These AP 10th Class Social Studies Important Questions 19th Lesson రాజకీయ ధోరణుల ఆవిర్భావం : 1977-2000 will help students prepare well for the exams.
AP Board 10th Class Social 19th Lesson Important Questions and Answers రాజకీయ ధోరణుల ఆవిర్భావం : 1977-2000
10th Class Social 19th Lesson ½ Mark Important Questions and Answers in Telugu Medium
1. 1977లో జరిగిన ఎన్నికలలో విజయం సాధించి జనతాపార్టీ తరపున ప్రధానమంత్రి అయిన వారు ఎవరు?
 జవాబు:
 మొరార్జీ దేశాయ్.
2. మొదటి కాంగ్రెసేతర ప్రధాని ఎవరు?
 జవాబు:
 మొరార్జీ దేశాయ్.
    
3. భారతదేశంలో అత్యవసర పరిస్థితి నిలుపుదల చేసిన సంవత్సరం ఏది?
 జవాబు:
 1977.
4. ఆపరేషన్ బ్లూస్టార్ చేపట్టినది ఎవరు?
 జవాబు:
 ఇందిరాగాంధీ.
    
5. L.K. అద్వానీచే రామజన్మభూమి రథయాత్ర ప్రారంభించ బడిన సంవత్సరం?
 జవాబు:
 1990.

    
6. భారత రాష్ట్రపతి పదవికి ఏకగ్రీవంగా ఎన్నికై భారత ఆరవ రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసినది ఎవరు?
 జవాబు:
 నీలం సంజీవరెడ్డి.
7. పంజాబ్ కి పరిమితమై నిక్కులకోసం ప్రత్యేకంగా పనిచేస్తున్న పార్టీ ఏది?
 జవాబు:
 శిరోమణి అకాలీదళ్ (SAD)
8. 1970లలో అసోంలో వచ్చిన సామాజిక ఉద్యమానికి నాయకత్వం వహించిన వారు?
 జవాబు:
 అఖిల అసోం విద్యార్థి సంఘం.
9. పంజాబులో తీవ్రవాద సిక్కుల బృందానికి నాయకత్వం వహించింది ఎవరు?
 జవాబు:
 బింద్రేన్ వాలా.
10. శ్రీలంకతో శాంతి ప్రక్రియలకు శ్రీకారం చుట్టిన మనదేశ ప్రధాని ఎవరు?
 జవాబు:
 రాజీవ్ గాంధీ.
11. 1989లోని మొదటి సంకీర్ణ ప్రభుత్వం తరపున ప్రధాన మంత్రి పదవిని చేపట్టినదెవరు?
 (లేదా)
 మొదటి సంకీర్ణ ప్రభుత్వం ఎవరి నేతృత్వంలో ఏర్పడింది?
 జవాబు:
 వి.పి. సింగ్
12. 1991 మే 21న రాజీవ్ గాంధీని పెరంబూర్లో హత్య గావించిన తీవ్రవాద సంస్థ ఏది?
 జవాబు:
 LTTE
13. ‘ఆపరేషన్ బర్గా’ను చేపట్టిన రాష్ట్రం ఏది?
 జవాబు:
 పశ్చిమ బెంగాల్.
14. రాష్ట్రాలలో రాష్ట్రపతి పాలన ప్రవేశ పెట్టుటకు దోహదం చేసే రాజ్యాంగ అధికరణ ఏది?
 జవాబు:
 356వ అధికరణ.
15. మండల్ కమీషన్ సిఫారసులను అమలు చేసిన ప్రభుత్వం ఏది?
 జవాబు:
 V.P. సింగ్ ప్రభుత్వం

16. తెలుగు దేశం పార్టీ ఏర్పాటులో ప్రధాన సిద్ధాంతం ఏది?
 జవాబు:
 ఆంధ్రుల ఆత్మగౌరవం.
17. స్థానిక సంస్థలలో స్త్రీలకు ఎన్నోవంతు సీట్లను కేటాయించారు?
 జవాబు:
 1/3 వంతు.
18. రెండూ లేదా అంతకంటే ఎక్కువ రాజకీయ పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడాన్ని ఏమంటారు?
 జవాబు:
 సంకీర్ణ ప్రభుత్వం
19. ‘బర్మా’ ప్రస్తుత నామం ఏమిటి?
 జవాబు:
 మయన్మార్.
20. చండిఘర్ను కేంద్ర పాలిత ప్రాంతంగా కాక తమ రాష్ట్రానికి చెందాలని కోరిన రాష్ట్రం ఏది?
 జవాబు:
 పంజాబు.
21. 1986 ఏప్రిల్ లో ఎక్కడ జరిగిన సమావేశంలో ఖలిస్తాను స్వతంత్ర దేశంగా ప్రకటించారు?
 జవాబు:
 అకల్ తఖ్త్
22. 1977 సాధారణ ఎన్నికల తర్వాత పశ్చిమ బెంగాల్ లో అధికారంలోకి వచ్చిన పార్టీ ఏది?
 జవాబు:
 CPI(M)
23. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా గ్రామస్థాయిలో స్థానిక స్వపరిపాలన పెట్టబడింది?
 జవాబు:
 73వ
24. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా పట్టణ స్థాయిలో స్థానిక స్వపరిపాలన పెట్టబడింది?
 జవాబు:
 74 వ.

25. స్థానిక స్వపరిపాలనకు రాజ్యాంగ గుర్తింపునిస్తూ 1992 సంవత్సరంలో రాజ్యాంగ సవరణ చేసిన ప్రభుత్వం ఏది?
 జవాబు:
 P.V. నరసింహారావు ప్రభుత్వం
26. ‘గోల్డెన్ టెంపుల్’ ఏ మతస్థులకు పవిత్ర స్థలం?
 జవాబు:
 సిక్కులకు
27. AGPని విస్తరింపుము.
 జవాబు:
 అస్సోం గణ పరిషత్.
28. SADని విస్తరింపుము.
 జవాబు:
 శిరోమణి అకాలీ దళ.
29. AASUని విస్తరింపుము.
 జవాబు:
 అఖిల అసోం విద్యార్థి సంఘం.
30. DMK ని విస్తరింపుము.
 జవాబు:
 ద్రవిడ మున్నేట్ర ఖజగం.
31. BLDని విస్తరింపుము.
 జవాబు:
 భారతీయ లోక్ దళ్
32. NDA ని విస్తరింపుము.
 జవాబు:
 నేషనల్ డెమొక్రాటిక్ అలయన్స్.
33. UPA ని విస్తరింపుము.
 జవాబు:
 యునైటెడ్ ప్రోగ్రెస్సివ్ అలయన్స్
34. ఇందిరా గాంధీని ఏ సంవత్సరంలో హత్య గావించారు?
 జవాబు:
 1984లో

35. సిక్కులు కోరిన ప్రత్యేక దేశంను ఏమంటారు?
 జవాబు:
 ఖలిస్తాన్.
36. వెనకబడిన తరగతులకు ఎంతశాతం రిజర్వేషన్లు కల్పించాలని మండల్ కమీషన్ సిఫారసు చేసింది?
 జవాబు:
 27%
37. ‘బోఫోర్సు’ కుంభకోణం ఆరోపణలను ఎదుర్కొన్న ప్రధాని ఎవరు?
 జవాబు:
 రాజీవ్ గాంధీ.
38. NDAకు నాయకత్వం వహిస్తున్న పార్టీ ఏది?
 జవాబు:
 బి.జె.పి. (BJP)
39. UPA కు నాయకత్వం వహిస్తున్న పార్టీ ఏది?
 జవాబు:
 కాంగ్రెస్ పార్టీ.
40. బెంగాలీ భాషలో ‘బర్గాదార్లు’ అనగా?
 జవాబు:
 కౌలుదార్లు.
41. ఆరవ సార్వత్రిక ఎన్నికలు ఎప్పుడు జరిగాయి?
 జవాబు:
 1977 మార్చిలో
42. ఆరవ లోకసభకు స్పీకర్గా ఎవరు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు?
 జవాబు:
 నీలం సంజీవరెడ్డి.

49. ఇంతవరకు లోకసభ స్పీకర్ గా అతి తక్కువ కాలం పనిచేసింది ఎవరు?
 జవాబు:
 నీలం సంజీవరెడ్డి.
44. మొట్ట మొదటిసారిగా ఏకగ్రీవంగా ఎన్నికైన భారత రాష్ట్రపతి ఎవరు?
 జవాబు:
 నీలం సంజీవరెడ్డి.
45. నీలం సంజీవరెడ్డి రాష్ట్రపతిగా ఉన్నకాలంలో మొరార్జీ దేశాయ్, వి.పి.సింగ్, చరణ్ సింగ్, ఇందిరాగాంధీలలో ఎవరు ప్రధాన మంత్రిగా పనిచేయలేదు?
 జవాబు:
 వి.పి.సింగ్.
46. 1977లో తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో అధికారంలోకి వచ్చిన పార్టీ ఏది?
 జవాబు:
 DMK
47. BLD ప్రధానంగా ఏ రాష్ట్రంలో ఉండేది?
 జవాబు:
 ఉత్తర ప్రదేశ్.

48. SAD ఏ రాష్ట్రానికి పరిమితమైన పార్టీ?
 జవాబు:
 పంజాబు.
49. మొరార్జీ దేశాయ్ తర్వాత ప్రధాన మంత్రి ఎవరు?
 జవాబు:
 చరణ్ సింగ్.
50. ఏదైన ఒక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలంటే (356 ప్రకారం) ఎవరి సిఫారసు అవసరం?
 జవాబు:
 ఆ రాష్ట్ర గవర్నర్.
51. కేంద్ర ప్రభుత్వం 356వ అధికరణాన్ని ప్రయోగించడానికి ఖచ్చితమైన నియమాలను ఏ తీర్పులో పేర్కొన్నారు?
 జవాబు:
 1994 సుప్రీంకోర్టు తీర్పులో
52. TDP ని ఎవరు స్థాపించారు?
 జవాబు:
 N.T. రామారావు
53. TDP ని ఎప్పుడు స్థాపించారు?
 జవాబు:
 1982లో
54. N.T. రామారావు ప్రభుత్వాన్ని భర్తరఫ్ చేసిన గవర్నర్ ఎవరు?
 జవాబు:
 రామ్ లాల్.
55. కేంద్ర ప్రభుత్వం, AASU మధ్య ఒప్పందం ఏ సంవత్సరంలో జరిగింది?
 జవాబు:
 1984
56. AASU కు అనుబంధంగా ఏర్పడిన పార్టీ ఏది?
 జవాబు:
 AGP.
57. పంజాబు రాష్ట్రం ఎప్పుడు ఏర్పడింది?
 జవాబు:
 1 నవంబరు, 1966 న

58. భాక్రానంగల్ ఆనకట్ట ఏ నదిపై, ఏ రాష్ట్రంలో నిర్మించారు?
 జవాబు:
 సట్లెజ్ నదిపై, హిమాచల్ ప్రదేశ్ లో.
59. గోల్డెన్ టెంపుల్ ని ఆక్రమించుకున్న సిక్కు తీవ్రవాదులను ఖాళీ చేయించడానికి చేసిన ఆపరేషన్ పేరేమిటి?
 జవాబు:
 ఆపరేషన్ బ్లూస్టార్ (1984).
60. ఇందిరాగాంధీ తర్వాత ప్రధాని అయినది ఎవరు?
 జవాబు:
 రాజీవ్ గాంధీ.
61. మిజో నేషనల్ ఫ్రంట్ కి, కేంద్ర ప్రభుత్వంకి మధ్య ఎప్పుడు ఒప్పందం కుదిరింది?
 జవాబు:
 1986 జూన్ 30 న.
62. “పేదలకోసం ఖర్చు పెడుతున్న ప్రతిరూపాయిలో 15 పైసలు కూడా వారికి చేరటం లేదని” అన్న ప్రధాని ఎవరు?
 జవాబు:
 రాజీవ్ గాంధీ.
63. 1984లో జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్ల విషయంలో ఏ ప్రధానమంత్రి క్షమాపణలు చెప్పారు? ఎప్పుడు?
 జవాబు:
 మన్మోహన్ సింగ్, రాజ్యసభలో 2005 ఆగస్టు 11న.
64. బాబ్రీ మసీదు ఎక్కడ ఉంది?
 జవాబు:
 అయోధ్యలో (ఉత్తరప్రదేశ్)
65. బోఫోర్స్ శతఘ్నులను ఏ దేశం నుంచి కొన్నారు?
 జవాబు:
 స్వీడన్.
66. భారత రాజకీయ చరిత్రలో ఏర్పడిన మొట్టమొదటి సంకీర్ణ ప్రభుత్వమేది?
 జవాబు:
 నేషనల్ ఫ్రంట్.
67. భారత కమ్యూనిస్ట్ పార్టీ, భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్, రివల్యూషనరీ సోషలిస్టు పార్టీ, భారతీయ జనతాపార్టీలలో భిన్నమైనది ఏది?
 జవాబు:
 భారతీయ జనతా పార్టీ.

68. 1977లో పశ్చిమ బెంగాల్ రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో గెలిచి, వామపక్ష ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన ముఖ్యమంత్రి ఎవరు?
 జవాబు:
 జ్యోతిబసు.
69. ఆపరేషన్ బర్గాను పశ్చిమబెంగాల్ ఎప్పుడు చేపట్టింది?
 జవాబు:
 1978లో
70. BSP ని విస్తరించండి.
 జవాబు:
 బహుజన్ సమాజ్ పార్టీ,
71. రథయాత్ర చేస్తున్న L.K. అద్వానీని ఏ రాష్ట్రంలో అరెస్ట్ చేశారు?
 జవాబు:
 బీహార్లో
72. క్రింది వానిలో సరికాని జతను గుర్తించండి?
 ఎ) రామజన్మభూమి రథయాత్ర – 1990
 బి) రాజీవ్ గాంధీ హత్య – 1991
 సి) ఆపరేషన్ బ్లూస్టార్ – 1984
 డి) ఆపరేషన్ బర్గా – 1987
 జవాబు:
 డి) ఆపరేషన్ బర్గా – 1987.
73. క్రింది వానిలో సరిఅయిన జతను గుర్తించి, రాయండి.
 → కాంగ్రెసు (0) – ఇందిరాగాంధీ
 → SAD – హర్యానా రాష్ట్రం
 → BLD – ఉత్తర ప్రదేశ్
 → జనసంఘ్ – జమ్ము & కాశ్మీర్
 జవాబు:
 BLD – ఉత్తరప్రదేశ్
74. క్రింద ఇచ్చిన వానిలో అస్సోం రాష్ట్రం యొక్క ప్రధాన వనరులు ఏవి?
 టీ, కాఫీ, ముడిచమురు, ఇనుప ఖనిజము.
 జవాబు:
 టీ, ముడిచమురు.

