AP Board 9th Class Telugu Important Questions Chapter 1 శాంతికాంక్ష

AP State Syllabus AP Board 9th Class Telugu Important Questions Chapter 1 శాంతికాంక్ష.

AP State Syllabus 9th Class Telugu Important Questions 1st Lesson శాంతికాంక్ష

9th Class Telugu 1st Lesson శాంతికాంక్ష Important Questions and Answers

I. అవగాహన – ప్రతిస్పందన

అపరిచిత పద్యం

“విద్య యొసగును వినయంబు వినయమునను
బడయు బాత్రత, పాత్రత వలన ధనము
ధనము వలనను ధర్మంబు దానివలన
ఐహికాముష్మిక సుఖంబులందు నరుడు.”
ప్రశ్నలు :
1. విద్య ఏది యొసగును?
2. పాత్రత వలన కలిగేదేది?
3. ధర్మము వలన ఏది కలుగును?
4. మనిషి ఏవేవి సాధించాలని పై పద్యం తెలియజేస్తోంది?
జవాబులు:
1. వినయం
2. ధనము
3. సుఖము
4. వినయం (Humility), పాత్రత (అర్హత, యోగ్యత /Eligibility), ధర్మం (దాతృత్వం -charity), సుఖం (కీర్తి ప్రతిష్ఠలు/credibility)

II. స్వీయరచన

అ) క్రింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
ధర్మరాజు శాంతి కాముకుడు అని ఎలా చెప్పగలవు?
జవాబు:
“శాంతము లేక సౌఖ్యమూ లేదు” అన్నారు త్యాగరాజు. విద్య, వినయం గల ధర్మరాజు శాంతినే ఎప్పుడూ కోరుకున్నాడు. శ్రీకృష్ణునితో ధర్మరాజు అన్న ఈ మాటలు గమనించండి. “సక్రమంగా మాకు అర్ధరాజ్యం పంచి ఇవ్వడానికి మా తండ్రి మనస్సొప్పకపోతే మేము తలదాచుకోవడానికి ఐదూళ్ళిచ్చినా చాలు” అని సంజయునితో చెప్పానన్నాడు. దీనిద్వారా పంతానికి పోయి తన రాజ్యం తనకు ఇమ్మని కాకుండా కుదిరితే అర్థరాజ్యం లేకపోతే ఐదూళ్ళెనా అనడంలో అతని శాంతి కాముకత ప్రస్ఫుటమౌతుంది.

ప్రశ్న 2.
పాండవులు కోరిన ఐదూళ్ళేవి?
జవాబు:
పాండవులు కోరిన ఐదూళ్ళ పేర్లను సంస్కృత మహాభారత కర్త వ్యాసుడు – “ఇంద్రప్రస్థం, కుశస్థం, వాసంతి, వృకస్థలం, వారణావతం” – అని పేర్కొన్నాడు. తెలుగు మహాభారత కర్తలలో ఒకరైన తిక్కన “అవిఫలం, వృక(కుశ) స్థలం, మాకంది (వాసంతి), వారణావతంతో మరొక ఊరేదైనా అని పేర్కొన్నాడు.

ప్రశ్న 3.
‘ఇతిహాసం’ ప్రక్రియ గురించి రాయండి.
జవాబు:
ఇతిహాసం అనగా (‘ఇతి + హ + అసీత్’ – ఇతిహాసము) ఇట్లు జరిగెనని చెప్పెడు పూర్వజుల చరిత్రము కలది. దీనినే తొల్లిటికథ అని అంటారు. ఇతిహాసంలోని ఇతివృత్తం (కథ) వాస్తవంగా జరిగినదై ఉంటుంది. రామాయణ మహాభారతాలు మన ఇతిహాసాలు.

AP Board 9th Class Telugu Important Questions Chapter 1 శాంతికాంక్ష

ప్రశ్న 4.
తిక్కన రచనా శైలిని గురించి రాయండి.
(లేదా)
శాంతిని కోరుతూ సందేశమిచ్చిన కవిని గూర్చి రాయండి. (S.A. III – 2016-17)
జవాబు:
మహా భారతాన్ని తెలుగులో కవిత్రయం వారు రచించారు. వారిలో రెండోవారు తిక్కన సోమయాజి. 13వ శతాబ్దబ్దికి చెందిన ఈయన నెల్లూరును పాలించిన మనుమసిద్ధికి మంత్రిగా, ఆస్థానకవిగా ఉన్నారు. నిర్వచనోత్తర రామాయణం, మహాభారతంలో విరాటపర్వం నుండి స్వర్గారోహణ పర్వం (15 పర్వాలు) రచించారు.

తిక్కన రచనలో తెలుగు పదాలెక్కువ. పాత్రల మనోభావాలను వెల్లడించటంలో ఈయన ప్రజ్ఞాశాలి. తిక్కన రచన ‘అర్థగౌరవం’ కలది. చిన్న చిన్న పదాలలో అనల్పమైన భావము ఇమిడేటట్లు రచించుటలో తిక్కన సిద్ధహస్తుడు. శ్రీనాథుడు ఇతని రచన ‘రసాభ్యుచితబంధమ’ని పొగిడాడు. ఆధునికులు ఆంధ్ర సాహిత్య ఆకాశంలో తిక్కన సూర్యుని వంటివాడని భావిస్తారు. వివిధ సన్నివేశాలను కళ్ళకు కట్టినట్లు ‘నాటకీయం’గా చిత్రించుటలో తిక్కన సాటిలేనివాడు. సంస్కృతాంధ్ర భాషలలో కవిత్వం రాయగల ప్రతిభాశాలి కాబట్టి ‘ఉభయ కవి మిత్రుడు” అనీ, కేతనాది కవులకు ప్రేరణ కలిగించి మార్గదర్శకులుగా నిలిచినందుకు ‘కవిబ్రహ్మ’ అనీ బిరుదులు పొందారు.

ఆ) క్రింది ప్రశ్నలకు పది లేక పన్నెండు వాక్యాలలో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
ధర్మరాజు శ్రీకృష్ణునితో మాట్లాడిన మాటలు మీకు ఎంతవరకు అర్థమయ్యాయి? ధర్మరాజు లాగా మనం ప్రవర్తించగలమా?
జవాబు:
ధర్మరాజు శ్రీకృష్ణునితో మాట్లాడిన మాటలు సర్వకాల సర్వావస్థల యందు అందరికీ వర్తిస్తాయి. ధర్మరాజు ధర్మానికి ప్రతీక. ఇతని అసలు పేరు యుధిష్ఠరుడు. ధర్మరాజు చెప్పిన మాటల్లో ప్రధానంగా – ‘సక్రమంగా ఇవ్వాల్సిన అర్థరాజ్యమైనా లేదా తలదాచుకోవడానికి ఐదూళ్ళిచ్చినా చాలు’ అనేవి అతనిలో సర్దుకుపోయే తత్వాన్ని తెలుపుతోంది. ఈ ఐదూళ్ళూ కూడా నన్ను ఆశ్రయించుకొని ఉన్న నా బంధు జనులకు కూటికీ, గుడ్డకూ దైన్యం ఏర్పడకుండా ఉండటానికే అని చెప్పడం అతనిలోని నిరాడంబరతను తెలియజేస్తుంది.

రాజ్యం కోసం ఎదుటవారిని ఎందుకు చంపాలి. వారిలోను బంధువులు, మిత్రులు ఉన్నారు అన్న ధర్మరాజు మాటల్లో శాంతికాముకత, స్నేహశీలం చక్కగా కనబడుతున్నాయి. అందరినీ చంపుకుంటూపోతే చివరికి మట్టే మిగిలేది. పాపమే చుట్టుకొనేది అన్న భావం వ్యక్తమైంది. జీవితానికి శాంతి లేనప్పుడు ఆ జీవనమే వృథా. అలాగే ఎవరితోనూ దీర్ఘకాల విరోధం పనికిరాదన్న అతని మాటలు అక్షర సత్యమని నేను భావిస్తున్నాను.

ఆవేశం, పగ మనిషి పతనానికి దారితీసేవి. కాబట్టి కలత లేక నిమ్మళంగా ఉండటమే మంచిది అన్న ధర్మరాజు మాటలు ప్రతి ఒక్కరినీ ఆలోచింపచేసేవిగా ఉన్నాయి. మనం మాట్లాడే మాట తేటగా పెద్దల మనస్సును ఆకట్టుకొనే విధంగా ఉండాలే గాని తూటాల్లాగా ఉండకూడదనే భావాన్ని ధర్మరాజు చెప్పాడు.

విద్యార్థి దశ నుండి ప్రతి ఒక్కరు పుస్తకాలు ఎక్కువగా చదివి జ్ఞాన సముపార్జన చేసి, దానిలోని సారాన్ని గ్రహించినపుడు మనం మహనీయుల అడుగు జాడల్లో నడువగలం. వారిలాగే ప్రవర్తించగలం.

AP Board 9th Class Telugu Important Questions Chapter 1 శాంతికాంక్ష

ప్రశ్న 2.
మీరే ధర్మరాజు అయితే ‘శాంతి’ గురించి విద్యార్థులకు ఏం చెబుతారో సందేశాత్మకంగా రాయండి. (S.A. I – 2018-19)
జవాబు:
ధర్మానికి ప్రతీకగా నిల్చిన యుధిష్ఠరుని లోకమంతా ధర్మరాజు అని కీర్తించింది. నేనే ధర్మరాజు అయితే శాంతినే కోరుకుంటాను. రాజ్యం కోసం ఎదుటవారిని ఎందుకు చంపాలి. వారిలోను బంధువులు, మిత్రులు ఉన్నారనే ధర్మరాజు మాటలతో నేనూ ఏకీభవిస్తాను. అందరినీ చంపుకుంటూపోతే చివరికి మట్టే మిగిలేది. పాపమేగా చుట్టుకొనేది. జీవితానికి శాంతి లేనపుడు ఆ జీవనమే వృథా. అలాగే ఎవరితోను దీర్ఘకాల విరోధం పనికి రాదన్న ధర్మరాజు మాటలు అక్షరసత్యాలు.

ఆవేశం, పగ మనిషి పతనానికి దారితీసేవి. కనుక కలత లేక నిదానంగా ఉండటమే మంచిది అన్న ధర్మరాజు మాటలు మనల్ని ఆలోచింపచేస్తాయి. ‘మాట తూటా వంటిది’ అన్నాడో కవి. కనుక నీ మాటలు ఎవరినీ, ఎప్పుడూ గాయపరచకుండా ఉండేలా చూసుకోవాలి. ‘శాంతము లేక సౌఖ్యము లేదు’ అన్న త్యాగరాజు మాటల్లోని భావాన్ని మనం గ్రహించాలి. శాంతి, సహజీవనం, సామరస్యం ఉన్న ఏ దేశమూ నాశనం కాదు. ‘అంధ విశ్వాసం, పేరాశ, భయంలేని జీవితమే వ్యక్తి నిరంతర ఆనందానికి మూలం, పునాది. అదే విశ్వశాంతి సౌఖ్యాలకు ఆధారం’ అన్న జిడ్డు కృష్ణమూర్తి (తత్త్వవేత్త) మాటలను మనం గుర్తుంచుకోవాలి. నీకు శాంతి ఇవ్వగలిగింది నీవు ఒక్కడవే. ఈ భూమి అంతటా శాంతి వర్ధిల్లాలి. అది నాతోనే ప్రారంభం కానిద్దాం అని అందరూ అనుకున్నప్పుడు ‘శాంతి’ అక్షరరూపం కాక, క్రియారూపం దాలుస్తుంది.

III. భాషాంశాలు (పదజాలం , వ్యాకరణం)

1. పర్యాయపదాలు :

యుద్ధం = రణం, సంగ్రామం, సంగరం, పోరు
ధరిత్రి = భూమి, నేల, ధరణి
పగలు = విరోధులు, శత్రువులు, వైరులు
శుభం = మేలు, క్షేమం, మంచి
శ్రీ = సిరి, సంపద, సొమ్ము
భూపతి = రాజు, జేడు, భూభర్త, ప్రభువు
కొడుకు = కుమారుడు, సుతుడు, తనూజుడు, పుత్రుడు

2. వ్యుత్పత్త్యర్థాలు :

1. కౌరవులు : కురువంశమున పుట్టినవారు = దుర్యోధనాదులు
2. పాండవులు – పాండురాజు కుమారులు = ధర్మరాజాదులు
3. దుర్యోధనుడు = సుఖముగా యుద్ధము చేయుటకు వీలుపడినవాడు = సుయోధనుడు
4. బంధువు రక్త సంబంధముచే బంధించువాడు = చుట్టము
5. కృష్ణుడు కృష్ణ (నలుపు) వర్ణము కలవాడు, భక్తుల హృదయాలను ఆకర్షించువాడు = విష్ణుని అవతార విశేషము
6. శ్రీ = విష్ణువును ఆశ్రయించునది = లక్ష్మి
7. ధర్మరాజు = సత్యం, అహింస మున్నగు ధర్మములకు రాజు = పాండుపుత్రుడు
8. మిత్రుడు = సర్వభూతములయందు స్నేహయుక్తుడు = స్నేహితుడు

AP Board 9th Class Telugu Important Questions Chapter 1 శాంతికాంక్ష

3. నానార్థాలు :

మిత్రుడు = హితుడు, సూర్యుడు
కృష్ణుడు = విష్ణువు, వసుదేవుని పుత్రుడు, వ్యాసుడు, అర్జునుడు
ఊరు = గ్రామం, లోపలి నుండి ద్రవం పైకివచ్చు, వృద్ధినొందు
దిక్కు = దిశ, శరణు, వైపు

4. ప్రకృతి – వికృతులు :

కాంక్ష – కచ్చు
బంధు – బందుగు (చుట్టము)
గ్రాసము – గాసము (ఆహారం)
దోషం – దోసం
బుద్ధి – బుద్ధి
ధర్మము – దమ్మము, దరమము
శ్రీ – సిరి
దిక్ – దెస (దిక్కు)
కార్యము – కర్జము
భూ – బువి

5. సంధులు :

సమయము + ఇది – సమయమిది – ఉత్వసంధి
అంశము + అగు – అంశమగు – ఉత్వసంధి
పగలు + ఐనన్ – పగటైనన్ – ఉత్వసంధి
దూఱు + ఎక్కుట – దూరెక్కుట – ఉత్వసంధి
అయిదు + ఊళ్ళు – అయిదూళ్ళు – ఉత్వసంధి
దోషము + అందుట – దోషమందుట – ఉత్వసంధి
పాము + ఉన్న – పామున్న – ఉత్వసంధి
ఉన్న + అట్లు – ఉన్నట్లు – అత్వసంధి
సత్ + జనులు – సజ్జనులు – శ్చుత్వసంధి
సుహృత్ + జనంబులు – సుహృజనంబులు – శ్చుత్వసంధి

6. సమాసాలు :

అన్నదమ్ములు – అన్నయును, తమ్ముడుయును – ద్వంద్వ సమాసం
ఐదు గ్రామాలు – ఐదు అను సంఖ్యగల గ్రామాలు – ద్విగు సమాసం
రాజ్యసంపద – రాజ్య మనెడి సంపద – రూపక సమాసం
బంధుమిత్రులు – బంధువులు మరియు మిత్రులు – ద్వంద్వ సమాసం
గొప్ప సాహసం – గొప్పదైన సాహసం – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
వంశనాశనం – వంశము యొక్క నాశనం – షష్ఠీ తత్పురుష సమాసం
నీతివర్తనం – నీతితో కూడిన వర్తనం – తృతీయా తత్పురుష సమాసం
సజ్జనులు – మంచివారైన జనులు – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
భూపతులు – భూమికి పతులు – షష్ఠీ తత్పురుష సమాసం
కౌరవపాండవులు – కౌరవులు, పాండవులు – ద్వంద్వ సమాసం

7. గణాలు :
AP Board 9th Class Telugu Important Questions Chapter 1 శాంతికాంక్ష 1
పద్య లక్షణాన్ని తెలిపేది ఛందస్సు. పద్యపాదం ఏ ఛందస్సుకు చెందినదో తెలియడానికి గురులఘువులతో గుర్తిస్తాము. గురువు – U, లఘువు – 1.

గురువు :
దీర్ఘాక్షరాలన్నీ గురువులు. సున్న (0) విసర్గలతో (8) కూడిన అక్షరాలు (కం, కఃమొ||) గురువులు, పొల్లుహల్లుతో కూడినవి (నన్,లన్) గురువులు. సంయుక్త, ద్విత్వాక్షరాలకు ముందున్నవి గురువులు. ఐ, ఔలతో కూడినవి కై, కౌ మొ||) గురువులు.

లఘువు :
గురువు కానిది లఘువు.

8. అలంకారాలు :

“మమ్మెఱుఁగు, దెదిరి నెఱుఁగుదు నెమ్మి యెఱుఁగుదు’. ఈ వాక్యమును ‘జ,గ,ద’ అను హల్లులు మరల మరల ఆవృతమైనవి. ఇది వృత్త్యనుప్రాస.

9th Class Telugu 1st Lesson శాంతికాంక్ష 1 Mark Bits

1. ధరిత్రి పుత్రిక సీత – (గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి) (SA. I – 2018-19)
ఎ) అవని – ఆవని
బి) ధరణి – ధర
సి) భూమి – భారం
డి) నింగి – నేల
జవాబు:
బి) ధరణి – ధర

2. సూర్యుడు ఉదయించగానే స్నేహితుడు మా ఇంటికి వచ్చాడు. (గీత గీసిన పదాలకు నానార్థపదం గుర్తించండి) (S.A. I – 2018-19)
ఎ) భానుడు
బి) భాస్కరుడు
సి) మిత్రుడు
డి) చెలికాడు
జవాబు:
సి) మిత్రుడు

AP Board 9th Class Telugu Important Questions Chapter 1 శాంతికాంక్ష

3. పగయడగించు కొని యుండుట చాలా మంచిది – (గీత గీసిన పదానికి సంధి పేరు గుర్తించండి) (S.A. I – 2018-19)
ఎ) యణాదేశ సంధి
బి) అత్వ సంధి
సి) ఉత్వ సంధి
డి) యడాగమ సంధి
జవాబు:
డి) యడాగమ సంధి

4. నా దేశం పుణ్యభూమి గా పేరొందినది – (గీతగీసిన పదానికి సమాసం గుర్తించండి) (S.A. I – 2018-19)
ఎ) ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం
బి) విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
సి) విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం
డి) ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసం
జవాబు:
బి) విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం

5. మ, స, జ, స, త, త, గ అనే గణాలు గల పద్య మేది? (S.A. I – 2018-19 S.A. III – 2016-17)
ఎ) మత్తేభం
బి) ఉత్పలమాల
సి) చంపకమాల
డి) శార్దూలం
జవాబు:
డి) శార్దూలం

6. 11వ అక్షరం యతిస్థానంగా గల పద్యం (S.A. I – 2018-19)
ఎ) ఉత్పలమాల
బి) చంపకమాల
సి) తేటగీతి
డి) మత్తేభం
జవాబు:
బి) చంపకమాల

7. వాగ్దేవిని ఆరాధించడం నా అభిమతం – (గీత గీసిన పదానికి గణం గుర్తించండి) / (S.A. I – 2018-19)
ఎ) మ గణం
బి) స గణం
సి) త గణం
డి) భ గణం
జవాబు:
సి) త గణం

8. శ్రీకృష్ణా ! నీవే మాకు దిక్కు (గీత గీసిన పదం ఏ గణమో గుర్తించండి) (S.A. II – 2018-19)
ఎ) ర
బి) త
సి) మ
డి) య
జవాబు:
సి) మ

9. శార్దూల పద్యం యతి స్థానం గుర్తించండి. (S.A. II – 2018-19)
ఎ) 11వ అక్షరం
బి) 10వ అక్షరం
సి) 13వ అక్షరం
డి) 12వ అక్షరం
జవాబు:
సి) 13వ అక్షరం

10. త్రిపురసుందరి కడవతో వడి వడి గ తడబడని అడుగులతో గడపను దాటింది – ఏ అలంకారం? (S.A. II – 2018-19)
ఎ) వృత్యానుప్రాస
బి) అంత్యానుప్రాస
సి) లాటానుప్రాస
డి) ఛేకానుప్రాస
జవాబు:
ఎ) వృత్యానుప్రాస

AP Board 9th Class Telugu Important Questions Chapter 1 శాంతికాంక్ష

11. కావున శాంతి బొందుటయ కర్జము దానది యట్టులుండె శ్రీ – నందలి ఛందస్సు గుర్తించండి. (S.A. II – 2017-18)
ఎ) మత్తేభం
బి) శార్దూలం
సి) చంపకమాల
డి) ఉత్పలమాల
జవాబు:
డి) ఉత్పలమాల

12. త్రిపుర సుందరి దయామయ హృదయం గలది – (గీత గీసిన పదానికి గణం గుర్తించండి) (S.A. II – 2017-18)
ఎ) న
బి) భ
సి) స
డి) య
జవాబు:
ఎ) న

13. ఉపమాలంకార లక్షణం గుర్తించండి. (S.A. II – 2017-18)
ఎ) ఉపమానమునందు ఉపమానధర్మం ఆరోపించడం
బి) ఉపమాన ఉపమేయాలకు అభేదం చెప్పడం
సి) ఉపమాన ఉపమేయాలకు భేదం చెప్పడం
డి) ఉపమాన ఉపమేయాలకు మనోహరమైన సాదృశ్యం చెప్పడం
జవాబు:
డి) ఉపమాన ఉపమేయాలకు మనోహరమైన సాదృశ్యం చెప్పడం

14. కింది వానిలో ఛేకానుప్రాసాలంకారమును గుర్తించండి. (S.A. III – 2016-17)
ఎ) పేదలకు చేయు సేవ
బి) చక్కని చుక్క మా అక్క
సి) భారతములో యుక్తి, భాగవతమున భక్తి, రామకథయే రక్తి
డి) నీకు వంద వందనాలు
జవాబు:
డి) నీకు వంద వందనాలు

15. పగవాడిచేత స్నేహం చెడగొట్టబడుతుంది. (ఈ కర్మణి వాక్యానికి కర్తరి వాక్యాన్ని గుర్తించండి.) (S.A. III – 2016-17)
ఎ) పగవానిచే స్నేహం చెడగొట్టును.
బి) పగవాని వలన స్నేహం చెడదు.
సి) స్నేహం చేత పగవాడు చెడగొట్టబడతాడు.
డి) పగవాడు స్నేహాన్ని చెడగొడతాడు.
జవాబు:
డి) పగవాడు స్నేహాన్ని చెడగొడతాడు.

భాషాంశాలు (పదజాలం, వ్యాకరణం)

1. అర్థాలు :

16. శత్రుత్వము ఏర్పడితే సర్పము ఉన్న ఇంటిలో ఉన్నట్లే – గీత గీసిన పదానికి సరైన అర్థాన్ని గుర్తించండి.
A) విరోధి
B) పులి
C) పాము
D) దయ్యం
జవాబు:
C) పాము

17. యుద్ధం వల్ల కుల క్షయం కలుగుతుంది – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
A) వృద్ధి
B) నాశనం
C) సమం
D) ఎదుగుదల
జవాబు:
B) నాశనం

18. సజ్జనుల మనస్సులకు తగినట్లుగా మాట్లాడాలి – గీత గీసిన పదానికి సరైన అర్థాన్ని గుర్తించండి.
A) మంచివారు
B) పిల్లలు
C) స్త్రీలు
D) చెడ్డవారు
జవాబు:
A) మంచివారు

19. నీకు బుద్ధులు చెప్పడానికి నేనే మాత్రం వాడిని? – గీత గీసిన పదానికి సరైన అర్థాన్ని గుర్తించండి.
A) చాడీలు
B) పొగడ్తలు
C) ఆజ్ఞలు
D) ఉపాయాలు
జవాబు:
D) ఉపాయాలు

20. మా మనము నిశ్చింతగా చేయుము – గీత గీసిన పదానికి సరైన అర్థాన్ని గుర్తించండి.
A) అందరం
B) మనస్సు
C) మీరు
D) మేము
జవాబు:
B) మనస్సు

21. దేవుని దయవల మాకు ఏ విధమైన పొచ్చెమును లేదు – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
A) అపకీర్తి
B) కొఱత
C) చెడు
D) చెడ్డపేరు
జవాబు:
B) కొఱత

AP Board 9th Class Telugu Important Questions Chapter 1 శాంతికాంక్ష

22. శ్రీకృష్ణుడు అన్ని విషయాలు ఎఱుక గలవాడు – గీత గీసిన పదానికి అర్థమును గుర్తించండి.
A) తెలివి
B) జ్ఞాపకము
C) గుర్తు
D) ప్రీతి
జవాబు:
B) జ్ఞాపకము

2. పర్యాయపదాలు :

23. యుద్ధం వల్ల సంపద నశిస్తుంది – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
A) సిరి, గిరి
B) సొమ్ము, పొమ్ము
C) సిరి, సొమ్ము
D ) శ్రీ, వరి
జవాబు:
C) సిరి, సొమ్ము

24. మాకు శుభము కలుగునట్లు చేయుము – గీత గీసిన పదానికి సరైన అర్థాన్ని గుర్తించండి.
A) మేలు, కీడు
B) క్షేమం, మేలు
C) మంచి, చెడు
D) మంచి, మర్యాద
జవాబు:
B) క్షేమం, మేలు

25. ధృతరాష్ట్రుని కుమారుడు సుయోధనుడు – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
A) పుత్రుడు, అల్లుడు
B) సుతుడు, తమ్ముడు
C) కొడుకు, తనూజుడు
D) అన్న, కొడుకు
జవాబు:
C) కొడుకు, తనూజుడు

26. మనిషి ఎదిగే కొద్ది శత్రువులు తగ్గాలి – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
A) పగలు, వైరులు
B) విరోధులు, మిత్రులు
C) స్నేహితులు, వైరులు
D) విరోధులు, హితులు
జవాబు:
A) పగలు, వైరులు

27. ధర్మానికి రాజు ధర్మరాజు – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
A) భూభర్త, భూపతి
B) లేడు, చంద్రుడు
C) ఇంద్రుడు, ప్రభువు
D) భటుడు, సైనికుడు
జవాబు:
A) భూభర్త, భూపతి

28. ‘మిత్రుల మధ్య పోరితము అనర్థాలకు మూలము’ – గీత గీసిన పదానికి సమానార్థక పదం గుర్తించండి.
A) వంశనాశనము
B) ద్వేషము
C) ఈర్ష్య
D) యుద్ధము
జవాబు:
D) యుద్ధము

29. శ్రీకృష్ణుడు నెమ్మిపింఛం ధరిస్తాడు – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
A) ప్రేమ, కోరిక
B) నెమలి, మయూరం
C) విరోధం, కలహము
D) హంస, నెమలి
జవాబు:
B) నెమలి, మయూరం

30. ‘విరోధులతో పోరితము లేకుండా పొందు కలిగించు’ – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
A) తగవు, దెబ్బలాట
B) సమరం, సంగ్రామం
C) సంధి, తగవు
D) కయ్యం, నెయ్యం
జవాబు:
B) సమరం, సంగ్రామం

31. కర్ణుడు, దుర్యోధనునకు మంచి మిత్రుడు – గీత గీసిన పదానికి పర్యాయపదాలు ఏవి?
A) స్నేహితుడు, నేస్తము
B) హితుడు, అహితుడు
C) అరి, విరోధి
D) సూర్యుడు, ఆప్తుడు
జవాబు:
A) స్నేహితుడు, నేస్తము

3. వ్యుత్పత్యర్థాలు :

32. కురువంశానికి చెందినవారు – అనే వ్యుత్పత్తి గల పదం ఏది?
A) పాండవులు
B) కౌరవులు
C) కుమారులు
D) కొమరులు
జవాబు:
A) పాండవులు

33. పాండురాజు కుమారులు – అనే వ్యుతుతి గల పదం ఏది?
A) పాండాలు
B) పాండురులు
C) పాండవులు
D) కౌంతేయులు
జవాబు:
C) పాండవులు

34. సుఖముగా యుద్ధం చేయ వీలుపడనివాడు – అనే వ్యుత్పత్తి గల పదం ఏది?
A) ధర్మరాజు
B) అర్జునుడు
C) కర్ణుడు
D) దుర్యోధనుడు
జవాబు:
D) దుర్యోధనుడు

35. రక్త సంబంధముచే బంధించువాడు – అనే వ్యుత్పత్తి గల పదం ఏది?
A) బంధువు
B) మిత్రుడు
C) శత్రువు
D) పొరుగువాడు
జవాబు:
A) బంధువు

36. నలుపు వర్ణం కలవాడు — అనే వ్యుత్పత్తి గల పదం ఏది?
A) శివుడు
B) కృష్ణుడు
C) ఇంద్రుడు
D) చంద్రుడు
జవాబు:
B) కృష్ణుడు

AP Board 9th Class Telugu Important Questions Chapter 1 శాంతికాంక్ష

37. విష్ణువును ఆశ్రయించునది – అనే వ్యుత్పత్తి గల పదం ఏది?
A) సంపద
B) భక్తి
C) శ్రీ
D) మనసు
జవాబు:
C) శ్రీ

38. సత్యం, అహింస మున్నగు ధర్మాలకు రాజు – అనే వ్యుత్పత్తి గల పదం ఏది?
A) ధర్మరాజు
B) రారాజు
C) యువరాజు
D) మహారాజు
జవాబు:
A) ధర్మరాజు

39. సర్వ భూతములందు స్నేహయుక్తుడు – అనే వ్యుత్పత్తి గల పదం ఏది?
A) మనిషి
B) పక్షి
C) సన్నిహితుడు
D) మిత్రుడు
జవాబు:
D) మిత్రుడు

40. ‘జనార్దనుడు’ శబ్దానికి వ్యుత్పత్త్యర్థ పదం గుర్తించండి.
A) జనులను అర్థించేవాడు
B) జనులచే పురుషార్థములకై కోరబడువాడు
C) జనులకు శత్రువు
D) జనాలను బాధించేవాడు
జవాబు:
B) జనులచే పురుషార్థములకై కోరబడువాడు

41. సులువుగా యుద్ధం చేయడానికి శక్యం కాని వాడు – అనే వ్యుత్పత్తి గల పదం ఏది?
A) దుర్యోధనుడు
B) సుయోధనుడు
C) కౌరవుడు
D) కితవుడు
జవాబు:
A) దుర్యోధనుడు

4. నానార్థాలు :

42. పుస్తకమే మనకు మంచి మిత్రుడు – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
A) హితుడు, సూర్యుడు
B) చంద్రుడు, మిత్రుడు
C) రాజు, తెలివి
D) బుద్ధి, ఆలోచన
జవాబు:
A) హితుడు, సూర్యుడు

43. శ్రీకృష్ణుడు జగన్నాటక సూత్రధారి – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
A) విష్ణువు, శివుడు
B) విష్ణువు, వ్యాసుడు
C) అర్జునుడు, భీముడు
D) వాసుదేవుడు, ధర్మరాజు
జవాబు:
B) విష్ణువు, వ్యాసుడు

44. బావిలో నీరు ఊరుచున్నది – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
A) వృద్ధి, తగ్గు
B) గ్రామం, సమం
C) వృద్ధి, గ్రామం
D) ద్రవం పైకి వచ్చు, లోనికిపోవు
జవాబు:
C) వృద్ధి, గ్రామం

45. ద్రౌపది తనకు శ్రీకృష్ణుడే దిక్కు అని ప్రార్థించింది – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
A) ఆధారం, రక్షణ
B) దిశ, బంధువు
C) దిశ, శరణు
D) రక్షకుడు, బంధువు
జవాబు:
C) దిశ, శరణు

46. కృష్ణా ! నీకు నెమ్మి తెలుసు – గీత గీసిన పదానికి నానార్థాలు ఏవి?
A) ప్రేమ, సర్వము
B) ప్రేమ, నెమలి
C) రహస్యము, రక్షణ
D) విరోధి , పగ
జవాబు:
B) ప్రేమ, నెమలి

47. నీవు నా పక్షములో ఉండి నన్ను కాపాడాలి – గీత గీసిన పదానికి నానార్థాలు ఏవి?
A) ప్రక్క, టెక్క
B) 15 రోజులు, దిక్కు
C) వైపు, ఆశ్రయము
D) ఎదుట, ముందు
జవాబు:
A) ప్రక్క, టెక్క

48. నీవు తప్పక సమయమునకు రావాలి – గీత గీసిన పదానికి నానార్థాలు ఏవి?
A) కాలము, శపథము
B) మాట, చెల్లుబడి
C) అదును, వీలు
D) వేళ, యుక్తము ఇతూ
జవాబు:
A) కాలము, శపథము

5. ప్రకృతి – వికృతులు :

49. కాంక్ష నిస్వార్థంగా ఉండాలి – గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.
A) కాంచ
B) కంచ
C) కచ్చు
D) కచు
జవాబు:
C) కచ్చు

50. దమ్మము తప్పి నడువకూడదు – గీత గీసిన పదానికి ప్రకృతి పదం గుర్తించండి.
A) దమం
B) ధర్మం
C) ధరమం
D) ధైర్యం
జవాబు:
B) ధర్మం

AP Board 9th Class Telugu Important Questions Chapter 1 శాంతికాంక్ష

51. సంపదలున్నప్పుడే బంధువులు వస్తారు – గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.
A) చుట్టం
B) నేస్తం
C) బందు
D) బందుగు
జవాబు:
D) బందుగు

52. శ్రీలు పొంగు పల్లెలందు – గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.
A) సిరి
B) శిరి
C) స్త్రీ
D) స్రీ
జవాబు:
A) సిరి

53. గ్రాస వాసాదులకై ప్రతి ఒక్కరు పోటీపడుతారు – గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.
A) ఆహారం
B) గాసం
C) గాసు
D) అన్నం
జవాబు:
B) గాసం

54. దిక్ అంతాలకు కీర్తి వ్యాపించాలి – గీత గీసిన పదానికి వికృతిపదం గుర్తించండి.
A) దిగు
B) దేస
C) వైపు
D) శరణు
జవాబు:
B) దేస

55. సాధనమున కర్జములు సమకూరు ధరలోన – గీత గీసిన పదానికి ప్రకృతి పదం గుర్తించండి.
A) కార్జం
B) కర్య
C) కార్యం
D) కర్మ
జవాబు:
C) కార్యం

56. బుద్ధి లేనివారే తెలివితక్కువవారు – గీత గీసిన పదానికి ప్రకృతి పదం గుర్తించండి.
A) బుది
B) బుద్ధి
C) ఒద్ధి
D) బుద్ధి
జవాబు:
D) బుద్ధి

57. భూలోకంలో ప్రాణికోటి మనుగడ సాగిస్తోంది – గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.
A) బువి
B) బూ
C) బూవి
D) బూమి
జవాబు:
A) బువి

6. సంధులు :

58. ఉతునకు సంధి నిత్యము – ఇది ఏ సంధి సూత్రం?
A) నుగాగమసంధి
B) టుగాగమ సంధి
C) అత్వసంధి
D) ఉత్వసంధి
జవాబు:
D) ఉత్వసంధి

59. ‘సమయమిది’ – విడదీయండి.
A) సమయ + ఇది
B) సమయము + ఇది
C) సమయం + ఇది
D) సమ + మిది
జవాబు:
B) సమయము + ఇది

60. ‘అయిదు + ఊళ్ళు’ – సంధి చేయండి.
A) అయిదు యూళ్ళు
B) అయిదు నూళ్ళు
C) అయిదూళ్ళు
D) ఐదూళ్ళు
జవాబు:
C) అయిదూళ్ళు

AP Board 9th Class Telugu Important Questions Chapter 1 శాంతికాంక్ష

61. ఉత్వసంధికి ఉదాహరణను గుర్తించండి.
A) పామున్న
B) ఏమేమి
C) రాలేను
D) గురూపదేశం
జవాబు:
A) పామున్న

62. ‘ఉన్నట్లు’ – సంధి పేరేమిటి?
A) ఇత్వ సంధి
B) ఉత్వసంధి
C) ఉకారసంధి
D) అత్వసంధి
జవాబు:
D) అత్వసంధి

63. ‘సత్ + జనులు’ – కలిపి రాయండి.
A) సద్దనులు
B) సర్జనులు
C) సజ్జనులు
D) సర్టనులు
జవాబు:
C) సజ్జనులు

64. ‘సుహృజ్జనంబులు’ – సంధి పేరేమిటి?
A) జస్వసంధి
B) శ్చుత్వసంధి
C) లు,ల,న ల సంధి
D) గసడదవాదేశ సంధి
జవాబు:
B) శ్చుత్వసంధి

65. ‘అయిదూళ్ళు’ పదములోని సంధిని విడదీయండి.
A) అయి + దూళ్ళు
B) అయిదు + ఊళ్ళు
C) అయిదూ + ఊళ్ళు
D) అయిదు + ఉళ్ళు
జవాబు:
B) అయిదు + ఊళ్ళు

66. ‘తెంపుసేయు’ ఈ సంధి పదంలో గల సంధి ఏది?
A) సరళాదేశ సంధి
B) యడాగమ సంధి
C) గసడదవాదేశ సంధి
D) రుగాగమ సంధి
జవాబు:
C) గసడదవాదేశ సంధి

7. సమాసాలు:

67. అన్నదమ్ములంటే రామలక్ష్మణులే – గీత గీసిన పదం యొక్క సమాసం పేరేమిటి?
A) ద్విగువు
B) ద్వంద్వ
C) రూపకం
D) బహుబ్లిహి
జవాబు:
B) ద్వంద్వ

68. పాండవులు ఐదూళ్ళెనా ఇమ్మని అడిగారు – సమాసం పేరు ఏమిటి?
A) ద్వంద్వ
B) రూపకం
C) ద్విగువు
D) షష్ఠీ తత్పురుషం
జవాబు:
C) ద్విగువు

69. రూపక సమాసానికి ఉదాహరణ రాయండి.
A) సజ్జనులు
B) భూపతులు
C) రాజ్యసంపద
D) నీతివర్తనం
జవాబు:
C) రాజ్యసంపద

AP Board 9th Class Telugu Important Questions Chapter 1 శాంతికాంక్ష

70. ‘మంచివారైన జనులు’ – సమాసం చేయండి.
A) సజ్జనులు
B) మంచివాళ్ళు
C) మంచి ప్రజలు
D) దుర్జనులు
జవాబు:
A) సజ్జనులు

71. ‘నీతితో కూడిన వర్తనం’ – సమాసం పేరేమిటి?
A) చతుర్దీ తత్పురుషం
B) రూపకం
C) షష్ఠీ తత్పురుషం
D) తృతీయా తత్పురుషం
జవాబు:
D) తృతీయా తత్పురుషం

72. ‘కౌరవపాండవులు’ – సమాసం పేరేమిటి?
A) ద్విగువు
B) ద్వంద్వ
C) షష్ఠీ తత్పురుషం
D) రూపకం
జవాబు:
B) ద్వంద్వ

73. ‘తమ్ముకుఱ్ఱలు’ – సమాసానికి విగ్రహవాక్యం ఏది?
A) తమ్ముళ్ళు కుఱ్ఱలు
B) కుఱ్ఱవారైన తమ్ముళ్ళు
C) మసజసతతగ
D) సభరనమయవ
జవాబు:
B) కుఱ్ఱవారైన తమ్ముళ్ళు

74. ‘మామిడి గున్న’ అనేది ఏ సమాసం?
A) విశేషణ పూర్వపద కర్మధారయము
B) ఉపమాన పూర్వపద కర్మదారయం
C) విశేషణ ఉత్తరపద కర్మధారయం
D) బహుప్రీహి సమాసం
జవాబు:
C) విశేషణ ఉత్తరపద కర్మధారయం

75. ‘పుణ్యమైన భూమి’ – దీన్ని సమాసపదంగా కూర్చండి.
A) పుణ్యభూమి
B) భూమి పుణ్యం
C) పుణ్యపు భూమి
D) పుణ్యాల భూమి
జవాబు:
A) పుణ్యభూమి

8. గణాలు :

76. ‘పక్షము’ అనేది ఏ గణం?
A) న గణం
B) స గణం
C) భ గణం
D) మ గణం
జవాబు:
C) భ గణం

77. ‘జ్ఞానం’ గురులఘువులు గుర్తించండి.
A) UI
B) UU
C) IU
D) ILL
జవాబు:
B) UU

78. ‘న, జ, భ, జ, జ, జ, ర’ అను గణాలుండు పద్య మేది?
A) చంపకమాల
B) ఉత్పలమాల
C) కందం
D) సీసం
జవాబు:
A) చంపకమాల

79. ‘UTU’ దీనిని బట్టి మాటను గుర్తించండి.
A) కాలము
B) శుభంబు
C) చుట్టాలు
D) కేశవా
జవాబు:
D) కేశవా

80. ‘ఏ గతినైనఁ జక్కబడు టెంతయు నొప్పుజుమీ జనార్దనా’ – ఈ పద్యపాదము ఏ వృత్తములోనిది?
A) చంపకమాల
B) మత్తేభము
C) తేటగీతి
D) ఉత్పలమాల
జవాబు:
D) ఉత్పలమాల

AP Board 9th Class Telugu Important Questions Chapter 1 శాంతికాంక్ష

81. చంపకమాల వృత్తములో ఉండే గణాలు ఏవి?
A) భరనభభరవ
B) నజభజజజర
C) తమ్ముళ్ళైన కుఱ్ఱలు
D) తమ్ములును, కుఱ్ఱలును
జవాబు:
B) నజభజజజర

82. ‘ఆదుర్యో’ పదం ఏ గణానికి చెందింది?
A) మ గణము
B) త గణము
C) ర గణం
D) స గణం
జవాబు:
A) మ గణము

9. అలంకారాలు :

83. ఉపమాన, ఉపమేయాలకు చక్కని పోలిక చెప్పుట – ఇది ఏ అలంకారం?
A) ఉపమాలంకారం
B) ఉత్ప్రేక్ష
C) రూపకం
D) అతిశయోక్తి
జవాబు:
A) ఉపమాలంకారం

84. “మమ్మెఱుఁగు, దెదిరి నెఱుఁగుదు నెమ్మి యెఱుఁగుదు” – ఇది ఏ అలంకారం?
A) లాటానుప్రాస
B) వృత్త్యనుప్రాస
C) రూపకం
D) అతిశయోక్తి
జవాబు:
B) వృత్త్యనుప్రాస

85. ‘పగయ కలిగెనేని పామున్న యింటిలో నున్న యట్లు’ఈ వాక్యంలో గల అలంకారమేది?
A) రూపకాలంకారము
B) స్వభావోక్తి
C) ఉపమాలంకారము
D) శ్లేషాలంకారము
జవాబు:
C) ఉపమాలంకారము

86. వాక్యాలకు బింబ ప్రతిబింబత్వం ఉంటే అది ఈ అలంకారం
A) ఉపమాలంకారం
B) స్వభావోక్తి
C) దృష్టాంతము
D) శ్లేష
జవాబు:
C) దృష్టాంతము

10. ఆధునిక వచనాన్ని గుర్తించడం :

87. లాతులైనఁ బగజైనను జంపన కోరనేల? – ఈ వాక్యానికి ఆధునిక వచనం గుర్తించండి.
A) పరాయివారైనా, విరోధులైనా చంపాలనే ఎందుకు కోరాలి?
B) పరులు, విరోధులు ఎందుకు చావాలి?
C) పరులు, విరోధులు ఎందుకు చంపాలి?
D) పరులైనా విరోధులను చంపాలి
జవాబు:
A) పరాయివారైనా, విరోధులైనా చంపాలనే ఎందుకు కోరాలి?

88. పగయ కలిగెనేనిఁ బామున్న యింటిలో నున్న యట్ల కాక ! – ఈ వాక్యానికి ఆధునిక వచనం గుర్తించండి.
A) పగ లేకపోతే పామున్న ఇంటిలో ఉన్నట్లే.
B) పగే కలిగితే పామున్న ఇంటిలో ఉన్నట్లే.
C) పగ ఉంటే పామున్న ఇంట్లో లేనట్టే.
D) పగ కదా పాముతో ఇంట్లో ఉన్నట్లుంటుంది.
జవాబు:
B) పగే కలిగితే పామున్న ఇంటిలో ఉన్నట్లే.

89. ‘వలవదధిక దీర్ఘ వైరవృత్తి’ – ఈ వాక్యానికి ఆధునిక
A) ఎక్కువగా దీర్ఘ వైరం పనికి రాదు
B) దీర్ఘ విరోధం వద్దు
C) వద్దు దీర్ఘ క్రోధం
D) వైరం మంచిది కాదు
జవాబు:
A) ఎక్కువగా దీర్ఘ వైరం పనికి రాదు

AP Board 9th Class Telugu Important Questions Chapter 1 శాంతికాంక్ష

11. కర్తరి, కర్మణి వాక్యాలను గుర్తించడం :

90. క్రియచే కర్త చెప్పబడిన అది కర్తరి ప్రయోగం దీనికి ఉదాహరణ గుర్తించండి.
A) రామునిచే రావణుడు చంపబడ్డాడు.
B) రాముడే రావణుని చంపాడు.
C) రాముడు రావణుని చంపెను.
D) రాముడు చంపాడు రావణుని.
జవాబు:
C) రాముడు రావణుని చంపెను.

12. వ్యతిరేకార్థక వాక్యాన్ని గుర్తించడం :

91. మా వంతు రాజ్యాన్ని మేము అనుభవిస్తాము – వ్యతిరేక వాక్యం గుర్తించండి.
A) మా వంతు రాజ్యాన్ని మేము అనుభవించము.
B) మా వంతు రాజ్యాన్ని వాళ్ళు అనుభవిస్తారు.
C) వాళ్ళవంతు రాజ్యాన్ని ఎవరో అనుభవిస్తారు.
D) మా వంతు రాజ్యాన్ని మేము అనుభవించాలా !
జవాబు:
A) మా వంతు రాజ్యాన్ని మేము అనుభవించము.

92. పగతో పగ సమసిపోదు – వ్యతిరేక వాక్యం గుర్తించండి.
A) పగతో పగ పెరుగుతుంది
B) పగతో పగ సమసిపోతుంది
C) పగతో పగ సమసిపోదా
D) పగతో పగ సమస్యే
జవాబు:
B) పగతో పగ సమసిపోతుంది

13. వాక్యరకాలను గుర్తించడం :

93. పరాయివారైనా, విరోధులైనా చంపాలనే ఎందుకు కోరాలి? – ఇది ఏ రకమైన వాక్యం?
A) నిషేధార్థకం
B) ఆశ్చర్యార్థకం
C) ప్రశ్నార్థకం
D) అనుమత్యర్థకం
జవాబు:
C) ప్రశ్నార్థకం

94. హస్తినాపురానికి వెళ్ళిరా – ఇది ఏ రకమైన వాక్యం?
A) ప్రార్థనాద్యర్థకం
B) ప్రేరణార్థకం
C) సామర్థ్యార్థకం
D) ఆశ్చర్యార్థకం
జవాబు:
A) ప్రార్థనాద్యర్థకం

95. చెప్పవలసినవి చెప్పి, నీదే భారం అన్నాడు – ఇది ఏ రకమైన వాక్యం?
A) సంయుక్త వాక్యం
B) సంక్లిష్ట వాక్యం
C) సామాన్య వాక్యం
D) మహావాక్యం
జవాబు:
B) సంక్లిష్ట వాక్యం

96. వానరులచే సేతువు కట్టబడెను – ఇది ఏ రకమైన వాక్యం?
A) కర్మణి
B) కర్తరి
C) సంయుక్త
D) సంక్లిష్ట
జవాబు:
A) కర్మణి

AP Board 9th Class Telugu Important Questions Chapter 1 శాంతికాంక్ష

14. ప్రక్రియలను గుర్తించడం :

97. పాండురాజు కుమారులు పాండవులు – ఇది ఏ ప్రక్రియకు చెందినదో గుర్తించండి.
A) ఆప్యత్యార్థకం
B) నిశ్చయార్థకం
C) ప్రశ్నార్థకం
D) క్త్యార్థకం
జవాబు:
A) ఆప్యత్యార్థకం

98. సంపద కావాలని యుద్ధం వద్దని కోరుతున్నాం – ఇది ఏ ప్రక్రియకు చెందినదో గుర్తించండి.
A) ప్రశ్నార్థకం
B) ప్రార్థనాద్యర్థకం
C) చేదర్థకం
D) నిషేధార్థకం
జవాబు:
B) ప్రార్థనాద్యర్థకం

99. “వర్తమాన కాలంలోని అసమాపక క్రియ”ను ఏమంటారు? – ఇది ఏ ప్రక్రియకు చెందినదో గుర్తించండి. (S.A. III – 2016-17)
A) క్యార్థకం
B) చేదర్థకం
C) శత్రర్థకం
D) ప్రశ్నార్థకం
జవాబు:
C) శత్రర్థకం

AP Board 8th Class Telugu Solutions Chapter 5 ప్రతిజ్ఞ

AP State Syllabus AP Board 8th Class Telugu Textbook Solutions Chapter 5 ప్రతిజ్ఞ Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Telugu Solutions 5th Lesson ప్రతిజ్ఞ

8th Class Telugu 5th Lesson ప్రతిజ్ఞ Textbook Questions and Answers

చదవండి – ఆలోచించండి – చెప్పండి
AP Board 8th Class Telugu Solutions Chapter 5 ప్రతిజ్ఞ 1

ప్రశ్న 1.
పై చిత్రంలో ఎవరెవరు ఏం చేస్తున్నారో చెప్పండి.
జవాబు:
పై చిత్రంలో కుమ్మరివాడు కుండలను తయారుచేస్తున్నాడు. కమ్మరి కొలిమిలో ఇనుప పనిముట్లు తయారుచేస్తున్నాడు. రైతు ఎద్దులతో పొలం దున్నుతున్నాడు. చేనేత కార్మికుడు మగ్గం నేస్తున్నాడు. ఒకామె కడవతో నీరు పట్టుకెడుతోంది. మరొకామె గంపతో సరుకులు తీసుకువెడుతోంది. పాలేరు గడ్డిమోపు మోస్తున్నాడు. కార్మికులు మరమ్మతుపని చేస్తున్నారు. జాలరి చెరువులో వల విసురుతున్నాడు.

ప్రశ్న 2.
ఆహారోత్పత్తి వెనుక ఉన్న కష్టాన్ని గురించి చెప్పండి.
జవాబు:
పంటలు పండించాలంటే, రైతులు ఎంతో కష్టపడాలి. ముందుగా పొలాల్ని నాగలితో దున్నాలి. చేనుకు నీరు పెట్టాలి. నారుమడి వేయాలి. నారును పెంచాలి. నారు తీసి పొలంలో నాటాలి. నీరు పెట్టాలి. కలుపు తీయాలి. పురుగు మందులు కొట్టాలి. ఎరువులు వేయాలి. చేను కోయాలి. ఆరబెట్టాలి. ధాన్యాన్ని నూర్చాలి. ధాన్యం ఎగురపోయాలి. సంచులలో ధాన్యం పోసి అమ్మాలి. దాన్ని మరల ద్వారా ఆడించాలి. ఇంత చేస్తే కాని బియ్యం, గోధుమ పిండి వంటివి మనకు లభించవు.

AP Board 8th Class Telugu Solutions Chapter 5 ప్రతిజ్ఞ

ప్రశ్న 3.
మనం వాడే ప్రతి వస్తువు తయారీ వెనుక ఉన్న శ్రమను గురించి చెప్పండి.
జవాబు:
మనం అనేక రకాల పనిముట్లు ఉపయోగిస్తాం. వాటి వెనుక ఎందరో కష్టజీవుల శ్రమ ఉంది. కమ్మరి కొలిమిలో ఇనుమును కాల్చి సమ్మెటపై బాది సాగదీసి కత్తి, కొడవలి, గొడ్డలి, గునపం, పార, నాగలి కొట్టు వగైరా తయారుచేస్తాడు. కుమ్మరి కుండలు, వంట పాత్రలు చేస్తాడు. సాలె మగ్గంపై మనకు బట్టలు వేస్తాడు. వడ్రంగి, ఇళ్ళకు గుమ్మాలూ, తలుపులూ వగైరా చేస్తాడు. ఇంకా ఎందరో కార్మికులు కార్యానాలలో, యంత్రాల దగ్గర పనిచేసి మనం వాడుకొనే వస్తువులు తయారుచేస్తున్నారు. ఇలా మనం వాడుకొనే ప్రతి వస్తువు వెనుక కార్మికుల శ్రమ, కష్టం, కృషి ఉంది.

ప్రశ్న 4.
కర్షకుడు, కార్మికుడు లేకపోతే ఏమౌతుందో ఆలోచించి చెప్పండి.
జవాబు:
కర్షకుడు, కార్మికుడు వీరిద్దరూ దేశానికి వెన్నెముకలాంటివారు. కర్షకుడు లేకపోతే మనకు తిండిలేదు. కార్మికుడు లేకపోతే, మనం వాడుకోవడానికి ఏ రకమైన పనిముట్లు, నిత్యావసర వస్తువులు, సైకిళ్ళు, కార్లు, విమానాలు, రైళ్ళు కూడా ఉండవు. ప్రతి వస్తువు వెనుక కార్మికుని కష్టం దాగి ఉంది.

ఇవి చేయండి

I. వినడం – మాట్లాడడం

ప్రశ్న 1.
కార్మికుల, కర్షకుల సౌభాగ్యం అంటే ఏమిటి ? మాట్లాడండి.
జవాబు:
కార్మికులు వారి శ్రమకు తగినట్టుగా ప్రతిఫలాన్ని పొందలేక బాధపడుతున్నారు. కర్షకులు కూడా ఎంతో శ్రమతో, చమటోడ్చి పండించిన పంటలకు తగిన గిట్టుబాటు ధరలు లేక అప్పులపాలవుతున్నాడు.

వీరికి ‘సౌభాగ్యం’ అంటే వారికి చేతినిండా పని ఉండి వారు, వారి భార్యాబిడ్డలతో సుఖంగా జీవించగలగడం. పారిశ్రామిక కార్మికులకు యజమానులు శ్రమకు తగిన జీతాలు ఇవ్వడం, కార్మికుల పిల్లలకు విద్యాసదుపాయాలు కలుగజేయడం, కార్మికులకు వైద్యసదుపాయాలు కలుగజేయడం వంటి వాటిని వారి సౌభాగ్యంగా భావించాలి.

ఇక వ్యవసాయ కార్మికులకు సంవత్సరమంతటా పని ఉండదు. ఆ పని లేని రోజుల్లో కూడా వారి జీవితం సుఖంగా నడిచే ఏర్పాట్లు అనగా ‘పనికి ఆహార పథకం, రోజ్ గార్ పథకం’ వంటివి ఏర్పాటు చేయడం జరగాలి.

ప్రశ్న 2.
‘కర్షకుడు, కార్మికుడు’ చేస్తున్న సేవను గురించి చర్చించండి.
జవాబు:
కర్షకులు, విరామ మెరుగని కష్టజీవులు. మూడువందల అరవై రోజులూ శ్రమించి వ్యవసాయం పనులు చేసి, మనకు ఆహారానికి కావలసిన ఆహార ధాన్యాలను పండిస్తున్నారు. వారు పశువులను మేమే, మనకు కావలసిన పాలను ఉత్పత్తి చేస్తున్నారు. ఇక కార్మికులు, మనకు కావలసిన నిత్యావసర వస్తువుల్నీ వ్యవసాయ పనిముట్లనూ ఉత్పత్తి చేస్తున్నారు. యంత్రాల ద్వారా వస్తువులు తయారవుతున్నా, అక్కడ కార్మికులు లేనిదే యంత్రాలు నడవవు. వస్తువులు ఉత్పత్తి కావు.

కార్మికులు, కర్షకులు తమ పనిని మానివేస్తే, మనకు తిండి ఉండదు. వాడుకోవడానికి వస్తువులు ఉండవు. మన సుఖజీవనానికి వారే ప్రాణాధారం అని గుర్తించాలి. కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, మేదరి, తాపీమేస్త్రీ ఇలా వీరందరూ పని చేయకపోతే ప్రపంచమే స్తంభించిపోతుంది.

AP Board 8th Class Telugu Solutions Chapter 5 ప్రతిజ్ఞ

ప్రశ్న 3.
శ్రీశ్రీ రాసిన కవిత విన్నారు కదా ! ఇలాంటి కవితను ఆయన ఎందుకు రాసి ఉంటారు ? ఊహించి చెప్పండి.
జవాబు:
మానవ సుఖజీవనానికి కార్మికులు, కర్షకులే ప్రాణాధారమని, దేశ సౌభాగ్యం కోసం వారు ఎనలేని సేవలందిస్తున్నారని, సకల వృత్తులకు సమ ప్రాధాన్యం గలదని, శ్రమైక జీవనంలోనే మాధుర్యం నిండి ఉందని తెలపడానికి శ్రీశ్రీ ఈ కవిత రాశాడు. కార్మికులూ, కర్షకులూ మానవ జీవిత గమనానికి అతిముఖ్యులని, వారు సౌఖ్యంగా జీవించేలా చూడవలసిన బాధ్యత ధనిక స్వాములపై ఉందనీ, సమాజంపై ఉందని చెప్పడానికే శ్రీశ్రీ ఈ కవిత రాశాడు. రష్యాలో వచ్చిన కార్మిక విప్లవం ప్రభావంతో, స్పందించిన శ్రీశ్రీ ఈ కవిత రాశాడు.

కేవలం రాజులూ, రాణులూ వారి ప్రేమ పురాణాలూ మాత్రమే కవితా వస్తువులు కావనీ, శరీర కష్టాన్ని తెలిపే గొడ్డలి, రంపం వంటి పనిముట్లు, వాటితో పనిచేసే కర్షక, కార్మికులు కూడా కవితా వస్తువులే అని, చెప్పడానికి అభ్యుదయ భావాలతో శ్రీశ్రీ ఈ కవిత రాశాడు.

II. చదవడం, అవగాహన చేసుకోవడం

1. పాఠం చదవండి. కింది పట్టికను పూరించండి. వృత్తులు

వృత్తులువాడే పనిముట్లు
ఉదా : జాలరిపగ్గం
1. …………………………………………
2. …………………………………………
3. …………………………………………
4. …………………………………………

జవాబు:

వృత్తులువాడే పనిముట్లు
ఉదా : జాలరిపగ్గం
1. సాలెలుమగ్గం
2. కుమ్మరిచక్రం
3. కమ్మరికొలిమి
4. కంసాలిసుత్తి

2. కింది కవితను చదివి, నాలుగు ప్రశ్నలు తయారుచేయండి.
పర్వతం ఎవడికీ వంగి సలాం చేయదు
సముద్రం ఎవడికాళ్ళకిందా మొరగదు
నేనింతా పిడికెడు మట్టే కావచ్చు
కానీ కలమెత్తితే నాకు
ఒక దేశపు జెండాకున్నంత పొగరుంది.
జవాబు:
ప్రశ్నలు:
1) ఎవరికీ వంగి సలాం చేయనిది ఏది?
2) ఎవడి కాళ్ళ కిందా మొరగనిది ఏది?
3) చివరికి నేను ఏమవుతాను?
4) కలమెత్తితే నాకు ఏమవుతుంది?

3. పాఠం చదవండి. పాఠంలో కొన్ని ప్రాసపదాలు ఉన్నాయి. వాటి కింద గీత గీయండి. చదవండి.
ఉదా : పొలాలనన్నీ – హలాలదున్నీ – హేమం పిండగ – సౌఖ్యం నిండగ
జవాబు:
పరిశ్రమించే – బలికావించే
కురిపించాలని – వర్ధిల్లాలని
కళ్యాణానికి – సౌభాగ్యానికి
వినుతించే విరుతించే
ఘర్మజలానికి – ధర్మజలానికి
పరిక్లమిస్తూపరిప్లవిస్తూ
సంధానిస్తూ – సంరావిస్తూ
నవీనగీతికి – నవీనరీతికి

4. కింది ప్రశ్నలకు పాఠం ఆధారంగా సమాధానాలు రాయండి.
అ) రైతు తన జీవితాన్ని ఎందుకు ధారపోస్తున్నాడు?
జవాబు:
రైతు నాగలిని నమ్ముకొన్నవాడు. అతడు పొలాలకు తన జీవితాన్ని ధారపోసి భూమిలో బంగారుపంటలు పండించాలనీ, లోకానికి అంతా సౌఖ్యం నిండుగా ఉండాలనీ, పొలాలను నాగళ్ళతో దున్నుతున్నాడు. విశ్రాంతి లేకుండా శ్రమిస్తున్నాడు. తన బలాన్ని అంతా, నేల తల్లికి ధారపోస్తున్నాడు.

ఆ) శ్రీశ్రీ తన నవ్య కవిత్వాన్ని ఎవరికి సమర్పిస్తానన్నాడు?
జవాబు:
శ్రీశ్రీ తన నవ్య కవిత్వాన్ని, కార్మికుల కల్యాణానికీ, శ్రామికుల సౌభాగ్యానికి సమర్పిస్తానన్నాడు. ముల్లోకాలలో, మూడు కాలాల్లో శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేదని, తెలుపుతానన్నాడు. కష్టజీవులూ, కర్మవీరులూ అయిన కార్మికులకు, నిత్యమంగళం నిర్దేశిస్తానన్నాడు. వారికి స్వస్తి వాక్యములు పలుకుతానన్నాడు. స్వర్ణ వాద్యములు మ్రోగిస్తూ, ఆర్త జీవుల వేదనలే పునాదిగా, భావివేదములు లోకానికి వినిపిస్తానన్నాడు.

ఇ) శ్రీశ్రీ దేనికి ఖరీదు కట్టలేమన్నాడు?
జవాబు:
ఆరుగాలం శ్రమించి తమ బలాన్ని భూమికి ధారపోసే కర్షక వీరుల శరీరంపై ప్రవహించే ఘర్మజలానికి, ఖరీదు కట్టలేమన్నాడు. గనుల్లో, అడవుల్లో, కార్యానాల్లో పనిచేస్తూ, ధనవంతులైన యజమానులకు దాస్యం చేస్తూ, యంత్రాలతో పనిచేసే కార్మికుల కళ్ళల్లో కణ కణ మండే విలాపాగ్నులకూ, గల గలా తొణకే విషాదపు కన్నీళ్లకూ ఖరీదు కట్టలేమన్నాడు.

ఈ) కార్మిక వీరుల కన్నులను కవి ఎలా వర్ణించాడు?
జవాబు:
కార్మిక వీరుల కన్నుల నిండా, కణ కణ మండే విలాపాగ్నులు ఉంటాయనీ, గల గలా ప్రవహించే దుఃఖపు కన్నీళ్ళు ఉంటాయనీ కవి వర్ణించాడు.

ఉ) శ్రీశ్రీ వేటిని పాటలుగా రాస్తానన్నాడు?
జవాబు:
లోకంలో జరిగే అన్యాయాలు, కాల్చే ఆకలి, కూల్చే వేదన, దారిద్ర్యములు, దౌర్జన్యములు, పరిష్కరించే, బహిష్కరించే – దారులు తీస్తాననీ, ఆ విషయాన్ని పాటలుగా రాస్తాననీ శ్రీ శ్రీ అన్నాడు.

III. స్వీయరచన

1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ) కర్షకుల శ్రమను గురించి రాయండి.
జవాబు:
విరామమంటే తెలియని కష్టజీవి కర్షకుడు. నాగలిని నమ్ముకొని బతికేవాడు. పంటపొలాలకే తన జీవితాన్ని ధారపోసి పంటను పండిస్తాడు. చేలు దున్నడం, నీరు పెట్టడం, గట్టు లంకలు కొట్టడం, తొరేలు వేయడం, నారుమళ్ళు పోయడం, నారు తీయడం, ఊడ్చడం, ఎరువులు వేయడం, పంట పండాక కోత కోయడం, మోపులు కట్టడం, ధాన్యం నూర్చడం, ఎగుర పోయడం, బస్తాలకు కట్టడం, బళ్ళపై ఇళ్ళకు చేర్చడం, వాటిని అమ్మడం – ఇలా కర్షకులు నిత్యం ఎంతో శ్రమపడతారు.

ఆ) కార్మికులంటే ఎవరు? వారి జీవన విధానం ఎలా ఉంటుందో ఆలోచించి రాయండి.
జవాబు:
కార్మికులు అంటే చేతివృత్తుల వారు. అలాగే పరిశ్రమలలో యంత్రాల వద్ద పనిచేసే సహాయకులు. ముఖ్యంగా పరిశ్రమలలో పనిచేసే వారు రోజుకు 8 గంటలు పనిచేయాలి. భోజనానికి మాత్రం విరామం ఇస్తారు. వీరు పరిశ్రమల్లో రసాయనిక పదార్థాల గాలులను పీలుస్తూ, పరిశ్రమల ముడిపదార్థాలను యంత్రాల వద్దకు చేరుస్తూ, వాటిని ఎత్తుతూ కష్టపడాలి. సామాన్యంగా వీరికి ఆ వాతావరణం పడక అనారోగ్యం వస్తూ ఉంటుంది.

ఇళ్ళ వద్ద పనిచేసే కమ్మరి, కుమ్మరి, మేదరి వంటి వారు తమకు పని ఉన్నంత సేపూ పని చేస్తారు. తాపీ, వడ్రంగి, ఇనుప పనివారలు రోజుకు ఏడు, ఎనిమిది గంటలు ఎండల్లో నిలబడి పనిచేయాలి.

ఇ) ప్రపంచమంతా భాగ్యంతో ఎప్పుడు వర్ధిల్లుతుంది?
జవాబు:
కర్షకులు, కార్మికులు సుఖసంతోషాలతో ఉంటే ప్రపంచ భాగ్యం వర్ధిల్లుతుంది. సకాలంలో వర్షాలు కురిసి, వరదలు, తుపానులు వంటి ప్రకృతి వైపరీత్యాలు లేకపోతే ప్రపంచ భాగ్యం వర్ధిల్లుతుంది.

పరిశ్రమలలో కార్మికులు సమ్మెలు, బండ్లు లేకుండా యజమానులతో సామరస్యంగా ఉండి మంచి ఉత్పత్తిని సాధిస్తే, ప్రపంచ భాగ్యం వర్ధిల్లుతుంది.

ప్రభుత్వమూ, పారిశ్రామికవేత్తలూ, కర్షకుల, కార్మికుల సంక్షేమానికి చర్యలు చేపట్టాలి. వ్యవసాయ కూలీలకు 365 రోజులూ పని చూపించాలి. కార్మికులకూ, కర్షకులకూ పెన్షనులు ఏర్పాటు చేయాలి. కార్మిక, కర్షకుల పిల్లలకు విద్యా, వైద్య సదుపాయాలు, స్కాలర్ షిప్పులూ ఇవ్వాలి. అప్పుడే ప్రపంచ భాగ్యం వర్ధిల్లుతుంది.

ఈ) అభాగ్యులను, అనాథలను చూస్తే మీకేమనిపిస్తుందో రాయండి.
జవాబు:
అభాగ్యులను, అనాథలను చూస్తే, నాకు బాధ కలుగుతుంది. నా మిత్రులతో, నా తల్లిదండ్రులతో చెప్పి, వారికి సాయం చేద్దామనిపిస్తుంది. అభాగ్యులకు, అనాథలకు ప్రభుత్వం ఆశ్రయం కల్పిస్తే బాగుండుననిపిస్తుంది. స్వచ్ఛంద సంస్థలు కూడా ఈ విషయంలో చొరవ చూపితే మేలనిపిస్తుంది. ధనవంతులు అభాగ్యులు, అనాథల కన్నీళ్ళు తుడవాలనీ, వారికి అండగా నిలిచి ఆదుకోవాలని అనిపిస్తుంది.

AP Board 8th Class Telugu Solutions Chapter 5 ప్రతిజ్ఞ

2. కింది ప్రశ్నలకు పదేసి వాక్యాలలో జవాబులు రాయండి.

అ) పాఠ్యభాగ సారాంశాన్ని సొంతమాటలలో రాయండి.
జవాబు:
‘రైతు విరామ మెరుగని కష్టజీవి. ప్రపంచం అంతా సుఖశాంతులతో ఉండాలని కోరేవాడు అతను. నాగలిని చేతపట్టి పొలాలను దున్ని బంగారాన్ని పండిస్తాడు. తన శరీరంలోని ప్రతి చెమట బొట్టును దేశానికే ధారపోయాలనుకుంటాడు. లోకానికి సుఖం కలిగేందుకు విశ్రాంతి లేకుండా కష్టపడుతున్న రైతుల చెమటకు విలువ కట్టలేము.

కార్మికుడు ప్రపంచమంతా సంపదలతో తులతూగాలని కోరుకుంటాడు. తమ నరాల చేతుల సత్తువతో, వరహాల వర్షం కురిపించాలని, ప్రపంచ సౌభాగ్యం కోసం, గనుల్లో, అడవుల్లో, కార్యానాల్లో కష్టపడుతూ, ధనవంతులకు దాస్యం చేసే కార్మికుల కళ్ళల్లో మండే దుఃఖాగ్నికి, కారే కన్నీళ్ళకూ ఖరీదు కట్టలేము.

