిలో నీతిగా జీవించడం తగ్గిపోగా, చాలామందిలో నీతిమంతమైన జీవనమే లోపించింది. అందుకనే అవినీతిపరుల గురించి వార్తలు పత్రికల్లో తరచుగా కన్పిస్తున్నాయి. కుమారశతకంలోని పద్యంలో నైతిక విలువలు చెప్పబడ్డాయి. సుమతీ శతకంలోని పద్యంలో ‘ఎంతకాలం బతికామనే దానికన్నా ఏమి సాధించామనే దానికే ప్రాధాన్యమ’నే నీతి చక్కగా నిరూపించబడింది. అందుకనే నాకు ఈ రెండు పద్యాలంటే చాలా ఇష్టం.

ఆ) 3, 4, 8 పద్యాలకు ప్రతిపదార్థం రాయండి.
జవాబు:
ఈ పాఠంలో ఇచ్చిన 3, 4, 8 పద్యాల ప్రతిపదార్థాలు చూడండి.

ఇ) పాఠం ఆధారంగా కింది ప్రశ్నలకు జవాబులు రాయండి.

ప్రశ్న 1.
దుర్గుణాలు గల ధనవంతునితో చేరితే ఏమవుతుంది?
జవాబు:
దుర్గుణాలు గల ధనవంతునితో చేరితే కోరికలు తీరకపోగా, ఆపదలు కలుగుతాయి. విలువైన మణి పడగపైన . ఉన్నప్పటికీ కూడా ఎవరూ పాముతో కలిసి ఉండటానికి ఇష్టపడరు గదా !

ప్రశ్న 2.
‘కులశైలంబులు’ అనే పద్యంలో అన్నమయ్య ఏం చెప్పాడో రాయండి.
జవాబు:
ఓ సర్వేశ్వరా ! కుల పర్వతాలన్నీ చెల్లా చెదురై , నాశనమైపోయినా, సముద్రాలు తమ ఎల్లలను దాటి పొంగుకు వచ్చినా, సూర్యచంద్రులు తమ గతులు తప్పినా భక్తుడు మాత్రం చలించడు. గర్వించడు. నీతి మార్గాన్ని విడచిపోడు కూడా.

AP Board 9th Class Telugu Solutions Chapter 5 పద్యరత్నాలు

ప్రశ్న 3.
ఎలాంటి జీవనం నిష్ప్రయోజనమని బద్దెన అంటున్నాడు?
జవాబు:
ఉడుము వందేళ్ళు వ్యర్థంగా గడుపుతుంది. పాము అవమానాలను సహిస్తూ వెయ్యేళ్ళు జీవిస్తుంది. కొంగ చెరువుల వద్ద తన జీవితాన్ని వృథాగా గడుపుతుంది. అలాగే మానవుడు స్వార్థంతో జీవితాన్ని వ్యర్థంగా గడిపితే ప్రయోజనం ఉండదు. అలాగాక ధర్మాన్నీ, అర్థాన్నీ, కోరికల్ని, మోక్షాన్ని సాధించగలిగినపుడే మానవ జీవితం ప్రయోజనవంతమవుతుందని బద్దెన బోధించాడు.

ప్రశ్న 4.
ధూర్జటి అభిప్రాయం ప్రకారం అన్నీ సులభసాధ్యమయ్యేలా చేసేది ఏది?
జవాబు:
ఈ లోకంలో “శివ ! శివ ! ” అని ఉత్సాహంగా పలికేవాడికి వజ్రాయుధం పువ్వు అవుతుంది. నిప్పు మంచు అవుతుంది.
సముద్రం కూడా గట్టి నేలలా మారుతుంది. శత్రువు మంచి మిత్రుడవుతాడు. విషం కూడా అమృతంగా పరిణమిస్తుంది. కాబట్టే ఈశ్వరుని పేరు తలచుకోవడం వల్ల అన్నీ సులభసాధ్యాలవుతాయి. 5. భగవంతుని సేవకుని లక్షణాలను తెలపండి. జ. కులపర్వతాలన్నీ చెదురుమదురైనా, సముద్రాలు తమ ఎల్లలు దాటి పొంగుకు వచ్చినా, సూర్యచంద్రులు తమ గతుల్ని
తప్పినా భగవంతుని భక్తుడు చలించడు. నీతిమార్గాన్ని వీడిపోడు. ఇంకా సత్యాన్ని పాటించడం, మంచి నడవడిక కలిగి ఉండడం, దుష్టులతో స్నేహం వీడడం, భక్తులతో స్నేహం చేయడం, సంసారమోహంలో చిక్కుకోకపోవడం భగవంతుని
సేవకుడి లక్షణాలు.

II. వ్యక్తీకరణ-సృజనాత్మకత

అ) కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాలలో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
‘లోభియైనవాడు రాజుగా తగడు’ ఇది సమర్ధనీయమేనా ?ఎందుకు ? (లేదా) “పిసినారియైన వాడు రాజుగా తగడు” అనే విషయం సమర్థించ తగినదేనా పద్యరత్నము ఆధారంగా వివరించండి.
జవాబు:
పిసినారి రాజుగా ఉండటానికి తగడు. ఎందుకంటే రాజువద్దకు పేదవారు, దరిద్రులు ఇంకా ధనం అవసరమైన వారు
సహాయార్థులై వస్తారు. రాజు సహృదయతతో వారి కష్టాల్ని, బాధల్ని విని తగిన సహాయం చేయాలి. పిసినారి ఆ పని చేయలేడు.
దానితో వచ్చిన వారు రాజు పై ద్వేషంతో సంఘ విద్రోహులుగా, దొంగలుగా మారే ప్రమాదం ఉంది. కాలం ఎప్పుడూ అనుకూలంగానే ఉండదు. ఒక్కొక్కసారి అతివృష్టి వలన గాని, అనావృష్టి వలన గాని రాజ్యంలో పంటలు దెబ్బతినడం గాని, సరిగా పండకపోవడం గాని జరగవచ్చు. అలాంటి సమయంలో రాజు ప్రజలకు అండగా నిలచి పన్నులను రద్దు చేయాలి. కాని లోభి ధన వ్యామోహంతో ప్రజలకు పన్ను మినహాయింపులివ్వక
బాధిస్తాడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోను లోభి రాజుగా తగడు.

ప్రశ్న 2.
నరసింహ శతకపద్యంలో గల విషయాలు నేటి సమాజానికి ఎంతవరకు అవసరమో వివరించండి.
జవాబు:
నరసింహ శతక పద్యంలో గల విషయాలు నేటి సమాజానికి బాగా ఉపయోగపడతాయి. మంచివారితో తగవు పెట్టుకుంటే హాని కలుగుతుంది. కవులతో శత్రుత్వం పెట్టుకొంటే, దీనులయిన వారిని పట్టుకొని కొడితే, ముష్టివారిని ఏడిపిస్తే, పేదలను నిందిస్తే కీడు జరుగుతుంది. పుణ్యాత్ములను తిడితే, మంచి భక్తులను తిరస్కరిస్తే, గురువుగారి సొమ్మును దోచుకుంటే కీడు జరుగుతుంది. ఈ విధంగా చెడుపనులు చేసే వారికి నరకం తప్పదు. వీరికి నరకం భద్రంగా కట్టుకొన్న మూటే.

AP Board 9th Class Telugu Solutions Chapter 5 పద్యరత్నాలు

ప్రశ్న 3.
‘ధనంపై కోరికతో అల్పుని దగ్గరికి చేరితే హాని కలుగుతుంది’ దీనికి సంబంధించి మీకు తెలిసిన సంఘటనను వివరించండి.
జవాబు:
మా వీధి చివరలో ఒక ధనవంతుడు ఉన్నాడు. అతడికి భార్యాబిడ్డలు లేరు. అతనికి బీదవాళ్ళంటే తేలిక భావం. ఎవరైనా బీదవాళ్ళు డబ్బు కావాలని అతని వద్దకు వెడితే అతడు వారికి సహాయం చేయడు. వారిని అవమానిస్తాడు. అత్యవసరంగా డబ్బు కావాలని ఎవరైనా అతణ్ణి అడిగితే మంగళ సూత్రాలూ, చెవి దుద్దులూ వగైరా తాకట్టు పెట్టుకుంటాడు. తిరిగి వారు డబ్బు ఈయలేకపోతే, ఆ నగలను తానే సొంతం చేసుకుంటాడు. వారికి ఉన్న చిన్న ఇంటిని లేక పాకను బాకీలు పేరు చెప్పి స్వాధీనం చేసుకుంటాడు. – కనుక అల్పబుద్ధి గల ధనవంతులను ధనం కోరి చేరితే హాని కలుగుతుందని తెలుస్తోంది.

ప్రశ్న 4.
‘పవి పుష్పంబగు’ పద్యభావాన్ని సొంతమాటల్లో రాయండి.
జవాబు:
శ్రీకాళహస్తి క్షేత్రంలో కొలువైన ఈశ్వరా ! నీ పేరును తలచుకోవడం వల్ల అన్నీ సాధ్యమవుతాయి. ఈ భూమిపై “శివ ! శివ !” అని ఉత్సాహంతో పలికేవాడికి వజ్రాయుధం పువ్వు అవుతుంది. నిప్పు మంచవుతుంది. సముద్రం కూడా గట్టినేలలా మారుతుంది. శత్రువు మంచి మిత్రుడవుతాడు. విషం అమృతమవుతుంది.

ప్రశ్న 5.
‘అరణ్యరోదనం’ అంటే ఏమిటి? దీన్ని ఏఏ సందర్భాల్లో వాడతారు?
జవాబు:
అడవి మధ్యలో ఉండి ఏడిస్తే ఆదుకొనేవారు, ఓదార్చేవారు ఎవరూ ఉండరు. ఏడ్చినా ఎవరూ పట్టించుకోకపోతే ఆ ఏడుపు వృథానే. వ్యర్థంగా ఏడిచే ఏడుపునే ‘అరణ్యరోదనం’ అంటారు. మనసులోని బాధను ఎన్ని రకాలుగా చెప్పినా ఎవరూ పట్టించుకోకపోయినప్పుడు, బాధను తీర్చేవారు ఎవరూలేని సందర్భాల్లో దీన్ని వాడతారు.

ఆ) కింది ప్రశ్నలకు పదిహేనేసి వాక్యాల్లో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
నిజమైన భక్తునికి ఉండదగిన లక్షణాలను గురించి రాయండి.
జవాబు:
భక్తులకు ఇంద్రియ నిగ్రహం, సర్వజీవుల హితం కోరే గుణం ఉండాలి. ఏ ప్రాణినీ ద్వేషించకూడదు. అన్ని ప్రాణులను ప్రేమించాలి. సుఖదుఃఖాలకు చలించకుండా స్థిరంగా ఉండగలగాలి. మమతను, అహంకారాన్ని వీడాలి. క్షమాగుణాన్ని కలిగి ఉండాలి. భగవంతుని యందు దృఢమైన విశ్వాసం కలిగి ఉండాలి. ఎవరినీ ఉద్రేకపరిచేలా ప్రవర్తించకూడదు. తాను కూడా ఎవరి చేష్టలకూ ఉద్రేకపడకూడదు. ఏమాత్రం కోరిక లేకుండా చేసే పనులన్నీ భగవంతుని పూజలా భావించి శ్రద్ధగా చేయాలి. శుచిగా ఉండాలి. పక్షపాత ధోరణిని వీడాలి. శత్రువుల యెడ, మిత్రుల యెడ సమభావంతో ఉండాలి. నిందకు కుంగిపోకుండా, పొగడ్తకు పొంగిపోకుండా ఉండగలగాలి. ఫలితాన్ని ఆశించకుండా పనులను చేయగలగాలి.

ప్రశ్న 2.
మంచి విద్యార్థికి ఉండాల్సిన లక్షణాలు, ఉండకూడని లక్షణాలను సొంతమాటల్లో రాయండి.
జవాబు:
మంచి విద్యార్థికి ఉండాల్సిన లక్షణాలు :
మంచి విద్యార్థికి గురువులను గౌరవించే లక్షణం ఉండాలి. ప్రతి విషయాన్నీ తెలుసుకోవాలనే ఆసక్తి ఉండాలి. క్రమశిక్షణతో మెలగాలి. విద్యలలోనే పోటీతత్త్వం ఉండాలి కాని ఇతర విషయాలలో పోటీ పడకూడదు. తోటి విద్యార్థులు స్నేహంగా ప్రవర్తించాలి. అందరితోనూ కలసిపోయే గుణం పెంచుకోవాలి. జ్ఞానార్జనకు సన్నద్ధులై ఉండాలి. మందమతులైన విద్యార్థులకు విద్యాభ్యాసంలో సహకరించాలి. తల్లిదండ్రులను గౌరవించాలి. దురలవాట్లకు దూరంగా ఉండాలి.

మంచి విద్యార్థికి ఉండకూడని లక్షణాలు :
విద్యార్థులకు అసూయాద్వేషాలు పనికిరావు. అంగవైకల్యం గల విద్యార్థులను పరిహసించకూడదు. మందమతులైన విద్యార్థులను హేళన చేయకూడదు. గురువుల మాటలకు ఎదురు చెప్పకూడదు. అహంకారంతో ప్రవర్తించకూడదు, చెడు ప్రవర్తన కలిగి ఉండకూడదు.

AP Board 9th Class Telugu Solutions Chapter 5 పద్యరత్నాలు

ఇ) సృజనాత్మకంగా రాయండి.

ధనమున్నవాళ్ళు తమధనాన్ని దానం చేయడం ద్వారా సమాజానికి ఉపయోగపడాలని ఈ పాఠంలో చదువుకున్నాం కదా!ఈ భావం వచ్చేటట్లు అనాథ శరణాలయాలకు, వృద్ధాశ్రమాలకు, బీదలకు విరాళాలు ప్రకటించమని ధనవంతులకు, వదాన్యులకు ఒక ‘కరపత్రం’ ద్వారా విజ్ఞప్తి చేయండి.
అనాథ శరణాలయాలకు, వృద్ధాశ్రమాలకు, బీదలకు విరాళాలు ఇవ్వమని ధనవంతులను కోరుతూ కరపత్రం తయారు చేయండి.
జవాబు:
కరపత్రం
అన్నదానాన్ని మించిన దానం లేదు
దాతను మించిన చిరంజీవి లేడు
దానం చేయడమే ధనార్జనకు సార్థకత. దాచుకోవడం కాదని భారతీయ ధర్మం బోధిస్తుంది. పుట్టడంతోనే తల్లిదండ్రులకు దూరమయ్యే అభాగ్యులు, చిన్న వయస్సులోనే తల్లిదండ్రులను కోల్పోయి, అయిన వారిచే నిరాదరణకు లోనైన అదృష్టహీను లెందరో ఈ దేశంలో ఉన్నారు. వారు సమాజంపై ద్వేషాన్ని పెంచుకొని సంఘ విద్రోహులుగా మారుతున్నారు. అలానే అనేక కష్టాలను, నష్టాలను భరించి, అపురూపంగా పెంచుకున్న తమ పిల్లలే ముసలితనంలో తమని వీధుల్లో విడిచి పెడితే ఏం చేయాలో తోచని అమాయక వృద్ధులు ఎందరో బిచ్చగాళ్ళ రూపంలో మనకు దర్శనమిస్తుంటారు. వీరేగాక రెక్కాడితే గాని డొక్కాడని ఎందరో నిరుపేదలు ఉన్నారు. వందల ఎకరాల పొలం గల వ్యక్తి ఉన్న ఊరిలోనే ఒక సెంటు భూమి కూడా లేనివారు జీవిస్తున్నారు. పెద్ద పెద్ద బంగళాలు గల ప్రాంతంలోనే రోడ్ల ప్రక్కన ప్రమాదకర స్థలాల్లో పూరిగుడిసెలలో జనాలు జీవిస్తున్నారు. కొందరు తిండి ఎక్కువై జీర్ణంకాక ఇబ్బంది పడుతుంటే, మరికొందరు తినడానికి ఏమీలేక బాధపడుతున్నారు.

ఇలాంటి విచిత్ర పరిస్థితుల్ని మనం నిత్యజీవితంలో దాదాపు రోజూ చూస్తూనే ఉంటాం. ఈ అసమానతలు ఇలా కొనసాగాల్సిందేనా ? వీటిని సరిచేయలేమా? అని ఆలోచిస్తాం. మన పనుల్లో పడి మర్చిపోతుంటాం. తీరికలేని పనుల్లో పడి సామాజిక బాధ్యతల్ని విస్మరిస్తాం.

మిత్రులారా ! మనకందరికి సమాజసేవ చేయాలనే కోరిక ఉన్నా తీరికలేక చేయలేకపోతున్నాం. మనం స్వయంగా సేవ చేయలేకపోయినా సమాజసేవలో మనవంతు కృషిచేసే అదృష్టం మనకందుబాటులోనే ఉంది. అదెలా అంటే మనం మన దగ్గర ఉన్న ధనాన్ని అనాథాశ్రమాలకు, వృద్ధాశ్రమాలకు విరాళంగా ఇవ్వవచ్చు. ఆ ఆశ్రమాల నిర్వాహకులు ఆ ధనాన్ని సద్వినియోగపరుస్తారు. అలానే మనవద్ద అదనంగా ఉన్న వస్త్రాలను, బియ్యం వంటి ధాన్యాలను, ఇతర ఆహార పదార్థాలను సేకరించి బీదలుండే ప్రాంతాలలో పంచిపెట్టే ఎన్నో సేవాసంస్థలు అందుబాటులోకి వచ్చాయి. మనం చేయాల్సిందల్లా ఆయా సేవాసంస్థలకు మనవద్ద ఉన్నవి అందివ్వడమే. అంతర్జాలంలో సేవాసంస్థల చిరునామాలు ఉంటాయి. డబ్బును కూడా ఉన్నచోటు నుండి కదలకుండా ఆయా సంస్థల బ్యాంకు ఖాతాలకు పంపించే సౌకర్యాలు ఉన్నాయి. వాళ్ళకు ఫోన్ చేస్తే వారే వాహనాలతో వచ్చి మనవద్ద ఉన్న ధాన్యం, వస్త్రాలు మొదలైన వాటిని తీసుకొని వెళ్తారు.

సోదరులారా ! మనకు ఎక్కువైన వాటితోనే కొన్ని కుటుంబాలు ఒకపూటైనా చక్కని, భోజనాన్ని, మంచి వస్త్రాన్ని పొందగలుగుతాయి. కాబట్టి మనకున్న ఈ సౌకర్యాన్ని వినియోగిద్దాం. మన సహృదయతను పెద్ద మొత్తాలలో విరాళాలు ప్రకటించడం ద్వారా, ధాన్య వస్త్రాలను ఇవ్వడం ద్వారా చాటుకొందాం. దేశంలో పేదరికాన్ని నిర్మూలించడంలో మన వంతు సాయాన్ని అందిద్దాం.
పేదలకు సాయం చేద్దాం
పేదరికాన్ని రూపుమాపుదాం
(లేదా)
మీ పాఠం ఆధారంగా కవుల భావాలను నీతివాక్యాల రూపంలో రాయండి.
(లేదా)
పద్యరత్నాలు పొఠం ఆధారంగా కొన్ని నీతివాక్యాలు రాయండి.
జవాబు:

  1. దుర్గుణాలు గల ధనవంతునితో చేరిక ; మణిగల నాగుపాముతో కలయిక.
  2. ప్రకృతి ప్రకోపించినా వేయకు వెనుకడుగు ; దేవుని చేరడానికి వేయి ధర్మపథాన ముందడుగు.
  3. గుణవంతుడు, కాంక్షారహితుడు, సత్యవంతుడు కాగలడు భగవద్భక్తుడు.
  4. పిసినారి కాలేడు ఎన్నటికీ ఉన్నతాధికారి ; విలువలేనివి చేరి పొందవుగా ఉన్నతి మరి.
  5. చేస్తే సమాజానికి హాని ; పడతాడు దేవుడు నీ పని.
  6. చేయకుండా భగవంతుని స్మరణం ; చేసిన పనులన్నీ అవుతాయి (శూన్యం) వ్యర్థం.
  7. నిరంతరం భగవంతుని స్మరణం ; అనవరతం కష్ట కార్యహరణం.
  8. గురువుల మాటకు ఎదురు చెప్పకు’ ; పోషించే యజమానిని నిందించకు.
  9. ఒక్కడివే కార్యాలోచన చేయవద్దు ; మంచి నడవడికను ఎన్నడు వీడవద్దు.
  10. ఎంతకాలం బతికామన్నది కాదు ముఖ్యం ; ఎంతమందికి మంచి చేశామన్నది ముఖ్యం.

(లేదా)
పాఠంలో మీకు నచ్చిన ఏదైనా పద్యానికి తగిన గేయాన్ని గాని, కవితను గానీ రాయండి.
జవాబు:
భగవంతునిపై భక్తి
పెంచుతుందెంతో ధీశక్తి
సమాజ సేవలపై కలిగిస్తుంది ఆసక్తి
చెడు స్నేహాల నుండి కల్పిస్తుంది విముక్తి
మంచి కార్యాలపై పెంచుతుంది అనురక్తి
దురలవాట్లపై కలిగిస్తుంది విరక్తి
సర్వానర్థాల నుండి కలుగుతుంది ముక్తి.

AP Board 9th Class Telugu Solutions Chapter 5 పద్యరత్నాలు

ఈ) ప్రశంసాత్మకంగా రాయండి.
“మంచి గుణాలు గల వ్యక్తికి రూపం, ధనం లేకపోయినప్పటికీ, వాణ్ణి బుద్ధిమంతులు చక్కగా గౌరవిస్తారు.” అని చదువుకున్నాం కదా ! అటువంటి వ్యక్తులెవరైనా మీకు తెలిసిన వారున్నారా? వారి గురించి తెలపండి.
జవాబు:
ఆంగ్ల సాహిత్యంలో “జార్జ్ బెర్నార్డ్ షా” సుప్రసిద్ధుడు. కానీ ఆయన అందవికారి. అయితే అతని అందవికారం అతనికి మహాకవిగా, గొప్ప విమర్శకునిగా కీర్తి రావటంతో ఏమాత్రం అడ్డంకి కాలేదు. అతనికి మంచి రూపం లేకపోయినప్పటికి బుద్ధిమంతులతని సాహిత్యాన్ని, విమర్శలను గొప్పవిగా గుర్తించి, గౌరవించారు. కాబట్టి రూపం ఎప్పుడూ మంచిగుణాలు గల వారికి అడ్డంకి కాలేదు.

మన తెలుగు సాహిత్యంలో మహాకవులుగాను ప్రసిద్ధులైన వారిలో చాలామంది పేదరికాన్ని అనుభవించారు. ఉదాహరణకు శ్రీశ్రీ గా ప్రసిద్ధుడైన “శ్రీరంగం శ్రీనివాసరావు”. ఈ మహాకవి “ఈ యుగం నాది” అని సగర్వంగా చాటుకొన్నాడు. ఇంతటి మహాకవి కటిక దారిద్ర్యాన్ని అనుభవించాడు. గుప్పెడు మెతుకుల కోసం చిన్న చిన్న ఉద్యోగాలెన్నో చేశాడు. డబ్బు లేక ప్రపంచాన్ని చుట్టివచ్చే అనేక అవకాశాలను వదులుకున్నాడు. ఎన్నో రోజులు ఆహారం లేకుండా గడిపాడు. అతిసామాన్యుల కష్టాలను బాగా దగ్గరగా పరిశీలించాడు. కాబట్టే ఆయన కవిత్వంలో పీడితులు, బాధితులు, కార్మికులు, కర్షకులు ప్రధానమయ్యారు. ఆయన కవిత్వాన్ని దేశవ్యాప్తంగానే గాక, ప్రపంచవ్యాప్త మేధావులు చదివి మెచ్చుకున్నారు. ఆయన విశ్వనరునిగా ఎదగడానికి ఆయన దారిద్ర్యం ఏమీ అడ్డం కాలేదు.

జరుక్ శాస్త్రిగా సుప్రసిద్ధుడైన “జలసూత్రం రుక్మినాథశాస్త్రి” తెలుగు సాహిత్యంలో ‘పేరడీ’ ప్రక్రియకు ఆద్యుడు. ఈయన కూడా భయంకరమైన దారిద్ర్యాన్ని అనుభవించాడు. కష్టాలను, బాధలను హాస్యంగా మలచి తన ‘పేరడీ’లలో ఆంధ్రులందరినీ కడుపుబ్బ నవ్వించాడు. నవ్వుతోపాటు కన్నీటి చుక్కల్ని కూడా తెప్పించగలిగిన మహామేధావి, కవీశ్వరుడు. ఆయన ఆరంభించిన ‘పేరడీ’ తర్వాత ఆంధ్రసాహిత్యంలో ఒక ప్రక్రియగా ఏర్పడి, నేటికీ అందరిచే ఆదరించబడుతున్నది. బాధని నవ్వుగా మలచగలిగిన బుద్ధిశాలి జరుక్ శాస్త్రి.

(లేదా)
ఈ పాఠంలో చెప్పిన గుణాల్లో ఏయే మంచి గుణాలను మీరు అలవరచుకోవాలనుకుంటున్నారో పట్టిక తయారు చేయండి.
జవాబు:
నేను అలవాటు చేసుకోవాలనుకుంటున్న మంచిగుణాలు :

  1. ధనవంతులైనా, కాకపోయినా చెడ్డవారిని ఆశ్రయించకూడదనే మంచి అలవాటు అలవర్చుకోవాలనుకుంటున్నాను.
  2. ఎన్ని కష్టాలెదురైనా ధర్మమార్గాన్ని వీడను.
  3. ఎల్లప్పుడూ సత్యాన్నే పలకాలని నిశ్చయించుకున్నాను.
  4. ఏ పనినైనా ఫలితాన్ని ఆశించకుండా చేయాలనుకుంటున్నాను.
  5. పిసినారితనాన్ని విడిచిపెట్టాలనుకుంటున్నాను.
  6. సమాజానికి హాని కలిగించే పనుల్ని చేయకూడదని నిర్ణయించుకున్నాను.
  7. గురువుల మాటకు ఎదురుచెప్పకూడదని అనుకుంటున్నాను.
  8. నాకు ఉద్యోగాన్ని ఇచ్చి, జీవనోపాధి కల్పించిన యాజమానిని/సంస్థను నిందించకూడదని అనుకుంటున్నాను.
  9. చెడు నడతను విడిచి పెట్టాలనుకుంటున్నాను.
  10. కార్యాలోచన ఒక్కడ్లే చేయకుండా ఆత్మీయుల, మిత్రుల సలహా, సూచనలతో చేయాలనుకుంటున్నాను.
  11. మంచి నడవడికను ఎప్పుడూ విడిచిపెట్టకూడదని నిశ్చయించుకున్నాను.
  12. అందరికీ సహాయం చేస్తూ ఆనందంగా బతకాలని నిర్ణయించుకున్నాను.

IV. ప్రాజెక్టు పని

ఒకటో తరగతి నుండి తొమ్మిదో తరగతి వరకు అన్ని తెలుగు పాఠ్యపుస్తకాల్లోని నీతి పద్యాలను సేకరించి, ఒక పుస్తకంలా తయారుచేయండి. మీ తరగతిలో ప్రదర్శించండి.
జవాబు:
విద్యార్థి కృత్యం.

III. భాషాంశాలు

పదజాలం

అ) కింద పదాలకు అర్థాలను పాఠ్యపుస్తకం చివర ఉన్న ‘పద విజ్ఞానం’లో వెతికి వాటిని ఉపయోగించి సొంతవాక్యాలు రాయండి.
ఉదా :
మడువు = కొలను, మడుగు
కొంగ మడువులోని చేపలను తినాలని చూసింది.

1. అవని = భూమి
అవనిపై పచ్చదనం తగ్గిపోతుందీ మధ్య.

2. కొక్కెర = కొంగ
కొక్కెర నేర్పుగా చేపలను పడుతుంది.

3. భృంగం = తుమ్మెద
పద్మాలపై భృంగం అందంగా తిరుగుతుంది.

4. అనర్ఘం = వెలకట్టలేనిది
మంచి పౌరులు సమాజానికి అనర్ఘ రత్నాల వంటివారు.

5. పవి = వజ్రాయుధం, పిడుగు
1) ఇంద్రునికి ఇష్టమైన ఆయుధం పవి.
2) ఈ సంవత్సరం పవి పతనాల (పిడుగుపాటు) వల్ల మరణాల సంఖ్య పెరిగింది.

6. తురంగం = గుఱ్ఱము
మోటారు వాహనాలు లేని రోజుల్లో తురంగం ప్రయాణాలకు ఉపయోగపడేది.

7. పంచాస్యం – సింహము
వేటగాని దాడివల్ల పంచాస్యం మరణించింది.

8. దురాచారుడు = చెడు ఆచారాలు గలవాడు
దురాచారునితో స్నేహం ఎప్పటికైనా ప్రమాదాన్నే కలిగిస్తుంది.

9. దివ్యాహారం = అమృతము దేవతలు,
దానవులు పాలసముద్రాన్ని మధించినపుడు దివ్యాహారం పుట్టింది.

ఆ) కింది పదాలకు పదపట్టికలో పర్యాయపదాలు వెతికి వాటితో వాక్యాలు రాయండి.
ఉదా :
ఈప్సితం = కోరిక, వాంఛ

అ) కళ్ళారా హిమాలయాలను చూడాలని రవికి చిరకాల వాంఛ.
ఆ) ఎన్నోసార్లు తన కోరికను తల్లిదండ్రుల ముందు బయటపెట్టాడు.
ఇ) మొత్తానికి తన ఈప్సితం తీరేటట్లు తల్లిదండ్రులు అనుమతి ఇచ్చారు.

అవని :
1) భూమి
2) ధరణి

అ) భూమిని రక్షించుకోవడం అందరి బాధ్యత.
ఆ) ఓజోన్ పొర తొలగిపోవటం వల్ల అవనికి ప్రమాదం ఏర్పడింది.
ఇ) సూర్యుని నుండి అతినీలలోహిత కిరణాలు వస్తూండడం వల్ల ధరణి వేడెక్కిపోతున్నది.

2. విపత్తు :
1) ఇడుము
2) ఆపద
అ) ఆడవారికీ మధ్యకాలంలో ఆపదలు పెరిగాయి.
ఆ) ఎటు నుండి విపత్తులు వస్తాయో అని ఆడపిల్లల తల్లిదండ్రులు భయపడుతున్నారు.
ఇ) ప్రభుత్వం ఆడవారికి రక్షణ కల్పించడం ద్వారా ఇడుములు దూరం చేయడానికి ఎంతగానో ప్రయత్నిస్తున్నది.

3. ఏనుగు :
1) కరి
2) మత్తేభం ,
అ) ఏనుగులు చెఱకుతోటలపై దాడిచేస్తాయి.
ఆ) కరుల సమూహాన్ని దూరంగా పంపడం కష్టంతో కూడిన పని.
ఇ) కొన్నిసార్లు మత్తేభాల కాళ్ళు కిందపడి జనాలు మరణిస్తూ ఉంటారు.

4. భుజంగం :
1) వాతాశనం
2) సర్పం
అ) సర్పాలలో విషం కలిగినవి కొన్నే. కాని మనం వాతాశనాన్ని చూడగానే చంపుతాం.
ఆ) కాబట్టే భుజంగాల సంఖ్య బాగా తగ్గిపోయిందీ మధ్యకాలంలో,

5. తురంగం :
1) అశ్వం
2) వాజి
అ) జంతువులలో బాగా వేగంగా పరుగెత్తగలవి అశ్వాలు.
ఆ) తురంగాల కాళ్ళు ఇసుకలో కూరుకుపోవు.
ఇ) కాబట్టే వాజులను ఎడారులలో ప్రయాణించడానికి వినియోగించేవారు పూర్వకాలంలో.

6. సత్యం :
1) నిజం
2) ఋతం
అ) పిల్లలు నిజం పలికేలా చూడాలి.
ఆ) సత్యం చెప్పడం వల్ల మంచి జరుగుతుందని వారికి నచ్చచెప్పాలి.
ఇ) ఋతాన్ని పలకడం వల్ల కలిగే ప్రయోజనాలను వారికి వివరించాలి.

AP Board 9th Class Telugu Solutions Chapter 5 పద్యరత్నాలు

ఇ) కింది పదాలకు వ్యుత్పత్త్యర్థాలు రాయండి.

1. దాశరథి : దశరథుని కుమారుడు (రాముడు)
2. గురువు : అజ్ఞానమనే అంధకారాన్ని పోగొట్టేవాడు
3. జలజాతం : నీటి నుండి పుట్టినది
4. పంచాస్యం : విస్తరించిన ముఖం గలది (సింహం)
5. మధువ్రతం : తేనె సేకరించడమే వ్రతంగా గలది (తుమ్మెద)
6. అబ్దం : నీటి నుండి పుట్టినది (అప్ అంటే నీరని అర్థం)
7. ధూర్జటి : పెద్ద జడలు కలిగినవాడు (శివుడు)
8. ధర : అన్నింటినీ ధరించునది (భూమి)

ఈ) పాఠార్యశం ఆధారంగా కింది నానార్థాలకు సంబంధించిన మూలపదాలను వెతికి రాయండి.
1. నీరు, గరళం, తామరతూడు = విషం
2. చీకటి, తమోగుణం, దుఃఖం = తమం
3. ఏనుగు, మూడడుగుల కొలత, ఎనిమిది అనే అంకె = గజం
4. అవయవం, ఒక దేశం, భాగం = అంగం

ఉ) కింది జాతీయాలను ఉపయోగించి సొంతవాక్యాలు రాయండి.
1. గజస్నానం : వ్యర్థమైన స్నానం
చిన్న పిల్లలకు స్నానం చేయించినా అది గజస్నానమే.

2. అరణ్యరోదనం : ఏడుపు వల్ల ప్రయోజనం లేకపోవడం.
నగరాలు విస్తరిస్తున్న నేటి కాలంలో ప్రకృతి ప్రేమికుల అరపులు అరణ్యరోదనలే అవుతున్నాయి.

3. బూడిదలో పోసిన నెయ్యి : వ్యర్థమైపోవడం
మా అన్నయ్య ఇంజనీరింగ్ లో తప్పడంతో అమ్మానాన్నల శ్రమ అంతా బూడిదలో పోసిన నెయ్యి అయింది.

