AP Inter 1st Year Economics Study Material Chapter 2 వినియోగదారుని ప్రవర్తనా సిద్ధాంతాలు

Andhra Pradesh BIEAP AP Inter 1st Year Economics Study Material 2nd Lesson వినియోగదారుని ప్రవర్తనా సిద్ధాంతాలు Textbook Questions and Answers.

AP Inter 1st Year Economics Study Material 2nd Lesson వినియోగదారుని ప్రవర్తనా సిద్ధాంతాలు

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
క్షీణోపాంత ప్రయోజన సూత్రాన్ని వివరించి, పరిమితులను పరిశీలించండి. [Mar. ’17, ’16, ’15]
జవాబు:
క్రమ క్షీణోపాంత ప్రయోజన సూత్రం మానవుని దైనందిన అనుభవం మీద ఆధారపడి ఉంటుంది. ప్రతి కోరికను ఒక కాల వ్యవధిలో పూర్తిగా సంతృప్తిపరచవచ్చుననే ప్రాతిపదికపై ఈ సూత్రం ఆధారపడి ఉంది. ఈ సూత్రాన్ని ప్రథమంగా 1854వ సంవత్సరంలో హెచ్. హెచ్. గాసెన్ ప్రతిపాదించాడు. దీనిని గాసెన్ ప్రథమ సూత్రంగా జీవన్స్ పేర్కొన్నాడు. మార్షల్ దీనిని అభివృద్ధిపరిచాడు.

“ఒక వ్యక్తి తనవద్దనున్న వస్తు రాశిని పెంచుతూ పోతే అదనంగా చేర్చిన యూనిట్ల నుండి లభించే అదనపు ప్రయోజనం క్రమంగా క్షీణిస్తుంది” అని క్షీణోపాంత ప్రయోజనాన్ని మార్షల్ నిర్వచించెను.

ఈ సూత్రాన్ని కొన్ని ప్రమేయాలపై ఆధారపడి రూపొందించడం జరిగింది.
ప్రమేయాలు:

  1. సిద్ధాంతం కార్డినల్ ప్రయోజన విశ్లేషణపై ఆధారపడింది. అంటే ప్రయోజనాన్ని కొలవవచ్చును, పోల్చవచ్చును.
  2. వస్తువు యూనిట్లు తగుమాత్రంగా ఉండి, మరీ చిన్న యూనిట్లుగాను, మరీ పెద్ద యూనిట్లుగాను ఉండరాదు.
  3. వినియోగించే వస్తువు వివిధ యూనిట్లు సజాతీయంగా ఉండాలి. అనగా పరిమాణం, నాణ్యత, రుచి మొదలైన విషయాలలో ఏ వ్యత్యాసం ఉండరాదు.
  4. ఒక యూనిట్ వినియోగానికి, మరొక యూనిట్ వినియోగానికి మధ్య కాలవ్యవధి ఉండకూడదు.
  5. వినియోగదారుల అభిరుచులు, అలవాట్లలో మార్పు ఉండరాదు.
  6. వినియోగదారుల ఆదాయాలు మారకూడదు.

క్షీణోపాంత ప్రయోజన సూత్ర వివరణ: ఈ సూత్రం వస్తురాశి పరిమాణానికి తృప్తి లేదా ప్రయోజనానికి మధ్యగల సంబంధాన్ని వివరిస్తుంది. ఈ సూత్రం ప్రకారం ఒక వినియోగదారుడు తన వద్ద ఉన్న వస్తురాశిని పెంచుతూ పోతుంటే అదనపు యూనిట్వల్ల లభించే అదనపు లేదా ఉపాంత ప్రయోజనం క్షీణిస్తుంది. ఈ సూత్రాన్ని ఈ క్రింది పట్టిక ద్వారా చూపించటం జరిగింది.

AP Inter 1st Year Economics Study Material Chapter 2 వినియోగదారుని ప్రవర్తనా సిద్ధాంతాలు 1

AP Inter 1st Year Economics Study Material Chapter 2 వినియోగదారుని ప్రవర్తనా సిద్ధాంతాలు

పట్టిక ప్రకారం ప్రతి అదనపు ఆపిల్ వల్ల లభించే ఉపాంత ప్రయోజనం క్షీణిస్తుంది. అంటే మొత్తం ప్రయోజనం తగ్గుతున్న రేటులో పెరగటం గమనించవచ్చు. 6వ ఆపిల్ వల్ల మొత్తం ప్రయోజనం 82 యుటిల్స్, ఉపాంత ప్రయోజనం 2 యుటిల్స్, 7వ ఆపిల్ వినియోగం వల్ల మొత్తం ప్రయోజనంలో మార్పు లేదు. అంటే మొత్తం ప్రయోజనం గరిష్టంగా ఉంది. ఉపాంత ప్రయోజనం శూన్యం 7, 8 ఆపిల్ పండ్ల నుండి మొత్తం ప్రయోజనం క్షీణించి, ఉపాంత ప్రయోజనం ఋణాత్మకమైనది. మొత్తం ప్రయోజనానికి, ఉపాంత ప్రయోజనానికి మధ్య సంబంధం ఈ క్రింది విధంగా ఉంటుంది.

  1. మొత్తం ప్రయోజనం తగ్గుతున్న రేటులో పెరిగినప్పుడు ఉపాంత ప్రయోజనం తగ్గుతుంది.
  2. మొత్తం ప్రయోజనం గరిష్టమైనపుడు ఉపాంత ప్రయోజనం శూన్యమవుతుంది.
  3. మొత్తం ప్రయోజనం తగ్గితే ఉపాంత ప్రయోజనం ఋణాత్మకమవుతుంది. దీనిని ఈ క్రింది రేఖాపటం ద్వారా వివరించవచ్చు.
    AP Inter 1st Year Economics Study Material Chapter 2 వినియోగదారుని ప్రవర్తనా సిద్ధాంతాలు 2

పట్టికను రేఖాపటంలో T.U.C. మొత్తం ప్రయోజన రేఖ M.U.C. ఉపాంత ప్రయోజన రేఖ. X – అక్షముపై ఆపిల్ పండ్ల సంఖ్యను, Y – అక్షముపై మొత్తం ప్రయోజనం, ఉపాంత ప్రయోజనం చూపించాము. వినియోగదారునికి ‘O’ యూనిట్ వద్ద మొత్తం ప్రయోజనం ‘0’ ఆపిల్స్ వినియోగం పెంచుతూ పోయిన కొద్దీ మొత్తం ప్రయోజనం తగ్గుతున్న రేటులో పెరిగింది. T.U.C. ఇదే అంశాన్ని స్పష్టం చేస్తోంది. M.U.C. క్రిందికి వాలుతున్నది. T.U.C. 7వ పండు వద్ద గరిష్టంగా ఉంది. M.U.C. X – అక్షాన్ని తాకి శూన్యమైంది. వినియోగదారుడు 7వ, 8వ పండ్లను వినియోగించటం వల్ల మొత్తం ప్రయోజనం క్షీణించింది. ఉపాంత ప్రయోజనం ఋణాత్మకమైంది.

క్షీణోపాంత ప్రయోజన సిద్ధాంతం, మినహాయింపులు: కొన్ని పరిస్థితులలో అదనపు యూనిట్ల నుంచి వచ్చే ప్రయోజనం క్రమంగా క్షీణించకపోవచ్చు. వీటినే ఈ సూత్రానికి మినహాయింపులుగా చెప్పటం జరుగుతుంది. అవి:

  1. అపూర్వ వస్తువుల విషయంలో ఈ సూత్రం వర్తించదు. ఉదా: నాణేలు, కళాత్మక వస్తువులు, తపాలా బిళ్ళలు.
  2. సామాజిక వస్తువుల వినియోగంలో ఈ సూత్రం వర్తించదు. ఉదా: ఒక పట్టణంలో టెలిఫోన్ల సంఖ్య పెరిగితే, టెలిఫోను ఉపయోగించటం వల్ల కలిగే ప్రయోజనం కూడా పెరుగుతుంది.
  3. మత్తు పదార్థాల విషయంలో ఈ సూత్రం వర్తించదు.
  4. ద్రవ్యం విషయంలో ఈ సూత్రం వర్తించదని కొందరి అభిప్రాయం.

క్షీణోపాంత ప్రయోజన సిద్దాంతం – ప్రాముఖ్యం:

  1. డిమాండ్ సూత్రానికి ఈ సూత్రం మూలాధారం.
  2. విలువ సిద్ధాంతానికి కూడా ఈ సూత్రం మూలాధారం. ఉదా: నీళ్ళకు ప్రాముఖ్యం ఎక్కువగా ఉంటుంది. నీటికి వినిమయ విలువ లేదు. వజ్రాలకు ఉపయోగితా విలువ ఏమీలేదు. కాని వాటి వినిమయ విలువ ఎక్కువగా ఉంటుంది. వీటికి సమాధానం ఈ సూత్రంలో లభ్యమవుతుంది.
  3. ఆర్థికమంత్రి పన్నుల విధానాన్ని నిర్ణయించటంలో ఈ సూత్రం చాలా ఉపయోగకారిగా ఉంటుంది. పురోగామి పన్నుల విధానానికి ఈ సూత్రం ఆధారం.
  4. వినియోగదారుని మిగులు భావన ఈ సూత్రంపైననే ఆధారపడి ఉంది.
  5. సంపద పంపిణీకి క్షీణోపాంత ప్రయోజన సూత్రం ఆధారమని చెప్పవచ్చు.
  6. వినియోగదారు, తన పరిమితమైన ఆదాయం ద్వారా ఏ విధంగా ప్రయోజనాన్ని గరిష్టం చేసుకోవచ్చునో తెలుపుతుంది.

ప్రశ్న 2.
సమోపాంత ప్రయోజన సూత్రం ప్రాముఖ్యాన్ని వివరించండి.
జవాబు:
సమోపాంత ప్రయోజనానికి చాలా ఆచరణీయమైన ప్రాధాన్యత ఉంది. ఆర్థిక జీవనంలో ఈ సూత్రం అనేక విధాలుగా ఉపకరిస్తుంది.
1) వినియోగం: ప్రతి వ్యక్తి తనకున్న పరిమిత ఆదాయాన్ని వివిధ వస్తువులపై ఖర్చు చేయటం ద్వారా గరిష్ట ప్రయోజనాన్ని పొందటానికి ప్రయత్నిస్తాడు. వినియోగదారుడు తక్కువ ప్రయోజనం లభించే వస్తువుకు బదులు అధిక ప్రయోజనం లభించే వస్తువును ప్రతిస్థాపన చేసుకుంటూ తన పరిమిత ఆదాయాన్ని ఖర్చు చేస్తాడు. కనుక ఈ సూత్రం వినియోగదారుని గరిష్ట సంతృప్తి విశ్లేషణకు తోడ్పడుతుంది.

AP Inter 1st Year Economics Study Material Chapter 2 వినియోగదారుని ప్రవర్తనా సిద్ధాంతాలు

2) ఉత్పత్తి: ఉత్పత్తిదారుడు అనేక ఉత్పత్తి కారకాలను ఉత్పత్తి ప్రక్రియలో వినియోగించడం ద్వారా లాభం, గరిష్ట ప్రయోజనాన్ని పొందటానికి ప్రయత్నిస్తాడు. వివిధ ఉత్పత్తి కారకాల నుండి గరిష్ట లాభాలను పొందటానికి ఏ విధంగా ఉత్పత్తి కారకాలను ప్రతిస్థాపన చేస్తాడో ఈ సూత్రం విశ్లేషణ చేస్తుంది.

3) వినిమయం: ఒక వస్తువుకు బదులుగా మరో వస్తువు ద్రవ్యము ద్వారా వినిమయం చేయడంలో ఈ సూత్రం ఉపయోగపడుతుంది. వినిమయానికి ప్రాతిపదిక ప్రతిస్థాపన సిద్ధాంతము.

4) పంపిణీ: వివిధ ఉత్పత్తుల ఉత్పత్తి కారకాలకు వాటి ప్రతిఫలాలను పంపిణీ చేయటాన్ని వివరించే ‘ఉపాంత ఉత్పాదకతా సిద్ధాంతానికి’ ఈ సూత్రం ప్రాతిపదిక.

5) ప్రభుత్వ విత్తము: ప్రభుత్వం వివిధ కార్యక్రమాలపై ఖర్చు చేసేటప్పుడు సమాజపు ప్రయోజనం గరిష్టంగా ఉండాలని భావిస్తుంది. అందువల్ల అధిక ప్రయోజనం కోసం వృధా వ్యయాలను తగ్గించి ప్రభుత్వం వ్యయం చేస్తుంది.

ఇంతేకాకుండా ఆదాయ పునఃపంపిణీకి ఒక వ్యక్తి తన పొదుపు లేదా పెట్టుబడి వివిధ రకాల ఆస్తుల మధ్య విభజించటానికి ఒక వ్యక్తి తన కాలాన్ని పని, విశ్రాంతి మధ్య కేటాయించడానికి మొదలైన అంశాల విశ్లేషణకు ఈ సూత్రం తోడ్పడుతుంది. పన్నుల విధానానికి ఈ సూత్రం సహాయపడుతుంది.

6) ఆదాయ పునఃపంపిణీ, వ్యయ విధానం: సంపన్నులపై ఎక్కువ స్థాయిలో పన్నులు విధించి, పేదవారికి ఎక్కువ ప్రయోజనం చేకూర్చే విధంగా ప్రభుత్వం వ్యయ విధానాన్ని అనుసరిస్తోంది. సంపన్నుల ఖర్చు విధానానికి, పేదవారికి ఖర్చు విధానానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గురించి ఆదాయ పునఃపంపిణీ జరిగే విధానాన్ని, అందువలన కలిగే ఆదాయాన్ని వ్యయం చేసే పద్ధతిని ఈ సూత్రం ఆధారంగా ప్రభుత్వం తన విధానాన్ని నిర్ణయించుకొని సమాజ శ్రేయస్సును పెంపొందిస్తుంది.

7) ధరలపై ప్రభావం: ఈ సూత్రం వస్తువు ధరలపై ప్రభావం చూపుతుంది. వస్తువు కొరతగా ఉంటే ఎక్కువగా ఉంటుంది. దీనికి బదులుగా కొరతలేని వస్తువును ప్రతిస్థాపన చేయటం ద్వారా ఉపాంత ప్రయోగం- తగ్గకుండా ప్రయత్నించటం జరుగుతుంది. అందువల్ల కొరత వస్తువు ధర తగ్గుతుంది.

సమోపాంత ప్రయోజన సూత్ర ప్రాముఖ్యం:

  1. ఉద్యమదారు వివిధ ఉత్పత్తి సాధనాలకు నియమించేటప్పుడు, అన్ని ఉత్పత్తి సాధనాల నుంచి వచ్చే ఉపా ఉత్పాదకత సమానంగా ఉన్నప్పుడు మొత్తం ఉత్పత్తిని గరిష్టం చేసుకుంటాడు. అంటే కనిష్ట వ సముదాయాన్ని నిర్ణయించుకోవడానికి ఈ సూత్రం ఉపకరిస్తుంది.
  2. పంపిణీ విషయంలో కూడా ఈ సూత్రం ప్రాధాన్యం కలిగి ఉంటుంది. ఒక రకమైన వస్తువును ని వ్యక్తుల మధ్య పంపిణీ చేసినప్పుడు, అందరికీ కలిగే ఉపాంత ప్రయోజనంగా ఉంటే, పం సక్రమంగా జరిగిందని చెప్పవచ్చు.
  3. ఆదాయాన్ని వినియోగం, పొదుపు మధ్యన కేటాయించడంలో కూడా ఈత్రం ఉపకరిస్తుంది.
  4. వ్యక్తులు తమ పొదుపును లేదా సంపదను వివిధ రకాల ఆస్తుల రూపంలో ఎంతెంత ఉంచుకో నిర్ణయించుకోవడానికి ఈ సూత్రం ఉపయోగకరంగా ఉంటుంది.
  5. కుటుంబాలు తమ పరిమిత ఆదాయాన్ని వివిధ రకాల వస్తువులపై కేటాయించడం ద్వారా, తమ సంక్షేమాన్ని ఎలా గరిష్టం చేసుకుంటారో ఈ సూత్రం ద్వారా తెలుసుకోవచ్చు.

AP Inter 1st Year Economics Study Material Chapter 2 వినియోగదారుని ప్రవర్తనా సిద్ధాంతాలు

ప్రశ్న 3.
సమోపాంత ప్రయోజన సూత్రం సహాయంతో వినియోగదారుని సమతౌల్యాన్ని వివరించండి.
జవాబు:
వినియోగదారుని సమతౌల్యాన్ని వివరించే సూత్రమే సమోపాంత ప్రయోజన మాత్రము. వినియోగదార గరిష్ట సంతృప్తిని పొందడానికి తన దగ్గర ఉన్న పరిమిత ఆదాయాన్ని వివిధ వస్తువులపై ఏ విధంగా ఉపయోగిస్తాని సూత్రం వివరిస్తుంది. సమోపాంత ప్రయోజన సూత్రం ప్రకారం ఒక వినియోగదారుడు తన దగ్గరున్న ద్రవ్యాన్ని . వస్తువులపై వాటి ఉపాంత ప్రయోజనాలు సమానమయ్యే వరకు ఒకదానికి బదులుగా మరొకటి ప్రతిస్థాపన చేస్తా ఈ ప్రతిస్థాపన గరిష్ట సంతృప్తిని సాధించేవరకు సాగుతుంది. ఉపాంత ప్రయోజనాలు సమానమైనప్పుడు ప్రయోజనం గరిష్టంగా ఉంటుంది. మొత్తం ప్రయోజనం గరిష్టంగా ఉన్నప్పుడు వినియోగదారుడు సమతౌల్య ఉంటాడు.

ఈ సూత్రాన్ని ప్రప్రధమంగా 1854వ సంవత్సరంలో హెచ్. హెచ్. గాసెన్ ప్రతిపాదించాడు. దీనిని గా ద్వితీయ సూత్రంగా జీవన్స్ పేర్నొన్నాడు. దీనిని మార్షల్ అభివృద్ధిపరిచాడు.

“ఒక వ్యక్తి దగ్గర ఉన్న ఒక వస్తువుకు అనేక ఉపయోగాలున్నప్పుడు అతడు ప్రతి ఉపయోగం నుండి ఉపాంత ప్రయోజనం సమానంగా ఉండేటట్లు ఆ వస్తువును వినియోగించడం జరుగుతుంది” అని మార్షల్ ఈ సూ నిర్వచించెను.

సూత్రం వివరణ:
ఉదా: ఒక వ్యక్తి వద్ద ఉన్న వస్తువు పరిమిత ద్రవ్యం ఐదు రూపాయలు అనుకుందాం. ఆ పరిమిత ప్ర X – y అనే వస్తువులపై ఖర్చు చేయటం ద్వారా ఏ విధంగా సమతౌల్యంలో ఉన్నాడో ఈ క్రింది పట్టిక పరిశీలించవచ్చును.
x − y ధరలు ఒక యూనిట్ వస్తువు ఒక రూపాయిగా భావించాలి. ప్రతి రూపాయికి లభించే ఉపాంత ప్రయోజనాలను పట్టికలో పరిశీలించవచ్చును.
AP Inter 1st Year Economics Study Material Chapter 2 వినియోగదారుని ప్రవర్తనా సిద్ధాంతాలు 3

బ్రాకెట్లలో చూపిన అంకెలు వినియోగదారుడు 5 రూపాయలను ఏ విధంగా ఖర్చు చేశాడో తెలియజేయును. పట్టికననుసరించి x, y వస్తువుల ఉపాంత ప్రయోజన వస్తు వినియోగం పెరుగుతున్న కొద్దీ క్షీణిస్తుంది. ఒకటో రూపాయి వల్ల వచ్చే ఉపాంత ప్రయోజనం y వస్తువు కంటే x వస్తువు వల్ల ఎక్కువగా ఉంది. అందువల్ల మొదటి రూపాయితో X వస్తువును కొనుగోలు చేస్తాడు. అదే విధంగా 2వ రూపాయిని x మీద వినియోగిస్తే ఉపాంత ప్రయోజనం 20 యుటిల్స్. అదే 2వ రూపాయిని y మీద వినియోగిస్తే ఉపాంత ప్రయోజనం 21 యుటిల్స్. కనుక 2వ రూపాయిని y వస్తువుపై ఖర్చు చేస్తాడు. 3వ రూపాయిని y వస్తువు మీద ఖర్చు చేస్తే, 15 యుటిల్స్ ఉపాంత ప్రయోజనము. అదే 3వ రూపాయిని X వస్తువుపై ఖర్చు చేస్తే ఉపాంత ప్రయోజనం 20 యుటిల్స్ కనుక 3వ రూపాయితో X వస్తువు 2వ యూనిట్ను కొనుగోలు చేస్తాడు. 4వ రూపాయితో y ని కొనుగోలు చేసినా ఉపాంత ప్రయోజనం 15 యుటిల్స్. 5వ | రూపాయిని X వస్తువు 3వ యూనిట్పై ఖర్చు చేస్తే ఉపాంత ప్రయోజనం 15 యుటిల్స్. 5 రూపాయలను X వస్తువుపై ఖర్చు చేస్తే 75 యుటిల్స్ ప్రయోజనం వస్తుంది. 5 రూపాయలను y వస్తువుపై ఖర్చు చేస్తే మొత్తం ప్రయోజనం 52 యుటిల్స్. కాని పైన పేర్కొన్న విధంగా ఖర్చు చేస్తే మొత్తం ప్రయోజనం 96 యుటిల్స్ [25 + 21 + 20 + 15 + 15 = 96]. వినియోగదారుడు ఈ విధంగా 3 యూనిట్ల xని, 2 యూనిట్ల yని కొనుగోలు చేసినప్పుడు మాత్రమే వినియోగదారునికి గరిష్ట సంతృప్తి వస్తుంది. అప్పుడే తాను ఖర్చు చేసిన చివరి రూపాయివల్ల రెండు వస్తువులకు ఒకే ప్రయోజనం ద్వారా తెలియజేయవచ్చు. వస్తుంది. మరే రకంగా ఖర్చు చేసినా ప్రయోజనం గరిష్టంగా ఉండదు. దీనిని పటము ద్వారా తెలియజేయవచ్చు.
AP Inter 1st Year Economics Study Material Chapter 2 వినియోగదారుని ప్రవర్తనా సిద్ధాంతాలు 4

పై రేఖాపటములో X – అక్షముపై ద్రవ్య పరిమాణము, Y – అక్షముపై ఒక రూపాయి వల్ల వచ్చే X, Y ల ఉపాంత ప్రయోజనం సూచించటం జరిగింది. XY రేఖ X వస్తువు ప్రయోజన రేఖ (MUC], YY రేఖ Y వస్తువు ఉపాంత ప్రయోజన రేఖ [MUC]. X వస్తువుపై 3వ రూపాయి 15 యుటిల్స్ ప్రయోజనం ఇస్తుంది. Y వస్తువుపై 2వ రూపాయి 15 యుటిల్స్ ప్రయోజనం ఇస్తుంది.

వినియోగదారుడు సమతౌల్య స్థితిని నిర్ణయించుటకు ఈ క్రింది నిబంధనను సంతృప్తిపరచవలెను.
AP Inter 1st Year Economics Study Material Chapter 2 వినియోగదారుని ప్రవర్తనా సిద్ధాంతాలు 5

AP Inter 1st Year Economics Study Material Chapter 2 వినియోగదారుని ప్రవర్తనా సిద్ధాంతాలు

ప్రశ్న 4.
ఉదాసీనత వక్రరేఖల పద్ధతి ద్వారా వినియోగదారుని సమతౌల్యాన్ని వివరించండి.
జవాబు:
ఒక వినియోగదారుని అభిరుచులు, అలవాట్లు రెండు వస్తువుల ధరలు నిలకడగా ఉండి పరిమిత ఆదాయ వనరులతో వీలైనంతగా రెండు వస్తువులను గరిష్టంగా కొనుగోలు చేయగలిగినట్లయితే వినియోగదారుడు సమతౌల్యస్థితికి చేరుకున్నాడని చెప్పవచ్చు.

ఈ క్రింది ప్రమేయాలను ఆధారంగా చేసుకొని ఉదాసీనత వక్రరేఖల సహాయంతో వినియోగదారుని సమతౌల్య స్థితిని వివరించవచ్చు.

  1. వినియోగదారుడు హేతుబద్ధంగా వ్యవహరిస్తాడు.
  2. వినియోగదారుని ద్రవ్య ఆదాయంలో ఎలాంటి మార్పులు ఉండవు.
  3. వినియోగదారుడు కొనుగోలు చేయాలనుకునే వస్తువుల ధరలు మారవు.
  4. వినియోగదారుని అభిరుచులు ఉదాసీనత వక్రరేఖలు తెలుపుతాయి.

వినియోగదారుని సమతౌల్యం: వినియోగదారు పొందగోరే వస్తు సముదాయాలు, పొందగలిగిన వస్తు సముదాయాలు సమానంగా ఉన్నప్పుడు సమతౌల్యంలో ఉంటాడు. అంటే ఉదాసీనతా వక్రరేఖ, బడ్జెట్ రేఖకు స్పర్శ రేఖగా ఉన్నప్పుడు వినియోగదారు గరిష్ట సంతృప్తిని పొందుతూ సమతౌల్యంలో ఉంటాడు. ఇలాంటి పరిస్థితులలో ఉదాసీనత వక్రరేఖ వాలు, బడ్జెట్ఖ వాలు సమానంగా ఉంటాయి. వినియోగదారుని సమతౌల్యానికి ముఖ్యమైన నిబంధన MRSxy = Px/Py

వినియోగదారు సమతౌల్యాన్ని ఈ క్రింది రేఖాపటం ద్వారా వివరించవచ్చు.
AP Inter 1st Year Economics Study Material Chapter 2 వినియోగదారుని ప్రవర్తనా సిద్ధాంతాలు 6

పై రేఖాపటంలో AB బడ్జెట్ ఖ. IC0, IC1, IC2, వివిధ ఉదాసీనత వక్రరేఖలు. IC0, రేఖ AB బడ్జెట్ రేఖను C, ఎదువుల వద్ద ఖండిస్తుంది. అందువల్ల వినియోగదారు C వద్ద లేదా D వద్ద సమతౌల్యంలో ఉండడు. AB బడ్జెట్ IC0 రేఖను ఖండిస్తుంది. అంటే ఇంకా వినియోగదారుడు అధిక సంతృప్తి స్థాయిని పొందటానికి వీలు ఉంటుంది. పొందువు వద్ద IC1, రేఖ, AB బడ్జెట్ రేఖకు స్పర్శరేఖగా ఉంది. అందువల్ల ‘E’ బిందువు వద్ద IC, రేఖవాలు, రేఖ వాలు సమానం. ఈ పరిస్థితిలో MRSxy = Px/Py. అందువల్ల వినియోగదారుడు ‘E’ బిందువు వద్ద OQ -వస్తువును, OP పరిమాణంలో ‘Y’ వస్తువును కొనుగోలు చేస్తూ IC1, పై గరిష్ట సంతృప్తిని పొందుతూ సమతౌల్యంలో డు. IC1, అతని ఆదాయం కన్నా ఎక్కువ రేఖ. అందువల్ల వినియోగదారుడు IC2 రేఖ పైననే ‘E’ బిందువు వద్ద శౌల్యంలో ఉంటాడు.

ధర లేదా బడ్జెట్ రేఖను నిర్వచించండి. బడ్జెట్ రేఖలోని కదలికలను వివరించండి. వినియోగదారుని కొనుగోలు ముఖ్యంగా రెండు అంశాలపై ఆధారపడి ఉంటుంది. అవి:

  1. వినియోగదారుని ద్రవ్య ఆదాయం
  2. కొనుగోలు చేయాలనుకుంటున్న రెండు వస్తువుల ధరలు.

ఒక వినియోగదారుడు కొనుగోలు చేసే రెండు వస్తువుల ధరలు, ఆదాయాలు స్థిరంగా ఉండి, ఏ సముదాయాలలో ఎ వస్తువులను కొనుగోలు చేయగలుగుతాడో తెలియజేసే రేఖని బడ్జెట్ రేఖ లేదా ధర రేఖ అంటారు. దీనిని ఈ ఉదాహరణ ద్వారా వివరించవచ్చు. వినియోగదారుని ఆదాయం గౌ 5/-, X, Y వస్తువుల ధరలు వరుసగా కే 10.50 పై. కుందాం. దీంతో వినియోగదారుడు కొనుగోలు చేయగలిగిన రెండు వస్తువుల వివిధ సముదాయాలు ఈ క్రింది గా ఉంటాయి.
AP Inter 1st Year Economics Study Material Chapter 2 వినియోగదారుని ప్రవర్తనా సిద్ధాంతాలు 7

వినియోగదారుడు మొత్తం ఆదాయాన్ని ‘X’ పైనే ఖర్చు చేస్తే 5X వస్తువులను మాత్రమే కొనుగోలు చేయగలుగుతాడు, స్తువులను కొనుగోలు చేయలేడు. Y వస్తువు మీద పూర్తిగా ఖర్చు చేస్తే 10 ‘Y’ లను, ‘0’ ‘X’ లను పొందగలుగుతాడు. విధంగా రెండు వస్తువుల ధరలు స్థిరంగా ఉన్నప్పుడు తాను స్థిరమైన ఆదాయంతో కొనుగోలు చేయగలిగిన రెండు వుల వివిధ సముదాయాలకు సంబంధించిన బిందువులను కలిపినట్లయితే బడ్జెట్ రేఖ వస్తుంది. ఈ రేఖ వాలు వస్తువుల ధరల నిష్పత్తిని తెలుపుతుంది. దీనిని క్రింది రేఖాపటం ద్వారా చూపించవచ్చు.
AP Inter 1st Year Economics Study Material Chapter 2 వినియోగదారుని ప్రవర్తనా సిద్ధాంతాలు 8

పై రేఖాపటంలో ‘X’ వస్తువు X అక్షంపై, ‘Y’ వస్తువు Y – అక్షంపై చూపించటం జరిగింది. PL అనేది బడ్జెట్ రేఖ. ఈ రేఖ వాలు XY వస్తువుల సాపేక్ష ధరల నిష్పత్తిని తెలియజేయును. ఏ ఆదాయ పరిమితికి లోబడి వినియోగదారుడు XY లను కొనుగోలు చేస్తున్నాడో బడ్జెట్ ఖ తెలియజేయును.

AP Inter 1st Year Economics Study Material Chapter 2 వినియోగదారుని ప్రవర్తనా సిద్ధాంతాలు

1) రెండు వస్తువుల ధరలు స్థిరంగా ఉండి, వినియోగదారుని ఆదాయం మార్పు చెందితే బడ్జెట్ రేఖ స్థితిలో మార్పు వస్తుంది. ఆదాయం పెరిగితే బడ్జెట్ రేఖ పైకి కదులుతుంది. అదే విధంగా ఆదాయం తగ్గితే, బడ్జెట్ రేఖ క్రిందికి కదులుతుంది. దీనిని క్రింది రేఖాపటం ద్వారా వివరించవచ్చు.
AP Inter 1st Year Economics Study Material Chapter 2 వినియోగదారుని ప్రవర్తనా సిద్ధాంతాలు 9

పై రేఖాపటంలో A1B1 బడ్జెట్ఖ అనుకుందాం. రెండు వస్తువుల ధరలు స్థిరంగా ఉండి ఆదాయం పెరిగితే బడ్జెట్ రేఖ A2B2 పైకి కదులుతుంది. ఆదాయం తగ్గితే బడ్జెట్ రేఖ A0B0 కిందికి కదులుతుంది.

2) ఆదాయం స్థిరంగా ఉండి X వస్తువు లేదా Y వస్తువు ధరలోగాని మార్పు వస్తే బడ్జెట్లేఖ వాలులో మార్పు వస్తుంది. దీనిని ఈ రేఖాపటాల ద్వారా వివరించవచ్చు.
AP Inter 1st Year Economics Study Material Chapter 2 వినియోగదారుని ప్రవర్తనా సిద్ధాంతాలు 10
A రేఖాపటంలో వినియోగదారుని ఆదాయం, Y వస్తువు ధర స్థిరంగా ఉండి X వస్తువు ధరలో మార్పు వస్తే బడ్జెట్ రేఖలో వచ్చే మార్పులను చూపించటం జరిగింది. X వస్తువు ధర తగ్గితే బడ్జెట్ రేఖ AB గాను, X వస్తువు ధర పెరిగితే బడ్జెట్ రేఖ AB0 గాను ఉంటుంది.

B రేఖాపటంలో వినియోగదారుని ఆదాయం, X వస్తువు ధర స్థిరంగా ఉండి, Y వస్తువు ధరలో మార్పు వస్తే బడ్జెట్ రేఖలో వచ్చే మార్పులను చూపటం జరిగింది. Y వస్తువు ధర తగ్గితే బడ్జెట్ రేఖ LP1 గాను, Y వస్తువు ధర పెరిగితే బడ్జెట్ రేఖ LP2 గాను ఉంటుంది.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
కార్డినల్, ఆర్డినల్ ప్రయోజనాలను విభేదించండి.
జవాబు:
కార్డినల్ ప్రయోజన విశ్లేషణ: 18వ శతాబ్దంలో జీవాన్స్, వాల్రాస్ మొదలగువారు ప్రయోజన విశ్లేషణను అభివృద్ధిపరిచారు. ఆ తరువాత మార్షల్, క్లార్క్ మొదలగువారు దీనిని అభివృద్ధిపరిచారు. వినియోగదారుని ప్రవర్తనను అధ్యయనం చేయటానికి కార్డినల్ ప్రయోజన విశ్లేషణను రూపొందించారు. వీరు ప్రయోజనాన్ని కొలవటానికి యుటిల్స్ అనే ఊహాత్మక కొలమానాన్ని ఉపయోగించారు. వీటి ద్వారా వివిధ వస్తువుల నుండి పొందగలిగే ప్రయోజనాన్ని కొలవవచ్చు, పోల్చవచ్చును అని నవ్య సంప్రదాయ ఆర్థికవేత్తలు భావించారు. 1, 2, 3 ……అనేవి కార్డినల్ సంఖ్యలు. ఈ విధమైన విశ్లేషణ కేవలం ఒక మానసిక భావన మాత్రమే.

ఆర్డినల్ ప్రయోజన విశ్లేషణ: జె.ఆర్. హిక్స్, అలెన్ అనే ఆర్థికవేత్తలు వినియోగదారుని ప్రవర్తనను అధ్యయనం చేయుటలో ఆర్డినల్ ప్రయోజన విశ్లేషణను రూపొందించారు. ఈ విశ్లేషణ ద్వారా ప్రయోజనాన్ని సంఖ్యా రూపంలో చెప్పటం సాధ్యం కాదు. వివిధ సముదాయాల నుంచి పొందే వివిధ సంతృప్తి స్థాయిలతో పోల్చి చెప్పడం జరుగుతుంది. అనగా ఒక వస్తు సముదాయం, మరొక వస్తు సముదాయం కంటే ఎంత ఎక్కువ లేదా ఎంత తక్కువ సంతృప్తి ఇస్తుందో చెప్పటానికి వీలు ఉన్నదనే అంశంపై ఉదాసీనత వక్రరేఖలు ప్రతిపాదించటం జరిగింది. 1వ, 2వ, 3వ ఆర్డినల్ సంఖ్యలు. వీరి ఉద్దేశ్యంలో ప్రయోజనం అనేది ఒక మానసిక భావన. దానిని కొలవలేము. కేవలం దేన్ని ఎంత కావాలో, ఎంత ఇష్టపడుతున్నారో మాత్రమే చెప్పగలం. దీనిని ఆర్డినల్ ప్రయోజనం అంటారు.

AP Inter 1st Year Economics Study Material Chapter 2 వినియోగదారుని ప్రవర్తనా సిద్ధాంతాలు

ప్రశ్న 2.
ఉదాసీనత వక్రరేఖల లక్షణాలు. [Mar. ’17, ’16, ’15]
జవాబు:
వినియోగదారుడు కొనుగోలు చేసే రెండు వస్తువుల వివిధ సమ్మేళనాలను తెలియజేసే బిందువులను కలుపగా ఏర్పడే రేఖను “ఉదాసీనత వక్రరేఖ” అని అంటారు.
లక్షణాలు / ధర్మాలు:

  1. ఉదాసీనత వక్రరేఖలు ఋణాత్మక వాలు కలిగి ఉంటాయి. అనగా ఎడమ నుండి కుడికి దిగువకు వాలుతాయి.
  2. ఉదాసీనత వక్రరేఖలు X- అక్షమునుగాని, Y – అక్షమునుగాని తాకవు.
  3. ఉదాసీనత వక్రరేఖలు పరస్పరం ఖండించుకొనవు.
  4. ఇవి మూలబిందువుకు కుంభాకారంలో ఉంటాయి. దీనికి కారణం ప్రతిస్థాపనోపాంత రేటు క్షీణించటం.
  5. ఎక్కువ స్థాయిలో ఉన్న ఉదాసీనత రేఖ ఎక్కువ సంతృప్తి, తక్కువ స్థాయిలో ఉన్న రేఖ తక్కువ సంతృప్తి స్థాయిని సూచిస్తాయి.
  6. పూర్తి ప్రత్యామ్నాయ వస్తువుల విషయంలో సరళరేఖలుగానూ, పూరక వస్తువుల విషయంలో ‘L’ ఆకారంలో ఉదాసీనత వక్రరేఖలు ఉంటాయి.

ప్రశ్న 3.
ఉపాంత ప్రత్యామ్నాయ రేటు
జవాబు:
ఉదాసీనతా వక్రరేఖ విశ్లేషణలో ప్రతిస్థాపనోపాంత రేటు అత్యంత ముఖ్యమైనది. అన్ని సముదాయాలు ఒకే స్థాయిలో సంతృప్తిని ఇవ్వడం వల్ల వినియోగదారుడు ఒక వస్తువు స్థానంలో మరొక వస్తువును ఏ రేటులో ప్రతిస్థాపన చేస్తున్నాడో దానిని ప్రతిస్థాపనోపాంత రేటు అంటారు.

ఉదా: వినియోగదారుడు X, Y వస్తువులను వినియోగిస్తాడు అనుకుందాం. ఈ రెండు వస్తువులు ఒకదానికి బదులు, మరో దానికి ప్రత్యామ్నాయం చేయటానికి వీలు ఉంటుంది. దీనిని ఈ క్రింది పట్టిక ద్వారా వివరించవచ్చు.
AP Inter 1st Year Economics Study Material Chapter 2 వినియోగదారుని ప్రవర్తనా సిద్ధాంతాలు 11

పై పట్టికలో వినియోగదారునికి అందుబాటులో ఉన్న వివిధ సముదాయాలలో A నుండి F వరకు పరిశీలించగా సముదాయం Aలో వినియోగదారునికి X తక్కువగా పొందే అవకాశం ఉంది. X పరిమాణం తక్కువగా ఉండటం వల్ల వినియోగదారుడు X కోసం Y ని వదులుకోవటానికి సిద్ధంగా ఉంటాడు. ఈ విధంగా అదనంగా 1 యూనిట్ X పరిమాణం పొందటానికి 5 యూనిట్ల Y ని వదులుకోవాలి. దీనినే ఉపాంత ప్రత్యామ్నాయ రేటు అంటారు.

ప్రశ్న 4.
ఉదాసీనత పటం
జవాబు:
వివిధ సంతృప్తి స్థాయిలను తెలిపే ఉదాసీనత వక్రరేఖల సముదాయాన్ని ఉదాసీనత పటం అందురు. ‘X’ వస్తువు, ‘Y’ వస్తువు వివిధ సముదాయాలను తెలియజేసే ఉదాసీనత రేఖల సముదాయమే ఉదాసీనత పటం. ఇందులో ఒక్కొక్క IC ఒక్కొక్క రకమైన సముదాయాన్ని తెలియజేయును.
AP Inter 1st Year Economics Study Material Chapter 2 వినియోగదారుని ప్రవర్తనా సిద్ధాంతాలు 12

AP Inter 1st Year Economics Study Material Chapter 2 వినియోగదారుని ప్రవర్తనా సిద్ధాంతాలు

పై రేఖాపటంలో ‘X’ అక్షంపై X వస్తువును, Y అక్షంపై Y వస్తువును చూపటం జరిగింది. IC,, IC2, IC3 అనేవి మూడు వేరువేరు ఉదాసీనత వక్రరేఖలు. ఈ రేఖలు వివిధ ఆదాయ స్థాయిల వద్ద పొందగలిగే సంతృప్తి స్థాయిలను తెలియజేస్తాయి. ఉదాసీనత వక్రరేఖలు కుడివైపుకు జరిగే కొద్ది సంతృప్తి స్థాయిలలో పెరుగుదల సూచిస్తుంది. IC, రేఖ, అన్ని రేఖల కంటే తక్కువ స్థాయి సంతృప్తిని తెలియజేయును.

ప్రశ్న 5.
ధర రేఖ
జవాబు:
వినియోగదారుని కొనుగోలు ముఖ్యంగా రెండు అంశాలపై ఆధారపడి ఉంటుంది. అవి:

  1. వినియోగదారుని ద్రవ్య ఆదాయం.
  2. కొనుగోలు చేయాలనుకుంటున్న రెండు వస్తువుల ధరలు.

ఒక వినియోగదారుడు కొనుగోలు చేసే రెండు వస్తువుల ధరలు, ఆదాయాలు స్థిరంగా ఉండి, ఏ సముదాయాలలో రెండు వస్తువులను కొనుగోలు చేయగలుగుతాడో తెలియజేసే రేఖని బడ్జెట్ రేఖ లేదా ధర రేఖ అంటారు. దీనిని ఈ క్రింది ఉదాహరణ ద్వారా వివరించవచ్చు. వినియోగదారుని ఆదాయం 5/-, X, Y వస్తువుల ధరలు వరుసగా * 10.50 పై. అనుకుందాం. దీంతో వినియోగదారుడు కొనుగోలు చేయగలిగిన రెండు వస్తువుల వివిధ సముదాయాలు ఈ క్రింది విధంగా ఉంటాయి.
AP Inter 1st Year Economics Study Material Chapter 2 వినియోగదారుని ప్రవర్తనా సిద్ధాంతాలు 13

వినియోగదారుడు మొత్తం ఆదాయాన్ని ‘X’ పైనే ఖర్చు చేస్తే 5X వస్తువులను మాత్రమే కొనుగోలు చేయగలుగుతాడు, Y వస్తువులను కొనుగోలు చేయలేడు. Y వస్తువు మీద పూర్తిగా ఖర్చు చేస్తే 10 Y లను, ‘0’ ‘X’ లను పొందగలుగుతాడు. ఈ విధంగా రెండు వస్తువుల ధరలు స్థిరంగా ఉన్నప్పుడు తాను స్థిరమైన ఆదాయంతో కొనుగోలు చేయగలిగిన రెండు వస్తువుల వివిధ సముదాయాలకు సంబంధించిన బిందువులను కలిపినట్లయితే బడ్జెట్ రేఖ వస్తుంది. ఈ రేఖ వాలు రెండు వస్తువుల ధరల నిష్పత్తిని తెలుపుతుంది. దీనిని క్రింది రేఖాపటం ద్వారా చూపించవచ్చు.
AP Inter 1st Year Economics Study Material Chapter 2 వినియోగదారుని ప్రవర్తనా సిద్ధాంతాలు 14

పై రేఖాపటంలో ‘X’ వస్తువు X – అక్షంపై, ‘Y’ వస్తువు Y – అక్షంపై చూపించటం జరిగింది. PL అనేది బడ్జెట్ రేఖ. ఈ రేఖ వాలు XY వస్తువుల సాపేక్ష ధరల నిష్పత్తిని తెలియజేయును. ఏ ఆదాయ పరిమితికి లోబడి వినియోగదారుడు XY లను కొనుగోలు చేస్తున్నాడో బడ్జెట్ రేఖ తెలియజేయును. వినియోగదారునికి ఈ క్రింది అవకాశాలు ఉన్నాయి.

  1. వినియోగదారుడు తన వద్దనున్న 5/- ను ‘X’ వస్తువుపై ఖర్చు చేసినట్లయితే ‘5’ X వస్తువులను మాత్రమే కొనుగోలు చేయగలడు. కాని Y వస్తువును కొనలేడు.
  2. వినియోగదారుడు తన వద్ద ఉన్న 5/- లను ‘Y’ వస్తువుపై ఖర్చు చేసినట్లయితే 10 ‘Y’ వస్తువును మాత్రమే కొనుగోలు చేయగలడు. కాని ‘X’ వస్తువును కొనలేడు.
  3. వాస్తవంగా వినియోగదారుడు రెండు వస్తువులను కోరుకుంటాడు కావున రేఖాపటంలో OPL అనేది అతనికి ఉండే అవకాశం తెలియజేయును.
  4. ‘PL’ బడ్జెట్ రేఖను దాటి వినియోగదారుడు ఒక్క వస్తువును కూడా కొనుగోలు చేయలేడు.

ప్రశ్న 6.
ఉదాసీనత వక్రరేఖల ప్రమేయాలు తెల్పండి.
జవాబు:

  1. వినియోగదారుడు హేతుబద్ధంగా వ్యవహరిస్తాడు. తన పరిమిత ఆదాయంతో గరిష్ట సంతృప్తి పొందటానికి ప్రయత్నిస్తాడు.
  2. ప్రతి వినియోగదారునికి అభిరుచి తరహా ఉంటుంది.
  3. ఉపాంత ప్రతిస్థాపన రేటు క్షీణించును.
  4. ఇది ఆర్డినల్ ప్రయోజన భావన మీద ఆధారపడి ఉంది.
  5. వినియోగదారుడు మార్కెట్ ధరతో సంబంధం లేకుండా తన అభిరుచి తరహా రూపొందించుకుంటాడు. అంటే ఒకదానికంటే మరియొకటి మెరుగైన ఎంపిక.
  6. వినియోగదారుని అభిరుచులు, ప్రవర్తన స్థిరంగా ఉంటాయి.
  7. వినియోగదారుడు వివిధ వస్తు సముదాయాల మధ్య ఉదాసీనంగా ఉంటాడు.

AP Inter 1st Year Economics Study Material Chapter 2 వినియోగదారుని ప్రవర్తనా సిద్ధాంతాలు

ప్రశ్న 7.
ఉదాసీన వక్రరేఖల విశ్లేషణ ఆవశ్యకతను వివరించండి.
జవాబు:

  1. ఇది బహుళ వస్తువుల విశ్లేషణ.
  2. ఇది ఆదాయ ప్రభావం, ధర ప్రభావం, ప్రత్యామ్నాయ ప్రభావాలని విశ్లేషించును.
  3. ఉదాసీనత వక్రరేఖ విశ్లేషణ అస్థిర వాస్తవికతను కలిగి ఉండును.
  4. ద్రవ్య ఉపాంత ప్రయోజనం స్థిరం అనే ప్రమేయం లేకపోవడం వల్ల ధరలో మార్పులను పరిగణిస్తుంది.

ప్రశ్న 8.
సమోపాంత ప్రయోజన సూత్ర పరిమితులను తెల్పండి.
జవాబు:

  1. ఈ సూత్రం మన్నిక కల్గిన వస్తువుల విషయంలో వర్తించదు.
  2. విభజించుటకు వీలుకాని వస్తువుల విషయంలో ఈ సిద్ధాంతం వర్తించదు.
  3. వినియోగదారుడు ఇష్టపడే వస్తువులను మార్కెట్లో లభ్యం కాని పరిస్థితిలో ఈ సూత్రం పనిచేయదు.
  4. వ్యక్తులు సంప్రదాయాలను నెరవేర్చటానికి వ్యయం చేస్తూ ఉంటారు.
    ఉదా: వివాహం, కర్మకాండ మొదలగునవి. అటువంటి వాటి విషయాలలో ఈ సూత్రం వర్తించదు.
  5. వినియోగదారుని ఆదాయం, వస్తువుల ధరలు స్థిరంగా ఉన్నప్పుడే ఈ సూత్రం వర్తిస్తుంది.

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
కార్డినల్ ప్రయోజనం [Mar. ’17, ’15]
జవాబు:
ఆల్ఫ్రెడ్ మార్షల్ కార్డినల్ సంఖ్యా పద్ధతి ద్వారా ప్రయోజన విశ్లేషణ చేసాడు. వివిధ వస్తువుల నుంచి పొందే ప్రయోజనాలను యుటిల్స్ అనే ఊహాత్మక యూనిట్స్ ద్వారా కొలవడానికి వీలుంది అని నవ్య సంప్రదాయ ఆర్థిక వేత్తలు భావించారు. 1, 2, 3 వంటి సంఖ్యలు కార్డినల్ సంఖ్యలు.

ప్రశ్న 2.
ఉపాంత ప్రయోజనం
జవాబు:
ఒక వినియోగదారుడు అదనంగా ఒక వస్తువు యూనిట్ని వినియోగించినప్పుడు మొత్తం ప్రయోజనంలో వచ్చే మార్పును ఉపాంత ప్రయోజనం అంటారు. దీనిని ఈ క్రింది విధంగా కొలవవచ్చు.
MU = ΔTU/ΔQ
ΔTU = మొత్తం ప్రయోజనంలో మార్పు
ΔQ = వస్తు పరిమాణంలో మార్పు.

ప్రశ్న 3.
వినియోగదారుని సమతౌల్యం
జవాబు:
సమతౌల్యం అనగా ఒక నిశ్చల స్థితి. వినియోగదారుడు తన వద్దనున్న పరిమిత ద్రవ్యంతో ఎక్కువ తృప్తిని పొందటానికి ప్రయత్నిస్తాడు. ఉపయోగించే వస్తువు ఉపాంత ప్రయోజనాలు సమానమైనప్పుడు మొత్తం ప్రయోజనం గరిష్టమవుతుంది. మొత్తం ప్రయోజనం గరిష్టమైనప్పుడు వినియోగదారుడు సమతౌల్యంలో ఉంటాడు.

AP Inter 1st Year Economics Study Material Chapter 2 వినియోగదారుని ప్రవర్తనా సిద్ధాంతాలు

ప్రశ్న 4.
బడ్జెట్ రేఖ [Mar 16]
జవాబు:
ఒక వినియోగదారుడు కొనుగోలుచేసే రెండు వస్తువుల ధరలు, ఆదాయాలు స్థిరంగా ఉండి ఏ సముదాయాలలో రెండు వస్తువులను కొనుగోలు చేయగలుగుతాడో తెలియజేసే దానిని బడ్జెట్ రేఖ లేదా ధర రేఖ అని అంటారు.

ప్రశ్న 5.
సమోపాంత ప్రయోజనం
జవాబు:
వినియోగదారుడు తన దగ్గర ఉన్న పరిమిత ద్రవ్యాన్ని వివిధ వస్తువుల మీద ఖర్చు చేసినప్పుడు ప్రతి చివరి రూపాయి నుంచి అతను పొందే ఉపాంత ప్రయోజనం సమానం అయ్యేటట్లు చూసుకోవాలి. అప్పుడు వినియోగదారుడు గరిష్ట సంతృప్తి పొందుతాడు. దీనినే సమోపాంత ప్రయోజన సూత్రం అంటారు.

ప్రశ్న 6.
ఉదాసీనత వక్రరేఖ
జవాబు:
వినియోగదారుడు కొనుగోలుచేసే రెండు వస్తువుల వివిధ సమ్మేళనాలను తెలియజేసే బిందువులను కలుపగా ఏర్పడే రేఖను “ఉదాసీనత వక్రరేఖ” అని అంటారు. దీనిని ఆర్డినల్ భావనపై ప్రతిపాదించటమైనది.

ప్రశ్న 7.
ప్రతిస్థాపనోపాంత రేటు
జవాబు:
అన్ని సముదాయాలు ఒకే స్థాయిలో సంతృప్తిని ఇవ్వటం వల్ల వినియోగదారుడు ఒక వస్తువు స్థానంలో మరొక వస్తువును ఏ రేటులో ప్రతిస్థాపన చేస్తున్నాడో దానిని ప్రతిస్థాపనోపాంత రేటు అంటారు. ఈ ప్రతిస్థాపనోపాంత రేటు ఉదాసీనత రేఖ స్వభావాన్ని, వాలును నిర్ణయించును.

అదనపు ప్రశ్నలు

ప్రశ్న 8.
ఉదాసీనత వక్రరేఖ పటం
జవాబు:
వినియోగదారుని అభిరుచి తరహాను తెలియజేసే అనేక ఉదాసీనతా వక్రరేఖల సముదాయం.
AP Inter 1st Year Economics Study Material Chapter 2 వినియోగదారుని ప్రవర్తనా సిద్ధాంతాలు 15

ప్రశ్న 9.
ఉదాసీనత పట్టిక
జవాబు:
వినియోగదారుడు ఉదాసీనంగా ఉండే వివిధ వస్తు సముదాయాలను తెలియజేయునది.

ప్రశ్న 10.
ఆర్డినల్ ప్రయోజనం
జవాబు:
హిక్స్, అలెస్ అనేవారు వినియోగదారుని ప్రవర్తనను అధ్యయనం చేయుటలో ఆర్డినల్ ప్రయోజన విశ్లేషణను సమర్థించారు. ఈ విశ్లేషణ ద్వారా ప్రయోజనాన్ని సంఖ్యారూపంలో ఖచ్చితంగా చెప్పటం సాధ్యం కాదు. అయితే వివిధ సముదాయాల నుంచి పొందే వివిధ సంతృప్తి స్థాయిలతో పోల్చి చెప్పటం జరుగుతుంది. 1, 2, 3 అనేవి ఆర్డినల్ సంఖ్యలు.

ప్రశ్న 11.
ప్రయోజనం
జవాబు:
ఒక వస్తువుకు ఉండే మానవుని కోరికను తీర్చగలిగే శక్తి. ఇది నాలుగు రకాలు.

  1. ఆకార ప్రయోజనం
  2. స్థల ప్రయోజనం
  3. కాల ప్రయోజనం
  4. సేవా ప్రయోజనం

AP Inter 1st Year Economics Study Material Chapter 2 వినియోగదారుని ప్రవర్తనా సిద్ధాంతాలు

ప్రశ్న 12.
మొత్తం ప్రయోజనం
జవాబు:
ఒక వినియోగదారుడు ఒక వస్తువును వినియోగం చేసేటప్పుడు లభించే మొత్తం తృప్తిని మొత్తం ప్రయోజనం అంటారు. ఉదా: ఒక యూనిట్ వినియోగం చేసే 20 యుటిల్స్ ప్రయోజనం వచ్చింది, రెండు యూనిట్లు ఉపయోగిస్తే, 35 యుటిల్స్ వస్తే వచ్చే మొత్తం ప్రయోజనం 55 యుటిల్స్ (1 + 2 Utils).
∴ TUx = f(Qx)

AP Inter 1st Year Economics Study Material Chapter 1 పరిచయం

Andhra Pradesh BIEAP AP Inter 1st Year Economics Study Material 1st Lesson పరిచయం Textbook Questions and Answers.

AP Inter 1st Year Economics Study Material 1st Lesson పరిచయం

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
సంపద నిర్వచనం గురించి చర్చించండి.
జవాబు:
అర్థశాస్త్రానికి సంపద నిర్వచనాన్ని ఆడమస్మిత్ అనే ఆర్థికవేత్త తెలియజేసారు. ఆడమ్స్మత్ను అర్థశాస్త్ర ” పితామహుడుగా చెప్పవచ్చు. ఇతని ఉద్దేశ్యంలో అర్థశాస్త్రం సంపదను గురించి వివరించే శాస్త్రం. ఆడమస్మిత్ తన ప్రఖ్యాతి పొందిన “రాజ్యాల సంపద” అనే గ్రంథంలో అర్థశాస్త్రాన్ని “రాజ్యాల సంపద స్వభావం, కారణాల పరిశీలన” అని నిర్వచించాడు. ఆడమస్మిత్ ఉద్దేశ్యంలో మానవుని ప్రధాన కార్యకలాపము సంపదను ఆర్జించడం. అతని అనుచరులయిన జె.బి. సే, జె. యస్, సాజ్ మొదలగువారు సంపద నిర్వచనాన్ని సమర్థించారు.

సంపద నిర్వచనములోని ప్రధానాంశాలు:
ఆడమస్మిత్ సంపద నిర్వచనంలోని ప్రధానాంశాలు క్రింది విధంగా పేర్కొన్నారు.

  1. మానవుని ఆర్థిక కార్యకలాపాల ముఖ్యోద్దేశం సంపదను ఆర్జించడం.
  2. సంపద అంటే ఉత్పత్తి చేయబడిన వస్తువులు.
  3. మానవుని స్వార్థపరమైన ఆలోచన సంపదను ఎక్కువగా ఆర్జించడం.

విమర్శ: అర్థశాస్త్రం సంపదను గురించి వివరించే శాస్త్రమనే సంకుచిత భావన వల్ల ఈ నిర్వచనం విమర్శలకు గురి అయింది.
1) కార్లెల్, రస్కిన్ అర్థశాస్త్రం నిర్వరహన్ని విమర్శించాడు. వారి ఉద్దేశ్యంలో ఈ నిర్వచనం సామాన్య మానవుని కార్యకలాపాలను గురించి అధ్యయనం చేయాలిగాని, ఆర్థిక మానవుని గురించికాదు అని విమర్శించారు. దానివల్ల వారు దీనిని “దయనీయమైన” శాస్త్రంగా వర్ణించారు.

AP Inter 1st Year Economics Study Material Chapter 1 పరిచయం

2) ఆడమస్మిత్ తన నిర్వచనంలో సంపదకు అత్యధిక ప్రాధాన్యతను ఇచ్చినాడు. కాని సంపద అనేది కేవలం మానవుని కోరికను తీర్చే ఒక సాధనం మాత్రమేనని మార్షల్ విమర్శించాడు.

3) కేవలం భౌతిక వస్తువులను మాత్రమే ఆడమ్స్మిత్ సంపదగా పరిగణించారు. అభౌతిక కార్యకలాపాలైన ఉపాధ్యాయుల, వైద్యుల సేవలను పరిగణనలోనికి తీసుకోలేదు. అందువల్ల అర్థశాస్త్ర పరిధి పరిమితమై పోతుంది.

4) సంపద నిర్వచనం కేవలం ఉత్పత్తి వైపు మాత్రమే దృష్టిని కేంద్రీకరిస్తోంది. పంపిణీని నిర్లక్ష్యం చేస్తుంది.

5) స్వార్థాన్ని పెంచును: సంపద నిర్వచనంలో సంపదకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. మానవుడు స్వార్థపరుడు, కనుక స్వప్రయోజనం కోసం పనిచేస్తాడు. స్మిత్ దృష్టిలో స్వప్రయోజనానికి, సామాజిక ప్రయోజనానికి తేడా లేదు. ఈ నిర్వచనం వల్ల ఆర్థిక వ్యక్తి ఏర్పడతాడు. ఈ ఆర్థిక వ్యక్తి పూర్తిగా స్వార్థపూరితమైనవాడు.

6) ధన దేవత ఉద్భోద (Gosfel of Mammon): ఈ నిర్వచనం సంపద సృష్టికి ప్రాధాన్యతనిస్తుంది. అందువల్ల దీనిని థామస్, కార్లెల్ “ధన దేవత”గా పేర్కొన్నారు.

