AP Board 9th Class Telugu Solutions Chapter 7 ఆడినమాట

AP State Syllabus AP Board 9th Class Telugu Textbook Solutions Chapter 7 ఆడినమాట Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Telugu Solutions 7th Lesson ఆడినమాట

9th Class Telugu 7th Lesson ఆడినమాట Textbook Questions and Answers

చదవండి-ఆలోచించండి-చెప్పండి

ఒక అడవిలో వేటగాడు వేటకోసం వచ్చి చెట్లను, పొదలను తొ! శిస్తున్నాడు. ఆ పొదల్లోంచి ఒక పాము బయటకు వచ్చి చెట్లను నరకవద్దు నీకు సహాయం చేస్తానని చెప్పి ఒక రత్నం ఇచ్చింది. దాన్ని అతడు ఎక్కువ ధరకు అమ్మి ధనవంతుడయ్యాడు. చేసిన మేలు మరచి అతడు పాముకు ఇన్ని మణులెక్కడివని ఆలోచించి పుట్టను కనుక్కొని అందులో ఎండు గడ్డి వేసి మంటపెట్టాడు. ఆ మంటలకు పాము చనిపోయింది. మణుల కోసం పుట్టను తవ్వుతుండగా మిగతా పాములు కరచి అతడు చనిపోయాడు. ‘కృతజ్ఞత’ లేని నరుడు క్రూరమైనవాడు కదా !

ప్రశ్నలు జవాబులు

ప్రశ్న 1.
చెట్లను నరక వద్దని పాము అనడానికి కారణమేమిటి?
జవాబు:
ఆ చెట్ల మధ్య, పొదల మధ్య ఆ పాము పెట్టిన పుట్ట ఉంది. ఆ పాము, ఆ పుట్టలో నివసిస్తోంది. తనక. నివసించడానికి పుట్ట లేకుండా పోతుందనే భయంతో పాము వేటగాడిని చెట్లను నరక వద్దని చెప్పింది.

ప్రశ్న 2.
వేటగాడు పామును ఎందుకు చంపాడు?
జవాబు:
వేటగాడికి పాము ఒక రత్నాన్ని ఇచ్చింది. దాన్ని అమ్మి వేటగాడు ధనవంతుడయ్యాడు. పాము పుట్టలో ఇంకా మరెన్నో రత్నాలు ఉంటాయని వేటగాడు ఆశించాడు. అందుకే వేటగాడు పుట్టను కనిపెట్టి ఎండుగడ్డితో దానిపై మంట వేసి పామును చంపాడు.

AP Board 9th Class Telugu Solutions Chapter 7 ససేమిరా

ప్రశ్న 3.
వేటగాడి స్వభావం ఎలాంటిది? ఇలాంటిదే మరో కథ తెలుసా మీకు?
జవాబు:
వేటగాడు, చేసిన మేలు మరచిపోయే స్వభావం కలవాడు. అనగా కృతజ్ఞత లేనివాడు. దురాశాపరుడు. పాము తనకు చేసిన మేలును మరచి, ఆ పాము పుట్టనే మంట పెట్టి ఆ పామును చంపాడు. ఈ వేటగాడు కృతఘ్నుడు. ఇలాంటి కథ మరొకటి నాకు తెలుసు.

కృతఘ్నతగల మరో జంతువు (పులి) కథ :
పూర్వము ఒక పులి, అడవిదున్నపోతును చంపి తింది. అప్పుడు పులి దవడలో ఒక ఎముక గ్రుచ్చుకుంది. పులి ఎంత విదల్చినా ఆ ఎముక ఊడి రాలేదు. పులి బాధతో విలవిలలాడింది. అప్పుడు ఆ పులి ఒక సూచీ ముఖ పక్షి దగ్గరకు వెళ్ళి, తన నోట్లో దిగిన ఎముకను లాగి తనకు సాయం చేయమని కోరింది. ఆ పక్షి, పులి మాటలు నమ్మి ఆ ఎముకను తన ముక్కుతో లాగింది. పులి బాధ తీరిపోయింది. తరువాత పులి, ఆ పక్షి స్నేహం కొనసాగించాయి. అప్పుడప్పుడు ఆ పక్షి, పులి నోట్లో గుచ్చుకున్న ఎముకలను లాగి ఉపకారం చేస్తూ ఉండేది. ఒక రోజున ఆ పులికి ఆహారం ఎక్కడా దొరకలేదు. పులి, పక్షి దగ్గరకు వెళ్ళి, తన నోట్లో దిగిన ఎముకను లాగమని చెప్పింది. పక్షి పులిమాటలు నమ్మి, పులి నోట్లో దూరి ఎముకను లాగుదామని చూస్తుండగా పులి ఆ పక్షిని కఱచి చంపింది. ఆ పులికి కృతజ్ఞత లేదు.

ఇవి చేయండి

I. అవగాహన – ప్రతిస్పందన

అ) కింది అంశాల ఆధారంగా మాట్లాడండి.

ప్రశ్న 1.
పాఠంలో ఆవు మాట్లాడిన విషయాన్నీ, పద్యాలనూ రాగయుక్తంగా పాడండి. వాటి భావం చెప్పండి.
జవాబు:
ఆవు మాట్లాడిన పద్యములు ఇవి. 1, 2, 4, 9, 10 వీటి భావాలను “పద్యాలు – ప్రతిపదార్థాలు – భావాలు”లో చూడండి.

ప్రశ్న 2.
అట్లాగే పులి మాట్లాడిన విషయాలున్న పద్యాలను రాగంతో పాడండి. వాటి భావం చెప్పండి.
జవాబు:
పులి మాట్లాడిన పద్యములు : 3, 13, 14
ఈ పద్యాల భావాలు “ప్రతిపదార్థాలు – భావాలు” వద్ద చూడండి.

ప్రశ్న 3.
క్రింది వాటిలో ఏదైనా ఒకదాన్ని సమర్థిస్తూ సరైన కారణాలతో మాట్లాడండి.
అ) “ఆడినమాట తప్పని ఆవు చాలా గొప్పది” – ఎందుకంటే …….
జవాబు:
ఆవు, పులికి మాట ఇచ్చిన విధంగా తన పుత్రునికి పాలిచ్చి, తనను తినివేయమని పులి వద్దకు తిరిగి వచ్చింది. అందుకే ఆవు గొప్పది.

AP Board 9th Class Telugu Solutions Chapter 7 ససేమిరా

ఆ) స్వభావరీత్యా పులి క్రూరమైన జంతువు. అయినా ఇచ్చిన మాట ప్రకారం వచ్చిన ఆవును చూసి, మారిన పులి ఇంకా గొప్పది. ఎందుకంటే ………
జవాబు:
పులి సహజంగా మాంసం తినే జంతువు. అయినా ఆడినమాట తప్పని ఆవును చంపలేదు. ఆవు వంటి మహాత్ముణ్ణి చంపితే తనకు అంతులేని పాపం వస్తుందని పులి చెప్పింది. ఆవును తిరిగి తన దూడవద్దకు పంపించింది. కాబట్టి పులి ఇంకా గొప్పది.

ఇ) ‘ఆడిన మాట ప్రకారం వచ్చిన ఆవు, మారిన పులి రెండూ గొప్పవే’. ఎందుకంటే ……….
జవాబు:
ఆవు ఆడిన మాటను నిలబెట్టుకుంది. కనుక ఆవు గొప్పది. పులి హింసా ధర్మాన్ని మాని, ఆడిన మాట తప్పని ఆవును చంపకుండా దయతో విడిచి పెట్టింది. కాబట్టి పులి గొప్పది.

AP Board 9th Class Telugu Solutions Chapter 7 ససేమిరా

ఆ) కింది మాటలు ఎవరు ఎవరితో అన్నారు?

అ) చెప్పేవారు చెప్పినా, వినేవారికి వివేకముండాలి.
జవాబు:
“చెప్పెడువారు చెప్పినన్ వినియెడువారి కించుక వివేకము పుట్టదె?” ఈ మాటలను పులి, ఆవుతో అంది.

ఆ) నా మనసు అసలే మెత్తనిది. దాన్నింకా పరీక్షించాలనుకోకు.
జవాబు:
“మెత్తని మనసే నాయది యెత్తి యిటులు చూడనేల”? ఈ మాటలను ఆవు తనను తినమని, పులిని బ్రతిమలాడుతూ చెప్పినది.

ఇ) నీవు ధర్మం తెలిసినదానివి. నీకెవ్వరూ సాటిలేరు.
జవాబు:
నీవు ధర్మవిదురాలవు. నీకెన యెవ్వరు? ఈ మాటలను పులి, ఆవును ప్రశంసిస్తూ చెప్పింది.

ఈ) నిన్ను కన్నందుకు ఋణవశాన ఇన్ని రోజులు సాకి పాలు ఇచ్చాను.
జవాబు:
“నిన్ను గని యిన్ని దినములు చన్నిచ్చితి ఋణవశంబున” ఈ మాటలను గోవు తన దూడతో అంది.

ఉ) ఇంతమాత్రానికే నా, ప్రాణాలు పోతాయా?
జవాబు:
“ప్రాణములింతనె పోవుచున్నవే?” ఈ మాటలను పులి, ఆవుతో చెప్పింది.

AP Board 9th Class Telugu Solutions Chapter 7 ససేమిరా

ఇ) పాఠం ఆధారంగా కింద ప్రశ్నలకు జవాబులు రాయండి.

అ) పులిని ఆవు ఏమని వేడుకున్నది? ఎందుకు?
జవాబు:
పులిని ఆవు తనకు ఏడెనిమిది రోజుల క్రితమే పుట్టిన కుమారునకు పాలు ఇచ్చి వస్తానని వేడుకున్నది. తనకు కుమారుడు జన్మించి ఏడెనిమిది రోజులు మాత్రమే అయినది వానికి ఇంకా గడ్డి మేయుట చేతకాదని కావున వానికి పాలిచ్చి తగు జాగ్రత్తలు చెప్పిరావడానికి పులిని వేడుకున్నది. ఈ

ఆ) ఆవు మాటలు విన్న పులి ఏమన్నది? ఏం చేసింది?
జవాబు:
ఆవు మాటలు విన్న పులి, ఆవును అపహాస్యం చేసి ‘ఓ గోవా ! నీవు మాట్లాడుతున్నదేమిటి? నన్ను అమాయకుణ్ణి చేసి, నీ కొడుకు దగ్గరికి వెళ్ళి వస్తానంటున్నావు. ఇది సమంజసమేనా? చెప్పేవాడు చెప్పినా, వినేవాడికి వివేకం ఉండవద్దా? అన్నది.

ఇ) ఆవు తన కొడుకుకు ఏమని బుద్దులు చెప్పింది?
జవాబు:
ఎప్పుడూ అబద్దాలు మాట్లాడకు. అక్కరకు రాని వారితో కలిసి ఉండకు. ఇతరులెవరైనా నీకు కీడు కలిగించే మాటలు మాట్లాడితే భయపడకు. వినీ విననట్లుగా ఉండి ఎదురు జవాబు చెప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపో అని బుద్ధులు చెప్పింది.

ఈ) తిరిగి వచ్చిన ఆవును చూసి పులి ఏమన్నది?
జవాబు:
నీ వంటి మహాత్ములను చంపి, పాపాన్ని మూటకట్టుకోలేను. కావాలంటే నాకు మాంసం ఎక్కడైనా దొరుకుతుంది. ఈ పులి జాతిలో నన్ను పుట్టించిన ఆ దైవం నా చేత గడ్డి తినిపించునా? (పాపాన్ని ఎందుకు చేయిస్తాడు?) ఇంత మాత్రానికే ప్రాణాలు పోతాయా ఏం”? అని పులి తిరిగి వచ్చిన ఆవుతో పలికింది.

ఉ) తినడానికి నిరాకరించిన పులితో ఆవు ఏమన్నది?
జవాబు:
“ఓ పుణ్యాత్ముడా ! ఈ కథలన్నీ ఎందుకు ? నా మనసు అసలే మెత్తనిది. దాన్నింకా పరీక్షించాలనుకోకు. నేనీ శరీరాన్ని నీకు ఇస్తానని వాగ్దానం చేశాను కదా” అని తనను తినడానికి నిరాకరించిన పులితో ఆవు పలికింది.”

II. వ్యక్తీకరణ-సృజనాత్మకత

అ) ఈ కింది ప్రశ్నలకు ఆలోచించి ఐదేసి వాక్యాలలో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
ఆకలితో ఉన్న పులిని ఆవు తన ఇంటికి వెళ్ళి రావడానికి ఒప్పించింది కదా ! పులి ఆవును నమ్మడానికి గల కారణాలు ఏమిటి?
(లేదా)
పులిని ఆవు ఏ మాటలతో నమ్మించింది?
జవాబు:
తాను తిరిగిరాకపోతే – అబద్ధాలు మాట్లాడి పెద్దలకు బాధ కలిగించేవాడు, తండ్రికి, తల్లికి ఎదురుమాట్లాడేవాడు, ఆకలితో గట్ల వెంబడి గడ్డిని మేయుచున్న ఆవును వెళ్ళగొట్టేవాడు ఏ నరకాల్లో పడతారో, తిరిగి రాకుంటే తాను కూడా అదే నరకాలలో పడతానని శపథం (ప్రమాణం) చేస్తుంది. కావున ఆవు మాటలను పులి నమ్మినది.

ప్రశ్న 2.
ఆవు తాను తిరిగి అడవికి వెళ్ళేముందు అబద్దమాడకు, పనికిరానివాళ్లతో తిరగకు అని బుద్ధులు చెప్పింది కదా ! ఆవు తన బిడ్డకు ఇంకా ఏమేమి బుద్దులు చెప్పి ఉండవచ్చు?
జవాబు:

  1. పక్క వారితో విరోధాలు పెట్టుకోకు
  2. అందరితో స్నేహం చెయ్యి
  3. వేళకు మేత తిను
  4. మేత తిని చక్కగా కడుపు
    నిండా నీళ్లు తాగి హాయిగా పడుకో వంటి నీతులు ఆవు దూడకు చెప్పవచ్చు.

ప్రశ్న 3.
ఇతరులు ఎవరైనా కీడును కలిగించే మాటలు మాట్లాడితే భయపడకు. వినీ విననట్లు ఉండి, వెళ్ళమని ఆవు తన కొడుకుతో చెప్పింది కదా ! అలా అనడానికి కారణాలు ఏమై ఉంటాయి?
జవాబు:
ఇతరులు కీడు కలిగించే మాటలు, పొగరుబోతుతనంతో మాట్లాడవచ్చు. ఆ మాటలకు భయపడి కూర్చుంటే మనం సంఘంలో ఏమీ చేయలేము. ఎవరికీ భయపడరాదు. ధైర్యంగా ఉండాలి. ఇతరులు నిందిస్తే తిరిగి వారిని నిందించరాదు. అలా ఎదురు మాటలు మాట్లాడితే తగవులు వస్తాయి. అందుకే ఆవు “ఎవరు ఏమి అన్నా భయపడకు. వారి మాటలు
పట్టించుకోకు” అని తన కొడుకుకు చెప్పింది.

ప్రశ్న 4.
“ఈ కథలన్నీ ఎందుకు” ? అని ఆవు అన్నది కదా ! ఈ మాటలనే ఇప్పుడు కూడా వాడుతుంటారు. ఏ ఏ సందర్భాల్లో వాడుతుంటారు?
జవాబు:

  1. మనం ఎవరినైనా ఎక్కడకైనా ఏదో పనిమీద పంపిస్తే, వాడు ఆ పని చేయకుండా ఎక్కడో తిరిగి వస్తాడు. పని ఏమయిందిరా అని అడిగితే ఏవో కథలు చెపుతాడు.
  2. పరీక్షలో ఎందుకు మంచి మార్కులు రాలేదంటే ఏవేవో కారణాలు చెపుతాడు. అప్పుడు పెద్దలు వాడితో “ఏవేవో కథలు చెప్పకు” అంటారు.

AP Board 9th Class Telugu Solutions Chapter 7 ససేమిరా

ఆ) కింది ప్రశ్నలకు పదేసి వాక్యాలలో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
“ఆవు-పులి” వంటి స్వభావం ఉన్నవాళ్ళు సమాజంలో ఉంటారు కదా ! వీరి స్వభావం ఎలా ఉంటుంది?
జవాబు:
ఆవు వంటి స్వభావం ఉన్నవాళ్ళు మన సమాజంలో ఉంటారు. వారు ఇతరులకు కష్టం వస్తే చూసి సహించలేరు. తనకు కష్టం కలిగినా, ఇతరులకు మేలు చేయాలనే చూస్తారు. తనకు కడుపునిండా తిండి లేకపోయినా, ఇతరులు కషాల్లో ఉన్నప్పుడు తనకు ఉన్నదంతా ధారపోసి ఎదుటివారిని ఆదుకుంటారు. సమాజంలో ఉన్నవారినందరినీ తనలాగే చూస్తారు. తనకు కష్టం వస్తే ఎలాగుంటుందో, ఇతరులకూ అలాగే ఉంటుందని వారు అనుకుంటారు.

ఆవు వంటి స్వభావం కలవారు ఎన్నడూ అబద్ధం మాట్లాడరు. ఆడినమాట కోసం తమ ప్రాణాలనైనా ధారపోస్తారు.

పులి వంటి స్వభావం కలవాళ్ళు తమ స్వార్థం కోసం ఇతరులకు హాని చేస్తారు. ఇతరులు ఎంత నష్టపోయినా వీరు పట్టించుకోరు. తమకోసం, తమవారి కోసం ఎదుటివారిని కష్టపెట్టి తమ ప్రయోజనాన్ని సాధించుకుంటారు.

పులి వంటి స్వభావం కలవారు అసత్యాలు మాట్లాడుతారు. అధర్మంగా నడచుకుంటారు. ఇతరులకు హాని చేస్తారు. పక్కవారి మంచిచెడ్డలను పట్టించుకోరు. పులి వంటి స్వభావం కలవారు అవసరమైతే ఇతరులను హత్యలు చేస్తారు. చేయిస్తారు, హింసిస్తారు, దుర్మార్గంగా నడుస్తారు.

ప్రశ్న 2.
“ఆవు” గుణగణాలను గురించి రాయండి.
జవాబు:
ఆవు ఆడినమాట తప్పని గోమాత. తన చిన్న బిడ్డకు పాలిచ్చి వస్తానని, వెళ్ళిరావడానికి తనకు అనుమతి ఇమ్మని పులిని బ్రతిమాలింది. తన బిడ్డకు గుమ్మెడు పాలు చాలునని, పులికి తన మాంసం అంతా తింటే కాని ఆకలి తీరదని, కాబట్టి ముందు తన పిల్లవాడికి పాలివ్వడం ధర్మమని నచ్చచెప్పింది. తాను అబద్ధం ఆడనని శపథాలు కూడా మాట్లాడి పులిని నమ్మించింది.

ఇంటికి వెళ్ళి ప్రేమతో కుమారుడికి పాలిచ్చి బుద్దులు చెప్పింది. ఆవు చెప్పిన బుద్ధులను బట్టి ఆవు స్వభావం చాలా మంచిదని తెలుస్తుంది. జరిగింది చెప్పి, కొడుకును ఓదార్చి పులి వద్దకు తిరిగి వచ్చింది. తన మనస్సు అసలే మెత్తనిదనీ ఇంకా పరీక్షించవద్దనీ పులికి చెప్పి, తనను తినమని పులిని బ్రతిమాలింది. దేవతలు సైతం ఆవు సత్యవాక్యశుద్ధిని మెచ్చుకున్నారు.

ప్రశ్న 3.
కథలో ఆవు గొప్పదనాన్ని తెలిపే సంఘటన ఏది? అట్లాగే పులి గొప్పదనాన్ని తెలిపే సన్నివేశం ఏది?
జవాబు:
ఆవు గొప్పదనం :
ఆవు తిరిగి వచ్చి పులిని తనను తిని కడుపు నింపుకోమంది. పులి, ఆవును చంపితే తనకు పాపం వస్తుందని చెప్పింది. అప్పుడు ఆవు పులితో “తనది అసలే మెత్తని మనస్సు అనీ, తనను ఇంకా పరీక్షించవద్దని చెప్పింది. అలాగే దూడకు బుద్ధులు చెప్పిన సంఘటన కూడా ఆవు గొప్పదనాన్ని తెలుపుతుంది.

పులి గొప్పదనం :
ఆవు చేసిన శపథములు విని, ఆవు ధర్మాత్మురాలని మెచ్చుకొని ఆవును నమ్మి ఇంటికి పంపిన ఘట్టంలో పులి గొప్పదనం తెలుస్తుంది. తిరిగివచ్చిన ఆవును తింటే తనకు దోషమనీ, తనకు మాంసం ఎక్కడైనా దొరకుతుందనీ, తనను పుట్టించిన దేవుడే తనకు ఆహారం చూపిస్తాడనీ, పులి చెప్పిన మాటలు – పులి గొప్పదనాన్ని తెలుపుతాయి.

AP Board 9th Class Telugu Solutions Chapter 7 ససేమిరా

ఇ) సృజనాత్మకంగా రాయండి. .
“ఆవు – పులి” పాత్రల సంభాషణలు రాయండి. నాటకీకరణ చేయండి.
(లేదా)
క్రూర స్వభావం గల పులి, సాధు స్వభావం గల ఆవుల మధ్య జరిగిన సంభాషణను రాయండి.
(ఆవు-పులి)
జవాబు:
పులి : ఆగు ! ఆగు ! ఈ రోజు నువ్వు నాకు ఆహారం కావలసిందే.

ఆవు : పులిరాజా ! నేను చేసిన అపరాధమేమిటి?

పులి : (ఆవును పట్టుకొని) నాకు ఆకలిగా ఉంది. నిన్ను చంపి తింటాను.

ఆవు : అయ్యా ! పులిరాజా ! నాకు ఈ మధ్యే దూడ పుట్టింది. దానికి ఏడెనిమిది రోజులు ఉంటాయి. అది గడ్డి కూడా తినలేదు. దానికి పాలిచ్చి నీ దగ్గరికి వస్తా. నన్ను విడిచి పెట్టు.

పులి : అదేం కుదరదు. నీ మాటలు నేను నమ్మను.

ఆవు : వ్యాఘ్ర కులభూషణా ! నా మాట నమ్ము. నా బిడ్డకు గుమ్మెడు పాలతో కడుపు నిండుతుంది. నీకు నా మాంసం అంతా తింటే కాని తృప్తి తీరదు. ఈ రెండు పనుల్లో ఏది ముందు చేయాలో నీకు తెలుసు. నాకు అనుమతి ఇయ్యి. తొందరగా తిరిగి వస్తా.

పులి : (అపహాస్యంగా నవ్వి) ఓ గోవా ! ఇలా మాట్లాడుతున్నావేమిటి? నన్ను మోసపుచ్చి నీ కొడుకు దగ్గరికి వెళ్ళి , వస్తానంటున్నావు. ఇది సమంజసంగా ఉందా? ఎవరైనా నీ మాటలు నమ్ముతారా?

ఆవు : అయితే శపథం చేస్తా. అబద్దాలాడే వాడు, తల్లిదండ్రులకు ఎదురు చెప్పేవాడు, మేస్తోన్న ఆవును వెళ్ళగొట్టేవాడు ఏ దుర్గతికి పోతారో, నేను తిరిగి రాకపోతే అదే దుర్గతికి పోతా. నన్ను నమ్ము.

పులి : సరే. నేను నమ్మాను. వెళ్ళి త్వరగా రా.

ఆవు : (దూడకు పాలిచ్చి తిరిగి ఆవు పులి దగ్గరకు వచ్చి) పులిరాజా ! క్షమించు. నన్ను తిని నీ ఆకలి తీర్చుకో.

పులి : శభాష్ ! మాట నిలబెట్టుకున్నావు. నీవు ధర్మాత్మురాలవు. పాపం మూటకట్టుకోలేను. నాకు మాంసం ఎక్కడైనా దొరకుతుంది. నీవు వెళ్ళిరా.

ఆవు : పులిరాజా ! నా మనస్సు అసలే మెత్తనిది. దాన్ని ఇంకా పరీక్షించాలని అనుకోకు. నా శరీరాన్ని నీకు ముందే వాగ్దానం చేశాను. నా రక్త మాంసాలతో నీ ఆకలి తీర్చుకో.

పులి : వద్దు వద్దు. నిన్ను నేను తినలేను. నీవు సత్యమూర్తివి. నీ ధర్మం నిన్ను కాపాడింది. వెళ్ళిరా !

AP Board 9th Class Telugu Solutions Chapter 7 ససేమిరా

(లేదా)
“ఆవు – పులి” రెండింటినీ ఒక కుందేలు చూసింది. ఆ కుందేలు వీటిని చూసి గొప్పగా గౌరవభావంతో పొగిడింది. ఆ కుందేలు ఆవును ఏమని పొగిడి ఉంటుంది? అట్లాగే పులిని ఏమని పొగిడి ఉంటుంది? ఊహించి రాయండి.
జవాబు:
కుందేలు ఆవును పొగడడం :
శభాష్ గోవా ! నీ వంటి ధర్మాత్మురాలిని నేను ఎక్కడా చూడలేదు. నీవు ఆడినమాటను నిలబెట్టుకున్నావు. నీ చిన్ని బిడ్డపై నీకు ఎంతో ప్రేమ ఉన్నా, దానిని విడిచిపెట్టి, ఇచ్చిన మాటకోసం పులికి ఆహారం కావడానికి సిద్ధపడ్డావు. సత్యవాక్యపాలనలో నీవు సత్యహరిశ్చంద్రుణ్ణి, బలిచక్రవర్తినీ, కర్ణుడినీ మించిపోయావు. నీవు లేదు మహాత్ముడివి. నిజానికి నీవు ధర్మమూర్తివి. నీ ధర్మమే నిన్ను కాపాడింది. నీ సత్యవాక్యశుద్ధిని, మనుష్యులూ, జంతువులూ, దేవతలూ సహితం మెచ్చుకుంటారు. భేష్.

కుందేలు పులిని మెచ్చుకోవడం :
శభాష్ పులిరాజా ! నీవు నిజంగా వ్యాఘ్రకుల భూషణుడవు. ఆవు పలికిన శపథాలు విని, దానిని నమ్మి, అది తన దూడకు పాలు ఇచ్చి రావడానికి, దానిని విడిచి పెట్టావు. అంతేకాదు అన్నమాట ప్రకారం తిరిగి వచ్చిన గోవును మెచ్చుకొని దాన్ని చంపకుండా విడిచిపెట్టావు. నీవు దయామూర్తివి. కరుణా సముద్రుడివి. దేవతలు సహితం నిన్ను పొగడకుండా ఉండలేరు.

ఈ) ప్రశంసాత్మకంగా రాయండి.
ఆవు తన కొడుక్కి మంచి బుద్ధులు చెప్పింది కదా ! అట్లాగే పిల్లలకు తల్లి చెప్పే బుద్ధులు ఏవి? ఉపాధ్యాయుడు చెప్పే మంచి బుద్ధులేవో రాయండి.
జవాబు:
పిల్లలకు తల్లి చెప్పే మంచి బుద్ధులు :

  1. తోటి పిల్లలతో దెబ్బలాడవద్దు
  2. పక్క పిల్లలతో స్నేహంగా ఉండు
  3. బట్టలు మాపుకోకు
  4. పుస్తకాలు జాగ్రత్తగా చూసుకో
  5. ఉపాధ్యాయులు చెప్పేది విని శ్రద్ధగా రాసుకో
  6. అసత్యం మాట్లాడకు
  7. మధ్యాహ్నం భోజనం చెయ్యి
  8. చెడ్డవారితో స్నేహం చెయ్యకు – మొ||నవి.

ఉపాధ్యాయుడు చెప్పే మంచి బుద్ధులు :

  1. ఏ రోజు పాఠం ఆ రోజే చదువు
  2. ఇంటిపని శ్రద్ధగా పూర్తిచెయ్యి
  3. చదువుపై శ్రద్ధ పెట్టు
  4. ఆటలు ఆడుకో
  5. వ్యాయామానికై శ్రద్ధ పెట్టు
  6. తల్లిదండ్రులను, గురువులను గౌరవించు
  7. అసత్యం మాట్లాడకు
  8. తోటి బాలబాలికలను అన్నా చెల్లెళ్ళవలె ప్రేమగా గౌరవించు – మొ||నవి. “
ఆచరించాల్సినవిఆచరించాలని అనుకొన్నవినెల తరువాత
ఆడిన మాట తప్పకపోవడంఆడిన మాట తప్పకపోవడంలేదు
అబద్ధం ఆడకుండా ఉండడంఅబద్దం ఆడకుండా ఉండడంఅవును
సమయపాలన పాటించడంభయపడకుండా ఉండడంలేదు
ఎవరైనా మనను సహాయం కోరితే సహాయం చేయడంఏ రోజు పాఠాలు ఆ రోజు చదవడంఅవును
భయపడకుండా ఉండడంనిత్యం ఉదయం నడవడంలేదు
ఇంకేమైనాఆటలలో పాల్గొనడంఅవును

IV. ప్రాజెక్టు పని

1. “ఆడినమాట తప్పరాదు!”, “సత్యవాక్కు” …… ఇలాంటి నీతికథలను మరికొన్నింటిని సేకరించండి. వాటిని రాసి ప్రదర్శించండి.
జవాబు:
“బలిచక్రవర్తి – వామనుడి కథ” శ్రీమహావిష్ణువు వామనుడిగా పుట్టి, బలిచక్రవర్తి వద్దకు వచ్చి మూడు అడుగుల నేలను దానంగా అడిగాడు. ఇస్తానని బలి మాట ఇచ్చాడు. ఇంతలో బలి చక్రవర్తి గురువు శుక్రాచార్యుడు, వామనుడు శ్రీమహా విష్ణువని, బలిని మోసం చేయడానికే వచ్చాడని, దానం ఇయ్యవద్దని అడ్డు పెట్టాడు. ఆడినమాట తప్పని బలి, వామనుడికి మూడు అడుగుల నేలను దానం చేశాడు. వామనుడు రెండు అడుగులతో భూమినీ, ఆకాశాన్ని కొలిచి, మూడవ అడుగు బలి తలపై పెట్టి అతణ్ణి పాతాళంలోకి తొక్కాడు. ఈ విధంగా బలి ఆడిన మాట తప్పలేదు.
(లేదా)
2. ఈ పాఠ్యపుస్తకంలోని పాఠాలు ఏఏకవులు/ఏఏరచయితలు రాసినవి? వాటి వివరాలు చార్టు మీద రాసి ప్రదర్శించండి.
జవాబు:
AP Board 9th Class Telugu Solutions Chapter 7 ససేమిరా 3 AP Board 9th Class Telugu Solutions Chapter 7 ససేమిరా 4

III. భాషాంశాలు

పదజాలం

అ) కింది పదాలకు అర్థాలు రాసి సొంతవాక్యాలలో రాయండి.

అ. కడుపార (కడుపునిండుగా) : పసిపిల్లలు కడుపునిండుగా పాలు తాగితే ఏడవకుండా నిద్రపోతారు.
ఆ. సుకృతం (పుణ్యం) : మన గతజన్మ సుకృతమే నేడు మనము అనుభవించేది.
ఇ. బడబాగ్ని (సముద్ర జలములోని అగ్ని) : పేదల హృదయాలలో ఆకలి మంట, బడబాగ్నిలా విజృంభిస్తోంది.
ఈ. అపహాస్యం (ఎగతాళి) : పెద్దల హితవచనాలను ఎన్నడూ అపహాస్యం చేయరాదు.
ఉ. మెత్తని మనసు (మెత్తని గుండె) . : పేదలకు నా మిత్రుడు తన మెత్తని మనస్సుతో ఎప్పుడూ సాయం చేస్తూ ఉంటాడు.
ఊ. ప్రసన్నులైరి (సంతోషించారు) : మహర్షుల తపస్సులకు మెచ్చి దేవతలు ప్రసన్నులయ్యారు.
ఎ. గగనవీధి (ఆకాశవీధి) : హనుమ గగనవీధి గుండా ఎగిరి లంకకు చేరాడు.
ఏ. దుర్గతి (హీనదశ) : నేటి పేదల దుర్గతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి.

AP Board 9th Class Telugu Solutions Chapter 7 ససేమిరా

అ) కింది పదాలకు పర్యాయ పదాలు రాయండి.
అ) పూరి : గడ్డి, తృణం
ఆ) అగ్ని : శుచి, చిచ్చు, అగ్గి, మంట
ఇ) ప్రల్లదము : పరుషవాక్యం, కఠినపు మాట
ఈ) కొడుకు : కుమారుడు, సుతుడు, పుత్రుడు మజుడు
ఉ) సత్యం : నిజం, ఒట్టు
ఊ) సత్వరం : వెంటనే, త్వరితం, చయ్యన, త్వరగా
ఎ) పులి : శార్దూలం, వ్యాఘ్రం, పుండరీకం
ఏ) ఆవు : గోవు, ధేనువు, మొదవు

ఇ) కింది వాక్యాలలో భావాన్ని బట్టి గీత గీసిన పదాలకు గల వేరువేరు అర్థాలను గుర్తించి రాయండి.

1. అరణ్యంలో పుండరీకం గాండ్రించగానే చిన్న జంతువులు కకావికలం అయ్యాయి.
సూర్యరశ్మి సోకగానే సరస్సులో పుండరీకం వికసిస్తుంది.
జవాబు:
పుండరీకం = పులి, పద్మం

2. సీత గుణములు చెవిసోకగానే శివధనస్సుకు రాముడు గుణమును బిగించుటకు ప్రయత్నించాడు.
జవాబు:
గుణము – స్వభావం, అల్లెత్రాడు

3. అందమైన తమ కులములో తమ కులము వృద్ధి చెందాలని కోరుకుంటారు.
జవాబు:
కులము = ఊరు, వంశము, తెగ, ఇల్లు, శరీరం

4. కొందరు పలుకులు మిఠాయి పలుకులుగా ఉంటాయి.
జవాబు:
పలుకు = మాట, ముక్క

5. రమణీరత్నము తన ఉంగరములో రత్నమును ధరించింది.
జవాబు:
రత్నము = శ్రేష్ఠము, మణి

AP Board 9th Class Telugu Solutions Chapter 7 ససేమిరా

ఈ) ఈ క్రింది పట్టికలోని వాక్యాలకు సంబంధించిన వ్యుత్పత్తిపదాలను రాయండి.
వ్యుత్పత్తిపదాలు : వ్యాఘ్రము, ప్రదక్షిణ, ప్రాణం, ధర్మం, రక్తం

1. శరీరాన్ని నిలిపే వాయువు = ప్రాణం
2. జనులచేత పూనబడునది = ధర్మం
3. పొడలచేత నానావర్ణాలతో శరీరం కలది = వ్యాఘ్రం
4. ఎఱ్ఱని వర్ణము కలది = రక్తం
5. దేవతాదులనుద్దేశించి మూడుసార్లు కుడివైపుగా తిరగడం = ప్రదక్షిణ

వ్యాకరణం

అ) కింది సంధులకు సంబంధించిన ఉదాహరణలను పాఠంలో వెతికి రాయండి. సూత్రాలు కూడా రాయండి.

1. ఉత్త్వసంధి : ఉత్తునకు సంధి నిత్యము
ఉదా :
ఇట్లు + అని = ఇట్లని
నేను + ఇట్లు = నేనిట్లు
నీవు + ఎన్నడు = నీవెన్నెడు

2. జశ్వసంది :
పరుషములకు వర్గ ప్రథమ ద్వితీయాక్షరాలు – శ, ష, స లు తప్ప మిగిలిన హల్లులు కానీ, అచ్చులు కానీ పరమైతే వరుసగా సరళాలు ఆదేశంగా వస్తాయి.
ఉదా :
మత్ + రక్తమాంసములు = మద్రక్తమాంసములు
వాక్ + దత్తము = వాగ్దత్తము

3. గసడదవాదేశ సంధి :
ప్రథమము మీది పరుషములకు గసడదవలగు
ఉదా :
అడుగు + తిరుగక = అడుగుదిరుకగ
అన్యచిత్త + కాక = అన్యచిత్తగాక
సక్తమ్ము + చేసి = సక్తమ్ము సేసి

4. ఇత్వసంధి :
ఏమ్యాదుల ఇత్తునకు సంధి వైకల్పికముగానగు.
ఉదా :
అంటివి + ఇది = అంటివిది, అంటివియిది
వారికి + ఇంచుక = వారికించుక, వారికి యించుక

5. యడాగమ సంధి :
సంధి లేని చోట స్వరంబు కంటె పరంబైన స్వరంబునకు యడాగమంబగు.
ఉదా :
నీ + ఉదరాగ్ని = నీ యుదరాగ్ని
నా + అది = నాయది
హింస + ఒనర్చి = హింస యొనర్చి

త్రికసంధి

ఆ) ఆ, ఇ, ఏ అను సర్వనామాలను త్రికం అంటారు. క్రింది ఉదాహరణలను గమనించండి.
అప్పులి = ఆ + పులి

1. దీనిలో ‘ఆ’ అనేది ‘త్రికము’లలో ఒకటి. ఇది దీర్ఘాక్షరం.
2. అటువంటి త్రికమైన ‘ఆ’ మీద ఉన్న అసంయుక్త హల్లు అయిన ‘పు’ అనే అక్షరానికి ద్విత్వం వచ్చి ‘ప్పు’ అయింది. అప్పుడు ఆ + ప్పులి అయినది.
3. ద్విత్వమైన ‘ప్పు’ పరమైనందువల్ల అచ్చతెనుగు ‘ఆ’ ఇపుడు ‘అ’ అయినది.. అప్పుడు ‘అప్పులి’ అయినది.

సూత్రములు :
1. ఆ, ఈ, ఏలు త్రికమనబడును.
2. త్రికంబుమీది అంసయుక్త హల్లునకు ద్విత్వంబు బహుళంబుగానగు.
3. ద్విరుక్తంబగు హల్లు పరమగునపుడు ఆచ్ఛికమగు దీర్ఘమునకు హ్రస్వంబగు.

కింది మాటలను విడదీసి రాయండి.
1. ఇచ్చోట – ఈ + చోట
2. అక్కడ – ఆ + కడ
3. ఎక్కడ – ఏ + కడ

AP Board 9th Class Telugu Solutions Chapter 7 ససేమిరా

ఇ) పాఠంలోని సమాస పదాల ఆధారంగా కింది పట్టికలోని ఖాళీ గళ్ళను పూరించండి.

సమాసంవిగ్రహవాక్యంసమాసం పేరు
1. నా సుతుడునా యొక్క సుతుడుషష్ఠీ తత్పురుష సమాసం
2. ధేనురత్నమురత్నము వంటి ధేనువురూపక సమాసం
3. ధర్మవిదుడుధర్మమును తెలిసినవాడుద్వితీయ తత్పురుష సమాసం
4. గంభీరరవముగంభీరమైన రవమువిశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
5. నాలుగు చన్నులునాలుగు సంఖ్యగల చన్నులుద్విగు సమాసము
6. అసత్యముసత్యము కానిదినఞ్ తత్పురుష సమాసం
7. తల్లిదండ్రులుతల్లి, తండ్రిద్వంద్వ సమాసం

ఈ) బహుబ్లిహీ సమాసం

కింది ఉదాహరణను గమనించండి.
చక్రపాణి – చక్రం పాణియందు (చేతిలో) కలవాడు – విష్ణువు అని అర్థం. దీంట్లో సమాసంలోని రెండు పదాలకు (చక్రానికి గాని పాణికి గాని) ప్రాధాన్యం లేకుండా ఆ రెండూ మరో అర్థం ద్వారా విష్ణువును సూచిస్తున్నాయి. ఇలా సమాసంలో ఉన్న పదాల అర్థానికి ప్రాధాన్యం లేకుండా అన్యపద అర్థాన్ని స్ఫురింపజేస్తే దాన్ని బహుప్రీహి సమాసం అంటారు. అన్యపదార్థ ప్రాధాన్యం కలది బహుజొహి సమాసం.

కింది పదాలకు విగ్రహవాక్యాలు రాయండి.
1. ముక్కంటి : మూడు కన్నుల కలవాడు (శివుడు)
2. శోభనాంగి : చక్కని అవయవములు కలది (స్త్రీ)
3. మహాత్ముడు : గొప్ప ఆత్మకలవాడు (మహానుభావుడు)
4. అన్యచిత్త : వేరు ఆలోచన కలది / కలవాడు
5. చతుర్ముఖుడు : నాలుగు ముఖములు కలవాడు (బ్రహ్మ)
6. నీలాంబరి : నల్లని వస్త్రాలు ధరించినది

ఓ) ఛందస్సు

కింది పద్య పాదాలకు గణవిభజన చేసి లక్షణాలు రాయండి.

1. ఇట్టి మహానుభావులకు హింసయొనర్చి దురంత దోషముల్
జవాబు:
AP Board 9th Class Telugu Solutions Chapter 7 ససేమిరా 1
పద్యం : ఉత్పలమాల
యతిస్థానం : 1, 10 అక్షరాలు
ప్రాస : 2వ అక్షరం
గణాలు : భ, ర, న, భ, భ, ర, వ

2. పులికి ప్రదక్షిణించి తలపుం బలుకున్ సదృశంబుగాగన (స్థలిత)
జవాబు:
AP Board 9th Class Telugu Solutions Chapter 7 ససేమిరా 2
పద్యం : చంపకమాల
యతిస్థానం : 1, 10 అక్షరాలు
ప్రాస : 2వ అక్షరం
గణాలు : న, జ, భ, జ, జ, జ, ర

ఊ) అలంకారాలు

7వ పద్యంలోని అలంకారాన్ని కనుక్కొని పేరు రాసి లక్షణాలతో సరిపోల్చండి.

రూపకాలంకారం : పాషాణ ధేనువు
ఇచట ఉపమేయమైన ధేనువును, ఉపమానమైన పాషాణానికే అభేదం చెప్పబడింది. కనుక ఇది రూపకాలంకారము. ఉపమాన ఉపమేయములకు అభేదము చెప్పుట రూపకాలంకారం.

ఋ) స్వభావోక్తి

“మునుమునుబుట్టె ………………… దయాగుణముల్లసిల్లగన్”
పద్యంలో గోవు యొక్క కొడుకు మొన్నమొన్ననే పుట్టాడని, ముద్దుముద్దుగా ఉంటాడని, ఏడెనిమిది రోజుల వయస్సు కలవాడని, కొద్దిగా గడ్డిని కూడా తినలేడని – ఉన్నది ఉన్నట్లుగా చక్కని పదజాలంతో వర్ణించారు. కనుక ఇది స్వభావోక్తి అలంకారం. ఇలా ఏదైనా విషయాన్ని ఉన్నది ఉన్నట్లుగా వర్ణిస్తే దానిని స్వభావోక్తి అలంకారం అంటారు.
ఉదా :
జింకలు బిత్తర చూపులు చూస్తూ చెవులు నిగిడ్చి చెంగుచెంగున గెంతుతున్నాయి.

స్వభావోక్తి అలంకారానికి రెండు ఉదాహరణలు రాయండి.

  1. ఆ తోటలోని చిలుకలు పచ్చని రెక్కలతో, ఎఱ్ఱని ముక్కుతో పండు తినుచున్నది.
  2. ఆమె ముఖము కాటుక కళ్ళతో, చిరునగవు పెదవులతో చూపురులను ఆకర్షిస్తున్నది.

9th Class Telugu 7th Lesson ఆడినమాట కవి పరిచయం

కవిపేరు : అనంతామాత్యుడు (అనంతుడు)
కాలం : 15వ శతాబ్దం
జన్మస్థలం : శ్రీకాకుళక్షేత్ర సమీపంలోని పెనుమకూరు
రచనలు : భోజరాజీయం – 2092 పద్యాల ప్రబంధ గ్రంథం. ఛందోదర్పణం – ఛందశ్శాస్త్ర గ్రంథము (నాలుగు ఆశ్వాసాల గ్రంథం) రసాభరణం – అలంకారశాస్త్ర గ్రంథము (నాలుగు ఆశ్వాసాలతో 344 గద్య పద్యాలు కలవు.)
కవితాదృక్పథం : ప్రతికథలోను నైతికత, సత్యం, త్యాగం అను సుగుణాలు ఉంటాయి.

పద్యాలు – ప్రతి పదార్థాలు-భావాలు

1వ పద్యం : కంఠస్థ పద్యం
*చ. మునుమును బుట్టె నాకు నొక ముద్దులపట్టి, యతండు పుట్టి యే
డెనిమిది నాళ్లపాటి గలఁడింతియ, పూరియు మేయనేరఁ డేఁ
జని, కడుపారం జన్గుడిపి చయ్యన వచ్చెద, నన్నుఁ బోయి ర
మ్మని సుకృతంబు గట్టికొనవన్న ! దయాగుణ ముల్లసిల్లఁగన్.
ప్రతిపదార్థం :
నాకున = నాకు
మునుమును = ముందుగా (తొలి సంతానంగా)
ఒక ముద్దుల పట్టి = ఒక ముద్దు బిడ్డ
పుట్టెన్ = పుట్టాడు
అతండు, పుట్టి = ఆ బిడ్డ పుట్టి
ఏడు + ఎనిమిది నాళ్లపాటి
గలడు = ఎనిమిది రోజులయింది
ఇంతియ = ఇంకా
పూరియున్ = గడ్డి కూడా
మేయనేరడు = తినడం చేతకాదు
ఏన్ + చని = నేను వెళ్ళి
కడుపారన్ = బిడ్డకు కడుపునిండా
చనుడిపి = పాలిచ్చి
చయ్యనన్ = వెంటనే
వచ్చెదన్ = తిరిగివస్తాను
దయాగుణము + ఉల్లసిల్లగన్ = దయాగుణం వెల్లడి అయ్యేటట్లు
నన్నున్ = నన్ను
పోయిరమ్ము + అని = వెళ్ళి రమ్మని చెప్పి
సుకృతంబు = పుణ్యము
కట్టికొనవన్న (కట్టికొనుము + అన్న) = కూడగట్టుకోవయ్యా!

భావం :
అయ్యా ! నాకు తొలి సంతానంగా పుట్టిన ముద్దుల బిడ్డ వయస్సు డెనిమిది రోజులు మాత్రమే. వాడికింకా గడ్డి మేయడం కూడా రాదు. వాడికి కడుపు నిండా పాలిచ్చి వెంటనే వస్తాను. దయతో నేను వెళ్ళిరావడానికి అంగీకరించి పుణ్యం కట్టుకో అని ఆవు పులితో చెప్పింది.

AP Board 9th Class Telugu Solutions Chapter 7 ససేమిరా

2వ పద్యం :
ఉ. గుమ్మెడు పాల నా సుతునకుం బరితృప్తి జనించుఁగాని, మాం
సమ్ము సమస్తముం గొనక చాలదు నీ యుదరాగ్ని కైన, ని
కుమ్ముగ నిందులోఁబ్రథమ కార్య వినిర్గతి నీ వెఱుంగవే,
పొమ్మన వన్న ! వ్యాసకులభూషణ! చయ్యనఁ బోయి వచ్చెదన్.
ప్రతిపదార్థం :
నా సుతునకున్ = నా బిడ్డకు
గుమ్మెడు పాలన్
(గుమ్మ + ఎడు = గుమ్మెడు) = ఒక పాలధారతో
పరితృప్తి = సంతృప్తి
జనించున్ = కలుగుతుంది
కాని = కానీ
నీ + ఉదర + అగ్నికిన్ + ఐనన్ = (నీయుదరాగ్నికైనన్) = నీ కడుపు మంటకు అయితే
మాంసమ్ము సమస్తమున్ = నా మాంసాన్ని అంతా
కొనక = తినక
చాలదు = సరిపోదు
నిక్కమ్ముగ = నిజంగా
ఇందులోన్ = ఈ విషయంలో
ప్రథమ కార్య వినిరతి = ముందుగా చేయవలసిన పని
నీవు + ఎరుంగవే = నీకు తెలియదా?
వ్యాఘ్రకుల భూషణ – పులుల వంశంలో శ్రేష్ఠుడా!
పొమ్మనవన్న = (పొమ్మనుము + అన్న) వెళ్ళు అని చెప్పవయ్యా!
చయ్యనన్ = వెంటనే
పోయి వచ్చెదన్ = వెళ్ళి తిరిగివస్తాను.

భావం :
ఓ పులివంశంలో శ్రేష్ఠుడా ! గుమ్మెడు పాలతో నా కుమారునకు తృప్తి కలుగుతుంది. నా మాంసము అంతా తింటే కాని నీ ఆకలి మంట చల్లారదు. అయినా నిజంగా దేనికి ప్రాధాన్యం ఇవ్వాలో నీకు తెలియదా? నాకు అనుమతి ఇయ్యి. తొందరగా వెళ్ళివస్తాను.

3వ పద్యం :
చ. అనవుడు పుండరీక మపహాస్యముచేసి ‘యిదేమి గోవ! యి
ట్లనియెదు, నన్ను బేల్పఱచి యాత్మజుఁ దున్నెడ కేగి సత్వరం|
బునఁ జనుదెంతు నంటి విది పోలునె, చెప్పెడువారు చెప్పినన్
వినియెదువారి కించుక వివేకము పుట్టదె, యింత యేటికిన్.
ప్రతిపదార్థం :
అనవుడు = (ఆవు) అట్లనగా
పుండరీకము = పెద్దపులి
అపహాస్యము చేసి = ఎగతాళి చేసి
గోవ = ఓ ఆవా !
ఇదేమి = ఇది + ఏమి ఇదేమిటి?
ఇట్లు + అనియెదు = ఇలా అంటున్నావు
నన్నున్ = నన్ను
బేల్పఱచి = అమాయకుని చేసి
ఆత్మజుడు = నీ కొడుకు
ఉన్నెడకున్ (ఉన్న+ఎడకున్) = ఉన్న చోటుకు
ఏగి = వెళ్ళి
సత్వరంబునన్ = త్వరగా
చనుదెంతున్ = తిరిగి వస్తాను
అంటివి = అన్నావు
ఇది, పోలునె = ఇది తగినదా? (ఇలా అనడం బాగుందా?)
చెప్పెడువారు = చెప్పేవారు
చెప్పినన్ = చెప్పినా
వినియెడువారికిన్ = వినే వారికి
ఇంచుక = కొంచెము
వివేకము = ఆలోచన (తెలివి)
పుట్టదె (పుట్టదు + ఎ) = పుట్టవద్దా
ఇంత + ఏటికిన్ = ఇదంతా ఎందుకు?

భావం :
ఆవు అట్లా అనగానే పులి అపహాస్యం చేసి, ‘ఓ గోవా ! ఇదేమిటి? ఇలా మాట్లాడుతున్నావు? నన్ను అమాయకుణ్ణి చేసి, నీ కొడుకు దగ్గరికి వెళ్ళి వస్తానంటున్నావు. ఇది బాగుందా? చెప్పేవాడు చెప్పినా వినేవాడికి కొంచెం వివేకం ఉండవద్దా ! ఇదంతా ఎందుకు?’ అన్నది.

AP Board 9th Class Telugu Solutions Chapter 7 ససేమిరా

4వ పద్యం : కంఠస్థ పద్యం
ఉ. ప్రల్లదమాడి పెద్దలకు బాధ యొనర్చునతండు, తండ్రికిం
దల్లికి మాజుపల్కెడు నతండును, నాఁకొని వచ్చి మొడ్లచే
సుల్ల మెలర్ప మేయఁజనుచున్న వృషంబు నదల్చునాతఁడు
ద్రెళ్ళాడు నట్టిదుర్గతులఁ దెళ్ళుదు నేనిటు రాక తక్కినన్.
ప్రతిపదార్థం :
ప్రల్లదము + ఆడి = కఠినమైన మాట మాట్లాడి
పెద్దలకు = పెద్దవారికి
బాధ + ఒనర్చు + అతండు = బాధ కలిగించేవాడూ
తండ్రికిన్ = తండ్రికిని
తల్లికిన్ = తల్లికి
మాఱు పల్కెడు + అతండును = ఎదురు తిరిగి మాట్లాడేవాడునూ
ఆ కొని వచ్చి = ఆకలితో వచ్చి
ఒడ్ల (ఒడ్డుల) = గట్లపై గల
చేను = సస్యము
ఉల్లము + ఎలర్బన్ = మనస్సునకు సంతోషము కలిగేటట్లు
మేయన్ = మేయడానికి
చను చున్న (చనుచున్ + ఉన్న) = వెళుతున్న
వృషంబున్ = ఎద్దును
అదల్చునాతడున్ (అదల్చు + ఆతడున్) = బెదరించేవాడునూ
త్రెళ్ళెడునట్టి = పడేటటువంటి
దుర్గతులన్ = నరకాలలో
నేను = నేను
ఇటురాక = తిరిగి ఇటువైపురాక
తక్కినన్ = మానేస్తే
తెళ్ళుదున్ = పడతాను

భావం :
కఠినమైన మాటలు మాట్లాడి పెద్దలకు బాధ కలిగించేవాడూ, తండ్రికీ, తల్లికీ ఎదురు మాట్లాడే వాడూ, ఆకలితో గట్ల వెంబడి గడ్డిని మేస్తున్న పశువును (ఎద్దును) వెళ్ళగొట్టేవాడూ, ఏ నరకాలలో పడతారో, తిరిగి నేను నీ దగ్గరికి రాకపోతే నేను ఆ నరకాలలో పడతాను.

5వ పద్యం :
క. అని శపథంబులు పలికిన
విని వ్యాఘ్రము – “నీవు ధర్మవిదురాలవు నీ
కెన యెవ్వరు, ధేనువ ! యే
నిను నమ్మితిఁ బోయి రమ్మ” నినఁ బటుబుద్దిన్,
ప్రతిపదార్థం :
అని = అట్లని
శపథంబులు పలికినన్ = శపథాలు మాట్లాడగా, (ఒట్లు పెట్టగా)
వ్యాఘ్రము = పులి
విని = విని
నీవు = నీవు
ధర్మవిదురాలవు = ధర్మం తెలిసిన దానవు
నీకున్ = నీకు
ఎవ్వరు = ఎవరు
ఎన = సాటి వస్తారు
ధేనువ = ఓ గోవా !
ఏన్ = నేను
నినున్ = నిన్ను
నమ్మితిన్ = నమ్మాను
పోయి రమ్ము =
అనినన్ = అని పులి అనగా
పటు బుద్దిన్ = (ఆవు) మంచి బుద్ధితో

భావం :
అని ఆవు పలికిన శపథాలు విన్న ఓ గోవా ! నీవు ధర్మం తెలిసిన దానవు. నీకెవ్వరూ సాటిరారు. నేను నిన్ను నమ్మాను. నీవు వెళ్ళిరా” అని చెప్పింది. ఆవు అప్పుడు చక్కని బుద్ధితో.

AP Board 9th Class Telugu Solutions Chapter 7 ససేమిరా

6వ పద్యం :
చ. పులికిఁ బ్రదక్షిణించి తలఁపుంబలుకున్ సదృశంబు గాఁగ, న
సలిత విలాసయాన మెసంగం బురికేఁగెఁ జతుస్తనంబులుం
బలసి పొదుంగు బ్రేఁగుపఱుపంగ గభీర రవంబుతోడ వీ
థుల నడయాడు బాలకులు దోరపు భీతిఁ దొలంగి పాఱఁగన్
ప్రతిపదార్థం :
పులికిన్ = పులికి
ప్రదక్షిణించి = ప్రదక్షిణము చేసి
తలపున్ = ఆలోచనయూ
పలుకున్ = మాటయూ
సదృశంబు = సమానము
కాగన్ = కాగా
చతుస్తనంబులున్ = నాలుగు చన్నులునూ
బలసి = పుష్టిపొంది
పొదుంగు = పొదుగు
త్రేగు పఱుపంగన్ = చేపగా
అస్ఖలిత = తొట్రుపాటు లేని
విలాసయానము = విలాసపు నడక
ఎసగన్ = అతిశయింపగా
గంభీరవంబుతోడన్ = గంభీరమైన ధ్వనితో
వీథులన్ = వీధులలో
నడయాడు = సంచరించే
బాలకులు = పిల్లలు
తోరపు భీతిన్ (తోరము + భీతిన్) = పెద్ద భయంతో
తొలంగి = ప్రక్కకు తప్పుకొని
పాఱగన్ = పరుగెత్తగా
పురికేగెన్ (పురికిన్ + ఏగెన్) = తన నివాస స్థలానికి వెళ్ళింది

భావం :
ఆవు, పులికి ప్రదక్షిణము చేసింది. తన బిడ్డకు సంబంధించిన ఆలోచనలూ, మాటలూ ఏకమయ్యాయి. స్తనములు లావెక్కి పొదుగు చేపుకు వచ్చింది. ఆవు గంభీర ధ్వని చేసింది. వీధులలో తిరిగే పిల్లలు పెద్ద భయంతో ప్రక్కకు తప్పుకొని పారిపోతుండగా ఆవు విలాసంగా నడుస్తూ, తన నివాసానికి వెళ్ళింది.
పురాతన

7వ పద్యం :
చ. కొడుకు చనుగ్రోలుచున్నంత దదవుఁ దల్లి
యడుగు దిరుగక కదలక యన్యచిత్త
గాక పై నీఁగ సోఁకినఁ గదలకుండా
నెమ్మిఁ బాషాణధేనువు నిలిపినట్లు.
ప్రతిపదార్థం :
కొడుకు = తన దూడ
చనుగ్రోలు చున్న = పాలు త్రాగుచున్న
అంతతడవు = అంత సేపూ
తల్లి = తల్లియైన ఆ ఆవు
అడుగు + తిరుగక = (తన) కాలు మరలింపక
కదలక = కదలకుండా
అన్యచిత్త + కాక = వేరు ఆలోచన లేక
పైన్ = తనపైన
ఈగ సోకినన్ = ఈగ వాలినా
పాషాణ ధేనువున్ = రాతి ఆవును
నిలిపినట్లు = నిలబెట్టినట్లు
నెమ్మి = దూడపై ప్రేమతో
కదలకుండె (కదలక + ఉండె) = కదలకుండా నిలబడింది.

భావం :
కొడుకు పాలు తాగుతున్నంత సేపూ ఒక్క అడుగు కూడా కదల్చకుండా, తన ఆలోచనంతా బిడ్డపైనే ఉంచి, తన మీద ఈగ వాలినా కూడా కదలకుండా, ప్రేమతో రాతి ప్రతిమలా ఆవు నిలిచి ఉంది.

8వ వచనం:
వ. అయ్యవసరంబున
(ఆ + అవసరంబున) = ఆసమయంలో
తా॥ ఆ సమయంలో

AP Board 9th Class Telugu Solutions Chapter 7 ససేమిరా

9వ పద్యం :
క. ‘నిన్నుఁ గని యిన్ని దినములు
చన్నిచ్చితి నేను ఋణవశంబున. నిఁక నీ
వెన్నఁడు నన్నుఁ దలంపకు ,
మన్న ! మమత్వంబు విడువు మన్న, మనమునన్’
ప్రతిపదార్థం :
నిన్నున్ + కని = నిన్ను నా పుత్రునిగా కని;
ఋణవశమునన్ = ఋణానుబంధం వల్ల
ఇన్ని దినములు = ఇన్ని రోజులూ
చన్నిచ్చితి (చన్ను + ఇచ్చితి) = పాలు ఇచ్చాను
అన్న = నాయనా
ఇఁకన్ = ఇంకముందు
నీవు = నీవు
ఎన్నడున్ = ఎప్పుడూ
నన్నున్ = నన్ను గూర్చి
తలంపకుము = ఆలోచించకు
అన్న = నాయనా
మనమునన్ = మనస్సులో
మమత్వంబు మమకారము (నా తల్లియనే అభిమానము)
విడువుము = విడిచిపెట్టు.

భావం :
నిన్ను కన్నాను. నీకూ నాకూ మధ్య ఉన్న ఋణానుబంధం చేత ఇన్ని రోజులూ నీకు పాలు ఇచ్చాను. ఇంక నీవు నన్ను ఎప్పుడూ తలంపవద్దు. నీ మనస్సులో ఇంక అమ్మ అనే భావాన్ని రానీయకు.

10వ పద్యం :
క. ఆడకు మసత్యభాషలు
కూడకు గొఱగానివాని గొంకక యొరు లె
గాడిన నెదు రుత్తరమీల
జూడకు విని విననివాని చొప్పునఁ జనుమీ.
ప్రతిపదార్థం :
అసత్య భాషలు = అబద్దపు మాటలు
ఆడకుము = మాట్లడకుము
కొఱగాని వానిన్ = పనికి మాలినవాడిని
కూడకు = చేరకు (పొందుచేయకు)
ఒరులు = ఇతరులు
ఎగ్గాడినన్ (ఎగు. + ఆడినన్) = నిందించినా
కొంకక = జంకక
ఎదురు + ఉత్తరము = ఎదురు జవాబు (తిరిగి సమాధానము)
ఈఁజూడకు (ఈన్ + చూడకు) = ఇయ్యాలని చూడవద్దు
విని = అవతలి వారి మాటలు విని కూడా
విననివాని చొప్పునన్ = విననట్టి వాడివలె
చనుమీ = వెళ్ళు

భావం :
అసత్యపు మాటలు మాట్లాడకు. అక్కరకు రాని వారితో కలసి ఉండకు. ఇతరులు ఎవరైనా నీకు కీడు కలిగించే మాటలు మాట్లాడితే, తిరిగి ఎదురు జవాబు చెప్పకు. విని కూడా వినని వాడివలె అక్కడి నుండి వెళ్ళిపో.

11వ పద్యం :
కం. చులుకన జలరుహతంతువు
చులుకన తృణకణము దూది చుల్కనసుమ్మీ !
యిలనెగయు ధూళిచులను
చులకనమరి తల్లిలేని సుతుడు కుమారా!
ప్రతిపదార్థం :
కుమారా ! = ఓ కుమారా ! (గోవత్సమా !)
ఇలనే = ఈ భూమిపై
జలరుహతంతువు = తామరతూడు
చులకన = లోకువ
తృణకణము = గడ్డిపరక
చులకన = లోకువ
దూది = ప్రత్తి
చుల్కన = తేలిక
ఎగయు = ఎగురుతున్న
ధూళి = దుమ్ముకూడా
చులకన = తేలిక
మఱి = అదేవిధంగా
తల్లిలేని = తల్లి లేని అనాధ ఐన
సుతుడు = కుమారుడు కూడా
చులకన సుమ్మీ = లోకువగా చూడబడతాడు కదా!

భావం :
ఈ లోకంలో తామరతూడు, గడ్డి పరక, ప్రత్తి, దుమ్ములను తేలికభావంతో చూస్తారు కదా ! అలాగే తల్లి లేని పిల్లలను కూడా అందరూ లోకువగా చూస్తారు. అని ఆవు తన కుమారునికి చెప్పింది.

12వ వచనం :
వ. అని గడుపాఱఁ బాలు కుడిచి తనిసిన కొడుకునకుం గడచిన
వృత్తాంతం బంతయు నెఱింగించి, పెద్దగా నేడ్చు కొడుకు నెట్టకేల
కోదార్చి, తగ బుద్ధి చెప్పి యా మొదవు పులియున్న వనంబునకు
మగిడి వచ్చిన …..
ప్రతిపదారం :
అని = అని ఆవు దూడకు చెప్పి
మును = ముందు
పుట్టగన్ + చేసిన + అట్టి = పుట్టించినట్టి
దైవము = భగవంతుడు
ఈ పట్టునన్ = ఈ సమయములో
పూరిన్ = గడ్డిని
మేపెడినే = (నాచే) తినిపిస్తాడా?
ప్రాణములు = నా ప్రాణాలు
ఇంతనె = నీ మాంసము మాత్రము చేత
పోవుచున్నవే = పోతాయా?

భావం :
అని ఆవు బుద్దులు చెప్పి, తనివి తీరా పాలు త్రాగిన కొడుకును చూసి జరిగిన సంగతి అంతా చెప్పింది. అది విని గట్టిగా ఏడుస్తున్న కొడుకును ఎట్లో ఓదార్చి, తగిన బుద్ధులు చెప్పి, ఆవు తిరిగి ఆ పులి ఉన్న అడవికి తిరిగి వచ్చింది. అప్పుడు పులి ఆవుతో ఇలా అంది.

AP Board 9th Class Telugu Solutions Chapter 7 ససేమిరా

13వ పద్యం : కంఠసపద్యం
*ఉ. ఇట్టి మహానుభావులకు హింస యొనర్చి దురంత దోషముల్
గట్టికొనంగఁజాల, మటి కల్గవె మాంసము లొండుచోట, నీ
పుట్టువునందు నన్ను మును పుట్టఁగఁ జేసినయట్టి దైవ మీ
పట్టునఁ బూరి మేపెడినే ! ప్రాణములింతనె పోవుచున్నవే !
ప్రతిపదార్థం :
ఇట్టి మహానుభావులకున్ = ఇంత గొప్ప ఔదార్య బుద్దిగల నీ వంటి వారికి
హింస + ఒనర్చి = హింసించి (చంపి)
దురంత దోషముల్ = అంతులేని పాపములను
కట్టికొనంగన్ + చాలన్ = మూట కట్టుకోలేను
ఒండు చోటన్ = మరోచోట
మాంసములు = మాంసములు
కల్గవె = లభింపవా!
ఈ పుట్టువునందు = ఈ జన్మమునందు
నన్నున్ = నన్ను
కడుపాఱన్ = కడుపు నిండా
పాలుకుడిచి = పాలు త్రాగి
తనిసిన = తృప్తి పడిన
కొడుకునకున్ = తన పుత్రునకు
కడచిన వృత్తాంతంబు + అంతయున్ = జరిగిన సంగతినంతా
ఎఱింగించి = తెలిపి
పెద్దగాన్ + ఏడ్చు, కొడుకున్ = పెద్దగా ఏడుస్తున్న పుత్రుని
ఎట్టకేలకున్ + ఓదార్చి = చిట్టచివరకు ఓదార్చి
తగన్ = తగు విధంగా
బుద్ధి చెప్పి = బుద్ధులు చెప్పి
ఆ మొదవు = ఆ ఆవు
పులి = పులి
ఉన్న వనంబునకున్ = ఉన్న అడవికి
మగిడి = తిరిగి
వచ్చినన్ = రాగా

భావం :
ఇటువంటి మహాత్ములను హింసించి అంతులేని పాపాల్ని మూటకట్టుకోలేను. మాంసాలు నాకు మరొక చోట దొరకవా ! ఈ పులి జాతిలో నన్ను పుట్టించిన ఆ దైవం, నాచే గడ్డి తినిపిస్తాడా? ఇంత మాత్రానికే నా ప్రాణాలు పోతాయా?” అని పులి ఆవుతో అన్నది.

14వ పద్యం : కంఠస్థ పద్యం
మ. అని యా ధేనువుఁ జూచి-నీ విమల సత్య ప్రొధికిన్ మెచ్చు వ
చ్చె, నినుం జంపఁగఁ జాల, నీదు తలగాచెన్ ధర్మ మీ ప్రొద్దు, పొ
మ్ము నిజావాసము చేర, నీ సఖులు సమ్మోదంబునుం బొంద నీ
తనయుం డత్యనురాగముం బొరయఁ జిత్త ప్రీతిమై నొందఁగన్
ప్రతిపదార్థం :
అని = పులి ఆ విధంగా ఆవుతో అని
ఆ ధేనువున్ = ఆ ఆవును
చూచి = చూచి
నీ = నీ యొక్క
విమల = నిర్మలమైన
సత్యప్రౌఢికిన్ = సత్యము యొక్క గొప్పతనానికి
మెచ్చు = ప్రీతి (సంతోషము)
వచ్చెన్ = కల్గింది
నినున్ = నిన్ను
చంపగన్ + చాలన్ = చంపజాలను
ఈ ప్రొద్దు = ఈ వేళ
ధర్మము = నీ ధర్మగుణము
నీదు = నీయొక్క
తల + కాచెన్ = తలను రక్షించింది
నీ సఖులు = నీ తోడి గోవులు
సమ్మోదంబునున్ + పొందన్ = మిక్కిలి సంతోషాన్ని పొందేటట్లు
నీ తనయుండు = నీ కుమారుడు
అత్యనురాగమున్ = మిక్కిలి ప్రేమను
పొరయన్ = అనుభవించేటట్లు
చిత్తప్రీతి = (నీ) మనస్సులో సంతోషము
మైనొందగన్ = కలిగేటట్లుగా
నిజావాసము (నిజ + ఆవాసము) = నీ యొక్క నివాస స్థానమును
చేరన్ + పొమ్ము = చేరడానికి వెళ్ళు. (సమీపించుము)

భావం :
పులి ఆవుతో అట్లు చెప్పి, ఆ ఆవును చూచి “నీవు మాట నిలబెట్టినందుకు నాకు సంతోషము కలిగింది. నిన్ను నేను చంపలేను. నీ ధర్మము ఈ రోజు నిన్ను రక్షించింది. నీ తోడివారు సంతోషించేటట్లు, నీ కొడుకు నీ ప్రేమను పొందేటట్లు, నీ మనస్సుకు ప్రీతి కలిగేటట్లు, నీ ఇంటికి నీవు వెళ్ళు” అని చెప్పింది.

AP Board 9th Class Telugu Solutions Chapter 7 ససేమిరా

15వ వచనం :
వ. అనిన నప్పులికి న మ్మొద విట్లనియె
ప్రతిపదార్థం :
అనినన్ = పులి అట్లనగా
అప్పులికిన్ = (ఆ + పులికిన్) ఆ పులితో
అమ్మొదవ = (ఆ + మొదవు) ఆ ఆవు
ఇట్లనియె = (ఇట్లు + అనియె) ఇలా అంది

భావం :
పులి చెప్పిన మాటలు విని, ఆవు పులితో ఇలా చెప్పింది.

16వ పద్యం :
క. ‘మెత్తని మనసే నాయది
యెత్తి యిటులు చూడనేల ? యో పుణ్యుడ ! నే’
నిత్తనువు నీకు మును వా
గ్దత్తము చేసినది కాదె ! కథ లేమిటికిన్.
ప్రతిపదార్థం :
ఓ పుణ్యుడా = ఓ పుణ్యాత్ముడా ! (ఓ పులి రాజా !)
కథలు + ఏమిటికిన్ = ఈ కథలు అన్నీ ఇప్పుడు ఎందుకు?
నా + అది = నాయది; (కాపాడింది)
మెత్తని మనసు + ఏ = అసలే మెత్తని మనస్సు
ఒత్తి = గట్టిగా నొక్కి
ఇటులు = ఈ విధంగా
చూడన్ + ఏల = పరీక్షించి చూడడం ఎందుకు?
నేను = నేను
ఇతనువు (ఈ + తనువు) = ఈ శరీరం
నీకున్ = నీకు
మును = ముందుగానే
వాగ్దత్తము (వాక్ + దత్తము) = మాటతో ఇచ్చినది
కాదె = కాదా?

భావం :
ఓ పుణ్యాత్ముడా ! “ఈ కథలన్నీ ఎందుకు? నా మనసు అసలే మెత్తనిది. దాన్ని ఇంకా పరీక్షించాలని అనుకోవద్దు. నేను నా శరీరాన్ని ఇస్తానని నీకు ముందే వాగ్దానం చేశాను కదా”.

AP Board 9th Class Telugu Solutions Chapter 7 ససేమిరా

17వ వచనం :
వ. కావున పగలించి యుపవాసభారం బంతయుఁ
బోవునట్లు మద్రక్తమాంసములతో సక్తమ్ము సేసి
నాకుఁ బుణ్యమ్ము ప్రసాదింపుము.
ప్రతిపదార్థం :
కావున = కాబట్టి
పగలించి = చీల్చి
ఉపవాస భారంబు = నీ ఉపవాస భారాన్ని; (తిండి లేకుండా ఉన్న నీ కష్టమును)
అంతయున్ = అంతా
పోవునట్లు = పోయేటట్లు
మద్రక్త మాంసమ్ములతోన్ మత్ = నా యొక్క
రక్తమాంసములతోన్ = రక్తంతో, మాంసంతో
సక్తమ్ము + చేసి = ఆరగించి
నాకున్ = నాకు
పుణ్యమ్ము = పుణ్యమును
ప్రసాదింపుము = అనుగ్రహింపుము

భావం :
“కాబట్టి నన్ను చీల్చి, నీ ఉపవాస భారము అంతా పోయేటట్లు, నా రక్తమాంసాలు ఆరగించి, నాకు పుణ్యం ప్రసాదించు.

18వ పద్యం :
క. అని గంగడోలు బిగియఁగఁ
దన మెడ యెత్తుకొని కపిల దగ్గఱఁ జనుదెం
చినఁ జూచి పుండరీకము
వెనువెనుకకె పోవు గాని విజువదు దానిన్.
ప్రతిపదార్థం :
అని = అట్లని
కపిల = ఆ కపిల ధేనువు
గంగడోలు = తన మెడ కింద ఉండే తోలు
బిగియగన్ = బిగించి
తనమెడ = తన మెడ
ఎత్తుకొని = పైకి ఎత్తి
దగ్గఱన్ = (పులికి) దగ్గరగా
చనుదెంచినన్ = రాగా
చూచి = ఆవును చూచి
పుండరీకము = పులి
వెనువెనుక = వెనుకకు వెనుకకే
పోవున్ + కాని – పోతోంది కానీ
దానిన్ = ఆవును
విఱువదు = (పైనబడి) చీల్చదు.

భావం :
అని చెప్పి ఆవు తన గంగడోలు బిగించి, తన మెడ ఎత్తి, పులి దగ్గరకు వెళ్ళగా, ఆ పులి వెనుక వెనుకకే వెడుతోంది. కానీ ఆవును చంపడానికి ముందుకు రాలేదు.

AP Board 9th Class Telugu Solutions Chapter 7 ససేమిరా

19వ పద్యం :
సీ. ‘కుడువంగ ర’ మ్మని తొడరి చుట్టముఁ బిల్వ
నాఁకలి గా దొల్ల ననుచుఁ బెనఁగు
నతఁడును బోలె నాతతశోభనాంగియై
తనరు నా ధేనురత్నంబు దన్ను
భక్షింపు మని పట్టుపటుప, సద్యోజ్ఞాన
శాలియై పరగు శార్దూలవిభుఁడు
దా నొల్ల నని పల్కఁ దమలోన నొక కొంత
దడవు ముహుర్భాషితంబు లిట్లు
ఆ. జరుగుచుండ గోవుసత్యవాక్శుద్ధికిఁ,
బులి కృపాసమగ్రబుద్ధికిని బ్ర
సన్ను లైరి సురలు; సాధువాదము లుల్ల
సిల్లె గగనవీథి నెల్లయెడల.
ప్రతిపదార్థం :
కుడువంగన్ = తినడానికి
రమ్మని = రమ్మని
తొడరి = పూనుకొని
చుట్టమున్ = బంధువును
పిల్వన్ = పిలువగా
ఆకలి + కాదు = ఆకలిగా లేదు
ఒల్లన్ + అనుచున్ = ఇష్టము లేదని (వద్దని)
పెనుగు+అతడును+పోలెన్ = పెంకితనము చేసే వాడిలా (మొరాయించే వాడిలా)
ఆతత శోభ నాంగియై ఆతత = విస్తృతమైన (అధికమైన)
శోభన+అంగి+ఐ = చక్కని అవయవములు గలదై
తనరు = ఒప్పునట్టి
ఆ ధేనురత్నంబు = ఆ రత్నము వంటి ఆవు
తన్నున్ = తనను
భక్షింపుము + అని = తినుమని
పట్టు పఱుపన్ = పులిని లొంగ దీయు చుండగా (బ్రతిమాలుచుండగా)
సద్యోజ్ఞానశాలియై = అప్పుడే కలిగిన జ్ఞానముతో కూడినదై
పరగు = ఒప్పునట్టి
శార్దూల విభుడు = పులిరాజు
తాను = తాను
ఒల్లను + అని = అంగీకరించనని (తిననని)
పల్కన్ = చెప్పగా
తమలోనన్ = ఆ పులికీ, ఆవుకూ మధ్య
ఒక కొంత తడవు = ఒక కొంచెం సేపు
ముహుః + భాషితంబులు = మాటి మాటికీ అవసరం లేక పోయినా మాట్లాడే మాటలు
ఇట్లు = ఈ విధంగా
జరుగుచుండన్ = సాగుచుండగా
గోవు సత్యవాక్శుద్ధికిన్ = ఆవు యొక్క సత్య వాక్యము యొక్క పవిత్రతకూ
పులి = పులి యొక్క
కృపా సమగ్ర బుద్ధికిని; కృపా = దయతో
సమగ్ర = నిండిన
బుద్ధికిని = బుద్ధికీ
సురలు = దేవతలు
ప్రసన్నులు + ఐరి = సంతుష్టులైరి
గగన వీధిన్ = ఆకాశ వీధిలో
ఎల్లయెడలన్ = అన్ని చోట్ల
సాధువాదములు = భళీ బాగు, సాధు అనే మాటలు
ఉల్లసిల్లెన్ = కలిగాయి. (పుట్టాయి, వినిపించాయి)

భావం :
తినడానికి రమ్మని బంధువును పిలిస్తే ఆకలిగా లేదు వద్దని పేచీ పెట్టే వాడిలా, చక్కని అవయవములతో ఒప్పిన ఆ శ్రేష్ఠమైన ఆవు తనను తినమని పులిని బ్రతిమాలంగా, జ్ఞానము కల్గిన ఆ పులిరాజు తాను తిననని చెప్పాడు. ఇలా వారు మాటిమాటికీ మాట్లాడుతున్నారు. అప్పుడు దేవతలు గోవు యొక్క సత్యవాక్య పవిత్రతకూ, పులి యొక్క దయతో నిండిన బుద్ధికీ సంతోషించారు. ఆకాశ వీధిలో అన్ని దిక్కులలో భళీ, బాగు అనే మాటలు వినిపించాయి.

కఠిన పదాలకు అర్థాలు

గుమ్మ = పాలు పితికేటప్పుడు వచ్చేధార
సుతుడు = కుమారుడు
పరితృప్తి = సంతోషం
ఉదరాగ్ని = కడుపులో మంట, ఆకలిమంట
వినిర్గతం = బయలు వెడలినది
వ్యాఘ్రము = పెద్దపులి
కులభూషణుడు = కులం మొత్తానికి అలంకారం వంటి వాడు, గొప్పవాడు
ఆత్మజుడు = కొడుకు
సత్వరం = వెంటనే
పాషాణము = రాయి
అసత్యభాషలు = అబద్దాలు
శార్దూలము = పెద్దపులి

AP Board 9th Class Telugu Solutions Chapter 11 ధర్మదీక్ష

AP State Syllabus AP Board 9th Class Telugu Textbook Solutions Chapter 11 ధర్మదీక్ష Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Telugu Solutions 11th Lesson ధర్మదీక్ష

9th Class Telugu 11th Lesson ధర్మదీక్ష Textbook Questions and Answers

చదవండి-ఆలోచించండి-చెప్పండి

వారణాసిని బ్రహ్మదత్తుడు పరిపాలిస్తున్నప్పుడు బోధిసత్వుడు ఐదువందల మంది శిష్యులతో హిమాలయాల్లో ఉండేవాడు. ఒకసారి ఎండలు బాగా కాసి అన్ని చోట్లా నీరు ఎండిపోయింది. జంతువులు నీళ్ళు దొరక్క అల్లాడిపోయాయి. శిష్యులలో ఒకడు వాటి దప్పిక తీర్చడంకోసం ఒక తొట్టి తయారుచేసి, దూరంగా ఉన్న నీళ్ళను తెచ్చి ఆ తొట్టెలో పోసేవాడు. జంతువులు గుంపులు గుంపులుగా వచ్చి ఆ నీరు తాగుతుండటంతో శిష్యుడికి పండ్లు తెచ్చుకోవడానికి గూడా తీరిక చిక్కలేదు. తనేమీ తినకుండానే ఆ జంతువులకు నీళ్ళు పోసేవాడు. ఇది చూసి జంతువులన్నీ మోయగలిగినన్ని పళ్ళు తెచ్చి ఇతనికివ్వాలని నిర్ణయించుకుంటాయి. అవన్నీ కలిపితే రెండువందల యాభై బండ్లు నిండాయి. వాటిని అక్కడి ఐదువందలమంది శిష్యులు తృప్తిగా తినేవాళ్ళు.

ప్రశ్నలు జవాబులు

ప్రశ్న 1.
జంతువులు ఎందుకు అల్లాడిపోయాయి?
జవాబు:
ఎండలు బాగా కాసి అన్నిచోట్లా నీరు ఎండిపోయింది. జంతువులు నీళ్ళు దొరక్క అల్లాడిపోయాయి.

ప్రశ్న 2.
వాటి బాధ ఎలా తీరింది?
జవాబు:
బోధిసత్వుని శిష్యులలో ఒకడు, జంతువుల దప్పిక తీర్చడం కోసం ఒక తొట్టి తయారుచేసి, దూరంగా ఉన్న నీళ్ళను తెచ్చి ఆ తొట్టిలో పోసేవాడు. జంతువులు వచ్చి ఆ నీటిని త్రాగుతూ ఉండేవి. ఆ విధంగా వాటి దాహ బాధ తీరింది.

ప్రశ్న 3.
ఈ కథ ద్వారా మీరు గ్రహించిందేమిటి?
జవాబు:
మనం తోటి ప్రాణులకు సహాయం చేస్తే, ఆ ప్రాణులు తిరిగి మనకు సహాయం చేస్తాయి. మనం తోటి మానవులకే కాక పరిసరాల్లో ఉన్న జంతువులకు సహితం సాయం చేయాలి. వాటిపై దయ చూపాలి. మనం సాయం చేస్తే జంతువులు సహితం మనకు సాయం చేస్తాయని ఈ కథ ద్వారా మనం గ్రహించగలం. మన పని మనం చేస్తే, మంచి ఫలితాలు దానంతట అవే వస్తాయని ఈ కథ తెలుపుతుంది.

AP Board 9th Class Telugu Solutions Chapter 11 ధర్మదీక్ష

ప్రశ్న 4.
జీవకారుణ్యం అంటే ఏమిటి?
జవాబు:
‘జీవకారుణ్యం’ అంటే ప్రాణులపై దయ అని అర్థం. తోటి మనుష్యుల పైననే కాకుండా, ప్రాణం గల జంతువులన్నింటి మీద కూడా దయ గలిగి ఉండాలి. దానినే ‘జీవకారుణ్యం’ అంటారు.

ప్రశ్న 5.
‘కర్తవ్య నిర్వహణ’ అంటే మీరేమని భావిస్తున్నారు?
జవాబు:
‘కర్తవ్యం’ అంటే ‘ప్రతి జీవి పాటించి తీరవలసిన నిష్ఠ’ అని అర్థం. ప్రతి వ్యక్తికి తాను చేయవలసిన ముఖ్యమైన పనులు ఉంటాయి. చేయవలసిన పనిని వదలకుండా ఆ పనిని చేయడాన్ని ‘కర్తవ్య నిర్వహణ’ అంటారని నేను భావిస్తున్నాను.

ఇవి చేయండి

I. అవగాహన – ప్రతిస్పందన

అ) కింది అంశాల గురించి తెలపండి.

ప్రశ్న 1.
ఈ కథను మీ సొంతమాటల్లో చెప్పండి.
జవాబు:
“ధర్మదీక్ష”

ఆళవీ గ్రామంలో నందగోపాలుడు అనే ఆవులను పెంచే గోపాలకుడు ఉండేవాడు. ఒకరోజు సాయంత్రం ఆవులు అన్నీ మేతమేసి, ఇంటికి తిరిగి వచ్చాయి. ఒక్క ఆవు రాలేదు. దాని దూడ దాని తల్లి కోసం అంబా అంటూ అరుస్తోంది. నందగోపుడికి ఆ ఆవు పులివాత పడిందేమో అని భయం వేసింది.

మరునాడు తెల్లవారకుండానే అతడు ఆవును వెదకడానికి బయలుదేరాడు. నందగోపుడు అడవిలోని ఆవును వెదకడానికి వెడుతున్నాడు. పొరుగూరి జనం అంతా తీర్థ ప్రజలా ఆళవీ గ్రామానికి వస్తున్నారు. కారణం ఏమిటని నందగోపాలుడు అడిగితే ఆ రోజు గౌతమ బుద్ధుడు ఆళవీ గ్రామానికి వస్తున్నాడనీ, మధ్యాహ్నభిక్ష తరువాత శ్రావస్తీ నగరానికి ఆయన వెడతాడనీ ఒక ముసలితాత నందగోపుడికి చెప్పాడు.

నందగోపుడు తాను తప్పిపోయిన ఆవును వెదకడానికి వెడుతున్నానని అతనితో చెప్పాడు. ఆవు కోసం వెతుకుతూ ఉంటే, బుద్ధుని దర్శనం తనకు కాదేమో అని నందుడికి భయం పట్టుకుంది. వెనకడుగు వేశాడు. కానీ అతనికి ఆవు దూడ అరచినట్లనిపించింది. నందుడు మధ్యాహ్నం వరకూ అడవిలో ఆవుకోసం వెదికాడు. ఇంతలో మిట్టమధ్యాహ్నవేళలో ఆవు ఆర్తనాదం వినిపించింది. అతి కష్టంపై ఆవును పట్టుకొని నందగోపుడు అన్నపానాలకు అలమటిస్తూనే ఆళవీ గ్రామానికి బయలుదేరాడు.

ఆళవీ గ్రామానికి బుద్ధుడు భిక్షువులతో వచ్చి గ్రామస్థుల విందును ఆరగించాడు. పొరుగూరి జనం ఎందరో బుద్ధుని ధర్మబోధలు విందామని వచ్చారు. మధ్యాహ్నం 3 గంటలు కాబోతోంది. బుద్ధుడు ఇంకా బోధలు మొదలు పెట్టలేదు. ఎవరికోసమో ఆయన తలఎత్తి చూస్తున్నాడు. ఇంతలో ఆలస్యమయిపోతోందని నందగోపాలుడు సరాసరి బుద్ధుడు విడిది చేసిన వటవృక్షం దగ్గరకు ఆవుతో వెళ్ళాడు. బుద్ధునికి నమస్కరించాడు. తనకు బుద్ధ దర్శనం అయ్యిందని నందుడు సంతోషించాడు.

బుద్దుడు లేచి, నందగోపాలుడికి దగ్గరుండి భోజనం పెట్టించాడు. అతని ఆవు దగ్గరకు దాని దూడ వచ్చి పాలు తాగుతోందని, దానికోసం బెంగ పెట్టుకోవద్దనీ నందుణ్ణి బుద్ధుడు ఊరడించాడు. నందుడి దగ్గర గోసాముద్రిక రహస్యాలను బుద్ధుడు తెలుసుకొన్నాడు.

తరువాత బుద్ధుడు అష్టాంగ ధర్మాన్ని బోధించాడు. ప్రజలంతా ఆనందంలో మునిగితేలారు. నందగోపుడికి బుద్ధుడు ధర్మదీక్ష ఇచ్చాడు. భిక్షువులంతా బుద్ధుడు నందగోపాలునిపై చూపిస్తున్న ఆదరానికి ఆశ్చర్యపడ్డారు. బుద్ధుడు వారికి తాను నందగోపాలుని కోసమే, ఆళవీ గ్రామానికి వచ్చానని తెలియ చెప్పాడు. అది విన్న భిక్షువులు, నందగోపాలుని గౌరవభావంతో చూశారు. నందగోపాలుడు మాత్రం ఆ లేగ దూడవల్లే తనకు బుద్ధుని దర్శనం లభించిందని, దూడను ముద్దు పెట్టుకున్నాడు.

ప్రశ్న 2.
ఈ పాఠానికి ‘ధర్మదీక్ష’ అనే పేరు సరైందేనా? ఎందుకు?
జవాబు:
ఈ పాఠమునకు ధర్మదీక్ష అని పేరు పెట్టారు. ఈ పేరు కొంతవరకు సరిపోతుంది. గోవులను పోషిస్తూ జీవించే నందగోపాలుడికి గౌతమ బుద్ధుడు ధర్మదీక్షను అనుగ్రహించాడు. కాబట్టి ధర్మదీక్ష అనే పేరు సరయినదే. అయితే ఈ పాఠంలో నందగోపాలుడి గోవాత్సల్యం సంపూర్తిగా కనిపిస్తుంది. అతడు బుద్ధుడి ధర్మ బోధనను వినాలనుకున్నా, దానికంటే ముందుగా తనకు గల గోవాత్సల్యానికే ప్రాధాన్యం ఇచ్చాడు. నందగోపాలుడు ఆకలి దప్పులను లెక్కచేయక ఆకలితో నకనకలాడుతూనే గోవును వెదకి పట్టుకున్నాడు. బుద్ధ దర్శనం కాదేమో అనే భయంతో నేరుగా బుద్ధుడు విడిది చేసిన వటవృక్షం వద్దకు వచ్చాడు. ఎందరో భక్తులు, బుద్ధుడు అనుగ్రహించే ధర్మదీక్ష కోసం ఎదురుచూస్తూ ఉంటారు. అటువంటి ధర్మదీక్షను స్వయంగా బుద్ధుడే నందగోపుడికి అనుగ్రహించాడు.