వ్యాకరణం

అ) కింది పదాలను విడదీసి, సంధి పేరు రాయండి.
ఉదా:
ఫణాగ్రము – ఫణ + అగ్రము : సవర్ణదీర్ఘ సంధి

పదంవిసంధి రూపంసంధి పేరు
1. పరమాన్నంపరమ + అన్నంసవర్ణదీర్ఘ సంధి
2. పంచాస్యంపంచ + ఆస్యంసవర్ణదీర్ఘ సంధి
3. పదాబ్దంపద + అబ్దంసవర్ణదీర్ఘ సంధి
4. ధనాఢ్యుడుధన + ఆఢ్యుడుసవర్ణదీర్ఘ సంధి
5. మధువ్రతేంద్రంమధువ్రత + ఇంద్రంగుణసంధి
6. సర్వేశ్వరాసర్వ + ఈశ్వరాగుణసంధి

ఆ) కింది పదాలను కలిపి, ఏ సంధులో గుర్తించండి.
ఉదా:
పలాయనంబు + అగుట = పలాయనంబగుట = ఉకారసంధి

విసంధి రూపంపదంసంధి పేరు
1. అభోజ్యములు + ఔటఅభోజ్యములౌటఉకారసంధి
2. కోపంబు . + ఎక్కువకోపంబెక్కువఉకారసంధి
3. భృత్యుండు + అతడుభృత్యుండతడుఉకారసంధి
4. ప్రాప్తము + అగుప్రాప్తమగుఉకారసంధి
5. రాజు + ఔనారాజానాఉకారసంధి

ఇ) పాఠం చదివి, కింది సంధులకు సంబంధించిన ఉదాహరణలను వెతికి రాయండి. ఆ సంధి పదాలను విడదీసి, సూత్రాలను నోటుబుక్కులో రాయండి.

1. యణాదేశ సంధి :
య్, వ్, ర్ – అనే వర్ణాలకు యణ్ వర్ణాలని పేరు. సంధిలో యణ్ వర్ణాలు ఆదేశంగా వస్తాయి. గనుక ఇది యణాదేశ సంధి.
సూత్రం :
ఇ, ఉ, ఋ లకు అసవర్ణమైన అచ్చులు పరమైతే వాటి స్థానంలో క్రమంగా య, వ, ర లు ఆదేశంగా వస్తాయి.

ఇతి + ఆభాషణ = ఇత్యాభాషణ = యణాదేశ సంధి
AP Board 9th Class Telugu Solutions Chapter 5 పద్యరత్నాలు 1

2. గుణసంధి :
ఏ, ఓ, అర్ అనే వర్ణాలకు గుణవర్ణాలని పేరు. సంధిలో గుణవర్ణాలు ఏకాదేశంగా వస్తాయి గనుక ఇది గుణసంధి.

సూత్రం :
అకారమునకు ఇ, ఈ లు పరమైతే ఏ కారం, ఉ, ఊ లు పరమైతే ఓ కారం ; ఋ, ౠలు పరమైతే ‘అర్’ అనేవి ఏకాదేశంగా వస్తాయి.
AP Board 9th Class Telugu Solutions Chapter 5 పద్యరత్నాలు 2

1) సర్వ + ఈశ్వరా = సర్వేశ్వరా = గుణసంధి
2) శివ + ఇతి = శివేతి = గుణసంధి
3) ఆభాషణ + ఉల్లాసికిన్ = ఆభాషణోల్లాసికిన్ = గుణసంధి
4) మధువ్రత + ఇంద్రం = మధువ్రతేంద్రం = గుణసంధి
5) పరంపర + ఉత్తుంగ = పరంపరోత్తుంగ = గుణసంధి
6) నామ + ఉక్తి = నామోక్తి = గుణసంధి

3. సవర్ణదీర్ఘ సంధి :
అ, ఆ అనే అచ్చులు ఒకేచోట పుట్టి, ఒకే ప్రయత్నంతో పలకబడతాయి. ఇలా ఒకేచోట పుట్టి, ఒకే ప్రయత్నంతో పలకబడే వర్ణాలను సవర్ణాలు అంటారు. సవర్ణాలకు సంధిలో దీర్ఘం వస్తుంది గనుక ఇది సవర్ణదీర్ఘ సంధి.

సూత్రం :
అకార – ఇకార – ఉకారములకు అవే అచ్చులు పరమైతే వాటి దీర్ఘాలు ఏకాదేశంగా వస్తాయి.

ఉదాహరణలు :
1) ధన + ఆఢ్యుడు = ధనాఢ్యుడు = సవర్ణదీర్ఘ సంధి
2) ఫణ + అగ్రభాగము = ఫణాగ్రభాగము = సవర్ణదీర్ఘ సంధి
3) పంచ + ఆస్యము = పంచాస్యము = సవర్ణదీర్ఘ సంధి
4) సుర + అవనీజము = సురావనీజము = సవర్ణదీర్ఘ సంధి
5) పద + అబ్ద = పదాబ్ద = సవర్ణదీర్ఘ సంధి
6) దయ + అంతరంగ = దయాంతరంగ = సవర్ణదీర్ఘ సంధి
7) ధరా + ఆత్మజ = ధరాత్మజ = సవర్ణదీర్ఘ సంధి
8) నిశాచర = అబ్జ = నిశాచరాబ్జ = సవర్ణదీర్ఘ సంధి
9) శుభ + అంగ = శుభాంగ = సవర్ణదీర్ఘ సంధి
10) దివ్య + ఆహారము = దివ్యాహారము = సవర్ణదీర్ఘ సంధి
11) శ్రీకాళహస్తి + ఈశ్వరా = శ్రీకాళహస్తీశ్వరా = సవర్ణదీర్ఘ సంధి
12) కార్య + ఆలోచనము = కార్యాలోచనము = సవర్ణదీర్ఘ సంధి
13) పురుష + అర్థపరుడు = పురుషార్థపరుడు = సవర్ణదీర్ఘ సంధి

AP Board 9th Class Telugu Solutions Chapter 5 పద్యరత్నాలు

4. ఉత్వ సంధి :
హ్రస్వమైన ఉకారానికి జరిగే సంధిని ఉత్వసంధి అంటారు. .

సూత్రం :
హ్రస్వమైన ఉకారానికి అచ్చు పరమైతే సంధి తప్పక జరుగుతుంది.
ఉదాహరణలు :
1) వారలు + ఈప్సితము = వారలీప్సితము
2) కాంతురు + ఆ = కాంతురా
3) తలకండు + ఉబ్బడు = తలకండుబ్బడు
4) సత్యంబు + ఎప్పుడు = సత్యంబెప్పుడు
5) తప్పడు + ఏనియు = తప్పడేనియు
6) కాడు + పని = కాడేని
7) ఔచిత్యంబు + ఏమరడు = ఔచిత్యంబేమరడు
8) పొందడు + ఏ = పొందడే
9) సాంగత్యంబు + ఆదట = సాంగత్యంబాదట
10) పాయడు + ఏని = పాయడేని
11) భృత్యుండు + ఆతడు = భృత్యుండాతడు
12) రత్నము + అగునా = రత్నమగునా
13) జోరు + ఈగ = జోరీగ
14) మధువ్రతేంద్రము + అగునా = మధుప్రతేంద్రమగునా
15) పంచాస్యము + ఔనా = పంచాస్యమౌనా
16) అవనీజము + అగునా = అవనీజమగునా
17) రాజు + ఔనా = రాజౌనా
18) కార్యములు + ఒనరించు = కార్యములొనరించు
19) ఘనతరంబు + ఐన = ఘనతరంబైన
20) చందంబు + అగున్ = చందంబగున్
21) మౌనంబు + ఒప్పన్ = మౌనంబొప్పన్
22) వేదము + అటవీ మధ్యంబులో = వేదమటవీ మధ్యంబులో
23) ఏడ్పు + అగున్ = ఏడుగున్
24) హోమములు + ఎಲ್ಲ = హోమములెల్ల
25) విడువబోకుము + అయ్య = విడువబోకుమయ్య
26) పుష్పంబు + అగు = పుష్పంబగు
27) మంచు + అగు = మంచగు
28) స్థలంబు + అవు = స్థలంబవు
29) శత్రుండు + అతి = శత్రుండతి
30) మిత్రుడు + ఔ = మిత్రుడా
31) దివ్యాహారము + ఔ = దివ్యాహారమౌ
32) సర్వవశ్యకరము + ఔ = సర్వవశ్యకరమౌ
33) ఆచార్యునకు + ఎదురు = ఆచార్యునకెదురు
34) చేయకుము + ఆచారము = చేయకుమాచారము
35) పోకుము + అయ్యా = పోకుమయ్య
36) ఉండుము + ఉండదె = ఉండుముండదె
37) నూఱు + ఏండ్లు = నూడేండ్లు
38) ఉండదు + ఏ = ఉండదే

ఈ) నూతన పరిచయం :
జశ్వ సంధి :
జశ్ వరాలకు (క, చ, ట, త, ప, ఖ, ఛ, ఠ, థ, ఫ, శ, ష, స) జరిగే సంధి కాబట్టి ఇది జశ్వ సంధి. ఉదాహరణలు :
1) సత్ + భక్తి = సద్భక్తి
2) దిక్ + అంతము = దిగంతము
3) సముత్ + అంచత్ + సముదంచత్
4) మృత్ + ఘటము = మృద్దటము
5) వాక్ + ఈశుడు = వాగీశుడు
6) వాక్ + యుద్ధం = వాగ్యుద్ధం
7) వాక్ + వాదం = వాగ్వాదం
8) తత్ + విధం = తద్విధం

జశ్వసంధి సూత్రం :
పరుషములకు వర్గ ప్రథమ ద్వితీయాక్షరాలు – శ, ష, స లు తప్ప మిగిలిన హల్లులు కానీ, అచ్చులు కానీ పరమైతే వరుసగా సరళాలు ఆదేశంగా వస్తాయి.

4) సమాసాలు – ఖాళీలను పూరించండి.

సమాసపదంవిగ్రహవాక్యంసమాసం పేరు
1. సాధుసజ్జనులుసాధువులైన సజ్జనులువిశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
2. ధనాఢ్యుడుధనము చేత ఆడ్యుడుతృతీయా తత్పురుష సమాసం
3. నూడేండ్లునూటైన సంఖ్య గల ఏండ్లుద్విగు సమాసం
4. దుష్టచిత్తుడుదుష్టమైన చిత్తము గలవాడుబహుబీహి సమాసం
5. క్రూర భుజంగంక్రూరమైన భుజంగంవిశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
6. కార్యాలోచనముకార్యమును గూర్చి ఆలోచనముద్వితీయా తత్పురుష సమాసం
7. ఫణాగ్రభాగముఫణము యొక్క అగ్రభాగముషష్ఠీ తత్పురుష సమాసం
8. అనర్ఘ రత్నాలుఅనర్హమైన రత్నాలువిశేషణ పూర్వపద కర్మధారయం

ఊ) కర్మధారయ సమాసాలు
కర్మధారయ సమాసం : విశేషణానికి విశేష్యం (నామవాచకం) తో చేసే సమాసాన్ని కర్మధారయ సమాసం అంటారు.
ఉదా : కృష్ణ సర్పం.

‘కృష్ణ’ అనేది విశేషణం. ‘సర్పం’ అనేది విశేష్యం.

I. ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం:
పోలిక చెప్పడానికి ఉపయోగించేదాన్ని ‘ఉపమానం’ అంటారు. కర్మధారయ సమాసంలో మొదటి పదం ఉపమానం అయితే దాన్ని ‘ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం’ అంటారు.
ఉదా :
కలువ కనులు.

కలువ వంటి కన్నులు అనే అర్థంలో కర్మధారయ సమాసంలో కన్నులను కలువలతో పోల్చారు. కాబట్టి ‘కలువ’ ఉపమానం. ఉపమానం మొదటి పదంగా ఉంది కాబట్టి ఇది ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం.

II. ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసం :
కర్మధారయ సమాసంలో ఉపమానం ఉత్తరపదంగా ఉంటే దాన్ని ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసం అంటారు.
ఉదా :
పదాబ్దము

పద్మం వంటి పదం (పాదం) అనే అర్థంలో కర్మధారయ సమాసం చేయగా పదశబ్దం మొదటి పదంగా నిలిచింది. ఉపమానమైన అబ్దం (పద్మం) రెండవ పదంగా ఉంది కాబట్టి ఇది ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసం.

సమాసపదంవిగ్రహవాక్యంసమాసం పేరు
1. తేనెమాటతేనెవంటి మాట
(తేనె – ఉపమానం; మాట-ఉపమేయం)
ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం
2. తనూలతలత వంటి తనువు
(తనువు-ఉపమేయం; లత-ఉపమానం)
ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసం
3. చిగురుకేలుచిగురు వంటి కేలు
(చిగురు-ఉపమానం; కేలు-ఉపమేయం)
ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం
4. కరకమలములుకమలముల వంటి కరములు
కరములు-ఉపమేయం: కమలములు-ఉపమానం
ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసం

కింది పదాలకు విగ్రహవాక్యాలు రాసి, సమాసం పేరు రాయండి.

1) సుధామధురం
2) జుంటిమోవి
3) ముఖారవిందం
4) కాంతామణి
జవాబు:

సమాసపదంవిగ్రహవాక్యంసమాసం పేరు
1. సుధామధురంసుధలా మధురమైనది
(సుధ = అమృతం)
ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం
2. జుంటిమోవిజున్ను వంటి మోవిఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం
3. ముఖారవిందంఅరవిందం (పద్మం) వంటి ముఖంఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసం
4. కాంతామణిమణి వంటి కాంతఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసం

AP Board 9th Class Telugu Solutions Chapter 5 పద్యరత్నాలు

ఋ) రూపక సమాసం:
“విద్యాధనం” దీనిలో విద్య, ధనం అనే రెండు పదాలు ఉన్నాయి. పూర్వపదమైన విద్య, ధనంతో పోల్చబడింది. కాని ‘విద్య అనెడి ధనం’ అని దీని అర్థం. కనుక, ఈ విధంగా ఉపమాన ధర్మాన్ని ఉపమేయం మీద ఆరోపించడాన్ని – రూపక సమాసం అంటారు. విగ్రహవాక్యంలో ‘అనెడి’ అనే మాట చేరుతుంది.
ఉదా :
1) హృదయసారసం – హృదయమనెడి సారసం (సరస్సు) .
2) సంసారసాగరం – సంసారమనెడి సాగరం

కింది పదాలకు విగ్రహవాక్యాలు రాయండి.
1) జానజ్యోతి -జ్ఞానమనెడి జ్యోతి – రూపక సమాసం
2) అజ్ఞానతిమిరం అజ్ఞానమనెడి తిమిరం – రూపక సమాసం
3) వచనామృతం — అమృతమనెడి వచనం – రూపక సమాసం

ఋ) ఛందస్సు – మత్తేభం :
1) ఈ పద్యానికి నాలుగు పాదాలుంటాయి.
2) ప్రతి పాదానికి స. భ, ర, న, మ, య, వ అనే గణాలుంటాయి.
3) ప్రాసనియమం ఉంది.
4) 14 వ అక్షరం యతిస్థానం.
5) ప్రతి పాదానికి 20 అక్షరాలు ఉంటాయి.
AP Board 9th Class Telugu Solutions Chapter 5 పద్యరత్నాలు 3
యతి : ప – పా.

మీరు కూడా పాఠంలోని పై పద్యంలో మిగిలిన మూడు పాదాలకూ, గణవిభజన చేసి, పై మత్తేభ పద్య లక్షణాలు సరిపోయాయో లేదో చూడండి.
AP Board 9th Class Telugu Solutions Chapter 5 పద్యరత్నాలు 4
యతి : ప – ఆ.
AP Board 9th Class Telugu Solutions Chapter 5 పద్యరత్నాలు 5
యతి : అ – ఆ.
AP Board 9th Class Telugu Solutions Chapter 5 పద్యరత్నాలు 6
య యతి : శి – శ్రీ.

ఎ) అలంకారాలు :
గతంలో మీరు నేర్చుకున్న రూపక, ఉపమాలంకారాలు 6, 7 పద్యాల్లో ఉన్నాయి. ఏ పద్యంలో ఏ అలంకారం ఉందో గుర్తించి, లక్ష్య లక్షణ సమన్వయం చేయండి.
గమనిక (1):
6వ పద్యంలో ‘ఉపమాలంకారాలు’ ఉన్నాయి పరిశీలించండి.

1. స్నానంబుల్ నదులందు జేయుట గజ స్నానంబు చందంబగున్”
ఇందులో ఉపమాలంకారం ఉంది.

లక్షణము : దీనిలో 1) ఉపమానం 2) ఉపమేయం 3) ఉపమావాచకం 4) సమానధర్మం ఉంటాయి.
సమన్వయము :
1) గజస్నానంబు – ఉపమానం
2) నదులందుచేయుట – ఉపమేయం
3) చందంబు – ఉపమావాచకం
4) అగున్ – సమానధర్మం

2. మౌనంబొప్ప జపించు వేద ‘మటవీ మధ్యంబులో నేడ్పగున్’
ఇందులో ఉపమాలంకారం ఉంది.
లక్షణము :
దీనిలో 1) ఉపమానం 2) ఉపమేయం 3) ఉపమావాచకం 4) సమానధర్మం ఉంటాయి.
సమన్వయము :
1) అటవీ మధ్యంలో ఏడుపు – ఉపమానం
2) మౌనంతో వేదం జపించడం – ఉపమేయం
3) (లోపించింది) – ఉపమావాచకం
4) అగున్ – సమానధర్మం

3. ‘నానాసూమములెల్ల బూడిదలలోన న్వేల్చు నెయ్యె చనున్’
ఈ పాదంలో ఉపమాలంకారము ఉంది.

లక్షణము :
దీనిలో 1) ఉపమానం 2) ఉపమేయం 3) ఉపమావాచకం 4) సమానధర్మం ఉంటాయి.
సమన్వయము :
1) బూడిదలలోవేల్చు నెయ్యి – ఉపమానం
2) నానా హోమములు – ఉపమేయం
3) (లోపము) – ఉపమావాచకం
4) చనున్ – సమానధర్మం

గమనిక (2) :
ఏడవ పద్యంలో ‘రూపకాలంకారాలు’ ఉన్నాయి. పరిశీలించండి.

1. ‘విపత్పరంపరోత్తుంగ తమః పతంగ’
ఈ వాక్యంలో రూపకాలంకారము ఉంది.
భావం :
కష్టాలు అనే కారుచీకట్లను తొలగించే సూర్యుడు అని భావం.

రూపకాలంకార లక్షణం :
ఉపమాన ఉపమేయాలకు అభేదాన్ని చెప్పడం రూపకాలంకారం.
సమన్వయము :
1) తమము (తమస్సు) – ఉపమానం
2) విపత్పరంపరలు – ఉపమేయం
ఉపమానమైన చీకటికీ, ఉపమేయమైన విపత్తులకూ భేదం ఉన్నా లేనట్లు చెప్పబడింది. కాబట్టి ‘రూపకాలంకారం’.

2. ‘ధరాత్మజాహృదయసారసభృంగ’
ఈ వాక్యంలో ‘రూపకాలంకారం’ ఉంది.
భావం :
సీతాదేవి హృదయం అనే పద్మానికి తుమ్మెద వంటివాడవు. రూపకాలంకార

లక్షణం :
ఉపమాన ఉపమేయాలకు అభేదం చెప్పడం రూపకాలంకారం.
సమన్వయం:
1) సారసము (పద్మము) – ఉపమానం
2) హృదయము – ఉపమేయం
ఉపమానమైన సారసమునకూ, ఉపమేయం అయిన హృదయమునకూ భేదం ఉన్నా, లేనట్లు చెప్పడం జరిగింది. కాబట్టి ‘రూపకాలంకారం’.

3. ‘నిశాచరాప్తమాతంగ’
ఈ వాక్యంలో రూపకాలంకారము ఉంది.
భావం :
రాక్షసులు అనే కలువలను నాశనం చేసే ఏనుగువంటివాడు.

రూపకాలంకార లక్షణం :
ఉపమాన – ఉపమేయములకు అభేదం చెప్పడం, లేక ఉపమేయంలో ఉపమాన ధర్మాన్ని ఆరోపించడం రూపకాలంకారం.
సమన్వయం:
1) అబ్జము (కలువ) – ఉపమానం
2) నిశాచరులు – ఉపమేయం
ఉపమానమైన అబ్దమునకూ, ఉపమేయం అయిన నిశాచరులకూ భేదం ఉన్నా లేనట్లు చెప్పబడింది. కా.ట్ట ‘రూపకాలంకారం’ ఉంది.

AP Board 9th Class Telugu Solutions Chapter 5 పద్యరత్నాలు

ఏ) దృష్టాంతాలంకారం :

లక్షణం :
ఉపమేయ వాక్యానికి, ఉపమాన వాక్యానికి బింబ ప్రతిబింబ భావం వర్ణించబడితే దాన్ని దృష్టాంతాలంకారం అంటారు.

లక్ష్యం (ఉదాహరణ) :
ఓ రాజా నీవే కీర్తిమంతుడవు. చంద్రుడే కాంతిమంతుడు.

సమన్వయం :
ఇందు రాజు ఉపమేయం. చంద్రుడు ఉపమానం. ఉపమేయ వాక్యానికి, ఉపమాన వాక్యానికి బింబ ప్రతిబింబ భావం చెప్పబడింది గనుక ఇది దృష్టాంతాలంకారం. దృష్టాంతాలంకారానికి రెండు ఉదాహరణలు రాయండి.
1) రాజే ధర్మపరుడు, బుద్ధుడే అహింసాపరుడు.
2) బాబా ఆమేనే విజ్ఞాని, రమణ మహర్షియే జ్ఞాని.

9th Class Telugu 5th Lesson పద్యరత్నాలు కవుల పరిచయం

ఈ పాఠంలోని ప్రతి పద్యమూ ఒక విలువైన రత్నమే. ఈ పద్యాలన్నీ వేర్వేరు కవులు రాసిన శతకాల్లోనివి. ఆయా కవుల వివరాలు చదవండి.

1. ‘శ్రీకర రాజశేఖరా !’ అనే మకుటంతో ఉన్న పద్యం ‘రాజశేఖర శతకం’ లోనిది. దీని కర్త ‘సత్యవోలు సుందరకవి.” 20వ శతాబ్దానికి చెందినవారు. భక్తిభావం ఉట్టిపడేటట్లు సులభ శైలిలో శతకాన్ని రచించారు.

2,3. ‘సర్వేశ్వరా ! అనే మకుటంతో ఉన్న పద్యాలు ‘సర్వేశ్వర శతకం’లోనివి. వీటిని ‘యథావాక్కుల అన్నమయ్య’ రచించారు. ఇతడు 12వ శతాబ్దానికి చెందిన శివకవి. భక్తిభావబంధురమైన కవిత్వం చెప్పగల దిట్ట.

4. ‘భర్గా ! పార్వతీ వల్లభా !’ అనే మకుటంతో ఉన్న పద్యం ‘కూచిమంచి తిమ్మకవి’ రచించిన ‘శ్రీ భర్గశతకం’ లోనిది. ఈయన 17వ శతాబ్దానికి చెందిన వారు. ‘నీలాసుందరీ పరిణయం’ అనే ప్రబంధాన్ని కూడా రచించారు.

5. ‘భూషణ వికాస శ్రీధర్మ పురనివాస ! దుష్టసంహార ! నరసింహ ! దురితదూర !’ అనే మకుటంతో ఉన్న పద్యం ‘కాకుత్సం శేషప్ప కవి’ రాసిన ‘నరసింహ శతకం’లోనిది. వీరు 18వ శతాబ్దానికి చెందినవారు. గోదావరీ తీరంలో కరీంనగర్ జిల్లాలోని ధర్మపురి గ్రామంలో వెలసిన నరసింహస్వామిని ప్రస్తుతిస్తూ రాసిన శతకం ఇది.

6. ‘నారాయణా !’ అన్న మకుటంతో ఉన్న పద్యం నారాయణ శతకం లోనిది. రాసింది బమ్మెర పోతన. 15వ ఆ శతాబ్దానికి చెందిన భక్త కవి. మనస్సుకు ఆహ్లాదకరమైన, అందమైన పద్యాలు చెప్పిన సహజపండితులు.

7. ‘దాశరథీ ! కరుణాపయోనిధీ !’ అనే మకుటంతో ఉన్న పద్యం దాశరథి శతకం లోనిది. దీన్ని రచించిన కవి కంచర్ల గోపన్న. 17వ శతాబ్దానికి చెందినవారు. ఈయనకే రామదాసు అనే పేరుంది.

8. ‘శ్రీకాళహస్తీశ్వరా !’ అనే మకుటంతో ఉన్న పద్యం ‘ధూర్జటీ’ కవి రచించిన ‘శ్రీకాళహస్తీశ్వర శతకం’లోనిది. వీరు 17వ శతాబ్దానికి చెందినవారు.

9. ‘కుమారా !’ అనే మకుటంతో ఉన్న పద్యం ‘కుమార శతకం’ లోనిది. కవి ‘పక్కి అప్పలనర్సయ్య’. వీరు 16వ శతాబ్దానికి చెందినవారు.

10. ‘సుమతీ !’ అన్న మకుటంతో ఉన్న పద్యం ‘సుమతీ శతకం’ లోనిది. కవి బద్దెన. వీరు 13వ శతాబ్దానికి ! చెందినవారు.

పద్యాలు – ప్రతిపదార్థాలు-భావాలు

1వ పద్యం : – కంఠస పదం
*ఉ॥ కోరికతో ధనాఢ్యుఁడని కుత్సితు నల్పుని దుష్టచిత్తునిన్
జేరినవార లీప్సితముఁ జెంది సుఖింపరు హానిఁ గాంతు రా
చారు ఫణాగ్రభాగ విలసన్మణిరాజము గల్గి వెళ్లినన్
గ్రూర భుజంగమున్ గవయఁ గూడునె శ్రీకర రాజశేఖరా !
ప్రతిపదార్థం:
శ్రీకర = శుభాన్ని కలిగించే
రాజశేఖరా = చంద్రుని శిరస్సున ధరించే ఈశ్వరా !
కోరికతోన్ = కోరుకొని
ధనాఢ్యుడు + అని = అధిక ధనవంతుడని
కుత్సితున్ = మోసకారియైన
అల్పునిన్ = తక్కువవాడైన
దుష్టచిత్తునిన్ = చెడ్డబుద్ధికలవాణ్ణి
చేరినవారలు = చేరినవారు (ఆశ్రయించినవారు)
ఈప్సితమున్ = కోరిన కోరికను
చెంది = పొంది
సుఖింపరు = సుఖపడరు
హానిన్ = కీడును
కాంతురు = పొందుతారు
చారు ఫణాగ్రభాగ విలసన్మణిరాజము ; చారు = అందమైన
అగ్రభాగ = పై భాగము నందు
ఫణ = పడగయొక్క
విలసత్ = ప్రకాశించే
మణిరాజము = శ్రేష్ఠమైన మణిని
కల్గి = కలిగియుండి
వెల్గినన్ = ప్రకాశించినప్పటికీ (ఒప్పియున్నా)
క్రూర భుజంగమున్ = క్రూరమైన సర్పాన్ని
కవయఁగూడును + ఎ = కలిసి ఉండవచ్చా? (కలిసి ఉండరాదు)

భావం :
శుభాన్ని కల్గించే రాజశేఖరా ! మోసకారియైన ధనవంతుణ్ణి కోరి చేరితే, కోరికలు తీరకపోగా కీడు కూడా కలుగుతుంది. పడగ మీద విలువగల మణి ప్రకాశిస్తూ ఉన్నప్పటికీ, భయంకరమైన పాముతో కలిసి యుండరు కదా !

2వ పద్యం: కంఠస్థ పద్యం
* మ॥ కుల శైలంబులు పొదు పెల్లగిలి దిక్కూలంబునం గూలినం
జలధు ల్మేరల నాక్రమించి సముదంచదృంగి నుప్పొంగినన్
జలజాతప్రియ శీతభానులు యథా సంచారముఱ్ఱప్పినం
దలకం డుబ్బడు చొప్పుదప్పడు భవద్భక్తుండు సర్వేశ్వరా !
ప్రతిపదార్థం:
సర్వేశ్వరా = ఓ సర్వేశ్వర స్వామి !
కుల శైలంబులు = కుల పర్వతాల
పాదు = మూలం (ఆలవాలం)
పెల్లగిలి = నశించి, ఊడిపోయి
దిక్కూలంబునన్ = దిక్కుల దగ్గర
(దిక్ + కూలంబునన్) (దిగంతముల వద్ద)
కూలినన్ = కూలిపోయినప్పటికీ
జలధుల్ = సముద్రాలు
మేరలన్ = సరిహద్దులను
ఆక్రమించి = దాటి (చేరి)
సముదంచత్ + భంగిన్ = మిక్కిలి చెలరేగిన విధంగా
ఉప్పొంగినన్ = పైకి పొంగినా
జలజాతప్రియ, శీతభానులు; జలజాతప్రియ = పద్మ బాంధవుడైన సూర్యుడూ,
శీతభానులు = చల్లని కిరణములు గల చంద్రుడూ
యథాసంచారముల్ = వారు నిత్యం తిరిగే దారిలో తిరగడం
తప్పి నన్ = తప్పిపోయినా (ప్రక్కదారిలో తిరుగుతున్నా)
భవద్భక్తుండు (భవత్ + భక్తుండు) = నీ యొక్క భక్తుడు
తలకండు = చలింపడు
ఉబ్బడు = గర్వపడడు
చొప్పు = నీతిమార్గాన్ని
తప్పడు = విడువడు (తప్పి సంచరింపడు)

భావం : సర్వేశ్వరా ! కుల పర్వతాలన్నీ చెల్లాచెదురై దిగంతాలలో కూలినా, సముద్రాలు హద్దులను దాటి ఉప్పొంగినా, సూర్య చంద్రులు గతులు తప్పి చరించినా, నీ భక్తుడు అణుమాత్రం గర్వపడడు. నీతిమార్గాన్ని తప్పి సంచరింపడు.

AP Board 9th Class Telugu Solutions Chapter 5 పద్యరత్నాలు

3వ పద్యం: కంఠస్థ పద్యంగా
* శా॥ సత్యం బెప్పుడు దప్పుడేనియు దురాచారుండు ‘గాడేని యౌ
చిత్యం బేమరడేని దుర్జనుల గోష్ఠిం బొందడే భక్తి సాం
గత్యం బాదట బాయడేని, మదనగ్రస్తుండు గాడేని నీ
భృత్యుండాతడు మూడు లోకములలోఁ బెంపొందు సర్వేశ్వరా !
ప్రతిపదార్థం :
సర్వేశ్వరా = ఓ సర్వేశ్వరా !
సత్యంబు = సత్యాన్ని
ఎప్పుడు = అన్నివేళలా
తప్పుడు + ఏనియున్ = తప్పకుండా ఉన్నట్లయితే
దురాచారుండు = చెడు నడతగలవాడు
కాడు + ఏనిన్ = కాకుండా ఉన్నట్లయతే
ఔచిత్యంబు = తగిన విధాన్ని (ఉచితత్వము)
ఏమరడు + ఏనిన్ = మరువనట్లయితే ఆ
దుర్జనులు = దుష్టుల (చెడ్డవారి యొక్క)
గోష్ఠిన్ : = కొలువును (సంఘమును)
పొందడు + ఏన్ – చేరనట్లయితే
భక్తిసాంగత్యంబు = భక్తులతో చెలియన
ఆదటన్ = వదలక
పాయడు + ఏని = విడువడేని
మదనగ్రస్తుండు = మన్మథీమోహాంలో చిక్కుకొన్నవాడు
కాడెనిన్ = కానివాడయితే
ఆతడు = అతడు
నీ భృత్యుండు = నీకు సేవకుడు అవుతాడు
మూడు లోకములలోన్ = ముల్లోకాలలోనూ
పెంపొందున్ = అభివృద్ధి పొందుతాడు.

భావం :
ఓ సర్వేశ్వరా ! ఈ మూడు లోకాల్లోనూ సత్యము తప్పనివాడు, చెడు నడతలేనివాడు, తగిన విధంగా మెలిగేవాడు, చెడ్డవాళ్ళతో చేరనివాడు, భక్తుల సాంగత్యాన్ని విడిచిపెట్టనివాడు, సంసారమోహంలో చిక్కుకోనివాడూ ఎవడున్నాడో అతడే నీ సేవకుడు.

4వ పద్యం : కంఠస్థ పద్యం
* శా॥ గాజుంబూస యనర్ఘ రత్న మగునా ? కాకంబు రాయంచ’
నా ? జోరీగ మధువ్రతేంద్ర మగునా ? నట్టెన్ము పంచాస్యమౌ
నా ? జిల్లేడు సురావనిజమగునా ? నానాదిగంతంబులన్ ,
రాజౌనా ఘనలోభి దుర్జనుడు ? భర్గా ! పార్వతీ వల్లభా!
ప్రతిపదార్థం :
పార్వతీవల్లభా = పార్వతీపతీ !
భర్గా = ఓ ఈశ్వరా !
నానా దిగంతంబులన్ = అన్ని దిక్కుల చివరలలోనూ (ప్రపంచంలో ఎక్కడయినా)
గాజుంబూస (గాజున్ + పూస) = గాజుపూస
అనర్ఘ = వెలకట్టలేని
రత్నము = రత్నం
అగునా = అవుతుందా? (కాలేదు)
కాకంబు = కాకి
రాయంచ = రాజహంస
ఔనా ? = అవుతుందా ? (కాలేదు)
జోరీగ = పశువుల రక్తాన్ని త్రాగే ఒక జాతి ఈగ
మధువ్రతేంద్రము (మధువ్రత + ఇంద్రము) = శ్రేష్ఠమైన తుమ్మెద
అగునా = అవుతుందా ? (కాలేదు)
నట్టెను = దున్నపోతు
పంచాస్యమ = సింహం
ఔనా = అవుతుందా ? (కాలేదు)
జిల్లేడు = జిల్లేడు చెట్టు
సుర + అవనీజము = దేవతల వృక్షమైన కల్పవృక్షం
అగునా = అవుతుందా ? (కాదు)
ఘనలోబి = గొప్ప పిసినారి అయిన
దుర్జనుడు = దుర్మార్గుడు
రాజు + ఔనా = రాజు అవుతాడా ? (కాలేడు)

భావం :
భర్గా ! పార్వతీపతీ ! ప్రపంచంలో ఎక్కడైనా, ఎప్పటికీ గాజుపూస విలువైన రత్నం కాజాలదు. కాకి రాజహంస కాజాలదు. జోరీగ తేనెటీగ కాజాలదు. దున్నపోతు సింహం కాజాలదు. జిల్లేడు చెట్టు కల్పవృక్షం కాజాలదు. అలాగే పిసినారి యైన దుర్మార్గుడు రాజు కాలేడు.