7) లోపభూయిష్టమైనది: వాల్రాస్ కూడా సంపద నిర్వచనాన్ని పరిశీలించి అది లోపభూయిష్టమైనదని, అశాస్త్రీయమైనదని, అసంపూర్ణమైనదని పేర్కొనెను.

8) సంకుచితమైనది ఆడమస్మిత్ తన నిర్వచనంలో సంపదకు ప్రాధాన్యత ఇచ్చాడు. కాని సంపద మానవుని కోర్కెలను సంతృప్తిపరచటానికి ఒక సాధనంగా ఉండాలి. అనగా వ్యక్తికి ప్రాధాన్యత ఇవ్వాలి కాని, సంపదకు కాదు. ఈ విషయంలో సంపద నిర్వచనం అర్థశాస్త్రాన్ని సంకుచిత దృష్టిలో వివరించింది.

ఇన్ని లోపాలున్న కారణంగానే ఎక్కువమంది ఆర్థికవేత్తలు ఈ నిర్వచనాన్ని తిరస్కరించారు.

ప్రశ్న 2.
సంక్షేమం నిర్వచనం గురించి వివరించండి.
జవాబు:
మార్షల్ అర్థశాస్త్రాన్ని “మానవుడు అతని శ్రేయస్సు గురించి చర్చించే శాస్త్రంగా” నిర్వచించారు. ఆయన నిర్వచనంలో మానవుడికి ప్రథమ స్థానాన్ని, సంపదకు ద్వితీయ స్థానాన్ని ఇచ్చారు. మార్షల్ ఉద్దేశ్యం ప్రకారం “దైనందిన కార్యకలాపాల్లో మానవ ప్రవర్తన గురించి అధ్యయనం చేసేది రాజకీయ అర్థశాస్త్రం. శ్రేయస్సును సాధించడం కోసం వ్యక్తి, సమాజం

ప్రవర్తనను గురించి అధ్యయనం చేస్తుంది. ఈ విధంగా ఒకవైపు సంపదను గురించి అధ్యయనం చేస్తూ, మరొకవైపు అధిక ప్రాధాన్యమైన మానవుని గురించి అధ్యయనం చేస్తుంది.” మార్షల్ అనుచరులైన ఏ.సి. పిగూ, ఎడ్విన్ కానస్ వంటి వారు మార్షల్ నిర్వచనాన్ని సమర్థించారు.

ముఖ్య లక్షణాలు:

  1. సంక్షేమాన్ని పెంపొందింపజేసే మానవ కార్యకలాపాలను గురించి మాత్రమే మార్షల్ నిర్వచనం పరిగణిస్తోంది.
  2. మానవునికి, మానవ శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇస్తూ సంపద అనేది మానవ సంక్షేమాన్ని పెంపొందింపజేసే సాధనంగా పేర్కొన్నాడు.
  3. ఇది కేవలం మానవుని ఆర్థిక విషయాలనే అధ్యయనం చేస్తుంది. రాజకీయ, సామాజిక, మత సంబంధమైన విషయాలతో దీనికి సంబంధం లేదు.
  4. మానవ సంక్షేమాన్ని పెంపొందింపజేయడానికి అవసరమైన భౌతిక సంపదను సముపార్జించడంలో వ్యక్తి, సమాజం ప్రవర్తనను అధ్యయనం చేస్తుంది.

విమర్శ: మార్షల్ నిర్వచనం కూడా అనేక విమర్శలకు గురైంది. ముఖ్యంగా రాబిన్స్, మార్షల్ యొక్క “శ్రేయస్సు” అనే భావనను విమర్శించాడు.

  1. అర్థశాస్త్రం సామాజిక శాస్త్రంగాని, మానవశాస్త్రం కాదు. అర్థశాస్త్ర మౌలిక సూత్రాలు మానవులందరికి వర్తిస్తాయి. అందువల్ల అర్థశాస్త్రాన్ని మానవ శాస్త్రంగానే తప్ప సామాజిక శాస్త్రంగా పరిగణించరాదు.
  2. మార్షల్ వస్తువులను భౌతిక మరియు అభౌతికమైనవిగా విభజించడం జరిగింది. కాని, తన నిర్వచనంలో అభౌతిక వస్తువులకు ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వలేదు.
  3. శ్రేయస్సును కొలవవచ్చు అనేది తీవ్రమైన అభ్యంతరంగా రాబిన్స్ విమర్శించారు. శ్రేయస్సు అనేది వ్యక్తిని బట్టి, కాలాన్ని బట్టి మారుతుంది.
  4. మానవ శ్రేయస్సును పెంపొందించే కార్యకలాపాలను మాత్రమే మార్షల్ పరిగణించాడు. అయితే మద్యం, విషంలాంటివి కూడా శ్రేయస్సును కలుగజేస్తాయి. మార్షల్ వీటిని విస్మరించాడు.

AP Inter 1st Year Economics Study Material Chapter 1 పరిచయం

ప్రశ్న 3.
సంక్షేమ నిర్వచనం కంటే రాబిన్స్ నిర్వచనం ఏ విధంగా మెరుగైనది ?
జవాబు:
శ్రేయస్సు నిర్వచనం: ఆడమస్మిత్ నిర్వచనంలోని లోపాలను మార్షల్ సరిదిద్దడానికి ప్రయత్నించాడు. మానవుడికి సంపదను ఆర్జించటమే అంతిమ ధ్యేయం కాదని, ఒక లక్ష్యాన్ని సాధించడానికి సంపద ఒక సాధనం మాత్రమేనని అన్నాడు. ఆ ఉద్దేశ్యంతో మార్షల్ మానవునికి ప్రథమ స్థానం, సంపదకు ద్వితీయ స్థానం ఇచ్చాడు. మార్షల్ ప్రకారం అర్థశాస్త్రం అనగా ఒకవైపు సంపద గురించిన చర్చ అని అంతకంటే ముఖ్యంగా మరొకవైపు మానవుని గురించిన పరిశీలనలో ఒక భాగం. అర్థశాస్త్రాన్ని మానవుని శ్రేయస్సుపై దృష్టిని కేంద్రీకరించే శాస్త్రంగా నిర్వచించెను. మార్షల్ పాటు పిగూ, ఎడ్విన్ కానన్, బెవరిడ్జి మొదలైనవారు కూడా శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని అర్థశాస్త్రాన్ని నిర్వచించారు.

శ్రేయస్సు నిర్వచనంలోని లోపాలు:

  1. అర్థశాస్త్రం సాధారణ మానవుని దైనందిన కార్యకలాపాలను పరిశీలిస్తుంది.
  2. సంఘటిత సమాజంలోని మానవుని ఆర్థిక కార్యకలాపాలను మాత్రమే అర్థశాస్త్రం పరిశీలిస్తుంది.
  3. శ్రేయస్సుకు ప్రథమ స్థానం, సంపదకు ద్వితీయ స్థానం ఇవ్వటం జరిగింది. సంపద మానవ శ్రేయస్సుకు సాధనం మాత్రమే.
  4. భౌతిక వస్తువుల ఆర్జన వినియోగాలను మాత్రమే అర్థశాస్త్రం అధ్యయనం చేస్తుంది. ఆర్థికేతర కార్యకలాపాలను అర్థశాస్త్రం అధ్యయనం చేయదు.

కొరత నిర్వచనం: మార్షల్ నిర్వచనాన్ని విమర్శించి రాబిన్స్ అర్థశాస్త్రానికి విశ్లేషణాత్మక నిర్వచనాన్ని ఇచ్చారు. ‘యాన్ ఎస్సే ఆన్ ది నేచర్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎకనామిక్ సైన్స్’ అనే గ్రంథంలో రాబిన్స్ తన నిర్వచనాన్ని తెలియజేసెను. మానవుని అపరిమితమైన కోరికలను ప్రత్యామ్నాయ ప్రయోజనాలున్న పరిమిత సాధనాలకు ఉండే సంబంధం పట్ల మానవ ప్రవర్తన అధ్యయనమే అర్థశాస్త్రం” అని నిర్వచించెను. ఈ నిర్వచనంలో మానవ జీవితానికి సంబంధించిన కొన్ని నిత్య సత్యాలు ఉన్నాయి.

1) అపరిమిత కోరికలు: మానవుని కోరికలు అపరిమితం. ఒక కోరిక తీరగానే మరొక కోరిక ఉద్భవిస్తుంది. వాటిని తీర్చుకోవడానికి మానవుడు నిరంతరం కృషి జరపటం వల్ల ఆర్ధిక కార్యకలాపాలు కొనసాగుతాయి.

2) వనరులు పరిమితం: మానవుని కోర్కెలు సంతృప్తిపరిచే సాధనాలు లేదా వనరులు పరిమితమైనవి. సాధనాలు పరిమితంగా ఉండటం వల్ల కొరత మరియు ఆర్థిక సమస్యలు ఉత్పన్నమౌతున్నాయి.

3) ప్రత్యామ్నాయ ప్రయోజనాలు: వనరులు పరిమితంగా ఉండటమే కాకుండా వాటికి ప్రత్యామ్నాయ ప్రయోజనాలు ఉన్నాయి. అనగా ఒక సాధనానికి అనేక ఉపయోగాలు ఉంటాయి.

4) ఎంపిక: సాధనాల కొరత, అపరిమితమైన కోరికల వల్ల ఎంపిక అంశం అతి ముఖ్యమైనదిగా ఉంటుంది. సాధనాల కేటాయింపులోను, కోరికల ప్రాధాన్యతను అనుసరించి సంతృప్తిపరిచే విషయంలోను ఎంపిక సమస్య ఉత్పన్నమవుతుంది.

రాబిన్స్ నిర్వచనం మార్షల్ నిర్వచనం కంటే శాస్త్రీయమైనది:
1) కార్యకలాపాలను విభజించలేదు మార్షల్ అర్థశాస్త్రంలో భౌతిక అంశాలను గూర్చి మాత్రమే వివరించాడు. కాని రాబిన్స్ భౌతిక, అభౌతిక అంశాలను రెండింటిని గూర్చి అర్థశాస్త్రంలో చర్చించాడు.

AP Inter 1st Year Economics Study Material Chapter 1 పరిచయం

2) శ్రేయస్సును విమర్శించుట మార్షల్ శ్రేయస్సు అనే పదానికి, అర్థశాస్త్రానికి ముడిపెట్టాడు. కాని రాబిన్స్ ప్రకారం, అర్థశాస్త్రానికి శ్రేయస్సుతో ఏ మాత్రం సంబంధం లేదు. కారణం అర్థశాస్త్రంలో శ్రేయస్సుకు దోహదపడని వస్తువులు ఉదాహరణకి మత్తు పానీయాలు, సిగరెట్లు, విషం మొదలగు వాటిని గూర్చి కూడా చర్చిస్తాం.

3) లక్ష్యాల మధ్య తటస్థంగా ఉండుట: రాబిన్స్ ప్రకారం అర్థశాస్త్రం లక్ష్యాల మధ్య తటస్థంగా ఉంటుంది. ఏది మంచి, ఏది చెడు అనే నిర్ణయాలను చేయదు. అందువల్ల ఇది వాస్తవిక శాస్త్రం.

4) శాస్త్రీయమైనది: రాబిన్స్ నిర్వచనం వల్ల ఆర్థిక సమస్య ఏ విధంగా ఏర్పడుతుందో తెలుసుకోవడానికి వీలైనది. రాబిన్స్ అర్థశాస్త్రాన్ని శాస్త్రీయ స్థాయికి చేర్చి, ఎంపిక శాస్త్రంగా మలిచాడు.

5) పరిధిని విస్తృతపరిచింది: ఈ నిర్వచనం అన్ని రకాల ఆర్థిక వ్యవస్థలకు వర్తిస్తుంది. “వనరుల కొరత” అనేది ఒక సార్వత్రిక సమస్య. కనుక ఈ నిర్వచనం వల్ల అర్థశాస్త్ర పరిధి కూడా విస్తరించింది.
రాబిన్స్ నిర్వచనం మార్షల్ నిర్వచనం కంటే మెరుగైనప్పటికి కొన్ని విమర్శలకు గురైనది.

విమర్శ:
1) ఈ నిర్వచనం కొరతగా ఉన్న వనరులను ఉపయోగించి గరిష్ట స్థాయిలో కోరికలను ఏ విధంగా సంతృప్తి పరుచుకోవాలో అనే విషయం మీద దృష్టి సారించలేదు. విమర్శకుల అభిప్రాయం ప్రకారం ఈ నిర్వచనంలో శ్రేయస్సు అనే భావన అంతర్గతంగా ఇమిడి ఉంది.

2) రాబిన్స్ నిర్వచనానికి మరొక విమర్శ, ఇది మారుతున్న సమాజానికి వర్తించదు. కాలం మారుతున్న కొద్ది అనేక మార్పులు వస్తాయి. కాబట్టి వనరుల కొరత అనే సమస్యను అధిగమించవచ్చు.

3) ఆధునిక అర్థశాస్త్రంలో చాలా ముఖ్యమైన జాతీయ ఆదాయం, ఉద్యోగిత వంటి స్థూల ఆర్థిక విశ్లేషణను రాబిన్స్ నిర్వచనం విస్మరించింది.

4) ఆర్థిక వృద్ధి, ఆర్థికాభివృద్ధి వంటి ఆధునిక అర్థశాస్త్రానికి సంబంధించిన ముఖ్యాంశాలను కొరత నిర్వచనంలో చర్చించలేదు.

5) శ్రీమతి జాన్ రాబిన్సన్ ఈ నిర్వచనాన్ని విమర్శించారు. ఆర్థిక వ్యవస్థలో ఉపయోగించని వనరులు ఎక్కువగా ఉన్నప్పుడు ముఖ్య సమస్య వనరుల కొరత మాత్రమే కాదని, ఉన్న వనరులను ఏ విధంగా ఉపయోగించుకోవాలనేదే ముఖ్యమని ఆమె అభిప్రాయము.

ప్రశ్న 4.
ఆచార్య సామ్యూల్సన్ వృద్ధి నిర్వచనాన్ని తెలియజేయండి.
జవాబు:
రాబిన్స్, నిర్వచనంలో నిశ్చల దృక్పధం ఉన్నదని, కాలానుగుణంగా కోరికలు, లక్ష్యాలు, వనరులు, ఎంపికలు మారుతూ ఉంటాయని సామ్యూల్సన్ అభిప్రాయం. అందువల్ల రాబిన్స్ నిర్వచనంలో ఇమిడి ఉన్న నిశ్చలత్వాన్ని తొలగించి చలనత్వాన్ని కల్పిస్తూ సామ్యూల్సన్ కొత్త నిర్వచనం ఇచ్చాడు.

నిర్వచనం: “ప్రత్యామ్నాయ ప్రయోజనాలున్న పరిమితమైన ఉత్పాదక వనరులను ప్రజలు, సమాజం ద్రవ్యంతోగాని, ద్రవ్యం లేకుండాగాని ఎంపిక చేసుకొని ఉపయోగించుకోవడం ద్వారా వస్తూత్పత్తి చేపట్టి దానిని సమాజంలోని వివిధ వర్గాల ప్రజల మధ్య వర్తమాన లేదా భవిష్యత్కాలంలో ఏ విధంగా పంపిణీ చేసుకోవడం జరుగుతుందనే విషయ పరిశీలనే అర్థశాస్త్రము.”

AP Inter 1st Year Economics Study Material Chapter 1 పరిచయం

నిర్వచనంలోని ముఖ్యాంశాలు:
1) వనరుల కొరత: రాబిన్స్ నిర్వచనంలో వలెనే సామ్యూల్సన్ కూడా వనరుల కొరత, అపరిమితమైన కోరికలు, ప్రత్యామ్నాయ ప్రయోజనాలున్న వనరులు అనే వాటినే బలపరచాడు.

2) ఆర్థిక వృద్ధి: సామ్యూల్సన్ తన నిర్వచనంలో ఆర్థికవృద్ధికి ప్రాధాన్యతయిచ్చాడు. కాలానుగుణంగా వివిధ వస్తువులను ఉత్పత్తి చేయడం, వస్తువులను వర్తమాన, భవిష్యత్కాలంలో పంపిణీ చేయడం అనే పదాలు కాల ప్రాముఖ్యాన్ని తెలుపుతాయి. ఆర్థిక వృద్ధి ప్రాముఖ్యాన్ని తెలియజేసే ప్రస్తుత వినియోగము, భవిష్యత్ వినియోగము కూడా ప్రాధాన్యతను కలిగి ఉన్నాయి.

3) చలన స్వభావం: సామ్యూల్సన్ నిర్వచనం చలనత్వం కలిగి ఉండటమే కాక విస్తృత పరిధి కలిగి ఉంది. ఎంపిక సమస్య ద్రవ్య ఆర్థిక వ్యవస్థలోనే కాకుండా వస్తుమార్పిడి సమస్యలో కూడా ఉంది.

4) ఎంపిక సమస్య: ఎంపిక సమస్య సామ్యూల్సన్ చలన దృష్టిలో పరిగణిస్తాడు. ఎంపిక వర్తమానానికే కాకుండా భవిష్యత్కాలానికి కూడా సంబంధించినది. మానవుని కోరికలు స్థిరంగా ఉండవు. అవి కాలంతోపాటు పెరుగుతూ, మారుతూ ఉంటాయి. ఈ మార్పులకు అనుగుణంగా వనరులను పెంచాలి, మార్పులను తీసుకొని రావాలి. కనుక అర్థశాస్త్రానికి చలనత్వ స్వభావం ఉంటుంది.

కనుక ఈ నిర్వచనం అధిక ప్రజాదరణ పొందింది. మిగిలిన నిర్వచనాల కంటే ఈ నిర్వచనం సమగ్రమైనది. 5. ‘సూక్ష్మ’, ‘స్థూల’ అర్థశాస్త్రాల మధ్య తేడాలను తెలియజేయండి.
జవాబు: ఆర్థిక సమస్యల విశ్లేషణకు ఆధునిక ఆర్థికవేత్తలు రెండు మార్గాలను అవలంబించారు. అవి:

  1. సూక్ష్మ అర్థశాస్త్రం
  2. స్థూల అర్థశాస్త్రం

రాగ్నార్ష్ మొదటిసారిగా 1933లో సూక్ష్మ, స్థూల అనే పదాలను అర్థశాస్త్రములో ప్రవేశపెట్టారు.
1. సూక్ష్మ అర్థశాస్త్రం: సూక్ష్మ అర్థశాస్త్రం అనేది ‘Micros’ అనే గ్రీకు పదం నుండి పుట్టింది. ‘Micro’ అంటే చిన్న అని అర్థం. సూక్ష్మ అర్థశాస్త్రం ఒక వైయుక్తిక ఆర్థిక యూనిట్ను పరిగణనలోనికి తీసుకొని దాని ప్రవర్తనను సమగ్రంగా అధ్యయనం చేస్తుంది. సూక్ష్మ అర్థశాస్త్రము ఆర్థిక వ్యవస్థలోని చిన్న చిన్న భాగాలను గూర్చి అధ్యయనం చేస్తుంది. వైయుక్తిక యూనిట్లను గూర్చి వివరంగా పరిశీలిస్తుంది. ఇవి జాతీయ ఆర్థిక వ్యవస్థలో చిన్న చిన్న భాగాలు లేదా వైయుక్తిక యూనిట్లు మాత్రమే. ఒక వినియోగదారుడు తన ప్రయోజనాన్ని ఏ విధంగా గరిష్టం చేసుకుంటాడో, ఒక సంస్థ గరిష్ట లాభాలను ఏ విధంగా పొందుతుందో సూక్ష్మ అర్థశాస్త్రము మనకు తెలుపుతుంది. వస్తువుల ఉత్పత్తి కారకాల ధరలు ఏ విధంగా నిర్ణయించబడతాయో సూక్ష్మ అర్థశాస్త్రము పరిశీలిస్తుంది. అందువలననే దీనిని ధరల సిద్ధాంతము అని కూడా పిలుస్తారు.

AP Inter 1st Year Economics Study Material Chapter 1 పరిచయం

2. స్థూల అర్థశాస్త్రం: స్థూల అర్థశాస్త్రం అనేది ‘Macros’ అనే గ్రీకు పదం నుండి వచ్చింది. ‘Macros’ అంటే పెద్ద అని అర్థం. స్థూల అర్థశాస్త్రం మొత్తం ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన అంశాలను అధ్యయనం చేస్తుంది. జాతీయాదాయం, మొత్తం వినియోగం, మొత్తం పొదుపు, మొత్తం ఉద్యోగిత మొదలైన సమిష్టి అంశాలను స్థూల అర్థశాస్త్రం అధ్యయనం చేస్తుంది..

J.M. కీన్స్ స్థూల అర్థశాస్త్రానికి ఎక్కువ ప్రాచుర్యాన్ని కల్పించారు. ఆర్థికమాంద్యం కాలంలో ఆయన రాసిన | పుస్తకం ఉద్యోగిత, వడ్డీ, ద్రవ్య సాధారణ సిద్ధాంతం ప్రచురణ తరువాత స్థూల ఆర్థిక సిద్ధాంతానికి ఎక్కువ ప్రాచుర్యం లభించింది.

స్థూల అర్థశాస్త్రాన్ని “ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతం” అని కూడా అంటారు. ఎందుకంటే ముఖ్యంగా ఆదాయం, ఉత్పత్తి, ఉద్యోగితా సిద్ధాంతాలను పరిగణనలోకి తీసుకొని వివరిస్తుంది.

సూక్ష్మ, స్థూల అర్థశాస్త్రాల మధ్య తేడాలు:
సూక్ష్మ అర్థశాస్త్రం

  1. సూక్ష్మ అర్థశాస్త్రం అనేది Micros అనే గ్రీకు పదం నుంచి ఉద్భవించింది. Micro అనగా చిన్న అని అర్థం.
  2. ఆర్థిక వ్యవస్థలో వ్యక్తిగత భాగాలను గురించి అధ్యయనం చేస్తుంది.
  3. దీనిని ధరల సిద్ధాంతం అని కూడా అంటారు.
  4. వస్తు, కారకాల మార్కెట్ ధర నిర్ణయం గురించి వివరిస్తుంది.
  5. డిమాండ్, సప్లయ్పై ఆధారపడి ధరల యంత్రాంగం ఉంటుంది.

స్థూల అర్థశాస్త్రం

  1. స్థూల అర్థశాస్త్రం అనేది Macros అనే గ్రీకు పదం నుంచి జనించింది. Macro అనగా పెద్ద అని అర్థం.
  2. ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని అధ్యయనం చేస్తుంది.
  3. ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతం అని కూడా అంటారు.
  4. జాతీయాదాయం, సమిష్టి ఉద్యోగిత, సమిష్టి పొదుపు, పెట్టుబడి సాధారణ ధరలస్థాయి, ఆర్థికాభివృద్ధి మొదలైన అంశాలను చర్చిస్తుంది.
  5. సమిష్టి డిమాండ్, సమిష్టి సప్లయ్ ప్రాతిపదికగా ఉంటుంది.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ఉచిత వస్తువులు, ఆర్థిక వస్తువుల మధ్య తేడాలు.
జవాబు:
మానవుని కోర్కెలను సంతృప్తిపరచగలిగే ఏ పదార్థాన్నైనా అర్థశాస్త్రంలో “వస్తువు” అంటారు. వస్తువులు ప్రాథమికంగా రెండు రకములు. అవి: 1) ఉచిత వస్తువులు 2) ఆర్థిక వస్తువులు
1. ఉచిత వస్తువులు: డిమాండ్ కంటే సప్లై శాశ్వతంగా ఎక్కువగా ఉండి, ధరలేని వస్తువులను ఉచిత వస్తువులంటారు. ఇవి మానవ నిర్మితాలు కాదు, ప్రకృతి ప్రసాదించినవి. వీటికి ఉపయోగిత విలువ మాత్రమే ఉంటుంది. ఉదా: గాలి, నీరు.

2. ఆర్థిక వస్తువులు: డిమాండ్ కంటే సప్లై తక్కువగా అనగా కొరతగా ఉండి ధర కలిగిన వస్తువులను ఆర్థిక వస్తువులు అంటారు. ఇవి మానవ నిర్మితాలు. వీటికి ఉత్పత్తి వ్యయం ఉంటుంది. వీటికి ఉపయోగిత విలువ, వినిమయ విలువలు ఉంటాయి.
ఉదా: ఆహారము, వస్త్రాలు, యంత్రాలు మొదలైనవి. ఇవి ఉచితంగా అనుభవించడానికి వీలుండదు.

1. ఉచిత వస్తువులు, ఆర్థిక వస్తువుల మధ్య తేడాలు.
ఉచిత వస్తువులు

  1. ఇవి ప్రకృతి బహుకరించినవి.
  2. వీటి సప్లై సమృద్ధిగా ఉంటుంది.
  3. వీటికి ధర ఉండదు.
  4. వీటికి ఉత్పత్తి వ్యయం ఉండదు.
  5. ఉపయోగిత విలువ ఉంటుంది.
  6. ఇవి జాతీయాదాయంలో చేర్చబడవు.

ఆర్థిక వస్తువులు

  1. ఇవి మానవుడిచే తయారుచేయబడినవి..
  2. డిమాండ్ కంటే సప్లై ఎప్పుడు తక్కువగా ఉంటుంది.
  3. వీటికి ధర ఉంటుంది.
  4. వీటికి ఉత్పత్తి వ్యయం ఉంటుంది.
  5. ఉపయోగిత విలువ, వినిమయ విలువ రెండూ ఉంటాయి.
  6. ఇవి జాతీయాదాయంలో చేర్చబడతాయి.

AP Inter 1st Year Economics Study Material Chapter 1 పరిచయం

ప్రశ్న 2.
కోరికల లక్షణాలు. [Mar. ’17, ‚ ’16, ’15]
జవాబు:
మానవుని కోరికలు, ఆర్థిక కార్యకలాపాలు పురోగతికి దోహదం చేస్తాయి. కోరికలు లేనిదే వినియోగం ఉండదు. ఉత్పత్తి ఉండదు, పంపిణి ఉండదు, వినిమయం ఉండదు..
కోరికలు లక్షణాలు:
1. కోరికలు అనంతాలు: మానవుల కోరికలకు ఒక పరిమితి అంటూ ఉండదు. ఒక కోరిక తీరగానే మరొక కోరిక పుట్టుకొస్తుంది. ఇవి వ్యక్తులనుబట్టి, కాలాన్నిబట్టి, నివసించే ప్రదేశాన్నిబట్టి మారుతూ ఉంటాయి.

2. ఒక కోరికను పూర్తిగా తృప్తిపరచగలగటం: మానవుడు తన కోరికలన్నింటిని పూర్తిగా సంతృప్తిపరచడం సాధ్యం కానప్పటికీ, ఒక కోరికను పూర్తిగా తృప్తి పరచటం సాధ్యమవుతుంది.
ఉదా: ఆకలిగా ఉన్న వ్యక్తి ఆహారాన్ని తీసుకోవడం ద్వారా ఆకలిని పూర్తిగా తీర్చుకోవచ్చు. అదే విధంగా ఒక కారును కొనుగోలు చేయడం ద్వారా, కారు కావాలనే కోరికను సంతృప్తిపరచవచ్చు.

3. కోరికలు పరస్పరం పోటీపడడం: కోరికలు అపరిమితంగా ఉంటాయి. కాని వాటిని తీర్చుకొనే సాధనాలు మాత్రం పరిమితంగా ఉంటాయి. అందువల్ల కోరికలను సంతృప్తిపరచుకునే ప్రాధాన్యత క్రియవలె అది పరస్పరం పోటీపడతాయి.

4. కోరికలు – పూరకాలు: ఒక కోరికను సంతృప్తిపరచుకోవడానికి అనేక వస్తువులు అవసరమవుతాయి. ఉదా: ఏదైనా మనం రాయాలి అనుకున్నప్పుడు పెన్ను, కాగితం, ఇంకు ఉన్నప్పుడే ఆ కోరిక తీరుతుంది.

5. ప్రత్యామ్నాయాలైన కోరికలు: ఒక కోరికను అనేక రకాలుగా తృప్తిపరచుకోవచ్చు.
ఉదా: ఆకలిగా ఉన్నప్పుడు భోజనం లేదా బ్రెడ్ లేదా పాలు, పండ్లు తీసుకోవడం ద్వారా ఈ కోరికను తృప్తిపరచుకోవచ్చు.

6. పునరావృత్తం: అనేక కోరికలు, ఒక సమయంలో వాటిని తృప్తిపరచినప్పుడు మళ్ళీ, మళ్ళీ పుట్టుకొస్తాయి. సాధారణంగా ఇవి కనీస అవసరాలైనా ఆహారం, నిద్ర మొదలైన కోరికల విషయంలో గమనించవచ్చు.

7. కోరికలు అలవాటుగా మారడం: ఒక కోరికను క్రమం తప్పకుండా సంతృప్తిపరచినప్పుడు అది అలవాటుగా మారుతుంది. ఈ అలవాటును మార్చుకోవడం తొందరగా సాధ్యం కాదు.

8. కోరికల ప్రాముఖ్యంలో తేడా: అన్ని కోరికల తీవ్రత ఒకే విధంగా ఉండదు. కొన్ని కోరికలను వాటి ప్రాముఖ్యతను బట్టి వెంటనే తీర్చుకోవాలని ఉంటుంది. మరికొన్నింటిని వాయిదా వేయడానికి అవకాశం ఉంటుంది.

ప్రశ్న 3.
ప్రయోజన రకాలు [Mar. ’15]
జవాబు:
మానవుల కోరికలను సంతృప్తిపరచగలిగే వస్తుసేవల శక్తిని ప్రయోజనం అంటారు. అర్థశాస్త్రంలో ప్రయోజనం అనే భావనకు చాలా ప్రాధాన్యత ఉంది.
ప్రయోజనం – రకాలు:
1. రూప ప్రయోజనం: ఒక వస్తువు ఆకారం, రంగు, పరిమాణం మొదలైనవి మార్చడం ద్వారా ఆ వస్తువుకు మానవుని కోరికను తీర్చగలిగే శక్తి పెరిగినట్లయితే దానిని రూప ప్రయోజనం అంటారు.

2. స్థల ప్రయోజనం: స్థలాన్ని మార్చడం ద్వారా కొన్ని వస్తువులకు అదనపు ప్రయోజనం చేకూరుతుంది. వస్తువులను ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి మార్చడం వల్ల ఆ వస్తువుకు స్థల ప్రయోజనం చేకూరుతుంది. ఉదా: సముద్రతీరంలో ఇసుకకు ప్రయోజనం ఉండదు. దీనిని బయటకు తీసి మార్కెట్లకు రవాణా చేయడం వల్ల స్థల ప్రయోజనం చేకూరుతుంది.

AP Inter 1st Year Economics Study Material Chapter 1 పరిచయం

3. కాల ప్రయోజనం: కాలాన్ని బట్టి కూడా వస్తువులకు ప్రయోజనం చేకూరుతుంది.
ఉదా: పంట చేతికి వచ్చిన కాలంలో ఆహార ధాన్యాలు ఎక్కువ మొత్తంలో అందుబాటులో ఉంటాయి. వ్యాపారస్తులు వీటిని నిలువచేసి, కొంతకాలం తరువాత ఈ వస్తువులను మార్కెట్లలో అమ్ముతారు. ఈ విధంగా వస్తువులను నిలవ చేయడం ద్వారా వ్యాపారస్తులు పొందే అదనపు ప్రయోజనాన్నే కాల ప్రయోజనంగా చెప్పవచ్చు.

4. సేవల ప్రయోజనం: సేవకు కూడా మానవుని కోరికలను తీర్చగలిగే శక్తి ఉంటుంది.
ఉదా: టీచర్లు, లాయర్లు, డాక్టర్లు సేవలు మొదలైన సేవలు కూడా మానవులు కోరికలను ప్రత్యక్షంగా తీర్చగలుగుతారు. అందువల్ల వీటిని సేవ ప్రయోజనాలుగా చెప్పవచ్చు.

ప్రశ్న 4.
జేకబ్ వైనర్ నిర్వచనం [Mar. ’17, ’16]
జవాబు:
అవసరాల ప్రాముఖ్యాన్ని లేదా ఆర్థిక కార్యకలాపాల ప్రాముఖ్యాన్ని ఆధారంగా చేసుకొని వ్యక్తులుగాని, సంస్థలుగాని, ప్రభుత్వన్యాయంగాని, ఆర్థిక వ్యవస్థగాని కొరతగా ఉండి ప్రత్యామ్నాయ ప్రయోజనాలున్న వనరులను పొదుపు లేదా ఆదా చేయటం ద్వారా అపరిమితమైన కోర్కెలను సంతృప్తిపరచటానికి ఎట్లా ఉపయోగించాలి అనేదే ఆర్థిక సమస్య. ఆర్థికవేత్తలు లేవనెత్తిన ప్రశ్నలను, వివిధ అంశాలను విశ్లేషణ చేయటం ద్వారా అర్థశాస్త్రాన్ని మెరుగైన విధంగా అధ్యయనం చేయటానికి వీలుంటుందని వీరి అభిప్రాయం. ఈ అభిప్రాయాలను సమర్థిస్తూ జేకబ్ వైనర్ ఈ నిర్వచనాన్ని ఇచ్చారు. జేకబ్ వైనర్ ఉద్దేశ్యం ప్రకారం “ఆర్థికవేత్తలు ప్రతిపాదించేది అర్థశాస్త్రం”.
లక్షణాలు ఏవైనా వివిధ ఆర్థిక వ్యవస్థల్లో ఆర్థికవేత్తలు కొన్ని మౌలికమైన సమస్యలను గురించి ఆందోళన కలిగి ఉంటారు.

  1. ఏ రకమైన వస్తువులను ఎంత పరిమాణంలో ఉత్పత్తి చేయాలి ?
  2. వస్తువులను ఏ విధంగా ఉత్పత్తి చేయాలి ?
  3. వస్తుసేవలను ఎవరి కోసం ఉత్పత్తి చేయాలి ?
  4. ఉత్పాదక వనరులను సమర్థవంతంగా ఎలా ఉపయోగించాలి ?
  5. అందుబాటులో ఉన్న వనరులన్ని ఉపయోగించబడుతున్నాయా ?
  6. ఒక కాలవ్యవధిలో ఆర్థిక వ్యవస్థ వృద్ధిచెందుతుందా లేదా స్థిరంగా ఉందా ?

ప్రశ్న 5.
వివిధ ఆర్థిక విచారణలను గురించి వివరించండి.
జవాబు:
ఆర్థిక సూత్రాలు, సిద్ధాంతాలు రూపొందించడంలో ఒక నిర్థిష్టమైన పద్ధతి అవలంబించబడుతుంది. పీటర్సన్ అభిప్రాయంలో “ఆర్థిక సూత్రాలను నిర్మించడంలో పరిశీలించడంలో ఉపయోగించే పద్ధతులు, మౌలికాల ప్రక్రియను పద్ధతి (Method) అని అంటారు. ఆర్థిక సంబంధమైన విచారణ చేయడానికి ఆర్థికవేత్తలు సాధారణంగా రెండు రకాలైన పద్ధతులను అవలంబిస్తారు.

  1. నిగమన పద్ధతి
  2. ఆగమన పద్ధతి

1. నిగమన పద్ధతి: సాంప్రదాయ ఆర్థికవేత్తలు ఈ పద్ధతిని ఎక్కువగా ఉపయోగించారు. దీనిని ‘పరికల్పన’ | (Hypothetical) లేదా అనిర్థిష్టక (Abstract) పద్ధతి అని కూడా అంటారు. ఇది వాస్తవాలపై కాకుండా ఒక మానసిక అభ్యాసం, తర్కం మీద ఆధారపడి ఉంటుంది. ఒక తరం నుంచి మరొక తరానికి కొన్ని నిర్థిష్టమైన ప్రమాణాలు అంగీకరించబడ్డ సూత్రాలు లేదా వాస్తవాల నుంచి తర్కం ద్వారా ఆర్థిక సిద్ధాంతాలను రూపొందించడం జరుగుతుంది. ఇందులో సాధారణ విషయాల నుంచి ఒక నిర్ధిష్ట విషయాన్ని రాబట్టడం జరుగుతుంది.

AP Inter 1st Year Economics Study Material Chapter 1 పరిచయం

ఉదా: హేతుబద్ధంగా ఆలోచిస్తే ఒక వ్యక్తి సాధారణంగా తక్కువ ధర గల వస్తువుని కొంటాడు. ఎక్కువ ధరగల వస్తువును విక్రయిస్తాడు. అయితే మార్కెట్ను గురించి సరైన పరిజ్ఞానం కలిగి ఉండాలి. నిగమన పద్ధతిలో నిర్ణయాలు చేసేటప్పుడు నాలుగు దశలు ఉంటాయి.

  1. ఒక సమస్యను ఎన్నుకోవడం
  2. ప్రమేయాలను రూపొందించడం
  3. ఒక పరికల్పనను రూపొందించడం (Hypothesis)
  4. పరికల్పన ప్రతిపాదనను పరిశీలించడం

క్షీణోపాంత ప్రయోజన సూత్రం నిగమన పద్ధతికి ఒక ఉదాహరణ.

2. ఆగమన పద్ధతి: దీనిని చారిత్రక లేదా గుణాత్మక లేదా అనుభవిక, వాస్తవ, నిర్థిష్ట పద్ధతి అని పిలుస్తారు. జర్మనీ ఆర్థికవేత్తలు దీనిని అభివృద్ధి పరిచారు. ఇది ఒక నిర్దిష్ట లేదా ప్రత్యేక అంశం నుంచి విశ్వజనీనతకు పయనిస్తుంది. ” ఇందులో వాస్తవాల వివరాల సేకరణ చేసి సమకూర్చి నేల నిర్ణయాలు చేయబడతాయి. ఉదా: మార్థస్ సిద్ధాంతం.
ఈ పద్ధతిలో నాలుగు దశలు ఉంటాయి.

  1. సమస్యను ఎన్నుకోవడం
  2. దత్తాంశాన్ని సేకరించడం
  3. పరిశీలించడం
  4. సాధారణీకరించటం

విషయాలను ఉన్నవి ఉన్నట్టుగానే వివరించడం వల్ల ఈ పద్ధతి దిగా భావించబడుతుంది.

ప్రశ్న 6.
స్థూల అర్థశాస్త్రానికి అర్థాన్ని తెలిపి, దాని పరిధి, ప్రాధాన్యతను వివరించండి ?
జవాబు:
అర్థశాస్త్రాన్ని సూక్ష్మ అర్థశాస్త్రం, స్థూల అర్థశాస్త్రమని రెండు విధాలుగా రాగ్నా 1933 సం॥లో విభజించారు. అప్పటి నుండి ఈ విభజన ప్రచారంలోకి వచ్చింది.

స్థూల అర్థశాస్త్రం వైయుక్తిక యూనిట్లను కాకుండా మొత్తం లేదా సమిష్టి యూనిట్లను మొత్తంగా పరిశీలిస్తుంది. యూనిట్ల మొత్తాన్ని స్పష్టంగా నిర్వచించి వాటి మధ్య ఉండే పరస్పర సంబంధాలను పరిశీలించడం ఈ విశ్లేషణ ముఖ్యోద్దేశము. గార్డెనర్ ఆక్లే ప్రకారం స్థూల అర్థశాస్త్రం ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన మొత్తం ఉత్పత్తి వనరుల నియామకం, జాతీయాదాయ పరిమాణం, సాధారణ ధరల స్థాయి మొదలైన వాటిని పరిశీలిస్తుంది. స్థూల అర్థశాస్త్రాన్ని ” ఆదాయ ఉద్యోగితా సిద్ధాంతము” అని కూడా ఆన్స్ ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు.

స్థూల అర్థశాస్త్ర పరిధి:
AP Inter 1st Year Economics Study Material Chapter 1 పరిచయం 1

స్థూల అర్థశాస్త్రం – ప్రాధాన్యత:

  1. ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నుల పరిశీలనకు తోడ్పడుతుంది. ఆర్థిక సమస్యలకు మూలకారణాలను కనుగొని, వాటి పరిష్కారానికి మార్గాలను సూచిస్తుంది.
  2. జాతీయోత్పత్తి స్థాయి, దాని కూర్పులను గురించి తెలుపుతుంది. తలసరి ఆదాయాలు, జీవన ప్రమాణాలు మొదలైన వాటిని విశ్లేషిస్తుంది.
  3. ఆర్థికవ్యవస్థ వృద్ధి, స్థిరత్వాల చర్చలకు తోడ్పడుతుంది. వ్యాపార చక్రాల విశ్లేషణకు సహకరిస్తుంది.
  4. పేదరికం, నిరుద్యోగితలకు కారణాలను కనుగొని వాటి పరిష్కారానికి తోడ్పడే ఆర్థికాభివృద్ధి విధానాల రూపకల్పనలో సహాయపడుతుంది.
  5. ఆర్థిక వ్యవస్థలో పొదుపు, పెట్టుబడుల ప్రాధాన్యాన్ని వివరిస్తుంది.
  6. ద్రవ్యోల్బణం, ఆర్థిక మాంద్యం కారణాలను స్పష్ట పరచటానికి సహాయపడుతుంది. అంతర్జాతీయ, జాతీయ సమస్యల పరిష్కారానికి ఈ శాస్త్రం తోడ్పడుతుంది.
  7. ఆర్థిక విధానాల కల్పనకు, ఆచరణకు ఉపయోగపడుతుంది.

ప్రశ్న 7.
సూక్ష్మ అర్థశాస్త్రం అంటే ఏమిటి ? దాని పరిధి, ప్రాధాన్యాన్ని వివరించండి.
జవాబు:
అర్థశాస్త్రాన్ని సూక్ష్మ అర్థశాస్త్రమని, స్థూల అర్థశాస్త్రమని 1933 సం॥లో రాగ్నార్ ఫ్రిష్ ప్రతిపాదించెను. సూక్ష్మ అర్థశాస్త్రం అనేది ‘Micros’ అనే గ్రీకు పదం నుండి పుట్టింది. ‘Micro’ అంటే చిన్న అని అర్థం. సూక్ష్మ అర్థశాస్త్రం ఒక వైయుక్తిక ఆర్థిక యూనిట్ను పరిగణనలోనికి తీసుకొని దాని ప్రవర్తనను సమగ్రంగా అధ్యయనం చేస్తుంది. ఇది ఆర్థిక వ్యవస్థలోని చిన్నచిన్న భాగాలను గూర్చి అధ్యయనం చేస్తుంది. వైయుక్తిక యూనిట్లను గూర్చి వివరంగా పరిశీలిస్తుంది. ఒక వినియోగదారుడు తన ప్రయోజనాన్ని ఏ విధంగా గరిష్టం చేసుకుంటాడో ? ఒక సంస్థ గరిష్ట లాభాలు ఏ విధంగా పొందుతుందో ? సూక్ష్మ అర్థశాస్త్రం తెలుపుతుంది. వస్తువుల ఉత్పత్తి కారకాల ధరలు ఏ విధంగా నిర్ణయించబడతాయో సూక్ష్మ అర్థశాస్త్రం పరిశీలిస్తుంది. అందువలనే దీనిని ధరల సిద్ధాంతం అని కూడా పిలుస్తారు.

AP Inter 1st Year Economics Study Material Chapter 1 పరిచయం

పరిధి: వైయుక్తిక యూనిట్ల పరిశీలనయే సూక్ష్మ అర్థశాస్త్రం. “సంపూర్ణ ఉద్యోగిత” అనే ప్రమేయముపై సూక్ష్మ అర్థశాస్త్ర విశ్లేషణ జరుగుతుంది. ఇది వినియోగదారులను ఉత్పత్తిదారులను విడివిడిగా వారి ప్రవర్తనను విశ్లేషించును. సూక్ష్మ అర్థశాస్త్రం ముఖ్యంగా ఏమిటి ? ఎలా ? ఎవరి కోసం ఉత్పత్తి చేయాలి ? అనే అంశాలను అధ్యయనం చేస్తుంది. వస్తువుల మార్కెట్లలో ధర నిర్ణయం, కారకాల మార్కెట్లో ధర నిర్ణయం అధ్యయనం చేస్తుంది. ఈ క్రింది చార్టు సూక్ష్మ అర్థశాస్త్ర పరిధిని వివరిస్తుంది.

సూక్ష్మ అర్థశాస్త్ర పరిధి:
AP Inter 1st Year Economics Study Material Chapter 1 పరిచయం 2

ప్రాధాన్యత:

  1. స్వేచ్ఛా మార్కెట్ ఆర్థిక వ్యవస్థలో అపరిమిత సంఖ్యలో ఉన్న వినియోగదారులు, ఉత్పత్తిదారులు మధ్య వనరులు అభిలషణీయంగా ఏ విధంగా కేటాయింపులు జరుగుతాయో సూక్ష్మ అర్థశాస్త్రం వివరిస్తుంది.
  2. ఇది వ్యక్తుల, సంస్థల సమతౌల్యాన్ని వివరిస్తుంది.
  3. ప్రభుత్వ ఆర్థిక విధానాల రూపకల్పనలో ఉపకరిస్తుంది. ఉదాహరణకు ఏకస్వామ్యాల నియంత్రణ, పరిశ్రమల సబ్సిడీ మొదలైనవి.
  4. ఆర్థిక మంత్రికి పన్ను భారంను ఏ విధంగా వినియోగదారులకు, ఉత్పత్తిదారులకు అమ్మకందారులకు పంపిణీ చేయాలో వివరిస్తుంది.
  5. ఉత్పత్తి వ్యయాలు, డిమాండ్ను అంచనా వేయడం వంటి వ్యాపార సంబంధ విషయాలను అధ్యయనం చేస్తుంది.
  6. పరిమిత సాధనాల నుండి గరిష్ట ప్రయోజనం పొందడానికి సహకరిస్తుంది.
  7. ఇది స్థూల అర్థశాస్త్రానికి ప్రతిపాదిక.

ప్రశ్న 8.
చక్రీయ ఆదాయ ప్రవాహాన్ని పటం సహాయంతో వివరించండి.
జవాబు:
ఆదాయానికి మూలం సంపద. ఆదాయం ఒక ప్రవాహం వంటిది. ఈ ప్రవాహం ఆది, అంతములేని చక్రంలాగా ఉంటుంది. చక్రం ఏ విధంగా భ్రమణం చెందుతుందో అదే విధంగా ఆదాయం కూడా భ్రమణం చెందుతుంది. చక్రీయ ఆదాయ ప్రవాహ (Circular flow of Income) స్వరూపాన్ని క్రింది పటం సహాయంతో అవగాహన చేసుకోవచ్చు.

AP Inter 1st Year Economics Study Material Chapter 1 పరిచయం 3
ద్రవ్యరూపంలో ఆదాయం (వేతనాలు, భాటకం, వడ్డీ, లాభాలు)

పైన చూపిన పటం ప్రకారం ఉత్పత్తి కారకాల మార్కెట్కు, వస్తుసేవల మార్కెట్కు మధ్య సన్నిహిత సంబంధమున్నట్లుగా అర్థమవుతుంది. కుటుంబాలు ఉత్పత్తి కారకాలను, మార్కెట్లో విక్రయిస్తాయి. వ్యాపార సంస్థలు ఉత్పత్తి కారకాలను కొనుగోలు చేస్తాయి. అందువల్ల ఉత్పత్తి కారకాలను ప్రతిఫలాలను వ్యాపార సంస్థలు ద్రవ్యరూపంలో చెల్లిస్తాయి. అనగా ఆదాయం వ్యాపార సంస్థల నుండి కుటుంబాలకు ప్రవహిస్తుంది. వ్యాపార సంస్థలు వినియోగ వస్తువులను ఉత్పత్తి చేస్తాయి. ఈ వస్తువులను కుటుంబాలు కొనుగోలు చేస్తాయి. ఈ కారణంగా కుటుంబాలు వ్యాపార సంస్థలకు ద్రవ్యరూపంలో చెల్లింపులు చేస్తాయి. అంటే ఆదాయం ఒకసారి వ్యాపార సంస్థల నుండి కుటుంబాలకు, మరొకసారి కుటుంబాల నుండి వ్యాపార సంస్థలకు ప్రవహిస్తుంది. దీనినే చక్రీయ ఆదాయ ప్రవాహం అంటారు.

ప్రశ్న 9.
వినియోగ, ఉత్పాదక వస్తువుల మధ్య ఉన్న తేడాను వివరించండి.
జవాబు:
మానవ కోరికలను సంతృప్తిపరచగలిగే ఏ పదార్థాన్నైనా అర్థశాస్త్రంలో “వస్తువు” అంటారు.
వస్తువులను రెండు రకాలుగా విభజిస్తారు. 1) ఉచిత వస్తువులు, 2) ఆర్థిక వస్తువులు.

ఆర్థిక వస్తువులను తిరిగి వినియోగ వస్తువులు, ఉత్పాదక వస్తువులని విభజిస్తారు.
1. వినియోగ వస్తువులు: మానవ కోరికలను ప్రత్యక్షంగా సంతృప్తిపరచే వస్తువులను వినియోగ వస్తువులంటారు. వీటినే ప్రథమశ్రేణి వస్తువులని కూడా అంటారు. వీటికి ప్రత్యక్ష డిమాండ్ ఉంటుంది. ఉదా: ఆహారం, వస్త్రాలు, నివసించే ఇల్లు మొదలైనవి. వినియోగ వస్తువులను రెండు రకములుగా విభజించవచ్చును. అవి,

  1. ఒకసారి ఉపయోగంతో నశించేవి
  2. కొంత కాలంపాటు ఉపయోగంలో ఉండేవి.

i) ఒకసారి ఉపయోగంతో నశించేవి: మనం తినే ఆహారం, త్రాగునీరు లేదా పానీయాలు ఒకసారి ఉపయోగంతోనే వాటి నుండి పొందే ప్రయోజనం నశిస్తుంది. సేవలన్నీ ఒకసారి ఉపయోగంతో ప్రయోజనాన్ని కోల్పోతాయి. ఉదా: విత్తనాలు, ముడిపదార్థాలు, బొగ్గు, విద్యుత్ మొదలగునవి.

ii) కొంత కాలంపాటు ఉపయోగంలో ఉండేవి: ఒకసారితోనే ప్రయోజనాన్ని పోగొట్టుకోకుండా కొంత కాలంపాటు ఉపయోగంలో ఉండి, వాటిని వినియోగించే వారికి ప్రయోజనాన్ని కలుగజేస్తాయి. ఈ వస్తువులు కొంత కాలంపాటు మన్నికను కలిగి ఉండి వినియోగదారులకు ప్రయోజనాన్ని ఇస్తాయి. వీటిని మన్నికగల వినియోగ వస్తువులంటారు. ఉదా: బల్ల, కుర్చీ, పుస్తకము, టీ.వి. మొదలైనవి.

2. ఉత్పాదక వస్తువులు: వీటినే మూలధన వస్తువులు అని కూడా అంటారు. అనగా ఉత్పత్తి చేయబడిన ఉత్పత్తి సాధనాలు. ఏ వస్తువులైతే ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొని, ఇతర వస్తువుల ఉత్పత్తికి తోడ్పడతాయో, అటువంటి వస్తువులను ఉత్పాదక లేదా మూలధన వస్తువులంటారు. ఇవి పరోక్షంగా మానవుని కోరికలను సంతృప్తిపరుస్తాయి. వీటినే ద్వితీయ శ్రేణి వస్తువులంటారు. వీటికి ఉత్పన్న లేదా పరోక్ష డిమాండ్ ఉంటుంది. ఇవి రెండు రకములు.

  1. ఒకసారి ఉపయోగంతో నశించేవి
  2. కొంత కాలంపాటు ఉపయోగంలో ఉండేవి

i) ఒకసారి ఉపయోగంతో నశించేవి: ఒకసారి వినియోగించగానే వాటి ప్రయోజనం నశిస్తుంది.
ఉదా: విత్తనాలు, ముడి పదార్థాలు, బొగ్గు, విద్యుత్ మొదలగునవి.

ii) కొంత కాలంపాటు ఉపయోగంలో ఉండేవి: కొన్ని వస్తువులు కొంత కాలం పాటు వినియోగంలో ఉంటాయి. అనగా కొంతకాలంపాటు ప్రయోజనాన్ని ఇవ్వగలుగుతాయి. వీటిని మన్నిక గల ఉత్పాదక వస్తువులు అంటారు. ఉదా: యంత్రాలు, ట్రాక్టర్, కర్మాగార భవనాలు మొదలగునవి.

వినియోగ వస్తువులకు, ఉత్పాదక వస్తువులకు మధ్యగల భేదములు:
వినియోగ వస్తువులు

  1. ఇవి ప్రత్యక్షంగా మానవ కోరికలను సంతృప్తిపరచును.
  2. వీటికి ప్రత్యక్ష డిమాండ్ ఉంటుంది.
  3. ఇవి ప్రథమశ్రేణి వస్తువులు.
  4. ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొనవు.
  5. వస్తువులను కలిగిన యజమానులకు ఆదాయాన్నివ్వవు.

ఉత్పాదక వస్తువులు

  1. ఇవి పరోక్షంగా మానవ కోరికలను సంతృప్తిపరచును.
  2. వీటికి పరోక్ష లేదా ఉత్పన్న డిమాండ్ ఉంటుంది.
  3. ఇవి ద్వితీయ శ్రేణి వస్తువులు.
  4. ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొంటాయి.
  5. వస్తువులను కలిగిన యజమానులకు ఆదాయాన్ని చేకూర్చి పెడతాయి.

AP Inter 1st Year Economics Study Material Chapter 1 పరిచయం

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ఆర్థిక వస్తువులు [Mar. ’15]
జవాబు:
డిమాండ్ కంటే సప్లై తక్కువగా అనగా కొరతగా ఉండి ధర కలిగిన వస్తువులను ఆర్థిక వస్తువులంటారు. ఉదా: ఆహారం, వస్త్రాలు, యంత్రాలు మొదలైనవి. అవకాశం ఉంటే వీటిని వ్యక్తులు ఎక్కువగా కావాలనుకుంటారు. వీటికి ఉపయోగిత విలువ, వినిమయ విలువ ఉంటాయి. ఇది మానవ నిర్మితాలు. కనుక వీటికి ఉత్పత్తి వ్యయం ఉంటుంది.

ప్రశ్న 2.
ఉత్పాదక వస్తువులు
జవాబు:
ఉత్పాదక వస్తువులనే మూలధన వస్తువులు అని కూడా అంటారు. ఇవి ఉత్పత్తి చేయబడిన ఉత్పత్తి సాధనాలు. ఏ వస్తువులైతే ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొని ఇతర వస్తువుల ఉత్పత్తికి తోడ్పడతాయో అటువంటి వస్తువులను ఉత్పాదక వస్తువులు లేదా మూలధన వస్తువులు అంటారు. ఇవి పరోక్షంగా మానవుని కోరికలను సంతృప్తిపరచును. వీటిని ద్వితీయ శ్రేణి వస్తువులంటారు.

వీటికి పరోక్ష లేదా ఉత్పన్న డిమాండ్ ఉంటుంది. ఇవి ఒకసారి ఉపయోగంలో నశించేవి, కొంతకాలంపాటు వినియోగంలో ఉండేవి అని రెండు రకములు. ఉదా: యంత్ర పరికరాలు, కర్మాగార భవనాలు మొదలైనవి.

ప్రశ్న 3.
మధ్యంతర వస్తువులు [Mar. ’17]
జవాబు:
పూర్తిగా తయారు కాకుండా ఇంకా తయారీలో ఉన్న వస్తువుల ముడిసరుకులను, అంతిమ వినియోగ వస్తువులకు మధ్యలో వివిధ దశలలో ఉన్న వస్తువులను మధ్యంతర వస్తువులు అంటారు. అంతిమ వినియోగానికి కాకుండా ఇతర వస్తువుల ఉత్పత్తి ప్రక్రియలో ఏదో ఒక దశలో, ఎక్కడో ఒకచోట ఉపయోగించే వస్తువులు మాధ్యమిక వస్తువులు. ఉదా: సిమెంటు, ఇటుకలు, స్టీలు మొదలైనవి నిర్మాణ రంగంలో మధ్యంతర వస్తువులు.

ప్రశ్న 4.
సంపద [Mar. ’16]
జవాబు:
సాధారణ పరిభాషలో సంపద అనగా కేవలం ప్రజల వద్దనున్న ద్రవ్యం. కాని అర్థశాస్త్రంలో సంపద అనగా ద్రవ్యము మాత్రమే కాకుండా ప్రయోజనం, కొరత బదిలీ చేయటానికి అవకాశం ఉండటము అనే లక్షణాలుగల ఏ వస్తువులైనా సంపదగా పరిగణిస్తారు. ఉదా: భూములు, భవనాలు మొదలైనవి.

ప్రశ్న 5.
ఆదాయం
జవాబు:
ఆదాయానికి మూలం సంపద. ఆదాయం ఒక ప్రవాహం వంటిది. ఆదాయం ఒకసారి వ్యాపార సంస్థల నుండి ఉత్పత్తి కారకాల ప్రతిఫలాల రూపంలో కుటుంబాలకు, మరొకసారి కుటుంబాల నుండి వస్తు సేవలపై వ్యయ రూపంలో వ్యాపార సంస్థలకు ప్రవహిస్తుంది. దీనిని చక్రరూప ఆదాయ ప్రవాహం అంటారు.

AP Inter 1st Year Economics Study Material Chapter 1 పరిచయం

ప్రశ్న 6.
ప్రయోజనం [Mar. ’16]
జవాబు:
వస్తుసేవలకుండే మానవ కోరికలను సంతృప్తిపరచగలిగే శక్తిని అర్థశాస్త్రంలో ప్రయోజనం అంటారు. వస్తువు అన్ని యూనిట్ల నుండి పొందే ప్రయోజనం మొత్తాన్ని మొత్తం ప్రయోజనమని, వస్తువు అదనపు యూనిట్ వలన మొత్తం ప్రయోజనానికి కలుపబడే లేదా తీసివేయబడే ప్రయోజనమును ఉపాంత ప్రయోజనమని అంటారు. ఈ భావన అర్థశాస్త్రంలో చాలా ప్రధానమైనది.

ప్రశ్న 7.
వినిమయ విలువ
జవాబు:
ఒక వస్తువును వినిమయం చేసినప్పుడు దాని బదులుగా పొందగలిగే ఇతర వస్తువులను లేదా సాధారణ ద్రవ్యాన్ని వినిమయ విలువ అని అంటారు. ఉచిత వస్తువులకు మారకం విలువ ఉండదు లేదా తక్కువగా ఉంటుంది. కొన్ని రకాల వస్తువులకు మారకం విలువ అధికంగా ఉంటుంది.

ప్రశ్న 8.
ధర
జవాబు:
ఒక వస్తువు విలువను ద్రవ్య రూపంలో చెప్పినట్లయితే దానిని ధర అంటారు.
ఉదా: ‘X’ వస్తువు 10/- వినిమయం చెందుతుంది.

ప్రశ్న 9.
ఎంపిక సమస్య
జవాబు:
సాధనాల కొరత వల్ల మానవుడు అపరిమితమైన కోరికలలో వేటిని సంతృప్తిపరుచుకోవాలి, సాధనాలను ఎట్లా కేటాయించుకోవాలి అని ఎంపిక చేసుకోవలసి ఉంటుంది. ఎంపిక సమస్యను అతి ముఖ్యమైన అర్థశాస్త్ర సమస్యగా రాబిన్స్ వివరించాడు.

