AP 8th Class Social Notes Chapter 23 క్రీడలు : జాతీయత, వాణిజ్యం

Students can go through AP Board 8th Class Social Notes 23rd Lesson క్రీడలు : జాతీయత, వాణిజ్యం to understand and remember the concept easily.

AP Board 8th Class Social Notes 23rd Lesson క్రీడలు : జాతీయత, వాణిజ్యం

→ ఆటలు అనేక కారణాల వలన ఆడతాం.

→ మన ఊరి ప్రజలు కబడ్డీ ఆడినట్లు ఒకప్పుడు ఇంగ్లాండులోని గ్రామస్తులు ఖాళీ మైదానాలలో క్రికెట్ ను ఆడేవాళ్ళు.

→ సాంప్రదాయ ఆటలకు ప్రజల నుంచి మద్దతు, ప్రోత్సాహం కరువయ్యాయి.

→ క్రికెట్ ను ఇంగ్లాండులో కనుగొన్నారు. బ్రిటిషు పాలిత దేశాలలో ఇది విస్తరించింది.

→ ఫుట్ బాల్, హాకీ వంటివి బృంద ఆటలు.

→ భారతీయులు ఆడిన క్రికెట్ బొంబాయిలో పుట్టింది. దీనిని మొదట చేపట్టినవారు పార్శీలు.

→ మొట్టమొదటి క్రికెట్టు క్లబ్ ను 1848లో బొంబాయిలో స్థాపించారు.

→ పార్శీ జింఖానా ఏర్పాటు భారతదేశంలో మతం ఆధారంగా జింఖానాలు ఏర్పరచింది.

→ 1970 దశకంలో క్రికెట్ మార్పులకు గురయ్యింది.

→ క్రికెట్ ను సొమ్ము చేసుకోగల ఆటగా, పెద్ద ఎత్తున ఆదాయాలు సమకూర్చే ఆటగా, ఆస్ట్రేలియన్ టీ.వీ సామ్రాట్టు అయిన కెర్రీ పాకర్ గుర్తింపు తెచ్చాడు.

AP 8th Class Social Notes Chapter 23 క్రీడలు : జాతీయత, వాణిజ్యం

→ భారతదేశంలో హాకీ కూడా జనాదరణ పొందింది.

→ క్రీడలు మానసిక వికాసంతో పాటు శారీరకాభివృద్ధిని పెంపొందిస్తాయి.

→ భిన్న సంస్కృతులు కలిగిన మన దేశానికి జాతీయ సమైక్యతను పెంపొందించడానికి క్రీడలు ఇతోధికంగా దోహదం చేస్తున్నాయి.

→ వలస పాలన (క్రీడ) : వలసపాలకుల ద్వారా మన దేశానికి వచ్చిన క్రీడ (క్రికెట్)

→ ప్రపంచ వాణిజ్యం : అంతర్జాతీయంగా జరిగే వాణిజ్యం.

→ జాతీయవాదం : నేను, నా దేశం ఒకే జాతి అనే భావన.

→ ప్రాయోజకులు : ఏదైనా ఒక కార్యక్రమాన్ని సమర్పించినవారు.

AP 8th Class Social Notes Chapter 23 క్రీడలు జాతీయత, వాణిజ్యం 1

AP 6th Class Social Notes Chapter 6 తొలి నాగరికతలు

Students can go through AP Board 6th Class Social Notes 6th Lesson తొలి నాగరికతలు to understand and remember the concept easily.

AP Board 6th Class Social Notes 6th Lesson తొలి నాగరికతలు

→ 19వ శతాబ్దం వరకు భారతదేశ చరిత్ర వేదకాలంలోనే ప్రారంభమైనదని విశ్వసించేవారు.

→ 1920 హరప్పా, మొహంజోదారో, ప్రాంతంలో జరిపిన తవ్వకాల వలన మనదేశ చరిత్ర రెండువేల సం॥రాల క్రితమే ప్రారంభమైనట్లు తెలిసింది.

→ హరప్పా నాగరికత క్రీ.పూ. 2500-1700 సం||రాల మధ్య వికసించింది.

→ హరప్పా నాగరికత సుమారు 1500 ప్రదేశాలలో బయటపడింది.

→ హరప్పా నాగరికత కాలం నాటికి నగరాలన్నియు ప్రణాళికాబద్ధంగా నిర్మించబడినవి.

→ హరప్పా నగరంలో ఆరు పెద్ద ధాన్యాగారాలు మరియు కార్మికులకు నివాస సముదాయాలు కలవు.

→ లోథాల్ నగరంలో అతి పెద్ద నౌకాశ్రయం కలదు.

AP 6th Class Social Notes Chapter 6 తొలి నాగరికతలు

→ సింధు నాగరికత కాలంలో మంచి ప్రణాళికాబద్ధమైన భూగర్భ మురుగు నీటి పారుదల వ్యవస్థ కలదు.

→ హరప్పా ప్రజలు ఎండిన మరియు బాగా కాల్చిన ఇటుకలతో ఇళ్ళు కట్టుకునేవారు.

→ పత్తి మరియు నూలు వస్త్రాలను నేయడం ఆ కాలంలలోని ప్రధాన వృత్తులు.

→ పత్తిని మొట్టమొదట పండించింది వీరే.

→ లోథాల్ నౌకాశ్రయం ద్వారా మెసపటోమియా, ఈజిప్టు మరియు ఇరాన్ దేశాలతో సింధూ ప్రజలు బాగా వ్యాపారం చేసేవారు.

→ వ్యవసాయం ప్రధాన వృత్తి. గోధుమ, బార్లీ, ఆముదాలు, బఠానీలు, కాయధాన్యాలు పండించేవారు.

→ నాట్యం, చదరంగం ఆడటం, సంగీతం, గోళీలు, పాచికలు ఆడటం సింధూ ప్రజల వినోదాలు.

→ సింధూ ప్రజలు పశుపతి (శివుడు) మరియు అమ్మతల్లిని పూజించేవారు.

→ స్వస్తిక్ (ఈ) గుర్తును సాధారణంగా ఉపయోగించేవారు.

→ సింధూ ప్రజల లిపిని ఇంతవరకు అర్థం చేసుకోలేకపోయారు.

→ ప్రామాణికమైన తూనికలను, కొలతలను మొట్టమొదట ఉపయోగించింది హరప్పా ప్రజలే.

→ ఆర్యుల దండయాత్రలు సింధూ నాగరికత పతనానికి కారణమనే సిద్ధాంతం కలదు. అయితే ‘మార్టిమర్ వీలర్’ అనే చరిత్రకారుడు దీనిని అంగీకరించలేదు.

AP 6th Class Social Notes Chapter 6 తొలి నాగరికతలు

→ ఆర్యుల పుట్టుపూర్వోత్తరాల గురించి అనేక సిద్ధాంతాలు కలవు.

→ వేద సాహిత్యము ఆవిర్భవించిన కాలాన్ని వేదకాలం అందురు.

→ ఆర్యుల నాగరికత సింధూ మరియు సరస్వతి నదీ మైదాన ప్రాంతాలలో వికసించింది.

→ ఆర్యుల గురించి తెలుసుకోవడానికి ప్రధాన ఆధారం వేద సాహిత్యం.

→ సంస్కృత భాషలో వేదమనగా ఉన్నతమైన జ్ఞానం, ఆత్మజ్ఞానమే వేదము.

→ వేదాలను శృతులు అని కూడా అంటారు.

→ వేద సాహిత్యములో నాలుగు ప్రముఖ వేదాలు కలవు, అవి ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము.

→ ఆధునిక కాలంలో స్వామి దయానంద సరస్వతి “వేదకాలానికే మరలా వెళ్ళాలి” అని పిలుపునిచ్చారు.

→ తొలి వేదకాలము క్రీ.పూ. 1500 – 1000 వరకు.

→ మలి వేదకాలము క్రీ.పూ. 1000 – 600 వరకు.