5వ పద్యం :
సీ॥ సాధు సజ్జనులతో జగడమాడినఁ గీడు
కవులతో వైరంబు గాంచఁగీడు,
పరమదీనులఁ జిక్కఁబట్టి కొట్టినఁ గీడు,
భిక్షగాండ్రను దుఃఖపెట్టఁగీడు ”
నిరుపేదలను చూచి నిందఁ జేసినఁగీడు
పుణ్యవంతులఁ దిట్టఁ బొసగుఁగేడు
సద్భక్తులను దిరస్కారమాడివఁ గీడు,
గురుని ద్రవ్యము దోఁచుకొనినఁ గీడు

తే॥గీ॥ దుష్టకార్యము లొనరించు దురమలకు
ఘనతరంబైన నరకంబు గట్టిముల్లె
భూషణ వికాస ! శ్రీధర్మపుర నివాస !
దుష్టసంహార ! నరసింహ ! దురితదూర!
ప్రతిపదార్థం :
భూషణ = అలంకారాల చేత
వికాస = శోభిల్లేవాడా !
శ్రీధర్మపుర = ధర్మపురి అనే గ్రామంలో
నివాస = నివసించేవాడా ! (వెలసినవాడా !)
దుష్టసంహార = దుష్టులను సంహరించేవాడా!
దురితదూర = పాపాలను పోగొట్టేవాడా !
నరసింహ = ఓ నరసింహస్వామీ !
సాధుసజ్జనులతోన్ = మంచివారితో
జగడము + ఆడినన్ = కలహం పెట్టుకొంటే
కీడు = హాని (చెడుపు
కవులతోన్ = కవులతో
వైరంబు = శత్రుత్వం
కాంచన్ = పొందగా
కీడు = హాని
పరమదీనులన్ = మిక్కిలి దీమలను
(చిక్కఁబట్టి) చిక్కన్ + పట్టి = కట్టివైచి
కొట్టినన్ = కొడితే
కీడు = హాని
భిక్షగాండ్రను = ముష్టివారిని
దుఃఖ పెట్టన్ = ఏడ్పిస్తే
నిరుపేదలను = మిక్కిలి పేడవారిని
చూచి = చూచి
నిందన్ + చేసినన్ = తిట్టితే (నిందిస్తే)
కీడు = హాని
పుణ్యవంతులన్ = పుణ్యాత్ములను
తిట్టన్ = తిడితే
కీడు = హాని
పొసగున్ = సంభవిస్తుంది (సత్ + భక్తులను) = మంచి భక్తులయినవారిని
తిరస్కారము + ఆడినన్ = తిరస్కరిస్తే
కీడు = హాని
గురుని = గురువుగారి యొక్క
ద్రవ్యమున్ = సొమ్మును
దోచుకొనినన్ = దొంగిలిస్తే
కీడు = హాని
దుష్టకార్యములు = చెడ్డపనులు
ఒనరించు = చేసే
దుర్జనులకు = దుష్టులకు
ఘనతరంబు + ఐన = గొప్పదైన
నరకంబు = నరకలోకం
గట్టి ముల్లె = భద్రముగా కట్టుకొన్న మూట

భావం :
అలంకారాలచేత శోభించేవాడా ! ధర్మపురి గ్రామంలో వెలసినవాడా ! దుష్టులను సంహరించేవాడా ! పాపాలను పోగొట్టేవాడా ! నరసింహా ! మంచివారితో తగవు పెట్టుకుంటే హాని కలుగుతుంది. కవులతో శత్రుత్వం పెట్టుకొంటే, వారిని పట్టుకొని కొడితే, ముష్టివారిని ఏడిపిస్తే, పేదలను నిందిస్తే కీడు జరుగుతుంది. పుణ్యాత్ములను తిడితే, మంచి భక్తులను తిరస్కరిస్తే, గురువుగారి సొమ్మును దోచుకుంటే కీడు జరుగుతుంది. ఈ విధంగా చెడు పనులు చేసేవారికి నరకం తప్పదు. (వారికి నరకం, భద్రంగా కట్టుకొన్న మూట వంటిది.)

AP Board 9th Class Telugu Solutions Chapter 5 పద్యరత్నాలు

6వ పద్యం : కంఠస్త పద్యం
* శా॥ స్నానంబుల్ వదులందుఁ జేయుట గజ స్నానంబు చందంబగున్
మౌనంబొప్ప జపించు వేద మటవీ మధ్యంబులో నేడుగున్
నానాహోమములెల్ల బూడిదలలోన న్వేల్చు నెయ్యి చను
న్నీ నామోక్తియు నీ పదాబ్దరతియున్ లేకున్న వారాయణా !
ప్రతిపదార్థం :
నారాయణా = ఓ విష్ణుమూర్తీ ! నారాయణా!
నీ = నీ యొక్క
నామోక్తియున్ కీడు (నామ + ఉక్తియున్) = నామాన్ని స్మరించుటయు
నీ = నీ యొక్క
పదాబ్జ (పద + అల్ల) = పద్మముల వంటి పాదాల యందు
రతియున్ = ఆసక్తియును (అనురాగమును)
లేకున్నన్ (లేక + ఉన్నన్) = లేకుంటే (లేకపోతే)
నదులందున్ = నదులలో (గంగ, గోదావరి వంటి పుణ్యనదులలో)
స్నానంబుల్ = స్నానములు
చేయుట = చేయడం
గజస్నానంబు = ఏనుగు చేసే స్నానం
చందంబు = వంటిది (పోలినది)
అగున్ = అవుతుంది.
మౌనంబు +ఒప్పన్ = పైకి ధ్వని వినబడకుండా
జపించు = జపించే
వేదము = వేదపారాయణం
అటవీ మధ్యంబులోన్ = అడవి మధ్యభాగంలో
ఏడ్పు + అగున్ = ఏడుపు వంటిది అవుతుంది.
నానాహోమములు = అనేక రకాలైన పుణ్యహోమాలు
ఎల్లన్ = అన్నియును
బూడిదలలోనన్ = బూడిద రాశులలో
వేల్చు = హోమం చేసే
నెయ్యె – (నెయ్యి + ఐ) = నేయివలె
చనున్ = పోతుంది (వ్యర్థం అవుతుంది)

భావం :
నారాయణా ! నీ నామం స్మరింపనివాడు, నీ పాదపద్మాలపై భక్తిలేనివాడు ఎన్ని నదులలో స్నానం చేసినా అది ఏనుగు స్నానం వంటిదే అవుతుంది. అతడు మంత్రాలను మౌనంగా జపించినా, అది అరణ్యరోదనమే అవుతుంది. ఎన్ని హోమాలు చేసినా, అది బూడిదలో పోసిన నెయ్యే అవుతుంది.

1) గజస్నానము :
గజస్నానము అంటే ఏనుగు స్నానం. ఏనుగు శుభ్రంగా నదులలో, మడుగులలో స్నానం చేసిన రంగ తరువాత గట్టుపైకి వచ్చి అక్కడ ఉన్న మట్టిని తొండంతో పీల్చి శరీరంపై చల్లుకుంటుంది. అంటే అది స్నానం చేసినా శుద్ధ దండుగ అని భావము.

2) అరణ్యరోదనం :
అరణ్యరోదనం అంటే అడవి మధ్యలో కూర్చుండి ఏడవడం. అడవిలో ఏడిస్తే ఎవరికీ వినబడదు. అందువల్ల ఎవరూ వచ్చి ఓదార్చరు. సాయం చేయరు. అదే జనులు ఉండే పల్లెలోనో, నగరంలోనో ఏడిస్తే ఎవరో ఒకరు వచ్చి ఓదారుస్తారు. అంటే అడవిలో ఏడవడం దండుగ అని భావం.

3) బూడిదలో నేయి హోమం :
సామాన్యంగా దేవతల ప్రీతికై అగ్నిజ్వాలల్లో నేతిని హోమం చేస్తారు. హోమం చేసేటప్పుడు, మంట మండేటప్పుడే హోమం చేయాలి. నిప్పులలో హోమం చేయరాదు. బూడిదలో హోమం చెయ్యడం శుద్ధ దండుగ అని భావం.

4) విష్ణుభక్తి లేనివాడు పుణ్యనదులలో స్నానం చేసినా, మౌనంగా వేదమంత్రాలు పారాయణ చేసినా, బూడిదలో నేతిని హోమం చేసినా దండుగ అని సారాంశం.

విశేషం :
‘జపం’ మూడు విధాలుగా ఉంటుంది.
1) మనస్సులో చేసే జపం ‘మానసికం’
2) పెదవులు కదుపుతూ చేసే జపం ‘ఉపాంశువు’
3) ఇతరులకు వినబడేటట్లు చేసే జపం ‘వాచికం’
ఈ పద్యంలో ‘మానసిక జపం’ గూర్చి చెప్పారు. ఇది జపాలన్నింటిలో ఉత్తమం.

7వ పద్యం : కంఠస్థ పద్యం
* ఉ॥ రంగదరాతి భంగ, ఖగ రాజతురంగ, విపత్పరంపరో
త్తుంగ తమః పతంగ, పరితోషితరంగ, దయాతరంగ, స
త్సంగ, ధరాత్మజాహృదయసారసభృంగ, నిశాచరాబ్జమా
తంగ, శుభాంగ, భద్రగిరి దాశరథీ ! కరుణాపయోనిధీ!
ప్రతిపదార్థం :
రంగత్ = ప్రకాశించుచున్న
అరాతి = శత్రువులను
భంగ = భంజించువాడా ! (సంహరించేవాడా !)
ఖగరాజ = పక్షిరాజయిన గరుత్మంతుడు అనెడి
తురంగ = గుఱ్ఱము కలవాడా !
విపత్ = ఆపదల యొక్క
పరంపరా = ఎడతెగని వరుస అనెడి
ఉత్తుంగ = మిక్కిలి అధికమైన
తమః = చీకటికి
పతంగ = సూర్యుడయినవాడా !
పరితోషిత = సంతోష పెట్టబడిన
రంగ = రంగస్వామి కలవాడా ! (రంగనాథస్వామి)
దయాంతరంగ (దయ + అంతరంగ) = దయగల మనస్సు కలవాడా!
సత్సంగ = సజ్జనులతో కూడిక కలవాడా!
ధరాత్మజా (ధర + ఆత్మజా) = భూదేవి కూతురైన సీతాదేవి యొక్క
హృదయ = మనస్సు అనెడి
సారస = పద్మమునకు
భృంగ = తుమ్మెద అయినవాడా !
నిశాచర = రాక్షసులనెడి
అబ్జ = తామరలకు
మాతంగ = ఏనుగు అయినవాడా !
శుభ + అంగ (శుభాంగ) = మంగళప్రదమైన
అవయవాలు కలవాడా !
భద్రగిరి = భద్రాచలంలో వెలసిన
దాశరథి = దశరథ పుత్రుడవయిన రామా!
కరుణాపయోనిధీ = దయా సముద్రుడా !

భావం :
భద్రగిరిపై కొలువున్న స్వామీ ! దశరథుని పుత్రుడా! సముద్రమంతటి దయగలవాడా ! నీవు యుద్ధరంగంలో శత్రువులను నాశనం చేసినవాడవు. గరుత్మంతుడినే వాహనంగా కలవాడవు. కష్టాలు అనే కారుచీకట్లను తొలగించే సూర్యుడవు. సంతోష పెట్టబడిన రంగనాథుడు కలవాడవు. దయగల హృదయం కలవాడవు. సీతాదేవి హృదయం అనే పద్మానికి తుమ్మెదవంటివాడవు. రాక్షసులనే పద్మాలను నాశనం చేసే ఏనుగువంటి వాడవు. మంగళప్రదమైన దేహం కలిగినవాడవు.

గమనిక : ఈ పద్యంలో “పరితోషితరంగ దయాంతరంగ” అనే సమాసాన్ని ఏకసమాసంగా తీసుకొని Text లో సంతోషము అనే అలలతో నిండిన దయగల హృదయం గలవాడవు అని భావం రాశారు – కాని ‘పరితోషితరంగ’ అనగా సంతోష పెట్టబడిన రంగనాథుడు కలవాడా అని పూర్వవ్యాఖ్యలలో రాయబడింది.

‘Text లో ఇచ్చినట్లు భావం రాయాలంటే పరితోష తరంగ’ అని ఉండాలి. కాని ఇక్కడ ‘పరితోషితరంగ’ అని ఉంది. కాబట్టి ‘పరితోషతరంగ’ అని దిద్దుకోవాలి. (లేదా) Text లో ఉన్నట్లే ‘పరితోషిత’ అని ఉంటే, పూర్వ వ్యాఖ్యలలో వలె, సంతోషపెట్టబడిన రంగనాథుడు కలవాడని అర్థం చెప్పాలి.

8వ పద్యం : కంఠస్థ పద్యం
*మ|| పవి పుష్పంబగు, నగ్నిమంచగు, నకూపారంబు భూమీస్థలం
బవు, శత్రుం డతిమిత్రుడౌ, విషము దివ్యాహారమౌ నెన్నఁగా
నవనీమండలి లోపలన్ శివశివే త్యాభాషణోల్లాసికిన్
శివ ! నీ నామము సర్వవశ్యకరమౌ ! శ్రీకాళహస్తీశ్వరా !
ప్రతిపదార్థం :
శ్రీకాళహస్తీశ్వరా (శ్రీకాళహస్తి + ఈశ్వరా) = శ్రీకాళహస్తీశ్వరా !
శివ = ఓ శివా !
అవనీమండలి లోపలన్ = భూమండలంలో
శివశివేతి (శివశివ + ఇతి) = శివ శివ అని
ఆభాషణోల్లాసికిన్ ఆభాషణ + ఉల్లాసికిన్ = స్మరిస్తూ ఆనందించే వాడికి
పవి = వజ్రాయుధము
పుష్పంబు + అగున్ = పుష్పం అవుతుంది
అగ్ని = కాల్చెడి అగ్ని
మంచు + అగున్ = చల్లని మంచు అవుతుంది
అకూపారంబు = సముద్రము
భూమీస్తలంబు + అవు = నేల అవుతుంది
శత్రుండు = శత్రువు
అతిమిత్రు డౌ (అతిమిత్రుడు + ఔ) : మంచి స్నేహితుడు అవుతాడు
విషము = విషము
దివ్య + ఆహారము = అమృతము
ఔన్ = అవుతుంది
ఎన్నగాన్ = ఎంచి చూడగా
నీ నామము = నీ నామోచ్చారణము
సర్వవశ్యకరము + ఔ = అన్నింటినీ సులభసాధ్యములుగా చేస్తుంది.

భావం :
శ్రీకాళహస్తి క్షేత్రంలో వెలసిన ఓ పరమేశ్వరా! నీ నామస్మరణం వల్ల అన్నీ సాధ్యం అవుతాయి. ఈ భూలోకంలో శివ ! శివ ! అని ఉత్సాహంతో పలికే వానికి వజ్రాయుధం – పుష్పంలా, నిప్పు – మంచులా, సముద్రం – నేలలా, పగవాడు – స్నేహితునిలా, విషం – అమృతంలా సులభసాధ్యాలుగా మారతాయి.

9వ పద్యం :
కం|| ఆచార్యున కెదిరింపకు
ప్రోచినదొర నింద సేయఁ బోకుము కార్యా
లోచనము లొంటిఁ జేయకు
మాచారము విడువఁ బోకుమయ్య కుమారా !
ప్రతిపదార్థం :
అయ్య, కుమారా = ఓ నాయనా ! కుమారా !
ఆచార్యునకున్ , = చదువు చెప్పే గురువు మాటకు
ఎదిరింపకు = ఎదురు చెప్పవద్దు
ప్రోచిన = నిన్ను పోషించిన
దొర = యజమానిని
నింద + చేయన్ + పోకుము = నిందింపవద్దు
కార్యాలోచనములు (కార్య + ఆలోచనములు) = పనిని గూర్చి ఆలోచనలు
ఒంటిన్ + చేయకు = ఒంటరిగా చేయవద్దు.
ఆచారము = మంచి నడవడికను
విడువఁబోకుము (విడువన్ + పోకుము) = వదలిపెట్టవద్దు.

భావం :
ఓ కుమారా ! చదువు చెప్పే గురువుమాటకు ఎదురు చెప్పవద్దు. నిన్ను పోషించే యజమానిని . నిందించవద్దు. ఒంటరిగా కార్యమును గూర్చి ఆలోచింపవద్దు. మంచి నడవడికను వదలి పెట్టవద్దు. (ఇలా చేయడం వల్ల నీకు ఎంతో మేలు కలుగుతుంది. అందరూ నిన్ను అనుసరిస్తారు.

AP Board 9th Class Telugu Solutions Chapter 5 పద్యరత్నాలు

10వ పద్యం :
కం|| ఉడుముండదె నూటేండ్లునుఁ
బడియుండదె పేర్మిఁ బాము పదినూడేండ్లున్
జీవించియుండదా? మడువునఁ గొక్కెర యుండదె
కడునిలఁ బురుషార్థపరుడు గావలె సుమతీ! |
ప్రతిపదార్థం :
సుమతీ = మంచిబుద్ధి కలవాడా !
ఉడుము = ఉడుము
నూఱేండ్లునున్ (నూఱు + ఏండ్లునువ్) – వంద సంవత్సరాలపాటు
ఉండదె = జీవించియుండదా ?
పేర్మిన్ = అభివృద్ధితో
పాము = పాము
పదినూటేండ్లున్ = వేయి సంవత్సరాలపాటు
పడియుండదె = (పడి + ఉండదు + ఎ) = ఉంటుంది కదా !
మడువునన్ = చెఱువులో
కొక్కెర = కొంగ
ఉండదె (ఉండదు + ఎ) = చాలాకాలం
ఇలన్ = భూమిపై
కడున్ = మిక్కిలి
పురుషార్థపరుడు (పురుష + అర్ధపరుడు) – ధర్మార్థ కామ మోక్షములు అనే పురుషార్థములను సాధించేవాడు
కావలెన్ = కావాలి

భావం :
సుమతీ ! వంద సంవత్సరాలు జీవించే ఉడుము, వేయి సంవత్సరాలు జీవించే పాము, చెఱువు నందు చాలాకాలం బతికే కొంగ – ఎన్ని సంవత్సరాలు బతికినా ప్రయోజనం ఉండదు. మంచి చేయాలనే ఆలోచన కలిగి, ధర్మార్థ కామ మోక్షాలను సాధించేవాడే ఉత్తముడు.

AP Board 9th Class Biology Solutions 1st Lesson కణ నిర్మాణం – విధులు

SCERT AP 9th Class Biology Guide Pdf Download 1st Lesson కణ నిర్మాణం – విధులు Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Biology 1st Lesson Questions and Answers కణ నిర్మాణం – విధులు

9th Class Biology 1st Lesson కణ నిర్మాణం – విధులు Textbook Questions and Answers

అభ్యసనాన్ని మెరుగుపరుచుకోండి

ప్రశ్న 1.
కింది వాటిలో భేదాలను గుర్తించండి. (AS 1)
A) వృక్ష కణం మరియు జంతు కణం
B) కేంద్రక పూర్వకణం మరియు నిజకేంద్రక కణం
జవాబు:
A) వృక్ష కణం మరియు జంతు కణం :

వృక్ష కణముజంతు కణము
1. సాధారణంగా పెద్ద పరిమాణంలో ఉంటుంది.1. సాధారణంగా చిన్న పరిమాణంలో ఉంటుంది.
2. కణకవచము ఉంటుంది.2. కణకవచము ఉండదు.
3. ప్లాస్టిడ్లు (క్రోమోప్లాస్టులు, ల్యూకోప్లాస్టులు) ఉంటాయి.3. ప్లాస్టిడ్లు ఉండవు.
4. సెంట్రియోల్స్ ఉండవు.4. సెంట్రియోల్స్ ఉంటాయి.
5. రిక్తికలు పెద్దవిగా ఉంటాయి.5. రిక్తికలు చిన్నవిగా ఉంటాయి.

B) కేంద్రక పూర్వకణం మరియు నిజకేంద్రక కణం

కేంద్రక పూర్వకణంనిజకేంద్రక కణం
1. కేంద్రకం చుట్టూ కేంద్రక త్వచం ఉండదు.1. కేంద్రకం చుట్టూ కేంద్రక త్వచం ఉంటుంది.
2. త్వచముతో కూడిన కణాంగాలు ఉండవు.2. త్వచముతో కూడిన కణాంగాలు ఉంటాయి.
3. కేంద్రక పూర్వకణాలు ఎక్కువగా ఏకకణజీవులలో ఉంటాయి.3. నిజకేంద్రక కణాలు బహుకణజీవులలో ఉంటాయి.
4. దీనిలో ఒకే క్రోమోసోము ఉంటుంది.4. దీనిలో ఒకటి కంటే ఎక్కువ క్రోమోసోములు ఉంటాయి.
5. కేంద్రకాంశము ఉండదు.5. కేంద్రకాంశము ఉంటుంది.
6. కణవిభజన సమవిభజన ద్వారా జరుగుతుంది.6. కణవిభజన సమవిభజన మరియు క్షయకరణ విభజనల ద్వారా జరుగుతుంది.
7. కణపరిమాణము చిన్నగా ఉంటుంది.7. కణ పరిమాణము పెద్దగా ఉంటుంది.
8. కేంద్రక పూర్వకణాలు బాక్టీరియా మరియు సయానో బాక్టీరియాలలో ఉంటాయి.8. నిజకేంద్రక కణాలు శిలీంధ్రాలు, మొక్కలు మరియు జంతు కణాలలో ఉంటాయి.

ప్రశ్న 2.
కణం నుండి కేంద్రకాన్ని తొలగిస్తే ఏమవుతుంది? మీ జవాబులను బలోపేతం చేయడానికి రెండు కారణాలు రాయండి. (AS 1)
జవాబు:

  1. కణాంగాలలో కేంద్రకము అతిముఖ్యమైనది.
  2. కేంద్రకము కణవిధులను అన్నింటిని నియంత్రిస్తుంది.
  3. కేంద్రకము అన్ని కణాంగాలను మరియు కేంద్రకాంశమును కూడా నియంత్రిస్తుంది.
  4. కణ మెదడు అయిన కేంద్రకమును తొలగించినట్లయితే కణము ఆ వెంటనే చనిపోతుంది.
  5. కనుక కేంద్రకమును తొలగించినట్లయితే కేంద్రక నియంత్రణలో పనిచేసే కణాంగాలు చనిపోతాయి. తద్వారా ఆ జీవి చనిపోతుంది.

AP Board 9th Class Biology Solutions 1st Lesson కణ నిర్మాణం – విధులు

ప్రశ్న 3.
లైసోజోమ్ లను స్వయం విచ్ఛిత్తి సంచులని ఎందుకు అంటారు? (AS 1)
జవాబు:

  1. లైసోజోములు విచ్ఛిన్నకర ఎంజైములను కలిగి ఉంటాయి.
  2. విచ్ఛిన్నం చేయవలసిన పదార్థములు లైసోజోమ్ నకు రవాణా చేయబడతాయి.
  3. కొన్ని సందర్భాలలో లైసోజోముల విచ్ఛిన్నం ద్వారా విడుదలైన ఎంజైములు కణమును జీర్ణం చేస్తాయి.
  4. అందువలన లైసోజోమ్ ను స్వయం విచ్ఛిత్తి సంచులు అంటారు.

ప్రశ్న 4.
వృక్ష కణంలో పెద్ద రిక్తికలు ఎందుకు ఉంటాయి? (AS 1)
జవాబు:

  1. మొక్కల రిక్తికలు నీటి నిలువకు, ద్రవాభిసరణ క్రమతకు, వ్యర్థ పదార్థాల సంగ్రహణకు ఉపయోగపడుట ద్వారా ఆకులు, రక్షకపత్రాల కణముల యొక్క నిర్మాణాత్మక రూపమును నియంత్రిస్తాయి.
  2. కణము మధ్యన గల రిక్తిక, కణకవచముపై కలిగించే ఒత్తిడి ద్వారా కణము యొక్క ఆకారము స్థిరంగా ఉంచబడుతుంది.
  3. నియంత్రిత పెరుగుదలలో భాగంగా మొక్కలు కణము పొడవుగా అగుటకు కణము అంతర్గతశక్తిని ఉపయోగించుకుంటాయి.
  4. జంతువుల రిక్తిక కంటె వృక్షము యందు ఉండు రిక్తిక క్లిష్టమైన విధులను నిర్వహిస్తుంది.
  5. అందువలన వృక్ష కణములలో పెద్ద రిక్తికలు ఉంటాయి.

ప్రశ్న 5.
“జీవుల మౌళిక ప్రమాణం కణం” వివరించండి. (AS 1)
జవాబు:

  1. కణ సిద్ధాంతం ప్రకారం జీవుల నిర్మాణాత్మక, క్రియాత్మక ప్రమాణం కణం, జీవులు కణ నిర్మితాలు మరియు కణములన్నీ ముందుతరం కణం నుంచి ఏర్పడతాయి.
  2. జీవి జీవించడానికి అవసరమయ్యే జీవక్రియలన్నీ కణస్థాయిలోనే జరుగుతాయి.
  3. అందువలన కణమును జీవుల మౌళిక ప్రమాణం అని చెప్పవచ్చు.

ప్రశ్న 6.
కణ సిద్ధాంతమును ఎవరు, ఎప్పుడు ప్రతిపాదించారు ? దీనిలోని ముఖ్యమైన అంశాలు ఏవి? (AS 1)
జవాబు:
ప్రతిపాదించినవారు :
ఎమ్.జె. ప్లీడన్ మరియు థియోడర్ ష్వాన్ 1838-39 సంవత్సరంలో కణ సిద్ధాంతమును

ప్రతిపాదించారు. ముఖ్యమైన అంశములు :

  1. జీవరాసులన్నీ కణాలు, వాటి ఉత్పన్నాలతో నిర్మించబడి ఉంటాయి.
  2. కణాలన్నీ ముందు తరం కణం నుంచే ఏర్పడతాయి.
  3. అన్ని కణాలు ఒకే రకమైన రసాయన నిర్మాణం కలిగి, ఒకే రకమైన జీవక్రియలు నెరవేరుస్తాయి.
  4. జీవి యొక్క జీవక్రియలు ఆ జీవిలోని కణములు నిర్వర్తించే విధులను బట్టి, ఆ జీవిలో వివిధ కణముల మధ్య ఉండే సంబంధ బాంధవ్యాల మీద ఆధారపడి ఉంటాయి.

AP Board 9th Class Biology Solutions 1st Lesson కణ నిర్మాణం – విధులు

ప్రశ్న 7.
ప్లాస్మా పొర పగిలిపోతే/ విరిగితే కణానికి ఏమి జరుగుతుంది? (AS 2)
జవాబు:
ప్లాస్మా పొర పగిలిపోతే / విరిగితే :

  1. విసరణ లేదా ద్రవాభిసరణ ద్వారా కణము లోపలకు, బయటకు జరిగే పదార్థాల రవాణాను ప్లాస్మా పొర నియంత్రిస్తుంది.
  2. అందువలన ప్లాస్మాపొర పగిలిపోతే కణము, దాని లోపలి అంశములను బయటకు విడుదల చేయవచ్చు.
  3. అందువలన కణము చనిపోతుంది.

ప్రశ్న 8.
గాల్జీ సంక్లిష్టాలు లేకపోతే కణానికి ఏమవుతుంది? (AS 2)
జవాబు:
గాల్జీ సంక్లిష్టాలు లేకపోతే :

  1. వీటి ద్వారా జరుగవలసిన కార్యకలాపాలు జరుగవు.
  2. వివిధ రకాల పదార్థములను మార్పుచేయడం కణము నందు జరుగదు.
  3. గాల్జీ సంక్లిష్టము నుండి పదార్థాలన్నీ ప్లాస్మాపొర వైపు కాని లేదా మరొక కణాంగమైన లైసోజోమ్స్ వైపు కాని పంపబడవు.
  4. రైబోజోములచే తయారుచేయబడిన ప్రోటీనులు మరియు ఇతర పదార్థములు లైసోజోమ్ లకు రవాణా చేయబడవు.
  5. పదార్ధముల రవాణా జరుగకపోయినట్లయితే ప్లాస్మా పొరకు మరమ్మత్తులు జరుగక కణం చనిపోతుంది.
  6. గాల్జీ సంక్లిష్టము నుండి విషపదార్థములు లైసోజోమ్స్ నకు పంపబడనట్లయితే విషపదార్ధములు కణము నందు నిల్వచేయబడి కణము చనిపోతుంది.

ప్రశ్న 9.
బుగ్గకణంలో కేంద్రకాన్ని చూడడానికి నీవు ప్రయోగశాలలో ఏమేమి జాగ్రత్తలు తీసుకున్నావు? (AS 3)
జవాబు:
బుగ్గకణంలో కేంద్రకాన్ని చూడడానికి ప్రయోగశాలలో తీసుకోవలసిన జాగ్రత్తలు :

  1. చెంప (బుగ్గ) లోపలి భాగాన్ని ఎక్కువగా గీకకూడదు. ఎక్కువగా గీకితే గాయమయ్యే అవకాశం ఉంటుంది.
  2. గీకిన భాగాన్ని స్లెడ్ పైన వ్యాపించేటట్లు చేయవలెను.
  3. ఎక్కువగా రంగు ఉన్నట్లయితే దానిని తొలగించవలెను.

ప్రశ్న 10.
ప్రస్తుత పాఠాన్ని పూర్తిగా, క్షుణ్ణంగా చదివి వివిధ రకాల కణాంగాల విధులకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి క్రమసంఖ్య, కణాంగాలు, విధులు అనే అంశాలను పట్టికలో నమోదు చేయండి. నమోదు చేసేటపుడు నూతన ప్రత్యేక అంశాలు ఉన్నట్లయితే పట్టిక క్రింద నమోదు చేయండి. (AS 4)
జవాబు:

కణాంగమువిధులు
1. కేంద్రకముకణవిధుల క్రమబద్దీకరణ మరియు నియంత్రణ, జీవుల లక్షణాల నిర్ధారణ.
2. అంతర్జీవ ద్రవ్యజాలముకణంలో ఒక భాగం నుండి మరియొక భాగానికి పదార్థాల రవాణా, జీవరసాయన చర్యలకు వేదిక.
3. గాల్జీ సంక్లిష్టముప్రోటీనుల రూపమును మార్చుట, అనేక పదార్థములను ఒకటిగా చేయుట.
4. లైసోజోములుకణాంతర జీర్ణక్రియ, కణభాగములను నాశనం చేయుట.
5. మైటోకాండ్రియాకణ శ్వాసక్రియ ద్వారా కణమునందు శక్తి ఉత్పాదన.
6. ప్లాస్టిడ్లుమొక్కల కణాలకు రంగులను ఇస్తుంది.
A) క్రోమోప్లాస్టులురకరకాల పూలు, పండ్లకు రంగునిచ్చుట.
B) క్లోరోప్లాస్టులుకిరణజన్య సంయోగక్రియలో కాంతి శక్తిని రసాయనశక్తిగా మార్చుట.
C) ల్యూకోప్లాస్టులురంగులేని ప్లాస్టిడ్లు, పిండిపదార్ధాలు, నూనెలు మరియు ప్రోటీనుల నిల్వ.

ప్రత్యేక అంశాలు :

  1. కేంద్రకము జన్యు సమాచారాన్ని కలిగి ఉంటుంది.
  2. గరుకు అంతర్జీవ ద్రవ్యజాలము ప్రోటీన్లను సంశ్లేషణ చేస్తుంది. నునుపు అంతర్జీవ ద్రవ్యజాలము లిపిడ్లను సంశ్లేషణ చేస్తుంది.
  3. గాల్టీ సంక్లిష్టము రైబోజోములు తయారు చేసిన ప్రోటీనులను ఒకటిగా చేర్చుటకు సహాయం చేస్తుంది.
  4. కణ వినాశమునకు కారణమగుట వలన లైసోజోములను స్వయంవిచ్చిత్తి సంచులు అంటారు.
  5. కణ శ్వాసక్రియ ద్వారా కణము శక్తిని ఉత్పాదన చేయుట వలన మైటోకాండ్రియాలను కణ శక్త్యా గారాలు అంటారు.
  6. క్లోరోప్లాస్టులు, ల్యూకోప్లాస్టులు, క్రోమోప్లాస్టులు మొక్కలలో ఉండే ప్లాస్టిడ్లు.

ప్రశ్న 11.
వృక్ష కణం లేదా జంతు కణం నమూనాను పరిసరాలలో లభ్యమయ్యే పదార్థాలతో తయారుచేయండి. (AS 15)
జవాబు:
AP Board 9th Class Biology Solutions 1st Lesson కణ నిర్మాణం – విధులు 1

ప్రశ్న 12.
మీరు సేకరించిన పత్రం పొరతో తాత్కాలిక స్లెడను తయారుచేసి పత్రరంధ్రాలను పరిశీలించి పటమును గీయండి. వాటి గురించి రాయండి. (AS 5)
జవాబు:
పెద్దదిగా చూపబడిన పత్రరంధ్రము ఈ క్రింది కణాలను చూపిస్తుంది.
AP Board 9th Class Biology Solutions 1st Lesson కణ నిర్మాణం – విధులు 2

  1. పత్రరంధ్రము రెండు రక్షక కణములచే ఆవరించబడినది.
  2. రక్షక కణములు మూత్రపిండాకారములో ఉన్నాయి.
  3. రక్షక కణమందు కేంద్రకము, క్లోరోప్లాస్టులు కలవు.
  4. రెండు రక్షక కణముల మధ్య చిన్న పత్రరంధ్రము కలదు.
  5. ఆకునందలి పత్రరంధ్రముల ద్వారా వాయువుల మార్పిడి జరుగును.
  6. ఆకు వైశాల్యం నందు పత్రరంధ్రములు సుమారు 1 నుండి 2 శాతం ఆక్రమించి ఉన్నాయి.

ప్రశ్న 13.
నమూనా జంతు కణం పటము గీచి భాగాలు గుర్తించండి. (AS 5)
జవాబు:
AP Board 9th Class Biology Solutions 1st Lesson కణ నిర్మాణం – విధులు 3

ప్రశ్న 14.
కింది కార్టూనును చూడండి. కణాంగాల విధులను గురించి రాయండి. (AS 5)
AP Board 9th Class Biology Solutions 1st Lesson కణ నిర్మాణం – విధులు 4
జవాబు:
కణంలోని ముఖ్యమైన కణాంగాలు అనగా అంతర్జీవ ద్రవ్యజాలం, గాల్టీ సంక్లిష్టాలు, లైసోజోములు, మైటోకాండ్రియా, – ప్లాస్టిడ్స్ మరియు రిక్తికలు.

కణాంగాలు, విధులు :
1) అంతర్జీవ ద్రవ్యజాలం :
కణ ద్రవ్యంలో వల వంటి నిర్మాణాన్ని అంతర్జీవ ద్రవ్యజాలం అంటారు. ఇది ప్రోటీన్ల వంటి పదార్థాలను కణద్రవ్యంలోని వివిధ ప్రాంతాలకు ఇక్కడ నుండి కేంద్రకానికి రవాణా మార్గంగా పని చేస్తుంది. క్రొవ్వు మరియు లిపిడ్ల సంశ్లేషణకు తోడ్పడుతుంది. విష పదార్థాలను నిర్వీర్యం చేస్తుంది.

2) గాల్జీ సంక్లిష్టాలు :
ఇవి వివిధ రకాల పదార్థాలను కణంలోని ఇతర భాగాలకు పంపే ముందు, తమలో నిల్వ చేసుకుని, అక్కడ నుండి ప్లాస్మాపొర వైపు లేదా లైసోసోమ్స్ వైపు పంపిస్తాయి.

3) లైసోజోములు :
వినాశకర పదార్థాలను ఇవి ఎంజైముల ద్వారా వినాశనం చేస్తాయి.

4) మైటోకాండ్రియా :
కణానికి కావలసిన శక్తిని ఉత్పత్తి చేసి కణ శ్వాసక్రియను జరుపుతాయి.

5) ప్లాస్టిడ్లు :
కిరణజన్య సంయోగక్రియలో సౌరశక్తిని గ్రహించి రసాయనిక శక్తిగా మార్చటమే వీటి యొక్క ముఖ్య

6) రిక్తికలు :
రిక్తికలు కార్బోహైడ్రేటులు, అమైనో ఆమ్లాలు, ప్రోటీనులు, వర్ణద్రవ్యాలు విసర్జన పదార్థాలను నిల్వ చేస్తాయి.