కాబట్టి ధర్మదీక్ష అనే పేరు ఈ పాఠానికి సరిపోతుంది.

AP Board 9th Class Telugu Solutions Chapter 11 ధర్మదీక్ష

ఆ) కింది మాటలు ఎవరు ఎవరితో అన్నారు? ఎందుకన్నారు?

ప్రశ్న 1.
ఆళవికి పోతున్నాను బాబూ!
జవాబు:
ఆవును వెతకడానికి నందగోపాలుడు అడవికి పోతున్నాడు. ఆళవీ గ్రామానికి బుద్ధ బోధనలు వినడానికి ఎందరో
వస్తున్నారు. అందులో ఒక ముసలివాడితో, “ఎక్కడికి తాత ! ఈ ప్రయాణం !” అని నందగోపుడడిగాడు. ఆ ప్రశ్నకు జవాబుగా ముసలి తాత నందగోపుడితో “ఆళవికి పోతున్నాను బాబూ” అన్నాడు.

ప్రశ్న 2.
నీకింకా తెలియదా?
జవాబు:
“ఎక్కడికి తాతా! ఈ ప్రయాణం!” అని నందగోపుడు ఆళవీ గ్రామానికి బుద్ధ బోధనలు వినడానికి వస్తున్న తాతను అడిగాడు. ఆళవికి వెడుతున్నానని తాత చెప్పాడు. అప్పుడు ఆ తాత, నందగోపాలుణ్ణి బుద్ధుడు వస్తున్నాడని “నీకింకా తెలియదా?” అని ప్రశ్నించాడు.

ప్రశ్న 3.
ఇంకా భోజన పదార్థాలేమైనా మిగిలి ఉన్నాయా?
జవాబు:
నందగోపుడు తప్పిపోయిన ఆవును పట్టుకొని ఎలాగో శ్రమపడి మధ్యాహ్నం మూడుగంటల సమయంలో బుద్ధుని వద్దకు వచ్చి నమస్కరించాడు. అప్పుడు బుద్ధుడు లేచి నిలబడి అక్కడ ఉన్న తన శిష్యులతో “ఇంకా భోజన పదార్ధములు ఏమైనా మిగిలి ఉన్నాయా” అని ప్రశ్నించాడు.

ప్రశ్న 4.
ఆనందగోపాలుని కోసమే !
జవాబు:
బుద్ధుడు తన వద్దకు వచ్చిన నందగోపాలునికి భోజనం పెట్టించి, ఆదరంతో చూసి ధర్మబోధచేసి, ధర్మదీక్షను అనుగ్రహించాడు. బుద్ధుడు నందగోపాలునిపై చూపిస్తున్న ఆదరాభిమానాలను చూచి మిగిలిన భిక్షువులు గుసగుసలు మాట్లాడుకున్నారు. బుద్ధదేవుడు నందగోపాలుని గోవాత్సల్యాన్ని మెచ్చుకొని, కేవలం నందగోపాలుణ్ణి చూడడం కోసమే తాను ఆళవీ గ్రామానికి వచ్చానని శిష్యులతో అన్నాడు.

ప్రశ్న 5.
బాబూ నేనేమీ ఎరగని వట్టి అమాయకుణ్ణి.
జవాబు:
బుద్ధుడు నందగోపాలకుడి కోసమే, తాను ఆళవీ గ్రామానికి వచ్చానని చెప్పాడు. బౌద్ధ భిక్షువులు నందగోపాలుని గౌరవించి నిలబడ్డారు. అప్పుడు నందగోపాలుడు లేచి నిలబడి, “బాబూ నేనేమీ ఎరగని వట్టి అమాయకుణ్ణి అని, భిక్షువులతో అమాయకంగా మాట్లాడాడు.

AP Board 9th Class Telugu Solutions Chapter 11 ధర్మదీక్ష

ఇ) కింది పేరా చదవండి. ఖాళీలు వివరించండి.

‘కర్తవ్యం. ………… ప్రతి జీవీ పాటించి తీరవలసిన నిష్ఠ. ఒక వానపాము ఎంత అల్పజీవి! మట్టిలో పుడుతుంది. మట్టి తింటుంది. మట్టిల్ మరణిస్తుంది. మరెందుకు అది జన్మ తీసుకుంటుంది. విచిత్రమైన విషయం ఏమిటంటే మట్టేదాని జీవనాధారమూ, జీవితమూ అయినా మట్టికీ దాని అవసరం ఉంది. అది మట్టిని తలకిందులు చేస్తుంది. గుల్లగుల్ల చేస్తుంది. గునపాలు చేయలేని ఆ సున్నితమైన వ్యవసాయాన్ని, సుకుమారమైన శరీరంతో శ్రద్ధగా అదే దాని జీవిత లక్ష్యం అన్నంత కర్తవ్యనిష్ఠతో చేస్తుంది. మనిషి మాత్రం అల్పజీవుల అవసరం ఏమిటన్న తేలికభావంతో ఉదాసీనత ప్రదర్శిస్తున్నాడు.
1. కర్తవ్యం అంటే ప్రతి జీవీ పాటించవలసిన నిష్ఠ.
2. వానపాము జీవనాధారం మట్టి.
3. మనిషి ఉదాసీనత చూపించేది అల్పజీవులయందు.
4. పై పేరాకు శీర్షిక ‘కర్తవ్య నిష్ఠ’.
5. పై పేరాలోని ముఖ్యమైన ఐదు పదాలు : 1) కర్తవ్యం 2) అల్పజీవి 3) జీవనాధారము 4) ఉదాసీనత 5) కర్తవ్య నిష్ఠ

ఈ) పాఠం ఆధారంగా కింది ప్రశ్నలకు జవాబులు రాయండి.

ప్రశ్న 1.
నందగోపుడు ఆరాటపడడానికి కారణం ఏమిటి?
జవాబు:
నందగోపుడి గోవులన్నీ సాయంత్రం తిరిగి వచ్చాయి. ఒక్క ఆవు మాత్రం రాలేదు. ఆ ఆవు దూడ ‘అంబా’ ‘అంబా’ అంటూ అరుస్తోంది. ఆ దూడ పుట్టినప్పటి నుండి నందగోపాలుని ఇల్లంతా పాడిపంటలతో కళకళలాడింది. అందుకే ఆ ఆవన్నా, ఆ దూడన్నా నందగోపాలుడికి ఎంతో ఇష్టం. దూడ తల్లి కోసం అదే పనిగా అరుస్తూ ఉండటంతో నందగోపుడికి అన్నం సయించలేదు. రాత్రి తెల్లవార్లూ, నందగోపుడు ఆవు ఏమైపోయిందో అని ఆరాటపడుతూనే ఉన్నాడు.

ప్రశ్న 2.
నందగోపునికి ఆ ఆవంటే ఎందుకంత ఇష్టం?
జవాబు:
ఆ ఆవు నందగోపాలుడి ఇంట్లోనే పుట్టి అతని పాపలతో పాటు పెరిగి పెద్దదయ్యింది. అతని పాపలందరూ ఆ ఆవు పాలు తాగి క్రమంగా పెరిగి పెద్దవారయ్యారు. నందుడు కూడా వారితో బాటే ఆ ఆవు పాలు తాగి పెద్దవాడయ్యాడు.

ఈ మధ్యనే దానికి ఒక కోడె దూడ పుట్టింది. కోడె పుట్టిన వేళ మంచిది. ఆనాటి నుండీ, నందగోపుని ఇల్లంతా పసిపాప నవ్వులతో కళకళలాడింది. అందుకే ఆ ఆవు అంటే నందగోపాలునికి బాగా ఇష్టం.

ప్రశ్న 3.
గ్రామస్థులు బౌద్ధ భిక్షువులకు ఏయే ఏర్పాట్లు చేశారు?
జవాబు:
ఆళవీ గ్రామస్థులు బౌద్ధ భిక్షువులకు ఎదురేగి, అతిథి సత్కారాలతో ఎంతో ఆప్యాయంగా ఆదరించారు. విశాలమైన మఱ్ఱిచెట్టు నీడలో వారికి విడుదులు ఏర్పాటు చేశారు.

తరువాత తాము ప్రత్యేకంగా భిక్షువులకు విందు చేస్తామనీ, విందు ఆరగించవలసిందనీ వారిని బ్రతిమాలారు. ఈ విధంగా బౌద్ధ భిక్షువులకూ, బుద్ధునికీ గ్రామస్థులు విందు ఏర్పాట్లు చేశారు.

ప్రశ్న 4.
గౌతమ బుద్ధుడు నందగోపుణ్ణి ఏమేం అడిగాడు?
జవాబు:
గౌతమ బుద్ధుడు నందుణ్ణి గోవును గురించీ, కోడె దూడను గురించి ఎన్నో కుశల ప్రశ్నలు వేశాడు. నందగోపుడు, తను కోడె దూడ నుదుటిపై నల్లని మచ్చలను గురించి, ఒంటిమీద సుడులను గురించి, ఎవరికీ తెలియని రహస్య సాముద్రిక విషయాలను చెప్పాడు. తాను వంశపారంపర్యముగా గ్రహించిన కొన్ని గోసాముద్రిక రహస్యాలను నందగోపుడు బుద్ధునికి తెలిపాడు. గౌతమబుద్ధుడు అడిగిన కొన్ని కొన్ని చిన్న సందేహాలను నందగోపుడు గౌతమునకు తెలిపాడు.

AP Board 9th Class Telugu Solutions Chapter 11 ధర్మదీక్ష

ప్రశ్న 5.
నందగోపుడు తన ధర్మాన్ని నిర్వర్తించాడని ఎలా చెప్పగలవు?
జవాబు:
నందగోపుడు సరళవర్తనం, సాధు స్వభావం కలవాడు. అతన్ని ఎంతగా ఆకలిమంట బాధించినా, అతడు తన గోపాలక ధర్మాన్ని మరువలేదు. అతనికి గోవులపై గల వాత్సల్యం అపారము. ముప్ఫై క్రోశాల దూరం నడిచి, ఎంతో శ్రమపడి అందుకే బుద్ధుడు నందగోపుణ్ణి చూడటానికి ఆళవీ గ్రామానికి వచ్చాడు.

ఆవు తప్పిపోయిందని తెలియగానే నందగోపుడు ఎంతో ఆరాటపడ్డాడు. అతనికి అన్నం సహించలేదు. మర్నాడు మిట్ట మధ్యాహ్నం దాటిపోయే వరకు తనను ఆకలి దహించి వేస్తున్నా, తనకు దాహం వేస్తున్నా ఆవును అతడు వెతికి పట్టుకున్నాడు. ఈ సంఘటన నందగోపునికి గల గోవాత్సల్యాన్నీ, అతని ధర్మ నిర్వహణనూ తెలియపరుస్తుంది.

II. వ్యక్తీకరణ-సృజనాత్మకత

అ) కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
‘గోధూళివేళ అంటే ఏ సమయం? ఆ సమయంలో గ్రామంలో వాతావరణం ఎలా ఉంటుంది?
జవాబు:
గోధూళి వేళ అంటే సాయం సమయం, అది ఆవులు మేతకు వెళ్ళి, ఇంటికి తిరిగి వచ్చే సమయం. ఆవులు మెడలో కట్టిన గంటలు చప్పుడు చేస్తూ, ఇంటి ముఖం పడతాయి. వాతావరణం చల్లగా ఉంటుంది. సూర్యుడు అస్తమిస్తూ ఉంటాడు. ఆకాశంలో ఎఱ్ఱగా కుంకుమ ఆరపోసినట్లుగా ఉంటుంది. కొందరు ఆవులను త్రాళ్ళకు కట్టివేస్తూ ఉంటారు. కొందరు చుంద్ చుంయ్ అంటూ పాలు పితుకుతూ ఉంటారు. సాయంత్రం పైరుగాలి వీస్తూ ఉంటుంది. ఆవుల కాపరులు ఆవులను వేగంగా ఇళ్ళకు తోలుకు వస్తూ ఉంటారు. ఆవులు, గేదెలు ఆనందంగా గంతులు వేస్తూ ఇళ్ళకు వస్తూ ఉంటాయి.

ప్రశ్న 2.
“ప్రజానీకం ముఖాలన్నీ అరుణోదయకాంతులతో, నూతనానందావేశాలతో కలకలలాడుతున్నాయి”. ఈ వాక్యాన్ని మీ సొంతమాటలలో వివరించండి.
జవాబు:
ప్రజల ముఖాలు సంతోషంతో నిండిపోయాయి. వారందరిలో ఆనందం పొంగుకు వచ్చింది. ముఖాలు మిలమిలా మెరిసిపోతున్నాయి. వారు సంతోషంతో కేరింతలు కొడుతున్నారు. ఉత్సాహం వారిలో ఉరకలు వేస్తోంది. అప్పుడే సూర్యుడు ఉదయించినట్లుగా, వారి ముఖాలు ఎర్రగా కళకళలాడుతున్నాయి. బుద్ధునికీ, భిక్షువులకూ ఎదురేగి, వారు జయజయధ్వానాలు చేస్తూ ఊరేగింపుగా బుద్ధుణ్ణి గ్రామంలోకి తీసుకువచ్చారు.

ప్రశ్న 3.
జిజ్ఞాస రేకెత్తడమంటే ఏమిటి? ఏ అంశాల పట్ల మీకు జిజ్ఞాస ఉంటుంది?
జవాబు:
జిజ్ఞాస అంటే తెలుసుకోవాలనే కోరిక. జిజ్ఞాస రేకెత్తించడం అంటే, తెలుసుకోవాలనే కోరిక కలిగించడం. పిల్లలకు కొత్త కథలు, వింతలు, ఇంద్రజాల విద్యలు వగైరా చిత్రాలను గూర్చి తెలుసుకోవాలని ఉంటుంది. సినిమా కథలను తెలుసుకోవాలని ఉంటుంది. ప్రక్క విద్యార్థులు ఏవైనా ప్రయోగాలు చేసి నూతన విషయాలను కనుక్కొంటే తాను కూడా వాటిని తెలుసుకోవాలని పిల్లలకు కుతూహలం ఉంటుంది. ఆకాశంలో పక్షులు ఎలా ఎగురుతున్నాయో, తూనీగలు ఎలా ఎగురుతున్నాయో, రైలు ఎలా నడుస్తోందో, యంత్రాలు ఎలా తిరుగుతున్నాయో వగైరా విషయాలను తెలుసుకోవాలనే కోరిక పిల్లలకు ఉంటుంది.

ప్రశ్న 4.
ఎదురేగి అతిథి సత్కారాలతో ఎవరెవరిని ఆప్యాయంగా పలకరిస్తారు?
జవాబు:
సన్యాసులను, మఠాధిపతులను ఎదురేగి, అతిథి సత్కారాలు చేసి గౌరవిస్తారు. గురువులను, పూజ్యులను, అతిథులను ఎదురేగి సత్కరిస్తారు. లోనికి రండని, స్వాగతం చెప్పి వారిని లోపలకు తీసుకువస్తారు. మంత్రులనూ, గౌరవనీయులనూ ఎదురేగి స్వాగత సత్కారాలు చేసి ఆహ్వానిస్తారు.

దేవాలయాలకు ట్రస్టీలనూ, చైర్మన్లనూ నియమించినపుడు వారిని ప్రజలు గౌరవంతో ఎదురేగి స్వాగతం చెప్పి ఆహ్వానిస్తారు. తల్లిదండ్రులను, తాత ముతాతలను, పెద్దలను వారు మన ఇంటికి వచ్చినపుడు గౌరవంగా ఎదురేగి సత్కరించి ఆహ్వానించాలి. మగ పెళ్ళివారికి ఆడపెళ్ళివారు ఎదురేగి అతిథి సత్కారాలతో ఆహ్వానించాలి.

ప్రశ్న 5.
బుద్ధుని ఆప్యాయతను చూసేసరికి నందగోపాలుడి హృదయం ద్రవించి నీరైపోయింది. “హృదయం ద్రవించి నీరైపోవడం ” అంటే ఏమిటి? దీన్ని ఇంకా ఏయే సందర్భాలలో వాడతారు?
జవాబు:
హృదయం ద్రవించి నీరైపోవడం అంటే, మనస్సు ప్రేమతో తడిసి ముద్దవడం అని అర్థం. జాలి, కరుణ, ఆర్ధత అనే గుణాలు మనస్సులో నిండడం. మనస్సు జాలితో, కరుణతో నిండిపోవడం అని అర్థం.

ఎవరైనా ఆపదలో ఉంటే, ఆ సంఘటనను చూసి జాలితో మనస్సు కరిగిపోతుంది. ఏదైనా బస్సు, ఆటో వంటి వాటికి ప్రమాదం సంభవించినపుడు, అందులోని ప్రయాణికుల కాళ్ళూచేతులు తెగితే, లేక గాయాలయితే, వారి రక్తం రోడ్డుపై ప్రవహిస్తే, అవయవాలు దెబ్బ తింటే ఆ సంఘటనను చూస్తే మనస్సు కరిగి ప్రవహిస్తుంది. మనశక్తి కొద్దీ, వారికి సాయం చేద్దామనుకుంటాం.

అగ్ని ప్రమాదాలు సంభవించినపుడు, ప్రకృతి బీభత్సాలు సంభవించినపుడు బాధలు పడ్డ ప్రజలను చూస్తే మనస్సులు అలాగే ద్రవిస్తాయి.

AP Board 9th Class Telugu Solutions Chapter 11 ధర్మదీక్ష

ప్రశ్న 6.
ఏ సమయాన్ని గోధూళివేళ యంటారు? అలా అనడానికి కారణమేమిటి?
జవాబు:
గోధూళి వేళ అంటే సాయం సమయం. ఇది ఆవులు మేతకు వెళ్ళి, ఇంటికి తిరిగి వచ్చే సమయం. పొద్దుగుంకే సమయం. అని నిఘంటువు అర్థం. ఉదయం మేతకై వెళ్ళిన ఆవులమంద, కడుపునిండినవై, బిడ్డల కడుపు నింపడానికి సంతోషంగా ఇంటికి వస్తున్నప్పుడు గోవుల కాళ్ళతో రేగిన దుమ్ము ఇక్కడ గోధూళిగా చెప్పవచ్చు. గోవులు ఇంటికి వచ్చే సమయం గోధూళి వేళగా ‘రూఢి’ అయింది. (ఉదయం బిడ్డలను విడిచి వెళ్ళే గోవులు మందగమనంతో ఉంటాయి. సాయంత్రం బిడ్డలను చూడాలనే ఆతురతతో గోమాతలు నడుస్తాయి. అందువల్ల దుమ్ము రేగుతుంది.

ఆ) కింది ప్రశ్నలకు పదిహేనేసి వాక్యాలలో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
నందగోపాలుడి గుణగణాలను వర్ణించండి.
జవాబు:
నందగోపాలుడు ఆవులను మేపుతాడు. తనకిష్టమైన ఆవు రాత్రి ఇంటికి రాకపోతే నందగోపాలుడికి అన్నం సయించలేదు. రాత్రంతా ఆవుకు ఏమవుతుందో అని ఆరాటపడుతూనే ఉన్నాడు. ఆవుపై ప్రేమతో మరునాడుదయమే నందుడు దాన్ని వెతకడానికి అడవికి వెళ్ళాడు. ఆకలి దహించి వేస్తున్నా, నాలుక పిడచగట్టుకు పోతూ ఉన్నా, నందుడు పట్టువిడవకుండా, ఆవును వెతికి పట్టుకున్నాడు.

బుద్ధుడు తన గ్రామానికి వస్తున్నాడని తెలిసి, ఆయన ధర్మబోధ వినలేకపోయినా, ఆయన దర్శనం చేసుకుందామని నందుడు ఆవును తీసుకొని సరాసరి బుద్ధుడు ఉన్న మజ్జి చెట్టు దగ్గరకు వచ్చి బుద్ధునకు నమస్కరించాడు.

నందగోపాలుడి ధర్మకార్యనిర్వహణకు తృప్తిపడిన గౌతమ బుద్ధుడు నందగోపాలునికి దగ్గరుండి భోజనం పెట్టించాడు. నందగోపాలుడికి, గోసాముద్రిక రహస్యాలు, కోడె దూడల లక్షణాలు, వంశపారంపర్యంగా తెలుసు. బుద్ధుడికి, నందుడు ఆ రహస్యాలను చెప్పాడు. నందుడు వచ్చిన తర్వాత కాని ఆనాడు బుద్ధుడు ధర్మబోధ ప్రారంభించలేదు. బుద్ధుడు స్వయంగా నందగోపాలునికి ధర్మదీక్షను ఇచ్చాడు.

నందగోపాలుడు బుద్దుని అనుగ్రహాన్ని పొందిన భక్తుడు. నందగోపాలుడిని చూడడానికే తాను ఆళవీ గ్రామానికి వచ్చానని బుద్ధుడు శిష్యులకు చెప్పిన మాట గుర్తు పెట్టుకోదగినది.

గౌతమ బుదుడు చెప్పినట్లు నందగోపాలుని సరళవర్తనం, సాధు స్వభావం ప్రసిద్ధమైనవి. ఎంత ఆకలి మంట అతణ్ణి వేధిస్తున్నా, అతడు తన గోపాలక ధర్మాన్ని విడిచిపెట్టలేదు. బౌద్ధభిక్షువులందరూ నందుని గౌరవభావంతో నిలబడి చూశారు. తాను వట్టి అమాయకుణ్ణని, నందగోపాలుడు అమాయకంగా వినయంతో వారికి చెప్పాడు. నందగోపాలుడు, సజ్జనుడైన ఆలకాపరి.

ప్రశ్న 2.
గౌతమబుద్ధుడు నందగోపాలుడిపై వాత్సల్యాన్ని ఎలా చూపించాడు? దానికి కారణాలు ఏమిటి?
జవాబు:
నందగోపాలుడి ధర్మ నిర్వహణ పట్ల, కర్తవ్యం పట్ల, అతనికి గల గోవాత్సల్యం పట్ల కరుణామూర్తియైన బుద్ధుడు ఆనందించాడు. నందగోపాలుడిని చూడాలని శిష్యులతో 30 క్రోశాల దూరం నడచి, నందగోపాలుడి ఆళవీ గ్రామానికి వచ్చాడు. నందగోపాలుడు వచ్చే వరకూ బుద్ధుడు తన ధర్మ ప్రసంగాన్ని ప్రారంభించలేదు.

నందగోపాలుడు మధ్యాహ్నము 3 గంటలకు తన ఆవుతో సహా బుద్దుడి వద్దకు వచ్చాడు. ఇంతలో ఆవు దూడ అరుపు గుర్తుకు వచ్చి అతడు ఇంటికి బయలుదేరబోయాడు. దూడ తాడు ట్రెంపుకొని తల్లి వద్ద పాలు తాగుతోందని, స్వయంగా బుద్దుడు నందుడికి చెప్పి, నందుడికి దగ్గరుండి కడుపు నిండా భోజనం పెట్టించాడు.

నందగోపాలుడి భోజనం పూర్తి అయ్యాక బుద్దుడు నందుణ్ణి తనతో తీసుకొని వెళ్ళి ధర్మబోధ ప్రారంభించాడు. బుద్ధుని ధర్మబోధ కోసం ఎంతోమంది ఎదురు చూస్తున్నా బుద్ధుడు నందుడు వచ్చేవరకూ బోధ ప్రారంభించలేదు.

మధ్యాహ్నమే శ్రావస్తీ నగరానికి వెళ్ళవలసియున్నా నందగోపాలుడు వచ్చే వరకూ బుద్ధుడు తన ప్రయాణాన్ని ఆపుకున్నాడు. నందగోపాలుడికి తాను ప్రక్కన కూర్చుండి కడుపునిండా భోజనం పెట్టించాడు. నందుడికి ధర్మదీక్షను ఇచ్చాడు. నందుడు సరళవర్తనం, సాధు స్వభావం కలవాడనీ, గోపాలక ధర్మాన్ని నిర్వర్తించిన సజ్జనుడనీ శిష్యులకు బుద్దుడు చెప్పి నందగోపాలకుని మెచ్చుకున్నాడు.

AP Board 9th Class Telugu Solutions Chapter 11 ధర్మదీక్ష

ప్రశ్న 3.
మానవులుగా పుట్టినందుకు మనం ఎవరిపట్ల, వేటిపట్ల మన కర్తవ్యాన్ని నిర్వహించాలి? ఎందుకని?
జవాబు:
మానవులుగా పుట్టినందుకు తోడి ప్రాణులపట్ల జాలి, దయ, సానుభూతి, అనుకంపలను మనం చూపించాలి. మానవులం కాబట్టి మనలో దానవత్వం ఉండరాదు. తోడి మానవుల యందు, ప్రకృతిలోని పశుపక్ష్యాదులయందు, కరుణ చూపించాలి. జీవహింస చేయరాదు.

మనకు ముల్లు గుచ్చుకుంటే మనం బాధపడతాము. అలాగే జంతువులు కూడా తమకు బాధ కలిగితే అవి సహించలేవు. ఏడుస్తాయి. మనము దయతో ఆ జంతువులకు కావలసిన ఆహారము, నీరు అందించాలి. కొందరు సత్పురుషులు పశు అశ పక్ష్యాదుల తిండికి, నీరు త్రాగడానికి ఏర్పాట్లు చేస్తారు. తాను అన్నం తినే ముందు, ఒకటి రెండు ముద్దలు కాకులకో, కుక్కలకో, జంతువులకో పెడతారు. అదే జీవకారుణ్యము. కొన్ని ప్రాంతాల్లో జీవకారుణ్య సంఘాలు ఉంటాయి.

తోటి ప్రాణులను, నీ ప్రాణం లాగే చూడాలి. సర్వప్రాణి సమానత్వం ఉండాలి. అల్ప ప్రాణులయిన సీతాకోక చిలుక, మిడత, దోమ, నల్లి వంటి వాటిని కూడా చంపరాదు. సర్వజీవ సమానత్వం మనందరం అలవరచుకోవలసిన మంచిగుణం. అది ముఖ్య కర్తవ్యం.

ఇ) సృజనాత్మకంగా రాయండి.

* ఇది ఎందుకూ పనికిరాదు. దీన్ని కబేళాకు తీసుకొనిపోండి – అన్న యజమాని మాటలకు ఆ ఎద్దు గుండె గుభేలుమంది. తన గంతులేసే బాల్యం, అప్పటి నుండి తన యజమానికి చేసిన సేవ గుర్తుకు వచ్చాయి. బాధగా మూలిగింది – ఇలాంటి ఎద్దు ఆత్మకథను ఊహించి రాయండి.
జవాబు:
అవును. నేను ఇప్పుడు ముసలిదాన్నయ్యాను. నన్ను కర్కశంగా చంపి తినేయడానికి కబేళాకు అమ్మేస్తారా ? ఎంత దారుణం!

నేను ఎంత బాగా పెరిగాను | మా అమ్మ, రోజూ నాకు తన పొదుగులో దాచి, అర్థశేరు పాలు ఇచ్చేది. అవి తాగి, లేత పచ్చి గడ్డి తిని ఎంతో బాగా గంతులు వేసేదాన్ని. నా మెడలో గంటలు కట్టి నన్ను పరుగు పెట్టించి, పిల్లలు నా వెనుక పరుగుపెట్టేవారు. ఆ రోజులే రోజులు !

నేను పెద్దయ్యాక, మా యజమాని నాగలిని ఎన్నోసార్లు లాగాను. పొలాలు దున్నాను. నా తోడి ఎదు రాముడుతోపాటు మా యజమాని బండి లాగాను. ఎంత బరువు వేసినా కాదనలేదు. ఇంతే కాదు. అందాల ఎద్దుల పోటీలో నేను నాలుసార్లు మొదటి బహుమతులు తెచ్చి మా యజమానికి ఇచ్చాను. ఎడ్ల పందేలలో మా యజమానికి మూడుసార్లు గెలుపు సాధించి పెట్టాను. బండ చాకిరీ చేశాను. ఇప్పుడు నేను పనికిరాని దాననయ్యాను.

ఈ మానవులకు జాలి లేదు. నాకు పెట్టే తిండి తగ్గించేశారు. చివరకు నన్ను కబేళాకు అమ్మేస్తున్నారు. ఇంత కృతఘ్నతా? ఈ విషయంలో మనుషుల కంటె, మా జంతువులే నయమేమో ! సరే అన్నింటికీ ఆ దేవుడే ఉన్నాడు. ఏం చేస్తాము ? మా యజమాని బహుశః వాళ్ళ అమ్మా నాన్నలనూ రేపో మాపో కబేళాకు తోలేస్తాడేమో ! భగవాన్ ! మా యజమానికి కొంచెం కరుణా బుద్ధి ప్రసాదించు.

(లేదా )

* ఈ రోజుల్లో కాలుష్యం, ఇతర కారణాల వల్ల కొన్ని పక్షులు, జంతువులు, కనుమరుగయే ప్రమాదం ఏర్పడింది. వీటిని కాపాడుకోవలసిన ఆవశ్యకతను వివరిస్తూ కింది వాటిలో ఒకదాన్ని తయారుచేయండి.
i) పోస్టర్ ii) కరపత్రం iii) ప్రసంగ పాఠం
జవాబు:
ii) జంతు రక్షణ చర్యలు (కరపత్రం) :
ఈ రోజుల్లో మనం ఎక్కువగా క్రిమిసంహారక మందులను పంట పొలాల్లో, పెరట్లోని మొక్కల పై, ఇంట్లో వస్తువులపై చల్లుతున్నాము. ముఖ్యంగా పుష్పాలు పూసి ఫలదీకరణ చెందాలంటే సీతాకోక చిలుకల వంటి పక్షులు ఒక పరాగాన్ని పుష్పానుండి మరొక పుష్పానికి తమ రెక్కలతో చేర్చాలి. పురుగులను కొన్ని పక్షులు తమ ముక్కులతో పొడిచి చంపాలి.

అలాగే మనం చల్లే ఎండ్రిన్ వల్ల భూమిని సారవంతం చేసే, గుల్లబార్చే వానపాములు ఎన్నో చస్తున్నాయి. మామూలు పాములు, ఎలుకలు వగైరా ఎన్నో జంతువులు చస్తున్నాయి. ఆ జంతువులు, పక్షులూ మన పంటలకు చేసే మేలును మనం కోల్పోతున్నాం. అదీగాక పురుగు మందుల అవశేషాలు పంటలపై మిగిలిపోవడంతో వాటికి ధరలు పలకటం లేదు. క్రిమి సంహారక మందుల అవశేషాలు మిగిలిన పంట గింజలను మనం తినడంతో కేన్సర్, టి.బి., గుండె జబ్బులు వస్తున్నాయి.

ప్రకృతి సహజంగా మనకు ఇచ్చిన రక్షణ కవచం ఈ పురుగులు, జంతువులు. “అవి ఒకదానిపై ఒకటి ఆధారపడి జీవిస్తాయి. అందువల్ల మన పంటలు హాయిగా పెరుగుతాయి. మనం భగవంతుడు మనకిచ్చిన సహజ ప్రకృతిని కాపాడుకుందాం. ఆరోగ్యంగా జీవిద్దాం. మన చుట్టూ ఉన్న పక్షులను, జంతువులను రక్షిద్దాం.

AP Board 9th Class Telugu Solutions Chapter 11 ధర్మదీక్ష

ఈ) ప్రశంసాత్మకంగా రాయండి.

* సామ్య తొమ్మిదో తరగతి చదువుతున్నది. ఆమెకు పిచ్చుకలంటే మహా ప్రేమ. వాటికోసం అపార్టుమెంటు బాల్కనీలోనే కుండీల్లో చెట్లు పెంచింది. కొన్నాళ్ళకు ఆ పూలచెట్ల మధ్యే పిచ్చుకలు గూళ్ళు కట్టుకున్నాయి. గుడ్లు పెట్టాయి. పొదిగాయి. సౌమ్య గింజలు చల్లి, నీళ్లు పెట్టి వాటి ఆలనాపాలనా చూస్తుండేది.
ఆమె ప్రయత్నాన్ని అభినందిస్తూ పదివాక్యాలు రాయండి.
జవాబు:
స్నేహశీలి సౌమ్యకు శుభాభినందనలు.

ఈ రోజుల్లో జంతు ప్రేమికులు ఎక్కువగా ఉన్నారు. నీకు పిచ్చుకలంటే ఇష్టమనీ, నీకు పెద్దగా సావకాశం లేకపోయినా, మీ బాల్కనీ కుండీల్లో పెరిగిన మొక్కల మధ్య పిచ్చుకలను పెంచుతున్నావని తెలిసింది. చాలా సంతోషం.

నిజానికి పిచ్చుకలు చాలా అందంగా, ముద్దు వస్తుంటాయి. నీవు వాటిని రోజూ ఏమి వేసి పెంచుతున్నావు? మనతోటి జంతువులను ప్రేమించి, రక్షించడం మంచి అలవాటు. నాకు కూడా కుక్కలంటే ఇష్టం. మా ఇంట్లో నాలుగు రకాల జాతుల కుక్కల్ని పెంచుతున్నాను. సోనియాగాంధీ తోడి కోడలికి కూడా జంతువులంటే గొప్ప ఇష్టం. నీ పక్షి ప్రేమకు, నా మనఃపూర్వక అభినందనచందనం. నాకు కూడా చిలుకల్ని పెంచాలని ఉంది. పక్షుల పెంపకంలో నీ సలహాలు నాకు చాలా అవసరం. – ఉంటా. బై.బై.

IV. ప్రాజెక్టు పని

* మీ పాఠ్యాంశంలోని జాతీయాలను సేకరించండి. వాటితోపాటు మరికొన్ని జాతీయాలను సేకరించండి. వివరించండి. ప్రదర్శించండి.
జవాబు:
విద్యార్థి కృత్యం.

III. భాషాంశాలు

పదజాలం

అ) పేరా చదివి గీత గీసిన పదాలను ఏ అర్థంలో వాడారో రాయండి.
నందగోపునికి అన్నం కంటపడగానే పంచప్రాణాలూ లేచి వచ్చాయి. గతరాత్రినించి ఆ క్షణం వరకూ అతడాకటితో నకనకలాడుతున్నాడు. ఆకలితో నవనాడులు కుంగిపోతున్నాయి.

1. పంచప్రాణాలూ లేచి రావడం
జవాబు:
శరీరంలో తిరిగి సత్తువ రావడం

2. ఆకలితో నకనకలాడటం
జవాబు:
ఆకలితో నీరసపడడం

3. నవనాడులు కుంగిపోవడం
జవాబు:
బాగా దిగాలు పడడం

ఆ) కింది పదాలకు సమానార్థకాలు రాయండి.
1) గోధూళి వేళ = సాయం సమయం (ఆవులు ఇళ్ళకు తిరిగి వచ్చే సమయం)
2) ఆలమంద = ఆవుల గుంపు
3) తీర్థప్రజ = తీర్థమునకు వచ్చిన జనం
4) గాలించు = వెదుకు
5) విడిది = అతిథుల వసతి గృహం
6) ఉవ్విళ్లూరు = బాగా కోరుకొను
7) అనతిదూరం = కొద్ది దూరం

ఇ) వాక్యాన్ని చదివి, జాతీయాల అర్థాన్ని ఊహించి రాయండి.

1) మీ ఆప్యాయతకు నా హృదయం కరిగిపోయింది.
జవాబు:
హృదయం కరిగిపోయింది = ద్రవించింది

2) మేధావులందరూ చర్చలలో తలమునకలయ్యారు.
జవాబు:
తలమునకలయ్యారు = మునిగిపోవు

3) ఆవు అరుపు విన్నాక నందగోపాలుడికి బుద్ధుడి దగ్గరకు వెళ్ళడానికి కాలుసాగలేదు.
జవాబు:
కాలుసాగలేదు = ముందడుగు పడలేదు.

వ్యాకరణం

అ) కింది వానికి వ్యతిరేకార్థక వాక్యాలు రాయండి.
1. ఒకే ఒక్క ఆవు తిరిగి రాలేదు. .
జవాబు:
ఒకే ఒక్క ఆవు తిరిగి వచ్చింది.

2. రాత్రి తెల్లవార్లూ నందగోపుడు ఆరాటపడ్డాడు.
జవాబు:
రాత్రి తెల్లవార్లూ నందగోపుడు ఆరాటపడలేదు.

3. నందుడతనికి తన ప్రయాణ కారణం తెలియజేశాడు.
జవాబు:
నందుడతనికి తన ప్రయాణ కారణం తెలియజేయలేదు.

4. ఒక్క పలుకైనా ఆయన నోటినుండి వెలువడలేదు.
జవాబు:
ఒక్క పలుకైనా ఆయన నోటినుండి వెలువడింది.

AP Board 9th Class Telugu Solutions Chapter 11 ధర్మదీక్ష

ఆ) కింది వాటిని సంయుక్త వాక్యాలుగా రాయండి.

1. బుద్ధదేవుడు, వటవృక్షచ్ఛాయకు వచ్చాడు. వెంటనే అష్టాంగ ధర్మప్రవచనం ప్రారంభమైంది.
జవాబు:
బుద్ధదేవుడు వటవృక్షచ్ఛాయకు వచ్చిన వెంటనే అష్టాంగ ధర్మప్రవచనం ప్రారంభమైంది. (సంయుక్త వాక్యం)

2. లేగ మూలంగా నందగోపునికి అదృష్టం కలిగింది. లేగదూడను నందగోపుడు ముద్దుపెట్టుకొన్నాడు.
జవాబు:
లేగ మూలంగా నందగోపునికి అదృష్టం కలిగింది కాన లేగదూడను నందగోపుడు ముద్దు పెట్టుకొన్నాడు. (సంయుక్త వాక్యం)

ఇ) విరామ చిహ్నాలు గుర్తించండి.
నాయనా నందగోపాలకుని సరళ వర్తనం సాధుస్వభావం మీరెరుగరు ఎంతగా ఆకటి చిచ్చు వేధించినా అతడు తన గోపాలక ధర్మం విస్మరించలేదు అతని గోవాత్సల్యం అపారం ముప్పయి క్రోశాల దూరం నడిచి ఇంతగా శ్రమపడి ఈ ఆళవీ గ్రామానికెందుకు వచ్చానో మీరెవరైనా ఎరుగుదురా
జవాబు:
“నాయనా! నందగోపాలుని సరళవర్తనం, సాధుస్వభావం మీరెరుగరు. ఎంతగా ఆకటి చిచ్చు వేధించినా, అతడు తన గోపాలక ధర్మం విస్మరించలేదు ! అతని గోవాత్సల్యం అపారం ! ముప్పయి క్రోశాల దూరం నడిచి, ఇంతగా శ్రమపడి ఈ ఆళవీ గ్రామానికెందుకు వచ్చానో మీరెవరైనా ఎరుగుదురా?”

ఈ) పాఠంలోని పది సమాస పదాలను రాయండి. వాటికి విగ్రహవాక్యాలు రాయండి. ఏ సమాసమో తెలపండి.
1) భాను బింబం = భానుని యొక్క బింబం – షష్ఠీ తత్పురుష సమాసం
2) ధర్మబోధ = ధర్మము యొక్క బోధ షష్ఠీ తత్పురుష సమాసం
3) విశాలనేత్రాలు = విశాలమైన నేత్రాలు విశేషణ పూర్వపద కర్మధారయం
4) వృక్షచ్ఛాయ = వృక్షము యొక్క ఛాయ షష్ఠీ తత్పురుష సమాసం
5) పంచప్రాణాలు = పంచ సంఖ్య గల ప్రాణాలు ద్విగు సమాసం
6) నవనాడులు = నవ సంఖ్య గల నాడులు – ద్విగు సమాసం
7) అన్నపానాలు = అన్నమును, పానమును ద్వంద్వ సమాసం
8) ముప్పయి క్రోశాలు = ముప్పది సంఖ్యగల క్రోశాలు – ద్విగు సమాసం
9) ఆనంద తరంగాలు = ఆనందము అనెడి తరంగాలు – రూపక సమాసం
10) ప్రశాంత స్వరం = ప్రశాంతమైన స్వరం – విశేషణ పూర్వపద కర్మధారయం
11) క్షుధార్తుడు = క్షుధతో ఆర్తుడు – తృతీయా తత్పురుషం

AP Board 9th Class Telugu Solutions Chapter 11 ధర్మదీక్ష

ఉ) మీరు తెలుసుకున్న అలంకారాలు ఏవి? ఈ పాతంలో వాటికి సంబంధించిన ఉదాహరణలు ఉన్నాయా? వాటిని రాయండి. లేని వాటికి మీరే సొంతంగా రాయండి.

1) ఉపమాలంకారం :
ఉపమానోపమేయాలకు చక్కని పోలిక చెప్పడం.
పాఠంలోని ఉదాహరణ :
1) గౌతమదేవుని ముఖ జ్యోతి అప్పుడప్పుడే ఉదయిస్తున్న భాను బింబంలా మెరిసింది.
2) వారి మనస్సు అప్పుడే తీసిన వెన్నపూస లాంటిది. అతంతు

2) రూపకాలంకారం :
ఉపమాన, ఉపమేయాలకు అభేదం చెప్పడం.
పాఠంలో ఉదాహరణ:
1) ముఖజ్యోతి (ముఖం అనెడి జ్యోతి) (రూపకాలంకారము)
2) ఆనంద తరంగాలలో తలమునకలైనారు (రూపకాలంకారము)

3) దృష్టాంతాలంకారం :
ఉపమానోపమేయాలు వేరైనా బింబ ప్రతిబింబ భావంతో నిర్దేశించడం,
ఉదాహరణ :
ఓ రాజా ! నీవే కీర్తిమంతుడవు. చంద్రుడే కాంతిమంతుడు.

4) స్వభావోక్తి అలంకారం :
ఉన్నది ఉన్నట్లు రమణీయంగా వర్ణించడం.
ఉదాహరణ :
లేళ్ళు బిత్తరి చూపులు చూస్తూ, చెవులు రిక్కించి ఎగిరి ఎగిరి గంతులు వేస్తున్నాయి.

5) ఉత్ప్రేక్షాలంకారం :
ఉపమేయాన్ని చూసి ఉపమానంగా ఊహించడం.
ఉదాహరణ :
మా ఇంటి ముందు ఉన్న పెద్ద కుక్కను చూసి, సింహమేమో అని భయపడ్డాను.

6) వృత్త్యనుప్రాస అలంకారం :
ఒకే అక్షరం, అనేకసార్లు రావడాన్ని వృత్త్యనుప్రాస అంటారు.
ఉదాహరణ :
నాయనా ! నేను నిన్నేమన్నా అన్నానా? నీవు నన్నేమన్నా అన్నావా?

7) అంత్యాను ప్రాసాలంకారం :
ఒక అక్షరం, లేదా రెండుమూడు అక్షరాలు, వాక్యం చివర మాటిమాటికీ వస్తే దాన్ని అంత్యానుప్రాసాలంకారం అంటారు.
ఉదాహరణ :
భాగవతమున భక్తి
భారతములో యుక్తి
రామకథలో రక్తి – ఓ కూనలమ్మా !

8) లాటాను ప్రాసాలంకారం :
అర్థభేదము లేకపోయినా, తాత్పర్యభేదం కల పదాలు ఒకదానివెంట మరొకటి రావడం.
ఉదాహరణ :
కమలాక్షునర్చించు కరములు కరములు.

9) ఛేకానుప్రాసాలంకారం :
అర్థభేదం గల జంటపదాలు వెంటవెంటనే రావడం ఛేకానుప్రాసాలంకారం,
ఉదాహరణ :
వందవందనాలు.

9th Class Telugu 11th Lesson ధర్మదీక్ష కవి పరిచయం

పిలకా గణపతిశాస్త్రి 1911 ఫిబ్రవరి 24న జన్మించారు. తూర్పుగోదావరి జిల్లాలోని కట్టుంగ వీరి స్వస్థలం. విజయనగరంలో విద్యనభ్యసించారు. సాహిత్య విద్యా ప్రవీణ, ఉభయభాషా ప్రవీణ పూర్తిచేశారు. రత్నాపహారం వీరి తొలిరచన. మణిదీపిక, ప్రాచీన గాథాలహరి, విశాలనేత్రాలు, కాశ్మీర పట్టమహిషి, నాగమల్లిక, అందని చందమామ వీరి ఇతర రచనలు. సంస్కృతం, బెంగాలీ భాషల నుంచి అనేక అనువాదాలు చేశారు. సరళమైన అలంకారిక శైలిలో వీరి రచన సాగింది.

కలిన పదాలకు అర్థాలు

గోధూళి వేళ = సాయం సమయం ; ఆవులు ఇళ్ళకు తిరిగి వచ్చే సమయం
ఆలమంద = ఆవుల గుంపు
గోవత్సాలు = ఆవు దూడలు
కుడుచుకుంటున్నాయి = చప్పరించుచున్నాయి (త్రాగుచున్నాయి)
కలకలలాడింది = ఆనందంగా ఉంది
సయించలేదు = ఇష్టం కాలేదు
ఆరాటపడు = ఆత్రపడు
= సంతాపము నొందు
అరుణోదయ కాంతులు (అరుణ +ఉదయ కాంతులు) = సూర్యోదయ కాంతులు
నూతనానందావేశాలు (నూతన+ఆనంద+ఆవేశాలు) = కొత్త ఆనందము యొక్క ఉద్రేకాలు
హృదయాంతరాళం (హృదయ+అంతరాళం) = హృదయం మధ్య చోటు
సందర్శనభాగ్యం = చూచే అదృష్టం
నిట్టూర్పు = దీర్ఘ నిశ్వాసము
వాలకం = రూపు
పులివాత = పులినోట్లో
ఆరాటం = ఆవుల పాక
తథాగతుడు = బుద్ధుడు
పాపలు = చిన్న పిల్లలు
కోడెదూడ = మగ ఆవుదూడ
పెయ్యదూడ = ఆడ దూడ

AP Board 9th Class Telugu Solutions Chapter 11 ధర్మదీక్ష

గౌతమదేవుడు = బుద్ధుడు
అధమ పక్షం = (మిక్కిలి చెడ్డ పక్షం) కనీసం
అంగలు = చాచివేసిన రెండు అడుగులు చోటులు
మిట్ట మధ్యాహ్నం = మధ్యాహ్న కాలము
దహించి వేయు = కాల్చు
పిడచగట్టుకుపోవు = నోరు ఎండిపోవు
స్పురించింది = తోచింది
ఆర్తనాదం = బాధతో అరిచే అరుపు
పెన్నిధి = పెద్ద నిధి
తికమకలు = బాధలు (తొట్రుపాటులు)
పొలిమేర = సరిహద్దు
సంకల్పం = ఉద్దేశ్యం
అధమం = కనీసం
మహామహుడు = గొప్పవాడు
ఉవ్విళ్ళూరిపోవు = బాగా కోరుకొను
శిష్యగణం = శిష్యుల సమూహం
విశ్రమించిన = ఆయాసం తీర్చుకొనిన
వటవృక్షం = మజ్జిచెట్టు
కాషాయాంబరధారులు = కాషాయ వస్త్రాన్ని ధరించినవారు.
భిక్షుకులు = సన్యాసులు
ముఖజ్యోతి = ముఖ ప్రకాశము
భాను బింబము = సూర్య బింబము
విడుదులు = అతిథుల వసతి గృహాలు
ఆసన్నము+అగు = సమీపించడం ; దగ్గరికి రావడం
వంశపారంపర్యత: = వంశములో ఒకరి తరువాత ఒకరుగా
అనుమతించలేదు = అంగీకరించలేదు
ప్రాధేయపడ్డారు = వేడుకున్నారు
విసర్జించు = విడుచు
అనుజ్ఞ = అంగీకారము
శ్రమణకులు = బౌద్ధ ధర్మాన్ని పాటిస్తూ బుద్ధుడి శిష్యులుగా ఉండేవారు.
వట తరుచ్ఛాయ = మట్టిచెట్టు నీడ
సమాసీనులు = చక్కగా కూర్చున్నవారు
యామాలకాలం = జాముల కాలం ; యామము అంటే 3 గంటలు
సుఖాసనం (సుఖ +ఆసనం) = సుఖమైన ఆసనం
అవలోకిస్తున్నాడు = చూస్తున్నాడు
ఆలకించు = విను
ఉత్కంఠ = ఇష్టవస్తు ప్రాప్తికై వేగిరపాటు
తహతహలాడిపోవు = వేగిరపడు
పలుకు = మాట
నేత్రాలు = కన్నులు
నిరీక్షించు = ఎదురుచూచు
స్ఫురిస్తున్నాయి = తోస్తున్నాయి
నిరీక్షణ = ఎదురుచూపు
అవగాహన = తెలిసికొనడం
అనతిదూరం = కొద్ది దూరం
పరికిస్తున్నాయి = పరీక్షిస్తున్నాయి
ఆత్రంగా = తొందరగా
ఆగమనము = రాక
సాగిలపడ్డాడు = సాష్టాంగ నమస్కారం చేశాడు
దోసిలి ఒగ్గి = చేతులు జోడించి
ఆత్రం = తొందర
పంచప్రాణాలు = ఐదు ప్రాణాలు 1) ప్రాణము 2) అపానము 3) వ్యానము 4) ఉదానము 5) సమానము
నవనాడులు = తొమ్మిది నాడులు (నాడులు అన్నీ)
నకనకలాడు = ఆకలిచే బాధపడు
పలుపు = పశువుల మెడకు కట్టు త్రాడు
ఆప్యాయత = ప్రేమ ప్రత్యక్షము = ఎదుట ఉన్నది
ద్రవించి = కరగి
కుశల ప్రశ్నలు = క్షేమ సమాచారాలను గూర్చి ప్రశ్నలు
సాముద్రిక విషయాలు = హస్తరేఖాది లక్షణాలను బట్టి శుభా శుభాలు తెలిపే శాస్త్ర విషయాలు
ఆచార్యదేవుడు = గురువు
సందేహాలు = అనుమానాలు
అభ్యర్థించారు = కోరారు
చనువు = ప్రేమ
ఉపదేశించు = బోధించు
ప్రసంగాలు = ఉపన్యాసాలు
విడ్డూరము = ఆశ్చర్యము
అష్టాంగ ధర్మ ప్రవచనం = ఎనిమిది అంగములైన ధర్మాలు చెప్పడం: 1) సమ్యక్ దృష్టి 2) సమ్యక్ వాక్కు 3) సమ్యక్ కర్మ 4) సమ్యక్ సంకల్పం లక్ష్యం 5) సమ్యక్ చేతన, మనస్తత్వం 6) సమ్యక్ జీవనం 7) సమ్యక్ వ్యాయామం 8) సమ్యక్ భావన

AP Board 9th Class Telugu Solutions Chapter 11 ధర్మదీక్ష

ఆనందతరంగాలు = సంతోషపు కెరటాలు
తలమునకలగు = ఎక్కువగు
అలవోకగా = అప్రయత్నముగా ; (లీలగా)
ప్రవచనం = చక్కగా మాట్లాడడం
నిగ్రహం = సంయమనం
శ్రమణకులు = బౌద్ధ భిక్షువులు
గుసగుసలు = రహస్యం మాటలు
ఉపేక్షించి = అశ్రద్ధ చేసి
పక్షపాతం = ఒకదానియందభిమానం
సమ్యక్ సంబుద్ధుడు = బుద్ధుడు
స్వరం = ధ్వని
క్షుధార్తుడు = ఆకలితో బాధపడేవాడు
క్షుధ = ఆకలి
దుస్సహము = సహింపరానిది
యాతన = తీవ్రవేదన
సమ్యగుృద్ధి (సమ్యక్ + బుద్ధి) = సరియైన బుద్ధి
నిర్వాణం = మోక్షం
కరతలామలకం (కరతల+ ఆమలకం) – బాగా తెలిసినది (అరచేతిలో ఉసిరిక)
పశ్చాత్తప్తులు = తాముచేసింది తప్పని తెలిసి, అలా చేశామే అని బాధపడేవారు
ఆకటిచిచ్చు = ఆకలి మంట
గోవాత్సల్యం = ఆవుపై ప్రేమ
అపారం = అంతులేనిది
గో, గోవత్సాలు = ఆవు, ఆవు దూడలు
మంద = ఆవులు మొదలైన పశువుల గుంపు
అన్నపానాలు = అన్నము, పానము (తిండి, నీరు)
తాండవించాయి. = కదలియాడాయి
మురిసిపోయాడు = సంతోషించాడు
కుడుచుకొని = చప్పరించి, త్రాగి

AP Board 9th Class Telugu Solutions Chapter 6 ప్రబోధం

AP State Syllabus AP Board 9th Class Telugu Textbook Solutions Chapter 6 ప్రబోధం Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Telugu Solutions 6th Lesson ప్రబోధం

9th Class Telugu 6th Lesson ప్రబోధం Textbook Questions and Answers

చదవండి-ఆలోచించండి-చెప్పండి

గాంధీజీ ఒక సభలో ఇలా సందేశమిచ్చారు. ‘స్వరాజ్య సాధన స్త్రీల చేతుల్లోనే ఉంది. మీమీ పనుల్లో మీరు నిష్ణాతులు కండి. స్త్రీలు పిరికివారు, బలహీనులు అనే సామాన్యుల వాదాలు మిథ్య అని రుజువు చేయండి. స్త్రీలకు సామాజిక స్పృహ ఉండాలి. వారికున్న నైతికబలం సామాన్యమైంది కాదు. ఈ ‘అంతశ్శక్తి’ పై ఆధారపడ్డప్పుడు ప్రపంచంలో ఏ శక్తీ కూడా ఆమెను ఓడించలేదు”.

ప్రశ్నలు జవాబులు

ప్రశ్న 1.
‘స్వరాజ్య సాధన’ ఎందుకు అవసరం?
జవాబు:
భారతదేశం స్వతంత్ర్యాభివృద్ధిని సాధించడం కోసం ‘స్వరాజ్య సాధన’ అవసరం.

ప్రశ్న 2.
సామాన్యుల మిథ్యావాదం ఏమిటి?
జవాబు:
స్త్రీలు పిరికివారు, బలహీనులు అనేది సామాన్యుల మిథ్యావాదం.

ప్రశ్న 3.
స్త్రీలలో ఉన్న “అంతశ్శక్తి” ఏది?
జవాబు:
వారి నైతికతే వారి “అంతశ్శక్త.”

AP Board 9th Class Telugu Solutions Chapter 6 ప్రబోధం

ప్రశ్న 4.
స్త్రీల గురించి గాంధీజీ కి ఉన్న అభిప్రాయాలు ఏమిటి?
జవాబు:
స్వరాజ్య సాధన స్త్రీల చేతుల్లోనే ఉంది. వారి పనుల్లో వారు నిష్ణాతులు కావాలి.

ఇవి చేయండి

I. అవగాహన – ప్రతిస్పందన

అ) కింది అంశాల ఆధారంగా మాట్లాడండి.

ప్రశ్న 1.
‘స్త్రీల విద్యాభివృద్ధికి బాల్య వివాహాలు ప్రతిబంధకములు’ దీనిపై మీ అభిప్రాయం తెలపండి.
జవాబు:
చిన్న వయస్సులోనే వివాహం చేయటం వల్ల స్త్రీల విద్యాభివృద్ధి కుంటుపడుతుంది. పెళ్ళైన పిల్లల్ని పాఠశాలకు పంపడానికి పెద్దలు ఇష్టపడేవారు కాదు. పెళ్ళి కుదిరిన తరువాత ఆడపిల్లలు చదువుకు స్వస్తి పలికేవారు.

ప్రశ్న 2.
“స్వశక్తిచేత” ఏ పనులనైనా సాధించవచ్చు? నిజమా ? కాదా ? వివరించండి.
జవాబు:
స్వశక్తితో ఏ పనులనైనా సాధించవచ్చు. ఇది నిజమే ఇతరులపై ఆధారపడితే వారికి అవకాశం ఉన్నప్పుడే మన పనుల్ని చేసుకోగలం.

ఆ) పాఠం ఆధారంగా కింది వాటికి సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
‘లేఖ’ ను ఎవరు రాశారు? ఎవరికి రాశారు?
జవాబు:
లేఖను ‘శారద’ అనే పేరుతో కనుపర్తి వరలక్ష్మమ్మ గారు రాశారు. కల్పలత అనే ఆమెకు రాస్తున్నట్లుగా ‘గృహలక్ష్మి’ పత్రికకు రాశారు.

ప్రశ్న 2.
సభలో ఉపన్యసించిన వారెవరు? సభకు అధ్యక్షురాలు ఎవరు?
జవాబు:
సభలో ఉపన్యసించినది శ్రీమతి సరోజినీ దేవిగారు. సభకు అధ్యక్షురాలుగా నెమలి పట్టాభి రామారావు పంతులుగారి కుమార్తె శ్రీమతి పద్మావతిదేవి గారు.

AP Board 9th Class Telugu Solutions Chapter 6 ప్రబోధం

ప్రశ్న 3.
ఢిల్లీ మహిళాసభవారు చేసిన తీర్మానాలు ఏవి?
జవాబు:
ఢిల్లీ మహిళాసభవారు స్త్రీలకు సంబంధించిన పెక్కు తీర్మానాలు చేశారు. వాటిలో కొన్ని బాలబాలికలకు విధిగా విద్య నేర్పించాలి. స్త్రీలకు నియోజక, నియోజిత స్వాతంత్ర్యము సాధించుట. అతి బాల్య వివాహము అనర్థకమని ప్రచారం చేయుట.

ప్రశ్న 4.
స్త్రీలకు ఎన్నిక హక్కులు లభించడం వల్ల కలిగిన ఫలితాలేవి?
జవాబు:
స్త్రీలకు ఎన్నిక హక్కులు లభించడం వల్ల మదరాసు రాష్ట్ర శాసనసభకు ఒక స్త్రీ డిప్యూటీ ప్రెసిడెంటుగా ఎన్నుకొనబడింది. తిరువాన్కూరులో ఒక స్త్రీ మంత్రిణిగా నియమింపబడింది. సమర్థురాలుగా పేరుపొందింది. ఇంకా చాలా స్థానిక సభల్లో, విద్యా సంఘాల్లో స్త్రీలు సభ్యులుగా నియమించబడుతున్నారు.

ప్రశ్న 5.
తనువే పుణ్యక్షేత్రముగా చేసుకొనవచ్చునని సరోజినీదేవి చెప్పిన అంశాలేవి?
జవాబు:
భూతదయ కలిగిఉండటం. చేసిన తప్పుకు పశ్చాత్తాపపడటం. జాతిమత భేదాలు పాటించక విశ్వ మానవులందరిని సోదరులుగా భావించడం, అకల్మషమైన హృదయాన్ని కలిగి ఉండటం. వీటి వల్ల మన శరీరాన్నే పుణ్యక్షేత్రంగా చేసుకోవచ్చు. నిజానికి జీవితమే ఒక యాత్ర. సంస్కరించబడని మనస్సుతో ఎన్ని యాత్రలు చేసినా ఫలితం ఉండదు.

ఇ) కింది పేరాను చదివి ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

మలాలా యూసుఫ్ జాయ్ ఈ తరం బాలికల నూతన స్ఫూర్తికి ప్రతినిధి. మలాలా పాకిస్థాన్ లోని స్వాత్ లోయ మింగోరా పట్టణంలో 12 జులై, 1997లో జన్మించింది.

చిన్నప్పటి నుంచి చదువంటే చాలా ఆసక్తిగల మలాలా తమ ప్రాంతంలోని ప్రతికూల పరిస్థితులకు ఎదురు నిలిచి పోరాడింది. అక్కడి ప్రభుత్వంపై ఆధిపత్యం వహిస్తున్న తాలిబాన్ ఛాందసవాదులు బాలికలు పాఠశాలకు వెళ్ళడం, చదువుకోవడంపై నిషేధం విధించారు. మలాలా ఏ మాత్రం భయపడకుండా చదువుకొంటూనే తన తోటి బాలికలకు చదువుపై ఆసక్తిని పెంచి పాఠశాలకు వెళ్ళేటట్లుగా ప్రోత్సహించింది. దీంతో ఆగ్రహించిన తాలిబాన్లు మలాలాపై 9 అక్టోబర్ 2012న కాల్పులు జరిపారు. ఆమె తీవ్రంగా గాయపడింది. ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళిపోయింది. ప్రపంచవ్యాప్తంగా మలాలాపై సానుభూతి వెల్లువెత్తింది. అందరూ ఆమె కోలుకోవాలని కోరుకున్నారు.

ఆమె ప్రాణాపాయ స్థితి నుండి బయటికి వచ్చింది. మలాలా చైతన్యానికి, సాహసానికి, ఆత్మ సైర్యానికి ముగ్ధులైన ఐక్యరాజ్య సమితి ఆమె జన్మదినాన్ని (జూలై 12ను) ‘మలాలా రోజు’ (Malala Day) గా జరుపుకోవాలని ప్రకటించింది. ప్రతీ బాలిక చదువుకోవడం ఒక ప్రాథమిక హక్కుగా గుర్తించింది. మలాలాను ‘ఇంటర్నేషనల్ చిల్డ్రన్ పీస్ ప్రైజ్’కు నామినీగా స్వీకరించింది.

AP Board 9th Class Telugu Solutions Chapter 6 ప్రబోధం

అ) మలాలా జన్మించిన ప్రాంతంలోని పరిస్థితులు ఏమిటి?
జవాబు:
చిన్నప్పటి నుండి చదువంటే ఆసక్తిగల మలాలాకు తన ప్రాంతంలో బాలికల చదువుకు వ్యతిరేక పరిస్థితులున్నాయి.

ఆ) తాలిబాన్ ఛాందసవాదులు దేన్ని నిషేధించారు?
జవాబు:
తాలిబాన్ ఛాందసవాదులు బాలికలు పాఠశాలకు వెళ్ళడం, చదువుకోవడంపై నిషేధం విధించారు.

ఇ) మలాలా బాలికలను ఏ విధంగా ప్రోత్సహించింది?
జవాబు:
మలాలా తాలిబాన్లకు ఏమాత్రం భయపడకుండా చదువుకొంటూనే తన తోటి బాలికలకు చదువుపై ఆసక్తిని పెంచింది. వారు కూడా పాఠశాలలకు వెళ్ళేటట్లుగా ప్రోత్సహించింది.

ఈ) మలాలా ప్రాణాపాయ స్థితిలోకి ఎందుకు వెళ్ళింది?
జవాబు:
తాలిబాన్లు మలాలాపై 9-అక్టోబర్-2012న కాల్పులు జరిపారు. దాంతో ఆమె తీవ్రంగా గాయపడి, ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళింది.

ఉ) ఐక్యరాజ్య సమితి మలాలాను ఏ విధంగా గౌరవించింది?
జవాబు:
మాలాలాను ‘ఇంటర్నేషనల్ చిల్డ్రన్ పీస్ ప్రైజ్’ కు నామినీగా తీసుకొంది. నవంబర్ 10వ తేదీన ‘మలాలా రోజు’గా ప్రకటించి ఆమెను గౌరవించింది.

ఈ) కింది వాక్యాలు పాఠంలో ఎక్కడ వచ్చాయో గుర్తించి వాటి సందర్భాన్ని బట్టి భావం రాయండి.

అ) నియోజిత, నియోజక స్వాతంత్ర్యం మన స్త్రీలకు శీఘ్రంగా లభించినది.
జవాబు:
భారతీయ స్త్రీలు తమకు తాము స్వతంత్రంగా ఎన్నికలలో పాల్గొనే హక్కును, తమకు నచ్చిన వారిని ఎన్నికలలో ఎన్నుకొనే హక్కును పొందారు. పాశ్చాత్య దేశాలలోని స్త్రీలు ఈ హక్కులను పొందడానికి ప్రత్యేకంగా పరిశ్రమ చేయాల్సి వచ్చింది. వారితో పోలిస్తే భారతీయ స్త్రీలు వీటిని చాలా త్వరగా పొందినట్లే అని సరోజినీదేవి చెప్పారు.

ఆ) మన తనువే పుణ్యక్షేత్రముగా చేసుకొనవచ్చును.
జవాబు:
మనం కాశీ – రామేశ్వరాది పుణ్యయాత్రలు చేయాలనుకుంటాం కాని భూతదయను కలిగిఉండటం, చేసిన తప్పులకు పశ్చాత్తాపపడటం, జాతి, మత భేదాలు లేకుండా అందరిని సోదరులలాగా చూడడం, అమలిన హృదయంతో ఉండటం వీటి ద్వారా మన శరీరాన్నే పుణ్యక్షేత్రంగా చేసుకోవచ్చు.

ఇ) చిత్త సంస్కారము లేని యాత్రల వలన ఫలము లేదు.
జవాబు:
నిజానికి జీవితమే తీర్థయాత్ర అన్నింటికి మనస్సే మూలం. మనసు సంస్కరించబడకుండా ఎన్ని యాత్రలు చేసినా ఫలితం ఉండదు.

II. వ్యక్తీకరణ-సృజనాత్మకత

అ) కింది వాటికి ఐదేసి వాక్యాల్లో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
ఇరుగుపొరుగు వారితో ఎలా ఉండాలో తెలపండి.
జవాబు:
సాధారణంగా తల్లి తన బిడ్డకు ఏదైనా ప్రమాదం వస్తే తన ప్రాణాలనైనా పణంగా పెట్టి బిడ్డను కాపాడుకోవడానికి సాహసిస్తుంది. అలాంటే ప్రేమను ఇరుగు పొరుగు వారిపై కూడా చూపాలి. ఇంకా, సర్వమతాల వారిపై చూపాలి. సర్వమానవుల్ని సొంతవారిగా భావించగలగాలి. అన్ని ప్రాణుల్ని సొంతబిడ్డలా ప్రేమించగలగాలి.

AP Board 9th Class Telugu Solutions Chapter 6 ప్రబోధం

ప్రశ్న 2.
మనిషికి నిజమైన సౌందర్యం ఏమిటి?
జవాబు:
మనిషి విలువైన ఆభరణాలు ధరిస్తే సౌందర్యం పెరుగుతుందని మనం భావిస్తాం. అది నిజం కాదు. నిర్మలమైన హృదయాన్ని కలిగి ఉండటం, కరుణతో ప్రవర్తించడం నిజమైన సౌందర్యం. అందరితో ప్రేమను పంచుకోవడమే సౌందర్యం. కాబట్టి సుగుణాలు కలిగి ఉండటమే సౌందర్యం. విలువైన ఆభరణాలు ధరించడం సౌందర్య హేతువు కాదని గ్రహించాలి.

ప్రశ్న 3.
‘స్త్రీ శక్తి స్వరూపం’ ఈ మాటను సమర్థిస్తూ రాయండి.
జవాబు:
స్త్రీ శక్తి స్వరూపం. ప్రధాన దేవతలైన సరస్వతి – లక్ష్మి – పార్వతులు స్త్రీలే. తమ సొంతశక్తితో విద్యను, సంపదలను పొందవచ్చు. పిరికితనాన్ని, బిడియాన్ని విడిచి పెట్టడం ద్వారా సాహస కార్యాల్ని చేయవచ్చు. వేదకాలం నాటి స్త్రీలు యజ్ఞయాగాల్ని నిర్వహించినట్టు, శాస్త్ర చర్చలలో పురుషులతో పోటీ పడినట్టు మన చరిత్ర చెపుతుంది. సంపదలను సాధించడంలో కూడా స్త్రీలు నైపుణ్యాన్ని ప్రదర్శించినట్టు తెలుస్తుంది. మహారాణి రుద్రమ, వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి వంటి సాహసం నేటికీ మరుపురానివే, స్త్రీలు తమ పని శక్తిస్వరూపాన్ని గుర్తించి, వెలికితీయడం ద్వారా ఉన్నత స్థితిని త్వరగా పొందవచ్చు.

ప్రశ్న 4.
ప్రతిబంధకాలు అంటే ఏమిటి? వాటిని ఎలా అధిగమించాలి?
జవాబు:
అభివృద్ధికి అడ్డంకి కలిగించే వాటిని ప్రతి బంధకాలు అంటారు. ప్రతి కార్యానికి ప్రతిబంధకాలు కలుగుతాయి. వాటిని అధిగమిస్తేనే కోరుకున్నదాన్ని సాధించగలం. అడ్డంకులు ఏర్పడగానే కంగారు పడిపోకూడదు. జాగ్రత్తగా ఆలోచించుకొని సమస్యను అధిగమించాలి. ఉద్రేకానికి లోను కాకూడదు. అవసరమైతే పెద్దవారి సలహాలను, స్నేహితుల సహకారాన్ని తీసుకోవాలి. తెలివిగా సమస్యలను సాధించుకోవడం నేర్చుకోవాలి.

ప్రశ్న 5.
‘సరస్వతీ ప్రసన్నత’ అంటే ఏమిటి? అది ఎప్పుడు లభిస్తుంది?
జవాబు:
‘సరస్వతీ ప్రసన్నత’ – అంటే ఉన్నత విద్యలను అభ్యసించగలగడం. ప్రాథమిక విద్యలను అభ్యసించకుండా, ఉన్నత విద్యలను అభ్యసించడం కుదరదు కాబట్టి ప్రాథమిక విద్యలను ముందు అభ్యసించి, అంతటితో ఆగిపోకూడదు. ఎన్ని ఇబ్బందులెదురైనా ఉన్నత విద్యలను అభ్యసించాలి. కష్టాలను ఎదిరించి ఇష్టతతో చదివేవారికి తప్పక సరస్వతీ ప్రసన్నత కలుగుతుంది. దానివల్ల సులువుగా ఉన్నత విద్యలను అభ్యసించగలుగుతాము.

ప్రశ్న 6.
బాలబాలికలకు విధిగా విద్య నేర్పాలని సరోజినీదేవి ఎందుకన్నది?
జవాబు:
దేశ భవిష్యత్తు బాలల పైనే ఆధారపడి ఉంటుంది. అందుకే “నేటి బాలలే రేపటి పౌరులు” అనే నానుడి ఏర్పడింది. బాలలందరూ విద్యావంతులైనప్పుడే సమాజం విద్యావంతమవుతుంది. విద్యావంతమైన సమాజం వల్లే దేశం పురోభివృద్ధిని సాధిస్తుంది. దేశం సర్వతోముఖాభివృద్ధిని త్వరగా సాధించాలంటే పౌరులందరూ ఉన్నత విద్యావంతులు కావాలి. కాబట్టే బాలబాలికలందరూ విధిగా విద్యనేర్చుకోవాలని సరోజినీదేవి కోరింది.

ఆ) కింది వాటికి పదిహేనేసి వాక్యాలలో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
సరోజినీదేవి ఉపన్యాసంలోని ముఖ్యాంశాలను సంక్షిప్తంగా రాయండి.
(లేదా)
స్త్రీ సమాజాభివృద్ధికై సరోజినీదేవి చేసిన ప్రసంగంలో ముఖ్యాంశాలేవి?
(లేదా)
సరోజినీదేవి స్త్రీలనుద్దేశించి చెప్పిన సందేశపు సారాంశాన్ని మీ మాటల్లో రాయండి.
(లేదా)
బాలబాలికలకు విధిగా విద్య నేర్వవలెను. అతిబాల్య వివాహాలు అనర్థదాయకాలు – అని సరోజనీ దేవిగారు స్త్రీ సామాజికాంశాలపై ఏ విధంగా స్పందించారో వివరించండి. ఆ
జవాబు:
శ్రీమతి సరోజినీదేవి గారి ఉపస్యౌసం మదనపల్లి యందు హిందూ సమాజం వారి యాజమాన్యంలో నిర్వహించబడింది. శ్రీమతి పద్మావతీదేవి గారు ఈ సభకు అధ్యక్షత వహించిరి. శ్రీమతి సరోజినీదేవి గారి ఉపన్యాస సారాంశం ఇట్లున్నది.

ఢిల్లీ మహిళా సభవారు స్త్రీలకు సంబంధించిన చాలా విషయాల్ని చర్చించారు. బాలలందరకూ తప్పక విద్య నేర్పించాలని అన్నారు. స్త్రీలకు నియోజక, నియోజిత స్వాతంత్ర్యం కావాలన్నారు. చిన్నవయస్సులోనే వివాహాలు చేయకూడదన్నారు. ఇతర దేశాల్లో స్త్రీలు ఎక్కువ కష్టం సాధించిన ఎన్నిక హక్కులు మనదేశంలోని స్త్రీలు పెద్దగా కష్టపడకుండానే సాధించారు. మద్రాసు రాష్ట్ర శాసనసభకు ఒక స్త్రీ డిఫ్యూటీ ప్రెసిడెంటుగా ఎన్నిక అయింది. తిరువాన్కూరులో ఒక స్త్రీ మంత్రి పదవిని పొందింది. ఇంకా చాలామంది మహిళలు స్థానిక సభల్లోను, విద్యాసంఘాల్లోను సభ్యులయ్యారు. ఈ స్వాతంత్ర్యపు హక్కుల్ని సమర్థతతో నిర్వహించాలంటే స్త్రీలు విద్యావంతులు కావాలి. కాని మన దేశంలో స్త్రీల విద్యాభివృద్ధికి బాల్య వివాహాలు అడ్డంకి అయ్యాయి. వాటిని రూపుమాపాలి.

స్త్రీ శక్తి స్వరూపం. ప్రధాన దేవతలైన సరస్వతి – లక్ష్మి – పార్వతులు స్త్రీలే. తమ సొంత శక్తితో విద్యను, సంపదలను పొందవచ్చు. పిరికితనాన్ని, బిడియాన్ని విడిచిపెట్టడం ద్వారా సాహసకార్యాల్ని చేయవచ్చు. కాని అట్టి శక్తి నేటి మహిళలలో స్తంభించిపోయింది. చాలామంది కాశీ రామేశ్వరాది పుణ్య యాత్రల్ని చేయాలనుకుంటారు. కాని సకల ప్రాణుల్ని ప్రేమించడం, చేసిన తప్పులకు పశ్చాత్తాపడటం, జాతి మత భేదాలు పాటించక విశ్వమానవులందరినీ సోదరులుగా భావించడం ద్వారా మన శరీరాన్నే పుణ్యక్షేత్రంగా చేసుకోవచ్చు. నిజానికి జీవితమే ఒక యాత్ర. సంస్కరింపబడని మనస్సుతో ఎన్ని యాత్రలు చేసినా ఫలితం ఉండదు. తోటివారిని అంటరాని వారిగా చూడడం తప్పు. స్త్రీలకు సౌందర్యం వెలలేని ఆభరణాలను ధరించడంలో లేదు. నిర్మలమైన ప్రేమను, కరుణను ఇరుగు పొరుగు వారిపై కలిగి ఉండాలి.

AP Board 9th Class Telugu Solutions Chapter 6 ప్రబోధం

ప్రశ్న 2.
‘స్త్రీ విద్య’ ఆవశ్యకతను వివరించండి.
జవాబు:
విద్యావంతురాలైన గృహిణి వలన ఎన్నో ప్రయోజనాలున్నాయి. గృహకార్యాలనే కాక బయటకు వెళ్ళి చేసుకోవలసిన పనులను కూడా చక్కగా నిర్వహించుకోగలదు. తన పిల్లలను చదివించడంలోను, వారికి వచ్చే సందేహాలను తీర్చడంలోనూ, విద్యావంతురాలే సమర్థురాలు. మూఢనమ్మకాలకు, మోసపు మాటలకు లొంగిపోకుండా వైజ్ఞానికంగా ఆలోచించగలగాలంటే గృహిణులు తప్పక విద్యావంతులు కావాలి ఒక్క ఇల్లాలు విద్యావంతురాలైతే ఆ ఇంటిని అనేక ఆపదల నుంచి రక్షిస్తుంది. కొబట్టే “ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు” అనే సామెత ఏర్పడింది. పిల్లలచే ఉన్నత విద్యలను అభ్యసింపజేయడంలో చదువుకున్న ఇల్లాలే చక్కని నిర్ణయాలు తీసుకోగలదు.

ఆడపిల్లల చదువు వల్ల చాలా అనర్థాలు దూరమవుతాయి. సమాజం విద్యావంతమవుతుంది. ఉత్తమ సమాజం వల్ల ఉత్తమ దేశం ఏర్పడుతుంది. మూఢవిశ్వాసాలు నశిస్తాయి. వైజ్ఞానిక దృక్పథం ఏర్పడుతుంది.

ప్రశ్న 3.
స్త్రీల చైతన్యానికి మహిళా సంఘాలు చేస్తున్న కృషిని వివరించండి.
జవాబు:
బాలికలు పాఠశాలలకు వెళ్ళి విద్యాభ్యాసం చేయడానికి మహిళా సంఘాలు పరిశ్రమించాయి. వయోజనులు, గృహిణులైన స్త్రీల కోసం వయోజన విద్యా సంఘాలను ఏర్పాటుచేశాయి. సమాజంలో స్త్రీల అణచివేతను అనేక ఉద్యమాలతో ఎదుర్కొన్నాయి చదువుకొనే ప్రదేశాల్లో, పనిచేసే చోట్ల మహిళలకు ఎదురయ్యే లైంగిక వేధింపులు, ఇతర సమస్యలను సమర్థవంతంగా తిప్పికొట్టడానికి మహిళా సంఘాలు కృషిచేస్తున్నాయి.

వివిధ రాష్ట్రాల మహిళా సంఘాల ఐక్య ఉద్యమాల ఫలితంగానే మహిళలకు ఓటు హక్కు, ఎన్నికలలో పాల్గొనే హక్కు లభించాయి. ఉన్నత కుటుంబాలలోని .ఆడపిల్లలు పాఠశాలలకు వచ్చి చదువుకోగలుగుతున్నారు. పరదాలమాటున, ఘోషాల చాటున మగ్గిన మహిళలు నేడు స్వేచ్ఛగా బయటికి వచ్చి తమ పనులు నిర్వహించుకోగలుగుతున్నారంటే వీటి వెనుక మహిళా సంఘాల కృషి ఎంతో ఉంది. నేటి సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న వరకట్న సమస్యలను, యాసిడ్ దాడులను దూరం చేయడంలో మహిళా సంఘాలు ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి. మహిళలకు అనుకూలంగా అనేక చట్టాలను తీసుకురావడంలో మహిళా సంఘాలు విజయాన్ని సాధించాయి. మహిళలపై లైంగిక దాడులకు వ్యతిరేకంగా ‘నిర్భయ్’ వంటి రక్షణను పొందడం (ఇందులో కొన్ని).

ఇ) కింద ఇచ్చిన వివరాలను విశ్లేషిస్తూ పది వాక్యాలు రాయండి.

అక్షరాస్యత – 2011 సం||జాతీయస్థాయిరాష్ట్రస్థాయి
పురుషుల అక్షరాస్యత82.14%75.56%
స్త్రీల అక్షరాస్యత70.04%59.74%
మొత్తం65.46%67.61%

జవాబు:

  1. భారతదేశంలో ప్రతి పది సంవత్సరాలకొకసారి జనాభాను లెక్కిస్తారు.
  2. ఈ మధ్యకాలంలో స్త్రీ – పురుష, చిన్న – పెద్ద తేడాలతో మాత్రమేగాక వివిధ కులాల, వర్గాల ప్రాతిపదికగా జనాభాను లెక్కించారు.
  3. 2001 వ సంవత్సరంలో జనాభాను లెక్కించాక తిరిగి పదేళ్ళ తర్వాత 2011వ సంవత్సరంలో జనాభా లెక్కలను భారత ప్రభుత్వం ప్రకటించింది.
  4. 2011 జనాభా లెక్కల ప్రకారం జాతీయస్థాయిలో పురుషుల అక్షరాస్యత 82.14%గా ఉంది.
  5. స్త్రీల అక్షరాస్యత 70.04% గా ఉంది.
  6. ఈ రెండింటి మధ్య తేడా 12.10. దీని ద్వారా పురుషుల కంటే స్త్రీల అక్షరాస్యతా సంఖ్య తక్కువ
  7. రాష్ట్రస్థాయిలో చూస్తే పురుషుల అక్షరాస్యతా శాతం 75.56% గా ఉంది.
  8. మహిళల అక్షరాస్యత 59.74% గా ఉంది.
  9. ఈ రెండింటి మధ్య తేడా 15.82%
  10. మన రాష్ట్రంలో మహిళల అక్షరాస్యతా శాతం ఇంకా పెరగాల్సి ఉంది.

AP Board 9th Class Telugu Solutions Chapter 6 ప్రబోధం

ఈ) సృజనాత్మకంగా రాయండి.

ప్రశ్న 1.
సునీతా విలియమ్స్ భారత సంతతికి చెందిన అమెరికా అంతరిక్ష పరిశోధకురాలు. ఆమెకు సంబంధించిన వివరాలు కింద ఉన్నాయి. వాటి ఆధారంగా ఆమె జీవిత విశేషాలను వర్ణనాత్మకంగా రాయండి. – పూర్తి పేరు సునీతా పాండ్యకృష్ణ – జననం 19 సెప్టెంబరు, 1965.
– అమెరికా అంతరిక్ష పరిశోధకురాలు
– అంతరిక్షంలో అత్యధిక సమయం నడిచిన తొలి మహిళ.
– ఎక్కువసార్లు అంతరిక్షయాత్ర చేసిన మహిళ
– 1998లో NASA చేత ఎంపిక.
– 2007లో భారత పర్యటన.
– గుజరాత్ లో స్వగ్రామం (జులాసన్), సబర్మతి సందర్శన
– విశ్వప్రతిభ అవార్డ్, ఫస్ట్ పర్సన్ ఆఫ్ ఇండియన్ డీసెంట్ అవార్డు.
– 4 అక్టోబర్ 2007లో “అమెరికన్ ఎంబసీ” లో ప్రసంగం.
– భారత ప్రధానితో సమావేశం.
– NASA లో డిప్యూటీ చీఫ్ గా 2008లో బాధ్యత.
జవాబు:
ప్రాచీన కాలపు భారతదేశ చరిత్రలో మహిళలు పురుషులతో పోటీపడటమే గాక, వారినధిగమించి తమ సత్తా చాటుకొన్న సందర్భాలు కోకొల్లలు. స్త్రీలు యజ్ఞ నిర్వాహకులుగా ఉన్నట్లు వేదమంత్రాల ద్వారా తెలుస్తుంది. గార్గియనే మహిళా శిరోమణి వేదవేదాంగాలలోను నిష్ణాతురాలు. తనను శాస్త్రవాదనలో ఓడించినవానినే వివాహం చేసుకుంటానని కఠోర ప్రతిజ్ఞ చేసింది. ఎందరో మహాపండితులను శాస్త్ర వాదనలో ఓడించింది. చివరకు యాజ్ఞవల్క్య మహర్షితో జరిగిన శాస్త్ర చర్చలో ఓడిపోయి, ఆ మహానుభావుణ్ణి వివాహం చేసుకొంది. తదనంతర కాలంలో భర్త ద్వారా బ్రహ్మవిద్యను పొంది మహా ప్రజ్ఞావంతురాలిగా పేరొందింది. తదనంతర కాలంలో మహిళలు తమ సామర్థ్యాన్ని విస్మరించి కష్టాల కడలిలో మునిగిపోయారు. కాని ఆధునిక కాలంలో మహిళలు ప్రతికార్యంలోనూ పురుషులతో పోటీపడుతున్నారు. తమ శక్తియుక్తులకు పదును పెడుతున్నారు. ఈ మధ్యకాలంలోనే భారతీయ మహిళ “కల్పనా చావ్లా” మొట్టమొదటిసారిగా అంతరిక్షంలో ప్రవేశించింది. మహిళల గొప్పదనాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటింది. కాని అంతటితో సంతృప్తి పడక స్వర్గలోకానికి కూడా ఆ కీర్తిని చాటాలని సంకల్పించి స్వర్గ సోపానాలను (మెట్లను) అధిరోహించింది.

కల్పనాచావ్లా లేని లోటును తాను భర్తీ చేస్తానని భారతీయులను ఊరడించింది శ్రీమతి సునీతా విలియమ్స్. సునీతా భారత సంతతికి చెందిన అమెరికా అంతరిక్ష పరిశోధకురాలు. ఈమె పూర్తి పేరు సునీతా పాండ్యకృష్ణ, ఈమె 19-9-1965న జన్మించింది. ప్రపంచవ్యాప్తంగా మహిళలందరూ గర్వించేలా అంతరిక్షంలో అత్యధిక సమయం నడిచిన తొలి మహిళగా గుర్తింపు పొందింది. 1998వ సంవత్సరంలో NASA చేత ఎంపిక చేయబడి అంతరిక్షయానం చేసింది. తన అనుభవాలను, అనుభూతులను భారతీయులతో పంచుకోదలచి 2007వ సంత్సరంలో భారతదేశంలో పర్యటించింది. గుజరాత్ రాష్ట్రంలో తన స్వగ్రామమైన జులాసనను, సబర్మతీ ఆశ్రమాన్ని సందర్శించింది. భారతీయుల ఆత్మీయతను, ఆప్యాయతను చవిచూసింది. వారు ప్రేమతో ఇచ్చిన ‘విశ్వ ప్రతిభ అవార్డు’ను, “ఫస్ట్ పర్సన్ ఆఫ్ ఇండియన్ డీసెంట్ అవార్డు’ను స్వీకరించి, గర్వంగా భావించింది. 4-10-2007వ తేదీన “అమెరికన్ ఎంబసీ’లో ప్రసగించింది. తర్వాత భారత ప్రధానితో సమావేశమై కృతజ్ఞతలు తెలిపింది. 2008వ సంవత్సరంలో NASA లో డిప్యూటీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించింది. ఒక మహిళ అందులోను భారతీయ సంతతి అలాంటి ఉన్నతపదవిని పొందడం అదే ప్రథమం.

AP Board 9th Class Telugu Solutions Chapter 6 ప్రబోధం

ఉ) ప్రశంసాత్మకంగా రాయండి. రాణి కుటుంబ ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవటం వల్ల 7వ తరగతి వరకు చదివి బడి మానేసింది. ఉపాధ్యాయురాలి ప్రోత్సాహంతో కస్తూర్బా పాఠశాలలో చేరి పదోతరగతి వరకు చదివి, పదోతరగతి పబ్లిక్ పరీక్షలో 9.7 పాయింట్స్ సాధించి కలెక్టర్ గారి చేతుల మీదుగా బహుమతినందుకున్నది. ఆమెను ప్రశంసిస్తూ లేఖ రాయండి.
జవాబు:

ప్రశంసా లేఖ

గుంటూరు,
x x x x

ప్రియమైన మిత్రురాలు రాణికి !

నీ స్నేహితురాలు కల్పన రాయునది. ఎవరీ కల్పన అని ఆలోచిస్తున్నావా? అట్టే శ్రమపడకు, నేను నీకు తెలియదు కాని నీ గురించి దిన పత్రికల్లో చదివి, ఆనందం ఆపుకోలేక నా ప్రశంసలు నీకు తెలియజేయాలని ఈ లేఖ రాస్తున్నాను.

మన రాష్ట్రంలో చాలామంది బాలికలు పేదరికం కారణంగా ప్రాథమిక స్థాయిలోనే చదువు ఆపేస్తున్నారు. అందరిలా నీవు కూడా ఏడవ తరగతితోనే చదువు ఆపి ఉంటే అది పెద్దవార్త అయ్యేదిగాదు. కాని నీ అదృష్టం కొద్దీ నీ ఉపాధ్యాయురాలు పాఠశాల మానిన నిన్ను కస్తూర్బా పాఠశాలలో చేర్పించింది. ఉచిత విద్యతోపాటు నివాసం, వస్త్రాలు, పుస్తకాలు, భోజన సౌకర్యాలు ఉచితంగా ఆడపిల్లలకు కల్పిస్తూ వారి కోసమే ప్రభుత్వం కస్తూర్బా పాఠశాలలను ఏర్పరచింది. ఈ పాఠశాలలు అందుబాటులో ఉన్నా ఎంతోమంది బాలికలు విద్యకు దూరమవుతున్నారు. వీటి గురించిన అవగాహన వారికి లేకపోవడమే ఇందుకు కారణం.

పాఠశాలలో చేరిన నువ్వు విద్యపైనే శ్రద్ధ పెట్టి బాగా చదవడం పదవతరగతి పబ్లిక్ పరీక్షలో 9.7 పాయింట్లు సాధించడం నిజంగా గొప్ప విషయం. చదువే లోకంగా ఉంటే తప్ప ఇది సాధ్యం కాదు. ఒక తపస్సులా విద్యాభ్యాసం సాగించిన నిన్ను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను. నువ్వు నా తోటి విద్యార్థినులకే గాక నాలా వార్తాపత్రికల ద్వారా, దూరదర్శన్ వంటి ప్రసార మాధ్యమాల ద్వారా తెలుసుకున్న అమ్మాయిలకు చాలామందికి ఆదర్శంగా నిలిచావు.