కాబట్టి లోకంలో అన్యాయాలు, ఆకలి, బాధ, దరిద్రం, దౌర్జన్యం పోయే విధంగా పాటలు రాస్తాను. నా కొత్త కవిత్వం కార్మికుల, శ్రామికుల సౌభాగ్యానికి సమర్పిస్తాను. ముల్లోకాల్లో శ్రమైక జీవన సౌందర్యానికి సాటిలేదని చెపుతూ కార్మికులకు స్వస్తి వాక్యాలు పలుకుతాను. బంగారు వాద్యాలు మ్రోగిస్తాను. ఆర్తుల జీవితం పునాదిగా, భావి వేదాలు లోకానికి చవిచూపిస్తాను.

వేలకొలదీ వృత్తుల చిహ్నాలే, నేను పలికే కొత్త పాటకూ, కొత్త రీతికీ, భావం, భాగ్యం, ప్రాణం, ఓంకారం” అంటున్నాడు శ్రీశ్రీ.

ఆ) మీ పరిసరాల్లో ఉన్న కష్టజీవుల జీవన విధానాన్ని రాయండి.
(లేదా)
మీ పరిసరాల్లో ఉన్న ఎవరైనా ఇద్దరి కష్టజీవుల జీవన విధానాన్ని రాయండి.
జవాబు:
మా పరిసరాలలో చాలా మంది కష్టజీవులు ఉన్నారు. వారు ఉదయం వేకువజామునే లేచి తమతమ వృత్తులలోనికి వెళతారు. వారు ప్రతిరోజూ ఎటువంటి. అవరోధాలు వచ్చినా తమ బ్రతుకును వెళ్ళదీస్తుంటారు. వారిలో కొందరు ఆటోరిక్షాలు నడుపుతూ జీవిస్తారు. కొందరు అద్దె టాక్సీలు నడుపుతారు. కొందరు దుకాణాల్లో పనిచేస్తారు. వారి ఆడవాళ్ళు పాచిపని, అంట్లు తోమడం వగైరా పనులు చేసి జీవిస్తారు.

అందులో మగవారు పగలంతా కష్టపడి పని చేయడంవల్ల, ఆ శ్రమ పోతుందనే భ్రాంతితో తాగుడుకు అలవాటు, పడ్డారు. తాగి చిందులు తొక్కుతూ ఉంటారు. ఒక్కొక్కప్పుడు తిండి తిప్పలు లేక, పస్తులు పడుకుంటారు. ఇందులో కొందరు పొరుగూరు వెళ్ళి వ్యవసాయం పనులు చేస్తారు. ఆ పనులు అన్ని రోజులూ ఉండవు. కాబట్టి పనులు దొరకని రోజుల్లో వీరికి జీవితం నడవడం కష్టమవుతోంది.

వీరి పిల్లలు చాలా మంది ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతారు. కొద్దిమంది కాన్వెంట్ లో చదువుతారు. అక్కడ ఫీజులు కట్టలేక బాధపడుతూ ఉంటారు. వీరు అప్పులు తెచ్చుకొంటూ ఉంటారు. అప్పులు ఇచ్చినవాళ్ళు బాకీ తీర్చలేని వార్ని తిడుతూ ఉంటారు. దాంతో తగవులు వస్తూ ఉంటాయి.

3. విత్తు నాటింది మొదలు పంట చేతికందే వరకు రైతు పడే కష్టాలు అనేకం. అటువంటి రైతుపడే కష్టాన్ని గురించి సొంత మాటల్లో రాయండి.
జవాబు:
విత్తు నాటింది మొదలు పంట చేతికందే వరకు రైతు పడే కష్టాలు ఇన్నీ అన్నీ అని చెప్పలేము. రైతు కష్టజీవి. విరామమంటే తెలియని శ్రామికుడు కర్షకుడు. నాగలిని నమ్ముకొని బతికేవాడు. పంట పొలాలకే తన జీవితాన్ని ధారపోసి పంటను పండిస్తాడు. చేను దున్ని, నీరు పెట్టి, నారుమళ్ళు పోసి, నారు తీసి, నాటు వేసి, ఎరువులు చల్లి, కోత కోసి, మోపులు కట్టి, కుప్పవేసి, పంట నూర్చి, తూర్పార పట్టి, బస్తాల కెత్తి, ధాన్యం బస్తాల కెత్తి ఇంటికి చేర్చి, అమ్మడం మొదలైన పనులు కర్షకుల శ్రమను తెలుపుతాయి.

అందుకే శ్రీ.శ్రీ. “ఆరుగాలం శ్రమించి భూమికి ధారపోసే కర్షక వీరుల శరీరంపై ప్రవహించే ఘర్మ జలానికి ఖరీదు కట్టలేమ”న్నాడు.

రైతు నాగలిని నమ్ముకొన్నాడు. పొలాలకే తన జీవితాన్ని ధారపోసి, భూమిలో బంగారు పంటలు పండించాలనీ కోరుకుంటున్నాడు. లోకమంతా సౌఖ్యంగా ఉండాలని కోరుకుంటాడు. అందుకే పొలాలను నాగళ్ళతో దున్నుతున్నాడు. విశ్రాంతి లేకుండా శ్రమిస్తున్నాడు.

IV పదజాలం

1. కింది వాక్యాల్లో గీత గీసిన పదాలకు అర్ధాలు రాయండి. వాటిని సొంతవాక్యాల్లో ప్రయోగించండి.

అ) మనం కష్టపడితే గాని ఘర్మజలం విలువ తెలియదు.
జవాబు:
ఘర్మజలం = చెమట
పరుగు పెడితే శరీరం అంతా ఘర్మజలంతో నిండుతుంది.

ఆ) జీవులెన్నో ధరిత్రి మీద జీవిస్తున్నాయి.
జవాబు:
ధరిత్రి = భూమి
ఈ పుణ్యధరిత్రి ఎందరో మహామహులకు కన్నతల్లి.

ఇ) సీత హేమా భరణాలు ధరించింది.
జవాబు:
హేమం = బంగారు
ఇటీవల కాలంలో హేమం ధర చుక్కలనంటుతోంది.

ఈ) జలం తాగితేనే దాహం తీరుతుంది.
జవాబు:
జలం = నీరు
కృష్ణానదిలోని జలం మురికి అయిపోతున్నది.

AP Board 8th Class Telugu Solutions Chapter 5 ప్రతిజ్ఞ

2. కింది వాక్యాలు పరిశీలించండి.
అ) ఉగాది తెలుగువారి నూతన వర్మం.
ఆ) వర్షం పడుతుందని గొడుగు తీసుకువచ్చాను.

పై వాక్యాల్లో వర్షం అనే పదానికి సంవత్సరం, వాన అనే రెండు అర్థాలు ఉన్నట్లు తెలుస్తోంది కదా ! ఇలా ఒక మాటకు అనేక అర్థాలు వస్తే వాటిని నానార్థాలు అంటారు.

కింది పదాలకు నానార్థాలు రాసి, వాక్యాల్లో ప్రయోగించండి.

ఇ) భూతం :
జవాబు:
భూతం (నానార్థాలు) : పిశాచము, జరిగిపోయిన కాలం, ప్రాణి

వాక్యప్రయోగములు :

  • నిన్ను బహుశః భూతం పట్టుకొంది. (పిశాచము)
  • ఈ విషయము నేటిది కాదు భూతమునకు సంబంధించినది. (జరిగిపోయిన కాలం)
  • పంచ భూతములలో వాయువు ముఖ్యమైనది.

ఈ) కరం :
జవాబు:
కరం : చెయ్యి, తొండము, మిక్కిలి, కిరణము

వాక్యప్రయోగములు :

  • నీ కరములు మురికిగా ఉన్నాయి. (చేతులు) .
  • ఏనుగు కరము సహాయంతో నీరు త్రాగుతుంది. (తొండము)
  • సూర్య కరములు నేడు తీక్షణముగా ఉన్నాయి. (కిరణములు)
  • వానికి తల్లిదండ్రులపై కరము ప్రియము. (మిక్కిలి)

3. కింది వాక్యాలను చదవండి.

బంగారం ధర బాగా పెరిగింది. అయినా ఆ పుత్తడి అంటే అందరికీ మక్కువే. కానీ మనసు బంగారమైతే ఈ స్వర్ణ మెందుకు?

పై వాక్యాల్లో బంగారం, పుత్తడి, స్వర్ణం అనే పదాలకు ఒకటే అర్థం అని గ్రహించారు కదా ! ఇలా ఒకే అర్థాన్నిచ్చే పదాలను పర్యాయపదాలు అంటారు. కింది పదాలకు పర్యాయపదాలు రాసి, వాక్యాల్లో ప్రయోగించండి.
అ) హలం ఆ) జగం ఇ) జలం – ఈ) ధ్వని ఉ) అగ్ని
జవాబు:
అ) హలం : నాగలి, లాంగలము, సీరము

వాక్యప్రయోగములు :

  • కర్షకుడు ఎప్పుడూ హలంను నమ్ముకుంటాడు.
  • నాగలితో పొలమును దున్ని పంటలను పండిస్తాడు.
  • రైతుకు అతిముఖ్యమైన పనిముట్టు సీరము.
  • ఇప్పుడు రైతులు లాంగలముతో దున్నడం మాని, ట్రాక్టర్లతో పొలాలను దున్నుతున్నారు.

ఆ) జగం : లోకము, జగత్తు, భువనము
వాక్యప్రయోగములు :

  • జగం అంతా మోసాల మయం.
  • లోకములో దైవభక్తులు ఎందరో ఉన్నారు.
  • జగత్తులో జిత్తులమారులు ఎక్కువయ్యారు.
  • ఈ విశ్వములో చతుర్దశ భువనములూ ఉన్నాయి.

ఇ) జలం : నీరు, ఉదకము, తోయము
వాక్యప్రయోగములు :

  • వేసవి రాగానే జలానికి కొరత ఏర్పడింది.
  • ఎక్కువగా నీరు తాగితే ఆరోగ్యం బాగుంటుంది.
  • గంగ ఉదకము మహాపవిత్రమైనది.
  • నీవు పాలల్లో తోయము ఎక్కువగా కలుపుతున్నావు.

ఈ) ధ్వని : శబ్దము, చప్పుడు, నాదము, నినాదము

వాక్యప్రయోగములు :

  • తరగతిలో పిల్లల ధ్వని వినబడడం లేదు.
  • నీ మోటారు సైకిలు ఎక్కువ శబ్దము చేస్తోంది.
  • నీవు చప్పుడు చేయకుండా కూర్చో.
  • గాన విద్వాంసుని నాదము మారుమ్రోగుతోంది.
  • కార్మికులు వ్యతిరేక నినాదములు ఇస్తున్నారు.

ఉ) అగ్ని : పావకుడు, వహ్ని, అనలము, దహనుడు

వాక్యప్రయోగములు :

  • పంచభూతాలలో అగ్ని ఒకటి.
  • ఇళ్ళన్నీ పావకుని విజృంభణంతో దగ్ధమయ్యాయి.
  • వహ్ని శిఖలు ఆకాశాన్ని అంటుతున్నాయి.
  • అనిలుని ప్రేరేపణతో అనలము పెచ్చుమీరుతోంది.
  • పొయ్యిలో దహనుడు మండకపోతే, వంట పూర్తి కాదు.

4. గీత గీసిన పదాలకు వికృతులు రాసి, వాక్యాల్లో ప్రయోగించండి.
అ) శారీరకమైన పనులు చేయడానికి శక్తి అవసరం.
ఆ) కష్టపడితే జీవితంలో మంచి ఫలితాలు పొందవచ్చు.
ఇ) ఎప్పటికైనా ధర్మమే జయిస్తుంది.
ఈ) ప్రాణమున్నంత వరకూ నిజాయితీగా బతకాలి.
జవాబు:
అ) ఆహారం మనకు సత్తి నిస్తుంది. శక్తి (ప్ర) – సత్తి (వి)
ఆ) ప్రభుత్వ అస్తవ్యస్త విధానాలతో పేదల జీతాలు అతలాకుతలమవుతున్నాయి. జీవితం (ప్ర) – జీతం (వి)
ఇ) రాములవారి పాలనలో దమ్మం నాలుగుపాదాల నడిచింది. ధర్మం (ప్ర) – దమ్మం (వి)
ఈ) నేను పానం పోయినా అసత్యమాడను. ప్రాణము (ప్ర) – పానం (వి)

V. సృజనాత్మకత

* రైతు / కార్మికుడు ఏ విధంగా కష్టపడుతున్నారో తెలుసుకొని అతని జీవనశైలిని ఆత్మకథగా రాయండి.
జవాబు:
నేను చిన్నరైతుని. నా పేరు రామయ్య. నాకు రెండు ఎకరాల వ్యవసాయ పొలం ఉంది. నాకు పెళ్ళాం, ముగ్గురు పిల్లలు ఉన్నారు. నాకు పొలం మీద వచ్చే ఆదాయం ఏ మూలకూ చాలదు. నా పిల్లలను చదివించలేకపోతున్నా. మా ఆవిడికి సరైన బట్టలు కొనలేకపోతున్నా. కడుపునిండా సరిపడ తిండి లేదు.

పక్క రైతు దగ్గర 2 ఎకరాలు కౌలుకు తీసుకున్నా. వ్యవసాయ ఖర్చులు పెరిగిపోయాయి. అప్పులు దొరకటల్లేదు. తెచ్చిన అప్పులు తీర్చలేకపోతున్నా. ఇల్లంతా వర్షం. నేయించుకోవడానికి డబ్బులు లేవు. పండిన ధాన్యం, కౌలు రైతుకు ఇచ్చాను. బాకీలు మిగిలాయి. నా పిల్లకూ, పిల్లవాడికీ పెళ్ళిళ్ళు చేయాలి. కట్నాలు ఇవ్వలేను. నా పిల్లవాడికి రైతుబిడ్డ అని, ఎవరూ పిల్లను ఇవ్వడంలేదు. కట్నం ఇవ్వలేనని మా పిల్లను ఎవరూ పెళ్ళి చేసుకోవడం లేదు.

రైతు గొప్పవాడని అందరూ అంటారు. చూస్తే నా బ్రతుకు ఇలా ఉంది. ఇవన్నీ చూశాక, నాతోటి రైతులు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారో అర్థం అవుతోంది. ప్రభుత్వమే మా రైతులను ఆదుకోవాలి.

(లేదా)

* తన కవితలో శ్రీశ్రీ కమ్మరి కొలిమీ, కుమ్మరి చక్రం, జాలరి పగ్గం, సాలెల మగ్గం, గొడ్డలి, రంపం, కొడవలి, నాగలి అనే వాటిని ఆయా వృత్తులకు చిహ్నాలుగా పేర్కొన్నారు. వీటిలో మీకు నచ్చిన వస్తువును ఎన్నుకొని చిత్రం గీయండి. దాన్ని గురించి రాయండి.
జవాబు:
AP Board 8th Class Telugu Solutions Chapter 5 ప్రతిజ్ఞ 2
ప్రక్క చిత్రంలో కుమ్మరి తన దగ్గర ఉన్న చక్రం(ఆవం)తో అందమైన కుండలను తయారుచేస్తున్నాడు. మొదట బంకమట్టి లేక ఎర్రమట్టిని తెచ్చి వాటిని బాగా కలిపి ముద్దగా చేస్తాడు. ఆ ముద్దను చక్రంపై పెట్టి తిప్పుతాడు. అప్పుడు ఆ మట్టిముద్ద అతని హస్తకళా నైపుణ్యంతో చక్కటి ఆకృతులను సంతరించుకుంటుంది. కుమ్మరి ఈ విధంగా కుండలు, ప్రమిదలు, పాలికలు, పూలకుండీలు మొదలగునవి తయారుచేస్తాడు. కానీ ప్రస్తుత కాలంలో ప్రజలు ఆధునిక పరికరాలు వాడకం వైపు మొగ్గు చూపుతుండటంతో కుమ్మరి జీవితం ఆర్థికంగా ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది.

VI. ప్రశంస

* శ్రీశ్రీ కవితా శైలి ఎలాంటిది ? ఆయన చేసిన పద ప్రయోగం గురించి ఒక వ్యాసం రాయండి.
జవాబు:
“ఏ దేశ చరిత్ర చూచినా ఏమున్నది గర్వకారణం?
నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం”

అని కొత్తగా గళమెత్తి సంచలనం రేకెత్తించిన మహాకవి శ్రీశ్రీ. శ్రీశ్రీ అనే రెండక్షరాలు తెలుగు కవిత్వంలో విప్లవం సృష్టించాయి. కలం పేరు శ్రీశ్రీ కాగా, అసలు పేరు శ్రీరంగం శ్రీనివాసరావు. “కష్టజీవి”కి ఇరువైపులా నిల్చేవాడే కవి అని కొత్త నిర్వచనం ఇచ్చిన కవి శ్రీశ్రీ. ఆకాశమార్గాన పయనించే తెలుగు కవితారథాన్ని భూమార్గం పట్టించి, భూకంపం పుట్టించి “అనితరసాధ్యం నా మార్గం” అని చాటిన ప్రజాకవి శ్రీశ్రీ. భావకవిత్వంపై తిరుగుబావుటా ఎగురవేసి అభ్యుదయ ఉద్యమానికి నాంది పలికాడు. ఆ తర్వాత విప్లవ కవిత్వోద్యమానికి స్ఫూర్తినిచ్చాడు.

కవితా శిల్పరచనలో ప్రవీణుడు శ్రీశ్రీ. ఈయన సారవంతమైన మహాభావ తరంగాల సంగమ స్థానము. శ్రీశ్రీ అక్షరాక్షర శిల్పి. ఈయన గేయరచనలో ఒక నవ్యత, పరాకాష్ట పొందిన లయ ఉన్నాయి. శ్రీశ్రీ యొక్క శబ్దాలంకారాలు, పదప్రయోగం విశిష్టమైనవి.

శ్రీశ్రీ కవితలో అంత్యానుప్రాసలు, అలవోకగా, అర్థవంతంగా సాగుతాయి. “హేమం పిండగ – సౌఖ్యం నిండగ”, “గనిలో, వనిలో, కార్యానాలో”, “పరిక్లమిస్తూ – పరిప్లవిస్తూ”, “విలాపాగ్నులకు – విషాదాశ్రులకు”, “బాటలు తీస్తూ – పాటలు వ్రాస్తూ”, “సంధానిస్తూ – సంరావిస్తూ”, “జాలరి పగ్గం – సాలెల మగ్గం”, “నా వినుతించే – నా విరుతించే, నా వినిపించే – నా విరచించే వంటి అనుప్రాసలు, పదప్రయోగం అర్థవంతంగా ఈ కవితలో ఉన్నాయి. అవి అద్భుతమైన లయతో, శ్రుతి మనోహరంగా ఉన్నాయి.

కార్మికుల శ్రమైక జీవన సౌందర్యానికి, వారి ఘర్మజలానికి ఖరీదు కట్టే షరాబు లేడని శ్రీశ్రీ యథార్థాన్ని చెప్పాడు. శ్రీశ్రీ ఆవేశంగా చెప్పేటప్పుడు సంస్కృత సమాసబంధుర శబ్దాలు ప్రయోగిస్తాడు. స్వస్తి వాక్యములు సంధానిస్తూ, స్వర్ణ వాద్యములు సంరావిస్తూ, వ్యధార జీవిత యథార్ధ దృశ్యం, శ్రామిక లోకపు సౌభాగ్యానికి” వంటి సంస్కృత సమాసాలు అందుకు ఉదాహరణం.

శ్రీశ్రీ పదాలతో బంతులాటలాడతాడు. “దారిద్ర్యాలూ, దౌర్జన్యాలూ”, “త్రిలోకాలలో, త్రికాలాలలో,” “భావివేదముల, జీవనాదములు” వంటివి ఇందుకు ఉదాహరణలు.

శ్రీశ్రీ అన్యాయాలు, ఆకలి, వేదన, దరిద్రము పోయే మార్గంలో నవ్యకవిత్వం రాస్తానని ప్రతిజ్ఞ చేశాడు. కార్మికుల వృత్తుల చిహ్నాలను తన కవితకు భావంగా, ప్రాణంగా, ప్రణవంగా స్వీకరించాడు.

సమాజాన్ని చైతన్యపరిచి, అభ్యుదయ కవిత్వానికి యుగకర్తగా వుండి, కొత్త తరానికి బాటలు వేసి, తనవాణిని జాతి జనులు పఠించే మంత్రంగా విరచించి, ప్రపంచ పీడిత జనానికి బాటసగా నిల్చి, వేమన, గురజాడల బాటలో నడిచి, తెలుగు కవిత్వంలో నిలువెత్తు సంతకంగా నిలిచిన శ్రీశ్రీ ప్రజాకవి. సమాజకవి.

AP Board 8th Class Telugu Solutions Chapter 5 ప్రతిజ్ఞ

(లేదా)

* మన గ్రామాల్లో, పట్టణాల్లో రకరకాల వృత్తుల వాళ్ళుంటారు. వాళ్ళంతా రెక్కల కష్టం మీద ఆధారపడ్డవాళ్ళే. వాళ్ళ దగ్గరకు వెళ్ళండి. తాము చేస్తున్న పనిలో వాళ్ళు పొందే ఆనందాన్ని గమనించండి. వాళ్ళను ప్రశంసించండి. వాళ్ళను ఏ విధంగా అభినందించారో రాయండి.
జవాబు:
వృత్తి పని చేసే పెద్దలారా ! మీరు నిజంగా మన సమాజానికి ఎంతో మేలు చేస్తున్నారు. మీకు ఈ వృత్తుల వల్ల వచ్చే సంపాదన మీ భార్యాబిడ్డలను పోషించడానికి సరిపోదు. అయినా మీరు మీ కులవృత్తులను కొనసాగిస్తున్నారు. గ్రామ, నగర సంస్కృతిని మీరు రక్షిస్తున్నారు.

మీ వడ్రంగులు వారి పని చేయకపోతే, ఇళ్ళకు తలుపులు, కిటికిలూ లేవు. మీ తాపీవారు ఇళ్ళు కట్టకపోతే, మాకు ఇళ్ళే లేవు. మీ రైతులు పంటలు పండించకపోతే మాకు తిండి లేదు.

మీ కమ్మర్లు కత్తులు, కొడవళ్ళు చేయకపోతే మాకు ఆ సాధనాలే ఉండేవి కావు. మీ కుమ్మర్లు ప్రమిదలు, కుండలు, పాలికలు తయారుచేయకపోతే దీపావళికి దీపాలు లేవు. పెళ్ళిళ్ళలో అయిరేణికుండలు లేవు. అంకురార్పణలకు పాలికలు లేవు.

మీరు కడుపులు మాడ్చుకుని, అర్ధాకలితో మీ తోటివారికి సాయం చేస్తున్నారు. మీకు నా అభినందనలు. మీరు మన దేశ సౌభాగ్యానికి పట్టుకొమ్మలు. పెద్దలారా ! సెలవు.

ప్రాజెక్టు పని

* శ్రీశ్రీ రాసిన కవితలను / గీతాలను సేకరించండి.
వాటిలో ఏదైనా ఒకదాన్ని రాసి రాగ భావయుక్తంగా పాడి వినిపించండి
జవాబు:
శ్రీశ్రీ గేయము :
మహాప్రస్థానం

1. మరో ప్రపంచం
మరో ప్రపంచం
మరో ప్రపంచం పిలిచింది
పదండి ముందుకు
పదండి త్రోసుకు
పోదాం పోదాం పైపైకి

2. కదం తొక్కుతూ
పదం పాడుతూ
హృదంతరాళం గర్జిస్తూ
పదండి పోదాం
వినబడలేదా
మరో ప్రపంచపు జలపాతం

3. దారి పొడుగునా గుండె నెత్తురులు
తర్పణ చేస్తూ పదండి ముందుకు
బాటలు నడచీ
పేటలు కడచీ
కోటలన్నిటిని దాటండి
నదీనదాలూ
అడవులు, కొండలు,
పదండి ముందుకు
పదండి త్రోసుకు
పోదాం పోదాం పైపైకి

4. ఎముకలు క్రుళ్ళిన
వయస్సు మళ్ళిన
సోమరులారా ! చావండి
నెత్తురు మండే
శక్తులు నిండే
సైనికులారా ! రారండి
హరోం హరోం హర
హరహర హరహర
హరహర హరహర
హరోం హరా అని కదలండి
మరో ప్రపంచం,
మహా ప్రపంచం
ధరిత్రి నిండా నిండింది.

VII. భాషను గురించి తెలుసుకుందాం

1) కింది పదాలను విడదీసి, సంధుల పేర్లను రాయండి.

అ) విరామమెరుగక = విరామము + ఎరుగక – ఉత్వసంధి
ఆ) జగానికంతా = జగానికి + అంతా – ఇకారసంధి
ఇ) విలాపాగ్నులు = విలాప + అగ్నులు = సవర్ణదీర్ఘ సంధి
ఈ) అనేకులింకా = అనేకులు + ఇంకా = ఉత్వసంధి
ఉ) విషాదాశ్రువులు = విషాద + అశ్రువులు = సవర్ణదీర్ఘ సంధి

2) కింది విగ్రహవాక్యాలను సమాసపదాలుగా కూర్చండి. సమాసాల పేర్లను రాయండి.

అ) ముగ్గురైన దేవతలు = ముగ్గురు దేవతలు – ద్విగు సమాసం
ఆ) రెండైన గంటలు = రెండు గంటలు – ద్విగు సమాసం

3) కింది పదాలకు విగ్రహవాక్యాలు రాయండి. ఏ సమాసమో రాసి కారణాలు చర్చించండి.

అ) నాలుగు వేదాలు = నాలుగైన వేదాలు – ద్విగు సమాసం
ఆ) రెండు చేతులు = రెండైన చేతులు – ద్విగు సమాసం
ఇ) త్రికరణాలు = మూడైన కరణాలు – ద్విగు సమాసం
ఈ) కోటిరత్నాలు = కోటి సంఖ్య గల రత్నాలు – ద్విగు సమాసం
ఉ) ముప్ఫైరోజులు = ముప్ఫై అయిన రోజులు – ద్విగు సమాసం
ఊ) మూడు జిల్లాలు = మూడైన జిల్లాలు – ద్విగు సమాసం
ఋ) నూరుపద్యాలు = నూరైన పద్యాలు – ద్విగు సమాసం

పైన తెలిపిన విగ్రహవాక్యాలకు అన్నింటికి సంఖ్యావాచక విశేషణాలు పూర్వపదంలో ఉన్నాయి. కాబట్టి వీటిని ద్విగు సమాసాలు అంటారు.

AP Board 8th Class Telugu Solutions Chapter 5 ప్రతిజ్ఞ

4) ఈ కింది సామాన్య వాక్యాలను సంక్లిష్ట వాక్యాలుగా మార్చి రాయండి.
అ) రుకియా బజారుకు వెళ్ళింది. రుకియా కూరగాయలు కొన్నది.
జవాబు:
రుకియా బజారుకి వెళ్ళి, కూరగాయలు కొన్నది.

ఆ) కృష్ణ బొబ్బిలి వెళ్ళాడు. కృష్ణ ఇల్లు కట్టాడు.
జవాబు:
కృష్ణ బొబ్బిలి వెళ్ళి, ఇల్లు కట్టాడు.

ఇ) తాతగారు ఇంటికి వచ్చారు. తాతగారు కాఫీ తాగారు.
జవాబు:
తాతగారు ఇంటికి వచ్చి, కాఫీ తాగారు.

ఈ) మాధురి తోటకి వెళ్ళింది. మాధురి పువ్వులు కోసింది.
జవాబు:
మాధురి తోటకి వెళ్ళి, పువ్వులు కోసింది.

ఉ) చిన్నా సినిమాకి వెళ్ళాడు. చిన్నా ఐస్ క్రీమ్ తిన్నాడు.
జవాబు:
చిన్నా సినిమాకి వెళ్ళి, ఐస్ క్రీమ్ తిన్నాడు.

5) కింది వాక్యాలను సంయుక్త వాక్యాలుగా మార్చి రాయండి.

అ) ఆజాద్ డేవిడ్ కంటే పెద్దవాడా ? ఆజాద్ డేవిడ్ కంటే చిన్నవాడా?
జవాబు:
ఆజాద్ డేవిడ్ కంటే పెద్దవాడా? చిన్నవాడా?

ఆ) జయ ఇంటికి వెళ్ళింది. విజయ బడికి వెళ్ళింది.
జవాబు:
జయ ఇంటికి, విజయ బడికి వెళ్ళారు.

ఇ) స్వప్న అన్నం తిన్నది. పద్మ పండ్లు తిన్నది.
జవాబు:
స్వప్న అన్నం, పద్మ పండ్లు తిన్నారు.

ఈ) రమ అందమైనది. రమ తెలివైనది.
జవాబు:
రమ అందమైనదీ, తెలివైనది.

ఉ) పావని సంగీతం నేర్చుకుంది. పావని నృత్యం నేర్చుకుంది.
జవాబు:
పావని సంగీతమూ, నృత్యమూ నేర్చుకుంది.

ఊ) రైలు వచ్చింది. చుట్టాలు రాలేదు.
జవాబు:
రైలు వచ్చింది కాని చుట్టాలు రాలేదు.

6) కింది పేరా చదవండి. సామాన్య, సంక్లిష్ట, సంయుక్త వాక్యాలను గుర్తించండి. రాయండి.

ఈశ్వరచంద్ర విద్యాసాగర్ పశ్చిమబెంగాల్ లో జన్మించాడు. ఈయన సంస్కృతం, ఆంగ్లం, హిందీ భాషలు నేర్చుకున్నారు. చదువు పూర్తయింది. ఈశ్వరచంద్రుడు ఉద్యోగంలో చేరాడు. ఈయన ప్రధానోపాధ్యాయునిగా, ప్రత్యేక తనిఖీ అధికారిగా పనిచేశాడు. ఈ ఉద్యోగం అతనికి రుచించలేదు. ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేశాడు. స్త్రీ విద్య అవసరాన్ని గుర్తించి, అనేక బాలికా పాఠశాలలు స్థాపించాడు. వితంతు వివాహాలను ప్రోత్సహించాడు. అంతేగాక తన కుమారునికి ఒక వితంతువుతో వివాహం జరిపించి, సభ్య సమాజానికి ఆదర్శప్రాయుడయ్యాడు.
సామాన్య వాక్యాలు :

  • ఈశ్వరచంద్ర విద్యాసాగర్ పశ్చిమ బెంగాల్ లో జన్మించాడు.
  • విద్య పూర్తయింది.
  • ఈశ్వరచంద్రుడు ఉద్యోగంలో చేరాడు.
  • ఈ ఉద్యోగం అతనికి రుచించలేదు.
  • ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేశాడు.
  • వితంతు వివాహాలు ప్రోత్సహించాడు.

సంక్లిష్ట వాక్యాలు :

  • స్త్రీ విద్య అవసరాన్ని గుర్తించి, అనేక బాలికా పాఠశాలలను స్థాపించాడు.
  • అంతేగాక తన కుమారునికి ఒక వితంతువుతో వివాహం జరిపించి, సభ్య సమాజానికి ఆదర్శప్రాయుడైనాడు.

సంయుక్త వాక్యాలు :

  • ఈయన సంస్కృతం, ఆంగ్లం, హిందీ భాషలు నేర్చుకున్నాడు.
  • ఈయన ప్రధానోపాధ్యాయునిగా, ప్రత్యేక తనిఖీ అధికారిగా పనిచేశాడు.

7) గసడదవాదేశ సంధి :
అ) కింది పదాలను ఏ విధంగా విడదీశారో గమనించండి.
గొప్పవాడుగదా = గొప్పవాడు + కదా (డు + క)
కొలువుసేసి = కొలువు + చేసి (వు + చే)
వాడుడక్కరి = వాడు + టక్కరి (డు + ట)
నిజముదెలిసి = నిజము + తెలిసి (ము + తె)
పొలువోయక = పాలు + పోయక (లు + పో)

పై ఉదాహరణలు గమనించారు కదా ! పూర్వపదం చివర ప్రథమావిభక్తి ప్రత్యయాలున్నాయి. పరపదం మొదట క, చ, ట, త, ప లున్నాయి. ఈ విధంగా ప్రథమావిభక్తి మీది ప్రత్యయాలకు క, చ, ట, త, పలు పరమైతే వాటిస్థానంలో గ, స, డ, ద, వలు ఆదేశంగా వస్తాయి. అంటే –
క → ‘గ’ గా మారుతుంది
చ → ‘స’ గా మారుతుంది
ట → ‘డ’ గా మారుతుంది
త → ‘ద’ గా మారుతుంది
ప → ‘వ’ గా మారుతుంది.
(క చ ట త ప లకు గ స డ ద వలు ఆదేశంగా వస్తాయి.)
పాలు

కింది పదాలను విడదీసి రాయండి. వివరించండి.

అ) నిక్కముదప్పదు
నిక్కము + తప్పదు = నిక్కము దప్పదు (ము + త)

పూర్వ పదం చివర ‘ము’ అనే ప్రథమావిభక్తి ప్రత్యయము ఉన్నది. పరపదము మొదట ‘త’ అనేది పరమైనపుడు ‘ద’ అనే పదం వచ్చింది. త, దగా మారింది.

AP Board 8th Class Telugu Solutions Chapter 5 ప్రతిజ్ఞ

ఆ) ప్రాణములుగల్లి – ప్రాణములు + కల్గి
ఇ) పొడగానరాక – పొడ + కానరాక
ఈ) నోరసూపు – నోరు + చూపు
ఉ) నీరుద్రావి – నీరు + త్రావి
ఊ) పాలుదాగి + తాగి

ద్వంద్వ సమాస పదాల విషయంలో కూడా గసడదవాదేశసంధి కనిపిస్తుంది.

ఆ) కింది పదాలను గమనించండి.

కూరగాయలు = కూర + కాయ + లు
కాలుసేతులు = కాలు + చేయి → చేతు + లు
టక్కుడెక్కులు టక్కు + టెక్కు + లు
తల్లిదండ్రులు = తల్లి + తండ్రి + లు
ఊరువల్లెలు = ఊరు + పల్లె + లు

పై పదాలు ద్వంద్వ సమాసానికి ఉదాహరణలు.

ద్వంద్వ సమాసంలో కూర + కాయ అన్నప్పుడు ‘క’ స్థానంలో ‘గ’ వచ్చింది. ఈ విధంగా కచటతపలకు, గసడదవలు రావడాన్నే గసడదవాదేశం అంటారు. సూత్రం : ద్వంద్వ సమాసంలో మొదటి పదం మీద ఉన్న కచటతపలకు గసడదవలు క్రమంగా వస్తాయి. కింది పదాలను కలపండి.

అ) అక్క + చెల్లెలు = అక్కాచెల్లెలు
ఆ) అన్న + తమ్ముడు = అన్నాదమ్ములు

8. తత్పురుష సమాసం :
అ) కింది పదాలు చదవండి. వాటికి విగ్రహవాక్యాలు చూడండి.
అ) రాజభటుడు
ఆ) తిండిగింజలు
ఇ) పాపభీతి

‘రాజభటుడు’ లో ‘రాజు’ పూర్వపదం, “భటుడు” ఉత్తరపదం. అట్లే తిండిగింజలు – తిండి కొఱకు గింజలు – ‘తిండి’ పూర్వపదం ‘గింజలు’ ఉత్తరపదం. పాపభీతి – పాపం వల్ల భీతి – ‘పాపం’ పూర్వపదం, ‘భీతి’ ఉత్తర పదం.

రాజభటుడుకు విగ్రహవాక్యం రాస్తే ‘రాజు యొక్క భటుడు’ అవుతుంది. దీంట్లో ‘యొక్క’ అనేది షష్ఠీవిభక్తి ప్రత్యయం. భటుడు రాజుకు చెందినవాడని చెప్పడానికి షష్ఠీవిభక్తి ప్రత్యయాన్ని వాడాం. ఇలా విభక్తి ప్రత్యయాలు విగ్రహవాక్యంలో ఉపయోగించే సమాసాలు తత్పురుష సమాసాలు.

పూర్వపదం చివర ఉండే విభక్తిని బట్టి తత్పురుష సమాసాలు :

తత్పురుష సమాసం రకాలువిభక్తులుఉదాహరణ
ప్రథమా తత్పురుష సమాసండు,ము,వు, లుమధ్యాహ్నం – అహ్నము మధ్య భాగం
ద్వితీయా తత్పురుష సమాసంని,ను,ల,కూర్చి, గుఱించిజలధరము – జలమును ధరించినది
తృతీయా తత్పురుష సమాసంచేత,చే, తోడ,తోబుద్ధిహీనుడు – బుద్ధిచేత హీనుడు
చతుర్టీ తత్పురుష సమాసంకొఱకు, కైవంటకట్టెలు వంట కొఱకు కట్టెలు
పంచమీ తత్పురుష సమాసంవలన, కంటె, పట్టిదొంగభయం – దొంగ వలన భయం
షష్ఠీ తత్పురుష సమాసంకి,కు, యొక్కలో, లోపలరామబాణం – రాముని యొక్క బాణం
సప్తమీ తత్పురుష సమాసంఅందు,నదేశభక్తి – దేశమునందు భక్తి
నఞ్ తత్పురుష సమాసంనఞ్ అంటే వ్యతిరేకార్థంఅసత్యం – సత్యం కానిది

ఆ) కింది పదాలు చదవండి. విగ్రహవాక్యాలు రాయండి. అవి ఏ తత్పురుష సమాసాలో రాయండి.
అ) రాజపూజితుడు = రాజు చేత పూజితుడు (తృతీయా తత్పురుషం)
ఆ) ధనాశ = ధనము నందు ఆశ (సప్తమీ తత్పురుషం)
ఇ) పురజనులు = పురము నందలి జనులు (సప్తమీ తత్పురుషం)
ఈ) జటాధారి = జడలను ధరించువాడు (ద్వితీయా తత్పురుషం)
ఉ) భుజబలం = భుజము యొక్క బలం (షష్ఠీ తత్పురుషం)
ఊ) అగ్నిభయం = అగ్ని వలన భయం (పంచమీ తత్పురుషం)
ఋ) అన్యాయం న్యాయం కానిది. (నః తత్పురుషం)

వ్యాకరణంపై అదనపు సమాచారం

పర్యాయపదాలు

బాట : దారి, మార్గం, పథం
స్వామి : ప్రభువు, దొర, యజమాని
కళ్యాణం : పెండ్లి, పరిణయం, ఉద్వాహం
హేమం : బంగారం, సువర్ణం, కాంచనం
జగం : లోకం, ప్రపంచం
ఖరీదు : మూల్యం , వెల
పాట : గీతం, గేయం
కాయం : శరీరం, దేహం, తనువు, మేను
దాస్యం : సేవ, ఊడిగం
ఇల : భూమి, ధరిత్రి, ధరణి

వ్యుత్పత్యర్థాలు

ధర్మము – ధరించబడేది.
అశ్రువులు – దుఃఖంతో కన్నుల నుండి కారే నీరు

నానార్థాలు

బలం – తావు, సామర్థ్యం, శక్యం
కాలం – సమయం, మరణం
భాగ్యం – అదృష్టం, సంపద
వర్షం – వాన, సంవత్సరం

సంధులు

సవర్ణదీర్ఘ సంధి
సూత్రం : అ, ఇ, ఉ, ఋ లకు సవర్ణములైన అచ్చులు పరమైనప్పుడు వాని దీర్ఘము ఏకాదేశమగును.
విలాపాగ్నులు = విలాప + అగ్నులు – సవర్ణదీర్ఘ సంధి
విషాదాశ్రువులు = విషాద + అశ్రువులు – సవర్ణదీర్ఘ సంధి
వృధార్తి = వృధ + ఆర్తి – సవర్ణదీర్ఘ సంధి

వృద్ధి సంధి
సూత్రం : ఆకారమునకు ఏ, ఐ లు పరమగునుపుడు ‘ఐ’ కారమును; ఓ, ఔలు పరమగునపుడు ‘ఔ కారమును ఏకాదేశమగును.
శ్రమైక – శ్రమ + ఏక – వృద్ధి సంధి

ఉత్వసంధి
సూత్రం : ఉత్తునకు అచ్చు పరమగునపుడు సంధి యగును.
సమానమైనది = సమానము + ఐనది – ఉత్వసంధి
జగత్తు అంతా = జగత్తుకు + అంతా – ఉత్వసంధి
చవులిస్తాను = చవులు + ఇస్తాను – ఉత్వసంధి
విరామమెరుగక = విరామము + ఎరుగక – ఉత్వసంధి

AP Board 8th Class Telugu Solutions Chapter 5 ప్రతిజ్ఞ

ఇత్వసంథి
సూత్రం : మధ్యమ పురుష క్రియలయందు ఇత్తునకు సంధియగు.
జగానికంత = జగానికి + అంతా – ఇత్వసంధి
వర్ధిల్లాలని = వర్ధిల్లాలి + అని – ఇత్వసంధి

సమాసాలు

సమాస పదంవిగ్రహవాక్యంసమాసం పేరు
విషాదాశ్రువులువిషాదం అనే అశ్రువులురూపక సమాసం
విలాపాగ్నులువిలాపం అనెడి అగ్నులురూపక సమాసం
యంత్రభూతములుయంత్రములు అనెడి భూతములురూపక సమాసం
ఘర్మజలముఘర్మము అనెడి జలమురూపక సమాసం
సహస్రవృత్తులుసహస్త్ర సంఖ్య గల వృత్తులుద్విగు సమాసం
నరాల బిగువునరాల యొక్క బిగువుషష్ఠీ తత్పురుష సమాసం
కరాల నృత్యంకరాల యొక్క నృత్యంషష్ఠీ తత్పురుష సమాసం
కుమ్మరి చక్రంకుమ్మరి యొక్క చక్రంషష్ఠీ తత్పురుష సమాసం
సాలె మగ్గంసాలెల యొక్క మగ్గంషష్ఠీ తత్పురుష సమాసం
కార్మిక లోకంకార్మికుల యొక్క లోకంషష్ఠీ తత్పురుష సమాసం
వ్యధార్తివ్యధతో ఆర్తితృతీయా తత్పురుష సమాసం
నవ్యకవిత్వంనవ్యమైన కవిత్వంవిశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
భావివేదంభావియైన వేదంవిశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
సమస్త చిహ్నాలుసమస్తమైన చిహ్నాలువిశేషణ పూర్వనద కర్మధారయ సమాసం
నవీన గీతినవీనమైన గీతివిశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
నవీనరీతినవీనమైన రీతివిశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
జీవన సౌందర్యంజీవనమందలి సౌందర్యంసప్తమీ తత్పురుష సమాసం

ప్రకృతి – వికృతులు

కష్టం – కస్తి
ప్రాణం – పానం
భాగ్యము – బాగెము
మంత్రం – జంత్రము
ఆకాశం – ఆకసం
అగ్ని – అగ్గి
రత్నము – రతనము
ప్రతిజ్ఞ – ప్రతిన
శ్రీ – సిరి
ధర్మము – దమ్మము

కవి పరిచయం

పూర్తి పేరు : శ్రీరంగం శ్రీనివాసరావు

జననం : 1910 వ సం||

జన్మస్థలం : విశాఖపట్టణం

తొలి రచన : పద్దెనిమిదేళ్ళ నాటికే “ప్రభవ” అనే భావకవితా సంపుటి.

మహాకవిగా : ఈయన రచించిన అభ్యుదయ కవితా సంపుటి ‘మహాప్రస్థానం’తో మహాకవి అయ్యారు.

విప్లవకవిగా : ఖడ్గసృష్టి, మరోప్రస్థానం గీతాలు రాశారు.

ఇతర రచనలు : మూడు యాభైలు పేరిట వ్యంగ్య కవితలు, కార్టూను కవితలు, 1+1= 1 లేక డిసెంబరు 31, 1999 పేరిట రేడియో నాటికలు.

రచనా శైలి : ‘చరమరాత్రి’ కథల ద్వారా చైతన్య స్రవంతి పద్ధతిని తెలుగు రచనలో ప్రవేశపెట్టారు. సృజనకు, ప్రతిభకు, తాత్త్విక మార్గాన్వేషణకు పేరుగన్నవాడు. నూతన పదప్రయోగాల మార్గదర్శకుడు.

కవితా వస్తువులు : కర్షకులు, కార్మికులు, పీడితులు, పేదలు అనుభవించే కష్టసుఖాలే శ్రీశ్రీ కవితావస్తువులు.

మరణం : 15-6-1983 వ సంవత్సరం

గేయాలు- అర్ధాలు- భావాలు

1వ గేయం

పొలాల నన్నీ,
హలాల దున్నీ,
ఇలాతలంలో హేమం పిండగ
జగానికంతా సౌఖ్యం నిండగ
విరామ మెరుగక పరిశ్రమించే,
బలం. ధరిత్రికి బలి కావించే,
కర్షకవీరుల కాయం నిండా
కాలువకట్టే ఘర్మజలానికి,
ఘర్మజలానికి,
ధర్మజలానికి,
ఘర్మజలానికి ఖరీదు లేదోయ్ !
అర్థాలు :
పొలాల నన్నీ = అన్ని పొలాలనూ ; (భూములనూ)
హలాల దున్నీ = నాగళ్ళతో దున్ని
ఇలా, తలంలో = భూమి ప్రదేశంలో (భూమిపై)
హేమం, పిండగ = బంగారాన్ని పిండడానికి (బంగారు పంటలు పండించడానికి)
జగానికంతా = లోకాని కంతా
సౌఖ్యం నిండగ = నిండుగా సౌఖ్యం కలగడానికి
విరామ మెరుగక = విశ్రాంతి లేకుండా
పరిశ్రమించే = ఎక్కువగా శ్రమించి అలసిపోయే
బలం ధరిత్రికి = తన బలాన్ని భూమికి (ధారపోసే)
బలి కావించే = బలి ఇచ్చే
కర్షకవీరుల = రైతు వీరుల
కాయం నిండా = శరీరం నిండా
కాలువకట్టే = కాలువలా ప్రవహించే
ఘర్మజలానికి = చెమటకు
ఘర్మజలానికి = చెమట నీటికి
ఖరీదు లేదోయ్ – విలువ కట్టలేము

భావం :
విరామమే తెలియని కష్టజీవి రైతన్న. ప్రపంచమంతా సుఖంగా ఉండాలని కోరేవాడు అతను. నాగలిని నమ్ముకొని జీవించే కష్టజీవి. పొలాలకు జీవితాన్ని ధారపోసి బంగారాన్ని పండిస్తాడు. ఈ రైతు శరీరమంతటినుంచి అంతటా స్రవించే చెమట ధర్మజలం. ఆ ధర్మజలానికి ఖరీదు కట్టలేము.

AP Board 8th Class Telugu Solutions Chapter 5 ప్రతిజ్ఞ

2వ గేయం

నరాల బిగువూ,
కరాల సత్తువ
వరాలవర్షం కురిపించాలని,
ప్రపంచ భాగ్యం వర్ధిల్లాలని –
గనిలో, వనిలో, కార్ఖానాలో
పరిక్లమిస్తూ,
పరిప్లవిస్తూ,
ధనికస్వామికి దాస్యం చేసే,
యంత్రభూతముల కోరలు తోమే,
కార్మికవీరుల కన్నుల నిండా
కణకణ మండే,
గలగల తొణకే
విలాపాగ్నులకు, విషాదాశ్రులకు
ఖరీదుకట్టే షరాబు లేడోయ్ !
అర్థాలు :
నరాల బిగువూ = (తన) నరముల బింకాన్నీ (సత్తువను)
కరాల సత్తువ = (తన) చేతుల బలమునూ
వరాలవర్షం కురిపించాలని = వరహాలు వర్షంగా కురిపించాలని (సిరులు కురిపించాలని)
ప్రపంచ భాగ్యం వర్ధిల్లాలని = (తాను పండించిన పంటలతో) ప్రపంచంలో ఐశ్వర్యం వృద్ధి చెందాలని
గనిలో = గనులలో
వనిలో = అడవులలో
కార్ఖానాలో = కర్మాగారాలలో
పరిక్లమిస్తూ – ఎక్కువగా శ్రమిస్తూ
పరిప్లవిస్తూ = తేలియాడుతూ (గంతులు వేస్తూ) (పనిలో గాఢంగా నిమగ్నమవుతూ)
ధనికస్వామికి = ధనవంతుడైన యజమానికి
దాస్యం చేసే = బానిసత్వాన్ని చేసే
యంత్రభూతముల = దయ్యాలవంటి పరిశ్రమలలోని యంత్రముల
కోరలు తోమే = పళ్ళు తోమే (యంత్రముల మధ్య పనిచేసే)
కార్మిక వీరుల = వీరులైన కార్మికుల
కన్నుల నిండా = కండ్ల నిండుగా
కణకణ మండే = నిప్పుల్లా కణ కణమని మండే
విలాపాగ్నులకు (విలాప + అగ్నులకు) = దుఃఖముతో కూడిన మాటలనే అగ్నులకు
విషాదాశ్రులకు (విషాద + అశ్రులకు) = దుఃఖపుకన్నీళ్ళకు
ఖరీదు కట్టే = విలువను నిర్ణయింప గల
షరాబు లేడోయ్ = బంగారపు వ్యాపారి లేడు

భావం :
కార్మికుడు ఎప్పుడూ ప్రపంచమంతా సంపదలతో తులతూగాలని కోరుకుంటాడు. దానికోసం తన శక్తినంతా పణంగా పెడుతున్నాడు. గనులలో కాని, అడవులలో కాని, కర్మాగారాలలో కాని అడుగడుగునా యజమానులకు సేవ చేయటానికి అంకితము అవుతున్నాడు. కార్మికుని జీవితం యంత్రాలలో చిక్కుకుపోయింది. కార్మిక వీరుల కష్టసుఖాలలో పాలు పంచుకునేవారు ఎవరూ లేరు. కార్మికుని దుఃఖానికి, అగ్నిగోళాల వంటి కళ్ళనుండి కారుతున్న కన్నీటికి ఖరీదు కట్టలేము.

3వ గేయం

కావున – లోకపుటన్యాయాలూ,
కాల్చే ఆకలి, కూల్చే వేదన,
దారిద్ర్యాలూ, దౌర్జన్యాలూ
పరిష్కరించే, బహిష్కరించే
బాటలు తీస్తూ, పాటలు వ్రాస్తూ
నాలో కదలే నవ్యకవిత్వం
కార్మికలోకపు కళ్యాణానికి,
శ్రామికలోకపు సౌభాగ్యానికి
సమర్పణంగా, సమర్చనంగా
త్రిలోకాలలో, త్రికాలాలలో
శ్రమైక జీవన సౌందర్యానికి
సమానమైనది లేనేలేదని
అర్ధాలు :
కావున = కాబట్టి
లోకపుటన్యాయాలు (లోకము + అన్యాయాలు) = లోకంలో జరిగే అన్యాయాలు
కాల్చే ఆకలి = కడుపును మండించే ఆకలి
గలగల తొణకే – గల గల మని ధ్వని చేస్తూ పొంగే
కూల్చే వేదన = మనిషిని పడగొట్టే మానసిక బాధ
దారిద్య్రాలూ – దరిద్రములూ
దౌర్జన్యాలూ = దుర్మార్గాలూ
పరిష్కరించే = చక్కపెట్టే (పోగొట్టే)
బహిష్కరించే = వెలివేసే (పై చెప్పిన అన్యాయాలను దూరం చేసే)
బాటలు తీస్తూ = దారులు తొక్కుతూ
పాటలు వ్రాస్తూ = గేయాలు రాస్తూ
నాలో కదలే నవ్య కవిత్వం = నాలో నుండి వచ్చే కొత్త కవిత్వం
కార్మికలోకము + కల్యాణానికి = కార్మికుల శుభానికి
శ్రామికలోకము + సౌభాగ్యానికి = శ్రమించే రైతుల, కార్మికుల, పనివారల, మంగళానికి (వైభవానికి)
సమర్పణంగా = భక్తితో అర్పించడానికి
సమర్చనంగా = విశేషమైన పూజగా అందించడానికి
త్రిలోకాలలో = మూల్లోకాలలో (స్వర్గ, మర్త్య, పాతాళ లోకాలలో)
త్రికాలలో = భూత, భవిష్యత్, వర్తమాన కాలాల్లో
శ్రమైక జీవన సౌందర్యానికి = శ్రమించి బ్రతకడంలో గల అందానికి
సమానమైనది = సమానమైనది
లేనేలేదని = లేదని

భావం :
“ఈ లోకంలో జరిగే అన్యాయాలను, ఆకలిని వేదనను, దారిద్ర్యాన్ని, దౌర్జన్యాలను నిరసిస్తున్నాను. వాటిని పరిష్కరించాలని, బహిష్కరించాలని ఈ పాటలను రాస్తున్నాను. నాలో కదిలేది కొత్త కవితావేశం. ఇది కార్మికుల కళ్యాణానికి, శ్రామికుల సౌభాగ్యానికి అంకితం. ఎందుకంటే ముల్లోకాలలో ఈ శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేదు.” అని శ్రీశ్రీ చెప్పాడు.

AP Board 8th Class Telugu Solutions Chapter 5 ప్రతిజ్ఞ

4వ గేయం

కష్టజీవులకు కర్మ వీరులకు
నిత్యమంగళం నిర్దేశిస్తూ,
స్వస్తివాక్యములు సంధానిస్తూ,
స్వర్ణవాద్యములు సంరావిస్తూ –
వ్యథార్త జీవిత యథార్థ దృశ్యం
భావివేదముల జీవనాదములు
జగత్తుకంతా చవులిస్తానోయ్ !
అర్థాలు :
కష్టజీవులకు = కష్టపడి జీవించే రైతులకూ, కార్మికులకూ, చేతివృత్తుల వారికీ
కర్మవీరులకు = కష్టపడి పట్టుదలతో పని చేసేవారికి
నిత్యమంగళం = నిత్యమూ శుభాన్ని
నిర్దేశిస్తూ = చూపిస్తూ
స్వస్తి వాక్యములు = మంగళ వాక్యములు (శుభము కలగాలని ఆశీర్వదించే వాక్యములు)
సంధానిస్తూ = కూరుస్తూ
స్వర్ణవాద్యములు = బంగారు వాయిద్యములు
సంరావిస్తూ = మ్రోగిస్తూ
వ్యధార జీవిత (వ్యధా + ఆర్త, జీవిత) = బాధచే పీడింపబడిన జీవితము యొక్క
యథార్థ దృశ్యం = నిజమైన దృశ్యము
పునాదిగా = మూలంగా
జనించబోయే = పుట్టబోయే
భావివేదముల = రాబోయే కాలంలోని వేదాల
జీవనాదములు = జీవధ్వనులు
జగత్తుకంతా = ప్రపంచానికంతా
చవులిస్తానోయ్ = రుచి చూపిస్తాను

భావం :
బంగారు వాద్యాలతో, స్వస్తి మంత్రాలతో, కష్ట జీవులకూ, కర్మవీరులకూ హారతులిస్తాను. శ్రామికుల బాధలు కళ్ళకు కట్టినట్లుగా రాబోయే తరాలవారికి చెప్తాను. నా మాటలు భావిభారత తరాలకు వేదాలు, జీవనాదాలు అంటాడు శ్రీశ్రీ.

5వ గేయం

కమ్మరి కొలిమి, కుమ్మరిచక్రం,
జాలరి పగ్గం, సాలెల మగ్గం,
శరీర కష్టం స్ఫురింపజేసే
గొడ్డలి, రంపం, కొడవలి, నాగలి
సహస్ర వృత్తుల, సమస్త చిహ్నలు-
నా వినుతించే పునాదిగా ఇక జనించబోయే
నా విరుతించే,
నా వినిపించే నవీనగీతికి,
నా విరచించే నవీనరీతికి,
భావం
భాగ్యం !
ప్రాణం !
ప్రణవం !
అర్థాలు :
కమ్మరి కొలిమి = ఇనుప పనిచేసే కమ్మరివాని కొలిమి (నిప్పు గుంట)
కుమ్మరి చక్రం = కుమ్మరి కుండల తయారీకి వాడే చక్రం
జాలరి పగ్గం = చేపలు పట్టేవాని వలతాడు
సాలెల మగ్గం = బట్టలు నేసేవాని మగ్గం
శరీర కష్టం స్ఫురింపజేసే = శరీర కష్టాన్ని తెలిపే
గొడ్డలి, రంపం = గొడ్డలి, రంపం
కొడవలి, నాగలి = కొడవలి, నాగలి వంటి
సహస్ర వృత్తుల = వేలకొలదీ వృత్తి పనివారల
సమస్త చిహ్నాలు = అన్ని గుర్తులూ
నా వినుతించే = నేను కొనియాడే
నా విరుతించే – నేను ధ్వనించే
నా వినిపించే నవీనగీతికి = నేను వినిపించే కొత్త పాటకు
నా విరచించే : నేను రచించే
నవీన రీతికి = కొత్త పద్ధతికి
భావం = భావము
భాగ్యం = భాగ్యము
ప్రాణం = ప్రాణము
ప్రణవం = ఓంకార నాదము

భావం :
ఈ దేశంలో శరీర కష్టం చేసేవారు చాలామంది ఉన్నారు. కమ్మరి కొలిమి, కుమ్మరి చక్రం, జాలరి పగ్గం, సాలెల మగ్గం, గొడ్డలి, రంపం, కొడవలి, నాగలి మొదలైన పనిముట్లు వివిధ వృత్తులకు గుర్తులు. ఆ గుర్తులే నా కవితా వస్తువులు. నేను వారి కొరకే గీతాలు రాస్తాను. ఆ శ్రామికులు, కార్మికులు నా కవిత్వంలో నాయకులు. అదే భావం, భాగ్యం, నా కవితకు ప్రాణం, ఓంకారం.

AP Board 9th Class Telugu వ్యాసాలు

AP State Syllabus AP Board 9th Class Telugu Textbook Solutions 9th Class Telugu వ్యాసాలు Notes, Questions and Answers.

AP State Syllabus 9th Class Telugu వ్యాసాలు

1. వాతావరణ కాలుష్యం

‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అన్నారు పెద్దలు. వాతావరణం పరిశుభ్రంగా ఉండి, చక్కటి ఆరోగ్యకరంగా ఉంటే మానవుని జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. మానవునికి హానికరమైన పదార్థాలు వాతావరణంలో కలిసి ఉంటే దానిని వాతావరణ కాలుష్యం అంటారు.

వివిధ కర్మాగారాలు, పరిశ్రమలు, లెక్కలేనన్ని మోటారు వాహనాలు, మురికినీరు మొదలైనవి వాతావరణ కాలుష్యానికి కారణాలు. కర్మాగారాల వల్ల నదులన్నీ మురికినీటితో నిండిపోయి జలకాలుష్యం ఏర్పడుతోంది. పరిశ్రమలవల్ల గాలి కలుషితమవుతోంది. మోటారు వాహనాల వల్ల నగరాలలోను, పట్టణాలలోను ధ్వని కాలుష్యం ఎక్కువవుతోంది.

వాతావరణ కాలుష్యం చాలా భయంకరంగా తయారయింది. పారిశ్రామికీకరణ వల్ల ఈ సమస్య మరీ ఘోరంగా తయారయింది. వాతావరణ కాలుష్యం మానవుని మనుగడకే పెద్ద సవాలుగా పరిణమించింది. దీనివల్ల ఉదరకోశవ్యాధులు, ఊపిరితిత్తుల వ్యాధులు, కేన్సర్, గుండెజబ్బుల వంటి వ్యాధులు పెరిగిపోతున్నాయి.

వాతావరణ కాలుష్య నివారణకు ప్రభుత్వం ప్రత్యేకమైన ప్రణాళికలు తయారుచేసి అమలు చేయాలి. పరిశ్రమలు, కర్మాగారాలు మానవుల నివాసాలకు దూరంగా నెలకొల్పాలి. ప్రతి వ్యక్తి తన ఇంటినీ, పరిసరాలనూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అవకాశం ఉన్నచోట మొక్కలను విరివిగా పెంచాలి. ఐక్యరాజ్యసమితి, ప్రపంచ ఆరోగ్య సంస్థలు పరిశోధనలు చేసి వాతావరణ కాలుష్య నివారణకు తగు సూచనలు చేశాయి. వాటిని మనం విధిగా పాటించాలి.

2. బాలకార్మికులు

నిరక్షరాస్యత, కుటుంబ ఆర్థిక పరిస్థితులు, కరవు కాటకాల కారణంగా లక్షలాది పిల్లలు చిన్న వయస్సులోనే కార్మికులుగా చేరుతున్నారని అంతర్జాతీయ కార్మిక నిర్వహణ సంస్థ (ఐ.ఎల్.ఒ.) తన సర్వేలో వెల్లడించింది.

ప్రపంచంలో ఏ దేశంలోనూ లేనంతగా భారతదేశంలో బాలకార్మిక వ్యవస్థ ఉందని ఐ.ఎల్.ఒ. నిర్వహించిన సర్వేలో తెలియజేసింది. దేశంలో ఆంధ్రప్రదేశ్ లోనే అత్యధికంగా బాలకార్మికులు ఉన్నారని ఆ నివేదికలో పేర్కొన్నారు.

బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం పలు సందర్భాలలో చేస్తున్న ప్రకటనలు కేవలం ప్రకటనలుగానే మిగిలిపోతున్నాయి. కాబట్టి నిర్దిష్టమైన ప్రణాళికను ఏర్పాటు చేసి అది అమలు జరిగేటట్లు చూడాలి. ప్రభుత్వం రూపొందించిన బాలకార్మిక నియంత్రణ చట్టం సరిగా అమలు అయ్యేటట్లు చూడాలి.

భారతదేశంలో 8.7 కోట్ల మంది బాలలు పాఠశాలలకు వెళ్ళడం లేదని, వీరంతా ఇళ్ళలోను, కర్మాగారాల్లోను, పొలాల్లోను పని చేస్తున్నారని ‘గ్లోబల్ మార్చ్ ఎగనెస్ట్ చైల్డ్ లేబర్’ అనే అంతర్జాతీయ సంస్థ పేర్కొంది. కాబట్టి బాలకార్మికుల కోసం ప్రత్యేక పాఠశాలలు నెలకొల్పాలి. వాళ్ళు చదువుకొనే అవకాశం కల్పించాలి.

మన రాష్ట్రంలో 16 లక్షల మంది బాలకార్మికులు ఉన్నారు. బాలకార్మిక వ్యవస్థను పూర్తిగా రూపుమాపేందుకు ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటున్నది.

బాలకార్మికులను కూలివారుగానే చూస్తే వారు కార్మికులుగానే మిగిలిపోతారు. వారిలో ఉన్న యోగ్యతను, ప్రతిభను వెలికి తీసేందుకు సహకారం అందజేస్తే భవిష్యత్తులో ఒక మంచి నిపుణుడిని అందించేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలు కూడా బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు సహకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

AP Board 9th Class Telugu వ్యాసాలు

3. కరవు – నివారణోపాయాలు

అనావృష్టి వల్ల కరవు వస్తుంది. వరుసగా కొన్నేండ్లు కరువు వస్తే క్షామం ఏర్పడుతంది. సామాన్య వర్షపాతంలో 75% కన్నా తక్కువ వర్షపాతం ఉండే స్థితిని ‘కరవు’గాను, 50% కన్నా తక్కువ వర్షపాతం ఉండే స్థితిని ‘తీవ్రమైన కరవు’ గాను భారత వాతావరణ శాఖ నిర్వచించింది.

ఋతుపవనాల నియమరహిత స్వభావం వల్ల దేశంలో ఏదో ఒకచోట ప్రతి సంవత్సరం తరచుగా కరవులు సంభవిస్తున్నాయి. ఎక్కువగా వాయవ్య భారతదేశం, ఆ తరువాత దక్షిణ మరియు మధ్య భారతదేశంలో తరచుగా కరవులు సంభవిస్తున్నాయి. రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, మధ్యప్రదేశ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, తమిళనాడులు అతిగా కరవులు సంభవించే రాష్ట్రాలు.

నివారణోపాయాలు :

  1. కరవు పీడిత ప్రాంతాలలో భూమిశిస్తు పూర్తిగా తొలగించడం గానీ, తగ్గించడం గానీ చేయాలి.
  2. క్షామపీడిత ప్రాంతాలలో ప్రజలు తిరిగి వ్యవసాయం చేసుకొనేందుకు వీలుగా ఆర్థిక సహాయం అందించడం, నీటిపారుదల సౌకర్యాలు కలిగించడం వంటివి చేయాలి.
  3. ఆయా ప్రాంతాలను బట్టి ఏయే పంటలు వేస్తే బాగా పండుతాయో వ్యవసాయదారులకు సూచనలివ్వాలి.
  4. పండిన పంటలకు మార్కెటింగ్ సౌకర్యం కలిగించాలి.
  5. తుపానులు వచ్చినపుడు తట్టుకొని, నిలబడి పంటనిచ్చే కొత్త రకాలను శాస్త్రజ్ఞులు కనిపెట్టాలి.
  6. వాతావరణ సమతౌల్యాన్ని కాపాడాలి.

కరవు నష్టాలను తగ్గించేందుకు భారత ప్రభుత్వం “కరవుకు గురయ్యే ప్రాంతాల ప్రణాళిక” (Drought prone area programme) ప్రవేశపెట్టింది. ఈ ప్రణాళికలో నీటిపారుదల, మృత్తికా పరిరక్షణ, వనీకరణ మొదలగు పథకాలున్నాయి. ప్రభుత్వమేకాకుండా ప్రజలు కూడా మానవతా దృష్టితో కరవుపీడిత ప్రాంతీయులను ఆదుకోవడం తమ కర్తవ్యంగా భావించాలి.

4. పర్యావరణ సంరక్షణ

భూమి, నీరు, గాలి మొదలైన వాటితో మనిషికి ఉండే అవినాభావ సంబంధమే పర్యావరణం. కాబట్టి పర్యావరణం అంటే పరిసరాల వాతావరణం అని అర్థం. పరిసరాల వాతావరణం కలుషితం కాకుండా కాపాడుకోవడమే పర్యావరణ సంరక్షణ అనబడుతుంది.

ప్రాణులు నివసించేది నేలపైన గదా ! ఆ నేలతల్లిని సరిగా చూసుకోవాలి. భూమిపై చెత్తా, చెదారమే కాదు ఓషధులుంటాయి. చెట్లుంటాయి. జంతువులుంటాయి. మనం జీవించటానికి ఆహారం లభించేది భూమి వల్లనే గదా ! రసాయనిక ఎరువుల వాడకం వల్ల భూమి నిస్సారమైపోతోంది. భూమిని ఆరోగ్యంగా ఉంచాలి. భూమి సమతౌల్యాన్ని పోషించాలి.

జలకాలుష్యం మిక్కిలి భయంకరమైనది. రసాయనిక పదార్థాలు, పరిశ్రమల వల్ల విడుదలయ్యే ద్రవపదార్థాలు సాగునీటిని, త్రాగే నీటిని కాలుష్యపరుస్తాయి. మురుగునీరు, త్రాగే నీరు అనే భేదం లేకుండా పోతోంది. డ్రైనేజీ వ్యవస్థ అరకొరగా ఉంది. దీనివల్ల కలరా, మలేరియా ఫ్లోరోసిస్, విషజ్వరం, టైఫాయిడ్ వంటివేకాక వైద్యులకి అంతుపట్టని కొత్త రోగాలు కూడా బయలుదేరాయి.

ఇక వాయు కాలుష్యం, గాలివల్లనే మనం జీవిస్తున్నాం. అటువంటి గాలి స్వచ్ఛంగా ఉండాలి. కానీ ఆధునిక పారిశ్రామికత పేరుతో గాలి కూడా కలుషితమైపోతోంది. విషపూరితమైన గాలి పీల్చటం వలన ఊపిరితిత్తులు, జీర్ణకోశం, గుండెకాయ, కళ్ళు అనారోగ్యానికి గురై ప్రమాదాలు సంభవిస్తున్నాయి. జీవితం రోగాలమయం అవుతోంది.

యంత్రాలవల్ల, వాహనాల వల్ల ధ్వనికాలుష్యం వ్యాపిస్తోంది. అణుశక్తి పరీక్షల వల్ల కూడా వాతావరణ కాలుష్యం ఏర్పడుతోంది. 1970లో అమెరికాలో పర్యావరణ పరిరక్షణ ఉద్యమం బయలుదేరింది. వాటి నుంచి శాస్త్రజ్ఞులు పర్యావరణ కాలుష్య నివారణకు విశేషమైన కృషి చేస్తున్నారు. ప్రతి సంవత్సరం జూన్ 5వ తేదీని పర్యావరణ దినోత్సవంగా పాటిస్తున్నారు. పర్యావరణ వ్యవస్థలోని సమతౌల్యాన్ని కాపాడుకోవటానికి అందరూ కృషి చేయాలి.