75. క్రింది వానిలో సరికాని జతను గుర్తించండి.
 i) తీవ్రవాద సిక్కు బృంద నాయకుడు, – బింద్రేన్వాలా
 ii) SAD అధ్యక్షుడు – సంత్ లాంగో వాల్
 iii) AGP అధ్యక్షుడు – జ్యోతిబసు
 iv) భారతదేశ ఆరవ రాష్ట్రపతి – నీలం సంజీవరెడ్డి
 జవాబు:
 (iii)
76. క్రింది వాటిని సరిగా జతపరచండి.
 i) DMK ( ) a) తమిళనాడు
 ii) SAD ( ) b) పంజాబు
 iii)AGP ( ) c) అస్సోం
 iv) BLD ( ) d) ఉత్తరప్రదేశ్
 జవాబు:
 i – a, ii – b, iii – c, iv – d
77. ఇవ్వబడిన ప్రధాన మంత్రులను సరియైన కాలక్రమంలో
 i) రాజీవ్ గాంధీ
 ii) V.P. సింగ్
 iii) ఇందిరాగాంధీ
 iv) పి.వి. నరసింహారావు
 జవాబు:
 iii, i, ii & iv
78. క్రింద ఇవ్వబడిన సంఘటనలను సరియైన కాల క్రమంలో అమర్చండి.
 i) TDP ఆవిర్భావం
 ii) శ్రీలంకతో ఒప్పందం
 iii) రామ జన్మభూమి రథయాత్ర.
 iv) సరళీకృత ఆర్థిక విధానాలు
 జవాబు:
 i, ii, iii & iv
79. ‘విధాన పక్షపాతం’ అనగా నేమి?
 జవాబు:
 భాగస్వామ్య మద్దతు ఉపసంహరించుకుంటుందన్న భయంతో తీవ్ర మార్పులను అమలు చేయకపోవటం.
80. భారతదేశంలో ‘టెలికం విప్లవం’ను ప్రారంభించిన ప్రధాని ఎవరు?
 జవాబు:
 రాజీవ్ గాంధీ.
81. క్రింది వారిలో ప్రధానమంత్రి పదవిలో అతి తక్కువ కాలం కొనసాగిన వారు ఎవరు?
 ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, P.V. నరసింహారావు, V.P. సింగ్
 జవాబు:
 రాజీవ్ గాంధీ
82. భారతదేశంలో సరళీకృత ఆర్థిక విధానాలు ప్రవేశపెట్టిన ప్రధాని ఎవరు?
 జవాబు:
 P.V. నరసింహారావు

83. సరికాని జతను ఎంచుకుని, రాయండి.
 → రామజన్మభూమి రథయాత్ర – L.K. అద్వానీ
 → రాజీవ్ గాంధీ హత్య – LTTE
 → మండల కమీషన్ – OBC లకు రిజర్వేషన్లు
 → మొదటి సంకీర్ణ ప్రభుత్వం – P.V. నరసింహారావు
 జవాబు:
 మొదటి సంకీర్ణ ప్రభుత్వం – P.V. నరసింహారావు
84. క్రింది సంఘటనలను సరియైన కాలక్రమంలో అమర్చండి.
 i) ఆపరేషన్ బ్లూస్టార్
 ii) మిజోనేషనల్ ఫ్రంట్ తో ఒప్పందం
 iii) జనతాదళ్ ప్రభుత్వం ఏర్పాటు
 iv) బాబ్రీ మసీదు కూల్చివేత.
 జవాబు:
 i, ii, iii & in
85. క్రింది వానిని సరిగా జతపరచండి.
 i) సరళీకృత ఆర్థిక విధానాలు ( ) a) ఇందిరాగాంధీ
 ii) టెలికం విప్లవం ( ) b) V.P. సింగ్ ఉంచండి.
 iii)మండల కమీషన్ ( ) c) రాజీవ్ గాంధీ
 iv) బ్యాంకుల జాతీయికరణ ( ) d) P.V. నరసింహారావు
 జవాబు:
 i – d, ii – c, iii – b, iv – a.
86. LTTE లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈలంలో తమిళ ఈలం అనగా?
 జవాబు:
 తమిళ రాజ్యం
87. క్రింది వానిని సరిగా జతపరచండి.
 i) కాంగ్రెస్ పార్టీ ( ) a) ప్రాంతీయ పార్టీ
 ii) భారతీయ జనతాపార్టీ ( ) b) వామపక్షం
 iii) భారత కమ్యూనిస్ట్ పార్టీ ( ) c) NDA
 iv) ద్రవిడ మున్నేట్ర కజగం ( ) d) UPA
 జవాబు:
 i – d, ii – c, iii – b, iv – a
88. సరళీకృత ఆర్థిక విధానాలలో భాగం కానిదాన్ని గుర్తించి, రాయండి.
 → రైతులకు ఇచ్చే సబ్సిడీలలో కోత మరియు సంక్షేమ పథకాల ఖర్చు తగ్గింపు
 → ఆర్థిక రంగంలోని అనేక రంగాలలో ప్రైవేటు పెట్టుబడి.
 → విదేశీ సరుకుల దిగుమతులమీద పరిమితులను తగ్గించటం.
 → భారతదేశంలో విదేశీ పెట్టుబడులపై ఆంక్షలు (పరిమితులు) విధించటం.
 జవాబు:
 భారతదేశంలో విదేశీ పెట్టుబడులపై ఆంక్షలు (పరిమితులు) విధించటం.
89. ‘ఓటు (హక్కు) విలువను తెలియజేయు ఒక నినాదంను రాయండి.
 జవాబు:
 ఓటరు చేతికి బ్రహ్మాస్త్రం – ఓటుహక్కు,
 అవినీతిపరులకు ఓటు – దేశానికి చేటు.
90. ప్రస్తుత ప్రధాన ఎన్నికల కమీషనర్ ఎవరు?
 జవాబు:
 సునీల్ అరోరా.
91. అత్యవసర పరిస్థితి తర్వాత, ప్రజాస్వామ్యాన్ని, స్వేచ్ఛని పునరుద్ధరిస్తామనే వాగ్దానంతో అధికారంలోకి వచ్చిన పార్టీ ఏది?
 జవాబు:
 జనతా పార్టీ

92. ఇందిరాగాంధీ విధానాలను వ్యతిరేకించిన కాంగ్రెసులోని సంప్రదాయవాద వర్గంతో ఏర్పాటు చేయబడిన పార్టీ ఏది?
 జవాబు:
 కాంగ్రెసు (ఓ)
93. ఏ సంవత్సరం చివరి నాటికి అంతిమంగా పంజాబులో శాంతి నెలకొన్నది?
 జవాబు:
 1990.
94. శ్రీలంక నుండి భారతదేశం తన సైన్యాన్ని వెనక్కి తీసుకున్న సంవత్సరం?
 జవాబు:
 1989.
95. ఏ సంవత్సరంలో షాబానో కేసులో సుప్రీంకోర్టు తీర్పును ఇచ్చింది?
 జవాబు:
 1985.
96. మహారాష్ట్రలోని రైతులు ఎవరి నాయకత్వంలో పోరాడుతున్నారు?
 జవాబు:
 శరద్ జోషి
97. ఉత్తరప్రదేశ్, హర్యానాలోని రైతులు ఎవరి నాయకత్వంలో పోరాడుతున్నారు?
 జవాబు:
 మహేంద్రసింగ్ తికాయత్
98. అయోధ్యలోని వివాదాస్పద మసీదును కూల్చివేసిన సంవత్సరం?
 జవాబు:
 1992.
99. భారతదేశ ప్రజాస్వామ్యానికి ఒక చారిత్రకమైన ఎన్నికలుగా ఏ ఎన్నికలను చెప్పవచ్చు?
 జవాబు:
 1977 ఎన్నికలు.
100. జాతీయస్థాయిలో కాంగ్రెసు పార్టీ ఓటమి చవిచూసిన ఎన్నికలు ఏవి ?
 జవాబు:
 1977 ఎన్నికలు.
101. హిందూ జాతీయవాద పార్టీగా పేరొందిన పార్టీ ఏది?
 జవాబు:
 జనసంఘ్.
102. పంచాయితీరాజ్ సంస్థలను క్రియాశీలకంగా మలచి పెద్ద సంఖ్యలో ప్రజలు పాలనలో భాగస్వామ్యులు అయ్యేలా ఉద్యమించారు?
 జవాబు:
 రాజీవ్ గాంధీ.
103. దళితుల ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ ఏది?
 జవాబు:
 BSP (బహుజన సమాజ్ పార్టీ)

104. పంజాబుపై H.S. లాంగోవాలోనూ, అస్సోంపై AASU తోనూ రాజీవ్ గాంధీ ఒప్పందాలు ఏ సంవత్సరంలో చేసుకున్నారు?
 జవాబు:
 1985
105. అధికారంలో ఉండగా హత్యకు గురికాబడిన భారత ప్రధాని ఎవరు?
 జవాబు:
 ఇందిరాగాంధీ.
106. ఏ సంవత్సరం నుండి జాతీయ స్థాయిలో ఏర్పడిన ప్రభుత్వాలన్నీ సంకీర్ణ ప్రభుత్వాలే?
 జవాబు:
 1989 నుంచి.
107. L.K. అద్వాని రథయాత్ర 1990లో ఎక్కడ నుంచి ప్రారంభమైంది?
 జవాబు:
 సోమనాథ్ (గుజరాత్).
108. 1992లో ఏర్పడిన పి.వి.నరసింహారావు ప్రభుత్వం ఆర్థిక సంక్షోభాన్ని నివారించటానికి చేపట్టిన అంశం ఏది?
 జవాబు:
 సరళీకృత ఆర్ధిక విధానం.
109. క్రింది వానిని పరిగణించండి.
 i) కేంద్రంలో గెలుపొందిన జనతాపార్టీ తన స్థానాన్ని సుస్థిర పరచుకోటానికి తొమ్మిది రాష్ట్రాలలోని కాంగ్రెసు ప్రభుత్వాలను తొలగించింది.
 ii) కాంగ్రెస్ పార్టీ జాతీయస్థాయిలో ఓడిపోయింది, కాబట్టి రాష్ట్రాలలో సైతం పాలించే హక్కును కోల్పోయింది.
 పై వానిలో సరైనది ఏది?
 A) (i) మాత్రమే
 B) (ii) మాత్రమే
 C) (i) మరియు (ii)
 D) రెండూ కావు
 జవాబు:
 A (i) మాత్రమే
110. పంజాబు ఆందోళన వేర్పాటు వాదం వైపునకు మరళటానికి ప్రధాన కారణం ఏమిటి?
 జవాబు:
 మతపరమైన రంగు సంతరించుకోవటం.

111. పంజాబు ఆందోళనకు కారణమైన సిక్కులు కోరిన అంశం కానిది.
 → రాజధాని చండీఘర్ కేంద్రపాలిత ప్రాంతంగా కాక తమకే చెందాలి.
 → భాక్రానంగల్ ఆనకట్ట నుంచి నీళ్ళు ఎక్కువ కావాలి.
 → సైన్యంలోకి ఎక్కువమంది సిక్కులను తీసుకోవాలి.
 → సిక్కు మతస్థులందరికి ప్రత్యేక దేశం కావాలి.
 జవాబు:
 సిక్కు మతస్థులందరికి ప్రత్యేక దేశం కావాలి.
112. ఏ రాష్ట్రంలో “తమని అంతర్గత వలస ప్రాంతంగా పరిగణిస్తున్నారని”, దీనిని ఆపివేయాలని ప్రజలు చేయటం మంచి పద్ధతని భావించిన ప్రధాని ఎవరు?
 జవాబు:
 అస్సోం.
113. 1977 ఎన్నికలలో అన్ని ప్రధాన ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్ వ్యతిరేక వర్గంలో చేరటానికి కారణం.
 జవాబు:
 అత్యవసర పరిస్థితికి వ్యతిరేకంగా.
114. నీలం సంజీవరెడ్డిగారి గురించిన సరియైన వాక్యం కానిది.
 → ఈయన ఆరవ లోకసభ స్పీకరుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
 → ఈయన భారత ఆరవ రాష్ట్రపతిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
 → 1977 జులై 25న స్పీకరుగా ప్రమాణ స్వీకారం చేశారు.
 → కాంగ్రెసు పార్టీతో సహా అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయి.
 జవాబు:
 → 1977 జులై 25న స్పీకరుగా ప్రమాణ స్వీకారం చేశారు.
115. “ప్రజాస్వామ్యాన్ని, స్వేచ్ఛని పునరుద్ధరిస్తామన్న వాగ్దానంతో జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది.” అయితే దీని కారణంగా ఆ పార్టీ పాలన ప్రభావితం అయ్యింది?
 జవాబు:
 అంతర్గత కీచులాటలు, ఫిరాయింపులు, అంతర్గత విభేదాలు
116. కాంగ్రెసేతర ప్రాంతీయ రాజకీయ పార్టీలు ఒక వేదికగా ఏర్పడ్డానికి కారణం కానటువంటి అంశం.
 జవాబు:
 కేంద్ర విషయాల్లో జోక్యం చేసుకోవటం.
117. రాష్ట్రపతి పాలనకు సంబంధించిన వాక్యాలను పరిశీలించి, సరియైన సమాధానము ఎంచుకోండి.
 I. రాజ్యాంగంలోని 356వ అధికరణం రాష్ట్రపతి పాలన గురించి వివరిస్తుంది.
 II. గవర్నరు సిఫారసు మేరకు, ప్రధానమంత్రి సలహాతో, రాష్ట్రపతి పాలన బాధ్యతను గవర్నరుకు అప్పగించవచ్చు.
 III. దీనికి సంబంధించిన ఖచ్చితమైన మార్గదర్శకాలు రాజ్యాంగంలో పొందుపరిచినారు.
 A) I, II & III సత్యాలు
 B) II, III సత్యాలు
 C) I, II & III అసత్యాలు
 D) I, II సత్యాలు
 జవాబు:
 D) I, 11 సత్యాలు
118. ఎన్.టి.రామారావు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకం కానిది.
 A) రెండు రూపాయలకు కిలో బియ్యం
 B) మధ్యాహ్న భోజన పథకం
 C) వృద్ధాప్య పింఛన్లు
 D) మద్యపాన నిషేధం
 C) వృద్ధాప్య పింఛన్లు

119. ఎన్.టి. రామారావు (రాజకీయాలలో) తెలుగుదేశం పార్టీ స్థాపనలో, ఎన్నికల్లో విజయం సాధించటానికి దోహదం చేసిన అంశం కానిది.
 → సినీహీరోగా ఉన్న నేపథ్యం.
 → రాజకీయ అనుభవం కలిగిన నాయకత్వం.
 → రాష్ట్ర ఆత్మగౌరవం కోసం పోరాటం.
 → పేదలకు జనాకర్షక సంక్షేమ పథకాలు
 జవాబు:
 రాజకీయ అనుభవం కలిగిన నాయకత్వం
120. అసోం ఉద్యమానికి కారణం.
 జవాబు:
 బెంగాలీ అధికారుల వివక్షత
 బంగ్లాదేశ్ కాందిశీకుల రాక
 సాంస్కృతిక మూలాలు కోల్పోతామన్న భయం
121. సంస్కృతి, జనాభా అంశాలే కాకుండా అసోం ఉద్యమానికి సంబంధించిన ఆర్థిక కోణం / కారణం
 → ఉపాధిలో బయట ప్రజలకు ప్రాధాన్యత
 → టీ పరిశ్రమ అస్సామేతర ప్రజల చేతుల్లో ఉండటం,
 → చమురు పరిశ్రమలో స్థానికులకు ప్రాధాన్యత తక్కువగా ఇవ్వటం
 → పైవన్నీ
 జవాబు:
 పైవన్నీ
122. ‘అసోం’ ఉద్యమంలోని ప్రజల ప్రధాన డిమాండ్ కానిది
 → అంతర్గత వలసగా పరిగణించటం
 → ఉపాధిలో స్థానికులకు ప్రాధాన్యత ఇవ్వటం
 → వనరులను స్థానిక ప్రజల ప్రయోజనం కోసం వినియోగించటం
 → బయటివాళ్లను తొలగించటం
 జవాబు:
 అంతర్గత వలసగా పరిగణించటం.
123. “ఈశాన్య ప్రాంతంలో ఘర్షణలు తగ్గించి, శాంతిని నెలకొల్పటానికి ఈ ప్రాంతాలలో సాయుధ బలగాలను కేంద్ర ప్రభుత్వం పెద్దఎత్తున నియమించింది.” ఈశాన్య ప్రాంతంలో సాయుధ దళాలను ప్రయోగించటానికి కారణం కాని అంశం.
 → పొరుగు దేశాలతో సరిహద్దు ప్రాంతంగా ఉండటం
 → ఘర్షణల మతపర రంగు సంతరించుకోవడం
 → తిరుగుబాటు బృందాలు తరచు భారతదేశం నుంచి విడిపోవాలని కోరుకోవటం.
 → అల్పసంఖ్యాక వర్గాలపై తిరుగుబాటు బృందాలు హింసాత్మక దాడులకు పాల్పడటం.
 జవాబు:
 ఘరణలు మతపర రంగు సంతరించుకోవడం
124. క్రింది స్టేట్ మెంట్లను పరిశీలించి, సరియైన సమాధానము ఎంచుకోండి.
 I. సిక్కు వేర్పాటు బృందాలు గోల్డెన్ టెంపుల్ ని ఆక్రమించుకోగా సైన్యం జోక్యం చేసుకోవలసి వచ్చింది.
 II. దీనికి ప్రతిచర్యగా 1984లో ప్రధాని ఇందిరా
 గాంధీని హత్య గావించారు.
 A) I, II అసత్యాలు
 B) I, II సత్యాలు
 C) I మాత్రమే సత్యం
 D) II మాత్రమే సత్యం
 జవాబు:
 B) I, II సత్యా లు
125. “పంజాబులో తీవ్రవాదాన్ని అణచివెయ్యటానికి ప్రభుత్వం చాలా తీవ్ర పదతులను ఉపయోగించింది. వీటిలో అనేకం పౌరుల రాజ్యాంగ హక్కులకు భంగం కలిగించాయని భావించారు.” అయితే ఈ చర్యను సమర్థించే వ్యాఖ్య.
 → హింసను హింసతోటే అణచివెయ్యాలి. కావున ఈ చర్య సమర్థనీయమే.
 → రాజ్యాంగ యంత్రాంగమే కుప్పకూలే అంచున ఉండటంతో మానవహక్కుల ఉల్లంఘన సమర్థనీయమే.
 → శాంతి, భద్రతల రక్షణలో ఏ విధంగాను పౌరహక్కుల ఉల్లంఘన జరగకూడదు.
 → ఇటువంటి చర్యలు అప్రజాస్వామిక ధోరణులు బలపడటానికి దోహదం చేస్తాయి.
 జవాబు:
 రాజ్యాంగ యంత్రాంగమే కుప్పకూలే అంచున ఉండటంతో మానవహక్కుల ఉల్లంఘన సమర్థనీయమే.

