AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు

Andhra Pradesh BIEAP AP Inter 2nd Year Physics Study Material 6th Lesson ప్రవాహ విద్యుత్తు Textbook Questions and Answers.

AP Inter 2nd Year Physics Study Material 6th Lesson ప్రవాహ విద్యుత్తు

అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
వాహకంలో ఎలక్ట్రాన్ స్వేచ్ఛా పథమాధ్యమాన్ని నిర్వచించండి.
జవాబు:
ఒక వాహకంలో, ఒక ఎలక్ట్రాన్ రెండు వరుస అభిఘాతాల మధ్య ప్రయాణించిన సరాసరి దూరంను వాహకంలో ఎలక్ట్రాన్ సరాసరి స్వేచ్ఛాపథ మాధ్యమము అంటారు.

ప్రశ్న 2.
ఓమ్ నియమాన్ని తెలిపి, దాని గణిత రూపం రాయండి.
జవాబు:
ఓమ్ నియమము :
స్థిర ఉష్ణోగ్రత వద్ద, వాహకంలో విద్యుత్ ప్రవాహసత్వం (1), దాని రెండు చివరల పొటెన్షియల్ తేడా (V) కు అనులోమానుపాతంలో ఉండును.
∴ I ∝ V ⇒ I = \(\frac{V}{R}\) ⇒ V = IR (గణితరూపం)
ఇక్కడ R ఒక స్థిరాంకం. దీనినే వాహకం నిరోధం అంటారు.

ప్రశ్న 3.
నిరోధకత లేదా విశిష్ట నిరోధంను నిర్వచించండి.
జవాబు:
నిరోధకత లేక విశిష్ట నిరోధం :
ప్రమాణ పొడవు మరియు ప్రమాణ మధ్యచ్ఛేద వైశాల్యం గల వాహకం నిరోధంను నిరోధకత అంటారు.
l = 1, A = 1 ⇒ ρ = \(\frac{R\times1}{1}\) ⇒ ρ =R

ప్రశ్న 4.
ఉష్ణోగ్రత నిరోధ గుణకంను నిర్వచించండి.
జవాబు:
ఉష్ణోగ్రత నిరోధ గుణకం :
ప్రమాణ ఉష్ణోగ్రత పెరుగుదలకు నిరోధకతలోని మార్పుకు, 0°C వద్ద నిరోధకంనకు గల నిష్పత్తిని ఉష్ణోగ్రత నిరోధ గుణకం అంటారు.
α = \(\frac{\mathrm{R}_{\mathrm{t}}-\mathrm{R}_0}{\mathrm{R}_0 \mathrm{t}}\)

ప్రశ్న 5.
ఘటాల మిశ్రిత సంధానం ద్వారా ప్రవహించే విద్యుత్ ఏ సందర్భాల్లో గరిష్ఠంగా ఉంటుంది ?
జవాబు:

  1. అన్ని ఘటాల ప్రభావ వి.చా.బ గరిష్ఠం అయిన
  2. బాహ్య నిరోధం, అన్ని ఘటాల అంతర నిరోధాల మొత్తమునకు సమానమయినప్పుడు, ఘటాల మిశ్రమ గ్రూపింగ్ విద్యుత్ ప్రవాహం గరిష్ఠం.

AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు

ప్రశ్న 6.
ఒక తీగను దాని ద్రవ్యరాశిలో మార్పు లేకుండా తొలి పొడవు రెట్టింపు అయ్యేట్లు సాగదీస్తే, తీగ నిరోధకత ఎలా ప్రభావితం అవుతుంది?
జవాబు:
ఉష్ణోగ్రతలో మార్పు లేకుండా, ఒక పదార్థం పరిమాణంలో మార్పు లేకుండా, తీగ నిరోధకత్వం మారదు.

ప్రశ్న 7.
ప్రామాణిక నిరోధకాల తయారీలో మాంగనీన్ను ఎందుకు ఉపయోగిస్తారు?
జవాబు:
మాంగనీన్ (Cu-84% + Mn – 12% + Ni – 4%) తీగ హెచ్చు నిరోధకత్వం (ρ) మరియు అల్ప ఉష్ణోగ్రత నిరోధ గుణకంను కల్గి ఉండుట వల్ల ప్రమాణ నిరోధాలలో వాడతారు.

ప్రశ్న 8.
కార్బన్ నిరోధకంపై గుర్తించిన రంగుల పట్టీల క్రమం: ఎరుపు, ఎరుపు, ఎరుపు, వెండి, అయితే దాని నిరోధం, సహనం ఎంత?
జవాబు:
AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు 1
ఎరుపు, ఎరుపు, ఎరుపు గుర్తులతో మార్కు చేయబడిన కార్బన్ నిరోధం = 22 × 10² = 2.2kΩ = 2200Ω
[∵ ఎరుపు క్రమ సంఖ్య = 2 మరియు లబ్ద కారకం = 10²]
కార్బన్ నిరోధకము టోలరెన్స్ = 10²

ప్రశ్న 9.
23 కిలో ఓమ్ల నిరోధం గల కార్బన్ నిరోధకం రంగుల కోడ్ను రాయండి.
జవాబు:
23 కిలో ఓమ్స్ (= 23 × 10³Ω) కార్బన్ నిరోధకం కలర్ కోడ్ వరుసగా ఎరుపు, నారింజ, నారింజ.
[∵ ఎరుపుకు క్రమసంఖ్య 2, నారింజకు 3, నారింజ లబ్ది కారకం 10³]

ప్రశ్న 10.
ఒక వాహకం చివరల మధ్య అనువర్తించిన వోల్టేజిని Vనుంచి 20కి పెంచితే, ఎలక్ట్రాన్ల డ్రిఫ్ట్ వేగం ఎలా మారుతుంది?
జవాబు:
AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు 2
∴ డ్రిఫ్ట్ వేగం రెండు రెట్లు పెరుగును.

ప్రశ్న 11.
సమాన పొడవులు గల రాగి, మాంగనీస్ తీగలు సమాన నిరోధాన్ని కలిగి ఉన్నాయి. వాటిలో ఏది మందమైంది?
జవాబు:
R = \(\frac{\rho \mathrm{A}}{l}\) ⇒ A = \(\frac{Rl}{\rho}\)
ρరాగి < ρమాంగనీస్ కావున రాగితీగ, మాంగనీన్ తీగకన్నా మందమైంది.

ప్రశ్న 12.
గృహ ఉపకరణాలను ఎందుకు సమాంతరంగా కలుపుతారు?
జవాబు:
గృహోపకరణ తీగలను సమాంతరంగా కలిపితే, ప్రతి దానిపై వోల్టేజి సమానం. వాని గుండా ప్రవహించి విద్యుత్ (1) గృహోపకరణ సామర్థ్యంపై ఆధారపడును. హెచ్చు సామర్థ్య గృహోపకరణం ఎక్కువ విద్యుత్ను తీసుకొనును. తక్కువ సామర్థ్య గృహోపకరణం తక్కువ విద్యుత్ను తీసుకొనును.
(∵ P = VI or I ∝ P)

AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు

ప్రశ్న 13.
లోహాలలో ఎలక్ట్రాన్ డ్రిఫ్ట్ వడి తక్కువ (~ms-1), ఎలక్ట్రాన్ ఆవేశం కూడా చాలా తక్కువ (~10-19C), అయినప్పటికీ లోహంతో అధిక పరిమాణంలో విద్యుత్ ప్రవాహాన్ని మనం పొందగలుగుతున్నాం. ఎందుకు?
జవాబు:
లోహం గుండా విద్యుత్ ప్రవాహం, I = n A eVd.

Aలోహ మధ్యచ్ఛేద వైశాల్యం. ఎలక్ట్రాన్ అవసర వడి Vd(~105ms-1) జన్వల్పము. ఎలక్ట్రాన్ ఆవేశం e(~1.6 × 10-19C) కూడా చాలా స్వల్పము. వాహకంలో చాలా స్వేచ్ఛా ఎలక్ట్రాన్లు (~ 1029 m-3) ఉండుట వల్ల, వాహకంలో ఎక్కువ పరిమాణం ఉన్న విద్యుత్ ప్రవాహంను ఇంకను పొందుతాము.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
10V emf, 3Ω అంతర్నిరోధం గల ఒక బాటరీని R నిరోధానికి సంధానం చేశారు.
i) వలయంలో విద్యుత్ ప్రవాహం 0.5 A అయితే, R విలువను లెక్కించండి.
ii) వలయం మూసి ఉంటే బాటరీ టెర్మినల్ వోల్టేజి ఎంత ?
జవాబు:
ఇచ్చినవి E 10 V, r = 3Ω, I = 0.5 A, R = ?, V = ?
AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు 3
i) E = I (R + r)
లేక R + r = \(\frac{E}{I}=\frac{10}{0.5}\) = 20Ω
⇒ R = 20 – 3 = 17Ω

ii) టెర్మినల్ వోల్టేజి, V = IR
= 0.5 × 17 = 8.5Ω

ప్రశ్న 2.
ఒక ఘటం అంతర్నిరోధం తెలుసుకోవడానికి పొటెన్షియోమీటర్ ఎలా ఉపయోగపడుతుందో తెలిపే వలయం రేఖా చిత్రాన్ని గీయండి. దానికి సూత్రాన్ని రాబట్టండి.
జవాబు:
AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు 4
పొటెన్షియోమీటర్తో అంతర్నిరోధం (r) ను కొలుచుట :
1) అంతర్నిరోధం కొలుచు పొటెన్షియోమీటర్ పటంలో చూపబడింది.
2) ఘటం(వి. చా. బ.) అంతర్నిరోధం (r)ను నిర్ణయించుటకు కీ K2 ద్వారా నిరోధాల పెట్టె సంధానం చేయబడి ఉంటుంది.
3) కీ K తెరిచి, సంతులన పొడవు l1 (AN1) పొందుతాము.
అప్పుడు ε = Φ l1 …………… (1)
4) కీ K2 ను మూస్తే నిరోధాల పెట్టె (R.B) ద్వారా, ఘటం నుండి విద్యుత్ ప్రవాహం I ప్రవహింపచేస్తుంది.
5) ఘటం, టెర్మినల్ పొటెన్షియల్ తేడా (V) అయినపుడు, సంతులన పొడవు I2(AN2) ను పొందితే అప్పుడు
AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు 5

ప్రశ్న 3.
మూడు నిరోధకాలను (i) శ్రేణి, (ii) సమాంతరంగా కలిపినప్పుడు ప్రభావాత్మక నిరోధానికి సమీకరణాన్ని ఉత్పాదించండి.
జవాబు:
i) మూడు నిరోధకాలను శ్రేణిలో కలిపినప్పుడు ప్రభావ నిరోధం :
AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు 6

  1. మూడు నిరోధకములు R1, R2 మరియు R3 లు శ్రేణిలో పటంలో చూపినట్లు కలుపబడినవి. R1, R2 మరియు R3ల వెంట పొటెన్షియల్ తేడాలు V1, V2 మరియు V3. వాని గుండా ప్రవహించు విద్యుత్ I.
  2. R1, R2 మరియు R3 లకు ఓమ్ నియమము అనువర్తిస్తే,
    అప్పుడు V1 = IR1, V2 = IR2, V3 = IR3
  3. ఈ శ్రేణిలో, V = V1 + V2 + V3
    IRs = IR1 + IR2 + IR3 [∵ V = IRs]
    ∴ Rs = R1 + R2 + R3

ii) మూడు నిరోధాలను సమాంతరంగా కలిపినపుడు ప్రభావ నిరోధం :
AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు 7

1. మూడు నిరోధకములు R1, R2 మరియు R3 లు సమాంతరంగా పటంలో చూపినట్లు కలుపబడినవి. ప్రతి నిరోధకము వెంట పొటెన్షియల్ తేడా V. వాని గుండా ప్రవహించు విద్యుత్లు I1, I2 మరియు I3.

2. R1, R2 మరియు R3 లకు ఓమ్ నియమము అనువర్తిస్తే, అప్పుడు V = I1R1 = I2R2 = I3R3
AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు 8

ప్రశ్న 4.
ఒక్కొక్కటి E emf, r అంతర్నిరోధం గల m ఘటాలను సమాంతరంగా సంధానం చేశారు. మొత్తం emf, అంతర్నిరోధం ఎంత ? ఘటాల మిశ్రిత సంధానం ద్వారా ఏ సందర్భాలలో విద్యుత్ ప్రవాహం గరిష్టంగా ఉంటుంది?
జవాబు:
ఘటాలను సమాంతరంగా కలిపినప్పుడు :
AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు 10
1) అంతర్నిరోధం r, వి.చా.బ. ౬ ఉన్న ఒకే రకమైన m ఘటాలను, బాహ్య నిరోధం R కు సమాంతరంగా పటంలో చూపినట్లు కలిపి ఉన్నాయని భావిద్దాం.

2) ఘటాలు సమాంతరంగా కలుపబడి ఉన్నాయి కావున వాని ప్రభావ అంతర్నిరోధం ను క్రింది సమీకరణం ఇస్తుంది.
AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు 9

3) Rమరియు r లు శ్రేణిలో ఉన్నాయి. వలయంలో మొత్తం
నిరోధం = R + \(\frac{r}{m}\)

4) ఒకే రకమైన ఘటాల సమాంతర సంయోగంలో, వలయంలో ప్రభావ వి.చా. బ. ఒకే ఒక వి.చా. బకు సమానము. ఎందువలన అనగా, ఈ సంయోగంలో ఎలక్ట్రోడుల పరిమాణం మాత్రమే పెరుగును. కాని వి. చా. బ. పెరగదు.

5) ∴ నిరోధంలో విద్యుత్ R = \(\frac{\varepsilon}{\mathrm{R}+\frac{\mathrm{r}}{\mathrm{m}}}=\frac{\mathrm{m} \varepsilon}{\mathrm{mR}+\mathrm{r}}\)

6) బాహ్య నిరోధం, అంతర్నిరోధంతో పోల్చినపుడు విస్మరించ దగిన విలువ కలిగి ఉంటే (R<<r) ఘటాల మిశ్రమ గ్రూపింగులో తీసుకొను విద్యుత్ గరిష్ఠము.

AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు

ప్రశ్న 5.
విద్యుత్ నిరోధాన్ని నిర్వచించండి. దాని SI ప్రమాణం రాయండి. కింది సందర్భాలలో వాహక నిరోధం ఎలా మారుతుందో తెల్చండి.
a) వాహకాన్ని దాని పొడవుకు 4 రెట్లు అయ్యేటట్లు సాగదీస్తే,
b) వాహక ఉష్ణోగ్రతను పెంచితే
జవాబు:
విద్యుత్ నిరోధం (R) :
వాహకంలో ఎలక్ట్రాన్ల ప్రవాహంను నిరోధించు ధర్మంను విద్యుత్ నిరోధం అంటారు. నిరోధం SI ప్రమాణం ఓమ్ (Ω).
AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు 11

b) ఉష్ణోగ్రతతో నిరోధంలో మార్పు Rt = R0 (1 + α t)
ఉష్ణోగ్రత పెరిగిన, నిరోధం కూడా పెరుగును.

ప్రశ్న 6.
ఘటానికి శ్రేణిలో కలిపిన నిరోధం సగం అయితే, విద్యుత్ ప్రవాహం రెట్టింపు లేదా రెట్టింపు విలువకు స్వల్పంగా తక్కువ లేదా రెట్టింపు విలువకు స్వల్పంగా ఎక్కువ అవుతుంది. ఎందుకు?
జవాబు:
నిరోధం R ను E వి.చా.బ ఉన్న ఘటంనకు శ్రేణిలో కల్పితే,
విద్యుత్ I = \(\frac{\varepsilon}{R+r}\)
AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు 12
ii) r << \(\frac{R}{2}\) అయితే, విద్యుత్ I’ స్వల్పంగా 2 కన్నా ఎక్కువ.
iii) r, R కన్నా స్వల్పంగా ఎక్కువగా ఉంటే, విద్యుత్ (1) స్వల్పంగా 2 కన్నా తక్కువ.

ప్రశ్న 7.
రెండు ఘటాల emfలు, అంతర్నిరోధాలు వరుసగా 4.5V, 6.0V, 6Ω, 3Ω . ఈ ఘటాల రుణ టెర్మినల్స్న 18Ω నిరోధం గల తీగతో ధన టెర్మినలు నన్ను 12Ω నిరోధం గల తీగతో కలిపారు. ఈ తీగల మధ్య బిందువులను 24Ω నిరోధం గల మూడవ తీగ సంధానం చేస్తుంది. కిర్కాఫ్ నియమాలను ఉపయోగించి మూడవ తీగ కొనల మధ్య పొటెన్షియల్ భేదాన్ని కనుక్కోండి.
జవాబు:
1) నెట్వర్క్ వేర్వేరు భుజాల గుండా విద్యుత్ ప్రవాహాలను పటంలో చూపినట్లు భావిద్దాం.
2) ABCDA సంవృత వలయంనకు కిర్కాఫ్ వోల్టేజి. నియమాన్ని అనువర్తిస్తే,
AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు 13

ప్రశ్న 8.
10Ω నిరోధం గల మూడు నిరోధకాలను (i) కనిష్ట నిరోధం, (ii) గరిష్ట నిరోధం వచ్చేటట్లు సంధానం చేశారు. (a) ప్రతీ సందర్భంలో ప్రభావాత్మక నిరోధం, (b) ఆ విధంగా పొందిన కనిష్ఠ, గరిష్ఠ నిరోధాల నిష్పత్తిని గణించండి.
జవాబు:
ప్రతి నిరోధకము యొక్క నిరోధం R = 10Ω
నిరోధకముల సంఖ్య, n = 3

i) మూడు నిరోధకములను సమాంతరంగా కలిపితే, కనిష్ఠ నిరోధం పొందుతాము.
∴ కనిష్ట నిరోధం Rకనిష్ట Rp = \(\frac{R}{n}=\frac{10}{3}\)Ω = 3.33Ω
ii) మూడు నిరోధకములను శ్రేణిలో కలిపితే, గరిష్ట నిరోధం పొందుతాము.
∴ గరిష్ట నిరోధం Rగరిష్ట = Rs = nR = 3 × 10 = 30Ω

a) కనిష్ట నిరోధం పొందటానికి ప్రభావ నిరోధం,
Rప్రభావ = \(\frac{R}{n}=\frac{10}{3}\) = 3.33Ω (సమాంతరంగా).
గరిష్ట నిరోధం పొందటానికి ప్రభావ నిరోధం,
Rప్రభావ = nR = 3 × 10 = 30Ω (శ్రేణిలో)
AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు 14

ప్రశ్న 9.
ఒక విద్యుత్ జాలానికి కిర్కాఫ్ నియమాలను తెలపండి. ఈ నియమాలను ఉపయోగించి వీటన్ బ్రిడ్జికి సంతులన నిబంధనను రాబట్టండి. [TS. Mar. 16; Mar. ’14]
జవాబు:
1) కిర్కాఫ్ మొదటి నియమము (సంధి నియమము లేక KCL) :
ఏదైనా సంధి వద్ద విద్యుత్ ప్రవాహాల బీజీయ మొత్తం శూన్యం.
∴ ∑I = 0 (లేక)

సంధి వద్దకు చేరు విద్యుత్ ప్రవాహాల బీజీయ మొత్తము, సంధి నుండి దూరంగా పోవు విద్యుత్ ప్రవాహాల బీజీయ మొత్తమునకు సమానము.

2) కిర్కాఫ్ రెండవ నియమము (సంవృత నియమము లేక KVL) :
ఏదైనా సంవృత వలయం వెంబడి పొటెన్షియల్ల బీజీయ మొత్తం శూన్యం.
∴ ∑(IR) + ∑E = 0

వీటన్ బ్రిడ్జి :
వీటన్ బ్రిడ్జి వలయం R1, R2, R3 మరియు R4 నిరోధాలు పటములో చూపినట్లు కలుపబడి ఉంటాయి. A మరియు C ల మధ్య ε వి. చా. బ ఉన్న ఘటం, B మరియు D ల మధ్య ఒక గాల్వనామీటర్ పటంలో చూపినట్లు కలుపబడి ఉంటాయి. వేర్వేరు భుజాలలో విద్యుత్ ప్రవాహాలు I1, I2, I3 మరియు I4. గాల్వనా మీటర్ Gలో విద్యుత్ ప్రవాహము Ig.
కిర్కాఫ్ మొదటి నియమం ప్రకారం
D సంధి వద్ద I1 – I3 – Ig = 0 …………. (1)
B సంధి వద్ద I2 + Ig – I4 = 0 …………… (2)

కిర్కా రెండవ నియమమును ADBA సంవృత వలయముకు అనువర్తిస్తే,
-I1R1 – IgG + I2R2 = 0 లేక
⇒ I1R1 + IgG = I2R2 ………… (3)

కిర్కాఫ్ రెండవ నియమమును BCBD సంవృత G వలయంకు అనువర్తిస్తే,
-I3R3 + I4R4 + IgG = 0
⇒ I3R3 – IgG = I4R4 ……….. (4)

గాల్వనా మాపకం శూన్య అపవర్తనంను చూపితే, బిందువులు D మరియు B లు ఒకే పొటెన్షియల్ చూపును.
AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు 15
Ig = 0.
ఈ విలువను (1), (2), (3) మరియు (4)లలో ప్రతిక్షేపించగా
I1 = I3 ……….. (5)
I2 = I4 ……….. (6)
I1R1 = I2R2 ……….. (7)
I3R3 = I4R4 ……….. (8)

సమీకరణం (7) ను (8) చే భాగించగా
AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు 16

AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు

ప్రశ్న 10.
పొటెన్షియోమీటర్ పనిచేసే సూత్రాన్ని తెలపండి. పొటెన్షియోమీటర్ను ఉపయోగించి రెండు ప్రాథమిక ఘటాల emf లను ఎలా పోలుస్తారో వలయం రేఖా చిత్రం సహాయంతో వివరించండి. [AP. Mar: ’17; AP. Mar ’16]
జవాబు:
పొటెన్షియోమీటర్ పనిచేయు సూత్రము : పొటెన్షియోమీటర్ తీగ పొడవు వెంబడి పొటెన్షియల్ తేడా, తీగ పొడవుకు | అనులోమానుపాతంలో ఉండును. (లేక) ఏకరీతి తీగ గుండా నిలకడ విద్యుత్ ప్రవహిస్తే, ప్రమాణ పొడవుకు పొటెన్షియల్ తగ్గుదల లేక పొటెన్షియల్ నతిక్రమము స్థిరము.
i.s.ε ∝ l
⇒ ε = Φl. ఇక్కడ Φ పొటెన్షియల్ నతిక్రమము.

రెండు ఘటాల వి.చా.బ. లు ε1 మరియు ε1 లను పోల్చుట :
AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు 17

  1. పొటెన్షియోమీటర్తో పోల్చవలసిన రెండు ఘటాల విచాబ E1 మరియు E2 లు పటంలో చూపబడినవి.
  2. 1, 2, 3 బిందువుల గుర్తులు ఒక ద్విమార్గ కీను తెల్పును.
  3. కీ మొదటి స్థానంలో 1, 3 లు గాల్వనామాపకం ద్వారా ఘటం ε1 కి కలుపబడినవి.
  4. జాకీని తీగవెంట A నుండి N1 కు జరిపిన, గాల్వనా మీటర్
    అపవర్తనం సున్న. సంతులన పొడవు AN1 = l1.
    అప్పుడు ε1 ∝ l1 ⇒ ε1 = Φl1 …………… (1)
  5. ఇదే విధంగా మరొక ఘటం ε2, సంతులన పొడవు AN2 = l2.
    అప్పుడు ε2 ∝ l2 ⇒ ε2 = Φl2 …………… (2)
  6. \(\frac{\text { (1) }}{(2)} \Rightarrow \frac{\varepsilon_1}{\varepsilon_2}=\frac{l_1}{l_2}\)

ప్రశ్న 11.
పొటెన్షియోమీటర్ పనిచేసే సూత్రాన్ని తెలపండి. పొటెన్షియోమీటర్ను ఉపయోగించి ఇచ్చిన ఘటం అంతర్నిరోధాన్ని ఎలా కనుక్కోవచ్చో వలయం రేఖా చిత్రం సహాయంతో వివరించండి. [TS. Mar. 17; AP & TS. Mar. 15]
జవాబు:
పొటెన్షియోమీటర్ పనిచేయు సూత్రము :
పొటెన్షియోమీటర్ తీగ పొడవు వెంబడి పొటెన్షియల్ తేడా, తీగ పొడవుకు అనులోమానుపాతంలో ఉండును. (లేక) ఏకరీతి తీగ గుండా నిలకడ విద్యుత్ ప్రవహిస్తే, ప్రమాణ పొడవుకు పొటెన్షియల్ తగ్గుదల లేక పొటెన్షియల్ నతిక్రమము స్థిరము.
i.e. ε ∝ l ⇒ ε = Φl ఇక్కడ పొటెన్షియల్ నతిక్రమము.

పొటెన్షియోమీటర్తో అంతర్నిరోధం (r) ను కొలుచుట :
AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు 18
1) అంతర్నిరోధం కొలుచు పొటెన్షియోమీటర్ పటంలో చూపబడింది.

2) ఘటం (వి.చా.బ. E) అంతర్నిరోధం (r) ను నిర్ణయించుటకు కీ K ద్వారా నిరోధాల పెట్టె సంధానం చేయబడి ఉంటుంది.

3) కీ K2 తెరిచి, సంతులన పొడవు I1 (AN1) పొందుతాము.
అప్పుడు ε = Φ l1 ………… (1)

4) కీ K ను మూస్తే నిరోధాల పెట్టె (R.B) ద్వారా, ఘటం నుండి విద్యుత్ ప్రవాహం I ప్రవహింపచేస్తుంది.

5) ఘటం, టెర్మినల్ పొటెన్షియల్ తేడా (V) అయినపుడు, సంతులన పొడవు I2(AN2) ను పొందితే అప్పుడు
AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు 19
AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు 20

ప్రశ్న 12.
GaAs కు అనువర్తించిన వోల్టేజి, విద్యుత్ ప్రవాహానికి గ్రాఫ్ను చూపండి. గ్రాఫ్లో (i) రేఖీయంగా లేని ప్రాంతం, (ii) ఋణాత్మక నిరోధ ప్రాంతాలను గుర్తించండి.
జవాబు:
V మరియు I ల మధ్య సంబంధం ఒకే విధంగా ఉండదు. ఒకే విద్యుత్ ప్రవాహం కు ఒకదాని కన్నా ఎక్కువ V విలువలు ఉండును. ఇటువంటి పదార్థ స్వభావంను GaAs (i.e., ఒక కాంతి ఉద్గార్గి డయోడ్) చూపును.
AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు 21

ప్రశ్న 13.
ఒక విద్యార్థి దగ్గర సమానమైన పొడవు, వ్యాసాలు గల ఇనుము, రాగి రెండు తీగలు కలవు. అతడు ఆ రెండు తీగలను మొదట శ్రేణిలో కలిపి ఆ సంధానం ద్వారా విద్యుత్ ప్రవాహాన్ని క్రమేపీ పెంచాడు. ఆ తరువాత ఆ రెండు తీగలను సమాంతరంగా కలిపి పై విధంగా ప్రవాహాన్ని పంపడాన్ని పునరావృతం చేశాడు. ప్రతీ సందర్భంలోను ఏ తీగ మొదట వెలుగును ఇస్తుంది?
జవాబు:
1) శ్రేణి సంధానంలో, ఇనుము మరియు రాగితీగ గుండా ఒకే విద్యుత్ ప్రవహించును. ఉష్ణ ఉత్పత్తి రేటు, P ∝ I² R లేక P ∝ R. (∵ I = స్థిరం). ఒకే పొడవు, ఒకే వ్యాసము ఉన్న తీగలలో, ఇనుము తీగ నిరోధము, రాగి తీగ కన్నా ఎక్కువగా ఉండును. కావున ఇనుము తీగలో, ఉష్ణ ఉత్పత్తి రేటు క్రమముగా పెరుగును. శ్రేణి సంధానములో ఇనుము మొదట వెలుగును.

2) ఇనుము మరియు రాగి తీగల సమాంతర సంధానంలో, వాని వెంట ఒకే పొటెన్షియల్ తేడా (V) ఉండును. ఉష్ణ ఉత్పత్తి రేటు, P = \(\frac{V^2}{R}\) లేక P ∝ \(\frac{1}{R}\) (∵ V = స్థిరం), ఒకే పొడవు, ఒకే వ్యాసము ఉన్న తీగలలో, ఇనుము తీగ నిరోధం, రాగి, తీగకన్నా ఎక్కువగా ఉండును. కావున. రాగితీగలో, ఉష్ణ ఉత్పత్తి రేటు ఎక్కువ. సమాంతర సంధానంలో రాగితీగ మొదట వెలుగును.

ప్రశ్న 14.
సర్వ సమమైన మూడు నిరోధకాలను సమాంతరంగా కలిపినప్పుడు వలయం మొత్తం నిరోధం R/3. ప్రతీ నిరోధం విలువను కనుక్కోండి.
జవాబు:
మూడు నిరోధాలు ఒకే విధంగా ఉండును.
కావున R1 = R2 = R3 = X (అనుకుందాము)
సమాంతర సంధానంలో మొత్తం నిరోధం, Rp = \(\frac{R}{3}\)
మూడు ఒకే విధమైన నిరోధాలు సమాంతరంగా కలుపబడితే, అప్పుడు
AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు 22

దీర్ఘ సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ఒక విద్యుత్ వలయంలో ఉత్పత్తి అయిన ఉష్ణం ఏ పరిస్థితుల్లో ఆ వలయం నిరోధానికి a) అనులోమానుపాతంలో,b) విలోమానుపాతంలో ఉంటుంది ? ఈ రెండు సందర్భాల్లో ఉత్పత్తి అయిన ఉష్ణ పరిమాణాల నిష్పత్తిని గణించండి.
AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు 23
జవాబు:
విద్యుత్ ప్రవాహం వల్ల ఉష్ణ ఉత్పత్తికి సమాసము :
నిరోధం ఉన్న వాహకం AB ను భావిద్దాం.
AB వెంట ప్రయోగించిన పొటెన్షియల్ తేడా = V
AB గుండా పోవు విద్యుత్ = I
విద్యుత్ ప్రవహించిన కాలం = t

∴ t కాలంలో A నుండి B కు ప్రవహించిన మొత్తం ఆవేశం q = It.

పొటెన్షియల్ తేడా నిర్వచనం ప్రకారం, A నుండి B కు ప్రమాణ ఆవేశంను తీసుకొని పోవటానికి జరిగిన పని = V.
A నుండి B కు “q” ఆవేశంను తీసుకుపోవుటలో జరిగిన పని
W = V × q = VIt = I²Rt (∵ V = IR)
ఈ జరిగిన పనిని, విద్యుత్ జరిగిన పని అంటారు. ఈ విద్యుత్ జరిగిన పని ఉష్ణరూపంలో వెలువడును. వెలువడిన ఉష్ణ ఉత్పత్తి
H = W = I²Rt’ జౌల్
ఇదియే జౌల్స్ ఉష్ణ నియమ నిర్వచనం.
a) విద్యుత్ వలయంలో ప్రవహించిన ఉష్ణం వెలువడును.
i.e., H1 ∝ R

b) ఒకే పొటెన్షియల్ తేడాను, విద్యుత్ వలయం వెంట ప్రయోగిస్తే, ఉష్ణం వెలువడును.
i. e., H2 ∝ \(\frac{1}{R}\)
AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు 24

AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు

ప్రశ్న 2.
A, B అనే రెండు లోహపు తీగలను సమాంతరంగా సంధానం చేశారు. A అనే తీగ L పొడవు, వ్యాసార్థాన్ని కలిగి ఉంటే, B తీగ 2L పొడవు, 2. వ్యాసార్థాన్ని కలిగి ఉంది. సమాంతర సంధానం మొత్తం నిరోధానికి A తీగ నిరోధానికి గల నిష్పత్తిని గణించండి.
జవాబు:
AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు 25
2) A మరియు B తీగల సమాంతర సంధానంలో, మొత్తం నిరోధం.
AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు 26
4) సమాంతర సంధానంలో మొత్తం నిరోధంనకు తీగ నిరోధం A కు గల నిష్పత్తి
AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు 27

ప్రశ్న 3.
ఒక ఇంట్లో ఒక్కొక్కటి 100 W రేటింగ్ ఉన్న 3 విద్యుత్ బల్బులు రోజుకు 4 గంటలు వెలుగుతున్నాయి. అలాగే 20W రేటింగ్ ఉన్న ఆరు ట్యూబ్లెట్లు రోజుకు 5 గంటలు వెలుగుతున్నాయి. 400 W రిఫ్రిజిరేటర్ రోజుకు 10 గంటలు చొప్పున వినియోగిస్తే నెలకు 30 రోజుల చొప్పున ఒక యూనిట్కు రూ.4.00 వంతున విద్యుత్ బిల్లును లెక్కించండి.
జవాబు:
ఒక ఇంట్లో ఉన్న బల్బుల సంఖ్య, N = 3
ప్రతి బల్బుపై సామర్థ్య రేటు, P = 100 W
వెలిగించిన కాలం, t = 4 గం||లు
AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు 28
1 యూనిట్ ఖరీదు = రూ.4.00/-
174 యూనిట్ల ఖరీదు = యూనిట్ల సంఖ్య X ఒక యూనిట్ ఖర్చు = 174 × 4 = రూ.696/-
ఆ ఇంటికి ఒక నెలకు విద్యుత్ బిల్లు = రూ. 696/–.

ప్రశ్న 4.
4 ఓమ్లు, 6 ఓమ్లు, 12 ఓమ్లు గల మూడు నిరోధకాలను సమాంతరంగా సంధానం చేశారు. ఈ నిరోధకాల శ్రేణి సంయోగాన్ని 2 ఓమ్ల నిరోధానికి, 6Vల బ్యాటరీకి శ్రేణిలో సంధానం చేశారు. వలయం రేఖాచిత్రాన్ని గీసి, కింది మూడు సందర్భాలలోని విలువలను లెక్కించండి.
a) ప్రధాన వలయంలోని విద్యుత్ ప్రవాహం
b) సమాంతర సంధానంలో ప్రతీ నిరోధకం ద్వారా ప్రవహించే విద్యుత్.
c) 2 ఓమ్ల నిరోధకం ఉపయోగించిన పొటెన్షియల్ భేదం, సామర్థ్యం.
జవాబు:
ఇచ్చిన దత్తాంశమునకు వలయ పటం క్రింద ఇవ్వబడింది.
AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు 29
AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు 30

ప్రశ్న 5.
220 V వద్ద 100 W, 220 V వద్ద 60 W రేటింగ్లు గల రెండు బల్బులను 220 V సరఫరాకు సమాంతరంగా కలిపారు. సరఫరా తీగల నుంచి ఎంత విద్యుత్ ప్రవాహాన్ని తీసుకుంటుంది?
జవాబు:
దత్తాంశము
AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు 31

ప్రశ్న 6.
3.0 × 10-7 m² మధ్యచ్ఛేద వైశాల్యం, 5 A విద్యుత్ ప్రవహిస్తున్న రాగి తీగలోని వహన ఎలక్ట్రాన్ల సరాసరి డ్రిఫ్ట్ వడిని అంచనా వేయండి. ప్రతీ రాగి పరమాణువు ఒక వహన ఎలక్ట్రాను సమకూరుస్తుంది అని భావించండి. రాగి సాంద్రత 9.0 × 10³ kg/m³, దాని పరమాణు ద్రవ్యరాశి 63.5u.
జవాబు:
రాగితీగ మధ్యచ్ఛేద వైశాల్యం A = 3 × 10-7 m² రాగి తీగ ద్వారా విద్యుత్, I = 5 A
ఎలక్ట్రాన్ ఆవేశం, e = 1.6 × 10-19C
ఎలక్ట్రాన్ల వాహక సాంద్రత = ప్రమాణ ఘనపరిమాణంలో పరమాణువుల సంఖ్య
AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు 32

ప్రశ్న 7.
పై లెక్కలో వచ్చిన డ్రిఫ్ట్ వడిని కింది వాటితో పోల్చండి.
i) సాధారణ ఉష్ణోగ్రతల వద్ద రాగి పరామణువుల ఉష్ణయవడి (Thermal speed)
ii) డ్రిఫ్ట్ గమనానికి కారణమై, తీగ వెంబడి వ్యాపనం (propagation) చెందే విద్యుత్ క్షేత్రం వడి.
జవాబు:
i) T ఉష్ణోగ్రత వద్ద, రాగి పరమాణు ద్రవ్యరాశి (M) ఉష్ణ వడిని క్రింది సమీకరణం నుండి రాబట్టవచ్చును.
AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు 33
∴ ఎలక్ట్రాన్ డ్రిఫ్ట్ వడి (Vd) = 1.047 × 10-8 = సాధారణ ఉష్ణోగ్రత వద్ద ఉష్ణవడి × 10-8 రెట్లు

ii) వాహకం వెంట విద్యుత్ క్షేత్రం, విద్యుదయస్కాంత తరంగ వడితో ప్రయాణించును.
AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు 34
∴ అపసర వడిని C తో పోల్చిన, 10-11 రెట్లు తక్కువగా ఉండును.

లెక్కలు Problems

ప్రశ్న 1.
10Ω మందమైన ఒక తీగను దాని పొడవు మూడు రెట్లు అయేటట్లు సాగదీశారు. సాగదీయడం వల్ల దాని సాంద్రతలో ఎటువంటి మార్పు లేదని భావించి సాగ దీసిన తీగ నిరోధం కనుక్కోండి.
సాధన:
ఇచ్చినది R1 = 10Ω
l1 = l
l2 = 3l
R2 = ?
AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు 35

ప్రశ్న 2.
4R నిరోధం గల ఒక తీగను వృత్తాకారంలో వంచారు. దాని వ్యాసం కొనల మధ్యగల ప్రభావాత్మక నిరోధం ఎంత? [TS. Mar. 16; Mar. ’14]
సాధన:
పొడవాటి తీగ నిరోధం = 4R
సగం తీగ నిరోధం = \(\frac{4R}{2}\) = 2R
AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు 36
సగం పొడవున్న, రెండు తీగల చివరలు పటంలో చూపినట్లు కలిపితే వృత్తం ఏర్పడుతుంది. వ్యాసం వెంట తీగ చివరల మధ్య ప్రభావ నిరోధము,
AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు 37

ప్రశ్న 3.
15 Vm-1 విద్యుత్ క్షేత్రాన్ని ఒక వాహకం కొనల మధ్య అనువర్తించినప్పుడు, ఆ వాహకం 2.5 × 106 Am-2 విద్యుత్ ప్రవాహ- సాంద్రతను కలిగి ఉంది. ఆ వాహకం నిరోధకతను కనుక్కోండి.
సాధన:
విద్యుత్ ప్రవాహ సాంద్రత = J = \(\frac{I}{R}\)
= 2.5 × 10-6 Am-2
ప్రయోగించిన విద్యుత్ క్షేత్రం, E = 15 Vm-1
వాహకం విశిష్టోష్ణం, ρ = \(\frac{E}{J}=\frac{15}{2.5\times10^6}\)
∴ ρ = 6 × 10-6 Ωm.

AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు

ప్రశ్న 4.
5% సహనంతో 350ml ల నిరోధాన్ని కలిగి ఉన్న ఒక నిరోధకం రంగుల కోడ్ ఏమిటి?
సాధన:
ఒక నిరోధకము యొక్క నిరోధం = 350 mΩ
= 350 × 10-3
= 35 × 10-2

సహన శీలత (Tolerance) = 5%
మొదటి సార్థకసంఖ్య (3), మొదటి పట్టీను సూచించును.
రెండవ సార్థకసంఖ్య (5), రెండవ పట్టీను సూచించును.
మూడవ సార్థకసంఖ్య (10-2) మూడవ పట్టీను సూచించును.
AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు 38

ప్రశ్న 5.
మీకు 8Ω నిరోధకం ఇచ్చారు. 6Ω నిరోధాన్ని పొందడానికి దానికి, 120 Ωm నిరోధకతను కలిగి ఉన్న ఎంత పొడవుగల తీగను సమాంతరంగా కలపాలి?
సాధన
నిరోధకము యొక్క నిరోధం R = 8Ω
AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు 39
తీగ విశిష్ట నిరోధం ρ = 120
1 పొడవున్న నిరోధంను Rకు సమాంతరంగా కలిపితే,
ప్రభావ నిరోధం, Rp = 6Ω
AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు 40

ప్రశ్న 6.
ఒక బ్యాటరీకి 3Ω, 6Ω, 9Ω మూడు నిరోధకాలను సంధానం చేశారు. ఒకవేళ a) అవన్నీ సమాంతరంగా కలిపినప్పుడు, b) అవన్నీ శ్రేణిలో కలిపినప్పుడు వాటిలోని ఏ నిరోధకంలో సామర్థ్య దుర్వ్యయం గరిష్టంగా ఉంటుంది. కారణాలను ఇవ్వండి.
సాధన:
ఇచ్చినవి R1 = 3Ω, R2 = 6Ω, R3 = 9Ω

a) సమాంతరంగా కలిపిన నిరోధాల ప్రభావ నిరోధము
AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు 41
∴ సమాంతర సంయోగంలో దుర్వ్యయ సామర్థ్యము,
AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు 42

b) శ్రేణిలో ప్రభావ నిరోధం,
Rs = R1 + R2 + R3 = 3 + 6 + 9 = 18Ω
∴ శ్రేణిలో దుర్వ్యయ సామర్థ్యం
PS ∝ RS ⇒ PS ∝ 18 → (2)

(1) మరియు (2) సమీకరణాల నుండి, దుర్వ్యయ సామర్థ్యం శ్రేణిలో గరిష్టం మరియు సమాంతరంగా కనిష్టం.

కారణాలు :

  1. శ్రేణి సంధానంలో, P ∝ R మరియు V ∝ R. కావున దుర్వ్యయ సామర్థ్యం (P) మరియు పొటెన్షియల్ భేదం (V) ఎక్కువ. ఎందుకనగా ప్రతినిరోధకం వెంట విద్యుత్ ప్రవాహం సమానము.
  2. సమాంతర సంధానంలో P ∝ \(\frac{1}{R}\) మరియు I ∝ \(\frac{1}{R}\) కావున దుర్వ్యయ సామర్థ్యం (P) మరియు పొటెన్షియల్ భేదము (V) తక్కువ. ఎందుకనగా ప్రతినిరోధకము వెంట వోల్టేజి సమానము.

ప్రశ్న 7.
ఒక వెండి తీగ 27.5°C వద్ద 2.1Ω నిరోధాన్ని, 100°C వద్ద 2.7Ω నిరోధాన్ని కలిగి ఉంది. వెండి ఉష్ణోగ్రత నిరోధకత గుణకం కనుక్కోండి.
సాధన:
వెండి తీగకు (సిల్వర్) R1 = 2.1Ω, t1 = 27.5°C
R2 = 2.7Ω,
t2 = 100°C, α = ?
AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు 43
∴ ఉష్ణోగ్రత నిరోధకత గుణకం a = 0.443 × 10-2 °C

ప్రశ్న 8.
ఒక విద్యుత్సాహక తీగ పొటెన్షియల్ భేదాన్ని స్థిరంగా ఉంచి, దాని పొడవు రెట్టింపు అయ్యేటట్లు సాగదీస్తే, ఎలక్ట్రాన్ల డ్రిఫ్ట్ వడి ఎన్ని రెట్లు మారుతుంది?
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు 44
∴ ఎలక్ట్రాన్స్ డ్రిఫ్ట్ వడి 2 రెట్లు అగును.

AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు

ప్రశ్న 9.
25,200 రేటింగ్ ఉన్న రెండు 120 V బల్బులను శ్రేణిలో కలిపారు. వాటిలో ఒక బల్బు దాదాపు వెంటనే కాలిపోయింది. ఏ బల్బు కాలిపోయింది? ఎందుకు?
సాధన:
మొదటి బల్బుకు
P1 = 25W, V1 = 120V
AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు 45
AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు 46
రెండు బల్బులు ఒకే వోల్టేజిని కలిగి ఉన్నప్పటికి, R1 > R2 అగుట వల్ల 25 W బల్బు తక్షణం కాలి పోతుంది.

ప్రశ్న 10.
ఒక స్థూపాకార లోహపు తీగను దాని పొడవు 5% పెరిగేటట్లు సాగదీశారు. దాని నిరోధంలో కలిగే మార్పు శాతం కనుక్కోండి.
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు 47

ప్రశ్న 11.
ఒక పదార్థంతో చేసిన A, B అనే రెండు తీగలు సమాన పొడవులు కలిగి ఉన్నాయి. వాటి మధ్యచ్ఛేద వైశాల్యాల నిష్పత్తి 1: 4, ఆ రెండు తీగల కొనల మధ్య స్థిరమైన వోల్టేజిని అనువర్తిస్తే, వాటిలో ఉత్పత్తి అయ్యే ఉష్ణదాశుల నిష్పత్తి ఎంత?
సాధన:
ఇచ్చినవి lA = lb, ρA = ρB, VA = VB, AA : BB = 1 : 4
తీగలో జనించు ఉష్ణరేటు,
AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు 48
A మరియు B తీగలకు ఒకే V, ρ, l లు ఉంటే
H ∝ A (మధ్యచ్ఛేద వైశాల్యం)
A మరియు B రెండు తీగలకు,
AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు 49

ప్రశ్న 12.
స్థిరమైన వోల్టేజి జనకానికి సమాంతరంగా కలిపిన రెండు బల్బుల నిరోధాల నిష్పత్తి 1 : 2. వాటిలో దుర్వ్యయం అయ్యే సామర్థ్యాల నిష్పత్తి ఎంత ?
సాధన:
ఇచ్చినవి R1 : R2 = 1 : 2
సమాంతర సంధానంలో దుర్వ్యయ సామర్థ్యం,
P = \(\frac{V^2}{R}\)
⇒ P = \(\frac{1}{R}\) [∵ V = స్థిరాంకము]
రెండు బల్బులలో దుర్వ్యయ సామర్ధ్యాల నిష్పత్తి.
\(\frac{P_1}{P_2}=\frac{R_2}{R_1}=\frac{2}{1}\)
∴ P1 : P2 = 2 : 1.

ప్రశ్న 13.
5m పొడవు గల పొటెన్షియోమీటర్ తీగ కొనల మధ్య 6 V పొటెన్షియల్ భేదం కొనసాగించారు. పొటెన్షియో మీటర్ తీగ 180 cm పొడవు వద్ద సంతులన స్థానాన్ని ఇస్తే, ఆ ఘటం emf కనుక్కోండి. [AP. Mar.’17; AP. Mar.’16]
సాధన:
పొటెన్షియోమీటర్ తీగ పొడవు, L = 5m
పొటెన్షియల్ భేదము, V = 6 వోల్ట్
పొటెన్షియల్ నతిక్రమము,
Φ = \(\frac{V}{L}=\frac{6}{5}\) = 1.2V/M.
సంతుల పొడవు, l = 180 cm = 1.80 m
ఘటం వి.చా. బ., E = Φl
= 1.2 × 1.8 = 2.16V.

AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు

ప్రశ్న 14.
2.5 Vemf, r అంతర్నిరోధం గల ఒక బ్యాటరీని 1 ఓమ్ నిరోధం గల అమ్మీటర్ ద్వారా 45 ఓమ్ నిరోధానికి శ్రేణిలో కలిపారు. అమ్మీటర్ 50 m విద్యుత్ ప్రవాహం చూపిస్తుంది. వలయం రేఖా చిత్రాన్ని గీయండి, r విలువను కనుక్కోండి. [TS. Mar: ’17]
సాధన:
ఇచ్చిన దత్తాంశ వలయ పటం కింద చూపబడింది.
AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు 50
E = 2.5
R = 45 Ω
rA = 1A
i = 50 mA
r = ?
E = I(R + rA + r)
2.5 = 50 × 10-3 (45 + 1 + r)
AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు 51

ప్రశ్న 15.
ఒక తీగ మధ్యచ్ఛేదం ద్వారా పోయే విద్యుదావేశ పరిమాణం q(t) = at² + bt + c. a, b, c లకు మితీయ ఫార్ములాలు రాయండి. SI ప్రమాణాలలో a, b, c విలువలు వరుసగా 6, 4, 2 అయితే, t = 6 సెకన్ల వద్ద విద్యుత్ ప్రవాహ విలువను కనుక్కోండి.
సాధన:
తీగ గుండా ప్రవహించు ఆవేశం q(t) = at²+bt +c
సజాతీయ సూత్రం ప్రకారం,
q(t) = at² మితిఫార్ములా
IT = aT²
q(t) మితిఫార్ములా = bt మితిఫార్ములా
IT = bT
∴ b మితిఫార్ములా = I
q(t) మితిఫార్ములా = C మితిఫార్ములా
IT = C మితి ఫార్ములా
∴ C మితి ఫార్ములా =IT
విద్యుత్ ప్రవాహం, I = \(\frac{dq(t)}{dt}\)
= \(\frac{d}{dt}\) [at² + bt + c]
= 2at + b
ఇక్కడ a = 6 మరియు b = 4
⇒ I = 12t + 4
∴ t = 6 సె. వద్ద విద్యుత్ ప్రవాహం
I = 12 × 6 + 4 = 76A.

అభ్యాసాలు Textual Exercises

ప్రశ్న 1.
ఒక కారు సంచాయక ఘటమాల (storage battery) emf 12 V, అంతర్నిరోధం 0.40. బ్యాటరీ నుంచి పొందగలిగే గరిష్ట విద్యుత్ ప్రవాహం ఎంత?
సాధన:
E = 12 V, r = 0.4 Ω
గరిష్ట విద్యుత్, Imax = \(\frac{E}{r}=\frac{12}{0.4}\) = 30A

ప్రశ్న 2.
10V emf, 3Ω అంతర్నిరోధకం గల ఒక బ్యాటరీని నిరోధకానికి సంధానం చేశారు. వలయంలోని విద్యుత్ ప్రవాహం 0.5 A అయితే, ఆ నిరోధకం నిరోధం ఎంత ? వలయం మూసి (closed) ఉన్నప్పుడు బ్యాటరీ టెర్మినల్ వోల్టేజిని కనుక్కోండి. [TS. Mar. 15]
సాధన:
E = 10 V, r = 3Ω, I = 0.5 A, R = ?, V = ?
I = \(\frac{E}{(R+r)}\) లేక (R + r) = \(\frac{E}{I}=\frac{10}{0.5}\) = 20
లేక R = 20 – r = 20 – 3 = 17Ω
అంత్య వోల్టేజి, V = IR = 0.5 × 17 = 8.5 Ω.

AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు

ప్రశ్న 3.
a) 1Ω, 2Ω, 3Ω ల మూడు నిరోధకాలను శ్రేణిలో సంధానం చేశారు. సంయోగం మొత్తం నిరోధం ఎంత ?
సాధన:
R1 = 1 Ω, R2 = 2 Ω, R3 = 3 Ω, V = 12 V
శ్రేణిలో, మొత్తం నిరోధం RS = R1 + R2 + R3
= 1+ 2+ 3 = 6Ω.

b) ఈ సంయోగాన్ని ఉపేక్షించదగిన అంతర్నిరోధం, 12 Vemf గల బ్యాటరీకి కలిపితే, ప్రతి నిరోధకం కొనల మధ్య గల పొటెన్షియల్ పాతాన్ని పొందండి.
సాధన:
వలయంలో ప్రవహించు విద్యుత్ I = \(\frac{V}{R_S}=\frac{12}{6}\) = 2A
R1 వెంట పొటెన్షియల్ = IR1 = 2 × 1 = 2V
R2 వెంట పొటెన్షియల్ = IR2 = 2 × 2 = 4V
R3 వెంట పొటెన్షియల్ = IR3 = 2 × 3 = 6V

ప్రశ్న 4.
a) మూడు నిరోధకాలు 2 Ω, 4 Ω, 5 Ω లను సమాంతరంగా కలిపారు. ఈ సంయోగం మొత్తం నిరోధం ఎంత?
సాధన:
R1 = 2 Ω, R2 = 4 Ω, R3 = 5 Ω, V = 20V
సమాంతర సంధానంలో, మొత్తం నిరోధం = Rp
AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు 52

b) ఈ నిరోధకాల సంయోగాన్ని ఉపేక్షించదగిన అంతర్నిరోధం, 20 Vemf గల బ్యాటరీకి కలిపితే, ప్రతీ నిరోధకం గుండా ప్రవహించే విద్యుత్, బ్యాటరీ నుంచి తీసుకొన్న మొత్తం విద్యుత్ ప్రవాహాన్ని కనుక్కోండి.
సాధన:
R ద్వారా విద్యుత్ = \(\frac{V}{R_1}=\frac{20}{2}\) = 10A
AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు 53

ప్రశ్న 5.
గది ఉష్ణోగ్రత వద్ద (27.0°C) ఒక వేడెక్కే తీగ (heating element) నిరోధం 100 Ω. ఆ వేడెక్కే తీగ నిరోధాన్ని 117 Ω గా గుర్తించినట్లయితే దాని ఉష్ణోగ్రత ఎంత? ఆ నిరోధక పదార్థం ఉష్ణోగ్రత గుణకం 1.70 × 10-4° C-1గా ఇచ్చారు.
సాధన:
R27 = 100 Ω, R1 = 117 Ω, t = ?
α = 1.70 × 10-4/°C.
AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు 54

ప్రశ్న 6.
15m పొడవు, 6.0 × 10-7m² ఏకరీతి మధ్యచ్ఛేద వైశాల్యం గల తీగ ద్వారా ఉపేక్షించదగినంత స్వల్పంగా విద్యుత్ను పంపారు. ఆ తీగ నిరోధం 5.0 Ω గా కొలవడమైనది. ఆ ప్రయోగం జరుగుతున్న ఉష్ణోగ్రత వద్ద ఆ పదార్థ నిరోధకత ఎంత?
సాధన:
l = 15 m, A = 6.0 × 10-7 m², R = 5.0 Ω, ρ = ?
AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు 55

ప్రశ్న 7.
ఒక వెండి తీగ 27.5°C వద్ద 2.1 Ω నిరోధాన్ని, 100°C వద్ద 2.7 Ω నిరోధాన్ని కలిగి ఉంది. వెండి ఉష్ణోగ్రత నిరోధకత గుణకాన్ని కనుక్కోండి.
సాధన:
R27.5 = 2.1 Ω, R100 = 2.7 2; α = ?

ప్రశ్న 8.
నిక్రోమ్ చేసిన ఒక వేడెక్కే తీగను 230 V సరఫరాకు కలిపినప్పుడు అది తొలుత 3.2 A విద్యుత్ ప్రవాహం తీసుకుంటుంది. కొన్ని సెకన్ల తరువాత ఆ ప్రవాహం 2.8 A నిలకడ విలువకు చేరింది. గది ఉష్ణోగ్రత 27.0°C అయితే, వేడెక్కే తీగ నిలకడ ఉష్ణోగ్రత ఎంత ? దీనిలో తీసుకున్న ఉష్ణోగ్రతా అవధిపై సరాసరిన తీసుకొన్న నిక్రోమ్ తీగ ఉష్ణోగ్రతా నిరోధ గుణకం 1.70 × 10-4 °C-1.
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు 57
AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు 58

ప్రశ్న 9.
పటంలో చూపిన జాలం ప్రతి నిరోధకంలో విద్యుత్ ప్రవాహాన్ని కనుక్కోండి.
AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు 59
సాధన:
వలయం వేర్వేరు భుజాల ద్వారా పోవు విద్యుత్ ప్రవాహాలు పటంలో చూపబడినవి.
కిర్కాఫ్స్ రెండవ నియమం ప్రకారం,
EABCE సంవృత వలయంలో
-10 + 10 (i1 + i2) + 10i1 5(i1 -i3)=0
లేక 10 = 25i1 + 10i2 – 5i3
లేక 2 = 5i1 + 2i2 – i3 → (i)

ABDA సంవృత వలయంలో,
10i1 + 5i3 – 5i2 = 0
లేక 2i1 + i3 – i2 = 0
లేక i2 = 2i1 + i3 → (ii)

BCDB సంవృత వలయంలో,
5(i1 – i3) – 10(i2 + i3) – 5i3 = 0
లేక 5i1 – 10i2 – 20i3 = 0
i1 = 2i2 + 4i3 → (iii)
(ii) మరియు (iii) ల నుండి
i1 = 2 (2i1 + i3) + 4i3 = 4i1 + 6i3
లేక 3i1 = −6i3
లేక i1 = -2i3 → (iv)
ఈ విలువను (ii) లో వ్రాయగా,
i2 = 2(−2i3) + i3 = – 3i3 → (v)
ఈ విలువను (i) లో వ్రాయగా,
2 = 5(−2i3) + 2(-3i3) -i3 లేక 2 = -17i3
లేక i3 = -2/17A
(iv) నుండి; i1 = -2 (-2/17) = 4/17A
(v) నుండి; i2 = -3(−2/17) = (6/17) A
∴ i1 + i2 = (4/17) + (6/17) = (10/17)A
i1 – i3 = 4/17 – (−2/17) = (6/17)A
i2 + i3 = (6/17) + (-2/17) = 4/17A.

AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు

ప్రశ్న 10.
a) మీటర్ బ్రిడ్జిలో Y నిరోధకం 12.5 Q అయినప్పుడు A కొన నుంచి 39.5 cm దూరంలో సంతులన బిందువును గుర్తించారు. X నిరోధాన్ని కనుక్కోండి. వీటన్ బ్రిడ్జి, మీటర్ బ్రిడ్జిలలోని నిరోధకాలను కలపడానికి మధ్యలో మందంగా గల రాగి పట్టీలను ఎందుకు ఉపయోగిస్తారు?
AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు 60
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు 61

మందమైన రాగి పట్టీలను ఉపయోగించి, కల్పిత నిరోధంను తగ్గిస్తారు.

b) ఒకవేళ X, Y లను తారుమారుచేస్తే బ్రిడ్జి సంతులన బిందువును నిర్ధారించండి.
సాధన:
X మరియు Y లను పరస్పరము మార్చితే, 1, మరియు 1, (పొడవులు) కూడా మారును.
కావున l = 100 – 39.5′ = 60.5cm.

c) సంతులన బిందువు వద్ద గాల్వనామీటర్, ఘటాలను తారుమారుచేస్తే ఏమవుతుంది ? గాల్వనామీటర్ ఏదైనా విద్యుత్ ప్రవాహాన్ని చూపుతుందా ?
సాధన:
గాల్వనా మీటర్ విద్యుత్ ప్రవాహంను చూపదు.

ప్రశ్న 11.
8.0 Vemf, 0.5 Ω అంతర్నిరోధం గల ఒక సంచాయక ఘటమాలను 15.5Ω శ్రేణిలో గల నిరోధకం ఉపయోగించి 120 V dc సరఫరాకు కలిపి ఆవేశితం చేశారు. ఆవేశం చెందేటప్పుడు బ్యాటరీ టెర్మినల్ వోల్టేజి ఎంత ? ఆవేశం చెందించే వలయంలో శ్రేణిలో గల నిరోధకం ఆవశ్యకత ఏమిటి?
సాధన:
ఘటం వి.చా. బి. = 8.0 V
d.c. సప్లై వోల్టేజి = 120 V
ఘటం అంతర్నిరోధం, r = 0.5 Ω
బాహ్య నిరోధం, R = 15.5Ω
వి.చా.బ. 8V గల ఘటంను 120 V, d.c సప్లైతో ఆవేశపరిస్తే, వలయం ఫలిత వి.చా.బి.
E = 120 – 8 = 112 V
వలయం మొత్తం నిరోధం = R + r = 15.5+ 0.5. = 16.0Ω
∴ వలయంలో విద్యుత్, I = \(\frac{E}{R+r}=\frac{112}{16}\) = 7.0A
∴ R వెంట వోల్టేజి = IR = 7.0 × 15.5 = 108.5 V

వలయంలో d.c. సప్లై వోల్టేజి, R వెంట వోల్టేజి మరియు ఘటం అంత్య వోల్టేజిల మొత్తమునకు సమానం.
∴ 120 = 108.5 V లేక V = 120 – 108.5 = 11.5V

శ్రేణి నిరోధం, బాహ్య d.c జనక సప్లై నుండి తీసుకునే విద్యుత్ను లిమిట్ చేస్తుంది. నిరోధం లేకపోతే విద్యుత్ ఎక్కువ ప్రమాద స్థాయిలో ఉండును.

ప్రశ్న 12.
పొటెన్షియోమీటర్ అమరికలో 1.25 Vemf గల ఘటం సంతులన బిందువును 35.0 cm వద్ద ఇచ్చింది. ఈ ఘటాన్ని మార్చి దాని స్థానంలో మరొక ఘటాన్ని ఉంచినప్పుడు కొత్త సంతులన బిందువు 63.0 cm కి జరిగింది. రెండవ ఘటం em ఎంత? [AP. Mar.’15]
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు 62

ప్రశ్న 13.
సాధించిన సమస్యల్లో 1వ ప్రశ్నలో అంచనావేసినట్లు ఒక రాగి వాహకంలోని స్వేచ్ఛా ఎలక్ట్రాన్ల సంఖ్య సాంద్రత 8.5 × 1028 m-3, 3.0 m పొడవు గల తీగ ఒక కొన నుంచి మరొక కొనకు డ్రిఫ్ట్ చెందటానికి ఎలక్ట్రాన్లకు ఎంత కాలం పడుతుంది ? తీగ మధ్యచ్ఛేద వైశాల్యం 2.0 × 10-6 m², దాని గుండా 3.0 A విద్యుత్ ప్రవహిస్తుంది.
సాధన:
n = 8.5 × 1028 m-3; l = 3.0 m;
A = 2.0 × 10-6 m²; I = 3.0 A, t = ?
AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు 63

అదనపు అభ్యాసాలు Additional Exercises

ప్రశ్న 14.
భూ ఉపరితలం 10° Cm రుణాత్మక ఉపరితల ఆవేశ సాంద్రతను కలిగి ఉంది. అత్యధిక ఎత్తులో గల వాతావరణ పై పొరకు, ఉపరితలానికి మధ్యగల 400 kV ప్రొటెన్షియల్ భేదం ఫలితంగా (తక్కువ ఎత్తులో గల వాతావరణం స్వల్ప వాహకత్వం వల్ల) గోళం (భూమి) అంతటా కేవలం 1800 A విద్యుత్ ప్రవాహం ఏర్పడుతుంది. ఒకవేళ అక్కడ వాతావరణ విద్యుత్ క్షేత్రాన్ని కొనసాగించే క్రియావిధానం లేకుంటే, భూఉపరితలాన్ని తటస్థం చేయడానికి (సుమారుగా) ఎంతకాలం అవసరం? (ఆచరణలో ఇలా ఎప్పటికీ జరుగదు. ఎందుకంటే (భూగోళంపై వివిధ ప్రదేశాల్లో సంభవించే మెరుపులు, తరచూ సంభవించే ఉరుములూ, మెరుపులతో కూడిన వర్షాల వల్ల విద్యుదావేశాలు తిరిగి నింపే క్రియావిధానం అక్కడ ఉంటుంది). (భూ వ్యాసార్థం = 6.37 × 106m).
సాధన:
6.37 × 106 m; σ = 10-9cm-2 ; I = 1800 A
గ్లోబ్ వైశాల్యం A = 4πr² = 4 × 3.14 × (6.37 × 106)² = 509.64 × 1012
ఆవేశము, Q = σ × A = 10-9 × 509.64 × 1012
= 509.64 × 10³ C
∴ t = \(\frac{Q}{I}=\frac{509.64 \times 10^3}{1800}\) = 283.1 s

AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు

ప్రశ్న 15.
a) ఒక్కొక్కటి 2.0 Vemf, 0.015 Q అంతర్నిరోధం గల ఆరు లేడ్ ఆసిడ్ రకం గౌణ ఘటాలను 8.5 Ω నిరోధానికి విద్యుత్ సరఫరా చేయడానికి శ్రేణిలో కలిపారు. విద్యుత్ సరఫరా నుంచి అది తీసుకునే విద్యుత్ ప్రవాహం, దాని టెర్మినల్ వోల్టేజీ ఎంత?
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు 64

b) చాలాకాలం ఉపయోగించిన తరువాత ఒక గౌణ ఘటం 1.9 Vemf, 380 Ω అత్యధిక అంతర్నిరోధాన్ని కలిగి ఉంది. ఆ ఘటం నుంచి పొందగలిగే గరిష్ఠ విద్యుత్ ప్రవాహం ఎంత? ఒక కారు మోటారును ఈ ఘటం గుండా నడపగలుగుతుందా (ఆన్ చేయగలుగుతుందా)?
సాధన:
E = 1.9 V; r = 380 2
Iగరిష్ఠ = \(\frac{E}{r}=\frac{1.9}{380}\) = 0.005A
కొద్ది సెకనులు మోటారు స్టార్ట్ చేయుటకు కావలసిన విద్యుత్ 100 A. కావున పైన వచ్చిన విద్యుత్ విలువతో కారును స్టార్ట్ చేయలేము.

ప్రశ్న 16.
సమాన పొడవు గల అల్యూమినియం, రాగి తీగలు సమాన నిరోధాన్ని కలిగి ఉన్నాయి. ఆ రెండు తీగల్లో ఏది తేలికైనది ? చాలా ఎత్తు ‘మీద నుంచి పోయే విద్యుత్ సామర్థ్య తీగలుగా అల్యూమినియం తీగలను ఎందుకు ప్రాధాన్యం ఇస్తారో తెలపండి. (ρAl = 2.63 × 10-8 Ωm, ρCu 1.72 × 10-8 Ωm, Al, Cu ల సాపేక్ష సాంద్రతలు వరుసగా 2.7, 8.9.)
సాధన:
అల్యూమినియం తీగకు, R1 = R; l1 = 1
సాపేక్ష సాంద్రత d1 = 2.7.
రాగి తీగకు, R2 = R, l2 = l1, d2 = 8.9

A1 మరియు A2 లు అల్యూమినియం మరియు రాగి తీగల మధ్యచ్ఛేద వైశాల్యాలు అయితే
AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు 65

రాగి తీగ ద్రవ్యరాశి, అల్యూమినియం తీగ ద్రవ్యరాశికి 2.16 రెట్లు అని చూపును. ఒకే పొడవు అంతే నిరోధం గల అల్యూమినియం తీగ, రాగి తీగకన్నా తక్కువ ద్రవ్యరాశి కల్గి ఉండును. కావున పైన ఉండే పవర్ కేబుల్స్లో అల్యూమినియం తీగను వాడతారు. భారమైన కేబుల్స్, వాని బరువు వల్ల క్రిందికి సాగును.

ప్రశ్న 17.
మాంగనీస్ మిశ్రమ లోహంతో తయారైన నిరోధకంపై చేసిన కింది పరిశీలనల నుంచి మీరు ఏ నిర్ణయాన్ని తీసుకోగలుగుతారు?
AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు 66
సాధన:
వేర్వేరు రీడింగుల, వోల్టేజి మరియు విద్యుత్ల నిష్పత్తి విలువలు సమానం. కావున ఓమ్స్ నియమము ఎక్కువ యదార్థతతో పాటించును. మాంగనీన్ విశిష్ట నిరోధం, ఉష్ణోగ్రతపై ఆధారపడదు.

AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు

ప్రశ్న 18.
కింది ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వండి.
a) అసమరీతి మధ్యచ్ఛేద వైశాల్యం కలిగి ఉన్న లోహపు వాహకంలో నిలకడగా విద్యుత్ ప్రవహిస్తున్నది. కింది రాశులలో ఏవి వాహకం వెంబడి స్థిరంగా ఉంటాయి :
విద్యుత్ ప్రవాహం, విద్యుత్ ప్రవాహ సాంద్రత, విద్యుత్ క్షేత్రం, డ్రిఫ్ట్ వడి. సాధన. అసమ మధ్యచ్ఛేద వైశాల్య వాహకం ద్వారా పోవు విద్యుత్ మాత్రమే స్థిరం. మిగిలిన రాశులు వాహక మధ్యచ్ఛేద వైశాల్యంనకు విలోమానుపాతంలో ఉండును.

b) అన్ని వాహక మూలకాలకు ఓమ్ నియమం సార్వత్రికంగా అనువర్తనీయమా? ఒకవేళ కాకుంటే, ఓమ్ నియమాన్ని పాటించని మూలకాలకు ఉదాహరణలివ్వండి.
సాధన:
అఓమిక్ మూలకాలకు ఓమ్ నియమం వర్తించదు.
ఉదా : శూన్య నాళికలు, పాక్షిక వాహక డయోడ్లు, విద్యుద్విశ్లేష్య ద్రవాలు.

c) తక్కువ వోల్టేజి గల ఒక జనకం నుంచి అధిక విద్యుత్ ప్రవాహాలు అవసరమైనప్పుడు తప్పకుండా దాని అంతర్నిరోధం చాలా తక్కువగా ఉండాలి. ఎందుకు?
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు 67

d) ఒక హైటెన్షన్ (high tension (HT)) సరఫరా 6 kV అనుకోండి, తప్పకుండా చాలా అధిక అంతర్నిరోధాన్ని కలిగి ఉండాలి. ఎందుకు?
సాధన:
HT సప్లయి చాలా ఎక్కువ అంతర్నిరోధం కలిగి ఉండును. అనుకోకుండా వలయం షార్ట్ అయితే, తీసుకునే విద్యుత్ సురక్షిత అవధిని దాటి వలయం పాడవటానికి కారణం అగును.

ప్రశ్న 19.
సరియైన ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోండి :
a) సాధారణంగా మిశ్రమ లోహాల నిరోధకత వాటి అనుఘటక లోహాల నిరోధకతల కంటే (ఎక్కువ / తక్కువ).
b) మిశ్రమ లోహాల ఉష్ణోగ్రతా నిరోధ గుణకాలు శుద్ధలోహాల కంటే తక్కువ / ఎక్కువ).
c) ఉష్ణోగ్రత పెరుగుదలతో మాంగనీస్ మిశ్రమ లోహం నిరోధకత (ఉష్ణోగ్రతపై ఆధారపడదు / శీఘ్రంగా పెరుగుతుంది).
d) ఒక మాదిరి బంధకం (ఉదా : అంబర్ – సీమ గుగ్గిలం) నిరోధకత లోహ నిరోధకత కంటే (1022 1023) రెట్లు అధికం.
సాధన:
a) ఎక్కువ
b) తక్కువ
c) ఉష్ణోగ్రతపై ఆధారపడదు.
d) 1022

ప్రశ్న 20.
a) R నిరోధం గల నిరోధకాలను ఇవ్వడమైంది.
i) గరిష్ఠంగా, ii) కనిష్ఠంగా ప్రభావాత్మక నిరోధాన్ని పొందడానికి మీరు వాటిని ఏ విధంగా సంయోగం చేస్తారు ? గరిష్ఠ, కనిష్ట నిరోధం నిష్పత్తి ఎంత?
సాధన:
తుల్య నిరోధం గరిష్టం కావటానికి, n నిరోధాలను శ్రేణిలో కలపాలి.
గరిష్ట తుల్య నిరోధం, RS = nR

తుల్య నిరోధం కనిష్టం కావటానికి, n నిరోధాలను సమాంతరంగా కలపాలి.
కనిష్ట తుల్య నిరోధం’, RP = \(\frac{R}{n}\)
∴ \(\frac{\mathrm{R}_{\mathrm{S}}}{\mathrm{R}_{\mathrm{P}}}=\frac{\mathrm{nR}}{\frac{\mathrm{R}}{\mathrm{n}}}=\mathrm{n}^2\)

నిరోధాల సమాంతర సంయోగంలో తుల్య నిరోధం, విడివిడి నిరోధాల కన్నా తక్కువ మరియు నిరోధాల శ్రేణి సంయోగంలో తుల్య నిరోధం, విడివిడి నిరోధాల కన్నా ఎక్కువ.

b) 1Ω, 2Ω, 3Ω నిరోధాలు మీకివ్వడమైంది. కింద ఇచ్చిన తుల్య నిరోధాలను పొందడానికి వాటిని ఏ విధంగా సంయోగం చేస్తారు? i) (11/3) Ω (ii) (11/5) Ω, (iii) 6Ω, (iv) (6/11)Ω ?
సాధన:
సందర్భం (i) : 1Ω మరియు 2Ω ల సమాంతర సంయోగమును 3Ω లతో శ్రేణిలో కలిపినప్పుడు
1Ω మరియు 2Ω లను సమాంతరంగా కలచినప్పుడు, తుల్య నిరోధం
AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు 68

c) పటంలో చూపిన జాలాల (networks) తుల్య నిరోధాలను కనుక్కోండి.
AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు 69
సాధన:
ఇచ్చిన వలయంను శ్రేణిలో 4 సమ భాగాల సంయోగము ప్రభావం 4 నిరోధాలు కలిగి ఉండును. వాటిలో ఒక్కొక్కటి 1Ω గల శ్రేణి నిరోధాలు 2 మరియు ఒక్కొక్కటి 2Ω గల సమాంతర నిరోధాలు 2.

ఒక్కొక్కటి 1Ω నిరోధం ఉన్న 2 నిరోధాల శ్రేణి. సన తుల్య నిరోధం= 1 + 1 = 2Ω.
ఒక్కొక్కటి 2Ω నిరోధం ఉన్న 2 నిరోధాల శ్రేణి సంధాన తుల్య నిరోధం = 2 + 2 = 4Ω
ఒక భాగంలో ఫలిత నిరోధం, \(\frac{1}{R_p}=\frac{1}{2}+\frac{1}{4}=\frac{3}{4}\) లేక Rp = \(\frac{3}{4}\)Ω
∴ 4 భాగాల మొత్తం నిరోధం Rp = \(\frac{3}{4}\) × 4 = \(\frac{16}{3}\)Ω = 5.33Ω
పటం (b)లో R నిరోధం ఉన్న 5 నిరోధాలు శ్రేణిలో కలిపారు. వాని తుల్య నిరోధం = 5R.

AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు

ప్రశ్న 21.
పటంలో చూపినట్లు అనంత జాలం, 0.5 Ω అంతర్నిరోధం గల 12V ల జనకం నుంచి పొందే విద్యుత్ ప్రవాహాన్ని కనుక్కోండి. ప్రతీ నిరోధకం 1 Ω నిరోధాన్ని కలిగి ఉంది.
AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు 70
సాధన:
అనంతమైన నెట్వర్క్ తుల్య నిరోధం x.నెట్వర్క్ అనంతమైనది కావున టెర్మినల్స్ వెంట ఒక్కొక్కటి 1Ω విలువ గల మూడు నిరోధాల ప్రమాణంను కల్పితే నెట్వర్క్ మొత్తం నిరోధం మారదు. i. e., వలయం మిగిలిన నిరోధం x.
నెట్వర్క్ పటంలో చూపినట్లు ఉండును. మొత్తం నిరోధం x.

x మరియు 1Ω ల సమాంతర సంయోగము ఒక్కొక్కటి 1Ωగల 2 నిరోధాలతో శ్రేణితో కలపబడినవి.
AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు 71

ప్రశ్న 22.
AB నిరోధకం తీగ కొనల మధ్య పొటెన్షియల్ పాఠాన్ని కొనసాగిస్తున్న 2.0 V emf, 0.40 Ω అంతర్నిరోధం గల ఘటంతో గల పొటెన్షియో మీటర్ను పటం చూపుతుంది. 1.02 V స్థిర emf ను కొనసాగిస్తున్న ప్రామాణిక ఘటం (చాలా మిత విద్యుత్ ప్రవాహాలకు, కొన్ని mA విద్యుత్ ప్రవాహాల వరకు) 67.3 cm ల పొడవు వద్ద సంతులన బిందువును ఇస్తుంది. ప్రామాణిక ఘటం నుంచి కచ్చితంగా స్వల్ప విద్యుత్ ప్రవాహాలను పొందడానికి, దానితో శ్రేణిలో 600 kΩ అధిక నిరోధాన్ని కలిపారు.
AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు 72

ఈ నిరోధాన్ని సంతులన బిందువుకు దగ్గరగా షార్ట్ (short) చేశారు. ఇప్పుడు ప్రామాణిక ఘటానికి బదులుగా తెలియని emf ε గల ఘటాన్ని అమర్చి, అదే విధంగా సంతులన పొడవును కనుక్కుంటే 82.3 cm పొడవు వద్ద సంతులన బిందువును ఇచ్చింది.
a) ε విలువ ఎంత?
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు 73

b) 600 kΩ నిరోధం అమర్చడానికి గల ఉద్దేశ్యమేమి?
సాధన:
600 kΩ హెచ్చు నిరోధం, గాల్వనామాపకం ద్వారా చాలా తక్కువ విద్యుత్ ప్రవాహంను అనుమతించును.

c) ఈ అధిక నిరోధం వల్ల సంతులన బిందువు ప్రభావితం అవుతుందా?
సాధన:
ఈ నిరోధం వలయంలో ఉండుట వల్ల తుల్యస్థానం మారదు.

d) చోదక ఘటం (driving cell) అంతర్నిరోధం వల్ల సంతులన బిందువు ప్రభావితం అవుతుందా?
సాధన:
విద్యుత్ ఘటం అంతర్నిరోధం వల్ల తుల్యస్థానం మారదు.

e) పొటెన్షియోమీటర్ చోదక ఘటం emf 2.0 V కు బదులుగా 1.0 V కలిగి ఉంటే పై పద్ధతి పనిచేస్తుందా?
సాధన:
కాదు. నడిచే ఘటం వి.చా. బ మరో ఘటం వి.చా. బ కన్నా తక్కువ అయితే పొటెన్షియోమీటర్ పద్ధతి పనికిరాదు. సంతులన బిందువును పొందలేము.

f) అత్యంత స్వలమైన emf లను, అంటే, కొన్ని mV ల వరకు (ఉష్ణయుగ్మం విలక్షణ emf లాంటివి) కనుక్కోవడానికి పై వలయం చక్కగా పనిచేస్తుందా? ఒకవేళ పనిచేయకపోతే, వలయాన్ని ఎలా మారుస్తారు?
సాధన:
స్వల్ప వి.చా. బ ను కొలుచుటకు వలయం పనికిరాదు. దీనికి కారణం సంతులన బిందువు A చివరకు దగ్గరగా ఉండును. వలయంను సరిచేయుటకు 2.0V ఘటంనకు శ్రేణిలో సరైన అధిక నిరోధంను ఉపయోగించాలి. ఇది పొటెన్షియో మీటర్ తీగ గుండా పోవు విద్యుత్ను తగ్గించును. కావున 1 cm తీగ పొటెన్షియల్ తేడా తగ్గును. కావున తక్కువ వి.చా. బను కనుగొనవచ్చును.

ప్రశ్న 23.
రెండు నిరోధాలను పోల్చడానికి పొటెన్షియోమీటర్ వలయాన్ని పటం సూచిస్తుంది. ప్రామాణిక నిరోధం R = 10.0 Ω తో సంతులన బిందువును 58.3 cm వద్ద కనుక్కొంటే, తెలియని నిరోధం X తో 68.5cm వద్ద సంతులన బిందువును కనుక్కొన్నారు. X విలువను కనుక్కోండి. ఒకవేళ emfe గల ఇచ్చిన ఘటంతో సంతులన బిందువును తెలుసుకోలేకపోతె, మీరు ఏం చేస్తారు?
AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు 74
సాధన:
l1 = 58.3cm; l2 = 68.5 cm; R = 10Ω; X = ?
పొటెన్షియోమీటర్ తీగలో విద్యుత్ I. R మరియు Xల వెంట పొటెన్షియల్లు E1 మరియు E2. కీని మూసి వలయంనకు R మరియు X లను కలిపితే అప్పుడు.
AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు 75

ఇచ్చిన ఘటం (వి. ఒ.బ) తో సంతులన బిందువు ఉండదు. దీని అర్థం R లేక X వెంట పొటెన్షియల్ డ్రాప్. పొటెన్షియోమీటర్ తీగ AB ట పొటెన్షియల్ డ్రాప్ కన్నా తక్కువ. R మరియు X లలో దేనికైనా సరైన నిరోధంను శ్రేణిలో ఉంచి లేక స్వల్ప వి. చా. బ ఉన్న ఘటంను ఉపయోగించి, R మరియు X గుండా పోవు విద్యుత్ తగ్గించి, వాని వెంట పొటెన్షియల్ డ్రాప్ తగ్గించి, సంతులన బిందువును పొందవచ్చును. మరియొక సాధ్యమగు మార్గము, వాడుతున్న ఘటం వోల్టేజి పెంచి, పొటెన్షియోమీటర్ తీగ వెంట పొటెన్షియల్ డ్రాప్ను పెంచవచ్చును.

ప్రశ్న 24.
పటం 1.5 Vఘటం అంతర్నిరోధం కనుక్కోవడానికి ఉపయోగించే 2.0V పొటెన్షియోమీటర్ను చూపిస్తుంది. వివృత వలయంలో ఘటం సంతులన బిందువు 76.3cm. ఘటం బాహ్య వలయంలో 9.5 Q నిరోధకాన్ని ఉపయోగించినపుడు, సంతులన బిందువు పొటెన్షియోమీటర్ తీగ పొడవు 64.8 cm వద్దకు జరిగింది. ఘటం అంతర్నిరోధం కనుక్కోండి.
AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు 76
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు 77

సాధించిన సమస్యలు Textual Examples

ప్రశ్న 1.
a) 1.0 × 10-7 m² మధ్యచ్ఛేద వైశాల్యం, 1.5 A విద్యుత్ ప్రవాహాన్ని తీసుకొనిపోతున్న ఒక రాగితీగలోని వహన ఎలక్ట్రాన్ల సరాసరి డ్రిఫ్ట్ వడిని అంచనావేయండి. ప్రతి రాగి పరమాణువు సుమారుగా ఒక వహన ఎలక్ట్రాన్ న్ను ఇస్తుంది అని భావించండి. రాగి పరమాణు ద్రవ్యరాశి 63.5 u, సాంద్రత 9.0 × 10³ kg/m³
b) పై విధంగా పొందిన డ్రిఫ్ట ్వడిని కింద తెలియజేసిన వివిధ సందర్భాలలో గల వడితో పోల్చండి. i) సాధారణ ఉష్ణోగ్రతల వద్ద రాగి అణువుల ఉష్ట్రీయ వదులు (thermal speeds), ii) డ్రిఫ్ట్ చలనాన్ని కలుగచేసే వాహకం వెంబడి విద్యుత్ క్షేత్ర వ్యాపన వడి (speed of propagation).
సాధన:
a) వహన ఎలక్ట్రాన్ల డ్రిఫ్ట్వేగం దిశ విద్యుత్ క్షేత్ర దిశకు వ్యతిరేకంగా ఉంటుంది. అంటే ప్రొటెన్షియల్ పెరిగే దిశలో ఎలక్ట్రాన్లు క్రిఫ్ట్ అవుతాయి.

సమీకరణం I∆t = + neA/υd/∆t నుంచి డ్రిఫ్ట్ వడి υd = (I/neA)

ఇక్కడ e = 1.6 × 10-19 C, A = 1.00 × 10-7 m², I 1.5 A. ఒక ఘనపు మీటర్ లోని పరమాణువుల సంఖ్య వహన ఎలక్ట్రాన్ల సాంద్రత n కి సమానం. రాగి పరమాణువులో సంయోజక (వేలన్సీ) ఎలక్ట్రాన్ ఒకటి కాబట్టి, ప్రతి Cu పరమాణువుకు ఒక వహన ఎలక్ట్రానన్ను ఊహించడం సమంజసంగా ఉంటుంది. ఒక ఘనపు మీటర్ కాగి ద్రవ్యరాశి 9.0 × 10³ kg, 6.0 × 1023 రాగి పరమాణువులు 63.5 g ద్రవ్యరాశిని కలిగి ఉంటాయి కాబట్టి
AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు 78

b) i) T ఉష్ణోగ్రత వద్ద, M ద్రవ్యరాశి గల రాగి పరమాణువుల ఉష్ట్రీయవడిని *[<(1/2) Mυ² > = (3/2) kBT] నుంచి. పొందవచ్చు. ఇది విలక్షణంగా, \(\sqrt{\mathrm{k}_{\mathrm{B}} \mathrm{T} / \mathrm{M}}\) క్రమంలో ఉంటుంది. ఇక్కడ kB బోల్ట్స్ ఎన్ స్థిరాంకం. రాగి లోహానికి 300 K ఉష్ణోగ్రత వద్ద kg విలువ 2 × 10² m/s. ఈ విలువ వాహకంలోని రాగి పరమాణువుల అనియత కంపన వడులను తెలియజేస్తుంది. సాధారణ ఉష్ణోగ్రతల వద్ద విలక్షణ ఉష్ట్రీయ వడ్డీ కంటే ఎలక్ట్రాన్ల క్రిఫ్ట్ వడి 10-5 రెట్లు తక్కువ అని గమనించండి.

ii) వాహకం వెంబడి ప్రయాణించే విద్యుత్ క్షేత్రం విద్యుదయస్కాంత తరంగాల వడి, అంటే 3.0 × 108 ms-1 ని కలిగి ఉంది. డ్రిఫ్ట్ వడిని విద్యుత్ క్షేత్రం వడితో పోల్చితే చాలా స్వల్పం, 10-11 కారకంతో చిన్నది.

AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు

ప్రశ్న 2.
a) కొన్ని ఆంపియర్ల అవధిలో ఉండే విద్యుత్ ప్రవాహాలకు ఎలక్ట్రాన్ డ్రిఫ్ట్ వడి స్వల్పంగా mm s-1 లో ఉంటుందని పై సమస్యలో అంచనావేయడమైంది. అయితే, ఇంచుమించు వలయాన్ని మూసిన వెంటనే విద్యుత్ ప్రవాహం ఏ విధంగా ఏర్పాటవుతుంది?
b) వాహకం లోపల గల విద్యుత్ క్షేత్రంలో ఎలక్ట్రాన్లు బలానికి గురికావడం వల్ల ఎలక్ట్రాన్ డ్రిఫ్ట్ ఉత్పత్తి అవుతుంది. కాని, బలం త్వరణాన్ని కలిగించాలి. అయితే ఎందుకు ఎలక్ట్రాన్లు నిలకడగా గల సరాసరి డ్రిఫ్ట్ వడిని పొందుతాయి?
c) ఎలక్ట్రాన్ ఆవేశం, డ్రిఫ్ట్ వడి చాలా స్వల్పం అయినప్పటికీ, వాహకంలో అధిక పరిమాణం గల ప్రవాహాలను మనం ఏ విధంగా పొందగలుగుతున్నాం?
d) ఒక లోహం లోపల ఎలక్ట్రాన్లు తక్కువ పొటెన్షియల్ నుంచి అధిక పొటెన్షియల్ వైపుకు డ్రిఫ్ట్కు చెందినప్పుడు, దీనర్థం ఆ లోహానికి చెందిన స్వేచ్ఛా ఎలక్ట్రాన్లు అన్నీ ఒకే దిశలో చలిస్తున్నాయా?
e) కింది రెండు సందర్భాల్లో వరుస అభిఘాతాల మధ్య (లోహం ధన అయాన్లతో) ఎలక్ట్రాన్ల పథం సరళరేఖలేనా?
i) విద్యుత్ క్షేత్రం లేనప్పుడు, ii) విద్యుత్ క్షేత్రం ఉన్నప్పుడు
సాధన:
a) వలయం అంతటా ప్రతి భాగంలో విద్యుత్ క్షేత్రం, ఇంచుమించు క్షణికంగా (కాంతివేగంతో) ఏర్పాటై, ప్రతి బిందువు వద్ద స్థానిక ఎలక్ట్రాన్ డ్రిఫ్ట్ ఏర్పడేట్లు చేస్తుంది. వాహకం ఒక కొన నుంచి మరొక కొనకు ఎలక్ట్రాన్లు ప్రయాణించే వరకు ప్రవాహ ఏర్పాటు వేచి ఉండాల్సిన అవసరం లేదు. అయితే, ప్రవాహం నిలకడ స్థితిని చేరడానికి మాత్రం అదీ స్వల్ప సమయాన్ని తీసుకొంటుంది.

b) ప్రతి స్వేచ్ఛా ఎలక్ట్రాన్ లోహం యొక్క ధన అయాన్తో అభిఘాతం చెందే వరకు త్వరణం చెంది దాని డ్రిఫ్ట్ వడిని పెంచుకొంటుంది. అభిఘాతం తరువాత తన డ్రిఫ్ట్ వడిని కోల్పోతుంది. కాని త్వరణం చెందడం ఆరంభం అవుతుంది. డ్రిఫ్ట్ వడి పెరుగుతుంది. తిరిగి అభిఘాతానికి లోనవుతుంది. ఇదే క్రమం జరుగుతూ ఉంటుంది. కాబట్టి సరాసరిగా, ఎలక్ట్రాన్లు డ్రిఫ్ట్ వడిని మాత్రమే పొందుతాయి.

c) ఎందుకంటే, ఎలక్ట్రాన్ సాంద్రత సంఖ్య చాలా పెద్దది ~ 1029 m-3.

d) అర్థరహితం. ఎలక్ట్రాన్ల అధిక అనియత వేగాలతో డ్రిఫ్ట్వేగం అధ్యారోపితం అవుతుంది.

e) విద్యుత్ కేత్రం లేనప్పుడు, పథాలు సరళరేఖలు, విద్యుత్ క్షేత్రం ఉన్నప్పుడు పథాలు సాధారణంగా వక్రాలు.

ప్రశ్న 3.
ఒక విద్యుత్ టోస్టర్ (toaster) లో వేడిచేయడానికి నిక్రోమ్ తీగని (heating element) ఉపయోగించుకొంది. గది ఉష్ణోగ్రత (27.0 °C) వద్ద దాని గుండా ఉపేక్షించదగిన స్వల్ప విద్యుత్ ప్రవహించినప్పుడు దాని నిరోధాన్ని 75.3 Ωగా కనుక్కొన్నారు. ఆ టోస్టర్ను 230 V ప్రధాన సరఫరాకి కలిపినప్పుడు విద్యుత్ ప్రవాహం స్థిరత్వం ఏర్పరచుకొని, కొన్ని సెకన్ల తరువాత 2.68 A నిలకడగా గల విలువకు చేరింది. నిక్రోమ్ తీగ నిలకడ ఉష్ణోగ్రత ఎంత ? పరిగణనలోకి తీసుకొన్న ఉష్ణోగ్రత అవధిపై సరాసరి ఉష్ణోగ్రత నిరోధ గుణకం విలువ 1:70 × 10-4 °C-1,
సాధన:
తీగ (heating element) ద్వారా ప్రవహించే విద్యుత్ ప్రవాహం చాలా స్వల్పంగా ఉన్నప్పుడు, ఉష్ణ ఫలితాలను ఉపేక్షించవచ్చు. దాని ఉష్ణోగ్రత T1 గది ఉష్ణోగ్రత అంతం అవుతుంది. టోస్టర్ను సరఫరాకు కలిపినప్పుడు, తొలి ప్రవాహం, నిలకడ విలువ 2.68 A కంటే కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. కాని విద్యుత్ ప్రవాహం వల్ల ఉష్ణ ఫలితం ఏర్పడి ఉష్ణోగ్రత పెరుగుతుంది. దీనితో నిరోధం పెరిగి విద్యుత్ ప్రవాహం కొద్దిగా తగ్గుతుంది. ఇంకా ఉష్ణోగ్రత పెరగకుంటే, కొద్ది సెకన్లలోనే నిలకడ స్థితికి చేరుతుంది. తీగ నిరోధం, తీసుకొన్న విద్యుత్ ప్రవాహం రెండూ నిలకడ విలువలను పొందుతాయి. నిలకడ ఉష్ణోగ్రత T2 వద్ద, నిరోధం R2 అనుకొంటే,
AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు 79

అందువల్ల, వేడెక్కే తీగ నిలకడ ఉష్ణోగ్రత (విద్యుత్ ప్రవాహం వల్ల కలిగే ఉష్ణ ఫలితం, పరిసరాలకు అయ్యే ఉష్ణ నష్టానికి సమానం అయినప్పుడు) విలువ 847 °C.

ప్రశ్న 4.
ఒక ప్లాటినం నిరోధపు థర్మామీటర్ లోని ప్లాటినం తీగ నిరోధం మంచు (ice point) బిందువు వద్ద 5 Ω, నీటి ఆవిరి (steam point) బిందువు వద్ద 5.39 Ω. ఈ థర్మామీటర్ను ఒక ఉష్ణతాపకంలోకి ప్రవేశపెట్టినప్పుడు ప్లాటినం తీగ నిరోధం 5.795 Ω. తాపకం ఉష్ణోగ్రతను లెక్కించండి.
సాధన:
R0 = 5 Ω, R100 = 5.23 Ω, Rt = 5.795 Ω
AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు 80

ప్రశ్న 5.
నిరోధకాల ఒక జాలం, (network) ను 10 అంతర్నిరోధం గల 16 V బ్యాటరీకి పటంలో చూపినట్లు సంధానం చేశారు :
a) జాలం తుల్య నిరోధాన్ని గణించండి.
b) ప్రతీ నిరోధకంలో విద్యుత్ ప్రవాహాన్ని రాబట్టండి.
c) VAB VBC, VCD వోల్టేజి పాతాలను పొందండి.
AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు 81
సాధన:
a) ఈ జాలం నిరోధకాల శ్రేణి, సమాంతర సంయోగం. మొదటి రెండు 4 Ω నిరోధకాలు సమాంతరంగా కలవు. వీటి ఫలితం = [(4 × 4)/ (4 + 4)] Ω = 2 Ω నిరోధానికి తుల్యమవుతుంది.

అదే విధంగా, 122, 62 నిరోధకాలు సమాంతరంగా కలవు. వీటి ఫలితం = [(12×6) / (12 + 6)] Ω = 4Ω నిరోధానికి తుల్యమవుతుంది. జాలం తుల్య నిరోధం R ను పై రెండు నిరోధకాల (2Ω, 4Ω) ను 12 తో శ్రేణిని కలిపి రాబట్టవచ్చు.
R = 2Ω + 4Ω + 1Ω = 7Ω

b) వలయంలో మొత్తం విద్యుత్ ప్రవాహం అనుకొంటే,
I = \(=\frac{\varepsilon}{R+r}=\frac{16 V}{(7+1) \Omega}\)

A, B ల మధ్య నిరోధకాలను పరిగణించండి. ఆ రెండింటిలో 4 Ω నిరోధం గల ఒక దానిలో విద్యుత్ I1 అనుకొంటే, రెండవ దానిలో విద్యుత్ I2 అవుతుంది.
I1 × 4 = I1 × 4
అంటే, I1 = I2 మరో విధంగా చూస్తే రెండు భుజాల సౌష్టవం వల్ల కూడా ఇది స్పష్టం. కాని I1 + I2 = I = 2A. కాబట్టి, I1 = I2 = IA

ప్రతీ 4 Ω నిరోధకంలోని విద్యుత్ ప్రవాహం 1 A, B, C ల మధ్య గల 1 Ω నిరోధకంలోని విద్యుత్ ప్రవాహం 2 A అవుతుంది. ఇప్పుడు C, D ల మధ్య గల రెండు నిరోధకాలను తీసుకొంటే, 12 Ω నిరోధకంలో విద్యుత్ ప్రవాహం I3, 6 Ω నిరోధకంలో I4 అనుకోండి.
I3 × 12 = I4 × 6 i. e., I4 = 2I3
కానీ, I3 + I4 = I = 2A
అందువల్ల I3 = (\(\frac{2}{3}\))A, I4 = (\(\frac{4}{3}\))A
అంటే 12Ω నిరోధకంలో విద్యుత్ ప్రవాహం (2/3) A, అదే సమయంలో 6Ω నిరోధకంలో విద్యుత్ ప్రవాహం (4/3) A.

c) AB కొనల మధ్య వోల్టేజి పాతం, VAB = I1 × 4 = 1 A × 4Ω = 4 V.
ఈ విలువను A, B ల మధ్య గల మొత్తం విద్యుత్ ప్రవాహాన్ని, A, B ల మధ్య గల తుల్య నిరోధంతో గుణించి కూడా రాబట్టవచ్చు. అంటే,
VAB = 2A × 2 Ω =4V
BC కొనల మధ్య వోల్టేజి పాతం,
VBC = 2A × 1 Ω = 2V
CD కొనల మధ్య వోల్టేజి పాతం,
VCD = 12 Ω × I3 = 12Ω × (\(\frac{2}{3}\)) A = 8 V.

ఈ విలువను C, D ల మధ్యగల మొత్తం విద్యుత్ ప్రవాహాన్ని, C, D ల మధ్య తుల్య నిరోధంతో గుణించి రాబట్టవచ్చు. అంటే, VCD = 2 A × 4 Ω = 8 V

AD కొనల మధ్య మొత్తం వోల్టేజి పాతం, 4 V+ 2 V + 8 V = 14 V అని గమనించండి. ఘటం కొనల మధ్య వోల్టేజి, (టెర్మినల్ వోల్టేజి) 14 V. అదే సమయంలో దాని emf 16 V. వోల్టేజిలో కలిగే నష్టం (= 2 V), ఈ నష్టం ఘటం అంతర్నిరోధం 1Ω వల్ల జరుగుతుంది [2 A × 1Ω = 2 V).

AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు

ప్రశ్న 6.
ఒక్కొక్కటి 1Ω నిరోధం గల 12 నిరోధకాలను కలిగి ఉన్న ఘనాకార జాలం కర్ణాల ఎదురెదురు కొనల మధ్య ఉపేక్షించదగిన అంతర్నిరోధం ‘గల 10 V బ్యాటరీని సంధానం చేశారు. జాలం తుల్య నిరోధాన్ని, ఘనం ప్రతీ అంచు ద్వారా ప్రవహించే విద్యుత్ ప్రవాహాన్ని కనుక్కోండి.
AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు 82
సాధన:
ఈ జాలాన్ని నిరోధకాల సరళశ్రేణి, సమాంతర సంయోగాలకు తగినట్లుగా రూపాంతరం చెందించలేం. అయితే, ఇచ్చిన లెక్కలో స్పష్టమైన సౌష్టవం ఉంది కాబట్టి దానిని ఉపయోగించుకొని జాలం తుల్య నిరోధాన్ని పొందవచ్చు.

AA’, AD, AB పథాలను స్పష్టంగా, సౌష్టవంగా ఉండేటట్లు జాలంలో ఉంచారు. కాబట్టి, ప్రతీ దానిలోని విద్యుత్ ప్రవాహం I సమానంగా ఉండాలి. ఇంకా A’, B, D కొనల వద్ద లోపలికి ప్రవేశించే విద్యుత్ ప్రవాహం I బయటికి పోయే రెండు శాఖల్లోకి తప్పకుండా రెండు సమాన భాగాలుగా విడిపోవాలి.

ఈ విధంగా లెక్కలోని సౌష్టవం, కిర్కాఫ్ మొదటి నియమాన్ని ఉపయోగించి ఘనం 12 అంచులలోని విద్యుత్ ప్రవాహాన్ని I పదాలలో సులభంగా రాయవచ్చు. తరువాత ABCCEA సంవృత లూపు తీసుకొని కిర్కాఫ్ రెండవ నియమాన్ని అనువర్తించండి :

-IR – (1/2) IR – IR + ε = 0

ఇక్కడ R ప్రతీ అంచు నిరోధం, ε ఘటం emf. అందువల్ల, ε = \(\frac{5}{2}\)IR
జాలం తుల్య నిరోధం Req అనుకొంటే, Req = \(\frac{\varepsilon}{3I}=\frac{5}{6}\)R
R = 1Ω కు Req = (5/6) Ω, ε = 10V అయితే జాలంలోని మొత్తం విద్యుత్ ప్రవాహం (=3I)
3I = 10V/(5/6) Ω = 12 A, అంటే, I = 4 A

ప్రశ్న 7.
పటంలో చూపిన జాలంలో ప్రతీ శాఖలోని విద్యుత్ ప్రవాహాన్ని కనుక్కోండి.
AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు 83
సాధన:
జాలం ప్రతీ శాఖ తెలియని విద్యుత్ ప్రవాహంతో నిర్దేశితమై ఉంది. వీటిని కిర్కాఫ్ నియమాలను ఉపయోగించి కనుక్కోవలసి ఉంది. మొదట తెలియని వాటి సంఖ్యను తగ్గించడానికి, ప్రతీ శాఖలో తెలియని విద్యుత్ ప్రవాహాన్ని నిర్దేశించడానికి ప్రతీ సంధి వద్ద కిర్కాఫ్ మొదటి నియమాన్ని ఉపయోగించాలి. అప్పుడు మనకు I1, I2, I3 అనే మూడు తెలియనివి – ఉన్నాయి. వీటిని మూడు వివిధ సంవృత లూప్లు కిర్కాఫ్ రెండవ నియమాన్ని అనువర్తించి కనుక్కోవచ్చు. ADCA సంవృత లూప్కు కిర్కాఫ్ రెండవ నియమాన్ని ఉపయోగిస్తే,
10 – 4(I1 – I2) + 2 (I2 + I3 – I1) – I1 = 0
అంటే, 7I1 – 6I2 – 2I3 = 10 → (1)

ABCA సంవృత వలయానికి ఉపయోగిస్తే,
10 -4I2 – 2 (I2 + I3) – I1 = 0
అంటే, I1 + 6I2 + 2I3 = 10 → (2)

BCDEB సంవృత వలయానికి ఉపయోగిస్తే,
5 – 2 (I2 + I3) – 2 (I2 + I3 – I1) = 0
అంటే, 2I1 – 4I2 – 4I3 = -5. → (3)

సమీకరణాలు (1, 2, 3) మూడు తెలియని విలువలు కలిగి ఉన్న సమకాలిక సమీకరణాలు. వీటిని సాధారణ. పద్ధతుల్లో సాధించినట్లయితే, కింది విలువలు వస్తాయి.
AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు 84

మిగతా సంవృత లూప్లకు కిర్కాఫ్ రెండవ నియమాన్ని అనువర్తించినట్లయితే, ఏ మాత్రం అదనపు స్వతంత్ర సమీకరణాన్ని సమకూర్చదని సులభంగా నిరూపితమైంది. అంటే, పై విద్యుత్ ప్రవాహ విలువలు జాలంలోని ప్రతీ సంవృత లూప్కు కిర్కా రెండవ నియమాన్ని సంతృప్తిపరుస్తాయి. ఉదాహరణకు, సంవృత లూప్ BADEB కి మొత్తం వోల్టేజి పాతం
AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు 85

కిరాఫ్ రెండవ నియమం ప్రకారం అవసరమైనట్లు, ఇది శూన్యానికి సమానం.

ప్రశ్న 8.
వీటన్ బ్రిడ్జి నాలుగు భుజాలు ఈ క్రింది విధంగా నిరోధాలను కలిగి ఉన్నాయి.
AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు 86
AB = 100Ω, BC = 10Ω, CD = 5Ω, DA= 60Ω BD కొనల మధ్య 15Ω నిరోధం గల గాల్వనామీటర్ను కలిపారు. AC ల మధ్య 10 V పొటెన్షియల్ భేదం కొనసాగించినప్పుడు, గాల్వనామీటర్ ద్వారా విద్యుత్ . ప్రవాహాన్ని కనుక్కోండి.
సాధన:
BADB వల (mesh) ను పరిగణనలోకి తీసుకొంటే,
100I1 + 15Ig – 60I2 = 0 లేదా 20I1 + 3Ig – 12I2 = 0 → (1)

BCDB వలను పరిగణనలోకి తీసుకొంటే,
10(I1 – Ig) – 15Ig – 5(I2 + Ig) = 0
10I1 – 30Ig – 5I2 = 0
2I1 – 6Ig – I2 = 0 → (2)

ADCEA వలను పరిగణనలోకి తీసుకొంటే,
60I2 + 5(I2 + Ig) = 10
65I2 + 5Ig = 10
13I2 + Ig = 2
సమీకరణం (2) ని 10 తో గుణిస్తే,
20I1 + 60Ig – 10I2 = 0
సమీకరణాలు (4) మరియు (1) ల నుంచి
63Ig – 2I2 = 0
I2 = 31.5Ig

పై I2 విలువను సమీకరణం (3) లో ప్రతిక్షేపిస్తే,
13(31.5Ig) + Ig = 2
410.5 Ig = 2
Ig = 4.87 mA.

ప్రశ్న 9.
మీటరు బ్రిడ్జిలో A నుంచి 36.7 cm ల దూరం వద్ద శూన్య బిందువును కనుక్కొన్నారు. ఇప్పుడు 12Ω నిరోధాన్ని S కి సమాంతరంగా కలిపితే, శూన్య బిందువు 51.9 cm వద్ద కలుగుతుంది. R, S విలువలను కనుక్కోండి.
AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు 87
సాధన:
మొదటి సంతులన బిందువు నుంచి కింది విధంగా వస్తుంది.
AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు 88
సమీకరణం (1) నుంచి R/S విలువ పై సమీకరణంలో ప్రతిక్షేపిస్తే,
AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు 89
దీని నుంచి S = 13.5 Ω వస్తుంది. పై R/S విలువను ఉపయోగిస్తే, మనకు R = 6.86Ω వస్తుంది.

AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు

ప్రశ్న 10.
RΩ ల ఒక నిరోధం పొటెన్షియోమీటర్ నుంచి విద్యుత్ ప్రవాహాన్ని తీసుకుంటుంది. పొటెన్షియోమీటర్ కలిగి ఉండే మొత్తం నిరోధం R0 Ω. పొటెన్షియోమీటరు సరఫరా అయిన వోల్టేజి V. జాకీ (తీగపై జారుతూ తీగతో స్పర్శలో ఉండేది) పొటెన్షియోమీటర్ మధ్యలో ఉన్నప్పుడు, R కొనల మధ్య ఉండే వోల్టేజికి సమీకరణాన్ని ఉత్పాదించండి.
AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు 90
సాధన:
జాకీ పొటెన్షియోమీటర్ మధ్యలో ఉన్నప్పుడు మాత్రమే A, B బిందువుల మధ్య నిరోధం మొత్తం నిరోధంలో సగం (R0/2) ఉంటుంది. అందువల్ల A, B ల మధ్య గల మొత్తం నిరోధం R1 అనుకుంటే, దీనిని కింది సమాసంగా ఇవ్వచ్చు.
AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు 91

A, C. మధ్య గల మొత్తం నిరోధం A, B, B, C ల మధ్య గల నిరోధాల మొత్తానికి సమానం. అంటే, R1 + R0 /2
∴ పొటెన్షియోమీటర్ ద్వారా ప్రవహించే విద్యుత్,
AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు 92

AP Inter 2nd Year Economics Study Material Chapter 5 పారిశ్రామిక రంగం

Andhra Pradesh BIEAP AP Inter 2nd Year Economics Study Material 5th Lesson పారిశ్రామిక రంగం Textbook Questions and Answers.

AP Inter 2nd Year Economics Study Material 5th Lesson పారిశ్రామిక రంగం

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
భారతదేశములో పారిశ్రామిక రంగము యొక్క పాత్రను వివరింపుము.
జవాబు:
భారతదేశములో పారిశ్రామికీకరణ పాత్ర: అభివృద్ధి చెందుతున్న భారతదేశం లాంటి దేశానికి పారిశ్రామికీకరణ అత్యావశ్యకము. పారిశ్రామిక రంగంలో ఉత్పత్తి చేయబడి, సరసమైన ధరలకు అందుబాటులో ఉండు యంత్రములు, పరికరములపై ప్రధాన రంగాలైన వ్యవసాయం, సేవల రంగం ఆధారపడినది. పారిశ్రామికీకరణ ప్రజల ఆదాయాలను పెంచి తత్ఫలితముగా వారి జీవనప్రమాణ స్థాయి పెరుగుటకు తోడ్పడును. పారిశ్రామికీకరణ క్రింది ప్రయోజనాలను కల్పిస్తుంది.
పారిశ్రామికీకరణ ప్రయోజనములు
AP Inter 2nd Year Economics Study Material Chapter 5 పారిశ్రామిక రంగం 1

1) ఆదాయ వృద్ధి: పారిశ్రామికీకరణ దేశంలో జాతీయాదాయాన్ని త్వరితగతిన పెంచుతుంది. వనరుల సద్వినియోగానికి దోహదం చేస్తుంది. 2012వ సంవత్సరంలో తలసరి ఆదాయములు జర్మనీలో 44,010 $, జపాన్లో 47,870 $, U.K. 38,250 $, USA.50,120 $ భారతదేశములో తక్కువగా 1,530 $ గా ఉన్నది.

2) ఆర్థిక వ్యవస్థ నిర్మాణములో మార్పు: వెనుకబడిన దేశాలలో పారిశ్రామికీకరణ ద్వారా ఆర్థిక వ్యవస్థలో నిర్మాణాత్మకమైన మార్పులు అవసరము. పారిశ్రామికీకరణ ఫలితాలు వ్యవసాయ, సేవలరంగ అభివృద్ధికి తోడ్పడుతూ, ఉపాధి, ఉత్పత్తి ఆదాయాలను పెంచును. భారతదేశ స్థూల దేశీయోత్పత్తిలో వ్యవసాయ రంగం వాటా 13.9 శాతము, పారిశ్రామిక రంగం వాటా 26.2 శాతం, సేవల రంగం వాటా 59.9 శాతముగా ఉంది.

AP Inter 2nd Year Economics Study Material Chapter 5 పారిశ్రామిక రంగం

3) అధిక ఆదాయ వర్గాల డిమాండు తీర్చుట: అధిక ఆదాయ వర్గాల వారు ఒక పరిమితి దాటిన తర్వాత పారిశ్రామిక వస్తువులను డిమాండ్ చేస్తారు. (రిఫ్రిజిరేటర్, ఎ.సి., మొదలగునవి) అవసరాలు తీరిన తరువాత అధిక ఆదాయ వర్గాలు తమ ఆదాయాన్ని తయారీ వస్తువులపై ఖర్చు చేస్తారు. ధనవంతుల విషయంలో తయారీ వస్తువుల డిమాండ్ ఆదాయ వ్యాకోచంగానూ, వ్యవసాయ వస్తువుల డిమాండ్ ఆదాయ అవ్యాకోచముగా ఉండును. ప్రజల డిమాండుకు అనుగుణంగా తయారీ వస్తువులను అందించుటకు పారిశ్రామికీకరణకు అవసరము.

4) విదేశీ వ్యాపారములో అభివృద్ధి: ప్రాథమిక వస్తువుల ధరలలో వచ్చు ఒడుదుడుకులను ఎదుర్కొనుటకు పారిశ్రామికీకరణ అవసరము. ప్రాథమిక వస్తువులను ఎగుమతి చేస్తూ తయారీ వస్తువులను దిగుమతి చేసుకుంటారు. మన దేశములో ప్రాథమిక వస్తువుల ధరలు స్థిరంగానూ లేదా తగ్గే అవకాశముంటుంది. తయారీ రంగ వస్తువుల ధరలు మాత్రం హెచ్చుగా ఉంటాయి. ఇది అంతర్జాతీయ వ్యాపార ప్రతికూలతలకు కారణము. ఇటువంటి దేశాలు దిగుమతి ప్రత్యామ్నాయ, ఎగుమతి ప్రోత్సాహక పారిశ్రామిక విధానాన్ని అనుసరించాలి.

5) ఉద్యోగ అవకాశాల కల్పన: భారతదేశములో అధిక జనాభా పెరుగుదల వలన శ్రామిక మిగులు ఎక్కువ. వ్యవసాయ రంగంలో అల్ప ఉద్యోగిత, ప్రచ్ఛన్న నిరుద్యోగిత ఎక్కువ. పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి పరచిన ఎక్కువ మందికి ఉద్యోగాలు కల్పించవచ్చును.

6) సాంకేతిక పురోగతి: పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి పరచి నూతన యంత్రాలు, పరికరాలను ఎక్కువగా ఉత్పత్తి చేసి తక్కువ ధరలకు అందజేయగలిగిన వాటిని ఉత్పత్తి రంగంలో ప్రవేశపెట్టి ఉత్పత్తిని పెంచవచ్చును. నూతన పరిశ్రమల ప్రారంభానికి దోహదపడతాయి. అనేక బహుళార్థసాధక ప్రాజెక్టులు, రైల్వేలు, విద్యుచ్ఛక్తి మొదలైన అవస్థాపన సౌకర్యాలు పెరుగుతాయి. సాంకేతిక ప్రగతి జరుగుతుంది.

7) ఆర్థిక వ్యవస్థ బలపడుటకు:

  • భవిష్యత్ ఆర్థిక పురోగతికి అవసరమైన అవస్థాపనా సౌకర్యాలు పెరగటానికి పరిశ్రమలు దోహదం చేస్తాయి.
  • వ్యవసాయరంగ అభివృద్ధికి అవసరమైన వ్యవసాయ పనిముట్లు, రసాయనిక ఎరువులు, క్రిమి సంహారక మందులు, రవాణా సదుపాయాలు వృద్ధి చెందుట ద్వారా ఉత్పత్తి పెరుగును.
  • బహుముఖంగా ఆర్థిక వ్యవస్థ విస్తృతం చేయుటకు పారిశ్రామికీకరణ అవసరము.
  • దేశ ఆర్థిక భద్రతకు పారిశ్రామికీకరణ ముఖ్యము. దేశ రక్షణకు అవసరమైన యుద్ధ సామాగ్రిని ఉత్పత్తి చేయుటలో స్వయం సమృద్ధిని సాధించుట అవసరం.

ప్రశ్న 2.
భారతదేశములో 1948 పారిశ్రామిక విధాన తీర్మానమును సమీక్షింపుము.
జవాబు:
1948 పారిశ్రామిక విధాన తీర్మానము: స్వాతంత్ర్యము పొందిన తరువాత త్వరిత పారిశ్రామికీకరణ 1948వ సంవత్సరం ఏప్రిల్ 6వ తేదీన భారత ప్రభుత్వము సమగ్ర, క్రమబద్ధమైన మొట్టమొదటి పారిశ్రామిక విధాన తీర్మానాన్ని ప్రకటించింది. ఈ తీర్మానము భారతదేశానికి మిశ్రమ ఆర్థికవ్యవస్థ అవసరముందని గుర్తించింది. ఇందులో పబ్లిక్ రంగము యొక్క ప్రయివేటు రంగము యొక్క పాత్రలు స్పష్టీకరించడమైనది.

లక్ష్యాలు:

  1. న్యాయమైన, సమాన అవకాశాలు అందరికీ కల్పించబడడం.
  2. దేశములో అంతర్గతముగా ఉన్న వనరులను పూర్తిగా వినియోగములోకి తెచ్చి, ప్రజల జీవన ప్రమాణాన్ని అభివృద్ధి చేయడం.
  3. పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా త్వరగా ఉత్పత్తి పెంచడం.
  4. సామాజిక సేవలో అందరికీ ఉద్యోగ అవకాశాలను కల్పించడము.

ఈ లక్ష్యాలను దృష్టిలో ఉంచుకొని 1948 పారిశ్రామిక విధానము పరిశ్రమలను నాలుగు విధాలుగా విభజించటం జరిగింది.
I. ప్రభుత్వ ఏకస్వామ్యం గల పరిశ్రమలు: ఈ జాబితాలో 3 రకాల పరిశ్రమలు ఉన్నాయి. అవి: 1) దేశరక్షణ, తత్సంబంధ పరిశ్రమలు, ఆయుధ సామాగ్రి, ఆయుధాల ఉత్పత్తి, 2) అణుశక్తి ఉత్పత్తి, నియంత్రణ,. 3) రైల్వే రాకపోకలు. వీటి నిర్వహణ, యాజమాన్యము ప్రభుత్వానిదే.

II. క్రమేణ ప్రభుత్వ యాజమాన్యం క్రిందికి వచ్చే పరిశ్రమలు: ఈ జాబితాలో బొగ్గు, ఇనుము, ఉక్కు, విమానాల ఉత్పత్తి, నౌకా నిర్మాణము, టెలిఫోన్, టెలిగ్రాఫ్, ఖనిజపు నూనెలు. ఇవి మౌళిక, కీలక పరిశ్రమలు.

AP Inter 2nd Year Economics Study Material Chapter 5 పారిశ్రామిక రంగం

III. ప్రైవేటు రంగానికి వదిలిపెట్టిన పరిశ్రమలు: పరిశ్రమలు ప్రైవేట్ రంగములో ఉన్నను, ప్రభుత్వ నియంత్రణకు, నిబంధనలకు లోబడిన పరిశ్రమలు. ఇందులో కొన్ని మౌళికమైన పరిశ్రమలు ఉన్నాయి. మోటారు కార్లు, ట్రాక్టర్లు, ఎలక్ట్రానిక్స్, ఇంజనీరింగ్, భారీ యంత్రసామాగ్రి, యంత్ర పనిముట్లు, ఎరువులు మొదలైనవి. వీటిని ప్రైవేట్ రంగము నిర్వహించినప్పటికీ వీటిలో ప్రభుత్వ నియంత్రణ, నిబంధనలకు లోబడి ఉత్పత్తి జరుగుతుంది.

IV. పైన తెల్పిన పరిశ్రమలు మినహా మిగిలినవన్నీ ప్రయివేట్ రంగానికి వదిలివేయడం జరిగింది. వీటి పై ప్రభుత్వ సాధారణ అజమాయిషీ ఉంటుంది.

V. ఈ పారిశ్రామిక విధానములో కుటీర, చిన్నతరహా పరిశ్రమలు, భారీ పరిశ్రమలకు పరిపూరకంగా స్థాపించడానికి, అవి సహకార సంఘాల ఆధ్వర్యంలో స్థాపించవచ్చునని తెలియజేసినది. సంస్థలలో శ్రామికులకు వాటా పెంచి, వారిని భాగస్వాములుగా చేయాలని చెప్పింది.

VI. ఈ పారిశ్రామిక విధానంలో ముఖ్యంగా విదేశీ మూలధనం, సాంకేతిక పరిజ్ఞానం ఎంతో అవసరమని ప్రభుత్వము భావించింది. విదేశీ సాంకేతిక పరిజ్ఞానం, సాంకేతిక పద్ధతులు మనదేశ త్వరిత పారిశ్రామికీకరణకు అవసరమని ప్రభుత్వము గుర్తించినది. విదేశీ మూలధనంపై, దేశ సంక్షేమం, లాభాల దృష్ట్యా, ప్రభుత్వ నియమ నిబంధనలు ఉంటాయి.

ప్రశ్న 3.
1956 పారిశ్రామిక విధాన తీర్మానమును గురించి వివరింపుము.
జవాబు:
1956 పారిశ్రామిక విధాన తీర్మానము: మొదటి పంచవర్ష ప్రణాళికలో వ్యవసాయ రంగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినప్పటికీ అనుకున్న వృద్ధిరేటును భారతదేశం సాధించలేదు. అయితే 1948 తరువాతనే ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు గల రాజ్యాంగం రూపొందించటం, సామ్యవాద పద్ధతిలో సాంఘిక, ఆర్థిక మార్పులను తేవచ్చునని, పార్లమెంట్ భావించడం, అనుకూల ఉత్సాహపూరిత వాతావరణములో రెండవ పంచవర్ష ప్రణాళికలో పారిశ్రామికీకరణ – భారీ, మౌళిక పరిశ్రమల స్థాపనకు కావలసిన ఏర్పాట్ల కోసం 1956 పారిశ్రామిక విధాన తీర్మానమును రూపొందించడం జరిగింది.

1956 పారిశ్రామిక విధాన తీర్మానము లక్ష్యాలు:

  1. ఆర్థికాభివృద్ధిని శీఘ్రతరము చేయడానికి, పారిశ్రామికీకరణను త్వరితం చేయడం.
  2. భారీ యంత్ర నిర్మాణ పరిశ్రమలను అభివృద్ధి పరచడము.
  3. విశాలమైన, అభివృద్ధికరమైన సహకార రంగాన్ని నిర్మించుట.
  4. ప్రజల ఆదాయ సంపదలలో ఉన్న వ్యత్యాసాలను తొలగించడము.
  5. ప్రాంతీయ అసమానతలను తొలగించడము.
  6. సామ్యవాదరీతి సమాజ స్థాపన.
  7. ఏకస్వామ్యాలను నిరోధించడం, ఆర్థికశక్తి కేంద్రీకృతము కావటాన్ని నిలుపుదల చేయటము, దాన్ని చిన్న ఉత్పత్తిదారులకు వికేంద్రీకరించటం.

1956 పారిశ్రామిక విధాన తీర్మానము ప్రధాన అంశాలు: ఈ పారిశ్రామిక విధాన తీర్మానం ప్రకారం పరిశ్రమలను 3 రకాలుగా వర్గీకరించారు.
ఎ) గ్రూపు పరిశ్రమలు: ఈ వర్గములో 17 పరిశ్రమలున్నాయి. భవిష్యత్తులో ఈ పరిశ్రమల అభివృద్ధికి ప్రభుత్వమే బాధ్యత వహిస్తుంది. ఈ వర్గ పరిశ్రమలైన ఇనుము, ఉక్కు, అణుశక్తి, భారీ యంత్రాలు, బొగ్గు, ఖనిజపు నూనెలు, రైల్వే, రవాణా, టెలిఫోన్, టెలిగ్రాఫ్, విద్యుచ్ఛక్తి మొదలగునవి.