→ తొలి వేదకాలంలో సమాజానికి ప్రాథమిక అంగం కుటుంబం, తండ్రి కుటుంబానికి పెద్ద. తొలి వేదకాలంలో సమాజంలో స్త్రీలకు గౌరవం ఉండేది. స్త్రీలు వేదాధ్యాయనం చేసేవారు.

AP 6th Class Social Notes Chapter 6 తొలి నాగరికతలు

→ వాసా (ధోవతి) ఆదివాసా (శరీరము పై భాగానికి కప్పుకొనేది) ప్రస్తుతం మన వేషధారణను పోలి ఉండేవి.

→ మూడు రకాలైన సంగీత వాయిద్యాలు ఉపయోగించేవారు.

→ విద్యకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే గురుకులాలు ఉండేవి.

→ ఆర్యులు దేవుడు ఒక్కడే అని నమ్మేవారు.

→ తొలివేదకాలంలో ఎటువంటి వివక్షత లేదు.

→ ఆర్యుల తెగ నాయకుడిని ‘రాజన్’ అంటారు.

→ రాజుకు పరిపాలనా విషయములో సలహాలు ఇచ్చేందుకు ‘సభ’, ‘సమితి’ అను రెండు సభలు ఉండేవి.

→ మలివేదకాలంలో రాజు మరింత శక్తిమంతుడైనాడు, సభ, సమితులు తమ ప్రాధాన్యతను కోల్పోయాయి.

→ మలివేదకాలంలో ఆశ్రమ వ్యవస్థ, వర్ణవ్యవస్థ ప్రారంభమైనవి.

→ రామాయణం, మహాభారతం అనేవి రెండు భారతదేశ గొప్ప ఇతిహాసాలు.

→ రామాయణాన్ని ఆదికావ్యం అంటారు. దానిని సంస్కృతంలో వాల్మీకి రచించారు.

→ మహాభారతాన్ని వేదవ్యాసుడు రచించారు.

→ నాగరికత : మానవుని యొక్క సాంఘిక, సాంస్కృతిక రంగాలలో ఉన్నతమైన స్థితి.

→ ఉపఖండం : ఖండంలో ఉన్న విశాలమైన భాగం

→ వాణిజ్యం : వస్తువులు మరియు సేవల అమ్మకం మరియు కొనుగోలు చేసే ప్రక్రియ.

→ వేదాలు : హిందూ మత పవిత్ర గ్రంథాలు.

→ బ్రాహ్మణాలు : వేదాలపై విపులంగా చేసిన వ్యాఖ్యానాలు.

→ ఉపనిషత్తులు : హిందూ మతం యొక్క పవిత్ర గ్రంథాలు.

→ వస్తు మార్పిడి పద్ధతి : డబ్బుకు బదులు వస్తువులను పరస్పరం మార్చుకొనే విధానం.

→ అమ్మతల్లి : సింధూ ప్రజలు పూజించిన దేవత.

→ గొప్పస్నానవాటిక : ప్రజలు అందరూ స్నానాలు చేయడానికై విశాలమైన కొలను. ఇది మొహంజోదారోలో బయల్పడింది.

→ సరస్వతి నది : థార్ ఎడారిలో ఇంకిపోయిన నదినే సరస్వతి నది అంటారు. ఋగ్వేదంలో సరస్వతి నది గురించి పలుమార్లు ప్రస్తావించడం జరిగింది.

→ అరణ్యకాలు : విద్యావాదము, క్రతువులు, సంస్కారాల గురించి తెలియజేయునవి.

→ తొలి వేదకాలము : క్రీ.పూ. 1500 – 1000 వరకు

→ మలి వేదకాలము : క్రీ.పూ. 1000 – 600 వరకు

→ వాసా : వేదకాలంలోని ధోవతి (దుస్తులు)

AP 6th Class Social Notes Chapter 6 తొలి నాగరికతలు

→ ఆదివాసా : వేదకాలంలోని శరీరము పై భాగానిని కప్పుకొనేది.

→ రాజన్ : ఆర్యుల తెగ నాయకుడిని రాజన్ అంటారు.

→ సభ, సమితి : రాజుకు పరిపాలనా విషయములో సలహాలు ఇచ్చే రెండు సభలు.

→ సతీసహగమనం : భర్త మరణిస్తే అతనితో పాటు భార్యను కూడా చితిలో కాల్చడం.

→ బహుభార్యత్వము : ఒక మగవాడు ఒకరి కంటే ఎక్కువ భార్యలు కల్గి ఉండటం.

→ వేద కాలం : వేద సాహిత్యము ఆవిర్భవించిన కాలాన్ని వేదకాలం అందురు.

→ ఇతిహాసాలు : రామాయణం, మహాభారతం అనేవి భారతదేశ రెండు గొప్ప ఇతిహాసాలు.

AP 6th Class Social Notes Chapter 6 తొలి నాగరికతలు

AP 8th Class Social Notes Chapter 22 సినిమా – ముద్రణా మాధ్యమాలు

Students can go through AP Board 8th Class Social Notes 22nd Lesson సినిమా – ముద్రణా మాధ్యమాలు to understand and remember the concept easily.

AP Board 8th Class Social Notes 22nd Lesson సినిమా – ముద్రణా మాధ్యమాలు

→ పూర్వకాలంలో నాటకాలే ప్రధాన వినోద మార్గాలుగా ఉండేవి.

→ తెలుగులో వరవిక్రయం, సత్యహరిశ్చంద్ర, కన్యాశుల్కం వంటి నాటకాలను సినిమాలుగా తీశారు.

→ మాటలు లేని సినిమాలను మూకీలని, మాటలున్న వాటిని టాకీలని అనేవారు.

→ తెలుగులో మొదటి మూకీ ‘భీష్మప్రతిజ్ఞు’, మొదటి టాకీ ‘భక్త ప్రహ్లాద’.

→ తెలుగు చిత్ర పరిశ్రమకు రఘుపతి వెంకయ్య ఆద్యుడు.

→ టెలివిజన్ రాకతో సినిమాలు చూడటానికి సినిమాహాళ్ళకి వెళ్ళవలసిన పని లేకుండా పోయింది.

→ అల్లూరి సీతారామరాజు సినిమా వ్యాపారపరంగా ఎంతో లాభాలు ఆర్జించింది.

→ శ్రీరంగం శ్రీనివాసరావు శ్రీశ్రీగా ప్రఖ్యాతి గాంచారు.

→ కొమురం భీం ఆదిలాబాదుకు చెందిన గోండు జాతి ఆదివాసి.

AP 8th Class Social Notes Chapter 21 ఆధునిక కాలంలో కళలు – కళాకారులు

→ సమాజం సినిమాను, సినిమా సమాజాన్ని ప్రభావితం చేస్తున్నాయి.

→ రాష్ట్రంలో 2000కు పైగా సినిమాహాళ్ళు ఉన్నాయి.

→ ముద్రణా మాధ్యమంలో దిన, వార, పక్షం, నెల పత్రికలు ఇంకా అనేక ఇతర పత్రికలు ఉన్నాయి.

→ తెలుగులో మొట్టమొదటి దినపత్రిక ‘కృష్ణా పత్రిక’.

→ బ్రిటిషు పాలనలో సంఘ సంస్కర్తలు సమాజంలో మార్పుల కోసం ఉద్యమించారు.

→ ప్రొజెక్టరు : ఒక తెరపై చిత్రాలను చూపించే స్లెలను ఉంచు పరికరం.

→ వ్యాఖ్యానం : వివరించి చెప్పుట

→ కంపోజ్ : ఏదైనా సంగీతానికి, పద్యానికి లేదా కవితకు సంబంధించి పూర్తిగా కళాత్మకంగా సృష్టించటం.

→ గెజెట్ : (ప్రభుత్వ) జర్నల్ లేదా వార్తాపత్రిక.

→ ప్రచురణ : ఏవేని అంశాలను పత్రికలలోకాని, ఇతర వాటిలో కాని ప్రచురించటం.