126. రాజీవ్ గాంధీ పాలనలో చేపట్టిన సంస్కరణ కానిది
 → శాంతి, భద్రతలు నెలకొల్పటం
 → టెలికాం విప్లవం
 → పంచాయితీరాజ్ సంస్థలను క్రియాశీలంగా మార్చటం.
 → ఆర్థిక విధానాలు కట్టుదిట్టం చేయటం.
 జవాబు:
 ఆర్థిక విధానాలు కట్టుదిట్టం చేయటం.
127. ఈ క్రింది కేసును పరిశీలించి, ఇచ్చిన ప్రశ్నకు సరియైన సమాధానము ఎంచుకోండి.
 I. భర్త నుంచి విడాకులు పొందిన షాబానో అనే మహిళ కేసులో సుప్రీంకోర్టు ఆమె మాజీ భర్త ఆమెకు భరణం చెల్లించాలని తీర్పు ఇచ్చింది.
 II. ఈ తీర్పు ఇస్లామిక్ చట్టంలో జోక్యం చేసుకుంటోందని దీనిని అనుమతిస్తే తమ మత జీవితంలో జోక్యం మరింత పెరుగుతుందని నిరసనలు చేపట్టారు.
 III. 1986లో కొత్త చట్టం ప్రకారం ముస్లిం భర్తలకు ఎటువంటి బాధ్యత లేకుండా చేసి విడాకులు పొందిన మహిళలకు మూడు నెలలపాటు ముస్లిం మత సంస్థలు భరణం ఇస్తే సరిపోతుంది.
 పై కేసును పరిశీలించిన మీదట మీకు అవగత మవుతున్న అంశం.
 జవాబు:
 ముస్లిం మహిళల ప్రయోజనాలు కాదని మత ఛాందసవాదులకు తలఒగ్గడం జరిగింది.
128. కేంద్రంలో ఏ ఒక్క పార్టీ కూడా తనంతట తాను ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యలేకపోవడంతో జాతీయ, ప్రాంతీయ పార్టీలు కలసి ఇలాంటి ప్రభుత్వాలని ఏర్పరచాయి.
 జవాబు:
 సంకీర్ణ ప్రభుత్వాలు
129. వామపక్ష రాజకీయ పార్టీ కానిది.
 A) CPI
 B) CPM
 C) ఫార్వర్డ్ బ్లాక్
 D) SAD
 జవాబు:
 D) SAD
130. సంకీర్ణ ప్రభుత్వంలో ఏదో ఒక భాగస్వామి మద్దతు ఉపసంహరించుకుంటుదన్న భయంతో తీవ్ర మార్పులను తెచ్చే విధానాలను అమలుచేయ్యటానికి భయపడటాన్ని ఇలా అనవచ్చు.
 జవాబు:
 విధాన పక్షపాతం.
131. క్రింది స్టేట్మెంట్లను పరిశీలించి, సరియైన సమాధానము ఎంచుకోండి.
 I. 1978 జూన్లో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ‘ఆపరేషన్ బర్గా’ చేపట్టింది.
 II. భూస్వాముల పేర్లను నమోదుచేసి, వాళ్ల హక్కులను కాపాడటానికి దీనిని చేపట్టారు.
 III. ఆపరేషన్ బర్గాలో చేపట్టిన చర్యల ఫలితంగా పశ్చిమ బెంగాల్ లో వ్యవసాయ ఉత్పత్తి 30% దాకా పెరిగింది.
 A) I, II & III సరియైనవి
 B) I, II మాత్రమే సరియైనవి
 C) I, III మాత్రమే సరియైనవి
 D) II, III మాత్రమే సరియైనవి
 జవాబు:
 C) I, III మాత్రమే సరియైనవి.

132. క్రింది స్టేట్ మెంట్లను పరిశీలించి, సరియైన సమాధానము జ. ఆర్థిక విధానాలు కట్టుదిట్టం చేయటం ఎంచుకోండి.
 I. ప్రభుత్వ ఉద్యోగాలలోను, విద్యాసదుపాయాల లోను ఇతర వెనకబడిన తరగతులకు రిజర్వేషను ఉండాలని మండల్ కమీషన్ సిఫారసు చేసింది.
 II. ఈ నివేదికను నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం వెలికి తీసింది.
 III. వెనకబడిన తరగతులకు విద్య, ఉద్యోగాలలో 29% రిజర్వేషన్లను అమలు చేస్తున్నట్లు వి.పి.సింగ్ ప్రభుత్వం ప్రకటించింది.
 IV. ఈ ప్రకటనకు భారతదేశం అంతట హర్షం వ్యక్తపరచి ఆదరించాయి.
 A) I, II, III & IV సరియైనవి.
 B) I, II మాత్రమే సరియైనవి
 C) I, II, III మాత్రమే సరియైనవి
 D) I, II, IV మాత్రమే సరియైనవి
 జవాబు:
 B) I, II మాత్రమే సరియైనవి
133. ఈ క్రింది వ్యాఖ్యలను పరిశీలించి, సరియైన సమాధానము ఎంచుకోండి.
 I. 73వ రాజ్యాంగ సవరణ గ్రామస్థాయిలో స్థానిక స్వపరిపాలనా ప్రభుత్వాలను కల్పించింది.
 II. 74వ రాజ్యాంగ సవరణ పట్టణ, నగరాల్లో స్థానిక స్వపరిపాలనా ప్రభుత్వాలను కల్పించింది.
 II. మొత్తం స్థానాల్లో 2/3 వంతు స్థానాలను స్త్రీలకు కేటాయించారు.
 A) I, II & III సరియైనవి
 B) I, II మాత్రమే సరియైనవి
 C) II, III మాత్రమే సరియైనవి
 D) I, III మాత్రమే సరియైనవి
 జవాబు:
 B) I, II మాత్రమే సరియైనవి
134. 1991లో భారతదేశం సరళీకృత ఆర్థిక విధానాలను అవలంభించటానికి కారణం కానిది.
 → అంతర్జాతీయ ద్రవ్యనిధి షరతులు
 → విదేశీ మారక నిల్వలు అడుగంటడం
 → తీవ్ర ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడటానికి
 → పారిశ్రామికాభివృద్ధి సాధించటానికి
 జవాబు:
 పారిశ్రామికాభివృద్ధి సాధించటానికి
135. ఈ క్రింది సంఘటనలను సరియైన కాలక్రమంలో ఉంచండి.
 i) తెలుగుదేశం పార్టీ స్థాపన
 ii) ఆపరేషన్ బ్లూస్టార్
 iii) అద్వా నీ రథయాత్ర
 iv) సరళీకృత ఆర్థిక విధానం
 A) i, ii, iii, iv
 B) i, ii, iv, iii
 C) i, iii, ii, iv a
 D) iv, i, ii, iii
 జవాబు:
 A) i, ii, iii, iv
136. క్రింది వానిలో సరియైన జత కానిది
 A) మొరార్జీదేశాయ్ – మొదటి కాంగ్రెసేతర ప్రధానమంత్రి
 B) వి.పి.సింగ్-మొదటి సంకీర్ణ ప్రభుత్వ ప్రధానమంత్రి
 C) రాజీవ్ గాంధీ – UPA మొదటి ప్రధానమంత్రి
 D) పి.వి.నరసింహారావు-సరళీకృత ఆర్ధిక విధానాలు
 జవాబు:
 C) రాజీవ్ గాంధీ – UPA మొదటి ప్రధానమంత్రి
క్రింది సమాచారమును పరిశీలించి, ఇచ్చిన ప్రశ్నలకు సరియైన సమాధానము ఎంచుకోండి.
 
137. మూడు సంకీర్ణ ప్రభుత్వాల్లో అధికారం పంచుకున్న పార్టీ.
 జవాబు:
 JKNC
138. AIADMK ఈ పార్టీ ఏ రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీ?
 జవాబు:
 తమిళనాడు
139. NDA సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతు మాత్రమే ఇచ్చిన పార్టీ
 జవాబు:
 TDP

140. నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం పడిపోయిన సంవత్సరం
 జవాబు:
 1990
141. యునైటెడ్ ఫ్రంట్ సంకీర్ణ ప్రభుత్వంలో గల జాతీయ పార్టీ పేరు రాయండి.
 జవాబు:
 సి.పి.ఐ.
142. NDA (అలయన్స్) ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ కి చెందిన ఏ పార్టీ మద్దతును ఇచ్చింది?
 జవాబు:
 TDP
143. నేషనల్ ఫ్రంట్ సంకీర్ణ ప్రభుత్వంలోని ఏవైనా రెండు ప్రాంతీయ పార్టీలను పేర్కొనండి?
 జవాబు:
 DMK, TDP, AGP,

144. యునైటెడ్ ఫ్రంట్ సంకీర్ణ ప్రభుత్వానికి బయటి నుండి మద్దతు నిచ్చిన పార్టీ ఏది?
 జవాబు:
 సి.పి.యం.
10th Class Social 19th Lesson 1 Mark Important Questions and Answers in Telugu Medium
ప్రశ్న 1.
 మీకీయబడిన భారతదేశ రాజకీయ పటంనందు ఏవేని రెండు ప్రాంతీయ పార్టీలు ప్రస్తుతం అధికారంలో గల రాష్ట్రాలను గుర్తించండి.
 జవాబు:
 
ప్రశ్న 2.
 ‘టెలీకం విప్లవం’ దేనికి దోహదపడింది?
 జవాబు:
 ఉపగ్రహ సాంకేతిక విజ్ఞానంతో దేశంలో టెలిఫోనిక్ నెట్ వర్క్ వేగంగా విస్తరించటానికి ఇది దోహదపడింది. భారతదేశంలో టెలిఫోన్ విప్లవాన్ని ప్రారంభించింది రాజీవ్ గాంధీ.
ప్రశ్న 3.
 సంకీర్ణ ప్రభుత్వం అనగా ఏమిటి? ఒక ఉదాహరణ ఇవ్వండి.
 జవాబు:
 అనేక జాతీయ, ప్రాంతీయ పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం.
 ఉదా : ఎన్.డి.ఏ, యు.పి.ఏ.
 (లేదా)
 సంకీర్ణ ప్రభుత్వము :
 ఏ ఒక్క రాజకీయ పార్టీకి స్పష్టమైన ఆధిక్యత రానప్పుడు కొన్ని పార్టీలు కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తే దానిని సంకీర్ణ ప్రభుత్వం అంటారు.
ప్రశ్న 4.
 ప్రాంతీయ రాజకీయ పార్టీలకు రెండు ఉదాహరణలీయండి.
 జవాబు:
 ఆంధ్రప్రదేశ్ : Y.S.R.C.P
 తమిళనాడు : D.M.K, AIADMK
 అసోం : AGP
 జమ్మూ & కాశ్మీర్ : National Conference
 పంజాబ్ : శిరోమణి అకాలీదళ్ళ
ప్రశ్న 5.
 ఎన్.టి. రామారావు ప్రవేశపెట్టిన ఏ సంక్షేమ పథకాలు కొన్ని మార్పులతో నేటికీ ఆంధ్రప్రదేశ్ లో కొనసాగుతున్నాయి?
 (లేదా)
 యన్.టి.రామారావు ప్రవేశపెట్టిన ఏవేని రెండు అంశాలను పేర్కొనండి.
 జవాబు:
- ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం.
 - పేదలకు సబ్సిడీ ధరకు బియ్యం అందించడం.
 
ప్రశ్న 6.
 73వ రాజ్యాంగ సవరణ గురించి రాయండి.
 జవాబు:
 గ్రామీణ స్థాయిలో స్థానిక స్వపరిపాలనా ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం.

ప్రశ్న 7.
 ఇవ్వబడిన సమాచారాన్ని పరిశీలించి క్రింది ప్రశ్నకు సమాధానం రాయండి.
 
 యునైటెడ్ ఫ్రంట్ సంకీర్ణ ప్రభుత్వంలో గల జాతీయ పార్టీ పేరు రాయండి.
 జవాబు:
 సి.పి.ఐ.
ప్రశ్న 8.
 రాజ్యాంగంలోని మౌలిక విలువలు ఏవి?
 జవాబు:
 రాజ్యాంగంలోని మౌలిక విలువలు :
- ప్రజాస్వామ్యం
 - దేశ ఐక్యత
 - సమగ్రత
 - సామాజిక, ఆర్థిక మార్పులు.
 
ప్రశ్న 9.
 అత్యవసర పరిస్థితిని ముగించిన సంవత్సరమేది?
 జవాబు:
 అత్యవసర పరిస్థితిని ముగించిన సంవత్సరం – 1977.
ప్రశ్న 10.
 ఇందిరాగాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగి ఏర్పాటైన సంవత్సరం ఏది?
 జవాబు:
 ఇందిరాగాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగి ఏర్పాటైన సంవత్సరం-1980.
ప్రశ్న 11.
 ఆపరేషన్ ‘బ్లూ స్టార్’ చేపట్టిన సంవత్సరం ఏది?
 జవాబు:
 ఆపరేషన్ ‘బ్లూ స్టార్’ చేపట్టిన సంవత్సరం-1984.
ప్రశ్న 12.
 ఇందిరాగాంధీ హత్యకు గురైన సంవత్సరం ఏది?
 జవాబు:
 ఇందిరాగాంధీ హత్యకు గురైన సంవత్సరం-1984.

ప్రశ్న 13.
 భారతదేశ ప్రజాస్వామ్యానికి పరీక్షా కాలం వంటిది ఏది?
 జవాబు:
 భారతదేశ ప్రజాస్వామ్యానికి పరీక్షా కాలం వంటిది 1976-85.
ప్రశ్న 14.
 1975-85 మధ్యకాలంలో భారతదేశ ప్రజాస్వామ్యం యొక్క ప్రాధాన్యత ఏమిటి?
 జవాబు:
 1975-85 మధ్యకాలంలో భారతదేశం ఏక పార్టీ ప్రజాస్వామ్యంలోకి జారిపోకుండా సమర్థవంతంగా నివారించబడింది.
ప్రశ్న 15.
 1975-85 మధ్యకాలంలో భారతదేశంలో ఉద్భవించిన ఉద్యమాలు ఏవి?
 జవాబు:
 1975-85 మధ్యకాలంలో భారతదేశంలో ఉద్భవించిన ఉద్యమాలు పర్యావరణ ఉద్యమం, స్త్రీవాద ఉద్యమం, పౌరహక్కుల ఉద్యమం, సాహిత్య ఉద్యమం.
ప్రశ్న 16.
 జనతా పార్టీగా ఏర్పడాలని నిర్ణయించిన పార్టీలు ఏవి?
 జవాబు:
 ‘జనతా పార్టీగా ఏర్పడాలని నిర్ణయించిన పార్టీలు :
- కాంగ్రెస్ (ఓ)
 - స్వతంత్ర పార్టీ
 - భారతీయ జనసంఘ్
 - భారతీయ లోక్ దళ్
 - సోషలిస్టు పార్టీ.
 
ప్రశ్న 17.
 కాంగ్రెస్ వ్యతిరేక, అత్యవసర పరిస్థితి వ్యతిరేక పార్టీలు అన్నీ ఒక తాటి కిందకు వచ్చి ఎన్నికలలో పోటీ చేయటంలో ముఖ్యపాత్ర పోషించినవారెవరు?
 జవాబు:
 జయప్రకాష్ నారాయణ్, ఆచార్య జె.బి. కృపలాని వంటి వారు కాంగ్రెస్ వ్యతిరేక, అత్యవసర పరిస్థితి వ్యతిరేక పార్టీలు అన్నీ ఒక తాటి కిందకు తేవడంలో ప్రధానపాత్ర పోషించారు.
ప్రశ్న 18.
 భారతదేశ ప్రజాస్వామ్యానికి ఒక చారిత్రాత్మకమైన ఎన్నిక ఏది?
 జవాబు:
 భారతదేశ ప్రజాస్వామ్యానికి ఒక చారిత్రాత్మకమైన ఎన్నిక 1977 సాధారణ ఎన్నికలు.
ప్రశ్న 19.
 జాతీయస్థాయిలో కాంగ్రెస్ పార్టీని ఓడించిన పార్టీ ఏది?
 జవాబు:
 జాతీయస్థాయిలో కాంగ్రెస్ పార్టీని ఓడించిన పార్టీ జనతా పార్టీ.
ప్రశ్న 20.
 1977 సాధారణ ఎన్నికలలో గెలుపొందిన జనతా పార్టీ ఎన్ని రాష్ట్రాలలోని కాంగ్రెస్ ప్రభుత్వాలను తొలగించింది?
 జవాబు:
 1977 సాధారణ ఎన్నికలలో గెలుపొందిన జనతా పార్టీ 9 రాష్ట్రాలలోని కాంగ్రెస్ ప్రభుత్వాలను తొలగించింది.