బి) గ్రూపు పరిశ్రమలు: ఈ వర్గములో 12 పరిశ్రమలు ఉన్నాయి. ఈ వర్గములోని పరిశ్రమలను, ఎక్కువగా కొత్త సంస్థలను ప్రభుత్వమే స్థాపించి తన భాగస్వామ్యాన్ని పెంచుకోవచ్చు. అయితే ప్రైవేటు రంగము ఇందులోని పరిశ్రమలను స్థాపించడానికి నిరాకరించడము జరగదు.

సి) గ్రూపు పరిశ్రమలు: పై రెండు వర్గాల్లో పేర్కొనబడని పరిశ్రమలు’ సి వర్గములో ఉంటాయి. వీటిని ప్రైవేట్ రంగము చొరవకు, సాహసానికి వదిలి పెట్టడము జరిగినది.

డి) ప్రభుత్వ, ప్రైవేటు రంగాలు: ఈ తీర్మానము ప్రకారం ప్రభుత్వ, ప్రైవేటు రంగాలు పరస్పరము సహకరించుకుంటాయి. అయితే ప్రభుత్వము ఏ రంగములోనైనా సంస్థలను స్థాపించవచ్చును. అలాగే ‘ఎ’ వర్గము మరియు ‘బి’ వర్గములో గల కొన్నింటిని మినహాయించి మిగిలిన ఏ ఇతర పరిశ్రమలలోనైనా ప్రయివేట్ రంగాన్ని అనుమతించవచ్చును.

ఇ) కుటీర మరియు చిన్నతరహా పరిశ్రమలు: కుటీర, చిన్నతరహా పరిశ్రమల ప్రాముఖ్యతను గుర్తించి, వీటిని ప్రోత్సహించడానికిగాను పెద్ద పరిశ్రమల ఉత్పత్తులపై పరిమితి విధించడం, విచక్షణాత్మక పన్నుల విధానాన్ని అనుసరించడం, సబ్సిడీలను ఇవ్వడము, ఆధునికీకరణకు తోడ్పడడం మొదలైన చర్యల ద్వారా వీటిని ప్రోత్సహించవలెను.

AP Inter 2nd Year Economics Study Material Chapter 5 పారిశ్రామిక రంగం

ఎఫ్) ప్రాంతీయ అసమానతలను తగ్గించడం: దేశంలోని అన్ని ప్రాంతాల్లో అవస్థాపనా సౌకర్యాలను కల్పించడం ద్వారా, వికేంద్రీకరణకు అవకాశము కల్పిస్తూ, ప్రాంతీయ అసమాతలను తగ్గించాలని ఈ తీర్మానములో పేర్కొనడం జరిగింది.

జి) కార్మిక పాత్ర: శ్రామికులు పనిచేసే స్థలములో సౌకర్యాల కల్పన, వారి సామర్థ్యాన్ని పెంచవలసిన ఆవశ్యకతను ఈ తీర్మానము గుర్తించింది. యాజమాన్యం, శ్రామికుల మధ్య ముఖ్య సంప్రదింపుల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సూచించింది.

హెచ్) విదేశీ పెట్టుబడి: పారిశ్రామిక తీర్మానము వేగవంతము చేయడానికి భారత సాంకేతిక నిపుణులకు, నిర్వాహకులకు శిక్షణను ఇవ్వడానికి విదేశీ మూలధనాన్ని వినియోగించాలని ఈ తీర్మానము సూచించడము జరిగింది. అయితే పరిశ్రమల యాజమాన్యం, నియంత్రణ భారతీయుల చేతులలోనే ఉండాలని స్పష్టం చేసింది.

1956 పారిశ్రామిక తీర్మానాన్ని ఆర్థిక రాజ్యంగా భావించవచ్చును. అయితే సామ్యవాదరీతి సమాజస్థాపన, మిశ్రమ ఆర్థికవ్యవస్థ నిర్మాణం, ఈ తీర్మానంలో ప్రధానంగా చోటుచేసుకున్నాయి. అయినప్పటికీ ప్రభుత్వరంగ విస్తరణకు ఈ తీర్మానము ఎక్కువ ప్రాముఖ్యతను కల్పించింది.

ప్రశ్న 4.
భారతదేశములో 1991 నూతన పారిశ్రామిక విధాన తీర్మానమును విమర్శనాత్మకంగా పరిశీలింపుము. [Mar ’16]
జవాబు:
1991 నూతన పారిశ్రామిక విధానము: దేశ ఆర్థిక వ్యవస్థలో పారిశ్రామిక, ఇతర రంగాలలో ఉన్న స్తబ్దతను తొలగించడానికి, ఆర్థిక వ్యవస్థను చలనస్థితికి తీసుకొనివచ్చి అభివృద్ధి పథములో నడిపించేందుకు ఒక నూతన పారిశ్రామిక విధానము అవసరము అయింది. దీనిని పూరించుటకు 1991 పారిశ్రామిక విధానము అమలులోకి వచ్చింది.

లక్ష్యాలు:

  1. అప్పటికే అనుభవిస్తున్న ప్రయోజనాల ఆధారంగా పారిశ్రామిక వ్యవస్థను నిర్మించటం.
  2. వ్యవస్థలోని బలహీనతలు, వక్రీకరణలు పారిశ్రామిక వృద్ధికి ఆటంకాన్ని కలిగించకుండా సరిదిద్దుట.
  3. పరిశ్రమలు తమ ఉత్పాదకశక్తిని పెంచి, లాభదాయకమైన ఉపాధి అవకాశాలను పెంచడము.
  4. సాధించిన (పొందిన) సాంకేతిక విజ్ఞానము ప్రపంచస్థాయి పోటీకి దీటుగా ఉండటం.
  5. భారత ఆర్థికరంగాన్ని ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో సమైక్యపరచటం.

1991 పారిశ్రామిక విధాన తీర్మాన ప్రధాన అంశాలు: 1991 నూతన పారిశ్రామిక విధాన తీర్మానములోని ప్రధానాంశాలను ఈ క్రింది విధముగా తెలియజేయవచ్చు.
1) డిలైసెన్సింగ్: దీని ప్రకారం పరిశ్రమల స్థాపన, నిర్వహణలో లైసెన్సు పొందవలసిన అవసరము లేదు. తప్పనిసరిగా లైసెన్సు పొందవలసిన పరిశ్రమలకూ పరిధిని తగ్గించారు. అలాగే వినియోగ సంబంధమైన వస్తువులు, చిన్నతరహా సంస్థలు ఉత్పత్తి చేసే వివిధ ఉత్పతులకు లైసెన్సింగ్ అవసరము లేదు. అయితే కొన్ని ముఖ్యమైన పరిశ్రమలకు లైసెన్సు అవసరము. ఉదా: బొగ్గు, పెట్రోలియం మొదలగునవి.

2) ప్రభుత్వ రంగమునకు ప్రత్యేక వసతి: ముఖ్యమైన, వ్యూహాత్మకమైన పరిశ్రమ రంగాలైన వాటికి ప్రత్యేక వసతి అవసరం. ఉదా: రక్షణ పరికరాలు, అణుశక్తి, ఖనిజపు నూనెలు, రైల్వే రవాణా మొదలగునవి. అయితే ప్రభుత్వ రంగ పరిధి కుదింపబడినది. ఈ చర్య ద్వారా ప్రైవేటు రంగ పరిధిని విస్తృత పరచడము జరిగినది.

3) మూలధన వస్తువుల దిగుమతి: దిగుమతుల వల్ల విదేశీ మారకద్రవ్యం కోల్పోవడం జరుగును. కావున దిగుమతుల మీద ప్రభుత్వం ఆంక్షలు విధిస్తుంది. మూలధన వస్తువులను దిగుమతి చేసుకోవడానికి ప్రభుత్వం వెంటనే ఆమోదించడం జరుగును.

4) స్థల విధానము: 10 లక్షల కంటే తక్కువ జనాభా ఉన్న నగరాలలో పరిశ్రమలు ఎక్కడైనా స్థాపించుకొనవచ్చును. అయితే 10 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న నగరాలలో కాలుష్యము కలిగించే పరిశ్రమలు స్థాపించుటకు నగరమునకు 25 కిలోమీటర్ల వెలుపలకు స్థాపించవలెను. పరిశ్రమల కాలుష్య నివారణకు అవసరమైన చర్యలను తప్పనిసరిగా తీసుకొనవలెను.

5) నిలుపుదల చేసి తిరిగి మరలా ఉత్పత్తిని కొనసాగించే గుణము గల పరిశ్రమలు: ఇలాంటి పరిశ్రమల విషయంలో చట్టపరంగా విత్త సంస్థల నుంచి ఋణాలను పొంది కొత్త ప్రాజెక్టులు చేపట్టడానికి, దీర్ఘకాలిక నిబంధనలు వర్తిస్తాయి. అయితే ఇలాంటి పరిశ్రమల యాజమాన్యానికి వాటాలు అవసరము.

AP Inter 2nd Year Economics Study Material Chapter 5 పారిశ్రామిక రంగం

6) విదేశీ పెట్టుబడి విధానము: విదేశీ మారక ద్రవ్యార్జన దృష్ట్యా విదేశీ పెట్టుబడులు అధిక ప్రాధాన్యత గల రంగాలలో అవసరమని ప్రభుత్వం భావిస్తే ఆ రంగాలలో మూలధన పెట్టుబడులు 51% వరకు అనుమతిస్తుంది. ఈ పెట్టుబడికి సంబంధించిన లావాదేవీలను చర్చించేందుకు ప్రత్యేక అధికారాలు ఉన్న బోర్డును ఏర్పాటు చేస్తారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి కొన్ని రంగాలకు మాత్రమే నిషేధించడమైనది. అవి:

  1. చిల్లర వ్యాపారము
  2. అణుశక్తి
  3. లాటరీ వ్యాపారము
  4. జూదము మరియు పందెము.

7) విదేశీ సాంకేతిక ఒప్పందాలు: 1991 తీర్మానం ప్రకారం విదేశీ సాంకేతిక విజ్ఞానం బదిలీ కోసం, ఒప్పందాల చెల్లింపు విషయంలో అధిక ప్రాధాన్యత గల పరిశ్రమలకు సంబంధించి ఒక కోటి రూపాయల వరకు, దేశీయ అమ్మకాలపై రాయల్టీ 5 శాతము వరకు, ఎగుమతులపై రాయల్టీ 8 శాతము వరకు రిజర్వుబ్యాంకు తక్షణమే ఆమోదిస్తుంది.

8) ప్రభుత్వ రంగ విధానము: ప్రభుత్వ రంగానికి దేశ వ్యాప్తంగా ఉన్న మొత్తము పరిశ్రమలపై దృష్టిని పెట్టక, వాటికి ప్రత్యేకంగా కేటాయించిన పరిశ్రమలపై మాత్రమే అధికారము ఉంటుంది. నష్టపోయిన పరిశ్రమలను ప్రభుత్వము స్వాధీనము చేసుకుంటుంది. వీటి పునర్ నిర్మాణము కోసము పారిశ్రామిక విత్త పునర్నిర్మాణ మండలి (BIFR) అను సంస్థను ఏర్పాటు చేసింది.

9) MRTP చట్టము: 1991 తీర్మానం ప్రకారం MRTP పరిధిలోని సంస్థలు, కొత్త సంస్థల స్థాపనకు, ఉత్పత్తిని పెంచటానికి (సంస్థ విస్తరణకు), వేరొక సంస్థలో విలీనం కావటానికి ఎటువంటి అనుమతి పొందనవసరం లేదు. ఆర్థిక స్థోమత కేంద్రీకరణను, ఏకస్వామ్యాలను, అక్రమ వ్యాపార పద్ధతులను సమర్థవంతంగా నియంత్రించటానికి ఈ | తీర్మానం MRTP చట్టానికి సవరణలు ప్రతిపాదించినది. ఈ చట్టం పరిధిలోకి వచ్చే సంస్థల విషయంలో గరిష్ట ఆస్తుల పరిమితిని (1985 నుంచి ఈ పరిమితి గౌ 100 కోట్లు) తొలగించుట.

1991 పారిశ్రామిక విధానము వల్ల భారత పారిశ్రామిక అభివృద్ధి ఆశించిన రేటులో పొందటానికి మార్గము ఏర్పడింది. అయితే పరిశ్రమల లైసెన్సింగ్, విదేశీ సహాయము, పరిజ్ఞానము, ఉపయోగము, MRTP చట్ట సవరణ మొదలైన చర్యల ద్వారా ప్రైవేట్ రంగం అభివృద్ధి చెందినది.

ప్రశ్న 5.
భారతదేశ జాతీయ తయారీ విధానమును గురించి వ్రాయుము.
జవాబు:
భారత ప్రభుత్వము – జాతీయ తయారీ విధానము: వ్యాపార నియంత్రణలను సడలిస్తూ దేశ ప్రయోజనాలను బలహీనపరచని విధంగా భారత జాతీయ తయారీ విధానాన్ని ప్రకటించడమైంది. తయారీ రంగాన్ని ప్రోత్సహించినట్లే సూక్ష్మ, చిన్నతరహా, మాధ్యమిక పరిశ్రమల ప్రాముఖ్యతను గుర్తించి ప్రోత్సహించుటకు సంకల్పించింది. సాంకేతికతను మెరుగుపరచుట, వాతావరణ పరిరక్షణ, స్నేహపూర్వక సాంకేతికత, పెట్టుబడి వాటాలలో ప్రభుత్వ జోక్యం ఉంటుంది. ప్రైవేటు రంగానికి కోశపరమైన ప్రోత్సాహకాల్ని కల్పించి, యువత ఎక్కువ ఉద్యోగాలను పొందే విధంగా నైపుణ్యాలను అభివృద్ధి పరచుట ఈ తయారీ విధానము యొక్క లక్ష్యము. వ్యవసాయమునకు ఉపయోగపడని భూములలో జాతీయ పెట్టుబడి మరియు తయారీ జోన్లను ఏర్పాటు చేయుట ఈ విధానము లక్ష్యము.

జాతీయ తయారీ విధానము – లక్ష్యాలు:

  1. తయారీ రంగంలో 12 నుండి 14 శాతము మాధ్యమిక వృద్ధిరేటును సాధించుట.
  2. స్థూల జాతీయోత్పత్తిలో ప్రస్తుతము 16 శాతముగా ఉన్న తయారీ రంగపు వాటాను 2022 నాటికి 25
    శాతమునకు పెంచుట.
  3. తయారీ రంగంలో 2012 నాటికి 100 మిలియన్ల అదనపు ఉద్యోగాల కల్పన.
  4. తయారీ రంగంలో ఉపాధి అవకాశములను అందుకొనే విధంగా గ్రామీణ వలసదారులకు మరియు పట్టణ పేదరికానికి సరిపడినన్ని నైపుణ్యాలను కల్పించుట.
  5. ప్రపంచ పోటీని తట్టుకొనే విధంగా భారత తయారీ విధానాన్ని అభివృద్ధి పరచుట.
  6. తయారీ రంగంలో దేశీయ ఉత్పత్తి విలువలు మరియు సాంకేతిక పరిధిని పెంపొందించుట. దేశ జనాభాలో 60 శాతము మంది శ్రమైక జీవన లక్షణములను కలిగిన యవ్వనదేశము భారతదేశము. ఇప్పుడున్న శ్రామిక జనాభాకు రాబోయే దశాబ్ది కాలంలో 220 మిలియన్ల అదనపు శ్రామిక సప్లయ్ ఉండగలదని అంచనా. వీరిలో సగం మందికైనా లాభసాటి ఉద్యోగితను కల్పించునట్లు తయారీ రంగమును అభివృద్ధిపరచాలి.

AP Inter 2nd Year Economics Study Material Chapter 5 పారిశ్రామిక రంగం

ప్రశ్న 6.
భారతదేశ పెట్టుబడుల ఉపసంహరణ విధానమును వివరింపుము.
జవాబు:
పెట్టుబడుల ఉపసంహరణ: ఉత్పాదక కార్యకలాపాలను ప్రభుత్వ రంగం నుంచి ప్రైవేటు రంగానికి బదిలీచేసే విధానమే ప్రైవేటీకరణ. ప్రభుత్వ రంగం నుంచి పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించడం జరుగును. నూతన ఆర్థిక విధానములో భాగంగా ప్రభుత్వము జూలై 1991 నుంచి పెట్టుబడుల ఉపసంహరణ విధానాన్ని అనుసరిస్తున్నది. ప్రభుత్వ రంగ సంస్థలలో ఉత్పాదకత అల్పంగా ఉండుట. ఈ సంస్థలలో |నిర్వహణపరమైన లోపాలు చోటుచేసుకోవడం తదితరమైన అంశాలు డిజిన్వెస్ట్మెంట్కు కారణం.

“వనరుల పెంపుదలకు మరియు విస్తృత ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించుటకు, ప్రభుత్వ రంగంలోని కొంత వాటాను మ్యూచువల్ ఫండ్స్కు, విత్త సంస్థలకు, అసాధారణ ప్రజలకు, శ్రామికులకు ఇవ్వటాన్ని “పెట్టుబడుల ఉపసంహరణ అంటారు.

పెట్టుబడి ఉపసంహరణ విధాన లక్షణాలు:

  1. ప్రభుత్వ రంగ సంస్థలలో కొంత భాగము వాటాల రూపములో పొందే హక్కు ప్రజలకు కల్పించుట.
  2. ప్రభుత్వ రంగ సంస్థలు జాతీయ సంపద కాబట్టి ఆ సంపద ప్రజలకే చెందుతాయి.
  3. ఈ ప్రక్రియలో కనీసము 51 శాతపు వాటా ప్రభుత్వ ఆధీనములో ఉంటుంది మరియు వాటి నిర్వహణ, నియంత్రణ ప్రభుత్వానిది.

పెట్టుబడి ఉపసంహరణ విధానము: నవంబర్ 5, 2009న లాభాలు ఆర్జించు ప్రభుత్వ కంపెనీలకు సంబంధించి కార్యాచరణ ప్రణాళికను ప్రభుత్వము ప్రకటించింది.

  1. ప్రభుత్వము గాని, కేంద్ర ప్రభుత్వ యాజమాన్య సంస్థలు గాని “వాటాల అమ్మకము లేదా తదుపరి వాటాల జారీ” పద్దతిని లాభదాయ ప్రభుత్వ రంగ సంస్థలలో కల్పించుట.
  2. నష్టాలలో లేకుండా వరుసగా మూడు సంవత్సరములు నికర లాభాన్ని ఆర్జిస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలను జాబితాలోని సంస్థలుగా చేర్చుట.
  3. పెట్టుబడుల ఉపసంహరణ సరయిన ప్రభుత్వరంగ సంస్థలలో కనీసము 51 శాతము పెట్టుబడులను ప్రభుత్వమే ఉంచుకోవాలి. తద్వారా సంస్థలపై యాజమాన్య నియంత్రణ ప్రభుత్వానిదే.
  4. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలలో అవసరమైన మూలధనాన్ని దృష్టిలో ఉంచుకొని “తదుపరి మూలధన సేకరణ” పద్ధతిని ప్రోత్సహించి, క్రమేణా ఆ సంస్థల అభివృద్ధిని సాధించుట.

2004-05వ సంవత్సరము నుంచి భారీ ఎత్తున పెట్టుబడుల ఉపసంహరణ జరిగింది. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC) 2,684.07 కోట్లు, మారుతి ఉద్యోగ లిమిటెడ్ (MVL) (Not a CPSU) R 2277.62 కోట్లు, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (PGCIL) < 994.82 కోట్లు, ఆయిల్ ఇండియా లిమిటెడ్ శ్ 2247.05 కోట్లు (N.M.D.C) (National Mineral Development Corporation) లిమిటెడ్ 9930.40 కోట్లు, కోల్ ఇండియా లిమిటెడ్ 15,199 కోట్లు మరియు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ 1144.55 కోట్లు మరియు పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్ కోట్లు డిజిన్వెస్ట్మెంట్ ద్వారా 30-1-2015 నాటికి భారత ప్రభుత్వము 1,79,625.25 కోట్లు రాబట్టినది. ఈ మొత్తాన్ని సాంఘిక అవస్థాపన సౌకర్యాలకు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు ఖర్చు చేయడం జరుగును.

ప్రశ్న 7.
భారతదేశ ఆర్థికాభివృద్ధిలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి అవసరాన్ని వివరింపుము.
జవాబు:
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు: 1991 పారిశ్రామిక విధాన తీర్మానం విదేశీ పెట్టుబడిని ప్రోత్సహించింది. పరిశ్రమల ఆధునికీకరణకు, సాంకేతిక పరిజ్ఞానం పెంచటానికి, ఆర్థికాభివృద్ధికి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఋణపూరిత పద్ధతిలో ఆర్థిక వనరుల లభ్యతకు అవకాశం కల్పించును. భారతదేశంలో శ్రమ చౌకగా లభించడమే కాక, పన్ను మినహాయింపులు ఇవ్వడము, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను భారత ప్రభుత్వము ఆకర్షిస్తుంది. ఏ దేశంలో విదేశీ పెట్టుబడులకు అవకాశం ఉంటుందో అచ్చట సాంకేతిక అభివృద్ధిని పొందటానికి, ఉపాధిని పెంచుటకు అవకాశము ఏర్పడును.

AP Inter 2nd Year Economics Study Material Chapter 5 పారిశ్రామిక రంగం

భారతదేశములో నిరంతర విదేశీ పెట్టుబడులు వెల్లువలా వచ్చి అన్ని రంగాలకు విస్తరించుట భారతదేశంపై విదేశీ పెట్టుబడిదారులకు ఉన్న విశ్వాసాన్ని తెలియజేస్తున్నది. ఇటీవల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులపై ప్రభుత్వ విధానము మరియు అధిక వ్యాపార అవకాశాలు విదేశీ పెట్టుబడులు మనదేశంలోని విరివిగా వస్తున్నాయి. భారత ప్రభుత్వము విదేశీ పెట్టుబడులపై ఇటీవల నియంత్రణ తొలగించుట అన్ని రంగాలకు విదేశీ పెట్టుబడులు విస్తరించినవి. రక్షణ, ప్రభుత్వ రంగములోని ఇంధనశుద్ధి కర్మాగారాలు, టెలికామ్, విద్యుచ్ఛక్తి మార్పిడి, స్టాక్ ఎక్స్ఛేంజీస్, ఆటోమొబైల్ రంగము, మందుల కంపెనీలు, రసాయనాలు మొదలగు పరిశ్రమలలోనికీ విదేశీ పెట్టుబడులు విచ్చలవిడిగా వచ్చుట భారత సత్వర ఆర్థికాభివృద్ధికి తోడ్పడగలదు.

ప్రశ్న 8.
భారతదేశ ఆర్థికాభివృద్ధిలో ప్రత్యేక ఆర్థికమండళ్ళ పాత్రను విమర్శనాత్మకంగా పరిశీలింపుము.
జవాబు:
ప్రత్యేక ఆర్థికమండళ్ళు: భారత ప్రభుత్వము ఏప్రిల్ 2000 సంవత్సరమున ప్రత్యేక ఆర్థికమండళ్ళను ప్రకటించినది. ఈ విధానము త్వరిత ఆర్థికవృద్ధికి అవసరమైన అవస్థాపన సౌకర్యాలతో పాటు పన్ను రాయితీలు పొందుతూ కనీస నియంత్రణలకు లోబడి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మద్దతుతో ఏర్పాటు చేయబడినది. భారతదేశములో ప్రత్యేక ఆర్థికమండళ్ళను ఏర్పాటు చేస్తూ, మే నెల 2005లో చట్టమును రూపొందించి ఫిబ్రవరి 2006 నుంచి కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి.
వీటి లక్ష్యాలు:

  1. అదనపు ఆర్థిక కార్యకలాపాలను సృష్టించుట.
  2. వస్తు సేవల ఎగుమతులను పెంచుట.
  3. దేశీయ అంతర్జాతీయ పెట్టుబడులను ప్రోత్సహించుట.
  4. ఉద్యోగావకాశాలను కల్పించుట.
  5. అవస్థాపనా సౌకర్యాలను అభివృద్ధిపరచుట.

SEZ’s ప్రయోజనాలు: ప్రత్యేక ఆర్థిక నియంత్రణ మండళ్ళు ఎగుమతులను, ఉద్యోగితను, పెట్టుబడిని ఎక్కువగా పెంచుటకు కృషి చేస్తున్నాయి. ఆర్థిక సౌభాగ్యస్థితిని తీసుకొచ్చేవే ప్రత్యేక ఆర్థికమండళ్ళు. వీటి ప్రయోజనాలు కింద పేర్కొన్నాము.

  1. ఆర్థికవృద్ధి తీవ్రంగా పెరిగే శక్తినిచ్చుట.
  2. గ్రామీణ ప్రాంతంలో సంపదను సృష్టించుట.
  3. తయారీ మరియు ఇతర సేవల రంగంలో ఎక్కువ మందికి ఉపాధిని కల్పించడము.
  4. ప్రపంచ తయారీ సంస్థలను మరియు సాంకేతిక నైపుణ్యాలను ఆకర్షించుట.
  5. అంతర్గత, విదేశీ పెట్టుబడులు ప్రైవేట్ మరియు పబ్లిక్ రంగాలకు తీసుకెళ్ళడము.
  6. భారతదేశ సంస్థలను ప్రపంచ పోటీని తట్టుకొనే విధంగా తయారుచేయుట.
  7. గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణ ప్రాంతానికి వలసలు తగునట్లు దోహదం చేయుట.

ప్రత్యేక ఆర్థికమండళ్ళ ఉత్పత్తి ఉద్యోగితను పెంచి పారిశ్రామికీకరణకు తోడ్పడుచున్నవి.

ప్రశ్న 9.
భారతదేశములో పారిశ్రామికవృద్ధి వెనుకబాటుతనానికి వివిధ కారణాలను తెల్పండి.
జవాబు:
భారత పారిశ్రామిక రంగం వెనుకబడుటకు కారణాలు: భారతదేశము సుసంపన్నమైన సహజ వనరులు మరియు ఎక్కువ మంది శ్రామిక జనాభాను కలిగి ఉన్నను పారిశ్రామిక రంగం ఆశించిన ప్రగతిని సాధించలేదు. పదకొండు పంచవర్ష ప్రణాళికలు పూర్తయినా నిర్ణయించుకొన్న లక్ష్యాలను, సాధించిన ప్రగతికి ఎంతో తేడా ఉన్నది.
పారిశ్రామిక వెనుకబాటుకు కారణాలు
AP Inter 2nd Year Economics Study Material Chapter 5 పారిశ్రామిక రంగం 2
1) ఉత్పాదక సామర్థ్యాన్ని తక్కువగా వినియోగించుకోవడం: అనేక పారిశ్రామిక సంస్థలు తమ పూర్తి ఉత్పాదకతా సామర్థ్యాన్ని వినియోగించుకొనే స్థాయి లేదు. దీనికి ముడిసరుకు కొరత, తక్కువ సాంకేతిక పరిజ్ఞానము కారణాలు.

2) ప్రభుత్వ రంగ సంస్థల పనితీరు: సరళీకరణకు ముందు ప్రభుత్వ రంగ సంస్థల వృద్ధి గుర్తించదగిన స్థాయిలో ఉండేది. 1999-2000 సంవత్సరములో 10,302 కోట్ల రూపాయలుగా ఉన్న నష్టాలు 2011-12 నాటికి |27,602 కోట్ల రూపాయలకు పెరిగింది.

3) రాజకీయ కారణాలు: ఒక ప్రాంతము పరిశ్రమల స్థాపనకు అనుకూలముగాక పోయిన రాజకీయ కారణాల ప్రభావము చేత అచ్చటి పరిశ్రమలను స్థాపించవలసి వస్తున్నది. దీని వలన మూలధన వనరులు నిరుపయోగమగుచున్నవి.

AP Inter 2nd Year Economics Study Material Chapter 5 పారిశ్రామిక రంగం

4) అవస్థాపనా సౌకర్యాల కొరత: పారిశ్రామిక ప్రగతి వెనుకబడుటకు అవస్థాపనా సౌకర్యాలు కొరతగా ఉండుట లేదా వాటిని సమకూర్చుకోవడానికి ఎక్కువ వ్యయమగుట కారణము. వీటి కారణంగా ప్రపంచ మార్కెట్టులో భారతదేశ పారిశ్రామిక రంగము పోటీపడలేకున్నది.

5) లక్ష్యాలకు మరియు సాధించిన ప్రగతికి మధ్య వ్యత్యాసము: గడచిన ప్రణాళికా కాలములో లక్ష్యాలను సాధించడములో ప్రభుత్వము విఫలమయినాయి.

6) తక్షణ సవాళ్ళు: ప్రపంచ వ్యాపార సంస్థ (W.T.O.) ప్రారంభ సభ్యదేశమైన భారతదేశము దిగుమతులపై అన్ని పరిమాణాత్మక పరిమితులను ఉపసంహరించడమైనది. భారతదేశములో అనేక సంస్థలు మూతబడుటకు ఇదొక కారణము.

ప్రశ్న 10.
భారత ఆర్థిక వ్యవస్థలో చిన్నతరహా సంస్థల లాభనష్టాలను తెలపండి. [Mar ’17]
జవాబు:
నిర్వచనములు: చిన్నతరహా పరిశ్రమలనగానే వాటి పెట్టుబడి 5 లక్షలకు లోబడి ఉంటుంది. విద్యుచ్చక్తి వినియోగించుకుంటూ 50 కంటే తక్కువ శ్రామికులకు ఉపాధి కల్పించేవి ఒక వర్గం. విద్యుచ్ఛక్తిని వినియోగించకుండా 100 కంటే తక్కువ శ్రామికులకు ఉపాధి కల్పించేవి ఇంకొక వర్గం.

భారత ప్రభుత్వము అక్టోబర్ 2, 2006వ సంవత్సరమున, “సూక్ష్మ, చిన్నతరహా, మధ్యతరహా పరిశ్రమల చట్టము” ను అమలులోకి తెచ్చినది. ఈ చట్టము ప్రకారము “సూక్ష్మ లేదా లఘు పరిశ్రమల విషయంలో యాంత్రీకరణను ప్రవేశపెట్టిన పెట్టుబడి 25 లక్షల రూపాయల నుంచి 5 కోట్ల రూపాయల వరకు పెట్టుబడి కల్గినవి. మధ్యతరహా పరిశ్రమల పెట్టుబడి 5 నుంచి 10 కోట్ల రూపాయల మధ్య ఉండాలి. పెద్ద పరిశ్రమలలో పెట్టుబడి 10 నుంచి 100 కోట్ల రూపాయల వరకు ఉండవచ్చును. మెగా పరిశ్రమలలో పెట్టుబడి 100 కోట్ల రూపాయలకు పైగా ఉండవచ్చును.

లాభాలు:
1) పారిశ్రామిక ఉత్పత్తిలో వాటా: 2006-07 సంవత్సరం తర్వాత శీఘ్రగతిన వృద్ధి చెందుతున్న చిన్నతరహా | పరిశ్రమలు భారతదేశ స్థూలదేశీయోత్పత్తికి ఎక్కువ వాటాలను సమకూరుస్తున్నాయి. 2006-07 సంవత్సరమున సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థల మొత్తం ఉత్పత్తి 13,51,383 కోట్ల రూపాయలు ఉండగా, 2011-12 నాటికి ఈ మొత్తం 18,34,332 కోట్ల రూపాయలకు పెరిగినది. దీనిని బట్టి మొత్తం స్థూల దేశీయోత్పత్తిలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థల వాటా 8 శాతం, తయారీ రంగ ఉత్పత్తులలో ఈ సంస్థల వాటా 38 శాతముగా ఉన్నది,

2) ఉద్యోగ అవకాశాల కల్పన: చిన్న తరహా పరిశ్రమలు శ్రమసాంద్రతమైనవి. చిన్నతరహా సంస్థలో మూలధన శ్రామికుల నిష్పత్తి తక్కువ. పెద్ద పరిశ్రమలలో ఒక వ్యక్తికి ఉపాధి కల్పించే మూలధనంతో చిన్నతరహా పరిశ్రమలలో 8 మందికి ఉపాధిని కల్పించవచ్చును. వ్యవసాయ రంగం తర్వాత ఎక్కువ మందికి ఉపాధి కల్పించే రంగం కుటీర చిన్న తరహా పరిశ్రమ.

3) తక్కువ మూలధనము: చిన్న తరహా సంస్థలలో మూలధన ఉత్పత్తి నిష్పత్తి తక్కువ. ఇది భారీ పరిశ్రమలలో 5:4:1 వుండగా చిన్న పరిశ్రమలలో కేవలం 1: మాత్రమే. భారతదేశంలో మూలధనము కొరతగా ఉంది. తక్కువ మూలధనంతో హెచ్చు ఉత్పత్తిని సాధించడం ఈ పరిశ్రమలలో సాధ్యపడుతుంది.

4) మూలధన సేకరణ: చిన్న తరహా సంస్థలు మూలధనాన్ని సులభంగా సేకరించుకోగలదు. చిన్న తరహా పరిశ్రమల విస్తరణ గ్రామీణ ప్రజల పొదుపు మరియు పెట్టుబడులను ప్రోత్సహిస్తుంది.

5) నైపుణ్యమును వెలికితీయడం: చిన్న తరహా పరిశ్రమలకు అధునాతన నైపుణ్యాలు అవసరం లేదు. చిన్న | తరహా పరిశ్రమల నిర్వహణదారులకు పెద్ద పరిశ్రమలలో కొద్దిమందైనా పని చేయగలిగిన అనుభవాన్ని గడించే శిక్షణను చిన్న తరహా పరిశ్రమలు కల్పించును. చిన్న తరహా పరిశ్రమలు ప్రజల పొదుపు మరియు పెట్టుబడులను ప్రోత్సహిస్తుంది.

6) తక్కువ దిగుమతులు: తక్కువ మూలధన సాంద్రత చిన్న తరహా పరిశ్రమల లక్షణము. చిన్న తరహా పరిశ్రమలు విదేశీ మూలధనంపై, విదేశీ మారకద్రవ్యంపై ఆధారపడకుండా విదేశీ వ్యాపార చెల్లింపులలోని ఇబ్బందులను తొలగిస్తుంది.

7) పారిశ్రామికాభివృద్ధి వికేంద్రీకరణ: చిన్నతరహా పరిశ్రమల అభివృద్ధి అన్ని ప్రాంతాలకు విస్తరించి, వికేంద్రీకరణ ద్వారా సంతులిత ప్రాంతీయాభివృద్ధిని సాధించవచ్చు. ఈ సంస్థలు స్థానికంగా లభించే మానవశక్తి, ముడిసరుకులు మరియు మూలధనంపై ఆధారపడును.

8) సమాన పంపిణీ: చిన్నతరహా పరిశ్రమలు ఆర్జించు లాభాలు వాటిని నిర్వహించే అనేకమంది ఉద్యమదారులు పంచుకోవడం వలన ఆదాయ మరియు సంపద పంపిణీలో వికేంద్రీకరణ జరుగును.

9) ఎగుమతులు: విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించడంలో చిన్నతరహా పరిశ్రమలు ప్రముఖ స్థానాన్ని ఆక్రమిస్తుంది. 2006-07 సంవత్సరంలో మనదేశం నుంచి విదేశాలకు ఎగుమతి చేయు మొత్తం వస్తు సేవల విలువలో 31.1 శాతం చిన్నతరహా పరిశ్రమలదే.

10) అనారోగ్య పట్టణ సంస్కృతిని నివారించుట లఘు, చిన్నతరహా, మధ్యతరహా పరిశ్రమలను అభివృద్ధి పరచడం ద్వారా గ్రామీణ ప్రాంతం వారికి లాభసాటి ఉపాధి కల్పించబడును. దీని ఫలితం నిరుద్యోగ యువత పట్టణాలకు ఉపాధి కొరకు వలస వెళ్ళుటను నివారించవచ్చును.

11) శ్రామిక సంబంధాలు: చిన్నతరహా పరిశ్రమలలో శ్రామిక తగాదాలు ఎక్కువగా ఉండవు. ఈ సంస్థలలో పరిమితమైన శ్రామికులు పనిచేయుట వలన యాజమాన్యంతో సత్సంబంధాలు కలిగి ఉంటారు. సమ్మెలు, లాకౌట్ల ప్రభావం ఈ చిన్నతరహా పరిశ్రమలపై తక్కువగా ఉంటుంది.

AP Inter 2nd Year Economics Study Material Chapter 5 పారిశ్రామిక రంగం

నష్టాలు:
1) అసమర్థ మానవ వనరులు: ఎక్కువ మంది గ్రామీణ జనాభా నిరక్షరాస్యులు. వారిలో సాంకేతిక అవగాహన తక్కువ స్థాయిలో ఉంటుంది. ఆధునిక ఉత్పత్తి పద్ధతులను గూర్చి తెలిసి ఉండరు. ప్రభుత్వ పరపతి విధానాలపై అవగాహన ఉండదు.

2) పరపతి కొరత: చాలా చిన్నతరహా పరిశ్రమల నిర్వాహణకు అవసరమైన పరపతి లభ్యం కావడం లేదు. ఈ విషయంలో కుటీర పరిశ్రమలు మరీ దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. వారు మధ్యవర్తుల నుంచి హెచ్చు వడ్డీకి అప్పులు చేస్తారు. తయారయిన వస్తువులను వారికి తక్కువ ధరలకు అమ్ముతూ నష్టపోతున్నారు.

3) ముడిసరుకు సమస్య: చిన్నతరహా సంస్థలకు ఆర్థికస్థోమత లేనందున, బ్యాంకులు అవసరమైన పరపతిని సమకూర్చకపోవడం వల్ల ఈ సంస్థల యాజమాన్యం పెద్దతరహా ఉత్పత్తి సంస్థల లాగా ధర తక్కువగా ఉన్నప్పుడు ముడి పదార్థాలను భారీ స్థాయిలో కొనుగోలు చేయలేనందున తక్కువ మొత్తాలలో ముడిసరుకును కొనుగోలు చేయుట వలన, ధర విషయంలో వీరికి బేరమాడే శక్తి ఉండదు.

4) మార్కెటింగ్ సమస్యలు: చిన్నతరహా పరిశ్రమలకు చెందిన వస్తువులను విక్రయించడానికి సంఘటిత మార్కెటింగ్ వ్యవస్థ అందుబాటులో లేదు. కుటీర పరిశ్రమల వస్తు విక్రయానికి మధ్యవర్తుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడవలసి వస్తున్నది.

5) ఆధునిక యంత్రపరికరముల కొరత: చిన్న పరిశ్రమలలో వాడుతున్న యంత్రాలు పురాతనమైనవి. వాటి ఆధునికీకరణకు నూతన పరికరములను ప్రవేశపెట్టుటకు పెట్టుబడి కొరతగా ఉన్నది. దీని ఫలితంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని దిగుమతి చేసుకోలేకపోతున్నాయి. ఉత్పత్తి వ్యయం కూడా ఎక్కువే, తక్కువ నాణ్యత కలిగిన వస్తువులు తయారవుతున్నాయి.

6) విద్యుచ్ఛక్తి కొరత: చిన్నతరహా ఉత్పత్తి సంస్థలు ఎదుర్కొనే మొదటి సమస్య విద్యుచ్ఛక్తి. తరచూ విద్యుత్ కోతలతో చిన్నతరహా పరిశ్రమలు లక్ష్యానికి అనుగుణంగా ఉత్పత్తిని సాధించలేకున్నవి. గ్రామీణ ప్రాంతములో ముఖ్యంగా పట్టణ ప్రాంతాలతో పోల్చిన విద్యుత్ కోతల ఫలితంగా చిన్నతరహా కుటీర పరిశ్రమలు అభివృద్ధిలో వెనుకబడి ఉన్నాయి.

7) పురాతన సాంకేతికత కొరత: చిన్నతరహా పరిశ్రమల ఉత్పాదకత మరియు సాంకేతికత ప్రపంచస్థాయి పోటీని తట్టుకోలేకున్నది. సాంకేతికత అభివృద్ధి చెందనంతవరకు చిన్నతరహా పరిశ్రమలు ప్రపంచ ప్రజల అవసరాలను తీర్చుట కష్టము.

8) అధిక పన్నులు: చిన్నతరహా పరిశ్రమలు ముడిసరుకు కొనుగోలు చేయునప్పుడు భారీ ఎత్తున పన్ను చెల్లించవలసి వస్తున్నది. ముగింపు వస్తువులను మార్కెట్లో విక్రయించునపుడు కూడా పన్ను చెల్లించవలసి వస్తున్నందున వీటి ధరలు పెరిగి డిమాండ్ తగ్గుచున్నది.

9) సరళీకరణ – ప్రపంచీకరణ: 1991వ సంవత్సరము తర్వాత ప్రభుత్వం సరళీకృత విధానాలను అమలుపరచడంలో భాగంగా దిగుమతి సుంకాలను తగ్గించడము జరిగినది. అందువల్ల ప్రపంచ దేశాల నుంచి ముఖ్యంగా చైనా, జపాన్, కొరియాల నుండి అత్యధికంగా వస్తువులు దిగుమతి కావడంతో మనదేశ చిన్నతరహా ||పరిశ్రమలు వాటితో పోటీ పడలేకున్నవి.

ప్రశ్న 11.
వివిధ పంచవర్ష ప్రణాళికలలో భారత పారిశ్రామికాభివృద్ధి రేటును వివరింపుము.
జవాబు:
భారతదేశములో పంచవర్ష ప్రణాళికలు – పారిశ్రామికాభివృద్ధి: భారత ప్రభుత్వం ఆర్థికాభివృద్ధి విధానంలో భాగంగా పారిశ్రామిక అభివృద్ధికి కృషి చేస్తున్నది. పారిశ్రామికీకరణ ప్రాథమికరంగ అభివృద్ధికి, అవస్థాపనా సౌకర్యాల పెరుగుదలకు, పరిశోధన ద్వారా సాంకేతిక మార్పులకు దోహదము చేస్తుంది. భారతదేశము వినియోగ వస్తువుల ఉత్పత్తిలో స్వయం సమృద్ధిని సాధించినది. మూలధన వస్తువుల ఉత్పత్తి కూడా ఆశాజనకముగా ఉన్నది. గనులు, రసాయనాలు, పెట్రోకెమికల్స్, ఎరువులు, మూలధన వస్తువులు, ఇంజనీరింగ్ వస్తువులు, విద్యుచ్ఛక్తి, రవాణా, నిర్మాణ రంగములలో వృద్ధిని సాధించుట ద్వారా పారిశ్రామిక రంగం కొంతమేర ప్రగతిని సాధించినది.

రెండవ పంచవర్ష ప్రణాళిక ద్వారా పారిశ్రామిక స్వావలంబనకు అవసరమైన మౌలిక, కీలక మూలధన పరిశ్రమలు ప్రభుత్వ రంగానికి కేటాయించబడ్డాయి.

మొదటి ప్రణాళిక (1951-56): మొదటి పంచవర్ష ప్రణాళికలో ఆర్థిక వనరులు తక్కువగా కేటాయించుట, వ్యవసాయ రంగ తక్షణ అభివృద్ధిని ప్రోత్సహించుటకు, ఈ ప్రణాళికలో పారిశ్రామిక రంగానికి ఎక్కువ ప్రాధాన్యత కల్పించలేదు.

పారిశ్రామిక ఉత్పత్తి పెరుగుదల ఈ ప్రణాళికా కాలంలో 39 శాతము కాగా సాంవత్సరిక వృద్ధిరేటు 8 శాతముగా ఉన్నది.

రెండవ ప్రణాళిక (1956-61): ఈ ప్రణాళికలో పారిశ్రామికీకరణకు అధిక ప్రాధాన్యత ఇవ్వడమైనది. 1956 పారిశ్రామిక విధాన తీర్మానం ప్రభుత్వరంగ విస్తరణకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చింది. మహళనోబీస్ నమూనా ప్రకారం భారీ స్థాయిలో మౌలిక, మూలధన వస్తువుల పరిశ్రమలు నెలకొల్పడానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది.
పారిశ్రామిక ఉత్పత్తి సూచి సంఖ్య (ఆదాయము 1950-51 = 100) 1955-56 సంవత్సరమున ఉన్న 139 శాతము 1960-61 సంవత్సరము నాటికి 194 శాతానికి పెరిగినది. సాంవత్సరిక సగటు వృద్ధిరేటు 11 శాతముగా ఉన్నది. మూడవ ప్రణాళిక (1961-66): ఈ ప్రణాళికలో కూడా భారీ కీలక పరిశ్రమలకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. పరిశ్రమలు, వ్యవసాయ రంగాల మధ్య సంతులితను సాధించడానికి ప్రాధాన్యతను ఇవ్వడం జరిగింది. పారిశ్రామిక వ్యవసాయ సంతులనంతో సమగ్రాభివృద్ధి సాధించే లక్ష్యంగా 15 సంవత్సరాల దీర్ఘదర్శి ప్రణాళికకు ఈ ప్రణాళిక నాంది పలికింది.

నాల్గవ ప్రణాళిక (1969-74): మూడవ ప్రణాళికలో ఆరంభించిన పరిశ్రమలను పూర్తిచేయుట, ఎగుమతి ప్రోత్సాహక, దిగుమతి ప్రత్యామ్నాయ పరిశ్రమల స్థాపన శక్తిని పెంచడానికి ఈ ప్రణాళిక నిర్ణయించినది.

AP Inter 2nd Year Economics Study Material Chapter 5 పారిశ్రామిక రంగం

సాంవత్సరిక పారిశ్రామిక వృద్ధిరేటును ఈ ప్రణాళికలో 8 శాతము లక్ష్యముగా నిర్ణయించుకోగా సాధించినది కేవలం 5 శాతము మాత్రమే.

ఐదవ ప్రణాళిక (1974-79): స్వావలంబన, సామాజిక న్యాయంతో కూడిన వృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా ఈ ప్రణాళిక ప్రాధాన్యత నిచ్చినది. ఈ ప్రణాళికలో ప్రభుత్వరంగ వాటా 9,700 కోట్ల రూపాయలు. ఈ ప్రణాళిక సత్వర మౌలిక పరిశ్రమల అభివృద్ధికి నిర్ణయించినది. సామాన్య ప్రజలకు అవసర వస్తువులు సరిపడా ఉత్పత్తి చేయాలని నిర్ణయించినది. పారిశ్రామికంగా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రాధాన్యతనిచ్చుట జరిగినది.

ఆరవ ప్రణాళిక (1980-85): అభిలషణీయమైన ఉత్పత్తి స్థాయి కంటే తక్కువ ఉత్పత్తి చేయడం ద్వారా పరిశ్రమల ఉత్పత్తి వ్యయాలు పెరుగుతున్నాయని, ప్రభుత్వ రంగ అభివృద్ధికి అవసరమైన వనరులను సమకూర్చుకోలేక పోతుందని, ప్రాంతీయ వ్యత్యాసాలు పెరిగాయని, వెనుకబడిన ప్రాంతాలు నిర్లక్ష్యము చేయబడ్డాయని, ఆరవ పంచవర్ష ప్రణాళిక పేర్కొన్నది. దీనిని సరిదిద్దుటకు ప్రభుత్వ రంగానికి ఈ ప్రణాళికలో 23,000 కోట్ల రూపాయలు కేటాయించిరి. ఈ ప్రణాళిక. 5.45 శాతము వృద్ధిరేటును సాధించినది.

ఏడవ ప్రణాళిక (1985-90): ఏడవ ప్రణాళిక మార్గదర్శక సూత్రాలైన సామాజిక న్యాయంతో కూడిన అభివృద్ధి, ఉత్పాదక పెరుగుదలకు అనుగుణంగా ఈ ప్రణాళిక పారిశ్రామిక రంగానికి లక్ష్యాలను నిర్దేశించినది. 7వ ప్రణాళిక లక్ష్యంగా నిర్ణయించుకొన్న 8.5 శాతము వృద్ధిని సాధించడమైనది. నూతన ఆర్థిక విధానము మరియు అవస్థాపనా సౌకర్యాల కొరత లేకుండుట వలన ఇది సాధ్యమైనది.

ఎనిమిదవ ప్రణాళిక (1992-97): ఆర్థిక సంస్కరణల నేపథ్యంలో ఎనిమిదవ ప్రణాళిక ప్రారంభించడం జరిగింది. ప్రభుత్వ రంగాల వైఫల్యంతో అనగా ప్రభుత్వ రంగాలు ఎక్కువ నష్టాలతో, ఆశించిన పారిశ్రామిక ప్రగతికి దోహదము చేయడములేదనే నమ్మిక బలపడి ప్రైవేటు రంగమునకు ప్రభుత్వము ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వడం జరిగినది. ఎనిమిదవ ప్రణాళిక పారిశ్రామిక ఉత్పత్తి వార్షిక వృద్ధి లక్ష్యం 7.4 శాతము కాగా వాస్తవిక వృద్ధిరేటు 7.3 శాతముగా ఉన్నది.

తొమ్మిదవ ప్రణాళిక (1997-2002): ఈ ప్రణాళిక ప్రభుత్వ రంగంలోను, ప్రైవేటు రంగంలోను నాణ్యమైన అవస్థాపనా సౌకర్యాలను పెంచడం కొరకు నిశ్చయించినది. దేశం పెట్రోలియం ఉత్పత్తులను విపరీతంగా దిగుమతి చేసుకుంటున్న దృష్ట్యా, ఈ ప్రణాళికా కాలంలో వీటి అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యతనిచ్చారు.

9వ ప్రణాళిక పారిశ్రామిక వృద్ధిరేటు 8 శాతము లక్ష్యంగా నిర్ణయించగా వాస్తవంగా సాధించినది 5 శాతము మాత్రమే. దీనికి ముఖ్య కారణము ప్రపంచవ్యాప్తంగా సాధించిన తక్కువ వృద్ధిరేటు.

పదవ ప్రణాళిక (2002-07): తొమ్మిదవ ప్రణాళికలో ప్రైవేటు రంగం కార్యకలాపాల విస్తరణకు అధిక అవకాశం ఇచ్చినందున ప్రభుత్వం రంగం కేటాయింపులు తగ్గించడం జరిగింది. పదవ పంచవర్ష ప్రణాళికా కాలంలో వార్షిక వృద్ధిరేటు పారిశ్రామిక రంగంలో 8.9 శాతము.

పదకొండవ ప్రణాళిక (2007-12): ఈ ప్రణాళికా కాలంలో పారిశ్రామిక వృద్ధిరేటు 10 నుంచి 11 శాతము ఉండాలని లక్ష్యంగా నిర్ణయించింది.

పన్నెండవ ప్రణాళిక (2012-17): రాబోవు 5 సంవత్సరాలలో మొత్తము పెట్టుబడి 50 లక్షల కోట్ల రూపాయలు. ||ప్రైవేటు రంగము 25 లక్షల కోట్ల పెట్టుబడి ఆశిస్తున్నది.
12వ ప్రణాళికలో 9.5 శాతము వృద్ధిని పారిశ్రామిక రంగము సాధించాలన్న తయారీ రంగము, విద్యుచ్ఛక్తి, గ్యాస్ మరియు నీటి సప్లయ్ రంగాలలో ఎక్కువ వృద్ధిరేటును సాధింపవలసి ఉన్నది.

ప్రశ్న 12.
భారత పారిశ్రామిక విత్తానికి గల మూలాధారాలను వివరింపుము.
జవాబు:
పారిశ్రామిక సంస్థలు తమ కార్యకలాపాలను నిర్వహించడానికి అవసరమైన విత్తాన్ని పారిశ్రామిక మూలధన విత్తం అంటారు. సమర్థవంతమైన విత్త విధానం దేశ పారిశ్రామికాభివృద్ధికి దోహదం చేస్తుంది. ఆర్థిక వ్యవస్థలో సమర్థవంతమైన విత్త సంస్థలుంటే ఆ దేశంలో అధిక మొత్తంలో పొదుపు సమీకరించి, ఆ పొదుపు మొత్తాన్ని లాభసాటిగా ఉపయోగించుకునే పరిశ్రమలను అందించటం జరుగుతుంది. పరిశ్రమలకు కావలసిన మూలధనం 2 రకాలుగా ఉంటుంది. 1) దీర్ఘకాలిక మూలధనం 2) స్వల్పకాలిక మూలధనం.

1) దీర్ఘకాలిక విత్త సంస్థలు: దీర్ఘకాలిక మూలధన అవసరాలైన స్థిర మూలధనము భవన నిర్మాణాలకు యంత్రాలు – యంత్ర పరికరాల కొనుగోలుకు, అధునాతన సాంకేతిక పరిజ్ఞానం దిగుమతి మొదలైన వాటికై పరిశ్రమలకు ఋణ సహాయం అందించే ఋణ చెల్లింపు కాల వ్యవధి 5-7 సం॥ల నుండి 10-15 సం||లు లేదా ఆపైన ఉంటుంది. దీర్ఘకాలిక ద్రవ్య అవసరాలను మూలధన మార్కెట్ తీరుస్తుంది.

AP Inter 2nd Year Economics Study Material Chapter 5 పారిశ్రామిక రంగం

2) స్వల్పకాలిక విత్త సంస్థలు: స్వల్పకాలిక మూలధన అవసరమైన చర మూలధనం ముడి పదార్థాల కొనుగోలుకు, రవాణా ఖర్చులకు, శ్రామికులకు చెల్లించే వేతనాలకు, ఇంధన ఖర్చులకు, ప్రకటన ఖర్చులకు మొదలైన అవసరాల కోసం ఋణ సహాయం అందించే సంస్థలను స్వల్పకాలిక విత్త సంస్థలు అంటారు. ఈ సంస్థలిచ్చే స్వల్పకాలిక మూలధనాన్ని చర మూలధనాన్ని చర మూలధనం లేదా వర్కింగ్ కాపిటల్ అంటారు. సాధారణంగా స్వల్పకాలిక విత్త సంస్థల ఋణాలు చెల్లింపుల కాల వ్యవధి ఒక సంవత్సరం లేదా ఒక సంవత్సరానికి మించి ఉంటుంది. స్వల్పకాలిక విత్త అవసరాలను ద్రవ్య మార్కెట్ తీరుస్తుంది.

చర మూలధనం: చర మూలధనాన్ని తగిన హామీపై వాణిజ్య బ్యాంకులు పరిశ్రమలకు సమకూరుస్తాయి. స్థిర మూలధనం: స్థిర మూలధనాన్ని పారిశ్రామిక సంస్థలు అనేక మార్గాల ద్వారా సమీకరిస్తాయి. అవి:

  1. వాటాలు, ఋణపత్రాలు: పరిశ్రమలకు కావలసిన మూలధనంలో ఎక్కువ భాగం వాటాలు, మూలధన పత్రాలను ప్రత్యక్షంగా విక్రయించటం ద్వారా సమకూర్చుకుంటాయి.
  2. పబ్లిక్ డిపాజిట్లు: పరిశ్రమలు, ప్రజల నుండి డిపాజిట్లను తీసుకుంటుంది.
  3. ప్రైవేటు డిపాజిట్లు: మేనేజింగ్ ఏజెంట్లు, ప్రైవేట్ సంస్థలు మొదలగునవి సమకూర్చే ఋణాలను ప్రైవేట్ డిపాజిట్లు అంటారు.
  4. రిజర్వ్లు: పారిశ్రామిక సంస్థలు మూలధనపు రిజర్వ్ ు, తరుగుదల రిజర్వ్ ు మొదలగునవి ఏర్పరచుకొని వాటిని పెట్టుబడిగా వినియోగించుకుంటాయి.
  5. ఇన్సూరెన్సు కంపెనీలు: జీవితబీమా, సాధారణ బీమా కంపెనీలు కూడా పరిశ్రమలకు కావలసిన మూలధనాన్ని ప్రత్యక్షంగాను, పరోక్షంగాను సమకూరుస్తాయి.
  6. ప్రత్యేక ద్రవ్య సంస్థలు పరిశ్రమల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ఏర్పడిన పారిశ్రామిక ద్రవ్య సహాయ సంస్థలు పరిశ్రమలకు మూలధనాన్ని సమకూరుస్తాయి.

భారత ప్రభుత్వం రెండవ ప్రణాళికా కాలం నుండి పారిశ్రామికీకరణకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది. కొత్త పరిశ్రమల స్థాపన, ఉన్న పరిశ్రమల ఆధునికీకరణలకు భారీ ఎత్తున మూలధనం అవసరమవుతుంది. కనుక పరిశ్రమల మధ్యకాలిక, దీర్ఘకాలిక విత్త అవసరాలను తీర్చడానికి కింది సంస్థలు ముందుకు వచ్చాయి. అవి:

  1. భారత పారిశ్రామిక విత్త సంస్థ (IFCI)
  2. రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి సంస్థ (SIDC)
  3. భారత పారిశ్రామిక పరపతి పెట్టుబడి సంస్థ (ICIC)
  4. భారత జీవితబీమా సంస్థ (LIC)
  5. భారత పారిశ్రామికాభివృద్ధి బ్యాంకు (IDBI)
  6. యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (UTI)
  7. భారతీయ పారిశ్రామిక పునర్నిర్మాణ సంస్థ (IRCI)
  8. ఎక్స్పోర్ట్ – ఇంపోర్ట్ బ్యాంక్ (EXIM Bank)
  9. సాధారణ బీమా సంస్థ (GIC)
  10. స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ (SIDBI)
  11. వెంచర్ కాపిటల్ ఫండ్
  12. జాతీయ గృహ నిర్మాణ సంస్థ (NHB)
  13. రాష్ట్ర ఆర్థిక సహాయ సంస్థలు (SFC)

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
భారత పారిశ్రామిక విత్త సంస్థ.
జవాబు:
భారతీయ పారిశ్రామిక విత్త సంస్థ 1948వ సంవత్సరంలో ఏర్పాటు చేయబడింది. ఇది ప్రజల నుండి డిపాజిట్లను ఆకర్షిస్తుంది. ఈ విత్త సంస్థ బాండ్లు మరియు డిబెంచర్లను బహిరంగ మార్కెట్టులో విడుదల చేసే అధికారమున్నది.
విధులు:

  1. పారిశ్రామిక సంస్థలకు 25 సం॥ల కాల పరిమితి గల ఋణాలు, అడ్వాన్సులు ఇస్తుంది.
  2. ప్రత్యక్షంగా విత్త సహాయం అందించడం.
  3. పారిశ్రామిక సంస్థలు చేసే రుణాలకు హామీగా నిలబడుతుంది.
  4. పారిశ్రామిక సంస్థల షేర్లు, డిబెంచర్లను కొంటుంది.
  5. వాయిదా పద్ధతిలో ఋణాల చెల్లింపులకు హామీ ఇస్తుంది..
  6. ఔత్సాహిక ఉద్యమదారులకు ప్రోత్సాహకాలు, సాంకేతిక శిక్షణ ఇస్తుంది.
  7. విదేశీ సంస్థల నుండి విదేశీ కరెన్సీలో తీసుకున్న ఋణాలకు హామీ ఇస్తుంది.

ప్రశ్న 2.
భారత పారిశ్రామిక పరపతి పెట్టుబడి సంస్థ (ICICI).
జవాబు:
దీనిని 1955వ సంవత్సరంలో భారత ప్రభుత్వం, విదేశీ పెట్టుబడి వాటాదారులను అనుమతిస్తూ ప్రారంభించారు. ఇది మొదటి ప్రైవేట్ పెట్టుబడి లిమిటెడ్ కంపెనీగా ప్రారంభమయిన విత్త సహాయ సంస్థ. దీనిలో వాటాదారులు జాతీయ బ్యాంకులు, బీమా సంస్థలు, అమెరికా, ఇంగ్లాండులోని ప్రైవేటు పెట్టుబడి సంస్థలు, భారత ప్రజలు 2002లో ICICIని (ICICI) బ్యాంకు లిమిటెడ్ విలీనం చేయడం వల్ల దేశంలో మొదటి యూనివర్సల్ బ్యాంకుగా ఆవిర్భవించింది.

AP Inter 2nd Year Economics Study Material Chapter 5 పారిశ్రామిక రంగం

విధులు:

  1. ప్రైవేటు రంగ భారీ పరిశ్రమలకు, దీర్ఘకాలిక రుణాలు అందజేయడం. ఈ ఋణాల మొత్తం రూపాయలలో, విదేశీ కరెన్సీలలో కూడా అందిస్తారు.
  2. ప్రైవేటు రంగ పెట్టుబడులకు, ఋణాలకు గ్యారంటీ ఇవ్వండి.
  3. పారిశ్రామిక సంస్థలు సేకరించే ఋణాలకు, డిబెంచర్లకు హామీదారుగా ఉండటం.
  4. పరిశ్రమలకు నిర్వహణ, సాంకేతిక సలహాలు అందించుట.
  5. పరిశ్రమల ఈక్విటీ మూలధనము, డిబెంచర్లలో పెట్టుబడి పెట్టడం.
  6. ఋణ వాయిదాలకు, వడ్డీకి తీసుకున్న అప్పు, వాయిదాలలో అమ్మకాలు. తాత్కాలిక వ్యాపార మూలధనం మొదలగు వాటికి విత్త సలహాలనిస్తుంది.

ICICI ద్వారా ఋణాలిచ్చిన మొత్తము 1981లో 180 కోట్ల రూపాయలు, 2001వ సంవత్సరము నాటికి ఈ మొత్తము 31,660 కోట్ల రూపాయలకు పెరిగినది.

ప్రశ్న 3.
పారిశ్రామిక క్షేత్రాలు. [Mar ’17]
జవాబు:
పారిశ్రామిక క్షేత్రాలు చిన్న పరిశ్రమలు అభివృద్ధి చెందటానికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. అనేక చిన్న పరిశ్రమలు కేంద్రీకృతమైన ప్రదేశాన్ని పారిశ్రామిక క్షేత్రం / పారిశ్రామిక వాడ అని అంటారు. వీటిలో పరిశ్రమలకు కావలసిన స్థలం, భవనాలు, నీరు, విద్యుచ్ఛక్తి, రవాణా, సమాచార సౌకర్యాల వంటి వసతులు చౌకగా లభింపచేయబడిన పారిశ్రామిక క్షేత్రాల ఏర్పాటు లక్ష్యం. పై వసతులన్నింటినీ ఒకే ప్రదేశంలో లభింపచేయడం వలన ఉత్పాదక సంస్థల ఉత్పత్తి వ్యయాలు తగ్గుతాయి.

ప్రయోజనాలు:

  1. వీటిని ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో, చిన్న / పాక్షిక పట్టణాలలో ఏర్పాటు చేయటం వలన ఆ ప్రదేశాలు పారిశ్రామికంగా అభివృద్ధి చెందే అవకాశముంది.
  2. ప్రాంతీయంగా లభ్యమయ్యే వనరులను ఉపయోగించే అవకాశం ఏర్పడుతుంది
  3. ప్రాంతీయ అసమానతలు తగ్గే అవకాశం ఉంటుంది.
  4. పారిశ్రామిక కేంద్రీకరణ వల్ల ఏర్పడే అంతర్గత, బహిర్గత ఆదాలు లభిస్తాయి.
  5. భారీ పరిశ్రమలున్న ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేస్తే ఇవి పెద్ద పరిశ్రమలకు అనుబంధ / అనుషంగిక పరిశ్రమలుగా ఉంటాయి.
  6. చిన్న పరిశ్రమలు ఇక్కడ లభించే వసతులను ఉపయోగించుకోవటం వలన ఉత్పత్తిని లాభసాటిగా మార్చుకునే వీలుంటుంది.

ప్రశ్న 4.
ప్రత్యేక ఆర్థికమండళ్ళు,
జవాబు:
భారత ప్రభుత్వము ఏప్రిల్ 2000 సంవత్సరమున ప్రత్యేక ఆర్థికమండళ్ళను ప్రకటించినది. ఈ విధానము త్వరిత ఆర్థికవృద్ధికి అవసరమైన అవస్థాపన సౌకర్యాలతో పాటు పన్ను రాయితీలు పొందుతూ కనీస నియంత్రణలకు లోబడి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మద్దతుతో ఏర్పాటు చేయబడినవి. మన దేశములో ప్రత్యేక ఆర్థికమండళ్ళను 2005లో ఏర్పాటు చేస్తూ చట్టమును రూపొందించిరి. 2006 నుంచి కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి.

లక్ష్యాలు:

  1. అదనపు ఆర్థిక కార్యకలాపాలను సృష్టించుట.
  2. వస్తు సేవల ఎగుమతులను పెంచుట.
  3. దేశీయ అంతర్జాతీయ పెట్టుబడులను ప్రోత్సహించుట.
  4. అవస్థాపనా సౌకర్యాలను అభివృద్ధిపరచటం.
  5. ఉద్యోగావకాశాలను కల్పించుట.

AP Inter 2nd Year Economics Study Material Chapter 5 పారిశ్రామిక రంగం

ప్రశ్న 5.
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు.
జవాబు:
1991వ పారిశ్రామిక విధాన తీర్మానం విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించింది. పరిశ్రమల ఆధునికీకరణకు సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచటానికి, ఆర్థికాభివృద్ధికి ఈ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఋణరహిత పద్ధతిలో ఆర్థిక వనరుల లభ్యతకు అవకాశం కలిగించును. ఏ దేశంలో విదేశీ పెట్టుబడులకు అవకాశం ఉంటుందో అచ్చట సాంకేతిక అభివృద్ధి పొందటానికి ఉపాధిని పెంచటానికి అవకాశం కలుగును. ఇటీవల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులపై ప్రభుత్వ విధానం మరియు అధిక వ్యాపార అవకాశాలు మన దేశంలోకి విరివిగా వస్తున్నాయి. ప్రభుత్వము విదేశీ పెట్టుబడులపై నియంత్రణను తొలగించటం వల్ల అన్ని రంగాలకు ఈ పెట్టుబడులు విస్తరించినవి. రక్షణ ప్రభుత్వ రంగంలోని ఇంధన శుద్ధి కర్మాగారాలు Stock exchange, టెలికం, మందుల కంపెనీలు మొదలగు పరిశ్రమలలోకి ఈ పెట్టుబడులు రావటం వల్ల సత్వర ఆర్థికాభివృద్ధికి తోడ్పడగలదు. మన కేంద్ర ప్రభుత్వం రైల్వే రంగంలో అవస్థాపన నిర్మాణానికి 100% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించింది. అదే విధంగా నిర్మాణ రంగంలో కూడా 100% అనుమతించింది. పట్టణీకరణ షాపింగ్ మాల్స్ మరియు వ్యాపార కేంద్ర నిర్వహణకు 100% FDI అనుమతించింది.

ప్రశ్న 6.
జాతీయ పెట్టుబడి నిధి.
జవాబు:
భారత ప్రభుత్వం నవంబరు 3, 2005లో జాతీయ పెట్టుబడి నిధిని ఏర్పాటు చేసింది. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, గ్రామీణ విద్యుదీకరణ కార్పొరేషన్ అను రెండు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల పెట్టుబడుల ఉపసంహరణల మొత్తం రూపాయలు 1814.45 కోట్లతో ఈ పెట్టుబడి నిధిని ప్రారంభించింది.

లక్షణాలు:

  1. ఈ పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా నిర్వహించబడును. సేకరించిన మొత్తము భారత సంఘటిత నిధిలో కలపకుండా ప్రత్యేకంగా ఉంటుంది.
  2. జాతీయ పెట్టుబడి నిధి శాశ్వత వినియోగ స్వభావం కలిగి ఉంటుంది.
  3. ప్రభుత్వానికి నిలకడతో కూడిన ఆర్థిక ఫలితాలను చేకూర్చే విధంగా. ఈ విధి నిర్వహణ జరుగుతుంది.
  4. ఈ నిధిపై వచ్చే వార్షిక ఆదాయంలో 75% విద్య, ఆరోగ్య ఉపాధి మొదలగు సామాజిక పధకాలైన జవహర్లాల్ నెహ్రూ పట్టణ రెన్యువల్ మిషన్, ఇందిరా ఆవాస్ యోజన మొదలగు కార్యకలాపాలకు ఆర్థిక సహాయం అందజేయబడుతుంది.

ప్రశ్న 7.
జాతీయ తయారీ విధాన లక్ష్యాలు.
జవాబు:
భారత ప్రభుత్వం జాతీయ తయారీ విధానాన్ని నవంబరు 4, 2011లో నూతన పారిశ్రామిక విధానం పేరుతో ప్రకటించడమైంది. ప్రైవేటు రంగానికి కోశపరమైన ప్రోత్సాహకాల్ని కల్పించి, యువతకు ఎక్కువ ఉద్యోగాల్ని పొందే విధంగా నైపుణ్యాలను అభివృద్ధి పరచుట ఈ తయారీ విధానము యొక్క లక్ష్యము. వ్యవసాయమునకు ఉపయోగపడని భూములలో జాతీయ పెట్టుబడి మరియు తయారీ జోన్లను ఏర్పాటు చేయుట ఈ విధానము లక్ష్యము.
జాతీయ తయారీ విధానము
లక్ష్యాలు:

  1. తయారీ రంగంలో 12 నుండి 14 శాతము మాధ్యమిక వృద్ధిరేటును సాధించుట.
  2. తయారీ రంగంలో 2012 నాటికి 100 మిలియన్లు అదనపు ఉద్యోగాల కల్పన.
  3. తయారీ రంగంలో ఉపాధి అవకాశములను అందుకొనే విధంగా గ్రామీణ వలసదారులకు మరియు పట్టణ పేదరికానికి సరిపడినన్ని నైపుణ్యాలను కల్పించుట.
  4. స్థూల జాతీయోత్పత్తిలో ప్రస్తుతము 16 శాతముగా ఉన్న తయారీ రంగపు వాటాను 2022 నాటికి 25 శాతమునకు పెంచుట.
  5. తయారీ రంగంలో దేశీయ ఉత్పత్తి విలువలు మరియు సాంకేతిక పరిణతిని పెంపొందించుట.
  6. ప్రపంచ పోటీని తట్టుకొనే విధంగా భారత తయారీ రంగాన్ని అభివృద్ధి పరచుట.

AP Inter 2nd Year Economics Study Material Chapter 5 పారిశ్రామిక రంగం

ప్రశ్న 8.
జాతీయ పెట్టుబడి మరియు తయారీ మండళ్ళు.
జవాబు:

  1. తయారీ రంగానికి అనువైన 5000 హెక్టార్ల భూమిని ఎంపిక బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలది.
  2. జాతీయ పెట్టుబడి మరియు తయారీ మండళ్ళు వ్యవహారాలను నిర్వహించేందుకు ప్రత్యేక ప్రయోజన వాహనాన్ని ఏర్పాటు చేయాలి.
  3. జాతీయ మూలధనం మరియు తయారీ మండళ్ళకు అవస్థాపనా సౌకర్యాలైన రైలు, రోడ్డు, విమానాశ్రయాలు మొదలగునవి ప్రణాళిక మేరకు నిర్ణీత కాల వ్యవధిలో పూర్తి చేయడం.
  4. నీరు, విద్యుచ్ఛక్తి మరియు ఇతర అవస్థాపనా సౌకర్యాలను రాష్ట్ర ప్రభుత్వం కల్పించాలి.
  5. ప్రాజెక్టుకు అయ్యే వ్యయంలో 20%కు మించకుండా ఆర్థిక సదుపాయ సౌకర్యానికి తగు నిధులను కేంద్ర ప్రభుత్వం కల్పించుట.
  6. జాతీయ తయారీ మండళ్ళు అంతర్గత అవస్థాపనా సౌకర్యాల అభివృద్ధి కోసం బహుళ ఆర్థిక సదుపాయ సంస్థలు వాణిజ్యపరమైన ఋణ సదుపాయాన్ని కల్పించుట.

ప్రశ్న 9.
సూక్ష్మ, చిన్నతరహా, మాధ్యమిక పరిశ్రమలు.
జవాబు:
1) సూక్ష్మ పరిశ్రమలు: సూక్ష్మ పరిశ్రమలు యంత్రాలు, యంత్ర పరికరాలపై, సేవలపై 25 లక్షలలోపు పెట్టుబడి ఉన్న పరిశ్రమలు.

2) చిన్నతరహా పరిశ్రమలు: ఉత్పత్తిపై 25 లక్షల నుండి 5 కోట్లు, సేవలపై 10 లక్షల నుండి 2 కోట్లు పెట్టుబడి పెట్టే పరిశ్రమలు. ఇవి మరల మూడు రకాలుగా వర్గీకరించవచ్చు.

  • గ్రామీణ పరిశ్రమలు: 10 లక్షలు అంతకంటే తక్కువ జనాభా ఉన్న గ్రామాలలో ఒక్కో శ్రామికునిపై సగటున గరిష్టంగా 15 వేలు పెట్టుబడి పెడితే వాటిని గ్రామీణ పరిశ్రమలంటారు.
  • కుటీర పరిశ్రమలు: నామమాత్రపు పెట్టుబడితో కుటుంబ సభ్యులతో కలిసి, శ్రమ సాంద్రత పద్ధతులు ద్వారా వస్తు సేవలను తయారుచేసే పరిశ్రమలను కుటీర పరిశ్రమ అంటారు.
  • చిన్నతరహా పరిశ్రమ: కోటి రూపాయల నుండి 5 కోట్ల వరకు పెట్టుబడి పెడుతున్న పరిశ్రమలు. 3) మధ్యతరహా పరిశ్రమలు: ఉత్పత్తిలో గరిష్ట పెట్టుబడి 35 కోట్ల నుండి 3 10 కోట్ల వరకు పెట్టుబడి పెడుతున్న పరిశ్రమలు.

ప్రశ్న 10.
భారత పారిశ్రామిక పెట్టుబడి బ్యాంకు. [Mar ’16]
జవాబు:
1971వ సంవత్సరంలో ఖాయిలాపడ్డ పరిశ్రమలను పునరుజ్జీవింప జేయుటకు భారత పారిశ్రామిక పునర్నిర్మాణ కార్పోరేషన్ (IRCI) ఏర్పాటు చేయబడినది. దీనిని 1985 నుండి భారత పారిశ్రామిక పునర్నిర్మాణ బ్యాంకు (IRBI) గా మార్చడమైనది. పోటీ పరిస్థితులు, విత్త సంస్థల పునర్నిర్మాణం దృష్టిలో ఉంచుకొని IRBD ని 1997లో దీనిని భారతీయ పారిశ్రామిక పెట్టుబడి బ్యాంకుగా పూర్తిస్థాయి పరపతి సంస్థగా మార్పు చేయడమైనది. ఇది పరిశ్రమల విభిన్న అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఋణాలను అందిస్తున్నది.

భారతీయ పారిశ్రామిక పెట్టుబడి బ్యాంకు 2004 మార్చి నాటికి పారిశ్రామికాభివృద్ధికి మంజూరు చేసిన మొత్తం 14,050 కోట్ల రూపాయలలో చెల్లించినవి 13,396 కోట్ల రూపాయలు.

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
భారత చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంక్ (SIDBI).
జవాబు:
భారత ప్రభుత్వం ఏప్రిల్ 1990లో భారత పారిశ్రామికాభివృద్ధి బ్యాంకుకు అనుబంధంగా భారతీయ చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంకును ఏర్పాటు చేయడమైనది. భారతదేశంలో చిన్న పరిశ్రమల ఏర్పాటుకు, అభివృద్ధికి, విస్తరణకు ప్రధానమైన విత్త సహాయ సంస్థగా “భారత చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంకు” ఏర్పడినది.

AP Inter 2nd Year Economics Study Material Chapter 5 పారిశ్రామిక రంగం

ప్రశ్న 2.
భారత పారిశ్రామిక అభివృద్ధి బ్యాంకు (IDBI).
జవాబు:
పరిశ్రమలకు దీర్ఘకాలిక పరపతిని అందించుటకు 1964వ సంవత్సరంలో భారతీయ పారిశ్రామికాభివృద్ధి బ్యాంకును ఏర్పాటు చేయడమైంది. ఇది పరిశ్రమల ఆధునికీకరణకు, బహు విధాలుగా విస్తరించుటకు పరపతిని అందిస్తుంది.

ప్రశ్న 3.
రాష్ట్ర విత్త సహాయ సంస్థలు (SFIS).
జవాబు:
భారత పారిశ్రామిక విత్త సంస్థల వల్ల చిన్న, మధ్యతరహా పరిశ్రమల దీర్ఘకాలిక అవసరాలను సక్రమంగా తీర్చలేకపోవడం వల్ల దీనిని సెప్టెంబర్ 18, 1951లో ఏర్పాటు చేసారు. ఇవి ఆయా రాష్ట్రాల్లో పారిశ్రామికాభివృద్ధికి తోడ్పడుతున్నాయి.

ప్రశ్న 4.
పెట్టుబడుల ఉపసంహరణ.
జవాబు:
వనరుల పెంపుదలకు మరియు విస్తృత ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించుటకు, ప్రభుత్వ రంగంలోని కొంత వాటాలను మ్యూచువల్ ఫండ్స్కు, విత్త సంస్థలకు, సాధారణ ప్రజలకు, శ్రామికులకు ఇవ్వటాన్ని పెట్టుబడుల ఉప సంహరణ అంటారు.

ప్రశ్న 5.
ఏకస్వామ్య నిర్బంధ వర్తక ఆవరణ చట్టం (MRTP Act).
జవాబు:
ఆర్థిక స్థోమత కేంద్రీకరణగాను, ఏకస్వామ్యాలను, అక్రమ వ్యాపార పద్ధతులను సమర్థవంతంగా నియంత్రించుటకు ఈ తీర్మానాన్ని MRTP చట్టానికి సవరణలు ప్రతిపాదించింది.

ప్రశ్న 6. ప్రత్యేక ఆర్థికమండళ్ళు, [Mar ’17]
జవాబు:
భారత ప్రభుత్వం ఏప్రిల్ 2000వ సం॥లో ప్రత్యేక ఆర్థికమండళ్ళను ప్రకటించింది. ఈ విధానము త్వరిత ఆర్థికాభివృద్ధికి అవసరమైన అవస్థాపనా సౌకర్యాలతో పాటు పన్ను రాయితీలు పొందుతూ కనీస నియంత్రణలకు లోబడి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మద్దతుతో ఏర్పాటు చేయబడింది. ఈ చట్టం 2006 నుండి తన కార్యకలాపాలను నిర్వహించుచున్నది.

ప్రశ్న 7.
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి.
జవాబు:
1991 పారిశ్రామిక విధాన తీర్మానం విదేశీ పెట్టుబడిని ప్రోత్సహించింది. పరిశ్రమల-ఆధునికీకరణకు, సాంకేతిక పరిజ్ఞానం పెంచటానికి, ఆర్థికాభివృద్ధికి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు లేదా ఋణరహిత పద్ధతిలో ఆర్థిక వనరుల లభ్యతకు అవకాశం కల్పించును.

ప్రశ్న 8.
పారిశ్రామిక క్షేత్రాలు.
జవాబు:
ఒక ప్రాంతంలో అనేక చిన్న పరిశ్రమలు కేంద్రీకృతం కావడాన్ని పారిశ్రామిక క్షేత్రాలు లేదా పారిశ్రామిక వాడలు అంటారు. చిన్న పరిశ్రమలకు అవసరమైన అవస్థాపనా సౌకర్యాలైన నీరు, రవాణా, విద్యుచ్ఛక్తి మొదలగునవి కల్పించి అనేక చిన్న పరిశ్రమల నిర్మాణం జరిగిన ప్రాంతాన్ని పారిశ్రామిక క్షేత్రాలు అంటారు.

ప్రశ్న 9. సూక్ష్మ, చిన్నతరహా, మాధ్యమిక పరిశ్రమలు.
జవాబు:
భారత ప్రభుత్వం అక్టోబర్ 2, 2006వ సం॥న సూక్ష్మ, చిన్నతరహా, మధ్యతరహా పరిశ్రమల చట్టమును అమలులోకి తెచ్చింది. ఈ చట్టం ప్రకారం సూక్ష్మ లేదా లఘు పరిశ్రమల విషయంలో యాంత్రీకరణను ప్రవేశపెట్టిన పెట్టుబడి 25 లక్షల రూ॥ నుంచి 5 కోట్ల వరకు పెట్టుబడి కలిగినవి. మధ్యతరహా పరిశ్రమల పెట్టుబడి 5 నుంచి 10 కోట్ల మధ్య ఉండాలి.

AP Inter 2nd Year Economics Study Material Chapter 5 పారిశ్రామిక రంగం

ప్రశ్న 10.
భారతీయ పారిశ్రామిక పరపతి పెట్టుబడి సంస్థ (ICICI).
జవాబు:
దీనిని 1995వ సం॥లో ప్రైవేట్ రంగంలో ప్రారంభించారు. దీర్ఘకాలిక ఋణాలను, మధ్యకాలిక ఋణాలను, స్వదేశీ, విదేశీ కరెన్సీలలో అందిస్తుంది. ముఖ్యంగా చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు పరపతి సౌకర్యం కల్పిస్తుంది. పరిశ్రమల షేర్లకి, డిబెంచర్లకు పూచీదారుగా వ్యవహరిస్తుంది.

ప్రశ్న 11.
ప్రపంచీకరణ.
జవాబు:
ప్రపంచ దేశాల మధ్య రాజకీయ ఎల్లలు లేని ఆర్థిక కార్యకలాపాల అభివృద్ధి.

AP Inter 2nd Year Economics Study Material Chapter 4 వ్యవసాయ రంగం

Andhra Pradesh BIEAP AP Inter 2nd Year Economics Study Material 4th Lesson వ్యవసాయ రంగం Textbook Questions and Answers.

AP Inter 2nd Year Economics Study Material 4th Lesson వ్యవసాయ రంగం

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
భారతదేశ ఆర్థికవ్యవస్థలో వ్యవసాయ రంగం ప్రాధాన్యతను వివరించండి.
జవాబు:
భారతదేశ ఆర్థికవ్యవస్థలో వ్యవసాయ రంగం అత్యంత కీలకపాత్రను పోషిస్తుంది. క్రింద పేర్కొన్న అంశాలు ద్వారా భారత ఆర్థికవ్యవస్థలో వ్యవసాయరంగం పాత్రను తెలుసుకోవచ్చు.

1) స్థూల దేశీయ ఉత్పత్తిలో వ్యవసాయ రంగం వాటా: వ్యవసాయం, దాని అనుబంధ రంగాలైన అడవుల పెంపకం, చేపల పెంపకం, పాడి, పశుపోషణ, కోళ్ళ పెంపకం, పట్టు పరిశ్రమ, తోటపంటలు, గనులు, క్వారీలు మొదలైనవన్నీ, కలిపి వ్యవసాయ రంగం అంటారు. నేటికి జాతీయాదాయంలో వ్యవసాయరంగం ముఖ్య భూమికను పోషిస్తూ వుంది. మొత్తం స్థూల, దేశీయ ఉత్పత్తిలో వ్యవసాయరంగంలో వాటా 1950-51 సంవత్సరంలో 56.5 శాతంగా వుంది. ఈ వాటా క్రమేపీ తగ్గుతూ 2013-14 నాటికి 13.9 శాతానికి చేరుకుంది. ఈ తగ్గుదలకు ప్రధానకారణం వ్యవసాయేతర రంగాలు అభివృద్ధి చెందడం ఉదాహరణకు జాతీయాదాయంలో వ్యవసాయరంగం వాటా ఇంగ్లాండులో 2 శాతం, అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో 3 శాతం, ఆస్ట్రేలియాలో 6 శాతం ఫ్రాన్స్లో 7 శాతంగా వుంది.

2) ఉపాధికల్పనలో వ్యవసాయరంగం: భారత ప్రజల ప్రధాన వృత్తి, వ్యవసాయం, నేటికి ఉపాధికల్పనలో వ్యవసాయరంగం కీలక భూమిక పోషిస్తుంది. వ్యవసాయరంగం ప్రత్యక్షంగా, పరోక్షంగా అనేకమంది ప్రజలకు జీవనోపాధి కల్పిస్తుంది.

వ్యవసాయరంగంపై ఆధారపడిన జనాభా (మిలియన్లలో)
AP Inter 2nd Year Economics Study Material Chapter 4 వ్యవసాయ రంగం 1

పట్టిక 4.2 పరిశీలిస్తే 1951 జనాభాలెక్కల ప్రకారం మొత్తం పనిచేస్తున్న జనాభాలో వ్యవసాయం మీద ఆధారపడిన వారి సంఖ్య 98 మిలియన్లు వుండగా 2011 నాటికి 234.1 మిలియన్లకు చేరింది. అభివృద్ధి చెందిన దేశాలలో వ్యవసాయరంగంపై ఆధారపడిన జనాభాశాతం చాలా తక్కువగా వుంది. అభివృద్ధి చెందిన దేశాలైన అమెరికా, బ్రిటన్ దేశాలలో వ్యవసాయరంగంపై ఆధారపడిన వారి సంఖ్య 2 శాతంకాగా, ఆస్ట్రేలియాలో 6 శాతం, జపాన్, ఫ్రాన్స్లలో 7 శాతంగా వుంది.

3) అంతర్జాతీయ వ్యాపారంలో వ్యవసాయరంగం పాత్ర: అంతర్జాతీయ వ్యాపారంలో భారతవ్యవసాయరంగం కీలకపాత్ర పోషిస్తుంది. చాలాకాలం వరకు మనదేశ వ్యవసాయ ఉత్పత్తులలో ముఖ్యంగా మూడురకాలైన ఉత్పత్తులైన నూలు వస్త్రాలు, జనుము, టీ అంతర్జాతీయ ఎగుమతులలో 50 శాతం ఆక్రమించాయి. వీటికి ఇతర వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులను కలిపితే మొత్తం విదేశీ వ్యాపారంలో వ్యవసాయరంగం వాటా 70 శాతానికి చేరుతుంది. ప్రస్తుతం భారతదేశం ప్రత్తి, పొగాకు, పంచదార, బియ్యం, కాఫీ, టీ, చేపలు, మాంసం, పండ్లు, పప్పుధాన్యాలు, నూనెపిండి, జీడిపప్పు, సుగంధద్రవ్యాలు మొదలైన వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేస్తుంది. ఎగుమతుల ద్వారా మనకు విదేశీ మారకద్రవ్యం లభిస్తుంది.

AP Inter 2nd Year Economics Study Material Chapter 4 వ్యవసాయ రంగం

4) సామాజిక రక్షణ కవచం: భారతదేశం గ్రామీణ ప్రాంతాలలో నివశిస్తున్న పేదప్రజలలో ఎక్కువ మందికి వ్యవసాయమే జీవనాధారం. భారతదేశ జాతీయోత్పత్తిలో వ్యవసాయరంగం వాటా 15శాతం కంటే తక్కువగా వున్నప్పటికీ నేటికి పనిచేస్తున్న జనాభాలో సగం మందికి వ్యవసాయమే జీవనాధారంగా వుంది. గ్రామీణ ప్రాంతాలలో కుటుంబ స్థాయిలో పంటలతో పాటు, పాడి, పశుపోషణ, చేపల పెంపకం, పట్టు పరిశ్రమ, తోటల పెంపకం, వ్యవసాయ అడవులు మొదలైన అనుబంధ వృత్తులను ప్రోత్సహిస్తే దారిద్య్రం, ఆకలి వాటంతట అవే తొలగిపోతాయి. ఈ విధంగా వ్యవసాయం గ్రామీణ ప్రజలకు జీవనోపాధిని కల్పిస్తూ, వారి సామాజిక జీవిత భద్రతకు రక్షణ కవచంలా పనిచేస్తుంది.

5) ఆహార భద్రత: వేగంగా పెరుగుతున్న జనాభాకు ఆహారభద్రతకు సమకూర్చడానికి ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరగాలి. తాజా ఆకలిసూచిక ప్రకారం ప్రపంచంలోని మొత్తం 75 ఆకలి పీడిత దేశాలలో మనదేశంలో 55వ స్థానంలో ఉంది. మనదేశంలో ఆహార సంక్షోభాన్ని నివారించాలంటే వ్యవసాయరంగం స్థిరంగా అభివృద్ధి చెందాలి. మొత్తం ఆహారధాన్యాల ఉత్పత్తి 255 మిలియన్ టన్నులను చేరినపటికీ నేటికి మనదేశంలో ఆహారభద్రత కరువైంది.

6) పారిశ్రామికీకరణలో వ్యవసాయరంగం పాత్ర: సాధి ౦గా కొన్ని పరిశ్రమలు తమ ముడిపదార్థాల కోసం వ్యవసాయరంగంపై ఆధారపడి వుంటాయి. అలాంటి పరిశ్రమలను వ్యవసాయధార పరిశ్రమలు అంటారు. ఉదాహరణకు జనపనార, వస్త్ర, పంచదార పరిశ్రమలు, నూనెమిల్లులు, పిండిమిల్లులు మొదలైనవి ప్రత్యక్షంగా ముడిసరుకుల |కోసం వ్యవసాయరంగంపై ఆధారపడి వున్నాయి. ఇవికాగా బియ్యం మిల్లులు, నూనె మిల్లులు, తోటపంటలు, ఆహారతయారీ మొదలైన చిన్న, కుటీర పరిశ్రమలు కూడా ముడిసరుకుల కోసం వ్యవసాయరంగంపై ఆధారపడి ఉన్నాయి. పరోక్షంగా మరెన్నో పరిశ్రమలకు వ్యవసాయరంగం తోడ్పడుతుంది.

అదేవిధంగా పారిశ్రామికాభివృద్ధి వ్యవసాయరంగ ప్రగతికి దోహదపడుతుందని చెప్పవచ్చు. పరిశ్రమలు అభివృద్ధిచెందితే వ్యవసాయానికి అవసరమైన యంత్రాలు, రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందులు మొదలైన ఉత్పాదకాలను అందిస్తాయి. ఈ విధంగా వ్యవసాయ పారిశ్రామికరంగాలు పరస్పరం ఒకదానిపై మరొకటి ఆధారపడి అభివృద్ధి చెందుతున్నాయి.

7) పారిశ్రామిక వస్తువులకు గిరాకీ: భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలలో మూడవవంతు గ్రామీణ ప్రాంతాలలోనే నివశిస్తున్నారు. వీరికి ఆదాయం చాలా తక్కువగా వుండి పారిశ్రామిక వస్తువులను కొనగల సామర్థ్యం లోపించింది. గ్రామీణ ప్రజల కొనుగోలుశక్తి పెరుగుదల వ్యవసాయరంగ అభివృద్ధిపై ఆధారపడి వుంటుంది. వ్యవసాయరంగం అభివృద్ధి చెందితే వ్యవసాయరంగం ఉత్పాదకత, విక్రయం కాగల మిగులు పెరిగే వ్యవసాయదారుల ఆదాయాలు, శ్రామికుల వేతనాలు పెరుగుతాయి. ఈ విధంగా పెరిగిన ఆదాయంవల్ల పారిశ్రామిక వస్తువుల గిరాకీ పెరిగి పరిశ్రమల అభివృద్ధికి ప్రోత్సాహం లభ్యమవుతుంది.

8) ఇతర అంశాలు:

  1. వ్యవసాయరంగం ప్రగతి రవాణా రంగాన్ని ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తుంది. వ్యవసాయ ఉత్పత్తులను రవాణా చేయడం ద్వారా ఈ రంగం ఆదాయాన్ని ఆర్జిస్తుంది. .
  2. వ్యవసాయరంగం ప్రగతి గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు వలసలను కనిష్టస్థాయిలో ఉంచుతుంది.
  3. పశువులకు కావలసిన మేత, దాణా మొదలైనవి వ్యవసాయరంగం సరఫరా చేయడం ద్వారా పశుగణాభివృద్ధికి తోడ్పడుతుంది.
  4. వ్యవసాయ ఆధారిత పర్యాటకాన్ని పెంపొందించవచ్చు.
  5. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలు అభివృద్ధి చెందితే జీవవైవిధ్యం పరిరక్షించబడుతుంది.
    పైన పేర్కొనబడిన అంశాల ఆధారంగా భారతదేశ ఆర్థికవ్యవస్థలో వ్యవసాయరంగం ప్రముఖపాత్ర పోషిస్తుంది చెప్పవచ్చు. అందువల్ల భారతదేశ వ్యవసాయ దేశంగా పరిగణించబడింది.

ప్రశ్న 2.
వ్యవసాయ శ్రామికుల ప్రస్తుత స్థితిగతులను వివరించి వారి స్థితిగతులను మెరుగుపరచడానికి తీసుకోవలసిన పరిష్కార మార్గాలను సూచించుము.
జవాబు:
సంవత్సరంలోని మొత్తం పనిదినాలలో సగానికి పైగా వ్యవసాయరంగంలో పనిచేసే వ్యక్తులను వ్యవసాయ శ్రామికులంటారు.
జాతీయ వ్యవసాయ శ్రామికుల పరిశీలనా సంఘం వ్యవసాయ శ్రామికులను రెండు రకాలుగా వర్గీకరించింది. 1) సాధారణ శ్రామికులు 2) రైతుల వద్ద పనిచేసే శ్రామికులు.
వ్యవసాయ శ్రామికుల స్థితిగతులు:
1) అల్పసాంఘిక హోదా: నేటికీ వ్యవసాయ శ్రామికులలో ఎక్కువమంది తరతరాలుగా నిర్లక్ష్యానికి గురైన అణగారిన వర్గాలకు చెందినవారు. సాంఘిక అసమానత్వం, దోపిడీ భావన వీరి విషయంలో సర్వసాధారణం. వీరు తమ హక్కుల పరిరక్షణకు ఏమాత్రం పోరాటం చేయలేని దయనీయస్థితిలో ఉంటారు. గ్రామీణ ప్రాంతాల్లో వివక్షకు గురైన వీరి సాంఘిక హోదా తక్కువగా ఉంటుంది.

2) అసంఘటిత శ్రామికులు: మనదేశంలో వ్యవసాయ శ్రామికుల మారుమూల గ్రామాలలో నివసిస్తున్నారు. అందువల్ల వీరు సంఘటితం కాలేకపోతున్నారు. వీరికి కార్మికసంఘాలు లేవు. అంతేకాక వీరిలో ఎక్కువ మంది నిరక్షరాస్యులు. అందువల్ల అసంఘటితంగా వున్న వీరికి భూస్వాములతో బేరమాడే శక్తి లోపించి తగిన వేతనాలు పొందలేకపోతున్నారు.

AP Inter 2nd Year Economics Study Material Chapter 4 వ్యవసాయ రంగం

3) రుతుసంబంధిత ఉద్యోగిత: వ్యవసాయ కార్యకలాపాలు రుతువులపై ఆధారపడి వుంటాయి. వ్యవసాయ కార్మికులు నాట్లు వేసేటప్పుడు, పంట కోసేటప్పుడు మాత్రం ఉపాధిని పొంది సంవత్సరంలో ఎక్కువ భాగం ఖాళీగా వుంటారు. నిరుద్యోగిత, అల్ప ఉద్యోగిత వీరు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు. అందువల్ల వీరి ఆదాయాలు తక్కువగా ఉండి జీవన ప్రమాణాలు అల్పంగా ఉంటాయి.

4) అల్ప వేతనాలు: వ్యవసాయ శ్రామికులకు చెల్లించే వేతనాలు అల్పంగా ఉన్నందువల్ల వారి కుటుంబ ఆదాయాలు తక్కువగా ఉన్నాయి. వ్యవసాయ శ్రామికులకు వివిధ రాష్ట్రాల్లో ఇచ్చే వేతనాలలో భిన్నత్వం వుంది. పంజాబ్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలలో తప్ప ఎక్కువ రాష్ట్రాలలో వీరికి చెల్లించే వేతనాలు అల్పంగా ఉన్నాయి. హరిత విప్లవనాంతరం వీరికి చెల్లించే ద్రవ్యవేతనాలు పెరిగినప్పటికీ వస్తుసేవల ధరలు పెరిగినందువల్ల వీరి నిజవేతనాలు
పెరగలేదు.

5) మహిళా శ్రామికుల పట్ల వివక్షత: వ్యవసాయరంగంలో పురుష శ్రామికులతో సమానంగా మహిళా శ్రామికులకు వేతనాలు ఇవ్వరు. అంతేగాక వ్యవసాయ కార్యకలాపాలతో వీరిచే బలవంతంగా అధికశ్రమ చేయిస్తారు. అనగా వ్యవసాయరంగంలో మహిళాశ్రామికులు వివక్షతకు గురవుతున్నారు.

6) గ్రామీణ రుణగ్రస్తత: గ్రామీణ ప్రాంతాలలోని వ్యవసాయ శ్రామికుల ఆదాయం తక్కువగా ఉండి పేదరికంలో ఉన్నారు. అందువల్ల వీరికి రుణ అవసరాలు ఎక్కువగా ఉంటాయి. వీరికి సంస్థాగత పరపతి సంస్థలనుంచి రుణం తీసుకోవడానికి అవసరమైన హామీపత్రాలు లేనందువల్ల సంస్థాగతం కాని వడ్డీవ్యాపారస్థులు, భూస్వాముల నుంచి అధికవడ్డీలకు రుణం పొందుతున్నారు. ఈ రుణభారం అధికమై తరతరాలుగా వారసత్వంగా సంక్రమించి వ్యవసాయ శ్రామికులు వెట్టిశ్రామికులుగా మారుతున్నారు.

7) అధికసంఖ్యలో బాలకార్మికులు: ఆసియాఖండంలోని బాలకార్మికులలో మూడవ వంతు మంది భారతదేశంలో ఉన్నారు. మనదేశంలోని బాలకార్మికులలో అధిక సంఖ్యాకులు వ్యవసాయరంగంలో పనిచేస్తున్నారు. వీరికి ‘చెల్లిస్తున్న వేతనాలు అత్యల్పంగా వుండి వారి కుటుంబ జీవన ప్రమాణంపై దుష్ప్రభావాన్ని చూపుతున్నాయి.

8) వ్యవసాయేతర వృత్తుల కొరత గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయేతర వృత్తులు అభివృద్ధి చెందలేదు. అందువల్ల శ్రామికులు ఉపాధికోసం ఎక్కువగా వ్యవసాయరంగంపై ఆధారపడుతున్నారు. ఫలితంగా వ్యవసాయరంగంలో శ్రామికుల సంఖ్య అధికమై ప్రచ్ఛన్న నిరుద్యోగితకు దారితీసింది.

వ్యవసాయ శ్రామికుల స్థితిగతులు పెంపొందించే చర్యలు: వ్యవసాయ శ్రామికుల జీవన స్థితిగతులు దుర్భరంగా ఉన్నాయి. వారి జీవన స్థితిగతులను మెరుగుపరచడానికి ప్రభుత్వం కింద పేర్కొన్న కొన్ని చర్యలను చేపట్టింది.
1) కనీస వేతనాలు: వ్యవసాయ శ్రామికుల జీవన స్థితిగతులను పెంపొందించడానికి భారత ప్రభుత్వం 1948లో కనీసవేతనాల చట్టాన్ని రూపొందించింది. ఈ చట్టం ప్రకారం వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాష్ట్రంలోని జీవన వ్యయాలను, జీవన ప్రమాణాలను దృష్టిలో ఉంచుకొని మూడు సంవత్సరాలలోపు కనీసవేతన చట్టాలను రూపొందించి అమలు చేయాలి.

2) భూమి లేని శ్రామికులకు భూపంపిణీ: వ్యవసాయ శ్రామికుల ఆర్థికస్థితులను పెంపొందించాలంటే ఉద్దేశంతో భూమిలేని శ్రామికులకు భూపంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ లక్ష్య సాధన కోసం కమతాల గరిష్ట పరిమితి చట్టం ద్వారా, భూదాన గ్రామదానోద్యమాల ద్వారా లభించిన 70లక్షల హెక్టారుల మిగులు భూమిని భూమిలేని వ్యవసాయ శ్రామికులకు పంపిణీ చేయడం జరిగింది.

3) నివాస గృహాలను, ఇళ్ల స్థలాలను కల్పించడం: వ్యవసాయ శ్రామికులలో ఎక్కువ మందికి సరైన స్వంత నివాస గృహాలు లేవు. సాధారణంగా వీరు గాలి, వెలుతురు లేని మట్టిచే నిర్మించబడిన గుడిసెలలో నివశిస్తూ తరచూ అనారోగ్యానికి గురవుతుంటారు. ఇందుకు పరిష్కారంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇందిరా ఆవాస్ యోజన, కనీస అవసరాల కార్యక్రమం వంటి పథకాలను రూపొందించి పేదవారికి ఉచితంగా నివాస స్థలములు యిచ్చి రాయితీ ప్రాతిపదికన ఇండ్లను నిర్మించడం వంటి కార్యక్రమాలను చేపట్టాయి.

4) శ్రామిక సహకార సంఘాలను ఏర్పరచడం: రెండవ పంచవర్ష ప్రణాళికల కాలంలో శ్రామిక సహకార సంఘాల ఏర్పాటు చేయబడ్డాయి. రహదారుల నిర్మాణం, కాలువలు, చెరువులు తవ్వడం, అటవీకరణ మొదలైన కార్యక్రమాల నిర్వహణను ఒప్పంద ప్రాతిపదికపైన ఈ శ్రామిక సంఘాలు చేపట్టుతాయి. దీని వల్ల శ్రామికులకు దోపిడీ రహిత ఉపాధి లభిస్తుంది.

5) ప్రత్యేక ఉపాధి కల్పనా పథకాలు: ప్రణాళికల కాలంలో ఉపాధి అవకాశాలు కల్పించుటకు అనేక పథకాలు ప్రారంభించబడ్డాయి. ఉదాహరణకు పనికి ఆహార పథకం (FWP) ఉపాధి హామీ పథకం (EGS) జాతీయ గ్రామీణ ఉపాధి పథకం (NREP) గ్రామీణ భూమిలేని శ్రామికుల ఉపాధి హామీ పథకం (RLEGP) జవహర్ రోజ్ గార్ యోజన (JRY) సంపూర్ణ గ్రామీణ రోజ్ గార్ యోజన (SGRY), చిన్నరైతుల అభివృద్ధి సంస్థ (SFDA).

AP Inter 2nd Year Economics Study Material Chapter 4 వ్యవసాయ రంగం

6) రుణాలు, రాయితీలు మంజూరులు: మనదేశంలో వ్యవసాయ శ్రామికులకు ప్రభుత్వం బ్యాంకుల ద్వారా అల్పవడ్డీ రేట్లపై రుణాలు మంజూరు చేస్తున్నారు. వ్యవసాయ శ్రామికులకు తక్షణం రుణవిముక్తి కల్పించడానికి రుణమాఫీని సైతం చేస్తున్నాయి. వ్యవసాయ శ్రామికుల స్వయం ఉపాధిని చేపట్టడానికి ప్రభుత్వం, రుణాలు, రాయితీలు మంజూరు చేస్తున్నాయి.

7) వెట్టిచాకిరి నిర్మూలన: దోపిడీ, బానిసత్వం అమానుషమైన కార్యక్రమాలే గాక శిక్షార్హులైన నేరాలు కూడా, 1976లో భారత ప్రభుత్వం వెట్టిచాకిరి నిర్మూలనా చట్టాన్ని రూపొందించింది. కాని నేటికీ వ్యవసాయ రంగంలో వెట్టిచాకిరి కొనసాగుతూనే వుంది. రైతులను విద్యావంతులను చేయడం, వారి ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడం వెట్టిచాకిరి నిర్మూలనకు చక్కని పరిష్కారమార్గాలు.

8) కుటీర పరిశ్రమలను ప్రోత్సహించడం: వ్యవసాయరంగంపై జనాభా ఒత్తిడిని కనిష్ట స్థాయికి తగ్గించాలి. అందుకుగాను ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలలో కుటీర, చిన్న తరహా పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి రాయితీలు, ప్రోత్సాహకాలు అందించాలి. ప్రణాళికా కాలంలో ప్రభుత్వం నిర్వహించిన ఈ విధమైన కృషి ఫలితంగా వ్యవసాయరంగంపై ఒత్తిడి కనిష్టస్థాయికి తగ్గి వ్యవసాయేతర రంగాల్లో ఉపాధి అవకాశాలు గరిష్టస్థాయికి పెరిగాయి.

ప్రశ్న 3.
భారతదేశంలో పంటతీరును ప్రభావితం చేసే అంశాలు ఏవి ? పంటల తీరును మెరుగుపరిచే చర్యలను సూచించుము.
జవాబు:
పంటల తీరు: సాధారణంగా ఒకదేశ ఆర్థికాభివృద్ధి ఆ దేశంలో లభించే సహజ వనరుల లభ్యత, వినియోగంపై ఆధారపడి ఉంటుంది. సహజ వనరులైన భూమి, నీరు, ఖనిజాలు మొదలైన వాటిని సమర్థవంతంగా, అభిలషణీయంగా, వినియోగించినప్పుడే కొనసాగించగలిగే అభివృద్ధి సాధ్యమవుతుంది. అదేవిధంగా భూసారం, నీటిపారుదల సౌకర్యాల లభ్యతను బట్టి దేశంలో విభిన్న పంటలు పండించడం జరుగుతుంది. దేశంలో పండే వివిధ పంటల తీరు ఆ దేశ ఆర్థిక ప్రగతిని ప్రభావితం చేస్తుంది.

పంటలతీరును ప్రభావితం చేసే అంశాలు: భారతదేశంలో పంటల తీరును భౌతిక, సాంకేతిక ఆర్థిక అంశాలతోపాటు ప్రభుత్వవిధానాలు కూడా ప్రభావితం చేస్తాయి.
I) భౌతికాంశాలు: పంటలతీరును నిర్ణయించడంలో భౌతికాంశాల పాత్ర కీలకమైంది.
1) శీతోష్ణస్థితి, వర్షపాతం: శీతోష్ణస్థితి, వర్షపాతం, పంటలతీరును ప్రభావితం చేస్తాయి. ఉష్ణ ప్రాంతాలలో, శీతల ప్రాంతాలలో పండే పంటలు వేర్వేరుగా వుంటాయి. ఉదాహరణకు, శీతల ప్రాంతాలలో మాత్రమే ఆపిల్స్ వుంటాయి. అదేవిధంగా వర్షపాతం కూడా పంటలతీరును ప్రభావితం చేస్తుంది.

2) భూస్వరూపం, భూసారం: భూసారం, భూస్వరూపంపై ఆధారపడి పంటలు పండుతాయి. ఉదాహరణకు నల్లరేగడి మృత్తికలు, పత్తిపంటకు అనుకూలం. అదేవిధంగా గోధుమ పంటకు సారవంతమైన ఒండ్రు, తడిబంకమన్ను మృత్తికలు అవసరం. ఈ విధంగా భూసారం, భూస్వరూపం పంటలతీరును ప్రభావితం చేస్తాయి.

3) నీటిపారుదల: నీటిపారుదల సౌకర్యాలు పంటలతీరును నిర్ణయించడంలో కీలకపాత్ర పోషిస్తాయి. నీటిపారుదల సౌకర్యాలు పుష్కలంగా లభ్యమైనపుడు వరి, చెరకు, గోధుమ మొదలైన పంటలు పండుతాయి. నీటిపారుదల సౌకర్యాలు తగినంతగా లేనిచోట రాగులు, మొక్కజొన్న, సజ్జలు వంటి పంటలు పండుతాయి.

II) ఆర్థికాంశాలు:
1) ధరలు, ఆదాయం: సాధారణంగా వ్యవసాయదారులు తమ ఉత్పత్తులను అధికధరలకు విక్రయించి తమ ఆదాయాలను గరిష్టం చేసుకోవాలనుకుంటారు. వరి, గోధుమలాంటి ఆహార పంటల ధరలపై మార్కెట్ ప్రభావం లేకుండా నిర్దేశిత సేకరణ ధరల పేరుతో ప్రభుత్వం ఈ పంటల ధరలను ముందుగా నిర్ణయిస్తుంది. ఈ విధమైన నియంత్రణల వల్ల రైతులు తమ ఆదాయాలను గరిష్టం చేసుకోవడానికి వాణిజ్య పంటలైన చెరకు, పత్తి, వేరుశెనగ మొదలైన వాటిని పండిస్తున్నారు.

2) భూకమతాల పరిమాణం: భూకమతాల పరిమాణం పంటల తీరుపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. సాధారణంగా చిన్న కమతాల రైతులు ఆహారపంటలను, పెద్దకమతాల రైతులు వాణిజ్యపంటలను పండిస్తారు. ఇటీవల కాలంలో చిన్న కమతాల రైతులు కూడా అధిక లాభాలను ఆశించి వాణిజ్యపంటలను పండిస్తున్నారు.

3) ఉత్పాదకాలు, అవస్థాపనా సౌకర్యాల కొరత: వ్యవసాయ ఉత్పాదకాలు కూడా పంటల తీరును నిర్ణయిస్తాయి. విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు, యంత్రాలు మొదలైన ఉత్పాదకాల లభ్యత పంటల తీరును ప్రభావితం చేస్తుంది. అదేవిధంగా రవాణా, గిడ్డంగులు, మార్కెటింగ్, నీటిపారుదల వంటి అవస్థాపనా సౌకర్యాల లభ్యతపై కూడా పంటల తీరు ఆధారపడి వుంటుంది.

AP Inter 2nd Year Economics Study Material Chapter 4 వ్యవసాయ రంగం

4) భీమా సౌకర్యాలు: సాధారణంగా వ్యవసాయదారులు విభిన్నమైన పంటలు పండిస్తారు. ఏదైన ఒక పంట నష్టానికి గురైనప్పుడు ఆ నష్టాన్ని ఇతర పంటల నుండి రాబట్టుకోవచ్చు అన్న ఉద్దేశ్యంలో బహుళపంటలు పండిస్తారు. అదే ప్రభుత్వం నష్టభయాన్ని ఎదుర్కొనడానికి ఏ పంటలకు బీమా సౌకర్యాలను కల్పిస్తుందో ఆ పంటలను రైతులు ధీమాగా పండిస్తారు.

5) కౌలుదారీ పద్ధతి: సాధారణంగా భూస్వాములు తమ భూములను కౌలుకు ఇచ్చేటప్పుడు ఏ పంటలు పండించాలో ముందుగానే కౌలుదార్లతో ఒప్పందం చేసుకుంటారు. కాబట్టి పంటలతీరు భూస్వాముల ఇష్టాలపై చాలావరకు ఆధారపడి వుంటుంది.

6) సాంఘీక కారణాలు: పరిసరాలు, ఆచారాలు, సాంప్రదాయాలు, మొదలైన సాంఘిక అంశాలు పంటల తీరును నిర్ణయించడంలో కొంతమేరకు ప్రభావాన్ని చూపుతాయి. ఈ అంశాలు రైతులను సాంప్రదాయ పంటలను, సాంప్రదాయ పద్దతుల్లో పండించేటట్లు ప్రేరేపిస్తాయి.

III) ప్రభుత్వ విధానాలు: విభిన్న పంటలు, ఎగుమతులు, పన్నులు, రాయితీలు, సాంకేతిక విజ్ఞానం, ఉత్పాదకాల సరఫరా, పరపతి లభ్యత, మద్దతుధరలు మొదలైన అంశాలకు సంబంధించిన ప్రభుత్వ విధానాలు పంటలతీరును నిర్ణయిస్తాయి.

  1. కొన్ని పంటల ఉత్పత్తికి కొన్ని ప్రాంతాలు మాత్రమే అనుగుణంగా వుంటాయి. అంటే అన్ని పంటలు అన్ని ప్రాంతాలలో పండవు. కాబట్టి ప్రభుత్వమే ముందుగా ఏ ప్రాంతం ఏ పంటకు అనుకూలంగా ఉందో నిర్ణయించి ఆ ప్రాంతానికి అనుకూలమైన పంటను మాత్రమే పండించేటట్లు చట్టాలను రూపొందించాలి.
  2. పెరుగుతున్న జనాభా ఆహార అవసరాలకు అనుగుణంగా ఆహార పంటలను పండించే విధంగా రైతులను ప్రోత్సహించాలి.
  3. ప్రభుత్వం నూతన వ్యవసాయ వ్యూహాన్ని ప్రోత్సాహించడం ద్వారా పంటల తీరును ప్రభావితం చేయాలి.

ప్రశ్న 4.
భారతదేశంలో వ్యవసాయ ఉత్పాదకత అల్పంగా ఉండటానికి గల కారణాలేవి ? ఉత్పాదకత పెంచడానికి తీసుకోవలసిన చర్యలను తెలియజేయండి. [Mar ’17]
జవాబు:
భారత వ్యవసాయరంగంలో ఉత్పత్తి అల్పంగా వుండటానికి అనేక కారణాలు వున్నాయి. వీటిని ప్రధానంగా నాలుగురకాలుగా వర్గీకరించారు.

  1. సాధారణ కారణాలు
  2. వ్యవస్థాపూర్వక కారణాలు
  3. సాంకేతిక కారణాలు
  4. పర్యావరణ కారకాలు

I) సాధారణ కారణాలు: వ్యవసాయ ఉత్పత్తి అల్పంగా వుండటానికి గల కారణాలు కింద విశ్లేషించబడినాయి.

1) వ్యవసాయరంగంపై జనాభా వత్తిడి: భారతదేశంలో జనాభా వేగంగా పెరుగుతుంది. పెరుగుతున్న జనాభా తమ జీవనోపాధికై వ్యవసాయరంగంపై ఆధారపడుతున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం 263 మిలియన్ల జనాభా తమ జీవనోపాధికై వ్యవసాయరంగం మీద ఆధారపడి వున్నారు. దీనికి తోడు వ్యవసాయేతర రంగాల్లో ప్రగతి చురుకుగా లేనందువల్ల పెరుగుతున్న జనాభా జీవనోపాధికై వ్యవసాయరంగంపై ఆధారపడటం తప్పనిసరైంది. అందువల్ల వ్యవసాయరంగం మీద ఒత్తిడి ఎక్కువై కమతాల విభజన, విఘటనలతో పాటు ప్రచ్ఛన్న నిరుద్యోగిత అధికమవుతుంది.

2) నిరాశాపూరిత గ్రామీణ వాతావరణం: మనదేశంలో గ్రామీణ వాతావరణం నిరాశాజనకంగా వుండి, వ్యవసాయ ప్రగతికి ప్రతిబంధకంగా మారింది. గ్రామీణ ప్రాంతాలలోని ప్రజలు ఎక్కువగా పేదవారు, నిరక్షరాస్యులు, అందువల్ల వీరు మూఢనమ్మకాలకు, సనాతన సాంప్రదాయాలకు విలవినిస్తూ నూతన వ్యవసాయ వ్యూహం యెడల నిరాసక్తతను కనపరుస్తున్నారు. రైతులలో సంకుచిత ధోరణి ఏర్పడి ఉమ్మడి కుటుంబాల విచ్ఛిన్నమవడం, భూమిపై మక్కువ మొదలైన గ్రామీణ పరిస్థితుల వల్ల వ్యవసాయ కమతాలు విభజన, విఘటనలకు గురై వ్యవసాయ ఉత్పాదకత దెబ్బతింటుంది. గ్రామీణ ప్రాంతాలలో కక్షలు, కుట్రలు, తగాదాలు, కోర్టు వ్యవహారాలు మొదలైన వాటి కారణంగా నిరుత్సాహపూరితమైన ఉద్రిక్త వాతావరణం ఏర్పడి రైతులు తమ విలువైన సమయం, ధనం వృథా చేసుకుంటున్నారు. ఫలితంగా మనదేశ వ్యవసాయరంగంలో ఉత్పాదకత తక్కువగా ఉంది.

AP Inter 2nd Year Economics Study Material Chapter 4 వ్యవసాయ రంగం

3) అవస్థాపనా సౌకర్యాల కొరత: వ్యవసాయాభివృద్ధికి అవసరమైన పరపతి, రవాణా, మార్కెటింగ్, గిడ్డంగి, సౌకర్యాలు రైతుల అవసరాలకు సరిపడినంతగా లేవు. జాతీయ బ్యాంకులు, సహకార పరపతి సంస్థలు, వ్యవసాయ విస్తరణ సేవాకేంద్రాల ప్రోత్సాహం రైతులందరికి అందుబాటులో లేదు. ఈ విధమైన అవస్థాపనా సౌకర్యాల కొరత వ్యవసాయ ఉత్పాదకత పెరుగుదలకు ప్రతిబంధకంగా తయారైంది.

4) బ్రిటీష్ పాలనా ప్రభావం: బ్రిటీషువారు తమ పరిపాలనా కాలంలో భారతదేశాన్ని ఒక వలసదేశంగా భావించారే తప్ప మనదేశ వ్యవసాయాభివృద్ధికి ఏవిధమైన చర్యలు చేపట్టలేదు. వారనుసరించిన భూస్వామ్య విధానాలు, కౌలుదారి విధానాలు, భూమిశిస్తు వసూళ్ళు భారత వ్యవసాయరంగ ప్రగతిని దెబ్బతీశాయి. మనదేశ వ్యవసాయ ఉత్పాదకత అల్పంగా వుండటానికి బ్రిటీషువారి పాలన చాలావరకు కారణమైంది.

II) వ్యవస్థాపూర్వక కారణాలు:
1) అల్ప కమతాల పరిమాణం: మనదేశంలో భూకమతాల పరిమాణం చాలా అల్పంగా ఉంది. జాతీయ సర్వేక్షణా సంస్థ నివేదిక ప్రకారం 1960 – 61లో రెండు హెక్టారుల కంటే తక్కువ పరిమాణం ఉన్న కమతాలు మొత్తం కమతాలలో 52 శాతం వుండగా 2010-11 నాటికి వీటి సంఖ్య 85 శాతానికి పెరిగింది. ఎక్కువ భూమి కొద్దిమంది భూస్వాముల చేతుల్లో కేంద్రీకృతమై ఉంది. వీరు వ్యవసాయ కార్యకలాపాలపై శ్రద్ధ చూపరు. వారసత్వ చట్టాలు, కమతాల విభజన, విఘటనల ఫలితంగా కమతాల పరిమాణం అల్పంగా వుండి తక్కువ భూమి ఎక్కువ మంది రైతుల ఆధీనంలో వుంది. చిన్న కమతాలు నూతన వ్యవసాయ కార్యకలాపాలకు అనుగుణంగా ఉండకపోవడం వల్ల వ్యవసాయ ఉత్పాదకత అల్పంగా ఉంది.

2) భూస్వామ్య వ్యవస్థలోని లోపాలు: బ్రిటీషువారి పరిపాలనా కాలంలో మనదేశంలో ఏర్పాటు చేసిన జమీందారీ పద్ధతి, జాగిర్దారీ పద్ధతి, మహల్వారీ పద్ధతి మొదలైన లోపభూయిష్టమైన భూస్వామ్య పద్ధతులు వ్యవసాయప్రగతిని ఆటంకపరచాయి. స్వాతంత్ర్యానంతరం రైత్వారీ పద్ధతి అమలులోకి వచ్చింది. ఈ విధానంలో కౌలుదారులకు కౌలుభద్రత, నిశ్చితమైన కౌలు పరిమాణం భూయాజమాన్యం హక్కులు వుండేవి కావు. ఈ అభద్రతల కారణంగా కౌలుదారుల వ్యవసాయంపై శ్రద్ధ చూపలేరు. ఫలితంగా వ్యవసాయరంగం యొక్క ఉత్పాదకత తగ్గింది.

3) మార్కెట్, పరపతి సౌకర్యాల కొరత: వ్యవసాయభివృద్ధికి అవసరమైన మార్కెట్ సౌకర్యాలు, రవాణా సౌకర్యాలు, పరపతి సౌకర్యాలు కొరత వలన నూతన పద్ధతిలో వ్యవసాయ కార్యకలాపాలను నిర్వహించడం కష్టమైంది. వీరికి కావలసిన పరపతి సముచితమైన వడ్డీరేట్లకు లభించదు. అంతేగాక ప్రభుత్వం ప్రకటించిన వ్యవసాయ ఉత్పత్తులకు అందించే రాయితీలు సంతృప్తికరంగా లేవు. ఈ కారణాల వల్ల అధిక దిగుబడినిచ్చే విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు, యంత్రాలు, నీటిపారుదల సౌకర్యాలను ఉపయోగించి నూతన పద్ధతులలో సాగుచేయడానికి బదులు సాంప్రదాయ పద్దతులలో సాగుచేస్తున్నారు. ఫలితంగా వ్యవసాయరంగంలో ఉత్పాదకత తగ్గింది.

III) సాంకేతిక కారణాలు:
1) పురాతన ఉత్పత్తి పద్ధతులు: భారతదేశంలోని రైతులు పేదరికం, అవగాహనారాహిత్యం కారణంగా పురాతన పనిముట్లు సహాయంతో సాంప్రదాయమైన వ్యవసాయ పద్ధతులలో సాగుచేయడం వల్ల పురాతన ఉత్పత్తి ఉత్పాదకత తక్కువగా వున్నాయని టి.డబ్ల్యు. హార్ట్ అనే ఆర్థికవేత్త అభిప్రాయపడినారు. నేటికి భారతీయ రైతులు కొడవళ్ళు, చెక్కనాగళ్ళు, ఎడ్లబండ్లు ఉపయోగిస్తున్నారు. వీరు అధిక దిగుబడినిచ్చే విత్తనాలు, ఎరువులను, క్రిమిసంహారక మందులను, యంత్రాలను పరిమితంగా వాడుచున్నారు. కాని ప్రభుత్వ నిర్విరామ కృషి, విద్యావ్యాప్తి ఫలితంగా ఇటీవల కాలంలో ఈ పరిస్థితులలో కొంతమేరకు మార్పు వచ్చింది.