AP Board 9th Class Biology Solutions 1st Lesson కణ నిర్మాణం – విధులు

ప్రశ్న 15.
సజీవులలో కణ వ్యవస్థీకరణను ఎలా అభినందిస్తావు? (AS 6)
జవాబు:

  1. జీవులలో ఐదు రకాల స్థాయిలను గమనిస్తాను. కణము-కణజాలము-అవయవము-అవయవ వ్యవస్థ – జీవి.
  2. జీవులలో కణము చక్కగా వ్యవస్థీకృతమైంది. కణము కణజాలముగాను, కణజాలములు అవయవముగాను, అవయవములు కలిసి అవయవ వ్యవస్థలుగాను, అవయవ వ్యవస్థలు జీవిగాను రూపొందినాయి.
  3. మౌలికమైన మరియు ప్రాథమికమైన కణము ఏకకణ జీవులను, బహుకణ జీవులను ఏర్పరుస్తుంది.
  4. జీవులు తరువాత క్రమంలో జనాభాలను, సంఘాలను, ఆవరణ వ్యవస్థలను మరియు జీవావరణంగాను వ్యవస్థీకృతమైనవి.

ప్రశ్న 16.
భౌతిక మరియు రసాయనిక చర్యల వలన కణ వ్యవకరణం నాశనమైతే ఏమి జరుగుతుంది? (AS 6)
జవాబు:

  1. జీవమునకు ప్రమాణమైన కణము, జీవక్రియలన్నింటిని నిర్వహించగల సామర్యము కలిగినది.
  2. భౌతిక మరియు రసాయనిక చర్యల వలన కణవ్యవస్థ నాశనమైతే జీవక్రియల నిర్వహణ అనగా శ్వాసక్రియ, పోషణ, విసర్జన మొదలగు క్రియల నిర్వహణకు కణ సామర్థ్యము సక్రమముగా ఉండదు.

ప్రశ్న 17.
అతి సూక్ష్మకణం విధిని అతి పెద్దగా ఉండే జీవిలో ఏ విధంగా అభినందిస్తావు? (AS 6)
జవాబు:

  1. కణ సిద్ధాంతం ప్రకారం జీవులన్నియూ కణనిర్మితాలు.
  2. జీవమునకు ప్రమాణమైన చిన్నకణము అన్ని జీవక్రియలను నిర్వహించగల సామర్థ్యం గలది.
  3. జీవి యొక్క జీవక్రియలు ఆ జీవిలోని కణములు నిర్వహించే విధుల మీద ఆధారపడి ఉంటాయి.
  4. కణములు జీవనిర్మాణ సౌధములు.
  5. అందువలన కణములను జీవమునకు నిర్మాణాత్మక మరియు క్రియాత్మక ప్రమాణము అంటారు.
  6. కణములు ఆకారములోను, పరిమాణములోను మరియు క్రియలపరంగా వేరుగా ఉంటాయి.
  7. ఒక కణము యొక్క పరిమాణము కచ్చితంగా ఆ కణము నిర్వహించే పని మీద ఆధారపడి ఉంటుంది.
  8. జీవిలోని కణములు సక్రమముగా విధులను నిర్వహించినట్లయితే జీవి శరీరము విధులను సక్రమముగా నిర్వహిస్తుంది.

9th Class Biology 1st Lesson కణ నిర్మాణం – విధులు Textbook InText Questions and Answers

9th Class Biology Textbook Page No. 1

ప్రశ్న 1.
ఉల్లిపొరలో కణాలు దీర్ఘచతురస్ర ఆకారంలో ఉంటే, బుగ్గ కణాలు గుండ్రంగా ఉంటాయని తెలుసుకున్నాం. ఇలాగే కణం గురించి మీరు గుర్తించిన మరికొన్ని ముఖ్యాంశాలు రాయండి.
జవాబు:

  1. జీవులన్నిటికి కణం ప్రధానమైన మూలం.
  2. కణాలలో కేంద్రకం ఉంటుంది.
  3. వృక్ష కణాలలో కణకవచం ఉంటుంది. కానీ జంతు కణాలలో కణకవచం ఉండదు.
  4. కణమును నిర్మాణాత్మక ప్రమాణంగా పరిగణించవచ్చు.
  5. బహుకణజీవులలో ఈ కణాల ఆకారంలో వైవిధ్యం కనపడుతుంది.

9th Class Biology Textbook Page No. 2

ప్రశ్న 2.
ఈ క్రింది కణాలను పరిశీలించండి.
జవాబు:
AP Board 9th Class Biology Solutions 1st Lesson కణ నిర్మాణం – విధులు 1

a) పై రెండు కణాలలో కనబడే సాధారణ లక్షణాలు ఏవి?
జవాబు:
పై రెండు కణాలలో కనబడే సాధారణ లక్షణాలు : పై రెండు కణాలు మైటోకాండ్రియా, గాల్టీ సంక్లిష్టం, కేంద్రకం, అంతర్జీవ ద్రవ్యజాలం అనే కణాంగాలను కలిగి ఉన్నాయి.

b) వృక్ష కణంలో మాత్రమే కనబడే కణాంగాలేవి?
జవాబు:
వృక్ష కణంలో మాత్రమే కనబడే కణాంగాలు : రిక్తికలు, ప్లాస్టిడ్లు, కణకవచం మొదలగునవి.

c) వృక్ష కణంలోని రిక్తకలు జంతుకణంలోని రిక్తికలను పోల్చండి. రెండింటి మధ్య మీరు గమనించిన భేదాలను రాయండి.
జవాబు:
వృక్ష కణంలో రిక్తికలు ఉంటాయి. జంతుకణంలో రిక్తికలు ఉండవు.

AP Board 9th Class Biology Solutions 1st Lesson కణ నిర్మాణం – విధులు

ప్రశ్న 3.
వృక్ష కణాలలో కణకవచం యొక్క ఆవశ్యకత ఏమిటి?
జవాబు:

  1. కణరసం ద్వారా ఏర్పడే బాహ్యపీడనాన్ని నిరోధించడానికి కణకవచం అంతర పీడనాన్ని కలిగిస్తుంది.
  2. అందువల్ల పరిసరాలలో జరిగే మార్పులను జంతుకణం కంటే వృక్షకణం తట్టుకునే అవకాశం ఎక్కువ.

9th Class Biology 1st Lesson కణ నిర్మాణం – విధులు Textbook Activities (కృత్యములు)

కృత్యం – 1

1. ప్లాస్మా పొర పరిశీలన :
a) సూక్ష్మదర్శినితో పత్రంనందలి ప్లాస్మా పొరను నీవు ఏ విధముగా పరిశీలిస్తావు? నీ పరిశీలనలు రాయుము.
జవాబు:

  1. రియో పత్రాన్ని తీసుకొని ఒక్కసారిగా మధ్యకు చించాలి.
  2. చించిన భాగాన్ని వెలుతురులో ఉంచి పరిశీలించాలి. పత్రంలోని లేతరంగులో ఉన్న భాగాన్ని తీసుకొని స్లెడ్ పైన పెట్టాలి.
  3. నీటి చుక్కను వేసి కవర్ స్లితో కప్పాలి. తరువాత స్లెడ్ ను సూక్ష్మదర్శినితో పరిశీలించాలి.

AP Board 9th Class Biology Solutions 1st Lesson కణ నిర్మాణం – విధులు 5
పరిశీలనలు :

  1. కణములు వరుసలలో అమరి ఉన్నాయి.
  2. ప్లాస్మా పొర స్పష్టముగా కనిపిస్తుంది.
  3. కణము నందు కేంద్రకము కలదు.

b) రియో పత్రపు పొరపై 1 లేదా 2 చుక్కల సజల ఉప్పు ద్రావణము వేసిన ఏమి జరుగుతుంది? సూక్ష్మదర్శిని ద్వారా పరిశీలించి బొమ్మను గీయుము. కేంద్రకముతో కూడిన జీవపదార్థము కుదించుకుపోవడానికి కారణములు రాయుము.
జవాబు:
AP Board 9th Class Biology Solutions 1st Lesson కణ నిర్మాణం – విధులు 6
పరిశీలనలు :

  1. రియో పత్రపు పొరపై జల ఉప్పు ద్రావణము వేసినప్పుడు రియో పత్రము నందలి కణముల నుండి నీరు బయటకు ప్లాస్మాపొర వచ్చును.
  2. నీరు బయటకు రావడము వలన కణద్రవ్యం, కణత్వచంతో పాటు కుదించబడుతుంది.
  3. మనకు కనబడే రంగుభాగపు బాహ్య అంచును కణత్వచం అంటారు. ఆ భాగం కణకవచం నుంచి వేరైపోతుంది.

2. కేంద్రక పరిశీలన :
జవాబు:
ఉద్దేశ్యం : చెంప (బు) కణంలో కేంద్రకం పరిశీలించుట.

కావాల్సిన పదార్థాలు :
టూత్ పిక్, స్లెడ్, కవర్‌ స్లిప్, వాచ్ గ్లాస్, నీడిల్, బ్లాటింగ్ పేపర్, 1% మిథిలీన్ బ్లూ, ఉప్పు ద్రావణం, గ్లిజరిన్, సూక్ష్మదర్శిని మొదలైనవి.

విధానం :

  1. ముందుగా నోటిని శుభ్రంగా కడగవలెను. టూత్ పిక్ తో గాని లేదా ఐస్ క్రీమ్ చెంచాతో గాని నోటిలోపలి చెంప (బుగ్గ)లోని భాగాన్ని కొద్దిగా గీకవలెను.
  2. గీకిన భాగాన్ని ఉప్పు ద్రావణం కలిగి ఉన్న వాచ్ గ్లాసులో పెట్టవలెను. (పదార్థం ఉప్పు ద్రావణంలో కలిసిపోకుండా జాగ్రత్త పడండి).
  3. తరువాత స్లెడ్ పైన పెట్టవలెను.
  4. ఒక చుక్క మిథిలీన్ బ్లూ ద్రావణాన్ని వేసి రెండు నిమిషాల సేపు కదపకుండా ఉండవలెను.
  5. అద్దుడు కాగితం ఉపయోగించి ఎక్కువగా ఉన్న రంగును తొలగించవలెను.
  6. ఒక చుక్క గ్లిజరిన్ వేయవలెను.
  7. కవర్ స్లితో కప్పి నీడిల్ లో కవర్ స్లిప్ ని కొద్దిగా తట్టవలెను. దాని వలన కణాలన్నీ వ్యాపిస్తాయి.

జాగ్రత్తలు:

  1. చెంప (బుగ్గ) లోపలి భాగాన్ని ఎక్కువగా గీకవద్దు. గాయమయ్యే అవకాశముంటుంది.
  2. గీకిన భాగాన్ని స్లెడ్ పైన వ్యాపించేటట్లు చేయవలెను.
  3. ఎక్కువగా రంగు ఉన్నట్లయితే తొలగించవలెను.

ఈ విధముగా తయారుచేసిన తాత్కాలిక సైడ్ ను సూక్ష్మదర్శిని ఎక్కువ, తక్కువగా కాంతిని వర్ధనం చేస్తూ పరిశీలించవలెను.

AP Board 9th Class Biology Solutions 1st Lesson కణ నిర్మాణం – విధులు 7
పరిశీలనలు:

  1. కణాల ఆకారంను పరిశీలించగా కణాలు వివిధ ఆకారాలలో ఉన్నవి.
  2. కణ మధ్య భాగంలో రంగుతో కూడిన గుండ్రటి చుక్క కనబడుతుంది. అదే కణ కేంద్రకం.

AP Board 9th Class Biology Solutions 1st Lesson కణ నిర్మాణం – విధులు

కృత్యం – 2

3. మైటోకాండ్రియా పరిశీలన :
ఉల్లిపొర కణాలతో మైటోకాండ్రియాను నీవు ఏ విధంగా పరిశీలిస్తావు?
(లేదా)
నిర్మల ఉల్లిపొరలోని కణాలను పరిశీలించాలనుకుంటుంది. అందుకు కావలసిన పరికరాలను, ప్రయోగ విధానాన్ని ఆమెకు వివరించండి.
జవాబు:
పరికరాలు :
ఉల్లిపొర, బ్లేడ్, జానస్ గ్రీన్ – B ద్రావణం కవర్‌ స్లిప్, వాచ్ గ్లాస్, సూక్ష్మదర్శిని

AP Board 9th Class Biology Solutions 1st Lesson కణ నిర్మాణం – విధులు 8
మైటోకాండ్రియా పరిశీలన :

  1. బీకరులో జానస్ గ్రీన్-బి ద్రావణాన్ని తయారుచేయాలి.
  2. 200 మి.గ్రా. జానస్ గ్రీన్-‘బి’ ను 100 మి.లీ. నీటిలో కలపాలి.
  3. ఒక వాచ్ గ్లాలో ఈ ద్రావణం కొంత తీసుకుని దానిలో ఉల్లిపొరను దాదాపు అరగంటసేపు ఉంచాలి.
  4. ఉల్లిపొరను వాచ్ గ్లాస్ నుండి తీసి స్లెడ్ పైన పెట్టి నెమ్మదిగా నీటితో కడగాలి.
  5. కవర్ స్లిప్ నుంచి ఉల్లిపొరను సూక్ష్మదర్శినిలో (ఎక్కువ మాగ్నిఫికేషన్) పరిశీలించాలి.
  6. పరిశీలించిన అంశాన్ని బొమ్మ గీయాలి.

పరిశీలనలు :
ఆకుపచ్చ రంగులో గుండ్రంగా కాని పొడవుగా ఉండే రేణువులు కణద్రవ్యంలో వెదజల్లినట్లు కనబడే నిర్మాణాలు మైటోకాండ్రియా.

కృత్యం – 3

4. రియో పత్రంలో హరితరేణువులను (Chloroplast) పరిశీలిద్దాం.
సూక్ష్మదర్శిని సహాయముతో రియో పత్రమునందలి క్లోరోప్లాస్టు (హరితరేణువులు)లను పరిశీలించుము. బొమ్మను గీచి, పరిశీలనలు రాయుము.
జవాబు:
AP Board 9th Class Biology Solutions 1st Lesson కణ నిర్మాణం – విధులు 9
క్లోరోప్లాస్టులను పరిశీలించుట :

  1. రియో పత్రం పొరను తీసుకొని స్లెడ్ పైన ఉంచి నీటి చుక్క వేయాలి.
  2. ఎక్కువ మాగ్నిఫికేషన్ గల సూక్ష్మదర్శినితో పరిశీలించాలి.

పరిశీలనలు:

  1. స్లెడ్ రియో పత్రమునందు ఆకుపచ్చని చిన్నటి రేణువులు కనబడుతున్నాయి. వీటిని హరితరేణువులు అంటారు.
  2. హరితరేణువులు పత్రహరిత వర్ణద్రవ్యమును కలిగి ఉంటాయి.

కృత్యం – 4

5. శైవలాలలో హరితరేణువులు పరిశీలిదాం :
శైవలములందలి హరితరేణువులను నీవు ఏ విధముగా సూక్ష్మదర్శినిలో పరిశీలిస్తావు ? పరిశీలించిన బొమ్మను గీచి, నీవు కనుగొనిన విషయమును రాయుము.
జవాబు:
శైవల హరితరేణువులను పరిశీలించుట :

  1. నీటి కొలను నుండి ఆకుపచ్చని శైవలాలను సేకరించాలి.
  2. వాటి సన్నని తంతువులను వేరుచేయాలి.
  3. కొన్ని తంతువులను స్లెడ్ పైన ఉంచి సూక్ష్మదర్శినితో పరిశీలించాలి.

AP Board 9th Class Biology Solutions 1st Lesson కణ నిర్మాణం – విధులు 10

పరిశీలనలు:

  1. శైవలాలలో హరితరేణువులు నిచ్చెన ఆకారంలో గాని, నక్షత్ర ఆకారంలో గాని, సర్పిలాకారంలో గాని, జాలాకారంలో గాని ఉంటాయి.
  2. కిరణజన్య సంయోగక్రియలో సూర్యకాంతిలోని సౌరశక్తిని గ్రహించి రసాయనశక్తిగా హరితరేణువులు మార్చుతాయి.

AP Board 9th Class Biology Solutions 1st Lesson కణ నిర్మాణం – విధులు

కృత్యం – 5

6. రిక్తికలను పరిశీలిద్దాం :
కలబంద వంటి రసభరిత మొక్క కాండం లేదా పత్రాన్ని నీవు ఏ విధముగా సూక్ష్మదర్శినితో పరిశీలిస్తావు?
జవాబు:
రిక్తికల పరిశీలన చేయు విధం :

  1. కలబంద వంటి రసభరిత మొక్క కాండం లేదా పత్రాన్ని తీసుకోవాలి.
  2. కాండం నుండి పల్చటి భాగాన్ని తీసుకొని నీరు ఉన్న వాగ్లాలో ఉంచాలి.
  3. స్లెడ్ మీద ఉంచి సజల సాఫ్రనిలో రంజనం చేయాలి.
  4. స్లెడు సంయుక్త సూక్ష్మదర్శినితో పరిశీలించాలి.

పరిశీలనలు :

  1. కణంలో పెద్ద పెద్ద ఖాళీ ప్రదేశాలు ఉన్నాయి. వాటిని రిక్తికలు అంటారు.
  2. ఇవి రసభరితంగా ఉండే సంచుల వంటి నిర్మాణాలు.

AP Board 9th Class Hindi निबंध लेखन

AP State Syllabus AP Board 9th Class Hindi Textbook Solutions निबंध लेखन Questions and Answers.

AP State Syllabus 9th Class Hindi निबंध लेखन

1. पुस्तकालय (ग्रन्थालय) (గ్రంథాలయము)

ग्रन्थालय में अनेक प्रकार की पुस्तकें रखी जाती हैं। कुछ पुस्तकों से केवल मनोविनोद होता है। कुछ ‘पुस्तकों को पढ़ने से ज्ञान प्राप्त होता है। पुस्तकें अच्छे मित्र के समान जीवन भर काम आती हैं।

साधारणतया पुस्तकालय में सभी दैनिक पित्रकाओं के साथ कई विशेष पत्रिकाएँ और बडे-बडे ग्रन्थों के साथ सभी आवश्यक किताबें इतिहास, भूगोल विज्ञान आदि किताबों के अतिरिक्त, कहानियाँ, उपन्यास, नाटक आदि किताबों का इन्तज़ाम होता है। जो लोग इन सब किताबों को खरीदकर नहीं पढ़ सकते हैं, उनके लिए ग्रन्थालय अत्यन्त लाभदायक है।

हमारे देश में तंजावूर के सरस्वती ग्रन्थालय अत्यन्त महत्व का है। ऐसे ग्रन्थालय देश में कई स्थानों पर स्थापित करने की अत्यन्त आवश्यकता है। साधारणतः हर एक गाँव में छोटे-छोटे ग्रन्थालयों के होने की अत्यंत आवश्यकता है।

2. समाचार-पत्र (వార్తాపత్రిక)

आजकल दुनियाँ में समाचार पत्रों का महत्वपूर्ण स्थान है। इनसे हमें संसार के सभी प्रातों के समाचारों के अतिरिक्त राजनैतिक टीका-टिप्पणी, अच्छे-अच्छे लेख, वस्तुओं के भाव कई प्रकार के विज्ञापन और सिनेमा संबंधी सचित्र विज्ञान आदि प्रकाशित होते हैं। संसार के सभी प्रांतों के समाचार शीघ्र ही पहुँचाते हैं।

समाचार पत्र कई प्रकार के होते हैं। इनमें दैनिक पत्रों की बड़ी माँग होती है। इसके अलावा साप्ताहिक, मासिक और पाक्षिक पत्र भी देश की विभिन्न भाषाओं में निकलते हैं। दैनिक पत्रों में राजनीति, समाज और विज्ञापन संबंधी सुन्दर लेख प्रकाशित होते हैं। सुन्दर कहानियाँ और धारावाहिक उपन्यास भी प्रकाशित होते रहते हैं। आजकल व्यापार, अर्थशात्र, सिनेमा आदि क्षेत्रों में विशेष पत्र, पत्रिकाएँ भी निकली हैं। मन बहलाव और ज्ञान -विज्ञान के लिये ये समाचार पत्र बहुत उपयोगी सिद्ध होते हैं।

AP Board 9th Class Hindi निबंध लेखन

3. सिनेमा से लाभ और हानि (సినిమా లాభ నష్టములు)

सिनेमा या चलन-चित्र से हमें कई लाभ हैं। एक गरीब आदमी घूम फिरकर संसार के सभी सुन्दर दृश्य नहीं देख सकता । लेकिन इनके द्वारा आसानी से थोडा समय और थोडे पैसों से देख सकता है। हम काम करते-करते थक जाते हैं। इसलिए मनोरंजन के बिना अपने काम अधिक समय तक नहीं कर सकते हैं। थोडे से मनोरंजन से हम में स्फूर्ति आती है और काम करने का नया उत्साह पैदा होता है। इन चलन चित्रों से हम बहुत विषय सीख सकते हैं। कई चलनचित्रों के द्वारा राष्ट्रीय भाषाओं का प्रचार भी हो रहा है। देश भक्ति संबन्धी कई प्रकार के दृश्य दिखाये जा रहे हैं। इसके ज़रिए समाज सुधार का काम आसानी से हो सकता है। समाज के दुराचार दिखाकर उनको दूर करने का प्रयत्न किया जा सकता है।

सिनेमाओं से बहुत हानियाँ भी हैं। पैसा कमाने के उद्देश्य से आजकल के निर्माता उत्तम चित्र नहीं बनाते । ताकि दुष्परिणामों का असर युवकों पर पड़ता है और वे बिगडे जा रहे हैं। सिनेमाओं को अधिक देखने से आँखों के रोग बढ जाते हैं।

4. विद्यार्थी जीवन (విద్యార్థి జీవితము)

जो बालक विद्या का आर्जन करता है उसे विद्यार्थी कहते हैं। जो विद्यार्थी महान व्यक्तियों से अच्छी बातों को सीखना चाहता है। वही आदर्श विद्यार्थी बन सकता है। आदर्श विद्यार्थी को अपने हृदय में सेवा का भाव रखना चाहिए। उसको अच्छे गुणों को लेना चाहिये। उसको विनम्र और आज्ञाकारी बनना चाहिए। उसको शांतचित्त से अपने गुरु के उपदेशों को सुनना चाहिए। उसको सरलता और सादगी की ओर ध्यान देना चाहिए। उसको स्वच्छ पवित्र जीवन बिताना चाहिए। उसको स्वावलंबी बनना चाहिये। उसको अपने कर्तव्य को निभाना चाहिए। उसको समाज और देश का उपकार करना चाहिए। महापुरुषों की जीवनियों से प्रेरणा लेनी चाहिए । उसको समय का सदुपयोग करना चाहिये। आदर्श विद्यार्थी को सच्चा और सदाचारी बनना चाहिए।

5. किसी राष्ट्रीय त्योहार (జాతీయ పండగ) (पन्द्रह अगस्त ) (ఆగష్టు 15)

हमारे भारत में कई तरह के त्योहार मनाये जाते हैं। जैसे दीपावली, दशहरा, क्रिसमस, रमज़ान आदि। इनके अतिरिक्त कुछ ऐसे त्योहार हैं जिनका राष्ट्रीय महत्व होता है। उन त्योहारों को सभी धर्मों के लोग समान रूप से मनाते हैं। भारत का गणतंत्र दिवस, अगस्त पन्द्रह का स्वतंत्र दिवस आदि राष्ट्रीय त्योहार है।

हमारे स्कूल में इस वर्ष अगस्त पन्द्रह का स्वतंत्र दिवस बड़े धूम-धाम से मनाया गया । विद्यालय में सर्वत्र रंग -बिरंगे झण्डे फहराये गये। सब लडके प्रातःकाल की प्रार्थना के लिए निकल पड़े । आठ बजे राष्ट्रीय झण्डे की वंदना की गयी । स्काऊट तथा एन. सी. सी. संबन्धी विन्यास हुए। इस अवसर पर खेल-कूद की प्रतियोगिताएं हुयी। विजेताओं को पुरस्कार बाँटी गयीं। दोपहर को सभा हुई। हमारे प्रधानाध्यापक महोदय और अन्य अध्यापक महोदयों ने राष्ट्रीय त्योहारों के महत्व एवं विद्यार्थियों में देशभक्ति और सेवा की भावनाएँ जागृत की हैं। इन त्योहारों से हमारे नेता और उनकी कुर्बानियों की याद बनी रहती है।

AP Board 9th Class Hindi निबंध लेखन

6. राष्ट्रभाषा हिन्दी (జాతీయబాష హిందీ)

भारत एक विशाल देश है। इसमें अनेक राज्य हैं। प्रत्येक राज्य की अपनी प्रादेशिक भाषा होती हैं। राज्य की सीमा के अंदर प्रादेशिक भाषा में काम चलता हैं। परंतु राज्यों के बीच में व्यवहार करने के लिए एक सामान्य संपर्क भाषा की आवश्यकता है। देश की प्रादेशिक भाषाओं में जिसे अधिक लोग बोलते और समझते हैं वही देश की राष्ट्र भाषा बन सकती है। इन सभी गुणों के होने के कारण प्राचीन संस्कृति और सभ्यता से पूर्ण होने के कारण हिन्दी भाषा राष्ट्रभाषा घोषित की गयी है।

इसलिए देश के करोड़ों लोगों से बोली जानेवाली हिन्दी को हमारे संविधान ने राष्ट्रभाषा घोषित की अंतर प्रांतीय और अखिल भारतीय व्यवहारों के लिए हिन्दी का उपयोग किया जाता है। प्रत्येक राज्य में वहाँ की प्रादेशिक भाषा, राज्यभाषा बनी ।

7. समय का मूल्य (సమయము యొక్క విలువ)

हमारे जीवन में जो समय बीत गया है फिर नहीं आयेगा। जो समय का मूल्य नहीं जातने हैं, वे समय का दुरुपयोग करते हैं। जो बचपन में पढाई से जी चुरा लेते हैं उन्हें आगे चलकर पछताना पड़ता है। जो समय का सदुपयोग करते हैं, वे जीवन में उन्नति अवश्य पाते हैं। जो सुस्त रहते हैं वे समय का दुरुपयोग करते हैं और आज का काम कल पर डालते रहते हैं, समय का महत्व नहीं जानते हैं। जो समय का महत्व जानते हैं वे समय का सदुपयोग करते हैं। महात्मा गाँधीजी समय के बडे पाबन्द थे।

छात्रों को समय पालन की बडी आवश्यकता है उन्हें व्यायाम, अध्ययन सैर सपाटे आदि के लिए समय निश्चित कर लेना चाहिए। समय निश्चित करना पर्याप्त नहीं है। नियमपूर्वक उसका पालन करना अत्यन्य आवश्यक है। बचपन से समय पालन करना अत्यंत आवश्यक है। जो समय पालन का अच्छा अभ्यास करते हैं, वे आगे चलकर अपने जीवन में सफलता प्राप्त करते हैं।

8. व्यायाम से लाभ (వ్యాయామం వలన లాభాలు)

व्यायाम से बहुत लाभ हैं। व्यायाम शक्ति देने वाला है और सफलता का साधन भी है। इसीलिए व्यायाम स्वास्थ्य और सफलता की कुंजी कहलाता है। नियम के अनुसार व्यायाम करेंगे तो हमेशा नीरोग रहते हैं। तंदुरुस्ती बनी रहती है।

व्यायाम करने की बहुत रीतियाँ हैं। कुस्ती लडना, कसरत करना, खेलना-कूदना, दन्ड-बैठक आदि व्यायाम के भेद माने जाते हैं। टहलना और घूमना भी एक प्रकार का व्यायाम है। व्यायाम करने से श्वासक्रिया खूब होती है। उससे शरीर का रक्त शुद्ध होता है। शुद्ध रक्त से स्वास्थ्य बना रहता है और जल्दी कोई बीमारी नहीं होती | व्यायाम करने से पाचन शक्ति बढती है और शरीर में स्फूर्ति आती है।

9. जनवरी 26 (జనవరి 26)

26 जनवरी को गणतंत्र दिवस कहते हैं। 1950 में इसी दिन पहले-पहल स्वतंत्र भारत का नया संविधान बनाया गया था । उसकी यादगार में इस दिन सारे देश में आनंद और उत्साह से मनाते हैं क्योंकि 26 जनवरी को ही देश को पूर्ण स्वाधीन की शपथ ली गयी थी । इसके पहले ” स्वाधीनता दिवस’ नाम से मनाया जा रहा था ।

यह गणतंत्र दिवस सारे भारत में बड़ी धूम-धाम से मनाया जाता है। लेकिन हमारी राजधानी दिल्ली में इसकी शोभा निराली होती है। इस दिन सभी को छुट्टी मिलती है। बाज़ार बन्द रहते हैं। दिल्ली में जल, स्थल और वायुसेना के टुकडियाँ राष्ट्रपति को वंदना करती है। इस समारोह को देखने के लिए दूरदूर से लोग दिल्ली पहुंचते हैं।

इस दिन राष्ट्रपति सजधजकर अभिवादन स्वीकार करते हैं। प्रधान मंत्री राष्ट्रपति का स्वागत करते हैं।

AP Board 9th Class Hindi निबंध लेखन

10. दूरदर्शन (టేలివిజన్)

दूरदर्शन को ‘टेलिविज़न’ भी कहते हैं। “टेली”का अर्थ है दूर और “विज़न’ का अर्थ है प्रतिबिंब। जिस यन्त्र की सहायता से दूर-दूर के दृश्यों का प्रतिबिंब हम घर बैठे देख सकते हैं उसे दूरदर्शन कहते हैं। देखने में यह रेडियो जैसा होता है। इसमें एक परदा लगा रहता है। परदे पर सारे दृश्य दिखायी देते हैं। फ़िल्म और नाटक भी देख सकते हैं। इसमें दृश्य और ध्वनि दोनों का समन्वय प्रसार किया जाता है। इन्हें प्रसारित करने का साधन रेडियो स्टेशन के समान होता है । इसकी महानता का श्रेय महान वैज्ञानिक डॉ. भाभा के प्रयत्नों से हैं।
दूरदर्शन से बहुत लाभ हैं। व्यापार, सामाजिक कार्य, वाद-विवाद, खेल, कृषि विज्ञान, नृत्य आदि इसके द्वारा दिखाये जा सकते हैं। दिन -ब-दिन इसकी माँग बढ रही है। अब गाँवों में भी इसका प्रसार अच्छी तरह हो रही है। इसके सुधार में वैज्ञानिक रात – दिन काम कर रहे हैं।

11. त्योहार (పండుగ)

दीपावली एक राष्ट्रीय त्योहार है। यह किसी न किसी रूप में भारत भर में मनाया जाता है। दीपावली हिन्दुओं का प्रमुख त्योहार है। यह दक्षिण भारत में आश्विन मास की अमावस्या को मनाया जाता है। यह अन्धकार पर प्रकाश डालनेवाला त्योहार है। इस त्योहार के संबन्ध में एक कहानी प्रसिद्ध है कि प्राचीनकाल में नरकासुर नामक एक क्रूर राक्षस रहता था । वह सभी को बहुत सताता था। बहुत स्त्रियों को कारागार में बन्दकर दिया था। लोगों में त्राहि-त्राहि मच गई । सभी लोगों ने जाकर भगवान कृष्ण से प्रार्थना की हैं कि उस राक्षस को मारकर हमारी रक्षा कीजिए। श्रीकृष्ण ने सत्यभामा समेत जाकर नरकासुर को युद्ध में मार डाला | उस दिन की याद में लोग हर साल दीवाली मनाते हैं। उस दिन लोग घरों को साफ़ करके घर-घर में दीप जलाकर खुशी मनाते हैं। बच्चे नये कपडे पहनकर पटाखे आदि छोडते हैं। पकवान खाते हैं। बन्धु लोग आते हैं। मंदिर में जाकर भगवान की पूजा करते हैं। खासकर लक्ष्मी की पूजा करते हैं। उस दिन से व्यापारी लोग पुराने हिसाब ठीक करके नये हिसाब शुरू करते हैं।

12. आपके प्रिय नेता (తమ ప్రియ నాయకుడు)

महात्मा गाँधीजी मेरे प्रिय नेता हैं। महात्मा गाँधीजी ‘जाति पिता’ के रूप में हम सबको मालूम हैं। आप देश की दास्यता को दूर करने के लिए सच्चे सेवक के रूप में काम किये थे।

महात्मा गाँधीजी अहिंसावादी थे। आप सदा सच ही बोले थे। आपके नेतृत्व में ही भारत आज़ादी को प्राप्त कर ली । आप हिन्दू-मुस्लिम एकता के लिए बहुत कोशिश करते थे । आप हरिजनोद्धरण के लिए बहुत प्रयत्न करते थे । आप कुटीर उद्योगों और स्त्री शिक्षा को प्रोत्साहन देते थे।

आपने सत्य और अहिंसा के द्वारा ही दक्षिण आफ्रिका को भी स्वतन्त्र दिलाये | देश को आज़ादी दिलाने के लिए आपको कई बार जेल जाना पड़ा । आपका समय पालन हमारे लिए अनुकरणीय योग्य बात है। 1948 जनवरी 30 वी. तारीख को आप गाड्से नामक एक व्यक्ति के हाथों मारे गये।

AP Board 9th Class Hindi निबंध लेखन

13. पर्यावरण और प्रदूषण (వాతావరణ కాలుష్యము)

पर्यावरण याने वातावरण है। पर्यावरण में संतुलन होना चाहिए। नहीं तो हमें कई हानियाँ होती हैं। पशु, पक्षी और हम सब मनुष्य हवा में से आक्सीजन लेते हैं और कार्बन-डाइ-आक्सइड छोडते हैं। यह इसी रूप में पर्यावरण में फैलता है। पेड-पौधों की सहायता से पर्यावरण संतुलित हो जाता है।

पर्यावरण के असंतुलन से मौसम समय पर नहीं आता और वर्षा नियमित रूप से नहीं होते । वर्षा हुई भी तो कहीं अतिवृष्टि कहीं अल्पवृष्टि होती है।

पर्यावरण के प्रदूषण को रोकने में हम सब सहयोग दे सकते हैं। सबसे पहले तो हम गंदगी न फैलाएँ। अपने आसपास की नालियों को साफ़ रखें। कूडा – कचरा जहाँ-तहाँ न फेंकें। जंगल के वृक्ष न काटें। हमारे यहाँ पेड लगाना पुण्य कार्य माना गया है।

पर्यावरण हमारा रक्षा कवच है। हमारे स्वस्थ जीवन का आधार साफ़-सुथरा पर्यावरण ही है। पर्यावरण की रक्षा के लिए हमें उपर्युक्त कामों को करना चाहिए।

14. विज्ञान से लाभ और हानियाँ (విజ్ఞానం వల్ల లాభనష్టాలు)

आज का युग विज्ञान का युग है। विज्ञान ने प्रकृति पर जीत लिया है। विज्ञान ने मानव जीवन पर क्रांतिकारी परिवर्तन लाया है। विज्ञान के कारण कई आविष्कार हो रहे हैं। इस से मानव का कल्याण और विनाश देनों संभव है। यह हमारे हाथ में है। इसे सद्विनियोग करें तो विश्व कल्याण होगा। नहीं तो विश्व नाश।

विज्ञान के लाभ :

  • मोटर, रेल, जहाज, हवाई जहाजों के कारण आज दिनों की यात्रा कुछ ही घंटों में हम कर रहे हैं।
  • रेडियो, टीवी. समचार पत्र आदि मनोरंजन और विज्ञान दोनों दे रहे हैं।
  • बिजली के बिना आज़कल कोई काम संभव नहीं है। आहार उत्पादन बढती जनसंख्या के लिए बढ़ रहा है। केवल इस विज्ञान के कारण।
  • वैज्ञानिक वृद्धि के कारण वैद्य क्षेत्र में कई प्रकार की दवाओं का सृजन हो रहा है। रोग दूर हो रहे हैं।

विज्ञान से नष्टः

  • अणुबम, उदजन बम, मेगटन बम आदि के आविष्कार से विश्व नाश होने की संभावना है।
  • चारों ओर अशांति फैल रही है। लोगों में आलसी, स्वार्थ भावनाएँ बढ रही हैं।

AP Board 9th Class Hindi पत्र लेखन

AP State Syllabus AP Board 9th Class Hindi Textbook Solutions पत्र लेखन Questions and Answers.