ప్రశ్న 21.
 1977 సాధారణ ఎన్నికల తరువాత జనతా పార్టీ ఏ ఏ రాష్ట్రాలలో విజయం సాధించింది?
 జవాబు:
 1977 సాధారణ ఎన్నికల తరువాత జనతా పార్టీ ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, బీహార్ రాష్ట్రాలలో విజయం సాధించింది.
ప్రశ్న 22.
 పంజాబ్ కి పరిమితమై సిక్కుల కోసం ప్రత్యేకంగా పనిచేస్తున్న పార్టీ ఏది?
 జవాబు:
 పంజాబ్ కి పరిమితమై సిక్కుల కోసం ప్రత్యేకంగా పనిచేస్తున్న పార్టీ శిరోమణి అకాలీ దళ్.
ప్రశ్న 23.
 రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకు వీలు కల్పించే అధికరణం ఏది?
 జవాబు:
 రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకు వీలు కల్పించే అధికరణం 356.
ప్రశ్న 24.
 జనతా పార్టీ అధికారంలోకి రావడానికి చేసిన వాగ్దానం ఏది?
 జవాబు:
 జనతా పార్టీ అధికారంలోకి రావడానికి చేసిన వాగ్దానం ప్రజాస్వామ్యాన్ని, స్వేచ్చని పునరుద్ధరిస్తామనడం.
ప్రశ్న 25.
 భారతదేశంలోని విభిన్న ప్రాంతాల్లో మరింత స్వయం ప్రతిపత్తి కోసం జరిగిన మూడు ఉద్యమాలు ఏవి?
 జవాబు:
 భారతదేశంలోని విభిన్న ప్రాంతాల్లో మరింత స్వయం ప్రతిపత్తి కోసం జరిగిన మూడు ఉద్యమాలు
- ఆంధ్రప్రదేశ్
 - అసోం
 - పంజాబ్ ఉద్యమాలు.
 
ప్రశ్న 26.
 ఎన్.టి. రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించింది ఎప్పుడు?
 జవాబు:
 ఎన్.టి. రామారావు తెలుగుదేశం పార్టీని 1982లో తన 60వ పుట్టినరోజున స్థాపించారు.
ప్రశ్న 27.
 ఎ.ఎ.ఎస్.యు అనగానేమి?
 జవాబు:
 అఖిల అసోం విద్యార్థి సంఘం.

ప్రశ్న 28.
 టీ పరిశ్రమ ప్రధానంగా ఏ నగరంలో ఉంది?
 జవాబు:
 టీ పరిశ్రమ ప్రధానంగా కోల్కతాలో ఉంది.
ప్రశ్న 29.
 అంతర్గత వలస ప్రాంతంగా దేనిని పరిగణించారు?
 జవాబు:
 అంతర్గత వలస ప్రాంతంగా ‘అసోం’ ను పరిగణించారు.
ప్రశ్న 30.
 అసోంలోని ఆదిమ వాసులెవరు?
 జవాబు:
 అసోంలోని ఆదిమవాసులు బోడోలు, ఖాసీలు, మిజోల, కర్జీలు.
ప్రశ్న 31.
 బర్మా ప్రస్తుతం ఏ పేరుతో పిలువబడుతోంది?
 జవాబు:
 బర్మా ప్రస్తుతం మయన్మార్ పేరుతో పిలువబడుతోంది.
ప్రశ్న 32.
 చండీగఢ్ ను కేంద్రపాలిత ప్రాంతంగా కాక తమ రాష్ట్రానికే చెందాలని కోరినది?
 జవాబు:
 చండీగఢ్ ను కేంద్రపాలిత ప్రాంతంగా కాక తమ రాష్ట్రానికే చెందాలని కోరినది-పంజాబ్.
ప్రశ్న 33.
 తీవ్రవాద సిక్కుల, బృందానికి నాయకుడిగా వ్యవహరించిన వారెవరు?
 జవాబు:
 తీవ్రవాద సిక్కుల బృందానికి నాయకుడిగా వ్యవహరించింది ‘భింద్రేన్ వాలా.
ప్రశ్న 34.
 సిక్కుల పవిత్రస్థలమేది?
 జవాబు:
 సిక్కుల పవిత్రస్థలం గోల్డెన్ టెంపుల్.
ప్రశ్న 35.
 ఖలిస్తాను స్వతంత్రదేశంగా ప్రకటించినదెప్పుడు?
 జవాబు:
 1986 ఏప్రిల్ లో అకల్ తఖ్ వద్ద జరిగిన సమావేశంలో ఖలిస్తానను స్వతంత్ర దేశంగా ప్రకటించారు.
ప్రశ్న 36.
 రాజీవ్ గాంధీ ఏ ఏ ప్రాంతాలలో శాంతి ప్రక్రియలు మొదలుపెట్టారు?
 జవాబు:
 రాజీవ్ గాంధీ పంజాబ్, అసోం, మిజోరంలలో, పొరుగుదేశమైన శ్రీలంకలో కూడా శాంతి ప్రక్రియలు మొదలు పెట్టారు.
ప్రశ్న 37.
 శ్రీలంక నుంచి అంతిమంగా భారతదేశం తన సైన్యాన్ని వెనక్కి తీసేసుకున్న సంవత్సరమేది?
 జవాబు:
 శ్రీలంక నుంచి అంతిమంగా భారతదేశం తన సైన్యాన్ని వెనక్కి తీసేసుకున్న సంవత్సరం-1989.
ప్రశ్న 38.
 పేదల కోసం ఖర్చు పెడుతున్న ప్రతి రూపాయిలో 15 పైసలు కూడా అతడికి చేరటం లేదని అన్నవారెవరు?
 జవాబు:
 పేదల కోసం ఖర్చు పెడుతున్న ప్రతి రూపాయిలో 15 పైసలు కూడా అతడికి చేరటం లేదని అన్నవారు రాజీవ్ గాంధీ.

ప్రశ్న 39.
 సరళీకృత ఆర్థిక విధానం వైపు పయనం మొదలుపెట్టింది ఎవరు?
 జవాబు:
 1985లో రాజీవ్ గాంధీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మొదటి బడ్జెట్ లో అమలులో ఉన్న కొన్ని నియంత్రణలను పరిమితులను తొలగించి సరళీకృత ఆర్థిక విధానంవైపు పయనం మొదలుపెట్టారు.
ప్రశ్న 40.
 భారతదేశంలో టెలికం విప్లవం అనబడుతున్న దానిని ఆరంభించినదెవరు?
 జవాబు:
 భారతదేశంలో టెలికం విప్లవం అనబడుతున్న దానిని ఆరంభించింది-రాజీవ్ గాంధీ.
ప్రశ్న 41.
 భర్త నుంచి విడాకులు పొందిన షా బానో కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన సంవత్సరం ఏది?
 జవాబు:
 భర్త నుంచి విడాకులు పొందిన షా బానో కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన సంవత్సరం – 1985.
ప్రశ్న 42.
 ఉత్తరప్రదేశ్, హర్యానా రైతులు దేనికోసం మహేంద్రసింగ్ తికాయత్ నేతృత్వంలో పోరాటం చేస్తున్నారు?
 జవాబు:
 వ్యవసాయ ఉత్పత్తులకు మెరుగైన ధరలకోసం డీజిల్, రసాయనిక ఎరువులు, విద్యుత్ వంటి ఉత్పాదకాలపై సబ్సిడీల కోసం పోరాటం చేస్తున్నారు.
ప్రశ్న 43.
 ఎప్పటి నుండి జాతీయస్థాయిలో సంకీర్ణ/ మైనారిటీ ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి?
 జవాబు:
 1989 నుంచి జాతీయస్థాయిలో ఏర్పడిన ప్రభుత్వాలన్నీ సంకీర్ణ మైనారిటీ ప్రభుత్వాలే.
ప్రశ్న 44.
 బెంగాలులో వామపక్ష ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఎవరు?
 జవాబు:
 బెంగాలులో వామపక్ష ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది జ్యోతిబసు.
ప్రశ్న 45.
 బర్గాదార్లు అంటే ఎవరు?
 జవాబు:
 కౌలుదార్లను బెంగాలీలో బర్గాదార్లు అంటారు.
ప్రశ్న 46.
 ఒబిసిలు అంటే ఎవరు?
 జవాబు:
 ఇతర వెనుకబడిన తరగతులకు చెందినవారు.
ప్రశ్న 47.
 ఒబిసిలకు ఎంత శాతం రిజర్వేషన్లు కల్పించారు?
 జవాబు:
 సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతులకు ప్రభుత్వ ఉద్యోగాలలో 27% రిజర్వేషన్లు కల్పించారు.
ప్రశ్న 48.
 హిందువుల మత అస్తిత్వం ఆధారంగా దేశాన్ని నిర్మించాలన్నది ఏ రాజకీయ పార్టీ ధోరణి?
 జవాబు:
 హిందువుల మత అస్తిత్వం ఆధారంగా దేశాన్ని నిర్మించాలన్న రాజకీయ ధోరణికి భారతీయ జనతాపార్టీ నేతృత్వం వహిస్తోంది.
ప్రశ్న 49.
 ఎల్.కె. అద్వానీ రథయాత్ర ఎప్పుడు చేపట్టారు?
 జవాబు:
 ఎల్.కె. అద్వానీ రథయాత్ర 1990లో సోమనాథ్ నుంచి అయోధ్య వరకు చేపట్టారు.
ప్రశ్న 50.
 వివాదాస్పద మసీదు ధ్వంసం చేయబడిన సంవత్సరమేది?
 జవాబు:
 వివాదాస్పద మసీదు ధ్వంసం చేయబడిన సంవత్సరం-1992.
ప్రశ్న 51.
 సరళీకృత ఆర్ధిక విధానాన్ని ప్రవేశపెట్టిన ప్రభుత్వం ఏది?
 జవాబు:
 సరళీకృత ఆర్థిక విధానాన్ని ప్రవేశపెట్టిన ప్రభుత్వం 1992లో ఏర్పడిన పి.వి. నరసింహారావు ప్రభుత్వం.

ప్రశ్న 52.
 రాజ్యాంగంలో 356 అధికరణం యొక్క ప్రత్యేకత ఏమిటి?
 జవాబు:
- రాజ్యాంగంలోని 356 అధికరణం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం, రాజ్యాంగం ప్రకారం రాష్ట్రాన్ని పాలించుకోలేకపోతోందని గవర్నరు అభిప్రాయపడితే రాష్ట్ర ప్రభుత్వాన్ని తొలగించమని, ఇంకా అవసరమైతే శాసన సభను రద్దు చెయ్యమని రాష్ట్రపతికి సిఫారసు చేయవచ్చు.
 - అప్పుడు ప్రధానమంత్రి సలహాతో రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్రపతి తొలగించి పాలనా బాధ్యతలను చేపట్టమని రాష్ట్ర గవర్నరును కోరవచ్చు.
 
ప్రశ్న 53.
 సంకీర్ణ ప్రభుత్వాలకు రెండు ఉదాహరణలు ఇవ్వండి.
 జవాబు:
 సంకీర్ణ ప్రభుత్వాలకు ఉదాహరణలు :
- కాంగ్రెస్ నేతృత్వంలోని UPA – యునైటెడ్ ప్రోగ్రెస్సివ్ అలయెన్స్.
 - BJP నేతృత్వంలోని NDA – నేషనల్ డెమొక్రటిక్ అలయెన్స్.
 
ప్రశ్న 54.
 AIADMK ని విస్తరింపుము.
 జవాబు:
 All India Anna Dravida Munnetra Kazagam
 అఖిల భారత అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం
10th Class Social 19th Lesson 2 Marks Important Questions and Answers in Telugu Medium
ప్రశ్న 1.
1. అత్యవసర పరిస్థితి ముగింపు, మొరార్జీ దేశాయ్, చరణ్ సింగ్  కింద జనతా పార్టీ ప్రభుత్వ ఏర్పాటు | 1977 | 
| 2. ఇందిరాగాంధీ నేతృత్వంలో కాంగ్రెసు ప్రభుత్వ ఏర్పాటు | 1980 | 
| 3. T.D.P ఏర్పాటు | 1982 | 
| 4. ఆపరేషన్ బ్లూస్టార్, ఇందిరాగాంధీ హత్య | 1984 | 
| 5. రాజీవ్ గాంధీ పంజాబ్, అసోంలలో శాంతి ప్రక్రియ | 1985 | 
ప్రశ్నలు:
 1) కేంద్రంలో మొట్టమొదటిసారిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెసేతర పార్టీ ఏది?
 2) తెలుగుదేశం పార్టీ స్థాపకుడు ఎవరు?
 జవాబు:
- జనతా పార్టీ
 - నందమూరి తారక రామారావు (NTR)
 
ప్రశ్న 2.
 2014 సాధారణ ఎన్నికలలో వివిధ రాజకీయ పార్టీలు, గెలిచిన సీట్ల సంఖ్యను సూచించే క్రింది ‘పై’ రేఖాచిత్రాన్ని పరిశీలించి రాజకీయ పార్టీల బలాబలాలను విశ్లేషించండి.
 
 జవాబు:
- 2014 సాధారణ ఎన్నికలలో బి.జె.పి.కి 282 ఎం.పి. స్థానాలు లభించాయి.
 - గతంలో పెద్ద పార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీ కేవలం 44 స్థానాలను మాత్రమే సాధించింది.
 - ప్రాంతీయ పార్టీలైన ఎ.ఐ.ఎ.డి.ఎం.కె., తెలుగుదేశంలకు వరుసగా 37, 16 స్థానాలు లభించాయి.
 - ఇతరులకు 140 స్థానాలు లభించాయి.
 
ప్రశ్న 3.
 క్రింది సమాచారం చదవండి. సమాధానం రాయండి.
“పంజాబ్ లో తీవ్రవాదాన్ని అణచివెయ్యటానికి ప్రభుత్వం చాలా తీవ్ర పద్ధతులను ఉపయోగించింది. వీటిల్లో అనేకం పౌరుల రాజ్యాంగ హక్కులకు భంగం కలిగించాయని భావించారు. తీవ్రవాద కార్యకలాపాల వల్ల రాజ్యాంగ యంత్రాంగమే కుప్పకూలే అంచున ఉండటంతో మానవ హక్కుల, రాజ్యాంగ ఉల్లంఘన సమర్థనీయమే అని చాలామంది పరిశీలకులు భావించారు.”
 పై సమాచారంపై మీ అభిప్రాయాన్ని వ్యక్తపరచండి.
 జవాబు:
 1. రాజ్యాంగ యంత్రాంగమే కుప్పకూలే అంచున ఉన్నప్పుడు మానవ హక్కుల, రాజ్యాంగ ఉల్లంఘన సమర్ధనీయమే అని నా అభిప్రాయం.
 (లేదా)
 2. కొంతమంది తీవ్రవాదుల వలన ఏర్పడే సంక్షోభం నుండి దేశాన్ని రక్షించడానికి సాధారణ పౌరులను బాధించకూడదు.
ప్రశ్న 4.
 ఇచ్చిన దత్తాంశాన్ని చదివి ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
 
 A) నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వాలలో అధికారాలు ఉండడానికి బయట నుండి మద్దతు ఇచ్చిన పార్టీలు ఏవి?
 B) మూడు ప్రభుత్వాలలోను అధికారంలో కొనసాగిన పార్టీ ఏది?
 జవాబు:
 A) నేషనల్ ఫ్రంట్ కు బయట నుంచి మద్దతు ఇచ్చిన పార్టీలు :
 1) సి.పి.ఎం.
 2) సి.పి.ఐ.
 3) బి.జె.పి.
 యునైటెడ్ ఫ్రంట్ కు బయట నుంచి మద్దతు ఇచ్చిన పార్టీ సి.పి.యం.
B) జమ్మూ – కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ (JKNC)
ప్రశ్న 5.
 ఇటీవలి కాలంలో ప్రాంతీయ పార్టీలు బలోపేతం కావటానికి దారితీసిన పరిస్థితులేవి?
 జవాబు:
- జాతీయ నాయకత్వం సరిగా లేకపోవడమే ప్రధాన కారణం.
 - ప్రాంతీయ, భాషా మతాభిమానాలు పెరిగిపోవడం.
 - వివిధ ప్రజలకు ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహించే ప్రాంతీయ పార్టీలు ఆవిర్భవించడం.
 - తమ ప్రాంత సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడటం కోసం కృషి చేయడం వలన.
 - తమ ప్రాంతాన్ని బాగా అభివృద్ధి చేసుకోవాలనే కోరిక.
 - తమకు స్వయం ప్రతిపత్తి కల్పించుకొని వారి గౌరవాన్ని కాపాడుకోవడం కోసం కృషి చేయడం వలన ప్రాంతీయ పార్టీలు బలోపేతము అయినాయి.
 