2) నీటిపారుదల సౌకర్యాల కొరత: 2011 నాటికి వివిధ పంటల కింద సాగవుతున్న భూవిస్తీర్ణం 198.97 మిలియన్ హెక్టారులు వుండగా అందులో 89.36 మిలియన్ హెక్టారుల భూమికి మాత్రమే నీటిపారుదల సౌకర్యం వుంది. అంటే 55శాతం సాగు భూమికి వర్షాలే ఆధారం. అకాల, అల్ప, అనిశ్చిత వర్షాల వల్ల వర్షాధార ప్రాంతాలలో పంటలు దెబ్బతింటున్నాయి. ఈ పరిస్థితులలో నూతన వ్యవసాయ వ్యూహం దేశమంతా విస్తరించడం కష్టమై వ్యవసాయ ఉత్పత్తి, ఉత్పాదకాలు, తక్కువగా వున్నాయి.

3) వ్యవసాయ ఉత్పాదకాల కొరత: అధిక దిగుబడిని సాధించుటకు ఆధునిక ఉత్పాదకాల వినియోగం తప్పనిసరి. ఆధునిక ఉత్పాదకాలైన సంకరజాతి విత్తనాలు, రసాయనిక ఎరువులు, యంత్రాలు, క్రిమిసంహారక మందుల సరఫరా రైతుల అవసరాలకు సరిపడినంతగా లేదు. ఉత్పాదకాలు సరిపడినంతగా లభ్యం కానందువల్ల వాటి వినియోగం తగ్గి వ్యవసాయ ఉత్పత్తి, ఉత్పాదకత అల్పంగా వున్నాయి.

AP Inter 2nd Year Economics Study Material Chapter 4 వ్యవసాయ రంగం

IV) పర్యావరణ కారణాలు: వ్యవసాయ ఉత్పాదకతను నిర్ణయించడంలో పర్యావరణం పాత్ర ప్రముఖమైనది. భూసార క్షీణత, వాతావరణంలో మార్పులు, నీటికాలుష్యం, వాయు కాలుష్యం, మొదలైనవి వ్యవసాయ ఉత్పత్తి ఉత్పాదకాల మీద దుష్ప్రభావాన్ని చూపుతాయి. పంటల క్షీణతకు కింది పర్యావరణ ప్రతికూల అంశాలు కారణభూతాలు అవుతున్నాయి.

  1. భూతాపం.
  2. భూసారం క్షీణించడం.
  3. అధిక దిగుబడినిచ్చే విత్తనాలను ఉపయోగించి సాంద్రవ్యవసాయం చేయడం.
  4. మితిమీరి రసాయనిక ఎరువులను వాడటం.
  5. పోడు వ్యవసాయం.
  6. పర్యావరణ పరిరక్షణా ప్రణాళికలు లేకపోవడం.
  7. సాంప్రదాయ పంటలను సాగుచేయకపోవడం.

వ్యవసాయ ఉత్పాదకతను పెంచడానికి తీసుకోవలసిన చర్యలు:
ఏ అంశాలు వ్యవసాయ ఉత్పాదకత అల్పంగా ఉండటానికి కారణభూతాలు అవుతున్నాయో వాటికి పరిష్కారాలను సూచిస్తే వ్యవసాయ ఉత్పత్తి, ఉత్పాదకత పెరుగుతుంది.

1) భూసంస్కరణలు: భారత వ్యవసాయరంగంలోని వ్యవస్థాపూర్వక లోపాలను తొలగించడానికి స్వాతంత్య్రానంతరం భారతప్రభుత్వం “దున్నే వానికే భూమి’ అనే నినాదంతో భూసంస్కరణలను ప్రవేశపెట్టింది. అల్పకమతాల సమస్య పరిష్కారానికి కమతాల సమీకరణ, సహకార వ్యవసాయం మొదలైన కార్యక్రమాలను ప్రవేశపెట్టడం
జరిగింది.

2) జనాభా పెరుగుదలను అరికట్టడం: భారతదేశంలో జనాభావిస్ఫోటనం కొనసాగుతుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం జనాభా పెరుగుదల వార్షిక వృద్ధిరేటు 1.64 శాతంగా వుంది. భూమి మీద జనాభా ఒత్తిడిని తగ్గించడానికి వేగంగా పెరుగుతున్న జనాభాను నియంత్రించడంతోపాటు వ్యవసాయేతర రంగాల్లో ఉపాధి అవకాశాలను విస్తృత
పరచాలి.

3) నీటిపారుదల సౌకర్యాలు: వ్యవసాయానికి నీరు అత్యంత ఆవశ్యకమైన ఉత్పాదక వనరు. నీటిపారుదల సౌకర్యాల కల్పన కోసం ప్రభుత్వం విరివిగా భారీతరహా, మధ్యతరహా, చిన్న తరహా ప్రాజెక్టులను స్థాపించి నీటిపారుదల సౌకర్యాలు వున్న భూవిస్తీర్ణాన్ని పెంపొందించాలి.

4) వ్యవసాయ సేవాకార్యక్రమాల విస్తరణా సంస్థలు: వ్యవసాయ ఉత్పాదకతను పెంపొందించడానికి వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ (ATMA) పంటలలో భిన్నత్వం, జీవవైవిధ్య పరిరక్షణ, భూసార సంరక్షణ కోసం వాలు ప్రాంతాల వ్యవసాయ భూసాంకేతిక విజ్ఞానం (SALT), వ్యవసాయ ఉత్పత్తుల ధరలు, వివిధ పంటల రకాలకు సంబంధించిన సమాచారం అందించడానికి ఇ-వ్యవసాయం మొదలైన వ్యవసాయ విస్తరణా సేవా సంస్థలను, పథకాలను ప్రభుత్వం ఏర్పాటు చేయాలి.

5) అవస్థాపనా సౌకర్యాలు: వ్యవసాయ ఉత్పాదకతను అవస్థాపనా సౌకర్యాలు విశేషంగా ప్రభావితం చేస్తాయి. వ్యవసాయ ఉత్పాదకాలైన ఎరువులు, క్రిమిసంహారక మందులు, సంకరజాతి విత్తనాలతో పాటు అవస్థాపనా సౌకర్యాలైన రవాణా, పరపతి, గిడ్డంగులు, మార్కెటింగ్, నిరంతర విద్యుత్ సరఫరా మొదలైన వ్యవసారంగం యొక్క ఉత్పాదకత సామర్థ్యాన్ని పెంపొందిస్తాయి.

6) వ్యవసాయ యాంత్రీకరణ: వ్యవసాయ యాంత్రీకరణ వ్యవసాయరంగం యొక్క ఉత్పత్తిని, ఉత్పాదకతను పెంపొందిస్తుంది. ‘కాబట్టి వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా పంపుసెట్లు, ట్రాక్టర్లు, పంటమార్పిడి యంత్రాలు నాట్లు వేసే యంత్రాలు, డ్రిల్లర్లు మొదలైన వాటి వినియోగాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహించాలి.

7) మార్కెటింగ్, పరపతి సౌకర్యాలు: నూతన వ్యవసాయ వ్యూహం అమలుకు అధిక వ్యయంతో కూడుకున్న సంకరజాతి విత్తనాలు, రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందులు, యంత్రాలు, నీటిపారుదల సౌకర్యాలు మొదలైన వ్యవసాయ ఉత్పాదకాలను విరివిగా వినియోగించాలి. వాణిజ్య బ్యాంకులు, గ్రామీణ బ్యాంకులు, ప్రాథమిక సహకార పరపతి సంఘాలు అందించాలి.

AP Inter 2nd Year Economics Study Material Chapter 4 వ్యవసాయ రంగం

8) అక్షరాస్యతను పెంపొందించడం: భారతీయ రైతుల ఉత్పాదక సామర్థ్యాన్ని అక్షరాస్యత పెంపొందిస్తుంది. కాబట్టి ప్రభుత్వం స్వచ్ఛంద సంస్థలు విరివిగా వయోజన విద్యాకేంద్రాలను స్థాపించి రైతులను విద్యావంతులను చేయాలి. అప్పుడే రైతుల యొక్క ఉత్పాదక సామర్థ్యం పెరుగుతుంది.

9) వ్యవసాయ పరిశోధనలు: భారత వ్యవసాయ పరిశోధన మండలి, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, అనేక ఇతరసంస్థల కృషి, పరిశోధనల ఫలితంగా అధిక దిగుబడినిచ్చే సంకరజాతి విత్తనాలను సృష్టించడం జరిగింది. ఈ పరిశోధనలు భూసార పరీక్ష, భూసార పరిరక్షణ, తెగుళ్ళు నివారణ, నూతన వ్యవసాయ పరికరాల సృష్టి మొదలైన కార్యక్రమాలను కూడా విస్తరించాలి.

భారత ఆర్థిక వ్యవస్థపై హరిత విప్లవ ప్రభావం: హరిత విప్లవం భారత ఆర్థిక వ్యవస్థపై విశేష ప్రభావాన్ని చూపింది. హరిత విప్లవం వల్ల ఏర్పడిన సత్ఫలితాలను కింది విధంగా వివరించవచ్చు.
1) ఆహార ధాన్యాల ఉత్పత్తిలో పెరుగుదల: హరిత విప్లవం యొక్క ప్రత్యక్ష ఫలితం ఆహార ధాన్యాల ఉత్పత్తిలో అధిక పెరుగుదల సాధించడం. హరిత విప్లవం ప్రభావం వరి, గోధుమ ఉత్పత్తి మీద ఎక్కువ ఉంది. 1960-61లో వరి, ధాన్యం ఉత్పత్తి 35 మిలియన్ టన్నుల నుంచి 2011-12 నాటికి 104 మిలియన్ టన్నులకు పెరిగింది. గోధుమ ఉత్పత్తి 1960-61లో 11 మిలియన్ టన్నులు ఉండగా 2011-12 నాటికి 255 మిలియన్ టన్నులకు పెరిగింది. మొత్తం మీద ఆహార ధాన్యాల ఉత్పత్తి 2012-13 నాటికి 257 మిలియన్ టన్నులకు పెరిగింది.

2) వాణిజ్య పంటల ఉత్పత్తిలో పెరుగుదల: హరిత విప్లవం ప్రారంభంలో ఆహార పంటలకు మాత్రమే పరిమితమై వాణిజ్య పంటల మీద ఎలాంటి ప్రభావం చూపలేదు. హరిత విప్లవం 1973-74 తరువాత వాణిజ్య పంటలైన చెరకు ఉత్పత్తి మీద విశేషమైన ప్రభావాన్ని, నూనె గింజలు, బంగాలదుంపల ఉత్పత్తుల మీద గణనీయమైన ప్రభావాన్ని చూపింది. చెరకు ఉత్పత్తి 1960-61లో 110 మిలియన్ టన్నుల నుంచి 2011-12 నాటికి 358 మిలియన్ టన్నులకు పెరిగింది. నూనెగింజలు ఉత్పత్తి 1960-61లో 7 మిలియన్ల టన్నుల నుంచి 2011-12 నాటికి 30 మిలియన్ టన్నులకు పెరిగింది.

3) ఉపాధి అవకాశాల పెరుగుదల: హరిత విప్లవం ఫలితంగా సాగులోవున్న భూ విస్తీర్ణం, వ్యవసాయ ఉత్పత్తి, ఉత్పాదకత పెరిగింది. వ్యవసాయరంగంలో శ్రమశక్తి ఎక్కువ అవసరమయ్యే వరి, చెరకు, తోటపంటలు, బంగాళదుంపలు కూరగాయలు మొదలైన పంటలు సాగుచేయడం వల్ల ఉపాధి అవకాశాలు పెరిగాయి. అంతేగాక సాంద్ర వ్యవసాయంలో భాగంగా బహుళ పంటలు పండించటం వల్ల కూడా ఉపాధి అవకాశాలు వృద్ధి చెందాయి. కార్పొరేట్ కంపెనీలు వ్యవసాయరంగంలో చిల్లర అమ్మకాలు చేపట్టడంతో ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరిగాయి.

4) బలిష్టమైన ముందు, వెనుక బంధాలు: వ్యవసాయ పారిశ్రామిక రంగాలు రెండూ పరస్పరం ఒకదానిపై మరొకటి ఆధారపడే రంగాలు వ్యవసాయం పరిశ్రమలకు కావల్సిన ముడిసరుకులనూ అందిస్తుంది. దీన్నే “ముందువైపు బంధం” అంటారు. అనాదిగా బలిష్టంగా ఉంది. పరిశ్రమలు వ్యవసాయానికి అవసరమైన ఉత్పాదకాలను అందిస్తుంది. దీనిని “వెనుకవైపు బంధం” అంటారు. అయితే ఈ బంధం బలహీనంగా ఉంది. హరిత విప్లవ ఫలితంగా పారిశ్రామిక రంగం సరఫరా చేసే వ్యవసాయ ఉత్పాదకాలను విపరీతంగా గిరాకీ పెరిగింది. తద్వారా వెనుక వైపు బంధం కూడా బలిష్టమైనది. ఈ విధంగా వ్యవసాయ, పారిశ్రామిక రంగాలు రెండూ బలోపేతం చేయబడ్డాయి.

5) ఆదాయల్లో పెరుగుదల: ఈ నూతన వ్యవసాయ వ్యూహం రైతులు తాము పండించిన పంటలను శ్రేణీకరణ, ప్రామాణీకరణ చేసి మధ్యవర్తుల ప్రమేయం లేకుండా గిట్టుబాటు ధరలకు ప్రత్యక్షంగా చిల్లర వ్యాపారం చేసే కంపెనీలకు, అమ్ముకొనే అవకాశాలను కల్పించింది. ఈ కంపెనీలు రైతులకు లాభసాటి ధరలను, వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులను అందించడమే గాక ధరల నియంత్రణకు తోడ్పడ్డాయి. హరితవిప్లవ ఫలితంగా పంజాబ్, హర్యానా, మధ్యప్రదేశ్, గుజరాత్, తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల రైతుల ఆదాయాలు గణనీయంగా పెరిగాయి.

6) పేదరికం తగ్గుదల: హరిత విప్లవం ఉపాధి అవకాశాలను వ్యవసాయరంగంలోనే కాక వ్యవసాయేతర రంగాలైన రవాణా, రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందుల పరిశ్రమల్లో, బ్యాకింగ్, సేవారంగాల్లో ఉపాధిని * కల్పించింది. అంతేకాక హరితవిప్లవ ఫలితంగా ఆహారధాన్యాలలో లభించిన మిగులును ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా చౌక ధరలకు పేదవారికి అందించడం జరుగుతుంది. దీని ఫలితంగా పేదవారి వాస్తవిక ఆదాయం పెరిగి పేదరికం తగ్గుతుంది.

ప్రశ్న 5.
భారతదేశంలో వివిధ రకాల నీటిపారుదల సౌకర్యాలను వివరించి, నీటిపారుదల సౌకర్యాల ప్రాధాన్యతను వివరింపుము.
జవాబు:
వ్యవసాయాభివృద్ధికి నీటిపారుదల అత్యంత ఆవశ్యకమైన ఉత్పాదక వనరు. మనదేశంలో కొన్ని ప్రాంతాలలో వర్షపాతం కొరతగాను అనిశ్చితంగా వుంది. ఈ పరిస్థితులలో వర్షంపై ఆధారపడి సంవత్సరం పొడవునా వ్యవసాయ కార్యకలాపాలు నిర్వహించడం అసాధ్యం. నేటికీ సాగుచేయబడుతున్న భూవిస్తీర్ణంలో 55 శాతం వర్షపాతంపై ఆధారపడి వుంది. వర్షంపై ఆధారపడి సాగుచేయడం అంటే “రుతువులతో జూదం ఆడటమే.”

AP Inter 2nd Year Economics Study Material Chapter 4 వ్యవసాయ రంగం

1) కాలువలు: భారతదేశంలో వ్యవసాయరంగానికి వున్న నీటిపారుదల వనరులలో కాలువలు అత్యంత ప్రధానమైనవి. కాలువల తవ్వకం, నిర్వహణ అధిక వ్యయంతో కూడుకున్న కార్యక్రమం. కాని ఎక్కువ భూవిస్తీర్ణానికి కాలువలు నీటిపారుదల సౌకర్యాలను అందిస్తాయి. ప్రధానంగా ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాలలో కాలువలు ఎక్కువ భూమికి నీటిపారుదల సౌకర్యాలు కల్పిస్తున్నాయి. మొత్తం సాగుభూమిలో కాలువలు ద్వారా సాగవుతున్న భూవిస్తీర్ణం 2011-12 నాటికి 16.1 మిలియన్ల హెక్టారులుగా వుంది. కాలువలను ప్రధానంగా రెండు రకాలుగా వర్గీకరించారు.
ఎ) శాశ్వత కాలువలు
బి) వెల్లువ నీటికాలువలు

ఎ) శాశ్వత కాలువలు: నదులపై అడ్డంగా ఆనకట్టలు కట్టగా ఏర్పడిన జలాశయాలకు ఈ కాలువలను అనుసంధానం చేస్తారు. అందువల్ల ఇవి వ్యవసాయానికి సంవత్సరం పొడవునా నీటిని అందించి శాశ్వత కాలువలుగా పిలవబడుతున్నాయి. ఈ కాలువలు ఎక్కువ విస్తీర్ణంలో భూమికి నీటిని అందిస్తాయి.

బి) వెల్లువ నీటికాలువలు: వరదలు వచ్చినపుడు పంటలు ముంపునకు గురికాకుండా ఈ కాలువలను ఏర్పాటు చేస్తారు. అందువల్ల వీటిని “వెల్లువ నీటికాలువలు” అంటారు. వేసవికాలంలో ఈ కాలువలు పూర్తిగా ఎండిపోతాయి. కరువు కాటకాల సందర్భాలలో అవసరమైతే అల్ప భూమివిస్తీర్ణానికి సాగునీరు అందించడానికి కూడా నీటిని ఉపయోగిస్తారు.

2) బావులు: బావులు ఆధారపడదగిన ముఖ్యమైన నీటి వనరులు. బావులను సాధారణ బావులని, గొట్టపు బావులని రెండు రకాలుగా వర్గీకరించారు. సాధారణ బావులు ద్వారా సాగవుతున్న భూవిస్తీర్ణం గొట్టపు బావుల ద్వారా సాగవుతున్న భూవిస్తీర్ణం కంటే చాలా తక్కువగా వుంది.

3) చెరువులు: సాధారణంగా బావులు, కాలువలు ద్వారా, నీటిపారుదల సౌకర్యాలు లభ్యంకాని ప్రాంతాలలో చెరువులు ప్రధాన నీటిపారుదల వనరులు. చెరువులు వర్షంతో నిండి రైతులకు అవసరమైనపుడు నీరు అందిస్తాయి. దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో చెరువుల ద్వారా సాగుచేస్తున్న భూవిస్తీర్ణం అధికంగా
ఉంది.

నీటిపారుదల ప్రాధాన్యత:
1) అకాల అనిశ్చిత వర్షాలు: వర్షాలు రుతువులపై ఆధారపడి సంవత్సరంలో నాలుగు నెలలకు మాత్రమే పరిమితమై వుంటాయి. కొన్నిసార్లు రుతువుల్లో సైతం వర్షపాతం అల్పంగా ఉండటమే గాక, అకాల వర్షాలు వస్తుంటాయి. నీటిపారుదల సౌకర్యాలను విస్తృత పరుచుట ద్వారా కరువుకాటకాలను సమర్థవంతంగా నియంత్రించవచ్చు.

2) ఉత్పాదకత పెరుగుదల: నీటిపారుదల సౌకర్యాలు పుష్కలంగా వున్నచోట వ్యవసాయ ఉత్పాదకత ఎక్కువగా వుంటుంది. నీటిపారుదల సౌకర్యాలు వున్నప్పుడే ఆధునిక వ్యవసాయ ఉత్పాదకాలైన అధిక దిగుబడినిచ్చే సంకరజాతి విత్తనాలు, ఎరువులు మొదలైన వాటిని వినియోగించడానికి వీలవుతుంది. ఫలితంగా ఆహారధాన్యాల ఉత్పత్తిలో వార్షిక పెరుగుదల 1.6 శాతం నుండి 2.6 శాతానికి పెరిగింది. అదే నీటిపారుదల సౌకర్యాలు అల్పంగా వున్న ప్రాంతాల్లో వ్యవసాయ ఉత్పాదకతలో పెరుగుదల 1శాతం లేదా గమనించలేనంత తక్కువగా నమోదైంది.

3) బహుళ పంటలు పండించడం: భారతదేశం ఉష్ణమండల, ఉప ఉష్ణమండల శీతోష్ణస్థితులు విస్తరించి వున్నాయి. ఈ దేశానికి సంవత్సరమంతా పంటలు పండించగల సామర్థ్యం వుంది. మనదేశంలో వర్షపాతం నాలుగు నెలలలోపు కాలానికి మాత్రమే పరిమితమైంది. కాబట్టి నీటిపారుదల సౌకర్యాలు కల్పిస్తే సంవత్సరమంతా బహుళ పంటలు పండించవచ్చు.

4) నూతన వ్యవసాయ వ్యూహంలో ప్రధానపాత్ర: నూతన వ్యవసాయ వ్యూహంలో భాగంగా ప్రవేశపెట్టబడిన అధిక దిగుబడినిచ్చే సంకరజాతి విత్తనాలను, రసాయనిక ఎరువులను విజయవంతంగా వినియోగించాలంటే సకాలంలో, సరిపడినంత నీటిపారుదల సౌకర్యాలు అవసరం. ఈ విత్తనాలు, ఎరువుల వినియోగానికి క్రమబద్ధంగా పుష్కలంగా నీటిని అందించాలి. నీటిపారుదల సౌకర్యాలు కల్పిస్తే నూతన వ్యవసాయ వ్యూహం కిందసాగులో వున్న భూవిస్తీర్ణం పెరుగుతుంది.

5) సాగుభూమి విస్తీర్ణంలో పెరుగుదల: భూవినియోగ గణాంకాల ప్రకారం మనదేశంలో లెక్కించిన మొత్తం భూమి 2009-10 నాటికి 305.56 మిలియన్ల హెకార్టు. ఇందులో 42.95 మిలియన్ల హెక్టార్లు వ్యవసాయం చెయ్యని భూములు కాగా 26.23 మిలియన్ల హెక్టార్లు బంజరు భూములుగా వున్నాయి. నీటిపారుదల సౌకర్యాల కల్పిస్తే నిరుపయోగంగా వున్న ఈ భూములను కొంతమేరకు సాగులోకి తీసుకురావచ్చు.

6) సంపద పెరుగుదల: కరువు కాటకాలు సంభవించినప్పుడు సాధారణంగా వ్యవసాయ ఉత్పత్తులు అస్థిరతకు లోనవుతాయి. కాని నీటిపారుదల సౌకర్యాల కరువు కాటకాల సమయంలో పంటలను రక్షించి వ్యవసాయ ఉత్పత్తులను ఒడిదుడుకులకు గురికాకుండా స్థిరీకరిస్తాయి. ఉత్పత్తులలో స్థిరీకరణ సాధించడం ద్వారా ఉపాధి అవకాశాలు, ఆదాయాలు పరిరక్షించబడి సంపద స్థిరంగా పెరుగుతుంది.

AP Inter 2nd Year Economics Study Material Chapter 4 వ్యవసాయ రంగం

7) పరోక్ష ప్రయోజనాలు: నీటిపారుదల సౌకర్యాలను దేశం నలుమూలలకు విస్తరింపజేయడం ద్వారా ఆహారధాన్యాలు ఉత్పత్తిలో అసమానతలు రూపుమాసిపోతాయి. అంతేకాక వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో ఉత్పత్తి పెరుగుతుంది. ఈ విధంగా సాధించబడిన పెరుగుదల వ్యవసాయ ఉత్పతుల ధరల స్థిరీకరణకు తోడ్పడుతుంది. భారత ఆర్థికవ్యవస్థ ప్రాధాన్యతా రంగాల్లో ఒకటైన వ్యవసాయ రంగాన్ని ప్రగతి ప్రధాన నడపడంలో నీటిపారుదల సౌకర్యాలు కీలక భూమికను పోషిస్తున్నాయి.

ప్రశ్న 6.
భారతదేశంలో కమతాల పరిమాణం అల్పంగా ఉండటానికి గల కారణాలేవి ? కమతాల పరిమాణం అల్పంగా ఉండటం వల్ల ఏర్పడే సమస్యలు సూచింపుము.
జవాబు:
రైతు వ్యవసాయ కోసం వినియోగించే భూమి పరిమాణానికి “భూకమతం” అంటారు. కుటుంబ సభ్యులందరికి సముచిత జీవనప్రమాణం, ఉపాధి అవకాశాలు కల్పించే భూమి పరిమాణాన్ని “ఆర్థికకమతం” అంటారు. భారతదేశంలో రైతులు సాగుచేస్తున్న భూకమతాలు చిన్నవిగా ఉండటమే గాక కాలక్రమేణ తగ్గిపోతున్నాయి. మనదేశంలో కమతాల సగటు పరిమాణం 1980-81లో 1.84 హెక్టార్లు వుండగా 2010-11 నాటికి 1.16 హెక్టార్లకు తగ్గింది. కాని అమెరికాలో కమతాల సగటు పరిమాణం 122.5 హెక్టార్లుగా వుంది.

భారతదేశంలో కమతాల పరిమాణం అల్పంగా వుండటానికి గల కారణాలు: మనదేశంలో కమతాల సగటు పరిమాణం అల్పంగా ఉన్నందువల్ల వ్యవసాయ ప్రగతి కుంటుపడి ఉత్పత్తి, ఉత్పాదకత తక్కువగా ఉన్నాయి. అందువల్ల ఈ సమస్యకు పరిష్కార మార్గాలు సూచించాలంటే అందుకు గల కారణాలను అన్వేషించాలి.

1) వారసత్వ చట్టాలు: మనదేశంలో కమతాల విభజన, విఘటనలకు వారసత్వ చట్టాలు ముఖ్య కారణం. హిందూ, మహమ్మదీయ చట్టాల ప్రకారం పిత్రార్జితమైన ఆస్తిని పంచుకోవడానికి కుమారులు మరియు కుమార్తెలు అర్హులు. ఈ కారణంగా కమతాల పరిమాణం విభజనకు, విఘటనకు లోనై కాలక్రమేణా తగ్గిపోతుంది.

2) భూమిపై జనాభా ఒత్తిడి: మనదేశంలో జనాభా పెరుగుదల రేటు సంవత్సరానికి 1.64 శాతంగా వుంది. జనాభా పెరుగుదల రేటు వేగంగా ఉన్నప్పటికీ వ్యవసాయ యోగ్యమైన భూవిస్తీర్ణంలో పెరుగుదలరేటు అత్యల్పంగా వుంది. అంతేగాక మనదేశంలో వ్యవసాయేతర రంగాలు వేగంగా విస్తరించక పోవడం వల్ల పెరుగుతున్న జనాభా వ్యవసాయరంగాన్ని ఆశ్రయించడంలో కమతాల విభజన విఘటనలకు దారితీస్తుంది.

3) ఉమ్మడి కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నమవడం: తరతరాలుగా కుటుంబ సభ్యులు కలిసి జీవించే ఉమ్మడి కుటుంబాలు పాశ్చాత్యీకరణ వల్ల విచ్ఛిన్నమై వాటాస్థానంలో వ్యక్తిగత కుటుంబాలు ఆవిర్భవించాయి. వ్యక్తిగత కుటుంబాల సంఖ్య పెరిగి, వ్యవసాయ భూమి అనేకసార్లు విభజనకు గురై కమతాల సగటు పరిమాణం క్రమేపి తగ్గిపోతున్నది.

4) గ్రామీణ రుణగ్రస్తత: గ్రామీణ ప్రాంతాలలోని రైతులు సంస్థాపరమైన పరపతి సౌకర్యాల అందుబాటులో లేక వడ్డీ వ్యాపారస్తులపై ఆధారపడి పీకల్లోతు అప్పుల్లో మునిగి ఉన్నారు. కొంతమంది వడ్డీ వ్యాపారస్తులు, చిన్న, సన్నకారు రైతుల భూమిని కబళించాలనే ఉద్దేశంలో వీరికి భూముల తనఖా మీద అప్పులిస్తుంటారు. అంతేకాక వీరు మోసపూరిత కార్యకలాపాలను అవలంభిస్తారు. రైతుల బాకీల పరిష్కారం కొరకు తమ భూమిని అమ్ముకునే పరిస్థితులు కల్పిస్తారు. తత్ఫిలితంగా వ్యవసాయదారుల భూకమతాలు క్రమేపి తగ్గిపోతున్నాయి.

5) భూమిపై మక్కువ ఎక్కువ: సాధారణంగా గ్రామీణ ప్రాంత రైతుల మానసిక, సాంఘిక, ఆర్థిక కారణాల వల్ల భూమిపై మక్కువ కలిగి ఉంటారు. వీరు భూమి కలిగి ఉండటాన్ని ఆస్థిగా కాక సాంఘిక హోదాగా, గౌరవంగా భావిస్తారు. అందువల్ల వీరు భూమిపై మమకారాన్ని అనుబంధాన్ని పెంచుకొని తమకు వారసత్వంగా లభించిన భూమి పరిమాణం ఎంత స్వల్పమైనప్పటికీ వదులుకోవడానికి ఇష్టపడరు. భూమి మీద ఉన్న ఈ అతి మక్కువ వల్ల ‘కమతాల పరిమాణం క్రమంగా క్షీణిస్తుంది.

6) చేతి వృత్తుల, కుటీర పరిశ్రమలు క్షీణించడం: పారిశ్రామికీకరణకు పూర్వం గ్రామీణ ప్రాంతాలలో చేతి వృత్తులు, కుటీర పరిశ్రమలు వైభవోపేతంగా విరాజిల్లుతుండేవి. పారిశ్రామికీకరణ తర్వాత అధునాతన యంత్రాల సహయంతో తయారయ్యే వస్తువుల పోటీకి తట్టుకోలేక చేతివృత్తులు, కుటీరపరిశ్రమలు కాలక్రమేణా క్షీణించడం ప్రారంభించాయి. ఈ రంగాలపై ఆధారపడిన గ్రామీణ వృత్తి కళాకారులు, ఇతరులు జీవనోపాధికై వ్యవసాయరంగంపై ఆధారపడటం తప్పనిసరైంది. అందువల్ల కమతాల పరిమాణం క్షీణించడం ప్రారంభమైంది.

చిన్న కమతాల పరిమాణం వల్ల ఏర్పడే దుష్పరిణామాలు:
1) వ్యవసాయపు భూమి వృథా: విభజన, విఘటన వల్ల కమతాల సంఖ్య పెరిగే కొద్ది విలువైన వ్యవసాయ భూమి గట్లు, కంచెలు, కాలిబాటలు మొదలైన వాటి రూపంలో మొత్తం భూమిలో మూడు నుండి నాలుగు శాతం వరకు వృథా అవుతుంది. మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో కమతాల సగటు పరిమాణం 0.006 ఎకరాలుగా వుంది. దీనిని బట్టి మనదేశంలో అల్పకమత పరిమాణ తీవ్రతను అర్థంచేసుకోవచ్చు.

AP Inter 2nd Year Economics Study Material Chapter 4 వ్యవసాయ రంగం

2) పర్యవేక్షణ కష్టం: మనదేశంలో రైతులుకున్న భూమి చిన్నచిన్నకమతాలుగా వేర్వేరు ప్రాంతాలలో విస్తరించి వుంటాయి. అంతేగాక వ్యవసాయ కార్యకలాపాలు రుతుబద్ధకంగా వుంటాయి. అందువల్ల వేర్వేరు ప్రాంతాలలో నిర్వహింపబడే వ్యవసాయ కార్యకలాపాలను వ్యవసాయదారులు ఏకకాలంలో పర్యవేక్షించలేరు. ఫలితంగా వ్యవసాయ ఉత్పాదక సామర్థ్యం, ఉత్పత్తి క్షీణిస్తున్నాయి.

3) ఆధునిక వ్యవసాయ పద్ధతులకు అవకాశం తక్కువ: వ్యవసాయకమతాలు చిన్నవిగా వున్నప్పుడు వ్యవసాయ కార్యకలాపాలలో యంత్రాలను వినియోగించడం కష్టం. అంతేకాక ఈ అల్పకమతాల అధిక పెట్టుబడితో కూడుకున్న ట్రాక్టర్లు విద్యుత్ మోటార్లు, డ్రిల్లర్లు, స్ప్రేయర్లు, పంటమార్పిడి యంత్రాలను వినియోగించి ఆధునిక పద్ధతుల్లో సాగుచేయడానికి అననుకూలం. తత్ఫలితంగా వ్యయసాయ యాంత్రీకరణ లోపించి ఉత్పత్తి క్షీణిస్తుంది.

4) ఉత్పత్తి పరికరాల రవాణా: కమతాల విభజన, విఘటనల ఫలితంగా వేర్వేరు ప్రాంతాలలో విస్తరించి ఉన్న చిన్న కమతాలలో వ్యవసాయ కార్యకలాపాల నిర్వహణకై వ్యవసాయ పరికరాలను యంత్రాలను, పశువులను, విత్తనాలను ఇతర ఉత్పత్తి పరికరాలను ఒకచోటు నుంచి వేరొక చోటుకు రవాణా చేయవలసి వుంటుంది. అందువల్ల రైతుల సమయం, ధనం వృథా అవుతాయి.

5) సరిహద్దు తగాదాలు, కోర్టు వ్యవహారాలు: సాధారణంగా చిన్న కమతాల సంఖ్య పెరిగే కొలది గ్రామీణ ప్రాంతాలలో కాలిబాటలు, సరిహద్దులు, కంచెలు, పంటలను దొంగిలించడం, దొంగతనంగా పశువులను మేపడం మొదలైన విషయాలలో గొడవలు జరగడం సర్వసాధారణం. వీటివల్ల గ్రామీణ వాతావరణం, కలుషితమై ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడతాయి. రైతులు న్యాయస్థానాలు చుట్టూ తిరుగుతూ తమ విలువైన సమయాన్ని, ధనాన్ని వృథా చేసుకుంటూ వ్యవసాయ కార్యకలాపాలను అశ్రద్ధ చేస్తున్నారు.

6) ప్రచ్ఛన్న నిరుద్యోగిత: వ్యవసాయేతర రంగాలలో ఉపాధి అవకాశాలు పెరగకపోవడంతో అవకాశాలు కొరవడి రైతు కుటుంబ సభ్యుల తప్పనిసరి పరిస్థితులలో జీవనోపాధికై తమ చిన్న వ్యవసాయ కమతాలలోనే పనిచేయడం తప్పనిసరైంది. ఫలితంగా వ్యవసాయరంగంలో ప్రచ్ఛన్న నిరుద్యోగిత ఏర్పడింది.

7) శ్రమ, మూలధనాల అల్పవినియోగం చిన్న రైతులు శ్రామికులను, మూలధనాన్ని పూర్తిగా వినియోగించుకోలేరు. అంతేకాక మార్కెటింగ్, పరపతి సౌకర్యాలను కూడా సరిపడినంతగా పొందలేరు. అందువల్ల ఉత్పత్తి వ్యయం పెరిగి తగిన ప్రతిఫలం పొందలేకున్నారు.

రైతులు తమ చిన్న వ్యవసాయ కమతాలలో భూసారపరిరక్షణ, భూమి పునరుద్ధరణ వంటి అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టలేరు. అంతేకాక పంటల మార్పిడి, పంటల విరామం వంటి నూతన పద్ధతులలో వ్యవసాయ కార్యకలాపాలను నిర్వహించలేరు.

ప్రశ్న 7.
సహకార వ్యవసాయం వల్ల లభించే లాభాలను, నష్టాలను వివరింపుము.
జవాబు:
సహకార వ్యవసాయం – అర్థం: “ఒక్కరికోసం అందరు – అందరికోసం ఒక్కరు” అనే మహత్తర భావనతో 1904 సంవత్సరంలో మనదేశంలో సహకార వ్యవసాయానికి పునాదులు ఏర్పడ్డాయి. గ్రామంలోని రైతులంతా స్వచ్ఛందంగా ఒక సంఘంగా ఏర్పడి తమ భూములు, వ్యవసాయ పరికరాలు, పశువులు మొదలైన ఉత్పాదకాలన్నంటిని సంఘానికి అందించి మొత్తం భూమిని ఏకఖండంగా చేసి సహకార ప్రాతిపదికన నిర్వహించే వ్యవసాయాన్ని “సహకార వ్యవసాయం” అంటారు. పండిన పంటను రైతులు సంఘానికి అందించిన భూమి అనుపాతానికి అనుగుణంగా పంచుకొంటారు. ఈ విధంగా రైతులు భూమిమీద తమ యాజమాన్యపు హక్కులను కోల్పోరు.

సహకార వ్యవసాయం – ప్రయోజనాలు:
1) ఉత్పత్తిలో పెరుగుదల: సహకార వ్యవసాయంలో భూములన్నింటినీ ఏకఖండంగా చేయడంలో గట్లు, కాలిబాటల రూపంలో వుండే భూములు, బంజరు భూములు కూడా సాగులోకి తేవడంవల్ల సాగులో వున్న భూవిస్తీర్ణం పెరుగుతుంది. అందువల్ల వ్యవసాయ ఉత్పత్తి, అధికమై విక్రయం కాగల మిగులు పరిమాణం పెరుగుతుంది.

2) పెద్దతరహా ఆదాలు: సహకార వ్యవసాయం ద్వారా ఉత్పత్తిలో సాంకేతిక, మార్కెటింగ్, ద్రవ్యపరమైన ఆదాలు లభిస్తాయి. అందువల్ల ఉత్పత్తి వ్యయాలు తగ్గి ఉత్పత్తిలో పెద్దతరహా ఆదాలు లభిస్తాయి.

3) వ్యవసాయాభివృద్ధి కార్యక్రమాలు: సహకారవ్యవసాయం, పెద్దతరహా వ్యవసాయం, అయినందువల్ల భూసార సంరక్షణ భూమి పునరుద్ధరణ, గొట్టపుబావులు త్రవ్వకం మొదలైన కార్యక్రమాలను సులభంగా ఏర్పాటు చేసుకోవచ్చు. అధిక పెట్టుబడి అవసరమయ్యే ఈ కార్యకలాపాలను సంఘంస్థాయిలో సమిష్టిగా చేపట్టి వ్యవసాయాభివృద్ధిని సాధించవచ్చు.

4) నూతన వ్యవసాయ సాంకేతిక విజ్ఞానం సహకార వ్యవసాయంలో నూతన వ్యవసాయ సాంకేతిక విజ్ఞానాన్ని పెద్ద తరహాలో ప్రవేశపెట్టవచ్చు. అందువల్ల సగటు వ్యయం తగ్గి లాభాల స్థాయి పెరుగుతుంది.

5) సమర్థవంతమైన క్షేత్ర నిర్వహణ: విస్తృత ప్రాతిపదికన జరుగుతున్న సహకార వ్యవసాయంలో వ్యవసాయ శాస్త్రవిజ్ఞాన నిపుణుల సేవలను వినియోగించి క్షేత్ర నిర్వహణను సమర్ధవంతంగా చేపట్టవచ్చు. అంతేకాక శ్రమ విభజనను ప్రవేశపెట్టి వ్యవసాయంలో తక్కువ పెట్టుబడితో అధిక ఫలితాలు పొందవచ్చు.

AP Inter 2nd Year Economics Study Material Chapter 4 వ్యవసాయ రంగం

6) వ్యవసాయరంగంలో ఉద్యోగిత అవకాశాలు: సహకార వ్యవసాయ విధానంలో సాంద్ర, విస్తృత వ్యవసాయానికి అవకాశాలు ఎక్కువ ఫలితంగా శ్రామికులకు డిమాండ్ పెరిగి రుతుసంబంధిత, ప్రచ్ఛన్న, నిరుద్యోగితలు తగ్గి ఉపాధి, అవకాశాలు పెరుగుతాయి.

7) సాంఘీక సమానత్వం: సహకార సంఘాలలోని రైతులందరూ పరస్పరం సహకరించుకుంటూ, సమిష్టిగా ఆలోచిస్తూ, ఉమ్మడిగా వ్యవసాయ కార్యకలాపాలు చేపట్టడం ద్వారా వారి మధ్య స్నేహం, సౌభ్రాతృత్వం ఏర్పడి సాంఘిక సమానత్వం సాధించబడుతుంది.

సహకార వ్యవసాయంలోని సమస్యలు:
1) రైతుల వ్యతిరేకత: సహకార వ్యవసాయ విధానంలో రైతులకు తమ భూముల మీద యాజమాన్యపు హక్కులు కోల్పోతామనే అపోహలుండేవి. అంతేగాక తాము శ్రామికుల స్థాయికి దిగజారుతామనే ఎక్కువమంది రైతుల విశ్వాసం. అందువల్ల వ్యతిరేకత ఈ కార్యక్రమ ప్రగతికి ప్రతిబంధకమైంది.

2) నిర్వహణ సమస్యలు: సాధారణంగా భారతీయ వ్యవసాయదారులకు చిన్న కమతాల నిర్వహణలో మాత్రమే సమర్ధులు. వీరికి పెద్ద కమతాలను నిర్వహించగల నిపుణత, దక్షత లేదు. అందువల్ల గ్రామీణ ప్రాంతాలలో నిపుణుల |కొరతవల్ల సహకార వ్యవసాయం నిరుత్సాహపరచబడింది.

3) నిరుద్యోగిత: సహకార వ్యవసాయ నిర్వహణలో భారీ ఎత్తున యంత్రాలను ఉపయోగించడానికి అవకాశాలు ఎక్కువ. వ్యవసాయ యాంత్రీకరణ వల్ల శ్రామికులు ఉపాధి కోల్పోవడంతో నిరుద్యోగిత మరింత అధికమవుతుంది.

4) పెద్ద రైతుల ఆధిపత్యం: సహకార వ్యవసాయం నిర్వహణలో పెద్దరైతుల ఆధిపత్యం కొనసాగి, చిన్న రైతుల ప్రయోజనాలు దెబ్బతినే అవకాశాలు ఎక్కువ. పెద్ద రైతులు చిన్న రైతులను ఎప్పటికీ తమలో సమానంగా చూడరనేది దాగిన సత్యం. అందువల్ల ఈ విధానంలో సమానత్వం సాధించడం సాధ్యం కాదు.

5) శిక్షణ, పొందిన సిబ్బంది కొరత: విస్తృత ప్రతిపాదికన జరిగే సహకార వ్యవసాయాన్ని నిర్వహించడానికి | శిక్షణ పొందిన నిపుణులు అవసరం. అయితే గ్రామీణ ప్రాంతాల్లో వీరి సంఖ్యా స్వల్పంగా ఉంది.

6) ఇతర సమస్యలు:

  1. రైతులలో సహకార వ్యవసాయం పట్ల ఆసక్తిని ప్రేరేపించకుండా పూర్తిగా స్వచ్ఛంద ప్రాతిపదికన ఈ విధానాన్ని ఏర్పరచడం వల్ల విఫలమైంది.
  2. సహకార వ్యవసాయం ద్వారా లభించిన ఉత్పత్తి ఫలాలు ఏ ప్రాతిపదికన రైతులు, వ్యవసాయ కూలీల మధ్య పంపిణీ చేయాలి అన్న విషయం పట్ల నిర్థిష్ట ప్రమాణాలు లేవు.

ప్రశ్న 8.
భారతదేశంలో కౌలు సంస్కరణలను వివరింపుము.
జవాబు:
ఏ రైతులు జీవనోపాధి కోసం, భూస్వాముల నుంచి భూమిని తీసుకొని సాగుచేస్తారో వారినే కౌలుదార్లు అంటారు. వీరిని మూడు రకాలుగా వర్గీకరించారు.

  1. జిరాయితీ హక్కులున్న కౌలుదార్లు
  2. ఉపకౌలుదార్లు
  3. ఏ హక్కులు లేని కౌలుదారులు.

జిరాయితీ హక్కులున్న కౌలుదార్లు:
1) జిరాయితీ హక్కులున్న కౌలుదార్లను శాశ్వత కౌలుదారులంటారు. వీరికి తమ అధీనంలోని భూములపై యాజమాన్యపు హక్కులుంటాయి. వీరు కౌలు సక్రమంగా చెల్లిస్తున్నంత కాలం వీరిని భూస్వాములు భూమి నుంచి తొలగించలేరు. వీరు చెల్లించాల్సిన కౌలు పరిమాణం ముందుగా నిర్ణయించబడి కౌలు భద్రత కల్గి ఉంటారు.

2) ఉపకౌలుదారులు: ఉపకౌలుదారులను “తాత్కాలిక కౌలుదారులు” అంటారు. శాశ్వత కౌలుదారులు తమ అధీనంలోని భూమిని ఇతరులకు కౌలుకిస్తారు. వీరినే ఉపకౌలుదారులు అంటారు. వీరికి తాము వ్యవసాయం చేస్తున్న భూములపై ఎలాంటి హక్కులుండవు.

3) ఏ హక్కులు లేని కౌలుదార్లు ఈ కౌలుదారుల పరిస్థితి అనిశ్చితం, దయనీయం, కౌలు పరిమాణాన్ని పెంచడం, భూమి నుంచి తొలగించడం వంటి చర్యల వల్ల వీరు దోపిడికి గురి అవుతారు.

కౌలుదారులను దోపిడి నుంచి రక్షించడానికి ప్రభుత్వం కౌలు సంస్కరణలు చేపట్టింది. కౌలుదారులు కౌలు భద్రత కల్పించడం, కౌల పరిమాణాన్ని నిర్ణయించడం కౌలుదారులకు యాజ్యమాన్యపు హక్కులు కల్పించడం కౌల సంస్కరణలలో ప్రధాన అంశాలు.

1) కౌలు పరిమాణం క్రమబద్ధీకరణ: స్వాతంత్ర్యానికి పూర్వం మనదేశంలో కౌలుపరిమాణం చాలా ఎక్కువగా ఉండేది. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దేశించిన కౌలపరిమాణంలో వ్యత్యాసాలున్నాయి. చట్ట ప్రకారం నిర్ణయించిన కౌలు పరిమాణం కంటే వాస్తవంగా చెల్లించే కౌలు పరిమాణం ఎక్కువగా ఉంది. దీనికి ప్రధాన కారణం, భూమి మీద జనాభా ఒత్తిడి ఎక్కువగా ఉండటం.

2) కౌలు భద్రత: మనదేశంలో కౌలుదారులు భూస్వాముల దయాదాక్షిణ్యాలపై ఆధారపడి వ్యవసాయం చేస్తుంటారు. అందువల్ల కౌలుదారులు వ్యవసాయ కార్యకలాపాలపై శ్రద్ధ చూపేవారు కాదు. కౌల భద్రత ఉన్నప్పుడే మీరు వ్యవసాయ కార్యకలాపాలపై శ్రద్ధ చూపుతారు. అప్పుడు మాత్రమే వారు భూమి అభివృద్ధి కార్యక్రమాలు, భూసార పరిరక్షణ వంటి కార్యక్రమాలు నిర్వహించగలరు.

AP Inter 2nd Year Economics Study Material Chapter 4 వ్యవసాయ రంగం

3) కౌలుదారులకు యాజమాన్యపు హక్కులు: “దున్నేవానికే భూమి” అనేది మన దేశ కౌలు సంస్కరణల ప్రధానోద్దేశం. ఈ లక్ష్య సాధన కోసం అనేక రాష్ట్ర ప్రభుత్వాలు కౌలదారులకు యాజమాన్యపు హక్కులు కల్పిస్తూ శాసనాలు రూపొందించి అమలు చేస్తున్నాయి. ఈ చర్యల ఫలితంగా 12. 42 మిలియన్ల కౌలదారులకు 6.32 మిలియన్ల హెక్టారుల భూమిపై యాజమాన్యపు హక్కులు లభించాయి.

ప్రశ్న 9.
భారతదేశంలో వివిధ రకాల భూ సంస్కరణలను సంక్షిప్తంగా వివరింపుము.
జవాబు:
వ్యవసాయాభివృద్ధి కొరకు ఉత్పత్తిని అధికం చేయుటకు, ప్రణాళిక బద్ధంగా ఆర్థికాభివృద్ధిని సాధించుటకు, సాంఘిక న్యాయాన్ని చేకూర్చుటకు మనదేశంలో భూ సంస్కరణలు అమలులోకి వచ్చాయి.
1) మధ్యవర్తుల తొలగింపు: మనదేశంలో భూ సంస్కరణలను అమలు చేయడంలో భాగంగా మధ్యవర్తులను తొలగించడమైనది. జమీందారి విధానం, జాగీరుదారుని విధానం, రైత్వారీ విధానంలోని లోపాలను తొలగించడం. 1948లో మధ్యవర్తుల తొలగింపు చట్టం చేశారు. ఫలితంగా 30 లక్షల మంది కౌలుదార్లు 62 లక్షల ఎకరాల భూమిపై యాజమాన్యపు హక్కులుపొందారు. మనదేశం తొలగించిన మధ్యవర్తులకు నష్టపరిహారం చెల్లించింది.

2) కౌలు సంస్కరణ: ఏ రైతులు జీవనోపాధికోసం, భూస్వాముల నుంచి భూమిని తీసుకొని సాగుచేస్తారో వారినే కౌలుదార్లు అంటారు. వీరిని మూడు రకాలుగా వర్గీకరించారు. 1) జిరాయితీ హక్కులున్న కౌలుదార్లు 2) ఉపకౌలుదార్లు 3) ఏ హక్కులూ లేని కౌలుదార్లు వ్యవసాయదారులలో సుమారు 50% మంది ఏ హక్కులు లేని కౌలుదారులుగా ఉన్నారు. వారు ఎటువంటి కౌలు భద్రతా లేదు. ఇష్టం వచ్చినప్పుడు భూస్వామి కౌలుదారులను తొలగించవచ్చు. అందుచేత అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని కౌలు సంస్కరణలు ప్రవేశపెట్టాయి.

  1. కౌలు భద్రత: కౌలుదారుడు సక్రమంగా కౌలు చెల్లించినంత కాలం భూస్వామి అతనిని తొలగించుటకు వీలులేదు. చట్టం నుండి తప్పించుకొనుటకు భూస్వాములు సొంత వ్యవసాయం చేసే నెపముతో కౌలుదార్లును తొలగించరాదు.
  2. కౌలు పరిమాణం: కౌలుదారుల నుండి భూస్వాములు వసూలు చేసే కౌలుకు పరిమితి నిర్ణయించారు. మొత్తం ఉత్పత్తిలో కౌలుదారులు చెల్లించవలసిన కౌలు ఉత్పత్తిలో 25 నుండి 50% మించకూడదని నిర్ణయించారు. రాష్ట్రానికి, రాష్ట్రానికి మధ్య కౌలు పరిమాణంలో తేడాలున్నాయి. ఆంధ్రలో మొత్తం ఉత్పత్తిలో 20 నుండి 30 శాతం గుజరాత్లో 1/6; కర్ణాటకలో 1/5 నుండి 1/4 భాగం.
  3. కౌలుదార్లుకు యాజమాన్యపు హక్కులు భూమిని దున్నే రైతులకు ఆ భూమిపై యాజమాన్యపు హక్కు కల్పించవలెననేది కౌలు సంస్కరణల ముఖ్యలక్ష్యం.

3) కమతాల గరిష్ట పరిమితి నిర్ణయం: వ్యవసాయ రంగంలో సాంఘిక అన్యాయాలను తొలగించి కమతాలపై గరిష్ట పరిమితి నిర్ణయించవలెను. భూమి దున్నేవారికి భూములు కల్పించటం కమతాలపై గరిష్ట పరిమితి నిర్ణయించటం ముఖ్య లక్ష్యం. కమతాల గరిష్ట పరిమాణం అన్ని రాష్ట్రాలలో ఒకే విధంగా లేదు. గరిష్ట పరిమితి నిర్ణయించేటప్పుడు భూసారం, నీటిపారుదల వసతులు, సేద్యపు పద్ధతులు మొదలగునవి పరిగణనలోనికి తీసుకోవడం, జరుగుతుంది. కుటుంబ సభ్యులు 5గురు కన్నా మించి ఉన్నట్లయితే గరిష్ట పరిమితి పెంచబడుతుంది.

4) చిన్న కమతాల సమస్యలు పరిష్కరించుట: కమతాల సమీకరణ,. లాభసాటి కమతాలను ఏర్పరుచుట, సహకార వ్యవసాయం మొదలగునవి చిన్న కమతాల సమన్వయ పరిష్కరించుటకు తీసుకొనిన చర్యలు.

5) సహకార వ్యవసాయం ప్రోత్సహించుట: భూ సంస్కరణల లక్ష్యాన్ని సాధించడానికి వ్యవసాయరంగ సామర్థ్యాన్ని పెంచడానికి సహకార వ్యవసాయం ఒక మంచి మార్గమని ఆర్థికవేత్తలు సూచించడం జరిగింది. ఈ విధానంలో రైతులందరూ సహకరించి చేసే ఉమ్మడి వ్యవసాయం. వ్యవసాయం పెద్ద తరహాలో చేస్తే వచ్చేలాభాలంటిని రైతులందరూ ఈ విధానంలో పొందే అవకాశం ఉంది. ఆధునిక వ్యవసాయ పద్ధతులు అవలంభించడం తేలిక. వనరులు సమర్థవంతంగా ఉపయోగించుకునే వీలుంటుంది.

ప్రశ్న 10.
భారతదేశంలో హరిత విప్లవం రావడానికి గల కారణాలను, భారత ఆర్థిక వ్యవస్థపై హరిత విప్లవ ప్రభావాన్ని వివరింపుము.
జవాబు:
భారత ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయం వెన్నెముక వంటిది. స్వాతంత్య్రానంతరం భారత ప్రభుత్వం వ్యవసాయరంగ ప్రగతిని వేగవంతం చేసేందుకు అనేక వ్యవస్థాపూర్వక, వ్యవస్థేతర సంస్కరణలను చేపట్టింది. వ్యవస్థేతర సంస్కరణలో నూతన వ్యవసాయ వ్యూహం అత్యంత ప్రధానమైంది. భారత ప్రభుత్వం 1965లో ప్రారంభించిన ఈ నూతన వ్యవసాయ వ్యూహం వ్యవసాయరంగంలో విప్లవాత్మకమైన మార్పులకు పునాది వేసింది.

AP Inter 2nd Year Economics Study Material Chapter 4 వ్యవసాయ రంగం

ఆచార్య నార్మన్ బోర్లెగ్ ఈ నూతన వ్యవసాయ వ్యూహానికి పితామహుడు. అంతర్జాతీయ అభివృద్ధి సంఘ సమావేశంలో ఉపన్యసిస్తూ విలియం ఎస్. గాండ్ అనే ఆర్థికవేత్త హరితవిప్లవం అనే పదాన్ని మొదటి సారిగా ఉపయోగించారు. అనేకమంది ఆర్థికవేత్తలు హరిత విప్లవాన్ని క్రింది విధంగా నిర్వచించారు.

1) వ్యవసాయరంగంలో ఉత్పత్తిని, ఉత్పాదకతను పెంపొందించే ఉద్దేశంతో రైతుల్లో నవచైతన్యాన్ని రగిల్చి అధిక దిగుబడినిచ్చే విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు, యంత్రాలు, యంత్రపరికరాలను ఉపయోగించి జీవనాధార, వ్యవసాయాన్ని పరిశ్రమగా మార్చే విప్లవాత్మకమైన మార్పుల కూర్పును ‘హరిత విప్లవం’ అంటారు.
పై నిర్వచనం ప్రకారం రైతుల్లో ప్రేరణ కలిగించి అధిక దిగుబడినిచ్చే విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు, యంత్రాలను ఉపయోగించి వ్యవసాయరంగంలో ఉత్పత్తిని, ఉత్పాదకతను పెంపొందించడానికి ప్రవేశపెట్టబడిన మౌలికమైన మార్పులను హరిత విప్లవం అంటారు.

2) జాన్, కేరీ వంటి ఆర్థికవేత్తలు హరిత విప్లవాన్ని రసాయన ఎరువులు, విత్తనాల విప్లవం అంటారు. ఎందుకంటే వ్యవసాయ ఉత్పాదకతను పెంపొందించడంలో వీటి పాత్ర ఎంతో కీలకం. భారతదేశ హరిత విప్లవ రూపశిల్పి డాక్టర్ ఎమ్. ఎస్. స్వామినాథన్ వ్యవసాయరంగ ప్రగతికి భూసార పునరుద్ధరణ, అభిలషణీయ నీటి వినియోగం, సరిపడినంత పరపతి, యాంత్రికీకరణ, సరైన మార్కెట్ సౌకర్యాలు ఆవశ్యకం అని సూచించారు.

హరిత విప్లవాన్ని ప్రభావితం చేసే అంశాలు:
భారత ప్రభుత్వం వ్యవసాయ అభివృద్ధికోసం అనేక పథకాలు, ప్రణాళికలు రూపొందించి అమలుచేసింది. ఈ చర్యల ఫలితంగా భారతదేశంలో హరిత విప్లవం ఆవిర్భవించింది. కింది అంశాలు హరిత విప్లవం ఆవిర్భవించడానికి కారణభూతాలైనాయి.

1) సాంద్ర వ్యవసాయ జిల్లాల కార్యక్రమం (IADP): భారత ప్రభుత్వం 1964లో ఫోర్ట్ ఫౌండేషన్ కమిటీ సిఫార్సుల ఆధారంగా అధిక భూసారం, నిశ్చితంగా లభించే నీటివనరులు, తగిన వర్షపాతం మొదలైన సౌకర్యాలుండి, వరదలు, మురుగునీరు, భూసార క్షీణత వంటి సమస్యల తీవ్రత తక్కువగా వున్న ఏడు జిల్లాలను చూచుకొని సాంద్ర వ్యవసాయ పద్ధతుల ద్వారా వ్యవసాయాభివృద్ధిని సాధించడానికి కృషి ప్రారంభించింది.
సాంద్ర వ్యవసాయ జిల్లాల అభివృద్ధి పథకం కింద రైతులకు అవసరమైన ఉత్పాదకాలను అన్నింటినీ ఒకేసారి అందించడం జరుగుతుంది. అందువల్లనే ఈ పథకాన్ని “పేకేజ్ పథకం” అని కూడా పిలుస్తారు.

2) సాంద్ర వ్యవసాయ ప్రాంతాల కార్యక్రమం (IAAP): భారత ప్రభుత్వం 1967లో సాంద్ర వ్యవసాయం కింద ఉన్న భూ విస్తీర్ణాన్ని అధికం చేయాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. అందుకుగాను ఈ పథకాన్ని దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ప్రవేశపెట్టడం జరిగింది. అయితే, ఈ పథకం కొన్ని ఎంచుకున్న పంటలు, ప్రాంతాలకు మాత్రమే పరిమితమైంది. ఈ పథకాన్ని మనదేశంలోని 114 జిల్లాలకు విస్తరింపచేశారు.

సాంద్ర వ్యవసాయ జిల్లాల కార్యక్రమంలాగానే సాంద్ర వ్యవసాయ ప్రాంతాల కార్యక్రమం కూడా కొన్ని ఎంచుకున్న ప్రాంతాలకు మాత్రమే పరిమితమై ఉన్నప్పటికీ ఈ ప్రాంతాల్లోని అభివృద్ధి ఫలితంగా సమీప ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందుతాయి. దీనినే ‘విస్తరణ ప్రభావాలు’ అంటారు.

3) అధిక దిగుబడినిచ్చే విత్తనాల కార్యక్రమం (HYVP): ఈ కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం 1965లో ప్రారంభించింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్యోద్దేశం ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధిని సాధించడం. హరిత విప్లవాన్ని సాధించడంలో సంకరజాతి విత్తనాల పాత్ర కీలకమైనది. భారత వ్యవసాయ పరిశోధన మండలి (ICAR) ఇంటర్నేషనల్ క్రాప్స్ రీసెర్స్ ఇన్స్టిట్యూట్ ఫర్ సెమి ఎరిడ్ ట్రాపిక్స్ (ICRISAT) పంజాబ్లోని వ్యవసాయ విద్యాలయాలు, వివిధ పరిశోధనా కేంద్రాల సమిష్టి కృషి ఫలితంగా అధిక దిగుబడినిచ్చే సంకరజాతి విత్తనాలను సృష్టించడం జరిగింది.

4) అల్పఫలన కాలపు పంటలు: భారత వ్యవసాయ పరిశోధన మండలి (ICAR) ఇక్రిశాట్ (ICRISAT) మొదలైన సంస్థల సమిష్టి కృషి, పరిశోధనల ఫలితంగా మనదేశంలో పంటల ఫలన కాలం గణనీయంగా తగ్గి అల్పఫలన కాలపు పంటలు అనుభవంలోనికి వచ్చాయి. వరి, గోధుమ, మొక్కజొన్న మొదలైన పంటల ఫలన కాలం బాగా తగ్గింది. వరి పంట ఫలనకాలం 6 నెలల కాలవ్యవధి నుండి 120 రోజులకు తగ్గింది. అద్భుత గోధుమ (MIRACLE WHEAT) ప్రాచుర్యం పొందిన మెక్సికన్ రకం గోధుమ, 188, 12Ro, 1001, 1010 మసూరి, బాసుమతి, జయ, పద్మ వంటి వరి రకాలు మనదేశంలో పండించబడుతున్నాయి. ఈ విత్తనాల ఫలన కాలం తగ్గినందువల్ల సంవత్సరానికి రెండు లేదు మూడు పంటలను పండించడం సాధ్యమైనది.

5) నీటిపారుదల సౌకర్యాల విస్తరణ: నీటిపారుదల సౌకర్యాలు పుష్కలంగా లభ్యమయ్యే ప్రాంతాలలో వ్యవసాయ పరిశోధనలు, ప్రయోగాలు చేయడానికి వీలవుతుంది. అంతేగాక అధిక దిగుబడినిచ్చే సంకరజాతి విత్తనాలకు సమృద్ధిగా నీటిపారుదల సౌకర్యాలు అవసరం.

AP Inter 2nd Year Economics Study Material Chapter 4 వ్యవసాయ రంగం

6) వ్యవసాయ యాంత్రికీకరణ: ఇది హరిత విప్లవంలో అంతర్భాగం వ్యవసాయ యాంత్రికీకరణలో భాగంగా విద్యుత్ పంపుసెట్లు చెరకు క్రషర్స్, ట్రాక్టర్లు పంట మార్పడి యంత్రాలు మనదేశంలో విరివిగా వాడుకలోకి వచ్చాయి. వ్యవసాయ యాంత్రీకీకరణ వల్ల వ్యవసాయ ఉత్పత్తులు గణనీయంగా పెరిగాయి.

7) రసాయనిక ఎరువులు క్రిమిసంహారక మందుల వినియోగం: అధిక దిగుబడినిచ్చే విత్తనాలకు అధిక పరిమాణంలో రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందుల వినియోగం అవసరం. అప్పుడు మాత్రమే ఈ విత్తనాలు సత్ఫలితాలాలను ఇస్తాయి. రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందుల వాడకం వల్ల వ్యవసాయ ఉత్పత్తులు గణనీయంగా పెరిగాయి. అందువల్ల భారత ప్రభుత్వం రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందుల సరఫరా అధికం చేసే ఉద్దేశంతో వీటిని ఉత్పత్తి చేసే సంస్థలకు సౌకర్యాలు, రాయితీలు కల్పించి ప్రోత్సహించింది.

8) ఇతర అంశాలు: భారతదేశంలో హరిత విప్లవ ఆవిర్భావానికి పైన పేర్కొనబడిన అంశాలు కూడా దోహదం చేశాయి.
1) వ్యవసాయాభివృద్ధిని సాధించడానికి అవసరమైన విస్తరణాధికారులను, గ్రామీణ విజ్ఞాన కేంద్రాలను, (RKC), వ్యవసాయం సాంకేతిక యాజమాన్య సంస్థ (ATMA) ను స్థాపించి రైతులకవసరమైన విస్తరణ సేవలను ప్రభుత్వం అందించింది.

2) విద్యావంతులైన రైతులు మాత్రమే నూతన వ్యవసాయ పద్ధతులను అవగాహన చేసుకోగలరు. అందుకే రైతుల్లో నిరక్షరాస్యతను తొలగించడం కోసం ప్రభుత్వము వయోజన విద్యాకేంద్రాలను ఏర్పాటు చేసింది.

3) రైతులు వ్యవసాయ కార్యకలాపాలను సకాలంలో నిర్వర్తించడానికి పరపతి అవసరం. అందువల్ల భారత ప్రభుత్వం వాణిజ్య బ్యాంకులను, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను, ప్రాథమిక వ్యవసాయ పరపతి .సంఘాలను స్థాపించి సకాలంలో పరపతి అందిస్తుంది.

భారత ఆర్థిక వ్యవస్థపై హరిత విప్లవ ప్రభావం: హరిత విప్లవం భారత ఆర్థిక వ్యవస్థపై విశేష ప్రభావాన్ని చూపింది. హరిత విప్లవం వల్ల ఏర్పడిన సత్ఫలితాలను కింది విధంగా వివరించవచ్చు.
1) ఆహార ధాన్యాల ఉత్పత్తిలో పెరుగుదల: హరిత విప్లవం యొక్క ప్రత్యక్ష ఫలితం ఆహార ధాన్యాల ఉత్పత్తిలో అధిక పెరుగుదల సాధించడం. హరిత విప్లవం ప్రభావం వరి, గోధుమ ఉత్పత్తి మీద ఎక్కువ ఉంది. 1960-61లో వరి, ధాన్యం ఉత్పత్తి 35 మిలియన్ టన్నుల నుంచి 2011-12 నాటికి 104 మిలియన్ టన్నులకు పెరిగింది. గోధుమ ఉత్పత్తి 1960-61లో 11 మిలియన్ టన్నులు ఉండగా 2011-12 నాటికి 255 మిలియన్ టన్నులకు పెరిగింది. మొత్తం మీద ఆహార ధాన్యాల ఉత్పత్తి 2012-13 నాటికి 257 మిలియన్ టన్నులకు పెరిగింది.

2) వాణిజ్య పంటల ఉత్పత్తిలో పెరుగుదల: హరిత విప్లవం ప్రారంభంలో ఆహార పంటలకు మాత్రమే పరిమితమై వాణిజ్య పంటల మీద ఎలాంటి ప్రభావం చూపలేదు. హరిత విప్లవం 1973-74 తరువాత వాణిజ్య పంటలైన చెరకు ఉత్పత్తి మీద విశేషమైన ప్రభావాన్ని, నూనె గింజలు, బంగాలదుంపల ఉత్పత్తుల మీద గణనీయమైన ప్రభావాన్ని చూపింది. చెరకు ఉత్పత్తి 1960-61లో 110 మిలియన్ టన్నుల నుంచి 2011-12 నాటికి 358 మిలియన్ టన్నులకు పెరిగింది. నూనెగింజలు ఉత్పత్తి 1960-61లో 7 మిలియన్ల టన్నుల నుంచి 2011-12 నాటికి 30 మిలియన్ టన్నులకు పెరిగింది.

3) ఉపాధి అవకాశాల పెరుగుదల: హరిత విప్లవం ఫలితంగా సాగులోవున్న భూ విస్తీర్ణం, వ్యవసాయ ఉత్పత్తి, ఉత్పాదకత పెరిగింది. వ్యవసాయరంగంలో శ్రమశక్తి ఎక్కువ అవసరమయ్యే వరి, చెరకు, తోటపంటలు, బంగాళదుంపలు కూరగాయలు మొదలైన పంటలు సాగుచేయడం వల్ల ఉపాధి అవకాశాలు పెరిగాయి. అంతేగాక సాంద్ర వ్యవసాయంలో భాగంగా బహుళ పంటలు పండించటం వల్ల కూడా ఉపాధి అవకాశాలు వృద్ధి చెందాయి. కార్పొరేట్ కంపెనీలు వ్యవసాయరంగంలో చిల్లర అమ్మకాలు చేపట్టడంతో ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరిగాయి.

4) బలిష్టమైన ముందు, వెనుక బంధాలు: వ్యవసాయ పారిశ్రామిక రంగాలు రెండూ పరస్పరం ఒకదానిపై మరొకటి ఆధారపడే రంగాలు వ్యవసాయం పరిశ్రమలకు కావల్సిన ముడిసరుకులనూ అందిస్తుంది. దీన్నే “ముందువైపు బంధం” అంటారు. అనాదిగా బలిష్టంగా ఉంది. పరిశ్రమలు వ్యవసాయానికి అవసరమైన ఉత్పాదకాలను అందిస్తుంది. దీనిని “వెనుకవైపు బంధం” అంటారు. అయితే ఈ బంధం బలహీనంగా ఉంది. హరిత విప్లవ ఫలితంగా పారిశ్రామిక రంగం సరఫరా చేసే వ్యవసాయ ఉత్పాదకాలను విపరీతంగా గిరాకీ పెరిగింది. తద్వారా వెనుక వైపు బంధం కూడా బలిష్టమైనది. ఈ విధంగా వ్యవసాయ, పారిశ్రామిక రంగాలు రెండూ బలోపేతం చేయబడ్డాయి.

5) ఆదాయల్లో పెరుగుదల: ఈ నూతన వ్యవసాయ వ్యూహం రైతులు తాము పండించిన పంటలను శ్రేణీకరణ, ప్రామాణీకరణ చేసి మధ్యవర్తుల ప్రమేయం లేకుండా గిట్టుబాటు ధరలకు ప్రత్యక్షంగా చిల్లర వ్యాపారం చేసే కంపెనీలకు, అమ్ముకొనే అవకాశాలను కల్పించింది. ఈ కంపెనీలు రైతులకు లాభసాటి ధరలను, వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులను అందించడమే గాక ధరల నియంత్రణకు తోడ్పడ్డాయి. హరితవిప్లవ ఫలితంగా పంజాబ్, హర్యానా, మధ్యప్రదేశ్, గుజరాత్, తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల రైతుల ఆదాయాలు గణనీయంగా పెరిగాయి.

AP Inter 2nd Year Economics Study Material Chapter 4 వ్యవసాయ రంగం

6) పేదరికం తగ్గుదల: హరిత విప్లవం ఉపాధి అవకాశాలను వ్యవసాయరంగంలోనే కాక వ్యవసాయేతర రంగాలైన రవాణా, రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందుల పరిశ్రమల్లో, బ్యాకింగ్, సేవారంగాల్లో ఉపాధిని * కల్పించింది. అంతేకాక హరితవిప్లవ ఫలితంగా ఆహారధాన్యాలలో లభించిన మిగులును ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా చౌక ధరలకు పేదవారికి అందించడం జరుగుతుంది. దీని ఫలితంగా పేదవారి వాస్తవిక ఆదాయం పెరిగి పేదరికం తగ్గుతుంది.

ప్రశ్న 9.
భారతదేశంలో వివిధ రకాల భూ సంస్కరణలను సంక్షిప్తంగా వివరింపుము.
జవాబు:
వ్యవసాయాభివృద్ధి కొరకు ఉత్పత్తిని అధికం చేయుటకు, ప్రణాళిక బద్ధంగా ఆర్థికాభివృద్ధిని సాధించుటకు, సాంఘిక న్యాయాన్ని చేకూర్చుటకు మనదేశంలో భూ సంస్కరణలు అమలులోకి వచ్చాయి.
1) మధ్యవర్తుల తొలగింపు: మనదేశంలో భూ సంస్కరణలను అమలు చేయడంలో భాగంగా మధ్యవర్తులను తొలగించడమైనది. జమీందారి విధానం, జాగీరుదారుని విధానం, రైత్వారీ విధానంలోని లోపాలను తొలగించడం. 1948లో మధ్యవర్తుల తొలగింపు చట్టం చేశారు. ఫలితంగా 30 లక్షల మంది కౌలుదార్లు 62 లక్షల ఎకరాల భూమిపై యాజమాన్యపు హక్కులు పొందారు. మనదేశం తొలగించిన మధ్యవర్తులకు నష్టపరిహారం చెల్లించింది.

2) కౌలు సంస్కరణ: ఏ రైతులు జీవనోపాధికోసం, భూస్వాముల నుంచి భూమిని తీసుకొని సాగుచేస్తారో వారినే కౌలుదార్లు అంటారు. వీరిని మూడు రకాలుగా వర్గీకరించారు.
1) జిరాయితీ హక్కులున్న కౌలుదార్లు 2) ఉపకౌలుదార్లు 3) ఏ హక్కులూ లేని కౌలుదార్లు వ్యవసాయదారులలో సుమారు 50% మంది ఏ హక్కులు లేని కౌలుదారులుగా ఉన్నారు. వారు ఎటువంటి కౌలు భద్రతా లేదు. ఇష్టం వచ్చినప్పుడు భూస్వామి కౌలుదారులను తొలగించవచ్చు. అందుచేత అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని కౌలు సంస్కరణలు ప్రవేశపెట్టాయి.

1. కౌలు భద్రత: కౌలుదారుడు సక్రమంగా కౌలు చెల్లించినంత కాలం భూస్వామి అతనిని తొలగించుటకు వీలులేదు. చట్టం నుండి తప్పించుకొనుటకు భూస్వాములు సొంత వ్యవసాయం చేసే నెపముతో కౌలుదార్లును
తొలగించరాదు.

2. కౌలు పరిమాణం: కౌలుదారుల నుండి భూస్వాములు వసూలు చేసే కౌలుకు పరిమితి నిర్ణయించారు. మొత్తం ఉత్పత్తిలో కౌలుదారులు చెల్లించవలసిన కౌలు ఉత్పత్తిలో 25 నుండి 50% మించకూడదని నిర్ణయించారు. రాష్ట్రానికి, రాష్ట్రానికి మధ్య కౌలు పరిమాణంలో తేడాలున్నాయి. ఆంధ్రలో మొత్తం ఉత్పత్తిలో 20 నుండి 30 శాతం గుజరాత్లో 1/6; కర్ణాటకలో 1/5 నుండి 1/4 భాగం.

3. కౌలుదార్లుకు యాజమాన్యపు హక్కులు భూమిని దున్నే రైతులకు ఆ భూమిపై యాజమాన్యపు హక్కు కల్పించవలెననేది కౌలు సంస్కరణల ముఖ్యలక్ష్యం.

3) కమతాల గరిష్ట పరిమితి నిర్ణయం: వ్యవసాయ రంగంలో సాంఘిక అన్యాయాలను తొలగించి కమతాలపై గరిష్ట పరిమితి నిర్ణయించవలెను. భూమి దున్నేవారికి భూములు కల్పించటం కమతాలపై గరిష్ట పరిమితి నిర్ణయించటం ముఖ్య లక్ష్యం. కమతాల గరిష్ట పరిమాణం అన్ని రాష్ట్రాలలో ఒకే విధంగా లేదు. గరిష్ట పరిమితి నిర్ణయించేటప్పుడు భూసారం, నీటిపారుదల వసతులు, సేద్యపు పద్ధతులు మొదలగునవి పరిగణనలోనికి తీసుకోవడం, జరుగుతుంది. కుటుంబ సభ్యులు 5గురు కన్నా మించి ఉన్నట్లయితే గరిష్ట పరిమితి పెంచబడుతుంది.

4) చిన్న కమతాల సమస్యలు పరిష్కరించుట: కమతాల సమీకరణ,. లాభసాటి కమతాలను ఏర్పరుచుట, సహకార వ్యవసాయం మొదలగునవి చిన్న కమతాల సమన్వయ పరిష్కరించుటకు తీసుకొనిన చర్యలు.

5) సహకార వ్యవసాయం ప్రోత్సహించుట: భూ సంస్కరణల లక్ష్యాన్ని సాధించడానికి వ్యవసాయరంగ సామర్థ్యాన్ని పెంచడానికి సహకార వ్యవసాయం ఒక మంచి మార్గమని ఆర్థికవేత్తలు సూచించడం జరిగింది. ఈ విధానంలో రైతులందరూ సహకరించి చేసే ఉమ్మడి వ్యవసాయం. వ్యవసాయం పెద్ద తరహాలో చేస్తే వచ్చేలాభాలంటిని రైతులందరూ ఈ విధానంలో పొందే అవకాశం ఉంది. ఆధునిక వ్యవసాయ పద్ధతులు అవలంభించడం తేలిక. వనరులు సమర్థవంతంగా ఉపయోగించుకునే వీలుంటుంది.

ప్రశ్న 10.
భారతదేశంలో హరిత విప్లవం రావడానికి గల కారణాలను, భారత ఆర్థిక వ్యవస్థపై హరిత విప్లవ ప్రభావాన్ని వివరింపుము.
జవాబు:
భారత ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయం వెన్నెముక వంటిది. స్వాతంత్య్రానంతరం భారత ప్రభుత్వం వ్యవసాయరంగ ప్రగతిని వేగవంతం చేసేందుకు అనేక వ్యవస్థాపూర్వక, వ్యవస్థేతర సంస్కరణలను చేపట్టింది. వ్యవస్థేతర సంస్కరణలో నూతన వ్యవసాయ వ్యూహం అత్యంత ప్రధానమైంది. భారత ప్రభుత్వం 1965లో ప్రారంభించిన ఈ నూతన వ్యవసాయ వ్యూహం వ్యవసాయరంగంలో విప్లవాత్మకమైన మార్పులకు పునాది వేసింది.

ఆచార్య నార్మన్ బోర్లెగ్ ఈ నూతన వ్యవసాయ వ్యూహానికి పితామహుడు. అంతర్జాతీయ అభివృద్ధి సంఘ సమావేశంలో ఉపన్యసిస్తూ విలియం ఎస్. గాండ్ అనే ఆర్థికవేత్త హరితవిప్లవం అనే పదాన్ని మొదటి సారిగా ఉపయోగించారు. అనేకమంది ఆర్థికవేత్తలు హరిత విప్లవాన్ని క్రింది విధంగా నిర్వచించారు.

AP Inter 2nd Year Economics Study Material Chapter 4 వ్యవసాయ రంగం

1) వ్యవసాయరంగంలో ఉత్పత్తిని, ఉత్పాదకతను పెంపొందించే ఉద్దేశంతో రైతుల్లో నవచైతన్యాన్ని రగిల్చి అధిక దిగుబడినిచ్చే విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు, యంత్రాలు, యంత్రపరికరాలను ఉపయోగించి జీవనాధార, వ్యవసాయాన్ని పరిశ్రమగా మార్చే విప్లవాత్మకమైన మార్పుల కూర్పును ‘హరిత విప్లవం’ అంటారు.
పై నిర్వచనం ప్రకారం రైతుల్లో ప్రేరణ కలిగించి అధిక దిగుబడినిచ్చే విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు, యంత్రాలను ఉపయోగించి వ్యవసాయరంగంలో ఉత్పత్తిని, ఉత్పాదకతను పెంపొందించడానికి ప్రవేశపెట్టబడిన మౌలికమైన మార్పులను హరిత విప్లవం అంటారు.

2) జాన్, కేరీ వంటి ఆర్థికవేత్తలు హరిత విప్లవాన్ని రసాయన ఎరువులు, విత్తనాల విప్లవం అంటారు. ఎందుకంటే వ్యవసాయ ఉత్పాదకతను పెంపొందించడంలో వీటి పాత్ర ఎంతో కీలకం. భారతదేశ హరిత విప్లవ రూపశిల్పి డాక్టర్ ఎమ్. ఎస్. స్వామినాథన్ వ్యవసాయరంగ ప్రగతికి భూసార పునరుద్ధరణ, అభిలషణీయ నీటి వినియోగం, సరిపడినంత పరపతి, యాంత్రికీకరణ, సరైన మార్కెట్ సౌకర్యాలు ఆవశ్యకం అని సూచించారు.

హరిత విప్లవాన్ని ప్రభావితం చేసే అంశాలు:
భారత ప్రభుత్వం వ్యవసాయ అభివృద్ధికోసం అనేక పథకాలు, ప్రణాళికలు రూపొందించి అమలుచేసింది. ఈ చర్యల ఫలితంగా భారతదేశంలో హరిత విప్లవం ఆవిర్భవించింది. కింది అంశాలు హరిత విప్లవం ఆవిర్భవించడానికి కారణభూతాలైనాయి.

1) సాంద్ర వ్యవసాయ జిల్లాల కార్యక్రమం (IADP): భారత ప్రభుత్వం 1964లో ఫోర్ట్ ఫౌండేషన్ కమిటీ సిఫార్సుల ఆధారంగా అధిక భూసారం, నిశ్చితంగా లభించే నీటివనరులు, తగిన వర్షపాతం మొదలైన సౌకర్యాలుండి, వరదలు, మురుగునీరు, భూసార క్షీణత వంటి సమస్యల తీవ్రత తక్కువగా వున్న ఏడు జిల్లాలను చూచుకొని సాంద్ర వ్యవసాయ పద్ధతుల ద్వారా వ్యవసాయాభివృద్ధిని సాధించడానికి కృషి ప్రారంభించింది.

సాంద్ర వ్యవసాయ జిల్లాల అభివృద్ధి పథకం కింద రైతులకు అవసరమైన ఉత్పాదకాలను అన్నింటినీ ఒకేసారి అందించడం జరుగుతుంది. అందువల్లనే ఈ పథకాన్ని “పేకేజ్ పథకం” అని కూడా పిలుస్తారు.

2) సాంద్ర వ్యవసాయ ప్రాంతాల కార్యక్రమం (IAAP): భారత ప్రభుత్వం 1967లో సాంద్ర వ్యవసాయం కింద ఉన్న భూ విస్తీర్ణాన్ని అధికం చేయాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. అందుకుగాను ఈ పథకాన్ని దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ప్రవేశపెట్టడం జరిగింది. అయితే, ఈ పథకం కొన్ని ఎంచుకున్న పంటలు, ప్రాంతాలకు మాత్రమే పరిమితమైంది. ఈ పథకాన్ని మనదేశంలోని 114 జిల్లాలకు విస్తరింపచేశారు.

ప్రశ్న 11.
భారతదేశంలో వివిధ రకాల పరపతి మూలాలు ఏవి ?
జవాబు:
ఆర్థిక కార్యకలాపాలకు ధనం ప్రధాన ఇంధనం, వ్యవసాయ కార్యకలాపాల నిర్వాహణకు సకాలంలో సరిపడినంత పరపతి అవసరం. కాబట్టి వ్యవసాయాభివృద్ధి పరపతిలో ప్రత్యక్షంగా ముడిపడి ఉంది. వ్యవసాయం చేయడానికి సకాలంలో సరిపడినంత పరపతి లభించక మనదేశ రైతులు తగిన వ్యవసాయ ప్రతిఫలాలు పొందలేకున్నారు. T.W. ఘర్జ్ అనే ఆర్థికవేత్త అభిప్రాయంలో పరపతి కొరత వ్యవసాయాభివృద్ధిని కుంటుపరచడం మాత్రమే గాక సాంప్రదాయ వ్యవసాయాన్ని ఆధునికీకరించడంలో ప్రతిబంధంకంగా తయారైంది.”

వ్యవసాయ పరపతి వర్గీకరణ: సాధారణంగా వ్యవసాయ పరపతి పరిమాణం సాగులోవున్న భూకమతం పరిమాణం, ఉత్పత్తి విధానాలు, ఉత్పత్తి కారకాల లభ్యత, సాంకేతిక విజ్ఞానం, కుటుంబ అవసరాలు మొదలైన అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. రైతులు పరపతిని ఉపయోగించే కార్యకలాపాల ఆధారంగా తిరిగి చెల్లించే కాలవ్యవధి ఆధారంగా వర్గీకరిస్తారు. అఖిల భారత గ్రామీణ పరపతి పరిశీలన సంఘం సూచనలను అనుసరించి రైతుల పరపతి అవసరాలను మూడు రకాలుగా వర్గీకరించారు.

1) స్వల్పకాలిక పరపతి: విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు, వేతనాలు, పశువుల దాణా, రవాణా మొదలైన అవసరాల కోసం పొందే పరపతిని ‘స్వల్పకాలిక పరపతి’ అంటారు. దీనిని 15 నెలల కాలవ్యవధిలో తిరిగి చెల్లించవలసి ఉంటుంది.

2) మధ్యకాలిక పరపతి: భూమిని మెరుగుపరుచుట, బావుల తవ్వకం, పశువుల, వ్యవసాయ పనిముట్లు కొనుగోలు మొదలైన అవసరాలు తీర్చుకొనుటకు పొందే పరపతి మధ్యకాలిక పరపతి అంటారు. దీనిని 15 నెలలు నుంచి 5 సంవత్సరాల కాలవ్యవధిలో తీర్చవలసి ఉంటుంది.

3) దీర్ఘకాలిక పరపతి: నూతన భూములు కొనుగోలు, శాశ్వతంగా భూమిని అభివృద్ధి చేయుట, ట్రాక్టర్లు, విద్యుత్తు పంపుసెట్లు, పంట మార్పిడి యంత్రాలు మొదలైనవి కొనుగోలు చేయుటకు, పాత బాకీలు చెల్లించుటకు మొదలైన అవసరాల కోసం రైతులకు పెద్దమొత్తంలో అవసరమయ్యే పరపతిని దీర్ఘకాలిక పరపతి అంటారు. దీనిని 5 నుంచి 20 సంవత్సరాల లోపు తిరిగి చెల్లించవలసి ఉంటుంది.

ఉత్పాదక, అనుఉత్పాదక రుణాలు: రుణాలను ఉత్పాదక, అనుత్పాదక రుణాలని రెండు రకాలుగా వర్గీకరించారు. విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందుల కొనుగోలు, బావులు త్రవ్వకం, కంచెల నిర్మాణం మొదలైన ఉత్పాదకాల కొనుగోలు తీసుకున్న రుణాలను ఉత్పాదక రుణాలు అంటారు. కానీ మత సంబంధ కార్యక్రమాలు, వివాహాలు, పండుగలు, నగలు కొనుగోలు మొదలైన కార్యక్రమాల కోసం తీసుకున్న రుణాలను అనుత్పాదక రుణాలు అంటారు.

AP Inter 2nd Year Economics Study Material Chapter 4 వ్యవసాయ రంగం

భారతదేశంలో వ్యవసాయ పరపతి ఆధారాలు: వ్యవసాయ కార్యకలాపాల నిర్వాహణకు పరపతి అత్యంత ఆవశ్యకం. రైతుల పరపతి ఆధారాలను సంస్థాగత మూలాధారాలు, సంస్థేతర మూలాధారాలు అని రెండు రకాలుగా వర్గీకరించారు. కాలక్రమేణా వ్యవసాయ పరపతిలో సంస్థాగత పరపతి ప్రాధాన్యత పెరుగుతూ ఉంది.

1) ప్రభుత్వం: సంస్థాగత పరపతి విస్తరించిన కాలంలో ప్రభుత్వమే వ్యవసాయ పరపతిని అందించే ముఖ్యమైన సంస్థ. సాధారణంగా వ్యవసాయ కార్యకలాపాల నిర్వహణకు రైతులకు ప్రభుత్వం అందించే పరపతి పరిమాణం చాలా తక్కువగా ఉంటుంది. వరదలు, కరువు కాటకాలు మొదలైన ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు రైతులను ఆదుకొనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రత్యక్షంగా తక్కువ వడ్డీకి రుణాలను మంజూరు చేస్తుంది. ఈ రుణాలను ‘తక్కువ రుణాలు’ అంటారు. రైతులు ఈ రుణాలను సులభ వాయిదాలలో ప్రభుత్వానికి చెల్లించవచ్చు.

2) భారత రిజర్వు బాంకు పాత్ర: 1935లో మనదేశంలో స్థాపించిన కేంద్ర బాంకును 1949లో జాతీయం చేశారు. అదే భారత రిజర్వ్ బాంకుగా ప్రారంభం నుంచి గ్రామీణ పరపతిని అందించడంలో విశిష్టమైన పాత్ర పోషిస్తుంది. ఈ బాంకు భారత వ్యవసాయాభివృద్ధి కోసం 1956లో రెండు రకాల నిధులను ఏర్పాటు చేసింది.

  1. జాతీయ వ్యవసాయ పరపతి – దీర్ఘకాలిక కార్యకలాపాల నిధి.
  2. జాతీయ వ్యవసాయ పరపతి – స్థిరీకరణ నిధి.

రైతులకు అవసరమైన దీర్ఘకాలిక రుణ సదుపాయాల కల్పనకు మొదటి నిధిని, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు రైతులను ఆదుకోవడానికి రెండవ నిధిని ఏర్పాటు చేశారు.
3) సహకార, పరపతి సంఘాలు: జర్మనీలో విజయవంతంగా అమలు చేయబడిన సహకార పరపతి విధానాన్ని ఆసరాగా తీసుకొని భారతదేశంలో 1904లో సహకారోద్యమం ప్రారంభించబడింది. గ్రామీణ రైతులను రుణ విముక్తులను చేసి వారిలో పొదుపు – అలవాట్లను పెంపొందించడం సహకార పరపతి సంస్థల మఖ్యోద్దేశం. మనదేశంలో సహకార పరపతి విధానాన్ని స్వల్పకాలిక, దీర్ఘకాలిక అవసరాలకు అనుగుణంగా రూపొందించడం జరిగింది.
4) వాణిజ్య బాంకులు: “లాభోద్దేశంలో బాంకింగ్ కార్యకలాపాలు నిర్వహించే బాంకులే వాణిజ్య బ్యాంకులు” 1951 వరకు వ్యవసాయానికి అందించబడిన మొత్తం పరపతిలో వాణిజ్య బాంకుల వాటా కేవలం 0.9 శాతం మాత్రమే ఉంది.

1. వాణిజ్య బాంకులు గ్రామీణ రైతులకు అవసరమైన మొత్తం స్వల్పకాలిక పరపతిలో 42 నుంచి 45 శాతం వరకు అందిస్తున్నాయి. అదే విధంగా రైతులు, యంత్రాలు, ట్రాక్టర్లు, పంపుసెట్లు మొదలైన వాటిని కొనుగోలు చేయడానికి అవసరమైన మొత్తం దీర్ఘకాలిక పరపతిలో 35 నుంచి 37 శాతం వరకు అందిస్తున్నాయి.

2. వాణిజ్య బాంకులు, వ్యవసాయ అనుబంధ కార్యక్రమాలైన పశుపోషణ, పాడి, పందుల పెంపకం, కోళ్ళు పెంపకం, చేపల పెంపకం మొదలైన కార్యక్రమాలకు కూడా పరపతిని అందిస్తున్నాయి.

5) ప్రాంతీయ గ్రామీణ బాంకులు: భారత ప్రభుత్వం ఆచార్య యమ్. నరసింహం కమిటీ సిఫార్సులు ఆధారంగా 1975 అక్టోబర్ 2వ తేదీన ఒక ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా 5 ప్రాంతీయ గ్రామీణ బాంకులను ప్రారంభించింది.
చిన్న రైతులు, ఉపాంత రైతులు, వ్యవసాయ కూలీలు, హస్తకళాకారులు, చిన్న వ్యాపారస్తులు మొదలైన వారికి పరపతిని సమకూర్చి ఉత్పాదక కార్యక్రమాల్లో ప్రగతిని సాధించడం గ్రామీణ బాంకుల ప్రధాన ఆశయం.

6) జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బాంకు (NABARD): వ్యవస్థీకృత పరపతి సౌకర్యాల సమీక్షా సంఘం (CRAFICARD) సిఫార్సుల మేరకు వ్యవసాయ గ్రామీణాభివృద్ధి కోసం 1982 జులై 12వ తేదీన జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బాంకును ప్రారంభించారు.

  1. వ్యవసాయం, కుటీర, గ్రామీణ, చిన్న పరిశ్రమలు, చేతివృత్తులు మొదలైన కార్యక్రమాలకు పరపతిని అందించి సమగ్ర గ్రామీణాభివృద్ధికి నాబార్డ్ తోడ్పడుతుంది.
  2. గ్రామీణ బాంకులు, సహకార సంఘాలు కార్యకలాపాలను పర్యవేక్షించడమేగాక పరపతికి సంబంధించిన విషయాల మీద కేంద్ర ప్రభుత్వానికి నాబార్డ్ సలహాదారుగా వ్యవహరిస్తుంది.

సంస్థేతర మూలాధారాలు:
1) వడ్డీ వ్యాపారస్తులు: మనదేశంలో సంస్థాపరమైన పరపతి అభివృద్ధి చెందకపోవడం వల్ల చాలాకాలంగా భారతదేశ వ్యవసాయ పరపతిలో వడ్డీ వ్యాపారస్తులు పాత్ర ఎక్కువగా ఉంది. వడ్డీ వ్యాపారస్తులు రెండు రకాలు. 1) వ్యవసాయదారులైన వడ్డీ వ్యాపారస్తులు. వీరు వ్యవసాయం చేస్తూ వడ్డీ వ్యాపారాన్ని మాత్రమే నిర్వహిస్తారు. సాధారణంగా వడ్డీ వ్యాపారస్తులు అధిక వడ్డీని వసూలు చేయడమేగాక అనుత్పాదక రుణాలను ప్రోత్సహిస్తారు. వీరు తప్పుడు లెక్కల ద్వారా రైతులను దోచుకుంటారు ప్రస్తుతం వడ్డీ వ్యాపారస్తుల పాత్ర క్రమేపి తగ్గుతున్నది.

2) భూస్వాములు: ఎక్కువ సందర్భాల్లో సన్నకారు రైతులు, కౌలుదారులు తమ పరపతి అవసరాల కోసం | భూస్వాముల దగ్గర నుంచి రుణాలు తీసుకొంటారు. భూస్వాములు అధిక వడ్డీని వసూలు చేయడమే కాక ఉత్పాదక, అనుత్పాదక కార్యక్రమాలు రెండింటికీ రుణాలిస్తుంటారు. వీరు తమ సమీపంలోని సన్నకారు రైతుల భూమిని కబళించాలనే దురాలోచనలో అధిక వడ్డీరేట్లకు వారికి తరచుగా రుణాలిస్తుంటారు. రైతులు అధిక వడ్డీతో కూడుకున్న ఈ రుణాలను చెల్లించలేక కొంతకాలం తరువాత రుణ పరిష్కారం కోసం తమ భూములను రుణాలిచ్చిన భూస్వాములకే అమ్మి వ్యవసాయ శ్రామికులుగా మారుతుంటారు. మొత్తం వ్యవసాయ పరపతిలో వీరి వాటా 1951లో 15శాతం ఉండగా 2002 నాటికి 1 శాతానికి తగ్గింది.

3) వ్యాపారులు కమీషన్ ఏజెంట్లు: వ్యాపారస్తులు, కమీషన్ ఏజెంట్లు ఉత్పాదక కార్యక్రమాల కోసం పంట తనఖా మీద రైతులకు రుణాలిస్తారు. పంట పండిన తరువాత రైతులు తమ పంటను వీరికి మాత్రమే అమ్మవలసి ఉంటుంది. వీరు రైతులకు తక్కువ ధరలను చెల్లించడమేగాక, అధిక కమీషన్ వసూలు చేస్తారు. అందువల్ల రైతులు తమ పంటలకు గిట్టుబాటు ధర పొందలేక రుణగ్రస్తులు అవుతున్నారు.

AP Inter 2nd Year Economics Study Material Chapter 4 వ్యవసాయ రంగం

ఉదాహరణకు వాణిజ్య పంటలైన పత్తి, చెరకు మొదలైన పంటలకు తనఖా మీద రుణాలిస్తారు. మొత్తం వ్యవసాయ పరపతిలో 1951లో 55 శాతంగా ఉన్న ఈ పరపతి 2012 నాటికి 2.6 శాతానికి తగ్గింది.

4) బంధువులు స్నేహితులు: రైతులు తరచుగా వ్యవసాయ అవసరాల కోసం బంధువులు, స్నేహితుల వద్ద రుణాలు తీసుకొంటారు. మొత్తం వ్యవసాయ పరపతిలో ఈ విధమైన పరపతి వాటా తక్కువ. వీరు వడ్డీ వసూలు చేయవచ్చు లేదా తక్కువ వడ్డీకి రుణం ఇవ్వవచ్చు. ఇది దోపిడీ రహిత పరపతి విధానం.

సాధారణంగా రైతులు పంట చేతికి రాగానే ఈ రుణాలను తిరిగి చెల్లిస్తారు. మొత్తం వ్యవసాయ పరపతిలో వీరి వాటా 1951 నాటికి 14.2 శాతం ఉండగా 2002 నాటికి 7.1 శాతానికి తగ్గింది.

ప్రశ్న 12.
భారతదేశంలో గ్రామీణ రుణగ్రస్తతకు కారణాలేవి? రుణ విముక్తికి కొన్ని పరిష్కారాలను సూచించుము. [Mar ’16]
జవాబు:
గ్రామీణ రుణగ్రస్తత: గ్రామీణ రుణగ్రస్తతకు భారతదేశంలో వ్యవసాయదారులు ఎదుర్కొనే ప్రధాన సమస్య. రుణగ్రస్తత వ్యవసాయ కార్యకలాపాలపై దుష్ప్రభావాన్ని చూపుతుంది. సాధారణంగా రైతులు ఉత్పాదక, అనుత్పాదక కార్యక్రమాల కోసం రుణాలు తీసుకొంటారు. రైతులు తాము తీసుకున్న రుణంలో అధిక భాగం అనుత్పాదక కార్యక్రమాల కోసం వ్యయం చేస్తున్నారు. అందువల్ల వీరు రుణాలను తిరిగి చెల్లించలేక అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. రైతులు ప్రతి సంవత్సరం చేసే రుణాలు పెరుగుతూనే వున్నాయి తప్ప చెల్లించలేకపోతున్నారు. దీనినే గ్రామీణ రుణగ్రస్తత అంటారు.

గ్రామీణ రుణగ్రస్తతకు కారణాలు:
1) వారసత్వపు అప్పులు: సాధారణంగా ఆస్తుల్లాగా అప్పులు కూడా వారసత్వంగా సంక్రమిస్తాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ రుణం వారసత్వంగా సంక్రమించినదే. వాస్తవంగా వారసత్వంగా సంక్రమించిన ఆస్తులతో పాటు అప్పులకు కూడా బాధ్యత వహించాలి. భారతదేశంలోని రైతులు వారసత్వపు రుణాలను తీర్చడం గౌరవంగాను, నైతిక బాధ్యతగాను భావిస్తున్నారు. అందువల్ల ఎక్కువమంది రైతులు తమ జీవితాలను అప్పులతోనే ప్రారంభిస్తున్నారు.

2) పేదరికం: గ్రామీణ రుణగ్రస్తతకు మరో ప్రధాన కారణం పేదరికం. పేదరికం కారణంగా పొదుపు చేయలేని రైతులు తమ కుటుంబ, వ్యవసాయ అవసరాలకోసం, పాత బాకీలు చెల్లించడం కోసం రుణం తీసుకోవడం తప్పనిసరైంది. పేదరికం, రుణగ్రస్తత ఒకదానికి మరొకటి కారణం మాత్రమేగాక ఫలితం కూడాను.

3) ప్రకృతి వైపరీత్యాలు: భారతదేశంలో వ్యవసాయం రుతువులపై ఆధారపడే జూదంలాంటి కార్యకలాపం రుతువుల వైఫల్యం వల్ల తరచుగా కరువుకాటకాలు సంభవిస్తున్నాయి. అధిక వర్షపాతం వల్ల విధ్వంసం జరిగి వరదలు రావడం మూలంగా పంటలు నాశనమవుతున్నాయి. వర్షపాతానికి అనిశ్చితివల్ల వ్యవసాయదారులు కనీస ప్రతిఫలాలు కూడా పొందలేకపోతున్నారు. అదేవిధంగా తుఫానులు, అగ్నిప్రమాదాలు వంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల కూడా రైతులు తమ పంటలను నష్టపోయి రుణగ్రస్తులవుతున్నారు.

4) రైతుల దుబారా వ్యయం: భారతీయ రైతులు వివాహాలు, పుట్టుకలు, పండుగలు, కర్మక్రతువులు, విందులు, వినోదాలు, ఆభరణాల కొనుగోలు మొదలైన సాంఘీక, ఆర్థిక, మత సంబంధ అంశాలపై దుబారా వ్యయం చేయడం వల్ల రుణగ్రస్తులవుతున్నారు.

5) వడ్డీ వ్యాపారులు: గ్రామీణ ప్రాంతాల్లోని రైతులకు పరపతిని సులువుగా అందించే ముఖ్యమైన మూలాధారం వడ్డీ వ్యాపారస్తులు. రైతుల భూములను కబళించాలనే ఉద్దేశంతో అధిక వడ్డీరేట్లకు అనుత్పాదక కార్యక్రమాల కోసం అప్పు తీసుకొనేటట్లు వడ్డీ వ్యాపారస్తులు రైతులను ప్రోత్సహిస్తారు. వీరు నిరక్షరాస్యులైన వ్యవసాయదారులను తప్పుడు లెక్కల ద్వారా మోసగిస్తున్నారు.

6) అల్ప కమతాలు: భారతదేశంలో సగటు భూకమతం పరిమాణం విభజన, విఘటనలకు గురై స్వల్పంగా ఉంది. ఈ కమతాలు నూతన వ్యవసాయ వ్యూహానికి అనువుగా లేకపోవడం వల్ల ఉత్పత్తి, ఉత్పాదకత తక్కువగా ఉన్నది. అందువల్ల రైతులు వ్యవసాయరంగం ద్వారా లాభదాయకమైన ప్రతిఫలాలు పొందలేక రుణగ్రస్తులవుతున్నారు.

7) న్యాయపరమైన వ్యవహారాలు: గ్రామీణ ప్రాంతాల్లోని రైతులు కాలిబాటలు, హద్దులు, కంచెలు మొదలైన విషయాలపై గొడవలు పడి కోర్టులు చుట్టూ తిరుగుతారు. వీరు కోర్టు వ్యవహారాల్లో గెలుపొందడం వ్యక్తిగత లేదా కుటుంబ ప్రతిష్టగా భావిస్తారు. ఈ విధంగా న్యాయస్థానాల చుట్టూ తిరుగుతూ తమ విలువైన సమయాన్ని ధనాన్ని వృధా చేసుకుంటూ వ్యవసాయ కార్యకలాపాలను నిర్లక్ష్యం చేసి రుణగ్రస్తులవుతున్నారు.

8) భూమిపై మక్కువ ఎక్కువ సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లోని రైతులు భూమి కావాలనే తీవ్రవాంఛ కలిగివుంటారు. వీరు కొంత భూమైనా కల్గి ఉండటాన్ని హోదాగా, గౌరవంగా భావిస్తారు. భూమిపై అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడానికి ఎంత వ్యయమైనా వెనుకాడరు. వీరు పొదుపు చేసి అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడమునుంచి పరిణామం అయినప్పటికీ ఈ కార్యక్రమాల కోసం రైతులు తలకు మించిన అప్పులు చేసి రుణగ్రస్తులు కావడం ఆందోళనకరం. 9) ఇతర కారణాలు: రైతులు విలాసవంతమైన కుటుంబ జీవితం గడపడం, దురలవాట్లపై వ్యయం చేయడం, వ్యవసాయ ఖర్చులు పెరగడం, ప్రైవేటు రుణాలుపై ఆధారపడటం మొదలైన కారణాలవల్ల రైతులు రుణగ్రస్తులవుతున్నారు.

గ్రామీణ రుణగ్రస్తత నివారణకు తీసుకోవలసిన చర్యలు:
1) సంస్థాగత పరపతి సౌకర్యాల విస్తరణ: గ్రామీణులకు ముఖ్యంగా రైతులకు సకాలంలో సరిపడినంత పరపతిని సంస్థాగత పరపతి సంస్థల ద్వారా అందించాలి. ఈ లక్ష్య సాధన కోసం వాణిజ్య బాంకులను, గ్రామీణ బాంకులను సహకార పరపతి సంఘాలను స్థాపించి వాటి ద్వారా సంస్థాగతమైన పరపతిని అందించి రుణవిముక్తి కలిగించాలి.

2) వడ్డీ వ్యాపారస్తుల నియంత్రణ: వడ్డీ వ్యాపారస్తుల నుండి గ్రామీణులను రక్షించడానికి అవసరమైన చట్టాలను ప్రభుత్వం రూపొందించి అమలుచేయాలి. అవసరమైన లైసెన్సులు, నిర్దేశించిన పద్ధతిలో వడ్డీ వ్యాపార గణకాల నిర్వహణ, గరిష్ట వడ్డీరేటుకు నిర్ణయించడం, చెల్లింపులకు రశీదులు ఇవ్వడం మొదలైన అంశాలను పరిగణలోకి తీసుకోవాలి.

3) రుణమాఫీ: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శాసనాల ద్వారా చిన్న ఉపాంత రైతులను, వ్యవసాయ శ్రామికులను రుణవిముక్తులను చేయడానికి రుణమాఫీ కార్యక్రమాన్ని చేపడుతున్నాయి.

AP Inter 2nd Year Economics Study Material Chapter 4 వ్యవసాయ రంగం

4) రైతులను విద్యావంతులను చేయడం: ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో వయోజన విద్యాకేంద్రాలను స్థాపించి రైతులను, గ్రామీణులను విద్యావంతులను చేయాలి. అంతేగాక రైతులు సాంఘిక, మత సంబంధ వ్యయాలు, న్యాయపరమైన ఖర్చులు మొదలైన అనవసర వ్యయాలను తగ్గించుకొని రుణవిముక్తులు అవుతారు.

5) ఉత్పాదకాల సరఫరా సంస్థాగత పరపతి సంస్థలు రైతులకవసరమైన పరపతిని ద్రవ్యరూపంలో కాక ఉత్పాదకాల రూపంలో అందించాలి. ఫలితంగా అనుత్పాదక వ్యయం తగ్గి సకాలంలో రుణాలను చెల్లించే సామర్థ్యం పెరగడంతో రైతులు రుణవిముక్తులు అవుతారు.

6) ఇతర చర్యలు: పైన పేర్కొనబడిన చర్యలతో పాటు పేదరిక నిర్మూలన కోసం. ఉపాధి కల్పన కోసం ప్రభుత్వం అనేక పథకాలను రూపొందించి అమలుచేయాలి.

ప్రశ్న 13.
భారతదేశంలో వ్యవసాయ, గ్రామీణ పరపతి రంగంలో నాబార్డ్ పాత్రను వివరింపుము.
జవాబు:
వ్యవస్థీకృత పరపతి సౌకర్యాల సమీక్షాసంఘం (CRATICARD) సిఫార్సుల మేరకు వ్యవసాయ గ్రామీణాభివృద్ధి |కోసం 1982 జులై 12వ తేదీన జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బాంకును (NABARD) ప్రారంభించారు. రిజర్వు బాంకులోని గ్రామీణ పరపతి ప్రణాళిక విభాగం, వ్యవసాయపరపతి కోసం ఏర్పాటైన రెండు ప్రత్యేక విధులు, వ్యవసాయ పునర్విత్త అభివృద్ధి సంస్థ (ARDC) మొదలైన వాటిని రిజర్వ్ బాంకు నాబార్డ్ బదిలీ చేసింది. నాబార్డ్ వ్యవసాయం, గ్రామీణాభివృద్ధికి సంబంధించిన శిఖరాగ్ర సంస్థగా పనిచేస్తుంది. ఈ బాంకు యొక్క అధీకృత మూలధనం 500 కోట్ల రూపాయలు చెల్లించిన మూలధనం 100 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బాంకు సమానంగా సమకూర్చినాయి.

ఎ) నాబార్డ్ విధులు: నాబార్డ్ ప్రధానంగా మూడు రకాల విధులు నిర్వర్తిస్తుంది.
1) పునర్విత్త విధులు 2) అభివృద్ధి ప్రోత్సాహక విధులు 3) పర్యవేక్షణ విధులు. నాబార్డ్ ప్రత్యేకంగా క్రింది విధులను నిర్వర్తిస్తుంది.

  1. రాష్ట్ర సహకార బాంకులను, ప్రాంతీయ గ్రామీణ బాంకులను భూమి అభివృద్ధి బాంకులను రిజర్వ్ బాంకు అనుమతితో గ్రామీణభివృద్ధిలో పాల్గొంటున్న విత్తసంస్థలు మొదలైన వాటన్నింటికి స్వల్పకాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలిక పరపతిని అందించి తద్వారా వ్యవసాయ, గ్రామీణ అభివృద్ధికి నాబార్డ్ పరోక్షంగా తోడ్పడుతుంది.
  2. సహకార సంస్థలకు వాటా మూలధనాన్ని అందించటం కోసం రాష్ట్ర ప్రభుత్వాలకు దీర్ఘకాలిక రుణాలను నాబర్డ్ మంజూరు చేస్తుంది.
  3. వ్యవసాయం, కుటీర గ్రామీణ, చిన్న పరిశ్రమలు, చేతివృత్తులు మొదలైన కార్యక్రమాలకు పరపతిని అందించి సమగ్ర గ్రామీణాభివృద్ధికి నాబర్డ్ తోడ్పడుతుంది.
  4. గ్రామీణ బాంకులు సహకార సంఘాలు కార్యకలాపాలను పర్యవేక్షించుడయే గాక పరపతికి సంబంధించిన విషయాల మీద కేంద్ర ప్రభుత్వానికి, నాబర్డ్ సలహాదారులు వ్యవహరిస్తుంది.
  5. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రణాళికా సంఘం, ఇతర సంస్థల కార్యకలాపాలను సమన్వయలా పరిచి చిన్న, కుటీర గ్రామీణ పరిశ్రమలు, చేతివృత్తులు, హస్తకళలు మొదలైన వీటి అభివృద్ధికి నాబార్ట్ పునర్వత్త సహాయం చేస్తుంది.
  6. తన ఆధీనంలోని విధులు అభివృద్ధి పథకాలను పరిశీలించడమే కాక వాటి పురోగతిని ఎప్పటికప్పుడు మదింపు చేస్తుంది.
  7. వ్యవసాయం గ్రామీణాభివృద్ధితో సంబంధం కలిగి కేంద్ర ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏ సంస్థకైన నాబార్డ్ రుణాలనిచ్చి ఆర్థికంగా బలోపేతం చేస్తుంది.
  8. వ్యవసాయం గ్రామీణాభివృద్ధి రంగాలలో పరిశోధనల కోసం ప్రత్యేకనిధిని నాబార్డ్ ఏర్పాటు చేస్తుంది.

బి) పునర్విత్త విధులు: నాబార్డ్ గ్రామీణ అవస్థాపనానిధి (RIDF) రైతుల పరపతి కార్డులు, (KCC) రైతు క్లబ్బులు, రైతు సాంకేతిక విజ్ఞానం బదిలీ నిధి (FTTF) వ్యవసాయంలో నూతన కల్పనల అభివృద్ధి నిధి (FIDF) మొదలైన నూతన పథకాలను రూపొందించింది. ఈ పధకాల ద్వారా పరపతిని అందిస్తూ నాబార్డ్ గ్రామీణాభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తుంది.
1) గ్రామీణ అవస్థాపనా అభివృద్ధి నిధి: ఈ నిధిని 1995-96 సం॥లో ఏర్పాటు చేసారు. వాణిజ్య బ్యాంకుల ప్రాధాన్యత రంగాలకు వ్యవసాయానికి ఇచ్చే ఋణాలు పోను మిగిలిన పరిమితి మొత్తంలో ఈ నిధిని ఏర్పాటు చేయడం జరిగినది. ఆనాటి నుండి నాబార్డ్ గ్రామాలలో అవస్థాపనా సౌకర్యాలను కల్పించడం రాష్ట్ర ప్రభుత్వంతో భాగస్వామ్యం వహిస్తూ వుంది.

ఈ నిధికి 1995-96 బడ్జెట్ లో 2000 కోట్ల రూపాయలను కేటాయిస్తే 2012-13 బడ్జెట్లో 20,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. 2012-13 నాటికి ఈ నిధి కింద మొత్తం 1,72,500 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగినది. భారత్ నిర్మాణ్ ఆశయమైన రహదారులు కల్పనకు ఈ నిధి 18,500 కోట్ల రూపాయలు అందించింది.

2) రైతుల పరపతి కార్డుల పథకం: కిసాన్ క్రెడిట్ కార్డు స్కీమ్ను ఆగష్టు 1998 సం||లో ప్రారంభించారు. తక్కువ ఖర్చుతో సకాలానికి తగినంత స్వల్పకాల పంట ఋణాలను రైతులకు అందించేందుకుగాను ఈ పథకాన్ని ప్రారంభించారు. ఉత్పత్తికి సంబంధించిన ఖర్చుల కోసం, వ్యవసాయ ఉత్పాదకాలను కొనుగోలు చేసేందుకుగాను ఈ పథకం రైతులకు సహాయపడుతుంది. ఈ పథకం కింద 2012 ఆగష్టు నెలలో 9.54 కోట్ల కార్డులను మంజూరు చేసి 91,676 కోట్ల రూపాయల రుణాన్ని రైతులకందించడం జరిగింది.

3) సూక్ష్మవిత్తం: గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని పేదలకు, స్వయం ఉపాధి లబ్ధిదారులకు స్వల్పమొత్తంలో విత్త సహాయాన్నే అందించడమే సూక్ష్మవిత్తం యొక్క లక్ష్యం. అందుకుగాను బాంకింగ్ సేవలకు పేదవారికి ముంగిటకు తీసుకువచ్చే నూతన కార్యక్రమమే సూక్ష్మవిత్తం. ఈ పథకం పొదుపును ప్రోత్సహించి వడ్డీ వ్యాపారస్తుల కబంద హస్తాలలో పేదవారు చిక్కకుండా కాపాడుతుంది. ఈ పథకం కింద 1986 87 నాబార్డ్ 2012-13 వార్షిక బడ్జెట్ లో 3916.64 కోట్ల రూపాయలు నిత్య సహాయాన్నే స్వయం సహాయక బృందాలకు అందించింది. ప్రభుత్వేతర సంస్థలు కూడా సూక్ష్మవిత్తం అందిస్తున్నాయి.

4) స్వర్ణజయంతి గ్రామీణా స్వయం ఉపాధి ప్రణాళిక: ఈ ప్రణాళికను 1999 సం॥ ఏప్రిల్ 1వ తేదీన ప్రారంభించారు. ఈ ప్రణాళిక ద్వారా ఇచ్చిన ఋణాల మధ్య కాలిక ఋణాలుగా ఉంటాయి. ఈ ప్రణాళిక 2009-10 సం|| బడ్జెట్ నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్గా మార్పు చేసి అమలుపరుస్తున్నారు. స్త్రీలు బలహీన వర్గాలవారు సాధకారతను సాధించడమే ప్రధానలక్ష్యంగా ఈ పునర్నిర్మాణం జరిగింది. నాబార్డ్ కూడా ఈ ప్రణాళికలకు పునర్విత సహాయాన్ని అందిస్తుంది. నాబర్డ్ 2012- 13 సం|| వార్షిక బడ్జెట్లో ఈ పథకానికి 111.72 కోట్ల రూపాయల నిధులు కేటాయించారు.

AP Inter 2nd Year Economics Study Material Chapter 4 వ్యవసాయ రంగం

ప్రశ్న 14.
భారతదేశ వ్యవసాయ మార్కెటింగ్లో లోపాలను వివరించి పరిష్కార మార్గాలను సూచింపుము.
జవాబు:
భారత వ్యవసాయ మార్కెటింగ్లో లోపాలు: భారత వ్యవసాయ మార్కెటింగ్లో దోపిడీ అధికంగా ఉంది. అందువల్ల రైతులు తమ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలను పొందలేకపోతున్నారు. వ్యవసాయ మార్కెటింగ్లోని ముఖ్యమైన లోపాలను కింద వివరించడం జరిగింది.
1) మధ్యవర్తుల జోక్యం: మన వ్యవసాయ మార్కెటింగ్లో రైతులకు, వినియోగదారులకు మధ్య దళారీలు ఎక్కువగా ఉన్నారు. దళారీలు వ్యాపారులతో రహస్యమంతనాలు జరిపి ఉత్పత్తులను తక్కువ ధర చెల్లించి రైతులను మోసగిస్తున్నారు. రకరకాల మోసపూరిత పద్ధతుల ద్వారా వీరు రైతులను దోపిడీకి గురి చేస్తున్నారు. కొన్ని అధ్యయనాల ప్రకారం ఉత్పత్తి యొక్క మార్కెట్ ధరల్లో 60 నుంచి 70% వరకు మధ్య దళారీలే దోచుకుంటున్నారన్నది ఒక అంచనా.

2) మార్కెట్లోని మోసపూరిత విధానాలు: వ్యవసాయ మార్కెటింగ్లో అనేక మోసపూరిత విధానాలు నెలకొని వున్నాయి. వ్యాపారులు, దళారులు కుమ్మకై రైతులను మోసం చేసి తక్కువ ధరలకు వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నారు. వ్యాపారస్తులు ఉపయోగించే తూనికలు, కొలతలు ప్రామాణికమైనవి కావు. వీరు నాణ్యతా, పరీక్షలు, ధర్మాలు, మామూళ్ల పేరిట ఉత్పత్తుల్లో కొంత భాగాన్ని కాజేస్తుంటారు. అంతేగాక వ్యాపారస్తులు రైతులకు ఉత్పత్తుల ప్రతిఫలాలను పాయిదా పద్ధతుల్లో చెల్లిస్తుంటారు. అందువల్ల రైతులు తమ ఉత్పత్తులను గిట్టుబాటు ధరలకు అమ్ముకోలేక తీవ్రంగా నష్టపోతున్నారు.

3) రవాణా సౌకర్యాల కొరత: మనదేశంలో రహదారులు అధ్వాన్నంగా ఉన్నాయి. నేటికి మన గ్రామీణ ప్రాంతాలలో చాలావరకు మట్టి రోడ్లు ఉన్నాయి. వర్షాకాలంలో ఈ రోడ్లు మీద రవాణా అసాధ్యం. ఎక్కువ భాగం గ్రామీణ రహదారులు రైలు మార్గాలతోను, పక్కారోడ్లు, మార్గాలతో అనుసంధానం చేయబడలేదు. అధికభాగం రైతులు తమ ఉత్పత్తులను స్థానిక సంతలలో లేదా మండీలలో గిట్టుబాటుకాని ధరలకు అమ్ముకోవడం తప్పనిసరైంది.

4) గిడ్డంగి సౌకర్యాల కొరత: ఈ వ్యవసాయ మర్కెటింగ్లో మరో ప్రధాన లోపం రైతులు తాము పండించిన పంటను నిల్వ చేసుకోవాలంటే సరిపడే గిడ్డంగి సౌకర్యాలుండాలి. వీటి కొరతవలన రైతులు తమ ఉత్పత్తులను పాతర్లలోను, మట్టికుండల్లోను అశాస్త్రీయ పద్ధతుల్లో నిల్వ చేస్తారు. ఈ అశాస్త్రీయ పద్ధతుల వల్ల తేమ తగిలి పంట నాణ్యత తగ్గుతుంది. అంతేకాక 10 నుంచి 20% వరకు పంటను చీమలు, ఎలుకలు, పందికొక్కులు తింటున్నాయి. ఈ పరిస్థితుల్లో రైతులు గిట్టుబాటు ధర వచ్చేంతవరకు ధాన్యాన్ని దాచుకోలేక తక్కువ ధరలకు నిర్భందంగా అమ్ముకోవలసి వస్తుంది.

5) మార్కెట్ సమాచార లోపం: మనదేశంలోని రైతులు గ్రామీణ ప్రాంతాల్లో నివసించడం వల్ల వీరికి సమాచారం తెలియదు. నిరక్షరాస్యులైన వీరికి డిమాండ్, సప్లయ్, ధరల్లో మార్పులు, ప్రభుత్వ ధరల విధానం మొదలైన విషయ పరిజ్ఞానం ఉండదు. సమాచార లోపం కారణంగా రైతులు తమ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలను పొందడంలో విఫలమవుతున్నారు.

6) శ్రేణీకరణ, ప్రామాణీకరణ సదుపాయాల కొరత: వ్యవసాయ ఉత్పత్తులను మనదేశంలో తగినరీతిలో శ్రేణీకరణ చేయడము లేదు. సాధారణంగా రైతులు తమ ఉత్పత్తులను నాణ్యతాపరంగా శ్రేణీకరణ, ప్రామాణికీకరణ చేయకుండా మొత్తం ఉత్పత్తినంతటికి ఒకే ధరకు అమ్ముతున్నారు. శ్రేణీకరణ చేయకపోవడం వల్ల రైతులు తమ నాణ్యమైన ఉత్పత్తులను సైతం తక్కువ ధరలకు అమ్ముకొని నష్టపోతున్నారు.

7) పరపతి సౌకర్యాల కొరత: సంస్థాగత పరపతి సౌకర్యాల కొరతవల్ల మనదేశంలోకి పేద రైతులు గ్రామీణ ప్రాంతాలలో పరపతి కోసం వడ్డీ వ్యాపారులపై ఆధారపడతారు. గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయ పరపతికి వ్యవసాయ మార్కెటింగ్కు మధ్య సమన్వయం కొరవడింది. రైతులు పంట చేతికొచ్చిన తక్షణమే మార్కెట్ ధరలు ఎంత తక్కువగా ఉన్నప్పటికీ అమ్మి వడ్డీ వ్యాపారులకు చెల్లించవలసి ఉంటుంది. అందువల్ల గిట్టుబాటు ధరలు వచ్చేంత వరకు వేచిఉండలేక రైతులు నష్టపోతున్నారు.