AP State Syllabus 9th Class Hindi पत्र लेखन

1. अपने भाई के विवाह में भाग लेने के लिए पाँच दिन की छुट्टी माँगते हुए कक्षाध्यापक के नाम छुट्टी पत्र लिखिए।
उत्तर:

आलमूरु,
दि. x x x x x

सेवा में,
श्री कक्षाध्यापक जी,
नौवीं कक्षा,
यस. यस. हाईस्कूल, आलमूरु।

महोदय,

सादर प्रणाम ।

सेवा में निवेदन है कि मेरे भाई का विवाह अगले सोमवार अमलापुरम में होनेवाला है । मुझे उस विवाह में सम्मिलित होना चाहिए। इसलिए मैं पाठशाला में नहीं आ सकती । कृपया आप मुझे पाँच दिन की छुट्टी देने की कृपा करें।

आपकी आज्ञाकारी छात्रा,
पि. ज्योति,
नौवीं कक्षा,
क्रम संख्या – 1919.

2. अपनी पाठशाला में मनाये गये वार्षिकोत्सव का वर्णन करते हुए मित्र के नाम पत्र लिखिए।
उत्तर:

तेनाली,
दि. x x x x x

प्रिय मित्र,

मैं यहाँ कुशल हूँ। आशा है कि वहाँ तुम कुशल हो । मैं अपने स्कूल के वार्षिकोत्सव का वर्णन कर रहा हूँ। दिनांक x x x x को हमारे स्कूल का वार्षिकोत्सव बडे धूम-धाम से मनाया गया । उस दिन स्कूल और सभा मंडप रंग – बिरंगे काग़ज़ से सजाये गये। फाटक पर “सुस्वागतम” टाँगी गयी। शाम के पाँच बजे संभा आरंभ हुई । बहुत से लोग वार्षिकोत्सव देखने आये। हमारे प्रधानाध्यापक अध्यक्ष बने। शिक्षा मंत्री ने मुख्य अतिथि के रूप में भाषण दिया । विद्यार्थियों से कार्यक्रम संपन्न हुए। विजेताओं को पुरस्कार दिये गये। राष्ट्रीय गीत के साथ सभा समाप्त हुई। तुम्हारे माँ-बाप को मेरे नमस्कार बताओ | पत्र की प्रतीक्षा में।

तुम्हारा प्रिय मित्र, के. अमरनाथ,
नौवीं कक्षा,
अनुक्रमांक – 46.

पता :
यस. मनीष लाल,
नौवीं कक्षा ‘ए’,
श्री सिद्धार्था हाईस्कूल, राजमहेन्द्री – 2.

AP Board 9th Class Hindi पत्र लेखन

3. किसी पुस्तक विक्रेता के नाम पर आवश्यक पुस्तकें माँगते हुए पत्र लिखिए।
उत्तर:

काकिनाडा,
दि. x x x x x

प्रेषक :
क्र.सं. 25 नौवीं कक्षा ‘बी’,
जि.प. हाईस्कूल, काकिनाडा।
सेवा में,
व्यवस्थापक जी, पुस्तक विक्रय विभाग,
वी.जि.यस. स्टोर्स, अमलापुरम।

प्रिय महोदय,

निम्न लिखित पुस्तकें ऊपर दिये गये पते पर वी.पी.पी. के द्वारा यथा शीघ्र भेजने की कृपा करें। पेशगी ₹ 1500 भेज रहा हूँ।
आवश्यक पुस्तकों की सूची :
1) सरल हिन्दी व्याकरण भाग – 1 …………. 6 प्रतियाँ
2) हिन्दी तेलुगु कोश …………. 4 प्रतियाँ
3) हिन्दी रचना भाग – 2 …………… 3 प्रतियाँ

आपका विश्वसनीय,
x x x,
क्रम संख्या – 25

पता :
श्री व्यवस्थापक जी,
पुस्तक विक्रय विभाग,
वी.जि.यस. स्टोर्स,
अमलापुरम।

4. बिजली की अच्छी व्यवस्था के लिए अधिकारियों को पत्र लिखिए।
उत्तर:

अमलापुरम
दि. x x x x x

प्रेषक :
सि.हेच. कोंडलराव (अध्यापक)
जि.प. हाईस्कूल, अमलापुरम।
सेवा में,
असिस्टेन्ट इंजनीयर (आपरेषन्स)
अमलापुरम सब स्टेशन, अमलापुरम।
प्रिय महाशय,

आपकी सेवा में नम्र निवेदन है कि हमारे नगर में बिजली की सप्लाई अच्छी तरह नहीं हैं। हर रोज़ घंटों बिजली नहीं रहती । इससे ग्राहकों को बड़ी मुसीबत होती है। टी.वी. के कार्यक्रम नहीं देख पाते। विद्या, परीक्षा की अच्छी तैयारी नहीं कर पाते । सब तरह के लोगों को कठिनाइयों का सामना करना पड़ रहा है। इसलिए आप बिजली की सप्लाई ठीक तरह से करवाने की कृपा करें।

भवदीय,
नं. x x x,

पता :
असिस्टेन्ट इंजनीयर
अमलापुरम सब स्टेशन,
अमलापुरम (मंडल), पू.गो. ज़िला – 533 201.

5. किसी प्रसिद्ध स्थान के बारे में वर्णन करते हुए मित्र को पत्र लिखिए।
उत्तर:

विशाखपट्टणम,
दि. x x x x x

प्रेषक :
ऐ.सत्य सूर्य श्रीनिवास,
नौवीं कक्षा , नं. 444,
जि.प. हाईस्कूल, विशाखपट्टणम ।
प्रिय मित्र,

मैं यहाँ सकुशल हूँ। हमारी परीक्षाएँ इसी महीने में शुरू होगी | मैं मन लगाकर खूब पढ़ रहा हूँ। पिछले सप्ताह अपने स्कूल के कुछ छात्रों के साथ तिरुपति देखने गया । हम रेल गाड़ी से गये। हमारे साथ हमारे दो अध्यापक भी आये। हम सब तिरुपति के देवस्थान की धर्मशाला में ठहरे । भगवान बालाजी के दर्शन करके हम आनंद विभोर हो गये।

वहाँ पर हम दो दिन रहे। तिरुपति में हमने कोदंडराम स्वामी का मंदिर, गोविंदराज स्वामी का मंदिर पापनाशनम, आकाशगंगा आदि देखें । उसके बाद मंगापुरम तथा श्री वेंकटेश्वर विश्वविद्यालय भी देखें। पिताजी को मेरे प्रणाम,

प्रिय मित्र,
ए. सत्य सूर्य श्रीनिवास।

पता :
के. रामप्रसाद,
हाईस्कूल रोड, अमलापुरम।

6. ग्रीष्मावकाश व्यतीत करने के विषय का वर्णन करते हुए अपने मित्र के नाम पत्र लिखिये।
उत्तर:

अमलापुरम,
दि. x x x x x

प्रिय मित्र,
साइ कुमार,

यहाँ मैं सकुशल हूँ। बहुत दिनों से तुम्हारा पत्र मुझे नहीं मिला | इस साल मैं ने ग्रीष्मावकाश बेंगलूर में बिताया । उस शहर के मल्लेश्वरम में हमारी माताजी रहती हैं। गरमी के मौसम में बेंगलूर का वातावरण ठंडा रहता है। वहाँ पेडों की हरियाली आँखों को आराम देती है।

बेंगलूर सचमुच एक सुन्दर नगर है। सुन्दर मकान, साफ़-सुथरी सडकें और सुहाने बाग बगीचे नगर की शोभा बढ़ाते हैं। मैं रोज़ वहाँ के लाल बाग में घूमने जाता हूँ। सिटी मार्केट में अच्छा बाज़ार लगता है। वहाँ पर कई रेशम के कारखाने हैं।

पिताजी का पत्र पाकर मुझे वहाँ से आ जाना पडा | बेंगलूर छोडकर आते हुए मुझे चिंता हुई । अपने माता-पिता से मेरे नमस्कार कहो।

तुम्हारा मित्र,
ऐ.यस.वी. प्रसाद।

पता:
यस. साइ कुमार,
पिता : विजय, सीतम्मधारा,
विशाखपट्टणम – 13.

AP Board 9th Class Hindi पत्र लेखन

7. अपने सहपाठियों के साथ आप किसी ऐतिहासिक नगर गये। उसका वर्णन करते हुए अपने छोटे भाई को पत्र लिखिए।
उत्तर:

विजयवाडा,
दि. x x x x x

प्रिय छोटे भाई,
आशीश,

तुम्हारा पत्र अभी मिला, पढकर खुश हुआ क्योंकि घर के समाचार प्राप्त हुए हैं। तुम जानते हो कि हम कुछ विद्यार्थी इस महीने की पहली तारीख को कश्मीर की यात्रा पर गये । हम विजयवाडा से तमिलनाडु एक्सप्रेस से दिल्ली गये। दिल्ली में दो दिन ठहरे । वहाँ से हम जम्मू तक रेल से गये। जम्मूतावी से हम सब श्रीनगर पहुँचे। रास्ते के दृश्य अत्यंत मनोहर हैं। हम श्रीनगर में एक होटल में ठहरे।। मौसम बडा सहावना था | वहाँ पर हमने डलझील, शंकराचार्य मंदिर, निशांत बाग, शालिमार बाग आदि देखें। बाकी बातें घर आकर सुनाऊँगा।

तुम्हारा प्यारा भाई,
आर.यस.कुमार,
नौवीं कक्षा ‘ए’
जि.प.हाईस्कूल,
विजयवाडा ।

पता :
आर. रामाराव,
पिता : गोपालराव,
गांधीनगर, काकिनाडा।

8. हिन्दी सीखने की आवश्यकता पर जोर देते हुए अपने दोस्त (मित्र) के नाम पत्र लिखिए।
उत्तर:

अमलापुरम,
दि. x x x x x

प्रिय मित्र,
सुरेश कुमार,

तुम्हारा पत्र पाकर मैं बहुत खुश हुआ | मैं अगले फरवरी में हिन्दी विशारद परीक्षा में बैठने की तैयारी कर रहा हूँ। हिन्दी सीखने में बहुत आसानी भाषा है। वह हमारे भारत की राष्ट्र भाषा है। देश भर में असंख्य लोग यह भाषा समझते और बोलते हैं। अगर हम उत्तर भारत में कही भी जाएँ तो हिन्दी की उपयोगिता समझ में आयेगी। वहाँ अंग्रेज़ी या किसी भी दूसरी भाषा से काम नहीं चलता | हिन्दी नहीं जानते तो हम वहाँ एक अजनबी रह जायेंगे। इसलिए तुमसे भी मेरा अनुरोध है कि तुम भी हिन्दी सीख लो। आशा है कि तुम समय-समय पर पत्र लिखा करोगे।

तुम्हारा,
प्रिय मित्र,
ऐ.श्रीनिवास

पता :
सुरेश कुमार,
नौवीं. कक्षा ‘बी’,
जि.प्र.प.हाईस्कूल, काकिनाडा।

9. तुम्हारे देखे हुए प्रदर्शिनी का वर्णन करते हुए मित्र को पत्र लिखिए।
उत्तर:

विलसा,
x x x x

प्रिय मित्र साई,

मैं यहाँ कुशल हूँ। तुम भी कुशल समझता हूँ। आजकल विजयवाडा में एक बडी – भारी औद्योगिक प्रदर्शिनी चल रही है। मैंने उसे देखा है उस प्रदर्शिनी के बारे में तुम्हें कुछ बताना चाहता हूँ।

इस प्रदर्शिनी में सैकडों की दूकानें, खिलौने की दूकानें हैं। इनके साथ खेतीबारी के संबंधित यंत्र और औजारों की प्रदर्शिनी भी हो रही है। बच्चों को आनंद देनेवाली ‘बच्चों की रेल गाडी’ है। घूमनेवाली बडी ‘जैन्टवील’ है। हवाई जहाज़, रॉकेट और ऊँट हैं। उन पर बैठकर सफ़र कर सकते हैं। रेल विभाग, तार विभाग के जो स्टाल हैं वे बड़े आकर्षक हैं और अन्य कई आकर्षणीय विभाग हैं।

परीक्षा के समाप्त होते ही तुम यहाँ चले आओ। तुमको भी मैं ये सब दिखाऊँगा। तुम्हारे माता-पिता से मेरा नमस्कार कहना ।

तुम्हारा प्रिय मित्र,
xxxx

पता :
यस.यस.साई,
नौवीं कक्षा,
जि.प्र.प.हाईस्कूल,
अमलापुरम, पू.गो. ज़िला।

10. तुम्हारे गाँव में सफ़ाई ठीक नहीं हैं । स्वास्थ्य अधिकारी के नाम पत्र लिखिए।
उत्तर:

उरवकोंडा,
दि. x x x x x

प्रेषक :
साईबाबा यस,
S/o. लालशाह,
मैंनेजर, स्टेट बैंक आफ़ इंडिया,
उरवकोंडा।
सेवा में,
श्रीमान् स्वास्थ्य अधिकारी,
पंचायत कार्यालय,
उरवकोंडा।
मान्य महोदय,

आपकी सेवा में नम्र निवेदन है कि “कुछ महीनों से हमारे गाँव में सफ़ाई ठीक ढंग से नहीं हो रही है। सड़कों पर कूडा-करकट जमा रहता है। नालों का गंदा पानी सड़कों पर बहता है। उनको साफ़ करने की ठीक व्यवस्था नहीं है। इसलिए मच्छर खूब बढ़ गये हैं। कई लोग मलेरिया के शिकार बन रहे हैं। इसलिए मैं आपसे प्रार्थना करता हूँ कि हर रोज़ सफ़ाई करने की अच्छी व्यवस्था की जाय”|

भवदीय,
नं. x x x x

पता :
स्वास्थ्य अधिकारी,
पंचायत कार्यालय,
उरवकोंडा।

AP Board 9th Class Hindi पत्र लेखन

11. तुम्हारे पिताजी की बदली हुई है। टी.सी., सी.सी., यस.सी. के लिए प्रधानाध्यापक जी को पत्र लिखिए।
उत्तर:

आलमूरु,
दि. x x x x x

आदरणीय प्रधानाध्यापक जी,

मैं नौवीं कक्षा (बी) का विद्यार्थी हूँ। मेरा नंबर 42 है। मेरे पिताजी की बदली नेल्लूर को हुई है। इसलिए मेरे टी.सी. (Transfer Certificate) (सी.सी.) (Conduct Certificate) और एस.सी. (Study Certificate) यथाशीघ्र दिलाने की कृपा करें। मैं नेल्लूर की पाठशाला में भर्ती होना चाहता हूँ।

आपका विनम्र विद्यार्थी,
नं. – 142
पी. ज्योति,
नौवीं कक्षा ‘बी’.

पता :
श्रीमान् प्रधानाध्यापक जी,
यस.यस. हाईस्कूल, आलमूरु।

12. अपने मित्र को पत्र लिखकर तुम्हारे देखे हुए किसी भी मैच का वर्णन कीजिए।
उत्तर:

विजयवाडा,
दि. x x x x x

प्रिय मित्र गोपाल साई,

मैं यहाँ कुशल हूँ। समझता हूँ कि तुम कुशल हो । मैं ने हाल ही में विशाखापट्टणम में एक क्रिकेट मैच देखा है। उसके बारे में मैं लिख रहा हूँ।

मैच में भाग लेने के लिए दो टीम आये। इंडिया और इंग्लैंड के बीच में स्पर्धा चली। दोनों टीम के खिलाडी बड़े उत्साह के साथ खेल रहे थे। भारत के खिलाडी बैटिंग कर रहे थे। विराट कोह्ली ने चार छक्के चलाये। धोनि ने पचास रन किये | 420 रन पर हमारे सभी खिलाडी आऊट हो गये हैं।

इंग्लैंड के खिलाडी उतनी उत्साह के साथ नहीं खेल सके। 275 रन पर सबके सब खिलाडी आऊट हो गये। इससे भारत के खिलाडी विजयी घोषित हुए। खेल बडे आनंद और उत्साह के साथ चला। हम अपने दोस्तों सहित बाहर आये | बाकी अगले पत्र में। माताजी से मेरा प्रणाम कहना ।

तुम्हारा प्रिय मित्र,
डि.मूर्ति,
नौवीं कक्षा ‘ए’,
मोडल हाईस्कूल, विजयवाडा।

पता :
यस. गोपाल साई,
नौवीं कक्षा,
गान्धी हैस्कूल,
विलसा, पू.गो. ज़िला

13. अपने पिताजी को पत्र लिखकर पंद्रह सौ रुपये मँगवाइए।
उत्तर:

अनंतपूर,
दि. x x x x x

पूज्य पिताजी,
प्रणाम,

मैं यहाँ कुशल हूँ। आशा है कि वहाँ आप सब कुशल हैं। मैं अच्छी तरह पढ़ रहा हूँ।

अगले सप्ताह हमारी कक्षा के सभी विद्यार्थी तिरुपति की यात्रा करनेवाले हैं। हमारे दो अध्यापक भी हमारे साथ आ रहे हैं । हम बालाजी के दर्शन करने के बाद मद्रास भी जाना चाहते हैं। मैं भी आपकी अनुमति पाकर उनके साथ जाना चाहता हूँ। इसलिए ₹ 1500 एम.ओ. करने की कृपा कीजिए। माताजी को मेरे प्रणाम कहिए।

आपका प्रिय पुत्र,
नं. xxx

पता :
जी.रामप्रसाद जी,
डो.नं. 9 – 1 -84,
उरवकोंडा, अनंतपूर ज़िला।

14. तुम्हारी साइकिल की चोरी हुई है। दारोगा साहब के नाम पत्र लिखिए।
उत्तर:

विजयवाडा,
दि. x x x x x

प्रेषक :
न. x x x x,
जि.प.उ. पाठशाला,
विजयवाड़ा – 520 004.
सेवा में,
श्रीमान दारोगा साहब,
वन टउन पुलिस स्टेशन,
विजयवाड़ा – 520 001.
प्रिय महाशय,

मेरा निवदेन है कि मैं कल शाम हिमालय होटल के सामने अपनी साइकिल रखकर चाय पीने अंदर गया। उसे ताला लगाना भूल गया। मैं चाय पीकर बाहर आया। लेकिन वहाँ साइकिल नहीं दिखाई पड़ी। मैंने वहाँ के लोगों से सइकिल के बारे में पुछताछ की । लेकिन साइकिल का पता नहीं चला | मेरी साइकिल ‘अम्बर’ की है। उसका रंग काला है। उसका नंबर – 345861 है । वह बिलकुल नयी सी लगती है। उसमें मिल्लर लाईट लगा है। अतः उसका पता लगाकर उसे दिलवाने की कृपा कीजिए।

आपका विश्वसनीय,
नं. x x x x.

पता :
दारोगा साहब,
वन टउन पुलिस स्टेशन,
विजयवाड़ा – 520 001.

15. अपने मित्र को पोंगल की छुट्टियों में आने का आमंत्रण देते हुए पत्र लिखिए।
उत्तर:

चेन्नाइ,
दि. x x x x x

प्रिय मित्र,

मैं यहाँ कुशल हूँ आशा करता हूँ कि तुम भी वहाँ कुशल हो। अगले हफ़ते से हमारी पोंगल की छुट्टियाँ शुरू हो जायेंगीं। मैं इस पत्र के द्वारा मुख्य रूप से तुम्हे आमंत्रित कर रहा हूँ। हमारे नगर में पोंगल का उत्सव बडे धूमधाम से मनाया जायेगा। यहाँ विशेष मेला और सांस्कृतिक कार्यक्रमों का आयोजन होगा। यहीं नहीं हमारे नगर में देखने लायक स्थान अनेक हैं। इसलिए तुम ज़रूर आना।

तुम्हारे माँ – बाप से मेरे प्रणाम कहो । तुम्हारे भाई को मेरा आशीर्वाद कहना । तेरे आगमन की प्रतीक्षा करता हूँ।

तुम्हारा प्रिय मित्र,
नं. x x x x x

पता :
आर. सुरेश कुमार,
नौवीं कक्षा ‘डी’.
नलन्दा विद्यालय,
एन. आर. पेटा,
गूडूरु।

AP Board 9th Class Hindi पत्र लेखन

16. बहिन की शादी में जाने के लिए तीन दिन की छुट्टी माँगते हुए प्रधानाध्यापक के नाम पत्र लिखिए।
उत्तर:

तणुकु,
दि. x x x x x

सेवा में,
श्री प्रधानाध्यापक जी,
जिला परिषद हाइस्कूल,
तणुकु।
सादर प्रणाम,

मैं आप की पाठशाला में नौवीं कक्षा पढ़ रहा हूँ। मेरा नाम गणेश है।

मेरी बहिन की शादी ता. xxxx को राजमहेंद्रवरम में होनेवाली है। इसलिए कृपया मुझे ता. xxxx से xxxxx तक तीन दिन की छुट्टी देने के लिए प्रार्थना कर रहा हूँ।
धन्यवाद सहित,

आपका
आज्ञाकारी छात्र,
के. किरण,
नौवीं कक्षा,

17. विहारयात्रा पर जाने के लिए अनुमति एवं पैसे माँगते हुए पिताजी के नाम पत्र लिखिए।
उत्तर:

तिरुपति
दि. x x x x x

पूज्य पिताजी,
सादर प्रणाम,

मैं यहाँ कुशल हूँ। मैं आशा करता हूँ कि आप भी वहाँ सकुशल हैं।

हम सब अपनी पाठशाला की ओर से विहारयात्रा पर विशाखपट्टणम जा रहे हैं। हमारे नौवीं कक्षा के छात्रों के साथ मैं भी जाना चाहती हूँ। इसलिए कृपया मुझे जाने की अनुमति के सथ इसके लिए आवश्यक ₹ 500 जरूर भेजने की प्रार्थना।
माताजी को मेरा नमस्कार,

आपकी
आज्ञाकारी पुत्री,
के. विमला

पता :
के. मोहन प्रसाद,
घर – 15 – 20 – 30,
एस. बी. ऐ. वीधि,
श्रीकालहस्ति।

18. हिंदी एक महत्वपूर्ण भाषा है। इस बात को समझाते हुए अपने मित्र के नाम पत्र लिखिए।
उत्तर:

ताडेपल्लि,
दि. x x x x x

प्यारे मित्र मुकुंदम,

मैं यहाँ कुशल हूँ। आशा करता हूँ कि तुम भी वहाँ सकुशल हो। तुमने अपने पत्र में पूछ लिया कि हिंदी का क्या महत्व है? मैं इस का समाधान दे रहा हूँ।

हिंदी हमारी राष्ट्रभाषा है। भारत देश में लगभग 18 राज्यों में हिंदी बोली जाती है। देश भर में करोड़ों लोगों की भाषा हिंदी ही है। देश में इसे जाननेवाले, बोलने वाले अधिक हैं। हिंदी राज भाषा भी है। हिंदी सीख लोगों ते देश मर में कहीं भी हम धूम कर लौट सकेंगे। कहीं भी रह सकेंगे। यह आसानी भाषा भी है। हर दिन सितंबर 14 को हम हिंदी भाषा दिवस मनाते है।
तुम भी हिंदी सीखो। घर में बड़ों को मेरा नमस्कार।

तुम्हारे प्यारे मित्र,
अनिल,
ताडेपल्लि।

पता :
पी. मुकुंदम,
पिता रमणय्या
घर – 20 – 20 – 30,
रथम बजार, पेराला।

19. अपने जन्मदिन के अवसर पर निमंत्रण देते हुए मित्र के नाम पत्र लिखिए।
उत्तर:

तेनाली,
दि. x x x x x

प्यारे मित्र रफ़ी,

मैं यहाँ कुशल हूँ। आशा करता हूँ कि तुम भी वहाँ सकुशल हो।

13 अक्तूबर को मेरा जन्म दिन है। यह तुम भले ही जानते हो। इस अवसर पर हमारे घर में 13 वीं तारीख को जन्म दिन दिवस मनाया जाता है। इस के लिए मैं तुझे निमंत्रण कर रहा हूँ। तुम अवश्य माँ – बाप के साथ आना।
घर में बड़ों को मेरा नमस्कार,

तुम्हारा प्यारा मित्र,
वेणु,
तेनाली

पता :
एस. के रफी,
पिताः मुनाफ
मसजिद वीधि,
पुराना बाजार,
गुंटूर।

20. खेल मानव जीवन का अनोखा अंग है। खेलों का महत्व समझाते हुए मित्र के नाम पत्र लिखिए।
उत्तर:

मंगलगिरि,
दि. x x x x x

प्यारे मित्र विनय,

मैं यहाँ कुशल हूँ। आशा करता हूँ कि तुम भी वहाँ सकुशल हो। मुझे खेलों में कई ईनाम मिले।

मैं इस पत्र में तुझे बताना चाहता हूँ कि खेल हमारे जीवन का अनोखा अंग है।

हमें खेलों से एकता का भाव मिलता है। खेलों से हमें तंदुरुस्त मिलता है। खेलों से हमें भाईचार का भावना मिलती है। इनसे प्रेम भावना बढ़ती है। स्नेह भावना बढ़ती है। खेलों से एकता की भावना जागृत होती है। खेलों से अनुशासन मिलता है। खेलों से शारीरिक और मानसिक विकास भी होता है।

मैं आशा करता हूँ कि तुम भी हमेशा खेलों में भाग लेते रहोगे।
बडों को मेरा नमस्कार।

तुम्हारे प्यारे मित्र,
बी. माधव

पता:
एस. विनय,
पिता : राकेश,
घर – 30-10-30,
स्टेट बैंक गली,
कोत्तपेट, तेनाली।

AP Board 9th Class Hindi पत्र लेखन

21. पेय जल पाठशाला तक नहीं पहुंच रहा है। शिकायत करते हुए मुनिसिपल कमीशनर के नाम पत्र लिखिए।
उत्तर:

रेपल्ले,
दि. x x x x x

सेवा में,
श्री मुनिसिपल कमीशनर,
रेपल्ले।
सादर प्रणाम,

मैं मुनिसिपल हाईस्कूल रेपल्ले में पढ़ रहा हूँ। मैं नौवीं कक्षा पढ़ रहा हूँ। कुहा दिनों से आप के नगर पालिका के द्वारा बाँटे पेयजल हमें नही मिल रहे हैं। इसलिए पाठशाला के छात्रों को पीने का पानी न मिलने के कारण बड़ी असुविधा हो रही है। इसलिए पत्र पाते ही हमें पेय जल का प्रबंध शीघ्र करे।
धन्यवाद सहित,

आपका विश्वसा भाजन,
रामगोपाल;
नौवीं कक्षा।

AP Board 9th Class Hindi शब्दकोश

AP State Syllabus AP Board 9th Class Hindi Textbook Solutions शब्दकोश Questions and Answers.

AP State Syllabus 9th Class Hindi शब्दकोश

अपनाना = తనకనుకూలముగా చేసికొనుట, to own (हमें अच्छे गुण अपनाना चाहिए।)
अरणी = యజ్ఞములో అగ్ని రాజేయడానికి ఉపయోగించునది, a wooden drill used for kindling fire (यज्ञ में अरणी की लकड़ी का उपयोग किया जाता है।)
अक्सर = తరచుగా, (usually अक्सर मैं अपने मामा के घर जाता हूँ।)
अंतर = భేదము, difference (बेटा और बेटी में अंतर नहीं करना चाहिए।)
अभिवादन = వందనము, salutation (शिष्य गुरूजी को अभिवादन करते हैं।)
अनुशासन = క్రమశిక్షణ, discipline (छात्रों को अनुशासन बनाये रखना चाहिए।)
अनुरोध = విన్నపము, request (मैंने छुट्टी के लिए अनुरोध किया।)
आँसू = కన్నీరు, tears (दुःख में आँखों से आँसू बहते हैं।)
असार = ప్రభావము, effect (बुरे कार्यों से बुरा असर पड़ता है।)
असार = సారహీనము, unfulfilled (असार विषयों से समय व्यर्थ होता है।)
आश्वासन = తోడ్పడుట, assurance (माँ, बच्चे को आश्वासन देती है।)
इंसान = మనిషి, human being (भला इंसान दुनिया में अच्छा नाम कमाता है।)
इच्छा = కోరిక, desire, wish (मनुष्य की इच्छाएँ अनंत हैं ।)
इलाज = చికిత్స, treatment (डॉक्टर इलाज करते हैं।)
इरादा = నిశ్చయము, intention (दृढ़ इरादा हर काम आसान बनाता है।)
इतिहास = చరిత్ర, history (भारत के इतिहास में कई राजा हुए हैं।)

AP Board 9th Class Hindi शब्दकोश

ईबादत = పూజ, worship (सदा भगवान की इबादत करो।)
ईमानदार = నమ్మకస్తుడు, honest (राजू ईनामदार लडका है।)
ईदगाह = ప్రార్థనాస్థలము, prayer place (ईदगाह में नमाज़ पढ़ी जाती है।)
उमंग = ఉల్లాసము, aspiration (स्वतंत्रता की लड़ाई में सभी में खूब उमंग थी।)
उजाला = నిర్మలమగు, ప్రకాశించు, bright (दिन में उजाला होता है।)
उल्लास = ఆనందము, delight (त्यौहार के दिन सभी में उल्लास भर जाता है।)
उपेक्षा = నిర్లక్ష్యం , తిరస్కారం, neglect/contempt (हमें किसी की उपेक्षा नहीं करना चाहिए।)
उपहार = కానుక, gift (जन्मदिन के दिन उपहार मिलते हैं।)
उपस्थित = హాజరైన, present (कक्षा में सभी बच्चे उपस्थित थे।)
उन्नति = అభివృద్ధి, progress (देश की उन्नति नागरिक के हाथों में होती है।)
उद्योग = పరిశ్రమ, industry (घरेलू उद्योगों से रोज़गार की समस्या हल होती है।)
उपभोक्ता = వినియోగదారుడు, consumer (सामान का उपयोग करने वाला उपभोक्ता कहलाता है।)
उपभोग = వినియోగం, consume (उपभोक्ता वस्तु का उपभोग करता है।)

AP Board 9th Class Hindi शब्दकोश

ओझल = అదృశ్యమగుట, to disappear (थोड़ी देर पहले रोहित यहाँ से ओझल हो गया।)
कगार = బురుజు, turret (पर्यावरण को प्रदूषण की कगार से दूर करना होगा।)
क़दम = అడుగు, foot step (आगे क़दम बढ़ाने वाले पीछे मुड़कर नहीं देखते।)
कहावत = సామెత, proverb (कहावत से भाषा में चमत्कार उत्पन्न होता है।)
कारनामा = ఎవరైనా చేసినపని, deed (भारत ने दुनिया में कई कारनामे कर दिखाये हैं।)
कोख = గర్భము, womb (हम माँ की कोख से जन्म लेते हैं।)
गायब = అదృశ్యమైన, disappeared (धूप को देखकर अंधेरा गायब हो जाता है।)
गैर = ఇతరులు, others (हमें गैरों को भी अपनाना चाहिए।)
गुज़ारा = బ్రతుకు తెరువు, livelihood (काम करने पर ही गुज़ारा हो सकता है।)
गाँठ = ముడి, knot (शेखर ने अपने गुरूजी की बात गाँठ बाँध ली।)
ग्राहक = వినియోగదారుడు, consumer (ग्राहक सामान खरीद रहे हैं।)
घोषणा = ప్రకటన, announcement (पाठशाला में छुट्टियों की घोषणा हुई।)
घटिया = నీచమైన, worst (घटिया कार्य निंदनीय होते हैं।)

AP Board 9th Class Hindi शब्दकोश

चेतावनी = హెచ్చరిక, warning (पुलिस ने अपराधियों को चेतावनी दी।)
चौकोर = నాల్గు కోణములు, four angled (हमारे घर का आकार चौकोर है।)
चेहरा = ముఖము, face (नरेश के चेहरे पर चोट लगी है।)
चिरायु = దీర్ఘాయు, long-lived (गुरूजी ने शिष्य को चिरायु होने का आशीर्वाद दिया।)
चुनाव = ఎన్నిక, election (हमेशा अच्छी चीज़ का चुनाव करना चाहिए।)
चपरासी = నౌకరు, peon (कार्यालय में चपरासी का कार्य महत्पपूर्ण होता है।)
चुनौती = సవాలు, challenge (लक्ष्मीबाई ने अंग्रेजों को चुनौती दी।)
ज़रूरत = అవసరము, need (साहिती को दस रुपयों की ज़रूरत है।)
जागरूक = సావధానముగా ఉండుట, alert (हमें जागरूक उपभोक्ता बनना चाहिए।)
जलपान = అల్పాహారము, breakfast (पिताजी जलपान करने के बाद काम पर चले गये।)
तलाश = వెతుకుట, to search (पुलिस को चोर की तलाश है।)
तृषा = దాహం, thirsty (शिक्षा की तृषा कभी नहीं मिटती।)
तेज़ = చురుకు, sharp (लडका पढ़ाई में बहुत तेज़ है।)
तैराकी = ఈత, swimming (राजू की तैराकी देखने लायक है।)
थकना = అలసిపోవుట, to tired (लक्ष्य प्राप्त करने से पहले थकना मना है।)
दुगुना = రెట్టింపు, double (प्रोत्साहन से काम करने में दुगुना उत्साह मिलता है।)