ప్రశ్న 6.
 ప్రస్తుత ప్రభుత్వాలు ప్రారంభించిన ప్రజా సంక్షేమ పథకాల గురించి వ్రాయుము.
 జవాబు:
 ప్రస్తుత ప్రభుత్వాలు ప్రారంభించిన ప్రజాసంక్షేమ పథకాలు :
- ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం
 - ఉపాధి హామీ పథకం
 - వృద్ధాప్య పింఛను
 - గృహ వసతి
 - ప్రజాపంపిణీ వ్యవస్థ – పేదలకు రూపాయికే కిలో బియ్యం
 - పేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంటు
 
ప్రశ్న 7.
 ఈ క్రింది సమాచారాన్ని చదివి, క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
 1980లో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వచ్చింది. వెంటనే తొమ్మిది రాష్ట్రాలలోని కాంగ్రెసేతర, జనతా ప్రభుత్వాలను రద్దుచేసి జనతా పార్టీ రీతిలోనే కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించింది. తమిళనాడు, పశ్చిమ బెంగాల్ లో మినహాయించి మిగిలిన అన్ని రాష్ట్రాలలో కాంగ్రెస్ విజయం సాధించింది.
 ప్రశ్నలు :
 A) 1980 కు ముందు ఏ పార్టీ అధికారంలో ఉంది?
 జవాబు:
 1980కి ముందు జనతాపార్టీ అధికారంలో ఉంది.
B) ఏ రెండు రాష్ట్రాలలో కాంగ్రెస్ ఓడిపోయింది?
 జవాబు:
 తమిళనాడు మరియు పశ్చిమ బెంగాల్ లలో కాంగ్రెస్ ఓడిపోయింది.
ప్రశ్న 8.
 భారత ప్రజాస్వామ్యాన్ని అత్యవసర పరిస్థితి ఏవిధంగా వెనక్కు తీసుకుపోయింది?
 జవాబు:
- ఐదు సంవత్సరాలకు ఒకసారి జరగవలసిన సాధారణ ఎన్నికలను వాయిదా వేశారు.
 - ప్రాథమిక హక్కులు హరించివేయబడ్డాయి.
 - పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగింది.
 - రాజకీయ ప్రత్యర్థులను జైలుపాలు చేశారు.
 
పైన తెలిపిన అప్రజాస్వామిక చర్యల కారణంగా అత్యవసర పరిస్థితి కాలంలో ప్రజాస్వామ్యం వెనక్కి వెళ్ళిందని చెప్పవచ్చు.
ప్రశ్న 9.
 ఈ క్రింది పట్టికను పరిశీలించి, ప్రశ్నలకు జవాబులు వ్రాయండి.
| 1. రాజీవ్ గాంధీ హత్య, పి.వి. నరసింహారావు ప్రధానమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వం | 1991 | 
| 2. ఆర్థిక సరళీకరణ విధానాలు | 1990 | 
| 3. బాబ్రీ మస్జిద్ కూల్చివేత | 1992 | 
| 4. దేవెగౌడ, ఐ.కె. గుజ్రాలు ప్రధానమంత్రులుగా నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం | 1996 | 
| 5. ఎ.బి. వాజ్ పేయి నేతృత్వంలో ఎన్.డి.ఏ. ప్రభుత్వం | 1998 | 
a) 1996 ఎన్నికలలో ఏ పార్టీ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది?
 b) పై పట్టికలోని సంకీర్ణ ప్రభుత్వాలు ఏవి?
 జవాబు:
 a) నేషనల్ ఫ్రంట్
 b) నేషనల్ ఫ్రంట్ మరియు NDA ప్రభుత్వాలు
ప్రశ్న 10.
 ఈ క్రింది పట్టికను పరిశీలించి, విశ్లేషించండి.
 పట్టిక : 2014 ఎన్నికలలో వివిధ పార్టీలు గెలిచిన లోకసభ స్థానాలు
| రాజకీయ పార్టీ | సాధించిన స్థానాలు | 
| 1. భారతీయ జనతా పార్టీ (BJP) | 282 | 
| 2. భారత జాతీయ కాంగ్రెస్ (INC) | 45 | 
| 3. తెలుగుదేశం పార్టీ (TDP) | 16 | 
| 4. తెలంగాణ రాష్ట్ర సమితి (TRS) | 11 | 
| 5. వామ పక్షాలు (CPI + CPI(M)] | 10 | 
జవాబు:
 పట్టిక 2014 లోక్ సభ ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తోంది. భారతీయ జనతా పార్టీకు అత్యధిక మెజార్టీ రాగా వామపక్షాలు, మాత్రం అట్టడుగు స్థాయిలో మిగిలిపోయాయి.
ఎవరితో పొత్తు పెట్టుకోకుండానే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని కేంద్రంలో ఏర్పాటు చేయగలదు. దగ్గర దగ్గర ఐదు దశాబ్దాలు దేశాన్ని ఏలిన కాంగ్రెసు ద్వితీయ స్థానానికి, రెండంకెల స్థానానికి పడిపోయింది.
ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీ అయిన వామపక్షాల కంటే అధిక స్థానాలు గెలుచుకున్నాయి. గెలిచిన వారు వారిపై ప్రజలుంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. ఓడినవారు ఆత్మ విమర్శ చేసుకుని మళ్ళీ ఎన్నికలలో వారి ఉనికిని కాపాడుకోవాలి.
ప్రశ్న 11.
 క్రింది సమాచారం ఆధారంగా దిగువ ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.
| విపి సింగ్, చంద్రశేఖర్తో జనతాదళ్ ప్రభుత్వాల ఏర్పాటు | 1989 | 
| మండల కమిషన్ సిఫారసుల అమలుకు నిర్ణయం | 1989 | 
| రామజన్మభూమి రథయాత్ర | 1990 | 
| రాజీవ్ గాంధీ హత్య, పివి నరసింహారావు ప్రధానమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వం | 1991 | 
| ఆర్థిక సరళీకరణ విధానాలు | 1990 | 
| బాబ్రీ మసీదు కూల్చివేత | 1992 | 
| దేవెగౌడ, ఐకె గుజ్రాలు ప్రధానమంత్రులుగా నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం | 1996 | 
| ఎబి వాజ్ పేయి నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం | 1998 | 
i) బాబ్రీ మసీదు కూల్చివేత సమయంలో గల ప్రధానమంత్రి పేరు తెలపండి.
 జవాబు:
 పి.వి. నరసింహారావు
ii) సంకీర్ణ ప్రభుత్వాలకు రెండు ఉదాహరణలివ్వండి.
 జవాబు:
- జనతాదళ్ ప్రభుత్వం
 - నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం
 - NDA ప్రభుత్వం
 

ప్రశ్న 12.
 క్రింది రాజకీయ పార్టీలను “జాతీయ, ప్రాంతీయ” పార్టీలుగా వర్గీకరించండి.
 బి.జె.పి., వై.యస్.ఆర్.సి.పి., టి.డి.పి., సి.పి.యమ్., సి.పి.ఐ., డి.యమ్.కె., కాంగ్రెస్-ఐ, ఎ.జి.పి.
 జవాబు:
| జాతీయ పార్టీలు | ప్రాంతీయ పార్టీలు | 
| భారతీయ జనతా పార్టీ | D.M.K | 
| కాంగ్రెస్ – (I) | T.D.P | 
| CPI | A.G.P | 
| CPM | Y.S.R.C.P | 
ప్రశ్న 13.
 క్రింది పట్టికను పరిశీలించి విశ్లేషిస్తూ ఒక పేరాగ్రాఫ్ రాయండి.
 
 జవాబు:
 పై పట్టిక ఏమి తెలియచేస్తుందంటే 2014 ఎన్నికలలో ముఖ్యమైన రెండు ప్రధాన పార్టీలు అయిన UPA కూటమి మరియు NDA కూటములు సాధించిన సీట్లను ఓట్ల శాతాన్ని ఇచ్చారు. 2014 ఎన్నికలలో UPA Congress కూటమి 19.31% ఓట్లు మరియు 44 లోకసభ స్థానాలను పొందింది. BJP 31% ఓట్లతో 282 స్థానాలను పొంది అతిపెద్ద పార్టీగా అవతరించినది. అది ఏమి తెలియచేస్తుందంటే స్వాతంత్ర్యానంతరం-1952 నుండి పరిపాలించిన పార్టీని కాదని BJP కి అధికారం ప్రజలు ఇచ్చారు.
దీనికి కారణం ప్రజలు మార్పును కోరుకుంటున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ లో అవినీతి రాజ్యం ఏలుతుంది. చాలామంది కాంగ్రెస్ నాయకులు కోర్టులలో అవినీతి కేసులను ఎదుర్కొంటున్నారు. ఇలాంటి తరుణంలో ప్రజలకు అవినీతి రహిత సమాజం, నూతన సంస్కరణలతో అభివృద్ధి చెందుతున్న సమాజం కావాలి. అందుకోసం వారు కొత్త పార్టీలకు అధికారం ఇవ్వడం జరిగింది. ఇకముందు రాబోయే ఎన్నికలలో ఏమి జరుగుతుందో చూద్దాం.
ప్రశ్న 14.
 “సంకీర్ణ ప్రభుత్వాలు రాజకీయ అస్థిరతకు కారణమవుతున్నాయి.” – దీనిపై వ్యాఖ్యానింపుము.
 జవాబు:
- కొన్నిసార్లు సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావలసినంత మెజారిటీ ఏ ఒక్క పార్టీకి రాదు. ఇటువంటి పరిస్థితులలో కొన్ని పార్టీలు కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పరుస్తాయి.
 - ప్రభుత్వ విధానాలకు సంబంధించి ఈ పార్టీల మధ్య ఒక ఉమ్మడి ఒప్పందం కుదరాల్సి వస్తుంది. కానీ ఇది అంత తేలికైన పని కాదు.
 - వేర్వేరు పార్టీలు తమ ప్రయోజనాల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాయి.
 - ఏ పార్టీ మద్దతు ఉపసంహరించుకుంటుందో అన్న భయంతో ప్రభుత్వాలు ఏ విధానాన్ని అమలు చేయలేని స్థితి ఏర్పడుతుంది. ప్రభుత్వాలు అస్థిరాలు అవుతాయి.
 
ప్రశ్న 15.
 ‘కొన్నిసార్లు సంకీర్ణ ప్రభుత్వాల వల్ల ‘విధాన పక్షవాతం’ సంభవిస్తుంది. దీనితో ఏకీభవిస్తారా ? మీ అభిప్రాయం తెల్పండి.
 జవాబు:
 అవును. నేను దీనితో ఏకీభవిస్తాను. ఏదో ఒక భాగస్వామి మద్దతు ఉపసంహరించుకుంటుందన్న భయంతో తీవ్ర
 మార్పులను తెచ్చే విధానాలను అమలు చెయ్యటానికి సంకీర్ణ ప్రభుత్వాలు భయపడతాయి.
ప్రశ్న 16.
 భారతదేశంలో సరళీకృత ఆర్థిక విధానాలు అవలంబించడం వలన కలిగిన ఫలితాలేమిటి?
 జవాబు:
 భారతదేశంలో సరళీకృత ఆర్థిక విధానాలు – ఫలితాలు :
- విదేశీ సరుకులు భారత మార్కెట్లో ప్రవేశించాయి.
 - చౌకగా లభించే విదేశీ ఉత్పత్తులతో పోటీపడలేక చాలా భారతీయ కర్మాగారాలు మూతపడ్డాయి.
 - భారతీయ పారిశ్రామికవేత్తలు ప్రపంచస్థాయి తయారీదారులతో పోటీపడవలసి వచ్చింది.
 - విదేశీ కంపెనీలు వచ్చి భారతదేశంలో సంస్థలు నెలకొల్పాయి.
 - అనేక సబ్సిడీలకు కోతలు విధించారు.
 - ప్రైవేటీకరణ పెరిగింది.
 
ప్రశ్న 17.
 పంజాబ్ ఆందోళన గురించి రాయండి.
 జవాబు:
- పంజాబ్ రాష్ట్రంలో స్వయం ప్రతిపత్తికి మరొక ఉద్యమం రూపుదిద్దుకొంది.
 - ఇక్కడ కూడా అత్యధిక శాతం ప్రజలు మాట్లాడే భాష, మతమూ ఆధారంగా ప్రజల సమీకరణ జరిగింది.
 - ఇక్కడ కూడా దేశాభివృద్ధిలో రాష్ట్రం పాత్రను విస్మరిస్తున్నారన్నదే పంజాబ్ ఆరోపణ.
 - రాష్ట్రం ఏర్పడినప్పుడు తమకు అన్యాయం జరిగిందని వారు భావిస్తున్నారు.
 - రాజధాని నగరమైన చండీగఢ్ కేంద్రపాలిత ప్రాంతంగా కాక తమ రాష్ట్రానికే చెందాలని కోరసాగారు.
 - భాక్రానంగల్ ఆనకట్ట నుంచి ఎక్కువ నీళ్ళు కావాలని, సైన్యంలోకి ఎక్కువమంది సిక్కులను తీసుకోవాలని కూడా కోరసాగారు.
 

ప్రశ్న 18.
 రాజీవ్ గాంధీ చేపట్టిన శాంతి చర్యలు ఏవి?
 జవాబు:
 రాజీవ్ గాంధీ చేపట్టిన శాంతి చర్యలు :
- రాజీవ్ గాంధీ పంజాబ్, అసోం, మిజోరంలలో, పొరుగు దేశమైన శ్రీలంకలో కూడా శాంతి ప్రక్రియలు మొదలు పెట్టాడు.
 - శ్రీలంకలో ఘర్షణ పడుతున్న ఇరుపక్షాల మధ్య శాంతి నెలకొల్పటానికి భారతదేశం తన సైన్యాన్ని పంపించింది.
 - అయితే దీనికి అటు తమిళులు, ఇటు శ్రీలంక ప్రభుత్వమూ అంగీకరించకపోవటం వల్ల ఇదొక దుస్సాహస చర్యగా పరిణమించింది.
 - అంతిమంగా భారతదేశం తన సైన్యాన్ని 1989లో వెనక్కి తీసేసుకుంది.
 
ప్రశ్న 19.
 సంకీర్ణ రాజకీయాల శకం గురించి రాయుము.
 జవాబు:
- 1990ల కాలంలో స్వాతంత్ర్యానంతర భారతదేశంలో చాలా కీలకమైన మార్పులు చోటుచేసుకున్నాయి.
 - పోటీతో కూడిన బహుళ పార్టీ వ్యవస్థకు మార్పుతో మెజారిటీ స్థానాలు గెలిచి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే స్థితి ఏ ఒక్క పార్టీకీ లేదు.
 - 1989 నుంచి జాతీయస్థాయిలో ఏర్పడిన ప్రభుత్వాలన్నీ సంకీర్ణ /మైనారిటీ ప్రభుత్వాలే.
 - కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటానికి అనేక జాతీయ, ప్రాంతీయ పార్టీలు కలవవలసి వచ్చేది.
 - దీని అర్థం అనేక పార్టీల రాజకీయ సిద్ధాంతాలను, కార్యక్రమాలను కలుపుకుని కనీస ఒప్పందాలకు రావలసివచ్చేది.
 
ప్రశ్న 20.
 పశ్చిమ బెంగాలులో ఏర్పడిన వామపక్ష ప్రభుత్వం గురించి రాయుము.
 జవాబు:
- వామపక్ష రాజకీయ పార్టీలైన భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ), ఫార్వర్డ్ బ్లాక్, రివల్యూషనరీ సోషలిస్టు పార్టీ, భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు (సి.పి.ఎం) వంటివి 1977లో పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ఎన్నికలలో గెలిచి సి.పి.ఎం.కి చెందిన జ్యోతిబసు నాయకత్వంలో వామపక్ష ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి.
 - రాష్ట్రంలో అసంపూర్తిగా ఉండిపోయిన భూసంస్కరణలను పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ముందుగా చేపట్టినది.
 