కలెక్టర్ గారు నిన్ను అభినందిస్తున్న దృశ్యం దూరదర్శన్ లో చూస్తుంటే నా ఒళ్ళు పులకరించి పోయిందనుకో. నాతో పాటు చదువుతూ, మధ్యలోనే చదువు మానేసిన నా స్నేహితురాళ్ళకు నీ గురించి చెప్పాను. ప్రముఖులందరూ నిన్ను ప్రశంసిస్తున్న దృశ్యాలను చూపాను. వారు కూడా ఎంతో సంతోషించారు. నువ్వు మా సోదరివైతే ఎంత బాగుణ్ణు అని ఎవరికి వారే అనుకున్నాం. ఇప్పుడైనా నువ్వు మా సోదరివే. నీ నుండి మేమెంతో స్ఫూర్తి పొందాం. పేదరికం విద్యకు అడ్డంకి కాలేదని నీవు నిరూపించాలని మన స్ఫూర్తిగా కోరుతున్నాను.
ధన్యవాదాల

ఇట్లు,
నీ మిత్రురాలు,
ఎ. కల్పన,
9వ తరగతి,
తెలుగుమాధ్యమం,
క్రమసంఖ్య – 18,
శారదానికేతన్ – బాలికోన్నత పాఠశాల,
బ్రాడీపేట 2/14, గుంటూరు.

చిరునామా :
పి. రాణి,
వెంకటేష్ నాయక్ గారి కుమార్తె,
రేగులగడ్డ గ్రామం,
మాచవరం మండలం,
గుంటూరు జిల్లా.

IV. ప్రాజెక్టు పని

వివిధ రంగాలలో ప్రసిద్ధులైన స్త్రీల పేర్లు సేకరించి వారు ఏ రంగంలో పేరు పొందారో పట్టికను రాసి ప్రదర్శించండి.
ఉదా :
క్రీడలకు సంబంధించిన వారు, రచయిత్రులు – మొదలయిన వారు.

పేరుప్రసిద్ధిగాంచిన రంగం
1. మొల్లకవయిత్రి
2. రంగాజమ్మకవయిత్రి
3. ఇందిరాగాంధీరాజకీయం
4. పి.టి. ఉషక్రీడలు
5. అశ్వని నాచప్పక్రీడలు
6. కల్పనాచావ్లావ్యోమగామి
7. సునీతా విలియమ్స్వ్యోమగామి
8. కిరణ్ బేడిరక్షణ విభాగం
9. మదర్ థెరిస్సాదీనజనసేన
10. డొక్కా సీతమ్మఅన్నదాత
11. శారదామాతఆధ్మాత్మిక రంగం
12. శకుంతలాదేవిగణితశాస్త్రం
13. యద్దనపూడి సులోచన రాణినవలా రచయిత్రి
14. ఐశ్వర్యారాయ్చలనచిత్రం
15. అరుంధతీరాయ్ఆంగ్ల సాహిత్య రచయిత్రి
16. శోభానాయుడునాట్యకారిణి
17. యమ్.యస్. సుబ్బులక్ష్మిసంగీతం
18. కిరణ్ మజుందార్ షావాణిజ్యం

III. భాషాంశాలు

పదజాలం

అ) కింది పట్టికలో సమానార్థక పదాలున్నాయి. వాటి నుండి పట్టిక కింద ఇచ్చిన పదాలకు పర్యాయపదాలు వెతికి రాయండి.
AP Board 9th Class Telugu Solutions Chapter 6 ప్రబోధం 1
1) వనిత, 2) లక్ష్మి, 3) కరుణ, 4) నెచ్చెలి, 5) శీఘ్రం, 6) అనిశం, 7) భ్రాత. 8) విక్రమం , 9) విదుషి
జవాబు:
1) వనిత : స్త్రీ, పడతి
2) లక్ష్మి : శ్రీ, రమ
3) కరుణ : దయ, జాలి
4) నెచ్చెలి : స్నేహితురాలు, ప్రాణసఖి
5) శీఘ్రం : వేగం, తొందర
6) అనిశం : ఎల్లప్పుడు, సదా
7) భ్రాత : సోదరుడు, సహోదరుడు
8) విక్రమం : పరాక్రమం, శౌర్యం
9) విదుషి : విద్వాంసురాలు, పండితురాలు

AP Board 9th Class Telugu Solutions Chapter 6 ప్రబోధం

ఆ) కింది వాటిలో ప్రకృతి, వికృతులు కలగలిసి ఉన్నాయి. వాటిని వేరుచేసి, ఎదురెదురుగా రాయండి.
ఫలము, లచ్చి, విద్దె, కృష్ణుడు, ఇంతి, లక్ష్మి, పండు, స్త్రీ, కన్నయ్య, విద్య, శక్తి,
జవాబు:
ప్రకృతి – వికృతి
ఫలము – పండు
లక్ష్మి – లచ్చి
విద్య – విద్దె
కృష్ణుడు – కన్నయ్య
స్త్రీ – ఇంతి
శక్తి – సత్తు

ఇ) కింది పదాలకు అర్థాలను గుర్తించి కింద గీత గీయండి. ఆ అర్థాన్ని ఉపయోగించి వాక్యాలు రాయండి.
ఉదా :
అనిశం = ఎల్లప్పుడు, అన్నము, గాలి
వాక్యం : సూర్యుడు ఎల్లప్పుడు తూర్పున ఉదయిస్తాడు.

1. విదుషీమణి అను విద్యావంతురాలు, నాయకురాలు, పండితురాలు.
వాక్యం : సరోజినీ నాయుడు ఆంగ్లభాషలో గొప్ప పండితురాలు.

2. నిర్మలం : స్వేచ్ఛ, స్వచ్ఛమైనది, భిన్నం కానిది.
వాక్యం : ఈ కొలను చాలా స్వచ్చమైనది.

3. కల్మషం : కలశం, కమలం, పాపం
వాక్యం : ఏ పాపం చేయని వారే తప్పు చేసిన వారిని శిక్షిం’ ‘లని ఏసుక్రీస్తు ప్రబోధించాడు.

4. ప్రతిబంధకం = ఎదిరించేది, అడ్డగించేది, తిరిగి బంధించేది.
వాక్యం : ముస్లిం స్త్రీల విద్యకు బురఖా పద్ధతి అడ్డంకిగా తయారయ్యింది.

ఈ) కింది పదాలకు ఎదురుగా వాటి నానార్థాలున్నాయి. వాటినుపయోగించి వాక్యాలు రాయండి.
ఉదా :
ఫలం (పండు) : నేను తిన్న ఫలం తీయగా ఉలు.
ప్రయోజనం : లక్ష్యం లేకుండా పనిచేస్తే ఫలం లభించదు.

1. పురము (పట్టణం) : గుంటూరు పురము విద్యలకు నెలవు.
(ఇల్లు) : మా పురము పేరు సౌదామిని.

2. నారి (స్త్రీ : బ్రిటిష్ అధికారులను ఎదిరించిన వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి.
(వింటితాడు) : అర్జునుడి నారి ధ్వనికే శత్రువులు భయపడిపోయేవారు.

వ్యాకరణం

అ) కింది కర్మణి వాక్యాలను కర్తరి వాక్యాలుగా మార్చండి.

1. కర్మణి వాక్యం : ఈ పురంలోని హిందూ సమాజంచారి యాజమాన్యంలో పై సభ జరుపబడింది.
కర్తరి వాక్యం : ఈ పురంలోని హిందూ సమాజం వారి యాజమాన్యంలో పై సభను జరిపారు.

2. కర్మణి వాక్యం : తిరువాన్కూరులో ఒక స్త్రీ మంత్రిణిగా నియమించబడింది.
కర్తరి వాక్యం : తిరువాన్కూరులో ఒక స్త్రీని మంత్రిణిగా నియమించారు.

3. కర్మణి వాక్యం : విద్యాసంఘాలలో స్త్రీలు సభ్యురాండ్రుగా నియమింపబడ్డారు.
కర్తరి వాక్యం : విద్యాసంఘాలలో స్త్రీలను సభ్యురాండ్రుగా నియమించారు.

ఆ) పడ్వాది సంధి :
భయము + పడు – భయపడు (మువర్ణానికి లోపం)
భయము + పడు – భయంపడు (బిందువు రావడం)

విడదీసిన పగాలకు, కలిపిన పదాలకు తేడా గమనించండి. కలిపిన పదంలో ‘ము’కు బదులుగా (0) వచ్చింది. ‘ము’ లోపించింది.

సూత్రం :
పడ్వాదులు పరమగునప్పుడు ‘ము’ వర్ణకానికి లోపమూ, పూర్ణబిందువూ (0) విభాషగా అవుతాయి.

పడ్వాదులు :
పడు, పట్టె, పాటు, పఱచు, పెట్టు మొదలగునవి.

AP Board 9th Class Telugu Solutions Chapter 6 ప్రబోధం

ఇ) కింది వాటిని గమనించండి :
1. తృప్తిగంటిని – తృప్తి పొందాను.
2. ఉపన్యసించిరి – ఉపన్యసించారు.
3. తీర్మానములు గావించియున్నారు – తీర్మానాలు చేశారు.
4. లభించినవి – లంచాయి.
5. చేయుదురు – చేస్తారు.

గమనిక :
మార్పు దాదాపు చివరి రెండు మూడు అక్షరాలలోనే రావడం గమనించండి. గ్రాంథిక భాషా పదాలు వ్యవహారభాషలోకి మార్చాలంటే – నిత్యం మనం మాట్లాడే భాషను బాగా పరిశీలించాలి.

కింది పదాలను వ్యవహారభాషలోకి మార్చండి.

గ్రాంథికమువ్యవహారభాష
1) చూడుడు1) చూడండి
2) సాహసించును2) సాహసిస్తుంది/సాహసిస్తాడు
3) కలిగియుండవలెను3) కలిగి ఉండాలి

9th Class Telugu 6th Lesson ప్రబోధం రచయిత్రి పరిచయం

కనుపర్తి వరలక్ష్మమ్మ గుంటూరు జిల్లా బాపట్లలో 6. 10. 1896న జన్మించారు. ఆమె భర్త కనుపర్తి హనుమంతరావు ప్రోత్సాహంతో సుమారు 50 కథలు, రెండు నవలలు రచించారు. భారతి, గృహలక్ష్మి, అనసూయ, వినోదవాణి, ఆనందవాణి మొదలయిన పత్రికలలో రచనలు చేశారు. గృహలక్ష్మి పత్రికలో సుమారు ఆరు సంవత్సరాలపాటు శారదలేఖలు ప్రచురణ అయ్యాయి. ‘లీలావతి’ అనే కలం పేరుతో ఆంధ్రపత్రికలో ‘మా చెట్టునీడ ముచ్చట్లు’ శీర్షికతో రచనలు చేశారు. ‘గాంధీ దండకం’ రచించారు. దేశభక్తిని, దైవభక్తిని ప్రబోధిస్తూ అనేక పాటలు, పద్యాలు, కనుపర్తి వరలక్ష్మమ్మ నాటికలు రచించారు.

ధర్మము నా జీవము, నీతి నా మతము, సతీశ్రేయము నా లక్ష్యం అని ప్రకటించి, కలముపట్టి రచనలు చేసిన ‘విదుషీమణి’ కనుపర్తి వరలక్ష్మమ్మ. వీరి సాహిత్యకృషికి గుర్తింపుగా 1930లో గృహలక్ష్మి స్వర్ణపతకం, 1934లో ‘స్వర్ణకంకణం’ అందుకున్నారు. 1967లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి ఉత్తమ రచయిత్రి పురస్కారాన్ని అందించింది. గుడివాడలో జరిగిన సప్తతి మహోత్సవ సన్మానసభలో ‘కవితా ప్రవీణ’ బిరుదును పొందారు. 1975లో ప్రథమ ప్రపంచ తెలుగుమహాసభల స్వర్ణఫలకం, తామ్రపత్ర బహుమతి నందుకున్నారు.

కఠిన పదాలకు అర్థాలు

సౌభాగ్యవతి = ముత్తైదువ (శ్రీమతి)
నెచ్చెలి (నెఱు + చెలి) = ప్రాణ స్నేహితురాలు
శుభ, సమాచారము = మంచి, ముచ్చట
వనితామణి = స్త్రీ రత్నము
గంభీరోపన్యాసము = గంభీరమైన ఉపన్యాసము
ఆలింపవలెనని = వినాలని
స్తంభించిపోయినది = మొద్దువారినది
ఎల్లరు = అందరు
అనిశము = ఎల్లప్పుడు
ఉత్కంఠపడు = ఇష్టమైన వస్తువును పొంద డానికి తొందరపడు
కవయిత్రి = కవిత్వం అల్లే స్త్రీ
విదుషీమణి = గొప్ప విద్వాంసురాలు
నారీరత్నము = స్త్రీ రత్నము
మహత్తరోపన్యాసము = గొప్ప ఉపన్యాసము
లేఖామూలముగా = ఉత్తరం ద్వారా
కొమార్తె = కూతురు
అగ్రాసనాధిపురాలు = అధ్యక్షురాలు
ఆంగ్లభాష = ఇంగ్లీషుభాష
మహనీయుడు = గొప్పవాడు
సారాంశము = తాత్పర్యము
మహిళాసభ = స్త్రీ సభ
బాల్యవివాహము = చిన్నవారికి వివాహము
పడయజాలక = పొందలేక
తత్పలితము = దాని ఫలితము
మంత్రిణి = మంత్రిగా ఉన్న స్త్రీ
నిర్వహింపుచున్నది = నెరవేర్చుతుంది
సభ్యురాండ్రు = సభలోని స్త్రీలు
ప్రతిబంధకము = అడ్డగించునది
రూపుమాపవలెను = నశింపజేయాలి
లక్ష్మీప్రసన్నత = ధనము కలుగుట
సరస్వతీప్రసన్నత = చదువువచ్చుట
బిడియము = సిగ్గు
అశక్తలు = శక్తిలేని వారు
విదుషీమణులు = శ్రేష్ఠమైన విద్వాంసురాండ్రు
పశ్చాత్తాపము = తాను చేసింది తప్పు అని తెలిసినపుడు, అలా చేశానే అని తరువాత చింతించుట
విశ్వమానవ భ్రాతృత్వము = ప్రపంచ మానవ సోదరత్వము
అకల్మష హృదయము = పాపము లేని మనసు
తనువు = శరీరము
చిత్త సంస్కారము = మనస్సు శుద్ధి
అస్పృశ్యులు = అంటరానివారు
అర్పించుట = ఇచ్చుట
నిర్మలము = స్వచ్ఛము
కరుణాభరితము = దయతో కూడినది
ప్రేమ పూర్ణము = ప్రేమతో నిండినది
పడయగోరు = పొందగోరు
ముఖ్యాంశములు (ముఖ్య + అంశములు) = ముఖ్య విషయాలు

AP Board 9th Class Telugu Solutions Chapter 1 శాంతికాంక్ష

AP State Syllabus AP Board 9th Class Telugu Textbook Solutions Chapter 1 శాంతికాంక్ష Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Telugu Solutions 1st Lesson శాంతికాంక్ష

9th Class Telugu 1st Lesson శాంతికాంక్ష Textbook Questions and Answers

చదవండి-ఆలోచించండి-చెప్పండి

అది 1945 వ సంవత్సరం. రెండో ప్రపంచ యుద్ధంలో అమెరికా జపాన్ లోని హిరోషిమా అనే నగరం మీద అణుబాంబులతో దాడి చేసింది. దాని ఫలితంగా కొద్ది క్షణాల్లో అరవైఆరు వేలమంది ప్రాణాలు కోల్పోయారు. డెబ్బై వేలమంది క్షతగాత్రులయ్యారు. నిన్న మొన్నటి వరకూ అక్కడి ప్రజలకు అది పీడకలగా నిలిచిపోయింది.

ప్రశ్నలు జవాబులు

ప్రశ్న 1.
ఈ పేరా చదివాక మీకేమర్థమైంది?
జవాబు:
యుద్ధం వలన జననష్టం ఎక్కువగా జరుగుతుందని అర్థమైంది.

ప్రశ్న 2.
మానవ కళ్యాణానికి ఉపయోగపడాల్సిన సైన్సు దేనికి దారితీసింది?
జవాబు:
మానవ వినాశనానికి దారితీసింది.

AP Board 9th Class Telugu Solutions Chapter 1 శాంతికాంక్ష

ప్రశ్న 3.
ఆధునిక కాలంలో యుద్ధాలవల్ల ఎలాంటి నష్టాలు సంభవిస్తాయి?
జవాబు:
ఆధునిక కాలంలో యుద్ధాలలో రసాయనిక బాంబులను, అణుబాంబులను ఉపయోగించే ప్రమాదముంది. దీనివల్ల ప్రపంచపటంలోని కొన్ని దేశాలు కనుమరుగయ్యే అపాయం ఉంది.

ప్రశ్న 4.
యుద్ధాలను నివారించడానికి, శాంతిని నెలకొల్పడానికి ఏం చేయాలి?
జవాబు:
యుద్ధాలను నివారించడానికి, శాంతిని నెలకొల్పడానికి ప్రపంచదేశాలన్నీ అసమానతలను వీడాలి. సోదర భావంతో మెలగాలి.

ఇవి చేయండి

I. అవగాహన – ప్రతిస్పందన

అ) కింది అంశాలను గురించి చర్చించండి.

ప్రశ్న 1.
శ్రీకృష్ణుణ్ణి కష్టాలను తొలగించే వ్యక్తిగా ధర్మరాజు కీర్తించాడు గదా! అలా ఎందుకన్నాడో చర్చించండి.
జవాబు:
పాండురాజు మరణిస్తూ శ్రీకృష్ణుణ్ణి ఆశ్రయించమని పాండవులకు సూచించాడు. పాండవులను చిన్నప్పటి నుండి శ్రీకృష్ణుడు అనేక కష్టాల నుండి రక్షించాడు. లక్క ఇంటి ప్రమాదం నుండి, ద్రౌపది వస్త్రాపహరణ ఘట్టంలో, అరణ్యవాస సమయంలో, ఇలా పలు సందర్భాల్లో శ్రీకృష్ణుడు కాపాడటం ధర్మరాజుకు తెలుసు. ధర్మరాజు ధర్మాన్నే ఆశ్రయించినవాడు కాగా శ్రీకృష్ణుడు ధర్మపక్షపాతి. అందుకే ధర్మరాజు శ్రీకృష్ణుణ్ణి ఆశ్రయించాడు.

యుద్ధం లేకుండా, బంధునాశనం కాకుండా, తమ రాజ్యం తమకు రావాలని ధర్మరాజు కోరిక. దాన్ని నెరవేర్చగల సమర్థుడు శ్రీకృష్ణుడని అతని విశ్వాసం. ఒకవేళ యుద్ధం తప్పనిసరి అయితే దానికి కారకుడిగా దుర్యోధనుడినే లోకం నిందించాలి తప్ప తమని నిందించకూడదనేది ధర్మజుడి కోరిక. అలా “కర్ర విరగకుండా పాము చావకుండా” – కార్యం సాధించగల నేర్పరి శ్రీకృష్ణుడు. కాబట్టే కష్టాలను తొలగించే వ్యక్తిగా ధర్మరాజు కృష్ణుణ్ణి కీర్తించాడు.

ఎదుటివారి మనోభావాలను చక్కగా గ్రహించి, తదనుగుణంగా వ్యూహాన్ని పన్నగల మేధావి శ్రీకృష్ణుడు. దక్షుడు కాబట్టే ఈ అసాధ్య కార్యాన్ని సాధించగలడని, రాయబార సమయంలో దుర్యోధనాదులు ఏవైనా ఇబ్బందులు కలిగించినా తప్పుకొనిరాగల ధీరుడని ధర్మరాజు నమ్మకం. పాండవుల హృదయాల్ని లోకానికి తెలియబరచగలిగిన వాక్చాతుర్యం, అవసరమైతే తగిన సమాధానం చెప్పగల నేర్పు, తగినంత ఓర్పు గల మహానుభావుడు శ్రీకృష్ణుడు. అందుకనే శ్రీకృష్ణుణ్ణి కష్టాలను తొలగించే వ్యక్తిగా ధర్మరాజు కీర్తించాడు.

శ్రీకృష్ణుడు తాను చిన్నప్పటి నుండే మానవాతీత శక్తుల్ని ప్రదర్శించాడు. పూతన, శకటాసురుడు మొదలైన రాక్షసులను చంపడం, కాళీయుని పడగలపై నాట్యం చేయడం వంటి అతిమానుష శక్తుల్ని కలిగి ఉన్నాడు. గోవర్ధనగిరిని పైకిలేపుట వంటి కార్యాల ద్వారా తాను పరమాత్ముడనే సత్యాన్ని వెల్లడి చేశాడు. కుంతీదేవి కూడా కృష్ణుడిని మేనల్లునిగా గాక భగవంతునిగానే సంభావించింది. కష్టాల నుండి గట్టెక్కించేవాడు, ఎల్లప్పుడు శుభాలను కలిగించేవాడు భగవంతుడు ఒక్కడే. కాబట్టే కృష్ణునికి శరణాగతుడైనాడు ధర్మరాజు.

ప్రశ్న 2.
యుద్ధాల వల్ల కలిగే నష్టాలు, అనర్దాలు చెప్పండి.
జవాబు:
యుద్దాల వల్ల సంపదలు కలిగినా ప్రాణహాని కూడా జరుగుతుంది. బలహీనులు బలవంతుని చేతిలో చనిపోతారు. ఒక్కొక్కసారి బలవంతులు సైతం బలహీనుల చేతిలో సమసిపోతారు. యుద్ధంలో ఎవరు గెలుస్తారో, ఎవరు ఓడిపోతారో నిశ్చయించి చెప్పలేము. ఒకవేళ సంగ్రామంలో అపజయం కలిగితే అది చావు కంటే భయంకరమైనది. యుద్ధం అన్ని అనర్థాలకు మూలం. యుద్ధానికి మూలం పగ. పగ కారణంగానే యుద్ధజ్వాల రగులుతుంది. పగ తగ్గితే యుద్ధ ప్రవృత్తి సహజంగానే తొలగిపోతుంది.

ఒకసారి పగ సాధింపునకు దిగితే ఇక దయాదాక్షిణ్యాలు ఉండవు. సంధికి అవకాశం ఉండదు. దారుణమైన క్రూరవృత్తితో శత్రుసంహారమే కొనసాగుతుంది. లక్ష్యం కొద్దిమందికే అయినా ఎంతోమంది అమాయకులు ప్రాణాలు కోల్పోతారు. చాలామంది వికలాంగులవుతారు. భర్తలను కోల్పోయిన స్త్రీలు, వారి కుటుంబాలు వీధినబడతాయి. తమ పిల్లల్ని కోల్పోయిన వృద్ధులు అనాథలవుతారు. దేశంలో కరవుకాటకాలు విలయతాండవం చేస్తాయి.

పూర్వకాలంలోని యుద్ధాలకు నీతినియమాలుండేవి. కానీ ఆధునిక కాలంలో యుద్ధాలకు అవి వర్తించడం లేదు. పూర్వం యుద్ధాలు సూర్యోదయం తర్వాత ఆరంభమై సూర్యాస్తమయంతో ముగిసేవి. నేడు రాత్రివేళల్లో కూడా యుద్ధాలు జరుగుతున్నాయి. ఆధునిక కాలంలో మానవుని విజ్ఞానం బాగా పెరిగి, అణ్వాయుధాలు, రసాయనిక ఆయుధాలు కనుగొనబడి యుద్ధాల్లో ప్రయోగించబడుతున్నాయి. వీటివల్ల దేశాలకు దేశాలే ప్రపంచ పటం నుండి మాయమయ్యే పరిస్థితులేర్పడుతున్నాయి. యుద్ధంలో పాల్గొనే దేశాలకే కాక ఇతర ప్రపంచ దేశాలకు సైతం నేడు అనర్థాలు కలుగుతున్నాయి.

బాంబుల విస్ఫోటనాల వల్ల జలకాలుష్యం, వాయు కాలుష్యాలేర్పడి ప్రక్కనున్న దేశాలు కూడా నష్టమౌతున్నాయి. పరిసరాల కాలుష్యం వలన యుద్ధం జరిగి కొన్ని సంవత్సరాలైనా అక్కడి ప్రజలు ఇంకా కోలుకోని దుస్థితులేర్పడుతున్నాయి. గ్రామాలలో, కొండలలో నక్కిన శత్రువులను చంపడం కోసం చేసే వైమానిక దాడుల్లో ఎందరో అమాయక ప్రజలు, పశువులు ప్రాణాలు కోల్పోతున్నాయి. యుద్ధ సమయంలో అరబ్బు దేశాల్లో పెట్రోలు బావుల పై బాంబులు పడి మంటలు రేగి కలిగిన నష్టం ఎప్పటికీ తీర్చలేనిది.

AP Board 9th Class Telugu Solutions Chapter 1 శాంతికాంక్ష

ఆ) గుర్తున్న పద్యాలకు ప్రతిపదార్థాలు రాయండి.

శా|| ఆ దుర్యోధనుఁడంత మాత్రయును జేయంజాలఁడో కాని, పెం
పేదం గ్రూరత కోర్వరాదు, సిరి నాకేలందునే, గ్రాసవా
సోదైన్యంబులు వచ్చు నాయరయు నీ చుట్టాలకుం, గావునన్
మోదంబందుట గలుఁ గౌరవులు నేముం బొంది శ్రీనొందినన్.
ప్రతిపదార్థం :
ఆ దుర్యోధనుడు = ఆ సుయోధనుడు
అంతమాత్రయును = ఆ కొలదియైనను
చేయన్ = చేయడానికి
చాలడు + ఓ = ఇష్టపడడేమో
కాని = కాని
పెంపు = అభివృద్ధి
ఏదన్ = నశించునట్లుగా
క్రూరతకున్ = క్రౌర్యమునకు
ఓర్వరాదు = సహించగూడదు
సిరి = రాజ్యం (సంపద)
నాకున్ + ఏల = నాకెందుకు
అందున్ + ఏ =అని అందునా
నా + అరయు = నేను బాగోగులు చూసుకోవలసిన
ఈ చుట్టాలకున్ = ఈ ఆశ్రితులకు (పరివారానికి, బంధువులకు)
గ్రాస = తిండికి
వాసః = బట్టకు (నివాసానికి)
దైన్యంబులు = దురవస్థలు
వచ్చు = కల్గుతాయి
కావునన్ = కాబట్టి
కౌరవులున్ = కౌరవులును
ఏమున్ = మేమును
పొంది = సంధి చేసుకొని
శ్రీన్ = రాజ్యాన్ని
పొందినన్ = పొందినట్లైతే (పంచుకున్నట్లైతే)
మోదంబు = (అందరికీ) సంతోషం
అందుట = పొందుట
కల్గున్ = జరుగుతుంది
అని ధర్మరాజు శ్రీకృష్ణునితో అన్నాడు.

సూచన : పాఠంలోని పద్యాలు అన్నింటికీ ప్రతిపదార్థాలు, భావాలు ముందు ఇవ్వబడ్డాయి. * గుర్తుపెట్టిన పద్యాల ప్రతిపదార్థాలు చదవండి.

ఇ) కింది పేరాను చదివి ఎలా, ఎందుకు? అనే ప్రశ్న పదాలను మాత్రమే ఉపయోగించి కొన్ని ప్రశ్నలు తయారుచేయండి.
మనసుకు నచ్చిన పనులే పిల్లలు ఇష్టంగా చేస్తారు. కఠినంగా మాట్లాడితే పిల్లలకు నచ్చదు. కాబట్టి అలా మాట్లాడేవారికి దూరంగా ఉంటారు. పిల్లలు అద్భుతంగా ఆలోచిస్తారు. కొందరు తల్లిదండ్రులు పిల్లల్ని అర్థం చేసుకోలేక అనవసరంగా బాధపడుతుంటారు. తమకు స్వేచ్ఛ ఉన్నచోటనే నిర్భయంగా ప్రశ్నిస్తారు. భద్రత ఉందని భావిస్తేనే, స్వేచ్చగా ఉంటారు. మనసు విప్పి మాట్లాడతారు.

ప్రశ్నలు:
1. మనసుకు నచ్చిన పనులే పిల్లలు ‘ఎలా’ చేస్తారు?
2. కఠినంగా మాట్లాడితే పిల్లలకు ఎందుకు నచ్చదు?
3. కఠినంగా మాట్లాడే వారితో పిల్లలు ఎలా ఉంటారు?
4. పిల్లలు ‘ఏలా’ ఆలోచిస్తారు?
5. కొందరు తల్లిదండ్రులు ‘ఎందుకు’ బాధపడుతూ ఉంటారు?
6. ఎలా ఉన్నచోట పిల్లలు నిర్భయంగా ప్రశ్నిస్తారు?
7. ఎందుకు స్వేచ్ఛగా ఉంటారు?
8. స్వేచ్ఛ ఉన్నచోట పిల్లలు ఎలా మాట్లాడతారు?

ఈ) పాఠం చదవి కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
ధర్మరాజు రాజ్యసంపద దేనికోసం కోరాడు?
జవాబు:
క్షత్రియ ధర్మాన్ని పాటించడం ఎంతో కష్టం. అలాగని రాజు వేరే ధర్మాలను పాటించకూడదు. కాబట్టి ఆయుధాలను చేపట్టి రాజ్యసంపదను పొందాలి. పోనీ రాజ్యసంపద తనకెందుకని కౌరవులను అడగటం మానితే, తననే ఆశ్రయించుకొని ఉన్న తన తమ్ములకు, బంధుజనాలకు కూటికీ, గుడ్డకు సైతం ఇబ్బంది ఏర్పడుతుంది. కాబట్టే ధర్మరాజు రాజ్యసంపదను కోరాడు.

ప్రశ్న 2.
శత్రుత్వ భావనను కవి దేనితో పోల్చాడు?
జవాబు:
శత్రుత్వ భావనను కవి పామున్న ఇంటిలో కాపురం ఉండడంతో పోల్చాడు. అంటే పామున్న ఇంట్లో ఎలా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని జీవిస్తామో అలా శత్రుత్వమున్న చోట కూడా ఏ క్షణం ఏమి జరుగుతుందో అని ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని జీవించాలని కవి భావం.

AP Board 9th Class Telugu Solutions Chapter 1 శాంతికాంక్ష

ప్రశ్న 3.
చాకచక్యంగా మాట్లాడమంటూ శ్రీకృష్ణునికి ధర్మరాజు ఎలాంటి సలహా ఇచ్చాడు?
జవాబు:
కృష్ణా ! మా విషయంలో పక్షపాతం చూపించకు ! ధర్మం – నీతి వాటిననుసరించి ఇరుపక్షాలకూ మేలు, అభివృద్ధి జరిగేలా మాట్లాడు. విదురుడు మొదలైన సత్పురుషుల మనసులకు సమ్మతమయ్యేటట్లుగా తగినంత మెత్తదనంతోనూ, అవసరమైనచోట కఠినమైన మందలింపులతోను కురుసభలో రాజులందరూ గ్రహించేలా మాట్లాడు. న్యాయం పట్టించుకోకుండా దుర్యోధనుడు పరుష వాక్యాలు పలికితే సహించు. తొందరపాటుతో సభను విడిచిరాకు. పెద్దలమాటను సుయోధనుడు వినలేదనే నింద అతనికే ఉంచు. మనం గౌరవంగా పెద్దలమాటను, ఉద్దేశాన్ని సాగనిస్తున్నామని లోకులు మెచ్చుకునేలా చేయి.

ఆ ధృతరాష్ట్రుడు సుతపక్షపాతియై సూటిగా ఏ అభిప్రాయాన్ని చెప్పక, అవినీతితో ప్రవర్తిస్తే సంధి కుదరదని సాహసించి పలుకకు. సాహసం చేయాల్సివస్తే జనులంతా మెచ్చుకునేటట్లు ధర్మానికి నిలచి, మాకు విచారం లేకుండా చేయి. నీకంతా తెలుసు. నీకు ఉపాయాలు చెప్పడానికి నేనేమాత్రం వాణ్ణి ? హస్తినాపురానికి వెళ్ళిరా !

II. వ్యక్తీకరణ సృజనాత్మకత

అ) కింది ప్రశ్నలకు పదేసి వాక్యాలలో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
“పామున్న ఇంటిలో కాపురమున్నట్లే” అంటే ఏమిటి? ధర్మరాజు ఈ వాక్యాన్ని ఎందుకు చెప్పాడు?
జవాబు:
ఇంట్లో పాము ఎప్పుడు కాటువేసి ప్రాణాలు తీస్తుందో తెలియదు కాబట్టి ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని ప్రతిక్షణం భయంతో గడపాలి.

యుద్ధానికి మూలం పగ. ఎడతెగని పగే యుద్ధాన్మాదంగా మారుతుంది. మాయాద్యూతంలో మోసంతో, రాజ్యాన్ని కాజేశారనే పగతో పాండవులలో యుద్ధజ్వాల రగుల్కొంది. బలవంతులైన పాండవులు బతికి ఉంటే రాజ్యం దక్కదని అసూయాపరులైన కౌరవులు వారి మీద పగతో యుద్ధానికి సిద్ధపడ్డారు. పగ తగ్గితే యుద్ధం చేయాలనే కోరిక అణగారి పోతుంది. కానీ ఇక్కడ అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. శత్రుత్వం వలన ఎప్పుడూ అశాంతితో ఉండాల్సి వస్తుందని ధర్మరాజు ఈ వాక్యాన్ని చెప్పాడు.

ప్రశ్న 2.
“ఎవరితోనూ దీర్ఘకాలం విరోధం మంచిది కాదు” దీని మీద మీ అభిప్రాయం ఏమిటి?
జవాబు:
పగ ఒకసారి ప్రవేశిస్తే ఇక శాంతి ఉండదు. కాబట్టి దాన్ని తగ్గించడం, తొలగించడం తప్ప మరో మార్గం లేదు. ఎక్కువకాలం పగను మనసులో ఉంచుకోకుండా నిర్మూలించడమే మంచిది. ఎందుకంటే మనసు త్వరగా శాంతిస్తుంది. ఉద్వేగం లేకపోవడం వలన ఆరోగ్యం చక్కబడుతుంది. పగబట్టినవారు ప్రతిరోజూ దుఃఖంతోనే నిద్రిస్తారు. పగ లేకుంటే ప్రశాంత చిత్తంతో సుఖంగా నిద్రిస్తారు. పగ వలన సుఖంలేనివాడు తన సర్వస్వాన్నీ తానే నాశనం చేసుకుంటాడు. అంతకుముందున్న మంచిపేరు కూడా పోతుంది.

దీర్ఘకాల విరోధం వలన కుటుంబాలే గాక వంశాలు కూడా నశించే ప్రమాదం ఉంది. ఒకవేళ ఈ విరోధం రెండుగాని అంతకన్న ఎక్కువ దేశాల మధ్యగాని ఉండేటట్లయితే ప్రపంచశాంతికే భంగం కలుగుతుంది. ఆయా దేశాలు నిరంతరం అశాంతితో, ఉద్వేగంతో గడపాల్సి వస్తుంది. కాబట్టి ఎవరితోనూ దీర్ఘకాలిక వైరం మంచిది కాదు.

ప్రశ్న 3.
“కార్యసాధన” అంటే అనుకొన్న పనిని సాధించడం. ధర్మరాజు మాటల్ని బట్టి ఈ కార్యసాధనను మనం ఎలా సాధించాలి?
జవాబు:
కార్యాన్ని సాధించదలచుకున్నవాడికి ఎంతో ఓర్పు, తగిన నేర్పు ఉండాలి. ఇతరులను బాధించకుండా, తాను బాధపడకుండా తెలివిగా పనిని సాధించుకోవాలి. ఒకవేళ జనాలు విమర్శించే పని అయినట్లైతే ఆ నింద తనపై పడకుండా అందరూ ఎదుటి వారినే నిందించేలా పనిని చాకచక్యంగా నెరవేర్చుకోవాలి. ధర్మబద్ధంగా, న్యాయసమ్మతంగా కార్యాన్ని సాధించాలి. కోరిన ప్రయోజనాన్ని పాపం రాకుండా, కీర్తి కలిగేలా సాధించుకోవాలి.

ప్రశ్న 4.
మాట్లాడే విధానం అంటే ఏమిటి? కార్యసాధకుడికి ఉండాల్సిన లక్షణాలు ఏమిటి?
జవాబు:
స్ఫుటంగాను, స్పష్టంగాను, సూటిగాను మాట్లాడాలి. వాదాంశాన్ని క్రమంగా ప్రతిపాదించాలి. నాటకీయ ధోరణిలో మాట్లాడే విధంగా ఉంటే సహజంగా మనసుకు హత్తుకుంటుంది. ఇలా చక్కగా ఆకర్షించేలా పనిని సాధించుకునేలా మాట్లాడటాన్నే మాట్లాడే విధం అంటారు. ఇక కార్యసాధకుడైనవాడు తన శక్తిని, ఎదుటివారి శక్తిని చక్కగా అంచనా వేయగలిగి ఉండాలి. వినయంతో ఉంటూ అవసరమైనప్పుడు తన శక్తియుక్తుల్ని ప్రదర్శించాలి. సమయానుకూలంగా తనని తాను మలచుకోగలిగి ఉండాలి. ధననష్టం, ప్రాణనష్టం వంటివి జరగకుండా తన కార్యాన్ని నేర్పుగా చేయగలిగి
ఉండాలి.

ఆ) కింది ప్రశ్నలకు పదిహేనేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
ధర్మరాజు శాంతి వచనాలను సొంతమాటల్లో రాయండి.
(లేదా)
ప్రపంచ శాంతిని కాంక్షించడం అందరి కర్తవ్యం కదా ! అలాంటి శాంతిని కోరుతూ ధర్మజుడు ఏం చెప్పాడో మీ సొంతమాటల్లో రాయండి.
(లేదా)
ధర్మరాజు కృష్ణనుద్దేశించి శాంతి పట్ల తనకు గల ఆకాంక్షను ఏ విధంగా వెల్లడించాడో మీ స్వంత మాటల్లో రాయండి.
(లేదా )
శాంతిని కోరుకోవడం అందరికి అభిలాష మరి ధర్మజుడు శాంతిని కోరుతూ ఏ విధంగా శ్రీకృష్ణునితో చెప్పాడు?
జవాబు:
ఓ కృష్ణా ! అర్ధరాజ్యం బదులు ఐదూళ్ళు ఇచ్చినా చాలని – నీవు, బంధువులు ఆశ్చర్యపోయేటట్లుగా చెప్పాను. కానీ ఆ ఔదార్యం కూడా కౌరవుల వలన బూడిదలో పోసిన పన్నీరైంది. ఒకవేళ దుర్యోధనుడు ఐదూళ్ళు కూడా ఇవ్వకపోతే సిరిసంపదలకు నెలవైన రాజ్యం అసలు ఉండదు. పోనీ సిరిని కోరకుండా వైరాగ్యజీవితం గడపటానికి సిద్ధమైతే నన్నాశ్రయించుకున్న వారికి కనీస అవసరాలైన కూడు – గుడ్డ – గూడులకు చాలా ఇబ్బంది ఏర్పడుతుంది. అప్పుడు తప్పక యుద్ధం జరుగుతుంది. దానికి నా మనసు ఒప్పుకోవడం లేదు. చంపాల్సి వస్తే లోకంలో పరాయివారిని, శత్రువులను ఎన్నుకోవడం సహజం. అయినా వారిని కూడా రాజ్యం కొరకు చంపాలనుకోవడం అహింసా ధర్మం కాదు. అది యుద్ధనీతి అవుతుంది గాని ధర్మనీతి కాదు. ఇక బంధుమిత్రులను చంపటం న్యాయం కాదు గదా !

విజయం పొందని యుద్ధం కంటే చావే మేలు. కాని యుద్ధంలో జయాపజయాలను ఎవరూ నిశ్చయించలేము. యుద్ధం వలన అనేక నష్టాలు కలుగుతాయి. ఇక శత్రుత్వమే ఏర్పడితే పామున్న ఇంటిలో కాపురమున్నట్లే. మనశ్శాంతికి చోటే ఉండదు. కాబట్టి ఎవరితోనూ దీర్ఘకాల వైరం పనికిరాదు. విరోధాన్ని అణచివేయడం మంచిది. విరోధం వలన విరోధమెప్పుడూ సమసిపోదు. ఒకడు వైరంతో వేరొకరికి బాధ కలిగిస్తే బాధపడినవాడు ఊరుకోడు. అవకాశం రాగానే పగ సాధిస్తాడు. సాహసించి పగను నిర్మూలించదలిస్తే దారుణకార్యాలు చేయాల్సి వస్తుంది. పగ వలన కీడే గాని వేరొక ప్రయోజనం లేదు.

కృష్ణా ! సంపద కావాలనీ, యుద్ధం జరగకూడదని కోరుకుంటున్నాను. యుద్ధం వలన ధననష్టం, వంశ నాశనం జరుగుతుంది. ఈ రెండూ జరగని ఉపాయంతో ఎలాగైనా బాగుపడటం మంచిది కదా ! ధర్మం, నీతి – వాటిని బట్టి రెండు వర్గాల వారికీ మేలు, అభివృద్ధి జరిగేలా చూడు. విదురుడు మొదలైన మహానుభావులు సమ్మతించేలా తగినంత మెత్తదనంతోను, అవసరమైనచోట కఠిన మందలింపులతోను కురుసభలో రాజులందరూ గ్రహించేలా మాట్లాడు. ఒకవేళ ధృతరాష్ట్రుడు కుమారుడి మీది ప్రేమతో ఏ విషయం తేల్చి చెప్పకుంటే ధర్మబద్ధుడవై తగిన నిర్ణయం తీసుకో. మా ఇరువర్గాలకూ కావాల్సినవాడివి. నీతి తెలిసిన వాడివి, నీకు నేను చెప్పగలవాడినా ? హస్తినాపురానికి వెళ్ళిరా ! … అని ధర్మరాజు శ్రీకృష్ణుడితో శాంతి వచనాలను పలికాడు.

ప్రశ్న 2.
ధర్మరాజు యుద్ధం వల్ల కలిగే నష్టాలు చెప్పాడు గదా ! ఈ రోజుల్లో కూడా యుద్ధాలు జరుగుతున్నాయి. యుద్ధాలు రాకుండా ఉండడానికి చేపట్టాల్సిన చర్యలేమిటి?
జవాబు:
నేటి కాలంలో కూడా దారుణమైన యుద్ధాలు జరుగుతున్నాయి. మన భారతదేశంపై పాకిస్థాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. మన సరిహద్దు ప్రాంతాన్ని ఆక్రమించడంతో తప్పక “కార్గిల్ యుద్ధాన్ని” చేయాల్సి వచ్చింది. అయినా బుద్ధి తెచ్చుకోక పాకిస్థాన్ మన దేశంలో ఉగ్రవాద చర్యలకు సిద్ధపడుతున్నది. మరొక ప్రక్క చైనా కూడా యుద్ధాన్మాదంతో ఊగిపోతోంది. మన సరిహద్దు రాష్ట్రాలను ఆక్రమించాలని నిరంతరం ప్రయత్నిస్తోంది.

అమెరికా ధన మదంతో, అధికార దాహంతో యుద్ధానికి కాలు దువ్వుతుంది. ఐక్యరాజ్యసమితి మిగతా దేశాలను కొంతవరకు అదుపు చేయగలిగినా అగ్రరాజ్యా లైన అమెరికా, బ్రిటన్లకు సూచనలను చేయడానికి కూడా సాహసించలేని దుస్థితిలో ఉంది. తమ ఇష్టానుగుణంగా ప్రవర్తిస్తున్న అగ్రరాజ్యాల అహంకారం ముందు ప్రపంచశాంతి కోసం స్థాపించబడిన ఐక్యరాజ్యసమితి సైతం బానిసలాగా తలొంచుకొని నిలుచుందంటే ఇంతకన్నా సిగ్గుపడాల్సిన విషయం లేదు.

యుద్దాలను ఆపాలనుకొంటే ముందు ప్రపంచ దేశాలన్నీ చిత్తశుద్ధితో శాంతి ఒడంబడికలు చేసుకోవాలి. ఐక్యరాజ్యసమితి ఆదేశాలను అన్ని దేశాలూ శిరసావహించాలి. దేశాల మధ్య ఉన్న ఆర్థిక అసమానతలను, పరిగణించక సోదరులుగా భావించాలి. ఒకరికొకరు సహకరించుకుంటూ సమగ్రమైన అభివృద్ధికి అన్ని దేశాలూ సహకరించాలి. చిన్న దేశమైనా, పెద్ద దేశమైనా పొరుగుదేశం యొక్క ఆంతరంగిక విషయాల్లో కలుగజేసుకోకూడదు. ఇప్పటికే రగులుతున్న సమస్యలైన కాశ్మీర్ సమస్య, వివిధ దేశాల సరిహద్దు సమస్యలను శాంతియుతంగా పరస్పర చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి. సామ్యవాద భావనలు వెల్లివిరియాలి. స్వార్ధ భావాలను విడిచి పెట్టాలి. ప్రక్క దేశాలపై కవ్వింపు చర్యల్ని కూడా మానాలి. విశ్వశాంతికై చిత్తశుద్ధితో పాటుపడాలి.

AP Board 9th Class Telugu Solutions Chapter 1 శాంతికాంక్ష

ఇ) సృజనాత్మకంగా రాయండి.
పగ, ప్రతీకారం మంచివి కాదనీ, శాంతియుత జీవనం గొప్పదనీ మీ మిత్రునికి లేఖ రాయండి.
జవాబు:

గుంటూరు,
x x x x

ప్రియమైన మిత్రునకు / మిత్రురాలికి,

నేనిక్కడ క్షేమంగా ఉన్నాను. బాగా చదువుకుంటున్నాను. నీవు క్షేమమని, బాగానే చదువుకుంటున్నావని తలుస్తాను. ఈ మధ్యకాలంలో కుటుంబ కలహాలు, ఇతర వివాదాల వలన చాలామంది చనిపోతున్నారు. గ్రామాలలో కుల వివాదాలు, ఇతర పొలాలు, ఆస్తులకు సంబంధించిన వివాదాల వలన రక్తపాతాలు జరుగుతున్నాయి. వీటి వలన పెద్దవారు, పిల్లలు అనాథలవుతున్నారు.

వీటి అన్నింటికి మూలమైన పగ, ప్రతీకారాలు మంచివి కాదు. చదువుకున్నవారు, ఉన్నతస్థితులలో ఉన్నవారు సైతం వీటి ప్రభావానికి లోనవుతున్నారంటే, చదువుకున్న మూర్ఖులులా ప్రవర్తిస్తున్నారంటే ఇవి ఎంత చెడ్డవో తెలుస్తుంది. పగ, ప్రతీకారాల వల్ల ఎల్లప్పుడూ అశాంతితో, భయంతో, ఉద్వేగంతో గడపాల్సి వస్తుంది. వీటి ద్వారా ఆరోగ్యం దెబ్బతిని, చిన్నవయస్సులోనే మధుమేహ వ్యాధి (షుగర్) వంటి దీర్ఘకాలిక రోగాల బారినపడే ప్రమాదం ఎక్కువ. పూర్వకాలంలో సమాజాలలో అన్ని కులాలవారు, మతాలవారు ఒకరినొకరు బాబాయ్, చిన్నమ్మ, అన్నయ్య, తమ్ముడూ, చెల్లెమ్మ లాంటి వావి-వరుసలతో పిలుచుకుంటూ ఒకే కుటుంబంలా మెలగేవారు. ఒక్కడి కోసం అందరూ, అందరికోసం ఒక్కడుగా నిలచేవారు. అటువంటి స్థితి నేడు రావాలి. దానికి ఉమ్మడి కుటుంబాలు ఎంతో సహకరిస్తాయి. ఉమ్మడి కుటుంబ భావన అందరికీ కలిగించాలి.

నగరాలలో, పట్టణాలలో బహుళ అంతస్థుల భవనాలు (అపార్ట్ మెంట్స్) పెరిగిపోతున్నాయి. వీటిల్లో నివసించేవారు వేరు వేరు కుటుంబాల నుంచి, ప్రాంతాల నుంచి వస్తారు. కొన్నిచోట్ల వేరు వేరు భాషలు మాట్లాడేవారు సైతం ఒకచోట జేరతారు. అలాంటి చోట అన్ని మతాల పండుగలను అందరూ కలసి జరుపుకోవడం, వంటకాలను పరస్పరం ఇచ్చిపుచ్చుకోవడం వంటి వాటి ద్వారా కుటుంబ భావన పెరుగుతుంది. దాని ద్వారా పరమత సహనం అలవడుతుంది. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. శాంతియుత జీవనం కలుగుతుంది. మానసిక ఉద్వేగాలు అణగారి పోయి, రోగాలు తగ్గుతాయి. ఆరోగ్యం వలన ఆయువు పెరిగి సుఖశాంతులతో జీవించవచ్చు.

మీ అమ్మగారిని, నాన్నగారిని ఇతర కుటుంబ సభ్యులను అడిగినట్లు చెప్పు. శాంతియుత సమాజ నిర్మాణాన్ని గూర్చి నీ భావాలను నాకు లేఖ ద్వారా తెలియజేయి. నీ లేఖకై ఎదురుచూస్తూ ఉంటాను.

ధన్యవాదములు

ఇట్లు,
నీ మిత్రుడు / మిత్రురాలు,
బి. రాజు | బి. రాణి,
9వ తరగతి, క్రమసంఖ్య – 12/6,
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,
రాజాగారి తోట,
గుంటూరు (పోస్టు) (మండలం), వేమవరం (పోస్టు),
గుంటూరు జిల్లా.

చిరునామా :
షేక్ రసూల్ / షేక్ రేష్మ,
తొమ్మిదవ తరగతి,
క్రమసంఖ్య – 18,
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,
మాచవరం (మండలం),
గుంటూరు జిల్లా.

(లేదా)
‘శాంతి’ ఆవశ్యకతను తెలియజేసేలా ఒక ‘కరపత్రాన్ని’ తయారుచేయండి.
(లేదా)
ధర్మరాజు లాగ శాంతిని కాంక్షించవలసిన ఆవశ్యకతను వివరిస్తూ ఒక కరపత్రం తయారుచేయండి.
జవాబు:
శాంతి నీవెక్కడ ? (కరపత్రం)

శాంతమే రక్ష
దయ చుట్టము
మనకి స్వాతంత్ర్యం వచ్చి ఆరు దశాబ్దాలు దాటినా, ఇంకా దేశంలో అశాంతి పూరిత, ఆందోళనకర వాతావరణమే నెలకొని ఉంది. అగ్రరాజ్యాలే నేటికీ అంతర్జాతీయ అంశాల్ని నిర్ణయించేవిగా ఉన్నాయి. ఉగ్రవాదం ఉరకలు వేస్తోంది. స్థానిక ఉద్యమాలు, కులమత లింగ వివక్షలు, ప్రజావిప్లవాలు దేశాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. స్వార్థపూరితమైన జీవనం, అనారోగ్యకరమైన పోటీతత్వం, ప్రపంచీకరణ విధానాలు అంటువ్యాధుల్లా ప్రజల్ని పట్టి పీడిస్తున్నాయి.

కేవలం మన దేశంలోనే గాక ప్రపంచవ్యాప్తంగా పలుదేశాల్లో ఇదే పరిస్థితి. ప్రపంచవ్యాప్తంగా యుద్ధమేఘాలు అలముకుంటున్నాయి. చాలా చోట్ల ప్రచ్ఛన్న యుద్ధాలు, ప్రత్యక్ష యుద్ధాలు చోటుచేసుకుంటున్నాయి. అణుబాంబుల్ని మించిన వినాశకర ఆయుధాలెన్నో అగ్రరాజ్యాలు సమకూర్చుకుంటున్నాయి. ప్రతి ప్రాంతంలోనూ అశాంతి, అభద్రత, అసంతృప్తి నెలకొంటున్నాయి. ప్రతివారి మనస్సు శాంతికోసం పరితపిస్తుంది. కానీ శాంతి ఎక్కడా కనిపించలేదు. ప్రపంచవ్యాప్తంగా అందరూ వెతుకుతున్నా ఎక్కడా కనిపించడం లేదు.

అవును, ఎక్కడని కనిపిస్తుంది? ‘శాంతిని’ మనమే చంపి, గోరీలు కూడా కట్టామాయె. ఇప్పుడు పరితపిస్తే మాత్రం ఎలా వస్తుంది? ఉన్నప్పుడు స్వార్థంతో, సామ్రాజ్యవాదంతో, మతోన్మాదంతో ఊపిరి సలపనీయకుండా చేశామాయె. ఇప్పుడు రమ్మంటే ఎక్కడి నుండి వస్తుంది? ఎలాగ వస్తుంది? ప్రపంచమంతా అశాంతితో నింపి, ఇప్పుడు శాంతి పాఠాలు వల్లిస్తే మాత్రం వస్తుందా? ‘శాంతి’ నీవెక్కడ ? అని ఆక్రోశిస్తే వచ్చేస్తుందా?

ఎప్పుడైతే మనం పరమత సహనాన్ని కలిగి ఉంటామో, ఎప్పుడైతే సోదరభావంతో అందరినీ కలుపుకుంటామో, ఎప్పుడైతే సహృదయతను, నిస్వార్థాన్ని అలవరచుకుంటామో, ఎప్పుడైతే పరోపకార పరాయణులమవుతామో, ఎప్పుడైతే పగ – ప్రతీకారాల్ని విడుస్తామో, అంతర్యుద్ధాలను అసహ్యించుకుంటామో, యుద్ధాలను విడిచి పెడతామో, ఆయుధాలను ప్రేమించడం మాని, మానవులను ఇష్టపడతామో, ప్రేమతత్వంతో మెలగుతామో అప్పుడు – సరిగ్గా అప్పుడు ‘శాంతి’ తన ఉనికిని చాటుకుంటుంది. మనం తనని మనస్ఫూర్తిగా కోరుతున్నామని నమ్మిన రోజున తనకైతానే ప్రత్యక్షమవుతుంది. అంతదాకా మానవజాతి అంతా ‘శాంతి’ నీవెక్కడా ? అని దీనంగా, హీనంగా విలపించక తప్పదు.

ఈ)
ప్రశంసాత్మకంగా రాయండి.

ప్రపంచశాంతి కోసం పాటుపడిన ‘నెల్సన్ మండేలా’, ‘గాంధీ’, ‘యాసర్ అరాఫత్’ వంటి వారి వివరాలు సేకరించి, వారిని అభినందిస్తూ ఒక వ్యాసం రాయండి. దాన్ని చదివి వినిపించండి.
జవాబు:
1) మహాత్మాగాంధీ :
మన దేశ ‘జాతిపిత’గా అందరిచే ప్రేమగా ‘బాపూజీ’ అని పిలవబడే మోహన్ దాస్ కరంచంద్ గాంధీ గుజరాత్ రాష్ట్రంలోని పోర్బందర్ పట్టణంలో 1869వ సంవత్సరం అక్టోబరు రెండవ తారీఖున జన్మించాడు. మెట్రిక్యులేషన్ పూర్తి చేశాక లండన్ వెళ్ళి బారిష్టరు పరీక్షలో ఉత్తీర్ణుడై తిరిగివచ్చాడు. 1893వ సంవత్సరంలో ఒక వ్యాజ్యం విషయంగా దక్షిణాఫ్రికా వెళ్ళాడు. అక్కడ భారతీయులు, ఇతర నల్ల జాతీయులు పడే అగచాట్లన్నీ గమనించాడు. రైళ్ళలో మొదటి తరగతిలో ప్రయాణం చేసేందుకు వీలులేదు. శ్వేత జాతీయులు, పెద్ద కుటుంబాలు ఉండే చోట్లకు భారతీయులను, ఇతర నల్లజాతి వారిని అనుమతించరు. చివరకు తలపై టోపీని ధరించి కోర్టులో వాదించడానికి కూడా అనుమతి లభించలేదు.

ట్రాముల్లోనూ, రైళ్ళలోనూ శ్వేత జాతీయులతో కలసి ప్రయాణించే యోగ్యత లేదు. బానిసలుగా చూస్తూ ‘కూలీ’ అని సంబోధించేవారు. ఈ దురాగతాలను ఆపడానికై గాంధీజీ ప్రయత్నించాడు. 1869వ సంవత్సరంలో ట్రాన్స్ వాల్ లో ఇంగ్లీషు, డచ్చి వారికి జరిగిన యుద్ధంలో గాయపడిన బ్రిటిషు వారిని వైద్యశాలలకు చేర్చి చికిత్స చేయించాడు. గాంధీ సేవను గుర్తించక వారు దక్షిణాఫ్రికా భారతీయులకు నాయకుడై, ప్రభుత్వ ఉత్తర్వులను ఎదిరిస్తున్నాడన్న వంకతో ఆయన్ని జైలుకు పంపి, వెట్టిచాకిరీ చేయించారు. కానీ శాంతి, ఓర్పు, అహింసలతో వాటిని ఎదుర్కొని ఐకమత్యంతోను, పత్రికల సహాయంతోను పోరాడి విముక్తిని సాధించాడు. దక్షిణాఫ్రికా వీడి వచ్చేటప్పుడు అక్కడి అభిమానులు తనకు ఇచ్చిన బహుమతులను, ధనాన్ని “దక్షిణాఫ్రికా భారతీయుల సంక్షేమ నిధి”గా ఏర్పాటుచేసిన నిస్వార్థపరుడు, పరోపకార పరాయణుడు, శాంతి కాముకుడు “గాంధీ మహాత్ముడు” !

భారతదేశానికి తిరిగి వచ్చాక భారతదేశ స్వాతంత్ర్యం కోసం అహర్నిశలు పాటుపడ్డాడు. ఉప్పు సత్యాగ్రహం, సహాయనిరాకరణోద్యమం, విదేశీ వస్తు బహిష్కరణోద్యమం, జైల్ బరో వంటి ఉద్యమాలను సమర్థతతో నిర్వహించి బ్రిటిష్ వారిని ముప్పుతిప్పలు పెట్టాడు. చివరికి వారు స్వాతంత్ర్యం ఇచ్చి వెళ్ళిపోవటం తప్ప మరో మార్గం లేకుండా చేశాడు. అలా భారతదేశం 1947వ సంవత్సరం, ఆగస్టు నెల 15వ తారీఖున స్వాతంత్ర్యాన్ని పొందింది. కానీ ఆ మహాత్ముడు, శాంతమూర్తి, అహింసా పరాయణుడు, నిరంతర కార్యశీలి స్వేచ్ఛావాయువులను పూర్తిగా ఆస్వాదించకుండానే 30-1-1948వ తారీఖున కీర్తిశేషుడయ్యాడు.

2) నెల్సన్ మండేలా :
నెల్సన్ మండేలా మొట్టమొదటి సారిగా దక్షిణాఫ్రికాకు ఎన్నికైన నల్లజాతికి చెందిన ప్రెసిడెంటు. ఈయన పూర్తి పేరు రోలిహలాహలా మండేలా. ‘నెల్సన్’ అనే పేరు ఆయన పాఠశాలలో జేరినప్పుడు ఆంగ్ల ఉపాధ్యాయురాలైన మిసెస్ మిడిగేన్ పెట్టినది. నాటి దక్షిణాఫ్రికాను పాలిస్తున్న బ్రిటిష్ వారి నియమాలలో పేరు మార్చడం ఒకటి. నల్ల జాతీయులను పాఠశాలలో చేర్చేటప్పుడు ఒక ఆంగ్లభాషా పేరు వారికి పెడతారు. ఇది బ్రిటిష్ వారి జాత్యహంకారానికి మచ్చుతునక.

మండేలా దక్షిణాఫ్రికాలోని ఆగ్నేయ ప్రాంతమైన ట్రాన్స్ కి ప్రాంతంలో 18-07-1918వ తేదీన టెంబు జాతికి చెందిన కుటుంబంలో జన్మించాడు. వీరి భాష హోసా. మండేలా పాఠశాల విద్యను పూర్తి చేసుకొని, కళాశాల విద్యకై ఆఫ్రికన్ నేటివ్ కళాశాలలో బి.ఎ. డిగ్రీ. ప్రథమ సంవత్సరంలో చేరాడు. కానీ విద్యార్థి సంఘాలలో చేరి తన ప్రవేశం అధికారులచే రద్దు చేయబడటంతో బయటకు వెళ్ళాల్సివచ్చింది. జోహన్స్ బర్గ్ ప్రాంతాన్ని చేరుకొని దూర విద్య ద్వారా చదివి బి.ఎ. డిగ్రీని పొందాడు. తర్వాత బారిష్టరు విద్య కోసం విశ్వవిద్యాలయంలో చేరాడు. అక్కడే ఆయన ఆఫ్రికా జాతీయ కాంగ్రెస్సులో (A.N.C.) సభ్యునిగా చేరాడు. తన మిత్రులైన వాల్టర్ సిస్లూ, ఆలివర్ టాంబో, విలియమ్ కోమో వంటి వారి సహాయంతో ఏ.ఎన్.సి. విస్తరించడం లోను, కార్యశీలకమైన సంస్థగా మలచడంలోను విశేష కృషి సల్పాడు.

దక్షిణాఫ్రికా ప్రభుత్వం ఆ దేశ పౌరులందరినీ మూడు వర్గాలుగా విభజించింది. శ్వేత జాతీయులు మొదటివరం. తల్లిదండ్రులలో ఒకరు శ్వేత జాతీయులు, వేరొకరు నల్లజాతీయులైన వారు రెండవ వర్గం. ఇక నల్ల జాతీయులు మూడవ వర్గం. మూడు వర్గాలకు ప్రత్యేకమైన వసతి ప్రదేశాలుంటాయి. ఎవరికి వారికే ప్రత్యేకమైన మరుగుదొడ్లు. ఉద్యానవనాలు, సముద్రతీర ప్రాంత విహారాలు, పాఠశాలలు, ఉద్యోగాలు ఉంటాయి. శ్వేతజాతీయులకే పూర్తి రాజకీయ అధికారాలుంటాయి. 1960 – 80 ల మధ్య ప్రభుత్వం శ్వేత జాతీయుల కోసం మిగిలిన రెండు వర్గాల వారిని ఖాళీ చేయించి మూరుమూల ప్రాంతాలకు పంపింది. ముప్పై లక్షలమంది తమ నివాస ప్రాంతాలను విడిచి మారుమూల ప్రాంతాలకు వెళ్ళాల్సి వచ్చింది.

ఈ దుశ్చర్యకు వ్యతిరేకంగా ఏ.ఎన్.సి. పోరాటానికి నడుం కట్టింది. ఐతే అహింసాయుత మార్గంలో సహాయనిరాకరణ, ధర్నాలు చేయటం, అధికారుల పట్ల అవిధేయతను ప్రదర్శించడం వంటి వాటి ద్వారా ఉద్యమించింది. పూర్తి పౌరసత్వాన్ని పొందడం, శాసనసభలో చోటు సంపాదించడం, మిగిలిన వర్గాలతో సమానమైన హక్కులను పొందడం లక్ష్యంగా నిరంతరం పోరాటం సల్పింది. మండేలా దేశమంతా సంచరిస్తూ న్యాయం కోసం పోరాడుతూ ఎంతోమంది మద్దతుదారులను కూడగట్టాడు. ప్రపంచ వ్యాప్తంగా మద్దతును సాధించగలిగాడు కూడా. దాని ఫలితంగా ప్రభుత్వం యొక్క ఆగ్రహానికి గురై 27 సంవత్సరాలు కఠిన కారాగారవాసాన్ని అనుభవించాడు.

చివరకు ప్రభుత్వం తలవొగ్గి ఏ.ఎన్.సి కోరిన వాటిని ఆమోదించింది. మండేలా దక్షిణాఫ్రికా అధ్యక్షుడైనాడు. 1993వ సంవత్సరంలో మండేలా, అతని సహచరుడైన డిక్లార్క్ లకు నోబెల్ శాంతి బహుమతి లభించింది. 1999 సంవత్సరం దాకా అధ్యక్షునిగా ఉండి, తర్వాత రాజకీయ సన్యాసం చేసి, స్వగ్రామానికి చేరుకున్నాడు. హెచ్.ఐ.వి. మరియు ఎయిడ్స్ రోగ విషయంలో తన వారిని జాగరూకులను చేయడానికి పెద్ద పెద్ద శిబిరాలను నడిపాడు. ప్రపంచవ్యాప్త సదస్సులలో పాల్గొన్నాడు.

దారుణమైన వర్ణ వివక్షకు లోనైనా, దృఢసంకల్పంతో ఎన్నో కష్టాలకు, కారాగారవాస శిక్షలకు ఓర్చి తోటివారికై పరిశ్రమించి కృతార్థుడైనాడు నెల్సన్ మండేలా మహాశయుడు.

3) యాసర్ అరాఫత్ :
యాసర్ అరాఫత్ గా ప్రసిద్ధిచెందిన ఆయన అసలు పేరు మొహమ్మద్ యాసర్ అబ్దుల్ రెహమాన్ అబ్దుల్ రౌఫ్ అరాఫత్ అల్ ఖుద్వా అల్ హుస్సేని. ఈయన 1929వ సంవత్సరం ఆగస్టు నెల 24వ తేదీన పాలస్తీనాలో జన్మించాడు. అరాఫత్ తన జీవితకాలంలో ఎక్కువ భాగం ఇస్రాయేల్ దేశీయులతో పాలస్తీనీయుల స్వీయ నిర్ధారణ అనే పేరుతో పోరాటం జరిపాడు.

పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ (P.L.O) కు చైర్మన్ గాను, పాలస్తీనియన్ నేషనల్ అథారిటీ (P.N.A) కి అధ్యక్షునిగాను, ఫాత్ రాజకీయ పార్టీ సభ్యునిగాను పనిచేశాడు. అరాఫత్ తన ఉద్యమాన్ని వివిధ అరబ్ దేశాల నుండి కూడా నిర్వహించాడు. ఇస్రాయేల్ దేశానికి ఇతని ఫాత్ పార్టీ ప్రధాన లక్ష్యం అయింది. ఇస్రాయేల్ దేశీయులు అతన్ని టెర్రరిస్టుగాను, బాంబు దాడులలో వందలమందిని చంపిన దుర్మార్గుడుగాను చిత్రీకరించారు. పాలస్తీనీయులతణ్ణి ఒక గొప్ప దేశభక్తునిగా సంభావించారు. అగ్రరాజ్యాల నెదిరించి, పాలస్తీనాకు సంపూర్ణ స్వేచ్చను సాధించిన ఘనత అరాఫత్ దే. పాలస్తీనాకు మొదటి అధ్యక్షుడుగా చేశాడు. 1994 వ సంవత్సరంలో అరాఫత్ కు నోబెల్ శాంతి బహుమతి లభించింది. శాంతి కోసం పోరాడిన ఈ యోధుడు 11 – 11 – 2004వ తేదీన 75 సంవత్సరాల వయస్సులో తీవ్ర అనారోగ్యానికి గురై కోమాలోకి వెళ్ళి మరణించాడు.

ఈ ముగ్గురు మహానుభావులను గమనించినట్లైతే నిస్వార్థంగా ప్రపంచశాంతికై కృషిచేశారని తెలుస్తుంది. కుల – మత – వర్ణ వివక్షలకు లోనైన ఎందరో సామాన్యులకు మానసిక స్టెర్యాన్ని కలిగించడమే కాకుండా వారిని ఆయా బంధనాల నుంచి విముక్తుల్ని చేసిన ఘనులని తెలుస్తుంది. తమ జాతీయుల స్వాభిమానాన్ని, పౌరుషాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయులు వీరు.

AP Board 9th Class Telugu Solutions Chapter 1 శాంతికాంక్ష

(లేదా)
మీ ఊరిలో ఏవైనా గొడవలు జరిగితే వెంటనే స్పందించి, గొడవలు వద్దు అని సర్ది చెప్పే పెద్ద వాళ్ళ గురించి, ‘నలుగురూ శాంతియుతంగా సహజీవనం చేయాలి’ అని ‘శాంతికోసం’ పాటుపడేవాళ్ళని గురించి అభినందిస్తూ కొన్ని వాక్యాలు రాయండి.
జవాబు:
మా ఊరిలో కుటుంబ కలహాలు గాని, చిన్న చిన్న తగాదాలు గాని, గొడవలు గాని జరిగితే మా ఊరి ప్రెసిడెంటు గారి వద్దకు తీసుకెళ్తారు. ఆయన ఇరుపక్షాల వారి వాదాలను ఓపికగా విని, నేర్పుగా ఎవరివైపు తప్పు ఉన్నదో గ్రహించి, వారి తప్పుని సున్నితంగా తెలియజేస్తారు. తగాదాలు మాని శాంతంగా ఉండాలని ఇద్దరికీ చెప్పి తగవు తీరుస్తారు. రామయ్య తాత ఊర్లో జరుపుకునే అన్ని మతస్థుల పండుగలకు అందరం పాల్గోవాలని, కులమత భేదాలు పట్టించుకోకుండా అందరం కలసి ఉండాలని చెపుతుంటాడు. అన్ని కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొని యువకుల్లో ఉత్సాహాన్ని కలిగిస్తాడు. అంజమ్మ అత్త మాలాంటి పిల్లలకు మంచి మంచి కథలు చెపుతూ ఉంటుంది.

ఆ కథల్లో ఎక్కువ శాంతికి సంబంధించినవే ఉంటాయి. మేము అందరం పాఠశాలలో మిగిలిన విద్యార్థులతో కలసిమెలసి మధ్యాహ్న భోజనం చేయాలని కోరుకుంటుంది. రహీమ్ బాబాయి వాళ్ళ పండుగలకు మాలాంటి పిల్లల్ని తన ఇంటికి తీసుకువెళ్ళి మిఠాయిలు పెడతాడు. ఊళ్ళోని ముస్లిం కుటుంబాలకు నాయకత్వం వహిస్తూ, హిందువులతోను, క్రైస్తవులతోను సన్నిహితంగా ఉంటాడు. తనవారు ఇతరులతో గొడవపడకుండా, ఇతరుల వలన తన వారికి ఇబ్బందిరాకుండా చూస్తూ ఉంటాడు. అలాంటివాడు ఉండబట్టే మా ఊళ్ళో కులాల పోర్లు లేవంటే అతిశయోక్తి ఏమీకాదు. ఇక డేవిడ్ అన్నయ్య మంచి ఆటగాడు. ఊళ్ళో పిల్లలందరినీ పోగుచేసి, సాయంత్రం పూట మంచి మంచి ఆటలు ఆడిస్తాడు. అందరూ ఒక్కటే. అందరం ఎప్పుడూ కలసి ఉండాలని దానికి ఆటలు ఎంతో సహకరిస్తాయని ఎప్పుడూ చెపుతుంటాడు. అతని వల్ల పిల్లలం అందరం ధనిక – పేద, కుల-మత, స్త్రీ-పురుష భేదాలు మరచి సంతోషంగా ఆటలు ఆడుతున్నాం . అతను లేకుంటే మాలో ఇలాంటి ఐకమత్యం వచ్చేది కాదు.

ప్రాజెక్టు పని

ప్రపంచశాంతి కోసం కృషిచేసిన వారి వివరాలు సేకరించండి. వారి గురించి ఒక నివేదిక తయారుచేసి ప్రదర్శించండి.
AP Board 9th Class Telugu Solutions Chapter 1 శాంతికాంక్ష 7

III. భాషాంశాలు

పదజాలం

అ) కింద గీత గీసిన పదాలకు అర్థాలు రాసి, వాక్యాల్లో ప్రయోగించండి.

1. గురువులు శుభంబైన వాటిని సమకూర్చెదరు.
జవాబు:
శుభంబైన = మంచిదైన
పెద్దలు మంచిదైన పనినే చేస్తారు.

2. దీర్ఘ వైరవృత్తి మంచిది కాదు.
జవాబు:
దీర్ఘ వైరవృత్తి : ఎక్కువ కాలం పగతో ఉండడం.
ఎక్కువకాలం పగతో ఉండడం వలన ఆరోగ్యం దెబ్బ తింటుంది.

3. శ్రీకృష్ణుడు అన్ని విషయాలు ఎఱుక గలవాడు.
జవాబు:
ఎఱుక = జ్ఞానం
రాముకు తెలుగుభాషా జ్ఞానం ఎక్కువ.

ఆ) కింది వాక్యాలను పరిశీలించి, గీత గీసిన పదాలకు నానార్థాలు రాయండి.
1. రెండు దిక్కుల న్యాయం చెప్పడానికి నీవే మాకు దిక్కు
దిక్కు: దిశ, శరణం

2. ఒక రాజు దివినేలు నొక రాజు భువినేలు నొక రాజు రాత్రిని యేలు నిజము.
రాజు : ఇంద్రుడు, టేడు, చంద్రుడు

3. వైరి పక్షములోని పక్షి, పక్షమునకు గాయమై, పక్షము రోజులు తిరుగలేకపోయెను.
పక్షము : ప్రక్క, టెక్క 15 రోజులు.

4. పాఠానికి సంబంధించిన మరికొన్ని పదాలకు నానార్థాలను నిఘంటువులో వెతికి, పై విధంగా వాక్యాలలో ప్రయోగించండి.

అ) సమయము లేకున్నా మనము సమయమించక తప్పదు. ఎందుకంటే ఇదే ధర్మమైన సమయము కాబట్టి.
సమయము : కాలము, శపథము, బుద్ధి.

ఆ) మనకు పూర్ణము లేకున్నా జలపాత్ర పూర్ణము ఐనది.
పూర్ణము : శక్తి నిండినది.

ఇ) తగవుకు పోతే తగవు కలిగి, తగవు జరగలేదు.
తగవు : తగిన, తగాదా, న్యాయం.

ఈ) నేను దోష సమయంలో కారులో ప్రయాణిస్తుంటే ఎదురుగా వచ్చేవాడి దోషానికి గాయమై, పెద్ద దోషం జరిగింది.
దోషము : రాత్రి, భుజము, తప్పు, పాపం.

ఉ) శరీరాన్ని పాముట వలన ఏర్పడిన మట్టి పాములా ఉంది.
పాము : రుద్దు, సర్పము.

AP Board 9th Class Telugu Solutions Chapter 1 శాంతికాంక్ష

ఇ) కింద గీత గీసిన పదాలకు పర్యాయ పదాలు రాసి, వాక్యాలలో ప్రయోగించండి.
ఉదా : ప్రేమ్, సంతోష్ ప్రాణ స్నేహితులు.

అ) స్రవంతికి సంగీత, రాధికలు మంచి నేస్తాలు.
ఆ) మిత్రులు ఆపద్బాంధవులు.

1. అనుకున్నది సాధించినపుడు మోదం కలుగుతుంది.
అ) పిల్లలు బహుమతులను పొందినప్పుడు ఎంతో ఆనందం కలుగుతుంది.
ఆ) పిల్లల సంతోషమే పెద్దలు కోరుకుంటారు.

2. ధరిత్రి పుత్రిక సీత.
అ) భూమి లాంటి నివాసయోగ్యమైన గ్రహం కోసం శాస్త్రవేత్తలు వెదకుతున్నారు.
ఆ) ధరకు ఉన్న ఒకే ఒక ఉపగ్రహం చంద్రుడు.

3. పోరితము నష్టదాయకం.
అ) తగాదాల వల్ల కుటుంబాలకు కుటుంబాలే నాశనమవుతాయి.
ఆ) యుద్ధం మూలంగా ధననష్టం, జననష్టం జరుగుతుంది.

వ్యాకరణం

అ) పాతం చదవండి. కింద తెల్సిన సంధులకు సంబంధించిన ఉదాహరణలను వెదికి రాయండి. సూత్రాలు కూడా రాయండి.
1) సవర్ణదీర్ఘ సంధి
2) సరళాదేశ సంధి
3) ఇత్వసంధి
4) యడాగమ సంధి

1. సవర్ణదీర్ఘ సంధి:
1) జనార్ధన : జన + అర్ధన
2) విదురాది : విదుర + ఆది

సూత్రం :అ, ఇ, ఉ, ఋ లకు, అవే అచ్చులు పరమైతే వాటి దీర్ఘాలు ఏకాదేశంగా వస్తాయి.

2. సరళాదేశ సంధి సూత్రం:
1) ద్రుతప్రకృతికము మీది పరుషములకు సరళములగు.
2) ఆదేశ సరళమునకు ముందున్న ద్రుతమునకు బిందు సంశ్లేషములు విభాషనగు.
ఉదాహరణలు :
1) చక్కన్ = చేయ = చక్కఁజేయ
2) ఇచ్చినను + చాలు = ఇచ్చిననుజాలు
3) చేయన్ + చాలడో = చేయంజాలడో
4) ఏమున్ + పొంది = ఏముంబొంది
5) ఒకమాటున్ + కావున = ఒకమాటుఁగావున
6) పగన్ + పగ = పగంబగ
7) కడున్ + తెగ = కడుందెగ
8) ఏమిగతిన్ + తలంచిన = ఏమిగతిఁదలంచిన
9) శాంతిన్ + పొందుట = శాంతిఁబొందుట
10) సొమ్ములున్ + పోవుట = సొమ్ములుంబోవుట
11) చక్కన్ + పడు = చక్కఁబడు
12) ఒప్పున్ + చుమీ = ఒప్పుఁజుమీ
13) మనమునన్ పక్షపాత = మనమునఁబక్షపాత
14) తగన్ + చెప్ప = తగంజెప్ప
15) తెగన్ + పాఱకు = తెగంబాఱకు

3. ఇత్వ సంధి సూత్రం :
సూత్రం – 1: ఏమ్యాదులందలి హ్రస్వమైన ఇకారానికి సంధి వైకల్పికంగా వస్తుంది.
సూత్రం – 2 : మధ్యమ పురుష క్రియలందలి హ్రస్వమైన ఇకారానికి సంధి వికల్పంగా జరుగుతుంది.

1) అదియొప్పది = అది + ఒప్పదె
2) ఊరడిల్లియుండు = ఊరడిల్లి + ఉండు
3) అదియజులు = అది + అట్టులు

4. యడాగమ సంధి సూత్రం :
సంధి జరగని చోట అచ్చు కంటె పరమైన అచ్చుకు యడాగమం వస్తుంది.
ఉదాహరణలు:
1) మా + అంశమగు = మాయంశమగు
2) నా + అరయు = నాయరయు
3) అది + ఒప్పదే = అదియొప్పది
4) పామున్న + ఇంటిలో = పామున్నయింటిలో
5) ఉన్న + అట్ల = ఉన్నయట్ల
6) పగ + అడగించుట = పగయడగించుట
7) పల్కక + ఉండగ = పల్కకయుండగ
8) అది + అట్టులుండె = అదియట్టులుండె
9) పల్కిన + ఏని = పల్కినయేని
10) పొంది + ఉండునట్లు = పొందియుండునట్లు

అ) కర్మధారయ సమాసం :
వివరణ :
‘నల్ల కలువ’ అనే సమాసపదంలో నల్ల, కలువ అనే రెండు పదాలున్నాయి. మొదటి పదం ‘నల్ల’ అనేది విశేషణం. రెండో పదం ‘కలువ’ అనేది నామవాచకం. ఈ విధంగా విశేషణానికీ, నామవాచకానికీ (విశేష్యానికీ) సమాసం జరిగితే దాన్ని ‘కర్మధారయ సమాసం’ అంటారు.

1) విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం.
విశేషణం పూర్వపదంగా (మొదటి పదంగా) ఉంటే ఆ సమాసాన్ని “విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం” అంటారు. ఉదా : తెల్లగుర్రం – తెల్లదైన గుర్రం తెల్ల – విశేషణం (పూర్వపదం – మొదటి పదం) గుర్రం – నామవాచకం (ఉత్తరపదం – రెండోపదం)

2) విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం.
‘మామిడి గున్న’ అనే సమాసంలో మామిడి, గున్న అనే రెండు పదాలున్నాయి. మొదటి పదం (పూర్వపదం) ‘మామిడి’ – నామవాచకం. రెండోపదం (ఉత్తరపదం) ‘గున్న’ విశేషణం. ఐతే విశేషణమైన ‘గున్న) ‘ఉత్తరపదం’గా (రెండోపదంగా) ఉండడం వల్ల దీన్ని ‘విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం’ అంటారు.

కింది పదాలు చదవండి. విగ్రహవాక్యాలు, ఏ సమాసమో రాయండి.
1) పుణ్యభూమి – పుణ్యమైన భూమి – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
2) మంచిరాజు – మంచివాడైన రాజు – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
3) కొత్త పుస్తకం – కొత్తదైన పుస్తకం – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
4) కార్మికవృద్ధుడు – వృద్ధుడైన కార్మికుడు – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
5) తమ్ముగుజ్జలు – తమ్మువైన గుజ్జలు విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం

ఇ) ఛందస్సు:
1. కింది పద్యపాదాలకు గణ విభజన చేసి, అవి ఏ పద్యపాదాలో తెల్పి, లక్షణాలను రాయండి.

i) కావున శాంతిఁబొందుటయ కర్జము దానది యట్టులుండె శ్రీ
AP Board 9th Class Telugu Solutions Chapter 1 శాంతికాంక్ష 1
ఇది “ఉత్పలమాల” పద్యపాదము.
ఉత్పలమాల – లక్షణం:

  1. ఈ పద్యానికి నాలుగు పాదములు ఉంటాయి.
  2. ప్రతి పాదములో భ-ర-న-భ-భ-ర-వ అనే గణాలు ఉంటాయి.
  3. ప్రతి పాదమందలి మొదటి అక్షరాలు పదవ అక్షరాలతో యతి మైత్రిని పొందుతాయి.
  4. ప్రాస నియమము ఉంది.
  5. ప్రతి పాదానికి 20 అక్షరాలు ఉంటాయి.

AP Board 9th Class Telugu Solutions Chapter 1 శాంతికాంక్ష

ii) పగయడగించు టెంతయు శుభం బదిలెస్సయడంగునే పగం
AP Board 9th Class Telugu Solutions Chapter 1 శాంతికాంక్ష 2
ఇది ‘చంపకమాల’ పద్యపాదం.
చంపకమాల – లక్షణం :

  1. చంపకమాల పద్యానికి నాలుగు పాదాలు ఉంటాయి.
  2. ప్రతిపాదములోనూ న-జ-భ-జ-జ-జ-ర అనే గణాలు ఉంటాయి.
  3. ప్రతి పాదమందలి మొదటి అక్షరాలు 11వ అక్షరాలతో యతి మైత్రిని పొందుతాయి.
  4. ప్రాస నియమం ఉంది.
  5. ప్రతి పాదానికి 21 అక్షరాలుంటాయి.

2. శార్దూలం:
AP Board 9th Class Telugu Solutions Chapter 1 శాంతికాంక్ష 3
పై గణవిభజనను పరిశీలించండి. ఇలా మ-స-జ-స-త-త-గ అనే గణాలు వరుసగా ప్రతి పాదంలోనూ వస్తే అది ‘శార్దూల’ పద్యం అవుతుంది. అన్ని వృత్త పద్యాలలాగా దీనికి ప్రాసనియమం ఉంటుంది. ‘యతి’ 13వ అక్షరానికి చెల్లుతుంది (ఆ-య).
మిగిలిన పాదాలకు గణ విభజన చేసి లక్షణాలను సరిచూడండి.

AP Board 9th Class Telugu Solutions Chapter 1 శాంతికాంక్ష 4
1) దీనిలో కూడా మ-స-జ-స-త-త-గ అనే గణాలున్నాయి.
2) ‘పే’ లోని ఏ కారానికి 13వ అక్షరమైన ‘కే’ లోని ఏ కారానికి యతి మైత్రి చెల్లింది.
3) ప్రాస నియమం ఉంది.
4) పాదానికి 19 అక్షరాలున్నాయి.

AP Board 9th Class Telugu Solutions Chapter 1 శాంతికాంక్ష 5
1) ఈ పాదంలో కూడా మ-స-జ-స-త-త-గ అనే గణాలున్నాయి.
2) ‘సో’ లోని ఓ కారానికి, 13వ అక్షరమైన ‘చు’ లోని ఉ కారానికి యతి మైత్రి చెల్లింది.
3) ప్రాస నియమం ఉంది
4) పాదానికి 19 అక్షరాలున్నాయి.

AP Board 9th Class Telugu Solutions Chapter 1 శాంతికాంక్ష 6
1) ఈ పాదంలో కూడా మ-స-జ-స-త-త-గ అనే గణాలున్నాయి.
2) ‘మో’లోని మకారానికి, 13 వ అక్షరమైన ‘ము’ లోని మ కారానికి యతి మైత్రి చెల్లింది.
3) ప్రాస నియమం ఉంది.
4) పాదానికి 19 అక్షరాలున్నాయి.

ఈ) అలంకారాలు :

I. ఇంతకుముందు తరగతులలో ‘ఉపమాలంకారం’ గురించి తెలుసుకున్నారు కదా ! ఈ పాఠంలోని ఉపమాలంకారానికి సంబంధించిన ఉదాహరణను రాసి, వివరించండి.
ఉపమాలంకార లక్షణం :
ఉపమానానికి, ఉపమేయానికి మనోహరమైన పోలిక వర్ణించినట్లైతే దాన్ని ఉపమాలంకారం అంటారు.
ఉదాహరణ :
పగ అంటూ ఏర్పడితే పామున్న ఇంట్లో కాపురమున్నట్లే.

సమన్వయం :
‘పగ’ ఉపమేయం. పామున్న ఇల్లు ఉపమానం ఉండటం సమాన ధర్మం. ఉపమావాచకం లోపించడం.

AP Board 9th Class Telugu Solutions Chapter 1 శాంతికాంక్ష

II. గతంలో తెలుసుకున్న ‘వృత్త్యనుప్రాస’ను గూర్చి ఆ అలంకార లక్షణం రాసి, ఉదాహరణలు రాయండి.

వృత్త్యనుప్రాసాలంకారం లక్షణము : ఒక పద్యంలో గాని, వాక్యంలో గాని ఒకే అక్షరం పలుమార్లు వచ్చేలా ప్రయోగించడాన్ని వృత్త్యనుప్రాసాలంకారం అంటారు.
ఉదాహరణ -1:
1) లక్ష భక్ష్యములు భక్షించు ఒక పక్షి కుక్షికి ఒక భక్ష్యము లక్ష్యమా?
పై వాక్యంలో ‘క్ష’ కారము ‘క్ష్య’ వర్ణము పలుమార్లు ప్రయోగించబడి ఒక అద్భుతమైన సౌందర్యము తీసుకురాబడినది కనుక ఇది వృత్త్యనుప్రాసాలంకారం.

ఉదాహరణ – 2:
2) కాకి కోకిల కాదు కదా !
పై వాక్యంలో ‘క’ కారం పలుమార్లు ప్రయోగించబడి, వినసొంపుగా ఉంది. కాబట్టి ఇది వృత్త్యనుప్రాసాలంకారం.

ఉదాహరణ – 3:
3) లచ్చి పుచ్చకాయ తెచ్చి ఇచ్చింది.
పై వాక్యంలో ద్విత్వచకారం పలుమార్లు అందంగా ప్రయోగింపబడినది. కాబట్టి ఇది వృత్త్యనుప్రాసాలంకారం.

9th Class Telugu 1st Lesson శాంతికాంక్ష కవిపరిచయం

మహాభారతాన్ని తెలుగులో కవిత్రయం వారు (ముగ్గురు కవులు) రచించారు. వారిలో తిక్కన రెండోవారు. వీరు 13వ శతాబ్దానికి చెందిన మహాకవి. నెల్లూరును పరిపాలించిన మనుమసిద్ధికి మంత్రిగా, ఆస్థానకవిగా ఉన్నారు. తిక్కన మొట్టమొదట ‘నిర్వచనోత్తర రామాయణము’ను రచించి మనుమసిద్ధికి అంకితం ఇచ్చారు. తిక్కన రెండో గ్రంథం ‘మహాభారతం’. విరాటపర్వం నుండి స్వర్గారోహణ పర్వం వరకు 15 పర్వాలు రచించి హరిహరనాథునికి అంకితం ఇచ్చారు.

మహాభారత రచనలో ఈయన తీర్చిదిద్దిన పాత్రలు సజీవంగా కనిపిస్తాయి. వీరి శైలిలో ‘నాటకీయత’ ఉంటుంది. సందర్భానుగుణంగా వీరు ప్రయోగించిన పదాలు సృష్టించిన సన్నివేశాలు రసాస్వాదన కలిగిస్తాయి. ఆ ఔచిత్యవంతంగా రసపోషణ చేయగలడాన్ని ‘రసాభ్యుచిత బంధం’ అంటారు. ఇందులో తిక్కన సిద్ధహస్తుడు. సంస్కృతాంధ్రాలలో కవిత్వం రాయగలిగిన ప్రతిభాశాలి కాబట్టి ‘ఉభయకవి మిత్రుడు’ అనీ, కేతనాది కవులకు ప్రేరణ కలిగించి మార్గదర్శకులుగా నిలిచినందుకు ‘కవి బ్రహ్మ’ అనీ బిరుదులు పొందారు.

పద్యాలు – ప్రతి పదార్థాలు-భావాలు

1వ పద్యం :
తే॥ సమయమిది మిత్రకార్యంబు చక్కఁజేయ
నీకతంబున నే మవినీతుఁడైన
యా సుయోధను తోడి పోరాట దక్కి
యనుభవింతుము మా యంశమగు ధరిత్రి.
ప్రతిపదార్థం :
మిత్రకార్యంబున్ = స్నేహితుల పనిని
చక్కన్ + చేయన్ = చక్కబెట్టడానికి
సమయము + ఇది = తగిన కాలమిది
నీ కతంబునన్ = నీ మూలంగా
ఏము = మేము
అవినీతుడు + ఐన = అయోగ్యుడైన
ఆ సుయోధను = ఆ దుర్యోధనునితో
తోడి పోరాట = యుద్ధం
తక్కి = మాని
మా + అంశము + అగు ధరిత్రిన్ = మా వంతు రాజ్యాన్ని
అనుభవింతుము = మేము అనుభవిస్తాము.