ప్రశ్న 10.
ఆర్థిక కార్యకలాపాలు
జవాబు:
ఆదాయ ఆర్జన, వ్యయానికి సంబంధించిన ఆర్థిక కార్యకలాపాలు.

ప్రశ్న 11.
సూక్ష్మ అర్థశాస్త్రం
జవాబు:
సూక్ష్మ అర్థశాస్త్రం అనేది మైక్రోస్ అనే గ్రీకు పదం నుండి పుట్టింది. సూక్ష్మ అర్థశాస్త్రం ఒక వైయుక్తిక ఆర్థిక యూనిట్ను పరిగణనలోకి తీసుకొని దాని ప్రవర్తనను సమగ్రంగా అధ్యయనం చేస్తుంది. ఉత్పత్తి కారకాల ధర నిర్ణయం గురించి వివరిస్తుంది, కాబట్టి దీనిని ధరల సిద్ధాంతం అంటారు.

ప్రశ్న 12.
స్థూల అర్థశాస్త్రం
జవాబు:
స్థూల అర్థశాస్త్రం అనేది మాక్రోస్ అనే గ్రీకు పదం నుండి పుట్టింది. ఆర్థిక వ్యవస్థ మొత్తానికి సంబంధించిన అంశాలను అంటే మొత్తం ఉద్యోగిత, మొత్తం ఆదాయం మొదలగు వాటిని గూర్చి అధ్యయనం చేస్తుంది. అందుచే స్థూల అర్థశాస్త్రాన్ని ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతం అని కూడా అంటారు.

ప్రశ్న 13.
నిశ్చల ఆర్థిక విశ్లేషణ
జవాబు:
ఒకే సమయంలో లేదా ఒకే కాలానికి సంబంధించిన విలువలను తెలియజేసే రెండు చలాంకాల మధ్య ఉన్న ప్రమేయ సంబంధాన్ని నిర్ధారించడానికి చేసే విశ్లేషణ. ఉదా: సంపూర్ణ పోటీలోని సమతౌల్య ధర నిర్ణయం.

AP Inter 1st Year Economics Study Material Chapter 1 పరిచయం

ప్రశ్న 14.
చలన ఆర్థిక విశ్లేషణ
జవాబు:
ఆర్థిక చలనత్వం వేరువేరు సమయాలకు చెందిన విలువలను తెలియజేసే సంబంధిత చలాంకాల మధ్య ఉన్న సంబంధాన్ని తెలియజేస్తుంది.

ప్రశ్న 15.
నిగమన పద్ధతి
జవాబు:
తార్కిక విశ్లేషణ ద్వారా సార్వజనీనమైన ఫలితాలను వ్యక్తిగత అంశాలకు వర్తింపచేయడం.
ఉదా: క్షీణోపాంత ప్రయోజన సూత్రం.

ప్రశ్న 16.
ఆగమన పద్ధతి
జవాబు:
తార్కిక విశ్లేషణ చేయడం ద్వారా ప్రత్యేక అంశాల పరిశీలన వల్ల వచ్చిన ఫలితాలు మొత్తం అంశాలకు వర్తింప చేయడం. ఉదా: క్షీణ ప్రతిఫల సూత్రం.

AP Inter 1st Year Commerce Study Material Chapter 12 వ్యాపారంలో ప్రస్తుత ధోరణులు

Andhra Pradesh BIEAP AP Inter 1st Year Commerce Study Material 12th Lesson వ్యాపారంలో ప్రస్తుత ధోరణులు Textbook Questions and Answers.

AP Inter 1st Year Commerce Study Material 12th Lesson వ్యాపారంలో ప్రస్తుత ధోరణులు

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
e – వ్యాపారాన్ని నిర్వచించి, దాని పరిధిని వివరించండి.
జవాబు:
e – వ్యాపారము అనే పదాన్ని మొదటిసారిగా 1997లో IBM ఉపయోగించినది. దీని ప్రకారము e- వ్యాపారము అంటే “ఇంటర్నెట్ పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ ముఖ్యమైన వ్యాపార దశలను బదలాయింపు చేయడము”.

అన్ని వ్యాపార కార్యకలాపాలను, వ్యాపార పరిధిని బలపరచడానికి Information and Communication Technology (ICT) సహకారాన్ని ఇంటర్ నెట్ల ద్వారా తీసుకోవటమును e- వ్యాపారముగా నిర్వచించవచ్చును. e – వ్యాపారము ICT వినియోగదారులతో సంబంధాలు పెంపొందించుకోవడానికి కార్యకలాపాలను చేస్తుంది. e వ్యాపార పద్ధతులు వ్యాపార సంస్థల అంతర్గత, బహిర్గత వ్యవస్థల మధ్య సత్సంబంధాలను అత్యంత సమర్థవంతంగా, సరళముగా e – వ్యాపార పరిధి : e వ్యాపారాన్ని క్రింది విధముగా విభజించవచ్చు.

  • వ్యాపార సంస్థలో మాత్రమే.
  • ఒక వ్యాపార సంస్థ మరొక వ్యాపార సంస్థ మధ్య వ్యవహారాలు
  • వ్యాపార సంస్థ – వినియోగదారుని మధ్య వ్యవహారాలు
  • వినియోగదారుడు – వినియోగదారుని మధ్య వ్యవహారాలు
  • వినియోగదారుడు – వ్యాపార సంస్థ మధ్య వ్యవహారాలు

e – వాణిజ్యము పరిధి ఆన్లైన్ వ్యవహారములకు మాత్రమే పరిమితము అవుతుంది. ఆన్లైన్ ద్వారా ” వ్యవహారములు వస్తువు లేదా సర్వీసుకు సంబంధించినవై ఉంటాయి. దాదాపుగా ప్రతి వస్తువు జిమ్ పరికరాల నుంచి కంప్యూటర్ ల్యాప్టాప్ వరకు, వస్త్రాలను మొదలుకొని ఆభరణాల వరకు e – వాణిజ్య రంగంలో ఆన్లైన్ ద్వారానే కొనుగోలు చేయడం జరుగుతుంది. కేవలం వస్తువులను మాత్రమే కాకుండా సేవలను కూడా ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఉదా : న్యాయవాదులు, డాక్టర్లు తమ సేవలను ఆన్లైన్ ద్వారా అందిస్తున్నారు. రైలు, బస్సు, విమాన టిక్కెట్ల కొనుగోలు, పన్ను చెల్లింపులు ఆన్లైన్ ద్వారా చేయవచ్చు.

AP Inter 1st Year Commerce Study Material Chapter 12 వ్యాపారంలో ప్రస్తుత ధోరణులు

e – వ్యాపార పరిధి దిగువ అంశాలకు వర్తింపచేయడం జరుగుతుంది.
1) e – వాణిజ్యము : ఇంటర్నెట్ ద్వారా వ్యాపారాన్ని నిర్వహించడాన్ని e – వాణిజ్యము అంటారు. ఎలక్ట్రానిక్ వాణిజ్యాన్ని e – వాణిజ్యము అని వ్యవహరిస్తారు. ఆన్లైన్ ద్వారా వస్తువుల కొనుగోలు, అమ్మకం చేసే ప్రక్రియ దీనికి మంచి ఉదాహరణ. అంతేకాకుండా e – వాణిజ్యములో అనేక కార్యకలాపాలు కలిసి ఉంటాయి. ఏదైనా కార్యకలాపాన్ని ఎలక్ట్రానిక్ పరికరము ద్వారా నిర్వహించడాన్ని e – వాణిజ్యము అనవచ్చు.

2) e – వేలం : ఇంటర్ నెట్ సహాయముతో ప్రజలు వేలములో పాల్గొనవచ్చు. e-వేలములో పాల్గొనదలచినవారు సంబంధిత వెబ్సైట్ను సందర్శించి వేలం కోసం ప్రదర్శించిన వస్తువులను క్లిక్ చేస్తూ కొనుగోలు చేయవచ్చు. అదే విధముగా వెబ్ పేజీలలో తమ వస్తువులను ఉంచి వేలం ద్వారా వస్తువులను అమ్మకము చేయవచ్చు..

3) e – బ్యాంకింగ్ : ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ మంచి విజయవంతమైన ఆన్లైన్ వ్యాపారము. బ్యాంకింగ్ వెబ్ సైట్ను ఉపయోగిస్తూ బ్యాంకు ఖాతాదారులు తమ అకౌంట్స్ నిర్వహించుకోవడానికి, చెల్లింపుల ఆజ్ఞ ఇవ్వడానికి e – బ్యాంకింగ్ సహాయము చేస్తుంది. ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా ఖాతాదారులు బ్యాంకును సందర్శించనవసరము లేకుండా అవసరమైన నగదును ATM ద్వారా పొందవచ్చు. ఖాతా నిల్వలు తెలుసుకోవచ్చు. బిల్లులను చెల్లించవచ్చును. నగదును బదిలీ చేయవచ్చును.

4) e – మార్కెటింగ్ : ఎలక్ట్రానిక్ మార్కెటింగ్లో ఎలాంటి భౌగోళిక అడ్డంకులు లేకుండా వస్తువుల కొనుగోలుకు, అమ్మకాలకు ప్రపంచవ్యాప్తముగా మార్కెటింగ్ ఏర్పాటు చేస్తుంది. ఎలాంటి సమయ భావన లేకుండా ఖాతాదారుల డిమాండ్ను కంపెనీలు స్పందించేందుకు ‘ఇంటర్నెట్ సహాయం చేస్తుంది. దీనికి వినియోగదారులు ఉండే ప్రాంతముతో
సంబంధము లేదు.

5) e – వర్తకము : e – వర్తకాన్ని ఆన్లైన్ వర్తకమని, e – బ్రోకింగ్ అని కూడా వ్యవహరిస్తారు. ఇది స్టాక్ ఎక్స్ఛేంజ్లలో సెక్యూరిటీలను అమ్మడానికి, కొనడానికి ఉపయోగపడుతుంది.

ప్రశ్న 2.
e – వ్యాపారం యొక్క ప్రయోజనాలను వివరించండి.
జవాబు:
e – వ్యాపారము వలన వినియోగదారులకు, వ్యాపార సంస్థలకు, సమాజానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. వినియోగదారులకు కలిగే ప్రయోజనాలు :

  1. e – వ్యాపారము వలన వినియోగదారులు ఏ ప్రాంతం నుంచి అయినా, ఏ సమయంలోనైనా వ్యాపార వ్యవహారాలు నిర్వహించవచ్చు.
  2. e – వ్యాపారము వినియోగదారులకు వస్తు సేవలకు సంబంధించి, అనేక ప్రత్యామ్నాయాలు, అవకాశాలను కల్పిస్తాయి.
  3. e – వ్యాపారము ద్వారా వినియోగదారుడు అనేక ప్రాంతాలలోని మార్కెట్లలో వస్తు, సేవలను పోల్చి చూసుకోవడానికి వీలవుతుంది.
  4. e – వ్యాపారము వస్తు సేవలు త్వరగా డెలివరీ కావడానికి దోహదము చేస్తుంది.
  5. వినియోగదారుడు వస్తు సేవలకు సంబంధించి సరైన సమాచారాన్ని పూర్తి స్థాయిలో, క్షణాలలో పొందవచ్చును.
  6. వినియోగదారుడు సరైన వేలములో పాల్గొనేందుకు e -వ్యాపారము సహాయపడుతుంది.
  7. e- వ్యాపారము వినియోగదారుల మధ్య సహకారాన్ని ఏర్పరచి, ఒకరికొకరు వ్యాపార ఉపాయాలు, అనుభవాలు పంచుకునేట్లు చేస్తుంది.
  8. e – వ్యాపారము వ్యాపారం మధ్య పోటీతత్వాన్ని ఏర్పరచి, వినియోగదారులకు సరైన డిస్కౌంట్లు లభించేందుకు సహకరిస్తుంది.

AP Inter 1st Year Commerce Study Material Chapter 12 వ్యాపారంలో ప్రస్తుత ధోరణులు

వ్యాపార సంస్థకు ప్రయోజనాలు :

  1. e – వ్యాపారము వలన సంస్థలు తమ ప్రస్తుత మార్కెట్ను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలకు విస్తరింపచేసుకోవచ్చు. ఇది సంస్థ యొక్క అమ్మకాలను పెంచుతుంది.
  2. e – వ్యాపారము వలన వస్తువులను లేదా సేవలను సృష్టించడము, ప్రాసెస్ చేయడం, పంపిణీ చేయడం, స్టోరింగ్ చేయడం, ‘సమాచారాన్ని సేకరించడానికి, ఇన్వెంటరీ, ఓవర్హెడ్ ఖర్చులు తగ్గుతాయి.
  3. పెట్టుబడికి, వస్తు సేవల అమ్మకము వలన వచ్చే ఆదాయానికి మధ్య ఉన్న సమయం తగ్గుతుంది.
  4. బిజినెస్ ప్రాసెస్, రీ-ఇంజనీరింగ్లకు సహకరిస్తుంది.
  5. టెలీ కమ్యూనికేషన్ ఖర్చు తక్కువగా ఉండటం వలన ఇంటర్నెట్ విలువ ఆధారిత నెట్వర్క్ కంటే వ్యయము తక్కువగా ఉంటుంది.

సమాజానికి ప్రయోజనాలు :

  1. ఇంటినుంచే పనిచేసుకోవడానికి అవకాశము ఉండటం వలన షాపింగ్ కోసము ప్రయాణాలు తగ్గుతాయి. రోడ్లపై ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయి. దీనివలన వాయు కాలుష్యం తగ్గుతుంది. అంతేకాకుండా సమయము కూడా ఆదా అవుతుంది.
  2. వ్యాపారస్తులు తమ వస్తువులను ఇంటర్ నెట్ ద్వారా తక్కువ ధరలకు అమ్మడం వలన పేదవారికి ప్రయోజనం లభిస్తుంది.
  3. ప్రపంచ దేశాలలో, గ్రామీణ ప్రాంతాలలో ఉండే ప్రజలకు, మార్కెట్ లో లభించని’ వస్తు సేవలను e- వ్యాపారము ద్వారా పొందవచ్చు.
  4. వస్తు సేవలు తక్కువ వ్యయానికి లభించడమే కాకుండా, వాటి మన్నిక, నాణ్యత కూడా పెరుగుతుంది.

ప్రశ్న 3.
21వ శతాబ్దంలో వ్యాపార సంస్థలకు ఉన్న అవకాశాలను తెలపండి.
జవాబు:
21వ శతాబ్దంలో వ్యాపార సంస్థలకు గల అవకాశాలు :
1) సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ : LPG రూపములో ప్రవేశపెట్టబడిన ఆర్థిక సంస్కరణలు, భారతదేశములోని వ్యాపార సంస్థలకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించినది. ఈ పరిస్థితులు భారతదేశ ఆర్థిక వ్యవస్థను ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో అనుసంధానించడానికి, పూర్తి స్థాయిలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడానికి, అంతర్జాతీయ వర్తకములో పెరుగుదలకు, ఉత్పత్తి, ఉద్యోగ అవకాశాల పెరుగుదలకు, ఆంక్షలు లేని మూలధన ప్రవాహానికి దారితీసింది.

2) భారీ తరహా, విస్తరణ అవకాశాలు : 21వ శతాబ్దపు వ్యాపార సంస్థలు భారీతరహా, ఎక్కువ’ విస్తరణకు అవకాశాలు గల సంస్థల లక్షణాలు కలిగి ఉన్నవి. భారీ తరహా సంస్థ, ఉత్పత్తిలో పెరుగుదల వలన కంపెనీ ఖర్చులు తగ్గి, లాభాలు పెరుగుతాయి.

3) తలసరి ఆదాయంలో పెరుగుదల : తలసరి ఆదాయము పెరుగుదలలో మనదేశము ప్రపంచవ్యాప్తముగా నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించినది. తలసరి ఆదాయము దేశములోని ప్రజల జీవన ప్రమాణస్థాయిని తెలుపుతుంది. పెరుగుతున్న తలసరి ఆదాయము వలన దేశములో వ్యాపార అవకాశాలు పెరగడానికి అవకాశము ఉన్నది.

4) మార్కెట్ ఆర్థిక వ్యవస్థలు : భారతదేశము 125 కోట్ల జనాభాతో ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఏర్పడి ప్రపంచవ్యాప్తముగా పారిశ్రామిక, వర్తక సేవారంగాలను ఆకర్షిస్తున్నది. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో వస్తున్న మార్పులు భారతదేశ మార్కెట్ ఆదాపూర్వక మార్కెట్గా రూపొందినది. దాని ఫలితముగా దేశములోని వ్యాపార సంస్థలకు అనేక వ్యాపార అవకాశాలు లభిస్తున్నవి.

AP Inter 1st Year Commerce Study Material Chapter 12 వ్యాపారంలో ప్రస్తుత ధోరణులు

5) e – వాణిజ్యము – ప్రపంచ మార్కెట్ కు గేట్వే : ప్రపంచవ్యాప్తంగా వ్యాపార సంస్థలు e- వాణిజ్యం ప్రయోజనాలను గుర్తిస్తున్నాయి. నగదు ప్రవాహములో పెరుగుదల, ఖాతాదారులు నిలుపుదల, సేవా సంతృప్తి e – వాణిజ్యం ద్వారా లభించిన ప్రయోజనాలు.

6) సాంకేతిక పురోభివృద్ధి: 21వ శతాబ్దములో వ్యాపార సంస్థలు అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నవి. దీనివలన వ్యాపార సంస్థలు సమాజానికి అవసరమైన వస్తు సేవలను తక్కువ వ్యయానికి అందిస్తున్నవి.

7) విత్త సేవల విస్తరణ : 21వ శతాబ్దములో విత్త సేవారంగము చాలా వేగముగా పెరుగుతున్నది. బ్యాంకింగ్, భీమా, రుణ, ఈక్విటీ, ఫైనాన్సింగ్, సూక్ష్మ విత్త రంగాలు ప్రజలలో పొదుపు అలవాట్ల పెరుగుదల, భవిష్యత్ అవసరాలకు సరళమైన ఋణాలు పొందడానికి అవకాశాలు కల్పిస్తున్నవి. ఈ ఆర్థిక రంగములో కంపెనీలకు వ్యాపార విస్తరణ | అవకాశాలకు దారితీసాయి.

8) వ్యాపార ప్రక్రియ ఆటోమేషన్ : వ్యాపార ప్రక్రియ ఆటోమేషన్ అనేది వ్యయాల నియంత్రణకు ఉపయోగించే వ్యూహము. ఇది వ్యాపార ప్రక్రియలను స్వయం చలితం చేయడమే కాక అధిక సామర్థ్యాన్ని పొందడం, వ్యాపార అవసరాలకు మార్పులను ఆపాదించుకోవడం, మానవ తప్పిదాలను తగ్గించడం ద్వారా పని ప్రవాహాన్ని మెరుగుపరచడం చేస్తుంది. ‘

9) పెరుగుతున్న కలయికలు, సముపార్జనలు, విదేశీ కొలాబరేషన్లు : కలయికలు, సముపార్జనలు, నవకల్పనల అభివృద్ధి, లాభదాయకత, మార్కెట్ వాటా, కంపెనీ వాటా విలువలలో పెరుగుదలకు ఆధునిక వ్యాపార సంస్థలకు అనుకూలించే వ్యూహము. ఇదే తరహాను అనుసరించే ప్రతిఫలాలలో పెరుగుదలకు, అధిక సమర్థతకు, వ్యయాల నియంత్రణకు దోహదం చేస్తుంది.

10) అంతర్జాతీయ వ్యవస్థాపన : 21వ శతాబ్దములో అనేక సంస్థలు, వ్యాపార ప్రపంచీకరణను, తయారీ, సేవల, మూలధన వనరుల, ప్రతిభ సంపాదనకి రక్షణ వ్యూహంగా పరిగణిస్తున్నది. వినియోగదారుల అవసరాలకు సరిపడేందుకు కొత్త ఉత్పత్తులు, సేవలు సృష్టించడానికి ఒకటి కంటే ఎక్కువ దేశాలలో వ్యాపార అవకాశాలు కనుగొంటున్నాయి.

ప్రశ్న 4.
21వ శతాబ్దంలో వ్యాపార సంస్థలు ఎదుర్కొనే సవాళ్ళను తెలపండి.
జవాబు:
21వ శతాబ్దంలో వ్యాపార సంస్థలు ఈ క్రింది సవాళ్ళను ఎదుర్కోవాలి.
1) సాంకేతిక పరిజ్ఞానము సవాళ్ళు: సాంకేతిక పరిజ్ఞానములో వేగముగా వస్తున్న మార్పులు చిన్న వ్యాపార సంస్థలకు ఖర్చు, సమయము ఒక ముప్పుగా ఏర్పడినది. ఈ సంస్థలు సాంకేతిక పరిజ్ఞానములో వచ్చిన మార్పులకు అనుగుణముగా ప్లాంటు, యంత్రాలు, పరికరాలు, ఉత్పత్తి విధానాలను ఆధునీకరించుకుంటున్నాయి. లేకపోతే సంస్థలు తమ ఉనికిని కోల్పోయి, మార్కెట్ నుంచి తొలగిపోతాయి.

2) పెరుగుతున్న వినియోగదారుల అవగాహన : ఉత్పత్తులు, సేవల పట్ల వినియోగదారుల అవగాహన పెరుగుతున్నది. వినియోగదారులను ఆకర్షించేందుకు, మార్కెట్ వాటా కోల్పోకుండా నివారించేందుకు వినియోగదారుల డిమాండ్లకు స్పందించవలసిన అవసరమున్నది.

3) ప్రపంచీకరణ సవాళ్ళు : ప్రపంచీకరణ వ్యాపార వాతావరణములో మిశ్రమ సంస్కృతులు, భాషలు మొదలైన వ్యూహాత్మక సవాళ్ళకు దారితీసింది. ఫలితముగా ప్రపంచ పోటీ, వస్తు సేవల ధరలు పెరిగినవి.

4) సహజ వనరుల క్షీణత : చాలా రకములైన ఉత్పత్తి సంస్థలు సహజ వనరులు ముఖ్యంగా ముడి పదార్థాలపై ఆధారపడి ఉంటాయి. ఖనిజాలు, అడవులు, ఇంధనాలు, సారవంతమైన నేలలు మొదలైన సహజ వనరులు క్షీణించి పోవడం వలన రాబోయే కాలములో వ్యాపార సంస్థలపై దీని ప్రభావము ఉంటుంది.

AP Inter 1st Year Commerce Study Material Chapter 12 వ్యాపారంలో ప్రస్తుత ధోరణులు

5) ఆర్థిక మాంద్యము : ప్రపంచవ్యాప్తముగా అంతర్జాతీయ, ఆర్థిక, రాజకీయ వ్యవస్థ మార్పు చెందుతోంది. అమెరికా, ఐరోపాలో ప్రారంభమైన ఆర్థిక మాంద్యము ఇతర దేశాలలో పనితీరుపై ప్రభావాన్ని చూపుతోంది.

6) షర్యావరణ సవాళ్ళు : వ్యాపార సంస్థలు ఎదుర్కొంటున్న ముఖ్యమైన సవాళ్ళలో పర్యావరణ క్షీణత అతి పెద్ద సవాలు. ఆర్థిక, సాంఘిక, సామాజిక, రాజకీయ, సాంకేతిక పరిజ్ఞానానికి చెందిన పరిసరాలు వేగముగా మారుతున్నాయి.

7) సమాచార సవాళ్ళు : నిర్వహణ పరికరాలు, సాంకేతిక పరిజ్ఞానం బదిలీ చేసే ప్రక్రియలో భాగంగా ఇంటర్నెట్ ఉపయోగము, వైర్లెస్ సమాచారము, సాంకేతిక పరిజ్ఞానముతో కూడిన e – వాణిజ్యం వ్యాపార సంస్థలకు పెద్ద సవాళ్ళు. అత్యధిక ద్రవ్యోల్బణ రేటు, అధిక వడ్డీరేట్లు, తక్కువ ఆర్ధిక పెరుగుదల, నిత్యావసర వస్తువుల పెరుగుదల వ్యాపార సంస్థలను ప్రభావితం చేస్తున్నవి.

8) అవినీతి, అధికారుల అడ్డంకులు: ఈ రోజులలో అవినీతి అనేది వ్యాపార సంస్థలకు పెద్ద అడ్డంకి. దేశములో అవినీతి బాగా పాతుకొనిపోయి, రోజువారీ జీవితములో అనేక అంశాలను ప్రభావితం చేస్తున్నది.

9) పారదర్శకత, పరిపాలన : కార్పొరేటు పరిపాలన వ్యక్తుల, సంస్థల ఆసక్తులను కాపాడటానికి ఉపయోగ పడుతుంది. కార్పొరేటు సంస్థలు తీసుకునే నిర్ణయాలు, అవి పొందుపరుచుకున్న ఆసక్తులు ప్రభావాన్ని చూపుతాయి. కంపెనీల పరిపాలన, పారదర్శకత, ప్రభుత్వ నిఘా ఉంటుంది..

10) కార్పొరేటు సామాజిక బాధ్యత : CSR ఆచరణ, అమలులో అనేక సవాళ్ళను ఎదుర్కొంటోంది. CSR మన దేశములో ప్రారంభ దశలో ఉన్నది. CSR పై అవగాహన లేకపోవడం, శిక్షణ పొందిన ఉద్యోగుల తక్కువ సంఖ్య, విధాన అంశాలు, కవరేజి మొదలైన అంశాలు CSR కు అడ్డంకులు.

11) విదేశీ ద్రవ్యం మార్పిడి సమస్య: వ్యాపార సంస్థల నిర్వహణ సమస్యల విదేశీ మారకపు రేట్లలో అస్థిరత. ఇది మార్పిడిరేట్లు, ఎగుమతులు, దిగుమతులు, రాజకీయ అంశాల కారణముగా ఏర్పడినది.

12) మానవ వనరుల సవాళ్ళు : సరైన సిబ్బందిని నియమించడం, శిక్షణ ఇవ్వడం, వారిని నిలిపి ఉంచడం, HR విభాగపు నిధులు. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానము కారణముగా IT నైపుణ్యము, సమస్య పరిష్కార నైపుణ్యం, రీజనింగ్ నైపుణ్యం గల అర్హులైన సిబ్బందిని నియమించడానికి సంస్థలు సమస్యలను ఎదుర్కొంటున్నవి.

13) భద్రత సమస్యలు : e – కామర్స్, వర్చువల్ ఆఫీసు వ్యాప్తిలో ముప్పులు ఎదురవుతాయి. ఈ ముప్పులు సమాచార భద్రత, ఇంటర్నెట్ భద్రత, భౌతిక భద్రత, కంపెనీ wireless access నెట్వర్క్, చట్టాలలో గోప్యత మొదలైన రూపాలలో జరుగుతుంది.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
e – వ్యాపారం యొక్క పరిధిని వివరించండి.
జవాబు:
e – వ్యాపార పరిధి : e – వ్యాపారాన్ని క్రింది విధముగా విభజించవచ్చును.

  • ఒక వ్యాపార సంస్థలో మాత్రమే.
  • ఒక వ్యాపార సంస్థ మరొక వ్యాపార సంస్థ మధ్య వ్యవహారాలు.
  • ఒక వ్యాపార సంస్థ – వినియోగదారుని మధ్య వ్యవహారాలు
  • వినియోగదారుడు వినియోగదారుని మధ్య వ్యవహారాలు
  • వినియోగదారుడు – వ్యాపార సంస్థ మధ్య వ్యవహారాలు.

e – వ్యాపార పరిధి దిగువ అంశాలకు వర్తింపచేయడం జరుగుతుంది.
1) e – వాణిజ్యము : ఇంటర్నెట్ ద్వారా వ్యాపారాన్ని నిర్వహించడాన్ని e – వాణిజ్యము అంటారు. e వాణిజ్యానికి మంచి ఉదాహరణ ఆన్లైన్ ద్వారా వస్తువుల కొనుగోలు, అమ్మకము చేసే ప్రక్రియ.

AP Inter 1st Year Commerce Study Material Chapter 12 వ్యాపారంలో ప్రస్తుత ధోరణులు

2) e – వేలం : e – వేలములో సంబంధిత వెబ్సైటును సందర్శించి వేలంలో ప్రదర్శించిన వస్తువులను క్లిక్ చేస్తూ కొనుగోలు చేయవచ్చు. అదే విధముగా వెబ్ పేజీలో తమ వస్తువులను ఉంచి వేలం ద్వారా అమ్మకాలు చేయవచ్చు.

3) e – బ్యాంకింగ్ : ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ వెబ్సైట్ను ఉపయోగించి బ్యాంకు ఖాతాదారులు తమ అకౌంట్స్ నిర్వహించుకోవచ్చు. చెల్లింపులను చేయవచ్చు. అవసరమైన నగదును ATM ద్వారా పొందవచ్చు. ఖాతా నిల్వను – తెలుసుకోవచ్చు. నగదును బదిలీ చేయవచ్చు.

4) e – మార్కెటింగ్ : ఎలక్ట్రానిక్ మార్కెటింగ్ ఎలాంటి భౌగోళిక అడ్డంకులు లేకుండా వస్తువుల కొనుగోలుకు, అమ్మకాలకు ప్రపంచవ్యాప్తముగా మార్కెటింగ్ను ఏర్పాటు చేస్తుంది. ఖాతాదారుల డిమాండ్కు కంపెనీలు స్పందించేందుకు ఇంటర్నెట్ సహాయం చేస్తుంది.

5) e – వర్తకము : e – వర్తకాన్ని ఆన్లైన్ వర్తకము లేదా e – బ్రోకింగ్ అంటారు. ఇది స్టాక్ ఎక్స్ఛేంజ్లలో సెక్యూరిటీలను కొనడానికి, అమ్మడానికి ఉపయోగపడుతుంది.

ప్రశ్న 2.
e – వ్యాపారం వల్ల సంస్థలకు కలిగే ప్రయోజనాలు ఏవి ?
జవాబు:
e – వ్యాపారం వల్ల వ్యాపార సంస్థలకు కలిగే ప్రయోజనాలు :

  1. e – వ్యాపారము వలన సంస్థలు తమ ప్రస్తుత మార్కెట్ను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలకు విస్తరింపచేసుకోవచ్చు. ఇది సంస్థ యొక్క అమ్మకాలను పెంచుతుంది.
  2. e– వ్యాపారము వలన వస్తువులను లేదా సేవలను సృష్టించడము, ప్రాసెసింగ్ చేయడం, పంపిణీ చేయడం, స్టోరింగ్ చేయడం, సమాచారాన్ని సేకరించడానికి అయ్యే వ్యయం తగ్గుతుంది.
  3. ఇన్వెంటరీ నిల్వ చేయడానికి, ఓవర్హెడ్ ఖర్చులు తగ్గుతాయి.
  4. పెట్టుబడికి, వస్తు సేవల అమ్మకం వలన వచ్చే ఆదాయానికి మధ్య ఉన్న సమయం తగ్గుతుంది.
  5. బిజినెస్ ప్రాసెస్, రీ- ఇంజనీరింగ్లకు సహకరిస్తుంది.
  6. టెలీ కమ్యూనికేషన్ ఖర్చు తక్కువగా ఉండటం వలన ఇంటర్నెట్ విలువ ఆధారిత నెట్వర్క్ వ్యయము కంటే తక్కువగా ఉంటుంది.

ప్రశ్న 3.
e – వ్యాపారం వల్ల వినియోగదారులకు కలిగే ప్రయోజనాలు ఏవి ?
జవాబు:
e – వ్యాపారం వల్ల వినియోగదారులకు కలిగే ప్రయోజనాలు :

  1. e – వ్యాపారము వలన వినియోగదారులు ఏ ప్రాంతం నుంచి అయినా, ఏ సమయంలోనైనా వ్యాపార వ్యవహారాలు నిర్వహించవచ్చు.
  2. e – వ్యాపారము వినియోగదారులకు వస్తు సేవలకు సంబంధించి, అనేక ప్రత్యామ్నాయాలు, అవకాశాలు కల్పిస్తాయి.
  3. e – వ్యాపారము ద్వారా వినియోగదారుడు అనేక ప్రాంతాలలోని మార్కెట్లలో వస్తు సేవలను పోల్చి చూసుకోవడానికి వీలవుతుంది.
  4. e- వ్యాపారము వస్తు సేవలు త్వరగా డెలివరీ కావడానికి దోహదము చేస్తుంది.
  5. వినియోగదారుడు వస్తు సేవలకు సంబంధించి సరైన సమాచారాన్ని పూర్తి స్థాయిలో క్షణాలలో పొందవచ్చును.
  6. వినియోగదారుడు సరైన వేలములో పాల్గొనేందుకు e – వ్యాపారము సహాయపడుతుంది.
  7. e– వ్యాపారము వినియోగదారుల మధ్య సహకారాన్ని ఏర్పరచి, ఒకరికొకరు వ్యాపార ఉపాయాలు, అనుభవాలు పంచుకునేటట్లు చేస్తుంది.
  8. e- వ్యాపారము వ్యాపారం మధ్య పోటీ తత్వాన్ని ఏర్పరచి, వినియోగదారులకు సరైన డిస్కౌంట్లు లభించేందుకు సహకరిస్తుంది.

AP Inter 1st Year Commerce Study Material Chapter 12 వ్యాపారంలో ప్రస్తుత ధోరణులు

ప్రశ్న 4.
e – వ్యాపార వ్యవహారాలలో కలిగే నష్ట భయాలను తెలపండి.
జవాబు:
e – వ్యాపార వ్యవహారాలలో కలిగే నష్ట భయాలు :

  1. ఇంటర్నెట్ వాడకములో సమాచారము అనధికారికముగా మార్చివేయబడడం. అనే నష్టభయమున్నది.
  2. రహస్యముగా ఉంచవలసిన వ్యక్తిగత సమాచారము మరియు క్రెడిట్ కార్డు వివరాలు, పాస్వర్డ్ లాంటి బ్యాంకింగ్ సమాచారానికి సంబంధించిన నష్టభయాలు.
  3. e – వాణిజ్యం ద్వారా జరిగే వ్యవహారాలకు భౌతిక ఆధారాలు లేని కారణముగా చట్టబద్ధతకు సంబంధించిన నష్టభయాలు ఎక్కువ.
  4. ఎలక్ట్రానిక్ సమాచారం అందించడములో వైఫల్యం, మొత్తము వ్యాపారము ముగింపుకు దారితీసే నష్టభయాలు.
  5. నిర్వాహక వర్గం, e – వాణిజ్య వ్యవహారాలు తన అదుపులో ఉంచుకొని, సరి చూసుకొని మరియు తగిన సమాచార పద్ధతులు ఎంచుకోవడంలోని నష్ట భయాలు.
  6. వైరస్లు, హ్యాగింగ్ంటి సాంకేతికపరమైన నష్ట భయాలు.

ప్రశ్న 5.
e – వ్యాపార వ్యవహారాల వల్ల సమాజానికి కలిగే ప్రయోజనాలను తెలపండి.
జవాబు:
e – వ్యాపారము వల్ల సమాజానికి కలిగే ప్రయోజనాలు :

  1. ఇంటినుంచే పనిచేసుకోవడానికి అవకాశము ఉండటం వలన షాపింగ్ కోసము ప్రయాణాలు తగ్గుతాయి. రోడ్లపై ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయి. దీనివలన వాయు కాలుష్యం తగ్గుతుంది. అంతేకాకుండా సమయము కూడా ఆదా అవుతుంది.
  2. వ్యాపారస్తులు తమ వస్తువులను ఇంటర్ నెట్ ద్వారా తక్కువ ధరలకు అమ్మడం వలన పేదవారికి ప్రయోజనం లభిస్తుంది.
  3. ప్రపంచ దేశాలలో, గ్రామీణ ప్రాంతాలలో ఉండే ప్రజలకు, మార్కెట్ లో లభించని వస్తు సేవలను e – వ్యాపారము ద్వారా పొందవచ్చు.
  4. వస్తు సేవలు తక్కువ వ్యయానికి లభించడమే కాకుండా, వాటి మన్నిక, నాణ్యత కూడా పెరుగుతుంది.

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
e – వ్యాపారం
జవాబు:
వ్యాపారము e- వ్యాపారం అనే పదాన్ని మొదటిసారిగా 1997లో IBM ఉపయోగించినది. దీని ప్రకారము e- అంటే ‘ఇంటర్నెట్ పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ ముఖ్యమైన వ్యాపార దశలను బదలాయింపు చేయడం’. అన్ని వ్యాపార కార్యకలాపాలను, వ్యాపార పరిధిని బలపరచడానికి Information and Communication Technology సహకారాన్ని ఇంటర్నెట్ల ద్వారా తీసుకోవడం – వ్యాపారముగా నిర్వచించవచ్చు.

 

ప్రశ్న 2.
e – బ్యాంకింగ్ [T.S. Mar 15]
జవాబు:
ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ మంచి విజయవంతమైన ఆన్లైన్ వ్యాపారము. బ్యాంకింగ్ వెబ్సైట్ను ఉపయోగిస్తూ బ్యాంకు ఖాతాదారులు తమ అకౌంట్స్ నిర్వహించుకోవడానికి, చెల్లింపులు, ఆజ్ఞ ఇవ్వడానికి e-బ్యాంకింగ్ సహాయము చేస్తుంది. ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా ఖాతాదారులు బ్యాంకును సందర్శించనవసరము లేకుండా అవసరమైన నగదును | ATM ద్వారా పొందవచ్చును. ఖాతా నిల్వలు తెలుసుకోవచ్చు. బిల్లులను చెల్లించవచ్చు. నగదును బదిలీ చేయవచ్చు.

ప్రశ్న 3.
e – మార్కెటింగ్ [A.P. Mar. ’15]
జవాబు:
ఎలక్ట్రానిక్ మార్కెటింగ్లో ఎలాంటి భౌగోళిక అడ్డంకులు లేకుండా వస్తువుల కొనుగోలుకు, అమ్మకాలకు ప్రపంచ వ్యాప్తముగా మార్కెటింగ్ ఏర్పాటు చేస్తుంది. ఎలాంటి సమయ భావన లేకుండా ఖాతాదారుల డిమాండ్కు కంపెనీ స్పందించేందుకు ఇంటర్నెట్ సహాయము చేస్తుంది. దీనికి వినియోగదారుడు ఉండే ప్రాంతముతో సంబంధం లేదు.

AP Inter 1st Year Commerce Study Material Chapter 12 వ్యాపారంలో ప్రస్తుత ధోరణులు

ప్రశ్న 4.
e – వాణిజ్యం
జవాబు:
ఇంటర్నెట్ ద్వారా వ్యాపారాన్ని నిర్వహించడాన్ని e-వాణిజ్యము అంటారు. ఎలక్ట్రానిక్ వాణిజ్యమును e – వాణిజ్యం · అని వ్యవహరిస్తారు. ఆన్లైన్ ద్వారా వస్తువుల కొనుగోలు, అమ్మకం చేసే ప్రక్రియ దీనికి మంచి ఉదాహరణ. అంతేకాకుండా e-వాణిజ్యములో అనేక కార్యకలాపాలు కలిసి ఉంటాయి. ఏదైనా కార్యకలాపాన్ని ఎలక్ట్రానిక్ పరికరము ద్వారా నిర్వహించడాన్ని e- వాణిజ్యం అనవచ్చు.

ప్రశ్న 5.
e – వర్తకం
జవాబు:
e-వర్తకాన్ని ఆన్లైన్ వర్తకమని, e- బ్రోకింగ్ అని కూడా వ్యవహరిస్తారు. ఇది స్టాక్ ఎక్స్ఛేంజ్లలో సెక్యూరిటీలను అమ్మడానికి, కొనడానికి సహాయపడుతుంది.

AP Inter 1st Year Commerce Study Material Chapter 11 బహుళ జాతి సంస్థలు

Andhra Pradesh BIEAP AP Inter 1st Year Commerce Study Material 11th Lesson బహుళ జాతి సంస్థలు Textbook Questions and Answers.

AP Inter 1st Year Commerce Study Material 11th Lesson బహుళ జాతి సంస్థలు

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
బహుళజాతి సంస్థలను నిర్వచించి, వాటి లక్షణాలను వివరించండి.
జవాబు:
ఒక దేశములో నిర్వహణ కార్యాలయము ఉండి, ఇతర దేశాలలో వ్యాపార కార్యకలాపాలను నిర్వహించినట్లయితే ఆ సంస్థలను బహుళజాతీయ సంస్థలు అంటారు. ఈ బహుళజాతి సంస్థలను మల్టీనేషనల్ సంస్థలని, గ్లోబల్ సంస్థలని లేదా అంతర్జాతీయ సంస్థలని వేరు వేరు పేర్లతో పిలవబడతాయి. పెప్సీ, హుండాయి, నైక్, రీబాక్, ఎల్.జి, సామ్సంగ్ బహుళ జాతి సంస్థలకు ఉదాహరణలు.

నిర్వచనాలు: ఏదైనా సంస్థ తన ఉత్పత్తి కార్యకలాపాలను తన మాతృదేశముతోపాటు ఇతర దేశాలకు విస్తరింపజేస్తే అలాంటి సంస్థను బహుళజాతి సంస్థ అంటారు.

అంతర్జాతీయ శ్రామిక నివేదిక ప్రకారము ‘ఒక దేశములో నిర్వహణ కార్యాలయము ఉండి, అనేక ఇతర దేశాలతో వ్యాపార కార్యకలాపాలను నిర్వహించే సంస్థనే బహుళజాతి సంస్థ’ అంటారు. విదేశమారక నియంత్రణ చట్టము 1973 ప్రకారము, 1) రెండు లేదా అంతకంటే ఎక్కువ దేశాలలో తమ అనుబంధ సంస్థగాని, శాఖగాని ఉన్న సంస్థ. 2) రెండు లేదా అంతకంటే ఎక్కువ దేశాలలో తమ వ్యాపార కార్యకలాపములను కొనసాగించే. సంస్థను బహుళజాతి సంస్థ అంటారు.

బహుళజాతి సంస్థల లక్షణాలు:
1. అధిక పరిమాణము: బహుళజాతి సంస్థల ఆస్తులు, అమ్మకాలు అధిక పరిమాణము కలిగి ఉంటాయి. ఈ సంస్థల అమ్మకాల టర్నోవర్ అభివృద్ధి చెందుతున్న అనేక దేశాల స్థూల జాతీయ ఉత్పత్తి కంటే ఎక్కువగా ఉంటుంది. ఉదా: IBM నిజ ఆస్తులు 8 బిలియన్ల డాలర్ల కంటే ఎక్కువ.

2. ప్రపంచ వ్యాప్తముగా కార్యకలాపాలు: ప్రపంచములో వివిధ దేశాలలో బహుళజాతీయ సంస్థలు తమ ఉత్పత్తి, మార్కెటింగ్ కార్యకలాపాలను నిర్వహిస్తాయి. వీటికి ఎన్నో దేశాలలో బ్రాంచీలు, అనుబంధ సంస్థలు, కర్మాగారాలు, కార్యాలయాలు ఉంటాయి. ఉదా: కోకోకోలా, ఆపిల్ సంస్థలు, మన దేశానికి చెందిన ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, రెడ్డి లాబ్స్ వంటివి ప్రపంచ వ్యాప్తముగా విస్తరించినవి.

AP Inter 1st Year Commerce Study Material Chapter 11 బహుళ జాతి సంస్థలు

3. కేంద్రీకృత నియంత్రణ: వివిధ దేశాలలో ఉన్న బహుళ జాతిసంస్థల బ్రాంచీలు లేదా అనుబంధ సంస్థలు ప్రధాన కార్యాలయము యొక్క పర్యవేక్షణ, మార్గదర్శకత్వము, నియంత్రణలో పనిచేస్తాయి.

4. నిర్వహణలో నైపుణ్యము: బహుళజాతి సంస్థలు సమర్థవంతమైన మేనేజర్లను, అనుభవము ఉన్నవారి సేవలను ఉపయోగించుకుంటాయి. కాబట్టి ఈ సంస్థలు వృత్తిపరమైన ‘నిర్వహణ ద్వారా తమ కార్యకలాపములను మార్కెట్లో విజయవంతముగా నిర్వహిస్తారు.

5. అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానము: బహుళజాతి సంస్థలకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానము అందుబాటులో ఉండటము వలన వినియోగదారులకు నాణ్యమైన వస్తుసేవలను అందించటం జరుగుతుంది.

6. ప్రముఖమైన స్థానము, హోదా: బహుళజాతి సంస్థల పరిమాణము, ఆస్తులు, అమ్మకాలు, చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ సంస్థలు వ్యాపారము కొనసాగిస్తున్న దేశాలలో మార్కేట్ను నియంత్రించడమే కాక ప్రముఖమైన స్థానాన్ని, హోదాను కలిగి ఉంటాయి.

7. అంతర్జాతీయ మార్కెట్లో ప్రవేశము: బహుళజాతీయ సంస్థలకు ఉన్న మూలధనము, సాంకేతిక పరిజ్ఞానము, నైపుణ్యాల బదిలీ ద్వారా సులభముగా అంతర్జాతీయ మార్కెట్లోనికి చొచ్చుకొనిపోతాయి.

ప్రశ్న 2.
బహుళజాతి సంస్థలను నిర్వచించి, వాటి ప్రయోజనాలను వివరించండి.
జవాబు:
ఏదైనా సంస్థ తన ఉత్పత్తి కార్యకలాపాల వలన తన మాతృదేశముతో పాటు ఇతర దేశాలకు విస్తరింపజేస్తే అలాంటి సంస్థను బహుళజాతి సంస్థ అంటారు. ILO నివేదిక ప్రకారము ‘ఒక దేశములో నిర్వహణ కార్యాలయము ఉండి, అనేక ఇతర దేశాలతో కార్యకలాపాలను నిర్వహించే సంస్థనే బహుళజాతి సంస్థ’ అంటారు.
బహుళజాతి సంస్థల ప్రయోజనాలు: బహుళజాతి సంస్థల వలన అతిథి దేశాలకు ఈ క్రింది ప్రయోజనాలు కలుగుతాయి.

  1. అభివృద్ధి చెందుతున్న దేశాలలో మూలధన కొరతను తగ్గించడానికి బహుళజాతి సంస్థలు ఆయాదేశాలలో పరిశ్రమల అభివృద్ధికి అవసరమైన మూలధనాన్ని సమకూరుస్తాయి.
  2. అతిథి దేశాలలో బహుళజాతి సంస్థలు ఉద్యోగ అవకాశాలు కల్పించి, ఆకర్షణీయమైన వేతనాలు చెల్లిస్తారు. ఆదాయము పెంపుదల జరుగుతుంది.
  3. ఈ సంస్థల వలన అతిథి దేశాలు, విదేశాల నుంచి నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని పొందుతాయి.
  4. వృత్తిపరమైన నిర్వహణను చేపట్టడంవలన అతిథి దేశాలు నిర్వహణా సామర్థ్యాన్ని పెంపొందించుకోగలవు.
  5. ఎగుమతులను పెంచి దిగుమతులను తగ్గించడం ద్వారా ఆ దేశము చెల్లింపు నిల్వ స్థాయి మెరుగవుతుంది. విదేశీమారక నిల్వలలో ఆదాలను పొందడం బహుళజాతి సంస్థల ద్వారానే సాధ్యమవుతుంది.
  6. బహుళ సంస్థలు ఆయా దేశాలలో నెలకొని ఉన్న ఏకస్వామ్యాన్ని అడ్డుకోవడంవలన ఆయా దేశాలలో పనిచేసే సాంప్రదాయాలను, పని వాతావరణము సృష్టించడమే కాకుండా, వినియోగదారులకు నాణ్యమైన సేవలను అందించడానికి కూడా వీలవుతుంది.
  7. బహుళజాతి సంస్థల కార్యకలాపాలవలన అతిథి దేశాలలో వ్యాపారస్తులు, పంపిణీదారులు, వర్తక మధ్యవర్తులు తమ వ్యాపార కార్యకలాపాలను ‘ విస్తృతపరుచుకుంటాయి.
  8. బహుళజాతి సంస్థలవలన, స్వదేశీ సంస్థలు పరిశోధన, అభివృద్ధి ప్రయోజనాలను పొందుతాయి.
  9. బహుళజాతి సంస్థలు ఆయాదేశాలలో నాణ్యమైన వస్తుసేవలను అందించడం ద్వారా వినియోగదారులకు కొనుగోలుశక్తి పెరిగి జీవన ప్రమాణస్థాయి మెరుగవుతుంది.
  10. బహుళజాతి సంస్థల వలన అతిథి దేశాలు పారిశ్రామిక ఆర్థిక పురోభివృద్ధిని సాధిస్తాయి.

స్వదేశాలకు కలిగే ప్రయోజనాలు: బహుళజాతి సంస్థలవలన స్వదేశాలకు ఈ క్రింది ప్రయోజనాలు కలుగుతాయి.

  1. బహుళజాతి సంస్థలు స్వదేశములో తయారైన వస్తువులు ప్రపంచమంతటా మార్కెటింగ్ చేసి అమ్మడానికి అవకాశాలు కల్పిస్తాయి.
  2. ఈ సంస్థలు స్వదేశములోని ప్రజలకు ఉద్యోగ అవకాశాలను స్వదేశములోను, ఇతర దేశాలలో కల్పిస్తాయి.
  3. బహుళజాతి సంస్థలు ముడి సరుకు, శ్రమ, భూమి మొదలైన వనరులు పొంది, స్వదేశములో వస్తువులను తక్కువ ధరకు లభించేటట్లు చేస్తాయి.
  4. స్వదేశ కంపెనీలు ఎగుమతులను చేపట్టడానికి అవసరమైన చేయూతను బహుళజాతి సంస్థల ద్వారా పొందగలుగుతున్నాయి. దీని వలన దీర్ఘకాలములో అనుకూల చెల్లింపుల శేషాన్ని సాధించవచ్చు.
  5. ఈ సంస్థలు స్వదేశములో పారిశ్రామికాభివృద్ధిని సాధించి ఉత్పత్తులను ప్రోత్సహిస్తాయి.
  6. అతిథి దేశాల నుంచి డివిడెండు, లైసెన్స్ ఫీజు, రాయల్టీలు మొదలైనవి పొందుతాయి. కాబట్టి స్వదేశ ఆరాయము పెంచుకోవడానికి వీలు అవుతుంది.
  7. ఈ సంస్థల వలన స్వదేశములో విదేశీ సంస్కృతుల వలన వచ్చే ఆదాలు చేకూరుతాయి.

AP Inter 1st Year Commerce Study Material Chapter 11 బహుళ జాతి సంస్థలు

ప్రశ్న 3.
బహుళజాతి సంస్థలను నిర్వచించి, వాటి పరిమితులు/నష్టాలను వివరించండి.
జవాబు:
ఏదైనా సంస్థ తన ఉత్పత్తి కార్యకలాపాల వలన తన మాతృదేశముతోపాటు ఇతర దేశాలకు విస్తరింపజేస్తే అలాంటి సంస్థను బహుళజాతి సంస్థ అంటారు. ILO నివేదిక ప్రకారము “ఒక దేశములో నిర్వహణ కార్యాలయం ఉండి అనేక ఇతర దేశాలతో కార్యకలాపాలను నిర్వహించే సంస్థను బహుళ జాతీయ సంస్థ” అంటారు.
బహుళజాతి సంస్థల వలన పరిమితులు / అతిథి దేశాలకు బహుళజాతి సంస్థల వలన పరిమితులు:

  1. బహుళజాతి సంస్థలు అతిథి దేశాలలోని పెద్ద పెద్ద వ్యాపార సంస్థలతో కలసి, ఏకస్వామ్యాన్ని సృష్టించి, ఆర్థికశక్తుల కేంద్రీకరణకు దోహదపడతాయి.
  2. బహుళజాతి సంస్థలు, తమ దేశములో పాతబడిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అతిథి దేశాలకు బదిలీచేయడానికి ప్రయత్నము చేస్తాయి.
  3. బహుళజాతి సంస్థలు ఆయా దేశాల రాజకీయ వ్యవహారాలలో జోక్యం చేసుకొని, అంతర్గత సమస్యలను సృష్టించడంవలన దేశ సార్వభౌమాధికారానికి భంగం కలిగించవచ్చును.
  4. లాభాలను సంపాదించే క్రమములో, బహుళజాతి సంస్థలు అతిథి దేశములోని సహజ వనరులను విచక్షణా రహితముగా వినియోగించడమువలన ఆ దేశాలలో సహజవనరులు తగ్గి క్షీణిస్తాయి.
  5. లాభాలు, డివిడెండ్లు, రాయల్టీ చెల్లింపు రూపములో, పెద్ద మొత్తములో ద్రవ్యము విదేశాలకు ప్రవహిస్తుంది. దీనివలన ఆ దేశ విదేశ మారకములో విపరీత మార్పులు చోటుచేసుకుంటాయి.
  6. అతిథి దేశాల ఉద్దేశాలను, ప్రాముఖ్యతను బహుళజాతి సంస్థలు పట్టించుకోవు. తమకు లాభదాయకమైన యూనిట్లలో పెట్టుబడిపెడతాయి.
  7. అతిథి దేశాలతో అనుసంధానాలు ఏర్పాటు చేసుకున్నప్పుడు బహుళజాతి సంస్థలు అనేక ఆంక్షలు విధిస్తుంది.
  8. బహుళజాతి సంస్థలు ప్రజల యొక్క అలవాట్లను, కోర్కెలను, ఫ్యాషన్లను మార్చి, విదేశీ సంస్కృతిని వ్యాపింపజేస్తాయి.

స్వదేశానికి బహుళజాతి సంస్థల వలన నష్టాలు:

  1. బహుళజాతి సంస్థలు స్వదేశము నుంచి వివిధ అతిథి దేశాలకు మూలధన మార్పిడి చేయడమువలన స్వదేశములో ప్రతికూల చెల్లింపుల శేషము జరగవచ్చు.
  2. బహుళజాతి సంస్థలు పక్షపాత ధోరణి అవలంబించడం వలన స్వదేశములోని ప్రజలకు ఉద్యోగ అవకాశాలను సృష్టించలేవు.
  3. విదేశాలలో పెట్టుబడి లాభదాయకముగా ఉండటంవలన, బహుళజాతి సంస్థలు స్వదేశములో పారిశ్రామికాభివృద్ధిని నిర్లక్ష్యము చేస్తాయి.

ప్రశ్న 4.
ప్రపంచీకరణ అంటే ఏమిటి ? దాని ఆవశ్యకతను వివరించండి.
జవాబు:
ప్రపంచము స్వయం పోషక జాతీయ ఆర్థిక వ్యవస్థల నుంచి క్రమముగా పరస్పరం ఆధారపడిన సమీకృత ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దిశగా కదులుతున్నది. దీనినే ప్రపంచీకరణగా వ్యవహరించడం జరుగుతుంది. ఒక దేశ ఆర్థిక వ్యవస్థ కార్యకలాపాల పరిధిని విదేశాలకు కూడా విస్తరించే విధానమే ప్రపంచీకరణ. ఉత్పత్తి కారకాలకు ప్రపంచవ్యాప్తముగా సంపూర్ణమైన గమనశీలతను ఏర్పరచడమే ప్రపంచీకరణ. ఒకదేశ ఆర్థిక వ్యవస్థను ప్రపంచ ఆర్థికవ్యవస్థలలో అనుసంధానము చేసి ప్రపంచాన్ని ఏకైక అంతర్జాతీయ మార్కెట్గా రూపొందించడమే ప్రపంచీకరణ లక్ష్యము. దీనివలన ప్రపంచ దేశాల మధ్య దూరము తగ్గి ప్రపంచమంతా ఒక గ్రామముగా మారే అవకాశము ఉన్నది.

AP Inter 1st Year Commerce Study Material Chapter 11 బహుళ జాతి సంస్థలు

అభివృద్ధి చెందిన దేశాల ఆర్థిక శాస్త్రవేత్తలు ప్రపంచీకరణను ఈ విధముగా నిర్వచించినారు. “స్వేచ్ఛా వాణిజ్య విధానము, పెట్టుబడి, సాంకేతిక పరిజ్ఞానము, శ్రామికుల గమనశీలత”. ప్రపంచీకరణలో నాలుగు లక్షణాలు ఉన్నవి. అవి:

  1. ఆటంకాలు లేని వర్తక ప్రవాహాలు: దేశ సరిహద్దులు దాటి వస్తువుల ప్రవాహాలు స్వేచ్ఛగా జరగడానికి అనుమతులు తేలికగా లభించేటట్లుగా వర్తక అవరోధాలను తగ్గించుట.
  2. మూలధన ప్రవాహాలు: వివిధ దేశాల మధ్య మూలధనము స్వేచ్ఛగా ప్రవేశించడానికి వీలుగా వాతావరణాన్ని సృష్టించడం.
  3. సాంకేతిక విజ్ఞానాల ప్రవాహము: సాంకేతిక విద్య, విజ్ఞానము ఒక ప్రాంతము నుంచి మరొక ప్రాంతానికి, ఒక దేశము నుంచి మరొక దేశానికి స్వేచ్ఛగా ప్రవేశించడానికి అనువైన వాతావరణము.
  4. ఆటంకములేని శ్రామికుల గమనము: ప్రపంచములోని వివిధ దేశాలమధ్య శ్రామికుల స్వేచ్ఛాగమనాన్ని ప్రోత్సహించే విధముగా వాతావరణమును సృష్టించడము.

ప్రపంచీకరణలో రెండు రూపాలున్నవి. 1) మార్కెట్ను ప్రపంచీకరించడం, 2) ఉత్పత్తిని ప్రపంచీకరించడం.

మార్కెట్ను ప్రపంచీకరించడం అంటే జాతీయ మార్కెట్లను ఒక ప్రపంచ మార్కెట్ కలిపివేయడం ద్వారా వ్యాపార ఆటంకాలు తగ్గి, అంతర్జాతీయ విక్రయాలు సులభతరము అవుతాయి. వినియోగదారుల అభిరుచులు, ఇష్టాలు ఒక ప్రపంచక్రమానుసారము ఐక్యం అవుతుంది. సంస్థలు సారూప్యత గల ప్రధాన వస్తువులను ప్రపంచవ్యాప్తముగా అందిస్తూ ప్రపంచమార్కెట్కు దోహదపడతాయి.