AP 8th Class Social Notes Chapter 22 సినిమా – ముద్రణా మాధ్యమాలు 1

AP 8th Class Social Notes Chapter 21 ఆధునిక కాలంలో కళలు – కళాకారులు

Students can go through AP Board 8th Class Social Notes 21st Lesson ఆధునిక కాలంలో కళలు – కళాకారులు to understand and remember the concept easily.

AP Board 8th Class Social Notes 21st Lesson ఆధునిక కాలంలో కళలు – కళాకారులు

→ కళాకారులు అనేక రకాలుగా ఉంటారు.

→ చాలావరకు జానపద కళలలో ప్రజలే పాల్గొంటారు.

→ యక్షగానం, గుసాడి, లంబాడి, సదిర్ నాట్యం , కురవంజి, కూచిపూడి మొదలైనవి నాట్యరూపాలు.

→ చాలామంది కళాకారులు ఊరూరా తిరగకుండా చక్రవర్తులు, రాజులు, జమీందార్ల పోషణలో ఉండేవాళ్ళు.

→ బుర్రకథలో కథనం చాలా ముఖ్యమయినది. దీనికి ఆట, వాచ్యం, పాట, నటనతోడై కథనంలో ఆసక్తిని పెంపొందిస్తాయి.

→ కమ్యూనిస్టు పార్టీకి మద్దతుదారులైన ప్రగతిశీల కళాకారులు 1943లో ప్రజానాట్య మండలిగా ఏర్పడ్డారు.

→ లాయరు, స్వాతంత్ర్య పోరాట యోధుడైన ఇ. కృష్ణ అయ్యర్ భరతనాట్యం నేర్చుకున్నాడు. ఈ కళలో ప్రజలకు ఆసక్తి కలిగించడానికి ఉద్యమించాడు.

→ కళ బ్రతకాలంటే గౌరవప్రదమైన చేతులకు బదిలీ చేయాలని చదువుకున్నవారు భావించారు.

→ ప్రదర్శన ద్వారా నేడు నాట్యకారులు జీవనోపాధిని పొందలేరు.

AP 8th Class Social Notes Chapter 21 ఆధునిక కాలంలో కళలు – కళాకారులు

→ అన్ని రకాల నాట్యాలు అనేక రకాల ఘర్షణలకు గురి అయ్యాయి.

→ భారతీయ సంప్రదాయ నృత్యాలలో భరతనాట్యం ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది.

→ తప్పెటలు : గుండ్రటి కంచు పళ్ళాలు (2). ఒకదానితో ఒకటి కట్టబడినవి. సంగీత వాయిద్యంగా ఉపయోగిస్తారు.

→ అందెలు : పాదాలకు మడమల దగ్గర గుండ్రంగా అలంకరించుకునే ఆభరణాలు.

→ భిక్షం : పేదవారికి ఆహారంగా కానీ, ధనం రూపేణా కాని ఉచితంగా ఇచ్చేది.

→ మూకాభినయం : మాట్లాడకుండా సంజ్ఞలతో చేసే అభినయం.

→ తరంగం : కూచిపూడి నృత్య రీతిలో ఇది ఒక కష్టమైన విధానం.
ఈ నృత్యంలో కళాకారులు పళ్ళెంలో కాళ్ళు ఉంచి, తలపై నీళ్ల గిన్నె ఉంచి నాట్యం చేస్తారు. కొంతమంది చేతుల్లో వెలిగే కొవ్వొత్తులు కూడా ఉంచుతారు.

→ నట్టువనార్లు : నాట్యం నేర్పే గురువులు, సాధారణంగా వీళ్ళు దేవదాసీలకు పుట్టిన మగ సంతానం.

AP 8th Class Social Notes Chapter 21 ఆధునిక కాలంలో కళలు – కళాకారులు 1

AP 8th Class Social Notes Chapter 20 లౌకికత్వం – అవగాహన

Students can go through AP Board 8th Class Social Notes 20th Lesson లౌకికత్వం – అవగాహన to understand and remember the concept easily.

AP Board 8th Class Social Notes 20th Lesson లౌకికత్వం – అవగాహన

→ కొన్ని దేశాలలో ఒక మతవర్గ ప్రజలు మరొక మత వర్గ ప్రజల పట్ల వివక్షత చూపుతున్నారు లేదా వేధింపులకు గురి చేస్తున్నారు.

→ తమ మత నమ్మకాలతో, తాము వాటిని అర్థం చేసుకున్నదానికి అనుగుణంగా జీవించడానికి వ్యక్తులకు భారత రాజ్యాంగం స్వేచ్ఛను ఇస్తోంది.

→ ప్రభుత్వం నుంచి మతాన్ని వేరు చేయటాన్నే లౌకికవాదం అంటారు. ఒక దేశం ప్రజాస్వామికంగా పనిచేయాలంటే ఇది ముఖ్యం.

→ భారతదేశంలో ప్రభుత్వ స్థలాల్లో ఏ ఒక్క మత చిహ్నాలను ప్రదర్శించకూడదు, ఏ మతాన్ని ప్రోత్సహించకూడదు.

→ భారత రాజ్యాంగం అంటరానితనాన్ని నిషేధించింది.

→ భారత లౌకిక విధానంలో మతం నుంచి పూర్తిగా వేరుచేయబడనప్పటికీ మతాల నుంచి అది సూత్రబద్ధ దూరంలో ఉంటుంది.

AP 8th Class Social Notes Chapter 20 లౌకికత్వం – అవగాహన

→ లౌకిక సూత్రాలపై ఆధారపడిన ప్రాథమిక హక్కులకు భారత రాజ్యాంగం హామీ ఇస్తోంది.

→ ప్రాథమిక హక్కులు : ఒక వ్యక్తికి అవసరమైన కనీస హక్కులు మన రాజ్యాంగం భారతదేశ పౌరులకు ఇచ్చింది. వీటినే ప్రాథమిక హక్కులు అంటారు.

→ ప్రజాస్వామ్యం : ఎన్నిక కాబడిన ప్రతినిధులచే పరిపాలించబడే విధానాన్ని ప్రజాస్వామ్యం అంటారు.

→ భయోత్పాతం : క్రూరమైన పాలన.

→ పౌర చట్టాలు : ప్రత్యేకించి ఒక వ్యక్తికి కానీ, ఒక వర్గం లేదా సమూహానికి కానీ సంబంధించిన చట్టాలు.

AP 8th Class Social Notes Chapter 20 లౌకికత్వం – అవగాహన 1

AP 8th Class Social Notes Chapter 19 సాంఘిక, మత సంస్కరణోద్యమాలు

Students can go through AP Board 8th Class Social Notes 19th Lesson సాంఘిక, మత సంస్కరణోద్యమాలు to understand and remember the concept easily.

AP Board 8th Class Social Notes 19th Lesson సాంఘిక, మత సంస్కరణోద్యమాలు

→ భారతీయులు సంఘసంస్కరణల ద్వారా అన్ని యుగాల్లోనూ తమ మూఢాచారాలను మార్చుకుంటూ వచ్చారు. ప్రపంచం పట్ల తమ అవగాహనను మెరుగుపరుచుకుంటూ వచ్చారు.

→ వివిధ దేశాల నుంచి భారతదేశంలోకి వచ్చిన రకరకాల అలవాట్లు, భావనల నుంచి వాళ్ళు కొత్త జ్ఞానాన్ని అలవర్చుకోసాగారు.

→ యూరోపియన్ పండితులు భారతదేశ ప్రాచీన సాహిత్యాన్ని చదివి, అనువదించి, పుస్తకాలుగా ప్రచురించారు.

→ బ్రహ్మ సమాజం, ఆర్య సమాజం మొదలైనవి దేశంలో ప్రారంభమయ్యాయి.

→ స్వామి వివేకానంద రామకృష్ణ పరమహంస శిష్యుడు. ఈయన హిందూమతం అన్ని మతాల కంటే గొప్పదని భావించాడు.