8) రైతులు అసంఘటితంగా ఉండటం: మనదేశంలోని రైతులు వేర్వేరు ప్రాంతాలలో నివసించడంవల్ల సంఘటితం కాలేకపోతున్నారు. కాని వ్యాపారస్తులు మాత్రం సంఘటితంగా ఉండి రైతులను గిట్టుబాటు ధరలు పొందకుండా అడ్డుకుంటున్నారు. ఫలితంగా అసంఘటితమైన రైతులు సంఘటితమై సమిష్టిగా బేరమాడుతున్న వ్యాపారస్తులను ఎదుర్కొని గిట్టుబాటు ధరలు పొందలేక నష్టపోతున్నారు.

నివారణ చర్యలు: వ్యవసాయ మార్కెటింగ్ లోని లోపాలను అరికట్టి రైతులు మార్కెటింగ్ సామర్థ్యాన్ని పెంపొందించడానికి భారత ప్రభుత్వం అనేక చర్యలను చేపట్టింది. కింద పేర్కొన్న చర్యలు రైతులు మార్కెటింగ్ సామర్థ్యాన్ని పెంపొందించడానికి తోడ్పడుతున్నాయి.
1) క్రమబద్ధమైన మార్కెట్లు (Regulated Markets): రైతుల ఉత్పత్తులకు సముచితమైన ధరలు చెల్లించడం, ఉత్పత్తిదారులకు, వినియోగదారులకు మధ్య ధరలలో ఉన్న వ్యత్యాసాన్ని తగ్గించాలన్న లక్ష్యాలతో 1951లో భారత ప్రభుత్వం 200లకు పైగా క్రమబద్ధమైన మార్కెట్లను ఏర్పాటుచేసింది. 2005 మార్చి చివరకు వీటి సంఖ్య 7521 కి పెరిగింది. వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ లోని లోపాలను సరిదిద్దడం కోసం, వ్యాపారస్తులకు, కమీషన్ ఏజెంట్లకు వారి విధులపరంగా కాకుండా లభించే మార్జిన్లను తగ్గించడం కోసం ఈ మార్కెట్లను రూపొందించారు. క్రమబద్ధమైన మార్కెట్లు కింది విధంగా నిర్వహిస్తాయి.

  1. వ్యవసాయ ఉత్పత్తుల ధరలను నోటీస్ బోర్డులో ఉంచుతాయి.
  2. ప్రామాణికమైన తూనికలు, కొలతల వాడకాన్ని తప్పనిసరి చేస్తాయి.
  3. మధ్యవర్తుల సంఖ్యను తగ్గించి వారికి లైసైన్సులను మంజూరు చేస్తాయి.
  4. తూకం చార్జీలు, దళారీలు కమీషన్లను ముందుగానే మార్కెట్ కమిటీలు నిర్ణయిస్తాయి.

2) సహకార మార్కెటింగ్: భారతదేశంలో మొట్టమొదటి సహాకార మార్కెటింగ్ సంఘం 1951లో ఏర్పడింది. ఈ విధానం డెన్మార్క్ విజయవంతంగా అమలు చేయబడి సత్ఫలితాలనిచ్చింది. ఈ సంఘాల ముఖ్య ఉద్దేశం రైతులు తమ ఉత్పత్తులకు లాభసాటి ధరలు వచ్చేంతవరకు విక్రయించకుండా వేచిఉండేటట్లు చేయడం.
ఈ విధానంలో గ్రామంలోని రైతులందరూ ఒక సంఘంగా ఏర్పడతారు. రైతులు తమ ఉత్పత్తులను సహకార సంఘానికి అందచేసిన వెంటనే కొంత ద్రవ్యాన్ని ముందస్తుగా అందజేస్తారు. సహకార సంఘాల గిట్టుబాటు ధరలు రాగానే ఈ ఉత్పత్తులను విక్రయించి ముందస్తు చెల్లింపులు పోగా మిగిలిన మొత్తాన్ని రైతులకు చెల్లిస్తారు. ప్రతి సంఘం పరిధిలో కొన్ని గ్రామాలు ఉంటాయి.

3) ఒప్పందపు వ్యవసాయం: వ్యవసాయ మార్కెటింగ్ విధానంలోని లోపాలను పరిష్కారించడానికి ఒప్పందపు వ్యవసాయం మరొక మంచి పరిష్కార మార్గం. రైతులు తమ ఉత్పత్తులను వినియోగించే సంస్థలతో ప్రత్యక్షంగా ఒప్పందాలను కుదుర్చుకొని చేసే వ్యవసాయ విధానాన్ని ‘ఒప్పందపు వ్యవసాయం’ అని నిర్వచించవచ్చు.

  1. ఈ విధానంలో ముందుగా ధరలకు సంబంధించిన ఒప్పందాలు చేసుకోవడం వల్ల వ్యవసాయ ఉత్పత్తుల ధరలలో ఉండే అస్థిరతలను తొలగించి రైతుల ఆదాయంలో స్థిరత్వాన్ని పెంపొందించవచ్చు.
  2. రైతులు ఏ పరిశ్రమలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారో అవి పరపతి, సాంకేతిక సహాయం అందిస్తాయి. 3. నాణ్యమైన వ్యవసాయ ఉత్పత్తులు లభించడానికి అవకాశం పెరుగుతుంది. ఎందుకంటే రైతులు ముందుగా చేసుకొన్న ఒప్పందాలు మేరకు నాణ్యమైన ఉత్పత్తులను అందించవలసి ఉంటుంది.

AP Inter 2nd Year Economics Study Material Chapter 4 వ్యవసాయ రంగం

4) రైతుబజార్లు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1999 జనవరి 26వ తేదీన వ్యవసాయ ఉత్పత్తిని విక్రయించడానికి రైతుబజార్లు అను నూతన మార్కెట్లను ప్రశేశపెట్టింది. ఈ మార్కెట్ కేంద్రాలను నగరాల్లోను, పట్టణాల్లోను ఏర్పాటు చేశారు. ఈ మార్కెట్లలో రైతులు తమ ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు దళారీల ప్రమేయం లేకుండా విక్రయించుకోవచ్చు. రైతులు ఈ మార్కెట్ కేంద్రాలలో బియ్యం, పండ్లు, పప్పుధాన్యాలు, కూరగాయలు మొదలైన వ్యవసాయ ఉత్పత్తులను సహేతుకమైన ధరలకు విక్రయిస్తున్నారు. ఈ మార్కెట్లలో ధరలు ఉత్పత్తిదారులైన రైతులకు, కొనుగోలుదారులకు ఇరువురికి లాభసాటిగా ఉంటాయి. ఈ మార్కెట్లలో వినియోగదారులు నాణ్యమైన ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి అవకాశం ఉంది. దళారులు ఉండరు కనుక రైతులు ఎలాంటి దోపిడికి గురికారు.

5) శ్రేణీకరణ, ప్రామాణికీకరణ: వ్యవసాయ ఉత్పత్తుల శ్రేణీకరణ, ప్రామాణీకరణ సౌకర్యాల కల్పన కోసం భారత ప్రభుత్వం అనేక చర్యలను చేపట్టింది. వ్యవసాయ ఉత్పత్తుల గ్రేడింగ్ చట్టం 1937 కింద భారత ప్రభుత్వం జైపూర్, భోపాల్, నాగపూర్, భువనేశ్వర్, షిల్లాంగ్ మొదలైన ప్రాంతాలలో వస్తుగుణ నిర్ణయ కేంద్రాలను స్థాపించింది. ఈ ప్రయోగశాలల్లో వస్తువుల యొక్క భౌతిక, రసాయన ధర్మాలను విశ్లేషించి నాణ్యతా ప్రమాణాలను నిర్ధారిస్తారు. ఈ కేంద్రాలలో 162 వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ ఉత్పత్తులను శ్రేణీకరించి ప్రామాణికీకరిస్తారు. ఉదాహరణకు బియ్యం, గోధుమలు, పప్పుధాన్యాలు, నూనెలు, నెయ్యి, వెన్న, పత్తి, తేనె, మసాల దినుసులు మొదలైనవి. గ్రేడింగ్ చేసిన వ్యవసాయ వస్తువుల నాణ్యతకు చిహ్నంగా అగ్మార్క్ (AGMARK) గుర్తును ముద్రిస్తారు. అగ్మార్క్ అగ్రికల్చరల్ మార్కెటింగ్ యొక్క సంకేతం. ఈ గుర్తు ఉన్న వస్తువుల మార్కెట్ విస్తరించడమేగాక, వాటికి సముచితమైన ధరలు లభిస్తాయి.

6) గిడ్డంగి సదుపాయాలు: రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను నిల్వ చేయడానికి అవసరమైన గిడ్డంగి సౌకర్యాలు ఉన్నప్పుడు పంట చేతికి రాగానే అమ్మడానికి సిద్ధపడరు. ఉత్పత్తులను నిల్వచేయగల సామర్థ్యం రైతుల యొక్క బేరమాడే శక్తిని పెంపొందిస్తుంది. అంతేకాక రైతులు తమ ఉత్పత్తులను గిట్టుబాటు ధరలు వచ్చేంతవరకు వేచి ఉండగల శక్తిని కూడా గిడ్డంగి సౌకర్యాలు కల్పిస్తాయి. గిడ్డంగుల్లో నిల్వ ఉంచిన సరుకుకు ఇచ్చే రశీదు ఆధారంగా వాణిజ్య బాంకులు రైతులకు రుణాలను మంజూరు చేస్తాయి. అందువల్ల భారత ప్రభుత్వం దేశం నలుమూలల గిడ్డంగులను ఏర్పాటుచేస్తుంది.

7) రవాణా సౌకర్యాలు: చక్కని రహదారులు, తక్కువ రవాణా చార్జీలు, అనువైన రవాణా సాధనాలు ఉన్నప్పుడు రైతులు ఖచ్చితంగా తమ ఉత్పత్తులను మార్కెట్ కేంద్రాలకు తరలించి గిట్టుబాటు ధరలకు అమ్ముకుంటారు. ఎందుకంటే ఈ సౌకర్యాలు రైతులు బేరమాడే శక్తిని పెంపొందిస్తాయి. కాబట్టి ప్రభుత్వం పక్కా రోడ్లను నిర్మించి ట్రాక్టర్లు, ట్రాలీలు మొదలైన చిన్న వాహనాలను గ్రామీణ రవాణా నిమిత్తం ప్రోత్సహించాలి.

8) పరపతి సౌకర్యాలు: రైతులకు సకాలంలో, సరిపడినంత, సంస్థాగత పరపతి సౌకర్యాలు కల్పిస్తే రుణం కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయించరు. అంతేగాక తమ ఉత్పత్తులకు లాభసాటి ధరలు వచ్చేంతవరకు వేచి వుండి విక్రయిస్తారు. దీని కోసం భారత ప్రభుత్వం ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు, వాణిజ్య బాంకులు, ప్రాంతీయ గ్రామీణ బాంకులు మొదలైన సంస్థాగత పరపతి సంస్థలను ఏర్పాటుచేసింది. పరపతి, మార్కెటింగ్ సౌకర్యాల నడుమ సమన్వయం కుదిరి, రైతులు లాభపడతారు.

9) మార్కెట్ ధరల సమాచారం: రైతులు ఎప్పుడైతే మార్కెట్లోని వ్యవసాయ ఉత్పత్తుల ధరలకు సంబంధించిన పక్కా సమాచారం తెలుసుకొని ఉంటారో అప్పుడు మాత్రమే సముచిత ధరలకు తమ ఉత్పత్తులను విక్రయించగలరు. ఇందుకోసం ప్రభుత్వం ఎప్పటికప్పుడు రేడియో, టి.వి, వార్తాపత్రికలు మొదలైన సమాచార సాధనాల ద్వారా ధరల సమాచారం రైతులకు తెలియజేయాలి.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
భారతదేశ వ్యవసాయరంగం – లక్షణాలు వివరింపుము.
జవాబు:
1) అనిశ్చితమైన వ్యవసాయ ఉత్పత్తులు:భారతదేశ వ్యవసాయరంగం అభివృద్ధి శీతోష్ణస్థితి, రుతువులపై ఆధారపడి ఉంటుంది. భారతదేశ వ్యవసాయరంగ అభివృద్ధిపై దుష్పరిణామాలు చూపుతున్నాయి. దీనిని బట్టి భారత వ్యవసాయరంగం రుతువులతో జూదం ఆడుతుందని చెప్పవచ్చు.

2) వ్యవసాయరంగంలో భూస్వామ్యం:స్వాతంత్య్రానంతరం మనదేశంలో భూస్వామ్య వ్యవస్థకు ప్రతిరూపాలైన, జమీందారీ, మహల్వారీ విధానాలు అమలులోకి వచ్చాయి. అందువల్ల కౌలుదారులు రైతుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడేవారు.

3) గ్రామీణ రుణగ్రస్తత:స్వాతంత్య్రానంతరం భారతప్రభుత్వం సంస్థాగత సంస్థలైన సహకార పరపతి సంఘాలు, వాణిజ్య బాంకులు మొదలైన వాటిని స్థాపించి గ్రామీణ ప్రజలకు పరపతిని అందిస్తుంది. వడ్డీ వ్యాపారస్తులు అధిక వడ్డీ వసూలు చేయడంలో పాటు, లెక్కలను తారుమారు చేసి రైతులను మోసం చేయడం పరిపాటైంది, రైతులకు రుణగ్రస్తత నిత్యసమస్యై తగిన పెట్టుబడి లేకపోవడంతో వ్యవసాయ ఉత్పత్తులు అల్పంగా ఉన్నాయి.

AP Inter 2nd Year Economics Study Material Chapter 4 వ్యవసాయ రంగం

4) శ్రామిక మార్కెట్లో ద్వంద్వత్వం:వ్యవసాయరంగంపై జనాభా ఒత్తిడి అధికమై ఈ రంగంలో పనిచేసే శ్రామికుల వేతనాల వ్యవసాయేతర రంగాల్లో పనిచేసే శ్రామికుల వేతనాల కంటే తక్కువగా ఉన్నాయి. వ్యవసాయ శ్రామికుల వేతనాలు అల్పంగా ఉన్నందువల్ల వీరిని అధిక సంఖ్యలో వినియోగించి శ్రమ సాంద్ర వ్యవసాయాన్ని నిర్వహిస్తున్నారు.

5) వ్యవసాయరంగంలో భిన్నత్వం:దేశంలోని వేర్వేరు ప్రాంతాలలో వేర్వేరు భూసారాలు, నీటిపారుదల సౌకర్యాలు, వర్షపాత పరిమాణాలు ఉన్నాయి. అదే విధంగా కొన్ని ప్రాంతాలలో వరదలు, కరువుకాటకాలు, నీటి లవణీయతలు అధికంగాను మరికొన్ని ప్రాంతాలలో అల్పంగాను ఉన్నాయి.

6) సాంకేతిక ద్వంద్వత్వం:నేటికి మనదేశంలో అధిక సంఖ్యాక రైతులు వ్యవసాయ కార్యకలాపాల్లో సనాతన ఉత్పాదకాలైన శ్రామికులు, పశువులు, వర్షాలు, పశువుల పేడ ఎరువు మొదలైన వాటిపై ఆధారపడి జీవనాధార వ్యవసాయాన్ని కొనసాగిస్తున్నారు. నూతన వ్యవసాయ వ్యూహంలో భాగంగా కొన్ని ప్రాంతాల్లో రైతులు అధిక దిగుబడినిచ్చే విత్తనాలు, రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందులు, యంత్రాలను ఉపయోగించి, సాగుచేయడం వల్ల అధిక దిగుబడిని పొందుతున్నారు.

ప్రశ్న 2.
వ్యవసాయ శ్రామికుల ప్రస్తుత స్థితిగతులను వివరింపుము.
జవాబు:
వ్యవసాయ శ్రామికుల స్థితిగతులు :
1) అల్పసాంఘీక హోదా:నేటికీ వ్యవసాయ శ్రామికులలో ఎక్కువమంది తరతరాలుగా నిర్లక్ష్యానికి గురైన అణగారిన వర్గాలకు చెందినవారు. సాంఘీక అసమానత్వం, దోపిడీ భావన వీరి విషయంలో సర్వసాధారణం. వీరు తమ హక్కుల పరిరక్షణకు ఏమాత్రం పోరాటం చేయలేని దయనీయస్థితిలో ఉంటారు. గ్రామీణ ప్రాంతాల్లో వివక్షకు గురైన వీరి సాంఘిక హోదా తక్కువగా ఉంటుంది.

2) అసంఘటిత శ్రామికులు:మనదేశంలో వ్యవసాయ శ్రామికుల మారుమూల గ్రామాలలో నివసిస్తున్నారు. అందువల్ల వీరు సంఘటితం కాలేకపోతున్నారు. వీరికి కార్మికసంఘాలు లేవు. అంతేకాక వీరిలో ఎక్కువ మంది నిరక్షరాస్యులు. అందువల్ల అసంఘటితంగా వున్న వీరికి భూస్వాములతో బేరమాడేశక్తి లోపించి తగిన వేతనాలు పొందలేకపోతున్నారు.

3) రుతుసంబంధిత ఉద్యోగిత:వ్యవసాయ కార్యకలాపాలు రుతువులపై ఆధారపడి వుంటాయి. వ్యవసాయ కార్మికులు నాట్లు వేసేటప్పుడు, పంట కోసేటప్పుడు మాత్రం ఉపాధిని పొంది సంవత్సరంలో ఎక్కువ భాగం ఖాళీగా వుంటారు. నిరుద్యోగిత, అల్ప ఉద్యోగిత వీరు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు. అందువల్ల వీరి ఆదాయాలు తక్కువగా ఉండి జీవన ప్రమాణాలు అల్పంగా ఉంటాయి.

4) అల్ప వేతనాలు:వ్యవసాయ శ్రామికులకు చెల్లించే వేతనాలు అల్పంగా ఉన్నందువల్ల వారి కుటుంబ ఆదాయాలు తక్కువగా ఉన్నాయి. వ్యవసాయ శ్రామికులకు వివిధ రాష్ట్రాల్లో ఇచ్చే వేతనాలలో భిన్నత్వం వుంది. పంజాబ్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలలో తప్ప ఎక్కువ రాష్ట్రాలలో వీరికి చెల్లించే వేతనాలు అల్పంగా ఉన్నాయి. హరిత విప్లవనాంతరం వీరికి చెల్లించే ద్రవ్యవేతనాలు పెరిగినప్పటికీ వస్తుసేవల ధరలు పెరిగినందువల్ల వీరి నిజవేతనాలు పెరగలేదు.

5) మహిళా శ్రామికుల పట్ల వివక్షత:వ్యవసాయరంగంలో పురుష శ్రామికులతో సమానంగా మహిళాశ్రామికులకు వేతనాలు ఇవ్వరు. అంతేగాక వ్యవసాయ కార్యకలాపాలతో వీరిచే బలవంతంగా అధికశ్రమ చేయిస్తారు. అనగా వ్యవసాయరంగంలో మహిళాశ్రామికులు వివక్షతకు గురవుతున్నారు.

6) గ్రామీణ రుణగ్రస్తత:గ్రామీణ ప్రాంతాలలోని వ్యవసాయ శ్రామికుల ఆదాయం తక్కువగా ఉండి పేదరికంలో ఉన్నారు. అందువల్ల వీరికి రుణ అవసరాలు ఎక్కువగా వుంటాయి. వీరికి సంస్థాగత పరపతి సంస్థలనుంచి రుణం తీసుకోవడానికి అవసరమైన హామీపత్రాలు లేనందువల్ల సంస్థాగతం కాని వడ్డీవ్యాపారస్థులు, భూస్వాముల నుంచి అధికవడ్డీలకు రుణం పొందుతున్నారు. ఈ రుణభారం అధికమై తరతరాలుగా వారసత్వంగా సంక్రమించి వ్యవసాయ శ్రామికులు వెట్టిశ్రామికులుగా మారుతున్నారు.

7) అధికసంఖ్యలో బాలకార్మికులు:ఆసియాఖండంలోని బాలకార్మికులలో మూడవ వంతు మంది భారతదేశంలో ఉన్నారు. మనదేశంలోని బాలకార్మికులలో అధిక సంఖ్యాకులు వ్యవసాయరంగంలో పనిచేస్తున్నారు. వీరికి చెల్లిస్తున్న వేతనాలు అత్యల్పంగా వుండి వారి కుటుంబ జీవన ప్రమాణంపై దుష్ప్రభావాన్ని చూపుతున్నాయి.

8) వ్యవసాయేతర వృత్తుల కొరత గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయేతర వృత్తులు అభివృద్ధి చెందలేదు. అందువల్ల శ్రామికులు ఉపాధికోసం ఎక్కువగా వ్యవసాయరంగంపై ఆధారపడుతున్నారు. ఫలితంగా వ్యవసాయరంగంలో శ్రామికుల సంఖ్య అధికమై ప్రచ్ఛన్న నిరుద్యోగితకు దారితీసింది.

AP Inter 2nd Year Economics Study Material Chapter 4 వ్యవసాయ రంగం

ప్రశ్న 3.
పంటల తీరును ప్రభావితం చేసే అంశాలను వివరింపుము.
జవాబు:
పంటల తీరు:సాధారణంగా ఒకదేశ ఆర్థికాభివృద్ధి ఆ దేశంలో లభించే సహజ వనరుల లభ్యత, వినియోగంపై ఆధారపడి ఉంటుంది. సహజ వనరులైన భూమి, నీరు, ఖనిజాలు మొదలైన వాటిని సమర్థవంతంగా, అభిలషణీయంగా, వినియోగించినప్పుడే కొనసాగించగలిగే అభివృద్ధి సాధ్యమవుతుంది. అదేవిధంగా భూసారం, నీటిపారుదల సౌకర్యాల లభ్యతను బట్టి దేశంలో విభిన్న పంటలు పండించడం జరుగుతుంది. దేశంలో పండే వివిధ పంటల తీరు ఆ దేశ ఆర్థిక ప్రగతిని ప్రభావితం చేస్తుంది.
పంటలతీరును ప్రభావితం చేసే అంశాలు:భారతదేశంలో పంటల తీరును భౌతిక, సాంకేతిక ఆర్థిక అంశాలతోపాటు ప్రభుత్వవిధానాలు కూడా ప్రభావితం చేస్తాయి.

I) భౌతికాంశాలు:పంటలతీరును నిర్ణయించడంలో భౌతికాంశాల పాత్ర కీలకమైంది.
1) శీతోష్ణస్థితి, వర్షపాతం:శీతోష్ణస్థితి, వర్షపాతం, పంటలతీరును ప్రభావితం చేస్తాయి. ఉష్ణ ప్రాంతాలలో, శీతల ప్రాంతాలలో పండే పంటలు వేర్వేరుగా వుంటాయి. ఉదాహరణకు, శీతల ప్రాంతాలలో మాత్రమే ఆపిల్స్ వుంటాయి. అదేవిధంగా వర్షపాతం కూడా పంటల తీరును ప్రభావితం చేస్తుంది.

2) భూస్వరూపం, భూసారం:భూసారం, భూస్వరూపంపై ఆధారపడి పంటలు పండుతాయి. ఉదాహరణకు నల్లరేగడి మృత్తికలు, పత్తిపంటకు అనుకూలం. అదేవిధంగా గోధుమ పంటకు సారవంతమైన ఒండ్రు, తడిబంకమన్ను మృత్తికలు అవసరం. ఈ విధంగా భూసారం, భూస్వరూపం పంటలతీరును ప్రభావితం చేస్తాయి.

3) నీటిపారుదల:నీటిపారుదల సౌకర్యాలు పంటలతీరును నిర్ణయించడంలో కీలకపాత్ర పోషిస్తాయి. నీటిపారుదల సౌకర్యాలు పుష్కలంగా లభ్యమైనపుడు వరి, చెరకు, గోధుమ మొదలైన పంటలు పండుతాయి. నీటిపారుదల సౌకర్యాలు తగినంతగా లేనిచోట రాగులు, మొక్కజొన్న, సజ్జలు వంటి పంటలు పండుతాయి.

II) ఆర్థికాంశాలు :
1) ధరలు, ఆదాయం:సాధారణంగా వ్యవసాయదారులు తమ ఉత్పత్తులను అధికధరలకు విక్రయించి తమ ఆదాయాలను గరిష్టం చేసుకోవాలనుకుంటారు. వరి, గోధుమలాంటి ఆహార పంటల ధరలపై మార్కెట్ ప్రభావం లేకుండా నిర్దేశిత సేకరణ ధరల పేరుతో ప్రభుత్వం ఈ పంటల ధరలను ముందుగా నిర్ణయిస్తుంది. ఈ విధమైన నియంత్రణల వల్ల రైతులు తమ ఆదాయాలను గరిష్టం చేసుకోవడానికి వాణిజ్య పంటలైన చెరకు, పత్తి, వేరుశెనగ మొదలైన వాటిని పండిస్తున్నారు.

2) భూకమతాల పరిమాణం: భూకమతాల పరిమాణం పంటల తీరుపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. సాధారణంగా చిన్న కమతాల రైతులు ఆహారపంటలను, పెద్దకమతాల రైతులు వాణిజ్యపంటలను పండిస్తారు. ఇటీవల కాలంలో చిన్న కమతాల రైతులు కూడా అధిక లాభాలను ఆశించి వాణిజ్యపంటలను పండిస్తున్నారు.

3) ఉత్పాదకాలు, అవస్థాపనా సౌకర్యాల కొరత: వ్యవసాయ ఉత్పాదకాలు కూడా పంటల తీరును నిర్ణయిస్తాయి. విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు, యంత్రాలు మొదలైన ఉత్పాదకాల లభ్యత పంటల తీరును ప్రభావితం చేస్తుంది. అదేవిధంగా రవాణా, గిడ్డంగులు, మార్కెటింగ్, నీటిపారుదల వంటి అవస్థాపనా సౌకర్యాల లభ్యతపై కూడా పంటల తీరు ఆధారపడి వుంటుంది.

4) భీమా సౌకర్యాలు:సాధారణంగా వ్యవసాయదారులు విభిన్నమైన పంటలు పండిస్తారు. ఏదైన ఒక పంట నష్టానికి గురైనప్పుడు ఆ నష్టాన్ని ఇతర పంటల నుండి రాబట్టుకోవచ్చు అన్న ఉద్దేశ్యంలో బహుళపంటలు పండిస్తారు. అదే ప్రభుత్వం నష్టభయాన్ని ఎదుర్కొనడానికి ఏ పంటలకు బీమా సౌకర్యాలను కల్పిస్తుందో ఆ పంటలను రైతులు ధీమాగా పండిస్తారు.

5) కౌలుదారీ పద్ధతి:సాధారణంగా భూస్వాములు తమ భూములను కౌలుకు ఇచ్చేటప్పుడు ఏ పంటలు పండించాలో ముందుగానే కౌలుదార్లతో ఒప్పందం చేసుకుంటారు. కాబట్టి పంటలతీరు భూస్వాముల ఇష్టాలపై చాలావరకు ఆధారపడి వుంటుంది.

6) సాంఘీక కారణాలు:పరిసరాలు, ఆచారాలు, సాంప్రదాయాలు, మొదలైన సాంఘీక అంశాలు పంటల తీరును నిర్ణయించడంలో కొంతమేరకు ప్రభావాన్ని చూపుతాయి. ఈ అంశాలు రైతులను సాంప్రదాయ పంటలను, సాంప్రదాయ పద్ధతుల్లో పండించేటట్లు ప్రేరేపిస్తాయి.

ప్రశ్న 4.
నీటిపారుదల సౌకర్యాల ప్రాధాన్యతను వివరింపుము.
జవాబు:
నీటిపారుదల ప్రాధాన్యత :
1) అకాల అనిశ్చిత వర్షాలు:వర్షాలు రుతువులపై ఆధారపడి సంవత్సరంలో నాలుగునెలలకు మాత్రమే పరిమితమై వుంటాయి. కొన్నిసార్లు రుతువుల్లో సైతం వర్షపాతం అల్పంగా ఉండటమేగాక, అకాల వర్షాలు వస్తుంటాయి. నీటిపారుదల సౌకర్యాలను విస్తృత పరుచుట ద్వారా కరువుకాటకాలను సమర్థవంతంగా నియంత్రించవచ్చు.

2) ఉత్పాదకత పెరుగుదల:నీటిపారుదల సౌకర్యాలు పుష్కలంగా వున్నచోట వ్యవసాయ ఉత్పాదకత ఎక్కువగా వుంటుంది. నీటిపారుదల సౌకర్యాలు వున్నప్పుడే ఆధునిక వ్యవసాయ ఉత్పాదకాలైన అధిక దిగుబడినిచ్చే సంకరజాతి. విత్తనాలు, ఎరువులు మొదలైన వాటిని వినియోగించడానికి వీలవుతుంది. ఫలితంగా ఆహారధాన్యాల ఉత్పత్తిలో వార్షిక పెరుగుదల 1.6 శాతం నుండి 2.6 శాతానికి పెరిగింది. అదే నీటిపారుదల సౌకర్యాలు అల్పంగా వున్న ప్రాంతాల్లో వ్యవసాయ ఉత్పాదకతలో పెరుగుదల 1శాతం లేదా గమనించలేనంత తక్కువగా నమోదైంది.

AP Inter 2nd Year Economics Study Material Chapter 4 వ్యవసాయ రంగం

3) బహుళ పంటలు పండించడం:భారతదేశం ఉష్ణమండల, ఉప ఉష్ణమండల శీతోష్ణస్థితులు విస్తరించి వున్నాయి. ఈ దేశానికి సంవత్సరమంతా పంటలు పండించగల సామర్థ్యం వుంది. మనదేశంలో వర్షపాతం నాలుగు నెలలలోపు కాలానికి మాత్రమే పరిమితమైంది. కాబట్టి నీటిపారుదల సౌకర్యాలు కల్పిస్తే సంవత్సరమంతా బహుళ పంటలు పండించవచ్చు.

4) నూతన వ్యవసాయ వ్యూహంలో ప్రధానపాత్ర:నూతన వ్యవసాయ వ్యూహంలో భాగంగా ప్రవేశపెట్టబడిన అధిక దిగుబడినిచ్చే సంకరజాతి విత్తనాలను, రసాయనిక ఎరువులను విజయవంతంగా వినియోగించాలంటే సకాలంలో, సరిపడినంత నీటిపారుదల సౌకర్యాలు అవసరం. ఈ విత్తనాలు, ఎరువుల వినియోగానికి క్రమబద్ధంగా పుష్కలంగా నీటిని అందించాలి. నీటిపారుదల సౌకర్యాలు కల్పిస్తే నూతన వ్యవసాయ వ్యూహం కిందసాగులో వున్న భూవిస్తీర్ణం పెరుగుతుంది.

5) సాగుభూమి విస్తీర్ణంలో పెరుగుదల:భూవినియోగ గణాంకాల ప్రకారం మనదేశంలో లెక్కించిన మొత్తం భూమి 2009-10 నాటికి 305.56 మిలియన్ల హెకార్టు. ఇందులో 42.95 మిలియన్ల హెక్టార్లు వ్యవసాయం చెయ్యని భూములు కాగా 26.23 మిలియన్ల హెక్టార్లు బంజరు భూములుగా వున్నాయి. నీటిపారుదల సౌకర్యాల కల్పిస్తే నిరుపయోగంగా వున్న ఈ భూములను కొంతమేరకు సాగులోకి తీసుకురావచ్చు.

6) సంపద పెరుగుదల:కరువు కాటకాలు సంభవించినప్పుడు సాధారణంగా వ్యవసాయ ఉత్పత్తులు అస్థిరతకు లోనవుతాయి. కాని నీటిపారుదల సౌకర్యాల కరువు కాటకాల సమయంలో పంటలను రక్షించి వ్యవసాయ ఉత్పత్తులను ఒడిదుడుకులకు గురికాకుండా స్థిరీకరిస్తాయి. ఉత్పత్తులలో స్థిరీకరణ సాధించడం ద్వారా ఉపాధి అవకాశాలు, ఆదాయాలు పరిరక్షించబడి సంపద స్థిరంగా పెరుగుతుంది.

7) పరోక్ష ప్రయోజనాలు:నీటిపారుదల సౌకర్యాలను దేశం నలుమూలలకు విస్తరింపజేయడం ద్వారా ఆహారధాన్యాలు ఉత్పత్తిలో అసమానతలు రూపుమాసిపోతాయి. అంతేకాక వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో ఉత్పత్తి పెరుగుతుంది. ఈ విధంగా సాధించబడిన పెరుగుదల వ్యవసాయ ఉత్పతుల ధరల స్థిరీకరణకు తోడ్పడుతుంది.
భారత ఆర్థికవ్యవస్థ ప్రాధాన్యతా రంగాల్లో ఒకటైన వ్యవసాయ రంగాన్ని ప్రగతి ప్రధాన నడవడంలో నీటిపారుదల సౌకర్యాలు కీలక భూమికను పోషిస్తున్నాయి.

ప్రశ్న 5.
వ్యవసాయ ఉత్పాదకత అల్పంగా ఉండటానికి గల కారణాలు వివరింపుము.
జవాబు:
భారత వ్యవసాయరంగంలో ఉత్పత్తి అల్పంగా వుండటానికి అనేక కారణాలు వున్నాయి. వీటిని ప్రధానంగా నాలుగురకాలుగా వర్గీకరించారు.
1) సాధారణ కారణాలు 2) వ్యవస్థాపూర్వక కారణాలు 3) సాంకేతిక కారణాలు 4) పర్యావరణ కారణాలు సాధారణ కారణాలు:వ్యవసాయ ఉత్పత్తి అల్పంగా వుండటానికి గల కారణాలు కింద విశ్లేషించబడినాయి.

1) వ్యవసాయరంగంపై జనాభా వత్తిడి:భారతదేశంలో జనాభా వేగంగా పెరుగుతుంది. పెరుగుతున్న జనాభా తమ జీవనోపాధికై వ్యవసాయరంగంపై ఆధారపడుతున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం 263 మిలియన్ల జనాభా తమ జీవనోపాధికై వ్యవసాయరంగం మీద ఆధారపడి వున్నారు. దీనికి తోడు వ్యవసాయేతర రంగాల్లో ప్రగతి చురుకుగా లేనందువల్ల పెరుగుతున్న జనాభా జీవనోపాధికై వ్యవసాయరంగంపై ఆధారపడటం తప్పనిసరైంది. అందువల్ల వ్యవసాయరంగం మీద ఒత్తిడి ఎక్కువై కమతాల విభజన, విఘటనలతో పాటు ప్రచ్ఛన్న నిరుద్యోగిత అధికమవుతుంది.

2) నిరాశాపూరిత గ్రామీణ వాతావరణం:మనదేశంలో గ్రామీణ వాతావరణం నిరాశాజనకంగా వుండి, వ్యవసాయ ప్రగతికి ప్రతిబంధకంగా మారింది. గ్రామీణ ప్రాంతాలలోని ప్రజలు ఎక్కువగా పేదవారు, నిరక్షరాస్యులు, అందువల్ల వీరు మూఢనమ్మకాలకు, సనాతన సాంప్రదాయాలకు విలవినిస్తూ నూతన వ్యవసాయ వ్యూహం యెడల నిరాసక్తతను కనపరుస్తున్నారు. రైతులలో సంకుచిత ధోరణి ఏర్పడి ఉమ్మడి కుటుంబాల విచ్ఛిన్నమవడం, భూమిపై మక్కువ మొదలైన గ్రామీణ పరిస్థితుల వల్ల వ్యవసాయ కమతాలు విభజన, విఘటనలకు గురై వ్యవసాయ ఉత్పాదకత దెబ్బతింటుంది. గ్రామీణ ప్రాంతాలలో కక్షలు, కుట్రలు, తగాదాలు, కోర్టు వ్యవహారాలు మొదలైన వాటి కారణంగా నిరుత్సాహపూరితమైన ఉద్రిక్త వాతావరణం ఏర్పడి రైతులు తమ విలువైన సమయం, ధనం వృథా చేసుకుంటున్నారు. ఫలితంగా మనదేశ వ్యవసాయరంగంలో ఉత్పాదకత తక్కువగా వుంది.

3) అవస్థాపనా సౌకర్యాల కొరత: వ్యవసాయాభివృద్ధికి అవసరమైన పరపతి, రవాణా, మార్కెటింగ్, గిడ్డంగి, సౌకర్యాలు రైతుల అవసరాలకు సరిపడినంతగా లేవు. జాతీయ బ్యాంకులు, సహకార పరపతి సంస్థలు, వ్యవసాయ విస్తరణ సేవా కేంద్రాల ప్రోత్సాహం రైతులందరికి అందుబాటులో లేదు. ఈ విధమైన అవస్థాపనా సౌకర్యాల కొరత వ్యవసాయ ఉత్పాదకత పెరుగుదలకు ప్రతిబంధకంగా తయారైంది.

4) బ్రిటీష్ పాలనా ప్రభావం: బ్రిటీషువారు తమ పరిపాలనా కాలంలో భారతదేశాన్ని ఒక వలసదేశంగా భావించారే తప్ప మనదేశ వ్యవసాయాభివృద్ధికి ఏవిధమైన చర్యలు చేపట్టలేదు. వారనుసరించిన భూస్వామ్య విధానాలు, కౌలుదారి విధానాలు, భూమిశిస్తు వసూళ్ళు భారత వ్యవసాయరంగ ప్రగతిని దెబ్బతీశాయి. మనదేశ వ్యవసాయ ఉత్పాదకత అల్పంగా వుండటానికి బ్రిటీషువారి పాలన చాలావరకు కారణమైంది.

AP Inter 2nd Year Economics Study Material Chapter 4 వ్యవసాయ రంగం

II) వ్యవస్థాపూర్వక కారణాలు :
1) అల్ప కమతాల పరిమాణం: మనదేశంలో భూకమతాల పరిమాణం చాలా అల్పంగా ఉంది. జాతీయ సర్వేక్షణా సంస్థ నివేదిక ప్రకారం 1960 – 61లో రెండు హెక్టారుల కంటే తక్కువ పరిమాణం ఉన్న కమతాలు మొత్తం కమతాలలో 52 శాతం వుండగా 2010-11 నాటికి వీటి సంఖ్య 85 శాతానికి పెరిగింది. ఎక్కువ భూమి కొద్దిమంది భూస్వాముల చేతుల్లో కేంద్రీకృతమై ఉంది. వీరు వ్యవసాయ కార్యకలాపాలపై శ్రద్ధ చూపరు. వారసత్వ చట్టాలు, కమతాల విభజన, విఘటనల ఫలితంగా కమతాల పరిమాణం అల్పంగా వుండి తక్కువ భూమి ఎక్కువ మంది రైతుల ఆధీనంలో వుంది. చిన్న కమతాలు నూతన వ్యవసాయ కార్యకలాపాలకు అనుగుణంగా ఉండకపోవడం వల్ల వ్యవసాయ ఉత్పాదకత అల్పంగా ఉంది.

2) భూస్వామ్య వ్యవస్థలోని లోపాలు:బ్రిటీషువారి పరిపాలనా కాలంలో మనదేశంలో ఏర్పాటు చేసిన జమీందారీ పద్ధతి, జాగిర్దారీ పద్ధతి, మహల్వారీ పద్ధతి మొదలైన లోపభూయిష్టమైన భూస్వామ్య పద్ధతులు వ్యవసాయప్రగతిని ఆటంకపరచాయి. స్వాతంత్ర్యానంతరం రైత్వారీ పద్ధతి అమలులోకి వచ్చింది. ఈ విధానంలో కౌలుదారులకు కౌలుభద్రత, నిశ్చితమైన కౌలు పరిమాణం భూయాజమాన్యం హక్కులు వుండేవి కావు. ఈ అభద్రతల కారణంగా కౌలుదారుల వ్యవసాయంపై శ్రద్ధ చూపలేరు. ఫలితంగా వ్యవసాయరంగం యొక్క ఉత్పాదకత తగ్గింది.

3) మార్కెట్, పరపతి సౌకర్యాల కొరత: వ్యవసాయభివృద్ధికి అవసరమైన మార్కెట్ సౌకర్యాలు, రవాణా సౌకర్యాలు, పరపతి సౌకర్యాలు కొరత వలన నూతన పద్ధతిలో వ్యవసాయ కార్యకలాపాలను నిర్వహించడం కష్టమైంది. వీరికి కావలసిన పరపతి సముచితమైన వడ్డీరేట్లకు లభించదు. అంతేగాక ప్రభుత్వం ప్రకటించిన వ్యవసాయ ఉత్పత్తులకు అందించే రాయితీలు సంతృప్తికరంగా లేవు. ఈ కారణాల వల్ల అధిక దిగుబడినిచ్చే విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు, యంత్రాలు, నీటిపారుల సౌకర్యాలను ఉపయోగించి నూతన పద్ధతులలో సాగుచేయడానికి బదులు సాంప్రదాయ పద్దతులలో సాగుచేస్తున్నారు. ఫలితంగా వ్యవసాయరంగంలో ఉత్పాదకత తగ్గింది.

III) సాంకేతిక కారణాలు :
1) పురాతన ఉత్పత్తి పద్ధతులు:భారతదేశంలోని రైతులు పేదరికం, అవగాహనారాహిత్యం కారణంగా పురాతన పనిముట్లు సహాయంతో సాంప్రదాయమైన వ్యవసాయ పద్ధతులలో సాగుచేయడం వల్ల పురాతన ఉత్పత్తి ఉత్పాదకత తక్కువగా వున్నాయని టి. డబ్ల్యు. హార్ట్ అనే ఆర్థికవేత్త అభిప్రాయపడినారు. నేటికి భారతీయ రైతులు కొడవళ్ళు, చెక్కనాగళ్ళు, ఎడ్లబండ్లు ఉపయోగిస్తున్నారు. వీరు అధిక దిగుబడినిచ్చే విత్తనాలు, ఎరువులను, క్రిమిసంహారక మందులను, యంత్రాలను పరిమితంగా వాడుచున్నారు. కాని ప్రభుత్వ నిర్విరామ కృషి, విద్యావ్యాప్తి ఫలితంగా ఇటీవల కాలంలో ఈ పరిస్థితులలో కొంతమేరకు మార్పు వచ్చింది.

2) నీటిపారుదల సౌకర్యాల కొరత:2011 నాటికి వివిధ పంటల కింద సాగవుతున్న భూవిస్తీర్ణం 198.97 మిలియన్ హెక్టారులు వుండగా అందులో 89.36 మిలియన్ హెక్టారుల భూమికి మాత్రమే నీటిపారుదల సౌకర్యం వుంది. అంటే 55శాతం సాగు భూమికి వర్షాలే ఆధారం. అకాల, అల్ప, అనిశ్చిత వర్షాల వల్ల వర్షాధార ప్రాంతాలలో పంటలు దెబ్బతింటున్నాయి. ఈ పరిస్థితులలో నూతన వ్యవసాయ వ్యూహం దేశమంతా విస్తరించడం కష్టమై వ్యవసాయ ఉత్పత్తి, ఉత్పాదకాలు, తక్కువగా వున్నాయి.

3) వ్యవసాయ ఉత్పాదకాల కొరత:అధిక దిగుబడిని సాధించుటకు ఆధునిక ఉత్పాదకాల వినియోగం తప్పనిసరి. ఆధునిక ఉత్పాదకాలైన సంకరజాతి విత్తనాలు, రసాయనిక ఎరువులు, యంత్రాలు, క్రిమిసంహారక మందుల సరఫరా రైతుల అవసరాలకు సరిపడినంతగా లేదు. ఉత్పాదకాలు సరిపడినంతగా లభ్యం కానందువల్ల వాటి వినియోగం తగ్గి వ్యవసాయ ఉత్పత్తి, ఉత్పాదకత అల్పంగా వున్నాయి.

IV) పర్యావరణ కారణాలు:వ్యవసాయ ఉత్పాదకతను నిర్ణయించడంలో పర్యావరణం పాత్ర ప్రముఖమైనది. భూసార క్షీణత, వాతావరణంలో మార్పులు, నీటికాలుష్యం, వాయు కాలుష్యం, మొదలైనవి వ్యవసాయ ఉత్పత్తి ఉత్పాదకాల మీద దుష్ప్రభావాన్ని చూపుతాయి. పంటల క్షీణతకు కింది పర్యావరణ ప్రతికూల అంశాలు కారణభూతాలు అవుతున్నాయి.

  1. భూతాపం.
  2. భూసారం క్షీణించడం.
  3. అధిక దిగుబడినిచ్చే విత్తనాలను ఉపయోగించి సాంద్రవ్యవసాయం చేయడం.
  4. మితిమీరి రసాయనిక ఎరువులను వాడటం.
  5. పోడు వ్యవసాయం.
  6. పర్యావరణ పరిరక్షణా ప్రణాళికలు లేకపోవడం.
  7. సాంప్రదాయ పంటలను సాగుచేయకపోవడం.

AP Inter 2nd Year Economics Study Material Chapter 4 వ్యవసాయ రంగం

ప్రశ్న 6.
ప్రస్తుతం భూమి వినియోగం తీరును వివరింపుము.
జవాబు:
ఆర్థిక వ్యవస్థ ప్రగతి సహజవనరులు లభ్యత, వినియోగం పై ఆధారపడి ఉంటుంది. సహజ వనరులలో భూమి అత్యంత ప్రధానమైన వనరు. భూమి యొక్క పరిమాణం అవ్యాకోచంగా ఉంటుంది. భూమి పరిమాణం ఆర్థికాభివృద్ధిని ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తుంది. అందువల్ల నేటి ఆధునిక సమాజ అవసరాలకు అనుగుణంగా భూ వినియోగం తీరులో మార్పులు తీసుకొని రావలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. వారతదేశంలో మొత్తం భౌగోళిక విస్తీర్ణం 328.72 మిలియన్ల హెక్టార్లు మొత్తం సాగవుతున్న పంట భూమి 192.. మిలియన్లు హెక్టార్లు. బీడుభూములు మొత్తం పరిమాణం 26 మిలియన్ల హెక్టార్లు. అడవుల క్రింద వున్న భూవిస్తీర్ణం 70 మిలియన్ల హెక్టార్లు.

ఇటీవల కాలంలో భూమి వినియోగంలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. భూస్వాముల ఆధీనంలోని బంజరు భూములను భూసంస్కరణల తరువాత వ్యవసాయయోగ్యంగా మార్చడం జరిగింది. బంజరు భూముల పునరుద్ధరణ “ఫలితంగా సాగు భూమి విస్తీర్ణం పెరిగింది. నీటిపారుదల సౌకర్యాల విస్తరణ వల్ల అల్ప ఫల కాలపు సంకరజాతి వంగడాల సృష్టి ఫలితంగా ఒకటి కంటే ఎక్కువ పంటలు పండే భూవిస్తీర్ణం గణనీయంగా పెరిగింది.

నాటికి కౌ 23 మిలియన్ల హెక్టార్లు భూమికి నీటి పారుదల సౌకర్యాలు కల్పించడం జరిగింది. వ్యవసాయేతర అవసరాలైన నివాస స్థలాలు, పరిశ్రమల స్థాపనకు భూవనరుల వాడకం అధికమైంది. దీని ఫలితంగా పొలాలలో ఉన్న భూవిస్తీర్ణం తగ్గి వ్యవసాయ ఉత్పత్తులు తగ్గిపోతున్నాయి. కాబట్టి పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా వ్యవసాయ ఉత్పత్తులను పెంచడానికి భూవనరులను అభిలషణీయంగా వినియోగించాలి.

ప్రశ్న 7.
భారతదేశంలో కమతాల సమీకరణ.
జవాబు:
మనదేశంలో కమతాల విభజన విఘటనకు గురై చిన్న పరిమాణానికి చేరి పంటల సాగును లాభదాయకం కాని పరిమాణానికి చేరినాయి. ఈ చిన్న కమతాలన్నింటిని కలిపి ఒక పెద్ద కమతంగా ఏర్పాటు చేయడం చాలా అవసరం. విడివిడిగా చిన్న చిన్నగా ఉన్న కమతాలను ఒక్కటిగా చేయటమే కమతాల సమీకరణ అంటారు. ప్రారంభంలో ఈ ప్రక్రియ చాలా వేగంగా జరిగింది. 2001 సం॥ సెప్టెంబరు నాటికి 1,633 లక్షల ఎకరాలలో మాత్రమే కమతాల సమీకరణ సాధ్యపడింది. రైతులు సమీకరణకు సహకరించలేదు. అందువల్ల ఉత్తరప్రదేశ్లో తప్ప మిగతా రాష్ట్రాలలో దేశ వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని రద్దు చేయడం జరిగింది. కమతాల సమీకరణ కార్యక్రమం విజయవంతం అవడానికి రైతుల సహకారం చాలా అవసరం.

ప్రశ్న 8.
లాభసాటి కమతాలు ఏర్పాటు.
జవాబు:
చిన్న కమతాల వల్ల ఏర్పడే దుష్పరిణామాలకు ముఖ్యమైన పరిష్కారం మార్గం లాభసాటి కమతాల ఏర్పాటు. భారత వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడానికి లాభసాటి కమతాల ఏర్పాటు తప్పనిసరి. కొంతమంది ఆర్థికవేత్తలు లాభసాటి కమతాలను “కుటుంబ కమతాలు” లేదా “అభిలషణీయ కమతాలు” అంటారు.

లాభసాటి కమతాలను ఏర్పాటు చేయడానికి క్రింది సూచనలు సహకరిస్తాయి.

  1. ప్రభుత్వం లాభసాటి కమతాలను ఏర్పాటు చేయడానికి ముందు భూములను, శాస్త్రీయంగా వర్గీకరించాలి.
  2. ప్రభుత్వం భూములను శాస్త్రీయంగా వర్గీకరించి, ఆర్థిక కమతం పరిమాణాన్ని నిర్ణయించేటపుడు భూసారాన్ని, నీటిపారుదల, రవాణా సౌకర్యాలను పరిగనణలోనికి తీసుకోవాలి.`
  3. ప్రభుత్వం చట్టాలను రూపొందించి, “ప్రామాణిక కమతం” పేరుతో లాభసాటి కమతాల కనీస పరిమాణాన్ని నిర్దేశించాలి.
  4. ప్రభుత్వం జనాభా పెరుగుదలను అరికట్టడానికి చట్టాలను రూపొందించి భూమిపై జనాభా ఒత్తిడిని తగ్గించి కమతాల విభజనను అరికట్టి ఆర్థిక కమతాల ఏర్పాటును ప్రోత్సహించాలి.
  5. ప్రభుత్వం లాభసాటికాని చిన్న కమతాలలో సాగు చేస్తున్న చిన్న రైతులను జీవనోపాధికై తమ కమతాలను వదిలి వ్యవసాయేతర రంగాలపై ఆధారపడేటట్లు ప్రోత్సహించాలి.

ప్రశ్న 9.
భారతదేశంలో భూ సంస్కరణల ఆవశ్యకత. [Mar ’17, ’16]
జవాబు:
భూసంస్కరణల ఆవశ్యకత :
1) వ్యవసాయాభివృద్ధి:వ్యవసాయాభివృద్ధిని ఆటంకపరిచే వివిధ రకాల ప్రతిబంధకాలను భూసంస్కరణల ద్వారా నిరోధించవచ్చు. ఉదాహరణకు మధ్యవర్తుల తొలగింపు, కౌలు సంస్కరణలు, కమతాల సమీకరణ, కమతాల విభజనను అరికట్టుట, సహకార వ్యవసాయం మొదలైన సంస్కరణలు. అప్పుడు మాత్రమే సాంకేతిక సంస్కరణలు సఫలమై వ్యవసాయాభివృద్ధి జరుగుతుంది.

2) ఆర్థికాభివృద్ధి:భూసంస్కరణల మరొక లక్ష్యం ఆర్థికాభివృద్ధిని సాధించడం. వ్యవసాయాభివృద్ధి పరిశ్రమలు, వ్యాపారం, రవాణా మొదలైన ఇతర రంగాల అభివృద్ధిని గణనీయంగా ప్రభావితం చేస్తుంది. అందువల్ల ఆర్థికాభివృద్ధిని సాధించాలంటే ముందుగా వ్యవసాయరంగం, అభివృద్ధి చెందాలి. తద్వారా కొనసాగించగల అభివృద్ధిని సాధించడం సాధ్యమవుతుంది.

AP Inter 2nd Year Economics Study Material Chapter 4 వ్యవసాయ రంగం

3) సాంఘీక న్యాయం:భూసంస్కరణలను అమలుచేయడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని పేదరికం, ఆదాయ అసమానతలను తగ్గించి, సాంఘిక న్యాయాన్ని సాధించి సామ్యవాదరీతి సమాజ స్థాపనకు పునాదులు వేయవచ్చు. ఉదాహరణకు, కౌలు భద్రత వల్ల కౌలుదార్లు వ్యవసాయం మీద శ్రద్ధ చూపుతారు. కమతాల గరిష్ట పరిమితి చట్టాలు భూపంపిణీలోని అసమానతలను రూపుమాపుతాయి. అంతేకాక బలహీన వర్గాల ప్రజలకు భూమి పంపిణీ చేయడం, నివాస స్థలములు ఇవ్వడం, స్త్రీలకు భూమిపై యాజమాన్యపు హక్కులను కల్పించడం మొదలైన కార్యక్రమాల ద్వారా సాంఘిక న్యాయాన్ని సాధించవచ్చు.

4) వ్యవసాయ ఉత్పాదకత:భూసంస్కరణ ద్వారా భూమి యాజమాన్యానికి సంబంధించి, వ్యవస్థాపూర్వక మార్పులు తేవడం ద్వారా వ్యవసాయ ఉత్పత్తిని, ఉత్పాదకతను పెంపొందించవచ్చు. యాజమాన్యపు హక్కులు కల్పించడం ద్వారా కౌలుదార్లు, రైతుకూలీలు శ్రద్ధలో వ్యవసాయం చేసి అధిక ఉత్పత్తిని సాధిస్తారు. ఈ విధంగా అదనపు వ్యయం లేకుండానే భూసంస్కరణల ద్వారా వ్యవసాయ ఉత్పాదకతను అధికం చేయవచ్చు.

ప్రశ్న 10.
భూ సంస్కరణలలో భాగంగా మధ్యవర్తుల తొలగింపు.
జవాబు:
మధ్యవర్తుల తొలగింపు:మనదేశంలో భూ సంస్కరణలను అమలుచేయడంలో భాగంగా మధ్యవర్తులను తొలగించడమైనది. జమీందారి విధానం, జాగీరుదారుని విధానం, రైత్వారీ విధానంలోని లోపాలను తొలగించడం. 1948లో మధ్యవర్తుల తొలగింపు చట్టం చేశారు. ఫలితంగా 30 లక్షల మంది కౌలుదార్లు 62 లక్షల ఎకరాల భూమిపై యాజమాన్యపు హక్కులు పొందారు. మనదేశం తొలగించిన మధ్యవర్తులకు నష్టపరిహారం చెల్లించింది.

ప్రశ్న 11.
కమతాల గరిష్ట పరిమితి.
జవాబు:
కమతాల గరిష్ట పరిమితి చట్టాలు రైతులకు ఉండవలిసిన భూమి గరిష్ట పరిమితిని నిర్ధేశిస్తాయి. కమతాల గరిష్ట పరిమాణం అన్నీ రాష్ట్రాల్లో ఒకే విధంగా లేదు. ప్రభుత్వం గరిష్ట పరిమాణాన్ని నిర్ణయించేటప్పుడు భూసారం నీటి పారుదల సౌకర్యాలు, వ్యవసాయ ఉత్పత్తి పద్ధతులు, పంటల స్వభావం మొదలైన అంశాలను పరిగణలోనికి తీసుకొంటుంది.

గరిష్ట పరిమాణం నిర్ణయించడంలో ఏకరూపకతను సాధించడానికి కేంద్ర ప్రభుత్వం 1972లో ముఖ్యమంత్రుల సమావేశాన్ని ఏర్పాటు చేసింది.
1) గరిష్ట పరిమితి పరిమాణం:నిశ్చితంగా నీటిపారుదల సౌకర్యాలు కలిగి, సంవత్సరానికి రెండు పంటలు పండే సారవంతమైన భూములు విషయంలో గరిష్ట పరిమితి 18 ఎకరాలుగా నిర్ణయించడమైనది. ఈ ప్రత్యేక రకాల భూముల గరిష్ట పరిమితిని నిర్ణయించడంలో రాష్ట్ర ప్రభుత్వాలకు విచక్షణాధికారం ఉంది.

2) గరిష్ట పరిమాణాన్ని నిర్ణయించే యూనిట్:కమతాల గరిష్ట పరిమాణాన్ని నిర్ణయించేటప్పుడు కుటుంబాన్ని యూనిట్గా తీసుకుంటారు. కుటుంబం అంటే భార్య, భర్త, సంతానంగా నిర్వచించబడింది. ‘ఐదుగురు సభ్యులున్న కుటుంబాన్ని ఒక యూనిట్గా నిర్ణయించారు. కుటుంబ సభ్యులు ఐదుగురు మించినట్లైతే, ప్రతి అదనపు సభ్యునికి భూమిని కేటాయించి గరిష్ట పరిమితిని నిర్ణయిస్తారు. ఈ విధంగా నిర్ణయింబడిన గరిష్ట పరిమితి కుటుంబ యూనిట్ గరిష్ట పరిమితి రెట్టింపు కంటే ఎక్కువగా ఉండకూడదు. కుటుంబంలో యుక్త వయస్సుకు వచ్చిన ప్రతీ సభ్యుడిని వేరే యూనిట్గా పరిగణిస్తారు.

3) మినహాయింపులు:కమతాల గరిష్ట పరిమితిని నిర్ణయించేటప్పుడు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించిన గరిష్ట పరిమితి మినహాయింపు చట్టాల్లో ఏకరూపకత లేదు. కాఫీ, టీ, రబ్బరు, కోకో మొదలైన తోట పంటల భూములను పంచదార కర్మాగారాలు, సహకార వ్యవసాయ క్షేత్రాల ఆధీనంలో ఉన్న భూములను గరిష్ట పరిమితి చట్టం నుంచి మినహాయించారు..

4) మిగులు భూమి పంపిణీ:కమతాల గరిష్ట పరిమితి చట్టాల అమలుచేయడం ద్వారా లభించిన మిగులు భూమిని భూమి లేని రైతు కూలీలు, చిన్నరైతులు, ఉపాంత రైతులకు పంపిణీ చేయాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది.

ప్రశ్న 12.
భూ సంస్కరణలు విఫలం కావడానికి కారణాలు.
జవాబు:
భూ సంస్కరణలు పేదరికాన్ని నిర్మూలించి పేదవారికి సాధికారిత కల్పించాలన్న ఉద్దేశ్యంతో ప్రారంభించినప్పటికీ ఆచరణలో అనేక ఆటంకాలను ఎదుర్కొన్నాయి.
కారణాలు :

  1. రాజకీయ నాయకులలో చిత్తశుద్ధి లేకపోవడం.
  2. బీనామి పేర్ల పై భూమి బదిలీ చేయడం.
  3. భూసంస్కరణ శాసనాలలో ఏక రూపత లేకపోవడం.
  4. న్యాయస్థానాల జోక్యం.
  5. భూమికి సంబంధించిన రికార్డులు సరిగ్గా లేకపోవడం.
  6. భూసంస్కరణ మినహాయింపు చట్టాలలో లొసుగులు ఉండటం.
  7. గ్రామీణ పేదలు అసంఘటితంగా ఉండటం.
  8. అవినీతిమీయమైన పరిపాలనా యంత్రాంగం.

ప్రశ్న 13.
భారత ఆర్థిక వ్యవస్థపై హరిత విప్లవ ప్రభావాన్ని వివరింపుము. [Mar ’17]
జవాబు:
భారత ఆర్థిక వ్యవస్థపై హరిత విప్లవ ప్రభావం:హరిత విప్లవం భారత ఆర్థిక వ్యవస్థపై విశేష ప్రభావాన్ని చూపింది. హరిత విప్లవం వల్ల ఏర్పడిన సత్ఫలితాలను కింది విధంగా వివరించవచ్చు.
1) ఆహార ధాన్యాల ఉత్పత్తిలో పెరుగుదల హరిత విప్లవం యొక్క ప్రత్యక్ష ఫలితం ఆహార ధాన్యాల ఉత్పత్తిలో అధిక పెరుగుదల సాధించడం. హరిత విప్లవం ప్రభావం వరి, గోధుమ ఉత్పత్తి మీద ఎక్కువ ఉంది. 1960-61లో వరి, ధాన్యం ఉత్పత్తి 35 మిలియన్ టన్నుల నుంచి 2011-12 నాటికి 104 మిలియన్ టన్నులకు పెరిగింది. గోధుమ ఉత్పత్తి 1960-61లో 11 మిలియన్ టన్నులు ఉండగా 2011-12 నాటికి 255 మిలియన్ టన్నులకు పెరిగింది. మొత్తం మీద ఆహార ధాన్యాల ఉత్పత్తి 2012-13 నాటికి 257 మిలియన్ టన్నులకు పెరిగింది.

2) వాణిజ్య పంటల ఉత్పత్తిలో పెరుగుదల:హరిత విప్లవం ప్రారంభంలో ఆహార పంటలకు మాత్రమే పరిమితమై వాణిజ్య పంటల మీద ఎలాంటి ప్రభావం చూపలేదు. హరిత విప్లవం 1973-74 తరువాత వాణిజ్య పంటలైన చెరకు ఉత్పత్తి మీద విశేషమైన ప్రభావాన్ని, నూనె గింజలు, బంగాలదుంపల ఉత్పత్తుల మీద గణనీయమైన ప్రభావాన్ని చూపింది. చెరకు ఉత్పత్తి 1960-61 లో 110 టన్నుల నుంచి 2011-12 నాటికి 358 మిలియన్ టన్నులకు పెరిగింది. మానె గింజల ఉత్పత్తి 1960-61లో 7 మిలియన్ టన్నుల నుంచి 2011-12 నాటికి 30 మిలియన్ టన్నులకు పెరిగింది.

AP Inter 2nd Year Economics Study Material Chapter 4 వ్యవసాయ రంగం

3) ఉపాధి అవకాశాల పెరుగుదల: హరిత విప్లవం ఫలితంగా సాగులోవున్న భూ విస్తీర్ణం, వ్యవసాయ ఉత్పత్తి, ఉత్పాదకత పెరిగింది. వ్యవసాయరంగంలో శ్రమశక్తి ఎక్కువ అవసరమయ్యే వరి, చెరకు, తోటపంటలు, బంగాళదుంపలు కూరగాయలు మొదలైన పంటలు సాగుచేయడం వల్ల ఉపాధి అవకాశాలు పెరిగాయి. అంతేగాక సాంద్ర వ్యవసాయంలో భాగంగా బహుళ పంటలు పండించటం వల్ల కూడా ఉపాధి అవకాశాలు వృద్ధి చెందాయి. కార్పొరేట్ కంపెనీలు వ్యవసాయరంగంలో చిల్లర అమ్మకాలు చేపట్టడంతో ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరిగాయి.

4) బలిష్టమైన ముందు, వెనుక బంధాలు:వ్యవసాయ పారిశ్రామిక రంగాలు రెండూ పరస్పరం ఒకదానిపై మరొకటి ఆధారపడే రంగాలు వ్యవసాయం పరిశ్రమలకు కావల్సిన ముడిసరుకులనూ అందిస్తుంది. దీన్నే “ముందువైపు బంధం” అంటారు. అనాదిగా బలిష్టంగా ఉంది. పరిశ్రమలు వ్యవసాయానికి అవసరమైన ఉత్పాదకాలను అందిస్తుంది. దీనిని “వెనుకవైపు బంధం” అంటారు. అయితే ఈ బంధం బలహీనంగా ఉంది. హరిత విప్లవ ఫలితంగా పారిశ్రామిక రంగం సరఫరా చేసే వ్యవసాయ ఉత్పాదకాలను విపరీతంగా గిరాకీ పెరిగింది. తద్వారా వెనుక వైపు బంధం కూడా బలిష్టమైనది. ఈ విధంగా వ్యవసాయ, పారిశ్రామిక రంగాలు రెండూ బలోపేతం చేయబడ్డాయి.

5) ఆదాయల్లో పెరుగుదల:ఈ నూతన వ్యవసాయ వ్యూహం రైతులు తాము పండించిన పంటలను శ్రేణీకరణ, ప్రామాణీకరణ చేసి మధ్యవర్తుల ప్రమేయం లేకుండా గిట్టుబాటు ధరలకు ప్రత్యక్షంగా చిల్లర వ్యాపారం. చేసే కంపెనీలకు, అమ్ముకొనే అవకాశాలను కల్పించింది. ఈ కంపెనీలు రైతులకు లాభసాటి ధరలను, వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులను అందించడమే గాక ధరల నియంత్రణకు తోడ్పడ్డాయి. హరితవిప్లవ ఫలితంగా పంజాబ్, హర్యానా మధ్యప్రదేశ్, గుజరాత్, తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల రైతుల ఆదాయాలు గణనీయంగా పెరిగాయి.

6) పేదరికం తగ్గుదల:హరిత విప్లవం ఉపాధి అవకాశాలను వ్యవసాయరంగంలోనే కాక వ్యవసాయేతర రంగాలైన రవాణా, రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందుల పరిశ్రమల్లో, బ్యాకింగ్, సేవారంగాల్లో ఉపాధిని కల్పించింది. అంతేకాక హరితవిప్లవ ఫలితంగా ఆహారధాన్యాలలో లభించిన మిగులును ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా చౌకధరలకు పేదవారికి అందించడం జరుగుతుంది. దీని ఫలితంగా పేదవారి వాస్తవిక ఆదాయం పెరిగి పేదరికం తగ్గుతుంది.

ప్రశ్న 14.
గ్రామీణ పరపతినందించడంలో ప్రాంతీయ గ్రామీణ బాంకుల పాత్ర.
జవాబు:
భారత ప్రభుత్వం ఆచార్య యమ్. నరసింహం కమిటి సిఫార్సుల ఆధారంగా 1975 అక్టోబర్ 2వ తేదిన ఒక ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా 5 ప్రాంతీయ, గ్రామీణ బాంకులను ప్రారంభించింది. తరువాత కాలంలో వీటి సంఖ్య 196కి చేరింది. ప్రభుత్వ గ్రామీణ బాంకులను ఆర్థికంగా బలోపేతం చేయడానికి వీటిని ఏకీకృతం చేసింది. సాధారణంగా గ్రామీణ బాంకులను ఒక జాతీయ బాంకు పూచిపై స్థాపించటం జరుగుతుంది. 2013 మార్చి చివరకు 26 రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతంలోని 635 జిల్లాలలో 17,856 గ్రామీణ బాంకు శాఖలు ఉన్నాయి.

ప్రతి గ్రామీణ బాంకు అధీకృత మూలధనం ఒక కోటి రూపాయలు, దీనిలో చెల్లించిన మూలధనం 25 లక్షల రూపాయలు. ఈ మొత్తంలో 50 శాతం కేంద్ర ప్రభుత్వం, 15 శాతం రాష్ట్ర ప్రభుత్వం, 35 శాతం పూచీ ఇచ్చిన ప్రభుత్వ బాంకు సమకూరుస్తాయి.

జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ది బాంకు, రిజర్వుబాంకు ప్రాంతీయ గ్రామీణ బాంకుల మధ్య సమన్వయకర్తగా వ్యవహరిస్తూ ఏట కార్యకలాపాలను పర్యవేక్షిస్తుంది.

చిన్న రైతులు, ఉపాంత రైతులు, వ్యవసాయ కూలీలు, హస్త కళాకారులు, చిన్న వ్యాపారస్తులు మొదలైన వారికి పరపతిని సమకూర్చి ఉత్పాదక కార్యక్రమాల్లో ప్రగతిని సాధించటం గ్రామీణ బ్యాంకుల ప్రధాన ఆశయం.

2011-2012 లో గ్రామీణ బాంకులు వ్యవసాయదారులకు 54,550 కోట్ల రూపాయల రుణం అందించాయి. ఇది మొత్తం సంస్థపరమైన పరపతిలో 10.65 శాతంగా ఉన్నది. ప్రస్తుతం గ్రామీణ బాంకులు, వాణిజ్య బ్యాంకుల మాదిరిగానే సాధారణ బాంకింగ్ కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు.

ప్రశ్న 15.
ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు.
జవాబు:
సహకార పరపతి సంఘాలు:జర్మనీలో విజయవంతంగా అమలు చేయబడిన సహకార పరపతి విధానాన్ని ఆసరాగా తీసుకొని భారతదేశంలో 1904లో సహకారోద్యమం ప్రారంభించబడింది. గ్రామీణ రైతులను రుణ విముక్తులను చేసి వారిలో పొదుపు అలవాట్లను పెంపొందించడం సహకార పరపతి సంస్థల ముఖ్యోద్దేశం.

స్వల్పకాలిక సహకార పరపతి విధానాన్ని మూడు అంచెల్లో నిర్మించడం జరిగింది. మొదటి అంచెలో గ్రామ స్థాయిలో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలను ఏర్పాటు చేశారు. రెండవ అంచెలో జిల్లా స్థాయిలో జిల్లా కేంద్ర సహకార బ్యాంకులను ఏర్పాటు చేశారు. మూడవ అంచెలో రాష్ట్ర సహకార బాంకులను ఏర్పాటు చేశారు.

ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు గ్రామ స్థాయిలో 10 లేదా అంతకంటే ఎక్కువమంది సభ్యులచేత ప్రారంభించబడతాయి. ఈ సంఘాలు ఎన్నుకోబడిన అధ్యక్ష, కార్యదర్శి, కోశాధికారులచే నిర్వహించబడతాయి. రిజర్వ్ బాంకు, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలను బలోపేతం చేయడానికి చర్యలు చేపట్టింది.

1976లో జరిగిన ప్రాథమిక వ్యవసాయం సహకార పరపతి సంఘాల పునర్వ్యవస్థీకరణ వల్ల “ఏకగవాక్ష విధానం” అమల్లోకి వచ్చింది.

2012 మార్చి 31 నాటికి 31 రాష్ట్ర సహకార బ్యాంకులు, 370 జిల్లా సహకార బాంకులు, 92,432 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల స్వల్పకాలిక పరపతిని అందిస్తున్నాయి.

AP Inter 2nd Year Economics Study Material Chapter 4 వ్యవసాయ రంగం

ప్రశ్న 16.
వాణిజ్య బాంకులు – గ్రామీణ పరపతి.
జవాబు:
లాభోద్దేశంతో బాంకింగ్ కార్యకలాపాలు నిర్వహించే బాంకులే వాణిజ్య బాంకులు “1951 వరకు వ్యవసాయానికి అందించబడిన మొత్తం పరపతిలో వాణిజ్య బాంకులు వాటా కేవలం 0.9 శాతం మాత్రమే ఉంది. 1964 లో 14, 1980లో 6 బాంకులను జాతీయం చేసిన తరువాత వాణిజ్య బాంకులు విజయవంతంగా నిర్మాణాత్మకమైన పాత్రను పోషిస్తున్నాయి. 2012 జూన్ నాటికి బాంకు శాఖలు 98,591 విస్తరించాయి.

వాణిజ్య బాంకులు కింది కార్యక్రమాలు కోసం గ్రామీణ పరపతిని అందిస్తున్నాయి.
1) వాణిజ్య బ్యాంకులు గ్రామీణ రైతులను అవసరమైన మొత్తం స్వల్పకాలిక పరపతిలో 42 నుంచి 45 శాతం వరకు అందిస్తున్నాయి. అదే విధంగా రైతులు యంత్రాలు, ట్రాక్టర్లు, పంపుసెట్లు మొదలైన వాటిని కొనుగోలు చేయడానికి అవసరమైన మొత్తం దీర్ఘకాలిక పరపతిలో 35 నుండి 37 శాతం వరకు అందిస్తున్నాయి.

2) వాణిజ్య బాంకులు, వ్యవసాయ అనుబంధ కార్యక్రమాలైన పశుపోషణ, పాడి, పందుల పెంపకం, కోళ్ళ పెంపకం, చేపల పెంపకం మొదలైన కార్యక్రమాలను కూడా పరపతిని అందిస్తున్నాయి.

3) వాణిజ్య బ్యాంకులు వివిధ ప్రభుత్వ రంగ సంస్థల సహకారంతో గ్రామీణ పేదరిక నిర్మూలనా పథకాలైన సమగ్ర గ్రామీణాభివృద్ధి పథకం, జవహర్ రోజ్ గార్ యోజన పథకం కింద లబ్దిదారులకు రుణ సౌకర్యాలు కల్పిస్తున్నారు.

4) వాణిజ్య బాంకులు రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందుల కంపెనీలకు, భారత ఆహార సంస్థకు, కేంద్ర గిడ్డంగుల సంస్థకు సహకార పరపతి సంఘాలకు, గ్రామీణ బాంకులకు పరపతి అందించి తద్వారా రైతులకు పరోక్షంగా లబ్ది చేకూరుస్తున్నాయి.

ప్రశ్న 17.
గ్రామీణ పరపతినందించడంలో రిజర్వుబాంకు పాత్ర.
జవాబు:
మనదేశంలో రిజర్వుబాంకు 1935 సం॥లో స్థాపించి 1949లో జాతీయం చేశారు. ఈ రిజర్వుబాంకు ప్రారంభం నుంచి గ్రామీణ పరపతిని అందించడంలో ప్రముఖ పాత్ర పోషించుచున్నది. ఈ బాంకు వ్యవసాయభివృద్ధి కోసం 1956లో రెండు రకాల నిధులను ఏర్పాటు చేసింది.

  1. జాతీయ వ్యవసాయ పరపతి – దీర్ఘకాలిక కార్యకలాపాల నిధి.
  2. జాతీయ వ్యవసాయ పరపతి – స్థిరీకరణ నిధి, రైతులకు అవసరమైన దీర్ఘకాలిక రుణ సదుపాయాల కల్పనకు మొదటి నిధిని, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు రైతులను అదుకోవడానికి రెండవ నిధిని ఏర్పాటు చేశారు.

1. స్వల్పకాలిక పరపతి:రిజర్వు బాంకు 15 నెలల కాలవ్యవధి కలిగిన పరపతిని అందించే ఉద్దేశ్యంతో ప్రభుత్వ సెక్యూరిటీలపై, తక్కువ వడ్డీకి పరపతి అందిస్తుంది.

2. మధ్యకాలిక పరపతి:రిజర్వు బాంకు 15 నెలల నుంచి 5 సం॥ కాలపరపతి గల రుణాలను వర్తమాన వడ్డీ రేటు కంటే తక్కువవడ్డీ రేటుకు ప్రభుత్వ సెక్యూరిటీలపై రాష్ట్ర సహకార బాంకులకు మధ్యకాలిక రుణాలను అందిస్తుంది.

3. దీర్ఘకాలిక పరపతి:ఇది 20 సం॥లదీర్ఘ కాల పరపతి గల దీర్ఘకాలిక పరపతిని అందిస్తుంది.

4. ఇతర సేవలు:1) వ్యవసాయ పరపతిని అందించే సంస్థలన్నింటికి రిజర్వుబాంకు రుణాలు మంజూరు చేయును. 2) చిన్న రైతులకు ఉపాంత రైతులకు, అభివృద్ధి సంస్థల ద్వారా రుణాలు రిజర్వు బాంకు అందించుచున్నది.

AP Inter 2nd Year Economics Study Material Chapter 4 వ్యవసాయ రంగం

ప్రశ్న 19.
వ్యవసాయ మార్కెటింగ్ లోని వివిధ దశలు.
జవాబు:
రైతులు పంటను పండించిన వెంటనే అమ్మకం జరపలేరు. విక్రయానికి ముందు ఈ ఉత్పత్తులు అనేక దశలను దాటవలసి ఉంటుంది. ఈ దశలనే వ్యవసాయ మార్కెటింగ్ దశలు అంటారు.

  1. అసెంబ్లింగ్:వివిధ ప్రాంతాలలోని అనేక మంది రైతులు అల్ప పరిమాణంలో చేసిన ఉత్పత్తులను సేకరించి పెద్ద మొత్తంగా పోగుచేసి ఒక నిర్ణీత ప్రదేశంలోకి చేర్చేప్రక్రియను ‘అసెంబ్లింగ్’ అంటారు.
  2. రవాణా:వ్యవసాయ వస్తువులను ఉత్పత్తి కేంద్రాల నుంచి మార్కెట్ కేంద్రాలకు తరలించటాన్ని రవాణా అంటారు.
  3. శ్రేణీకరణ:రైతులు పండించిన ఉత్పత్తుల నాణ్యతలో తేడాలుంటాయి. నాణ్యతలను బట్టి మన్నికను బట్టి ఉత్పత్తుల వర్గీకరించటాన్ని శ్రేణికరణ అంటారు.
  4. ప్రాసెసింగ్:వినియోగదారుల అన్ని వ్యవసాయ వస్తువులును నేరుగా వినియోగించే వాటిని వినియోగానికి అనువుగా మార్చాలి. ఈ ప్రక్రియను ప్రాసెసింగ్ అంటారు. ఉదా:వరి ధాన్యం బియ్యంగా, నూనెగింజలను వంటనూనెగా మార్చడం.
  5. ప్రతిచయనీకరణ:వ్యవసాయ వస్తువులను ప్రామాణికరించడం కోసం శ్రేణీకరణ చేయబడిన ఉత్పత్తుల నుంచి కొన్ని ప్రతిచయనాలను ఎంపిక చేయుట.
  6. పాకింగ్:ప్రాసెస్ చేయబడిన ఉత్పత్తులను పాకింగ్ చేయాలి.
  7. నిల్వ చేయడం:గిట్టుబాటు ధర వచ్చేంత వరకూ కొన్ని వ్యవసాయ ఉత్పత్తులను నిల్వ చేయాలి. నశ్వర వ్యవసాయ వస్తువులను భద్రపర్చుటకు శీతల గిడ్డంగులు అవసరం.

ప్రశ్న 20.
క్రమబద్దీకరించిన మార్కెట్లు. [Mar ’16]
జవాబు:
మార్కెట్లను 1951 సం॥లో ఏర్పాటు చేశారు. వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ లోని లోపాలను సరిదిద్దడం కోసం, వ్యాపారస్తులు, కమిషన్ ఏజెంట్లకు వారి విధులు పరంగా కాకుండా లభించే మార్జిన్లు తగ్గించడం కోసం ఈ మార్కెట్లు రూపొందించారు. ఈ మార్కెట్లు నిర్వహించడానికి ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు, స్థానిక సంస్థల ప్రతినిధులు, రైతులు, వ్యాపారస్తుల ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. విధులు :

  1. వ్యవసాయ ఉత్పత్తుల ధరలను నోటీస్ బోర్డులో ఉంచుతాయి.
  2. మధ్యవర్తుల సంఖ్యను తగ్గించి వారికి లైసెన్సులను మంజూరు చేస్తాయి.
  3. తూకం చార్జీలు, దళారీల కమీషన్లు ముందుగానే మార్కెట్ కమిటీలు నిర్ణయిస్తాయి.
  4. ప్రామాణికమైన తూనికలు, కొలతలు వాడకాన్ని తప్పనిసరి చేస్తాయి.
  5. అవసరమైన ప్రదేశాలలో సాధారణ, శీతలీకరణ గిడ్డంగులను ఏర్పాటు చేస్తాయి.
  6. మార్కెట్ మోసాలను పూర్తిగా నియంత్రిస్తాయి.

ప్రశ్న 21.
సహకార వ్యవసాయం.
జవాబు:
గ్రామంలోని రైతులంతా స్వచ్ఛందంగా ఒక సంఘంగా ఏర్పడి, తమ భూములు వ్యవసాయ పరికరాలు, పశువులు మొదలైన ఉత్పాదకాలన్నింటికీ సంఘానికి అందించి మొత్తం భూమిని ఏకఖండంగా చేసి సహకార ప్రాతిపదికన నిర్వహించే వ్యవసాయాన్ని ‘సహకార వ్యవసాయం’ అంటారు.

  1. సహకార వ్యవసాయం వల్ల ఉత్పత్తి అధికమై మిశ్రమం కొరకు మిగులు ఏర్పడుతుంది.
  2. ఈ వ్యవసాయం వల్ల ఉత్పత్తిలో సాంకేతిక, మార్కెటింగ్, ద్రవ్యపరమైన ఆదాలు లభిస్తాయి.
  3. భూమి పునరుద్ధరణ, గొట్టపు బావుల త్రవ్వకం మొదలైన కార్యక్రమాలకు అధిక పెట్టుబడి అవసరం. ఈ కార్యకలాపాలను సంఘం స్థాయిలో సమిష్టిగా చేపట్టి వ్యవసాయాభివృద్ధి సాధించవచ్చు.
  4. ఈ వ్యవసాయ విధానంలో సాంద్ర, విస్తృత వ్యవసాయానికి అవకాశాలు ఎక్కువ.
  5. సహకార సంఘంలోని రైతులందరూ పరస్పరం సహకరించుకుంటూ, ఉమ్మడిగా వ్యవసాయ కార్యకలాపాలు చేపట్టడం ద్వారా వారి మధ్య సాంఘిక సమానత్వము సాధించవచ్చు.

AP Inter 2nd Year Economics Study Material Chapter 4 వ్యవసాయ రంగం

ప్రశ్న 22.
ఒప్పందపు వ్యవసాయం.
జవాబు:
వ్యవసాయ మార్కెటింగ్ విధానంలోని లోపాలను పరిష్కరించడానికి ఏర్పాటు చేసిన పరిష్కార మార్గం ఒప్పంద వ్యవసాయం రైతులు తమ ఉత్పత్తులను వినియోగించే సంస్థలతో ప్రత్యక్షంగా ఒప్పందాలను కుదుర్చుకొని చేసే వ్యవసాయ విధానాన్ని ‘ ఒప్పంద వ్యవసాయం’ అంటారు.

  1. ఈ విధానంలో ముందుగా ధరలకు సంబంధించిన ఒప్పందాలు చేసుకోవడం వల్ల వ్యవసాయ ఉత్పత్తుల ధరలలో ఉండే అస్థిరతలను తొలగించి రైతుల ఆదాయంలో స్థిరత్వాన్ని పెంపొందించవచ్చు.
  2. రైతులు ఏ పరిశ్రమలలో ఒప్పందాలు కుదుర్చుకున్నారో అవి పరపతి, సాంకేతిక సహాయం అందిస్తాయి.
  3. నాణ్యమైన వ్యవసాయ ఉత్పత్తులు లభించడానికి అవకాశం పెరుగుతుంది.
  4. రైతులు వ్యక్తిగతంగా కాక సహకార ప్రాతిపదికన ఒప్పందం కుదుర్చుకుంటే వారికి బేరమాడే శక్తి పెరుగుతుంది.

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
వ్యవసాయరంగం.
జవాబు:
వ్యవసాయం, దాని అనుబంధరంగాలైన అడవుల పెంపకం, చేపల పెంపకం, పాడి, పశుపోషణ, తోటల పెంపకం, గనులు, క్వారీలు మొదలగువాటన్నింటికి కలిపి వ్యవసాయరంగం అంటారు.

ప్రశ్న 2.
వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు.
జవాబు:
పరిశ్రమలు వాటికవసరమైన ముడిసరుకులు అది వ్యవసాయరంగముపై ఆధారపడితే వాటిని వ్యవసాయ ఆధార పరిశ్రమలంటారు. మనదేశంలో వ్యవసాయ ఆధార పరిశ్రమలు అనేకం ఉన్నాయి. ఉదా:జనపనార, పంచదార మొదలగు పరిశ్రమలు. ఈ పరిశ్రమల అభివృద్ధికి వ్యవసాయ ప్రగతి తోడ్పడుతుంది.

ప్రశ్న 3.
ఆహార భద్రత.
జవాబు:
ఆరోగ్యవంతమైన, చురుకైన జీవనాన్ని కొనసాగించడానికి ప్రజలందరికి అన్ని కాలాలలో చాలినంత పరిమాణంలో ఆహారం అందుబాటులో ఉండటం “ఆహార భద్రత”.

ప్రశ్న 4.
బంజరు భూముల పునరుద్ధరణ.
జవాబు:
వ్యవసాయరంగంలో మధ్యవర్తుల తొలగింపు ఫలితంగా బంజరు భూములు మీద యాజమాన్యపు హక్కులు పొందిన రైతులు వాటిని వ్యవసాయ యోగ్యంగా మార్చడమే “బంజరు భూముల” పునరుద్ధరణ.

ప్రశ్న 5.
పంటల తీరు .
జవాబు:
నిర్ణీత కాలంలో ఒకదేశంలో వ్యవసాయ భూమిని వివిధ పంటలు పండించటానికి ఉపయోగిస్తున్నారు. ఈ రీతిని “పంటతీరు” అంటారు.

ప్రశ్న 6.
శాశ్వత నీటి కాలువలు.
జవాబు:
నదులపై అడ్డంగా ఆనకట్టలు కట్టగా ఏర్పడిన జలాశయాలకు ఈ కాలువలను అనుసంధానం చేస్తారు. అందువల్ల ఇవి వ్యవసాయానికి సంవత్సరం పొడవున నీటిని అందించి శాశ్వత కాలువులుగా పిలవబడుతున్నాయి.

AP Inter 2nd Year Economics Study Material Chapter 4 వ్యవసాయ రంగం

ప్రశ్న 7.
బిందు నీటి పారుదల.
జవాబు:
మొక్కల యొక్క వేరు మొదలులో నీటిని బొట్లు బొట్టుగా చేయడం ‘బిందు నీటిపారుదల’.

ప్రశ్న 8.
తుంపరల నీటి పారుదల.
జవాబు:
మొక్కల్ని తడపడానికి సాంకేతిక పరికరాల సహాయంతో నీరు తుంపర్లుగా పడేటట్లు చేస్తారు. దీనినే తుంపర్ల నీటి పారుదల.

ప్రశ్న 9.
భూ సంస్కరణలు.
జవాబు:
సమానత్వం, సాంఘీకన్యాయం, వ్యవసాయాభివృద్ధి సాధించడానికి భూమి మీద చేపట్టే ఆర్థిక, ఆర్థికేతర చర్యలను “భూసంస్కరణలు” అంటారు.

ప్రశ్న 10.
సేంద్రీయ వ్యవసాయం. [Mar ’16]
జవాబు:
ప్రకృతి సిద్ధంగా లభించే ఎరువులను, క్రిమిసంహారక మందులను ఉపయోగించి వ్యవసాయం చేయడాన్ని “సేంద్రియ వ్యవసాయం” అంటారు.

ప్రశ్న 11.
ఆర్థిక మతం
జవాబు:
కుటుంబ సభ్యులందరికి సముచితమైన జీవనప్రమాణం,ఉపాధి కల్పించే భూపరిణాన్ని “ఆర్థిక కమతం” అంటారు.

ప్రశ్న 12.
వ్యవసాయ యాంత్రీకరణ.
జవాబు:
వ్యవసాయ కార్యకలాపాల నిర్వహణలో ట్రాక్టర్లు, పంపుసెట్లు, పంటమార్పిడి యంత్రాలు మొదలగునవి వినియోగించడాన్ని “వ్యవసాయ యాంత్రీకరణ” అంటారు.

ప్రశ్న 13.
కమతాల సమీకరణ.
జవాబు:
గ్రామంలో వేర్వేరు ప్రాంతాలలో విస్తరించి ఉన్న భూకమతాలను ఏకఖండంగా చేసే ప్రక్రియను కమతాల సమీకరణ అంటారు.

ప్రశ్న 14.
సహకార వ్యవసాయం.
జవాబు:
గ్రామంలోని రైతులందరూ స్వచ్ఛందంగా తమ భూములను ఏకఖండంగా చేసి సహకార ప్రాతిపదికపై నిర్వహించే వ్యవసాయ విధానాన్ని “సహకార వ్యవసాయం” అంటారు.

ప్రశ్న 15.
భూ సంస్కరణల ఆశయం.
జవాబు:

  1. గత సంవత్సరం నుండి వారసత్వంగా వచ్చినటువంటి అడ్డంకులను తొలగించటం.
  2. భూమిని దున్నే వాడికి రక్షణ కల్పించడం
  3. వివిధ రూపాలలో ఉన్న దోపిడీలను అరికట్టడం మొదలగునవి.

AP Inter 2nd Year Economics Study Material Chapter 4 వ్యవసాయ రంగం

ప్రశ్న 16.
జమీందారీ విధానం.
జవాబు:
ఈ పద్ధతిలోని 1793 లార్డ్ కార్నవాలీస్ మొదట బెంగాల్లో ప్రవేశపెట్టాడు. ఈ పద్ధతిలో జమీందారులు తమపరిధిలోని భూములపై యాజమాన్యపు హక్కులు కలిగి ప్రభుత్వానికి పన్ను చెల్లించే బాధ్యత వహించేవారు. అయితే వారు రైతుల దగ్గర అధిక మొత్తాన్ని వసూలు చేసేవారు.

ప్రశ్న 17.
రైత్వారీ విధానం.
జవాబు:
దీనిని సర్ థామస్ మాన్రో 1792లో మద్రాసు రాష్ట్రంలో ప్రవేశపెట్టాడు. తరువాత ఈ విధానం మహారాష్ట్ర, బీహారు, తూర్పు పంజాబు విస్తరించింది. ఈ విధానంలో రైతులు తమ భూములమీద యాజమాన్యపు హక్కులు కలిగి ఉంటారు. రైతుకి, ప్రభుత్వానికి మధ్యవర్తులు ఉండరు. రైతులే ప్రత్యక్షంగా భూమిశిస్తు చెల్లిస్తారు.

ప్రశ్న 18.
జిరాయితీ హక్కు గల కౌలుదార్లు. [Mar ’16]
జవాబు:
ఏ కౌలుదారులను భూస్వాములు కౌలు చెల్లిస్తున్నంతకాలం తొలగించలేరో వారిని “జిరాయితీ హక్కున్న ‘కౌలుదారులు’ లేదా శాశ్వత కౌలుదారులు అంటారు.

ప్రశ్న 19.
హరిత విప్లవం.
జవాబు:
ఆచార్య నిర్మల్ బోర్లోగ్ ఈ నూతన వ్యవసాయ వ్యూహానికి పితామహుడు. వ్యవసాయ రంగంలో ఉత్పత్తిని, ఉత్పాదకతను పెంపొందించే ఉద్దేశంతో రైతుల్లో నవ చైతన్యాన్ని రగల్చి అధిక దిగుబడినిచ్చే విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు, యంత్రాలను ఉపయోగించి జీవనాధార వ్యవసాయాన్ని పరిశ్రమగా మార్చే విప్లవాత్మకమైన మార్పును హరిత విప్లవం అంటారు.

ప్రశ్న 20.
IADP.
జవాబు:
సాంద్రత వ్యవసాయ జిల్లాల కార్యక్రమం (IADP) భారత ప్రభుత్వం 1964లో ఫోర్సు ఫౌండేషన్ కమిటీ సిఫార్సును ఆధారంగా అధిక భూసారం, నిశ్చితంగా లభించే నీటి వనరులు, తగిన వర్షపాతం మొదలైన సౌకర్యాలుండి వరదలు, మురుగునీరు, భూసార క్షీణత వంటి సమస్య తీవ్రత తక్కువగా ఉన్న ఏడు జిల్లాలను ఎంచుకొని సాంద్ర వ్యవసాయ పద్ధతుల ద్వారా వ్యవసాయాభివృద్ధిని సాధించడానికి ప్రారంభించబడినది. ఉదా:ఆంధ్రలో పశ్చిమగోదావరి,

ప్రశ్న 21.
IAAP.
జవాబు:
సాంద్ర వ్యవసాయ ప్రాంతాల కార్యక్రమం. భారత ప్రభుత్వం 1967లో సాంద్ర వ్యవసాయ కింద ఉన్న భూసార విస్తీర్ణాన్ని అధికం చేయాలనే ఉద్దేశ్యంతో ఈ పథకాన్ని ప్రవేశ పెట్టింది. ఈ పథకాన్ని కొన్ని ఎంచుకొన్న పంటలు, ప్రాంతాలకు మాత్రమే పరిమితమైంది. ఈ పథకాన్ని దేశంలో 114 జిల్లాలకు విస్తరింప చేశారు.

ప్రశ్న 22.
HYVP అధిక దిగుబడిలునిచ్చే విత్తనాలు కార్యక్రమాలు.
జవాబు:
దీనిని 1965లో ప్రారంభించారు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్యోద్దేశం ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధిని సాధించడం, హరిత విప్లవం సాధించడంలో సంకర జాతి విత్తనాల పాత్ర కీలకమైంది. ICAR, ICRISAT మొదలగునవి అధిక దిగుబడినిచ్చే సంకరజాతి విత్తనాలను సృష్టించడం జరిగింది.

AP Inter 2nd Year Economics Study Material Chapter 4 వ్యవసాయ రంగం

ప్రశ్న 23.
RIDF
జవాబు:
నాబార్డ్ ఆధ్వర్యంలో గ్రామీణ అవస్థాపనా నిధి 1995-96లో ఏర్పాటు చేయడం జరిగింది. దీని ముఖ్య ఆశయం అవస్థాపనా సౌకర్యాల కొరత కారణంగా మధ్యలో ఆగిపోయిన వివిధ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు నిధులు అందించడం.

ప్రశ్న 24.
కిసాన్ క్రెడిట్ కార్డు. [Mar ’17]
జవాబు:
ఈ స్కీమ్ను 1998లో ప్రవేశపెట్టింది. రైతులకు వ్యవసాయ ఖర్చులకోసం, వ్యవసాయ ఉత్పాదకాల కొనుగోలు కోసం తక్కువ వడ్డీకి సకాలంలో సరిపడినంత స్వల్పకాలిక పంట రుణాలు అందించడం ఈ పథకం యొక్క ఉద్దేశం.

ప్రశ్న 25.
SGSY.
జవాబు:
స్వర్ణ జయంతి గ్రామీణ స్వరోజ్ గార్ యోజన సంస్థాపరమైన పరపతి అందిస్తున్న పెద్ద పథకం, IRDP, TRYSEM, DWCRA ఇతర అనుబంధ పథకాలన్నింటిని ఒక్కటిగా విలీనం చేసి దీనిని 1999న ప్రారంభించిరి. పేదరికాన్ని నిర్మూలించడం ఈ పథకం యొక్క ముఖ్యోద్దేశం.

ప్రశ్న 26.
సూక్ష్మ విత్తం. [Mar ’17]
జవాబు:
గ్రామీణ, పట్టణ ప్రాంతపు పేదలకు స్వల్ప మొత్తంలో పరపతిని తక్కువ వడ్డీకి అందించడాన్ని సూక్ష్మ పరపతి అంటారు.

ప్రశ్న 27.
అసెంబ్లింగ్.
జవాబు:
వివిధ ప్రాంతాలలోని అనేక మంది రైతులు అల్పపరిమాణంలో చేసిన ఉత్పత్తులను సేకరించి పెద్ద మొత్తంగా పోగు చేసి ఒక నిర్ణీత ప్రదేశంలోనికి చేర్చే ప్రక్రియను “అసెంబ్లింగ్” అంటారు.

ప్రశ్న 28.
ప్రాసెసింగ్.
జవాబు:
వ్యవసాయ ఉత్పత్తులను వినియోగానికి అనువుగా మార్చే ప్రక్రియను ప్రాసెసింగ్ అంటారు. ఉదా: వడ్లు లేదా ధాన్యంను బియ్యంగా మార్చడం.

ప్రశ్న 29.
AGMARK.
జవాబు:
వ్యవసాయ ఉత్పత్తుల నాణ్యతల గుర్తుగా వ్యవసాయ మార్కెటింగ్ యొక్క సంకేతాక్షరం AGMARK.

AP Inter 2nd Year Economics Study Material Chapter 4 వ్యవసాయ రంగం

ప్రశ్న 30.
విక్రయం కాగల మిగులు. [Mar ’17]
జవాబు:
వ్యవసాయదారులు తాము పండించిన మొత్తం ఉత్పత్తిని మార్కెట్లో విక్రయించలేరు. అందులో కొంత భాగాన్ని విత్తనాలకు, వేతనాలకు సొంత వినియోగానికి దాచుకుంటారు. ఈ అవసరాలు పోను మిగిలిన మొత్తం మార్కెట్లో విక్రయించడానికి సిద్ధంగా ఉంటుంది. ఈ మిగులునే విక్రయం కాగల మిగులు అంటారు.

 

ప్రశ్న 31.
రైతు బజార్లు. [Mar ’17, ’16]
జవాబు:
ఏ మార్కెట్లలో అమ్మకందారులైన, రైతులకు కొనుగోలుదారులకు మధ్య దళారీలు ఉండరో అ మార్కెట్లను “రైతు బజార్లు” అంటారు.

AP Inter 2nd Year Economics Study Material Chapter 3 జాతీయ ఆదాయం

Andhra Pradesh BIEAP AP Inter 2nd Year Economics Study Material 3rd Lesson జాతీయ ఆదాయం Textbook Questions and Answers.

AP Inter 2nd Year Economics Study Material 3rd Lesson జాతీయ ఆదాయం

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
భారతదేశంలో జాతీయాదాయ పెరుగుదల ధోరణులను విశ్లేషించండి.
జవాబు:
ఒక దేశంలో ఒక సంవత్సరకాలంలో ఉత్పత్తి అయిన వస్తుసేవల నికర విలువను జాతీయాదాయం అంటారు. కేంద్ర గణాంక సంస్థ జాతీయాదాయ అంచనాలను, వర్తమాన ధరలను మరియు స్థిర ధరలలో మదింపు చేస్తుంది. ప్రస్తుత ధరల వద్ద జాతీయాదాయము పెరుగుదల రెండు అంశాలను ప్రభావితం చేస్తుంది.

  1. వాస్తవిక వస్తు సేవల పెరుగుదల
  2. ధరలలో పెరుగుదల.

వస్తుసేవల ఉత్పత్తి వల్ల జాతీయాదాయం పెరిగితే వాస్తవిక ఆర్థికవృద్ధిని సూచిస్తుంది. రెండవ కారణం వల్ల జాతీయాదాయం పెరిగితే ద్రవ్యరూపంలో పెరిగిన ఆదాయాన్ని స్థిర ధరల వద్ద ఆదాయాన్ని కుదించి వాస్తవిక ఆదాయాన్ని లెక్కించవలసి వస్తుంది. స్థిర ధరల వద్ద నికర జాతీయోత్పత్తి సమాజం యొక్క ఉత్పాదక సామర్థ్యాన్ని సూచిస్తుంది.
AP Inter 2nd Year Economics Study Material Chapter 3 జాతీయ ఆదాయం 1

1R: మొదటిసారి సరిచేసిన అంచనాలు 2R: రెండవసారి సరిచేసిన అంచనాలు 3R మూడవసారి సరిచేసిన అంచనాలు.

AP Inter 2nd Year Economics Study Material Chapter 3 జాతీయ ఆదాయం

1950 – 51వ సంవత్సరంలో నికర జాతీయోత్పత్తి ప్రస్తుత ధరల ప్రకారం 9,464 కోట్ల రూపాయలు ఉండగా 2013 -14 నాటికి రూ. 91,71,045 లకు పెరిగింది. తలసరి నికర జాతీయోత్పత్తి 1950-51వ సం॥లో రూ.264 ఉండగా 2013-14లో రూ.74,380లుగా ఉంది.
AP Inter 2nd Year Economics Study Material Chapter 3 జాతీయ ఆదాయం 2
AP Inter 2nd Year Economics Study Material Chapter 3 జాతీయ ఆదాయం 3

1, 2 పంచవర్ష ప్రణాళికలలో నికర జాతీయోత్పత్తి 4.2 శాతంగా ఉంది. 3వ ప్రణాళికలో 2.6 శాతంకు తగ్గినది. దీనికి కారణం తీవ్ర కరువు. 4వ ప్రణాళికలో 3.2 శాతం కాగా 5వ ప్రణాళికలో 4.9%, 6వ ప్రణాళికలో 3.1%, 11వ ప్రణాళికాకాలంలో 7.5% గా ఉంది. ఇదే ప్రణాళికలలో తలసరి నికర జాతీయోత్పత్తి వరుసగా 1వ ప్రణాళికలో 2.4% ఉండగా 11వ ప్రణాళికలో 5.9గా ఉంది.

ప్రశ్న 2.
జాతీయోత్పత్తిలో వివిధ రంగాల వాటాలను వివరించండి.
జవాబు:
జాతీయాదాయములో వివిధ రంగాల వాటా వివరాలు అత్యధిక ప్రాధాన్యత కలిగిన అంశము. ఒకవేళ ఆర్థికాభివృద్ధి ముఖ్యంగా వివిధ రంగాలు జాతీయాదాయమునకు సమకూర్చే వాటాలపై ఆధారపడును. జాతీయాదాయములో ఏ రంగానికి ఎంతెంతవాటా ఉన్నదీ పరిశీలిస్తే ఆయారంగాల ప్రాధాన్యతలు, వాటి పోకడలు తెలుస్తాయి. ముఖ్యంగా మనదేశంలో జాతీయాదాయ ప్రాథమిక రంగం, ద్వితీయ, తృతీయ రంగాల ఆదాయంతో సంయోజనమవుతుంది. సాధారణంగా జాతీయాదాయమునకు వ్యవసాయరంగం వాటా అధికముగా ఉన్న ఆ దేశము అభివృద్ధి చెందుతున్న దేశంగా చెప్పవచ్చును.

స్థూలదేశీయోత్పత్తిలో ప్రాథమిక రంగం వాటా: స్వాతంత్ర్యం తరువాత భారతదేశంలో స్థూల దేశీయోత్పత్తిలో. ప్రాథమిక రంగం (వ్యవసాయం, అడవులు, చేపల పెంపకం) వాటా 1950 – 51 లో 55.4 శాతము ఉండగా 1980 81 నాటికి 38 శాతానికి 2013-14 (ముందస్తు అంచనాలు) 13.9 శాతానికి తగ్గినది. దీనికి కారణము ప్రాథమిక రంగంలో కేవలం వ్యవసాయరంగపు వాటా భారీగా తగ్గుట. జాతీయాదాయంలో అటవీ ఉత్పత్తుల విలువకూడా తగ్గుచున్నది. జాతీయాదాయానికి చేపల ఉత్పత్తుల విలువ స్థిరంగా ఉన్నది. రవాణా, వ్యాపారం, బ్యాంకింగ్, భీమా, ఇతర సేవల వ్యవసాయరంగం కంటే వేగంగా అభివృద్ధి చెందడం వలన జాతీయాదాయాన్ని వ్యవసాయేతర రంగాలు ఎక్కువగా ప్రభావితము చేయుచున్నవి. భారతదేశ జాతీయోత్పత్తిలో ఇప్పటికీ వ్యవసాయరంగము వాటా ముఖ్యమైనదిగా పరిగణింపవచ్చును.

ద్వితీయరంగపు వాటా: ద్వితీయ రంగమనగా గనులు, తయారీ, నిర్మాణము, విద్యుచ్ఛక్తి, గ్యాస్, నీటి సరఫరా, మొదలగునవి ఉంటాయి. జాతీయాదాయంలో ఈ రంగం వాటా క్రమంగా పెరుగుచున్నది. 1950-51 లో ద్వితీయ రంగం వాటా 15 శాతము. 1980-81 నాటికి ఈ రంగం వాటా 24 శాతానికి పెరిగింది. 2013-14 నాటికి కేవలము 2. 2శాతము పెరిగి 26.2% ఉన్నది.

తృతీయరంగపు వాటా: ఈ రంగం అనగా వ్యాపారము, రవాణా, ఫైనాన్సింగ్, భీమా, రియల్ ఎస్టేట్, బ్యాంకులు, సామాజిక వ్యక్తిగత సేవలు. జాతీయాదాయములో ఈ రంగం వాటా 1950-51లో 29.6 శాతము, 1980-81లో 38 శాతము, 2013-2014 నాటికి ఎక్కువ పెరుగుదలను కలిగి 59.9 శాతానికి పెరిగినది. 1980-81 తరువాత తృతీయ రంగపు వాటా ఎక్కువగా ఉన్నది. జాతీయాదాయములో వ్యాపారము, రవాణా, కమ్యూనికేషన్స్ వాటా 1950-51లో 11.3 శాతము నుంచి మూడురెట్లుకు పైగా పెరిగి 2013-14 నాటికి 26.4 శాతముగా ఉన్నది. స్థూలదేశీయోత్పత్తిలో ఫైనాన్స్, భీమా, రియల్ ఎస్టేట్ మరియు వ్యాపార సేవలవాటా 1950-51 లో 7.7 శాతముకాగా, 30 సంవత్సరముల కాలంలో 0.2% తగ్గి 1980-81 నాటికి 7:5 శాతముగా ఉన్నది. తరువాత దాదాపు మూడురెట్లు దాకా పెరిగి 2013-14లో 20.6 శాతముగా ఉన్నది.

AP Inter 2nd Year Economics Study Material Chapter 3 జాతీయ ఆదాయం

ప్రశ్న 3.
ఆదాయ – సంపద పంపిణీలోని అసమానతలకు గల కారణాలను వివరింపుము.
జ.
భారతదేశములోని ఆదాయ అసమానతల వలన అట్టడుగు వర్గ ప్రజల జీవితాలు దుర్భరమౌతున్నాయి. ఆకలి చావులకు కారణమౌతున్నది.

AP Inter 2nd Year Economics Study Material Chapter 3 జాతీయ ఆదాయం 4

1) భూ యాజమాన్యంలో అసమానత: బ్రిటీష్వారు ప్రవేశపెట్టిన జమీందారీ పద్ధతి ఫలితంగా భూ సంపద కొద్దిమంది చేతులలో కేంద్రీకృతమైనది. స్వాతంత్ర్యానంతరము భారత ప్రభుత్వము జమీందారీ పద్ధతిని రద్దు చేసినప్పటికీ యాజమాన్య పద్ధతిలో పెద్దగా మార్పులేదు. 2010-11వ సంవత్సరములో మొత్తము వ్యవసాయదారులలో 67 శాతము మంది ఉపాంత కమతాలను కల్గి ఉన్నారు. (ఒక హెక్టారుకన్నా తక్కువ) మొత్తము సాగుభూమిలో వీరు సాగుభూమిలో వీరు సాగుచేయుచున్నది. కేవలము 22.2 శాతము మాత్రమే. పెద్ద కమతాలను (10 హెక్టార్ల కంటే ఎక్కువ) కలిగి ఉన్నావారు కేవలం 0.7 శాతముగా ఉండి మొత్తము సాగు విస్తీర్ణములో 10.9 శాతపు భూమిని వీరు సాగుచేయుచున్నారు.

భూస్వాములు పొదుపుచేసే శక్తిని కలిగి ఉండడమేగాక సంస్థాపూర్వక రుణాలను కూడా సులభంగా పొందగలిగి నూతన ఉత్పత్తి పద్ధతులను ప్రవేశపెట్టి అధిక ఆదాయమును ఆర్జించుట ఆదాయ అసమానతలకు కారణము.

2) ప్రైవేటు కార్పొరేటు రంగంలో ఆస్తుల కేంద్రీకరణ: భారీ పారిశ్రామికవేత్తల ఆధీనంలో సంపద కేంద్రీకరించ బడినది. 1975-76వ సంవత్సరము ఆచరణాత్మక ఆర్థిక పరిశోధనపై జాతీయ సంస్థ (NCAER), పై 10 శాతము ప్రజల ఆధీనంలో 46.28 శాతపు పట్టణ సంపద కేంద్రీకృతమైనది. అట్టడుగు 60% ప్రజల ఆధీనంలో కేవలం 11.67 శాతపు సంపద కేంద్రీకృతమైనది. మార్చి 31, 1991 నాటికి భారీ ప్రైవేటు పరిశ్రమల మొత్తము ఆస్తి 45,830 కోట్ల రూపాయలు 2013-14 నాటికి ఒక్క రిలయన్స్ పరిశ్రమల మొత్తము ఆస్తుల 3,62,375 రూపాయలు. ఇదే సంవత్సరము రిలయన్స్ పరిశ్రమ, టాటా మోటార్స్, భారతి ఎయిర్టెల్ మరియు లార్సన్ మరియు టూబ్రో అను 5 ప్రైవేటు కంపెనీల మొత్తము ఆస్తులు 9,80,764 రూపాయలుగా ఉన్నవి.

3) వృత్తి నైపుణ్యాలలో అసమానత: వ్యాపార కార్యనిర్వాహకులు, ఇంజనీర్లు, సమాచార సాంకేతిక నిపుణులు, న్యాయవాదులు మరియు ఇతర వృత్తి నైపుణ్యాలు గల వారి ఆదాయాలు ఎక్కువ. సమాజంలో ఉన్నత వర్గాల పిల్లలకు మాత్రమే ఉన్నత మరియు సాంకేతిక (వృత్తి) విద్య అందుబాటులో ఉన్నది. వ్యవసాయ కూలీలు, పారిశ్రామిక శ్రామికులు, సామాజికంగా వెనుకబడిన వర్గాల పిల్లలకు ఇటువంటి విద్య అందుబాటులో లేదు. కావున విద్య, శిక్షణ అవకాశాల్లో ఉన్న వ్యత్యాసాలు ఆదాయ అసమానతలకు కారణము.

4) ద్రవ్యోల్బణము మరియు ధరల పెరుగుదల: భారతదేశంలో 1950 దశకం మధ్యకాలం నుంచి సాధారణ ధరల స్థాయి క్రమంగా పెరుగుచున్నది. దీని వలన పేదవర్గాల వాస్తవిక ఆదాయము తగ్గుచున్నవి. ద్రవ్యోల్బణ ప్రభావము ధనవంతులపై ఉండదు. పారిశ్రామిక వేత్తలు, వ్యాపారస్తులు, విక్రయం కాగల మిగులును కల్గివున్న వ్యవసాయదారులు ద్రవ్యోల్బణము ద్వారా లబ్ధిపొందుతారు. ఈ విధముగా ధనిక, పేద వర్గాల మధ్య ఆదాయ వ్యత్యాసాలు అధికమవుతున్నాయి.

5) నగరాలవైపు ప్రైవేటు పెట్టుబడి భారతదేశంలో 70శాతం మంది ప్రజలు గ్రామాలలో జీవిస్తున్నారు. కాని దాదాపు 70% ప్రైవేటు పెట్టుబడి పట్టణ ప్రాంత పారిశ్రామిక రంగానికి వెళ్ళుచున్నది. ప్రైవేటు పెట్టుబడిదారులు గ్రామీణ ప్రాంతములో పరిశ్రమల స్థాపనకు ఆసక్తి చూపడములేదు. శ్రామిక సప్లయికి అనుగుణంగా భారీ పరిశ్రమలు ఉపాధిని కల్పించలేకపోవుట ఆదాయపంపిణీలో అసమానతలకు కారణము.

6) పరపతి సౌకర్యాలలో అసమానత: భారీ పారిశ్రామిక వేత్తలకు, పెద్ద వ్యాపారస్తులకు సులభంగా సంస్థాపూర్వక రుణాలు లభిస్తాయి. వ్యవసాయదారులకు, వ్యవసాయధార సంస్థలకు, చిన్న ఉద్యమదారులకు తక్కువ పరిమాణములో రుణాలను సమకూరుస్తారు. కావున వీరి అధిక వడ్డీరేటుకు రుణాలను పొందుటకు వడ్డీవ్యాపారులపై ఆధారపడవలసి వస్తున్నది. వివిధ ఉత్పత్తి వర్గాల మధ్య ఆదాయ అసమానతలు పెరగుటకు పరపతి వివక్ష ముఖ్య కారణము.

7) ప్రభుత్వ పాత్ర: సంక్షేమ పథకాలైన విద్య, వైద్య, గృహనిర్మాణము, సాంఘిక భద్రతా పథకాలపై (వితంతు, వృద్ధాప్య, అంగవైకల్య, ఫించన్లు, ఫీజురీయింబర్స్మెంట్) ప్రభుత్వ వ్యయవిధానాలు సాపేక్ష ఆదాయాల వారికి అందుచున్నాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో పారదర్శకత లోపించుట అసమానతలకు కారణము.

8) అసమంజసమైన పన్నుల విధానము మొత్తం పన్నుల రాబడిలో ప్రత్యక్ష పన్నుల కంటే పరోక్ష పన్నుల వాటా హెచ్చుగా ఉంటుంది. పరోక్ష పన్నుల భారము పేదవారిపై అధికంగా ఉంటుంది. ప్రత్యక్ష పన్నుల నుంచి తప్పించుకోవడానికి లేదా పన్ను చెల్లింపులను ఎగవేయడానికి ధనిక వర్గాలు తీవ్రంగా ప్రయత్నించి సఫలీకృతులగుట | ఆర్థిక అసమానతలకు కారణము.

ప్రశ్న 4.
ఆదాయ అసమానతలను తొలగించుటకు తీసుకోవలసిన చర్యలను సంక్షిప్తంగా వివరింపుము.
జవాబు:
భారతదేశ ఆర్థిక ప్రణాళికల ముఖ్య లక్ష్యము ఆర్థిక అసమానతలను నిర్మూలించి, ప్రజలందరికీ సాంఘీక న్యాయాన్ని కల్పించుట. ఈ లక్ష్యసాధనకు భారతప్రభుత్వము క్రింది నియంత్రణా చర్యలను చేపట్టింది.
AP Inter 2nd Year Economics Study Material Chapter 3 జాతీయ ఆదాయం 5
1) భూ సంస్కరణలు: గ్రామీణ ప్రాంతాలలో అసమానతలకు కారణము భూపంపిణీలోని అసమానతలు. ప్రభుత్వము భూసంస్కరణలలో భాగంగా జమీందారీ పద్ధతిని రద్దుచేసి “దున్నేవానిదే భూమి” అను చట్టాన్ని చేసినప్పటికీ భూపంపిణీలోని అసమానతలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. కౌలు సంస్కరణలలో భాగంగా కౌలు పరిమాణమును తగ్గించి, కౌలుదారునికి భద్రత కల్పించినప్పటికీ, కౌలుదారులు ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు.

AP Inter 2nd Year Economics Study Material Chapter 3 జాతీయ ఆదాయం

2) ఏకస్వామ్య వ్యాపార కార్యకలాపాల నియంత్రణ: డిసెంబర్, 1969వ సంవత్సరములో ప్రవేశపెట్టిన ఏకస్వామ్య వ్యాపార నియంత్రణ చట్టము (Monopolies Restrictive Trade Practices Act) జూన్ 1, 1970 నుంచి అమలులోకి వచ్చినది. ఈ చట్టము ఏకస్వామ్య ధోరణి కల్గిన సంస్థలను నియంత్రించుటకు ఉద్దేశించినది. పరిశ్రమల విస్తరణ, ఏకీకరణ మొదలగు వాటిని ఈ చట్టము నియంత్రించును.

3) సహకార చర్యలు: పెద్ద పరిశ్రమల స్థాపన ఆర్థికస్థోమత కేంద్రీకరణకు దారితీస్తుంది. సహకార రంగములో సంస్థలు నెలకొల్పిన అవి ఆర్జించు లాభాలు అందులో సభ్యులైన అందరూ పంచుకోవటము ద్వారా ఆదాయ అసమానతలు తగ్గించవచ్చును. సహకార సంస్థల లక్ష్యము ప్రజల ప్రయోజనాలను కాపాడుట.

4) నూతన సంస్థలను ప్రోత్సహించుట: ఒకే కుటుంబం అనేక సంస్థలను నెలకొల్పుట ద్వారా ఆర్థికస్థోమత కేంద్రీకరణకు తోడ్పడును. ప్రభుత్వము ప్రోత్సాహకాలను ప్రకటించుట ద్వారా నూతన సంస్థలను ప్రోత్సహించాలి. ఇదివరకే పరిశ్రమలను కలిగి ఉన్న వారికి మరల పరిశ్రమల స్థాపనకు లైసెన్సును ఇవ్వకుండా జాగ్రత్త వహించి, ఆర్థిక శక్తి కేంద్రీకరణను నివారించవచ్చును.

5) సాంఘీక భద్రత: ప్రభుత్వము “సాంఘిక న్యాయంతో కూడిన వృద్ధిరేటు” లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తరచూ ప్రకటిస్తుంది. ప్రభుత్వము వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు సాంఘిక భద్రతాచర్యలలో భాగంగా భరణము (ఫించను) ఇస్తున్నవి. పరిశ్రమలలో ప్రమాదవశాత్తు గాయపడిన వారికి నష్టపరిహారము, ప్రసూతి వసతులు, కనీస వేతన అమలు, ఉద్యోగులకు భీమా, భవిష్యత్తు నిధి మొదలగు వసతులను కల్పించుట ద్వారా ఆదాయాల పెంపునకు కృషిచేస్తున్నది.

6) పన్నుల విధానము: సంపద కేంద్రీకృత ధోరణిని నివారించే విధంగా భారతదేశము పురోగామి పన్నుల విధానమును అమలుచేస్తున్నవి. అధిక ఆదాయము కలవారు తమ ఆదాయ మొత్తాన్ని లెక్కల్లో చూపడము లేదు. పారిశ్రామిక వేత్తలు, న్యాయవాదులు, వైద్యులు, కాంట్రాక్టర్లు ఆదాయ పన్ను ఎగ్గొట్టడానికి ప్రయత్నిస్తారు. కావున ప్రత్యక్ష పన్నులను సక్రమముగా అమలుపరచిన ఆర్థిక అసమానతలను కొంతవరకు తగ్గించవచ్చును.

7) ఉపాధి మరియు వేతన విధానము: ఆదాయ అసమానతలు తగ్గించడానికి భారత ప్రభుత్వము అనేక ఉపాధి కల్పనా పథకాలను అమలు చేస్తున్నది. ఉదాహరణకు సమగ్ర గ్రామీణాభివృద్ధి పథకము, జాతీయ గ్రామీణ ఉపాధి పథకము, జవహర్ గ్రామ సమృద్ధియోజన, మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకము మొదలగునవి.
ఎక్కువమంది పనిచేయుచున్న అసంఘటిత రంగ శ్రామికుల వేతనాల స్థాయి చాలా తక్కువ. వీరికి కనీస వేతనాలను అమలుచేయుట ద్వారా ఆదాయ అసమానతలను తగ్గించవచ్చు.

8) చిన్న తరహా పరిశ్రమలను ప్రోత్సహించడం కుటీర చిన్నతరహా పరిశ్రమలు భారీపరిశ్రమలకు ప్రత్యమ్నాయాలుగా అభివృద్ధి పరచగలిగిన, ఇవి ఆర్జించు లాభాలు అనేకమంది పంచుకొనుట ద్వారా ఆర్థిక స్థోమత కేంద్రీకరణను నివారించవచ్చు. కొన్ని వస్తువుల తయారీని చిన్న పరిశ్రమలకు కేటాయించి, జాతీయ బ్యాంకులు సులభ నిబంధనలతో రుణాలివ్వాలని ప్రభుత్వము నిర్ణయించి, అమలుచేయగలిగితే ఆదాయ అసమానతలు తగ్గించవచ్చును.

ప్రశ్న 5.
భారతదేశములో పేదరికానికి కారణాలు ఏవి ? [Mar ’17]
జవాబు:
పేదరికము మానవ జీవితానికి ఒక శాపములాంటిది. పేదరికము ఒక సాంఘీక, ఆర్థిక సమస్య. సమాజంలో ఒక వర్గం వారు కనీస అవసరాలైన ఆహారము, గృహము, వస్త్రము పొందలేని పరిస్థితిని పేదరికం అంటారు. భారతదేశంలో 2013వ సంవత్సరమున మొత్తము జనాభాలో 230 మిలియన్ల ప్రజలు అనగా 17.59 శాతము మంది పేదరిక రేఖకు దిగువన ఉన్నారు. పేదరిక సమస్యను సమగ్రంగా అర్థంచేసుకోవడానికి నిరపేక్ష మరియు సాపేక్ష పేదరిక భావనలను ఉపకరిస్తాయి.

నిరపేక్ష పేదరికము (Absolute Poverty): సమాజంలో కనీస జీవన అవసరాలను కూడా పొందలేని వారిని నిరపేక్ష పేదవారుగా పేర్కొంటాము.

సాపేక్ష పేదరికము (Relative Poverty): సాపేక్ష పేదరికమనేది ఆదాయ అసమానతలను ఆధారంగా చేసుకొని చెప్పవచ్చు. దేశంలో అధిక ఆదాయ వర్గ ప్రజలతో పోల్చుకొని తక్కువ ఆదాయముతో కనీస వసతులు మాత్రమే పొందేవారిని సాపేక్ష పేదవారుగా పేర్కొంటాము.