ఉత్పత్తిని ప్రపంచీకరించడం అంటే వస్తుసేవల ఉత్పత్తి కేంద్రాలను ఉత్పత్తికారకములైన శ్రమ, భూమి, మూలధనమును ప్రపంచములోని వివిధ ప్రాంతాలకు వ్యాపింపచేయడం. కంపెనీలు వ్యయమును తగ్గించుట ద్వారా, నాణ్యతను పెంచడంద్వారా వస్తు సేవలను అందించడములో వాటి పనితీరును మెరుగుపరుచుకుంటాయి.
ప్రపంచీకరణకు రెండు కారకాలు ఉంటాయి. 1) తక్కువ వర్తక ఆటంకాలు. 2) సాంకేతికపరమైన మార్పులు. సాంకేతిక మార్పులు టెలీకమ్యూనికేషన్స్ మరియు మైక్రోప్రాసెసర్స్, ప్రపంచవ్యాప్త వెబ్, రవాణాలో పురోగతులు సంభవించినవి. రవాణా వ్యయాలను తగ్గించి, సంస్థలు తమకు ఆర్థికముగా భౌగోళికముగా, అనుకూలముగా ఉన్న ప్రాంతాలకు వ్యాప్తిచెందేలా చేశాయి. సమాచారాన్ని సేకరించడానికి, విశ్లేషించడానికి, అందించడానికి అయ్యే వ్యయాలను తగ్గించడం ద్వారా ప్రపంచవ్యాప్తమైన ఉత్పత్తి సంవిధానాన్ని సంస్థలు సమర్థవంతముగా నిర్వహించేలా చేశాయి.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
బహుళజాతి సంస్థల అర్థాన్ని వివరించండి.
జవాబు:
Multinational అనే పదము రెండు పదముల కలయిక. అవి Multi మరియు National. Multi అంటే అనేకము, బహుళ అని అర్థము. National అంటే జాతి, దేశము అని అర్ధము. కాబట్టి బహుళజాతి సంస్థలు అంటే వివిధ దేశాలలో నడపబడుతున్న లేదా నిర్వహించబడుతున్న సంస్థ అని అర్ధము. ఆ కంపెనీకి ఒక దేశము కంటే ఎక్కువ దేశాలలో ఫ్యాక్టరీలు, బ్రాంచీలు లేదా ఆఫీసులు ఉంటాయి. యునైటెడ్ నేషన్స్ కమీషన్ ప్రకారము బహుళజాతి సంస్థ అంటే నమోదుచేసిన దేశములో కాకుండా అదనముగా ఒకటి లేదా అంతకంటే ఎక్కువ దేశాలలో నిర్వహింపబడుతున్న సంస్థ అని అర్ధము.

బహుళజాతి సంస్థ అంటే కంపెనీల పరంపర లేదా కంపెనీల శ్రేణి అని అర్థము. ఈ కంపెనీలన్నీ ఏకకాలములో వివిధ దేశాలలో నిర్వహింపబడతాయి. అందువలన ఈ కంపెనీలన్నీ వివిధ దేశాల అధికార పరిధులలో పనిచేస్తాయి. కంప్యూటీకరణ మరియు కమ్యూనికేషన్లో అభ్యుదయ ఆధారముగా ఏర్పడిన రెండవ పారిశ్రామిక విప్లవము ఫలితమే బహుళజాతి సంస్థ.

AP Inter 1st Year Commerce Study Material Chapter 11 బహుళ జాతి సంస్థలు

ప్రశ్న 2.
బహుళజాతి సంస్థల లక్షణాలను పేర్కొనండి.
జవాబు:
బహుళజాతి సంస్థల లక్షణాలు:
1. అధిక పరిమాణము: బహుళజాతి సంస్థల ఆస్తులు, అమ్మకాలు, అధిక పరిమాణములో ఉంటాయి. ఈ సంస్థల అమ్మకాల టర్నోవర్ అభివృద్ధి చెందుతున్న దేశాల స్థూల జాతీయ ఉత్పత్తికంటే ఎక్కువ. ఉదా: IBM నిజ ఆస్తులు 8 బిలియన్ల డాలర్ల కంటే ఎక్కువ.

2. ప్రపంచవ్యాప్తముగా కార్యకలాపాలు ప్రపంచములో వివిధ దేశాలలో బహుళజాతి సంస్థలు తమ ఉత్పత్తి, మార్కెటింగ్ కార్యకలాపాలను నిర్వహిస్తాయి. వీటికి ఎన్నో దేశాలలో బ్రాంచీలు, అనుబంధ సంస్థలు, కర్మాగారాలు, కార్యాలయాలు ఉంటాయి. ఉదా: కోకోకోలా, ఆపిల్ సంస్థలు, ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, రెడ్డి లాబ్స్ వంటివి ప్రపంచవ్యాప్తముగా విస్తరించినవి.

3. కేంద్రీకృత నియంత్రణ: వివిధ దేశాలలో ఉన్న బహుళజాతి సంస్థల బ్రాంచీలు లేదా అనుబంధ సంస్థలు ప్రధాన కార్యాలయం యొక్క పర్యవేక్షణ, మార్గదర్శకత్వం, నియంత్రణలో పనిచేస్తాయి.

4. నిర్వహణలో నైపుణ్యము: బహుళజాతి సంస్థలు సమర్థవంతమైన మేనేజర్లు, అనుభవము కలవారి సేవలను ఉపయోగించుకుంటాయి. కాబట్టి ఈ సంస్థలు వృత్తిపరమైన నిర్వహణ ద్వారా తమ కార్యకలాపాలను మార్కెట్లో విజయవంతముగా నిర్వహిస్తాయి.

5. అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానము: బహుళజాతి సంస్థలకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానము అందుబాటులో ఉంటుంది కాబట్టి వినియోగదారులకు నాణ్యమైన వస్తుసేవలను అందించడం జరుగుతుంది. 6. ప్రముఖమైన స్థానము, హోదా: బహుళజాతి సంస్థల పరిమాణము, ఆస్తులు, అమ్మకాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వ్యాపారము కొనసాగిస్తున్న దేశాలలో మార్కెట్ను నియంత్రించడమే కాకుండా ప్రముఖమైన స్థానాన్ని, హోదాను కలిగి ఉంటాయి.

ప్రశ్న 3.
బహుళజాతి సంస్థల వల్ల అతిథి దేశానికి కలిగే ఏవైనా నాలుగు ప్రయోజనాలను వివరించండి.
జవాబు:
బహుళజాతి సంస్థల వలన అతిథి దేశానికి ప్రయోజనాలు:

  1. మూలధనము సమకూర్చడము: అభివృద్ధి చెందుతున్న దేశాలలో మూలధనము కొరతను తగ్గించడానికి బహుళజాతి సంస్థలు ఆయాదేశాల పారిశ్రామికాభివృద్ధికి అవసరమైన మూలధనాన్ని సమకూరుస్తాయి.
  2. సాంకేతిక పరిజ్ఞానము బదిలీ: బహుళజాతి సంస్థల ద్వారా సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చెందుతున్న దేశాలు సులభముగా బదిలీ చేసుకొనగలుగుతాయి.
  3. ఉద్యోగాల లభ్యత: అతిథి దేశాలలో బహుళజాతి సంస్థలు ఉద్యోగ అవకాశాలను కల్పించి, ఆకర్షణీయమైన వేతనాలను అందిస్తాయి.
  4. విదేశమారకము: ఎగుమతులను పెంచి, దిగుమతులను తగ్గించడం ద్వారా ఆ దేశము యొక్క చెల్లింపు నిల్వల స్థాయి మెరుగవుతుంది. విదేశమారకము నిల్వలలో ఆదాలను పొందడం బహుళజాతి సంస్థల ద్వారా సాధ్యమవుతుందీ.

ప్రశ్న 4.
బహుళజాతి సంస్థల వల్ల స్వదేశానికి కలిగే ఏవైనా నాలుగు ప్రయోజనాలను వివరించండి. [T.S. Mar. ’15]
జవాబు:

  1. బహుళజాతి సంస్థలు స్వదేశములో తయారైన వస్తువులు ప్రపంచమంతటా మార్కెటింగ్ చేసి అమ్మడానికి అవకాశాలను కల్పిస్తాయి.
  2. ఈ సంస్థలు స్వదేశములోని ప్రజలకు ఉద్యోగ అవకాశాలను స్వదేశములోనూ, ఇతర దేశాలలో కల్పిస్తాయి.
  3. బహుళజాతి సంస్థలు ముడిసరుకు, శ్రమ, భూమి మొదలైన వనరులను పొంది, స్వదేశములో వస్తువులను తక్కువ ధరకు లభించేటట్లు చేస్తాయి.
  4. స్వదేశ కంపెనీలు ఎగుమతులను చేపట్టడానికి అవసరమైన చేయూతను బహుళజాతి సంస్థల ద్వారా పొందగలుగుతున్నాయి. దీని వలన దీర్ఘకాలములో అనుకూల చెల్లింపుల శేషాన్ని సాధించవచ్చును.

AP Inter 1st Year Commerce Study Material Chapter 11 బహుళ జాతి సంస్థలు

ప్రశ్న 5.
బహుళజాతి సంస్థల వల్ల అతిథి దేశానికి ఉన్న నష్టాలను వివరించండి. [A.P. Mar. ’15]
జవాబు:
బహుళజాతి సంస్థల వల్ల అతిథి దేశానికి కలిగే నష్టాలు:

  1. బహుళజాతి సంస్థలు అతిథి దేశాలలో పెద్దపెద్ద వ్యాపార సంస్థలతో కలిసి, ఏకస్వామ్యాన్ని సృష్టించి, ఆర్థిక శక్తుల కేంద్రీకరణకు దోహదపడుతుంది.
  2. బహుళజాతి సంస్థలు తమ దేశములో పాతబడిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అతిథి దేశాలకు బదిలీచేయడానికి ప్రయత్నిస్తాయి.
  3. బహుళజాతి సంస్థలు ఆయాదేశాల రాజకీయ వ్యవహారాలలో జోక్యము చేసుకొని, అంతర్గత సమస్యలను సృష్టించడంవలన దేశ సార్వభౌమాధికారానికి భంగము కలిగించవచ్చు.
  4. లాభాలను సంపాదించే క్రమములో బహుళజాతి సంస్థలు అతిథి దేశములో సహజవనరులను విచక్షణా- రహితముగా వినియోగించడంవలన ఆ దేశాలలో సహజవనరులు తగ్గి క్షీణిస్తాయి.

ప్రశ్న 6.
బహుళజాతి సంస్థల వల్ల స్వదేశానికి ఉన్న నష్టాలను వివరించండి.
జవాబు:
బహుళజాతి సంస్థల వల్ల స్వదేశానికి కలిగే నష్టాలు:

  1. బహళజాతి సంస్థలు స్వదేశము నుంచి అతిథి దేశాలకు మూలధన మార్పిడి చేయడంవలన స్వదేశములో ప్రతికూల చెల్లింపుల శేషము ఏర్పడవచ్చు.
  2. బహుళజాతి సంస్థలు పక్షపాత ధోరణి అవలంబించడంవలన స్వదేశములోని ప్రజలకు ఉద్యోగ అవకాశాలు సృష్టించలేవు.
  3. విదేశాలలో పెట్టుబడి లాభదాయకముగా ఉండటమువలన బహుళజాతి సంస్థలు స్వదేశములో పారిశ్రామికాభివృద్ధిని నిర్లక్ష్యము చేస్తాయి.
  4. బహుళజాతి సంస్థలు స్వదేశములో విదేశీ సంస్కృతిని వ్యాపింపజేస్తాయి.

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ప్రపంచీకరణను నిర్వచించండి.
జవాబు:
ఒక దేశ ఆర్థిక వ్యవస్థ కార్యకలాపాల పరిధిని విదేశాలకు విస్తరింపజేయడమే ప్రపంచీకరణ. అభివృద్ధి చెందిన దేశాల ఆర్థిక శాస్త్రవేత్తలు ప్రపంచీకరణను ఈ విధముగా నిర్వచించినారు “స్వేచ్ఛా వాణిజ్య విధానము, పెట్టుబడి, సాంకేతిక పరిజ్ఞానము, శ్రామికుల గమనశీలత. ఈ నిర్వచనము ప్రకారము ప్రపంచీకరణలో నాలుగు లక్షణాలు ఉన్నవి. 1) ఆటంకాలు లేని వర్తక ప్రవాహము, 2) మూలధన ప్రవాహాలు, 3) సాంకేతిక విజ్ఞానాల ప్రవాహము, 4) ఆటంకములేని శ్రామికుల గమనశీలత.

ప్రశ్న 2.
ఎఫ్.డి.ఐ. ని నిర్వచించండి.
జవాబు:
ఒక దేశములోని (అతిథి దేశము) ఉత్పత్తులను మరొక దేశానికి (స్వదేశానికి) సంబంధించిన సంస్థ నియంత్రించడాన్ని విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి (F.D.I.) అంటారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి అనేది బహుళజాతి సంస్థల నిర్వచనాత్మక లక్షణము. స్వదేశము బయట ఉన్న వ్యాపార సంస్థ కార్యకలాపాలలో, ఏదైనా సంస్థ పెట్టుబడి పెడితే దానిని విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి జరిగినట్లుగా భావిస్తారు.

AP Inter 1st Year Commerce Study Material Chapter 11 బహుళ జాతి సంస్థలు

ప్రశ్న 3.
బహుళజాతీయ సంస్థను నిర్వచించండి.
జవాబు:
అంతర్జాతీయ శ్రామిక నివేదిక ప్రకారము ‘ఒక దేశములో నిర్వహణ కార్యాలయము ఉండి, అనేక ఇతర దేశాలతో వ్యాపార కార్యకలాపాలను నిర్వహించే సంస్థను బహుళజాతీయ సంస్థ’ అంటారు. విదేశ మారక నియంత్రణ చట్టం 1973 ప్రకారము

  1. రెండు లేదా అంతకంటే ఎక్కువ దేశాలలో తమ అనుబంధ సంస్థనుగాని, శాఖ గాని ఉన్న సంస్థ.
  2. రెండు లేదా అంతకంటే ఎక్కువ దేశాలలో తమ కార్యకలాపాలను కొనసాగించే సంస్థను బహుళజాతి అంటారు.

AP Inter 1st Year Commerce Study Material Chapter 10 సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలు

Andhra Pradesh BIEAP AP Inter 1st Year Commerce Study Material 10th Lesson సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలు Textbook Questions and Answers.

AP Inter 1st Year Commerce Study Material 10th Lesson సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలు

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
MSME లను నిర్వచించి, వాటి ఆవశ్యకతను వివరించండి.
జవాబు:
సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థల అభివృద్ధి (MSMED) చట్టము, 2006 పొందుపరచబడిన దాని ప్రకారము MSME లను రెండు రకాలుగా వర్గీకరించవచ్చును.

  1. ఉత్పత్తి సంస్థలు
  2. సేవా సంస్థలు

1. ఉత్పత్తి సంస్థలు: వస్తూత్పత్తిలో లేదా వస్తుతయారీలో నిమగ్నమైన సంస్థలను ఉత్పత్తి సంస్థలు అంటారు. యంత్రపరికరాలను ఉపయోగించి ముడి సరుకును పూర్తిగా తయారైన వస్తువులుగా మార్చి, వాటికి విలువను సృష్టించే సంస్థలను ఉత్పత్తి సంస్థలుగా చెప్పవచ్చును.

MSMEల దృష్టిలో ఉత్పత్తి సంస్థలు వాటి యంత్రపరికరాలలో పెట్టిన పెట్టుబడి ఆధారముగా నిర్వచింపబడినవి.

  1. సూక్ష్మ సంస్థ (Micro enterprise): యంత్రపరికరాలలో పెట్టిన పెట్టుబడి 25 లక్షల రూపాయలకు మించని సంస్థను సూక్ష్మ సంస్థ అంటారు.
  2. చిన్నతరహా సంస్థ (Small enterprise): యంత్రపరికరాలలో పెట్టుబడి 25 లక్షల రూపాయల కంటే ఎక్కువగా ఉండి, 5 కోట్ల రూపాయలకు మించని సంస్థను చిన్నతరహా సంస్థ అంటారు.
  3. మధ్యతరహా సంస్థ (Medium enterprise): యంత్రపరికరాలలో పెట్టుబడి 5 కోట్ల రూపాయల కంటే ఎక్కువగా ఉండి, 10 కోట్ల రూపాయలకు మించకపోతే దానిని మధ్యతరహా సంస్థ అంటారు.

AP Inter 1st Year Commerce Study Material Chapter 10 సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలు

2. సేవా సంస్థలు: సేవలను అందించడములో నిమగ్నమైన సంస్థలను సేవా సంస్థలు అంటారు. వాటిని ఈ క్రింది విధముగా నిర్వచించవచ్చును.

  1. సూక్ష్మ సంస్థ: పరికరాలలో పెట్టుబడి 10 లక్షల రూపాయలకు మించకపోతే దానిని సూక్ష్మ సంస్థ అంటారు.
  2. చిన్నతరహా సంస్థ: పరికరాలలో పెట్టుబడి 10 లక్షల రూపాయల కంటే ఎక్కువగా ఉండి, 2 కోట్ల రూపాయలు మించకపోతే దానిని చిన్నతరహా సంస్థ అంటారు.
  3. మధ్యతరహా సంస్థ: పరికరాలలో పెట్టుబడి 2 కోట్ల రూపాయల కంటే ఎక్కువగా ఉండి, 5 కోట్లకు మించకపోతే దానిని మధ్యతరహా సంస్థ అంటారు.

MSMEల ఆవశ్యకత: MSME లు మన స్థూల జాతీయ ఉత్పత్తిలో సుమారు 8% వాటాను, పారిశ్రామిక ఉత్పత్తిలో 45% వాటాను, ఎగుమతులలో 40% వాటాలను కలిగి ఉన్నవి. MSME రంగము ఉద్యోగ కల్పనలో వ్యవసాయము తరువాత స్థానాన్ని ఆక్రమించినది.

  1. భారతదేశములోని 90% MSMEలు చట్టం ప్రకారము నమోదు అవసరము లేని సంస్థలే. (వీటిలో 80% వరకు సొంతవ్యాపార సంస్థలే)
  2. భారతదేశములోని 40% ఎగుమతులు MSME ల ద్వారా జరుగుతున్నవి.
  3. భారతదేశములో దాదాపుగా 40% వరకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు MSMEల ద్వారా కల్పించబడుతున్నవి.
  4. భవిష్యత్ వ్యాపారవేత్తలకు MSME లు వారి పెట్టుబడిస్థాయి ఆధారముగా, వివిధ రంగాలలో పెట్టుబడి అవకాశాలను కల్పిస్తున్నవి.
  5. MSME లు భారతదేశములో వెంచర్ మూలధనము వ్యాపారము కోసము, విదేశీ కంపెనీలకు మంచి మార్కెట్ను కల్పిస్తున్నవి.

ప్రశ్న 2.
MSME లు పొందే వివిధ ప్రోత్సాహకాలను వివరించండి.
జవాబు:
MSME చట్టములో పొందుపరిచిన ధ్యేయాలకు అనుగుణముగా MSME ల చట్టము ఈ క్రింద పేర్కొనబడిన సదుపాయాలను సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలకు కల్పిస్తుంది.
1. వస్తు, సేవల మొత్తాన్ని సకాలములో చెల్లించడానికి కొనుగోలుదారు బాధ్యత: MSME చట్టములోని సెక్షన్, 15 ప్రకారము ఈ సంస్థలు తమ వస్తుసేవల అమ్మకాలకు సంబంధించి, తమకు రావలసిన వసూళ్ళు సకాలములో రావడానికి తోడ్పడుతుంది. కొనుగోలుదారుడు తాను కొన్న వస్తు, సేవల విలువకు సరైన మొత్తాన్ని అమ్మకపుదారుకు నిర్ణీత సమయములో చెల్లించవలసిన బాధ్యతను తెలియజేస్తుంది.

ఎ) వ్రాతపూర్వక ఒప్పందము ఉన్నప్పుడు: వ్రాతపూర్వక ఒప్పందములో సూచించిన తేదీకిగాని, అంతకు ముందు తేదీకిగాని చెల్లింపు జరగాలి. ఎలాంటి పరిస్థితులలోను ఒప్పందములో తెలిపిన తేదీకంటే 45 రోజులు మించకుండా ఉండాలి.

బి) ఒప్పందము లేనప్పుడు: అమ్మకపుదారుకు, కొనుగోలుదారుకు మధ్య ఎలాంటి ఒప్పందము లేకపోతే, నిర్ణయించిన తేదీలోపు అంటే వ్యవహారము జరిగిన 15 రోజులలోపు చెల్లించాలి.

కొనుగోలుదారుడు, అమ్మకపుదారుడు, ఒప్పందము తేది పదాలను చట్టములో దిగువ విధముగా నిర్వచింపబడినవి. అమ్మకపుదారు నుంచి ప్రతిఫలము నిమిత్తము, ఎవరైతే వస్తువులను కొనుగోలు చేస్తారో లేదా సేవలను పొందుతారో వారిని కొనుగోలుదారు అంటారు.

అమ్మకపుదారు అంటే సూక్ష్మ లేదా చిన్నతరహా సంస్థ.
ఒప్పందము తేదీ అంటే వస్తువులు బదిలీ జరిగిన తేదీ లేదా సేవలను అందించిన రోజు.

2. ఆలస్య కాలానికి కొనుగోలుదారు ద్వారా వడ్డీ చెల్లింపు: ఏదైనా కారణాల వలన కొనుగోలుదారు తాను చెల్లించవలసిన మొత్తాన్ని సకాలములో చెల్లించకపోతే, అతడు ఆ మొత్తానికి వడ్డీని చెల్లించవలసి ఉంటుంది. ఈ వడ్డీ సాధారణ బ్యాంకు వడ్డీకి మూడు రెట్లుగా చెల్లించాలి. నెలవారీ మొత్తముగా బాకీ ఉన్న మొత్తముపై వడ్డీని చెల్లించాలి.

3. తగాదాల నివేదన: వస్తుసేవల కోసం చెల్లించవలసిన మొత్తానికి, వడ్డీకి సంబంధించి ఏమైనా తగాదాలు ఉంటే వాటిని సూక్ష్మ, చిన్న సంస్థల మార్గదర్శిక మండలికి సూచించవచ్చు. ఈ మండలి తగిన విచారణచేసి, న్యాయం చేకూరుస్తుంది.

AP Inter 1st Year Commerce Study Material Chapter 10 సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలు

MSME లకు అవసరమైన ప్రోత్సాహక చర్యలు: MSME రంగం ప్రోత్సాహకానికి, అభివృద్ధికి, ఆధునీకరణ కోసం కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వాలు, రిజర్వు బ్యాంకు దిగువ సూచించిన చర్యలను చేపట్టినవి.

  1. ఉద్యోగులలో, నిర్వాహకులలో, వ్యవస్థాపకులలో నైపుణ్యాల వృద్ధికి చర్యలు, సాంకేతిక అభివృద్ధికి ఏర్పాట్లు, మార్కెటింగ్ సౌకర్యాలు లేదా అవస్థాపనా సౌకర్యాలు, సూక్ష్మ, చిన్నతరహా, మధ్యతరహా పరిశ్రమల సముదాయాల అభివృద్ధికి కావలసిన కార్యక్రమాలు చేపడతాయి.
  2. ఈ సంస్థలకు కాలానుగుణముగా, అవసరమైన ఋణసదుపాయాలను అందించడం, సంస్థలు ఖాయిలాపడటానికి అవకాశాలు తగ్గించడం తద్వారా పోటీతత్వాన్ని పెంపొందించడం లాంటి చర్యలు చేపడతాయి.
  3. ప్రభుత్వము, దాని అనుబంధ సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు MSMEల ఉత్పత్తులను, సేవలను వాటి ప్రాధాన్యము ఆధారముగా సేకరిస్తాయి.
  4. ఈ సంస్థల ప్రోత్సాహకానికి, అభివృద్ధికి కావలసిన ప్రత్యేక నిధులను ఏర్పరచడం లేదా ప్రభుత్వ నిధులను సమకూర్చడం వంటి చర్యలు చేపడతాయి.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
MSME ల చట్టం, 2006 ప్రకారము ఉత్పత్తి సంస్థలను నిర్వచించండి.
జవాబు:
ఉత్పత్తి సంస్థలు: వస్తూత్పత్తిలో లేదా వస్తుతయారీలో నిమగ్నమైన సంస్థలను ఉత్పత్తి సంస్థలు అంటారు. యంత్రపరికరాలను ఉపయోగించి ముడి సరుకును పూర్తిగా తయారైన సరుకుగా మార్చి, వాటి విలువను సృష్టించే సంస్థలను ఉత్పత్తి సంస్థలు అని చెప్పవచ్చును.

MSME ల దృష్టిలో ఉత్పత్తి సంస్థలు వాటి యంత్రపరికరాలలో పెట్టిన పెట్టుబడి ఆధారముగా నిర్వచించబడినది.

  1. సూక్ష్మ సంస్థ: యంత్రపరికరాలలో పెట్టిన పెట్టుబడి 25 లక్షల రూపాయలకు మించని సంస్థలను సూక్ష్మ సంస్థలు అంటారు.
  2. చిన్నతరహా సంస్థ: యంత్రపరికరాలలో పెట్టిన పెట్టుబడి 25 లక్షల రూపాయల కంటే ఎక్కువగా ఉండి, కోట్ల రూపాయలకు మించని సంస్థను చిన్నతరహా సంస్థ అంటారు.
  3. మధ్యతరహా సంస్థ: యంత్రపరికరాలలో పెట్టిన పెట్టుబడి 5 కోట్ల రూపాయల కంటే ఎక్కువగా ఉండి, 10 కోట్ల రూపాయలకు మించకపోతే, దానిని మధ్యతరహా సంస్థ అంటారు.

ప్రశ్న 2.
MSME ల చట్టం, 2006 ప్రకారము సేవా సంస్థలను నిర్వచించండి. [TS. Mar 15]
జవాబు:
సేవలను అందించడములో నిమగ్నమైన సంస్థలను సేవా సంస్థలు అంటారు. వాటిని ఈ క్రింది విధముగా నిర్వచించవచ్చును.

  1. సూక్ష్మ సంస్థ: పరికరాలలో పెట్టుబడి 10 లక్షల రూపాయలకు మించకపోతే దానిని సూక్ష్మ సంస్థ అంటారు.
  2. చిన్నతరహా సంస్థ: పరికరాలలో పెట్టుబడి 10 లక్షల రూపాయల కంటే ఎక్కువగా ఉండి, 2 కోట్ల రూపాయలకు మించకపోతే దానిని చిన్నతరహా సంస్థ అంటారు.
  3. మధ్యతరహా సంస్థ: పరికరాలలో పెట్టుబడి 2 కోట్ల రూపాయల కంటే ఎక్కువగా ఉండి, 5 కోట్ల రూపాయలకు మించకపోతే దానిని మధ్యతరహా సంస్థ అంటారు.

AP Inter 1st Year Commerce Study Material Chapter 10 సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలు

ప్రశ్న 3.
MSMEల నమోదు ప్రక్రియను వివరించండి.
జవాబు:
MSME ల నమోదుకు కావలసిన అంశములు:

  1. ఏ వ్యక్తి అయినా ఇష్టానుసారము సూక్ష్మ లేదా చిన్నతరహా సంస్థను స్థాపించవచ్చు.
  2. ఇష్టానుసారము సేవలను అందించడానికి లేదా సేవలు చేయడం కోసం మధ్యతరహా సంస్థను స్థాపించవచ్చు.
  3. వస్తు ఉత్పత్తి కోసము లేదా తయారీ కోసం మధ్యతరహా సంస్థను స్థాపించడానికి పారిశ్రామిక (అభివృద్ధి, నియంత్రణ) చట్టం, 1951లోని మొదటి షెడ్యూల్లో పేర్కొన్న విధముగా అనుసరించాలి. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థల నియమావళి పత్రాన్ని రాష్ట్ర లేదా కేంద్ర ప్రభుత్వము నిర్దేశించిన లేదా సూచించిన అధికారి వద్ద నమోదు కోసం దాఖలు చేయాలి.

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
సూక్ష్మ సంస్థలను నిర్వచించండి.
జవాబు:
ఉత్పత్తి సంస్థలు అయితే యంత్రపరికరాలలో పెట్టిన పెట్టుబడి 25 లక్షల రూపాయలకు మించకపోతే దానిని సూక్ష్మ సంస్థ అంటారు.
సేవా సంస్థలు అయితే పరికరాలలో పెట్టిన పెట్టుబడి 10 లక్షల రూపాయలకు మించకపోతే దానిని సూక్ష్మ సంస్థ అంటారు.

ప్రశ్న 2.
చిన్నతరహా సంస్థలను నిర్వచించండి. [A.P. Mar. ’15]
జవాబు:
ఉత్పత్తి సంస్థలు అయితే యంత్రపరికరాలలో పెట్టిన పెట్టుబడి 25 లక్షల రూపాయల కంటే ఎక్కువగా ఉండి, 5 కోట్ల రూపాయలకు మించకపోతే దానిని చిన్నతరహా సంస్థ అంటారు.

సేవాసంస్థలయితే పరికరాలలో పెట్టిన పెట్టుబడి 10 లక్షల రూపాయల కంటే ఎక్కువగా ఉండి, 2 కోట్ల రూపాయలకు మించకపోతే దానిని చిన్నతరహా సంస్థ అంటారు.

ప్రశ్న 3.
మధ్యతరహా సంస్థలను నిర్వచించండి.
జవాబు:
ఉత్పత్తి సంస్థలయితే యంత్రపరికరాలలో పెట్టిన పెట్టుబడి 5 కోట్ల రూపాయల కంటే ఎక్కువగా ఉండి, 10 కోట్ల రూపాయలకు మించకపోతే దానిని మధ్యతరహా సంస్థ అంటారు.

సేవా సంస్థలయితే పరికరాలలో పెట్టిన పెట్టుబడి 2 కోట్ల రూపాయల కంటే ఎక్కువగా ఉండి, 5 కోట్ల రూపాయలకు మించకపోతే దానిని మధ్యతరహా సంస్థ అంటారు.

AP Inter 1st Year Commerce Study Material Chapter 10 సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలు

ప్రశ్న 4.
ఉత్పత్తి సంస్థలను నిర్వచించండి.
జవాబు:
వస్తూత్పత్తిలో లేదా వస్తుతయారీలో నిమగ్నమైన సంస్థలను ఉత్పత్తి సంస్థలు అంటారు. యంత్రపరికరాలను ఉపయోగించి ముడిసరుకును పూర్తిగా తయారైన వస్తువులుగా మార్చి, వాటికి విలువలను సృష్టించే సంస్థలను ఉత్పత్తి సంస్థలుగా చెప్పవచ్చును.

ప్రశ్న 5.
సేవా సంస్థలను నిర్వచించండి.
జవాబు:
సేవలను అందించడములో నిమగ్నమైన సంస్థలను సేవా సంస్థలు అంటారు.

AP Inter 1st Year Commerce Study Material Chapter 9 వ్యాపార విత్తం మూలాధారాలు – II

Andhra Pradesh BIEAP AP Inter 1st Year Commerce Study Material 9th Lesson వ్యాపార విత్తం మూలాధారాలు – II Textbook Questions and Answers.

AP Inter 1st Year Commerce Study Material 9th Lesson వ్యాపార విత్తం మూలాధారాలు – II

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
మనదేశంలో వ్యాపారస్తులకు లభించే వివిధ వ్యాపార విత్త మూలాధారాలను వివరించండి.
జవాబు:
ఒక వ్యాపార సంస్థ తన మూలధనాన్ని వివిధ మూలాధారాల నుంచి సమకూర్చుకుంటుంది. ఏ మూలాధారము నుంచి వనరులు సమకూర్చుకొనాలి అనేది సంస్థల స్వభావము, పరిమాణం మొదలైన అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఒక వ్యాపార సంస్థ తన స్థిర మూలధన అవసరాలకు నిధులను సేకరించవలసివస్తే యాజమాన్యపు నిధుల ద్వారా, ఋణపూర్వక నిధుల ద్వారా సేకరించాలి. రోజువారీ వ్యాపార నిర్వహణ కోసం స్వల్పకాలిక నిధులను సేకరించాలి. కాల వ్యవధి ఆధారముగా నిధుల మూలాలు మూడు రకాలు.

  1. దీర్ఘకాలిక విత్తమూలాలు,
  2. మధ్యకాలిక విత్తమూలాలు,
  3. స్వల్పకాలిక విత్తమూలాలు.

1. దీర్ఘకాలిక విత్తమూలాలు: 5 సంవత్సరాల కాలపరిమితికి మించి సంస్థలో దీర్ఘకాలిక అవసరాలకు ఉపయోగించే నిధులను దీర్ఘకాలిక మూలధనము అంటారు. వీటి ద్వారా స్థిరాస్తుల కొనుగోలు, రోజువారీ ఖర్చులకు శాశ్వత నిర్వహణ మూలధనము, వ్యాపార విస్తరణ, ఆధునీకరణకు ఉపయోగిస్తారు.
దీర్ఘకాలిక విత్తానికి మూలాధారాలు:

  1. ఈక్విటీ వాటాల జారీ,
  2. ఆధిక్యపు వాటాల జారీ
  3. ఋణ పత్రాల జారీ
  4. నిలిపి ఉంచిన ఆర్జనలు

AP Inter 1st Year Commerce Study Material Chapter 9 వ్యాపార విత్తం మూలాధారాలు – II

2. మధ్యకాలిక విత్తము: ఒక సంవత్సరము నుంచి 5 సంవత్సరాలలోపు కాలపరిమితితో సేకరించే నిధులను మధ్యకాలిక విత్తము అంటారు. దీనిని యంత్రాల ఆధునీకరణ, భారీ ప్రకటనలకు, కొత్త వస్తువులు ప్రవేశపెట్టడానికి, కొత్త శాఖలను, ప్రదర్శనశాలను ఏర్పరచుకొనడానికి ఉపయోగిస్తారు.
మధ్యకాలిక విత్తానికి మూలాధారాలు:

  1. పబ్లిక్ డిపాజిట్లు
  2. బ్యాంకుల నుంచి ఋణము
  3. కాలవిత్తము.

3. స్వల్పకాలిక విత్తము: ఒక సంవత్సరము కంటే తక్కువ కాలానికి అనగా స్వల్పకాలానికి అవసరమయ్యే నిధులను స్వల్పకాలిక విత్తము అంటారు. ఈ విత్తము సంస్థ యొక్క నిర్వహణ మూలధన అవసరాలకు ఉపయోగపడుతుంది. ఇది నగదు నుంచి సరుకు, సరుకు నుంచి ఋణగ్రస్తులు మరియు నగదుగా మారుతుంది.
స్వల్పకాలిక విత్తానికి మూలాధారాలు:

  1. బ్యాంకు ఋణము
  2. వర్తక ఋణము
  3. వాయిదా ఋణము
  4. ఖాతాదారుల నుంచి అడ్వాన్సులు
  5. వాణిజ్య పత్రాలు

ప్రశ్న 2.
కంపెనీలకు లభించే ప్రధానమైన దీర్ఘకాలిక, స్వల్పకాలిక ఆర్థిక వనరుల గురించి చర్చించండి.
జవాబు:
దీర్ఘకాలిక విత్త వనరులు: కంపెనీ తన దీర్ఘకాలిక ఆర్థిక వనరులను దిగువ మూలాల ద్వారా సేకరిస్తుంది. 1. వాటాలు, 2. డిబెంచర్లు, 3. నిలిపి ఉంచిన ఆర్జనలు.
1. వాటాలు: కంపెనీ వ్యవస్థలో మూలధనాన్ని చిన్న చిన్న భాగాలుగా లేదా యూనిట్లుగా విభజిస్తారు. ఒక్కొక్క యూనిట్ను వాటా అంటారు. పెట్టుబడిదారుల నుంచి నిధులు సేకరించడానికి కంపెనీలు రెండు రకాల వాటాలను జారీ చేస్తాయి. అవి i) ఆధిక్యపు వాటాలు ii) ఈక్విటీ వాటాలు.

i) ఆధిక్యపు వాటాలు: ఆధిక్యపు హక్కులు కలిగిన వాటాలను ఆధిక్యపు వాటాలు అంటారు. చట్టము ప్రకారం వీటికి రెండు ఆధిక్యపు హక్కులుంటాయి. ప్రతి సంవత్సరం నిర్ణీతమైన లాభాంశాలను ఈక్విటీ వాటాదారుల కంటే ముందుగా పొందే హక్కు, కంపెనీ రద్దు అయినపుడు ఈక్విటీ వాటాదారుల కంటే ముందుగా మూలధనాన్ని పొందే హక్కు ఆధిక్యపు వాటాలలో సంచిత, అసంచిత, మళ్ళీ భాగాన్ని పంచుకునే, విమోచనీయ, అవిమోచనీయ, పూచీగల, మార్పుకు వీలులేని వాటాలుగా జారీ చేసి మూలధనాన్ని సేకరిస్తాయి.

ii) ఈక్విటీ వాటాలు: వీరు కంపెనీకి యజమానులు. కారణము వీరికి ఓటింగ్ హక్కు ఉంటుంది. ఆధిక్యపు వాటాదారులకు డివిడెండ్ చెల్లించిన తర్వాత వీరికి డివిడెండ్ చెల్లిస్తారు. వీరికి చెల్లించే డివిడెండు రేటు కంపెనీ గడించే లాభాలపై ఆధారపడి ఉంటుంది. లాభాలు ఎక్కువగా ఉంటే ఎక్కువ డివిడెండు, లాభాలు రాకపోతే వీరికి డివిడెండు రాకపోవచ్చు. వీరు ఎక్కువ నష్టభయాన్ని స్వీకరిస్తారు. కంపెనీ రద్దు అయినపుడు ఋణదాతలకు, ఆధిక్యపు వాటాదారులకు, చెల్లించిన తర్వాతనే వీరికి మూలధనము వాపసు చేస్తారు. ఈక్విటీ వాటాల జారీ ద్వారా కంపెనీలు శాశ్వత మూలధనాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు.

2. డిబెంచర్లు: వాటా మూలధనమువలె కంపెనీ డిబెంచర్లను జారీ చేస్తుంది. డిబెంచరు కంపెనీ తీసుకున్న అప్పుకు స్వీకృతి తెలిపే పత్రము, ‘అప్పును అంగీకరిస్తూ ఆ సొమ్మును భవిష్యత్తులో ఒక నిర్ణీత కాలములో, నిర్ణీత వడ్డీతో చెల్లించడానికి అంగీకరిస్తూ కంపెనీ అధికార ముద్రతో లిఖిత పూర్వకముగా వ్రాసి జారీ చేసిన పత్రాన్ని డిబెంచరు అంటారు. ఈ పత్రాన్ని కొన్నవారిని డిబెంచర్దారులు అంటారు. ఋణధ్రువ పత్రము కంపెనీ తీసుకున్న అప్పుకు ఇచ్చే రశీదు. దీనిలో ఋణపత్రదారుని పేరు, అప్పు విలువ, అప్పు షరతులు, అప్పు తీర్చే పద్ధతి’ మొదలైన వివరాలు ఉంటాయి. కంపెనీ దీర్ఘకాలిక అవసరాలకు డిబెంచర్లను జారీ చేస్తాయి.

AP Inter 1st Year Commerce Study Material Chapter 9 వ్యాపార విత్తం మూలాధారాలు – II

3. నిలిపి ఉంచిన ఆర్జనలు: సాధారణముగా ఒక కంపెనీ ఆర్జించిన లాభము మొత్తాన్ని వాటాదారులకు డివిడెండుగా పంచరు. కొంత మొత్తాన్ని భవిష్యత్ అవసరాలకై వేరుగా ఉంచుతారు. ఈ మొత్తాన్ని నిలిపి ఉంచిన ఆర్జన అంటారు. కంపెనీ అంతర్గత ఆర్థిక వనరులలో ఇది చాలా ముఖ్యమైనది. ఈ విధముగా లాభాల నుంచి రిజర్వునిధిగా ఏర్పరచిన మొత్తాన్ని మూలధన వనరులుగా వినియోగించుకోవడాన్ని ‘లాభాల పునరాకర్షణ’ అంటారు.

స్వల్పకాలిక విత్తవనరులు: ఒక వ్యాపారానికి అవసరమయ్యే నిర్వహణ మూలధన అవసరాలకు స్వల్పకాలిక నిధులు అవసరము. స్వల్పకాలము అంటే ఒక సంవత్సరము కంటే తక్కువ కాలము.

స్వల్పకాలిక నిధులకు మూలాధారాలు:
1. బ్యాంకు పరపతి: వ్యాపార సంస్థలకు అవసరమయ్యే స్వల్పకాలిక వనరులను బ్యాంకులు ఋణాలు, క్యాష్ క్రెడిట్లు, ఓవర్ డ్రాఫ్ట్ రూపములో ధనసహాయము చేస్తాయి.
ఎ) ఋణాలు: ఈ పద్ధతిలో బ్యాంకులు పెద్ద మొత్తములో అడ్వాన్సు చేస్తుంది. ఈ ఋణాలని చరాస్థులు లేదా స్థిరాస్థుల హామీ మీద మంజూరు చేస్తారు. అనుమతించిన ఋణం మొత్తంపై వడ్డీని చెల్లించాలి.

బి) క్యాష్ క్రెడిట్: ఇది ఒక పరపతి సదుపాయము సర్దుబాటు. బ్యాంకులు వ్యాపార సంస్థలకు ఒక పరిమితికి లోబడి పరపతిని మంజూరు చేస్తుంది. ఈ పరపతిలో ఎంత అవసరమో అంత మొత్తాన్నే వ్యాపార సంస్థ వాడుకుంటుంది. వడ్డీని వాడుకున్న మొత్తానికే చార్జి చేస్తారు.

సి) ఓవర్ డ్రాఫ్ట్: ఈ విత్త సదుపాయము ప్రకారము బ్యాంకరు వ్యాపార సంస్థ ఖాతాలో నిల్వ కంటే ఎక్కువ మొత్తాన్ని వాడుకునే అవకాశము కల్పిస్తుంది. దీనిని ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యము అంటారు. ఈ పరిమితిని బ్యాంకరు నిర్ణయిస్తాడు. నిల్వ కంటే మించి వాడిన మొత్తము మీదనే వడ్డీని చార్జి చేస్తారు.

2. వర్తక ఋణాలు: ఒక సంస్థ తన ఖాతాదారులకు అరువు ఇచ్చినట్లే తరుచుగా తన సప్లయిదారుల నుంచి అరువు సౌకర్యాన్ని పొందుతుంది. దీనిని వర్తకపు ఋణము అంటారు. దీనిని నగదు పూర్వకముగా ఇవ్వడం జరగదు. కాని కొనుగోలు చేసిన సరుకునకు వెంటనే నగదు చెల్లించనవసరము లేదు. ఆర్థికపుష్టి, గుడ్విల్ ఉన్న సంస్థలకు, ఖాతాదారులకు వర్తకపు ఋణాన్ని ఇస్తారు.

3. వాయిదా పరపతి: యంత్రాలు, యంత్రపరికరాలు సప్లయిదారుల నుంచి వ్యాపార సంస్థలు పరపతిని పొందవచ్చు. సాధారణముగా సప్లయిదారులు కొనుగోలు చేసిన ఆస్తుల విలువను 12 నెలలు అంతకంటే ఎక్కువ కాలానికి చెల్లించడానికి అంగీకరిస్తారు. నగదు ధరలో కొంత మొత్తము చెల్లించి, మిగిలినది కొన్ని వాయిదాలలో చెల్లించవలసి ఉంటుంది.

4. వినియోగదారుల నుంచి అడ్వాన్సులు: సాధారణముగా వ్యాపార సంస్థలు ఆర్డర్లతో పాటు కొంత మొత్తాన్ని | అడ్వాన్సుగా స్వీకరించవచ్చును. ఖాతాదారుల ఆర్డర్ ప్రకారము వారికి భవిష్యత్తులో సప్లయి చేసే వస్తువుల ధరలో కొంత భాగాన్ని వినియోగదారుల అడ్వాన్సు సూచిస్తుంది. ఇది స్వల్పకాలిక మూలధన వనరు.

5. వాణిజ్య పత్రాలు: ఒక సంస్థ స్వల్పకాలానికి నిధులను అంటే 90 రోజుల నుంచి 365రోజుల లోపు కాలవ్యవధితో సేకరించడానికి జారీ చేసే హామీ లేని ప్రామిసరీ నోటు “వాణిజ్య పత్రము”. దీనిని ఒక సంస్థ వేరొక సంస్థకు, భీమా కంపెనీలకు, బ్యాంకులకు, పెన్షన్నిధి సంస్థలకు జారీ చేస్తుంది. ఈ ఋణంపై హామీ లేనందున మంచి పరపతి రేటింగ్ ఉన్న సంస్థలే వీటిని జారీ చేస్తాయి.

ప్రశ్న 3.
ఒక వ్యాపారసంస్థ ఆర్థికావసరాలకు ఉపయోగపడే వివిధ పద్ధతులను తులనాత్మకంగా పరిశీలించండి.
జవాబు:
దీర్ఘకాలిక విత్త వనరులు: కంపెనీ తన దీర్ఘకాలిక ఆర్థిక వనరులను దిగువ మూలాల ద్వారా సేకరిస్తుంది. 1. వాటాలు, 2. డిబెంచర్లు, 3. నిలిపి ఉంచిన ఆర్జనలు.
1. వాటాలు: కంపెనీ వ్యవస్థలో మూలధనాన్ని చిన్న చిన్న భాగాలుగా లేదా యూనిట్లుగా విభజిస్తారు. ఒక్కొక్క యూనిట్ను వాటా అంటారు. పెట్టుబడిదారుల నుంచి నిధులు సేకరించడానికి కంపెనీలు రెండు రకాల వాటాలను జారీ చేస్తాయి. అవి i) ఆధిక్యపు వాటాలు ii) ఈక్విటీ వాటాలు.

AP Inter 1st Year Commerce Study Material Chapter 9 వ్యాపార విత్తం మూలాధారాలు – II

i) ఆధిక్యపు వాటాలు: ఆధిక్యపు హక్కులు కలిగిన వాటాలను ఆధిక్యపు వాటాలు అంటారు. చట్టము ప్రకారం వీటికి రెండు ఆధిక్యపు హక్కులుంటాయి. ప్రతి సంవత్సరం నిర్ణీతమైన లాభాంశాలను ఈక్విటీ వాటాదారుల కంటే ముందుగా పొందే హక్కు, కంపెనీ రద్దు అయినపుడు ఈక్విటీ వాటాదారుల కంటే ముందుగా మూలధనాన్ని పొందే హక్కు ఆధిక్యపు వాటాలలో సంచిత, అసంచిత, మళ్ళీ భాగాన్ని పంచుకునే, విమోచనీయ, అవిమోచనీయ, పూచీగల, మార్పుకు వీలులేని వాటాలుగా జారీ చేసి మూలధనాన్ని సేకరిస్తాయి.

ii) ఈక్విటీ వాటాలు: వీరు కంపెనీకి యజమానులు. కారణము వీరికి ఓటింగ్ హక్కు ఉంటుంది. ఆధిక్యపు వాటాదారులకు డివిడెండ్ చెల్లించిన తర్వాత వీరికి డివిడెండ్ చెల్లిస్తారు. వీరికి చెల్లించే డివిడెండు రేటు కంపెనీ గడించే లాభాలపై ఆధారపడి ఉంటుంది. లాభాలు ఎక్కువగా ఉంటే ఎక్కువ డివిడెండు, లాభాలు రాకపోతే వీరికి డివిడెండు రాకపోవచ్చు. వీరు ఎక్కువ నష్టభయాన్ని స్వీకరిస్తారు. కంపెనీ రద్దు అయినపుడు ఋణదాతలకు, ఆధిక్యపు వాటాదారులకు, చెల్లించిన తర్వాతనే వీరికి మూలధనము వాపసు చేస్తారు. ఈక్విటీ వాటాల జారీ ద్వారా కంపెనీలు శాశ్వత మూలధనాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు.

మధ్యకాలిక విత్తము: ఒక సంవత్సరము నుంచి 5 సంవత్సరాల కాలపరిమితితో సేకరించే నిధులను మధ్యకాలిక విత్తమూలాలు అంటారు. దీనిని యంత్రాల ఆధునీకరణకు, భారీ ప్రకటనలకు, కొత్త వస్తువులను మార్కెట్లో ప్రవేశపెట్టడానికి, ప్రదర్శనశాలను ఏర్పరచుకోవడానికి ఉపయోగిస్తారు.

మధ్యకాలిక విత్తమూలాలు:
1. పబ్లిక్ డిపాజిట్లు: ఒక సంస్థ ప్రజల నుంచి నేరుగా వసూలు చేసే డిపాజిట్లను పబ్లిక్ డిపాజిట్లు అంటారు. ఈ పబ్లిక్ డిపాజిట్లపై చెల్లించే వడ్డీరేటు బ్యాంకు డిపాజిట్లపై చెల్లించే వడ్డీరేటు కంటే ఎక్కువగా ఉంటుంది. ఒక సంస్థలో డిపాజిట్ చేయదలుచుకున్న వ్యక్తి నిర్దేశించిన నమూనాలో దరఖాస్తు పూర్తి చేసి సమర్పించవలెను. ఆ దరఖాస్తును కంపెనీ స్వీకరించి, తీసుకున్న డిపాజిట్కు సాక్ష్యముగా డిపాజిట్ రశీదును జారీ చేస్తుంది. ఇది మధ్యకాలిక, స్వల్పకాలిక అవసరాలను తీరుస్తుంది. ఈ డిపాజిట్ల వలన సంస్థకి, డిపాజిట్ చేసే వ్యక్తికి కూడా ఉపయోగకరముగా ఉంటుంది. పెట్టుబడిదారులకు డిపాజిట్లపై బ్యాంకు ఇచ్చే వడ్డీ కంటే ఎక్కువగాను, కంపెనీకి ఈ డిపాజిట్ల సేకరణకు అయ్యే వ్యయం, బ్యాంకు నుంచి ఋణాలు పొందడానికి అయ్యే వ్యయము కంటే తక్కువగాను ఉంటుంది. పబ్లిక్ డిపాజిట్ల సేకరణను, రిజర్వు బ్యాంకు నియంత్రిస్తుంది.

2. వాణిజ్య బ్యాంకులు: కంపెనీలకు అవసరమైన వివిధ అవసరాలకు వివిధ కాలపరిమితులున్న రుణాలు అందించడములో బ్యాంకులు ప్రధాన పాత్రను పోషిస్తున్నవి. బ్యాంకులు వివిధ సంస్థలకు ఋణాల ద్వారా, క్యాష్ క్రెడిట్లు, ఓవర్ డ్రాఫ్ట్లు, వినిమయ బిల్లులను డిస్కౌంట్ చేసుకోవడం, పరపతి లేఖలు జారీ చేయడం ద్వారా మూలధనాన్ని సమకూరుస్తాయి. బ్యాంకులు వివిధ కారకాలపై ఆధారపడి మంజూరు చేసిన ద్రవ్య సహాయముపై వడ్డీ రేటును నిర్ణయిస్తుంది. మంజూరు చేసిన ఋణాన్ని ఒకే మొత్తముగాగాని, వాయిదాల రూపములోగాని వసూలు చేస్తుంది. సాధారణముగా బ్యాంకులు మధ్యకాలిక, స్వల్పకాలిక అవసరాలనే తీరుస్తాయి. ఋణాన్ని పొందిన సంస్థ ఋణాన్ని పొందడానికి ఆస్తులను తాకట్టు పెట్టవలసి ఉంటుంది.

3. కౌలు ద్రవ్యము: ఒక ఆస్తికి యజమాని అయిన వ్యక్తి తన ఆస్తిని వాడుకోవడానికి వేరొకరికి హక్కును ఇచ్చి, ఆ హక్కును బదిలీ చేసినందుకుగాను కొంత ప్రతిఫలము పొందడానికి చేసుకున్న. ఒప్పందమే కౌలు ఒప్పందము. ఆస్తి యజమానికి లెస్సార్ (కౌలు యజమాని) గాను, అద్దెకు తీసుకున్న వ్యక్తిని లెస్సీ (కౌలుదారని) అని పిలుస్తారు.

కౌలుదారు ఆస్తిని వాడుకున్నందుకు నిర్ణీత కాలవ్యవధులలో యజమానికి కౌలు అద్దెను చెల్లిస్తాడు. కౌలు ఒప్పందానికి సంబంధించిన షరతులు, నిబంధనలు కౌలు ఒప్పందములో ఉంటాయి. కాలపరిమితి పూర్తికాగానే ఆస్తిపై గల హక్కులు యజమానికి బదిలీ అవుతాయి. సంస్థల ఆధునీకరణ, వినూత్నముగా మార్చడానికి అవసరమయ్యే ద్రవ్యము కౌలు ద్రవ్యము. సాంకేతిక పరిజ్ఞానములో వస్తున్న శీఘ్ర మార్పుల కారణముగా కంప్యూటర్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు పాతబడి పోతాయి. కౌలు ద్రవ్యముతో నిర్ణయాలు తీసుకునే ముందు సొంత ఆస్తులను అమర్చుకోవడానికయ్యే వ్యయాన్ని కౌలుకయ్యే వ్యయముతో పోల్చి నిర్ణయాలు తీసుకోవాలి.

AP Inter 1st Year Commerce Study Material Chapter 9 వ్యాపార విత్తం మూలాధారాలు – II

4. ప్రత్యేకత ఉన్న ఆర్థిక సహాయ సంస్థలు అంటే ఏమిటో వివరించండి. వాటి ఆవశ్యకతల గురించి తెలపండి.
జవాబు:
దేశములో ఆర్థిక కార్యకలాపాలు వేగముగా విస్తరించడం వలన విత్తరంగములో ఎన్నో వ్యవస్థాపూర్వక మార్పులు చోటుచేసుకున్నాయి. వర్తక, వాణిజ్యాలకు అనుగుణముగా వెంచర్ మూలధనము, క్రెడిట్ రేటింగ్, కౌలు విత్తములాంటి విత్త అవసరాలను దృష్టిలో ఉంచుకొని కొన్ని కొత్త విత్తసంస్థలు ఏర్పడినాయి. వీటిని ప్రత్యేక విత్తసంస్థలుగా వ్యవహరిస్తారు.

1. IFCI వెంచర్ మూలధన నిధుల లిమిటెడ్: కొత్త ఉద్యమదారులు, సాంకేతిక నిపుణులు, వృత్తి నిపుణులు, పారిశ్రామికవేత్తలు, పారిశ్రామిక ప్రాజెక్టులను ప్రారంభించడం కోసం వారికి వడ్డీలేని ఋణాలుగాని, తక్కువ వడ్డీకి ఋణాలుగాని ఇవ్వడం ద్వారా వారిని ప్రోత్సహించే ఉద్ద్యేశముతో 1975లో భారత పారిశ్రామిక సంస్థ I.F.C.I రిస్క్ కాపిటల్ను ప్రారంభించినది. 1988 జనవరిలో రిస్క్ కాపిటల్ అండ్ టెక్నాలజీ కార్పొరేషన్ లిమిటెడ్గా మార్చడమైనది. ఈ సంస్థ ప్రాధాన్యము ఉన్న నూతన సాంకేతిక పద్ధతులు, ఉత్పత్తులు,’ ప్రక్రియలు, మార్కెట్ సేవలు, సాంకేతిక పరమైన పెంపుదల, శక్తి సంరక్షణ ఏర్పాట్లకు ప్రాధాన్యతనిస్తూ విత్తసహాయం అందిస్తుంది.

2. ICICI వెంచర్ ఫండ్స్ లిమిటెడ్: 1989లో టెక్నాలజీ డెవలప్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ కంపెనీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అనే ఒక సంస్థను స్థాపించినారు. కొత్తగా సాహసంతో ప్రాజెక్టులకు విత్త సహాయము అందించడం దీని ప్రధాన ఆశయము. కంప్యూటర్లు, రసాయనాలు, పాలిమర్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్, టెలికాం, పర్యావరణం, ఇంజనీరింగ్ రంగాలకు సహాయాన్ని అందించినది. ప్రస్తుతం ఈ సంస్థను ICICI వెంచర్ ఫండ్స్ పేరుతో పిలవబడుతున్నది.

3. టూరిజం ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా: దేశములో పర్యాటక పరిశ్రమను ప్రోత్సహించే లక్ష్యముతో కేంద్ర ప్రభుత్వము టూరిజం ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడు నెలకొల్పినది. సంప్రదాయ పర్యాటక ప్రాజెక్టులకే కాకుండా అమ్యూజ్మెంట్ పార్కులు, రోప్వలు, కార్ రెంటల్ సేవలు, నీటి రవాణా, ఫెర్రీలు లాంటి సంప్రదాయేతర పర్యాటక ప్రాజెక్టులకు కూడా ఈ సంస్థ విత్త సహాయాన్ని అందిస్తుంది.

ప్రశ్న 5.
వివిధ రకాల వాటాల జారీవల్ల (ఈక్విటీ వాటాలు, ఆధిక్యపు వాటాలు) కలిగే ప్రయోజనాలను, పరిమితులను విమర్శనాత్మకంగా వివరించండి.
జవాబు:
ఆధిక్యపు వాటాల వలన కలిగే ప్రయోజనాలు:

  1. పెట్టుబడి మీద స్థిర ఆదాయముతో పాటు, పెట్టుబడి సురక్షితముగా ఉండాలని కోరుకునే వారికి ఇవి లాభదాయకము.
  2. తక్కువ నష్ట భయముతో, పెట్టుబడి మీద స్థిర ఆదాయమును కోరుకునే వారికి ఈ వాటాలు అనువైనవి.
  3. కంపెనీ దీర్ఘకాలిక మూలధనాన్ని పొందవలసివస్తే ఈ వాటాల జారీ దోహదపడుతుంది.
  4. కంపెనీకి శాశ్వత మూలధనము అవసరము లేకపోతే, అభివృద్ధి తరువాత విమోచనీయ ఆధిక్యపు వాటాలను వాపసు చేయవచ్చు.
  5. కంపెనీకి అధిక లాభాలు వచ్చినపుడు, వీటి డివిడెండు రేటు స్థిరము కాబట్టి కంపెనీ ఈక్విటీలో ట్రేడింగ్ చేయవచ్చు.
  6. కంపెనీని రద్దు చేసినపుడు ఈక్విటీ వాటాదారుల కంటే ముందు ఆధిక్యపు వాటాదారులకు మూలధనం వాపసు చేస్తారు.
  7. ఆధిక్యపు వాటాల జారీకి ఆస్తుల తనఖా అవసరము లేదు.

AP Inter 1st Year Commerce Study Material Chapter 9 వ్యాపార విత్తం మూలాధారాలు – II

ఆధిక్యపు వాటాలకు గల పరిమితులు:

  1. ఈ వాటాలపై డివిడెండు రేటు స్థిరము కాబట్టి కంపెనీపై శాశ్వత భారాన్ని మోపుతుంది.
  2. ఈ వాటాలపై ఓటింగ్ హక్కు ఉండదు, కాబట్టి ఆధిక్యపు వాటాదారులు నిర్వహణలో పాల్గొనలేరు.
  3. స్వభావరీత్యా ఎంతటి నష్టాన్నైనా భరించగలిగే ధైర్యసాహసాలు ఉన్న పెట్టుబడిదారులు, సముచితమైన ప్రతిఫలాన్ని పొందాలనే ఆసక్తి ఉన్నవారు ఈ ఆధిక్యపు వాటాలను అంతగా ఇష్టపడరు.
  4. కంపెనీ ఆస్తులపై ఈక్విటీ వాటాదారులకు ఉన్న హక్కు ఆధిక్యపు వాటా మూలధనము వలన పలచబడే అవకాశమున్నది..
  5. ఈక్విటీ వాటాలతో పోలిస్తే ఆధిక్యపు వాటాల జారీకయ్యే ఖర్చు తక్కువైనా డిబెంచర్లతో పోలిస్తే వీటిపై ఖర్చు ఎక్కువ.
  6. ఈ వాటాలపై డివిడెండును కంపెనీ లాభాలను ఆర్జించినపుడే చెల్లిస్తారు. కంపెనీకి లాభాలు రాకపోతే -పెట్టుబడిదారులకు ఎలాంటి హామీ ఉండదు. అందువలన పెట్టుబడిదారులను ఆకర్షించవు.