→ స్వామి దయానంద సరస్వతి అనుచరులు పంజాబ్ లో దయానంద్ ఆంగ్లో వేదిక్ పాఠశాలను స్థాపించారు.

→ 1857 తిరుగుబాటు అణచివేత ముస్లింలు ఆంగ్లేయుల మధ్య తీవ్ర విభేదాలు సృష్టించింది.

→ ముస్లింలలో సాంఘిక, సంస్కరణలకు, ఆధునిక విద్యా వ్యాప్తికి సర్ సయ్యద్ అలీగఢ్ ఉద్యమాన్ని ప్రారంభించాడు.

→ 1846లో 10 సంవత్సరాలలోపు ఆడపిల్లలకు పెళ్ళి చేయటాన్ని నిషేధిస్తూ చట్టం చేశారు.

→ బాల్య వివాహాలకు, బహు భార్యాత్వానికి వ్యతిరేకంగా ఈశ్వరచంద్ర విద్యాసాగర్ పోరాడాడు.

→ కందుకూరి వీరేశలింగం ఆంధ్రప్రదేశ్ లో బ్రహ్మసమాజాన్ని స్థాపించాడు.

AP 8th Class Social Notes Chapter 19 సాంఘిక, మత సంస్కరణోద్యమాలు

→ 1848లో పూణేలో అంటరాని కులాల బాలికల కోసం జ్యోతిబా ఒక పాఠశాల స్థాపించాడు.

→ మనుషులందరికీ ‘ఒకే కులం, ఒకే మతం, ఒకే దేవుడు’ అన్న భావనను ప్రచారం చేసిన మత గురువు నారాయణగురు.

→ సహాయనిరాకరణ, సత్యాగ్రహ ఉద్యమాల్లో పాల్గొనవలసినదిగా మహిళలను గాంధీజీ ప్రోత్సహించాడు.

→ సంస్కరణలు : ఏదేనీ ఒక రంగంలో కొత్త మార్పులను తీసుకుని రావడాన్ని సంస్కరణలు అంటారు.

→ సతి : పూర్వం భర్త చనిపోతే అతని భార్యను, భర్త చితిమీద బలవంతంగా కూర్చోబెట్టి తగులబెట్టేవారు. దీనినే ‘సతి’ అని అంటారు.

→ పరదా : స్త్రీ తన ముఖం పరులకు కనపడకుండా ముసుగును ధరించడం.

→ వితంతు పునర్వివాహం : భర్తలు మరణించిన స్త్రీలకు మరలా వివాహం చేయడం.

→ అంటరానితనం : పూర్వకాలం సమాజంలో కొన్ని కులాల వారిని మిగతావారు ముట్టుకునేవారు కాదు. దాన్ని ‘అంటరానితనం’ అని అనేవారు.

AP 8th Class Social Notes Chapter 19 సాంఘిక, మత సంస్కరణోద్యమాలు 1

AP 8th Class Social Notes Chapter 18 హక్కులు – అభివృద్ధి

Students can go through AP Board 8th Class Social Notes 18th Lesson హక్కులు – అభివృద్ధి to understand and remember the concept easily.

AP Board 8th Class Social Notes 18th Lesson హక్కులు – అభివృద్ధి

→ ప్రపంచంలోని మానవులందరికీ ఉల్లఘించకూడని కొన్ని మౌలిక హక్కులున్నాయి.

→ వీటిలో గౌరవప్రద జీవనం గడిపే హక్కు స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలకు హక్కు జీవించే హక్కు అంటే మానవ గౌరవానికి భంగం కలగకుండా జీవించే హక్కు ముఖ్యమైనవి.

→ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి నిధులు కేటాయించడం అంటే అది ప్రజలందరి ప్రాథమిక హక్కు.

→ 1945లో ఐ.రా.స. ఏర్పడినప్పుడు స్వేచ్ఛ, ఆర్థిక అభివృద్ధికి సంబంధించిన హక్కులు మానవులందరి ప్రాథమిక హక్కులుగా పరిగణించారు.

→ పేదల ప్రయోజనాల కోసం రూపొందించిన కార్యక్రమాలు సాధారణంగా వారికి చేరవు. ఇలా జరగటానికి అవినీతే ముఖ్యమైన కారణం.

→ ఎన్నో సం||రాల పోరాటం తరువాత అధికారిక సమాచారాన్ని వెల్లడి చేయడాన్ని తప్పనిసరి చేస్తూ 1995లో రాజస్థాన్లో ఒక చట్టం చేశారు.

→ జాతీయస్థాయిలో పార్లమెంటు 2005లో స.హ.చ. చేసింది.

AP 8th Class Social Notes Chapter 18 హక్కులు – అభివృద్ధి

→ 2002లో విద్యను 86వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక హక్కుగా గుర్తించారు. 2009లో ఉచిత, నిర్బంధ విద్యా హక్కు చట్టాన్ని చేశారు.

→ మానవ హక్కులు : మానవులకు మౌలికంగా, కొన్ని హక్కులున్నాయి. జీవించే హక్కు స్వేచ్ఛా హక్కు మొదలైనవి.

→ సమాచార హక్కు చట్టం : ప్రభుత్వ శాఖల నుండి ఏ సమాచారమైన నిర్ణీతమైన పద్ధతిలో తెలుసుకునే హక్కు చట్టం (కొన్నింటికి మినహాయింపు కలదు).

→ విద్యా హక్కు చట్టం : 6 నుండి 14 ఏళ్ళ లోపు బాలబాలికలకు ఉచిత నిర్బంధ విద్యను అందించాలనే చట్టం

→ స్వేచ్ఛ : ఎవరికి వారు కలిగి ఉండేది, ఇతరులకు లోబడకుండా ఉంచేది.

AP 8th Class Social Notes Chapter 18 హక్కులు – అభివృద్ధి 1

AP 6th Class Social Notes Chapter 5 సంచార జీవనం నుండి స్థిర జీవనం

Students can go through AP Board 6th Class Social Notes 5th Lesson సంచార జీవనం నుండి స్థిర జీవనం to understand and remember the concept easily.

AP Board 6th Class Social Notes 5th Lesson సంచార జీవనం నుండి స్థిర జీవనం

→ కొన్నివేల సం||రాలకు పూర్వం భారత ఉపఖండంలో నివసించే ప్రజలను ఆహార సేకరణ వేటగాళ్ళు అని పిలిచేవారు.

→ పురావస్తు తవ్వకాలలో లభించిన (దొరికిన) పనిముట్ల ద్వారా మనం ఆది మానవుల గురించి తెలుసుకోవచ్చు.

→ ఆది మానవులు నిప్పు కనుగొనడంతో ఆహారాన్ని వండుకొని తినే విధానానికి నాంది పలికింది.

→ ఆది మానవులు, సంచార జీవనం గడిపేవారు.

→ ఎముకలతో చేసిన పనిముట్ల బెలూమ్ గుహలలో తప్ప భారత ఉపఖండంలో ఎక్కడా దొరకలేదు.

→ గుహల గోడలపై, రాతిస్థావరాలపై ఆది మానవులు, రంగురాళ్ళను పిండి చేసి జంతువుల కొవ్వును కలిపి చిత్రాలు వేయడానికి అవసరమైన రంగులను తయారుచేసి అనేక చిత్రాలను చిత్రించారు.

AP 6th Class Social Notes Chapter 5 సంచార జీవనం నుండి స్థిర జీవనం

→ వైయస్ఆర్ కడప జిల్లాలోని చింతకుంట గ్రామంలో 10 రాతి స్థావరాలున్నాయి.

→ ఈ రాతి స్థావరాలలో ఎరుపు, తెలుపు రంగులలో 200 పైగా చిత్రాలున్నాయి.

→ ఎరుపు రంగు చిత్రాలలో ఉన్న మూపురం ఎద్దు ఒకే ఒక గుహలో ఉంది.