భావం :
కృష్ణా ! మిత్రులమైన మా పనిని చక్కబెట్టడానికి నీకు ఇదే తగిన కాలం. నువ్వే రాయబారానికి వెళితే, అయోగ్యు డయిన ఆ దుర్యోధనుడితో మేము యుద్ధం చేయవలసిన పని లేదు. మా వంతు రాజ్యం మాకు వస్తుంది.

AP Board 9th Class Telugu Solutions Chapter 1 శాంతికాంక్ష

2వ పద్యం :
కం॥ ఇచ్చటి బంధులు నీవును
నచ్చెరువడి వినుచునుండ నయిదూళ్ళును మా
కిచ్చినను జాలునంటిని
బొచ్చెముగా దింతపట్టు పూర్ణము సుమ్మీ !
ప్రతిపదార్ధం :
ఇచ్చటి = ఇక్కడ ఉన్న
బంధులు = చుట్టాలు
నీవును = నీవు కూడ
అచ్చెరువడి = ఆశ్చర్యంతో
వినుచున్ + ఉండన్ = వింటూ ఉండగా
మాకున్ = అన్నదమ్ములమైన మాకు
అయిదు + ఊళ్ళును = ఐదు గ్రామాలను
ఇచ్చినను = ఇచ్చినప్పటికీ
చాలున్ + అంటిని = సరిపోతాయని అన్నాను
పొచ్చెము + కాదు = తక్కువ కాదు
ఇంతవట్టు = నే పల్కిన ఈ మాట
పూర్ణము సుమ్మీ ! = సంపూర్ణమైనది (నిజమైనది) సుమా !

భావం :
ఓ కృష్ణా ! ఇక్కడున్న చుట్టాలూ, నీవూ ఆశ్చర్యంతో వింటూండగా, ‘సక్రమంగా మాకు అర్ధరాజ్యం ఇవ్వడానికి మా తండ్రికి మనసొప్పకపోతే మేముండటానికి ‘ఐదూళ్ళిచ్చినా చాలు’ అని సంజయుడితో నేనింతవరకూ చెప్పిన మాటలలో దాపరికం లేదు. అంతా నిజమే సుమా!

విశేషం :
పాండవులు కోరిన ఐదూళ్ళ పేర్లను సంస్కృత మహాభారత కర్త వ్యాసుడు ఇంద్రప్రస్థం, కుశస్థం, వృకస్థలం, వాసంతి, వారణావతం అని పేర్కొన్నాడు. కానీ తెలుగు మహాభారత కర్తలలో ఒకడైన తిక్కన అవస్థలం, వృక (కుశ) స్థలంగాను, మాకంది (వాసంతి), వారణావతంతో మరొక ఊరేదైనా పేర్కొన్నాడు. బహుశా తిక్కన కాలానికి ఆయా నగరాల పేర్లు మారి ఉండవచ్చు లేక ఇంకేదైనా కారణం ఉండవచ్చు.

3వ పద్యం : కంఠస్థ పద్యంలో
శా|| ఆ దుర్యోధనుఁడంత మాత్రమును జేయంజాలఁడో కాని, పెం
పేదం గ్రూరత కోర్వరాదు, పిరి నాకేలందునే, గ్రాసవా
సోదైన్యంబులు వచ్చు నాయరయు నీ చుట్టాలకుం, గావునన్
మోదంబందుట గలుఁ గౌరవులు నేముం బొంది శ్రీపొందివన్.
ప్రతిపదార్థం :
ఆ దుర్యోధనుడు = ఆ సుయోధనుడు
అంతమాత్రమును = అంతమాత్రమైనా (నే కోరిన ఐదూళ్ళనైనా)
చేయన్ + చాలండో = ఇస్తాడో, ఇవ్వడో
కాని = కాని
పెంపు + ఏదన్ = గౌరవం చెడేటట్లు
క్రూరతకున్ + ఓర్వన్ రాదు = క్రూరమైన పనులు చేయటాన్ని సహించలేను
సిరి = రాజ్యసంపద
నాకున్ + ఏల + అందునేన్ = నాకెందుకని విడిస్తే
నా + అరయు = నేను చూసే
ఈ చుట్టాలకున్ = ఈ బంధువులకు
గ్రాసవాసః + దైన్యంబులు= తిండికీ, బట్టకూ కరవు
వచ్చున్ = ఏర్పడుతుంది
కావునన్ = కాబట్టి
కౌరవులున్ = దుర్యోధనాదులు

భావం :
ఆ సుయోధనుడు అంతమాత్రమైనా (నే కోరిన ఐదూళ్ళనైనా) ఇస్తాడో ? ఇవ్వడో ? కాని గౌరవం చెడేటట్లు క్రూరమైన పనులు చేయటాన్ని సహించలేను. రాజ్యసంపద నాకెందుకని విడిస్తే నేను చూసే ఈ బంధువులకు తిండికీ, బట్టకూ కరవు ఏర్పడుతుంది. కాబట్టి దుర్యోధనాదులు, మేము కలిసి సంపదలను పొందితే సంతోషం కలుగుతుంది.

విశేషం :
తన కుమారుల, బంధువుల పోషణ, రక్షణ ధృతరాష్ట్రునికి ఎంతముఖ్యమో తన తమ్ముల, ఆశ్రయించిన వారి పోషణ, రక్షణ తనకు ముఖ్యం అని ధర్మరాజు గడుసుగా సమాధానమిచ్చాడు. ఈ పద్యంలో చక్కని మనోవిశ్లేషణ చేయబడింది.

4వ పద్యం : -కంగస్థ పద్యం
ఉ॥ అక్కట ! లాతులైనఁ బగజైనను జంపన కోరనేల ? యొం
డొక్క తెలుగు లేదె ? యది యొప్పదె ? బంధు సుహృజ్జనంబు లా
దిక్కున మన్నవారు, గణుతింపక సంపదకై వధించి దూ
ఱెక్కుట దోషమందుటను నీ దురవస్థల కోర్వవచ్చునే ?
ప్రతిపదార్థం :
అక్కట ! = అయ్యో !
లాంతులు + జనన్ = పరాయివారైనా
పగఱు + ఐనన్ = విరోధులైనా
చంపన్ + అ + కోరన్ + ఏల = చంపాలనే ఎందుకు కోరాలి?
ఒండు + ఒక్క + తెఱంగులేదే ? = మరొక మార్గం లేదా?
అది + ఒప్పదా? = ఆ మార్గం సరైంది కాదా ?
ఆ దిక్కునన్ = ఆ కౌరవులలో
బంధుసుహృద్ + జనంబులు = చుట్టాలు, మిత్రులు
ఉన్నారు = ఉన్నారు
గణుతింపక = ఆ వైపున ఉన్న మా బంధువులను లెక్కించక
సంపదకై = రాజ్య సంపద కోసం
వధించి = చంపి
దూఱు + ఎక్కుట = నిందల పాలవటం
దోషము + అందుట = పాపం పొందటం
అను = అనే
దుర్ + అవస్థలకున్ = చెడు స్థితిని
ఓర్వన్ + వచ్చునే – సహింపదగునా?

భావం :
అయ్యో ! పరాయివారైనా, విరోధులైనా చంపాలనే ఎందుకు కోరాలి ? మరొక మార్గం లేదా ? ఆ మార్గం సరైంది కాదా ? ఆ కౌరవులలో చుట్టాలు, మిత్రులు ఉన్నారు. ఆ వైపున ఉన్న బంధువులను లెక్కించక రాజ్యసంపద కోసం చంపి, నిందల పాలవటం, పాపం పొందడమనే చెడు స్థితిని సహింపదగునా ? (కూడదని భావం).

AP Board 9th Class Telugu Solutions Chapter 1 శాంతికాంక్ష

5వ పద్యం :
ఆ||వె|| పగయ కలిగినేనిఁ బామున్న యింటిలో
నున్న యట్ల కాక యూజడిల్లి
యుండునెట్లు చిత్త మొకమాటుగావున
వలవ దధిక దీర్ఘ వైరవృత్తి
ప్రతిపదార్థం :
పగ + అ + కలిగెనేనిన్ = శత్రుత్వమే ఏర్పడితే
పాము + ఉన్న + ఇంటిలోన్ = సర్పమున్న ఇంటిలో
ఉన్న + అట్ల + కాక – ఉన్నట్లే గాని
ఒక మాటున్ = ఒకసారి అయినా
చిత్తము = హృదయం
ఊఱడిల్లి = ఊరట పొంది
ఎట్లు + ఉండున్ = ఎట్లా ఉండగలదు?
కావునన్ = కాబట్టి
అధిక దీర్ఘ వైర వృత్తి = చిరకాల విరోధంతో మెలగటం
వలవదు. = కూడదు

భావం :
శత్రుత్వము ఏర్పడితే, పాము ఉన్న ఇంటిలో ఉన్నట్లే గాని, ఒకసారైనా హృదయం ఊరట పొందదు. కాబట్టి చిరకాలం విరోధంతో ఉండకూడదు.

6వ పద్యం : కంఠస్థ పద్యం
చం|| పగయడఁగించు టెంతయు శుభం, బది లెస్స, యడంగునే సగం
బగ ? పగగొన్న మార్కొనక పల్కక యుండగ వచ్చునే ? కడుం
చెగ మొదలెత్తి పోవఁ బగ దీర్పగ వచ్చినఁ శౌర్యమొందు, నే
మిగతిఁ దలంచినం బగకు మేలిమి లేమి ధ్రువంబు దేశవా!
ప్రతిపదార్థం :
కేశవా = శ్రీ కృష్ణా !
పగ + అడంగించుట = శత్రుత్వాన్ని అణచి వేయడం
ఎంతయున్ శుభంబు = ఎంతో మేలు
అది లెస్స = అదే మంచిది
పగన్ = పగతో
పగ + అడంగునే = పగ సమసిపోదు
పగ + గొన్నన్ = (ఒకరి) పగవలన (మరొకరు) బాధపడితే
మార్కొనక = అతడిని ఎదిరించక
పల్కక + ఉండగన్ = ఊరక ఉండడం
వచ్చునే = సాధ్యమా?
కడున్ + తెగన్ = గొప్ప సాహసంతో
మొదలు + ఎత్తిపోవన్ = తుదముట్టే విధంగా
పగన్ + తీర్పగన్ = విరోధాన్ని రూపుమాపడానికి
వచ్చినన్ = సిద్ధపడితే
క్రౌర్యము + ఒందున్ = దారుణమైన పనులు చేయాల్సివస్తుంది
ఏమిగతి + తలంచినన్ = ఏ విధంగా ఆలోచించినా
పగకున్ = విరోధం వలన
మేలిమిలేమి = మంచి జరగదు
ధ్రువంబు = ఇది నిజం

భావం :
శ్రీ కృష్ణా ! శత్రుత్వాన్ని అణచివేయడం ఎంతో మేలు. అదే మంచిది. పగతో పగ సమసిపోదు. ఒకరి పగ వలన మరొకరు బాధపడితే అతడిని ఎదిరించక ఊరకుండటం సాధ్యమా ? గొప్ప సాహసంతో తుదముట్టే విధంగా విరోధాన్ని రూపుమాపడానికి సిద్ధపడితే దారుణమైన పనులు చేయాల్సి వస్తుంది. ఏ విధంగా ఆలోచించినా విరోధం వలన మంచి జరగదు. ఇది నిజం.

AP Board 9th Class Telugu Solutions Chapter 1 శాంతికాంక్ష

7వ పద్యం : కంఠస్థ పద్యం
ఉ॥ కావున శాంతిఁ బొందుటయ కర్ణము, దా నది యట్టులుండె, శ్రీ
గావలెనంచు, బోరితము గామియుఁ గోరెద, మెల్ల సొమ్ములుం
బోవుటయుం గులక్షయము పుట్టుటయున్ వెలిగాఁగ నొండుమై
వేవిధినైనఁ జక్కఁబడు టెంతయు నొప్పుఁజుమీ జనార్థవా !
ప్రతిపదార్థం :
కావునన్ = కాబట్టి
శాంతిన్ = శాంతిని
పొందుట + అ = పొందుటే
కర్ణము = చేయాల్సిన పని
తాన్ + అది = ఆ విషయం
అట్టులు + ఉండెన్ = అలా ఉండనీ
శ్రీ = సంపద
కావలెన్ + అంచున్ = కావాలని
పోరితము = యుద్ధం
కామియున్ = వద్దని
కోరెదము = కోరుతున్నాం
ఎల్ల = అన్ని
సొమ్ములున్ = సంపదలు
పోవుటయున్ = నశించడం
కులక్షయము = వంశనాశనం
వుట్టుటయున్ = కలగడం
వెలికాగన్ = జరగకుండ
ఒండుమైన్ = వేరొకవిధంగా
ఏ విధిన్ + ఐనన్ = ఎలాగోలా
చక్కన్ + పడుట = బాగుపడుట
ఎంతయున్ = మిక్కిలి
ఒప్పున్ + చుమీ = తగినది గదా !

భావం :
కాబట్టి శాంతిని పొందుటీ చేయాల్సిన పని. ఆ విషయం అలా ఉండనీ. సంపద కావాలని, యుద్ధం వద్దని కోరుతున్నాం. అన్ని సంపదలు నశించడం, వంశ నాశనం కలగడం జరగకుండా వేరొక విధంగా ఎలాగోలా బాగుపడుట మిక్కిలి తగినది గదా!

8వ పద్యం : కంఠస్థ పద్యంగా
చం॥ మనమువఁ బక్షపాతగతి మాడెన మామము ధర్మనీతి వ
రవముల రెండు దిక్కుల హితంబును బెంపును గల్గునట్టి చొ
ప్పున విదురాది సజ్జనుల బుద్ధికి రామచితంబు తోడి మె
ల్పునఁ బరుసందనంబువను భూపతులెల్ల వెఱుంగ వాడుమీ !
ప్రతిపదార్థం :
మనమునన్ = నీ మనస్సులో
మాదెసన్ = మాపై
పక్షపాతగతిన్ = అభిమానం చూపడం
మానుము = విడిచిపెట్టు
ధర్మనీతివర్తనములన్ = ధర్మంతో, నీతితో కూడిన నడవడికతో
రెండు దిక్కులన్ = ఇరువురికి
హితంబును = మేలును
పెంపును = అభివృద్ధియు
కల్గునట్టి = కలిగే
చొప్పునన్ = విధంగా
విదుర + ఆది = విదురుడు మొదలయిన
సజ్జనుల = మంచివారి
బుద్ధికిన్ + రాన్ = మనస్సులకు అంగీకారమయ్యేలా
ఉచితంబు తోడి = అనువుగా
మెల్పునన్ = మెత్తగా
పరుసందనంబునన్ = పరుషంగా
భూపతులు = రాజులు
ఎల్లన్ = అందరూ
ఎఱుంగన్ = తెలుసుకొనేలా
ఆడుము = మాట్లాడు

భావం :
నీ మనస్సులో మాపై అభిమానం చూపడం విడిచి పెట్టు, ధర్మంతో, నీతితో కూడిన నడవడికతో ఇరువురికీ మేలు, అభివృద్ధి కలిగే విధంగా, విదురుడు మొదలైన మంచివారి మనస్సులకు అంగీకారమయ్యేలా అనువుగా, మెత్తగా, పరుషంగా రాజులందరూ తెలుసుకునేలా మాట్లాడు.

AP Board 9th Class Telugu Solutions Chapter 1 శాంతికాంక్ష

9వ పద్యం :
మ॥ సుతువాఁడై వినయంబు పేకొనక యే చొప్పుం దగం జెప్ప కా
ధృతరాష్ట్రుం డవినీతిఁ జేసినను సంధింపంగ రాదంచు వే
గ తెగంబాలకు చెంపు సేయునెడ లోకం బెల్ల మెచ్చం బ్రకా
శిత ధర్మస్థితి నొంది మా మనము నిశ్చింతంబుగాఁ జేయుమీ !
ప్రతిపదార్థం :
ఆ ధృతరాష్ట్రుండు = ఆ ధృతరాష్ట్ర మహారాజు
సుతువాడు + ఐ = కొడుకు మాటే వినేవాడై
వినయంబు = విధేయతను
చేకొనక = చూపక
ఏ చొప్పుం = ఏ మార్గాన్ని
తగన్ + చెప్పక = తేల్చి చెప్పక
అవినీతిన్ చేసినను = అవినీతితో ఉన్నట్లయితే
సంధింపగన్ = సంధి చేయటం
రాదు + అంచున్ = కుదరదని
వేగ = వెంటనే
తెగన్ + పాలుకు = సాహసించకు
తెంపు + చేయు + ఎడన్ = సాహసించాల్సి వస్తే
లోకంబు + ఎల్లన్ = లోకమంతా
మెచ్చన్ = మెచ్చుకునేలా
ప్రకాశిత ధర్మస్థితిన్ = ధర్మానికి నిలచి
మా మనమున్ = మా మనస్సుల్ని
నిశ్చింతంబుగాన్ = విచారం లేనట్టివిగా
చేయుమీ = చేయాల్సింది

భావం :
ధృతరాష్ట్ర మహారాజు కొడుకుమాటే వినేవాడై | విధేయతను చూపక, ఏ మార్గాన్ని తేల్చి చెప్పక, అవినీతితో – ఉన్నట్లయితే సంధిచేయటం కుదరదని వెంటనే సాహసించి వచ్చేయకు. సాహసించాల్సి వస్తే ధర్మానికి నిలచి లోకమంతా మెచ్చుకునేలా, మా మనస్సుల్ని విచార రహితంగా చేయి.

10వ పద్యం :
కం॥ మమ్మెఱుఁగు, దెదిరి నెఱుఁగుదు
నెమ్మి యెటుఁగు దగ్గ సిద్ది నెట్ యెటుఁగుదు నా
క్యమ్ముల పద్ధతి వెఱుఁగుదు
పొమ్మోవ్వఁడ నేను నీకు బుద్ధులు సెప్పవ్.
ప్రతిపదార్థం :

మమ్మున్ + ఎఱుఁగుదు = మేమెలాంటి వాళ్ళమో తెలిసినవాడవు
ఎదిరిన్ = కౌరవులను గూర్చి
ఎఱుఁగుదు = తెలిసినవాడవు
నెమ్మిన్ + ఎఱుఁగుదు : కూర్మి అంటే ఎలాంటిదో తెలిసినవాడవు
అర్ధ సిద్ధి నెటి + ఎఱుగుదు = కార్యసాధన పద్ధతి తెలిసినవాడవు
వాక్యమ్ముల పద్ధతిన్ = మాటలాడే విధం
ఎఱుఁగుదు = తెలిసినవాడవు
నీకున్ = నీకు
బుద్ధులు + చెప్పన్ = ఉపాయాలు చెప్పడానికి
నేను + ఎవ్వడన్ = నేనేమాత్రం వాడిని
పొమ్ము = హస్తినాపురానికి వెళ్ళిరా !

భావం:
మేమెలాంటి వాళ్ళమో తెలిసినవాడివి, కౌరవులను గూర్చి తెలుసు. కూర్మి అంటే ఏమిటో తెలుసు. కార్యసాధన పద్ధతి కూడా తెలుసు. మాటలాడే విధం తెలుసు. నీకు ఉపాయాలు చెప్పడానికి నేనేమాత్రం వాడిని ? హస్తినాపురానికి వెళ్ళిరా !

AP SSC 10th Class Telugu Solutions Chapter 8 సముద్రలంఘనం

AP State Board Syllabus AP SSC 10th Class Telugu Solutions 8th Lesson సముద్రలంఘనం Textbook Questions and Answers.

AP State Syllabus SSC 10th Class Telugu Solutions 8th Lesson సముద్రలంఘనం

10th Class Telugu 8th Lesson సముద్రలంఘనం Textbook Questions and Answers

ఉన్ముఖీకరణ : చదవండి – ఆలోచించి చెప్పండి

ప్రశ్నలు – జవాబులు

AP SSC 10th Class Telugu Solutions Chapter 8 సముద్రలంఘనం 1
ప్రశ్న 1.
పై చిత్రంలో ఎవరెవరున్నారు?
జవాబు:
పై చిత్రంలో రామలక్ష్మణులు, వారి యెదుట సుగ్రీవుడు, హనుమంతుడు, మరో ఇద్దరు వానర శ్రేష్ఠులు ఉన్నారు.

ప్రశ్న 2.
ఎవరెవరి మధ్య సంభాషణ ఎందుకు జరుగుతున్నదో చెప్పండి.
జవాబు:
రామలక్ష్మణులకూ, సుగ్రీవునికీ మధ్య వారు ఒకరితో ఒకరు స్నేహం చేసుకోడానికి సంభాషణ జరుగుతోంది. సీతమ్మ జాడను తెలిసికొనివస్తానని సుగ్రీవుడు రామునికి చెప్పాడు. సుగ్రీవుని అన్న వాలిని చంపి, కిష్కింధ రాజ్యాన్ని సుగ్రీవునికి పట్టం కడతానని, రాముడు సుగ్రీవునికి మాట ఇచ్చాడు.

AP SSC 10th Class Telugu Solutions Chapter 8 సముద్రలంఘనం

ప్రశ్న 3.
‘సీత’ జాడ తెలుసుకున్నది ఎవరు? ఆయన ఏ మార్గంలో లంకకు చేరాడు?
జవాబు:
సీతమ్మ జాడను హనుమంతుడు తెలిసికొన్నాడు. హనుమంతుడు సముద్రంపై నుండి ఆకాశమార్గంలో ఎగిరి, లంకకు చేరాడు.

ఇవి చేయండి.

1. అవగాహన-ప్రతిస్పందన

ప్రశ్న 1.
పాఠంలోని పద్యాలను రాగ, భావయుక్తంగా చదవండి.
జవాబు:
మీ ఉపాధ్యాయుల సహాయంతో పాఠంలోని పద్యాలను, రాగముతో, భావం తెలిసేలా చక్కగా చదవడం నేర్చుకోండి.

ప్రశ్న 2.
‘కటకట……….. పోయన దగెగా’ – పద్యభావాన్ని సొంతమాటల్లో చెప్పండి.
జవాబు:
కవులు సామాన్యంగా సముద్రాన్ని భూమి అనే స్త్రీ ధరించిన వస్త్రంలా ఉందని ఉత్ప్రేక్షిస్తారు. ఇక్కడ లంక చుట్టూ సముద్రం ఆవరించి ఉండడం వల్ల కవి, ఆ సముద్రాన్ని, లంకా నగరం కోటగోడ చుట్టూ, శత్రువులు రాకుండా తవ్విన లోతైన కందకమేమో అన్నట్లు ఉందని ఉత్ప్రేక్షించాడు.

AP SSC 10th Class Telugu Solutions Chapter 8 సముద్రలంఘనం

ప్రశ్న 3.
పాఠానికి ‘సముద్రలంఘనం’ శీర్షిక సరిపోయిందా? ఏ విధంగానో తెలపండి.
జవాబు:
ఈ పాఠంలో మహేంద్రగిరి నుండి త్రికూట పర్వతం మీదికి హనుమంతుడు ఎగిరి వెళ్ళిన ఘట్టాన్ని కవి వర్ణించాడు. హనుమంతుడు ఎగిరినప్పుడు ఏమయ్యిందో ఈ పాఠంలో చెప్పాడు.

హనుమంతుడు ఎగిరే ముందు ఏమి చేశాడో, ఈ పాఠంలో ఉంది. సముద్రం మీద వెడుతున్న హనుమంతుడు బాణంలా దూసుకుపోయాడని చెప్పాడు. ఎగిరి వెళ్ళేటప్పుడు అతని పిక్కల గాలి వేగానికి సముద్రం చీలిపోయి అది చూసేవారికి ఎలా కనిపించిందో కవి చెప్పాడు.

హనుమంతుడు మహేంద్రగిరి నుండి త్రికూటగిరికి దాటి వెళ్ళడం గురించి, ఈ పాఠంలో ఉంది. కాబట్టి ఈ పాఠానికి “సముద్రలంఘనం” అన్న పేరు చక్కగా సరిపోయింది.

II. వ్యక్తికరణ-సృజనాత్మకత

1. కింది భావం వచ్చే పద్యపాదాలు గుర్తించి, సందర్భం వివరించండి.
అ) ప్రవాహ తరంగాలు ఆకాశాని కెగిశాయి.
జవాబు:
“ఝరీతరంగఘట లెల్లెడల నుప్పరంబు లెగసి పడి” – అన్న పద్యపాదం, పై భావాన్ని ఇస్తుంది. హనుమంతుడు మహేంద్ర పర్వతంపై అడుగువేసి, ఎగరడంతో ఆ పర్వతం కంపించడంతో ఆ పర్వత శిఖరంపై గల సెలయేళ్ళ కెరటాలు అన్నీ, ఆకాశమునకు ఎగిరాయి అని కవి చెప్పిన సందర్భంలోనిది.

ఆ) ఒకచోట నిలబడి దక్షిణం వైపు చూశాడు.
జవాబు:
“ఒక్కచో నిల్చి దక్షిణ దిక్కుఁజూచి” – అన్న పద్యపాదం, పై భావాన్ని ఇస్తుంది. హనుమంతుడు సముద్రం మీదికి ఎగిరేటప్పుడు అతని వేగానికి పర్వత శిఖరాలు చలించాయి అనీ, హనుమంతుడు పర్వతాన్ని ఎక్కి అంతటా తిరిగాడనీ, ఒకచోట నిలబడి దక్షిణ దిశవైపు చూచాడనీ, కవి వర్ణించిన సందర్భంలోనిది.

AP SSC 10th Class Telugu Solutions Chapter 8 సముద్రలంఘనం

ఇ) ఒక గొప్పధ్వని పుట్టింది.
జవాబు:
“ఒక మహారవం బుదయింపన్”- అనే పద్యపాదం, పై అర్థాన్ని ఇస్తుంది. కొండ అనే విల్లు నుండి వెలువడిన హనుమంతుడు అనే బాణం, గొప్ప ధ్వని వచ్చేలా, రాక్షసుల పట్టణం వైపు వేగంగా వెళ్ళిందని కవి చెప్పిన సందర్భంలోనిది.

ఈ) బలిచక్రవర్తి ఇంటి వాకిలా అన్నట్లున్నది.
జవాబు:
“బలిమందిరంబు వాకిలియొ యనఁగ” అన్న పద్యపాదం, పై భావాన్ని ఇస్తుంది. హనుమంతుని పిక్కల నుండి పుట్టిన గాలికి, సముద్ర జలం లోతుగా చీలింది. ఆ దృశ్యం ఆదిశేషుడు హనుమంతుని చూడ్డానికి వచ్చి తలుపులు తెరిచిన బలి చక్రవర్తి ఇంటివాకిలా? అన్నట్లు ఉందని కవి చెప్పిన సందర్భంలోనిది.

2. పాఠంలోని పద్యాలలో హనుమంతుని సముద్రలంఘనానికి సంబంధించిన వర్ణనలు ఉన్నాయి కదా! కవి కింది అంశాలను వేటితో పోల్చాడు? ఆ పద్యపాదాల కింద గీత గీయండి. చదవండి.

అ) హనుమంతుని అడుగులు
జవాబు:
అడుగులొత్తిన పట్లఁ బిడుగు మొత్తినయట్ల.

ఆ) హనుమంతుని చూపు
జవాబు:
భావిసేతు వచ్చుపడ లంకకడకును సూత్రపట్టుమాడ్కిఁ జూడ్కి వెలుఁగ

ఇ) హనుమంతుడు ఆకాశంలో ప్రయాణించడం ,
జవాబు:
విపరీతగతిన్ దోల దొరకొనెనొ, రవియిటు దేలం బెనుగాడితోడి తేరు

3. కింది పద్యం చదివి ప్రశ్నలకు సరైన సమాధానాన్ని కుండలీకరణాలలో ( ) రాయండి.
తే॥ గీ॥ పవన తనయ నీ వర్గము, స్వర్ణసమము
వాయుపుత్ర నీ వేగము, వాయుసమము
అసుర వనమును కాల్చు నీ వగ్నిసమము
రామదూత నీ చరితము, రమ్యమయము.

అ) ఆంజనేయుని దేహకాంతి స్వర్ణసమం కదా ! స్వర్ణమంటే
i) వెండి
ii) ఇత్తడి
iii) బంగారం
iv) రాగి
జవాబు:
iii) బంగారం

ఆ) హనుమంతుని వేగం దీనితో సమానమైంది.
i) విమానంతో
ii) పక్షితో
iii) గరుడునితో
iv) వాయువుతో
జవాబు:
iv) వాయువుతో

ఇ) అసురులు ఎవరంటే
i) దేవతలు
ii) పాములు
iii) రాక్షసులు
iv) గంధర్వులు
జవాబు:
iii) రాక్షసులు

AP SSC 10th Class Telugu Solutions Chapter 8 సముద్రలంఘనం

ఈ) రమ్యచరితుడైన హనుమంతుడు ఈ విధంగా ప్రసిద్ధుడు.
i) శివదూతగా
ii) ఇంద్రదూతగా
iii) బ్రహ్మదూతగా
iv) రామదూతగా
జవాబు:
iv) రామదూతగా

ఉ) అసురవనాన్ని కాల్చే సమయంలో హనుమ ఎలాంటివాడు?
i) అగ్ని
ii) వాయువు
iii) ఇంద్రుడు
iv) రాముడు
జవాబు:
i) అగ్ని

4. పాఠం ఆధారంగా కింది ప్రశ్నలకు జవాబులు రాయండి. అ) హనుమంతుడికి లంక ఎలా కనిపించింది?
జవాబు:
సహజంగా సముద్రం, భూదేవి నడుమునకు కట్టిన వస్త్రంలా శోభిస్తుంది. అటువంటి సముద్రం, లంక వైపుకు వచ్చి, దుష్టరాక్షసులున్న లంకా నగరం కోటకు, చుట్టూ త్రవ్విన కందకంలా ఇప్పుడు హనుమంతుడికి కనిపించింది.

ఆ) హనుమంతుడు సముద్రలంఘనానికి ముందు ఎలా సిద్ధమై లంఘించాడు?
జవాబు:
హనుమంతుడు సముద్రాన్ని దాటడానికి సిద్ధమై, గట్టిగా కొండపై ఒత్తి అడుగులు వేశాడు. తన తోకను అటు ఇటూ తిప్పాడు. తన చేతితో కొండను బలంగా చరిచాడు. గట్టిగా సింహనాదం చేశాడు. వాయుదేవునిలా పర్వత శిఖరాలు కదిలేలా తన శరీరాన్ని పెంచాడు. కొండపైకి ఎక్కి అటూఇటూ తిరిగాడు. తరువాత ఒకచోట నిలబడి, దక్షిణ దిక్కు వైపు చూశాడు.

ఇ) హనుమంతుడు ఆకాశంలోకి ఎగిరినప్పుడు సమీపంలోని వారికి ఏమనిపించింది?
జవాబు:
హనుమంతుడు కొండను అణగదొక్కి ఆకాశంపైకి ఎగిరి, ప్రయాణిస్తూ ఉంటే, సమీపంలోని వారికి, హనుమంతుడు ఎగిరినట్లు కాకుండా, ఒక పర్వతము ఎగిరినట్లు అనిపించింది.

ఈ) హనుమంతుడు లంకవైపు ఎలా ఎగిరాడు?
జవాబు:
హనుమంతుడు సముద్రం వైపు చూసి, తన రెండు చెవులు రిక్కించి, వంగి తన చేతులను నడుమునకు ఆనించి, తోకను ఆకాశ వీధిలోకి పెంచి, పాదాలు దగ్గరగా పెట్టి, గట్టిగా గాలి పీల్చి, తాను నిలబడిన కొండను ఒక్కసారిగా అణగదొక్కి పైకి ఎగిరి లంఘించాడు. హనుమంతుడు అప్పుడు కొండ అనే విల్లు నుండి వెలువడిన బాణంలా లంక వైపుకు దూసుకుపోయాడు.

ఉ) మహావేగంతో వెడుతున్న హనుమంతుని చూసి దేవతలు ఏమనుకున్నారు?
జవాబు:
వాయుపుత్రుడైన హనుమంతుడు తన తోకతో పాటు ఎగరడం చూసి, దేవతలు “సూర్యుడు విపరీతమైన వేగంతో పెద్ద
కోడి ఉన్న తన రథాన్ని నడిపిస్తూ అటు వచ్చాడేమో” అనుకున్నారు.

5. కింది ప్రశ్నలకు ఐదేసి వాఠ్యాల్లో సమాధానాలు రాయండి.

అ) హనుమంతుడు సముద్రాన్ని లంఘించడానికి సిద్ధమై అడుగులు వేసినపుడు పెద్దపెద్ద కొండలు బద్దలై, చెట్లు పెకిలింపబడి, ఏనుగులూ, సింహాలూ పరుగులు పెట్టాయి. కొండ గుహలు ప్రతిధ్వనించాయి. దీన్ని బట్టి హనుమంతుని బలం ఎంతటిదో ఊహించి రాయండి.
జవాబు:
హనుమంతుని బలం వర్ణనా తీతం. అతడు కొండలను’ పిండి చేసేటంత బరువూ, శక్తి, బలం కలవాడు. అందుకే అతడు అడుగులు వేస్తే, పెద్ద పెద్ద రాళ్ళు పగిలి పడిపోయాయి. అతడు వాయుదేవుని అంత వేగం గలవాడు. అందుకే అతడు తోకను తిప్పితే, అక్కడి చెట్లు అన్నీ కూలిపోయి బయళ్ళు ఏర్పడ్డాయి. అతడు చేతితో గట్టిగా చరిస్తే ఏదో కర్రతో కొట్టినట్లు, క్రూర జంతువులు అన్నీ బెదరి పారిపోయాయి. అతడు సింహనాదం చేస్తే అక్కడి కొండ గుహలు ప్రతిధ్వనించాయి. దీన్ని బట్టి హనుమంతుని కంఠధ్వని, మహా గంభీరమైనదని తెలుస్తోంది.

హనుమంతుడు మహా బలవంతుడు, శక్తిమంతుడు అయినందువల్లనే తాను ఒక్కడూ, నూరు యోజనాల సముద్రం దాటి వెళ్ళి లంకిణిని చంపి, అశోక వనాన్ని భగ్నం చేసి, లక్షల కొద్దీ రాక్షసులను చంపి, లంకను అగ్నితో కాల్చి, రావణునికి బుద్ధి చెప్పి, సీత జాడను తెలిసికొని రాముని వద్దకు తిరిగివచ్చాడు.

ఆ) వానర సైన్యంలో ఎంతోమంది వీరులుండగా సముద్రలంఘనానికి హనుమంతున్లే ఎన్నుకోడానికి గల కారణాలు ఏమై ఉండవచ్చు?
జవాబు:
మిగిలిన వానరులలో కొందరు తాము నూరు యోజనాల దూరం ఎగిరి వెళ్ళలేమన్నారు. మరికొందరు ఎగిరి వెళ్ళినా, తిరిగి రాలేమన్నారు.

హనుమంతుడికి బ్రహ్మ శాపం వల్ల తన బలం తనకు తెలియదు. అతడు వాయుదేవుని పుత్రుడు. అతడు వాయుదేవునితో సమాన బలం గలవాడు. 10 వేల యోజనాల దూరం దాటగలవాడు. అదీగాక శ్రీరాముడు హనుమంతుని బలాన్ని ముందే గుర్తించి, హనుమంతుని చేతికే, సీతమ్మకు ఇమ్మని, తన ఉంగరాన్ని కూడా ఇచ్చాడు.

హనుమంతునివల్లే ఆ కార్యం నెరవేరుతుందని జాంబవంతుడు సలహా చెప్పాడు. జాంబవంతుడు హనుమంతుని వెళ్ళి రమ్మని ప్రోత్సహించాడు. ఈ కారణంగా హనుమంతుణే, సముద్రలంఘనానికి వానరులు ఎన్నుకున్నారు.

AP SSC 10th Class Telugu Solutions Chapter 8 సముద్రలంఘనం

ఇ) హనుమంతుడు సముద్రలంఘనానికి ముందు చేసిన చేష్టల ఆంతర్యం ఏమై ఉంటుంది?
జవాబు:
సముద్రలంఘనానికి ముందు హనుమంతుడు గట్టిగా ఒత్తి అడుగులు వేసి, రాళ్ళను పగులకొట్టి, చెట్లను కూలగొట్టి, క్రూర జంతువులను సైతం పారిపోయేలా చేసి, గుహలు ప్రతిధ్వనించేలా సింహనాదం చేశాడు. ఆతని పాదాల ఒత్తిడికి పర్వత శిఖరాలు కంపించి పోయాయి.

హనుమంతుడు తన శక్తిని మిగిలిన వానరులకు, ఈ విధంగా చూపించాడు. తాను సీత జాడను తెలిసికొని రాగలనని తనవారికి ఆ విధంగా ధైర్యం కల్పించాడు. తాను మహాశక్తిమంతుడననీ, కొండల్ని పిండి చేయగలననీ నిరూపించాడు. తాను వాయుదేవుని అనుగ్రహం కలవాడినని, మిగిలిన వానరులకు తెలియపరచి, వారికి ధైర్యం కల్పించాడు. హనుమంతుడు తప్పక సీత జాడను తెలిసికొని రాగలడని, ముందుగానే తన తోటి వానరులకు ఈ విధంగా భరోసా ఇచ్చాడు. అందుకే హనుమంతుడు ఆ చేష్టలు చేశాడు.

ఈ) హనుమంతుడు ఆకాశంలోకి ఎగరగా సమీపంలోని వారికి ఒక పెద్ద కొండ ఎగిరిందా! అని అనిపించింది. అలా ఎందుకు అనిపించిందో రాయండి.
జవాబు:
హనుమంతుడు సముద్రాన్ని దాటడానికి ముందు తన శరీరాన్ని బాగా పెంచాడు. పర్వదినాలలో ఉప్పొంగే సముద్రుడిలా శరీరాన్ని పెంచాడు. అతడు పర్వతమంత శరీరాన్ని ధరించాడు. హనుమంతుడు సముద్రం మీద ఎగిరేటప్పుడు అతని నీడ, పదియోజనాల పొడవు, ముప్ఫైయోజనాల వెడల్పు ఉందని రామాయణంలో చెప్పబడి ఉంది. అంత గొప్ప శరీరం కల హనుమంతుడు చూసేవారికి తెక్కలున్న పర్వతం వలె కనిపించాడు.

అందుకే హనుమంతుడు ఆకాశంలోకి ఎగిరినప్పుడు ఒక పెద్ద కొండ ఎగిరిందా అని ప్రక్కనున్న వాళ్ళకి అనిపించింది.

6. కింది ప్రశ్నలకు పది వాక్యాల్లో సమాధానాలు రాయండి.

అ) హనుమంతుణ్ణి గురించి మీ సొంతమాటల్లో రాయండి.
జవాబు:
హనుమంతుడు మహాబలవంతుడు. అతడు సముద్రాన్ని దాటేముందు శరీరాన్ని పెంచి మహేంద్రగిరిపై అడుగులు వేశాడు. అప్పుడు పిడుగులు పడ్డట్లు అక్కడి రాళ్ళు పగిలిపోయాయి. హనుమంతుడు తోకను త్రిప్పినప్పుడు వచ్చిన గాలి వేగానికి అక్కడి చెట్లు కూలిపోయాయి. అతడు చేతితో చరిస్తే భయపడి క్రూర జంతువులు పారిపోయాయి. అతడు చేసిన సింహనాదానికి గుహలు ప్రతిధ్వనించాయి. కొండలు కంపించాయి. కొండలపై సెలయేళ్ళ కెరటాలు ఎగసిపడి ఆకాశాన్ని తాకాయి. హనుమంతుడు పెరిగి మహేంద్ర గిరిపై నిలిచాడు.

హనుమంతుడు సముద్రాన్ని చూసి, చెవులు రిక్కించి, చేతులు నడుముకు ఆనించి, తన తోకను ఆకాశం వైపుకు పెంచి, పాదాలు దగ్గరగా పెట్టి, తాను నిలబడ్డ కొండను క్రిందకు అణగదొక్కి పైకి ఎగిరాడు. అప్పుడు చూచేవాళ్ళకు పర్వతం ఎగురుతున్నట్లు అనిపించింది. బాణంలా ధ్వని చేసుకుంటూ అతడు వేగంగా సముద్రం మీంచి ఎగిరాడు.

హనుమంతుని పిక్కల గాలి వేగానికి సముద్రం చీలి, రాముని కోప ప్రవాహం, లంకకు చేరడానికి తవ్విన కాలువలా కనిపించింది. ఆదిశేషుడు వచ్చి తలుపులు తెరిచిన బలిచక్రవర్తి ఇంటి వాకిలిలా కనిపించింది. సేతు నిర్మాణానికి త్రవ్విన పునాదిలా కనిపించింది.

ఆ) హనుమంతుడు సముద్రాన్ని లంఘించిన విధానాన్ని కవి ఎలా వర్ణించాడు?
జవాబు:
హనుమంతుడు సముద్రం వైపు చూసి, తన రెండు చెవులు రిక్కించి, కిందికి వంగి, తన చేతులను నడుముకు ఆనించి, తోకను ఆకాశం మీదికి పెంచి, తన పాదాలు దగ్గరగా పెట్టి, గాలి గట్టిగా పీల్చి, తాను నిలబడ్డ కొండను కిందకు అణగదొక్కి పైకి ఎగిరాడు.

హనుమంతుడు ఎగురుతూ ఉంటే, పర్వతము ఎగురుతున్నట్లు అనిపించింది. హనుమంతుడు విల్లు నుండి విడిచి పెట్టబడిన బాణంలా పెద్ద ధ్వనితో లంకవైపు దూసుకుపోయాడు.

హనుమంతుడు తోకతో ఎగరడం చూసిన దేవతలు, సూర్యుడు కాడి ఉన్న తన రథాన్ని వేగంగా తోలుకు వస్తున్నాడేమో అనుకొన్నారు. హనుమంతుని పిక్కల నుండి వచ్చిన గాలి వేగానికి, సముద్రం లోతుగా చీలింది. ఆ గాలి, పాతాళంలో ఉన్న పాములకు ఆహారం వచ్చిందేమో అనిపించింది.

హనుమంతుడి పిక్కల బలంతో వీచిన గాలి వేగానికి సముద్రం చీలినట్లు కాగా అది, రాముని క్రోధ రసం లంకకు చేరడానికి తవ్విన కాలువలా, రాబోయే కాలంలో కట్టే సేతువు పునాదిలా, ఆదిశేషుడు తలుపులు తెరిచిన బలిమందిరం వాకిలిలా కనిపించింది. ఆ విధంగా హనుమ త్రికూట పర్వత శిఖరం చేరాడు.

7. కింది అంశాల గురించి సృజనాత్మకంగా/ప్రశంసిస్తూ రాయండి.

1. హనుమంతుడి సముద్రలంఘనానికి ముందు వానరులందరూ మహేంద్రగిరికి చేరుకున్నారు. ఎవరు సముద్రాన్ని దాటగలరు? అనే చర్చ బయలుదేరింది. హనుమంతుడు, జాంబవంతుడు, అంగదుడు ఇతర వానరులు ఉన్నారు. వాళ్లు ఏమేమి మాట్లాడుకొని ఉంటారు? సంభాషణ రూపంలో రాయండి.
జవాబు:
మహేంద్రగిరి వద్ద హనుమంతుడు – జాంబవంతుడు – అంగదుడు
ఇతర వానరుల మధ్య సంభాషణ

అంగదుడు : వానరులారా ! మనలో ఎవరు సముద్రాన్ని దాటి, మా పినతండ్రి సుగ్రీవుని ప్రతిజ్ఞను నిలబెట్టగలరు? మీరు ఎంతెంత దూరం సముద్రం దాటగలరో చెప్పండి.

శరభుడు : యువరాజా ! నేను ముప్పై యోజనాల దూరం దాటగలను.

మైందుడు : యువరాజా ! నేను డెబ్బె యోజనాల దూరం వరకూ దాటగలను.

జాంబవంతుడు : మనము తప్పక రామకార్యం సాధించాలి. ఒకప్పుడు నాకు ఎగిరేందుకు మంచి బలం ఉండేది. నేనిప్పుడు ముసలివాణ్ణి అయ్యాను. నేను ఇప్పటికీ 100 యోజనాలు దూరం దాటగలను. కాని తిరిగి రాలేనేమో ? అంగదా ! నీవు నూరు యోజనాల దూరం దాటి తిరిగి వెళ్ళి రాగలవు. కాని యువరాజువైన నిన్ను మేము పంపగూడదు. నేను సరయిన వాణ్ణి మీకు చూపిస్తా.

అంగదుడు : తాతా ! జాంబవంతా ! మనలో సముద్రం దాటి తిరిగి రాగల వీరుణ్ణి మాకు చూపించు”.

జాంబవంతుడు : ఆంజనేయా ! నీవు రామ, సుగ్రీవులంతటి బలం కలవాడవు. నీవు చిన్నప్పుడే 300 యోజనాల దూరం ఎగిరి సూర్యుడిని చేరిన వాడవు. మన వానరులంతా దిగులుగా ఉన్నారు. నీవు సముద్రం దాటి తప్పక తిరిగి రాగలవు. వెళ్ళిరా ! నాయనా !

హనుమంతుడు : తాతా ! నీవు చెప్పినది నిజము. నేను గరుడునికి అనేక వేల పర్యాయాలు ప్రదక్షిణం చేయగలను. నేను సీతమ్మను చూడగలను. నేను వాయువుతో సమానుడిని. 10 వేల యోజనాలు దూరం వెళ్ళి రాగలను.

అంగదుడు : భేష్ ! ఆంజనేయా! నీవే మా విచారాన్ని తీర్చగలవు. నీవు సముద్రం దాటి వెళ్ళి సీతమ్మ జాడ తెలిసికొనిరా.

హనుమంతుడు : వానరులారా ! నన్ను దీవించండి.

జాంబవంతుడు : మంచిది నాయనా ! నీవు తప్పక కార్యం సాధిస్తావు. నీకు నా దీవెనలు. నాయనా వెంటనే బయలు దేరు.

హనుమంతుడు : మీరు ధైర్యంగా ఉండండి. నేను తప్పక కార్యం సాధించి వస్తా. మిత్రులారా ! సెలవు.
(లేదా)
మీ పాఠంలో హనుమంతుని శక్తి యుక్తులను వర్ణించిన కవిని ప్రశంసిస్తూ, అతని రచనలు చదవమని సలహా ఇస్తూ, మిత్రునికి ఒక లేఖ రాయండి.
జవాబు:

లేఖ

విశాఖపట్టణం,
x x x x x

 

మిత్రుడు ప్రసాదు,

మిత్రమా ! నీవు మన పదవ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలో 8వ పాఠం ‘సముద్రలంఘనం’ చదివావని అనుకుంటున్నాను. ఈ పాఠం ‘అయ్యలరాజు రామభద్రుడు’ అనే మహాకవి రచించిన “రామాభ్యుదయము” అనే గ్రంథంలోనిది. రామాభ్యుదయంలోని కథ, సీతారామ కథయే. మన పాఠంలో హనుమంతుడు సముద్రం దాటిన ఘట్టమును కవి “అద్భుతంగా వర్ణించాడు.

రామభద్రుడు సాహితీసమరాంగణ సార్వభౌముడైన శ్రీకృష్ణదేవరాయల అష్టదిగ్గజ కవులలో ఒకడు. రామాయణము ఒక తియ్యని కావ్యము. ఈ రామాభ్యుదయంలో కవి హనుమంతుని శక్తిని, పరాక్రమాన్ని గొప్పగా వర్ణించాడు. ఈ కవి ‘సకల కథాసార సంగ్రహం’ అనే మరో గ్రంథం కూడా రచించాడట. నేను. ఈ రోజే “రామాభ్యుదయం” కావ్యం కొన్నాను. నీవు కూడా రామభద్రుని రచనలు తప్పక చదువు. ఆ కవిని గూర్చి, నీ అభిప్రాయం నాకు రాయి. ఉంటా.

ఇట్లు,
నీ మిత్రుడు,
పి. రఘునాథ్ బాబు,
మునిసిపల్ ఉన్నత పాఠశాల.

చిరునామా :
యస్. ప్రసాదు,
S/O. యస్. రమణారావుగారు,
ఇంటి నెం. 2-6-15, గాంధీపురం, కాకినాడ,
తూ||గో॥జిల్లా, ఆం.ప్ర.

భాషా కార్యకలాపాలు ప్రాజెక్టు పని

మీ పాఠశాలలో జరిగే తల్లిదండ్రుల సమావేశంలో లేదా మరే ఇతర కార్యక్రమంలోనో హనుమంతుని ఏకపాత్రాభినయాన్ని ప్రదర్శించాలి. ఇందుకోసం కావలసిన సామాగ్రిని తయారుచేయండి.
ఉదా : కిరీటం, గద, తోక మొదలగునవి. కావాల్సిన వాక్యాలను రాయండి, అభ్యాసం చేయండి, ప్రదర్శించండి.
జవాబు:
విద్యార్థికృత్యం

III. భాషాంశాలు

పదజాలం

1. క్రింది వాక్యాలలో గీత గీసిన పదాలకు సమానారక పదాలను ఖాళీలలో రాయండి.

అ) హనుమంతుడు కొండకొమ్మున నిలబడ్డాడు, ఆ …….. న అతడు సూర్యగోళంలా ఉన్నాడు. (కూటాగ్రము)
ఆ) వివరములో సర్పముంది. ఆ ……………….. లో చేయిపెట్టకు. (రంధ్రము)
ఇ) హనుమంతుడెగిరితే ధూళి నభమునకు ఎగిసింది. అది ……………. అంతటా వ్యాపించింది. తర్వాత …………….. లోని సూర్యుని కూడా కమ్మేసింది. (ఉప్పరము, ఆకాశము)

2. కింది ప్రకృతులకు వికృతులు, వికృతులకు ప్రకృతులు రాసి సొంత వాక్యాలలో ప్రయోగించండి.

అ) సముద్రాన్ని వార్ధి అని కూడా అంటారు.
జవాబు:
సముద్రము (ప్ర) – సంద్రము (వి)
సొంతవాక్యాలు:
ఓడలు సంద్రంలో తిరుగుతుంటాయి.

ఆ) దక్షిణ దిశ యముని స్థానం.
జవాబు:
దిశ (ప్ర) – దెస (వి)
సొంతవాక్యాలు:
రాజుగారి కీర్తి దెసలందు వ్యాపించింది.

ఇ) మంచి గొనములు అలవరచుకోండి.
జవాబు:
గుణములు (ప్ర) – గొనములు (వి)
సొంతవాక్యాలు:
మంచి గుణములు కలవారిని అందరు గౌరవిస్తారు.

ఈ) నిముసమైనా వృథా చేయకు.
జవాబు:
నిమిషము(ప్ర) – నిముసము (వి)
సొంతవాక్యాలు:
విద్యార్థులు నిమిషం వృథా కాకుండా చదువుకోవాలి.

ఉ) అగ్గిలో చేయిపెడితే కాలుతుంది.
జవాబు:
అగ్ని (ప్ర) – అగ్గి (వి)
సొంతవాక్యాలు:
అగ్నిలో ఏ వస్తువు వేసినా తగలబడిపోతుంది.

3. కింద ఇచ్చిన పదాలకు వ్యుత్పత్త్యర్థాలను జతచేయండి.

పదంవ్యుత్పత్త్యర్థం
అ) కార్ముకం1. అపారమైన తీరం గలది.
ఆ) అమరుడు2. దనువు అనే స్త్రీ యందు పుట్టినవాళ్ళు
ఇ) ఉదధి3. జూలు కలిగినది.
ఈ) ప్రభంజనం4. కర్మకారునిచే చేయబడినది.
ఉ) దానవులు5. ఉదకము దీని యందు ధరించబడును.
ఊ) కేసరి6. వృక్షశాఖాదులను విరగొట్టేది.
ఋ) ధరాధరం7. మరణము లేనివారు.
ఋ) పారావారం8. ధరను ధరించునది.

జవాబు:

పదంవ్యుత్పత్త్యర్థం
అ) కార్ముకం4. కర్మకారునిచే చేయబడినది.
ఆ) అమరుడు7. మరణము లేనివారు.
ఇ) ఉదధి5. ఉదకము దీని యందు ధరించబడును.
ఈ) ప్రభంజనం6. వృక్షశాఖాదులను విరగొట్టేది.
ఉ) దానవులు2. దనువు అనే స్త్రీ యందు పుట్టినవాళ్ళు
ఊ) కేసరి3. జూలు కలిగినది.
ఋ) ధరాధరం8. ధరను ధరించునది.
ఋ) పారావారం1. అపారమైన తీరం గలది.

వ్యాకరణాంశాలు

సంధులు, సమాసాలు

1. కింది పదాలు విడదీసి సంధి పేరు రాయండి.
అ) హరియపుడు
జవాబు:
హరి + అపుడు . – – (హరి + య్ + అపుడు) – యడాగమం.

ఆ) కూటాగ్రవీధి
జవాబు:
కూట + అగ్రవీధి = (అ + అ = ఆ) – – సవర్ణదీర్ఘ సంధి

ఇ) పురాభిముఖుడు
జవాబు:
పుర + అభిముఖుడు = (అ + అ = ఆ) ‘ – సవర్ణదీర్ఘ సంధి

ఈ) అణగదొక్కి
జవాబు:
అణగన్ + తొక్కి = (‘త’ – ‘ద’ గా మారింది) – సరళాదేశ సంధి

ఉ) వాడుగొట్టె జ. వాడు + కొట్టి = (‘క’ – ‘K’ గా మారింది) – గసడదవాదేశ సంధి

ఊ) నీవుడక్కరివి
జవాబు:
నీవు + టక్కరివి : ‘ట’ – ‘డ’ గా మారింది) – గసడదవాదేశ సంధి

ఋ) వారు వోరు
జవాబు:
వారు + పోరు = (‘ప’ – ‘వ’ గా మారింది) – గసడదవాదేశ సంధి

బ) రారుగదా
జవాబు:
రారు + కదా = (‘క’ – ‘X’ గా మారింది) – గసడదవాదేశ సంధి

AP SSC 10th Class Telugu Solutions Chapter 8 సముద్రలంఘనం

2) పాఠ్యాంశం నుండి షష్ఠీ తత్పురుష సమాసానికి ఉదాహరణలు రాయండి. వాటికి విగ్రహవాక్యాలు రాయండి.
ఉదా : కూటాగ్రము : కూటము యొక్క అగ్రము – షష్ఠీ తత్పురుష సమాసం
జవాబు:

సమాసములువిగ్రహవాక్యముసమాసనామము
1) తరంగ ఘటలుతరంగముల యొక్క ఘటలుషష్ఠీ తత్పురుష సమాసం
2) తమ తండ్రితమ యొక్క తండ్రిషష్ఠీ తత్పురుష సమాసం
3) కూటకోటులుకూటము యొక్క కోటులుషష్ఠీ తత్పురుష సమాసం
4) గాడ్పు కొడుకుగాడ్పు యొక్క కొడుకుషష్ఠీ తత్పురుష సమాసం
5) ధరణీ కటి తటముధరణి యొక్క కటి తటముషష్ఠీ తత్పురుష సమాసం
6) వప్ర పరిఘవప్రమునకు పరిఘషష్ఠీ తత్పురుష సమాసం
7) గాడ్పువేల్పుపట్టిగాడ్పువేల్పునకు పట్టిషష్ఠీ తత్పురుష సమాసం
8) ఏటిజోటి మగడుఏటి జోటి యొక్క మగడుషష్ఠీ తత్పురుష సమాసం
9) శ్రవణ ద్వంద్వంబుశ్రవణముల యొక్క ద్వంద్వముషష్ఠీ తత్పురుష సమాసం
10) కటిసీమకటి యొక్క సీమషష్ఠీ తత్పురుష సమాసం
11) నభీవీథినభస్సు యొక్క వీథిషష్ఠీ తత్పురుష సమాసం
12) పురాభిముఖంబుపురమునకు అభిముఖముషష్ఠీ తత్పురుష సమాసం
13) సురగరుడ దురవలోకముసురగరుడులకు దురవలోకముషష్ఠీ తత్పురుష సమాసం
14) కరువలి వేలుపు కొడుకుకరువలి వేలుపునకు కొడుకుషష్ఠీ తత్పురుష సమాసం
15) పవనజ జంఘపవనజ జంఘషష్ఠీ తత్పురుష సమాసం
16) పవనాశనకోటిపవనాశనుల యొక్క కోటిషష్ఠీ తత్పురుష సమాసం
17) రఘువరేణ్యుడురఘువంశజులలో వరేణ్యుడుషష్ఠీ తత్పురుష సమాసం
18) రఘువరేణ్య క్రోధరసమురఘువరేణ్యుని యొక్క క్రోధరసముషష్ఠీ తత్పురుష సమాసం
19) సేతుబంధముసేతువు యొక్క బంధముషష్ఠీ తత్పురుష సమాసం
20) బలిమందిరముబలి యొక్క మందిరముషష్ఠీ తత్పురుష సమాసం

అలంకారాలు :

శబ్దాలంకారాల్లో వృత్త్యనుప్రాస, అంత్యానుప్రాస లాంటివే మరికొన్ని ఉన్నాయి. వాటిని గురించి తెలుసుకుందాం.
1. ముక్తపదగ్రసం:
కింది పద్యాన్ని పరిశీలించండి. ప్రత్యేకతను గుర్తించండి.
కం. మన వేటికి నూతనమా !
తన మానినిఁ బ్రేమఁ దనకుఁ దక్కితి ననుమా
నను మానక దయ దనరం
దనరంతులు మాని నరసధవు రమ్మనవే.

పై పద్యంలోని ప్రత్యేకతను గమనించారు కదా!

1) పద్యంలో మొదటి పాదం చివర ఉన్న తనమా అనే అక్షరాలు, రెండవపాదం మొదట తిరిగి ప్రయోగింపబడ్డాయి.
2) రెండవ పాదము చివర ఉన్న ననుమా అనే మూడు అక్షరాలు, మూడవ పాదం మొదట తిరిగి ప్రయోగింపబడ్డాయి.
3) మూడవ పాదము చివరన ఉన్న దనరం అనే మూడక్షరాలు, తిరిగి నాల్గవ పాదం మొదట ప్రయోగింపబడ్డాయి.
4) ఈ విధంగా ముందు పాదం చివర విడిచిపెట్టబడ్డ పదాలే, తరువాతి పాదాల మొదట తిరిగివచ్చాయి.

ముక్తపదగ్రస్త అలంకారం:

1) ఒక పద్యపాదంగాని, వాక్యంగాని ఏ పదంతో పూర్తి అవుతుందో, అదే పదంతో తర్వాత పాదం
(లేక)
వాక్యం మొదలవుతుంది. దీన్నే ‘ముక్తపదగ్రస్త అలంకారం’ అంటారు.

2. యమకము :
కింది వాక్యాలు పరిశీలించండి. ప్రత్యేకతను గుర్తించండి.

అ) లేమా ! దనుజుల గెలువఁగలేమా
(లేమ’ అంటే స్త్రీ ; ‘గెలువగలేమా’ అంటే గెలవడానికి మేము ఇక్కడ లేమా (అంటే ఉన్నాం ‘ కదా!) అని భావము.

ఆ) ఆ తోరణం శత్రువులతో రణానికి కారణమైంది.
(‘తోరణం’ అంటే ద్వారానికి కట్టే అలంకారం ; ‘రణం’ అంటే యుద్ధము.

గమనిక :
పై రెండు ఉదాహరణములలోనూ, ఒకే పదం, అర్థభేదంతో ప్రయోగించబడింది. దీనినే ‘యమకాలంకారం’ అంటారు.

యమకము :
(వివరణ) రెండు లేక అంతకంటే ఎక్కువ అక్షరాలు ఉన్న పదములు, తిరిగి తిరిగి అర్థభేదంతో వస్తే అది ‘యమకాలంకారము’.

AP SSC 10th Class Telugu Solutions Chapter 8 సముద్రలంఘనం

3. లాటానుప్రాస: కింది కవితా భాగాలను/ వాక్యాలను చదవండి. ప్రత్యేకతను గమనించండి.

అ) హరి భజియించు హస్తములు హస్తములు.
గమనిక :
పై వాక్యంలో హస్తములు అనే పదము ఒకే ఆద్దంతో వరుసగా రెండుసార్లు వచ్చాయి.

ఇక్కడ హస్తములు అన్న పదం యొక్క అర్థము ఒకటే అయినా, వాటి తాత్పర్యము భేదముంది. అందులో ‘హస్తములు’ అనే మొదటి పదానికి ‘చేతులే’ అని భావము. ‘హస్తములు’ అనే రెండవసారి వచ్చిన దానిని, నిజమైన చేతులు అని భావము.

ఆ) చిత్తశుద్ధితో జేసెడి సేవ సేవ
గమనిక :
ఇక్కడ ఈ వాక్యంలో ‘సేవ’ అనే పదము రెండుసార్లు వచ్చింది. వాటి అర్థాలు సమానమే. కాని తాత్పర్యం వేరుగా ఉంటుంది.

అందులో మొదటి ‘సేవ’ అనే పదానికి, సేవించుట అని భావము. రెండవ ‘సేవ’ అనే పదానికి, ‘నిజమైన సేవ’ అని తాత్పర్యము.

పై రెండు సందర్భాల్లోనూ ఒకే పదం అర్థంలో తేడా లేకున్నా భావంలో తేడా ఉండేటట్లు ప్రయోగించారు. ఈ విధంగా ఒకే పదాన్ని, అర్థం ఒకటే అయినా తాత్పర్యభేదంతో ప్రయోగించడాన్ని ‘లాటానుప్రాసాలంకారం’ అంటారు.

4 నుగాగమ సంధి:
కింది పదాలను విడదీయండి. మార్పును గమనించండి.

అ) చేయునతడు
జవాబు:
చేయు + అతడు

ఆ) వచ్చునప్పుడు
జవాబు:
వచ్చు + అప్పుడు
గమనిక :
చేయు, వచ్చు అనే క్రియలకు చివర ‘ఉత్తు’ ఉంటుంది. అనగా హ్రస్వమైన ‘ఉ’ కారము ఉంది. వీటికి అచ్చు కలిసింది. అతడు, అప్పుడు అనే పదాల మొదట, ‘అ’ అనే అచ్చు ఉంది. ఆ విధంగా క్రియాపదాల చివరన ఉన్న ఉత్తుకు, అచ్చు పరమైతే, అప్పుడు ఆ రెండు పదాలలోనూ లేని ‘స్’ అనే హల్లు, కొత్తగా వస్తుంది. ఆ విధంగా కొత్తగా వచ్చిన ‘స్’ అనే హల్లును, ‘నుగాగమము’ అంటారు. ‘న్’ ఆగమంగా వచ్చింది. అంటే దేనినీ కొట్టివేయకుండా కొత్తగా వచ్చి చేరింది. దీనినే ‘నుగాగమ సంధి’ అంటారు.

నుగాగమ సంధి సూత్రం:
ఉదంత తద్ధర్మార్థ విశేషణానికి, అచ్చు పరమైతే నుగాగమం వస్తుంది. కింది. ఉదాహరణలు విడదీసి, లక్షణాలు సరిచూడండి –

1. పోవునట్లు
జవాబు:
పోవు + అట్లు : ఇక్కడ ‘పోవు’ అనే క్రియ యొక్క చివర ‘ఉత్తు’ ఉంది. దానికి ‘అట్లు’ అన్న దానిలోని ‘అ’ అనే అచ్చు కలిసింది. నుగాగమ సంధి సూత్ర ప్రకారము, ‘పోవు’ అనే ఉదంత తద్ధర్మార్థక విశేషణానికి, అచ్చు పరమై నుగాగమం వచ్చింది.
ఉదా : పోవు + న్ + అట్లు = పోవునట్లు = నుగాగమ సంధి.

2. కలుగునప్పుడు
జవాబు:
కలుగు + అప్పుడు అని విడదీయండి.

ఇక్కడ ‘కలుగు’ అనేది, ఉత్తు చివర కల తద్ధర్మార్థక క్రియా విశేషణము, ఆ ఉదంత తద్ధర్మార్థక విశేషణానికి, “అప్పుడు” అనే శబ్దములోని ‘అ’ అనే అచ్చు పరమయ్యింది. నుగాగమము వచ్చింది.
ఉదా : కలుగు + న్ + అప్పుడు = కలుగునప్పుడు = (నుగాగమ సంధి)

పైన చెప్పిన సందర్భంలోనే గాక, మణికొన్ని స్థలాల్లో సైతమూ ‘సుగాగమం’ వస్తుంది. కింది పదాలను పరిశీలించండి.

అ) తళుకు + గజ్జెలు
1) నుగాగమ సంధి సూత్రము (2) : సమాసాలలో ఉదంతములైన స్త్రీ సమాలకు, పు, ంపులకు, పరుష సరళములు పరములైనప్పుడు నుగాగమం వస్తుంది.
ఉదా : తళుకు + న్ + గజ్జెలు (‘తళుకు’ అనే ఉదంత స్త్రీ సమ శబ్దానికి, సరళము పరమై నుగాగమం)

2) ద్రుతమునకు సరళ స్థిరములు పరములైనప్పుడు, లోప సంశ్లేషలు విభాషనగు.
ఉదా : 1) తళుకు గజ్జెలు (ద్రుత లోపము)
2) తళుకున్దజ్జెలు (సంశ్లేషము)

3) సూత్రము : వర్గయుక్సరళములు పరములైనప్పుడు ఒకానొకచో ద్రుతమునకు పూర్ణబిందువును కనబడుతుంది.
ఉదా : తళుకుంగజ్జెలు (పూర్ణబిందువు)

పుంప్వాదేశ, నుగాగమ సంధులు:
ఆ) ఉన్నతము + గొడుగు
1) పుంప్వాదేశ సంధి సూత్రము : కర్మధారయములలో మువర్ణకమునకు పు, ంపులగు.
ఉదా : ఉన్నతంపు గొడుగు

2) నుగాగమ సంధి సూత్రము (3) : సమాసాలలో ఉదంతాలైన స్త్రీసమాలకు పు, ంపులకు, పరుష సరళాలు పరములైతే నుగాగమం వస్తుంది.
ఉదా : ఉన్నతపు + న్ + గొడుగు

అ) ద్రుతమునకు సరళ స్థిరములు పరములయినప్పుడు, లోప సంశ్లేషలు విభాషనగు. .
ఉదా : ఉన్నతంపు గొడుగు (ద్రుతలోపము)

ఆ) వర్గయుక్సరళములు పరములైనపుడు ఒకానొకచో ద్రుతమునకు పూర్ణబిందువు కనబడుతుంది.
ఉదా : ఉన్నతంపుం గొడుగు (ద్రుతమునకు పూర్ణ బిందువు)

అభ్యాసము : కింది ఉదాహరణలు పరిశీలించి, లక్షణాలు సరిచూడండి

1) సరసపున్దనము = (సరసము + తనము)
సూత్రము : 1) కర్మధారయములందు మువర్ణమునకు పుంపులగు
సరసపు + తనము = పుంప్వాదేశము

నుగాగమ సంధి సూత్రము (4) : ఉదంత స్త్రీ సమములకు, పుంపులకు, అదంత గుణవాచకములకు తనంబు పరమగునపుడు నుగాగమంబగు.
ఉదా : సరసపు + న్ + తనము (పుంపులకు, తనము పరమై, నుగాగమం వచ్చింది)

అ) ద్రుత ప్రకృతికము మీది పరుషములకు సరళములగు.
సరసపు + న్ + దనము (సరళాదేశము) .

ఆ) ద్రుతంబునకు సరళ స్థిరంబులు పరంబులగునపుడు లోప సంశ్లేషలు విభాషణగు
ఉదా : సరసపున్దనము (సంశ్లేషరూపము)

2) తెల్లన్దనము = తెల్ల + తనము
సూత్రము : ఉదంత స్త్రీ సమంబులకు, పుంపులకు, అదంత గుణవాచకంబులకు తనంబు పరమగునపుడు నుగాగమంబగు.
ఉదా : తెల్ల + న్ + తనము (అదంత గుణవాచకమైన ‘తెల్ల’ శబ్దానికి తనము పరమైనందున, నుగాగమం)

అ) ద్రుత ప్రకృతికము మీది పరుషములకు సరళములగు
ఉదా : తెల్ల + న్ + దనము (సరళాదేశము)

ఆ) ద్రుతమునకు సరళ స్థిరములు పరములగునపుడు లోప సంశ్లేషలు విభాషనగు
ఉదా : తెల్లన్దనము (సంశ్లేష రూపము) షష్ఠీ తత్పురుష సమాసాల్లో నుగాగమ సంధి.
నుగాగమ సంధి (5)

AP SSC 10th Class Telugu Solutions Chapter 8 సముద్రలంఘనం

6. కింది పదాలను విడదీసి, పరిశీలించండి.
అ) విధాతృనానతి – (విధాత యొక్క ఆనతి) = విధాతృ + ఆనతి
ఆ) రాజునాజ్ఞ – (రాజు యొక్క ఆజ్ఞ) = రాజు + ఆజ్ఞ
గమనిక :
1) పై సమాస పదాలకు విగ్రహవాక్యాలను పరిశీలిస్తే, అవి షష్ఠీ తత్పురుష సమాసానికి చెందినవని తెలుస్తుంది.
2) పై రెండు ఉదాహరణలలోనూ సమాసాలలోని పూర్వపదాల చివర “ఋకారం”, “ఉత్తు” ఉన్నాయి.
3) షష్టీ సమాసపదాల్లో, ఉకార, ఋకారములకు అచ్చు పరమైతే నుగాగమము వస్తుంది.

నుగాగమ సంధి సూత్రము : షష్ఠీ సమాసము నందు, ఉకార ఋకారములకు అచ్చు పరమైనపుడు నుగాగమంబగు.
అ) విధాతృ + న్ + ఆనతి = విధాతృనానతి
ఆ) రాజు + న్ + ఆజ్ఞ = రాజునాష్ట్ర

పూర్వస్వరం స్థానంలో ‘ఋ’కారం, ఉత్తు ఉన్నాయి. వీటికి అచ్చుపరమైనప్పుడు నుగాగమం వచ్చింది. అంటే – షష్టీ తత్పురుషాల్లో ఉకారానికి, ఋకారానికి అచ్చుపరమైనప్పుడు నుగాగమం వస్తుంది.

అదనపు సమాచారము

సంధులు

1. ఎల్లెడలన్ = ఎల్ల + ఎడలన్ – అకారసంధి
2. ఎగసినట్లు = ఎగసిన + అట్ల – అకారసంధి
3. విప్పినయట్ల = విప్పిన + అట్ల – యడాగమ సంధి
4. కొట్టినయట్ల = కొట్టిన + అట్ల – యడాగమ సంధి
5. ఎగసినయట్ల = ఎగసిన + అట్ల – యడాగమ సంధి
6. మొత్తినయట్ల = మొత్తిన + అట్ల – యడాగమ సంధి
7. బిట్టూది = బిట్టు + ఊది – ఉత్వసంధి
8. గట్టెక్కి = గట్టు + ఎక్కి – ఉత్వసంధి
9. కెళ్లవుల కెల్లన్ = కెళవులకున్ + ఎల్లన్ – ఉకార వికల్ప సంధి
10. పాయవడు = పాయ + పడు – గసడదవాదేశ సంధి
11. అక్కొండ = ఆ + కొండ – త్రికసంధి
12. అచ్చెల్వ = ఆ + చెల్వ – త్రికసంధి
13. అయ్యుదధి = ఆ + ఉదధి – యడాగమ, త్రిక సంధులు
14. సూత్రపట్టు = సూత్రము + పట్టు – పడ్వాది మువర్ణలోప సంధి
15. దవాగ్ని = దవ + అగ్ని – సవర్ణదీర్ఘ సంధి
16. పురాభిముఖంబు = పుర + అభిముఖంబు – సవర్ణదీర్ఘ సంధి
17. పవనాశన కోటి = పవన + ఆశన కోటి – సవర్ణదీర్ఘ సంధి
18. బంధాను రూపంబు = బంధ + అనురూపంబు – సవర్ణదీర్ఘ సంధి
19. కూటాగ్రవీథి = కూట + అగ్రవీథి – సవర్ణదీర్ఘ సంధి
20. మహోపలములు = మహా + ఉపలములు – గుణసంధి
21. నభీవీథి = నభః + వీథి – విసర్గ సంధి
22. యశోవసనంబు = యశః + వసనంబు – విసర్గ సంధి
23. దిక్కుఁజూచి = దిక్కున్ + చూచి – సరళాదేశ సంధి
24. అరుగఁజూచి = అరుగన్ + చూచి – సరళాదేశ సంధి
25. అడంగఁ దొక్కి = అడంగన్ + త్రొక్కి – సరళాదేశ సంధి

సమాసాలు

సమాస పదంవిగ్రహవాక్యంసమాసం పేరు
1. మహోపలములుగొప్పవైన ఉపలములువిశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
2. బలుగానలుబలము గల కాననములువిశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
3. దవాగ్నిదవము అనే అగ్ని తనసంభావన పూర్వపద కర్మధారయ సమాసం
4. మహావివరముగొప్పదైన వివరమువిశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
5. క్రోధరసముక్రోధము అనే పేరు గల రసముసంభావన పూర్వపద కర్మధారయ సమాసం
6. నల్లని వల్వనల్లనైన వలువవిశేషణ పూర్వపద కర్మధారయ సమాసం

ప్రకృతి – వికృతి

భిదురకము – పిడుగు
జంఘ – జంగ
నిమిషము – నిముసము
గుహ – గొబ
ఉపరి – ఉప్పరము
కార్యము – కర్జము
అగ్ని – అగ్గి
పుత్రుడు – బొట్టె
ఘట్టము – గట్టు
వీథి – వీది
యశము – అసము
రూపము – రూపు
బంధము – బందము
ఆశ – ఆస
త్వర – తొర
శరము – సరుడు
కుల్య – కాలువ
సముద్రము – సంద్రము
దిశ – దెస
గుణములు – గొనములు

పర్యాయపదాలు

1. తోక : పుచ్చము, లాంగూలము, వాలము
2. అంభోధి : సముద్రము, ఉదధి, పారావారము, ఏటిజోటి మగడు, అంబుధి, కడలి
3. కార్ముకం : విల్లు, ధనుస్సు, శరాసనం, సింగిణి
4. నింగి : ఆకాశం, మిన్ను, గగనము, నభము, ఉప్పరము
5. రవి : సూర్యుడు, దివాకరుడు, దినకరుడు, ప్రభాకరుడు
6. వల్వ : వస్త్రము, వలువ, పటము, వసనము
7. వివరం : రంధ్రము, బిలము, కలుగు
8. మందిరము : భవనము, గృహము, ఇల్లు, సదనము, ఆలయము
9. తేరు : రథము, అరదము, స్యందనము, శతాంగము
10. అమరులు : దేవతలు, సురలు, నిర్దరులు, గీర్వాణులు, త్రిదశులు, వేల్పులు
11. పవనజుడు : హనుమంతుడు, ఆంజనేయుడు, గాడ్పుపట్టి, కరువలి వేలుపు కొడుకు, గాడు వేల్పు పట్టి, హనుమ
12. హరి : వానరము, కోతి, మల్లు, కపి, మర్కటము
13. పవనము – : వాయువు, గాడ్పు, గాలి, అనిలము, ప్రభంజనము, సమీరము, కరువలి
14. శ్రవణము : చెవి, కర్ణము, శ్రుతి, శ్రోత్రము
15. తండ్రి : జనకుడు, అయ్య, నాయన, నాన్న
16. కొండ : పర్వతము, గిరి, నగము, గట్టు, అద్రి
17. నభము . : ఆకాశము, మిన్ను, గగనము.

వ్యుత్వత్వరాలు

1. ధరాధరము : భూమిని ధరించునది – పర్వతము
2. తరంగము : దరిచేరినది – అల
3. కపి : చలించేది – కోతి
4. గాడ్పుకొడుకు : వాయువు యొక్క కొడుకు – హనుమంతుడు
5. పారావారము : అపారమైన తీరము గలది – సముద్రము
6. దానవులు : దనువు అనెడి స్త్రీ వల్ల పుట్టినవారు – రాక్షసులు
7. గాడ్పు వేల్పు పట్టి : వాయుదేవుని కొడుకు – హనుమంతుడు
8. ఏటిజోటి మగడు : నదీ కాంతకు భర్త – సముద్రుడు
9. అంబుధి : ఉదకములను ధరించునది – సముద్రము
10. హరి : 1. చీకటిని హరించేవాడు – సూర్యుడు
2. భక్తుల హృదయాలను ఆకర్షించేవాడు – విష్ణుమూర్తి
3. గజాదులను హరించునది – సింహము
11. కార్ముకము : యుద్ధ కర్మ కొఱకు సమర్థమైనది – విల్లు
12. కరువలి వేల్పు కొడుకు : గాలిదేవుని పుత్రుడు – హనుమంతుడు
13. పవనజుడు : వాయువునకు పుట్టినవాడు – హనుమంతుడు
14. పవనాశనులు : గాలి ఆహారముగా కలవి – సర్పములు
15. ఉదధి : ఉదకములను ధరించునది – సముద్రము
16. ప్రభంజనుడు : వృక్షశాఖాదులను విరుగగొట్టేవాడు – వాయువు
17. కరి : కరము (తొండము) కలది – ఏనుగు
18. ఝరి : కాలక్రమమున స్వల్పమైపోవునది – ప్రవాహము

నానార్థాలు

1. వీధి : త్రోవ, వాడ, పంక్తి
2. హరి : విష్ణువు, సింహము, కిరణము, కోతి, పాము, గుఱ్ఱము
3. నిమిషము : టెప్పపాటు, తెప్ప వేసేటంత కాలము, పూవులు ముడుచుకొనడం
4. శరము : బాణము, నీరు, రెల్లు –
5. పురము : పట్టణము, ఇల్లు, శరీరము, మరణము
6. రవి : సూర్యుడు, జీవుడు, కొండ, జిల్లేడు చెట్టు
7. రసము : పాదరసము, శృంగారాది రసములు, విషము, బంగారు
8. బలి : గంధకము, ఒక చక్రవర్తి, కప్పము

కవి పరిచయం

పాఠ్యభాగం : ‘సముద్రలంఘనం’

దేనినుండి గ్రహింపబడింది : “రామాభ్యుదయము” ఆరవ ఆశ్వాసం నుండి.

కవి : అయ్యలరాజు రామభద్రుడు.

కాలం : రామభద్రుడు 16వ శతాబ్దివాడు.

ఏ ప్రాంతము వాడు : కడపజిల్లా ఒంటిమిట్ట ప్రాంతంవాడు.

ఎవరికి అంకితం : అయ్యలరాజు రామభద్రకవి, తన ‘రామాభ్యుదయ కావ్యాన్ని అళియ రామరాయల మేనల్లుడైన గొబ్బూరి నరసరాజుకు అంకితం ఇచ్చాడు.

అష్టదిగ్గజకవి : రామభద్రుడు శ్రీకృష్ణదేవరాయల ఆస్దానంలోని అష్టదిగ్గజ కవులలో ఒకడు.

ఇతర రచన : ఈ కవి మరొక రచన, “సకల కథాసార సంగ్రహం”

రామాభ్యుదయ కావ్య విశిష్టత : రామాభ్యుదయ కావ్యం, ప్రబంధరీతిలో ఎనిమిది ఆశ్వాసాల కావ్యం. ప్రతి పద్యంలో కల్పనా చాతుర్యం కనిపిస్తుంది. ఈ కావ్యంలో శ్రీరాముడి చరిత్ర ఉంది. రామాయణంలో ‘ఉత్తర కాండ’ను మాత్రం ఈ కవి వ్రాయలేదు.

బిరుదులు : ఈ కవికి ‘చతురసాహిత్య లక్షణ చక్రవర్తి’, “ప్రతివాది మదగజపంచానన” అనే బిరుదులు ఉన్నాయి.

ఆ కవితా సామర్థ్యం : రామభద్రుని కవితా సామర్థ్యం అంతా చమత్కారంతో కూడినదని, ఆయన వర్ణనల ద్వారా వెల్లడి అవుతుంది.

పద్యాలు – ప్రతిపదార్థాలు – భావాలు

అవగాహన – ప్రతిస్పందన

పద్యం – 1

సీ|| అదుగు లొత్తినపట్లఁ బిదుగు మొత్తినయట్ల
బహుమహెపలములు పగిలి పడగం
దోఁక త్రిప్పినపట్ల మూఁక విప్పినయట్ల
బలుగాన లిలఁ గూలి బయలు గాఁగఁ
గేలం దట్టినపట్లఁ గోల గొట్టినయట్ల
గరికేసరాదులు గలంగి పఱవ
రంతు చూపినపట్ల వంతు మోపినయట్ల
గుహలు ప్రతిధ్వనుల్ గ్రుమ్మరింపఁ

తే.|| గంపితధరాధరాధిత్యకారరీత
రంగఘట లెల్లెడల నుప్పరంబు లెగసి
పడి తడిపి కార్యదాహవిభ్రాంతకపుల
యుల్లములతో దవాగ్నులంజల్లజేయ,
ప్రతిపదార్థం :
అడుగులు + ఒత్తినపట్లన్ = (హనుమంతుడు సముద్ర లంఘనం చేయడానికి) అడుగులు, నొక్కి పెట్టి వేసిన చోట
పిడుగు మొత్తినయట్ల = పిడుగు మీద పడిన విధంగా
బహుమహోపలములు; బహు = అనేకములైన
మహా + ఉపలములు = పెద్ద పెద్ద రాళ్ళు
పగిలి పడగన్ = ముక్కలై పడుచుండగా
తోక త్రిప్పినపట్లన్ = తన తోకను (హనుమంతుడు)
మూక విప్పినయట్లన్ = చెదరగొట్టినట్లుగా
బలుకానలు – పెద్ద పెద్ద అడవులు
ఇలఁగూలి (ఇలన్ + కూలి) = నేలపై కూలి
బయలుగాగన్ (బయలు + కాగన్) = ఆ ప్రదేశములు చెట్లు చేమలు లేని శూన్య ప్రదేశములు కాగా
కేలన్ = తన చేతితో
తట్టినపట్లన్ = తాకిన స్థలములలో
కోలన్ = కఱ్ఱతో
కొట్టినయట్లన్ – కొట్టిన విధంగా
కరి కేసరాదులు = ఏనుగులు, సింహాలు మొదలయిన
క్రూర జంతువులు

గమనిక :
‘కరి, కాసరారులు’ అని ఇక్కడ ఉండాలి. (శబ్ద రత్నాకరంలో ఇలానే ఉంది. (కాసర + అరులు) అనగా ఎనుబోతులకు శత్రువులయిన సింహాలు అని భావము. ‘కేసర’ + ఆదులు అన్న చోట, కేసర అంటే సింహము కాదు కేసరి అంటేనే సింహము)

కలగి, పఱవన్ = కలతపడి, పరుగెత్తి పోగా
రంతు చూపిన పట్లన్ = (హనుమ) సింహనాదము చేసిన చోట

గమనిక :
‘రంతు చూపుట’ అంటే సింహనాదము చేయడం అని సూర్యరామాంధ్ర నిఘంటువు).

వంతుమోపినయట్లన్ = పోటీ పడినట్లుగా
గుహలు = కొండ గుహలు
ప్రతిధ్వ నుల్ = ప్రతిధ్వనులను
క్రుమ్మరింపన్ = పోతపోయగా
కంపిత ధరాధరాధిత్యకాఝరీ తరంగ ఘటలు; కంపిత = కదల్పబడిన (హనుమంతుని పాదాల విన్యాసానికి కంపించిన)
ధరాధర = పర్వతము యొక్క
అధిత్యకా = ఎత్తైన నేలమీది
ఝరీ = సెలయేళ్ళ
యందలి = కెరటముల యొక్క
ఘటలు = సమూహములు;
ఎల్లెడలన్ (ఎల్ల + ఎడలన్) = అన్ని చోటులందును
ఉప్పరంబులు = ఆకాశమంత ఎత్తుకు
ఎగసిపడి = లేచిపడి
తడిపి = (ఆ ప్రదేశాలను) తడిపి
కార్యదాహ విభ్రాంత కపుల; కార్య దాహ = సీతాన్వేషణ కార్యము అనే అగ్నితో
విభ్రాంత = క్షోభపడిన
కపుల = వానరుల యొక్క
ఉల్లములతోన్ = మనస్సులతో పాటు
దవాగ్నులన్ = అక్కడనున్న దావాగ్నులను సైతము
చల్లఁజేయన్ (చల్లన్ + చేయన్) = చల్లపరచగా (చల్లార్చాయి)

భావం :
సముద్రాన్ని దాటడానికి సిద్ధమైన హనుమంతుడు, అడుగులు నొక్కిపెట్టి వేస్తున్నప్పుడు, పిడుగులు పడ్డట్లుగా పెద్ద పెద్ద రాళ్ళు పగిలి పడిపోయాయి. వేగంగా తన తోకను తిప్పినప్పుడు వచ్చిన గాలికి, పెద్ద పెద్ద అడవులు సైతం చెదరగొట్టబడిన విధంగా చెట్లు లేని శూన్యప్రదేశములుగా ఏర్పడ్డాయి. చేతితో చరిస్తే కల్టుతో కొట్టినట్లు, ఏనుగులు, సింహాలు మొదలయిన క్రూర జంతువులు కలత చెంది, పరుగులు పెట్టాయి. హనుమంతుడు సింహనాదం చేసినప్పుడు, పోటీపడుతూ గుహలు ప్రతిధ్వనించాయి. అక్కడ కొండల కంపనాల వల్ల, కొండ నేలలపై ఉన్న సెలయేళ్ళ కెరటాలు, ఆకాశానికి అంటేటట్లు ఎగసిపడ్డాయి. అవి దావాగ్నులతోపాటు, రామకార్యము పూర్తి చేయాలని తపించిపోతున్న వానరుల మనస్సులలోని మంటలను సైతమూ చల్లార్చాయి.

AP SSC 10th Class Telugu Solutions Chapter 8 సముద్రలంఘనం

పద్యం – 2

తే॥గీ॥ | ఒడలు వడసిన తమతండ్రి వడువు దోప
రయమునకుఁ గూటకోటులన్నియుఁ జలింపఁ
బెరింగి గిరి గాడ్పుకొడు కెక్కి తిరిగి తిరిగి
యొక్క చో నిల్చి దక్షిణదిక్కుల జూచి.
ప్రతిపదార్థం :
ఒడలు వడసిన (ఒడలు + పడసిన) = శరీరమును ధరించిన
తన తండ్రి = తన తండ్రియైన వాయుదేవుని
యొక్క
వడువు = విధము
తోపన్ = కన్పడేటట్లుగా
రయమునకున్ = వేగానికి
కూటకోటులు = పర్వత శిఖరాలు
అన్నియున్ – అన్నియునూ
చలింపన్ = కదలగా
పెరిగి = పెద్ద రూపంతో పెరిగి
గిరిన్ = పర్వతమును
గాడ్పుకొడుకు = వాయుదేవుని కుమారుడైన హనుమంతుడు
ఎక్కి = ఎక్కి
తిరిగి తిరిగి = అటూ ఇటూ దానిపై తిరిగి
ఒక్కచోస్ = ఒకచోట
నిల్చి = నిలబడి
దక్షిణ దిక్కున్ = దక్షిణ దిశను
చూచి = చూసి (చూశాడు)

భావం :
హనుమంతుడు శరీరాన్ని ధరించిన వాయుదేవుడా అనేటట్లు పర్వత శిఖరాలు అన్నీ కదలిపోయేటట్లు పెరిగి పర్వతము పైకెక్కి తిరిగి తిరిగి, ఒకచోట నిలబడి దక్షిణ దిక్కు వైపుకు చూశాడు.
అలంకారం : ఉత్ప్రేక్షాలంకారం

పద్యం -3

క॥ కటకట! ధరణీకటితట
పట మనిపించుకొనఁ గన్న పారావారం
బిటు వచ్చి కుటిలదానవ
పుటభేదనవప్రపరిఖపో యనఁ దగెఁగా
ప్రతిపదార్థం :
కటకట = అయ్యయ్యో !
ధరణీకటితట పటము; ధరణీ = భూదేవి యొక్క
కటితట = నడుమున (కట్టిన)
పటము = వస్త్రము
అనిపించుకొనన్ = అని చెప్పుకొనేటట్లు
కన్న = కనిపించేటటువంటి
పారావారంబు = సముద్రము
ఇటువచ్చి = ఇక్కడకు వచ్చి (ఈ లంకకు వచ్చి)
కుటిల = మోసగాడైన
దానవ = రాక్షస రాజైన రావణుని యొక్క
పుటభేదనవ = పట్టణమైన లంకకు
వప్ర పరిఖ పో = కోటగోడ చుట్టునూ ఉన్న, అగడ్త ఏమో
అనన్ = అనేటట్లుగా
తగెఁగా = తగినట్లు ఉన్నది కదా !