ప్రశ్న 21.
 ఆపరేషన్ బర్గాను గురించి వ్రాయుము.
 జవాబు:
- 1978 జూన్లో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కౌలుదార్ల పేర్లను నమోదుచేసి వాళ్ల హక్కును కాపాడటానికి ఆపరేషన్ బర్గాను చేపట్టింది.
 - కౌలుదార్లను బెంగాలీలో బర్గాదార్లు అంటారు.
 - వీళ్ళు భూస్వాముల భూములను సాగుచేస్తూ పంటలో అధికభాగం వాళ్ళకి కౌలుగా చెల్లిస్తూ ఉండేవాళ్లు.
 - పశ్చిమ బెంగాల్ లో గ్రామీణ జనాభాలో ఈ కౌలుదార్లు అధికసంఖ్యలో ఉండేవాళ్ళు.
 
ప్రశ్న 22.
 సరళీకృత ఆర్థిక విధానంలోని ప్రధాన అంశాలు ఏవి?
 జవాబు:
- ప్రభుత్వ ఖర్చును బాగా తగ్గించుకోవటం, రైతులకు ఇచ్చే సబ్సిడీలలో కోత, ప్రజాసేవలు, ఆరోగ్యం వంటి వాటిల్లో కూడా ప్రభుత్వ ఖర్చును తగ్గించుకోవటం.
 - విదేశీ సరుకుల దిగుమతుల మీద పరిమితులను, పన్నులను తగ్గించుకోవటం.
 - భారతదేశంలో విదేశీ పెట్టుబడులపై పరిమితులను తగ్గించుకోవటం.
 - ఆర్థిక రంగంలోని అనేక రంగాలలో ప్రైవేటు పెట్టుబడిదారులకు అవకాశం కల్పించటం.
 
ప్రశ్న 23.
 అత్యవసర పరిస్థితిని తొలగించి ఇందిరాగాంధీ చేపట్టిన చర్యలు ఏవి?
 జవాబు:
- 1977 జనవరిలో ఎన్నికలను ప్రకటించారు.
 - రాజకీయ ఖైదీలందరినీ ఇందిరాగాంధీ విడుదల చేసి స్వేచ్ఛ, కదలికలు, ప్రచార ఉద్యమాలు, సమావేశాలను అనుమతించని అన్ని నియంత్రణలను, సెన్సారును తొలగించారు.
 
ప్రశ్న 24.
 1977 సాధారణ ఎన్నికల తరువాత ఏ ఏ రాష్ట్రాలలో, ఏ ఏ కాంగ్రెసేతర ప్రభుత్వాలు ఏర్పడ్డాయి?
 జవాబు:
 1977 సాధారణ ఎన్నికల తరువాత ఏర్పడిన కాంగ్రెసేతర ప్రభుత్వాలు:
- ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, బీహార్లో జనతాపార్టీ
 - పశ్చిమబెంగాల్ లో సి.పి.ఐ (ఎం)
 - తమిళనాడులో డి.ఎం.కె గెలిచాయి.
 
ప్రశ్న 25.
 1977 సాధారణ ఎన్నికల నాటి నుండి 1980 ఎన్నికల వరకు జాతీయస్థాయిలో జరిగిన రాజకీయ పరిస్థితిని వివరింపుము.
 జవాబు:
- 1977 సాధారణ ఎన్నికలలో ప్రజాస్వామ్యాన్ని, స్వేచ్ఛని పునరుద్ధరిస్తామన్న ‘వాగ్దానంతో జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది.
 - అంతర్గత విభేదాల కారణంగా దాని పాలన ప్రభావితం అయ్యింది.
 - అంతర్గత కీచులాటలకు, ఫిరాయింపులకు ఈ పాలన గుర్తుండిపోయింది.
 - పార్టీలో అంతర్గత కుమ్ములాటల వల్ల 3 సం||రాల లోపే ప్రభుత్వం పడిపోయి 1980లో తాజా ఎన్నికల నిర్వహణకు దారితీసింది.
 - 1980లో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వచ్చింది.
 
ప్రశ్న 26.
 1970 లో ఏర్పడ్డ కొన్ని ప్రతిపక్ష రాజకీయ పార్టీలు ఏవి?
 జవాబు:
 1970 లో ఏర్పడ్డ కొన్ని ప్రతిపక్ష రాజకీయ పార్టీలు :
- బి.ఎల్.డి – భారతీయ లోకదళ్ – ఉత్తరప్రదేశ్
 - కాంగ్రెస్ (ఓ) – ఇందిరాగాంధీ విధానాలను వ్యతిరేకించిన కాంగ్రెస్లోని సంప్రదాయవాద వర్గం
 - సి.పి.ఐ (ఎం) – భారతీయ కమ్యూనిస్టు పార్టీ (మార్కిస్టు)
 - డి.ఎం.కె – ద్రవిడ మున్నేట్ర కజగం – తమిళనాడు
 - జనసంఘ్ – ఉత్తరాది రాష్ట్రాలకు పరిమితమైంది.
 - ఎస్.ఎ.డి – శిరోమణి అకాలీ దళ్ – పంజాబ్.
 

ప్రశ్న 27.
 ఈ క్రింది వాటిని భారతదేశ పటంలో గుర్తించండి.
 1) ఆంధ్రప్రదేశ్
 2) అసోం
 3) పంజాబ్
 4) తమిళనాడు
 5) పశ్చిమబెంగాల్
 6) ఉత్తరప్రదేశ్
 7) నాగాలాండ్
 8) మిజోరం
 9) బీహార్
 10) గుజరాత్
 11) మహారాష్ట్ర
 12) అయోధ్య
 జవాబు:
 
ప్రశ్న 28.
 భారత రాజ్యాంగంలోని 73వ సవరణకు సంబంధించిన ముఖ్యాంశాలు ఏవి?
 జవాబు:
- స్థానిక స్వపరిపాలనకు రాజ్యాంగ గుర్తింపునిస్తూ 1992 సంవత్సరంలో P.V. నరసింహారావు ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేసింది.
 - 73వ రాజ్యాంగ సవరణ గ్రామస్థాయిలో స్థానిక స్వపరిపాలనా ప్రభుత్వాలను కల్పించగా, 74వ రాజ్యాంగ సవరణ ” పట్టణ, నగరాలకు వాటి స్థాయిలో ప్రభుత్వాలను సార్వత్రిక వయోజన ఓటింగ్ హక్కు ద్వారా మొదటిసారి ఎన్నుకున్నారు.
 - మొత్తం స్థానాలలో 1/3 వంతు స్త్రీలు, SC, ST లకు కూడా కొన్ని స్థానాలు రిజర్వ్ చేశారు.
 - స్థానిక స్వపరిపాలనకు కొన్ని విధులు, అధికారాలు రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయానికి వదిలి పెట్టారు.
 
ప్రశ్న 29.
 73వ రాజ్యాంగ సవరణ వల్ల స్థానిక సంస్థలకు ఉపయోగముంటుందని మీరు భావిస్తున్నారా? కారణాలు తెల్పండి.
 జవాబు:
- 73వ రాజ్యాంగ సవరణ వల్ల స్థానిక సంస్థలకు తప్పనిసరిగా ప్రయోజనం ఉంటుంది.
 - రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాలను గౌరవిస్తూ స్థానిక స్వపరిపాలనా ప్రభుత్వాలకు ఉండే విధులు, అధికారాలను రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయానికి వదిలిపెట్టారు.
 - కొన్ని అంశాలలో కొంతమేర స్వయంప్రతిపత్తి స్థానిక ప్రభుత్వాలకు లభించింది.
 
ప్రశ్న 30.
 నిరక్షరాస్యత ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తుందో మీ అభిప్రాయాన్ని తెల్పండి.
 జవాబు:
- నిరక్షరాస్యత ప్రజాస్వామ్యంపై ఋణాత్మక ప్రభావాన్ని చూపిస్తుంది.
 - నిరక్షరాస్యులు ఓటు ప్రాధాన్యతను అర్థం చేసుకోలేరు.
 - ఎన్నికలలోని అనుచిత ప్రవర్తనలు నిరక్షరాస్యులను కేంద్రంగా చేసుకొని జరుపబడతాయి.
 - ప్రజాస్వామ్యం విజయవంతం కాకపోవడానికి నిరక్షరాస్యత కారణమయ్యే ప్రమాదముంది.
 
ప్రశ్న 31.
 రాజీవ్ గాంధీ అనుసరించిన సరళీకృత ఆర్థిక విధానం దేశాభివృద్ధికి దోహదపడిందని భావిస్తున్నారా? అభిప్రాయం తెల్పండి.
 జవాబు:
- రాజీవ్ గాంధీ అనుసరించిన సరళీకృత ఆర్థిక విధానాలు దేశాభివృద్ధికి ఖచ్చితంగా దోహదం చేశాయని నేను భావిస్తున్నాను,
 - ఆర్థిక రంగంలో రాజీవ్ గాంధీ భిన్నమైన పంథాను అనుసరించడానికి ప్రయత్నించాడు.
 - 1986లో అతడి ప్రభుత్వం ప్రవేశపెట్టిన మొదటి బడ్జెట్ లో అమలులో ఉన్న కొన్ని నియంత్రణలను, పరిమితులను తొలగించి సరళీకృత ఆర్థిక విధానంవైపు పయనం మొదలు పెట్టాడు.
 - ఆ తర్వాత అవే ప్రపంచీకరణకు, ‘టెలికం విప్లవానికి బాటలు వేయడం జరిగింది.
 
ప్రశ్న 32.
 పేజి 268లోని ఆంధ్రప్రదేశ్ శీర్షిక కింద గల “ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రులను …….. అతడు వాదించాడు.” వరకు, చదివి, దానిపై వ్యాఖ్యానించండి.
 జవాబు:
 ఆ కాలంలో ఎన్.టి. రామారావుగారు ఆంధ్రప్రదేశ్, భారతదేశ రాజకీయాలలో ముఖ్యమైన పాత్ర పోషించారు. ఆయన నినాదం ‘తెలుగు వారి ఆత్మగౌరవం’ నాటికీ, నేటికీ అద్భుతమైనది. అప్పటి వరకు జాతీయ రాజకీయాలలో ఉత్తరాది వారే అధిక పాత్ర పోషిస్తున్నారు. కాని తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత జాతీయ రాజకీయాలలో ప్రాంతీయ పార్టీల హవా పెరిగింది. ముఖ్యంగా టి.డి.పి.ది.
ఎన్.టి.ఆర్ ప్రవేశపెట్టిన సబ్సిడీ బియ్యం పథకం, మద్యపాన నిషేధం మొదలైనవి ఆయన ప్రభుత్వ పనితనానికి ఉదాహరణలు – గర్వకారణాలు. ఆయన పార్టీలోనే కొంత వ్యతిరేకత ఉన్నప్పటికీ ఆయన దానిని సమర్థవంతంగా అణిచివేశారు.
10th Class Social 19th Lesson 4 Marks Important Questions and Answers in Telugu Medium
ప్రశ్న 1.
 అసోం ఉద్యమం గురించి రాయండి. అసోం ఉద్యమానికి గల ప్రధాన కారణాలు రాయండి.
 జవాబు:
- అసోంలో అస్సామీ భాషే కాకుండా బెంగాలీ భాష కూడా ఎక్కువగా మాట్లాడతారు.
 - బ్రిటిష్ పాలన నాటి నుంచి రాష్ట్ర పరిపాలనలోని కింది, మధ్య స్థాయి ఉద్యోగాలలో బెంగాలీలు ఉండేవారు.
 - బెంగాలీ అధికారులు తమని సమానులుగా కాకుండా రెండవ తరగతి పౌరులుగా చూస్తున్నారని అస్సోమీయులు భావించేవారు.
 - స్వాతంత్ర్యం తరువాత కూడా బెంగాలీలు అసోంలో ఎంతోమంది స్తిరపడ్డారు. దీనికి తోడు బంగ్లాదేశ్ నుంచి కూడా ఎంతోమంది వలసవచ్చి స్థానికులను అనేక ఇబ్బందులకు గురి చేయసాగారు.
 - దీంతో స్థానిక ప్రజలు తమ సాంస్కృతిక మూలాలు కోల్పోతామని అసంతృప్తి చెంది 1970లో సామాజిక ఉద్యమాన్ని తెచ్చారు.
 

ప్రశ్న 2.
 దేశ విభజన నాటి నుండి రాజకీయాలను మతము ప్రభావితం చేస్తుంది అనడానికి నిదర్శనాలు రాయండి. .
 జవాబు:
- 1947లో జరిగిన మత మారణహోమం నుండి భారతదేశం విభజింపబడి భారతదేశం, పాకిస్థాన్ అను రెండు దేశాలుగా అవతరించాయి.
 - దేశ విభజన తరువాత మన దేశాన్ని లౌకిక రాజ్యంగా ప్రకటించినప్పటికి దేశ రాజకీయాలను మతము అనేక విధాలుగా ప్రభావితం చేస్తుంది.
 - పంజాబ్ లో సిక్కు మతస్థులు ప్రత్యేక ఖలిస్థాన్ కావాలని మారణ హోమం సృష్టించారు. ఇది దేశ ప్రధాని ఇందిరాగాంధీ హత్యకు దారి తీసింది.
 - షాబానో కేసులో ముస్లిం మత ఛాందసవాద వర్గాల ఒత్తిడికి తలొగ్గి కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్రభుత్వం చట్టం చేసిందని చాలామంది భావించారు.
 - అయోధ్యలో వివాదాస్పద కట్టడమైన బాబ్రీ మసీదు ఉన్న స్థానములో రాముడికి గుడి కట్టాలని హిందువులు ఉద్యమం మొదలు పెట్టి బాబ్రీ మసీదును కూల్చివేశారు.
 
ప్రశ్న 3.
 టెలి కమ్యూనికేషన్ రంగం మానవ జీవనంలో నేడు అనేక మార్పులు తెచ్చింది. వాటిని వివరించండి.
 జవాబు:
 టెలి కమ్యూనికేషన్ రంగం మానవ జీవనంలో తెచ్చిన మార్పులు :
- సమయం ఆదా అవుతుంది.
 - వేగంగా సమాచారం అందించడం జరుగుతుంది.
 - ఆన్లైన్ సర్వీసుల విస్తరణ జరిగింది.
 - సుఖవంతమైన / విలాసవంతమైన జీవనానికి దారులు ఏర్పడ్డాయి.
 - ప్రజలు ఫోనులకు, ఇంటర్నెట్లకు బానిసలు (అడిక్షన్) కావడం.
 - కూర్చొనే సమయం పెరగడం వలన ఊబకాయం రావడం జరిగింది. (ఒబేసిటి)
 - జీవన వ్యయం పెరిగింది.
 - ఫోనులకు అతుక్కుపోవడం వలన మానవ సంబంధాలు దెబ్బతిన్నాయి.
 
ప్రశ్న 4.
 దిగువ అంశాన్ని చదివి ప్రశ్నలకు సమాధానములు వ్రాయుము.
| పంచాయితీ రాజ్ & 73 వ సవరణ స్థానిక స్వపరిపాలనకు రాజ్యాంగ గుర్తింపునిస్తూ 1992 వ సంవత్సరంలో పి.వి. నరసింహారావు ప్రభుత్వము రాజ్యాంగ సవరణ చేసింది. 73వ రాజ్యాంగ సవరణ గ్రామ స్థాయిలో స్థానిక స్వపరిపాలనా ప్రభుత్వాలను కల్పించగా, 74వ రాజ్యాంగ సవరణ పట్టణ, నగరాలకు వాటి స్థాయిలో ప్రభుత్వాలను సార్వత్రిక వయోజన ఓటింగ్ ద్వారా మొట్టమొదటిసారి ఎన్నుకొన్నారు. మొత్తం స్థానాలలో మూడింట ఒక వంతు (1/3 వ వంతు) స్థానాలను స్త్రీలకు కేటాయించారు. షెడ్యూలు కులాలు, షెడ్యూలు జాతులకు కూడా కొన్ని స్థానాలను రిజర్వు చేశారు. రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాలను గౌరవిస్తూ స్థానిక స్వపరిపాలనా ప్రభుత్వాలకు ఉండే విధులు, అధికారాలను రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయానికి వదిలి పెట్టారు. అందువలన దేశవ్యాప్తంగా పనిచేసే స్థానిక స్వపరిపాలనా ప్రభుత్వాల అధికారాలలో తేడాలుంటాయి.  | 
ప్రశ్నలు :
 1) స్థానిక స్వపరిపాలన అంటే ఏమిటి?
 2) స్థానిక సంస్థలకు రాజ్యాంగ గుర్తింపు నిచ్చిన ప్రభుత్వమేది?
 3) 73వ రాజ్యాంగ సవరణ దేనికి సంబంధించినది?
 4) స్థానిక సంస్థలలో 1/3 వంతు సీట్లు మహిళలకు కేటాయించడం సమర్ధనీయమా? చర్చించండి.
 జవాబు:
- గ్రామ, పట్టణ మరియు నగర ప్రాంతాలలో ప్రజలు స్థానికంగా ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకొని తద్వారా వారికి గల ఉమ్మడి అవసరాలను తీర్చుకొనుటనే స్థానిక స్వపరిపాలన అంటారు.
 - పి.వి. నరసింహారావు ప్రభుత్వం లేదా కాంగ్రెస్ ప్రభుత్వం
 - గ్రామ స్థాయిలో స్థానిక స్వపరిపాలనకు సంబంధించినది.
 - సమర్థనీయమే. రాజకీయ సమానత్వాన్ని సాధించడంకోసం మరియు వారిని స్థానిక పాలనలో భాగస్వాములను చేయుట కొరకు స్థానిక సంస్థలలో 1/3 వంతు సీట్లు కేటాయించడం సమర్ధనీయం.
 