5. విద్యార్థులు – క్రమశిక్షణ

విద్యను అర్థించేవారు విద్యార్థులు. క్రమశిక్షణ అంటే సక్రమమైన ప్రవర్తనని కలిగి ఉండటం. నిజానికి క్రమశిక్షణ అన్ని వర్గాలవాళ్ళకీ, అన్ని వయస్సుల వాళ్ళకీ అవసరమే. అయితే విద్యార్థులు భావిభారత పౌరులు! జాతి భవిష్యత్తు వాళ్ళమీదే ఆధారపడి ఉంది. “మొక్కే వంగనిదే మానై వంగునా !” అన్నారు. చిన్నప్పుడే క్రమశిక్షణ అలవడటం సాధ్యం. పెద్దయిన తర్వాత మనిషి మారటం చాలా కష్టం. అందుకని విద్యార్థుల్లో క్రమశిక్షణ ఉండాలి.

అయితే విద్యార్థుల్లో క్రమశిక్షణ ఎందుకు లోపిస్తోంది ? అనే అంశాన్ని లోతుగా పరిశీలించవలసి ఉంది. అందుకు కొన్ని

కారణాలు:

  1. కావలసిన కోర్సులో సీటు దొరకకపోవడం – కావలసిన రంగంలో ఉద్యోగం దొరకకపోవడం.
  2. రాజకీయ పార్టీల, నాయకుల ప్రభావం, జోక్యం.
  3. విద్యాలయాల్లో అవినీతి, అవకతవకల పరంపరలు !
  4. ప్రభుత్వం విద్యను వ్యాపారంగా చేయడం.
  5. తల్లిదండ్రుల అశ్రద్ధ, అలసత్వం.

ఇన్ని కారణాలతో పాటు పేర్కొనవలసిన మరొక రెండు ముఖ్యమైన అంశాలున్నాయి – ఒకటి సినిమా, రెండు టీ.వీ ! ఈ రెండూ మానసిక వికాసానికి, జ్ఞానాభివృద్ధికి ఉద్దేశించబడ్డాయి. కానీ పాశ్చాత్య విషసంస్కృతి ప్రభావంచే ఈ రెండు ప్రసార సాధనాలూ యువకులపై, విద్యార్థులపై “స్లోపాయిజన్” లా పనిచేస్తున్నాయి.

విద్యార్థుల్లో క్రమశిక్షణ అలవడాలంటే ముందుగా

  1. విద్యను వ్యాపారంగా మార్చే ధోరణులపై కఠిన వైఖరి అవలంభించాలి.
  2. విద్యారంగంలోని అవకతవకల్ని, అవినీతిని (లీకేజీ, మాస్ కాపీయింగ్ సంప్రదాయాల్ని) అరికట్టాలి.
  3. ఉపాధ్యాయులు చిత్తశుద్ధితో, ఆదర్శవంతంగా ప్రవర్తిస్తూ బోధనకి అంకితమవ్వాలి.
  4. రాజకీయ పార్టీల నీడ కూడా విద్యాలయాలపై పడకూడదు.
  5. విద్యాభ్యాసం తర్వాత ఉద్యోగం వస్తుందన్న గ్యారంటీ ఉండాలి.
  6. విద్యార్థుల్లో దేశభక్తి, సచ్ఛీలత, సహనం అలవడేలా తగిన చర్యలు తీసుకోవాలి.

క్రమశిక్షణ ఇతరులు బలవంతంగా రుద్దినట్లు ఉండకూడదు. ఆత్మగౌరవానికి సంబంధించినదిగా, ఆత్మశక్తికి సంబంధించినదిగా, జీవితధ్యేయంగా క్రమశిక్షణను అలవరచుకోవాలి. అప్పుడు విద్యార్థులతో పాటు దేశం కూడా అక్షరజ్యోతిగా వెలిగి అభివృద్ధి బాటలో పయనిస్తుంది.

AP Board 9th Class Telugu వ్యాసాలు

6. దూరదర్శన్

విజ్ఞానశాస్త్ర ప్రగతికి, మానవుడి ప్రతిభకి నిదర్శనం టెలివిజన్ దృశ్యతరంగాలను గాలిలో ప్రసారం చేయటం ద్వారా దృశ్యాలు చూడగలుగుతున్నాం. శబ్దతరంగాల ద్వారా శబ్దం వింటున్నాం. టెలివిజన్ ను మానవుడి ప్రతిసృష్టిగా పేర్కొనాలి. ఇది బ్రిటన్లో 1936లో మొదట వ్యాప్తిలోకి వచ్చింది. దీనిని స్కాట్ దేశపు ఇంజనీర్ జాన్ లాగ్ బర్డ్ 1928లో కనిపెట్టాడు.

టెలివిజన్ ఈనాడు ప్రపంచమంతటా వ్యాప్తి చెందింది. టీ.వీ.లు లేని ఊరులేదు. ఇది కేవలం ప్రచార సాధనమో, వినోద సాధనమో కాదు. టీ.వీ.ల ద్వారా ప్రభుత్వం, వాణిజ్య సంస్థలు ప్రచారం చేసుకోవచ్చు. మన సంస్కృతిని, కళలను కాపాడుకోవచ్చు. మనం చూడలేని ప్రదేశాలు చూడవచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రపంచాన్ని మన ముందు నిలబెట్టేది టెలివిజన్. విద్యారంగంలో, వైద్యరంగంలో, వాణిజ్యరంగంలో, విజ్ఞానశాస్త్ర రంగంలో నేడు టెలివిజన్ కు తిరుగులేని స్థానం ఉంది. “వీడియో” పరిజ్ఞానానికి టీ.వీ. మూలకారణం. నిరక్షరాస్యత నిర్మూలనలో టెలివిజన్ కీలకపాత్ర వహిస్తోంది. ప్రజల్ని అన్ని రంగాలలోనూ చైతన్యవంతం చేస్తున్న శక్తివంతమైన సాధనం టెలివిజన్.

విదేశీ ఛానల్స్ ప్రసారం వల్ల యువత నిర్వీర్యమవుతోంది. మన సంస్కృతిని విస్మరిస్తున్నారు. సినిమాల వ్యా మోహం, సెక్స్ వ్యామోహం ఎక్కువై పెడదారి పడుతున్నారు. ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం పిల్లలపై టీ.వీ.లు దుష్ప్రభావం చూపిస్తున్నాయని వెల్లడైంది. కాబట్టి టెలివిజన్న మంచికి ఉపయోగించుకొనేలా చూడవలసిన బాధ్యత ప్రభుత్వానిది. ప్రైవేట్ ఛానలను నియంత్రించి వాటిపై సెన్సారు అధికారాన్ని కలిగి ఉండాలి. అప్పుడే టీ.వీ. వల్ల సత్రయోజనాలుంటాయి. .

7. గ్రంథాలయాలు

“చిరిగిన చొక్కా అయినా తొడుక్కో – కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కో” అన్నది సూక్తి. ఇటువంటి సూక్తులెన్నో పుస్తకాల ప్రాముఖ్యాన్ని, ప్రాశస్త్యాన్ని వివరించేవి ఉన్నాయి. తరతరాల విజ్ఞాన సంపదను అందించేవి గ్రంథాలు.. అటువంటి గ్రంథాలు గల నివాసాన్ని గ్రంథాలయం (Library) అంటారు.

అయ్యంకి వెంకట రమణయ్య, గాడిచర్ల హరిసర్వోత్తమరావు, నాళం కృష్ణారావు మొదలైన వాళ్ళు మన రాష్ట్రంలో గ్రంథాలయోద్యమాన్ని చేపట్టి గ్రంథాలయాలను స్థాపించారు. గ్రంథాలయ మహాసభలు నిర్వహించి పుస్తకాలను సేకరించి భద్రపరిచారు.

ప్రపంచంలో గొప్ప గొప్ప గ్రంథాలయాలున్నాయి. అమెరికాలో గల ‘కాంగ్రెసు లైబ్రరీ’, రోము నగరంలోని ‘వాటికన్ లైబ్రరీ’, ‘బ్రిటిష్ లైబ్రరీ’ మొదలైనవి ప్రపంచంలో పేరొందాయి. మన దేశంలో చెన్నైలోని “కన్నెమరా” గ్రంథాలయం, తంజావూరులోని “సరస్వతీ మహలు”, వేటపాలెంలోని “సారస్వత నికేతనం”, హైదరాబాదులోగల “శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయం” మొదలైనవి చెప్పుకోదగ్గవి చాలా ఉన్నాయి. కడపలో సి.పి. బ్రౌన్ స్మారక గ్రంథాలయం కూడా నెలకొల్పబడింది.

గ్రంథాలయాలలో చాలా రకాలున్నాయి. ప్రభుత్వ గ్రంథాలయాలు, స్వచ్ఛంద సంస్థల గ్రంథాలయాలు ఉన్నాయి.

గ్రంథాలయాల వల్ల చాలా లాభాలున్నాయి :

  1. గ్రంథాలయాలు మనిషిని మనిషిగా మారుస్తాయి.
  2. మహామేధావులు తరతరాలుగా సంపాదించిన అనుభవాలు, ఆలోచనలు గ్రంథాలలో భద్రపరచబడతాయి.
  3. దేశాభ్యుదయానికి, సమాజవికాసానికి మూలస్తంభాలు గ్రంథాలయాలు.
  4. గ్రంథపఠనమనే మంచి అలవాటు అలవడుతుంది.
  5. గ్రంథాలు తండ్రివలె ఆదేశిస్తాయి. తల్లివలె లాలిస్తాయి. మిత్రుని వలె ఆదుకుంటాయి. గురువువలె ప్రబోధిస్తాయి.

గ్రంథాలయాధికారులు పుస్తకాలు కొనేటప్పుడు అత్యంత శ్రద్ధ వహించాలి. డబ్బును దుర్వినియోగం చెయ్యకుండా మంచి పుస్తకాలనే కొనాలి. హాని కలిగించే పుస్తకాలను నిర్మొహమాటంగా తిరస్కరించాలి. పోటీ పరీక్షలకి, ఉద్యోగ పరీక్షలకి, చదువుకి కావలసిన పాఠ్య గ్రంథాలు, క్విజ్ పుస్తకాల వంటివాటికి ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రభుత్వం గ్రంథాలయోద్యమాన్ని నీరుకార్చకుండా తగిన శ్రద్ధవహిస్తే సమాజం అభ్యుదయ పథంలో పయనిస్తుంది.

8. కంప్యూటర్

కంప్యూటర్ అనేది ఒక ఎలక్ట్రానిక్ పరికరం. కంప్యూటర్ లో ‘డేటా’ (Data) ను నిల్వ చేయవచ్చు. దాన్ని మళ్ళీ ఎప్పుడైనా వెనక్కి తీసుకోవచ్చు. అంతేకాకుండా కంప్యూటర్ చాలా కచ్ఛితంగా, త్వరగా ఫలితాన్ని ఇస్తుంది. ఇటువంటి అద్భుత సాధనమైన కంప్యూటర్ ను కనిపెట్టినవాడు ఛార్లెస్ బాబ్బేజి.

కంప్యూటర్ గురించి మాట్లాడినప్పుడు మనం తరచుగా హార్డువేర్, సాఫ్ట్ వేర్ అనే పదాలను వింటూ ఉంటాం. హార్డువేర్ అంటే కంప్యూటర్ పరికరాలు. సాఫ్ట్ వేర్ అంటే కంప్యూటర్ పనిచేయడానికి కావలసిన పద్ధతిని తెలిపేది.

కంప్యూటర్లను ఉపయోగించి ప్రస్తుతం పరిశోధనలు చేస్తున్నారు. కూడికలు, తీసివేతలు, గుణకారాలు (హెచ్చవేతలు), భాగహారాలు వంటి లెక్కలు చాలా వేగంగా చేయడానికి కంప్యూటర్ బాగా పనికివస్తుంది. కంప్యూటర్ల ద్వారా వాతావరణ పరిస్థితిని తెలుసుకోవచ్చు. విమానాలు, బస్సులు, రైళ్ళు మొదలైనవాటి టెక్కెట్ల రిజర్వేషన్లకు కంప్యూటర్లను ఉపయోగిస్తారు. పెద్ద పెద్ద కర్మాగారాల్లో, కార్యాలయాల్లో, బ్యాంకుల్లో ఇవి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. విద్య, వైద్య, వ్యాపార, వ్యవసాయ, సమాచార, శాస్త్ర సాంకేతిక రంగాలలో ఈ కంప్యూటర్లు ప్రముఖపాత్ర వహిస్తున్నాయి. కంప్యూటర్‌ను ఉపయోగించి ఇంటర్నెట్ అనే సౌకర్యం ద్వారా ప్రపంచంలో జరుగుతున్న విషయాలన్నింటినీ మన ఇంట్లోని కంప్యూటర్ ముందు కూర్చొని తెలుసుకోవచ్చు.

అయితే కంప్యూటర్లని వాడటం వల్ల ఉద్యోగాలకు నష్టం వాటిల్లుతుందనీ, నిరుద్యోగ సమస్య పెరుగుతుందని కొందరి వాదన. ఇది కొంతవరకు నిజమే.. ఆ మాత్రంచేతనే ఆధునిక విజ్ఞానాన్ని త్రోసిరాజనడం న్యాయం కాదు. కాబట్టి భావిభారత పౌరులైన విద్యార్థులు కంప్యూటర్ విద్య ఆవశ్యకతను గుర్తించి తప్పక దాన్ని అభ్యసించాలి.

AP Board 9th Class Telugu వ్యాసాలు

9. జాతీయ సమైక్యత

ఒక దేశంలో పుట్టి పెరిగిన వారంతా ఒక జాతి వారని చెప్పవచ్చు. మనది భారత జాతి. భాష, మతం, సంస్కృతి, ఆచార వ్యవహారాలు ఒక్కటైనా, కాకున్నా ఒకే ప్రభుత్వం కిందనున్న ప్రజలంతా ఒకే జాతి అని చెప్పవచ్చు. మతాలు వేరయినా, భాషలు, రాష్ట్రాలు వేరయినా జాతి అంతా కలసి ఉండటమే జాతీయ సమైక్యత అంటారు.

మన భారతీయులలో కనిపించే దౌర్బల్యం అనైక్యత. మతం పేరిటనో, అధికారాన్ని ఆశించో మన రాజులొకరితో ఒకరు కయ్యాలాడుకొని విదేశీయుల పాలనలో దేశాన్ని పడవేశారు. నేటికీ మన దేశాన్నత్యాన్ని సహింపలేని విదేశాలున్నాయి. ఆ దేశాలతో మన జాతి సమైక్యతకు భంగం కలిగించే కొన్ని శక్తులు, మన దేశంలోనే ఉండి పొత్తు పెట్టుకొంటున్నవి. అట్టి అవాంఛనీయ శక్తులను తుదముట్టించి మన జాతినంతా ఒకే తాటిపై నిలపాలి. మనం ఏ రాష్ట్రం వారమైనా, ఏ భాషను మాట్లాడే వారమైనా మనమందరం భారతీయులమనే మాట మరువరాదు.

కొందరు మత కలహాలు పెంచి వారిలో భేదాలు రెచ్చగొట్టి హత్యలకు, లూటీలకు, గృహదహనాలకు సిద్ధపడుతున్నారు. దీనివల్ల ప్రజలలో ఇతర మతంవారిపై ద్వేషం పెరుగుతుంది. కొందరికి ప్రాంతీయ దురభిమానం, మరికొందరికి తమ భాషలపై మోజు ఎక్కువ. స్వభాషాభిమానం ఉండటం మంచిదే. కానీ పరభాషపై ద్వేషం ఉండకూడదు. భాషా రాష్ట్రాలుగా విభజించిన తరువాత ప్రాంతీయ దురభిమానాలు పెరిగి నదీ జలాల కొరకు, తమ ప్రాంతాల అభివృద్ధి కొరకు పరస్పరం కలహించుకొంటున్నారు.

మన జాతిలో అనైక్యతను పోగొట్టి ఐక్యపరచటానికి ప్రభుత్వం జాతీయ సమైక్యతా మండలిని స్థాపించింది. భారత జాతి అంతా ఒక్కటే అని బోధిస్తున్నది. జాతీయ సమైక్యతవల్ల దేశం అన్నిరంగాలలో అభివృద్ధి చెందుతుంది. అంతేకాకుండా విదేశాలలో భారతజాతి కీర్తిపతాకలు రెపరెపలాడతాయి.

10. మతసామరస్యం

భారతీయ సమాజంలోని వ్యక్తులకు మతం అనేది పుట్టుక నుండి సంక్రమిస్తుంది. అదే విధంగా మతము యొక్క ప్రభావం వ్యక్తిపై పుట్టుక నుండి మరణించే వరకు ఉంటుంది. ప్రపంచంలో అధిక ప్రభావం కలిగిన ముఖ్యమైన మతాలన్నీ భారతదేశంలో ఉన్నాయి. ఎవరికి వారు వారి మతం గొప్పదిగా భావించడం జరుగుతుంది. ఒకనాటి సమాజాన్ని క్రమబద్ధం చేయడానికి, ఆనాటి సమాజంలో శాంతిభద్రతలు కాపాడుకోవడానికి మతాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. భారతదేశంలో ఉన్న మతాలను ఏడు రకాలుగా విభజించవచ్చు.

  1. హిందూమతం,
  2. ముస్లింమతం,
  3. క్రైస్తవమతం,
  4. బౌద్ధమతం,
  5. జైనమతం,
  6. సిక్కుమతం,
  7. పార్సీ, యూదుమతం.

భారతీయ సమాజంలో హిందూమతం వారే ఎక్కువగా ఉన్నప్పటికీ అనేక కారణాలవల్ల మతాల మధ్య వ్యత్యాసాలు, సంఘర్షణలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఈ విధమైన మతతత్వానికి అనేక కారణాలున్నాయి. వాటిలో ముఖ్యమైనవి :

  1. ప్రజలలో స్వార్థబుద్ధి,
  2. మహమ్మదీయులలో ఆర్థిక బలహీనతల కారణంగా మైనార్టీలకు ఎక్కువ సౌకర్యాలను కలిగించాలనే వారి వాదన,
  3. ప్రాంతీయతత్త్వం మొదలైన కారణాలవల్ల భారతీయ సమాజంలో మతతత్త్వం వెర్రితలలు వేస్తోంది. మతతత్వానికి మరొక ముఖ్యకారణం మతంతో రాజకీయాలు మిళితమై ఉండటం.

మతాన్ని రాజకీయాల్లో చేర్చటంవల్ల భారత్ నుండి పాకిస్థాన్ విడిపోయింది. నేడు సిక్కుమతం వారు భారత్ నుండి విడిపోయి స్వతంత్ర దేశంగా ఏర్పడతామని అనేక సంవత్సరాలుగా ఉద్యమిస్తూనే ఉన్నారు. మరో ప్రక్క ‘రామజన్మభూమి – బాబ్రీ మసీదు’ వివాదం మతసమస్యగా తయారయింది. భారతదేశంలో మతకలహాలు తరచూ సంభవిస్తూనే ఉన్నాయి. అల్ప

సంఖ్యాకులకు, అధిక సంఖ్యాకులకు మధ్య పరస్పర విశ్వాసం, సామరస్యం లోపించడంతో ఈ భయానక వాతావరణం ఏర్పడి అల్లర్లు, అలజడులు, ఆస్తినష్టం, ప్రాణనష్టం తరచు ఏర్పడుతూనే ఉన్నాయి. వివిధ రాజకీయ పక్షాలు పాక్షిక ప్రయోజనాల సాధనకోసం మతకలహాలను ఒక ఆయుధంగా ఉపయోగించుకొంటున్నాయి.

ఈ విధమైన పరిస్థితులను చక్కదిద్దాలంటే ప్రజలు చైతన్యవంతులై రాజకీయ నాయకుల బూటకపు మాటలకు మోసపోక పరమత సహనం కలిగి ఉండాలి. మత సామరస్యంతో అందరూ కలిసిమెలసి జీవించడం నేర్చుకోవాలి.

AP Board 9th Class Telugu వ్యాసాలు

11. జనాభా సమస్య కుటుంబ నియంత్రణ

జనాభా ఎక్కువగుట వలన సమస్య ఏర్పడటాన్ని జనాభా సమస్య అంటారు.

“అమెరికాలో డాలర్లు పండును
ఇండియాలో సంతానం పండును”

అని తెలుగులో బాలగంగాధరతిలక్ అనే కవి వ్యంగ్యంగా భారతీయులకి సంతానంపై గల మక్కువ తెలిపాడు. జనాభా సమస్య ఏర్పడటానికి ఈ క్రింది కారణాలు ముఖ్యం

  1. సంతానం ఎక్కువగా ఉండటం గొప్పదనంగా భావించడం.
  2. ఆడపిల్లలు లేదా మగపిల్లలు కావాలనే కోరికలు.
  3. చిన్నప్పుడే వివాహాలు చెయ్యటం.
  4. నిరక్షరాస్యత.
  5. మత విశ్వాసాలు.

ఇన్ని కారణాల వల్ల రాను రాను జనాభా ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతోంది. జనాభా సమస్యను పరిష్కరించటానికి ప్రభుత్వం పటిష్టమైన ప్రణాళికా విధానం రూపొందించింది. జనాభా సమస్య నిర్మూలనకు తీసుకోవలసిన చర్యలు :

  1. ‘కుటుంబ నియంత్రణ’ ను అన్ని మతాల ప్రజలు పాటించేలా చర్యలు తీసుకోవాలి.
  2. జనాభా సమస్య వల్ల ఏర్పడే నష్టాలను ప్రజలకు తేటతెల్లం చెయ్యాలి.
  3. స్త్రీల కంటే పురుషులు కుటుంబ నియంత్రణ చికిత్స చేసుకోవటం తేలిక అని చెప్పాలి.
  4. కుటుంబ నియంత్రణకి ప్రోత్సాహం కలిగించే సదుపాయాలు, సౌకర్యాలు కల్పించాలి.
  5. ఆడయినా, మగయినా ఒకటేనన్న భావాన్ని కలిగించాలి.
  6. కుటుంబ నియంత్రణ పాటించడం పాపమనే భావనని తొలగించాలి.

అప్పుడు మాత్రమే జనాభా పెరుగుదలను అరికట్టడం సాధ్యమవుతుంది. జనాభా సమస్య వల్ల నష్టాలు ఇవి –

  1. జనాభా పెరుగుదల వల్ల ఆహార సమస్య, నిరుద్యోగ సమస్య, కాలుష్య సమస్యల వంటివి ఎక్కువవుతాయి.
  2. విద్యాలయాలలో సీట్లు లభించక విద్యావకాశాలు తగ్గిపోతాయి.
  3. దేశ ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నమవుతుంది.
  4. “అందరికీ ఆరోగ్యం ” అనేది సాధ్యం కానేరదు.
  5. సంతానం ఎక్కువగా ఉంటే తల్లిదండ్రులపై భారం ఎక్కువై పిల్లల్ని సక్రమంగా పెంచి పోషించలేరు.
  6. జనాభా ఇదే విధంగా పెరుగుతూవుంటే బట్టకీ, ఇంటికీ కూడా కరవు తప్పదు.

అందువల్ల ప్రభుత్వం జనాభా సమస్య నిర్మూలనకే అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. ‘చిన్న కుటుంబమే చింతలు లేని కుటుంబం’ అని బోధించడమే కాదు. నాయకులు, అధికారులు తాము కూడా పాటించాలి. కుటుంబ నియంత్రణ పాటించని వారిని శిక్షించే చట్టం రూపొందించాలి. అప్పుడే దేశం ప్రగతి మార్గంలో పయనిస్తుంది.

AP Board 9th Class Telugu వ్యాసాలు

12. విజ్ఞానయాత్రలు

విజ్ఞానయాత్రలు లోకజ్ఞానాన్ని కలిగించేవి. అయినా ఇవి వినోదయాత్రలుగా, విహారయాత్రలుగా వ్యవహారంలో ఉన్నాయి. అంటే కొన్ని ప్రత్యేక స్థలాలకి ప్రయాణం చేయటం వల్ల విజ్ఞానం సంపాదించవచ్చు. విజ్ఞానమే కాకుండా వినోదం కూడా లభిస్తుంది.

పుస్తక పఠనం వల్ల పుస్తక జ్ఞానం మాత్రమే లభిస్తుంది. లోకానుభవం, ప్రజల ఆచారవ్యవహారాలు, మన సంస్కృతి తెలుసుకోవాలంటే పర్యటనలు తప్పనిసరి. పుస్తకాలలో ఉన్న విషయాలను పూర్తిగా ఆకళింపు చేసుకోవాలంటే యాత్రలు చేయవలసి ఉంది. ఉదాహరణకు నీటి నుంచి విద్యుత్ ఎలా లభిస్తోందో పుస్తకాలలో వివరంగా ఉంటుంది. అది చదివితే కొంతమాత్రమే తెలుస్తుంది. అది కేవలం “Bookish knowledge”. జలవిద్యుత్ కేంద్రానికి వెళ్ళి, అది పనిచేసే విధానాన్ని పరిశీలించినప్పుడు సంపూర్ణ జ్ఞానం లభిస్తుంది. ముఖ్యంగా చరిత్ర, సైన్సు వంటి విషయాల అవగాహనకు యాత్రలు ఎంతో అవసరం.

విజ్ఞానయాత్రల వల్ల ముఖ్యమైన ప్రయోజనాలు –

  1. లోకజ్ఞానం అలవడుతుంది.
  2. మానసిక విశ్రాంతి లభిస్తుంది.
  3. విభిన్న సంస్కృతుల్ని, భాషల్ని, జీవన విధానాల్ని తెలుసుకోవచ్చు.
  4. పదిమందితో ఏవిధంగా మెలగాలో అనుభవం వస్తుంది.
  5. స్నేహితులను పొందే అవకాశం లభిస్తుంది.
  6. జాతి సమైక్యత, దేశ సమైక్యతకి దోహదం చేస్తాయి.
  7. కవులకి, చిత్రకారులకి, మానసిక రోగులకి స్ఫూర్తిని, ఉల్లాసాన్ని కలిగిస్తాయి.

ఇటువంటి విజ్ఞాన యాత్రల్లో చాలా రకాలున్నాయి-

  1. ప్రకృతికి సంబంధించినవి – ఊటీ, హిమాలయాలు, జోగ్ జలపాతం మొదలగునవి.
  2. చారిత్రక సంబంధమైనవి-ఎల్లోరా, రామప్పగుడి, చార్ మినార్ మొదలగునవి.
  3. శాస్త్ర సంబంధమైనవి-బిర్లా ప్లానిటోరియం, పరిశ్రమలు, అణుకేంద్రాలు మొదలగునవి.
  4. ఈ యాత్రల పట్ల విద్యార్థి దశనుండే ఉత్సాహం ఏర్పడేలా చూడాలి. విద్యార్థిగా ఉన్నప్పుడే లోకజ్ఞానం అలవడితే జీవితం సంపన్నమవుతుంది – అర్థవంతమవుతుంది. ఉపాధ్యాయుల, విద్యార్థుల మధ్య సత్సంబంధాలు ఏర్పడతాయి. ఉపాధ్యాయుల వల్ల ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. విద్యార్థులలో ఐకమత్యానికి కూడా ఈ యాత్రలు తోడ్పడతాయి.

విజ్ఞానయాత్రలు లేదా విహారయాత్రలు కేవలం యువకులకో లేదా విద్యార్థులకో, కళాకారులకో అనుకోవటం సరికాదు. అన్ని వయస్సులవాళ్ళకీ, అన్ని వృత్తులవాళ్ళకీ అవసరమే. కూపస్థమండూకం లాగా జీవించటం మానవుడి నైజం కాదు కాబట్టి విజ్ఞానయాత్రలు అత్యంతావశ్యకాలు.

13. విద్యార్థులు – సంఘసేవ

విద్యార్థుల ప్రప్రథమ కర్తవ్యం విద్యాభ్యాసం అనటంలో సందేహం లేదు. కానీ విద్యార్థులు కూడా ఈ దేశపు పౌరులే. వాళ్ళూ సంఘజీవులే. సంఘంలో భాగస్వాములే. కాబట్టి సంఘసేవలో వాళ్ళకీ బాధ్యత ఉంది. విద్యాభ్యాసానికి ఆటంకం లేకుండానే సంఘసేవ చేసే అవకాశాలున్నాయి.

“చిన్ని నా బొజ్జకు శ్రీరామరక్ష” అని స్వార్థంగా జీవించటం సంఘజీవి లక్షణం కాదు. గురజాడ అన్నట్టు

“సొంతలాభం కొంత మానుకు
పొరుగువాడికి తోడుపడవోయ్”

అన్న భావనైనా కనీసం ఉండాలి. ఇతరులకి మనం తోడ్పడితే ఇతరులు మనకి తోడ్పడతారు. అదే సంఘీభావం అంటే. సంఘసేవ ఎలా చెయ్యాలి ? ఏ పనులు చేస్తే సంఘసేవ అవుతుంది ? విద్యార్థులు చేయదగిన కార్యక్రమాలు ఏవి ? అంటే

  1. ప్రమాదాల బారినుండి కాపాడటం,
  2. వృద్ధులకి, అంగవికలురకి చేయూతనివ్వటం,
  3. ఆపదలో ఉన్నవారికి సహకారమందించటం,
  4. విద్యాదానం చేయటం,
  5. మురికివాడల్ని పరిశుభ్రం చెయ్యటం మొదలగునవి.

ఇవి ఏ విద్యార్థి అయినా చేయదగిన కనీస కార్యక్రమాలు. సంఘసేవకి పదవులు అక్కరలేదు. ధనమూ అంతగా అవసరం లేదు. సేవాతత్పరత ఉంటే చాలు. మానవతా దృక్పథం ఉంటే చాలు. కొందరు కీర్తికోసం, ప్రచారం కోసం సేవచేస్తున్నట్టు నటిస్తారు. అది స్వార్థపూరితమైన ప్రవర్తన అవుతుంది. విద్యార్థులు అటువంటివారు కారు. నిజంగా తలచుకుంటే విద్యార్థులు చేయలేనిది ఏమీ ఉండదు. ఉత్సాహం, బలం, ఆసక్తి గల విద్యార్థులే అసలైన సంఘసేవా పరాయణులుగా ఉంటారు. అందుకనే జాతీయ సేవా పథకం (National Service Scheme – NSF) విద్యాలయాలలో ప్రవేశపెట్టారు.

ప్రతి కళాశాలలోనూ ఈ జాతీయ సేవా పథకంలో చాలామంది విద్యార్థులు చేరి సంఘసేవ చేస్తున్నారు. హైస్కూల్సులో ఎన్‌సిసి, స్కౌట్స్ లో కూడా చేరి సంఘసేవ చేస్తున్నారు. ఒక విధంగా ప్రభుత్వ సంస్థలు, దేశ సేవకులనిపించుకొనే నాయకులు చేయని, చేయలేని పనులు విద్యార్థులు చేసి చూపించడం ప్రశంసనీయం.

విద్యార్థులు ఈ విధంగా సంఘసేవ చెయ్యటంలో వారికొక ఆత్మసంతృప్తి కలుగుతుంది. ఆత్మవిశ్వాసం ఏర్పడుతుంది. తమ దేశభక్తిని ప్రకటించుకొనే సువర్ణావకాశం సంఘసేవ. కార్యదీక్షా దక్షతలు అలవడతాయి. కాబట్టి విద్యార్థుల్ని సత్పౌరులుగా తీర్చిదిద్దే సంఘసేవా కార్యక్రమాలకి ప్రభుత్వం ప్రోత్సాహం ఇవ్వాలి.

AP Board 9th Class Telugu వ్యాసాలు

14. నిరుద్యోగ సమస్య

ఉద్యోగం లేకపోవడమే నిరుద్యోగం. ఉద్యోగాలు చేయగలవారందరికీ ఉద్యోగాలు చూపించలేకపోవడాన్నే నిరుద్యోగ సమస్య అంటారు. పూర్వకాలంలో అందరూ కులవృత్తులకే ప్రాధాన్యమిచ్చేవారు. కానీ నేడు అందరూ ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎగబ్రాకుట వల్ల నిరుద్యోగ సమస్య తీవ్రరూపం దాల్చింది.

మనకు స్వాతంత్ర్యం లభించిన తరువాత ప్రభుత్వం అనేక పాఠశాలలను, కళాశాలలను స్థాపించింది. వాటిలో చదివి ఉత్తీర్ణులైన అందరికీ ఉద్యోగాలు చూపించడం ఒక చిక్కు సమస్యగా తయారైంది. ఉద్యోగం లభించకపోవడంతో యువకులకు చదువులపై నిరాశానిస్పృహలు కలుగుతున్నాయి. అటు కులవృత్తి చేయలేక, ఇటు ఉద్యోగం లభింపక ఉభయభ్రష్టులవుతున్నారు.

నిరుద్యోగ సమస్య తీరాలంటే ప్రభుత్వం విద్యావిధానంలో విప్లవాత్మకమైన మార్పులు తేవాలి. వృత్తి విద్యల కెక్కువ ప్రోత్సాహమివ్వాలి. ఇంటికొక ఉద్యోగమిచ్చే పథకం ప్రవేశపెట్టాలి. పరిశ్రమలు విరివిగా స్థాపించాలి. స్వయం ఉపాధి పథకాలను ప్రవేశపెట్టి, బ్యాంకుల ద్వారా ఋణాలు ఇప్పించాలి.

యువతీయువకులు నిరాశా నిస్పృహలకు లోనుకాకుండా, ధైర్యంగా ఏదో ఒక వృత్తిని చేపట్టి స్వతంత్రంగా జీవించడం అలవరచుకోవాలి.

15. నదులు – ఉపయోగాలు

నదులు పర్వతాలలో పుడతాయి. అన్ని ఖండాలలో, అన్ని దేశాలలో ఇంచుమించు నదులు ఉంటాయి. అందులో కొన్ని జీవనదులు మరికొన్ని వర్షాధార నదులు.

మన దేశంలోని నదులను రెండు విధాలుగా విభజించవచ్చు. 1) హిమాలయాల గుంపు 2) దక్కను గుంపు. హిమాలయపు నదులు, దక్కను నదుల కంటే తక్కువ వయస్సు కలవి.

హిమాలయపు నదులు మంచు కరగడం వల్ల, వర్షాల వల్ల సంవత్సరం పొడవునా ప్రవహిస్తూనే ఉంటాయి. అందుచేత వీటిని శాశ్వతనదులు అంటారు. హిమాలయపు గుంపులో సింధు, గంగ, బ్రహ్మపుత్ర ముఖ్యమైనవి.

దక్కను నదులు అనేక వేల సంవత్సరాల నుండి ప్రవహిస్తున్నాయి. ఈ నదులలో ముఖ్యమైనవి గోదావరి, కృష్ణ, కావేరి, పెన్న, మహానది, నర్మద, తపతి మొదలైనవి. ఈ నదులు పూర్తిగా వర్షంపై ఆధారపడినట్టివి. అందువల్లనే వేసవికాలం వచ్చేటప్పటికి నదులు సన్నబడిపోయి చిన్న ప్రవాహాలలాగా ఉంటాయి.

నదుల వల్ల అనేక లాభాలు ఉన్నాయి. నదులకు వంతెనలు కట్టి రిజర్వాయర్లు నిర్మించుకోవచ్చు. కాలువల ద్వారా లక్షలాది ఎకరాలకు నీటి పారుదల సౌకర్యాలను కలిగించి, పంటలు బాగా పండించుకోవచ్చు. నదిలోని నీటి ద్వారా విద్యుదుత్పాదక శక్తి కలిగించుకొనే థర్మల్ పవర్ స్టేషన్లు ఏర్పాటు చేసుకోవచ్చు. నదులను రవాణా సౌకర్యాలకి ఉపయోగించుకోవచ్చు. ఇతర ప్రాంత ప్రజలకు తాగునీటిని సరఫరా చేయవచ్చు.

16. వారాపత్రికలు

వార్తలను అందించే పత్రికలను “వార్తా పత్రికలు” (News papers) అంటారు. వార్తలను ఇంగ్లీషులో NEWS ఆంటారు గదా! ఆ అక్షరాలను బట్టి కొందరు ఈ విధమైన వివరణ ఇస్తారు – N అంటే North, E అంటే East, W అంటే West, S అంటే South. కాబట్టి ప్రపంచం నలుమూలలా జరిగే సంఘటనలను అందించేవి వార్తా పత్రికలు అనే వివరణ సమంజసంగానే కనిపిస్తుంది.

ప్రాచీనకాలంలో వార్తలను చేరవేయటానికి మనుషుల్ని, జంతువుల్ని, పక్షుల్ని వాడేవారు. “వార్తాహరులు”, “రాయబారులు” ఉండేవారు. కానీ విజ్ఞాన శాస్త్రం అభివృద్ధి చెందిన తర్వాత ముద్రణాయంత్రాలు వెలువడ్డాయి. అప్పటి నుంచి ‘అచ్చు’కి ప్రాముఖ్యం లభించి వార్తా పత్రికల వ్యాప్తి జరిగింది.

ప్రపంచంలో మొట్టమొదటగా వెనిస్ నగరంలో వార్తాపత్రిక ప్రారంభించబడిందని చెప్తారు. సుమారు క్రీ.శ. 1620 నాటికి వార్తా పత్రికలు వచ్చినట్టు తెలుస్తోంది. భారతదేశంలో మొదటి వార్తాపత్రికగా “ఇండియా గెజిట్”అని కొందరు, “బెంగాల్ గెజిట్”అని మరికొందరు పేర్కొంటున్నారు. క్రీ.శ. 1850 నుంచి మన దేశంలో పత్రికల ప్రచురణ అధికమైంది. కాశీనాథుని నాగేశ్వరరావు, ముట్నూరి కృష్ణారావు, ఖాసా సుబ్బారావు, సి.వై. చింతామణి, గోరా, నార్ల వెంకటేశ్వరరావు, నండూరి రామమోహనరావు, పొత్తూరి వెంకటేశ్వరరావు, ఎ.బి.కె. ప్రసాద్ మొదలైనవారు సంపాదకులుగా తెలుగువార్తా పత్రికల ప్రాచుర్యానికి ఎంతో కృషి చేశారు.

ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి, ఈనాడు, ఆంధ్రభూమి, వార్త అనే దినపత్రికలు తెలుగునాట విశేష ఆదరణ పొందాయి.

వార్తా పత్రికల వల్ల లాభాలు చాలా ఉన్నాయి. అవి :

  1. మానవుడి మేధ వికసిస్తుంది.
  2. ఆర్థిక, రాజకీయ, విద్య, క్రీడ, వ్యవసాయ, సాహిత్యాదిరంగాలలోని విషయాలు క్షుణ్ణంగా తెలుసుకోవచ్చు.
  3. సమాజంలో అట్టడుగున పడి కనిపించని వాస్తవాలెన్నో పత్రికల ద్వారా తెలుస్తాయి.
  4. రచయితలకు, యువతకు, కళాకారులకు, విద్యార్థులకు, నిరుద్యోగులకు, వ్యాపారవేత్తలకు, రైతులకు ఇంకా సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకూ వార్తా పత్రికలు కరదీపికలు.
  5. జాతీయాభివృద్ధికి, జాతి సమైక్యతకి దోహదపడతాయి.
  6. ప్రభుత్వానికీ, ప్రజలకీ మధ్య వారధి వలె తోడ్పడతాయి. అంటే ప్రభుత్వ పథకాలూ, లోపాలూ ప్రజలకి తెలియజేస్తాయి. ప్రజల కష్టనష్టాలూ, సమస్యలూ, అభిప్రాయాలూ ప్రభుత్వానికి తెలియజేస్తాయి.

కొన్ని పత్రికలు నిష్పాక్షికంగా ఉండి అధికారుల అవినీతిని, అక్రమాలని బహిరంగపరుస్తున్నాయి. మరికొన్ని అశ్లీలానికీ, నీతిబాహ్యమైన అంశాలకీ ప్రాధాన్యం ఇస్తున్నాయి. ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛని కాపాడాలి. సంపాదకులు, పత్రికా నిర్వాహకులు పత్రికా స్వేచ్ఛను దుర్వినియోగం చెయ్యకుండా నైతిక బాధ్యత కలిగి ఉండాలి.

AP Board 9th Class Telugu వ్యాసాలు

17. ‘స్వచ్చభారత్ కార్యక్రమం’ అంశంపై ఒక వ్యాసం మీ మాటల్లో రాయండి.
జవాబు:
‘స్వచ్ఛభారత్’ అంటే భారతదేశాన్ని పరిశుభ్రంగా చెత్తచెదారము లేకుండా ఉంచడం. స్వచ్ఛమైన, మాలిన్యంలేని ప్రాంతంలో తిరిగే వారికి, మంచి ఆరోగ్యము ఉంటుంది. ఆరోగ్యమే మహాభాగ్యము. మనము అశ్రద్ధ చేయడం వల్ల, గ్రామాలు, నగరాలు, కార్యాలయాలు, వైద్యశాలలు చెత్తాచెదారాలతో నిండిపోయాయి. దీన్ని గుర్తించి మన భారత ప్రధాని నరేంద్రమోడీ గారు, భారతీయులకు స్వచ్ఛభారత్ కు పిలుపునిచ్చారు.

ఈ పిలుపును అందుకొని, ఎందరో పెద్దలు తమ నగరాలను, గ్రామాలను, కార్యాలయాలను పరిశుభ్రంగా ఉంచడంలో పోటీపడుతున్నారు. ముఖ్యంగా మన విద్యార్థినీ, విద్యార్థులు, నిత్యమూ తమ బడినీ, ఇంటినీ, పుస్తకాలను శుభ్రంగా ఉంచుకోవాలి.

అలాగే ప్రతి కార్యాలయం వారు వారానికి ఒకసారైనా తమ కార్యాలయాలను శుభ్రంగా తీర్చిదిద్దాలి. ముఖ్యంగా ప్రభుత్వ వైద్యశాలలను నిర్మలంగా ఉంచాలి. అందుకు వైద్యులు, రోగులు సహకరించాలి. కాలువలు, నదులు, చెరువులు మొదలయిన చోట్ల నీటిని కలుషితం చేయకుండా పరిశుభ్రంగా ఉంచాలి. రోడ్లపై తుక్కు పోయరాదు. చెత్తకుండీలలోనే తుక్కు వేయాలి.

మన ప్రధాని ఈ కార్యక్రమం కోసం ఎంతో ధనాన్ని ఖర్చు చేస్తున్నారు. ఇంటింటికీ మరుగుదొడ్డి సదుపాయం సమకూరుస్తున్నారు. మలమూత్ర విసర్జనలు, బహిరంగ ప్రదేశాల్లో చేయరాదు. మనదేశాన్ని మనమే శుభ్రంగా ఉంచే బాధ్యత తీసికోవాలి. భారతదేశం స్వచ్ఛమైనదని పేరు వచ్చేలా ప్రతి భారతీయుడు కృషి చేయాలి.

18. “మాతృభాషలో విద్యాబోధన ఆవశ్యకత” గురించి వ్యాసం రాయండి.
జవాబు:
మాతృభాష అంటే తల్లి భాష అని అర్థం. మనం పుట్టిన చోట జనవ్యవహారంలో ఉండే భాష మాతృభాష. మానవుడు పుట్టింది మొదలు గిట్టేవరకు మాతృభాషలోనే ఎక్కువగా మాట్లాడటం జరుగుతుంది. మనం ఏ భాషలో మాట్లాడతామో, ఏ భాషలో కలలు కంటామో ఆ భాషలోనే విద్యను నేర్చుకోవడం ఎంతైనా అవసరం.

పరాయి భాషలో విద్యాభ్యాసం చేస్తే చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముందుగా పరాయి భాషను అర్థం చేసుకోవడానికి చాలా ప్రయాస పడాల్సివస్తుంది. అందులో తగినంత పరిజ్ఞానం అలవడనిదే విషయ గ్రహణంగానీ, విషయ వ్యక్తీకరణగానీ సాధ్యపడదు. మాతృభాషలో విద్యాభ్యాసం వల్ల విద్యార్థి ఉపాధ్యాయులు చెప్పిన విషయాన్ని సులభంగా అర్థం చేసుకోవచ్చు. గుర్తుంచుకొని పరీక్షలు బాగా వ్రాయవచ్చు. తక్కువ సమయంలో ఎక్కువ విజ్ఞానాన్ని పొందవచ్చు.

మాతృభాషలో విద్యను నేర్చుకోవడం తల్లిపాలు త్రాగి పెరగడం వంటిది. పరభాషలో విద్యను నేర్చుకోవడం దాది పాలు త్రాగడం వంటిది. ఆంగ్లం వంటి పరాయిభాషలో విద్యార్థికి సరైన పరిజ్ఞానం లేనందువల్ల విద్యార్థికి ఆ భాషరాక బట్టీపట్టి ఏదోవిధంగా కృతార్థుడవుతున్నాడు. ఉపాధ్యాయులు చెప్పేది అర్థంకాక గైడ్సు (Guides) వెంట పడుతున్నాడు. కాబట్టి కనీసం సెకండరీ విద్యాస్థాయి వరకు మాతృభాషలోనే విద్యను బోధించడం, విద్యను నేర్చుకోవడం అవసరం.

AP Board 9th Class Telugu వ్యాసాలు

19. ఈ రోజులలో కాలుష్యం, ఇతర కారణాల వలన కొన్ని జంతువులు, పక్షులు కనుమరుగయ్యే ప్రమాదం ఏర్పడింది. వాటిని కాపాడుకోవల్సిన ఆవశ్యకతను వివరిస్తూ ఒక వ్యాసం రాయండి.
జవాబు:
ఈ రోజులలో కాలుష్యం, ఇతర కారణాల వలన కొన్ని జంతువులు, పక్షులు కనుమరుగయ్యే ప్రమాదం ఏర్పడింది. వాటిని కాపాడుకోవల్సిన ఆవశ్యకత మనందరి మీద ఉంది.

మనం ఎక్కువగా క్రిమి సంహారక మందులను పంటపొలాల్లో, పెరట్లోని మొక్కల పై, ఇంట్లో వస్తువులపై చల్లడం వల్ల, అలాగే మనం చల్లే ఎండ్రిన్ వల్ల భూమిని సారవంతం చేసే, గుల్ల బార్చే వానపాములు ఎన్నో ఇలా చస్తున్నాయి. అంతేకాక మామూలు పాములు, ఎలుకలు, పక్షులు, పురుగులు వగైరా ఎన్నో ప్రాణులు మన వల్లే మనుగడ సాగించలేకపోతున్నాయి. ఈ ప్రాణులు మన పంటలకు చేసే మేలును మనం కోల్పోతున్నాము. జంతువులు, పక్షులే కాదు మనకూ ప్రమాదమే. ఎలా అంటే క్రిమిసంహారక మందుల అవశేషాలు మిగిలిన పంట గింజలను మనం తినడంతో కేన్సర్, టి. బి, గుండె జబ్బులు వస్తున్నాయి.

ప్రకృతి సహజంగా మనకు ఇచ్చిన రక్షణ కవచం ఈ పురుగులూ, జంతువులు. అవి ఒకదానిపై ఒకటి ఆధారపడి జీవిస్తాయి. అందువల్ల మన పంటలు హాయిగా పెరుగుతాయి. మనం భగవంతుడు మనకిచ్చిన సహజ ప్రకృతిని కాపాడుకుందాం. ఆరోగ్యంగా జీవిద్దాం. మన చుట్టూ ఉన్న పక్షులను, జంతువులను రక్షించుకుందాం.

టెక్నాలజీ పేరుతో వృద్ధి సాధిస్తున్నామనే భ్రమలో బుద్ధిని కోల్పోతున్నాం మనం. టి.వి.లు, సెల్ ఫోన్లు మన ఆరోగ్యాన్ని ఎంతగా పాడుచేస్తున్నాయో కదా ! తెలిసికూడా వాటిని మనం విడిచి పెట్టలేకపోతున్నాం. సెల్ ఫోన్ టవర్లు వంటివి కొన్ని రకాల పక్షుల జాతి అంతరించిపోవడానికి కారణమౌతున్నాయి. కానీ ఇవేమి మనకు పట్టదు. “పచ్చని చెట్టు ప్రగతికి మెట్టన్న పెద్దల మాట పెడచెవిన పెట్టకూడదు. తోటి ప్రాణుల పట్ల కారుణ్య భావంతో మెలగాలి. అప్పుడే ప్రకృతి సమంగా నడవడానికి అవకాశం ఉంటుంది. మన విపరీత ధోరణుల వల్లే ప్రకృతి కూడా వికృతంగా నడుస్తోంది.

ఈ సమస్య ఏ ఒక్కరిదో కాదు మనందరిది. చిన్న ప్రాణుల పట్ల నిర్లక్ష్యం వద్దు. అవే మనల్ని ఆపదల పాలు కాకుండా కాపాడతాయి. కనుక మనందరం నేటి నుంచి జీవకారుణ్య భావంతో మెలుగుదామని ప్రతిజ్ఞ చేద్దాం.

AP Board 8th Class Telugu Solutions Chapter 7 హరిశ్చంద్రుడు

AP State Syllabus AP Board 8th Class Telugu Textbook Solutions Chapter 7 హరిశ్చంద్రుడు Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Telugu Solutions 7th Lesson హరిశ్చంద్రుడు

8th Class Telugu 7th Lesson హరిశ్చంద్రుడు Textbook Questions and Answers

చదవండి – ఆలోచించండి – చెప్పండి

బలి చక్రవర్తి గొప్పదాత. అతడు ఒకసారి యజ్ఞం చేస్తున్నాడు. ఆ యజ్ఞవేదిక దగ్గర దానధర్మాలు చేస్తున్నాడు. వామనుడు దానం స్వీకరించడానికి వచ్చాడు.
బలి : ఏం కావాలి ?

వామనుడు : మూడడుగుల నేల.

బలి : తప్పక ఇస్తాను.

శుక్రాచార్యుడు : బలీ ! వద్దు ! వద్దు ! వచ్చినవాడు రాక్షసవిరోధి ! అతనికి దానం ఇస్తే నీకీ ప్రమాదం !

బలి : గురువర్యా ! నేను ఆడినమాట తప్పను. వామనా ! మూడడుగుల నేల గ్రహించు.

ప్రశ్నలు జవాబులు

ప్రశ్న 1.
బలిని దానం ఇవ్వవద్దని ఎవరన్నారు? ఎందుకన్నారు?
జవాబు:
బలిని దానం ఇవ్వవద్దని శుక్రాచార్యుడు అన్నాడు. వచ్చినవాడు రాక్షసవిరోధి కాబట్టి దానం ఇవ్వవద్దని చెప్పాడు.

ప్రశ్న 2.
దానం ఇస్తే ఎవరికి ప్రమాదం?
జవాబు:
దానం ఇస్తే బలి చక్రవర్తికి ప్రమాదం.

ప్రశ్న 3.
బలి చక్రవర్తి గొప్పదనం ఏమిటి?
జవాబు:
బలి చక్రవర్తి తాను ఆడినమాట తప్పను అని చెప్పాడు. తాను అన్న మాటకు కట్టుబడి మూడడుగుల నేలను వామనునికి ధారపోశాడు.

AP Board 8th Class Telugu Solutions Chapter 7 హరిశ్చంద్రుడు

ప్రశ్న 4.
ఆడినమాట తప్పనివారి గురించి మీకు తెలుసా?
జవాబు:
బలి, శిబి చక్రవర్తి, హరిశ్చంద్రుడు మొదలగువారు.

ఇవి చేయండి

I. వినడం – మాట్లాడడం

అ) హరిశ్చంద్రుని గొప్పదనం గురించి మీ అభిప్రాయాలు చెప్పండి.
జవాబు:
హరిశ్చంద్రుడు అయోధ్య రాజధానిగా పాలించిన సూర్యవంశ చక్రవర్తి. సూర్యవంశానికి గొప్ప పేరు ప్రతిష్ఠలు తెచ్చి పెట్టినవాడు. గొప్పదాత. వివేకమే సంపదగా కలవాడు. మంచి కీర్తి వైభవాలు కలవాడు. ధనుర్వేద విద్యలో ఆరితేరినవాడు. సముద్రమంత దయగలవాడు. సర్వశాస్త్రాలు తెలిసినవాడు. సత్యవాక్పరిపాలకుడు. ఆడినమాట తప్పనివాడు. వశిష్ఠుడు చెప్పినట్లు బ్రహ్మరాత తప్పినా, సూర్యుడు తూర్పున అస్తమించినా, మేరు పర్వతము కుంగిపోయినా, ఆకాశం ఊడి కింద పడినా, సముద్రం ఎండినా, భూగోళం తలకిందులయినా హరిశ్చంద్రుడు ఆడినమాట తప్పడు.

ఆ) ద్విపద రూపంలోని ఈ పాఠాన్ని లయబద్ధంగా రాగంతో పాడండి.
జవాబు:
విద్యార్థి కృత్యము

ఇ) సారాంశాన్ని సొంతమాటల్లో చెప్పండి.
జవాబు:
ఒకసారి దేవేంద్రుడు కొలువుదీర్చి “ముల్లోకాలలో బొంకనివారు ఎవరైనా ఉన్నారా ? ఇప్పుడు జీవించి ఉన్నవారిలో కానీ, గతకాలం వారిలో కానీ అసత్యమాడని వారున్నారా ? భవిష్యత్తులో ఎవరైనా ఉంటారా ?” అని త్రికాలజ్ఞులైన మునీశ్వరులను అడిగాడు. ఎవ్వరూ మాట్లాడలేదు. కొంతమంది విన్నా విననట్లు ఊరుకున్నారు. అప్పుడు వశిష్ఠుడు అటువంటి ఉత్తమ లక్షణాలు కలవాడు హరిశ్చంద్రుడని సభలో ప్రకటించాడు. వశిష్ఠుడు హరిశ్చంద్రుని గొప్పదనం, గుణగణాలను గురించి దేవేంద్రునితో ఇలా చెప్పాడు.

“దేవేంద్రా ! హరిశ్చంద్ర మహారాజు ఈ ప్రపంచంలో మహా పరాక్రమవంతుడు. షోడశమహాదానాలు చేసినవాడు. వినయ వివేకాలు గలవాడు. విద్యావంతుడు. కీర్తిశాలి. దయాసముద్రుడు. గాంభీర్యము గలవాడు. పుణ్యాత్ముడు. పండితులచే పొగడదగ్గవాడు. సర్వశాస్త్ర పండితుడు. శత్రుభయంకరుడు. షట్చక్రవర్తులలో పేరుపొందినవాడు. త్రిశంకుని పుత్రుడు. సత్యసంధుడు. సూర్యవంశీయుడు. అతడు ఆడి బొంకనివాడు. ఆదిశేషువు కూడా హరిశ్చంద్రుని గుణగణాలను కీర్తింపలేడు. అబద్ధం ఆయన నాలుక నుండి రాదు.

బ్రహ్మరాత తప్పినా, సూర్యుడు తూర్పున అస్తమించినా, మేరువు కుంగినా, ఆకాశం ఊడి కింద పడినా, భూగోళం తలకిందైనా, సముద్రాలు ఎండినా, వజ్రాయుధం పదును తగ్గినా హరిశ్చంద్రమహారాజు మాత్రం ఆడినమాట తప్పడు.”

II. చదవడం, అవగాహన చేసుకోవడం

1. కింది భావాలున్న ద్విపద పాదాలను పాఠంలో వెతికి రాయండి.

అ) హరిశ్చంద్రుడు వినయమే అలంకారంగా గలవాడు. వివేకం సంపదగా గలవాడు.
జవాబు:
వినయభూషణుఁడు వివేకసంపన్నుడు

ఆ) హరిశ్చంద్రుడు ఎల్లప్పుడూ ప్రసన్నంగా ఉంటాడు. నీతిగా పరిపాలన చేస్తాడు.
జవాబు:
నిత్యప్రసన్నుండు నీతిపాలకుడు.

ఇ) త్రిశంకుని కుమారుడు సత్యాన్నే పలికేవాడు.
జవాబు:
సత్యసంధుండు త్రిశంకునందనుఁడు

AP Board 8th Class Telugu Solutions Chapter 7 హరిశ్చంద్రుడు

2. కింది పద్యం చదవండి. భావంలో ఖాళీలు ఉన్నాయి. పూరించండి.
నుతజల పూరితంబులగు నూతులు నూటిటికంటె సూనృత
వ్రత! యొక బావివేలు, మరి బావులు నూటిటికంటె నొక్క స
త్క్రతువది మేలు, తత్రతు శతంబున కంటె సుతుండుమేలు, త
త్సుతశతకంబుకంటె నొక సూనృత వాక్యము మేలు సూడగన్

పై పద్యం శకుంతల దుష్యంతునితో చెప్పింది. సత్యవ్రతం యొక్క గొప్పదనాన్ని తెలిపే పద్యం ఇది.
భావం :
స్వచ్ఛమైన జలం ఉన్న నూరునూతులకన్నా ఒక …………….. మేలు. అలాంటి వందబావులకన్నా ఒక ……….. మేలు. అలాంటి వంద ………..ల కన్నా ఒక ………….. ఉండటం మేలు. అలాంటి వందమంది ……………… ఉండటం కన్నా ఒక ……….. మేలు.
జవాబు:
భావం :
స్వచ్ఛమైన జలం ఉన్న నూరునూతులకన్నా ఒక బావి మేలు. అలాంటి వందబావులకన్నా ఒక మంచియజ్ఞం మేలు. అలాంటి వంద మంచియజ్ఞముల కన్నా ఒక కుమారుడు ఉండటము మేలు. అలాంటి వందమంది కుమారులు ఉండటం కన్నా ఒక సత్యవాక్యం మేలు.

3. కింది ప్రశ్నలకు పాఠం ఆధారంగా సమాధానాలు రాయండి.

అ) హరిశ్చంద్రుని గుణగణాలను కవి ఏ విధంగా వర్ణించాడు?
జవాబు:
హరిశ్చంద్రుడు సూర్యవంశస్థుడు. నీతిపాలకుడు. నిత్య ప్రసన్నుడు. మహా పరాక్రమవంతుడు. షోడశమహాదానాలు చేస్తూ ఆనందించేవాడు. వినయ వివేక సంపన్నుడు. కీర్తిమంతుడు. ధనుర్విద్యావేత్త. కరుణాపయోనిధి. గంభీరుడు. పుణ్యాత్ముడు. సర్వశాస్త్రాలసారం తెలిసినవాడు. పండితుల స్తోత్రములకు పాత్రుడు. శత్రుజన భయంకరుడు. షట్చక్రవర్తులలో ఒకడు. సత్యసంధుడు. త్రిశంకు మహారాజు యొక్క కుమారుడు. విజ్ఞాన నిధి. అబద్ధం ఎరుగనివాడు. రెండువేల నాలుకలు ఉన్న ఆదిశేషుడికి కూడా హరిశ్చంద్రుని గుణములను కీర్తించడం అసాధ్యము.

ఆ) హరిశ్చంద్రుని గొప్పతనం గురించి వశిష్ఠుడు ఎవరితో చెప్పాడు? ఎందుకు చెప్పాడు?
జవాబు:
ఒకసారి దేవేంద్రుడు కొలువుదీర్చి ఉన్న సమయంలో మూడులోకాలలో ఎవరైనా బొంకని వారున్నారా? ఇప్పుడు జీవించి ఉన్నవారిలో కాని, గతకాలం వారిలో కాని, అసత్యమాడని వారున్నారా? భవిష్యత్తులో ఎవరైనా ఉంటారా? అని అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ వశిష్ఠుడు దేవేంద్రునితో హరిశ్చంద్రుని గొప్పతనం గురించి చెప్పాడు.

ఇ) హరిశ్చంద్రునికి ఉన్న విశిష్టతలు ఏవి?
జవాబు:
హరిశ్చంద్రుడు సూర్యవంశుడైన త్రిశంకుని కుమారుడు. సూర్యవంశమనే పాలసముద్రంలో పుట్టిన చంద్రుడు. సాటిలేని విజ్ఞానం కలవాడు. రెండు వేల నాలుకలు గల ఆదిశేషునికైనా ఈ హరిశ్చంద్రుని గుణగణాలు కీర్తించడం సాధ్యం కాదు. అతడు సత్యస్వరూపుడు. బ్రహ్మరాత తప్పినా, సూర్యుడు తూర్పున అస్తమించినా, మేరు పర్వతం భూమిలో కుంగినా, ఆకాశం ఊడి కిందపడినా, భూగోళం తలకిందులైనా హరిశ్చంద్రుడు మాత్రం ఆడినమాట తప్పడు- ఇవి అతనిలోని విశిష్టతలు.

ఈ) అసాధారణాలైనవి కూడా సంభవించవచ్చని కవి వేటిని పేర్కొన్నాడు? వీటిని ఏ సందర్భంలో పేర్కొన్నాడు?
జవాబు:
అసాధారణాలైనవి కూడా సంభవించవచ్చునని కవి ఈ కింది వాటిని పేర్కొన్నాడు.

బ్రహ్మరాత తప్పినా, సూర్యుడు తూర్పున అస్తమించినా, మేరు పర్వతం భూమిలో కుంగినా, ఆకాశం కింద ఊడిపడినా, భూగోళం తలకిందులైనా, సముద్రాలు ఎండినా, వజ్రాయుధం పదును తగ్గినా హరిశ్చంద్ర మహారాజు మాత్రం అబద్దమాడడని కవి చెప్పాడు.

ఎంతటి వైపరీత్యాలూ, అసాధారణాలు సంభవించినా హరిశ్చంద్రుడు అబద్ధమాడడని చెప్పే సందర్భంలో కవి వాటిని పేర్కొన్నాడు.

AP Board 8th Class Telugu Solutions Chapter 7 హరిశ్చంద్రుడు

4. కింది వాక్యాలకు సమానార్థాన్నిచ్చే వాక్యాలు గుర్తించండి.

అ) హరిశ్చంద్రుడు వివేకసంపన్నుడు, వినయభూషణుడు.
i) హరిశ్చంద్రుడు కేవలం వివేకసంపన్నుడు.
ii) హరిశ్చంద్రుడు వినయభూషణుడే.
iii) హరిశ్చంద్రునికి వివేకసంపదకన్న వినయభూషణం అధికం.
iv) హరిశ్చంద్రునిలో వివేకసంపద, వినయభూషణం రెండూ సమానమే.
జవాబు:
iv) హరిశ్చంద్రునిలో వివేకసంపద, వినయభూషణం రెండూ సమానమే.

ఆ) మేరువు గ్రుంకినా, మిన్ను వ్రాలినా హరిశ్చంద్రుడు అసత్యం పలకడు.
i) మేరువు కుంగినా, ఆకాశం ఊడిపడ్డా హరిశ్చంద్రుడు అబద్దం ఆడడు.
ii) మేరువు కుంగి, మిన్ను వాలినా, సత్యం పలుకుతాడు హరిశ్చంద్రుడు.
iii) మేరువు కుంగినా, మిన్ను వాలకున్నా హరిశ్చంద్రుడు అబద్ధం ఆడడు.
iv) మేరువు కుంగినా మిన్ను వాలినా హరిశ్చంద్రుడు సత్యం పలకడు.
జవాబు:
i) మేరువు కుంగినా, ఆకాశం ఊడిపడ్డా హరిశ్చంద్రుడు అబద్దం ఆడడు.

III. స్వీయరచన

1) కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో సమాధానాలు రాయండి.

అ) “హరిశ్చంద్రుణ్ణి షోడశ మహాదాన వినోది” అని వశిష్ఠుడు ఎందుకు అన్నాడు?
జవాబు:
పదహారు రకాల దానాలను చేస్తూ ఆనందించేవాడు షోడశ మహాదాన వినోది. హరిశ్చంద్రునికి ఇతరులకు దానం చేయడం వినోదం అన్నమాట. గో-భూ-తిల-హిరణ్య-రత్న-కన్యా-దాసీ-శయ్యా-గృహ-అగ్రహార-రథ-గజ-అశ్వభాగ-మహిషీ దానాలను షోడశ మహాదానాలు అంటారు. హరిశ్చంద్రుడు ఎవరికైనా, ఏదైనా ఇస్తానంటే తప్పక ఇస్తాడనీ, ఆడినమాట తప్పడనీ, దానగుణం అన్నది ఆయనకు ఒక వినోదక్రీడ వంటిదనీ చెప్పడానికే వశిష్ఠుడు హరిశ్చంద్రుని “షోడశ మహాదాన వినోది” అని చెప్పాడు.

ఆ) హరిశ్చంద్రునిలో మిమ్మల్ని ఆకట్టుకునే అంశాలేవి?
జవాబు:
హరిశ్చంద్రునిలోని షోడశ మహాదాన వినోదిత్వం, వినయభూషణత్వం, వివేక సంపన్నత, అపారమైన కరుణ, మహాజ్ఞాని కావడం, ధనుర్వేద విద్యాధికత, ధర్మతత్పరత, సత్యసంధత, ప్రియభాషణ, నిత్యప్రసన్నత, నీతిపాలకత అనే గుణాలు నన్ను బాగా ఆకట్టుకున్నాయి.

ఇ) ‘హరిశ్చంద్రుడు ఆడినమాట తప్పడు’ అని తెలుసుకున్నారు కదా ! ఆడినమాట తప్పనివారు ఎలా ఉంటారో రాయండి.
జవాబు:
ఆడిన మాట తప్పనివారు అంటే సత్యసంధులు. వారు ప్రాణం పోయినా సరే అబద్ధం ఆడరు. సత్యవాక్యం గొప్పతనాన్ని వారు గుర్తించినవారు. భార్యను అమ్మవలసి వచ్చినా, తానే అమ్ముడుపోయినా హరిశ్చంద్రుడు అబద్ధమాడలేదు. వామనునికి మూడు అడుగుల నేల దానం చేస్తే బలిచక్రవర్తికే ప్రమాదం వస్తుంది అని ఆయన గురువు శుక్రుడు చెప్పినా బలి తాను అన్నమాటను తప్పలేదు. శిబి చక్రవర్తి తన శరీరంలోని మాంసాన్నే కోసి ఇచ్చి పావురాన్ని రక్షించాడు. ఆడినమాట తప్పనివారు బలి చక్రవర్తిలా, హరిశ్చంద్రునిలా, శిబిచక్రవర్తిలా ఉంటారు.

ఈ) ‘మిన్ను వ్రాలినా’ అని వశిష్ఠుడు హరిశ్చంద్రుని పరంగా ఉపయోగించాడు కదా ! ఈ జాతీయాన్ని ఏ సందర్భంలో ఉపయోగిస్తారు?
జవాబు:
‘మిన్ను వ్రాలటం’ అంటే ఆకాశం వంగిపోవటం అని అర్థం. ఆకాశం వంగిపోవటం అనేది సృష్టిలో ఎప్పుడూ జరగనిది. అందువలన ఎన్నటికీ జరగని విషయం అని చెప్పే సందర్భంలో ఈ వాక్యాన్ని ఉపయోగిస్తారు.

AP Board 8th Class Telugu Solutions Chapter 7 హరిశ్చంద్రుడు

2. కింది ప్రశ్నలకు పదేసి వాక్యాలలో జవాబులు రాయండి.

అ) ‘హరిశ్చంద్రుడు’ పాఠ్యభాగ సారాంశం సొంతమాటల్లో రాయండి.
(లేదా)
వశిష్ఠుడు వివరించిన ‘హరిశ్చంద్రుని సద్గుణాలేమిటో’ రాయండి.
(లేదా)
పర్వతాలు కుంగిన, ఆకాశం నేలమీద పడినా మాట తప్పనివాడైన హరిశ్చంద్రుడి గురించి కవి ఏ విధంగా వ్యక్తపరచారో రాయండి.
జవాబు:
దేవేంద్రుడు ఒక రోజు కొలువుదీర్చి ఉన్నాడు. ఆ సభలో వశిష్ఠ మహాముని హరిశ్చంద్రుని గుణగణాలను వర్ణించాడు.

“ఓ దేవేంద్రా! ఈ ప్రపంచంలో హరిశ్చంద్రుడు గొప్ప పరాక్రమవంతుడు. పదహారు రకాల దానాలు చేస్తూ వినోదిస్తూ ఉంటాడు. వినయం, వివేకం ఉన్నవాడు. గొప్ప కీర్తి, భాగ్యం కలవాడు. విలువిద్యా పండితుడు. దయాసముద్రుడు. పాపం చేయనివాడు. సర్వశాస్త్రార్థములు తెలిసినవాడు. మహాజ్ఞాని. శత్రుభయంకరుడు. షట్చక్రవర్తులలో మొదటివాడు. నీతిగలవాడు. త్రిశంకుని కుమారుడు. సూర్యవంశంలో పుట్టినవాడు. సత్యవాక్పరిపాలకుడు.

హరిశ్చంద్రుని గుణగణాలను ఆదిశేషుడు సైతం వర్ణించలేడు. హరిశ్చంద్రుడు సత్యసంధుడు. ఆయన పనులు ధర్మము. ఆయన మాట ప్రియము. బ్రహ్మరాత తప్పినా, సూర్యుడు తూర్పు వాలినా, మేరువు కుంగినా, భూమి తలకిందులయినా, ఆకాశం కిందపడినా, సముద్రాలు ఇంకినా, వజ్రాయుధం పదును తగ్గినా హరిశ్చంద్రుడు ఆడినమాట తప్పడు.” అని వశిష్ఠుడు చెప్పాడు.