AP Board 9th Class Hindi शब्दकोश

दायरा = పరిధి/హద్దు, limit, jurisdiction (हमें अपना दायरा ध्यान में रखकर काम करना चाहिए।)
दुआ = దీవెన, blesses (बुजुर्गों की दुआ लेनी चाहिए।)
धरा = భూమి, land (हमारी धरा हमेशा हरी-भरी रहनी चाहिए।)
धीरज = ధైర్యము, courage (हर काम धीरज के साथ करना चाहिए।)
नेतृत्व = నాయకత్వం, leadership (गांधीजी के नेतृत्व में स्वतंत्रता आंदोलन चला।)
निरंतर = ఎల్లప్పుడు, continuous (ज्ञान का प्रवाह निरंतर चलता रहता है।)
निश्चय = సంకల్పము, decision (दृढ़ निश्चय करने वाले पीछे मुडकर नहीं देखते।)
नियुक्ति = నియామకము, appointment (सरकार अध्यापकों की नियुक्ति करती है।)
नगरपालिका= మున్సిపాలిటీ, municipality (आंध्र प्रदेश में कई नगरपालिकाएँ हैं।)
पहचान = గుర్తింపు, recognition (वोटर कार्ड हमारा पहचान पत्र है।)
पिघलना = కరుగుట, melting (हिमालय का पिघलना जारी है।)
पूर्वज = పూర్వీకులు, forefather (हमारे पूर्वज महान हैं।)
प्रदूषण = కాలుష్యము, pollution (प्रदूषण से पर्यावरण बिगड़ता जा रहा है।)
परिवर्तन = మార్పు, change (समाज में परिवर्तन की आवश्यकता है।)
परंतु = కాని, but (वह मेहनत कर सकता है, परंतु आलसी है।)

AP Board 9th Class Hindi शब्दकोश

प्रफुल्लित = సంతోషించుట, happy (रवि अपने मित्र को देखकर प्रफुल्लित हो उठा।)
प्रेरणा = ప్రేరణ, inspiration (मनुष्य का आत्मविश्वास ही उसकी सच्ची प्रेरणा है।)
परवाह = లక్ష్యపెట్టుట, to concern (हमें हर किसी की परवाह करनी चाहिए।)
प्रयास = ప్రయత్నము, effort (हमें सदा प्रयास करना चाहिए।)
पक्षपात = పక్షపాతము, partiality (हमें किसी के साथ पक्षपात नहीं करना चाहिए।)
परसो = ఎల్లుండి, after tomorrow (मेरा मित्र परसों विजयवाड़ा जाने वाला है।)
प्याला = పాత్ర, cup (मेज पर गरम चाय का प्याला है।)
प्यास = దప్పిక, thirst (गर्मियों में ज़्यादा प्यास लगती है।)
पीढ़ी = తరము, generation (हर पीढ़ी को पर्यावरण की रक्षा करनी चाहिए।)
प्रशासन = కార్యనిర్వహణ, administration (अच्छे प्रशासन की ज़िम्मेदारी सरकार पर होती है।)
पैगाम = సందేశము, a message (संसार के सभी धर्म शांति का पैगाम फैलाते हैं।)
प्रामाणिक = అధికారపూర్వకమైన, authentic (प्रमाण पत्र प्रामाणिक होना चाहिए।)
फुदकना = ఎగురుట, to hop (चिड़िया का फुदकना अच्छा लगता है।)
फँसना = చిక్కుకొనుట, to be entrapped (हमें बुरी आदतों में नहीं फँसना चाहिए।)
फर्ज = బాధ్యత, కర్తవ్యం, obligation, duty (हमें अपना फर्ज़ निभाना चाहिए।)
बढ़ोतरी = వృద్ధి, progress (जनसंख्या में बढ़ोतरी होती जा रही है।)
बदलाव = మార్పు, change (समय के साथ मनुष्य में बदलाव आते रहते हैं।)
बेहोश = స్పృహ కోల్పోవుట, unconscious (लड़का कमज़ोरी के कारण बेहोश होकर गिर पड़ा।)
बाँध = ఆనకట్ట, dam (नागार्जुनसागर बड़ा बाँध है।)
बढ़िया = చాలా గొప్పది, excellent (परीक्षा में अच्छे अंक लाना बढ़िया बात है।)
भेंट = కానుక, gift (भक्त भगवान को भेंट चढ़ाते हैं।)
भाँति = ఇలా, వలె, like (रामू विद्रोह की भाँति विचार करने लगा।)
भाईचारा = సౌభ్రాతృత్వము, brotherhood (भारत में सभी धर्मावलंबी भाईचारे से रहते हैं।)
माँग = కోరిక, demand (किसान बीज और खाद की माँग कर रहे हैं।)

AP Board 9th Class Hindi शब्दकोश

मुलाकात = కలయిక, meeting (प्रधानमंत्री ने राष्ट्रपति से मुलाकात की।)
मासूम = అమాయకపు, innocent (छोटे बच्चे मासूम होते हैं।)
मजबूर = వివశుడైన, helpless (हमें किसी को मजबूर नहीं करना चाहिए।)
मतलब = ఉద్దేశము, purpose (अपने मतलब के लिए दूसरों का बुरा मत कीजिए।)
मुग्ध = ముగ్ధుడగుట, fascinate (संगीत मंत्र मुग्ध करता है।)
मृदुल = సున్నితము, smooth (मृदुल भाव हृदय को छू जाते हैं।)
मछुआरा = మత్స్యకారుడు, fisherman (मछुआरा मछली पकड़ता है।)
माप-तोल = తూనికలు, కొలతలు, weight & measurements (वस्तु लेने से पहले माप – तोल लेना चाहिए।)
राजनैतिक = రాజనైతిక, political (भारत – पाक की सीमा राजनैतिक विषय है।)
यशस्वी = కీర్తి గలవాడు, glorious (भारत के महापुरुष यशस्वी हैं।)
रोज़ा = ఉపవాసము, fasting (रमज़ान के महीने में रोज़ा का विधान है।)
लुप्त = అదృశ్యమైపోవుట, disappeared (गिद्ध लुप्त होते जा रहे हैं।)
लज्जित = సిగ్గుపడిన, shamed (हमें लज्जित होने वाला काम नहीं करना चाहिए।)
लालच = దురాశ, greediness (लालच बुरी बात है।)
सिर्फ़ = కేవలం, only (सिर्फ़ परिश्रम से ही सफलता संभव है।)
वलयित = చుట్టుముట్టబడి ఉన్న, ringed (भारत तीनों ओर सागर से वलयित है।)
व्यवस्था = ఏర్పాటు, system (भारत में चुनाव की व्यवस्था प्रशंसनीय है।)
शिकायत = ఫిర్యాదు, complaint (दूसरों पर शिकायत न करें।)

AP Board 9th Class Social Solutions Chapter 21 మానవహక్కులు, ప్రాథమిక హక్కులు

SCERT AP 9th Class Social Studies Guide Pdf 21th Lesson మానవహక్కులు, ప్రాథమిక హక్కులు Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Social Solutions 21st Lesson మానవహక్కులు, ప్రాథమిక హక్కులు

9th Class Social Studies 21st Lesson మానవహక్కులు, ప్రాథమిక హక్కులు Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
1. కింద పేర్కొన్న వాటిలో ఏది ప్రాథమిక హక్కులలో భాగం కాదు? (AS1)
అ) బీహార్ కార్మికులు పంజాబ్ కి వెళ్ళి అక్కడ పనిచేయడం.
ఆ) అల్పసంఖ్యాక మత వర్గం బడులు నడపటం.
ఇ) ప్రభుత్వ ఉద్యోగాలలో స్త్రీ, పురుషులకు ఒకే జీతం లభించటం.
ఈ) తల్లిదండ్రుల ఆస్తి పిల్లలకు సంక్రమించటం.
జవాబు:
(ఈ) తల్లిదండ్రుల ఆస్తి పిల్లలకు సంక్రమించటం.

ప్రశ్న 2.
కింద పేర్కొన్న వాటిల్లో ఏ స్వేచ్ఛ భారత పౌరులకు లేదు? (AS1)
అ) ప్రభుత్వాన్ని విమర్శించే స్వేచ్ఛ.
ఆ) సాయుధ విప్లవంలో పాల్గొనే స్వేచ్ఛ.
ఇ) ప్రభుత్వాన్ని మార్చే ఉద్యమాన్ని చేపట్టే స్వేచ్ఛ.
ఈ) రాజ్యాంగ మౌళిక విలువలను వ్యతిరేకించే స్వేచ్ఛ.
జవాబు:
(ఆ) సాయుధ విప్లవంలో పాల్గొనే స్వేచ్ఛ.

AP Board 9th Class Social Solutions Chapter 21 మానవహక్కులు, ప్రాథమిక హక్కులు

ప్రశ్న 3.
ప్రజాస్వామ్యం, హక్కులకు మధ్యగల సంబంధాల గురించి కింద పేర్కొన్న వాటిల్లో ఏది సరైనది? మీ ఎంపికకు కారణాలు పేర్కొనండి.
అ) ప్రజాస్వామికమైన ప్రతిదేశం తన పౌరులకు హక్కులను ఇస్తుంది.
ఆ) పౌరులకు హక్కులు ఇచ్చే ప్రతి దేశం ప్రజాస్వామిక దేశం అవుతుంది.
ఇ) హక్కులు ఇవ్వటం మంచిదే, కాని ప్రజాస్వామ్యానికి అవి తప్పనిసరి కాదు. (AS1)
జవాబు:
ప్రజాస్వామికమైన ప్రతి దేశం తన పౌరులకు హక్కులను ఇస్తుంది :
మనదేశం శతాబ్దాల పాటు, రాజులు, రాణుల పాలనలో ఉండగా, బ్రిటిష్ పరిపాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసి, దేశ భవిష్యత్, ప్రభుత్వం రాచరిక పాలనలో కాకుండా ప్రజాస్వామిక దేశంగా ఉండాలని కోరుకున్నాం. ప్రజలు తమకు తాము పరిపాలించుకోవాలని నిర్ణయం మొదట తీసుకున్నాం. రాజ్యాంగంలో సర్వసత్తాక, గణతంత్ర దేశంగా ఉండాలని, న్యాయం, సమానత్వం, స్వేచ్ఛ పౌరులందరికీ అందించబడింది. ప్రజాస్వామ్యంలో భాగాలే పౌరులకు కల్పించే హక్కులు: ప్రజాస్వామ్య ఫలాలు అనుభవించడానికి పౌరులకు అందించే హక్కులు మార్గదర్శకాలు. ప్రజాస్వామ్యంలో ఇతరులు తమ హక్కులను అనుభవించనిచ్చే స్వేచ్ఛ, రాజ్యాంగం కల్పించింది. కాబట్టి ప్రజాస్వామికమైన ప్రతి దేశం తన పౌరులకు హక్కులను ఇస్తుంది.

ప్రశ్న 4.
స్వాతంత్ర్యపు హక్కుకు దిగువ పేర్కొన్న పరిమితులు విధించటం సరైనదేనా? మీ సమాధానాలకు కారణాలు ఇవ్వండి.
అ) భద్రత దృష్ట్యా దేశంలోని కొన్ని సరిహద్దు ప్రాంతాలను సందర్శించటానికి భారతీయ పౌరులకు అనుమతి కావాలి.
ఆ) స్థానిక ప్రజల ప్రయోజనాలను కాపాడటానికి కొన్ని ప్రాంతాలలో బయటవాళ్ళు ఆస్తులు కొనటాన్ని నిషేధించారు.
ఇ) రాబోయే ఎన్నికలలో అధికారంలో ఉన్న పార్టీ విజయావకాశాలను దెబ్బతీసే పుస్తక ప్రచురణను ప్రభుత్వం నిషేధించింది. (AS2)
జవాబు:
అ) భద్రత దృష్ట్యా దేశంలోని కొన్ని సరిహద్దు ప్రాంతాలను సందర్శించటానికి భారతీయ పౌరులకు అనుమతి కావాలి :
స్వాతంత్ర్యపు హక్కులో భాగంగా ప్రజా ప్రయోజనాల దృష్యా, భద్రత దృష్యా దేశంలోని కొన్ని సరిహద్దు ప్రాంతాలను సందర్శించటానికి భారతీయ పౌరులకు అనుమతి లేదు. కొన్ని సరిహద్దు ప్రాంతాలలో స్వేచ్ఛా సంచారం వల్ల దేశ భద్రతకు ముప్పు వాటిల్లే క్రమంలో పౌరులు సంచరించే వీలులేదు. సరిహద్దు ప్రాంతాలలో ఇరు ప్రాంతాలు, దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఎదురవ్వవచ్చు. అటువంటి సమయాలలో ప్రజలు సంచరిస్తే వారి ప్రాణాలకు ముప్పు వాటిల్లే పరిస్థితులు ఎదురవ్వవచ్చు. కాబట్టి సరిహద్దు ప్రాంతాలను సందర్శించటానికి భారతీయ పౌరులకు అనుమతిలేదు.

ఆ) స్థానిక ప్రజల ప్రయోజనాలను కాపాడటానికి కొన్ని ప్రాంతాలలో బయటవాళ్ళు ఆస్తులు కొనటాన్ని నిషేధించారు :
స్థానిక ప్రజల ప్రయోజనాలను కాపాడటానికి కొన్ని ప్రాంతాలలో బయటవాళ్ళు ఆస్తులు కొనవచ్చును. అయితే ప్రజా ప్రయోజనాల దృష్ట్యా, అనైతికమైన, ప్రమాదకరమైన వ్యాపారం చేపట్టరాదు. రాజ్యాంగం పౌరులకు ఏ వృత్తి అయినా, ఉపాధి, వాణిజ్యం ఏ ప్రాంతంలోనైనా చేపట్టవచ్చు. అయితే చేసే వ్యాపారం వల్ల ఇతరులకు ఇబ్బంది, అన్యాయం, అక్రమాలు చోటు చేసుకోకూడదు. ఆస్తులు (కొనాలన్నా, అమ్మాలన్నా) ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం క్రయ విక్రయాలు జరగాలి.

ఇ) రాబోయే ఎన్నికలలో అధికారంలో ఉన్న పార్టీ విజయావకాశాలను దెబ్బతీసే పుస్తక ప్రచురణను ప్రభుత్వం నిషేధించింది :
భారత రాజ్యాంగం స్వాతంత్ర్యపు హక్కు ద్వారా వాక్ స్వాతంత్ర్యం, భావ ప్రకటన స్వేచ్ఛలకు అనుగుణంగా వివిధ ప్రచురణలకు, భావ వ్యక్తీకరణలకు అవకాశం కల్పించింది. తమ భావాలను, అభిప్రాయాలను, వాస్తవ విషయాలను పత్రికలు, ప్రచురణలు ద్వారా పాఠక లోకానికి తెలియజేయవచ్చు. అయితే ఆ ప్రచురణలో వ్యక్తిగత దూషణలు, అవాస్తవాలు, అబద్ధపు ప్రచారాలు చేయకూడదు. ఒకవేళ ప్రచురణకు పూనుకుంటే దానికి తగిన రుజువులు, సాక్ష్యాలు పొందుపరచవలసి ఉంటుంది.

ప్రశ్న 5.
ఈ అధ్యాయం, గత అధ్యాయం చూసి రాజ్యాంగం ఇచ్చిన ఆరు ప్రాథమిక హక్కుల జాబితాను తయారుచేయండి. (AS1)
జవాబు:
భారత రాజ్యాంగంలోని 3వ భాగంలో ప్రాథమిక హక్కులను పేర్కొన్నారు. అణచివేతకు పాల్పడే ప్రభుత్వాల నుంచి ప్రజలకు ఈ హక్కులు రక్షణనిస్తాయి. వీటిని కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఈ హక్కులు ఉల్లంఘించ బడినప్పుడు అత్యున్నత న్యాయస్థానాల ద్వారా రక్షణ పొందవచ్చును. ప్రాథమిక హక్కులు 6. అవి :

  1. సమానత్వపు హక్కు
  2. స్వాతంత్ర్యపు హక్కు
  3. మత స్వాతంత్ర్యపు హక్కు
  4. పీడనాన్ని నిరోధించే హక్కు
  5. సాంస్కృతిక, విద్యావిషయక హక్కు
  6. రాజ్యాంగ పరిహారపు హక్కు.

AP Board 9th Class Social Solutions Chapter 21 మానవహక్కులు, ప్రాథమిక హక్కులు

ప్రశ్న 6.
కింద పేర్కొన్న వాటిల్లో ప్రాథమిక హక్కులు ఉల్లంఘింపబడుతున్నాయా? అలా అయితే ఏ హక్కు లేదా హక్కులు – ఉల్లంఘింపబడుతున్నాయి? తరగతిలో మీ తోటి విద్యార్థులతో చర్చించండి. (AS1)
అ) ఏ చట్టాన్ని అతిక్రమించారో చెప్పకుండా ఒక వ్యక్తిని నాలుగు రోజులపాటు పోలీస్ స్టేషనులో ఉంచారు.
ఆ) నీ ఆస్తిలో కొంతభాగం తనదని పక్క వ్యక్తి పేర్కొనటం.
ఇ) మీ తల్లిదండ్రులు నిన్ను బడికి వెళ్ళనివ్వటం లేదు. నీకు ఆహారర్ సరిగా పెట్టలేకపోతున్నారు కాబట్టి నిన్ను అగ్గిపెట్టెల కర్మాగారంలో పనిచేయటానికి పంపిస్తున్నారు.
ఈ) మీ తండ్రి నుంచి వారసత్వంగా నువ్వు పొందిన ఆస్తిని నీ సోదరుడు నీకు ఇవ్వటానికి నిరాకరిస్తున్నాడు.
జవాబు:
అ) ఏ చట్టాన్ని అతిక్రమించారో చెప్పకుండా ఒక వ్యక్తిని నాలుగు రోజులపాటు పోలీస్ స్టేషన్లో, ఉంచారు :
చట్టాలు అందరికీ ఆ వ్యక్తి ఆదాయం , హోదా, నేపథ్యం వంటి వాటితో సంబంధం లేకుండా వర్తిస్తాయి. చట్టరక్షణ సమానంగా వర్తిస్తుంది. అయితే చట్ట అతిక్రమణ జరిగినట్లు తెలిస్తే, ఫిర్యాదులు వస్తే, వాటికి సంబంధించిన వ్యక్తులకు ముందుగా తెలియజేసి అరెస్టు చేసి పోలీసు స్టేషన్లో ఉంచవచ్చు. కాని 24 గంటలలోపు ఆ వ్యక్తులను కోర్టులకు అప్పగించాలి. అంతేగాని నేరం రుజువు కాకుండా, 4 రోజులు పోలీసుస్టేషన్లో ఉంచడం చట్టరీత్యా నేరం. అ కారణంగా అరెస్టు చేస్తే ఆ వ్యక్తి తను ఎంచుకున్న లాయర్ ద్వారా వాదించే హక్కు ఉంది.

ఆ) నీ ఆస్తిలో కొంతభాగం తనదని పక్క వ్యక్తి పేర్కొనటం :
ప్రజాస్వామ్యం పౌరులకు ప్రాథమిక హక్కులు అందించింది. వాటిని సక్రమంగా, హుందాగా అనుభవించాలని, అవసరమైతే చట్టాలు, న్యాయస్థానాలు ద్వారా లబ్ధిపొందాలని రాజ్యాంగం తలచింది. అయితే ఏ వ్యక్తి కూడా దురాక్రమణ పూర్వకంగా, ఇతరుల ఆస్తులను, సంపదలను ఆక్రమించటానికి అవకాశం లేదు. తాత తండ్రుల నుండి పౌరులు సంపాదించిన ఆస్తులకు సంబంధించి, రిజిష్టర్డ్ ‘ దస్త్రాలు, రుజువు పత్రాలు ఉంటాయి. వాటిని కాదని ఆస్తిలో సగభాగం తనదని ఆక్రమించుకోవటం చట్టరీత్యా నేరం. అటువంటి సందర్భాలలో న్యాయస్థానాలు కఠినంగా శిక్షిస్తాయి.

ఇ) మీ తల్లిదండ్రులు నిన్ను బడికి వెళ్ళనివ్వటం లేదు. నీకు ఆహారం సరిగా పెట్టలేకపోతున్నారు కాబట్టి నిన్ను అగ్గిపెట్టెల కర్మాగారంలో పని చేయటానికి పంపిస్తున్నారు.
2002లో జీవించే హక్కులో విద్యా హక్కు భాగమైంది. దీని ప్రకారం 6 నుండి 14 సంవత్సరాల వయసు పిల్లలకు ప్రభుత్వం ఉచిత, నిర్భంద విద్యను అందించాలి. తమ పిల్లలు క్రమం తప్పకుండా బడికి హాజరు అయ్యేలా చూసే బాధ్యత తల్లిదండ్రులది. తల్లిదండ్రులు వివిధ వృత్తులు, ఉపాధి అవకాశాలు అందుకొని, పిల్లలను పెంచి పోషించి తగిన ఆహారాన్ని అందించే బాధ్యత కూడా తల్లిదండ్రులదే. 14 సం||ల లోపు బాలలను కర్మాగారాలు, గనులు, అగ్గిపెట్టెలు, టపాకాయలు, అద్దకం వంటి ప్రమాదకరమైన పనులలో పెట్టడం నేరం. అలా చేస్తే తల్లిదండ్రులకు కూడా చట్టరీత్యా శిక్షలు అమలుచేస్తారు.

ఈ) మీ తండ్రి నుంచి వారసత్వంగా నువ్వు పొందిన ఆస్తిని నీ సోదరుడు నీకు ఇవ్వటానికి నిరాకరిస్తున్నాడు.
ప్రాథమిక హక్కుల జాబితా నుండి ఆస్తి హక్కును భారత రాజ్యాంగం తొలగించింది. అయితే ఆస్తి పంపకం విషయంలో తల్లిదండ్రుల ఆస్తులకు సంబంధించి, రుజువు పత్రాలు, అన్నదమ్ముల మధ్య ఆస్తి పంపకాలకు సంబంధించి, పెద్ద మనుషుల ఒప్పందాలు చాలా ముఖ్యం. తండ్రి నుంచి వారసత్వంగా పొందిన ఆస్తిని నీ సోదరుడు ఇవ్వటానికి నిరాకరిస్తే, న్యాయస్థానాలను ఆశ్రయించి, వాటి ద్వారా వారికి రావలసిన ఆస్తి వాటాను పొందవచ్చును.

ప్రశ్న 7.
మీరు ఒక న్యాయవాది అనుకోండి. కొంతమంది ప్రజలు దిగువ పేర్కొన్న విన్నపంతో మీ దగ్గరకు వచ్చారు. వాళ్ళ తరఫున మీరు ఏవిధంగా వాదిస్తారు?
“ఎగువన ఉన్న కర్మాగారాల వల్ల మా ప్రాంతంలోని నదీజలాలు బాగా కలుషితం అవుతున్నాయి. మాకు మంచినీళ్ళు ఈ నది నుంచే వస్తాయి. ఈ నీళ్ళు కలుషితం కావటం వల్ల మా ఊరి ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. మేం ప్రభుత్వానికి ఫిర్యాదు . చేశాం. కాని వాళ్ళు ఎటువంటి చర్య తీసుకోలేదు. ఇది ఖచ్చితంగా మా ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే.” (AS4)
జవాబు:
భారత రాజ్యాంగం ప్రకారం భారతదేశంలో ఎక్కడైనా సుఖంగా నివసించటానికి, ఆనందంగా బ్రతకడానికి, స్థిరపడడానికి హక్కుంది. తను జీవనం సాగించే ప్రదేశంలో తనకు నష్టం కలిగించే చర్యలు, అపాయం, హానికరం కలిగించే కార్యక్రమాలు ఎవరూ చేపట్టకూడదు. కర్మాగారాలు విడిచే హానికరమైన వ్యర్థాలు ద్వారా నదీజలాలు కలుషితమయ్యి, ప్రమాదకరమైన జబ్బులు, ప్రాణాపాయం కలగవచ్చు. తద్వారా మనిషి జీవనం దుర్భరమౌతుంది. అటువంటి సందర్భాలలో వ్యక్తులకు న్యాయస్థానాల ద్వారా, చట్టాల ద్వారా రక్షణ కల్పించాలి.

ఇటువంటి సమస్యలు ఎదురైనప్పుడు స్థానిక పోలీసులు కేసులు నమోదు చేస్తారు. కర్మాగారాల యజమానులను అరెస్టులు చేస్తారు. దానికి నివారణా చర్యలు, ప్రతి చర్యలు ద్వారా, ఈ కలుషితాలను దూరం చేయడానికి ప్రయత్నిస్తారు. .. అవసరమైతే బాధిత కుటుంబాలకు నష్టపరిహారం అందించుటకు కృషి చేస్తాను. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా న్యాయస్థానాల ద్వారా ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేయడానికి ప్రయత్నిస్తాను.

ప్రశ్న 8.
“బిరుదుల రద్దు” అన్న శీర్షిక కింద ఉన్న వాక్యాలను చదివి ఈ ప్రశ్నకు సమాధానమివ్వండి.
ఈ బహుమతులు పొందిన వ్యక్తి దానిని బిరుదుగా ఉపయోగించుకోకూడదు. ఎందుకు? (AS2)
జవాబు:
రాచరిక వర్గాన్ని, బూర్జువాలను ఇష్టమొచ్చినట్లు, అసమానంగా విభజించటాన్ని తొలగిస్తూ భారత ప్రభుత్వం ఎటువంటి బిరుదులు ఇవ్వకుండా రాజ్యాంగం నిషేధం విధించింది. భారతదేశ పౌరులు ఇతర దేశాల బిరుదులను తీసుకోకూడదు. అయితే భారతదేశ పౌరులు సైనిక, పౌర పతకాలు పొందవచ్చు. భారతరత్న, పరమవీరచక్ర, పద్మవిభూషణ్ వంటి పతకాలు పొందిన వాళ్ళు వాటిని బిరుదుగా ఉపయోగించుకోకూడదు. కాబట్టి, ఇవి రాజ్యాంగ నిషేధ పరిధిలోకి రావు.

AP Board 9th Class Social Solutions Chapter 21 మానవహక్కులు, ప్రాథమిక హక్కులు

ప్రశ్న 9.
మీకు తెలిసిన ఒక హక్కుల ఉల్లంఘన సందర్భాన్ని విశ్లేషించండి. (AS6)
జవాబు:
రాజ్యాంగం మనకు అందించిన అద్భుతమైన గొప్ప అవకాశం ప్రాథమిక హక్కుల కల్పన. అయితే ఇటీవల సమానత్వపు హక్కులో భాగంగా అస్పృశ్యత నిషేధం (అంటరానితనాన్ని) రాజ్యాంగం నిర్ద్వంద్వంగా రద్దు పరిచింది. ఎవరైనా అస్పృశ్యతను పాటిస్తే నేరం అవుతుంది. అందుకు పాల్పడిన వాళ్లు చట్టరీత్యా శిక్షార్హులు. జైలుశిక్ష కూడా పడుతుంది. కాని ఇటీవల గ్రామీణ ప్రాంతాలలో అంటరానితనం కొన్ని సందర్భాలలో మేం గమనిస్తున్నాం. గ్రామాలలో టీక్లబ్ వద్ద రెండు గ్లాసుల పద్ధతి అమలులో ఉంది. అంతేకాకుండా హరిజన కాలనీలు, గిరిజన కాలనీలని గ్రామాలకు దూరంగా ఇండ్లను కడుతున్నారు. – అదే విధంగా స్వాతంత్రపు హక్కులో భాగంగా జీవించే హక్కు ముఖ్యమైనది. జీవించే హక్కులో 2002లో విద్యాహక్కు కూడా భాగమైంది. దీని ప్రకారం 6-14 సంవత్సరాల పిల్లలకు ఉచిత నిర్బంధ విద్యను అమలు చేయాలి. కాని ప్రయివేట్ పాఠశాలలు నిబంధనలను ఉల్లంఘిస్తూ, అధిక ఫీజులు, భరించలేని శిక్షలు, ప్రభుత్వ సూచనలు పట్టించుకోని యాజమాన్యం, అధిక ఒత్తిడితో బాల్యాన్ని నాశనం చేస్తున్నారు. ఇలా నేను హక్కుల ఉల్లంఘనలను గమనిస్తున్నాను.

9th Class Social Studies 21st Lesson మానవహక్కులు, ప్రాథమిక హక్కులు InText Questions and Answers

9th Class Social Textbook Page No.255

ప్రశ్న 1.
గత సంవత్సరం మీరు చదివిన రాజ్యాంగ పీఠికలోని ముఖ్యమైన కొన్ని అంశాలను రాయండి.
జవాబు:
స్వాతంత్ర్య పోరాటానికి స్ఫూర్తినిచ్చి, మార్గదర్శకంగా నిలిచిన విలువలే భారతదేశ ప్రజాస్వామ్యానికి పునాదిగా నిలిచాయి. ఈ విలువలు భారత రాజ్యాంగ “పీఠిక”లో పొందుపరిచి ఉన్నాయి. రాజ్యాంగ ఉద్దేశాలను, మౌళిక సూత్రాలను ఈ పీఠిక తెలియజేస్తుంది. “భారతదేశ ప్రజలమైన మేము భారతదేశాన్ని గణతంత్రంగా ఏర్పాటు చేయటానికి తీర్మానించి దేశ ప్రజలందరికీ న్యాయం, స్వేచ్ఛ, సమానత, సౌభ్రాతృత్వం ఇస్తూ మాకు మేం ఈ రాజ్యాంగాన్ని ఇచ్చుకుంటున్నాం.”

9th Class Social Textbook Page No.259

ప్రశ్న 2.
ఏ రకమైన సమానత్వపు హక్కులకు రాజ్యాంగం హామీ ఇస్తోంది? ఉదాహరణలు ఇవ్వండి.
జవాబు:
భారత రాజ్యాంగం సమానత్వానికి హక్కు ఇస్తోంది. ఇందులో ఉన్న ముఖ్యమైన హక్కులు :

1. చట్టరక్షణలో సమానత్వం : ఉదా : చట్టరక్షణ సమానంగా లభిస్తుంది. భారతీయ పౌరుల కులం, వర్ణం, లింగ, మతం, హోదా వంటి వాటికి ప్రాధాన్యత లేదు. వివక్షత చూపరాదు. తప్పు చేస్తే ప్రధానమంత్రి అయినా శిక్షార్హుడే.

2. సామాజిక సమానత్వం : ఉదా : పౌరులు, దుకాణాలు, రెస్టారెంట్లు, బావులు, చెరువులు, రహదారులు మరియు ప్రభుత్వం అందించు సదుపాయాలు ఉపయోగించుకోవడానికి అడ్డులేదు.

3. అవకాశాలలో సమానత్వం : ఉదా : మతం, జాతి, కులం, లింగ, వారసత్వం, జన్మస్థానం, నివాస స్థానం కారణంగా ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హులు కాకూడదు. వివక్షతకు గురి కాకూడదు.

4. అస్పృశ్యత నిషేధం : ఉదా : అంటరానివాళ్ళుగా ఎవరినీ పరిగణించరాదు.

5. బిరుదులు రద్దు : ఉదా : రాచరికపు బిరుదులను రాజ్యాంగం నిషేధించింది.

AP Board 9th Class Social Solutions Chapter 21 మానవహక్కులు, ప్రాథమిక హక్కులు

ప్రశ్న 3.
సమానత్వపు ప్రాథమిక హక్కును కింద పేర్కొన్నవి ఉల్లంఘిస్తున్నాయేమో చర్చించండి. ఇలా చేయటం రాజ్యాంగ రీత్యా సరైనదో, కాదో చర్చించండి.
– వీధిలోని నల్లా (కుళాయి) నుండి నీళ్ళు పట్టుకుంటున్నప్పుడు మరొక వ్యక్తి కుండ తనక కుండకు తగిలిందని ఒక వ్యక్తి గొడవ పెట్టుకున్నాడు.
– కొన్ని ప్రత్యేక కులాలకు చెందిన వారనే నెపంతో కొందరు పిల్లలను పాఠశాలల్లో మంచినీళ్లు ఇతరులకు పోయనివ్వరు.
– కొన్ని వర్గాల ప్రజలను ఊరిలో కాకుండా ఊరిబయట మాత్రమే ఉండడానికి అనుమతిస్తారు.
– ప్రార్థనా స్థలాలకు వెళితే తమను అవమానిస్తారనీ, లేదా కొడతారనీ చాలా సమూహాల ప్రజలు అక్కడకు వెళ్ళరు.
జవాబు:
సమానత్వపు ప్రాథమిక హక్కులో భాగంగా అస్పృశ్యత నిషేధం పొందుపరిచారు. ఏ రూపంలోనైనా అంటరాని తనాన్ని రాజ్యాంగం రద్దు పరిచింది. అస్పృశ్యతను ఎవరైనా పాటిస్తే వారు చట్టరీత్యా శిక్షార్హులు. వారికి జైలు శిక్ష కూడా పడవచ్చు. వీధులలో పబ్లిక్ కుళాయిలలో కులమతాలకు అతీతంగా నీటిని పొందవచ్చు. అక్కడ కులం ఆధారంగా వివక్షత చూపిస్తే, ఫిర్యాదు చేస్తే చట్టరీత్యా నేరం. చాలా గ్రామాలలో కొన్ని వర్గాల ప్రజలను అంటరాని వాళ్ళుగా, తక్కువ కులాల వారిగా పరిగణించి, ఊరిలోకి రానీయకపోయినా, ఊరి బయట బహిష్కరణకు గురిచేసినా తీవ్ర శిక్షకు గురౌతారు. అంతేకాకుండా మన రాజ్యాంగం లౌకికతత్వానికి ప్రాధాన్యతనిస్తూ, అన్ని మతాలను, కులాలను సమానంగా చూస్తూ, అన్ని మతాలను గౌరవిస్తుంది. కాని కొన్ని ప్రాంతాలలో, కొన్ని దేవాలయాలకు కొంతమందిని అనుమతించకపోవడం, ప్రవేశం నిషేధించడం చట్టరీత్యా నేరం. అటువంటి సంఘటనలు జరిగినచో వారు ఫిర్యాదు చేస్తే దోషులను కఠినంగా శిక్షించడం జరుగుతుంది.

ప్రశ్న 4.
రాజ్యాంగంలో సమానత్వపు ప్రాథమిక హక్కు లేకపోతే ఏమవుతుంది? చర్చించండి.
జవాబు:
రాజ్యాంగం ద్వారా సమానత్వపు ప్రాథమిక హక్కు లేకపోతే సమన్యాయపాలన దెబ్బతింటుంది. చట్టరక్షణ సమానంగా లభించదు. అస్పృశ్యత అధికమౌతుంది. సంపన్నులు, మేధావులే ఉన్నత ఉద్యోగాలు పొందుతారు. అల్పసంఖ్యాకులు, వెనుకబడిన వారికి అవకాశాలు అందవు. దుకాణాలు, రెస్టారెంట్లు, బావులు, చెరువులు, రహదారులు, ప్రభుత్వ సదుపాయాలు అందరికీ అందవు. సామాజిక సాంప్రదాయం దెబ్బతింటుంది. మహిళలు, పిల్లలు, వికలాంగులు, వెనుకబడినవారు అణగదొక్కబడతారు.

9th Class Social Textbook Page No.261

ప్రశ్న 5.
మీ ప్రాంతంలో ఎటువంటి సంఘాలు ఉన్నాయి?
జవాబు:
మా ప్రాంతంలో మహిళా, డ్వాక్రా సంఘాలు, కార్మిక సంఘాలు, యువజన సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, వైద్య సంఘాలు, వ్యాపార సంఘాలు, పెన్షనర్స్ సంఘాలు ఉన్నాయి.