→ దాదాపు 12,000 సం||రాల క్రితం ప్రపంచ వాతావరణంలో గొప్ప మార్పులు సంభవించాయి.

→ పాత రాతియుగం (పాలియోలిథిక్ యుగం) – BCE 2.6 మి|| సం||రాల నుండి BCE 10,000 సంవత్సరాల వరకు.

→ మధ్య రాతియుగం (మెసోలిథిక్ యుగం) – BCE 10,000 సం||రాల నుండి BCE 8,000 సంవత్సరాల వరకు.

→ కొత్త రాతియుగం (నియోలిథిక్ యుగం) – BCE 8,000 సం||రాల నుండి BCE 3,000 సంవత్సరాల వరకు.

→ ఆది మానవులు వ్యవసాయం ప్రారంభించటంతో స్థిర జీవనం మొదలయ్యింది.

→ ఆహార నిల్వల కొరకు మట్టి పాత్రలను, గంపలు బుట్టలు లేదా నేల మాళిగలను ఉపయోగించారు.

→ కొత్తరాతి పనిముట్లతో వ్యవసాయం చేసిన కాలాన్ని నవీన శిలాయుగం లేదా కొత్త రాతియుగం అంటారు.

→ నవీన రాతియుగ కాలంలో ప్రజలు సాంకేతికంగా ముందంజ వేసారు.

→ ప్రపంచ వ్యాప్తంగా నదీలోయ నాగరికతలు మెసపటోమియా, సింధులోయ (భారత్) మరియు చైనాలలో వర్ధిల్లాయి.

→ వరి, గోధుమ, బార్లీ, పప్పులు, పెసలు, సెనగ, మునగ పంటలను పండించారు.

AP 6th Class Social Notes Chapter 5 సంచార జీవనం నుండి స్థిర జీవనం

→ మట్టితో, గడ్డితో చేసిన గుడిసెలలో, ఇండ్లలో నివసించేవారు.

→ గొర్రెలు, మేకలు, ఎద్దులు మొదలైన పశువులను మచ్చిక చేసుకున్నారు.

→ పురాతన సామాగ్రిని, ఎముకలు, పాత్రలు, భవనాలు, అవశేషాలను అధ్యయనం చేసేవారిని పురావస్తు శాస్త్రవేత్తలు అంటారు.

→ మన రాష్ట్రంలో (ఆం.ప్ర.)లో యానాదులు, చెంచులు తెగకు చెందిన వారు కొన్ని ప్రాంతాలలో వేటాడటం, ఆహార సేకరణ ద్వారా నేటికి జీవితాన్ని గడుపుతున్నారు.

→ వేట-ఆహార సేకరణ చేసేవారు : అడవుల నుండి ప్రకృతి సిద్ధంగా లభించే వస్తువులు, జంతువులు, పక్షులను వేటాడేవారు.

→ పశుకాపరులు : పశువులను పెంచేవారు. ఈ పురాతత్వ శాస్త్రజ్ఞుడు : తవ్వకాలలో దొరికిన పురాతన సామగ్రి, ఇతరాలను అధ్యయనం చేసేవారు.

→ స్థిర జీవనం : ఒకచోట నివసించడం. ఈ రాతి పరికరాలు : వివిధ అవసరాలకు రాతితో చేసిన పనిముట్లు.

→ రోలు – రోకలి : వ్యవసాయ ఉత్పత్తులను దంచడానికి ఉపయోగించేవి.

→ కంచు లోహం : రాగి, టిన్ లోహాల మిశ్రమం.

→ మచ్చిక చేసుకొనుట : కావలసిన మొక్కలను, జంతువులను పెంచుకోవడం.

→ సంచార జీవులు : ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి నిరంతరం సంచరించే వారిని సంచార జీవులు అంటారు.

AP 6th Class Social Notes Chapter 5 సంచార జీవనం నుండి స్థిర జీవనం

→ పురావస్తు శాస్త్రవేత్త : ప్రాచీన కాలంలో ప్రజలు నివసించిన ప్రదేశాలలో నేలను త్రవ్వినపుడు దొరికిన పురాతన సామగ్రిని అధ్యయనం చేసేవారు.

→ పాత రాతియుగం : BCE 2.6 మిలియన్ సం||రాల నుండి BCE 10,000 సం||రాల వరకు

→ మధ్య రాతియుగం : BCE 10,000 మిలియన్ సం||రాల నుండి BCE 8,000 సం||రాల వరకు

→ కొత్త (నవీన) రాతియుగం : BCE 8,000 మిలియన్ సం||రాల నుండి BCE 3,000 సం||రాల వరకు

→ రాతి చిత్ర కళాస్థావరాలు : ప్రాచీన కాలం నాటి చిత్రకళ (ఆది మానవుల గీసిన చిత్రాలు)ను కనుగొన్న కొండ/గుహ ప్రాంతాలు.

AP 6th Class Social Notes Chapter 5 సంచార జీవనం నుండి స్థిర జీవనం 1

AP 8th Class Social Notes Chapter 17 పేదరికం – అవగాహన

Students can go through AP Board 8th Class Social Notes 17th Lesson పేదరికం – అవగాహన to understand and remember the concept easily.

AP Board 8th Class Social Notes 17th Lesson పేదరికం – అవగాహన

→ వ్యవసాయ పనులలో మార్పులు రావటంతో కొంతమంది వృత్తిపనివారల జీవితాలలో సమస్యలు వచ్చాయి.

→ తీవ్రమైన ఆకలి కూడా పేదరికమే.

→ దీర్ఘకాల లేదా తీవ్ర ఆకలికి గురయిన వాళ్ళు బలహీనంగా ఉండి తరచు రోగాలబారిన పడుతుంటారు.

→ శక్తిని కిలోకాలరీలలో కొలుస్తారు.

→ పల్లె ప్రాంతాల వాళ్ళకి 2400, పట్టణంలో వాళ్ళకి 2100 కిలో కాలరీలు ఇచ్చే ఆహారం ప్రతిరోజూ అవసరమని జాతీయ స్థాయిలో ప్రామాణికంగా నిర్ధారించారు.

→ పోషకాహారలోపం ఉంటే చదవటం, పనిచేయటం, శారీరక పనులు చేయటం కష్టమవుతుంది.

→ భారత ప్రభుత్వం ప్రతి నాలుగేళ్ళకు ఒకసారి జాతీయ నమూనా సర్వేని నిర్వహిస్తుంది.

→ జనాభాలో అత్యంత పేదవాళ్ళు అత్యంత ధనికుల కంటే చాలా తక్కువ కాలరీలు తీసుకుంటున్నారు.

→ ప్రామాణిక స్థాయిలో కాలరీలు తీసుకొని వాళ్ళనందరినీ పేదలుగా పరిగణించవచ్చు.

→ పేదరికానికి ప్రధాన కారణం క్రమం తప్పకుండా పని దొరకకపోవడం.

AP 8th Class Social Notes Chapter 17 పేదరికం – అవగాహన

→ భారతదేశంలో ఇప్పటికీ 50% కంటే ఎక్కువ ప్రజలు తమ జీవనోపాధికి వ్యవసాయం పనులపై ఆధారపడుతున్నారు.

→ ప్రస్తుతం వ్యవసాయం అనేక సమస్యలను ఎదుర్కొంటూ ఉంది.

→ ప్రాథమిక అవసరాలు సమకూర్చుకోవటానికి, ప్రతి వ్యక్తికి పని కల్పించాలని ‘పనికి హక్కు’ చెపుతోంది.

→ చౌక ధరల దుకాణాల ద్వారా ఆహారధాన్యాలు, ఇతర నిత్యావసర వస్తువులు సరఫరా చేయటాన్ని ప్రజా పంపిణీ వ్యవస్థ అంటారు.

→ BPL సర్వే ఆధారంగా ప్రభుత్వం 3 రకాల కార్డులు జారీ చేసింది.

→ పోషకాహార లోపం : మనం తీసుకునే ఆహారంలో కావలసినన్ని పోషకాలు లేకపోవడం.