ఆ) వివేక సంపన్నుడు, సత్యసంధుడు, విద్యాధికుడు, కరుణాపయోనిధి, విజ్ఞాననిధి అని హరిశ్చంద్రుణ్ణి కీర్తించారు కదా ! మన సమాజంలోని వ్యక్తులు అందరూ ఈ గుణాలతో ఉంటే ఈ సమాజం ఎలా ఉంటుందో ఊహించి రాయండి.
(లేదా)
సమాజంలో ఉన్న అందరూ హరిశ్చంద్రుడిలా ఉంటే మన సమాజం ఎలా ఉంటుందో ఊహించి రాయండి.
జవాబు:
సమాజం. అంటే ‘సంఘం’. మన సంఘంలో హరిశ్చంద్రుని వంటి గుణగణాలు గల వ్యక్తులు చాలా తక్కువమంది ఉంటారు. అందరూ హరిశ్చంద్రునిలా వివేకం కలిగి ఉండి, నిజమే మాట్లాడుతూ, దయ గలిగి, అందరూ విద్యావిజ్ఞానములు కలిగి ఉంటే చాలా బాగుంటుంది. అందరూ వివేకం గలవారు కాబట్టి తగవులూ, యుద్ధాలూ ఉండవు. అధర్మ ప్రవర్తనలూ, వాటికి శిక్షలూ, కోర్టులూ ఉండవు. అందరూ చదువుకున్నవారే కాబట్టి ప్రజలు సంస్కారం కలిగి న్యాయధర్మాలతో ఉంటారు.

మళ్ళీ కృతయుగం వచ్చినట్లు అవుతుంది. మనం అంతా స్వర్గంలో ఉన్నట్లు ఉంటుంది. అటువంటి మంచి కాలం రావాలని అందరూ కోరుకోవాలి. అందరూ హరిశ్చంద్రునివంటి గుణాలు గలవారు అయితే విశ్వామిత్రుడు లాంటి వాళ్ళు అకారణంగా వారిని హింసించే ప్రమాదం లేకపోలేదు. కానీ చివరకు న్యాయం, ధర్మం జయిస్తాయి.

IV. పదజాలం

1. కింది పట్టికను పరిశీలించండి. అందులో హరిశ్చంద్రుని గుణగణాలకు సంబంధించిన పదాలున్నాయి. అయితే . ఒక్కొక్క పదం రెండుగా విడిపోయింది. వాటిని కలిపి రాయండి. ఆ పదాల ఆధారంగా సొంతవాక్యాలు రాయండి.
AP Board 8th Class Telugu Solutions Chapter 7 హరిశ్చంద్రుడు 1

ఉదా : నీతినిధి – నీతికి నిధియైన సర్పంచ్ వల్ల గ్రామానికి మేలు జరుగుతుంది.
జవాబు:
పై పట్టికలోని పదాలు ఇవి :

  1. భాగ్యశాలి
  2. విజ్ఞాన నిధి
  3. బొంకనివాడు
  4. శరధిచంద్రుడు
  5. వినయభూషణుడు
  6. వివేక సంపన్నుడు
  7. కరుణాపయోనిధి
  8. నీతిపాలకుడు
  9. దాన వినోది
  10. సత్యసంధుడు

వాక్యప్రయోగములు:

1) భాగ్యశాలి : దానధర్మములు చేస్తే భాగ్యశాలి కీర్తి మరింత వృద్ధి అవుతుంది.

2) విజ్ఞాన నిధి : అబ్దుల్ కలాం గొప్ప ‘విజ్ఞాన నిధి’.

3) బొంకనివాడు : ప్రాణం పోయినా బొంకనివాడే యోగ్యుడు.

4) శరధిచంద్రుడు : శ్రీరాముడు సూర్యవంశ శరథి చంద్రుడు.

5) వినయభూషణుడు : ధర్మరాజు చక్రవర్తులలో వినయ భూషణుడు.

6) వివేక సంపన్నుడు : ఎంత విజ్ఞానం ఉన్నా వివేక సంపన్నుడు అయి ఉండాలి.

7) కరుణాపయోనిధి : శ్రీరాముడిని ‘కరుణాపయోనిధి’ అని రామదాసు కీర్తించాడు.

8) నీతిపాలకుడు : నీతిపాలకుడైన రాజు కీర్తి విస్తరిస్తుంది.

9) దాన వినోది : కర్ణుడు దానవినోదిగా పేరుపొందాడు.

10) సత్యసంధుడు : శిబి చక్రవర్తి సత్యసంధుడు.

AP Board 8th Class Telugu Solutions Chapter 7 హరిశ్చంద్రుడు

2. కింది పదాలు చదవండి. గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి. వాక్యంలో ప్రయోగించండి.

అ) అడవికి కంఠీరవం రాజు.
జవాబు:
కంఠీరవం = సింహము
వాక్యం :
మృగరాజు అయిన కంఠీరవం మిగిలిన జంతువులు చేసిన ప్రతిపాదనకు అంగీకరించింది.

ఆ) త్రిశంకు నందనుడు హరిశ్చంద్రుడు.
జవాబు:
నందనుడు = కుమారుడు
వాక్యం :
శ్రీరాముడు దశరథ నందనుడు.

ఇ) ఆంజనేయుడు శరధి దాటాడు.
జవాబు:
శరధి = సముద్రము
వాక్యం :
శ్రీరాముడు వానరుల సాయంతో శరధిపై సేతువు నిర్మించాడు.

ఈ) దేవతలకు రాజు సురేంద్రుడు.
జవాబు:
సురేంద్రుడు = దేవేంద్రుడు
వాక్యం :
గౌతముడు సురేంద్రుని శపించాడు.

ఉ) భానుడు ప్రపంచానికి వెలుగును, వేడిని ఇస్తున్నాడు.
జవాబు:
భానుడు = సూర్యుడు
వాక్యం :
భానుడు నిత్యము తూర్పున ఉదయిస్తాడు.

AP Board 8th Class Telugu Solutions Chapter 7 హరిశ్చంద్రుడు

3. కింది వాక్యాలు పరిశీలించండి. పర్యాయపదాలతో ఇలాంటి వాక్యాలు రాయండి.

అ) భానుకిరణాలు చీకట్లు పోగొడతాయి. ఆదిత్యుడు వెలుగుతో పాటు వేడిమినిస్తాడు. రవి మొక్కలకూ, జంతువులకూ ప్రాణాధారం. సూర్యుడు లేకపోతే ఈ సమస్తజీవులు ఉండవు.
జవాబు:
భానుడు – ఆదిత్యుడు, రవి, సూర్యుడు

ఆ) వానరులు లంకను చేరడానికి సముద్రాన్ని దాటాలి. ఇందుకోసం ఆ శరధి పై వారధి కట్టాలి. దీనికి నలుణ్ణి వినియోగించారు. నలుని నేతృత్వంలో వానరవీరుల సహాయంతో. అంబుధిపై వారధి తయారయింది. శ్రీరాముని వెంట వానరులు కడలి దాటి వెళ్ళారు. సంద్రంలో ఆ వారధి ఈనాటికీ కనిపిస్తుంది.
జవాబు:
సముద్రం – శరధి, అంబుధి, కడలి, సంద్రం

పై వాక్యాలను పోలిన మరికొన్ని వాక్యాలు :
జవాబు:
1) తల్లిదండ్రులు తమకు కొడుకు పుట్టినప్పుడు సంతోషిస్తారు. ‘పుత్రుడు‘ పున్నామ నరకం పోగొడతాడని, వృద్ధాప్యంలో సుతుడు ఆదుకుంటాడనీ అనుకుంటారు. కానీ ఈనాడు తనయుడు తల్లిదండ్రులను పట్టించుకోవడం లేదు. కుమారుడు తన భార్య చుట్టూ తిరుగుతున్నాడు.

2) నీవు కుక్కను పెంచుతావు. నాకు జాగిలము అంటే ఇష్టము కాదు. మా ఇంట్లో వెనుక శునకము ఉండేది. ఆ శ్వానము బిస్కట్లు తినేదికాదు.

3) నేను ఈశ్వరుడు అంటే ఇష్టపడతాను. మహేశ్వరుడు దయగలవాడు. శివుడు పార్వతిని పెళ్ళాడాడు. పార్వతికి కూడా శంకరుడు అంటే మక్కువ ఎక్కువ. ఈశ్వరుడు చంద్రశేఖరుడు. ఆయన త్రిలోచనుడు. గంగను ధరించి గంగాధరుడు అయ్యాడు.

4) ఈ రోజు మన ఉపాధ్యాయుడు రాడు. మన గురువు నగరానికి వెళ్ళాడు. మన అధ్యాపకుడు రేపు రావచ్చు. ఒజ్జ పాఠం విననిదే నాకు నిద్ర పట్టదు.

V. సృజనాత్మకత

* మహాభాగ్యశాలి, ధనుర్వేద విద్యాధికుడు, సర్వశాస్త్రార్థ కోవిదుడు, నీతిపాలకుడు, ధర్మపరాయణుడు, మహా సత్యవంతుడు అయిన హరిశ్చంద్రుని పాత్రకు ఏకపాత్రాభినయం తయారుచేయండి. ప్రదర్శించండి.
జవాబు:
ఏకపాత్రాభినయం

హరిశ్చంద్రుడు :
అయ్యో ! హతవిధీ ! ఎంత కష్టము ! ఆడినమాట తప్పనివాడనే ! అయోధ్యాపతినే ! త్రిశంకునందనుడినే! ధర్మమూ, సత్యమూ నాలుగు పాదాలా నడిపిస్తూ ప్రజల్ని కన్నబిడ్డల్లా చూసుకుంటున్నందుకా ఇంత కష్టము ! దైవమా! నీ లీలలు ఎవరికీ అర్థం కావు కదా !

(భార్యను అమ్మడానికి వేలం పెడుతూ)
అయ్యలారా ! ఈ దౌర్భాగ్యుడు హరిశ్చంద్రుడు, భార్యను అమ్ముకుంటున్నాడు. క్షమించండి. ఈమె పరమ పతివ్రతా శిరోమణి. ఎండ కన్నెరుగని ఇల్లాలు. ఆడి తప్పని హరిశ్చంద్ర మహారాజు భార్య. అయోధ్యా నగర చక్రవర్తి హరిశ్చంద్రుని సతీమణి. పూజ్య విశ్వామిత్రులకు బాకీపడిన సొమ్ముకై ఈ చంద్రమతిని వేలానికి పెడుతున్నా. కన్న తండ్రులారా ! ఈ అసూర్యం పశ్యను, మీ సొంతం చేసుకోండి.

(భార్యను అమ్మాడు. కాటికాపరిగా మారాడు)
అయ్యో ! చివరకు హరిశ్చంద్రుడు కాటికాపరి అయ్యాడు. ఎంత దౌర్భాగ్యము ? షోడశ మహాదానములు చేసిన చేయి. మహాపరాక్రమంతో శత్రువులను చీల్చి చెండాడిన చేతులివి – నేను దశదిశలా మారుమ్రోగిన కీర్తికెక్కిన చరిత్ర కలవాడిని. ధనుర్వేద పండితుడిని. పండిత స్తోత్రపాఠములు అందుకున్నవాడిని. షట్చక్రవర్తులలో గొప్పవాడిగా కీర్తికెక్కిన వాడిని. ఏమి నాకీ దుర్గతి ! హతవిధీ ! ఏమయ్యా ! నీ లీలలు !

ఏమైన నేమి ? ఈ హరిశ్చంద్రుడు ఆడినమాట తప్పడు. బ్రహ్మ తలరాత తప్పుగాక ! ఆ సూర్యుడు తూర్పున అస్తమించుగాక ! మేరువే నేల కుంగిన కుంగుగాక ! ఆకాశం ఊడిపడుగాక ! భూమి తలక్రిందులగు గాక ! సప్త సముద్రములూ ఇంకుగాక ! నక్షత్రములు నేల రాలు గాక ! ఆడను గాక ఆడను. అబద్ధమాడను. దైవమా ! త్రికరణ
శుద్ధిగా నేను చెపుతున్న మాట ఇది. (కింద కూలి పడతాడు)

(లేదా)

* హరిశ్చంద్రుని గుణగణాలను తెలిపే విశేషణాలను తెలుసుకున్నారు కదా ! ఇలాంటి విశేషణాలను ఉపయోగించి ఎవరైనా ఒక గొప్ప నాయకుడి గురించి ఒక వ్యాసం రాయండి.
జవాబు:
(అటల్ బిహారీ వాజపేయి)
మన మాజీ భారత ప్రధానులలో “వాజపేయి” భారతీయ జనతా పార్టీ ప్రాభవానికీ, దేశ సౌభాగ్యానికి కృషి చేసిన మహోన్నతుడు. ఈయన నిత్య ప్రసన్నుడు. ముఖాన చెరగని చిరునవ్వు ఈయనకు అలంకారము. ఈయన నీతిపాలకుడు. నిరుపమ విజ్ఞాన నిధి. మహాకవి. అతులసత్కీర్తి. దురిత దూరుడు. బుధస్తోత్ర పాత్రుడు.

గొప్ప రాజకీయవేత్త. ఆడి తప్పనివాడు. అన్యాయాన్నీ, దుర్మార్గాన్ని సహింపనివాడు కళంక రహితుడు. వినయ భూషణుడు. వివేక సంపన్నుడు. భారతదేశ కీర్తిని దశదిశలా చాటిన మహోన్నత గుణశీలుడు.

ఈయన విద్యాధికుడు. సర్వశాస్త్రార్థ విచార కోవిదుడు. విశ్వనాయకులలో వినుతి కెక్కినవాడు. ఇతడు కరుణాపయోనిధి. గాంభీర్యఘనుడు. సత్యసంధుడు. ఆడి తప్పని నాయకుడు. ఈయన తనువెల్లా సత్యము. ఈయన తలపెల్లా కరుణ. ఈయన పలుకెల్లా ప్రియము. ఈయన పనులెల్లా ధర్మము.

మన దేశ ప్రధానులలో చెరిగిపోని, వాడిపోని, సత్కీర్తిని సంపాదించిన న్యాయ ధర్మవేత్త ఈయనయే.

VI. ప్రశంస

* ఆడినమాట తప్పకుండా తను చేస్తున్న వృత్తిలో నిజాయితీపరులైన వారివల్ల ప్రజలకు కలిగే మేలును ప్రశంసిస్తూ పత్రికకు లేఖ రాయండి.
జవాబు:

రాజమహేంద్రవరం,
x x x x x x x

పత్రికా సంపాదకులు,
సాక్షి,
లబ్బీపేట,
విజయవాడ.
ఆర్యా,
విషయం : ప్రజల మేలు కోరే వారి పట్ల ప్రశంస.

నమస్కారములు.
నేను ఇటీవల కాలంలో కొంతమంది నిజాయితీపరులైన నాయకులను చూశాను. వారు ప్రజలకు తమవంతు సాయం చేస్తున్నారు. ప్రజలు వారి వద్ద తమ సమస్యలను విన్నవించుకుంటారు. నాయకులు వెంటనే పరిష్కరిస్తామని మాట ఇస్తున్నారు. అలాగే నిజాయితీగా, ధర్మబద్ధంగా ఆ పనులను చేస్తున్నారు. అదే విధంగా దేశంలో ఉన్న ప్రతి నాయకుడు కూడా ఇలాగే స్పందించి అందరికీ సహాయ సహకారాలు అందిస్తే దేశం బాగుపడుతుందని భావిస్తున్నాను. ఆడినమాట తప్పకుండా వృత్తిలో నిజాయితీపరులైన వారికి ఈ పత్రికా ముఖంగా అభినందనలను తెలుపకోరుచున్నాను.

మీ విశ్వసనీయుడు,
xxxxxx,
8వ తరగతి,
టాగూర్ ఉన్నత పాఠశాల,
రాజమహేంద్రవరం.
తూ.గో. జిల్లా.

చిరునామా :
సంపాదకులు,
సాక్షి, దిన పత్రిక,
లబ్బీపేట,
విజయవాడ.

VII. ప్రాజెక్టు పని

* సత్యం గొప్పతనం తెలుసుకున్నారు కదా ! సత్యాన్ని తెలిపే కథలను, పద్యాలను సేకరించండి. మీ పాఠశాలలో ప్రదర్శించండి.
జవాబు:
కథ :
( సత్యమేవ జయతే)
ఒక గ్రామంలో ఒక ఆవు ఉండేది. అది ఎంతో మంచిది. తోటి పశువులతో ఎన్నడూ కలహించుకోకుండా, యజమాని మాట వింటూ సాధు జంతువుగా జీవించేది.

ఒకరోజు అడవిలో అది ఒంటరిగా మేత మేస్తుండగా పులి చూచి దానిపై దూకడానికి సిద్ధమైనది. అది గమనించిన ఆవు భయపడక “పులిరాజా ! కొంచెం ఆగు. నేను చెప్పే మాటలు విను ఇంటి దగ్గర నాకొక బిడ్డ ఉన్నది. ఆ లేతదూడ పుట్టి రెండు వారాలు కూడా కాలేదు. పచ్చిక తినడం కూడా నేర్చుకోలేదు. నీవు దయదలిస్తే నా బిడ్డకు కడుపు నిండా పాలు ఇచ్చి వస్తాను. ఆ తరువాత నన్ను భక్షించు” అన్నది దీనంగా ఆవు.

ఆ మాటలు విన్న పులి పెద్దగా నవ్వి “ఆహా ! ఏమి, మాయమాటలు. ఇంటికి వెళ్ళి బిడ్డకు పాలు ఇచ్చి వస్తావా ? అడవిలో ఉన్నంత మాత్రాన నాకు తెలివితేటలు లేవనకు నేం వెర్రిబాగుల నుంచి అనుమతులు అనుకోవడం సరికాదు. నేను అసత్యం పలికే చాసను కాను. ఒక చచ్చి తను కు బయలు ! ఎప్పటికైనా చావు తప్పదు. ఆకలి గొన్న నీకు ఆహారమై తృప్తి కలిగిస్తే మంచిదే గదా ! ఉపకారం చేసిన దానినవుతాను. ఒక్కసారి నా బిడ్డను చూచి, ఆకలి తీర్చి రావాలని నా ఆశ” అన్నది ఆవు.

ఈ ఊరిలో నివసించే ఈ జంతువులలో నీతి ఎంతుందో తెలుసుకొందామని ‘సరే’ అన్నది పులి. ఆవు ఇంటికిపోయి దూడకు కడుపునిండా పాలిచ్చి కోడెదూడ శరీరాన్ని ప్రేమతో నాకుతూ “నాయనా ! బుద్ధిమంతురాలుగా మంచితనంతో జీవించు. తోటి వారితో స్నేహంగా ఉండు. ఎట్టి పరిస్థితులలోను అబద్దాలాడకు. మంచి ప్రవర్తనతో పేరు తెచ్చుకో” అని బిడ్డకు. మంచిబుద్ధులు చెప్పి ఆవు అడవికి చేరుకున్నది. ఆవుని చూసిన పులికి ఆశ్చర్యం కలిగింది. తన ప్రాణాల కంటే ఇచ్చిన మాట ముఖ్యం అనుకున్న ఈ ఆవు ఎంత గొప్పది ! దీనిని చంపితే తనకే పాపం అనుకొని ఆవును వదిలివేసింది పులి.

నీతి : ఎప్పటికైనా సత్యమే గెలుస్తుంది.

పద్యాలు :

1. అసువినాశమైన నానంద సుఖకేళి
సత్యనిష్ఠవరుని సంతరించు
సత్యనిష్ఠజూడ సజ్జన భావంబు
విశ్వదాభిరామ ! వినురవేమ !

2. రూపించి పలికి బొంకకు
ప్రాపగు చుట్టంబు నెగ్గు పలుకకు మదిలోఁ
గోపించురాజుఁ గొల్వకు
పాపపుదేశంబు సొరకు, పదిలము సుమతీ !

3. సర్వతీర్థాభిగమనంబు సర్వవేద
సమధి గమము, సత్యంబుతో సరియుఁగావు
ఎఱుగు మెల్ల ధర్మంబుల కెందుఁ బెద్ద
యండ్రు సత్యంబు ధర్మజ్ఞులైన మునులు
భారత – ఆది – 4 ఆ. 96 ప.

AP Board 8th Class Telugu Solutions Chapter 7 హరిశ్చంద్రుడు

(లేదా)

*హరిశ్చంద్రుని కథను చదివి అతని గొప్పతనాన్ని వర్ణించే వాక్యాలను చార్ట్ పై రాసి ప్రదర్శించండి.
జవాబు:
హరిశ్చంద్రుడు గుణగణాలు
హరిశ్చంద్రుడు – మహావిక్రమోన్నతుడు
హరిశ్చంద్రుడు – షోడశమహాదాన వినోది
హరిశ్చంద్రుడు – సత్యసంధుడు
హరిశ్చంద్రుడు – వినయ వివేక సంపన్నుడు
హరిశ్చంద్రుడు – సత్కీర్తి మహాభాగ్యశాలి
హరిశ్చంద్రుడు – ధనుర్వేద విద్యావిశారదుడు
హరిశ్చంద్రుడు – గాంభీర్యఘనుడు
హరిశ్చంద్రుడు – కరుణాపయోనిధి
హరిశ్చంద్రుడు – సర్వశాస్త్రార్థ విచారకోవిదుడు
హరిశ్చంద్రుడు – షట్చక్రవర్తులలో మేటి
హరిశ్చంద్రుడు – నిరుపమ విజ్ఞాన నిధి
హరిశ్చంద్రుడు – గుణగణాలను ఆదిశేషుడు సైతం, ప్రశంసింపలేడు
హరిశ్చంద్రుడు – ఆడి తప్పనివాడు
హరిశ్చంద్రుడు – మేరువు క్రుంగినా, ధారుణి తలక్రిందయినా మాట తప్పని మహారాజు.

VIII. భాషను గురించి తెలుసుకుందాం

1) కింది వాటిని పూరించండి.

సంధిపదంవిసంధిసంధి పేరు
అ) అన్నదమ్ములుఅన్న + తమ్ముడు + లుగసడదవాదేశ సంధి
ఆ) గుణములు వొగడగుణములు + పొగడగసడదవాదేశ సంధి
ఇ) విద్యాధికుడువిద్య + అధికుడుసవర్ణదీర్ఘ సంధి
ఈ) సురేంద్రసుర + ఇంద్రగుణసంధి
ఉ) తలపెల్లతలపు + ఎల్లగుణసంధి
ఊ) నల్ల గలువనల్ల + కలువగసడదవాదేశ సంధి
ఋ) వీడుదడివీడు + తడిసెగసడదవాదేశ సంధి
ఋ) కొలుసేతులుకాలు + చేయి + లుగసడదవాదేశ సంధి

2) కింది పేరాలోని సంధి పదాలను గుర్తించి అవి ఏ సంధులో రాయండి.

విద్యార్థులందరూ ఆడుకుంటూండగా ఎగురుతున్న పక్షి కింద పడింది. ఆ పక్కనే ఉన్న వాళ్ళంతా దానివైపు పరుగెత్తారు. కాని పురుషోత్తముడనే పిల్లవాడు నీళ్ళు తీసుకువెళ్ళి ఆ పక్షి పైన చల్లాడు. అది తేరుకొని లేచి పైకెగిరి వెళ్ళింది. అందరూ అతన్ని మెచ్చుకున్నారు.
పై పేరాలోని సంధులు :
విద్యార్థులు = విద్య + అర్థులు – సవర్ణదీర్ఘ సంధి
వాళ్ళంతా = వాళ్ళు + అంతా – ఉకారసంధి
పురుషోత్తముడు = పురుష + ఉత్తముడు – గుణసంధి
పైకెగిరి = పైకి + ఎగిరి – ఇత్వసంధి
విద్యార్థులందరూ = విద్యార్థులు + అందరూ – ఉత్వసంధి

AP Board 8th Class Telugu Solutions Chapter 7 హరిశ్చంద్రుడు

3) అలంకారాలు :
అ) వృత్త్యనుప్రాసాలంకారం :
అలంకారాలు ప్రధానంగా రెండు రకాలు.
1) అర్థాలంకారాలు
2) శబ్దాలంకారాలు

ఉపమాది అలంకారాలు అర్థాలంకారాలు. వీటి గురించి కింది తరగతులలో తెలుసుకున్నారు కదా ! ఇప్పుడు కొన్ని శబ్దాలంకారాలను గురించి తెలుసుకుందాం. కింది వాక్యాలను చదవండి.
1) “ఆమె కవతో వడిడి అడుగులతో గపను దాటింది”.
2) “చి చినుకులు పమని పడుతున్న వేళ”

మొదటి వాక్యంలో ‘డ’ అనే హల్లు, రెండవ వాక్యంలో ‘ట’ అనే హల్లు చాలాసార్లు వచ్చాయి.
ఈ విధంగా

ఒక హల్లును మళ్ళీ మళ్ళీ ఉపయోగిస్తే వినసొంపుగా ఉంటుంది. శబ్దం ద్వారా సౌందర్యం ఇక్కడ ప్రధానంగా కనబడుతుంది. ఈ విధంగా శబ్దానికి ప్రాముఖ్యం ఇచ్చే అలంకారాలలో వృత్త్యనుప్రాసాలంకారం ఒకటి.

మరికొన్ని ఉదాహరణలు చూడండి.
అ) బాబు జిలేబి పట్టుకొని డాబా పైకెళ్ళాడు.
ఆ) గట్టు మీది చెట్టు కింద కిట్టు రొట్టెను లొట్టలేస్తూ తింటున్నాడు.
ఇ) లక్షభక్ష్యాలు తినేవాడికి ఒక భక్ష్యం లక్ష్యమా!

ఒక హల్లుగాని, రెండు, మూడు హల్లులు గాని, వేరుగా నైనా, కలిసి ఐనా, మళ్ళీ మళ్ళీ వచ్చినట్లయితే దాన్ని “వ్యత్యనుప్రాస అలంకారం” అంటారు. “ప్రతిజ్ఞ” పాఠం చదవండి. వృత్త్యనుప్రాస అలంకారానికి చెందిన పదాలు/ వాక్యాలు గుర్తించండి.
జవాబు:
‘ప్రతిజ్ఞ’ పాఠంలోని వృత్త్యనుప్రాసాలంకారానికి చెందిన పదాలు / వాక్యాలు :

  1. పొలాల నన్నీ హలాల దున్నీ ఇలా తలంలో
  2. హేమం పిండగ – సౌఖ్యం నిండగ
  3. ఘర్మజలానికి, ధర్మజలానికి
  4. నిలో వనిలో కార్యానాలో
  5. నా వినిపించే నా విరుతించే నా వినిపించే నా విరచించే
  6. త్రిలోకాలలో త్రికాలాలలో
  7. బాటలు తీస్తూ పాటలు వ్రాస్తూ
  8. విలాపాగ్నులకు విషాదాశ్రులకు
  9. పరిష్కరించే, బహిష్కరించే – మొ||వి.

ఆ) ఛేకానుప్రాసాలంకారం :
కింది వాక్యం చదవండి.
నీకు వంద వందనాలు

పై వాక్యంలో ‘వంద’ అనే హల్లుల జంట వెంటవెంటనే అర్థభేదంతో వచ్చింది. ఇక్కడ మొదట వచ్చిన ‘వంద’ సంఖ్యను తెలుపుతుంది. రెండోసారి వచ్చిన ‘వంద’నాలు – నమస్కారాలు అనే అర్థాన్నిస్తుంది. ఈ విధంగా – హల్లుల జంట అర్థభేదంతో వెంటవెంటనే వస్తే దానిని ‘ఛేకానుప్రాస అలంకారం’ అంటారు. ఇలాంటివే మరికొన్ని ఉదాహరణలు రాయండి.
జవాబు:

  1. పాప సంహరుడు “హరుడు”
  2. మహాహీ భరము
  3. కందర్పదర్పము
  4. కానఁగాననమున ఘనము ఘనము

వ్యాకరణంపై అదనపు సమాచారం

పర్యాయపదాలు

వారిధి : సముద్రం, అంబుధి, ఉదధి
భానుడు : సూర్యుడు, రవి, ప్రభాకరుడు\
ఘనము : మేఘము, పయోధరం
గిరి : పర్వతం, కొండ, అది
జిహ్వ : నాలుక, రసన, కకుత్తు
మిన్ను : ఆకాశం, గగనము, నభము
నందనుడు : కుమారుడు, పుత్రుడు, ఆత్మజుడు
కంఠీరవం : సింహం, కేసరి, పంచాస్యం
సురలు : దేవతలు, అనిమిషులు, నిర్జరులు
ధరణి : భూమి, వసుధ, అవని
బొంకు : అబద్దం, అసత్యం
రాజు : నృపతి, నరపతి, క్షితిపతి
నుతి : పొగడ్త, స్తోత్రము, స్తుతి
వారిజగర్భుడు : బ్రహ్మ, విధాత, విరించి

వ్యుత్పత్యర్థాలు

భానుడు – కాంతిని కలుగజేయువాడు (సూర్యుడు)
వారిజగర్భుడు – పద్మము గర్భముగా కలవాడు (బ్రహ్మ)
వారిజము – నీటి నుండి పుట్టినది (పద్మం)
నందనుడు – సంతోషమును కలుగజేయువాడు (కుమారుడు)
ధరణి – సమస్తాన్ని ధరించునది (భూమి)
శరధి – శరములకు (నీళ్ళకు) నిధి (సముద్రం)
రాజు – రంజింపచేయువాడు (నరపతి)
కంఠీరవం – కంఠంలో ధ్వని కలది (సింహం)

నానార్థాలు

రాజు = ప్రభువు, చంద్రుడు
బుద్ధుడు = పండితుడు, బుధగ్రహం, వేల్పు, వృద్ధుడు
గుణము = స్వభావం, దారము, వింటినారి
పాకం = వంట, పంట, కార్యపాకాలు
జిహ్వ = నాలుక, వాక్కు జ్వాల
నందనుడు = కొడుకు, సంతోష పెట్టువాడు
ధర్మం = పుణ్యం, న్యాయం, ఆచారం

సంధులు

సవర్ణదీర్ఘ సంధి
సూత్రం: అ, ఇ, ఉ, ఋ లకు అవే (సవర్ణ) అచ్చులు పరమైనప్పుడు వానికి దీర్ఘములు ఏకదేశమగును.
విద్యాధికుండు = విద్యా + అధికుండు – సవర్ణదీర్ఘ సంధి
శాస్త్రార్థం = శాస్త్ర + అర్థం – సవర్ణదీర్ఘ సంధి
వారిజాప్తుడు = వారిజ + ఆప్తుడు – సవర్ణదీర్ఘ సంధి
వజ్రాయుధంబు = వజ్ర + ఆయుధంబు – సవర్ణదీర్ఘ సంధి

గుణసంధి
సూత్రం : అకారమునకు ఇ, ఉ, ఋ లు పరమైన వానికి క్రమముగా ఏ, ఓ, అర్లు ఏకాదేశమవుతాయి.
సురేంద్ర = సుర + ఇంద్ర – గుణసంధి
విక్రమోన్నతుడు = విక్రమ + ఉన్నతుడు – గుణసంధి
దేవేంద్ర = దేవ + ఇంద్ర – గుణసంధి

ఇత్వసంధి
సూత్రం : ఏమి మొదలైన పదాల్లోని ఇత్తునకు సంధి వైకల్పికంగా అవుతుంది.
వానికైన = వానికిన్ + ఐన – ఇత్వసంధి
వినుతికెక్కిన = వినుతికిన్ + ఎక్కిన – ఇత్వసంధి

ఉత్వసంధి
సూత్రం : ఉత్తునకు అచ్చు పరమైనపుడు సంధి అవుతుంది.
తరమిడి = తరము + ఇడి – ఉత్వసంధి
తనువెల్ల = తనువు + ఎల్ల – ఉత్వసంధి
తలపెల్ల = తలపు + ఎల్ల – ఉత్వసంధి
మున్నెన్నన్ = మున్ను + ఎన్నన్ – ఉత్వసంధి

గసడదవాదేశ సంధి
సూత్రం : ప్రథమ మీది పురుషములకు గసడదవలు బహుళంబుగానుగు.
ధారదప్పిన = ధార + తప్పిన – గసడదవాదేశ సంధి
కాలుసేతులు = కాలు + చేతులు – గసడదవాదేశ సంధి

సమాసాలు

సమాస పదంవిగ్రహవాక్యంసమాసం పేరు
మహాదానంగొప్పదైన దానంవిశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
మహాభాగ్యంగొప్పదైన భాగ్యంవిశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
విద్యధికుండువిద్యచేత అధికుండుతృతీయా తత్పురుష సమాసం
వినయభూషణుడువినయము చేత భూషణుడుతృతీయా తత్పురుష సమాసం
వివేక సంపన్నుడువివేకము చేత సంపన్నుడుతృతీయా తత్పురుష సమాసం
బుధస్తోత్ర పాత్రుండుబుధస్తోత్రమునకు పాత్రుండుషష్ఠీ తత్పురుష సమాసం
శాస్త్రార్థముశాస్త్రముల యొక్క అర్థముషష్ఠీ తత్పురుష సమాసం
భానువంశంభానువు యొక్క వంశంషష్ఠీ తత్పురుష సమాసం
విజ్ఞాననిధివిజ్ఞానమునకు నిధిషష్ఠీ తత్పురుష సమాసం
రెండువేల నాల్కలురెండు వేల సంఖ్య గల నాలుకలుద్విగు సమాసం
సత్కీర్తిగొప్పదైన కీర్తివిశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
విచారకోవిదుడువిచారమునందు కోవిదుడుసప్తమీ తత్పురుష సమాసం
వారిజగర్భుడువారిజము గర్భము నందు కలవాడుబహున్రీహి సమాసం
రిపుగజమురిపువు అనే గజమురూపక సమాసం
వారిజాప్తుడువారిజములకు ఆప్తుడుషష్ఠీ తత్పురుష సమాసం
దేవేంద్రుడుదేవతలకు ఇంద్రుడుషష్ఠీ తత్పురుష సమాసం
దురితదూరుడుదురితములను దూరం చేయువాడుతృతీయా తత్పురుష సమాసం

ప్రకృతి – వికృతులు

నిత్యము – నిచ్చలు
వంశము – వంగడము
అద్భుతము – అబ్బురము
విజ్ఞానము – విన్నానము
సత్యము – సత్తు
భాగ్యము – బాగేము
రాట్టు – ఱేడు
గుణము – గొనము
విద్య – విద్దె / విద్దియ
గర్వము – గరువము
శాస్త్రము – చట్టము
కీర్తి – కీరితి

కవి పరిచయం

పాఠము : ‘హరిశ్చంద్రుడు’

కవి : గౌరన

నివాసస్థలం : నల్గొండ జిల్లా దేవరకొండ ప్రాంతం

దేని నుండి గ్రహించబడింది : గౌరన కవి రచించిన “హరిశ్చంద్రోపాఖ్యానం” అనే ద్విపద కావ్యం నుండి గ్రహించబడింది.

కవి కాలము : 15వ శతాబ్దానికి చెందినవాడు.

రచనలు :
1) హరిశ్చంద్రోపాఖ్యానం
2) నవనాథ చరిత్ర
3) సంస్కృతంలో ‘లక్షణ దీపిక’ రచించాడు.

బిరుదు :
సరస సాహిత్య విచక్షణుడు.

రచనాశైలి : మనోహరమైనది. సామెతలు, జాతీయాలతో కవిత్వం అలరారుతుంది. అచ్చతెలుగు పలుకుబళ్ళు కవిత్వం నిండా రసగుళికల్లా జాలువారుతాయి. పదప్రయోగాలలో నైపుణ్యం అడుగడుగునా కనబడుతుంది.

ద్విపద పద్యాలు – ప్రతి పదార్థాలు-భావాలు

1-2 పంక్తులు
నిరుపమ విజ్ఞాననిధి వశిష్ఠుండు
పురుహూతు తోడ నద్భుతముగాఁ బలికె
ప్రతిపదార్ధం :
నిరుపమ విజ్ఞాననిధి; నిరుపమ = సాటిలేని
విజ్ఞాన = విజ్ఞానానికి
నిధి = పాతర (ఆశ్రయమైన) ;
వశిష్ఠుండు = వశిష్ఠ మహర్షి
పురుహూతుతోడన్ = దేవేంద్రునితో (పెక్కు మందిచే పిలువబడువాడు పురుహూతుడు)
అద్భుతముగాన్ = ఆశ్చర్యకరముగా (వింతగా)
పలికెన్ = ఇలా చెప్పాడు

భావం :
సాటిలేని విజ్ఞాన నిధియైన వశిష్ఠ మహర్షి, ఆశ్చర్యం కలిగే విధంగా దేవేంద్రునితో ఇలా చెప్పాడు.

AP Board 8th Class Telugu Solutions Chapter 7 హరిశ్చంద్రుడు

3వ పంక్తి నుండి 10వ పంక్తి వరకు
వినుము సురేంద్ర యీ విశ్వంబునందు
వినుతి కెక్కిన మహావిక్రమోన్నతుఁడు
వినయభూషణుఁడు వివేకసంపన్నుఁ
డతుల సత్కీర్తి మహాభాగ్యశాలి
వితత ధనుర్వేద విద్యాధికుండు
కరుణాపయోనిధి గాంభీర్యఘనుఁడు
దురితదూరుఁడు బుధస్తోత్రపాత్రుండు
ప్రతిపదార్ధం :
సురేంద్ర = ఓ దేవేంద్రా
వినుము = విను
ఈ విశ్వంబునందు = ఈ ప్రపంచంలో
వినుతికెక్కిన ; (వినుతికిన్ + ఎక్కిన) = ప్రసిద్ధి కెక్కిన
మహావిక్రమోన్నతుడు ; మహా = గొప్ప
విక్రమ = పరాక్రమం చేత
ఉన్నతుడు = గొప్పవాడు
తనరు = ప్రసిద్ధి పొందిన
షోడశ మహాదాన = పదహారు గొప్పదానములచే
వినోది = వినోదంగా ప్రొద్దుపుచ్చేవాడు
వినయ భూషణుడు = వినయమే అలంకారంగా గలవాడు
వివేక సంపన్నుడు = “మంచి చెడ్డలు తెలిసికోడం” అనే వివేకముతో కూడినవాడు
అతుల = పోలిక చెప్పడానికి వీలుకాని
సత్మీర్తి = మంచి కీర్తి గలవాడు
మహాభాగ్యశాలి = గొప్ప ఐశ్వర్యంచే ప్రకాశించేవాడు తనరు షోడశమహాదాన వినోది
వితత = విరివియైన (విస్తారమైన)
ధనుర్వేద విద్యా = ధనుర్వేద విద్య యందు (విలు విద్యలో)
అధికుండు = గొప్పవాడు
కరుణాపయోనిధి = దయకు సముద్రుని వంటివాడు
గాంభీర్యఘనుడు = మేఘము వలె గంభీరుడు
దురితదూరుడు = పాపానికి దూరంగా ఉండేవాడు (పుణ్యాత్ముడు)
బుధస్తోత్ర పాత్రుండు = పండితుల యొక్క ప్రశంసలకు యోగ్యుడు

భావం :
ఓ దేవేంద్రా ! ఈ ప్రపంచంలో మహా పరాక్రమ వంతుడు హరిశ్చంద్రుడు. అతడు పదహారు రకాల దానాలు చేస్తూ ఆనందిస్తాడు. వినయమే అలంకారంగా కలవాడు. వివేకమే సంపదగా కలవాడు. సాటిలేని కీర్తి కలవాడు. గొప్ప భాగ్యవంతుడు. విస్తారమైన ధనుర్వేద విద్యలో ఆరితేరినవాడు. దయకు సముద్రుని వంటివాడు. పుణ్యాత్ముడు పండితులను గౌరవించేవాడు.

విశేషాంశం :
షోడశమహాదానములు :
1. గోదానము 2. భూదానము 3. తిలదానము 4. హిరణ్యదానము 5. రత్నదానము 6. విద్యాదానము 7. కన్యాదానము 8. దాసీదానము 9. శయ్యాదానము 10. గృహదానము 11. అగ్రహార దానము 12. రథదానము 13. గజదానము నిధి 14. అశ్వదానము 15. ఛాగ (మేక) దానము 16. మహిష (దున్నపోతు) దానము.

11వ పంక్తి నుండి 18వ పంక్తి వరకు
సర్వ శాస్త్రా విచారకోవిదుఁడు
గర్వితరిపుగజ కంఠీరవుండు
వరుస నార్వురు చక్రవర్తులలోనఁ
దరమిడి మున్నెన్నఁదగు చక్రవర్తి
నిత్యప్రసన్నుండు నీతిపాలకుఁడు
సత్యసంధుండు త్రిశంకు నందనుఁడు
నిరుపమ విజ్ఞాననిధి భానువంశ
శరధిచంద్రుఁడు హరిశ్చంద్రుఁడా రాజు
ప్రతిపదార్థం :
సర్వ శాస్త్రార్థ విచారకోవిదుఁడు; సర్వశాస్త్ర = అన్ని శాస్త్రముల
అర్థ = అర్థాన్ని
విచార = పరిశీలించడంలో
కోవిదుడు = పండితుడు
గర్వితరిపుగజ కంఠీరవుండు ; గర్విత = గర్వించిన
రిపు = శత్రువులు అనే
గజ = ఏనుగులకు
కంఠీరవుండు – సింహము వంటివాడు (శత్రువులను మర్ధించేవాడు)
వరుసన్ = వరుసగా
ఆర్వురు చక్రవర్తులలోన్ = ప్రసిద్ధులైన షట్ చక్రవర్తులలో
తరమిడి = తారతమ్యము ఎంచి
మున్ను = ముందుగా
ఎన్నదగు = లెక్కింపదగిన (గ్రహింపదగిన)
చక్రవర్తి = మహారాజు
నిత్య, ప్రసన్నుండు = ఎల్లప్పుడు నిర్మలమైనవాడు (నిత్య సంతుష్టుడు)
నీతిపాలకుఁడు = నీతివంతమైన పాలన చేసేవాడు
సత్యసంధుడు = సత్యమును పాటించేవాడు
త్రిశంకునందనుడు = త్రిశంకుమహారాజు కుమారుడు
నిరుపమ విజ్ఞాన నిధి ; నిరుపమ = పోలిక చెప్పరాని
విజ్ఞాన = విజ్ఞానానికి
నిధి = రాశి (సాటిలేని విజ్ఞానం కలవాడు)
భానువంశ శరధి చంద్రుడు ;
భానువంశ = సూర్య వంశము అనే
శరధి = సముద్రములో పుట్టిన
చంద్రుడు = చంద్రుని వంటివాడు
హరిశ్చంద్రుఁడా రాజు = హరిశ్చంద్రుడు అనే రాజు

భావం :
అన్ని శాస్త్రాల సారం తెలిసినవాడు. గర్వించిన శత్రురాజులనే ఏనుగుల పాలిటి సింహం వంటివాడు. షట్చక్ర వర్తులలో ఒకడు. సత్యం వదలనివాడు. నీతిమంతమైన పాలన చేసేవాడు. గొప్ప జ్ఞాని. సత్యవాక్పరిపాలకుడు. సూర్యవంశస్థుడైన త్రిశంకుని కుమారుడు. సాటిలేని విజ్ఞానం కలవాడు. సూర్య వంశమనే సముద్రంలో పుట్టిన చంద్రుడు.

విశేషాంశం :
షట్చక్రవర్తులు :
1) హరిశ్చంద్రుడు 2) నలుడు 3) పురుకుత్సుడు 4) పురూరవుడు 5) సగరుడు 6) కార్తవీర్యార్జునుడు.

AP Board 8th Class Telugu Solutions Chapter 7 హరిశ్చంద్రుడు

19వ పంక్తి నుండి 26వ పంక్తి వరకు
పోండిమి మదిఁ దలపోసి చూచినను
వాఁడెపో బొంకనివాఁడు దేవేంద్ర
అల రెండువేల జిహ్వల వానికైనఁ
గొలఁదె హరిశ్చంద్రు గుణములు వొగడఁ
దను వెల్ల సత్యంబు తలఁ పెల్లఁగరుణ
పను లెల్ల ధర్మంబు పలు కెల్లఁ బ్రియము
బొంకు నాలుకకుఁ జేర్పుట కాని వావి
ప్రతిపదార్థం :
పోడిమిన్ = చక్కగా
మదిన్ = మనస్సులో
తలపోసి చూచినను = ఆలోచించి చూసినట్లయితే
దేవేంద్ర = ఓ దేవేంద్రా
బొంకనివాడు = అబద్దం ఆడనివాడు
వాడెపో = వాడే సుమా (ఆ హరిశ్చంద్రుడే)
అల = ప్రసిద్ధమైన
రెండువేల జిహ్వలవానికైనన్; = రెండువేల నాలుకలు గల ఆదిశేషునికైనా
హరిశ్చంద్రు = హరిశ్చంద్రుని యొక్క
గుణములు + పొగడన్ = గుణాలను పొగడుటకు
కొలదె; (కొలది + ఎ) = శక్యమా (కాదు)
తనువు + ఎల్లన్ = ఆయన శరీరమంతా
సత్యంబు = సత్యము
తలపు + ఎల్లన్ = హృదయము అంతా
కరుణ = జాలి, దయ
పనులు + ఎల్లన్ = ఆయన పనులు అన్నీ
ధర్మంబు = ధర్మము
పలుకు + ఎల్లన్ = మాట అంతయూ
ప్రియము = ఇంపుగా ఉంటుంది
బొంకు = అబద్ధము
నాలుకకున్ = నాలికవద్దకు
చేర్పుట = చేర్చడం
కాని = లేని
వాయి = నోరు

భావం :
ఓ దేవేంద్రా ! చక్కగా మనస్సులో ఆలోచించి ఆ రాజు చూస్తే హరిశ్చంద్రుడే అబద్ధం ఆడనివాడు. రెండువేలు నాలుకలు గల ఆదిశేషునికైనా ఈ హరిశ్చంద్రుని గుణగణాలు కీర్తించడం సాధ్యం కాదు. అతడు సత్యస్వరూపుడు. అతని ఆలోచనలు కరుణతో నిండి ఉంటాయి. హరిశ్చంద్రుడు ధర్మగుణం కలవాడు. ఆయన ఎప్పుడూ నిజాలే మాట్లాడతాడు. ఆబద్ధమనేది అతనికి తెలియదు.

AP Board 8th Class Telugu Solutions Chapter 7 హరిశ్చంద్రుడు

27వ పంక్తి నుండి 33వ పంక్తి వరకు
యింక నన్నియుఁ జెప్ప నేమి కారణము
వారిజ గర్భుని వ్రాంత దప్పినను
వారిజాప్తుఁడు దూర్పువంకఁ గ్రుంకినను
మేరువు గ్రుంగిన మిన్ను వ్రాలినను
ధారుణీ చక్రంబు తలక్రిందు వడిన
వారిధు లింకిన వజ్రాయుధంబు
ధార దప్పిన మాటతప్పఁడా రాజు.
ప్రతిపదార్థం :
ఇంకన్ = ఇంకా
అన్నియున్ = అన్ని గుణాలనూ
చెప్పడన్ = చెప్పడానికి
ఏమి కారణము = కారణము ఏముంది (చెప్పడం ఎందుకు)
వారిజ గర్భుని = పద్మమున పుట్టిన బ్రహ్మ యొక్క
వ్రాత + తప్పి న = రాత తప్పినా
వారిజాప్తుడు = పద్మబంధువైన సూర్యుడు
తూర్పు వంకన్ = తూర్పు దిక్కున
క్రుంకినను = అస్తమించినా
మేరువు = మేరు పర్వతము
క్రుంగినన్ = భూమిలోకి దిగిపోయినా
మిన్ను = ఆకాశము
వ్రాలినను = ఊడి కిందపడినా
ధారుణీ చక్రంబు = భూమండలము
తలక్రిందు + పడినన్ = తలక్రిందులుగా పడినా
వారిధులు = సముద్రములు
ఇంకినన్ = ఎండిపోయినా
వజ్రాయుధంబు = దేవేంద్రుని వజ్రాయుధము
ధారతప్పినిన్ = పదును తగ్గినా
ఆరాజు = ఆ హరిశ్చంద్ర మహారాజు
మాట తప్పడు = ఆడిన మాట తప్పడు

భావం : ఇన్ని మాటలు చెప్పడం ఎందుకు? బ్రహ్మరాత తప్పినా, సూర్యుడు తూర్పున అస్తమించినా, మేరు పర్వతం భూమిలో కుంగినా, ఆకాశం ఊడి కిందపడినా, భూగోళం తలక్రిందులైనా, సముద్రాలు ఎండినా, వజ్రాయుధం పదును తగ్గినా హరిశ్చంద్రుడు మాత్రము ఆడినమాట తప్పడు.

AP Board 8th Class Telugu Solutions ఉపవాచకం Chapter 3 గులాబి అత్తరు

AP State Syllabus AP Board 8th Class Telugu Textbook Solutions ఉపవాచకం Chapter 3 గులాబి అత్తరు Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Telugu Solutions ఉపవాచకం 3rd Lesson గులాబి అత్తరు

8th Class Telugu ఉపవాచకం 3rd Lesson గులాబి అత్తరు Textbook Questions and Answers

I. అవగాహన – ప్రతిస్పందన

కింది పరిచిత గద్యాలను చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

1. “ఇంకేమంటే మనవి చేసుకున్నాను గదా,
గోల్కొండ తరవాత పెద్దాపురమే చూడతగ్గదని విన్నానని ? ముందు తమరిది చిత్తగించకోరుతున్నాను.” ఇలా అని, భాను, మూత తెరిచి ఒక చిన్న పెట్టి దివాంజీ ముందు వుంచాడు. లోపల, ఎర్రని ముఖముల్ గుడ్డ అతికించిన చక్కని పెట్టి అది. అందులో ఒక చిన్న సీసా. చక్కని నగిషీ పనితో
యెంతో ముచ్చటగా వుందది. సీసాలో సగానికి పైగా అత్తరు వుంది. అది చూసి అక్కడివారందరూ గుటకలు మింగారు.
ప్రశ్నలు :
1. గోలకొండ తరువాత చూడదగినది ఏది?
జవాబు:
గోలకొండ తరువాత చూడదగినది పెద్దాపురం.

2. అత్తరు సీసా ఎలా ఉంది?
జవాబు:
అత్తరు సీసా చక్కని నగిషీ పనితో ఎంతో ముచ్చటగా ఉంది.

3. సీసాలో ఎంత అత్తరు ఉంది?
జవాబు:
సీసాలో సగానికి పైగా అత్తరు ఉంది.

4. అత్తరు సీసా చూసి అక్కడివారు ఏమి చేశారు?
జవాబు:
అత్తరు సీసా చూసి అక్కడివారు గుటకలు మింగారు.

2. “పెద్దాపురం ప్రభువులకు నజరు పెట్టుకుందామని తయారుచేశానది. గోల్కొండ నవాబుగారికి వట్టివేళ్ళ అత్తరు మిక్కిలి ప్రియం అని తెలిసి అదెంత శ్రద్ధగా తయారుచేశానో, పెద్దాపురం మహారాజులుంగారికి గులాబీ అత్తరు మిక్కిలి ప్రీతిపాత్రం అని తెలిసి అదీ అంతే శ్రద్ధగానూ తయారుచేశాను. ఆ సీసాలో ఉన్నది ఒక్కటే తులం – దీని నిమిత్తం కాశ్మీరం జాతి పువ్వులు వాడాను. ఢిల్లీ పరిసరాల్లో పారశీక జాతులే ఎక్కువ. కాశ్మీరజాతి చాలా అరుదుగా దొరుకుతుంది. అందుచేత, ఆ కాస్త అత్తరూ తయారు కావడానికి దాదాపుగా రెండేళ్ళు పట్టింది మహాప్రభూ” అని వివరించి చెప్పాడతను.

ఇది విని అక్కడివారు; దాని విశిష్టతా, విలువ ఊహించుకుని చాలా ఆనందించారు; కాని “ఆశ్చర్యమా?”
ప్రశ్నలు :
1. ఎవరికి నజరు పెట్టుకుందామని తయారు చేశాడు?
జవాబు:
పెద్దాపురం ప్రభువులకు నజరు పెట్టుకుందామని తయారు చేశాడు.

2. పెద్దాపురం మహారాజుకి ప్రీతిపాత్రం అయినది ఏది?
జవాబు:
పెద్దాపురం ప్రభువులకు గులాబీ అత్తరు ప్రీతి పాత్రమైనది.

3. గులాబీ అత్తరులో ఏ జాతి పువ్వులు వాడారు?
జవాబు:
గులాబీ అత్తరులో కాశ్మీరుజాతి పువ్వులు వాడారు.

4. ఢిల్లీ పరిసరాల్లో ఏ జాతులు ఎక్కువ?
జవాబు:
ఢిల్లీ పరిసరాల్లో పారశీక జాతులెక్కువ.

AP Board 8th Class Telugu Solutions ఉపవాచకం Chapter 3 గులాబి అత్తరు

3. ప్రతిఘటనలు అతిక్రమించగలిగితేనే జీవితానికి విజయం చేకూరుతుంది. కాని, ఒక్కొక్క జీవితానికి హృదయం పునాది అయితే, మరొక్క జీవితానికి మేధస్సు ప్రధానం అయి ఉంటుంది.

ఎక్కడ మేధస్సు ప్రధానమో అక్కడ అనుభూతి తక్కువయిపోతుంది. అక్కడ సానుభూతి కూడా ఉండదు. ఏ జీవితానికి పునాది హృదయమో అది కళాబంధురం అవుతుంది. అక్కడే కళలకు పరిణతి ఉంటుంది. అక్కడే కళలకు వినియోగం కూడా అక్కడే తన్మూలంగా కలిగే ఆనందానుభవమూ ఉంటుంది. అలాంటి ఆనందం తాననుభవించాలన్నా, ఇతర్లకు కలిగించాలన్నా ఆ కళాశీలి, తప్పనిసరిగా మహామేధావి అయివుండాలి.

కళావేత్తలోనే – కళాసాధనలోనే తన జీవితం పరిపక్వం చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే? ఎవరి సంకల్పం విశుద్ధమో, ఎవరి హృదయం కళామయమో, ఎవరి దీక్ష అనన్య సామాన్యమో, ఎవరి ప్రాప్యం లోక కళ్యాణమో ఆ కళాశీలుల నిర్మాణాలే ద్వంద్వ భూయిష్టమైన భౌతికజగత్తులో ధ్రువతారలయి మెరుస్తూ ఉంటాయి.

నిజంగా షుకురల్లీ ఖాను అలాంటి కళాశీలి. అతని అత్తరు అలాంటి ధ్రువతార.
ప్రశ్నలు :
1. ఎక్కడ మేధస్సు ప్రధానమో అక్కడ ఏది తక్కువౌతుంది?
జవాబు:
ఎక్కడ మేధస్సు ప్రధానమో అక్కడ అనుభూతి తక్కువయిపోతుంది.

2. వేటిలోనే ఒక జీవితాన్ని పరిపక్వం చేసుకుంటూ ఉండాలి?
జవాబు:
కళావేత్తలోనే, కళారాధనలోనే తన జీవితం పరిపక్వం చేసుకుంటూ ఉండాలి.

3. నిజమైన కళాశీలి ఎవరు?
జవాబు:
నిజమైన కళాశీలి షుకురలీఖాన్.

4. కళాశీలి తప్పనిసరిగా ఏమై ఉండాలి?
జవాబు:
కళాశీలి తప్పనిసరిగా మహామేధావి అయి ఉండాలి.

4. తన అత్తర్లకు విలువ కేవలం డబ్బే అయితే అందుకోసం అతనింత దూరం రానక్కర్లేదు. ఉన్నవూరే కదలనక్కర్లేదు. అసలు, ఢిల్లీ నగరమే ఒక మహాదేశం అంత. అక్కడే ఎందరో ప్రభువులూ, సంపన్నులు ఉన్నారు. వారిలో ఎందరో రసికులున్నారు. అతని అత్తర్లు కళ్ళకద్దుకునేవారు వందల వేలమంది ఉన్నారు.

అయితే, పెద్దాపురం ప్రభువు, శ్రీశ్రీశ్రీ శ్రీవత్సవాయి చతుర్భుజ తిమ్మజగపతి మహారాజు రసికత ఢిల్లీలో గుబాళించింది. ఢిల్లీ పాదుషా రసికతకే వంకలు దిద్దింది. అంచేత ఖాను ఆగలేకపోయాడు. దీక్ష పట్టాడు. తపస్సులో కూచున్నాడు. అపూర్వ సాధన చేశాడు. తహతహలాడిపోయాడు. రెక్కలు కట్టుకువచ్చి మరీ వాలాడు.

కాని, షష్టి గడియలూ పువ్వులతోనే కాలంగడిపే అతనికి, ఇక్కడ ప్రభుదర్శనం గగనపుష్పం అయిపోయింది. అపూర్వమైన జాతిరత్నం గులకరాళ్లతో కూడుకుపోయి వుండినట్టనిపించిదతనికి వచ్చి వచ్చి ముళ్ళకంచె ల్లోనూ, మురికి గుంటల్లోనూ పడిపోయినట్టు బాధపడ్డాడతను.
ప్రశ్నలు:
1. ఢిల్లీ నగరంలో ఎవరెవరు ఉన్నారు?
జవాబు:
ఢిల్లీ నగరంలో ఎందరో ప్రభువులు, సంపన్నులు ఉన్నారు.

2. అత్తర్లు కళ్ళకద్దుకునేవారు ఎంతమంది ఉన్నారు?
జవాబు:
అత్తర్లు కళ్ళకద్దుకునేవారు వందల వేల మంది ఉన్నారు.

3. పెద్దాపురం మహారాజు ఎవరు?
జవాబు:
పెద్దాపురం ప్రభువు శ్రీశ్రీ శ్రీ శ్రీవత్సవాయి చతుర్భుజ తిమ్మజగపతి

4. పేరాలోని రెండు జాతీయాలు ఏవి?
జవాబు:
తహతహలాడిపోవు, గగనపుష్పం.

5. తెల్లవారడం తడవుగా వెళ్ళి రాణేదారు పాదాల మీద వాలిపోయాడు ఖాను. ఇంతవరకూ అంత గొప్ప అత్తర్లు పెద్దాపురం కోటకు రాలేదన్న సంగతి రాణేదారుకి తెలుసు. ఖానుకి మంచి సన్మానం జరగడం దివాంజీకి సుతరామూ ఇష్టం లేదు. ఇది తెలుసు ఇతనికి. బుర్ర ఎగిరిపోడానికి కయినా ఒప్పుకుంటాడు గానీ భాను సరయిన ధర చెప్పడు ఇదీ తెలుసు అతనికి. అయితే మాత్రం మహారాజు చూశాడంటే భాను అత్తర్లు విడిచిపెట్టడు. ఈ విషయాన్ని ఆ సమయంలో దివాంజీ దగ్గర వుండిన వారందరూ గుర్తించేశారు.
ప్రశ్నలు:
1. ఖాను ఎవరి పాదాల మీద వాలిపోయాడు?
జవాబు:
భాను ఠాణేదారు పాదాలమీద వాలిపోయాడు. ఉంది.

2. భానుకి సన్మానం జరగడం ఎవరికి ఇష్టం లేదు?
జవాబు:
భానుకి సన్మానం జరగడం దివాంజీకి సుతరామూ ఇష్టం లేదు.

3. అత్తరు చూశాడంటే విడిచిపెట్టనిది ఎవరు?
జవాబు:
అత్తరును చూశాడంటే విడిచిపెట్టనిది మహారాజు.

4. ఈ పేరా ఆధారంగా దివాంజీ ఎలాంటి స్వభావం గలవాడు?
జవాబు:
ఈ పేరా ఆధారంగా దివాంజీ అసూయాపరునిగా తెలుస్తుంది.

AP Board 8th Class Telugu Solutions ఉపవాచకం Chapter 3 గులాబి అత్తరు

6. సీసా భళ్ళుమంది. సీసా పెంకులు ఘళ్ళున చెదిరిపడ్డాయి. రాజసఖుల హృదయాలు రువ్వుమన్నాయి. ఆ ప్రదేశం అంతా అత్తరు సౌరభంతో గుమ్మంది. అందరూ ఆ పరిమళానికి మత్తెక్కుతున్నట్టయ్యారు.

ఒక క్షణానికి తెలివివచ్చి అందరూ కళ్ళెత్తి చూసేటప్పటికి, హఠాత్తుగానూ అప్రయత్నంగానూ వెనక్కి తిరిగి చూసి ఖాను కొయ్యయిపోయాడు.

అదేమిటో అని అందరూ వెనక్కి తిరిగి చూడగా, పంచకళ్యాణి మీద శ్రీ శ్రీ శ్రీ శ్రీవత్సవాయి చతుర్భుజ తిమ్మజగపతి మహాద్భుతమైన గులాబి అత్తరు సౌరభాన్ని ఆఘ్రాణిస్తూ. ఎక్కడివీ సమనోహర సుగంధ పరిమళాలు అని అరకంట చూస్తూ నిలిచి ఉన్నాడు.

మోర పైకెత్తుకుని, పంచకళ్యాణి గుర్రం సైతం అద్భుతాన్ని ఆస్వాదిస్తూ ఉండుండి సప్రయత్నంగా ఊపిరి తీసుకుంటోంది.
ప్రశ్నలు :
1. రాజ సభ్యుల హృదయాలు ఏమైనాయి?
జవాబు:
రాజసఖుల హృదయాలు ఠువ్వుమన్నాయి.

2. మహారాజు దేని మీద వెళ్తున్నాడు?
జవాబు:
మహారాజు పంచకళ్యాణి మీద వెళ్తున్నాడు.

3. కొయ్యబారిపోయింది ఎవరు?
జవాబు:
కొయ్యబారిపోయింది ఖాను.

4. ఏ పరిమళానికి అందరు మత్తెక్కిపోయారు?
జవాబు:
గులాబీ అత్తరు పరిమళానికి అందరు మత్తెక్కి పోయారు.

II వ్యక్తీకరణ – సృజనాత్మకత

కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
“గులాబీ అత్తరు” కథను సంక్షిప్తంగా రాయండి.
జవాబు:
శ్రీశ్రీ శ్రీ శ్రీవత్సవాయి చతుర్భుజ తిమ్మజగపతి మహారాజు పెద్దాపురాన్ని పరిపాలించే ప్రభువు. ఆ రాజు యొక్క రసికత ఢిల్లీ వరకు వ్యాపించింది. ఆ వార్త విని ఢిల్లీ నగరవాసి అయిన షుకురల్లీఖాన్ ఎలాగైనా ఆ పెద్దాపురం ప్రభువును కలిసి తన అత్తరు వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలనుకున్నాడు.

షుకురలీఖాను ఎంతో సుమధుర సువాసనలు గుభాళించే అత్తరులను తయారు చేయడంలో పెట్టింది పేరు. ఈ భాను చేసే అత్తరుకు ఢిల్లీ ప్రభువులందరూ ముగ్ధులయ్యేవారు. ఖాను అత్తరు తయారీలో బాగా ఆరితేరినవాడు. అయితే పెద్దాపురం ప్రభువుకు తన అత్తరు గుభాళింపు చూపించి మంచి పేరు సంపాదించాలనుకున్నాడు. అందుకు గాను ఆ రాజ్యంలో కొలువులో పనిచేస్తున్న ఠాణేదారు సహాయంతో రాజ భవనానికి వచ్చాడు. రాజ కొలువులో జవానులు, పెద్ద మనుషులు, దివాంజీ ఉండడం గమనించి తన అత్తరు సీసా బిరడా తీసి, వెంటనే బిగించాడు. ఆ సుమధుర సువాసనకు అక్కడి వారందరికీ ఒక్కసారిగా మత్తెక్కినట్లయింది. అందరూ తమ ముక్కులకు పని చెప్పారు. అందరూ ఆ వాసనకు ముగ్ధులయ్యారు.

కాని దివాంజీ మాత్రం ఆ పరిమళాన్ని అసహ్యించుకున్నాడు. ఇది చూచి ఖాను నిరాశపడ్డాడు. ఎట్టకేలకు దివాంజీని కలిసి తాను అత్తరు వ్యాపారినని, తన వద్ద సువాసనతో కూడిన గులాబీ అత్తరు ఉందని చూపించాడు. కాని దివాంజీ ఆసక్తిని చూపలేదు. దాంతో నిరాశగా తిరిగి వెళ్ళాడు. మరుసటిరోజు ఖాను మళ్ళీ దివాంజీని కలిసే ప్రయత్నం చేశాడు. కానీ నిరాసే ఎదురైంది. తాను రెండు సంవత్సరాలు కష్టపడి తయారు చేసిన గులాబీ అత్తరు సీసాను కోపంగా కోట గోడవద్ద విసిరికొట్టాడు. అది పగిలిపోయింది. దాని వాసన అంతటా వ్యాపించింది. అదే సమయంలో అటుగా వెళ్తున్న రాజు గారు అక్కడి పరిమళానికి ముగ్ధుడయ్యాడు.

ఖాను ఆశ నెరవేరింది. దివాంజీ ఎన్ని యుక్తులు పన్నినా, అనుమతి ఇవ్వకపోయినా తన గులాబి అత్తరు ప్రభువుల దృష్టిలో పడింది. తన సంకల్పసిద్ధి నెరవేరింది. తన ప్రయత్నానికి దేవుడే ప్రతిఫలాన్ని ఇచ్చాడని ఎంతో సంతోషించాడు. ప్రయత్నం ఉంటే ఫలితం దానంతట అదే వస్తుంది.

ప్రశ్న 2.
షుకురభీ ఖాన్ స్వభావం ఎలాంటిది?
జవాబు:
‘గులాబీ అత్తరు’ అనే పాఠ్యభాగంలో ఎన్నో పాత్రలు ఉన్నాయి. వాటిలో షుకురలీఖాన్ పాత్ర ప్రముఖమైంది. ఖాను ఒక అత్తరు వ్యాపారి. అతడు తయారుచేసే అత్తరుకు అందరు ముగ్గులవుతారు. ఢిల్లీ నవాబుతో ఎన్నో సత్కారాలు పొందాడు. ప్రశంస, కీర్తి కోసం నిరంతరం శ్రమపడే స్వభావం భానుది. ఖాను చేసిన అత్తరు పరిమళాన్ని ఆస్వాదించినవారు ఒక్కక్షణం మత్తెక్కినట్లు అవుతారు.

దక్షిణ దేశంలో పెద్దాపురం ప్రభువు కీర్తి దశదిశల వ్యాపించింది. అది తెలుసుకొని ఖాను రెండు సంవత్సరాలపాటు శ్రమించి తయారు చేసిన గులాబీ అత్తరును తీసుకొని పెద్దాపురం సమీపించాడు. రాజును సమీపించి అత్తరు ఇచ్చి కీర్తి ప్రతిష్ఠలను పొందాలని భావించాడు. రాజదర్శనం చాలా కష్టం అయింది. ఆ కొలువు కూటంలో ఉన్న దివాంజీని కలిసాడు. రాజదర్శనం కలిగించమని కోరాడు. కొన్నిరకాల అత్తరులను చూపించాడు. దివాంజీ ఆసక్తిని చూపలేదు. ఫలితం దక్కలేదు. కోపంతో ఖాను ఆ అత్తరు సీసాను ప్రాకారం పై కొట్టాడు. తన శ్రమ వృథా అయిందని భావించాడు.

గులాబి అత్తరు సీసా పగిలి ఆ పరిమళం, సౌరభం ఆ ప్రాంతం అంతా వ్యాపించిన సమయంలో రాజావారు అక్కడికే రావడం, ఆ సౌరభానికి ముగ్ధుడవ్వడం చూసి ఎంతో సంబరపడిపోయాడు. తన ప్రయత్నం ఫలించినందుకు భగవంతునికి కృతజ్ఞతలు తెలుపుకున్న కృతజ్ఞతాశీలి. మాటల్లో నేర్పరి. ఎటువంటి సమస్యనైనా ఎదుర్కోగల ధీరత్వం గల వ్యాపారి. లాభంతో పాటు, కీర్తిని ఆశించే కీర్తితత్పరుడు. అతని అత్తరు ధ్రువతార వంటిది.

AP Board 8th Class Telugu Solutions ఉపవాచకం Chapter 3 గులాబి అత్తరు

ప్రశ్న 3.
పెద్దాపురం ప్రభువు ఎవరు? ఆయన గురించి రాయండి.
జవాబు:
దక్షిణ భారత దేశంలో పెద్దాపురం ప్రభువు శ్రీ శ్రీ శ్రీ శ్రీవత్సవాయి చతుర్భుజ తిమ్మజగపతి ప్రసిద్ధుడు. ఈయన గొప్ప రసికరాజు. ఈయన కీర్తి దశదిశల విస్తరించింది. ఢిల్లీ వరకు విస్తరించింది. ప్రజలను ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా రాజ్యాన్ని పాలించాడు. ఉదార స్వభావం కలవాడు. పరిపాలనలో తన కార్యనిర్వహణా చతురతను ప్రదర్శించేవాడు. ఎంతటి సమస్యనైనా తన మేధా సంపత్తితో చక్కగా పరిష్కరించేవాడు. తన రాజ్యంలో అందరికి న్యాయం జరగాలని ఆకాంక్షించాడు. దివాంజీకి గొప్ప పదవిని ఇచ్చి గౌరవించాడు. అయితే దివాంజీ నమ్మకద్రోహం చేసేవాడు. దివాంజీ తన ముందు నటిస్తున్నాడనే విషయం తెలియక ఆయనకు గౌరవం ఇచ్చేవాడు.