ప్రశ్న 6.
కార్మిక సంఘాలు ఎందుకు ఏర్పడతాయి? అవి ఎదుర్కొనే సమస్యలు ఏమిటి?
జవాబు:
కర్మాగారాలలో కార్మిక సంఘాలు, తమ కోరికల సాధన కొరకు సంఘాలుగా ఏర్పడతాయి. తమ కుటుంబ సభ్యులకు విద్య, వైద్య, ఆరోగ్య సదుపాయాల కొరకు, అధిక మొత్తంలో జీతాలు కొరకు, వసతి సదుపాయాలు కొరకు, ప్రమాదాల కాలంలో జరిగిన నష్టాలకు పరిహారం గూర్చి, కార్మిక సంఘాలు, కర్మాగారాల యజమానుల నుండి లబ్ది పొందడానికి సంఘాల అవసరం ఉంది.

సంఘాలు ఎదుర్కొనే సమస్యలు :

  1. లాకౌట్లు
  2. తక్కువ సదుపాయాలు
  3. ఎక్కువ పనిగంటలు
  4. ఆరోగ్య సమస్యలు
  5. ఆలస్య జీతాలు
  6. యజమానుల నిరంకుశత్వాలు
  7. ఏకపక్ష నిర్ణయాలు
  8. శాశ్వతం కాని ఉద్యోగాలు
  9. నిరంతరం ఇబ్బందులు

AP Board 9th Class Social Solutions Chapter 21 మానవహక్కులు, ప్రాథమిక హక్కులు

ప్రశ్న 7.
ప్రజలు దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్ళి ఎందుకు స్థిరపడాలనుకుంటారు?
జవాబు:

  1. రోజురోజుకూ అంతరించిపోతున్న కులవృత్తులు.
  2. లాభసాటిగా లేని వ్యవసాయ పనులు.
  3. ఉపాధి, అవకాశాలు కల్పించలేని ప్రభుత్వాలు.
  4. గ్రామాలలో లభించే తక్కువ కూలిరేట్లు.
  5. నిరంతరం కరువు కాటకాలు, తుపానులు, వరద బీభత్సాలు.
  6. పట్టణాలలో, నగరాలలో విరివిగా లభించే ఉద్యోగాలు.
  7. తక్కువ పని గంటలు, ఎక్కువ జీతాలు.
  8. నగరాలు, ఇతర ప్రాంతాలలో మెరుగైన విద్య, వైద్య సదుపాయాలు వలన ప్రజలు దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్ళి స్థిరపడాలనుకుంటున్నారు.

ప్రశ్న 8.
పట్టణంలో పని దొరికి, ఉండటానికి సరైన ఇల్లు లేని వాళ్ళపట్ల ప్రభుత్వ బాధ్యత ఏమిటి?
జవాబు:
దేశంలో ప్రజలు ఏ ప్రాంతంలో, ఏ పట్టణంలో, ఏ నగరాలలో నివసిస్తున్నప్పటికీ వారికి సదుపాయాల కల్పన ప్రభుత్వ బాధ్యత. ఎప్పటికప్పుడు వివిధ ఆర్థిక, గణాంక సర్వేల ద్వారా ప్రజలకు అందుతున్న సదుపాయాలు, గృహవసతి, ఆరోగ్యం , విద్య సదుపాయాలు అందించవలసి ఉంది. వివిధ కారణాలతో ఉపాధి అవకాశాలకై పట్టణాలకు వచ్చి స్థిరపడిన వారికి ఇళ్ళు, రాజీవ్ గృహకల్పన ద్వారా వసతి సదుపాయాలు కల్పించాలి. దగ్గరలో గల ప్రభుత్వ అధికారుల ద్వారా వారికి చేయూతనందించాలి.

9th Class Social Textbook Page No.262

ప్రశ్న 9.
కింద పేర్కొన్న వాటిల్లో వాక్ స్వాతంత్ర్య నియంత్రణను దృష్టియందుంచుకొని చర్చ నిర్వహించండి.
1. ఒక కులం ప్రజల భావనలను గాయపరిచే ఉద్దేశంతో ఒక పుస్తకం రాశారు.
2. ప్రతి సినిమాకి విడుదలకు ముందు సెన్సారు బోర్డు నుంచి ఆమోదం పొందాలి.
3. రాత్రి 11 గంటలు దాటిన తరువాత పండుగలు, ప్రార్థనల రోజులలో ఎవరూ మైకు వాడకూడదని న్యాయస్థానం ఆదేశించింది.
జవాబు:
వాక్ స్వాతంత్ర్యం వల్ల వ్యక్తులకు ప్రజా కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం లభిస్తుంది. సమావేశాలు, ప్రచురణలు, నాటకాలు, చిత్రలేఖనం వంటి వివిధ రూపాల ద్వారా తమ అభిప్రాయాలను వ్యక్తపరచవచ్చు. వాక్ స్వాతంత్ర్యం పరిమితమైన హక్కు. శాంతిభద్రతలు, ప్రభుత్వ భద్రత, నైతికత, ప్రజాహితం వంటి కారణాలతో ఈ హక్కుకు పరిమితులున్నాయి. వాక్ స్వాతంత్ర్యం ద్వారా ఒక కులాన్ని గాని, మతాన్ని గాని కించపరిచే వ్యాఖ్యలు, ప్రచురణలు చేయకూడదు. ఒకరి కుల సాంప్రదాయాలను, ఆచారాలను వక్రీకరించకూడదు. ఒకరి కుల మనోభావాలను కించపరచకూడదు. అవమాన పరచకూడదు మరియు ప్రజల శాంతిభద్రతలకు, వారి సుఖజీవనానికి ఆటంకం కలిగించకూడదు. రాత్రి 11 గంటల వరకు మాత్రమే ప్రచారం చేసుకోవడానికి, సమావేశాలు, సభలు, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు న్యాయస్థానాలు అనుమతి ఉంటుంది. మన వాక్ స్వాతంత్ర్యం మిగతా వారికి ఇబ్బందుల నుండి రక్షణకు కాల నిర్ణయం విధించారు.

సినిమాలు ప్రజలను, సమాజాన్ని, సక్రమ మార్గంలో నడిపించడానికి మార్గదర్శకాలు. “సినిమా” అనేది అనుకరణ మాధ్యమం. ఈ సినిమా మాధ్యమం ద్వారా, పిల్లలను, మహిళలను, ఉద్యోగస్థులను, కుల, మతాలను కించపరిచే సన్నివేశాలు, చిత్రాలు, పాటలు, మాటలు ఉండకూడదు. దాని ఫలితంగా సమాజంలో చెడు ఫలితాలు కలుగుతాయి. కాబట్టి దానిని దృష్టిలో ఉంచుకొని, అశ్లీల దృశ్యాలు, బూతు సాహిత్యం ద్వంద్వార్థ పదాలను సెన్సార్ బోర్డు సినిమా విడుదలకు ముందు పరిశీలించి, సెన్సార్ చేసిన పిమ్మట ఆమోదిస్తూ మంజూరు పత్రం అందిస్తుంది.

ప్రశ్న 10.
ఎనిమిదవ తరగతిలో చదివిన పోలీసులు, న్యాయస్థానాల పాత్రలలో తేడాలు ఏమిటి?
జవాబు:
శాంతిభద్రతల పరిరక్షణ పోలీసుల ప్రధానపాత్ర. నేరాలకు సంబంధించి ఫిర్యాదులు స్వీకరించి, విచారణ చేయడం పోలీసుల కర్తవ్యం. రకరకాల రుజువులు సేకరిస్తారు. సాక్ష్యులను విచారించి విషయాలు నమోదు చేస్తారు. ముందుగా తొలి సమాచార నివేదిక (ఎఫ్.ఐ.ఆర్) తయారుచేస్తారు. సాక్ష్యాలు దోషి అని రుజువు చేస్తుంటే పోలీసులు న్యాయస్థానంలో చార్జిషీటు దాఖలు చేయాలి.

నిందితుడు దోషో, కాదో అని వాదోపవాదాలు సాక్షుల ద్వారా నిర్ధారించుకొని, దోషి అయితే ఏ శిక్ష విధించాలో న్యాయమూర్తులు, లేదా న్యాయవర్గం విధిస్తుంది. హత్య, లంచగొండి తనం, దోపిడీ వంటి నేరాలు మోపబడిన వ్యక్తికి బెయిలు పోలీసులు ఇవ్వరు. బెయిల్ మంజూరు చేయాలో వద్దా నిర్ధారించేది న్యాయమూర్తి. ఒకవేళ బెయిలు మంజూరు చేస్తే కొన్ని హామీలు సమర్పించాలి.

AP Board 9th Class Social Solutions Chapter 21 మానవహక్కులు, ప్రాథమిక హక్కులు

ప్రశ్న 11.
మీ ప్రాంతంలో ఏ ఏ రకాల పాఠశాలలు ఉన్నాయి? ఇన్ని రకాల పాఠశాలలు ఎందుకు ఉన్నాయి?
జవాబు:
మా ప్రాంతంలో ప్రభుత్వ పాఠశాలలు, ప్రయివేట్ పాఠశాలలు, బాలికల పాఠశాలలు, వికలాంగుల పాఠశాలలు, చెవిటి, మూగ పాఠశాలలు, గిరిజన సంక్షేమ పాఠశాలలు, ముస్లిం పాఠశాలలు (ఉర్దూ), ఆంగ్ల పాఠశాలలు ఉన్నాయి. ప్రభుత్వ నిధులతో, ప్రభుత్వం నియమించు ఉపాధ్యాయులతో ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఇందులో ఎక్కువగా సాధారణ, మధ్య తరగతి విద్యార్థులు చదువుతున్నారు. ఈ పాఠశాలలో అనేక రకాల బిల్డింగ్లు, మధ్యాహ్న భోజన పథకాలు, ఉచితంగా బట్టలు, పుస్తకాలు అందించబడుతున్నాయి.

ప్రయివేట్ పాఠశాలలో ఉద్యోగస్తుల పిల్లలు, ఆర్థికస్ధమత గలవారు చదువుతున్నారు. ఇందులో శిక్షణ పొందని ఉపాధ్యాయులు కూడా పనిచేస్తుంటారు. వారికి ప్రభుత్వం అందించు సౌకర్యాలు ఉండవు.

బాలికలు వారి అవసరాలు, వారి జీవన విధానానికి అనుగుణంగా, ప్రత్యేక వాతావరణంలో చదువుకోవడానికిగాను బాలికలకు ప్రత్యేక పాఠశాలలు ఏర్పాటు చేస్తున్నారు.

గిరిజన బాలబాలికల సంక్షేమం కొరకు గిరిజన సంక్షేమ పాఠశాలలు ఏర్పాటు చేశారు.

చెవిటి, మూగ విద్యార్థులు, మామూలు విద్యార్థులతో కలిసి చదువుకోలేరు. కాబట్టి వారికి కొన్ని ప్రత్యేక పరికరాల ద్వారా బోధన చేయాలి. కాబట్టి చెవిటి, మూగ పాఠశాలలున్నాయి. భాషాపరమైన ఇబ్బందులు లేకుండా ఉండడానికి ఉర్దూ పాఠశాలలున్నాయి.

ప్రశ్న 12.
మీ ప్రాంతంలో ఈ రకమైన హక్కులు పిల్లలకు కల్పించబడుతున్నాయని నీవు భావిస్తున్నావా?
జవాబు:
మా ప్రాంతంలో 6-14 సంవత్సరాల వయసు పిల్లలకు ప్రభుత్వం ఉచిత, నిర్భంద విద్యను అందిస్తున్నారు. పిల్లల అవసరాలకు తగ్గట్లు. ఏర్పాటు చేస్తున్నారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యను బోధిస్తున్నారు. క్రమం తప్పకుండా మా తల్లిదండ్రులు బడికి పంపిస్తున్నారు. ఆరోగ్యం, ఆహారం, మధ్యాహ్న భోజన పథకం ద్వారా సమకూరుస్తున్నారు. ప్రమాదకరమైన పనులు చేయించటం లేదు. కర్మాగారాలు, హోటళ్ళు, బీడీ పరిశ్రమలు, అగ్గిపెట్టెల తయారీలో పిల్లలను చేర్చుకోవటం లేదు. మా ప్రాంతంలో బలవంతపు చాకిరీలు నిషేధించబడ్డాయి.

ప్రశ్న 13.
ఉపాధ్యాయుడి సహాయంతో రాష్ట్రంలోని కనీస వేతనాలను తెలుసుకోండి.
జవాబు:
రాష్ట్రంలో స్త్రీ, పురుషులకు, ఉద్యోగస్థులకు, వ్యవసాయ, ఉపాధి హామీ పథకం కూలీలకు వేరువేరుగా వేతనాలు అందిస్తున్నారు.
ఉపాధి హామీ పథకంలో
పురుషులకు – రూ. 200 వరకు (రోజుకు) :
స్త్రీలకు – రూ. 150 వరకు (రోజుకు)
రోజువారి వ్యవసాయ కూలి (పురుషులకి) – రూ. 120 (రోజుకు)
రోజువారి కూలి (స్త్రీలకి) – రూ. 80 (రోజుకు)
తాపీ మేస్త్రీకి (ఇల్లు కట్టే సమయంలో) – రూ. 300 (రోజుకు)
సాయం చేసే స్త్రీలకు – రూ. 130
ఉపాధ్యాయులకు – రూ. 300 నుండి రూ. 2000 వరకు (రోజుకు)
వైద్యులకి (తనిఖీ రుసుం) – రూ. 100 నుండి 300 వరకు (రోజుకు)

9th Class Social Textbook Page No.263

ప్రశ్న 14.
సతీసహగమనాన్ని ఆచరించటం వల్ల ప్రాథమిక హక్కులకు ఏవిధంగా భంగం కలుగుతుంది?
జవాబు:
పౌరులందరూ తమ అంతరాత్మను అనుసరించి ఏ మతాన్ని అయినా అవలంబించే హక్కు కలిగి ఉన్నారు. వ్యక్తిగా తన మత ఆచారాలను పాటించకుండా ఏ వ్యక్తినీ నిషేధించలేరు. అయితే మతం మాటున జరిగే ఘోరాలు, హత్యలను రాజ్యాంగం ప్రకారం అనుమతించరు. బలవంతంగా తమ అభిమతాలకు వ్యతిరేకంగా, ‘సతి’ సహగమనాన్ని ప్రోత్సహించడం, ‘ . మత స్వాతంత్ర్యపు హక్కుకు భంగం కలుగుతుంది. ‘సతి’ సహగమనం లౌకికవాద స్ఫూర్తికి విఘాతం. మతం పేరుతో బలవంతపు చావులను రాజ్యాంగం అనుమతించదు.

AP Board 9th Class Social Solutions Chapter 21 మానవహక్కులు, ప్రాథమిక హక్కులు

ప్రశ్న 15.
ఒక వ్యక్తి అనుకుంటే ఏ మతమూ అవలంబించకుండా ఉండవచ్చా?
జవాబు:
రాజ్యాంగం ప్రకారం ఏ వ్యక్తి అయినా తనకు నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు. ప్రచారం చేసుకోవచ్చు. అదేవిధంగా ఏ వ్యక్తి అయినా తను అనుకుంటే ఏ మతమూ అవలంబించకుండా ఉండవచ్చు.

9th Class Social Textbook Page No.266

ప్రశ్న 16.
మన రాష్ట్రంలో మానవ హక్కుల సంఘం ఉందా? దాని కార్యక్రమాల గురించి తెలుసుకోండి.
జవాబు:
1993లో ఆంధ్రప్రదేశ్ లో మానవ హక్కుల పరిరక్షణ చట్ట నిబంధనల మేరకు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో ఒక చైర్మన్, ఇద్దరు సభ్యులుంటారు. వీరందరినీ రాష్ట్ర గవర్నర్ నియమిస్తారు. వీరిని నియమించే సమయంలో గవర్నర్ ఈ కింది వారిని సంప్రదించాలి.

  1. రాష్ట్ర ముఖ్యమంత్రి, కమిటీకి అధ్యక్షుడు.
  2. రాష్ట్ర విధానసభ స్పీకరు
  3. రాష్ట్ర హోం మంత్రి
  4. రాష్ట్ర విధాన సభ స్పీకర్
  5. రాష్ట్ర విధాన సభ నాయకుడు, ప్రతిపక్ష నాయకుడు

రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ పదవీ కాలం – 5 సం||రాలు
రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ గా రిటైర్డ్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయి ఉండాలి.
మరొక సభ్యుడు మానవ హక్కుల రంగంలో నిష్ణాతుడై ఉండాలి.

రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ అధికార విధానాలు :

  1. మానవ హక్కులు ఉల్లంఘనను నివారించటంలో ప్రభుత్యోద్యోగి విఫలమైనప్పుడు తనంతట తానుగానే లేదా ఫిర్యాదు ఆధారంగా కాని విచారణ జరపడం.
  2. న్యాయస్థానాలు అనుమతితో మానవహక్కుల ఉల్లంఘనకు సంబంధించిన కేసులో కక్షిదారునిగా చేరడం.
  3. జైళ్ళను ఇతర నిర్బంధ గృహాలను సందర్శించి తనిఖీ చేసి అక్కడ ఉన్నవారికి కనీస వసతుల కల్పనపై విచారించి అవసరమైన సూచనలివ్వడం.
  4. మానవ హక్కుల పరిరక్షణలో రాజ్యాంగంలో పొందుపరచిన అంశాలను, చట్టపరమైన నిబంధనలను’ నిరంతరం సమీక్షిస్తూ తగిన సూచనలివ్వడం.

ప్రశ్న 17.
మానవ హక్కులకు ఉల్లంఘనలను కొన్నింటిని పేర్కొనండి.
జవాబు:

  1. పోలీసుల వేధింపులు
  2. ఇష్టమొచ్చినట్లు అరెస్టు చేయటం
  3. సమాచార హక్కును తిరస్కరించటం
  4. అవినీతి
  5. మహిళలపై లైంగిక వేధింపులు
  6. అత్యాచారాలు
  7. నేర విచారణలో ఆలస్యం
  8. స్త్రీ, శిశు హత్య
  9. డబ్బుకోసం కిడ్నాపింగ్
  10. మహిళలు, పిల్లలు, అట్టడుగు ప్రజల దారుణ జీవన పరిస్థితులు
  11. కుటుంబంలో మహిళల పట్ల వివక్షత
  12. ఇంటి పని చేసేవాళ్ళ పై హింస వంటివి మానవ హక్కుల ఉల్లంఘనలకు కొన్ని ఉదాహరణలు.

AP Board 9th Class Social Solutions Chapter 21 మానవహక్కులు, ప్రాథమిక హక్కులు

ప్రశ్న 18.
మీ ప్రాంతంలో ఏదైనా మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందని తెలిస్తే దానికి సంబంధించి జాతీయ మానవ హక్కుల సంఘానికి ఒక ఫిర్యాదు రాయండి.
జవాబు:

ఫిర్యాదు

విజయవాడ,
10 – 10 – 20xx.

సబ్జెక్టు : జాతీయ మానవ హక్కుల చైర్మన్ గారికి మా ప్రాంతంలోని పోలీసుల వేధింపుల గురించి ఒక చిన్న విన్నపం.

To:
జాతీయ మానవ హక్కుల చైర్మన్,
డిల్లీ.

గౌరవనీయులైన జాతీయ మానవ హక్కుల చైర్మన్ గారికి,

అయ్యా,
మాది విజయవాడలోని లబ్బీపేట ప్రాంతం. మా ప్రాంతం నందు దినసరి కార్మికులు ఎక్కువగా నివసిస్తూ ఉంటారు. వారికి చట్టం గురించి కాని, పోలీసుల గురించి కాని అంతగా తెలియదు.’ అయితే పోలీసులు లేనిపోని కారణాలు చెబుతూ తరచుగా మా ప్రాంతంలోని ప్రజలను బెదిరింపులతోను, వేధింపులతోను అనేక ఇబ్బందులకు గురిచేసి వారి నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. అందువల్ల మీరు ఈ విషయం నందు జోక్యం చేసుకుని మా ప్రాంతంలోని, ప్రజలను పోలీసుల వేధింపుల నుండి రక్షణ కల్పించవలసినదిగా ప్రార్థించుచున్నాము.

ఇట్లు
మీ విధేయుడు,
ఎం. భావసాయి,
9వ తరగతి.

ప్రాజెక్టు

ప్రశ్న 1.
ఒక సీనియర్ న్యాయవాదిని మీ తరగతికి ఆహ్వానించి, ముఖాముఖి ద్వారా ఈ కింది విషయాలు తెలుసుకోండి :
– ప్రాథమిక హక్కుల ఉల్లంఘన, వాటి పర్యవసానాలు
– బాలల హక్కుల ఉల్లంఘన
– ప్రజాస్వామ్యంలో హక్కుల కోసం పోరాడే విధానాలు
– సంబంధిత ఇతర విషయాలు.
జవాబు:
ప్రాథమిక హక్కుల ఉల్లంఘన, వాటి పర్యవసానాలు :
ప్రాథమిక హక్కులను న్యాయస్థానాలు పరిరక్షిస్తాయి. థమిక హక్కుల ఉల్లంఘనకు గురైనప్పుడు వ్యక్తులు శిక్షార్హులు అవుతారు.

బాలల హక్కుల ఉల్లంఘన :
బాలల హక్కుల ఉల్లంఘించటం కూడా చట్టరీత్యా నేరం మరియు శిక్షార్హులు. న్యాయస్థానాలు బాలల హక్కులను పరిరక్షిస్తాయి. దానికితోడు జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ 2007 మార్చిలో ఏర్పాటుచేశారు.

ఈ సంస్థ 18 సం||రాల వయస్సు లోపల గల బాలలందరికి వర్తిస్తుంది.

బాలల కోసం అమలవుతున్న వివిధ రక్షణలను, సౌకర్యాలను పరిశీలించి సమీక్ష చేసి తగిన సిఫారసులు చేస్తుంది. బాలల హక్కుల ఉల్లంఘనకు సంబంధించి, విచారించి తగిన చర్యలు చేపడుతుంది. తీవ్రవాదం, మత ఘర్షణలు, గృహహింస, లైంగిక దాడులు, వేధింపులు మొదలగు సమస్యలపై తగిన పరిష్కారాలను సూచిస్తుంది.

బాలల హక్కులకు సంబంధించిన ఒప్పందాలను, చట్టాలను, పథకాలను, కార్యక్రమాలను అధ్యయనం చేసి సమర్థవంతంగా అమలు చేయడానికి సిఫారసులు చేస్తుంది. బాలల హక్కులపైన పరిశోధన మరియు హక్కులపై అవగాహన కల్పించడానికి సెమినార్లు, చర్చావేదికలు నిర్వహిస్తుంది.

బాల నేరస్థుల జైళ్లను సందర్శించి వారికి కల్పిస్తున్న వసతులపై ప్రభుత్వానికి నివేదికలు ఇస్తుంది.

పై విధంగా బాలల హక్కులను ఒకవైపు న్యాయస్థానాలు మరోవైపు కమిషన్ కంటికి రెప్పలా కాపాడుతున్నాయి.

ప్రజాస్వామ్యంలో హక్కుల కోసం పోరాడే విధానాలు :
శాంతియుతంగా, గాంధేయ మార్గంలో హక్కులకోసం .పోరాడాలి. ఏ విధమైన హింసాపూరిత వాతావరణానికి అవకాశం కల్పించరాదు. ప్రభుత్వ, ప్రయివేటు ఆస్తులను ధ్వంసం చేయరాదు. పౌరులు, తమ తమ విధులను పాటిస్తూనే శాంతియుత మార్గంలో న్యాయస్థానాలు ద్వారా లేదా సమస్యలను పరిష్కరించు కోవలయును.

సంబంధిత ఇతర విషయాలు :
మానవుల ప్రాథమిక హక్కుల పరిరక్షణ న్యాయస్థానాలతో పాటు జాతీయ స్థాయిలో జాతీయ మానవ హక్కుల కమిషన్, రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ పనిచేస్తున్నాయి. వీటిని 1993లో పార్లమెంటు చట్టం ద్వారా ఏర్పాటుచేయడం జరిగింది.

జాతీయ మానవ హక్కుల చట్టాన్ని 2006లో సవరించారు. జాతీయ మానవ హక్కుల కమిషన్లో ఒక చైర్మన్ నలుగురు సభ్యులు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లో ఒక చైర్మన్ ఇద్దరు సభ్యులు ఉంటారు.

జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మను రాష్ట్రపతి నియమిస్తారు.
రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ ను గవర్నర్ నియమిస్తారు.

ఈ కమిషన్లు చేసే విధులు :
మానవ హక్కుల ఉల్లంఘన లేదా ఉల్లంఘనను నివారించటంలో ప్రభుత్వోద్యోగి విఫలమైనప్పుడు తనంతట తానుగానే . లేదా ఫిర్యాదు ఆధారంగా కాని విచారణ జరపడం. న్యాయస్థానాల అనుమతితో మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన కేసులో కక్షిదారునిగా చేరటం.

జైళ్ళను ఇతర నిర్బంధ గృహాలను సందర్శించి తనిఖీ చేసి అక్కడ ఉన్నవారికి కనీస వసతుల కల్పనపై విచారించి అవసరమైన సూచనలివ్వడం వంటి విధులను నిర్వహించడం జరుగుతుంది.

AP Board 9th Class Biology Solutions 5th Lesson జీవులలో వైవిధ్యం

SCERT AP 9th Class Biology Study Material Pdf Download 5th Lesson జీవులలో వైవిధ్యం Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Biology 5th Lesson Questions and Answers జీవులలో వైవిధ్యం

9th Class Biology 5th Lesson జీవులలో వైవిధ్యం Textbook Questions and Answers

అభ్యసనాన్ని మెరుగుపరుచుకోండి

ప్రశ్న 1.
జీవులలో ఉండే తేడాలు వైవిధ్యానికి ఏ విధంగా ఆస్కారం కల్పిస్తాయి? వివరించండి. (AS 1)
జవాబు:

  1. ఒకే జాతి జీవుల మధ్య ఉండే తేడాలను వైవిధ్యం అంటారు.
  2. వేరువేరు జాతుల మధ్య ఉన్న వైవిధ్యం కంటే, ఒక జాతి జీవుల మధ్య వైవిధ్యం తక్కువగా ఉంటుంది.
  3. ఒక జీవి చూపించే ప్రత్యేక లక్షణాలే జీవులు చూపించే వైవిధ్యానికి ఆధారంగా నిలుస్తాయి.
  4. నిత్య జీవితంలో మన చుట్టూ అనేక రకాలయిన మొక్కలను, జంతువులను చూస్తాము.
  5. మనము కొండ ప్రాంతాలు మరియు అటవీ ప్రాంతాలకు వెళ్ళినపుడు మనము రకరకాల మొక్కలను, జంతువులను గమనిస్తాం.
  6. నిజం చెప్పాలంటే ప్రపంచంలోని ప్రతిభాగము దానికే పరిమితమైన ప్రత్యేక రకమైన జీవులను కలిగి ఉంటుంది.
  7. అందువలన జీవులలో ఉండే తేడాలు వైవిధ్యానికి ఆస్కారం కల్పిస్తున్నాయి.

ప్రశ్న 2.
శాస్త్రవేత్తలు దేని ఆధారంగా మొదటగా వర్గీకరణ ప్రారంభించారు? (AS 1)
జవాబు:

  1. జీవులు వాటి శరీర నిర్మాణం ఆధారంగా వర్గీకరించబడ్డాయి.
  2. జీవుల మధ్య ఉన్న పోలికలు, విభేదాలను అనుసరించి జీవులు వర్గీకరించబడ్డాయి.
  3. చరకుడు, సుశ్రుతుడు మొక్కలను వాటి ఔషధ గుణములను అనుసరించి వర్గీకరించారు.
  4. పరాశర మహర్షి పుష్ప నిర్మాణం ఆధారంగా మొక్కలను వర్గీకరించాడు.
  5. అరిస్టాటిల్ జంతువులను అవి నివసించే ప్రదేశం అనగా భూమి, నీరు మరియు గాలి ఆధారంగా వర్గీకరించాడు.

ప్రశ్న 3.
ఏకదళ బీజాలు ద్విదళ బీజాల కంటే ఎలా భిన్నంగా ఉంటాయి? (AS 1)
జవాబు:

ఏకదళ బీజాలుద్విదళ బీజాలు
1. మొక్కల గింజలలో ఒకే దళం కలిగి ఉంటాయి.1. మొక్కల గింజలలో రెండు దళాలు కలిగి ఉంటాయి.
2. సమాంతర ఈనెల వ్యాపనం కలిగి ఉంటాయి.2. జాలాకార వ్యాపనం కలిగి ఉంటాయి.
3. గుబురు వేరు వ్యవస్థను కలిగి ఉంటాయి.3. ప్రధాన వేరు వ్యవస్థను కలిగి ఉంటాయి.
4. ఏకదళ బీజాలకు ఉదాహరణలు వరి, గోధుమ మొదలైనవి.4. ద్విదళ బీజాలకు ఉదాహరణ వేప, మామిడి మొదలైనవి.

ప్రశ్న 4.
విట్టేకర్ ప్రకారం క్రింది జీవులు ఏ రాజ్యానికి చెందుతాయి? (AS 1)
AP Board 9th Class Biology Solutions 5th Lesson జీవులలో వైవిధ్యం 1
జవాబు:
AP Board 9th Class Biology Solutions 5th Lesson జీవులలో వైవిధ్యం 2

ప్రశ్న 5.
నేను ఏ విభాగానికి చెందుతాను? (AS 1)
ఎ) నా శరీరంలో రంధ్రాలున్నాయి, నేను నీటిలో నివసిస్తాను. నాకు వెన్నెముక లేదు.
జవాబు:
ఫొరిఫెర

బి) నేను కీటకాన్ని. నాకు అతుకుల కాళ్ళున్నాయి.
జవాబు:
ఆల్డోపొడ

సి) నేను సముద్రంలో నివసించే జీవిని, చర్మంపై ముళ్ళు ఉండి, అనుపార్శ్వ సౌష్టవం కలిగి ఉంటాను.
జవాబు:
ఇఖైనోడర్మేట

AP Board 9th Class Biology Solutions 5th Lesson జీవులలో వైవిధ్యం

ప్రశ్న 6.
చేపలు, ఉభయచరాలు, పక్షులలో మీరు గమనించిన సాధారణ లక్షణాలను రాయండి. (AS 1)
జవాబు:

  1. చేపలు, ఉభయచరాలు, పక్షులు అన్నీ సకశేరుకాలు.
  2. ఇవి అన్నీ వెన్నెముక కలిగిన జీవులు.
  3. చేపలు, ఉభయచరాలు, పక్షులు అన్నీ అండజనకాలు.

ప్రశ్న 7.
వర్గీకరణ అవసరం గురించి తెలుసుకోవడానికి నీవు ఏ ఏ ప్రశ్నలు అడుగుతావు? (AS 2)
జవాబు:
ప్రశ్నలు :
i) వర్గీకరణ యొక్క అవసరం ఏమిటి?
ii) వర్గీకరణను ఎవరు, ఎప్పుడు చేశారు?
iii) వర్గీకరణ వలన ఉపయోగం ఏమిటి?
iv) వర్గీకరణలో నూతనముగా వచ్చిన మార్పులు ఏమిటి?
v) వర్గీకరణ అన్ని జీవులకు వర్తిస్తుందా?

ప్రశ్న 8.
స్లెడు తయారు చేసేటప్పుడు నీవు తీసుకున్న జాగ్రత్తలేమిటి? (AS 3)
జవాబు:
స్లెడును తయారుచేసేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు :

  • పరిచ్ఛేదాలను పలుచగా కత్తిరించాలి.
  • పరిచ్ఛేదాలను వా గ్లాస్ ఉన్న నీటిలో ఉంచాలి.
  • పలుచటి పరిచ్చేదాలను మాత్రమే గాజు పలకపై ఉంచాలి.
  • పరిచ్ఛేదం ఆరిపోకుండా దానిపై గ్లిజరిన్ చుక్క వేయాలి.
  • భాగాలు స్పష్టంగా కనిపించటానికి అవసరమైన రంజకాన్ని ఉపయోగించాలి.
  • గాజు పలక పై ఉన్న పరిచ్ఛేదం ఎక్కువ కాలం ఉంచుటకు కవర్ స్లితో మూసి ఉంచాలి.
  • గాజు పలకపై కవర్ స్లిప్ ను ఉంచునపుడు గాలిబుడగలు లేకుండా చూడాలి.
  • అధికంగా ఉన్న నీటిని లేక గ్లిజరిన్ లేక వర్ణద్రవ్యాన్ని అద్దుడు, కాగితంతో తొలగించాలి.

ప్రశ్న 9.
ఒక రోజు కవిత పెసలు, గోధుమలు, మొక్కజొన్న, బఠాని మరియు చింతగింజలను నీటిలో నానవేసింది. అవి నీటిలో నానిన తరువాత నెమ్మదిగా పగలగొడితే అవి రెండు బద్ధలుగా విడిపోయాయి. ఇవి ద్విదళ బీజాలు. కొన్ని విడిపోలేదు. ఇవి ఏకదళ బీజాలు. కవిత పట్టికను ఎలా నింపిందో ఆలోచించండి. మీరూ ప్రయత్నించండి. (AS 4)
AP Board 9th Class Biology Solutions 5th Lesson జీవులలో వైవిధ్యం 3
జవాబు:
AP Board 9th Class Biology Solutions 5th Lesson జీవులలో వైవిధ్యం 4

ప్రశ్న 10.
గ్రంథాలయం లేదా అంతర్జాలం నుండి సమాచారం సేకరించి ప్లాటిపస్ మరియు ఎకిడ్నాలను క్షీరదాలను మరియు సరీసృపాలను అనుసంధానం చేసే జీవిగా ఎలా చెప్పవచ్చో వివరించండి. (AS 4)
జవాబు:

  1. ఎకిడ్నా మరియు ప్లాటిపస్లు రెండూ మెనోట్రీమ్ గ్రూపునకు చెందిన జీవులు,
  2. ఈ రెండు కూడా అండజనక క్షీరదాలు. అయినప్పటికీ ఇవి సరీసృపాలు లేదా పక్షులు కావు.
  3. గుడ్లను పొదుగుతాయి. రెండూ పిల్లలకు పాలు ఇస్తాయి.
  4. ఇవి రెండూ ఆస్ట్రేలియా మరియు టాస్మేనియాలో కనిపిస్తాయి.
  5. ప్లాటిపస్ ముఖ్య లక్షణాలు మరియు అసాధారణ లక్షణాలు-బాతుకు ఉన్న ముక్కు వంటి నిర్మాణం దీనికి ఉండటం, క్షీరద లక్షణమైన దంతములు లేకపోవటం.
  6. స్పైనీ ఏంట్ ఈటర్ అయిన ఎకిడ్నాకు కూడా దంతములు లేవు. నాలుక ఆహారం తీసుకోవడానికి ఉపయోగపడుతుంది.
  7. గుడ్ల నుండి బయటకు వచ్చిన ఎకిడ్నా మరియు ప్లాటిపస్ పిల్లలు బొరియలలో నివసిస్తాయి. కానీ సరీసృపాలు కాదు. ప్రజనన సమయంలో ఎకిడ్నా ప్రాథమికమైన సంచిని అభివృద్ధి చేసుకుంటుంది.
  8. రెండు జీవులకూ గుంటలు చేయడానికి పదునైన గోళ్ళు కలవు.
  9. ప్లాటిపస్ మరియు ఎకిడ్నా నీటిని ఇష్టపడతాయి. ప్లాటిపస్ నీటిలో ఆహారం వేటాడుతుంది.
  10. ఎకిడ్నా నీటిలో ఉండుట ద్వారా తన శరీర ఉష్ణోగ్రతను క్రమబద్దీకరణ చేస్తుంది.