ఈక్విటీ వాటాల వలన కలిగే ప్రయోజనాలు:

  1. ఈక్విటీ వాటాలపై స్థిరమైన రేటు ప్రకారము డివిడెండ్ చెల్లించనవసరము లేదు. కంపెనీకి తగినన్ని లాభాలు వచ్చినపుడే డివిడెండ్ చెల్లిస్తారు. అందువలన కంపెనీకి శాశ్వత భారాన్ని మోపవు.
  2. ఈ రకమైన వాటాల జారీకి కంపెనీ ఆస్తులను తనఖా పెట్టనక్కర్లేదు.
  3. కంపెనీని మూసివేస్తే తప్ప ఈక్విటీ మూలధనమును వాపసు చేయనవసరము లేదు.
  4. ఈక్విటీ వాటాదారులు కంపెనీ యజమానులు. వీరికి ఓటు హక్కు ఉంటుంది. నిర్వహణలో పాల్గొనవచ్చు.
  5. కంపెనీ అధిక లాభాలు గడించినపుడు ఎక్కువ డివిడెండుతో పాటు వాటా విలువ పెరిగినందు వలన కలిగే లాభాన్ని కూడా పొందవచ్చును.

ఈక్విటీ వాటాలకు గల పరిమితులు:

  1. స్థిరమైన, నిలకడ ఉన్న ఆదాయాన్ని కోరుకునేవారు, ముందుచూపుగల పెట్టుబడిదారులు ఈక్విటీ వాటాలలో పెట్టుబడి పెట్టటానికి అంతగా ఇష్టపడరు.
  2. ఇతర వనరుల ద్వారా లభించే విత్త సేకరణకు అయ్యే వ్యయం కంటే ఈక్విటీ వాటాల ద్వారా సేకరించే నిధులకు అయ్యే వ్యయం ఎక్కువ.
  3. కంపెనీకి తగినంత లాభాలు రాకపోతే వీరికి డివిడెండ్ ఉండదు.
  4. ఎక్కువ సంఖ్యలో అదనముగా ఈక్విటీ వాటాలను జారీ చేస్తే, ఓటింగ్ హక్కులు తగ్గి, వారి ఆర్జన కూడా తగ్గుతుంది.
  5. ఈక్విటీ వాటాల జారీపై ఎక్కువగా ఆధారపడితే అతి మూలధనీకరణ జరిగే ప్రమాదము ఉన్నది.
  6. కంపెనీ ఎక్కువ లాభాలు సంపాదించినపుడు, డివిడెండ్ రేటు పెరిగి, స్పెక్యులేషన్కు దారితీయవచ్చు.
  7. ఎక్కువ ఈక్విటీ వాటాలు కలిగిన కొద్దిమంది కంపెనీపై నియంత్రణ సాధించవచ్చును.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
స్వల్పకాలిక విత్తానికి ఉన్న వనరులు ఏవి ? [A.P. & T.S. Mar. ’15]
జవాబు:
ఒక సంవత్సరము కంటే తక్కువ కాలానికి అనగా స్వల్ప కాలానికి అవసరమయ్యే నిధులను స్వల్పకాలిక విత్తము అంటారు. ఈ విత్తము సంస్థ యొక్క నిర్వహణ మూలధన అవసరాలకు ఉపయోగపడుతుంది. ఇది నగదు నుంచి సరుకు, సరుకు నుంచి ఋణగ్రస్తులు మరియు నగదుగా మారుతుంది.

స్వల్పకాలిక విత్తానికి మూలాధారాలు:
1. బ్యాంకు పరపతి: వ్యాపార సంస్థలకు అవసరమయ్యే స్వల్పకాలిక వనరులను బ్యాంకులు ఋణాలు, క్యాష్ క్రెడిట్లు, ఓవర్ డ్రాఫ్ట్ రూపములో ధనసహాయము చేస్తాయి.
ఎ) ఋణాలు: ఈ పద్ధతిలో బ్యాంకులు పెద్ద మొత్తములో అడ్వాన్సు చేస్తుంది. ఈ ఋణాలని చరాస్థులు లేదా స్థిరాస్థుల హామీ మీద మంజూరు చేస్తారు. అనుమతించిన ఋణం మొత్తంపై వడ్డీని చెల్లించాలి.

బి) క్యాష్ క్రెడిట్: ఇది ఒక పరపతి సదుపాయము సర్దుబాటు. బ్యాంకు వ్యాపార సంస్థలకు ఒక పరిమితికి లోబడి పరపతిని మంజూరు చేస్తుంది. ఈ పరపతిలో ఎంత అవసరమో అంత మొత్తాన్నే వ్యాపార సంస్థ వాడుకుంటుంది. వడ్డీని వాడుకున్న మొత్తానికే ఛార్జి చేస్తారు.

AP Inter 1st Year Commerce Study Material Chapter 9 వ్యాపార విత్తం మూలాధారాలు – II

సి) ఓవర్ డ్రాఫ్ట్: ఈ విత్త సదుపాయము ప్రకారము బ్యాంకరు వ్యాపార సంస్థ ఖాతాలో నిల్వ కంటే ఎక్కువ మొత్తాన్ని వాడుకునే అవకాశము కల్పిస్తుంది. దీనిని ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యము అంటారు. ఈ పరిమితిని బ్యాంకరు నిర్ణయిస్తాడు. నిల్వ కంటే మించి వాడిన మొత్తము మీదనే వడ్డీని ఛార్జి చేస్తారు.

2. వర్తక ఋణాలు: ఒక సంస్థ తన ఖాతాదారులకు అరువు ఇచ్చినట్లే తరుచుగా తన సప్లయిదారుల నుంచి అరువు సౌకర్యాన్ని పొందుతుంది. దీనిని వర్తకపు ఋణము అంటారు. దీనిని నగదు పూర్వకముగా ఇవ్వడం జరగదు. కాని కొనుగోలు చేసిన సరుకునకు వెంటనే నగదు చెల్లించనవసరము లేదు. ఆర్థికపుష్టి, గుడ్ విల్ ఉన్న సంస్థలకు, | ఖాతాదారులకు వర్తకపు ఋణాన్ని ఇస్తారు.

3. వాయిదా. పరపతి: యంత్రాలు, యంత్రపరికరాలు సప్లయిదారుల నుంచి వ్యాపార సంస్థలు పరపతిని పొందవచ్చు. సాధారణముగా సప్లయిదారులు కొనుగోలు చేసిన ఆస్తుల విలువను 12 నెలలు అంత కంటే ఎక్కువ కాలానికి చెల్లించడానికి అంగీకరిస్తారు. నగదు ధరలో కొంత మొత్తము చెల్లించి, మిగిలినది కొన్ని వాయిదాలలో చెల్లించవలసి ఉంటుంది.

4. వినియోగదారుల నుంచి అడ్వాన్సులు: సాధారణముగా వ్యాపార సంస్థలు ఆర్డర్లతో పాటు కొంత మొత్తాన్ని అడ్వాన్సుగా స్వీకరించవచ్చును. ఖాతాదారుల ఆర్డర్ ప్రకారము వారికి భవిష్యత్తులో సప్లయి చేసే వస్తువుల ధరలో కొంత భాగాన్ని వినియోగదారుల అడ్వాన్సు సూచిస్తుంది. ఇది స్వల్పకాలిక మూలధన వనరు.

5. వాణిజ్య పత్రాలు: ఒక సంస్థ స్వల్పకాలానికి నిధులను అంటే 90 రోజులనుంచి 365 రోజుల లోపు కాలవ్యవధితో సేకరించడానికి జారీ చేసే హామీ లేని ప్రామిసరీ నోటు “వాణిజ్య పత్రము”. దీనిని ఒక సంస్థ వేరొక సంస్థకు, భీమా కంపెనీలకు, బ్యాంకులకు, పెన్షన్నిధి సంస్థలకు జారీ చేస్తుంది. ఈ ఋణంపై హామీ లేనందున మంచి పరపతి రేటింగ్ ఉన్న సంస్థలే వీటిని జారీ చేస్తాయి.

ప్రశ్న 2.
దీర్ఘకాలిక విత్తానికి ఉన్న వనరులు ఏవి ?
జవాబు:
5 సంవత్సరాల కాలపరిమితికి మించి సంస్థలో దీర్ఘకాలిక అవసరాలకు ఉపయోగించే నిధులను దీర్ఘకాలిక మూలధనము అంటారు. వీటి ద్వారా స్థిరాస్తుల కొనుగోలు, రోజువారీ ఖర్చులకు శాశ్వత నిర్వహణ మూలధనము, వ్యాపార విస్తరణకు ఆధునీకరణకు ఉపయోగిస్తారు.
దీర్ఘకాలిక విత్తానికి మూలాధారాలు:
i) ఆధిక్యపు వాటాలు: ఆధిక్యపు హక్కులు కలిగిన వాటాలను ఆధిక్యపు వాటాలు అంటారు. చట్టము ప్రకారం వీటికి రెండు ఆధిక్యపు హక్కులుంటాయి. ప్రతి సంవత్సరం నిర్ణీతమైన లాభాంశాలను ఈక్విటీ వాటాదారుల కంటే ముందుగా పొందే హక్కు “కంపెనీ రద్దు అయినపుడు ఈక్విటీ వాటాదారుల కంటే ముందుగా మూలధనాన్ని పొందే ” హక్కు” ఆధిక్యపు వాటాలలో సంచిత, అసంచిత, మళ్ళీ భాగాన్ని పంచుకునే, విమోచనీయ, అవిమోచనీయ, పూచీగల, మార్పుకు వీలులేని వాటాలుగా జారీ చేసి మూలధనాన్ని సేకరిస్తాయి.

ii) ఈక్విటీ వాటాలు: వీరు కంపెనీకి యజమానులు. కారణము వీరికి ఓటింగ్ హక్కు ఉంటుంది. ఆధిక్యపు వాటాదారులకు డివిడెండ్ చెల్లించిన తర్వాత వీరికి డివిడెండ్ చెల్లిస్తారు. వీరికి చెల్లించే డివిడెండు రేటు కంపెనీ గడించే లాభాలపై ఆధారపడి ఉంటుంది. లాభాలు ఎక్కువగా ఉంటే ఎక్కువ డివిడెండు, లాభాలు రాకపోతే వీరికి డివిడెండు రాకపోవచ్చు. వీరు ఎక్కువ నష్టభయాన్ని స్వీకరిస్తారు. కంపెనీ రద్దు అయినపుడు ఋణదాతలకు, ఆధిక్యపు వాటాదారులకు చెల్లించిన తర్వాతనే వీరికి మూలధనము వాపసు చేస్తారు. ఈక్విటీ వాటాల జారీ ద్వారా కంపెనీలు శాశ్వత మూలధనాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు.

డిబెంచర్లు: వాటా మూలధనమువలె కంపెనీ డిబెంచర్లను జారీ చేస్తుంది. డిబెంచరు కంపెనీ తీసుకున్న అప్పుకు స్వీకృతి తెలిపే పత్రము, ‘అప్పును అంగీకరిస్తూ ఆ సొమ్మును భవిష్యత్తులో ఒక నిర్ణీత కాలములో, నిర్ణీత వడ్డీతో చెల్లించడానికి అంగీకరిస్తూ కంపెనీ అధికార ముద్రతో లిఖిత పూర్వకముగా వ్రాసి జారీ చేసిన పత్రాన్ని డిబెంచరు అంటారు. ఈ పత్రాన్ని కొన్నవారిని డిబెంచర్దారులు అంటారు. ఋణధ్రువ పత్రము కంపెనీ తీసుకున్న అప్పుకు ఇచ్చే రశీదు. దీనిలో ఋణపత్రదారుని పేరు, అప్పు విలువ, అప్పు షరతులు, అప్పు తీర్చే పద్ధతి మొదలైన వివరాలు ఉంటాయి. కంపెనీ దీర్ఘకాలిక అవసరాలకు డిబెంచర్లను జారీ చేస్తాయి.

3. నిలిపి ఉంచిన ఆర్జనలు: సాధారణముగా ఒక కంపెనీ ఆర్జించిన లాభము మొత్తాన్ని వాటాదారులకు డివిడెండుగా పంచరు. కొంత మొత్తాన్ని భవిష్యత్ అవసరాలకై వేరుగా ఉంచుతారు. ఈ మొత్తాన్ని ‘నిలిపి ఉంచిన ఆర్జన’ అంటారు. కంపెనీ అంతర్గత ఆర్థిక వనరులలో ఇది చాలా ‘ముఖ్యమైనది. ఈ విధముగా లాభాల నుంచి రిజర్వునిధిగా ఏర్పరచిన మొత్తాన్ని మూలధన వనరులుగా వినియోగించుకోవడాన్ని ‘లాభాల పునరాకర్షణ’ అంటారు.

AP Inter 1st Year Commerce Study Material Chapter 9 వ్యాపార విత్తం మూలాధారాలు – II

ప్రశ్న 3.
మధ్యకాలిక విత్తానికి ఉన్న వనరులు ఏవి ?
జవాబు:
ఒక సంవత్సరము నుంచి 5 సంవత్సరాలలోపు కాలపరిమితితో సేకరించే నిధులను మధ్యకాలిక విత్తము అంటారు. దీనిని యంత్రాల ఆధునీకరణ, భారీప్రకటనలకు, కొత్త వస్తువులు ప్రవేశపెట్టడానికి, కొత్త శాఖలకు, ప్రదర్శనశాలను ఏర్పాటు చేసుకోవడానికి ఉపయోగిస్తారు.

మధ్యకాలిక విత్తానికి మూలాలు:
1. పబ్లిక్ డిపాజిట్లు: ఒక సంస్థ ప్రజల నుంచి నేరుగా వసూలు చేసే డిపాజిట్లను పబ్లిక్ డిపాజిట్లు అంటారు. ఈ పబ్లిక్ డిపాజిట్లపై చెల్లించే వడ్డీరేటు బ్యాంకు డిపాజిట్లపై చెల్లించే వడ్డీరేటు కంటే ఎక్కువగా ఉంటుంది. ఒక సంస్థలో డిపాజిట్ చేయదలుచుకున్న వ్యక్తి నిర్దేశించిన నమూనాలో దరఖాస్తు పూర్తి చేసి సమర్పించవలెను. ఆ దరఖాస్తును కంపెనీ స్వీకరించి, తీసుకున్న డిపాజిటు సాక్ష్యముగా డిపాజిట్ రశీదును జారీ చేస్తుంది. ఇది మధ్యకాలిక, స్వల్పకాలిక అవసరాలను తీరుస్తుంది. ఈ డిపాజిట్ల వలన సంస్థకి, డిపాజిట్ చేసే వ్యక్తికి కూడా ఉపయోగకరముగా ఉంటుంది. పెట్టుబడిదారులకు డిపాజిట్లపై బ్యాంకు ఇచ్చే వడ్డీ కంటే ఎక్కువగాను, కంపెనీకి ఈ డిపాజిట్ల సేకరణకు అయ్యే వ్యయం, బ్యాంకు నుంచి ఋణాలు పొందడానికి అయ్యే వ్యయము కంటే తక్కువగాను ఉంటుంది: పబ్లిక్ డిపాజిట్ల సేకరణను రిజర్వు బ్యాంకు నియంత్రిస్తుంది.

2. వాణిజ్య బ్యాంకులు: కంపెనీలకు అవసరమైన వివిధ అవసరాలకు వివిధ కాలపరిమితులున్న రుణాలు అందించడములో బ్యాంకులు ప్రధాన పాత్రను పోషిస్తున్నవి. బ్యాంకులు వివిధ సంస్థలకు ఋణాల ద్వారా, క్యాష్ క్రెడిట్లు, ఓవర్ డ్రాఫ్ట్లు, వినిమయ బిల్లులను డిస్కౌంట్ చేసుకోవడం, పరపతి లేఖలు జారీ చేయడం ద్వారా మూలధనాన్ని సమకూరుస్తాయి. బ్యాంకులు వివిధ కారకాలపై ఆధారపడి మంజూరు చేసిన ద్రవ్య సహాయముపై వడ్డీ రేటును నిర్ణయిస్తుంది. మంజూరు చేసిన ఋణాన్ని ఒకే మొత్తముగాగాని, వాయిదాల రూపములోగాని వసూలు చేస్తుంది. సాధారణముగా బ్యాంకులు మధ్యకాలిక, స్వల్పకాలిక అవసరాలనే, తీరుస్తాయి. ఋణాన్ని పొందిన సంస్థ ఋణాన్ని పొందడానికి ఆస్తులను తాకట్టు పెట్టవలసి ఉంటుంది.

3. కౌలు ద్రవ్యము: ఒక ఆస్తికి యజమాని అయిన వ్యక్తి తన ఆస్తిని వాడుకోవడానికి వేరొకరికి హక్కును ఇచ్చి, ఆ హక్కును బదిలీ చేసినందుకుగాను కొంత ప్రతిఫలము పొందడానికి చేసుకున్న ఒప్పందమే కౌలు ఒప్పందము. ఆస్తి యజమానికి లెస్సార్ (కౌలు యజమాని) గాను, అద్దెకు తీసుకున్న వ్యక్తిని లెస్సీ (కౌలుదారని) అని పిలుస్తారు.

కౌలుదారు ఆస్తిని వాడుకున్నందుకు నిర్ణీత కాలవ్యవధులలో యజమానికి కౌలు అద్దెను చెల్లిస్తాడు. కౌలు ఒప్పందానికి సంబంధించిన షరతులు, నిబంధనలు కౌలు ఒప్పందములో ఉంటాయి. కాలపరిమితి పూర్తికాగానే ఆస్తిపై గల హక్కులు యజమానికి బదిలీ అవుతాయి. సంస్థల ఆధునీకరణ, వినూత్నముగా మార్చడానికి అవసరమయ్యే ద్రవ్యము కౌలు ద్రవ్యము. సాంకేతిక పరిజ్ఞానములో వస్తున్న శీఘ్ర మార్పుల కారణముగా కంప్యూటర్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు పాతబడి పోతాయి. కౌలు ద్రవ్యముతో నిర్ణయాలు తీసుకునే ముందు సొంత ఆస్తులను అమర్చుకోవడానికయ్యే వ్యయాన్ని కౌలుకయ్యే వ్యయముతో పోల్చి నిర్ణయాలు తీసుకోవాలి.

ప్రశ్న 4.
ప్రత్యేక ఆర్థిక సహాయ సంస్థల ఆవశ్యకతను వివరించండి.
జవాబు:
భారతదేశ ఆర్థికాభివృద్ధిలో ఆర్థిక సంస్థల పాత్ర కీలకమైనది. ఒక దేశ ఆర్థికాభివృద్ధి కేవలము స్వల్పకాలిక రుణ సదుపాయాన్ని అందించే సంస్థలు ఉంటే సరిపోదని వివిధ రకాలైన మూలధన స్వరూపాలతో, వివిధ ధ్యేయాలతో ప్రత్యేకీకరణలతో వివిధ సంస్థలను, పెట్టుబడి సంస్థలను స్థాపించడం జరిగినది. పారిశ్రామిక విత్తాన్ని చౌకగా, సులువుగా లభ్యమయ్యేటట్లు చూడడానికి ప్రభుత్వము అనేక కార్పొరేషన్లను స్థాపించినది. వాటిలో ముఖ్యమైనది.

AP Inter 1st Year Commerce Study Material Chapter 9 వ్యాపార విత్తం మూలాధారాలు – II

1. భారత పారిశ్రామికాభివృద్ధి బ్యాంకు: భారత పారిశ్రామికాభివృద్ధి బ్యాంకును 1964 జూలై 1న స్థాపించినారు. మన దేశములో పారిశ్రామికాభివృద్ధి కోసం ఏర్పడిన పారిశ్రామిక విత్త సంస్థలలో ఇది శిఖర సంస్థ. ప్రత్యక్ష ధన సహాయముతో పారిశ్రామిక సంస్థలకు ప్రాజెక్టు ఋణాలు, సరళ ఋణాలు, పరికరాలు కొనుగోలు చేయడానికి ఋణాల
మంజూరు, పారిశ్రామిక వాటాలు, డిబెంచర్ల జారీకి, చందాపూచీ ఇవ్వడం, పారిశ్రామిక సంస్థలు తీసుకున్న ఋణాలకు హామీలు ఇవ్వడం. పరోక్ష విత్త సహాయము అంటే పారిశ్రామిక సంస్థలకు ఇచ్చిన ఋణాలకు రీఫైనాన్సింగ్, వాటి వినిమయ బిల్లులను రీడిస్కౌంట్ చేసుకుంటుంది.

2. భారత పారిశ్రామిక ద్రవ్య సహాయ సంస్థ: భారత పారిశ్రామిక ద్రవ్య సహాయక చట్టము, 1948 ప్రకారము ఈ సంస్థను ఏర్పాటు చేయడం జరిగినది. పరిశ్రమలకు అవసరమైన దీర్ఘకాలిక, మధ్యకాలిక ఋణాలను అందించడమే ఈ సంస్థ ప్రధాన లక్ష్యము. మన దేశ, విదేశీ కరెన్సీలతో విత్త సహాయాన్ని చేయడం, పారిశ్రామిక సంస్థల సెక్యూరిటీలకు, ఋణాలకు చందాపూచీదారుగా ఉండడమేకాక వారి వాటాలను, బాండ్లను, ఋణపత్రములను ప్రత్యక్షముగా కొనుగోలు చేస్తుంది. మర్చంట్ బ్యాంకింగ్ సేవలు, పునరావాస కార్యక్రమాలు, కంపెనీల సంయోగాలు మొదలైనవి అందించడం ఈ సంస్థ చేస్తుంది.

3. భారత చిన్నతరహా పరిశ్రమల అభివృద్ధి బ్యాంకు: భారత పారిశ్రామికాభివృద్ధి బ్యాంకు 100% ప్రభుత్వ అనుబంధ సంస్థగా, పార్లమెంటులో ప్రత్యేక శాసనము ద్వారా 1990లో భారత చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధి సంస్థను కేంద్ర ప్రభుత్వం స్థాపించినది. చిన్నతరహా పరిశ్రమల స్థాపన, అభివృద్ధికి అవసరమయ్యే ఆర్థిక సహాయం చేసే సంస్థలలో ఇది ప్రధానమైనది. చిన్నతరహా పరిశ్రమలకు ఆర్థిక సహాయము చేసే సంస్థలను సమన్వయపరచడం, ఆర్థికాభివృద్ధికి తోడ్పడటం, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంపొందించడానికి, సంతులిత ప్రాంతీయ అభివృద్ధికి తోడ్పడటం ఈ సంస్థ ముఖ్య ధ్యేయాలు.

4. భారత పారిశ్రామిక పెట్టుబడి బ్యాంకు ఖాయిలాపడిన (Sick) పరిశ్రమల పునర్నిర్మాణం, ఆధునీకరణ, పునర్వ్యవస్థీకరణ, విస్తరణ లాంటి కార్యకలాపాలను నిర్వర్తించడానికి అవసరమైన ఆర్థిక సహాయం చేయడం ప్రధాన లక్ష్యముగా భారత పారిశ్రామిక పెట్టుబడి బ్యాంకును స్థాపించారు. 1973లో పారిశ్రామిక పునర్నిర్మాణ కార్పొరేషన్గా ప్రారంభమై 1985లో ప్రత్యేక చట్టం ద్వారా కేంద్ర ప్రభుత్వము పారిశ్రామిక పునర్నిర్మాణ బ్యాంకుగాను, మరల 1997 భారత పారిశ్రామిక పెట్టుబడి బ్యాంకుగా స్థిరపరిచినారు.

ప్రశ్న 5.
విత్త మూలాధారముగా ఈక్విటీ వాటాలకు ఉన్న ప్రయోజనాలను, పరిమితులను వివరించండి.
జవాబు:
ఈక్విటీ వాటా వలన కలుగు ప్రయోజనాలు:

  1. ఈక్విటీ వాటాలపై స్థిరమైన రేటు ప్రకారము డివిడెండు చెల్లించనవసరము లేదు. కంపెనీకి తగినన్ని లాభాలు వచ్చినపుడే డివిడెండ్ చెల్లిస్తారు. అందువలన కంపెనీకి శాశ్వత భారాన్ని మోపవు.
  2. ఈ రకమైన వాటాల జారీకి కంపెనీ ఆస్తులను తనఖా పెట్టనక్కర్లేదు.
  3. కంపెనీని మూసివేస్తే తప్ప ఈక్విటీ వాటా మూలధనాన్ని వాపసు చేయనవసరము లేదు.
  4. ఈక్విటీ వాటాదారులు కంపెనీకి యజమానులు. వీరికి ఓటు హక్కు ఉంటుంది. నిర్వహణలో పాల్గొనవచ్చు.
  5. కంపెనీకి అధిక లాభాలు గడించినపుడు ఎక్కువ డివిడెండ్ తోపాటు వాటా విలువ పెరిగినందు వలన కలిగే లాభాన్ని కూడా పొందవచ్చును.

ఈక్విటీ వాటాలకు గల పరిమితులు:

  1. స్థిరమైన నిలకడ ఉన్న ఆదాయాన్ని కోరుకునేవారు, ముందుచూపుగల పెట్టుబడిదారులు ఈక్విటీ వాటాలలో పెట్టుబడి పెట్టడానికి అంతగా ఇష్టపడరు.
  2. ఇతర వనరుల ద్వారా లభించే విత్తసేకరణకు అయ్యే వ్యయము కంటే ఈక్విటీ వాటాల ద్వారా సేకరించే నిధులకు వ్యయం ఎక్కువ.
  3. కంపెనీకి తగినంత లాభాలు రాకపోతే వీరికి డివిడెండ్ ఉండదు.
  4. ఎక్కువ సంఖ్యలో అదనముగా ఈక్విటీ వాటాలను జారీచేస్తే ఓటింగ్ హక్కులు తగ్గి, వారి ఆర్జన కూడా తగ్గుతుంది.
  5. ఈక్విటీ వాటాల జారీపై ఎక్కువగా ఆధారపడితే అతి మూలధనీకరణ జరిగే ప్రమాదము ఉన్నది.
  6. కంపెనీ ఎక్కువ లాభాలు సంపాదించినపుడు డివిడెండ్ రేటు పెరిగి, స్పెక్యులేషన్కు దారి తీయవచ్చు.
  7. ఎక్కువ ఈక్విటీ వాటాలు గల కొద్దిమంది కంపెనీపై నియంత్రణను సాధించవచ్చు.

AP Inter 1st Year Commerce Study Material Chapter 9 వ్యాపార విత్తం మూలాధారాలు – II

ప్రశ్న 6.
ఈక్విటీ వాటాలకు, ఆధిక్యపు వాటాలకు ఉన్న వ్యత్యాసాలను తెలపండి.
జవాబు:
ఈక్విటీ వాటాలు, ఆధిక్యపు వాటాలకు గల వ్యత్యాసాలు:
AP Inter 1st Year Commerce Study Material Chapter 9 వ్యాపార విత్తం మూలాధారాలు 1

ప్రశ్న 7.
వాటాలకు డిబెంచర్లకు మధ్య ఉన్న తేడాలను వివరించండి. [A.P. Mar. 15]
జవాబు:
వాటాలకు, డిబెంచర్లకు మధ్య ఉన్న వ్యత్యాసము:
వాటాలు

  1. వాటా యాజమాన్యపు మూలధనములో ఒక భాగము.
  2. వాటాలపై వాటాదారులకు డివిడెండు చెల్లిస్తారు.
  3. విభాజనీయ లాభాలపై చెల్లించవలసిన డివిడెండ్ రేటు డైరెక్టర్ల బోర్డు నిర్ణయించిన విధముగా మారుతూ ఉంటుంది.
  4. వాటాదారులకు ఓటు హక్కు ఉంటుంది. కాబట్టి వాళ్ళు కంపెనీని నియంత్రించగలరు.
  5. కంపెనీ తన జీవిత కాలములో వాటాలను (విమోచనీయ ఆధిక్యపు వాటాలను తప్ప) విమోచనము చేయనవసరము లేదు.
  6. కంపెనీ పరిసమాప్తి చెందినపుడు బయట వారికి అప్పులను చెల్లించిన తర్వాత వాటా మూలధనాన్ని చెల్లిస్తారు.
  7. వాటాదారులకు కంపెనీ ఆస్తులపై ఎటువంటి ఛార్జ్ ఉండదు.
  8. సాహసోపేతమైన పెట్టుబడిదారులకు ఆకర్షణీయంగా ఉంటాయి.

డిబెంచర్లు

  1. తీసుకున్న అప్పుకు సాక్ష్యముగా డిబెంచర్ ఉంటుంది.
  2. డిబెంచర్లపై డిబెంచర్ దారులకు వడ్డీని చెల్లిస్తారు.
  3. లాభనష్టాలతో నిమిత్తము లేకుండా డిబెంచర్లపై ఒక స్థిరమైన రేటు ప్రకారము వడ్డీని చెల్లిస్తారు.
  4. డిబెంచర్దారులకు ఓటు హక్కు లేదు. వీరు కేవలము కంపెనీకి ఋణదాతలు మాత్రమే.
  5. ఒక నిర్దిష్ట కాలము తర్వాత డిబెంచర్లను విమోచనము చేయవలసి ఉంటుంది.
  6. వాటా మూలధనము కంటే ముందుగానే డిబెంచర్లను చెల్లించవలసి ఉంటుంది.
  7. డిబెంచర్దారులకు కంపెనీ ఆస్తులపై ఛార్జ్ ఉంటుంది.
  8. జాగ్రత్తపరులైన పెట్టుబడిదారులు ఇష్టపడతారు.

AP Inter 1st Year Commerce Study Material Chapter 9 వ్యాపార విత్తం మూలాధారాలు – II

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
వ్యాపార విత్తం
జవాబు:
ఆధునిక వ్యాపార సంస్థలకు విత్తము ప్రధానమైనది. వ్యాపారము, విత్తము ఒకదానిపై మరొకటి ఆధారపడి పరస్పరము సహకరించుకుంటూ పని చేస్తాయి. వ్యాపార సంస్థకు అవసరమైన మూలధనాన్ని సేకరించి, భద్రపరిచి, నిర్వహించి, తద్వారా లాభార్జన లక్ష్యాన్ని సాధించుటకు సంబంధించిన కార్యకలాపములను వ్యాపార విత్తం అంటారు. ఒక వ్యాపారాన్ని ప్రారంభించటానికి, విస్తరించడానికి, మార్కెట్లో తన వాటాను పదిలపరుచుకోవడానికి ప్రతి సంస్థకు
విత్తం అవసరము.

ప్రశ్న 2.
బ్యాంకు ఋణము
జవాబు:
ఏదైనా ఆస్తిని హామీగా ఉంచుకొని, బ్యాంకు వారు కొంత నిర్దిష్ట మొత్తాన్ని నేరుగా అందజేస్తే దానిని బ్యాంకు ఋణము అంటారు. బ్యాంకు అప్పుకు సంబంధించి బ్యాంకరు ఖాతాదారుకు నిర్దిష్టమైన మొత్తాన్ని కేటాయిస్తారు. బ్యాంకువారు ఇచ్చిన అప్పును ఖాతాదారునకు నగదు రూపములోగాని, ఖాతాదారుని, ఖాతాకు జమచేయడం జరుగుతుంది. ఖాతాదారుడు అప్పు మొత్తాన్ని వాయిదాల పద్ధతిలోగాని లేదా ఒకే మొత్తముగాగాని వడ్డీ కలుపుకొని చెల్లిస్తాడు.

ప్రశ్న 3.
డిబెంచర్లు
జవాబు:
అప్పును ఒప్పుకుంటూ అధికార ముద్ర వేసి ఇచ్చిన పత్రాన్ని డిబెంచర్ అంటారు. ఈ పత్రము కంపెనీ తీసుకున్న అప్పుకు సాక్ష్యంగా ఉంటుంది. ఈ పత్రములో కంపెనీ పేరు, డిబెంచర్ దారుని పేరు, అప్పు మొత్తము, వడ్డీరేటు, కాలపరిమితి, పూచీలు, షరతులు మొదలైనవి స్పష్టంగా పేర్కొనడం జరుగుతుంది. వాటాల మాదిరిగా డిబెంచర్లను కూడా నిర్ణీతమైన విలువతో జారీ చేస్తారు. వీటిని కూడా సమమూల్యముతోగాని, ప్రీమియంతోగాని, డిస్కాంటుకు జారీ చేయవచ్చు. డిబెంచరు ముద్రిత మూల్యాన్ని దరఖాస్తు, కేటాయింపు, పిలుపులపై వసూలు చేయవచ్చు. కాని ఆచరణలో డిబెంచర్ మూల్యాన్ని ఒకేసారి వసూలు చేయడం జరుగుతుంది.

ప్రశ్న 4.
వర్తక ఋణము
జవాబు:
ఒక వర్తకుడు తన ఖాతాదారులకు అరువు ఇచ్చినట్లే తరుచుగా తన సప్లయిదారుల నుంచి అరువు సౌకర్యాన్ని’ పొందుతాడు. దీనినే వర్తక ఋణము అంటారు. దీనిని నగదు పూర్వకముగా ఇవ్వడం జరగదు. కాని కొనుగోలు చేసిన సరుకునకు వెంటనే నగదు చెల్లించనవసరము లేదు. కొన్ని వాయిదాలుగా చెల్లించవచ్చు. ఆర్థిక పుష్టి, గుడ్విల్ ఉన్న సంస్థలకు, ఖాతాదారులకు వర్తకపు ఋణాన్ని ఇస్తారు.

ప్రశ్న 5.
ఈక్విటీ వాటా [A.P. Mar. ’15]
జవాబు:
యాజమాన్యపు మూలధనములో ప్రధానమైనది ఈక్విటీ వాటా మూలధనము. ప్రతి కంపెనీ మూలధన సేకరణ కోసం తప్పనిసరిగా ఈక్విటీ వాటాలను జారీ చేస్తుంది. కంపెనీ నిర్వహణ లోపాలు పంచుకునేందుకు ఓటు హక్కు కలిగిన నిజమైన యజమానులు ఈక్విటీ వాటాదారులు. కంపెనీ వైఫల్యము చెంది, నష్టాలు పొందితే అధికముగా నష్టపోయేది ఈక్విటీ వాటాదారులే. వీరికి కంపెనీ వ్యవహారాలు నిర్వహించి, నియంత్రించే డైరెక్టర్లను ఎన్నుకొనుటకు ఓటు హక్కు ఉంటుంది. డివిడెండుకు సంబంధించి ఎటువంటి ఆధిక్యతగాని, గ్యారంటీగాని లేదు. కంపెనీకి లాభాలు వస్తేనే డివిడెండు చెల్లిస్తుంది.

AP Inter 1st Year Commerce Study Material Chapter 9 వ్యాపార విత్తం మూలాధారాలు – II

ప్రశ్న 6.
ఆధిక్యపు వాటా
జవాబు:
ఈక్విటీ వాటాదారుల కంటే కొన్ని ఆధిక్యమైన హక్కులు, ప్రత్యేక సదుపాయాలు కలిగి ఉన్న వాటాలను ఆధిక్యపు వాటాలు అంటారు. భారత కంపెనీల చట్టం, 1956లోని సెక్షన్ 85 ప్రకారం దిగువ పేర్కొన్న రెండు లక్షణాలు కలిగి ఉన్న వాటాలను ఆధిక్యపు వాటాలు అంటారు.

  1. స్థిరమైన డివిడెండు చెల్లించే విషయములో ఆధిక్యపు హక్కు కలిగి ఉండటము.
  2. కంపెనీ పరిసమాపన సమయములో వాటాదారులకు వారి మూలధనాన్ని తిరిగి చెల్లించడంలో ఆధిక్యపు హక్కు కలిగి ఉండటము. వీరికి డివిడెండును స్థిరమైన రేటు ఈక్విటీ వాటాదారుల కంటే ముందు చెల్లిస్తారు. అలాగే కంపెనీ రద్దయినపుడు ఈక్విటీ వాటాదారుల కంటే ముందు మూలధనము వాపసు పొందుతారు.

ప్రశ్న 7.
నిలిపి ఉంచిన ఆర్జనలు [T.S. Mar. ’15]
జవాబు:
సాధారణముగా ఒక కంపెనీ ఆర్జించిన లాభము మొత్తాన్ని వాటాదారులకు డివిడెండ్గా పంచరు. కొంత మొత్తాన్ని భవిష్యత్ అవసరాలకు వేరుగా ఉంచుతారు. ఈ మొత్తాన్ని నిలిపి ఉంచిన ఆర్జనలు అంటారు. కంపెనీ అంతర్గత ఆర్థిక వనరులలో ఇది చాలా ముఖ్యమైనది. ఈ విధముగా లాభాల నుంచి రిజర్వు నిధిగా ఏర్పరచిన మొత్తాన్ని మూలధన వనరులుగా వినియోగించడాన్ని ‘లాభాల పునరాకర్షణ’ అంటారు.

ప్రశ్న 8.
విలంబిత వాటాలు
జవాబు:
విలంబిత వాటాదారులకు ఈక్విటీ వాటాదారులకు డివిడెండ్ చెల్లించిన తర్వాతనే చెల్లిస్తారు. మూలధన వాపసు విషయములో ఇదే పద్ధతిని అవలంబిస్తారు. కంపెనీపై విశ్వాసము ఎక్కువగా ఉన్నవారు ఈ వాటాలను తీసుకుంటారు. సాధారణముగా వ్యవస్థాపకులే ఈ వాటాలను తీసుకోవడం జరుగుతుంది. అందువలన వీటిని వ్యవస్థాపక వాటాలు అంటారు. 1956 భారత కంపెనీల చట్టము ప్రకారము పబ్లిక్ కంపెనీలు ఈ వాటాలను జారీ చేయడానికి వీలు లేదు. సెక్షన్, 90 (2) ప్రకారము స్వతంత్రమైన ప్రైవేటు కంపెనీలు మాత్రమే ఈ రకమైన వాటాలను జారీ చేయవచ్చును.

ప్రశ్న 9.
రాష్ట్ర ఆర్థిక సహాయ సంస్థ
జవాబు:
చిన్నతరహా, మధ్యతరహా పరిశ్రమలకు ఆర్థిక సహాయము అందించే ఉద్దేశ్యముతో 1951లో భారతదేశ ప్రభుత్వము రాష్ట్ర ఆర్థిక సహాయక సంస్థల చట్టమును రూపొందించినది. కారణము ఈ సంస్థలకు ధన సహాయము భారత పారిశ్రామిక ఆర్థిక సంస్థ పరిధిలో లేదు. ఈ సంస్థలు నూతన కంపెనీల స్థాపనకు, అమలులో ఉన్న పరిశ్రమల అభివృద్ధికి తోడ్పడతాయి. ప్రస్తుతము ప్రతి రాష్ట్రములో రాష్ట్ర ద్రవ్య సహాయక సంస్థలను ఏర్పాటు చేయడం జరిగినది.

ప్రశ్న 10.
వాణిజ్య బ్యాంకులు
జవాబు:
కంపెనీలకు అవసరమైన వివిధ అవసరాలకు వివిధ కాలపరిమితులున్న ఋణాలు అందించడములో వాణిజ్య బ్యాంకులు ప్రధాన పాత్రను పోషిస్తున్నవి. బ్యాంకులు వివిధ సంస్థలకు రుణాల ద్వారా క్యాష్ క్రెడిట్లు, ఓవర్ డ్రాఫ్ట్, వినిమయ బిల్లులను డిస్కౌంట్ చేసుకోవడం, పరపతి లేఖలను జారీ చేయడం ద్వారా మూలధనాన్ని సమకూరుస్తాయి. బ్యాంకు తాను మంజూరు చేసిన ద్రవ్య సహాయముపై వడ్డీ రేటును నిర్ణయిస్తుంది. ఋణగ్రహీత వాణిజ్య బ్యాంకుల నుంచి ఋణాన్ని పొందడానికి హామీగా ఆస్తులను తాకట్టు పెట్టవలసి ఉంటుంది.

ప్రశ్న 11.
ద్రవ్య సహాయక సంస్థలు
జవాబు:
భారతదేశ ఆర్థికాభివృద్ధిలో ఆర్థిక సంస్థల పాత్ర కీలకమైనది. ఒక దేశ ఆర్థికాభివృద్ధి కేవలము స్వల్పకాలిక ఋణ సదుపాయాన్ని అందించే సంస్థలుంటే సరిపోదని, వివిధ రకాలైన మూలధన స్వరూపాలతో, వివిధ ధ్యేయాలతో, ప్రత్యేకీకరణలతో వివిధ సంస్థలను, పెట్టుబడి సంస్థలను స్థాపించడము జరిగినది. పారిశ్రామిక విత్తాన్ని చౌకగా, సులభముగా లభ్యమయ్యేటట్లు చూడడానికి ప్రభుత్వము అనేక కార్పొరేషన్లను స్థాపించడం జరిగినది.

AP Inter 1st Year Commerce Study Material Chapter 9 వ్యాపార విత్తం మూలాధారాలు – II

అదనపు ప్రశ్నలు

ప్రశ్న 12.
భారత పారిశ్రామికాభివృద్ధి బ్యాంకు
జవాబు:
భారత పారిశ్రామికాభివృద్ధి బ్యాంకును 1964 జూలై 1న స్థాపించినారు. మన దేశములో పారిశ్రామికాభివృద్ధి కోసం ఏర్పడిన పారిశ్రామిక విత్త సంస్థలలో ఇది శిఖర సంస్థ. ప్రత్యక్ష ధన సహాయముతో పారిశ్రామిక సంస్థలకు ప్రాజెక్టు ఋణాలు, సరళ ఋణాలు, పరికరాలు కొనుగోలు చేయడానికి ఋణాల మంజూరు, పారిశ్రామిక వాటాలు, డిబెంచర్ల జారీకి, చందాపూచీ ఇవ్వడం, పారిశ్రామిక సంస్థలు తీసుకున్న ఋణాలకు హామీలు ఇవ్వడం. పరోక్ష విత్త సహాయము అంటే పారిశ్రామిక సంస్థలకు ఇచ్చిన ఋణాలకు రీఫైనాన్సింగ్, వాటి వినిమయ బిల్లులను రీడిస్కౌంట్ చేసుకుంటుంది.

ప్రశ్న 13.
భారత పారిశ్రామిక ద్రవ్య సంస్థ
జవాబు:
భారత పారిశ్రామిక ద్రవ్య సహాయక చట్టము, 1948 ప్రకారము ఈ సంస్థను ఏర్పాటు చేయడం జరిగినది. పరిశ్రమలకు అవసరమైన దీర్ఘకాలిక, మధ్యకాలిక ఋణాలను అందించడమే ఈ సంస్థ ప్రధాన లక్ష్యము. మన దేశ,. విదేశీ కరెన్సీలతో విత్త సహాయాన్ని చేయడం, పారిశ్రామిక సంస్థల సెక్యూరిటీలకు, ఋణాలకు చందాపూచీదారుగా ఉండడమేకాక వారి వాటాలను, బాండ్లను, ఋణపత్రములను ప్రత్యక్షముగా కొనుగోలు చేస్తుంది. మర్చంట్ బ్యాంకింగ్ సేవలు, పునరావాస కార్యక్రమాలు, కంపెనీల సంయోగాలు మొదలైనవి అందించడం ఈ సంస్థ చేస్తుంది.

ప్రశ్న 14.
భారత చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధి సంస్థ
జవాబు:
భారత పారిశ్రామికాభివృద్ధి బ్యాంకు 100% ప్రభుత్వ అనుబంధ సంస్థగా, పార్లమెంటులో ప్రత్యేక శాసనము ద్వారా 1990లో ‘భారత చిన్నతరహా పరిశ్రమల అభివృద్ధి సంస్థను కేంద్ర ప్రభుత్వం స్థాపించినది. చిన్నతరహా పరిశ్రమల స్థాపన, అభివృద్ధికి అవసరమయ్యే ఆర్థిక సహాయం చేసే సంస్థలలో ఇది ప్రధానమైనది. చిన్నతరహా పరిశ్రమలకు ఆర్థిక సహాయము చేసే సంస్థలను సమన్వయపరచడం, ఆర్థికాభివృద్ధికి తోడ్పడటం, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంపొందించడానికి, సంతులిత ప్రాంతీయ అభివృద్ధికి తోడ్పడటం ఈ సంస్థ ముఖ్య ధ్యేయాలు.

ప్రశ్న 15.
భారత పారిశ్రామిక పెట్టుబడి బ్యాంకు
జవాబు:
ఖాయిలాపడిన (Sick) పరిశ్రమల పునర్నిర్మాణం, ఆధునీకరణ, పునర్వ్యవస్థీకరణ, విస్తరణ లాంటి కార్యకలాపాలను నిర్వర్తించడానికి అవసరమైన ఆర్థిక సహాయం చేయడం ప్రధాన లక్ష్యముగా భారత పారిశ్రామిక పెట్టుబడి బ్యాంకును స్థాపించారు. 1973లో పారిశ్రామిక పునర్నిర్మాణ కార్పొరేషన్ ప్రారంభమై 1985లో ప్రత్యేక చట్టం ద్వారా కేంద్ర ప్రభుత్వము పారిశ్రామిక పునర్నిర్మాణ బ్యాంకుగాను, మరల 1997 భారత పారిశ్రామిక పెట్టుబడి బ్యాంకుగా స్థిరపరిచినారు.

AP Inter 1st Year Commerce Study Material Chapter 9 వ్యాపార విత్తం మూలాధారాలు – II

ప్రశ్న 16.
గ్లోబల్ డిపాజిటరీ రశీదులు
జవాబు:
విదేశీ కంపెనీలలో వాటాల కోసం ఈ గ్లోబల్ డిపాజిటరీ రశీదులను (GDR) ఒకటి కంటే ఎక్కువ దేశాలలో జారీ చేస్తారు. ఈ GDR ఒక బ్యాంకు రశీదు. ప్రపంచవ్యాప్తముగా 900 GDR లను స్టాక్ ఎక్స్ఛేంజ్లలో చేర్చబడినవి. ఈ GDR లు ఫ్రాంక్ ఫర్ట్ స్టాక్ ఎక్స్ఛేంజ్, లక్సెంబర్గ్ స్టాక్ ఎక్స్ఛేంజి, లండన్ స్టాక్ ఎక్స్ఛేంజ్లలో చేర్చబడినవి. ఈ GDR లు వాటాలలో వర్తకానికి అనువుగా ఉంటాయి. వీటిని పలు అంతర్జాతీయ బ్యాంకులు అంటే సిటీ బ్యాంకు, జె.పి. మోర్గాన్, బ్యాంక్ ఆఫ్ న్యూయార్క్ మొదలైనవి జారీ చేస్తాయి. GDR కలిగి ఉన్న వారికి ఓటింగ్ హక్కులు ఉండవు. ఈ GDR కలిగి ఉన్న వ్యక్తులు వాటిని వాటాలుగా (GDR లపై సూచించే సంఖ్య ప్రకారం) మార్చుకోవచ్చు. GDR లను ఈక్విటీ వాటాలుగా మార్చుకోవడానికి ఎలాంటి చెల్లింపులు అవసరము లేదు.

AP Inter 1st Year Commerce Study Material Chapter 8 వ్యాపార విత్తం – మూలాధారాలు – I

Andhra Pradesh BIEAP AP Inter 1st Year Commerce Study Material 8th Lesson వ్యాపార విత్తం – మూలాధారాలు – I Textbook Questions and Answers.

AP Inter 1st Year Commerce Study Material 8th Lesson వ్యాపార విత్తం – మూలాధారాలు – I

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
వ్యాపార విత్తము అంటే ఏమిటి ? ఒక వ్యాపార సంస్థలో దీని అవసరాన్ని, ప్రాముఖ్యాన్ని వివరించండి. [A.P. & T.S. Mar. ’15]
జవాబు:
వ్యాపార సంస్థ లక్ష్యాలను సాధించడానికి అవసరమైన ద్రవ్య వనరుల సేకరణ, వినియోగము, నియంత్రణ, నిర్వహణకు సంబంధించిన ప్రక్రియను వ్యాపార విత్తము అంటారు. గల్మన్, దగల్ ప్రకారము “వ్యాపారములో ఉపయోగించే నిధుల ప్రణాళికీకరణ, సేకరణ, నియంత్రణ, వాడకాన్నే వ్యాపార విత్తము” అంటారు. ఓస్బర్న్ “వ్యాపారములో వాడే నిధుల సేకరణ, వాటిని వాడే ప్రక్రియను వ్యాపార విత్తము” గా నిర్వచించినాడు.

వ్యాపార విత్తము – ఆవశ్యకత: సాధారణముగా వ్యాపారములో స్థిరాస్తుల కొనుగోలుకు, దైనందిన కార్యకలాపాల నిర్వహణకు విత్తము అవసరమవుతుంది. లాభార్జనే ప్రధాన లక్ష్యముగా కలిగిన వ్యాపార సంస్థకు ఈ లక్ష్య సాధన నిమిత్తము ఈ దిగువ తెలిపిన కారణాల వలన విత్తము అవసరమవుతుంది.

1) వ్యాపార ప్రారంభానికి: వ్యాపారాన్ని ప్రారంభించడానికి, స్థిరాస్తులను కొనుగోలు చేయడానికి విత్తము అవసరమవుతుంది. వ్యాపార స్వరూపము, స్వభావాన్ని బట్టి, సాంకేతిక పరిజ్ఞానము బట్టి ఎంత విత్తము అవసరమో. తెలుస్తుంది. వ్యాపారాన్ని ప్రారంభించడానికి ప్రాథమిక కృషికి విత్తము అవసరము.

AP Inter 1st Year Commerce Study Material Chapter 8 వ్యాపార విత్తం - మూలాధారాలు - I

2) వ్యాపార విస్తరణకు: అధునాతనమైన యంత్ర సామాగ్రిని కొనుగోలు చేయడానికి, సాంకేతిక నైపుణ్యముగల శ్రామికులను నియమించుటకు పెద్ద మొత్తములో విత్తము అవసరమవుతుంది. నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించినపుడే వస్తువు నాణ్యత పెరుగుతుంది. యూనిట్ వ్యయం తగ్గుతుంది.

3) కొత్త వస్తువులను ఉత్పత్తి చేసి, మార్కెట్ చేయడం: నూతన వస్తువులను రూపొందించడానికి, వినియోగదారులకు వస్తువులను అందించడానికి సంస్థకు విత్తము అవసరము. మార్కెట్లో సుస్థిరముగా నిలబడవలెనంటే వస్తువుల నవకల్పనకు, పరికల్పనకు తగిన ప్రాధాన్యత ఇవ్వవలసి ఉంటుంది.

4) కొత్త మార్కెట్లో ప్రవేశించడం: కొత్త మార్కెట్ను సృష్టించుకోవడం అంటే కొత్త ఖాతాదారులను ఆకర్షించడమే. కొత్త మార్కెట్లోనికి ప్రవేశించడానికి, సంస్థకు ప్రచారాల కోసము, చిల్లర దుకాణాలను ఏర్పాటు చేయటము కోసము విత్తము అవసరమవుతుంది.

5) మరొక వ్యాపారాన్ని కొనుగోలు చేయడానికి లేదా స్వాధీనము చేసుకోవడం కోసము: పోటీని నివారించడానికి, మరింత బలపడడానికి ఒక సంస్థ మరొక సంస్థను స్వాధీనము చేసుకోవడానికి విత్తము అవసరమవుతుంది.

6) వ్యాపారాన్ని కొత్త ప్రదేశానికి తరలించవలసినపుడు: ప్రభుత్వ ఆదేశాల మేరకు వ్యాపారాన్ని మరొక కొత్త ప్రదేశానికి మార్చవలసినపుడు, ప్రస్తుతము ఉన్న వ్యాపారాన్ని వేరొక ప్రదేశానికి తరలించవలసి వచ్చినపుడు విత్తము అవసరమవుతుంది.

7) రోజువారీ కార్యకలాపాల నిర్వహణ కోసము: వేతనాల చెల్లింపు, రవాణా, స్టేషనరీ, సప్లయిదారులకు చెల్లింపులు మొదలైన రోజువారీ ఖర్చుల కోసము సంస్థకు విత్తము అవసరమవుతుంది.

ప్రశ్న 2.
వివిధ విత్త మూలాధారాల ఎంపికను ప్రభావితము చేయు కారకాలను పేర్కొనండి.
జవాబు:
ఒక సంస్థకు ఆర్థికపరమైన అవసరాలు అనేక రకాలుగా ఉంటాయి. అవి దీర్ఘకాలిక, స్వల్పకాలిక, స్థిర మూలధన, నిర్వహణ మూలధన అవసరాలుగా చెప్పవచ్చును. అందువలన వ్యాపార సంస్థలు వివిధ అవసరాలకు వివిధ విత్త మూలాధారాలను అన్వేషించవలసి ఉంటుంది. స్వల్పకాలిక నిధుల సేకరణ వ్యయము తక్కువ. కాని అనేక కారణాల వలన దీర్ఘకాలిక నిధులు అవసరమవుతాయి. వివిధ విత్త మూలాధారాలను ఎంపిక చేయడానికి క్రింది కారకాలను పేర్కొనవచ్చును.

1) వ్యయము: వ్యయం రెండు రకాలుగా ఉంటుంది. నిధుల సేకరణ వ్యయం, నిధులను ఉపయోగించేటపుడు అయ్యే వ్యయము. ఒక సంస్థ విత్త మూలాధారాలను ఎంపిక చేసేటప్పుడు ఈ రెండు వ్యయాలను లెక్కలోకి తీసుకొనవలెను.

2) ఆర్థిక పటిష్టత: సంస్థ ఆర్థిక పటిష్టత నిధుల సేకరణలో కీలకమైనది. వ్యాపార సంస్థ ఆర్థికముగా పటిష్టముగా ఉన్నప్పుడే తీసుకున్న ఋణాలను వడ్డీతో సహా చెల్లించగలదు.

3) వ్యాపార సంస్థ తరహా: ఒక వ్యాపార సంస్థ తరహా నిధులను సేకరించే ఎంపికను ప్రభావితం చేస్తుంది. ఉదా: భాగస్వామ్య సంస్థ వాటాలను జారీ చేయడం ద్వారా నిధులను సేకరించలేదు. కంపెనీలు మాత్రమే వాటాలను జారీ చేస్తాయి.

4) కాల పరిమితి, ఆవశ్యకత: ఒక వ్యాపార సంస్థకు ఎంత కాలానికి నిధులు అవసరము అవుతాయో ముందుగానే అంచనా వేయగలగాలి. ఉదా: స్వల్పకాలిక నిధులను తక్కువ వడ్డీరేటుకు వర్తక ఋణం, వాణిజ్య పత్రాల ద్వారా సేకరించవచ్చు. దీర్ఘకాలిక విత్తాన్ని వాటాలు, డిబెంచర్ల జారీ ద్వారా సేకరించవచ్చు.

5) నష్టభయము: వ్యాపార సంస్థ తనకు అందుబాటులో ఉన్న ప్రతి విత్త మూలాధారాన్ని నష్టభయం దృష్ట్యా పరిశీలించవలెను. ఉదా: ఈక్విటీ వాటాల ద్వారా మూలధనాన్ని సేకరిస్తే నష్ట భయం తక్కువ. మూలధనాన్ని, రద్దు అయితే తప్ప, వాపసు చేయనవసరం లేదు. లాభాలు రాకపోతే డివిడెండ్లు చెల్లించనక్కరలేదు. అదే ఋణ సేకరణ ద్వారా నిధులు సమకూర్చుకుంటే అసలు, లాభ నష్టాలతో ప్రమేయం లేకుండా వడ్డీని చెల్లించాలి.

AP Inter 1st Year Commerce Study Material Chapter 8 వ్యాపార విత్తం - మూలాధారాలు - I

6) నియంత్రణ: ఒక ప్రత్యేక నిధుల మూలాధారము సంస్థ నిర్వహణపై ఉన్న యాజమాన్య అధికారాన్ని ప్రభావితము చేయవచ్చు. ఈక్విటీ వాటాల జారీ సంస్థ నియంత్రణాధికారాన్ని పలుచన చేస్తుంది.

7) ఆర్థిక పటిష్టతపై ప్రభావము: వ్యాపార సంస్థ కొన్ని రకాల విత్త వనరులపై ఆధారపడినపుడు మార్కెట్లో సంస్థ ఆర్థిక పటిష్టతపై ప్రభావాన్ని చూపుతుంది. ఉదా: హామీగల డిబెంచర్లను జారీచేస్తే, హామీలేని ఋణదాతలకు కంపెనీ పట్ల ఆసక్తి తగ్గి, పరపతిని పొడిగించడానికి ఇష్టపడకపోవచ్చు.

8) సరళత, సౌలభ్యము: వ్యాపార సంస్థలు ఆర్థిక సహాయక సంస్థల నుంచి ఋణాలు పొందడానికి ఎన్నో నిబంధనలు, లాంఛనాలను పూర్తి చేయవలసి ఉంటుంది. ఉదా: బ్యాంకుల నుంచి ఋణాలు పొందడానికి ఎన్నో నియమాలు పాటించవలసి ఉంటుంది. ఇతరుల నుంచి ఋణాలను తేలికగా పొందడానికి సౌలభ్యము ఉంటే వాణిజ్య బ్యాంకుల కంటే ఇతర విత్త వనరులను ఎన్నుకోవచ్చు.

9) పన్ను ప్రయోజనాలు: పన్ను ఆదాలను దృష్టిలో ఉంచుకొని నిధుల ఆధారాలను ఎంపిక చేసేటప్పుడు కొన్ని మూలాలు మనకు అందుబాటులో ఉండవచ్చు. ఉదా: ఆధిక్యపు వాటాలపై డివిడెండు పన్ను నుంచి మినహాయించలేము. కాని డిబెంచర్ల వడ్డీ చెల్లింపును పన్ను నుంచి మినహాయించవచ్చును.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ఒక వ్యాపార సంస్థకు అవసరమైన వివిధ రకాల మూలధనాన్ని పేర్కొనండి.
జవాబు:
వ్యాపార సంస్థ ప్రారంభించడానికి విత్తము అవసరమవుతుంది. దీనినే మూలధనం అంటారు. మూలధనము ఎంత అవసరము అవుతుంది అనేది వ్యాపార సంస్థ యొక్క స్వభావము, పరిమాణాన్ని బట్టి ఉంటుంది. మూలధనమును రెండు రకాలుగా విభజించవచ్చును. అవి: 1. స్థిర మూలధనము 2. నిర్వహణ మూలధనము.
1) స్థిర మూలధనము: ఒక వ్యాపార సంస్థ స్థాపనకు ‘స్థలము, భవనాలు, యంత్రాలు, ప్లాంటు మొదలైన స్థిరాస్తులను సేకరించడానికి ఉపయోగించే మూలధనమును స్థిర మూలధనము అంటారు. ఇలాంటి మూలధనము లేకుండా సంస్థ వ్యాపారాన్ని నిర్వహించలేదు. వ్యాపార సంస్థ తన దీర్ఘకాలిక అవసరాలకు సేకరించే మూలధనమే స్థిర మూలధనము. స్థిర మూలధన పరిమాణము వ్యాపార సంస్థ స్వభావము, కార్యకలాపాలు, ఉత్పత్తి విధానము మొదలైన వాటిమీద ఆధారపడి ఉంటుంది. భారీ పరిశ్రమలకు స్థిర మూలధనము పెద్ద మొత్తములోను, వ్యాపారము చేసే దుస్తుల పంపిణీ సంస్థలో తక్కువ మొత్తములో అవసరము ఉంటుంది.