భావం:
అయ్యోయ్యో ! భూదేవి నడుమునకు కట్టిన వస్త్రమువలె శోభిల్లే సముద్రము, ఈ దిక్కునకు వచ్చి, ఈ దుష్ట రాక్షసుల పట్టణమైన లంకకు కందకము (అగడ్త) అనేటట్లు అమరి ఉన్నది కదా !

పద్యం -4

ఆ॥ గాడ్పు వేల్పుపట్టి గట్టెక్కి యుక్కునఁ
జూచె సూటి నేటి జోటిమగని
భావిసేతు వచ్చుపడ లంకకడకును
సూత్రపట్టుమాడ్కి జూద్కు వెలుఁగు
ప్రతిపదార్ధం :
గాడ్పు, వేల్పు పట్టి = వాయుదేవుని కుమారుడైన హనుమంతుడు
గట్టెక్కి (గట్టు + ఎక్కి) = పర్వతమును ఎక్కి (మహేంద్రగిరిని ఎక్కి)
ఏటిజోటి మగనిస్; ఏటిజోటి = నదీ కాంతలకు (నదులు అనే స్త్రీలకు)
మగనిన్ = భర్తయైన సముద్రుని
భావి సేతువు = రాబోయే కాలంలో శ్రీరామునిచే కట్టబడే వారధి
అచ్చుపడన్ = ఏర్పడడానికి
లంకకడకును = లంకా నగరము వఱకూ
సూత్రపట్టుమాడ్కిన్ = తాడు (దారము) పట్టుకొన్న విధంగా
చూడ్కి = తన కంటి చూపు
వెలుగన్ = ప్రకాశింపగా
సూటిన్ = నిటారుగా (నిదానముగా)
ఉక్కునన్ = స్థిరముగా
చూచెన్ = చూచాడు

భావం :
వాయుదేవుని ముద్దుల కుమారుడైన హనుమంతుడు, కొండను ఎక్కి రాబోయే కాలంలో శ్రీరాముడు కట్టబోయే సేతువును ఏర్పాటు చేయడానికి కొలత తీసుకోడానికి పట్టుకొన్న దారమా అన్నట్లుగా, సూటిగా సముద్రుని చూచాడు.
అలంకారము : ఉత్ప్రేక్షాలంకారము

AP SSC 10th Class Telugu Solutions Chapter 8 సముద్రలంఘనం

పద్యం – 5 : కంఠస్థ పద్యం

మ|| | తన చూ పంబుధిమీఁదఁ జాచి శ్రవణద్వంద్వంబు రిక్కించి వం
చిన చంచద్భుజముల్ సముత్కటకటినీ మంబులన్ బూన్చి తోఁ
క నబోవీథికిఁ బెంచి యంపు లిజీయంగాఁ బెట్టి చిట్టూది గ్ర
క్కున నర్కొంద యడంగండ్రొక్కి పయికిం గుప్పించి లంఘించుచోవ్
ప్రతిపదార్థం :
తన చూపు = తన కంటి చూపును
అంబుధిమీదన్ = సముద్రంపై
చాచి = బాగా ప్రసరింపజేసి
శ్రవణ ద్వంద్వంబున్ = చెవుల జంటను (తన చెవులు రెండింటినీ)
రిక్కించి = నిక్కించి (నిక్కపొడిచేటట్లు చేసి)
వంచిన = కొంచెము వంచిన
చంచద్భుజముల్ (చంచత్ + భుజముల్) = కదలుతున్న చేతులను
సముత్కటకటిసీమంబులన్; సముత్కటి = మిక్కిలి విశాలమైన
కటీ సీమంబులన్ = మొలపై భాగములందు
పూన్చి = గట్టిగా ఉంచి
తోకన్ = తన తోకను
నభోవీథికిన్ = ఆకాశములోనికి
పెంచి = ఎత్తుగా పెంచి
అంఘ్రులు = పాదములు
ఇటీయంగాఁ బెట్టి (ఇటీయంగాన్ + పెట్టి) = బిగించి పెట్టి
బిట్టూది (బిట్టు + ఊది) = గట్టిగా గాలి పీల్చి
గ్రక్కునన్ = వెంటనే
ఆ క్కొండ (ఆ + కొండ) = ఆ మహేంద్ర పర్వతము
అడంగన్ = అణగి పోయేటట్లు
త్రొక్కి = కాళ్ళతో తొక్కిపెట్టి
పయికిన్ = ఆకాశములోనికి
కుప్పించి = ఎగిరి
లంఘించుచోన్ = దూకేటప్పుడు

భావం:
హనుమంతుడు తన కంటి చూపును సముద్రము వైపు ప్రసరింపజేశాడు. రెండు చెవులు రిక్కించి, వంగి కదలుతున్న చేతులను తన విశాలమైన నడుముపై ఆనించాడు, తోకను ఆకాశవీధికి పెంచి, తన రెండు పాదాలు దగ్గరగా పెట్టి, గట్టిగా గాలి పీల్చాడు. తాను నిలబడిన కొండను ఒక్కసారిగా అణగదొక్కి పైకి ఎగిరి దూకాడు.

పద్యం -6

కం॥ గిరి గ్రుంగంద్రొక్కి చెంగున
హరి నింగికి దాంటుగొనిన హరిహరి యవుడా
హరి యెగసినట్లు దోంచం
గిరి యెగానయట్లు తోఁచెం గౌళవుల కెల్లన్.
ప్రతిపదార్థం :
గిరిన్ = పర్వతమును (మహేంద్ర పర్వతాన్ని)
క్రుంగన్ = భూమిలోకి దిగిపోయేటట్లు
త్రొక్కి = త్రొక్కి
చెంగునన్ = ‘చెంగ్’ మనే ధ్వనితో
హరి = వానరుడయిన హనుమంతుడు
నింగికిన్ = ఆకాశములోకి
దాటుగొనినన్ = దూకగా
హరిహరి = ఆశ్చర్యము, ఆశ్చర్యము
అపుడు = ఆవేళ (ఆ సమయములో)
ఆ హరి = ఆ వానరుడైన ఆంజనేయుడు
ఎగసినయట్లు (ఎగసిన + అట్లు) = పైకి ఎగిరినట్లు
తోచక = అనిపించక
కెళవులకున్ + ఎల్లన్ = దూరం నుండి చూసేవారు అందఱికీ
గిరి = పర్వతము
ఎగసినయట్లు (ఎగసిన + అట్లు) = ఎగిరినట్లుగా
తోఁచెన్ = అనిపించింది (హనుమంతుడు పర్వతము అంత పరిమాణంలో ఉన్నాడని భావము)

భావం :
ఆంజనేయుడు ఆ విధంగా కొండను అణగదొక్కి, ఆకాశం పైకి ఎగిరినపుడు, హనుమంతుడు ఎగిరినట్లు కాకుండా, ఒక పర్వతము ఎగిరినట్లుగా, దూరం నుండి చూసిన వారికి అనిపించింది.

పద్యం -7

కం॥ గిరికారు కనిర్గమై
హరిశర మపు దసురవరపురాభిముఖంబై
సురగరుదదురవలోక
త్వరతో అనె నొకమహారవం బుదయింపన్
ప్రతిపదార్థం :
గిరికార్ముక నిర్గతమై; గిరీకార్ముక = పర్వతము అనే ధనుస్సు నుండి
నిర్గతము + ఐ = వెలువడినదై
హరిశరము = వానరుడు అనే బాణం
అపుడు = అప్పుడు
అసురవరపురాభిముఖంబై; అసుర వర = రాక్షసరాజయిన రావణాసురుని
పుర = లంకా పట్టణానికి
అభిముఖంబు + ఐ = ఎదురై
సురగరుడదురవలోక త్వరతోన్; సుర = దేవతలకును
గరుడ = గరుడ పక్షులకును
దురవలోక = చూడశక్యముకాని
త్వరతోన్ = వేగముతో
ఒక మహారవంబు = ఒక గొప్ప ధ్వని
ఉదయింపన్ = పుట్టే విధంగా
చనెన్ = వెళ్ళింది

భావం :
కొండ అనే విల్లు నుండి వెలువడిన హనుమంతుడు అనే బాణము, గొప్ప ధ్వనితో రాక్షస రాజైన రావణుని పట్టణమైన లంకానగరం వైపు వెళ్ళింది. అది దేవతలకు కాని, గరుడులకు కాని చూపునకు అందనంత వేగంతో దూసుకుపోయింది.

గమనిక :
పై పద్యంలో శ్లేషాలంకారము ఉంది. దీనికి మరో అర్థం, ఇలా చెప్పవచ్చు. గమనించండి.

AP SSC 10th Class Telugu Solutions Chapter 8 సముద్రలంఘనం

పద్యం – 8

కం|| వాలంబుఁ దానుఁ గరువలి
వేలుపుల గొడు కరుగం జూచి విపరీతగతిన్
దోల దొరఁకొనెనొ రవి యిటు
దేలం టెనుగాడితోదితే రని రమరుల్
ప్రతిపదార్థం :
కరువలివేలుపుఁ గొడుకు= వాయుదేవుని కుమారుడైన హనుమంతుడు
వాలంబున్ = తోకయునూ
తానున్ = తానునూ
అరుగఁజూచి; (అరుగన్ + చూచి) = వెడుతుండగా చూసి
అమరుల్ = దేవతలు
విపరీతగతిన్ = గొప్ప వేగముతో
రవి = సూర్యుడు
ఇటు = ఈ వైపు
తేలన్ = గాలిలో తేలేటట్లు
పెనుగాడితోడి; (పెను + కాడి తోడి) = పెద్దకాడితో ఉన్న (పెద్ద నాగలితో ఉన్న)
తేరు = రథమును
తోలన్ = తోలడానికి
దొరకొనెన్ = పూనుకున్నాడేమో
అనిరి = అన్నారు

భావం :
వాయుదేవుని కుమారుడైన హనుమంతుడు, తోకతో ఎగరడం చూసిన దేవతలు, “సూర్యుడు చాలా వేగంతో పెద్దకాడి ఉన్న రథాన్ని నడిపిస్తూ, అలా వచ్చాడేమో” అనుకున్నారు.

పద్యం – 9

కం|| పవనణజంఘాసంభవ
పవనము వడింగదలిఁ బాయవడ నదంచి మహా
వివరమునకుం జారంబడి
పవనాశనకోటి నాశపణచి గమించెన్
ప్రతిపదార్థం :
పవనజ జంఘాసంభవ పవనము; పవనజ = వాయుపుత్రుడైన హనుమంతుని యొక్క
జంఘా = కాలి పిక్కల నుండి
సంభవ = పుట్టిన
పవనము = గాలి
వడిన్ = వేగంగా
కడలిన్ = సముద్రమును
పాయవడన్ (పాయ + పడన్) = చీలిపోయేటట్లు
అడచి = అణచి
మహా వివరమునకున్ = గొప్ప రంధ్రములోకి (గొప్ప కన్నములోకి)
చొరంబడి = ప్రవేశించి
పవనాశన కోటిన్ (పవన + అశన + కోటిన్) = గాలిని ఆహారంగా భుజించే పాముల గుంపును
ఆశపఱచి = అశపెట్టి (తమకు కావలసిన ఆహారము తమ దగ్గరకు వస్తోంది అన్న ఆశను కల్పించి)
గమించెన్ = వెళ్ళిపోయింది

భావం :
వాయుసుతుడైన హనుమంతుని కాలి పిక్కల నుండి పుట్టిన గాలి, వేగంగా సముద్రాన్ని చీలుస్తూ, లోతుకు ప్రవేశించింది. ఆ గాలి సముద్రపు అడుగున ఉన్న పాతాళంలో నివసిస్తూ గాలియే ఆహారం గల పాములకు, ఆహారం వచ్చిందేమో అనే ఆశను కలిగించి వెళ్ళింది. (హనుమంతుడు ఎగిరే ప్రదేశమంతా క్రింద సముద్రములో చీలి పాతాళలోకము కనబడుతోందని భావము.)

పద్యం – 10

సీ| | రఘువరేణ్యక్రోధరసము లంకకు ముట్టం
గ్రోవ్వారు కాలువ ద్రవ్వె ననంగ
నాగామి సేతుబంధానురూపంబుగాఁ
జేయు గుణావర్తమో యనంగ
నవయతో వసనంబు లవని కర్పించి య
చ్చెల్వ నల్లనివల్వ చించె ననఁగఁ
దనుఁ జూద శేషుందు తలుపులు దెఱచిన
బలిమందిరంబు వాకిలియొ యనంగ

తే॥॥ నొక నిమిష మాత్ర మప్పుదయ్యుదధి నడుమ
నుకువది తోంచె నదరంటం చి పఱచు
నలఘుణంఘా ప్రభంజనంబులఁ దనర్చి
యతండు వ్రాలెఁ ద్రికూటకూటాగ్రవీథి.
ప్రతిపదార్థం :
రఘువరేణ్యక్రోధరసము; రఘువరేణ్య = రఘువంశ శ్రేష్ఠుడైన శ్రీరాముని యొక్క
క్రోధరసము = కోపము అనే నీరు
లంకకున్ = లంకా పట్టణానికి
ముట్టన్ = చేరడానికై
క్రొవ్వారు = అందమైన
కాలువన్ = కాలువను
త్రవ్వెననగన్ (త్రవ్వెన్ + అనగన్) = త్రవ్వినారా అనేటట్లు
ఆగామి సేతుబంధాను రూపంబుగాన్; ఆగామి = రాబోయే కాలంలో కట్టబోయే
సేతుబంధ = వారధి నిర్మాణానికి
అనురూపంబుగాన్ = తగిన విధంగా
చేయు = చేసే
గుణావర్తమోయనంగన్ (గుణావర్తమో + అనంగన్) = పునాది గొయ్యియా అన్నట్లుగానూ
నవయశోవసనంబులన్; నవయశః = క్రొత్త కీర్తులు అనే
వసనంబులన్ = వస్త్రములను
అవనికిన్ = భూదేవికి
అర్పించి = ఇచ్చి
అచ్చెల్వ (ఆ + చెల్వ) = ఆ భూదేవి యొక్క
నల్లని వల్ప = నల్లని వస్త్రాలను (చీరను)
చించెననగన్ | = చింపివేసినాడా అనేటట్లునూ
తనున్ = తనను
చూడన్ = చూడ్డానికి
శేషుండు = ఆదిశేషుడు
తలుపులు దెఱచిన; (తలుపులు + తెఱచిన) = తలుపులు తెరచిన
బలిమందిరంబు = బలిచక్రవర్తి ఇంటి
వాకిలియొ యనంగన్ (వాకిలి + 1 + అనంగన్) = వాకిలియా అనే విధంగా
ఒక్క నిమిషము = ఒక క్షణ కాలము
అప్పుడు = అప్పుడు
అయ్యుదధినడుమన్ (ఆ + ఉదధి, నడుమన్) = ఆ సముద్రము యొక్క మధ్యలో
నఱకువడి = నఱకుడు పడినట్లు (తెగిన విధంగా, చీలినట్లు)
తోచెన్ = కనబడింది
అదరంటన్ = గాఢముగా
చలచిపఱచు = కొట్టి వెడుతున్న
జంఘా ప్రభంజనములన్; జంఘా = కాలి పిక్కల బల వేగముతో
ప్రభంజనములన్ = వేగంగా లేచిన పెను గాలులతో
తనర్చి = అతిశయించి
అతడు = ఆ హనుమంతుడు
త్రికూటకూటాగ్రవీధిన్; త్రికూట = త్రికూట పర్వతము యొక్క
కూట + అగ్రవీధిన్ = శిఖరము యొక్క పైభాగముపై
వ్రాలెన్ = వ్రాలాడు.

భావం :
శ్రీరాముని క్రోధరసము, లంకకు చేరేటట్లుగా కాలువ త్రవ్వినారా అనేటట్లును, రాబోయే కాలంలో నిర్మించే సేతు బంధనానికి అనుగుణంగా త్రవ్విన పునాది గొయ్యి, అనేటట్లును, క్రొత్తదైన కీర్తి వస్త్రాలను భూదేవికి అర్పించి, అంతకు ముందు ఆమె ధరించిన నల్లని వస్త్రాలను చింపివేశాడా అన్నట్లును, హనుమంతుని చూడడానికై ఆదిశేషుడు వచ్చి తలుపులు తెరిచిన బలిచక్రవర్తి ఇంటి వాకిలియా అన్నట్లును, ఒక నిమిషము సముద్రము మధ్య చీలినట్లు కనబడింది. ఇలా గాఢంగా కొట్టివెడుతున్న పిక్కల బలవేగంతో లేచిన గాలులతో, అతిశయించి హనుమంతుడు, త్రికూట పర్వత శిఖరముపై వ్రాలాడు.

AP SSC 10th Class Telugu Solutions Chapter 9 మాణిక్యవీణ

AP State Board Syllabus AP SSC 10th Class Telugu Solutions 9th Lesson మాణిక్యవీణ Textbook Questions and Answers.

AP State Syllabus SSC 10th Class Telugu Solutions 9th Lesson మాణిక్యవీణ

10th Class Telugu 9th Lesson మాణిక్యవీణ Textbook Questions and Answers

ఉన్ముఖీకరణ : చదవండి – ఆలోచించి చెప్పండి

“సౌందర్యం ఆరాధించేవాడా!
కవితలో, శిల్పంలో
పురుగులో, పుష్పంలో
మెరుపులో, మేఘంలో
సౌందర్యం ఆరాధించేవాడా!
జీవించేవాడా!
సుఖించేవాడా ! దుఃఖించేవాడా!
విహ్వలుడా ! వీరుడా!
ప్రేమించేవాడా!
వియోగీ! యోగీ! భోగీ! త్యాగీ!
ఆలోచనలు పోయేవాడా!
అనునిత్యం అన్వేషించేవాడా!
చెట్టూ, చెరువూ, గట్టూ, పుట్టా
ఆకసంలో సముద్రంలో
అన్వేషించేవాడా!”

ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
ఈ కవిత ఎవరిని గురించి తెలుపుతుంది?
జవాబు:
ఈ కవిత మానవుని గురించి తెలుపుతుంది.

ప్రశ్న 2.
కవితలో పేర్కొన్న మానవుని ప్రత్యేక లక్షణాలేవి?
జవాబు:
కవితలో పేర్కొన్న మానవుడు – సౌందర్య ఆరాధకుడు, జీవించేవాడు, సుఖించేవాడు, దుఃఖించేవాడు, విహ్వలుడు, వీరుడు, ప్రేమికుడు, వియోగి, యోగి, భోగి, త్యాగి, ఆలోచనాపరుడు, అన్వేషకుడు.

AP SSC 10th Class Telugu Solutions Chapter 9 మాణిక్యవీణ

ప్రశ్న 3.
మానవుణ్ణి ఎన్ని కోణాల్లో ఈ కవితలో దర్శించవచ్చు?
జవాబు:
మానవుణ్ణి 13 కోణాలలో ఈ కవితలో దర్శించవచ్చును.

ప్రశ్న 4.
మానవునికి వివిధ లక్షణాలు ఎలా సంక్రమించి ఉండవచ్చు?
జవాబు:
తన జీవన క్రమంలో, నిత్యం అన్వేషణలో, అభివృద్ధిలో మానవునికి అనేక లక్షణాలు సంక్రమించి ఉండవచ్చును.

ఇవి చేయండి

I. అవగాహన – ప్రతిస్పందన

ప్రశ్న 1.
‘మాణిక్య వీణ’ శీర్షికన ఉన్న కవిత విన్న తర్వాత మీకు ఎలాంటి అనుభూతి కలిగిందో చెప్పండి.
జవాబు:
మాణిక్య వీణ కవితను విన్నపుడు చాలా ఆనందం కలిగింది. మంత్రాలు-చింతకాయలు, చింతలు, యంత్రాలు, జబ్బులు, తంత్రాలు-రుగ్మతలు, అనవచ్చు – అనిపించనూవచ్చు, పొట్ట-పుట్ట, కట్టెదుట-నిట్టనిలువు, కట్టుకొని, అందచందాలు, రంగులను-రవళినీ, గుట్టాలు-జింకలు, మొక్కలు-నిక్కి, చక్కని నొక్కులు – చిక్కని పదాలు, చక్రం – చరిత్ర, చరచరా – విరచించిన, తప్పటడుగులు – తాండవం, కిలకిలలు – కలభాషలు, అలతి మాటలు – పదాలు, కలమ – కళలు, తళతళలు, జ్ఞానం – విజ్ఞానం – ప్రజ్ఞానం మొదలైన పదాలు చాలా బాగున్నాయి. ఆ పదాలను సందర్భానుసారంగా ఉపయోగించడం చాలా బాగుంది.

ఆదిమానవుని స్థాయి నుండి అంతరిక్ష పరిశోధకుని వరకు పురోగమించిన మానవజాతి మహాప్రస్థానంలోని ముఖ్యమైన రోజులను వర్ణించడం చాలా ఆనందపరచింది. మానవజాతి చరిత్రలోని ప్రతిరోజును విశ్లేషించి, మనం ఇప్పుడున్న స్థితి కోసం మన పూర్వులు పడిన కష్టాన్ని గుర్తుచేశారు. దీని వలన మన పూర్వుల పైన మన గౌరవం పెరుగుతుంది. మానవజాతిని మా నవజాతి అని కీర్తించి, నిరూపించిన మానవతావాది, మానవతావాది అయిన కవి గారిని అభినందించడం
మానవధర్మం.

ప్రశ్న 2.
‘మాణిక్య వీణ’ వచన కవితను భావయుక్తంగా చదవండి. దీని భావాన్ని సొంతమాటల్లో చెప్పండి.
జవాబు:
వచన కవితను భావయుక్తంగా పాడడం, మీ గురువు గారి దగ్గర నేర్చుకొని పాడండి.

మాణిక్యవీణ (భావం సొంతమాటల్లో) (కవితా సారాంశం) :
మంత్రాలతో చింతకాయలు ఎలా రాలవో, అలాగే స్తుతి పద్యాల ధాటితో చింతలు తొలగిపోవు. యంత్రాలతో రోగాలు నయం కానట్లే, తంత్రాలతో సమాజ సమస్యలు దారికిరావు.

కడుపులో కేన్సరుతో సంఘం బాధపడుతూ ఉంటే, అంతరిక్షంలోకి రాకేట్లు పంపితే మాత్రం ఏం ప్రయోజనం ? మనిషి పుట్టగానే ప్రకృతిని చూసి ఆనందించాడు. దాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకోవాలని అతడు ప్రయత్నించాడు. ప్రకృతిలోని రంగులనూ, ధ్వనులనూ అనుకరించాడు.

మానవుడు గుహలలో జీవించే ఆదిమకాలంలోనే, గోడలపై జంతువుల బొమ్మలు గీశాడు. ఎండిన చెట్లు చిగిర్చేలా పాడాడు. గజ్జెకట్టి నాట్యం చేశాడు. చక్కని తీరుగా పదాలు పాడుకున్నాడు.

‘చక్రం’ కనుక్కొన్న రోజు, ‘లిపి’ తో రాసిన రోజు, నిప్పును కనిపెట్టిన రోజు, చక్కగా నాట్యం చేసిన రోజు, మానవచరిత్రలో మంచిరోజులు. మానవుడు అర్థవంతమైన భాషలు నేర్చుకొన్న రోజు, చిన్నమాటలతో జానపద గీతాలు అల్లుకున్న రోజు, ధాన్యం పండించిన రోజు, కళలను పండించిన రోజు గొప్పరోజులు. మానవచరిత్రలో అవి అన్నీ పండుగరోజులు.

కళలు, కవితలు, విజ్ఞానం, ప్రజ్ఞానం కలగలసి, మానవుడిని మహోన్నతంగా నడిపిస్తాయి. ఈ విధంగా నేల నుండి ఎదిగి మానవుడు ఆకాశాన్ని అందుకున్న చిన్నవాడు. మానవుడు చిరంజీవి. అతి ప్రాచీనుడు.

అనాదిగా నడుస్తున్న ఈ మానవుడి జీవనయాత్రలో కళాకవితలూ, జ్ఞాన విజ్ఞానాలూ, మానవుడి వెంటనే ఉండి, అతనితో నడుస్తూ, అవే అతణ్ణి నడిపిస్తున్నాయి.

AP SSC 10th Class Telugu Solutions Chapter 9 మాణిక్యవీణ

ప్రశ్న 3.
పొట్లపల్లి రామారావు రాసిన కింది కవితను చదివి ప్రశ్నలకు జవాబులివ్వండి.
“ఎన్ని దినములు నీవు – ఇల గడిపినను ఏమి?
ఎన్ని జన్మాలింక – ఎదిరి చూచిన ఏమి?
ఎన్నాళ్లకైన నీ – ఔన్నత్యమును నీవే
సాధించవలెనోయి – శోధించవలెనోయి !
నీలోన వెలుగొందు – నీస్వశక్తిని మరచి –
పరుల పంచల జూడ – ఫలమేమి కలదోయి !”

అ) పై కవితకు పేరు పెట్టండి.
జవాబు:
1) స్వశక్తి
2) సాధన – శోధన
3) మానవా – మా ! నవా !
గమనిక :
కవితలోని సారాంశాన్ని బట్టి, విద్యార్థులు తమకు నచ్చిన, సరిపోయే పేరును దేనినైనా పెట్టవచ్చును.

ఆ) ఔన్నత్యం పొందడానికి కవి ఏం చేయాలని చెప్తున్నాడు?
జవాబు:
సాధించాలి. శోధించాలి. అప్పుడే ఔన్నత్యం పొందగలం అని కవి చెప్తున్నాడు.

ఇ) స్వశక్తికి, ఇతరులపై ఆధారపడడానికి గల తేడా ఏమిటి?
జవాబు:
ఎవరి సహాయసహకారాలను ఆశించకుండా, తను సొంతంగా చేయడం స్వశక్తి. దాని వలన ఆత్మవిశ్వాసం, గౌరవం, పనిచేసే తత్వం, పట్టుదల, ఓర్పు, నేర్పు మొ||వి పెరుగుతాయి. ఇతరులపై ఆధారపడితే పైన చెప్పినవేమీ ఉండవు.

ఈ) ‘పరులపంచ’ అనే పదంతో సొంతవాక్యాన్ని రాయండి.
జవాబు:
పరుల పంచ : దుర్యోధనుని కుటిలనీతి, దుర్మార్గం, మోసం వలన జూదంలో పాండవులు ఓడిపోయి, పరుల పంచల పాలయ్యారు.

ప్రశ్న 4.
ఈ పాఠంలోని “అంత్యప్రాసలున్న” పదాలు వకండి. అలాంటివే మరికొన్ని పదాలను రాయండి.
జవాబు:
పాఠంలోని అంత్యప్రాస పదాలు :
చింతకాయలు – చింతలు, జబ్బులు – రుగ్మతలు, అనవచ్చు – అనిపించనూవచ్చు, అననూవచ్చు – అనిపించనూ వచ్చు, ఆయత్తమయినాడు – గీసుకొన్నాడు, ఆరంభించినాడు – కట్టినాడు, పిక్కటిల్లేలా – చూచేలా, దినమో – శుభదినమో, రోజు – రోజు, మానవుడు – మానవుడు, విజ్ఞానం – ప్రజ్ఞానం.

మరికొన్ని అంత్యప్రాసలు :
సన్నిధి – పెన్నిధి, చూస్తా – వస్తా, చూసి – చేసి, కాలం – గాలం, ధీరత – శూరత, మమకారము – సహకారము, నీరు – మీరు, క్షీరము – నారము, వనజ – జలజ, కలతలు – మెలతలు, గిలిగింత – చికిలింత, జాతి – నీతి, పలక – గిలక, రానీ – పోనీ, నాది – నీది, వనధి – జలధి.

(గమనిక : పదంలోని చివరి అక్షరం గాని, చివరి రెండు లేక మూడు అక్షరాలు గాని ఒకే అక్షరాలుగా వచ్చేలా ఎన్ని పదాలైనా రాయవచ్చును.)

5. కింది ప్రశ్నలకు పాఠం ఆధారంగా జవాబులు రాయండి.

అ) “మంత్రాలతో చింతకాయలు………………..” అని కవి వేటితో పోల్చాడు?
జవాబు:
“మంత్రాలతో చింతకాయలు రాలవు” అనే విషయంలోని మంత్రాలతో చింతకాయలు రాలనట్లే పద్యభయంతో చింతలు పారిపోవు అన్నాడు. యంత్రాలతో జబ్బులు తగ్గవు అన్నాడు. తంత్రాలతో సమాజ రుగ్మతలు పోవు అన్నాడు. పొట్టలోని పుట్టకురుపుతో సంఘం కలతపడుతుంటే అంతరిక్ష ప్రయోగాల వలన ఉపయోగం ఏమిటని ప్రశ్నించాడు.

పైవానిలో పద్యాలు, యంత్రాలు, తంత్రాలు, పొట్టలోని పుట్టకురుపుతో ఉన్న సంఘపు కలతను మంత్రాలతో పోల్చాడు. చింతలు పారిపోకపోవడం, జబ్బులు తగ్గకపోవడం, సమాజరుగ్మతలు పోకపోవడం, అంతరిక్ష ప్రయోగాల వలన ఉపయోగం లేకపోవడం అనే వాటిని చింతకాయలు రాలకపోవడంతో పోల్చాడు.

ఆ) కవి వేటిని శుభదినాలని వర్ణించాడు?
జవాబు:
చక్రం అభివృద్ధికి కారణం. అంతవరకు చాలా ప్రయాసతో చేసిన పనులను చక్రం కనుగొన్నాక సులువుగా చేశాడు మానవుడు. ఇంత అభివృద్ధి కారకమైన చక్రం కనుగొన్న రోజు నిజంగా అద్భుతమైన గొప్ప రోజు. అది మానవ చరిత్రలో శుభదినం.

నిప్పును కనుగొన్నాక మానవుని జీవన విధానం మారింది. అంతవరకు పచ్చిమాంసం, పచ్చి కూరలు, పచ్చి దుంపలు తిన్న మానవుడు వాటిని కాల్చుకొని తినడం ప్రారంభించాడు.

ఎప్పుడైతే నాలుకకు రుచి తగిలిందో అప్పుడే కళల వైపు దృష్టి మళ్ళింది. ఇక తప్పటడుగులు మానివేసి, తాండవం చేయడం మొదలు పెట్టాడు. ఇది పరిపక్వతకు, సమర్థతకు గుర్తు.

మానవుడు భాష నేర్చుకొన్నది నిజంగా శుభదినమే. పదాలు తనకు తాను అల్లుకొంటూ పదజాలాన్ని సృష్టించిన మానవుడు సాధించిన ప్రగతి సామాన్యమైనదికాదు. పదజాలం నుండే సమస్త సాహిత్యం ఏర్పడింది. అది మానవజాతి చరిత్రలో మంచిరోజు.

పంటలు పండించడానికి వ్యవసాయం చేసిన రోజు ఈనాటి ఆధునిక మానవుని ప్రతినిధులుగా మానవులను రూపొందించిన మంచిరోజు. ఇక మానవజాతి పూర్తిగా అభివృద్ధి చెందిందని చెప్పడానికి ఏర్పడిన శుభదినం.

ఈ విధంగా మానవుడు సాధించిన అభివృద్ధికి ఆస్కారమైన రోజులన్నీ శుభదినాలే.

ఇ) మానవుణ్ణి శాశ్వతంగా నిల్పేవి ఏవి?
జవాబు:
మానవుడిని చరిత్రలో శాశ్వతంగా నిలిపే అతను సాధించిన అభివృద్ధి, పొందిన చైతన్యం మాత్రమే.

మానవుడు వేసిన కుడ్య చిత్రాలు అతడిని శాశ్వతుడిని చేశాయి. అతను పాడిన పాటలు, చేసిన నృత్యాలు అతని చరిత్రలో చిరస్థాయిగా నిలిచాయి. ఘీంకరించడమేకాక చక్కని పదాలు పాడిన గొంతు మానవుణ్ణి శాశ్వతం చేసింది. అతను కనుగొన్న చక్రం, చిత్రలేఖనం అతను కనుగొన్న నిప్పు మానవుడికి శాశ్వత కీర్తిని తెచ్చాయి. అతను చేసిన తాండవం చరిత్ర పుటలలో శాశ్వతంగా స్థానం సంపాదించింది. కూతలు మాని మధురమైన భాష పలికిన రోజు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడింది. తేలికైన మాటలతో పాటలను అల్లుకొన్నరోజు చరిత్రలో శాశ్వతంగా నిలిచింది. కళలను పండించిన రోజు, కవిత్వం చెప్పిన రోజు, అతని జ్ఞానం, విజ్ఞానం, ప్రజ్ఞానం మానవుణ్ణి శాశ్వతంగా నిలిపాయి.

AP SSC 10th Class Telugu Solutions Chapter 9 మాణిక్యవీణ

ఈ) విద్వాన్ విశ్వం గురించి, ఆయన కవితాశైలిని గురించి ఐదు వాక్యాలు రాయండి.
జవాబు:
వ్యక్తిగతం :
విద్వాన్ విశ్వం అనంతపురం జిల్లా తరిమెల గ్రామంలో లక్ష్మమ్మ, రామయ్య దంపతులకు క్రీ.శ. 1915లో జన్మించారు. ఆయన అసలు పేరు మీసరగండ విశ్వరూపాచారి. ఆయన సంస్కృతాంధ్రాంగ్ల భాషలలో పండితుడు. ఆయన మీజాన్, ప్రజాశక్తి, ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి పత్రికలలో అనేక హోదాలలో పనిచేశారు. భాష, సాహిత్యం , సమాజ నైతిక విలువలు మొదలైన అంశాలపై ‘అవి – ఇవి’, ‘తెలుపు – నలుపు’, ‘మాణిక్య వీణ’ వంటి శీర్షికలతో సంపాదకీయాలు రాశారు. ఆయన సాహితీవేత్త. రాజకీయ నాయకుడు, పత్రికా సంపాదకుడు, బహుముఖ ప్రజ్ఞావంతుడు. ‘ప్రేమించాను’ అనే నవల, ‘ఒకనాడు’, ‘పెన్నేటిపాట’ అనే కావ్యాలు రచించారు. కళాప్రపూర్ణ, డి.లిట్. పట్టాలు అందుకొన్నారు.

శైలి :
విశ్వం శైలి మధురమైనది. సామాన్య పాఠకునకు అర్థం అయ్యే పదాలు ప్రయోగిస్తాడు. తేలికైన సంస్కృత పదాలు ప్రయోగిస్తాడు. అంత్యప్రాసలకు ప్రాధాన్యం ఇస్తాడు.

II. వ్యక్తికరణ-సృజనాత్మకత

1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ) చరిత్రలో మైలురాళ్ళుగా నిల్చిన అంశాలేవి? ఇవి దేనికి ప్రతీకగా భావిస్తున్నావు?
జవాబు:
గుహలలో నివసించిన రోజులలో మానవుడు గీసిన కుడ్యచిత్రాలు చరిత్రలో మైలురాళ్ళుగా నిలిచాయి. అది మానవునిలోని పరిశీలనాశక్తికి, కళాదృష్టికి ప్రతీకగా భావించవచ్చును.

అడవులలో సంచరించిన రోజులలోనే పాటలు పాడడం మానవుడు ప్రారంభించాడు. అది చరిత్రలో మైలురాయి. ఇది మానవునిలోని కళాదృష్టికి, పాటలు పాడాలి అనే అతని తపనకు ప్రతీక.

గులకరాళ్ళమీద కాలికి గజ్జెకట్టిన దృశ్యం చరిత్రలో మైలురాయి. అతనిలో నాట్య ప్రవృత్తికి, శాస్త్రీయ నృత్యాభిలాషకు ఇది ప్రతీక.

దిక్కులు పిక్కటిల్లేలా ఘీంకరించిన రోజు మానవచరిత్రలో మైలురాయి. ఇది అతని ధైర్యానికి, విజయానికి ప్రతీక. చక్కని నొక్కులతో చిక్కని పదాలు పాడిన రోజు కూడా చరిత్రలో మైలురాయి. అది మానవునిలోని రచనాశక్తికి ప్రతీక.

చక్రం కనుగొన్న రోజు, చిత్రలేఖనం చేసిన రోజు, నిప్పును కనుగొన్నరోజు, తప్పటడుగులు మాని తాండవమాడిన రోజు, కూతలు మాని మధురమైన భాష నేర్చిన రోజు, పాటలు రచించిన రోజు అన్నీ చరిత్రలో మైలురాళ్ళే. అవి అన్నీ మానవునిలోని అభివృద్ధి చెందాలనే కాంక్షకు, సాధించాలనే తపనకు, సుఖపడాలి అనే కోరికకు, భవిష్యత్తు గురించిన ఆలోచనలకు ప్రతీకలు.

ఆ) “మిన్నులు పడ్డ చోటి నుంచి……….. తిన్నగా ఎదిగి మిన్నందుకుంటున్న చిన్నవాడు మానవుడు” అని కవి వర్ణించాడు. ఈ వాక్యాల మీద నీ అభిప్రాయమేమిటి?
జవాబు:
మానవులకు చిన్నతనంలో ఒక కోరిక ఉంటుంది. దూరంగా చూస్తే, ఆకాశం భూమి కలసినట్లు కనిపిస్తుంది. అక్కడకు వెళ్ళి, ఆకాశం ముట్టుకోవాలని ఉంటుంది. కానీ, అది తీరదు.

ఆది మానవుడు జీవితంలో ఎన్నో అద్భుతాలు సాధించాడు. ఎంతో అభివృద్ధిని సాధించాడు. కానీ మొదట్లో ఆదిమానవుడు ప్రకృతిని, ఆకాశాన్ని చూసి భయపడేవాడు. క్రమేణా భయం తగ్గింది. అంటే ప్రకృతిలో చాలా చిన్నవాడు మానవుడు. అటువంటివాడు అంతరిక్ష పరిశోధనలు చేసే స్థాయికి ఎదిగాడు. అంటే చాలా అభివృద్ధిని సాధించాడు. ఇంకా సాధించవలసింది చాలా ఉంది.

అందుచేత “మిన్నందుకొంటున్న చిన్నవాడు” అన్నాడు కవి. మిన్నందుకోవడం బాగా ఉన్నత స్థితికి వెళ్ళడం. అంటే మానవుడు ఇంకా చాలా అభివృద్ధిని సాధించాలి అని కవి భావన. ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న “చిన్నవాడు” అనడంలో మానవజాతి ఆవిర్భావం జరిగి తక్కువ కాలమే అయ్యిందని కవి భావన. ఇంకా కొన్ని కోట్ల సంవత్సరాలు మానవజాతి పురోగమిస్తుంది అని కూడా కవి భావన. దినదినాభివృద్ధి చెందుతుందని, చెందాలని కవిగారి విశ్వాసం. ఆకాంక్ష.

AP SSC 10th Class Telugu Solutions Chapter 9 మాణిక్యవీణ

ఇ) మానవ చరిత్రలో అన్నీ అసాధారణ పర్వదినాలే అనడంలో ఆంతర్యం ఏమై ఉంటుంది?
జవాబు:
మానవచరిత్రలోని తొలి రోజులలో ఆదిమానవుడు జంతువులతో సమానంగా జీవించాడు. జంతువులకు, ప్రకృతిలోని వర్షాలకు, గాలులకు, ఉరుములకు, మెరుపులకు భయపడి బిక్కుబిక్కుమంటూ కొండగుహలలో బ్రతికాడు. అటువంటి మానవుడు భయం విడిచి పెట్టాడు. ధైర్యం పుంజుకున్నాడు. అసాధారణ పర్వదినాలను సృష్టించాడు. గోడలపై జంతువుల బొమ్మలు చిత్రించి ఒక పర్వదినం సృష్టించాడు. పాటలు పాడాడు. అతనిలోని కళాతృష్ణను వ్యక్తీకరించిన ఆ రోజు కూడా పర్వదినమే. కాలికి గజ్జె కట్టిన రోజు – మానవుని ఉత్సాహాన్ని గమనించిన ఆ రోజునూ కవి పర్వదినమన్నాడు. చక్కని పదాలతో పాటలను అల్లిన మానవునిలోని కవితాశక్తిని గమనించి, ఆ రోజును పండుగ దినంగా కవి భావించాడు. చక్రం కనుగొన్న రోజు నిజంగా మానవజాతికి పర్వదినమే. అక్కడనుండే మానవజాతి అసలైన అభివృద్ధి ప్రారంభమైంది. . కనుకనే దాన్ని పర్వదినమన్నాడు కవి. నిప్పును కనుక్కొని పండుగ రోజుకు కమ్మని వంటకాలు సిద్ధచేయడం మరి పండుగే కదా ! మానవజాతికి, అదే పేర్కొన్నాడు కవి.

తప్పటడుగులు మాని, తాండవం చేసిన రోజును మనిషిలో ఉప్పొంగిన ఉత్సాహానికి పరవశించిన పర్వదినంగా పేర్కొన్నాడు కవి. మధురభాష నేర్చుకొన్న రోజును మానవుల భావ వ్యక్తీకరణకు అవకాశం దొరికింది కనుక ఆ రోజును పర్వదినంగా కవి పేర్కొన్నాడు. తేలికైన మాటలతో పాటలల్లిన రోజున మానవునిలోని కవిత్వ రచనాశక్తి బయటపడింది కనుక దానిని కూడా పండుగరోజుగా కవి పేర్కొన్నాడు.

వరిధాన్యం పండించిన రోజు నాగరిక మానవుడు ఆవిర్భవించాడు కనుక, అది పర్వదినమన్నాడు కవి. కళలు, కవిత్వం, జ్ఞానం, విజ్ఞానం, ప్రజ్ఞానం వికసించిన రోజులన్నీ మానవుల అభివృద్ధినీ, పురోగతినీ ప్రకటించిన రోజులే. కనుక అవి అన్నీ పర్వదినాలే అన్నాడు కవి.

2. కింది ప్రశ్నలకు పదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ) మానవ ప్రస్థానంలో కళ, కవిత, విజ్ఞానం తోడున్నాయని కవి వర్ణించాడు గదా ! దీనినెలా సమర్థిస్తావు?
జవాబు:
కళ :
ప్రకృతిలోని అందాలకు మానవుడు పరవశించాడు. దానిని అనుకరించడానికి ప్రయత్నించాడు. గుహలలో నివసించిననాడే గోడలపై జంతువుల బొమ్మలు చిత్రించాడు. అడవులలో నివసించే రోజులోనే మోడులు కూడా చిగురించేలా పాడాడు. గులకరాళ్ళ ములుకుల మీద గజ్జెకట్టి నాట్యం చేశాడు. ఇవి అన్నీ మానవునిలోని కళాశక్తికి నిదర్శనాలు. అందుచేత ‘కళ’ మానవ పురోగతిలో తోడుగా నిలిచి అతని మనసుకు ఉత్సాహాన్ని నింపింది.

కవిత :
ఘీంకరించడమే కాదు. చక్కని నొక్కులు గల చిక్కని పదాలతో పాటలు రచించి పాడుకొన్నాడు. నాలుగు గీతలతో ఒక చిత్రాన్ని రచించాడు. తప్పటడుగులు మాని శాస్త్రీయ నృత్యం చేశాడు. కూతలు మాని భాష నేర్చుకొన్నాడు. అలతి పదాలతో పాటలు అల్లుకొన్నాడు. ఇవి అన్నీ మానవునిలోని కవితాసక్తిని నిరూపిస్తున్నాయి. అందుచేత ‘కవిత్వం’ మానవ పురోగతిలో అడుగడుగునా తోడై కర్తవ్యాన్ని గుర్తు చేసింది. ఆహ్లాదాన్ని పెంచింది.

విజ్ఞానం :
మానవుని పురోగతిలో ‘విజ్ఞానం’ ప్రధానపాత్ర పోషించింది. కళ, కవిత్వాలు అతనిలోని విజ్ఞానాన్ని తట్టిలేపాయి. శోధించాడు, సాధించాడు. చక్రం కనుగొన్నాడు. కష్టంగా బరువులెత్తినవాడు సులువుగా బరువులను తరలించాడు. జీవితాన్ని తన విజ్ఞానంతో సుఖమయం చేసుకొన్నాడు. నిప్పును కనుగొన్నాడు. మానవజీవితంలో విప్లవాత్మకమైన మార్పు వచ్చింది. కమ్మని భోజనం దొరికింది. ధాన్యం పండించాడు. సౌఖ్యమంతమైన రోజులు సృష్టించాడు. అద్భుతాలెన్నో సృష్టించాడు. అంతరిక్ష పరిశోధనల దాకా అతని విజ్ఞానం పురోగమించింది. పురోగమిస్తుంది.

పై వాటిని పరిశీలిస్తే మానవ ప్రస్థానంలో కళ, కవిత, విజ్ఞానం తోడై అతనిని ఆకాశమంత ఎత్తుకు పెంచాయి అనడం సమర్థనీయమే.

AP SSC 10th Class Telugu Solutions Chapter 9 మాణిక్యవీణ

ఆ) మాణిక్య వీణ కవితా సారాంశాన్ని సొంతమాటల్లో రాయండి.
(లేదా)
‘మాణిక్య వీణ’ పాఠం ఆధారంగా మానవ పరిణామ క్రమాన్ని సొంతమాటల్లో వివరించండి.
జవాబు:
మంత్రాలకు చింతకాయలు రాలవు. అట్లే పద్యం ధాటికి చింతలు పారిపోవు. కేవలం రోగాలను పరీక్షించే యంత్రాల వలన రోగాలు తగ్గవు. అట్లే ఏవేవో ఉపాయాల వలన సమాజంలోని రుగ్మతలు పోవు.

సృష్టిలో మానవుడు పుట్టిన లక్షల సంవత్సరాల క్రితమే ప్రకృతిని ప్రేమించాడు. ప్రకృతి అందాలకు పరవశించాడు. ఆనాడే ప్రకృతిని జయించాలనుకొన్నాడు. గుహలలో నివసించిన నాడే గోడల పై జంతువుల బొమ్మలను చిత్రించాడు.

అడవులలో ఆదిమానవుడు సంచరించిన నాడే పాటలు పాడాడు. నృత్యం చేశాడు. దిక్కులు పిక్కటిల్లేలా గర్జించడమే కాదు చిక్కనైన పదాలతో చక్కని పాటలు పాడాడు.

చక్రం కనుగొన్నాడు. చరిత్రలో ఆ రోజు ప్రముఖమైనది. నాలుగు గీతలతో చక్కని బొమ్మను చిత్రించిన రోజు కూడా ప్రముఖమైనదే. నిప్పును కనుగొన్నాడు. అది మానవ జీవితంలో మార్పును తెచ్చిన శుభదినం. తప్పటడుగులు మాని, తాండవం చేసిన రోజు కూడా శుభదినం.

కూతలు మాని మధురమైన భాష నేర్చుకొన్న రోజు కూడా నిజంగా మంచిరోజు. తేలిక పదాలతో పాటలు అల్లుకొన్న రోజు చరిత్రలో పర్వదినం. వరి ధాన్యం పండించిన రోజు కూడా పర్వదినం. అన్నీ పర్వదినాలే.

అలాగ అన్నీ కలిసి, పెనవేసుకొన్నాయి. కళలు, కవితలు, విజ్ఞానం, ప్రజ్ఞానం మెరుపులై మానవుని నడిపించాయి. మిన్నులు పడ్డచోటు నుండి నిటారుగా ఎదిగాడు. ఆకాశమంత ఎత్తు ఎదిగాడు. అంతరిక్ష పరిశోధనలు చేస్తున్నాడు మానవుడు. అయినా ఇంకా చాలా అభివృద్ధి చెందవలసిన చిన్నవాడు మానవుడు.

ఏనాటి నుండో నడుస్తున్న ఈ సుదీర్ఘమైన మానవ జీవనయాత్రలో మానవుని వదలనివి కళ, కవిత, జ్ఞానం, విజ్ఞానం, ప్రజ్ఞానం. మానవునితో నడిచేవీ, నడిపించేవీ అవే.

3. కింది అంశాల గురించి సృజనాత్మకంగా ప్రశంసిస్తూ రాయండి.

అ) నీ చుట్టూ ఉన్న పరిసరాల్లో, మానవ జీవితంలో కలిగిన మార్పులను, అభివృద్ధిని వర్ణిస్తూ పది పంక్తులకు తక్కువ కాకుండా ఒక కవితను రాయండి.
జవాబు:
రోడ్లన్నీ నాడు బురదతో జర్రు జర్రు
నేడు హారన్లతో బర్రు బర్రు
నాడు ధర మీదే మా చదువులు
నేడు ధరల మీదే మా చదువులు
నాడు మాస్టార్లంటే భయం భయం
నేడు విద్యాహక్కు చట్టమంటే ప్రియం ప్రియం
అప్పుడందరూ రైతులే, అన్నీ పొలాలే
ఇప్పుడందరూ నేతలే, అన్నీ బిల్డింగులే
అప్పుడు సినిమాలే ఎరగం
ఇప్పుడు సినిమాలే జగం
నాడు చదువంటే చాలా కష్టం
నేడు చదువంటే చాలా ఇష్టం
నాడు అదే స్వర్గం
నేడు ఇదో స్వర్గం.

ఆ) విద్వాన్ విశ్వం కవిత్వాన్ని ప్రశంసిస్తూ మిత్రునికి లేఖ రాయండి.
జవాబు:

మహబూబ్ నగర్,
x x x x x

ప్రియమైన రాజేష్ కు,
నీ మిత్రుడు సురేష్ వ్రాయు లేఖ.
ఇక్కడ మేమంతా క్షేమం. అక్కడ మీరంతా క్షేమమని తలచెదను.

విద్వాన్ విశ్వం రచించిన ‘మాణిక్య వీణ’ పాఠం చాలా బాగుంది. అది వచన కవిత. దానిలో ఉపయోగించిన ప్రాస పదాలు చాలా బాగున్నాయి. మానవజాతి పురోగతిని చాలా చక్కగా వర్ణించారు. సందర్భానికి తగిన పదాలు ప్రయోగించారు. కవితా వస్తువు కూడా ఎక్కడా కుంటుపడకుండా చాలా చక్కగా సాగింది.

‘మంత్రాలకు చింతకాయలు రాలతాయా !’ అనే నానుడితో కవిత ప్రారంభమౌతుంది. ఈ వాక్యంలోనే కవి చెప్పబోయే విషయాన్ని సూచించాడు. మానవ ప్రయత్నం లేకపోతే ఏ పనీ జరగదు అని చెప్పాడు. అదే ఆయన కవితాశిల్పం.

గోడలపై మానవుడు గీసిన బొమ్మల గురించి చెబుతూ, గుర్రాలు, జింకల బొమ్మలు చిత్రించాడన్నాడు. రెండూ వేగానికి సంకేతాలే. అంటే మానవుడు చాలా వేగంగా అభివృద్ధి చెందుతాడని బొమ్మల ద్వారా చెప్పాడు. పదాల ద్వారా చెప్పకుండా, సంకేతాల ద్వారా చెప్పడం ఉత్తమ కవితా లక్షణం. దానిని నిరూపించాడు విశ్వం.

“మొక్కలు నిక్కి చూచేలా – చక్కని నొక్కులతో చిక్కని పదాలు పాడుకొన్నాడు” అనేది కూడా అద్భుతమైన వర్ణన. వృత్త్యనుప్రాసాలంకారం ప్రయోగించాడు. ఇలాగే జ్ఞానం, విజ్ఞానం, ప్రజ్ఞానం మూడూ సమానార్థకాలుగా కనిపిస్తాయి. ఒకదాని కంటే ఒకటి ఉన్నతమైనవి.

తప్పక నీవు ఈ కవిత చదువు. ఉంటా.

ఇట్లు
నీ స్నేహితుడు,
కె.సురేష్,

చిరునామా :
పేరు : జి. రాజేష్,
10వ తరగతి, సి. సెక్షన్, నెం. 4,
పాఠశాల : xxxxxx. గ్రామం : xxxxxx.
మండలం : xxxxxx. జిల్లా : xxxxxx.

భాషా కార్యకలాపాలు ప్రాజెక్టు పని

దిన, వార పత్రికల ఆధారంగా, మీకు నచ్చిన రెండు వచన కవితల్ని సేకరించి, అంశాల ఆధారంగా కింది పట్టికను పూరించండి.
జవాబు:
AP SSC 10th Class Telugu Solutions Chapter 9 మాణిక్యవీణ 5

(గమనిక : ఆంధ్రజ్యోతి, ఈనాడు, సాక్షి, ఆంధ్రభూమి వంటి దినపత్రికలు వారానికి ఒకసారి కవితలు ప్రచురిస్తాయి. స్వాతి, ఆంధ్రప్రభ, ఆంధ్రభూమి మొదలైన వారపత్రికలలో ప్రతివారం ప్రచురిస్తారు. గమనించి, సేకరించి, పట్టిక నింపాలి.)

III. భాషాంశాలు

పదజాలం

1. కింది వాక్యాలు చదివి గీతగీసిన పదాలకు అర్థం రాయండి. పదాలతో సొంతకార్యాలు రాయండి.

అ) రోదసి లోకి దూసుకెళ్ళిన మరో ఉపగ్రహం
జవాబు:
రోదసి = అంతరిక్షం
సొంతవాక్యం : రోదసిలో పరిశోధిస్తే ఎన్నో అద్భుతాలు తెలుస్తాయి.

ఆ) విద్యార్థులంతా పరీక్షలకు ఆయత్తమవుతున్నారు.
జవాబు:
ఆయత్తమవు = సిద్ధపడు
సొంతవాక్యం : మేము తిరుపతికి వెళ్ళడానికి ఆయత్తమవుతున్నాము.

ఇ) రుగ్మత ఉన్న ఈ సమాజానికి మానవీయ విలువలతో చికిత్స అవసరం.
జవాబు:
రుగ్మత = రోగం
సొంతవాక్యం : రుగ్మత తగ్గాలంటే వైద్యం తప్పదు.

ఈ) కళవళపడటమెందుకు? నెమ్మదిగా జవాబు చెప్పు,
జవాబు:
కళవళపడటము = కలవరపడటము
సొంతవాక్యం : జీవితంలో కష్టాలకు కళవళపడటం మంచిదికాదు.

AP SSC 10th Class Telugu Solutions Chapter 9 మాణిక్యవీణ

2. పాఠం ఆధారంగా కింది వాక్యాలకు సమానమైన పదాల్ని వెతికి రాయండి.

ఒకరిని చూసి మరొకరు చేయడం
పనిచేయడానికి సిద్ధమవడం
అద్భుతంగా నాట్యమాడటం
పనిని మొదలుపెట్టడం

జవాబు:

ఒకరిని చూసి మరొకరు చేయడంఅనుకరించడం
పనిచేయడానికి సిద్ధమవడంఆయత్తమవడం
అద్భుతంగా నాట్యమాడటంతాండవమాడడం
పనిని మొదలుపెట్టడంతిన్నగా ఎదగడం

3. క్రింది జాతీయాలను ఏయే సందర్భాల్లో ప్రయోగిస్తారో తెలిపి సొంతవాక్యాల్లో ఉపయోగించండి.
అ) మంత్రాలకు చింతకాయలు రాలడం :
జవాబు:
పనులు చేయకుండా కేవలం కబుర్లు మాత్రమే చెబితే ప్రయోజనం లేదని చెప్పే సందర్భంలో ఈ జాతీయం ఉపయోగిస్తారు.
సొంతవాక్యం :
మంత్రాలకు చింతకాయలు రాలవు గానీ, పని మొదలుపెట్టండయ్యా.

ఆ) మిన్నందుకోడం :
జవాబు:
చాలా అభివృద్ధి చెందడం అనే అర్థంలో దీనిని ఉపయోగిస్తారు. ఆకాశం అందదు. కానీ, దానిని కూడా అందుకున్నాడంటే అతనికి అసాధ్యం లేదు కదా !
సొంతవాక్యం :
తెలివితేటలు పెంచుకుంటే మిన్నందుకోడం సాధ్యమే.

ఇ) గజ్జెకట్టడం :
జవాబు:
నాట్యం ప్రారంభించేవారు ముందుగా గజ్జె కట్టుకుంటారు. గజ్జె కట్టడం జరిగితే తప్పనిసరిగా నాట్యం చేస్తారని అర్థం. పనిలో చురుకుగా పాల్గొని అన్నీ తానై చేసేవారిని గూర్చి ఈ జాతీయం ఉపయోగిస్తారు.
సొంతవాక్యం :
రుద్రమదేవి కదనరంగంలో గజ్జెకట్టి కాళికలా నర్తించింది.

4. కింది పదాలకు అదే అర్థం వచ్చే మరి రెండు పదాలు రాయండి.
అ) మిన్ను :
1) ఆకాశం
2) నింగి

అ) తాండవం :
1) నాట్యం
2) నృత్యం

ఇ) రుగ్మత :
1) రోగం
2) జబ్బు

ఈ) జ్ఞానం :
1) తెలివి
2) మేధ

5. కింది రాశ్యాల్లోని వికృతి పదాలను గుర్తించి పాఠం ఆధారంగా ప్రకృతి పదాలు చేర్చి తిరిగి వాక్యాలు రాయండి.

అ) అమ్మ బాసలోనే నేను మాట్లాడతాను.
జవాబు:
వికృతి = బాస,
ప్రకృతి = భాష
వాక్యం : అమ్మ భాషలోనే నేను మాట్లాడతాను.

ఆ) మన కవులు రాసిన కైతలు భారతి మెడలో అలంకరించిన హారాలు.
జవాబు:
వికృతి = కైతలు, ప్రకృతి = కవితలు
వాక్యం : మన కవులు రాసిన కవితలు భారతి మెడలో అలంకరించిన హారాలు.

ఇ) విన్నాణము పెంచుకోకపోతే భవిష్యత్తు అంధకారమవుతుంది.
జవాబు:
వికృతి = విన్నాణము, ప్రకృతి = విజ్ఞానము
వాక్యం : విజ్ఞానము పెంచుకోకపోతే భవిష్యత్తు అంధకారమవుతుంది.

ఈ) సింహాలు గొబల్లో నిద్రిస్తున్నాయి.
జవాబు:
వికృతి = గొబ, ప్రకృతి = గుహ
వాక్యం : సింహాలు గుహల్లో నిద్రిస్తున్నాయి.

వ్యాకరణాంశాలు

1) కింది పదాల్లో నుగాగమ సంధి పదాలను గుర్తించి, విడదీసి సూత్రం రాయండి.
నిట్టనిలువు, తెల్లందనము, పోయేదేమి, తళుకుంగజ్జెలు, మహోపకారం, సరసపుఁదనము

నుగాగమ సంధి పదాలు :
1) తెల్లందనము
2) తళుకుంగజ్జెలు
3) సరసపుఁదనము
తెల్ల + తనము
సరసపు + తనము
తళుకు + గజ్జెలు

సూత్రము :
సమాసంబుల నుదంతంబులగు స్త్రీ సమంబులకు, పుం, పులకు పరుష సరళములు పరములగునపుడు నుగాగమంబగు.
AP SSC 10th Class Telugu Solutions Chapter 9 మాణిక్యవీణ 1
( గమనిక : విద్యార్థుల సౌకర్యం కొఱకు మిగిలినవి కూడా క్రింద ఇవ్వబడ్డాయి.)

1) నిట్టనిలువు = నిలువు + నిలువు – ద్విరుక్తటకారదేశ సంధి
సూత్రం : ఆమ్రేడితము పరమగునపుడు కడాదుల తొలి అచ్చు మీది వర్ణంబుల కెల్ల అదంతంబగు ద్విరుక్తటకారంబగు.

2) పోయేదేమి = పోయేది + ఏమి – ఇత్వసంధి
సూత్రం : ఏమ్యాదుల ఇత్తునకు సంధి వైకల్పికముగానగు.

3) మహోపకారము = మహా + ఉపకారము – గుణసంధి
సూత్రం : అకారమునకు ఇ, ఉ, ఋలు పరమైతే వానికి క్రమంగా, ఏ, ఓ, అర్లు ఆదేశమగును.

2) కింది వాటిని జతపరచండి.
AP SSC 10th Class Telugu Solutions Chapter 9 మాణిక్యవీణ 2
జవాబు:
AP SSC 10th Class Telugu Solutions Chapter 9 మాణిక్యవీణ 3

3) కింది వాక్యాలను పరిశీలించండి.
అ) మిమ్ము మాధవుడు రక్షించుగాక !
AP SSC 10th Class Telugu Solutions Chapter 9 మాణిక్యవీణ 4
వివరణ :
పై వాక్యాలలో ఒకే శబ్దం వేర్వేరు అర్థాలను అందిస్తుంది. ఇలాగ విభిన్న అర్థాలు గల పదాలతో ఉండే దానిని ‘శ్లేషాలంకారం’ అంటారు. అంటే నానార్థాలను కలిగి ఉండే అలంకారం శ్లేషాలంకారం.

కింది లక్ష్యాలలో ఉన్న అలంకారాన్ని గుర్తించి, సమన్వయం చేయండి.
1. రాజు కువలయానందకరుడు.
అర్థం :
1. రాజు (దేశాన్ని పాలించే ప్రభువు) కువలయమునకు (భూమండలానికి) ఆనందకరుడు.
2. రాజు (చంద్రుడు) కువలయములకు (కలువలకు) ఆనందకరుడు.
వివరణ :
పై వాక్యంలో రాజు (పరిపాలకుడు, చంద్రుడు), కువలయం (భూమి, కలువ) అనేవి వేర్వేరు అర్థాలలో ప్రయోగించారు. కనుక అది శ్లేషాలంకారం.

2. నీవేల వచ్చెదవు.
అర్థం :
1. నీవు ఏల (ఎందుకు) వచ్చెదవు.
2. నీవు ఏల (పరిపాలించడానికి) వచ్చెదవు.
వివరణ :
పై వాక్యంలో ‘ఏల’ అనే పదాన్ని ఎందుకు’, ‘పరిపాలించడానికి’ అనే విభిన్న అర్థాలలో ప్రయోగించారు. కనుక, అది శ్లేషాలంకారం.

అదనపు సమాచారము

సంధులు

1) కట్టెదుట = కడు + ఎదుట – ద్విరుక్తటకారాదేశ సంధి
2) నిట్టనిలువు = నిలువు + నిలువు – ఆమ్రేడిత సంధి
3) గుర్రాలు = గుర్రము + లు – లులనల సంధి
4) పదాలు = పదము + లు – లులనల సంధి
5) మిన్నందుకొన్న = మిన్ను + అందుకొన్న – ఉత్వ సంధి
6) ఆయత్తమయినాడు = ఆయత్తము + అయినాడు – ఉత్వ సంధి
7) ఏమిటని = ఏమిటి + అని – ఇత్వ సంధి

సమాసాలు

సమాస పదంవిగ్రహవాక్యంసమాసం పేరు
1) మానవ చరిత్రమానవుల యొక్క చరిత్రషష్ఠీ తత్పురుష సమాసం
2) సమాజ రుగ్మతలుసమాజంలోని రుగ్మతలుషష్ఠీ తత్పురుష సమాసం
3) చక్కని నొక్కులుచక్కనైన నొక్కులువిశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
4) చిక్కని పదాలుచిక్కనైన పదాలువిశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
5) శుభదినంశుభమైన దినంవిశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
6) తప్పటడుగులుతప్పు అయిన అడుగులువిశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
7) అలతి మాటలుఅలతియైన మాటలువిశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
8) అనాదిఆదికానిదినఇ్ తత్పురుష సమాసం
9) అందచందాలుఅందమును, చందమునుద్వంద్వ సమాసం

ప్రకృతి- వికృతి

కుడ్యము – గోడ
విజ్ఞానము – విన్నాణము
భాషలు – బాసలు
పద్యము – పద్దెము
కవిత – కైత
మూలిక – మొక్క
పర్వము – పబ్బము
గుహ – గొబ
యంత్రము – జంత్రము

పర్యాయపదాలు

1) మాట : 1) పలుకు 2) వచనము 3) ఉక్తి
2) అడుగు : 1) పాదం 2) చరణం 3) పదం
3) గుర్రాలు : 1) అశ్వములు 2) హయములు 3) తురంగములు
4) పొట్ట : 1) కడుపు 2) కుక్షి 3) ఉదరం
5) చింత : 1) చింతచెట్టు 2) ఆలోచన 3) దుఃఖము
6) మనిషి : 1) మానవుడు 2) నరుడు 3) మర్త్యుడు 4) మనుజుడు
7) దిక్కు : 1) దిశ 2) ఆశ 3 ) దెస 4) కడ
8) కాయ : 1) వీణకు అమర్చే సొరకాయ 2) చెట్టుకాయ 3) బిడ్డ 4) జూదపు సారె

కవి పరిచయం

AP SSC 10th Class Telugu Solutions Chapter 9 మాణిక్యవీణ 6
విద్వాన్ విశ్వం జననం జననీ జనకులు : అసలు పేరు మీసరగండ విశ్వరూపాచారి. వీరిది అనంతపురం జిల్లాలోని తరిమెల గ్రామం. జననీ జనకులు లక్ష్మమ్మ, రామయ్య దంపతులు.

రచనలు : “ఇంత మంచి పెన్నతల్లి ఎందుకిట్లు మారెనో?
ఇంత మంది కన్నతల్లి ఎందుకెండి పోయెనో ?”
అని ఆవేదనతో ‘పెన్నేటిపాట’ను సృష్టించాడు. ‘ప్రేమించాను’ అనే నవల, ‘ఒకనాడు’, ‘పెన్నేటిపాట’ అనే కావ్యాలు విద్వాన్ విశ్వం కలం నుండి జాలువారిన రచనలు.

పాండిత్యం – పత్రికలు : సంస్కృతాంధ్రాంగ్ల భాషా పండితులు విద్వాన్ విశ్వం. మీజాన్, ప్రజాశక్తి, ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి పత్రికలలో వివిధ హోదాలలో పనిచేశారు. పత్రికా సంపాదకునిగా “అవి – ఇవి’, ‘తెలుపు – నలుపు’, ‘మాణిక్య వీణ’ మొదలైన శీర్షికలను భాష, సాహిత్యం , సమాజం, నైతిక విలువలు తదితర అంశాలపై సంపాదకీయాలు రాశారు. పత్రికల్లో వివిధ హోదాలలో పనిచేస్తూనే సంస్కృత భాషలోని అనేక గ్రంథాలు తెలుగులోకి అనువదించారు.

విశ్వం – విశ్వరూపం : సాహితీవేత్తగా, రాజకీయనాయకునిగా, పత్రికా సంపాదకునిగా బహుముఖీన దర్శనమిచ్చిన ప్రతిభాశాలి విద్వాన్ విశ్వం. ఆయన సాహిత్య సేవకు కళాప్రపూర్ణ, డి.లిట్. పట్టాలనందు కున్నాడు.

గేయాలు అర్థాలు భావాలు

1. అవగాహన – ప్రతిస్పందన

గేయం -1

మంత్రాలతో చింతకాయలు
రాలనప్పుడు పద్యం
సంత్రాసంతో చింతలు
పారిపోతాయా?
అర్థాలు :
సంత్రాసం = మిక్కిలి భయం
చింతలు = బాధలు

భావం:
మంత్రాలతో చింతకాయలు రాలవు. అలాగే పద్యం నిర్మాణంలోని యతులు, ప్రాసలు, గణాలు మొదలైన వాటికి భయపడితే ఆ భయంతో మనలోని వేదనలు, బాధలు తగ్గవు. అంటే మన బాధలు, భయాలను వచన కవితలోనైనా, వ్యక్తీకరించాలి. అలా వ్యక్తీకరిస్తేనే మనశ్శాంతి కలుగుతుంది.

గేయం -2

యంత్రాలతో జబ్బులు
వయం కానప్పుడు
తంత్రాలతో సమాజరుగ్మతలు
దారికి వస్తాయా?
ఆంటే అనవచ్చు,
ఔనని కొందలుతో
అనిపించనూ వచ్చు.
అర్థాలు:
తంత్రము = హేతువు
రుగ్మత = రోగం, జబ్బు

భావం :
రోగిని పరీక్షించే యంత్రాల వలన రోగాలు తగ్గవు. ఉపాయాలు, హేతువులు అన్వేషిస్తూ, కాలక్షేపం చేస్తే సమాజం లోని చెడు లక్షణాలు, దురాచారాలు నిర్మూలనం కావు. ఈ విషయాలను కొంతమంది ఆమోదిస్తారు. కొంతమంది ఇష్టం లేకపోయినా కాదనలేక ఔనంటారు.

AP SSC 10th Class Telugu Solutions Chapter 9 మాణిక్యవీణ

గేయం -3

పొట్టలోని పుట్టకురుపుతో సంఘం
కట్టెదుట కళవళపడి పోతుంటే
నిట్టనిలువున రోదసిలోనికి
కట్టలు కట్టుకొని దూసుకొనిపోయి
కట్టుకొని పోయేదేమిటని
అంటే అవమావచ్చు,
బావని కొందలతో
అనిపించమావచ్చు.
అర్థాలు:
పుట్టకురుపు = వ్రణము
కళవళపడు = కలతపడు
రోదసి = అంతరిక్షము
భావం :
మనిషిలోని చెడు లక్షణాలు, దురాచారాలు, మూఢ నమ్మకాలు అనే పుట్ట కురుపుతో కలతపడుతుంటే రాకెట్లను అంతరిక్షంలోకి పంపుతూ చేసే పరిశోధనల వలన ప్రయోజన మేముంది ? అదంతా వృథా అని కొంతమంది అనవచ్చును. కొంతమందిచేత అనిపించవచ్చును.

ఆలోచించండి – చెప్పండి

ప్రశ్న 1.
ఈ కవితలో ప్రాస పదాలు ఏమున్నాయి?
జవాబు:
ఈ కవితలో చింతకాయలు- చింతలు, అనవచ్చు అనిపించనూవచ్చు, పొట్ట-పుట్ట, కట్టెదుట- నిట్టనిలువు, కట్టలు – కట్టుకొని, కాడు – మోడు, చక్కని – చిక్కని, మొక్కలు – నిక్కి కిలకిలలు – కలభాషలు, కలమ – కళలు, విజ్ఞానం – ప్రజ్ఞానం, చిరంజీవి – చిరంతనుడు, జ్ఞానం – విజ్ఞానం అనే ప్రాసపదాలు ఉన్నాయి.

ప్రశ్న 2.
“అంటే అనవచ్చు, ఔనని కొందఱతో అనిపించనూ వచ్చు” అనే వాక్యాల ద్వారా మీరేమి గ్రహించారు?
జవాబు:
ఒకదానికి ఇంకోదానికి ముడివేసి, కొంతమంది సమాజపు అభ్యున్నతినీ, శాస్త్ర పరిశోధనలనూ ప్రశ్నిస్తే ప్రశ్నించవచ్చును. వారి వాదానికి మద్దతుగా ఇంకా కొంతమందితో ఔననిపించవచ్చును. ఎంతమంది ప్రశ్నించినా, అడ్డు తగిలినా, వాద ప్రతివాదనలు చేసినా మానవజాతి పురోగమిస్తూనే ఉంటుంది. అభివృద్ధి చెందుతూనే ఉంటుంది.

ప్రశ్న 3.
సమాజ రుగ్మతలు’ అంటే ఏమిటి? కొన్ని ఉదాహరణలు చెప్పండి.
జవాబు:
సమాజ రుగ్మతలు’ అంటే సమాజానికి అనగా సంఘానికి పట్టిన జబ్బులు.

  1. అంటరానితనాన్ని పాటించడం
  2. కులమతభేదాలు పాటించడం
  3. మూఢనమ్మకాలు కలిగియుండడం
  4. అవినీతి దురాచారం
  5. కులసంఘాలు, మత సంఘాలు మొ||నవి.

AP SSC 10th Class Telugu Solutions Chapter 9 మాణిక్యవీణ

ప్రశ్న 4.
“పొట్టలోని పుట్టకురుపుతో సంఘం కట్టెదుట కళవళ పడిపోవడం” అంటే ఏమిటి?
జవాబు:
పొట్ట అంటే సంఘంలోని కీలకమైన స్థానాలు. పుట్టకురుపు అంటే ఎప్పటికీ తగ్గకుండా, వ్యాపించే గుణం కలిగిన పెద్ద ప్రణం. అంటే సమాజం అభివృద్ధికి కారకులు కావలసిన వారే అవినీతి, బంధుప్రీతితో సంఘాన్ని పాడుచేస్తున్నారు. అవినీతిని అంత మొందించాలని సామాన్యులు భావించినా, ఏమీ చేయలేని స్థితి. అందుచేత అవినీతి అనే పుట్టకురుపు సంఘమంతా వ్యాపిస్తోంది. మొత్తం సంఘాన్ని కలుషితం చేస్తోంది. దీనికితోడు, కుల, మత, ప్రాంత విభేదాలు, దురాచారాలు మొదలైనవి కూడా అవినీతిని ఆసరా చేసుకొని విజృంభిస్తున్నాయి. వీటన్నిటి ఫలితంగా మన సంఘం మన ఎదురుగానే మనలేక, ఎవరినీ ఏమనలేక కలవరపడుతోంది.

గేయం – 4

మనిషి కనువిచ్చినప్పుడే
నాని అందచందాలు చవిగొన్నాడు.
ఆనాడే ప్రకృతిని
ఆధీనం చేసుకోవడానికి
అందలి రంగులమా రవళిని
అనుకరించడానికి కూడా ఆయత్తమయివాడు.
గుహలలో వివసించేవాడే
గోడలపై గుర్రాలు, జింకలూ గీసుకున్నాడు
అర్థాలు :
కనువిచ్చుట – జ్ఞానం కలగడం) జన్మించడం
రవళి = ధ్వని
ఆయత్తము = సిద్ధము

భావం:
మానవ జన్మ ప్రారంభమైన తొలి రోజులలోనే ఆది మానవుడు ప్రకృతి అందచందాలను గమనించాడు. ఆనాడే ప్రకృతిని జయించడానికి ప్రయత్నించాడు. ప్రకృతిలోని రంగులనూ, అందాలనూ చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. ప్రకృతిలోని పక్షులు, జంతువుల అరుపుల ధ్వనులను అనుకరించాడు. కొద్దిగా అభివృద్ధి చెంది గుహలలో నివసించి నప్పుడు ఆ గోడలపై గుజ్జాలూ, జింకలూ మొదలైన వేగంగా కదిలే జంతువుల బొమ్మలను చిత్రించాడు. ఆ బొమ్మల ద్వారా వేగవంతమైన తన అభివృద్ధిని అన్యాపదేశంగా చెప్పాడు.

గేయం – 5

కాడు వీడనప్పుడే
మోడులు చివురించేలా
పాడడం ఆరంభించినాడు
గులకతాల ములుకుమీదే
గొబ్బున కాలికి గల కట్టివాడు.
దిక్కులు పిక్కటిల్లేలా
ఘీంకరించుటే కాదు
మొక్కలు విక్కి చూచేలా
చక్కని నొక్కులలో
చిక్కని పదాలు పాడుకొన్నాడు.
అర్థాలు:
కాడు = అడవి
మోడు = ఎండిన చెట్టు
ములుకు = వాడియైన మొన
గొబ్బున = శీఘ్రంగా
నిక్కి = నిలబడి
నొక్కులు = వంపుసొంపులు
చిక్కని = గంభీరమైన, దట్టమైన
పదాలు = పాటలు

భావం:
కొంచెం అభివృద్ధి చెందిన ఆదిమానవుడు అడవిలో సంచరించినప్పుడే ఎండిన చెట్లు కూడా చిగురించేలా గొంతెత్తి పాడడం మొదలు పెట్టాడు. ఆ అడవిలో వాడియైన మొనదేలిన గులకరాళ్ల మీదనే శీఘ్రంగా కాలికి గజ్జెకట్టి ఆనందంతో నృత్యం చేశాడు. దిక్కులు పిక్కటిల్లేలా గర్జించాడు. క్రూరమృగాలను కూడా తన అరుపులతో భయపెట్టాడు. అంతేకాదు మొక్కలు కూడా తలయెత్తి చూచేలా చక్కని లయతో గంభీరమైన పదాలతో పాటలు పాడుకొన్నాడు.

గేయం -6

“చక్రం కనుక్కున్న రోజెంత
చరిత్రలో ప్రముఖ దివమో
చరచరా నాలుగు గీతలతో ఓ ఆకారం
విరచించిన రోజు అంతే ప్రముఖం
నిప్పును కనుక్కున్న నాడెంత శుభదినమో
తప్పటడుగులు మావి
తాండవం చేసిన వాడు అంతే శుభదినం.
అర్థాలు :
ప్రముఖము = ముఖ్యము
విరచించుట = ఉత్తమంగా రచించడం
శుభదినం = మంచి రోజు
తప్పటడుగులు = తడబడే అడుగులు
చరచరా = తొందరగా

భావం:
మానవ చరిత్రలో ఇంకా అభివృద్ధి చెందిన మానవుడు ‘చక్రం’ కనుగొన్న రోజు తన అభివృద్ధికి తొలిమెట్టు. చకచకా నాలుగు గీతలతో ఒక ఆకారాన్ని లిఖించిన రోజు కూడా అభివృద్ధికి సంకేత దినమే. ప్రముఖమైన రోజే, నిప్పును కనుగొన్న రోజు మానవజాతి పరిణామంలో గొప్ప శుభదినం. తడబడే అడుగులు మాని, శాస్త్ర బద్ధంగా ఉద్ధతమైన నృత్యం చేసిన రోజు కూడా అంతే శుభదినం.

ఆలోచించండి – చెప్పండి

ప్రశ్న 1.
ప్రకృతికీ, మనిషికీ ఉండే సంబంధం ఏమిటి?
జవాబు:
మనిషి కళ్ళు తెరవగానే తనచుట్టూ ఉన్న ప్రకృతి యొక్క అందచందాలకు పరవశుడయ్యాడు. ప్రకృతిని అతడు తన అధీనంలో ఉంచుకోవడానికి కూడా ప్రయత్నం చేశాడు. ప్రకృతిలోని రంగుల్నీ, ధ్వనుల్ని అనుకరించ డానికి ప్రయత్నం చేశాడు. ఈ విధంగా ప్రకృతితో మనిషి తాదాత్మ్యం చెందాడు.

AP SSC 10th Class Telugu Solutions Chapter 9 మాణిక్యవీణ

ప్రశ్న 2.
ఈ కవితలో పద సౌందర్యంతో వినసొంపుగా ఉన్న పదాలు ఏవి?
జవాబు:
ఈ కవితలో ప్రాస పదాలన్నీ పద సౌందర్యంతో వినసొంపుగా ఉన్నాయి. అంతేకాక ఎక్కువ పదాలు సౌందర్యవంతంగా ఉన్నాయి.
మంత్రాలు – సంత్రాలు, చింతలు – చింతకాయలు, సమాజ – రుగ్మతలు, యంత్రాలు – తంత్రాలు, అనవచ్చు – అనిపించనూవచ్చు, పొట్ట – పుట్ట, కట్టెదుట – కట్టలు కట్టుకొని, అననూవచ్చు – అనిపించనూవచ్చు. అందచందాలు, రంగులను – రవళినీ, కాడు – వీడు,
మోడు, గొబ్బున – గజ్జె కట్టడం, మొక్కలు • నిక్కి చక్కని నొక్కులు, చిక్కని పదాలు, చరచరా, విరచించిన,

తప్పటడుగులు, కిలకిలలు – కల భాషలు, అలతి – కలమ, కళలు, విజ్ఞానం – ప్రజ్ఞానం, తళతళలు, చిన్నవాడు, చిరంజీవి – చిరంతనుడు, మహాప్రస్థానం
మొదలైన’ పదాలు ఈ కవితలో పద సౌందర్యంతో వినసొంపుగా ఉన్నాయి.

ప్రశ్న 3.
చక్రం కనుగొనడం, నిప్పును కనుగొనడం చరిత్రలో అతి ముఖ్యమైనవని ఎందుకంటారు?
జవాబు:
1) చక్రం కనుగొనడం :
చక్రాన్ని కనుగొన్న తరువాతే బళ్ళు, రిక్షాలు, సైకిళ్ళు, మోటారు సైకిళ్ళు, రైళ్ళు, యంత్రాలు వగైరా వాడుకలోకి వచ్చాయి. నేటి పారిశ్రామిక అభివృద్ధి అంతా, ‘చక్రం’ తిరగడం మీదే ఆధారపడింది.

2) నిప్పును కనుగొనడం :
చెకుముకి రాయితో దూదిని వెలిగించి నిప్పును తయారుచేశారు. నిప్పు గురించి తెలియని ఆదిమానవుడు మొదట పచ్చి పదార్థాలు తిన్నాడు. పచ్చిమాంసం తిన్నాడు. నిప్పు కనిపెట్టాక పదార్థాలను ఉడకబెట్టి, రుచికరంగా తిన్నాడు. కాబట్టి, నిప్పును కనుగొనడం, చక్రంను కనుగొనడం అనేవి, ఆధునిక నాగరికతకు, మానవ ప్రగతికి సంకేతాలు.

ప్రశ్న 4.
‘తప్పటడుగులు మాని తాండవం చేసిననాడు శుభదినం’ అంటే ఏమిటి?
జవాబు:
చిన్నపిల్లలు తప్పటడుగులు వేస్తారు. నడకలు నేర్చాక తాండవ నృత్యం చేస్తారు. మనిషి రాతియుగంనాటి చీకటిని చీల్చుకొని, నవీన విజ్ఞానపు వెలుతురులోకి ప్రవేశించడాన్నే, తాండవ నృత్యంగా కవి సంకేతించాడు.

గేయం -7

కిలకిలలు మావి కలభాషలు నేర్చుకున్న రోజు
అలతి మాటలతో పదాలల్లుకున్న రోజు
కలను ధావ్యం పండించుకున్న రోజు
కళలను పండించుకున్న రోజు
అన్నీ గొప్ప రోజులే
మానవ చరిత్రలో
అన్నీ అసాధారణ పర్వదినాలే
అర్థాలు:
కలభాష = అవ్యక్త మధురమైన భాష
అలతి = తేలిక
కలమము = వరి పైరు
కళలు = విద్యలు
పర్వదినం = పండుగ

భావం :
మానవుడు, జంతువులు – పక్షులు లాగా అర్థంలేని కిలకిలలను మాని అవ్యక్త మధురమైన భాష నేర్చుకొన్న రోజు శుభదినం. తేలిక మాటలతో పదాలను అల్లుకున్న రోజు నిజంగా పండుగరోజు. 64 రకాల కళలను నేర్చుకొన్న రోజు మంచి రోజు. అవి అన్నీ గొప్ప రోజులే. మానవ చరిత్రలో అన్నీ అసాధారణమైన పర్వదినాలే.

గేయం – 8

అలా అలా కలగలిపి
పెనవేసుకొని
కళలూ కవితలూ
విజ్ఞానం ప్రజ్ఞానం
తళతళలతో తన్ను నడిపింపగా
మిన్నులు పడ్డ చోటునుండి
తిన్నగా ఎదిగి మిన్నందుకుంటున్న
చిన్నవాడు మానవుడు
చిరంజీవి మానవుడు
చిరంతనుడు మానవుడు
ఆవాదిగా నడుస్తున్న ఈ
మహాప్రస్థానంలో
అతగానివి వదలని
జతలు కళా కవితా
జ్ఞావం విజ్ఞానం
వానితో నడిచేవి
వానిని నడిపించేవీ అవే –
అవే కళా కవితా
జ్ఞావం విజ్ఞానం
ప్రజ్ఞానం
అర్థాలు:
విజ్ఞానం = విశేషమైన తెలివి
ప్రజ్ఞానం = మేధ
మిన్నులు పడ్డచోటు = సుదూరప్రాంతం (ఆకాశం భూమి కలిసినట్లు కనిపించే సుదూరప్రాంతం)
మిన్ను = ఆకాశం
చిరంజీవి = మరణం లేనివాడు
చిరంతనుడు = చాలాకాలపు వాడు (ప్రాతవాడు)
అనాది = బాగా పూర్వం
మహాప్రస్థానం = పెద్దదైన ప్రయాణం

భావం :
అలా అన్నీ కలగలిపి, ఒకదానితో ఒకటి పెనవేసు కొన్నాయి. కళలూ, కవితలూ, విశేషమైన తెలివి, మేధ అన్నీ మానవుని నడిపించాయి. దూరంగా దిక్కుల వైపు చూస్తే ఆకాశం, భూమి కలిసినట్లు కనిపిస్తుంది. అలాగ దానినే ఆదర్శంగా చేసుకొని, అభివృద్ధి చెంది ఆధునిక మానవుడు రోదసీలోకి ప్రయాణించాడు. అయినా మానవుడు ఇంకా అభివృద్ధి చెందుతున్న చిన్నవాడు. శాశ్వతమైనవాడు. చాలా పాతవాడు. చాలా పూర్వం నుండీ నడుస్తున్న ఈ సుదీర్ఘ ప్రయాణంలో మానవుని వదలనివి కళలు – కవితలు, జ్ఞానం – విజ్ఞానం, అవి మానవునితో అభివృద్ధి చెందుతున్నాయి. మానవునికి కర్తవ్యాన్ని బోధిస్తూ పురోగమింపచేస్తున్నాయి. అవే అవే కళాత్మకమైన కవిత్వం, జ్ఞానం, విజ్ఞానం కలగలిసిన ప్రజ్ఞానం.

ఆలోచించండి – చెప్పండి

ప్రశ్న 1.
కవి వేటిని గొప్ప రోజులన్నాడు? ఎందుకు?
జవాబు:
మానవుడు
1) కిలకిలలు మాని కలభాషలు నేర్చుకొన్నరోజు
2) చిన్న చిన్న మాటలతో జానపదాలు అల్లుకొన్నరోజు
3) వరిధాన్యం పండించుకున్నరోజు
4) కళలను పెంపొందించుకున్న రోజు గొప్ప రోజులని కవి చెప్పాడు. ఎందుకంటే మానవుడు కళలను కవితలను ఆధారం చేసుకొని, విజ్ఞాన మార్గంలో ప్రయాణించాడు.

ప్రశ్న 2.
మీ దృష్టిలో ఏవి గొప్ప రోజులు? ఎందుకు?
జవాబు:
మాకు మంచి జరిగిన రోజులన్నీ మా దృష్టిలో గొప్ప రోజులే. ఎందుకంటే అవి మాకు ఆనందాన్ని, అభివృద్ధిని కలిగిస్తాయి. కనుక, మేము తొలిసారి నడక నేర్చుకొన్న రోజు గొప్పరోజు. ఎందుకంటే ఎవరి సహాయం లేకుండా నాకు నేనుగా ఈ రోజు నడవగలుగుతున్నాను. పరుగు పందేలలో పాల్గొంటున్నాను. బహుమతులు గెలుచుకొంటున్నాను. నాట్యం చేస్తున్నాను. చాలా పాటలకు నాట్యం చేయగలం.

మేము తొలిసారి మాటలు నేర్చుకొన్న రోజులు కూడా మా దృష్టిలో గొప్ప రోజులే. ఎందుకంటే మాటలు నేర్చుకోవడం వలననే నేడు మాట్లాడగలుగుతున్నాం.

తొలిసారి సైకిల్ తొక్కడం నేర్చుకొన్న రోజులు మరచిపోలేము. వేగంగా ప్రయాణించడానికి, గమ్యం చేరడానికి సైకిల్ బాగా ఉపయోగపడుతోంది.

మేము తొలిసారి ‘ఓనమాలు’ దిద్దిన రోజులు మరచిపోలేము. అలా నేర్చుకొన్న అక్షరాలే మాకీ వేళ జ్ఞాన సముపార్జనకు ఉపయోగపడుతున్నాయి.

AP SSC 10th Class Telugu Solutions Chapter 9 మాణిక్యవీణ

ప్రశ్న 3.
‘కళలూ, కవితలూ-పెనవేసుకోవడం’ అనే వాక్యాన్ని సమర్థిస్తూ మాట్లాడండి.
జవాబు:
కళ అంటే అందం, విద్య అని అర్ధాలు. కవిత్వం అంటే భావాన్ని రసాత్మకంగా, ఆకర్షణీయంగా చెప్పడం. అంటే చక్కని పదాలతో, మంచి మంచి అలంకారాలతో ఒక భావాన్ని చెబితే అదే కళాత్మకమైన కవిత్వం అవుతుంది. చక్కని పదాలు, అలంకారాలు లేనిది కవిత్వం కాదు. అందుచేత కళ లేకపోతే కవిత్వానికి విలువ ఉండదు అని చెప్పవచ్చు.

కళలు 64 మానవుడు కష్టపడి సాధించినవి. మానవ జాతి అభివృద్ధిని సూచించేవి కళలు. మానవజాతి నిరంతరం కృషిచేసి కళలను సాధించింది. కళల వలన అభివృద్ధి, సంఘపరమైన గౌరవం మనిషికి లభిస్తుంది. అటువంటి కళలు నేర్చుకోవడంలో మానవుడు సాటిలేని ఆనందం పొందాడు. అటువంటి కళలను కవిత్వంలో చెప్పుకొని ఆనందించాడు. అంటే మానవ జీవితంలో కళలు, కవిత్వం పెనవేసుకొని పోయాయి. పాటకు సంగీతం అంటే స్వరం, లయ, గాన సరళి లేకపోతే బాగుండదు. అలాగే సాహిత్యం లేకపోతే అసలు బాగుండదు. కనుక పాటలో సంగీతం, సాహిత్యం ఎలా పెనవేసుకొని ఉంటాయో అలాగే మానవజీవితంలో కూడా కళలు, కవిత్వం విడదీయలేనంతగా కలసి పోయాయి.