పేదరిక కారణాలు: పేదరికం ఒక సాంఘిక, ఆర్థిక సమస్య. ఇందు అనేక సాంఘీక, ఆర్థిక, రాజకీయ, వ్యవస్థాపక కారణాలున్నాయి. పేదరిక ప్రభావము ఒక విషవలయములాంటిది. పేదరికము, నిరుద్యోగము ఒకదానిపై ఒకటి ఆధారపడును. పేదరికము నిరుద్యోగానికి, నిరుద్యోగము పేదరికానికి కారణము

AP Inter 2nd Year Economics Study Material Chapter 3 జాతీయ ఆదాయం 6
1. వెనుకబడిన ఆర్థిక వ్యవస్థ: పేదరికానికి ప్రధాన కారణం భారత ఆర్థికవ్యవస్థ వెనుకబడి ఉండుట దండేకర్ మరియు రధ అభిప్రాయము ప్రకారం లాభసాటికాని వ్యవసాయము మరియు అల్పమూలధన సంచయనము భారత గ్రామీణ పేదరికమునకు కారణము. వ్యవసాయరంగంలోని చిన్న కమతాలు, కమతాల విఘటన, ఉత్పాదకాల కొరత, పరపతి సౌకర్యాల కొరత, కౌలుదారునికి భద్రత లేకుండుట ద్వారా భారత వ్యవసాయరంగం వెనుకబడి గ్రామీణ పేదరికానికి కారణమగుచున్నది.

AP Inter 2nd Year Economics Study Material Chapter 3 జాతీయ ఆదాయం

2. నిరుద్యోగము మరియు అల్పవేతనాల స్థాయి: అల్పఉద్యోగిత మరియు నిరుద్యోగితతో పాటు తక్కువస్థాయి వేతనాలు పేదరికానికి కారణము. దీనికి ముఖ్యకారణము భారతదేశంలో శ్రామిక డిమాండ్ కన్నా శ్రామిక సప్లయ్ ఎక్కువగా ఉండుట. మూలధన కొరత వలన పారిశ్రామికరంగం ఎక్కువమంది ప్రజలకు ఉపాధిని కల్పించలేకపోవుట పేదరికానికి కారణం.

3. జనాభా విస్ఫోటనము: భారతదేశంలో కుటుంబ సంక్షేమ కార్యక్రమ అమలు వల్ల మరణాల రేటు తగ్గి జననముల రేటు అధికంగా వున్నది. మనదేశంలో 1951 సంవత్సరంలో 361.09 మిలియన్ల ఉన్న జనాభా 2011 నాటికి 1210.19 మిలియన్లకు పెరిగినది. గత 60 సంవత్సరములలో జనాభా మనదేశంలో 31/2 రెట్లు పెరిగినది. మూలధన కొరత మరియు అల్పసాంకేతిక పరిజ్ఞానం వలన అధిక జనాభాకు అవసరమైన వస్తుసేవలను ప్రజలందరికీ అవసరమైన మేరకు అందడం లేదు. జనాభా వృద్ధిరేటు కన్నా జాతీయాదాయ వృద్ధిరేటు తక్కువగా వున్నది. తక్కువ జాతీయాదాయాన్ని ఎక్కువమంది జనాభా పంచుకొనుట ద్వారా తలసరి ఆదాయం తక్కువగా ఉండి పేదరికాన్ని అనుభవిస్తున్నారు.

4. ఆదాయ, ఆస్తుల పంపిణీలో అసమానతలు: జాతీయాదాయ పంపిణీలో అసమానత సాపేక్ష పేదరికానికి కారణం. భారతదేశంలో ఎక్కువ వ్యవసాయ కుటుంబాలు ఒక హెక్టారుకన్నా తక్కువ వ్యవసాయ భూమిని కలిగివున్నారు. ఫలితంగా ఆధునిక పద్దతులలో వ్యవసాయ కార్యక్రమాన్ని నిర్వర్తించలేక తక్కువ ఆదాయాన్ని పొందుట పేదరికానికి కారణం. పారిశ్రామిక సంస్థల వాటాలను, సంస్థల యాజమాన్యంలోని అసమానతలు పట్టణ పేదరికానికి కారణం.

5. తక్కువ అందుబాటులో ఉన్న నిత్యావసరాలు: నిత్యావసరాలైన ఆహారం, బట్టలు, వసతిగృహం ప్రజలందరికీ అందుబాటులో లేవు. తీవ్రజనాభా పెరుగుదలకు అవసరమైన వస్తుసేవలను మనదేశం ఉత్పత్తి చేయలేకున్నది. ప్రథమ శ్రేణి (వినియోగ) వస్తువుల అల్ప లభ్యత ప్రజల అల్పజీవన ప్రమాణానికి కారణం. ధనిక, పేద ప్రజల మధ్య వినియోగస్థాయిలో ఎక్కువ తారతమ్యం వున్నది. ఇది సాపేక్ష పేదరికాన్ని సూచిస్తుంది.

6. ద్రవ్యోల్బణం: దేశంలో నిరంతరం పెరుగుచున్న అల్పాదాయ వర్గాల ప్రజల పేదరికానికి కారణం. ముఖ్యంగా వ్యవసాయ, వ్యవసాయేతర కూలీలకు స్థిర ఆదాయముండదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరి ధరల పెరుగుదలను అధిగమించడానికి కరువు భత్యం లభించదు. మధ్యతరగతి, అల్పాదాయ వర్గాల ప్రజలు కనీస అవసరాలను తీర్చుకోవడానికి వీలులేక పేదరికానికి గురవుతున్నారు. ‘

7. పంచవర్ష ప్రణాళికల వైఫల్యం: పంచవర్ష ప్రణాళికల ప్రధాన లక్ష్యం ప్రజలందరికీ కనీస అవసరాలను కల్పించడం. ప్రభుత్వము పన్నెండు పంచవర్ష ప్రణాళికలలో అనేక పేదరిక నిర్మూలనా పథకాలను అమలు చేసినప్పటికీ పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించలేకపోయినది. మనదేశంలో ప్రణాళికల ద్వారా సాధించే వృద్ధిరేటు పేదరిక నిర్మూలనకు దోహదపడుట లేదు.

8. సాంఘీక కారణాలు: దేశంలో కులవ్యవస్థ, ఉమ్మడి కుటుంబ విధానం. వారసత్వ చట్టాలు, ఆర్థికాభివృద్ధికి ఆదాయ పెరుగుదలకు అవరోధాలుగా ఉన్నాయి. భారతదేశంలోని సామాజిక వ్యవస్థ ఆలోచనా సరళి ప్రజల పురోగతికి ప్రతిబంధకాలు, ప్రజలలోని మూఢనమ్మకాలు, పాపభీతి, దైవభక్తి, అనుత్పాదకతా వ్యయాన్ని పెంచి పేదరికానికి కారణమగుచున్నది. పండుగలకు, పుట్టినరోజు వేడుకలు, పెళ్ళిళ్లు, మరణాలు మొదలగు వాటిపై చేయు విపరీతమైన ఖర్చులు ప్రజల పేదరిక విషవలయానికి కారణం.
బలహీనపడింది.

9. రాజకీయ కారణాలు: బ్రిటీషు వారి వలస ఆర్థిక విధానం ద్వారా భారతదేశం ఆర్థికంగా స్వాతంత్య్రానంతరం దేశంలోని రాజకీయ నాయకులు తమస్వార్థ ప్రయోజనాల కోసం పేదవారిని మరీ పేదవారిగా వుంచే వ్యూహాన్ని అనుసరిస్తున్నారు. భూసంస్కరణలు సమర్థవంతంగా ఆమలు కాకపోవడం, భారతదేశ పరిపాలకులలోని అసమర్థత, లంచగొండితనము, పేదరికరేటు ఎక్కువగా ఉండుటకు కారణం. చట్టసభలలో పేదప్రజల అభ్యున్నతికి చట్టాలను తీసుకురావడంలో వెనుకబడి వున్నాము.

10. వ్యవస్థాపరమైన కారణాలు: పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో వున్న వ్యవస్థాపూర్వకమైన సమస్యలు ఆర్థికాభివృద్ధికి ప్రతిబంధకంగా ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాలలోని భూస్వామ్యవ్యవస్థ పేదరికానికి కారణము. గ్రామీణ ప్రాంతములోని తక్కువ భూమి గల రైతులు ఆర్థికంగా వెనుకబడి ఉండుట, నూతన వ్యవసాయ వ్యూహాన్ని అనుసరించలేక హరితవిప్లవంలోని ప్రయోజనాన్ని పొందలేకున్నారు. వ్యవస్థాపూర్వక ప్రతిబంధకము మరియు రాజకీయ ప్రాబల్యము లేనందున ప్రభుత్వ సబ్సిడీల ద్వారా లభించే ఎరువులు, విత్తనాలు ఇతర ఉత్పాదకాలు పేదవారికి లభ్యం కావడం లేదు. ప్రభుత్వం సమకూర్చే గృహవసతి, ఇతర ఫించను పథకాలు కొంతవరకు రాజకీయ జోక్యంతో పేదవారికి దక్కడము లేదు. వ్యవస్థాపక ప్రతిబంధకాల వలన ప్రభుత్వము కల్పించే విద్య, వైద్య సదుపాయాలు పేదవారికి లభ్యంకావడము లేదు.

ప్రశ్న 6.
భారతదేశంలో పేదరికం నిర్మూలించడానికి తీసుకోవలసిన చర్యలు ఏవి ?
జవాబు:
2000 సంవత్సరం సెప్టెంబర్ నెల, ఐక్యరాజ్యసమితి మిలీనియం శిఖరాగ్ర సమావేశంలో 189 ప్రపంచదేశాల “నాయకులు ప్రపంచ పేదరికానికి ముగింపు పలకాలనే నిర్ణయాన్ని తీసుకొస్తున్నారు. మిలీనియం అభివృద్ధి లక్ష్యాలుగా భావించే పేదరిక నిర్మూలన, మానవ ఆత్మగౌరవాన్ని నిలబెట్టడం, ప్రపంచశాంతిని నెలకొల్పడం, పర్యావరణ నిలకడగల స్థితిని పెంపొందించడం మొదలైన లక్ష్యాలను ప్రపంచవ్యాప్తంగా సాధించడానికి కృషిచేయాలని ఈ దేశ నాయకులు అంగీకరించారు. పేదరికాన్ని రెండు రకాల స్థాయిలో, స్థానికంగా వున్న సమాజాభివృద్ధి ద్వారానూ, వ్యక్తుల, ఎంపిక చేసిన వర్గాల అభివృద్ధి ద్వారాను నివారించవచ్చును. వ్యక్తుల యొక్క ఆరోగ్యం, విద్య, నైపుణ్యాలను పెంచుతూ అన్ని రంగాలనూ బలోపేతం చేస్తూ పేదరికాన్ని నిర్మూలించుట.

AP Inter 2nd Year Economics Study Material Chapter 3 జాతీయ ఆదాయం

1. సరళీకరణ, దేశీయ ఉత్పత్తి వృద్ధి కంటే పేదవారి వృద్ధి వ్యూహాన్ని ఎంపికచేసుకొనుట: మాజీ ప్రధాని శ్రీ అటల్ బిహారి వాజ్పాయ్ 15 ఆగస్టు 2001 స్వాతంత్య్రదినోత్సవ సందేశంలో “సరళీకరణ ఫలితాలు గ్రామీణ పేద ప్రజలకు చేరడములేదు. ఆదాయ అసమానతలు పెరుగుతున్నాయి” అని పేర్కొన్నారు. అసంఘటిత రంగంలోని నిరుద్యోగిత తొలగింపునకు ప్రాధాన్యతనివ్వాలి. “పనిహక్కు” (Right to work) ను ప్రాథమిక మానవహక్కుగా గుర్తించాలి. ఈ పద్దతిలో నీటి సంరక్షణ, నీటిపారుదలకు ప్రాధాన్యత నివ్వాలి. సహాకార వ్యవసాయాన్ని బలపరచాలి.

2. వ్యవసాయ వృద్ధిరేటును పెంపొందించుట: వ్యవసాయ వృద్ధిరేటు 9వ పంచవర్ష ప్రణాళికలో 2.7 శాతము 10వ పంచవర్ష ప్రణాళికలో 1.7 శాతము మాత్రమే ఉన్నది. ఈ విధమైన అల్పవృద్ధిని అధిగమించుటకు భారత ప్రభుత్వం ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త యం.ఎస్. స్వామినాథన్ అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేసినది. ఈ కమిటీ వ్యవసాయ రంగాల వృద్ధికి అంశాలు కార్యాచరణ ప్రణాళికను సూచించినవి. అవి:

  1. భూమి సారవంతాన్ని పెంచే కార్యక్రమాన్ని అమలుచేయుట.
  2. పంట రుణాలపై వడ్డీని 4 శాతానికి తగ్గించుట.
  3. రైతులకు అధునాతన వ్యవసాయ విధానాలపై శిక్షణ ఇచ్చుటకు కృషి విజ్ఞాన కేంద్రాలను నెలకొల్పుట మొదలైనవి.

3. అసంఘటిత రంగములో వృత్తి నైపుణ్యాన్ని, ఉత్పాదకతను పెంచుట: అసంఘటిత శ్రామికుల ఆదాయాలు తక్కువగా ఉండి పేదరికాన్ని అనుభవిస్తున్నారు. ప్రభుత్వము వీరి వృత్తి నైపుణ్యాలను పెంచి అసంఘటిత రంగాన్ని లాభసాటిగా మార్చాలి. అసంఘటిత రంగంలో 10 మిలియన్ల ఉద్యోగాల కల్పనకై లక్ష్యంగా 2002 సంవత్సరములో యస్.పి. గుప్తా అధ్యక్షతన నేషనల్ డెమోక్రటిక్ అలియెన్స్ (ఎన్.డి.ఎ) ప్రభుత్వము కమిటీని నియమించినది. దీనిద్వారా నిరుద్యోగాన్ని, పేదరికాన్ని నిర్మూలించవచ్చును.

4. వృద్ధి ప్రక్రియలో వేతనాల రేటును పెంచి పేదరికాన్ని నిర్మూలించుట:
AP Inter 2nd Year Economics Study Material Chapter 3 జాతీయ ఆదాయం 7
ఆర్థికవృద్ధి నిర్మాణంలో వేతనాల వాటాను పెంచుట ద్వారా పేదరికాన్ని నిర్మూలించవచ్చు. వేతనాల వాటా 1989-90లో 70.8 శాతము ఉండగా 2009-10 సంవత్సరమునకు 36.5 శాతానికి తగ్గినది. లాభాల వాటా 1989-90 సంవత్సరములో కేవలము 19.1 శాతము ఉండగా 2009-10 నాటికి 56.2 శాతానికి పెరిగినది. లాభాల వాటాలో వచ్చిన గణనీయ మార్పులు, వేతనాల వాటాలో వచ్చిన తగ్గుదల పేదరికము తక్కువ స్థాయిలో తగ్గుటకు కారణం.

5. విద్య, నైపుణ్యాల విషయంలో పేదవారిని శక్తివంతులను చేయుట: భారతదేశంలో వృద్ధిచెందిన విద్యావ్యవస్థలో 378 విశ్వవిద్యాలయాలు, 18,064 కళాశాలు, 152 లక్షల ఉన్నత పాఠశాలలు మానవ వనరుల అభివృద్ధికి తోడ్పడుతూ పేదరికాన్ని అరికడుతున్నాయి. ఇందులో భాగంగా కేంద్రప్రభుత్వము జాతీయ నైపుణ్యాల అభివృద్ధి సంస్థ నెలకొల్పినది.

6. మంచి ఆరోగ్యవసతుల ద్వారా పేదవారిని శక్తివంతులను చేయుట: ఆరోగ్యానికి, పేదరికానికి మధ్యగల సంబంధాన్ని గుర్తించాలి. దీర్ఘకాలిక ఎక్కువఖర్చుతో కూడిన అనారోగ్యమునకు గురైన పేదరికాన్ని ఎదుర్కోక తప్పదు. జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ (NRHM) మరియు జాతీయ పట్టణ ఆరోగ్య మిషన్ (NUHM) అను రెండు సంస్థలు పేదలను, ఆరోగ్యవంతులను అందుబాటులోకి తెచ్చినవి. పేదరిక ఉచ్చునుండి బయటపడటానికి, అసంఘటిత రంగంలోని శ్రామికులకు ఆరోగ్యభీమా సౌకర్యాన్ని కల్పించాలి.

7. పేదవారికి ఇంటి వసతిని కల్పించాలి: గ్రామీణ మరియు పట్టణ పేదవారికి ఇల్లు ప్రధాన అవసరము. రాబోవు 20 సంవత్సరాల కాలంలో ఇందిరా ఆవాస్ యోజన అనుగొప్ప నిర్మాణ పథకాన్ని, పౌరులందరికీ కనీస వసతుల కల్పనకు, కేంద్ర ప్రభుత్వము ఒక పధకాన్ని ప్రవేశపెట్టినది. ప్రాథమిక అవసరాలైన త్రాగునీరు, విద్యుత్తు వంటి వసతులను పేదలకు కల్పించాలి.

8. ఐటి రంగాన్ని, విస్తృతపరచి, నైపుణ్యాల ద్వారా పేదలను శక్తివంతులను చేయడము: సమాచార సాంకేతికతను వృద్ధిచేయడము ద్వారా ఎక్కువ ఉద్యోగాలు సృష్టించి పేదరికాన్ని నిర్మూలింపవచ్చు. ఎక్కువ మంది పేద విద్యార్థులకు ఉపకార వేతనాలను మంజూరుచేయాలి. ప్రభుత్వము విద్యాసంస్థలను ఆర్థికంగా, వ్యవస్థాపరమైన సౌకర్యాలను కల్పిస్తూ’ పేద విద్యార్థులకు విద్యను అందించాలి.

9. జాతీయ ఉపాధి గ్రామీణ పథకము: జాతీయ గ్రామీణ ఉపాధి హమీ చట్టము వెనుకబడిన 200 జిల్లాలో 2006వ సంవత్సరము నుంచి ప్రారంభించి ఏప్రిల్ 1, 2008 నుంచి దేశంలోని అన్ని జిల్లాలకు విస్తరించబడినది. |2010-11 కేంద్ర బడ్జెట్లో 40,000 కోట్ల రూపాయలు కేటాయించుట ద్వారా గ్రామీణ జనాభాకు ఉపాధిని కల్పించి తద్వారా పేదరికాన్ని నిర్మూలించుటకు ప్రభుత్వము సంకల్పించినది.

AP Inter 2nd Year Economics Study Material Chapter 3 జాతీయ ఆదాయం

ప్రశ్న 7.
నిరుద్యోగితకు కారణాలను మరియు నిరుద్యోగిత నివారణ చర్యలను వివరింపుము.
జవాబు:
భారతదేశంలో నిరుద్యోగితకు కారణాలు:
AP Inter 2nd Year Economics Study Material Chapter 3 జాతీయ ఆదాయం 8
నిరుద్యోగ సమస్యకు అనేక సాంఘిక, ఆర్థిక, వ్యవస్థాపరమైన కారణాలున్నాయి.
1. అధికరేటులో వృద్ధి చెందే జనాభా: అధికరేటులో వృద్ధిచెందే జనాభాకు అనుగుణముగా శ్రామిక సప్లయ్ పెరుగును. మనదేశంలో 1960 ప్రాంతములో సాలుసరి జనాభా వృద్ధిరేటు 2.2 శాతము కాగా సాలుసరి శ్రామిక శక్తి 1.9 శాతముగా ఉన్నది. 2011-12 సంవత్సరముల మధ్య పెరిగిన నికర శ్రామిక జనాభాకు లాభసాటి ఉపాధిని కల్పించుట మన ఆర్థిక వ్యవస్థకు దుర్లభము.

2. ఉపాధి రహితవృద్ధి: స్వాతంత్య్రానంతర మూడు దశాబ్దాల ప్రణాళికా కాలంలో సాంవత్సరిక స్థూల దేశీయోత్పత్తి వృద్ధిరేటు 3.5 శాతముగా ఉన్నది. ఈ కాలంలో సాంవత్సరిక ఉపాధి అవకాశాలు కేవలము 2 శాతము మాత్రమే. 1999-2000 నుంచి 2004-05 మధ్య 5 సంవత్సరాల కాలంలో సాంవత్సరిక ఉపాధి వృద్ధిరేటు 2.9 శాతము కాగా 2004-05 నుంచి 2009-10 మధ్య ఉపాధి వృద్ధి రేటు దాదాపు శూన్యము.

3. ప్రతికూల సాంకేతికం: భారతదేశము మూలధన కొరతను కల్గి అధిక శ్రామిక శక్తిని కల్గిఉన్నది. మార్కెట్ శక్తులు స్వేచ్ఛగా సమర్ధవంతముగా నిర్వహించిన శ్రమసాంద్రత ఉత్పత్తి పద్ధతిని ఎంపికచేసుకోవలసి వస్తుంది. పారిశ్రామిక రంగంలోనే గాక వ్యవసాయ రంగంలో కూడా ఉత్పత్తిదారులు శ్రమకు బదులుగా మూలధనాన్ని (యాంత్రీకరణను) ఉపయోగించుటవలన నిరుద్యోగిత పెరుగుచున్నది.

4. గ్రామీణ పరిశ్రమలు విస్తరించకపోవుట భారతదేశములో గ్రామీణ పరిశ్రమలు విస్తరించకపోవుట వలన, జనాభా మొత్తము వ్యవసాయముపై ఆధారపడుట వలన వ్యవసాయ రంగంలో ఒత్తిడి అధికమై వ్యవసాయరంగమే వెనుకబడినది. వ్యవసాయరంగము అధికరేటులో పెరిగే జనాభాకు ఉపాధిని కల్పించలేక నిరుద్యోగము అధికమగుచున్నది.

5. లోపభూయిష్ట విద్యావిధానము: బ్రిటీష్ వారి కాలములో మెకాలే ప్రవేశపెట్టిన విద్యావిధానము నేటికీ కొనసాగుచున్నది. గున్నార్ మీర్జాల్ ప్రకారము “మానవ వనరుల అభివృద్ధి లక్ష్యంగా భారతదేశ విద్యావిధానము లేదని” పేర్కొనుట సమంజసము. ఇతని ప్రకారము ఇంకనూ ఈ విద్యా విధానము కేవలం ప్రభుత్వ ప్రైవేటు రంగాలలో క్లర్క్స్ ను మరియు తక్కువస్థాయి కార్యనిర్వాహకులను మాత్రమే ఉత్పత్తి చేస్తుందని పేర్కొనెను. లోపభూయిష్ట విద్యావిధానము వలన మానవ వనరులు అభివృద్ధి చెందనంత వరకు విద్యనభ్యసించిన వారందరికి ఉపాధిని కల్పించుట కష్టము.

6. మానవ వనరుల వృద్ధిలో లోపము: భవిష్యత్లో అవసరమైన నైపుణ్యము కలిగిన శ్రామికులకు అనుగుణంగా తగిన విద్యాభోదన. అందుకు అవసరమైన కోర్సులను ప్రారంభించడములో వెనుకబడుట నిరుద్యోగమునకు కారణము.

7. సాంఘీక కారణాలు: స్వాతంత్య్రానంతరము స్త్రీలు పురుషులతో పాటు విద్యనభ్యసించుచున్నారు. ఉద్యోగం పురుషలక్షణం అనే నానుడి గతించినది. ప్రస్తుతము అన్ని రంగాలలో పురుషులతో పాటు స్త్రీలు కూడా ఉద్యోగాలను పొందటంలో పోటీపడుచున్నారు. ప్రభుత్వములు కూడా స్త్రీలకు ఉద్యోగాలలో రిజర్వేషన్ కల్పించుచున్నది. ఆర్థిక వ్యవస్థ అన్ని వర్గాల వారికి ఉద్యోగితను కల్పించే స్థాయికి చేరకపోవుట నిరుద్యోగితకు కారణము.

8. స్వయం ఉపాధిపై మక్కువ లేకుండుట: గ్రామీణ ప్రాంతంలోని ఉపాంత రైతులు మరియు వ్యవసాయ కూలీలు స్వయం ఉపాధిపై దృష్టిపెట్టక అల్ప ఉద్యోగితను మరియు నిరుద్యోగితను ఎదుర్కొనుచున్నారు. విద్యాధికులైన యువకులలో ఉద్యమిత్వ సామర్థ్యము కొరవడి అతితక్కువ వేతనాలకు ప్రభుత్వ ఉద్యోగాల కొరకు సంవత్సరముల తరబడి నిరీక్షిస్తూ నిరుద్యోగితను అనుభవిస్తున్నారు.

9. కుటీర పరిశ్రమలు క్షీణించుట: గ్రామీణ ప్రాంత భూమిలేని ప్రజలకు కుటీర పరిశ్రమలు ఉపాధిని కల్పించింది. జీవనోపాధి కొరకు ఎక్కువ మంది ఆధారపడే కుటీర పరిశ్రమలు పారిశ్రామికీకరణ ఫలితంగా క్షీణించినవి. అధునాతన పారిశ్రామిక ఉత్పత్తులలో కుటీరపరిశ్రమల ఉత్పత్తులు పోటీపడలేకుండుట దీనికి కారణము. దీని ఫలితంగా ఈ పరిశ్రమలపై ఆధారపడిన వారు ఉపాధిని కోల్పోయి నిరుద్యోగులుగా ఉన్నారు.

AP Inter 2nd Year Economics Study Material Chapter 3 జాతీయ ఆదాయం

నిరుద్యోగిత – నివారణ చర్యలు:
నిరుద్యోగ సమస్య స్వభావాన్ని, తీవ్రతను, వీటి కారణాలను విశ్లేషించిన అనంతరం నిరుద్యోగ సమస్య పరిష్కారానికి అవసరమైన చర్యలను, ప్రభుత్వ స్పందనను పరిశీలించాలి.
AP Inter 2nd Year Economics Study Material Chapter 3 జాతీయ ఆదాయం 9

1. వేగవంతమైన ఆర్థికాభివృద్ధి: నూతన ఆర్థిక విధానాలను ప్రోత్సహించి, పెట్టుబడులను పెంచి ఆర్ధికాభివృద్ధిని వేగవంతము చేయాలి. పారిశ్రామిక రంగంలో ఉపాధిని పెంచుట ద్వారా వ్యవసాయరంగంపై ఒత్తిడిని తగ్గించి గ్రామీణ నిరుద్యోగితను అరికట్టవచ్చును.

2. స్వయం ఉపాధికి విరివిరిగా రుణాలిచ్చుట ఉద్యమిత్వ సామర్థ్యము కలిగిన విద్యాధికులు స్వతహాగా. నిర్వహించే పరిశ్రమలు, సేవలరంగానికి విరివిగా రుణసౌకర్యాలను కల్పించిన నిరుద్యోగితను అరికట్టవచ్చును.

3. చిన్నతరహా పరిశ్రమలను ప్రోత్సహించుట: చిన్నతరహా పరిశ్రమలు శ్రమ సాంద్రతమైనది. ప్రభుత్వము పెద్దపరిశ్రమలతో పోటీని నివారించుటకు కొన్ని వస్తువుల ఉత్పత్తిని చిన్నతరహా పరిశ్రమలకు రిజర్వుచేయాలి.

4. ప్రభుత్వ ప్రధాన ఉద్యోగితా పథకాలు: భారత ప్రభుత్వము దేశం ఎదుర్కొనే ప్రధాన సమస్య అయిన నిరుద్యోగితను తొలగించాలనే ధృడ సంకల్పముతో అనేక ఉద్యోగితా పథకాలను అమలు చేస్తుంది.

  1. సమీకృత గ్రామీణాభివృద్ధి పధకము (IRDP): ఈ పధకాన్ని 1978 – 79లో స్వయం ఉపాధి లక్ష్యంగా ప్రవేశపెట్టబడినది.
  2. స్వయం ఉపాధికోసం గ్రామీణ యువత శిక్షణ పథకము (TRYSEM): గ్రామీణ యువత ఎదుర్కొనే నిరుద్యోగితను తొలగించడానికి 1979 సంవత్సరములో ఈ పథకాన్ని ప్రవేశపెట్టడమైనది.
  3. జవహర్ రోజ్ గార్ యోజన (JRY): దేశంలో బాగా వెనుకబడిన 120 జిల్లాల్లో ఉపాధిని పెంచుటకు ఫిబ్రవరి 1989లో ఈ పథకం ప్రారంభించబడినది.
  4. జాతీయ గ్రామీణ ఉపాధి పథకము (NREP): వ్యవసాయ పనులు లేనికాలంలో గ్రామీణ జనాభాకు వేతనం, ఉద్యోగితను కల్పించే లక్ష్యంతో 6వ పంచవర్ష ప్రణాళికలో దీనిని ప్రవేశపెట్టడమైనది.
  5. దీనదయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల యోజన (DDUGKY): పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ 98వ జన్మదినాన్ని పురస్కరించుకొని సెప్టెంబర్ 25, 2014న ఈ పథకము ప్రారంభించబడినది. మేధావంతులైన గ్రామీణయువతకు ఉద్యోగితను కల్పించుట ఈ పథకము ఉద్దేశ్యము.

ప్రశ్న 8.
భారతదేశములో పేదరికాన్ని నివారించుటలో సూక్ష్మ విత్త పాత్రను వివరింపుము.
జవాబు:
సూక్ష్మవిత్త ఆవశ్యకత ప్రపంచబ్యాంకు పరిశోధన ప్రకారము ప్రపంచములో 1/3వ వంతు పేదవారు భారతదేశంలో ఉన్నారు. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పేదరిక నిర్మూలన పథకములు అమలుచేస్తున్నప్పటికీ, సూక్ష్మవిత్తము యొక్క పాత్ర మనదేశంలో ఎక్కువ. గత కొన్ని దశాబ్దాలుగా పేదరిక నిర్మూలనలో సూక్ష్మవిత్తము ప్రముఖ పాత్ర నిర్వహిస్తున్నది. సూక్ష్మవిత్తము ద్వారా ప్రజలు అధిక ఆదాయాన్ని పొందుతూ జీవన ప్రమాణస్థాయిని పెంచుకొంటున్నారని అనేక నివేదికలు భారతదేశములో తెలియజేస్తున్నాయి.

బ్యాంకుల స్థానంలో సూక్ష్మవిత్త సంస్థలు పేదవారికి మెరుగైన సేవలను అందిస్తున్నాయి. ఈ సంస్థలు విత్తేతర సేవలను శిక్షణ, కౌన్సిలింగ్, భీమా మొదలగునవి కూడా ప్రజలకు అందిస్తున్నాయి. ఋణగ్రహీతల నమ్మకాన్ని నిలబెట్టే విధంగా తిరిగి చెల్లింపులు ఉంటూ వారి ఇంటి వద్దకే సేవలను అందిస్తున్నాయి. ‘ఇవి వాణిజ్య బ్యాంకులకన్నా ఎక్కువ వడ్డీని వసూలు చేస్తున్నాయి.

సూక్ష్మవిత్త మార్గాలు (Channels of Micro finance):
1. స్వయం సహాయక సమూహం (Self Help Group): జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకుచే ప్రోత్సాహించబడి, బ్యాంకు ద్వారా సూక్ష్మపరపతిని అందించుట. సాధారణంగా 10 నుంచి 15 మంది స్త్రీలు ఒక స్వయం సహాయక సమూహముగా ఏర్పడుట. బృందంలోని సభ్యులంతా తరచు కొంతమొత్తాన్ని పొదుపుచేసి అందునుంచి అవసరనిమిత్తము రుణాలు పొందుట. ఈ విధానము బహుళ ప్రాచుర్యము పొందినది. స్వయం సహాయక బృందాలు స్వయం పోషక స్థాయికి ఎదిగిన స్వచ్ఛంద సంస్థలు (Non Government Organization) మరియు భారతీయ చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంకు (SIDBI) సహకారముతో స్వంతంగా మనుగడను కొనసాగించగలవు.

AP Inter 2nd Year Economics Study Material Chapter 3 జాతీయ ఆదాయం

2. సూక్ష్మవిత్త సంస్థలు: సూక్ష్మవిత్త సహాయాన్ని అందించుట ఈ సంస్థల ముఖ్య లక్ష్యము బృంద సమిష్ఠి జవాబుదారితనాన్ని ఆధారంగా చేసుకొని రుణాల్విడము జరుగును. పరస్పర హామీ పద్ధతిలో వ్యక్తిగత లేదా గ్రూప్ అవసరాలకు అనియత (Informal) పద్ధతిలో 5 నుండి 10 మంది సభ్యులు కలిగిన సమిష్టి జవాబుదారితనము కలిగిన సమూహము బ్యాంకు రుణాలను పొందును.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
భారతదేశంలో నిరుద్యోగ వ్యాప్తి.
జవాబు:
భారతదేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలలో నిరుద్యోగ సమస్య ఒకటి. అమలులో ఉన్న వేతనం రేటుకు ఇష్టపడి పనిచేయటానికి సిద్ధపడినప్పుడు వారికి పని దొరకని స్థితిని నిరుద్యోగితగా నిర్వచించవచ్చు. భారతదేశంలో 1983 నుంచి 2012 సం॥ల మధ్య నిరుద్యోగిత రేటు సగటున 7.58 శాతంగా ఉన్నది. 2009 సంవత్సరమున నిరుద్యోగిత రేటు గరిష్టంగా 9.4 శాతంగాను, 2012 సంవత్సరము నిరుద్యోగిత రేటు తక్కువ స్థాయిలో అనగా 5.20 శాతంగా ఉంది.

భారతదేశంలో సాధారణ స్థితి నిరుద్యోగిత 1977-78వ సంవత్సరములో 4.23% ఉండగా ఇది 1999-2000 సంవత్సరం నాటికి 2.81 శాతమునకు తగ్గినది. తిరిగి 2004-05 సంవత్సరం నాటికి సాధారణ స్థితి నిరుద్యోగిత 3.06 శాతమునకు పెరిగినది. 2011-12 నాటికి సాధారణ స్థితి నిరుద్యోగిత 2.7% అంచనా వేయబడినది.
మనదేశంలో వర్తమాన రోజువారి స్థితి నిరుద్యోగిత 1977-78వ సం||న 8.18 శాతంగా ఉన్నది. ఈ నిరుద్యోగిత 2004-05 సం॥నాటికి తిరిగి 8.28 శాతమునకు పెరిగింది.

ప్రశ్న 2.
వివిధ రకాలైన పేదరిక భావనలు వివరించండి. [Mar ’16]
జవాబు:
పేదరికం ఒక సాంఘీక ఆర్థిక సమస్య. సమాజంలో ఒక వర్గం వారు కనీస అవసరాలైన ఆహారము, గృహము, వస్త్రము పొందలేని పరిస్థితిని పేదరికం అంటారు. భారతదేశంలో 2013వ సం॥ మొత్తం జనాభాలో 230 మిలియన్ల ప్రజలు అనగా 17.59% మంది పేదరిక రేఖకు దిగువన ఉన్నారు.

పేదరికపు భావనలు:
1. నిరపేక్ష పేదరికం: సమాజంలో కనీస జీవన అవసరాలు కూడా పొందలేని వారిని నిరపేక్ష పేదవారుగా పేర్కొంటాము. నిర్ణయించిన కనీస ఆదాయం లేదా వినియోగ వ్యయాన్ని కూడా పొందలేని వారిని నిరపేక్ష పేదవారుగా చెప్పవచ్చు.

2. సాపేక్ష పేదరికం: దీనిని ఆదాయ అసమానతలను ఆధారంగా చేసుకొని చెప్పవచ్చు. దేశంలో అధిక ఆదాయ వర్గ ప్రజలతో పోల్చుకొని తక్కువ ఆదాయంతో కనీస వసతులు మాత్రమే పొందేవారిని సాపేక్ష పేదవారుగా చెప్పవచ్చు.

3. దారిద్ర్యపు రేఖ: పేదరికాన్ని కొలవడానికి పేదరిక గీత అనే భావనను ఉపయోగిస్తారు. దేశంలోని ప్రజల కనీస అవసరాల వినియోగ వ్యయాన్ని అంచనావేసి, దాని కన్నా తక్కువ వినియోగ వ్యయాన్ని కల్గిన ప్రజలందరు, పేదరిక రేఖకు దిగువన ఉన్నట్లు చెప్పవచ్చును. పేదరిక గీతను నిర్ధారించుటకు దోహదపడే అంశాలు.

  1. కనీస జీవన వినియోగ స్థాయి
  2. కనీస పోషక పదార్థాల వ్యయం
  3. తలసరి, నెలసరి వినియోగ వ్యయం

ప్రశ్న 3.
వివిధ రకాలైన నిరుద్యోగాలు. [Mar ’17]
జవాబు:
నిరుద్యోగాన్ని నిర్వచించడం చాలా కష్టం. వ్యక్తి పనిచేయాలనే కోరిక ఉన్నప్పటికీ పని కల్పించలేక పోవడాన్ని నిరుద్యోగితగా పేర్కొంటారు. భారతదేశంలో నిరుద్యోగిత ఎక్కువగా వ్యవస్థాపరమైనది.
నిరుద్యోగితను ప్రధానంగా 1. పట్టణ ప్రాంత నిరుద్యోగిత (2) గ్రామీణ ప్రాంత నిరుద్యోగిత అని రెండు రకాలుగా పేర్కొనవచ్చు.
AP Inter 2nd Year Economics Study Material Chapter 3 జాతీయ ఆదాయం 10
I. పట్టణ ప్రాంత నిరుద్యోగిత: పట్టణ ప్రాంతంలో వ్యవసాయేతర రంగాల ప్రాధాన్యత ఎక్కువ. ఈ ప్రాంతంలో
రెండు రకాల నిరుద్యోగిత కనిపించును.

  1. విద్యావంతులలో నిరుద్యోగిత: లోపభూయిష్ట విద్యావిధానము, సృజనాత్మకత కొరవడం, సాంకేతిక విద్యలో వెనుకబడుట, డిమాండ్కు తగిన నైపుణ్యాలు కల్పించలేకపోవటం విద్యావంతులలో నిరుద్యోగిత అధికముగా ఉన్నది.
  2. పారిశ్రామిక నిరుద్యోగిత: మనదేశంలో పారిశ్రామిక రంగం వృద్ధి చెందుతున్నప్పటికీ ఆశించిన స్థాయిలో ఉద్యోగ కల్పన చేయలేక పోవుచున్నది. దీనికి కారణం వృద్ధిరేటు కన్నా జనాభా మరియు శ్రామిక సప్లయి పెరగడం. పట్టణాలు, దాని సమీప ప్రాంతాలలో కుటీర, చిన్నతరహా పరిశ్రమలు క్షీణించుట పారిశ్రామిక నిరుద్యోగితకు కారణం.

AP Inter 2nd Year Economics Study Material Chapter 3 జాతీయ ఆదాయం

II. గ్రామీణ ప్రాంత నిరుద్యోగిత: ఇది కూడా రెండు రకాలు.
1. ఋతుసంబంధమైన నిరుద్యోగం: మనదేశంలో ఈ రకమైన నిరుద్యోగిత వ్యవసాయరంగంలో కనిపిస్తుంది. వ్యవసాయ కార్యక్రమాలు ఋతు సంబంధంగా ఉండటమే ఇందుకు కారణము. వ్యవసాయ కార్మికులకు నాట్లు, కోతల సమయంలోనే పనిదొరుకుతుంది. మిగతా సమయంలో నిరుద్యోగులుగా ఉంటారు. సం॥లో 6 నుండి 8 మాసాలు మాత్రమే పని దొరుకుతుంది.

2. ప్రచ్ఛన నిరుద్యోగం: ఇది కూడా మనదేశంలో వ్యవసాయ రంగంలో కనిపించును. వ్యవసాయ రంగంలో అవసరానికి మించి ఎక్కువ మంది పనిచేస్తుంటారు. వీరిని పనినుండి తొలగించినప్పటికీ ఉత్పత్తిలో ఎటువంటి తగ్గుదల ఉండదు. వీరి ఉపాంత ఉత్పాదకత శూన్యం. దీనినే ప్రచ్ఛన్న నిరుద్యోగం అంటారు.

III. ఇతర నిరుద్యోగాలు:

  1. చక్రీయ నిరుద్యోగం: అభివృద్ధి చెందిన దేశాలలో ఈ నిరుద్యోగిత కనిపించును. కీన్స్ ప్రకారం సార్థక డిమాండ్ కొరతవల్ల చక్రీయ నిరుద్యోగిత ఏర్పడును.
  2. వ్యవస్థాపరమైన నిరుద్యోగం: శ్రామిక మార్కెట్ పనిచేయడానికి సిద్దంగా ఉన్న వారందరికి పనిని కల్పించలేకపోవడం వ్యవస్థాపరమైన నిరుద్యోగం. ఇది జనాభా అధికంగా ఉండే మనలాంటి దేశాలలో ఉంటుంది. దీనినే బహిరంగ నిరుద్యోగిత అంటారు.
  3. అల్ప ఉద్యోగిత: ఒక వ్యక్తి తన ఉత్పాదక శక్తి కంటే తక్కువ స్థాయిలో పనుల్లో పనిచేయటాన్ని అల్ప ఉద్యోగిత అంటారు. ఉదా॥ ఇంజనీరింగు పూర్తిచేసిన వారు ప్రైవేటు స్కూల్లో గుమస్తాగా పనిచేయడం.
  4. సంఘృష్ట నిరుద్యోగం: శ్రామికులు ఒక వృత్తి నుంచి మరొక వృత్తికి మార్పు చెందే కాలంలో ఏర్పడిన నిరుద్యోగితను సంఘృష్ట లేదా ఘర్షణ నిరుద్యోగిత అంటారు.

ప్రశ్న 4.
ఉపాధి హామీ పథకాన్ని గూర్చి సంక్షిప్తంగా వ్రాయుము.
జవాబు:
దీనినే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉద్యోగ హామీ పథకం (MGNREGS) అంటారు. దీనిని అక్టోబర్ 2, 2009న ఈ పథకం ప్రారంభించారు. ప్రతి గ్రామీణ కుటుంబంలో ఒకరికి నైపుణ్య రహిత పనులు చేయటకు అర్థిక సంవత్సరంలో 100 రోజులు వేతన ఉద్యోగితను కల్పించుట ఈ పథకం ఉద్దేశ్యం: 33 శాతం మంది లబ్ధిదారులు ఖచ్ఛితంగా స్త్రీలు ఉండాలి. బాంకులు, పోస్టాఫీసుల ద్వారా వేతనాలు ఇవ్వబడును. రోజుకు రూ.100/- వేతనం ఇవ్వబడును. నీటి సంరక్షణ, కరువు నివారణ పనులు, భూమి అభివృద్ధి మొదలగు పనుల నిర్వహణలో ఉపాధి కల్పన. ఈ పథకం క్రింద 2012-13లో 39,661 కోట్ల రూపాయాలు ఖర్చు పెట్టి 229.93 కోట్ల పనిదినాలు కల్పించబడినవి.

ప్రశ్న 5.
దీనదయాళ్ ఉపాధ్యాయ కౌశల యోజన గూర్చి సంక్షిప్తంగా వ్రాయండి.
జవాబు:
దీనదయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల యోజన (DDUGKY): పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ 98వ జన్మదినాన్ని పురస్కరించుకొని సెప్టెంబర్ 25, 2014న ఈ పథకము ప్రారంభించబడినది. మేధావంతులైన గ్రామీణ యువతకు ఉద్యోగితను కల్పించుట ఈ పథకము ఉద్దేశ్యము వీరికి ఉద్యోగాలను కల్పించుటకు భారత ప్రభుత్వము నైపుణ్యాల అభివృద్ధి పథకము (skill development scheme)ను ప్రారంభించినది.

DDUGKY ప్రధాన లక్షణాలు:
– 2017 నాటికి 10 లక్షల గ్రామీణ యువతకు ఉద్యోగితను పొందే విధంగా తర్ఫీదు ఇచ్చుట.
ఈ పథకము క్రిందికి రావటానికి కనీస వయసు 15 సంవత్సరములు.
గ్రామీణ ప్రాంత నిరుద్యోగ సమస్యను అధిగమించుటకు నైపుణ్యాభివృద్ధి తర్ఫీదు కేంద్రాలను ఏర్పాటు చేస్తారు.
అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నైపుణ్యాలను అందిస్తూ ప్రధానమంత్రి “భారతదేశంలో తయారీ”కి తోడ్పడాలి.
2015 – 16 బడ్జెట్లో ఈ పథకానికి 1500 కోట్ల రూపాయలు కేటాయించుట. నిరుద్యోగితను తగ్గించగలదనుటలో సందేహము లేదు.

ప్రశ్న 6.
సూక్ష్మ విత్తము.
జవాబు:
1976 సం॥లో బంగ్లాదేశ్కు చెందిన నోబెల్ బహుమతి గ్రహీత మొహమ్మద్ యూనస్ గ్రామీణ బ్యాంకును ఏర్పాటు చేయుట ద్వారా ఆధునిక సూక్ష్మ విత్తానికి పునాది వేయడము జరిగినది. భారతదేశంలో ప్రభుత్వేతర సంస్థలుగా (NGOs) సూక్ష్మ ఆర్థిక సంస్థలు అమలులో ఉన్నాయి. బాంకింగేతర విత్త సంస్థలు, వాణిజ్యబాంకులు, ప్రాంతీయ గ్రామీణ బాంకులు, సహకారసంస్థలు పెద్ద స్థాయి గల రుణదాతలు మొదలైన 25 కంపెనీలు సూక్ష్మవిత్త సంస్థలకు పునర్విత్త సహాయాన్ని అందిస్తున్నాయి.

అల్పాదాయ వర్గాల వారికి బాంకుల ద్వారా రుణాలు పొందే అవకాశము తక్కువ. స్వయం ఉపాధికి మరియు వినియోగ ఖర్చులకు విత్త సేవలను అందించుట సూక్ష్మవిత్త ఉద్దేశ్యము. పట్టణాల్లో, గ్రామాల్లో ప్రజల జీవన ప్రమాణస్థాయిని పెంచడానికి రుణము, పొదుపు, భీమా మొదలగు విత్తపరమైన శిక్షణ మరియు కౌన్సిలింగ్ వంటి విత్తేతర సేవలను సూక్ష్మవిత్తం అంటారు.

AP Inter 2nd Year Economics Study Material Chapter 3 జాతీయ ఆదాయం

సూక్ష్మవిత్త లక్షణాలు:

  • రుణాలు పొందేవారు అల్పాదాయ వర్గాలుగా ఉండాలి.
  • రుణాలు చిన్న మొత్తంలో ఉంటాయి.
  • రుణ కాలవ్యవధి చాలా తక్కువ.
  • రుణాలు పొందడానికి అదనపు హామీ లేదా భద్రత అవసరములేదు.
  • తరచూ ఋణాలు తిరిగి చెల్లించుట ఎక్కువ సార్లుగా ఉంటుంది (Repayment of Loans).
  • ఆదాయ పెంపుదలకు సాధారణముగా రుణాలు ఇవ్వబడును.

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం.
జవాబు:
వ్యవసాయ పనులు లేని కాలంలో గ్రామీణ జనాభాకు వేతన ఉద్యోగితను కల్పించే లక్ష్యంతో 6వ పంచవర్ష ప్రణాళికలో దీనిని ప్రవేశపెట్టడమైనది.

ప్రశ్న 2.
సాపేక్ష పేదరికం.
జవాబు:
అధిక ఆదాయ వర్గాల వినియోగ వ్యయంతో అల్పాదాయ వర్గాల వారి వినియోగ వ్యయం పోల్చి చెప్పటం. అభివృద్ధి చెందిన దేశాలలో ఇటువంటి పేదరికం ఉంటుంది.

ప్రశ్న 3.
TRYSEM. [Mar ’16]
జవాబు:
స్వయం ఉపాధి కోసం గ్రామీణ యువత శిక్షణ పథకం: ఈ పథకాన్ని గ్రామీణ యువత ఎదుర్కొనే నిరుద్యోగితను తొలగించడానికి 1979 సం॥లో ప్రవేశపెట్టారు. సంవత్సరానికి 2 లక్షల యువతకు స్వయం ఉపాధి లక్ష్యంగా ఈ పథకం ఉద్దేశించబడినది.

ప్రశ్న 4.
ప్రచ్ఛన్న నిరుద్యోగిత.
జవాబు:
ఈ నిరుద్యోగిత మనలాంటి దేశాలలో వ్యవసాయ రంగంలో కనిపిస్తుంది. అవసరాన్ని కన్నా ఎక్కువమంది పనిచేయటం వారిని పనినుండి తొలగించిన ఉత్పత్తిలో ఎటువంటి తగ్గుదల ఉండదు. వారి ఉపాంత ఉత్పాదకత శూన్యముగా ఉంటుంది.

ప్రశ్న 5.
పేదరిక వ్యత్యాస సూచిక.
జవాబు:
పేదరిక రేఖ కన్నా దిగువ సగటు వినియోగ స్థాయికి మధ్య ఉన్న అనుపాత స్థాయిని పేదరిక వ్యత్యాసంగా పేర్కొంటారు. పేదవారి ఆదాయాన్ని పెంచి వారిని పేదరికరేఖ వద్దకు చేర్చి పేదరికాన్ని తొలగించడాన్ని పేదరిక వ్యత్యాసం తెలుపుతుంది.

AP Inter 2nd Year Economics Study Material Chapter 3 జాతీయ ఆదాయం 11

AP Inter 2nd Year Economics Study Material Chapter 3 జాతీయ ఆదాయం

ప్రశ్న 6.
సాధారణ స్థితి నిరుద్యోగిత.
జవాబు:
సంవత్సరము మొత్తం కాలంలో నిరుద్యోగులుగా ఉన్న వారిని సాధారణ స్థితి నిరుద్యోగిత అంటారు.

ప్రశ్న 7.
నిరపేక్ష పేదరికం.
జవాబు:
కనీస అవసరాలైన ఆహారం, బట్టలు, వసతి గృహం లేని వారిని నిరపేక్ష పేదరికం అంటారు. భారతదేశంలోని | పేదరికము నిరపేక్ష పేదరికం.

ప్రశ్న 8.
సూక్ష్మ విత్తం.
జవాబు:
1976వ సంవత్సరములో బంగ్లాదేశ్కు చెందిన నోబెల్ బహుమతి గ్రహీత మొహమ్మద్ సూక్ష్మ విత్తానికి పునాది వేయడం జరిగింది. పేద ప్రజల జీవన ప్రమాణ స్థాయిని పెంచటానికి తక్కువ మొత్తంలో రుణం, విత్తపరమైన సేవలు, పొదుపును ప్రోత్సహించాడు.

ప్రశ్న 9.
తలసరి ఆదాయం.
జవాబు:
ఒక సంవత్సర కాలంలో ఒక వ్యక్తి సగటు ఆదాయాన్ని తలసరి ఆదాయం అంటారు. ఒక దేశ జాతీయాదాయాన్ని ఆ దేశ జనాభాతో భాగించగా వచ్చే దానిని తలసరి ఆదాయం అంటారు.
AP Inter 2nd Year Economics Study Material Chapter 3 జాతీయ ఆదాయం 12

ప్రశ్న 10.
దారిద్ర్యరేఖ.
జవాబు:
పేదరికాన్ని కొలవడానికి ‘పేదరిక గీత’ అనే భావనను ఆర్థికవేత్తలు ఉపయోగిస్తారు. గ్రామీణ ప్రజలు తలసరి ఆహారధాన్యాల వినియోగం రోజుకు 2,400 కాలరీలు, పట్టణ ప్రజల తలసరి ఆహారధాన్యాల వినియోగం రోజుకు 2,100 కాలరీలు కూడా పొందలేని వారు పేదరిక రేఖకు క్రిందన ఉన్నారు.

ప్రశ్న 11.
సంఘృష్ట నిరుద్యోగిత.
జవాబు:
శ్రామికులు ఒక వృత్తి నుంచి వేరొక వృత్తికి మార్పుచెందే కాలంలో ఏర్పడిన నిరుద్యోగితను సంఘృష్ట నిరుద్యోగిత అంటారు. శ్రామికులకు ఉద్యోగ అవకాశాల గురించి సరియైన అవగాహన లేకపోవడం వల్ల ఈ నిరుద్యోగిత ఏర్పడును.

ప్రశ్న 12.
అల్ప ఉద్యోగిత.
జవాబు:
ఒక వ్యక్తి తన ఉత్పాదక శక్తి కంటే తక్కువ స్థాయి పనుల్లో పనిచేయటాన్ని అల్ప ఉద్యోగిత అంటారు. పూర్తి స్థాయిలో పనిచేసే శక్తి ఉండి పార్టెమ్ పనిని నిర్వర్తించడంను అల్ప ఉద్యోగిత అంటారు.

AP Inter 2nd Year Economics Study Material Chapter 3 జాతీయ ఆదాయం

ప్రశ్న 13.
చక్రీయ నిరుద్యోగిత.
జవాబు:
ఆర్థిక కార్యకలాపాలలో వచ్చే చక్రీయ మార్పులు ఈ నిరుద్యోగితకు కారణం. అభివృద్ధి చెందిన దేశాలలో వ్యాపార కార్యకలాపాల్లో మందకొడితనం ఏర్పడటం వల్ల సాధారణంగా ఏర్పడే నిరుద్యోగితను చక్రీయ నిరుద్యోగిత అంటారు.

AP Inter 2nd Year Economics Study Material Chapter 6 తృతీయ రంగం

Andhra Pradesh BIEAP AP Inter 2nd Year Economics Study Material 6th Lesson తృతీయ రంగం Textbook Questions and Answers.

AP Inter 2nd Year Economics Study Material 6th Lesson తృతీయ రంగం

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న1.
సేవల రంగమంటే ఏమిటి నిర్వచించి, భారతదేశ ఆర్థిక వ్యవస్థలో సేవలరంగం ప్రాధాన్యతను గూర్చి వివరించండి.
జవాబు:
సేవా రంగాన్నే తృతీయ రంగం లేదా మూడవ రంగమని పిలుస్తారు. బాంకులు, అంతర్జాతీయ వర్తకం, కమ్యూనికేషన్లు, డాక్టర్లు, ఉపాధ్యాయులు మొదలైన సేవలన్నీ తృతీయ రంగంలోకి వస్తాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో తృతీయ రంగం నుండి ఎక్కువగా స్థూల జాతీయదాయం సమకూరుతుందని, ఎక్కువ మందికి ఉపాధి ఈ రంగం కల్పిస్తూ ఉంటుందని మరియు ఎగుమతి ఆదాయం ఈ రంగం నుంచి ఎక్కువగా సమకూరుతుందని, ఎక్కువ మందికి ఉపాధిని ఈ రంగం కల్పిస్తూ ఉంటుందని మరియు ఎగుమతుల అదాయం ఈ రంగం నుంచి ఎక్కువగా సమకూరుతుందని అర్థికవేత్తల అభిప్రాయం. తృతీయరంగం వాటా జాతీయోత్పత్తిలో అమెరికా మొదటి స్థానంలోను, ఇండియా పదకొండవ స్థానంలోను ఉంది.

1) స్థూల జాతీయోత్పత్తిలో వాటా:
దేశాలు వారీగా స్థూల జాతీయోత్పత్తిలో వాటి వాటాలు పరిశీలిస్తే 2001 నుంచి 2013 మధ్యకాలంలో సేవలరంగం వాటా పెరిగింది. మొదటి మూడు స్థానాల్లో ఇంగ్లాండు, ఆమెరికా, ఫ్రాన్సు ఉన్నట్లు తెలుస్తుంది. ఈ పట్టికను బట్టి భారతదేశం జాతీయోత్పత్తిలో సేవలరంగం వాటా 2001లో 51.3 శాతం కలిగి ఉండగా 2013 నాటికి 57.0 శాతం పెరిగింది.
దేశాల వారిగా జాతీయోత్పత్తి సేవల రంగం వాటా
AP Inter 2nd Year Economics Study Material Chapter 6 తృతీయ రంగం 1

2) శ్రామికుల శాతం:
సేవల రంగంలో పనిచేసే వారి సంఖ్య శాతం మిగతా రంగాలలో పనిచేసేవారి సంఖ్యశాతం కంటే ఎక్కువగా ఉంది. వివరాలను గమనిస్తే ఇండియా, చైనా తప్ప మిగతా దేశాలలో సేవల రంగంలో పనిచేసే వారి సంఖ్య 2001 మరియు 2013 సంవత్సరాల మధ్య 60 మరియు 80 శాతం మధ్య ఉంది. భారతదేశంలో తృతీయ రంగంలో పనిచేసే శ్రామికుల శాతం 2001 లో 24.0 శాతం నుంచి 2013 నాటికి 28.1 శాతం పెరిగింది.

AP Inter 2nd Year Economics Study Material Chapter 6 తృతీయ రంగం

3) సేవల ఎగుమతులు:
ప్రస్తుత కాలంలో ప్రతి అర్థిక వ్యవస్థకు ఎగుమతులు అనేవి అర్థికాభివృద్ధికి ఇంజను లాంటిది. ఎగుమతులు, విదేశీ మారకద్రవ్యాన్ని సమకూరుస్తుంది. ఎగుమతుల విలువ దిగుమతుల విలువ కంటే ఎక్కువగా ఉంటే విదేశీ చెల్లింపుల శేషం అనుకూలంగా ఉన్నట్లు చెప్పవచ్చును.
ఇంగ్లాండు (35.1%), భారతదేశం (32.5%), అమెరికా (29.5%) మరియు ఫ్రాన్సు (29.0%) సేవలరంగం ఉత్పత్తులను ఎక్కువగా ఎగుమతి చేస్తున్నాయి.

ప్రశ్న 2.
భారతదేశంలో అవస్థాపనా సౌకర్యాలు ఆర్థికాభివృద్ధికి ఎట్లా దోహదపడుతుందో వివరించండి.
జవాబు:
సుస్థిరమైన ఆర్థికాభివృద్ధికి అవస్థాపనా సౌకర్యాలు అవసరమని చెప్పవచ్చును. స్వాతంత్య్రానంతరం, ప్రణాళికా కర్తలు అర్థికాభివృద్ధికి అవస్థాపన సౌకర్యాలు ప్రాధాన్యతను గుర్తించడం జరిగింది. అర్థిక అవస్థాపనా సౌకర్యాలైన విద్యుత్, రవాణా, బ్యాంకింగ్, కమ్యూనికేషన్ మొదలైన వాటిపై పెట్టుబడులు భారీగా ఉంటాయి. అంతేకాకుండా వీటిని అధునాతన సాంకేతిక పరిజ్ఞానం కూడా అవసరం. అందుకని అవస్థాపన సౌకర్యాలకై సరళీకరణ విధానాన్ని ఉపయోగించి ప్రైవేటు మరియు విదేశీ పెట్టుబడిని ప్రోత్సహించింది.
సాధారణంగా అవస్థాపన సౌకర్యాలను రెండుగా వర్గీకరించవచ్చును. అవి ఆర్థిక అవస్థాపన సౌకర్యాలు మరియు సాంఘిక అవస్థాపన సౌకర్యాలు. ఇవి:

  1. శక్తి: బొగ్గు, విద్యుచ్ఛక్తి, పెట్రోల్, సాంప్రదాయ, సాంప్రదాయేతర వనరులు.
  2. రవాణా: రోడ్లు, రైల్వేలు, నౌక మరియు వైమానిక సర్వీసులు..
  3. సమాచారం: తంతి తపాలా, టెలిఫోన్, టెలీకమ్యూనికేషన్.
  4. బ్యాంకింగ్, ఫైనాన్స్ మరియు భీమా.
  5. సాంఘీక అవస్థాపనా సౌకర్యాలు: విద్య, వైద్యం, పరిశుభ్రత.

ఆర్థిక అవస్థాన మూలధనం, సాంఘీక అవస్థాపన మూలధనం అనేవి సేవారంగంలో ఉపరంగాలుగా చెప్పవచ్చును. అవస్థాపనా సౌకర్యాలు బాగా లభిస్తే తలసరి స్థూల జాతీయోత్పత్తి పెరగటంతో పాటు కింది ఫలితాలు కూడా లభిస్తాయి.

  1. ఉత్పత్తి ప్రక్రియ యొక్క ఉత్పాదకత పెరుగుతుంది.
  2. మార్కెట్లను అందుబాటులోకి తెస్తుంది.
  3. వ్యాపార వ్యయాలను తగ్గిస్తుంది. వ్యాపార ఆస్తుల, చరమూలధనాల మీద చేసే వ్యయాన్ని తగ్గిస్తుంది. 4) ఉపాధి అవకాశాలను పెంచుతుంది.
  4. వర్తకంలోను, ఉత్పత్తులలోను వైవిధ్యాన్ని, ఆధునికతను సాధించే వీలు కలుగచేస్తుంది.
  5. సంక్షేమం అంటే ఏమిటో తెలియజేస్తుంది. దారిద్ర్యాన్ని తగ్గిస్తూ, ఆర్థికవ్యవస్థ వృద్ధి చెందటానికి తగిన హామీనిస్తుంది.
  6. జీవన నాణ్యతను మెరుగుపరుస్తుంది.
  7. వ్యవసాయేతర ఉపాధి అవకాశాలను పెంచుతుంది.
  8. మానవ ఆవాసాల యొక్క పర్యావరణ సుస్థిరతను పెంపొందిస్తుంది.
  9. ప్రజారోగ్యాన్ని సంరక్షిస్తుంది. ఆరోగ్యానికి సంబంధించిన ప్రయోజనాలను అందిస్తుంది.

అవస్థాపన సౌకర్యాలు కలిగించే ప్రయోజనకరమైన ప్రభావాలను దృష్టిలో ఉంచుకొని మనదేశ ప్రభుత్వ గ్రామీణ ప్రాంతాల్లో ఈ సౌకర్యాలను అభివృద్ధి పరచటానికి మొత్తం చేయనున్న రూ.14,36,559 కోట్ల పెట్టుబడుల్లో రూ.4,35,349 కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టడానికి నిశ్చయించింది. ఈ మొత్తాన్ని విద్యుత్, రోడ్లు, టెలీకమ్యూనికేషన్స్, సాగునీరు, నీటి సరఫరా, పరిశుభ్రత సౌకర్యాలను అభివృద్ధి చేయాడానికి కేటాయించడం జరిగింది.

AP Inter 2nd Year Economics Study Material Chapter 6 తృతీయ రంగం

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
సేవా రంగంలో స్థూల జాతీయోత్పత్తి స్థాయిని వివరించండి.
జవాబు:
ఒక దేశం యొక్క జాతీయాదాయంలోని పెరుగుదల ఆ దేశంలోని వస్తు-సేవల ఉత్పత్తిలోని పెరుగుదలపై ఆధారపడి ఉంటుంది. అర్థికవ్యవస్థలో ఈ రంగం నుండి ఎక్కువగా స్థూల జాతీయదాయం సమకూర్చుతుంది. సేవా రంగంలో సేవలను అందించే వివిధ సంస్థలుంటాయి అవి రవాణా, బ్యాంకింగ్, భీమా సంస్థలు, హోటల్స్, గ్రంథాలయాలు మొదలైనవి.

జాతీయాదాయంలో సేవరంగం వాటా క్రమంగా పెరుగుతూ వచ్చింది. ఇది ఆర్థికాభివృద్ధి ప్రక్రియలో వచ్చే అశించదగిన పరిణామం. 1950-51లో స్థూల దేశీయోత్పత్తిలో సేవరంగం వాటా 28% కాగా 2013లో ఇది 57.0% చేరింది. దేశాల వారిగా స్థూల జాతీయోత్పత్తిలో వాటి వాటాలను పరిశీలిస్తే 2001 నుంచి 2013 మధ్యకాలంలో సేవల రంగం వాటా పెరిగింది.

దేశాల వారిగా జాతీయోత్పత్తి సేవల రంగం వాటా
AP Inter 2nd Year Economics Study Material Chapter 6 తృతీయ రంగం 2
పై పట్టికలో మొదటి మూడు స్థానాలలో ఇంగ్లండు, అమెరికా, ఫ్రాన్సు ఉన్నాయి. పై పట్టికలో ఇండియాలో జాతీయోత్పత్తి సేవారంగం వాటా 2001 లో 57.3% ఉండగా 2013 నాటికి 57.0% పెరిగింది.

ప్రశ్న 2.
భారతదేశ సేవారంగంలో తలచిన కార్యకలాపాలు ఏమిటి ?
జవాబు:
మన దేశంలో ఇటీవల కాలంలో తృతీయరంగం ఎక్కువ మందికి ఉపాధి కలిస్పూ, మన జాతీయాదాయంలో ఎక్కువ వాటాను అందించుచున్నది. సేవారంగంలో రకరకాల కార్యకలాపాలను కొన్ని ప్రధాన తరగతులుగా విభజించవచ్చును.

  1. వ్యాపారం
  2. రవాణావ్యవస్థ
  3. హోటళ్లు, రెస్టారెంట్లు
  4. నిర్మాణాలు
  5. గిడ్డంగులు
  6. బ్యాంకులు, భీమా సంస్థలు
  7. ప్రభుత్వ పాలన మరియు రక్షణ
  8. విద్య, వైద్య, మత, సామాజిక సేవలు మొదలైనవి
  9. కమ్యూనికేషన్లు
  10. స్థిరాస్తి వ్యాపారం మరియు వర్తక సేవలు

ప్రశ్న 3.
రోడ్డు రవాణా వల్ల లాభాలు ఏమిటి ? [Mar ’17, ’16]
జవాబు:
ఒక ప్రదేశాన్ని, మరొక ప్రదేశాన్ని కలిపేటటువంటి రోడ్డు రవాణా మనదేశంలో పూర్వకాలం నుంచి ఉన్నటువంటి ప్రధాన రవాణా పద్ధతి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో రోడ్లు అత్యంత కీలకంగా పనిచేస్తాయి. సమీకృతంగా ఉండే రవాణా వ్యవస్థలో రోడ్లు అత్యంత కీలకమైనవిగా చెప్పవచ్చు. మనదేశం ప్రపంచ దేశాలలో అతి పెద్ద రోడ్డు వ్యవస్థ గల దేశం. మనదేశంలో 48.65 లక్షల కిలోమీటర్ల పొడవైన రోడ్లు ఉన్నాయి.

AP Inter 2nd Year Economics Study Material Chapter 6 తృతీయ రంగం

లాభాలు:

  1. అన్ని గ్రామలను, ప్రాంతాలను కలిపేది రోడ్డు రవాణా, రైల్వే మార్గాలలో కలవనటువంటి ప్రదేశాలను రోడ్లు కలుపుతాయి.
  2. తొందరగా చెడిపోయే, చెడిపోవడం చాలా తక్కువగా ఉంటుంది.
  3. రైల్వే రవాణా వ్యవస్థకు సరుకులను, ప్రయాణికులను చేరవేస్తుంది.
  4. సరుకులు నష్టపోవడం, చెడిపోవడం చాలా తక్కువగా ఉంటుంది.
  5. గ్రామీణ, పట్టణ నగరాల్లో చాలా అనుకూలమైన రవాణా సౌకర్యాలను అందజేస్తుంది.
  6. రోడ్డు రవాణా వ్యవస్థలో మూలధన వ్యయం తక్కువగా ఉంటుంది.
  7. అత్యవసర పరిస్థితులలో ఇతర మార్గాల ద్వారా చేరలేని ప్రదేశాలను రక్షణ బలగాలను త్వరగా చేర్చేందుకు సహాయపడతాయి.

ప్రశ్న 4.
రైల్వేలు ప్రాముఖ్యత వివరించండి.
జవాబు:

  1. ఆర్థికాభివృద్ధికి రైల్వే రవాణా ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే ప్రయాణీకులను, సరుకులను రవాణా చేసే ప్రధాన వ్యవస్థల్లో రైల్వే రవాణా ఒకటి.
  2. ముడి పదార్థాలు, యంత్ర సామాగ్రి తయారీ వస్తువులు, వ్యవసాయ ఉత్పత్తులు మొదలైన వాటి రవాణాకు `దేశీయ, విదేశీ వ్యాపారాభివృద్ధికి, శ్రామిక గమనశీలతకు రైల్వేలు ఎంతో దోహదపడతాయి.
  3. వ్యవసాయాన్ని, పరిశ్రమలను అభివృద్ధిపర్చడంలో డై ప్రధానపాత్రను పోషిస్తున్నాయి.
  4. ప్రయాణికులకు కావలసిన సౌకర్యాలను మెరుగుపర్చడం, సాంకేతిక విజ్ఞానాన్ని మరియు ఆధునికం చేయడం ఎంతైనా అవసరం.

ప్రశ్న 5.
పర్యాటకం అంటే ఏమిటి ? మన దేశ ఆర్థిక వ్యవస్థలో దాని ప్రాధాన్యతను గూర్చి వివరించండి.
జవాబు:
ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO) ప్రకారం “విశ్రాంతి కోసం గాని, వ్యాపారనిమిత్తం గాని, ఇతర ప్రయోజనాల కోసం గాని ప్రజలు (ప్రయాణీకులు) వారి సాధారణ పరిసరాల నుండి దూరంగా వరసగా ఒక ఏడాది కంటే ఎక్కువ కాలం ప్రయాణిస్తూ ఒక స్థలంలో నిలిచి ఉండే వారి కార్యకలాపాలనే పర్యాటకం” అని అంటారు.

పర్యాటకం తృతీయ రంగంలో ఒక ఉపవిభాగము ప్రత్యేకించి సేవలరంగంలో ముఖ్యమైన విభాగము. పర్యాటక రంగానికి ఉన్నటువంటి అంతర్జాతీయ ధృక్కోణాల కారణంగా ఈ రంగాన్ని ‘అదృశ్యవాణిజ్యం’ అని ‘ధూమరహిత ‘పరిశ్రమ’ అని అంటారు. ఈ పర్యాటకరంగం వలన అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలకు ఆర్థికపరమైన ఆర్థికేతరమైన లాభాలు కలుగుతున్నాయని నిపుణుల అభిప్రాయము.

పర్యాటకం – లక్షణాలు:
“ప్రయాణీకులు అనేక అవసరాలను సంతృప్తిపరిచే అన్ని కార్యకలాపాలను పర్యాటకం” అని చెప్పవచ్చును. ప్రయాణాలను పర్యాటకం అని చెప్పడానికి క్రింది లక్షణాలుండాలి.

  1. ప్రయాణం తాత్కాలికమైనదై ఉండాలి.
  2. ప్రయాణం ఐచ్ఛికమైనదై ఉండాలి.
  3. ప్రయాణం స్థానికేతరులు చేసినదై ఉండాలి.
  4. ఒక ప్రతిఫలాన్నిచ్చే ఉపాధి లక్ష్యంగా ప్రయాణం ఉండరాదు.
  5. ఆ ప్రయాణం వస్తు సేవలకు గిరాకీని కల్పించేదై ఉండాలి.
  6. ప్రయాణీకులు ఎక్కడికైతే పర్యటిస్తూ ఉంటారో అక్కడి వస్తుసేవలను వారు వినియోగించాలి.
  7. ప్రయాణీకులు ఒక చోట 24 గంటలకంటే ఎక్కువ సమయం నిలిచి ఉండాలి.
  8. ప్రయాణం, తిరుగు ప్రయాణం చేసేదిగా ఉండాలి.

AP Inter 2nd Year Economics Study Material Chapter 6 తృతీయ రంగం

ప్రశ్న 6.
భారతదేశంలో బాంకింగ్ రంగ పద్దతి గూర్చి వివరించండి.
జవాబు:
అసంఘటిత విభాగంలో బ్యాంకింగ్ కార్యకలాపాలు ప్రాచీన కాలం నుండి నిర్వహించబడుతూనే ఉన్నాయి. కాని ఒక శతాబ్దం కాలం నుండి బ్యాంకింగ్ వ్యవస్థ సంఘటిత విభాగంలో అభివృద్ధి చెందసాగింది. బ్యాంకింగ్ వ్యవస్థ ప్రజల పొదుపును సమీకరించి, పెట్టుబడికి మళ్ళిస్తుంది. వనరులను ఉత్పాదకంగా ఉపయోగించడానికి, మూలధన కల్పనకు బాంకులు సమర్ధవంతమైన ఏజెంట్లుగా పనిచేస్తాయి. ఇటీవల కాలంలో బాంకులు మనదేశంలో సాంఘీక, అర్థికాభివృద్ధిని సాధించడంలో కీలకపాత్రను పోషిస్తున్నాయి.
మనదేశంలో బ్యాంకింగ్ వ్యవస్థను మూడు విధాలుగా విభజించవచ్చు.

  1. వాణిజ్య బ్యాంకులు
  2. సహకార బ్యాంకులు
  3. కేంద్ర బ్యాంకు లేదా భారత రిజర్వు బాంకు

వాణిజ్య బ్యాంకులను దశల వారీగా 1969లోనూ, 1980లోనూ జాతీయం చేశారు. S.B.I, దాని అనుబంధ బ్యాంకులను, ఇతర 20 బ్యాంకులను జాతీయ బ్యాంకులు అంటారు. జాతీయం చేయబడని బ్యాంకులను ప్రైవేటు బ్యాంకులు అంటారు.

స్వల్పకాలిక ఋణాలనందిస్తూ సహకార బ్యాంకుల వ్యవస్థ పరిధి క్రిందకు వచ్చే రాష్ట్ర సహకార బ్యాంకులను, జిల్లా కేంద్ర బ్యాంకులు మొదలైన వాటిని సహకార బ్యాంకులు అంటారు.

భారత రిజర్వు బ్యాంకు 1935లో స్థాపించి 1949లో జాతీయం చేశారు. ఇది మనదేశంలో అత్యన్నత స్థాయి బ్యాంకు. షెడ్యులు బ్యాంకు ద్రవ్యాన్ని భవిష్యత్తు ఉపయోగాల కోసం తన వద్ద రిజర్వు ఉంచుకుంటుంది.

ప్రశ్న 7.
భారతదేశ భీమా పరిశ్రమలో గల ముఖ్యమైన అంశాలేమిటి ?
జవాబు:
ఖాతాదారులు తమకు కలిగినటువంటి నష్టాలనుంచి లేదా ప్రమాదాల నుంచి ఆర్థికంగా రక్షణ పొందేందుకు గాను ఒక సంస్థలో ఒప్పందం కుదుర్చుకోవడాన్ని భీమా అంటారు. అభివృద్ధి చెందిన భీమా రంగం వల్ల నష్టాభయాన్ని భరించే కార్యకాలాపాలను చేపట్టడంతో పాటు దీర్ఘకాలిక పొదుపు పెరుగుతుంది. పొదుపు పెరుగుదల ఆర్థికాభివృద్ధి కీలకమైనది.

భీమా పరిశ్రమలో రెండు ముఖ్యమైన భాగాలు ఉన్నాయి.

  1. జీవిత భీమా
  2. సాధారణ భీమా

1. జీవిత భీమా: కుటుంబంలో అదాయాన్ని ఆర్జించే కుటుంబ యాజమాని అకాల మరణ నష్ట భయం నుంచి భద్రత కల్పించడానికి ఉద్దేశించినది.

2. సాధారణ భీమా: అనారోగ్యం, ప్రమాదాలు, ఆస్తి నష్టం మొదలైన నష్ట భయాల భద్రతలకు సంబంధించినది. ఇది కంపెనీ మోటారు వాహనాలు, జల రవాణా, వస్తు రవాణా మరియు ఆగ్ని ప్రమాదాలు అనే మూడు రకాలైన వ్యాపారాలు చేస్తుంది.

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
సేవారంగం. [Mar ’17]
జవాబు:
సేవారంగాన్నే తృతీయ లేదా మూడవ రంగమని పిలుస్తాం. బాంకులు, అంతర్జాతీయ వర్తకం, రవాణా, కమ్యూనికేషన్లు, హోటళ్ళు, లాయర్లు, డాక్టర్లు మొదలైన సేవలన్నీ తృతీయరంగంలోకి వస్తాయి. మనలాంటి దేశాలు వ్యవసాయ, పరిశ్రమ రంగాలు సేవలరంగం మీద ప్రత్యక్షంగా ఆధారపడి వృద్ధి చెందుతూ ఉంటాయి.

AP Inter 2nd Year Economics Study Material Chapter 6 తృతీయ రంగం

ప్రశ్న 2.
అవస్థాపన.
జవాబు:
అవస్థాపన సౌకర్యాలను సాంఘిక వ్యవస్థా మూలధనం అని కూడా అంటారు. వీటివల్ల కలిగే ప్రయోజనం సమాజం అంతటికి వరిస్తుంది. అవస్థాపనలో ప్రధాన విభాగాలు శక్తి, రవాణా, సమాచారం, బాంకులు, ఆరోగ్యం, విద్య, పరిశుభ్రత మొదలైనవి.

ప్రశ్న 3.
రవాణా.
జవాబు:
ప్రయాణికులను, సంపదను ఒక చోటు నుండి వేరొక చోటుకు తరలించడాన్నే రవాణా అంటారు. ప్రసుత్తం మన దేశంలో రవాణా వ్యవస్థలో రైల్వేలు, రోడ్డు రవాణా, జలరవాణా, వాయు రవాణా ముఖ్యమైనవి. వివిధ రవాణా సాధనాలను సంవిధానపరచటం వ్యవసాయ పారిశ్రామిక రంగాల అభివృద్ధికి ఎంతగానో అవసరం.

ప్రశ్న 4.
జల రవాణా. [Mar ’16]
జవాబు:
అధిక పరిమాణం, బరువుగల సరుకులను రవాణా చేయడానికి జలరవాణా ఉపయోగపడుతుంది. ఇది రెండు రకాలు 1. దేశీయ జల రవాణా 2. అంతర్జాతీయ జల రవాణా
అంతర్జాతీయ నౌక రవాణా మరియు తీర నౌక రవాణా అని, ఓవర్సీస్ షిప్పింగ్ అని విభజించటం జరిగింది. దేశీయ జల రవాణాను నదుల మీద, కాలువల మీద కొనసాగించవచ్చు.

ప్రశ్న 5.
విమానయానం.
జవాబు:
ఆర్థికాభివృద్ధిలో ఈ వ్యవస్థ అత్యంత కీలకమైనది. విమానయానం ఖరీదైనప్పటికి కాలాన్ని ఆదా చేయవచ్చు. దూర ప్రాంతాల ప్రయాణానికి ఇది ఉపకరిస్తుంది. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వారు దేశంలో 125 విమానయాన సేవలు అందిస్తున్నారు.

ప్రశ్న 6.
పర్యాటకం. [Mar ’17, ’16]
జవాబు:
పర్యాటకం తృతీయ రంగంలో ఒక ఉప విభాగం. దీనిని “అదృశ్య వాణిజ్యం” అని “ధూమరహిత పరిశ్రమ” అని అంటారు.
ప్రపంచ వాణిజ్య సంస్థ ప్రకారం “విశ్రాంతి కోసంగాని, వ్యాపారం నిమిత్తంగాని, ఇతర ప్రయోజనాలకోసం గాని ప్రజలు వారి సాధారణ పరిసరాల నుంచి దూరంగా, వరుసగా ఒక ఏడాది కంటే ఎక్కువ కాలం ప్రయాణిస్తూ ఒక స్థలంలో నిలిచి ఉండే వారి కార్యకలాపాలనే పర్యాటకం” అంటారు.

ప్రశ్న 7.
జీవిత భీమా సంస్థ (LIC).
జవాబు:
దీనిని 1956 సం॥లో స్థాపించిరి. ఇది ప్రజల నుండి చిన్న చిన్న పొదుపు మొత్తాలను సేకరించి నిర్మాణాత్మక కార్యక్రమాలలో ఉపయోగిస్తుంది. ఇది ప్రత్యేకంగా వ్యక్తుల జీవితానికి భద్రత కల్పించును అనుకోని సంఘటనల వల్ల వ్యక్తి ప్రాణానికి ప్రమాదం ఏర్పడినప్పుడు నిర్ణీత మొత్తంలో భీమా సంస్థ నష్టపరిహారం అందచేయును. వివిధ పాలసీల ద్వారా, స్కీముల ద్వారా భీమా సంస్థ వినియోగదార్లకు సౌకర్యాలు కల్గిస్తుంది.

AP Inter 2nd Year Economics Study Material Chapter 6 తృతీయ రంగం

ప్రశ్న 8.
సాధారణ భీమా సంస్థ (GIC).
జవాబు:
దీనిని కేంద్ర ప్రభుత్వం 1972 సం॥లో స్థాపించిరి. జాతీయం చేసిన తరువాత 107 సాధారణ భీమా కంపెనీలన్నింటిని కలిపి నాలుగు కంపెనీలుగా విభజించారు. అనారోగ్యం, ప్రమాదాలు, ఆస్తినష్టం మొదలైన నష్టభయాల భద్రతకు సంబంధించినది సాధారణ భీమా. సాధారణ భీమా కంపెనీ మోటారు వాహనాలు, జలరవాణా మరియు అగ్ని ప్రమాదాలు అనే మూడు రకలైన వ్యాపారాలు చేస్తోంది.

ప్రశ్న 9.
సూక్ష్మ భీమా.
జవాబు:
సూక్ష్మ విత్త విధానంలో ఇది అంతర్భాగం. ప్రజలకు విస్తృతమైన, పరిపూరకమైన సేవలను అందించడానికి, రవాణాతో పాటు పొదుపును పెంపొందించే పథకానికి అనుగుణంగా సూక్ష్మ భీమా విధానం అమల్లోకి వచ్చింది. చాలా తక్కువ ప్రీమియంతో ఈ భీమా సౌకర్యాన్ని వాడుకోవచ్చు. స్వయం సహాయక బృందాల్లోని సభ్యులకు, రైతులకు, చిన్న వ్యాపారులకు, షెడ్యూల్డు తెగల వారికి సూక్ష్మ భీమా పథకం వర్తించును.

ప్రశ్న 10.
సమాచార వ్యవస్థ.
జవాబు:
ఇది అర్థికాభివృద్ధిలో ఒక అంతర్భాగం. మార్కెట్లకు సంబంధించిన సమాచారాన్ని, వస్తుసేవల వివరాలను అందిస్తూ కొనుగోలుదారులను, అమ్మకందారులను దగ్గరకు చేరుస్తుంది. సమాచారం తపాలా సేవలు, టెలీకమ్యూనికేషన్లు, ప్రసార సాధనాలు, టెలివిజన్లు, ఇంటర్నెట్, బ్రాడ్ బ్యాండ్ సేవల ద్వారా ప్రసారమవుతుంది.

ప్రశ్న 11.
శాస్త్ర, సాంకేతిక విజ్ఞానం.
జవాబు:
ఆర్థికాభివృద్ధిని సాధించడానికి తోడ్పడే సాధానాల్లో శాస్త్ర, సాంకేతిక విజ్ఞానాల సేవలు అత్యంత అవసరమైనవి. విజ్ఞానం పెరుగుదల శాస్త్రమైతే, యంత్రపరికరాల ఆధునీకరణ సాంకేతిక పరిజ్ఞానం అవుతుంది. ఆర్థికాభివృద్ధి సాధించాలంటే శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాలను వ్యవసాయ, రవాణా, ఆర్థిక, ఆర్థికేతర రవాణాలకు విస్తరించాలి.

AP Inter 2nd Year Economics Study Material Chapter 6 తృతీయ రంగం

ప్రశ్న 12.
సాఫ్ట్వేర్ పరిశ్రమ ప్రగతి.
జవాబు:
ఈ పరిశ్రమ 1960 సం॥లో ప్రారంభమైనది మనదేశంలో సమాచార సాంకేతిక విజ్ఞాన రంగానికి చెందిన అతి ముఖ్యమైన రంగాల్లో సాఫ్ట్వేర్ పరిశ్రమ ఒకటి. 2012 13 అంచనాల ప్రకారం ఈ పరిశ్రమ మనదేశ స్థూల జాతీయోత్పత్తి 14.1 % అదాయం సమకూర్చింది. 2013 – 14లో 3.1 మిలియను మందికి ఉపాధి కల్పించింది. 2011 – 12లో మనదేశం నుంచి 69 బిలియన్ల అమెరికన్ డాలర్ల విలువ గల సాఫ్ట్వేర్ ఎగుమతులు జరిగాయి.

AP Inter 1st Year Civics Study Material Chapter 1 రాజనీతిశాస్త్రం, పరిధి-ప్రాముఖ్యత

Andhra Pradesh BIEAP AP Inter 1st Year Civics Study Material 1st Lesson రాజనీతిశాస్త్రం, పరిధి-ప్రాముఖ్యత Textbook Questions and Answers.

AP Inter 1st Year Civics Study Material 1st Lesson రాజనీతిశాస్త్రం, పరిధి-ప్రాముఖ్యత

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
రాజనీతిశాస్త్రాన్ని నిర్వచించి, ఆ శాస్త్ర పరిధిని వివరించండి. [Mar 19′,’17, ’16]
జవాబు:
పరిచయం: సాంఘిక శాస్త్రాలలో రాజనీతిశాస్త్రము ప్రధానమైనది. ప్రాచీన గ్రీకునగర రాజ్యాలైన ఏథెన్స్, స్పార్టా, గ్రీస్, రోమ్ లో క్రీ.పూ. 4వ శతాబ్దంలో ప్రారంభమైనది. ప్రముఖ గ్రీకు రాజనీతివేత్తలైన సోక్రటీస్, ప్లేటో, అరిస్టాటిల్ రాజనీతిని తత్త్వశాస్త్రము నుండి వేరుచేసి ప్రత్యేక అధ్యయన శాస్త్రముగా అభివృద్ధి చేసిరి. అరిస్టాటిల్ రాజనీతిశాస్త్రానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చాడు. అందువలన ఇతను “మొట్టమొదటి రాజనీతి శాస్త్రవేత్త”గాను, “రాజనీతి “శాస్త్ర పితామహుడు”గా కీర్తింపబడినాడు. అరిస్టాటిల్ తన ప్రఖ్యాత గ్రంథమైన “పాలిటిక్స్”లో రాజ్యము, ప్రభుత్వము గురించి అధ్యయనము చేసే శాస్త్రము రాజనీతిశాస్త్రమని పేర్కొనినాడు.

పద పరిణామము: “పాలిటిక్స్ అనే పదం “పోలిస్” (Polis) మరియు “పొలిటికస్” (Politicus) అనే లాటిన్ పదాల నుండి గ్రహించడమైనది. వీటి అర్థం నగర రాజ్యం (City State).

రాజనీతిశాస్త్ర నిర్వచనాలు (Definitions of Political Science): రాజనీతి శాస్త్రజ్ఞులు రాజనీతిశాస్త్రాన్ని వివిధ రకాలుగా నిర్వచించినారు. వాటిని రెండు రకాలుగా వర్గీకరించవచ్చు.

  1. సాంప్రదాయ నిర్వచనాలు
  2. ఆధునిక నిర్వచనాలు.

1. సాంప్రదాయక నిర్వచనాలు (Traditional Definitions): సాంప్రదాయకమైన నిర్వచనాలను మూడు ఉపవర్గాలుగా వర్గీకరించారు. వాటిని కింది విధంగా పేర్కొనవచ్చు.
i) రాజ్యం గురించి అధ్యయనం చేసేదే రాజనీతిశాస్త్రం (Study of the State): రాజనీతి తత్వవేత్తలైన జె.డబ్ల్యు. గార్నర్, ఆర్.జి.గెటిల్, అప్పాదొరై మరియు ఇతరులు రాజనీతిశాస్త్రం రాజ్యాన్ని గురించి అధ్యయనం చేస్తుందని వివరించారు.

  1. జె.డబ్ల్యు. గార్నర్: “రాజనీతిశాస్త్రం రాజ్యంతో ఆరంభమై రాజ్యంతోనే అంతమవుతుంది”.
  2. ఆర్.జి.గెటిల్: “రాజనీతిశాస్త్రమంటే రాజ్యం గతంలో ఎలా ఉండేదో పరిశోధించి, వర్తమాన కాలంలో ఎలా ఉన్నదో విశ్లేషించి, భవిష్యత్ కాలంలో ఎలా ఉండాలి అనే అంశంపై జరిపే రాజకీయ, నైతిక చర్చల సారాంశం”.

AP Inter 1st Year Civics Study Material Chapter 1 రాజనీతిశాస్త్రం, పరిధి-ప్రాముఖ్యత

ii) ప్రభుత్వాన్ని గురించి అధ్యయనం చేసేదే రాజనీతిశాస్త్రం (Study of the Government): రాజనీతి తత్వవేత్తలైన స్టీఫెన్ లీకాక్, జాన్ రిచర్డు సీలీ ఇతరులు రాజనీతి శాస్త్రం ప్రభుత్వాన్ని గురించి అధ్యయనం చేస్తుందని తెలిపారు.

  1. స్టీఫెన్ లీకాక్: “రాజనీతిశాస్త్రమంటే ప్రభుత్వం గురించి అధ్యయనం చేసే శాస్త్రం”.
  2. జాన్ రిచర్డు సీలీ: “ప్రభుత్వ దృగ్విషయాన్ని గురించి పరిశోధన జరిపే శాస్త్రమే రాజనీతిశాస్త్రం”.

iii) రాజ్యం, ప్రభుత్వం గూర్చి అధ్యయనం చేసేది (Study of State and Government): రాజనీతి
తత్వవేత్తలైన పాలానెట్, ఆర్.ఎన్. గిల్ క్రిస్ట్, డిమాక్, ప్రొఫెసర్ కాట్లిన్ ఇతరులు రాజనీతిశాస్త్రం రాజ్యాన్ని మరియు ప్రభుత్వాన్ని గురించి అధ్యయనం చేసే శాస్త్రంగా తెలియజేసారు.
“ప్రభుత్వాన్ని గురించి వివరిస్తుంది”:

  1. పాలానెట్: “రాజనీతిశాస్త్రమంటే రాజ్య మూలాధారాలు, ప్రభుత్వ సూత్రాల గురించి తెలియజేసే సామాజిక శాస్త్రంలోని ఒక విభాగం”.
  2. ఆర్.ఎన్.గిల్ క్రిస్ట్: ‘రాజ్యం, ప్రభుత్వ సూత్రాలను, అధ్యయనం చేసే శాస్త్రమే రాజనీతిశాస్త్రం’.
  3. కాట్లిన్: ‘ప్రభుత్వాంగాలు, వ్యక్తుల రాజకీయ కార్యకలాపాలను అధ్యయనం చేసే శాస్త్రమే రాజనీతిశాస్త్రం’.

2. ఆధునిక నిర్వచనాలు:

  • లాస్వెల్, కాప్లాన్: “రాజనీతిశాస్త్రం ఒక అనుభవాత్మక శాస్త్రంగా ఉంటూ అధికార రూపకల్పన, అధికారుల భాగస్వామ్యం గురించి అధ్యయనం చేస్తుంది”.
  • డేవిడ్ ఈస్టన్: “రాజనీతిశాస్త్రం సమాజం కోసం విలువలను (వస్తువులను) అధికారయుతంగా పంపిణీ చేయడానికి సంబంధించి అధ్యయనం చేస్తుంది”.

రాజనీతి శాస్త్రం-పరిధి: గత వంద సంవత్సరాలలో రాజనీతిశాస్త్ర పరిధి చాలా విస్తరించింది. ప్రస్తుతం ఉన్న ఆధునిక రాజ్యాల కార్యకలాపాలను వివరించే శాస్త్రముగా అభివృద్ధి చెందింది. వ్యక్తి స్వేచ్ఛను ఎలా కాపాడుకోవాలి, రాజ్యానికి, శాసనానికి ఎందుకు విధేయత చూపాలి అనే విషయాలను తెలియజేయును. వాస్తవానికి ప్రభుత్వ ప్రమేయం ప్రత్యక్షంగానో, పరోక్షంగానో లేని మానవ కార్యకలాపాలుండవు. రాజనీతిశాస్త్రము మానవుని ప్రవర్తనను అధ్యయనం చేస్తుంది. అందువలన ప్రవర్తనావాదులు “సర్వత్రా వ్యాపించిన రాజకీయాలు” (Ubiquity of Politics) అని అంటారు.

రాజనీతిశాస్త్రములో చర్చించబడే విషయాలను ఈక్రింది విధంగా వివరించవచ్చును.
i) సమాజం, రాజ్యాలతో మానవునికి గల సంబంధాలు అధ్యయనం (Study of Man in relation to the Society and State): మానవుడు సంఘజీవి అని అరిస్టాటిల్ భావించాడు. మానవుడు తన ఆహారం, వస్త్రం, గృహం వంటి ప్రాథమిక అవసరాలను సమాజంలో తీర్చుకొంటాడు. రాజనీతిశాస్త్రం మానవుడికి, సమాజానికి మధ్య గల సంబంధాన్ని వివరిస్తుంది. అంతేకాకుండా సమాజం పుట్టుక, పరిణామం, ఉద్దేశ్యాలను కూడా అది తెలుపుతుంది. మానవుడు సమాజంలో ఏ విధంగా సర్దుబాటు చేసుకొని జీవిస్తాడు అనే అంశాన్ని పరిశీలిస్తుంది. ఈ సందర్భంలో రాజనీతిశాస్త్ర అధ్యయనం వ్యక్తికి, సమాజానికి ఎంతో ప్రాముఖ్యతగలదిగా ‘దిలాన్’ అనే పండితుడు భావించాడు. సమాజం పట్ల ఆధునిక మానవుడు సరైన దృక్పథాన్ని ఏర్పర్చుకోవాల్సిన అవసరం ఉందన్నాడు. సమాజంలో మానవుడు | మమేకం అయినప్పుడు మాత్రమే అది సాధ్యపడుతుందని వివరించారు.

వ్యక్తులకు, రాజ్యానికి మధ్య సరియైన సంబంధాన్ని నెలకొల్పే ప్రధాన అంశాలపైనే రాజనీతిశాస్త్ర అధ్యయనం కేంద్రీకృతమవుతుంది. రాజ్యంలోని రాజకీయ సంస్థల ప్రాముఖ్యతను వివరించడం ద్వారా అనేక సంక్లిష్ట సమస్యల పరిష్కారానికి ఈ శాస్త్రం దోహదపడుతుంది. ఈ సందర్భంలో అది రాజ్యాధికార పరిమితులు, వ్యక్తి స్వాతంత్ర్యాల అవధులు వంటి అనేక విషయాలను చర్చిస్తుంది.

ii) రాజ్య అధ్యయనం (Study of State): పాలానెట్, బ్లంటి షిల్లీ, గార్నర్ లాంటి రాజనీతి శాస్త్రవేత్తలు రాజనీతిశాస్త్రాన్ని రాజ్యానికి సంబంధించిన అధ్యయన శాస్త్రంగా పరిగణించారు. వారి ప్రకారం, రాజ్యమనేది రాజకీయ సంస్థగా వారు భావించారు. రాజ్యం ప్రతి వ్యక్తికీ అవసరమైనది. రాజ్యానికి, పౌరులకు మధ్యగల సన్నిహిత సంబంధాన్ని రాజనీతిశాస్త్రం తెలుపుతుంది. అలాగే రాజ్య అవతరణ సిద్ధాంతాలను వివరిస్తుంది. అంతేకాకుండా రాజ్యం స్వభావం విధులు, వివిధ రాజ్యాధికార సిద్ధాంతాలను పేర్కొంటుంది. రాజనీతిశాస్త్రం గతంలో రాజ్య అవతరణ అభివృద్ధి గురించి, వర్తమానంలోనూ, భవిష్యత్తులోనూ రాజకీయ సంస్థ, రాజకీయ భావాలను వర్ణించి విశ్లేషించేందుకు దోహదపడుతుందని ఈ సందర్భంలో ఆర్.జి. గెటిల్ పేర్కొన్నాడు.
i) వర్తమానంలో రాజ్యం పరిస్థితి ii) గతంలో రాజ్యపు ఉనికి iii) భవిష్యత్లో రాజ్యం ఎలా ఉండబోతుంది అనే మూడు విషయాల విశ్లేషణలు రాజనీతిశాస్త్రం పరిధిలో ఉంటాయి.

iii) ప్రభుత్వ అధ్యయనం (Study of Government): రాజనీతిశాస్త్ర పరిధిలో ప్రభుత్వం గురించిన అంశాలు ఉంటాయి. స్టీఫెన్ లీకాక్, జాన్ రిచర్డ్ సీలీ లాంటి కొందరు రాజనీతిశాస్త్రవేత్తలు ఈ శాస్త్ర పరిధిని ప్రభుత్వ అధ్యయనానికి పరిమితం చేశారు. వారి ప్రకారం, ఈ శాస్త్రం ప్రభుత్వం గురించి అధ్యయనం చేస్తుంది. ప్రభుత్వమనేది రాజ్యపు ప్రతినిధి అని, ప్రభుత్వం లేకుండా రాజ్యం ఉండదని వారు భావించారు. ప్రభుత్వం ద్వారానే రాజ్య ఆశయాలు నెరవేరతాయి. రాజ్య అభీష్టాన్ని ప్రభుత్వం రూపొందించి, వ్యక్తీకరించి, అమలులో ఉంచుతుంది. కొంతమంది వ్యక్తులు లేదా వ్యక్తుల సముదాయం రాజ్యం తరపున అధికారికంగా ఆజ్ఞలను జారీచేస్తారు. వారినే ప్రభుత్వంగా పరిగణించడమైంది. రాజనీతిశాస్త్రం, ప్రభుత్వానికి గల అర్థం, నిర్మితి, రకాలు స్వభావం, కర్తవ్యాలను అధ్యయనం చేస్తుంది. అలాగే ప్రభుత్వ అంశాల మధ్య సంబంధాన్ని చర్చిస్తుంది. రాజ్యం, ప్రభుత్వాల మధ్య వ్యత్యాసాలను గుర్తిస్తుంది.

iv) సంఘాలు, సంస్థల అధ్యయనం (Study of Associations and Institutions): వ్యక్తి జీవనాన్ని ప్రభావితం చేసే అనేక సంఘాలు, సంస్థలు ఉన్నాయి. ప్రతి వ్యక్తి రాజ్యంలోని భిన్న సంఘాలు, సంస్థలలో సభ్యుడిగా ఉంటాడు. రాజ్యం వ్యక్తుల రాజకీయ అవసరాలను తీర్చగా, సంఘాలు, సంస్థలనేవి వ్యక్తుల నైతిక, మత, సాంస్కృతిక, వైజ్ఞానిక, సాంకేతిక ప్రగతికి సంబంధించిన విషయాలపై సహాయంగా ఉంటాయి. అవి స్థానిక, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలలో తమ కార్యక్రమాలను నిర్వహిస్తుంటాయి. వ్యక్తులు ఆ సంస్థలలో తమ ప్రయోజనాలు లేదా ఉద్దేశ్యాలకు అనుగుణంగా చేరి వ్యక్తిత్వ వికాసానికై కృషి చేస్తారు. పైన పేర్కొన్న సంఘాలు, సంస్థలు వ్యక్తుల సంపూర్ణ వికాసంలో కీలకపాత్ర పోషిస్తాయి. వ్యక్తులు, కుటుంబం, కులం, రాజకీయ పార్టీలు, మతం వంటి అనేక సంస్థలనుండి ప్రయోజనాలను పొందుతారు. రాజనీతిశాస్త్రం వివిధ సంస్థల నిర్మాణం, స్వభావం మరియు విధులను గురించి వివరిస్తుంది.

AP Inter 1st Year Civics Study Material Chapter 1 రాజనీతిశాస్త్రం, పరిధి-ప్రాముఖ్యత

v) హక్కులు, బాధ్యతల అధ్యయనం (Study of Rights and Responsibilities): రాజనీతిశాస్త్ర పరిధి, వ్యక్తుల హక్కులకు, బాధ్యతలకు సంబంధించిన అధ్యయనంగా ఉంది. ప్రజాస్వామ్య రాజ్యాలలోని పౌరులు జీవించే హక్కు, స్వాతంత్య్రపు హక్కు, ఆస్తిహక్కు కొన్ని హక్కులను అనుభవిస్తారు. ఈ సందర్భంలో రాజనీతిశాస్త్రం హక్కుల నిర్వచనం, వర్గీకరణ, వివిధ సిద్ధాంతాలను ప్రస్తావిస్తుంది. అలాగే ప్రాథమిక హక్కులకు సంబంధించిన రాజ్యాంగ అంశాలపై దృష్టిని సారిస్తుంది. రాజ్యం పట్ల పౌరులు కొన్ని బాధ్యతలు కలిగి ఉంటారు. అటువంటి బాధ్యతలలో పన్నుల చెల్లింపు, శాసన విధేయతలాంటివి ఉంటాయి. రాజనీతిశాస్త్రం, పౌరుల హక్కుల బాధ్యతల ప్రాముఖ్యతను
వివరిస్తుంది.

vi) జాతీయ – అంతర్జాతీయ అంశాల అధ్యయనం (Study of National and International Issues): రాజనీతిశాస్త్ర పరిధిలో 20వ శతాబ్ది ప్రారంభం నుంచి ప్రాముఖ్యత వహించిన అంతర్జాతీయ సంబంధాలనేవి చేర్చబడినాయి. ఈ శాస్త్రం వర్ధమాన జాతి రాజ్యాలతో పాటుగా అంతర్జాతీయ రాజకీయాలను కూడా చర్చిస్తుంది. ఆధునిక రాజ్యాలు ఇతర రాజ్యాలతో ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమత్వం పరిరక్షణకు సంబంధించిన అంశాలను ఈ శాస్త్రం వివరిస్తుంది. ప్రచ్ఛన్న యుద్ధం, ప్రాబల్య సమతౌల్యం, నిరాయుధీకరణ, దౌత్యనీతి వంటి విషయాలను అధ్యయనం చేస్తుంది. అలాగే అంతర్జాతీయ రాజకీయాలు, అంతర్జాతీయ న్యాయం, అంతర్జాతీయ సంస్థలు వంటి అనేక అంశాలు ఈ శాస్త్ర అధ్యయనంలో ఉంటాయి.

vii) శక్తి అధ్యయనం (Study of Power): 20వ శతాబ్ద కాలం నాటి ప్రవర్తనావాదులు రాజనీతిశాస్త్రాన్ని రాజకీయ శక్తి నిర్మాణం, దాని భాగస్వాములను గురించి అధ్యయనం చేసే శాస్త్రంగా భావించారు. ఈ శాస్త్రం శక్తి ఏ విధంగా దక్కించుకోబడి, వినియోగించబడుతుందనే విషయాన్ని వివరిస్తుందన్నారు. రాజకీయ సామాజికీకరణ రాజకీయ సంస్కృతి, రాజకీయ ప్రాతినిధ్యంలాంటి అనేక అంశాలు ఈ శాస్త్ర అధ్యయనంలో ఉన్నాయన్నారు. అంతేకాకుండా, రాజకీయ ప్రసరణ, ప్రయోజనాల వ్యక్తీకరణ, ప్రయోజనాల సమీకరణల వంటి లాంఛనప్రాయం కాని రాజకీయశక్తి దృక్కోణాలు కూడా ఈ శాస్త్ర అధ్యయనంలో భాగంగా ఉన్నాయన్నారు.

viii) ప్రభుత్వ విధానాల అధ్యయనం (Study of Public Policy): డేవిడ్ ఈస్టన్, ఆండర్సన్, ఛార్లెస్ లిండ్బామ్ లాంటి ఆధునిక రాజనీతిశాస్త్రవేత్తలు రాజనీతిశాస్త్రాన్ని విధానశాస్త్రమని వాదించారు. రాజనీతిశాస్త్రాన్ని ప్రభుత్వ విధాన రూపకల్పన, అమలు, మూల్యాంకనాలకు సంబంధించినదన్నారు. లాంఛనప్రాయమైన రాజకీయ నిర్మితులు, లాంఛనప్రాయంకాని రాజకీయ వర్గాల పాత్రను ఈ శాస్త్రం అధ్యయనం చేస్తుందన్నారు.

ఒక రాజ్యం యొక్క ప్రభుత్వ విధానాన్ని అధ్యయనం చేసే సందర్భంలో అంతర్జాతీయ సంబంధాలపరంగా దౌత్యపరమైన, ఆర్థిక, సైనికపరమైన అంశాలకు శాస్త్రీయ వ్యూహాల రూపకల్పన కీలకపాత్రను పోషిస్తుంది.

ప్రశ్న 2.
రాజనీతిశాస్త్ర అధ్యయన ప్రాముఖ్యతను చర్చించండి.
జవాబు:
పరిచయం: సాంఘిక శాస్త్రాలలో రాజనీతిశాస్త్రము ప్రధానమైనది. ప్రాచీన గ్రీకునగర రాజ్యాలైన ఏథెన్స్, స్పార్టా, గ్రీస్, రోమ్ లో క్రీ.పూ. 4వ శతాబ్దంలో ప్రారంభమైనది. ప్రముఖ గ్రీకు రాజనీతివేత్తలైన సోక్రటీస్, ప్లేటో, అరిస్టాటిల్ రాజనీతిని తత్త్వశాస్త్రము నుండి వేరుచేసి ప్రత్యేక అధ్యయన శాస్త్రముగా అభివృద్ధి చేసిరి. అరిస్టాటిల్ రాజనీతిశాస్త్రానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చాడు. అందువలన ఇతను “మొట్టమొదటి రాజనీతి శాస్త్రవేత్త”గాను, “రాజనీతి శాస్త్ర పితామహుడు”గా కీర్తింపబడినాడు. అరిస్టాటిల్ తన ప్రఖ్యాత గ్రంథమైన “పాలిటిక్స్”లో రాజ్యము, ప్రభుత్వము గురించి అధ్యయనము చేసే శాస్త్రము రాజనీతిశాస్త్రమని పేర్కొనినాడు.

పద పరిణామము: “పాలిటిక్స్ అనే పదం “పోలిస్” (Polis) మరియు “పొలిటికస్” (Politicus) అనే లాటిన్ పదాల నుండి గ్రహించడమైనది. వీటి అర్థం నగర రాజ్యం (City State).
నిర్వచనం:

  1. జె.డబ్ల్యు.గార్నర్: “రాజనీతి శాస్త్రం రాజ్యంతో ఆరంభమై రాజ్యంతోనే అంతమవుతుంది”.
  2. డేవిడ్ ఈస్టన్: “రాజనీతిశాస్త్రం సమాజం కోసం విలువలను (వస్తువులను) అధికారయుతంగా పంపిణీ చేయడానికి సంబంధించి అధ్యయనం చేస్తుంది”.

రాజనీతిశాస్త్రం ప్రాముఖ్యత (Significance of Political Science): రాజనీతిశాస్త్ర అధ్యయనం ఎంతో ప్రయోజనకరమైనది, విలువైనదిగా పేర్కొనవచ్చు. ఈ శాస్త్ర పరిజ్ఞానం పాలకులు, పాలితులు ఇరువురికీ ఎంతగానో ఆవశ్యకమైంది. ఈ శాస్త్ర ప్రాముఖ్యతను కింద పేర్కొన్న విధంగా విశ్లేషించవచ్చు.

1) రాజ్యం గురించి సమాచారం (Information about the State): రాజనీతిశాస్త్ర అధ్యయనం ప్రధానంగా రాజ్యానికి సంబంధించిన పరిజ్ఞానాన్ని అందించేందుకు ఉద్దేశించింది. రాజ్యం అవతరణ, దాని స్వభావం, నిర్మితి విధుల గురించి ఈ శాస్త్రం తెలుపుతుంది. రాజ్యానికి సంబంధించిన పరిజ్ఞానం ప్రతి ఒక్కరికీ ఎంతగానో అవసరం. రాజ్యాలలో రాజకీయ సంస్థల పాత్ర పట్ల సరియైన అవగాహన కలిగి ఉన్నప్పుడు వివిధ రాజకీయ సమస్యలకు పరిష్కారం కనుగొనే వీలుంటుంది. అలాగే తగిన సామాజిక అవగాహన కూడా ఎంతగానో అవసరమవుతుంది. ఈ విషయంలో రాజనీతిశాస్త్రం చాలినంత పరిజ్ఞానం, అవగాహనను వ్యక్తులకు అందిస్తుంది.

AP Inter 1st Year Civics Study Material Chapter 1 రాజనీతిశాస్త్రం, పరిధి-ప్రాముఖ్యత

2) ప్రభుత్వం – పరిపాలనల పరిజ్ఞానం (Knowledge of Government and Administration): రాజ్య కార్యకలాపాలను నిర్వహించే పరిపాలకులు, రాజకీయ నాయకులు, దౌత్యవేత్తలు తమ విధులను సమర్థవంతంగా నిర్వహించేందుకై రాజనీతిశాస్త్ర పరిజ్ఞానం ఎంతగానో అవసరమవుతుంది. పరిపాలన యంత్రాంగం, సిబ్బంది, పాలన, ప్రజా సంబంధాల నిర్వహణ, పరిపాలన న్యాయం, సంప్రదింపులు వంటి అంశాల గురించి వారికి ఈ శాస్త్ర అధ్యయనం విశేషమైన అవగాహనను ఏర్పరుస్తుంది. అలాగే ఈ శాస్త్ర అధ్యయనం ద్వారా స్థానిక స్వపరిపాలన సంస్థలైన కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, జిల్లా పరిషత్తులు, మండల పరిషత్తులు, గ్రామ పంచాయితీలు లాంటి సంస్థలకు సంబంధించిన విషయాలను తెలుసుకోవచ్చు.

3) ప్రజాస్వామ్య విలువల సమాచారం (Information about Democratic Values): రాజనీతిశాస్త్ర అధ్యయనం రాజ్యం, ప్రభుత్వం, జాతి, జాతీయత, రాజ్యాంగం ప్రజాస్వామ్యం, ఉదారవాదం, పెట్టుబడిదారీ విధానం, సామ్యవాదం, కమ్యూనిజంలాంటి అనేక రాజకీయ భావనలకు సంబంధించిన ఖచ్చితమైన సమాచారాన్ని అందిస్తుంది. ఈ భావనలు మానవ జీవనంలో అనేక రంగాలలో వాడుకలో ఉన్నాయి. వాటి సారం, స్వభావం, పరిధుల గురించి ఖచ్చితమైన అర్థాన్ని గురించి రాజనీతిశాస్త్రం తెలుపుతుంది. రాజనీతిశాస్త్రం రాజకీయ భావనలైన హక్కులు, స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం పట్ల మంచి పరిజ్ఞానం, అవగాహనలను ఏర్పరుస్తుంది.

4) ప్రజాస్వామ్య విజయం (Success of Democracy):’ వర్తమాన ప్రపంచంలో ప్రజాస్వామ్యం అత్యంత ప్రాముఖ్యతగల ప్రభుత్వ విధానంగా రూపొందింది. అది “ప్రపంచ గొప్ప రాజకీయ మతం” గా భావించబడింది. ఈ విధానంలో ప్రజలు తమ ప్రతినిధులను ఎన్నుకోవడం, ఆ ప్రతినిధులు ప్రజలను పరిపాలించడం జరుగుతుంది.
రాజనీతిశాస్త్రం ఓటుహక్కు ప్రాముఖ్యతను వివరిస్తుంది. ప్రజాస్వామ్య భావాలు, ఆదర్శాలను సామాన్య వ్యక్తులకు నేర్పుతుంది. ప్రజాస్వామ్య విజయానికి ఈ శాస్త్రం ఎంతగానో ఉపకరిస్తుంది. ఈ శాస్త్ర అధ్యయనం పౌరులలో ప్రజాస్వామ్య విలువలను, వివేకాన్ని, దేశభక్తిని మరియు అప్రమత్తతను ఏర్పరుస్తుంది.

5) హక్కులు, బాధ్యతల పట్ల అవగాహన (Awareness about Rights and Responsibilities): రాజనీతిశాస్త్ర అధ్యయనం ప్రజలలో హక్కులు, బాధ్యతల పట్ల చక్కని అవగాహనను పెంపొందిస్తుంది. ఈ శాస్త్ర అధ్యయనం ద్వారా పౌరులు తమ హక్కులు, బాధ్యతలను గుర్తుంచుకొని, ఆ రెండింటి మధ్య పరస్పర సంబంధాన్ని తెలుసుకోగలుగుతారు. ప్రజాస్వామ్య ప్రభుత్వ విజయం హక్కులు, విధుల మధ్యగల సంబంధాన్ని సక్రమంగా అర్థం చేసుకొనే అంశంపైనే ఆధారపడి ఉంటుంది.

6) మంచి పౌరసత్వ గుణాల బోధన (Teaching the qualities of good citizenship): రాజనీతి శాస్త్ర అధ్యయనం మంచి పౌరసత్వాన్ని పొందేందుకు, జాతీయ సమైక్యతను సాధించేందుకు ఎంతో అవసరం. ఈ శాస్త్ర అధ్యయనం పౌరులకు జాతీయ ఆశయాలు, లక్ష్యాలను గుర్తుచేస్తుంది. మంచి పౌరుడనేవాడు చట్టాలు ఎలా రూపొందించబడి అమలు చేయబడతాయనే విషయాన్ని తప్పకుండా తెలుసుకోవాలి. రాజనీతిశాస్త్రం మంచి పౌరసత్వపు వివిధ దృక్కోణాలను, ప్రయోజనాలను బోధిస్తుంది. పౌరులను ఆదర్శపౌరులుగా తీర్చిదిద్దేందుకు శిక్షణ ఇస్తుంది. విధేయత, సామాజిక సేవ, నిస్వార్థంలాంటి మంచి పౌరసత్వ గుణాలను పెంపొందిస్తుంది. పౌరులు సమాజం, రాజ్యం పట్ల బాధ్యత కలిగి ఉండాల్సిన అవసరాన్ని తెలుపుతుంది. మొత్తం మీద వ్యక్తుల మూర్తిమత్వాన్ని పెంపొందిస్తుంది.

7) ప్రపంచ వ్యవహారాల పరిజ్ఞానం (Knowledge of World Affairs): రాజనీతిశాస్త్ర అధ్యయనం వలన వ్యక్తులకు ప్రపంచ వ్యవహారాల పరిజ్ఞానం పెంపొందుతుంది. వ్యక్తుల మేధోపరమైన పరిధి విస్తృతమవుతుంది. సమకాలీన ప్రపంచ వ్యవహారాలను పరిశీలించి అవగాహన చేసుకొనుటకు ఈ శాస్త్ర అధ్యయనం ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది. అంతర్జాతీయ రాజకీయాలకు సంబంధించిన అనేక దృగ్విషయాలను అర్థం చేసుకొనేందుకు అవసరమైన ఆలోచన విధానం, విశాలదృష్టి వంటి లక్షణాలను వ్యక్తులకు పెంపొందిస్తుంది.

8) అంతర్జాతీయ సంస్థల పరిజ్ఞానం (Knowledge of International Organisations): రాజనీతి శాస్త్ర అధ్యయనం అంతర్జాతీయవాద స్ఫూర్తిని పెంపొందిస్తుంది. ఐక్యరాజ్యసమితి లాంటి అంతర్జాతీయ సంస్థల గురించి పరిజ్ఞానాన్ని అందిస్తుంది. ఈనాటి ప్రపంచ రాజ్యాల మధ్య ఉత్పన్నమయ్యే ఉద్రిక్తతలను తొలగించే విషయంలో ఈ శాస్త్ర అధ్యయనం ఎంతగానో అవసరమవుతుంది. నిరాయుధీకరణ ఆవశ్యతకను గట్టిగా వాంఛిస్తుంది. అంతేకాకుండా ఈ శాస్త్రం పౌరులకు ప్రచ్ఛన్నయుద్ధం, వలసవాదం, సామ్రాజ్యవాదం, నయావలసవాదాల వల్ల ఏర్పడే ప్రమాదాలను తెలిపి, ప్రపంచశాంతి స్థాపన ఆవశ్యకతను వివరిస్తుంది.

9) రాజకీయ అవగాహనను పెంపొందించడం (Developing Political Awareness): రాజనీతిశాస్త్ర అధ్యయనం ద్వారా స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, న్యాయం వంటి రాజకీయ ఆదర్శాలకు సంబంధించిన పరిజ్ఞానాన్ని ప్రతి ఒక్కరూ పొందవచ్చు. అలాగే ఈ శాస్త్ర అధ్యయనం ద్వారా ఫాసిజం, సామ్యవాదం, కమ్యూనిజం లాంటి కొన్ని రాజకీయ భావజాలాల గురించి సమగ్రమైన అవగాహనను పొందవచ్చు. భావజాలాల గురించి ప్రజలలో ఉండే అజ్ఞానాన్ని పారద్రోలవచ్చు. ఈ శాస్త్ర అధ్యయనం అంతిమంగా ప్రజలలో రాజకీయ అవగాహనను పెంపొందిస్తుంది.

AP Inter 1st Year Civics Study Material Chapter 1 రాజనీతిశాస్త్రం, పరిధి-ప్రాముఖ్యత

10) సహకారం, సహనం, ఆవశ్యకతల వివరణ (Explaining the need for Co-operation and Toleration): అనేక రాజ్యాలలో జాతీయ సమైక్యత అత్యంత ప్రాముఖ్యత గల అంశంగా గుర్తించబడింది. ఈ రాజ్యాలలో మతతత్వం, భాషాతత్వం, ఉప, జాతీయ, ప్రాంతీయభావాల వంటి ఆటంకాలు జాతీయ సమైక్యతకు సవాళ్ళుగా పరిణమించాయి. ఈ సందర్భంలో రాజనీతిశాస్త్ర అధ్యయనం సర్దుబాటు, సహకారం, సహనం వంటి అంశాల ఆవశ్యకతను బోధిస్తుంది. ప్రజలలో సంకుచిత మనస్తత్వం, స్వార్ధ దృక్పథాలను తొలగిస్తుంది. వర్గ సంబంధమైన ఆసక్తులను అధిగమించాల్సిన ఆవశ్యకతను నొక్కి చెబుతుంది. సమాజంలో ప్రతి ఒక్కరూ పరస్పర గౌరవంతో జీవించాల్సిన అవసరాన్ని వివరిస్తుంది.

ప్రశ్న 3.
రాజనీతిశాస్త్రాన్ని నిర్వచించి, ఆ శాస్త్ర స్వభావాన్ని పేర్కొనండి.
జవాబు:
పరిచయం: సాంఘిక శాస్త్రాలలో రాజనీతి శాస్త్రము ప్రధానమైనది. ప్రాచీన గ్రీకునగర రాజ్యాలైన ఏథెన్స్, స్పార్టా, గ్రీస్, రోమ్ లో క్రీ.పూ. 4వ శతాబ్దంలో ప్రారంభమైనది. ప్రముఖ గ్రీకు రాజనీతివేత్తలైన సోక్రటీస్, ప్లేటో, అరిస్టాటిల్ రాజనీతిని తత్త్వశాస్త్రము నుండి వేరుచేసి ప్రత్యేక అధ్యయన శాస్త్రముగా అభివృద్ధి చేసిరి. అరిస్టాటిల్ రాజనీతిశాస్త్రానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చాడు. అందువలన ఇతను “మొట్టమొదటి రాజనీతి శాస్త్రవేత్త”గాను, “రాజనీతి శాస్త్ర పితామహుడు”గా కీర్తింపబడినాడు. అరిస్టాటిల్ తన ప్రఖ్యాత గ్రంథమైన “పాలిటిక్స్”లో రాజ్యము, ప్రభుత్వము గురించి అధ్యయనము చేసే శాస్త్రము రాజనీతిశాస్త్రమని పేర్కొనినాడు.

పద పరిణామము: “పాలిటిక్స్ అనే పదం “పోలిస్” (Polis) మరియు “పొలిటికస్” (Politicus) అనే లాటిన్ పదాల నుండి గ్రహించడమైనది. వీటి అర్థం నగర రాజ్యం (City State).

నిర్వచనం:
1. జె.డబ్ల్యు. గార్నర్: “రాజనీతిశాస్త్రం రాజ్యంతో ఆరంభమై రాజ్యంతోనే అంతమవుతుంది”.

2. డేవిడ్ ఈస్టన్: “రాజనీతిశాస్త్రం సమాజం కోసం విలువలను (వస్తువులను) అధికారయుతంగా పంపిణీ చేయడానికి సంబంధించి అధ్యయనం చేస్తుంది”.

రాజనీతిశాస్త్ర స్వభావం (Nature of Political Science): రాజనీతిశాస్త్ర స్వభావం విషయంలో రాజనీతి శాస్త్రజ్ఞుల మధ్య కొంత వివాదముంది. కొంతమంది రాజనీతిశాస్త్రం ఒక శాస్త్రమని, మరికొందరు ఇది ఒక ‘కళ” అని అంటారు. అరిస్టాటిల్, బ్లంటే లీ, బోడిన్, హాబ్స్, జెల్లినిక్, మాంటెస్క్యూ, సిడ్జివిక్ మొదలైనవారు రాజనీతిశాస్త్రాన్ని ఒక శాస్త్రమని పేర్కొనగా మరోవైపు బార్కర్, కొలిన్, మెయిట్లాండ్, జె.యస్. మిల్ రాజనీతిశాస్త్రం ఒక కళ అని పేర్కొన్నారు.
1) రాజనీతి శాస్త్రం ఒక శాస్త్రమా ? (Is Political Science a Science ?): రాజనీతిశాస్త్రాన్ని క్రింది అంశాల ప్రాతిపదికగా పరిగణించవచ్చు.