పెద్దాపురం రాజావారు ఎంత సరసులో ఆయన పరివారం అంత విరసులు. పెద్దాపురంలోని ప్రజలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండేవారు. పంచకళ్యాణి గుర్రంపై నగర సంచారం చేస్తూ ఉండేవారు. ఖాను తన కోసం కష్టపడి రెండు సంవత్సరాల సమయం వెచ్చించి తయారుచేసిన గులాబి అత్తరును కోపంతో విసిరివేయగా అది పగిలి ఆ సువాసన అంతటా వ్యాపించగా, ఆ పరిమళాన్ని నిలబడి ఆశ్వాదించిన సువాసన ప్రియుడు. మహాద్భుతమైన గులాబి అత్తరు సౌరభాన్ని ఆఘ్రాణిస్తూ, ఆ సుమధుర, సుమనోహర సుగంధ పరిమళాలకు ఎంతో ముగ్ధుడయ్యాడు. దక్షిణ దేశానికంతటికీ జాతిరత్నం శ్రీవత్సవాయి ప్రభువు.

AP Board 9th Class Telugu లేఖలు

AP State Syllabus AP Board 9th Class Telugu Textbook Solutions 9th Class Telugu లేఖలు Notes, Questions and Answers.

AP State Syllabus 9th Class Telugu లేఖలు

ప్రశ్న 1.
పగ ప్రతీకారం మంచిది కాదనీ, శాంతియుత జీవనం గొప్పదనీ మీ మిత్రునికి లేఖ రాయండి.
జవాబు:

గుంటూరు,
x x x x

మిత్రుడు రవికుమార్‌,

మిత్రమా ! నీకు స్నేహపూర్వక అభినందనలు. ఈ మధ్య నీకూ నీ ప్రక్క ఇంటి మోహనకూ తగవు వచ్చిందనీ, దానితో నీ మనస్సు బాగోలేదనీ రాశావు. నేను నీ ఉత్తరం అంతా చదివాను.

నాకు మీ తగవుకు, గట్టి కారణం ఉందని అనిపించలేదు. పగ, విరోధము, కలహము అన్న మాటలు అసలు మంచివి కావు. పగ పెంచుకొన్న కొద్దీ మన మనస్సులు పాడవుతాయి. అశాంతి పెరిగిపోతుంది. సుఖం ఉండదు.

మనం భారతం చదివితే, అన్నదమ్ముల మధ్య అకారణ విరోధం వల్ల, కౌరవ వంశం సమూలంగా నాశనమయ్యిందని తెలుస్తుంది. ఇక పాండవుల్లో కేవలం ఆ అయిదుగురూ, ద్రౌపదీ మిగిలారు. రాముడితో విరోధం పెట్టుకొన్న రావణుడు, బంధుమిత్ర పరివారంతో మరణించాడు.

ప్రస్తుత కాలంలో చూసినా, దేశాలు యుద్ధాలవల్ల సర్వనాశనం అవుతున్నాయి. గ్రామాల్లో తగవుల వల్ల కొన్ని కుటుంబాలు చితికిపోతున్నాయి.

కాబట్టి నీవు నీ ప్రక్క ఇంటి మోహతో విరోధం మానివెయ్యి. స్నేహంగా ఉండు. నీ మనస్సు సుఖంగా ఉంటుంది. మనది, శాంతికాముకులయిన గాంధీ, బుద్ధుడు పుట్టిన దేశం. మరువవద్దు. ప్రక్కవారితో స్నేహంవల్ల మనకు ఎంతో మేలు కలుగుతుంది.

ఇట్లు,
నీ మిత్రుడు,
పి.వెంకటేశ్వరరావు,
9వ తరగతి,
రవి పబ్లిక్ స్కూలు,
విజయవాడ.

చిరునామా :
కె.రవికుమార్,
S/O కె.ప్రసన్నకుమార్,
తేరు వీధి, తిరుపతి, చిత్తూరు జిల్లా,
ఆంధ్రప్రదేశ్.

ప్రశ్న 2.
అబ్దుల్ కలాంగారి గూర్చి మిత్రునికి లేఖ రాయండి.
జవాబు:

విశాఖపట్నం,
x x x x x

ప్రియమైన ప్రభాకర్ కు,

మిత్రమా ! మన రాష్ట్రపతిగా పనిచేసిన ప్రముఖ శాస్త్రవేత్త అబ్దుల్ కలామ్ గారి గూర్చి ఈ లేఖలో తెలియజేస్తున్నాను. అబ్దుల్ కలాంగారు సామాన్య కుటుంబంలో పుట్టి అత్యున్నత శిఖరాలను, అధిరోహించిన మహనీయుడు. చిన్నతనం నుండి ఆయనలో పట్టుదల, క్రమశిక్షణ, జ్ఞాన జిజ్ఞాస ఎక్కువ. అవే ఆయన ఇంజనీరుగా, శాస్త్రవేత్తగా ఎదగడానికి కారణమయ్యాయి.

అబ్దుల్ కలాంగారు అతి సామాన్య కుటుంబంలో పుట్టి, పరిశోధన సంస్థలకు ప్రాణం పోసి, ‘భారతరత్న’ పురస్కారం అందుకొన్న గొప్ప వ్యక్తి, ఆయన భారత రాష్ట్రపతిగా భారతజాతికి అందించిన సేవలు ఎనలేనివి. ఆయన మన విద్యార్థిలోకానికి స్ఫూర్తి ప్రధాతగా భావిస్తున్నాను.

ఇట్లు,
నీ మిత్రుడు,
పి. సుధాకర్.

చిరునామా :
కె. ప్రభాకర్, 9వ తరగతి,
ప్రభుత్వ ఉన్నత పాఠశాల,
శ్రీకాకుళం.

AP Board 9th Class Telugu లేఖలు

ప్రశ్న 3.
ఉపాధ్యాయురాలి ప్రోత్సాహంతో పదో తరగతి చదివి, 9.7 పాయింట్స్ సాధించి, కలెక్టరు గారి నుండి బహుమతిని అందుకున్న ‘రాణి’ని ప్రశంసిస్తూ లేఖ రాయండి.
జవాబు:

ప్రశంసా లేఖ

గుంటూరు,
x x x x x

ప్రియమైన మిత్రురాలు రాణికి !

నీ స్నేహితురాలు కల్పన రాయునది. ఎవరీ కల్పన అని ఆలోచిస్తున్నావా ? అట్టే శ్రమపడకు, నేను నీకు తెలియదు కాని నీ గురించి దిన పత్రికల్లో చదివి, ఆనందం ఆపుకోలేక నా ప్రశంసలు నీకు తెలియజేయాలని ఈ లేఖ రాస్తున్నాను.

మన రాష్ట్రంలో చాలామంది బాలికలు పేదరికం కారణంగా థమికస్థాయిలోనే చదువు ఆపేస్తున్నారు. అందరిలా నీవు కూడా ఏడవ తరగతితోనే చదువు ఆపి ఉంటే అది పెద్దవార్త అయ్యేదిగాదు. కాని నీ అదృష్టం కొద్దీ నీ ఉపాధ్యాయురాలు పాఠశాల మానిన నన్ను కస్తూర్బా పాఠశాలలో చేర్పించింది. ఉచిత విద్యతోపాటు నివాసం, వస్త్రాలు, పుస్తకాలు, భోజన సౌకర్యాలు ఉచితంగా ఆడపిల్లలకు కల్పిస్తూ వారి కోసమే ప్రభుత్వం కస్తూర్బా పాఠశాలలను ఏర్పరచింది. ఈ పాఠశాలలు అందుబాటులో ఉన్నా ఎంతోమంది బాలికలు విద్యకు దూరమవుతున్నారు. వీటి గురించిన అవగాహన వారికి లేకపోవడమే ఇందుకు కారణం.

పాఠశాలలో చేరిన నువ్వు విద్యపైనే శ్రద్ధ పెట్టి బాగా చదవడం పదవతరగతి పబ్లిక్ పరీక్షలో 9.7 పాయింట్లు సాధించడం నిజంగా గొప్ప విషయం. చదువే లోకంగా ఉంటే తప్ప ఇది సాధ్యం కాదు. ఒక తపస్సులా విద్యాభ్యాసం సాగించిన నిన్ను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను. నువ్వు నా తోటి విద్యార్థినులకే గాక నాలా వార్తాపత్రికల ద్వారా, దూరదర్శన్ వంటి ప్రసార మాధ్యమాల ద్వారా తెలుసుకున్న అమ్మాయిలకు చాలామందికి ఆదర్శంగా నిలిచావు.

కలెక్టర్ గారు నిన్ను అభినందిస్తున్న దృశ్యం దూరదర్శన్ లో చూస్తుంటే నా ఒళ్ళు పులకరించి పోయిందనుకో. నాతో పాటు చదువుతూ, మధ్యలోనే చదువుమానేసిన నా స్నేహితురాళ్ళకు నీ గురించి చెప్పాను. ప్రముఖులందరూ నిన్ను ప్రశంసిస్తున్న దృశ్యాలను చూపాను. వారు కూడా ఎంతో సంతోషించారు. నువ్వు మా సోదరివైతే ఎంత బాగుణ్ణు అని ఎవరికి వారే అనుకున్నాం. ఇప్పుడైనా నువ్వు మా సోదరివే. నీ నుండి మేమెంతో స్ఫూర్తి పొందాం. పేదరికం విద్యకు అడ్డంకి కాలేదని నీవు నిరూపించాలని మన స్ఫూర్తిగా కోరుతున్నాను.

ధన్యవాదాలు

ఇట్లు,
నీ మిత్రురాలు,
ఎ. కల్పన,
9వ తరగతి,
తెలుగు మాధ్యమం,
క్రమసంఖ్య – 18,
శారదానికేతన్ – బాలికోన్నత పాఠశాల,

చిరునామా:
పి. రాణి,
వెంకటేష్ నాయక్ గారి కుమార్తె,
రేగులగడ్డ గ్రామం,
మాచవరం మండలం.

ప్రశ్న 4.
వ్యవసాయం చేసే రైతులకు కావలసిన విత్తనాలు, ఎరువులు, సాగుకు అవసరమైన ప్రత్యేక ఋణసౌకర్యం సకాలంలో అందించే బాధ్యత చేపట్టాలని వ్యవసాయాధికారికి లేఖ రాయండి.
జవాబు:

మండపేట,
x x x x

జిల్లా వ్యవసాయాధికారి గార్కి,

ఆర్యా,

విషయం :
రైతుల అవసరాలను తీర్చే బాధ్యత తీసుకోవాలని కోరిక. – మా మండపేట భూములలో ఏటా రెండు పంటలు పండుతాయి. మా తాత ముత్తాతల నుండి మేము వ్యవసాయాన్నే నమ్ముకొని జీవిస్తున్నాము. క్రమక్రమంగా మా రైతుల జీవితం దుఃఖనిలయం అవుతోంది.

మాకు కావలసిన ఎరువులు, విత్తనాలు, పురుగుమందులు సక్రమమైన ధరలకు దొరకట్లేదు. స్థానిక వర్తకులు వాటిని దాచి, కృత్రిమంగా కొరతను సృష్టిస్తున్నారు. పండించిన ధాన్యాన్ని ఎవరూ కొనడం లేదు. ఇప్పుడు రెండవ పంటకు పెట్టుబడి దొరకడం లేదు. బ్యాంకులకు ఎన్నిసార్లు వెళ్ళినా మేము ఉత్త చేతులతో తిరిగి రావలసి వస్తోంది. విద్యుచ్ఛక్తి కనీసం మూడు గంటలయినా రావడంలేదు.

మేము పంటలు పండించకపోతే ప్రజలు పస్తులు ఉండాలి. ప్రజలకు చేతిలో ఎంత డబ్బు ఉన్నా తిండి గింజలే తింటారు కదా. మీరు శ్రద్ధ చూపించి, మాకు అప్పులు దొరికేలా, ఎరువులు, విత్తనాలు సరయిన ధరలకు దొరికేలా చర్యలు వెంటనే చేపట్టండి. వ్యవసాయాన్ని బ్రతికించండి. సెలవు.

నమస్కారములు.

ఇట్లు,
మీ విశ్వసనీయుడు,
ఎన్. శ్రీకాంత్,
మండపేట,
తూర్పుగోదావరి జిల్లా.

చిరునామా :
జిల్లా వ్యవసాయశాఖాధికారిగార్కి,
కాకినాడ,
తూ|| గో|| జిల్లా.

ప్రశ్న 5.
మీ జిల్లాలో ఒక విద్యార్థి వ్యర్థంగా పారవేసిన వస్తువులతో అద్భుతంగా కళా ఖండాలు తయారుచేశాడు. ఆ వార్తను మీరు పత్రికలో చూశారు. అతణ్ణి ప్రశంసిస్తూ పత్రికకు లేఖ రాయండి.
జవాబు:

వాకాడు,
x x x x

కె. రాజా రవివర్మ,
9వ తరగతి,
వాకాడు జిల్లా పరిషత్ హైస్కూలు,
నెల్లూరు జిల్లా,

ఈనాడు పత్రికా సంపాదకులకు,
సోమాజీగూడ, హైదరాబాదు.

ఆర్యా,

ఈ రోజు మీ పత్రికలో మా నెల్లూరు జిల్లా గూడూరు విద్యార్థి కె. రవిరాజు, వీధుల్లో పారవేసే ప్లాస్టిక్ కాగితాలు, బాటరీలు, అగ్గిపెట్టెలు వగైరా వ్యర్థ పదార్థాలతో చార్మినార్, తాజ్ మహల్ వంటి కళాఖండాల నమూనాలను అద్భుతంగా తయారు చేశాడని చదివాను. ఆ కళాఖండాలను చూసి, మా జిల్లా విద్యాశాఖాధికారి గారు, మా కలెక్టరు గారు, స్థానిక మంత్రిగారు ఆ విద్యార్థిని ప్రశంసించినట్లు చదివాను.

రవిరాజులోని కళాతృష్ణనూ, కళాచాతుర్యాన్ని నేను మనసారా ప్రశంసిస్తున్నాను. మా నెల్లూరు జిల్లా విద్యార్థి యొక్క కళాపిపాసనూ, అతనిలోని సృజనాత్మక శక్తినీ నేను మనసారా మెచ్చుకుంటున్నాను. మీ పత్రిక ద్వారా నా అభినందనలను, మా సోదరుడు రవిరాజుకు అందజేయండి. భవిష్యత్తులో అతడు ఉత్తమ కళాకారుడు కావాలని నేను కోరుకుంటున్నాను.

ఇట్లు,
కె. రాజా రవివర్మ,
జిల్లా పరిషత్ హైస్కూలు,
వాకాడు.

చిరునామా :
సంపాదకులు,
ఈనాడు దినపత్రిక,
సోమాజీగూడ, హైదరాబాదు.

AP Board 9th Class Telugu లేఖలు

ప్రశ్న 6.
మీ పాఠశాలలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలను వివరిస్తూ మిత్రునికి లేఖ రాయండి.
జవాబు:

వాకాడు,
x x x x x

ప్రియమైన మిత్రుడు కిరణకు,

ఉభయకుశలోపరి. ఇటీవల మా పాఠశాలలో 70వ గణతంత్ర దినోత్సవాన్ని వేడుకగా జరిపారు. మా ఊరి సర్పంచ్, కొందరు విద్యార్థుల తల్లిదండ్రులు ఈ కార్యక్రమానికి వచ్చారు. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో మేమంతా అంబేద్కర్, బాబూ రాజేంద్రప్రసాద్, నెహ్రూ, మహాత్మాగాంధీ, పింగళి వెంకయ్య మొదలైన మహనీయుల గురించి మాట్లాడాము. మా సోషల్ టీచర్ భారతుల ఫణిగారు మాకు మాట్లాడటంలో శిక్షణ ఇచ్చారు. మమ్మల్ని అందరూ మెచ్చుకున్నారు. మీ పాఠశాలలో జరిగిన విశేషాలను తెలియజేయి. ఇంతే సంగతులు.

ఇట్లు,
నీ ప్రియమిత్రుడు,
కె. ఫణిరామ్.

చిరునామా :
కె. కిరణ్ కుమార్,
9వ తరగతి,
ప్రభుత్వ ఉన్నత పాఠశాల,
రేటూరు, గుంటూరు జిల్లా.

ప్రశ్న 7.
మీ పాఠశాలలో జరిగిన “అమ్మకు వందనం” కార్యక్రమం గూర్చి వివరిస్తూ మీ మిత్రునికి లేఖ రాయండి.
జవాబు:

చెరుకూరు,
x x x x x

ప్రియమైన మిత్రుడు కార్తీక్ కు,

నేను క్షేమం. నీవు క్షేమమని భావిస్తున్నాను. నేను బాగా చదువుతున్నాను. నీవెలా చదువుతున్నావు. ఇటీవల మా పాఠశాలలో ‘అమ్మకు వందనం’ కార్యక్రమం బాగా జరిగింది. దానిలో భాగంగా ప్రతి విద్యార్థి తల్లిని ఆహ్వానించారు. ఆ అమ్మలకు వారి పిల్లల చేత పాదపూజ చేయించారు. మేము అలా చేసి అమ్మ ఆశీస్సులు పొందాం. నేను, మరికొంతమంది పిల్లల అమ్మ గొప్పదనం, మా అమ్మ గొప్పతనాన్ని గొప్పగా చెప్పాము. ఆ సమయంలో మా అమ్మ కళ్ళలో నా మీద ప్రేమ తొణికిసలాడింది. ఆమె నా కోసం పడ్డ కష్టాన్ని వృధా పోనీయక బాగా చదివి మంచి స్థాయికి వెళ్ళి అమ్మను ఇంకా బాగా సంతోషించేటట్లు చేయాలని నిర్ణయించుకున్నాను. మీ స్కూలులో ఈ కార్యక్రమం ఎలా జరిగిందో ఉత్తరం రాయి.

ఇట్లు,
నీ ప్రియమిత్రుడు,
కె. లీలాకృష్ణ సాయిశ్రీ ప్రసాదు.

చిరునామా :
ఎస్. కార్తీక్,
S/o బాలు,
9వ తరగతి ఎ-సెక్షన్,
ప్రభుత్వ పాఠశాల, ఒంగోలు,
ప్రకాశం జిల్లా.

ప్రశ్న 8.
మీ గ్రామంలో జరుగుతున్న స్వచ్ఛభారత్ కార్యక్రమాల గురించి వివరిస్తూ నీ మిత్రునకు లేఖ వ్రాయుము.
జవాబు:

మిత్రునికి లేఖ

అప్పాపురం,
x x x x x

ప్రియ మిత్రుడు ఫణిరామ్ కు,
ఉభయకుశలోపరి. నేను బాగా చదువుతున్నాను. నీవెలా చదువుతున్నావు ? నీకు నేను ఇటీవల రెండు ఉత్తరాలు రాశాను. జవాబులేదు. చదువు ధ్యాసలో పడి నన్ను మరచిపోవద్దు. మొన్నీ మధ్యన మా గ్రామంలో “స్వచ్ఛభారత్” కార్యక్రమాలు నిర్వహించారు. మనం అశ్రద్ధ చేయడం వల్ల, గ్రామాలు, నగరాలు, కార్యాలయాలు, వైద్యశాలలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు ఇలా అన్నీ చెత్తా చెదారాలతో నిండిపోయాయి. దీన్ని గుర్తించి మన భారత ప్రధాని నరేంద్రమోడీగారు, భారతీయులకు ‘స్వచ్ఛభారత్’ పిలుపునిచ్చారు. ఆరోగ్యమే మహాభాగ్యం కదా !

ఆ పిలుపునందుకొని ఎందరో పెద్దలు తమ ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంలో పోటీపడుతున్నారు. ఆ క్రమంలో మా గ్రామంలో కూడా స్వచ్ఛభారత్ నిర్వహించారు. చెరువులు శుభ్రం చేశారు. రోడ్లకు ఇరువైపులా ఉన్న తుమ్మచెట్లు వగైరా తొలగించారు. మురుగునీరు తొలగించి, బ్లీచింగ్ పౌడర్ చల్లారు. త్రాగునీరు పరిశుభ్రంగా ఉండేట్లు చేశారు. మల, మూత్ర విసర్జన బహిరంగ ప్రదేశంలో చేయకూడదని చాటింపు వేశారు. ప్లాస్టిక్ కవర్లు ఉపయోగించకూడదని నిర్ణయించారు. అలాగే ‘ప్పారాగ్, గుట్కా పొగాకు’ వంటి వాటి జోలికి పోకూడదని, ఎవరూ అమ్మకూడదని నిర్ణయం తీసుకున్నారు. ఇది ఏ ఒక్కరితో సాధ్యపడేది కాదు. అందరి సహకారం కావాలి. మరి మీ ఊరిలో స్వచ్ఛభారత్ నిర్వహించారా ? మరి ఆ విశేషాలు లేఖ ద్వారా తెలియజేయి.

ఇట్లు,
నీ మిత్రుడు,
కె. కిరణ్ కుమార్.

చిరునామా:
కె. ఫణిరామ్,
9వ తరగతి, ప్రభుత్వ ఉన్నత పాఠశాల,
చెరుకూరు,
ప్రకాశం జిల్లా.

ప్రశ్న 9.
ప్రపంచ శాంతి ఆవశ్యకతను తెలుపుతూ మిత్రునికి లేఖ రాయండి. మితునికి లేఖ
జవాబు:

పూళ్ళ,
x x x x x

ప్రియమైన మిత్రుడు కార్తీక్ కు,

నేను క్షేమం, నీవు క్షేమమని భావిస్తాను. బాగా చదువుతున్నావా? ఇటీవల మా పాఠశాలలో వ్యాసరచన పోటీలు పెట్టారు. మాకు ‘ప్రపంచశాంతి’ అంశం ఇచ్చారు. ఆ పోటీలో నేనే ప్రథమస్థానం పొందాను. నేను రాసిన పాయింట్స్ బాగున్నాయని మా మాస్టార్లు అన్నారు.

శాంతిని మనమే చంపి, గోరీలు కూడా కట్టామాయె. ఇప్పుడు పరితపిస్తే మాత్రం ఎలా వస్తుంది? ఉన్నప్పుడు స్వార్థంతో, మతోన్మాదంతో ఊపిరి సలపనీయకుండా చేశామాయె. ఇప్పుడు రమ్మంటే ఎక్కడి నుండి వస్తుంది? ఎలాగ వస్తుంది? ఎప్పుడైతే మనం పరమత సహనం కల్గి ఉంటామో, ఎప్పుడైతే సోదర భావంతో అందరితో మెలుగుతామో అప్పుడు ‘శాంతి’ తన ఉనికిని చాటుకుంటుంది. అని రాశాను. మీ పాఠశాలలో జరిగిన విశేషాలను రాస్తావు కదూ !

ఇట్లు,
నీ ప్రియమిత్రుడు,
కె. లీలాకృష్ణ

చిరునామా:
S. కార్తీక్,
S/o బాలసుబ్రహ్మణ్యం,
9వ తరగతి, ప్రభుత్వ పాఠశాల,
ఒంగోలు.

9th Class Telugu కరపత్రాలు

ప్రశ్న 1.
“స్వచ్చభారత్” ఆవశ్యకతను తెలుపుచూ ఒక కరపత్రం తయారుచేయండి.
జవాబు:

ప్రియమైన పర్యావరణ పరిరక్షకులారా !

ఆరోగ్యమే మహాభాగ్యమని పెద్దల మాట. మనం అశ్రద్ధ చేయడం వల్ల గ్రామాలు, నగరాలు, కార్యాలయాలు, వైద్యశాలలు చెత్తాచెదారాలతో నిండిపోయాయి. దీనిని గుర్తించి మన భారత ప్రధాని నరేంద్రమోడీగారు, భారతీయులకు స్వచ్ఛభారత్ కోసం పిలుపునిచ్చారు.

ఈ పిలుపును అందుకొని ఎందరో పెద్దలు తమ నగరాలను, గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంలో పోటీ పడుతున్నారు. ముఖ్యంగా మన పిల్లలు ప్రతిరోజూ ఇంటిని, అలాగే బడిని పరిశుభ్రంగా ఉంచుకోవడంలో తల్లిదండ్రులుగా మీరంతా వారికి సహకరించాలి.

ప్రభుత్వ వైద్యశాలలను పరిశుభ్రంగా ఉంచడంలో సిబ్బందికి, రోగులు, ప్రజలు సహకరించాలి. రోడ్లపై తుక్కు పోయకుండా, చెత్తకుండీలలోనే వేయాలి. మలమూత్ర విసర్జనలు బహిరంగ ప్రదేశాల్లో చేయకూడదు. చెరువులు, బావులు, కాలువలను కలుషితం చేయకుండా పరిశుభ్రంగా ఉంచాలి.

మనదేశాన్ని మనమే శుభ్రంగా ఉంచే బాధ్యత తీసుకోవాలి. మనదేశం స్వచ్ఛమైనదని పేరు వచ్చేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరుకుంటున్నాం.

మనం శుభ్రంగా ఉందాం.

దేశాన్ని పరిశుభ్రంగా ఉంచుదాం.
ఇట్లు,
పర్యావరణ పరిరక్షణ బృందం.

AP Board 9th Class Telugu లేఖలు

ప్రశ్న 2.
పగ, ప్రతీకారం మంచిదికాదనీ, శాంతియుత జీవనం గొప్పదని తెలియజేస్తూ ‘కరపత్రం’ రూపొందించండి.
జవాబు:

కరపత్రం

ప్రియమైన మిత్రులారా !
పగ, ప్రతీకారం మంచిదికాదు, శాంతియుత జీవనం గొప్పదన్న సంగతి తెలుసుకోండి. అలనాడు రావణాసురుడు, దుర్యోధనుడు, కర్ణుడు మొదలుకొని నేటి పాక్ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ వరకు అందరూ పగతో రగిలినవారే. చివరకు ఏం జరిగిందో, ఏమి జరుగుతుందో మనందరికీ తెలుసు. పగ ఉంటే పాము ఉన్న ఇంట్లో ఉన్నట్టే. కాలుతున్న కట్టే ఇంకొక కట్టెను కాల్చగలదు. అంటే పగ, ప్రతీకారంతో రగులుతున్న వ్యక్తి ముందు తాను నశిస్తూ, ఇంకొకరిని నాశనం చేయడానికి ప్రయత్నిస్తాడు. దీనివల్ల వారు ఏం సాధిస్తారు. అందరూ ఉంటేనే కదా సమాజం. ఎవరూ లేకపోతే అది స్మశానమే.

పెద్దలు ఎప్పుడూ ఒకమాట చెబుతారు. ఏమిటంటే ‘నీ కష్టంలో నీ వెంట వచ్చే నలుగురిని సంపాదించుకో’ అని. అంటే నలుగురితో మంచిగా ఉండమని కదా ! గౌతమ బుద్ధుడు, మహాత్మాగాంధీ వంటి మహనీయుల వారసులుగా మనం సాధించేది ఇదేనా ? సరిహద్దుల్లో శత్రువులను పారద్రోలడానికి సైనికులున్నారు. సంఘంలోని చెడ్డవారిని ఆపడానికి పోలీసులున్నారు. మరి నీలోని శత్రువులను రూపుమాపడానికి ఎవరున్నారు ? ముందు మనం మారాలి. మన మనసును మన ఆధీనంలో ఉంచుకున్నప్పుడు అంతా సంతోషమే. మనమే బాగుండాలి అన్నది స్వార్థం. ‘అందరూ బాగుండాలి ఆ అందరిలో నేనుండాలి’ అనుకోవడం పరమార్థం. శాంతిని స్థాపిద్దాం. సుఖైక జీవనం సాగిద్దాం. “శాంతి నీ ఆయుధమైతే; పగ, ప్రతీకారం నీ బానిసలు అవుతాయి.” అశాంతీ, అగ్గిపుల్లా ఒకటే. అవి కాలుతూ ఇంకొకరిని కాల్చడానికి ప్రయత్నిస్తాయి.

లోకా సమస్తా సుజనోభవన్తు
సర్వేసుజనా సుఖినోభవన్తు

ప్రశ్న 3.
ప్రభుత్వ పాఠశాలల్లోని సౌకర్యాలను వివరిస్తూ కరపత్రాన్ని తయారు చేయండి.
జవాబు:

ప్రభుత్వ పాఠశాల – సౌకర్యాలు

తల్లిదండ్రులందరికీ మా విన్నపము. నేడు మన ప్రభుత్వ పాఠశాలలు, విద్యార్థులకు కావలసిన అన్ని సౌకర్యాలతో హాయిగా ఉన్నాయి. ముఖ్యంగా విద్యార్థులకు కావలసినది, చక్కని శిక్షణ పొందిన ఉపాధ్యాయులు. ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులంతా పోటీ పరీక్షల్లో నెగ్గిన రత్నాల వంటివారు. వారికి మంచి విద్యార్హతలు, మెరిట్ ఉంది. వారికి మంచి జీతాలు సక్రమంగా వస్తాయి. వారు మంచిగా బోధిస్తారు.

ఇక ప్రభుత్వ పాఠశాలలకు చక్కని భవనములు, ఆటస్థలాలు, ప్రయోగశాలలు ఉన్నాయి. ఆటలు ఆడించే వ్యాయామ ఉపాధ్యాయులు, అనుభవజ్ఞులయిన ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఉన్నారు. మంచినీటి సదుపాయము, విద్యుచ్ఛక్తి, ఫోను, మరుగుదొడ్లు ఉన్నాయి.

ఇక్కడ పిల్లలందరికి ఉచితంగా చదువు చెపుతారు. ఉచితంగా పుస్తకాలు ఇస్తారు. మధ్యాహ్నం భోజనాలు ఉంటాయి. అర్హులయిన వారికి హాస్టలు సదుపాయం ఉంటుంది. హాస్టల్ విద్యార్థులకు ప్రయివేటుగా శిక్షణ చెప్పే ఉపాధ్యాయులు ఉంటారు. కాబట్టి మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్చండి. కాన్వెంట్ల కోసం అధిక ధన వ్యయం చేసుకోకండి. బాగా ఆలోచించి, మంచి నిర్ణయం తీసికోండి. గొప్ప గొప్ప విద్యావేత్తలంతా ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివారని మరచిపోకండి.

నమస్కారములు.

ఇట్లు,
ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయ సంఘం,
కాకినాడ.

దివి x x x x x

ప్రశ్న 4.
ఈ రోజుల్లో కాలుష్యం, ఇతర కారణాల వల్ల కొన్ని పక్షులు, జంతువులు కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. వీటిని కాపాడుకోవలసిన ఆవశ్యకతను వివరిస్తూ కరపత్రం తయారుచేయండి.
జవాబు:
ఈ రోజుల్లో మనం ఎక్కువగా క్రిమిసంహారక మందులను పంట పొలాల్లో, పెరట్లోని మొక్కల పై, ఇంట్లో వస్తువులపై చల్లుతున్నాము. ముఖ్యంగా పుష్పాలు పూసి ఫలదీకరణ చెందాలంటే సీతాకోక చిలుకల వంటి పక్షులు ఒక పరాగాన్ని పుష్పానుండి మరొక పుష్పానికి తమ రెక్కలతో చేర్చాలి. పురుగులను కొన్ని పక్షులు తమ ముక్కులతో పొడిచి చంపాలి.

అలాగే మనం చల్లే ఎండ్రిన్ వల్ల భూమిని సారవంతం చేసే, గుల్లబార్చే వానపాములు ఎన్నో చస్తున్నాయి. మామూలు పాములు, ఎలుకలు వగైరా ఎన్నో జంతువులు చస్తున్నాయి. ఆ జంతువులూ, పక్షులూ మన పంటలకు చేసే మేలును మనం కోల్పోతున్నాం. అదీగాక పురుగు మందుల అవశేషాలు పంటలపై మిగిలిపోవడంతో వాటికి ధరలు పలకటం లేదు. క్రిమి సంహారక మందుల అవశేషాలు మిగిలిన పంట గింజలను మనం తినడంతో కేన్సర్, టి.బి., గుండె జబ్బులు వస్తున్నాయి.

ప్రకృతి సహజంగా మనకు ఇచ్చిన రక్షణ కవచం ఈ పురుగులూ, జంతువులు. అవి ఒకదానిపై ఒకటి ఆధారపడి జీవిస్తాయి. అందువల్ల మన పంటలు హాయిగా పెరుగుతాయి. మనం భగవంతుడు మనకిచ్చిన సహజ ప్రకృతిని కాపాడుకుందాం. ఆరోగ్యంగా జీవిద్దాం. మన చుట్టూ ఉన్న పక్షులను, జంతువులను రక్షిద్దాం.

ప్రశ్న 5.
ధనవంతులు సమాజానికి ఉపయోగపడాలి. అనాథ శరణాలయాలకు, వృద్ధాశ్రమాలకు, బీదలకు విరాళాలు ప్రకటించమని ధనవంతులకు, వృద్ధాశ్రమాలకు కరపత్రం ద్వారా విజ్ఞప్తి చేయండి.
జవాబు:
అన్నదానాన్ని మించిన దానం లేదు
దాతను మించిన చిరంజీవి లేడు

దానం చేయడమే ధనార్జనకు సార్థకత. దాచుకోవడం కాదని భారతీయ ధర్మం బోధిస్తుంది. పుట్టడంతోనే తల్లిదండ్రులకు దూరమయ్యే అభాగ్యులు, చిన్న వయస్సులోనే తల్లిదండ్రులను కోల్పోయి, అయిన వారిచే నిరాదరణకు లోనైన అదృష్టహీను లెందరో ఈ దేశంలో ఉన్నారు. వారు సమాజంపై ద్వేషాన్ని పెంచుకొని సంఘవిద్రోహులుగా మారుతున్నారు. అలానే అనేక కష్టాలను, నష్టాలను భరించి, అపురూపంగా పెంచుకున్న తమ పిల్లలే ముసలితనంలో తమని వీధుల్లో విడిచి పెడితే ఏం చేయాలో తోచని అమాయక వృద్ధులు ఎందరో బిచ్చగాళ్ళ రూపంలో మనకు దర్శనమిస్తుంటారు. వీరేగాక రెక్కాడితే గాని డొక్కాడని ఎందరో నిరుపేదలు ఉన్నారు. వందల ఎకరాల పొలం గల వ్యక్తి ఉన్న ఊరిలోనే ఒక సెంటు భూమి కూడా లేనివారు జీవిస్తున్నారు. పెద్ద పెద్ద బంగళాలు గల ప్రాంతంలోనే రోడ్ల ప్రక్కన ప్రమాదకర స్థలాల్లో పూరిగుడిసెలలో జనాలు జీవిస్తున్నారు. కొందరు తిండి ఎక్కువై జీర్ణంకాక ఇబ్బంది పడుతుంటే, మరికొందరు తినడానికి ఏమీలేక బాధపడుతున్నారు.

ఇలాంటి విచిత్ర పరిస్థితుల్ని మనం నిత్యజీవితంలో దాదాపు రోజూ చూస్తూనే ఉంటాం. ఈ అసమానతలు ఇలా కొనసాగాల్సిందేనా ? వీటిని సరిచేయలేమా ? అని ఆలోచిస్తాం. మన పనుల్లో పడి మర్చిపోతుంటాం. తీరికలేని పనుల్లో పడి సామాజిక బాధ్యతల్ని విస్మరిస్తాం.

మిత్రులారా ! మనకందరికి సమాజసేవ చేయాలనే కోరిక ఉన్నా తీరికలేక చేయలేకపోతున్నాం. మనం స్వయంగా సేవచేయలేకపోయినా సమాజసేవలో మనవంతు కృషిచేసే అదృష్టం మన కందుబాటులోనే ఉంది. అదెలా అంటే మనం మన దగ్గర ఉన్న ధనాన్ని అనాథాశ్రమాలకు, వృద్ధాశ్రమాలకు విరాళంగా ఇవ్వవచ్చు. ఆ ఆశ్రమాల నిర్వాహకులు ఆ ధనాన్ని సద్వినియోగపరుస్తారు. అలానే మనవద్ద అదనంగా ఉన్న వస్త్రాలను, బియ్యం వంటి ధాన్యాలను, ఇతర ఆహార పదార్థాలను సేకరించి బీదలుండే ప్రాంతాలలో పంచి పెట్టే ఎన్నో సేవాసంస్థలు అందుబాటులోకి వచ్చాయి. మనం చేయాల్సిందల్లా ఆయా సేవాసంస్థలకు మనవద్ద ఉన్నవి అందివ్వడమే. అంతర్జాలంలో సేవాసంస్థల చిరునామాలు ఉంటాయి. డబ్బును కూడా ఉన్నచోటు నుండి కదలకుండా ఆయా సంస్థల బ్యాంకు కాతాలకు పంపించే సౌకర్యాలు ఉన్నాయి. వాళ్ళకు ఫోన్ చేస్తే వారే వాహనాలతో వచ్చి మనవద్ద ఉన్న ధాన్యం, వస్త్రాలు మొదలైన వాటిని తీసుకొని వెళ్తారు.

సోదరులారా ! మనకు ఎక్కువైన వాటితోనే కొన్ని కుటుంబాలు ఒకపూటైనా చక్కని భోజనాన్ని, మంచి వస్త్రాన్ని పొందగలుగుతాయి. కాబట్టి మనకున్న ఈ సౌకర్యాన్ని వినియోగిద్దాం. మన సహృదయతను పెద్ద మొత్తాలలో విరాళాలు ప్రకటించడం ద్వారా, ధాన్యవస్త్రాలను ఇవ్వడం ద్వారా చాటుకొందాం. దేశంలో పేదరికాన్ని నిర్మూలించడంలో మన వంతు సాయాన్ని అందిద్దాం.

పేదలకు సాయం చేద్దాం
గుంటూరు జిల్లా,

పేదరికాన్ని రూపుమాపుదాం
బ్రాడీపేట 2/14, గుంటూరు.

AP Board 9th Class Telugu లేఖలు

ప్రశ్న 6.
దోమల నివారణకు ప్రజలు తీసుకోవలసిన జాగ్రత్తలను తెలుపుతూ కరపత్రం తయారుచేయండి.
జవాబు:
దోమలపై దండయాత్ర దోమలపై దండయాత్ర యువతీ యువకులారా ! ఆలోచించండి ! ఆరోగ్యవంతమైన శరీరంలో ఆరోగ్యవంతమైన ఆలోచనలు వస్తాయి. అనారోగ్యానికి ప్రధాన కారణాలలో దోమకాటు ప్రధానమైనది. ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించాలంటే దోమలను నివారించాలి. మురుగునీరు దోమలకు నిలయం. మురుగునీరు నిల్వ ఉండకుండా చూద్దాం. నీటిలో కుళ్ళిన ఆకులు, చెత్తా చెదారం వలన దోమలు వృద్ధి అవుతాయి. రోగాలు వ్యాపిస్తాయి. మలేరియా, డెంగ్యూ వంటివి దోమల వల్లే వ్యాపిస్తాయి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడమే ఈ సమస్యకు పరిష్కారం. దోమలు వ్యాపించకుండా బ్లీచింగ్ పౌడర్ చల్లుకోవాలి. వాకిళ్ళు, కిటికీలకు దోమతెరలు బిగించాలి. జెట్ కాయిల్స్ వంటి వాటితో కూడా దోమలబాధ తగ్గుతుంది. కానీ మనకు శ్వాసకోశ ఇబ్బందులుంటాయి కాబట్టి సహజంగా దొరికే సాంబ్రాణి పొగ వేయడం, ఎండిన వేపాకు పొగవేయడం వంటివి దోమలను నివారిస్తాయి. పొడుగు దుస్తులు ధరించడం కూడా మేలే. దోమలను నివారిద్దాం – ఆరోగ్యాన్ని కాపాడుదాం.

ఇట్లు,
జిల్లా ఆరోగ్య పరిరక్షణ బృందం.

ప్రశ్న 7.
మీ పాఠశాలలో ‘ప్రపంచ శాంతి’ అనే అంశంపై మండలస్థాయి వ్యాసరచన పోటీ నిర్వహించాలని అనుకున్నారు. విద్యార్థులను ఆహ్వానిస్తూ కరపత్రం తయారు చేయండి.
జవాబు:

వ్యాసరచన పోటీ

కొవ్వూరు మండల విద్యార్థులకు ఒక శుభవార్త. దివి X X X X X వ తేదీ సోమవారం, కొవ్వూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో “ప్రపంచశాంతి” అనే విషయమై వ్యాసరచన పోటీ నిర్వహిస్తున్నాము. ఈ పోటీలో కొవ్వూరు మండలంలోని ప్రభుత్వ గుర్తింపు గల ఉన్నత పాఠశాలల విద్యార్థులందరూ పాల్గొనవచ్చును. పోటీలో పాల్గొనే విద్యార్థులు తమ ప్రధానోపాధ్యాయుని వద్ద నుండి గుర్తింపు పత్రం తీసుకురావాలి.

వ్యాసరచనకు సమయం 30 నిమిషాలు ఇవ్వబడుతుంది. వ్యాసాలు రాయడానికి కాగితాలు ఇవ్వబడతాయి. ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు ఇవ్వబడతాయి. ఈ పోటీ కొవ్వూరు మండల డెవలప్ మెంట్ ఆఫీసరు గారి పర్యవేక్షణలో సాగుతాయి.

వ్యాసరచన విషయం : “ప్రపంచశాంతి”

ఎక్కువమంది విద్యార్థినీ విద్యార్థులు ఈ పోటీలో పాల్గొని జయప్రదం చేయగోరిక. ప్రధానోపాధ్యాయులు అందరూ ఈ పోటీని జయప్రదం చేయడానికి సహకారం అందించగోరుతున్నాను.

దివి X XX XX.

మండల డెవలప్ మెంటు ఆఫీసర్,
కొవ్వూరు,
పశ్చిమ గోదావరి జిల్లా,

9th Class Telugu అభినందన పత్రాలు

ప్రశ్న 1.
మీ స్నేహితులలో కేవలం తెలుగులోనే ఒక రోజంతా మాట్లాడగలిగే వారెవరో గుర్తించి, వారిని అభినందిస్తూ కేవలం తెలుగు పదాలతో ఒక అభినందన పత్రం రాయండి.
జవాబు:

అభినందన పత్రం

మిత్రమా ! రాఘవా ! నీవు తెలుగు భాషాభిమానివి. నీవు చక్కని తెలుగును పరభాషా పదాలు లేకుండా మాట్లాడగలవు. అందుకుగాను నిన్ను తప్పక అభినందించాలి. మన మిత్రబృందంలో నీలాగా తెలుగు ఉచ్చారణ, దోషాలు లేకుండా స్వచ్ఛంగా మాట్లాడగలిగినవారు లేరు. నీవు మొన్న “భౌతికశాస్త్రము – ఉపయోగాలు” అన్న అంశం మీద వక్తృత్వం పోటీలో మాట్లాడిన విధం నన్ను బాగా ఆకట్టుకుంది. శాస్త్రవిషయిక అన్యభాషా పదాలను చక్కని పారిభాషిక పదాలతో తెలుగులో బోధించడం, మాట్లాడడం, నేడు ఉపాధ్యాయులకు సైతం కష్టంగా ఉంది. అలాంటిది నీవు అనర్గళంగా తెలుగులో ఒక్క పరభాషా పదం కూడా లేకుండా మాట్లాడావంటే అభినందించాల్సిన విషయమే. నిన్ను చూసి మేమూ అలాగే మాట్లాడాలని ప్రేరణ పొందాం. ఇదే విధంగా నీవు నీ తెలుగు భాషా జ్ఞానాన్ని పెంపొందించుకుంటూ, మరింత ప్రతిభతో ముందుకు పోవాలని ఆకాంక్షిస్తూ … ఇవే నా హార్దిక అభినందనలు.

విజయవాడ,
x x x x x

ఇట్లు,
శ్రీరామ్.

AP Board 9th Class Telugu లేఖలు

ప్రశ్న 2.
మీ పాఠశాలలో ఒక విద్యార్థి రాష్ట్రస్థాయి స్కౌట్స్ అండ్ గైడ్స్ జంభోరీలో పాల్గొని ముఖ్యమంత్రి చేతుల మీదుగా బహుమతిని అందుకున్నాడు. అతణ్ణి అభినందిస్తూ పది వాక్యాలు రాయండి.
జవాబు:

అభినందన పత్రం

మిత్రుడు రవికాంత్ కు,
నీవు రాష్ట్రస్థాయి స్కౌట్స్ అండ్ గైడ్స్ జంభోరీలో పాల్గొని, మన ముఖ్యమంత్రి గారి చేతులమీదుగా ఉత్తమ స్కౌటుగా మొదటి బహుమతిని అందుకున్నావని తెలిసింది. ఇది మన పాఠశాల విద్యార్థులందరికీ గర్వకారణము. మన పాఠశాల పేరును నీవు రాష్ట్రస్థాయిలో నిలబెట్టావు. నీకు మన విద్యార్థులందరి తరఫునా, నా శుభాకాంక్షలు, అభినందనలు.

నీవు మొదటి నుండి చదువులోనూ, ఆటపాటలలోనూ ఉత్తమ విద్యార్థిగా పేరుతెచ్చుకుంటున్నావు. ఈ రోజు ఇంత ఉన్నతమైన బహుమతిని అందుకున్నావు. నీవు మన పాఠశాల విద్యార్థులందరికీ ఆదర్శప్రాయుడవు. నీవు సాధించిన ఈ విజయాన్ని మన విద్యార్థినీ విద్యార్థులంతా, హార్దికంగా అభినందిస్తున్నారు. నీకు మా అందరి జేజేలు.

ఉంటా,

ఇట్లు,
కె. శ్రీకాంత్ రవివర్మ,

 

ప్రశ్న 3.
రామయ్య ఆదర్శరైతు. ఆధునిక పద్ధతులతో, సేంద్రియ ఎరువులతోనే అధిక దిగుబడిని సాధించాడు. వ్యవసాయ శాఖ తరఫున ఆయన్ను అభినందిస్తూ అభినందన పత్రాన్ని తయారు చేయండి.
జవాబు:

అభినందన పత్రం

అభ్యుదయ రైతురాజు రామయ్య మహాశయా!
మీకు అభినందన మందారాలు. భారతదేశ సౌభాగ్యం పల్లెలపై ఆధారపడియుంది. పల్లెల్లో రైతులు పండించే పంటలపైనే మన వర్తక పరిశ్రమలు ఆధారపడియున్నాయి. మేం కడుపునిండా అన్నం తింటున్నామంటే అది మీ వంటి కర్షకోత్తముల హస్తవాసి అనే చెప్పాలి.

కర్షకోత్తమా !
మీరు మన ప్రభుత్వ వ్యవసాయశాఖ వారు సూచించిన సూచనలను అందిపుచ్చుకొని, మీ పొలాల్లో ఈ సంవత్సరం ఎకరానికి 60 బస్తాల ధాన్యం పండించారు. చేల గట్లపై కంది మొక్కలు పాతి 20 బస్తాల కందులు పండించారు. రసాయనిక ఎరువులు, పురుగుమందుల జోలికి పోకుండా, మీ తోటలో 10 గేదెలను పెంచి, పాడి పరిశ్రమను ప్రోత్సహిస్తూ, ఆ పశువుల పేడతో సేంద్రియ ఎరువుల్ని తయారు చేసి వాటినే ఉపయోగించి మంచి పంటలు పండించారు. మీ కృషికి ప్రభుత్వ పక్షాన అభినందనలు అందిస్తున్నాము. రైతురత్న రామయ్య గారూ!

నమస్కారం. ప్రభుత్వం మీకు ‘రైతురత్న’ అనే బిరుదునిచ్చి సత్కరిస్తోంది. మీరే ఈ జిల్లాలో రైతులకు ఆదర్శం. మీరు వ్యవసాయంలో మరిన్ని నూతన పద్ధతులు పాటించి, మన జిల్లాలో, రాష్ట్రంలో రైతులకు ఆదర్శంగా నిలవాలని కోరుతున్నాము. ఈ సందర్భంగా మీకు మన ముఖ్యమంత్రిగారి తరఫున రూ. 25,000లు బహుమతి ఇస్తున్నాము. మీకు మా శుభాకాంక్షలు. మా నమస్సులు.

అభినందనములు.

ఇట్లు,
జిల్లా వ్యవసాయాధికారి,

AP Board 9th Class Telugu లేఖలు

ప్రశ్న 4.
మీ తొమ్మిదో తరగతి తెలుగు దివ్వెలు – I పాఠ్యపుస్తకం గురించి పుస్తక పరిచయ నివేదికను; మీ అభిప్రాయాలను రాయండి.
జవాబు:
మా తొమ్మిదో తరగతి తెలుగు పుస్తకం పేరు, ‘తెలుగు దివ్వెలు’ – I అంటే తెలుగు దీపాలు అని అర్థం. ఈ పుస్తకంలో ఐదు పద్యభాగాలు, ఆఱు గద్యభాగాలు ఉన్నాయి. ఆరు ఉపవాచక వ్యాసాలు ఉన్నాయి.

పద్యభాగంలో కవి బ్రహ్మ తిక్కన గారి పద్యాలు, భారతం నుండి ఇవ్వబడ్డాయి. తిక్కన గారి తెలుగు పలుకుబడి, ఈ పద్యాల్లో కనబడుతుంది. ఇక వివిధ శతక కవుల పద్యాలు, ప్రాచీన కవిత్వానికీ, భక్తి, నీతి, ప్రబోధానికి ఉదాహరణలు. ఆడినమాట పద్యాలు, భోజరాజీయము అనే కథా కావ్యంలోనివి. దువ్వూరి రామిరెడ్డి గారి పద్యాలు, ఆధునిక పద్యానికి ఉదాహరణలు. ఆ పద్యాలు, రైతుకు వారు అందించిన నీరాజనాలు.

ఇక వచన పాఠాలలో పానుగంటి వారి సాక్షివ్యాసం, గ్రాంధిక భాషకు ఉదాహరణం. వచన పాఠములలో వివిధ వచన ప్రక్రియలను పరిచయం చేశారు. ఒక కథను, ఆత్మ కథను, లేఖను, వ్యాసాన్ని, పుస్తక పరిచయాన్ని పరిచయం చేశారు. మొత్తం పై మా తొమ్మిదో తరగతి తెలుగు పుస్తకం, తెలుగు సాహిత్యానికి ప్రతిరూపంగా ఉంది.

ఇక ఉపవాచక వ్యాసాలు, ఆరుగురు మహాత్ముల జీవితచరిత్రలను పరిచయం చేస్తున్నాయి. అవి మా విద్యార్థినీ విద్యార్థులకు, మంచి స్ఫూర్తి ప్రదాయకంగా ఉన్నాయి. మా తొమ్మిదో తరగతి పాఠ్య నిర్ణాయక సంఘం వారికి, నా కృతజ్ఞతలు.

AP Board 9th Class Telugu Important Questions Chapter 2 స్వభాష

AP State Syllabus AP Board 9th Class Telugu Important Questions Chapter 2 స్వభాష.

AP State Syllabus 9th Class Telugu Important Questions 2nd Lesson స్వభాష

9th Class Telugu 2nd Lesson స్వభాష Important Questions and Answers

I. అవగాహన – ప్రతిస్పందన

క్రింది పరిచిత గద్యాలను చదివి, ప్రశ్నలకు జవాబులు రాయండి.

ప్రశ్న 1.
పరభాషాపదములకర్థము తెలిసినంత మాత్రమున బరభాషా పాండిత్యము లభించినదని భ్రమపడకుడు. భాషలోని కళను బ్రాణమును తత్త్వము నాత్మను గనిపట్టవలయును. అది మీకసాధ్యము. తుదకిన్ని యీనాముల నమ్మి యమ్మ మెడలోని పుపూసలమ్మి – వంట యింటి పాత్రల నమ్మి – దైన్య పడి – వారములు చేసికొని – ముష్టియెత్తి సంపాదించిన – యాంగ్లేయభాషలోని పాండిత్యపుఁబస యీ రంగులోనికి దిగినది. ఈ విధముగా బ్రద్దలైనది.
ప్రశ్నలు:
1. భాషలోని వేనిని తెలుసుకోవాలి?
2. ‘ఈనాములు’ అనగానేమి?
3. ‘పాండిత్యపుఁబస’ విడదీయుము.
4. ‘అసాధ్యము’ విగ్రహవాక్యము రాయుము.
జవాబులు:
1. కళ, ప్రాణం, తత్త్వం , ఆత్మ
3. పాండిత్యము + పస
2. బహుమతిగా ఇచ్చిన భూమి
4. సాధ్యము కానిది

AP Board 9th Class Telugu Important Questions Chapter 2 స్వభాష

ప్రశ్న 2.
ఆంధ్రభాష బొత్తిగ రానివాడతోడనే కాని మీరాంధేయమున నెన్నఁడు మాటాడవలదు. మీరు మీ మిత్రులకుత్తరము వ్రాయునప్పుడు ‘డియర్ క్రైండ్’తో నారంభించి ‘యువర్సుట్రూలీ’ తోఁ బూర్తి చేయక ‘బ్రహ్మశ్రీ’ తోడనో? ‘మహారాజశ్రీ ‘ తోడనోయారంభించి, ‘చిత్తగింపవలయును’తో బూర్తి చేయవలయును. ఆంధ్రభాష వచ్చినవాని కాంగ్లేయ భాషలో నుత్తరమెన్నఁడును వ్రాయఁకుడు. ఈ నియమములను మీరు చేసికోఁగలరా ? (అభ్యంతరమేమి యను కేకలు) నూతనముగా నచ్చుపడుచున్న యాంధ్ర గ్రంథము లెల్లను విమర్శనబుద్ధితోఁజదువుఁడు. తొందరపడి యధిక్షేపింపకుఁడు. శనివారాది వారములందు రాత్రి తప్పకుండ రెండు గంటలు పురాణ పఠనమునఁ గాలక్షేపము చేయుఁడు. స్వభాషా పత్రికలను జూడకుండ నావలఁ బాఱవేయకుఁడు. ఆంగ్లేయ భాషా గ్రంథములు మీరు చదువుచున్నప్పుడు వానిలో ‘మనభాష కక్కఱకు వచ్చు నంశము లేమియా’ యని తదేక దృష్టితోఁ జూచుచు వానిని మొదటిలోఁబదిలిపటపుఁడు.
ప్రశ్నలు:
1. తెలుగులో ఉత్తరములు రాయునపుడు మొదట వేనితో ప్రారంభించాలి?
2. ముగింపుగా ఏమి రాయాలి?
3. గ్రంథ పఠనము చేయునపుడు ఎలా చదవాలి?
4. ఏయే వారాలలో పురాణ పఠనం చేయమన్నారు?
జవాబులు:
1. బ్రహ్మశ్రీ / మహారాజశ్రీ
3. విమర్శన బుద్ధితో
2. చిత్తగింపవలయును
4. శనివారం, ఆదివారం

ప్రశ్న 3.
క్రింది అపరిచిత గద్యాలను చదివి, ప్రశ్నలకు జవాబులు రాయండి. | సమాజంలో ఈనాడు కావాల్సినవి నైతిక విలువలు, అందుకు సమాజంలో సత్యానికి ప్రాధాన్యం ఇవ్వడం అవసరం. సత్యాన్ని మించిన దైవమే లేదన్న విశిష్ట సంస్కృతి మనది. జాతిపిత గాంధీజీ జీవితానికి స్ఫూర్తినిచ్చిన ఇతివృత్తం హరిశ్చంద్రది. హరిశ్చంద్ర నాటకాన్ని బలిజేపల్లి లక్ష్మీకాంతంగారు ఉప్పు సత్యాగ్రహం జరుగుతున్న కాలంలో, జైలులో ఉండి రచించారు. మేనత్త సరస్వతమ్మ ద్వారా భారత, భాగవత, రామాయణాలను అర్థాలతో సహా తెలుసుకున్నారు. శివానందలహరి, బ్రహ్మరథం, మణిమంజూష మొ|| నవలలు, బుద్ధిమతి విలాసం, సత్యహరిశ్చంద్రీయం, ఉత్తర రాఘవీయం నాటకాలు బలిజేపల్లి వారి అమృతలేఖిని నుండి జాలు వారాయి. ‘కవితా కళానిధి’, ‘పుంభావ సరస్వతి’ అనే బిరుదులు వీరి పేరు పక్కన చేరి కొత్త సొబగులు సంతరించుకొన్నాయి.
ప్రశ్నలు:
1. నేటి సమాజానికి కావల్సినవి?
2. గాంధీజీ జీవితానికి స్ఫూర్తినిచ్చిన ఇతివృత్తం?
3. బలిజేపల్లి వారి మేనత్త?
4. వీరి నవలలు ఏవి?
జవాబులు:
1. నైతిక విలువలు
2. సత్యహరిశ్చంద్రీయం
3. సరస్వతమ్మ
4. శివానందలహరి, బ్రహ్మరథం, మణిమంజూష

ప్రశ్న 4.
సామెత అంటే అనుభవం నేర్పిన పాఠమే. సామెతలు ఉపయోగించుట ఒక కళ. సందర్భోచితంగా సామెతలు వాడుతూ, మాట్లాడుతుంటే – మాట్లాడేవారికి సంతోషం – వినేవారికి తృప్తి కలుగుతాయి. “సామెతల మాట – విందు వినోదాల పొందు” అందుకే సామెత లేని మాట – ఆమెత లేని యిల్లు’ అనే సామెత పుట్టింది. అనుభవజ్ఞుల నోటి నుండి మంచి ముత్యాల వానలా జారిపడిన ఈ సామెతలు ప్రజల మనసు లోతుల్ని తాకీ, ఆలోచనా స్రవంతిని కదలించి చైతన్యవంతుల్నిగా చేసే విజ్ఞాన భాండాగారాలు.
ప్రశ్నలు:
1. సామెత అనగానేమి?
2. సామెతల మాట …………… (ఖాళీ నింపండి.)
3. సామెతలు ఎక్కడ నుండి జారిపడ్డాయి?
4. సామెతలు ప్రజలను చైతన్యవంతుల్ని చేసే …….
జవాబులు:
1. అనుభవం నేర్పిన పాఠం
2. విందు వినోదాల పొందు
3. అనుభవజ్ఞుల నోటినుండి
4. విజ్ఞాన భాండాగారాలు.

II. స్వీయరచన

అ) క్రింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
మాతృభాష పట్ల అభిమానంతో జంఘాల శాస్త్రి పాత్ర సృష్టించి స్వభాషా ప్రాముఖ్యాన్ని వివరించిన రచయిత గూర్చి రాయండి.
జవాబు:
పానుగంటి లక్ష్మీ నరసింహారావుగారు 11.2.1865లో రాజమండ్రి – సీతానగరంలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు రత్నమాంబ, వేంకటరమణయ్య. ఉన్నతవిద్య వరకూ రాజమండ్రిలోనే విద్యాభ్యాసం చేశారు. బళ్ళారి జిల్లాలోని ఆనెగొంది సంస్థానంలో దివానుగా కొంతకాలం చేసి, తరువాత పిఠాపురం సంస్థానంలో ఆస్థానకవిగా స్థిరపడ్డారు. సారంగధర, ప్రచండ చాణక్యము, విప్రనారాయణ, కంఠాభరణం, పూర్ణిమ, సరస్వతి, సరోజని, సాక్షి మొ||వి వీరి ప్రసిద్ధ రచనలు. వీరి శైలి అద్భుతమైన గ్రాంథిక భాషా ప్రవాహంతో సున్నితమైన వ్యంగ్యంతో, చురుక్కుమనే హాస్యంతో అలరారుతుంది. సమకాలీన సమస్యలపై తీవ్రంగా స్పందించి, సంఘ సంస్కరణకు నడుం కట్టి, తన రచనల ద్వారా ప్రజల్లో ఆలోచనలు రేకెత్తించిన పానుగంటివారు చిరస్మరణీయులు. వారి రచనలు ఈనాటి పరిస్థితులకు కూడా అద్దం పడుతున్నాయి. వీరు 1-1-1940 న పరమపదించారు.

ప్రశ్న 2.
“వినక ఏమి చెవులు చిల్లులు పడినవా?” అని జంఘాలశాస్త్రి ఎందుకన్నాడు? ఈ మాటలను ఇంకా ఏయే సందర్భాలలో ఉపయోగిస్తారు?
జవాబు:
సభాధ్యక్షుడు తనకు తెలుగురాదని, ఇష్టమైతే ఆంగ్లభాషలో మాట్లాడుతానని చెప్పాడు. అతని ప్రసంగం ముగిసిన పిదప జంఘాలశాస్త్రి తన ఉపన్యాసాన్ని ఆరంభించి ఇలా అన్నాడు- ఆ మాటలు తాను నిజంగా విన్నాడా ? లేక భ్రమపడ్డాడా? అని కాసేపు సందేహించినా తాను వాటిని విన్నాడనే నిశ్చయానికి వచ్చాడు. చెప్పేవాడు ఏ మాత్రం సిగ్గుపడకుండా చెప్పినా తాము మాత్రం సిగ్గుపడేలా విన్నామని, గుండెలు పగిలేలా, మనస్సు మండేలా విన్నామని చెప్పాడు.

ఇష్టంలేని వాటిని ఎదుటివాళ్ళు చెప్పినప్పుడు ఈ మాటల్ని ఉపయోగిస్తాం. ప్రమాదం కలిగించే మాటల్ని విన్నప్పుడు వాటిని ఉపయోగిస్తాం. ఒళ్ళుమండి కోపం తారాస్థాయికి చేరినప్పుడు వాటిని వాడతాం. ఎదుటివారు అవాకులు చవాకులు పేలినప్పుడు అంటాం.

AP Board 9th Class Telugu Important Questions Chapter 2 స్వభాష

ప్రశ్న 3.
‘అధిక్షేప వ్యాసం’ ప్రక్రియ గురించి రాయండి. (S.A. III – 2016-17)
జవాబు:
విషయ ప్రాధాన్యం ఉండి, ఒక క్రమంలో సమగ్రంగా వివరించిన దాన్ని వ్యాసం అంటారు. అధిక్షేపం అంటే ఎత్తి పొడుపు. ఇది వివిధ విషయాలపట్ల విమర్శదృష్టితో వ్యంగ్య, హాస్య ధోరణిలో వ్యాఖ్యానిస్తూ, పరిష్కార మార్గాన్ని సూచిస్తూ సాగే సాహిత్య ప్రక్రియ.

ప్రశ్న 4.
స్వభాష పాఠం నేపథ్యం వివరించుము.
(లేదా )
పరభాషా వ్యా మోహంతో స్వభాష ప్రాముఖ్యాన్ని మరచిన వానిని విమర్శిస్తూ వ్రాసిన “స్వభాష” – నేపథ్యం గూర్చి రాయండి. (S.A. II – 2017-18)
జవాబు:
ఒక పాఠశాల విద్యార్థులు తెలుగువాడైన ఒక పెద్దమనిషి వద్దకు వెళ్ళి, వార్షికోత్సవ కార్యక్రమానికి అధ్యక్షత వహించవలసిందిగా కోరారు. ఆయన న్యాయవాదవృత్తి చేస్తూ పేరు గడించినవాడు. ‘నేను వస్తానుగాని, తెలుగులో మాట్లాడలేను. ఇంగ్లీషులో మాట్లాడతా’నన్నాడు. పిల్లలు సరే అనక తప్పలేదు. సమావేశానికి వచ్చిన ఆ పెద్దమనిషి ఆంగ్లంలో ‘దేహసాధన’ గురించి పావుగంట మాట్లాడి ‘విల్ ఎనీ జెంటిల్మన్ కమ్ ఫార్వర్డు టు స్పీక్’ అని ముగించాడు. అప్పుడా సభలోనున్న జంఘాలశాస్త్రి లేచి ఈ విధంగా ఉపన్యసించాడు.

ప్రశ్న 5.
ఆహాహా ! యేమని యేమని? మన యధ్యక్ష భగవానుని యాలాపకలాపమేమి? – అంటూ ప్రవాహంలా సాగే జంఘాలశాస్త్రి మాటకారితనాన్ని విశదీకరించుము. (S.A. III – 2015-16)
జవాబు:
జంఘాలశాస్త్రికి మాతృభాషపై మక్కువ ఎక్కువ. తెలుగులో మాట్లాడితే తక్కువ అనే భావంలో సభాధ్యక్షుడు ఆంగ్లంలో మాట్లాడతాడు. ఇంకేముంది జంఘాలశాస్త్రికి కోపం నషాళానికి అంటింది. ప్రవాహంలా సాగే తన మాటలతో సూటిగా, స్పష్టంగా చెప్పదలచిన విషయాన్ని, తన తెలుగు భాషా అభిమానాన్ని చెప్పాడు. ప్రాచీనతను ఆధునికతతో మేళవించి వ్యవహార దక్షతను చూపాడు. శ్రోతలను మంత్రముగ్ధులను చేయగల వాగ్దాటిని ప్రదర్శించాడు. యువతకు చక్కని మార్గదర్శనం చేశాడు. గొప్ప వక్తకు ఉండాల్సిన మాటకారితనాన్ని ప్రదర్శించి విద్యార్థులకు మార్గదర్శి అయ్యాడు.

ఆ) క్రింది ప్రశ్నలకు పది పన్నెండు వాక్యాలలో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
‘స్వభాష’ పాఠ్యభాగ రచయితను పరిచయం చేయండి.
జవాబు:
‘స్వభాష’ పాఠ్యభాగ రచయిత శ్రీ పానుగంటి లక్ష్మీనరసింహారావుగారు.

జననం : 11-02-1865 సీతానగరం (రాజమండ్రి)

మరణం : 1-1-1940

తల్లిదండ్రులు : రత్నమాంబ, వేంకటరమణయ్య

రచనలు : సారంగధర, ప్రచండ చాణక్యము, విప్రనారాయణ, కంఠాభరణం, పూర్ణిమ, సరస్వతి, సరోజని, సాక్షి మొదలైనవి.

విశేషాలు : బళ్ళారి జిల్లా ఆనెగొంది సంస్థాన దివానుగా కొంతకాలం చేసి, తరువాత పిఠాపురం సంస్థాన ఆస్థానకవిగా స్థిరపడ్డారు.

శైలి : అద్భుతమైన గ్రాంథిక భాషా ప్రవాహంతో, సున్నితమైన వ్యంగ్యంతో, చురుక్కుమనే హాస్యంతో అలరారుతుంది.

ప్రత్యేకత : సమకాలీన సమస్యలపై తీవ్రంగా స్పందించి, సంఘసంస్కరణకు నడుం కట్టి, తన రచనల ద్వారా ప్రజల్లో ఆలోచనలు రేకెత్తించారు.

బిరుదులు : అభినవ కాళిదాసు, ఆంధ్రా ఎడిసన్, ఆంధ్ర షేక్ స్పియర్.

AP Board 9th Class Telugu Important Questions Chapter 2 స్వభాష

ప్రశ్న 2.
జంఘాలశాస్త్రి స్వభాష విషయంలో విద్యార్థులను ఏయే విషయాలను పాటించమని చెప్పాడో వివరించండి. (S.A. II – 2018-19)
జవాబు:
పానుగంటి లక్ష్మీనరసింహారావు గారు సంఘసంస్కరణాభిలాషతో ‘సాక్షి’ పేరుతో అనేక వ్యాసాలను రాశారు. అందులో భాగంగా మన భాష గొప్పతనాన్ని గూర్చి “జంఘాల శాస్త్రి” అనే పాత్ర ఉపన్యాసం ద్వారా తెలియజేశారు. జంఘాలశాస్త్రి స్వభాష విషయంలో విద్యార్థులకు సూచనగా నాయనలారా ! ఆంధ్రభాష బొత్తిగా రానివానితో తప్ప మీరు ఆంగ్లంలో మాట్లాడవద్దు. మీరు మీ మిత్రులకు ఉత్తరం రాయునపుడు ‘డియర్ ఫ్రెండ్’ అని ప్రారంభించి, ‘యువర్స్ ట్రూలి’తో పూర్తిచేయక, ‘బ్రహ్మశ్రీ’ లేదా ‘మహారాజశ్రీ’తో ఆరంభించి, ‘చిత్తగింపవలెను’ తో పూర్తి చేయండి. తెలుగుభాష వచ్చిన వారికి ఆంగ్లభాషలో ఉత్తరం ఎప్పుడూ రాయవద్దు. ఈ నియమం మీరు తప్పకూడదు. తెలుగులో వస్తున్న కొత్త గ్రంథాలను విమర్శనగా చదవండి. తొందరపడి విమర్శించకండి. శని, ఆది వారాలందు రాత్రి తప్పకుండా రెండు గంటలు పురాణ పఠన కాలక్షేపం చేయండి. తెలుగు పత్రికలను చూడండి. ఇంగ్లీషు భాషా గ్రంథాలను చదువుతున్నప్పుడు వానిలో “మన భాషకు పనికి వచ్చే అంశాలే”వని తదేక దృష్టితో చూసి, గుర్తుంచుకోండి. మీరీ నియమాలు ఏర్పాటు చేసుకొని పట్టుదలతో పాటించి, పుట్టుక చేతనే కాక, బుద్ధి చేత, స్వభావం చేత, యోగ్యత చేత ఆంధ్రులని పించుకోండి ! అంటూ సందేశమిచ్చారు.