→ వ్యవసాయాభివృద్ధి : వ్యవసాయం ప్రస్తుతం సంక్షోభంలో ఉన్నది. ఈ వ్యతిరేక పరిస్థితులను ఎదుర్కొని వ్యవసాయాన్ని లాభసాటిగా ముందుకు నడిపించడమే వ్యవసాయాభివృద్ధి.

→ ఆదేశిక సూత్రాలు : ప్రభుత్వ విధానాలను నిర్దేశించినవే ‘ఆదేశిక సూత్రాలు’

→ ప్రజాపనులు : ప్రజలకు ఉపయోగపడే పనులు.

→ సామాజిక తనిఖీ : ప్రభుత్వంలోని అవినీతిని తగ్గించడానికి ఉద్దేశించినదే ‘సామాజిక తనిఖీ’.

→ దారిద్ర్యరేఖకు దిగువన : కుటుంబం ఆదాయం, జీవనోపాధి మార్గాలు, రోజూ తింటున్న ఆహారం, బట్టలు, గృహవసతి, వలస, అప్పు వంటి అంశాలను సేకరించి, ఆ వివరాలను బట్టి ఆ కుటుంబ స్థాయిని ప్రభుత్వం నిర్ణయిస్తుంది. దానికి కొలబద్దే ఈ దారిద్ర్యరేఖ. దీనికన్నా తక్కువ స్థాయి ఉన్నవారిని దారిద్ర్యరేఖకు దిగువనున్నవారు అని అంటారు.

→ ప్రజాపంపిణీ వ్యవస్థ : చౌకధరల దుకాణాల ద్వారా ఆహారధాన్యాలు, ఇతర నిత్యావసర వస్తువులు సరఫరా చేయడాన్ని ప్రజాపంపిణీ వ్యవస్థ అంటారు.

AP 8th Class Social Notes Chapter 17 పేదరికం – అవగాహన 1

AP 6th Class Social Notes Chapter 4 ఆంధ్రప్రదేశ్ – భూస్వరూపాలు

Students can go through AP Board 6th Class Social Notes 4th Lesson ఆంధ్రప్రదేశ్ – భూస్వరూపాలు to understand and remember the concept easily.

AP Board 6th Class Social Notes 4th Lesson ఆంధ్రప్రదేశ్ – భూస్వరూపాలు

→ భూస్వరూపాలు ముఖ్యంగా మూడు రకాలు. అవి పర్వతాలు, పీఠభూములు, మైదానాలు.

→ భూ ఉపరితలంపై సహజమైన అత్యధిక ఎత్తు కలిగిన ప్రాంతాలు పర్వతాలు.

→ పీఠభూములు అనగా ఎత్తు ఉండి సమతలంగా ఉండే ప్రదేశాలు.

→ అగ్ని పర్వత మూలానికి చెందిన దక్కన్ పీఠభూమి భారతదేశంలో అతి ప్రాచీన పీఠభూమి.

→ రాయలసీమలోని అధికభాగం దక్కన్ పీఠభూమికి చెందినది.

→ సాధారణంగా పీఠభూములు ఖనిజ సంపదను కలిగి ఉంటాయి.

AP 6th Class Social Notes Chapter 4 ఆంధ్రప్రదేశ్ – భూస్వరూపాలు

→ సముద్ర మట్టం నుండి 1,000 నుండి 6,000 మీ|| ఎత్తుగల టిబెట్ పీఠభూమి ప్రపంచంలోనే ఎత్తైన పీఠభూమి.

→ సముద్రమట్టం నుండి గరిష్ఠంగా 200 మీటర్ల ఎత్తులో ఉండే సమతల ప్రాంతాలే మైదానాలు.

→ మైదానాలు ఎక్కువ జనసాంద్రత కలిగి ఉండే ప్రాంతాలు.

→ చోటానాగపూర్ పీఠభూమిలో ఇనుము, బొగ్గు, మాంగనీస్ నిల్వలు అత్యధికంగా కనుగొనబడినది.

→ అంధ్రప్రదేశ్ తీర రేఖ పొడవు 972 కి. మీ.||

→ ఆంధ్రప్రదేశ్ విస్తీర్ణతపరంగా భారతదేశంలో ఏడవ పెద్ద రాష్ట్రం, జనాభాపరంగా 10వ పెద్ద రాష్ట్రం.

→ కోస్తా ఆంధ్ర ప్రాంతాలలో 9 జిల్లాలున్నాయి. ఇది సారవంతమైన ప్రదేశం.

→ రాయలసీమ ప్రాంతంలో 4 జిల్లాలున్నాయి. అనిశ్చిత వర్షపాత ప్రాంతం.

→ ఆంధ్రప్రదేశ్ లో కొండల వరుసలు విచ్చిన్న శ్రేణులుగా ఉండి తూర్పు కనుమలుగా పిలవబడుతున్నాయి.

→ 1690 మీ|| ఎత్తుగల అరుకులోయలోని అరోమకొండ (జిందగడ) మన రాష్ట్రంలో ఎత్తయిన శిఖరం.

→ పోలవరం ప్రాజెక్ట్ గోదావరి నదిపై నిర్మిస్తున్నారు.

→ విశాఖ జిల్లాలోని అరకులోయ, బొర్రాగుహలు, తూర్పు గోదావరి జిల్లాలోని పాపికొండలు పేరుపొందిన పర్యాటక ప్రదేశాలు.

→ లంబ సింగి/ లమ్మసింగిని ఆంధ్రా కాశ్మీర్‌గా పిలుస్తారు.

AP 6th Class Social Notes Chapter 4 ఆంధ్రప్రదేశ్ – భూస్వరూపాలు

→ పోడు అనేది గిరిజన వ్యవసాయ పద్ధతి. దీనినే ‘స్థలమార్పిడి’ లేదా ‘ఝూమ్’ వ్యవసాయం అనికూడా పిలుస్తారు.

→ 1989లో శ్రీశైలంలో ఇంటిగ్రేటెడ్ గిరిజన అభివృద్ధి సంస్థ యొక్క ప్రధాన కార్యాలయంను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

→ ఆంధ్రప్రదేశ్ పీఠభూమి ప్రాంతం రాయలసీమలో కలదు. ఇక్కడ వర్షపాతం తక్కువ మరియు అంతగా నమ్మదగినదిగా ఉండదు.

→ ఆంధ్రప్రదేశ్ లో మైదానాలు కోస్తా జిల్లాలో విస్తరించి ఉన్నాయి.

→ డెల్టా మైదానాలు ఆహార ధాన్యాలకు గిడంగుల వంటివి.

→ వర్షకాలపు పంటని ఖరీఫ్’గానూ, శీతాకాలపు పంటని ‘రబీ’ అని పిలుస్తారు.

→ కొల్లేరు సరస్సు పశ్చిమ గోదావరి జిల్లాలో కలదు.

→ పులికాట్ సరస్సు నెల్లూరు జిల్లాలో కలదు.

→ ఎక్కువ ఆదాయాన్ని, లాభాన్ని ఇచ్చే పంటలను నగదు పంటలు / వ్యాపార, వాణిజ్య పంటలు అంటారు.

→ ఆహార పంటలు సామాన్యంగా వినియోగం కొరకు సాగు చేసేవి.

→ ఆహారం కొరకు జలచరాలను పెంచుటను (సాగు చేయుటను) ‘ఆక్వాకల్చర్’ అంటారు.

→ ఆహారం, వస్త్రధారణ, వృత్తులు వారి జీవనోపాధులు ప్రాంతీయంగా ఉండే భౌగోళిక పరిసరాలు, శీతోష్ణస్థితితో చాలా దగ్గర సంబంధాన్ని కలిగి ఉంటాయి.

→ ఆంధ్రప్రదేశ్ లోని కొండలు (తూర్పు కనుమలు) భాండలైట్, చార్నోకైట్ రాళ్ళతో ఏర్పడినవి.