  1. రాజనీతిశాస్త్రాన్ని ఒక క్రమ పద్ధతిలో అధ్యయనం చేయవచ్చు.
  2. రాజకీయాలలో ప్రయోగాత్మకతకు అవకాశం ఉంది.
  3. ఇతర సామాజిక శాస్త్రాల వలె నిరపేక్షమైన, విశ్వవ్యాప్తమైన చట్టాలను కలిగి ఉంటుంది.
  4. రాజకీయాలలో అంచనాలను సులభంగా వర్తింపచేయవచ్చు.
  5. రాజనీతిశాస్త్ర అధ్యయనంలో నిర్దిష్టమైన సార్వత్రిక ఆమోదిత సూత్రాలను పొందుపరచవచ్చు.
  6. రాజనీతిశాస్త్రం శాస్త్రీయ స్వభావాన్ని కలిగి ఉంటుంది. అందువల్ల ఈ శాస్త్ర అధ్యయనంలో శాస్త్రీయమైన సూత్రాలను పొందుపరచటం జరిగింది.
  7. రాజనీతిశాస్త్రం ఇతర శాస్త్రాల వలె కార్యకారణ సంబంధాన్ని అమలు చేసేందుకు అవకాశమిస్తుంది.

2) రాజనీతి శాస్త్రం ఒక కళా ? (Is Political Science an Art ?): రాజనీతిశాస్త్రాన్ని క్రింది అంశాలను బట్టి ఒక కళగా భావించవచ్చు.

  1. రాజనీతిశాస్త్రం, భౌతికశాస్త్రాలకు భిన్నంగా నిరపేక్షమైన, విశ్వవ్యాప్త చట్టాలను కలిగి ఉండదు.
  2. రాజనీతిశాస్త్రంలో కొన్ని దృగ్విషయాలను సమయం సందర్భాన్ని బట్టి వివిధ రకాలుగా వ్యాఖ్యానించి అధ్యయనం చేయవచ్చు. అందువల్ల ఈ శాస్త్రం వివిధ భావనల వ్యాఖ్యానాలకు సంబంధించి ఏకరూపతను కలిగి ఉండదు.
  3. అన్ని శాస్త్రాలకు ప్రాతిపదికగా పరిగణించే కార్యకారణ సిద్ధాంతాన్ని ఖచ్చితంగా అనుసరించేందుకు ఈ శాస్త్రం అవకాశమివ్వదు.
  4. రాజనీతిశాస్త్రం పరిణామాత్మక స్వభావాన్ని కలిగి ఉండదు. ఎందుకంటే ఈ శాస్త్రంలోని భావనలు క్రమాను గతంగా నిరంతర ప్రాతిపదికపై రూపొందించబడి అభివృద్ధి చెందలేదు.
  5. రాజనీతిశాస్త్రంలో శాస్త్రీయ పద్ధతులైన పరిశీలన, ప్రయోగాత్మకతలు పాటించబడవు.
  6. రాజనీతిశాస్త్రంలోని వివిధ అధ్యయన అంశాల వివరణలలో సంపూర్ణమైన నిష్పాక్షికత, ప్రత్యేకత గోచరించవు.
  7. రాజనీతిశాస్త్రం ఖచ్చితమైన ఫలితాలకు అవకాశమివ్వదు.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
రాజనీతిశాస్త్ర సాంప్రదాయక నిర్వచనాల గురించి రాయండి.
జవాబు:
సాంప్రదాయకమైన నిర్వచనాలను మూడు ఉప వర్గాలుగా వర్గీకరించారు. వాటిని క్రింది విధంగా పేర్కొనవచ్చు. i) రాజ్యం గురించి అధ్యయనం చేసేదే రాజనీతిశాస్త్రం (Study of the State): రాజనీతి తత్వవేత్తలైన జె.డబ్ల్యు గార్నర్, ఆర్.జి.గెటిల్, అప్పాదొరై మరియు ఇతరులు రాజనీతిశాస్త్రం రాజ్యాన్ని గురించి అధ్యయనం చేస్తుందని
వివరించారు.

  1. జె.డబ్ల్యు. గార్నర్: “రాజనీతిశాస్త్రం రాజ్యంతో ఆరంభమై రాజ్యంతోనే అంతమవుతుంది”.
  2. ఆర్.జి.గెటిల్: “రాజనీతిశాస్త్రమంటే రాజ్యం గతంలో ఎలా ఉండేదో పరిశోధించి, వర్తమాన కాలంలో ఎలా ఉన్నదో విశ్లేషించి, భవిష్యత్ కాలంలో ఎలా ఉండాలి అనే అంశంపై జరిపే రాజకీయ, నైతిక చర్చల సారాంశం”.
  3. అప్పాదొరై: “రాజ్య మనుగడ, అభివృద్ధికి అవసరమైన పరిస్థితుల గురించి అధ్యయనం చేసే శాస్త్రమే” రాజనీతి శాస్త్రం.

AP Inter 1st Year Civics Study Material Chapter 1 రాజనీతిశాస్త్రం, పరిధి-ప్రాముఖ్యత

ii) ప్రభుత్వాన్ని గురించి అధ్యయనం చేసేదే రాజనీతిశాస్త్రం (Study of the Government): రాజనీతి తత్వవేత్తలైన స్టీఫెన్ లీకాక్, జాన్ రిచర్డ్ సీలి, ఇతరులు రాజనీతిశాస్త్రం ప్రభుత్వాన్ని గురించి అధ్యయనం చేస్తుందని తెలిపారు.

  1. స్టీఫెన్ లీకాక్: “రాజనీతిశాస్త్రమంటే ప్రభుత్వం గురించి అధ్యయనం చేసే శాస్త్రం”.
  2. జాన్ రిచర్డ్ సీలీ: “ప్రభుత్వ దృగ్విషయాన్ని గురించి పరిశోధన జరిపే శాస్త్రమే రాజనీతిశాస్త్రం”.

iii) రాజ్యం, ప్రభుత్వం గురించి అధ్యయనం చేసేది (Study of State and Government): రాజనీతి తత్వవేత్తలైన పాల్ జానెట్, ఆర్.ఎన్.గిల్ క్రిస్ట్, డిమాక్, ప్రొఫెసర్ కాట్లిన్, ఇతరులు రాజనీతి శాస్త్రం రాజ్యాన్ని మరియు ప్రభుత్వాన్ని గురించి అధ్యయనం చేసే శాస్త్రంగా తెలియజేసారు.
“ప్రభుత్వాన్ని గురించి వివరిస్తుంది”

  1. పాల్ జానెట్: “రాజనీతిశాస్త్రమంటే రాజ్య మూలాధారాలు, ప్రభుత్వ సూత్రాల గురించి తెలియజేసే సామాజిక శాస్త్రంలోని ఒక విభాగం”.
  2. ఆర్.ఎన్.గిల్ క్రిస్ట్: “రాజ్యం, ప్రభుత్వ సూత్రాలను అధ్యయనం చేసే శాస్త్రమే రాజనీతిశాస్త్రం”.
  3. ప్రొఫెసర్ కాట్లిన్: “ప్రభుత్వాంగాలు, వ్యక్తుల రాజకీయ కార్యకలాపాలను అధ్యయనం చేసే శాస్త్రమే రాజనీతిశాస్త్రం”.

ప్రశ్న 2.
రాజనీతిశాస్త్రపు ఆధునిక నిర్వచనాలు ఏవి ?
జవాబు:
ఆధునిక రాజనీతి శాస్త్రజ్ఞుల దృష్టిలో సాంప్రదాయక నిర్వచనాలు చాలా సంకుచితంగాను, న్యాయ, సంస్థాగత దృక్పథంతో కూడి ఉన్నవని వారి అభిప్రాయం. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత రాజనీతిశాస్త్ర దృష్టి రాజకీయ సంస్థల నుంచి రాజకీయ ప్రక్రియల వైపు మళ్ళింది. ప్రవర్తనావాద దృక్పథం వాడుకలోకి వచ్చింది. దీనివల్ల రాజనీతి శాస్త్ర అధ్యయనంలో పెనుమార్పులు సంభవించాయి. పౌరుల రాజకీయ ప్రవర్తనా అధ్యయన ప్రాముఖ్యత పెరిగింది. ఆధునిక రాజనీతిశాస్త్రజ్ఞులు, రాజనీతిశాస్త్రాన్ని ఒక విధాన శాస్త్రంగా పేర్కొన్నారు. అంతేకాకుండా, రాజనీతిశాస్త్ర అధ్యయనంలో శక్తిని ఒక ముఖ్య అంశంగా వివరించారు.
అవి:
మొత్తానికి ఆధునిక రాజనీతిశాస్త్రజ్ఞులు రాజనీతిశాస్త్ర నిర్వచనాలను రెండు ఉప తరగతులుగా విభజించారు.
i) రాజనీతిశాస్త్రం – శక్తి అధ్యయనం (Study of Power):

  1. లాస్వెల్, కాప్లాన్: “రాజనీతిశాస్త్రం ఒక అనుభవాత్మక శాస్త్రంగా ఉంటూ అధికార రూపకల్పన, అధికారుల భాగస్వామ్యం గురించి అధ్యయనం చేస్తుంది”.
  2. విలియం.ఎ.రాబ్సన్: “రాజనీతిశాస్త్రం ప్రధానంగా సమాజంలో అధికారానికి సంబంధించినది”.

ii) రాజనీతిశాస్త్రం – విలువల పంపకాన్ని అధ్యయనం చేస్తుంది (Study of allocation of values):

  1. డేవిడ్ ఈస్టన్: “రాజనీతిశాస్త్రం సమాజం కోసం విలువలను (వస్తువులను) అధికారయుతంగా పంపిణీ చేయడానికి సంబంధించి అధ్యయనం చేస్తుంది”.
  2. హిల్మన్: “రాజనీతిశాస్త్రం ఎవరు, ఎప్పుడు, ఎక్కడ, ఏమి, ఎలా పొందుతారో అధ్యయనం చేసే శాస్త్రం”.
    పైన పేర్కొన్న ఆధునిక నిర్వచనాలు రాజకీయ’ సంస్థల అధికారాలు, ఇతర కార్యకలాపాలను మూల్యాంకనం చేసే అంశాల అధ్యయనంగా రాజనీతిశాస్త్రాన్ని పరిగణించారని మనం చెప్పవచ్చు.

ప్రశ్న 3.
రాజనీతిశాస్త్ర పరిధిలోని ఏవైనా మూడు అంశాలను పేర్కొనండి.
జవాబు:
రాజనీతిశాస్త్రం – పరిధి:
i) సమాజం, రాజ్యాలతో మానవునికి గల సంబంధాలు అధ్యయనం (Study of Man in relation to the Society and State): మానవుడు సంఘజీవి అని అరిస్టాటిల్ భావించాడు. మానవుడు తన ఆహారం, వస్త్రం, గృహం వంటి ప్రాథమిక అవసరాలను సమాజంలో తీర్చుకొంటాడు. రాజనీతిశాస్త్రం మానవుడికి, సమాజానికి మధ్య గల సంబంధాన్ని వివరిస్తుంది. అంతేకాకుండా సమాజం పుట్టుక, పరిణామం, ఉద్దేశ్యాలను కూడా అది తెలుపుతుంది. మానవుడు సమాజంలో ఏ విధంగా సర్దుబాటు చేసుకొని జీవిస్తాడు అనే అంశాన్ని పరిశీలిస్తుంది. ఈ సందర్భంలో రాజనీతిశాస్త్ర అధ్యయనం వ్యక్తికి, సమాజానికి ఎంతో ప్రాముఖ్యతగలదిగా ‘దిలాన్’ అనే పండితుడు భావించాడు. సమాజం పట్ల ఆధునిక మానవుడు సరైన దృక్పథాన్ని ఏర్పర్చుకోవాల్సిన అవసరం ఉందన్నాడు. సమాజంలో మానవుడు మమేకం అయినప్పుడు మాత్రమే అది సాధ్యపడుతుందని వివరించారు.

AP Inter 1st Year Civics Study Material Chapter 1 రాజనీతిశాస్త్రం, పరిధి-ప్రాముఖ్యత

వ్యక్తులకు, రాజ్యానికి మధ్య సరియైన సంబంధాన్ని నెలకొల్పే ప్రధాన అంశాలపైనే రాజనీతిశాస్త్ర అధ్యయనం కేంద్రీకృతమవుతుంది. రాజ్యంలోని రాజకీయ సంస్థల ప్రాముఖ్యతను వివరించడం ద్వారా అనేక సంక్లిష్ట సమస్యల పరిష్కారానికి ఈ శాస్త్రం దోహదపడుతుంది. ఈ సందర్భంలో అది రాజ్యాధికార పరిమితులు, వ్యక్తి స్వాతంత్ర్యాల అవధులు వంటి అనేక విషయాలను చర్చిస్తుంది.

ii) రాజ్య అధ్యయనం (Study of State): పాలానెట్, బ్లంటి షిల్లీ, గార్నర్ లాంటి రాజనీతిశాస్త్రవేత్తలు రాజనీతిశాస్త్రాన్ని రాజ్యానికి సంబంధించిన అధ్యయన శాస్త్రంగా పరిగణించారు. వారి ప్రకారం, రాజ్యమనేది రాజకీయ సంస్థగా వారు భావించారు. రాజ్యం ప్రతి వ్యక్తికీ అవసరమైనది. రాజ్యానికి, పౌరులకు మధ్యగల సన్నిహిత సంబంధాన్ని రాజనీతిశాస్త్రం తెలుపుతుంది. అలాగే రాజ్య అవతరణ సిద్ధాంతాలను వివరిస్తుంది. అంతేకాకుండా రాజ్యం స్వభావం విధులు, వివిధ రాజ్యాధికార సిద్ధాంతాలను పేర్కొంటుంది. రాజనీతిశాస్త్రం గతంలో రాజ్య అవతరణ అభివృద్ధి గురించి, వర్తమానంలోనూ, భవిష్యత్తులోనూ రాజకీయ సంస్థ, రాజకీయ భావాలను వర్ణించి విశ్లేషించేందుకు దోహదపడుతుందని ఈ సందర్భంలో ఆర్.జి.గెటిల్ పేర్కొన్నాడు.

  • వర్తమానంలో రాజ్యం పరిస్థితి
  • గతంలో రాజ్యపు ఉనికి
  • భవిష్యత్లో రాజ్యం ఎలా ఉండబోతుంది అనే మూడు విషయాల విశ్లేషణలు రాజనీతిశాస్త్రం పరిధిలో ఉంటాయి.

iii) ప్రభుత్వ అధ్యయనం (Study of Government): రాజనీతిశాస్త్ర పరిధిలో ప్రభుత్వం గురించిన అంశాలు ఉంటాయి. స్టీఫెన్ లీకాక్, జాన్ రిచర్డ్ సీలీ లాంటి కొందరు రాజనీతిశాస్త్రవేత్తలు ఈ శాస్త్ర పరిధిని ప్రభుత్వ అధ్యయనానికి పరిమితం చేశారు. వారి ప్రకారం, ఈ శాస్త్రం ప్రభుత్వం గురించి అధ్యయనం చేస్తుంది. ప్రభుత్వమనేది రాజ్యపు ప్రతినిధి అని, ప్రభుత్వం లేకుండా రాజ్యం ఉండదని వారు భావించారు. ప్రభుత్వం ద్వారానే రాజ్య ఆశయాలు నెరవేరతాయి. రాజ్య అభీష్టాన్ని ప్రభుత్వం రూపొందించి, వ్యక్తీకరించి, అమలులో ఉంచుతుంది. కొంతమంది వ్యక్తులు లేదా వ్యక్తుల సముదాయం రాజ్యం తరపున అధికారికంగా ఆజ్ఞలను జారీచేస్తారు. వారినే ప్రభుత్వంగా పరిగణించడమైంది. రాజనీతిశాస్త్రం, ప్రభుత్వానికి గల అర్థం, నిర్మితి, రకాలు స్వభావం, కర్తవ్యాలను అధ్యయనం చేస్తుంది. అలాగే ప్రభుత్వ అంశాల మధ్య సంబంధాన్ని చర్చిస్తుంది. రాజ్యం, ప్రభుత్వాల మధ్య వ్యత్యాసాలను గుర్తిస్తుంది.

ప్రశ్న 4.
ప్రభుత్వానికి సంబంధించి రాజనీతిశాస్త్ర పరిధిని వర్ణించండి.
జవాబు:
రాజనీతిశాస్త్ర పరిధిలో ప్రభుత్వం గురించిన అంశాలు ఉంటాయి. స్టీఫెన్ లీకాక్, జాన్ రిచర్డ్ సీలీ లాంటి కొందరు రాజనీతిశాస్త్రవేత్తలు ఈ శాస్త్ర పరిధిని ప్రభుత్వ అధ్యయనానికి పరిమితం చేశారు. వారి ప్రకారం, ఈ శాస్త్రం ప్రభుత్వం గురించి అధ్యయనం చేస్తుంది. ప్రభుత్వమనేది రాజ్యపు ప్రతినిధి అని, ప్రభుత్వం లేకుండా రాజ్యం ఉండదని వారు భావించారు. ప్రభుత్వం ద్వారానే రాజ్య ఆశయాలు నెరవేరతాయి. రాజ్య అభీష్టాన్ని ప్రభుత్వం రూపొందించి, వ్యక్తీకరించి, అమలులో ఉంచుతుంది. కొంతమంది వ్యక్తులు లేదా వ్యక్తుల సముదాయం రాజ్యం తరపున అధికారికంగా ఆజ్ఞలను జారీచేస్తారు. వారినే ప్రభుత్వంగా పరిగణించడమైంది. రాజనీతిశాస్త్రం, ప్రభుత్వానికి గల అర్థం, నిర్మితి, రకాలు స్వభావం, కర్తవ్యాలను అధ్యయనం చేస్తుంది. అలాగే ప్రభుత్వ అంశాల మధ్య సంబంధాన్ని చర్చిస్తుంది. రాజ్యం, ప్రభుత్వాల మధ్య వ్యత్యాసాలను గుర్తిస్తుంది.

ప్రశ్న 5.
“రాజనీతిశాస్త్రమనేది రాజ్యపు గతం, వర్తమాన, భవిష్యత్ విషయాల అధ్యయనం” విశ్లేషించండి.
జవాబు:
వర్తమానంలో రాజ్యం పరిస్థితి, గతంలో రాజ్యపు ఉనికి మరియు భవిష్యత్లో రాజ్యం ఎలా ఉండబోతుంది అనే మూడు విషయాల విశ్లేషణలు రాజనీతిశాస్త్ర పరిధిలో ఉంటాయి. వాటిని క్రింది విధంగా వివరించవచ్చు.
i) వర్తమానంలో రాజ్యం పరిస్థితి (Study of State in the Present): రాజనీతిశాస్త్రం వర్తమాన కాలంలో రాజ్యం పరిస్థితిని చర్చిస్తుంది. రాజ్యం, అర్థం, స్వభావం, ఉద్దేశ్యం, అభివృద్ధి, పనితీరులను వివరిస్తుంది. అలాగే రాజ్య అవతరణ సిద్ధాంతాలను అధ్యయనం చేస్తుంది. ప్రజాభిప్రాయం, రాజకీయ పార్టీలు, ప్రభావ వర్గాలు ఏ విధంగా రాజకీయ అధికార సాధనకు ప్రభుత్వ విధానాల ప్రభావానికి కృషి చేస్తాయనే విషయాలను తెలుపుతుంది.

ii) గతంలో రాజ్యపు ఉనికి (Study of State in the Past): రాజనీతిశాస్త్రం రాజ్యవ్యవస్థ అవతరణ, దాని పరిణామ క్రమాలను వివరిస్తుంది. అలాగే రాజ్యంలోని వివిధ రాజకీయ సంస్థల గురించి చర్చిస్తుంది. రాజ్య ఆవిర్భావం, వికాసాలను ప్రభావితం చేసిన వివిధ అంశాలను అధ్యయనం చేస్తుంది. ఇటువంటి చారిత్రక అధ్యయనం ఒక్క రాజనీతిశాస్త్రంలోనే సాధ్యమవుతుంది.

AP Inter 1st Year Civics Study Material Chapter 1 రాజనీతిశాస్త్రం, పరిధి-ప్రాముఖ్యత

iii) భవిష్యత్లో రాజ్యం ఎలా ఉంటుంది ? (Study of State in Future): ఆదర్శ రాజ్య సూత్రాలను, భావనలను నిర్ణయించే అంశాలను రాజనీతిశాస్త్రం అధ్యయనం చేస్తుంది. అదే విధంగా, రాజ్య పరిధిలో ఆచరణలో ఉన్న వివిధ రాజకీయ సంస్థలను గురించి చర్చిస్తుంది. మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో భవిష్యత్తులో రాజకీయ సంస్థల ప్రమాణాలను, కార్యకలాపాలను మెరుగుపరచేందుకు అనుసరించాల్సిన మార్గాలను రాజనీతిశాస్త్రం సూచిస్తుంది. మొత్తం మీద రాజనీతిశాస్త్ర పరిధిలో రాజ్య స్వభావం, ఆవిర్భావం, పరిణామం, అభివృద్ధి వంటి అనేక అంశాలు ఉంటాయని చెప్పవచ్చు. అలాగే ఈ శాస్త్రంలో వివిధ రాజ్యావతరణ సిద్ధాంతాలు అధ్యయనం చేయబడతాయి. ప్రాచీన కాలపు పోలీసు రాజ్యం మొదలుకొని ఆధునిక కాలపు సంక్షేమరాజ్యం వరకు గల రాజ్య కార్యకలాపాల అధ్యయనం చేస్తుంది. కాబట్టి రాజనీతిశాస్త్రం రాజ్యపు భూత, వర్తమాన, భవిష్యత్ అంశాలను చర్చిస్తుందని పేర్కొనవచ్చు.

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ప్రాచీన రాజ్యాల గురించి రాయండి. [Mar. ’18, ’17, ’16]
జవాబు:
రాజనీతిశాస్త్రం ప్రాచీన గ్రీకునగర రాజ్యాలలో ఆవిర్భవించిందని రాజనీతిశాస్త్రజ్ఞుల అభిప్రాయం. మొదట గ్రీకు నగరాలు అయిన ఏథెన్స్, కోరింత్, మెసిడోనియా, థేబ్స్, స్పార్టా, మిలాన్ నగరాలలో నాగరికత విరాజిల్లినట్లుగా రాజనీతి శాస్త్రజ్ఞులు వివరించారు. ఈ నగర రాజ్యాలు సార్వభౌమాధికారాన్ని, అవి స్వయం సమృద్ధి, స్వయం ఆధారితలను కలిగి ఉండేవి. ప్రొఫెసర్ కాల్టిన్ వీటిని నగర సమాజాలుగా అభివర్ణించారు. ఈ నగర నివాసితులను మూడు రకాలకు చెందినవారిగా పరిగణించారు. వారికి (1) పౌరులు (2) విదేశీయులు (పరులు) (3) బానిసలుగా పేర్కొన్నారు. వీరిలో పౌరులు నగర రాజ్యాల కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనేవారు.

ప్రశ్న 2.
రాజనీతిశాస్త్ర ఏవైనా రెండు సాంప్రదాయక నిర్వచనాలను పేర్కొనండి.
జవాబు:
సాంప్రదాయకమైన నిర్వచనాలను మూడు ఉప వర్గాలుగా వర్గీకరించారు. వాటిని క్రింది విధంగా పేర్కొనవచ్చు.

  1. రాజ్యం గురించి అధ్యయనం చేసేదే రాజనీతిశాస్త్రం (Study of the State): రాజనీతి తత్వవేత్తలైన జె.డబ్ల్యు గార్నర్, గెటిల్; అప్పాదొరై మరియు ఇతరులు రాజనీతిశాస్త్రం రాజ్యాన్ని గురించి అధ్యయనం చేస్తుందని వివరించారు.
  2. ఆర్.జి.గెటిల్: “రాజనీతిశాస్త్రమంటే రాజ్యం గతంలో ఎలా ఉండేదో పరిశోధించి, వర్తమాన కాలంలో ఎలా ఉన్నదో విశ్లేషించి, భవిష్యత్ కాలంలో ఎలా ఉండాలి అనే అంశంపై జరిపే రాజకీయ, నైతిక చర్చల సారాంశం”.
  3. అప్పాదొరై: “రాజ్య మనుగడ, అభివృద్ధికి అవసరమైన పరిస్థితుల గురించి అధ్యయనం చేసే శాస్త్రమే” రాజనీతిశాస్త్రం.

ii) ప్రభుత్వాన్ని గురించి అధ్యయనం చేసేదే రాజనీతిశాస్త్రం (Study of the Government): రాజనీతి ‘తత్వవేత్తలైన స్టీఫెన్ లీకాక్, జాన్ రిచర్డ్ సీలి, ఇతరులు రాజనీతిశాస్త్రం ప్రభుత్వాన్ని గురించి అధ్యయనం చేస్తుందని తెలిపారు.

  1. స్టీఫెన్ లీకాక్: “రాజనీతిశాస్త్రమంటే ప్రభుత్వం గురించి అధ్యయనం చేసే శాస్త్రం”.
  2. జాన్ రిచర్డ్ సీలీ: “ప్రభుత్వ దృగ్విషయాన్ని గురించి పరిశోధన జరిపే శాస్త్రమే రాజనీతిశాస్త్రం”.

ప్రశ్న 3.
ఏవైనా రెండు రాజనీతి శాస్త్ర ఆధునిక నిర్వచనాలను రాయండి.
జవాబు:
ఆధునిక రాజనీతిశాస్త్రజ్ఞులు రాజనీతిశాస్త్ర నిర్వచనాలను రెండు ఉప తరగతులుగా విభజించారు. అవి:
i) రాజనీతిశాస్త్రం – శక్తి అధ్యయనం (Study of Power):
1. లాస్వెల్, కాప్లాన్: “రాజనీతిశాస్త్రం ఒక అనుభవాత్మక శాస్త్రంగా ఉంటూ అధికార రూపకల్పన, అధికారుల భాగస్వామ్యం గురించి అధ్యయనం చేస్తుంది”.
2. విలియం.ఎ.రాబ్సన్: “రాజనీతిశాస్త్రం ప్రధానంగా సమాజంలో అధికారానికి సంబంధించినది”.

ii) రాజనీతిశాస్త్రం – విలువల పంపకాన్ని అధ్యయనం చేస్తుంది (Study of allocation of values): 1. డేవిడ్ ఈస్టన్: “రాజనీతిశాస్త్రం సమాజం కోసం విలువలను (వస్తువులను) అధికారయుతంగా పంపిణీ చేయడానికి సంబంధించి అధ్యయనం చేస్తుంది”.

AP Inter 1st Year Civics Study Material Chapter 1 రాజనీతిశాస్త్రం, పరిధి-ప్రాముఖ్యత

2. హిల్మన్: “రాజనీతిశాస్త్రం ఎవరు, ఎప్పుడు, ఎక్కడ, ఏమి, ఎలా పొందుతారో అధ్యయనం చేసే శాస్త్రం”. .
పైన పేర్కొన్న ఆధునిక నిర్వచనాలు రాజకీయ సంస్థల అధికారాలు, ఇతర కార్యకలాపాలను మూల్యాంకనం చేసే అంశాల అధ్యయనంగా రాజనీతిశాస్త్రాన్ని పరిగణించారని మనం చెప్పవచ్చు.

ప్రశ్న 4.
రాజనీతిశాస్త్రం ఏ విధంగా ఉత్తమ పౌరసత్వ గుణాలను బోధిస్తుంది ?
జవాబు:
మంచి పౌరసత్వ గుణాల బోధన (Teaching the qualities of good citizenship): రాజనీతి శాస్త్ర అధ్యయనం మంచి పౌరసత్వాన్ని పొందేందుకు, జాతీయ సమైక్యతను సాధించేందుకు ఎంతో అవసరం. ఈ శాస్త్ర అధ్యయనం పౌరులకు జాతీయ ఆశయాలు, లక్ష్యాలను గుర్తుచేస్తుంది. మంచి పౌరుడనేవాడు చట్టాలు ఎలా రూపొందించబడి అమలు చేయబడతాయనే విషయాన్ని తప్పకుండా తెలుసుకోవాలి. రాజనీతిశాస్త్రం మంచి పౌరసత్వపు వివిధ దృక్కోణాలను, ప్రయోజనాలను బోధిస్తుంది. పౌరులను ఆదర్శపౌరులుగా తీర్చిదిద్దేందుకు శిక్షణ ఇస్తుంది. విధేయత, సామాజిక సేవ, నిస్వార్థంలాంటి మంచి పౌరసత్వ గుణాలను పెంపొందిస్తుంది. పౌరులు సమాజం, రాజ్యం పట్ల బాధ్యత కలిగి ఉండాల్సిన అవసరాన్ని తెలుపుతుంది. మొత్తం మీద వ్యక్తుల మూర్తిమత్వాన్ని పెంపొందిస్తుంది.

ప్రశ్న 5.
రాజనీతిశాస్త్రం ఒక కళయని ప్రకటించడాన్ని సమర్థించండి.
జవాబు:
రాజనీతి శాస్త్రం ఒక కళా ? (Is Political Science an Art ?): రాజనీతిశాస్త్రాన్ని క్రింది అంశాలను బట్టి ఒక కళగా భావించవచ్చు.

  1. రాజనీతిశాస్త్రం, భౌతికశాస్త్రాలకు భిన్నంగా నిరపేక్షమైన, విశ్వవ్యాప్త చట్టాలను కలిగి ఉండదు.
  2. రాజనీతిశాస్త్రంలో కొన్ని దృగ్విషయాలను సమయం సందర్భాన్ని బట్టి వివిధ రకాలుగా వ్యాఖ్యానించి అధ్యయనం చేయవచ్చు. అందువల్ల ఈ శాస్త్రం వివిధ భావనల వ్యాఖ్యానాలకు సంబంధించి ఏకరూపతను కలిగి ఉండదు.
  3. అన్ని శాస్త్రాలకు ప్రాతిపదికగా పరిగణించే కార్యకారణ సిద్ధాంతాన్ని ఖచ్చితంగా అనుసరించేందుకు ఈ శాస్త్రం అవకాశమివ్వదు.
  4. రాజనీతిశాస్త్రం పరిణామాత్మక స్వభావాన్ని కలిగి ఉండదు. ఎందుకంటే ఈ శాస్త్రంలోని భావనలు క్రమానుగతంగా నిరంతర ప్రాతిపదికపై రూపొందించబడి అభివృద్ధి చెందలేదు.
  5. రాజనీతిశాస్త్రంలో శాస్త్రీయ పద్ధతులైన పరిశీలన, ప్రయోగాత్మకతలు పాటించబడవు.
  6. రాజనీతిశాస్త్రంలోని వివిధ అధ్యయన అంశాల వివరణలలో సంపూర్ణమైన నిష్పాక్షికత, ప్రత్యేకత గోచరించవు.
  7. రాజనీతిశాస్త్రం ఖచ్చితమైన ఫలితాలకు అవకాశమివ్వదు.

ప్రశ్న 6.
ఏ అంశాల ప్రాతిపదికగా రాజనీతిశాస్త్రాన్ని ఒక శాస్త్రంగా పరిగణించవచ్చు ?
జవాబు:
రాజనీతిశాస్త్రం ఒక శాస్త్రమా ? (Is Political Science a Science ?): రాజనీతిశాస్త్రాన్ని క్రింది అంశాల ప్రాతిపదికగా పరిగణించవచ్చు.

  1. రాజనీతిశాస్త్రాన్ని ఒక క్రమ పద్ధతిలో అధ్యయనం చేయవచ్చు.
  2. రాజకీయాలలో ప్రయోగాత్మకతకు అవకాశం ఉంది.
  3. ఇతర సామాజిక శాస్త్రాల వలె నిరపేక్షమైన, విశ్వవ్యాప్తమైన చట్టాలను కలిగి ఉంటుంది.
  4. రాజకీయాలలో అంచనాలను సులభంగా వర్తింపచేయవచ్చు.
  5. రాజనీతిశాస్త్ర అధ్యయనంలో నిర్దిష్టమైన సార్వత్రిక ఆమోదిత సూత్రాలను పొందుపరచవచ్చు.
  6. రాజనీతిశాస్త్రం శాస్త్రీయ స్వభావాన్ని కలిగి ఉంటుంది. అందువల్ల ఈ శాస్త్ర అధ్యయనంలో శాస్త్రీయమైన సూత్రాలను పొందుపరచటం జరిగింది.
  7. రాజనీతిశాస్త్రం ఇతర శాస్త్రాల వలె కార్యకారణ సంబంధాన్ని అమలు చేసేందుకు అవకాశమిస్తుంది.

AP Inter 1st Year Civics Study Material Chapter 1 రాజనీతిశాస్త్రం, పరిధి-ప్రాముఖ్యత

ప్రశ్న 7.
రాజనీతిశాస్త్ర పరిధిలో ఏవైనా నాలుగు విషయాలను తెలపండి.
జవాబు:

  1. రాజ్య అధ్యయనం
  2. ప్రభుత్వ అధ్యయనం
  3. సంఘాలు, సంస్థల అధ్యయనం
  4. హక్కులు, బాధ్యతల అధ్యయనం

ప్రశ్న 8.
రాజనీతిశాస్త్రం ఏ విధంగా ప్రభుత్వ అధ్యయనశాస్త్రంగా పరిగణించబడింది ?
జవాబు:
స్టీఫెన్ లీకాక్, జె.ఆర్.సీలి లాంటి ప్రముఖ రాజనీతిశాస్త్రవేత్తలు రాజనీతిశాస్త్రం ప్రభుత్వం గురించి అధ్యయనం చేసేదని పేర్కొన్నారు. ప్రభుత్వమనేది రాజ్యపు ప్రతినిధి అని, ప్రభుత్వం లేకుండా రాజ్యం ఉండదని వారు భావించారు. ప్రభుత్వం ద్వారానే రాజ్య ఆశయాలు నెరవేరుతాయి. రాజ్య అభీష్టాన్ని ప్రభుత్వం రూపొందించి, వ్యక్తీకరించి అమలులో ఉంచుతుంది.

AP Inter 2nd Year Civics Study Material Chapter 13 ఆంధ్రప్రదేశ్, ఇండియాలలో ఇటీవలి పరిణామాలు

Andhra Pradesh BIEAP AP Inter 2nd Year Civics Study Material 13th Lesson ఆంధ్రప్రదేశ్, ఇండియాలలో ఇటీవలి పరిణామాలు Textbook Questions and Answers.

AP Inter 2nd Year Civics Study Material 13th Lesson ఆంధ్రప్రదేశ్, ఇండియాలలో ఇటీవలి పరిణామాలు

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆవిర్భావాన్ని వర్ణించండి.
జవాబు:
ఆంధ్రులంతా ఒక్క రాష్ట్రంగా ఏర్పడాలన్న భావన కొత్తదేమీ కాదు. 1938లో ఉస్మానియా విశ్వవిద్యాలయ స్నాతకోపన్యాసానికి ఆహ్వానితుడై వచ్చిన సర్ కట్టమంచి రామలింగారెడ్డి గారు తెలుగు మాట్లాడే ప్రజలంతా ఒక్క రాష్ట్రంలో మనుగడ సాగించే పరిస్థితులేర్పడితే బాగుంటుందని ప్రస్తావించారు. ఆ తరువాత ఆచార్య మామిడిపూడి వెంకటరంగయ్య గారు ఒక రచనలో మద్రాసు ఆంధ్రులూ, నిజాం ఆంధ్రులూ ఒక్కటై బాధ్యతాయుత పాలన ఏర్పరిస్తే బాగుంటుందని అభిప్రాయపడినారు.

1) కమ్యూనిస్టు పార్టీ పాత్ర: ఈ భావాలకు వ్యక్తరూపాన్నిచ్చిన ఘనత ఆంధ్ర కమ్యూనిస్టులది. 1946లోనే విశాలాంధ్ర వాదాన్ని పైకి తెచ్చింది ఆంధ్ర కమ్యూనిస్టు పార్టీయే. 1952లో జరిగిన సాధారణ ఎన్నికల్లో అటు ఆంధ్రలోనూ, ఇటు తెలంగాణలోనూ కమ్యూనిస్టులు ఘనవిజయం సాధించారు. వారి ఎన్నికల నినాదంలో విశాలాంధ్ర కూడా ఒక. అంశం వారు ప్రత్యేకంగా “విశాలాంధ్ర” పత్రికను నడిపి ప్రజల్లో ముమ్మరమైన ప్రచారం కూడా చేశారు. 1953లో అక్టోబర్ మొదటి తేదీనాడు ఆంధ్ర రాష్ట్ర అవతరణ జరగటంతో ఇటు ఆంధ్ర ప్రాంతంలోనూ, అటు తెలంగాణా ప్రాంతంలోనూ విశాలాంధ్ర స్థాపన దిశగా రాజకీయాలు నడిచాయి.

2) ప్రధమ విశాలాంధ్ర మహాసభ: 1949 నవంబరు, 26న శ్రీ అయ్యదేవర కాళేశ్వరరావు నాయకత్వంలో విజయవాడలో విశాలాంధ్ర మహాసభ జరిగెను.

3) రెండవ విశాలాంధ్ర మహాసభ: 1954 జూన్ 13, 14 తేదీలలో శ్రీశ్రీ అధ్యక్షతన రెండవ విశాలాంధ్ర మహాసభ హైదరాబాద్లో జరిగెను.

4) ఫజల్ అలీ కమీషన్: ప్రత్యేకాంధ్ర రాష్ట్రం ఏర్పాటు కావడంతో కేరళులు, కర్ణాటకులు ప్రత్యేక రాష్ట్రాలు కావాలని అందోళన చేయసాగారు. వారి జతకు మహారాష్ట్రులు కూడా కలిశారు. దక్షిణ భారతంలో కాంగ్రెస్ పార్టీ నిలబడాలంటే భాషా ప్రాతిపదికన రాష్ట్రాల నిర్మాణం అనివార్యమని ప్రధానమంత్రి నెహ్రూకు ఎన్.వి. గాద్గిల్ సలహా ఇచ్చారు. ఈ నేపధ్యంలో 22 డిసెంబర్ 1953 నాడు ఫజల్ ఆలీ నేతృత్వంలో రాష్ట్రాల పునర్నిర్మాణ సంఘాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ కమీషన్లో ఇతర సభ్యులు పండిట్ హృదయనాధ కుంజూ, సర్దార్ కె.ఎం.ఫణిక్కర్, కమిటీ తన నివేదికను 30 సెప్టెంబర్ 1955 నాడు కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది.

AP Inter 2nd Year Civics Study Material Chapter 13 ఆంధ్రప్రదేశ్, ఇండియాలలో ఇటీవలి పరిణామాలు

ఈ నివేదికలో విశాలాంధ్రను ఏర్పాటు చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను, ఆ విధంగానే ప్రత్యేక తెలంగాణా ఏర్పాటుకు అనుకూల వాదాలను కూడా కూలంకుషంగా పరిశీలించింది. సదరు అనుకూల ప్రతికూల వాదాలను ప్రస్తావించి పూర్వం ఆంధ్ర, రాయలసీమ నాయకుల మధ్య శ్రీ భాగ్ ఒప్పందం లాంటిది కుదుర్చుకొని, తెలంగాణ ప్రాంతం అభివృద్ధికి గానీ, ఉద్యోగావకాశాలకు హాని కలిగించని రీతిలో తగిన పరిరక్షణలను కల్పించి విశాలాంధ్రను ఏర్పాటు చేసుకోవచ్చని కమీషన్ సూచించింది. అలాగే ఆంధ్రరాష్ట్రంతో ఏకం కావడానికి 1952లో ఎన్నికైన తెలంగాణా రాష్ట్ర శాసన సభ్యులు 2/3 మెజారిటీతో ఆ మేరకు తీర్మానాన్ని ఆమోదిస్తే విశాలాంధ్రను ఏర్పాటు చేసుకోవచ్చు.

5) పెద్ద మనుషుల ఒప్పందం: ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు మూలంగా తెలంగాణా ప్రయోజనాలకు భంగం కలుగుతుందేమోననే అనుమాలను నివారించడానికి పెద్ద మనుషుల ఒప్పందం 1956 ఫిబ్రవరి 20న ఢిల్లీలో జరిగింది.

ఆంధ్రరాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ బెజవాడ గోపాలరెడ్డి, అతని మంత్రి మండలి సహచరులు సర్వ శ్రీ నీలం సంజీవరెడ్డి, గౌతు లచ్చన్న, ఎ.పి.సి.సి. అధ్యక్షుడు అలూరి సత్యనారాయణ రాజు సమావేశానికి హాజరైనవారు.

హైదరాబాదు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ బూర్గుల రామకృష్ణారావు, అతని మంత్రి మండలి సహచరులు. సర్వ శ్రీ కొండా వెంకటరంగారెడ్డి, డా॥ మర్రి చెన్నారెడ్డి, హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు జె.వి నర్సింగరావు వీరు ఒప్పందంపై సంతకాలు చేశారు.

ఒప్పందంలోని అంశాలు:
1) రాష్ట్రానికి సంబంధించిన కేంద్ర, సాధారణ పరిపాలన వ్యయం ఆంధ్ర తెలంగాణా నిష్పత్తి ప్రకారం భరించాలి. తెలంగాణాలో మిగులు, ఆ ప్రాంతపు అభివృద్ధికి కేటాయించాలి. అయిదేళ్ల దాకా ఈ ఏర్పాటు ఉండాలి. అటు తరువాత, తెలంగాణా శాసన సభ్యుల కోరికపై మరో అయిదేళ్లు పొడిగించవచ్చు.

2) తెలంగాణలో ఉన్న విద్యా సౌకర్యాలు తెలంగాణా వారికే లభింపజేసి ఇంకా అభివృద్ధి చేయాలి. లేకపోతే మొత్తం రాష్ట్రంలో సాంకేతిక విద్యతో సహా అన్ని విద్యాలయాల్లోను మూడోవంతు తెలంగాణా విద్యార్థులకు కేటాయించాలి.

3) ముందు రాబోయే ఉద్యోగాలు ఉభయ ప్రాంతాల జనాభా ప్రాతిపదిక మీద ఉండాలి.

4) తెలంగాణలో నిష్పత్తి ప్రకారం నిర్ణయించిన ఉద్యోగాల్లో ప్రవేశించడానికి అభ్యర్థులు ఆ ప్రాంతంలో 12 సంవత్సరాల నివాసం ఉండాలి.

5) తెలంగాణా సర్వతోముఖాభివృద్ధి సాధించడానికి ఒక ప్రాంతీయ మండలి ఉండాలి.

6) మంత్రివర్గంలో ఆంధ్ర ప్రాంతం నుంచి 60% తెలంగాణా ప్రాంతం నుంచి 40% ఉండాలి. తెలంగాణా భాగంలో ఒక ముస్లిం కూడా ఉండాలి.

7) ముఖ్యమంత్రి ఆంధ్ర ప్రాంతం వాడైతే ఉపముఖ్యమంత్రి తెలంగాణా వ్యక్తి అయి ఉండాలి. ముఖ్యమంత్రి తెలంగాణా ప్రాంతం వాడైతే ఉపముఖ్యమంత్రి ఆంధ్ర ప్రాంతంవాడై ఉండాలి. హోం, ఫైనాన్స్, రెవెన్యూ, ప్లానింగ్, డెవలప్మెంట్, వాణిజ్య పరిశ్రమల శాఖల్లో కనీసం రెండైనా తెలంగాణా వారికివ్వాలి.

పెద్ద మనుషుల ఒప్పందం కుదరడంతో విశాలాంధ్ర ఏర్పాటు సుగమమైంది. 1956 మార్చి 16వ తేదీన పార్లమెంటు ఉభయసభల్లో రాష్ట్రాల పునర్నిర్మాణ బిల్లును ప్రతిపాదించడమైంది.

  • 1956 ఏప్రిల్ 5న ఆంధ్ర శాసనసభలో సదరు బిల్లుపై తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. శాసనసభ కొన్ని సవరణలతో తీర్మానాన్ని ఆమోదించింది.
    1. రాష్ట్రం పేరు ఆంధ్రప్రదేశ్ అని వుండాలి.
    2. రాజధాని మరియు హైకోర్టు హైదరాబాద్లో నే వుండాలి.
    3. ఆంధ్రప్రదేశ్ అంతటికీ 1962లోనే సాధారణ ఎన్నికలు జరగాలి.
    4. 72 మంది సభ్యులతో కూడిన విధాన పరిషత్ ఏర్పాటుకావాలి.
  • 1956 ఏప్రిల్ 13న హైదరాబాదు రాష్ట్ర శాసనసభ రాష్ట్రాల పునర్నిర్మాణ బిల్లును ఆమోదించింది.
  • 1956 ఆగష్టు 25న రాజ్యసభ బిల్లును ఆమోదించింది. అటు తరువాత లోక్సభ కూడా ఆమోదించింది. + 1956 ఆగష్టు 31న బిల్లుపై రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు.
  • 1956 నవంబర్ 1న అక్షర క్రమంలో మొదటిది భాషా రాష్ట్రాల్లో కూడా మొదటిదై ఆంధ్రప్రదేశ్ దీపావళి పర్వదినాన అవతరించింది. నాటి గవర్నర్ సి.ఎం. త్రివేది, ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డిలు వ్యవహరించారు.

ప్రశ్న 2.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు దారి తీసిన కారణాలను పరిశీలించండి.
జవాబు:
2000 సంవత్సరంలో చత్తీస్ ఘడ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ఏర్పాటుతో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం మళ్ళీ తెరపైకి వచ్చింది. ఈ సారి తెలంగాణ రాష్ట్ర సమితి (Telangana Rastra Samithi – T.R.S) ఆధ్వర్యంలో రాజకీయ ఉద్యమం కొనసాగింది. ఆంధ్రప్రదేశ్ అనేది భారతదేశంలో మొట్టమొదటి భాషాప్రయుక్త రాష్ట్రమనే విషయాన్ని మనం ఈ సందర్భంలో గుర్తుంచుకోవాలి. ఐతే ఆంధ్రప్రదేశ్ ఏర్పడి 57 సంవత్సరాలు పూర్తి అయినప్పటికీ ఒకే భాష (తెలుగు) రాష్ట్ర ప్రజలందరినీ కలిపి ఉంచడంలో విఫలమైందని చెప్పవచ్చు.

తెలంగాణ ఉద్యమానికి ఒక్క ఆర్థికంగా వెనుకబాటుతనమే ప్రధాన ఇతివృత్తం కాదు. దాంతోబాటుగా నీటి వనరులు, ఆర్థిక వనరుల పంపిణీ, ఉపాధి అవకాశాలు, సాంస్కృతిక వికాసం మొదలైన అనేక అంశాలలో తెలంగాణ ప్రాంతం వివక్షకు గురి అయిందని ఆ ప్రాంత నాయకులు భావించడం జరిగింది. అయితే అటువంటి అంశాలు వాదోపవాదనలతో కూడినవిగా కొందరు పేర్కొన్నారు. అయితే ఒకసారి ప్రజానీకంలో కొన్ని వర్గాలలో అసౌకర్యం, అనుమానం ఏర్పడి అధికమైతే ఇతర ప్రాంతాల ప్రజలతో కలిసిమెలిసి జీవనం సాగించడం సాధ్యం కాదని చెప్పవచ్చు.

2009 డిసెంబర్లో తెలంగాణ ఉద్యమం తీవ్రం అయిన సమయంలో దేశీయ వ్యవహారాల శాఖమంత్రి చిదంబరం తెలంగాణ విషయంలో కేంద్రం ఎంతో శ్రద్ధను ప్రదర్శిస్తున్నట్లుగా ప్రకటించాడు. అందులో భాగంగా 2010 ఫిబ్రవరి మూడో తేదీన భారత ప్రభుత్వం న్యాయమూర్తి బి.ఎన్.శ్రీకృష్ణ ఆధ్వర్యంలో ఒక సంఘాన్ని నియమించి తెలంగాణ విషయంలోనూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ రాజకీయ పరిస్థితిని అధ్యయనం చేయాల్సిందిగా కోరింది. ఆ సంఘం రెండు ప్రధాన అంశాలను విస్తృతంగా పరిశీలించింది. అవి 1) తెలంగాణ ప్రాంతానికి ప్రత్యేక రాష్ట్ర హోదా కావాలని డిమాండ్ చేయడం. 2) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని యథావిధంగా కొనసాగించడం. శ్రీకృష్ణ సంఘం తన నివేదికను 2010 డిసెంబరు 30వ తేదీన దేశీయ వ్యవహారాల శాఖకు సమర్పించింది.

తెలంగాణ నాయకులు శ్రీకృష్ణ సంఘం నివేదికను తిరస్కరించారు. హైదరాబాద్ రాజధానిగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రాంతంలో సమ్మెలు, నిరాహార దీక్షలు, ఆత్మహత్యలు విజ్ఞప్తులను అందించడం, ప్రభుత్వ అధికారులకు గులాబీపూల బహుకరణ, ప్రభుత్వ ఉత్సవాల బహిష్కరణ వంటి చర్యలకు ఆందోళనకారులు పాల్పడ్డారు. దాంతో పరిస్థితి తీవ్రతను గమనించి భారత ప్రభుత్వం 2013 జూలై 30వ తేదీన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ప్రకటించింది. తదుపరి 2014 ఫిబ్రవరిలో పార్లమెంటు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ |బిల్లును తీవ్ర గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో ఆమోదించింది. దాంతో సీమాంధ్ర ప్రాంతం అట్టుడిగిపోయింది. పార్లమెంటు ఆమోదించిన పై బిల్లు రాష్ట్రపతి 2014 మార్చి ఒకటో తేదీన సంతకం చేశారు. తెలంగాణ భారతదేశంలో 29వ రాష్ట్రంగా 2014 జూన్ రెండో తేదీన ఆవిర్భవించింది.

AP Inter 2nd Year Civics Study Material Chapter 13 ఆంధ్రప్రదేశ్, ఇండియాలలో ఇటీవలి పరిణామాలు

ప్రశ్న 3.
మానవ హక్కులంటే ఏమిటో నిర్వచించి, భారతదేశంలో జాతీయ మానవ హక్కుల సంఘం నిర్మాణాన్ని వర్ణించండి.
జవాబు:
మానవ హక్కుల నిర్వచనం: మానవ హక్కుల పరిరక్షణ చట్టం, 1993, రెండో సెక్షన్ (d) మానవ హక్కులను క్రింది విధంగా నిర్వచించింది.

“మానవ హక్కులు అనేవి వ్యక్తి జీవనం, స్వేచ్ఛ, సమానత్వం, హోదాలకు సంబంధించినవి. రాజ్యాంగం చేత హామీ ఇవ్వబడిన అంతర్జాతీయ చట్టాలు, భారతదేశ న్యాయస్థానాల చర్యల ద్వారా అమలవుతాయి.”

జాతీయ మానవ హక్కుల సంఘం నిర్మాణం: జాతీయ మానవ హక్కుల సంఘం అనేది బహుళసభ్య సంస్థ. ఆ సంస్థ నియమావళి సభ్యుల అర్హతలు, నియామకం గురించి పేర్కొన్నది. ఆ సంస్థకు సంబంధించిన సెక్షన్ 3 ప్రకారం క్రింది పట్టికలో సూచించిన సభ్యులు ఉంటారు.
AP Inter 2nd Year Civics Study Material Chapter 13 ఆంధ్రప్రదేశ్, ఇండియాలలో ఇటీవలి పరిణామాలు 1

దీనిలో నలుగురు సభ్యులు ఉంటారు. దీనికి సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి అధ్యక్షత వహిస్తాడు. దీనిలో సభ్యులుగా సుప్రీం కోర్టు ప్రస్తుత లేదా మాజీ న్యాయమూర్తి, హైకోర్టు ప్రస్తుత న్యాయమూర్తి లేదా మాజీ ప్రధాన న్యాయమూర్తితో పాటుగా మానవ హక్కుల కార్యకలాపాలకు సంబంధించిన ఇద్దరు వ్యక్తులు సభ్యులుగా ఉంటారు. ఈ కమీషన్ ఛైర్మన్, సభ్యులను భారత రాష్ట్రపతి నియమిస్తారు. ఈ విషయంలో అతడు కేంద్ర హోంమంత్రి, లోక్సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్, పార్లమెంటు ఉభయసభలలోని ప్రతిపక్ష నేతలను సంప్రదిస్తారు. ఛైర్మన్, సభ్యులు ఐదేళ్ళ పాటు లేదా 70 ఏళ్ళు నిండేవరకు వారి పదవులలో కొనసాగుతారు. ఈ కమీషన్లో జాతీయ షెడ్యూల్డ్ కులాల, షెడ్యూల్డ్ తెగల, మైనారిటీల, మహిళల కమీషన్లకు సంబంధించిన ఛైర్మన్లు పదవిరీత్యా సభ్యులుగా ఉంటారు. ఈ కమీషన్ సాధారణ కార్యదర్శిగా కేంద్ర ప్రభుత్వంలో సెక్రటరీ జనరల్ హోదా గల అధికారి వ్యవహరిస్తాడు.

విధులు: జాతీయ మానవ హక్కుల కమీషన్ కింద పేర్కొన్న ముఖ్య విధులను నిర్వహిస్తోంది.

  1. ప్రభుత్వాధికారులు మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడినట్లు ఆరోపణలు వస్తే, వాటిపై జాతీయ మానవ హక్కుల కమీషన్ విచారణ జరిపిస్తుంది.
  2. న్యాయస్థానాలు అనుమతించినమేరకు మానవ హక్కుల ఉల్లంఘన ఉదంతాలపై విచారణ జరుపుతుంది.
  3. మానవ హక్కుల అమలుకు సంబంధించిన వివిధ చట్టబద్ధమైన చర్యలను సమీక్షిస్తుంది.
  4. మానవ హక్కులకు భంగం కలిగించే టెర్రరిస్టుల కార్యకలాపాలను నివారించేందుకై సలహాలు ఇస్తుంది.
  5. మానవ హక్కులకు సంబంధించిన విషయాలపై పరిశోధనలను కొనసాగిస్తుంది.
  6. మానవ హక్కుల పట్ల ప్రజలలో అవగాహనను పెంపొందించేందుకై తగిన చర్యలను తీసుకొంటుంది.
  7. మానవ హక్కులను పరిరక్షించే స్వచ్ఛంద సంస్థలకు తగిన ప్రోత్సాహకాలను అందిస్తుంది.

ప్రశ్న 4.
సమాచార హక్కు చట్టం గురించి వివరించండి.
జవాబు:
సమాచార హక్కు చట్టం 2005 పార్లమెంటు ద్వారా ఆమోదించబడి అమలులోకి వచ్చింది. ఈ చట్టం ద్వారా ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఏ సంస్థ నుండి అయినా సమాచారాన్ని కోరే హక్కు ప్రతి భారతీయుడికి కల్పించింది. ఈ చట్టం జమ్మూకాశ్మీర్ రాష్ట్రం మినహా యావత్ భారతదేశానికి వర్తిస్తుంది.

ఈ చట్టం ద్వారా పౌరులు ప్రభుత్వ డాక్యుమెంటులు, ఉత్తర్వులు, నివేదికలు, మెమోలు మొదలగు వాటికి సంబంధించిన సమాచారాన్ని పొందవచ్చు.

సమాచారం పొందగోరే వారు సంబంధిత సమాచార అధికారికి లిఖిత పూర్వకంగా ఆర్జీ పెట్టుకొని 10 రుసుము చెల్లించవలెను. దారిద్ర్య రేఖకు దిగువున ఉన్నవారు ఎట్టి రుసుము చెల్లించనవసరము లేదు. 30 రోజుల లోపు సమాధానము ఇవ్వాలి.

ప్రభుత్వ సమాచార అధికారులు: ప్రతి పాలనా విభాగంలో ఒక ప్రభుత్వ సమాచార అధికారిని ప్రభుత్వం నియమిస్తుంది. ఈ అధికారి పౌరులడిగిన సమాచారాన్ని అందించాలి. సాధారణ సమాచారం అయితే ముప్పది రోజుల లోపల సమాధానం ఇవ్వాలి. అదే వ్యక్తి ప్రాణానికి, స్వేచ్ఛకు సంబంధించిన సమాచారం అయితే 48 గంటల లోపు సమాధానం ఇవ్వాలి. సమాచారాన్ని తిరస్కరిస్తే దానికి తగు కారణాలను పేర్కొనాలి.

సమాచార హక్కు చట్టం మినహాయింపులు: దేశ సమగ్రతకు, సార్వభౌమాధికారానికి సంబంధించిన అంశాలు (రక్షణ, అణుశాస్త్రీయ) సమాచార హక్కు చట్టం నుండి మినహాయింపబడినాయి. కేంద్ర, రాష్ట్రమంత్రి వర్గాల నిర్ణయాలు పార్లమెంటు, రాష్ట్ర శాసనసభల హక్కులకు భంగం కల్గించే అంశాలు కూడా మినహాయింపబడినాయి.
ఇదిగాక పెక్కు సంస్థలు చట్ట పరిధి నుండి మినహాయించబడ్డాయి. అవి ఏమనగా: IBR మరియు AW, Direc- torate of Revenue Intelligence, Aviation Research Centre, BSF, CRPF, Assam Riffles, Special Branch CID, మున్నగునవి. కాని ఈ సంస్థలు అవినీతి చర్యలకు పాల్పడ్డా, మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డా సమాచారం కోరే హక్కు ఉంది.

సమాచార కమీషన్లు: సంబంధిత సమాచార అధికార ఫిర్యాదుదారునికి సరియైన సమాచారాన్ని సకాలంలో ఇవ్వకపోయినా, ఎక్కువ రుసుము వసూలు చేసినా, మరే విధంగానైనా ఇబ్బంది కల్గచేసినా అప్పీలు చేసుకోవటానికి సమాచార హక్కు చట్టం కేంద్ర స్థాయిలో కేంద్ర సమాచార కమీషను, రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర సమాచార కమీషన్ న్ను ఏర్పాటు చేసింది.

కేంద్ర సమాచార కమీషన్: ఈ కమీషన్లో ఒక ముఖ్య సమాచార కమీషనర్, 10 మందికి మించని సమాచార కమీషనర్లు ఉంటారు. వీరిని రాష్ట్రపతి నియమిస్తాడు. వీరి పదవీకాలం 5 సం॥లు లేక 65 సం॥ వయోపరిమితి. రాష్ట్ర సమాచార కమీషన్: ఈ కమీషన్లో ఒక ముఖ్య సమాచార కమీషనర్ పది మంది మించని సమాచార కమీషనర్లు ఉంటారు. వీరిని గవర్నరు నియమిస్తారు. వీరి పదవీకాలం 5 సం॥లు లేక 68 సం॥లు వయోపరిమితి. కేంద్ర, రాష్ట్ర సమాచార కమీషన్ల నిర్ణయమేతుది తీర్పు, ఈ తీర్పులపై ఎవ్వరికి అప్పీలు చేసుకొనే అధికారం లేదు. కాని రాజ్యాంగం ద్వారా అధికారాలు కల్గిన హైకోర్టు ఈ కమీషన్ల తీర్పులపై రిట్ల ద్వారా ఫిర్యాదుదారునికి మేలు చేకూర్చవచ్చు.

AP Inter 2nd Year Civics Study Material Chapter 13 ఆంధ్రప్రదేశ్, ఇండియాలలో ఇటీవలి పరిణామాలు

కేంద్ర సమాచార కమీషన్ మరియు రాష్ట్ర సమాచార కమీషన్ ఇచ్చే తీర్పులు సాధారణ న్యాయస్థానాలతో సమానమైనవి.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ఆంధ్రరాష్ట్ర అవతరణ గురించి వర్ణించండి. [Mar. ’16]
జవాబు:
ప్రత్యేకాంధ్ర రాష్ట్ర వాంఛ: ఒకవైపు వందేమాతరం స్వదేశీ ఉద్యమం, దేశవ్యాప్తంగా పుంజుకొంటూ ఉండగా మచిలీపట్నంలో భోగరాజు పట్టాభి సీతారామయ్య పంతులుగారు, ముట్నూరి కృష్ణారావు పంతులుగారు, కొండా వెంకటప్పయ్య పంతులుగారు, టంగుటూరి ప్రకాశం పంతులుగారు సమావేశమై ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణా
ప్రాంతాలను ఏకం చేసి సంయుక్త ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటును గురించి ఆలోచించసాగారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో 58% తెలుగు ప్రాంతాలుండి 40% తెలుగు జనాభా ఉండి కూడా తెలుగు వారు వెనుకబడి ఉండడం వారిని రోషపూరితుల్ని చేసేది. ఆ తరువాత, 1912లో నిడదవోలులో గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల సంయుక్త సమావేశం ఒకటి జరిగింది. ఆ సమావేశానికి కీ.శే. వేమనరపు రామదాసు పంతులుగారు అధ్యక్షత వహించారు.

1. ప్రధమాంద్ర మహాసభ, బాపట్ల 1913: ఆంధ్రరాష్ట్ర నిర్మాణ సమస్యపై ప్రధమాంధ్ర మహాసభ 1913లో గుంటూరు జిల్లా, బాపట్లలో శ్రీ బి.ఎన్. శర్మగారి అధ్యక్షతన జరిగింది. ఆ మహాసభకు మొత్తం 800 మంది ప్రతినిధులు, 2000 మంది ప్రేక్షకులు హాజరయ్యారు.

2. ద్వితీయాంధ్ర మహాసభ, విజయవాడ 1914: రెండో ఆంధ్ర మహాసభ 1914లో విజయవాడలో ఏప్రిల్ 11న జరిగింది. ఈ సభకు న్యాపతి సుబ్బారావుగారు అధ్యక్షత వహించారు. ఈ సభకు విజయవాడకు చెందిన శ్రీ అయ్యదేవర కాళేశ్వరరావు గారు నిర్వహకులుగా వ్యవహరించారు. సుమారు 1600 మంది ప్రతినిధులు ఈ సభకు హజరయ్యారు.

3. తృతీయాంధ్ర మహాసభ, విశాఖపట్నం 1915: మూడో ఆంధ్ర మహాసభ విశాఖపట్నంలో 1915 మే నెలలో జరిగింది. ఈ సభకు పానగల్లు రాజారామారాయణింగారు అధ్యక్షత వహించారు. ఈ సభ రెండు తీర్మానాలు చేసింది.

  1. ప్రత్యేకాంధ్ర రాష్ట్రం అత్యవసరం.
  2. సెకండరీ స్కూలు స్థాయిలో మాతృభాషలోనే బోధన జరగాలి.

1920లో నాగపూర్లో జరిగిన కాంగ్రెస్ మహాసభ భాషా రాష్ట్రాల సిద్ధాంతాన్ని అంగీకరిస్తున్నట్లు అధికారికంగా ఒక ప్రకటన చేసింది. దానికి నాందిగా మొత్తం 21 భాషలను గుర్తించి, ఆ ప్రాతిపదికనే ప్రత్యేక ప్రదేశ్ కాంగ్రెస్లను ఏర్పాటుచేసింది.

మాంటేగ్ – ఛెమ్స్ఫర్డ్ నివేదిక ఆధారంగా భారత కౌన్సిల్ చట్టం 1919ని బ్రిటిష్ పార్లమెంటు ఆమోదించింది. చట్టంలోని 52 (ఎ) ప్రకరణం రాష్ట్ర శాసనసభల్లో అత్యధిక సంఖ్యాకులు ప్రత్యేక రాష్ట్ర నిర్మాణాన్ని అంగీకరిస్తూ తీర్మానించినట్లయితే ప్రభుత్వం అందుకు సమ్మతించవచ్చు అని పేర్కొన్నది.

ఆ రోజుల్లో ఆంధ్రులకు ముఖ్యంగా బ్రహ్మణేతర విద్యార్థులకు మద్రాసు విశ్వవిద్యాలయంలో ప్రవేశం దొరకడం చాలా కష్టంగా వుండేది. ఆనాటి విద్యామంత్రి అనెం పరశురామ పాత్రో కృషి ఫలితంగా 1926లో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఏర్పాటైంది.

1932లో మద్రాసులో శ్రీ కడప కోటిరెడ్డి గారు అధ్యక్షతన ప్రత్యేకాంధ్ర మహసభ జరిగింది. ఈ సభకు శ్రీ కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుగారితో పాటు ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు చెందిన ముఖ్య నాయకులు హాజరైనారు.

ప్రశ్న 4.
శ్రీ భాగ్ ఒప్పందం 1937 నవంబర్: 14, నవంబర్ 1937 నాడు మద్రాసులో శ్రీ కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుగారి స్వగృహమైన “శ్రీ భాగ్”లో ఆంధ్ర, రాయలసీమ నాయకుల సమావేశం జరిగింది. ఆంధ్ర ప్రాంతం నుంచి శ్రీయుతులు డా॥ భోగరాజు పట్టాభి సీతారామయ్య, కొండా వెంకటప్పయ్య, మహబూబ్ ఆలీబేగ్, దేశిరాజు
హనుమంతరావు, ముళ్ళపూడి పళ్లం రాజు, కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుగారు, రాయలసీమ నుంచి శ్రీయుతులు కడప కోటిరెడ్డి, సీతారామిరెడ్డి, దేశపాండ్యా సుబ్బరామిరెడ్డి, టి.ఎన్. రామకృష్ణా రెడ్డి, పప్పురి రామాచారి, వరదాచారి పాల్గొన్నారు.

1938 మార్చి, 30న ప్రత్యేకాంధ్ర రాష్ట్రాన్ని స్థాపించాలని కోరుతూ దేశభక్త కొండా వెంకటప్పయ్యగారు మద్రాసు శాసనసభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దాన్ని కడప కోటిరెడ్డిగారు బలపరిచారు. తీర్మానాన్ని బలపరుస్తూ ముఖ్యమంత్రి రాజగోపాలాచారి గంభీరోపన్యాసం చేశారు. తీర్మానం ఏకగ్రీవామోదం పొందింది.
1938లో ఆంధ్ర మహాసభ డా॥, సర్వేపల్లి రాధాకృష్ణన్ అధ్యక్షతన జరిగింది. ఆ సభలో రాజధాని గురించి చర్చించారు.

5. జె.వి.పి. నివేదిక: జైపూర్, కాంగ్రెస్ సభల్లో సభ్యులు సమస్యను పునఃపరిశీలించాలని అభిప్రాయపడ్డారు. దాన్ని పురస్కరించుకొని పార్టీ ఒక ఉపసంఘాన్ని నియమించింది. అందులో జవహర్లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్, పట్టాభిసీతారామయ్య గారు సభ్యులు ముద్దుగా మూడక్షరాల మాటగా దీన్ని జె.వి.పి. కమిటీ అని పిలిచారు. ఈ కమిటీ ||ఏప్రిల్ 1949లో తన నివేదికను ప్రకటించింది. చిరకాలంగా ఆంధ్రుల్లో నెలకొని వున్న అలజడి దృష్ట్యా ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయవచ్చు. అందుకోసం ఆంధ్రులు మద్రాసు నగరం కోరికను వదులుకోవాలని పేర్కొంది.

6. స్వామి సీతారం ఉపవాస దీక్ష: ఆంధ్ర రాష్ట్ర సిద్ధిని శుభం చేయాలనే సంకల్పంతో 15 ఆగష్టు 1952 నాడు శ్రీ స్వామి సీతారాం (శ్రీ గొల్లపూడి సీతారామశాస్త్రి గారు) ఆమరణ నిరాహార దీక్షను ప్రారంభించారు. ఈయన ఉపవాస దీక్ష గుంటూరు పట్టణంలో టౌన్ హాలులో జరిగింది. మొత్తం 36 రోజులు ఉపవాస దీక్ష సాగింది.

AP Inter 2nd Year Civics Study Material Chapter 13 ఆంధ్రప్రదేశ్, ఇండియాలలో ఇటీవలి పరిణామాలు

7. పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్ష: ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం 19 అక్టోబరు, 1952 నాడు పొట్టి శ్రీరాములు గారు మహర్షి బులుసు సాంబమూర్తి గారి ఇంట్లో దీక్ష ప్రారంభించారు. ఆ ఇంటికి “యజ్ఞశాల” అని నామకరణం చేశారు.

ఈ వాతావరణంలో డిశంబర్ 9, 1952 నాడు పార్లమెంటులో మద్రాసును వదులుకొని ఆంధ్ర రాష్ట్రానికి అంగీకరిస్తే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకాంధ్ర రాష్ట్రం ఏర్పాటును పరిశీలించగలదని ఒక ప్రకటన చేయడమైనది. ఈ ప్రకటన వెలువడే నాటికి శ్రీరాములు దీక్ష మొదలు పెట్టి 52 రోజులైంది. ఆ తరువాత 15 డిశంబరు, 1952 రాత్రి 11 గం॥ 39 ని॥లకు పొట్టి శ్రీరాములు అమరజీవి పొట్టి శ్రీరాములయ్యారు.

8. వాంఛూ కమిటీ 1953: 1953 జనవరిలో ప్రత్యేకాంధ్ర రాష్ట్ర నిర్మాణ విషయాలను పరిశీలించడానికి కేంద్ర ప్రభుత్వం రాజస్థాన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కె.ఎన్.వాంఛను నియమించింది. వాంఛూ నివేదిక అందటంతోనే ప్రధానమంత్రి నెహ్రూ ఒక ప్రకటన చేస్తూ, ఆంధ్ర రాష్ట్రం అక్టోబరు 1, 1953 నాడే ఏర్పాటవుతుందని, కాబట్టి రాజధాని నగరం ఆంధ్ర ప్రాంతంలో ఎక్కడ వుండాలో తేల్చుకోవాల్సిన బాధ్యత ఆంధ్ర శాసన సభ్యులదే అని తెలిపారు. అంతేకాని మద్రాసు నగర ప్రసక్తి మాత్రం లేదు అని ఆయన స్పష్టం చేశారు.

9) ఆంధ్ర రాష్ట్ర అవతరణ: నూతనంగా రాష్ట్ర నిర్మాణం చేయడానికి భారత ప్రభుత్వం సి.ఎం.త్రివేదీని ప్రత్యేకాధికారిగా నియమించింది. అనుకొన్న ప్రకారం 1 అక్టోబర్, 1953 నాడు కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం అధికారికంగా ఏర్పాటయింది. దీనిలో శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు 11 జిల్లాలు వున్నాయి.

4 జూలై, 1954న గుంటూరులో హైకోర్టును ఏర్పాటు చేశారు. హైకోర్టుకు మొదటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్. కోకా సుబ్బారావుగారు, ఆంధ్రరాష్ట్రానికి మొదట గవర్నర్ సి.ఎం. త్రివేది ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు గారు. భారత ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ రాష్ట్రానికి 1 అక్టోబర్, 1953 నాడు ఆంధ్ర రాష్ట్ర అవతరణకు ప్రారంభోత్సవం చేశాడు. ఆనాడు అశేషాంధ్ర ప్రజానీకం వాడవాడలా విందులు, వినోదాలు జరుపుకున్నారు.

ప్రశ్న 2.
జై ఆంధ్ర ఉద్యమానికి దారితీసిన అంశాలను పరిశీలించండి.
జవాబు:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆవిర్భావం తరువాత కూడా తెలంగాణ ప్రాంతంలో ముల్కీ నిబంధనలు అమలులో ఉన్నాయి. అటువంటి నిబంధనలు ఆంధ్రప్రాంత ప్రజలకు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో ఆటంకంగా ఉన్నాయనే భావన ఏర్పడింది. దాంతో ఆ నిబంధనలను రాష్ట్ర హైకోర్టులో కొందరు సవాల్ చేయడమైంది. అప్పుడు ఆ అంశంపై రాష్ట్ర హైకోర్టు సమగ్రంగా విచారించి ముల్కీ నిబంధనలు చెల్లుబాటు కావని ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైకోర్టు తీర్పుపై సమగ్ర వివరణ కోరుతూ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ ను దాఖలు చేసింది. సుప్రీంకోర్టు ఆ అంశాన్ని క్షుణ్ణంగా విచారించి ముల్కీ నిబంధనలు సక్రమమే అని తీర్పును ఇచ్చింది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెనురాజకీయ ప్రకంపనలను సృష్టించింది. ఆంధ్రప్రాంత ప్రజలు హైదరాబాద్ రాజధాని పట్టణంలోని ద్వితీయశ్రేణి పౌరులుగా దిగజారిపోయామనే భావన వ్యక్తీకరించారు. ఆంధ్రప్రదేశ్ నుండి ఆంధ్రప్రాంతం విడిపోయి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడాలనే డిమాండ్తో వారు జై ఆంధ్ర ఉద్యమాన్ని చేపట్టారు.

ప్రశ్న 3.
జాతీయ మానవ హక్కుల సంఘం అమలు చేసిన ప్రతిపాదనలు ఏవి ?
జవాబు:

  1. మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన అంశాల విచారణ.
  2. న్యాయస్థానం విచార క్రమంలో మానవ హక్కులకు సంబంధించిన అంశాలు ఉన్నట్లయితే జోక్యం చేసుకోవడం.
  3. కారాగారాలను సందర్శించి, అక్కడి పరిస్థితులను అధ్యయనం చేసి తగిన సూచనలు అందించడం.
  4. మానవ హక్కుల పరిరక్షణకు సంబంధించిన రాజ్యాంగ, చట్టపరమైన పరిరక్షణలను సమీక్షించడం.
  5. మానవ హక్కులను అనుభవించడంలో ఎదురయ్యే ఆటంకాలను సమీక్షించి, నివారణ చర్యలను సూచించడం.
  6. మానవ హక్కులకు సంబంధించిన అంతర్జాతీయ చట్టాలను అధ్యయనం చేసి, వాటిని సమర్థవంతంగా అమలులో ఉంచేందుకు సూచనలు అందించడం.
  7. మానవ హక్కులకు సంబంధించిన అంశాలపై పరిశోధనలు గావించడం.
  8. ప్రజలలో మానవ హక్కుల పట్ల అవగాహనను పెంపొందించి, మానవ హక్కుల పరిరక్షణకు సంబంధించిన సమాచారాన్ని అందించడం.
  9. మానవ హక్కుల విషయంలో ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థల కృషిని ప్రోత్సహించడం.
  10. మానవ హక్కులను కోల్పోయిన బాధితులకు నష్టపరిహారాన్ని అందించడంలో సంబంధిత అధికారులకు సూచనలు చేయడం.

ప్రశ్న 4.
జాతీయ, రాష్ట్రస్థాయిలలో మానవహక్కుల సంఘాలు ఎందుకు అవసరమో తెలపండి.
జవాబు:
జాతీయ మానవహక్కుల సంఘం (National Human Rights Commission – NHRC) అనేది చట్టబద్ధమైన సంస్థ. ఆ సంస్థ 1993 అక్టోబరు 12న ఏర్పాటయింది. దానికి సంబంధించిన అంశాలను 1993 నాటి మానవహక్కుల పరిరక్షణ చట్టం నుండి గ్రహించడమైంది. ఆ చట్టం 1991 అక్టోబరులో పారిస్ లో జరిగిన అంతర్జాతీయ అధ్యయన సదస్సులో ఆమోదించిన నియమాలకు అనుగుణంగా ఉంటుంది. అట్లాగే ఆ చట్టం మానవహక్కుల పరిరక్షణ, వికాసానికి దోహదపడుతుంది. ఆ నియమాలను 1993 డిసెంబర్ 20వ తేదీన ఐక్యరాజ్యసమితి సాధారణ సభ 48/134 వ తీర్మానం ద్వారా ఆమోదించింది. మానవహక్కుల పరిరక్షణ, వికాసంలో భారతదేశపు ఆసక్తికి జాతీయ మానవహక్కుల సంఘం ప్రతీకగా ఉంటుంది. జాతీయ మానవహక్కుల సంఘం ఆ చట్టాన్ని 2006లో సవరించండం జరిగింది.

AP Inter 2nd Year Civics Study Material Chapter 13 ఆంధ్రప్రదేశ్, ఇండియాలలో ఇటీవలి పరిణామాలు

మానవహక్కుల పరిరక్షణ చట్టం, 1993 జాతీయ మానవహక్కుల సంఘంతో బాటుగా రాష్ట్ర మానవహక్కుల సంఘాల ఏర్పాటుకు వీలు కల్పించింది. ప్రస్తుతం భారతదేశంలో 23 రాష్ట్రాలు మానవహక్కుల సంఘాలను ఏర్పాటుచేశాయి. వాటిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఉంది. భారత రాజ్యాంగం ఏడో షెడ్యూలులోని రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితాలలో పేర్కొన్న అంశాల విషయంలో, మానవ హక్కుల ఉల్లంఘనలపై విచారణ జరిపే ముఖ్య ఉద్దేశ్యంతో రాష్ట్ర మానవహక్కుల సంఘం ఏర్పాటయింది.

ప్రశ్న 5.
సమాచార సంఘాల అధికారాలు, విధులు ఏవి ?
జవాబు:
సమాచార సంఘాల అధికారాలు, విధులు: [Mar. ’17]
1. కేంద్ర సమాచార సంఘం / రాష్ట్ర సమాచార సంఘం ఏ వ్యక్తి వద్ద నుంచైనా ఫిర్యాదులను స్వీకరించవచ్చు. అటువంటి వ్యక్తులు

  • ప్రధాన సమాచార అధికారి నియామకం జరగకపోవడంతో సమాచారం పొందేందుకు అవకాశం లేనివారై ఉండాలి.
  • అడిగిన సమాచారాన్ని ఇచ్చేందుకు అధికారులు తిరస్కరించి ఉండాలి.

2. సహేతుక కారణాలపై విచారణ జరిపించే అధికారం.

3. కేంద్ర సమాచార సంఘం / రాష్ట్ర సమాచార సంఘాలకు పౌరన్యాయస్థానాలుగా నిర్వహించే అధికారాలు ఎ) వ్యక్తుల హాజరు, వారి ప్రమాణంపై మౌఖిక, రాతపూర్వక సాక్ష్యాలను తీసుకోవడం, రాతప్రతుల వస్తువులను సమకూర్చడం.
బి) రాతప్రతులను పరిశోధించి, తనిఖీ చేయడం.
సి) అఫిడవిట్ ఆధారంగా సాక్ష్యాన్ని తీసుకోవడం.

4. విచారణ సమయంలో ఈ చట్టం ప్రకారం అన్ని ప్రతులను కేంద్ర సమాచార సంఘం / రాష్ట్ర సమాచార సంఘాలకు అందించడం.

5. ప్రభుత్వ అధికారుల నుంచి తన నిర్ణయాల అమలు గురించి సమాచారాన్ని రాబట్టడం.

  • నిర్ణీత ఫారంలో సమాచారాన్ని అందించే వీలుకల్పించడం.
  • ఎవరూ లేనిచో ప్రజాసమాచార అధికారి (PIO) / సహాయ ప్రజాసమాచార అధికారి (APIO) నియామకం గురించి ప్రభుత్వ అధికారులను ఆదేశించడం.

ప్రశ్న 6.
కేంద్ర సమాచార సంఘం ఏ విధంగా నిర్మితమైంది ?
జవాబు:
కేంద్ర సమాచార సంఘాన్ని ఒక ప్రత్యేక గెజిట్ ప్రకటన ద్వారా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఆ సంఘంలో ఒక ప్రధాన సమాచార కమీషనర్, పది మందికి మించకుండా సమాచార కమీషనర్లు ఉంటారు. వారందరినీ భారత రాష్ట్రపతి నియమిస్తారు. భారత రాష్ట్రపతి వారిచే ప్రమాణ స్వీకారం చేయిస్తాడు. ఆ సంఘం ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. కేంద్రప్రభుత్వం ఆ సంఘానికి సంబంధించిన కార్యాలయాలను దేశంలోని ఇతర ప్రాంతాలలో ఏర్పాటు చేయవచ్చు. ఆ సంఘం తన కార్యకలాపాలకు ఇతర అధికారులు / సంస్థల ఆదేశాలకు లోబడక స్వతంత్రంగా నిర్వహిస్తుంది.

AP Inter 2nd Year Civics Study Material Chapter 13 ఆంధ్రప్రదేశ్, ఇండియాలలో ఇటీవలి పరిణామాలు

ప్రశ్న 7.
సమాచారం పొందేందుకు గల సమయ పరిమితి ఏమిటి ?
జవాబు:
దరఖాస్తుదారుడు ప్రజాసమాచార అధికారి లేదా సహాయ ప్రజా సంబంధాల అధికారికి తదుపరి ఏ ఇతర అధీకృత అధికారికి గానీ తనకు కావాల్సిన సమాచారాన్ని ఒక దరఖాస్తు ద్వారా కోరతాడు. అందుకు అతడు కౌ 10లతో కూడిన డిమాండ్ డ్రాఫ్ట్, బ్యాంకు చెక్కు, ఇండియన్ పోస్టల్ ఆర్డర్ కోర్టు స్టాంపునుగానీ దరఖాస్తుతో జతపరచాలి. పేదరికం దిగువన నివసించే వారికి అటువంటి రుసుము చెల్లింపు నుంచి మినహాయంపు ఇవ్వబడింది. అయితే అందుకు సంబంధించిన నకలు పత్రాన్ని వారు దరఖాస్తుతో జతపరచాలి. సమాచారాన్ని ప్రజా సంబంధాల అధికారి, సహాయ ప్రజా సంబంధాల అధికారి దరఖాస్తుదారుడికి 30 రోజులలోగా అందించాలి. ఒకవేళ దరఖాస్తుదారుడి జీవనం, స్వేచ్ఛలకు సంబంధించిన అంశాలు ఇమిడి ఉంటే, సమాచారాన్ని అతడికి 48 గంటలలోగా అందించాలి. మూడో వ్యక్తి ఉన్నట్లయితే, అతడికి 40 రోజుల వ్యవధిలోగా సమాచారాన్ని అందించాలి. ఆ నిర్ణీత వ్యవధిలో సమాచారాన్ని అందించని యెడల, శాఖాధిపతికి దరఖాస్తుదారుడు మొదటిసారి అప్పీలు చేసుకోవచ్చు. కొంత నిర్ణీత వ్యవధి తరువాత దరఖాస్తుదారుడు సమాచార సంఘానికి అప్పీలు చేసుకోవచ్చు. ఒకవేళ సమాచారం అందించే విషయంలో నిర్హేతుకమైన జాప్యం ఏర్పడినచో లేదా తప్పుడు సమాచారం అందించినచో రోజుకు సంబంధిత, అధికారి 250ల మొత్తాన్ని దరఖాస్తుదారుడికి చెల్లించాలి. ఆ మొత్తం గరిష్ఠంగా 25000 వరకు ఉంటుంది. సంబంధిత అధికారిని విచారణ చేసేందుకు వీలుంటుంది.

ప్రశ్న 8.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోదా గురించి శ్రీకృష్ణ కమిటీ సూచించిన వివిధ ప్రతిపాదనలేవి ? [Mar. ’17, ’16]
జవాబు:
1. శ్రీకృష్ణ కమిటీ ఆరు ఐచ్ఛిక అంశాలతో కూడిన ప్రతిపాదనలను సూచించింది. అవి: 1. యథాతథస్థితిని కొనసాగించడం.

2. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సీమాంధ్ర, తెలంగాణ అనే రెండు రాష్ట్రాలుగా విభజించి, హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించడం.

3. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని (1) హైదరాబాద్ రాజధానిగా తెలంగాణ, రాయలసీమ ప్రాంతాలతో కూడిన రాయల తెలంగాణగా ఏర్పరచడం (2) కోస్తా ప్రాంతాన్ని అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉంచడం.

4. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సీమాంధ్ర, తెలంగాణలుగా విభజించి, హైదరాబాద్ మెట్రోపాలిటన్ ప్రాంతాన్ని ప్రత్యేక కేంద్రపాలిత ప్రాంతంగా ఉంచడం. దానిని భౌగోళికంగా కోస్తా ప్రాంతంలోని గుంటూరు జిల్లాతో అనుసంధానం గావించడం. అందులో భాగంగానే దక్షిణ ఆగ్నేయంలో ఉన్న నల్గొండ జిల్లాను దక్షిణాన ఉన్న మహబూబ్నగర్ జిల్లా మొదలుకొని రాయలసీమ ప్రాంతంలోని కర్నూలు జిల్లాతో అనుసంధానం గావించడం.

5. ప్రస్తుతం ఉన్న సరిహద్దుల ఆధారంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తెలంగాణ, సీమాంధ్రలుగా విభజించి, తెలంగాణకు హైదరాబాదు రాజధానిగా ఉంచడం, సీమాంధ్రకు నూతన రాజధాని నిర్మాణం గావించడం.

6. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచి, తెలంగాణ ప్రాంత సామాజిక – ఆర్థిక అభివృద్ధికి, రాజకీయ ప్రగతికి ఒక ప్రాంతీయ మండలిని ఏర్పాటు గావించడం.

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
పెద్ద మనుషుల ఒప్పందం.
జవాబు:
హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణ ప్రాంత విలీనాన్ని గట్టిగా వ్యతిరేకించాడు. కాని కాంగ్రెస్ అధిష్ఠానవర్గం ఆంధ్రప్రాంత నాయకుల ఒత్తిళ్ళుకు తలొగ్గి విశాలాంధ్ర ఏర్పాటును ఆమోదించింది. తెలంగాణ ప్రజానీకంలో ఉన్న భయాందోళనలను నివారించేందుకై ఆంధ్ర, తెలంగాణ ప్రాంత నాయకుల మధ్య కుదిరిన ఒప్పందాన్ని పెద్ద మనుషుల ఒప్పందం అని అంటారు. ఈ ఒప్పందంలోని ప్రధాన ఆంశం ప్రకారం తెలంగాణ సంపూర్ణ అభివృద్ధి కొరకై ప్రాంతీయ మండలి ఏర్పాటయింది.

AP Inter 2nd Year Civics Study Material Chapter 13 ఆంధ్రప్రదేశ్, ఇండియాలలో ఇటీవలి పరిణామాలు

ప్రశ్న 2.
జె.వి.పి కమిటీ. [Mar. ’16]
జవాబు:
దక్షిణ భారతదేశంలో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ జరగాలనే డిమాండ్ ఉదృతం కావడంతో, భారత జాతీయ కాంగ్రెస్ ఆ అంశాన్ని పరిశీలించేందుకై ఒక త్రిసభ్య సంఘాన్ని నియమించింది. ఆ సంఘంలో జవహర్లాల్నెహ్రూ, వల్లభబాయి పటేల్, పట్టాభి సీతారామయ్య సభ్యులు ఉన్నారు. ఈ సంఘాన్ని జె.వి.పి కమిటీ అంటారు. ఈ కమిటీ తన నివేదికను 1949 ఏప్రిల్ 1వ తేదిన సమర్పించింది.

ప్రశ్న 3.
శ్రీబాగ్ ఒడంబడిక.
జవాబు:
1953 అక్టోబర్ 1వ తేదిన ఆంధ్రరాష్ట్రం అవతరించింది. నూతన రాష్ట్రానికి కర్నూల్ పట్టణాన్ని రాజధానిగా ఎంపిక చేయటమైంది. ఈ సమయంలో రాయలసీమ ఆంధ్రప్రాంత నాయకుల మధ్య కుదిరిన ఒడంబడికనే శ్రీబాగ్ ఒడంబడిక అంటారు. ఆంధ్రరాష్ట్ర అవతరణ దినోత్సవానికి ప్రధాని నెహ్రూ ముఖ్య అతిధిగా విచ్చేయడమైంది. ఆంధ్రరాష్ట్ర మొదటి ముఖ్యమంత్రిగా టంగుటూరి ప్రకాశం పంతులు వ్యవహరించారు.

ప్రశ్న 4.
ఫజల్ ఆలీ సంఘం.
జవాబు:
1952 డిసెంబర్ 15వ తేదిన ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం కావాలని ఆమరణ దీక్ష చేపట్టిన పొట్టి శ్రీరాములు అశువులు బాశారు. దాని ఫలితంగా ఆంధ్ర ప్రాంతంలో శాంతి భద్రతలకు తీవ్ర విఘాతం కలగటంలో ప్రజాభిప్రాయానికి తలొగ్గి ఆనాటి ప్రధాని నెహ్రూ 1) ఫజల్ ఆలీ 2) కె.ఎమ్. ఫణిక్కర్ 3) హృదయేంద్ర నాథ్ కుంజ్రూలతో ఒక సంఘాన్ని నియమించటం జరిగింది. ఈ సంఘానికి ఫజల్ ఆలీ చైర్మన్ గా వ్యవహరించటంతో దీనిని ఫజల్ అలీ సంఘం అంటారు. ఈ సంఘం ప్రత్యేక రాష్ట్రాల డిమాండ్ను పరిశీలించి తన నివేదికను 1955 అక్టోబర్లో కేంద్రప్రభుత్వానికి సమర్పించింది.

ప్రశ్న 5.
జాతీయ మానవ హక్కుల సంఘం చైర్మన్ నియామకంలో అనుసరించాల్సిన నియమాలు.
జవాబు:
జాతీయ మానవ హక్కుల సంఘం చైర్మను భారత రాష్ట్రపతి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించిన తరువాత ఖరారు చేసి నియమించటం జరుగుతంది. ఈ సందర్భంలో రాష్ట్రపతి ఆరుగురు సభ్యులతో కూడిన నియామకపు సంఘం సూచనలను పాటిస్తాడు.

AP Inter 2nd Year Civics Study Material Chapter 13 ఆంధ్రప్రదేశ్, ఇండియాలలో ఇటీవలి పరిణామాలు

ప్రశ్న 6.
మానవ హక్కుల సంఘం చైర్మన్, సభ్యుల నియామకంలో అనుసరించాల్సిన ప్రక్రియ. [Mar. ’17]
జవాబు:
రాష్ట్ర మానవ హక్కుల సంఘం చైర్మన్, సభ్యులను సంబంధిత రాష్ట్ర గవర్నర్ నియమిస్తారు. ఈ సందర్భంలో గవర్నర్కు సలహా ఇచ్చేందుకు అత్యున్నత స్థాయి సలహామండలి ఉంటుంది. అందులో రాష్ట్రముఖ్యమంత్రి, రాష్ట్ర హోం మంత్రి విధానసభ స్పీకర్, విధాన సభలోని ప్రతిపక్ష పార్టీ నాయకుడు సభ్యులుగా ఉంటారు. ఆ సలహా మండలికి ముఖ్యమంత్రి కన్వీనర్ ఉంటాడు. రాష్ట్ర మానవహక్కుల సంఘం సభ్యుల నియామకంలో గవర్నర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సంప్రదిస్తాడు.

ప్రశ్న 7.
పౌర న్యాయస్థానంగా మానవ హక్కుల సంఘం.
జవాబు:
మానవ హక్కుల సంఘం పౌర న్యాయస్థానంగా పనిచేస్తుంది. పౌర శిక్షాస్మృతికి అనుగుణంగా పనిచేసే సివిల్ కోర్టుకు ఉండే అధికారాలు ఈ సంఘానికి ఉంటాయి. దానితో సాక్షులను పిలిచేందుకు, ఏదైనా రాత ప్రతిని సమర్పించాలని కోరేందుకు, అఫిడవిట్లపై అవసరమైన సాక్ష్యాన్ని రాబట్టేందుకు మానవ హక్కుల సంఘం సంపూర్ణ అధికారాన్ని కలిగి ఉంది.

ప్రశ్న 8.
సైనిక దళాలపై జాతీయ మానవ హక్కుల సంఘం పరిధి.
జవాబు:
సైనిక దళాల సిబ్బంది మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడిన ఉదంతాలపై విచారణ జరిపే విషయంలో జాతీయ మానవ హక్కుల సంఘానికి పరిమితమైన పాత్ర మాత్రమే ఉంటుంది. అయితే ప్రభుత్వం ఆ సంఘం చేసిన సిఫార్సులను విమర్శించటానికి వీలులేదు అని ఆ కమీషన్ లోని మాజీ సభ్యుడు ఒకరు వ్యాఖ్యానించారు.

ప్రశ్న 9.
ప్రజా సమాచార అధికారి (P.I.O).
జవాబు:
ప్రజా సమాచార అధికారిని సమాచార కమీషన్ ఆదేశాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తుంది. ఈ అధికారి |సమాచార కమీషన్కు తన అధికారాలు, విధులలో తన సహాయ సహకారాలను అందిస్తారు.

AP Inter 2nd Year Civics Study Material Chapter 13 ఆంధ్రప్రదేశ్, ఇండియాలలో ఇటీవలి పరిణామాలు

ప్రశ్న 10.
సమాచారం అంటే ఏమిటి ?
జవాబు:
సమాచారమంటే ఏదో ఒక భౌతికరూపంలో ఉండేదిగా పేర్కొనవచ్చు. రికార్డులు, డాక్యుమెంట్లు, మెమోలు, ఈ-మెయిళ్ళు, అభిప్రాయాలు, సలహాలు, పత్రికాప్రకటనలు, సర్క్యులర్లు. ఆదేశాలు, లాగ్ పుస్తకాలు, నివేదికలు, కాగితాలు, నమూనాలు, ఎలక్ట్రానిక్ రూపంలో ఉండే ఏమైనా మెటీరియల్ మొదలైనవి సమాచారం క్రిందకు వస్తాయి.

AP Inter 2nd Year Civics Study Material Chapter 12 రాజకీయ పార్టీలు

Andhra Pradesh BIEAP AP Inter 2nd Year Civics Study Material 12th Lesson రాజకీయ పార్టీలు Textbook Questions and Answers.

AP Inter 2nd Year Civics Study Material 12th Lesson రాజకీయ పార్టీలు

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
భారతదేశంలోని జాతీయ పార్టీలపై ఒక వ్యాసం వ్రాయండి.
జవాబు:
జాతీయ పార్టీ: దేశంలో నాలుగు (లేదా) అంతకు మించిన రాష్ట్రాలలో జరిగే ఎన్నికలలో పాల్గొని, పోలైన ఓట్లలో ఆరు శాతం పొందటంతో పాటు నాలుగు లోక్సభ సీట్లను గెలుచుకొన్న పార్టీని జాతీయ (లేదా) అఖిల భారత పార్టీగా భారత ఎన్నికల సంఘం గుర్తిస్తుంది.
భారతదేశంలోని ప్రధాన జాతీయ పార్టీలను ఈ క్రింది విధంగా పేర్కొనవచ్చు. అవి:

  1. భారత జాతీయ కాంగ్రెస్
  2. భారతీయ జనతా పార్టీ
  3. భారత కమ్యూనిస్టు పార్టీ
  4. భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
  5. బహుజన సమాజ్ పార్టీ
  6. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ

1) భారత జాతీయ కాంగ్రెస్: భారత జాతీయ కాంగ్రెస్ మన దేశంలో అతి పురాతన పార్టీ. దీనిని 1885 డిశంబరు, 28వ తేదీన బ్రిటిష్ సివిల్ సర్వెంట్ (A. O) ఎ.ఒ హ్యూమ్ స్థాపించాడు. ఉమేష్ చంద్ర బెనర్జీ దీనికి ప్రధమ అధ్యక్షుడుగా వ్యవహరించాడు. స్వాతంత్య్ర ఉద్యమంలో ఈ పార్టీ చురుకైన పాత్ర పోషించి దేశానికి స్వాతంత్య్రాన్ని తీసుకోచ్చింది.

స్వాతంత్ర్యానంతరం జరిగిన 15 సాధారణ ఎన్నికల్లో, కాంగ్రెస్ పార్టీ ఆరుసార్లు ఎన్నికల్లో స్పష్టమైన మెజారిటి సాధించింది. నాలుగు సార్లు అధికార సంకీర్ణానికి నాయకత్వం వహించింది. మొత్తం దాదాపు 49 సంవత్సరాల పాటు కేంద్రప్రభుత్వానికి నాయకత్వం వహించింది. దీనిలో ప్రధాని జవహర్లాల్ నెహ్రూ మొదలుకొని (1947 – 64), ఇటీవలి మన్మోహన్ సింగ్ (2004-14) వరకు ఏడుగురు కాంగ్రెస్ ప్రధాన మంత్రులు దేశాన్ని పాలించారు. 2004 నుండి 2014 వరకు కాంగ్రెస్ నాయకత్వంలోని ఐక్య ప్రగతిశీల కూటమి (United Progressive Alliance – UPA) మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఎన్నో ప్రాంతీయ పార్టీల సంకీర్ణంగా ప్రభుత్వాన్ని ఏర్పరచింది. 2014లో జరిగిన పదహారవ సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్వాతంత్య్రానంతరం మొదటిసారిగా హీనమైన ఓటమిని చవిచూచి, 543 మంది గల లోక్సభలో 44 స్థానాలకు పరిమితమైంది.

AP Inter 2nd Year Civics Study Material Chapter 12 రాజకీయ పార్టీలు

2) భారతీయ జనతా పార్టీ: భారతీయ జనతా పార్టీ (బిజెపి) ని 1980లో స్థాపించారు. భారతీయ జనతా పార్టీ 1951 అక్టోబర్ 21న శ్యాంప్రసాద్ ముఖర్జీ అధ్యక్షతన స్థాపించిన భారతీయ జన సంఘ్క ఒక నూతన, సవరించిన స్వరూపంగా పేర్కొనవచ్చు. భారతీయ జనతా పార్టీ తన పూర్వపు జన సంఘ్్కు కొనసాగింపుగా క్రమశిక్షణ – చక్కని వ్యవస్థీకృత యంత్రాంగం, సంప్రదాయ హిందూ సాంఘిక – సాంస్కృతిక సంస్థలైన రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ (ఆర్. ఎస్. ఎస్), విశ్వహిందూ పరిషత్ (వి. హెచ్. పి) తదితర సంస్థలతో అనుబంధాన్ని కొనసాగిస్తూ వచ్చింది. ఏవో కొన్ని రాజకీయ దృక్పధాలు, పార్టీ స్థాపించిన తొలినాళ్ళలో 1984 సాధారణ ఎన్నికల్లో బిజెపి దేశ వ్యాప్తంగా రెండు సీట్లలో మాత్రమే విజయం సాధించింది. అయితే ఆ తరువాత కాలంలో రామజన్మ భూమి – బాబ్రీ మసీదు అంశం ఆధారంగా తన బలాన్ని బాగా పుంజుకుని గణనీయంగా పెంచుకోగలిగింది. ఎన్నో రాష్ట్రాలకు జరిగిన ఎన్నికలలో విజయాలు సాధించడం, జాతీయ స్థాయి ఎన్నికల్లో చక్కని ఫలితాలు సాధించడంతో 1996 కల్లా బిజెపి పార్లమెంటులో అతి పెద్ద పార్టీగా మారింది. అయితే పార్లమెంటులోని దిగువ సభలో సరైన మెజారిటీ లేకపోవడంతో ఆ పార్టీ ప్రభుత్వం కేవలం 13 రోజులు మాత్రమే అధికారంలో కొనసాగింది.

అనంతరం 1998 సాధారణ ఎన్నికల్లో బిజెపి మాత్రమే నేతృత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి (National Democratic Alliance) అటల్ బీహారీ వాజ్పాయ్ ప్రధానమంత్రిగా ఒక సంవత్సరంపాటు అధికారంలోకి వచ్చింది. ఆ తరువాత మళ్ళీ తాజాగా ఎన్నికలు జరగడంతో ఎన్. డి. ఎ ప్రభుత్వం అటల్ బిహారీ వాజ్పాయ్ నాయకత్వంలో పూర్తి పదవీకాలం అధికారంలో కొనసాగింది. అందుచేత స్వాతంత్య్రానంతర చరిత్రలో కాంగ్రెసేతర ప్రభుత్వం అనేది పూర్తి పదవీకాలం కొనసాగడం ఇదే మొదటిసారిగా పేర్కొనవచ్చు. ఆ తరువాత 2004లో జరిగిన సాధారణ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి (NDA) అనూహ్యంగా పరాజయం పాలైంది. అలాగే 2009లో జరిగిన లోక్సభ సాధారణ ఎన్నికలలో కూడా ఇదే జరిగింది. ఫలితంగా దాదాపు 10 సంవత్సరాల పాటు భారతీయ జనతా పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా కొనసాగింది. ఆ తరువాత 2014 సాధారణ ఎన్నికలలో సుదీర్ఘ కాలం గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ ప్రధాన ప్రచారకునిగా, పార్టీలో జనాకర్షణ గల నాయకునిగా భారతీయ జనతాపార్టీని నడిపించి, పార్టీకి అద్భుతమైన విజయాన్ని అందించగలిగాడు. అప్పటి నుండి, నరేంద్ర మోడి ప్రధానమంత్రిగా భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఏర్పడిన 13 రాష్ట్రాలకు చెందిన రాజకీయ పార్టీల సంకీర్ణంగా జాతీయ ప్రజాస్వామ్య కూటమి (NDA) ప్రభుత్వం ఏర్పడి కొనసాగుతోంది.

3) భారత కమ్యూనిస్టు పార్టీ: భారతదేశంలోని రెండో అతి ప్రాచీన జాతీయ పార్టీయే భారత కమ్యూనిస్టు పార్టీ. |కమ్యూనిస్టు పార్టీ జాతీయోద్యమములో ప్రముఖపాత్ర వహించింది. భారతదేశంలో కమ్యూనిస్టు భావాలను వ్యాప్తి చేసే బాధ్యత ఎమ్. ఎన్. రాయ్కి అప్పజెప్పారు. 1925 డిశంబరు 26వ తేదీన మార్క్సిస్టు సిద్ధాంతములను విశ్వసించిన కొంతమంది కమ్యూనిస్టు పార్టీని స్థాపించారు. పశ్చిమ బెంగాల్, కేరళ, బీహార్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో దీని ప్రాబల్యము హెచ్చుగా వుంది.

4) భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు): 1964 సంవత్సరములో విజయవాడ సమావేశములో భారత కమ్యూనిస్టు పార్టీ రెండుగా చీలిపోయి పి. సుందరయ్య, జ్యోతిబసు, నంబూద్రిపాద్ మొదలగు నాయకుల ఆధ్వర్యంలో భారత కమ్యూనిస్టు పార్టీలోని అతివాదులు సి. పి. ఐ. (ఎమ్)గా ఏర్పడిరి. సి.పి.ఐ కి భిన్నముగా సి.పి.ఎమ్ నాయకులు (అతివాదులు) మావో సిద్ధాంతాలకు సన్నిహితులై చైనా కమ్యూనిజాన్ని అనుసరించిరి. పశ్చిమబంగ, త్రిపుర, కేరళలలో ఈ పార్టీకి చెప్పుకోదగ్గ మద్దతు ఉంది. ఈ పార్టీ పశ్చిమబంగలో 1977 నుండి 2012 వరకు అధికారంలో వుంది.

5) బహుజన సమాజ్ పార్టీ: బహుజన సమాజ్ పార్టీ దళితులు ఆధిపత్యం కలిగిన పార్టీ. ఈ పార్టీ ఉద్యోగుల సమాఖ్య. దళిత్ శోషిత్ సమాజ్ సమితిల విలీనం ఫలితంగా 1984లో ఏర్పండింది. కాన్షీరాం ఈ పార్టీ వ్యవస్థాపక నాయకుడు. మాయావతి ప్రస్తుతం ఈ పార్టీకి నాయకురాలుగా వ్యవహరిస్తున్నారు. ఈ పార్టీ భారత రాజకీయ వ్యవస్థలో జాతీయ పార్టీగా గుర్తింపు పొందింది. మాయావతి నాయకత్వంలో ఆ పార్టీ జనాకర్షణ క్రమేణా పెరుగుతూ వచ్చింది.

6) నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ: 1999, మే, 25 వ తేదీన కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ అయిన శరద్ పవార్, పి. ఎ. సంగ్మా, తారిక్ అన్వర్ తదితరులు స్థాపించిన పార్టీయే నేషనలిస్ట్ కాంగ్రెస్. ఈ పార్టీ స్థాపన సమయంలో ఇండియన్ కాంగ్రెస్ (సోషలిస్ట్) ను తనలో విలీనం చేసుకుంది. భారత ఎన్నికల సంఘం నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీని జాతీయ పార్టీగా గుర్తించింది. మహారాష్ట్ర, మణిపూర్, మేఘాలయ మొదలగు రాష్ట్రాలలో ఈ పార్టీకి చెప్పుకోదగ్గ

2. పార్టీలలోని వివిధ రకాలను తెలిపి, భారతదేశంలో ప్రాంతీయ పార్టీల పాత్రను అంచనా వేయండి. జవాబు: పార్టీలలోని వివిధ రకాలు: ఆధునిక ప్రజాస్వామ్య రాజ్యాల్లో నాలుగు రకాలైన రాజకీయ పార్టీలు ఉంటాయి.

  1. నిరోధకవాద (ప్రతిక్రియాత్మక) పార్టీలు,
  2. సాంప్రదాయకవాద పార్టీలు,
  3. ఉదారవాద పార్టీలు,
  4. విప్లవాత్మక (సమూల సంస్కరణవాద పార్టీలు.

నిరోధకవాద (ప్రతిక్రియాత్మక) పార్టీలు పూర్వపు సాంఘిక, ఆర్థిక, రాజకీయ సంస్థలను సర్థిస్తూ ఉంటాయి. సాంప్రదాయకవాద పార్టీలు యథాతథ స్థితిని విశ్వసిస్తాయి. ఉదారవాద పార్టీలు వర్తమాన సంస్థలో సంస్కరణలను ప్రవేశపెట్టే లక్ష్యంతో పనిచేస్తాయి. విప్లవాత్మకవాద (సమూల సంస్కరణవాద) పార్టీలు ప్రస్తుత సంస్థలను కూలద్రోసి వినూత్న వ్యవస్థ స్థాపన లక్ష్యంతో పనిచేస్తాయి.

AP Inter 2nd Year Civics Study Material Chapter 12 రాజకీయ పార్టీలు

భారతదేశంలో ప్రాంతీయ పార్టీల పాత్ర: భారత రాజకీయాల్లో ప్రాంతీయపార్టీల పాత్రను గురించి వ్యాఖ్యానిస్తూ డా॥ కె. ఆర్. బాంబువాల్ (Dr. K. R. Bambwal) కొన్ని విశిష్ట దృక్కోణాలను గుర్తించారు.
1) ప్రాంతీయ పార్టీలు భారతదేశంలోని ‘ఏకపార్టీ ఆధిపత్య వ్యవస్థ’ కు ఎంతో శక్తివంతమైన సవాలుగా నిలిచాయి.
2) ప్రాంతీయ పార్టీలు కేంద్ర, రాష్ట్ర సంబంధాల కూర్పుపైన, స్వభావంపైన ఒక బలమైన ప్రభావాన్ని చూపాయి. కేంద్ర ప్రభుత్వం వద్ద తమ వ్యవహారాల విషయంలో రాష్ట్ర నాయకులు మరింత హెచ్చుగా వ్యక్తీకరించుకోవడానికి ప్రయత్నించడం, కేంద్ర ప్రభుత్వం ప్రాంతీయ శక్తుల అవసరాలు, డిమాండ్లపై మరింతగా స్పందించడం మొదలైంది.
3) ప్రాంతీయ పార్టీలు రాజకీయాలను మరింత పోటీతత్త్వంతో ఉండే విధంగా మార్చాయి. అలాగే రాజకీయ ప్రక్రియలో ప్రజల భాగస్వామ్యం అట్టడుగు స్థాయిలో మరింత విస్తృతంగా ఉండేలా చేశాయి.
4) ప్రాంతీయ పార్టీలతో ఉండే మరో ప్రయోజనం ఏమంటే ప్రజలు నాయకులతో సాన్నిహిత్యాన్ని కలిగి ఉండడం. ప్రజలు తమ సమస్యల పరిష్కారానికి, జాతీయపార్టీకి చెందిన ఉన్నత పదవిలో ఉన్న వ్యక్తిని కలుసుకోవడం కంటే స్థానిక రాజకీయ పార్టీకి చెందిన నాయకుని కలుసుకోవడం తేలికగా భావిస్తారు.

భారతదేశంలో 1996 తరువాత అనేక ప్రాంతీయపార్టీలు జాతీయ రాజకీయాలలో కీలకంగా మారాయి. జాతీయ ప్రజాసామ్య కూటమి (NDA) లో భాగస్వామ్య పక్షాలుగా 23 ప్రాంతీయపార్టీలు 1999లో, 2004లో కేంద్ర ప్రభుత్వంలో అధికారాన్ని పంచుకున్నాయి. కొన్ని ప్రాంతీయపార్టీలు రాష్ట్రాల్లో అధికార పార్టీలుగా ఉన్నాయి. వీటిలో ఎఐఎడిఎంకె (AIADMK), టి.డి.పి (TDP), జె.డి.యు (JDU), బిజెడి (BJD), యుడిఎఫ్ (UDF), ఎస్.ఎ.డి (SAD) మొదలైనవి ఉన్నాయి. ఈ పరిణామం భారత రాజకీయాల్లో నిరంతరం పెరుగుత్ను, ప్రాముఖ్యంలో వృద్ధి కొనసాగుతున్న ప్రాంతీయపార్టీల ఉనికిని ప్రతిబింబిస్తుంది

ప్రశ్న 3.
భారతదేశంలో ఏకపార్టీ ఆధిపత్యంపై ఒక వ్యాసం వ్రాయండి.
జవాబు:
భారతదేశంలో స్వాతంత్య్ర పోరాటం సమర్థవంతమైన రాజకీయ పార్టీల వ్యవస్థ స్థాపనకు పిలుపునిచ్చింది. దేశంలోని బ్రిటిషు వ్యతిరేక శక్తులను – జాతీయవాద శక్తులను సమీకరించి ఒకే గొడుకు క్రిందకు తెచ్చిన సంస్థగా భారత జాతీయ కాంగ్రెస్ అవతరించింది. భారతదేశం స్వాతంత్ర్యం సాధించిన తరువాత జాతిపిత మహాత్మగాంధీ ఈ పార్టీని ఒక సాంఘిక సంస్థగా మాత్రమే కొనసాగించాలని కోరినప్పటికీ, అది ఒక రాజకీయ పార్టీగానే కొనసాగుతూ వచ్చింది. స్వాతంత్య్రానంతర దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ క్రియాశీల పాత్ర ఎంతఘనమైనదంటే, చాలా తరుచుగా భారతదేశాన్ని ఏక పార్టీ ఆధిపత్య వ్యవస్థగా అభివర్ణించడం జరిగింది. ఈ పార్టీ సర్వసమ్మత పార్టీగా, అందరి సమీకృత ప్రయోజనాలే తన వ్యూహంగా పేర్కొన్నది. భారతీయ సమాజానికి ప్రతిరూపంగా కాంగ్రెస్ పార్టీ జాతి ఆవశ్యక లక్షణాలన్నింటిని తనలో ప్రతిబింబించింది.

జాతీయోద్యమ స్థాయి నుండి ఒక రాజకీయ పార్టీగా మారడంతో, కాంగ్రెస్, పార్టీ బ్రహ్మాండమైన సంస్థగా ఉంటూ విభిన్న అభిప్రాయాలు గల పలు సమూహాలను తనలో ఇముడ్చుకోగలిగింది. స్వాతంత్య్రానంతరం జరిగిన 15 సాధారణ ఎన్నికల్లో, కాంగ్రెస్ పార్టీ ఆరుసార్లు ఎన్నికల్లో స్పష్టమైన మెజారిటీ సాధించింది. నాలుగు సార్లు అధికార సంకీర్ణానికి నాయకత్వం వహించింది. మొత్తం దాదాపు 49 సంవత్సరాల పాటు కేంద్రప్రభుత్వానికి నాయకత్వం వహించింది. దీనిలో ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ మొదలుకొని (1947 – 64), ఇటీవలి మన్మోహన్ సింగ్ |(2004-14) వరకు ఏడుగురు కాంగ్రెస్ ప్రధాన మంత్రులు దేశాన్ని పాలించారు. 2004 నుండి 2014 వరకు కాంగ్రెస్ నాయకత్వంలోని ఐక్య ప్రగతిశీల కూటమి (United Progressive Alliance – UPA) మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఎన్నో ప్రాంతీయ పార్టీల సంకీర్ణంగా ప్రభుత్వాన్ని ఏర్పరచింది. 2014లో జరిగిన పదహారవ సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్వాతంత్య్రానంతరం మొదటిసారిగా హీనమైన ఓటమిని చవిచూచి, 543 మంది గల లోక్సభలో 44 స్థానాలకు పరిమితమైంది.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
రాజకీయ పార్టీ అనగానేమి ? దాని లక్షణాలను, విధులను వివరించండి. [Mar. ’16]
జవాబు:
రాజకీయ పార్టీ అర్థం: రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్యం సజీవంగా ఉండడానికి రక్తప్రసరణవలే పనిచేస్తాయి. అవి ప్రజాభిప్రాయాన్ని తీర్చిదిద్ది, వ్యక్తిగత అభిప్రాయాల ఫలితంగా ఏర్పడే సందిగ్ధత నుండి ప్రజాభిప్రాయాన్ని ఏర్పరుస్తాయి. ప్రజాభిప్రాయాన్ని పటిష్టంగా రూపొందించడంలో, పెంపొందించడంలో రాజకీయపార్టీలు ప్రధాన సాధనాల వలే పనిచేస్తాయి. విధాన రూపకర్తలనకు, పౌరులకు మధ్య రాజకీయ పార్టీలు మధ్యవర్తుల వలే పనిచేస్తాయి.

AP Inter 2nd Year Civics Study Material Chapter 12 రాజకీయ పార్టీలు

రాజకీయ పార్టీ లక్షణాలు: రాజకీయ పార్టీకి ఈ దిగువ సూచించిన ముఖ్య లక్షణాలు ఉంటాయి.

  1. రాజకీయపార్టీ ఉమ్మడి ప్రయోజనాలు, ఒకేరకమైన విలువలు కలిగి ఉండే వ్యక్తుల సమూహంగా ఉంటుంది.
  2. రాజకీయపార్టీ తన స్వీయ రాజకీయ భావజాలాన్ని, కార్యక్రమాన్ని కలిగి ఉంటుంది.
  3. రాజ్యాంగపార్టీ సాధనాలతో ఎన్నికల ద్వారా మాత్రమే అధికారాన్ని చేజిక్కించుకోవడానికి ప్రయత్నిస్తుంది.
  4. జాతీయ ప్రయోజనాలను, జాతీయ, సంక్షేమాన్ని పెంపొందించడానికి రాజకీయ పార్టీ ప్రయత్నిస్తుంది.

రాజకీయపార్టీల విధులు:

  1. సామాజిక ప్రయోజనాల సమీకరణ, వ్యక్తీకరణ
  2. రాజకీయ భర్తీ
  3. ప్రజాభిప్రాయ సాధనాలు
  4. రాజకీయ సామాజికీకరణ, పౌరుల భాగస్వామ్యాన్ని పెంపొందించటం
  5. శాసనాల తయారీ
  6. ప్రతిపక్ష పాత్ర
  7. ప్రభుత్వ యంత్రాంగం, సంక్షేమ పథకాల అందుబాటు
  8. రాజకీయ వ్యవస్థకు న్యాయబద్ధతను చేకూర్చటం

ప్రశ్న 2.
పార్టీల వ్యవస్థ గురించి నీకేమి తెలియును ? పార్టీల వ్యవస్థ రకాలపై ఒక సంక్షిప్త సమాధానం వ్రాయండి.
జవాబు:
పార్టీల వ్యవస్థ అనేది సంక్లిష్ట సాంఘిక రాజకీయ ప్రక్రియలు, వ్యక్తిగత నాయకులు, సాంఘిక సంస్థలు, రాజకీయ సమూహాలు, సంస్థలు వాటిమధ్య పరస్పర చర్యలు, అంతర్గత సంబంధాలు మొదలైన వాటి సమాహారంగా పేర్కొనవచ్చు. ఈ చర్య – ప్రతిచర్యల రీతులు రాజ్యాంగాలు, శాసనాలు, నియమనిబంధనలు, సంస్థలు మొదలైన వాటి ఆధారంగా జరుగుతాయి. అలాగే ఒక సమాజంలో, రాజకీయ వ్యవస్థలో ఉండే రాజకీయ ఆలోచనలు, ప్రవర్తనలు కూడా వీటిని నిర్దేశిస్తాయి. ఈ విధమైన పరస్పర సంబంధాలు రాజకీయ భావజాలాల్లో, నాయకుల్లో, పార్టీ నిర్మాణంలో, పార్టీల్లో ఏర్పడే చీలికలలో, పార్టీ మద్దతు, నిరసన రీతుల్లో, ఓటర్ల సమీకరణలో, ఎన్నికల్లో జరిగే పోటీల్లో, ఇలా అనేక అంశాల్లో ప్రతిబింబిస్తుంది. భారతదేశం వంటి బహుళ సంస్కృతి సమాజంలో వివిధ స్థాయిల్లో అంటే జాతీయ, ప్రాంతీయ, ఉపప్రాంతీయ, గ్రామీణ – పట్టణ స్థాయిల్లో పార్టీల మధ్య సంకీర్ణాల నిర్మాణం జరుగుతుంది. పార్టీలు భారత రాజకీయాల్లో ఇతర ప్రధాన ప్రజాస్వామ్యాల్లో వలే కేంద్రస్థానాన్ని పొందుతాయి.

పార్టీల వ్యవస్థ – రకాలు: పార్టీల వ్యవస్థ మూడు రకాలు. అవి: 1) ఏక పార్టీ వ్యవస్థ 2) రెండు పార్టీల వ్యవస్థ 3) బహుళ పార్టీ వ్యవస్థ.
1) ఏక పార్టీ వ్యవస్థ: ఏక పార్టీ వ్యవస్థలో ఒకే ఒక రాజకీయపార్టీ మనుగడలో ఉంటుంది. ఇతర రాజకీయపార్టీలు పనిచేయడానికి అనుమతి ఉండదు. ఒకే రాజకీయపార్టీలో అసంతృప్తులు, వర్గాలు ఉండవచ్చు. ఉదాహరణకు జర్మనీలో నాజీ పార్టీ, ఇటలీలో ఫాసిస్టు పార్టీ, చైనాలో – పూర్వపు సోవియట్ యూనియన్ కమ్యూనిస్టు పార్టీలను ఏకపార్టీ వ్యవస్థగా పేర్కొనవచ్చు.

2) రెండు పార్టీల వ్యవస్థ: రెండు పార్టీల వ్యవస్థలో రాజకీయ వ్యవస్థ రెండు ప్రధాన రాజకీయ పార్టీలు ఆధారంగా పనిచేస్తుంది. వీటిలో ఒకటి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే, మరొకటి ప్రతిపక్ష పార్టీగా విధులు నిర్వహిస్తుంది. ఈ తరహా వ్యవస్థలో రాజకీయ అధికారం రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్య పరస్పర ప్రత్యామ్నాయంగా పనిచేస్తాయి. ఇంగ్లాండ్ (యు.కె)లోని లేబర్ పార్టీ, కన్సర్వేటివ్ పార్టీలు, అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని (USA) రిపబ్లికన్, డెమొక్రటిక్ పార్టీలు వీటికి ఉదాహరణలుగా చెప్పవచ్చు.

3) బహుళ పార్టీ వ్యవస్థ: ఈ తరహా వ్యవస్థలో రెండు పార్టీల కంటే ఎక్కువ పార్టీలు ఉంటాయి. అయితే వాస్తవంలో అవి అధికార పార్టీకిగానీ, ప్రతిపక్ష పార్టీకి గానీ స్నేహబంధంతో ఉంటాయి. ఈ విధమైన బహుళ పార్టీ వ్యవస్థ భారతదేశం, ఫ్రాన్స్, స్వీడన్, నార్వే తదితర దేశాల్లో వాడుకలో ఉంది.

ప్రశ్న 3.
భారతీయ పార్టీ వ్యవస్థ లక్షణాలను సంక్షిప్తంగా వ్రాయండి.
జవాబు:
భారతదేశంలో పార్టీ వ్యవస్థ లక్షణాలు:

  1. బహుళ పార్టీ వ్యవస్థ: భారతదేశంలో బహుళ సంఖ్యలో పార్టీలున్నాయి. ప్రస్తుతం దేశంలో 6 జాతీయ పార్టీలు, 64 రాష్ట్రస్థాయి పార్టీలున్నాయి.
  2. ఏకపార్టీ ఆధిపత్య వ్యవస్థ భారతదేశ రాజకీయ రంగంలో సుదీర్ఘకాలంపాటు కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యంతో కొనసాగింది.
  3. స్పష్టమైన భావజాలం లేకపోవటం: BJP, CPI, CPI (M) మినహా మిగిలిన పార్టీలకు స్పష్టమైన సిద్ధాంత భావజాలం లేదు.
  4. వ్యక్తిపూజ: చాలా తరచుగా భారతదేశంలో రాజకీయ పార్టీలు గొప్ప నాయకుని చుట్టూ వ్యవస్థీకృతమై ఉంటాయి.
  5. సాంప్రదాయక అంశాలు: భారతదేశంలో అనేక పార్టీలు మతం, కులం, భాష, సంస్కృతి, తెగ తదితర |అంశాల ప్రాతిపదికగా ఏర్పడతాయి.
  6. ప్రాంతీయ పార్టీల అవతరణ: భారత రాజకీయ వ్యవస్థలో పెద్ద సంఖ్యలో ప్రాంతీయ పార్టీలు అవతరించటానికి ప్రధాన లక్షణంగా చెప్పవచ్చు..
  7. చీలికలు, ఫిరాయింపులు: వర్గపోరు, ఫిరాయింపులు, చీలికలు, విలీనాలు, విచ్ఛిన్నాలు, సమీకరణాలు భారతదేశ రాజకీయ పార్టీల కార్యాచరణలో ప్రధాన అంశాలుగా కొనసాగుతున్నాయి.
  8. సమర్థవంతమైన ప్రతిపక్షం లేకపోవటం: భారతదేశ రాజకీయ వ్యవస్థలో సమర్థవంతమైన ప్రతిపక్షం |లేకపోవటం ఒక ప్రధాన లోపంగా గోచరిస్తుంది.