ప్రశ్న 5.
 ఈ క్రింది పట్టికను చదివి, ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
 పార్లమెంట్ లో వివిధ రాజకీయ పార్టీల బలబలాలు
| రాజకీయ పార్టీ పేరు | సంవత్సరం 1952 | సంవత్సరం 1962 | 
| 1. భారత జాతీయ కాంగ్రెస్ | 364 | 361 | 
| 2. కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా | 16 | 29 | 
| 3. సోషలిస్టు పార్టీ | 12 | 12 | 
| 4. కిసాన్ మజ్జూర్ పార్టీ | 09 | – | 
| 5. పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ | 07 | – | 
| 6. గణతంత్ర పరిషత్ | 06 | – | 
| 7. ఇతరులు | 38 | 27 | 
| 8. స్వతంత్ర అభ్యర్థులు | 37 | 20 | 
| 9. జనసంఘ్ | – | 18 | 
| 10. ప్రజా సోషలిస్ట్ పార్టీ | – | 12 | 
| 11. DMK | – | 07 | 
a) ఏ ఏ రాజకీయ పార్టీలు పార్లమెంట్ లో తమ బలాలు 1952 కంటే 1962 లో ఎక్కువ పొందినాయి?
 b) 1962 నాటికి కనుమరుగైన రాజకీయ పార్టీలు ఏవి?
 c) 1952 మరియు 1962లో తమ బలాన్ని కోల్పోయిన రాజకీయ పార్టీలు ఏవి?
 d) 1952 కంటే 1962 నాటికి తమ సంఖ్యాబలాన్ని కోల్పోయిన రాజకీయ పార్టీలు ఏవి?
 జవాబు:
 a) కమ్యూనిస్టు పార్టీ
 b) 1) జనసంఘ్
 2) ప్రజా సోషలిస్టు పార్టీ
 3) DMK
c) 1962 – 1) కిసాన్ మజ్జూర్ పార్టీ
 2) పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ (1952లో ఏ పార్టీ సీట్లను కోల్పోలేదు)
 3) గణతంత్ర పరిషత్
d) ఇతరులు, స్వతంత్రులు, కాంగ్రెస్

ప్రశ్న 6.
 క్రింది పేరాను చదివి, అర్థం చేసుకొని వ్యాఖ్యానించుము.
భారతదేశంలోకి స్వేచ్ఛగా విదేశీ పెట్టుబడులు, వస్తువులను అనుమతించేలా భారత ఆర్థిక విధానం బలవంతంగా సరళీకృతం చేయబడింది. ఇంకొక వైపు కొత్త సామాజిక వర్గాలు మొదటిసారిగా తమ రాజకీయ అకాంక్షలను సాధించుకోటానికి ప్రయత్నించసాగాయి. అంతేగాకుండా రాజకీయ జీవితంలో మతపర జాతీయవాదం, మతం పేరుతో రాజకీయ సమీకరణలు ముఖ్యాంశాలుగా మారాయి. వీటన్నిటి కారణంగా భారతీయ సమాజం తీవ్ర కల్లోలానికి లోనయ్యింది. ఈ మార్పులను అర్థం చేసుకొని వాటిని అనుగుణంగా మారే ప్రయత్నంలోనే ఇంకా మనం ఉన్నాం.
 జవాబు:
 భారతదేశాన్ని సుస్థిరంగా, సమర్థవంతంగా, వేగవంతంగా అభివృద్ధి పరచడానికి ప్రణాళికలను అమలుపరచడం జరిగినది. దానివలన ప్రభుత్వ వ్యయం కూడా విపరీతంగా పెరిగిపోయింది. దానిని అధిగమించడానికి, భారతదేశంలోకి స్వేచ్చగా విదేశీ పెటుబడులు, వస్తువులను అనుమతించేలా భారత ఆర్థిక విధానం బలవంతంగా సరళీకృతం చేయబడింది.
దానికోసం ప్రజాసేవకు అయ్యే ఖర్చు మరియు రైతులకు ఇచ్చే సబ్సిడీలలో కోత విధించడం జరిగింది. అప్పుడే అభివృద్ధి చెందుచున్న మధ్య తరగతి కులాలవారు రాజకీయ పార్టీలను ప్రారంభించడం వారి ఆకాంక్షలను నెరవేర్చుకోవాలనుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా, మతం పేరుతో రాజకీయ, సమీకరణలు చేయడం జరిగింది. వీటన్నింటి కారణంగా సమాజంలో చాలా సమస్యలు ఎదురైనాయి. రిజర్వేషన్ కూడా ఒక సమస్యే. ప్రస్తుతం మన పరిస్థితి ఏమిటంటే ప్రస్తుత సమాజంలో జరిగే మార్పులకు అనుగుణంగా మనం మారడమే.
ప్రశ్న 7.
 సరళీకృత ఆర్థిక విధానాల కారణంగా భారతదేశంలోకి విదేశీ సరుకులు రావటంతో భారతీయ పారిశ్రామికవేత్తలకు ప్రపంచ ఉత్పత్తిదారులలో పోటీ పడక తప్పలేదు. దీని వల్ల విదేశీ కంపెనీలు భారతదేశంలో పరిశ్రమలను నెలకొల్పి వ్యాపారాలు మొదలు పెట్టాయి. అయితే ప్రభుత్వం ప్రజలకు ఇచ్చే సబ్సిడీలలో కోత విధించడం వల్ల చౌక విదేశీ సరుకులు వెల్లువెత్తడంతో ఇక్కడ అనేక కర్మాగారాలు మూతపడడం వల్ల సాధారణ ప్రజలు, ఎన్నో కష్టాలకు గురయ్యారు. విద్య, ఆరోగ్యం, రవాణా వంటి అనేక ప్రభుత్వ సదుపాయాల ప్రవేటీకరణకు కూడా ఇది, దారితీయటంతో ఈ సేవలు అందించే ప్రవేటు వ్యక్తులకు ప్రజలు పెద్ద మొత్తంలో డబ్బులు/రుసుం చెల్లించాల్సి వస్తోంది.
 ప్రశ్న : సరళీకృత ఆర్థిక విధానాల ఫలితాలపై మీ అభిప్రాయాన్ని వ్రాయుము.
 జవాబు:
- భారతదేశము ప్రపంచ మార్కెట్ లోకి లాగబడింది.
 - సరళీకరణ సమాచార విప్లవానికి దారితీసింది.
 - ప్రపంచ ఉత్పత్తిదారులతో భారతీయ వ్యాపారులు పోటీపడవలసి వచ్చింది.
 - ప్రభుత్వం ప్రజలకు ఇచ్చే సబ్సిడీలలో కోత విధించవలసి వచ్చినందున ప్రజలకు, స్థానిక పరిశ్రమలకు తీవ్ర నష్టం వాటిల్లింది.
 - విద్య, ఆరోగ్యము, రవాణా వంటి అనేక ప్రభుత్వ సదుపాయాల ప్రైవేటీకరణకు దారితీసింది.
 - ప్రపంచీకరణకు మార్గం సుగమమైంది.
 - సరళీకృత ఆర్థిక విధానాల వల్ల సంపన్న వర్గాల వారికి మాత్రమే ఎక్కువ మేలు జరిగిందని చెప్పవచ్చు.
 
ప్రశ్న 8.
 క్రింది సమాచారాన్ని చదివి, క్రింది ప్రశ్నలకు సమాధానములు వ్రాయుము.
 
 i) ఏ రాష్ట్రం నుండి జార్ఖండ్ రాష్ట్రం ఏర్పడింది?
 జవాబు:
 బీహార్
ii) ఉత్తరాఖండ్ రాష్ట్రం యొక్క ఒక ప్రత్యేకతను తెల్పండి.
 జవాబు:
 సంస్కృతం ఒక అధికార భాషగా ఉండటం.
iii) నవంబర్ 1, 2000 సంవత్సరంలో ఏర్పడిన రాష్ట్రం ఏది?
 జవాబు:
 ఛత్తీస్ గఢ్
iv) మధ్యప్రదేశ్ నుండి వేరుబడిన రాష్ట్రమేది?
 జవాబు:
 ఛత్తీస్ గఢ్
ప్రశ్న 9.
 క్రింది పట్టికను పరిశీలించి, సంకీర్ణ ప్రభుత్వాల ధోరణిని విశ్లేషించండి.
 
 జవాబు:
- పై పట్టికలో 1989వ సం||ము నుండి 2004 వరకు సంకీర్ణ ప్రభుత్వాల ధోరణి ఏ విధంగా ఉందో తెలియచేయడం జరిగినది.
 - మూడు సంకీర్ణ ప్రభుత్వాలు మరియు వాటి పాలనా కాలం గురించి ఇవ్వబడింది.
 - 1989 మరియు 1990 లలో జనతాదళ్, నేషనల్ ఫ్రంట్ అనే సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినది. దానిలో JD, DMK, AGP, TDP, JINC లు అధికార పార్టీలుగా మరియు CPM, CPI, BJP లు మద్దతు పార్టీలుగా ఉన్నాయి.
 - 1996 – 1998 సం||ల మధ్యకాలంలో యునైటెడ్ ఫ్రంట్ అనే ఇంకొక సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. దానిలో JKNC. TDP. TMC, CPI, AGP, DMK, MGP లు అధికార పార్టీలుగా, CPM మద్దతుదారుగా ఉంది.
 - 1998 – 2004 ల మధ్యకాలంలో నేషనల్ డెమోటిక్ అలయెన్స్ అనే ఇంకొక సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. , దానిలో JDU, SAD, TMC, AIADMK, JKNC, BJD, శివసేన లు అధికార పార్టీలుగా, TDP మద్దతుదారుగా ఉంది.
 - స్వాతంత్ర్యానంతరం, 1990 సంవత్సరం నుండి మన రాజకీయాలలో చాలా గమనించదగ్గ మార్పులు వచ్చాయి.
 - బహుళ రాజకీయ పార్టీలు వాటి మధ్య పోటీ చివరకు ఏ పార్టీకి ఎన్నికలలో ఆధిక్యం రాని పరిస్థితి ఏర్పడినది.
 - 1989 నుండి 2004 వరకు ఎక్కువగా మనం సంకీర్ణ రాజకీయ పార్టీలు మరియు సంకీర్ణ ప్రభుత్వాలనే చూడటం జరుగుతుంది.
 - ఇది ప్రజల యొక్క ఆలోచనను తెలియచేస్తుంది. రాజకీయ పార్టీలు బాధ్యతగా వ్యవహరించాలని తెలియచేస్తుంది.
 
ప్రశ్న 10.
 ఈ క్రింది పేరాను చదివి, మీ అభిప్రాయం రాయండి.
20వ శతాబ్దం ముగింపులో భారతదేశం ప్రపంచ మార్కెట్ లోకి లాగబడింది. ఈ భారతదేశంలో ఒక వైపున జనాభాలోని వివిధ వర్గాల గొంతులు వినిపించే ప్రజాస్వామ్యం విలసిల్లుతోంది. ఇంకో వైపున ప్రజలను విభజించే, మతపర రాజకీయ సమీకరణల వల్ల సామాజిక శాంతికి ముప్పు పొంచి ఉంది. యాభై ఏళ్ళకు పైగా అది కాలపరీక్షకు నిలబడింది. ఎంతో కొంత స్థిర ఆర్థిక పరిస్థితిని సాధించింది. ప్రజాస్వామిక రాజకీయాలు బలంగా వేళ్లూనుకున్నాయి. తీవ్ర పేదరికాన్ని, కులాలు, మతాలు, ప్రాంతాలు, స్త్రీ-పురుషుల మధ్య తీవ్ర అసమానతల్ని ఇది ఇంకా పరిష్కరించలేదు.
 జవాబు:
 పైన ఇవ్వబడిన పేరాగ్రాఫ్ ప్రజలను విభజించే మరియు మతపరమైన రాజకీయాలను గురించి వర్ణించడం జరిగినది. ఇవి సామాజిక శాంతికి ముప్పును కలిగిస్తాయి. మనకు స్వాతంత్ర్యం వచ్చిన మొదటి 30 మరియు 40 సంవత్సరాల వరకు సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పడినది. ఆ తరువాతే అస్థిర ప్రభుత్వాల కాలం మొదలైనది. ప్రధాన సమస్యలైన పేదరికం, ఆర్థిక అసమానతలు మొ|| వాటిని ఇంకా పరిష్కరించలేదు.
నా అభిప్రాయములో రాజకీయాలు అనేవి ఓటు, బ్యాంకు మీద ఆధారపడి ఉన్నవి. మన దేశంలో కొన్ని సందర్భాలలో మతపరమైన గొడవలు జరిగిన సందర్భములో వాటి వెనుక కొందరు రాజకీయ నాయకుల పాత్ర కలదు. ముఖ్యమంత్రులను పదవి నుండి దింపడానికి, ఆ పార్టీకి చెందిన నాయకులే మత విద్వేషాలను రెచ్చగొట్టిన సందర్భాలు మనదేశంలో కలవు.
మన దేశంలో కుల ఆధారిత రాజకీయాలు నడుస్తాయి. ఆ ప్రాంతంలో ఏ కులంవారు ఎక్కువగా ఉంటే వారికి అక్కడ సీట్లు కేటాయించడం మరియు ఆ కులాలు గ్రూపులుగా ఏర్పడి ఎన్నికలలో అనుచిత చర్యలకు పాల్పడటం జరుగుతుంది. కొన్ని నియోజక వర్గాలలో ప్రత్యేకంగా కొన్ని మతాల వారు ప్రాతినిధ్యం వహించడం, వారి పెత్తనం చలాయించడం జరుగుచున్నది. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్య అభివృద్ధికి ఆటంకంగా తయారవుతున్నాయి.
కావున ప్రజలు, పార్టీలు రాజకీయాలలో కులం, మతం ప్రస్తావనలకు దూరంగా ఉంటే దేశం చాలా బాగా అభివృద్ధి చెందుతుంది.

ప్రశ్న 11.
 ప్రజాస్వామ్యంలో ప్రాంతీయ పార్టీ యొక్క ప్రాముఖ్యతను వివరించండి.
 జవాబు:
- జాతీయ, ప్రాంతీయ పార్టీలతో కూడిన బహుళ పార్టీ వ్యవస్థ ప్రజాస్వామ్యాన్ని బలపరుస్తుంది.
 - సమాఖ్య రాజ్యస్ఫూర్తిని ప్రాంతీయ పార్టీలు ప్రతిబింబిస్తాయి.
 - ప్రాంతీయ పార్టీలు ఆయా రాష్ట్రాల సమస్యలు, అవసరాలపట్ల మంచి అవగాహన కలిగి ఉంటాయి.
 - అవి తమ స్వీయ రాష్ట్రాల అభివృద్ధిపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తాయి.
 
ప్రశ్న 12.
 సంకీర్ణ రాజకీయాల శకం ప్రారంభం కావడానికి గల కారణాలతో పాటు దాని ప్రభావాన్ని వివరించండి.
 జవాబు:
 సంకీర్ణ రాజకీయాల శకం ప్రారంభం కావడానికి గల కారణాలు :
- బహుళపార్టీ వ్యవస్థ
 - ఏ పార్టీకి కావలసినంత మెజారిటీ రాకపోవడం
 - ప్రాంతీయ పార్టీల ప్రాబల్యం పెరగడం.
 - 1960ల తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రజల మద్దతును క్రమంగా కోల్పోవడం.
 