→ కొండ ప్రాంతాలు (నేలలు) కాఫీ, తేయాకు తోటల వంటి పానీయపు పంటలకు అనువుగా ఉంటాయి.

→ కడప, కర్నూలు జిల్లాల్లో నల్లరేగడి నేలలు కలవు.

→ చౌడు నేలల్లో ఎక్కువగా సున్నం, క్షార లవణాలు ఉంటాయి. ఇవి పంటలకు అనుకూలంగా ఉండవు.

→ ఉత్తరాన శ్రీకాకుళం నుంచి దక్షిణాన ఉన్న పులికాట్ సరస్సు వరకు విస్తారమైన తీర మైదానం ఉంది.

→ ఆంధ్రప్రదేశ్ లోని రెండు ప్రధాన నదులు గోదావరి, కృష్ణా.

AP 6th Class Social Notes Chapter 4 ఆంధ్రప్రదేశ్ – భూస్వరూపాలు

→ యారాడ మరియు అనంతగిరి కొండలు విశాఖపట్నం జిల్లాలో కలవు.

→ శేషాచలం, హార్సిలీ కొండలు చిత్తూరు జిల్లాలో కలవు.

→ పెనుకొండ, మడకశిర కొండలు అనంతపురం జిల్లాలో కలవు.

→ పూర్వకాలంలో వర్షపునీటిని నిల్వ ఉంచుకోవడానికి చెరువులు తవ్వేవారు.

→ భూస్వరూపం : భూమి ఉపరితలం పైన విస్తరించి ఉన్న వివిధ భూభాగాలు.

→ భూభాగం : ఒక ప్రదేశం యొక్క భౌగోళిక స్థితిని తెలుపుతుంది.

→ మధ్యవర్తి : ఒక వ్యక్తి లేదా సమూహానికి ప్రతినిధిగా వ్యవహరించేవాడు.

→ నీటి ఊట : భూమి ఉపరితలం పైకి ఉబికి వచ్చే నీటి జాడ.

→ కరవు : సుదీర్ఘమైన వర్షాభావం వల్ల ఏర్పడే స్థితి.

→ కరవుకు గురయ్యే ప్రాంతం : తరచుగా కరవులు వచ్చే ప్రదేశం.

→ ఒండ్రు మట్టి నేలలు : నదీప్రవాహం మేట వేయటం వలన ఏర్పడిన సారవంతమైన నేలలు.

→ ఉద్యానవనాలు : పండ్లతోటలు.

→ మెరక భూములు : మైదాన ప్రాంతానికి కన్నా కొంచెం ఎత్తుగా ఉన్న ప్రదేశాలు.

→ పర్వతాలు : భూ ఉపరితలంపై సహజమైన ఎత్తు కలిగిన ప్రాంతాలు పర్వతాలు, కింది భాగంలో విశాలంగాను, పై భాగంలో చిన్న శిఖరాన్ని కల్గి ఉంటాయి.

→ పీఠభూములు : ఎత్తుగా ఉండి సమతలంగా ఉండే ప్రదేశాలు. ఇవి పరిసరాల కంటే ఎత్తయిన సమ ఉపరితలం గల బల్ల పరుపు భూములే పీఠభూములు.

→ మైదానాలు : సముద్ర మట్టం నుండి గరిష్ఠంగా 200 మీటర్ల ఎత్తులో ఉండే సమతల ప్రాంతాలే మైదానాలు.

→ కోస్తా ఆంధ్ర : ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న 9 జిల్లాలను కోస్తా ఆంధ్రగా పిలుస్తారు.

→ రాయలసీమ : రాతిపొరలు, పొడి నేలలతో కూడిన 4 జిల్లాల సమాహారం.

→ ఖరీఫ్ : వర్షాకాలపు పంట (జూన్, జులై నెలలో ప్రారంభించే పంట)

→ రబీ : శీతాకాలపు పంట (డిసెంబరు నెలలో వేసే పంట)

AP 6th Class Social Notes Chapter 4 ఆంధ్రప్రదేశ్ – భూస్వరూపాలు

→ నగదు పంట/వ్యాపార వాణిజ్య పంట : అధిక ఆదాయాన్ని, లాభాన్ని ఇచ్చే పంటలు.
ఉదా : వేరుశనగ, పొగాకు.

→ ఆహార పంటలు : ఆహార పంటలు సామాన్యంగా వినియోగం కొరకు సాగుచేసేవి.
ఉదా : వరి

→ ఆక్వాకల్చర్ (జలసేద్యం) : ఆహారం కొరకు జలచరాలను పెంచుటను (సాగు చేయుటను) ఆక్వాకల్చర్ అంటారు.

→ చౌడు నేలలు : ఎక్కువగా సున్నం, క్షార లవణాలు ఉండి పంటలు పండించటానికి అనుకూలంగా ఉండని నేలలు.

→ భూగర్భ జలం : నేల లోపలి పొరలలో ఉండే నీరు.

→ దక్కన్ పీఠభూమి : భారతదేశంలో దక్షిణాన ఉన్న పీఠభూమి, ఆంధ్రప్రదేశ్ ఈ పీఠభూమిలోని తూర్పు భాగానికి చెందినది.

→ గిరిజనులు : కొండ ప్రాంతాలలో (అడవుల్లో) నివసించే ఆదిమ జాతులు.

→ పెరటి తోట : ఇంటి ఆవరణలో పెంచేతోట.

→ అటవీ ఉత్పత్తులు : అడవులలో దొరికే ఉత్పత్తులు.

→ పోడు వ్యవసాయం (ఝూమ్) : కొండ ప్రాంతాలలో గిరిజనులు చేయు ఒక వ్యవసాయ పద్ధతి. అడవులను నరికి (కాల్చి, ఆ ప్రాంతంలో వ్యవసాయం చేస్తారు. తరువాత భూసారం తగ్గడం వలన వేరే స్థలానికి మారతారు.

AP 6th Class Social Notes Chapter 4 ఆంధ్రప్రదేశ్ – భూస్వరూపాలు

→ గొట్టపు బావులు : భూమిలోపలికి డ్రిల్లింగ్ ద్వారా గొట్టములను పంపి నీరును, మోటార్ల ద్వారా బయటకు తీసుకు వచ్చుట.

→ ITDA : ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ అథారిటీ.

→ డెల్టా : నది సముద్రంలో కలిసే ముందు ఏర్పడే పాయల మధ్యభాగం మెత్తటి మట్టి మేటలుగా ఏర్పడుతుంది. ఇవి సాధారణంగా ‘∆’ ఆకారంలో ఉంటాయి. ఇవే డెల్టాలు.

AP 6th Class Social Notes Chapter 4 ఆంధ్రప్రదేశ్ – భూస్వరూపాలు 1

AP 8th Class Social Notes Chapter 16 జమీందారీ వ్యవస్థ రద్దు

Students can go through AP Board 8th Class Social Notes 16th Lesson జమీందారీ వ్యవస్థ రద్దు to understand and remember the concept easily.

AP Board 8th Class Social Notes 16th Lesson జమీందారీ వ్యవస్థ రద్దు

→ స్వాతంత్ర్యం వచ్చే నాటికి భారతదేశంలో పేదరికం ఎక్కువగా ఉంది. కరవు కాటకాలు, రోగాలు తరచు సంభవిస్తూ వినాశనాన్ని సృష్టించేవి.

→ బ్రిటిషు కాలంలోని ఆందోళనలు రైతుకూలీల సమస్యలు, వారి కోరికలు, ఆశలపై దృష్టి కేంద్రీకరించాయి. ‘దున్నేవాడికి భూమి’ అని నినదించారు.

→ జమీందారీ వ్యవస్థను రద్దు చేసే చట్టాన్ని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు 1950లో చేశాయి.

→ మద్రాసు ఎస్టేట్ బిల్లు 1950లో అమలులోకి వచ్చింది.

→ 1927లోనే వెట్టిని నిర్మూలిస్తూ చట్టం చేశారు. కానీ అది 1948 నాటికి అంతమయింది.