వ్యక్తీకరణ – సృజనాత్మకత

క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
నీకు నచ్చిన ఒక పుస్తకం గురించి నీ మిత్రునికి లేఖ రాయండి.
జవాబు:

తెనాలి,
x x x x x

ప్రియమైన మిత్రునికి,

నేనిక్కడ క్షేమం. నీవు అక్కడ క్షేమమని తలుస్తాను. మొన్న జరిగిన నా పుట్టినరోజు వేడుకకు నీవు రాలేదు. నాకు బాధగా ఉంది. కారణం లేకుండా నీవు మానవని సరిపెట్టుకున్నాను. ఇక… ఫంక్షన్ బాగా జరిగింది. బోలెడు కానుకలు, స్వీట్స్ అందరూ ఇచ్చారు. వాటిలో ఒక పుస్తకం నాకు బాగా నచ్చింది. అది మా నాన్నగారు ఇచ్చారు. ఆ పుస్తకం పేరు ‘బొమ్మల పంచతంత్రం’. రకరకాల పక్షులు, జంతువులు, మనుష్యుల పాత్రల ద్వారా మనుష్యులు ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో దానిలో ఉంది. ఆపదలు వచ్చినప్పుడు ఉపాయంతో ఎలా తప్పించుకోవాలో వివరంగా, ఆసక్తికరంగా. అందులోని కథలు సాగుతాయి. నీవు కూడా ఇలాంటి పుస్తకం కొని చదువు. మీ పెద్దలకు నా నమస్కారాలు తెలియజేయి.

ఇట్లు,
నీ మిత్రుడు,
కె. ఫణిరామ్,
9 వ తరగతి,
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,
తెనాలి, గుంటూరు జిల్లా,

చిరునామా :
యస్. నాగలక్ష్మణ శర్మ,
S/o. పూర్ణాచంద్రశాస్త్రి,
ఒంగోలు,
ప్రకాశం జిల్లా.

AP Board 9th Class Telugu Important Questions Chapter 2 స్వభాష

ప్రశ్న 2.
తెలుగు భాషా ప్రాముఖ్యతను తెలుపుతూ విదేశీ మిత్రునికి లేఖ రాయండి. (S.A. I -2018-19)
జవాబు:

చెరుకూరు,
x x x x x

ప్రియమైన మిత్రుడు బాలు,

నేను క్షేమం, నీవు అక్కడ క్షేమమని తలుస్తాను. చిన్నప్పటి నుండి స్నేహితులమైన మనం ఈనాడు మీ నాన్నగారు విదేశాలలో స్థిరపడాలనే కోరికతో దూరం అయ్యాం. కానీ మనం ఒకరిమీద మరొకరి అవ్యాజమైన స్నేహబంధం వల్ల ఇలా ఉత్తరాల ద్వారా మాట్లాడుకొంటున్నాం. నీవు అక్కడి ఆంగ్లం మోజులో పడి తెలుగును మరువద్దు. తెలుగు సాహిత్య కార్యక్రమాలు ఎక్కడ జరిగినా నీవు వెళ్ళడానికి ప్రయత్నించు. తెలుగు లేని జీవితం, వెలుగు లేని ఇల్లు లాంటిది. తెలుగును ‘ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్’ అన్నారని నీకు తెలుసు కదా ! అక్కడున్న నీతోటి పిల్లలందరికి నీవు నేర్చుకున్న తెలుగు పద్యాలను నేర్పు. మీ అమ్మా నాన్నలకు నా నమస్కారాలు. తిరిగి జాబు రాయి.

ఇట్లు,
నీ మిత్రుడు,
కె. ఫణిరామ్.

చిరునామా :
యస్. బాలసుబ్రహ్మణ్యం, 9వ తరగతి
S/o పూర్ణచంద్రశాస్త్రి,
న్యూ వాషింగ్టన్, అమెరికా.

III. భాషాంశాలు (పదజాలం, వ్యాకరణం)

1. వ్యుత్పత్త్యర్థాలు :

1. అక్షరం = నాశనము పొందనిది – వర్ణం
2. శివుడు = సాధుల హృదయమున శయనించి యుండువాడు, మంగళప్రదుడు – ఈశ్వరుడు
3. పండితుడు = శాస్త్రమందు మంచి బుద్ధి కలవాడు (పండ = బుద్ధి) – విద్వాంసుడు

2. సంధులు :

1. అమూల్యాలంకారాలు : అమూల్య + అలంకారాలు = సవర్ణదీర్ఘ సంధి
2. అగ్రాసనాధిపతి = అగ్ర + ఆసన + అధిపతి = సవర్ణదీర్ఘ సంధి
3. శిలాక్షరం = శిల + అక్షరం = సవర్ణదీర్ఘ సంధి
4. యథార్థం = యథా + అర్థం = సవర్ణదీర్ఘ సంధి
5. తాత్కాలికోన్మాదం = తాత్కాలిక + ఉన్మాదం = గుణసంధి
6. భాషోచ్చారణ = భాష + ఉచ్ఛా రణ = గుణసంధి
7. కంఠోక్తి = కంఠ + ఉక్తి = గుణసంధి
8. తదేక = తత్ + ఏక = జశ్త్వసంధి
9. నిస్సందేహము = నిః + సందేహము = విసర్గ సంధి
10. వాగోరణి = వాక్ + ధోరణి = జశ్త్వసంధి
11. దైన్యపడి = దైన్యము + పడి = పడ్వాది సంధి
12. శతాబ్దము = శత + అబ్దము = సవర్ణదీర్ఘ సంధి
13. రవంత = రవ + అంత = అత్త్వసంధి
14. వాగ్వాహినీ = వాక్ + వాహినీ = జశ్త్వసంధి
15. పండితాగ్రణులు = పండిత + అగ్రణులు = సవర్ణదీర్ఘ సంధి

AP Board 9th Class Telugu Important Questions Chapter 2 స్వభాష

3. సమాసాలు:

మాతాపితలు = మాతయు, పితయు – ద్వంద్వ సమాసం
పండితాగ్రణులు = పండితులలో శ్రేష్ఠుడు – షష్ఠీ తత్పురుష సమాసం
శ్రీసూక్తి = మంగళకరమైన నీతివాక్యం – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
మాతృభాష = తల్లి యొక్క భాష – షష్ఠీ తత్పురుష సమాసం
అనర్హం = అర్హము కానిది – నఞ్ తత్పురుష సమాసం
అనుచితం = ఉచితం కానిది – నఞ్ తత్పురుష సమాసం
నిస్సందేహం = సందేహం లేనిది – నఞ్ తత్పురుష సమాసం
వాగౌరణులు = మాట యొక్క తీరులు – షష్ఠీ తత్పురుష సమాసం
ఏబది సంవత్సరాలు = ఏబది సంఖ్య గల సంవత్సరాలు – ద్విగు సమాసం (అర్ధ శతాబ్దం)

9th Class Telugu 2nd Lesson స్వభాష 1 Mark Bits

1. నీవు చెప్పిన మాటలు ఆశ్చర్యము కలిగించాయి – (గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి) (S.A. I – 2018-19)
ఎ) అచ్చెరువు
బి) ఆచెరువు
సి) అచెరువు
డి) అస్చెరువు
జవాబు:
ఎ) అచ్చెరువు

2. అక్షరం జిహ్వ కిక్షురసం వంటిది – (గీత గీసిన పదానికి వ్యుత్పత్త్యర్థం గుర్తించండి) (S.A. II – 2018-19)
ఎ) నాశన మగునది
బి) నాశనము పొందినది
సి) నాశనం కలిగినది
డి) నాశనం లేనిది
జవాబు:
డి) నాశనం లేనిది

3. ప్రయత్నిస్తే ఏదీ అసాధ్యం కాదు. (గీత గీసిన పదానికి సమాసం గుర్తించండి.) (S.A. III – 2016-17)
ఎ) ప్రథమ తత్పురుష సమాసం
బి) ద్వితీయ తత్పురుష సమాసం
సి) చతుర్డీ తత్పురుష సమాసం
డి) నఞ్ తత్పురుష సమాసం
జవాబు:
డి) నఞ్ తత్పురుష సమాసం

AP Board 9th Class Telugu Important Questions Chapter 2 స్వభాష

4. ఆయన నడుస్తూ పాటలు వింటున్నాడు. (ఇది ఏ రకమైన వాక్యం) (S.A. I – 2018-19)
ఎ) ప్రశ్నార్థక వాక్యం
బి) క్వార్థక వాక్యం
సి) చేదర్థక వాక్యం
డి) శత్రర్థక వాక్యం
జవాబు:
సి) చేదర్థక వాక్యం

5. కింది వాటిలో క్వార్థక క్రియ గుర్తించండి.
ఎ) వేడుకొన్నది
బి) పాల్గొన్నది
సి) చూసి
డి) వెళ్తూ
జవాబు:
సి) చూసి

6. మీ సభా కార్యక్రమము నంతయు జెడగొట్టితిని. (ఆధునిక వచనాన్ని గుర్తించండి.) (S.A. II – 2018-19)
ఎ) మా సభా కార్యక్రమాన్నంతా చెడకొట్టలేదు.
బి) మీ సభా కార్యక్రమాన్నంతా చెడకొట్టాను.
సి) మీ సభా కార్యక్రమాన్నంతా చెడకొట్టకూడదు.
డి) మీ సభా కార్యక్రమం అంతా చెడకొట్టబడింది.
జవాబు:
బి) మీ సభా కార్యక్రమాన్నంతా చెడకొట్టాను.

AP Board 9th Class Telugu Important Questions Chapter 2 స్వభాష

7. “నేనొక్కడినే అదృష్ట వంతుడినా”? అన్నాడు జంఘాలశాస్త్రి (పరోక్ష కథనాన్ని గుర్తించండి) (S.A. II – 2018-19)
ఎ) తానొక్కడినే దురదృష్ట వంతుడినా ! అని అన్నాడు జంఘాలశాస్త్రి
బి) జంఘాల శాస్త్రి తానొక్కడినే అదృష్టవంతుడినా అని అన్నాడు.
సి) తానొక్కడినే అదృష్టవంతుడినా అని జంఘాలశాస్త్రి అనలేదు.
డి) జంఘాల శాస్త్రి తనకు తాను అదృష్టవంతుడనని ప్రకటించుకున్నాడు.
జవాబు:
బి) జంఘాల శాస్త్రి తానొక్కడినే అదృష్టవంతుడినా అని అన్నాడు.

8. శృతి సంగీతము విని, ఆనందించినది. (ఏ రకపు వాక్యమో గుర్తించండి) (S.A. II – 2018-19)
ఎ) శత్రర్థకము
బి) క్వార్థకము
సి) చేదర్థకము
డి) అభ్యర్థకము
జవాబు:
బి) క్వార్థకము

9. పాఠాలు చదివితే, విషయం అర్థమౌతుంది (ఏ రకమైన వాక్యమో గుర్తించండి) (S.A. II – 2018-19)
ఎ) తుమున్నరకము
బి) వ్యతిరేకార్థకము
సి) భావార్థకము
డి) చేదర్థకము
జవాబు:
డి) చేదర్థకము

10. ఈ విధముగా బ్రద్దలైనది. (ఆధునిక వచనాన్ని గుర్తించండి) (S.A. II – 2017-18)
ఎ) ఈ విధంగా బద్దలైంది
బి) ఈ విధమ్ముగా బద్దలైనది
సి) ఈ విధంబుగా బ్రద్దలైంది
డి) ఈ విధమ్ముగా బ్రద్దలుఐనది
జవాబు:
ఎ) ఈ విధంగా బద్దలైంది

AP Board 9th Class Telugu Important Questions Chapter 2 స్వభాష

11. నరేశ్ తాను రానని రఘుతో అన్నాడు. (ప్రత్యక్ష కథనం గుర్తించండి) (S.A. II – 2017-18)
ఎ) “నరేశ్ రాడు”, అని అన్నాడు రఘు.
బి) “తాను రాడు”, అని నరేశ్ రఘుతో అన్నాడు.
సి) “నేను రాను”, అని నరేశ్ రఘుతో అన్నాడు.
డి) “తాను రాను”, అని నరేశ్ రఘుతో అన్నాడు.
జవాబు:
సి) “నేను రాను”, అని నరేశ్ రఘుతో అన్నాడు.

12. కవిత గ్రంథాలయానికి వెళ్లి పుస్తకాలు తెచ్చుకొంది. (ఏ రకపు వాక్యమో గుర్తించండి) (S.A. II – 2017-18)
ఎ) సంయుక్తం
బి) ఆశీర్వార్థకం
సి) ప్రశ్నార్థకం
డి) సంక్లిష్టం
జవాబు:
డి) సంక్లిష్టం

13. వానలు వస్తే పంటలు పండుతాయి. (ఏ రకమైన వాక్యమో గుర్తించండి.) (S.A. II – 2017-18)
ఎ) చేదర్థకం
బి) తమున్నర్థకం
సి) భావార్థకం
డి) వ్యతిరేకార్థకం
జవాబు:
ఎ) చేదర్థకం

14. అనుచితమనుమాట నిస్సందేహము (ఆధునిక వచనంలోకి మార్చిన వాక్యం గుర్తించండి.) (S.A. III – 2016-17)
ఎ) అనుచితమనుమాట నిస్సందియము.
బి) అనుచితమనెడిమాటయు నిస్సందేహము.
సి) అనుచితం అనేమాట నిస్సందేహం.
డి) అనుచితం అనేమాట సందేహం.
జవాబు:
సి) అనుచితం అనేమాట నిస్సందేహం.

AP Board 9th Class Telugu Important Questions Chapter 2 స్వభాష

15. వర్షాలు కురుస్తాయి. పంటలు పండుతాయి. (ఈ రెండు వాక్యాలను చేదర్థక వాక్యంగా మార్చినది గుర్తించండి.) (S.A. III – 2016-17)
ఎ) వర్షాలు కురిసి పంటలు పండుతాయి.
బి) వర్షాలు కురిస్తే పంటలు పండుతాయి.
సి) వర్షాలు కురవక పంటలు పండుతాయి.
డి) వర్షాలు కురవక పంటలు పండలేదు.
జవాబు:
బి) వర్షాలు కురిస్తే పంటలు పండుతాయి.

భాషాంశాలు (పదజాలం, వ్యాకరణం)

1. అర్థాలు :

16. సామెత లేని మాట. ఆమెత లేని ఇల్లు ఉండవు – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
A) గోడలు
B) కిటికీలు
C) విందు
D) గది
జవాబు:
C) విందు

17. అధిక్షేపము ఒక ప్రక్రియ – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
A) ఎత్తిపొడుపు
B) పొత్తికడుపు
C) నత్తిమాట
D) పొగడ్త
జవాబు:
A) ఎత్తిపొడుపు

18. రాజులు పండితులకు ఈనాములిచ్చారు – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
A) మాన్యం
B) సామాన్యం
C) అన్యం
D) వస్త్రం
జవాబు:
A) మాన్యం

19. తొందరపడి ఎవరినీ ‘అధిక్షేపించకూడదు’ – గీత గీసిన పదానికి అర్థాన్ని గుర్తించండి.
A) ఆక్షేపించు
B) మెచ్చుకొను
C) స్తుతించు
D) కొట్టు
జవాబు:
A) ఆక్షేపించు

20. తెలుగు నేర్చుకోడానికి ఇంగ్లీషు భాషాభ్యాసమునకు పడే శ్రమలో పదవ వంతు అక్కఱ లేదు – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
A) కఱ్ఱ
B) ధనము
C) కష్టము
D) శ్రమ
జవాబు:
C) కష్టము

AP Board 9th Class Telugu Important Questions Chapter 2 స్వభాష

21. నీవు నిస్సందేహముగా ఈ పని చేయగలవు – గీత గీసిన పదానికి అర్థము ఏది?
A) సందేహము
B) నిశ్శంకము
C) నిక్కచ్చి
D) తప్పక
జవాబు:
B) నిశ్శంకము

2. పర్యాయపదాలు :

22. సూక్తి చెప్పేవాడి కన్నా, ఆచరించి చెప్పేవాడు మిన్న – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
A) మంచిమాట, ఆట
B) మంచిమాట, నీతి వాక్యం
C) నీతివాక్యం, తిట్టు
D) ఆట, పాట
జవాబు:
B) మంచిమాట, నీతి వాక్యం

23. తల్లి గర్భం నుండి పుట్టి చివరకు గర్భశోకం మిగిల్చేవారు పశుప్రాయులు – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి
A) జన్మించి, ఏడిపించి
B) ఉద్భవించి, నవ్వించి
C) జన్మించి, అవతరించి
D) బాధించి, జనించి
జవాబు:
C) జన్మించి, అవతరించి

24. దేశభాషలు ఉపాధ్యాయుడు అక్కఱ లేకయే, నేర్చుకొన గలము- గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
A) గురువు, పండితుడు
B) ఆచార్యుడు, బుధుడు
C) ఒజ్జ, గురువు
D) అధ్యాపకుడు, ఆచారి
జవాబు:
C) ఒజ్జ, గురువు

AP Board 9th Class Telugu Important Questions Chapter 2 స్వభాష

25. శివరాత్రినాడు గుడిలో శంభో, హర, హరా అనే నాదాలు మిన్నుముట్టాయి – గీత గీసిన పదాలకు పర్యాయపదం గుర్తించండి.
A) బ్రహ్మ
B) విష్ణువు
C) ఇంద్రుడు
D) శివుడు
జవాబు:
D) శివుడు

26. నీ ఆస్యగహ్వరము నుంచి వచ్చిన మాట అసమంజ సముగా ఉంది – గీత గీసిన పదానికి, సమానార్థకపదం ఏది?
A) ముఖము
B) గుహ
C) కంఠము
D) నోరు
జవాబు:
B) గుహ

3. వ్యుత్పత్యర్థాలు :

27. నాశనము పొందనిది – వ్యుత్పత్త్యర్ధం గల పదం గుర్తించండి.
A) వినాశనం
B) అక్షరం
C) సంపద
D) జీవం
జవాబు:
B) అక్షరం

28. ‘శివుడు’ – వ్యుత్పత్తిని గుర్తించండి.
A) మంగళప్రదుడు
B) విషం మింగినవాడు
C) అర్ధనారీశ్వరుడు
D) చంద్రుని తలపై ఉన్నవాడు
జవాబు:
A) మంగళప్రదుడు

29. ‘శాస్త్రమందు మంచిబుద్ధి కలవాడు’ – వ్యుత్పత్త్యర్థం గల పదం ఏది?
A) వివేకి
B) మేధావి
C) పండితుడు
D) బుద్ధిశాలి
జవాబు:
C) పండితుడు

AP Board 9th Class Telugu Important Questions Chapter 2 స్వభాష

30. ‘భక్తుల పీడను హరించేవాడు’ – అనే వ్యుత్పత్త్యర్థం గల పదమేది?
A) శంభుడు
B) శివుడు
C) ముక్కంటి
D) హరుడు
జవాబు:
D) హరుడు

31. ‘పక్షి’ అనే దాని వ్యుత్పత్తిని గుర్తించండి.
A) పలికేది
B) పక్షములు గలది
C) టెక్కలు గలది
D) టెక్కలతో ఎగిరేది
జవాబు:
B) పక్షములు గలది

4. నానార్థాలు :

32. శ్రీలు ఒలికించు చిఱునవ్వు స్త్రీలకు దివ్యాభరణమే ! – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
A) లక్ష్మి, జ్యేష్ఠ
B) ఐశ్వర్యం, అలంకారం
C) శోభ, వింత
D) విషం, పాము
జవాబు:
B) ఐశ్వర్యం, అలంకారం

33. అర్ధము లేనిదే వ్యర్థము – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
A) సంపద, ధనం
B) శబ్దార్థం, శతాబ్దం
C) శబ్దాది విషయం, ధనం
D) న్యాయం, శాంతి
జవాబు:
C) శబ్దాది విషయం, ధనం

34. నీవు నీ మిత్రుడికి ఉత్తరము తెలుగులోనే రాయి – గీత గీసిన పదానికి నానార్ధములు గుర్తించండి.
A) స్నేహితుడు, హితుడు
B) సూర్యుడు, స్నేహితుడు
C) బ్రహ్మ, నేస్తము
D) విష్ణువు, హితుడు
జవాబు:
B) సూర్యుడు, స్నేహితుడు

AP Board 9th Class Telugu Important Questions Chapter 2 స్వభాష

5. ప్రకృతి – వికృతులు :

35. భ్రాంతిమయ జీవితంలో ఎన్నటికి సుఖము ఉండదు – గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.
A) బ్రాతి
B) బాంతి
C) బ్రాంతి
D) బాతి
జవాబు:
A) బ్రాతి

36. సుద్దులు ఎన్నెనా ఏమి బుద్దులు సరిలేనప్పుడు – గీత గీసిన పదానికి ప్రకృతి పదం గుర్తించండి.
A) శుభ్రత
B) శుభం
C) సూక్తులు
D) పనులు
జవాబు:
C) సూక్తులు

37. ‘అక్షరము’ అనే పదానికి వికృతిని గుర్తించండి.
A) అక్కరము
B) అక్కలు
C) ఆకరము
D) అంకె
జవాబు:
A) అక్కరము

38. నీవు చెప్పే సూక్తి శ్రుతపూర్వమే – గీత గీసిన పదానికి వికృతి ఏది?
A) సుక్కి
B) సుద్ది
C) శ్రుతి
D) సూక్తము
జవాబు:
B) సుద్ది

AP Board 9th Class Telugu Important Questions Chapter 2 స్వభాష

39. మీ ఒజ్జలు మహాపండితులు – గీత గీసిన పదానికి ప్రకృతి ఏది?
A) అధ్యాపకుడు
B) ఉపాధ్యాయుడు
C) గురువు
D) ఆచార్యుడు
జవాబు:
B) ఉపాధ్యాయుడు

6. సంధులు :

40. గుణసంధికి చెందినదేది?
AP Board 9th Class Telugu Important Questions Chapter 2 స్వభాష 1
జవాబు:
B)

41. ‘యథార్థం’ విడదీయండి.
A) యథా + అర్థం
B) యథ + అర్థం
C) యాథా + అర్థం
D) యథా + ఆర్థం
జవాబు:
A) యథా + అర్థం

42. ‘తదేక’ విడదీయండి.
A) తద + ఏక
B) తత్ + దేక
C) తత్ + ఏక
D) తదా + ఏక
జవాబు:
C) తత్ + ఏక

43. ‘వాగౌరణి’ – సంధి పేరేమిటి?
A) శ్చుత్వసంధి
B) గుణసంధి
C) వృద్ధిసంధి
D) జశ్త్వసంధి
జవాబు:
D) జశ్త్వసంధి

AP Board 9th Class Telugu Important Questions Chapter 2 స్వభాష

44. సవర్ణదీర్ఘ సంధికి ఉదాహరణ రాయండి.
A) కంఠోక్తి
B) తదేక
C) శతాబ్దం
D) వజ్రాలు
జవాబు:
C) శతాబ్దం

45. ‘దైన్యపడి’ విడదీయండి.
A) దైన్యము + పడి
B) దైన్యము + వడి
C) దైన్య + వడి
D) దైన్య + పడి
జవాబు:
A) దైన్యము + పడి

46. ‘నిః + సందేహం’ కలిపి రాయండి.
A) నీ దేహం
B) నిస్సందేహం
C) నిసందేహం
D) నీస్సందేహం
జవాబు:
B) నిస్సందేహం

47. ‘రవంత’ – సంధి పేరేమిటి?
A) ఉత్వసంధి
B) సవర్ణదీర్ఘ సంధి
C) ఇత్వసంధి
D) అత్వసంధి
జవాబు:
B) సవర్ణదీర్ఘ సంధి

48. ‘కంఠోక్తి’ పదాన్ని విడదీయండి.
A) కంఠ + ఓక్తి
B) కంఠ + ఊక్తి
C) కంఠ + ఉక్తి
D) కం + రోక్తి
జవాబు:
C) కంఠ + ఉక్తి

49. ‘పాండిత్యపుఁబస’ విడదీసి చూపండి.
A) పాండిత్యపు + బస
B) పాండిత్యము + పస
C) పాండిత్యం + బస
D) పాండిత్యపు + పస
జవాబు:
B) పాండిత్యము + పస

AP Board 9th Class Telugu Important Questions Chapter 2 స్వభాష

50. ‘భాషాభిమానము’ – ఏ సంధి?
A) అత్వసంధి
B) సవర్ణదీర్ఘ సంధి
C) గుణసంధి
D) వృద్ధి సంధి
జవాబు:
B) సవర్ణదీర్ఘ సంధి

51. ‘అయ్యయ్యో’ పదంలో గల సంధి ఏది?
A) ప్రాతాది సంధి
B) ఆమ్రేడిత సంధి
C) యడాగమ సంధి
D) యణాదేశ సంధి
జవాబు:
B) ఆమ్రేడిత సంధి

7. సమాసాలు :

52. మాతాపితలు దైవసమానులు – గీత గీసిన పదం ఏ సమాసమో గుర్తించండి.
A) ద్విగు
B) రూపకం
C) ద్వంద్వం
D) బహువ్రీహి
జవాబు:
C) ద్వంద్వం

53. మాతృభాష మరువకూడదు – గీత గీసిన పదం ఏ సమాసమో గుర్తించండి.
A) ద్వంద్వ
B) షష్ఠీ
C) తృతీయా
D) రూపకం
జవాబు:
B) షష్ఠీ

AP Board 9th Class Telugu Important Questions Chapter 2 స్వభాష

54. అనుచితమైన పనులు చేయకు – గీత గీసిన పదం ఏ – విగ్రహవాక్యమో గుర్తించండి.
A) ఉచితం
B) చిత్రమైనది
C) అమూల్యం
D) ఉచితం కానిది
జవాబు:
D) ఉచితం కానిది

55. ‘ఏబది సంఖ్యగల సంవత్సరాలు’ – సమాసపదం ఏది?
A) ఏబది సంవత్సరాలు
B) యాభై
C) ఏబది వసంతాలు
D) యాభైయేళ్ళు
జవాబు:
A) ఏబది సంవత్సరాలు

56. ‘మంగళకరమైన నీతివాక్యం’ – సమాసపదం ఏది?
A) మంగళవాక్యం
B) శ్రీ సూక్తి
C) మంగళ శ్రీ
D) శ్రీవాక్యం
జవాబు:
B) శ్రీ సూక్తి

57. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసానికి ఉదాహరణ రాయండి.
A) అనర్హం
B) మాతాపితలు
C) శ్రీసూక్తి
D) మాటతీరు
జవాబు:
C) శ్రీసూక్తి

AP Board 9th Class Telugu Important Questions Chapter 2 స్వభాష

58. ‘మాతాపితలు’ – ఈ సమాసానికి విగ్రహవాక్యం ఏది?
A) మాతయు, పితయు
B) అమ్మానాన్నలు
C) తండ్రి, తల్లి
D) మాతయు, పితృడును
జవాబు:
A) మాతయు, పితయు

59. ‘రక్తమును, మాంసమును’ దీన్ని సమాస పదంగా కూర్చండి.
A) రక్తా మాంసాలు
B) రక్త మాంసము
C) రక్తమాంసములు
D) మాంసరళములు
జవాబు:
C) రక్తమాంసములు

60. ‘భాషయందభిమానము’ దీన్ని సమాస పదంగా కూర్చండి.
A) భాష అభిమానము
B) భాషాభిమానము
C) అభిమాన భాష
D) భాషలయభిమానం
జవాబు:
B) భాషాభిమానము

61. ‘వాగ్వాహిని’ ఇది ఏ సమాసం?
A) నఞ్ తత్పురుష
B) ద్విగు
C) బహువ్రీహి
D) రూపకము
జవాబు:
D) రూపకము

AP Board 9th Class Telugu Important Questions Chapter 2 స్వభాష

8. గణాలు :

62. ‘స, భ, ర, న, మ, య, వ’ గణాలు ఏ వృత్తానికి చెందినవి?
A) ఉత్పలమాల
B) చంపకమాల
C) శార్దూలం
D) మత్తేభం
జవాబు:
D) మత్తేభం

63. ‘సౌలభ్యం’ గురులఘువులు గుర్తించండి.
A) UIU
B) UII
C) UUU
D) IUU
జవాబు:
C) UUU

64. III ఏ గణమో చెప్పండి.
A) స గణం
B) న గణం
C) మ గణం
D) భ గణం
జవాబు:
B) న గణం

9. ఆధునిక వచనాన్ని గుర్తించడం :

65. భాషలోని కళను బ్రాణమును తత్త్వము నాత్మను గనిపట్టవలయును – ఈ వాక్యాన్ని ఆధునిక వచనంలోకి మార్చండి. (S.A. I – 2018-19)
A) భాష ద్వారా కళ, ప్రాణం, తత్త్వం , ఆత్మ తెలుసు కోవాలి.
B) భాషలోని కళని, ప్రాణాన్ని, తత్వాన్ని, ఆత్మని కనిపెట్టాలి.
C) భాష యొక్క కళ, ప్రాణాన్ని, తత్త్వం , ఆత్మను కనిపించాలి.
D) భాషతో కళను ప్రాణంతో తత్త్వం ఆత్మతో కనిపెట్టాలి.
జవాబు:
B) భాషలోని కళని, ప్రాణాన్ని, తత్వాన్ని, ఆత్మని కనిపెట్టాలి.

66. స్వభాషను మీరు నేర్చుకొనుటకేమంత శ్రమమున్నది – ఈ వాక్యాన్ని ఆధునిక వచనంలోకి మార్చండి.
A) మీ భాష మీరు తెల్సుకోడానికి శ్రమలేదు.
B) మీ భాష మేము నేర్చుకోడానికి ఏం శ్రమున్నది.
C) స్వభాషను మీరు నేర్చుకోడానికి ఏం శ్రముంది.
D) స్వభాషను మేము నేర్చుకోడానికి శ్రమమేముంది.
జవాబు:
C) స్వభాషను మీరు నేర్చుకోడానికి ఏం శ్రముంది.

AP Board 9th Class Telugu Important Questions Chapter 2 స్వభాష

67. ఆంధ్రభాష బొత్తిగ రానివానితోడనే కాని మీరాంధేయము ననెన్నడు మాటాడవలదు – ఈ వాక్యాన్ని ఆధునిక వచనంలోకి మార్చండి.
A) తెలుగు అసలు రానివానితో తప్ప (ఇతరులతో) మీరు ఆంగ్లేయంలో ఎప్పుడు మాట్లాడవద్దు.
B) తెలుగు రానివారితో తప్ప ఇంగ్లీషులో మాట్లాడవద్దు.
C) తెలుగు వారితో ఇంగ్లీషులో మాట్లాడవద్దు.
D) తెలుగు రానివారితో ఇంగ్లీషులో మాట్లాడు.
జవాబు:
A) తెలుగు అసలు రానివానితో తప్ప (ఇతరులతో) మీరు ఆంగ్లేయంలో ఎప్పుడు మాట్లాడవద్దు.

68. “నేనొక్కడను మాత్రమే యదృష్టవంతుడనా ?” – దీన్నిఆధునిక వచనంగా మార్చండి.
A) నేను ఒక్కడ్లో అదృష్టవంతుడను కాను.
B) నేనొక్కణ్ణి మాత్రమే అదృష్టవంతుణా !
C) నేను అదృష్టవంతుణ్ణి మాత్రమే కాదు.
D) నేను అదృష్టవంతుడిని కానేకాను.
జవాబు:
B) నేనొక్కణ్ణి మాత్రమే అదృష్టవంతుణా !

69. కోతిని మీరెచ్చటనైనా జూచితిరా – ఆధునిక వచనంగా మార్చండి.
A) కోతిని మీరెక్కడైనా చూశారా?
B) కోతిని మీరు ఎక్కడా చూడలేదు
C) కోతిని మీరెక్కడా చూడరు
D) కోతిని మీరెచ్చటా చూడరు.
జవాబు:
A) కోతిని మీరెక్కడైనా చూశారా?

10. కర్తరి, కర్మణి వాక్యాలను గుర్తించడం:

70. ప్రతి విషయం పరిశీలించబడుతుంది – దీన్ని కర్తరి వాక్యంగా రాయండి.
A) ప్రతి విషయమును పరిశీలిస్తారు.
B) ప్రతి విషయం పరిశీలింపగలరు.
C) ప్రతి విషయాన్ని పరిశీలించండి.
D) ప్రతి విషయమును పరిశీలింపబడుతుంది.
జవాబు:
A) ప్రతి విషయమును పరిశీలిస్తారు.

11. ప్రత్యక్ష, పరోక్ష కథనంలోకి మార్చడం :

71. ‘నేను బడికి రాను’ సీత చెప్పింది – ఈ ప్రత్యక్ష కథనానికి పరోక్షకథనాన్ని గుర్తించండి.
A) నేను బడికి రానని సీత చెప్పింది.
B) తాను బడికి రానని సీత చెప్పింది.
C) తాను బడికి వెళ్ళనని సీత అంది.
D) వాడు బడికి రాడని సీత చెప్పింది.
జవాబు:
B) తాను బడికి రానని సీత చెప్పింది.

AP Board 9th Class Telugu Important Questions Chapter 2 స్వభాష

72. వ్యతిరేకార్థక వాక్యాన్ని గుర్తించడం :
8. మా భాష మాకు రాదు – వ్యతిరేక వాక్యం గుర్తించండి.
A) మా భాష మాకు వచ్చు
B) మా భాష మాకు తెలుసు
C) మీ భాష మాకు వచ్చు
D) మీ భాష మాకు తెలియదు
జవాబు:
A) మా భాష మాకు వచ్చు

73. మాధవి ఉద్యోగం చేస్తున్నది – వ్యతిరేక వాక్యం గుర్తించండి.
A) మాధవి ఉద్యోగం చేయట్లేదు
B) మాధవి ఉద్యోగం చేస్తుంది
C) మాధవి ఉద్యోగం చేయబోతుంది
D) మాధవి ఉద్యోగం చేయట్లేదు
జవాబు:
A) మాధవి ఉద్యోగం చేయట్లేదు

12. వాక్యరకాలను గుర్తించడం :

74. మోహన కూచిపూడి నృత్యం మరియు భావన భరత నాట్యం నేర్చుకొన్నారు – ఇది ఏ రకమైన వాక్యం?
A) సంక్లిష్ట వాక్యం
B) సామాన్య వాక్యం
C) సంయుక్త వాక్యం
D) మహావాక్యం
జవాబు:
C) సంయుక్త వాక్యం

75. నన్ను మీరు క్షమించి, మరెప్పుడైన ఈ సభను తిరిగి చేసుకోండి – ఇది ఏ రకమైన వాక్యం?
A) మహా వాక్యం
B) సంక్లిష్ట వాక్యం
C) సామాన్య వాక్యం
D) సంయుక్త వాక్యం
జవాబు:
B) సంక్లిష్ట వాక్యం

AP Board 9th Class Telugu Important Questions Chapter 2 స్వభాష

76. ఎ) మోహిని కూచిపూడి నృత్యం నేర్చుకుంది.
బి) భావన భరత నాట్యం నేర్చుకుంది – వీటిని సంయుక్త వాక్యంగా మార్చండి.
A) మోహిని కూచిపూడి నృత్యం, భావన భరతనాట్యం నేర్చుకున్నారు.
B) మోహిని, భావనలు నృత్య నాట్యాలు నేర్చారు.
C) మోహిని నృత్యం నేర్చుకోగా భావన భరతనాట్యం నేర్చుకుంది.
D) మోహిని, భావనలు నృత్య నాట్యాలు నేర్చారు.
జవాబు:
A) మోహిని కూచిపూడి నృత్యం, భావన భరతనాట్యం నేర్చుకున్నారు.

13. ప్రక్రియలను గుర్తించడం :

77. భూతకాలిక అసమాపక క్రియకు ఉదాహరణను
గుర్తించండి.
A) కురిస్తే
B) తింటూ
C) వెళ్ళి
D) చూసాడు
జవాబు:
C) వెళ్ళి

78. ‘పడితే’ – ఇది ఏ ప్రక్రియకు చెందినది?
A) క్వార్థకం
B) శత్రర్థకం
C) చుతుబర్ధకం
D) చేదర్థకం
జవాబు:
D) చేదర్థకం

79. భూతకాల అసమాపక క్రియను ఇలా పిలుస్తారు.
A) చేదర్థకం
B) క్త్వార్థకం
C) హేత్వర్థకం
D) శత్రర్థకం
జవాబు:
B) క్త్వార్థకం

80. మందు వాడితే జబ్బు తగ్గుతుంది – ‘గీత గీసిన పదం’ ఏ అసమాపక క్రియకు చెందినదో తెల్పండి.
A) అప్యర్థకం
B) క్వార్థకం
C) చేదర్థకం
D) శత్రర్థకం
జవాబు:
C) చేదర్థకం

AP Board 9th Class Telugu Important Questions Chapter 2 స్వభాష

81. వర్తమాన అసమాపక క్రియను ఏమంటారు? (S.A. III – 2016-17)
A) శత్రర్థకం
B) చేదర్థకం
C) క్త్వార్థకం
D) ఆశ్చర్యార్థకం
జవాబు:
A) శత్రర్థకం

82. చుట్టుముట్టడం : సమస్యలెన్ని చుట్టిముట్టినా ధైర్యంతో ముందడుగు వేయాలి.

83. అయోమయం : అర్థంకాని విషయం / పరిస్థితిని తెలిపే సందర్భంలో ఉపయోగిస్తారు.

AP Board 8th Class Telugu Solutions ఉపవాచకం Chapter 2 గుశ్వం

AP State Syllabus AP Board 8th Class Telugu Textbook Solutions ఉపవాచకం Chapter 2 గుశ్వం Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Telugu Solutions ఉపవాచకం 2nd Lesson గుశ్వం

8th Class Telugu ఉపవాచకం 2nd Lesson గుశ్వం Textbook Questions and Answers

I. అవగాహన-ప్రతిస్పందన

కింది పరిచిత గద్యాలను చదివి, ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

1. గుశ్వం నాటిక హాస్యంతో కూడినది. ఎందుకంటే శిష్యులు పదాలు సరిగా పలకలేక పోవడం గుఱ్ఱం బదులు : | గుల్లం అనడం నవ్వు తెప్పిస్తుంది. గుర్రంలో ‘గు’, అశ్వంలో ‘శ్వం’ కలిపి ‘గుశ్వం’ అనే పదం వారు తయారు చెయ్యడం హాస్యానికి కారణం. గుర్రానికి గుడ్డు ఉండదని కూడా తెలియని వాళ్ళ అమాయకత్వం, ఆ అయోమయాన్ని గురువు గారికి కూడా తగిలించి వాళ్ళు గుర్రం గుడ్డు తెస్తామనగానే ఆయన తలూపి పది వరహాలివ్వడం నవ్వు పుట్టిస్తుంది. బూడిద గుమ్మడికాయను గుడ్డు అని చెప్పగానే నమ్మేయడం గుమ్మడికాయ పగిలిపోతే ఆ శబ్దానికి బెదిరి కుందేలు పరుగెత్తడం చూసి ఆ కాయలోంచే కుందేలు వచ్చి ఉంటుందని వారు భావించి దానివెంట పరుగెత్తడం మరీ విడ్డూరం. ఇలా ఈ కథలో ప్రతి సన్నివేశమూ నవ్వు పుట్టిస్తుంది ఈ నాటికలో. –
ప్రశ్నలు :
1. శిష్యుల అమాయకత్వం ఎలాంటిది?
జవాబు:
గుర్రానికి గుడ్డు ఉండదని తెలియకపోవడం శిష్యుల అమాయకత్వం.

2. పరమానందయ్య శిష్యులు ఎలాంటివారు?
జవాబు:
పరమానందయ్య శిష్యులు అమాయకులు.

3. ‘గుశ్వం’ నాటిక దేనితో కూడినది ?
జవాబు:
‘గుశ్వం’ అనే నాటిక హాస్యంతో కూడినది.

4. శిష్యులు దేనిని గుర్రం గుడ్డుగా భావించారు?
జవాబు:
శిష్యులు బూడిద గుమ్మడికాయను గుర్రం గుడ్డుగా భావించారు.

AP Board 8th Class Telugu Solutions ఉపవాచకం Chapter 2 గుశ్వం

2. పరమానందయ్యగారు పేరు పొందిన గురువు. ఆయన దగ్గర శిష్యులు అమాయకులు. ఏ పని చెప్పినా అయోమయంగా చేస్తారు. వాళ్ళకు గురువుగారు ఒక రోజు గుర్రం గురించి చెప్పాలనుకున్నారు. చెన్నడు అనే శిష్యుడికి గుఱ్ఱం అని పలకమంటే అ పలకలేని చెన్నడు గుల్లం అన్నాడు. గున్నడు అనే శిష్యుడు ఇంకో పేరు చెప్పమంటే గురువు ‘అశ్వం’ అని చెప్పాడు. అశ్వమనే పేరు నాదంటే నాదని ఆ యిద్దరు కొట్లాడుకుంటూ గుర్రంలోని ‘గు’, అశ్వంలోని ‘శ్వం’ కలిపి ‘గుశ్వం’ అనే పేరు తయారుచేశారు. గురువుగారు వారిని విసుక్కుంటూ నాకు గుర్రమెక్కాలనే కోరిక తీరిక కనీసం మీకు గుర్రం గురించి చెబుదామనుకుంటే ఆ పేరు గూడ నేర్చుకోలేకపోయారు. అంటుంటే తిన్నడు అనే మరోశిష్యుడు పది వరహాలిస్తే గుర్రం గుడ్డు కొనుక్కొస్తానని చెప్పి చెన్నడు, గున్నడు ఇద్దర్నీ
వెంటబెట్టుకొని ఒక బూడిద గుమ్మడికాయను కొనుక్కొని వస్తుంటే దారిలో అది కిందపడి పగిలింది.
ప్రశ్నలు:
1. పేరు పొందిన గురువు ఎవరు?
జవాబు:
పేరు పొందిన గురువు పరమానందయ్య.

2. శిష్యులు ఏ పని చేసినా ఎలా చేస్తారు?
జవాబు:
శిష్యులు ఏ పని చేసినా అయోమయంగా చేస్తారు.

3. గుర్రాన్ని సంస్కృతంలో ఏమని అంటారు?
జవాబు:
గుర్రాన్ని సంస్కృతంలో ‘అశ్వం’ అని అంటారు.

4. బూడిద గుమ్మడికాయను దేనిగా భావించారు?
జవాబు:
బూడిద గుమ్మడికాయను గుర్రం గుడ్డుగ భావించారు.

3. ఇంతలో పరమానందయ్య గారి మరో శిష్యుడు, ‘తిన్నడు’ వచ్చి, గుర్రం గుడ్డును పట్టేశాననీ, పది వరహాలిస్తే అది వారికి ఇచ్చి గుర్రం గుడ్డు మోసితెస్తానన్నాడు. గురువుగారు కూడా ఆ మాటనమ్మి శిష్యులకు డబ్బిచ్చి పంపారు. శిష్యులు ఆ డబ్బు ఇచ్చి గుర్రం గుడ్డు అని బూడిద గుమ్మడికాయను కొని మోసి తెస్తుండగా ఆ కాయ పగిలిపోయింది. అప్పుడే అక్కడ తిరుగుతున్న కుందేలు పిల్లను చూసి, శిష్యులు గుర్రం పిల్ల పారిపోయిందని, దానికై వెతికి, పట్టుకోలేక ఏడుస్తూ వచ్చి గురువుగారికి చెప్పారు. బూడిదగుమ్మడికాయ ముక్కల్ని చూసి, శిష్యులూ, తానూ కూడా, తెలివితక్కువ పని చేశామని గురువుగారు తెలిసికొన్నారు.

ఇంతలో బూడిదగుమ్మడికాయ అమ్మిన పెద్దమనిషి, కుందేలు పిల్లను పట్టి తెచ్చి, పదివరహాలనూ గురువుగారికి తిరిగి ఇచ్చాడు. జరిగిన విషయం అంతా గురువుగారికి చెప్పాడు.
ప్రశ్నలు:
1. తిన్నడు ఎవరు?
జవాబు:
తిన్నడు పరమానందయ్య శిష్యుడు.

2. కుందేలు పిల్లను శిష్యులు దేనిగా గుర్తించారు?
జవాబు:
కుందేలు పిల్లను గుర్రం పిల్లగా గుర్తించారు.

3. పది వరహాలు ఇస్తే ఏది తెస్తామని శిష్యులు చెప్పారు?
జవాబు:
పది వరహాలు ఇస్తే గుర్రం గుడ్డును తెస్తామని చెప్పారు.

4. పెద్దమనిషి దేనిని అమ్మాడు?
జవాబు:
పెద్దమనిషి బూడిద గుమ్మడికాయను అమ్మాడు.

AP Board 8th Class Telugu Solutions ఉపవాచకం Chapter 2 గుశ్వం

4. గుఱ్ఱము అనే మాట తెలుగు అనీ, అశ్వము అనే మాట సంస్కృతము అనీ గురువుగారు చెప్పారు. అయితే ఆ రెండు మాటలు వస్తే సంస్కృతము, తెలుగుభాషలు పూర్తిగా తమకు వచ్చేస్తాయని గున్నడు అంటాడు.

మరో శిష్యుడు తిన్నడు, గుర్రం గుడ్డు అనుకొని, బూడిద గుమ్మడికాయను పది వరహాలిచ్చి కొన్నాడు. గుర్రం గుడ్డు పెట్టదని కూడా ఆ శిష్యులకు తెలియదు. వారు పరమ మూర్ఖులు. వారికి గురుభక్తి ఎక్కువ. గురువుగారు చచ్చిపోతే తాము బతికే అంత తెలివి తక్కువ వాళ్ళము కాము అని వారు తమ గురుభక్తిని ప్రకటిస్తారు.

పరమానందయ్యగారి శిష్యులు అతి తెలివిని చూపిస్తారు. గుర్రము కొంటే అది తన్నుతుందనీ, గుడ్డును కొని, దాని పిల్లను పెంచితే ఆ గుర్రం పిల్ల తాము చెప్పిన మాట వింటుందనీ వారు గురువు గారికి ధర్మసూక్ష్మాన్ని వివరిస్తారు.

ఆ గురువుగారు తమకు చెప్పిన మాటలు గురువుగారికే తిరిగి వారు అప్పచెపుతారు. గుర్రం గుడ్డు తొందరగా కొనాలనీ, ‘ఆలస్యం అమృతం విషం’ అని గురువుగారికి వారు గుర్తు చేస్తారు.
ప్రశ్నలు:
1. గుర్రం గుడ్డు అనుకొని బూడిద గుమ్మడికాయను కొన్న శిష్యుడు ఎవరు?
జవాబు:
తిన్నడు గుర్రం గుడ్డు అనుకొని బూడిద గుమ్మడ కాయను కొన్నాడు.

2. అతి తెలివిని ప్రదర్శించినది ఎవరు?
జవాబు:
పరమానందయ్య శిష్యులు అతి తెలివిని ప్రదర్శిస్తారు.

3. ఆలస్యం అమృతం విషం అని గుర్తు చేసినది ఎవరు?
జవాబు:
ఆలస్యం అమృతం విషం అని గుర్తు చేసినది శిష్యులు.

4. గుర్రం అనే పదాన్ని సంస్కృతంలో ఏమని అంటారు?
జవాబు:
గుర్రం అనే పదాన్ని సంస్కృతంలో ‘అశ్వం’ అని అంటారు.

II వ్యక్తీకరణ – సృజనాత్మకత

కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
ఈ నాటకం వేయడానికి ఒకరు గురువుగాను, ముగ్గురు శిష్యులుగా, ఇంకొకరు పెద్దమనిషిగా ఉండాలి. నాటకంలోని సంభాషణలను అభ్యాసం చేయండి. పాత్రలకనుగుణంగా దుస్తులు ధరించాలి. అలంకరించుకోవాలి. తరగతిలో / పాఠశాలలో ప్రదర్శించాలి.
జవాబు:
నాటకం మీ తరగతిలో ప్రదర్శించండి.

ప్రశ్న 2.
“గుశ్వం” నాటకాన్ని కథగా సొంతమాటల్లో పది వాక్యాల్లో రాయండి.
జవాబు:
పరమానందయ్యగారికి చెన్నడు, గున్నడు అనే శిష్యులు ఉన్నారు. గురువుగారు చెన్నడికి ‘గుజ్జము’ అనే మాట చెప్పారు. అతడు దాన్ని గుల్లము అని పలుకుతాడు. అపుడు గున్నడు, చెన్నడి నోరు చిన్నదనీ గుఱ్ఱం, బండి వాడినోరు పట్టడం లేదనీ చెప్పాడు. గురువుగారు ‘అశ్వము’ అని మరో మాట చెప్పాడు. గున్నడు, చెన్నడు కలసి, గుఱ్ఱములో ‘ఱ్ఱ’ తీసి, అశ్వములోని ‘శ్వ’ అక్కడ పెట్టి, ‘గుశ్వం’ అనే మాట తయారుచేశారు. గురువుగారు అది తప్పని చెప్పి, వాళ్ళను మందలించి వారికి ‘తురగము’ అని మరో మాట చెప్పారు.

ఇంతలో పరమానందయ్య గారి మరో శిష్యుడు, ‘తిన్నడు’ వచ్చి, గుర్రం గుడ్డును పట్టేశాననీ, పది వరహాలిస్తే అది వారికి ఇచ్చి గుర్రం గుడ్డును మోసితెస్తానన్నాడు. గురువుగారు కూడా ఆ మాటనమ్మి శిష్యులకు డబ్బిచ్చి పంపారు. శిష్యులు ఆ డబ్బు ఇచ్చి గుర్రం గుడ్డు అని బూడిద గుమ్మడికాయను కొని మోసి తెస్తుండగా ఆ కాయ పగిలిపోయింది. అప్పుడే అక్కడ తిరుగుతున్న కుందేలు పిల్లను చూసి, శిష్యులు గుర్రం పిల్ల పారిపోయిందని, దానికై వెతికి, పట్టుకోలేక ఏడుస్తూ వచ్చి గురువుగారికి చెప్పారు. బూడిద గుమ్మడికాయ ముక్కల్ని చూసి, శిష్యులూ, తానూ కూడా, తెలివితక్కువ పని చేశామని గురువుగారు తెలిసికొన్నారు.

ఇంతలో బూడిద గుమ్మడికాయ అమ్మిన పెద్దమనిషి, కుందేలు పిల్లను పట్టి తెచ్చి, పదివరహాలనూ గురువుగారికి తిరిగి ఇచ్చాడు. జరిగిన విషయం అంతా గురువుగారికి చెప్పాడు.

AP Board 8th Class Telugu Solutions ఉపవాచకం Chapter 2 గుశ్వం

ప్రశ్న 3.
“గుశ్వం” నాటిక హాస్యంతో కూడినది కదా! ఎందుకో వివరంగా పది వాక్యాల్లో రాయండి.
జవాబు:
పరమానందయ్యగారు శిష్యుడికి ‘గుఱ్ఱం’ అనే మాట చెపితే చెన్నడనే శిష్యుడు “గుల్లము” అంటాడు. ‘గుఱ్ఱము’ అనే
మాటలో బండి ‘ఱ’ ఉంది అని గురువుగారంటే, అందుకే గుల్లము, బండి ‘ఱ’, ఒక్కసారిగా తన నోట పట్టడం లేదని శిష్యుడంటాడు. గున్నడు అనే మరో శిష్యుడు, చెన్నడి నోరు బొత్తిగా చిన్నదనీ, బళ్ళూ, రాళ్ళూ అసలు పట్టవని అంటాడు. ఈ మాటలు హాస్యంతో కూడినవి.

అలాగే ‘గుఱ్ఱంలో’ ఱ తీసివేసి అశ్వంలో ‘శ్వ’ ను కలిపి, శిష్యులు, ‘గుశ్వం’ అనే మాట సృష్టిస్తారు. అది కూడా హాస్యంతో కూడినదే. ఇంకో శిష్యుడు తిన్నడు గుర్రం గుడ్డుతెస్తానని పదివరహాలిచ్చి, బూడిద గుమ్మడికాయను కొని తెస్తాడు. ఆ శిష్యులకు గుర్రం గుడ్డు పెట్టదనీ, పిల్ల మాత్రమే పుడుతుందనీ తెలియకపోవడం నవ్వు పుట్టిస్తుంది. కుందేలు పిల్ల పారిపోతే, గుర్రం పిల్ల పారిపోయిందని శిష్యులు వెతకడం నవ్వు పుట్టిస్తుంది. గుర్రాన్ని కొనడం కంటె, గుర్రం గుడ్డుకొని దాని పిల్లను పెంచితే అది తమ చెప్పినమాట బాగా వింటుందనే, శిష్యుల అతితెలివిమాట కూడా నవ్వు పుట్టిస్తుంది.

గుర్రం గుడ్డును తామే పొదుగుతామని శిష్యులు అంటారు. ఆ మాట మరీ నవ్వు పుట్టిస్తుంది. గురువుగారి దగ్గర ఆ శిష్యులు చూపించే వినయమూ, వారి అతి తెలివితక్కువ మాటలూ మనకు నవ్వును తెప్పిస్తాయి. కాబట్టి “గుశ్వం” – హాస్యనాటిక.

ప్రశ్న 4.
“గుశ్వం” నాటికలోని శిష్యులు ఎలాంటివారు ? వీరి గురించి సొంతమాటల్లో రాయండి.
జవాబు:
గుశ్వం నాటికలో చెన్నడు, గున్నడు, తిన్నడు అనే ముగ్గురు శిష్యులున్నారు. వీరు అతి తెలివి తక్కువవారు. కాని వారంతా అతి తెలివిని ప్రదర్శిస్తూ ఉంటారు. వీరంతా మూర్ఖులయిన శిష్యులు.

అందులో చెన్నడికి ‘గుఱ్ఱం’ అనే మాటలో బండి ‘ఓ’ పలకదు. ఆ మాటను ‘గుల్లము’ అంటాడు. తనకు గుల్లము బండి ఒక్కసారే నోట పట్టడం లేదంటాడు. గున్నడు అనే మరో శిష్యుడు, చెన్నడికి నోరు బొత్తిగా చిన్నదనీ బళ్ళు, రాళ్లు దాంట్లో పట్టవు అని అంటాడు.

గుఱ్ఱము అనే మాట తెలుగు అనీ, అశ్వము అనే మాట సంస్కృతము అనీ గురువుగారు చెప్పారు. అయితే ఆ రెండు మాటలు వస్తే సంస్కృతము, తెలుగుభాషలు పూర్తిగా తమకు వచ్చేస్తాయని గున్నడు అంటాడు.

మరో శిష్యుడు తిన్నడు, గుర్రం గుడ్డు అనుకొని, బూడిద గుమ్మడికాయను పది వరహాలిచ్చి కొన్నాడు. గుర్రం గుడ్డు పెట్టదని కూడా ఆ శిష్యులకు తెలియదు. వారు పరమ మూర్ఖులు. వారికి గురుభక్తి ఎక్కువ. గురువుగారు చచ్చిపోతే తాము బతికే అంత తెలివి తక్కువ వాళ్ళము కాము అని వారు తమ గురుభక్తిని ప్రకటిస్తారు.

పరమానందయ్య గారి శిష్యులు అతి తెలివిని చూపిస్తారు. గుర్రము కొంటే అది తన్ను తుందనీ, గుడ్డును కొని, దాని పిల్లను పెంచితే ఆ గుర్రం పిల్ల తాము చెప్పినమాట వింటుందని వారు గురువు గారికి ధర్మసూక్ష్మాన్ని వివరిస్తారు.

గురువుగారు తమకు చెప్పిన మాటలు గురువుగారికే తిరిగి వారు అప్పచెపుతారు. గుర్రం గుడ్డు తొందరగా కొనాలనీ, ‘ఆలస్యం అమృతం విషం’ అని గురువుగారికి వారు గుర్తు చేస్తారు.

మొత్తంపై పరమానందయ్యగారి శిష్యుల మాటలూ, చేష్టలూ అడుగడుగునా నవ్వు పుట్టిస్తాయి.

AP Board 8th Class Telugu Solutions ఉపవాచకం Chapter 2 గుశ్వం

ప్రశ్న 5.
పరమానందయ్య గురువుగారు, తిన్నడు, చెన్నడు, గున్నడు శిష్యులు కదా! గురుశిష్యుల మధ్య ఉండే సంబంధం గురించి తెలపండి.
జవాబు:
గురువులు పూర్వకాలంలో శిష్యులకు తామే భోజనం పెట్టి, వారికి చదువు చెప్పేవారు. శిష్యులు గురువులు చెప్పిన పనులుచేస్తూ, భక్తి ప్రపత్తులతో శ్రద్ధగా గురువులు చెప్పే విద్యలు నేర్చుకొనేవారు.

గురుశిష్యులు ఒకరంటే ఒకరు ఎంతో ప్రేమగా ఉండేవారు. శిష్యులు గురువుగారినీ, గురువుగారి భార్యను ఎంతో భక్తితో సేవించేవారు. వారు చెప్పే పనులన్నీ చేసేవారు. గురువుగారి పూజకు, అగ్నిహోత్రాది విధులకు, కావలసిన సమిధలు, పూజాద్రవ్యాలు శిష్యులు తెచ్చి ఇచ్చేవారు.

గురుపత్ని శిష్యులకు కడుపునిండా భోజనం పెట్టేది. గురువుగారు శిష్యుల మంచి చెడ్డలను చూస్తూ వారికి కావలసిన విద్యలు నేర్పేవారు. చదువు పూర్తి అయిన తర్వాత గురువులకు, శిష్యులు గురుదక్షిణ సమర్పించేవారు. గురువులు ఏమి అడిగినా శిష్యులు వారికి ఇచ్చేవారు.

ఉదంకుడు అనే శిష్యుడు, పౌష్య మహారాజు భార్య కుండలాలను అడిగితెచ్చి గురుపత్నికి ఇచ్చి, ఆ విధంగా గురుదక్షిణ సమర్పించాడు. ఏకలవ్యుడు’ అనే శిష్యుడు తాను ఆరాధించే గురువు ద్రోణాచార్యునికి తన కుడిచేతి బొటనవ్రేలును గురుదక్షిణగా సమర్పించాడు.

AP Board 8th Class Telugu Solutions ఉపవాచకం Chapter 1 హద్దులు-హద్దులు

AP State Syllabus AP Board 8th Class Telugu Textbook Solutions ఉపవాచకం Chapter 1 హద్దులు-హద్దులు Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Telugu Solutions ఉపవాచకం 1st Lesson హద్దులు-హద్దులు

8th Class Telugu ఉపవాచకం 1st Lesson హద్దులు-హద్దులు Textbook Questions and Answers

I. అవగాహన – ప్రతిస్పందన

కింది పరిచిత గద్యాలను చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

1. సంక్రాంతి పండక్కి వచ్చిన అల్లుడు ఇడ్డెన్లు, బొబ్బట్లు, గారెలు, మొక్కజొన్న పొత్తులు, తాలింపు శనగలు ఇలా తెగ చిరుతిళ్ళు లాగించి కడుపునొప్పంటుంటే డాక్టరుకు కబురు చేశారు మామగారు. డాక్టరుగారు అల్లుడికి ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ అయ్యాక, అల్లుడిగారు జబ్బేమిటంటూ మామగారు డాక్టర్ని అడిగాడు. డాక్టరుగారు ఒక పళ్ళెంలో ఉన్న గారెలు, బొబ్బట్లు, వేరుశనగ పప్పులు, ఐదూ, పది పైసల నాణేలూ చూపించాడు. ఆ డబ్బులెక్కడివో అని అత్తగారు అయోమయంగా చూసింది. మెంతుల డబ్బాలోను, పప్పుల డబ్బాలోను అత్తగారు దాచుకున్న డబ్బులు శనగపప్పుతో పాటు బొబ్బట్లలో కలిసి అల్లుడిగారు పొట్టలోకి వెళ్ళి పోయుంటాయన్నారు మామగారు.
ప్రశ్నలు :
1. అల్లుడి కడుపునొప్పికి కారణమేంటి?
జవాబు:
ఇద్దెన్లు, బొబ్బట్లు, గారెలు, మొక్కజొన్నలు, తాలింపు శనగలు బాగా తినడంతో కడుపునొప్పి వచ్చింది.

2. అల్లుడికి ఆపరేషన్ చేసి తీసిన వాటిలో ఏమేమి ఉన్నాయి?
జవాబు:
గారెలు, బొబ్బట్లు, వేరుశనగపప్పులు, ఐదు పైసల నాణేలు, పది పైసల నాణేలు.

3. సంక్రాంతి పండక్కి కాక, ఇంకా ఏయే సందర్భాలలో అల్లుళ్ళను మామగారు ఇంటికి ఆహ్వానిస్తారు?
జవాబు:
గృహప్రవేశాలకు, దీపావళి, ఉగాది వంటి పండు గలకు, ఇంట్లో వేడుకలకు మావగారు అల్లుళ్ళని ఆహ్వానిస్తారు.

4. పై గద్యంలో మీకు నవ్వు తెప్పించిన విషయమేంటి?
జవాబు:
బొబ్బట్లు, గారెలు, వేరుశనగపప్పులతో పాటు అల్లుడిగారి పొట్టలోంచి ఐదు పైసల నాణేలు, పది పైసల నాణేలను డాక్టరుగారు బయటకు తీసి అందరికీ ఆదర్శంగా నిలవాలి.

AP Board 8th Class Telugu Solutions ఉపవాచకం Chapter 1 హద్దులు-హద్దులు

2. పండుగకు కొత్త అల్లుడు వచ్చాడు. బావమరిది బావగారిని హద్దు మీరి వేళాకోళం చేస్తున్నాడు. అందుకు మామగారు కొడుకును మందలించాడు. మామగారు – అతిగా ఫలహారాలు పెట్టకు, అల్లుడి ఆరోగ్యం పాడవుతుంది అని భార్యతో చెప్పాడు. ఇంతలో అల్లుడు కడుపునొప్పితో మెలితిరిగిపోయాడు. బావగారితో మరిది వేరుశనగకాయలు కావాలా ? అని వేళాకోళం చేస్తాడు. అల్లుడు మరిది పై కోపపడతాడు.

అత్తగారు డాక్టరును తీసుకురమ్మని భర్తతో అంటుంది. పండుగ ఖర్చుతోపాటు, డాక్టరు ఖర్చూ వచ్చిందని మామగారు మూలుగుతాడు. చివరకు డాక్టరు పరీక్షించి అల్లుడి పొట్టకు ఆపరేషన్ చేయాలన్నాడు. వేయిరూపాయలు ఖర్చవుతుందన్నాడు. అల్లుడు తన ప్రాణం పోతుందని కంగారు పడ్డాడు. తప్పనిసరయి, మామగారు ఆపరేషను చేయించాడు.
ప్రశ్నలు:
1. పండుగకు వచ్చింది ఎవరు?
జవాబు:
పండుగకు కొత్త అల్లుడు వచ్చాడు.

2. అల్లుడు ఎవరిపై కోపపడతాడు?
జవాబు:
అల్లుడు మరిది పై కోపపడతాడు.

3. అత్తగారు ఎవరిని తీసుకురమ్మని భర్తతో అంటుంది?
జవాబు:
అత్తగారు డాక్టరును తీసుకొని రమ్మని భర్తతో అంటుంది.

4. బావమరిది ఎవరిని హద్దుమీరి వేళాకోళం చేస్తున్నాడు?
జవాబు:
బావమరిది బావగారిని హద్దుమీరి వేళాకోళం చేస్తున్నాడు.

3. ‘హద్దులు హద్దులు’ నాటకంలో అల్లుడు పొట్టకు డాక్టరు రంపంతో కోసి ఆపరేషను చేసినట్లు చూపించిన ఘట్టం మంచి హాస్యఘట్టం.

డాక్టరు నర్సును ఆపరేషనుకు సిద్ధం చేయమంటాడు. నర్సు రంపం తీసుకువస్తుంది. “ఈ రంపమేమిటి ? దీనితో కోస్తారా?” అని అల్లుడు కంగారుపడతాడు. “దేనితో కోస్తే నీకెందుకు ? మాట్లాడకుండా బల్లమీద పడుకో” అని డాక్టరు అల్లుడిని మందలిస్తాడు.

ఆ తర్వాత ప్రేక్షకులకు పేషంటు కనబడడు. కానీ డాక్టరు రంపంతో కోసినట్లు నటించి పొట్టలో నుంచి, బొబ్బట్లు, గారెలు, చెంచాలు వగైరా ఒక్కొక్కటీ తీసి, ప్రేక్షకులకు చూపించి, పక్కన పెడుతూ ఉంటాడు. ఈ ఘట్టం మంచి నవ్వును తెప్పించింది.
ప్రశ్నలు:
1. ‘హద్దులు హద్దులు’ అనే నాటకంలో హాస్యఘట్టం ఏది?
జవాబు:
హద్దులు హద్దులు అనే నాటకంలో అల్లుడు పొట్టకు డాక్టరు రంపంతో కోసి ఆపరేషను చేసినట్లు చూపించిన ఘట్టం మంచి హాస్యఘట్టం.

2. డాక్టరు ఎవరిని మందలించాడు?
జవాబు:
డాక్టరు అల్లుడిని మందలించాడు.

3. ప్రేక్షకులకు కనబడనిది ఎవరు?
జవాబు:
ప్రేక్షకులకు కనబడనిది పేషంటు.

4. కంగారు పడినది ఎవరు?
జవాబు:
కంగారు పడినది అల్లుడు.

AP Board 8th Class Telugu Solutions ఉపవాచకం Chapter 1 హద్దులు-హద్దులు

4. హద్దులు హద్దులు నాటిక ద్వారా, తినడానికి హద్దులు, నవ్వడానికి హద్దులు, ఆలస్యానికి హద్దులు, తొందరకు – హద్దులు, చాదస్తానికి హద్దులు, అల్లరికి హద్దులు, ఖర్చుకు హద్దులు – ఉండాలని రచయిత సందేశం ఇచ్చాడు.

పండుగకు కొత్త అల్లుడు వచ్చాడు గదా అని, అతిగా ఫలహారాలూ, పిండివంటలూ, చిరుతిళ్ళు పెడితే, అవి తిన్న వారికి రోగం వస్తుందని ఈ నాటిక సందేశం ఇస్తోంది. బావమరిది బావగారిని వేళాకోళం చేయడం సహజం. కానీ అల్లరి అతిగా ఉండరాదని ఈ నాటిక సందేశం ఇచ్చింది. అల్లం రసం పట్టే సందే ఉంటే, మరి రెండు బొబ్బట్లు బావగారు లాగించేసే వారని మరిది అతిగా వేళాకోళం చేశాడు.
ప్రశ్నలు:
1. ప్రతీదానికి హద్దులు ఉండాలని సందేశం ఇచ్చింది ఎవరు?
జవాబు:
ప్రతీదానికి హద్దులు ఉండాలని సందేశం ఇచ్చింది రచయిత.

2. పండుగకు వచ్చింది ఎవరు?
జవాబు:
పండుగకు వచ్చింది కొత్త అల్లుడు.

3. చిరుతిళ్ళు అతిగా తింటే ఏమి వస్తుంది?
జవాబు:
చిరుతిళ్ళు అతిగా తింటే రోగం వస్తుంది.

4. ఎవరు ఎవరిని వేళాకోళం చేయడం సహజం?
జవాబు:
బావమరిది బావను వేళాకోళం చేయడం సహజం.

II. వ్యక్తీకరణ – సృజనాత్మకత

కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
ఈ నాటిక సారాంశాన్ని సొంతమాటల్లో రాయండి.
జవాబు:
కొత్త అల్లుడు తన అత్తవారింటికి పండుగకి వస్తాడు. కొత్త అల్లుడు వచ్చాడనే సంబరంతో వాళ్ళు రకరకాల పిండివంటలు చేసి అల్లుడికి విందుభోజనం తినిపిస్తారు. తమ ఇంటికి వచ్చిన బావగారిని మరిది హద్దుమీరి వేళాకోళం చేస్తుంటాడు. అది చూచిన మామగారు తన కొడుకుని అలా చేయకూడదని మందలిస్తాడు. అత్తగారు కూడా ఎంత బావయినా అలా చేయకూడదని కొడుకుని కోప్పడుతుంది. అల్లుడుగారు కూడా కొంత బెట్టుగా ఉంటే బాగుంటుంది అంటుంది.

ఇంతలో అల్లుడు కడుపునొప్పితో మెలితిరిగిపోతాడు. బావగారితో మరిది వేరుశనగకాయలు కావాలా ? అని వేళాకోళం చేస్తాడు. అల్లుడు మరిదిపై కోప్పడతాడు.