2) నిర్వహణ మూలధనము: ఒక వ్యాపార సంస్థ తన రోజువారీ కార్యకలాపాలను నిర్వహించడానికి అంటే ముడిపదార్థాల కొనుగోలు, వేతనాల చెల్లింపు, ఆఫీసు నిర్వహణ ఖర్చులు, స్వల్పకాలిక పెట్టుబడులు, ఋణగ్రస్తులు, సరుకు నిల్వ, వసూలు బిల్లుల వంటి స్వల్పకాలిక ఆస్తులలో పెట్టుబడి పెట్టిన మూలధనాన్ని నిర్వహణ మూలధనము అంటారు. ప్రస్తుత ఆస్తులలో పెట్టుబడి పెట్టిన మొత్తాన్ని సంవత్సరములోపు నగదు రూపములో తిరిగి పొందే అవకాశమున్నది. ఈ నిర్వహణ మూలధన పరిమాణము అన్ని వ్యాపార సంస్థలకు ఒకే మాదిరిగా ఉండదు. ఆయా సంస్థల అమ్మకాల టర్నోవర్, నగదు అమ్మకాలు, అమ్మకాల పరిమాణము వంటి అంశాలనాధారముగా ఎక్కువ లేదా తక్కువ నిర్వహణ మూలధనం అవసరమవుతుంది.

AP Inter 1st Year Commerce Study Material Chapter 8 వ్యాపార విత్తం - మూలాధారాలు - I

ప్రశ్న 2.
వ్యాపార విత్తమూలాల వర్గీకరణను వివరించండి.
జవాబు:
1) కాల వ్యవధి ఆధారముగా: కాల వ్యవధి ఆధారముగా విత్తాన్ని సేకరించడానికి దీర్ఘకాలిక, మధ్యకాలిక, స్వల్పకాలిక వ్యవధిగా విభజించవచ్చు.
ఎ) దీర్ఘకాలిక విత్తము: దీర్ఘకాలిక అవసరాలకు వినియోగించే నిధులను దీర్ఘకాలిక మూలధనము అంటారు. దీని కాలపరిమితి 5 సంవత్సరాలకు మించి ఉంటుంది. సేకరించడానికి వనరులు –

  • వాటాలు, డిబెంచర్ల జారీ
  • దీర్ఘకాలిక ఋణాలు
  • ఆర్థిక సంస్థల నుంచి ఋణాలు
  • నిలిపి ఉంచిన ఆర్జనలు, ప్రభుత్వ గ్రాంట్లు.

బి) మధ్యకాలిక విత్తము: ఒక సంవత్సరము నుంచి ఐదు సంవత్సరాల కాలపరిమితితో సేకరించే నిధులను మధ్యకాలిక విత్తము అంటారు. వీటిని ఈ క్రింది వనరుల నుంచి సేకరించవచ్చును.

  • వాణిజ్య బ్యాంకులు
  • పబ్లిక్ డిపాజిట్లు
  • లీజు విత్తము
  • ఆర్థిక సంస్థల నుంచి ఋణాలు

సి) స్వల్పకాలిక విత్తము: ఈ తరహా విత్తాన్ని స్వల్పకాలము అంటే ఒక సంవత్సరములోపు అవసరాల నిమిత్తం సేకరిస్తారు. ఈ విత్తాన్ని సేకరించడానికి వనరులు

  • వాణిజ్య బ్యాంకుల నుంచి ఋణాలు
  • వాయిదా ఋణాలు
  • ఖాతాదారుల నుంచి అడ్వాన్సులు
  • వాణిజ్య పత్రాలు

2. యాజమాన్యము ఆధారముగా: నిధులపై యాజమాన్యపు హక్కు ఆధారము రెండు రకాలు. ·
ఎ. యాజమాన్యపు నిధులు
బి. ఋణాత్మక నిధులు

ఎ) యాజమాన్యపు నిధులు: దీనిలో యజమానుల మూలధనమే కాకుండా నిలిపి ఉంచిన ఆర్జనలు కూడా చేరి ఉంటాయి.
బి) ఋణపూర్వక నిధులు: ఋణాల ద్వారా సమకూర్చుకునే నిధులు. వీటికి మూలాలు వాణిజ్య బ్యాంకుల నుంచి, ఆర్థిక ద్రవ్య సహాయక సంస్థల నుంచి ఋణాలు, డిబెంచర్ల జారీ, పబ్లిక్ డిపాజిట్లు, వర్తకపు ఋణాలు.

3) విత్తము ఉత్పన్నమయ్యే మూలాల ఆధారముగా: మూలధన వనరులు అంతర్గత లేదా బహిర్గత మూలాల నుంచి లభించవచ్చు. అంతర్గత మూలాలు అంటే సంస్థలోనే లభ్యమయ్యేవి. లాభాల పునరాకర్షణ, నిలిపి ఉంచిన ఆర్జనలు, వసూలు బిల్లులపై వసూళ్ళు, మిగిలిన సరుకు అమ్మివేయడం, నిధులను వెనుకకు మళ్ళించడం లేదా నిధుల తగ్గింపు.
‘బహిర్గత మూలాలు అంటే సంస్థ వెలుపలి నుంచి లభ్యమయ్యే వనరులు. ఉదా: వాటాలు, డిబెంచర్లు, పబ్లిక్ డిపాజిట్లు, వాణిజ్య బ్యాంకులు, ద్రవ్య సహాయక సంస్థల నుంచి ఋణాలు, సరుకు సరఫరాదారులు అందించే వర్తక ఋణము, పెట్టుబడిదారులు, ఋణదాతలు.

AP Inter 1st Year Commerce Study Material Chapter 8 వ్యాపార విత్తం - మూలాధారాలు - I

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
వ్యాపార విత్తము [T.S. Mar. 15.]
జవాబు:
ఆధునిక వ్యాపార సంస్థలకు విత్తము ప్రధానమైనది. వ్యాపారము, విత్తము ఒకదానిపై మరొకటి ఆధారపడి పరస్పరము సహకరించుకుంటూ పనిచేస్తాయి. వ్యాపార సంస్థకు అవసరమైన మూలధనాన్ని సేకరించి, భద్రపరిచి, నిర్వహించి తద్వారా లాభార్జన లక్ష్యాన్ని సాధించుటకు సంబంధించిన కార్యకలాపాలను వ్యాపార విత్తము అంటారు. ఒక వ్యాపారము ప్రారంభించడానికి, విస్తరణకు, మార్కెట్ తన వాటాను పంచుకొనడానికి ప్రతి సంస్థకు విత్తము అవసరము.

ప్రశ్న 2.
స్థిర మూలధనము
జవాబు:
ఒక వ్యాపార సంస్థ స్థాపనకు స్థలము, భవనాలు, యంత్రాలు, ప్లాంటు మొదలైన స్థిరాస్తులను సేకరించడానికి ఉపయోగించే మూలధనమును స్థిర మూలధనము అంటారు. ఇలాంటి మూలధనం లేకుండా సంస్థ వ్యాపారాన్ని నిర్వహించలేదు, మనుగడను సాగించలేదు. వ్యాపార సంస్థ తన దీర్ఘకాలిక అవసరాలకు సేకరించే మూలధనమే స్థిర మూలధనము. స్థిర మూలధన పరిమాణము వ్యాపార సంస్థ స్వభావము, కార్యకలాపాలు, ఉత్పత్తి విధానము మొదలైన వాటి మీద ఆధారపడి ఉంటుంది. భారీ పరిశ్రమలకు స్థిర మూలధనము పెద్ద మొత్తములోనూ, వ్యాపారము చేసే దుస్తుల పంపిణీ సంస్థలో తక్కువ మొత్తములో అవసరమవుతుంది.

ప్రశ్న 3.
నిర్వహణ మూలధనము
జవాబు:
ఒక వ్యాపార సంస్థ తన రోజువారీ కార్యకలాపాలను నిర్వహించడానికి అంటే ముడిపదార్థాల కొనుగోలు, వేతనాల చెల్లింపు, ఆఫీసు నిర్వహణ ఖర్చులు, స్వల్పకాలిక పెట్టుబడులు, సరుకు మొదలైన స్వల్పకాలిక ఆస్తులలో పెట్టుబడి పెట్టిన మూలధనాన్ని నిర్వహణ మూలధనము అంటారు. ప్రస్తుత ఆస్తులలో పెట్టుబడి పెట్టిన మూలధనము సంవత్సరంలోపు తిరిగి వచ్చే అవకాశము ఉన్నది. ఈ నిర్వహణ మూలధన పరిమాణము అన్ని సంస్థలలో ఒకే మాదిరిగా ఉండదు. ఆయా సంస్థల అమ్మకాల టర్నోవర్, నగదు అమ్మకాలు, అమ్మకాల పరిమాణాన్నిబట్టి ఎక్కువ లేదా తక్కువ నిర్వహణ మూలధనము అవసరమవుతుంది.

ప్రశ్న 4.
దీర్ఘకాలిక విత్తము [A.P. Mar. ’15]
జవాబు:
దీర్ఘకాలిక అవసరాలకు వినియోగించే నిధులను దీర్ఘకాలిక మూలధనము అంటారు. దీని కాలపరిమితి 5 సంవత్సరాలకు మించి ఉంటుంది. దీర్ఘకాలిక విత్తమును సేకరించడానికి వనరులు:

  1. వాటాలు, డిబెంచర్ల జారీ
  2. దీర్ఘకాలిక ఋణాలు
  3. ఆర్థిక సంస్థల నుంచి ఋణాలు
  4. నిలిపి ఉంచిన ఆర్జనలు
  5. ప్రభుత్వ గ్రాంట్లు.

ప్రశ్న 5.
స్వల్పకాలిక విత్తము
జవాబు:
ఈ తరహా విత్తాన్ని స్వల్ప కాలానికి అంటే సంవత్సరము అవసరాల నిమిత్తము సేకరించడము జరుగుతుంది. ఈ విత్తాన్ని సేకరించడానికి వనరులు

  • వాణిజ్య బ్యాంకుల నుంచి ఋణాలు
  • వాయిదా పరపతి
  • ఖాతాదారుల నుంచి అడ్వాన్సులు
  • వాణిజ్య పత్రాలు’

ప్రశ్న 6.
అంతర్గత విత్త మూలాధారాలు
జవాబు:
అంతర్గత మూలాలు అంటే సంస్థలోనే లభ్యమయ్యే వనరులు. అవి:

  1. లాభాల పునరాకర్షణ
  2. నిలిపి ఉంచిన ఆర్జనలు
  3. వసూలు బిల్లులపై వసూళ్ళు
  4. మిగిలిన సరుకు అమ్మకాలు
  5. నిధులను వెనక్కి మళ్ళించడం లేదా నిధుల తగ్గింపు.

AP Inter 1st Year Commerce Study Material Chapter 8 వ్యాపార విత్తం - మూలాధారాలు - I

ప్రశ్న 7.
బహిర్గత నిధులకు మూలాలు
జవాబు:
బహిర్గత నిధులకు మూలాలు అంటే సంస్థ వెలుపలి నుంచి లభించే వనరులు. వీటికి ఉదాహరణలు

  1. వాటాలు
  2. డిబెంచర్లు
  3. పబ్లిక్ డిపాజిట్లు
  4. వాణిజ్య బ్యాంకులు
  5. ద్రవ్య సహాయక సంస్థలు
  6. సరుకు సప్లయిదారులకు అందించే ఋణం
  7. పెట్టుబడిదారులు
  8. ఋణదాతలు

AP Inter 1st Year Commerce Study Material Chapter 7 కంపెనీ స్థాపన

Andhra Pradesh BIEAP AP Inter 1st Year Commerce Study Material 7th Lesson కంపెనీ స్థాపన Textbook Questions and Answers.

AP Inter 1st Year Commerce Study Material 7th Lesson కంపెనీ స్థాపన

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
వ్యవస్థాపనలోని వివిధ దశలను వివరించండి.
జవాబు:
కంపెనీ తనంతట తాను ఉద్భవించదు. ఇది మానవ కృషి ఫలితముగా ఏర్పడుతుంది. ఎవరో ఒకరు పూనుకొని నిధులను, ఆస్తులను, నిర్వహణా సామర్థ్యమును సమీకరించాలి. కంపెనీ ఏర్పాటుకు ముందు జరిగే కార్యక్రమాన్ని అంతటిని వ్యవస్థాపన అంటారు. అంటే వ్యాపార ఉద్దేశాన్ని ఏర్పరచుకొని, అవకాశాన్ని కనుక్కొని, లాభార్జనకై ఉత్పత్తి సాధనాలు సమీకరించి సమర్థవంతముగా నిర్వహించే ప్రక్రియను వ్యవస్థాపన అంటారు. వ్యవస్థాపనను గెస్టిన్ బర్గ్ ఇట్లా నిర్వచించినాడు. “వ్యాపార అవకాశాలు కనుక్కోవడం, ఆ తరువాత, లాభార్జనకై నిధులను, ఆస్తులను, నిర్వహణా సామర్థ్యమును వ్యాపార సంస్థలో వెచ్చించడము”. కంపెనీ వ్యవస్థాపన వ్యయ ప్రయాసలతో కూడినది.

వ్యవస్థాపనలోని దశలు :
1) వ్యాపార అవకాశాలు కనుగొనుట : వ్యాపార విజయము సరైన వ్యాపార ఎన్నికపై ఆధారపడి ఉంటుంది. ఏదైనా కొత్త వ్యాపార అవకాశాలు తటస్థించినపుడు ఆ అవకాశాలను ఎంతవరకు అమలుపరచవచ్చును ? లాభదాయకమా ? కాదా ? అనే అంశములు నిశ్చితముగా పరిశీలించి, ఆచరణ యోగ్యము, లాభదాయకమని భావిస్తే వ్యాపార సంస్థ ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకుంటాడు.

2) సమగ్ర పరిశోధన : ప్రారంభించవలసిన వ్యాపారాన్ని గురించి సమగ్రమైన పరిశోధన జరపాలి. పెట్టుబడిదారుల మనస్తత్వము, మార్కెట్ పరిస్థితులు, కంపెనీకి అవసరమయ్యే ఆర్థిక వనరులు, శ్రామికులు, ముడిపదార్థాలు, యంత్రాల లభ్యత వస్తువుకు ఉండే డిమాండ్ మొదలైన అంశాలను గురించి సమగ్ర పరిశోధన చేయాలి.

3) వనరుల సమీకరణ : వ్యవస్థాపకుడు తాను ఎంపిక చేసిన వ్యాపారము లాభసాటిగా, ఆమోద యోగ్యముగా ఉందని నిర్ధారణ చేసుకున్న తరువాత వ్యాపార సంస్థకు అవసరమయ్యే ముడిపదార్థాలు, ఆస్తులు, యంత్రాలు, నిర్వాహకుల, సాంకేతిక నిపుణుల సేవలు మొదలైనవి సమకూరే లాగా ఒప్పందాలు చేసుకుంటాడు.

AP Inter 1st Year Commerce Study Material Chapter 7 కంపెనీ స్థాపన

4) ఆర్థిక ప్రతిపాదన : వ్యవస్థాపకుడు కంపెనీకి ఉండవలసిన మూలధన స్వరూపాన్ని నిర్ణయిస్తాడు. ఏ రకమైన వాటాలు, డిబెంచర్లు జారీ చేయాలి ? ఎంత మొత్తము జారీచేయాలో నిర్ణయిస్తాడు. వివిధ ఆర్థిక సంస్థల నుంచి సేకరించవలసిన దీర్ఘకాలిక ఋణాలను కూడా నిర్ధారణ చేస్తాడు.

ప్రశ్న 2.
కంపెనీ నమోదు గురించి విశదీకరించండి.
జవాబు:
కంపెనీ ఒక కల్పిత వ్యక్తి నమోదు ద్వారా దీనికి అస్తిత్వము వస్తుంది. నమోదు అనేది చట్టపరమైన చర్య. ప్రైవేటు కంపెనీగాని, పబ్లిక్ కంపెనీగాని కంపెనీ రిజిస్ట్రారు కార్యాలయములో అవసరమైన ముఖ్యమైన పత్రాలు దాఖలు చేసి, రిజిస్ట్రేషన్ చేయవలెను.

కంపెనీ నమోదు విధానము : కంపెనీ నమోదు కోసము దిగువ ముఖ్య పత్రాలను తయారు చేసి జతపరచాలి. 1) పేరు అనుమతి కోసం దరఖాస్తు: ‘కంపెనీ నమోదుకోసం మొదట పేరు అనుమతి కోరుతూ ఆ రాష్ట్ర కంపెనీల రిజిస్ట్రారుకు దరఖాస్తు చేయాలి. పేర్ల చట్టం 1950 పరిధిలోపు ఏ పేరైనా కంపెనీ పెట్టుకోవచ్చు. కంపెనీ రిజిస్ట్రారు దరఖాస్తు అందిన 14 రోజులలోపు అనుమతిని ఇస్తారు. ఆ తేదీనుంచి 3 నెలల లోపు ఆ పేరును రిజిస్ట్రేషన్ చేయాలి.

2) సంస్థాపనా పత్రము : ఈ పత్రము కంపెనీకి రాజ్యాంగము వంటిది. ఇందులో కంపెనీ ధ్యేయాలు, అధికారాలు, బయటవారితో ఉన్న సఁ న నిర్వచిస్తుంది. ఇది చాలా ముఖ్యమైన పత్రము దీనిని జాగ్రత్తగా తయారు చేసి తగిన స్టాంపులు అతికించాలి. పబ్లిక్ కంపెనీ అయితే ఏడుగురు, ప్రైవేటు కంపెనీ అయితే ఇద్దరు ఈ పత్రముపై
సంతకాలు చేయాలి.

3) కంపెనీ నియమావళి : ఈ పత్రము కంపెనీ అంతర్గత పరిపాలనకు సంబంధించి నియమ నిబంధనలు ఉంటాయి. సంస్థాపనా పత్రము మీద సంతకాలు చేసినవారు దీని మీద సంతకాలు చేయవలెను. ప్రైవేటు కంపెనీ నియమావళిని తప్పని సరిగా రిజిస్ట్రారుకు దాఖలు చేయాలి. పబ్లిక్ కంపెనీ నియమావళిని తయారుచేయకపోతే కంపెనీ చట్టంలోని షెడ్యూల్ 1, టేబుల్ A ని అనుసరించవచ్చును.
అవి :

4) అదనపు పత్రాలు : కంపెనీ నమోదుకు మరికొన్ని అదనపు పత్రాలు తయారు చేసి రిజిస్ట్రారుకు దాఖలు చేయాలి.
ఎ) డైరెక్టర్ల అంగీకార పత్రము : డైరెక్టర్లుగా వ్యవహరించడానికి వారి సమ్మతిని తెలియజేస్తూ ఒక పత్రాన్ని రిజిస్ట్రారుకు దాఖలు చేయవలెను.

బి) పవర్ ఆఫ్ అటార్నీ : కంపెనీ నమోదుకు కావలసిన లాంఛనాలు పూర్తి చేసినట్లు ధృవీకరించడానికి, అవసరమయితే తగిన మార్పులు చేయడానికి ఒక న్యాయవాదిని వ్యవస్థాపకులు నియమించాలి. అతనిని అటార్నీ అంటారు. అతని నియామకపు పత్రాన్ని కూడా రిజిస్ట్రారుకు దాఖలు చేయాలి.

సి) కంపెనీ రిజిష్టర్డ్ కార్యాలయము తెలిపే నోటీసు : కంపెనీ రిజిష్టర్డ్ కార్యాలయము ఎక్కడ ఏర్పాటు చేయవలెనో ముందు నిర్ణయము అయితే, నమోదైన 30 రోజులలోపు రిజిష్టర్డ్ కార్యాలయ వివరాలను రిజిస్ట్రారుకు తెలియజేయాలి.

డి) డైరెక్టర్ల వివరాలు : కంపెనీ డైరెక్టర్లు, మేనేజరు లేదా సెక్రటరీ మొదలైన వారి వివరాలను ఫారం 32లో పొందుపరిచి నమోదుకు 30 రోజులలోపు రిజిస్ట్రారుకు దాఖలు చేయాలి.

5) శాసనాత్మక ప్రకటన .: కంపెనీల చట్టం ప్రకారము నమోదుకు సంబంధించి అన్ని లాంఛనాలు సక్రమముగా నిర్వర్తించినట్లు కంపెనీ న్యాయవాది గాని, ఛార్టర్డ్ అకౌంటెంట్ లేదా సెక్రటరీగాని చట్టపూర్వకమైన ప్రకటన చేయించాలి.

6) నమోదు రుసుం చెల్లింపు : కంపెనీ నమోదుకు చట్టప్రకారము నిర్దేశించిన రుసుము చెల్లించి రశీదును పొందాలి.

పైన తెలిపిన పత్రాలన్నింటిని రిజిస్ట్రారు పరిశీలించి సంతృప్తి చెందితే నమోదు పత్రాన్ని జారీ చేస్తాడు. ఈ పత్రాన్ని పొందిన వెంటనే ప్రైవేటు కంపెనీ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. కాని పబ్లిక్ కంపెనీ వ్యాపార ప్రారంభ ధృవపత్రము పొందనిదే వ్యాపారాన్ని ప్రారంభించరాదు.

AP Inter 1st Year Commerce Study Material Chapter 7 కంపెనీ స్థాపన

ప్రశ్న 3.
సంస్థాపన పత్రం అంటే ఏమిటి ? అందులోని క్లాజులను పేర్కొనండి. [A.P & T.S. Mar. ’15 ]
జవాబు:
భారత కంపెనీల చట్టము క్రింద నమోదైన అన్ని కంపెనీలకు ఆవశ్యకమైన పత్రము సంస్థాపన పత్రము. సంస్థాపనా పత్రమనే పునాది మీదనే కంపెనీ అనే భవనము నిర్మాణము అవుతుంది. ఈ పత్రము కంపెనీ అధికార ఎల్లలను, కంపెనీ వ్యవహారాలకు హద్దులను ఏర్పాటు చేస్తుంది. కంపెనీ ధ్యేయాలను, అధికారాలను, కార్యకలాపాలను వాటాదారులు, ఋణదాతలు, కంపెనీతో ప్రత్యక్షముగా సంబంధమున్న ప్రతివారికి ఖచ్చితముగా తెలియపరచడమే ఈ పత్రము ముఖ్య ఉద్దేశ్యము. కనుక దీనిని కంపెనీ రాజ్యాంగము అంటారు.

ఈ పత్రము కంపెనీకి, బయటవారికి గల సంబంధాలను నిర్వచిస్తుంది. ఈ పత్రములో పొందుపరిచిన వ్యవహారాలు, నిర్వచించిన అధికారాలను, నిర్ణయించిన సంబంధాలను అతిక్రమించి ఏ కంపెనీ నడుచుకోవడానికి వీలులేదు. అలా నడుచుకుంటే ఆ వ్యవహారాలు, అధికారాలు, సంబంధాలు న్యాయవిరుద్ధము అవుతాయి. అవి చెల్లుబాటు కావు:
దీనిని పేరాలుగా విభజించి, వరుసగా సంఖ్యలు వేసి ముద్రించవలెను. పబ్లిక్ కంపెనీ అయితే ఏడుగురు, ప్రైవేటు కంపెనీ అయితే ఇద్దరు సాక్షి సమక్షములో ఈ పత్రాల మీద సంతకాలు చేయవలెను. సంతకము చేసిన ప్రతి వ్యక్తి కనీసం ఒక వాటానైనా తీసుకొనవలెను.

సంస్థాపనా పత్రములోని క్లాజులు.
1) నామధేయపు క్లాజు : ఈ క్లాజులో కంపెనీ పూర్తి పేరు వ్రాయవలెను. పబ్లిక్ కంపెనీ అయితే పేరు చివర ‘లిమిటెడ్’, ప్రైవేటు కంపెనీ అయితే పేరు చివర ‘ప్రైవేటు లిమిటెడ్’ అనే పదములు ఉండాలి. కంపెనీ ఏ పేరునైనా పెట్టుకోవచ్చుగాని అంతకముందు స్థాపితమైన మరొక కంపెనీ పేరును పోలిగాని, సమీపములోగాని ఉండరాదు. అంతేగాక అవాంఛనీయమైన పేర్లు, చట్టముచే బహిష్కరింపబడిన పేర్లు కంపెనీకి పెట్టరాదు.

2) కంపెనీ స్థానపు క్లాజు : కంపెనీ రిజిష్టర్డ్ ఆఫీసు ఏ రాష్ట్రములో ఉన్నదో ఆ రాష్ట్రము పేరు ఈ క్లాజులో తెలిపాలి. కంపెనీతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరపడానికి కార్యాలయ చిరునామా అవసరము. కంపెనీ నమోదు సమయములో గాని, నమోదు అయిన 30 రోజులలోపు కార్యాలయపు చిరునామాను రిజిస్ట్రారుకు

3) ధ్యేయాల క్లాజు : ఇది అతి ప్రధానమైన క్లాజు. ఇందులో కంపెనీ ధ్యేయాలు, అధికారాలు, వ్యాపార వ్యవహారాల పరిధి స్పష్టముగా పేర్కొనబడి ఉంటాయి. న్యాయపూరితమైన ఎన్ని ధ్యేయాలనైనా ఇందులో చేర్చవచ్చును. వాటినన్నింటిని కంపెనీ చేపట్టనవసరం లేదు. ఈ క్లాజులో చేర్చని కార్యకలాపాలను, ధ్యేయాలను అతిక్రమించి ఏ పని చేయరాదు. అలా చేస్తే అవి న్యాయవిరుద్ధము అవుతాయి.

4) ఋణబాధ్యత క్లాజు : కంపెనీ వాటాదారుల యొక్క స్వభావాన్ని ఈ క్లాజులో వ్రాయవలెను. వాటాదారుల ఋణబాధ్యత వారు తీసుకున్న వాటాల విలువ మేరకు పరిమితమని తెలియజేస్తుంది. ఒకవేళ వాటాలో కొంత మొత్తము చెల్లిస్తే, వారి ఋణబాధ్యత ఆ చెల్లించని మొత్తానికే పరిమితము అవుతుంది.

5) మూలధనపు క్లాజు : ఎంత మూలధనాన్ని జారీ చేయడానికి అనుమతి కావలెనో ఈ క్లాజులో తెలియజేస్తారు. దీనిని అధీకృత మూలధనము, నమోదు మూలధనము అంటారు. ఈ మూలధనాన్ని ఎన్ని వాటాలుగా విభజించినారు, వాటా విలువ ఎంతో తెలియపరచవలెను.

6) వ్యవస్థాపన – చందాల క్లాజు : తాము కంపెనీని స్థాపించడానికి ఒక సంస్థగా ఏర్పడినట్లు, తమ పేర్లకు ఎదురుగా ఉన్న వాటాలను తీసుకోవడానికి ఒప్పుకున్నట్లు ఒక ప్రకటన ద్వారా ఈ క్లాజులో తెలియజేయాలి. వారందరూ సాక్షి సమక్షములో సంతకాలు చేయాలి.

ప్రశ్న 4.
నియమావళి గురించి నీకేమి తెలుసు ? దానిలోని అంశాలను వ్రాయండి. [A.P Mar. ’15]
జవాబు:
కంపెనీ నమోదు చేసేటప్పుడు రిజిస్ట్రారు వద్ద దాఖలు చేయవలసిన పత్రాలలో రెండవది నియమావళి. కంపెనీ ఆంతరంగిక వ్యవహారములు సమర్థవంతముగా నిర్వహించుటకు కొన్ని నియమాలు, నిబంధనలు అవసరము. ఆ నియమ నిబంధనలు గల పత్రమే నియమావళి. కంపెనీ నియమావళి ఆంతరంగిక వ్యవహారములకు చుక్కాని వంటిది. నిర్వహణాధికారులకు ఈ నియమావళి మార్గదర్శకముగా ఉంటుంది. కంపెనీకి వాటాదారులకు మధ్య గల సంబంధాన్ని ఇది స్పష్టపరుస్తుంది. ఇది డైరెక్టర్లు, నిర్వహణాధికారులు, వాటాదారులు, ఋణపత్రధారులు అధికారాలను విధులను, బాధ్యతలను స్పష్టముగా నిర్వచిస్తుంది.

కంపెనీ నియమావళిని వివిధ పేరాలుగా విభజించి, వరుసగా సంఖ్యలు వేసి, ముద్రించవలెను. సంస్థాపనా పత్రము మీద సంతకాలు చేసినవారు నియమావళి మీద సాక్షి సమక్షములో సంతకాలు చేయవలెను.

AP Inter 1st Year Commerce Study Material Chapter 7 కంపెనీ స్థాపన

ప్రైవేటు కంపెనీలు, వాటాపరిమిత కంపెనీలు, పూచీ పరిమిత కంపెనీలు, అపరిమిత కంపెనీలు నియమావళిని తప్పని సరిగా తయారు చేసుకొనవలెను. పబ్లిక్ కంపెనీ తన సొంత నియమావళిని తయారుచేసుకోవచ్చు. లేకపోతే కంపెనీల చట్టము షెడ్యూల్ 1లో Table A అనే ఆదర్శ నియమావళి వర్తిస్తుంది.

నియమావళిలో ఉండే అంశాలు :

  1. వాటా మూలధనము దాని తరగతులు, వాటాల సంఖ్య, వాటాల విలువ, వాటాదారుల హక్కులు, వాటా పిలుపులు.
  2. వాటాల బదిలీ, వాటాల జప్తు, తిరిగి జారీచేసే విధానము.
  3. డిబెంచర్లు, స్టాకు జారీ.
  4. వాటా మూలధనము మార్చుట, మూలధన తగ్గింపు.
  5. డైరెక్టర్ల నియామకము, వారి అధికారాలు, బాధ్యతలు, పారితోషికము.
  6. మేనేజింగ్ డైరెక్టర్ నియామకము.
  7. కంపెనీ సమావేశాలు – తీర్మానాలు.
  8. డివిడెండ్లు, రిజర్వులు, లాభాలను మూలధనంగా మార్చుట.
  9. ప్రాథమిక ఒప్పందాలు ఆమోదించే తీరు.
  10. కంపెనీ అధికార ముద్ర.
  11. కంపెనీ లెక్కలు, వాటి తనిఖీ.
  12. సభ్యుల ఓటింగ్ పద్దతి.
  13. సమావేశానికి కోరం నిర్ణయించుట.
  14. బ్యాంకు ఖాతాల నిర్వహణ.
  15. కనీసపు చందా.
  16. మధ్యవర్తిత్వము.
  17. కంపెనీని రద్దు చేసే విధానము.

ప్రశ్న 5.
పరిచయ పత్రం అంటే ఏమిటి ? అందులోని అంశాలు ఏమిటి ? [A.P. Mar. ’15]
జవాబు:
కంపెనీ : వస్థాపకులు నమోదు పత్రము రూపొందిన తర్వాత మూలధన సేకరణకై వాటాలు, డిబెంచర్లు జారీ చేస్తారు. పెట్టుబడి పెట్టే ప్రజలను ఆహ్వానించుటకు, ఆకర్షించుటకు వ్యవస్థాపకులు ఒక ప్రకటన చేస్తారు. ఆ ప్రకటనను పరిచయు పము అంటారు. కంపెనీ వాటాలను, ఋణపత్రాలు కొనమని ప్రజలను ఆహ్వానించే విజ్ఞప్తి పత్రమే, పరిచను పత్రము. ఇది నోటీసు రూపములోగాని, సర్క్యులర్ రూపములోగాని, వ్యాపార ప్రకటన లేదా మరేవిధమైన వివర పత్రములోగాని ఉండవచ్చు. కంపెనీల చట్టము ‘పరిచయ పత్రాన్ని ఇలా నిర్వచించినది. కంపెనీ వాటాలకు లేదా డిబెంచర్లకు చందాలు సమకూర్చడానికి లేదా వాటిని కొనడానికి గాని – పరిచయ పత్రము, నోటీసు, ప్రకటన పత్ర వ్యాపార ప్రకటన లేదా మరో విధమైన ప్రతిపాదనల ద్వారా పెట్టుబడి పెట్టే ప్రజలను ఆహ్వానించడము.”

పరిచయ పత్రమును జారీచేయడములో ఉద్దేశ్యము కొత్తగా ఒక కంపెనీ స్థాపించబడినదని, దానిలోని డైరెక్టర్లు దక్షత గల వారిని, కంపెనీకి ఉజ్వల భవిష్యత్తు ఉన్నదని ప్రజలకు తెలియచేయడం. అంతేగాక ప్రకటించిన విషయాలకు డైరెక్టర్లదే పూర్తి బాధ్యత అని తెలియజేయడం.

AP Inter 1st Year Commerce Study Material Chapter 7 కంపెనీ స్థాపన

పరిచయపత్రములో ఉండే అంశాలు :

  1. సంస్థాపనా పత్రములోని అంశాలు, ముఖ్యముగా కంపెనీ ధ్యేయాలు.
  2. సంస్థాపనా పత్రము మీద సంతకము చేసినవారి పేర్లు, వారి వృత్తులు, చిరునామాలు, వారు తీసుకున్న వాటాల వివరాలు.
  3. డైరెక్టర్లు, సెక్రటరీ, మేనేజర్ల పేర్లు, విలాసాలు, పారితోషికం.’
  4. కనీసపు చందా మొత్తము.
  5. చందా జాబితాలు తెరిచి ఉంచే కాలము.
  6. వాటా మూలధనాన్ని ఎన్ని తరగతులుగా విభజించినారు, ఎన్ని వాటాలుగా విభజించినది; వాటాదారుల హక్కులు.
  7. దరఖాస్తు మీద, కేటాయింపు మీద, పిలుపుల మీద చెల్లించవలసిన సొమ్ము.
  8. చందా పూచీదారుల పేర్లు, వారి కమీషన్.
  9. ప్రాథమిక ఖర్చులు.
  10. రిజర్వులు – మిగుళ్ళు వాటిని నిర్వహించే పద్ధతి.
  11. కంపెనీ ఆడిటర్లు, లాయర్ల పేర్లు, చిరునామాలు.
  12. కంపెనీ ఆస్తులను విక్రయించిన వారి పేర్లు, వారికి చెల్లించే కొనుగోలు ప్రతిఫలము.
  13. కంపెనీ వ్యవస్థాపకులకు చెల్లించవలసిన ప్రతిఫలము.
  14. వాటాదారుల ఓటింగ్ హక్కులు, సమావేశాల వివరాలు.
  15. ఆస్తి అప్పుల పట్టిక, లాభనష్టాల ఖాతా తనిఖీ చేసే ప్రదేశము, సమయము.
  16. వ్యాపారము గూర్చి నిపుణుల అభిప్రాయము.
  17. వాటాదారుల సమస్యలు పరిష్కరించే విధానము.

ప్రశ్న 6.
కంపెనీ స్థాపనా విధానాన్ని కూలంకషంగా విపులీకరించండి.
జవాబు:
కంపెనీ స్థాపనలో నాలుగు దశలుంటాయి. అవి. 1) వ్యవస్థాపన 2) నమోదు లేదా రిజిస్ట్రేషన్ 3) మూలధన సమీకరణ 4) వ్యాపార ప్రారంభము.
1) వ్యవస్థాపన : కంపెనీ ఏర్పాటుకు ముందు జరిగే కార్యక్రమాన్ని వ్యవస్థాపన అంటారు. అనగా వ్యాపార ఉద్దేశ్యాన్ని ఏర్పరచుకొని, అవకాశాలను కనుగొని లాభార్జన కోసము ఉత్పత్తి సాధనాలను సమీకరించుకొని సమర్ధవంతముగా నిర్వహించే ప్రక్రియను వ్యవస్థాపన అంటారు. వ్యవస్థాపనలో నాలుగు దశలుంటాయి. 1. వ్యాపార అవకాశాలను కనుగొనుట 2. సమగ్రమైన పరిశోధన, 3. వనరుల సమీకరణ, 4. ఆర్థిక ప్రతిపాదన.

2) కంపెనీ నమోదు లేదా రిజిస్ట్రేషన్ : ఏ కంపెనీ అయినా చట్టబద్ధముగా గుర్తింపు పొందవలెనంటే నమోదు అవసరము. నమోదు కొరకు కొన్ని ముఖ్యమైన పత్రాలను రిజిస్ట్రారు వద్ద దాఖలుచేసి రిజిస్ట్రేషన్ చేయాలి. కంపెనీ, నమోదుకొరకు దాఖలు చేయవలసిన ముఖ్య పత్రాలు.

  1. పేరు అనుమతి కోసము దరఖాస్తు
  2. సంస్థాపనా పత్రము
  3. నియమావళి
  4. క్రింది అదనపు పత్రాలను కూడా రిజిస్ట్రారు వద్ద, దాఖలు చేయాలి.
    i) మొదటి డైరెక్టర్ల సమ్మతి పత్రము
    ii) పవర్ ఆఫ్ అటార్నీ
    iii) కంపెనీ రిజిష్టర్డ్ కార్యాలయం తెలిపే నోటీసు
    iv) డైరెక్టర్లు, మేనేజరు, సెక్రటరీ వివరాలు 5. శాసనాత్మక ప్రకటన
  5. నమోదు రుసుం చెల్లింపు
  6. నమోదు పత్రము
    పై పత్రాలను రిజిస్ట్రారు పరిశీలించి సంతృప్తి చెందిన మీద కంపెనీ నమోదు పత్రాన్ని జారీ చేస్తాడు. నమోదు పత్రము పొందిన వెంటనే ప్రైవేటు కంపెనీ వ్యాపారమును ప్రారంభించవచ్చును. కాని పబ్లిక్ కంపెనీ వ్యాపారమును ప్రారంభించుటకు వ్యాపార ప్రారంభ ధ్రువ పత్రాన్ని పొందవలెను.

3) మూలధన సేకరణ : కంపెనీ వాటాలను జారీచేసి మూలధనాన్ని సేకరిస్తుంది. కంపెనీ నమోదుకు ప్రాథమిక ఖర్చులు, ఆస్తుల కొనుగోలు మొదలైన వాటికి అవసరమయ్యే మొత్తాన్ని కనీసపు చందా అంటారు. కంపెనీ పరిచయ పత్రములో పేర్కొన్న కనీసపు చందా మొత్తాన్ని సేకరించకుండా వ్యాపారమును ప్రారంభించలేదు. కంపెనీ జారీ చేసిన మూలధనములో మొత్తాన్ని, 90% పరిచయ పత్రాన్ని జారీ చేసిన 120 రోజులలోపు సేకరించాలి. అలా సేకరించకపోతే సెబీ సూచనల మేరకు 10 రోజులలోపు దరఖాస్తు దారులకు తిరిగి చెల్లించవలెను.

AP Inter 1st Year Commerce Study Material Chapter 7 కంపెనీ స్థాపన

4) వ్యాపార ప్రారంభము పబ్లిక్ కంపెనీ వ్యాపార ప్రారంభ ధ్రువపత్రాన్ని పొందుటకు ఈ క్రింది పత్రాలను రిజిస్ట్రారుకు సమర్పించాలి.

  1. పరిచయ పత్రము లేదా ప్రత్యామ్నాయ పరిచయ పత్రము..
  2. డైరెక్టర్ల అర్హత వాటాలు తీసుకొని చెల్లించినట్లు ధృవీకరణ పత్రము.
  3. కనీసపు చందా వసూలైనట్లు, దాని మేరకు వాటాలను కేటాయించినట్లుగా ధృవీకరణ పత్రము.
  4. వ్యాపార ప్రారంభానికి అవసరమైన లాంఛనాలు పాటించినట్లుగా కంపెనీ డైరెక్టరు లేదా సెక్రటరీ ప్రకటన. పై పత్రాలను రిజిస్ట్రారు పరిశీలించి, సంతృప్తి చెందినట్లయితే వ్యాపార ప్రారంభ ధృవపత్రాన్ని జారీ చేస్తాడు. ఈ పత్రము పొందడముతో కంపెనీ స్థాపన పూర్తి అవుతుంది.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
వివిధ రకాల వ్యవస్థాపకుల గురించి వ్రాయండి.
జవాబు:
వ్యవస్థాపకులను దిగువ విధాలుగా వర్గీకరించవచ్చును.

  1. వృత్తిగా స్వీకరించిన వ్యవస్థాపకులు : ఈ రకమైన వ్యక్తులు కంపెనీ వ్యవస్థాపనలో ప్రత్యేకీకరణ చూపుతారు. ఒకసారి కంపెనీ వ్యాపారాన్ని ప్రారంభించిన తర్వాత దానిని వాటాదారులకు అప్పగిస్తారు. వీరు వ్యవస్థాపన పూర్తికాల వృత్తిగా నిర్వహిస్తారు.
  2. యాదృచ్ఛిక వ్యవస్థాపకులు : ఈ వ్యవస్థాపకులు కంపెనీ వ్యవస్థాపనను వృత్తిగా స్వీకరించనప్పటికి కొన్ని సమయాలలో కంపెనీ వ్యవస్థాపనలో ఆసక్తిని చూపుతారు. ఉదా : లాయర్లు, ఇంజనీర్లు.
  3. ఆర్థిక వ్యవస్థాపకులు : కొన్ని సందర్భాలలో కొన్ని ఆర్థిక సంస్థలు కంపెనీ వ్యవస్థాపనను చేపట్టవచ్చును.
  4. సాంకేతిక వ్యవస్థాపకులు: ఈ తరహా వ్యవస్థాపకులు తమకున్న ప్రత్యేక పరిజ్ఞానము ద్వారా కొత్త సంస్థలను స్థాపించడము జరుగుతుంది.
  5. సంస్థాగత వ్యవస్థాపకులు : కంపెనీ స్థాపనకు కావలసిన సాంకేతిక, నిర్వహణ, ఆర్థిక సహాయాలను అందించడానికి ప్రత్యేకముగా ఏర్పాటయ్యే సంస్థలను సంస్థాగత వ్యవస్థాపకులు అంటారు. మన దేశములో మేనేజింగ్ ఏజెంట్లు నూతన సంస్థల వ్యవస్థాపనలో ముఖ్యమైన పాత్రను పోషించినారు.

ప్రశ్న 2.
సంస్థాపనా పత్రానికి, నియమావళికి మధ్య ఉన్న వ్యత్యాసాలను తెలపండి.
జవాబు: సంస్థాపనా పత్రానికి, నియమావళికి మధ్య గల వ్యత్యాసాలు :
సంస్థాపనా పత్రము

  1. ధ్యేయాలు: సంస్థాపనా పత్రము కంపెనీకి రాజ్యాంగము వంటిది.
  2. ఉద్దేశ్యాలు : కంపెనీకి, బాహ్య ప్రపంచానికి మధ్యగల సంబంధాలను విశదీకరిస్తుంది.
  3. ఆవశ్యకత : ప్రతి కంపెనీ సంస్థాపనా పత్రాన్ని తప్పనిసరిగా తయారుచేయాలి. ఇది ప్రధాన పత్రము.
  4. మార్పులు : మార్పులు చేయడానికి కేంద్ర ప్రభుత్వము, కోర్టు అనుమతించాలి.
  5. ఒప్పందము : ఇది చట్టానికి మాత్రమే లోబడి ఉంటుంది.
  6. చట్ట ప్రభావము : సంస్థాపనా పత్రములో పేర్కొన్న అంశాలకు విరుద్ధముగా కంపెనీ వ్యవహరిస్తే అవి న్యాయాతీతముగా భావించబడతాయి. చెల్లుబడి • కావు.
  7. హోదా : రెండు పత్రాలకు మధ్య వివాదము ఉంటే ‘సంస్థాపనా పత్రములోని అంశాలకు ప్రాధాన్యత ఉంటుంది.

AP Inter 1st Year Commerce Study Material Chapter 7 కంపెనీ స్థాపన

నియమావళి

  1. నియమావళి కంపెనీకి చట్టములాంటిది. అంతర్గత వ్యవహారాలకు చుక్కాని వంటిది.
  2. కంపెనీ అంతర్గత వ్యవహారాలకు సంబంధించిన నియమ నిబంధనలను తెలియజేస్తుంది.
  3. పబ్లిక్ కంపెనీలకు సొంత నియమావళి అవసరము లేదు. ఇది ద్వితీయ ముఖ్య పత్రము.
  4. మార్పు కోసం వాటాదారుల ప్రత్యేక తీర్మానము చాలు.
  5. ఇది కంపెనీల చట్టానికి, సంస్థాపనా పత్రానికి రెండింటికి లోబడి ఉంటుంది.
  6. నియమావళిలోని అంశాలకు విరుద్ధముగా సంస్థాపనా పత్రానికి లోబడి తీసుకున్న చర్యలను సభ్యులు అంగీకరిస్తే చెల్లుబడి అవుతాయి.
  7. నియమావళిలోని అంశాలు ఎప్పుడూ సంస్థాపనా పత్రములోని అంశాలకు లోబడి ఉంటాయి.

ప్రశ్న 3.
వ్యవస్థాపకుల విధులను పేర్కొనండి.
జవాబు:
వ్యవస్థాపకుని విధులు :

  1. వ్యవస్థాపకుడు వ్యాపార అవకాశాలను శోధిస్తాడు. ఎప్పుడు, ఎక్కడ, ఎలాంటి వ్యాపారము ప్రారంభించవలెననే విషయములపై పరిశోధనలను జరిపి ఒక నిర్ణయానికి వస్తాడు.
  2. వ్యాపార ఉద్దేశ్యము ఏర్పడగానే ఆ ఉద్దేశాన్ని ఆచరణలో పెట్టడానికి సవిస్తరమైన శోధనలు చేస్తాడు. ఉత్పత్తి వస్తువుల డిమాండు, ముడిపదార్థాల లభ్యత, రవాణా సౌకర్యాలు, అవసరమైన మూలధనము, లాభాలు మొదలైన అంశాల గురించి పరిశీలన చేసి, ఇవి అనుకూలముగా ఉంటే స్థాపనకు ముందంజ వేస్తాడు.
  3. ఫ్యాక్టరీ నిర్మాణానికి స్థలాన్ని సేకరించాలి. భవన నిర్మాణాలు, యంత్రాలు, యంత్ర పరికరాలు సేకరించాలి. నిర్వహణా సామర్థ్యాన్ని సమీకరించుకోవాలి.
  4. కంపెనీ బ్యాంకర్లను, ఆడిటర్లను, సొలిసిటర్లను ఎన్నుకోవాలి.
  5. కంపెనీ నమోదుకు కావలసిన ముఖ్య పత్రాలను తయారు చేయాలి.
  6. కంపెనీకి కావలసిన ఆస్తుల కొనుగోలుకు సంబంధించి ఒప్పందాలు చేసుకోవాలి.
  7. కంపెనీని నిర్వహించడానికి కావలసిన మూలధనాన్ని సేకరించాలి.
  8. పరిచయ పత్రాన్ని జారీచేసి, వ్యాపార ప్రారంభ ధ్రువపత్రాన్ని పొందవలెను.

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
వ్యవస్థాపన నిర్వచనం.
జవాబు:
కంపెనీని ఏర్పాటు చేయడానికి ముందు జరిగే కార్యక్రమమును వ్యవస్థాపన అంటారు. అనగా వ్యాపార ఉద్దేశ్యాన్ని ఏర్పరచుకొని, అవకాశాన్ని కనుగొని, లాభార్జనకై ఉత్పత్తి సాధనాలను సమీకరించుకొని సమర్థవంతముగా నిర్వహించే ప్రక్రియ. గెస్టిన్ బర్గ్ వ్యవస్థాపనను ఇలా నిర్వచించినాడు. ‘వ్యాపార అవకాశాలు కనుక్కోవడము, ఆ తరువాత లాభార్జనకై నిధులను, ఆస్తులను, నిర్వహణా సామర్థ్యాన్ని ఆ సంస్థలో వెచ్చించడము’

ప్రశ్న 2.
కనీసపు చందా
జవాబు:
పబ్లిక్ కంపెనీ స్థాపనకు కావలసిన కనీసపు మూలధనాన్ని కనీసపు చందా అంటారు. కనీసపు చందాను పరిచయ పత్రాన్ని జారీ చేసిన 120 రోజుల లోపు సేకరించాలి. ఈ మొత్తాన్ని సేకరించకుండా పబ్లిక్ కంపెనీ వాటాలను కేటాయించరాదు. కనీసపు చందా మొత్తాన్ని క్రింది అంశాల ఆధారముగా నిర్ణయిస్తారు.

  1. కంపెనీ స్థిరాస్థుల కొనుగోలుకు,
  2. ప్రాథమిక ఖర్చులు చెల్లించడానికి
  3. నిర్వహణకు అవసరమైన మూలధన సేకరణకు
  4. కంపెనీ స్థాపనకు, నిర్వహణకు అవసరమయ్యే ఇతర వ్యయాలకు.

 

ప్రశ్న 3.
సంస్థాపనా పత్రం
జవాబు:
భారత కంపెనీల చట్టము క్రింద నమోదయిన అన్ని కంపెనీలకు అత్యావశ్యకమైన పత్రము సంస్థాపనా పత్రము. సంస్థాపనా పత్రము అనే పునాది మీదనే కంపెనీ అనే భవనము నిర్మాణము అవుతుంది. ఈ పత్రము కంపెనీ అధికారానికి గల ఎల్లలను, వ్యవహారాలకు హద్దులను ఏర్పాటు చేస్తుంది. కంపెనీ ధ్యేయాలను, అధికారాలను, కార్యకలాపాలను వాటాదారులు, ఋణదాతలు, కంపెనీతో ప్రత్యక్షముగా సంబంధమున్న ప్రతివారికి ఖచ్చితముగా తెలియపరచడమే ఈ పత్రము యొక్క ముఖ్య ఉద్దేశ్యము. కనుక దీనిని కంపెనీ రాజ్యాంగమంటారు.

AP Inter 1st Year Commerce Study Material Chapter 7 కంపెనీ స్థాపన

ప్రశ్న 4.
ప్రత్యామ్నాయ పరిచయ పత్రం.
జవాబు:
పబ్లిక్ కంపెనీలు తామే మూలధనాన్ని సేకరించుకోగలిగితే పరిచయ పత్రాన్ని జారీచేయనక్కర్లేదు. ప్రత్యామ్నాయముగా పరిచయపత్ర నివేదికను వాటాల కేటాయింపుకు కనీసము మూడు రోజులు ముందుగా కంపెనీల రిజిస్ట్రారుకు దాఖలు చేయాలి. పరిచయ పత్రములోని అంశాలే దాదాపుగా దీనిలో ఉంటాయి. ఈ నివేదికపై డైరెక్టర్లు అందరూ సంతకాలు చేయవలెను.

ప్రశ్న 5.
పరిచయ పత్రంలోని అసత్య ప్రకటనలకు విధించే క్రిమినల్ బాధ్యత
జవాబు:
పరిచయ పత్రములో అసత్య ప్రకటనలు ఉండి, వాటిని నమ్మి ఎవరైనా వాటాలను గాని, డిబెంచర్లను గాని కొని నష్టపోయామని నిరూపించినట్లయితే, పరిచయ పత్రము జారీతో సంబంధమున్న ప్రతి వ్యక్తికి 50,000 జరిమానా లేదా రెండు సంవత్సరాల జైలుశిక్ష లేదా రెండింటిని విధించవచ్చును.

AP Inter 1st Year Commerce Study Material Chapter 6 జాయింట్ స్టాక్ కంపెనీ స్థాపన

Andhra Pradesh BIEAP AP Inter 1st Year Commerce Study Material 6th Lesson జాయింట్ స్టాక్ కంపెనీ స్థాపన Textbook Questions and Answers.

AP Inter 1st Year Commerce Study Material 6th Lesson జాయింట్ స్టాక్ కంపెనీ స్థాపన

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
జాయింట్ స్టాక్ కంపెనీ అనగానేమి ? వాటి లక్షణాలేవి ?
జవాబు:
సొంత వ్యాపారము, భాగస్వామ్య వ్యవస్థలలోని పరిమితులు అధిగమించడానికి కంపెనీ వ్యవస్థ ఉద్భవించినది. ఉమ్మడి వాటాల ద్వారా రూపుదిద్దుకొనే సంస్థ కాబట్టి దీనిని జాయింట్ స్టాక్ కంపెనీ అంటారు. కంపెనీ కొంతమంది వ్యక్తుల స్వచ్ఛంద సంఘము. కొంతమంది వ్యక్తులు కలసి ఒక ధ్యేయమును సాధించడానికి ఏర్పడిన సంస్థ. కంపెనీల
చట్టము దీనికి ప్రత్యేకమైన వ్యక్తిత్వాన్ని ప్రసాదించినది. దీనికి న్యాయాత్మకమైన వ్యక్తిత్వము, పారంపర్యాధికారము, పరిమిత ఋణబాధ్యత ఉన్నవి. కంపెనీలకు ప్రత్యేక వ్యక్తిత్వము ఉండటము అది తన పేరుతోనే ఆస్తులను కొనవచ్చు, అమ్మవచ్చు ఒడంబడికలు చేసుకోవచ్చు. అందుకే అటువంటి సంస్థను కంపెనీల చట్టము సృష్టించిన కల్పిత వ్యక్తిగా వర్ణించడమైనది.

“అధికార ముద్రతో, పారంపర్యాధికారముతో చట్టం సృష్టించిన కల్పిత వ్యక్తిత్వముతో రిజిస్టర్ అయిన స్వచ్ఛంద సంస్థ” – కంపెనీల చట్టము.

“సమిష్టి ధ్యేయం కోసం ఐచ్ఛికముగా ఏర్పడిన వ్యక్తుల సముదాయమే కంపెనీ”

– లార్డ్ జస్టీస్ జేమ్స్ “న్యాయశాస్త్ర దృష్టిలో అదృశ్యముగా కంటికి కనిపించకుండా జీవించే కల్పిత మానవుడు. కేవలం న్యాయ శాస్త్ర సృష్టి వలన ఏర్పడినది కాబట్టి రాజ్యాంగము నిర్దేశించిన ధర్మాలే దానికి ఉంటాయి. ఆ ధర్మాలలో అతి ముఖ్యమైనవి శాశ్వతత్వము, వ్యక్తిత్వము” – ప్రధాన న్యాయాధికారి మార్షల్.

కంపెనీల లక్షణాలు :
1. న్యాయాత్మకమైన వ్యక్తిత్వము కంపెనీ చట్టము ద్వారా సృష్టించబడుతుంది. మానవునకు సహజముగా ఉండే హక్కులన్నీ కంపెనీలకు ఉంటాయి. కంపెనీ ఆస్తులను సేకరించి, అప్పులు తీసుకోవచ్చు. తన పేరుమీదగానే కోర్టులో దావా వేయవచ్చు. ఇతరులు కూడా కంపెనీ మీద దావా వేయవచ్చు.

2. న్యాయసత్వము : కంపెనీ నమోదు అయిన తర్వాత ప్రత్యేకమైన అస్థిత్వము ఏర్పడుతుంది. కంపెనీ వేరు, కంపెనీ సభ్యులు వేరు. సభ్యులతో కంపెనీకి సంబంధము ఉండదు.

AP Inter 1st Year Commerce Study Material Chapter 6 జాయింట్ స్టాక్ కంపెనీ స్థాపన

3. స్థాపన : భారత కంపెనీల చట్టము, 1956 క్రింద నమోదు అయినప్పుడే కంపెనీ మనుగడలోనికి వస్తుంది.

4. అధికార ముద్ర : కంపెనీకి భౌతిక రూపము లేదు కాబట్టి అది సంతకాలు చేయలేదు. అందుచేత చట్టం ప్రకారము అధికార ముద్ర ఉండవలెను. ఇది కంపెనీ సంతకము వలె చెలామణి అవుతుంది. అధికార ముద్ర మీద కంపెనీ పేరును, వ్యాపార చిహ్నాన్ని చెక్కుతారు.

5. పారంపర్యాధికారము : చట్టము సృష్టించిన అసహజ మానవుడు కావున కంపెనీ ఛిరకాలము కొనసాగుతుంది. వాటాదారుల మరణముతోగాని, దివాలా తీయడం ద్వారా కంపెనీ మనుగడకు అంతరాయముండదు.

6. పరిమిత ఋణబాధ్యత : వాటాదారుల ఋణబాధ్యత వారు తీసుకున్న వాటాల మేరకు పరిమితము.

7. వాటాల బదిలీ : పబ్లిక్ కంపెనీలోని వాటాదారులు తమ వాటాలను యథేచ్చగా బయటవారికి బదిలీ చేయవచ్చును.

8. యాజమాన్యానికి, నిర్వహణకు పొత్తుండదు : వాటాదారులు కంపెనీ యజమానులు అయినా వారందరూ నిర్వహణలో పాల్గొనలేరు. వారు ఎన్నుకున్న డైరెక్టర్ల బోర్డు నిర్వహణ చేస్తుంది. కాబట్టి యాజమాన్యం వేరు, నిర్వహణ వేరు,

9. సభ్యుల సంఖ్య : జాయింట్ స్టాక్ కంపెనీలలో ప్రధానముగా పబ్లిక్ కంపెనీలు, ప్రైవేటు కంపెనీలు ఉంటాయి. పబ్లిక్ కంపెనీలలో కనిష్ట సభ్యుల సంఖ్య 7, గరిష్ట సభ్యుల సంఖ్య అపరిమితము. ప్రైవేటు కంపెనీలలో కనిష్ట సభ్యుల సంఖ్య 2. గరిష్ట సభ్యుల సంఖ్య 50.

10. చట్టబద్ధమైన నిబంధనలు : కంపెనీ వ్యవహారములన్నీ భారత కంపెనీల చట్టము అజమాయిషీలో జరుగును.

ప్రశ్న 2.
జాయింట్ స్టాక్ కంపెనీకి గల ప్రయోజనాలను, పరిమితులను వివరింపుము. ‘
జవాబు:
కంపెనీ వ్యవస్థ వలన ఈ క్రింది ప్రయోజనాలు ఉంటాయి.
1. భారీ ఆర్థిక వనరులు : ప్రజల నుంచి విస్తారముగా నిధులు సేకరించడానికి కంపెనీ వ్యవస్థ అనువైనది. కంపెనీ వాటాలను చిన్నచిన్న మొత్తాలుగా విభజించి అమ్మడం వలన స్వల్ప ఆదాయముగల ప్రజలు కూడా వాటాలను సులభముగా కొనగలరు. అందువలన భారీ మూలధనాన్ని తేలికగా సేకరించవచ్చు.

2. పరిమిత ఋణబాధ్యత : వాటాదారుల ఋణబాధ్యత వారి వాటా విలువకు పరిమితము అవుతుంది. కంపెనీ అప్పులు తీర్చడానికి సొంత ఆస్తులు తేనవసరము లేదు. వాటా సొమ్ము మాత్రమే కోల్పోతారు. నష్టభయం తక్కువ. అందువలన కంపెనీలో పెట్టుబడి పెట్టడానికి ప్రజలు ముందుకు వస్తారు.

3. శాశ్వతత్వము : కంపెనీల చట్టం ప్రకారము కంపెనీకి ప్రత్యేక న్యాయసత్వము ఉన్నది. అందువలన కంపెనీ నిరాటంకముగా కొనసాగుతుంది. వాటాదారుల మరణము, దివాలా తీయడం వలన కంపెనీ మనుగడకు ఎటువంటి అంతరాయం కలగదు. అది నిరాటంకముగా కొనసాగుతుంది.