ప్రభావం :
- రాజకీయ స్థిరత్వం లేకపోవడం
 - రాజకీయ సిద్ధాంతాలను వదులుకోవడం
 - జాతి ప్రయోజనాలకన్న పార్టీ ప్రయోజనాలకు ప్రాముఖ్యత ఇవ్వడం.
 - అత్యధిక ప్రజల మద్దతు లేకపోయినప్పటికీ అధికారంలోకి రావడం.
 
ప్రశ్న 13.
 షాబానో కేసులో 1985లో సుప్రీం కోర్సు ఇచ్చిన తీర్పు, “అన్యాయానికి గురవుతున్న మహిళలకు జరుగుతున్న అన్యాయాలను ఇది అరికడుతుందనే” మహిళా ఉద్యమ నాయకుల వాదనను మీరు సమర్థిస్తారా? కారణాలు తెలపండి.
 జవాబు:
- భర్త నుంచి విడాకులు పొందిన షా బానో అన్న మహిళ వేసిన కేసులో 1985లో సుప్రీంకోర్టు ఆమె మాజీ భర్త ఆమెకు భరణం చెల్లించాలని తీర్పు ఇచ్చింది.
 - ప్రగతిశీల ముస్లిములు ఈ తీర్పును స్వాగతించారు.
 - అయితే ఇతరులు ఈ తీర్పు ఇస్లామిక్ చట్టంలో జోక్యం చేసుకుంటోందనీ, దీనిని అనుమతిస్తే తమ మత జీవితంలో జోక్యం మరింత పెరుగుతుందని నిరసనలు చేపట్టారు.
 - మహిళా ఉద్యమ నాయకులు, ముస్లిం సమాజంలో సంస్కరణలు కోరుకుంటున్న సభ్యులు ఏకపక్షంగా భర్తలతో విడాకులు ఇవ్వబడి అన్యాయానికి గురవుతున్న మహిళలకు జరుగుతున్న అన్యాయాలను ఇది అరికడుతుందని వాదించసాగారు.
 
ప్రశ్న 14.
 రామ జన్మభూమి – బాబ్రీ మసీదు వివాదంపై నీ అభిప్రాయమేమిటి?
 జవాబు:
- అయోధ్యలో వివాదాస్పద కట్టడమైన బాబ్రీ మసీదు ఉన్న స్థానంలో రాముడికి గుడి కట్టాలని కొంతమంది హిందువులు ఉద్యమం మొదలుపెట్టారు.
 - అది రాముని జన్మస్థలం అని, అంతకుముందు అక్కడ ఉన్న గుడిని పడగొట్టి మసీదు కట్టారని వాళ్ల వాదన.
 - బాబ్రీ మసీదు నిర్వాహకులు ఇది నిజం కాదని, ఇది ముస్లింల ప్రార్థనాస్థలమని పేర్కొన్నారు.
 - ఈ వివాదం కొంతకాలంగా సాగుతోంది. అంతిమ నిర్ణయం తీసుకునేదాకా సంవత్సరంలో ఒక రోజు తప్పించి మసీదును మూసి ఉంచాలని ఆదేశించింది.
 - 1986లో కోర్టు తీర్పు ఇస్తూ మసీదుని సంవత్సరం పొడవునా తెరచి ఉంచవచ్చని, హిందువులను రోజువారీ పూజలకు అనుమతించాలని ఆదేశించింది.
 
ప్రశ్న 15.
 రాజకీయాలలో మత వినియోగం గురించి బి.జె.పి అభిప్రాయాన్ని రాయుము.
 జవాబు:
- జనాభా సంఖ్యలో అత్యధికులు అంటే హిందువుల మత అస్తిత్వం ఆధారంగా దేశాన్ని నిర్మించాలన్న రాజకీయ ధోరణికి భారతీయ జనతా పార్టీ నేతృత్వం వహిస్తోంది.
 - ప్రజాస్వామ్యం, లౌకికవాదం వంటివి పాశ్చాత్య భావాలని, ఇవి సరిపోవని పురాతన భారతీయ సంస్కృతి నుంచి మనం ఎంతో నేర్చుకోవాలని ఈ పార్టీ విశ్వసిస్తుంది.
 - అయితే మత గురువులు నడిపే మతపరమైన రాజ్యా నికి బి.జె.పి వ్యతిరేకం.
 - లౌకికరాజ్యం అల్పసంఖ్యాక వర్గాలకు మాత్రమే ప్రత్యేక సదుపాయాలు కల్పించకూడదు.
 - దేశ ప్రజలందరిని సమదృష్టితో చూడాలని బి.జె.పి లౌకికవాద స్వరూపం చర్చను ప్రారంభించింది.
 
ప్రశ్న 16.
 భారత ప్రజాస్వామ్యం విజయవంతం అయ్యిందని ఎలా చెప్పగలవు?
 జవాబు:
 భారత ప్రజాస్వామ్యం అనేక సవాళ్ళను ఎదుర్కొని నిలిచిందని, ఆ ప్రక్రియలో అది మరింత బలపడిందని చెప్పవచ్చును.
 కారణాలు:
- క్రమం తప్పకుండా జరిగే స్వేచ్ఛాయుత, న్యాయబద్ధమైన ఎన్నికలు
 - ఎన్నికలలో ఓటు వేసేవాళ్ల సంఖ్య క్రమంగా పెరుగుతుండటం
 - ప్రభుత్వాల మార్పు.
 - కొత్త గ్రూపుల సాధికారీకరణ
 - పౌర హక్కులను కాపాడటం వంటి అంశాలు.
 

ప్రశ్న 17.
 కాంగ్రెస్ ఏకైక పార్టీ కాదనే వాదనను సమర్ధిస్తూ, ప్రత్యామ్నాయాలను చర్చించండి.
 జవాబు:
 కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఏర్పడిన ప్రత్యామ్నాయాలు :
- కాంగ్రెస్ కు వ్యతిరేకంగా అన్ని ప్రధాన ప్రతిపక్ష పార్టీలు కలిసి పోటీ చెయ్యాలని నిర్ణయించాయి.
 - కాంగ్రెస్ (ఓ), స్వతంత్ర పార్టీ, భారతీయ జనసంఘ్, భారతీయ లోకదళ్, సోషలిస్టు పార్టీలు విలీనమై జనతా పార్టీగా ఏర్పడాలని నిర్ణయించాయి.
 - జగజ్జీవన్రాం వంటి ముఖ్యమైన కాంగ్రెస్ నేతలు ఆ పార్టీని వీడి కాంగ్రెస్ వ్యతిరేక వేదికతో చేరారు.
 - ఇతర ప్రధాన ప్రతిపక్ష పార్టీ డి.ఎం.కె, ఎస్.ఎ.డి., సి.పి.ఐ (ఎం) వంటివి తమ ఉనికిని కొనసాగించాలనీ, అయితే ‘కాంగ్రెస్ వ్యతిరేక వేదికలో, జనతా పార్టీకి మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నాయి.
 - కాంగ్రెస్ వ్యతిరేక, అత్యవసర పరిస్థితి వ్యతిరేక పార్టీలు అన్నీ ఒక తాటి కిందకు వచ్చి ఎన్నికలలో పోటీ చేయడం జయప్రకాష్ నారాయణ్, ఆచార్య జె.బి. కృపలాని వంటి సీనియర్ నాయకులు ముఖ్యపాత్ర పోషించారు.
 
ప్రశ్న 18.
 జనాభా సంఖ్యలో అత్యధికులు అంటే హిందువుల మత అస్తిత్వ ఆధారంగా దేశాన్ని నిర్మించాలన్న రాజకీయ ధోరణికి భారతీయ జనతా పార్టీ నేతృత్వం వహిస్తోంది. ప్రజాస్వామ్యం, లౌకికవాదం వంటివి పాశ్చాత్య భావాలని, ఇవి సరిపోవని, పురాతన భారతీయ సంస్కృతి నుంచి మనం నేర్చుకోవాలని ఈ పార్టీ విశ్వసిస్తుంది. అయితే మతగురువులు నడిపే మతపరమైన రాజ్యానికి బి.జె.పి వ్యతిరేకం. లౌకికరాజ్యం అల్పసంఖ్యాక వర్గాలకు మాత్రమే ప్రత్యేక సదుపాయాలు కల్పించడం కాకుండా, దేశ ప్రజలందరినీ సమదృష్టితో చూస్తూ ఒకే పౌర చట్టాన్ని అమలు చేయాలని బి.జె.పి లౌకికవాద స్వరూపం చర్చను ప్రారంభించింది.
1980ల వరకు భారత రాజకీయాలలో ఈ ధోరణి నామమాత్రంగా ఉండేది. ఉదాహరణకు 1984 లోకసభ ఎన్నికలలో వీళ్లు రెండు సీట్లు మాత్రమే గెలిచారు. అయితే అయోధ్య అంశాన్ని – రాముడు పుట్టిన ప్రదేశమంటూ మసీదు ఉన్నచోట గుడి కట్టటానికి ఉద్యమాన్ని చేపట్టటంతో బి.జె.పికి ఆదరణ గణనీయంగా పెరిగింది. ఈ అంశాలకు మద్దతుగా బి.జె.పి నాయకుడైన ఎల్.కె. అద్వాని 1990లో సోమనాథ్ నుంచి అయోధ్య వరకు ‘రథయాత్ర’ చేపట్టాడు. ఈ లౌకికవాద రాజకీయాలు అల్పసంఖ్యాక వర్గాలను, ప్రత్యేకించి ముస్లిములను సంతృప్తి పరచటానికి ప్రయత్నించి, అధిక సంఖ్యలో ఉన్న హిందువులను నిర్లక్ష్యం చేస్తున్నాయని వాదించసాగారు. ఈ ఉద్యమ సమయంలో ప్రజలు పలుపాంత్రాలలో మతపరంగా చీలిపోయారు. పెద్ద ఎత్తున మతపరమైన అల్లర్లు చెలరేగాయి. బీహార్ లో అద్వానీని అరెస్టు చెయ్యటంతో ఈ యాత్ర ముగిసింది. దీనికి ప్రతిగా వి.పి.సింగ్ ప్రభుత్వానికి బి.జె.పి తన మద్దతును ఉపసంహరించుకుని ముందుగానే ఎన్నికలు జరిపేలా చేసింది.
శ్రీలంకకు భారతీయ సైన్యాన్ని పంపించటంలో అతని పాత్రకు ప్రతీకారంగా శ్రీలంకలోని తమిళ వేర్పాటువాద బృందమైన ఎల్టిటిఇ చేతిలో ఈ ఎన్నికల ప్రచారంలో రాజీవ్ గాంధీ హత్యకు గురయ్యాడు. ఆ తరువాత కురిసిన సానుభూతి వెల్లువలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అయితే లోకసభలో బి.జె.పి బలం 120కి పెరిగింది. రామాలయ ప్రచారంలో సమీకరింపబడిన పెద్దగుంపు 1992లో అయోధ్యకు చేరి మసీదును ధ్వంసం చేసింది. ఈ ఘటన తరువాత తీవ్ర నిరసనలు, మతకల్లోలాలు చెలరేగాయి. చాలా ప్రాణనష్టం జరిగింది.
 “రాజకీయాలలో మత వినియోగంపై” నీ అభిప్రాయమేమిటి?
 జవాబు:
 దేశ విభజన సమయంలో రాజకీయ రంగం నుంచి మతాన్ని వేరుచేయటానికి కొంత ప్రయత్నం జరిగింది. అయితే ఆ , తరువాత రాజకీయాలలో మత ప్రమేయం కనిపించింది. రాజకీయ ప్రయోజనాల కోసం మతాన్ని వాడుకోవడం మొదలయ్యింది.
జనాభా సంఖ్యలో అత్యధికంగా ఉన్న హిందువుల మత ఆధారంగా దేశాన్ని నిర్మించాలని భారతీయ జనతా పార్టీ అభిప్రాయం. ప్రజాస్వామ్యం, లౌకికవాదం వంటివి పాశ్చాత్య భావాలని, పురాతన భారతీయ సంస్కృతి నుంచి మనం నేర్చుకోవాలని ఈ పార్టీ విశ్వసిస్తుంది. అయితే 1980 వరకు నామమాత్రంగా ఉన్న ఈ ధోరణి “అయోధ్య రాముడు పుట్టిన ప్రదేశమంతటా మసీదు ఉన్నచోట గుడి కట్టటానికి ఉద్యమాన్ని చేపట్టటంతో ఒక్కసారిగా బి.జె.పి.కి ఆదరణ పెరిగింది. దీనికి మద్దతుగా బి.జె.పి. నాయకుడు ఎల్.కె. అద్వాని 1990లో సోమనాథ్ నుంచి అయోధ్య వరకు “రథయాత్ర” చేశాడు. అంతేకాక లౌకికవాద రాజకీయాలు, అల్పసంఖ్యాక వర్గాలను, ప్రత్యేకించి ముస్లిములను సంతృప్తి, పరచటానికి ప్రయత్నించి, అధిక సంఖ్యలో ఉన్న హిందువులను నిర్లక్ష్యం చేస్తున్నామని వీరు వాదించారు.
ఈ అయోధ్య అంశంలో పెద్ద ఎత్తున మతపరమైన అల్లర్లు జరిగాయి. ప్రజలు చాలా ప్రాంతాలలో మతపరంగా చీలిపోయారు. చివరికి 1992లో అయోధ్యలోని మసీదును ధ్వంసం చేసారు. ఈ ఘటన తరువాత తీవ్ర నిరసనలు, మతకల్లోలాలు చెలరేగాయి. చాలా ప్రాణనష్టం కూడా జరిగింది..
ఈ విధంగా రాజకీయాలలో మతాన్ని వినియోగించి, ప్రాబల్యాన్ని పెంచుకున్నారు.
ప్రశ్న 19.
 స్థానిక స్వపరిపాలనకు రాజ్యాంగ గుర్తింపునిస్తూ 1992వ సంవత్సరంలో పి.వి.నరసింహారావు ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేసింది. 73వ రాజ్యాంగ సవరణ గ్రామస్థాయిలో స్థానిక స్వపరిపాలనా ప్రభుత్వాలను కల్పించగా, 74వ రాజ్యాంగ సవరణ పట్టణ, నగరాలకు వాటి స్థాయిలో ప్రభుత్వాలను సార్వత్రిక వయోజన ఓటింగ్ ద్వారా మొట్టమొదటిసారి ఎన్నుకున్నారు. మొత్తం స్థానాలలో మూడింట ఒకవంతు (1/3వ వంతు) స్థానాలను స్త్రీలకు కేటాయించారు. షెడ్యూలు కులాలు, షెడ్యూలు జాతులకు కూడా కొన్ని స్థానాలను రిజర్వు చేసారు.
 ఇచ్చిన పేరాను అధ్యయనం చేసి, ఈ క్రింది ప్రశ్నలకు సమాధానాలిమ్ము.
 ఎ. రాజ్యాంగంలోని ఏ రాజ్యాంగ సవరణ స్థానిక స్వపరిపాలనకు గుర్తింపునిచ్చింది?
 జవాబు:
 73వ రాజ్యాంగ సవరణ స్థానిక స్వపరిపాలనకు గుర్తింపు ఇచ్చింది.
బి. పట్టణాలు, నగరాలలో ఏ రాజ్యాంగ సవరణ ప్రకారం మొదటిసారిగా సార్వత్రిక వయోజన ఓటింగ్ ద్వారా ఎన్నికలు జరిగాయి?
 జవాబు:
 74వ రాజ్యాంగ సవరణ ప్రకారం పట్టణాలు, నగరాలలో మొదటిసారిగా సార్వత్రిక వయోజన ఓటింగ్ ద్వారా ఎన్నికలు జరిగాయి.
సి. స్థానిక సంస్థలలో మొత్తం స్థానాలలో స్త్రీలకు ఎన్నవ వంతు కేటాయించారు?
 జవాబు:
 స్థానిక సంస్థలలో స్త్రీలకు 1/3వ వంతు కేటాయించారు.
ప్రశ్న 20.
 ఈ కింది పట్టికను పరిశీలించి, ఈ క్రింది ప్రశ్నలకు సమాధానాలిమ్ము.
 
 ఎ) టి.డి.పి. ఏ సంవత్సరంలో ఏర్పాటైనది?
 జవాబు:
 టి.డి.పి. 1982లో ప్రారంభమైంది.
బి) ఇందిరాగాంధీ హత్య ఏ సంవత్సరంలో జరిగింది?
 జవాబు:
 ఇందిరాగాంధీ హత్య 1984లో జరిగింది.
సి) ఆర్థిక సరళీకరణ విధానాలు ఎప్పుడు జరిగినవి?
 జవాబు:
 ఆర్థిక సరళీకరణ విధానాలు 1984లో జరిగినవి.