అత్తగారు డాక్టరును తీసుకురమ్మని భర్తతో అంటుంది. పండుగ ఖర్చుతో పాటు, డాక్టరు ఖర్చూ వచ్చిందని మామగారు మూలుగుతాడు. చివరకు డాక్టరు పరీక్షించి అల్లుడి పొట్టకు ఆపరేషన్ చేయాలన్నాడు. వేయిరూపాయలు ఖర్చవుతుందన్నాడు. అల్లుడు తన ప్రాణం పోతుందని కంగారుపడ్డాడు. తప్పనిసరయి, మామగారు ఆపరేషను చేయించాడు.

అల్లుడు పొట్టలో అతడు తిన్న గారెలు, బూరెలతోపాటు చెంచాలు, అణాలు, నాణేలు ఉన్నాయి. వాటిని తీసి డాక్టరు అందరికీ చూపించాడు. అత్తగారు పోపులడబ్బాలో దాచిన నాణేలు శనగపప్పుతో కలిసి అల్లుడి పొట్టలోకి వెళ్ళాయి.

అన్ని పనులకూ హద్దులు ఉండాలి అని ఈ నాటిక సందేశం ఇస్తుంది.

ప్రశ్న 2.
ఈ నాటికలో మీకు నచ్చిన హాస్య సంఘటనను రాయండి. “హద్దులు – హద్దులు” నాటికలోని మీకు నచ్చిన హాస్య సన్నివేశాన్ని రాయండి.
(లేదా)
హద్దులు – హద్దులు నాటిక ద్వారా మీరు పొందిన ‘హాస్యానుభూతి’ని మీ మాటల్లో రాయండి.
జవాబు:
ప్రతిదానికి హద్దులుండాలంటూ హాస్యస్పోరకంగా సాగిన ఈ నాటకం ఆద్యంతం నవ్వులు పూయిస్తుంది. అయితే నాకు ఈ నాటకంలో అల్లుడి పొట్టను డాక్టరు రంపంతో కోసి ఆపరేషను చేసినట్లు చూపించిన ఘట్టం కడుపు ఉబ్బేలా నవ్వు తెప్పించింది.

డాక్టరు నర్పును ఆపరేషనుకు సిద్ధం చేయమంటాడు. నర్పు రంపం తీసుకువస్తుంది. “ఈ రంపమేమిటి ? దీనితో కోస్తారా ?” అని అల్లుడు కంగారుపడతాడు. “దేనితో కోస్తే నీకెందుకు ? మాట్లాడకుండా బల్లమీద పడుకో” అని డాక్టరు అల్లుడిని మందలిస్తాడు.

తర్వాత ప్రేక్షకులకు పేషంటు కనబడడు. కానీ డాక్టరు రంపంతో కోసినట్లు నటించి పొట్టలో నుంచి, బొబ్బట్లు, గారెలు, చెంచాలు వగైరా ఒక్కొక్కటీ తీసి, ప్రేక్షకులకు చూపించి, పక్కన పెడుతూ ఉంటాడు.

డాక్టరు ఆపరేషను పూర్తి చేసి, “పెద్దవాళ్ళెవరో ఒకసారి ఇలా రండి” అని పిలిస్తాడు. అత్తగారు, “ఆపరేషన్ పూర్తయ్యిందా ! మా అల్లుడు కులాసాగా ఉన్నాడా ?” అని డాక్టర్ని అడుగుతుంది. అప్పుడు డాక్టరు “ఏమల్లుడు ? నా మొఖం అల్లుడు” అంటాడు. అప్పుడు అత్తగారు గుండెలు బాదుకొని, “అయ్యో అయిపోయిందా, అయ్యో నా తల్లీ ! ఓ నా కూతురా ! చిన్నతనంలోనే నీకీ…..” అంటూ ఏడుస్తుంది.

“ఛా. ఛా ! ఊరుకోండి. మీ అల్లుడు నిక్షేపంలా ఉన్నాడు” అని డాక్టరు ఆవిడను మందలిస్తాడు.

ఈ హాస్య ఘట్టం నాకు ఎంతగానో నచ్చింది.

AP Board 8th Class Telugu Solutions ఉపవాచకం Chapter 1 హద్దులు-హద్దులు

ప్రశ్న 3.
హద్దులు – హద్దులు నాటిక ద్వారా రచయిత ఇచ్చిన సందేశాన్ని వివరంగా చర్చించండి.
జవాబు:
దేనికైనా హద్దులుండాలని రచయిత ఈ నాటకం ద్వారా సందేశమిచ్చారు.

పండుగకు కొత్త అల్లుడు వచ్చాడు గదా అని, అతిగా ఫలహారాలూ, పిండివంటలూ, చిరుతిళ్ళు పెడితే, అవి తిన్నవారికి రోగం వస్తుందని ఈ నాటిక సందేశం ఇస్తోంది. బావమరిది బావగారిని వేళాకోళం చేయడం సహజం. కానీ అల్లరి అతిగా ఉండరాదని ఈ నాటిక సందేశం ఇచ్చింది. “అల్లం రసం పట్టే సందే ఉంటే, మరి రెండు బొబ్బట్లు బావగారు లాగించేసే వార”ని మరిది అతిగా వేళాకోళం చేశాడు.

అల్లుడు అజీర్ణం చేసి, గిలగిలలాడుతూ ఉంటే, డాక్టరు దగ్గరకు వెళ్ళడానికి ఖర్చు అవుతుందని మామగారు వెనకాడతాడు. ఆలస్యానికి హద్దులుండరాదని ఈ ఘట్టం చెపుతోంది.

అల్లుడికి అజీర్ణం చేయడానికి నీవే కారణం అని మామగారూ, మీరే కారణం అని అత్తగారూ డాక్టరు దగ్గరే పోట్లాటకు దిగారు. పోట్లాటకు హద్దులుండాలి అని ఈ నాటిక సూచిస్తోంది.

డాక్టరు ఆపరేషనుకు ఫీజు వేయి రూపాయలు కావాలన్నాడు. ఫీజుకు హద్దులుండాలని ఈ నాటిక తెలుపుతోంది. అల్లుళ్ళు అత్తవారింట్లో అతి చనువుగా ఉండరాదనీ, మరీ ముంగిగా కూడా ఉండరాదనీ ఈ నాటిక తెలిపింది.

రచయిత ఈ నాటకం ద్వారా తినడానికి హద్దులు, నవ్వడానికి హద్దులు, ఆలస్యానికి హద్దులు, తొందరకు హద్దులు, చాదస్తానికి హద్దులు, అల్లరికి హద్దులు, పిసినారితనానికి హద్దులు, ఖర్చుకు హద్దులు ….. మొత్తానికి అన్నింటికీ హద్దులుండాలని సందేశమిచ్చారు.

AP Board 8th Class Telugu Solutions Chapter 9 సందేశం

AP State Syllabus AP Board 8th Class Telugu Textbook Solutions Chapter 9 సందేశం Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Telugu Solutions 9th Lesson సందేశం

8th Class Telugu 9th Lesson జసందేశం Textbook Questions and Answers

చదవండి – ఆలోచించండి – చెప్పండి

స్వంత లాభం కొంతమానుకు
పొరుగువారికి తోడుపడవోయ్
దేశమంటే మట్టి కాదోయ్
దేశమంటే మనుషులోయ్
పాడిపంటలు పొంగి పొర్లే
దారిలో నువు పాటుపడవోయ్;
తిండి కలిగితే కండగలదోయ్
కండ కలవాడేను మనిషోయ్
చెట్టపట్టాల్ పట్టుకొని దే
శస్థులంతా నడువవలెనోయ్
అన్నదమ్ములవలెను జాతులు
మతములన్నీ మెలగవలెనోయ్
– గురజాడ అప్పారావు

ప్రశ్నలు జవాబులు

ప్రశ్న 1.
పై పంక్తులు ఏ గేయంలోవి ? ఆ గేయాన్ని ఎవరు రాసారు?
జవాబు:
పై పంక్తులు దేశభక్తి గేయంలోవి. ఆ గేయాన్ని గురజాడ అప్పారావు గారు రాసారు.

ప్రశ్న 2.
ఈ గేయంలో ఉన్న విషయాలేమిటి?
జవాబు:

  • స్వంత లాభం కొంచెం వదులుకొని, తోటివాడికి సాయం చేయాలి.
  • దేశమంటే మట్టికాదు మనుషులు.
  • దేశంలో పాడి పంటలు అభివృద్ధి అయ్యేటట్లు శ్రమించాలి.
  • కండ బలం ఉన్నవాడే మనిషి.
  • దేశ ప్రజలు కలసిమెలసి జీవించాలి.
  • జాతిమత భేదాలు విడచి, ప్రజలు సోదరులవలె మెలగాలి.

ప్రశ్న 3.
గేయ సందేశం ఏమిటి ?
జవాబు:
పరోపకారం, దేశభక్తి, ఐకమత్యం అనేవి అందరూ కలిగి ఉండాలనేదే ఈ గేయ సందేశం.

AP Board 8th Class Telugu Solutions Chapter 9 సందేశం

ప్రశ్న 4.
దేశభక్తిని గురించిన గేయాలు, కవితలు, పద్యాలను కవులు ఎందుకు రాస్తారు?
జవాబు:
దేశభక్తిని గురించిన గేయాలను, కవితలను, పద్యాలను కవులు ప్రజలలో దేశభక్తిని పెంపొందించడానికి రాస్తారు.

ఇవి చేయండి

I. వినడం – మాట్లాడడం

ప్రశ్న 1.
ఈ పాఠంలోని పద్యాల్లో మనదేశం గొప్పతనం గురించి చదివినపుడు మీకేమనిపించింది?
జవాబు:
ఈ పాఠంలోని పద్యాల్లో మన భారతదేశం తపోభూమి అని, బంగారు పంటలకు నిలయమని, శాంతి వెన్నెలలో,
కురిపించిన దేశమని, గంగ, గోదావరి వంటి పవిత్ర నదులు ప్రవహించిన దేశమని చదివినప్పుడు, నేను ఇటువంటి గొప్ప దేశంలో పుట్టాను కదా ! అని గర్వంగా తల ఎత్తుకొని తిరగాలనిపించింది. జన్మభూమి స్వర్గం కంటే గొప్పది కదా.

మరింతగా మన దేశ సౌభాగ్యం వర్ధిల్లేలా పాటుపడాలని అనిపించింది. మన దేశంలో అన్యాయాలు, దౌర్జన్యాలు, కుల మత హింసలు లేకుండా చూడాలని అనిపించింది. అవినీతి, లంచగొండితనం, కుంభకోణాలు, పేదరికం లేకుండా ఉంటే ఇంకా బాగుంటుంది అనిపించింది. ప్రపంచ దేశాల్లో నేను జన్మించిన నా భారతమాత చాలా గొప్పది అనిపించింది.

ప్రశ్న 2.
ప్రజాప్రతినిధులు ఎలా ఉండాలని మీరు భావిస్తున్నారు?
జవాబు:
మనం చట్టసభలకు ఎన్నుకొనేవారే ప్రజా ప్రతినిధులు. అనగా ఎం.పి.లు, ఎం.ఎల్.ఎ.లు మొదలైనవాళ్ళు ప్రజల కష్టాల్ని చట్టసభల్లో ప్రతిధ్వనింపచేసేవారు కావాలి. ప్రజల సమస్యల్ని, కష్టాల్ని ప్రభుత్వానికి తెలిపి, వాటిని పరిష్కరించేవారు. కావాలి. అవినీతి, లంచగొండితనం, దుర్మార్గం అన్న వాటికి వారు దూరంగా ఉండాలి. ప్రజాప్రతినిధులు ప్రజల మధ్య తిరుగుతూ, ప్రజల కష్టసుఖాల్ని తెలుసుకోవాలి. వాటికి త్వరగా పరిష్కార మార్గాల్ని చూపించగలగాలి. ప్రతినిధుల ఎప్పుడూ ప్రజల పక్షంలోనే నిలబడాలి. అన్యాయానికీ, అధికారానికి బానిసలు కారాదు. సచ్ఛీలత కలిగి, సత్కార్యాలు: చేస్తూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఆదర్శప్రాయ జీవనం సాగించాలి.

AP Board 8th Class Telugu Solutions Chapter 9 సందేశం

ప్రశ్న 3.
లంచగొండితనం మన దేశ ప్రగతి గౌరవాలపై ఎలాంటి ప్రభావం చూపుతున్నదో చర్చించండి.
జవాబు:
స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మూడవ, నాలుగవ సాధారణ ఎన్నికల తర్వాత రాజకీయ నాయకులలో అవినీతి బాగా ఎక్కువైంది. రాజకీయ నాయకులలో, మంత్రులలో అవినీతి ఎక్కువైనపుడు అధికారులకి అది అనుకూలంగా మారింది. ప్రభుత్వ కార్యాలయాలలో గల సిబ్బంది ప్రతి చిన్నపనికీ లంచం తీసుకొంటున్నారు. ప్రతిపనికీ “ఒక రేటు” ఉంటోంది. చివరికి జీతాలు ఇవ్వడానికీ, పింఛను చెల్లించడానికి మాత్రమే కాదు – మరణించిన వాళ్ళకి “సర్టిఫికేట్” ఇవ్వడంలోనూ లంచం తప్పని పరిస్థితులున్నాయంటే అవినీతి ఎంతగా విలయతాండవం చేస్తోందో గ్రహించవచ్చు.

ఈ రోజు మన దేశంలో లంచగొండితనం విచ్చలవిడిగా పెరిగిపోయింది. ఒకప్పుడు ఈ లంచగొండితనం చిన్న ఉద్యోగుల్లోనే ఉండేది. కానీ ఇప్పుడు మంత్రుల నుండి ఐ.ఎ.ఎస్. ఆఫీసర్ల దాకా ఈ లంచగొండితనం విస్తరించింది.

లంచం ఇవ్వనిదే ప్రభుత్వంలో ఏ పనీ కావట్లేదు. ప్రపంచంలో లంచగొండితనం ఎక్కువ ఉన్న దేశాల్లో మన భారతదేశం అగ్రస్థానంలో ఉంది. ముఖ్యమంత్రులూ, వారి పుత్రులూ, అల్లుళ్ళూ వేల కోట్ల రూపాయలు లంచాలుగా మేసేస్తున్నారు.

ఇందువల్ల మన దేశంలో అభివృద్ధి జరుగడం లేదు. ప్రభుత్వం ఒక రూపాయి ఖర్చు పెడితే పది పైసల పని కూడా కావట్లేదు. ఏ పనీ సక్రమంగా సాగటంలేదు. కట్టిన ప్రాజెక్టులు, రోడ్లు, పరిశ్రమలు కొద్ది రోజుల్లోనే పాడయిపోతున్నాయి. దేశాన్ని రక్షింపవలసిన మిలటరీ, పోలీసు వ్యవస్థలు సైతం లంచగొండితనాన్ని మరిగి బాధితులకు అన్యాయం చేస్తున్నాయి. పెద్ద పెద్ద అధికారులు లంచగొండితనానికి అలవాటుపడి జైళ్ళలో మగ్గుతున్నారు.

అవినీతి, లంచగొండితనంల కారణంగా ప్రపంచంలో భారతదేశ ప్రతిష్ఠకు భంగం వాటిల్లుతోంది. కనుక ప్రజలు యువత అవినీతి నిర్మూలనకు నడుంకట్టి ఈ దుష్ట జాడ్యాన్ని మన దేశం నుండి తరిమికొట్టాలి.

II. చదవడం – రాయడం

1. కింది పద్యం చదవండి. దాని భావంలోని ఖాళీలలో సరైన పదాలు రాయండి.
“దేశభక్తి మరియు దేశసమగ్రత
ప్రజల నాడులందు ప్రబలి ప్రబలి
కర్మభూమి యగు నఖండ భారతమహా
క్షితిని నెగురు ప్రగతి కేతనమ్ము”.

భావం :
దేశభక్తి, ………… అనే భావాలు ప్రజల్లోని నరనరాల్లో …………. కర్మభూమి అయిన మన ……….. దేశం ప్రగతి ……………….. రెపరెపలాడుతోంది.
జవాబు:
దేశభక్తి, దేశసమగ్రత అనే భావాలు ప్రజల నరనరాల్లో వ్యాపించి కర్మభూమి అయిన మన అఖండ భారతదేశం ప్రగతి జెండా రెపరెపలాడుతుంది.

2. కింది ఖాళీలకు సరైన సమాధానాన్ని గుర్తించండి.

అ) మధురమైన ధర్మా నికి ………………… తగలరాదు. (రాయి / దెబ్బ)
జవాబు:
మధురమైన ధర్మానికి దెబ్బ తగలరాదు.

ఆ) భరత జాతి …………… ఆశయాలకు అనుగుణంగా లేదు. (మహాత్ముడి / బుద్ధుడి)
జవాబు:
భరత జాతి మహాత్ముడి ఆశయాలకు అనుగుణంగా లేదు.

ఇ) సకల జగతికి ………. నేర్పినట్టి మన భరతమాతను పూజించాలి. (అశాంతి / శాంతి)
జవాబు:
సకల జగతికి శాంతి నేర్పినట్టి మన భరతమాతను పూజించాలి.

ఈ) అఖండ భారతావనిలో ………….. కేతనం ఎగురవేయాలి. (ప్రగతి / తిరోగతి)
జవాబు:
అఖండ భారతావనిలో ప్రగతి కేతనం ఎగురవేయాలి.

AP Board 8th Class Telugu Solutions Chapter 9 సందేశం

3. కింది ప్రశ్నలకు పాఠం ఆధారంగా జవాబులు రాయండి.

అ) భారతీయులు ఏమని ప్రతిజ్ఞ చేయాలి?
జవాబు:
“ఇది నా దేశం, ఇది నన్ను కన్నతల్లి. నాదేశ సౌభాగ్య సంపదలు, అభివృద్ధి చెందడానికి నేను సహాయపడతాను. ప్రపంచమంతా దీన్ని పూజించేటట్లుగా గొప్ప ప్రగతిని నెలకొల్పుతాను” అంటూ భారతీయులు ప్రతిజ్ఞ చేయాలి.

ఆ) మనదేశ సౌభాగ్యానికి పట్టుగొమ్మలు ఏవి?
జవాబు:
గంగ, బ్రహ్మపుత్ర, కృష్ణ, కావేరి, గోదావరి, సింధు, నర్మద అనే జీవనదులు మనదేశ సౌభాగ్యానికి పట్టుగొమ్మలు.

ఇ) ఈ పాఠంలో కవి చెప్పిన “మహామౌని” ఎవరు ? ఆయన గొప్పతనం ఏమిటి?
జవాబు:
ఈ పాఠంలో కవి చెప్పిన “మహామౌని” మహాత్మాగాంధీ. భారతమాత ముద్దుబిడ్డలలో మహాత్మాగాంధీ అగ్రగణ్యుడు. సత్యం, శాంతి, అహింస అనే సూత్రాలను పాటించి, రవి అస్తమింపని బ్రిటిషు సామ్రాజ్యం పునాదులను కదలించి, భారతదేశానికి స్వాతంత్ర్యం సాధించి పెట్టిన మహాత్మాగాంధీ చిరస్మరణీయుడు. మన జాతిపిత అయిన గాంధీజీ తన బోసి నోటితో పలికిన శాంతి సందేశానికి ప్రపంచమంతా జేజేలు పలికింది. అది మన భారతదేశానికి కీర్తిని తెచ్చింది.

ఈ) మనదేశ ప్రగతి కేతనం ఎప్పుడు రెపరెపలాడుతుంది?
జవాబు:
దేశభక్తి, దేశసమగ్రత అనే భావాలు ప్రజల నరనరాల్లో వ్యాపించినపుడు, పుణ్యభూమియైన అఖండ భారతదేశంలో ప్రగతి కేతనం రెపరెపలాడుతుంది.

III. స్వీయరచన

1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాలలో సమాధానాలు రాయండి.

అ) పాఠంలో కవి చెప్పిన విషయాలే గాక, మనదేశ కీర్తిని పెంచిన ఇతర విషయాలు రాయండి.
జవాబు:

  • మన దేశంలో బుద్ధుడు జన్మించి ప్రపంచంలోని చాలా దేశాల్లో బౌద్ధమతం విస్తరించేలా తన సందేశాన్ని అందించాడు.
  • వివేకానందుడు ప్రపంచ మత మహాసభలో పాల్గొని సర్వమత సమానత్వాన్ని చాటాడు.
  • రవీంద్రనాథ్ ఠాగూర్ తన కవితల ద్వారా, సర్ సి.వి. రామన్ శాస్త్ర పరిశోధనల ద్వారా మన దేశ కీర్తిని పెంచారు.
  • మన ఇతిహాసాలైన భారత రామాయణాలు ప్రపంచ ఖ్యాతిని పొందాయి. మన మహర్షులు, వేదాలు, ధర్మ ప్రచారా మన దేశ కీర్తిని విస్తరించాయి.
  • నెహ్రూ, ఇందిర వంటి మన నాయకులు ప్రపంచ ఖ్యాతిని సంపాదించారు.
  • మన రోదసీ విజ్ఞానం ప్రపంచ ఖ్యాతిని సంపాదించింది.
  • మన పారిశ్రామికవేత్తలలో కొందరు ప్రపంచ ప్రసిద్ధి పొందారు.
  • మన క్రికెట్టు ఆటగాడు టెండూల్కర్ ప్రపంచ ఖ్యాతి పొందాడు.

ఆ) మన జీవనదులు దేశానికి ఎటువంటి పరిపుష్టిని కలిగిస్తున్నాయి?
జవాబు:
మనదేశంలో కవి చెప్పినట్లు గంగ, సింధు, బ్రహ్మపుత్ర, కృష్ణానది, గోదావరి, కావేరి వంటి జీవనదులు ఉన్నాయి. నదులపై భాక్రానంగల్, నాగార్జునసాగర్, హీరాకుడ్ వంటి ఎన్నో బహుళార్థసాధక ప్రాజెక్టులు నిర్మించారు. వాటి నుఁ కాలువల ద్వారా వ్యవసాయానికి నీరు అందుతోంది. ఆ నీటితో బంగారు పంటలు పండుతున్నాయి. ఈ ప్రాజెక్టుల వ విద్యుదుత్పత్తి కూడా జరుగుతోంది.

మన ప్రభుత్వాలు నదులలోని పవిత్రమైన జీవజలాలను పూర్తిగా వినియోగించుకుంటే దేశం పాడిపంటల సస్యశ్యామలంగా ఉంటుంది.

ఇ) భారతీయ సంస్కృతిలో నీకు బాగా నచ్చిన విషయాలు ఏమిటి? అవి ఎందుకు బాగా నచ్చాయి?
జవాబు:
ఒక జాతి నిర్వీర్యం కాకుండా ఆత్మబలాన్ని సమకూర్చుకోవడానికి సంస్కృతి తోడ్పడుతుంది. ప్రజా జీవితం ప్రశాంతం సాగాలంటే సంస్కృతి ఇచ్చే సంస్కారమే మూలాధారం అవుతుంది. ఆత్మ సంస్కారాన్ని నేర్పి, మానవుడు సంఘజీవి అ. మానవసేవే మాధవ సేవ అని బోధించేది సంస్కృతి. మన భారతీయ సంస్కృతి ఎంతో విశిష్టమైనది.

భారతీయ సంస్కృతిలో దేవాలయాలు, పురాణాలు, రామాయణ భారత ఇతిహాసాలు, భాగవతము, భగవద్గీత వం భక్తి గ్రంథాలు, జీవనదులైన గంగ, గోదావరుల వంటి నదులు, మన ఋషులు, వారు బోధించిన ధర్మ ప్రబోధాలు నా బాగా నచ్చాయి.

మన దేశంలోని ఆచార వ్యవహారాలు, తల్లిదండ్రులను, గురువులను పిల్లలు గౌరవించడం, పెద్దల పట్ల, ఆచార్యు పట్ల ప్రజలకు గౌరవాదరాలు ఉండడం వంటి భారతీయ సంస్కృతీ సంప్రదాయాలు అంటే నాకు గౌరవం.

మనకు ఉన్న దేవాలయాల వంటి గొప్ప దేవాలయాలు, పుణ్యనదులు మరి ఏ దేశానికీ లేవు. మన రామాయః భారత భాగవతాల వంటి పుణ్య గ్రంథాలు ఏ దేశానికీ లేవు. మనకు ఉన్న తత్త్వశాస్త్ర గ్రంథాలు, వేదాంత గ్రంథాల భగవద్గీత, వేదాలు వంటివి మనకే సొంతం. అవి ఏ దేశానికీ లేవు. ఇంత గొప్ప సంస్కృతి గల దేశంలో జన్మించడ నాకు గర్వకారణం.

ఈ) నీవే ప్రజాప్రతినిధివి అయితే దేశం కోసం ఏం చేస్తావు?
జవాబు:
నేనే ప్రజాప్రతినిధిని అయితే ప్రజలకు, ప్రభుత్వానికి మధ్యవర్తిగా ఉండి ప్రజల సమస్యలను ప్రభుత్వానికి వివరిం వాటిని పరిష్కరించేటట్లు చేస్తాను. దేశానికి హాని కలిగించే పనిని ఏదైనా జరుగకుండా అడ్డుకుంటాను. అలాగే నా పాటు ఉన్న ప్రజాప్రతినిధులందరికీ ఆదర్శంగా నిలుస్తాను. అంటే నేను ప్రజలపట్ల చూపుతున్న సమస్యా పరిష్కారాల వారు కూడా తీర్చేటట్లు ఆదర్శంగా ఉంటాను.

AP Board 8th Class Telugu Solutions Chapter 9 సందేశం

2. కింది ప్రశ్నలకు పదేసి వాక్యాల్లో సమాధానాలు రాయండి.

అ) మనదేశాన్ని గురించి ప్రపంచం పొగడాలంటే, దేశంలో ఏమేమి ఉండగూడదని కవి చెప్పాడు?
జవాబు:
ఘనత గన్న మన పుణ్యదేశంలో అసూయలు, దౌర్జన్యాలు, కుల, మత హింసలనే పిశాచాలను తల ఎత్తనీయకు. నానాటికీ పెరిగిపోతున్న దుష్టులు, మోసగాళ్ళ గూండాయిజం నిలువకూడదు. బలిష్టమైన దేశ సౌభాగ్యాన్ని లంచాలనే జలగలు పట్టి పీల్చకూడదు. ప్రతినిధులైన వాళ్ళు పగలు, సెగలు రగిలించే మాటలు మాట్లాడకూడదు. “మనమంతా అన్నదమ్ములము” అనే తీయని ధర్మానికి దెబ్బ తగులనీయకూడదు. అలా జరిగినప్పుడు సమైక్యత అనే ఢంకా మోగుతుంది. మన భారతదేశాన్ని ప్రపంచం పొగడుతుంది.

ఆ) “భారతీయుడిగా పుట్టినందుకు గర్విస్తున్నాను” ఈ వాక్యాన్ని సమర్థిస్తూ రాయండి.
(లేదా)
“భారతదేశం జీవనదులకు, పాడి పంటలకు నిలయమైయున్న దేశం. భారతీయుడిగా పుట్టినందుకు గర్విస్తున్నాను.” – ఈ వాక్యాన్ని మీ మాటల్లో రాయండి.
జవాబు:
మన భారతదేశం వేదాలు పుట్టిన దేశం. వ్యాస వాల్మీకాది మహర్షులు జన్మించిన దేశం. మన దేశం శ్రీలు పొంగిన జీవగడ్డ. పాడిపంటలు పొంగిపొర్లిన భాగ్యసీమ. ఇది వేదాంగాలూ, రామాయణం పుట్టిన దేశం. భారత భాగవతాలు పుట్టిన దేశం. ఉపనిషత్తులు ఇక్కడే పుట్టాయి. ఇది పవిత్ర భూమి. ఇక్కడ విస్తారమైన వృక్షసంపద ఉంది. లక్ష్మీబాయి, రుద్రమ్మ వంటి వీరవనితలకు ఇది జన్మభూమి. ప్రచండ పరాక్రమం ఉన్న రాజులు ఇక్కడ పుట్టారు. కాళిదాసు, తిక్కన వంటి మహాకవులు ఇక్కడ పుట్టారు. గాంధీ, బుద్ధుడు వంటి శాంతిదూతలు ఇక్కడే పుట్టారు. గంగా, సింధు, గోదావరి, కృష్ణా వంటి పవిత్ర నదులు ఇక్కడే పుట్టి, దేశాన్ని తమ జలాలతో సిరుల సీమగా మార్చాయి. ఇక్కడ నెహ్రూజీ, ఇందిర వంటి జాతీయ నాయకులూ, అబ్దుల్ కలామ్ వంటి శాస్త్రజ్ఞులూ ఇక్కడే పుట్టారు. ఇది కర్మభూమి. ఇది పవిత్రభూమి. అందుకే భారతదేశంలో పుట్టినందుకు నేను గర్విస్తున్నాను.

IV. పదజాలం

1. కింద గీత గీసిన పదాలకు అర్థాలను రాసి ఆ వాక్యాలను తిరిగి రాయండి.

అ) మా పాఠశాలలో గణతంత్ర దినోత్సవం నాడు జాతీయ కేతనాన్ని ఎగురవేస్తాం.
జవాబు:
కేతనాన్ని = జెండాను
వాక్యం : మా పాఠశాలలో గణతంత్ర దినోత్సవం నాడు జాతీయ జెండాను ఎగురవేస్తాం.

ఆ) ప్రతి వ్యక్తికీ మనోదార్డ్యుం ఉండాలి.
జవాబు:
మనోదార్యుం = దృఢమైన మనస్సు
వాక్యం : ప్రతి వ్యక్తికి దృఢమైన మనస్సు ఉండాలి.

ఇ) ఇతరుల సంపదలు చూసి మచ్చరికించకూడదు.
జవాబు:
మచ్చరికించ = అసూయ
వాక్యం : ఇతరుల సంపదలు చూసి అసూయపడరాదు.

ఈ) రవి చేతిరాతను చూసి అందరూ అబ్బురపడతారు.
జవాబు:
అబ్బురపడు = ఆశ్చర్యపోవు
వాక్యం : రవి చేతిరాతను చూసి అందరూ ఆశ్చర్యపోతారు.

AP Board 8th Class Telugu Solutions Chapter 9 సందేశం

2. కింద గీత గీసిన పదాలకు వికృతి పదాలతో తిరిగి వాక్యాలు రాయండి.

అ) నాదేశ సమగ్రతను కాపాడతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను.
జవాబు:
ప్రతిజ్ఞ (ప్ర) – ప్రతిన (వి)
నాదేశ సమగ్రతను కాపాడతానని ప్రతిన చేస్తున్నాను.

ఆ) నాది తెలుగుజాతి. నాది తెలుగు భాష.
జవాబు:
భాష (ప్ర) – బాస (వి)
నాది తెలుగు జాతి. నాది తెలుగు బాస.

ఇ) మనకు దేశంపై భక్తి ఎక్కువగా ఉండాలి.
జవాబు:
భక్తి (ప్ర) – బత్తి (వి)
మనకు దేశంపై బత్తి ఎక్కువగా ఉండాలి.

ఈ) మన కీర్తి ఖండ ఖండాంతరాలకు వ్యాపించింది.
జవాబు:
కీర్తి (ప్ర) – కీరితి (వి)
మన కీరితి ఖండ ఖండాంతరాలకు వ్యాపించింది.

3. పాఠానికి సంబంధించిన మాటలను కింది గళ్ళ నుండి వెతికి పక్క గళ్ళల్లో రాయండి. వాటితో వాక్యాలు తయారుచేయండి.
AP Board 8th Class Telugu Solutions Chapter 9 సందేశం 1

వాక్యములు :

  1. భారత ప్రభుత్వం జ్ఞానానంద కవిని పద్మశ్రీతో సత్కరించింది.
  2. హిందూదేశము జీవనదులకు పుట్టినిల్లు.
  3. దేశ యువత, దేశభక్తిని పెంపొందించుకోవాలి.
  4. ఇది నా దేశము, అనే ప్రేమ భావము దేశ పౌరులలో కలగాలి.
  5. హనుమంతుడు సీతమ్మకు సందేశమును తీసుకువెళ్ళాడు.
  6. గంగానదిని భారతీయులు మహా పుణ్యనదిగా భావించి సేవిస్తారు.
  7. బాపూజీ శాంతి సందేశానికి ప్రపంచం జోహార్లు ఆర్పించింది.
  8. గాంధీజీ, హింసను విడనాడండని దేశ ప్రజలకు సందేశం అందించాడు.
  9. సింధునది హిమాలయాల్లో పుట్టిన జీవనది.
  10. నెహ్రూ శాంతిదూత.

V. సృజనాత్మకత

* పాఠంలో మనదేశం గొప్పతనాన్ని తెలుసుకున్నారు కదా ! మన దేశ గొప్పతనాన్ని వర్ణిస్తూ భారతీయ విలువలు కాపాడటానికి అందరూ బాధ్యత తీసుకోవాలని ఒక “కరపత్రం” తయారుచేసి ప్రదర్శించండి.
జవాబు:
భారతీయ విలువలను కాపాడదాం

సోదర సోదరీమణులారా ! మన భారతదేశం తపోభూమి. ఇది బంగారు పంటలకు నిలయం. శాంతి సందేశాన్ని ప్రపంచానికి అందించిన బుద్ధుడు, గాంధీజీ జన్మించిన పవిత్రదేశం మనది. గంగా, గోదావరి, కృష్ణానది, సింధు, * బ్రహ్మపుత్ర వంటి పవిత్ర నదులు ప్రవహిస్తున్న పవిత్ర భాగ్యసీమ మనది.

ఇది వేద వేదాంగాలు పుట్టిన కర్మభూమి. భారత, భాగవత, రామాయణాలు, వేదవ్యాస, వాల్మీకి, కాళిదాసుల వంటి కవులు పుట్టిన దేశం ఇది. కృష్ణదేవరాయలు వంటి మహా సాహితీ సమరాంగణ చక్రవర్తులు జన్మించిన పవిత్రభూమి ఇది. ఝాన్సీలక్ష్మీబాయి, రాణిరుద్రమ్మ వంటి వీరనారులకు జన్మభూమి ఇది. గాంధీజీ, నెహ్రూ, ఇందిర వంటి రాజకీయ దురంధరులకు ఇది పుట్టినిల్లు. శంకరాచార్యులు వంటి అద్వైతమత ప్రవక్త నడయాడిన కర్మభూమి ఇది.

మన భారతీయులందరూ న్యాయానికీ, ధర్మానికీ, శాంతికీ, సత్యాహింసలకూ ప్రాధాన్యం ఇచ్చారు. మనం పైన చెప్పిన పుణ్యాత్ములకు వారసులం. మన భారతీయ విలువలను కాపాడదాం. నిజమైన భారతీయులం అనిపించుకుందాం. భారతీయులారా ! మన భారతభూమి గౌరవాన్ని రక్షించుకుందాం.

ప్రపంచ దేశాల ముందు తలెత్తుకొని నిలబడదాం. మన దేశ గౌరవాన్ని నిలబెడదాం.

VI. ప్రశంస

*మనదేశం ప్రపంచ ప్రసిద్ధి చెందటానికి ఎంతో మంది కృషి చేశారు. నేటికీ విద్య, వ్యాపారం, క్రీడలు, సాంస్కృతికం, రాజకీయం మొదలైన రంగాలలో ఎంతో మంది కృషి చేస్తున్నారు. అటువంటి వ్యక్తులలో మీకు తెలిసిన వ్యక్తిని గూర్చి వారి కృషిని గూర్చి ప్రశంసిస్తూ ఒక వ్యాసం రాయండి.
జవాబు:
అబ్దుల్ కలామ్ ఆజాద్

భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ ఆజాద్ ఆదర్శ భారతీయుడు. ప్రముఖ శాస్త్రజ్ఞుడు. భారతదేశాన్ని స్వర్ణభారతం చేయాలని శ్రమించే నిరంతర శ్రామికుడు. వివాహానికి, వివాదానికి జీవితంలో చోటివ్వని వ్యక్తి. నేటి బాలలకు ఈయన ప్రచోదక శక్తి. ఈయన ప్రజాస్వామ్యహితైషి.

అబ్దుల్ కలామ్ ఆజాద్ తమిళనాడులోని రామేశ్వరంలో జైనులబ్లీన్, ఆషియమ్మ దంపతులకు 1931, అక్టోబరు 15న జన్మించాడు. ఈయన విద్యాభ్యాసం రామేశ్వరం, రామనాథపురం, తిరుచురాపల్లి, మద్రాసులలో కొనసాగింది. మద్రాసు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ‘ఏరో ఇంజనీరింగులో డి.ఎం. ఈ.టీ’ చేసి తరువాత సైన్సులో డిప్లొమా (ఆనర్సు) చేశాడు.

ఈయన 1958వ సంవత్సరంలో డీ.ఆర్.డి.ఓ. లో జూనియర్ సైంటిస్టుగా చేరాడు. తరువాత కొద్దికాలానికే ఆ సంస్థకే డైరెక్టరు జనరల్ అయ్యాడు. మధ్యలో ఇస్రోలో సైంటిస్టుగా, డీ. ఆర్.డి.ఎల్. డైరెక్టరుగా పనిచేశాడు. 1999లో భారత ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా బాధ్యతలు చేపట్టాడు.

అబ్దుల్ కలాంకు ‘పద్మవిభూషణ్’ వంటి పురస్కారాలతోపాటు, భారతదేశ అత్యున్నత పురస్కారమయిన ‘భారతరత్న’ లభించింది. ఈయన అగ్ని, పృథ్వి, త్రిశూల్, ఆకాశ్, నాగ్ మొదలైన క్షిపణుల రూపకల్పనకు సారథ్యం వహించి భారతదేశ క్షిపణి పితామహుడిగా పేరు పొందాడు. 1998 అణుపరీక్షలలో కలాం ముఖ్య పాత్ర పోషించాడు. అంతేగాక తేలికపాటి యుద్ధ విమానం, ప్రధాన యుద్ధ ట్యాంకు ‘అర్జున్’ ప్రాజెక్టుల రూపకల్పనకు నాయకత్వం వహించి అనేక మైలురాళ్ళను అధిగమించాడు.

అబ్దుల్ కలాం వ్యక్తిత్వం విశిష్టమయినది. ఈయన సమష్టితత్వం కలవాడు. ఈయన ఎక్కడ ఏ స్థాయిలో పనిచేసినా అందరినీ కలుపుకొని పనిచేసే మనస్తత్వం కలవాడు. కల్మషం లేని వ్యక్తిత్వం ఈయన సొంతం. ఈయన దేశం కోసం అనునిత్యం తపిస్తాడు. ఈయన ఒక శాస్త్రవేత్తగా ఉపగ్రహాల్ని కక్ష్యలోకి ప్రవేశ పెట్టడం మొదలుకొని, అణుపరిజ్ఞానం ఉపయోగించడం దాకా అనేక రంగాలలో పని చేశాడు.

ఈయన ఆచరణ భగవద్గీత, ఖురాన్లు. అభిరుచి కర్ణాటక సంగీతం. ఈయన స్వప్నం అభివృద్ధి చెందిన భారతదేశం. ఈయన భారత దేశాభివృద్ధికి కలలు కనమని భారతీయులకు సందేశం ఇస్తాడు.

రాజకీయానుభవం లేకపోయినా గత రాష్ట్రపతులకు ధీటుగా ప్రత్యేక శైలిలో రాష్ట్రపతిగా పనిచేయడం కలాం విలక్షణతకు మచ్చుతునక. ఏ బాధ్యతనైనా ఈయన చక్కగా నెరవేర్చగలడు. ఈ దేశాన్ని అత్యున్నత శిఖరాలకు తీసుకొని వెళ్ళే విధానాలకు రూపకల్పన చేయగల సమర్థుడు.

కలాం గొప్ప ఆదర్శ పురుషుడు. ఎన్నికలలో ఓటువేసి, అన్ని పనులూ ప్రభుత్వమే చేయాలని అనుకోడం పొరపాటని, దేశాన్ని నిందించడం కాక దేశ వ్యవస్థను పటిష్ఠం చేసే మార్గం గురించి అందరూ ఆలోచించాలని ఈయన పలికే పలుకులు భారతీయులందరికీ ఆదర్శం.

అబ్దుల్ కలామ్ అజాద్ కు మంచితనంలో తల్లిదండ్రులు, క్రమశిక్షణలో బంధువులైన శంషుద్దీన్, అహ్మద్ జలాలుద్దీన్స్ స్ఫూర్తి. అజాద్ వంటి వ్యక్తి రాష్ట్రపతి కావడం భారతీయులందరికీ గర్వకారణము.

ప్రాజెక్టు పని

* ప్రపంచస్థాయిలో మన దేశ గౌరవం పెరగాలంటే కింద ఇవ్వబడిన అంశాలకు సంబంధించి మనమేం చేయాలో తరగతి గదిలో సమగ్రంగా చర్చించి వ్యక్తిగత నివేదిక (రిపోర్టు) ను తయారుచేయండి.
1) క్రీడలు – కళలు
2) వైజ్ఞానిక ప్రగతి
3) అవినీతి, లంచగొండితనం లేని సమాజం
4) భాషా సంస్కృతీ పరిరక్షణ
జవాబు:
1) క్రీడలు – కళలు :
121 కోట్ల జనాభా గల మన దేశం ఒలింపిక్ క్రీడల వంటి ఆటల్లో ప్రపంచస్థాయిలో ఒక్క బంగారు పతకం కూడా గెల్చుకోలేకపోతున్నది. అందుకని పాఠశాల స్థాయి నుండి క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఆటలలో నైపుణ్యం చూపిన వారికి ప్రత్యేక శిక్షణను ఇప్పించాలి. నగరాలన్నింటిలో మంచి క్రీడా మైదానాలు ఉండాలి. సంగీతము, చిత్రలేఖనము వంటి లలిత కళలలో ప్రతిభ చూపిన బాలురకు పోటీలు నిర్వహించి బహుమతులివ్వాలి. ప్రత్యేక్ష శిక్షణ ఇప్పించాలి.

2) వైజ్ఞానిక ప్రగతి :
మన దేశంలో విజ్ఞానశాస్త్ర పరిశోధనలకు బాగా వ్యయం చేయాలి. అందులో ప్రతిభ చూపిన వారికి స్కాలర్ షిప్పులు ఇవ్వాలి. అవసరం అయితే విదేశాలలో శిక్షణను ఇప్పించాలి. ప్రతిభకు పట్టం కట్టాలి.

3) అవినీతి, లంచగొండితనం లేని సమాజం :
ప్రపంచంలో మనదేశం లంచగొండి, అవినీతి దేశంగా చెడ్డ పేరు తెచ్చుకొంటోంది. నిత్యం పత్రికలు ఆ విషయాలు రాస్తున్నాయి. ముఖ్యంగా అవినీతి ఆరోపణ వచ్చిన నాయకుణ్ణి ప్రజలు ఎన్నుకోరాదు. అటువంటి వారిని సంఘ బహిష్కరణ చేయాలి. సజ్జనులను ప్రోత్సహించాలి. అవినీతిపరుల ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి.

4) భాషా సంస్కృతీ పరిరక్షణ :
మాతృభాషను ఆదరించాలి. మన సంస్కృతిని కాపాడాలి. ప్రభుత్వం దీనికి ప్రత్యేక శాఖను ఏర్పరచి, ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలి. ప్రజలు ఈ సంస్కృతిని కాపాడుకోవాలి.

అనంత కాలం ఇంకా ఆర్థిక పరిస్థను ఆస్ట్రేలు జరగా అను

VII. భాషను గురించి తెలుసుకుందాం

1) కింది పదాలకు గురువులను, లఘువులను గుర్తించండి.
UTI దేశము
AP Board 8th Class Telugu Solutions Chapter 9 సందేశం 2

2) కింది వాటిలో తప్పుగా ఉన్న గణాలను గుర్తించి సరి చేయండి.
AP Board 8th Class Telugu Solutions Chapter 9 సందేశం 3
AP Board 8th Class Telugu Solutions Chapter 9 సందేశం 4

3) ఛందస్సులో గణాల విభజన తెలుసుకున్నారు కదా ! ఇప్పుడు గణాల ఆధారంగా పద్య లక్షణాలను తెలుసుకుందాం.

అ) కింది పద్యపాదాలను పరిశీలించండి.
AP Board 8th Class Telugu Solutions Chapter 9 సందేశం 5

పై పాదాల్లో “భ, ర, న, భ, భ, ర, వ” అనే గణాలు ఒకే వరుసలో వచ్చాయి కదా ! ఇలా పద్యంలో నాలుగు పాదాల్లో ఒకే రకమైన గణాలు ఒకే వరుసలో ఉన్న పద్యాన్ని ‘వృత్తిపద్యం’ అంటారు.

పద్యపాదంలో మొదటి అక్షరాన్ని ‘యతి’ అంటారు. ఈ యతి అక్షరంగానీ, దాని వర్ణమైత్రి అక్షరంగానీ ఆపాదంలో నియమిత స్థానంలో రావటాన్ని “యతిమైత్రి” లేదా “యతిస్థానం” అంటారు.

ఈ పద్య పాదాల్లో ఆ-అ; జే (ఏ) – సి (ఇ)లకు యతిమైత్రి చెల్లింది.

పై పద్యపాదాల్లో రెండవ అక్షరంగా నాలుగు పాదాలలో ‘య’ అను అక్షరం వచ్చింది. ఇలా పద్య పాదాలన్నింటిలోను రెండవ అక్షరంగా ఒకే హల్లు రావడాన్ని “ప్రాసనియమం” అంటారు.

పై పద్యపాదాలు ‘ఉత్పలమాల’ పద్యానివి. పై ఉదాహరణననుసరించి ‘ఉత్పలమాల’ పద్య లక్షణాలను ఈ విధంగా పేర్కొనవచ్చు.

ఇలాంటి లక్షణాలు గల పద్యాన్ని “ఉత్పలమాల” పద్యం అంటారు. పై విషయాల ఆధారంగా ఉత్పలమాల పద్య లక్షణాలను ఎలా రాయాలో గమనించండి.

ఉత్పలమాల:

  1. ఇది వృత్తపద్యం.
  2. ఇందు నాలుగు పాదాలుంటాయి.
  3. ప్రతి పాదంలో భ, ర, న, భ, భ, ర, వ అనే గణాలుంటాయి.
  4. ప్రతిపాదంలో 10వ అక్షరం యతిస్థానం.
  5. ప్రాస నియమం ఉంటుంది.
  6. ప్రతిపాదంలోను 20 అక్షరాలుంటాయి.
    ఈ లక్షణాలు గల పద్యపాదమే ఉత్పలమాల పద్యపాదం.

ఆ) ఉత్పలమాల పద్య లక్షణాలు తెలుసుకున్నారు కదా ! ఈ పద్య లక్షణాల ఆధారంగా కింద ఇవ్వబడిన చంపకమాల పద్యానికి గురులఘువులు గుర్తించి, గణ విభజన చేసి పద్యం కిందగల లక్షణాలు పూరించండి.

‘అమిత పరాక్రమంబును, రయంబును, లావును గల్గు ఖేచరో
త్తముడవు, నీవు, నీదయిన దాస్యము వాపికొనంగ నీకు జి
త్తము గలదేని, భూరి భుజ దర్పము శక్తియు నేర్పడంగ మా
కమృతము దెచ్చియి మ్మనిన నవ్విహగేంద్రుడు సంతసంబునన్

AP Board 8th Class Telugu Solutions Chapter 9 సందేశం 6

చంపకమాల :

  1. ఇది వృత్త పద్యం.
  2. పద్యంలో నాలుగు పాదాలు ఉన్నాయి.
  3. ప్రతి పాదంలోను ‘న, జ, భ, జ, జ, జ, ర’ అనే గణాలు ఉన్నాయి.
  4. ప్రతి పాదంలో 11వ అక్షరం యతి స్థానం.
    (అ – య) (త – దా) (త్త – ద) (క – న) వీటికి యతి మైత్రి.
  5. ప్రాస నియమం ఉంది.
  6. ప్రతి పాదంలోను 21 అక్షరాలు ఉంటాయి.

ఇ) కింది పాదాలు ఏ వృత్తాలకు సంబంధించినవో గుర్తించండి.
AP Board 8th Class Telugu Solutions Chapter 9 సందేశం 7

గమనిక :
పై పాదంలో ‘న, జ, భ, జ, జ, జ, ర’ గణాలు ఉన్నాయి. కాబట్టి పై పద్యపాదము ‘చంపకమాల’ వృత్తమునకు సంబంధించినది.
AP Board 8th Class Telugu Solutions Chapter 9 సందేశం 8
గమనిక :
పై పాదంలో ‘భ, ర, న, భ, భ, ర, వ’ అనే గణాలు ఉన్నాయి. కాబట్టి ఇది ‘ఉత్పలమాల’ వృత్తము.

ఈ)కింద సూచించిన పద్యపాదాలను పూరించి గణవిభజన చేసి అవి ఏ పద్యపాదములో గుర్తించండి.
AP Board 8th Class Telugu Solutions Chapter 9 సందేశం 9

గమనిక : పై పద్యపాదంలో ‘న, జ, భ, జ, జ, జ, ర’ గణాలు వరుసగా వచ్చాయి. కాబట్టి (ప – బం) ‘చంపకమాల’ పద్యము. యతి 11వ అక్షరము.

వ్యాకరణంపై అదనపు సమాచారం

పర్యాయపదాలు

భూమి – వసుధ, ధరణి, అవని
కేతనం – జెండా, పతాకము
వికారి – ముని, తాపసి
గంగ – భాగీరథి, త్రిపథగ
ఖ్యాతి – కీర్తి, యశము
బ్రహ్మ – విధాత, ధాత, సృష్టికర్త

వ్యుత్పత్యర్థాలు

ధరణి – సమస్తాన్ని ధరించునది (భూమి)
బ్రహ్మ – ప్రజలను వర్థిల్ల చేయువాడు (విధాత)

AP Board 8th Class Telugu Solutions Chapter 9 సందేశం

నానార్థాలు

ధర్మము = పుణ్యం, న్యాయం, ఆచారం
జలం = నీరు, ఎర్రతామర
భావము = పుట్టుక, ప్రపంచం, సంసారం

సంధులు

సవర్ణదీర్ఘ సంధి
సూత్రం : అ, ఇ, ఉ, ఋ లకు సవర్ణములైన అచ్చులు పరమైనప్పుడు వాని దీర్ఘములు ఏకాదేశమగును.
మహాభ్యుదయమ్ము = మహా + అభ్యుదయమ్ము – సవర్ణదీర్ఘ సంధి
కుమారాగ్రణి = కుమార + అగ్రణి – సవర్ణదీర్ఘ సంధి
నయవంచకాళి = నయవంచక + ఆళి – సవర్ణదీర్ఘ సంధి

గుణసంధి
సూత్రం : అకారానికి ఇ, ఉ, ఋ లు పరమైనప్పుడు క్రమంగా ఏ, ఓ, అర్లు ఏకాదేశమగును.
భరతోర్వర = భరత + ఉర్వర – గుణసంధి
సహోదరా = సహ + ఉదరా – గుణసంధి
నవ్యోజ్జ్వల = నవ్య + ఉజ్జ్వ ల – గుణసంధి

యణాదేశ సంధి
సూత్రం : ఇ, ఉ, ఋ లకు అసవర్ణాచ్చులు పరమైనపుడు క్రమముగా య, వ, రలు ఆదేశమగును.
అభ్యుదయము = అభి + ఉదయము – యణాదేశ సంధి

అత్వసంధి
సూత్రం : అత్తునకు సంధి బహుళంగా వస్తుంది.
సంపాదించుకొన్నట్టి = సంపాదించుకొన్న + అట్టి – అత్వసంధి
నేర్పినట్టి = నేర్పిన + అట్టి – అత్వసంధి
మొలకెత్తు = మొలక + ఎత్తు – అత్వసంధి
నాడులందు = నాడుల + అందు – అత్వసంధి

ఇత్వసంధి
సూత్రం : ఏమి మొదలైన పదాల్లోని ఇత్తునకు సంధి వైకల్పికంగా అవుతుంది.
ఏదైనను = ఏది + ఐనను – ఇత్వ సంధి

ఉత్వసంధి
సూత్రం : ఉత్తునకు అచ్చు పరమైనపుడు సంధి అవుతుంది.
శిరమెత్తగా = శిరము + ఎత్తరా – ఉత్వసంధి
జోతలర్పించే = జోతలు + అర్పించె – ఉత్వసంధి
పాడయ్యె = పాడు + అయ్యె – ఉత్వసంధి
తరుణమ్మిదే = తరుణమ్ము + ఇదే – ఉత్వసంధి

గసడదవాదేశ సంధి (అ)
సూత్రం (అ) : ప్రథమమీది పురుషాలకు గసడదవలు బహుళంగా వస్తాయి.
పట్టుగొమ్మ = పట్టు + కొమ్మ – గసడదవాదేశ సంధి

గసడదవాదేశ సంధి సూత్రం (ఆ) : ద్వంద్వ సమాసంలో మొదటి పదం మీద ఉన్న కచటతపలకు గసడదవలు క్రమంగా వస్తాయి.
అన్నదమ్ములు = అన్న + తమ్ముడు – గసడదవాదేశ సంధి

AP Board 8th Class Telugu Solutions Chapter 9 సందేశం

యడాగమ సంధి
సూత్రం : సంధి లేనిచోట స్వరం కంటె పరంగా ఉన్న స్వరానికి యడాగమం అవుతుంది.
కన్నయది = కన్న + అది – యడాగమ సంధి
నీళాదేశము = నీ + ఈదేశము – యడాగమ సంధి

సమాసాలు

సమాస పదంవిగ్రహవాక్యంసమాసం పేరు
జాతి శిరస్సుజాతి యొక్క శిరస్సుషష్ఠీ తత్పురుష సమాసం
శాంతి చంద్రికలుశాంతి అనెడి చంద్రికలురూపక సమాసం
గంగా నదిగంగ అనే పేరుగల నదిసంభావనా పూర్వపద కర్మధారయ సమాసం
నా దేశమునా యొక్క దేశముషష్ఠీ తత్పురుష సమాసం
ప్రపంచ చరిత్రప్రపంచము యొక్క చరిత్రషష్ఠీ తత్పురుష సమాసం
నిఖిల ధరణినిఖిలమైన ధరణివిశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
నవ్యభారతమునవ్యమైన భారతమువిశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
మహామౌనిగొప్పవాడైన మౌనివిశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
నీ తల్లినీ యొక్క తల్లిషష్ఠీ తత్పురుష సమాసం
దేశభక్తిదేశము నందు భక్తిసప్తమీ తత్పురుష సమాసం
ప్రజలనాడులుప్రజల యొక్క నాడులుషష్ఠీ తత్పురుష సమాసం
అఖండ భారతంఅఖండమైన భారతంవిశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
గట్టి ప్రతిజ్ఞగట్టిదైన ప్రతిజ్ఞవిశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
హింసా పిశాచిహింస అనెడి పిశాచిరూపక సమాసం
అన్నదమ్ములుఅన్నయును, తమ్ముడునుద్వంద్వ సమాసం
– సకల ప్రపంచముసకలమైన ప్రపంచమువిశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
ధాన్యాగారాలుధాన్యమునకు ఆగారాలుషష్ఠీ తత్పురుష సమాసం

ప్రకృతి – వికృతులు

ప్రతిజ్ఞ – ప్రతిన
భూమి – బూమి
భాష – బాస
గౌరవం – గారవం
కీర్తి – కీరితి
భక్తి – బత్తి
హృదయం – ఎద
అద్భుతం – అబ్బురం
భృంగారం – బంగారం
మత్సరం – మచ్చరం

కవి పరిచయం

కవి : సురగాలి తిమోతి జ్ఞానానందకవి

జన్మస్థలం : బొబ్బిలి తాలూకా, ‘పెద పెంకి’ గ్రామంలో జన్మించారు.

జీవిత కాలం : 1922 – 2011

ఉద్యోగం : కాకినాడ మెక్లారిన్ ఉన్నత పాఠశాలలో తెలుగు పండితునిగా పనిచేశారు.

ప్రతిభ : ప్రాథమిక విద్యను నేర్చుకుంటున్నప్పుడే ఆశువుగా సీసపద్యాలు చెపుతూ “దీనబంధు శతకాన్ని” రాశారు.

రచనలు : 1) ఆమ్రపాలి 2) పాంచజన్యం 3) క్రీస్తు శతకం 4) నా జీవితగాథ 5) కూలీ నుండి కళాప్రపూర్ణ వరకు 6) పర్జన్యం 7) గోల్కొండ మొ||నవి.

రచనా శైలి : సరళమైన శైలితో సామాజిక చైతన్యాన్ని అందించిన కవి.

అవార్డు : ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డును 1975లో పొందారు.

పురస్కారం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం “ఉత్తమ ఉపాధ్యాయ” పురస్కారం ఇచ్చింది. భారత ప్రభుత్వం ‘పద్మశ్రీ’తో సత్కరించింది.

పద్యాలు – ప్రతిపదార్థాలు – భావాలు

1వ పద్యము (కంఠస్థ పద్యం)

*చం. పరమ తపోనివేశనము బంగరుపంటలకు న్నివాస మ
బ్బురమగు శాంతిచంద్రికల భూమి ప్రపంచచరిత్రలోన బం
ధురతర కీర్తి గొన్న భరతోర్వర నా జనయిత్రియంచు పా
డర! శిరమెత్తరా! విజయఢంకను గొట్టుమురా! సహైదరా!
ప్రతిపదార్థాలు :
సహోదరా (సహ + ఉదరా) = ఓ సోదరా !
పరమ తపోనివేశనము ; పరమ = మేలైన (అధికమైన)
తపః + నివేశనము = తపస్సునకు ఉనికి పట్టు (తపో భూమి).
బంగరుపంటలకున్ = బంగారు పంటలకు
నివాసము = నిలయము
అబ్బురము + అగు = అసాధారణమైన
శాంతిచంద్రికల = శాంతివెన్నెలలు కురిసే
భూమి = ప్రదేశము
ప్రపంచచరిత్రలోనన్ = ప్రపంచదేశముల చరిత్రలో
బంధురతరకీర్తి ; బంధురతర = మిక్కిలి రమ్యమైన
కీర్తి = కీర్తిని
భరతోర్వరభ (రత + ఉర్వర) = భారత భూమి
నా జనయిత్రి + అంచు = నా తల్లియని
పాడర = కీర్తించు
శిరము + ఎత్తరా = తల ఎత్తుకోరా !
కైకొనుమురా = తీసికొనుము

భావం :
ఓ భారతకుమార శ్రేష్ఠుడా ! “ఇది నా దేశం. ఈమె నన్ను కన్నతల్లి. నా దేశ సౌభాగ్య సంపదలు అభివృద్ధి చెందడానికి నేను సహాయమందిస్తాను. ప్రపంచమంతటా దీన్ని పూజించేటట్లుగా గొప్ప అభివృద్ధిని నెలకొల్పుతాను” అంటూ నీవు నీ మనస్సులో గట్టిగా ప్రతిజ్ఞ చెయ్యి (చేయుము).

2వ పద్యము

మ. ఇది నాదేశము నన్నుఁ గన్నయది నా యీ దేశ సౌభాగ్య సం
పదలీ విశ్వమునందు వర్ధిలగఁ దోడ్పాటున్ బొనర్తున్ మహా
భ్యుదయమ్మున్ నెలకొల్పుదున్ భువనముల్ పూజింపనంచీవు నీ
యెదలో గట్టి ప్రతిజ్ఞఁ గైకొనుమురా! హిందూకుమారాగ్రణీ!
ప్రతిపదార్థాలు :
హిందూకుమార + అగ్రణీ = శ్రేష్ఠుడైన ఓ భారత కుమారా!
ఇది నా దేశము – ఇది నా దేశము
నన్నున్ = నన్ను
కన్నయది (కన్న + అది) = కన్నది (కనిన తల్లి)
నా, ఈ = ఈ నా యొక్క
దేశ సౌభాగ్య సంపదలు; దేశ = దేశము యొక్క
సౌభాగ్య = వైభవపు
సంపదలు = ఐశ్వర్యములు
ఈ విశ్వమునందు = ఈ ప్రపంచంలో
వర్దిలగన్ = వృద్ధి పొందడానికి
తోడ్పాటున్ = సాయమును
పొనర్తున్ = చేస్తాను
భువనముల్ = లోకములు (ప్రపంచములు)
పూజింపన్ = పూజించేటట్లుగా
మహాభ్యుదయమున్ (మహా + అభ్యుదయమున్) = గొప్ప అభివృద్ధిని = పొందిన
నెలకొల్పుదున్ = నిలబెడతాను
అంచున్ = అంటూ
ఈ వు = నీవు
నీ + ఎదలోన్ = నీ మనస్సులో
గట్టి = దృఢమైన ప్రతిజ్ఞను
విజయఢంకను = విజయఢంకాను
కొట్టుమురా – మ్రోగించరా ! (చాటింపుము)

భావం :
ఓ సోదరా ! మన దేశం తపోభూమి. బంగారు పంటలకు నిలయం. శాంతి వెన్నెలలు కురిసే పుణ్యభూమి. ప్రపంచంలో మనోహరమైన కీర్తిని పొందిన ఈ భరతభూమి నా తల్లి అని గర్వంగా తల ఎత్తుకొని చాటిస్తూ, విజయఢంకాను మ్రోగిస్తూ నీ దేశం గురించి కీర్తించు.

AP Board 8th Class Telugu Solutions Chapter 9 సందేశం

3వ పద్యము (కంఠస్థ పద్యం )

*ఉ. జాతి శిరస్సు నెత్తికొని క్ష్మాతలవీధిని గౌరవాన హుం
తన మొప్పగాఁ దిరిగినన్ గలుగున్ గడుకీర్తి భారత
క్ష్మాతలి కట్టి భాగ్యమును గల్గగ శాంతి సముద్ధరింప లే
రా ! తరుణమ్మిదే మరల రాదు సుమీ! గతకాల మెన్నడున్
ప్రతిపదార్థాలు :
జాతి = భారతజాతి
శిరస్సున్ + ఎత్తి = తల ఎత్తుకొని
క్ష్మాతల వీధిని . = భూమండలంలో (ప్రపంచంలో)
గౌరవాన = గౌరవంగా
హుందాతనము + ఒప్పగాన్ = హుందాగా
తిర్గినన్ = తిరిగితే
కడు = మిక్కిలి
కీర్తి = కీర్తి
కలుగున్ = కలుగుతుంది
అట్టి భాగ్యమును = అటువంటి సౌభాగ్యము
కల్గగన్ = కలిగే విధంగా
శాంతిన్ = శాంతిని
సముద్ధరింపన్ = పైకి తేవడానికి (లేవనెత్తడానికి)
లేరా = లెమ్ము
తరుణము + ఇదే = ఇదే తగిన సమయము
ఎన్నడున్ = ఎప్పుడునూ
గతకాలము = జరిగిపోయిన కాలం
మరల రాదు సుమీ = తిరిగి రాదు సుమా !

భావం :
భారత జాతి తల ఎత్తుకొని ప్రపంచ వీధిలో సగౌరవంగా, హుందాగా తిరిగినప్పుడే గొప్ప కీర్తి కలుగుతుంది. మన దేశానికి అటువంటి సౌభాగ్యం కలిగే విధంగా శాంతిని పెంపొందించడానికి ఇదే సరైన సమయము. అందుకు సిద్ధం కండి. ఎందుకంటే పోయిన కాలం తిరిగి రాదు కదా !

4వ పద్యము

మ. మతమేదైనను భాషయేదయిన సంపాదించుకొన్నట్టి సం
స్కృతి యేదైనను నిండు నీ తనువులో జీర్ణించు జాతీయతా
హితనవ్యోజ్జ్వల భావబంధురత లీ హింసా ప్రపంచాన క
ద్భుత రీతిన్ గనిపింపగా వలయు బాబూ! శాంతి దీక్షారతా!
ప్రతిపదార్థాలు :
(ప్రపంచానికి) శాంతి దీక్షారతా = శాంతి దీక్షయందు ఆసక్తి గలవాడా !
మతము = నీ మతము
ఏదయినను (ఏది + అయినను) ఏమయినప్పటికీ
భాషయేదయిన = నీ భాష ఏదయినా
సంపాదించుకున్నట్టి (సంపాదించుకున్న + అట్టి) = ఆర్జించినట్టి
సంస్కృతి – నాగరికత (సంస్కారము)
ఏదైనను (ఏది + ఐనను) = ఏదయినా
నిండు = నిండైన
నీ తనువులో = నీ శరీరములో (నీ నరనరాల్లో)
జీర్ణించు = నిండిన
జాతీయతా = భారత జాతీయత అనే
హిత = మేలయిన
నవ = కొత్తయైన
ఉజ్జ్వల = ప్రకాశించే
భావబంధురతలు = ఇంపైన భావములు
ఈ హింసా ప్రపంచానకున్ = ఈ హింసతో నిండిన ప్రపంచానికి
అద్భుత రీతిన్ = అద్భుతంగా
కనిపింపగా వలయున్ = కనిపించాల్సిన అవసరం ఉంది

భావం :
శాంతి దీక్షయందు ఆసక్తి గలవాడా ! నీ మతం, భాష, సంస్కృతి ఏవయినప్పటికీ, నీ నరనరాల్లో నిండిన భారతీయ భావన హింసతో నిండిన ఈ ప్రపంచానికి అద్భుతంగా కనిపించాలి.

5వ పద్యము

తే.గీ. నిఖిల ధరణికి శాంతిని నేర్పినట్టి
భరత భువనమ్ము నీ తల్లి ప్రథితయశము
నిలువఁబెట్టుట నీవంతు నిశ్చయముగ
నీకుఁ గలదు బాధ్యతయు హిందూకుమార!
ప్రతిపదార్థాలు :
హిందూకుమార ! = ఓ భారత కుమారా !
నిఖిల ధరణికిన్ = సమస్త భూమండలానికీ
శాంతిని = శాంతి మార్గాన్ని ముందు
నేర్పినట్టి (నేర్పిన + అట్టి) = నేర్పించినట్టి
భరత భువనమ్ము = భారత భూమి (భారతదేశం)
నీ తల్లి = నీకు తల్లి
ప్రథిత యశము = ప్రసిద్ధి పొందిన కీర్తి
నిలువబెట్టుట = నిలబెట్టడం
నిశ్చయముగ = తప్పక
నీ వంతు = నీ వాటా
నీకున్ = నీకు
బాధ్యతయు = పూచీయూ
కలదు = ఉంది

భావం :
ఓ భారత కుమారా ! సమస్త భూమండలానికి శాంతిని నేర్పినది భారతదేశం. నీ తల్లియైన ఈ భారతదేశం యొక్క సముజ్జ్వల కీర్తిని నిలబెట్టాల్సిన బాధ్యత నీమీద ఉంది.

AP Board 8th Class Telugu Solutions Chapter 9 సందేశం

6వ పద్యము

సీ. శిరమెత్తరాదు మచ్చరికించి విషపు దౌ
ర్జన్య కులమత హింసాపిశాచి
నిలవఁగారాదు పెన్ బలిసిపోయిన దుష్ట
నయవంచకాళి గూండాయిజమ్ము
తొలచఁగారాదు విద్రోహాన దేశ భా
గ్యాల దార్యతను లంచాల జలగ
వచియింపఁగారాదు ప్రతినిధి యగువాడు
పగ ననల్ మొలకెత్త పలుకుబడుల

ఆ.వె. అంద అన్నదమ్ములన్న మధురమైన
ధర్మమునకు దెబ్బతగులరాదు
నాడురా ! సమేకతా డిండిమము మ్రోగు
వసుధ పొగడ నవ్యభారతమున
ప్రతిపదార్థాలు :
మచ్చరికించి = పట్టు పట్టి
విషపు = తీవ్రంగా వ్యాపించే
దౌర్జన్య కులమత హింసాపిశాచి;
దౌర్జన్య = దుండగములు (దౌర్జన్యములు)
కులమత = కులానికి, మతానికి చెందిన
హింసా పిశాచి = హింస అనే భూతము
శిరము + ఎత్తరాదు = తల ఎత్తరాదు (చెలరేగరాదు)
పెన్ = పెద్దగా
బలిసిపోయిన = పెరిగిపోయిన
దుష్ట = దుష్టులు
నయవంచక + ఆళి = నయవంచకుల సమూహం యొక్క (మోసగాండ్ర యొక్క)
గూండాయిజమ్ము = గూండాయిజం
నిలువగా రాదు = నిలువకూడదు
దేశభాగ్యాల = దేశ సౌభాగ్యముల
దాద్యతను = సత్తువను
లంచాల జలగ = లంచములు అనే జలగ
తొలచగా రాదు = పీల్చరాదు
ప్రతినిధి + అగువాడు = ప్రజా ప్రతినిధులయిన వారు (శాసనసభ్యులు)
పగ = శత్రుత్వము
ననల్ = చివుళ్ళు
మొలకెత్తన్ = అంకురించేలా
పలుకుబడులు = మాటలు
వచియింపగారాదు = మాట్లాడరాదు
అందరు = దేశప్రజలు అందరూ
అన్నదమ్ములు = సోదరులు
అన్న = అనిన
మధురమైన = తీయని
ధర్మమునకున్ = ‘ధర్మానికి
దెబ్బ తగులనీయరాదు = దెబ్బ తగలకూడదు
నవ్య భారతమున = నూతన భారతదేశంలో
వసుధ పొగడన్ = ప్రజలు పొగిడేలా
సమేకతా = సమైక్యము అనే
డిండిమము = ఢక్కా
నాడు = ఆనాడే
మ్రోగున్ రా = ధ్వనిస్తుందిరా !