4. వాటాల బదిలీ : పబ్లిక్ కంపెనీ వాటాలను ఇతరులు అనుమతి లేకుండా సులభముగా బదిలీ చేయవచ్చును. కంపెనీ వాటాలను స్టాక్ ఎక్స్చేంజిలో అమ్ముతారు. బదిలీ సౌకర్యము ద్వారా వీటిని తేలికగా నగదులోనికి మార్చుకొనవచ్చు. కాబట్టి వాటాలకు ద్రవ్యత్వ లక్షణం ఉండటంవలన కంపెనీకి స్థిరత్వము కల్పిస్తుంది.

5. పెద్దతరహా కార్యకలాపాల ఆదాలు : అధిక నిధుల వలన కంపెనీలు ఉత్పత్తిని భారీగా చేపడతాయి. అందువలన కొనుగోళ్ళు, మార్కెటింగ్, సిబ్బంది వినియోగం, రవాణా తదితర వ్యవహారాలలో అనేక ఆదాలు లభిస్తాయి. ఖర్చులు తగ్గి, లాభాలు పెరుగుతాయి.

6. సమర్థవంతమైన నిర్వహణ : కంపెనీకి అపారమైన నిధులు ఉండటం వలన నిర్వహణ నిపుణులను, వ్యయగణకులను, ఛార్టర్డ్ అకౌంటెంట్లు, సాంకేతిక నిపుణులను నియమిస్తే వారు నిర్వహణను సమర్థవంతముగా చేపడతారు.

7. పరిశోధన మరియు అభివృద్ధి : ఒక కంపెనీ ఉత్పత్తి ప్రక్రియను మెరుగుపరచడానికి, నూతన వస్తువుల రూపకల్పనకు, కార్మికులకు శిక్షణ ఇవ్వడానికి ఎక్కువ మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టవలసి ఉంటుంది. ఈ విస్తరణ కంపెనీలలోనే సాధ్యము.

8. పన్ను ఆదాలు : కంపెనీలు ఆదాయపు పన్ను ఎక్కువ కట్టవలసి వచ్చినప్పటికి, ఎన్నో పన్ను మినహాయింపులు ఇవ్వడం వలన వీటికి పన్ను చెల్లించే బాధ్యత మొత్తంమీద తగ్గుతుంది.

AP Inter 1st Year Commerce Study Material Chapter 6 జాయింట్ స్టాక్ కంపెనీ స్థాపన

పరిమితులు :
1. స్థాపనలో సౌలభ్యము లేకపోవడము : ఒక కంపెనీని స్థాపించడం చాలా కష్టముతోనూ, ఖర్చుతో కూడుకున్నది. అనేక పత్రాలు తయారుచేసి రిజిస్ట్రారుకు సమర్పించాలి. ఇందుకు నిపుణులు కావలెను. కంపెనీని తప్పనిసరిగా నమోదు చేయవలెను. కాబట్టి కంపెనీ స్థాపన సులభమైన ప్రక్రియ కాదు.

2. డైరెక్టర్ల స్వార్ధపరత్వము : కంపెనీ యజమానులైన వాటాదారులు కంపెనీని పరిపాలన చేయరు. నిర్వహణ కోసం డైరెక్టర్లను ఎన్నుకుంటారు. డైరెక్టర్లు తమ అధికారాలను ముఖ్యకార్యనిర్వహణాధికారికి దత్తం చేస్తారు. ఆయన తన అధికారాలను కింద ఉద్యోగులకు అప్పగిస్తారు. వీరిలో ఎవరు అసమర్థులైనా, స్వార్థపరులైనా కంపెనీ నష్టాలపాలై దివాలా తీసే పరిస్థితి ఏర్పడుతుంది.

3. శ్రద్ధాసక్తులు తక్కువ : యాజమాన్యానికి, నిర్వహణకు అంతరము ఉంటుంది. నిర్వహణ అంతా సిబ్బంది ‘ద్వారా జరుగుతుంది. సిబ్బందికి వ్యక్తిగత చొరవ, శ్రద్ధాసక్తులు ఉండకపోవచ్చు. సిబ్బంది కష్టపడినా ప్రోత్సాహముండదు కాబట్టి వారిలో అలసత్వము ఏర్పడుతుంది.

4. కొద్దిమంది పరిపాలన : సిద్ధాంతరీత్యా కంపెనీ నిర్వహణ ప్రజాస్వామిక సూత్రాలను అనుసరించి ఉంటుంది. కాని ఆచరణలో ఇది అల్ప సంఖ్యాకుల నిర్వహణ. ఓటింగ్ హక్కులు, నిర్వహణాధికార్డులు చేజిక్కించుకున్న ‘ కొంతమంది డైరెక్టర్లు లోపలి వృత్తముగా ఏర్పడి సర్వాధికారాలు చెలాయిస్తారు.

5. అధికమైన ప్రభుత్వ నియంత్రణ : కంపెనీ నిర్వహణలో అనేక నిబంధనలు పాటించాలి. వార్షిక నివేదికలు, తనిఖీ చేసిన లెక్కలను విధిగా రిజిస్ట్రారుకు సమర్పించాలి. డైరెక్టర్ల నియామకానికి ప్రభుత్వ అనుమతి పొందాలి. కంపెనీ ధ్యేయాలు మార్పుచేయడానికి అనేక చట్టబద్దమైన లాంఛనాలు పాటించాలి.

6. వాటాలలో అనుచిత స్పెక్యులేషన్: పబ్లిక్ కంపెనీల వాటాలను స్టాక్ ఎక్స్చేంజ్ జాబితాలో చేర్చి సులభముగా కొనుగోలు, అమ్మకాలు చేయవచ్చు. వాటా ధరలు కంపెనీ ఆర్థిక పరిస్థితి, డివిడెండ్ల చెల్లింపు, కంపెనీ పేరు ప్రతిష్ట, కంపెనీ అభివృద్ధికి అవకాశాలు మొదలైనవాటి మీద ఆధారపడతాయి. కంపెనీ డైరెక్టర్లు కంపెనీ లెక్కలను తారుమారుచేసి, వాటా విలువను తమకు అనుకూలముగా మార్చుకొని స్పెక్యులేషన్ ద్వారా డైరెక్టర్లు లాభపడతారు.

7. వ్యాపార నిర్ణయాలు తీసుకోవడములో జాప్యము : కంపెనీ వ్యాపారానికి సంబంధించిన నిర్ణయాలను డైరెక్టర్ల సమావేశాలలోనూ, వాటాదారుల సమావేశాలలోను తీసుకొనవలెను. ఈ సమావేశాలు ఏర్పాటు చేయడానికి కొంత కాలయాపన జరుగుతుంది.

8. వ్యాపార రహస్యాలు : వ్యాపార నిర్వహణ వాటాదారులు, డైరెక్టర్లు, ఉద్యోగుల చేతులలో ఉంటుంది. కాబట్టి కంపెనీ రహస్యాలను కాపాడటానికి వీలులేదు.

9. ఆసక్తుల సంఘర్షణ : ఈ తరహా వ్యాపారములో ఆసక్తులకు సంబంధించి నిరంతరము సంఘర్షణ జరుగుతుంది. సాధారణముగా వాటాదారులు, డైరెక్టర్ల మధ్య లేదా వాటాదారులు, ఋణదాతల మధ్య లేదా మేనేజ్మెంట్, సిబ్బందికి మధ్య ఎప్పుడూ కలహాలు, కొనసాగుతూనే ఉంటాయి.

10. గుత్తాధిపత్యము కంపెనీలు గుత్తాధిపత్య ధోరణులను ప్రోత్సహిస్తుంది. వీరు వినియోగదారులను, శ్రామికులను దోచుకోవడం జరుగును.

ప్రశ్న 3.
ప్రైవేటు కంపెనీ, పబ్లిక్ కంపెనీలకు మధ్యగల తేడాలేవి ?
జవాబు:
ప్రైవేటు కంపెనీకి, పబ్లిక్ కంపెనీకి ఈ క్రింది వ్యత్యాసాలున్నవి.
ప్రైవేటు కంపెనీ

  1. సభ్యుల సంఖ్య : కనీసము ఇద్దరు సభ్యులు ఉండాలి. గరిష్ట సభ్యుల సంఖ్య యాభైకి మించరాదు.
  2. కనీస చెల్లింపు మూలధనము 1,00,000.
  3. పేరు : పేరు చివర ప్రైవేటు లిమిటెడ్ అనే మాటలుండాలి.
  4. మూలధన సేకరణ : మూలధన సేకరణకు పరిచయ పత్రాన్ని జారీ చేయరాదు.
  5. వ్యాపార ప్రారంభము : నమోదు పత్రాన్ని పొందిన వెంటనే వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు.
  6. శాసనాత్మక సమావేశము : శాసనాత్మక సమావేశము ఏర్పాటుచేయనవసరం లేదు.
  7. కనీసపు చందా : కనీసపు చందా నిమిత్తము లేకుండా వాటాలను కేటాయించవచ్చును.
  8. డైరెక్టర్లు : కనీసం ఇద్దరు డైరెక్టర్లు ఉండాలి. డైరెక్టర్లుగా ఉండటానికి అర్హత వాటాలు తీసుకోనవసరము లేదు. డైరెక్టర్లు రొటేషన్ పద్ధతిలో పదవీ విరమణ చేయనవసరము లేదు.
  9. నియామకము : డైరెక్టర్లు అందరిని ఒకే తీర్మానము ద్వారా నియామకం చేయవచ్చును.
  10. నిర్వాహక పారితోషికము : డైరెక్టర్లకు, ఇతర నిర్వాహకులకు చెల్లించే పారితోషికంపై ‘ పరిమితి లేదు.
  11. కోరమ్ : సమావేశాలకు ఉండవలసిన కోరమ్ 2.
  12. డైరెక్టర్లకు కేంద్ర ప్రభుత్వపు అనుమతి లేకుండా ఋణాలు ఇవ్వవచ్చును.

AP Inter 1st Year Commerce Study Material Chapter 6 జాయింట్ స్టాక్ కంపెనీ స్థాపన

పబ్లిక్ కంపెనీ

  1. కనీసము ఏడుగురు సభ్యులుండాలి. గరిష్ట సభ్యుల సంఖ్య అపరిమితము.
  2. కనీస చెల్లింపు మూలధనము 5,00,000
  3. పేరు చివర లిమిటెడ్ అనే మాటను వాడాలి.
  4. పరిచయ పత్రము లేదా ప్రత్యామ్నాయ పరిచయపత్ర నివేదికను విధిగా రిజిస్ట్రారుకు దాఖలు చేయాలి.
  5. వ్యాపార ప్రారంభ ధ్రువపత్రము పొందకుండా వ్యాపారాన్ని ప్రారంభించరాదు.
  6. శాసనాత్మక సమావేశము ఏర్పాటుచేసి శాసన నివేదికను రిజిస్ట్రారుకు దాఖలుచేయవలెను.
  7. కనీసపు చందా నిర్ణీత సమయములో రాకపోతే వాటాలను కేటాయించడానికి వీలులేదు.
  8. కనీసము ముగ్గురు డైరెక్టర్లు ఉండాలి. -డైరెక్టర్లుగా ఉండటానికి అర్హత వాటాలు తీసుకొనవలెను. ప్రతి ఏటా మూడోవంతు డైరెక్టర్లు పదవీ విరమణ చేయవలెను.
  9. ప్రతి డైరెక్టరు ఎన్నికకు ఒక ప్రత్యేక తీర్మానము చేయవలెను.
  10. డైరెక్టర్లకు, నిర్వాహకులకు చెల్లించే పారితోషికం నికర లాభములో 11%నకు మించరాదు.
  11. సమావేశాలకు ఉండవలసిన కోరమ్ 5.
  12. కేంద్ర ప్రభుత్వము అనుమతి లేకుండా డైరెక్టర్లకు ఋణాలను మంజూరు చేయరాదు

ప్రశ్న 4.
భాగస్వామ్యము, కంపెనీ వ్యాపారముల మధ్య గల వ్యత్యాసము లేవి ?
జవాబు:
భాగస్వామ్యానికి, కంపెనీలకు మధ్య ఈ క్రింది వ్యత్యాసాలున్నవి.
భాగస్వామ్యము

  1. స్థాపన : 1932 భారత భాగస్వామ్య చట్టముననుసరించి స్థాపించబడుతుంది.
  2. నమోదు : నమోదు తప్పనిసరి కాదు.”
  3. సభ్యుల సంఖ్య : కనీస సభ్యుల సంఖ్య 2. గరిష్ట సభ్యుల సంఖ్య బ్యాంకింగ్ వ్యాపారాలలో 10, ఇతర వ్యాపారాలలో 20.
  4. వ్యాపార ప్రారంభము : భాగస్తులు ఒప్పందము కుదుర్చుకున్న వెంటనే ప్రారంభించవచ్చును.
  5. వ్యక్తిత్వము : సభ్యులకు సంస్థకు తేడా లేదు.
  6. ఋణబాధ్యత : భాగస్తుల ఋణబాధ్యత వ్యక్తిగతము, సమిష్టిగతము, అపరిమితము.
  7. వాటాలబదిలీ : ఇతర భాగస్తుల అనుమతి లేకుండా ఏ భాగస్తుడు తన వాటాను బయటవారికి బదిలీ చేయరాదు.
  8. పారంపర్యాధికారము : భాగస్తుల మరణం, విరమణ, దివాలా మూలముగా భాగస్వామ్యము రద్దవుతుంది.
  9. మూలధనము : సంస్థే మూలధనాన్ని సమకూర్చుకుంటుంది.
  10. ఖాతాల ఆడిట్: ఖాతాలను ఆడిట్ చేయనవసరము లేదు.
  11. బాధ్యత : భాగస్తుల కార్యకలాపాలకు సంస్థ బాధ్యత వహిస్తుంది.
  12. నిర్వహణ : భాగస్తులే నిర్వహణ చేపడతారు.

కంపెనీ

  1. 1956 భారత కంపెనీల చట్టముననుసరించి స్థాపన జరుగుతుంది.
  2. నమోదు తప్పనిసరి.
  3. ప్రైవేటు కంపెనీలలో కనిష్ట సభ్యుల సంఖ్య 2. గరిష్ట సభ్యుల సంఖ్య 50. పబ్లిక్ కంపెనీలలో కనిష్ట సభ్యుల సంఖ్య 7. గరిష్ట సభ్యుల సంఖ్య అపరిమితము.
  4. ప్రైవేటు కంపెనీలు నమోదు పత్రాన్ని పబ్లిక్ కంపెనీలు వ్యాపార ప్రారంభ ధృవపత్రాన్ని పొందితేగాని వ్యాపారాన్ని ప్రారంభించుటకు వీలులేదు.
  5. కంపెనీ వేరు. కంపెనీలో ఉండే సభ్యులు వేరు.
  6. వాటాదారుల ఋణబాధ్యత వారు తీసుకున్న వాటాల విలువ మేరకే పరిమితము అవుతుంది.
  7. వాటాదారులు తమ వాటాలను స్వేచ్ఛగా బదిలీ చేయవచ్చును.
  8. వాటాదారులు, డైరెక్టర్లు మరణించినా, విరమించినా కంపెనీ యథావిధిగా కొనసాగుతుంది.
  9. వాటాలను జారీచేసి, మూలధనాన్ని సేకరించుకుంటుంది.
  10. ఖాతాలను తప్పనిసరిగా ఆడిట్ చేయించాలి.
  11. వాటాదారుల చర్యలు కంపెనీని బంధించలేవు.
  12. కంపెనీలలో నిర్వహణ బాధ్యతను డైరెక్టర్ల బోర్డుకు అప్పగిస్తారు.

AP Inter 1st Year Commerce Study Material Chapter 6 జాయింట్ స్టాక్ కంపెనీ స్థాపన

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ఏవైనా ఐదు రకాల కంపెనీలను వివరింపుము.
జవాబు:
కంపెనీలను వ్యవస్థాపన, ప్రజల ఆసక్తి, ఋణబాధ్యత, నియంత్రణ, జాతీయత ఆధారముగా అనేక రకాలుగా విభజించవచ్చును.
1. చార్టర్డ్ కంపెనీలు : ఒక దేశము యొక్క రాజు జారీ చేసిన రాజశాసనమును అనుసరించి ఏర్పడిన కంపెనీలను రాజశాసన కంపెనీలు అంటారు. ఇలాంటి కంపెనీలకు ప్రత్యేక హక్కులు ఉంటాయి. ఉదా : ఈస్ట్ ఇండియా కంపెనీ, ఛార్టర్డ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.

2. శాసనాత్మక కంపెనీలు : ఒక దేశ పార్లమెంటుగాని, రాష్ట్ర శాసనసభ ఆమోదించి ప్రత్యేక చట్టము ద్వారా’ ఏర్పడిన కంపెనీలను శాసనాత్మక కంపెనీలు అంటారు. ఉదా : భారత రిజర్వ్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్, జీవిత భీమా కార్పొరేషన్ మొదలైనవి.

3. రిజిష్టర్డ్ కంపెనీలు : కంపెనీల చట్టము క్రింద రిజిస్ట్రారు వద్ద నమోదైన కంపెనీలను రిజిస్టర్డ్ కంపెనీలు అంటారు. ఉదా : ఆంధ్రప్రదేశ్ పేపర్ మిల్స్ లిమిటెడ్, ఇండోనిప్పన్ బాటరీస్ లిమిటెడ్.

4. ప్రభుత్వ కంపెనీలు : కంపెనీల చట్టము 1956 సెక్షన్ 617 ప్రకారము ఏ రిజిస్టర్అయినా కంపెనీలో అయినా కేంద్ర ప్రభుత్వానికి లేదా రాష్ట్ర ప్రభుత్వానికి లేదా రెండింటికి చెల్లించిన మూలధనములో 51 శాతానికి ఎక్కువ వాటాలున్న కంపెనీని ప్రభుత్వ కంపెనీ అంటారు. ప్రభుత్వము పూర్తిగా లేదా పాక్షికముగా యాజమాన్యాన్ని నిర్వహించవచ్చును. ఉదా : విశాఖ స్టీల్ ప్లాంటు, భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ మొదలైనవి.

5. ప్రైవేటు కంపెనీలు : కంపెనీ నియమావళి ప్రకారము వాటాలను బదిలీ చేయడానికి వీలులేదని, సభ్యుల సంఖ్య 50కి మించరాదని, మూలధన సేకరణకోసం పరిచయ పత్రము జారీచేయడానికి వీలులేని కంపెనీలు ప్రైవేటు కంపెనీలు.

6. పబ్లిక్ కంపెనీలు : చట్టము ప్రకారము ప్రైవేటు కంపెనీలుకాని కంపెనీలు పబ్లిక్ కంపెనీలే. 7. వాటా పరిమిత కంపెనీలు : ఏ కంపెనీలో అయితే వాటాదారుల ఋణబాధ్యత వారు తీసుకున్న వాటా విలువకు పరిమితము అవుతుందో ఆ కంపెనీలను వాటా పరిమిత కంపెనీలు అంటారు.

8. పూచీ పరిమిత కంపెనీలు : ఈ కంపెనీలలో వాటాదారులు కంపెనీ పరిసమాప్తి సమయములో ఒక స్థిర · మొత్తాన్ని చెల్లించడానికి పూచీ ఇస్తారు.

9. అపరిమిత కంపెనీలు : ఈ తరహా కంపెనీలలో వాటాదారుల ఋణబాధ్యత అపరిమితముగా ఉంటుంది.

10. హోల్డింగ్ కంపెనీ : ఒక కంపెనీ వేరొక కంపెనీలో 51 శాతము వాటాలుండి ఆ కంపెనీ విధి విధానాలను నియంత్రించే అధికారము ఉంటే ఆ కంపెనీని హోల్డింగ్ కంపెనీ అంటారు.

11. అనుబంధ కంపెనీ : ఒక కంపెనీని వేరొక కంపెనీ నిర్వహణను నియంత్రించగలిగినపుడు, నియంత్రించబడే కంపెనీని అనుబంధ కంపెనీ అంటారు.

12. స్వదేశ కంపెనీలు : ఒక కంపెనీ మన దేశపు కంపెనీల చట్టం క్రింద నమోదై, మన దేశములో గాని, విదేశాలలో గాని వ్యాపారాన్ని కొనసాగిస్తే దానిని స్వదేశ కంపెనీ అంటారు.

13. విదేశ కంపెనీలు : వేరే దేశములో నమోదై, మన దేశములో వ్యాపార కేంద్రాన్ని ఏర్పరచుకున్న కంపెనీలను విదేశ కంపెనీలు అంటారు.

14. జాతీయ కంపెనీలు : కంపెనీగా నమోదైన దేశపు సరిహద్దులను దాటకుండా వ్యాపారము చేయు కంపెనీలను జాతీయ కంపెనీలు అంటారు.

15. బహుళ జాతీయ కంపెనీలు : తమ దేశపు సరిహద్దులు దాటి ఇతర దేశాలలో కూడా వ్యాపార కార్యకలాపములను నిర్వర్తించే కంపెనీలను బహుళ జాతీయ కంపెనీలు అంటారు.

AP Inter 1st Year Commerce Study Material Chapter 6 జాయింట్ స్టాక్ కంపెనీ స్థాపన

ప్రశ్న 2.
పబ్లిక్ కంపెనీ లక్షణాలను వివరింపుము.
జవాబు:
కంపెనీల చట్టము 1956 సెక్షన్ 3 ప్రకారము ప్రైవేటు కంపెనీలు కానివన్నీ పబ్లిక్ కంపెనీలే. ఈ కంపెనీని స్థాపించడానికి కనీసము ఏడుగురు సభ్యులుండాలి. గరిష్ట సభ్యుల సంఖ్యపై పరిమితి లేదు. ఈ కంపెనీలు వాటాలను ప్రజలకు అమ్మవచ్చును. అందుకోసము ప్రజలకు పరిచయ పత్రాన్ని జారీచేయవచ్చును. సభ్యులు (వాటాదారులు) తమ వాటాలను తేలికగా బదిలీ చేసుకొనవచ్చును. ఈ కంపెనీ వ్యాపారాన్ని ప్రారంభించవలెనంటే రిజిస్ట్రారు నుంచి వ్యాపార ప్రారంభ ధృవపత్రాన్ని తప్పనిసరిగా పొందవలెను. ఈ కంపెనీల కనీసపు చెల్లింపు మూలధనము 5,00,000.

భారీ మొత్తములో మూలధనమును వెచ్చించి పెద్ద తరహా కార్యకలాపాలను చేపట్టే వ్యాపార సంస్థలకు పబ్లిక్ కంపెనీ అనువైనది. ఒక పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ తన పేరు చివర లిమిటెడ్ అనే పదాన్ని ఉపయోగించాలి. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, బజాజ్ ఆటోలిమిటెడ్, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, హిందూస్థాన్ లీవర్ లిమిటెడ్లు పబ్లిక్ కంపెనీలకు ఉదాహరణలు.

 

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
కంపెనీ – నిర్వచనం.
జవాబు:
కంపెనీల చట్టము ప్రకారము “అధికార ముద్రతో, పారంపర్యాధికారముతో చట్టము సృష్టించిన కల్పిత వ్యక్తిత్వముతో రిజిస్టర్ అయిన స్వచ్ఛంద సంస్థ”.
ప్రధాన న్యాయాధికారి కంపెనీలను ఈ విధముగా నిర్వచించినాడు. “న్యాయశాస్త్ర దృష్టిలో అదృశ్యముగా కంటికి కనిపించకుండా జీవించే కల్పిత మానవుడు. కేవలము న్యాయశాస్త్ర సృష్టి వలన ఏర్పడినది. కాబట్టి రాజ్యాంగము నిర్దేశించిన ధర్మాలే ఉంటాయి. ఆ ధర్మాలలో అతిముఖ్యమైనవి శాశ్వతత్వము, వ్యక్తిత్వము.”

ప్రశ్న 2.
ప్రభుత్వ కంపెనీ
జవాబు:
కంపెనీల చట్టము 1956 సెక్షన్ 617 ప్రకారము ఏ రిజిష్టరు అయిన కంపెనీలోనైనా కేంద్రప్రభుత్వానికి లేదా రాష్ట్ర ప్రభుత్వానికి లేదా రెండింటికి చెల్లించిన మూలధనములో 51 శాతమునకు ఎక్కువ వాటాలున్న కంపెనీని ప్రభుత్వ కంపెనీ అంటారు. ప్రభుత్వము పూర్తిగా గాని, పాక్షికముగా గాని యాజమాన్యాన్ని నిర్వహించవచ్చు. ఉదా : విశాఖ స్టీల్ ప్లాంటు, భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్.

AP Inter 1st Year Commerce Study Material Chapter 6 జాయింట్ స్టాక్ కంపెనీ స్థాపన

ప్రశ్న 3.
శాసనాత్మక కంపెనీ
జవాబు:
ప్రజాశ్రేయస్సు దృష్ట్యా లోక్సభలోనూ, శాసనసభలోను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక శాసనము చేసి కంపెనీలను ఏర్పాటుచేస్తాయి. ఇలాంటి కంపెనీలను ప్రత్యేక శాసనాల ద్వారా ఏర్పరచిన కంపెనీలు లేదా శాసనాత్మక కంపెనీలు అంటారు. ఉదా : రిజర్వ్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్, ఎయిర్ ఇండియా లిమిటెడ్, జీవిత భీమా కార్పొరేషన్, పారిశ్రామిక ద్రవ్య సహాయ సంస్థ మొదలైనవి.

AP Inter 1st Year Commerce Study Material Chapter 5 భాగస్వామ్య వ్యాపార సంస్థ

Andhra Pradesh BIEAP AP Inter 1st Year Commerce Study Material 5th Lesson భాగస్వామ్య వ్యాపార సంస్థ Textbook Questions and Answers.

AP Inter 1st Year Commerce Study Material 5th Lesson భాగస్వామ్య వ్యాపార సంస్థ

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
భాగస్వామ్యాన్ని నిర్వచించి, ప్రయోజనాలు, పరిమితులను చర్చించండి. [A.P & T.S. Mar. ’15]
జవాబు:
కొంత మంది వ్యక్తులు కలిసి ఉమ్మడిగా చేసే వ్యాపారాన్ని భాగస్వామ్య వ్యాపారము అని చెప్పవచ్చును. 1932 భారత భాగస్వామ్య చట్టం ప్రకారం భాగస్వామ్యాన్ని దిగువ విధముగా నిర్వచించినారు. – “అందరుకుగాని, అందరి తరపున కొందరుగాని వ్యాపారాన్ని నిర్వహిస్తూ అందులోని లాభాలను పంచుకోవడానికి వ్యక్తుల మధ్య ఏర్పరచుకున్న సంబంధమే భాగస్వామ్యము”.

భాగస్వామ్య సంస్థ ప్రయోజనాలు:
1. స్థాపనా సౌలభ్యము: భాగస్వామ్య వ్యాపారాన్ని స్థాపించడానికి చట్టబద్ధమైన లాంఛనాలు తక్కువ. నమోదు తప్పని సరికాదు. దీనిని స్థాపించడానికి వ్రాత పూర్వకమైన లేదా నోటిమాటల ద్వారా ఏర్పరచుకున్న సాధారణ ఒప్పందము సరిపోతుంది.

2. అధిక నిధులు లభ్యము: భాగస్తులందరూ పెట్టుబడి పెడతారు కాబట్టి, సొంత వ్యాపారానికంటే భాగస్వామ్యానికి ఎక్కువ నిధులు లభిస్తాయి.

3. సత్వర నిర్ణయాలు: భాగస్తులందరూ స్థానికులే కాబట్టి తరచూ కలుసుకుంటూ ఉంటారు. వ్యాపార నిర్ణయాలు జాప్యము లేకుండా తీసుకోవచ్చు. త్వరిత నిర్ణయాల వలన వ్యాపార లాభాలు పెరుగుతాయి.

4. మార్పునకు అనుకూలము: అవసరాన్ని బట్టి వ్యాపారములో మార్పులు చేయడానికి న్యాయపరమైన అవరోధాలు తక్కువ. వ్యాపారస్వభావాన్ని, ప్రదేశాన్ని సులభముగా మార్చుకోవచ్చును.

5. వ్యాపార రహస్యాలు: వ్యాపార రహస్యాలు భాగస్తులకు మాత్రమే తెలిసి ఉంటుంది. లాభనష్టాలను, ఆస్తి-అప్పుల వివరాలను బయటకు వెల్లడిచేయరు. రహస్యాలను జాగ్రత్తగా కాపాడతారు.

AP Inter 1st Year Commerce Study Material Chapter 5 భాగస్వామ్య వ్యాపార సంస్థ

6. నష్టాల పంపిణీ: భాగస్వామ్య వ్యాపారములో వచ్చిన నష్టాలను భాగస్తులందరూ అంగీకరించిన నిష్పత్తిలో పంచుకుంటారు. విడివిడిగా ఒక్కొక్క భాగస్తుడు భరించే నష్టము తక్కువ.

7. వ్యక్తిగత శ్రద్ధ: భాగస్వామ్య వ్యాపారాన్ని ప్రత్యక్షముగాను, అతి సన్నిహితముగాని పర్యవేక్షణ చేస్తారు. అందువలన వృథాలు తగ్గి, వ్యాపారము విజయవంతము అవుతుంది.

8. ప్రత్యేకీకరణ: భాగస్వామ్యములో మూలధనము, నిర్వహణా సామర్థ్యము, సాంకేతిక నైపుణ్యము తదితర లక్షణాలు గల భాగస్తుల కలయిక వలన ప్రత్యేకమైన సేవలను ఉపయోగించుకొని సంస్థ రాణిస్తుంది.

9. ఆసక్తుల పరిరక్షణ: భాగస్వామ్యములో ప్రతిభాగస్తుని హక్కులు, ఆసక్తులు పూర్తిగా కాపాడబడతాయి. ఏ. భాగస్తుడైనా ఒక నిర్ణయం పట్ల అసంతృప్తి చెందితే, అతడు రద్దును కోరవచ్చు లేదా వైదొలగవచ్చు.

పరిమితులు/లోపాలు: భాగస్వామ్య సంస్థలకు క్రింది పరిమితులున్నవి.
1. పరిమిత మూలధనము: వాటాదారుల సంఖ్యకు పరిమితిలేని జాయింట్ స్టాకు కంపెనీలతో పోలిస్తే భాగస్వామ్య సంస్థ నిధులను సేకరించే శక్తి తక్కువ. భాగస్వామ్యములో 20 మందికి మించి భాగస్తులు ఉండరాదు.

2. స్థిరత్వము లేకపోవుట: భాగస్తులలో ఎవరు మరణించినా, విరమించినా లేదా దివాలాతీసినా భాగస్వామ్యము రద్దు అవుతుంది. అసంతృప్తి చెందిన ఏ భాగస్తుడైనా సంస్థను రద్దుపరచడానికి ఏ సమయములోనైనా నోటీసు ఇవ్వవచ్చును.

3. అపరిమిత ఋణబాధ్యత: భాగస్తుల ఋణ బాధ్యత పరిమితము. సంస్థ నష్టాలపాలై వ్యాపార అప్పులను సంస్థ ఆస్తుల నుంచేకాక భాగస్తుల సొంత ఆస్తుల నుంచి తీర్చవలసి ఉంటుంది.

4. వాటాను బదిలీ చేయరాదు: ఏ భాగస్తుడు సహభాగస్తుల అంగీకారము లేకుండా తన వాటాను బయటవారికి బదిలీ చేయడానికి వీలులేదు. దీనికి ప్రత్యామ్నాయం సంస్థను రద్దు పరచడమే.

5. భాగస్తుల మధ్య ఐక్యత లోపము: ప్రతి భాగస్తుడు నిర్వహణలో పాల్గొనవచ్చు. ఏ విషయములోనైనా తన అభిప్రాయాన్ని వెల్లడించవచ్చు. ఇది కొన్నిసార్లు భాగస్తుల మధ్య అభిప్రాయభేదాలు, తగాదాలకు దారితీయవచ్చును.

6. ప్రచ్ఛన్న అధికారము: సంస్థ తరపున లావాదేవీలు జరపడానికి ప్రతిభాగస్తునకు హక్కు ఉంటుంది. ఇది ఆసరాగా తీసుకొని కొంతమంది భాగస్తులు నిర్లక్ష్యముగాను, ‘దురుద్దేశముతో వ్యవహరిస్తే సంస్థ నష్టాలపాలయ్యే అవకాశమున్నది.

7. ప్రజలకు విశ్వాసము లేకపోవడం: భాగస్వామ్యములో లెక్కలను ప్రచురించరు. అంతాగోప్యముగా ఉంటుంది, కాబట్టి ప్రజలకు వీటిపై విశ్వాసము ఉండదు.

ప్రశ్న 2.
భారత భాగస్వామ్య చట్టము, 1932 ప్రకారము భాగస్వామ్య నమోదు తప్పనిసరియా ? సంస్థ నమోదుకు సంబంధించిన విధానాన్ని వివరించండి.
జవాబు:
భాగస్వామ్య సంస్థ నమోదు తప్పనిసరి అని భారత భాగస్వామ్య చట్టము, 1932లో చెప్పలేదు. కాని సంస్థ నమోదు కాకపోతే కొన్ని ఇబ్బందులను ఎదుర్కొనవలసి ఉంటుంది. అందువలన నమోదు ఆవశ్యకము అవుతుంది. నమోదును ఏ సమయములోనైనా చేయించవచ్చును. సంస్థను నమోదు చేయడానికి క్రింది విధానాన్ని అవలంబించవలసి
ఉంటుంది.

నమోదు పద్ధతి: భాగస్వామ్య సంస్థ నమోదు కొరకు భాగస్తులు దిగువ సమాచారముతో ఒక నివేదికను తయారుచేసి దరఖాస్తు చేసుకోవాలి.

AP Inter 1st Year Commerce Study Material Chapter 5 భాగస్వామ్య వ్యాపార సంస్థ

  1. భాగస్వామ్య సంస్థ పేరు.
  2. సంస్థ వ్యాపారము చేసే ప్రదేశము లేదా ప్రదేశాలు.
  3. భాగస్తుల పూర్తి పేర్లు, చిరునామాలు.
  4. ప్రతి భాగస్తుడు సంస్థలో చేరిన తేది.
  5. సంస్థ ప్రారంభమైన తేది, వ్యాపారస్వభావము. .
  6. భాగస్వామ్య వ్యాపార సంస్థ కాలపరిమితి.
  7. భాగస్వామ్య వ్యాపార సంస్థకు సంబంధించిన ఇతర అంశాలు.

భాగస్తులు ఈ దరఖాస్తు పత్రముపై సంతకాలు చేసి క్ 3 నమోదు రుసుము చెల్లించి రిజిష్ట్రారుకు దాఖలు చేయాలి. చట్ట ప్రకారము ఉన్న నియమ నిబంధనలతో దరఖాస్తును పరిశీలించిన పిమ్మట రిజిష్ట్రారు సంతృప్తిపడితే, సంస్థ పేరును, భాగస్తుల పేర్లను రిజిష్టరులో నమోదు చేసి, అధికార ముద్రవేసిన నమోదు పత్రాన్ని రిజిష్టారు సంబంధిత సంస్థకు జారీ చేస్తాడు..

ప్రశ్న 3.
భాగస్తులలో రకాలను వివరించండి.
జవాబు:
భాగస్తులకు భాగస్వామ్యములో ఉండే ఆసక్తిని బట్టి వారి బాధ్యతలు, విధులనుబట్టి, నిర్వహణలో వారికున్న హక్కులనుబట్టి భాగస్తులను అనేక రకాలుగా వర్గీకరిస్తారు.
1. సక్రియ భాగస్తుడు: భాగస్వామ్య వ్యాపార నిర్వహణలో చురుకుగా పాల్గొని ప్రధాన పాత్రను నిర్వహించే భాగస్తుని ‘సక్రియ భాగస్తుడు’ లేదా ‘నిర్వాహక భాగస్తుడు’ అంటారు. ఇటువంటి భాగస్తుడు అవసరమైన మూలధనాన్ని సమకూర్చడమే కాక, సంస్థ యొక్క వ్యవహారాలలో ఆసక్తిని చూపించి, సంస్థను నిర్వహించడములో ముఖ్యమైన పాత్రను ” వహిస్తాడు.

2. నిష్క్రియ భాగస్తుడు: భాగస్వామ్య సంస్థకు మూలధనాన్ని సమాకూర్చి నిర్వహణలో పాల్గొనని భాగస్తుని ‘నిష్క్రియ భాగస్తుడు’ అంటారు. ఇతడు నిర్వహణలో పాల్గొనకపోయినా లాభనష్టాలను పంచుకుంటాడు.

3. నామమాత్రపు భాగస్తుడు: యదార్థముగా భాగస్వామ్య సంస్థలో భాగస్తుడు కాకపోయినా తన పేరును, పరపతిని వినియోగించడానికి అంగీకరిస్తే అటువంటి భాగస్తుని నామమాత్రపు భాగస్తుడు అంటారు. ఇతడు మూలధనాన్ని సమకూర్చడు. నిర్వహణలో పాలుపంచుకోడు. లాభాలను పంచుకోడు. అయినప్పటికీ సంస్థ బయటవారితో చేసే కార్యకలాపాలకు ఇతను కూడా బాధ్యత వహిస్తాడు.

4. లాభాలలో భాగస్తుడు: సంస్థ నష్టాలతో సంబంధము లేకుండా లాభాలలో మాత్రమే వాటా పొందే భాగస్తుని లాభాలలో భాగస్తుడు అంటారు. ఇది ‘మైనర్లకు మాత్రమే వర్తిస్తుంది. కారణము మైనర్లు సంస్థ లాభాలలోని భాగాన్ని పొందుతాడు. వారి ఋణ బాధ్యత వారి మూలధనానికి మాత్రమే పరిమితము అవుతుంది.

5. పరిమిత భాగస్తుడు: భాగస్వామ్యములో భాగస్తుని ఋణబాధ్యత సాధారణముగా అపరిమితముగా, సమిష్టిగా, వ్యక్తిగతముగా ఉంటుంది. కాని భాగస్తుని ఋణబాధ్యత అతడు సమకూర్చిన మూలధనానికే పరిమితము అయితే అతనిని పరిమిత భాగస్తుడు అంటారు.

6. సాధారణ భాగస్తుడు: అపరిమిత ఋణ బాధ్యత ఉన్న భాగస్తులను సాధారణ భాగస్తులు అంటారు.

7. భావిత భాగస్తుడు: ఒక వ్యక్తి తన మాటల ద్వారాగాని, చేష్టల ద్వారాగాని ఎదుటి వ్యక్తికి తాను ఫలానా సంస్థలో భాగస్తుడు అని నమ్మించిన భాగస్తుని భావిత భాగస్తుడు అని అంటారు. అలా నమ్మకం కలిగించటము వలన ఎదుటి వ్యక్తి ఋణం ఇచ్చినా, సరుకులు అమ్మినా లేదా మరొక విధముగా నష్టపోయినా భావిత భాగస్తుడే బాధ్యత
వహించాలి.

8. మౌన నిర్ణీత భాగస్తుడు: ఒక భాగస్తుడు లేదా భాగస్వామ్య సంస్థ ఒక వ్యక్తిని భాగస్తునిగా ప్రకటించినపుడు, భాగస్తుడు కాకపోతే ఆ ప్రకటనను ఖండించవలెను. అలా ఖండించకుండా మౌనముగా ఉండే అతనిని మౌన నిర్ణీత భాగస్తుడు అంటారు. ఇతనికి సంస్థ లాభాలలో వాటా ఉండదు కాని సంస్థ చేసే అప్పులకు మాత్రము పూర్తి బాధ్యత
వహించాలి.

AP Inter 1st Year Commerce Study Material Chapter 5 భాగస్వామ్య వ్యాపార సంస్థ

ప్రశ్న 4.
భాగస్వామ్య ఒప్పందము అంటే ఏమిటి ? అందులోని ముఖ్యాంశాలను వివరించండి.
జవాబు:
హారానికి దారము ఎంత ముఖ్యమో భాగస్వామ్యానికి ఒప్పందము అంత ముఖ్యమైనది. వ్యాపారము నిర్వహించడానికి, లాభాలు పంచుకోవడానికి, పెట్టుబడికి సొంతవాడకాలకు సంబంధించి భాగస్తుల మధ్య ఒక ఒడంబడిక కుదురుతుంది. దీనిని భాగస్వామ్య ఒప్పందము అంటారు. ఇది నోటి మాటలద్వారాగాని, వ్రాతపూర్వకముగాగాని ఉండవచ్చు. అయితే ఇది వ్రాత పూర్వకముగా ఉంటే మంచిది. దీని మీద భాగస్తులందరూ సంతకాలు చేయాలి. దీనిని రిజిష్ట్రారు వద్ద నమోదు చేసుకుంటారు. సంస్థ వ్యాపార నిర్వహణలో భాగస్తుల మధ్య సంబంధము, వారి హక్కులు, విధులు, బాధ్యతలను ఈ ఒప్పందము నిర్వచిస్తుంది. దీనితో బయట వ్యక్తులకు సంబంధము లేదు. ఇందులో పేర్కొన్న అంశాలు భాగస్వామ్య చట్టములోని అంశాలకు విరుద్ధముగా ఉండరాదు. భారత స్టాంపుల చట్టము 1989 ప్రకారము తగిన స్టాంపులను ఈ పత్రముపై అతికించవలసి ఉంటుంది. ప్రతి భాగస్తుని వద్ద ఒప్పందపు నకలు ఉంటుంది. సాధారణముగా ఒప్పందములో దిగువ పేర్కొనబడిన అంశాలు ఉంటాయి.

  1. వ్యాపార సంస్థ పేరు
  2. వ్యాపార స్వభావము
  3. వ్యాపార కాలపరిమితి
  4. భాగస్తుల పేర్లు, చిరునామాలు
  5. వ్యాపార ప్రదేశము
  6. భాగస్తులు సమకూర్చవలసిన మూలధనము
  7. లాభనష్టాల పంపిణీ నిష్పత్తి
  8. భాగస్తుల పెట్టుబడిపై చెల్లించవలసిన వడ్డీ
  9. భాగస్తుల సొంతవాడకాలు, అట్టి సొంతవాడకాలపై భాగస్తుడు చెల్లించవలసిన వడ్డీ
  10. భాగస్తులకు చెల్లించే జీతాలు, పారితోషికము
  11. భాగస్తుల హక్కులు, విధులు, బాధ్యతలు
  12. సంస్థ ఖాతాలను తయారు చేసే పద్ధతి, ఆడిట్ చేయించుట
  13. భాగస్వామ్య సంస్థ రద్దుపరిచే విధానము
  14. భాగస్తుల మధ్య తగాదాలు ఏర్పడినపుడు మధ్యవర్తుల ద్వారా పరిష్కార పద్ధతి.

అదనపు ప్రశ్నలు

ప్రశ్న 5.
సొంత వ్యాపారానికి, భాగస్వామ్య వ్యాపారానికి మధ్యగల వ్యత్యాసాలను తెలపండి.
జవాబు:
సొంత వ్యాపారానికి, భాగస్వామ్య వ్యాపారానికి మధ్యగల తేడాలు:
సొంత వ్యాపార సంస్థ

  1. వ్యక్తుల సంఖ్య: దీనిలో ఒకే వ్యక్తి ఉండును.
  2. స్థాపన: దీనిని స్థాపించుట చాలా సులభం.
  3. ఋణ బాధ్యత: సొంతవ్యాపారి ఋణబాధ్యత అపరిమితము.
  4. నమోదు: వ్యాపార సంస్థ నమోదు తప్పని సరికాదు.
  5. మూలధనము: ఒకే వ్యక్తి మూలధనాన్ని సమ కూరుస్తాడు, కాబట్టి మూలధనము తక్కువ.
  6. ఒప్పందము: ఒప్పందము అవసరము లేదు.
  7. వ్యాపార రహస్యాలు: ఒకే వ్యక్తి ఉండటం వలన వ్యాపార రహస్యాలు కాపాడుకోవచ్చు.
  8. శీఘ్ర నిర్ణయాలు: వ్యాపార నిర్ణయాలు త్వరగా తీసుకోవచ్చు.
  9. శ్రమ విభజన: ఒకే వ్యక్తి ఉండటము వలన శ్రమ విభజనకు అవకాశము లేదు.
  10. మంచి నిర్ణయాలు: ఒకే వ్యక్తి ఉండటం వలన తప్పుడు నిర్ణయాలు తీసుకోవచ్చు.

భాగస్వామ్య వ్యాపార సంస్థ

  1. కనిష్ట సభ్యుల సంఖ్య 2. గరిష్ట సభ్యుల సంఖ్య బ్యాంకింగ్ వ్యాపారమయితే 10, ఇతర వ్యాపారమైతే 20.
  2. వ్యాపార స్థాపనకు భాగస్తుల మధ్య అంగీకారముకావలెను.
  3. భాగస్తుల ఋణ భాధ్యత అపరిమితం, వ్యక్తిగతం, సమిష్టిగతము.
  4. నమోదు తప్పనిసరి కాకపోయినా అవసరము.
  5. ఎక్కువ మంది భాగస్తులు ఉండటము వలన ఎక్కువ మూలధనము ఉంటుంది.
  6. ఒప్పందము లేకుండా భాగస్వామ్యము ఏర్పడదు.
  7. ఎక్కువ మంది వ్యక్తులు ఉండటము వలన వ్యాపార రహస్యాలు కాపాడలేరు.
  8. నిర్ణయాలు తీసుకోవడములో ఆలస్యము జరుగుతుంది.
  9. ఎక్కువ మంది ఉండటము వలన శ్రమ విభజనను ప్రవేశపెట్టవచ్చును.
  10. భాగస్తులందరూ సమిష్టిగా ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశమున్నది.

AP Inter 1st Year Commerce Study Material Chapter 5 భాగస్వామ్య వ్యాపార సంస్థ

ప్రశ్న 6.
భాగస్వామ్య వ్యాపారము, సమిష్టి హిందూ కుటుంబ వ్యాపారాలకు మధ్యగల తేడాలను తెలపండి.
జవాబు:
సమిష్టి.హిందూ కుటుంబానికి, భాగస్వామ్యానికి మధ్య గల తేడాలు:
భాగస్వామ్య సంస్థ,

  1. స్థాపన: భాగస్తుల మధ్య ఒప్పందము.
  2. సభ్యుల సంఖ్య: కనిష్ట సభ్యుల సంఖ్య 2 గరిష్ట సభ్యుల సంఖ్య బ్యాంకింగ్ వ్యాపారాలయితే 10, ఇతర వ్యాపారాలయితే 20.
  3. నిర్వహణ: భాగస్తులందరూ లేదా అందరు తరపున కొందరు వ్యాపారాన్ని నిర్వహిస్తారు.
  4. ఋణబాధ్యత: భాగస్తుల ఋణభాధ్యత వ్యక్తిగతం, సమిష్టిగతము, అపరిమితము.
  5. లాభాల పంపిణీ: ఒప్పందము ప్రకారము లాభనష్టాలను పంపిణీ చేస్తారు.
  6. రద్దు: భాగస్తుని విరమణ, మరణం లేదా దివాలా తీయడం వలన భాగస్వామ్య ఒప్పందము రద్దవుతుంది.
  7. మైనర్ భాగస్తుడు: చట్టము ప్రకారము మైనరు భాగస్తుడు కాలేడు.
  8. సభ్యులను భాగస్తులు అంటారు.
  9. అధికారము: సంస్థ తరపున వ్యవహరించ- డానికి భాగస్తులకు ప్రచ్ఛన్న అధికారము ఉంటుంది.
  10. నూతన సభ్యులు: సహభాగస్తుల అంగీకారముతో కొత్త వారిని భాగస్తులుగా చేర్చుకోవచ్చు.

సమిష్టి హిందూ కుటుంబము

  1. హిందూ చట్టము ద్వారా ఏర్పడుతుంది.
  2. కనిష్ట సభ్యుల సంఖ్య లేదు. సహవారసుల సంఖ్యకు పరిమితి లేదు.
  3. కర్త మాత్రమే నిర్వహణను చేపడతాడు.
  4. కర్త ఋణబాధ్యత అపరిమితము. సహవారసుల ఋణబాధ్యత వారి వాటాలకే పరిమితము. 5. సహవారసుల జనన, మరణాల ద్వారా లాభ నష్టాల వాటా మారుతూ ఉంటుంది.
  5. ఎవరు మరణించినా వ్యవస్థ రద్దు కాదు. కుటుంబము విడిపోతే వాటాలను పంచడం జరుగుతుంది.
  6. మైనరు అయినా ఉమ్మడి కుటుంబములో సహవారసుడు అవుతాడు.
  7. సభ్యులను సహవారసులు అంటారు.
  8. సహవారసులకు ప్రచ్ఛన్న అధికారము ఉండదు.
  9. సహవారసులు అంగీకరించినా బయటి వారిని సహవారసులుగా చేర్చుకొనడానికి వీలులేదు.

ప్రశ్న 7.
సహకార సంస్థలకు, భాగస్వామ్యానికి మధ్య గల వ్యత్యాసములేవి ?
జవాబు:
సహకార సంస్థలకు, భాగస్వామ్య సంస్థలకు గల తేడాలు:
సహకార సంస్థ

  1. స్థాషన: సహకార సంస్థల చట్టం 1912 క్రింద ఇవి స్థాపించబడతాయి..
  2. సభ్యత్వము: కనిష్ట సభ్యుల సంఖ్య 10, గరిష్ట సభ్యుల సంఖ్య అపరిమితము.
  3. ముఖ్య ఉద్దేశ్యము: సేవాశయము.
  4. ఋణ బాధ్యత: పరిమితము.
  5. నిర్వహణ: ప్రజాస్వామ్యబద్ధముగా సంస్థ నిర్వహించబడుతుంది.
  6. మినహాయింపులు, సౌకర్యములు ; ఆదాయపు పన్ను చెల్లింపులో, స్టాంపు రిజిస్ట్రేషన్ ఫీజులో మినహాయింపు ఉంటుంది.
  7. మిగులు లాభాల పంపిణీ: లాభాలలో కొంత శాతము మాత్రమే సభ్యులకు డివిడెండ్లుగా పంచుతారు.
  8. మూలధనము: మొత్తము వాటాలలో 10%నకు మించిన వాటాలను ఏ వ్యక్తి కొనరాదు.

భాగస్వామ్య సంస్థ

  1. భారత భాగస్వామ్య చట్టం 1932 క్రింద ఇవి ఏర్పడతాయి.
  2. కనిష్ట సభ్యుల సంఖ్య 2. గరిష్ట సభ్యుల సంఖ్య బ్యాంకింగ్ వ్యాపారము అయితే 10, ఇతర వ్యాపారాలలో 20.
  3. ముఖ్య ఉద్దేశ్యము లాభాశయము.
  4. ఋణబాధ్యత అపరిమితము, వ్యక్తిగతము, సమిష్టి
  5. భాగస్వామ్య ఒప్పందము సంస్థ నిర్వహణలో పాల్గొనవచ్చు.
  6. ఎలాంటి సౌకర్యాలు, మినహాయింపులు ఉండవు.
  7. మొత్తము లాభాలను ఒప్పందము ప్రకారం భాగస్తులకు పంపిణీ చేస్తారు.
  8. ఒప్పందము ప్రకారము మూలధనాన్ని తేవడం జరుగుతుంది.

AP Inter 1st Year Commerce Study Material Chapter 5 భాగస్వామ్య వ్యాపార సంస్థ

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
భాగస్వామ్యాన్ని నిర్వచించి, ముఖ్య లక్షణాలను తెలపండి.
జవాబు:
హాని ప్రకారము “లాభం ఆర్జించే నిమిత్తము చట్టబద్ధమైన వ్యాపారము చేయడానికి అంగీకరించిన అర్హులైన వ్యక్తుల మధ్య ఏర్పరచుకున్న సంబంధమే భాగస్వామ్యము”.

జాన్ శుఖిన్ ప్రకారం “ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు వ్యాపారాన్ని ఉమ్మడిగా, బాధ్యతాయుతముగా నిర్వహించడం కోసం వ్రాతపూర్వకముగాగాని, నోటిమాటల ద్వారాగాని కుదుర్చుకున్న ఒప్పందమే భాగస్వామ్యము”. 1932 భారత భాగస్వామ్య చట్టము ప్రకారము “అందరూగాని, అందరి తరపున కొందరుగాని వ్యాపారాన్ని నిర్వహిస్తూ అందులోని లాభాలను పంచుకోవడానికి వ్యక్తుల మధ్య ఉన్న సంబంధమే భాగస్వామ్యము”.

లక్షణాలు: భాగస్వామ్య సంస్థకు ఈక్రింది లక్షణాలు ఉంటాయి.
1. స్థాపన: లాభాన్ని ఆర్జించే ఉద్దేశ్యముతో చట్టబద్ధమైన వ్యాపారాన్ని నిర్వహిస్తూ, లాభనష్టాలను పంచుకోవడానికి వ్యక్తుల మధ్య సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి న్యాయాత్మక ఒప్పందము ద్వారా భాగస్వామ్య సంస్థలు అమలులోనికి వస్తాయి..

2. నమోదు ఐచ్ఛికము: భాగస్వామ్య సంస్థల నమోదు తప్పనిసరికాదు. నమోదు కాని సంస్థలు కొన్ని ఇబ్బందులను ఎదుర్కొనవలసి ఉంటుంది.

3. అపరిమిత ఋణబాధ్యత: భాగస్తుల ఋణబాధ్యత అపరిమితము, వ్యక్తిగతము, సమిష్టిగతము. ఋణదాతలు తమ బాకీలను అందరి నుంచి లేదా ఏ ఒక్కరి నుంచైనా వసూలు చేసుకోవచ్చు. వ్యాపార అప్పులకు వ్యాపార ఆస్తులు సరిపోకపోతే, సొంత ఆస్తులనుంచి అప్పులను తీర్చవలసి ఉంటుంది.

4. యజమాని ప్రతినిధి సంబంధము: భాగస్వామ్యములో భాగస్తులు యజమానిగాను, ప్రతినిధులగానూ వ్యవహరిస్తారు. ఏ భాగస్తుడు అయినా బయటవారితో లావాదేవీలు జరపవచ్చు. వారు చేసే పనులకు ఇతర భాగస్తులు కూడా బాధ్యత వహించవలెను.

5. చట్టబద్ధమైన వ్యాపారము: లాభాలను పంచుకోవడానికి అంగీకరించిన వ్యక్తులు చేసే వ్యాపారము చట్టసమ్మతమైనదిగా ఉండాలి.

ప్రశ్న 2.
భాగస్వామ్య నమోదు ప్రక్రియను వివరించండి.
జవాబు:
సమాధానానికి వ్యాసరూప సమాధాన ప్రశ్న నెంబరు 2 ను చూడండి.

ప్రశ్న 3.
భాగస్తుని హక్కులను సంక్షిప్తముగా వివరించండి.
జవాబు:
భాగసుని హక్కులు:

  1. ప్రతి భాగస్తునకు వ్యాపార నిర్వహణలో పాల్గొనే హక్కు ఉంటుంది.
  2. వ్యాపారములో వచ్చే లాభనష్టాలు, ఒప్పందములో లేకపోతే, సమానముగా పంచుకోవడానికి హక్కు ఉన్నది.
  3. వ్యాపార నిర్ణయాలు చేయడంలో ప్రతి భాగస్వామికి తన అభిప్రాయాలను యథేచ్ఛగా వెలుబుచ్చు హక్కు కలదు.
  4. ప్రతి భాగస్తుడు సంస్థ లెక్కలను తనిఖీ చేసే హక్కు ఉన్నది. అవసరమైన నకళ్ళు తీసుకునే హక్కు కూడా ఉన్నది.
  5. భాగస్వామ్య సంస్థకు ఏ భాగస్తుడైనా అప్పు ఇచ్చినట్లయితే దానిపై వడ్డీని పొందే హక్కు ఉంటుంది.
  6. సాధారణ వ్యాపార నిర్వహణలో ప్రతి భాగస్తుడు తాను చేసిన ఖర్చులను లేదా తనకు సంభవించిన నష్టాలను సంస్థ నుంచి రాబట్టుకోవడానికి హక్కు కలిగి ఉంటాడు.
  7. భాగస్తులకు సంస్థ యొక్క ఆస్తులపై సమిష్టి హక్కు ఉన్నది.
  8. సంస్థ కొరకు ప్రతి భాగస్తుడు సంస్థ ప్రతినిధిగా పనిచేసి తన చర్యలచే సంస్థకు బాధ్యత వహింపజేయు హక్కు ఉన్నది.

AP Inter 1st Year Commerce Study Material Chapter 5 భాగస్వామ్య వ్యాపార సంస్థ

ప్రశ్న 4.
భాగస్తుని విధులను సంక్షిప్తముగా వివరించండి.
జవాబు:
భాగస్తుని విధులు:

  1. ప్రతి భాగస్తుడు తన విధులను నీతిగాను, నిజాయితీగాను నిర్వహించవలెను.
  2. ఇతర భాగస్తులతో అత్యంత విశ్వాసముగా వ్యవహరించాలి.
  3. సక్రియ భాగస్తుడు వ్యాపారము తాలూకు లెక్కలను నిజాయితీగా వ్రాయవలెను.
  4. వ్యాపార నిర్వహణలో వచ్చిన లాభనష్టాలను భాగస్వామ్య ఒప్పందములో పేర్కొనబడిన నిష్పత్తిలో పంచుకోవాలి.
  5. ఒక భాగస్వామి యొక్క అశ్రద్ధ వలన సంభవించిన నష్టమును ఆ భాగస్వామియే పూర్తిగా భరించవలెను.
  6. భాగస్తుడు తన సంస్థకు పోటీ వ్యాపారము చేయరాదు.
  7. ఏ భాగస్వామి వ్యాపార ఆస్తులను, పేరును ఉపయోగించి రహస్య లాభాలు లేదా కమీషన్ పొందరాదు.
  8. భాగస్తుల లిఖిత పూర్వకమైన అంగీకారము లేకుండా కొత్త వారిని భాగస్తునిగా చేర్చుకోరాదు.
  9. సహభాగస్తుల అంగీకారము లేకుండా తన వాటాను బయటవారికి బదిలీ చేయరాదు..
  10. ప్రతి భాగస్తుడు తన అధికార పరిధిలోనే నడుచుకోవాలి.

ప్రశ్న 5.
భాగస్వామ్య సంస్థ రద్దు రకాలను వివరించండి.
జవాబు:
భాగస్వామ్యము రద్దు, భాగస్వామ్య సంస్థ రద్దుకు తేడా ఉన్నది. భాగస్తుని మరణము, విరమణ, మతిభ్రమించడం, దివాలా తీయడం వలన భాగస్వామ్యము రద్దు అవుతుంది. కాని భాగస్వామ్య సంస్థ రద్దుకానవసరము లేదు. సంస్థను |పునర్వవస్థీకరణచెంది అదే పేరు మీద వ్యాపారాన్ని కొనసాగించవచ్చును. కాబట్టి భాగస్వామ్య రద్దులో సంస్థ రద్దు కావచ్చును లేదా కాకపోవచ్చును. కాని భాగస్వామ్య సంస్థ రద్దయితే వ్యాపారమును కొనసాగించే ప్రశ్న ఉండదు. సంస్థ ఆస్తులను అమ్మి, ఋణదాతలకు చెల్లించగా ఏమైనా మిగిలితే మిగిలిన భాగస్తులు పంచుకుంటారు.