AP Inter 2nd Year Civics Study Material Chapter 12 రాజకీయ పార్టీలు

ప్రశ్న 4.
భారతదేశంలో కాంగ్రెస్ పార్టీపై సంక్షిప్త సమాధానం వ్రాయండి.
జవాబు:
భారత జాతీయ కాంగ్రెస్ మన దేశంలో అతి ప్రాచీన పార్టీ. దీనిని 1885 డిశంబరు 28వ తేదీన బ్రిటిష్ సివిల్ సర్వెంట్. A.O. హ్యూమ్ స్థాపించాడు.

భారత జాతీయ కాంగ్రెస్ ఆసియా – ఆఫ్రికా ఖండాల్లో బాగా విజయవంతమైన జాతీయోద్యమాల్లో ఒక దానిని నిర్వహించింది. స్వాతంత్ర్యం సాధించిన తరువాత, దేశాన్ని పరిపాలించే బాధ్యతను కాంగ్రెస్ స్వీకరించింది. స్వతంత్ర భారతదేశంలో రెండు దశాబ్దాల పాటు పూర్తి స్థాయి రాజకీయ ఆధిపత్యాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రదర్శించింది. 1960వ దశకం చివరిభాగంలో కాంగ్రెస్ పార్టీ మొదటిసారిగా చీలిపోయింది. దాంతో కమ్యూనిస్టేతర పార్టీలు, కాంగ్రెస్ (ఒ)లు సంయుక్తంగా శ్రీమతి ఇందిరాగాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ (ఆర్)ను అధికారం నుండి తొలగించడానికి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. 1972లో జరిగిన ఎన్నికలలో శ్రీమతి ఇందిరాగాంధీ పూర్తి మెజారిటీ సాధించి తిరిగి అధికారంలోనికి వచ్చింది. అయితే కాంగ్రెస్ పార్టీ అనుసరించిన కొన్ని విధానాల వలన క్రమేణా దాని జనాకర్షణ తగ్గిపోయింది. దీంతో 1977లో పార్లమెంటుకు జరిగిన ఎన్నికల్లో చారిత్రాత్మక కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటిసారిగా ఓటమిని చవిచూచి, ప్రతిపక్షపార్టీ స్థాయికి దిగజారిపోయింది.

స్వాతంత్య్రానంతరం జరిగిన గత 15 సాధారణ ఎన్నికల్లో, కాంగ్రెస్ పార్టీ ఆరుసార్లు ఎన్నికల్లో స్పష్టమైన మెజారిటీ సాధించింది. నాలుగుసార్లు అధికార సంకీర్ణానికి నాయకత్వం వహించింది. మొత్తం దాదాపు 49 సంవత్సరాలపాటు కేంద్ర ప్రభుత్వానికి నాయకత్వం వహించింది. దీనిలో ప్రధాని జవహర్లాల్ నెహ్రూ మొదలుకొని (1947-64), ఇటీవలి మన్మోహన్ సింగ్ (2004-14) వరకు ఏడుగురు కాంగ్రెస్ ప్రధాన మంత్రులు దేశాన్ని పాలించారు. 2004 నుండి 2014 వరకు కాంగ్రెస్ నాయకత్వంలోని ఐక్య ప్రగతిశీల కూటమి (United Progres- sive Alliance – UPA) మన్మోహన్సంగ్ ప్రధానమంత్రిగా ఎన్నో ప్రాంతీయపార్టీలు సంకీర్ణంగా ప్రభుత్వాన్ని ఏర్పరచింది. 2014లో జరిగిన పదహారవ సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్వాతంత్య్రానంతరం మొదటిసారిగా హీనమైన ఓటమిని చివిచూచి, 543 మంది గల లోక్సభలో 44 స్థానాలకు పరిమితమైంది.

ప్రశ్న 5.
భారతీయ జనతా పార్టీ గురించి సంక్షిప్తంగా వివరించండి.
జవాబు:
భారతీయ జనతా పార్టీ (బిజెపి) ని 1980లో స్థాపించారు. భారతీయ జనతా పార్టీ 1951 అక్టోబర్ 21న శ్యాంప్రసాద్ ముఖర్జీ అధ్యక్షతన స్థాపించిన భారతీయ జనసంఘక్కు ఒక నూతన, సవరించిన స్వరూపంగా పేర్కొనవచ్చు. భారతీయ జనతా పార్టీ తన పూర్వపు జనసంఘ్్కు కొనసాగింపుగా క్రమశిక్షణ – చక్కని వ్యవస్థీకృత యంత్రాంగం, సంప్రదాయ హిందూ సాంఘిక – సాంస్కృతిక సంస్థలైన రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ (ఆర్ ఎస్ ఎస్), విశ్వహిందూ పరిషత్(వి హెచ్ పి) తదితర సంస్థలతో అనుబంధాన్ని కొనసాగిస్తూ వచ్చింది. ఏవో కొన్ని రాజకీయ దృక్పథాలు, విధాన స్వభావాలలో వైవిధ్యాలు మినహా, బిజెపికి తన పూర్వపు జనసంఘ్ ఎంతో సామీప్య అనుబంధం ఉంది.

జనసంఘ్ తన అస్థిత్వాన్ని రద్దు చేసుకొని, 1977 మే ఒకటో తేదీన జనతా పార్టీలో విలీనమైంది. అయితే కొంతకాలం తరువాత జనతాపార్టీలో చీలిక రావడంతో, పూర్వపు జనసంఘ్ నాయకులు, సభ్యులు కొద్దిమందితో కలిసి జనతా పార్టీని విడిచిపెట్టి, భారతీయ జనతా పార్టీ పేరుతో కొనసాగుతున్నారు.

ప్రశ్న 6.
భారతదేశంలో ప్రాంతీయ పార్టీల ప్రాధాన్యతను అంచనా వేయండి. [Mar. 17]
జవాబు:
అనేక ప్రాంతీయ పార్టీలు గణనీయమైన ప్రజా ఎన్నికల మద్దతుతో ముఖ్య రాజకీయ సంస్థలుగా సుస్థిరంగా కొనసాగుతున్నాయి. భారతదేశ సమాఖ్య ప్రజాస్వామిక రాజకీయ వ్యవస్థలో ప్రాంతీయపార్టీలు, స్థానిక పార్టీలు ఎంతో ఆవశ్యకంగా కొనసాగుతున్నాయి. ప్రధానంగా కొన్ని ఆధిపత్య, సాంఘిక, ఆర్థిక ప్రయోజనాల కోసం ఇవి తప్పనిసరి అవుతాయి. రాజకీయపార్టీలలో విస్తృతస్థాయి పాత్ర విషయంలో చాలా పార్టీలకు ప్రయోజిత వర్గాలు, ప్రభావ వర్గాల వలె సమరూప లక్షణాలు ఉంటాయి. జాతీయపార్టీలు నడిపే విస్తృత పాత్ర నేపథ్యంలో ప్రాంతీయపార్టీల ప్రభావం కొన్నిసార్లు ప్రభావవంతంగా, మరికొన్నిసార్లు బలహీనంగా ఉంటుంది. అనేక ప్రాంతీయపార్టీలు రాష్ట్ర ప్రభుత్వాల ఏర్పాటులో జాతీయపార్టీలకు సంకీర్ణ భాగస్వాములయ్యాయి. కొన్ని ప్రాంతీయ పార్టీలు స్థిరంగా ఉండి, కొన్ని రాష్ట్రాల్లో ప్రధాన రాజకీయ సంస్థలుగా పనిచేస్తున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా, పెరుగుతున్న ప్రాంతీయ పార్టీల మనుగడ నిస్సందేహంగా, భారతదేశంలో ఒక విశిష్ట రాజకీయ పరిణామానికి చెందిన అంశంగా పేర్కొనవచ్చు.

ప్రశ్న 7.
ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీపై ఒక సంక్షిప్త సమాధానం వ్రాయండి.
జవాబు:
1983వ సంవత్సరములో ఆకస్మాత్తుగా రాష్ట్ర రాజకీయ చిత్రపటంలో గణనీయమైన మార్పు వచ్చింది.
ఎన్.టి.రామారావు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ నూతన ప్రాంతీయ రాజకీయపార్టీగా ఆవిర్భవించింది. అప్పటికే కలతలతో, ముఠాలతో విడిపోయి ఉన్న కాంగ్రెస్ పార్టీని ఎన్నికల్లో మట్టి కరిపించింది. ఎన్. టి. రామారావు తెలుగు చలనచిత్ర రంగంలో ప్రఖ్యాత కథానాయకునిగా ఎంతో పేరు ప్రతిష్టలు గడించాడు. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఒక వేగుచుక్కవలె దూసుకురావడానికి ఎన్నో అంశాలు తోడ్పడ్డాయి. కాంగ్రెస్ పార్టీ ఎంతోకాలం అధికారంలో ఉండి అసమర్థతతో వ్యవహరించడంతో సామాన్య ప్రజల విశ్వసనీయతను కోల్పోయింది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను సరిగా నిర్వహించలేకపోవడం, ద్రవ్యోల్బణం, పెరుగుతున్న నిరుద్యోగాన్ని పట్టించుకోకపోవడం, పరిపాలన వ్యవస్థలో అన్ని స్థాయిల్లో అవినీతి వంటి అంశాలు ఆ పార్టీ పతనానికి దారితీసాయి. దీనికితోడు, తరచుగా ముఖ్యమంత్రుల మార్పుతో రాష్ట్రంలో నాయకత్వ శూన్యత ఏర్పడింది. ముఖ్యమంత్రులు, రాష్ట్ర మంత్రిమండలి కాంగ్రెస్ అధినాయకత్వం చేతిలో ఆట బొమ్మలుగా మారారు. దాంతో జాతీయ స్థాయిలో రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించి, ప్రాతినిధ్యం వహించే సామర్థ్యం రాష్ట్ర కాంగ్రెస్ నాయకులలో లేదనే అభిప్రాయం ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. ఆంధ్రుల ఆత్మగౌరవం దెబ్బతిందనే విషయాన్ని తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారంలో చాటి చెప్పింది.

AP Inter 2nd Year Civics Study Material Chapter 12 రాజకీయ పార్టీలు

2014లో జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 14వ శాసనసభ ఎన్నికలలో ఆ పార్టీ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో 174 స్థానాలకు 102 స్థానాలు సాధించి ప్రభుత్వాన్ని ఏర్పరచింది. శ్రీనారా చంద్రబాబునాయుడు విభజించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి అయ్యాడు.

ప్రశ్న 8.
తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అవతరణకు తోడ్పడిన పరిస్థితులను అంచనా వేయండి.
జవాబు:
ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షలు ప్రజల్లో సజీవంగా ఉన్నప్పటికీ, వాటిని నెరవేర్చే రీతిలో తీవ్రస్థాయిలో పోరాటం చేసే వేదిక అవతరించడానికి ఎంతో సమయం పట్టింది. 1990 దశకం మధ్యభాగంలో అనేక ప్రజాసంఘాలు, సంస్థలు ప్రత్యేక రాష్ట్ర అంశంపై సమావేశాలు ఏర్పాటు చేయడం మొదలుపెట్టాయి.

ఇదే తరుణంలో తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడు, మాజీమంత్రి డిప్యూటీ స్పీకర్గా ఉన్న సిద్దిపేట శాసనసభ్యుడు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్రావు, ఆనాడు నారా చంద్రబాబునాయుడు పెంచిన విద్యుత్ బిల్లులకు వ్యతిరేకంగా ఒక బహిరంగ లేఖ రాసినాడు. దానిలో పెంచిన విద్యుత్ బిల్లుల వలన తెలంగాణా ప్రాంత ప్రజలు, రైతులకు 80% తీవ్ర అన్యాయం జరుగుతుందని ఎదురు తిరుగుబాటుచేసి తెలంగాణావాదులకు కేంద్ర బిందువుగా మారినాడు. తెలంగాణావాదులు మేధావులు అందరూ తెలంగాణాకు జరుగుతున్న వివక్ష గురించి వివరించటం జరిగింది. దీనితో తెలంగాణా బలం గ్రహించిన కె.సి.ఆర్, కొన్ని వందల గంటలపాటు వివిధ వర్గాల వారితో చర్చించి తెలంగాణా రాష్ట్రమే ఏకైక ఎజెండాగా T.R.S. పార్టీ ఆవిర్భావానికి పునాది వేసినాడు.

కల్వకుంట్ల చంద్రశేఖరరావు (KCR) తెలంగాణ రాష్ట్ర సాధన అంశంపై 2000 సంవత్సరం మొదట్లో తన ప్రయత్నాలను ప్రారంభించాడు. 2001 మే నెల 17వ తేదీన కె. చంద్రశేఖరరావు తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటుచేసుకున్నట్లు ప్రకటించాడు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ మద్ధతును కె. చంద్రశేఖరరావు పొందాడు. 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో టి.ఆర్.ఎస్ (TRS) పార్టీ భారత జాతీయ కాంగ్రెస్తో మైత్రి ఏర్పరచుకొని తెలంగాణలో 26 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించడమే కాక, జాతీయ స్థాయిలో 5 పార్లమెంటు స్థానాల్లో విజయం పొందింది. అలాగే రాష్ట్రస్థాయిలో, కేంద్రంలో టి.ఆర్.ఎస్. (TRS) పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వంతో చేరింది. 2006 సెప్టెంబర్ నెలలో టి.ఆర్.ఎస్ (TRS) పార్టీ కేంద్ర ప్రభుత్వం నుండి వైదొలిగింది. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు విషయంలో ఎన్నికల వాగ్దానానికి అనుగుణంగా కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకోలేకపోవడాన్ని కారణంగా చూపి కేంద్రప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంది.

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
రాజకీయ పార్టీ విధులు. [Mar. ’17]
జవాబు:
రాజకీయ పార్టీ విధులు:

  1. సామాజిక ప్రయోజనాల సమీకరణ, వ్యక్తీకరణ,
  2. రాజకీయ భర్తీ బాధ్యతలు,
  3. ప్రజాభిప్రాయ సాధనాలుగా పనిచేయడం,
  4. రాజకీయ సామాజికీకరణ, పౌరుల భాగస్వామ్యాన్ని పెంపొందించటం.
  5. శాసనాలను రూపొందించటం,
  6. ప్రతిపక్ష పాత్రను పోషించటం,
  7. ప్రభుత్వ యంత్రాంగం, సంక్షేమ పథకాలను అమలుచేయటం,
  8. రాజకీయ వ్యవస్థకు న్యాయబద్ధతను చేకూర్చటం మొదలగునవి.

ప్రశ్న 2.
పార్టీ వ్యవస్థ రకాలు.
జవాబు:
పార్టీ వ్యవస్థను ముడు రకాలుగా పేర్కొంటారు. అవి:
1) ఏకపార్టీ వ్యవస్థ: ఈ వ్యవస్థలో ఒకే రాజకీయ పార్టీ ఉంటుంది.
ఉదా: జర్మనీలో నాజీ పార్టీ, ఇటలీలో ఫాసిస్ట్ పార్టీ.

2) రెండు పార్టీల వ్యవస్థ: ఈ వ్యవస్థలో రెండు రాజకీయ పార్టీలుంటాయి. ఉదా: ఇంగ్లాండులో లేబర్ పార్టీ మరియు కన్సర్వేటివ్ పార్టీలు.

3) బహుళ పార్టీ వ్యవస్థ: ఈ వ్యవస్థలో ఎక్కువ పార్టీలు ఉంటాయి. ఉదా: భారతదేశం, ఫ్రాన్స్

AP Inter 2nd Year Civics Study Material Chapter 12 రాజకీయ పార్టీలు

ప్రశ్న 3.
జాతీయ పార్టీలు.
జవాబు:
జాతీయ స్థాయిలో దేశమంతటా విస్తరించి జాతీయ అజెండాను రూపొందించుకొని రాజ్యాంగ పద్ధతుల ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు నిరంతరం కృషిచేసే ప్రజల స్వచ్ఛంద సంస్థ లేదా సమూహాన్ని జాతీయ పార్టీగా పేర్కొంటారు.
ఉదా: భారతదేశంలో కాంగ్రెస్, జనతాపార్టీ, భారత కమ్యూనిస్టు పార్టీ, భారతీయ జనతా పార్టీ మొదలగునవి.

ప్రశ్న 4.
ప్రాంతీయ పార్టీలు. [Mar. ’16]
జవాబు:
ప్రాంతీయ పార్టీలు భౌగోళిక, రాజకీయ, హేతుబద్ధమైన అంశాల ప్రాతిపదికగా అవతరిస్తాయి. సమాఖ్య వ్యవస్థలో జాతీయ పార్టీల నాయకుల ఆధిపత్య, సిరంకుశ ధోరణి, ప్రాంతీయ, రాష్ట్ర సమస్యలను నిర్లక్ష్యం చేయటం. రాష్ట్రస్థాయి నాయకశ్రేణిని అగౌరవపరచటం, అవమానించటం తదితర కారణాలు ప్రాంతీయ పార్టీల ఆవిర్భావానికి ముఖ్య కారణాలుగా చెప్పవచ్చు. ప్రాంతీయ పార్టీలు ఒక రాష్ట్రానికి పరిమితంగా తమ కార్యకలాపాలను కొనసాగిస్తాయి.
ఉదా: తెలుగుదేశం, తెలంగాణ రాష్ట్ర సమితి, ద్రవిడ మున్నేట్ర కజగం, ఆల్ ఇండియా అన్నా డి.ఎం.కె. మొదలగునవి.

ప్రశ్న 5.
డి.ఎం.కె.
జవాబు:
1949 వ సంవత్సరంలో సి. ఎస్. అన్నాదురై దాదాపు నాలుగింట మూడొంతులు అనుచర గణంతో ద్రవిడ కజగం నుండి వేరుపడి ద్రవిడ మున్నేట్ర కజగం (డి.ఎం.కె) అనే పార్టీని స్థాపించాడు. ఈ రాజకీయ పార్టీ తమిళుల గుర్తింపుపై దృష్టి నిలిపి, పార్టీ మౌళిక భావన అయిన బ్రాహ్మణ వ్యతిరేక వాదాన్ని చేపట్టింది. తరువాత ఎన్నికలలో క్రియాశీలంగా పాల్గొని తమిళనాడు రాష్ట్ర విధానసభలో బలీయమైన శక్తిగా అవతరించింది.

ప్రశ్న 6.
ఎ.ఐ.ఎ.డి.ఎం.కె.
జవాబు:
1972వ సంవత్సరంలో ఎం.జి. రామచంద్రన్ నాయకత్వంలో ఏర్పడిన అన్నా డి.ఎం.కె. పార్టీ తరువాత ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగంగా రూపాంతరం చెందింది. 1988వ సంవత్సరములో ఎం.జి. రామచంద్రన్ మరణం తరువాత ఎ.ఐ.ఎ.డి.ఎం.కె. పార్టీ జయలలిత నాయకత్వంలో బలపడి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పలుమార్లు ఘనవిజయం సాధించింది. నేడు ఆ పార్టీ నాయకురాలు కుమారి జయలలిత తమిళనాడు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు.

ప్రశ్న 7.
ఏకపార్టీ ఆధిపత్యం.
జవాబు:
స్వాతంత్ర్యానంతరం దేశరాజకీయాలలో కాంగ్రెస్ పార్టీ క్రియాశీల పాత్ర పోషించటంతో తరుచుగా భారతదేశాన్ని ఏకపార్టీ ఆధిపత్యం వ్యవస్థగా అభివర్ణించటం జరిగింది. ఈ పార్టీ సర్వసమ్మత పార్టీగా, అందరి సమీకృత ప్రయోజనాలే ముఖ్యంగా, భారతీయ సమాజానికి ప్రతిరూపంగా కాంగ్రెస్ పార్టీ జాతి ఆవశ్యక లక్షణాలన్నింటిని తనలో ప్రతిబింబించింది. అయితే కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం సంపూర్ణం కాదని కొద్దిమంది రాజకీయ విశ్లేషకులు పేర్కొంటారు.

ప్రశ్న 8.
బహుళ పార్టీ వ్యవస్థ. [Mar. ’16]
జవాబు:
దాదాపు ఒక భౌగోళిక ఖండం పరిమాణంలో విస్తరించిన దేశం. భిన్నభిన్న సంస్కృతుల స్వభావం, వయోజన ఓటుహక్కు విచిత్ర తరహా రాజకీయ ప్రక్రియ తదితర కారణాలు భారతదేశంలో బహుళ పార్టీ వ్యవస్థకు దారితీసినాయి. ప్రస్తుతం మన దేశంలో 6 జాతీయ పార్టీలు, 64 రాష్ట్రస్థాయి పార్టీలు, 1737 రిజిష్టర్ అయి గుర్తింపులేని పార్టీలు మన దేశంలో ఉన్నాయి.

AP Inter 2nd Year Civics Study Material Chapter 12 రాజకీయ పార్టీలు

ప్రశ్న 9.
బహుజన సమాజ్ పార్టీ.
జవాబు:
బహుజన సమాజ్ పార్టీ దళితులు ఆధిపత్యం కలిగిన పార్టీ. ఈ పార్టీ ఉద్యోగుల సమాఖ్య, దళిత్ శోషిత్ సమాజ్ సమితిల వీలినం ఫలితంగా ఏర్పడింది. కాన్షీరాం ఈ పార్టీ వ్యవస్థాపక నాయకుడు. మాయావతి ప్రస్తుతం ఈ పార్టీకి నాయకురాలుగా వ్యవహరిస్తున్నారు. ఈ పార్టీ భారత రాజకీయ వ్యవస్థలో జాతీయ పార్టీగా గుర్తింపు పొందింది. మాయావతి నాయకత్వంలో ఆ పార్టీ జనాకర్షణ క్రమేణా పెరుగుతూ వచ్చింది.

ప్రశ్న 10.
నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ.
జవాబు:
కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ అయిన శరద్ పవార్, పి.ఎ. సంగ్మా, తారిక్ అన్వర్ తదితరులు స్థాపించిన పార్టీయే నేషనలిస్ట్ కాంగ్రెస్. ఈ పార్టీ స్థాపన సమయంలో ఇండియన్ కాంగ్రెస్ (సోషలిస్ట్)ను తనలో విలీనం చేసుకుంది. భారత ఎన్నికల సంఘం నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీనీ జాతీయ పార్టీగా గుర్తించింది. మహారాష్ట్ర, మణిపూర్, మేఘాలయ మొదలగు రాష్ట్రాలలో ఈ పార్టీకి చెప్పుకోదగ్గ బలముంది.

AP Inter 2nd Year Civics Study Material Chapter 11 ఎన్నికలు – ప్రాతినిధ్యం

Andhra Pradesh BIEAP AP Inter 2nd Year Civics Study Material 11th Lesson ఎన్నికలు – ప్రాతినిధ్యం Textbook Questions and Answers.

AP Inter 2nd Year Civics Study Material 11th Lesson ఎన్నికలు – ప్రాతినిధ్యం

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
భారతదేశ ఎన్నికల వ్యవస్థపై ఒక వ్యాసం వ్రాయండి.
జవాబు:
పౌరులందరూ ప్రభుత్వం చేసే నిర్ణయాలన్నింటిలో ప్రత్యక్షంగా పాల్గొనే వీలులేదు. కాబట్టి ప్రజాప్రతినిధులు ప్రజలచే ఎన్నుకోబడి వారి కోరికలు, ఆకాంక్షలు నెరవేర్చుతారు. కావున ఎన్నికలకు విశేషమైన ప్రాధాన్యత ఉన్నది. భారతదేశం ఒక ప్రజాస్వామ్య దేశమని మనం అనుకున్నప్పుడు మన ఆలోచనలు గతంలో జరిగిన సార్వత్రిక ఎన్నికలవైపు మళ్ళుతాయి. నేడు ఎన్నికలు ప్రజాస్వామ్య ప్రక్రియకు ప్రతీకలుగా నిలిచాయి.

భారత ఎన్నికలవ్యవస్థ యొక్క ముఖ్య లక్షణాలు:
ఈ క్రింది ముఖ్యలక్షణాలు భారతదేశంలోని ఎన్నికల వ్యవస్థ యొక్క నిర్మాణాన్ని మరియు నిర్వహణను విశదీకరిస్తున్నాయి. అవి:
1) ప్రజాప్రతినిధుల ప్రత్యక్ష ఎన్నిక: భారతదేశంలోని ప్రజలు తమ ప్రజాప్రతినిధులను ప్రత్యక్షంగా ఎన్నుకొనుటకు రాజ్యాంగం వీలుకల్పించింది. పార్లమెంటు సభ్యులను, రాష్ట్ర శాసనసభలకు, పట్టణ, నగరపాలక సంస్థలు గ్రామ పంచాయితీ సభ్యులను ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకుంటున్నారు. భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈ శాసనసభలు ప్రజల అధికారానికి ముఖ్యకేంద్రాలు.

2) కొన్ని సంస్థలకు పరోక్ష ఎన్నికలు: రాజ్యసభ, రాష్ట్రాలవిధానమండలు, రాష్ట్రపతి మరియు ఉపరాష్ట్రపతి ఎన్నికలకు రాజ్యాంగం పరోక్ష ఎన్నికలకు అవకాశం కల్పించింది. ఆయా సంస్థలకు, పదవులకు పరోక్షంగా నైష్పత్తిక ప్రాతినిధ్య ఓటు పద్ధతిలో ఎన్నికలు నిర్వహించబడతాయి.

3) వయోజన ఓటు హక్కు: భారత రాజ్యాంగం పౌరులందరికి వయోజన ఓటుహక్కును కల్పించినది. 21 సంవత్సరములు నిండిన పౌరులందరికీ కుల, మత, జాతి, లింగవివక్షత లేకుండా ఓటుహక్కును కల్పించినది. ఆ తరువాత ఓటు హక్కుకు అర్హత వయస్సు 21 నుండి 18 సంవత్సరములకు తగ్గించడం జరిగినది. నేడు భారతదేశంలో 18 సంవత్సరములు నిండిన పౌరులందరి పేర్లు ఓటర్ల జాబితాలలో చేర్చబడి వారు స్వేచ్ఛగా తమ ఓటుహక్కు వినియోగించుకొనేందుకు అర్హత లభించింది.

4) షెడ్యూల్డ్ కులాలు, తెగలకు సీట్ల కేటాయింపులో ప్రాతినిధ్యం: షెడ్యూల్డ్ కులాలు, తెగల అభీష్టాన్ని పరిరక్షించేందుకు భారతరాజ్యాంగం వారికి పార్లమెంటు, శాసనసభ సీట్ల కేటాయింపులో ప్రత్యేక ప్రాతినిధ్యం కల్పించింది. రాజ్యాంగంలోని 330 ప్రకరణ లోక్సభలోని సీట్లు, 332 ప్రకరణ రాష్ట్రశాసనసభలలోని సీట్లు కేటాయింపులో ఆయాతరగతులకు ప్రాతినిధ్యం కల్పించాలని పేర్కొన్నది. వారికి కేటాయించిన స్థానాలలో ఆయా తెగలకు చెందిన అభ్యర్థులు మాత్రమే పోటీ చేయాలి.

AP Inter 2nd Year Civics Study Material Chapter 11 ఎన్నికలు - ప్రాతినిధ్యం

5) నియామకపు ప్రతిపాదనలు: భారతరాజ్యాంగంలోని 337 ప్రకరణం పార్లమెంటులోని లోక్సభకు రాష్ట్రపతి ఇద్దరు ఆంగ్లో ఇండియన్లను నియమించి చెయ్యవచ్చును. ఇదే పద్ధతిలో గవర్నర్ రాష్ట్రశాసన సభకు ఒక ఆంగ్లో ఇండియన్ను నియమించే అధికారం ఉంది.

6) ఓటరు జాబితాల సవరణ: భారతదేశంలో ప్రతి 10 సంవత్సరాలకు ఒక సారి ఓటర్లనమోదు, ఓటరు జాబితాల సవరణ, తయారీ ప్రక్రియలను భారత ఎన్నికల సంఘం చేపడుతుంది. అంతేగాక ప్రతిసాధారణ ఎన్నికలకు ముందుగా ఎన్నికల జాబితాల సవరణ, కొత్త ఓటర్ల నమోదు కార్యక్రమాలకు ఎన్నికల సంఘం ఆదేశిస్తుంది. ప్రతి ఏడాది ఓటరు జాబితాల సవరణకు కూడా అవకాశం ఉన్నది. ఓటరు జాబితాలో ఎవరి పేరు నమోదు కాబడిందో వారు మాత్రమే ఎన్నికల తేదీన ఓటు హక్కు వినియోగించుకొనేందుకు అర్హులు.

7) ప్రాదేశిక, ఏక సభ్య నియోజకవర్గాలు: భారత ఎన్నికల వ్యవస్థ ఏక సభ్య ప్రాదేశిక నియోజకవర్గాల ఏర్పాటుకు అవకాశం కల్పించింది. నిర్దేశించబడిన ప్రతిపాదిత ప్రాంతంలో నివశించే ఓటర్లు అందర్నీ కలిపి ఒక నియోజకవర్గంగా పరిగణిస్తారు. ఇలాంటి ఒక నియోజకవర్గం నుండి ఒకే ప్రతినిధిని ఓటర్లు ఎన్నుకోవలసి ఉంటుంది. దేశంలోని అన్ని రాష్ట్రాలూ శాసన, పార్లమెంటు నియోజకవర్గాలుగా విభజించబడ్డాయి. ప్రతీ నియోజకవర్గం నుండి ఒక శాసనసభ్యుడ్ని, పార్లమెంటు సభ్యుడ్ని ఓటర్లు ఎన్నిక చేసుకుంటారు. వీటిలో కొన్ని నియోజకవర్గాలు షెడ్యూలు కులాలు, తెగలకు కేటాయిస్తారు. `ఆయా నియోజకవర్గాలలో ఆ తెగలకు, కులాలకు చెందిన అభ్యర్థులను మాత్రమే ఎన్నిక చేసుకోవాలి.

8) నియోజకవర్గాల పునర్విభజన: ప్రతి పది సంవత్సరములకు జనాభాలెక్కల ఆధారంగా నియోజకవర్గాలు పునర్విభజన చేయబడుతాయి. దీనికొరకు నియోజ వర్గాల పునర్విభజన సంఘం ఏర్పాటు చేయబడుతుంది. ఈ సంఘం ప్రతిపాదనల మేరకు నియోజకవర్గాలు పునర్విభజన చేయబడవచ్చు లేదా ఒకదానిలో ఒకటి కలపవచ్చు. ఈ విషయంలో నియోజకవర్గాల పునర్విభజన సంఘం నిర్ణయమే అంతిమం. ఈ సంఘం యొక్క నిర్ణయాన్ని ఏ న్యాయస్థానంలోనూ సవాలు చేయుటకు వీలులేదు.

9) రహస్య బ్యాలెట్ పద్ధతి: ఓటర్లు ఓటును స్వేచ్ఛగా తమ అభీష్టం మేరకు వినియోగించుకొనేందుకు రహస్య ఓటింగుకు వీలు కల్పించింది. ఎన్నికలలో ఓటర్లు తమ ఓటుహక్కును నిర్భయంగా, రహస్యంగా వినియోగించుకొనేందుకు, దొంగ ఓట్లు వేసేవారిని గుర్తించేందుకు ప్రత్యేకమైన చర్యలు, తీసుకున్నారు. ఇటువంటి విధానం ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు చాలా అవసరం.

10) ఓటింగు యంత్రాలను ప్రవేశపెట్టడం: భారత ఎన్నికల సంఘం ఎన్నికలలో ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకొనేందుకు, ఓట్ల లెక్కింపుకు ఓటింగు యంత్రాలను ప్రవేశపెట్టింది. వీటిని ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు అంటారు. ఓటింగులో బ్యాలెట్ పత్రాలకు బదులుగా ఓటింగు యంత్రాలను వినియోగించడమైంది.

11) పరస్పర ఆధిక్యత ఓటు పద్ధతి: ప్రతీ నియోజకవర్గంలోనూ ఎన్నికలలో తోటి అభ్యర్థుల కన్నా ఎక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థిని ఎన్నిక కాబడిన ప్రజాప్రతినిధిగా ప్రకటిస్తారు. ఈ పద్ధతిలో ఓట్ల లెక్కింపుకు అర్హత కల్గిన ఓట్లను మాత్రమే పరిగణనలోనికి తీసుకుంటారు. ఒక అభ్యర్థి విజయాన్ని ఆ అభ్యర్థితో పోటీపడిన అభ్యుర్థులకు వచ్చిన ఓట్లకన్నా ఎక్కువగా వచ్చిన ఓట్లను బట్టి నిర్దేశింపబడుతుంది. అంటే తోటి అభ్యర్థుల కన్నా ఏ అభ్యర్థికైతే ఎక్కువ ఓట్లు పోలౌతాయో ఆ అభ్యర్థి గెలుపొందినట్లు లెక్క

2) స్వయంప్రతిపత్తి కలిగిన యంత్రాంగం: రాజ్యాంగంలోని 324 ప్రకరణ ప్రకారం దేశంలోని ఎన్నికల నిర్వహణ భారత ఎన్నికల సంఘం యొక్క ముఖ్యబాధ్యత. ఎన్నికలను స్వతంత్రంగా, స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు రాజ్యాంగబద్ధంగా ఏర్పాటు చేయబడిన స్వయంప్రతిపత్తి కలిగిన రాజ్యాంగ వ్యవస్థ భారత ఎన్నికల సంఘం.

ప్రశ్న 2.
భారత ఎన్నికల సంఘం విధులను వివరించండి.
జవాబు:
భారత రాజ్యాంగంలోని ప్రకరణ 324(1) ప్రకారం పార్లమెంటు, రాష్ట్ర శాసనసభలు, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతులకు సంబంధించిన ఎన్నికలను పర్యవేక్షించి, నిర్వహించుటకై ఎన్నికల సంఘం ఏర్పాటు కొరకు వీలుకల్పించాయి.

భారత ఎన్నికల సంఘం రాజ్యాంగబద్ధంగా ఏర్పాటు చేయబడిన శాశ్వతమైన స్వయం ప్రతిపత్తి కలిగిన వ్యవస్థ. నిర్మాణం: భారత ఎన్నికల సంఘం ఒక ప్రధాన ఎన్నికల కమీషనర్ మరియు ఇద్దరు ఎన్నికల కమీషనర్లను కలిగి బహుళ సభ్య వ్యవస్థగా పనిచేయుచున్నది.

నియామకం: ప్రధాన ఎన్నికల కమీషనర్ మరియు ఇతర కమీషనర్లను భారత రాష్ట్రపతి నియమిస్తారు. పదవీకాలం: భారత ప్రధాన ఎన్నికల కమీషనర్ మరియు ఇద్దరు ఎన్నికల కమీషనర్లు 6 సంవత్సరములు లేదా 65 సంవత్సరమలు వయస్సు నిండే వరకు పదవిలో కొనసాగుతారు.

ఎన్నికల సంఘం విధులు: భారత రాజ్యాంగంలోని 324 నుండి 328 వరకు గల ప్రకరణలు ఎన్నికల సంఘం యొక్క ఏర్పాట్లు, అధికారాలు, విధులను విశదీకరిస్తున్నాయి. అవి.

  1. భారత ఎన్నికల సంఘం నిర్ణీత కాలవ్యవధిలో ఓటర్ల జాబితాలను సవరిస్తుంది.
  2. ఓటర్ల జాబితాలు నమోదు చేయబడ్డ అర్హత కలిగిన ఓటర్ల పేరులో తప్పులు లేకుండా తయారుచేయటం ఎన్నికల సంఘం విధి.
  3. ఎన్నికల నిర్వహణకు ఎన్నికల తేదీ, ఇతర వివరాలతో ఎన్నికల ప్రకటన, అభ్యర్థుల నామినేషన్ పత్రాల పరిశీలన కూడా నిర్వహిస్తుంది.
  4. ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు తగిన నిర్ణయాలు తీసుకునే అధికారం ఉంది.
  5. ఎన్నికల నిర్వహణ, ప్రశాంతతకు భంగం కలిగినట్లయితే దేశం మొత్తం ఎన్నికలను, లేదా కొన్ని రాష్ట్రాలలో లేదా రాష్ట్రంలో, కొన్ని నియోజకవర్గాలు లేదా నియోజకవర్గంలో ఎన్నికలను రద్దు చేయవచ్చు లేదా వాయిదా వేయవచ్చును.
  6. పార్టీలకు, ఎన్నికలలో పోటీచేయు అభ్యర్థులకు ఎన్నికల నియమావళిని వర్తింపచేస్తుంది.
  7. ఏదో ఒకటి లేదా కొన్ని నియోజకవర్గాలలో తిరిగి ఎన్నికల నిర్వహణకు ఆజ్ఞలు జారీ చేయవచ్చును.
  8. ఎన్నికల లెక్కింపు ప్రక్రియ సవ్యంగా జరగలేదని భావిస్తే ఎన్నికల సంఘం తిరిగి ఓట్ల లెక్కింపునకు ఆదేశించవచ్చును.
  9. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీకి ఎన్నికల గుర్తులు కేటాయించటం, రాజకీయ పార్టీలకు గుర్తింపునివ్వటం ఎన్నికల సంఘం ముఖ్యవిధి.
  10. రాష్ట్రపతి పాలన సమయంలో రాష్ట్రాలలో ఎన్నికల నిర్వహణకు రాష్ట్రపతికి ఎన్నికల సంఘం సలహాలనిస్తుంది.
  11. రాష్ట్ర శాసనసభలో సభ్యుల అర్హత లేదా అనర్హత విషయాలలో రాష్ట్ర గవర్నర్కు సలహాలిస్తుంది.

ప్రశ్న 3.
ప్రాతినిధ్యం అనగానేమి ? భారతదేశంలో ఎన్ని రకాల ప్రాతినిధ్య వ్యవస్థలు ఉన్నాయో తెలపండి.
జవాబు:
ప్రాతినిధ్యం – అర్థం: ఆధునిక ప్రజాస్వామ్య దేశాలు ప్రజలచే ఎన్నుకోబడిన ప్రతినిధులచే ఏర్పడిన ప్రాతినిధ్య లేదా పరోక్ష ప్రజాస్వామ్య దేశాలుగా కొనసాగుతున్నాయి. ఆధునిక ప్రజాస్వామ్య దేశాలు ప్రత్యక్ష ప్రజాస్వామ్య లేదా |ప్రాతినిధ్య ప్రజాస్వామ్య ప్రభుత్వాలను కలిగి ఉంటున్నాయి. ఇలాంటి వ్యవస్థలో ప్రజలు తమకు బదులుగా శాసనాల తయారీ కొరకు ప్రతినిధులను ఎన్నుకుంటారు. ఈ ప్రతినిధులు శాసనసభలో ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తారు. భారతదేశంలో అమలులో ఉన్న ప్రాతినిధ్య వ్యవస్థలు:

AP Inter 2nd Year Civics Study Material Chapter 11 ఎన్నికలు - ప్రాతినిధ్యం

భారతదేశంలో రెండు రకాల ప్రాతినిధ్య వ్యవస్థలు లేదా పద్ధతులు ఉన్నాయి. అవి:

  1. ప్రాదేశిక ప్రాతినిధ్య పద్ధతి
  2. వృత్తి ఆధారిత ప్రాతినిధ్య పద్ధతి.

1) ప్రాదేశిక ప్రాతినిధ్య పద్ధతి: ప్రాదేశిక ప్రాతినిధ్య పద్ధతిలో దేశంలోని ఓటరులందరినీ వివిధ ప్రాదేశిక నియోజకవర్గాలుగా విభజించి, ప్రతి నియోజకవర్గం నుండి ఒకరు లేదా అంతకన్నా ఎక్కువ ప్రతినిధులను ఓటర్లు ఎన్నుకుంటారు. అన్ని ప్రాదేశిక నియోజకవర్గాలు దాని పరిమాణంలోగాని, జనాభా సంఖ్యలో గాని సుమారుగా ఒకే విధంగా ఉంటాయి. నియోజకవర్గంలో నివసించే ఓటరులందరూ తమ ప్రజాప్రతినిధి ఎన్నికప్రక్రియలో భాగస్వామ్యులౌతారు. ప్రాదేశిక నియోజకవర్గం నుండి ఒకే ప్రజాప్రతినిధి ఎన్నిక కాబడితే అది ఏకసభ్య నియోజకవర్గంగా పరిగణిస్తారు. అలాకాక ఒక నియోజక వర్గం నుండి ఒకరికన్నా ఎక్కువమంది ప్రతినిధులు ఎన్నికైతే దానిని బహుళ సభ్య నియోజక వర్గం అంటారు. భారతదేశం లాంటి ఆధునిక ప్రజాస్వామ్య దేశాలలో దిగువసభ సభ్యుల ఎంపిక కొరకు ఏకసభ్య ప్రాదేశిక నియోజకవర్గ పద్దతిని అనుసరిస్తున్నారు.

2) వృత్తి ఆధారిత ప్రాతినిధ్య పద్ధతి: పౌరులు చేసే వృత్తుల ఆధారంగా ఇటువంటి నియోజకవర్గాలు ఏర్పాటవుతాయి. ఇటువంటి నియోజకవర్గాలలో పౌరులు ఒకే రకమైన వృత్తి లేదా సమాన లక్షణాలు కలిగిన వృత్తులలో నిమగ్నమై ప్రాదేశిక ప్రాంతంలో నివాసముంటారు. వైద్యులు, వ్యవసాయదారులు, వ్యాపారులు, పత్రికా విలేకరులు, న్యాయవాదులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు, శ్రామికులు తదితరులు వివిధ రకాల వృత్తి సంఘాల్ని కలిగి ఉంటారు. ఒకే వ్యక్తి అన్ని రకాల వృత్తులకు ప్రాతినిధ్యం వహించలేడు కనుక వృత్తి లేదా పని ఆధారంగా ప్రాతినిధ్యం ఉండాలి. ఇక చట్టసభలు వివిధ రకాల వృత్తుల సమూహాలకు ప్రాతినిధ్యం వహిస్తే, ఆ సభ వివిధ రకాల ప్రజాభీష్టాన్ని ప్రతిబింబిస్తూ వాటిని వ్యక్తీకరిస్తుంది. కాని అసంఖ్యాకమైన వృత్తులు, పనులను నిర్వహిస్తున్న అపరిమితమైన సమూహాలున్న దేశంలో అన్ని వృత్తుల వారికి, సమూహాలకు ప్రాతినిధ్యం కల్పించటం సాధ్యం కాదని చెప్పవచ్చు.

ప్రశ్న 4.
భారత ఎన్నికల వ్యవస్థను సంస్కరించాల్సిన అవసరం ఉందని నీవు భావిస్తున్నావా ?
జవాబు:
భారతదేశంలో ఎన్నికల వ్యవస్థ, యంత్రాంగం, ఎన్నికల ప్రక్రియలను పరిశీలించి సంస్కరణలను ప్రతిపాదించుటకై అనేక కమిటీలు, కమిషన్లను భారత ప్రభుత్వం నియమించింది. అందులో కొన్నింటిని క్రింద పేర్కొనడం జరిగింది.

  1. 1974 తార్కుండై కమిటీని నియమించగా అది 1975లో తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది.
  2. 1990లో ఎన్నికల సంస్కరణల కొరకు దినేష్ గోస్వామి కమిటీని నియమించడమైంది.
  3. రాజకీయాలు, నేరాల మధ్య సంబంధాల అధ్యయనం కోసం 1993 సంసత్సరంలో ఓహ్రా కమిటీ నియామకం జరిగింది.
  4. ఎన్నికలలో రాజకీయ నిధుల అధ్యయనం కొరకు 1998 సంవత్సరంలో ఇంద్రజిత్ గుప్తా కమిటీ నియమించబడింది.

ఎన్నికల సంస్కరణలు:
పైన పేర్కొన్న వివిధ కమిటీలు ఎన్నికల సంస్కరణల కొరకు అనేక సూచనలు, సంస్కరణలు ప్రతిపాదించాయి. వాటిలో ముఖ్యమైనవిగా ఈ క్రింది వాటిని పేర్కొనవచ్చు. అవి.
1) ఓటు అర్హత వయస్సు తగ్గింపు:
ప్రాతినిధ్యం లేని యువతకు ఓటుహక్కు కల్పించేందుకు రాజ్యాంగం (61వ సవరణ) చట్టం 1998 ద్వారా ఓటుహక్కు వయస్సును 21 సంవత్సరాల నుండి 18 సంవత్సరాలకు తగ్గించడమైంది.

2) ఎన్నికల సంఘానికి ఉద్యోగుల బదిలీ: ఎన్నికల సమయాలలో ఓటర్ల జాబితా తయారీ, సవరణ మరియ తప్పులు సరిదిద్దడం వంటి విధుల నిర్వహణకు అధికారులు మరియు ప్రభుత్వ సిబ్బందికి 1988 నుండి ఎన్నికల సంఘంకు తాత్కాలికంగా బదిలీ చేయడమైంది. ఆ ఉద్యోగులు ఎన్నికల సమయాలలో ఎన్నికల సంఘం నియంత్రణ, పర్యవేక్షణా పరిధిలో ఉంటారు.

3) ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు:
ఎన్నికలలో ఎలక్ట్రానిక్ ఓటింగు యంత్రాలను (Electronic Voting Machines) వినియోగించేందుకు 1989లో అవకాశం కల్పించుట జరిగినది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఢిల్లీ శాసనసభ ఎన్నికల కొరకు 1998 సంవత్సరంలో మొట్టమొదట ప్రయోగాత్మకంగా కొన్ని నియోజక వర్గాలలో ఎలక్ట్రానిక్ ఓటింగు యంత్రాలు ఉపయోగించడమైంది. దేశం మొత్తానికి 1999 సాధారణ ఎన్నికలలో మొదటిసారిగా ఎలక్ట్రానిక్ ఓటింగు యంత్రాలను ఉపయోగించుట జరిగినది.

4) మద్యం అమ్మకాలపై నిషేధం:
ఫలహార లేదా భోజనశాలలో గాని, ప్రభుత్వ ప్రయివేటు ప్రదేశాలలో గాని ఎన్నికల గడువు ముగియడానికి 48 గంటల ముందునుండి మద్యంగాని లేదా ఇతర మత్తుపానీయాలు గాని విక్రయించుట, పంపిణీ చేయుట, ఓటర్లకు అందించుట చేయరాదు. ఎవరైనా ఈ నిబంధన అతిక్రమించినట్లయితే వారు శిక్షార్హులుగా పరిగణించబడి శిక్షించబడటం జరుగుతుంది.

5) అభ్యర్థులు రెండు నియోజక వర్గాలలో పోటీకి పరిమితం చేయటం:
సాధారణ ఎన్నికలు లేదా ఉపఎన్నికలలో పార్లమెంటు, శాసనసభ నియోజకవర్గాలలో ఒకేసారి రెండు నియోజకవర్గాల కంటే ఎక్కువ నియోజకవర్గాలలో అభ్యర్థులు పోటీ చేయరాదు. ఇదే తరహా పరిమితి రాజ్యసభ, శాసనమండలి ఎన్నికలలో కూడా వర్తిస్తుంది.

6) ఆయుధాలపై నిషేధం:
పోలింగు కేంద్రం సమీపంలో గాని, పోలింగు కేంద్రం లోపలికి గాని ఏ రకమైన ఆయుధాలతో ఎవరు ప్రవేశించరాదు లేదా సంచరించరాదు. అలా చేసినచో అది నేరంగా పరిగణిస్తూ రెండు సంవత్సరాల జైలుశిక్ష లేదా కొంత మొత్తం అపరాధ రుసుము లేదా రెండూ విధించవచ్చును. అంతేగాక ఆ ఆయుధానికి సంబంధించిన లైసైన్సు కూడా రద్దు చేయబడుతుంది.

AP Inter 2nd Year Civics Study Material Chapter 11 ఎన్నికలు - ప్రాతినిధ్యం

7) ఎన్నికల ప్రచార సమయం కుదింపు:
ఎన్నికలలో పోటీచేయు అభ్యుర్థుల నామినేషన్ పత్రాల ఉపసంహరణ గడుపునుండి పోలింగు తేది మధ్యగల కనీస వ్యవధి 20 రోజుల నుండి 14 రోజులకు కుదించడమైంది.

8) పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్:
కొందరు వ్యక్తులు తమ ఓటును పోస్టల్ బ్యాలెట్ ద్వారా వినియోగించేందుకు అవకాశం 1999 సంవత్సరంలో కల్పించబడింది. ఎన్నికల సంఘంచే గుర్తించబడిన కొన్ని వర్గాల వ్యక్తులు తమ ఓటుహక్కును సంబంధిత నియోజకవర్గాల ఎన్నికలలో పోస్టల్ బ్యాలెట్ ద్వారా మాత్రమే వినియోగించుకోవాలి.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ఎన్నికల విధులపై లఘటీక రాయండి.
జవాబు:
ఎన్నికల విధులు: ఎన్నికల విధులను నాలుగు రకాలుగా వర్గీకరించారు. అవి 1) రాజకీయ ఎంపిక 2) రాజకీయ భాగస్వామ్యం 3) మద్దతును అందించడం, కొనసాగించడం 4) అనుబంధ విధులు.

1) రాజకీయ ఎంపిక:
ఎన్నికలను ప్లెబిసైట్, రిఫరెండం లేదా ప్రజానిర్ణయం వంటి వాటిని వివరించడానికి ఉపయోగిస్తారు. ఎన్నికలు ప్రజలు తమ నాయకుల్ని ఎన్నిక చేసుకొనేందుకు, జనేచ్ఛను నిర్ణయించడానికి ఎన్నికలు కీలకమైన సాధనాలుగా ఉంటాయి. అధికారం చట్టబద్ధంగా బదలాయించడానికి, శాంతిని పరిరక్షించడానికి ఎన్నికలు సహాయపడతాయి.

2) రాజకీయ భాగస్వామ్యం:
ఎన్నికల అతిపెద్ద విధి ప్రజలకు రాజకీయ భాగస్వామ్య అవకాశాల్ని, మార్గాల్ని కల్పించడం, ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల రాజకీయ భాగస్వామ్యం అతిముఖ్యమైనది. కావున ఎన్నికలకు ఇది కేంద్రబిందువు. ప్రజల భాగస్వామ్యమే ప్రజాస్వామ్య వ్యవస్థకు బలం.

3) నిర్మాణ సహకారం – వ్యవస్థ నిర్వహణ:
ఒక రాజకీయ వ్యవస్థకు ఎన్నికలు చట్టబద్ధతను, రాజకీయ స్థిరత్వాన్ని, సమైక్యతను, గుర్తింపును కల్పించటం ద్వారా సహకరిస్తాయి. కాబట్టి ఎన్నికలు రాజకీయ వ్యవస్థ సహాయం అందించేవి మాత్రమేగాక దానిని నియంత్రించగలిగే కారకంగా చెప్పవచ్చును.

4) అనుబంధ విధులు:
ప్రభుత్వానికి మరియు ప్రజలకు మధ్య రాజకీయ సమాచారాన్ని అందించే ముఖ్యప్రతినిధులు ఎన్నికలే. ప్రజలు తమ రాజకీయ ప్రతినిధులతో ప్రత్యక్ష సంబంధాన్ని కలిగి ఉండేందుకు ఎన్నికలు దోహదపడతాయి.

ప్రశ్న 2.
భారత ఎన్నికల ప్రక్రియను గూర్చి చర్చించండి.
జవాబు:
భారతదేశంలో పార్లమెంటులోని లోక్సభ (దిగువసభ) మరియు రాష్ట్ర విధానసభల సభ్యులను ఎన్నుకునేందుకై చేపట్టే సాధారణ ఎన్నికల నిర్వహణ ప్రపంచంలోనే పెద్ద ప్రక్రియగా చెప్పవచ్చు. ప్రతి ఐదుసంవత్సరాలకు రాష్ట్రపతి అదేశానుసారం ఎన్నికల ప్రకటన విడుదలవుతుంది. దేశంలోని ఓటర్లు తమ ప్రతినిధులను ఎంపిక చేసుకొనేందుకు రాష్ట్రపతి, రాష్ట్ర గవర్నర్లు ఎన్నికల నోటిఫికేషన్లు ఇస్తారు. లోక్సభ, విధానసభల స్థానాలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించవచ్చు లేదా వేర్వేరు సమయాలలోనూ నిర్వహించవచ్చు.

భారతదేశంలో ఎన్నికల ప్రక్రియ వివిధ దశలలో నిర్వహించబడుతుంది. అవి:
1) నియోజక వర్గాల పునర్విభజన: ఎన్నికల ప్రక్రియలో మొదటి దశ నియోజక వర్గాల పునర్విభజనతో మొదలౌతుంది. రాష్ట్రపతిచే నియమితమైన నియోజకవర్గాల పునర్విభజనసంఘం ప్రతి పదిసంవత్సరాలకు నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను చేపడుతుంది. సాధారణంగా లోక్సభ నియోజవర్గం ఆరు లేక ఏడు శాసనసభ నియోజకవర్గాలలో కలిపి ఉంటుంది.

2) రాజకీయ పార్టీల గుర్తింపు: దేశంలోని రాజకీయ పార్టీలన్నీ ఎన్నికల సంఘం గుర్తింపు పొందాల్సి ఉంటుంది. ఎన్నికలలో పొందిన ఓట్ల శాతం ఆధారంగా పార్టీలను జాతీయ లేదా ప్రాంతీయ పార్టీలుగాను, లేదా నమోదు చేయబడి గుర్తింపు లేని పార్టీలుగాను వర్గీకరిస్తుంది. అలాగే పార్టీలకు ఎన్నికల గుర్తులను కేటాయిస్తుంది.

3) ఓటరు గుర్తింపు కార్డులు: ఓటరు జాబితాలు తప్పులు లేనివిగా తీర్చిదిద్దటం, ఎన్నికలలో అక్రమాలకు అడుకట్టవేయటం కొరకు ఎన్నికల సంఘం దేశంలోని అర్హతకలిగిన అందరు ఓటర్లకు ఓటరు గుర్తింపు కార్డులు ఆగష్టు 1993 నుండి జారీచేయటం జరిగింది.

4) ఓటర్ల జాబితాలు: ఎన్నికల నిర్వహణకు దేశంలోని అర్హత కలిగిన ఓటర్ల పేరుతో నియోజకవర్గాల వారీగా ఓటర్ల జాబితాలను తయారు చేయటం ముఖ్యమైన విధి. ప్రతి పది సంవత్సరాలకు జరిపే జనాభా లెక్కలు ఆధారంగా ఓటర్లు జాబితాలు సవరించబడతాయి.

5) ఎన్నికల ప్రకటన – రిటర్నింగ్ అధికార్ల నియామకం: ప్రతీసాధారణ ఎన్నికల నిర్వహణకు రాష్ట్రపతి ఎన్నికలసంఘానికి ఆజ్ఞలు జారీ చేస్తారు. వెంటనే ఎన్నికల సంఘం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదించి ఎన్నికలతేదీలు, నామినేషన్లు దాఖలు, ఉపసంహరణ తేదీలు ప్రకటిస్తుంది. వివిధ నియోజకవర్గాల ఎన్నికల నిర్వహణకు రిటర్నింగ్ అధికారాలను ఎన్నికల సంఘం నియమిస్తుంది.

6) నామినేషన్ పత్రాల దాఖలు చేయుట: ఎన్నికలలో పోటీ చేయ్యాలనుకొనే అభ్యర్థులు తమతమ నియోజకవర్గాలలోని రిటర్నింగ్ అధికారులకు తమ నామినేషన్ పత్రాలు దాఖలు చేయవలసి ఉంటుంది. ఎన్నికల సంఘంచే ఇవ్వబడిన నామినేషన్ పత్రాలను పూర్తివివరాలతో అభ్యర్థులు సమర్పించాల్సి ఉంటుంది. పార్టీ తరపున పోటీచేయు అభ్యర్థుల పేర్లను ఇద్దరు ప్రతిపాదించాల్సి వుంటుంది.

7) నామినేషన్ పత్రాల పరిశీలన: నామినేషన్ పత్రాల దాఖలుకు గడువు పూర్తయిన వెంటనే అభ్యర్థులు లేదా వారి అనుమతి పొందిన వ్యక్తుల సమక్షంలో సంబంధిత నియోజకవర్గాలలోని రిటర్నింగ్ అధికారులు అభ్యర్థులందరి నామినేషన్ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలిస్తారు.

8) నామినేషన్ల ఉపసంహరణ: నామినేషన్ పత్రాల పరిశీలనానంతరం ఎన్నికల సంఘం ప్రకటించిన తేదీ, సమయంలోపుగా అభ్యర్థులు స్వచ్ఛందంగా తమ నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చును.

AP Inter 2nd Year Civics Study Material Chapter 11 ఎన్నికలు - ప్రాతినిధ్యం

9) ఎన్నికల ప్రచారం: ఎన్నికల ప్రక్రియలో తరువాత దశ ఎన్నికల ప్రచారం. పోటీలో నిలిచిన అభ్యర్థులు, పార్టీలు తమ గెలుపు కోరుతూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తారు. రాజకీయ పార్టీలు తమ విధానాలు, కార్యక్రమాలు, వాగ్దానాలుతో కూడిన ఎన్నికల ప్రణాళికలను (Election Manfesto) విడుదల చేస్తారు.

10) ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు: బ్యాలెట్ పత్రాలకు, బ్యాలెట్ పెట్టెలకు ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రానిక్ ఓటింగు యంత్రాలను ఉపయోగించటం ద్వారా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.

11) ఓటర్లు ఓటు వేయుట: ప్రతి ప్రాదేశిక నియోజక వర్గంలోనూ ఎన్నికల సిబ్బంది పోలింగు బూత్లు ఏర్పాటు చేసి ఓటర్లు తమ ఓటుహక్కును స్వేచ్ఛగా వినియోగించుకొనేందుకు తగిన ఏర్పాట్లు చేస్తారు.

12) ఎన్నికల పరిశీలకుల పర్యవేక్షణ: ఎన్నికలు సజావుగా జరిగేందుకు, ఎన్నికలప్రచారం నిబంధనల మేరకు నిర్వహించేందుకు, ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకొనేందుకు ఎన్నికల సంఘం ప్రతీ నియోజకవర్గంలోనూ ఎన్నికల పరిశీలకులను నియమిస్తుంది.

13) ప్రసార మాధ్యమాల ప్రచారం: ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా ఉంచేందుకు గాను ప్రచారమాధ్యమాలను ఎన్నికల తేదీల ఎన్నికల ప్రక్రియను ప్రసారం చేసేందుకు అవకాశం కల్పిస్తారు.

14) ఓట్లలెక్కింపు -ఫలితాల ప్రకటన ఓటింగు పూర్తయిన తర్వాత ఎన్నికల సంఘం నిర్దేశించిన తేదీన సమయానికి రిటర్నింగు అధికారి మరియు సిబ్బంది అభ్యర్థులు మరియు వారి ప్రతినిధులు సమక్షంలో ఓటింగు యంత్రాలను తెరుస్తారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రంలో ప్రతీ అభ్యర్థి తనకుపోలైన ఓట్లను సరిచూసుకుంటారు. ప్రతీ నియోజకవర్గంలోనూ ఏ అభ్యర్థికైతే సమీప అభ్యర్థి కన్నా ఎక్కువ ఓట్లు వస్తాయో ఆ అభ్యర్థి గెలిచినట్లుగా ప్రకటిస్తారు. సంబంధిత ఎన్నికల రిటర్నింగ్ అధికారి అధికారికంగా ప్రకటిస్తూ గెలిచిన అభ్యర్థికి ధ్రువప్రతాన్ని అందజేస్తారు.

15) ఎన్నికల ఫిర్యాదులు: ఎన్నికలలో అవినీతి, అక్రమాలు చోటు చేసుకున్నట్లు భావిస్తే ఓటరు లేదా అభ్యర్థి ఎన్నికల సంఘానికి ఎన్నికలపై ఫిర్యాదు చేయవచ్చును. ఎన్నికల ఫిర్యాదు న్యాయస్థానంలో వేసే వాజ్యం (Suit) కాదు. కాని ఈ ఫిర్యాదులో మొత్తం నియోజకవర్గం అంతా భాగస్వామి అవుతుంది. న్యాయస్థానంలో కూడా ఎన్నిక చెల్లదు అని అభ్యర్థి ఎన్నికను సవాలు చేయవచ్చును. ఇలాంటి ఫిర్యాదు ఆయారాష్ట్రాల ఉన్నత న్యాయస్థానాల (High Court) లలో విచారించబడతాయి. ఎన్నికలలో అక్రమాలు రుజువైతే అభ్యర్థి ఎన్నిక నిలిపివేయబడి రద్దు చేయబడుతుంది.

ప్రశ్న 3.
భారత ఎన్నికల సంఘం నిర్మాణం, విధులను రాయండి. [Mar. ’16]
జవాబు:
నిర్మాణం: భారత ఎన్నికల సంఘం ఒక ప్రధాన ఎన్నికల కమీషనర్ మరియు ఇద్దరు ఎన్నికల కమీషనర్లను కలిగి బహుళసభ్య వ్యవస్థగా పనిచేయుచున్నది. దీనిని 1950 జనవరి 26న నెలకొల్పారు.

ఎన్నికల సంఘం విధులు:
భారత రాజ్యాంగంలోని 324 నుండి 328 వరకు గల ప్రకరణలు ఎన్నికల సంఘం యొక్క ఏర్పాటు, అధికారాలు, విధులను విశదీకరిస్తున్నాయి. అవి.

  1. భారత ఎన్నికల సంఘం నిర్ణీత కాలవ్యవధిలో ఓటర్ల జాబితాలను సవరిస్తుంది.
  2. ఓటర్ల జాబితాలు నమోదు చేయబడ్డ అర్హత కలిగిన ఓటర్ల పేరుతో తప్పులు లేకుండా తయారుచేయటం ఎన్నికల సంఘం విధి.
  3. ఎన్నికల నిర్వహణకు ఎన్నికల తేదీ, ఇతర వివరాలతో ఎన్నికల ప్రకటన, అభ్యర్థుల నామినేషన్ పత్రాల పరిశీలన కూడా నిర్వహిస్తుంది.
  4. ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు తగిన నిర్ణయాలు తీసుకునే అధికారం ఉంది.
  5. ఎన్నికల నిర్వహణ, ప్రశాంతతకు భంగం కలిగినట్లయితే దేశం మొత్తంగా ఎన్నికలను, లేదా కొన్ని రాష్ట్రాలలో లేదా రాష్ట్రంలో, కొన్ని నియోజకవర్గాలు లేదా నియోజకవర్గంలో ఎన్నికలను రద్దు చేయవచ్చు లేదా వాయిదా వేయవచ్చును.
  6. పార్టీలకు, ఎన్నికలలో పోటీచేయు అభ్యర్థులను ఎన్నికల నియమావళిని వర్తింపచేస్తుంది.

ప్రశ్న 4.
ప్రాతినిధ్యం అనగానేమి ? ప్రాదేశిక ప్రాతినిధ్యం గురించి నీకు ఏమి తెలుసో రాయండి.
జవాబు:
ప్రాతినిధ్యం – భావం:
ప్రభుత్వ ప్రక్రియలో పాల్గొనే అవకాశం లేదు. అందుచేతనే ఆధునిక ప్రజాస్వామ్య దేశాలు ప్రజలచే ఎన్నుకోబడిన ప్రతినిధులచే ఏర్పడిన ప్రాతినిధ్య లేదా పరోక్ష ప్రజాస్వామ్య దేశాలుగా కొనసాగుతున్నాయి. ఆధునిక ప్రజాస్వామ్య దేశాలు ప్రత్యక్ష ప్రజాస్వామ్య లేదా ప్రాతినిధ్య ప్రజాస్వామ్య ప్రభుత్వాలను కలిగి ఉంటున్నాయి. ఇలాంటి వ్యవస్థలో ప్రజలు తమకు బదులుగా శాసనాల తయారీ కొరకు ప్రతినిధులను ఎన్నుకొంటారు. ఆ ప్రతినిధులు శాసనసభలో ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తారు.

AP Inter 2nd Year Civics Study Material Chapter 11 ఎన్నికలు - ప్రాతినిధ్యం

ప్రాదేశిక ప్రాతినిధ్యం:
ప్రాదేశిక ప్రాతినిధ్య పద్ధతిలో దేశంలోని ఓటరులందరినీ వివిధ ప్రాదేశిక నియోజకవర్గాలుగా విభజించి, ప్రతి నియోజకవర్గం నుండి ఒకరు లేదా అంతకన్నా ఎక్కువ ప్రతినిధులను ఓటర్లు ఎన్నుకుంటారు. అన్ని ప్రాదేశిక నియోజకవర్గాలు దాని పరిమాణంలోగాని, జనాభా సంఖ్యలో గాని సుమారుగా ఒకే విధంగా ఉంటాయి. నియోజక వర్గంలో నివసించే ఓటరులందరూ తమ ప్రజాప్రతినిధి ఎన్నిక ప్రక్రియలో భాగస్వామ్యలౌతారు. ప్రాదేశిక నియోజకవర్గం నుండి ఒకే ప్రజాప్రతినిధి ఎన్నిక కాబడితే అది ఏకసభ్య నియోజకవర్గంగా పరిగణిస్తారు. అలాకాక ఒక నియోజకవర్గం నుండి ఒకరికన్నా ఎక్కువమంది ప్రతినిధులు ఎన్నికైతే దానిని బహుళ సభ్య నియోజక వర్గం అంటారు. భారతదేశం లాంటి ఆధునిక ప్రజాస్వామ్య దేశాలలో దిగువసభ సభ్యుల ఎంపిక కొరకు ఏకసభ్య ప్రాదేశిక నియోజవర్గ పద్ధతిని అనుసరిస్తున్నారు.

ప్రశ్న 5.
ఎఫ్.పి.టి.సి వ్యవస్థ యొక్క గుణదోషాలను అంచనా వేయండి.
జవాబు:
ఎఫ్.పి.టి.పి పద్ధతినే “ప్రథమ ఆధిక్యతతో పదవీ విధానం” (First Past The Post System) (FPTP) అంటారు. ఎన్నికలబరిలో ఏ అభ్యర్థి అయితే ఇతర అభ్యర్థుల కన్నా ఆధిక్యంతో ఉంటాడో, ఎన్నికకు కావల్సిన అధిక ఓట్లు సంపాదిస్తాడో అతడే విజయం సాధించినట్లు ప్రకటిస్తారు. ఈ పద్ధతినే ‘బహుత్వ ప్రాతినిధ్య విధానం’ (ప్లూరల్ సిస్టమ్) అంటారు. ఇదే ఎన్నిక పద్ధతిని మన రాజ్యాంగం ప్రతిపాదించినది.

ఇండియాలో FPTP పద్ధతి యొక్క సాధారణ మరియు సున్నితమైన స్వభావం మూలంగా బహుళ ప్రాచుర్యంలో ఉండి విజయం సాధించినది. ఈ పద్ధతి రాజకీయాలు, ఎన్నికలలో స్పష్టమైన ఎటువంటి పరిజ్ఞానం లేని సాధారణ పౌరునికి కూడా అర్థమయ్యే రీతిలో ఉంటుంది. అంతేగాక ఎన్నికలలో స్పష్టమైన తమ నిర్ణయాన్ని ఓటర్లు ప్రకటించడానికి ఈ పద్ధతి అనువుగా ఉంటుంది. ఓటర్లు ఎన్నికలలో అత్యధిక ప్రాధాన్యత పార్టీకి, అభ్యర్థికి లేదా రెండింటికి సమతౌల్యంగా ఇస్తారు. ఈ పద్ధతి సాధారణంగా అతిపెద్ద జాతీయ పార్టీకి లేదా సంకీర్ణ ప్రభుత్వాల ఏర్పాటుకు అవకాశం కల్పిస్తుంది. ఈ విధానం- ఒక ప్రాంతంలోని వివిధ సామాజిక సమూహాలు ఒకటిగా కలిసి ఎన్నికలలో విజయం సాధించేందుకు వీలుకల్పిస్తూ ప్రోత్సాహాన్నిస్తుంది. ఏది ఏమైనప్పటికి FPTP వ్యవస్థ సాధారణ ఓటర్లకు సుపరిచయంగాను, సరళమైనదిగాను నిరూపితమైనది. కేంద్ర, రాష్ట్ర స్థాయిలలో అతి పెద్ద పార్టీలు ఎన్నికలలో స్పష్టమైన ఆధిక్యతతో విజయం సాధించేందుకు ఈ పద్ధతి సహకరిస్తుంది.

ప్రశ్న 6.
ఎన్నికల సంస్కరణ పై లఘు వ్యాసం రాయండి. [Mar. ’17]
జవాబు:
భారతదేశంలో ఎన్నికల వ్యవస్థ, యంత్రాంగం, ఎన్నికల ప్రక్రియలను పరిశీలించి సంస్కరణలను ప్రతిపాదించుటకై అనేక కమిటీలు, కమిషన్లను భారత ప్రభుత్వం’ నియమించింది. అందులో కొన్నింటిని క్రింద పేర్కొనడం జరిగింది.

  1. 1974లో తార్కుండె కమిటీని నియమించగా అది 1975లో తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది.
  2. 1990లో ఎన్నికల సంస్కరణల కొరకు దినేష్ గోస్వామి కమిటీని నియమించడమైంది.
  3. రాజకీయాలు, నేరాల మధ్య సంబంధాల అధ్యయనం కోసం 1993 సంవత్సరంలో ఓహ్రా కమిటీ నియామకం జరిగింది.
  4. ఎన్నికలలో రాజకీయ నిధుల అధ్యయనం కొరకు 1998 సంవత్సరంలో ఇంద్రజిత్ గుప్తా కమిటీ నియమించబడింది.
  5. ఎన్నికల చట్టాల సంస్కరణలపై భారత న్యాయసంఘం 1999లో నివేదిక సమర్పించినది.

పైన పేర్కొన్న కమిటీలు, కమిషన్లు ఎన్నికల సంస్కరణల కొరకు చేసిన సూచనలలో ముఖ్యమైనవి

  1. ఓటు అర్హత వయస్సు తగ్గింపు
  2. ఎన్నికల సంఘానికి ఉద్యోగుల బదిలీ
  3. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు
  4. మద్యం అమ్మకాలపై నిషేధం
  5. ఎన్నికల వ్యయపరిమితి పెంపు
  6. ఆయుధాలపై నిషేధం మొదలగునవి.

AP Inter 2nd Year Civics Study Material Chapter 11 ఎన్నికలు - ప్రాతినిధ్యం

ప్రశ్న 7.
నైష్పత్తిక ప్రాతినిధ్య వ్యవస్థ గురించి నీకు ఏమి తెలుసు ?
జవాబు:
ఈ ఎన్నిక పద్ధతిలో రాజకీయ పార్టీల ఓటింగు బలాన్ని బట్టి తమ ప్రాతినిధ్యాన్ని పొందుతుంది. ఈ ఎన్నిక రహస్య పద్ధతిలో నిర్వహిస్తారు. భారత రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, రాజ్యసభ సభ్యులు, విధాన మండలి సభ్యుల ఎన్నికకు ఈ పద్ధతిని ఉపయోగిస్తారు. రాష్ట్రాల మధ్య సమానత్వానికి సభ్యుడు చెలాయించే ఓటును విలువలతో గుణించడం చేస్తారు. ముందుగా రాష్ట్ర శాసనసభ్యుల ఓట్ల విలువలను నిర్ధారిస్తారు. ఒక రాష్ట్ర మొత్తం జనాభాను రాష్ట్ర శాసనసభలో ఎన్నికైన సభ్యుల సంఖ్యచే భాగించగా వచ్చిన లబ్దమును మరల వెయ్యిచే భాగించగా వచ్చిన సంఖ్యను ఆ రాష్ట్ర శాసనసభ్యుని ఓటు విలువగా లెక్కిస్తారు. రాష్ట్ర శాసనసభ్యుల మొత్తం ఓటు విలువలను ఎన్నికైన పార్లమెంటు ఉభయసభల సభ్యుల సంఖ్యచేత భాగించగా వచ్చిన సంఖ్య పార్లమెంటు సభ్యుని విలువగా పరిగణిస్తారు. ఓట్ల లెక్కింపులో మొదటి ప్రాధాన్యతా ఓటు లేదా ద్వితీయ ప్రాధాన్యతా ఓటును పరిగణనలోనికి తీసుకొని ఆధిక్యత సాధించిన అభ్యర్థిని గెలుపొందినట్లుగా ప్రకటిస్తారు. ఈ పద్ధతిలో ఎక్కువమంది ప్రతినిధులు, అల్పసంఖ్యాకులు అల్పసంఖ్యలో ప్రతినిధులను ఎంపిక చేసుకొనే వీలుంటుంది.

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ఎన్నికలు, ప్రజాస్వామ్యంకు గల సంబంధం.
జవాబు:
ప్రజాస్వామ్య ప్రాతినిధ్య ప్రభుత్వాలకు ఎన్నికలు కీలకమైనవి. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు నిర్ణీత కాలవ్యవధిలో జరుగుతాయి. ఎన్నికయ్యే ప్రతినిధులు ప్రజలకు జవాబుదారీగా ఉంటారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలు అంతర్భాగం. రాజకీయ వ్యవస్థకు, దేశంలోని పౌరులకు ఎన్నికలు ముఖ్య సేవలందిస్తాయి. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయీకరణను పెంపొందించేందుకు ఎన్నికలు పెద్ద ప్రతినిధి సంస్థలుగా పనిచేస్తాయి.

ప్రశ్న 2.
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు. [Mar. ’16]
జవాబు:
భారత ఎన్నికల సంఘం ఎన్నికలలో ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకునేందుకు, ఓట్లు లెక్కింపుకు ఓటింగు యంత్రాలను ప్రవేశపెట్టింది. వీటినే ఎలక్ట్రానిక్ ఓటింగు యంత్రాలని అంటారు. ఓటింగులో బ్యాలెట్ పత్రాలను బదులుగా ఓటింగు యంత్రాలను వినియోగించటమైనది.

ప్రశ్న 3.
ప్రాదేశిక ప్రాతినిధ్యం.
జవాబు:
ప్రాదేశిక ప్రాతినిధ్య పద్ధతిలో దేశంలోని ఓటరులందరిని వివిధ ప్రాదేశిక నియోజకవర్గాలుగా విభజించి, ప్రతి నియోజక వర్గం నుండి ఒకరు లేదా అంతకన్నా ఎక్కువ ప్రతినిధులను ఓటర్లు ఎన్నుకొంటారు. అన్ని ప్రాదేశిక నియోజకవర్గాలు దాని పరిమాణంలో కాని, జనాభా సంఖ్యలో కాని సుమారుగా ఒకే విధంగా ఉంటాయి. నియోజకవర్గంలో నివసించే ఓటర్లందరూ తమ ప్రజాప్రతినిధిని ఎన్నుకోవటంలో భాగస్వాములవుతారు.

ప్రశ్న 4.
వృత్తి ఆధారిత ప్రాతినిధ్యం.
జవాబు:
పౌరులు చేసే వృత్తుల ఆధారంగా ఇటువంటి నియోజకవర్గాలు ఏర్పాటవుతాయి. ఇటువంటి నియోజకవర్గంలో పౌరులు ఒకేరకమైన వృత్తి లేదా సమాన లక్షణాలు కలిగిన వృత్తులలో నిమగ్నమైన ప్రాదేశిక ప్రాంతాలలో నివాసముంటారు. వైద్యులు, వ్యవసాయదారులు, వ్యాపారులు, న్యాయవాదులు, అధ్యాపకులు, ఉపాధ్యాయులు, శ్రామికులు, తదితరులు వివిధ రకాల వృత్తి సంఘాల్ని కల్గి ఉంటారు.

AP Inter 2nd Year Civics Study Material Chapter 11 ఎన్నికలు - ప్రాతినిధ్యం

ప్రశ్న 5.
భారత ఎన్నికల సంఘం నిర్మాణం.
జవాబు:
భారత ఎన్నికల సంఘం ఒక ప్రధాన ఎన్నికల కమీషనర్ మరియు ఇద్దరు ఎన్నికల కమీషనర్లను కలిగి బహుళ సభ్య వ్యవస్థగా పని చేయుచున్నది. దీనిని 1950 జనవరి 26న నెలకొల్పారు.

ప్రశ్న 6.
ఎన్నికల సంస్కరణలు. [Mar. ’16]
జవాబు:
భారతదేశంలో ఎన్నికలను స్వేచ్చగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు వీలుగా స్వయంప్రతిపత్తి కలిగిన ఎన్నికల సంఘాన్ని ఏర్పాటుచేయటం జరిగింది. అయిన్నప్పటికీ గడిచిన 65 సం॥ల అనుభవం మన ఎన్నికల వ్యవస్థలో సంస్కరణల అవసరాన్ని తెలియజేస్తుంది. ఎన్నికల సంఘం, వివిధ రాజకీయ పార్టీలు, అనేక స్వచ్ఛంద సంస్థలు, రాజ్యాంగ ఎన్నికల నిపుణులు ఎన్నికల వ్యవస్థలో అనేక సలహా సంప్రదింపులలో ముందుకు రావడం జరిగింది.

ప్రశ్న 7.
ఎన్నికల నేరాలు.
జవాబు:
ఎన్నికల్లో చట్టవ్యతిరేక కార్యకలాపాలు, లేదా పద్ధతులను పాల్పడినట్లయితే జైలుశిక్ష లేదా అపరాధ రుసుము లేదా రెండూ విధించబడతాయి. ఎన్నికల నేరాలకు జైలుశిక్ష మూడునెలల నుండి మూడు సంవత్సరాలవరకు ఉంటుంది. మతం, జాతి, కులం, భాష, ప్రాంతాల ఆధారంగా ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం, ఎన్నికల సభలలో గొడవలు సృష్టించి భగ్నం చేయటం ఎన్నికల నేరాలకు ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు.

ప్రశ్న 8.
ఎన్నికలలో అక్రమ పద్ధతులు.
జవాబు:
ఎన్నికలలో అభ్యర్థులు అక్రమ పద్ధతులకు పాల్పడితే ఆ ఎన్నికలను సంఘం రద్దు చేయగలదు. అవినీతి, అక్రమాలకు పాల్పడిన అభ్యర్థిని ఆరు సంవత్సరముల వరకు ఎన్నికలలో పోటీచేయటానికి అనర్హునిగా ప్రకటించడమేగాక అటువంటి అభ్యర్థిని న్యాయస్థానంలో విచారణ చేసి శిక్షిస్తారు. ఎన్నికల్లో ముఖ్యమైన అవినీతి, అక్రమ పద్ధతులను ఎన్నికల సంఘం నియంత్రించేందుకు అనేక చర్యలు తీసుకొంటుంది.

ప్రశ్న 9.
భారత ఎన్నికల సంఘం పాత్ర. [Mar, ’17]
జవాబు:
భారతదేశంలో నిష్పక్షపాతంగా, సమర్థవంతంగా ఎన్నికలను నిర్వహించే విషయంలో కాలానుగుణంగా ఎన్నికల సంఘం ఒక స్వతంత్ర మరియు స్వయంప్రతిపత్తి గల అధికార వ్యవస్థగా రూపుదిద్దుకొంది. ఎన్నికల ప్రక్రియ, పవిత్రతను కాపాడేందుకు ఎన్నికల సంఘం నిష్కర్షగాను, నిష్పక్షపాతంగా వ్యవహరిస్తుంది. ఎన్నికల సంఘం గతంలో కన్నా మరింత స్వతంత్రంగా, నిర్ణయాత్మకంగా, క్రియాశీలకంగా నేడు వ్యవహరిస్తుందని అందరూ అంగీకరిస్తున్న మాట వాస్తవం.

AP Inter 2nd Year Civics Study Material Chapter 11 ఎన్నికలు - ప్రాతినిధ్యం

ప్రశ్న 10.
ప్రాతినిధ్యం.
జవాబు:
ఆధునిక దేశాలలో ప్రభుత్వ ప్రక్రియలో ప్రజలు నేరుగా భాగస్వాములు కాలేరు. ఇలాంటి వ్యవస్థలో ప్రజలు తమకు బదులుగా శాసనాలను రూపొందించుకొనటానికి ప్రతినిధులను ఎన్నుకుంటారు. ఆ ప్రతినిధులు శాసనసభలో ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తారు. ప్రపంచ దేశాలలో రెండు రకాల సాధారణ ప్రాతినిధ్యం ప్రామాణికంగా ఉన్నాయి. అవి 1) ప్రాదేశిక ఆధారిత ప్రాతినిధ్యం 2) వృత్తి ఆధారిత ప్రాతినిధ్యం.

AP Inter 2nd Year Civics Study Material Chapter 10 భారతదేశంలో స్థానిక ప్రభుత్వాలు

Andhra Pradesh BIEAP AP Inter 2nd Year Civics Study Material 10th Lesson భారతదేశంలో స్థానిక ప్రభుత్వాలు Textbook Questions and Answers.

AP Inter 2nd Year Civics Study Material 10th Lesson భారతదేశంలో స్థానిక ప్రభుత్వాలు

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
భారతదేశంలో పంచాయతీరాజ్ సంస్థల విధులను వివరించండి.
జవాబు:
ప్రస్తుతం భారతదేశంలో పంచాయతీరాజ్ సంస్థలు భారత రాజ్యాంగం 73వ సవరణ చట్టం, 1992 ప్రకారం ఏర్పాటయ్యాయి. సాధారణంగా భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో (జనాభా ఇరవై లక్షల కంటే తక్కువ కాకుండా) గ్రామీణ ప్రాంతాలలో ప్రతి జిల్లాలో మూడంచెల సంస్థలు ఏర్పాటయ్యాయి. అవి.
విధులు.

  1. గ్రామ పంచాయతీలు
  2. మధ్యస్థాయి సంస్థలు (మండల పరిషత్తు)
  3. జిల్లాస్థాయి (జిల్లా పరిషత్తు)

1) గ్రామ పంచాయతీ విధులు: గ్రామపంచాయతీ విధులు రెండు రకాలు: i) ఆవశ్యక విధులు ii) వివేచనాత్మక
i) ఆవశ్యక విధులు: ఆవశ్యక విధులను గ్రామపంచాయతీ తప్పనిసరిగా నిర్వహించవలసి ఉంటుంది. అలాంటి వాటిలో క్రింద పేర్కొన్నవి ఉంటాయి.

  1. రహదార్లను నిర్మించడం, మరమ్మత్తులు చేయించడం, నిర్వహించడం.
  2. శ్మశానవాటికలను నిర్మించడం, నిర్వహించడం..
  3. విద్యుత్ స్థంభాలను ఏర్పరచడం, విద్యుత్ సౌకర్యాలను అందించడం.
  4. జనన, మరణాల రిజిస్టర్లను నిర్వహించడం.
  5. అంటురోగాల బారి నుంచి ప్రజలను కాపాడటానికి వారికి తగిన టీకాలను వేయించడం.
  6. త్రాగునీటి సౌకర్యాలను సమకూర్చడం.
  7. కాలిబాటలు, చిన్నవంతెనలు, పబ్లిక్ పార్క్లు, క్రీడాస్థలాలను నిర్మించడం, మరమ్మత్తులు చేయించి నిర్వహించడం.

AP Inter 2nd Year Civics Study Material Chapter 10 భారతదేశంలో స్థానిక ప్రభుత్వాలు

ii) వివేచనాత్మక విధులు:
గ్రామపంచాయతి వివేచనాత్మక లేదా ఐచ్ఛిక విధులను ఆర్థిక వనరుల లభ్యతమేరకు నిర్వహిస్తుంది. వాటిలో క్రిందివి ఉంటాయి.

  1. విశ్రాంతి గృహాల నిర్మాణం, నిర్వహణ.
  2. ప్రాథమిక పాఠశాలలు, ఆరోగ్యకేంద్రాలు, గ్రంథాలయాలు, పఠన మందిరాల నిర్మాణం.
  3. మాత, శిశు సంక్షేమ కేంద్రాల నిర్మాణం, నిర్వహణ.
  4. సమాజాభివృద్ధి పథకాల అమలులో స్వచ్చంద శ్రామిక శిబిరాల నిర్వహణ.
  5. ఆధునిక సేద్య పద్ధతుల ప్రచారం.
  6. భూసంస్కరణల అమలు..

2) మధ్యస్థాయి సంస్థలు (మండల పరిషత్తు) విధులు:
మండల పరిషత్తు మండల పరిధిలో క్రింద పేర్కొన్న విధులను నిర్వహిస్తుంది.

  1. సమాజాభివృద్ధి పథకాల అమలుకు అవసరమైన చర్యలు తీసుకుంటుంది.
  2. వైద్యశాలలు, త్రాగునీరు, టీకాలు, పొగరాని పొయ్యలు వంటి సదుపాయాల కల్పనకు తగిన కార్యక్రమాలు చేపడుతుంది.
  3. సామాజిక విద్య, కమ్యూనికేషన్లు, సహకారం, కుటీరపరిశ్రమలు, మహిళాభివృద్ధి, సాంఘిక సంక్షేమం వంటి అనేక కార్యక్రమాల అమలుకు సంబంధించిన వ్యవహారాలను సమీక్షిస్తుంది.
  4. వ్యవసాయరంగంలో అధికోత్పత్తిని సాధించడానికి మేలు రకమైన ఎరువులు, క్రిమిసంహారకమందులు, అధునాతన వ్యవసాయ పరికరాలను వినియోగించుకోవడానికి తగిన చర్యలు తీసుకుంటుంది.
  5. పశు సంపద అభివృద్ధి కోసం పశుగ్రాసాన్ని అందించడం కృత్రిమ వీర్యకేంద్రాలు, పశుగ్రాస క్షేత్రాల నిర్వహణ వంటి వివిధ కార్యక్రమాలను అమలుచేస్తుంది.

3) జిల్లా పరిషత్తు విధులు:
జిల్లా పరిషత్తు క్రింద పేర్కొన్న విధులను నిర్వహిస్తుంది.

  1. జిల్లాలోని మండల పరిషత్తుల వార్షిక బడ్జెట్లను ఆమోదిస్తుంది.
  2. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మండలాల అభివృద్ధి కోసం మంజూరు చేసిన సహాయక గ్రాంట్లను మండల పరిషత్తులకు కేటాయిస్తుంది.
  3. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామీణాభివృద్ధి కోసం ఇచ్చే ఆదేశాలను అమలుచేస్తుంది.
  4. వివిధ మండల పరిషత్తుల కార్యకలాపాలను సమన్వయపరిచి, పర్యవేక్షిస్తుంది.
  5. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాలకు అనుగుణంగా గణాంక సర్వేలను నిర్వహిస్తుంది.
  6. జిల్లాలోని సెకండరీ స్కూళ్ళను నిర్వహిస్తుంది.
  7. మండల పరిషత్తులు, గ్రామపంచాయతీల ఆర్థిక పరిపుష్టికి అవసరమైన సూచనలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పంపుతుంది.

ప్రశ్న 2.
భారతదేశంలో వివిధ రకాల పట్టణ స్థానిక ప్రభుత్వాలను వర్ణించండి. [Mar. ’17]
జవాబు:
భారతదేశంలో పట్టణ స్థానిక ప్రభుత్వాలు 9 రకాలు. అవి

  1. నగరపాలక సంస్థలు
  2. పురపాలక సంస్థలు
  3. నగర పంచాయతీలు
  4. నోటిఫైడ్ ఏరియా కమిటీలు
  5. టౌన్ ఏరియా కమిటీలు
  6. కంటోన్మెంట్ బోర్డులు
  7. టౌన్ షిప్పులు
  8. పోర్ట్ ట్రస్ట్లు
  9. ప్రత్యేక ప్రయోజిత సంస్థలు.

AP Inter 2nd Year Civics Study Material Chapter 10 భారతదేశంలో స్థానిక ప్రభుత్వాలు

1) నగరపాలక సంస్థలు:
పట్టణ స్థానిక ప్రభుత్వాలలో నగరపాలక సంస్థలు చాలా ముఖ్యమైనవి. ఇవి అత్యున్నత పట్టణ, స్థానిక సంస్థలుగా అతిపెద్ద నగరాలలో ఏర్పాటు చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టం ద్వారా ఈ నగరపాలక సంస్థలను ఏర్పాటుచేస్తుంది. భారతదేశంలో 1687లో మద్రాస్ నగరంలో మొట్టమొదటి నగరపాలక సంస్థ ఏర్పాటైంది. మూడు లక్షల జనాభా కలిగి నాలుగుకోట్ల వార్షికాదాయమున్న పట్టణాలను నగరపాలక సంస్థలుగా రాష్ట్రప్రభుత్వం ప్రత్యేక చట్టం ద్వారా ఏర్పాటుచేస్తుంది.

నగర జనాభా ఆధారంగా ఆయా నగర సంస్థలలోని ప్రతినిధుల సంఖ్యను రాష్ట్ర శాసన సభ నిర్ణయిస్తుంది. ప్రతి నగరపాలక సంస్థలో 1) నగరపాలక మండలి, 2) మేయర్, 3) కమీషనర్, 4) స్థాయీ సంఘాలు అనే నాలుగు ప్రధాన అంగాలు ఉంటాయి.

2) పురపాలక సంస్థలు:
ప్రతి పురపాలక సంస్థలో నాలుగు అంగాలు ఉంటాయి. 1) పురపాలక మండలి, 2) పురపాలక చైర్మన్, 3) మున్సిపల్ కమీషనర్, 4) స్థాయీ సంఘాలు. పురపాలక సంస్థ చర్చావేదికయే పురపాలక మండలి. దీనిలో 1) ఎన్నికయ్యే సభ్యులు 2) అనుబంధ సభ్యులు 3) గౌరవ సభ్యులు అనే మూడు రకాల సభ్యులు ఉంటారు. పురపాలక సంస్థ పరిధిలోని రిజిష్టర్ ఓటర్లు మొదటి తరహా సభ్యులను ఎన్నుకుంటారు. వీరిని కౌన్సిలర్స్ అంటారు.

3) నగర పంచాయతీలు:
గ్రామ స్థాయి నుండి పట్టణ స్థాయికి పరిణామం చెందే ప్రాంతం లేదా అతిచిన్న పట్టణ ప్రాంతాలలో ఏర్పాటయ్యే స్థానిక సంస్థలను నగర పంచాయతీ అంటారు. దీని కొరకు జనసాంద్రత, స్థానిక సంస్థల ఆదాయం, వ్యవసాయేతర రంగాలలో ఉపాధి అవకాశాలు. ఆ ప్రాంత ఆర్థిక ప్రాధాన్యత మొదలైన ప్రామాణికాల ఆధారంగా నగర పంచాయతీ ఏర్పాటు జరుగుతుంది.

నగర పంచాయితీ సభ్యుల సంఖ్యను ఆ రాష్ట్ర శాసనసభ నిర్ణయిస్తుంది. ఈ సభ్యులు ప్రజలచే వయోజన ఓటుహక్కు ద్వారా ప్రత్యక్షంగా ఎన్నుకోబడతారు. దీని కొరకు నగర పంచాయతీని వార్డులుగా విభజించి ప్రతి వార్డు నుండి ఒక ప్రతినిధిని ఎన్నుకునేందుకు అవకాశం కల్పిస్తారు.

4) నోటిఫైడ్ ఏరియా కమిటీలు:
శీఘ్రగతిన అభివృద్ధి పథంలో పురోగమించే పట్టణాలలో లేదా పురపాలక సంస్థల ఏర్పాటుకు అనుకూలంగాలేని పరిస్థితులలో ఈ కమిటీ ఏర్పాటవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రకటన ద్వారా ఈ కమిటీ ఏర్పడటంతో దీనిని నోటిఫైడ్ ఏరియా కమిటీగా వ్యవహరించడమైంది. దీనికి చట్టబద్ధమైన హోదా ఉండదు. దీనిలో ఒక చైర్మన్, కొందరు సభ్యులు ఉంటారు. వారిని రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తుంది.

5) టౌన్ ఏరియా కమిటీలు:
రాష్ట్ర శాసనసభ ఆమోదించే ప్రత్యేక చట్టం ద్వారా టౌన్ ఏరియా కమిటీ ఏర్పాటవుతుంది. చిన్న పట్టణాల అవసరాలను తీర్చడానికి ఈ కమిటీలు అవసరమవుతాయి. అవి పరిమితమైన విధులను మాత్రమే నిర్వహిస్తుంటాయి. వీధిదీపాలను అమర్చడం, డ్రైనేజీ సౌకర్యాల కల్పన వంటి విధులను అవి నిర్వహిస్తాయి.

AP Inter 2nd Year Civics Study Material Chapter 10 భారతదేశంలో స్థానిక ప్రభుత్వాలు

6) కంటోన్మెంట్ బోర్డులు:
భారతదేశంలో ప్రస్తుతం మూడు రకాల కంటోన్మెంట్ బోర్డులున్నాయి. అవి దేశరక్షణ మంత్రిత్వశాఖ ప్రత్యేక ఉత్తర్వుల ద్వారా ఏర్పాటై కొనసాగుతున్నాయి. ప్రతి కంటోన్మెంట్ బోర్డులో కొందరు ఎన్నుకోబడినవారు సభ్యులుకాగా, కొందరు కేంద్ర ప్రభుత్వంతో నామినేట్ చేయబడినవారు, మరికొందరు పదవిరీత్యా సభ్యులుగా ఉంటారు. ప్రతి కంటోన్మెంట్ బోర్డులో ఒక జనరల్ ఆఫీసర్ – ఆఫ్- కంమాండర్ (GOC – General Officer of Commander) ఉంటాడు.

7) టౌన్ షిప్ లు:
టౌన్షిప్లు అనేవి ప్రభుత్వరంగ సంస్థలలో ఏర్పాటవుతాయి. ప్రభుత్వరంగ సంస్థలలో పనిచేసే సిబ్బందికి మౌలిక సదుపాయాలను కల్పించడానికి అవి కృషిచేస్తాయి. వాటిలో ఎన్నుకోబడే సభ్యులు ఎవరూ ఉండరు. ప్రతి టౌన్షిప్కు ఒక టౌన్ పరిపాలన అధికారి ఉంటాడు. అతడిని కేంద్రప్రభుత్వంలోని సంబంధిత మంత్రిత్వశాఖ నియమిస్తుంది. టౌన్ షిప్ సేవలు సామాన్య ప్రజలకు కాకుండా అందులో పనిచేసే వారికే లభ్యమవుతాయి.

8) పోర్ట్ ట్రస్ట్:
దేశంలో సముద్రతీరంలో ఓడరేవులు ఉన్న ప్రాంతాలలో పోర్ట్ ట్రస్ట్లు ఏర్పాటవుతాయి. అలాగే నౌకాశ్రయాలలో పనిచేసే సిబ్బందికి సంబంధించిన వ్యవహారాలను పర్యవేక్షిస్తాయి. అవి నౌకాశ్రయాలలో మౌలిక సదుపాయాలను కల్పించడానికి కృషిచేస్తాయి. కేంద్రప్రభుత్వం అందుకోసం కొన్ని కమిటీలను నియమిస్తుంది. ఆ కమిటీల సభ్యులలో కొందరు ఎన్నుకోబడగా, మరికొందరు నామినేట్ అవుతారు.

9) ప్రత్యేక ప్రయోజిత సంస్థలు:
పట్టణ ప్రాంతాలలో నివసించే ప్రజలు ఎదుర్కొనే సమస్యల పరిష్కారానికి ఈ రకమైన సంస్థలు పనిచేస్తుంటాయి. పురపాలక సంఘాలు. ఇతర నోటిఫైడ్ ప్రాంతాలలో నివసించే ప్రజల ప్రత్యేక అవసరాలను తీర్చడానికి అవి కృషిచేస్తాయి. రాష్ట్ర శాసనసభ ఆమోదించిన ప్రత్యేక చట్టాల ప్రకారం వాటిని స్థాపించడం జరుగుతుంది. కొన్ని సందర్భాలలో రాష్ట్ర కార్యనిర్వాహక వర్గం ప్రత్యేకంగా జారీచేసే ఆజ్ఞల ద్వారా అవి ఏర్పడతాయి.

ప్రశ్న 3.
భారత రాజ్యాంగం 73వ సవరణ చట్టాన్ని గురించి క్లుప్తంగా వివరించండి.
జవాబు:
భారతదేశంలో పంచాయతీరాజ్ సంస్థలను సమర్థవంతమైనవిగా తీర్చిదిద్దడానికి ఏకీకృత చట్టం అవసరమని కేంద్ర, రాష్ట్రాల సంబంధాలపై నియమించిన సర్కారియా కమీషన్ సూచించింది. పర్యవసానంగా రాజీవ్ గాంధీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం 1988లో పి.కే. తుంగన్ ఆధ్వర్యంలో పార్లమెంటరీ ఉపసంఘాన్ని నియమించింది. జిల్లా కమిటీల ఏర్పాటుకు అవసరమైన ఆదర్శవంతమైన పరిపాలన, రాజకీయ యంత్రాంగాన్ని సూచించవలసిందిగా ఆ ఉపసంఘాన్ని కేంద్ర ప్రభుత్వం కోరింది. రెండేళ్ళ తరువాత 1991 జూన్లో శ్రీ పి.వి. నరసింహారావు ఆధ్వర్యంలో అధికారంలోకి వచ్చిన కేంద్రప్రభుత్వం పంచాయితీరాజ్ సంస్థలకు వెంటనే రాజ్యాంగ ప్రతివృత్తిని కల్పించవలసిన విషయాన్ని గుర్తించింది. 1991 సెప్టెంబర్ లో అందుకు సంబంధించిన బిల్లును పార్లమెంటులో ప్రతిపాదించింది. తరువాత ఆ బిల్లు సంయుక్త పార్లమెంటరీ కమిటీకి సమర్పించడమైంది. పార్లమెంటు ఆ కమిటీ సమర్పించిన నివేదికను ఆమోదించింది. ఆ బిల్లుపై రాష్ట్ర శాసనసభల ఆమోదం కోసం పంపడమైంది. మెజారిటీ రాష్ట్ర శాసనసభలు ఆ బిల్లుపట్ల తమ సమ్మతిని తెలిపాయి. దాంతో ఆ బిల్లును రాజ్యాంగం (73వ సవరణ) చట్టం, 1992గా పిలవడం జరిగింది.

AP Inter 2nd Year Civics Study Material Chapter 10 భారతదేశంలో స్థానిక ప్రభుత్వాలు

ప్రధాన అంశాలు: రాజ్యాంగం (73వ సవరణ) చట్టం 1992లో క్రింది ముఖ్యాంశాలు ఉన్నాయి.
1. ఆ చట్టం నూతనంగా జిల్లా, గ్రామసభ, పంచాయితీ, గ్రామం అనే నూతన పదాలను చేర్చింది

2. ప్రతి గ్రామానికి ఒక గ్రామ సభను ఏర్పాటుచేసింది. ఆ గ్రామసభ గ్రామ స్థాయిలో శాసన నిర్మాణ సంస్థగా వ్యవహరిస్తుంది.

3. ప్రతి రాష్ట్రప్రభుత్వం పంచాయతీరాజ్ యొక్క మూడంచెల విధానాన్ని ఏర్పాటు చేయవలసి ఉంటుంది. ఉదా: గ్రామ, మాధ్యమిక, జిల్లా స్థాయిలలో పంచాయతీలు

4. ప్రతి రాష్ట్ర శాసనసభ తప్పనిసరిగా పంచాయతీల నిర్మాణానికి సంబంధించిన చట్టాలను రూపొందించాలి. ప్రాదేశిక నియోజకవర్గాల ప్రాతిపదికపై పంచాయతీలకు ప్రత్యక్ష ఎన్నికలను నిర్వహించాలి. పంచాయతీల అధ్యక్షులకు, ఇతర సభ్యులకు, (వారు ప్రత్యక్షంగానో లేదా పరోక్షంగానో ఎన్నుకోబడినప్పటికీ) తీర్మానాలపై ఓటుచేసే హక్కు ఉంటుంది.

5. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు పంచాయతీలలో రిజర్వేషన్లు కల్పించడం జరిగింది. అలాగే మొత్తం సీట్లలో 1/3వ వంతుకు మించకుండా మహిళలకు రిజర్వేషన్ కేటాయించడమైంది. (ఉమ్మడి ఆంధ్రప్రదేశ్) ప్రభుత్వ మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు పెంచడం జరిగింది.)

6. పంచాయతీల కాలపరిమితి అయిదేళ్ళు. ఆ గడుపు ముందే కొత్తగా ఎన్నికలు జరిపించుకోవచ్చు. కాలపరిమితికి ముందే అవి ఒకవేళ రద్దయితే వాటికి ఎన్నికలను నిర్వహించవలసి ఉంటుంది.

7. స్థానిక సంస్థలకు పోటీచేసే అభ్యర్థుల అర్హతలు, అనర్హతలను ఎదుర్కొనడమైంది.

8. ఈ చట్టం స్థానిక సంస్థలకు ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేసింది.

9. పంచాయితీల ఖాతాలు, వ్యయాలపై తనిఖీ జరపడానికి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉంటుంది.

10. స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించడానికి స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న ఎన్నికల సంఘం ఏర్పాటవుతుంది.

ప్రశ్న 4.
భారత రాజ్యాంగం 74వ సవరణ చట్టాన్ని గురించి క్లుప్తంగా వివరించండి.
జవాబు:
74వ రాజ్యాంగ సవరణ చట్టం: రాజ్యాంగం 74వ సవరణ చట్టం, 1993ను భారత పార్లమెంటు 1992. డిసెంబర్ లో ఆమోదించింది. దానికి 1993, ఏప్రిల్ 20వ తేదీన రాష్ట్రపతి ఆమోదం లభించింది. భారతదేశంలో పట్టణస్థానిక ప్రభుత్వాలను పటిష్టపరచడంలో ఆ చట్టం అత్యంత ముఖ్యమైందిగాను, ప్రగతిశీలమైనదిగానూ వర్ణించడం జరిగింది. భారతదేశంలో పట్టణ స్థానిక ప్రభుత్వాలు సమర్థవంతంగా కార్యకలాపాలను నిర్వహించడానికి ఆ చట్టం ఒక ఉమ్మడి విధివిధానాలను రూపొందించింది. అంతకు పూర్వం ఆ చట్టాన్ని రూపొందించడానికి విశేషమైన కృషి జరిగింది. తొలుత పార్లమెంటు ఆ చట్టానికి సంబంధించిన బిల్లును 1989లో రాజ్యాంగం (65వ సవరణ) బిల్లుగా ప్రతిపాదించడం జరిగింది. అయితే లోక్సభ అర్ధంతర రద్దు కారణంగా ఆ బిల్లు పార్లమెంటు ఆమోదానికి నోచుకోలేదు.

తరువాత ఆ బిల్లులో కొన్ని సవరణలు చేసి, 1991, సెప్టెంబర్ 16వ తేదీన లోక్సభలో ప్రవేశపెట్టడం జరిగింది. దరిమిలా పార్లమెంటు ఉభయసభలు ఆ బిల్లును కూలంకషంగా పరిశీలించి, 1992 డిసెంబర్లో ఆమోదించాయి. చివరికి రాష్ట్రపతి ఆమోదం తరవాత ఆ బిల్లు చట్టంగా రూపొంది 1993, జూన్ 1వ తేదీన అమల్లోకి వచ్చింది. . ముఖ్యాంశాలు:
1. ఈ చట్టం పట్టణ స్థానిక సంస్థలకు మొట్టమొదటిసారిగా రాజ్యాంగపరమైన గుర్తింపునిచ్చింది. రాజ్యాంగంలో 9(ఎ) అనే భాగాన్ని అదనంగా చేర్చింది.

2. రాజ్యాంగంలో పన్నెండో షెడ్యూల్ను ప్రవేశపెట్టింది.

3. పట్టణ స్థానిక సంస్థలకు 18 అంశాలపై తీర్మానాలను రూపొందించుకొని అమలులో ఉంచుకోవడానికి అధికారాన్నిచ్చింది.

4. పట్టణ స్థానిక సంస్థలకు సంబంధించిన వివిధ పదాలను నిర్వచించింది. జనాభా పదిలక్షలు లేదా అంతకుమించి ఉంటే పట్టణ ప్రాంతాన్ని మహానగర ప్రాంతం (మెట్రోపాలిటన్ ఏరియా) గా ప్రకటించింది.

AP Inter 2nd Year Civics Study Material Chapter 10 భారతదేశంలో స్థానిక ప్రభుత్వాలు

5. నగరపాలకసంస్థ, మున్సిపల్ కౌన్సిల్, నగర పంచాయతీ వంటి అనేక సంస్థల నిర్మాణానికి ఈ సవరణ వీలు కల్పించింది. నగరపాలక సంస్థ అనేది విస్తృతమైన పట్టణ ప్రాంతాలను వర్తిస్తుంది. పట్టణ స్థానిక సంస్థల పేర్లను ఖరారు చేయడానికి, వాటి భౌగోళిక సరిహద్దులను స్పష్టంగా గుర్తించడానికి ఈ చట్టం రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఇచ్చింది.

6. పురపాలక సంస్థ నిర్మాణాన్ని ఈ చట్టం ప్రత్యేకంగా గుర్తించింది. పురపాలక సంస్థ పరిధిలోని విధానసభ సభ్యులు, లోక్సభ సభ్యులు పురపాలక సంస్థల కౌన్సిళ్ళు సమావేశంలో పదవి రీత్యా సభ్యుల హోదాలో పాల్గొంటారని స్పష్టం చేసింది. అంతేకాకుండా పురపాలక సంస్థ సమావేశాలలో రాష్ట్ర విధానపరిషత్తు లేదా రాజ్యసభ సభ్యులు పాల్గొనడానికి అర్హులని ప్రకటించింది.

7. జనాభా మూడులక్షల లేదా అంతకుమించి ఉన్న పురసాలక సంస్థలలో వార్డ్ కమిటీల ఏర్పాటుకు అవకాశం ఇచ్చింది. అలాంటి వార్డు కమిటీల ఏర్పాటు విషయంలో శాసనాలను రూపొందించే అధికారాన్ని రాష్ట్ర శాసనసభలకు అప్పగించింది.

8. పట్టణ స్థానిక సంస్థలలో కొన్ని స్థానాలను షెడ్యూల్డ్ కులాలు, తెగలకు వారి జానాభా నిష్పత్తికి అనుగుణంగా కేటాయించడం జరుగుతుందని పేర్కొంది. అంతేకాకుండా ఆ సంస్థలలో మూడోవంతు స్థానాలు మహిళలకు, మహిళా అధ్యక్ష పదవులకు రొటేషన్ పద్ధతిలో కేటాయించునట్లు ప్రకటించింది.

ప్రశ్న 5.
జిల్లా కలెక్టర్ అధికారాలు, విధులను అంచనా వేయండి. [Mar. ’16]
జవాబు:
జిల్లా పరిపాలనలో కలెక్టర్ కీలకపాత్ర వహిస్తాడు. అతడు జిల్లా పరిపాలన అధిపతిగా వ్యవహరిస్తాడు. జిల్లాస్థాయిలో వివిధ పాలనా విధానాల రూపకల్పన, అమలులో ప్రత్యక్ష ప్రమేయం కలిగి ఉంటాడు. జిల్లా ప్రజల సత్వర వికాసానికి అవసరమయ్యే విధి విధానాలను రూపొందించి, అమలు చేయడంలో కలెక్టర్కు కీలకపాత్ర ఉంటుంది. అతడి అధికారాలు విధుల నిర్వహణలో అనేకమంది అధికారులు సహాయపడతారు.

భారతదేశంలో జిల్లా కలెక్టర్ పదవిని 1722లో మొదటిసారిగా తూర్పు ఇండియా కంపెనీ ప్రవేశపెట్టింది. కాలంలో ప్రజల వద్ద నుంచి భూమిశిస్తు వసూలుచేసే ఉద్దేశంతో ఆ పదవిని ఏర్పాటుచేసింది. అప్పటి నుంచి ఆ పదవిని నిర్వహించే వ్యక్తుల అధికారాలు, విధులలో విశేషమైన మార్పులు చోటుచేసుకున్నాయి. క్రమేణా తూర్పు ఇండియా కంపెనీ, తరువాత బ్రిటిష్ ప్రభుత్వం జిల్లా కలెక్టర్ అధికార విధులను గణనీయంగా పెంచుతూ వచ్చాయి. వర్తమాన కాలంలో భారతదేశంలో జిల్లా కలెక్టర్గా నియమితులయ్యేవారు ప్రతిష్టాత్మకమైన ఐ.ఏ.ఎస్. హోదా కలిగి ఉంటున్నారు. జిల్లా కలెక్టర్ను రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తుంది.

జిల్లా కలెక్టర్ అధికారాలు – విధులు: జిల్లా పాలన అధిపతిగా – కలెక్టర్కు విశేష అధికారాలు, విస్తృత విధులు ఉంటాయి. వాటిని క్రింది విధంగా వివరించడమైంది.
1) కలెక్టర్ – ప్రధాన రెవిన్యూ అధికారి: జిల్లాలో కలెక్టర్ ప్రధాన రెవిన్యూ అధికారిగా వ్యవహరిస్తాడు. ఆ హోదాలో అతడు జిల్లాలోని రైతులకు మార్గదర్శిగా ఉంటాడు. జిల్లాలోని గ్రామాలలో భూమిశిస్తు, జమాబందీ లెక్కలకు ఆధ్వర్యం వహిస్తాడు. భూమిశిస్తు వసూళ్ళు, రైతులకు రుణాల మంజూరు, ప్రకృతి విపత్తుల సమయంలో రైతులకు పంట నష్టపరిహారాలను చెల్లించడం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికార బృందాలకు నష్టపరిహార అంచనా సేకరణ, తయారీలలో సహకరించడం, ప్రభుత్వ భూముల రికార్డులను నిర్వహించడం వంటివి జిల్లా కలెక్టర్కు ఉన్న రెవిన్యూ అధికారాలలో ముఖ్యమైనవి. కలెక్టర్ జిల్లాలో ప్రభుత్వ కోశాగారాల పనితీరును సమీక్షిస్తాడు. పైన పేర్కొన్న విధులన్నీ జిల్లా అభివృద్ధికి సంబంధించినవై ఉంటాయి. అంతేకాకుండా వాటి నిర్వహణలో భౌతిక, ఆర్థిక, మానవ సంబంధమైన వనరుల సమీకరణకు సంబంధం ఉంటుంది.

2) జిల్లా మెజిస్ట్రేట్గా వ్యవహరించడం: కలెక్టర్ జిల్లా మెజిస్ట్రేట్ గా వ్యవహరిస్తాడు. జిల్లాలో పనిచేసే పోలీస్ సిబ్బంది వ్యవహారాలపై అతనికి పర్యవేక్షణాధికారం ఉంటుంది. జిల్లాలో శాంతిభద్రతలు సాధారణ స్థాయిలో కొనసాగేటట్లు చూడవలసిందిగా పోలీస్ అధికారులకు సూచిస్తాడు. జిల్లాలో పోలీస్ యంత్రాంగం అంతా కలెక్టర్కు సహాయకారిగా ఉంటుంది. జిల్లా పోలీస్ సూపరింటెండెంట్, ఇతర అధికారులు కలెక్టర్ ఆదేశాల మేరకు వ్యవహరిస్తారు. జిల్లాలోని కారాగారాలు, పోలీస్ సిబ్బంది వ్యవహారాలను కలెక్టర్ నిర్ణీత వ్యవధులలో సమీక్షిస్తాడు.

సబార్డినేట్ కోర్టులపై పర్యవేక్షణ, కార్మిక సమస్యల పరిష్కారం, పేలుడు పదార్థాల తయారీ, రవాణాకు అనుమతినివ్వడం, పెట్రోలు బంకులు, సినిమా థియేటర్లు వంటి అధునాతన సౌకర్యాలు కల్పించడానికి అనుమతులు మంజూరుచేయడం వంటి అనేక విధులను కలెక్టర్ నిర్వహిస్తాడు. పైన పేర్కొన్న విధులన్నీ జిల్లా అభివృద్ధికి సంబంధించిన వ్యవహారాలపై విశేషమైన ప్రభావాన్ని చూపిస్తాయి.

3) ముఖ్య సమన్వయ కర్త: జిల్లాలోని వివిధ ప్రభుత్వశాఖల అధికారుల మధ్య కలెక్టర్ సమన్వయ కర్తగా వ్యవహరిస్తాడు. వ్యవసాయం, నీటిపారుదల, సహకారం, విద్య, పరిశ్రమలు వంటి వివిధ శాఖల అధిపతులతో సమీక్ష సమావేశాలను నిర్వహిస్తాడు. జిల్లాలోని వివిధ శాఖల అధికారుల పనితీరును తెలుసుకుంటాడు. ప్రభుత్వ పథకాల అమలులో వారికి తగిన ఆదేశాలను, సూచనలను ఇస్తాడు. వివిధ శాఖల అధిపతులు విడివిడిగా జిల్లా అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించి, అమలు చేసినప్పటికీ, అంతిమంగా వారంతా కలెక్టర్కు జవాబుదారీగా ఉంటూ కలెక్టర్ సూచనల మేరకు వ్యవహరిస్తారు.

4) జిల్లా ముఖ్య ఎన్నికల అధికారి: జిల్లా ముఖ్య ఎన్నికల అధికారిగా కలెక్టర్ వ్యవహరిస్తాడు. భారత ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘం తరపున జిల్లాలోని వివిధ ప్రాతినిధ్య సంస్థల ప్రతినిధుల ఎన్నికకు అవసరమైన ఏర్పాట్లు చేస్తాడు. ఎన్నికలను ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా జరిగేటట్లు చూస్తాడు.

ఎన్నికలకు సంబంధించిన వారంతా పార్టీలు అభ్యర్థులు, అధికారులు, నాయకులు, ప్రజలు ఎన్నికల నియమావళిని పాటించేలా చూస్తాడు. జిల్లాలో సహకార బ్యాంకులు, డెయిరీ యూనిట్లు, నీటి వినియోగ కమిటీలు, పాఠశాల నిర్వహణ కమిటీలు మొదలైన వాటికి రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు ఎన్నికలను నిర్వహిస్తాడు.

5) జనాభా లెక్కల ముఖ్య అధికారి: కలెక్టర్ జిల్లాలో జనాభా లెక్కల ముఖ్య అధికారిగా వ్యవహరిస్తాడు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పదేళ్ళకొకసారి జనాభా లెక్కల సేకరణకోసం పంపించే మార్గదర్శక సూత్రాలకు అనుగుణంగా జనాభా లెక్కల సేకరణకు చర్యలు తీసుకుంటాడు. అలాగే జిల్లాలో పాడిపశువులు, ఫలసాయమిచ్చే వృక్షాలు, పెంపుడు జంతువులకు సంబంధించిన గణాంక సమాచారాన్ని సేకరించడానికి తగిన ఏర్పాట్లు చేస్తాడు. జిల్లాలో నిరుపేదలకు ఇండ్లు నిర్మించి ఇవ్వడం, ఇతర కుటుంబ సంక్షేమ మహిళా సాధికారత వంటి అంశాలకు సంబంధించిన సమాచార సేకరణకు కలెక్టర్ ఏర్పాట్లు చేస్తాడు.

AP Inter 2nd Year Civics Study Material Chapter 10 భారతదేశంలో స్థానిక ప్రభుత్వాలు

6) స్థానిక సంస్థల సమావేశాలకు శాశ్వత ఆహ్వానితుడు: జిల్లాలోని పంచాయితీరాజ్, పట్టణ పాలిత స్థానికసంస్థల సమావేశాలలో కలెక్టర్ శాశ్వత ఆహ్వానితుని హోదాలో పాల్గొంటాడు. జిల్లాలోని వివిధ స్థానిక సంస్థలకు, కేంద్ర, రాష్ట్రాల మధ్య కలెక్టర్ ప్రధాన సంధానకర్తగా వ్యవహరిస్తాడు. జిల్లా పరిషత్/మండల పరిషత్, సాధారణ/అత్యవసర సమావేశాలకు హాజరై వివిధ అంశాలపై ప్రజా ప్రతినిధులకు, అధికారులకు సలహాలిస్తాడు. జిల్లాలోని స్థానిక సంస్థల వ్యవహారాలు, పనితీరు గురించి రాష్ట్ర ప్రభుత్వానికి నిర్ణీత సమయాలలో విశ్వసనీయ నివేదికలను పంపుతాడు. జిల్లా పరిషత్ ఛైర్మన్పై వచ్చే అవిశ్వాస తీర్మానంపై జిల్లాపరిషత్తు సమావేశాన్ని నిర్వహించి, ఆ తీర్మానంపై ఓటింగ్ నిర్వహించి ఫలితాన్ని ప్రకటిస్తాడు. జిల్లాలో గ్రామీణ/పట్టణ ప్రాంతాలలో కొత్తగా స్థానిక సంస్థల ఏర్పాటు విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి తగిన ప్రతిపాదనలు పంపుతాడు.

ఇతర విధులు: జిల్లా కలెక్టర్ క్రింద పేర్కొన్న ఇతర విధులను నిర్వహిస్తాడు.

  1. మాజీ సైనికోద్యోగుల సంక్షేమం.
  2. నీటిపారుదల సౌకర్యాల కల్పన.
  3. ప్రభుత్వకోశాగారాలపై పర్యవేక్షణ.
  4. వివిధ ప్రభుత్వశాఖల మధ్య సమన్వయం చేకూర్చటం.
  5. జూనియర్ అధికారులకు వివిధ అంశాలపై తర్ఫీదు ఇప్పించటం.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
భారతదేశంలో స్థానిక ప్రభుత్వాల చారిత్రక నేపధ్యాన్ని సంక్షిప్తంగా రాయండి.
జవాబు:
చారిత్రక నేపథ్యం: భారతదేశంలో స్థానిక ప్రభుత్వాలకు విశేషమైన చారిత్రక ప్రాముఖ్యత ఉంది. ప్రశస్తమైన నాలుగు వేదాలలో మొదటిదైన రుగ్వేదంలో సభ, సమితి అనే రెండు సంస్థల గురించి ప్రస్తావన ఉంది. ఆ రెండు సంస్థలూ, స్థానిక సంస్థలకు ప్రతిరూపాలే. గ్రామస్థాయిలో ఆ రెండూ అనేక పరిపాలన, రాజకీయ విధులను నిర్వర్తించాయి. ప్రాచీన భారతదేశంలో చక్కని సమర్థవంతమైన ప్రభుత్వ వ్యవస్థలు ఏర్పడి, పనిచేశాయి. గ్రామీణ సమాజానికి సంబంధించిన పరిపాలన, న్యాయ వ్యవహారాలను పర్యవేక్షించడానికి అవి కొనసాగాయి. వాటిని గ్రామపంచాయితీలు, కుల పంచాయితీలుగా పరిగణించడం జరిగింది. ఆనాటి పాలకుల మద్దతు లేకపోయినప్పటికీ అవి సమర్థవంతంగా వ్యవహరించాయి. మెగస్తనీస్, కౌటిల్యుడు, ఫాహియాన్ వంటి ప్రసిద్ధ పర్యాటకులు తమ గ్రంథాలలో పైన పేర్కొన్న సంస్థల గురించి ప్రస్తావించారు.

మధ్యయుగంలో దక్షిణ భారతదేశంలో చోళ వంశ రాజుల పరిపాలన కాలంలో గ్రామపంచాయితీలు వికసించాయి. స్థానిక సంస్థలను ఏర్పాటు చేసి పోషించిన వారిలో చోళులకు మంచిపేరు వచ్చింది. అయితే వర్తమాన స్థానిక ప్రభుత్వాల నిర్మాణం, పనితీరుపై బ్రిటీష్ ప్రభుత్వానికి చెందిన ఉన్నతాధికారుల పాత్ర విస్మరించలేనిది. బ్రిటిష్ పాలకులు స్వీయ ప్రయోజనాలను పెంపొందించుకొనే లక్ష్యంతో స్థానిక ప్రభుత్వాల అభివృద్ధికి కృషి చేశారు. 1870 నాటి మేయో ప్రభువు, 1882 నాటి రిప్పన్ ప్రభువుల తీర్మానాలు భారతదేశంలో ఈ రకమైన ప్రభుత్వాల పురోగతికి మార్గదర్శకమయ్యాయి. అంతకు పూర్వం 1688లో తూర్పు ఇండియా కంపెనీ భారతదేశంలో మొదటిసారిగా మదరాసు (ప్రస్తుతం చెన్నై) నగరపాలక సంస్థను ఆనాటి బ్రిటిష్ చక్రవర్తి రెండో జార్జి అనుమతితో ఆరంభించింది. 1726 నాటికి మదరాసులో ప్రజల వద్ద నుంచి పన్నులను సేకరించడం, న్యాయపాలన వంటి ప్రధాన విధులను నిర్వహించడానికి కొన్ని మేయర్ కోర్టులు ఏర్పాటయ్యాయి. 1773 నాటి రెగ్యులేటింగ్ చట్టం ద్వారా కలకత్తా (కోల్కతా), మదరాసు (చెన్నై), బొంబాయి (ముంబై) నగరాలలో స్థానిక ప్రభుత్వాల ఏర్పాటుకు మార్గం సుగమమైంది.