ప్రశ్న 11.
అనిమేలియా రాజ్యాన్ని వాటి లక్షణాల ఆధారంగా ఒక ఫ్లో చార్టు తయారుచేయండి. (AS 5)
జవాబు:
AP Board 9th Class Biology Solutions 5th Lesson జీవులలో వైవిధ్యం 5

ప్రశ్న 12.
వెన్నెముక గల జీవులను ఉపరితరగతులుగా విభజిస్తూ ఫ్లోచార్ట్ తయారు చేయండి. (AS 5)
జవాబు:
AP Board 9th Class Biology Solutions 5th Lesson జీవులలో వైవిధ్యం 6

ప్రశ్న 13.
శాస్త్రవేత్తలు వర్గీకరణపై చేసిన పరిశోధనలను నీవు ఏ విధంగా ప్రశంసిస్తావు? (AS 6)
జవాబు:

  1. శాస్త్రవేత్తలు చేసిన వర్గీకరణముల వలన వైవిధ్యము కలిగిన జీవుల అధ్యయనం సులభమయ్యింది.
  2. వివిధ మొక్కలు మరియు జంతువుల మధ్య గల సంబంధాలను వర్గీకరణ ద్వారా అవగాహన చేసుకోవచ్చు.
  3. జీవులు సరళస్థితి నుండి సంక్లిష్ట స్థితి వరకు జరిగిన పరిణామము వర్గీకరణ ద్వారా మనకు అవగాహన కలుగుతుంది.

AP Board 9th Class Biology Solutions 5th Lesson జీవులలో వైవిధ్యం

ప్రశ్న 14.
‘గబ్బిలం పక్షి కాదు క్షీరదం’ అని సుజాత చెప్పింది. మీరు ఆమె మాటలను ఏ విధంగా సమర్థిస్తారు? (AS 7)
జవాబు:

  1. గబ్బిలం పక్షి కాదు క్షీరదం అని సుజాత చెప్పిన మాటను సమర్థిస్తాను.
  2. ఇతర క్షీరదాలవలె మానవునితో సహా గబ్బిలానికి శరీరం మీద వెంట్రుకలు లేదా రోమములు కలవు.
  3. గబ్బిలం ఉష్ణరక్త జంతువు.
  4. పుట్టిన గబ్బిలం పాలకోసం తల్లిపాల మీద ఆధారపడుతుంది.
  5. గబ్బిలములు క్షీరదములలో గల ఏకైక ఎగిరే క్షీరదము.

9th Class Biology 5th Lesson జీవులలో వైవిధ్యం Textbook InText Questions and Answers

9th Class Biology Textbook Page No. 63

ప్రశ్న 1.
వృక్షరాజ్యాన్ని వాటి లక్షణాల ఆధారంగా ఒక ఫ్లోచార్ట్ తయారు చేయండి. పేజి నెం. 63
జవాబు:
AP Board 9th Class Biology Solutions 5th Lesson జీవులలో వైవిధ్యం 8

ప్రశ్న 2.
మీ తరగతిలో నలుగురు లేదా ఐదుగురు విద్యార్థులు ఒక జట్టుగా ఏర్పడి పాఠశాల గ్రంథాలయం లేదా అంతర్జాలం నుండి ఏవైనా 20 మొక్కలు, 20 జంతువుల శాస్త్రీయ నామాలతో జాబితా రూపొందించండి. (పేజి నెం. 71)
జవాబు:
మొక్కల శాస్త్రీయ నామములు :

మొక్క పేరుశాస్త్రీయ నామం
1. మామిడిమాంగి ఫెరా ఇండికా
2. కొబ్బరికాకస్ న్యూసిఫెర
3. తాటిబొరాసస్ ప్లాజెల్లి ఫెర్
4. గరిక గడ్డిసైనోడాన్ డాక్టలాన్
5. వరిఒరైజా సటైవా
6. అరటిమ్యూసా పారడైసికా
7. మర్రిఫైకస్ బెంగాలెన్సిస్
8. పెద్ద ఉసిరిఎంబ్లికా అఫిసినాలిస్
9. తోటకూరఅమరాంతస్ గాంజిటికస్
10. తులసిఆసిమమ్ సాంక్టమ్
11. టేకుటెక్టోనా గ్రాండిస్
12. కనకాంబరముక్రొసాండ్ర ఇన్ఫండిబులిఫార్మిస్
13. వంకాయసొలానమ్ మెలాంజినా
14. సపోటఎక్రస్ జపోట
15. గడ్డి చామంతిట్రెడాక్స్ ప్రొకంబెన్స్
16. ధనియాలు (కొత్తిమీర)కొరియాండ్రమ్ సటైవమ్
17. జామసిడియమ్ గ్వజావ
18. గులాబిరోజా గ్రాండిప్లోరా
19. చింతటామరిండస్ ఇండికా
20. మందారహైబిస్కస్ రోజా – సైనెన్సిస్
21. బెండఅబెలియాస్మస్ ఎస్కూలెంటస్
22. జీడిమామిడిఅనకార్డియం ఆక్సిడెంటాలిస్
23. పైనాపిల్అనాన స్క్వామోజస్
24. ఆవాలుబ్రాసికా జెన్షియా
25. క్యా బేజిబ్రాసికా ఒలరేసియా రకం కాపిటేట
26. తేయాకుకెమెల్లియా సైనన్సిస్
27. నారింజసిట్రస్ సైనన్సిస్
28. పసుపుకుర్కుమా లోంగా
29. ఉమ్మెత్తదతురా మెటల్
30. వెదురుడెండ్రోకాలమస్ కలోస్ట్రాఖియస్
31. మిరపకాప్సికమ్ ఫ్రూటి సెన్స్

AP Board 9th Class Biology Solutions 5th Lesson జీవులలో వైవిధ్యం

జంతువుల శాస్త్రీయ నామములు :

జంతువు పేరుశాస్త్రీయ నామం
1. కాకికార్పస్ స్పెండెన్స్
2. పిచ్చుకపాస్సర్ డొమెస్టికస్
3. కప్పరానాటైగ్రీనా
4. కుక్కకేనిస్ ఫెమిలియారీస్
5. పిల్లిఫెలిస్ డొమెస్టికస్
6. చింపాంజిఎంత్రోపిథికస్ ట్రైగ్లో డైట్స్
7. కోడిగాలస్ డొమెస్టికస్
8. పావురముకొలంబియ లివియ
9. గేదేబుబాలస్ బుబాలిస్
10. తేనెటీగఎపిస్ ఇండికా
11. వానపాముఫెరిటీమా పోస్తుమా
12. బొద్దింకపెరిప్లానేటా అమెరికానా
13. జలగహిరుడినేరియా గ్రాన్యులోస
14. రొయ్యపాలియమాన్ మాక్మో సోనీ
15. ఈగమస్కా సెబ్యులోం
16. నత్తపైలాగ్లోబోసా
17. గుడ్లగూబబుబోబుబో
18. తాచుపామునాజనాజ
19. గుర్రముఈక్వస్ కబాలస్
20. రామచిలుకసిట్టిక్యుల క్రామెరి
21. చీమహైమినోప్టెరస్ ఫార్మిసిడి
22. గాడిదఇక్వియస్ అసినస్
23. కంగారుమాక్రోఫస్ మాక్రోపాజిడే
24. కుందేలురొడెంటియా రాటస్
25. ఏనుగుప్రోబోసిడియా ఎలిఫెండిడే
26. జిరాఫీరాఫాకామిలో పారాలిస్
27. పందిఆడియో డక్టలా సుయిడే
28. నీటి గుర్రంఇప్పోకాంపస్ సిగ్నాంథిగే
29. నెమలిపావో క్రిస్టేటస్

9th Class Biology 5th Lesson జీవులలో వైవిధ్యం Textbook Activities (కృత్యములు)

కృత్యం – 1

ప్రశ్న 1.
మొక్కలలో ఆకుల పరిశీలన :

మొక్కలలో ఆకుల పరిశీలన. వివిధ రకాల మొక్కల ఆకులను సేకరించి వాటిని పరిశీలించి పట్టికను పూరించండి.
AP Board 9th Class Biology Solutions 5th Lesson జీవులలో వైవిధ్యం 9
AP Board 9th Class Biology Solutions 5th Lesson జీవులలో వైవిధ్యం 10
ఎ) పైన పరిశీలించిన ఆకులలో ఏ రెండు ఆకులైనా ఒకే విధంగా ఉన్నాయా? (ఆకారం, పరిమాణం, రంగులో)
జవాబు:
ఏ రెండు ఆకులూ పరిమాణంలోను, ఆకారంలోను ఒకే విధముగా లేవు.

బి) సేకరించిన ఆకులలో మీరు గుర్తించిన ముఖ్యమైన భేదాలను రాయండి. ఏ రెండు లక్షణాలలో ఎక్కువగా భేదాలు చూపుతున్నాయో గుర్తించండి.
జవాబు:
AP Board 9th Class Biology Solutions 5th Lesson జీవులలో వైవిధ్యం 11
i) కొన్ని ఆకుల ఆకారం అండాకారంగాను, మరికొన్ని ఆకుల ఆకారం దీర్ఘవృత్తాకారంగాను ఉంది.
ii) పత్రపు అంచులు కొన్నిటికి నొక్కబడి, కొన్ని రంపము అంచుగలవిగా మరికొన్ని నొక్కులు లేనివిగా ఉన్నాయి.
iii) ఆకుల పొడవు, వెడల్పులలో ఆకులు అన్నీ వివిధ కొలతలలో ఉన్నాయి.

కృత్యం – 2

ప్రశ్న 2.
మొక్కల పరిశీలన :
మీ పరిసరాలలో గల 5 రకాల మొక్కలు వాటి పుష్పాలతో సేకరించి వాటి బాహ్య లక్షణాలను జాగ్రత్తగా పరిశీలించండి. పరిశీలించిన అంశాలను పట్టికలో నమోదు చేయండి.
AP Board 9th Class Biology Solutions 5th Lesson జీవులలో వైవిధ్యం 12

1. ఏయే లక్షణాలలో ఎక్కువ తేడాలు ఉండటం గమనించారు?
జవాబు:
కాండం పొడవు, కణుపుల మధ్య దూరం, ఆకుల, ఈనెల వ్యాపనంలో మరియు వేరు వ్యవస్థలలో తేడాలు ఉన్నాయి.

2. అతి తక్కువ భేదం చూపుతున్న లక్షణమేది?
జవాబు:
పుష్పం నందు అతి తక్కువ భేదం చూపుతున్నవి – పుష్పాలు గుత్తులుగా రావడం అనేది.

3. మీకు వాటిలో ఏమైనా పోలికలు కనిపించాయా? కనిపిస్తే అవి ఏమిటి?
జవాబు:
ఈనెల వ్యాపనంలోను, రక్షక ఆకర్షక పత్రాల సంఖ్యలోను వేరువ్యవస్థలోను పోలికలు ఉన్నాయి.

4. పీచు వేర్లు కలిగిన మొక్కలలో పుష్పాలు గుంపులుగా ఉన్నాయా? లేక వేరే విధంగా ఉన్నాయా?
జవాబు:
గుంపులుగా ఉంటాయి.

5. పై పట్టికలో పేర్కొన్న లక్షణాలు కాకుండా ఇంకేమైనా కొత్త లక్షణాలను మీరు పరిశీలించారా ? వాటిని నమోదు చేయండి.
జవాబు:
గులాబి చెట్లకు ముళ్ళుంటాయి.

6. పట్టికలో పేర్కొన్న లక్షణాలు ప్రాతిపదికగా పరిశీలిస్తే ఏ రెండు మొక్కలైనా ఒకేలా ఉన్నాయా?
జవాబు:
లేవు.

7. వేరు వేరు మొక్కలలో ఒకే రకమైన లక్షణాలు పరిశీలించినట్లయితే వాటిని పేర్కొనండి.
జవాబు:
వరి, మొక్కజొన్న నందు సమాంతర వ్యాపనం, పీచు వేరు వ్యవస్థ ఉన్నాయి. మామిడి, గులాబి, జామనందు తల్లివేరు వ్యవస్థ, జాలాకార ఈనెల వ్యాపనం ఉన్నాయి.

8. మీరు సేకరించిన మొక్కలలో ఏ రెండు మొక్కలలో అయినా ఎక్కువ లక్షణాలు ఒకే రకంగా ఉన్నాయా? అవి ఏమిటి?
జవాబు:
జామ, గులాబినందు ఎక్కువ లక్షణాలు ఒకే విధంగా ఉన్నాయి.

AP Board 9th Class Biology Solutions 5th Lesson జీవులలో వైవిధ్యం

కృత్యం – 3

ప్రశ్న 3.
విత్తనాలను పరిశీలిద్దాం :
వివిధ రకముల విత్తనములందు గల బీజదళాల సంఖ్యను నీవు ఏ విధముగా పరిశీలిస్తావు? నీ యొక్క పరిశీలనలను పట్టికయందు నమోదు చేయుము.
జవాబు:
విత్తనమునందు గల బీజదళాల సంఖ్యను పరిశీలించు విధము :

  1. పెసలు, కందులు, మినుములు, గోధుమ, వరి, వేరుశనగ, మొక్కజొన్న విత్తనములను సేకరించి వాటిని ఒక రోజు నీటిలో నానబెట్టాలి.
  2. వీటిలో మొక్కజొన్న విత్తనాన్ని తీసుకొని చేతివేళ్ళతో నొక్కాలి.
  3. మొక్కజొన్న విత్తనము నుండి తెల్లని నిర్మాణం బయటకు వస్తుంది.
  4. తెల్లని నిర్మాణమును పిండం లేదా పిల్లమొక్క అంటారు.
  5. పిండం కాకుండా మన చేతిలో మిగిలిన భాగంలో ఉన్న విత్తనం పైభాగంలో ఒకే బీజదళం ఉంటుంది.
  6. ఇదే విధంగా మిగిలిన అన్ని విత్తనాలనూ నొక్కి పరిశీలించాలి.
  7. భూతద్దం ద్వారా పరిశీలించిన అంశాలను పట్టికలో నమోదుచేయాలి.

AP Board 9th Class Biology Solutions 5th Lesson జీవులలో వైవిధ్యం 13

కృత్యం – 4

ప్రశ్న 4.
ఏకదళ, ద్విదళ బీజ మొక్కల లక్షణాలను పరిశీలిద్దాం :
ఏకదళ, ద్విదళ బీజ మొక్కలను సేకరించి వాటి లక్షణాలను పరిశీలించి పట్టికను పూరించండి.
జవాబు:
AP Board 9th Class Biology Solutions 5th Lesson జీవులలో వైవిధ్యం 14
AP Board 9th Class Biology Solutions 5th Lesson జీవులలో వైవిధ్యం 15

కృత్యం – 5

ప్రశ్న 5.
కీటకాల బాహ్య లక్షణాలను పరిశీలిద్దాం.
మీ పరిసరాలలోని ఈగ, దోమ, చీమ, పేడ పురుగు, సీతాకోక చిలుక మాత్, బొద్దింక మొదలైన కీటకాలను పరిశీలించి పట్టికను పూర్తిచేయండి. ప్రశ్నలకు జవాబులు రాయండి.
AP Board 9th Class Biology Solutions 5th Lesson జీవులలో వైవిధ్యం 16

1. అన్ని కీటకాలు ఒకే ఆకారం, పరిమాణం కలిగి ఉన్నాయా?
జవాబు:
కీటకాలు అన్నీ ఒకే ఆకారం, పరిమాణం కలిగి ఉండలేదు.

2. కాళ్ళను పరిశీలిస్తే వాటిలో కనిపించే తేడాలేమిటి?
జవాబు:
కొన్ని కీటకాలకు కీళ్ళు కలిగిన కాళ్ళు ఉన్నాయి. ఒక్కొక్క కీటకము కాళ్ళనందు అతుకులు ఉన్నాయి.

3. రెక్కలను పరిశీలిస్తే వాటిలో కనిపించే తేడాలేమిటి?
జవాబు:
రెక్కలు పెద్దవిగాను, చిన్నవిగాను ఉన్నాయి. కొన్నింటిలో 1 జత రెక్కలు ఉంటే కొన్నింటిలో – (సీతాకోకచిలుక, మాత్, బొద్దింక) రెండు జతల రెక్కలు ఉన్నాయి. రెక్కలు వివిధ రంగులలో ఉన్నాయి.

4. రెక్కల సంఖ్యకి, కాళ్ళ సంఖ్యకి మధ్య ఏమైనా సంబంధం ఉందా?
జవాబు:
కాళ్ళ సంఖ్య స్థిరంగా ఉంటే అనగా 6 కాళ్ళు ఉంటే, రెక్కలు తక్కువ సంఖ్యలో ఉన్నాయి.

5. ఏ రెండు కీటకాల లక్షణాలు ఒకేలా ఉన్నాయా? ‘అవును’ అయితే వాటిని మీ తరగతిలో ప్రదర్శించండి. ‘లేదు’ అయితే తేడాలను మీ నోట్‌బుక్ లో రాయండి.
జవాబు:
ఏ రెండు కీటకాల లక్షణాలు ఒకే విధంగా లేవు. సీతాకోకచిలుక, బొద్దింక కాళ్ళ సంఖ్యలోను, రెక్కలసంఖ్యలోను ఒకేవిధంగా ఉన్నప్పటికి ఆకారంలోను, రంగులోను తేడాను చూపిస్తున్నాయి.

కృత్యం – 6

ప్రశ్న 6.
మానవులలో వైవిధ్యాన్ని పరిశీలిద్దాం :
జంతువులలో వైవిధ్యం పరిశీలించడానికి పాఠశాలలోని పదిమంది పిల్లలను ఎంపిక చేసుకొని వారి వివరములను క్రింది పట్టిక యందు నింపండి. ఒక్కొక్క జట్టు యందు నలుగురు చొప్పున జట్లుగా ఏర్పడాలి.
AP Board 9th Class Biology Solutions 5th Lesson జీవులలో వైవిధ్యం 17
జవాబు:
1. ఏ లక్షణం వీరిని విభజించడంలో ఎక్కువగా తోడ్పడుతుంది?
జవాబు:
‘ఎత్తు’ లక్షణం ద్వారా వీరిని విభజించవచ్చు.

2. ఏ లక్షణం గ్రూపులలో ఒక్కరికి మాత్రమే వర్తిస్తుంది?
జవాబు:
బొటన వేలిముద్ర

3. మీ తరగతిలో ఏ ఇద్దరు విద్యార్థులకైనా ఒకే విధమైన లక్షణాలు ఉన్నాయా?
జవాబు:
లేవు

4. మీ పట్టికను ఇతరులతో పోల్చి వివిధ పట్టికలలో ఉన్న అంశాల మధ్య తేడాలను నమోదు చేయండి.
జవాబు:
విద్యార్థి కృత్యము.

AP Board 9th Class Biology Solutions 5th Lesson జీవులలో వైవిధ్యం

కృత్యం – 7

ప్రశ్న 7.
రెండు వేరు వేరు మొక్కలలో వైవిధ్యాన్ని పరిశీలిద్దాం.
రెండు వేరు వేరు వేప మొక్కలలోని వైవిధ్యంను పరిశీలించి కింది పట్టికను పూర్తి చేయంది.
సమాన పరిమాణాలలో ఉన్న రెండు వేప మొక్కలను ఎంపిక చేసుకొని వాటి లక్షణాలను పట్టికలో పూరించాలి.
AP Board 9th Class Biology Solutions 5th Lesson జీవులలో వైవిధ్యం 18
1. ఒకే రకమైన రెండు వేపమొక్కలలో ఏ ఏ తేడాలను నీవు గమనించావు?
జవాబు:
పొడవులో తేడా, ఆకుల సంఖ్యలో తేడా గలవు.

2. అలాంటి తేడాలు వాటిలో ఉండడానికి కారణాలు ఏమై ఉండవచ్చునని ఊహిస్తున్నావు?
జవాబు:
ఒక్కొక్క మొక్క దాని లక్షణాలు ప్రత్యేకంగా ఉంటాయి. మొక్క వయసు కూడా లక్షణాలలో తేడా ఉండడానికి కారణమవుతుంది.

కృత్యం – 8

ప్రశ్న 8.
వివిధ రకాల నాచు మొక్కలను పరిశీలిద్దాం.
నాచు మొక్క (మాస్)ను సేకరించి దానిని భూతద్దంతో గాని సంయుక్త సూక్ష్మదర్శినితో గాని పరిశీలించండి. బొమ్మ గీసి నాచు మొక్కల లక్షణములు రాయండి.
జవాబు:

  1. గోడలపైన, ఇటుకల మీద వానాకాలంలో పెరిగే ‘పచ్చని నిర్మాణాలను సేకరించాలి.
  2. వాటి నుండి కొంతభాగం ఒక స్లెడ్ పైన తీసుకొని సంయుక్త సూక్ష్మదర్శినితో పరిశీలించాలి.

AP Board 9th Class Biology Solutions 5th Lesson జీవులలో వైవిధ్యం 19
పరిశీలనలు :

  1. నాచు మొక్క సైడ్ నందు కనిపించే పువ్వుల మాదిరి నిర్మాణాలను సిద్ధబీజాలు అంటారు.
  2. సిద్ధ బీజాలలో చాలా తక్కువ పరిమాణంలో ఆహారపదార్థాలు నిల్వ ఉంటాయి.
  3. సిద్ధబీజాలు సిద్ధబీజాశయము నుండి ఉత్పత్తి అవుతాయి.

ప్రయోగశాల కృత్యములు

ప్రశ్న 1.
ప్రయోగశాల నుండి హైడ్రాస్లెడ్ ను సేకరించి మైక్రోస్కోపులో పరిశీలించండి. బొమ్మను గీచి, భాగాలు గుర్తించి పరిశీనలను రాయండి.
జవాబు:
AP Board 9th Class Biology Solutions 5th Lesson జీవులలో వైవిధ్యం 20
పరిశీలనలు :
1. హైడ్రా శరీరం ఏకకణ నిర్మితమా ? బహుకణ నిర్మితమా?
జవాబు:
బహుకణ నిర్మితము.

2. హైడ్రా శరీరం లోపల ఎలా కనిపిస్తుంది?
జవాబు:
హైడ్రా శరీరం లోపల ఖాళీ ప్రదేశం కనిపిస్తుంది. దానిని శరీరకుహరం అంటారు.

3. హైడ్రాలో ఇంకేమైనా లక్షణాలు కనిపించాయా?
జవాబు:
1) హైడ్రా జీవుల అపముఖము వైపు ఒక సన్నని కాడ చివర ఉన్న ఆధారముతో అంటిపెట్టుకొని ఉంటుంది.
2) స్వేచ్ఛగా ఉండే ముఖభాగము హైపోస్టోమ్ మీద అమరి ఉంటుంది.
3) హైపోస్టోమ్ చుట్టూ 6-10 స్పర్శకాలు ఉంటాయి.
4) కాడ ప్రక్కభాగమున నోరు లేదా స్పర్శకాలతో కూడిన ప్రరోహము ఉంటుంది.

ప్రశ్న 2.
బద్దెపురుగు స్పెసిమన్ ను పరిశీలించి బొమ్మగీచి, భాగాలు గుర్తించండి. పరిశీలనలు రాయండి.
జవాబు:
AP Board 9th Class Biology Solutions 5th Lesson జీవులలో వైవిధ్యం 21
పరిశీలనలు:
1. జీవి శరీరం ఎలా కనిపిస్తుంది?
జవాబు:
జీవి శరీరం చదునుగా ఉండి, రిబ్బన్ వలె ఉంటుంది. వీటిని ప్లాటీహెల్మింథిస్ లేదా చదును పురుగు అంటారు.

2. జీవి శరీరంలో ఏదైనా ఖాళీ ప్రదేశం కనిపించినదా?
జవాబు:
ఖాళీ ప్రదేశం లేదు. నిజ శరీరకుహరం ఏర్పడలేదు.

3. దాని తల మరియు తోక ఎలా ఉంది?
జవాబు:
తలభాగము చిన్నదిగా గుండుసూదంత పరిమాణంలో ఉంటుంది. తోక కలిగి ఉంటుంది.

ప్రశ్న 3.
నులిపురుగు స్పెసిమన్ ను పరిశీలించండి. గమనించిన అంశాలను నోటు పుస్తకంలో రాయంది. దాని బొమ్మ గీచి, భాగాలు గుర్తించండి.
జవాబు:
AP Board 9th Class Biology Solutions 5th Lesson జీవులలో వైవిధ్యం 22
పరిశీలనలు :
1. జీవి శరీరం బద్దెపురుగు (ప్లాటీ హెల్మింథిస్) ను పోలి ఉందా?
జవాబు:
జీవి శరీరం బద్దెపురుగును పోలియుండలేదు. శరీరం గుండ్రంగా ఉంది.

2. బద్దెపురుగు మరియు నులిపురుగులలో ఏమి తేడాలు గమనించారు?
జవాబు:
బద్దెపురుగు చదునుగా, శరీరకుహరం లేకుండా ఉంటుంది. నులిపురుగు గుండ్రంగా మిథ్యాకుహరం కలిగి ఉంటుంది.

3. స్పెసిమన్ లో దాని తల మరియు తోక ఎలా కన్పిస్తుంది?
జవాబు:
తల మరియు తోకలు చిన్నవిగా ఉండి మొనదేలి ఉంటాయి.

AP Board 9th Class Biology Solutions 5th Lesson జీవులలో వైవిధ్యం

ప్రశ్న 4.
వానపాము స్పెసిమను పరిశీలించండి. మీరు గమనించిన అంశాలు నోటుపుస్తకంలో రాయండి. దాని బొమ్మ గీచి, భాగాలు గుర్తించండి.
జవాబు:
AP Board 9th Class Biology Solutions 5th Lesson జీవులలో వైవిధ్యం 23
పరిశీలనలు :
1. వానపాము ఎలా కదులుతుంది?
జవాబు:
వర్తులాకార మరియు నిలువు కండరాల ఏకాంతర సంకోచ, సడలికల వల్ల కదులుతుంది.

2. దాని రంగు ఎలా ఉంది? శరీరంలో వలయాలు ఉన్నాయా?
జవాబు:
ముదురు గోధుమ వర్ణంలో ఉంది. శరీరంలో వలయాలు ఉన్నాయి.

3. శరీర రంగులో, శరీర భాగాల్లో ఏమి తేడా గమనించారు?
జవాబు:
శరీర పైభాగము ముదురు గోధుమ రంగులో ఉంటుంది. శరీర అడుగుభాగము లేత గోధుమ రంగులో ఉంటుంది. శరీర భాగమునందు ఖండితములు 14 నుండి 17 వరకు ఉన్నాయి. చర్మం మందంగా ఉంది. అక్కడ చర్మం శ్లేష్మంను స్రవించి గట్టిపడుతుంది. శరీరమంతా వలయాకార ఖండితాలు ఉన్నాయి.

ప్రశ్న 5.
బొద్దింక స్పెసిమన్ పరిశీలించండి. మీరు గమనించిన అంశాలు నోటు పుస్తకంలో రాయండి. దాని బొమ్మ గీచి, భాగాలు గుర్తించండి.
జవాబు:
AP Board 9th Class Biology Solutions 5th Lesson జీవులలో వైవిధ్యం 24
పరిశీలనలు :
1. బొద్దింక చర్మం ఎలా కనిపిస్తుంది?
జవాబు:
బొద్దింక చర్మం గట్టిదైన అవభాసినితో ఆవరించబడి ఉంది.

2. వాటి చర్మంపై ఏదయినా గట్టిపొరను గమనించారా?
జవాబు:
గట్టి పొరను గమనించాము. దానిని అవభాసిని అంటారు.

3. బొద్దింక కాళ్ళను గమనించండి. అవి ఎలా కన్పిస్తున్నాయో చెప్పండి.
జవాబు:
బొద్దింకలో 3 జతల కాళ్ళున్నాయి. అవి కీళ్ళు కలిగిన కాళ్ళు.

4. బొద్దింక శరీరాన్ని ఎన్ని భాగాలుగా విభజించవచ్చు?
జవాబు:
బొద్దింక శరీరాన్ని మూడు భాగాలుగా విభజించవచ్చు. అవి : తల, రొమ్ము , ఉదర భాగం.

5. బొద్దింక మాదిరిగా కీళ్ళు కలిగిన కాళ్ళు ఉండే మరికొన్ని కీటకాల జాబితా రాయండి.
జవాబు:
సీతాకోక చిలుక, దోమ, ఈగ, గొల్లభామ, చీమ మొదలైనవి.

ప్రశ్న 6.
నత్త స్పెసిమనను పరిశీలించి గమనించిన అంశాలను నోటుపుస్తకంలో రాయండి. దాని బొమ్మ గీచి, భాగాలు గుర్తించండి.
జవాబు:
AP Board 9th Class Biology Solutions 5th Lesson జీవులలో వైవిధ్యం 25
పరిశీలనలు :
1. నత్త బాహ్య స్వరూపం ఎలా కన్పిస్తుంది?
జవాబు:
నత్త బాహ్య స్వరూపం మెత్తగా ఉండి గట్టి కర్పరంతో ఉంటుంది.

2. నత్తను కాసేపు కదలకుండా ఉంచండి. అది కదలికను ఎక్కడ నుంది మొదలు పెట్టింది? ఆ భాగం ఏమిటి?
జవాబు:
పాదము నుండి కదలికను మొదలుపెట్టింది.

3. నత్త శరీరం గట్టిగా ఉందా? మెత్తగా ఉందా?
జవాబు:
నత్త శరీరం గట్టిగా ఉంది.

4. నత్త శరీరంలో ఏవైనా స్పర్శకాలు వంటి నిర్మాణాలు గుర్తించారా?
జవాబు:
నత్త శరీరంలో స్పర్శకాలు వంటి నిర్మాణాలు ఉన్నాయి.

ప్రశ్న 7.
సముద్ర నక్షత్రం స్పెసిమను పరిశీలించండి. మీరు గమనించిన అంశాలను నోటు పుస్తకంలో రాయండి. దాని బొమ్మ గీచి, భాగాలు గుర్తించండి.
జవాబు:
AP Board 9th Class Biology Solutions 5th Lesson జీవులలో వైవిధ్యం 26
పరిశీలనలు:
1. సముద్ర నక్షత్రం శరీరం చర్మంపై ఏమి గమనించారు?
జవాబు:
సముద్ర నక్షత్రం శరీరం చర్మంపై ముళ్ళు ఉన్నాయి.

2. వాటికి చేతుల వంటి నిర్మాణాలు ఏమైనా ఉన్నాయా? అవి ఎలా ఉన్నాయి?
జవాబు:
జీవి శరీరం పంచభాగ వ్యాసార్ధ సౌష్టవము కలిగి ఐదు చేతుల వంటి నిర్మాణాలు ఉన్నాయి.

3. శరీరం మధ్యలో ఏదైనా రంధ్రాన్ని గమనించారా?
జవాబు:
సముద్ర నక్షత్రం మధ్య భాగంలో చిన్న రంధ్రము ఉన్నది. అది దాని యొక్క నోరు.

AP Board 9th Class Biology Solutions 5th Lesson జీవులలో వైవిధ్యం

ప్రశ్న 8.
పాఠశాల ప్రయోగశాల నుండి చేప స్పెసిమన్ ను పరిశీలించండి. మీరు గమనించిన అంశాలు నోటుపుస్తకంలో రాయండి. దాని బొమ్మ గీచి, భాగాలు గుర్తించండి.
జవాబు:
పరిశీలనలు :
1. చేప యొక్క చర్మం గమనించి ఎలా ఉందో చెప్పంది.
జవాబు:
చేప చర్మం తేమగా, జిగటగా పొలుసులతో నిండియున్నది.
AP Board 9th Class Biology Solutions 5th Lesson జీవులలో వైవిధ్యం 27

2. పొలుసులు లేని భాగాలను చేపలో గుర్తించి రాయండి.
జవాబు:
తలభాగము, ఉదరభాగము నందు పొలుసులు ఉండవు.

3. చేప యొక్క నోటిని తెరచి చేప నోటిలో ఏముందో చెప్పంది.
జవాబు:
చేప నోటిలో దంతాలు అమరి ఉన్నాయి. నాలుక ఉన్నది.

4. చేప యొక్క చెవి భాగాన్ని తెరచి అక్కడ ఏమి చూసారో చెప్పండి.
జవాబు:
చేప యొక్క చెవిభాగాన్ని తెరచి చూస్తే అక్కడ ఎర్రగా దువ్వెన మాదిరిగా ఉన్న మొప్పలు ఉన్నాయి.

5. చేపను కోసి దాని గుండెను పరిశీలించండి.
జవాబు:
చేప గుండె ఎరుపురంగులో చిన్నగా ఉన్నది.

6. చేప హృదయంలో ఎన్ని గదులున్నాయో తెల్పండి.
జవాబు:
చేప హృదయంలో రెండు గదులున్నాయి.

AP Board 9th Class Maths Notes Chapter 15 Proofs in Mathematics

Students can go through AP Board 9th Class Maths Notes Chapter 15 Proofs in Mathematics to understand and remember the concepts easily.

AP State Board Syllabus 9th Class Maths Notes Chapter 15 Proofs in Mathematics

→ The sentences that can be judged on some criteria, no matter by what process for their being true or false are statements.

→ Mathematical statements are of a distinct nature from general statements. They cannot be proved or justified by getting evidence while they can be disproved by finding a counter example.

→ Making mathematical statements through observing patterns and thinking of the rules that may define such patterns.
A hypothesis is a statement of idea which gives an explanation to a sense of observation.

AP Board 9th Class Maths Notes Chapter 15 Proofs in Mathematics

→ A process which can establish the truth of a mathematical statement based purely on logical arguments is called a mathematical proof.

→ Axioms are statements which are assumed to be true without proof.

→ A conjecture is a statement we believe is true based on our mathematical intuition, but which we are yet to prove.

→ A mathematical statement whose truth has been established or proved is called a theorem.

→ The prime logical method in proving a mathematical statement is deductive reasoning.

→ A proof is made up of a successive sequence of mathematical statements.

→ Beginning with given (Hypothesis) of the theorem and arrive at the conclusion by means of a chain of logical steps is mostly followed to prove theorems.

AP Board 9th Class Maths Notes Chapter 15 Proofs in Mathematics

→ The proof in which, we start with the assumption contrary to the conclusion and arriving at a contradiction to the hypothesis is another way that we establish the original conclusion is true is another type of deductive reasoning.

→ The logical tool used in the establishment of the truth of an un-ambiguous statement is called deductive reasoning.

→ The reasoning which is based on examining of variety of cases or sets of data discovering pattern and forming conclusion is called Inductive reasoning.