భావం :
ఇటువంటి పుణ్యదేశంలో అసూయలు, దౌర్జన్యాలు, కులమత హింసలు అనే పిశాచాలను తలయెత్తనీయకూడదు. నానాటికీ పెరిగిపోతున్న దుష్టుల, మోసగాళ్ళ యొక్క గూండాయిజం నిలువకూడదు. బలిష్ఠమైన దేశ సౌభాగ్యాన్ని లంచాలు అనే జలగలు పట్టి పీల్చకూడదు. పగలు, సెగలు రగిలించే మాటలు ప్రజా ప్రతినిధులైన వారు మాట్లాడకూడదు. మనమంతా అన్నదమ్ములం అన్న తీయనైన ధర్మానికి దెబ్బతగులనీయకూడదు. అలా జరిగినప్పుడు సమైక్యము అనే ఢక్కా నవ్యభారతంలో ప్రజలు పొగిడేలా మోగుతుంది.

7వ పద్యము (కంఠస్థ పద్యం)

*శా. ఈ గంగానది బ్రహ్మపుత్రయును నీ కృష్ణమ్మ కావేరియున్
ఈ గోదావరి సింధు నర్మదలు నీ యీదేశ సౌభాగ్య ధా
న్యాగారాలకు పట్టుగొమ్మలు నఖండంబైన నీ ధారుణీ
భాగ్యమ్మీ సకల ప్రపంచమునకున్ స్వామిత్వముం బూనెడిన్
ప్రతిపదార్థాలు:
ఈ గంగానది = ఈ గంగానది
బ్రహ్మపుత్రయునున్ = బ్రహ్మపుత్రా నదియును
ఈ కృష్ణమ్మ = ఈ కృష్ణా నదియు
కావేరియున్ = కావేరీ నదియు
ఈ గోదావరి = ఈ గోదావరి నదియు
సింధు నర్మదలు = సింధు నదియు, నర్మదా నదియు
నీ + ఈ దేశ = నీ యొక్క ఈ భారతదేశపు
సౌభాగ్య ధాన్యాగారాలకు = సౌభాగ్యానికీ, ధాన్యాగారాలకు
పట్టుగొమ్మలు (పట్టు + కొమ్మలు) = ఆధారములు
అఖండంబయిన = సంపూర్ణమైన
ఈ ధారుణీ భాగమ్ము = ఈ భూభాగము
ఈ సకల ప్రపంచమునకున్ = ఈ సమస్త ప్రపంచానికి
స్వామిత్వమున్ = ఆధిపత్యమును
పూనెడిన్ = వహిస్తుంది

భావం :
గంగ, బ్రహ్మపుత్ర, కృష్ణ, కావేరి, గోదావరి, సింధు, నార్మద అనే జీవనదులు ఈ దేశ సౌభాగ్యమైన ధాన్యాగారాలకు ముఖ్యమైన ఆధారం. అఖండమైన సౌభాగ్య సంపదలు గలిగిన ఈ దేశం ప్రపంచానికి అధిపతి అయ్యింది.

8వ పద్యము

తే.గీ. ముసలి సన్న్యాసి బాపూజీ బోసినోరు
విప్పిపలికిన పలుకుకే విశ్వజగతి
జోతలర్పించె జాతికి ఖ్యాతి యదియ
ఆ మహామౌని నేల పాడయ్యె నేడు
ప్రతిపదార్థాలు :
ముసలి సన్న్యాసి = ముసలివాడైన సన్న్యాసి వంటివాడైన
బాపూజీ = గాంధీజీ యొక్క
బోసినోరు = పళ్ళులేని నోరు
విప్పి = విప్పి
పలికిన = మాట్లాడిన
పలుకుకే = మాటకే
విశ్వజగతి = ప్రపంచము
జోతలు + అర్పించే = జోహార్లు సమర్పించింది
అదియ = అది ప్రపంచం, గాంధీజీకి జోహార్లు సమర్పించడం అన్నది
జాతికి= భారత జాతికి
ఖ్యాతి = కీర్తినిచ్చేది ఖ్యాతి
ఆ మహామౌని = ఆ గొప్ప మునివంటి గాంధీజీ పుట్టిన
నేల = భూమి (భారతదేశం)
నేడు = ఈనాడు
పాడయ్యె = చెడిపోయింది (గాంధీజీ ఆశయాలకు అనుగుణంగా నడవడం లేదు)

భావం :
గొప్ప ముసలి సన్యాసి వంటి గాంధీజీ తన బోసి నోరు విప్పి పలికిన పలుకులకు (శాంతి సందేశానికి) ప్రపంచ మంతా జేజేలు పలికింది. అందువల్ల మన భారత జాతికి ఖ్యాతి వచ్చింది. అటువంటి మహాత్ముని కన్న భూమి, నేడు గాంధీజీ ఆశయాలకు అనుగుణంగా నడవడం లేదు.

AP Board 8th Class Telugu Solutions Chapter 9 సందేశం

9వ పద్యము

ఆ.వె. దేశభక్తి మఱియు దేశసమగ్రత
ప్రజల నాడులందు ప్రబలి ప్రబలి
కర్మభూమియగు నఖండ భారతమహా
క్షితిని నెగురు ప్రగతి కేతనమ్ము
ప్రతిపదార్థాలు :
దేశభక్తి = దేశమునందు భక్తి
మఱియున్ = మఱియు
దేశసమగ్రత = దేశము యొక్క సమగ్రత అనే భావాలు
ప్రజల నాడులందు = ప్రజల నరనరాలలో
ప్రబలి, ప్రబలి = బాగా వ్యాపించి
కర్మ భూమి + అగు = పుణ్యభూమియైన
అఖండ భారత మహాక్షితిని ;
అఖండ = సంపూర్ణమైన
భారత = భారతము అనే
మహాక్షితినిన్ = గొప్ప నేలపై
ప్రగతి కేతనమ్ము = అభివృద్ధి అనే జెండా
ఎగురు = ఎగురుతుంది

భావం :
దేశభక్తి, దేశసమగ్రత అనే భావాలు, ప్రజల నరనరాల్లో వ్యాపించి, పుణ్యభూమియైన అఖండ భారతదేశంలో ప్రగతి జెండా రెపరెపలాడుతూ ఎగురుతుంది.

AP Board 8th Class Telugu Solutions Chapter 11 భూదానం

AP State Syllabus AP Board 8th Class Telugu Textbook Solutions Chapter 11 భూదానం Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Telugu Solutions 11th Lesson భూదానం

8th Class Telugu 11th Lesson భూదానం Textbook Questions and Answers

చదవండి – ఆలోచించండి – చెప్పండి
AP Board 8th Class Telugu Solutions Chapter 11 భూదానం 1

ప్రశ్నలు జవాబులు

ప్రశ్న 1.
చిత్రంలో ఎవరెవరున్నారు? ఏం చేస్తున్నారు?
జవాబు:
చిత్రంలో గాంధీజీ, ఆయన అనుచరులూ, కాంగ్రెసు సేవాదళ్ కార్యకర్తలూ ఉన్నారు. వారు పాదయాత్ర చేస్తున్నారు.

ప్రశ్న 2.
వీళ్ళు ఎందుకు పాదయాత్ర చేస్తున్నారు?
జవాబు:
వీళ్ళు పార్టీ కార్యక్రమాలను ప్రజలలో ప్రచారం చేయడానికి, ప్రజల కష్టసుఖాల్ని తెలుసుకోవడానికి, పాదయాత్ర చేస్తున్నారు.

AP Board 8th Class Telugu Solutions Chapter 11 భూదానం

ప్రశ్న 3.
ఇలా పాదయాత్రలు చేసినవారు మీకు తెలుసా? చెప్పండి.
జవాబు:
గాంధీజీ, వినోబా భావే, వంటి నాయకులు పాదయాత్రలు చేశారు. వెనుక, శంకరాచార్యులు, మహావీరుడు, బుద్ధుడు, కబీరు, చైతన్యుడు, నామ్ దేవ్ వంటి గురువులు కూడా పాదయాత్రలు చేశారు.

ఇవి చేయండి

I. వినడం – మాట్లాడడం

ప్రశ్న 1.
‘భూదానం’ అని పాఠం పేరును విన్నప్పుడు మీరేమి అనుకున్నారు?
జవాబు:
సామాన్యంగా పుణ్యం కోసం దానాలు చేస్తూ ఉంటారు. ఆ దానాల్లో దశదానాలు ముఖ్యం. ఆ పది దానాల్లో భూదానం ఒకటి. పెద్దలు చనిపోయినపుడు వారు స్వర్గానికి వెళ్ళడానికి బ్రాహ్మణులకు భూమిని దానం చేస్తారు. లేదా లక్షవర్తి వ్రతం, ఋషి పంచమీ వ్రతం వంటివి చేసినపుడు, పుణ్యం కోసం భూదానం చేస్తారు. ఈ విధంగా ఎవరో పుణ్యాత్ములు, భూదానం చేశారని భూదానం మాట విన్నప్పుడు అనుకున్నాను.

ప్రశ్న 2.
ఈ పాఠం ద్వారా మీరు గ్రహించినదేమిటి?
జవాబు:
గాలి మీద, నీటి మీద, వెలుగు మీద ప్రజలందరికీ సమాన హక్కు ఉన్నట్లే, భూమి మీద కూడా అందరికీ సమాన హక్కు ఉన్నదని గ్రహించాను.

ప్రశ్న 3.
‘భూ సమస్య చాలా పెద్దది’ అని వినోబా అన్నారు కదా ! ఇలా ఎందుకు అని ఉంటారు ? ఇది ఈనాటి పరిస్థితులలో కూడా ఇలాగే ఉందా? దీని మీద మీ అభిప్రాయం చెప్పండి.
జవాబు:
మనదేశంలో కొందరి దగ్గర అంగుళం భూమి కూడా లేదు. కొందరి దగ్గర వందలాది వేలాది ఎకరాల భూమి ఉంది. భూమి కలవారు తక్కువ. లేని వారు ఎక్కువ. అందువల్ల భూ సమస్య చాల పెద్దది అని వినోబా అన్నారు.

ఈనాడు మనదేశంలో భూసంస్కరణలు అమలయ్యాయి. అందువల్ల ప్రతి వ్యక్తి వద్ద కూడా 28 ఎకరాల పల్లం భూమి, లేక 50 ఎకరాల మెట్ట భూమి మించి ఉండరాదు. ఇప్పుడు కూడా భూ సమస్య ఉంది. ఇల్లు కట్టుకొనే చోటు లేక పేదలు బాధపడుతున్నారు. కొందరు నాయకులు అక్రమంగా సెజ్ ల పేరుతో వేల ఎకరాల భూమిని ఆక్రమిస్తున్నారు.

II. చదవడం – రాయడం

1. కింది వాక్యాలు చదవండి. ఆ వాక్యాలకు సమానభావం వచ్చే వాక్యాన్ని గుర్తించండి.

అ) పల్లె పట్టణాల ప్రజల్లో ఉత్సాహం ఎక్కువగా ఉంది. పల్లెల్లో ఆప్యాయతతో కూడిన ప్రత్యేక విశేషం కనబడింది.
అ) పల్లె పట్టణాల ప్రజల్లో ప్రత్యేక విశేషం ఉంది. (✗)
ఆ) పల్లె ప్రజల కంటే, పట్టణాల ప్రజల్లో ఎక్కువ విశేషం ఉంది. (✗)
ఇ) పల్లె ప్రజల్లో పట్టణ ప్రజల కంటే తక్కువ విశేషం కనబడింది. (✗)
ఈ) ఆప్యాయత అనే ప్రత్యేక విశేషం, పల్లె ప్రజల్లో ఎక్కువగా కనబడింది. (✓)

ఆ) వినోబాకు తెలుగు వచ్చు. కానీ తెలుగులో మాట్లాడలేరు. అయినా వచ్చిన తెలుగు భాష వల్ల ఎంతో ప్రయోజనం కలిగింది.

అ) వినోబాకు తెలుగు వచ్చు. కానీ సరిగా మాట్లాడలేరు. (✓)
ఆ) వినోబాకు తెలుగు రాదు. కాబట్టి అసలే మాట్లాడలేరు. (✗)
ఇ) వినోబాకు తెలుగు బాగా వచ్చు, బాగా మాట్లాడగలరు. (✗)
ఈ) వినోబాకు తెలుగు బాగా రాదు. కానీ ఎంతో కొంత మాట్లాడగలరు. (✗)

ఇ) శివరాంపల్లి వెళ్ళవలసిన అవసరం లేకపోతే తోవలో కొద్ది రోజులపాటు ఉండవలసిన గ్రామాలు అనేకం తగిలాయి.
అ) శివరాంపల్లికి తప్పకుండా వెళ్ళాలి కాబట్టి తోవలోని గ్రామంలో ఉండవలసిన అవసరం ఉన్నా ఉండకుండా వెళ్ళారు. ( ✓)
ఆ) శివరాంపల్లికి వెళ్ళవలసిన అవసరం లేదు. అందుకే తోవలోని గ్రామాల్లో ఉండకుండా వెళ్ళారు. (✗)
ఇ) శివరాంపల్లికి వెళ్ళారు. తోవలోని గ్రామాల్లో కూడా కొద్దిరోజులు ఉండి వెళ్ళారు. (✗)
ఈ) శివరాంపల్లికి వెళ్ళడం కంటే ఇతర గ్రామాల్లో ఉండడం ఎక్కువ అవసరం. (✗)

ఈ) “మాకు కొద్దిగా భూమి దొరికితే, కష్టపడి పని చేసుకుంటాం; కష్టార్జితం తింటాం”.
అ) కష్టపడి పనిచేయడానికి భూమి ఉంటే, మేము మా కష్టార్జితం తింటాం. (✓)
ఆ) భూమి లేదు కాబట్టి, మేము కష్టపడి కష్టార్జితం తింటున్నాం. (✗)
ఇ) మాకు కొద్దిగా భూమి దొరికితే కష్టపడకుండా తినవచ్చు. (✗)
ఈ) మాకు భూమి ఉన్నది కాబట్టి కష్టార్జితం తినవలసిన పనిలేదు. (✗)

AP Board 8th Class Telugu Solutions Chapter 11 భూదానం

2. పాఠంలోని కింది పేరాలు చదవండి. ఆ పేరాలోని ముఖ్యమైన పదం / పదాలు కింద గీత గీయండి. అవి ఎందుకు ముఖ్యమైనవో రాయండి.
1వ పేరా, 3వ పేరా, 6వ పేరా, 7వ పేరా, 13వ పేరా, చివరి పేరా

పేరాపేరా లో ముఖ్యమైన పదం/పదాలుఎందుకు ముఖ్యమో రాయడం
1వ పేరాపాదయాత్రపాదయాత్ర వల్ల ప్రజలను, ప్రకృతిని దగ్గరగా చూడవచ్చు.
3వ పేరాపాదయాత్రే తగిన యాత్రా సాధనంపాదయాత్రలో తిరిగేటప్పుడు ప్రతి మాట నిండు హృదయంతో, ఎంతో విశ్వాసంతో చెప్పగలిగే వారు. అవసరమైన నిబ్బరం, ఆత్మవిశ్వాసం భావే గారికి కలిగాయి.
6వ పేరాప్రజలు ప్రేమతో భూమిని ఇవ్వగలరు.ప్రేమతో 100 ఎకరాలు వెదిరె రామచంద్రారెడ్డి భూదానం చేయడం వల్ల.
7వ పేరాఏ సమస్యనైనా అహింసా విధానంలో పరిష్కరింపవచ్చు.వినోబా భావే సాధించిన భూదాన విజయము నెహ్రూజీ అభినందనలను అందుకొంది.
13వ పేరాఏడాదిలో లక్ష ఎకరాల భూదానంప్రతి సభలో ప్రజలు భూదానం చేయడం వల్ల.
చివరి పేరాదేవుడు కల్పవృక్షం వంటివాడుభగవంతుడే భూదాన రూపంలో సాక్షాత్కరించాడని భావే గారి తలంపు.

3. పాఠం ఆధారంగా కింది ప్రశ్నలకు జవాబులు రాయండి.
అ) వినోబా శివరాంపల్లికి ఎలా వెళదామనుకున్నారు? ఎందుకు?
జవాబు:
వినోబా శివరాంపల్లికి పాదయాత్ర ద్వారా వెళ్ళాలనుకున్నారు. పాదయాత్ర చేస్తున్నప్పుడు ప్రకృతినీ, ప్రజలనూ, మిక్కిలి దగ్గరగా చూడవచ్చు. అందుకే వినోబా పాదయాత్ర ద్వారా శివరాంపల్లి వెళ్ళాలనుకున్నారు.

ఆ) వినోబాకు తెలుగు రావడం వల్ల ఎలాంటి ప్రయోజనం పొందారు?
జవాబు:
వినోబాకు తెలుగు రావడం వల్ల, ప్రార్థన సభల్లో స్థితప్రజ్ఞుని లక్షణాలను గురించి తెలుగులో చెప్పేవారు. వినోబాగారి తెలుగుమాటలు ప్రజల హృదయాలకు హత్తుకొనేవి. మాట్లాడుతున్నవాడు తనవాడే, తన సోదరుడే అని, ప్రజలు ప్రేమతో ఆయనకు స్వాగతం పలికారు.

ఇ) వినోబా గ్రామాలకు వెళ్ళడం వల్ల ఏమి గ్రహించారు?
జవాబు:
వినోబా గ్రామాలకు వెళ్ళడం వల్ల, అక్కడ గ్రామంలో ఉన్న లోటుపాట్లు తెలుసుకోగలిగారు. అక్కడి సమస్యల్ని గ్రహించి వాటిని పరిష్కరించగలిగారు. ప్రతి గ్రామంలోనూ వినోబా భావే గారి ఉద్యమానికి సంబంధించిన ఒక వ్యక్తి ఉండాలనీ, గ్రామస్థులతో సంబంధం ఏర్పడి ఉండాలనీ, అప్పుడు ఎన్నో గొప్ప కార్యాలను సాధించగలమని ఆయన గ్రహించారు.

ఈ) వినోబాకు పోచంపల్లిలో ఎలాంటి అనుభవం ఎదురైంది?
జవాబు:
వినోబా భావే పోచంపల్లి గ్రామం వెళ్ళారు. ఆ గ్రామ దళితులు వినోబాగార్ని కలిసి, తమకు కొద్దిగా భూమి దొరికితే కష్టపడి పనిచేసుకుంటాం, కష్టార్జితం తింటాం అని చెప్పారు. వారంతా సమష్టి వ్యవసాయం చేసుకోవడానికి అంగీకరిస్తే, వారికి పొలం ఇప్పిస్తాననీ, వారికి పొలం కావాలి అన్న అర్జీని ప్రభుత్వానికి పంపిస్తాననీ వినోబా చెప్పారు. ఇంతలో అదే సభలో వెదిరె రామచంద్రారెడ్డిగారు ఆ దళితులకు తాను వంద ఎకరాల భూమిని దానం ఇస్తానని వాగ్దానం చేశారు.

ఉ) వినోబా భూ సమస్యను ఎలా పరిష్కరించాలని భావించారు?
జవాబు:
పోచంపల్లిలో వినోబాగారికి గొప్ప అనుభవం కల్గింది. ప్రజలు ప్రేమతో భూమిని ఇవ్వగలరనే అనుభూతి ఆయనకు కలిగింది. భూ సమస్య విషయంలో కలిగిన ప్రత్యక్ష అనుభవాన్ని అర్థం చేసుకొంటే, భూ సమస్యకు పరిష్కారం సులభం అవుతుందని వినోబా గ్రహించారు. భూదానం చేయమని ప్రతి సభలోనూ ప్రజల ముందు ఆయన చేయి చాచారు. గాలిమీద, నీటిమీద, వెలుగుమీద అందరికి హక్కు ఉన్నట్లే, భూమిపై కూడా హక్కు అందరికీ ఉందని వినోబా ప్రజలకు చెప్పారు. భూదాన యజ్ఞం ద్వారా శాంతియుతంగా ఈ సమస్యను పరిష్కరించాలని వారు భావించారు.

III. స్వీయరచన

1. కింది ప్రశ్నలకు ఆలోచించి ఐదేసి వాక్యాలలో జవాబులు రాయండి.

అ) “పల్లెల్లో పట్టణాల కంటే ఆప్యాయతతో కూడిన ప్రత్యేక విశేషం కనబడింది,” అని వినోబా అన్నారు కదా ! పల్లెల్లోని ప్రత్యేక ఆప్యాయత అంటే ఏమై ఉంటుంది?
జవాబు:
పల్లెల్లో అతిథులకు ప్రేమగా స్వాగతం పలుకుతారు. వచ్చిన అతిథులకు అన్నపానీయములు అందిస్తారు. అందులోనూ తమ సమస్యల్ని అడిగి తెలుసుకొనే వినోబా వంటి సత్పురుషులను పల్లె ప్రజలు ప్రేమతో ఆదరంగా పిలిచి, వారికి ఉండడానికి తగిన ఏర్పాట్లు చేస్తారు. వారికి భోజన సదుపాయములు చేస్తారు. తమకు ఉన్న భూమిని దానం చేస్తారు. వినోబా వంటి వారి మాటలను ఆదరంగా వింటారు. ఇది చూచిన వినోబా, పల్లె ప్రజలలో ప్రత్యేక ఆప్యాయత ఉందని రాశారు.

ఆ) ఏదైనా ఇతర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడి భాషను నేర్చుకోవడం అవసరమా? ఎందువల్ల?
జవాబు:
మనము ఏదైనా ఇతర ప్రాంతాలకు, అక్కడ కొన్నిరోజులు ఉండి, అక్కడి ప్రజలతో పనిచేయవలసిన పరిస్థితి ఉంటే మనము అక్కడి ప్రజల భాష తెలిసికోవలసిన అవసరం వస్తుంది. ఒక ప్రక్క రాష్ట్రానికి గానీ, ఒక విదేశానికి కానీ, చదువుకోసమో, ఉద్యోగం కోసమో వెళ్ళవలసివస్తే అక్కడి ప్రజల భాషను నేర్చుకోవడం తప్పనిసరి అవుతుంది.

ఇ) సమష్టి వ్యవసాయం అంటే ఏమిటి? ఈనాడు గ్రామాల్లో సమష్టి వ్యవసాయాలు జరగకపోవడానికి గల కారణాలు ఏమిటి?
జవాబు:
‘సమష్టి వ్యవసాయం’ అంటే గ్రామంలో రైతులు అందరూ తమకు ఉన్న పొలాల్ని కలిసికట్టుగా శ్రమించి పండించడం. వారు వచ్చిన ఫలసాయాన్ని, వారికి ఉన్న పొలాలను బట్టి పంచుకుంటారు. వ్యవసాయానికి పెట్టుబడులు అందరూ కలిసి పెడతారు. లాభనష్టాల్ని సమంగా పంచుకుంటారు.

ఈనాడు గ్రామాల్లో ప్రజలు బీదలు, ధనికులుగా, కులాలు మతాలుగా విడిపోయారు. గ్రామాల్లో అందరికీ వ్యవసాయ భూములు లేవు. అందరూ సమానంగా పెట్టుబడులు పెట్టలేరు. ప్రజలు గ్రామాల్లో ఐకమత్యంగా లేరు. అందువల్ల గ్రామాల్లో సమష్టి వ్యవసాయం నేడు సాగడం లేదు.

ఈ) బీదలకు ఉపకారం చేశామని దాతలు భావించకూడదని వినోబా చెప్పారు కదా ! ఆయన ఎందుకని అలా అని ఉంటారు?
జవాబు:
బీదవాళ్ళకు ఉపకారం చేశామని భూదానం చేసిన దాతలు అనుకుంటే, అది అహంకారం అవుతుంది. దానివల్ల వినోబా ఆశించిన ఫలితం సిద్ధించదు. గాలిమీద, నీటి మీద, వెలుగు మీద ప్రజలందరికీ హక్కు ఉన్నట్లే, భూమి మీద కూడా అందరికీ హక్కు ఉన్నదని ప్రజలు భావించాలి. కొందరి దగ్గర అంగుళం భూమిసైతం లేకపోవడం, మరికొందరి దగ్గర వేలాది ఎకరాలు ఉండడం సబబు కాదు. కాబట్టి దాతలు ఉపకారం చేశామని కాకుండా, ప్రజలందరికీ భూమిపై హక్కు ఉందని గ్రహించి భూదానం చేయాలి.

ఉ) పేదలకు, భూమికి ఉండే సంబంధం తల్లికి, బిడ్డలకు ఉన్న సంబంధం వంటిది అని వినోబా అన్నారు కదా ! అది సరైందేనా? ఎందుకు?
జవాబు:
పేదవారికి భూమిని ఇప్పించడమే వినోబాగారి పాదయాత్రలో ప్రధానమైన ఉద్దేశ్యం. ప్రజలలో భూదానం చేయాలన్న ప్రవృత్తిని మేల్కొల్పాలని వినోబా భావించారు. భూమి తల్లి వంటిది. కాగా ప్రజలు ఆ భూమికి బిడ్డలవంటివారు. ప్రజలు తల్లి వంటి భూమిని దున్ని పంటలు పండిస్తారు – అంటే తల్లి వంటి భూమి, తనకు పిల్లల వంటి ప్రజలకు, ఫలసాయాన్ని అందిస్తుంది. కాబట్టి పేదలకూ, భూమికీ గల సంబంధం, తల్లీ బిడ్డల సంబంధం వంటిది అని వినోబా భావించారు.

AP Board 8th Class Telugu Solutions Chapter 11 భూదానం

2. కింది ప్రశ్నలకు పదేసి వాక్యాలలో సమాధానాలు రాయండి.

అ) వినోబా గురించి 10 వాక్యాలలో వ్యాసం రాయండి.
(లేదా)
భూదానోద్యమాన్ని విజయవంతంగా వినోబాభావే నడిపిన విధము రాయండి.
జవాబు:
వినోబా భావే గాంధీగారి ముఖ్య శిష్యుడు. గొప్ప సర్వోదయ నాయకుడు. వార్దాలో ఉండేవాడు. 1951లో హైదరాబాదు దగ్గరలో ఉన్న “శివరాంపల్లి” లో సర్వోదయ సమ్మేళనం జరిగింది. ప్రజలను దగ్గరగా చూడవచ్చని, వార్ధా నుండి వినోబా పాదయాత్రలో శివరాంపల్లి వెడుతున్నారు. 1951 ఏప్రిల్ 8వ తేదీన, వినోబా ‘పోచంపల్లి’ గ్రామం వచ్చారు. ఆ గ్రామ దళితులు తమకు కొంచెం భూమి దొరికితే కష్టార్జితంతో తింటాం భూమి ఇప్పించండి అని వినోబాను అడిగారు. వారు సమష్టి వ్యవసాయం చేసుకొని జీవిస్తామంటే, భూమిని ఇప్పిస్తాననీ, అర్జీ పెట్టమనీ, వినోబా వారికి చెప్పారు.

ఇంతలో ఆ ఊరి పెద్ద రైతు వెదిరె రామచంద్రారెడ్డి ఆ దళితులకు తాను వంద ఎకరాల భూమిని దానం చేస్తానన్నాడు. ప్రజలు ప్రేమతో భూమిని దానం ఇస్తారని వినోబాకు అనుభవం అయ్యింది. వినోబా పేదలకు భూమిని ఇప్పించడం కోసం, పాదయాత్ర చేశారు. ఒక ఏడాదిలో లక్ష ఎకరాల భూమి దానంగా వచ్చింది. వినోబా భూదాన యజ్ఞం ఫలించింది. గాలి, నీరు, వెలుగు వలె భూమి కూడా ప్రజలందరి హక్కు అని వినోబా నమ్మకం.

ఆ) కొందరికి అసలే భూమి లేకపోవడం, మరికొందరికి వందల ఎకరాల భూమి ఉండడం అనే పరిస్థితి నేడు కూడా ఉంది కదా! ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి మీరు సూచించే పరిష్కార మార్గాలు ఏమిటి?
జవాబు:
నేటికీ మన ప్రజలలో కొందరికి అంగుళం కూడా భూమి లేదు. కాగా కొందరికి వందలు, వేల ఎకరాల భూమి ఉంది. ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి మన ప్రభుత్వాలు భూసంస్కరణలు తెచ్చాయి. ఏ వ్యక్తికీ పల్లం భూమి 28 ఎకరాలు, మెట్టభూమి అయితే 50 ఎకరాలు మించి ఉండకూడదని చట్టం ఉంది. ఎక్కువగా పొలం ఉన్నవారి నుండి సర్కారు తీసుకొని, పేదలకు పంచింది.

కాని ఈ పని సక్రమంగా జరగలేదు. ప్రజలలో కొందరు తమవద్ద ఎక్కువగా ఉన్న పొలాలను ఎవరో కావలసిన వారి పేరున రాసి, బినామీ ఆస్తులుగా తమవద్దనే వాటిని ఉంచుకున్నారు. అదీగాక నేడు పరిశ్రమల స్థాపన పేరుతో, విమానాశ్రయాలు, ఓడరేవులు పేరుతో వేల ఎకరాల ప్రభుత్వ, ప్రయివేటు భూముల్ని ప్రభుత్వ పెద్దల పలుకుబడితో కొందరు స్వాధీనం చేసుకున్నారు.

ప్రభుత్వము భూసంస్కరణలను నియమబద్ధంగా, న్యాయంగా అమలు జరిపిస్తే, ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది.

IV. పదజాలం

1. పాఠం ఆధారంగా కింది పదాల అర్థాలు తెలుసుకోండి. వీటిని సొంతవార్యాలలో రాయండి.

అ) “కష్టార్జితం” :
కష్టార్జితం అంటే కష్టపడి సంపాదించడం. తానే కష్టపడి పనిచేసి డబ్బునూ, భూమినీ సంపాదిస్తే, దాన్ని కష్టార్జితం అంటారు. తల్లిదండ్రుల వల్ల, తాత ముత్తాతల వల్ల ఆస్తులు సంక్రమిస్తే, దాన్ని “పిత్రార్జితం” అంటారు.

ఆ) “నిండు హృదయం” :
‘నిండు హృదయం’ అంటే మనశ్శుద్ధిగా అని భావం. తన మనస్సుకు పూర్తిగా అంగీకారం అయిన విషయం .

ఇ) “అసాధారణ ఘట్టం” :
సాధారణంగా జరిగే సంగతి కానిది. ఇటువంటి సంఘటన అరుదుగా జరుగుతుంది. అరుదైన సంఘటన అని భావం.

ఈ) “హృదయశుద్ధి” :
నిర్మలమైన మనస్సుతో చేసే పని. ఏదో తప్పని పరిస్థితులలో ఎదుటివారినీ నమ్మించడానికి కాకుండా, నిండు మనస్సుతో పవిత్రమైన బుద్ధితో చేయడం.

ఉ) “జీవన పరివర్తనం” :
బ్రతుకు విధానంలో మార్పు. అప్పటివరకు సాగించే బ్రతుకు విధానంలో మార్పు రావడాన్ని ‘జీవన పరివర్తనం’ – అంటారు.

ఊ) “సమాజ పరివర్తనం” :
మన చుట్టూ ఉంటే సంఘాన్ని ‘సమాజం’ అంటారు. నాటి వరకు నడచుకొనే మార్గం నుండి కొత్త విధానంలోకి సంఘ ప్రజలు మారడాన్ని “సమాజ పరివర్తనం” అంటారు.

ఎ) “సత్కార్యాలు” :
మంచిపనులు. సంఘంలోని ప్రజల మంచికోసం చేసే పనులు సత్కార్యాలు. దానధర్మాలు చేయడం, భూదానం, నేత్రదానం, అవయవదానం వంటి మంచి పనులను సత్కార్యాలు అంటారు.

AP Board 8th Class Telugu Solutions Chapter 11 భూదానం

2. కింది పదాలకు పర్యాయపదాలు రాసి సొంతవాక్యాలు రాయండి.
అ) రాత్రి = నిశి, రేయి రాత్రిపూట చంద్రుడు ఉదయిస్తాడు.
ఆ) పల్లె = గ్రామం, జనపదం పల్లెలు ప్రగతికి పట్టుకోమ్మలు.
ఇ) హృదయం= ఎద, మనసు హృదయం నిర్మలంగా ఉండాలి.
ఈ) భూమి = వసుధ, ధరణి భూమిపై శాంతి నెలకోవాలి.
ఉ) ఆకాంక్ష = కోరిక, వాంఛ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగించాలి.

3. కింది పదాలకు నానార్థాలు రాయండి.
అ) పాపము = దుష్కృతం, పావడం
ఆ) ప్రజలు – జనులు, సంతానము
ఇ) ధనము = సంపద, ఆవులమంద
ఈ) యుగము = కృతాదియుగం, రెండు
ఉ) పొలం – కేదారము, అడవి
ఊ) వ్యవసాయం = కృషి, ప్రయత్నం, పరిశ్రమ

4. కింది వాక్యాలలో గీత గీచిన పదాలకు వికృతి పదాలు రాయండి.
అ) ప్రజలు ప్రేమతో భూమిని ఇస్తున్నారు.
ఆ) త్రిలింగ భాష మధురమైనది.
ఇ) మంచివారి హృదయంలో భగవంతుడుంటాడు.
ఈ) ఎవరి కార్యములను వారు సమర్థవంతంగా చెయ్యాలి.

ప్రకృతి వికృతి

ప్రజలు – పజలు
ప్రేమ – ప్రేముడి
భాష – బాస
త్రిలింగం – తెలుగు
హృదయం – ఎద, డెందము
కార్యం – కర్జము

V. సృజనాత్మకత

ప్రశ్న 1.
నువ్వే వినోబా స్థానంలో ఉంటే, నేటి పరిస్థితుల్లో ప్రజలకు ఏమని సందేశం ఇస్తావు ? దాన్ని రాసి ఏకపాత్రాభినయం చేయండి.
జవాబు:
“ఏకపాత్రాభినయం”

నేను గాంధీగారి శిష్యుణ్ణి. నా పేరు వినోబా భావే. నా పేరు ఈ పాటికే మీ చెవిన పడి ఉంటుంది. నేను భూదాన యజ్ఞం ప్రారంభించాను. ఈ యజ్ఞంలో మొదటి దానం చేసిన పుణ్యాత్ముడు పోచంపల్లిలో రామచంద్రారెడ్డి. ఆ దానకర్ణుడు తన గ్రామంలో దళితులకు 100 ఎకరాలు భూదానం చేశాడు. మనం తల్లికి పుట్టినప్పుడు, మన వెంట ఏమీ తీసుకురాలేదు. పోయినప్పుడు పూచికపుల్ల కూడా పట్టుకెళ్ళలేము.

మన తోటి సోదరులు బీదవారు, ఇల్లు కట్టుకోవడానికి కూడా జాగా లేక ఏడుస్తున్నారు. దాతలారా ! వారి కన్నీరు తుడవండి. భూదాన యజ్ఞంలో మీ వంతుగా ఒక సమిధ వేసి, పుణ్యం సంపాదించండి. మీకు గాంధీజీ ఆశీస్సులు ఉంటాయి. కదలండి. వస్తా …

(లేదా)

ప్రశ్న 2.
ఈనాటి పరిస్థితులకునుగుణంగా భూదానం ఆవశ్యకతను వివరిస్తూ ఒక పోస్టరును తయారుచేసి ప్రదర్శించండి.
జవాబు:
పోస్టరు

“మిత్రులారా ! భూదానం అన్ని దానాల్లో గొప్పదానం. భూదానం చేసేవారికి స్వర్గాది పుణ్యలోకాలు వస్తాయి. మీ తోడిజనంలో కొంతమంది ఇల్లు కట్టుకోవడానికి చోటులేక, కూరగాయలు పండించడానికి జాగాలేక, వ్యవసాయం చేయడానికి పొలం లేక బాధపడుతున్నారు. మీకు వ్యవసాయ కూలీలు దొరకడం లేదు.

మనం గాలి, నీరు, వెలుగు సమంగా అనుభవిస్తున్నాం. అలాగే భూమి కూడా ప్రజలందరిది. మీకున్న వంద ఎకరాలలో రెండు ఎకరాలు తక్కువైతే, మీ వారికి లోటు రాదు. కానీ ఆ రెండు ఎకరాలు మీరు దానం ఇస్తే, 100 మంది దరిద్ర నారాయణులు ఇళ్ళు కట్టుకుంటారు. కలకాలం మీ పేరు చెప్పుకుంటారు. మీకు స్వర్గం వస్తుంది.

ఎకరం పైగా దానం చేసిన రైతులకు ముఖ్యమంత్రి గారు స్వయంగా సత్కారం చేస్తారు. త్వరపడండి. భూదానం చేయండి. పుణ్యం మూట కట్టుకోండి. పత్రికల్లో మీ పేరు, మీ ఫొటోతో వేస్తారు. మరువకండి.

ఇట్లు,
భూదాన యజ్ఞం సభ్యులు.

VI. ప్రశంస

1. భూదానం అనేది ఒక సత్కార్యం. ఇలాంటివే ఇంకా ఏ ఏ సత్కార్యాలు చేయవచ్చు ? ఇలాంటి సత్కార్యాలు చేసిన వారిని అభినందిస్తూ లేఖ రాసి ప్రదర్శించండి.
జవాబు:
భూదానం ఒక మంచిపని. భూదానం లాగానే విద్యాదానం, నేత్రదానం, కిడ్నీదానం, అవయవదానం, పాఠశాలలకు కావలసిన ఫర్నిచరు దానం, పేద విద్యార్థులకు పుస్తకదానం, పేద విద్యార్థులకు ఫీజులకు ధన దానం, మెరిట్ విద్యార్థులకు బహుమతులు ఇవ్వడం, మంచి క్రీడాకారులకు షీల్డులు ఇవ్వడం వంటివి చేయవచ్చు.

సత్కార్యాలను చేసిన వారిని అభినందిస్తూ లేఖ

విజయవాడ,
x x x x x

పి. సుధీర్ కుమార్,
8వ తరగతి,
S/o రాజేంద్ర కుమార్,
శాంతి హైస్కూలు,
గవర్నరుపేట, విజయవాడ.

పూజ్యశ్రీ కె. గుణశేఖర్ గార్కి,

అయ్యా, నమస్తే. మీరు మీ ‘బంటుమిల్లి’ గ్రామంలో, దళితులకు ఇండ్లు కట్టుకోవడానికి మూడు ఎకరాల పొలం ఇచ్చారట. మీ ఊరి హైస్కూలు పిల్లలకు ఉచితంగా నోటుపుస్తకాలు, పెన్నులు ఇచ్చారట. మీ తదనంతరం మీ నేత్రాలను నేత్రదానం చేశారట. మేము పేపరులో చదివాం. మీరు చేసిన ఈ దానాలు ఎందరికో ఆదర్శంగా నిలుస్తాయి.

మీకూ, మీ దానగుణానికీ, మా పాఠశాల విద్యార్థుల తరఫున అభినందనలు. నమస్కారాలు. సెలవు.

ఇట్లు,
మీ అభిమాని,
పి. సుధీర్.

చిరునామా :
K. గుణశేఖర్,
S/o ల్యాండ్ లార్డ్,
బంటుమిల్లి,
కృష్ణాజిల్లా,
ఆంధ్రప్రదేశ్.

(లేదా)

AP Board 8th Class Telugu Solutions Chapter 11 భూదానం

2. వినోబా భూదాన ఉద్యమం కోసం చేసిన పాదయాత్రను అభినందిస్తూ, ఆయనకు ఏమని లేఖ రాస్తారు? రాసి గోడ పత్రికలో ప్రదర్శించండి.
జవాబు:

వినోబాభావే గారికి అభినందన లేఖ

గుంటూరు,
x x x x x

పి. సీతాలక్ష్మి,
8వ తరగతి,
వివేకానంద హైస్కూల్,
రాజేంద్రనగర్,
గుంటూరు.

పూజ్యశ్రీ వినోబా భావే మహాశయులకు,

నమస్కారములు. మీరు మా నగరానికి దగ్గరలో గల పోచంపల్లిలో రామచంద్రారెడ్డి గారు ఇచ్చిన వంద ఎకరాల భూదానంతో ప్రేరణ పొంది, భారతదేశంలో భూదాన యజ్ఞం ప్రారంభించారనీ, బీదలకు లక్షల ఎకరాలు భూమిని ఇప్పించారనీ మా మాష్టారు చెప్పారు. నేను మీ ఉద్యమాన్ని, యజ్ఞాన్ని గూర్చి తెలుసుకొని మురిసిపోయాను.

మీకు శతకోటి నమస్కారాలు. ప్రజలలో భూదానం చేయాలనే ప్రేరణ కల్గించిన మీకు, మా పాఠశాల విద్యార్థుల తరఫున అభినందన మందారాలు. నమస్తే.

ఇట్లు,
మీ అభిమాని,
కుమారి పి. సీతాలక్ష్మి,
8వ తరగతి,
సెక్షను-‘ఎ’.

చిరునామా :
వినోబా భావే ఆశ్రమ సంచాలకులకు,
వార్థా,
మహారాష్ట్ర.

ప్రాజెక్టు పని

1. పోచంపల్లిలో రామచంద్రారెడ్డిగారు వినోబా భావే ప్రసంగానికి ప్రేరణపొంది ఒకేసారి వంద ఎకరాలను దానం చేశారు కదా! అలా మీ ఊరిలోనూ పేరు పొందిన దాతలు కొందరు ఉంటారు కదా ! వాళ్ళ పేర్లను సేకరించి ఎవరు ఏ రకమయిన దానం చేశారో తెలియజేసే వివరాలను రాసి గోడపత్రికలో పెట్టండి.
జవాబు:
కొవ్వూరు గ్రామం పశ్చిమ గోదావరి జిల్లాలో రెవెన్యూ డివిజన్ కేంద్రము. కొవ్వూరు గ్రామం గోదావరీ నదికి పశ్చిమతీరాన ఉంది.

మా గ్రామంలో ఆంధ్ర గీర్వాణ విద్యాపీఠము అనే సంస్కృతాంధ్ర కళాశాల ఉంది. దానికి ప్రిన్సిపాలుగా కీ|| శే|| కేశిరాజు వేంకట నృసింహ అప్పారావుగారు ఉండేవారు. వారు గాంధీ మార్గంలో నడిచిన దేశభక్తులు. వినోబా భావే గారి పిలుపుతో ప్రేరణ పొంది, వీరికున్న నాలుగు ఎకరాల పంటభూమిని భూదానం చేశారు. వారు కేవలం ఖద్దరు ధరించేవారు. వీరికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఈయన మా గ్రామవాసి అని తెలిసి నేను ఆనందిస్తున్నాను.

పి. శకుంతల, యన్. శ్రీధర్
గవర్నమెంటు హైస్కూలు,
కొవ్వూరు, ప|| గో|| జిల్లా,

VII. భాషను గురించి తెలుసుకుందాం

1. కింది పదాలను విడదీయండి. సంధి పేరు రాయండి.
అ) సర్వోదయం = సర్వ + ఉదయం – గుణసంధి
ఆ) ఊహాతీతం = ఊహ + అతీతం – సవర్ణదీర్ఘ సంధి
ఇ) ఆయాచోట్ల = ఆ + ఆచోట్ల – యడాగమ సంధి
ఈ) తేవాలని = తేవాలి + అని – ఇత్వసంధి
ఉ) మరొకటి = మరి + ఒకటి – ఇత్వసంధి

AP Board 8th Class Telugu Solutions Chapter 11 భూదానం

2. కింది సమాస పదాలకు విగ్రహవాక్యాలు, సమాస నామాలు రాయండి.
అ) పాదయాత్ర – పాదములతో యాత్ర – తృతీయా తత్పురుష
ఆ) పల్లె ప్రజలు – పల్లె యందలి ప్రజలు – సప్తమీ తత్పురుష
ఇ) వంద ఎకరాలు – వంద సంఖ్యగల ఎకరాలు – ద్విగు సమాసం
ఈ) నా గ్రంథం – నా యొక్క గ్రంథం – షష్ఠీ తత్పురుష సమాసం

3. కింది వానిలో కర్తరి వాక్యం కర్మణి వాక్యంగా, కర్మణి వాక్యం కర్తరి వాక్యంగా మార్చండి.
అ) నెహ్రూ తన జాబులో సంతోషాన్ని వ్యక్తం చేశారు. (కర్తరి వాక్యం)
జవాబు:
నెహ్రూ చేత తన జాబులో సంతోషం వ్యక్తము చేయబడింది. (కర్మణి వాక్యం)

ఆ) ఆయనకు సమాధానం రాయబడి పంపబడింది. (కర్మణి వాక్యం)
జవాబు:
ఆయనకు సమాధానం రాసి పంపారు. (కర్తరి వాక్యం)

ఇ) భగవంతుడు నా మాటలకు శక్తిని ప్రసాదించాడు. (కర్తరి వాక్యం)
జవాబు:
భగవంతుని చేత నా మాటలకు శక్తి ప్రసాదింపబడింది. (కర్మణి వాక్యం)

ఈ) నాచే దీనికి భూదానయజ్ఞం అని పేరు పెట్టబడింది. (కర్మణి వాక్యం)
జవాబు:
నేను దీనికి భూదానయజ్ఞం అని పేరు పెట్టాను. (కర్తరి వాక్యం)

వ్యాకరణంపై అదనపు సమాచారం

పర్యాయపదాలు

ఇల్లు : గృహం, సదనం
హృదయం : ఎద, మనసు
వ్యవసాయం : కృషి, సేద్యము
అవసరం : ఆవశ్యకం, అక్కల
తోవ : దారి, పథము
నిర్ణయం : నిశ్చయం, సిద్ధాంతం

వ్యతిరేకపదాలు

రాత్రి × పగలు
సమిష్టి × వ్యష్టి
లక్ష్యం × అలక్ష్యం
శాంతి × అశాంతి
ప్రత్యక్షం × పరోక్షం
సుఖం × కష్టం
ప్రవృత్తి × అప్రవృత్తి
స్పష్టం × అస్పష్టం
న్యాయం × అన్యాయం
విశ్వాసం × అవిశ్వాసం
అంగీకారం × తిరస్కారం
సత్కార్యం × దుష్కార్యం
హింస × అహింస

AP Board 8th Class Telugu Solutions Chapter 11 భూదానం

ప్రకృతి – వికృతులు

దూరం – దవ్వు
శక్తి – సత్తి
రూపం – రూపు
హృదయం – ఎద, ఎడద
గుణము – గొనము
కార్యం – కర్జం
న్యాయం – నాయం
యాత్ర – జాతర
యజ్ఞము – జన్నము
సత్యం – సత్తు

సంధులు

సవర్ణదీర్ఘ సంధి
సూత్రం : అ, ఇ, ఉ, ఋలకు సవర్ణములైన అచ్చులు పరమైనప్పుడు వాని దీర్ఘం ఏకాదేశమగును.
శంకరాచార్యులు = శంకర + ఆచార్యులు – సవర్ణదీర్ఘ సంధి
ఊహాతీతుడు = ఊహ + అతీతుడు – సవర్ణదీర్ఘ సంధి
కష్టార్జితం = కష్ట + ఆర్జితం – సవర్ణదీర్ఘ సంధి
ప్రత్యక్షానుభవం = ప్రత్యక్ష + అనుభవం – సవర్ణదీర్ఘ సంధి

ఉత్వసంధి
సూత్రం : ఉత్తునకు అచ్చు పరమగునపుడు సంధియగును.
వందలాది = వందలు + ఆది – ఉత్వసంధి
సాధనమని = సాధనము + అని – ఉత్వసంధి
అవసరమైన : అవసరము + ఐన – ఉత్వసంధి

ఇత్వసంధి
సూత్రము : ఏమ్యాదులలోని, క్రియాపదాలలోని ఇత్తునకు సంధి వైకల్పికముగానగు.
కావాలనుకొని = కావాలి + అనుకొని – ఇత్వసంధి

సమాసాలు

సమాస పదంవిగ్రహవాక్యంసమాసం పేరు
హృదయ పరివర్తనముహృదయము నందు పరివర్తనముసప్తమీ తత్పురుష సమాసం
మూడు విధానాలుమూడు సంఖ్యగల విధానాలుద్విగు సమాసం
భూసమస్యభూమి యొక్క సమస్యషష్ఠీ తత్పురుష సమాసం
లక్ష ఎకరాలులక్ష సంఖ్యగల ఎకరాలుద్విగు సమాసం
రెండుమాటలురెండు సంఖ్యగల మాటలుద్విగు సమాసం
యాత్రాసాధనముయాత్ర కొరకు సాధనముచతుర్థి తత్పురుష సమాసం
భూదానంభూమి యొక్క దానముషష్ఠీ తత్పురుష సమాసం
సత్కార్యముమంచిదైన కార్యమువిశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
భూదాన యజ్ఞముభూదానమనెడి యజ్ఞమురూపక సమాసం
భూఖండముభూమి యొక్క ఖండముషష్ఠీ తత్పురుష సమాసం
శాంతియుతంశాంతితో యుతంతృతీయా తత్పురుష సమాసం
కష్టార్జితంకష్టముతో ఆర్జితంతృతీయా తత్పురుష సమాసం

కొత్త పదాలు-అర్ధాలు

అభిలషించు = కోరు
అవధులు = హద్దులు, మేరలు
అనుగ్రహించు = దయతో ఇచ్చు
అనుభూతి = ప్రత్యక్ష జ్ఞానము
అహంకారం = గర్వము
ఆత్మవిశ్వాసం = తనపై నమ్మకం
ఆటపట్టు = నిలయం, చోటు
ఆచరణ = నడవడి (చేయుట)
అర్జీ = పై అధికారులకు రాసే లేఖ.
ఈర్ష్య = ద్వేషం
ఊహాతీతం = ఊహింపశక్యం కానిది
ఔదార్యం = దాతృత్వము;
కష్టార్జితం = కష్టపడి సంపాదించినది
కుత్తుక = కంఠము
కృతనిశ్చయులు = నిశ్చయం చేసుకున్నవారు
చిత్తశుద్ధి = మనస్సు పరిశుద్ధి
జాబు = ఉత్తరము
టూకీగా = కొద్దిగా, సంగ్రహంగా
తార్కాణం = నిదర్శనము

AP Board 8th Class Telugu Solutions Chapter 11 భూదానం

తామస భావం = తమోగుణం
నిబ్బరం = స్థిరము, తదేకాగ్రత
నిక్షిప్తం = ఉంచబడినది
దళితులు = హరిజనులు
దర్శనం = చూచుట
పరిష్కరించు = చక్కబెట్టు
పరివర్తన – మార్పు
ప్రభంజనం = పెద్ద గాలి
బీజాలు = విత్తనాలు
మహత్కార్యం = గొప్ప పని
మహత్తర = గొప్ప
మాత్సర్యం = అసూయ
ముమ్మరంగా = అధికంగా
సమ్మేళనం = సమావేశం
యోచించడం = ఆలోచించడం
రాజస భావం = రజోగుణం
లోభం = దురాశ
వ్యక్తం = వెల్లడి
వాగ్దానం = మాట ఇచ్చుట
విడ్డూరం = మొండితనం
సుగమము = సులభముగా తెలియునది
సమష్టి వ్యవసాయం= అందరూ కలసి చేసే వ్యవసాయం
సమక్షం = ఎదుట
సాక్షాత్కారం = ప్రత్యక్షము
హత్తుకోవడం = చేరుకోవడం
హేతువు = కారణం
స్థిత ప్రజ్ఞులు = మనస్సులోని కోరికలను పూర్తిగా వదలి, నిర్మలమైన మనస్సుతో తృప్తి పొందేవారు ‘సిద్ధ ప్రజ్ఞులు’ అని భగవద్గీత చెబుతుంది.

AP 7th Class Social Notes Chapter 1 విశ్వం మరియు భూమి

Students can go through AP Board 7th Class Social Notes 1st Lesson విశ్వం మరియు భూమి to understand and remember the concept easily.

AP Board 7th Class Social Notes 1st Lesson విశ్వం మరియు భూమి

→ జీవరాశులున్న ఏకైక గ్రహం భూమి.

→ విశ్వాన్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఖగోళశాస్త్రం అంటారు. దీనిని రష్యన్ భాషలో “కాస్మాలజీ” అని ఆంగ్లంలో “ఆస్ట్రానమీ” అంటారు.

→ ఖగోళశాస్త్రంలో శాస్త్రీయ పరిశోధన ‘టెలిస్కోప్’ను కనుగొన్న గెలీలియో అనే ఇటాలియన్ ఖగోళ శాస్త్రవేత్తతో ప్రారంభమయింది.

→ విశ్వం యొక్క ఆవిర్భావం గురించి ‘మహా విస్ఫోటన (బిగ్ బ్యాంగ్) సిద్ధాంతం’ తెలియజేస్తుంది.

→ మహా విస్ఫోటన సిద్ధాంతాన్ని బెల్జియం దేశానికి చెందిన ఖగోళ శాస్త్రవేత్త జార్జిస్ లెమైటర్ ప్రతిపాదించాడు.

→ ప్రస్తుత విశ్వం 13.7 బిలియన్ సం||రాల క్రితం చిన్న అణువు నుండి ప్రారంభమై నేటికీ విస్తరిస్తోందని అతను గట్టిగా నమ్మాడు.

→ ‘విశ్వం’ అనే పదం లాటిన్ పదమైన ‘యూనివర్సమ్’ నుండి ఉద్భవించింది. దీని అర్థం ‘మొత్తం పదార్థం’ మరియు “మొత్తం అంతరిక్షం”.

AP 6th Class Social Notes Chapter 1 విశ్వం మరియు భూమి

→ విశ్వం సెకనుకు 70 కి.మీ. మేర విస్తరిస్తోంది.

→ ఖగోళ శాస్త్రవేత్తల ప్రకారం విశ్వంలో కనీసం 125 బిలియన్ గెలాక్సీలున్నాయి.

→ గెలాక్సీ యొక్క ఒక అంచు నుంచి మరో అంచుకు దూరం 1,20,000 కాంతి సంవత్సరాలు.

→ కాంతి సంవత్సరం అనేది దూరాన్ని కొలిచే ఒక ప్రమాణం. కాంతి ఒక సం||లో ప్రయాణించగల దూరం.

→ కాంతి సెకనుకు 3,00,000 కి.మీ. వేగంతో ప్రయాణిస్తుంది.

→ మన సౌర కుటుంబంలో 8 గ్రహాలున్నాయి. అవి బుధుడు, శుక్రుడు, భూమి, కుజుడు (అంగారకుడు), బృహస్పతి (గురుడు), శని, వరుణుడు మరియు ఇంద్రుడు.

→ శాస్త్రవేత్తల అంచనా ప్రకారం 4. 6 బిలియన్ సం||రాల క్రితమే మన సౌర కుటుంబం ఆవిర్భవించింది.

→ భూకేంద్రక సిద్ధాంతాన్ని టాలెమి అనే ఈజిప్టు ఖగోళ శాస్త్రవేత్త ప్రతిపాదించాడు.

→ సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని నికోలస్ కోపర్నికస్ అనే పోలిష్ ఖగోళ శాస్త్రవేత్త ప్రతిపాదించాడు.

→ భూమి విశ్వానికి కేంద్రమని నమ్మే సిద్ధాంతం భూకేంద్రక సిద్ధాంతం.

→ సూర్యుడు సౌరవ్యవస్థకు కేంద్రమని నమ్మే సిద్ధాంతం సూర్యకేంద్రక సిద్ధాంతం.

→ నీహారిక పరికల్పన ప్రకారం గ్రహాలు సూర్యునితో సంబంధం ఉన్న ధూళి మరియు వాయువులతో కూడిన మేఘం నుండి ఏర్పడ్డాయి.

→ ఒక ప్రాంతంలోని మొక్కలు, జంతువులు మరియు సూక్ష్మజీవులతో కూడిన అన్ని జీవ మరియు జీవరహిత కారకాలతో పనిచేసే సహజ వ్యవస్థను పర్యావరణం అంటారు.

AP 6th Class Social Notes Chapter 1 విశ్వం మరియు భూమి

→ భూమి యొక్క రాతి పొరను శిలావరణము అంటారు.

→ శిలావరణములో భూస్వరూపాలను మూడు శ్రేణులుగా విభజించారు. అవి మొదటి శ్రేణి, రెండవ శ్రేణి, మూడవ శ్రేణి.

→ శిలావరణము (లిథోస్పియర్) అనే పదం ‘లిథో’ మరియు స్నెరా అనే గ్రీకు పదాల నుంచి ఉద్భవించింది. లిథో అంటే ‘రాయి’ మరియు స్పైరా అంటే ‘గోళం’ లేదా బంతి అని అర్ధం.

→ పర్యావరణం (ఎన్విరాన్మెంట్) అనే పదం ఫ్రెంచ్ పదం అయిన ‘ఎన్విరోనర్’ అంటే ‘పొరుగు’ అనే అర్ధం నుంచి ఉత్పన్నమైంది.

→ భూమి అంతర్భాగం మూడు పొరలను కలిగి ఉంది. అవి : 1) భూ పటలం, 2) భూ ప్రావారం, 3) భూకేంద్ర మండలం.

→ వ్యవసాయం మరియు నివాసాల కోసం మనం ఉపయోగించే ఆవరణం శిలావరణము.

→ భూమి యొక్క ఉపరితలంలో ఉన్న అన్ని నీటి వనరులను సమష్టిగా జలావరణం అంటారు.

→ హైడ్రోస్పియర్ (జలావరణం) అనే పదం ‘హైడర్’ మరియు ‘స్పైరా’ అనే గ్రీకు పదాల నుండి ఉద్భవించింది. ‘హైడర్’ అంటే నీరు మరియు స్పైరా అంటే గోళం లేదా బంతి అని అర్ధం.

→ జలమును సమృద్ధిగా కలిగి ఉన్న ఏకైక గ్రహం కనుక భూమిని “జలయుత గ్రహం” అని పిలుస్తారు. – భూమి యొక్క ఉపరితలం సుమారు 2/3 వ వంతు (71%) నీటితో ఆవరించి ఉంది.

→ కేవలం 1% నీరు మాత్రమే మన అవసరాలకు ఉపయోగపడుతుంది. మిగిలిన 99% నీరు మంచు, ఉప్పు నీరు మొదలగు రూపంలో ఉంటుంది.

→ భూమి లోపల రాళ్ళ పొరల మధ్య లోతుగా ఉండే జలాన్నే భూగర్భ జలం అంటారు.

→ భూమి చుట్టూ ఉన్న గాలి యొక్క మందపాటి పొరను వాతావరణం అంటారు.

→ వాతావరణం (అట్మాస్ఫియర్) అనే పదం ‘అట్మోస్’ మరియు ‘స్పెరా’ అనే గ్రీకు పదాల నుండి ఉద్భవించింది. అట్మోస్ అంటే ‘ఆవిరి’ అని ‘స్పైరా’ అంటే గోళం లేదా బంతి అని అర్థం.

→ ఆక్సిజన్ “ప్రాణ వాయువు” గా పరిగణించబడుతుంది.

→ వాతావరణంలో ట్రోపో, స్ట్రాటో, మెసో, థర్మో మరియు ఎక్సో అనే ‘5’ (ఆవరణాలు) పొరలు కలవు.

→ వృక్షాలు, జంతువులు, కంటికి కనిపించని అసంఖ్యాక సూక్ష్మజీవులు మరియు మానవులు కలిసి ఉండే ఆవరణాన్ని జీవావరణం అంటారు.

→ జీవావరణం (బయోస్పియర్) అనే పదం గ్రీకు పదాలైన ‘బయోస్’ మరియు స్పెరా నుండి ఉద్భవించింది. ‘బయోస్’ అంటే ‘జీవితం’ మరియు స్పెరా అంటే ‘గోళం’ లేదా ‘బంతి’.

→ ప్రతి సంవత్సరం జూన్ 5వ తేదీని ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా జరుపుతున్నాం.

→ ప్రతి సంవత్సరం ఏప్రిల్ 22వ తేదీని ప్రపంచ ధరిత్రీ దినోత్సవంగా జరుపుతున్నాం.

→ ప్రతి సంవత్సరం మార్చి 22వ తేదీని ప్రపంచ జల దినోత్సవంగా జరుపుతున్నాం.

→ ప్రతి సంవత్సరం సెప్టెంబరు 16వ తేదీని ప్రపంచ ఓజోన్ దినోత్సవంగా జరుపుతున్నాం.

→ వాతావరణంలో ఆక్సిజన్ 21% కలదు.

→ వాతావరణంలో నైట్రోజన్ 78% కలదు.

→ వాతావరణంలో కార్బన్ డై ఆక్సైడ్ 0.03% కలదు.

→ వాతావరణంలో ఆర్గాన్ 0.93% కలదు.

AP 6th Class Social Notes Chapter 1 విశ్వం మరియు భూమి

→ మానవులతో ఏర్పడిన పరిసరాలను ‘మానవ పర్యావరణం’ అంటారు. ఇది వ్యక్తి కుటుంబం, సమాజం, మత, విద్య, ఆర్థిక, రాజకీయ పరిస్థితులను కల్గి ఉంటుంది.

→ మానవులు తయారు చేసిన పరిసరాలను మానవ నిర్మిత పర్యావరణం అంటారు. ఇది భవనాలు, కర్మాగారాలు, ఉద్యానవనాలు, రోడ్లు, వంతెనలు, ప్రాజెక్ట్లు మరియు స్మారక చిహ్నాలు మొ||న వాటిని కల్గి ఉంటుంది.

→ పర్యావరణంలోనికి వివిధ రకాల మలినాలు చేరడాన్ని కాలుష్యం అంటారు.

→ విపత్తు అనేది స్వల్ప లేదా దీర్ఘకాలికంగా సంభవించే తీవ్రమైన అంతరాయం.

→ వరద అనేది పొడిగా ఉన్న భూమిని మునిగిపోయేలా చేసే అధిక నీటి ప్రవాహం.

→ భూమి అంతర్భాగంలో అకస్మాత్తుగా విడుదలయ్యే తరంగాల ప్రభావంతో భూమి కంపించడాన్ని “భూకంపం” అంటారు.

→ ఏదైనా విపత్తును నివారించడానికి అవసరమైన చర్యలతో ప్రణాళిక రూపొందించడం, నిర్వహించడం మరియు అమలు చేయడం యొక్క నిరంతర, సమగ్ర ప్రక్రియనే విపత్తు నిర్వహణ అంటారు.

→ పదవ పంచవర్ష ప్రణాళికలో మొదటిసారిగా విపత్తు నిర్వహణ “అభివృద్ధి అంశం”గా నిర్ణయించబడింది.

→ విశ్వం : ఊహించలేని అనేక అంశాలు కలిగి ఉన్న విస్తారమైన అంతరిక్షమును విశ్వం అంటారు.

→ సౌర కుటుంబం : సూర్యుడు, గ్రహాలు, ఉపగ్రహాలు, గ్రహశకలాలు, ఉల్కలు మరియు తోకచుక్కలు మొదలైన ఖగోళ వస్తువులు కల్గిన వ్యవస్థ.

→ పర్యావరణం : ఒక ప్రాంతంలోని మొక్కలు, జంతువులు మరియు సూక్ష్మజీవులతో కూడిన అన్ని జీవ మరియు జీవరహిత కారకాలతో కలిసి పనిచేసే సహజ వ్యవస్థను పర్యావరణం అని అంటారు.

→ కాలుష్య కారకాలు : పర్యావరణాన్ని కలుషితం చేసే అంశాలు : ఉదా : శిలాజ ఇంధనాలను మండించటం, అడవుల నిర్మూలన, పారిశ్రామిక వ్యర్థాలు.

→ విపత్తులు : అనుకోకుండా పెద్ద ఎత్తున భారీగా ధన, ప్రాణ, ఆస్తి నష్టం కల్గించే ప్రమాదాలు. ఇవి సహజంగా సంభవిస్తాయి. ప్రకృతి విపత్తుకు ఉదా : భూకంపాలు, సునామి మొదలైనవి.

→ ఖగోళశాస్త్రం : విశ్వాన్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఖగోళ శాస్త్రం అంటారు.

→ ఖగోళ శాస్త్రవేత్త : అంతరిక్షంలో నక్షత్రాలు, గ్రహాలు మరియు ఇతర సహజ వస్తువులను అధ్యయనం చేసే వ్యక్తియే ఖగోళ శాస్త్రవేత్త.

→ మహా విస్ఫోటన (బిగ్ బ్యాంగ్) సిద్ధాంతం: ఈ విశ్వం 13.7 బిలియన్ సం||రాల క్రితం ఒక చిన్న అణువు నుండి ప్రారంభమై నేటికీ విస్తరిస్తోందని తెలియజేసే సిద్ధాంతం. దీనిని జార్జిస్ లెమైటర్ ప్రతిపాదించాడు.

AP 6th Class Social Notes Chapter 1 విశ్వం మరియు భూమి

→ కాంతి సంవత్సరం : కాంతి సంవత్సరం అనేది దూరాన్ని కొలిచే ఒక ప్రమాణం, కాంతి ఒక సం||లో ప్రయాణించగల దూరం.

→ భూకేంద్రక సిద్ధాంతం : భూమి ఈ విశాల విశ్వానికి కేంద్రమని ఈ సిద్ధాంతం చెబుతోంది.

→ సూర్యకేంద్రక సిద్ధాంతం : సూర్యుడు ఈ విశాల విశ్వానికి కేంద్రమని ఈ సిద్ధాంతం చెబుతోంది.

→ శిలావరణము : భూమి యొక్క రాతి పొర. + జలావరణము : భూమి యొక్క ఉపరితలంలో ఉన్న అన్ని నీటి వనరులను సమష్టిగా జలావరణం అంటారు.

→ వాతావరణము : భూమి చుట్టూ ఉన్న గాలి యొక్క మందపాటి పొర.

→ జీవావరణము : వృక్షాలు, జంతువులు, కంటికి కన్పించని అసంఖ్యాక సూక్ష్మజీవులు మరియు మానవులు కలసి ఉండే ఆవరణం.

→ భూమి అంతర్భాగం : 1) భూపటలము, 2) భూ ప్రావారము, 3) భూ కేంద్రము.

→ వాతావరణంలోని పొరలు : ‘ట్రోపో, స్టాటో, మెసో, థర్మో మరియు ఎక్సో ఆవరణములు.

→ మానవ పర్యావరణం : మానవులతో ఏర్పడిన పరిసరాలు. ఉదా : కుటుంబం, మతం.

→ మానవ నిర్మిత పర్యావరణం : మానవులు తయారు చేసిన పరిసరాలు.
ఉదా : భవనాలు, కర్మాగారాలు.

→ పర్యావరణ కాలుష్యం : పర్యావరణంలోనికి వివిధ రకాల మలినాలు చేరడాన్ని పర్యావరణ కాలుష్యం అంటారు.

→ విపత్తు : విపత్తు అనేది స్వల్ప లేదా దీర్ఘకాలికంగా సంభవించే తీవ్రమైన అంతరాయం.

→ విపత్తు నిర్వహణ : ఏదైనా విపత్తును నివారించడానికి అవసరమైన ప్రణాళిక రూపొందించడం, నిర్వహించడం మరియు అమలు చేయడం యొక్క నిరంతర మరియు సమగ్ర ప్రక్రియ.

→ నీటి కాలుష్యం : నీటి నాణ్యతలో ఏదైనా భౌతిక, జీవ లేదా రసాయనిక మార్పు జరిగి దానివల్ల జీవులపై దుష్ప్రభావం ఏర్పడినట్లయితే దానిని నీటి కాలుష్యంగా పరిగణిస్తారు.

AP 6th Class Social Notes Chapter 1 విశ్వం మరియు భూమి

→ పాలపుంత : మన సౌర వ్యవస్థ ఉన్న గెలాక్సీ.

→ పారిశ్రామిక విప్లవం : పారిశ్రామిక రంగంలో వచ్చిన ఆకస్మిక మార్పులు (ఉత్పత్తి రంగం).

→ వాయు కాలుష్యం : గాలిలో కార్బన్ డయాక్సెడ్ వంటి హానికరమైన మూలకాల పెరుగుదల.

→ కిరణజన్య సంయోగ : కార్బన్ డయాక్సెడ్ మరియు నీటి నుండి పోషకాలను సంశ్లేషణ చేయడానికి మొక్కలు సూర్యరశ్మిని ఉపయోగించే ప్రక్రియ.

→ గురుత్వాకర్షణ శక్తి : విశ్వంలోని రెండు వస్తువుల మధ్య ఉన్న ఆకర్షణ శక్తి.

1.
AP 7th Class Social Notes Chapter 1 విశ్వం మరియు భూమి 1

2.
AP 7th Class Social Notes Chapter 1 విశ్వం మరియు భూమి 2

3.
AP 7th Class Social Notes Chapter 1 విశ్వం మరియు భూమి 3