→ 1949, ఆగస్టు 15న జారీ చేసిన మరొక ఫర్మానా ద్వారా చిన్న చిన్న రాజ్యాలుగా ఉన్న 995 జాగీర్లను రద్దు చేశారు.

→ అన్ని రకాల కౌలుదార్లకు రక్షణ కల్పిస్తూ ప్రఖ్యాత హైదరాబాదు కౌలుదారీ చట్టాన్ని 1950లో చేశారు.

→ భూకేంద్రీకరణ సమస్యను శాంతియుత పద్ధతుల ద్వారా, అంటే భూదాన ఉద్యమం ద్వారా పరిష్కరించాలని సర్వోదయ నాయకుడు ఆచార్య వినోబాభావే భావించాడు.

→ భూపరిమితి చట్టాన్ని ఆంధ్రప్రదేశ్ శాసనసభ, విధానసభలు 1972 సెప్టెంబరులో ఆమోదించాయి.

→ భూ పరిమితి : ఒక్కొక్క కుటుంబం ఎంత భూమి కలిగి ఉండాలనే పరిమితి.

→ జాగీరుదారీ వ్యవస్థ : చిన్న చిన్న రాజ్యాలను జాగీర్లు అనేవారు. వీటిని పాలించే వారిని జాగీర్దారులు అంటారు. ఈ వ్యవస్థ జాగీర్దారీ వ్యవస్థ.

→ ఫర్మానా : ప్రభుత్వ ఉత్తర్వులు – నాటి నిజాం ప్రభుత్వ ఉత్తర్వులు.

→ కౌలుదారీ చట్టం : కౌలుదారులను భూ యజమానులుగా ప్రకటించిన చట్టం.

AP 8th Class Social Notes Chapter 16 జమీందారీ వ్యవస్థ రద్దు

→ భూదాన ఉద్యమం : ఆచార్య వినోబాభావే ప్రారంభించిన ఉద్యమం. భూమి ఉన్నవారి నుండి సేకరించి, లేనివారికి పంచడం.

→ సర్ఫ్-ఎ-ఖాస్ : నిజాం సొంత ఆస్తి.

→ మక్తాలు : చిన్న చిన్న రాజ్యాల లాంటివి.

→ భూకమతం : ఒక యజమాని కలిగియున్న భూమి.

→ బేగార్ / వెట్టి : ఫలం లేకుండా ఇతరుల వద్ద పనిచేయడం (బలవంతంగా)

→ నష్టపరిహారం : ఏదేనీ ఒక వస్తువును పోగొట్టుకున్నందుకు బదులుగా పొందేది.

→ ఖుద్‌కాస్త్ : జమీందారుల సొంత భూమి.

AP 8th Class Social Notes Chapter 16 జమీందారీ వ్యవస్థ రద్దు 1

AP 6th Class Social Notes Chapter 3 పటములు

Students can go through AP Board 6th Class Social Notes 3rd Lesson పటములు to understand and remember the concept easily.

AP Board 6th Class Social Notes 3rd Lesson పటములు

→ చిత్తు చిత్రంలో స్కేల్, దిక్కులు చూపకుండ గీస్తారు.

→ ప్రధాన దిక్కులు నాలుగు, మూలలు నాలుగు.

→ పటాలలో కుడిచేతివైపు పైన ‘N’ అనే అక్షరం, బాణం గుర్తు ఉంటాయి.

→ భూమిపై కల వాస్తవ దూరానికి పటంలో చూపబడిన దూరానికి గల నిష్పత్తినే స్కేలు అని పిలుస్తాం.

→ పటాలను తయారు చేసేవారిని కార్టోగ్రాఫర్లు అని పిలుస్తారు.

→ పటాల సంకలనాన్ని అట్లాస్ అని పిలుస్తారు.

AP 6th Class Social Notes Chapter 3 పటములు

→ పటాలను రాజకీయ, భౌతిక, విషయ నిర్దేశిత పటాలు అని 3 రకాలుగా వర్గీకరించవచ్చు.

→ ఆసియా ప్రపంచంలో పెద్ద ఖండం కాగా భారతదేశం అందులో ఒక భాగం.

→ పర్వతాలు, పీఠభూములు, మైదానాలు, సముద్రాలు, నదులు, ఎడారులు వంటి భౌగోళిక స్వరూపాలను భౌతిక పటాలు వివరిస్తాయి.

→ విశాల భూభాగాలను ఖండాలు అని, జలభాగాలను మహా సముద్రాలు అని పిలుస్తారు.

→ ఖండాలు 7, మహాసముద్రాలు 5 కలవు.

→ GPS అనగా గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్.

→ గ్రామాలు, నగరాలు, పట్టణాలు, జిల్లాలు, రాష్ట్రాలు మరియు దేశాల సరిహద్దులు చూపేవి రాజకీయ పటాలు.

→ కొన్ని విషయ నిర్దేశిత పటాలలో రంగులకి బదులుగా చుక్కలు, గీతలు దిద్దడం వంటి నమూనాలను కూడా ఉపయోగిస్తారు.

→ పటం, మానచిత్రం : ప్రామాణిక కొలతలతో గీసిన పటం.

→ చిత్తు పటం : పరిశీలించిన స్థలాలు, సంకేతాలు గుర్తు ఉంచుకుని స్కేలు లేకుండా గీసిన పటం.

→ ప్రణాళిక : విస్తృతమైన స్కేలుపై చిత్రించిన చిన్న ప్రదేశాన్ని సూచించునది.

→ కొలబద్ద : నేలపై సహజమైన దూరానికి, పటంలో సూచించిన దూరానికి గల నిష్పత్తిని తెలుపునది.

→ దిక్కులు : తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణ దిశలు.

AP 6th Class Social Notes Chapter 3 పటములు

→ మూలలు : రెండు దిక్కుల మధ్యగల దిశ. (ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం)

→ దిక్సూచి : రెండు బిందువుల మధ్య దూరాన్ని కొలుచుటకు వృత్తాలు, రేఖలు గీయుటకు ఉపయోగించే పరికరం.

→ కార్టోగ్రాఫర్లు : పటాలను తయారు చేసేవారిని కార్టోగ్రాఫర్లు అంటారు.

→ అట్లాస్ : పటాల సంకలనాన్ని అట్లాస్ అని పిలుస్తారు.

→ చిహ్నాలు : మాన చిత్రాల్లో వాడు వివిధ గుర్తులు. ఇవి ప్రపంచ ప్రామాణికమైనవి.

→ ప్రధాన దిక్కులు : నాలుగు ప్రధాన దిక్కులు :

  1. ఉత్తరం
  2. దక్షిణం
  3. తూర్పు
  4. పడమర

→ విషయ నిర్దేశిత పటాలు : ఒక నిర్ణీతమైన అంశాన్ని కాని, విషయాన్ని కాని తెలిపే పటాలు.

→ GPS : గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (మ్)

→ ఖండాలు : భూమిపై గల విశాల భూభాగాలు.

→ మహాసముద్రాలు : భూ ఉపరితలంపై విశాలంగా ఆవరించియున్న జలభాగాలు.

→ పటాల్లో రకాలు : రాజకీయ, భౌతిక, విషయ నిర్దేశిత అను మూడు రకాల పటాలు.

AP 6th Class Social Notes Chapter 3 పటములు

→ రాజకీయ పటములు : వివిధ దేశముల రాజకీయ విభాగాలు, సరిహద్దులు, రాష్ట్రాలు జిల్లాలు, ముఖ్య పట్టణాలు మొదలైనవి సూచించే పటాలు.

→ భౌతిక పటములు : వివిధ భూస్వరూపములను (పర్వతాలు, పీఠభూములు, మైదానాలు, నదులు మొదలైనవి) నిర్దిష్ట రంగులు, ఎత్తు పల్లములతో సూచించే పటాలు.

AP 6th Class Social Notes Chapter 3 పటములు 1