ప్రశ్న 4.
“మిన్నందుకుంటున్న చిన్నవాడు” అని ఎందుకన్నాడు కవి?
జవాబు:
మానవుడు ఆదిమకాలంలో అనగా రాతియుగం రోజుల్లో నాగరికత లేకుండా జీవించేవాడు. అంటే బట్ట కట్టుకోవాలని కూడా తెలియని చిన్నపిల్లవాడిలా, చిన్నవాడుగా ఉండేవాడు.

ఇప్పుడు వైజ్ఞానిక యుగంలో కళలతో, కవిత్వంతో మిన్ను అందుకున్నాడు. అంటే ఆకాశం ఎత్తుకు పెరిగాడు. అంటే వైజ్ఞానికంగా అభ్యున్నతిని సాధించాడని భావం.

ప్రశ్న 5.
“కళా, కవితాజ్ఞానం, విజ్ఞానం ” అంటే ఏమిటి?
జవాబు:
‘కళ అంటే – తాను వెలుగుతూ ఇతరులను వెలిగించేది. ఈ కళలు 64. అందులో సుందరమైన సంగీతం, సాహిత్యం , చిత్రలేఖనం, నృత్యం వంటివి లలిత కళలు.

కవితాజ్ఞానం అంటే కవిత్వం రాయగలగడం. కవితను అర్థం చేసికోగలగడం. విజ్ఞానం అంటే, విశేషమైన తెలివి. ఇది శాస్త్ర సంబంధమైనది.

ఇవీ తెలుసుకోండి

చతుషష్టి కళలు (64కళలు):
1) ఇతిహాసము2) ఆగమము
3) కావ్యము4) అలంకారము
5) నాటకము6) గాయకము
7) కవిత్వము8) కామశాస్త్రము
9) దురోదరము10) దేశభాష లిపి జ్ఞానము
11) లిపి కర్మము12) వాచకము
13) అవధానము14) సర్వశాస్త్రము
15) శకునము16) సాముద్రికము
17) రత్యశాస్త్రము18) రధాశ్వగజ కౌశలము
19) మల్లశాస్త్రము20) శూదకర్మము
21) వోహము22) గంధనాదము
23) ధాతువాదము24) ఖనివాదము
25) రసవాదము26) జలపాదము
27) అగ్నిస్తంభనము28) ఖడ్గస్తంభనము
29) వాక్ స్తంభనము30) వాయుస్తంభనము
31) వశ్యము32) ఆకర్షణము
33) మోహనము34) విద్వేషణము
35) ఉచ్ఛాటనము36) మారణము
37) కాలవంచము38) పరకాయ ప్రవేశం
39) పాదుకాసిద్ధి40) వాక్సుద్ధి
41) ఇంద్రజాలము42) అంజనము
43) దృష్టివంచనము44) సర్వవంచనము
45) మణిసిద్ధి46) చోరకర్మము
47) చిత్రక్రియ48) లోహక్రియ
49) అశ్వక్రియ50) మృత్రియ
51) దారుక్రియ52) వేణుక్రియ
53) చర్మక్రియ54) అంబరక్రియ
55) అదృశ్యకరణము56) దుతికరణము
57) వాణిజ్యము58) పాశుపల్యము
59) కృషి60) అశ్వకరణము
61) ప్రాణిదుత్య కౌశలము62) జలస్తంభనము
63) మంత్రసిద్ధి64) ఔషధ సిద్ధి

చిరంజీవులు:
1) హనుమంతుడు
2) వ్యాసుడు
3) అశ్వత్థామ
4) విభీషణుడు
5) బలిచక్రవర్తి
6) కృపాచార్యుడు
7) పరశురాముడు

AP SSC 10th Class Telugu Important Questions Chapter 3 జానపదుని జాబు

AP State Board Syllabus AP SSC 10th Class Telugu Important Questions Chapter 3 జానపదుని జాబు

AP State Syllabus SSC 10th Class Telugu Important Questions 3rd Lesson జానపదుని జాబు

10th Class Telugu 3rd Lesson జానపదుని జాబు 2 Marks Important Questions and Answers

ఈ క్రింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాల్లో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
జానపదుని జాబు రచయిత గురించి వ్రాయండి.
జవాబు:
జానపదుని జాబు పాఠమును డా|| బోయి భీమన్నగారు రచించారు. ఆయన తూర్పుగోదావరి జిల్లాలోని మామిడికుదురులో జన్మించారు. వారు 1911 నుండి 2005 వరకు జీవించారు.

వీరు కొంతకాలం జర్నలిస్టుగా పనిచేశారు. 1940-45 వరకు ఉపాధ్యాయునిగా పనిచేశారు. స్వాతంత్ర్య ఉద్యమకాలంలో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. వీరు డిశంబరు 16వ తేదీ, 2005న మరణించారు.

ప్రశ్న 2.
జానపదుని జాబు రచయిత ఎవరు? ఆయన రచనా వ్యాసంగాన్ని గూర్చి వ్రాయండి.
జవాబు:
జానపదుని జాబు పాఠమును డా॥ బోయి భీమన్న గారు రచించారు.

ఆయన తన 11వ ఏట నుండే రచనలు చేశారు. “గుడిసెలు కాలిపోతున్నాయి”, పాలేరు, జానపదుని జాబు, పిల్లీ శతకం, ఉశారులు, ధర్మం కోసం పోరాటం, రాగవైశాఖి మొదలైన 70 రచనలు చేశారు.

ఆయన రచించిన పాలేరు నాటకం ప్రభావంతో ఎంతోమంది పేదలు, దళితులు తమ పిల్లలను పాలేరు వృత్తి మాన్పించి పాఠశాలలో చేర్పించారు. ఈ నాటకం స్ఫూర్తితో ఎంతోమంది ఉన్నత విద్యావంతులయ్యారు. ఉన్నతోద్యోగులు అయ్యారు.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 3 జానపదుని జాబు

ప్రశ్న 3.
జానపదుని జాబు రచయిత ఎవరు? ఆయన అందుకొన్న పురస్కారాలేవి?
జవాబు:
జానపదుని జాబు పాఠమును డా|| బోయి భీమన్నగారు రచించారు. ఆయన రచించిన గుడిసెలు కాలిపోతున్నాయ్ రచనకు 1975లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. కేంద్ర ప్రభుత్వం 1973లో పద్మశ్రీ బిరుదునిచ్చింది. 2001లో పద్మభూషణ్ బిరుదునిచ్చి గౌరవించింది.

ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ బిరుదును ఇచ్చింది.

1978+84 మధ్య రాష్ట్ర ప్రభుత్వం శాసన మండలి సభ్యత్వం ఇచ్చి బోయి భీమన్న గారిని గౌరవించింది. 1991లో . రాజ్యలక్ష్మీ ఫౌండేషన్ వారు రాజ్యలక్ష్మీ అవార్డును ఇచ్చి సత్కరించారు.

ప్రశ్న 4.
పల్లెటూరి జీవితం ఎలా ఉంటుందో తెలపండి.
జవాబు:
పల్లెటూరి జీవితం ఎంతో మనోహరంగా ఉంటుంది. అక్కడ చక్కని గాలి, ఎండ, నీరు దొరుకుతుంది. పాలు, కూరగాయలు దొరుకుతాయి. మంచి అందమైన చేలూ, కాలువలూ ఉంటాయి. అక్కడ ప్రకృతి మనోహరంగా ఉంటుంది. కాని, ఆధునిక సదుపాయాలు ఏవీ అక్కడ ఉండవు. అక్కడి ప్రజలు కలిసిమెలిసి జీవిస్తారు. ఒకరికి మరొకరు సహాయం చేసుకుంటూ ఉంటారు.

ప్రశ్న 5.
రచయిత పాత్ర స్వభావాన్ని రాయండి.
జవాబు:
గ్రామీణ నేపథ్యాన్ని ఇష్టపడతాడు. పేద కుటుంబీకుడు. తన కుటుంబంతో చాలా అనుబంధం గలవాడు. పట్నవాసులంతా సుఖంగా ఉంటారనే అపోహ కలవాడు. రైతు కుటుంబం. తోటి రైతుల కష్టాలలో పాలుపంచుకొనే స్వభావం కలవాడు. పల్లెటూరి ప్రజలపై ప్రేమ కలవాడు. పల్లెటూరిపై మమకారం కలవాడు.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 3 జానపదుని జాబు

ప్రశ్న 6.
జానపదుని జాబు” పాఠ్యభాగ నేపథ్యం గురించి రాయండి.
జవాబు:
చదువుకొని బీదతనం వలన చదువు కొనసాగించలేక స్వగ్రామం పోయి పల్లెటూరి పనులలో మునిగిపోయిన ‘జానపదుడు’ శ్రీమంతుడైన తన మిత్రునికి తన అవస్థలను, గ్రామాలలోని పరిస్థితులను లేఖల రూపంలో తెలుపుటయే జానపదుని జాబు పాఠ్యభాగ నేపథ్యము.

ప్రశ్న 7.
సమాచార సాధనమైన ‘లేఖ’ను గురించి వివరించండి. (March 2018)
జవాబు:

  1. సమాచారాన్ని చేరవేసే సాధనం లేఖ.
  2. కొన్ని సందర్భాలలో ప్రత్యేక సాహితీ లక్షణాలను, విలువలను కలిగి ఉంటుంది.
  3. లేఖలు ఆయాకాలాలకు సంబంధించినవే అయినా, కొన్నిసార్లు అందులోని విషయాలు అన్ని కాలాలకు వర్తిస్తాయి.
  4. లేఖలు వ్యక్తిగత లేఖలు, అధికారిక లేఖలు, వ్యాపారాత్మక లేఖలు అని ప్రధానంగా మూడు విధాలుగా ఉంటాయి.

10th Class Telugu 3rd Lesson జానపదుని జాబు 4 Marks Important Questions and Answers

ఈ క్రింది ప్రశ్నలకు 10 లేక 12 వాక్యాల్లో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
‘బద్దకం’ గురించి మీ అభిప్రాయం తెలపండి.
జవాబు:
‘బద్దకం’ అంటే పనిచేయడానికి వెనుకాడడం. అంటే మాంద్యము. సోమరిపోతులయిన వారు ఏ పని చేయడానికీ ముందుకు రారు. వారికి పనిచేయడానికి బద్దకం. తగిన పని, చేతిలో లేకపోతే పనిమంతులకు కూడా బద్దకం వస్తుంది.

నగరాలలో వారికి చేతిలో ఏదో పని ఉంటుంది. గ్రామాలలో రైతులకు కొన్ని రోజుల్లోనే పని ఎక్కువగా ఉంటుంది. కొన్ని రోజుల్లో ఏ పనీ ఉండదు. అప్పుడు వారు ముడుచుకొని మంచము ఎక్కి పడుకుంటారు. లేదా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు.

కాని ‘బద్దకం’ మంచి లక్షణం కాదు. పిల్లలు బడికి వెళ్ళడానికి, పాఠం చదవటానికి, ఇంటి పని చేయడానికి బద్దకిస్తూ ఉంటారు. అది మంచిది కాదు. ఏ రోజు పని ఆ రోజే పూర్తి చెయ్యాలి. బద్దకం విడిచి చురుకుగా పనులు చేస్తే మంచి ఆరోగ్యం ఉంటుంది. బద్దకం, సంజ నిద్ర, పనికిరాదని సుమతీ శతకం చెపుతోంది. ముఖ్యంగా యువత, బద్దకం, విడిచి తమ పనులు సకాలంలో సాగిస్తే దేశం సౌభాగ్యవంతం అవుతుంది.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 3 జానపదుని జాబు

ప్రశ్న 2.
బద్దకం వదలాలంటే ఏమి చేయాలో వివరించండి.
జవాబు:
‘బద్దకం’ అంటే పని చేయడానికి ముందుకు రాకపోవడం. పని బద్ధకులకు అభివృద్ధి ఉండదు. బద్దకం వదలాలంటే రాత్రి పెందలకడనే నిద్రపోవాలి. ఉదయం సూర్యోదయం కాకుండానే లేవాలి. నడక, పరుగు, వంటి వ్యాయామాలు చేయాలి. పిల్లలు, పెద్దలకు ఇంటి పనుల్లో సాయం చేయాలి. చక్కగా స్నానం చేయాలి. పిల్లలు సాయం సమయంలో ఆటలు ఆడాలి. హాయిగా గొంతువిప్పి పాటలు పాడాలి.

పిల్లలు బద్దకంగా టి.విల ముందు కూర్చుండి, సీరియల్సు చూస్తూ ఉండరాదు. ఆడపిల్లలు తల్లుల పనిలో సాయం చేయాలి. మగపిల్లలు తండ్రికి పనిలో సాయం చేయాలి. అలా చేస్తే తండ్రి చేసే వృత్తి పనులు వారికి అలవాటు అవుతాయి.

పిల్లలు బద్దకం విడిచి చక్కగా చదువుకుంటే మంచి మార్కులు వస్తాయి. ఆరోగ్యం చక్కగా ఉంటుంది. వారు యోగా, వ్యాయామము వంటి వాటిలో పాల్గొంటూ, ఆటపాటలలో పాల్గొంటూ మంచి చురుకుగా, ఉత్సాహంగా ఉండాలి. అటువంటి చురుకైన యువతవల్లే దేశం సర్వతోముఖంగా అభివృద్ధి అవుతుంది.

ప్రశ్న 3.
కాలం ఎలా విలువైందో నిరూపించు.
జవాబు:
‘కాలము’ విలువ అయింది. గడచిన క్షణం, తిరిగి రాదు. ప్రతి వ్యక్తి తాను చేయవలసిన పనిని సకాలంలో చేయాలి. రేపు . చేద్దాం అనుకుంటే, ఒక రోజు అతడి జీవితంలో వ్యర్థం అయినట్లే.

మన ఆయుర్దాయం చాలా పరిమితంగా ఉంటుంది. మనం ఎంత కాలం బ్రతుకుతామో మనకు తెలియదు. దేవుడిని ప్రార్థించేందుకు తిరిగి మనకు సమయం దొరకదు. బ్రతికి ఉండగానే దైవపూజ చేయాలి. చేయవలసిన పనులు పూర్తి చేయాలి. ఒక పరీక్షకు సిద్ధపడే వ్యక్తి ఏ రోజుకు ఆ రోజు చదివి సిద్ధం కావాలి. రేపు అనే మాట ఉండరాదు. అందరూ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. జీవితాన్ని ఒక క్రమపద్ధతిలో నడుపుకోవాలి. ఆడవలసిన కాలంలో ఆడాలి. వ్యాయామం చేయవలసిన కాలంలో వ్యాయామం చేయాలి.

డాక్టరుగారు నిత్యం వ్యాయామం చేసి ఉన్నట్లయితే గుండె రోగం వచ్చి ఉండేది కాదంటారు. అప్పుడు మనం పశ్చాత్తాప పడతాం. కాని జరిగి పోయిన కాలాన్ని మనం వెనుకకు తీసుకురాలేము. ఎంత డబ్బు ఇచ్చినా, జరిగిపోయిన కాలాన్ని ఒక్క నిమిషం కూడా తిరిగి తీసుకురాలేము.

కాబట్టి కాలం ప్రాధాన్యాన్ని గుర్తించి, సకాలంలో ప్రతి పనినీ పూర్తి చేసి జీవితాన్ని సక్రమంగా నడుపుకోవాలి. గ్రామాల్లో రైతులు సకాలంలో పొలం పనులు చేపట్టాలి. సకాలంలో పురుగుమందులు చల్లాలి. లేకపోతే పొలంలో పంట, నాశనం అవుతుంది.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 3 జానపదుని జాబు

ప్రశ్న 4.
పల్లెల్లో నివసించే వారందరూ నిజంగా సుఖపడుతున్నారని భావిస్తున్నారా?
జవాబు:
పల్లెలు నిజానికి సౌఖ్యనిలయాలు. పల్లెల్లో మంచి పాడిపంటలు ఉంటాయి. తాజాకూరగాయలు, చల్లని, కలుషితం కాని గాలి లభిస్తుంది. ప్రతి ఇల్లు ముగ్గులతో, పూల తోరణాలతో కలకలలాడుతూ ఉంటుంది. గ్రామాలలో ఆవులు, గేదెలు ఇచ్చే తాజా పాలు లభిస్తాయి. అక్కడ కల్మషం లేని ప్రజల పలకరింపులు దొరుకుతాయి. పల్లె ప్రజలు పరస్పరం ఒకరికి , మరొకరు సాయం చేసుకుంటారు. పల్లెల్లో మంచి తాజాపళ్ళు, కూరలు లభిస్తాయి.

కాని గ్రామాలలో కూడా కొన్ని లోటుపాట్లు ఉంటాయి. ముఖ్యంగా వాటికి రోడ్లు, ప్రయాణసౌకర్యాలు ఉండవు. విద్య, వైద్య సదుపాయాలు ఉండవు. కావలసిన వస్తువులు అన్నీ అక్కడ దొరకవు. సరుకులకై నగరాలకు వెళ్ళాలి. చదువులకు నగరాలకు వెళ్ళాలి. రోగం వస్తే మంచి డాక్టర్లు పల్లెల్లో ఉండరు. విద్యుచ్ఛక్తి కూడా 24 గంటలూ అక్కడ లభించదు. కొత్త బట్టలు వగైరా కావాలంటే నగరాలకు పల్లెవాసులు వెళ్ళాలి.

కాబట్టి పల్లెల్లో నివసించే వారందరూ నిజంగా సుఖపడుతున్నారని మనం భావించకూడదు. పల్లె ప్రజల కష్టాలు పల్లెవాసులకు ఉన్నాయి. పల్లె ప్రజలకు తగిన విశ్రాంతి ఉండదు. 24 గంటలు శ్రమిస్తేనే కాని వారికి కూడు, గుడ్డ దొరకదు.

ప్రశ్న 5.
పల్లెటూరి జీవితం హాయిగా ఉంటుందని ఎలా చెప్పగలవు?
జవాబు:
పల్లెటూళ్ళలో జీవితం ప్రశాంతంగా ఉంటుంది. చక్కని గాలి, ఎండ, నీరు, ఆహారము ప్రతి ఒక్కరికీ లభిస్తుంది. అక్కడ చక్కని ప్రకృతి శోభ ఉంటుంది. పచ్చని పొలాలు కలకలలాడుతూ, గాలికి తలలాడిస్తూ గ్రామ ప్రజలను సుఖసంతోషాలతోముంచెత్తుతాయి.

ప్రజలందరికీ పాడి పంటలు ఉంటాయి. పొయ్యి కిందికీ, పొయ్యి మీదికీ వారికి కావలసినవన్నీ అక్కడే దొరుకుతాయి. గ్రామంలో చేతివృత్తుల వారు ఒకర్ని ఒకరు, అన్నదమ్ములుగా భావిస్తూ పరస్పరం ఒకరికొకరు సాయపడతారు.

పల్లెల్లో ఒకరి ఇంట్లో పెళ్ళయితే, ఊరందరికీ అది పండుగ. పల్లెల్లో ముఖ్యంగా సంక్రాంతి పండుగకు ముగ్గులు, గొబ్బిళ్ళు, భోగి మంటలు, సంక్రాంతి ప్రభలు మహావైభవంగా తీర్థాలూ సాగుతాయి. హరిదాసులు, గంగిరెద్దులు, పగటివేషధారులూ, వారి చక్కని పాటలూ ఆనందాన్ని ఇస్తాయి.

గ్రామీణులు ఆనందంగా నవ్వుతూ కలకలలాడుతూ ఒకరిని ఒకరు బంధుత్వంతో పలకరించుకుంటూ, కష్టసుఖాల్లో అందరూ పాలు పంచుకుంటారు. గ్రామాలు పాడిపంటలకు నిలయాలు. అవి ప్రకృతి రమణీయతకు పుట్టిళ్ళు.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 3 జానపదుని జాబు

ప్రశ్న 6.
శ్రమదోపిడి గురించి రచయిత ఉద్దేశ్యమేమిటి?
జవాబు:
సామాన్యంగా గ్రామాల్లో భూకామందులు, తమకున్న పొలాలను తాము సేద్యం చేసుకోకుండా గ్రామాల్లోని బీద రైతులకు కౌలుకు ఇస్తుంటారు. ఆ బీద రైతులు ధనికుల పొలాలను కౌలుకు తీసుకొని, కష్టపడి సేద్యం చేస్తుంటారు. రాత్రింబగళ్ళు కష్టపడి పండించిన ధాన్యాన్ని భూకామందులకు వారు కౌలుగా వారికి చెల్లిస్తారు. మిగిలిన ధాన్యాన్ని వారు తింటారు. కాని సామాన్యంగా కౌలు రైతులకు ఏమీ మిగలదు. భూకామందులు, బీద రైతుల శ్రమను దోపిడీ చేయడం క్రింద వస్తుంది.

బీదరైతులు శ్రమపడి పండించిన ఫలసాయాన్ని భూకామందులు దోచుకుంటున్నారన్నమాట నిజానికి శ్రమపడేవానికి ఫలాన్ని తినే హక్కు ఉంటుంది. కాని ఇక్కడ శ్రమ ఒకరిది, ఫలం మరొకరిది అవుతోంది.
దీనినే దృష్టిలో ఉంచుకొని రైతులు కష్టపడుతున్నారని, కాని దాని ఫలితం ఇనాందారుకు లభిస్తోందని చెప్పడమే ఇక్కడ రచయిత ఉద్దేశ్యమై ఉంటుంది.

ప్రశ్న 7.
పల్లె ప్రజల కష్టాలను వివరించండి.
జవాబు:
పల్లెలలో ప్రజలు కష్టపడి పంటలు పండిస్తారు. ఒకప్పుడు వర్షాలు ఉండవు. చేలకు నీళ్ళను తోడాలి. ఒకప్పుడు తోడుకోవడానికి సైతం వారికి నీళ్ళు దొరకవు. ఒక్కొక్కసారి అతివృష్టి, ఒక్కొక్కసారి అనావృష్టి సంభవిస్తుంది.

వారి మోటర్లకు రాత్రింబవళ్ళు విద్యుచ్ఛక్తి ఉండదు. పాడిపశువులకు మేత లభించదు. రాత్రివేళల్లో కూడ చేనుకు నీరు పెట్టడానికి వారు వెళ్ళాల్సివస్తుంది. చీడపీడలకు పురుగుమందులు చల్లాలి. ఒకప్పుడు వారికి అవి ప్రమాదాన్ని తీసుకువస్తాయి.

చక్కగా పండిన పంట, ఒక్కరోజు పురుగు పట్టి తినేస్తుంది. ఇనాందార్లకు కౌలు చెల్లించాక రైతుకు ఫలసాయం మిగలదు. ఒక్కొక్కసారి కాలం కలసివస్తే పంట మిగులుతుంది. కాని రైతుకు దానికి తగిన ధర లభించదు.

రైతు పండించిన పంటలను వర్తకులు చౌకగా కొంటారు. కాని రైతుకు కావలసిన ఎరువులు వగైరా ఎక్కువ ధరకు కాని దొరకవు. పల్లె ప్రజలకు విద్యావైద్య సదుపాయాలు ఉండవు. వారికి రోడ్డు, బస్సు సౌకర్యాలు ఉండవు. ప్రతి వస్తువు కోసం నగరాలకు వెళ్ళాలి. రోగం వస్తే వారు నగరాలకు బళ్ళ పై రోగులను తీసుకువెళ్ళాలి. ఒకప్పుడు మోసుకు వెళ్ళాల్సివస్తుంది.

ఈ విధంగా పల్లెల్లో ప్రజలు ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 3 జానపదుని జాబు

ప్రశ్న 8.
పల్లెల ప్రగతికి మీరిచ్చే సలహాలు, సూచనలు ఏవి?
జవాబు:
పల్లెలు బాగుపడాలంటే రైతులకు కావలసిన ఎరువులు, పురుగుమందులు, విత్తనాలు చౌకగా వారికి అందించాలి. గ్రామాల్లో వ్యవసాయంతో పాటు, పాడి పరిశ్రమ అభివృద్ధి కావాలి. రైతులకు ప్రభుత్వం విత్తనాలు మంచివి చౌకధరలకు ఇవ్వాలి. తక్కువ వడ్డీకి బ్యాంకులు వారికి ఋణాలు ఇవ్వాలి.

రైతులు తోటల్లో పశుగ్రాసాన్ని పెంచుకోవాలి. వారు పాడి పశువులను పెంచి, పాల ఉత్పత్తులను మంచి ధరలకు అమ్ముకోవాలి. రైతుల ఉత్పత్తులకు మంచి ధరలు లభించాలి. రైతులు కూరగాయలను పెంచాలి.

గ్రామాల్లో ప్రజలకు విద్యావైద్య సదుపాయాలు కల్పించాలి. ప్రతి గ్రామానికి మంచినీటి కుళాయిలు, రోడ్లు, విద్యుచ్ఛక్తి సదుపాయం ఉండాలి. ప్రతి గ్రామానికి నగరాలకు పోవడానికి బస్సులు ఉండాలి. పల్లె ప్రజలు సంఘాలుగా ఏర్పడి గ్రామాలలో చెరువులు బాగు చేసుకోవాలి. మురికి నీరు దిగే కాలువలు బాగు చేసుకోవాలి. ప్రభుత్వ సహాయంతో గ్రామాలకు రోడ్లు వేసుకోవాలి. గ్రామీణ స్త్రీలు డ్వా క్రా సంఘాలలో చేరి, లఘు పరిశ్రమలను చేపట్టాలి.

పల్లెలలోని ప్రజలు తమ పిల్లలను తప్పక చదివించాలి. పిల్లలందరికీ టీకాలు వేయించాలి. పల్లెలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. పల్లె ప్రజలు తీరిక సమయాల్లో చేతి వృత్తులు చేపట్టి దాని ద్వారా ధనం సంపాదించాలి.

రైతులు పండించే ఉత్పత్తులకు న్యాయమైన మంచి ధరలు లభించేలా అధికారులు చర్యలు చేపట్టాలి. గ్రామాల్లోని పోరంబోకు పొలాల్లో రైతులు సమిష్టిగా సహకార వ్యవసాయం చేపట్టాలి.

ప్రశ్న 9.
పల్లెటూళ్ళ సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన అవసరాలను వివరించండి.
జవాబు:
పల్లెటూళ్ళలో ప్రజలు ఒకరినొకరు ఆప్యాయంగా అక్కా, బావా అంటూ పలకరించుకుంటారు. పల్లెలలో పండుగలు, ఉత్సవాలు, వేడుకగా జరుగుతాయి. సంక్రాంతి, దసరా వంటి పండుగలకు, గ్రామాలు చక్కగా అలంకరింపబడతాయి. ప్రతి ఇంటికి రంగుల పూలతోరణాలు కడతారు. వివిధ వాయిద్యాలు మ్రోగిస్తారు. గంగిరెద్దులు, గరగలు, విచిత్రవేషాలు తోలుబొమ్మలాటలు, హరికథలు వగైరా ఉంటాయి. ఈ కళలు మన సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుతున్నాయి.

భోగిమంటలు, హరిదాసుల కీర్తనలు సంక్రాంతికి ఉంటాయి. వీటివల్ల మన ప్రజలకు ప్రాచీన సంస్కృతీ వైభవం తెలుస్తుంది. గ్రామాలు పరిశుభ్రంగా ఉండి, మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి. భోగిమంటల వల్ల, ముగ్గుల వల్ల దోమలు వగైరా దూరం అవుతాయి. మనుష్యుల మధ్య సత్సంబంధాలు పెరుగుతాయి. ఒకరి కష్టసుఖాల్లో ఒకరు పాలుపంచుకుంటారు.

పల్లెటూళ్ళు మన ప్రాచీన సంస్కృతీ వైభావాన్ని వెల్లడించే కేంద్రాలు. ఈ సంస్కృతీ సంప్రదాయాలను మనం కాపాడుకుంటే మన భారతదేశ ప్రాచీన నాగరికతా వైభవం కాపాడబడుతుంది.

ప్రశ్న 10.
‘పల్లెటూరి జీవితం ప్రశాంతంగా ఉంటుంది’ – సమర్థించండి. (March 2017)
జవాబు:
పల్లెటూళ్ళలో జీవితం ప్రశాంతంగా ఉంటుంది. చక్కని గాలి, ఎండ, నీరు, ఆహారము ప్రతి ఒక్కరికీ లభిస్తుంది. అక్కడ చక్కని ప్రకృతి శోభ ఉంటుంది. పచ్చని పొలాలు కలకలలాడుతూ, గాలికి తలలాడిస్తూ గ్రామ ప్రజలను సుఖసంతోషాలతో ముంచెత్తుతాయి.

ప్రజలందరికీ పాడి పంటలు ఉంటాయి. పొయ్యి కిందికీ, పొయ్యి మీదికీ, వారికి కావలసినవన్నీ అక్కడే దొరుకుతాయి. గ్రామంలో చేతివృత్తుల వారు ఒకర్ని ఒకరు, అన్నదమ్ములుగా భావిస్తూ పరస్పరం ఒకరికొకరు సాయపడతారు.

పల్లెల్లో ఒకరి ఇంట్లో పెళ్ళయితే, ఊరందరికీ అది పండుగ. పల్లెల్లో ముఖ్యంగా సంక్రాంతి పండుగకు ముగ్గులు, గొబ్బిళ్ళు, భోగి మంటలు, సంక్రాంతి ప్రభలు మహావైభవంగా తీర్థాలూ సాగుతాయి. హరిదాసులు, గంగిరెద్దులు, పగటివేషధారులూ, వారి చక్కని పాటలూ ఆనందాన్ని ఇస్తాయి.

గ్రామీణులు ఆనందంగా నవ్వుతూ కలకలలాడుతూ ఒకరిని ఒకరు బంధుత్వంతో పలకరించుకుంటూ, కష్టసుఖాల్లో అందరూ పాలు పంచుకుంటారు. గ్రామాలు పాడిపంటలకు నిలయాలు. అవి ప్రకృతి రమణీయతకు పుట్టిళ్ళు.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 3 జానపదుని జాబు

ప్రశ్న 11.
“పల్లెటూళ్ళలో ప్రజలు పడే కష్టాలు తొలగిపోతే మానవ సంఘానికి పల్లెటూళ్ళు ఆనందాన్ని ఇవ్వగలవు”. దీనిని ‘ సమర్థిస్తూ వివరించండి.
జవాబు:
భారతావనికి పల్లెలు పట్టుకొమ్మలని మహాత్మాగాంధీ బోధించారు. దేశ సర్వతోముఖాభివృద్ధికి పల్లెలు ప్రధాన కారణాలుగా , పేర్కొనవచ్చు. ఒకప్పుడు పల్లెలు ప్రశాంత వాతావరణానికి ఆనవాలుగా ఉండేవి. చుట్టూ పంటపొలాలు, పచ్చని చెట్లు కనువిందు చేస్తుంటాయి. స్వచ్ఛమైన గాలి, జలం దొరుకుతాయి. కలుషితమైన వాతావరణం కన్పించదు.

ప్రజల మధ్య సోదరభావం, సమత్వం కన్పిస్తాయి. కష్ట సుఖాలను సమంగా పంచుకుంటారు. కాని ఈనాడు పల్లెల ప్రజలు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. రైతులకు కనీస మద్దతు ధర లభించడం లేదు. దళారీల పోరు ఎక్కువైంది. కనీస ప్రాథమిక సౌకర్యాలు కూడా పల్లెల్లో కన్పించడంలేదు. ఉపాధి అవకాశాలు లేక ఎంతోమంది పట్టణాలకు వలస పోతున్నారు. రైతులు అప్పుల బాధతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.

ఈ పరిస్థితుల్లో పల్లె ప్రజలకు సౌకర్యాలు కల్పించాలి. విద్య, వైద్యం వంటి సౌకర్యాలు కల్పించాలి, ఉపాధి అవకాశాలను కల్పించాలి. అప్పుడే పల్లె ప్రజలు ఆనందోత్సాహాలతో సుఖంగా ఉంటారు. పల్లె ప్రజలంతా ఆనందంతో సుఖంగా తమ జీవనాన్ని గడుపగలుగుతారు.

10th Class Telugu 3rd Lesson జానపదుని జాబు Important Questions and Answers

ప్రశ్న 1.
అన్నదాత అవస్థ గురించి ఒక వ్యాసం వ్రాయండి.
జవాబు:
( అన్నదాత అవస్థ )

అన్నదాతగా గర్వంగా పిలిపించుకొనే రైతుకు అన్నీ అవస్థలే. ఎప్పుడు వర్షపు చినుకులు నేలపై పడతాయా? అని ఆత్రుతగా, ఆశగా ఆకాశంవైపు చూడడంతో వ్యవసాయంలో రైతుకు అవస్థలు ప్రారంభమౌతాయి. కాలువ నీటి కోసం రాత్రింబవళ్ళు ఎదురు చూస్తాడు.

దుక్కి దున్నుతాడు. విత్తనాలు చల్లుతాడు. కూలీల కొరకు పోటీపడి ఆకుమడి తయారు చేస్తాడు. బాడీబందా, వానా – వరదా పట్టించుకోకుండా వరి నాట్లు వేస్తాడు.

ఆకుమళ్ళను పశువులు తినేయకుండా తొక్కి పాడు చేయకుండా రాత్రింబవళ్ళు రైతు కాపలా కాస్తాడు. ఆ చేలగట్లపై జెర్రీలు, తేళ్ళు, పాములూ ఉంటాయి. అవి కరుస్తుంటాయి. అయినా అన్నదాత పట్టించుకోడు. పురిటిబిడ్డను బాలెంతరాలు కాపాడుకొన్నట్లు పంటను కాపాడతాడు.

ఎరువు చల్లి, పంటను కోసి, పనలు కట్టి కుప్ప వేస్తాడు. నూరుస్తాడు. ధాన్యం అమ్మితే వచ్చిన డబ్బులు చేసిన అప్పులకు సరిపోవు. అయినా వ్యవసాయం మానడు.

అందుకే అన్నదాత అయ్యాడు. అమ్మకే అన్నం పెట్టే అన్నదాతకు భూమాత కూడా కన్న కూతురే.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 3 జానపదుని జాబు

ప్రశ్న 2.
వ్యవసాయ ప్రాధాన్యతను వివరిస్తూ కరపత్రం తయారు చేయండి.
జవాబు:
వ్యవసాయం మన జీవనాధారం

ఆంధ్రులారా ! సోదరులారా !
కల్లాకపటం తెలియని పల్లెటూరి జనాల్లారా !
కంప్యూటరు విద్య నేర్చిన పట్నవాసపు నిరుద్యోగులారా !
రండి! వ్యవసాయం చేద్దాం ! పట్టెడన్నం పదిమందికీ పెడదాం !

ఉద్యోగం చేస్తే ఎవరికో సలాం చేస్తూ బతకాలి. మన బంగారు భూమిని మనమే సాగు చేసుకొంటూ ఏడాదికి మూడు పంటలు పండిద్దాం. ఆకలి మంటలను ఆర్పేద్దాం. కరవు కాటకాలను తరిమేద్దాం. ఆత్మాభిమానంతో జీవిద్దాం. ఎవ్వరికీ తల వంచకుండా బతుకుదాం. ఆంధ్రమాతను భారతదేశపు ధాన్యాగారంగా మారుద్దాం. మన తాత ముత్తాతల దారికి ఆధునికత జోడించి అద్భుతాలు సాధిద్దాం.

భూసారానికి మన తెలివి జతచేసి కలిమిని సృష్టిద్దాం. జై కిసాన్.
ఇట్లు,
భూమి పుత్రులు.

ప్రశ్న 3.
నీ చుట్టూ ఉన్న ప్రకృతిని వర్ణిస్తూ 10 పంక్తుల వచన కవిత రాయండి.
జవాబు:
(‘మా ఇంటి తోట’ వచన కవిత)
మా ఇంటితోట మాకు నచ్చిన పాట
అందమైన మల్లె తీగ, విందు లిచ్చు మొల్లపూలు
రంగు రంగుల గుత్తిపూలు, శృంగారాల విరిజల్లు
దొడ్డిలోన జామచెట్టు, చెట్టుమీద చిలుక గూడు
చిలుక కొట్టిన జామపండు అబ్బో ఎంతో తియ్యగుండు
చెట్లమీద పక్షి గూళ్ళు, చెవులు మెచ్చెడి సంగీతాలు
పెరడులోన పనసచెట్టు, దాని పక్క నిమ్మ మొక్క
గుమ్మం ముందు తులసి తల్లి, చేస్తుంది పూజ మాదుతల్లి
కూరగాయ మొక్కలెన్నో – బీరకాయ పాదులెన్నో
వీధి గుమ్మం వెనుక తట్టు – ఉన్న దొక్కరావి చెట్టు
వేపచెట్టు పిల్లగాలి – అది యిచ్చును మాకు హేళి
పూలమొక్కల మీది గాలి – మొక్కలన్న నాకు జాలి

ప్రశ్న 4.
‘పల్లె సంరక్షణ – మన బాధ్యత’ అని వివరిస్తూ కరపత్రం రూపొందించండి.
జవాబు:
పల్లెటూళ్ళు మన దేశ సౌభాగ్యానికి పుట్టిళ్ళు. మనదేశంలో కొన్ని లక్షల గ్రామాలు ఉన్నాయి. గ్రామాల్లో ఉన్న పల్లె ప్రజలు పంటలు పండిస్తేనే నగరవాసులకు ఇంత తిండి దొరుకుతుంది. పల్లెల్లో ప్రజలు పశువులను మేపి పాలను నగరాలకు అందిస్తేనే నగరవాసులకు టీ, కాఫీలు దొరుకుతాయి. పల్లెల్లో రైతులు కూరగాయలు పండిస్తేనే, నగరాల కూరగాయల దుకాణానికి కూరగాయలు వస్తాయి.

గ్రామాల్లో చేతి వృత్తులవారు పనిచేస్తేనే కత్తి, చాకు, కొడవలి, మంచాలు, కుర్చీలు, వగైరా పనిముట్లు నగరవాసులకు లభిస్తాయి. గ్రామాల్లో రైతులు పత్తి పండిస్తేనే నగరవాసులకు బట్టలు లభిస్తాయి. నగరాలు ప్రతి దానికి గ్రామాలపైనే ఆధారపడాలి. కాబట్టి ప్రతి దేశ పౌరుడు గ్రామాభివృద్ధికి కంకణం కట్టుకోవాలి. ప్రభుత్వం గ్రామాల్లో రైతులకు చౌకగా ఋణాలు, ఎరువులు, పురుగు మందులు వగైరా అందించాలి. రైతుల ఉత్పత్తులకు మంచి గిట్టుబాటు ధరలను ప్రభుత్వం ఇవ్వాలి. ‘పల్లెల సంరక్షణ బాధ్యత’ ప్రతి పౌరుడు తీసికోవాలి. పల్లెలను రక్షించవలసిన బాధ్యత నగరవాసులదే అని అందరూ గుర్తించాలి. పల్లెలకు రోడ్డు సదుపాయాలు కల్పించాలి. పల్లెల్లో విద్యా వైద్య సదుపాయాలు కల్పించాలి. పల్లెలు పచ్చగా ఉంటేనే నగరాలు తద్వారా దేశం సుభిక్షంగా ఉంటుంది. కాబట్టి కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వాలు, నగరాల్లోని ప్రజలు, పల్లెల ఉత్పత్తులను ఉపయోగించుకుంటున్న అందరూ ముందుకు రావాలి. పల్లెలను, పల్లె ప్రజలను రక్షించాలి. పల్లెలు పచ్చగా ఉండేలా అందరూ చూడాలి.

పల్లెల సంరక్షణకు కంకణం కట్టుకుందాం. కదలి రండి. ఆలస్యం వద్దు. మనదేశ సౌభాగ్యం పల్లెల అభివృద్ధిపైనే ఆధారపడి ఉంది. గమనించండి.

దివి. x x x x x

ఇట్లు,
అఖిల భారత యువజన సంఘం,
విజయవాడ.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 3 జానపదుని జాబు

ప్రశ్న 5.
కిలకిలలాడే పక్షులతో కలకలలాడే పల్లెటూరిలో మీకు నచ్చిన ఒక ప్రకృతి దృశ్యాన్ని వర్ణించండి. (S.A. I – 2018-19)
జవాబు:
పల్లెల్లో పచ్చని చేలు, తలలాడిస్తూ మనల్ని ఆహ్వానిస్తాయి. చెట్లపై చిలుకలూ, పిచ్చుకలూ దోబూచులాడుకుంటూ ఉంటాయి. వృక్షాలపై పక్షులు గొంతెత్తి పాటలు కమ్మగా పాడుతాయి. పక్షుల మధురనినాదాల ముందు సుశీలమ్మ పాటలు ఏమి హాయి? బాటలన్నీ ముత్యాల ముగ్గులతో, ముసి ముసి నవ్వులు నవ్వుతాయి. పొలాల్లో ఆవులు మేతలు మేస్తూ, అంభారవాలు చేస్తూ ఉంటాయి. పశువుల కాపర్ల జానపద గీతాలు జోరుజోరుగా వినిపిస్తాయి. మామిళ్ళు, పనసలు చెట్లపై కాయలతో నిండు ముత్తదువుల్లా ఉంటాయి. కాల్వ గట్ల నుండి పోతూ ఉంటే పిల్లకాల్వలు సన్నగా సాగుతూంటాయి. పచ్చగా ఈనిన వరిచేలు, బుక్కా చల్లుకొన్న పడుచుకన్నెల్లా ఉంటాయి. పల్లెల్లోని ప్రకృతి దృశ్యాలు అతిథుల నేత్రాలకు విందు చేస్తాయి.

10th Class Telugu 3rd Lesson జానపదుని జాబు 1 Mark Bits

1. గురుశిష్యులు పూదోటకు వెళ్ళారు – (గీత గీసిన పదమును విడదీసిన రూపమును గుర్తించండి.) (March 2017)
A) పూన్ + తోట
B) పూవు + తోట
C) పూ + తోట
D) పూవు + తోట
జవాబు:
B, D

2. కాలం ఎంతో విలువైనది – గీత గీసిన పదానికి నానార్ధములు గుర్తించండి. (S.A. I – 2018-19 June 2018)
A) నలుపు, కళ
B) సమయం, నలుపు
C) చావు, జీవనం
D) జీవనం, సంతోషం
జవాబు:
B) సమయం, నలుపు

3. సీత సంగీతం, నృత్యం నేర్చుకుంటున్నది. (ఏ వాక్యమో గుర్తించండి.) (June 2017)
A) సామాన్య వాక్యం
B) సంక్లిష్ట వాక్యం
C) సంయుక్త వాక్యం
D) కర్మణీ వాక్యం
జవాబు:
C) సంయుక్త వాక్యం

AP SSC 10th Class Telugu Important Questions Chapter 3 జానపదుని జాబు

4. రామారావు మెట్లు ఎక్కుతూ, దిక్కులు చూస్తున్నాడు. (ఏ వాక్యమో గుర్తించండి.) (June 2017)
A) కర్మణీ వాక్యం
B) సంక్లిష్ట వాక్యం
C) సంయుక్త వాక్యం
D) సామాన్య వాక్యం
జవాబు:
B) సంక్లిష్ట వాక్యం

5. తాత పిల్లలకు నీతి కథలు చెప్పాడు – దీనికి కర్మణి వాక్యం గుర్తించండి. (March 2017)
A) తాత చేత పిల్లలకు నీతి కథలు చెప్పబడ్డాయి
B) తాత చేత పిల్లలకు నీతి కథలు చెప్పబడలేదు
C) తాత పిల్లలకు నీతి కథలు చెప్పాడా ?
D) తాత పిల్లలకు నీతి కథలు చెప్పలేదు
జవాబు:
A) తాత చేత పిల్లలకు నీతి కథలు చెప్పబడ్డాయి

6. రైతుల చేత పంటలు పండించబడ్డాయి – దీనికి కర్తరి వాక్యం గుర్తించండి. (March 2017)
A) రైతులు పంటలను పండించలేదు
B) రైతులు చేత పంటలు పండించబడలేదు
C) రైతుల చేత పంటలు పండించబడ్డాయి
D) రైతులు పంటలను పండించారు.
జవాబు:
D) రైతులు పంటలను పండించారు.

7. తాత భారతం చదివి నిద్రపోయాడు – ఏ వాక్యమో గుర్తించండి. June 2018
A) చేదర్థకము
B) సంయుక్త వాక్యము
C) సంక్లిష్ట వాక్యము
D) నిషేధార్థకము
జవాబు:
C) సంక్లిష్ట వాక్యము

AP SSC 10th Class Telugu Important Questions Chapter 3 జానపదుని జాబు

8. రామకృష్ణ వివేకానందులు గురుశిష్యులు – ఇది ఏ రకమైన వాక్యమో గుర్తించండి. (June 2018)
A) సామాన్య వాక్యం
B) కర్తరి వాక్యం
C) సంక్లిష్ట వాక్యం
D) సంయుక్త వాక్యం
జవాబు:
D) సంయుక్త వాక్యం

9. పురిటిలోనే సంధి కొట్టడం : సంధివాక్యంలో వస్తుంది. ఇది పురిటిలోనే వస్తే తప్పక మరణిస్తారు. అలాగే ఏదైనా పని ప్రారంభంలోనే నాశనమైన సందర్భంలో ఈ జాతీయం ఉపయోగిస్తారు. (June 2017)

10. అడుగున పడిపోవుట : క్రొత్త సమస్యలు వస్తే పాత సమస్యలు అడుగున పడిపోతాయి. (June 2017)

11. కష్టఫలం : నేడు రైతులకు బొత్తిగా కష్టఫలం దక్కడం లేదు. (June 2018)

12. పొద్దస్తమానం : అన్నదాతలు పొద్దస్తమానం పొలాల్లో పనిచేస్తారు. (June 2018)

13. చమత్కారం : రఘురామ్ మాటలలో చమత్కారం తొణికిసలాడుతుంటుంది. (June 2018)

14. తునాతునకలు : ముక్కలు ముక్కలగుట / ఛిన్నాభిన్నమగుట అనే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడుతారు. (S.A.I -2018-19 March 2018)

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 4 కిష్కింధ కాండ

AP State Board Syllabus AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం 4th Lesson కిష్కింధ కాండ Textbook Questions and Answers.

AP State Syllabus SSC 10th Class Telugu Solutions ఉపవాచకం 4th Lesson కిష్కింధ కాండ

10th Class Telugu ఉపవాచకం 4th Lesson కిష్కింధ కాండ Textbook Questions and Answers

I. అవగాహన – ప్రతిస్పందన

సంఘటనా క్రమం

సంఘటనల ఆధారంగా వరుస క్రమంలో వాక్యాలను అమర్చడం

1. అ) ఋష్యమూక పర్వతం నుంచి రామలక్ష్మణులను చూశాడు సుగ్రీవుడు.
ఆ) ఈయన మాట్లాడే తీరు చూస్తే చంపడానికి కత్తి ఎత్తిన శత్రువుు కూడా చేతులు రావు అని మెచ్చుకున్నాడు.
ఇ) సుగ్రీవుని ఆనతి మీద రామలక్ష్మణులున్న చోటికి ఒక్క గంతు వేశాడు హనుమంతుడు.
ఈ) హనుమంతుని మాటతీరు శ్రీరాముణ్ణి ఆకట్టుకుంది.
జవాబులు
అ) ఋష్యమూక పర్వతం నుంచి రామలక్ష్మణులను చూశాడు సుగ్రీవుడు.
ఇ) సుగ్రీవుని ఆనతి మీద రామలక్ష్మణులున్న చోటికి ఒక్క గంతు వేశాడు.
ఈ) హనుమంతుని మాటతీరు శ్రీరాముణ్ణి ఆకట్టుకుంది.
ఆ) ఈయన మాట్లాడే తీరు చూస్తే చంపడానికి కత్తి ఎత్తిన శత్రువుకు కూడా చేతులు రావు అని మెచ్చుకున్నాడు.

2. అ) శ్రీరామసుగ్రీవులు స్నేహపూర్వకంగా మాట్లాడుకుంటున్న సమయంలోనే సీతాదేవికి, వాలికి, రావణాసురునికి ఎడమకన్ను ఒక్కసారిగా అదిరింది.
ఆ) శ్రీరామ, సుగ్రీవులు అగ్నిసాక్షిగా మిత్రులైనారు.
ఇ) సుగ్రీవుడు గతంలో తాను నలుగురు మంత్రులతో కొండమీద ఉన్నప్పుడు ఒక రాక్షసుడు స్త్రీని బలవంతంగా తీసుకుపోవడం చూశామన్నాడు.
ఈ) శ్రీరాముడు మందహాసాన్ని చిందిస్తూ ‘సుగ్రీవా! ఆపదలో ఆదుకునేవాడే గదా మిత్రుడు. నీ భార్యను అపహరించిన
వాలిని తప్పక వధిస్తాన’ని మాట ఇచ్చాడు.
జవాబులు
ఆ) శ్రీరామ, సుగ్రీవులు అగ్నిసాక్షిగా మిత్రులైనారు.
ఈ) శ్రీరాముడు మందహాసాన్ని చిందిస్తూ ‘సుగ్రీవా! ఆపదలో ఆదుకునేవాడే గదా మిత్రుడు. నీ భార్యను అపహరించిన వాలిని తప్పక వదిస్తాన’ని మాట ఇచ్చాడు.
అ) శ్రీరామసుగ్రీవులు స్నేహపూర్వకంగా మాట్లాడుకుంటున్న సమయంలోనే సీతాదేవికి, వాలికి, రావణాసురునికి ఎడమ కన్ను ఒక్కసారిగా అదిరింది.
ఇ) సుగ్రీవుడు గతంలో తాను నలుగురు మంత్రులతో కొండమీద ఉన్నప్పుడు ఒక రాక్షసుడు స్త్రీని బలవంతంగా తీసుకుపోవడం చూశామన్నాడు.

3. అ) తమ్ముడి భార్యను చెరబట్టడం వంటి అధర్మాలకు ఒడిగట్టినందువల్ల నేను నీకు మరణదండన విధించానన్నాడు శ్రీరాముడు.
ఆ) శ్రీరాముడు కాలి బొటనవేలితో అక్కడ పడి ఉన్న దుందుభి అస్థిపంజరాన్ని పదియోజనాల దూరం పడేటట్లు చిమ్మివేశాడు. ఒకే బాణంతో ఏడు మద్దిచెట్లను చీల్చాడు.
ఇ) విషసర్పంతో సమానమైన బాణాన్ని అతడు వాలి మీదకు వదిలాడు.
ఈ) వానరుడివి గనుక చాటుగా ఉండి చంపడంలో తప్పులేదన్నాడు.
జవాబులు
ఆ) శ్రీరాముడు కాలి బొటనవేలితో అక్కడ పడి ఉన్న దుందుభి అస్థిపంజరాన్ని పదియోజనాల దూరం పడేటట్లు చిమ్మివేశాడు. ఒకే బాణంతో ఏడు మద్దిచెట్లను చీల్చాడు.
ఇ) విషసర్పంతో సమానమైన బాణాన్ని అతడు వాలి మీదకు వదిలాడు.
అ) తమ్ముడి భార్యను చెరబట్టడం వంటి అధర్మాలకు ఒడిగట్టినందువల్ల నేను నీకు మరణదండన విధించానన్నాడు శ్రీరాముడు.
ఈ) వానరుడివి గనుక చాటుగా ఉండి చంపడంలో తప్పులేదన్నాడు.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 4 కిష్కింధ కాండ

4. అ) ప్రాయోపవేశానికి సిద్ధపడిన తారసు హనుమంతుడు ఓదార్చాడు.
ఆ) ఒకనాటి అర్ధరాత్రి మాయావి కిష్కింధకు వచ్చి వాలిని యుద్ధానికి ఆహ్వానించాడు.
ఇ) సంపాతి తన సోదరుని మరణానికి ఎంతో విలపించాడు.
ఈ) సుగ్రీవుడు వివిధ ప్రాంతాలలో గల వానర వీరులను రావలసిందిగా చెప్పమని హనుమంతుడిని ఆజ్ఞాపించాడు.
జవాబులు
ఈ) సుగ్రీవుడు వివిధ ప్రాంతాలలో గల వానర వీరులను రావలసిందిగా చెప్పమని హనుమంతుడిని ఆజ్ఞాపించాడు.
ఇ) సంపాతి తన సోదరుని మరణానికి ఎంతో విలపించాడు.
ఆ) ఒకనాటి అర్థరాత్రి మాయావి కిష్కింధకు వచ్చి వాలిని యుద్ధానికి ఆహ్వానించాడు.
అ) ప్రాయోపవేశానికి సిద్ధపడిన తారను హనుమంతుడు ఓదార్చాడు.

5. అ) శ్రీరాముని బలమెంతో తెలుసుకోవాలనుకున్నాడు సుగ్రీవుడు.
ఆ) శ్రీరాముడి శోకాన్ని పోగొట్టే ప్రయత్నం చేశాడు సుగ్రీవుడు.
ఇ) లక్ష్మణ హనుమాదులతో కలిసి సుగ్రీవుడిని సమీపించాడు శ్రీరాముడు.
ఈ) సుగ్రీవుని ఆనతితో హనుమంతుడు రామలక్ష్మణులను సమీపించాడు.
జవాబులు
ఈ) సుగ్రీవుని ఆనతితో హనుమంతుడు రామలక్ష్మణులను సమీపించాడు.
ఆ) శ్రీరాముడి శోకాన్ని పోగొట్టే ప్రయత్నం చేశాడు సుగ్రీవుడు. అ) శ్రీరాముని బలమెంతో తెలుసుకోవాలనుకున్నాడు సుగ్రీవుడు.
ఇ) లక్ష్మణ హనుమాదులతో కలిసి సుగ్రీవుడిని సమీపించాడు శ్రీరాముడు.

6. అ) సుగ్రీవుడు రామునితో సమావేశమై వానరుల రాకను చెప్పాడు.
ఆ) భర్త విషయం తెలుసుకున్న తార పరుగున వచ్చింది.
ఇ) సీతాన్వేషణ కార్యభారాన్ని గుర్తుచేశాడు హనుమంతుడు.
ఈ) సుగ్రీవ హనుమదాదులు శ్రీరాముని దగ్గరకు వెళ్ళారు.
జవాబులు
ఆ) భర్త విషయం తెలుసుకున్న తార పరుగున వచ్చింది.
ఈ) సుగ్రీవ హనుమదాదులు శ్రీరాముని దగ్గరకు వెళ్ళారు.
ఇ) సీతాన్వేషణ కార్యభారాన్ని గుర్తుచేశాడు హనుమంతుడు.
అ) సుగ్రీవుడు రామునితో సమావేశమై వానరుల రాకను చెప్పాడు.

7. అ) హనుమంతుడు దక్షిణ దిక్కుకు ప్రయాణమయ్యాడు.
ఆ) హనుమంతుడు నమస్కరించి రామ ముద్రికను గ్రహించాడు.
ఇ) హనుమంతుని మాటలకు జాంబవంతుడు ఆనందించాడు.
ఈ) ఉవ్వెత్తున లేచే అలల అలజడి భయాన్ని కల్గిస్తున్నది.
జవాబులు
అ) హనుమంతుడు దక్షిణ దిక్కుకు ప్రయాణమయ్యాడు.
ఆ) హనుమంతుడు నమస్కరించి రామ ముద్రికను గ్రహించాడు.
ఈ) ఉవ్వెత్తున లేచే అలల అలజడి భయాన్ని కల్గిస్తున్నది.
ఇ) హనుమంతుని మాటలకు జాంబవంతుడు ఆనందించాడు.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 4 కిష్కింధ కాండ

8. అ) సుగ్రీవుడు భయంకరంగా గర్జిస్తూ వాలిని యుద్ధానికి ఆహ్వానించాడు.
ఆ) యుద్ధానికి వెళ్ళడం మంచిదికాదని తార బోధించింది.
ఇ) హనుమంతుని మాటతీరు రాముడిని ఆకట్టుకుంది.
ఈ) వాలితో వైరం ఎందుకు వచ్చిందో తెలుపమన్నాడు శ్రీరాముడు.
జవాబులు
ఇ) హనుమంతుని మాటతీరు రాముడిని ఆకట్టుకుంది.
ఈ) వాలితో వైరం ఎందుకు వచ్చిందో తెలుపమన్నాడు శ్రీరాముడు.
అ) సుగ్రీవుడు భయంకరంగా గర్జిస్తూ వాలిని యుద్ధానికి ఆహ్వానించాడు.
ఆ) యుద్ధానికి వెళ్ళడం మంచిది కాదని తార బోధించింది.

9. అ) రక్తపు మడుగులో పడియున్న వాలి కొంతసేపటికి తేరుకున్నాడు.
ఆ) శ్రీరాముని తమ వల్లనే తాను ఈ స్థితిలో ఉన్నానని సుగ్రీవుడు చెప్పాడు.
ఇ) వాలి సుగ్రీవుల మధ్య యుద్ధం భీకరంగా జరుగుతున్నది.
ఈ) శ్రీరాముని మాటలు విని వాలి తన తప్పు తెలుసుకున్నాడు.
జవాబులు
ఇ) వాలి సుగ్రీవుల మధ్య యుద్ధం భీకరంగా జరుగుతున్నది.
అ) రక్తపు మడుగులో పడియున్న వాలి కొంత సేపటికి తేరుకున్నాడు.
ఈ) శ్రీరాముని మాటలు విని వాలి తన తప్పు తెలుసుకున్నాడు.
ఆ) శ్రీరాముని తమ వల్లనే తాను ఈ స్థితిలో ఉన్నానని సుగ్రీవుడు చెప్పాడు.

10. అ) హనుమంతుని అభిప్రాయాలకు సమ్మతి తెలుపుతూ రామలక్ష్మణులు తమ వృత్తాంతాన్ని చెప్పారు.
ఆ) అగ్నిసాక్షిగా రామసుగ్రీవులు మిత్రులయ్యారు.
ఇ) వాలి భయంతో సుగ్రీవుడు ఋష్యమూక పర్వతం చేరాడు.
ఈ) హనుమంతుడు సన్యాసి రూపంలో రామలక్ష్మణులను సమీపించాడు.
జవాబులు
ఈ) హనుమంతుడు సన్యాసి రూపంలో రామలక్ష్మణులను సమీపించాడు.
అ) హనుమంతుని అభిప్రాయాలకు సమ్మతి తెలుపుతూ రామలక్ష్మణులు తమ వృత్తాంతాన్ని చెప్పారు.
ఆ) అగ్నిసాక్షిగా రామసుగ్రీవులు మిత్రులయ్యారు.
ఇ) వాలి భయంతో సుగ్రీవుడు ఋష్యమూక పర్వతం చేరాడు.

పాత్ర స్వభావాలు

1. సుగ్రీవుడు :
వాలి యొక్క తమ్ముడు. రాజనీతి బాగా తెలిసినవాడు. వారిని ఓడించడానికి శ్రీరామునితో స్నేహం చేశాడు. ఓడించాడు. శ్రీరామునకు సీతాదేవి జాడను తన మంత్రి అయిన హనుమంతుని ద్వారా కనుగొన్నాడు. రామరావణ సంగ్రామంలో తన బలగాలను వినియోగించాడు. శ్రీరాముని విజయానికి కారకుడయ్యాడు.

2. హనుమంతుడు :
అంజనకు వాయుదేవుని అనుగ్రహం వల్ల జన్మించాడు. సుగ్రీవుని మంత్రి, సుగ్రీవునకు రామలక్ష్మణులతో స్నేహం ఏర్పాటు చేశాడు. సీత ఉన్న అశోకవనం తప్ప లంకంతా కాల్చాడు. సీత జాడ రామునకు చెప్పాడు. సీతకు ధైర్యం చెప్పాడు. తన బలం తనకు తెలియదు. ఎవరైనా తన బలాన్ని గుర్తు చేయాలి. మహాబలవంతుడు. శ్రీరాముని బంటు. చక్కగా మాట్లాడగల నేర్పు ఉన్నవాడు.

3. వాలి :
ఆలోచన తక్కువ. ఆవేశం ఎక్కువ. మహాబలవంతుడు. బలగర్వం ఎక్కువ. తమ్ముడైన సుగ్రీవుని బాధించాడు. భయపెట్టాడు. అతని భార్యను అపహరించాడు. శ్రీరాముని చేతిలో మరణించాడు.

సంఘటన ద్వారా గ్రహించుట

ప్రశ్న 1.
“కాలి అందెలు మాత్రం, మా వదినెగారివే. ఆమెకు నిత్యం పాదాభివందనం చేయడం వల్ల గుర్తుపట్టాను” అని రామునికి లక్ష్మణుడు చెప్పిన మాటను బట్టి, మీరేమి గ్రహించారో తెల్పండి.
జవాబు:
ఒక రాక్షసుడు స్త్రీని బలవంతంగా తీసుకుపోవడం తాను చూశానని, ఆమె రామా ! లక్ష్మణా ! అని అరిచిందనీ, ఒక నగల మూటను విసిరిందనీ చెప్పి సుగ్రీవుడు ఆ నగలను రామునికి చూపించాడు. శ్రీరాముడు సీత నగలను చూసి ఏడ్చాడు. లక్ష్మణుడు ఆ నగలను చూసి తాను ఆ నగల మూటలోని కేయురాలను, కుండలాలను గుర్తుపట్టలేనని అందులోని కాలి అందెలు మాత్రం సీతాదేవివని చెప్పాడు.

ఈ మాటలను బట్టి లక్ష్మణుడు తన వదిన సీతను, ఆ 14 సంవత్సరాలలో ఒక్కసారి కూడా తలపైకి ఎత్తి ఆమె ముఖాన్ని చూడలేదని గ్రహించాను. లక్ష్మణుడు మహాభక్తుడని వదినకు నిత్యం నమస్కరించే వాడనీ గ్రహించాను. లక్ష్మణుని వంటి సుగుణవంతుడు, సచ్చీలుడు మరొకరుండరని గ్రహించాను.

ప్రశ్న 2.
‘లక్ష్మణా ! ఈ హనుమంతుని మాటల్లో ఒక్క వ్యాకరణ దోషం లేదు’ అని రాముడు పలికిన మాటల వల్ల మీరేమి గ్రహించారు?
జవాబు:
హనుమంతుడు సన్యాసి వేషంలో రామలక్ష్మణులను సమీపించాడు. సుగ్రీవుని దూతగా వచ్చాడు. హనుమంతుని మాటల తీరు రామునికి నచ్చింది. హనుమంతుని మాటల్లో వ్యాకరణ దోషాలు లేవని లక్ష్మణుడితో చెప్పాడు.

శ్రీరాముని మాటల తీరును బట్టి హనుమంతుడు మంచి వాక్చాతుర్యం కలవాడని, ఉచ్ఛారణపరమైన, భాషాపరమైన, వ్యాకరణపరమైన దోషాలు లేకుండా మాట్లాడగలిగే సామర్థ్యం కలవాడని గ్రహించాను. మాటల్లో ఎలాంటి దోషాలు లేకుండా మాట్లాడాలని, అది అందరిని ఆకట్టుకుంటుందని గ్రహించాను.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 4 కిష్కింధ కాండ

ప్రశ్న 3.
“తమ్ముడి భార్యను చెరబట్టడం వంటి అధర్మాలకు ఒడిగట్టినందువల్ల నేను నీకు మరణదండన విధించాను” అని రాముడు పలికిన మాటలను బట్టి మీరేమి గ్రహించారు?
జవాబు:
శ్రీరాముడు వాలిని సంహరించాడు. వాలి రామునితో “నన్ను ఎందుకు సంహరించావు?” అని అడిగాడు. దానికి సమాధానంగా రాముడు “తమ్ముని భార్యను చెరబెట్టడం వంటి అధర్మాలకు ఒడిగట్టినందువల్ల నేను నీకు మరణదండన విధించాను” అని చెప్పాడు.

శ్రీరాముని మాటల వల్ల పరస్త్రీని చెరబెట్టడం అన్యాయమని గ్రహించాను. సోదరుని భార్యను కూతురుగా భావించాలని, ధర్మాన్ని అతిక్రమించకూడదని గ్రహించాను. శ్రీరాముడు ధర్మాత్ముడు కాబట్టి అధర్మపరుడైన వాలిని సంహరించాడని గ్రహించాను. అధర్మపరులను శిక్షించడమే ధర్మాత్ముల లక్షణంగా గ్రహించాను.

ప్రశ్న 4.
శ్రీరాముడు తన కాలిబొటనవేలితో దుందుభి కళేబరాన్ని దూరంగా పడవేయడం, ఒకే బాణంతో మద్దిచెట్లను చీల్చడం ద్వారా మీరేమి గ్రహించారు?
జవాబు:
రామలక్ష్మణులు సుగ్రీవుడిని సమీపించారు. పరస్పరం స్నేహం చేసుకోవాలనుకున్నారు. శ్రీరాముడు సుగ్రీవునికి తన పరాక్రమంపై నమ్మకాన్ని కల్గించడానికి దుందుభి కళేబరాన్ని కాలిబొటనవేలితో దూరంగా పడవేశాడు. ఒకే బాణంతో మద్ది చెట్లను చీల్చాడు.

దీనివల్ల శ్రీరాముడు అమిత పరాక్రమవంతుడని, అసాధ్యమైన పనులను కూడా సుసాధ్యం చేయగల సమర్థుడని గ్రహించాను. దీనివల్ల శ్రీరాముని బలపరాక్రమాలపై సుగ్రీవునికి నమ్మకం కల్గియుంటుందని గ్రహించాను. విశ్వాసంతోనే మైత్రి చిరకాలం నిలుస్తుందని గ్రహించాను.

ప్రశ్న 5.
“సుగ్రీవా ! ఆపదలో ఆదుకున్నవాడే గదా మిత్రుడు” అని రాముడు పలకడం వల్ల మీరేమి గ్రహించారు?
జవాబు:
రామలక్ష్మణులు సుగ్రీవుడిని సమీపిరచారు. పరస్పరం సహకారం అందించుకోవాలనుకున్నారు. అగ్నిసాక్షిగా స్నేహం చేశారు. రాముడు సుగ్రీవుని బాధలను విని ‘మిత్రమా ! ఆపదలో ఆదుకున్నవాడే గదా మిత్రుడు’ అని మిత్ర ధర్మాన్ని గురించి పలికాడు.

శ్రీరాముని మాటల ద్వారా ఆపదలో ఆదుకున్నవాడే నిజమైన మిత్రుడని గ్రహించాను. మిత్రుని కోసం అవసరమైతే ప్రాణాలను కూడా అర్పించడానికి సిద్ధపడాలని గ్రహించాను. మిత్రుని యొక్క సుఖాల్లోనే కాదు, అతనికి అనుకోని ఆపదలు వచ్చినప్పుడు కూడా. ఆదుకోవాలని గ్రహించాను.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 4 కిష్కింధ కాండ

ప్రశ్న 6.
సంపాతి తన సోదరుడైన జటాయువు మరణవార్త విని బాధపడి వానరులకు సీత జాడను తెలియజేశాడు. దీనిని బట్టి మీరేమి గ్రహించారు?
జవాబు:
సంపాతి జటాయువు సోదరుడు. వానరుల ద్వారా జటాయువు మరణవార్త విని దుఃఖించాడు. ఆ దుఃఖంలోనే వానరులకు సీత జాడను తెలిపాడు. లంకకు వెళ్ళే మార్గాన్ని చెప్పాడు. తరువాత రెక్కలు రావడంతో సంపాతి గగనమార్గంలో వెళ్ళాడు.

జటాయువులాగే ఇతడు కూడా పరోపకారబుద్ధి కలవాడని, శ్రీరాముని సేవలో పరోక్షంగా సహకరించాడని గ్రహించాను. అతని పరోపకారబుద్ధి వల్లే రెక్కలు వచ్చాయని గ్రహించాను. శ్రీరాముని సేవలో తరించిన సంపాతి నిజంగా ధన్యజీవి అని గ్రహించాను.

విషయాత్మక ప్రశ్నలు

ఈ క్రింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
ఒకడు సన్యాసి రూపంలో వచ్చిచెడు చేశాడు. మరొకడు సన్యాసి రూపంలోనే వచ్చి మంచి చేశాడు. వారెవరు? అవేమిటి?
జవాబు:
రావణుడు సన్యాసి రూపంలో వచ్చి, సీతాదేవిని ఎత్తుకెళ్లాడు. సీతారాములకు ఎడబాటు కలిగించి వారి దుఃఖానికి కారకుడయ్యాడు. తన వంశ నాశనానికి కారకుడయ్యాడు. –
హనుమంతుడు సన్యాసి వేషంలో రామలక్ష్మణుల దగ్గరికి వచ్చాడు. సుగ్రీవునితో స్నేహం కుదిర్చాడు. సీతారాముల కలయికకు మార్గం చూపించాడు. తన జన్మ ధన్యం చేసుకొన్నాడు.

ప్రశ్న 2.
వాలి వధలో అధర్మం ఉందా? లేదా? ఎందుకు?
జవాబు:
వాలి వధలో అధర్మం లేదు. వాలి తన తమ్ముని భార్యను అపహరించాడు. అధర్మంగా ప్రవర్తించాడు. ధర్మ స్వరూపుడైన శ్రీరాముడు అధర్మాన్ని సహించలేడు. అధర్మంగా ప్రవర్తిస్తే ఎవరినైనా శిక్షిస్తాడు. అందుకే మరణదండన విధించాడు. వాలి వానరుడు కనుక జంతువులను చెట్ల చాటు నుండి వేటాడడం వేట ధర్మం, కనుక వాలి వధలో అధర్మం లేదు.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 4 కిష్కింధ కాండ

ప్రశ్న 3.
‘సుగ్రీవాజ్ఞ’ అంటే మీకు ఏమి అర్థమైంది?
జవాబు:
‘సుగ్రీవాజ్ఞ’ అంటే తిరుగులేని ఉత్తరువు (శాసనం) అని అర్థం. ఆయన చెప్పింది తలవంచి చేయాల్సిందే. సుగ్రీవుడు సీతాన్వేషణ విషయంలో శ్రీరాముడికి సహాయపడాలనుకున్నాడు. ఆయన వివిధ ప్రాంతాలలో గల వానర వీరులను రావలసిందిగా చెప్పమని హనుమంతుణ్ణి ఆజ్ఞాపించాడు. పదిరోజుల్లోగా రాకపోతే వాళ్ళకు మరణదండన తప్పదని హెచ్చరించాడు. హనుమంతుడు ఈ వార్తను అన్ని దిక్కులకూ వేగంగా పంపాడు. ఫలితంగా కోట్లమంది వానరయోధులు కిష్కింధకు చేరుకున్నారు. సుగ్రీవుని ఆజ్ఞ అటువంటిది. అందుకే సుగ్రీవాజ్ఞ అనేది జాతీయంగా స్థిరపడ్డది.

వ్యాసరూప ప్రశ్నలు

ఈ క్రింది ప్రశ్నలకు 10 లేక 12 వాక్యాల్లో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
వాలి సుగ్రీవుల విరోధం గురించి రాయండి.
(లేదా)
వాలి, సుగ్రీవుల మధ్య విరోధానికి గల కారణాలను తెలపండి.
జవాబు:
వాలి సుగ్రీవులు అన్నదమ్ములు. వాలి మహాబలశాలి. తండ్రి తరువాత ‘కిష్కింధ’ కు వాలి రాజు అయ్యాడు. మాయావి రాక్షసుడికీ, వాలికీ విరోధం ఉంది. మాయావి వాలిని యుద్దానికి పిలిచాడు. వాలిసుగ్రీవులు మాయావి వెంటబడ్డారు. మాయావి గుహలో ప్రవేశించాడు. వాలి, సుగ్రీవుడిని బిలద్వారం దగ్గర ఉండమని చెప్పి, తాను బిలంలోకి వెళ్ళి మాయావితో సంవత్సర కాలం పోరాడాడు.

ఆ గుహలోంచి రక్తం బయటకు వచ్చింది. గుహలోపల రాక్షసుడివి, వాలివి అరుపులు వినబడ్డాయి. సుగ్రీవుడు వాలి చనిపోయాడని భావించి, రాక్షసుడు పైకి రాకుండా గుహద్వారం మూసివేసి, కిష్కింధకు వచ్చాడు. మంత్రులు సుగ్రీవుని కిష్కింధకు రాజును చేశారు. తర్వాత వాలి వచ్చి, సుగ్రీవుడు రాజుగా ఉన్నందున కోపించి, సుగ్రీవుడిని రాజ్యభ్రష్టుణ్ణి చేసి, సుగ్రీవుని భార్య రుమను తాను అపహరించాడు.

సుగ్రీవుడు ప్రాణభీతితో పారిపోయి భూమండలం అంతా తిరిగి, ఋష్యమూక పర్వతం చేరుకున్నాడు. మతంగముని శాపం వల్ల వాలి ఆ పర్వతానికి రాలేడు. వాలి ఋష్యమూకంపై కాలుపెడితే మరణిస్తాడని మతంగ మహర్షి శపించాడు.

రామలక్ష్మణులు’ సీతాదేవిని వెదకుతూ, ఋష్యమూక పర్వత సమీపానికి వచ్చారు. ధనుర్భాణాలు ధరించిన రామలక్ష్మణులను చూసి, వారు వాలి పంపితే తన్ను చంపడానికి వచ్చారని అనుకున్నాడు. హనుమంతుడు సుగ్రీవుని మంత్రి. హనుమ రామలక్ష్మణులను కలిసి, సుగ్రీవుని వృత్తాంతాన్ని వారికి చెప్పాడు. లక్ష్మణుడు సీతాపహరణం గురించి చెప్పాడు. హనుమ, రామలక్ష్మణులకూ, సుగ్రీవునికీ మైత్రిని చేకూర్చాడు. వాలిని చంపుతానని రాముడు మాట ఇచ్చాడు. వానరులను పంపి, సీతను వెదికిస్తానని సుగ్రీవుడు మాట ఇచ్చాడు.

రాముని మాటపై సుగ్రీవుడు వాలిని యుద్ధానికి పిలిచాడు. వాలి సుగ్రీవులు ఇద్దరూ ఒకే పోలిక. అందువల్ల రాముడు సుగ్రీవుని మెడలో “నాగకేసరపులత”ను వేయించాడు. ఓడిపోయిన సుగ్రీవుడు తిరిగి వాలిని యుద్ధానికి పిలిచాడు. రాముడు విషసర్పం వంటి బాణాన్ని వాలిపై వేశాడు. వాలి తన మెడలోని సువర్ణమాలను సుగ్రీవుడికి ఇచ్చాడు. తార, అంగదుల బాధ్యతను సుగ్రీవునికి అప్పచెప్పి వాలి మరణించాడు.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 4 కిష్కింధ కాండ

ప్రశ్న 2.
శ్రీరామ సుగ్రీవుల మైత్రి జరిగిన తీరును వివరించండి.
జవాబు:

  1. సీతాన్వేషణలో భాగంగా ఋష్యమూక పర్వత ప్రాంతానికి చేరుకొన్న రామలక్ష్మణులను చూసి వాలి పంపిన వీరులని భయపడిన సుగ్రీవుడు హనుమంతుడిని పంపి వివరాలు తెలుసుకొమ్మని కోరాడు.
  2. సన్యాసిరూపంలో వెళ్ళిన హనుమంతుడు రామలక్ష్మణుల రూపలావణ్యాలను పొగిడి పరిచయం కోరాడు. మౌనముద్ర దాల్చిన రామలక్ష్మణులకు తన వివరాలు తెల్పి సుగ్రీవుడు పంపగా వచ్చినట్లు చెప్పాడు.
  3. సుగ్రీవుని గుణగణాలు తెల్పి, అన్నయైన వాలి అతడికి చేసిన అన్యాయాన్ని చెప్పి, రక్షణ కోసం సుగ్రీవుడు జాగ్రత్త పడుతున్నాడని వివరించాడు.
  4. సుగ్రీవుడు మీ స్నేహాన్ని కోరుతున్నాడని చాకచాక్యంగా చెప్పాడు. విషయాన్ని చెప్పే పద్ధతిలో ఎంతో నేర్పు ప్రదర్శించాడు. హనుమంతుని మాట తీరు శ్రీరాముడిని ఎంతగానో ఆకట్టుకొంది.
  5. శ్రీరాముడు హనుమంతుణ్ణి ప్రశంసిస్తూ మాట్లాడి తమ వృత్తాంతం చెప్పవలసినదిగా లక్ష్మణుణ్ణి ఆదేశించాడు. లక్ష్మణుడు శ్రీరాముని ఆదేశాన్ని అనుసరించి తమ వృత్తాంతం హనుమంతుడికి తెల్పి సుగ్రీవుని సహాయం కావాలని కోరాడు.
  6. సన్యాసి రూపం వదిలి రామలక్ష్మణులను తన భుజాలపై ఎక్కించుకొని ఋష్యమూక పర్వతానికి చేరిన హనుమంతుడు ప్రాణభయంతో మలయగిరికి చేరిన సుగ్రీవుణ్ణి పిలుచుకు వచ్చాడు. శ్రీరామ సుగ్రీవులు అగ్నిసాక్షిగా మిత్రులయ్యారు.

ప్రశ్న 3.
ఒకడు సన్యాసి వేషంలో వచ్చి అపకారం చేశాడు. మరొకడు ఉపకారం చేశాడు. వారెవరు? వాటి ఫలితాలేమిటి?
జవాబు:
రావణుడు అనే రాక్షసుడు, సన్యాసి వేషంలో వచ్చి పంచవటిలో పర్ణశాలలో ఒంటరిగా ఉన్న సీతను బలవంతంగా అపహరించి లంకకు తీసుకుపోయాడు. ఈ విధంగా సస్యాసి వేషంలో వచ్చిన రావణుడు రామలక్ష్మణులకు అపకారం చేశాడు.

రామలక్ష్మణులు సుగ్రీవుడితో స్నేహం చేయాలని సుగ్రీవుడు ఉన్న ఋష్యమూక పర్వతం దగ్గరకు వచ్చారు. రామలక్ష్మణులను చూసి వారు తన్ను చంపడానికి అన్న వాలి పంపిన వీరులని సుగ్రీవుడు భయపడ్డాడు. రామలక్ష్మణుల వివరాలు తెలిసికోమని, అంజనేయుడు అనే తన మంత్రిని సన్యాసి వేషంలో సుగ్రీవుడు పంపాడు. హనుమంతుడు సన్యాసి రూపంలో వచ్చి, రామలక్ష్మణులను గూర్చి తెలిసికొని, రామసుగ్రీవులకు మైత్రిని కల్పించాడు. వానర సహాయంతో రాముడు రావణుడిని చంపి, సీతను తీసుకువచ్చాడు.

ఈ విధంగా సన్యాసి రూపంలో వచ్చి ఉపకారం చేసినవాడు హనుమంతుడు. హనుమంతుని సాయంతోనే సీతను అపహరించిన రావణుడిని సంహరించి, రాముడు సీతను తిరిగి తీసుకువచ్చాడు.

ప్రశ్న 4.
రామసుగ్రీవుల స్నేహం గూర్చి విశ్లేషించండి.
జవాబు:
వాలిసుగ్రీవులు అన్నదమ్ములు. సుగ్రీవుడిని రాజ్యం నుండి తరిమి, సుగ్రీవుని భార్య రుమను వాలి చేపట్టాడు. సుగ్రీవుడు ఋష్యమూక పర్వతంపై ఉంటున్నాడు. హనుమంతుడు సుగ్రీవునకు మంత్రి. సుగ్రీవుడితో స్నేహం చేయాలని రామలక్ష్మణులు, ఋష్యమూక పర్వతం దగ్గరకు వచ్చారు. సుగ్రీవుడు ధనుర్ధారులయిన రామలక్ష్మణులను చూసి వారు తన్ను చంపడానికి వాలి పంపించిన వీరులని, భయపడ్డాడు. రామలక్ష్మణులను గూర్చి తెలిసికొని రమ్మని తన మంత్రి హనుమంతుడిని సుగ్రీవుడు పంపాడు.

హనుమంతుడు సన్యాసి రూపంలో రామలక్ష్మణుల వద్దకు వచ్చాడు. రామలక్ష్మణులకు సుగ్రీవుడిని గూర్చి చెప్పి తాను సుగ్రీవుని మంత్రిననీ, పేరు హనుమంతుడనీ చెప్పాడు. హనుమంతుని మాటల్లోని నేర్పును రాముడు మెచ్చుకున్నాడు. లక్ష్మణుడు తమకు సుగ్రీవుని సాయం కావాలన్నాడు. హనుమంతుడు రామలక్ష్మణులను తన భుజాలపై ఎక్కించుకొని సుగ్రీవుని దగ్గరకు తీసుకువచ్చాడు. అక్కడ శ్రీరామ సుగ్రీవులు, అగ్నిసాక్షిగా స్నేహితులయ్యారు.

సుగ్రీవుడు రామునితో ప్రాణమిత్రులుగా ఉందామని చెప్పి తనకు వాలి నుండి అభయం కావాలని కోరాడు. వాలిని చంపుతానని రాముడు మాట ఇచ్చాడు. సుగ్రీవుడు సీత విడిచిన నగల మూటను రామునికి చూపించాడు. సుగ్రీవుడు సీతను వెదికించడానికీ, రావణుని చంపడానికీ, రామునికి సాయం చేస్తానన్నాడు. రాముడు తన కాలి బొటనవ్రేలితో దుందుభి శరీరాన్ని 10 యోజనాల దూరం విసరివేశాడు. ఒక బాణంతో ఏడు తాడిచెట్లను పడగొట్టాడు. దానితో సుగ్రీవునికి రాముడి బలంపై నమ్మకం కుదిరింది. రామసుగ్రీవులు ప్రాణమిత్రులు అయ్యారు.

ప్రశ్న 5.
వాలి సుగ్రీవుల యుద్దానికి కారణాలను విశ్లేషించండి.
జవాబు:
వాలి సుగ్రీవులు అన్నదమ్ములు. వాలి మహాబలశాలి. వాలి, తండ్రి తర్వాత కిష్కింధకు రాజు అయ్యాడు. మాయావి అనే రాక్షసుడు, వాలిని యుద్దానికి పిలిచాడు. వాలి సుగ్రీవులు మాయావి వెంటపడ్డారు. మాయావి ఒక గుహలో ప్రవేశించాడు. వాలి, తన తమ్ముడు సుగ్రీవుడిని బిలద్వారం దగ్గర కాపలా ఉండమని, తాను బిలంలోకి వెళ్ళి, మాయావితో సంవత్సర కాలం పోరాడాడు.

ఆ గుహాద్వారం నుండి రక్తం బయటకు వచ్చింది. గుహలో వాలి, మాయావి యొక్క అరపులు వినిపించాయి. సుగ్రీవుడు వాలి చనిపోయాడని అనుకొని, మాయావి పైకి రాకుండా గుహాద్వారం మూసివేసి, కిష్కింధకు తిరిగి వచ్చాడు. మంత్రులు వాలి చచ్చిపోయాడనుకొని, సుగ్రీవుడిని కిష్కింధకు రాజును చేశారు. తర్వాత వాలి మాయావిని చంపి, గుహాద్వారాన్ని తెరిచి, కిష్కింధకు వచ్చాడు. సుగ్రీవుడు రాజుగా ఉన్నందుకు వాలి కోపించి, సుగ్రీవుడిని రాజ్యభ్రష్టుడిని చేసి, సుగ్రీవుడి భార్య రుమను తాను అపహరించాడు.

సుగ్రీవుడు ప్రాణభయంతో పారిపోయి, భూమండలం అంతా తిరిగి, ఋష్యమూక పర్వతంపై ఉన్నాడు. మతంగముని శాపం వల్ల వాలి, ఆ పర్వతానికి రాలేడని, సుగ్రీవుడు ఆ పర్వతంపై ఉన్నాడు. ఈ విధంగా అన్నదమ్ములయిన వాలి సుగ్రీవులకు విరోధం వచ్చింది. సుగ్రీవుడు రాముని సహాయంతో వెళ్ళి, వాలితో యుద్ధం చేశాడు.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 4 కిష్కింధ కాండ

ప్రశ్న 6.
శ్రీరాముడు వాలిని చంపడం ధర్మమా? కాదా? చర్చించండి.
జవాబు:
రామ సుగ్రీవులకు స్నేహం కుదిరింది. సుగ్రీవుడు తనకు తన అన్న వాలి వల్ల భయం ఉందనీ, రాముడి అభయం కావాలనీ రాముడిని అడిగాడు. రాముడు సుగ్రీవుని భార్యను అపహరించిన వాలిని, తప్పక వధిస్తానని సుగ్రీవుడికి మాట ఇచ్చాడు.

వాలిసుగ్రీవుల యుద్ధం భయంకరంగా సాగింది. సుగ్రీవుడి శక్తి తగ్గిపోయింది. అప్పుడు రాముడు వాలి మీదికి బాణం వేశాడు. ఆ బాణం తగిలి వాలి తెలివి తప్పాడు. తరువాత వాలి తెలివి తెచ్చుకుని రాముడు అధర్మంగా ప్రవర్తించాడని తప్పు పట్టాడు.

రామునికి కాని, రాముని దేశానికి కాని వాలి అపచారం చేయలేదు. అదీగాక వాలి సుగ్రీవుడితో యుద్ధం చేస్తున్నప్పుడు రాముడు వాలిపై దొంగదెబ్బ తీశాడు. అందువల్ల రాముడు వాలిని చంపడం అధర్మమని, వాలి రాముడిని తప్పు పట్టాడు.

వాలి మాటలకు రాముడు జవాబు చెష్పాడు. తమ్ముడి భార్యను చెరబట్టడం వంటి అధర్మాలు చేయడం వల్ల తాను వాలికి మరణదండన విధించానన్నాడు. వాలి, వానరుడు కాబట్టి తాను చాటున ఉండి కొట్టడం, తప్పు కాదన్నాడు.

రాముడు మహారాజు కాబట్టి, తప్పు చేసిన వాలిని చంపడం ధర్మమే అవుతుంది.

ప్రశ్న 7.
శ్రీరామ సుగ్రీవుల మైత్రి ఎలా ఏర్పడింది?
జవాబు:
వాలి సుగ్రీవులు అన్నదమ్ములు. రామలక్ష్మణులు సుగ్రీవునితో మైత్రి చేయాలని సుగ్రీవుడు ఉంటున్న ఋష్యమూక పర్వతం దగ్గరకు వచ్చారు. సుగ్రీవుడు రామలక్ష్మణులను చూసి, వాలి తన్ను చంపడానికి పంపిన వీరులని భయపడ్డాడు. రామలక్ష్మణులను గురించి తెలుసుకోమని తనమంత్రి హనుమంతుని సుగ్రీవుడు పంపాడు.

హనుమ సన్న్యాసి రూపంలో రామలక్ష్మణుల దగ్గరికి వచ్చాడు. హనుమంతుడు సుగ్రీవుని గూర్చి రామలక్ష్మణులకు చెప్పి, తాను సుగ్రీవుని మంత్రిననీ, తన పేరు హనుమంతుడనీ చెప్పాడు. హనుమ మాటల్లోని నేర్పును రాముడు మెచ్చుకున్నాడు. హనుమతో లక్ష్మణుడు తమకు సుగ్రీవుని సాయం కావాలని చెప్పాడు. హనుమ రామలక్ష్మణులను తన భుజాలపై ఎక్కించుకొని, సుగ్రీవుని వద్దకు తీసుకువచ్చాడు. శ్రీరామ సుగ్రీవులు అగ్నిసాక్షిగా స్నేహితులయ్యారు.

సుగ్రీవుడు రామునితో “ప్రాణమిత్రులుగా ఉందాం” అని చెప్పి, తనకు వాలి భయం లేకుండా అభయం కావాలి అన్నాడు. వాలిని చంపుతానని రాముడు మాట ఇచ్చాడు. సుగ్రీవుడు రామునితో “ఒక రాక్షసుడు స్త్రీని బలవంతంగా తీసుకుపోవడం తాను చూశాననీ, ఆమె “రామా! లక్ష్మణా!” అని గట్టిగా అరుస్తుండగా తాను విన్నానని చెప్పి ఆమె జారవిడిచిన నగల మూటను తెప్పించి రాముడికి చూపించాడు. రాముడు ఆ నగలను చూసి ఏడ్చాడు. లక్ష్మణుడు ఆ నగలలోని కాలి అందెలు తన వదిన సీతమ్మవే అన్నాడు.

సుగ్రీవుడు సీతను వెదికించడానికీ, రావణుని చంపడానికీ, రాముడికి సాయం చేస్తానన్నాడు. రామ సుగ్రీవులు ప్రాణమిత్రులు అయ్యారు. శ్రీరాముడు కాలి బొటన వ్రేలుతో దుందుభి శరీరాన్ని 10 యోజనాల దూరం చిమ్మివేశాడు. ఒక్క బాణంతో ఏడు తాడిచెట్లను కూల్చి రాముడు సుగ్రీవుడికి తన బలంపై నమ్మకం కల్గించాడు.