భాగస్వామ్య సంస్థ రద్దు దిగువ పద్ధతుల ద్వారా జరుగుతుంది.

  1. ఒప్పందము ద్వారా రద్దు: భాగస్వామ్య సంస్థను భాగస్తుల పరస్పర అంగీకారముతో లేదా ఒప్పందములో పేర్కొన్న షరతుల ప్రకారము రద్దు చేయవచ్చును.
  2. నోటీసు ద్వారా రద్దు: ఏ భాగస్తుడైనా సంస్థను రద్దు చేయాలని ‘వ్రాతపూర్వకముగా ఇతర భాగస్తులకు నోటీసు పంపడం ద్వారా కూడా రద్దు పరచవచ్చును.
  3. ఆగంతుక రద్దు: -ఒక భాగస్తుడు మరణించినా, మతిభ్రమించినా లేదా దివాలా తీసిన ఆ సంస్థను రద్దు చేయవచ్చును.
  4. తప్పనిసరిగా రద్దు: ఒక భాగస్తుడు లేదా భాగస్తులందరూ దివాలాదారుగా ప్రకటించబడినపుడు లేదా సంస్థ వ్యాపారము చట్ట వ్యతిరేకము అయినపుడు సంస్థ రద్దవుతుంది.
  5. కోర్టు ద్వారా రద్దు: సంస్థలో ఏ భాగస్తుడైనా శాశ్వతముగా అశక్తుడు అయినా, అనుచితముగా ప్రవర్తించినా, ఉద్దేశ్యపూర్వకముగా ఒప్పందాన్ని అతిక్రమించినా, ఇతరుల అంగీకారము లేకుండా తన వాటాను బయటవారికి బదిలీ చేసినా కోర్టు సంస్థను రద్దు చేయవచ్చును.

AP Inter 1st Year Commerce Study Material Chapter 5 భాగస్వామ్య వ్యాపార సంస్థ

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
భాగస్వామ్య సంస్థ
జవాబు:
కింబల్ నిర్వచనము ప్రకారము “ఒక వ్యాపారము నడపడానికి కొంతమంది వ్యక్తులు కలసి మూలధనాన్ని లేదా సేవలను సేకరించుకునే సంస్థను భాగస్వామ్య సంస్థ అనవచ్చు”. “లాభం ఆర్జించే నిమిత్తము చట్టబద్ధమైన వ్యాపారము చేయడానికి అంగీకరించిన అర్హులైన వ్యక్తుల మధ్య ఏర్పరచుకున్న సంబంధమే భాగస్వామ్యము” అని హాని నిర్వచించినాడు. 1932 భారత భాగస్వామ్య చట్టము భాగస్వామ్యాన్ని ఈ విధముగా నిర్వచించినది “అందరూగాని అందరి తరపున కొందరు గాని వ్యాపారము చేస్తూ లాభాన్ని పంచుకోవడానికి అంగీకరించిన వ్యక్తుల మధ్య ఉన్న సంబంధమే భాగస్వామ్యము”.

ప్రశ్న 2.
భాగస్వామ్య ఒప్పందము
జవాబు:
హారానికి దారము ఎంత ముఖ్యమో భాగస్వామ్యానికి ఒప్పందము అంత ముఖ్యమైనది. వ్యాపారము నిర్వహించడానికి, లాభాలు పంచుకోవడానికి, పెట్టుబడికి, సొంతవాడకాలకు సంబంధించి భాగస్తుల మధ్య ఒక ఒడంబడిక కుదురుతుంది. దీనిని భాగస్వామ్య ఒప్పందము అంటారు. ఇది నోటిమాటల ద్వారాగాని, వ్రాతపూర్వకముగాగాని ఉండవచ్చు. అది వ్రాతపూర్వకముగా ఉంటేనే శ్రేయస్కరము. భాగస్వామ్య ఒప్పందము వ్రాతపూర్వకముగా ఉంటే దానిని రిజిష్ట్రారు వద్ద నమోదు చేసుకుంటారు.

ప్రశ్న 3.
సక్రియ భాగస్తుడు. [TS. Mar. ’15]
జవాబు:
భాగస్వామ్య వ్యాపార నిర్వహణలో చురుకుగా పాల్గొని ప్రధాన పాత్రను నిర్వహించే భాగస్తుని ‘సక్రియ భాగస్తుడు’ లేదా ‘నిర్వాహక భాగస్తుడు’ అంటారు. ఇటువంటి భాగస్తుడు అవసరమైన మూలధనాన్ని సమకూర్చడమే కాక, సంస్థ యొక్క వ్యవహారాలలో ఆసక్తిని చూపించి, సంస్థను నిర్వహించడములో ముఖ్యమైన పాత్రను వహిస్తాడు.

ప్రశ్న 4.
నిష్క్రియ భాగస్తుడు
జవాబు:
భాగస్వామ్య సంస్థకు మూలధనాన్ని సమాకూర్చి నిర్వహణలో పాల్గొనని భాగస్తుని నిష్క్రియ భాగస్తుడు అంటారు. ఇతడు నిర్వహణలో పాల్గొనకపోయినా లాభనష్టాలను పంచుకుంటాడు.

AP Inter 1st Year Commerce Study Material Chapter 5 భాగస్వామ్య వ్యాపార సంస్థ

ప్రశ్న 5.
భావిత భాగస్తుడు
జవాబు:
ఒక వ్యక్తి తన మాటలద్వారాగాని, చేష్టలద్వారాగాని, ఎదుటి వ్యక్తికి తాను ఫలానా సంస్థలో భాగస్తుడు అని నమ్మించిన భాగస్తుని భావిత భాగస్తుడు అని అంటారు. అలా నమ్మకం కలిగించటము వలన ఎదుటి వ్యక్తి ఋణం ఇచ్చినా, సరుకులు అమ్మినా లేదా మరొక విధముగా నష్టపోతే భావిత భాగస్తుడే అందుకు బాధ్యత వహించాలి.

ప్రశ్న 6.
మౌన నిర్ణీత భాగస్తుడు
జవాబు:
ఒక భాగస్తుడు లేదా భాగస్వామ్య సంస్థ ఒక వ్యక్తిని భాగస్తునిగా ప్రకటించినపుడు, భాగస్తుడు కాకపోతే ఆ ప్రకటనను ఖండించవలెను. అలా ఖండించకుండా మౌనముగా, ఉంటే అతనిని మౌన నిర్ణీత భాగస్తుడు అంటారు. ఇతనికి సంస్థ లాభాలలో వాటా ఉండదు. కాని, సంస్థ చేసే అప్పులకు మాత్రము పూర్తి బాధ్యతను వహించాలి.

AP Inter 1st Year Commerce Study Material Chapter 4 ఉమ్మడి హిందూ కుటుంబ వ్యాపార వ్యవస్థ, సహకార సంఘం

Andhra Pradesh BIEAP AP Inter 1st Year Commerce Study Material 4th Lesson ఉమ్మడి హిందూ కుటుంబ వ్యాపార వ్యవస్థ, సహకార సంఘం Textbook Questions and Answers.

AP Inter 1st Year Commerce Study Material 4th Lesson ఉమ్మడి హిందూ కుటుంబ వ్యాపార వ్యవస్థ, సహకార సంఘం

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ఉమ్మడి హిందూ కుటుంబ వ్యాపారం అంటే ఏమిటి ? దాని ముఖ్య లక్షణాలను చర్చించండి. [A.P & T.S. Mar. ’15]
జవాబు:
అవిభక్త హిందూ కుటుంబ వ్యాపార సంస్థలు హిందూ న్యాయశాస్త్రము ప్రకారము అమలులోనికి వచ్చినవి. హిందూ శాస్త్రములో రెండు వాదాలు ఉన్నవి. 1) మితాక్షరవాదము, 2) దయాభాగవాదము. మితాక్షరవాదము, పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాలకు మినహాయించి మిగతా భారతదేశానికి వర్తిస్తుంది. దయాభాగవాదం పై రెండు రాష్ట్రాలకు వర్తిస్తుంది.
అవిభక్త హిందూ కుటుంబము ఏవిధమైన ఒప్పందము వలన ఏర్పడదు. హిందూ న్యాయశాస్త్రములోని మితాక్షరవాదం వలన ఏర్పడినది. అవిభక్త హిందూ కుటుంబము సభ్యులలో కుటుంబ యజమాని, కొడుకులు కాక వారి భార్యలు, అవివాహిత కుమార్తెలు కూడా ఉంటారు. ‘అంటే ఎటువంటి ఒప్పందము వలన కాక కుటుంబములో జన్మించడంవలన, కుటుంబ వ్యాపారములో హక్కును పొందుతారు. వీరిని దాయాదులు అంటారు.

అవిభక్త హిందూ కుటుంబ వ్యాపారమును కుటుంబ యజమాని నిర్వహించును. అతను సామాన్యముగా కుటుంబ సభ్యులలో పెద్దవాడై ఉంటాడు. అతనిని ‘కర్త’ లేదా ‘మేనేజర్’ అంటారు. కుటుంబ వ్యాపారము మీద అతనికి సంపూర్ణ అధికారము, నియంత్రణ ఉంటుంది. వ్యవహారములన్నీ అతడే నిర్వహించును. సమిష్టి ఆస్తికి, దాయాదుల సంక్షేమానికి కుటుంబ కర్తయే పరిరక్షకుడు. కర్త ఋణబాధ్యత అపరిమితము కాని దాయాదుల ఋణబాధ్యత సమిష్టి ఆస్తిలోని వారి వాటాకే పరిమితమై ఉంటుంది. కర్త చర్యలను కుటుంబ సభ్యులు ప్రశ్నించడానికి వీలు లేదు. ఒకవేళ కుటుంబ వ్యాపారములో కొనసాగటము ఇష్టము లేకపోతే కుటుంబము ఆస్తి పంపకమును కోరవలెను.

ముఖ్య లక్షణాలు:
1. స్థాపన: హిందూ అవిభక్త కుటుంబ వ్యాపారానికి కనీసము ఇద్దరు సభ్యులు ఉండి పూర్వీకుల ఆస్తులుండాలి. ఇది ఒప్పందము మీద కాక హిందూ న్యాయశాస్త్రము ప్రకారము ఏర్పడుతుంది.

2. సభ్యత్వము: సమిష్టి హిందూ కుటుంబ వ్యాపారములో సభ్యత్వం కేవలము ఆ కుటుంబములో జన్మించడమువలన మాత్రమే కలుగుతుంది. బయట వ్యక్తులు ఒప్పందము వలన ఇందులో ప్రవేశించలేరు.

3. లాభనష్టాల పంపిణీ: వ్యాపార లాభాలలో దాయాదులందరికి సమాన వాటా ఉంటుంది.

AP Inter 1st Year Commerce Study Material Chapter 4 ఉమ్మడి హిందూ కుటుంబ వ్యాపార వ్యవస్థ, సహకార సంఘం

4. నిర్వహణ: ఈ వ్యాపారాన్ని కుటుంబ సభ్యులలో పెద్దవాడు మాత్రమే నిర్వహిస్తాడు. అతనిని కర్త అంటారు. మిగిలిన సభ్యులకు సంస్థ నిర్వహణలో పాల్గొనే హక్కు ఉండదు. కర్త తన ఇష్టానుసారము వ్యాపారాన్ని నిర్వహించడానికి అధికారము ఉన్నది. అతడి అధికారాన్ని ప్రశ్నించే హక్కు ఎవరికి లేదు. ఒకవేళ కుటుంబ వ్యాపారములో కొనసాగడం ఇష్టము లేకపోతే అందరి ఒప్పందముతో హిందూ అవిభక్త కుటుంబ వ్యాపారాన్ని రద్దుచేయవచ్చు.

5. ఋణబాధ్యత: దాయాదుల ఋణబాధ్యత సమిష్టి ఆస్తిలోని వారి వాటాలకు మాత్రమే పరిమితము. కాని కర్త యొక్క ఋణబాధ్యత అపరిమితము. వ్యాపార ఋణాలకు అతని సొంత ఆస్తులను కూడా ఉపయోగించవలెను.

6. మనుగడ: కుటుంబ సభ్యులలో ఎవరు మరణించినా వ్యాపార మనుగడకు అంతరాయము కలగదు. కర్త మరణించినపుడు, దాయాదులలో పెద్దవాడు కర్త స్థానాన్ని తీసుకుంటాడు. హిందూ అవిభక్త కుటుంబ వ్యాపారము అందరి సభ్యుల అంగీకారముతో రద్దుకావచ్చు లేదా కోర్టు చేసిన పంపకాలతో రద్దు అవుతుంది.

ప్రశ్న 2.
సహకార సంఘాలను నిర్వచించి, దాని ముఖ్య లక్షణాలను వివరించండి.
జవాబు:
ప్రజాస్వామ్య పద్ధతిలో లాభాపేక్షలేని పరస్పర సహాయము, సేవాశయాల కొరకు పరిమిత వనరులు గల వ్యక్తులు వ్యాపారము మరియు ఆర్థిక ప్రయోజనాలు పెంపొందించుటకే సమానత్వ ప్రాతిపదికపైన ఏర్పడిన స్వచ్ఛంద సంఘము సహకార సంఘము. సమిష్టి కృషికి, సాంఘిక శ్రేయస్సు దృష్టికి, సమాజ సేవకు పాటుపడుటయే ఈ సంస్థ లక్ష్యము. దీని ప్రధాన ధ్యేయము లాభార్జన కాదు. సభ్యులకు సేవ చేయుటయే. ఒకరికోసము అందరూ, అందరి కోసము ఒక్కరు అనేది ఆశయము. పరస్పర సహాయము ద్వారా స్వయం సహాయము దీని మార్గదర్శకమైన సూత్రము.

1912 సహకార సంఘాల చట్టము ప్రకారము ‘సహకార సూత్రాలకు అనుగుణముగా సభ్యుల ఆర్థిక ప్రయోజనాలను పరిరక్షించే ధ్యేయముతో స్థాపించబడిన సంస్థను సహకార సంస్థ’ అంటారు.

లక్షణాలు:
1. స్వచ్ఛంద సంఘము: ఒక ప్రాంతానికి లేదా ఒక వర్గానికి చెందిన ప్రజలు తమంతట తాముగా స్వప్రయోజనాల కోసము ఏర్పాటు చేసుకున్న సంఘమే సహకార సంస్థ. ఈ సంస్థలో చేరడానికిగాని, వదిలివెళ్ళడానికి సభ్యులకు పూర్తి స్వేచ్ఛ ఉంటుంది.

2. బహిరంగ సభ్యత్వము: సహకార సంఘములో చేరడానికి కులము, మతము, జాతి, రాజకీయ సిద్ధాంతాలు, విశ్వాసాలు మొదలైన వాటితో సంబంధము లేదు. సభ్యత్వము అందరికీ లభిస్తుంది.

3. సభ్యుల సంఖ్య: సహకార సంస్థలను స్థాపించడానికి 10 మంది సభ్యులు కావలెను. రాష్ట్ర సహకార సంఘాలలో వ్యక్తులు 50 మంది కావలెను. గరిష్ట సభ్యులకు పరిమితి లేదు..

4. ప్రభుత్వ నియంత్రణ: సహకార సంఘాల నమోదు తప్పనిసరి. వాటిపై ప్రభుత్వ అజమాయిషీ, నియంత్రణ ఉంటాయి. ఇవి ప్రభుత్వ నిబంధనలను పాటించాలి. ప్రతి సంవత్సరము వార్షిక నివేదికలను, లెక్కలను తయారుచేసి ప్రభుత్వానికి సమర్పించవలెను. సహకార శాఖ ఆడిటర్ వీటిని తనిఖీ చేస్తాడు.

5. మూలధనము: సంఘాల మూలధనమును సభ్యులే సమకూరుస్తారు. మూలధనము పరిమితముగా ఉండటమువలన ప్రభుత్వము నుంచి ఋణాలు, రాష్ట్ర, కేంద్ర సహకార సంస్థల నుంచి గ్రాంటు, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నుంచి సహయాన్ని పొందుతాయి.

AP Inter 1st Year Commerce Study Material Chapter 4 ఉమ్మడి హిందూ కుటుంబ వ్యాపార వ్యవస్థ, సహకార సంఘం

6. ప్రజాస్వామ్యబద్ధమైన నిర్వహణ: ఈ సంస్థ నిర్వహణ ప్రజాస్వామిక సూత్రాలమీద జరుగుతుంది. ప్రతి సభ్యునికి సంఘ నిర్వహణలో పాల్గొనే అవకాశము ఉంటుంది. సంఘములోని సభ్యులందరికి ఓటు హక్కు సమానము. ఒక మనిషికి ఒక ఓటు ఉంటుంది.

7. సేవాశయము: సహకార సంస్థల ప్రధాన ధ్యేయము సభ్యులకు సేవచేయుటయే. లాభార్జన కాదు.

8. పెట్టుబడిపై రాబడి సభ్యులకు తమ పెట్టుబడులపై డివిడెండు లభిస్తుంది.

9. మిగులు పంపిణీ: సహకార సంస్థలు వ్యాపారము చేయగా వచ్చిన మిగులు నుంచి కొంత మొత్తాన్ని విరాళాలకు (విద్య, వైద్యం మొదలైనవి) మరికొంత మొత్తాన్ని రిజర్వు నిధులకు కేటాయించి, మిగిలిన దానిని సభ్యులకు పరిమితమైన లాభాంశాలుగా పంచుతారు.

10. సహకార సంస్థల నమోదు: సహకార సంస్థను సహకార సంఘాల చట్టము 1912 క్రింద నమోదు చేయించవలెను. అప్పుడు దానికి కంపెనీ హోదా వస్తుంది. దాని వలన సంస్థకు న్యాయాత్మకమైన వ్యక్తిత్వము, నిర్దిష్టమైన న్యాయసత్వము కలుగుతుంది.

ప్రశ్న 3.
‘స్వయం-సహాయం అనే ప్రాతిపదికపై ఏర్పడిన వ్యవస్థ సహకార సంఘం’ చర్చించండి.
జవాబు:
సమాజములోని బలహీనవర్గాల ఆసక్తులను రక్షించుటకై సహకార ఉద్యమము ఏర్పడినది. సొంత వ్యాపారము, భాగస్వామ్య వ్యాపారము, కంపెనీ వ్యాపారము చేసే సంస్థల ధ్యేయము లాభ సముపార్జనే లాభాన్ని సంపాదించడానికి ఈ సంస్థలు వినియోగదారులకు అందించే సేవలు చాలా పరిమితముగా ఉంటాయి. లాభార్జన దృష్టితో అవి ధరలను పెంచడము, కల్తీ సామానులు అమ్మడం మొదలైన హీనమైన చర్యలకు పాల్పడతాయి. సాంఘిక ప్రయోజనము బాధ్యతల కంటే తమ స్వప్రయోజనము, స్వలాభము సూత్రాలుగా ఉండేవి. పెట్టుబడిదారులు, శ్రామికులు, ‘వినియోగదారులు దోపిడీచేస్తున్నారు. వస్తు పంపిణీలో మధ్యవర్తుల వలన ఉత్పత్తిదారులకు వినియోగదారులకు మధ్య అగాధము ఏర్పడినది. లోపభూయిష్టమైన పెట్టుబడిదారీ విధానాన్ని సంస్కరించి సామ్యవాది రీతి సమాజ స్థాపనకై సహకార సంఘాలను ఏర్పాటుచేయడం జరిగినది.
ప్రజాస్వామ్య పద్ధతిలో లాభాపేక్షరహితమైన పరస్పర సహాయము, సేవాశయము కొరకు పరిమిత నిధులు గల వ్యక్తులు వ్యాపారము మరియు ఆర్థిక ప్రయోజనాలు పెంపొందించటానికి సర్వమానవ సమానత్వ ప్రాతిపదికమీద ఏర్పరచిన స్వచ్ఛంద సంఘము సహకార సంస్థలు. సమిష్టి కృషికి, సాంఘిక శ్రేయస్సు, సమాజ సేవకు పాటుబడుటయే ఈ సంస్థల లక్ష్యము. దీని ప్రధాన ఆశయము లాభార్జనకాదు. సభ్యులకు సేవ చేయుటయే. ఒకరికోసం అందరూ, అందరికోసం ఒక్కరు అనేది దీని ఆశయం. పరస్పర సహాయము ద్వారా స్వయం సహాయం దీని మార్గదర్శక సూత్రము.

మన దేశములో సహకార సంస్థలను లాభాల కొరకు ఆకలిగొన్న వ్యాపారస్తుల కబంధ హస్తాల నుంచి బలహీనవర్గాలవారి ఆసక్తులను రక్షించుటకు సహకార సంస్థలు ఏర్పడినవి.

ప్రశ్న 4.
ఉమ్మడి హిందూ కుటుంబ వ్యాపార సంస్థ ప్రయోజనాలను, లోపాలను చర్చించండి.
జవాబు:
ఉమ్మడి హిందూ కుటుంబ వ్యాపార సంస్థ యొక్క ప్రయోజనాలు:
1. నిరంతరము కొనసాగుతుంది: ఈ తరహా వ్యాపార సంస్థ కుటుంబ సభ్యుల మధ్య ఒప్పందము వలన ఏర్పడదు. ఉమ్మడి కుటుంబములో తండ్రి, తన తండ్రి నుంచి సంపాదించిన ఆస్తిని తన కుమారునకు, తిరిగి తన కుమారుడు ఆ తర్వాత అతని కుమారుని పుట్టుక ద్వారా ఆస్తిని పొందుతాడు. దాయాదులు, కర్త మరణంతో సంస్థ మూతపడదు. అది నిరంతరము కొనసాగుతుంది.

AP Inter 1st Year Commerce Study Material Chapter 4 ఉమ్మడి హిందూ కుటుంబ వ్యాపార వ్యవస్థ, సహకార సంఘం

2. కేంద్రీకృత నిర్వహణ: వ్యాపారసంస్థ నిర్వహణ కర్త చేతిలో కేంద్రీకృతమై ఉంటుంది. కర్త కుటుంబ సభ్యులలో పెద్దవాడు, అనుభవజ్ఞుడు అయి ఉండటమువలన, అతడు సంస్థకు క్రమశిక్షణతో కూడిన నిర్వహణ ఇవ్వగలడు.

3. గరిష్ట సభ్యుల సంఖ్యపై పరిమితి లేదు: భాగస్వామ్యము వలె ఈ తరహా కుటుంబ వ్యాపార సంస్థలో గరిష్ట సభ్యులకు పరిమితిలేదు.

4. పరపతీ సౌకర్యాలు: ఈ సంస్థలో పరపతి సౌకర్యాలు ఎక్కువ. దీనికి కారణం కర్త యొక్క ఋణబాధ్యత అపరిమితము.

5. వ్యాపార రహస్యాలు: సంస్థ యావత్తు నిర్వహణ కర్త చేతులలో ఉంటుంది. కాబట్టి అతడు వ్యాపార రహస్యాలు గోప్యముగా ఉంచగలడు. రహస్యాలు బయటకు పొక్కవు.

6. శీఘ్ర నిర్ణయాలు: సమిష్టి హిందూ కుటుంబములో కర్తకు మాత్రమే నిర్ణయాలు చేసే అధికారము ఉంటుంది. అందువలన ‘శీఘ్రముగా నిర్ణయాలు తీసుకొనగలడు. ఇతర కుటుంబ సభ్యులతో సంప్రదించవలసిన పనిలేదు.

7. సమర్థతను బట్టి పని అప్పగించుట: కుటుంబ సభ్యులకు వారి సామర్ధ్యాన్ని బట్టి పనులు అప్పగించబడతాయి. కర్త సొమ్ము వినియోగములో జాగ్రత్త, పొదుపరితనం పాటిస్తాడు.

ఉమ్మడి హిందూ కుటుంబ వ్యాపార సంస్థ యొక్క లోపాలు:
1. శ్రమకు, ప్రతిఫలానికి సహసంబంధము ఉండదు: వ్యాపారాన్ని కర్త ఒక్కడే నిర్వహిస్తాడు. కాని లాభాలు వచ్చినపుడు సభ్యులందరూ సమానముగా పంచుకుంటారు. దాయాదుల సోమరితనాన్ని ఇది ప్రోత్సహిస్తుంది.

2. పరిమిత నిర్వహణా సామర్థ్యము: ఈ వ్యాపారాన్ని కుటుంబ సభ్యులలో పెద్దవాడు కర్త మాత్రమే నిర్వహిస్తాడు. నిర్వహణ విధులన్నీ అతనే చూసుకుంటాడు. వ్యాపార నైపుణ్యానికి సంబంధించిన పూర్తి పరిజ్ఞానము అతనికి ఉండకపోవచ్చు.

3. పరిమిత మూలధనము: ఇందులోని పెట్టుబడి ఒక కుటుంబ ఆర్థిక వనరులకు మాత్రమే పరిమితమై ఉంటుంది. వ్యాపార విస్తృతికి సంబంధించిన నిధులు లభించకపోవచ్చు.

4. కష్టం ఒకరిది, సుఖం ఇంకొకరిది: ఉమ్మడి కుటుంబ వ్యాపారములో కర్తకు పూర్తి స్వేచ్ఛ ఉన్నది. వ్యాపారము కోసం అతడు కష్టించి కృషి చేస్తాడు. దాయాదులు
కష్టపడకుండా అనుభవిస్తారు.

5. ` నిర్వహణను కర్తకు వదిలివేయడము: వ్యాపార నిర్వహణను పూర్తిగా కర్తకే వదిలివేయడం జరుగుతుంది. కొన్ని సమయాలలో అతడు తప్పుడు నిర్ణయాలు తీసుకోవచ్చు. తత్ఫలితముగా వ్యాపారము దెబ్బతినవచ్చు. కర్త చేసిన తప్పిదాలకు దాయాదులు కూడా బాధ్యతను వహించవలసి ఉంటుంది.

6. అనుమానము: కర్త ఈ వ్యాపారాన్ని అత్యంత గోప్యముగా నిర్వహిస్తాడు. ముఖ్యమైన విషయాలను దాయాదుల నుంచి రహస్యముగా ఉంచుతాడు. దీని వలన కుటుంబ సభ్యులకు అతని మీద అనుమానం వచ్చే అవకాశము ఉన్నది..

ప్రశ్న 5.
సహకార సంఘాల ప్రయోజనాలను, లోపాలను వివరించండి.
జవాబు:
సహకార సంఘాల వలన ప్రయోజనాలు:
1. స్థాపనా సౌలభ్యము: సహకార సంస్థలను స్థాపించుట సులభము. పదిమంది కలసి తమ ఆర్థిక ప్రయోజనాల కోసము ఒక సంస్థగా ఏర్పడవచ్చు. నమోదుచేయుటకు అవలంబించవలసిన చట్టబద్ధమైన లాంఛనాలు చాలా తక్కువ.

2. ప్రజాస్వామ్య పరిపాలన: సంస్థల నిర్వహణ ప్రజాస్వామిక సూత్రాలపై ఆధారపడి ఉంటుంది. వ్యాపార నిర్వహణలో పాల్గొనే హక్కు ప్రతి సభ్యునకు ఉంటుంది. ఒక మనిషికి ఒకే ఓటు. అతనికి ఎన్ని వాటాలు అయినా ఉండవచ్చు.

3. నిర్వహణ ఖర్చులు తక్కువ: సహకార సంస్థలలో పరిపాలన ఖర్చులు తక్కువ. పాలక మండలి సభ్యులు వేతనము తీసుకోకుండా నిర్వహణ పనులు చేపడతారు.

4. సేవాశయము: సహకార సంస్థల ముఖ్య ఉద్దేశము సేవలను అందించుట. సభ్యులకు చౌక ధరలకు వస్తువులను అందజేస్తుంది. తక్కువ వడ్డీలకు ఋణాలను అందిస్తుంది. సభ్యుల మధ్య సహకార భావనను కలుగజేస్తుంది.

5. పరిమిత ఋణబాధ్యత: సభ్యుల ఋణబాధ్యత వారు చెల్లించిన వాటా మూలధనానికే పరిమితమై ఉంటుంది.

6. స్థిరత్వము: సభ్యుల మరణము, విరమణ లేదా దివాలా తీయడంవలన సంస్థ మనుగడకు భంగముకలగదు.

7. పన్ను రాయితీలు: సహకార సంఘాల ఆదాయముపై కొంత పరిమితి మేరకు పన్ను మినహాయింపు ఉంటుంది. అంతేగాక నమోదు రుసుములోను, స్టాంపు డ్యూటీలోను మినహాయింపు ఉంటుంది.

AP Inter 1st Year Commerce Study Material Chapter 4 ఉమ్మడి హిందూ కుటుంబ వ్యాపార వ్యవస్థ, సహకార సంఘం

8. ప్రభుత్వ ఆదరణ: ప్రభుత్వము సహకార సంఘాలకు అప్పులు, గ్రాంట్ల రూపములో ఆర్థిక సహాయం అందిస్తుంది. సమాజములో ఆర్థికముగా, సాంఘికముగా వెనుకబడిన వర్గాలకు సహాయపడే ధ్యేయముతో ఈ సంఘాలకు ఉదారముగా ధన సహాయం అందిస్తుంది.

9. వాటాలలో స్పెక్యులేషన్ ఉండదు: ఈ సంఘాలలో సభ్యుడు ఎప్పుడైనా వాటాలను కొనవచ్చు కాబట్టి వాటాలలో స్పెక్యులేషన్ ఉండదు.

10. సాంఘిక ప్రయోజనాలు: ఈ సంస్థలు ప్రజాస్వామ్యములో విద్య, శిక్షణ, స్వయం పరిపాలన, స్వయం సహాయం, పరస్పర సహాయము మొదలైన సూత్రాలను ప్రతిపాదిస్తుంది.

11. వ్యాపారాలపై నియంత్రణ: ఇతర వ్యాపారసంస్థలు అధిక ధరలతో వినియోగదారులను దోచుకుంటున్నప్పుడు, ఇవి తక్కువ ధరలకు వస్తువులను అందజేస్తుంది.

12. మధ్యవర్తులు ఉండరు: సహకార సంస్థలు వస్తువులను నేరుగా ఉత్పత్తిదారుల నుంచి కొనుగోలుచేసి వాటిని వినియోగదారులకు అందజేస్తాయి. మధ్యవర్తుల బెడద ఉండదు.

13. సభ్యుల మధ్య సుహృద్భావము: ఒకరి కోసము అందరూ, అందరికోసం ఒకరు అనే సూత్రముపై సహకార సంఘాలు పని చేస్తాయి. కాబట్టి సభ్యుల మధ్య సోదరభావం, సంఘీభావము పెంపొందిస్తాయి.

సహకార సంఘాల వలన లోపాలు:
1. అసమర్థ నిర్వహణ: పాలకవర్గ సభ్యులకు గౌరవ వేతనము మాత్రమే లభిస్తుంది. కాబట్టి వారు నిర్వహణలో పూర్తి ఆసక్తిని చూపరు. ఆదాయ వనరులు స్వల్పముగా ఉంటాయి. కాబట్టి సమర్థవంతులైన, వృత్తి నిపుణులైన నిర్వాహకులను నియమించుట కష్టము.

2. పరిమిత ఆర్థిక వనరులు: డివిడెండ్ల పరిమితి మరియు ఒక వ్యక్తికి ఒక ఓటు అనే సూత్రము వలన ధనవంతులు ఈ సంఘాలలో చేరడానికి ఇష్టపడరు. పరిమితమైన వనరుల వలన విస్తృతికి అవకాశముండదు.

3. సభ్యులమధ్య సంఘీభావము లోపించుట: సభ్యుల మధ్య మనస్పర్థలు, తగాదాల వలన సహకార సంస్థలు విఫలమవుతాయి..

4. కష్టపడేవారికి ప్రోత్సాహము ఉండదు: సంఘాలకు ఎక్కువ లాభాలు వచ్చినా వారి సేవలకు చెల్లింపు జరగదు కాబట్టి మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు నిర్వహణలో ఎక్కువ ఆసక్తిని చూపరు.

5. వాటాల బదిలీ ఉండదు: ఏ సభ్యుడు తన వాటాలను బదిలీచేయడానికి, వీలులేదు కాని మూలధనాన్ని వాపసు తీసుకోవచ్చు.

6. కఠినమైన ప్రభుత్వ నియంత్రణ: సహకార సంఘములు చట్టములోని నియమ నిబంధనలను మరియు ప్రభుత్వ నిబంధనలు పాటించవలెను.

7. అన్ని సంస్థలకు వర్తించకపోవడం: ఇవి చిన్న, మధ్యతరహా వ్యాపారాలకే అనువుగా ఉంటుంది.

8.. రహస్యాలు దాగవు: సంస్థ వ్యవహారాలు సభ్యులందరికి తెలుస్తాయి కాబట్టి వ్యాపార రహస్యాలు దాగవు.

9. నిస్వార్థ సేవకులు దొరుకుట కష్టము: సంస్థ విజయానికి నిస్వార్థ సేవకులు, నాయకుల ఆవశ్యకత ఉన్నది. కాని అటువంటివారు లభించుట అరుదు.

10. రాజకీయాల జోక్యము: మేనేజ్మెంట్ కమిటీలో ప్రభుత్వము సభ్యులను నామినేట్ చేస్తుంది. ప్రతి ప్రభుత్వము -తమ సొంతపార్టీ సభ్యులను ఈ సంఘాలకు పంపుతుంది.

11. పోటీతత్వము లేకపోవుట: సహకార సంస్థలకు పరిమిత వనరులు ఉండటము వలన పెద్ద సంస్థల పోటీని తట్టుకోలేవు. అవి భారీ ఉత్పత్తి ద్వారా ఓవర్హెడ్ ఖర్చులను తగ్గించుకోగలవు.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
వివిధ రకాల సహకార సంఘాలను గురించి క్లుప్తంగా వివరించండి. [AP & TS Mar 15]
జవాబు:
ప్రజల అవసరాల ప్రకారము భారతదేశములో వివిధ రకాల సహకార సంఘాలను స్థాపించడం జరిగినది. అవి దిగువ పేర్కొనబడినవి.
1. వినియోగదారుల సహకార సంఘాలు: నిత్యావసర వస్తువులను సరసమైన ధరలకు కొనుగోలు చేసే నిమిత్తము వినియోగదారులు ఈ రకమైన సంఘాలను ఏర్పాటుచేసుకుంటారు. ఈ సంఘాలు నేరుగా వస్తువులను టోకు వర్తకుల నుంచి పెద్ద మొత్తములో తక్కువ ధరకు కొనుగోలు చేసి చిన్న మొత్తాలలో ఈ సంఘ సభ్యులకు విక్రయించడం జరుగుతుంది. సభ్యులు కానివారికి ఎక్కువ ధరకు అమ్మి ఆ విధముగా వచ్చిన లాభాలను సభ్యుల సంక్షేమం కోసం కొంత ఖర్చు చేసి మిగతా మొత్తాన్ని డివిడెండ్ల రూపములో సభ్యులకు పంచడం జరుగుతుంది.

AP Inter 1st Year Commerce Study Material Chapter 4 ఉమ్మడి హిందూ కుటుంబ వ్యాపార వ్యవస్థ, సహకార సంఘం

2. ఉత్పత్తిదారుల సహకార సంఘాలు: చిన్న ఉత్పత్తిదారులు, చేతివృత్తుల వారు ముడిపదార్థాలు, పనిముట్లు, సాంకేతిక పరిజ్ఞానము మొదలైన సమస్యలు ఎదుర్కొంటారు. ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటున్న ఉత్పత్తిదారులకు, చేతివృత్తుల వారికి అవసరమైన సౌకర్యాలు కల్పించి వారి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడంకోసం ఈ సంఘాలను ఏర్పాటుచేసుకుంటారు.

3. మార్కెటింగ్ సహకార సంఘాలు: తాము ఉత్పత్తిచేసిన వస్తువులను మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా వినియోగదారులకు అమ్మే నిమిత్తము చిన్న ఉత్పత్తిదారులు స్వచ్ఛందముగా ఏర్పాటుచేసుకున్న సంఘాలే మార్కెటింగ్ సహకార సంఘాలు. ఇవి మార్కెటింగ్ చేయడంలో ఎదురయ్యే సమస్యలను అధిగమించడానికి చిన్న ఉత్పత్తిదారులకు సహాయపడతాయి.

4. గృహ నిర్మాణ సహకార సంఘాలు: అల్పాదాయవర్గ ప్రజలు ఆర్థిక ఇబ్బందుల కారణముగా సొంతముగా ఇళ్ళు నిర్మించుకోలేని వారికి ఈ సంఘాలు వారి’ సభ్యులకు ప్రభుత్వము ద్వారా స్థలము పొందడానికి, ప్లాట్లుగా ఇవ్వడానికి ఋణ సౌకర్యాన్ని కల్పిస్తాయి. దీర్ఘకాలానికి సులభ వాయిదాలలో నిర్మాణ వ్యయాన్ని సభ్యులు చెల్లిస్తారు. కొంతకాలము తరువాత సభ్యులు వారి ఇంటికి సొంతదారులు / యజమానులు అవుతారు.

5. వ్యవసాయ సహకార సంఘాలు: శాస్త్రీయపద్ధతిలో వ్యవసాయము చేస్తూ భారీ వ్యవసాయ ప్రయోజనాలను పొందడానికి చిన్న వ్యవసాయదారులు స్వచ్ఛందంగా కలిసి ఏర్పాటుచేసుకున్న సంఘాలే వ్యవసాయ సహకార సంఘాలు. ఈ సంఘాలు వ్యవసాయదారులకు ట్రాక్టర్లు, ఖరీదైన యంత్రాలను అద్దెకు అందజేస్తుంది. నీటి సరఫరా, ఎరువులు, విత్తనాల సరఫరా మొదలైన వసతులను సమకూరుస్తుంది.

6. సహకార పరపతి సంఘాలు: ఆర్థిక సమస్యలు ఉన్న రైతులు, చేతి వృత్తులవారు, కార్మికులు, ఉద్యోగులు వీటిని స్థాపిస్తారు. ఈ సంఘాలు సభ్యుల నుంచి పొదుపు మొత్తాలను సేకరించి, అవసరము ఉన్న సభ్యులకు తక్కువ వడ్డీ రేట్లకు ఋణాలు అందిస్తాయి. ఇచ్చిన ఋణాన్ని సభ్యుల నుంచి సులభ వాయిదాలలో తిరిగి వసూలు చేసుకుంటాయి.

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1. కర్త [T.S. Mar. ’15]
జవాబు:
హిందూ అవిభక్త కుటుంబములో పెద్దవాడిని కర్త లేదా మేనేజరు అంటారు. వ్యాపార నిర్వహణ అంతా అతని చేతుల మీదగానే జరుగుతుంది. వ్యాపారము మీద అతని సంపూర్ణ అధికారాలు ఉంటాయి. అతని అధికారాన్ని ప్రశ్నించే హక్కు ఎవరికి లేదు. కర్త యొక్క ఋణబాధ్యత అపరిమితము.

ప్రశ్న 2.
సహవారసులు
జవాబు:
కర్త కాకుండా సమిష్టి హిందూ కుటుంబ వ్యాపార సంస్థ సభ్యులందరిని సహవారసులుగా పిలుస్తారు. సంస్థ లాభాలను వీరు సమానముగా పంచుకుంటారు. వీరి ఋణబాధ్యత వారి వాటాల మేరకు పరిమితము.

ప్రశ్న 3.
దయాభాగ
జవాబు:
దయాభాగము అస్సాం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు వర్తిస్తుంది. ఈ వాదనలోని నిబంధనలు కొన్ని మినహాయించి మితాక్షరవాదం వలె ఉంటాయి. ఈ వాదన ప్రకారము దాయాదులకు ఆస్తిపై గల హక్కు వారసత్వము ద్వారా సంక్రమిస్తుంది కాని పుట్టుకతో రాదు. కాబట్టి హిందూ అవిభక్త కుటుంబములోని వాటా సభ్యుల మరణము, జననం వలన మార్పురాదు.

AP Inter 1st Year Commerce Study Material Chapter 4 ఉమ్మడి హిందూ కుటుంబ వ్యాపార వ్యవస్థ, సహకార సంఘం

ప్రశ్న 4.
మితాక్షర
జవాబు:
ఈ వాదము అస్సాం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు తప్ప మిగిలిన భారతదేశమంతా వర్తిస్తుంది. అవిభక్త హిందూ కుటుంబ సభ్యులలో కుటుంబ యజమాని, కొడుకులు కాక వారి’ భార్యలు, అవివాహిత కుమార్తెలు కూడా ఉంటారు. పుట్టుక ద్వారా సభ్యునకు ఆస్తిలో వాటా వస్తుంది. ఈ హక్కు అతని / ఆమె మరణము వరకు ఉంటుంది. కాబట్టి ఆస్తిలో వాటా దాయాదుల సంఖ్యను బట్టి మారుతుంది. అనగా జీవించి ఉన్న సభ్యులకే ఆస్తిహక్కు ఉంటుంది. భర్త పోయిన స్త్రీకి ఆస్తిహక్కు ఉండదు. కాని మనోవర్తి క్రింద కొంత మొత్తాన్ని అడగవచ్చు.

ప్రశ్న 5.
సహకార సంఘం అర్థం ఏమిటి ?
జవాబు:
ప్రజాస్వామ్య పద్ధతిలో లాభాపేక్షలేని, పరస్పర సహాయము సేవాశయాల కొరకు పరిమిత వనరులు గల వ్యక్తులు వ్యాపారము మరియు ఆర్థిక ప్రయోజనాలు పెంపొందించుటకు సమానత్వ ప్రాతిపదికపైన ఏర్పడిన స్వచ్ఛంద సంఘము ‘సహకార సంఘము, 1912 సహకార సంఘాల చట్టం ప్రకారము సహకార సూత్రాలకు అనుగుణముగా సభ్యుల ఆర్థిక ప్రయోజనాలను పరిరక్షించే ధ్యేయముతో స్థాపించబడిన సంస్థను సహకార సంఘము అంటారు.

AP Inter 1st Year Commerce Study Material Chapter 3 వ్యాపార వ్యవస్థ స్వరూపాలు

Andhra Pradesh BIEAP AP Inter 1st Year Commerce Study Material 3rd Lesson వ్యాపార వ్యవస్థ స్వరూపాలు Textbook Questions and Answers.

AP Inter 1st Year Commerce Study Material 3rd Lesson వ్యాపార వ్యవస్థ స్వరూపాలు

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
సొంత వ్యాపారాన్ని నిర్వచించి, దానివలన కలిగే ప్రయోజనాలను, దానికి ఉన్న పరిమితులను చర్చించండి. [A.P. Mar. ’15]
జవాబు:
సొంత యాజమాన్యము, నియంత్రణ కలిగిన వ్యాపార సంస్థను సొంత వ్యాపార సంస్థ అంటారు. ఈ వ్యాపార వస్థలో మూలధనాన్ని ఒక వ్యక్తే సమకూర్చుకొని వ్యాపారానికి అవసరమయ్యే నిధులను స్నేహితుల నుండి, బంధువుల ఒంచి, బ్యాంకు నుంచి అప్పు తీసుకుంటాడు. వ్యాపార నిర్ణయాలు అతడు ఒక్కడే తీసుకుంటాడు. కొనుగోళ్ళు, మొదలైన కార్యకలాపాలన్నీ అతడే నిర్వహించుకొని వచ్చే లాభనష్టాలను అతడే భరిస్తాడు. అవసరమయితే బ సభ్యులను లేదా ఉద్యోగులను నియమిస్తాడు.

తన అభిప్రాయము ప్రకారము “ఎవరైతే వ్యాపార బాధ్యతను మోస్తారో, ఎవరైతే కార్యకలాపాలు నిర్వహిస్తారో, నష్టభం ఎవరైతే స్వీకరిస్తారో, ఆ వ్యక్తి నడిపే సంస్థ సొంతవ్యాపారము”.

జేమ్స్ స్టీఫెన్సన్ అభిప్రాయము ప్రకారము “సొంత వ్యాపారాన్ని ఒక వ్యక్తి తన సొంత నిధులు, నిర్వహణా సామర్థ్యముతో నిర్వహిస్తాడు. ఈ వ్యాపారానికి సంబంధించిన జయాపజయాలకు అతడే బాధ్యత వహించవలసి ఉంటుంది”.

ప్రయోజనాలు:
1. సులభముగా స్థాపించుట: సొంత వ్యాపార సంస్థను స్థాపించడానికి చట్టబద్ధమైన లాంఛనాలు ఉండవు కాబట్టి దీనిని సత్వరము ప్రారంభించవచ్చును. రద్దుపరుచుట కూడా తేలిక.

2. శీఘ్ర నిర్ణయాలు: వ్యాపార నిర్ణయాలు తీసుకోవడములో జాప్యము ఉండరాదు. ఆలస్యము వలన అవాంఛనీయమైన పరిస్థితులు ఏర్పడవచ్చు. సొంతవ్యాపారి తనకుతానే యజమాని, ఇతరులతో సంప్రదించవలసిన పనిలేదు. కాబట్టి వ్యాపార నిర్ణయాలు శీఘ్రముగా తీసుకోవచ్చు.

AP Inter 1st Year Commerce Study Material Chapter 3 వ్యాపార వ్యవస్థ స్వరూపాలు

3. వ్యక్తిగత శ్రద్ధాసక్తులు: వ్యాపారములో లభించే లాభమంతా సొంతవ్యాపారికి చెందుతుంది. అంతేగాక అతని ఋణబాధ్యత కూడా అపరిమితము. అందుచేత వ్యాపార కార్యకలాపాలలో అతనికి శ్రద్ధాసక్తులు ఉంటాయి. తన ప్రత్యక్ష పర్యవేక్షణలో వ్యవహారాలను సమర్థవంతముగా, ఆదాయపూర్వకముగా నడపవచ్చు.

4. మార్పులకు సౌలభ్యము: అవసరాలను బట్టి సంస్థను ఒక చోటు నుంచి మరొక చోటుకు మార్చవచ్చును లేదా వ్యాపార స్వభావాన్ని మార్చవచ్చును. దీనికి చట్టబద్దమైన ప్రతిబంధకాలు ఉండవు.

5. వ్యాపార రహస్యాలు: వ్యాపార సుస్థిరతకు, విజయానికి కొన్ని మెళుకువలు, కిటుకులు ఉంటాయి. వీటిని వ్యాపార రహస్యాలు అంటారు. సొంత వ్యాపారి ఒకడే కాబట్టి వ్యాపార రహస్యాలు బయటకు పొక్కవు. అంతేగాక లాభనష్టాలను ప్రచురించవలసిన అవసరములేదు.

6. వ్యక్తిగత సంబంధము: వ్యాపారము అభివృద్ధి చెందడానికి ఖాతాదారులతో మైత్రి అవసరము. సొంతవ్యాపారములో యజమానే అన్ని వ్యవహారములు స్వయముగా చూసుకుంటాడు. కాబట్టి ఖాతాదారుల మన్ననలను చూరగొంటాడు. ఖాతాదారులతో మైత్రిని ఏర్పరచుకొని, వారి అవసరాలకు అనుగుణముగా తన వ్యాపారములో మార్పులను చేయవచ్చు.

పరిమితులు:
1. పరిమిత నిధులు: సొంతవ్యాపారి ఆర్థికస్థోమత పరిమితముగా ఉండటము వలన అవసరమైనప్పుడు నిధులను సమకూర్చుకొనలేడు. కాబట్టి వ్యాపారాన్ని విస్తృతపరుచుట కష్టము.

2. అనిశ్చిత మనుగడ: న్యాయశాస్త్ర దృష్టిలో సొంతవ్యాపారము సొంతవ్యాపారి వేరుకాదు. కాబట్టి వ్యాపారములో అనుకోని పరిస్థితులు ఏర్పడి అతడు మరణించినా, దివాలా తీసినా సంస్థ మూతపడుతుంది.

3. అపరిమిత ఋణబాధ్యత: సొంతవ్యాపారి యొక్క ఋణబాధ్యత అపరిమితము. వ్యాపారములో నష్టాలు ఎక్కువగా వచ్చి అప్పులపాలయితే, అప్పులను తీర్చడానికి వ్యాపార ఆస్తులు చాలకపోతే, సొంత ఆస్తులను అమ్మి అప్పులను తీర్చవలెను. అందువలన సొంత ఆస్తులకు రక్షణ లేదు.

4. భారీతరహా కార్యకలాపాలకు అనువుగా ఉండదు: పరిమిత వనరులు, నిర్వహణా సామర్థ్యము వలన సొంతవ్యాపారము భారీ తరహా వ్యాపారాలకు అనువుగా ఉండదు.

5. పరిమిత నిర్వహణా సామర్థ్యము: వ్యాపారములో కొనుగోళ్ళు, అమ్మకాలు, ఆర్థిక వ్యవహారాలు మొదలైన అనేక విధులు ఉంటాయి. వీటన్నింటిని చూసుకొనే శక్తియుక్తులు, అనుభవము సొంతవ్యాపారికి ఉండకపోవచ్చు. నిపుణులను నియమించుటకు నిధులు సరిపోవు.

ప్రశ్న 2.
“అన్ని విషయాలను నిర్వహించుకోగల శక్తిమంతుడై ఉండాలేగాని, ప్రపంచములో సొంతవ్యాపారానికి మించినది మరొకటి లేదు” – వివరించండి.
జవాబు:
సొంతవ్యాపారము నాగరికత పుట్టినప్పటి నుంచి అమలులో ఉన్నది. ఇది అతిపురాతనమైనది. చరిత్రగతిని పరిశీలిస్తే వాణిజ్యము సొంత వ్యాపారముతోనే ఆరంభమైనట్లు కనిపిస్తున్నది. అన్ని దేశాలలోనూ ఈ రకం వ్యాపారమే అధికముగా ఉన్నట్లు గోచరిస్తున్నది. ఎవరైనా వ్యాపారము ప్రారంభించదలిస్తే మొదట కొద్దిపాటి మూలధనముతో సొంతవ్యాపారము ప్రారంభించి, అనుభవము గడించి క్రమేణ అభివృద్ధి చేసుకుంటూ ఉంటారు. చిన్నకార్లను తయారుచేసే ప్రఖ్యాతిచెందిన ఫోర్డు కంపెనీ ఒకనాడు సొంతవ్యాపారముగా స్థాపితమై, తరువాత అభివృద్ధి చెందినదే. ఈ రకముగా సొంతవ్యాపార సంస్థ అత్యంత ముఖ్యమైనది.

AP Inter 1st Year Commerce Study Material Chapter 3 వ్యాపార వ్యవస్థ స్వరూపాలు

ఒక వ్యక్తి యాజమాన్యము, నియంత్రణ కలిగి ఉండే వ్యాపార సంస్థను సొంతవ్యాపార సంస్థ అంటారు. వ్యాపారానికి కావలసిన మూలధనాన్ని అతడు ఒక్కడే సమకూర్చుకొని వ్యాపారానికి కావలసినవన్నీ ఏర్పాటుచేసుకుంటాడు. వ్యాపార నిర్ణయాలు తానొక్కడే తీసుకుంటాడు. తన కుటుంబసభ్యుల సహకారముతో లేదా ఉద్యోగులను నియమించుకొని తానే స్వయముగా వ్యాపారాన్ని నిర్వహించుకుంటాడు. సంస్థకు కావలసిన నిధులను అవసరమైతే తన బంధువులు, స్నేహితులు లేదా బ్యాంకుల నుంచి అప్పులు తెస్తాడు. కొనుగోళ్ళు, అమ్మకాలు మొదలగు వ్యాపార కార్యకలాపాలన్నీ తానే స్వయముగా నిర్వహించుకుంటూ మిక్కిలి పొదుపుతో అధిక లాభాలను పొందడానికి ప్రయత్నిస్తాడు. లాభాలను తానొక్కడే అనుభవిస్తాడు, కాబట్టి ఎక్కువ లాభాల కోసము అహర్నిశలు శ్రమిస్తాడు. తన పొరపాట్ల వలన సంస్థకు నష్టము వస్తే తానే భరించాలి కాబట్టి మిక్కిలి జాగురూకతతో నిర్వహణా బాధ్యతను చేపడతాడు. ఈ విధముగా ‘అన్నీ తానే, తనకే అన్నీ’ అనే తరహాలో సొంతవ్యాపారము నడుస్తుంది.

వ్యాపార రథానికి సారథిగా, వ్యాపార విజయానికి నాయకుడిగా నిలబడాలి అంటే సొంతవ్యాపారికి దూరదృష్టి, చొరవ, సరైన నిర్ణయాలు తీసుకునే శక్తి, వ్యాపార దక్షత, సామర్థ్యము, ఓర్పు, చిత్తశుద్ధి, ఆత్మవిశ్వాసము, లౌక్యము మొదలైన లక్షణాలు కలిగి ఉండవలెను.

ఈ విధముగా పైవిషయాలన్నీ నిర్వహించగల శక్తిమంతుడై వ్యాపారస్తుడు ఉన్నయెడల సొంతవ్యాపారానికి మించినది మరొకటి లేదు. అతడు స్వేచ్ఛగా, హాయిగా వ్యాపారము చేసుకుంటూ తాను సాధించదలచిన వ్యాపార విజయాన్ని, సంతృప్తిని పొందుతాడు.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
సొంత వ్యాపారము అంటే ఏమిటి ?
జవాబు:
ఒక వ్యక్తి యాజమాన్యము, నియంత్రణ కలిగి ఉండే వ్యాపార సంస్థను సొంత వ్యాపార సంస్థ అంటారు. వ్యాపారానికి కావలసిన మూలధనాన్ని అతడే సమకూర్చుకొని వ్యాపారానికి కావలసిన ఏర్పాట్లు అతడే చేసుకుంటాడు. వ్యాపార నిర్ణయాలు అతడు ఒక్కడే తీసుకుంటాడు. తన కుటుంబసభ్యుల సహకారముతో లేదా ఉద్యోగులను నియమించుకొని తానే స్వయముగా వ్యాపారాన్ని నిర్వహిస్తాడు. సంస్థకు కావలసిన నిధులను అవసరమయితే తన బంధువులు, స్నేహితులు లేదా బ్యాంకుల నుంచి అప్పులు తెస్తాడు. కొనుగోళ్ళు, అమ్మకాలు మొదలగు వ్యాపార కార్యకలాపాలన్నీ తానే స్వయముగా నిర్వహించుకుంటూ మిక్కిలి పొదుపుతో అధిక లాభాలను పొందడానికి ప్రయత్నిస్తాడు. లాభాలను తానొక్కడే అనుభవిస్తాడు, కాబట్టి ఎక్కువ లాభాల కోసము అహర్నిశలు శ్రమిస్తాడు. తన పొరపాట్ల వలన సంస్థకు నష్టమువస్తే తానే భరించాలి కాబట్టి మిక్కిలి జాగురూకతతో నిర్వహణా బాధ్యతను చేపడతాడు. ఈ విధముగా ‘అన్నీ తానే, తనకే అన్నీ’ అనే తరహాలో సొంతవ్యాపారము నడుస్తుంది.

ప్రశ్న 2.
సొంత వ్యాపారము లక్షణాలను వివరించండి.
జవాబు:
సొంత వ్యాపార సంస్థ లక్షణాలు:

  1. ఒకే యజమాని: సొంత వ్యాపారములో ఒకే యజమాని ఉండి, వ్యాపారానికి కావలసిన నిధులను అతడే సమకూర్చుకుంటాడు.
  2. యాజమాన్యానికి, నిర్వహణకు పొత్తు: సొంతవ్యాపారములో ఒకడే తన తెలివితేటలు, నైపుణ్యముతో వ్యాపారాన్ని నిర్వహిస్తాడు. కంపెనీల వలెకాక యాజమాన్యము, నిర్వహణ సొంతవ్యాపారి చేతిలో ఉంటుంది.
  3. చట్టబద్ధమైన లాంఛనాలు తక్కువ: సొంతవ్యాపార సంస్థ స్థాపనకు, నిర్వహణకు చట్టబద్ధమైన లాంఛనాలు తక్కువ. దీనిని స్థాపించుట తేలిక.
  4. ప్రత్యేక అస్థిత్వము ఉండదు: చట్టము దృష్టిలో సొంతవ్యాపారి, సొంతవ్యాపార సంస్థ ఒక్కటే. వ్యాపారములో జరిగే అన్ని విషయాలకు అతడే బాధ్యతను స్వీకరించాలి:
  5. లాభనష్టాలలో వేరేవారికి వాటా లేకపోవడం: లాభాలన్నీ సొంత వ్యాపారే అనుభవిస్తాడు. నష్టాలన్నీ అతడే భరించవలెను. లాభనష్టాలలో వేరేవారికి వాటా ఉండదు.
  6. అపరిమిత ఋణబాధ్యత: సొంతవ్యాపారి ఋణబాధ్యత అపరిమితము. నష్టము వచ్చినప్పుడు వ్యాపార అప్పులను తీర్చడానికి వ్యాపార ఆస్తులు సరిపోకపోతే సొంత ఆస్తుల నుంచీ అప్పులను చెల్లించవలెను.
  7. ఏకవ్యక్తి నియంత్రణ: సొంతవ్యాపారములో నియంత్రణ యజమాని చేతిలో ఉంటుంది. అతడు తన ఇష్టానుసారము. వ్యాపారాన్ని నిర్వహించవచ్చును.

AP Inter 1st Year Commerce Study Material Chapter 3 వ్యాపార వ్యవస్థ స్వరూపాలు

ప్రశ్న 3.
సొంత వ్యాపారి పరిమితులను వివరించండి.
జవాబు:
సొంత వ్యాపారము పరిమితులు:

  1. పరిమితమైన నిధులు: సొంతవ్యాపారి ఆర్థికస్థోమత పరిమితముగా ఉండుటవలన అవసరమైనప్పుడు నిధులను సమకూర్చుకొనలేడు. కాబట్టి వ్యాపారాన్ని విస్తృతపరచడము కష్టము.
  2. అనిశ్చిత మనుగడ: న్యాయశాస్త్ర దృష్టిలో సొంతవ్యాపార సంస్థ, సొంతవ్యాపారి వేరుకాదు. కాబట్టి వ్యాపారములో అనుకోని పరిస్థితులు ఏర్పడి అతడు మరణించినా, దివాలా తీసినా సంస్థ మూతపడుతుంది.
  3. అపరిమిత ఋణబాధ్యత: సొంతవ్యాపారి యొక్క ఋణబాధ్యత అపరిమితము. వ్యాపారములో నష్టాలు ఎక్కువగా వచ్చి, అప్పులపాలైతే, అప్పులను తీర్చడానికి వ్యాపార ఆస్తులు చాలకపోతే సొంత ఆస్తులను అమ్మి, అప్పులను తీర్చవలెను. అందువలన సొంత ఆస్తులకు రక్షణ లేదు.
  4. భారీ వ్యాపారానికి అనువుగా లేకపోవడం: పరిమిత వనరులు, పరిమిత నిర్వహణా సామర్థ్యము వలన సొంతవ్యాపారి భారీ తరహా వ్యాపారము చేయలేడు.
  5. పరిమిత నిర్వహణా సామర్ధ్యము.: వ్యాపారములో కొనుగోళ్ళు, అమ్మకాలు, ఆర్థిక వ్యవహారాలు మొదలైన అనేక విధులు ఉంటాయి. సొంతవ్యాపారికి అన్నింటిలోనూ ప్రావీణ్యము, అనుభవము ఉండకపోవచ్చు. నిపుణులను నియమించడానికి నిధులు సరిపోవు.