1935 చట్టం స్థానిక స్వపరిపాలన అనే అంశాన్ని ఆ చట్టం 12వ ప్రవేశ విషయంగా (Entry 12) ప్రకటించింది. భారతదేశంలో రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ చట్టాలను రూపొందించడం ద్వారా గ్రామపంచాయితీల అధికారాలను విశేషంగా పెంచడానికి చర్యలు తీసుకున్నాయి. గ్రామపంచాయతీల ఆధీనంలో క్రిమినల్ న్యాయంతో సహా అనేక అంశాలను చేర్చడం జరిగింది. మహత్మాగాంధీ వంటి ప్రముఖ జాతీయోద్యమ నాయకులు స్థానిక ప్రభుత్వాలను వెంటనే ఏర్పాటు చేయవలసిందిగా బ్రిటీష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

AP Inter 2nd Year Civics Study Material Chapter 10 భారతదేశంలో స్థానిక ప్రభుత్వాలు

1935 భారత ప్రభుత్వ చట్టం స్థానిక ప్రభుత్వాలు సమర్థవంతంగా పనిచేయటానికి వీటి ఏర్పాటు నిర్వహణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించింది. స్థానిక స్వపరిపాలన రాష్ట్ర ప్రభుత్వ అధికారాలలో 12వ అంశంగా పేర్కొంటారు. వీటి పాలనతో పాటు క్రిమినల్ న్యాయవ్యవస్థలు స్థానిక ప్రభుత్వాల పరిధిలోకి తెచ్చారు. మనదేశ పెద్దలైన మహాత్మాగాంధీలాంటి వారు దీనిని గట్టిగా సమర్థించారు. అయితే రెండవ ప్రపంచయుద్ధం తరువాత తగినంత ప్రగతి స్థానిక ప్రభుత్వాలలో కొనసాగలేదు. మనం ఇప్పుడు స్థానిక ప్రభుత్వాల అధికారాలు, విధులను రెండు భాగాలుగా విభజించి అధ్యయనం చేయవచ్చు. 1) గ్రామీణ స్థానిక ప్రభుత్వాలు 2) పట్టణ స్థానిక ప్రభుత్వాలు.

ప్రశ్న 2.
స్థానిక ప్రభుత్వాల ప్రయోజనాలను వివరించండి.
జవాబు:
ప్రయోజనాలు: వర్తమాన ప్రజాస్వామ్య రాజ్యాలలో స్థానిక ప్రభుత్వాలు పనిచేస్తుంటాయి. ఆ సంస్థల వల్ల అనేక ప్రయోజనాలు లభించడం వల్ల వాటిని ఆధునిక ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ప్రోత్సహిస్తాయి. స్థానిక ప్రభుత్వాల వల్ల క్రింది ప్రయోజనాలు ఉంటాయి.

  1. స్థానిక ప్రభుత్వాలు ప్రజాస్వామ్యాన్ని అట్టడుగు స్థాయిలో పెంపొందించి పటిష్టంగావిస్తాయి. మారుమూల ప్రాంతాల ప్రజలు సైతం స్థానిక రాజకీయ ప్రక్రియలో సమర్థవంతంగా పాల్గొనేటట్లు ప్రోత్సహిస్తాయి.
  2. స్థానిక ప్రభుత్వాలు ప్రజలలో రాజకీయ అవగాహనను, బాధ్యతను పెంపొందిస్తాయి. ఎందుకంటే అవి స్థానిక స్థాయిలో వివిధ రాజకీయ సంస్థల నిర్వహణలో విధానాలపై నిర్ణయం, విధానాల అమలులో ప్రజలకు అవకాశమిస్తాయి.
  3. స్థానిక ప్రభుత్వాలు స్థానిక స్థాయిలో ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రజలకు భాగస్వామ్యం కల్పించి ఆ సమస్యలు శీఘ్రంగానూ, సంపూర్ణంగానూ పరిష్కారమయ్యేలా చూస్తాయి.
  4. స్థానికంగా అందుబాటులో ఉండే మానవీయ, భౌతిక వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవడంలోనూ, సక్రమంగా నిర్వహించుకోవడంలోనూ స్థానిక ప్రభుత్వాలు దోహదపడతాయి.
  5. స్థానిక ప్రభుత్వాలు పాలనలో పొదుపు పెంచుతాయి.
  6. ఇవి ప్రజలలో స్వేచ్ఛా వాతావరణాన్ని పెంపొందిస్తాయి.
  7. ఇవి స్వయం సహాయ, స్వయం ఆధారిత స్ఫూర్తిని అలవరుస్తాయి.

ప్రశ్న 3.
పంచాయితీ కార్యదర్శి విధులు ఏవి?
జవాబు:
ప్రతి గ్రామ పంచాయితీకి పూర్తి కాల ప్రభుత్వ అధికారిగా కార్యదర్శి వ్యవహరిస్తాడు. ఇతనిని రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తుంది. కార్యదర్శి జీతం ఇతర భత్యాలు ప్రభుత్వనిబంధనల ప్రకారం పంచాయితీ నిధుల నుంచి కేటాయిస్తారు. ఇతను సర్పంచ్ ప్రత్యక్ష పర్యవేక్షణలో పనిచేస్తాడు.

పంచాయతీ కార్యదర్శి ఈ క్రింది పేర్కొన్న విధులను నిర్వహిస్తాడు.

  1. పంచాయతీ బడ్జెట్ తయారుచేయడం, వార్షిక పాలనా నివేదికలు తయారుచేయడం.
  2. నెలవారీ, త్రైమాసిక, ఆర్థిక గణాంకాలు తయారుచేయడం.
  3. నగదు పుస్తక నిర్వహణ.
  4. పంచాయతీ రికార్డులను తన ఆధీనంలో భద్రపరుచుట.
  5. పంచాయతీలో ఇతర ఉద్యోగులకు విధులు కేటాయించడం.
  6. గ్రాంటు కోసం ధరఖాస్తుచేయడం, గ్రాంట్ ఇన్ ఎయిడ్ రిజిష్టరు చేయడం.
  7. పంచాయతీలో జరిగే పనులు తనిఖీ, పని ప్రగతిని పరిశీలించడం.
  8. అభివృద్ధి పనులకు సంబంధించిన ఫిర్యాదులను స్వీకరించి, పరిశీలించి తగు చర్యలు తీసుకోవడం.

ప్రశ్న 4.
గ్రామ సభ గూర్చి నీకు ఏమి తెలియును?
జవాబు:
ప్రతి గ్రామపంచాయతీలో గ్రామసభ ఏర్పాటవుతుంది. దానిలో గ్రామానికి చెందిన రిజిష్టర్డ్ ఓటర్లు సభ్యులుగా ఉంటారు. అది సంవత్సరానికి కనీసం మూడుసార్లయినా సమావేశమవుతుంది. గ్రామసభ పంచాయతీకి సంబంధించిన వార్షిక పరిపాలన, ఆడిట్ నివేదికలను పరిశీలించి ఆమోదిస్తుంది. వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాల లబ్ధిదారుల జాబితాను ఖరారు చేస్తుంది. సమాజ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు శ్రీఘ్రగతిన అమలుపరచడానికి, ప్రజల భౌతిక సేవలను స్వచ్ఛందంగా వినియోగించుకోవడానికి తగిన సూచనలిస్తుంది. గ్రామసభలను బీహార్లో పంచాయతీ అని, ఒడిస్సాలో పాలీ సభ అని వ్యవహరిస్తారు. కేంద్రప్రభుత్వం 2009-2010 సంవత్సరాన్ని పంచాయతీరాజ్ సంస్థలను ఏర్పరచి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో గ్రామసభ సంవత్సరంగా ప్రకటించింది. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14వ తేదీన గ్రామసభలను తప్పనిసరిగా నిర్వహించాలని పేర్కొంది.

AP Inter 2nd Year Civics Study Material Chapter 10 భారతదేశంలో స్థానిక ప్రభుత్వాలు

ప్రశ్న 5.
మండల పరిషత్తు గూర్చి క్లుప్తంగా రాయండి.
జవాబు:
జిల్లాలో మాథ్యమిక స్థాయిలో గల స్థానిక సంస్థయే మండల పరిషత్తు, రాష్ట్ర ప్రభుత్వ చట్టం ద్వారా మండల పరిషత్తు ఏర్పాటవుతుంది. మండల పరిషత్తులను వివిధ రాష్ట్రాలలో వివిధ రకాల పేర్లతో పిలుస్తారు. ఉదాహరణకు తమిళనాడులో పంచాయతి యూనియన్ కౌన్సిల్, కర్నాటకలో తాలూక అభివృద్ధి బోర్డు, గుజరాత్లో తాలూక పంచాయత్ అని అంటారు. అయినప్పటికీ దీనికి ప్రాచుర్యంలో ఉన్న పేరు పంచాయతీ సమితి.

నిర్మాణం: ప్రతి మండలాన్ని కొన్ని మండల ప్రాదేశిక నియోజకవర్గాలుగా (జనాభా ప్రాతిపదికన) విడదీస్తారు. ఓటర్లు మండల ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులను ఎన్నుకుంటారు. మండల పరిషత్తులో నాలుగు అంగాలుంటాయి. అవి: 1) మండలపరిషత్తు, 2) మండల పరిషత్తు అధ్యక్షుడు 3) మండల పరిషత్తు అభివృద్ధి అధికారి 4) మండల మహాసభ.

ప్రశ్న 6.
జిల్లా పరిషత్తు నిర్మాణం గురించి వివరించండి.
జవాబు:
రాష్ట్రంలోని ప్రతి జిల్లాకు ఒక జిల్లా పరిషత్తు ఉంటుంది. జిల్లా స్థాయిలో అత్యున్నత స్థాయి స్వపరిపాలన సంస్థయే జిల్లా పరిషత్తు, జిల్లా పరిషత్తుకు చట్టబద్ధమైన ప్రతిపత్తి ఉంటుంది.

జిల్లా పరిషత్: జిల్లా పరిషత్తులో ఆరు ప్రధాన అంగాలు ఉంటాయి. అవి:

  1. జిల్లా పరిషత్తు,
  2. ఛైర్మన్,
  3. జిల్లా మహాసభ,
  4. ముఖ్య కార్యనిర్వహణాధికారి,
  5. స్థాయీ సంఘాలు,
  6. జిల్లా కలెక్టర్.

జిల్లా పరిషత్తు అనేది జిల్లా స్థాయిలో శాసన నిర్మాణ అంగంగా వ్యవహరిస్తుంది. దానిలో వివిధ రకాల సభ్యులు ఉంటారు. వారిలో ఎన్నికయినవారు కో-ఆప్టెడ్ చేసుకోబడినవారు, ఎక్స్-అఫీషియో సభ్యులుంటారు. జిల్లా స్థాయి అధికారులైన జిల్లా కలెక్టర్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు, జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ, జిల్లా గ్రంథాలయ సంస్థలకు చెందిన అధ్యక్షులు శాశ్వత ఆహ్వానితుల హోదాలో జిల్లా పరిషత్తు సమావేశాలలో పాల్గొంటారు. అంతేకాకుండా జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గ సభ్యులు (MLAs) జిల్లా పరిషత్తు సమావేశాలలో పాల్గొంటారు.

ప్రశ్న 7.
భారతదేశంలో వివిధ రకాల పట్టణ స్థానిక సంస్థల గూర్చి చర్చించండి.
జవాబు:
భారతదేశంలో 9 రకాల పట్టణ స్థానిక సంస్థలున్నాయి. అవి

  1. నగరపాలక సంస్థలు,
  2. పురపాలక సంస్థలు
  3. నగర పంచాయతీలు
  4. నోటిఫైడ్ ఏరియా కమిటీలు
  5. టౌన్ ఏరియా కమిటీలు
  6. కంటోన్మెంట్ బోర్డులు
  7. టౌన్ షిప్పులు
  8. పోర్టుట్రస్టులు
  9. ప్రత్యేక ప్రయోజిత సంస్థలు.

1) నగరపాలక సంస్థలు: పట్టణ స్థానిక ప్రభుత్వాలలో నగరపాలక సంస్థలు చాలా ముఖ్యమైనవి. ఇవి అత్యున్నత పట్టణ, స్థానిక సంస్థలుగా అతిపెద్ద నగరాలలో ఏర్పాటుచేస్తారు.

2) పురపాలక సంస్థలు: నగరపాలక సంస్థకు దిగువన, గ్రామపంచాయతీ/నగర పంచాయతీకి ఎగువన గల పట్టణ స్థానిక సంస్థలే పురపాలక సంస్థలు. సాధారణంగా జనాభా 20,001 లేదా అంతకుమించితే లేదా . అరవై లక్షలకు మించిన వార్షికాదాయం ఉంటే పురపాలక సంస్థలుగా ఏర్పాటవుతాయి.

AP Inter 2nd Year Civics Study Material Chapter 10 భారతదేశంలో స్థానిక ప్రభుత్వాలు

3) నగర పంచాయతీలు: గ్రామ స్థాయి నుండి పట్టణ స్థాయికి పరిణామం చెందే ప్రాంతం’ లేదా అతిచిన్న పట్టణ ప్రాంతాలలో ఏర్పాటయ్యే స్థానిక సంస్థలను నగర పంచాయతీ అంటారు.

4) నోటిఫైడ్ ఏరియా కమిటీలు: శీఘ్రగతిన అభివృద్ధి పథంలో పురోగమించే పట్టణాలలో లేదా పురపాలక సంస్థల ఏర్పాటుకు అనుకూలంగా లేని పరిస్థితులలో ఈ కమిటీ ఏర్పాటవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రకటన ద్వారా ఈ కమిటీ ఏర్పడడంతో దీనిని నోటిఫైడ్ ఏరియా కమిటీగా వ్యవహరించడమైంది.

5) టౌన్ ఏరియా కమిటీలు: రాష్ట్ర శాసనసభ ఆమోదించే ప్రత్యేక చట్టం ద్వారా టౌన్ ఏరియా కమిటీ ఏర్పాటవుతుంది. చిన్న పట్టణాల అవసరాలను తీర్చడానికి ఈ కమిటీలు అవసరమవుతాయి. అవి పరిమితమైన విధులను మాత్రమే నిర్వహిస్తుంటాయి.

6) కంటోన్మెంట్ బోర్డులు భారతదేశంలో కంటోన్మెంట్ బోర్డులనేవి భారత ప్రభుత్వ కంటోన్మెంట్ చట్టం, 1904 ద్వారా ఏర్పాటయ్యాయి. ప్రస్తుతం భారతదేశంలో 62 కంటోన్మెంట్ బోర్డులు పనిచేస్తున్నాయి. కంటోన్మెంట్ ప్రాంతాలలో నివసించే పౌరులు, సైనిక సిబ్బంది తాలుకు వ్యక్తుల ప్రయోజనాలను పెంపొందించడానికి అవి కృషి చేస్తున్నాయి.

7) టౌన్షిప్లు: టౌన్షిప్లు అనేవి ప్రభుత్వరంగ సంస్థలలో ఏర్పాటవుతాయి. ప్రభుత్వరంగ సంస్థలలో పనిచేసే సిబ్బందికి మౌలిక సదుపాయాలను కల్పించడానికి అవి కృషిచేస్తాయి. వాటిలో ఎన్నుకోబడే సభ్యులు ఎవరూ ఉండరు. ప్రతి టౌన్షిప్కు ఒక టౌన్ పరిపాలన అధికారి ఉంటాడు.

8) పోర్ట్ స్ట్లు: దేశంలోని సముద్రతీరంలో ఓడరేవులు ఉన్న ప్రాంతాలలో పోర్ట్ స్ట్లు ఏర్పాటవుతాయి. అలాగే నౌకాశ్రయాలలో పనిచేసే సిబ్బందికి సంబంధించిన వ్యవహారాలను పర్యవేక్షిస్తాయి.

9) ప్రత్యేక ప్రయోజిత సంస్థలు: పట్టణ ప్రాంతాలలో నివసించే ప్రజలు ఎదుర్కొనే సమస్యల పరిష్కారానికి ఈ రకమైన సంస్థలు పనిచేస్తుంటాయి. పురపాలక సంఘాలు. ఇతర నోటిఫైడ్ ప్రాంతాలలో నివసించే ప్రజల ప్రత్యేక అవసరాలను తీర్చడానికి అవి కృషిచేస్తాయి. రాష్ట్ర శాసనసభ ఆమోదించిన ప్రత్యేక చట్టాల ప్రకారం వాటిని స్థాపించడం జరుగుతుంది.

ప్రశ్న 8.
మున్సిపాలిటీల గురించి నీకు ఏమి తెలియును?
జవాబు:
నగరపాలక సంస్థకు దిగువన, గ్రామపంచాయతీ / నగర పంచాయితీకి ఎగువన గల పట్టణ స్థానిక సంస్థలే పురపాలక సంస్థలు. సాధారణంగా జనాభా 20,001 లేదా అంతకుమించితే లేదా అరవై లక్షలకు మించిన వార్షికాదాయం ఉంటే పురపాలక సంస్థలుగా ఏర్పాటవుతాయి.

ప్రతి పురపాలక సంస్థలో నాలుగు అంగాలు ఉంటాయి. 1) పురపాలక మండలి, 2) పురపాలక చైర్మన్, 3) మున్సిపల్ కమీషనర్, 4) స్థాయీ సంఘాలు, ఆ నాలుగు రకాల అంగాల గురించి క్రింది విధంగా వివరించవచ్చు.

పురపాలక సంస్థ చర్చావేదికయే పురపాలక మండలి. దీనిలో i) ఎన్నికయ్యే సభ్యులు ii) అనుబంధ సభ్యులు iii) గౌరవ సభ్యులు అనే మూడు రకాల సభ్యులు ఉంటారు. పురపాలక సంస్థ పరిధిలోని రిజిష్టర్డ్ ఓటర్లు మొదటి తరహా సభ్యులను ఎన్నుకుంటారు. వీరిని కౌన్సిలర్స్ అంటారు. అనుబంధ సభ్యులను, ఎన్నికయిన సభ్యులు ఎన్నుకుంటారు. జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమీషనర్, పురపాలక సంస్థ పరిధిలోని లోక్సభ, విధానసభ సభ్యులు తమ అధికార హోదారీత్యా పురపాలక మండలిలో సభ్యులుగా వ్యవహరిస్తారు.

ప్రశ్న 9.
జిల్లా కలెక్టర్ యొక్క ఏవైనా మూడు విధులను గూర్చి రాయండి.
జవాబు:
జిల్లా పాలనాధిపతిగా – కలెక్టరుకు విశేష అధికారాలు, విస్తృత విధులు ఉంటాయి. వాటిని ఈ క్రింది విధంగా పేర్కొనవచ్చు.
1) కలెక్టర్ – ప్రధాన రెవిన్యూ అధికారి: జిల్లాలో కలెక్టర్ ప్రధాన రెవిన్యూ అధికారిగా వ్యవహరిస్తాడు. హోదాలో అతడు జిల్లాలోని రైతులకు మార్గదర్శిగా ఉంటాడు. జిల్లాలోని గ్రామాలలో భూమిశిస్తు, జమాబందీ లెక్కలకు ఆధ్వర్యం వహిస్తాడు. భూమిశిస్తు వసూళ్ళు, రైతులకు రుణాల మంజూరు, ప్రకృతి విపత్తుల సమయంలో రైతులకు పంట నష్టపరిహారాలను చెల్లించడం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికార బృందాలకు నష్టపరిహార అంచనా సేకరణ, తయారీలలో సహకరించడం, ప్రభుత్వ భూముల రికార్డులను నిర్వహించడం వంటివి జిల్లా కలెక్టర్కు ఉన్న రెవిన్యూ అధికారాలలో ముఖ్యమైనవి.

2) జిల్లా మెజిస్ట్రేట్గా వ్యవహరించడం: కలెక్టర్ జిల్లా మెజిస్ట్రేట్గా వ్యవహరిస్తాడు. జిల్లాలో పనిచేసే పోలీస్ సిబ్బంది వ్యవహారాలపై అతనికి పర్యవేక్షణాధికారం ఉంటుంది. జిల్లాలో శాంతిభద్రతలు సాధారణ స్థాయిలో కొనసాగేటట్లు చూడవలసిందిగా పోలీస్ అధికారులకు సూచిస్తాడు. జిల్లాలో పోలీస్ యంత్రాంగం అంతా కలెక్టర్కు సహాయకారిగా ఉంటుంది. జిల్లా పోలీస్ సూపరింటెండెంట్, ఇతర అధికారులు కలెక్టర్ ఆదేశాల మేరకు వ్యవహరిస్తారు.

3) ముఖ్య సమన్వయ కర్త: జిల్లాలోని వివిధ ప్రభుత్వశాఖల అధికారుల మధ్య కలెక్టర్ సమన్వయ కర్తగా వ్యవహరిస్తాడు. వ్యవసాయం, నీటిపారుదల, సహకారం, విద్య, పరిశ్రమలు వంటి వివిధ శాఖల అధిపతులతో సమీక్ష సమావేశాలను నిర్వహిస్తాడు. జిల్లాలోని వివిధ శాఖల అధికారులు పనితీరును తెలుసుకుంటాడు. ప్రభుత్వ పథకాల అమలులో వారికి తగిన ఆదేశాలను, సూచనలను ఇస్తాడు.

AP Inter 2nd Year Civics Study Material Chapter 10 భారతదేశంలో స్థానిక ప్రభుత్వాలు

ప్రశ్న 10.
జిల్లా కలెక్టరు పాత్రను అంచనా వేయండి.
జవాబు:
జిల్లాలోని వివిధ స్థానిక ప్రభుత్వాల వ్యవహారాల నిర్వహణలో కలెక్టర్ అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తాడు. జిల్లాలో నివసించే సాధారణ ప్రజానీకానికి కలెక్టర్ స్నేహితుడిగా, తాత్త్వికుడిగా, మార్గదర్శకుడిగా ఉంటాడు. జిల్లాలోని స్థానిక ప్రభుత్వాలకు, ప్రజలకు మధ్య సంధానకర్తగా వ్యవహరిస్తాడు. ‘సాధారణంగా జిల్లాలోని సామాన్య ప్రజలు ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు కలెక్టర్ అందించే సహాయసహకారాల కోసం ఆత్రుతతో ఎదురుచూస్తూ ఉంటారు.

జిల్లాలోని స్థానిక ప్రభుత్వాల పనితీరు గురించి కలెక్టర్ రాష్ట్ర ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు తగిన సూచనలందిస్తాడు. జిల్లాలో నూతనంగా స్థానిక సంస్థలను ఏర్పాటు చేసే విషయంలో కలెక్టర్ సిఫారసులు, వ్యాఖ్యానాలు అత్యంత కీలకమైన స్థానాన్ని ఆక్రమిస్తాయి. అనేక సందర్భాలలో జిల్లాలో వ్యవసాయం, పశుపోషణ, రెవిన్యూ, పోలీసు, ఆరోగ్యం, విద్య వంటి రంగాలలో పనిచేసే సిబ్బంది కలెక్టర్ సలహాల ప్రకారం వ్యవహరిస్తారు. జిల్లాలోని రైతులకు వ్యవసాయక ఉత్పాదితాలైన ఎరువులు, క్రిమిసంహారక మందులు, సహకార రుణాలు వంటి సౌకర్యాలు, వ్యవసాయ పంటల మార్కెటింగ్ సదుపాయాలు, ఆరోగ్యం, విద్యవంటి రంగాలలో పనిచేసే సిబ్బంది కలెక్టర్ సలహాల ప్రకారం వ్యవహరిస్తారు. జిల్లాలోని రైతులకు వ్యవసాయక ఉత్పాదితాలైన ఎరువులు, క్రిమిసంహారక మందులు, అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటాడు. వ్యవసాయ కార్యకలాపాలు నిరాటంకంగా కొనసాగడానికి కృషిచేస్తాడు. అలాగే పేదరిక రేఖ దిగువన నివసించే ప్రజలకు ఆరోగ్యం, ఆహారం, త్రాగునీరు, ఉపాధి వంటి సౌకర్యాలు కల్పించడానికి దోహదపడతాడు.

జిల్లా స్థాయిలో కలెక్టర్ దాదాపు నూరుకు పైగా కమిటీల సమావేశాలకు అధ్యక్షత వహించడమనే విషయం కలెక్టర్ పదవి ప్రాముఖ్యత గురించి, జిల్లా పాలనా వ్యవహారాలలో కలెక్టర్ నిర్వహించే కీలకపాత్ర గురించి తెలుపుతుంది. కలెక్టర్ జిల్లాస్థాయిలో వివిధ కమిటీల సమావేశాలకు అధ్యక్షత వహించడంతోపాటుగా ఆ సమావేశాలలో తీసుకున్న నిర్ణయాలను అమలుచేయడానికి తగిన శ్రద్ధ వహిస్తాడు. జిల్లాలో వివిధ మండల పరిషత్తులు, గ్రామపంచాయతీలను నెలలో దాదాపు ఇరవై రోజులపాటు సందర్శించి, ఆయా సంస్థల పనితీరును సమీక్షించి, వాటి మెరుగుదలకు తగిన సూచనలిస్తాడు. రాష్ట్రస్థాయిలో ముఖ్యకార్యదర్శి వలె, జిల్లాస్థాయిలో కలెక్టర్ విశేషమైన ప్రభావాన్ని చూపిస్తూ, తన అధికారాల వినియోగంలో వివేకం, వివేచనలను ప్రదర్శిస్తాడు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన అనేక అభివృద్ధి పథకాలైన జాతీయగ్రామీణ ఉపాధి హామీ పథకం (NREGS – National Rural Employment Guarantee Scheme), ప్రధానమంత్రి గ్రామ శోధక్ యోజన (PMGSY), జాతీయ గ్రామీణ ఆరోగ్య పథకం వంటి అనేక కార్యక్రమాల అమలు, విజయాలు, జిల్లా కలెక్టర్ చైతన్యవంతమైన నాయకత్వం పైనే ఆధారపడి ఉంటాయి. అందువల్ల జిల్లాస్థాయిలో ఉత్పన్నమయ్యే ఆర్థిక, రాజకీయ సమస్యల పరిష్కారంలో, జిల్లా ప్రజలతో మమేకమయ్యే జిల్లా కలెక్టర్తో ఆ ప్రభుత్వాలు నిరంతరం దృశ్య, శ్రవణ మాధ్యమాల ద్వారా సంబంధాలను కలిగి ఉంటాయి. జిల్లా స్థాయిలో జరిగే ప్రభుత్వ సంబంధమైన అనేక కమిటీలకు కలెక్టర్ కన్వీనర్గానో, సంధానకర్తగానో, సమన్వయ కర్తగానో వ్యవహరిస్తాడు.

ఇటీవలి కాలంలో కలెక్టర్ పదవిలో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. సరళీకరణ, ప్రైవేటీకరణల ప్రభావంవల్ల కలెక్టర్ అధికార విధులు పునర్నిర్వచించబడినాయి. ఆ పరిణామాలు తమ అధికార విధుల నిర్వహణలో ఎంతో అప్రమత్తతతో వ్యవహరించేటట్లు కలెక్టర్ను తీర్చిదిద్దాయి. అంతేకాకుండా జనాభా పెరుగుదల, శాస్త్రసాంకేతిక రంగాలలో పురోగతి, ప్రణాళికలు, మహిళా సాధికారత, బలహీనవర్గాల సంక్షేమం, రాజ్యాంగపరమైన కర్తవ్యాలు మొదలైన అంశాలు జిల్లా కలెక్టర్ అధికార విధుల నిర్వహణలో విశేషమైన మార్పులకు దారితీశాయి.

ప్రశ్న 11.
ఆకర్షణీయ గ్రామ స్వభావాన్ని వివరించండి. [Mar. ’17]
జవాబు:
నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు 2015లో ఆకర్షణీయ గ్రామ (Smart Village) పథకాన్ని ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ సుస్థిరాభివృద్ధి సాధించాలనే లక్ష్యానికి కట్టుబడి స్వర్ణాంధ్ర లక్ష్యం విజన్ 2029 నాటికి దేశంలో అభివృద్ధి చెందిన మొదటి మూడు రాష్ట్రాలలో ఒకటి చేయాలనేది ప్రభుత్వలక్ష్యం. ఈ లక్ష్యసాఫల్యం కోసం ప్రభుత్వం మిషన్ ఆధారిత దృక్పథంతో సాంఘిక, ఆర్థిక, మౌలిక సదుపాయాల సౌకర్యాలను సృష్టిస్తారు. ఈ లక్ష్య సాధన కోసం రాష్ట్రంలో పెద్దఎత్తున ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తారు.

జన్మభూమి, మా ఊరు కార్యక్రమానికి కొనసాగింపుగా ఆకర్షణీయ గ్రామం, ఆకర్షణీయ వార్డు కార్యక్రమాన్ని ప్రభుత్వం రూపొందించి పాలన వికేంద్రీకరణ, అధికార దత్తత, ప్రభుత్వసేవలు, అభివృద్ధి పథకాలు మొ॥ విషయాలలో ప్రజలను భాగస్వాములను చేసి వారి జీవన విధానంలో నాణ్యత పెంచడం ద్వారా స్వర్ణాంధ్రప్రదేశ్ ఏర్పాటు చేయాలనేది ఈ పథకం లక్ష్యం.

AP Inter 2nd Year Civics Study Material Chapter 10 భారతదేశంలో స్థానిక ప్రభుత్వాలు

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
గ్రామీణ స్థానిక ప్రభుత్వాలు
జవాబు:
ప్రస్తుతం భారతదేశంలో పంచాయితీరాజ్ సంస్థలు లేదా గ్రామీణ స్థానిక ప్రభుత్వాలు 73వ రాజ్యాంగ సవరణ చట్టం 1992 ప్రకారం ఏర్పాటయ్యాయి. గ్రామీణ స్థానిక ప్రభుత్వాలు మూడు అంచెలలో వుంటాయి. అవి:

  1. గ్రామస్థాయిలో గ్రామ పంచాయితీలు
  2. మండల లేదా మధ్య స్థాయిలో మండల పరిషత్లు
  3. జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్లు.

ప్రశ్న 2.
రాజ్యాంగం (73వ సవరణ చట్టం) 1992
జవాబు:
భారతదేశంలో గ్రామీణ స్థానిక ప్రభుత్వాలు లేదా పంచాయితీరాజ్ సంస్థలను సమర్థవంతంగా తీర్చిదిద్దటానికి రాజ్యాంగం (73వ సవరణ) చట్టం 1992ని కేంద్ర ప్రభుత్వం రూపొందించింది. ఈ చట్టంలో నూతనంగా జిల్లా, గ్రామసభ, పంచాయితీ గ్రామం అనే పదాలను చేర్చడం జరిగింది. ప్రతి గ్రామానికి ఒక గ్రామసభను ఏర్పాటు చేసింది. ఈ చట్టం షెడ్యూల్డు కులాలకు, షెడ్యూల్డు తెగలకు, వెనుకబడిన తరగతులకు మరియు మొత్తం సీట్లలో 33.3 శాతం మహిళలకు కేటాయిస్తూ పంచాయితీరాజ్ సంస్థలలో రిజర్వేషన్లను కల్పించింది.

ప్రశ్న 3.
గ్రామసభ
జవాబు:
ప్రతి గ్రామ పంచాయితీలో క గ్రామ సభ ఏర్పాటవుతుంది. దానిలో గ్రామానికి చెందిన రిజిష్టర్డ్ ఓటర్లు సభ్యులుగా ఉంటారు. ఇది సంవత్సరానికి కనీసం మూడుసార్లు సమావేశమవుతుంది. గ్రామసభ పంచాయితీకి సంబంధించిన వార్షిక పరిపాలన, ఆడిట్ నివేదికలను పరిశీలించి ఆమోదిస్తుంది. అభివృద్ధి, సంక్షేమం, ప్రభుత్వ పథకాలకు లబ్దిదారులను ఎంపిక చేయడం దీని పని.

ప్రశ్న 4.
జిల్లా పరిషత్
జవాబు:
రాష్ట్రంలో ప్రతి జిల్లాకు ఒక జిల్లా పరిషత్తు ఉంటుంది. జిల్లా స్థాయిలో అత్యున్నత స్థాయి స్వపరిపాలన సంస్థయే జిల్లా పరిషత్తు, జిల్లా పరిషత్కు చట్టబద్ధమైన ప్రతిపత్తి ఉంటుంది. జిల్లా పరిషత్లో ఆరు అంగాలుంటాయి. అవి:

  1. జిల్లా పరిషత్
  2. ఛైర్మన్
  3. జిల్లా మహాసభ
  4. ముఖ్య కార్యనిర్వహణాధికారి
  5. స్థాయీసంఘాలు
  6. జిల్లా కలెక్టరు.

AP Inter 2nd Year Civics Study Material Chapter 10 భారతదేశంలో స్థానిక ప్రభుత్వాలు

ప్రశ్న 5.
ఎం.పి.డి.ఒ (లేదా) మండల పరిషత్ అబివృద్ధి అధికారి [Mar. ’16]
జవాబు:
ఎం.పి.డి.ఒ అంటే మండల పరిషత్ డెవలప్మెంట్ అధికారి. ఇతనిని రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తుంది. ఇతను మండల పరిషత్క పరిపాలనాధిపతిగా వ్యవహరిస్తారు. మండల పరిషత్, మండల మహాసభ తేదీలు, అజెండాల రూపకల్పనలోనూ ముఖ్యపాత్ర పోషిస్తాడు. మండల పరిషత్ వార్షిక బడ్జెట్ను రూపొందిస్తాడు. మండల పరిషత్ సమర్థవంతంగా పనిచేయడానికి అవసరమైన చర్యలను తీసుకుంటాడు.

ప్రశ్న 6.
మండల పరిషత్తు
జవాబు:
జిల్లాలో మాధ్యమిక స్థాయిలో గల స్థానిక సంస్థయే మండల పరిషత్తు. రాష్ట్ర ప్రభుత్వ చట్టం ద్వారా మండల పరిషత్తు ఏర్పడుతుంది. ప్రతి మండలాన్ని కొన్ని మండల ప్రాదేశిక నియోజక వర్గాలుగా (జనాభా ప్రాతిపదికన) విభజిస్తారు. ఓటర్లు మండల ప్రాదేశిక నియోజక వర్గ సభ్యులను ఎన్నుకుంటారు. మండల పరిషత్తులో నాలుగు అంగాలుంటాయి. అవి: 1) మండల పరిషత్తు 2) మండల పరిషత్తు అధ్యక్షుడు 3) మండల పరిషత్తు అభివృద్ధి అధికారి 4) మండల మహాసభ.

ప్రశ్న 7.
జిల్లా మహాసభ
జవాబు:
ప్రతి జిల్లాపరిషత్లో జిల్లా మహాసభ ఉంటుంది. దానిలో జిల్లా పరిషత్ చైర్మన్, కొందరు సభ్యులుంటారు. జిల్లా మహాసభ జిల్లా పరిషత్కు సలహా సంస్థగా వ్యవహరిస్తుంది. దాని సమావేశాలకు జిల్లా పరిషత్ చైర్మన్ అధ్యక్షత వహిస్తాడు. జిల్లా పరిషత్ వార్షిక బడ్జెట్, ఆడిట్ నివేదికలను పరిశీలించడం, జిల్లా పరిషత్క సంబంధించిన గత సంవత్సరపు పరిపాలన నివేదికను పరిశీలించటం జిల్లా మహాసభ ముఖ్య విధులుగా భావిస్తారు.

ప్రశ్న 8.
జిల్లా పరిషత్తు స్థాయీ సంఘాలు
జవాబు:
ప్రతి జిల్లా పరిషత్తులో ఏడు స్థాయి సంఘాలుంటాయి. అవి జిల్లా పరిషత్కు అనేక అంశాలపై సలహాలిస్తుంటాయి. ప్రణాళికలు, విత్తం, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, మహిళాభ్యుదయం, సామాజిక సంక్షేమం, విద్య, ఆరోగ్యం మొ॥ అంశాలు స్థాయి సంఘాలు పరిధిలో ఉన్నాయి. జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి జిల్లా పరిషత్తు చైర్మన్ ను సంప్రదించి స్థాయి సంఘాల సమావేశాలను ఏర్పాటుచేస్తాడు.

ప్రశ్న 9.
జిల్లా పరిషత్తు ముఖ్య కార్యనిర్వహణ అధికారి
జవాబు:
ప్రతి జిల్లా పరిషత్తులో ఒక ముఖ్య కార్యనిర్వహణ అధికారి ఉంటాడు. అతడిని రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తుంది. అతడు తన అధికారాల, విధుల నిర్వహణలో ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వానికి, మరొకవైపు జిల్లా పరిషత్తుకు బాధ్యత వహిస్తాడు. అతడు జిల్లా పరిషత్తు పరిపాలన అధిపతిగా వ్యవహరిస్తాడు. జిల్లా పరిషత్ సాధారణ సమావేశాల అజెండాను, వార్షిక బడ్జెట్ను రూపొందించడంలో కీలకపాత్ర పోషిస్తాడు. జిల్లా పరిషత్తుకు సంబంధించిన సిబ్బంది, ఆస్తులు, భవనాలు, రికార్డులపై పరిపాలనాపరమైన అజమాయిషీ కలిగి ఉంటాడు. జిల్లా పరిషత్తు, జిల్లామహాసభ, జిల్లా స్థాయీ సంఘాలు తీసుకున్న నిర్ణయాలను, ఆమోదించిన తీర్మానాలను అమలులో ఉంచడానికి చర్యలు తీసుకుంటాడు.

AP Inter 2nd Year Civics Study Material Chapter 10 భారతదేశంలో స్థానిక ప్రభుత్వాలు

ప్రశ్న 10.
పురపాలక మండలి
జవాబు:
పురపాలక సంస్థ చర్చా వేదికయే పురపాలక మండలి. దీనిలో మూడు రకాల సభ్యులుంటారు. వారు 1) ఎన్నికయ్యే సభ్యులు 2) అనుబంధ సభ్యులు 3) గౌరవ సభ్యులు, పురపాలక మండలి సాధారణంగా నెలకొక పర్యాయం సమావేశమవుతుంది. పురపాలక మండలి సమావేశాల అజెండాను మున్సిపల్ కమీషనర్, మున్సిపల్ ఛైర్మన్ నన్ను సంప్రదించి రూపొందిస్తాడు. పురపాలక సంస్థకు సంబంధించిన వ్యవహారాలన్నింటిని పురపాలక మండలి పరిశీలిస్తుంది.

ప్రశ్న 11.
నగర పంచాయతి
జవాబు:
గ్రామస్థాయి నుండి పట్టణ స్థాయికి పరిణామం చెందే ప్రాంతం లేదా అతిచిన్న పట్టణ ప్రాంతాలలో ఏర్పాటయ్యే స్థానిక సంస్థలను నగర పంచాయతి అంటారు. జనసాంద్రత, స్థానిక సంస్థల ఆదాయం, వ్యవసాయేతర రంగాలలో ఉపాధి అవకాశాలు, ఆ ప్రాంత ఆర్థిక ప్రాధాన్యత మొదలైన అంశాల ఆధారంగా నగర పంచాయితీల ఏర్పాటు
జరుగుతుంది.

ప్రశ్న 12.
నోటిఫైడ్ ఏరియా కంపెనీ
జవాబు:
శీఘ్రగతిన అభివృద్ధి పథంలో పురోగమించే పట్టణాలలో లేదా పురపాలక సంస్థల ఏర్పాటుకు అనుకూలంగాలేని పరిస్థితులలో ఈ కమిటీ ఏర్పాటవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రకటన ద్వారా ఈ కమిటీ ఏర్పడుతుంది. కావున దీనిని నోటిఫైడ్ ఏరియా కమిటీ అని అంటారు. దీనికి చట్టబద్ధమైన హోదా ఉండదు. దీనిలో ఒక చైర్మన్. కొంతమంది సభ్యులను రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తుంది. దీని విధులు పురపాలక సంస్థ విధులను పోలి ఉంటాయి.

ప్రశ్న 13.
కంటోన్మెంట్ బోర్డులు
జవాబు:
భారతదేశంలో కంటోన్మెంట్ బోర్డులనేవి భారత ప్రభుత్వ కంటోన్మెంట్ చట్టం, 1904 ద్వారా ఏర్పాటయ్యాయి. ప్రస్తుతం భారతదేశంలో 62 కంటోన్మెంట్ బోర్డులు పనిచేస్తున్నాయి. కంటోన్మెంట్ ప్రాంతాలలో నివసించే పౌరులు, సైనిక సిబ్బంది తాలుకు వ్యక్తుల ప్రయోజనాలను పెంపొందించడానికి అవి కృషిచేస్తున్నాయి.

భారతదేశంలో ప్రస్తుతం మూడు రకాల కంటోన్మెంట్ బోర్డులున్నాయి. అవి దేశరక్షణ మంత్రిత్వశాఖ ప్రత్యేక ఉత్తర్వుల ద్వారా ఏర్పాటై కొనసాగుతున్నాయి. ప్రతి కంటోన్మెంట్ బోర్డులో కొందరు ఎన్నుకోబడిన వారు సభ్యులుకాగా, కొందరు కేంద్ర ప్రభుత్వంతో నామినేట్ చేయబడినవారు, మరికొందరు పదవిరీత్యా సభ్యులుగా ఉంటారు. ప్రతి కంటోన్మెంట్ బోర్డులో ఒక జనరల్ ఆఫీసర్ – ఆఫ్ – కమాండర్ (GOC – General Officer of Commander) ఉంటాడు.

ప్రశ్న 14.
టౌన్ ఏరియా కమిటి
జవాబు:
రాష్ట్ర శాసనసభ ఆమోదించే ప్రత్యేక చట్టం ద్వారా టౌన్ ఏరియా కమిటీ ఏర్పాటవుతుంది. చిన్న పట్టణాల అవసరాలను తీర్చడానికి ఈ కమిటీలు అవసరమవుతాయి. ఈ కమిటీ నిర్వర్తించే విధులలో ముఖ్యమైనవి వీధి దీపాలను అమర్చటం, డ్రైనేజీ సౌకర్యాల కల్పన, పట్టణ ప్రాంతాలలో నివసించే ప్రజల స్థితిగతులను మెరుగుపరచటం మొదలగునవి.

ప్రశ్న 15.
టౌన్ షిప్
జవాబు:
టౌన్ షిప్ నేవి ప్రభుత్వరంగ సంస్థలలో ఏర్పాటవుతాయి. ప్రభుత్వరంగ సంస్థలలో పనిచేసే సిబ్బందికి మౌలిక సదుపాయాలను కల్పించడానికి ఇవి కృషిచేస్తాయి. వాటిలో ఎన్నుకోబడే సభ్యులు ఎవరూ ఉండరు. ప్రతి టౌన్షిప్కి ఒక టౌన్ పరిపాలన అధికారి ఉంటాడు. అతడిని కేంద్రప్రభుత్వంలోని సంబంధిత మంత్రిత్వశాఖ నియమిస్తుంది.

AP Inter 2nd Year Civics Study Material Chapter 10 భారతదేశంలో స్థానిక ప్రభుత్వాలు

ప్రశ్న 16.
పోర్ట్ ట్రస్ట్లు
జవాబు:
దేశంలోని సముద్రతీరంలో ఓడరేవులు ఉన్న ప్రాంతాలలో పోర్ట్ ట్రస్ట్లు ఏర్పాటవుతాయి. అలాగే నౌకాశ్రయాలలో పనిచేసే సిబ్బందికి సంబంధించిన వ్యవహారాలను పర్యవేక్షిస్తాయి. అవి నౌకాశ్రయాలలో మౌలిక సదుపాయాలను కల్పించడానికి కృషి చేస్తాయి. కేంద్ర ప్రభుత్వం అందుకోసం కొన్ని కమిటీలను నియమిస్తుంది. ఆ కమిటీల సభ్యులలో కొందరు ఎన్నుకోబడగా, మరికొందరు నామినేట్ అవుతారు.

ప్రశ్న 17.
జిల్లా రెవిన్యూ అధికారిగా కలెక్టర్ [Mar. ’17]
జవాబు:
జిల్లాలో కలెక్టర్ ప్రధాన రెవిన్యూ అధికారిగా వ్యవహరిస్తాడు. జిల్లాలోని గ్రామాలలో భూమిశిస్తు, జమాబందీ లెక్కలకు ఆధ్వర్యం వహిస్తాడు. భూమిశిస్తు వసూళ్ళు, రైతులకు రుణాల మంజూరు, ప్రకృతి విపత్తుల సమయంలో రైతులకు పంట నష్టపరిహారాలు చెల్లించటం, ప్రభుత్వభూముల రికార్డులను నిర్వహించటం మొదలగునవి జిల్లా కలెక్టరుకు ఉన్న రెవిన్యూ అధికారాలలో ముఖ్యమైనవి.

ప్రశ్న 18.
జిల్లా ముఖ్య ఎన్నికల అధికారిగా కలెక్టర్
జవాబు:
జిల్లా ముఖ్య ఎన్నికల అధికారిగా కలెక్టర్ వ్యవహరిస్తాడు. జిల్లాలో ఎన్నికలను ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా జరిగేటట్లు చూసే బాధ్యత కలెక్టర్పై ఉంది. ఓటర్ల జాబితా తయారీ, ఓటర్ల జాబితాలో సవరణలు, ఓటర్ల జాబితాలపై ఫిర్యాదుల పరిశీలన, కొత్త ఓటర్ల నమోదు, రిటర్నింగ్ అధికారుల నియాయకం మొదలగు అనేక విధులను కలెక్టర్ నిర్వహిస్తాడు.

ప్రశ్న 19.
స్వర్ణాంధ్రప్రదేశ్
జవాబు:
నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2015లో ఆకర్షణీయ గ్రామ పథకాన్ని ప్రారంభించారు. జన్మభూమి, మా వూరు కార్యక్రమానికి కొనసాగింపుగా ఆకర్షణీయ గ్రామం (Smart Village), ఆకర్షణీయ వార్డు కార్యక్రమాన్ని ప్రభుత్వం రూపొందించి, పాలనా వికేంద్రీకరణ, అధికార దత్తత, ప్రభుత్వ సేవలు, అభివృద్ధి పథకాలతో ప్రజలను భాగస్వాములను చేయటం ద్వారా స్వర్ణాంధ్రప్రదేశ్ను ఏర్పాటు చేయటమే ఈ పథకం ఉద్దేశ్యం.

ప్రశ్న 20.
ఆకర్షణీయ నగరం [Mar. ’16]
జవాబు:
‘ఆకర్షణీయ నగరం (Smart City), అనేది అవస్థాపన సౌకర్యాల పరంగా ఎంతగానో అభివృద్ధి చెందిన పట్టణ ప్రాంతం. ఆ ప్రాంతంలో రియల్ ఎస్టేట్, కమ్యూనికేషన్లు, మార్కెట్ల సామర్థ్యం వంటి అంశాలు ఉంటాయి. నివాసితులకు అత్యవసర, ప్రాథమిక సేవలను అందించేందుకు అవసరమైన ప్రధాన అవస్థాపక (Infrastracture), సమాచార సాంకేతికత (Information Technology) లు అందుబాటులో ఉంటాయి.

AP Inter 2nd Year Civics Study Material Chapter 10 భారతదేశంలో స్థానిక ప్రభుత్వాలు

ఆకర్షణీయ నగరాలు పెట్టుబడులు తరలివచ్చేందుకు దోహదపడతాయి. మంచి అవస్థాపన, సాధారణ పారదర్శక, శీఘ్రతతో కూడిన స్థాపనాలకు వీలు కల్పిస్తాయి. పెట్టుబడిదారీ మితృత్వ నగరాలుగా ఉంటూ, ఉద్యమిత్య సంస్థలను స్థాపించి, సమర్థవంతంగా నిర్వహించుకొనేందుకు వీలుకల్పిస్తాయి.

AP Inter 2nd Year Civics Study Material Chapter 9 కేంద్ర – రాష్ట్ర సంబంధాలు

Andhra Pradesh BIEAP AP Inter 2nd Year Civics Study Material 9th Lesson కేంద్ర – రాష్ట్ర సంబంధాలు Textbook Questions and Answers.

AP Inter 2nd Year Civics Study Material 9th Lesson కేంద్ర – రాష్ట్ర సంబంధాలు

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
భారతదేశంలోని కేంద్ర – రాష్ట్ర సంబంధాలను క్లుప్తంగా వివరించండి.
జవాబు:
భారత రాజ్యాంగం కూడా అన్ని సమాఖ్య రాజ్యాంగాల వలె కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికారాలను విభజించింది. భారత రాజ్యాంగం 11, 12 భాగాలలోని 245 నుంచి 300 వరకు గల అధికరణాలు కేంద్ర, రాష్ట్రాల మధ్యగల సంబంధాలను ప్రస్తావించాయి. కేంద్ర, రాష్ట్ర సంబంధాలను స్థూలంగా మూడు శీర్షికల క్రింద అధ్యయనం చేయవచ్చు. అవి:

  1. శాసన సంబంధాలు
  2. పరిపాలనా సంబంధాలు
  3. ఆర్థిక సంబంధాలు.

1. శాసన సంబంధాలు: భారత రాజ్యాంగంలోని 245 నుంచి 255 వరకు గల 11 అధికరణాలలో కేంద్ర, రాష్ట్రాల మధ్యగల శాసన సంబంధాలు వివరించబడ్డాయి. శాసనపరమైన అంశాలను మూడు జాబితాల క్రింద వర్గీకరించారు. అవి:

  1. కేంద్ర జాబితా
  2. రాష్ట్ర జాబితా
  3. ఉమ్మడి జాబితా.

i) కేంద్ర జాబితా: జాతీయ ప్రాధాన్యం ఉన్న అంశాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఈ అంశాలపై శాసనాలను రూపొందించే అధికారం ఒక్క పార్లమెంటుకే ఇవ్వడం జరిగింది. ఉదా: దేశరక్షణ, సాయుధ దళాలు, విదేశీ వ్యవహారాలు, రైల్వేలు, తంతితపాలా, ఆకాశవాణి, దూరదర్శన్ మొదలగునవి.

ii) రాష్ట్ర జాబితా: ఈ జాబితాలోని అంశాలపై రాష్ట్ర శాసనసభలు చట్టాలు చేస్తాయి. ఉదా: శాంతి భద్రతలు, పోలీసు, జైళ్ళు, గ్రంథాలయాలు, వ్యవసాయం, పశుపోషణ మొదలగునవి.

AP Inter 2nd Year Civics Study Material Chapter 9 కేంద్ర – రాష్ట్ర సంబంధాలు

iii) ఉమ్మడి జాబితా: ఈ జాబితాలోని అంశాలపై శాసనాలు చేసే అధికారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండింటికీ ఉంది. అయితే పార్లమెంటు, రాష్ట్ర శాసనసభలు ఈ జాబితాలోని ఏదైనా ఒకానొక అంశంపై శాసనం రూపొందిస్తే, పార్లమెంటు రూపొందించిన శాసనానికి ఆధిక్యం ఇవ్వడం జరుగుతుంది. ఉదా: వివాహం, విడాకులు, ధర్మాదాయ, దేవాదాయ సంస్థలు, విద్య, విద్యుచ్ఛక్తి. వార్తాపత్రికలు మొదలగునవి.

పై మూడు జాబితాల్లో లేని అంశాలపై శాసనాలు చేసే అధికారం పార్లమెంటుకు ఉంది. ఈ అంశాలను అవశిష్టాధికారాలు అంటారు.

  • జాతీయ అత్యవసర పరిస్థితి ప్రవేశపెట్టినప్పుడు రాష్ట్ర జాబితాలోని అంశాలపై కూడా పార్లమెంటు చట్టాలు చేసే అధికారం పొందుతుంది.
  • ఏదైనా రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధిస్తే ఆ రాష్ట్రానికి అవసరమైన చట్టాలను పార్లమెంటు రూపొందిస్తుంది. శాసన వ్యవహారాల్లో రాష్ట్రాలకంటే కేంద్రానికే ఎక్కువ అధికారాలున్నాయి.

2. పరిపాలనా సంబంధాలు: భారత రాజ్యాంగంలోని 256 నుంచి 263 వరకు గల 8 అధికరణలలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పరిపాలనా సంబంధాలు వివరించబడ్డాయి.

  • కేంద్ర ప్రభుత్వం తన విధులను కొన్నింటిని రాష్ట్రాలకు అప్పగించవచ్చు. వాటికి అయ్యే ఖర్చు కేంద్రం భరిస్తుంది.
  • జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటించినప్పుడు పరిపాలనకు సంబంధించి కేంద్రం రాష్ట్రాలకు ఆదేశాలిస్తుంది.
  • కేంద్ర ప్రభుత్వ కార్యనిర్వహణాధికారానికి భంగం వాటిల్లని రీతిలో రాష్ట్ర ప్రభుత్వాలు తమ కార్యనిర్వహణాధికారాన్ని వినియోగించుకోవాలి.
  • కేంద్రం అంతర్ రాష్ట్రమండలిని ఏర్పాటు చేయడం ద్వారా రాష్ట్రాల మధ్య ఏర్పడే తగాదాలను పరిష్కరిస్తుంది.

3. ఆర్థిక సంబంధాలు: భారత రాజ్యాంగంలోని 264 నుండి 300 వరకు అధికరణలలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్యగల ఆర్థిక సంబంధాలు వివరించబడ్డాయి. కేంద్ర, రాష్ట్రాల మధ్య ఆర్థిక వ్యవహారాల్లో సంఘర్షణలు నివారించడానికి ఏయే పన్నులను ఏయే ప్రభుత్వాలు వసూలు చేయాలో, ఎలా పంచుకోవాలో అనే విషయాలపై ప్రత్యేక వివరణ ఇచ్చారు.

  • కేంద్ర ప్రభుత్వానికి 12 రకాల పాలనాంశాలపై విధించే పన్నుల ద్వారా ఆదాయం లభిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలకు 19 రకాల ఆదాయ మార్గాలు ఉన్నాయి.
  • అభివృద్ధి కోసం ఉద్దేశించిన కొన్ని ప్రత్యేక ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు కేంద్రం, రాష్ట్రాలకు ప్రత్యేక గ్రాంట్లను మంజూరు చేస్తుంది.
  • రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం సమ్మతి లేనిదే ఎటువంటి ఋణాలు పొందకూడదు. ఆర్థిక విషయాలలో రాష్ట్రాలు, కేంద్రంపై ఆధారపడి ఉన్నాయని తెలుస్తుంది.

ప్రశ్న 2.
కేంద్ర – రాష్ట్ర సంబంధాలలోని మూడు జాబితాలను చర్చించండి.
జవాబు:
భారతరాజ్యాంగం కేంద్ర, రాష్ట్రాల మధ్య శాసనాధికారాల పంపిణీని మూడు రకాలుగా విభజించింది. అవి: మొదటి జాబితా (కేంద్ర జాబితా), రెండవ జాబితా (రాష్ట్ర జాబితా), మూడవ జాబితా (ఉమ్మడి జాబితా) కేంద్ర జాబితా: కేంద్ర రాష్ట్రాల మధ్య శాసన సంబంధాలను ఒక ప్రత్యేకమైన పద్ధతిలో విభజించడం జరిగింది. కేంద్ర జాబితా చాలా సుదీర్ఘమైనది. భారతరాజ్యాంగ ప్రారంభంలో ఇందులో 97 అంశాలు ఉండేవి. ప్రస్తుతం ఇందులో 100 అంశాలు కలవు. ఈ జాబితాలోని అంశాలపైనా చట్టాలు చేయడానికి పార్లమెంట్కు మాత్రమే అధికారం కలదు. ఈ జాబితాలోని కొన్ని ముఖ్యాంశాలు: దేశభద్రత, ఐక్యరాజ్య సమితి సంబంధించిన అంశాలు, విదేశీ వ్యవహారాలు, దౌత్య సంబంధాలు, విదేశాలతో సంధులు చేసుకోవడం, యుద్ధం, శాంతి, పౌరసత్వం, రైల్వేలు, జాతీయ రహదారులు, విమానయానం, నౌకాయానం, విమానయాన నియంత్రణ, తపాలా, టెలిఫోన్, నాణెములు, వాణిజ్యం, బ్యాంకింగ్, అంతర్ రాష్ట్ర వ్యాపారం, బీమా, విదేశీ అప్పులు, పేటెంట్లు, తూనికలు, జలాలు, కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్, అఖిల భారత సర్వీసులు, పార్లమెంటుకు ఎన్నికలు, అణుశక్తి, ఆయుధాల తయారీ, నౌక, వైమానిక, సైనికదళాలు, కేంద్ర భద్రతా దళాలు, ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, పేలుడు పదార్థాలు, వైమానిక రవాణా నియంత్రణ మరియు క్రమబద్ధీకరణ మొదలగునవి. ఈ అంశాలపై తయారుచేసిన చట్టాలు దేశంలోని అన్ని రాష్ట్రాలకు మరియు దేశ పౌరులందరికీ సమానంగా వర్తిస్తాయి.

AP Inter 2nd Year Civics Study Material Chapter 9 కేంద్ర – రాష్ట్ర సంబంధాలు

రాష్ట్ర జాబితా: సాధారణ పరిస్థితులలో రాష్ట్ర జాబితాలోని అంశాలపై చట్టాలను తయారుచేయడానికి రాష్ట్ర శాసనసభలకు అధికారం కలదు. ఇందులో స్థానిక ప్రాముఖ్యత కలిగిన 66 అంశాలు ఉంటాయి. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా వీటి సంఖ్యను 62కు కుదించడం జరిగింది.

ఈ జాబితాలోని కొన్ని ముఖ్య అంశాలు: శాంతిభద్రతలు, న్యాయం, జైళ్ళు, పోలీసులు, వ్యవసాయం, నీటిపారుదల, ప్రజారోగ్యం, స్థానిక స్వపరిపాలన సంస్థలు, తీర్థయాత్రలు, గ్రంథాలయం, ఫిషరీస్, మార్కెట్లు, సంతలు, భూమిశిస్తు మొదలగునవి. వీటిపై చేసిన చట్టాలు రాష్ట్రంలోని వ్యక్తులకు మరియు సంస్థలకు మాత్రమే వర్తిస్తాయి.

ఉమ్మడి జాబితా: ఈ జాబితాలోని అంశాలపై చట్టాలు చేయడానికి పార్లమెంట్కు మరియు రాష్ట్ర శాసనసభలకు అధికారం కలదు. ఇందులో జాతీయ మరియు స్థానిక ప్రాధాన్యత గల 47 అంశాలు ఉంటాయి. 42వ రాజ్యాంగ సవరణ తరువాత వీటి సంఖ్య 52కు పెరిగింది. ఈ అంశాలపై పార్లమెంట్ మరియు రాష్ట్ర శాసనసభలు చట్టాలు చేసినప్పటికీ ఏదైనా సమస్య ఉత్పన్నమయినపుడు పార్లమెంటు తయారుచేసిన చట్టాలు మాత్రమే అమలులో ఉంటాయి.

ఈ జాబితాలోని ముఖ్యాంశాలు: అడవులు, అడవి జంతువులు మరియు పక్షుల పరిరక్షణ, జనాభా నియంత్రణ, కుటుంబ నియంత్రణ, విద్య (సాంకేతిక మరియు వైద్య విద్య), నేర విచారణ విధానం, వివాహం మరియు విడాకులు, ధార్మిక సంస్థలు మరియు ధర్మకర్తృత్వ మండళ్ళు, కల్తీలు, కార్మిక సంఘాలు, విద్యుచ్ఛక్తి, ముద్రణాలయాలు, వార్తాపత్రికలు, తూనికలు మరియు కొలతలు (ప్రమాణముల నిర్థారణ మినహాయించి) మొదలగు ఈ జాబితాలో పొందుపరచిన అంశాలను సవరించుటకు మరియు రద్దు చేయుటకు, రాష్ట్ర శాసనసభలు ఈ అంశాలపై చేసిన చట్టాలను సవరించుటకు, రద్దు చేయుటకు పార్లమెంటు అధికారం కలదు. రాష్ట్ర జాబితా మరియు ఉమ్మడి జాబితాలలో పేర్కొనని ఏ అంశంపైన అయినా శాసనాలు తయారు చేయుటకు పార్లమెంట్కు ప్రత్యేక అధికారం కలదు. రాష్ట్ర శాసనసభలు తయారుచేసిన రాష్ట్ర జాబితాలోని అంశాలను కొన్ని ప్రత్యేక సందర్భాలలో రద్దు చేయుటకు కేంద్ర ప్రభుత్వానికి అధికారం కలదు.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
భారతదేశంలోని కేంద్ర – రాష్ట్రాల మధ్య గల పరిపాలన సంబంధాలను తెలపండి. [Mar. ’17, ’16]
జవాబు:
భారత రాజ్యాంగంలోని 256 నుంచి 263 వరకు గల 8 అధికరణాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలనా సంబంధాల గురించి వివరించాయి. ప్రగతి సాధనకు పాలనా వ్యవస్థ గుండెకాయ వంటిది. కేంద్ర, రాష్ట్రాల మధ్య పాలనా వ్యవహారాల్లో ఎటువంటి ఘర్షణలు రాకుండా చూసేందుకు మన రాజ్యాంగం తగిన విధంగా రూపొందించబడింది.

  1. కేంద్ర ప్రభుత్వ శాసనాల అమలుకు అనుగుణంగా రాష్ట్రాలు తమ పరిపాలనను నిర్వహించుకోవలెను.
  2. అవసరమని భావించినప్పుడు కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వాలకు పరిపాలనా సంబంధమైన ఆదేశాలను ఇస్తుంది.
  3. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల సంక్షేమానికి సంబంధించి కేంద్రం రాష్ట్రాలకు ఆదేశాలు ఇవ్వవచ్చు. ఈ విషయంలో కేంద్రం రూపొందించి, అమలుపరిచే పథకాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ఉండాలి.
  4. సైనిక లేదా జాతీయ ప్రాముఖ్యత కలిగిన రహదారులను నిర్మించి, వాటిని రక్షించుటలో రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలను ఇస్తుంది. వాటి నిర్మాణానికి అయ్యే ఖర్చును కేంద్రమే భరిస్తుంది.
  5. రైల్వేలు మొదలైన ఆస్తుల రక్షణకు సంబంధించి కేంద్రం రాష్ట్రాలకు సూచనలు చేస్తుంది. 6) అంతర్ రాష్ట్ర నదీజలాల వివాదాలను పరిష్కరించే అధికారం కేంద్ర పార్లమెంటుకు ఉంది.
  6. ఏదైనా ఒక రాష్ట్రంలో పాలన రాజ్యాంగబద్ధంగా జరగనప్పుడు ఆ రాష్ట్రంలో కేంద్రం రాష్ట్రపతి పాలనను విధించవచ్చు.
  7. రాష్ట్ర పాలకులైన గవర్నర్లను రాష్ట్రపతి (కేంద్ర ప్రభుత్వం) నియమిస్తాడు. రాష్ట్రపతి పాలన విధించబడినప్పుడు వారు కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులుగా వ్యవహరిస్తారు.
  8. విదేశీ దురాక్రమణల నుంచి, అల్లకల్లోలాల నుంచి రాష్ట్రాలను కాపాడవలసిన బాధ్యత కేంద్రంపై ఉంది.
  9. కేంద్రం అంతర్ రాష్ట్రమండలిని ఏర్పాటు చేయడం ద్వారా రాష్ట్రాల మధ్య ఏర్పడే తగాదాలను పరిష్కరిస్తుంది మొదలైనవి.
  10. కేంద్ర, రాష్ట్రాలలో ఎన్నికలను నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం స్వతంత్రమైన రాజ్యాంగబద్ధ ఎన్నికల కమీషన్ను నియమిస్తుంది.
  11. రాష్ట్రాల ముఖ్యమంత్రుల పైన వచ్చే ఆరోపణలను విచారించడానికి కేంద్ర ప్రభుత్వం విచారణ సంఘాన్ని ఏర్పాటు చేసే అధికారం కలదు.

ప్రశ్న 2.
కేంద్ర – రాష్ట్రాల మధ్య గల ఆర్థిక సంబంధాలను వివరించండి.
జవాబు:
రాజ్యాంగంలోని 12వ భాగంలోని 268 నుంచి 293 వరకు గల ప్రకరణలు కేంద్ర, రాష్ట్రాల మధ్యగల ఆర్థిక సంబంధాలను గూర్చి వివరిస్తాయి. ఈ క్రింది శీర్షికల ద్వారా కేంద్ర, రాష్ట్రాల మధ్యగల ఆర్థిక సంబంధాలను తెలుసుకోవచ్చు.
a) కేంద్ర విధించే పన్నులు, సుంకాలు: కొన్ని రకాల పన్నులను కేంద్ర ప్రభుత్వం మాత్రమే విధిస్తుంది. దిగుమతి సుంకాలు, కస్టమ్స్, పొగాకు, జనపనారపై ఎక్సైజ్ సుంకం, కార్పొరేషన్ పన్ను, మూలధన విలువపై పన్ను, వ్యవసాయేతర ఎస్టేట్లపై పన్ను, రైల్వేలు, తంతితపాలా, టెలిఫోన్స్, వైర్లెస్, విదేశీ మారకద్రవ్యం, కరెన్సీ, నాణేల ముద్రణ, ప్రసార మాధ్యమాలు, ఇతర రకాల కమ్యూనికేషన్లు మొదలైనవి ఇందులోకి వస్తాయి.

b) రాష్ట్రం విధించి, ఉపయోగించే పన్నులు, సుంకాలు: కొన్ని రకాల పన్నులు రాష్ట్ర ప్రభుత్వాల పరిధి క్రిందకు మాత్రమే వస్తాయి. భూమిశిస్తు, రోడ్డు మరియు దేశీయ జలమార్గాల ద్వారా ప్రయాణించే ప్రయాణికులు మరియు వస్తువులపై పన్నులు, విద్యుత్ వినియోగం మరియు అమ్మకంపై పన్ను, టోల్యాక్స్, మద్యపానంపై పన్ను, వినోదపు పన్ను, పందాలపై, జూదాలపై, విలాసాలపై పన్నులు మొదలగునవి.

AP Inter 2nd Year Civics Study Material Chapter 9 కేంద్ర – రాష్ట్ర సంబంధాలు

c) కేంద్రం విధించి, రాష్ట్రాలు సేకరించి ఉపయోగించుకునే పన్నులు: ఈ క్రింద తెలిపిన పన్నులు కేంద్రంచే విధించబడతాయి. అయితే వాటిని రాష్ట్రాలు సేకరించి, ఉపయోగించుకుంటాయి. బిల్లుల మారకం, చెక్కులు, ప్రామిసరీ నోటులు, బిల్స్ ఆఫ్ లెండింగ్, కంపెనీ వాటాల బదలాయింపు, టాయ్లెట్ సంబంధ వస్తువులపై ఎక్సైజ్ డ్యూటీలు, మత్తుపదార్థాలు మొదలగునవి ఈ కోవకు చెందుతాయి.

d) కేంద్రం విధించి, సేకరించి రాష్ట్రాలకు పంపిణీ చేసే పన్నులు: ఈ క్రింద తెలిపిన పన్నులు కేంద్రం విధించి, రాష్ట్రాలకు పంపిణీ చేస్తుంది. వ్యవసాయేతర ఆస్తిపై ఎస్టేట్ సుంకం, రైల్వే ఛార్జీలు, రైల్వే వస్తువుల రవాణా ద్వారా వచ్చే ఆదాయంపై పన్ను, రైలు, సముద్ర, వైమానిక, సాధనాల ద్వారా పంపే వస్తువులు, ప్రయాణీకులపై విధించే టెర్మినల్ పన్నులు మొదలైనవి ఈ కోవలోకి వస్తాయి.

e) కేంద్రం విధించి, వసూలు చేసి కేంద్ర – రాష్ట్రాల మధ్య పంపిణీ చేసే పన్నులు: ఈ పన్నులను కేంద్ర ప్రభుత్వం విధించి, వసూలు చేస్తుంది. కానీ రాష్ట్రాలతో కలిసి పంచుకుంటుంది. వ్యవసాయేతర ఆదాయంపై పన్ను, టాయ్లెట్, ఔషదేతర వస్తువులపై విధించే ఎక్సైజ్ సుంకాలు మొదలగునవి.

ప్రశ్న 3.
కేంద్ర – రాష్ట్రాల మధ్య గల శాసన సంబంధాలను పరిశీలించండి.
జవాబు:
భారత రాజ్యాంగం 11వ భాగంలోని మొదటి అధ్యాయంలోని 245 నుంచి 255 ప్రకరణలు కేంద్రం మరియు రాష్ట్రాల మధ్యగల శాసన సంబంధాలను తెలియజేస్తాయి. భారత రాజ్యాంగం కేంద్ర, రాష్ట్రాల మధ్య గల శాసన | సంబంధాలను ప్రాదేశిక పరిధి ప్రాతిపదికపై ఈ విధంగా తెలపవచ్చు.
ఎ) పార్లమెంటు భారతదేశం మొత్తానికి గానీ లేదా దేశంలో కొంత ప్రాంతానికి గానీ చట్టాలు చేయవచ్చు.

బి) కేంద్రపాలిత ప్రాంతాలకు కూడా పార్లమెంటే చట్టాలు చేస్తుంది.

సి) భారత రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్లోని మొదటి జాబితా (కేంద్ర జాబితా) నందు పేర్కొన్న ఏదైనా అంశం మీద చట్టాలు చేయడానికి పార్లమెంటుకు మాత్రమే అధికారం కలదు.

డి) భారత రాజ్యాంగం 7వ షెడ్యూల్లోని తృతీయ జాబితా (ఉమ్మడి జాబితా) నందు పేర్కొన్న ఏదైనా అంశం మీద చట్టాలు చేయడానికి పార్లమెంటుకు, రాష్ట్ర శాసనసభలకు అధికారం కలదు.

ఇ) భారత రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్లోని ద్వితీయ జాబితా (రాష్ట్ర జాబితా) నందు తెలియజేయబడిన ఏదైనా అంశం మీద చట్టాలు చేయడానికి రాష్ట్ర శాసన సభలకు మాత్రమే అధికారం కలదు.

ఎఫ్) రాష్ట్ర ప్రభుత్వాల భౌగోళిక పరిధికి వెలుపలున్న భారతదేశంలోని ఇతర ప్రాంతాలకు సంబంధించి పార్లమెంటు ఎటువంటి చట్టాలైన (రాష్ట్ర జాబితాలో వున్నప్పటికి చేయవచ్చు.

జి) మూడు జాబితాలలో పేర్కొనని ఏ అంశాల పైన అయినా చట్టాలు తయారు చేయడానికి పార్లమెంటుకు ప్రత్యేక అధికారం కలదు.

హెచ్) కొన్ని ప్రత్యేకమైన సందర్భాలలో ద్వితీయ జాబితాలోని (రాష్ట్ర జాబితా) అంశాలపైన చట్టాలు చేయడానికి పార్లమెంటుకు అధికారం కలదు. అవి: జాతీయ ప్రాధాన్యత గల అంశాలు; జాతీయ అత్యవసర పరిస్థితి సమయంలో రెండు లేక అంతకంటే ఎక్కువ రాష్ట్రాలు కలిసి పార్లమెంట్ను చట్టాలు చేయమని అడిగినప్పుడు; అంతర్జాతీయ సంధులు, ఒప్పందాలు అమలు చేసేటప్పుడు.

AP Inter 2nd Year Civics Study Material Chapter 9 కేంద్ర – రాష్ట్ర సంబంధాలు

ప్రశ్న 4.
ఆర్థిక సంఘం నిర్మాణం, అధికారాలు, విధులను వివరించండి.
జవాబు:
నిర్మాణం: భారత రాజ్యాంగం 280వ ప్రకరణలో ఆర్థిక సంఘ నిర్మాణం, అధికారాలు మరియు విధులను గూర్చి చర్చించడం జరిగింది. పాక్షిక న్యాయాధికారాలు గల ఈ ఆర్థిక సంఘాన్ని రాష్ట్రపతి ఏర్పాటు చేస్తాడు. ఇందులో ఒక అధ్యక్షుడు మరియు నలుగురు సభ్యులు ఉంటారు. వీరిని ఐదు సంవత్సరాల పదవీ కాలానికి రాష్ట్రపతి నియమిస్తాడు. ఈ సభ్యులు తిరిగి నియమింపబడటానికి అర్హులు. ఈ సంఘ అధ్యక్ష మరియు ఇతర సభ్యుల అర్హతలు నిర్ణయించడానికి పార్లమెంటుకు రాజ్యాంగం అధికారం కల్పించింది. అందుకు అనుగుణంగా పార్లమెంట్ ఆర్థిక సంఘ అధ్యక్షునితో పాటు ఇతర సభ్యుల అర్హతలను ప్రత్యేకంగా ప్రస్తావించడం జరిగింది. ఈ సంఘం కేంద్ర, రాష్ట్రాల మధ్య ఆర్థిక వనరుల పంపిణీ గురించి రాష్ట్రపతికి సిఫార్సులు చేస్తుంది. ఈ సంఘ అధ్యక్షుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాలలో అనుభవజ్ఞుడై ఉండాలి. మిగిలిన నలుగురు సభ్యులు

ఈ క్రింది రంగాల నుండి నియమించబడుతారు.

  • హైకోర్టు న్యాయమూర్తి (లేదా) హైకోర్టు న్యాయమూర్తి నియామకానికి అర్హత గల వ్యక్తి అయి ఉండాలి.
  • మరో సభ్యుడు ప్రభుత్వ ఆర్థిక లావాదేవీలు మరియు ఖాతాలలో అనుభవం కలిగి ఉండాలి.
  • మూడవ సభ్యుడు విత్త విషయాలలో నిష్ణాతుడై ఉండాలి.
  • నాల్గవ సభ్యుడు ఆర్థికశాస్త్రంలో నిపుణుడై ఉండాలి.

అధికారాలు విధులు: ఆర్థిక సంఘం కేంద్ర మరియు రాష్ట్రాల మధ్య ఆర్థిక సంబంధాలకు సంబంధించి ఎప్పటికప్పుడు సమీక్షించి భారత రాష్ట్రపతికి తగు సిఫార్సులు ఈ క్రింది విషయాలలో చేయవలసి ఉంటుంది.

  1. కేంద్ర పన్నులను రాష్ట్రాలకు ఏ నిష్పత్తి ప్రకారం పంపిణీ చేయాలో సిఫార్సులు చేస్తుంది.
  2. భారత సంఘటిత నిధి నుండి రాష్ట్రాలకు సహాయక నిధులకు సంబంధించి ఏ సూత్రాల ఆధారంగా పంపిణీ చేయాలో తగు మార్గదర్శక సూత్రాలను సూచిస్తుంది.
  3. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలతో చేసుకున్న ఒప్పందాలను కొనసాగించాలా లేదా మార్పులు చేయాలా అనే విషయంలో ఈ సంఘం సిఫార్సులు చేస్తుంది.
  4. దేశ ఆర్థిక పటిష్టతకు సంబంధించి రాష్ట్రపతి కోరినప్పుడు తగిన సూచనలిస్తుంది.
  5. 73 మరియు 74 రాజ్యాంగ సవరణల ద్వారా ఈ ఆర్థిక సంఘ విధులు మరింత విస్తృతం అయ్యాయి. రాష్ట్రాలలోని పంచాయితీలకు మరియు మున్సిపాలిటీలకు ఆర్థిక వనరులు అందజేయుటకు భారత సంఘటిత నిధికి వనరులను ఏ విధంగా పెంచాలో చర్యలను సూచిస్తుంది.
  6. పటిష్టమైన ఆర్థిక స్థిరత్వం కొరకు పరిపాలన మరియు రాజకీయ రంగాలలోని ఉన్నతాధికారులతో ప్రముఖ నేతలతో చర్చలు జరుపుతుంది. దేశంలోని వివిధ ఆర్థిక సంఘాల అధినేతల సూచనలను ఆహ్వానిస్తుంది.

ఆర్థిక సంఘం తన నివేదిక రాష్ట్రపతికి సమర్పిస్తుంది. దీనిని సాధారణంగా కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తుంది. రాష్ట్రపతి ఆర్థిక సంఘం చేసిన కొన్ని లేదా అన్ని సిఫార్సులను అంగీకరించవచ్చు లేదా తిరస్కరించవచ్చు. ఈ సిఫార్సులు ఐదు సంవత్సరాల కాలం అమలులో ఉంటాయి.

ప్రశ్న 5.
సర్కారియా కమీషన్ సిఫార్సులను మూల్యాంకనం చేయండి. [Mar. ’17]
జవాబు:
సర్కారియా కమిషన్ (1983 – ’87): 1983, జూన్ 9వ తేదీన కేంద్ర ప్రభుత్వం రంజిత్సింగ్ సర్కారియా ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి కమిషను ఒకదానిని ఏర్పరచింది. కేంద్ర-రాష్ట్ర సంబంధాలను పునఃపరిశీలన జరిపి తగిన సిఫారసులు చేయవలసిందిగా ఆ కమిషన్ను కోరడమైంది. ఆ కమిషన్లో బి. శివరామన్, ఎస్. సేన్ అనే ఇద్దరు సభ్యులు ఉన్నారు. కమిషన్ కార్యదర్శిగా ఎమ్.ఆర్. సుబ్రహ్మణ్యం, రాజ్యాంగ సలహాదారుడిగా ఎల్.ఎన్. సిన్హా వ్యవహరించారు. 1987, అక్టోబరు 27వ తేదీన 247 సిఫారసులతో కూడిన 5000 పేజీలకు పైగా ఒక అంతిమ నివేదికను సర్కారియా కమిషన్ కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది.

సిఫారసులు: సర్కారియా కమిషన్ పేర్కొన్న సిఫారసులలో కింద పేర్కొన్నవి అత్యంత ప్రధానమైనవి.

  1. రాజకీయేతర రంగాలకు చెందిన, వివాదాస్పదం కాని ప్రముఖ వ్యక్తులు, సాధ్యమైనంతవరకు మైనారిటీలకు చెందిన వ్యక్తులను రాష్ట్ర గవర్నర్లుగా నియమించాలి.
  2. రాష్ట్ర గవర్నర్ల నియామకంలో ముఖ్యమంత్రులను సంప్రదించాలి.
  3. ముఖ్యమంత్రి నియామకం, రాష్ట్ర మంత్రివర్గం కొనసాగింపు విషయాలలో విధానసభలో మెజారిటీ సభ్యుల అభిప్రాయాలను తెలుసుకోవాలి.
  4. అరుదైన సందర్భాలలో మాత్రమే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను ప్రవేశపెట్టాలి.
  5. అఖిల భారత సర్వీసు సిబ్బందికి సంబంధించిన విషయాలలో కేంద్రం రాష్ట్రాలను సంప్రదించాలి.
  6. జోనల్ కౌన్సిళ్ళను పునర్వ్యవస్థీకరించాలి.
  7. శాశ్వత ప్రాతిపదికపై అంతర్ ప్రభుత్వ మండలిని ఏర్పాటు చేయాలి.
  8. జాతీయ అభివృద్ధి మండలి పేరును జాతీయ ఆర్థిక అభివృద్ధి మండలిగా మార్చి, దాని అస్థిత్వాన్ని పరిరక్షించాలి.
  9. ఆర్థిక నిపుణులను ఆర్థిక సంఘ సభ్యులుగా నియమించాలి.
  10. భారతదేశ సమిష్టి సంస్కృతిని సంరక్షించేందుకు ప్రాంతీయ భాషలలో జాతీయ కార్యక్రమాలను ప్రసారం చేయాలి.
  11. జాతీయ వ్యవహారాల విషయంలో కేంద్రం – రాష్ట్రాల మధ్య సంప్రదింపులు జరగాలి.
  12. అవశిష్టాంశాలపై పన్నులు విధించే శాసన నిర్మాణాధికారాన్ని పార్లమెంటుకు అప్పగించాలి.
  13. రాష్ట్రాలతో సంప్రదించి కేంద్రం ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసు, ఇండియన్ హెల్త్ సర్వీసు, ఇండియన్ ఎడ్యుకేషన్ సర్వీసులను ఏర్పాటు చేయాలి.
  14. కార్పొరేషన్ పన్నులో కొంత భాగాన్ని రాష్ట్రాలకు ఇవ్వాలి.
  15. రాష్ట్రాలకు సైన్యాన్ని పంపేముందు కేంద్రం రాష్ట్రాలతో సంప్రదింపులు జరపాలి.

AP Inter 2nd Year Civics Study Material Chapter 9 కేంద్ర – రాష్ట్ర సంబంధాలు

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
కేంద్ర – రాష్ట్రాల మధ్య గల ఏవైనా మూడు సంబంధాలు.
జవాబు:
కేంద్ర, రాష్ట్రాల మధ్య గల సంబంధాలను మూడు రకాలుగా వర్గీకరించటం జరిగింది. అవి:

  1. శాసన సంబంధాలు
  2. పరిపాలనా సంబంధాలు
  3. ఆర్థిక సంబంధాలు

ప్రశ్న 2.
కేంద్ర జాబితా.
జవాబు:
కేంద్ర జాబితా చాలా సుదీర్ఘమైనది. ప్రస్తుతం ఈ జాబితాలో 100 పరిపాలనాంశాలు ఉన్నాయి. ఈ జాబితాలోని అంశాలపై చట్టాలు చేయడానికి పార్లమెంటుకు మాత్రమే అధికారం ఉంది. ఈ జాబితాలో దేశభద్రత, ఐక్యరాజ్య సమితికి సంబంధించిన అంశాలు, విదేశీ వ్యవహారాలు, దౌత్య సంబంధాలు మొదలైన ముఖ్యమైన అంశాలు ఉన్నాయి.

ప్రశ్న 3.
అత్యవసర పరిస్థితులలో పరిపాలన సంబంధాలు.
జవాబు:
జాతీయ అత్యవసర పరిస్థితి అమలులో ఉన్న సమయంలో, కేంద్ర ప్రభుత్వానికి ఏకకేంద్ర ప్రభుత్వం వలె అధికారాలు చెలాయించడానికి భారత రాజ్యాంగం అవకాశం కల్పించింది. ఈ పరిస్థితులలో రాష్ట్ర ప్రభుత్వాలు రద్దు కాకుండా, కేంద్ర ప్రభుత్వం పూర్తి ఆధీనంలో పనిచేస్తాయి. రాష్ట్రపతి పాలన అమలులో ఉన్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారాలను రాష్ట్రపతి తరుఫున గవర్నర్ చెలాయిస్తాడు.

ప్రశ్న 4.
కేంద్ర, రాష్ట్రాల మధ్యగల శాసన సంబంధాలు.
జవాబు:
పార్లమెంటు భారతదేశం మొత్తానికి గానీ లేదా దేశంలో కొంత ప్రాంతానికి గానీ చట్టాలు చేయవచ్చు. కేంద్రపాలిత ప్రాంతాలకు కూడా పార్లమెంటే చట్టాలు చేస్తుంది. కేంద్ర జాబితాలో పేర్కొన్న ఏదైనా అంశంపై చట్టాలు చేయడానికి పార్లమెంటుకు మాత్రమే అధికారం ఉంది. కేంద్ర, రాష్ట్ర, ఉమ్మడి జాబితాలలో పేర్కొనబడని అంశాలపై చట్టాలు చేయడానికి పార్లమెంటుకు మాత్రమే అధికారం ఉంది.

ప్రశ్న 5.
అవశిష్ట అధికారాలు.
జవాబు:
కేంద్ర, రాష్ట్ర మరియు ఉమ్మడి జాబితాలలో లేని అంశాలను అవశిష్ట అధికారాలు అంటారు. వీటి పై శాసనాలను రూపొందించే అధికారం పార్లమెంటుకు మాత్రమే కలదు.
ఉదా: ఆర్థిక వ్యవస్థలోని సేవారంగంపై పన్నులు విధించే అధికారం పార్లమెంటుకు ఉంది.

ప్రశ్న 6.
కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన రెండు రాజ్యాంగేతర సాధనాలు.
జవాబు:

  1. నీతి అయోగ్.
  2. జాతీయ అభివృద్ధి మండలి.

1) నీతి అయోగ్ జాతీయ ప్రణాళికా సంఘం స్థానంలో రాజ్యాంగేతర సంస్థగా ఏర్పాటు చేయబడింది. దీనినే 2015 జనవరి 1వ తేదీన ప్రస్తుత భారత ప్రధానమంత్రి నరేంద్రమోడి ఏర్పాటు చేయడం జరిగింది.

2) జాతీయ అభివృద్ధి మండలి రాజ్యాంగేతర, శాసనేతర సంస్థ. ఇది ప్రణాళికలను తయారు చేయటంలో సహాయపడుతుంది.

AP Inter 2nd Year Civics Study Material Chapter 9 కేంద్ర – రాష్ట్ర సంబంధాలు

ప్రశ్న 7.
నీతి ఆయోగ్. [Mar. ’17, ’16]
జవాబు:
నీతి ఆయోగ్ జాతీయ ప్రణాళికా సంఘానికి ప్రత్యామ్నాయంగా ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్రమోడి చేత | 2015 జనవరి 1వ తేదీన ఏర్పాటు చేయబడింది. ఇది విధాన, ఆర్థిక విషయాలకు సంబంధించిన సాంకేతిక, వ్యూహాత్మక సలహాలతో కూడిన జాతీయ అజెండాను కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేస్తుంది. గ్రామీణస్థాయి ప్రణాళికల యంత్రాంగాన్ని అభివృద్ధి చేయడంతోపాటు వివిధ స్థాయిలలోని ప్రభుత్వాల ప్రణాళికలకు సంబంధించి ఒక యంత్రాంగాన్ని అభివృద్ధి
పరుస్తుంది.

ప్రశ్న 8.
జాతీయ అభివృద్ధి మండలి.
జవాబు:
జాతీయ అభివృద్ధి మండలి రాజ్యాంగేతర, శాసనేతర సంస్థ. ఇది ప్రణాళికలను తయారు చేయడంలో సహాయపడుతుంది. ఈ సంస్థను 1952లో ఏర్పాటు చేశారు. దీనికి ప్రధానమంత్రి అధ్యక్షుడిగా ఉంటారు. కేంద్ర కేబినెట్ సభ్యులందరూ, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అన్ని కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, నీతి ఆయోగ్ సభ్యులు ఇందులో సభ్యులుగా ఉంటారు. నీతి ఆయోగ్ దీనికి కార్య నిర్వాహక శాఖగా పనిచేస్తుంది.

ప్రశ్న 9.
జాతీయ సమగ్రత మండలి.
జవాబు:
కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో “భిన్నత్వంలో ఏకత్వం” పై జరిగిన జాతీయ సదస్సులో తీసుకొన్న ఒక నిర్ణయం మేరకు మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ జాతీయ సమగ్రతా మండలి 1961లో న్యూఢిల్లీలో ఏర్పాటు చేశారు. ప్రధానమంత్రి దీనికి అధ్యక్షులు కాగా, కేంద్ర హోంశాఖామంత్రి, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాజకీయ పార్టీలకు చెందిన ఏడుగురు నాయకులు. యు.జి.సి. అధ్యక్షుడు, ఇద్దరు విద్యావేత్తలు మొదలగు వారు ఇందులో సభ్యులుగా ఉంటారు. మతవాదం, కులవాదం, ప్రాంతీయవాదం, భాషావాదం మరియు జాతీయ సమగ్రతకు సంబంధించి సంకుచిత భావనలు మొదలగు వాటికి సంబంధించిన సమస్యలను పరిశీలించి, వ్యవహరించవలసిన విధానం గూర్చి సిఫారసు చేస్తుంది.

ప్రశ్న10.
కేంద్ర, రాష్ట్ర సంబంధాలలో మూడు ఉద్రిక్త పరిస్థితులు.
జవాబు:

  1. గవర్నర్ల నియామక పద్ధతి
  2. గవర్నర్ల పక్షపాత వైఖరి
  3. రాష్ట్రాలపై 356 నిబంధనను ప్రయోగించడం.

ప్రశ్న 11.
పూంఛీ కమీషన్.
జవాబు:
కేంద్ర, రాష్ట్ర సంబంధాలను అధ్యయనానికై ఏర్పాటైన మరొక కమీషన్లే పూంఛీ కమీషన్.
పదవీ విరమణ పొందిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మదన్మోహన్ పూంఛీ అధ్యక్షతన కేంద్ర, రాష్ట్ర సంబంధాలను అధ్యయనం చేయడానికి UPA ప్రభుత్వం ఏప్రిల్ 28, 2007న ఈ కమీషన్ ను ఏర్పాటు చేసింది. భారత రాజకీయ వ్యవస్థలో వచ్చిన గణనీయమైన మార్పులను దృష్టిలో ఉంచుకొని కేంద్ర – రాష్ట్ర సంబంధాలను అధ్యయనం చేయవలసిందిగా ప్రభుత్వం కమీషన్ను కోరింది. ఎందుకంటే కేంద్ర, రాష్ట్ర సంబంధాలను సర్కారియా కమీషను సమీక్షించి దాదాపు దశాబ్దాలు గడిచిపోయాయి. కేంద్ర – రాష్ట్ర సంబంధాలలో ప్రాధాన్యత కలిగిన అంశాలతో ఏ విధంగా వ్యవహరించాలి అనే విషయంపై కమీషన్ దాదాపు 310 సిఫార్సులు చేసింది. కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి ఏప్రిల్ 20, 2010న సమర్పించింది. పూంఛీ కమీషన్ చాలా అంశాలలో కేంద్ర రాష్ట్ర సంబంధాలను లోతుగా పరిశీలించి, భారతదేశ సమైక్యతను, సమగ్రతకు భావితరాల ఆర్థిక మరియు సామాజిక అభివృద్ధి మెరుగు పరచడానికి భారతదేశం ఒక సహకార సమాఖ్యగా ఉండాలని సూచించింది. సహకార సమాఖ్య సూత్రాలు భారత రాజకీయ వ్యవస్థకు మరియు సుపరిపాలనకు ఆచరణలో మార్గదర్శకంగా ఉండాలని వివరించింది.

AP Inter 2nd Year Civics Study Material Chapter 9 కేంద్ర – రాష్ట్ర సంబంధాలు

ప్రశ్న 12.
కేంద్ర – రాష్ట్ర సంబంధాలు.
జవాబు:
కేంద్ర – రాష్ట్ర సంబంధాలు అనగా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికారాలు, విధులు మరియు బాధ్యతలు ప్రధానాంశంగా నిలుస్తాయి. కేంద్ర – రాష్ట్ర సంబంధాలను గూర్చి భారత రాజ్యాంగంలోని 11 మరియు 12 భాగాలలో 245 – 300 వరకు గల ప్రకరణలలో వివరించడమైంది. భారతదేశంలో కేంద్ర, రాష్ట్ర సంబంధాలను మూడు శీర్షికల క్రింద చర్చించవచ్చు. అవి: i) శాసన సంబంధాలు ii) పరిపాలన సంబంధాలు. iii) ఆర్థిక సంబంధాలు.

AP Inter 2nd Year History Study Material Chapter 3 ఖండాతర ఖ్యాతినార్జించిన రోమను సామ్రాజ్యం

Andhra Pradesh BIEAP AP Inter 2nd Year History Study Material 3rd Lesson ఖండాతర ఖ్యాతినార్జించిన రోమను సామ్రాజ్యం Textbook Questions and Answers.

AP Inter 2nd Year History Study Material 3rd Lesson ఖండాతర ఖ్యాతినార్జించిన రోమను సామ్రాజ్యం

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
మానవాళికి రోమనులు అందజేసిన వారసత్వం గూర్చి చర్చింపుము.
జవాబు:
రోమ్ సామ్రాజ్య వైభవ కాలంలో వారు ఈజిప్ట్, బాబిలోనియా, గ్రీస్, పశ్చిమ ఐరోపా, ఉత్తర ఆఫ్రికా భూభాగాలను పరిపాలించారు. ప్రాక్ దేశాల నాగరికత, సంస్కృతులకు రోమనులు వారసులయ్యారు. ఆ నాగరికతలను అనుసరించడమే కాక రోమన్లు కూడా ఎన్నో నూతన విషయాలను, భావాలను కల్పనలను ప్రపంచ సంస్కృతికి ప్రసాదించారు.
రోమన్లు మతము, తత్వశాస్త్రము, కళలు, భవననిర్మాణం, విజ్ఞానం, పాండిత్యం వంటి అనేక భావాలను గ్రీకుల నుండి గ్రహించారు. కేంద్ర, ప్రాదేశిక ప్రభుత్వపాలన, న్యాయసూత్రాలు, పన్నుల విధింపు సూత్రాలు, పౌరహక్కులు, వైద్య, ఆరోగ్య, మురుగు పారుదల విధానాలు, ప్రజోపయోగ పనులు, రహదారులు, నీటి ఊటలు, రంగస్థల వేదికలు, స్నానవాటికలు, వంతెనలు వంటి అనేక పనులు చేపట్టారు. రోమన్ ఇంజనీరింగ్ పరిజ్ఞానానికి వారి రహదారులు, నీటి సరఫరా పద్ధతులు నిదర్శనాలు.

న్యాయ సూత్రాలు : రోమన్ న్యాయశాసనాలు, పాలనా సిద్ధాంతాలు వారు ప్రపంచ నాగరికతకు చేసిన సేవలలో అత్యంత ప్రముఖమైనవి, శ్లాఘనీయమైనవి. వారి న్యాయశాసనాలు నేటి ప్రపంచంలోని దాదాపు అన్ని నాగరిక రాజ్యాలపై సంపూర్ణ ప్రభావాన్ని చూపాయి. 12 ఫలకాలపై రాసిన న్యాయసూత్రాలతో రోమన్ న్యాయశాస్త్రం ఆరంభమైనదని చెప్పవచ్చు. క్రీ.పూ. 150 నాటి ఈ 12 ఫలకాలు కంచుతో చేయబడి వ్యాపారకూడలి ప్రాంతాలలో ప్రదర్శించబడ్డాయి.

న్యాయాధీశులు ఇచ్చిన తీర్పులు రాయబడని చట్టాలై చిరస్థాయిని పొందాయి. ఘనమైన జస్టీనియన్ చక్రవర్తి ఈ న్యాయసూత్రాలను క్రోడీకరించుటతో వీటిని జస్టీనియన్ కోడ్ అన్నారు. రోమన్ న్యాయశాసనాలు సహజమైనవి. దయాగుణం కలవి. ప్రపంచంలోని అనేక రాజ్యాలు రోమన్ న్యాయసూత్రాలను ఆధారం చేసుకుని కొన్ని మార్పులతో, చేర్పులతో తమ న్యాయ సిద్ధాంతాలను రూపొందించుకున్నాయి. రోమన్ న్యాయశాసనం నిందితునికి తన వ్యాజ్యాన్ని నిరూపించుకునే అవకాశం ఇస్తుంది. నేరనిరూపణ జరిగే వరకు నిందితుడిని శిక్షించకూడదు. మరొక గొప్ప అంశమేమిటంటే పౌరులు ఎంత గొప్పవారైనా, బీదవారైనా చట్టం ముందు అందరూ సమానులే.

AP Inter 2nd Year History Study Material Chapter 3 ఖండాతర ఖ్యాతినార్జించిన రోమను సామ్రాజ్యం

మతం : ప్రాచీన రోమనులు దేవతలను, ఆత్మలను ఆరాధించారు. జూపిటర్, జునో, మార్స్, నెప్ట్యూన్, వీనస్లు వీరి దైవాలు. రోమన్లు అతీత శక్తులను విశ్వసించారు. దేవతలనారాధించడం వ్యక్తిగత విషయంగా కాక సామూహిక విధిగా రోమనులు భావించారు. జూదాతత్వం, క్రైస్తవమత బోధనలు నాడు ప్రచారంలో ఉన్నాయి.

తత్వశాస్త్రం : గ్రీకు తత్వశాస్త్రంలోగల స్థాయిసిజమ్, ఎకి క్యూరియానిజమ్ రెండూ రోమన్లను ప్రభావితపరచాయి. రోమన్ చింతనాపరులు స్థాయిక్ తత్వాన్ని ప్రచారం చేసారు. స్థాయిన్ తత్వవేత్తలలో ‘పనేషియస్’, ‘సేనేకా’ మరియు చక్రవర్తి ‘మార్కస్ అరీలియస్’ ప్రముఖులు. మార్కస్ అరీలియస్ తన భావాలను ‘మెడిటేషన్స్’ అనే గ్రంథంలో తన భావాలను వ్యక్తం చేసాడు. తాను చక్రవర్తి అయి ఉండి కూడా భోగభాగ్యాలకు దూరంగా నిరాడంబరంగా బ్రతికాడు.

సాహిత్యం : రోమన్ లు జిజ్ఞాసాపరులు. అలంకార, వ్యాకరణ, తర్క, ఖగోళ, గణిత, వైద్యశాస్త్రాలలో అధ్యయనం జరిగేది. అగస్టస్ కాలంలో లాటిన్ సాహిత్యం మహోన్నత శిఖరాలనందుకుంది. ఈ లాటిన్ యూరప్లోని అనేక | భాషలకు మూలధారంగా నిలచింది.

శాస్త్రవిజ్ఞానం : వైద్య విషయాలను గూర్చి ‘గాలన్’ కొన్ని పరిశోధనలు చేయడమే కాక, ‘వైద్య విజ్ఞాన సర్వస్వాన్ని’ రచించాడు. రోమన్ సామ్రాజ్యంలో ‘గాలన్’ గొప్ప వైద్యుడు. మానవ శరీర అవయవాలు, రక్తప్రసరణపై 500 పైగా గ్రంథాలు రచించాడు. ప్లిని ‘నేచురల్ హిస్టరీ’ రచించాడు. ఇది ఒక శాస్త్ర విజ్ఞానాల సర్వస్వం. రోమన్లు కాలెండర్ను అభివృద్ధి చేసారు. ఎన్నో నెలల పేర్లు రోమన్ చక్రవర్తులవే. జూలియస్ సీజర్ పేరున జూలై, ఆగస్టస్ పేరున ఆగస్ట్ నెలలు పిలువబడ్డాయి. సెప్టెంబర్, అక్టోబర్ లు లాటిన్ భాషలో తొమ్మిది, పది అని అర్థం. జాలియస్ కేలండర్ను సొసిజెనెస్ అనే అలెగ్జాండ్రియాకు చెందిన ఖగోళ శాస్త్రజ్ఞుడు తయారు చేసాడు.

ఈ విధంగా రోమన్ వాఙ్మయం, న్యాయశాస్త్రం, పాలనావిధానం, కళలు కూడా వారి మేథాశక్తికి, సంస్కృతికి చిహ్నాలుగా మిగిలిపోయాయి. రోమన్ న్యాయశాస్త్రం అనేక నాగరిక దేశాలకు ఒక నమూనాగా నిలిచిపోయింది. విశాల సామ్రాజ్య నిర్మాణంలో, అసంఖ్యాక జన సమూహాల్ని ఒక బలీయమైన జాతిగా తీర్చిదిద్దడంలో రోమన్లు గొప్ప పాత్రను పోషించారు.

ప్రశ్న 2.
రోమన్ సాంఘిక, ఆర్థిక వ్యవస్థల ప్రాథమిక లక్షణాలు పేర్కొనుము.
జవాబు:
సాంఘిక వ్యవస్థ : రోమ్ సాంఘిక వ్యవస్థలో ప్రముఖ వర్గాలున్నాయి. వారిని పేట్రిసియన్స్, ప్లీబియన్స్ అని పిలిచేవారు. పేట్రిసియన్స్ రాజకీయ, సాంఘిక, ఆర్థిక హక్కులను కలిగి ఉండేవారు. రోమన్ రాజ్యవ్యవస్థలో సెనేట్ ముఖ్యమైన సభ. సెనేట్ అధికారాలన్నీ భూస్వాములు, ఐశ్వర్యవంతులైన పేట్రీసియన్లు చలాయించగా, ప్లీబియన్స్ పిలవబడే పనివాళ్ళు, చిన్నరైతులు, వృత్తికళాకారులు, చిన్న చిన్న వరక్తకులు, సైనికులు మొదలైన వారికి హక్కులు తక్కువ. కానీ వారు చెల్లించవలసిన పన్నులు ఎక్కువగా ఉండేవి. కాగా రోమన్ న్యాయశాసనాలు ప్లేబియన్లు, పేట్రిసియన్లకు సమానంగా వర్తింపజేయబడ్డాయి.

రోమన్ సాంఘిక జీవనంలో ఉమ్మడి కుటుంబాలకు బదులు ఏకీకృత చిన్న కుటుంబాల సంఖ్య గణనీయంగా పెరిగింది. పెండ్లి అయిన అమ్మాయికి తను పుట్టి పెరిగిన కుటుంబంలో ఆస్తిహక్కు కలదు. వివాహిత స్త్రీకి చట్టబద్ధమైన స్వేచ్ఛ ఉంది. విడాకులు పొందడం అంత కష్టమేమీ కాదు. పెద్దలు కుదిర్చిన వివాహాలు కూడా జరిగేవి. భార్యను హింసించడం సామాన్య విషయంగా మారింది. సమాజంలో బిషప్పులు మతగురువులు. మతగురువులు సమాజంలో చాలా శక్తివంతమైన వారుగా ఉండేవారు. పిల్లలపై తల్లిదండ్రులకు చట్టబద్ధ అధికారాలుండేవి.

రోమన్ సమాజంలో బానిసత్వం ఒక పాతుకుపోయిన సాంఘిక దురాచారం. పై తరగతికి చెందిన రోమన్లు బానిసలను పైశాచికంగా చూసేవారు. వారి సాంఘిక వ్యవస్థలో మూడు వర్గాలు కలవు. సెనేటర్లు, మధ్య తరగతి మరియు దిగువ తరగతి గ్రామీణ శ్రామిక శక్తి దిగువ తరగతిగా ఏర్పడింది. నైట్స్ లేదా అశ్వదళాధిపతులు సాంప్రదాయకంగా శక్తిమంతులు. ధనిక వర్గానికి చెందినవారు. వారిలో చాలా మంది భూస్వాములు కలరు. సైనికులు, సైన్యాధికారులు, భూయజమానులలో చాలా మంది అక్షరాస్యులు. నాటి సమాజంలో సాంస్కృతిక వైవిధ్యం కన్పిస్తుంది. భిన్న మతాచారాలు, విభిన్న భాషలు, వివిధ రకాల వేషధారణ, అనేకరకాల ఆహారపుటలవాట్లు ఆ ప్రజలలో ఉండేవి. అరమిక్, కాప్టిక్, సెల్టిక్, లాటిన్ వంటి వివిధ భాషలు మాట్లాడేవారు. ప్రజలలో అధికులు లాటిన్ భాష మాట్లాడేవారు.

ఆర్థిక వ్యవస్థ : రోమన్ సామ్రాజ్యంలో ఆర్థికంగా మౌలికరంగానికి చెందిన హార్బర్లు, లోహఖనిజాలు, క్వారీలు, ఇటుకల, పరిశ్రమ, నూనె పరిశ్రమలు గణనీయమైనవి. గోధుమ, ద్రాక్ష సారాయి, ఆలివ్ననెల వ్యాపారం ముమ్మరంగా జరిగేది. ద్రవ పదార్థాలు ‘ఆప్ఫోరె’ అనే కంటైనర్లలో రవాణా చేయబడినవి. ఆసియా మైనర్ (టర్కీ), సిరియా, పాలస్తీనా వంటి ప్రదేశాల నుండి ద్రాక్షసారాయి, ఆలివ్ నూనెలు ఎగుమతి అయ్యేవి. కంపానియా నుండి ఉత్తమశ్రేణి సారాయి లభించేది. సిసిరీ, బైజాసియాని ప్రాంతాల నుండి గోధుమలు రోమ్ నగరానికి ఎగుమతి చేయబడేవి.

AP Inter 2nd Year History Study Material Chapter 3 ఖండాతర ఖ్యాతినార్జించిన రోమను సామ్రాజ్యం

రోమన్ సామ్రాజ్యంలో విశిష్టమైన సారవంతమైన ప్రాంతాలు ఎన్నో కలవు. ‘గలీలీ’ సాంద్ర వ్యవసాయానికి పేరుగాంచింది. అత్యాధునిక హైడ్రాలిక్ గని త్రవ్వకాల సాంకేతికతను చేపట్టి స్పానిష్ బంగారు, వెండి గనులు ప్రఖ్యాతి చెందాయి. రోమన్లు వాణిజ్య బ్యాంకింగ్ రంగంలో గణనీయమైన విజయాలు సాధించారు. వీరు విస్తృతంగా ద్రవ్య వినియోగం చేసేవారు. నాటి గ్రామీణ ఋణ గ్రస్తత కూడా విస్తృతమైనది. సామ్రాజ్యంలోని పెద్ద భూస్వాములు మార్కెట్లపై అదుపు సాధించడానికి పోటీపడేవారు. ‘డెమేరియస్’ అనే వెండి నాణెంను 41/2 గ్రాముల శుద్ధమైన వెండితో తయారు చేసారు. రోమన్లు బ్రహ్మాండమైన నిర్మాణాలు చేసారు. ఆనాటి ఇంజనీర్లు నిర్మించిన పెద్ద అక్విడెట్లు మూడు ఖండాలలో నీటి పారుదలను మెరుగుపరచాయి.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1. 12 ఫలకాలపై రాసిన న్యాయసూత్రాలు.
జవాబు:
రోమన్ న్యాయశాసనాలు, పాలనా సిద్ధాంతాలు వారు ప్రపంచ నాగరికతకు చేసిన సేవలలో అత్యంత ప్రముఖమైనవి. శ్లాఘనీయమైనవి, వారి న్యాయశాసనాలు నేటి ప్రపంచంలోని దాదాపు అన్ని నాగరిక రాజ్యాలపై సంపూర్ణ ప్రభావాన్ని చూపాయి. 12 ఫలకాలపై వ్రాసిన న్యాయసూత్రాలతో రోమను న్యాయశాస్త్రం ఆరంభమైనదని చెప్పవచ్చు. క్రీ.పూ. 150 నాటి ఈ 12 ఫలకాలు కంచుతో చేయబడి వ్యాపారకూడలి ప్రాంతాలలో ప్రదర్శించబడ్డాయి.

ప్రశ్న 2.
రోమన్ సామ్రాజ్య చరిత్రకు లభించు చారిత్రక ఆధారాలు.
జవాబు:
ఖండాంతరాలలో ఖ్యాతినార్జించిన ప్రాచీన రోమన్ సామ్రాజ్య చరిత్రకు విస్తారంగా ఆధారాలు లభించాయి. లిఖిత ఆధారాలు : లివీ రచించిన ‘అన్నాల్స్’ (రోమ్ చరిత్ర); వర్జిల్ రచించిన ఏనియడ్; లుక్రేషియస్ ప్రకృతి రహస్యం; ఓవిడ్ హెరాస్, ప్లిని – నేచురల్ హిస్టరీ; టాసిటస్ – ఏనల్స్ + హిస్టరీ; చక్రవర్తి మార్కస్ అరలియస్ – మెడిటేషన్స్; జస్టీనియన్ చక్రవర్తి సంకలనం చేసిన న్యాయస్మృతి జస్టీనియన్ కోడ్, ఇవన్నీ ఆనాటి సాంఘిక, ఆర్థిక, రాజకీయ, న్యాయ, తాత్త్విక పరిస్థితులను మనకు తెలియజేస్తున్నాయి.

కట్టడాలు: రోమన్ ఇంజనీరింగ్ వైభవానికి చిహ్నాలుగా అనేక కట్టడాలు రోమ్, కార్తేజ్ ఆంటియోస్ అలెగ్జాండ్రియా, కాన్స్టాంట్్నపుల్ ఇంకా అనేక చోట్ల లభించాయి. ఎత్తైన స్తంభాలు, ఆర్చ్ లు గుమ్మటాలు, అక్విడక్ట్లు, కలోసియాలు, ప్రజాస్నాన వాటికలు ఎన్నో నాటి సాంకేతిక వైభవాన్ని చాటుతున్నాయి.

త్రవ్యకాలు: వెసూవియస్ అగ్నిపరత్వం దగ్గరలో ఉన్న పాంపేయీ నగరాన్ని క్రీ. శ. మొదటి శతాబ్దిలో హఠాత్తుగా బద్దలయిన పర్వతం లావా క్రింద నగరం పూడిపోయింది. దాదాపు 10 మీటర్లు మందం లావా క్రింద పూడుకపోయిన నగరాన్ని త్రవ్వకాలలో వెలికితీసారు. ఈ త్రవ్వకాలలో వీధులు, నివాసగృహాలు, ఫోరమ్, ఆంఫిధియేటర్, స్నానాగారాలు, దేవాలయాలు బయటపడ్డాయి.

శాసనాలు, నాణేలు : ఆగస్టస్ చక్రవర్తి వేయించిన శాసనం, ‘డెమిరియస్’ అనే 41/2 గ్రా వెండి నాణెం నాటి పరిస్థితులను తెలుపుతున్నాయి. ఇంకా అసంఖ్యాకంగా విగ్రహాలు, వర్గచిత్రాలు నాటి వైభవాన్ని చాటి చెబుతున్నాయి.

ప్రశ్న 3.
జూలియస్ సీజర్.
జవాబు:
విశ్వవిఖ్యాత విజేత జూలియస్ సీజర్. ఒక సంపన్న కుటుంబంలో క్రీ.పూ. 102 సంవత్సరంలో రోమ్లో జన్మించాడు. ఆంటోనియస్ వద్ద విద్యనభ్యసించాడు. అసాధారణ శౌర్యపరాక్రమాలు, విజ్ఞత ప్రదర్శించాడు. ఒక న్యాయాధికారిగా, మత పెద్దగా, స్పెయిన్కు గవర్నర్ గా బహుముఖ కార్యాలను నిర్వహించాడు. త్రిమూర్తులుగా పేరు గాంచిన సాంపే, సీజర్, కానన్లలో సీజర్ అగ్రగణ్యుడు. వాస్తవానికి సీజర్ ఒక నియంతగా పిలవబడినా గణతంత్ర సాంప్రదాయాలకు విలువనిచ్చాడు. ఈజిప్టు రాణి క్లియోపాత్రా అందానికి బానిసై ఆమె ద్వారా ఒక కుమానికి తండ్రి అయ్యాడు. క్రీ.పూ. 46లో రోమ్ నగరానికి తిరిగి వచ్చి నియంతగా ప్రకటించుకున్నాడు. ఈజిప్ట్ రోమన్ సామ్రాజ్యానికి మిత్రరాజ్యమయింది.

స్పెయిన్, ఈజిప్టులలో చెలరేగిన తిరుగుబాట్లను, అణచివేసిన తర్వాత రోమన్ సామ్రాజ్యంలో అనేక సంస్కరణలను ఆవిష్కరించాడు. వ్యవసాయాభివృద్ధి పన్నుల తగ్గింపు, అవినీతిమయమైన నిరంకుశ అధికారుల తొలగింపు, గాల్, సిసిలీ, ప్రజలకు పౌరహక్కులు ప్రసాదించుట, ప్రభుత్వ భూముల పంపిణీ, ప్రజా పనుల కొనసాగింపు, నాణేల వ్యవస్థను మెరుగుపరచుట, జూలియన్ కేలండర్ను పరిచయం చేయడం వంటి అనేక పనులు చేపట్టాడు. న్యాయస్మృతులు పరిచయం, గ్రంథాలయ నిర్మాణం వంటి పెక్కు పనులు ప్రారంభించాడు. కానీ పూర్తి చేయలేకపోయాడు. ‘బ్రూటస్’ వంటి శత్రువులు ఏకమై సీజర్ను క్రీ.పూ.44లో హత్య చేసారు.

AP Inter 2nd Year History Study Material Chapter 3 ఖండాతర ఖ్యాతినార్జించిన రోమను సామ్రాజ్యం

ప్రశ్న 4.
రోమన్ ల పట్టణీకరణ.
జవాబు:
రోమన్ సామ్రాజ్యంలోని పరిస్థితులు పట్టణీకరణను ప్రోత్సహించాయి. చక్రవర్తులు కూడా అనేక ప్రజోపయోగ పనులను చేపట్టి పేదవారికి ఉపాధి కల్పించారు. ఈ కాలంలో అనేక రహదారులు, భవనాలు, వంతెనలు, ప్రదర్శనశాలలు, నీటి ఊటలు నిర్మించబడ్డాయి. వీటి నిర్మాణం కోసం ఎంతోమంది శ్రామికులు అవసరమయ్యేవారు. అలా శ్రామికులుగా, బానిసలుగా వచ్చిన వారితో నగర విస్తీర్ణం పెరుగుతూపోయాయి.

కార్తేజ్, అలెగ్జాండ్రియా, ఆంటియోక్ వంటి ప్రసిద్ధ నగరాలు మధ్యథరా తీరప్రాంతంలో చూడగలం. రోమన్ సామ్రాజ్య సిరిసంపదలు ఇలా అనేక నగరాలలో చూడవచ్చు. విన్టోనిస్సా ప్రజాస్నాననాటిక నిర్మాణం రోమన్ నాగరికత ప్రత్యేక లక్షణం. పట్టణ ప్రజానీకం ఉన్నతశ్రేణి వినోదాన్ని అనుభవించింది. పెద్ద పెద్ద ప్రదర్శనలు తరచుగా ఏర్పాటు చేయబడేవి. విన్డోనిస్సా వద్ద నిర్మించబడిన ఏంపిధియేటర్ సైనిక విన్యాసాలకు, గొప్ప ప్రదర్శనలకు నిలయం. క్రీ.శ. 79లో నిర్మించబడిన పెద్ద ప్రదర్శనశాల కలోసియమ్లో 50,000 మంది వీక్షకులు కూర్చునే సౌకర్యం కలది. ఈ కలేసియామేలలో ‘గ్లాడియేటర్స్’ క్రూరమృగాలతో పోరాడేవారు. ‘సోంపెల్లి’, ‘ఆరంజ్’, ‘టారోమినిమమ్’ వంటి ప్రదర్శనశాలలు ఇట్టివే. ప్రజలను ప్రజా సమస్యల నుండి దూరంగా ఉంచడానికి రోమన్ ప్రభువులకు ఈ ప్రదర్శనశాలలో నిత్యం జరిగే ‘హింసాత్మక కార్యక్రమాలు కొంత వరకు తోడ్పడ్డాయి.

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
పేపిరస్.
జవాబు:
పేపిరస్ అనేది పేపిరస్ చెట్టు నుండి తయారు చేయబడిన పల్చని కాగితంలాంటిది. దీనిని విషయాలను రచించడానికి ఉపయోగించేవారు. పేపిరస్ ను పత్రాలను ఒక కట్టగా చుట్టేవారు. పేపిరస్ ను వ్రాతకోసం తొలిసారిగా ఈజిప్టు ప్రజలు వాడారు. పేపిరస్ చౌకగా తయారై తొందరగా చినగకుండా ఎక్కువ కాలం మన్నుతుంది. రోమన్లు సాహిత్యంగాని, లేఖలుగాని మరి ఇతర డాక్యుమెంట్లు గాని పేపిరస్ను వాడేవారు.

ప్రశ్న 2.
రిపబ్లిక్.
జవాబు:
పేట్రీషియన్లు తమ ప్రభుత్వ వ్యవస్థను ‘ప్రజా ఆశయం’ లాటిన్ భాషలో ‘రిపబ్లికా’ అనేవాళ్ళు. దాని నుండి రిపబ్లిక్ అనే మాట పుట్టింది. రిపబ్లిక్ అంటే ఒక నిర్ణీత కాలానికి ఎన్నుకోబడిన వాళ్ళచేత పరిపాలింపబడే రాజ్యం. రోమ్లో పాలన ఎన్నిక మీద ఆధారపడింది. ప్రతి సంవత్సరమూ ప్రజా సభచేత ఇద్దరు పేట్రీషియన్లు కాన్సళ్ళుగా ఎన్నుకోబడేవారు. వీరు కోర్టు తీర్పులు చెప్పడం, సైన్యానికి నాయకత్వం వహించేవారు. ఏడాది ముగిసాక వీరిలో అత్యున్నతులు సెనేట్ సభ్యులు అయ్యేవారు. సెట్కు విశేష అధికారాలుండేవి. అన్ని విషయాలు సెనేట్ లో చర్చించి అమలుచేయబడేవి.

ప్రశ్న 3.
బానిసల ఉత్పత్తి.
జవాబు:
రోమ్ చేసిన యుద్ధాల్లో చిక్కిన లక్షల కొలది ఖైదీలు బానిసలుగా మార్చబడేవారు. సకాలంలో పన్నులు కట్టని ప్లేబియన్లను కూడా బానిసలుగా మార్చడం ఉండేది. రోమ్ ఆక్రమించుకున్న ప్రాంతాలలో వందల కొద్దీ బానిస మార్కెట్లు ఉండేవి. రోజుకు 10,000 మంది బానిసలు దాక విక్రయించబడేవారు. రోమన్ బానిస యజమానులు, బానిసలను మనుషులుగా గుర్తించలేదు.

బానిసల పట్ల దయాదాక్షిణ్యాలు లేక గొడ్డుచాకిరీ చేయించేవారు. బానిసలలో బలిష్టులను గ్లాడియేటర్లుగా తీర్చిదిద్దేవారు. బానిసలను కఠినాతి కఠినంగా హింసించేవారు. దారుణ చిత్రహింసలు పెట్టేవాళ్ళు. బానిసలను రోమ్ దోచుకున్నంతగా ప్రపంచంలో మరే దేశం దోచుకోలేదు. ఎక్కడా అంతమంది బానిసలు లేరు.

AP Inter 2nd Year History Study Material Chapter 3 ఖండాతర ఖ్యాతినార్జించిన రోమను సామ్రాజ్యం

ప్రశ్న 4.
కలోసియమ్.
జవాబు:
రోమన్ పాలకుల విధానాలతో, గత్యంతరం లేని సోమరితనంతో, దానధర్మాలతో పాడుచేయబడిన రోమన్ పేదప్రజలకు పనిచేయాలని ఉండేది కాదు. పని చేయడం బానిసల వంతుగా బానిసల యజమానులు కూడా భావించేవారు. వీరు చక్రవర్తి నుండి ఉచిత ఆహారాన్ని, వినోదాన్ని డిమాండ్ చేసేవారు.

రోమన్ బానిస యజమానులకు, పేదవారికి వినోదార్థం గ్లాడియేటర్ల, పోరాటాల కోసం క్రీ.శ. మొదటి శతాబ్ది ఉత్తరార్థంలో రోమ్లో ‘కొలీసియం’ అనే బ్రహ్మాండమైన ఆంఫిథియేటర్ నిర్మించబడింది. ఈ కొలీసియంలో 50,000 మంది వరకు ప్రేక్షకులు కూర్చొనవచ్చు. ఈ కలోసియంలో గ్లాడియేటర్లు క్రూరమృగాలతోను, తమలో తాము పోరాడేవారు.

ప్రశ్న 5.
అగస్టస్.
జవాబు:
అగస్టస్ పేరు మార్చుకున్న జూలియస్ సీజర్ వారసుడు ఆక్టివియన్ రిపబ్లికన్ను అంతం చేసాడు. రోమ్ చరిత్రలో అగస్టస్ కాలం స్వర్ణయుగంగా బాసిల్లింది. శాంతి సౌభాగ్యాలకు ప్రతీకగా నిలిచింది. క్లిష్టపరిస్థితులలో పేదవారికి ఆగస్టస్ ఉచితంగా ఆహార పదార్థాలిచ్చి సంతోషపరచాడు. అనేక ప్రజాపనులను చేపట్టి పేదవారికి ఉపాధి కల్పించాడు. ఈ కాలంలో అనేక రహదారులు, వంతెనలు, భవనాలు, ప్రదర్శనశాలలు, నీటి ఊటలు నిర్మించబడ్డాయి. కలోసియమ్ వీటన్నింటిలో ప్రసిద్ధమైన కట్టడం 50,000 మంది ఒకేసారి కూర్చోగల ప్రదర్శనశాల. అగస్ట్ కాలంలో రోమ్ వాణిజ్యకేంద్రంగా ఉండేది. భారత, చైనాలతో సహా అనేక దేశాలతో సంబంధం కలిగిఉండేది.

ప్రశ్న 6.
కాన్స్టాంటైన్ చక్రవర్తి.
జవాబు:
డియోక్లిటియన్ పాలన అనంతరం అధికారం కోసం కాన్స్టాంటిన్ అనే సేనానాయకుడు ఎన్నో కుట్రలు, అరాచకాలు చేసి అధికారంలోకి వచ్చాడు. సింహాసనాన్ని కాంక్షిస్తున్నాడనే అనుమానంతో కన్నకొడుకును కూడా వధించాడు. ప్రజలను బానిసలను అధిక పన్నులతో తీవ్రంగా వేధించాడు.

తన అధికారాన్ని బలపరచుకోవడానికి కన్స్టంటైన్ క్రైస్తవ చర్చిని వినియోగించుకున్నాడు. చర్చికి డబ్బులు, భూములు, విలువైన వస్తువులు ధారాళంగా ఇచ్చాడు. బాస్ఫరస్ జలసంధి తీరంలో బైజాంటియమ్ అనే గ్రీకు వలస ఉన్నచోట కాన్స్టంటెన్ ఒక నగరాన్ని నిర్మించాడు. దీనినే కాన్స్టాంట్్నపిల్ అన్నారు. కాన్స్టంటిస్ ఎన్ని క్రూరకర్మలు చేసినా క్రైస్తవులు అతడిని పవిత్ర పురుషుడిగా ప్రకటించారు.