సుగ్రీవుడు రామలక్ష్మణులతో కలిసి కిష్కింధకు వెళ్ళి వాలిని యుద్దానికి పిలిచాడు. వాలి సుగ్రీవులు ఒకే పోలికగా ఉన్నారు. అందువల్ల రాముడు వారిని గుర్తించలేక, బాణం వేయలేదు. సుగ్రీవుడు ఓడిపోయాడు.

రాముడు, సుగ్రీవుడి మెడలో “నాగకేసరపులత”ను గుర్తుగా వేయించాడు. సుగ్రీవుడు తిరిగి వాలిని యుద్ధానికి రమ్మని కవ్వించాడు. రాముని సాయంతో సుగ్రీవుడు వచ్చాడనీ, యుద్ధానికి వెళ్ళవద్దనీ, వాలికి అతడి భార్య తార చెప్పింది. వాలి సుగ్రీవులకు భయంకర యుద్ధం జరిగింది. రాముడు విషసర్పం వంటి బాణం వేసి, వాలిని సంహరించాడు.

సుగ్రీవుడు కిష్కింధకు రాజయ్యాడు. సుగ్రీవుడు సీతను వెదికించడానికి వానరవీరులను పిలిచాడు. అన్ని దిక్కులకూ వానరులను సీతాన్వేషణ కోసం పంపాడు. దక్షిణ దిశకు అంగదుని నాయకత్వంలో హనుమంతుడు, జాంబవంతుడు మొదలయిన వానరులను పంపాడు.

దక్షిణ దిశకు వెళ్ళిన వానరులకు ‘సంపాతి’ పక్షి కనబడింది. సంపాతి పక్షి, దివ్యజ్ఞానంతో రావణుని వృత్తాంతాన్ని వానరులకు చెప్పింది. జాంబవంతుడు హనుమంతునికి ఉత్సాహం కలిగించాడు. హనుమ తాను సముద్రాన్ని దాటి వెళ్ళి లంకలోని సీత జాడను తెలుసుకుంటానని మహేంద్రగిరిపైకి చేరాడు.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 4 కిష్కింధ కాండ

ప్రశ్న 8.
హనుమంతుడు సీతాన్వేషణకై బయలుదేరిన విధమెట్టిది?
జవాబు:
సుగ్రీవుడు సీతాన్వేషణకై వానరులను అన్ని దిశలకూ పంపాడు. అంగదుని నాయకత్వంలో హనుమ, జాంబవంతుడు మొదలయిన వీరులను దక్షిణ దిక్కుకు పంపాడు. తూర్పు, పడమర, ఉత్తర దిక్కులకు వెళ్ళిన వానరులు, వట్టి చేతులతో తిరిగివచ్చారు.

అంగదుని నాయకత్వంలో దక్షిణ దిశకు బయలుదేరి వచ్చిన వానర వీరులు అణువణువూ వెదకుతున్నారు. సుగ్రీవుడు ఇచ్చిన గడువు నెలపూర్తి అయ్యింది. అంగదుడు ఉత్సాహంతో ముందుకు కదలుదాము అన్నాడు. వారు ‘ఋక్షబిలము’ అనే గుహ దగ్గరికి వచ్చారు. వానరులకు ఆకలి, దాహము పట్టుకొంది. అక్కడ ‘స్వయంప్రభ’ అనే యోగిని దయతో, వానరులు ఆకలిదప్పులు తీర్చుకొన్నారు. ఆమె ప్రభావంతో, వారు సముద్రతీరానికి చేరారు. వానరులు సీత జాడ తెలిశాకే సుగ్రీవుని కలుద్దాం అనుకున్నారు.

వానరుల మాటలో ‘జటాయువు’ మాట వచ్చింది. ఈ జటాయువు సోదరుడు ‘సంపాతి’. సంపాతి తన దివ్యదృష్టితో లంకను గురించి వానరులకు చెప్పాడు. లంకకు వెళ్ళాలంటే సముద్రాన్ని దాటాలి. అది ఎవరివల్ల ఔతుందో అని వానరులు చర్చించుకున్నారు. హనుమంతుడు ఒక్కడే సముద్రాన్ని దాటగలడని చివరకు వారు నిశ్చయించారు.

జాంబవంతుడు హనుమంతుడికి, అతని శక్తియుక్తులను గురించి తెలిపాడు. హనుమ బలాన్ని పుంజుకున్నాడు. దానితో హనుమ వానరులతో “నేను వేయి పర్యాయాలు మేరు పర్వతాన్ని చుట్టి రాగలను. సముద్రాలను దాటగలను” అని చెప్పాడు.

హనుమ మాటలకు జాంబవంతుడు ఆనందించాడు. “నీ ధైర్యోత్సాహాలకు తగు విధంగా మాట్లాడావు. నీవు ఋషులు, గురువుల అనుగ్రహంతో సముద్రాన్ని దాటు. నీ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాం. మన వానరుల ప్రాణాలన్ని నీపై ఆధారపడి యున్నాయి” అని జాంబవంతుడు హనుమకు చెప్పాడు.

హనుమ, తాను ఎగరడానికి ‘మహేంద్రగిరి’ తగినదని, నిశ్చయించి అక్కడకు చేరాడు.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 7 మా ప్రయత్నం

AP State Board Syllabus AP SSC 10th Class Telugu Important Questions Chapter 7 మా ప్రయత్నం

AP State Syllabus SSC 10th Class Telugu Important Questions 7th Lesson మా ప్రయత్నం

10th Class Telugu 7th Lesson మా ప్రయత్నం 2 Marks Important Questions and Answers

ఈ క్రింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాల్లో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
పీఠిక అంటే ఏమిటి? వివరించండి. (June 2017)
(లేదా)
‘పీఠిక’ సాహిత్య ప్రక్రియను వివరింపుము. (March 2017)
ఒక పుస్తకం యొక్క తాత్త్వికతను, అంతస్సారాన్ని తెలియజేసే దానిని ‘ముందుమాట’ లేదా ‘పీఠిక’ అంటారు గదా ! ‘పీఠిక’ ప్రక్రియ గురించి వ్రాయండి. (March 2019)
జవాబు:
ఒక గ్రంథాన్నీ, గ్రంథ నేపథ్యాన్ని పరిచయం చేస్తూ వ్రాసే ముందుమాటను పీఠిక అంటారు. దీనిని రచయిత కానీ, విమర్శకుడు కానీ, వేరే వ్యక్తి కానీ వ్రాయవచ్చు.

పీఠికకు ముందుమాట, ప్రస్తావన, తొలిపలుకు, మున్నుడి, ఆముఖం అని కూడా అంటారు.

ప్రశ్న 2.
‘మహిళావరణం’ అనే పుస్తకానికి రచయిత్రులు రాసిన ‘పీఠిక’ ప్రక్రియ వివరించండి. (S.A. I – 2018-19)
(లేదా)
మా ప్రయత్నం పాఠ్యాంశ ప్రక్రియను రాయండి. (S.A. I – 2019-20)
జవాబు:
ఒక గ్రంథాన్నీ, గ్రంథ నేపథ్యాన్ని పరిచయం చేస్తూ వ్రాసే ముందుమాటను పీఠిక అంటారు. దీనిని రచయిత కానీ, విమర్శకుడు కానీ, వేరే వ్యక్తి కానీ వ్రాయవచ్చు.

పీఠికకు ముందుమాట, ప్రస్తావన, తొలిపలుకు, మున్నుడి, ఆముఖం అని కూడా అంటారు.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 7 మా ప్రయత్నం

ప్రశ్న 3.
ఓల్గా గారి గురించి వ్రాయండి.
జవాబు:
ఈమె ప్రముఖ స్త్రీవాద రచయిత్రి. ఈమే తన కథలు, కవితలు, నవలలతో తెలుగు సాహిత్యంలో స్త్రీవాద ఉద్యమానికి ఉత్తేజాన్ని అందించింది. ఈమె ఎన్నో పుస్తకాలకు సంపాదకత్వం వహించారు. అనేక పురస్కారాలు, అవార్డులను ఆమె అందుకొన్నారు.

ప్రశ్న 4.
వసంత కన్నబిరాన్ గురించి వ్రాయండి.
జవాబు:
ఈమె 1930లో హైదరాబాద్ లో జన్మించారు. ఈమె ఇంగ్లీషు లెక్చరర్‌గా పనిచేశారు. మానవహక్కులు, స్త్రీ సమానత్వం కోసం ఆమె కృషి చేస్తున్నారు. ఆమె “నేషనల్ అలయెన్స్ ఆఫ్ ఉమెన్”, “ఇండియన్ నేషనల్ సోషల్ యాక్షన్ ఫోరం”లో పనిచేస్తున్నారు.

ప్రశ్న 5.
కల్పన కన్నబిరాన్ గురించి వ్రాయండి.
జవాబు:
ప్రముఖ న్యాయవాది కె.జి. కన్నబిరాన్, రచయిత్రి వసంత కన్నబిరాన్ల కుమార్తె కన్నబిరాన్. ఈమె హైదరాబాద్లోని ‘సెంటర్ ఫర్ నేషనల్ డెవలప్ మెంట్’ కు సంచాలకులుగా పనిచేస్తున్నారు. సామాజిక న్యాయం, సామాజిక ఉద్యమాలలో క్రియాశీలకంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ‘జెండర్ స్టడీస్’, ‘క్రిమినల్ లా’లో విస్తృత అధ్యయనం, పరిశోధనలు చేశారు. చాలా విలువైన గ్రంథాలు రాశారు.

10th Class Telugu 7th Lesson మా ప్రయత్నం 4 Marks Important Questions and Answers

ఈ క్రింది ప్రశ్నలకు 10 లేక 12 వాక్యాల్లో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
“స్త్రీలు ప్రధానమైన చరిత్ర నిర్మాతలు” అని రచయిత్రులు భావించడానికి గల కారణాలను ‘మా ప్రయత్నం’ పాఠం ఆధారంగా వివరించండి. (June 2018)
జవాబు:

  1. కొత్త కాలంలోకి అడుగు పెడుతున్న కాలంలో గడచిన కాలాన్ని గుర్తుకు తెచ్చుకొని భవిష్యత్తుపై ఒక అంచనాకు రావటం సహజం.
  2. గత శతాబ్దపు సామాజిక మార్పులలో, అభివృద్ధిలో స్త్రీల భాగస్వామ్యాన్ని గురించి ఆలోచించిన రచయిత్రులకు చరిత్ర నిర్మాతలుగా స్త్రీలు ప్రధానంగా ఉన్నారనే భావం కలిగింది.
  3. గడచిన శతాబ్దంలో స్త్రీలు చేసిన పోరాటాలూ, వారు నడిపిన ఉద్యమాలూ, రాణించిన రంగాలు ఎన్నో ఉండటమే ఆ భావనకు ప్రధాన కారణం.
  4. మొదటిసారి చదువుకొన్న స్త్రీలు, మొదటి వితంతు వివాహం చేసుకొనే సాహసం చేసిన స్త్రీలు, స్త్రీ విద్య కోసం పాటుపడినవారు, ఉద్యమాలలో పాల్గొని జైలుకు కూడా వెళ్ళేందుకు తెగించిన స్త్రీలు, కళారంగంలో తొలిసారి కాలుమోపిన మహిళలు, మొదటి తరం డాక్టర్లూ, శాస్త్రవేత్తలూ – వారు చేసిన పోరాటాలు రచయిత్రుల భావాన్ని బలపరిచాయి.
  5. స్త్రీలకు తగిన గుర్తింపు లభించలేదని, సంప్రదాయ చరిత్రకారులు స్త్రీలకు తగిన ప్రాధాన్యం, ప్రాతినిధ్యం ఇవ్వలేదని రచయిత్రులు భావించారు.
  6. చరిత్ర అనే జగన్నాథ రథ చక్రాల క్రింద నలిగిపోయినందున చరిత్ర నిర్మాతలుగా స్త్రీలకు గుర్తింపు లభించలేదని, కానీ, ప్రధాన చరిత్ర నిర్మాతలుగా వారిది తిరుగులేని స్థానమని రచయిత్రులు భావించారు.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 7 మా ప్రయత్నం

ప్రశ్న 2.
“మహిళావరణం” పుస్తక రూపకల్పనలో రచయిత్రులు పడిన శ్రమను, పొందిన అనుభవాలను తెల్పండి. (March 2018)
జవాబు:
1) గడచిన శతాబ్దంలో సామాజికాభివృద్ధిలో, సామాజిక మార్పులలో, స్త్రీల యొక్క భాగస్వామ్యం గురించి ఆలోచించిన – ఓల్గా తదితర స్త్రీవాద రచయితల ముందుకు ఎన్నో విషయాలు వచ్చాయి. గడచిన శతాబ్దంలో చాలా అంశాలలో స్త్రీల భాగస్వామ్యం అధికంగా ఉందని చరిత్ర నిర్మాతలుగా వారిది తిరుగులేని స్థానమని రచయిత్రులు భావించారు.

2) ఆ విషయాన్ని సాధికారికంగా, సోదాహరణంగా నిరూపించటానికి రచయిత్రులు ఒక పుస్తకాన్ని తీసుకురావాలను కొన్నారు. అలా “మహిళావరణం” పుస్తక రూపకల్పనకు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో వారెన్నో కష్టాలనెదుర్కొన్నారు. ఒళ్ళు పులకించే అనుభవాలను పొందారు.

3) గడచిన శతాబ్దంలో స్త్రీలు చేసిన పోరాటాలు, రాణించిన రంగాలు ఎన్నో ఉన్నాయి. ఆ స్త్రీలను అందరినీ ఒకచోట చేర్చటం రచయిత్రులకెంతో ఉత్సాహాన్నిచ్చింది. ఇంతమంది స్త్రీలను ఒకే చోట చూడటం వలన, స్త్రీలు వెనుకబడిపోయారనే భావంతో ఉన్న రచయిత్రులకు కనువిప్పు కలిగింది. ఒక చైతన్య ప్రవాహంగా స్త్రీలను వాళ్ళు చూడగలిగారు.

4) ఎక్కడో ఒకచోట కొంతమంది స్త్రీలను గురించి చదవటానికి, ఒకేసారి వందమందికి పైగా స్త్రీలను, వివిధరంగాలలో వారు చేసిన కృషిని, సాధించిన విజయాలను తెలుసుకోవటానికి గల తేడాను, అనుభూతిలో గల భేదాన్ని రచయిత్రులు గ్రహించారు.

5) చరిత్రను నిర్మించడానికి ఆనాటి స్త్రీలు ఎంత మూల్యం చెల్లించారో తలచుకొంటే రచయిత్రుల గుండెలు బరువెక్కాయి. ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా, ఎంతో శ్రమకోర్చి. రచయిత్రులు ఈ “మహిళావరణం” పుస్తకాన్ని రూపొందించారనటం అక్షర సత్యం.

ప్రశ్న 3.
సామాన్యంగా చరిత్ర నిర్మాతలుగా స్త్రీలకు ఎందుకు గుర్తింపు లభించదో వివరించండి.
జవాబు:
చరిత్ర రచయితలకు, స్త్రీలను గూర్చి, వారు చేసిన కృషిని గురించి, అంతగా గౌరవమూ, శ్రద్ధ లేకపోవడం వల్లనే, స్త్రీలు చరిత్రలో ఎక్కకపోవడానికి కారణం అయి ఉంటుంది. చరిత్ర అనే జగన్నాథ రథచక్రాల క్రింద, ఆ స్త్రీల యొక్క ఉనికి, ముక్కలయ్యింది.

అదీగాక చరిత్రకారులకు, స్త్రీలపై చిన్నచూపు ఉండడం కూడా అందుకు కారణం అయి ఉంటుంది. చరిత్రకారుడికి ఆ స్త్రీలను గూర్చి అంతగా వివరంగా తెలియకపోవడం కూడా ఒక కారణం అయి ఉంటుంది. అందుకే సంప్రదాయ చరిత్ర రచయితలు స్త్రీలను చరిత్రలో అక్కడక్కడ పౌడర్ అద్దుతారు. బాగా ప్రసిద్ధులయిన స్త్రీలను గురించి మాత్రమే ఆ చరిత్రకారులు రాసి ఉంటారు. అదీగాక, ఈనాటి వలె ఆ రోజుల్లో సమాచారం అంతగా తెలిసికోడానికి సాధనాలు కూడా లేవు. అందువల్లనే ఆయారంగాల్లో అక్కడక్కడ కృషి చేసిన స్త్రీల గూర్చి ఆ చరిత్రకారుల దృష్టికి సరిగా వచ్చి ఉండదు. కొంతమంది ఉద్యమ స్త్రీలను గురించి, చరిత్ర రచయిత విని ఉన్నా, ఆ స్త్రీల వివరాలు, వారు చేసిన కృషి, చరిత్రకారుల దృష్టికి వచ్చియుండకపోవచ్చు.

అందువల్లనే సామాన్యంగా చరిత్ర నిర్మాతలుగా పెక్కుమంది స్త్రీలకు గుర్తింపు లభించలేదని మనం గ్రహించాలి.

ప్రశ్న 4.
“మహిళావరణం” శీర్షిక గురించి మీ అభిప్రాయాలు రాయండి.
జవాబు:
గడచిన 20వ శతాబ్దంలో స్త్రీలు ఆయారంగాల్లో కీలకస్థానాల్లో కీలక సమయాలలో పనిచేసి, అక్కడ తమ ముద్రవేసిన వందమంది స్త్రీలను గురించి మహిళావరణం సంపాదకులు ఒక పుస్తకం తీసుకువచ్చారు. ఆ పుస్తకానికి “మహిళావరణం” అని పేరు పెట్టారు. ‘మహిళావరణం’ అంటే, స్త్రీలను వరించడం, అనగా కోరుకోవడం అని భావము. 20వ శతాబ్దంలో విభిన్నరంగాలలో కీలక సమయాల్లో, కీలక స్థానాల్లో పనిచేసిన నారీమణులను, ఈ పుస్తకం సంపాదకులు కోరి వారికి తమ గ్రంథములో చోటు కల్పించారు. వారి దృష్టికి, ఎంతోమంది స్త్రీలు చరిత్రకు ఎక్కవలసినవారు కనిపించారు. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా అందులో కొంతమందినే ఏరి కోరుకొని, ఈ పుస్తకంలో, వారికి, చోటు కల్పించారు.

అంటే ఈ పుస్తకంలోకి ఎక్కిన స్త్రీలు, సంపాదకులు కోరి వరించిన వారన్న మాట. అందుకే ఈ పుస్తకానికి ‘మహిళావరణం’ అని, సంపాదకులు అర్థవంతమైన చక్కని పేరు పెట్టారని నా అభిప్రాయము.

అయితే, ఈ పుస్తకానికి “20వ శతాబ్దపు ప్రసిద్ధ నారీమణులు” అని కూడా పేరుపెట్టవచ్చు. సంపాదకుల దృష్టికి సుప్రసిద్ధ నారీమణులు సుమారు 300 మంది వచ్చారు. వారిలో కేవలం 118 మంది మహిళామణులనే ఏరి కోరుకొని, స్థానం కల్పించారు. అందువల్లనే ‘మహిళావరణం’ అన్న పేరు “సమంజసంగా ఉంది.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 7 మా ప్రయత్నం

ప్రశ్న 5.
చరిత్ర సాగిన క్రమాన్ని ప్రతివాళ్ళూ ఎందుకు ప్రశ్నించారు?
జవాబు:
మహిళావరణం సంపాదకులు, విభిన్నరంగాల్లో విశిష్ట కృషి చేసిన స్త్రీమూర్తులను కలసికొన్నారు. అందులో వారు సరిదె మాణిక్యాంబగారిని కలిసినప్పుడు, వేశ్యాకులం వారిని మొదట ఆడవద్దని ప్రభుత్వం వారు, వారి మాన్యాలను తీసికొన్నారని, కానీ ఇప్పుడు అన్ని కులాలవారు జీవనోపాధి కోసం ఆడుతున్నారనీ, వేశ్యలను నాట్యం చేయవద్దనడం నేరం కదా అని ప్రశ్నించింది.

ఈ విధంగా మాణిక్యాంబగారే కాక, మరెందరో స్త్రీలు చరిత్ర సాగిన క్రమాన్నీ, అందులో స్త్రీలకు జరిగిన అన్యాయాన్నీ ప్రశ్నించారు. ఆ రోజుల్లో స్త్రీలకు ఉన్నత విద్య చదువుకొనే అవకాశం ఉండేది కాదు. స్త్రీలు రేడియో, సినిమా వంటి రంగాల్లో పనిచేయడానికి అవకాశం ఉండేది కాదు.

వితంతు స్త్రీలకు తిరిగి వివాహం చేసుకొనే హక్కు ఉండేది కాదు. అందుకే సాహసవంతులయిన స్త్రీ మూర్తులు నాడు చరిత్ర సాగిన క్రమాన్ని ప్రశ్నించారు.

ప్రశ్న 6.
ప్రతివాళ్ళూ ప్రశ్నించే విధంగా చరిత్ర ఎందుకు సాగింది? దీనికి కారణాలు ఏమిటి? విశ్లేషించండి.
జవాబు:
20వ శతాబ్దం నాటికి సంఘంలో నేడు ఉన్నంత చైతన్యం లేదు. పెద్దవాళ్ళు పాటించిన రీతిలోనే చరిత్ర సాగిపోయేది. స్త్రీలకు బాల్యవివాహాలు ఉండేవి. విధవ వివాహాలు చేసేవారు కారు. స్త్రీలకు అన్నిరంగాల్లోనూ ప్రవేశం ఉండేది కాదు. స్త్రీలు ఉన్నత విద్య చదివే సావకాశం లేదు.

స్త్రీలు బిడియపడుతూ ఉండేవారు. ఆనాడు అంతా మనుధర్మశాస్త్రం ప్రకారం అంటూ, మూఢాచారాలు పాటించేవారు, ఆ రోజుల్లోనే కందుకూరి వీరేశలింగము, రాజ్యలక్ష్మి, విలియం బెంటిక్, రాజారామమోహనరాయ్ వంటి సంఘ సంస్కర్తల ప్రభావంతో సంఘంలో కొంత మార్పు వచ్చింది.

స్త్రీ సహగమనము వంటి దురాచారాలు తగ్గాయి. విధవా పునర్వివాహాలు, సామాన్య స్త్రీలు విద్యాభ్యాసం చెయ్యడం వంటివి సాగించారు. మొత్తంపై ఆ 20వ శతాబ్దంలో మొదట్లో కొన్ని సాంఘిక దురాచారాల వల్ల స్త్రీలు అంతగా రాణించలేకపోయారు.

అందువల్లనే ప్రతివాళ్ళూ ప్రశ్నించే విధంగా నాడు చరిత్ర సాగింది. ఆ స్త్రీలు అందరూ చరిత్రను మార్చటానికి గట్టిగా ప్రయత్నించారు.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 7 మా ప్రయత్నం

ప్రశ్న 7.
చరిత్ర నిర్మాతలుగా స్త్రీలు ప్రధానంగా ఉన్నారనడానికి కారణాలను వివరించండి.
జవాబు:
20వ శతాబ్దం సామాజికాభివృద్ధిలో, సామాజిక మార్పులలో, స్త్రీల భాగస్వామ్యాన్ని గూర్చి ఆలోచిస్తే, 20వ శతాబ్దపు చరిత్ర నిర్మాతలుగా, వారికి తిరుగులేని స్థానం ఉందని సంపాదకులకు అనిపించింది.

20వ శతాబ్దంలో స్త్రీలు చేసిన పోరాటాలు, వారు పాలుపంచుకున్న ఉద్యమాలు, రాణించిన రంగాలు ఎన్నో ఉన్నాయి. అటువంటి స్త్రీలు ఎంతోమంది ఉన్నారు. అటువంటి స్త్రీలు ఎంతోమంది సంపాదకులకు గుర్తుకు వచ్చారు.

20వ శతాబ్దంలో మొదటిసారి చదువుకున్న స్త్రీలు, ఉద్యమాల్లో చేరి జైలుకు వెళ్ళడానికి సైతం సిద్ధపడిన స్త్రీలు, మొదటగా వితంతు వివాహం చేసుకునేందుకు సాహసించిన స్త్రీలు, స్త్రీ విద్యకోసం ఉద్యమించిన స్త్రీలు, నాటకం, రేడియో, సినిమా రంగాలలో మొదటిసారి అడుగు పెట్టిన స్త్రీలు, మొదటి తరం డాక్టర్లూ, శాస్త్రవేత్తలూ, సంగీత నృత్య కళాకారిణులూ, విద్యావేత్తలూ ఎందరో సంపాదకులకు కనిపించారు. దానితో చరిత్ర నిర్మాతలుగా స్త్రీలు ప్రధానంగా ఉన్నారనే భావన సంపాదకులకు కలిగింది.

ప్రశ్న 8.
‘స్త్రీలే ప్రధానమైన చరిత్ర నిర్మాతలు’ – సమర్థించండి.
జవాబు:
20వ శతాబ్దపు సామాజికాభివృద్ధిలో, సామాజిక మార్పులలో, స్త్రీలకు కల భాగస్వామ్యాన్ని గురించి ఆలోచిస్తే, ఎన్నో విషయాలు మహిళావరణం సంపాదకుల ముందుకు వచ్చాయి. 20వ శతాబ్దాన్ని స్త్రీల శతాబ్దంగా చెప్పవచ్చునని వారికి అనిపించింది. జరిగిన శతాబ్దం చరిత్ర నిర్మాతలుగా, స్త్రీలకు తిరుగులేని స్థానం ఉందని వారికి అనిపించింది.

గడిచిన 20వ శతాబ్దంలో స్త్రీలు చేసిన పోరాటాలు, వారు పాలుపంచుకున్న ఉద్యమాలు, వారు రాణించిన రంగాలు ఎన్నో ఉన్నాయి. 20వ శతాబ్దంలో మొదటిసారి చదువుకున్న స్త్రీలు, మొదటి వితంతు వివాహం చేసుకున్న సాహసురాండ్రు, స్త్రీ విద్య కావాలని, ఉద్యమించిన స్త్రీలు, ఉద్యమాలు చేసి జైలుకు వెళ్ళిన స్త్రీలూ ఉన్నారు. నాటకం, సినిమా, రేడియో, వంటి రంగాలలో స్త్రీలు మొదటిసారిగా 20వ శతాబ్దంలోనే అడుగుపెట్టారు. స్త్రీలలో ఎందరో మొదటితరం డాక్టర్లు, శాస్త్రవేత్తలు, కళాకారిణులు, విద్యాధికులు నాడు ఉన్నారు.

శరీరం పులకరింపజేసే ఎందరో సాహసమూర్తులు, ఆ శతాబ్దంలోనే ఉన్నారు. అందువల్లనే 20వ శతాబ్దంలో స్త్రీలే .. ప్రధానమైన చరిత్ర నిర్మాతలు అని చెప్పవచ్చు.

ప్రశ్న 9.
చరిత్ర నిర్మాతలుగా స్త్రీలు నిలదొక్కుకొనేందుకు ఎంత కష్టపడి ఉంటారు?
జవాబు:
చరిత్ర నిర్మాతలుగా స్త్రీలు నిలదొక్కుకోడానికి వారు చాలా కష్టపడి యుంటారు. ఆ విషయం తలచుకోగానే ఈ గ్రంథము సంపాదకులకు గుండెలు బరువెక్కాయట. ఆ స్త్రీలు, వాస్తవ జీవితానికి వ్యతిరేకమైన పరిస్థితులతో పోరాడారు. ఆ స్త్రీలు కొత్త కలలు కనడానికి, కొత్త జీవిత విధానాలు కనుక్కోడానికి, వారు ఎన్నో కఠిన పరీక్షలకు గురి అయ్యారు. మొదటిసారిగా వివాహం చేసుకున్న వితంతువు పరిస్థితి తలచుకొంటే, ఆ సామాన్య స్త్రీల సాహసం అసామాన్యమైనదని, సంపాదకులకు అనిపించింది.

ఉద్యమాలలో చేరి జైలుకు వెళ్ళిన స్త్రీ మూర్తులను, మొదటిసారి సినిమాలలో నటించిన స్త్రీలను చూస్తే వారు ఆనాడు ఎంత సాహసం చేశారో మనకు తెలుస్తుంది. ఆనాడు సమాజంలో స్త్రీలకు నేటి స్వాతంత్ర్యం లేదు. ఎన్నో కట్టుబాట్లు ఉండేవి. ఆ పరిస్థితులలో చరిత్ర నిర్మాతలుగా నిలదొక్కుకోడానికి ఆనాటి స్త్రీలు చాలా కష్టపడి ఉంటారని మనం గ్రహింపవచ్చు.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 7 మా ప్రయత్నం

ప్రశ్న 10.
రచయిత్రుల గుండెలు ఎందుకు బరువెక్కాయి?
జవాబు:
స్త్రీలు దేశం కోసం, తమ కోసం ఒక సమూహంగా చేసిన పోరాటాలకూ, వారు పడిన సంఘర్షణలకూ, వారు సాధించిన విజయాలకూ చరిత్రలో సరైన గుర్తింపు దొరకలేదు. చరిత్ర అనే జగన్నాథ రథచక్రాల కింద వారి సామూహిక ఉనికి ముక్కముక్కలయ్యింది.

మహిళావరణం పుస్తకంలో స్త్రీమూర్తులందరినీ గూర్చి వరుసగా రాయడం జరిగింది. ఆ స్త్రీలందరి గూర్చి చదివేటప్పటికి, వారు సాధించిన విజయాలను గూర్చి తెలిసికొనేటప్పటికి, స్త్రీల చైతన్య ప్రవాహవేగం, జీవం, ఆ ప్రవాహక్రమంలోని మార్పులూ ఈ గ్రంథ సంపాదకులకు ఒక కొత్త విషయాన్ని చెపుతున్నట్లు అనిపించింది.

ఆ స్త్రీలు అందరూ చరిత్ర నిర్మాణానికి ఎంత కష్టపడి ఉంటారో కదా! అని తలచుకొనేటప్పటికి, సంపాదకుల గుండెలు బరువెక్కాయి. ఆ స్త్రీలు వాస్తవ జీవిత ప్రతికూల పరిస్థితులతో తలపడ్డారు. వారు కొత్త కలలు కనడానికీ, కొత్త జీవిత విధానాలు కనుక్కోడానికీ, ఎన్నో కఠిన పరీక్షలకు గురయ్యారు. అవి తలచుకుంటే, ఆ సామాన్య స్త్రీల సాహసం అసామాన్యమైనదని సంపాదకులకు అనిపించింది.

ఆ స్త్రీలు చరిత్రను నిర్మించేందుకు ఎంతగానో కష్టనష్టాలకు గురై ఉంటారని సంపాదకులు అభిప్రాయపడ్డారు.

10th Class Telugu 7th Lesson మా ప్రయత్నం Important Questions and Answers

ప్రశ్న 1.
మహిళల ప్రగతిని వివరిస్తూ వ్యాసం రాయండి.
జవాబు:
ఈనాడు సమాజంలో స్త్రీలు అన్ని రంగాల్లో అగ్రగాములుగా ఉంటున్నారు. చదువుల్లో వారు సరస్వతీమూర్తులుగా మంచి ర్యాంకులు సాధిస్తున్నారు. వారు విమానాలను నడుపుతున్నారు. మిలటరీలో కూడా చేరి రాణిస్తున్నారు. శాస్త్రవేత్తలుగా ఎన్నో చక్కని పరిశోధనలు చేసి పేరు గడిస్తున్నారు. ఐ.ఎ.యస్, ఐ.పి.యస్ ఆఫీసర్లుగా పరిపాలనా రంగంలో స్త్రీలు చక్కగా రాణిస్తున్నారు.

M.L.Aలుగా, MLC లుగా, MP లుగా, ముఖ్యమంత్రులుగా, ప్రధానమంత్రులుగా, కేంద్రమంత్రులుగా స్త్రీలు చక్కగా రాణిస్తున్నారు. స్త్రీలు గొప్ప పరిపాలనాదక్షలుగా నిరూపించుకున్నారు. నిరూపించుకుంటున్నారు.

ఒకనాడు స్త్రీలు ఉన్నత విద్యారంగంలో ఉండేవారు కాదు. అటువంటిది ఈనాడు స్త్రీలకు ప్రత్యేక కళాశాలలు, విశ్వవిద్యాలయాలు వచ్చాయి. పురుషులతో సమానంగా స్త్రీలు విద్యావంతులై రాణిస్తున్నారు. స్త్రీలలో మంచి డాక్టర్లు, ఇంజనీర్లు నేడు ఉన్నారు. స్త్రీలు పంచాయతీ బోర్డు మెంబర్ల దగ్గర నుండి, దేశ ప్రధానులుగా కూడా తమ పరిపాలనా దక్షతను ప్రదర్శిస్తున్నారు. ఇందిరాగాంధీ, మార్గరెట్ థాచర్, సిరిమావో- భండారనాయకే, జయలలిత, మమత వంటి స్త్రీమణులు, మంచి పరిపాలన దక్షలుగా రాణించారు. రాణిస్తున్నారు.

స్త్రీలల్లో మంచి క్రీడాకారిణులు ఉన్నారు. ఉషా, అశ్వినీ వంటి స్త్రీలు, పరుగుపందెంలో రాణించారు. సైనా నెహ్వాల్, సెరెనా విలియమ్స్, హంపి, సానియామీర్జా వంటి క్రీడాకారిణులు వివిధమైన ఆటలలో ప్రపంచంలో మొదటివారుగా ఉన్నారు.

వ్యాపార రంగంలో ఎందరో స్త్రీలు చక్కగా రాణిస్తున్నారు. కిరణ్ బేడీ వంటి మంచి పోలీసు ఆఫీసర్లు స్త్రీలలో ఉన్నారు. ఈ విధంగా స్త్రీలు అన్ని రంగాలలో నేడు ముందంజలో ఉంటున్నారు. నేటి మహిళల ప్రగతికి, 20వ శతాబ్దంలో స్త్రీ విద్యకై పోరాడిన స్త్రీ మూర్తులే కారణం అని మనం ఎప్పుడూ మరువకూడదు.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 7 మా ప్రయత్నం

ప్రశ్న 2.
అత్యున్నత స్థాయికి చేరిన ఒక మహిళ ఆత్మకథ రాయండి.
జవాబు:
నాకు నచ్చిన మహిళ (శ్రీమతి ఇందిరా గాంధీ) : భరతమాత ముద్దుబిడ్డలలో, ఇందిరాగాంధీ ఒకరు. ప్రపంచ ప్రఖ్యాతి పొందిన మహిళామణులలో, ఇందిర సుప్రసిద్ధురాలు. ఈమె 1917వ సంవత్సరము నవంబరు 19వ తేదీన అలహాబాదులో జవహర్లాల్ నెహ్రూ – కమలా నెహ్రూ దంపతులకు జన్మించింది.

ఇందిర శాంతినికేతన్లో రవీంద్రుని వద్ద చదివింది. ఈమె గొప్ప దేశ భక్తురాలు. ఈమె భర్త ఫిరోజ్ గాంధీ, మహమ్మదీయుడు. ఆ వివాహం ఈమెకు మత సహనాన్ని నేర్పింది. ఈమె తండ్రితో పాటు దేశ విదేశాలు పర్యటించి, రాజనీతి చతురజ్ఞ అయ్యింది.

ఈమె భారతదేశ ప్రధానమంత్రిగా 15 సంవత్సరాలు పనిచేసింది. ఆ కాలంలో ఈమె బ్యాంకులను జాతీయం చేసింది. రాజభరణాలను రద్దు చేసింది. భూ సంస్కరణలను చేపట్టింది. ‘గరీబీ హఠావో’ అని ఈమె ఇచ్చిన నినాదం భారతదేశం అంతటా మారుమ్రోగింది.

ఈమె బడుగువర్గాల ఆశాజ్యోతిగా, దళిత వర్గాల కన్నతల్లిగా పేరు తెచ్చుకొంది. ఈమె గొప్ప సాహసురాలు. గొప్ప రాజనీతిజ్ఞురాలు.

ప్రశ్న 3.
మహిళల పట్ల చూపుతున్న వివక్షను, వారిపై జరుగుతున్న దాడులనూ ఖండిస్తూ నినాదాలు రాయండి.
జవాబు:

  1. ఆడపిల్ల ఇంటికి మహాలక్ష్మి – ఆమెను పువ్వుల్లా చూడండి.
  2. స్త్రీ, పురుషులు ఇద్దరూ సమానమే – స్త్రీలపట్ల వివక్ష విడవండి.
  3. స్త్రీలు నీకు కన్నతల్లులు, సోదరీమణులు – స్త్రీలను నీవు గౌరవించు.
  4. స్త్రీలను అవమానించావా! నిర్భయ చట్టానికి లొంగుతావు జాగ్రత్త.
  5. ఆడపిల్లల జోలికి వస్తే – అడుగంటిపోతావు జాగ్రత్త.
  6. మహిళలు లక్ష్మీ స్వరూపిణులు, సరస్వతీ స్వరూపిణులు. వారిని గౌరవించండి.
  7. పార్లమెంటులో స్త్రీలకు రిజర్వేషన్లు కల్పించండి – స్త్రీ పురుష సమానత్వాన్ని గౌరవించండి.
  8. స్త్రీలపై దాడిచేస్తే – మాడు పగులుగొడతారు జాగ్రత్త.
  9. ఆడా మగా తేడావద్దు – స్త్రీ పురుష భేదం నేటితో రద్దు.
  10. భ్రూణహత్యలను నివారించండి – మహిళామణులను ఆదరించండి.

ప్రశ్న 4.
మహిళలను గౌరవించవలసిన ఆవశ్యకతను గురించి వివరిస్తూ, మీ మిత్రునికి లేఖ వ్రాయండి.
జవాబు:

లేఖ,

ఒంగోలు,
x x x x x.

ప్రియమైన స్నేహితుడు శంకరు,
నీ స్నేహితుడు రాజేష్ వ్రాయు లేఖ.

నేను క్షేమంగానే ఉన్నాను. అక్కడ మన మిత్రులంతా క్షేమంగా ఉన్నట్లు తలచెదను.

స్త్రీలను గౌరవించడం మన భారతీయ ధర్మం కదా ! మొన్న ఒక రోడ్ సైడు రోమియో ఒక అమ్మాయిని ఏడిపిస్తుంటే చూశాను.

స్త్రీలు ఆనందించిన చోట దేవతలు ఉంటారు. సిరిసంపదలు వృద్ధి చెందుతాయి. మన అమ్మ, అక్క, చెల్లి, ఉపాధ్యాయురాలు కూడా స్త్రీయే, స్త్రీలను గౌరవించలేని సమాజం అనాగరిక సమాజం. అందుకే స్త్రీలను గౌరవించాలి. స్త్రీలను హేళన చేయడం, దూషించడం తప్పు. నా ఎదురుగా ఇటువంటి పనులు చేస్తే పోలీసు కంప్లైంటు ఇస్తాను అని చెప్పాను. దానితో వాడు పరారైపోయాడు.

ఈ ఉంటాను మరి. మీ అమ్మగారికి, నాన్నగారికి నా నమస్కారాలని చెప్పు. మన స్నేహితులందరినీ అడిగినట్లు చెప్పు.

ఇట్లు,
కె. రాజేష్.

చిరునామా :
జి. శంకర్,
10వ తరగతి, బాలుర ఉన్నత పాఠశాల,
నరసరావుపేట, గుంటూరు జిల్లా.

10th Class Telugu 7th Lesson మా ప్రయత్నం 1 Mark Bits

1. దీపావళి పండుగరోజు ఆబాలగోపాలం ఆనందిస్తారు – గీత గీసిన పదం ఏ సమాసం? (June 2017)
A) బహుజొహి
B) అవ్యయీభావం
C) తత్పురుషం
D) కర్మధారయం
జవాబు:
B) అవ్యయీభావం

2. అవ్యయీభావ సమాసానికి ఉదాహరణను గుర్తించుము. (March 2017)
A) సేవావృత్తి
B) మృదుమధురం
C) అనుకూలం
D) పదాబ్దములు
జవాబు:
C) అనుకూలం

3. ప్రతిదినము పాఠశాల అసెంబ్లి సమయంలోపే పాఠశాలకు రావాలి – గీత గీసిన పదం సమాసం పేరు గుర్తించండి. (June 2018)
A) అవ్యయీభావ సమాసం
B) రూపక సమాసం
C) షష్టీతత్పురుష సమాసం
D) ద్వంద్వ సమాసం
జవాబు:
A) అవ్యయీభావ సమాసం

AP SSC 10th Class Telugu Important Questions Chapter 7 మా ప్రయత్నం

4. క్రింది వానిలో సంభావన పూర్వపద కర్మధారయ సమాసానికి సరియైన ఉదాహరణ గుర్తించండి. (June 2018)
A) రామబాణం
B) గంగానది
C) మూడు రోజులు
D) తల్లిదండ్రులు
జవాబు:
B) గంగానది

5. విద్యార్థులు ప్రతిదినము పాఠాలను చదవాలి. (సమాసం గుర్తించండి) (S.A. I – 2018-19)
A) అవ్యయీభావ సమాసం
B) ద్విగు సమాసం
C) ద్వంద్వ సమాసం
D) షష్ఠీ తత్పురుష
జవాబు:
A) అవ్యయీభావ సమాసం

6. ఆహా ! ఎంత బాగుందీ ! (ఏ వాక్యమో గుర్తించండి.) (June 2017)
A) ఆశ్చర్యార్థకం
B) విధ్యర్థకం
C) ప్రేరణార్థకం
D) సందేహార్ధకం
జవాబు:
A) ఆశ్చర్యార్థకం

7. రమేష్ బడికి వస్తాడో, రాడో. (ఏ వాక్యమో గుర్తించండి.) (June 2017)
A) ప్రార్థనార్థకం
B) సందేహార్థకం
C) ప్రశ్నార్థకం
D) నిషేధార్థకం
జవాబు:
B) సందేహార్థకం

8. ప్రతి పనికి లాభం ఉంటుంది – దీనికి వ్యతిరేకార్థక వాక్యాన్ని గుర్తించండి. (March 2017)
A) ప్రతి పనికి లాభం ఉంటుందా?
B) ప్రతి పనిలో లాభం ఉంటుంది.
C) ప్రతి పనికి లాభం ఉండే ఉంటుంది.
D) ప్రతి పనికి లాభం ఉండదు.
జవాబు:
D) ప్రతి పనికి లాభం ఉండదు.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 7 మా ప్రయత్నం

9. సోముడు అడవికి వెళ్ళి, కట్టెలు తెచ్చాడు – ఇది ఏ రకమైన వాక్యమో గుర్తించండి. (March 2017)
A) సంయుక్తం
B) సంక్లిష్టం
C) ప్రశ్నార్థకం
D) ఆశ్చర్యార్థకం
జవాబు:
B) సంక్లిష్టం

10. ‘ఆకాశం నీలంగా ఉంటుంది’ – ఇది ఏ రకమైన వాక్యమో గుర్తించండి. (March 2017)
A) సంక్లిష్టం
B) చేదర్థకం
C) సామాన్యం
D) సందేహార్థకం
జవాబు:
C) సామాన్యం

11. “నీవు శాస్త్రవేత్తవు కాగలవు” – ఇది ఏ రకమైన వాక్యమో గుర్తించండి. (March 2017)
A) సామర్థ్యార్థకం
B) సందేహార్థకం
C) సంక్లిష్ట వాక్యం
D) సంయుక్త వాక్యం
జవాబు:
A) సామర్థ్యార్థకం

12. ‘ఆహా’ ఎంత రుచిగా ఉందో ! – ఇది ఏ రకమైన వాక్యమో గుర్తించండి. (March 2017)
A) చేదర్థకం
B) సందేహార్థకం
C) ఆశ్చర్యార్థకం
D) అప్యర్థకం
జవాబు:
C) ఆశ్చర్యార్థకం

13. ‘వాహనాన్ని వేగంగా నడుపవద్దు’ – ఇది ఏ రకమైన వాక్యమో గుర్తించండి. (March 2017)
A) నిషేధాకం
B) ఆశ్చర్యార్థకం
C) ప్రశ్నార్థకం
D) సందేహార్థకం
జవాబు:
A) నిషేధాకం

14. “మీరంతా పాఠం చదవండి” – ఏ రకమైన వాక్యమో గుర్తించండి. (March 2017)
A) చేదర్థకం
B) ప్రశ్నార్థకం
C) సందేహార్థకం
D) విధ్యర్థకం
జవాబు:
D) విధ్యర్థకం

AP SSC 10th Class Telugu Important Questions Chapter 7 మా ప్రయత్నం

15. ‘తిండి కలిగితే కండ గలదు’ – ఇది ఏ రకమైన వాక్యమో గుర్తించండి. (March 2017)
A) విధ్యర్థకం
B) చేదర్థకం
C) అభ్యర్థకం
D) అనుమత్యర్ధకం
జవాబు:
B) చేదర్థకం

16. ప్రతివాళ్ళు ప్రశ్నించారు చరిత్ర సాగిన క్రమాన్ని – కర్మణి వాక్యం గుర్తించండి. (June 2018)
A) చరిత్ర సాగిన క్రమాన్ని ఎందుకు ప్రశ్నించాలి.
B) ప్రతి ఒక్కడు ప్రశ్నించకూడదు చరిత్ర సాగిన క్రమాన్ని.
C) చరిత్ర సాగిన క్రమం ప్రతి వాళ్ళచేత ప్రశ్నించబడింది.
D) ఎవరూ ప్రశ్నించలేదు చరిత్ర సాగిన క్రమాన్ని.
జవాబు:
C) చరిత్ర సాగిన క్రమం ప్రతి వాళ్ళచేత ప్రశ్నించబడింది.

17. విమల టి.వి. చూస్తూ నృత్యం చేస్తున్నది – ఏ రకమైన వాక్యమో గుర్తించండి. (June 2018)
A) అప్యర్థక వాక్యం
B) సంయుక్త వాక్యం
C) చేదర్థక వాక్యం
D) శత్రర్థక వాక్యం
జవాబు:
D) శత్రర్థక వాక్యం

18. రవి లెక్కలు బాగా చేయగలడు – ఇది ఏ రకమైన వాక్యమో గుర్తించండి. (June 2018)
A) సామర్థ్యార్థకం
B) సంభావనార్థకం
C) ఆశ్చర్యార్థకం
D) ఆశీరర్థకం
జవాబు:
A) సామర్థ్యార్థకం

19. నేను తప్పక వస్తాను – ఇది ఏ రకమైన వాక్యమో గుర్తించండి. (June 2018)
A) అనుమత్యకం
B) విధ్యర్థకం
C) నిశ్చయార్థక వాక్యం
D) నిషేధకం
జవాబు:
C) నిశ్చయార్థక వాక్యం

20. సీత ఆటలు ఆడి అన్నం తిన్నది – ఇది ఏ రకమైన వాక్యమో గుర్తించండి.
A) అభ్యర్థకము
B) విధ్యర్థకము
C) చేదర్థకము
D) క్వార్థకము
జవాబు:
D) క్వార్థకము

21. భారతదేశంలో వస్తువుల ఉత్పత్తి పెరిగినా ధరలు తగ్గలేదు – ఇది ఏ రకమైన వాక్యమో గుర్తించండి. (June 2018)
A) అష్యకము
B) విధ్యర్థకము
C) క్వార్ధకము
D) చేదర్థకము
జవాబు:
A) అష్యకము

AP SSC 10th Class Telugu Important Questions Chapter 7 మా ప్రయత్నం

22. తామంతా కుటుంబ స్త్రీలం కామా ? అని శ్యామలగారన్నారు. (ప్రత్యక్ష కథనం గుర్తించండి)
A) “మేమంతా కుటుంబ స్త్రీలం కామా?” అని శ్యామల గారన్నారు.
B) “మనమంతా కుటుంబ స్త్రీలం కామా?” అని శ్యామల గారన్నారు.
C) “తామంతా కుటుంబ స్త్రీలం కామా?”, అని శ్యామల గారన్నారు.
D) “మీరు, మేము అంతా కుటుంబ స్త్రీలంకామా”, అని శ్యామల గారన్నారు.
జవాబు:
A) “మేమంతా కుటుంబ స్త్రీలం కామా?” అని శ్యామల గారన్నారు.

23. మా కంటె సీరియస్ గా ఆలోచించి, ప్రశ్నించి, సలహాలిచ్చారు. ఇది ఏ వాక్యమో గుర్తించండి) (S.A.I – 2018-19)
A) సంయుక్త వాక్యం
B) సంక్లిష్ట వాక్యం
C) సామర్థ్యార్థక వాక్యం
D) ప్రార్థనార్థక వాక్యం
జవాబు:
B) సంక్లిష్ట వాక్యం

24. కాలధర్మం చెందుట : పుట్టిన జీవికి కాలధర్మం చెందుట తప్పదు. (June 17, Mar 18)

25. గుండెలు బరువెక్కడం : “మిక్కిలి బాధపడటం” అనే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడుతారు. (March 17, 18, S.A.I – 2018-19)

26. కనువిప్పు : గురువులు చెప్పిన మాటలతో అజ్ఞానము తొలగి నాకు కనువిప్పు కలిగింది. (March 2017 S.A. I – 2018-19)

AP SSC 10th Class Telugu Important Questions Chapter 11 భిక్ష

AP State Board Syllabus AP SSC 10th Class Telugu Important Questions Chapter 11 భిక్ష

AP State Syllabus SSC 10th Class Telugu Important Questions 11th Lesson భిక్ష

10th Class Telugu 11th Lesson భిక్ష 2 Marks Important Questions and Answers

ఈ క్రింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాల్లో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
“ఇవ్వాటిమీద నాగ్రహముదగునె?” అనే మాటలు ఎవరు ఎవరితో ఏ సందర్భంలో అన్నారు? (March 2017)
జవాబు:
ఈ వాక్యం భిక్ష పాఠంలోనిది. కాశీ మహా నగరంలో వేదవ్యాస మహర్షికి ఎవ్వరూ భిక్ష పెట్టలేదు. దానితో ఆయనకు కోపం వచ్చింది. కాశీని శపించబోయాడు. అంతలో పార్వతీదేవి ప్రాకృత వేషంలో వచ్చింది. భోజనానికి రమ్మంది. వేదవ్యాసునికి బుద్ధులు చెపుతూ కాశీ మహానగరం మీద కోప్పడడం తప్పని చెప్పింది.

ప్రశ్న 2.
భిక్ష పాఠ్యాంశ నేపథ్యం రాయండి.
జవాబు:
వేదవ్యాస మహర్షి తన 10 వేలమంది శిష్యులతో కాశీలో నివసిస్తున్నాడు. ఋషి ధర్మంగా భిక్షాటన చేస్తూ జీవిస్తున్నాడు. శివుడు వ్యాసుని పరీక్షించాలనుకొన్నాడు. అతనికి భిక్ష దొరకకుండా చేయుమని తన భార్య పార్వతీదేవికి చెప్పాడు. ఆమె కాశీ నగర స్త్రీల హృదయాలలో ప్రవేశించి భిక్ష దొరకకుండా చేసింది.

ప్రశ్న 3.
భిక్ష పాఠం ఎవరు రచించారు? ఆయన గురించి రాయండి.
జవాబు:
భిక్ష పాఠం శ్రీనాథ మహాకవి రచించాడు. ఆయన రచించిన కాశీఖండం సప్తమాశ్వాసంలోనిది.

శ్రీనాథుడు 1380-1470 మధ్య జీవించాడు. అనగా 15వ శతాబ్ది కవి. రాజమహేంద్రవరంలో రెడ్డిరాజుల కొలువులో ఆస్థానకవి. మారయ, భీమాంబలు శ్రీనాథుని తల్లిదండ్రులు.

‘కవి సార్వభౌమ’ బిరుదాంకితుడు. పెదకోమటి వేమారెడ్డి కొలువులో విద్యాధికారి. ప్రౌఢ దేవరాయల ఆస్థానంలోని గౌడడిండిమ భట్టును పాండిత్యంలో ఓడించాడు. అతని కంచుఢక్కను పగులకొట్టించాడు.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 11 భిక్ష

ప్రశ్న 4.
శ్రీనాథుని రచనా శైలిని, సాహిత్య సేవను వివరించండి.
జవాబు:
శ్రీనాథుడు చిన్నతనం నుండే కావ్యరచన ప్రారంభించాడు. మరుత్తరాట్చరిత్ర, కాశీఖండం, శృంగారనైషధం మొదలైనవి రచించాడు.

చమత్కారానికీ, లోకానుశీలనకు, రసజ్ఞతకు, ఆయన జీవిత విధానానికి అద్దంపట్టే చాటువులు చాలా ఉన్నాయి. ఆయన కవిత్వం ఉద్దండలీల, ఉభయ వాక్రౌఢి, రసాభ్యుచిత బంధం, సూక్తి వైచిత్రి వంటి లక్షణాలతో ఉంటుంది.

సీస పద్య రచనలో ఆయనకు ఆయనే సాటి. వృద్ధాప్యంలో కష్టాలనుభవించాడు.

ప్రశ్న 5.
వ్యాసునికి కోపకారణం తదనంతర పరిణామాలను వివరించండి.
జవాబు:
వ్యాసుడు కాశీనగరంలో శిష్యులతో భిక్ష కోసం తిరిగాడు. ఈశ్వరుని మాయతో వరుసగా రెండు రోజులపాటు ఎవరూ ఆయనకు భిక్ష పెట్టలేదు. దానితో వ్యాసుడు భిక్షాపాత్రను పగులకొట్టి, కాశీవాసులకు మూడు తరాలదాకా ధనం, విద్య, మోక్షం లేకుండుగాక అని శపించబోయాడు.

అప్పుడు పార్వతీదేవి కాశీ నగరాన్ని శపించడం తప్పని, ఉన్న ఊరు కన్నతల్లితో సమానమని వ్యాసుడిని మందలించి, వ్యాసుడిని తన ఇంటికి భోజనానికి రమ్మని పిలిచింది. వ్యాసుడు, తన పదివేల శిష్యులు తినకుండా, తాను తినననే వ్రతం తనకు ఉందన్నాడు. అప్పుడు అందరికీ భోజనం పెడతాననీ శిష్యులతో తన ఇంటికి రమ్మని పార్వతి పిలిచింది.

వ్యాసుడు గంగలో స్నానం చేసి శిష్యులతో పార్వతీదేవి ఇంటికి వచ్చాడు. పార్వతి వారందరికీ భోజనం వడ్డించింది.

ప్రశ్న 6.
‘వ్రతము తప్పి భుజింపంగ వలను గాదు’ – ఈ మాటలు ఎవరు ఎవరితో ఏ సందర్భంగా అన్నారు?
జవాబు:
‘వ్రతము తప్పి భుజింపంగ వలనుగాదు’ అని వ్యాసుడు సామాన్య స్త్రీవలె కనబడిన అన్నపూర్ణాదేవితో అన్నాడు. వ్యాసుడు తనకు రెండు రోజులుగా కాశీలో భిక్ష దొరకలేదని కోపించి కాశీనగరమును శపించబోయాడు. అప్పుడు అన్నపూర్ణాదేవి సామాన్య స్త్రీవలె కనబడి, వ్యాసుని మందలించి, తన ఇంటికి భోజనానికి రమ్మని వ్యాసుడిని పిలిచింది.

అప్పుడు వ్యాసుడు తనకు పదివేల మంది శిష్యులు ఉన్నారనీ, వారందరితో కలిసి భుజించే వ్రతం తనకు ఉందనీ, ఆ వ్రతాన్ని విడిచి పెట్టి తాను ఒక్కడూ ‘భోజనానికి రాననీ చెప్పిన సందర్భంలో ఈ మాటను అన్నపూర్ణాదేవితో ఆయన చెప్పాడు.

ప్రశ్న 7.
కాశీ పట్టణంలో స్త్రీలు అతిథులను ఎలా ఆదరించేవారు?
జవాబు:
కాశీనగరంలోని స్త్రీలు అన్నపూర్ణాదేవికి ప్రియమైన స్నేహితురాండ్రు. వారు వాకిట్లో ఆవుపేడతో చక్కగా అలికి, నాలుగు అంచులూ కలిసేలా దానిపై ముగ్గు పెడతారు. ఆ ముగ్గు మధ్యలో నచ్చిన అతిథిని నిలిపి, వారికి అర్హపాద్యాలు ఇస్తారు. వారికి పూలతో, గంధముతో పూజ చేస్తారు.

తరువాత బంగారు గరిటెతో అన్నముపై ఆవునేయిని అభిఘరిస్తారు. తరువాత భక్తి విశ్వాసాలు కనబరుస్తూ, పండ్లతో, పరమాన్నముతో, పలురకాల పిండివంటలతో, గాజులు గలగల ధ్వని చేస్తుండగా, యతీశ్వరులకు వారు మాధుకర భిక్ష పెడతారు.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 11 భిక్ష

ప్రశ్న 8.
కోపం తగదని అన్నపూర్ణాదేవి వ్యాసునికి ఏయే ఉదాహరణల పూర్వకంగా తెలిపింది?
జవాబు:
వ్యాసుడికి కోపం తగదని అన్నపూర్ణాదేవి ఈ కింది విధంగా చెప్పి, ఆయనను మందలించింది.

“ఓ మహర్షీ! నీవు ఇప్పుడు గొంతుదాకా తినడానికి భిక్షాన్నము దొరకలేదని చిందులు వేస్తున్నావు. ఇది మంచిపని కాదు. నీవు నిజంగా శాంత స్వభావం కలవాడవు కాదు. ఎందుకంటే, ఎంతో మంది మునులు పిడికెడు వరిగింజలతో కాలం వెళ్ళదీస్తున్నారు. మరికొందరు శాకాహారంతో, దుంపలతో సరిపెట్టుకుంటున్నారు. కొందరు వరిమళ్ళలో రాలిన ధాన్యం కంకులు ఏరుకొని దానితో బతుకుతున్నారు. మరికొందరు మునులు రోళ్ళ దగ్గర జారిపడిన బియ్యం ఏరుకొని బతుకుతున్నారు. వారంతా నీ కంటె తెలివితక్కువవారు కాదు కదా ! ఆలోచించు.

అదీగాక ఉన్నఊరు, కన్నతల్లి వంటిది. కాశీ నగరం శివునికి భార్య. “నీవంటివాడు అటువంటి కాశీ నగరాన్ని భిక్ష దొరకలేదని కోపించడం తగదు.” ఈ ఉదాహరణలతో అన్నపూర్ణాదేవి వ్యాసుడిని మందలించింది.

10th Class Telugu 11th Lesson భిక్ష 4 Marks Important Questions and Answers

ఈ క్రింది ప్రశ్నలకు 10 లేక 12 వాక్యాల్లో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
“భిక్ష” పాఠ్యభాగ కథను మీ మాటల్లో వివరించండి. (June 2018)
జవాబు:

  1. వ్యాసమహర్షి శిష్యులతో మండుటెండలో కాశీనగర బ్రాహ్మణ వీధులందు భిక్ష కోసం తిరుగసాగాడు.
  2. ఒక ఇల్లాలు వండుతున్నామని చెప్పగా మరో గృహిణి మళ్ళీ రమ్మని చెబుతుంది. ఇంకొక ఆవిడ వ్రతం అని చెబితే, వేరొక ఇల్లాలు అసలు తలుపులే తెరువదు.
  3. కాశీ నగర గృహిణులు అన్నపూర్ణాదేవికి ప్రియమైన చెలులు. అతిథిని పరమేశ్వర స్వరూపంగా భావించి సకల మర్యాదలతో భిక్ష సమర్పిస్తారు. అలాంటి స్త్రీలున్న కాశీలో ఒక్కరు కూడా భిక్ష సమర్పించకపోవడంతో వ్యాసుడు ఆశ్చర్యపోయాడు.
  4. మరుసటి రోజు కూడా విశ్వనాథుని మాయ వలన భిక్ష లభించకపోవడంతో వ్యాసుడు కోపావేశాలకు లోనై కాశీనగర జనులను శపించబోయాడు.
  5. అప్పుడు పార్వతీదేవి సామాన్య స్త్రీ వేషంలో బ్రాహ్మణ మందిరపు వాకిట నిల్చి, వ్యాసుడిని ఇటు రమ్మని పిల్చి “ఓ మునివరా ! ‘ఉన్న ఊరు కన్నతల్లితో సమానం’ అని నీవెరుగవా ? ఈ కాశీనగరిపై ఇంత కోపం తగునా ?” అని సున్నితంగా మందలించింది.
  6. “మా ఇంటికి భోజనానికి రా !” అని పార్వతీదేవి పిలువగా, శిష్యులను వదలి పెట్టి భుజించరాదన్న తన నియమాన్ని వ్యాసుడు వెల్లడించాడు. ఆమె తాను విశ్వనాథుని దయవలన ఎంతమంది అతిథులకైనా భోజనం పెట్టగలనని తెల్సింది. వ్యాసుడు తన శిష్యులతో పాటు, గంగానదిలో స్నాన, ఆచమనాలు ముగించి, భోజనానికి వచ్చాడు.

ప్రశ్న 2.
“కోపం మంచి చెడులను గ్రహించే జ్ఞానాన్ని నశింపచేస్తుంది” – భిక్ష పాఠ్యభాగం ఆధారంగా నిరూపించండి. March 2018
జవాబు:

  1. బ్రహ్మజ్ఞానియైన వేదవ్యాసుడు తన పదివేలమంది శిష్యులతో కాశీలో కొంతకాలం నివసించాడు. ఆ సమయంలో శిష్యులతో కలిసి భిక్షాటనం చేసి జీవించేవాడు. ఒక రోజున కాశీ విశ్వనాథుడికి వ్యాసుణ్ణి పరీక్షించాలన్న సంకల్పం కలిగింది.
  2. పరమేశ్వర సంకల్పం వలన పట్టపగలు మండుటెండలో భిక్షాటనం చేస్తున్న వ్యాసునికి భిక్ష లభించలేదు. “నేను ఈ రోజు ఏ పాపిష్టి వాడి ముఖం చేశానో” అని వ్యాసుడు చింతించాడు. ఆ రోజుకు ఉపవాసం ఉండి మరునాడు భిక్ష కోసం తిరుగసాగాడు. కానీ విశ్వనాథుని మాయ వలన ఏ ఇల్లాలూ భిక్ష పెట్టలేదు.
  3. కోపంతో ఆలోచనాశక్తిని కోల్పోయిన వ్యాసుడు భిక్షపాత్రను నట్టనడివీథిలో విసిరికొట్టి ముక్కలు చేశాడు. ఈ కాశీ నగరంలో నివసించే వారికి మూడు తరాలదాక ధనము, విద్య, మోక్షము లభించకుండుగాక !” అని శపించబోయాడు.
  4. మహర్షులు మనోనిగ్రహం కలిగి ఉండాలి. కోపాన్ని జయించాలి. సంయమనాన్ని (ఓర్పును) వహించాలి. కానీ వ్యాసుడు అలా చేయలేకపోయాడు. వేదాలను విభజించినవాడు, అష్టాదశ పురాణాలను రచించిన వాడైన వ్యాసుడు తన గొప్పతనానికి తగినట్లు ప్రవర్తించక, మితిమీరిన కోపావేశాలకు లోనయ్యాడు. పార్వతీ పరమేశ్వరుల ఆగ్రహానికి గురియైనాడు.
  5. కోపాన్ని అదుపులో ఉంచుకోకపోతే ఎంతటివారికైనా తిప్పలు తప్పవనే విషయం వ్యాసుని ప్రవర్తన ద్వారా
    నిరూపితమైంది. “కోపం ఆలోచనాశక్తిని నశింపజేస్తుంది” అనటానికి వ్యాసుని వృత్తాంతమే నిదర్శనమని చెప్పవచ్చు.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 11 భిక్ష

ప్రశ్న 3.
క్రింది పాత్రల స్వభావాలను రాయండి.
జవాబు:
1. వ్యాసమహర్షి :
వేద విభజన చేశాడు. 18 పురాణాలు రచించాడు. 10 వేల మంది శిష్యులకు విద్య నేర్పేవాడు. ఋషి ధర్మంగా భిక్షాటన చేసినవాడు. రెండు రోజులు భిక్ష దొరకలేదు. తన శిష్యుల ఆకలి చూడలేక కాశీని శపించబోయాడు. అంటే కాశీని కూడా శపించగల మహా తపస్సంపన్నుడు. అన్నపూర్ణాదేవి స్వయంగా పిలిచి భిక్షను పెట్టింది. అంటే అన్నపూర్ణాదేవిని కూడా ప్రత్యక్షం చేసుకోగల పుణ్యాత్ముడు. ఆ జగన్మాత చేతి వంటను రుచి చూసిన మహాభాగ్యశాలి. కాని తన కోపం కారణంగా ఆ వైభవాలను కోల్పోయాడు. అల్పసంతోషి. తక్షణ కోపం కలవాడు.

2. కాశీలోని సామాన్య స్త్రీలు :
చక్కగా అలికి ముగ్గులు పెట్టి, ఇల్లు కలకలలాడుతూ ఉంచే స్వభావం కలవారు. అతిథులను సాక్షాత్తు దైవంగా భావించి పూజిస్తారు. బంగారు కంచంలో పిండి వంటలతో అన్నం పెడతారు. భిక్షుకులకు లేదు అనే మాట వారినోట రాదు. వారి హృదయాలలో నిరంతరం అన్నపూర్ణాదేవి కొలువై ఉంటుంది. కాశీలోని స్త్రీలు అన్నపూర్ణాదేవికి చెలికత్తెలు. అంతటి పుణ్యస్త్రీలు ఎక్కడా కనిపించరు. వారికి వారేసాటి.

3. అన్నపూర్ణాదేవి (పార్వతీదేవి) :
కేవలం భిక్ష దొరకనంత మాత్రాన ఇంత బాధపడిపోతావా? ఇది మంచిదా? అని బిడ్డను తల్లి మందలించినట్లు వ్యాసుని మందలించింది. పిడికెడు బియ్యం వండుకొని తినే వారున్నారు. కేవలం కాయలు తినే వారున్నారు. ఇంకా రకరకాల వారున్నారు కదా! వారంతా నీకంటే తెలివితక్కువ వారా! అని ప్రశ్నించింది.

ఒక బిడ్డకు తల్లి చెప్పే నీతులు, మందలింపులు, పోలికలు, ప్రశ్నలు సంధిస్తూ పార్వతీదేవి ఒక పెద్ద ముత్తైదువగా కనిపిస్తుంది. పరిపూర్ణ మాతృత్వం మూర్తీభవించినట్లుగా అన్నపూర్ణాదేవి స్వభావం కనిపిస్తుంది.

ప్రశ్న 4.
అన్నపూర్ణాదేవి ప్రత్యక్షమవడానికి కారణాలు వివరించండి.
జవాబు:
వేదవ్యాసుడు ఒకనాడు కాశీనగరంలో తన పదివేల మంది శిష్యులతో భిక్ష కోసం బ్రాహ్మణ వీధులలో ఇంటింటికీ తిరిగాడు. ఎవరూ వారికి భిక్ష పెట్టలేదు. సామాన్యంగా కాశీనగరంలోని బ్రాహ్మణ స్త్రీలు, రోజూ అతిథులకు ఆదరంగా మాధుకర భిక్ష పెడుతూ ఉంటారు. కానీ ఆనాడు వ్యాసుడికి ఎవరూ భిక్ష పెట్టలేదు. ఒకామె ‘అన్నం వండుతున్నాము’ అంది. మరొక స్త్రీ ‘మళ్ళీ రండి’ అంది. ఒకామె తమ ఇంట్లో దేవకార్యం అని చెప్పింది.

ఆ రోజుకు ఎలాగో ఉపవాసం ఉందామనీ, మరునాడు తప్పక భిక్ష దొరుకుతుందని వ్యాసుడు నిశ్చయించాడు. మరుసటి రోజున వ్యాసుడు శిష్యులతో భిక్షాటనకు వెళ్ళాడు. ఈశ్వరుడి మాయవల్ల ఆ రోజు కూడా ఆయనకు కాశీ నగరంలో ఎవరూ భిక్ష పెట్టలేదు.

దానితో వ్యాసుడు కోపంతో తన భిక్షాపాత్రను పగులకొట్టి, కాశీవాసులకు మూడు తరాల వరకూ ధనము, మోక్షము, విద్య లేకుండుగాక అని శపించడానికి సిద్ధమయ్యాడు.

అప్పుడు అన్నపూర్ణాదేవి, ఒక బ్రాహ్మణ భవనం వాకిటిలో సామాన్య స్త్రీవలె ప్రత్యక్షమయ్యింది. వ్యాసుడు కాశీ నగరాన్ని శపించకుండా అడ్డుపడి, ఆయనను మందలించడానికే అన్నపూర్ణాదేవి అలా ప్రత్యక్షమయ్యింది.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 11 భిక్ష

ప్రశ్న 5.
‘కోపం అన్ని అనర్ధాలకు కారణం అని ఎలా చెప్పగలవు?
(లేదా)
కోపం మనిషి విచక్షణను కోల్పోయేలా చేస్తుంది అనే విషయాన్ని భక్ష పొఠం ఆధారంగా వివరించండి.
జవాబు:
“కోపం వస్తే నేను మనిషిని కాను” అని అంటూ ఉంటారు. అది నిజమే. కోపం వస్తే తనను తాను మరచి, మనిషి రాక్షసుడు అవుతాడు. ఆ కోపంతో తాను ఏమి చేస్తున్నాడో, తెలిసికోలేడు. కోపంలోనే అన్నదమ్ములనూ, అక్క చెల్లెండ్రనూ, చివరకు కట్టుకొన్న భార్యనూ, కన్నపిల్లల్నీ కూడా చంపుతూ ఉంటారు. కాబట్టి కోపం మంచిది కాదు.

ఈ కథలో వ్యాసుడి అంతటి బ్రహ్మజ్ఞాని రెండు రోజులు భిక్ష దొరకలేదని కాశీ నగరాన్నే శపించబోయాడు. భర్తృహరి నీతి శతకంలో “క్షమ కవచంబు క్రోధమది శత్రువు” అంటాడు. అంటే ఓర్పు కవచం లాంటిది.
కోపం శత్రువు లాంటిది అని అర్థం. శత్రువులాంటి కోపాన్ని విడిచి పెట్టాలి.

దుర్యోధనుడికి పాండవుల పైన, భీముడి మీద కోపం. అందుకే వారితో తగవు పెట్టుకొని యుద్ధంలో తాను మరణించాడు. దేవతలపై కోపంతోనే, రాక్షసులు అందరూ మరణించారు. “కోపమునను ఘనత కొంచెమైపోవును” అని వేమన కవి చెప్పాడు.

కాబట్టి మనిషి కోపాన్ని అణచుకోవాలి. కోపము మనిషికి శత్రువు వంటిది. “తన కోపమే తన శత్రువు” అంటాడు సుమతీ శతక కర్త. కాబట్టి కోపం విడిచి పెట్టాలి.

ప్రశ్న 6.
‘ఆవేశం ఆలోచనలను నశింపచేస్తుంది’ – మీ పాఠం ఆధారంగా సమర్థించండి.
జవాబు:
కోపం వస్తే, ఆవేశం వస్తుంది. ఆవేశంలో ఏది మంచిదో, ఏది చెడ్డదో గ్రహించే వివేచన శక్తి మనిషికి నశిస్తుంది. దానితో అతడు తప్పుడు పనులకు సిద్ధం అవుతాడు. ఆవేశంతో కట్టుకున్న భార్యను, కన్న పిల్లల్నీ కూడా చంపడానికి సిద్ధం అవుతాడు.

కోపం యొక్క ఆవేశంలో అష్టాదశ పురాణాలు రచించిన వ్యాసమహర్షి అంతటివాడు, కన్నతల్లి వంటి కాశీ నగరాన్నే శపించబోయాడు. వ్యాసమహర్షి పదివేలమంది శిష్యులకు గురువు. నిత్యం కాశీ నగరంలో శిష్యులతో భిక్షకు వెళ్ళి ఆ భిక్షాన్నం తిని జీవించేవాడు. వ్యాసుడిని పరీక్షించాలని శివుడు భావించాడు. అన్నపూర్ణాదేవితో చెప్పి ఎవరూ వ్యాసునికి భిక్ష పెట్టకుండా చేశాడు.

ఒక రోజున వ్యాసుడికి, శిష్యులకూ ఎవరూ భిక్ష పెట్టలేదు. ఆ రోజు కాకపోయినా, మరునాడు తప్పక భిక్ష దొరకుతుందని వారు అనుకున్నారు. మరునాడు కూడా వ్యాసునికి ఎవరూ భిక్ష పెట్టలేదు.

దానితో వ్యాసుడు కోపంవల్ల వచ్చిన ఆవేశంతో, ఉద్రేకంతో తాను నివసిస్తున్న కాశీ నగరాన్నే శపించబోయాడు. ఉన్న ఊరు కన్నతల్లితో సమానం అంటారు. భిక్ష దొరకలేదనే ఆవేశంతో, వ్యాసుడు కాశీ నగరవాసులకు మూడు తరాల దాక విద్య, ధనము, మోక్షము లేకుండా పోవుగాక అని శపించబోయాడు.

దీనినిబట్టి ఆవేశం, ఆలోచనలను నశింపజేస్తుంది అని మనకు తెలుస్తోంది.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 11 భిక్ష

ప్రశ్న 7.
అన్నపూర్ణాదేవి పాత్ర స్వభావం వివరించండి.
జవాబు:
పార్వతీ స్వరూపం :
అన్నపూర్ణాదేవి కాశీ విశ్వేశ్వరుని ఇల్లాలు. పరమశివుని భార్య పార్వతీదేవినే, కాశీ నగరంలో అన్నపూర్ణాదేవి అని అంటారు. అన్నపూర్ణా విశ్వేశ్వరులు ఒకసారి కాశీ నగరంలో శిష్యులతో నివసిస్తున్న వ్యాసమహర్షిని పరీక్షిద్దాం అనుకున్నారు.

ఆదిశక్తి :
కాశీ నగరంలో అన్నం కావలసిన వారందరికీ అన్నపూర్ణాదేవి భిక్ష పెడుతుంది. కాశీ నగరంలోని బ్రాహ్మణ స్త్రీలు అందరూ అన్నపూర్ణాదేవికి స్నేహితురాండ్రు. అన్నపూర్ణాదేవి వేదపురాణ శాస్త్ర మార్గాన్ని చక్కగా పాటించే ముత్తయిదువ. ఆమె కాశీనగర బంగారుపీఠాన్ని అధిష్ఠించిన ఆదిశక్తి.

ఆతిధ్యము :
వ్యాసుడు కాశీ నగరాన్ని శపించకుండా అన్నపూర్ణాదేవి అడ్డుపడింది. ఒక బ్రాహ్మణ గృహద్వారం దగ్గర సామాన్య స్త్రీ వలె ఆమె ప్రత్యక్షమై, వ్యాసుడిని మందలించింది. తన ఇంటికి వ్యాసుడినీ, శిష్యులనూ భోజనానికి పిలిచి, వారికి కడుపునిండా భోజనం పెట్టింది.

మాట చాతుర్యం :
అన్నపూర్ణాదేవి మాటలలో మంచి నేర్పు ఉంది. “గొంతు దాకా తిండిలేదని గంతులు వేస్తున్నావు. మహర్షులు పిడికెడు నివ్వరి గింజలతో, కాయగూరలతో తృప్తి పడుతున్నారు కదా” అని వ్యాసుడిని చక్కగా మందలించింది. ఉన్న ఊరు కన్నతల్లి వంటిదని, కాశీ నగరం శివుడికి ఇల్లాలని, వ్యాసుడికి గుర్తు చేసింది. వ్యాసుడు అంతటివాడు కాశీని శపించడం తగదని హితవు చెప్పింది.

దీనినిబట్టి అన్నపూర్ణాదేవి మహాసాధ్వి అని, మంచి మాట చాతుర్యం కలదని, అతిథులకు అన్నం పెట్టే ఉత్తమ ఇల్లాలు అని తెలుస్తుంది.

10th Class Telugu 11th Lesson భిక్ష Important Questions and Answers

ప్రశ్న 1.
యాచన మంచిదికాదు అని చెబుతూ కరపత్రం తయారు చేయండి.
జవాబు:
యాచన మానండి – మాన్నించండి
ఆత్మాభిమానానికి గొడ్డలిపెట్టు యాచన. మర్యాదకు సమాధి యాచన. దరిద్రానికి పునాది యాచన.

అందుకే యాచన మానండి. కష్టపడండి. కాసులను ఆర్జించండి. దరిద్రాన్ని తరిమికొట్టండి. మీకెదురైన యాచకులకు ఆత్మసైర్యాన్ని కల్గించండి. జీవన మార్గాన్ని నిర్దేశించండి. ఉపాధి మార్గాలు చూపించండి. వృద్ధులైతే వృద్ధాశ్రమాల్లో చేర్చండి. అనాథలైతే అనాథాశ్రమాలలో చేర్పించండి. వారూ మన సోదరులే. వారిని ఉద్దరించడం, వారిలో ఆత్మాభిమానం కల్గించడం మన సామాజిక బాధ్యత.

ఇట్లు,
యాచనా వ్యతిరేక సంఘం.

ప్రశ్న 2.
కోపంవల్ల కలిగే అనర్థాలను వివరిస్తూ వ్యాసం రాయండి.
జవాబు:
‘కోపం – అనర్థాలు’

కోపము చెడ్డ లక్షణం. మనకు వ్యతిరేకంగా మాట్లాడితే, పనిచేస్తే, మనకు కోపం వస్తుంది. అనుకున్న పని జరుగకపోతే, కోపం వస్తుంది. కోపం వల్ల మోహం వస్తుంది. మోహం వల్ల బుద్ది నశిస్తుంది. బుద్ధి నశిస్తే మనిషి నశిస్తాడు అని గీత చెపుతోంది.

కోపంవల్ల చాలా అనర్థాలు సంభవిస్తాయి. మనిషి విచక్షణ శక్తిని కోల్పోతాడు. మనిషి కోపంలో తాను ఏమి చేస్తున్నాడో తెలిసికోలేడు. కోపంలో మనిషి తల్లిదండ్రులనూ, భార్యాబిడ్డలనూ, గురువులనూ సహితం, చంపడానికి సిద్ధం అవుతాడు. కోపంతో పగబట్టి మనిషి శత్రువులను చంపడానికి ప్రయత్నిస్తాడు.

కోపం మంచిదికాదని, మనకు పురాణాలు కూడా చెపుతున్నాయి. విశ్వామిత్రుడు, దుర్వాసుడు వంటి మహర్షులు, కోపంతో విచక్షణ పోగొట్టుకొని, ఎన్నో చిక్కులు పడ్డారు. విశ్వామిత్రుడు వశిష్ఠుడి చేతిలో భంగపడ్డాడు.

దుర్యోధనుడు పాండవులపై కోపంతో యుద్ధానికి దిగి, సర్వనాశనం అయ్యాడు. దుర్వాస మహర్షి అంబరీషుడిపై కోపపడి తానే కష్టాలపాలయ్యాడు. వ్యాసుడి వంటి బ్రహ్మజ్ఞాని కోపంతో కాశీని శపించబోయాడు.

కోపం మంచిది కాదని, మనకు నీతిశతకాలు చెపుతున్నాయి. భర్తృహరి “క్రోధమది శత్రువు” అని చెప్పాడు! “కోపమునను ఘనత కొంచెమైపోవును” అని వేమన చెప్పాడు. “తన కోపమె తన శత్రువు” అని సుమతీశతకం చెప్పింది.

అందువల్ల మనము కోపాన్ని విడిచి, శాంతముగా బ్రతకాలి. ‘శాంతమే భూషణము’ అని మనం గ్రహించాలి.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 11 భిక్ష

ప్రశ్న 3.
కోపంవల్ల గౌరవం తగ్గుతుందనే విషయాన్ని వివరిస్తూ ఒక కరపత్రం రాయండి.
జవాబు:
కోపం – గౌరవహీనం మిత్రులారా!

ఒక్కసారి ఆలోచించండి. మనం ప్రతి చిన్న విషయానికీ కోపం తెచ్చుకుంటూ ఉంటాము. కోపం అన్ని అనర్ధాలకూ మూలకారణం. కోపంవల్ల విచక్షణా జ్ఞానం నశిస్తుంది. ముఖ్యంగా చీటికీ మాటికీ కోపపడే వ్యక్తులకు, సంఘంలో గౌరవం తగ్గుతుంది. కోపం ఉన్న వ్యక్తి, ఇతరుల మనస్సులను జయించలేడు. నవ్వుతూ మాట్లాడే వ్యక్తి, ప్రపంచాన్నే జయిస్తాడు.

క్రోధం వల్ల మోహం, మోహంవల్ల బుద్ధి నాశనం కల్గుతాయని భగవద్గీత చెప్పింది. పురాణాలలో చెప్పబడే మునులలో విశ్వామిత్రుడు, దుర్వాసుడు సులభకోపులు. కోపంవల్ల వారు ఎన్నో చిక్కులు పడ్డారని, ఇతరులను అకారణంగా వారు హింసించారని పురాణాలు చెపుతున్నాయి. కోపం మనిషికి గౌరవ హీనతను తెస్తుంది. కోపం మనిషి వివేకాన్ని పాతర వేస్తుంది.

అందుకే మనం కోపాన్ని దూరంగా పెడదాం. తన కోపం తన శత్రువు అని సుమతీశతకం చెప్పినమాట గుర్తు పెట్టుకుందాము. కోపంవల్ల ఆయుర్దాయం తగ్గుతుంది. గుండె బలం తగ్గుతుంది. పిల్లలకు కోపంతో చెప్పిన దానికంటె, నవ్వుతో చెప్పినధి సులభంగా ఎక్కుతుంది. కార్యసాధనకు కోపం మహాశత్రువు అని గుర్తించండి. కోపానికి తిలోదకాలు ఇవ్వండి. నవ్వుకు, ఆనందానికి స్వాగతం పలకండి. పదికాలాలపాటు ఆరోగ్యంగా బ్రతకండి. కోపాన్ని విడిచిపెడతాం అని మనం ప్రతిజ్ఞ చేద్దాం. పదండి. కదలండి.
ఇట్లు,
ఆరోగ్య మిత్ర సంఘం,
గుంటూరు యువత.

10th Class Telugu 11th Lesson భిక్ష 1 Mark Bits

1. గురుశిష్యులు మండుటెండలో భిక్ష కోసం తిరిగారు – గీత గీసిన పదానికి విడదీసిన రూపాన్ని గుర్తించండి. (June 2017)
A) మండుట + ఎండ
B) మండు + టెండ
C) మండు + ఎండ
D) మండుట + అండ
జవాబు:
C) మండు + ఎండ

2. పార్వతి కాశీనగరమును శపించబోయిన వ్యాసుని మందలించింది – గీత గీసిన పదంలోని సమాసమేది ? (June 2017)
A) ఉపమాన ఉత్తరపద కర్మధారయం
B) సంభావనా పూర్వపద కర్మధారయం
C) అవధారణా పూర్వపద కర్మధారయం
D) విశేషణ పూర్వపద కర్మధారయం
జవాబు:
B) సంభావనా పూర్వపద కర్మధారయం

3. మునివర ! నీవు శిష్యగణముంగొని చయ్యన రమ్మువిశ్వనా – ఇది ఏ పద్యపాదమో గుర్తించండి. (June 2017)
A) మత్తేభం
B) ఉత్పలమాల
C) శార్దూలం
D) చంపకమాల
జవాబు:
D) చంపకమాల

4. మేఘుడంబుధికి పోయి జలంబులు తెచ్చి ఇస్తాడు. లోకోపకర్తలకిది సహజగుణము – ఇందులోని అలంకారాన్ని గుర్తించండి. (June 2017)
A) అర్థాంతరన్యాసం
B) రూపకం
C) స్వభావోక్తి
D) అంత్యానుప్రాసం
జవాబు:
A) అర్థాంతరన్యాసం

AP SSC 10th Class Telugu Important Questions Chapter 11 భిక్ష

5. విజ్ఞానం కోసం విహారయాత్రలు చేయాలి – (గీత గీసిన పదమునకు వికృతిని గుర్తించండి.) (March 2017)
A) యంత్రము
B) ప్రయత్నం
C) జతనం
D) జాతర
జవాబు:
D) జాతర

6. సామాన్యాన్ని విశేషంతో గానీ, విశేషాన్ని సామాన్యంతో గాని సమర్థించి చెప్పే అలంకారం గుర్తించండి. (June 2018)
A) శ్లేష
B) ఉత్ప్రేక్ష
C) రూపకము
D) అర్థాంతరన్యాసము
జవాబు:
D) అర్థాంతరన్యాసము

7. ‘స్వభావం చేతనే ఐశ్వర్యం గలవాడు” అను వ్యుత్పత్యర్ధము గల్గిన పదమును గుర్తించుము. (March 2018)
A) భాగ్యశాలి
B) సంపన్నుడు
C) ధనికుడు
D) ఈశ్వరుడు
జవాబు:
D) ఈశ్వరుడు

8. భవాని ఒక పెద్ద ముత్తైదువ రూపంలో వచ్చి వ్యాసుణ్ణి మందలించింది – గీత గీసిన పదానికి సరైన వ్యుత్పత్యర్థాన్ని గుర్తించుము. (March 2018)
A) ఇంద్రుని భార్య
B) భవుని భార్య
C) విష్ణువు భార్య
D) సూర్యుని భార్య
జవాబు:
B) భవుని భార్య

9. పద్యములోని మొదటి అక్షరమును ఏమంటామో గుర్తించండి?
A) ప్రాస
B) యతి
C) పాదం
D) పదం
జవాబు:
B) యతి

10. మాయింటికిం గుడువ రమ్ము ! (ఆధునిక వచన వాక్యాన్ని గుర్తించండి.) (June 2017)
A) మాయింటికి భోజనానికి రావద్దు
B) మాయింటిలో అన్నం వండేందుకు రా
C) మాయింటికి భోజనానికి రా !
D) మాయింటికి భోజనానికి రాబోకుమా
జవాబు:
C) మాయింటికి భోజనానికి రా !

11. ఏ పాపాత్ముని ముఖంబు నీక్షించితినో – ఈ వాక్యానికి ఆధునిక వచనాన్ని గుర్తించండి. (March 2017)
A) ఏ పాపాత్ముని చూసానో నేను
B) ఏ పాపాత్ముని ముఖాన్ని చూసానో
C) ఏ పాపాత్ముని ముఖాన్ని చూడలేదు
D) ఏ పాపాత్ముని చూడలేదు నేను
జవాబు:
B) ఏ పాపాత్ముని ముఖాన్ని చూసానో

AP SSC 10th Class Telugu Important Questions Chapter 11 భిక్ష

12. బౌద్ధ భిక్షువులచే వేలాది దీపాలు వెలిగించబడ్డాయి – దీనికి కర్తరి వాక్యం గుర్తించండి. (March 2018)
A) బౌద్ధ భిక్షువులు వేలాది దీపాలను వెలిగించారు.
B) బౌద్ధ భిక్షువులు వేలాది దీపాలను వెలిగించలేదు.
C) వేలాది దీపాలు బౌద్ధ భిక్షువులచే వెలిగించారు.
D) బౌద్ధ భిక్షువులు వేలాది దీపాలను వెలిగిస్తారు.
జవాబు:
A) బౌద్ధ భిక్షువులు వేలాది దీపాలను వెలిగించారు.

13. హరిహర బ్రహ్మలను పురిటి బిడ్డలను చేసిన పురంద్రీ లలామ అనసూయ – గీత గీసిన పదానికి సరైన వ్యుత్పత్యర్థాన్ని రాయండి. (March 2019)
జవాబు:
గృహమును ధరించునది

14. ఆకంఠంబుగ నిష్ణు మాధుకర భిక్షాన్నంబు భక్షింపఁగా – ఇది ఏ పద్యపాదము?
జవాబు:
శార్దూలము

15. అర్థాంతరన్యాసాలంకారానికి ఉదాహరణ
జవాబు:
హనుమంతుడు సముద్రమును లంఘించెను. మహాత్ములకు సాధ్యం కానిది లేదుగదా !

చదవండి – తెలుసుకోండి

మాట్లాడటమూ ఒక కళ

మనసులోని భావాన్ని ఎదుటివారికి తెలియజేసే మాధ్యమం మాట. మాటకున్న శక్తి గొప్పది. అది అవతలివారిని మెప్పించగలదు, నొప్పించగలదు, ఆపదల నుండి తప్పించగలదు. మాట్లాడటం ఒక కళ. శబ్దశక్తి తెలిసిన వానికే ఈ కళ కరతలామలకమవుతుంది.

ఒకాయన మెట్లు దిగుతున్నాడు. అదే సమయంలో మరొకాయన మెట్లు ఎక్కుతున్నాడు. దారి ఇరుకుగా ఉంది. ఇద్దరూ మధ్యలో ఎదురుపడ్డారు. కింద నుండి వస్తున్న అతనికి కోపమెక్కువ పై నుండి దిగుతున్న వానితో ‘నేను మూర్ఖులకు దారివ్వను’ అన్నాడు. వెంటనే ఎదుటివాడు ఏమాత్రం తడుముకోకుండా ‘పరవాలేదు నేనిస్తాను’ అన్నాడు. ఇప్పుడు ఎవడు మూర్ఖుడయ్యాడు?

ఒకావిడ ఇంకొకావిడతో పేచీ పెట్టుకున్నది. కోపంతో రెచ్చిపోయి ‘ఛీ కుళ్కా’ అనేసింది. అవతలావిడ ‘ఏమత్కా?” అన్నది. ఈ ముక్కతో మొదటావిడ తిక్క కుదిరింది.

తాంబూలం వేసుకోడానికి వెళ్ళాడో పెద్దమనిషి. తమలపాకులు కట్టేవానితో ‘ఏయ్, ఆకులో సున్నం తక్కువవేయి, దవడ పగులుతుంది’ అంటూ పక్కనేవున్న అరటిపండ్ల గెలకు చేయి ఆనించి నిలబడ్డాడు. అవకాశం కోసం ఎదురుచూస్తున్న తమలపాకులవాడు ‘ఏమయ్యోయ్, చెయ్యితియ్యి, పండ్లు రాలుతాయి’ అన్నాడు. మాటకు మాట, దెబ్బకు దెబ్బ.

సాహిత్యాభిలాషియైన ఒకడు కవిని కలిశాడు. ఎంతోకాలం నుండి తన మనసులో దాచుకున్న ఆశను బయటపెట్టాడు. ‘అయ్యా, నాకు ఏదైనా నాటికను రాసివ్వండి’ అనడిగాడు. దానికి బదులిస్తూ ఆ కవి ‘ఓ! దానికేముంది ఏనాటికైనా రాస్తాను’ అని అభయమిచ్చాడు.

ఒక పెండ్లి వేడుకలో కొందరు కూర్చుని మాట్లాడుకుంటున్నారు. ఒక పెద్దాయన ‘మీవయసెంతండి’ అనడిగారు. దానితా పెద్దమనిషి ‘ఏడేళ్ళు’ అన్నాడు. అందరూ ముక్కున వేలేసుకున్నారు. ఎంత పెద్దమనిషైతే మాత్రం ఇంతగా పరిహాసమాడుతారా అని నిలదీశారు. అతడన్నాడు. ‘నేను నిజమే చెప్పాను నాకు ఏడేళ్ళు (7 x 7 = 49) అన్నాడు. అసలు విషయం తెలుసుకుని అందరూ గొల్లున నవ్వేశారు.

బజారులో వెళుతున్న ఒకతనికి మిత్రుడు తారసపడ్డాడు. చాలాకాలమైంది వాళ్ళు కలుసుకొని. మిత్రుడు చెప్పులు లేకుండా ఉండడం చూసి విషయమేమిటని ప్రశ్నించాడు. దానికి బదులిస్తూ ‘చెప్పుకొనుటకే మున్నద’ని పెదవి విరిచాడా మిత్రుడు.

తను తీయబోయే సినిమా విషయంలో నిర్మాత ఒక కవి దగ్గరకు వెళ్లాడు. ‘నా సినిమాత పాట రాస్తారా?” అని అభ్యర్థించాడు. దానికి కవి రాస్తారా’ అన్నాడు. ఎంత కవియైతే మాత్రం ఇంత అహంతారంగా తనను ‘రా’ అంటాడా అనుకున్నాడు నిర్మాత. అతని ఆంతర్యం గ్రహించిన కవి అయ్యా, నన్ను తప్పుగా అనుకుంటున్నట్లున్నారు నేనన్నది ‘రాస్తా, రా’ అని. హమ్మయ్య అనుకున్నాడు.

ఇలా మాటలలో విరుపులు మెరుపులను సృష్టిస్తాయి. వ్యంగ్యం గిలిగింతలు పెడుతుంది.

AP SSC 10th Class Telugu Solutions Chapter 10 గోరంత దీపాలు

AP State Board Syllabus AP SSC 10th Class Telugu Solutions 10th Lesson గోరంత దీపాలు Textbook Questions and Answers.

AP State Syllabus SSC 10th Class Telugu Solutions 10th Lesson గోరంత దీపాలు

10th Class Telugu 10th Lesson గోరంత దీపాలు Textbook Questions and Answers

ఉన్ముఖీకరణ : చదవండి – ఆలోచించి చెప్పండి

జడ్డ ఆకలి అమ్మకి తెలుస్తుంది. ఈ తల్లులకు తమ ఆకలేకాదు, అనాథల క్షుద్బాధా తెలుసు. ఇంత తెలిసిన వీరంతా గొప్ప స్థితిమంతులేం కాదు. అలాంటప్పుడు లేనివారికి గుప్పెడు మెతుకులు పంచేదెలా? ఆలోచించగా ఆలోచించగా వారికొక దారి దొరికింది. రోజూ పిడికెడు గింజలు దాచాలన్న ఊహ కలిగింది. పిడికిలి జగిస్తే ఉద్యమం అవుతుంది. ఆ ఊళ్లో జనం పిడికిలి తెరిచారు. తమ దగ్గరున్న గింజల నుంచి ప్రతిరోజూ పిడికెడు పంచడం నేర్పారు. ఇవ్వడం సాయం, పంచడం మానవత్వం. సాటి మనుషుల ఆకలి తీర్చడం దైవత్వం.

ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
ఈ పేరా ద్వారా మీరేం తెలుసుకున్నారు?
జవాబు:
సాటి మనుషుల ఆకలి తీర్చాలి అని తెలుసుకొన్నాం.

ప్రశ్న 2.
మానవత్వంతో చేసే పనులు ఏవి?
జవాబు:
మన దగ్గరున్న సంపదను ఇతరులకు పంచడం మానవత్వం. అనాథలను, అభాగ్యులను, పేదలను ఆదుకోవడం
మానవత్వంతో చేసేపని.

AP SSC 10th Class Telugu Solutions Chapter 10 గోరంత దీపాలు

ప్రశ్న 3.
సహాయపడే గుణం, మానవత్వం కలిగిన వారి వల్ల సమాజానికి కలిగే మేలు ఏమిటి?
జవాబు:
సమాజంలో ఎవరికి కష్టం వచ్చినా సహాయపడతారు. వారి వలన బలహీనులు రక్షించబడతారు. అందరికీ మేలు
జరుగుతుంది. సమాజంలో శాంతి నెలకొంటుంది. ఎంతోమంది జీవితాలలో వారు వెలుగులు నింపుతారు.

ప్రశ్న 4.
మీరు ఇతరులకు ఎప్పుడైనా సాయం చేశారా? ఎప్పుడు? ఎందుకు?
జవాబు:
నేను, ఇతరులకు చాలాసార్లు సాయం చేశాను. ఒకసారి మా స్నేహితుడు టిఫిను చేయకుండా పాఠశాలకు వచ్చాడు. కళ్ళు తిరుగుతున్నాయని చెప్పాడు. వెంటనే మాష్టారికి చెప్పాను. వెంటనే మాష్టారు బిస్కెట్లు, టీ తెప్పించి ఇచ్చారు. నీరసం తగ్గింది.
(గమనిక : తరగతిలోని ప్రతి విద్యార్థి తన అనుభవాన్ని చెప్పాలి.)

ఇవి చేయండి

I. అవగాహన – ప్రతిస్పందన

ప్రశ్న 1.
“గోరంత దీపాలు” అనే శీర్షిక ఈ పాఠానికి తగిన విధంగా ఉందా? ఎందుకు? సకారణంగా చర్చించండి.
జవాబు:
(గమనిక : విద్యార్థి తనకు శీర్షిక నచ్చితే నచ్చిందని సకారణంగా నిరూపించవచ్చును. నచ్చకపోతే ‘శీర్షిక తగదు’ అని సకారణంగా నిరూపించవచ్చును. రెండు అభిప్రాయాలను ఇస్తున్నాం. ఒక దానిని మాత్రమే గ్రహించండి.)

1) శీర్షిక తగినదే :
గోరంత దీపాలు పాఠంలో అనాథ శిశువులను వృద్దుడు చేరదీసి వారి జీవితాలను ఆనందమయం చేస్తున్నాడు. చాలామంది బాలబాలికలు ఆయన వద్ద ఆశ్రయం పొందుతున్నారు. వారందరు ఆయన ప్రేమాప్యాయతలతో పాటు బాగా చదువుకుని మంచి ఉద్యోగాలు సంపాదించుకుంటున్నారు. ఆ పిల్లలంతా అనాథలే ? రైలు పెట్టెలు శుభ్రం చేసేవారు కొందరు, యాచన, చిన్న చిన్న దొంగతనాలు చేసిన వారు కూడా ఆ పిల్లల్లో ఉంటారు. వాళ్ళు ఈ విశాల ప్రపంచంలో దిక్కుమొక్కు లేక బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతుంటే చేరదీసి అక్కున చేర్చుకున్నాడా వృద్ధుడు. ఆ పసి పిల్లలందరు చిఱుగాలికి రెపరెపలాడే గోరంత దీపాల్లాంటివారు. ఆ గోరంత దీపాలకు కొండంత అండగా నిలబడ్డాడు వృద్ధుడు. వారికి ఆశ్రయం కల్పించి తీర్చిదిద్దుతున్నాడు వృద్ధుడు. ఈ కథలోని వృద్ధుడు చదువుతున్న వారపత్రికలోని కథ కూడా అనాథబాలుని కథే. అందుచేత ఈ పాఠానికి గోరంత దీపాలనే శీర్షిక తగిన విధంగా ఉంది.

2) శీర్షిక తగినది కాదు :
గోరంత దీపాలు పాఠంలో అనాథబాలలు కంటే వృద్ధుని ఔదార్యం ప్రధానమైనది. ఆ వృద్ధుని ఔదార్యాన్ని పదిమంది ఆదర్శంగా స్వీకరించాలి. ఈ శీర్షికలలో వృద్ధుని ఔదార్యం ఎక్కడా ధ్వనించదు. శీర్షిక ఎప్పుడు అంశంలోని ప్రధాన విషయాన్ని ధ్వనించేదిగా ఉండాలి. గోరంత దీపాలు అనేది అనాథ బాలల దీనస్థితిని తెలియజేస్తోంది తప్ప ఇక దేనిని తెలియచేయటం లేదు. అంతేకాక ఆ గోరంతదీపాలకే కొండంత అండగా నిలబడి తీర్చిదిద్దిన త్యాగమూర్తిని పట్టించుకోలేదు. పెరిగి పెద్దయ్యాక ఆ గోరంత దీపాలే ఆ వృద్ధుని పాదాలకు కృతజ్ఞతతో కన్నీటి అభిషేకాలు చేసారు. ఇంతటి మహోన్నతమైన త్యాగనిరతిని బాధ్యతను, మానవత్వాన్ని, శీర్షిక విస్మరించడం విజ్ఞులను ఆశ్చర్యపరుస్తుంది. శీర్షికను చూచిన మరుక్షణం ఉత్తేజం కలగాలి. కథలోని ఆశయం తెలియాలి. దీనికి మానవత్వపు పరిమళం అనే శీర్షిక పెట్టి ఉంటే సార్థకత చేకూరి ఉండేది.

AP SSC 10th Class Telugu Solutions Chapter 10 గోరంత దీపాలు

ప్రశ్న 2.
పాఠం చదవండి. “వేపచెట్టు” గురించి వివరించిన, వర్ణించిన వాక్యాలు ఏమేమి ఉన్నాయి? వాటిని గుర్తించి చదవండి.
జవాబు:
పాఠ్యాంశం మొదటి ఐదు వాక్యాలు వేపచెట్టుని వర్ణించాయి. వేపచెట్టును తల్లి ప్రేమ లాంటి చల్లని నీడనిచ్చే చెట్టుగా వర్ణించారు. ఆ చెట్ల కొమ్మలను దరిద్రుడి గుండెల్లో నుండి పుట్టిన అంతులేని ఆశల్లా అభివర్ణించారు. నాలుగు కొమ్మలు నాలుగు దిక్కుల్లా బాగా విస్తరించాయని చెప్పారు. కలిగిన వాడికి బాగా కండపట్టినట్లు ఆ కొమ్మలు పూతా పిందెలతో నిండుగా ఉన్నాయని వర్ణించారు.

మధ్యలో ఎక్కడా వేపచెట్టు వర్ణన లేదు. చివరి నుండి రెండవ పేరాలో వేపచెట్టు వర్ణన ఉంది. అది ఆ వృద్ధుడు వచ్చిన మనిషితో వేపచెట్టు గురించి చెప్పాడు. వేపచెట్టు అనగానే చేదు అనే భావన మనసులో మొదలవుతుంది. కానీ వేపచెట్టుని ఆశ్రయిస్తే చల్లని నీడ నిస్తుంది.

కనీసం ప్రతీరోజు ఒక వేపకాయని నమిలిన అనేక దీర్ఘరోగాలు తగ్గుతాయి. వేపపుల్లతో పళ్ళు తోముకుంటే దంత వ్యాధులు, నోటి జబ్బులు రావు. (పిప్పిపళ్ళు) (పుచ్చుపళ్ళు) ఉండవు.

ప్రశ్న 3.
పాఠంలోని కింది పేరాలు చదవండి. ఆ పేరాలలో వేటి గురించి వివరించారో తెల్పండి. ఆ పేరాల్లోని వివరణ/వర్ణనకు సంబంధించిన కీలక పదాలను రాయండి.
జవాబు:
AP SSC 10th Class Telugu Solutions Chapter 10 గోరంత దీపాలు 1

ప్రశ్న 4.
క్రింది వాక్యాలు చదవండి. ఎవరు, ఎవరితో, ఏ సందర్భంలో అన్నారు?

అ) అవును బాబూ ! నిజంగా అతడు అదృష్టవంతుడే!
జవాబు:
పరిచయం :
ఈ వాక్యం పులికంటి కృష్ణారెడ్డి రచించిన “కథావాహిని” నుండి గ్రహింపబడిన “గోరంత దీపాలు” అను పాఠంలోనిది.

సందర్భం :
తన ఎదురుగా నిలబడిన వ్యక్తిని ఎప్పుడు వచ్చావని వృద్ధుడు అడిగితే అదృష్టవంతుడికి (వృద్ధుడికి) కన్నీటితో అభిషేకం జరుగుతున్నప్పుడు అని అతను చెప్పిన సందర్భంలో తన పాదాలను కన్నీటితో అభిషేకం చేసిన వ్యక్తి నిజంగా అదృష్టవంతుడని చెప్తున్న సందర్భంలోని వాక్యమిది.

భావం:
వృద్ధుని ఆశ్రయంలో చక్కగా చదువుకుని మంచి ఉద్యోగంలో స్థిరపడిన అనాథ చాలా అదృష్టవంతుడు అని వృద్ధుని భావం.

ఆ). “పెట్టమన్న చోటల్లా కండ్లు మూసుకొని సంతకాలు పెడుతున్నాను. అనాథలయిన పిల్లలు, వాళ్ళ అధోగతికి దారితీస్తే పుట్టగతులుండవు” ఇది మాత్రం మనసులో పెట్టుకోండి !”
జవాబు:
పరిచయం :
ఈ వాక్యం పులికంటి కృష్ణారెడ్డి రచించిన “కథావాహిని” నుండి గ్రహింపబడిన “గోరంత దీపాలు” అను పాఠంలోనిది.

సందర్భం :
తన గుమాస్తా తెచ్చిన చిట్టా పుస్తకంలో వృద్ధుడు సంతకాలు పెడుతూ, అతనితో మాట్లాడిన మాటలివి.

భావం:
అనాథ బాలల ఆశ్రమ చిట్టా పుస్తకాలలో వృద్ధుడు పరిశీలించకుండా సంతకాలు పెడుతున్నాడు. ఆ అనాథ పిల్లలకు సంబంధించిన ఖర్చులు దానిలో ఉంటాయి. ఆ లెక్కలలో తేడాపాడాలుంటే మహాపాపం. అందుచేత పాపభీతితో పనిచేయాలి అని వృద్ధుని మాటల సారాంశం.

ఇ) “అదృష్టవంతుడికి కన్నీటితో అభిషేకం జరుగుతున్నప్పుడు!”
జవాబు:
పరిచయం:
ఈ వాక్యం పులికంటి కృష్ణారెడ్డి రచించిన “కథావాహిని” నుండి గ్రహింపబడిన “గోరంత దీపాలు” అను పాఠంలోనిది.

సందర్భం :
కథా రచయితను వృద్ధుడు ఎప్పుడు వచ్చావు బాబు, అని అడిగినపుడు రచయిత చెప్పిన సమాధానమిది.

భావం:
అనాథను చేరదీసి విద్యాబుద్ధులు చెప్పించి అతని జీవితంలో కొండంత వెలుగును నింపి అతని కృతజ్ఞతకు పాత్రుడైన వృద్ధునికి అతడు కన్నీటితో నమస్కరించాడు అని భావం.

ఈ) “మీరెక్కడున్నా, నేనెక్కడున్నా తమ పాదాలకు ప్రణమిల్లే అవకాశాన్ని మహా అదృష్టంగా భావిస్తాను”.
జవాబు:
పరిచయం :
ఈ వాక్యం పులికంటి కృష్ణారెడ్డి రచించిన “కథావాహిని” నుండి గ్రహింపబడిన “గోరంత దీపాలు” అను పాఠంలోనిది.

సందర్భం :
వృద్ధుని ఆశ్రయంలో చదువుకొని మంచి ఉద్యోగం సంపాదించుకొన్న వ్యక్తి బదిలీపై వేరే ఊరికి వెళుతూ 3 . వృద్ధుని పాదాలకు నమస్కరించి కృతజ్ఞతతో పలికిన వాక్యమిది.

భావం:
వృద్ధుడంటే ఆ వ్యక్తికి దైవంతో సమానం అని భావం.

ఉ) “అవి గోరంత దీపాలే కావచ్చు. ఏనాటికో ఒక నాటికి, అవి కొండంత వెలుగునిస్తాయి”.
జవాబు:
పరిచయం :
ఈ వాక్యం పులికంటి కృష్ణారెడ్డి రచించిన “కథావాహిని” నుండి గ్రహింపబడిన “గోరంత దీపాలు” అను పాఠంలోనిది.

సందర్భం :
కథకుని ప్రశ్నకు సమాధానంగా వృద్ధుడు పలికిన వాక్యమిది. అనాథలను, వీథి బాలలను, కొడిగట్టిన దీపాలతో, వేపచెట్టుతో పోల్చి చెప్పుచున్న సందర్భములోని వాక్యమిది.

భావం:
అనాథలైన బాలలు గోరంత దీపాల వంటివారు. వారిని ఆదరించి కాపాడితే ఉన్నతులై కొండంత వెలుగును ఇస్తారు.

AP SSC 10th Class Telugu Solutions Chapter 10 గోరంత దీపాలు

ప్రశ్న 5.
పేరా చదివి, ప్రశ్నలకు జవాబులు రాయండి.

బతకడానికి ఉద్యోగం వెతుక్కుంటారు కొందరు. జీవితానికి అర్థం వెతుక్కుంటారు మరికొందరు ….. లక్ష్మీకాంతం రెండో కోవకు చెందుతారు. ఒక బిడ్డ కన్నీరు తుడవడమే భాగ్యం. ఒక బిడ్డకు తల్లి కావడం ఇంకా భాగ్యం. అలాంటిది లక్ష్మీకాంతం అరవై ఎనిమిది మంది అనాథలకు అమ్మలా మారారు. వాళ్ళకు కంటిపాప అయ్యారు. పైపైన చేస్తే ఉద్యోగం అవుతుంది. హృదయంలో నుంచి చేస్తే మానవత్వం అవుతుంది. లక్ష్మీకాంతం మానవీయ మూర్తి. వీధి బాలలుగా ముద్రపడిన అనాథలకు విశాఖ వాకిట నేడొక అమృతహస్తం దొరికింది. కన్నతల్లి ఒడి దక్కినట్టయింది. వీళ్ళ జీవితాలకు అండగా నేనుంటానంటూ పోడూరి లక్ష్మీకాంతం ముందుకు వచ్చింది. మాటలు కాదు – గత పదేళ్ళుగా ఆప్యాయతానురాగాలను చేతల్లో చూపుతోంది. అరవై ఎనిమిది మంది వీధి బాలల (స్ట్రీట్ చిల్డ్రన్) కు అమ్మగా
అవతరించింది. కన్నబిడ్డల కంటే వీధి బాలలనే ఎక్కువగా చూసుకుంది.
ప్రశ్నలు:
అ) పై పేరా దేని గురించి తెలియజేస్తుంది?
జవాబు:
పోడూరి లక్ష్మీకాంతం గారి ఔదార్యం గురించి తెలియజేస్తోంది. అనాథ బాలలను ఆమె ఆదుకొంటున్న విధానం గూర్చి తెలియజేస్తోంది.

ఆ) పై పేరాలోని కీలకపదాలను ఏరి రాయండి.
జవాబు:
(గమనిక : కీలకపదాలు అంటే ముఖ్యమైన పదాలు. పేరాలోని విషయం సూటిగా తెలియజేసే పదాలు అని గ్రహించండి.)
ఉద్యోగం వెతుక్కోవడం, అర్థం వెతుక్కోవడం, రెండో కోవ, కన్నీరు తుడవడం, తల్లి కావడం, అనాథ, కంటి పాప, మానవత్వం, మానవీయమూర్తి, వీధి బాలలు, ముద్రపడడం, అమృతహస్తం, తల్లి ఒడి, అండ, ఆప్యాయతానురాగాలు, అవతరించడం, కన్నబిడ్డలు.

ఇ) ‘అమృతహస్తం’ అనే పదానికి అర్థమేమిటి?
జవాబు:
‘అమృతం’ బాధలను రూపుమాపుతుంది. అలాగే అమృతం లాంటి చెయ్యిగల వారు అంటే పదిమందికి సహాయం చేసేవారు అని అర్థం. ఇతరుల కష్టాలను నివారించి, ఆదుకొనే వారని అర్థం.

AP SSC 10th Class Telugu Solutions Chapter 10 గోరంత దీపాలు

ప్రశ్న 6.
పాఠం ఆధారంగా కింది ప్రశ్నలకు జవాబులు రాయండి.
అ) వృద్ధుడి వద్దకు వచ్చిన కుర్రాడు ప్రవర్తించిన తీరు ఎలా ఉంది? రచయిత అతని ప్రవర్తనను ఏఏ వాక్యాలతో వివరించాడు.
జవాబు:
వృద్ధుని వద్దకు వచ్చిన కుర్రవాడు నిలబడి ఉన్నాడు. అతను నిలబడటంలో వినయం ఉట్టిపడుతోంది. అతని వేషంలో సంస్కారం ఉంది. అతని ముఖం ఆనందంతో వెలిగిపోతోంది.

ఆ కుర్రవాడు వినయానికి మారుపేరుగా ఉన్నాడు. సంస్కారవంతంగా ప్రవర్తించాడు. వృద్ధుడు ఆశీర్వదిస్తుంటే కృతజ్ఞతా భావంతో ఉన్నాడు. అతనికి ఆనంద భాష్పాలు వచ్చాయి. వృద్ధుని పాదాలపై తలపెట్టి నమస్కరించాడు. పైకి లేచి మళ్ళీ నమస్కరించాడు. అలా నమస్కరిస్తూనే నాలుగు అడుగులు వెనక్కు వేసి, శిరసువంచి నమస్కరించి హుందాగా వెళ్ళి పోయాడు. ఈ ప్రవర్తనను బట్టి ఆ కుర్రవాడు కృతజ్ఞత కలవాడని తెలుస్తోంది. ఆదర్శవంతమైన ప్రవర్తన కలవాడు. ఉపకారం పొందినవారెవరయినా, ఉపకారం చేసిన వారి పట్ల ఎలా ప్రవర్తించాలో ఆ కుర్రవాని ప్రవర్తన బట్టి తెలుసుకోవచ్చును.

రచయిత అతని ప్రవర్తనను చక్కటి పదాలతో భావస్పూరకంగా వర్ణించాడు. ఆ కుర్రవాడు నిలబడి ఉండడంలో వినయం ఉట్టిపడుతూ ఉంది. వేషంలో సంస్కారం ఉంది. అతని ముఖం ఆనందంతో వెలిగిపోతూ ఉంది అని వర్ణించాడు. అతని కనుకొలుకుల్లో నిలచిన నీళ్ళు సంజెవెలుగులో ముత్యాలలా మెరుస్తున్నాయి. అనిర్వచనీయమైన కృతజ్ఞతాభావం అతని ముఖంలో దోబూచులాడుతూ ఉంది. ఆనందానుభూతిలో తడుస్తూ మూగబోయాడు. తనివితీరనట్లు మళ్ళీ ఒకసారి ఆ కుర్రవాడు అతని పాదాలను ఒడిసిపట్టుకున్నాడు. పాదాల మీద తలను ఆనించాడు. కన్నీటితోనే అతని పాదాలను కడుగుతున్నాడేమో అనే వాక్యాలతో అతని ప్రవర్తనను వివరించాడు.

కన్నీటితో నిండిన కండ్లను జేబురుమాలుతో వత్తుకున్నాడు. మళ్ళీ ఒకసారి రెండు చేతులు జోడించాడు. జోడించిన చేతులు జోడించుకున్నట్లే ఉంచుకుని అలాగే నాలుగు అడుగులు వెనక్కు వేశాడు. అక్కడ నిలబడి మళ్ళీ ఒకసారి శిరస్సు వంచి నమస్కరించాడు. గిరుక్కున వెనక్కు తిరిగి హుందాగా ముందుకు సాగిపోతున్నాడనే వాక్యాలతో అతని ప్రవర్తనను వర్ణించాడు.

ఆ) విద్యానగరం ఒక విద్యాలయం కదా! దాని ఆవరణ, వాతావరణం ఎలా ఉంది?
జవాబు:
విద్యానగరం ప్రశాంతమైన వాతావరణంలో ఉంది. అది దాదాపు రెండు, మూడు చదరపు మైళ్ళ విస్తీర్ణం కలిగి ఉంది. అక్కడ ఒక వేపచెట్టు, అంత కంటే పెద్దవైన రావి చెట్లున్నాయి. మట్టిమానులున్నాయి. జువ్వి చెట్లున్నాయి. రకరకాల పూల మొక్కలున్నాయి. కూరల తోటలున్నాయి. పాలపిట్టలు పరవశంగా పాడుకొంటుంటాయి.

ఆ ఆవరణలో బాలబాలికలకు వసతి గృహాలున్నాయి. అతిథులకు ప్రత్యేక సదుపాయాలతో గదులున్నాయి. వయోవృద్ధులకు వసతులు ఉన్నాయి. గ్రంథాలయం ఉంది. సాయంసమయాలలో పూజకు ప్రార్థనాలయం ఉంది. వేలాది మంది అనాథలు అక్కడ ఆశ్రయం పొందుతున్నారు. కొన్ని వందలమంది ఉపాధ్యాయులు ఆ అనాథలకు విద్య నేర్పుతున్నారు.

ఇ) వృద్దుడు చేస్తున్న సేవాకార్యక్రమం గురించి లోకం ఏమనుకునేది ? దానికి వృద్ధుడి ప్రతిస్పందన ఎలా ఉంది?
జవాబు:
పరులకు సేవ చేస్తున్నాననే పేరుతో స్వార్థం పెంచుకొన్న మనిషిగా వృద్ధుడిని లోకం నిందించింది, నోరు లేని పిల్లలకు అర్థాకలిగా అన్నం పెడుతున్నాడు. వాళ్ళ నోళ్ళు కొడుతున్నాడని కూడా ఆడిపోసుకొంది.

అయినా వృద్దుడు పట్టించుకోలేదు. పుండు మీద మాత్రమే కారం చల్లినా, ఉప్పు చల్లినా మంట పుడుతుంది. పుండ్లులేని దేహానికి మండదు కదా ! అలాగే తప్పు చేస్తుంటే లోకం అనే మాటలకు బాధపడాలి. తన తప్పేమీలేనపుడు ఆ మాటలు గాలిలో కలిసి పోతాయి. కాబట్టి లోకానికి భయపడి, మంచి లక్ష్యాన్ని విడిచిపెట్టకూడదు. అలా విడిచి పెడితే అది చేతగానితనమే అవుతుంది.

ఈ) వారపత్రికలో చదివిన కథ ఏమిటి?
జవాబు:
వృద్ధుడు చదివిన కథలో దొరైరాజ్ పదేండ్ల కుర్రవాడు. అతడు రైలు పెట్టెలు తుడుస్తాడు. ప్రయాణీకులు దయతలచి ఇచ్చిన డబ్బులతో జీవితం గడుపుతాడు. ఇచ్చిన వారికి నమస్కారం చేస్తాడు. ఇవ్వకపోతే పట్టించుకోడు. అలాగే ఒక వ్యక్తి ముందు చేయి ఊపుతాడు. ఆ వ్యక్తి, దొరైరాజ్ ను ఆప్యాయంగా దగ్గరికి పిలుస్తాడు. పేరు అడుగుతాడు. నిర్లక్ష్యంగా తన పేరు చెబుతాడు దొరైరాజ్, చేతిలో చిల్లర పైసల్ని ఎగరేసుకొంటూ వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోతున్న దొరైరాజ్ న్ను చూసి, ఆలోచనలో పడతాడు ఆ వ్యక్తి. ఇది ఆ కథ, అంటే జీవితం గడవక పోయినా, గడిచినా ఎవరి ధోరణి వారిది. ఎవ్వరూ తమ ధోరణిని మార్చుకోరు. ఆప్యాయతలు, అనురాగాలతో పనిలేదు. తమ నిర్లక్ష్య ధోరణిని విడిచిపెట్టరు. అలాగ అనాథలైన పిల్లలను చేరదీయాలి. వాళ్ళ జీవితాలలో వెలుగులు నింపాలని ఉన్నా ఆ అనాథలు రావాలి కదా! మారాలి కదా ! అవకాశాలు వినియోగించుకోవాలి కదా !

ఉ) రైలు పెట్టెలో ఊడుస్తున్న బాలుడి గురించి వృద్ధుడు ఏం చేశాడు?
జవాబు:
రైలు పెట్టెలో ఊడుస్తున్న బాలుడిని పరీక్షించాలనుకొన్నాడు. నిద్రపోతున్నట్లు నటించాడు. ఆ పిల్లవానిని గమనించాడు. పనిలో శ్రద్ధను పరిశీలించాడు. ఆనందించాడు. ఐదు రూపాయిల కాగితం జారవిడిచాడు. దానిని ఆ కుర్రవాడు ఆ కాగితాన్ని తీసి, వృద్ధుని లేపి ఇచ్చేశాడు. అతని నిజాయితీ వృదుని ఆనంద సంభ్రమాలలో ముంచింది. ఒక పావలా ఇచ్చాడు. ఆ కుర్రవాడు అది అందుకొని, నమస్కరించాడు. తర్వాత తన పనిలో లీనమయ్యాడు. తర్వాత ఆ పిల్లవానిని పిలిచి, కుశలప్రశ్నలు వేశాడు. తనతో రమ్మన్నాడు. ఆలనాపాలనా చూశాడు. చదువు చెప్పించాడు. పెళ్ళి చేశాడు. ఉద్యోగం వచ్చింది. వాడు జీవితంలో స్థిరపడ్డాడు.

II. వ్యక్తీకరణ-సృజనాత్మకత

1. కింది ప్రశ్నలకు ఆలోచించి ఐదేసి వాక్యాల్లో సమాధానాలు రాయండి.

అ) “గోరంత దీపం” కథానిక ద్వారా మీరు గ్రహించిన ముఖ్యమైన ఐదు విషయాలు రాయండి.
జవాబు:
గోరంత దీపం కథానికలో వృద్ధుని ద్వారా అనాథలను అక్కున చేర్చుకొని, ఆదుకోవాలి అని తెలుసుకొన్నాము. ఆదుకొంటే ఆ గోరంత దీపాలే సమాజానికి కొండంత వెలుగునిస్తాయి అని తెలుసుకొన్నాము. కుర్రవాని పాత్ర ద్వారా, నిజాయితీతో, నిబద్ధతతో పనిచేయాలి అని తెలుసుకొన్నాం. మనకు ఉపకారం చేసిన వారిపట్ల కృతజ్ఞతతో ఉండాలి అని తెలుసుకొన్నాం. పెద్దలతో స్నేహంగా ఉండాలి. వారి అనుభవాలను వినాలి, వారు చెప్పే విషయాలు విని, ఆచరిస్తే జీవితంలో ఉన్నతులుగా గుర్తించబడతామని తెలుసుకొన్నాం, వేపచెట్టులోని ఔషధ గుణాలు కూడా తెలిసాయి.

ఆ) “ఆ కుర్రవాడి బతుకుమీద కూడా ఓ ప్రయత్నం చేయాలని సంకల్పించాను.” అన్న వృద్ధుడు ఏం ప్రయత్నం చేశాడు? దాని ఫలితం ఎలా ఉంది?
జవాబు:
వృద్ధుడు రైలు పెట్టెలోని అనాథబాలుని గమనించాడు. అతనికి పనిపై ఉన్న శ్రద్ధను గమనించాడు. తను చదివిన కథ దీనికి బలం చేకూర్చింది, ఆ పిల్లవాడి నిజాయితీ పరీక్షించాలనుకొన్నాడు. ఐదు రూపాయిలనోటు జారవిడిచి, నిద్రపోతున్నట్లు నటించాడు. ఆ కుర్రవాడు ఆ నోటును తీసి, వృద్ధుని నిద్రలేపి ఇచ్చేశాడు. కుర్రవాడికి ఒక పావలా ఇచ్చాడు. నమస్కరించి, తనపనిలో లీనమయ్యాడు కుర్రవాడు.
అతనికి ఉన్న పనిపట్ల శ్రద్ధ, కష్టపడే స్వభావం, నిజాయితీ వృద్ధునికి నచ్చాయి, చేరదీసి చదివించాడు. కష్టపడి చదువుకొన్నాడు. మంచి ఉద్యోగి అయ్యాడు. ఆ బాలుడి జీవితం స్థిరపడింది. వృద్ధుని ప్రయత్నం మంచి ఫలితాన్ని ఇచ్చింది.

ఇ) “బాబూ! ఈ వయస్సులో చదువుకొంటే, ఆ వయస్సులో సంపాదించుకోవచ్చు”ఈ వాక్యం గురించి మీ అభిప్రాయాల్ని రాయండి.
జవాబు:
ఎవరైనా చిన్నతనంలో చదువుకోవాలి. బాల్యం జీవితానికి పునాది వంటిది. బాల్యంలోని ప్రవర్తనను బట్టి ఆ మనిషి
జీవితం ఉంటుంది. బాల్యంలో బాగా చదువుకొంటే, మంచి ఉద్యోగంలో స్థిరపడవచ్చు. డబ్బు సంపాదించుకొని జీవిత మంతా సుఖపడవచ్చును. 100 సంవత్సరాల జీవితంలో మొదటి ఇరవై సంవత్సరాలు కష్టపడి చదువుకొంటే మిగిలిన 80 సంవత్సరాలూ సుఖపడవచ్చు. మొదటి ఇరవై సంవత్సరాలు చదువుకోకుండా, డబ్బులు సంపాదించుకొంటూ సుఖపడితే, మిగిలిన 80 సంవత్సరాలూ కష్టపడాలి. అందుకే ‘పిల్లలు బడికి – పెద్దలు పనికి’, ‘పనికెందుకు తొందర ? చదువుకో
ముందర’ అని ప్రభుత్వం నినాదిస్తోంది.

ఈ) ‘ఒంటరిగా ఉన్నప్పుడు పుస్తకాలే మన నేస్తాలు’ అనే వాక్యంతో మీరు ఏకీభవిస్తారా? ఎందుకు?
జవాబు:
ఒంటరిగా ఉన్నప్పుడు తప్పని సరిగా పుస్తకాలే మన నేస్తాలు అనే వాక్యంతో ఎవరైనా ఏకీభవించాలి. ఎందుకంటే ఒంటరిగా ఉన్నప్పుడు రకరకాల ఆలోచనలు వస్తాయి. వాటిలో చెడు ఆలోచనలు కూడా రావచ్చును. ఏదైనా పుస్తకం చదువుకొంటే అటువంటి ఆలోచనలు రావడానికి అవకాశం ఉండదు. సమయం కూడా తెలియదు. జ్ఞానం పెంపొందుతుంది. పుస్తకాలలో కూడా మంచి ఉన్నత విలువలతో కూడిన వాటిని మాత్రమే చదవాలి. మనసుకు ఆహ్లాదం కలుగుతుంది. ఒంటరితనం మరచిపోతాం. “ఒక మంచి పుస్తకం 100 మంది మిత్రులతో సమానం” అని ఆర్యోక్తి. అందుచేత పుస్తకాలే మన నేస్తాలుగా చేసుకొంటే, ప్రపంచమంతా మన కుటుంబమవుతుంది.

AP SSC 10th Class Telugu Solutions Chapter 10 గోరంత దీపాలు

2. కింది ప్రశ్నలకు ఆలోచించి పదేసి వాక్యాల్లో సమాధానాలు రాయండి.
అ) “గోరంతదీపాలు” కథానికలోని వృద్ధుని పాత్ర స్వభావాన్ని, గొప్పదనాన్ని సొంతమాటల్లో రాయండి.
జవాబు:
గమనిక :
ఏ పాత్ర స్వభావం రాయాలన్నా కథలోని ఆ పాత్ర ప్రవర్తన, మాటల తీరును గమనించాలి. ఆ విషయాన్నే సొంతమాటలలో రాయాలి.

వృద్ధుడు :
నేస్తాలు లేనపుడు పుస్తకాలే మన నేస్తాలని భావించే స్వభావం కలవాడు. కేవలం పుస్తకాలలో చదవడమే కాకుండా వాటిని నిజ జీవితంలో ఆచరణలో పెట్టే స్వభావం కలవాడు. పరోపకారి. ముఖ్యంగా అనాథలను, వృద్ధులను ఆదరిస్తాడు, అతిథులను గౌరవిస్తాడు. వృద్ధులకు ఆశ్రయం కల్పిస్తాడు. దైవభక్తి కలవాడు, నీతి నిజాయితీలు కలవారిని, నిబద్ధతతో, శ్రద్ధతో పనిచేసే వారిని ఇష్టపడతాడు. పచ్చటి ప్రకృతిలో జీవించడమంటే ఇష్టపడతాడు.

గొప్పతనం :
ఒక అనాథను పరీక్షించాడు. అతని నీతి నిజాయితీలను తెలుసుకొన్నాడు, పనిపట్ల శ్రద్ధను గమనించాడు, చదివించాడు. పెళ్ళి చేశాడు. ఉద్యోగం వచ్చింది. అతను స్థిరపడ్డాడు. అనాథలోని మంచి గుణాలను గుర్తించి, తీర్చిదిద్దిన మహోన్నతుడు, ఒక్కడినే కాదు వేలాది మంది బాలబాలికలను తీర్చిదిద్దాడు. వందల మంది ఉపాధ్యాయులకు ఉపాధి కల్పించిన మహానుభావుడు వృద్ధుడు.

ఆ) వృద్ధుడు, ప్రయోజకుడైన యువకుని మధ్య ఉన్న సంబంధం ఎలాంటిది? వారి మధ్య ఉన్న సంబంధాన్ని, అనురాగాన్ని మీ సొంతమాటల్లో వివరించండి.
(లేదా)
‘గోరంతదీపం’ కథానిక ద్వారా వృద్ధుడు, ప్రయోజకుడైన యువకుని మధ్య ఉన్న అనుబంధం ఎలాంటిదో విశ్లేషిస్తూ సొంతమాటల్లో వివరించండి.
జవాబు:
వృద్ధునికి, యువకునికి మధ్య ఉన్న సంబంధం తల్లీ పిల్లల అనుబంధం కంటె గొప్పది. తండ్రీ తనయుల సంబంధం కంటే మిన్న, భగవంతునికి భక్తునికీ మధ్య ఉన్న సంబంధం వంటిది అని చెప్పవచ్చును. ఇద్దరు సత్పురుషుల మధ్య సంబంధం ఏర్పడితే అలాగే ఉంటుంది.

ప్రయోజకుడైన యువకుడు వృద్ధుని వద్ద నిలబడిన తీరు, అతని వేషం గమనిస్తే ఇది బోధపడుతుంది. భగవంతుడు ప్రత్యక్షమైతే, భక్తుడు ఎంత పరవశిస్తాడో అంతగా పరవశించాడు వృద్ధుని చూసిన యువకుడు. ఆ వృద్ధుని పాదాలకు కన్నీటితో అభిషేకం చేసిన తీరును గమనిస్తే అతనికి గల గౌరవభావన తెలుస్తుంది. అతనిని ఆశీర్వదిస్తున్న వృద్ధుని కళ్ళలోని ఆనందభాష్పాలు చూస్తే అతని పట్ల గల వాత్సల్యం తెలుస్తుంది. వారిద్దరికీ ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం. వృద్ధుడికి తనకంటే కూడా ఆ కుర్రవాడంటేనే ఇష్టం. అలాగే ఆ కుర్రవానికీ, వారిద్దరి అనురాగాన్ని గమనిస్తే ఒకే ప్రాణం రెండు శరీరాలలో ఉందేమో అనిపిస్తుంది.

ఇద్దరూ అదృష్టవంతులే. అనాథ కుర్రవాడు అదృష్టవంతుడు కనుకనే వృద్ధుడు రైలు పెట్టెలో కనిపించాడు. చేరదీశాడు, ఆలనాపాలనా చూశాడు, చదువు చెప్పించాడు, పెండ్లి చేశాడు. ఉద్యోగం సంపాదించుకొందుకు దారి చూపాడు. ఎటో పోవలసిన జీవితం గౌరవంగా స్థిరపడింది.

వృద్ధుడు కూడా అదృష్టవంతుడే తన అంచనా తప్పు కాలేదు. తను పడిన శ్రమ ఫలించింది. అతని జీవితం బాగుపడింది. ప్రయోజకుడయ్యాక కూడా తనపట్ల కృతజ్ఞతతో ఉన్నాడు. జీవితాంతం ఉంటాడు. అటువంటి భక్తిప్రపత్తులు కలవాడు దొరకడం వృద్ధుని అదృష్టం.

AP SSC 10th Class Telugu Solutions Chapter 10 గోరంత దీపాలు

3. కింది అంశాల గురించి సృజనాత్మకంగా ప్రశంసిస్తూ రాయండి.
అ) ‘విద్యాలయం’ ఆవరణ ఎలా ఉందో పాఠంలో వర్ణించిన విధానం చదివారు కదా! దీని ఆధారంగా, మీరు మీ పాఠశాల గురించి లేదా ఒక పర్యాటక క్షేత్రాన్ని గురించి వర్ణించి రాయండి.
జవాబు:
పాఠశాల : మా పాఠశాల చాలా బాగుంటుంది. మా పాఠశాల సరస్వతీ మాత నిలయం. మా పాఠశాల ఆవరణచుట్టూ పచ్చటి చెట్లతో నిండి ఉంటుంది. పూల మొక్కలు వరుసలలో ఉంటాయి. క్రోటన్సు మొక్కలు పూల మొక్కలకు రక్షక భటులుగా ఉంటాయి. రకరకాల పళ్ళనిచ్చే చెట్లు కూడా ఉన్నాయి. దానిమ్మ, జామ, కమలా, బత్తాయి చెట్లు ఉన్నాయి. అరటి చెట్లు కూడా ఉన్నాయి.

మా పాఠశాలలో 20 తరగతి గదులున్నాయి. అన్ని గదులూ అందంగా అలకరించి ఉంటాయి. మచ్చుకైనా ఎక్కడా చెత్త కనబడదు. తరగతి గదులలోని గోడలకు పిల్లలు వేసిన బొమ్మల చార్టులు, కవితలు, కథల చార్టులు ఉంటాయి. మా పాఠశాల గోడ పత్రికలలో రోజూ ఏవేవో కథలూ, కవితలూ, కార్టూన్లూ, సూక్తులూ వచ్చి చేరుతుంటాయి. మా ఉపాధ్యాయులు జ్ఞాన జ్యోతులు. చిరునవ్వుతో పాఠాలు చెబుతారు. కథలు కూడా చెబుతారు. ఎన్నో మంచి విషయాలు చెబుతారు. మమ్మల్ని చెప్పమంటారు. ఆలోచించమంటారు.

మా పాఠశాల ఆటస్థలం 500 చదరపు గజాలు ఉంటుంది. అన్ని రకాల ఆటలు ఆడతాము. అనేకమైన ఆట వస్తువులు ఉన్నాయి. పెద్ద గ్రంథాలయం కూడా ఉంది. 6 బీరువాల పుస్తకాలు ఉన్నాయి. నాకు మా పాఠశాల అంటే చాలా ఇష్టం.

పర్యాటక క్షేత్రం :
తిరుపతి మంచి పర్యాటక క్షేత్రం. ఎంతో మంది భక్తులు రోజూ తిరుమలకు వస్తారు. తిరుమల కొండ నడిచి ఎక్కేటపుడు చాలా బాగుంటుంది. ఎంత దూరం నడిచినా తరగదు. కొండదారి, చుట్టూ అడవి. జింకలు కనబడతాయి. అవి భలే గంతులువేస్తూ పరుగెడతాయి. మోకాటి పర్వతం మెట్లు నిట్టనిలువుగా ఉంటాయి. ఆకాశంలో చందమామలాగా ఎక్కడో పైన గోవిందనామాలు కనిపిస్తుంటాయి. చుట్టూ అడవులలో దట్టమైన పొదలు, పెద్ద పెద్ద చెట్లు, తీగలు కనిపిస్తాయి. మా సైన్సు టీచర్లనడిగి వాటి పేర్లు, లక్షణాలు తెలుసుకొన్నాం. గుడిలోకి వెడితే శ్రమంతా మరచిపోతాం. అంత ప్రశాంతత. నాకైతే తిరుమల అంటే చాలా ఇష్టం. సువర్ణ ముఖీ నదిలో స్నానం చాలా బాగుంటుంది.
(గమనిక : విద్యార్థులు ఏ క్షేత్రాన్నినా వర్ణించవచ్చు. )

అ) పాఠంలో “దాదాపు రెండు, మూడు ……… పరవశంతో పాడుతున్నారు” పేరా చదవండి. దీనికి సంబంధించిన చిత్రం ీయండి. రంగులు వేయండి. కవిత రాయండి.
జవాబు:
(గమనిక : డ్రాయింగు మాష్టారు వద్ద చిత్రం నేర్చుకొని గీయాలి. రంగులు వేయాలి.)
కవిత :
విస్తీర్ణం చూడండి రెండు, మూడు చదరపు మైళ్ళూ
వేపచెట్టు, రావిచెట్లు, జవ్విచెట్లు, మర్రిచెట్లి పిట్టల లోగిళ్ళూ
పూల బాల పాదులలో కిలకిల లాడాలి
కూరల సుకుమారం తోటలలో కలకలలాడాలి.
సంజవెలుగు కెంజాయకు బంగారం తళతళలూ
అనుభూతుల హృదయాలకు అనురాగపు స్నానాలూ
నక్కినక్కి చక్కనైన చిలకమ్మా, కోకిలమ్మా
పాలపిట్ట, పరవశించి పాటలందుకొన్నాయి.

భాషా కార్యకలాపాలు ప్రాజెక్టు పని

మీ పాఠశాల గ్రంథాలయంలోని ఏదైనా కథల పుస్తకం నుంచి గాని లేదా ఏదైనా పత్రిక నుంచి గాని సామాజిక సేవ, మానవ సంబంధాలు, గురుశిష్య సంబంధం మొదలైన విషయాలకు సంబంధించిన మంచి కథను చదివి ఎంపిక చేయండి. దాన్ని రాసి ప్రదర్శించండి. అది మీకు ఎందుకు నచ్చిందో, దాంట్లోని గొప్పతనమేమిటో నివేదిక రాయండి.
జవాబు:
(గమనిక : కనీసం 10 వాక్యాలలో రాస్తే చాలును)

III. భాషాంశాలు

పదజాలం

1) ఈ కింద ఇచ్చిన రెండేసి పదాలను ఉపయోగిస్తూ సొంతవాక్యాలు రాయండి.

అ) వినయం – విధేయత
జవాబు:
సొంతవాక్యం : వినయం – విధేయత నేర్పని చదువుల వలన ప్రయోజనం లేదు.

ఆ) రాజు – మకుటం
జవాబు:
సొంతవాక్యం : ధరణికి వెలుగు రాజు – మకుటం కాంతిని బట్టి ఉంటుంది.

ఇ) ప్రదేశం – ప్రశాంతత
జవాబు:
సొంతవాక్యం : నివాస ప్రదేశం – ప్రశాంతత కలిగినదైతే అన్ని సౌఖ్యాలూ ఉన్నట్లే.

ఈ) గుడిసె – దీపం
జవాబు:
సొంతవాక్యం : కనీసం గుడిసె – దీపం లేని బతుకులెన్నో దేశంలో ఉన్నాయి.

ఉ) ప్రయాణం – సౌకర్యం
జవాబు:
సొంతవాక్యం : ఈ రోజులలో ప్రయాణం – సౌకర్యంలేని ఊరులేదు.

AP SSC 10th Class Telugu Solutions Chapter 10 గోరంత దీపాలు

2. కింది వాక్యాలలో గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి.
ఉదా : సంజవెలుగులో తటాకంలోని నీరు కొత్త అందం సంతరించుకుంది.
సంజవెలుగు = సంధ్యా సమయంలో వెలువడే కాంతి.

అ) నా పుట్టిన రోజున మా నాన్నగారి ఆశీర్వాదం తీసుకున్నాను.
జవాబు:
ఆశీర్వాదం : దీవెన

ఆ) రాజు ప్రకృతి అందాల్ని తదేకంగా చూస్తూ నిలబడ్డాడు.
జవాబు:
తదేకంగా = అది ఒకటే (పని) అన్నట్లుగా

ఇ) శివ పుస్తకాలతో కాలక్షేపం చేస్తూ ఉంటాడు.
జవాబు:
కాలక్షేపం – సమయం గడపడం

ఈ) రాణి ముఖం నిండా పసుపు పులుముకుంది.
జవాబు:
పులుము = పూసు

ఉ) లత పాఠాన్ని చక్కగా ఆకళింపు చేసుకొంది.
జవాబు:
ఆకళింపు. – అవగాహన

3. కింది పదాలకు నానార్థాలు రాయండి.
అ) రాజు – ప్రభువు, క్షత్రియుడు, ఇంద్రుడు
ఆ) సమయం – బుద్ధి, సంకేతము, ప్రతిజ్ఞ
ఇ) కృషి – స్త్రీ, సేద్యము, కరిసనము
ఈ) కన్ను ‘ – ఏరు, వలిపము, తీరు
ఉ) కొమ్మ – శాఖ, ఆడుది, కోటకొమ్మ
ఊ) ఆశ – దిక్కు కోరిక

4. కింది పదాలకు పర్యాయపదాలు రాయండి.

అ) పక్షి – నీడజము, ద్విజము, పతగము
ఆ) నేత్రం – అక్షి, చక్షువు, నయనం
ఇ) శిరస్సు – తలకాయ, నెత్తి, మస్తకము
ఈ) సూర్యుడు – అహిమకరుడు, భానుడు, భాస్కరుడు
ఉ) చెట్టు – తరువు, భూరుట్టు, వృక్షము
ఊ) కొండ – అచలము, శైల్యము, ఆహార్యము

5. కింది పదాలకు వ్యుత్పత్త్యర్థాలు రాయండి.
అ) అతిథి – తిథి, వార, నక్షత్ర నియమం లేకుండా ఇంటికి భోజనమునకు వచ్చువాడు.
ఆ) అక్షరం – నాశనము పొందనిది (వర్ణము)
ఇ) పక్షి – పక్షములు కలది (విహంగము)
ఈ) మౌని – మౌనము దాల్చియుండువాడు (ఋషి)

AP SSC 10th Class Telugu Solutions Chapter 10 గోరంత దీపాలు

6. అనాథలను చేరదీసే సంస్థలను అనాథ శరణాలయాలు అంటారు కదా ! ఇలాంటివే మరికొన్ని ఉన్నాయి. కింద ఇచ్చిన సమాచారం ఆధారంగా వాటిని రాయండి.

అ) పక్షులను రక్షించే సంస్థ :
జవాబు:
పక్షి సంరక్షణ కేంద్రం

ఆ) జంతువులను రక్షించే సంస్థ :
జవాబు:
జంతు ప్రదర్శనశాల

ఇ) వృద్ధులను చేరదీసే సంస్థ :
జవాబు:
వృద్ధాశ్రమం

ఈ) మనోవైకల్యం గలవాళ్ళకు చేయూతనిచ్చే సంస్థ :
జవాబు:
మనోపునర్వ్యవస్థీకరణ సంస్థ

ఉ) కుష్ఠురోగుల పునరావాస కేంద్రం :
జవాబు:
కుష్టువ్యాధి నిరోధక మరియు ఆరోగ్య సంస్థ

వ్యాకరణాంశాలు

1) కింది పదాల్లోని పుంప్వాదేశ సంధి, టుగాగమ సంధి, అత్వ సంధి, ద్విరుక్తటకార సంధుల పదాలను గుర్తించి, విడదీసి సూత్రాలను రాయండి.
సరసంపుమాట, కట్టెదుట, చింతాకు, తూగుటుయ్యేల, నట్టడవి, ముద్దుటుంగరము, మధురంపుకావ్యం, పల్లెటూరు, రామయ్య

పుంప్వాదేశ సంధి : 2
1) సరసము + మాట = సరసంపుమాట
2) మధురము + కావ్యం – మధురంపు కావ్యం
సూత్రం :
కర్మధారయము నందు “ము” వర్ణకములకు పుంపులగు.

టుగాగమ సంధి :
1) తూగు + ఉయ్యేల = తూగుటుయ్యేల
2) పల్లె + ఊరు = పల్లెటూరు
3) ముద్దు + ఉంగరము = ముద్దుటుంగరము
సూత్రం :
కర్మధారయములందు ఉత్తున కచ్చు పరమగునపుడు టుగాగమంబగు.

అత్వసంధి :
1) రామ + అయ్య = రామయ్య
2) చింత + ఆకు = చింతాకు
సూత్రం : అత్తునకు సంధి బహుళంబుగానగు.

ద్విరుక్తటకారాదేశ సంధి :
1) కడు + ఎదుట = కట్టెదుట
2) నడు + అడవి = నట్టడవి
సూత్రం :
కులు, చిఱు, కడు, నడు, నిడు శబ్దముల ఐ, డ లకు అచ్చు పరమగునపుడు ద్విరుక్తటకారంబగు.

సకార త వర్గంశకార చ వర్గం
ఝు

శ్చుత్వ సంధి :
క్రింది ఉదాహరణలు పరిశీలించండి.
నిస్ + చింత = నిశ్చింత
సత్ + ఛాత్రుడు = సచ్చాత్రుడు
శరత్ + చంద్రికలు = శరచ్చంద్రికలు
జగత్ + జనని = జగజ్జనని
శార్జ్గిన్ + జయః – శార్జ్గియః

పై ఉదాహరణలలో మొదటి పదాల (నిస్, సత్, శరత్, జగత్, శార్జిన్) లో దాంతాలుగా ‘స’ కారం కాని, ‘త’ వర్గ కాని ఉంది. వాటికి ‘శ’ కారం కాని, ‘చ’ వర్గ (చ, ఛ, జ, ఝు, ఞ) కాని పరమైంది. శాంతి, ఛాత్రుడు, చంద్రిక, జనని, జయః లలో మొదటి అక్షరాలైన శ,చ,ఛ,జ పరమయ్యా యి. అప్పుడు వరుసగా “శ, ఛ, చ, జ, ఞ” లు ఆదేశమయ్యా యి కదా ! దీనిని సూత్రీకరిస్తే : ‘స’ కార ‘త’ వర్గ అక్షరాలకు ‘శ’ వర్ణ ‘చ’వర్గాలతో సంధి కలిస్తే ‘శ వర్ణ ‘చ’ వర్గాలే ఆదేశంగా వస్తాయి.

అభ్యాసం:
సత్ + జనుడు = సజ్జనుడు
సత్ + చరిత్రము = సచ్చరిత్రము

సూత్రం :
‘స’ కార ‘త’ వర్గ అక్షరాల (త, థ, ద, ధ, న) కు ‘శ’ వర్ణ, ‘చ’ వర్గాక్షరాలతో సంధి కలిస్తే ‘శ’ వర్ణ ‘చ’ వర్గాలే ఆదేశంగా వస్తాయి.

అదనపు సమాచారము

సంధులు

1) గ్రంథాలయం గ్రంథ + ఆలయం – సవర్ణదీర్ఘ సంధి
2) ప్రార్థనాలయం = ప్రార్థన + ఆలయం – సవర్ణదీర్ఘ సంధి
3) ఆనందానుభూతి = ఆనంద + అనుభూతి – సవర్ణదీర్ఘ సంధి
4) జీవితానుభవం = జీవిత + అనుభవం – సవర్ణదీర్ఘ సంధి
5) పరహితార్థం = పరహిత + అర్థం – సవర్ణదీర్ఘ సంధి
6) స్వార్థం = స్వ + అర్థం – సవర్ణదీర్ఘ సంధి
7) వయోవృద్ధులు = వయః + వృద్ధులు – విసర్గ సంధి
8) అహరహం = అహః + అహం – విసర్గ సంధి (విసర్గ రేఫగా మారడం)
9) ఏమంటావు = ఏమి + అంటావు – ఇత్వ సంధి
10) ఏమనుకున్నావు = ఏమి + అనుకున్నావు – ఇత్వ సంధి
11) చేయెత్తి = చేయి + ఎత్తి – ఇత్వ సంధి
12) – కొండంత = కొండ + అంత – అత్వ సంధి
13) గొంతెత్తి = గొంతు + ఎత్తి – ఉత్వ సంధి –
14) పాదాలు = పాదము = లు – లులన సంధి
15) ముత్యాలు = ముత్యము + లు – లులన సంధి
16) అడ్డం పెట్టు = అడ్డము + పెట్టు – పడ్వాది సంధి
17) ఆశ్చర్యపడు = ఆశ్చర్యము + పడు – పడ్వాది సంధి
18) తదేకంగా = తత్ + ఏకంగా – జత్త్వ సంధి
19) భవిష్యజ్జీవితం = భవిష్యత్ + జీవితం – శ్చుత్వ సంధి

సమాసాలు

సమాస పదంవిగ్రహవాక్యంసమాసం పేరు
1) వేపచెట్టు‘వేము’ అనే పేరు గల చెట్టుసంభావనా పూర్వపద కర్మధారయ సమాసం
2) రావి చెట్టు‘రావి’ అనే పేరు గల చెట్టుసంభావనా పూర్వపద కర్మధారయ సమాసం
3) నాలుగుదిక్కులునాలుగైన దిక్కులుద్విగు సమాసం
4) నాలుగు బారలునాలుగైన బారలుద్విగు సమాసం
5) రెండు చేతులురెండైన చేతులుద్విగు సమాసం
6) నాలుగడుగులునాలుగయిన అడుగులుద్విగు సమాసం
7) ఏడు గంటలుఏడు సంఖ్య గల గంటలుద్విగు సమాసం
8) రెండు రోజులురెండు సంఖ్య గల రోజులుద్విగు సమాసం
9) నికృష్ట జీవితంనికృష్టమైన జీవితంవిశేషణ పూర్వపద కర్మధారయం
10) మహాయోగిగొప్పవాడయిన యోగివిశేషణ పూర్వపద కర్మధారయం
11) మహా మెరుపుగొప్పదయిన మెరుపువిశేషణ పూర్వపద కర్మధారయం
12) అరమోడ్పు కనులుఅరమోడ్పయిన కనులువిశేషణ పూర్వపద కర్మధారయం
13) చిరునవ్వుచిన్నదయిన నవ్వువిశేషణ పూర్వపద కర్మధారయం
14) ముగ్గమనోహరంముగ్ధము, మనోహరమువిశేషణ ఉభయపద కర్మధారయం
15) సంజ వెలుగుసంజ యొక్క వెలుగుషష్ఠీ తత్పురుష సమాసం
16) గ్రంథాలయంగ్రంథములకు ఆలయంషష్ఠీ తత్పురుష సమాసం
17) కనుల పండువుకనులకు పండువుషష్ఠీ తత్పురుష సమాసం
18) మబ్బు తునకలుమబ్బు యొక్క తునకలుషష్ఠీ తత్పురుష సమాసం
19) చేతి చలువచేతి యొక్క చలువషష్ఠీ తత్పురుష సమాసం
20) జీవితానుభవంజీవితమందలి అనుభవంసప్తమీ తత్పురుష సమాసం
21) వయోవృద్ధులువయస్సు చేత వృద్ధులుతృతీయా తత్పురుష సమాసం
22) ప్రార్థనాలయంప్రార్థన కొఱకు ఆలయంచతుర్డీ తత్పురుషం
23) అనిర్వచనీయంనిర్వచనీయం కానిదినఞ్ తత్పురుషం
24) బాలబాలికలుబాలురును, బాలికలునుద్వంద్వ సమాసం
25) నిమీలిత నేత్రుడునిమీలితములయిన నేత్రములు గలవాడుబహువ్రీహి సమాసం

ప్రకృతి – వికృతి

వేషము – వేసము
ఆశ – ఆస
ముఖం – మొగం
సంధ్య – సంజ
పుష్పము – పూవు, పువ్వు
దీపము – దివ్వె
సంధి – సంది
కథ – కత
మౌక్తికము – ముత్యము, ముత్తియము
భృంగారము – బంగారము
నిమిషము – నిముసము
పీఠము – పీట
శక్తి – సత్తి
భారము – బరువు
భంగము – బన్నము
స్నేహము – నెయ్యము
పేటిక – పెట్టె

పర్యాయపదాలు

1) చెట్టు : 1) వృక్షము 2) తరువు 3) మహీరుహము
2) ముత్యము : 1) మౌక్తికము 2) ముక్తాఫలము 3) ఆణి
3) కన్నీరు : 1) అశ్రువు 2) బాష్పము 3) అస్రము
4) కన్ను : 1) నేత్రము 2) నయనము 3) చక్షువు
5) ఓర్పు : 1) తాల్మి 2) సహనము 3) ఓరిమి

నానార్థాలు

1. ఆశ : కోరిక, దిక్కు
2. మాను : విడుచు, చెట్టు
3. పాదము : అడుగు, కాలు, పద్యపాదము, పాతిక
4. చిత్రము : చిత్తరువు, చమత్కారం, ఆట, ఆశ్చర్యము
5. సమయము : కాలము, శపథము, ఆజ్ఞ
6. కథ : కత, చెప్పడం, గౌరి
7. కద : దిక్కు, మరణము, ప్రక్క
8. అక్షరము : పరబ్రహ్మము, అక్కరము, నీరు, తపస్సు

రచయిత పరిచయం

కృష్ణారెడ్డి జననం :
పులికంటి కృష్ణారెడ్డి క్రీ.శ. 1931లో జన్మించారు. చిత్తూరు జిల్లాలోని వెదురుకుప్పం మండలంలోని జక్కదన్న గ్రామం వీరి స్వగ్రామం. పులికంటి పాపమ్మ, గోవిందరెడ్డి వీరి తల్లిదండ్రులు. వీరిది వ్యవసాయ కుటుంబం. మధ్యతరగతి కుటుంబం.

పులికంటి నటజీవితం:
పులికంటి కృష్ణారెడ్డి మంచి నటుడు, బెల్లంకొండ రామదాసు రచించిన ‘పునర్జన్మ’ నాటకంలో వృద్ధుని పాత్ర ధరించడంతో ఆయన నటజీవితం ప్రారంభమైనది. నటునిగా చాలామందిచేత ప్రశంస లందుకొన్నాడు. మంచినటుడే కాక మంచి రచయిత కూడా.

రచనా వ్యాసంగం :
పులికంటి కృష్ణారెడ్డి పేరు వినగానే గుర్తు వచ్చేది కథా సాహిత్యం . 1960లో ఆంధ్రపత్రికలో ప్రచురింపబడిన “గూడుకోసం గువ్వలు” ఆయన రచించిన మొదటి కథ. ‘నాలుగ్గాళ్ళ మండపం’ ఆయన మరో రచన. సుమారు 150 కథలు రచించారు.

అవీ – ఇవీ :
పులికంటి కృష్ణారెడ్డి మంచి బుర్రకథా కళాకారుడు. కుటుంబ సంక్షేమం, వాతావరణ కాలుష్యం, పొదుపు మొదలైన అంశాల మీద సుమారు 100 బుర్రకథలను రచించాడు. వాటిని ప్రదర్శించి, అందరి మెప్పును పొందాడు. జనజీవనాన్ని ‘కళ్ళకు కట్టినట్టు రచనలు చేసిన దిట్ట. అంతేకాక, ఆయన జానపద కళాకారుడు, కవి. ప్రతిభాశాలియైన పులికంటి కృష్ణారెడ్డి గారు క్రీ.శ. 2007లో స్వర్గస్తులైనారు.

కఠిన పదాలకు అర్థాలు

బోదె = ప్రకాండము
కండ = మాంసము
కృతజ్ఞత = చేసిన మేలు మరచిపోకపోవడం
కనుకొలుకులు = కనుల చివరలు
యోగి = యోగాభ్యాసం చేయువాడు
మైలపరచడం = అశుచి చేయడం
బార = రెండుచేతులు పొడవుగా చాచిన మధ్యదూరం
తటస్థస్థితి = ఎటూకాని స్థితి
ఒడిసి = నేర్పుతో
మేరువు = బంగారు పర్వతం, దీనిపై దేవతలు విహరిస్తారు
విస్తీర్ణం = వ్యాపించిన ప్రాంతం
సంజ = సంధ్య
పరవశం = పరాధీనం
జోడించడం = జతచేయడం
చేతులు జోడించడం = నమస్కరించడం
హుందా = దర్జా
అతిథి = తిథితో నిమిత్తం లేకుండా వచ్చేవాడు
సదుపాయం = సౌకర్యం నివాసం
వసతి = ఉండే చోటు
మకుటం = కిరీటం
మారుపేరు = మరొక పేరు
లీనము = కలసిపోవడం, తన్మయం కావడం
గోరంత = చిన్నది
నిర్వర్తించడం = చేయడం
కొండంత = చాలా ఎక్కువ
అనుభూతి = అనుభవం
తేలిపోవడం = లీనమవడం
చెవిని పడడం = వినబడడం
బిలబిలా = అతి త్వరితముగా
గుమి = సమూహం
తెగిన గాలిపటం = తాడు విడిచిన
బొంగరం = ఎవరూ పట్టించుకోని అనాథ
మనిషి = విద్వాంసుడు
అక్షరసత్యం = కచ్చితమైన నిజం
స్మృతి = జ్ఞాపకం
వడదెబ్బ = వేడి తాకిడి
గుడ్డివెలుగు = తక్కువ వెలుగు
బుడ్డి దీపం = చిన్న దీపం
ఓనమాలు = అక్షరమాల
ధ్యేయం = లక్ష్యం
అహరహం = ప్రతిరోజు, నిరంతరం
పరహితం = ఇతరులకు మంచి
స్వార్థం = తన గురించి
గాలిలో కలిసిపోవడం = నాశనమైపోవడం, మిగలక పోవడం
కాచి వడబోయడం = బాగా అవగాహన చేసుకోవడం
పరమసత్యం = కచ్చితమైన నిజం
గాలివాటం = గాలి వీలు
నిదర్శనం = ఉదాహరణ
పరామర్శ = చక్కగా విచారించుట
ఏకాగ్రత = ఒకే విషయంపై దృష్టి నిలపడం

అలోచించండి- చెప్పండి

ప్రశ్న 1.
తల్లి ప్రేమ ఎలా ఉంటుంది? వివరించండి.
జవాబు:
తల్లి ప్రేమ నిర్మలంగా ఉంటుంది. తల్లి, తన బిడ్డలకు తనకు ఉన్నదంతా పెట్టాలని కోరుకుంటుంది. బిడ్డలకు తన పాలను ఇచ్చి పెంచుతుంది. తన కడుపు కూడా కట్టుకొని, బిడ్డలకు పెడుతుంది. తల్లి ప్రేమకు సాటి మరొకటి లేదు.

ప్రశ్న 2.
వినయంతో నిలబడడం, వేషంలో సంస్కారం అంటే మీకేమర్థమైంది?
జవాబు:
వినయంతో నిలబడడంలో, ఎదుటి వ్యక్తి యందు, ఆ వ్యక్తికి గల గౌరవం, ప్రేమ, ఆదరం వెల్లడవుతాయి. వేషంలో సంస్కారం అంటే నిండుగా బట్టలు వేసుకోడం, చక్కగా నుదుట బొట్టు పెట్టుకొని మర్యాదస్తులు ధరించే దుస్తులు ధరించడం.

AP SSC 10th Class Telugu Solutions Chapter 10 గోరంత దీపాలు

ప్రశ్న 3.
అనిర్వచనీయమైన కృతజ్ఞతాభావాన్ని ఎవరి పట్ల, ఎందుకు ప్రదర్శిస్తారు?
జవాబు:
మన జీవితాన్ని మంచి దారిలో పెట్టినవారిపై కృతజ్ఞత ప్రదర్శిస్తాము. ఎదుటి వ్యక్తి తమకు చేసిన గొప్ప మేలునకు ప్రతిగా, ఆ వ్యక్తి యందు వ్యక్తులు కృతజ్ఞతను ప్రదర్శిస్తారు. మనకు ఉపకారం చేసిన వారికి కృతజ్ఞత చెప్పడం, వారి యందు పూజ్యభావం కలిగి యుండడం అన్నవి, మానవుని సంస్కారానికి గుర్తులు.

ప్రశ్న 4.
మీ బడి, మీ ఇల్లు ప్రశాంతతకు మారుపేరుగా ఉండా లంటే ఏం చేయాలి ? ఏం చేయకూడదు?
జవాబు:
బడిలో పిల్లలు అల్లరి చేయరాదు. క్రమశిక్షణతో మెలగాలి. పిల్లలు గురువుల యందు గౌరవం కలిగి ఉండాలి. పిల్లలు ఇంట్లో తల్లిదండ్రుల యందు గౌరవాదరాలు కలిగి ఉండాలి. అల్లరి పనులు, కొంటె పనులు చేయకూడదు. ఇంట్లో టి.వి ధ్వనిని బాగా పెంచరాదు. కోపంతో పరుష వాక్యాలు మాట్లాడరాదు. అప్పుడు ఇల్లు, బడి కూడా ప్రశాంతంగా ఉంటాయి.

ప్రశ్న 5.
విద్యాలయావరణం కనులపండువుగా ఉంది కదా? మీ కంటికి కనులపండువుగా ఏమేమి గోచరిస్తాయి?
జవాబు:
1) పద్మాలతో నిండిన చెరువును చూసినపుడు.
2) మా చెల్లి మంచి అందమైన గౌను వేసుకొని నగలు పెట్టుకున్నప్పుడు.
3) ఆగస్టు 15వ తేదీకి పాఠశాలను రంగు రంగు కాగితాలతో అలంకరించినపుడు.
4) సినిమాలలో అందమైన పార్కులలో, నటీనటులు నాట్యాలు చేస్తున్నప్పుడు, నాకు కనులపండువుగా ఉంటుంది.
(గమనిక : గ్రామం, బడి, ఇల్లు మొ|| వాటి గురించి విద్యార్థులంతా సొంతంగా మాట్లాడాలి.)

ప్రశ్న 6.
పెద్దల మాటలు, జీవితానుభవాలు అక్షరసత్యాలు ఎందుకో వివరించండి.
జవాబు:
పెద్దలు ఏది మాట్లాడినా తమ అనుభవాల నుండో, తాము చదివిన గ్రంథాల నుండో ఉదాహరిస్తారు. అవి వారి జీవితాన్ని ప్రభావితం చేసినవై ఉంటాయి. అవి పిల్లలకు చాలా బాగా ఉపయోగపడతాయి. అందుకే ‘పెద్దలమాట – చద్దిమూట’ అన్నారు పెద్దలు. పెద్దల మాటలు విని, ఆచరిస్తే కష్టాలు దరిదాపులకు రావు. వారి జీవితానుభవాలు కూడా పిల్లలకు చాలా ఉపయోగపడతాయి. అవి పిల్లల జీవితాలకు దిక్సూచిల వంటివి. పెద్దలు తమ జీవితానుభవాలను పిల్లలకు చెప్పాలి. అందువల్ల పిల్లల జీవితాలు బాగుపడతాయి.

పరాకాష్ఠ = అత్యున్నత స్థితి
కుతూహలం = ఆత్రుత
వాయిదా = గడువు
గతాన్ని నెమరువేయడం = జరిగిన దానిని తలచుకోవడం
సందర్శనం = చూడడం
పుంగవము = ఎద్దు
పుంగవుడు = శ్రేష్ఠమైనవాడు
తలపు = ఆలోచన
ముగ్ధమనోహరం = అమాయకపు అందం
శ్రుతి = వినికిడి
నేస్తాలు = స్నేహితులు
అదిరిపడడం = భయపడడం
నివ్వెరపడు = ఆశ్చర్యపడడం
నిర్దాక్షిణ్యం = దయలేకపోవడం
పరధ్యానం = ఇతర ఆలోచన
నడివయస్సు = మధ్యవయస్సు (40-50 సం||లు)
పొదివి = జాగ్రత్తగా, అపురూపంగా
అథోగతి = హీనమైన స్థితి
పుట్టగతులుండవు = సర్వనాశనం
పొంతన = పోలిక
వేళకాని వేళ = అనువుకాని సమయం
మునుపు = పూర్వం
కుతూహలం = ఆత్రుత
నికృష్టం = అధమము
బుడతడు = చిన్నవాడు
నిర్లక్ష్యం = లక్ష్యం లేకపోవడం
ఉడాయించడం = పారిపోవడం
ధోరణి = విధానం
క్లుప్తం = సంక్షిప్తం, తగ్గించడం
ఏమరుపాటు = అకస్మాత్తుగా

ఆలోచించండి – చెప్పండి

ప్రశ్న 1.
సమయం, సందర్భం కలిసి రావడమంటే ఏమిటి? కొన్ని ఉదాహరణలు తెల్పండి.
జవాబు:
సమయం, సందర్భం కలిసి రావడమంటే, కాలమూ దానికి తగిన సంఘటన కలిసిరావడం. ఉదాహరణకు చదువుకొందుకు సరియైన సమయం ఉదయకాలం. ఉదయం 4 గంటల నుండి చదువుకొందుకు సరియైన సమయం. అప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఏరకమైన అలజడులూ ఉండవు. వాతావరణం కూడా చల్లగా ఉంటుంది. అటువంటి సమయంలో చదువు కొంటే చదువు బాగా వస్తుంది. మంచి మంచి ఆలోచనలు వస్తాయి.

ఆ సమయంలో చదవాలంటే మెలుకువ రాదు. మెలుకువగా ఉండాలంటే కొంచెం కష్టం. కనుక ఉదయం 4 గంటలకు ఎవరైనా ప్రయాణమై వెడుతుంటే, ఎలాగూ నిద్రలేస్తాం. ఆ ప్రయాణ సందర్భంగా నిద్రలేస్తాం. కనుక మంచి సమయం, సందర్భం కలిసివచ్చాయి. అప్పుడు చదువుకోవడం మంచిది.

అలాగే, కంచి దైవదర్శనానికి వెడతాం. అది మంచి సమయం కనుక అక్కడ ఉన్న చూడదగిన ప్రదేశాలన్నీ చూస్తాం. దేవాలయాలు కూడా చూస్తాం. కంచిలో పట్టుబట్టలు నాణ్యమైనవి. చౌకగా దొరుకుతాయి. అంతదూరం వెళ్ళాం. పట్టుబట్టల దుకాణాలు చూశాం. ఆ సందర్భంలో నచ్చిన బట్టలు కూడా కొనుక్కొంటే సమయం, సందర్భం కలిసి వస్తాయి.

AP SSC 10th Class Telugu Solutions Chapter 10 గోరంత దీపాలు

ప్రశ్న 2.
“తెలుగు వారికి తెలుగంటే బోలెడంత అభిమానం” దీన్ని గురించి మీ అభిప్రాయాలు చెప్పండి.
జవాబు:
ఎవరి భాషపైన వారికి అభిమానం ఉంటుంది. ఈ విషయంలో తమిళనాడు వారే ఆదర్శవంతులు. వారు తమిళానికి ఇచ్చినంత గౌరవం ఏ భాషకూ ఇవ్వరు. వారు సాధ్యమైనంత వరకు తమిళంలోనే మాట్లాడతారు.

తెలుగు వారికీ తెలుగంటే అభిమానమే కాని, అంతేకాదు, మన వారికి పరభాషా వ్యా మోహం ఎక్కువ. తెలుగులో మాట్లాడడం నామోషీగా భావిస్తారు. పరభాషలలో మాట్లాడడం గొప్పతనంగా భావిస్తారు. తెలుగులో కూడా పరభాషా పదాలను ఎక్కువగా చేర్చి, మాట్లాడతారు. అది కొంతమంది తెలుగువారి పద్దతి.

తెలుగంటే ఎడతెగని అభిమానం కలవారు కూడా చాలామంది ఉన్నారు. కవులు, రచయితలు, సాహిత్యాభిమానులు, కళాకారులు మొదలైనవారు. వారు తెలుగులోనే ఎంతో చమత్కారం కల పదాలు ప్రయోగిస్తూ చక్కగా మాట్లాడతారు. ఎంతసేపైనా వినాలి అనిపిస్తుంది. తెలుగులోని తియ్యదనం చవిచూస్తే జన్మ ధన్యమౌతుంది. తెలుగు పలుకుల వెలదికి తేనెచినుకుల చిలకరింపులకు మనసు పులకరిస్తుంది.

ప్రశ్న 3.
పిల్లలు ఎందుకోసం వచ్చి ఉంటారు? ఆయన వారితో ఏం మాట్లాడి ఉంటారు? ఊహించండి.
జవాబు:
పిల్లలు తమకు కావలసిన అవసరాలను ఆ వృద్ధునికి చెప్పాలని ఆయన దగ్గరికి వారు వచ్చి ఉంటారు. వారు తమకు పుస్తకాలు కావాలనో, వారు బడిలో ఫీజు కట్టాలనో, వారికి దుస్తులు కావాలనో ఆయనను అడిగి ఉంటారు.

ప్రశ్న 4.
కథల పుస్తకాలు లేదా ఇతర పుస్తకాల్లో బొమ్మలు ఎందుకు వేస్తారు?
జవాబు:
పుస్తకంలోని విషయం దేని గురించి ఉందో అట్లపై బొమ్మ చెబుతుంది. కథలోని విషయం కళ్ళకు కట్టినట్లు తెలియజెప్పడానికే బొమ్మలు వేస్తారు. బొమ్మను చూపి కథ ఊహించుకోవచ్చు. కాని, కథ పూర్తిగా అవగాహనకు రాదు. అదేమిటో తెలుసుకోవాలనే తపన బయలు దేరుతుంది. ఆ తపన తీరాలంటే ఆ కథ తెలియాలి. ఆ కథ తెలియాలంటే చదవాలి. అందుచేత బొమ్మ చూస్తే, అది ఆ కథను చదివిస్తుంది.

క్రింది తరగతులలోని పాఠ్యపుస్తకాలలోని బొమ్మలు కూడా మమ్మల్ని ఇదే విధంగా ప్రేరేపించాయి. పాఠ్యపుస్తకం చేతికి రాగానే బొమ్మలు చూసేవాళ్ళం. ఆ బొమ్మలను బట్టి కథ ఊహించుకొని, ఆ పాఠం చదివేసేవాళ్ళం. పద్యాలైతే అర్థంగావు, కాని పాఠాలంటే భలే ఇష్టం. బొమ్మలు లేని పుస్తకం అలంకారాలు లేని మనిషిలా ఉంటుంది. సరిగ్గా సర్దుకోని ఇల్లులా ఉంటుంది. ఒక లక్ష్యం లేని జీవితంలా ఉంటుంది. బొమ్మలు పుస్తకాలకి ప్రాణం.

ప్రశ్న 5.
వృద్ధుడిని ఆకట్టుకొన్న బొమ్మ ఏమిటి? ఆ బొమ్మను చూసి ఎలాంటి అనుభూతిని పొందాడు?
జవాబు:
వృద్ధుడిని ఆకట్టుకొన్నది. రైలు పెట్టెలో యాచిస్తున్న కుర్రవాడి బొమ్మ, ఆ బొమ్మలోని కుర్రవాడిని చూడగానే రైలు పెట్టె తుడుస్తున్న కుర్రవాడిని తీసుకొనివచ్చి, చదివించి, ప్రయోజకుడిని చేయాలి అనిపించింది. అప్పుడు తన ఎదుట ఆ బొమ్మలోని కుర్రవాని వలె అనాథగా నిలుచున్నవాడే ఈ రోజు సంఘంలో గౌరవప్రదమైన ఉద్యోగం చేసుకొంటూ బ్రతుకుతున్నాడు.

చాలామంది కథలలోను, నవలలలోనూ ఆదర్శ వంతమైన ఊహలు రాస్తారు. ఉపన్యాసాలలో కూడా ఆదర్శవంతమైన మాటలు చెబుతారు. కాని, ఆచరణలో శూన్యం. కొందరు మాత్రం ఆ కథలు విని, ఉపన్యాసాలు విని అలా చేస్తారు. కాని, ఈ వృద్దుడు చేసిన ఆదర్శ వంతమైన పనికి మూలం కథ. అందుచేత వృద్ధుడు తాను చేసిన పనికి చాలా ఆనందానుభూతిని పొందాడు. మాటలలో వర్ణించలేనంత సంతృప్తిని పొందాడు.

ప్రశ్న 6.
వారపత్రికలో వృద్ధుడు చదివిన కథ ఏమై ఉంటుంది?
జవాబు:
వారపత్రికలో వృద్ధుడు చదివిన కథ బహుశః “రైలు పెట్టెల్లో చిక్కుకొన్న అనాథ బ్రతుకు” అనే కథ అయి ఉండవచ్చు.

స్వభావం = తనయొక్క భావం
తటాలున = అకస్మాత్తుగా
ఇంటివాడవ్వడం = పెళ్ళి చేసుకోవడం
గాద్గదికం = బొంగురు
పూడుకపోవడం = మూసుకొనిపోవడం
దీర్ఘవ్యాధి = చాలాకాలం ఉండే వ్యాధి

ఆలోచించండి – చెప్పండి

ప్రశ్న 1.
రైలు పెట్టెలో తుడుస్తున్న బాలుడిని చూసి, ఇలాంటి నికృష్ణ జీవితాలకు ఎంతమంది బలి అవుతున్నారో అని వృద్ధుడు భావించడం సరైందేనా? ఎందుకు?
జవాబు:
సరైనది :
రైలు పెట్టెలో తుడుస్తున్న బాలుడిని చూసి, ఇలాంటి నికృష్ట జీవితాలకు ఎంతమంది బలి అవుతున్నారో అని వృద్ధుడు భావించడం సరైనదే. ఎందుకంటే గృహహింస తట్టుకోలేక చాలామంది బాలలు ఇళ్ళలో నుండి పారిపోతారు. పిల్లల అభిప్రాయాలను పెద్దలు పట్టించుకోకపోయినా, వారికి ఇష్టంలేని పనులు చేయమని బలవంత పెట్టినా, కోప్పడినా పిల్లలు పారిపోతారు. తర్వాత వారు ఏ ముఠాలకో దొరుకుతారు. వారు, రైలు పెట్టెలు తుడిచే పనులు, భిక్షాటన, దొంగతనాలు మొదలైన వాటిలో ప్రవేశపెడతారు. ఇక ఆ పిల్లల జీవితాలు నికృష్టంగా తయారౌతాయి. తల్లి తండ్రులెవరో తెలియని అనాథ పిల్లల జీవితాలు కూడా ఇంతే, కొంతమంది పిల్లలను దొంగలు ఎత్తుకొనిపోయి కూడా ఇలాంటి పనులు చేయిస్తారు. అందుచేత వృద్ధుడి భావన సరైనది. సరైనది కాదు : రైలు పెట్టెలో తుడుస్తున్న బాలుడిని చూసి, ఇలాంటి నికృష్ట జీవితాలకు ఎంతమంది బలి అవుతున్నారో అని వృద్ధుడు భావించడం సరైనది కాదు. ఎందుకంటే తను సుదీర్ఘమైన జీవితాన్ని చూసినవాడు, అనుభవం గడించిన వాడు. ఆ పిల్లలు అలాగ తయారు కావటానికి కారణం పెద్దలే. తమ పిల్లలను అపు రూపంగా చూసుకొంటే ఇలాంటి పరిస్థితులు రావు. దుర్వ్యసనాల పాలైన పెద్దలు పెట్టే బాధలను పిల్లలు భరించలేరు. కనీసం సమాజంలోని వాళ్ళు ఆ పిల్లలను పట్టించుకొని ఇళ్ళకు చేరిస్తే ఈ బాధలుండవు. కౌన్సిలింగ్ ద్వారా పిల్లల పెంపకంపై అవగాహన కలిగించాలి. లేదా చట్టప్రకారం చర్యలు తీసుకొనేలా చేయాలి. అన్నిటిపైనా అవగాహన గల ఆ వృద్ధుడు చేతగానివాడిలా బాధపడడం సమర్థనీయం కాదు. (సూచన : పై వానిలో ఒక అభిప్రాయమే గ్రహించాలి.
రెండూ గ్రహించకూడదు.)

ప్రశ్న 2.
“ప్రయత్నం చేసి ఫలితాలు సాధిస్తే ఆనందం కలుగు తుంది” దీంతో మీరు ఏకీభవిస్తారా?
జవాబు:
ఏ ప్రయత్నమూ లేకుండా కలిగే ఫలితం ఆనందం కలిగించదు. కష్టపడి పనిచేసి ఫలితాన్ని పొందితే చాలా ఆనందం కలుగుతుంది. ఎవరో చేసిన ప్రయత్నానికి ఫలితాన్ని మనం అనుభవించడమే దోపిడి అంటే అది మోసం, దగా, నయవంచన. మన ప్రయత్నం మనం చేసుకోవాలి. దానిలో కష్టాలు ఎదురుకావచ్చును. నష్టాలు రావచ్చును. బాధలు కలగవచ్చును. శ్రమ కలగవచ్చు. కొన్ని మాటలు కూడా పడవలసిరావచ్చును. కాని, ఫలితం అందుకోగానే అవన్నీ మరచిపోతాం. చాలా ఆనందం పొందుతాం. చాలా సంతృప్తి కలుగుతుంది. చాలా గర్వంగా ఉంటుంది. ఉప్పొంగి పోతాం. పడిన శ్రమంతా మరచిపోతాం. గంతులు వేస్తాం, ఇంత హడావుడికి కారణం? మన ప్రయత్నంతో సాధించుకోవడం. అందుకే దేనినైనా సాధించుకోవాలి తప్ప దక్కించుకోకూడదు. యాచించకూడదు.

AP SSC 10th Class Telugu Solutions Chapter 10 గోరంత దీపాలు

ప్రశ్న 3.
అందరు పిల్లలూ తప్పనిసరిగా బడికి వెళ్ళి చదువుకోవాలి కదా ! మరి అలా ఎందుకు జరగడం లేదు?
జవాబు:
మనది వ్యవసాయ ప్రధానమైన దేశం. బీదల సంఖ్య ఎక్కువ. చిన్న చిన్న వృత్తులతో పొట్టపోసుకొనేవారు చాలామంది ఉన్నారు. కుటుంబంలోని వారంతా కష్టపడి డబ్బు సంపాదించకపోతే రోజు గడవదు. అందుచేత పిల్లలను కూడా డబ్బు కోసం పనులకు పంపుతారు. సంపాదనలో పెడతారు. సంచార జాతులవారు తమ పిల్లలను తమ కూడా తిప్పుకొంటారు. అందుచేత వారి పిల్లలు కూడా బడులకు రాలేరు.

కొంతమంది పిల్లలు మొండితనం, అల్లరి, అతిగారాబం వలన బడులకు వెళ్ళరు. వెళ్ళినా అక్కడ అందరితోటి కలవలేక బడి మానివేస్తారు. చిన్నతనం నుండీ పెద్దలు సరిగా పట్టించుకోక దురలవాట్లకు బానిసలౌతారు.

కొన్ని కుటుంబాలలోని ఆడపిల్లలకు చిన్నతనంలోనే వివాహాలు చేసేస్తారు. అది కూడా బాలల విద్యాభ్యాసానికి ఆటంకంగా ఉంది. నిరక్షరాస్యత, నిరక్షరాస్యులకు అక్షరాల విలువ తెలియదు. తమకు చదువు లేకపోయినా చక్కగా గడుస్తోంది కదా ! దేనికీ లోటులేదు. అలాగే తమ పిల్లలకూ గడుస్తుంది అనే ఆలోచన. ఎంత చదువు చదివినా ఉద్యోగాలు రావు. అంతకంటే పని నేర్చుకొంటే నయం అనే భావన కూడా కారణం. బాలలు తప్పనిసరిగా బడికి రావాలంటే వారి ఇబ్బందులు తెలుసుకొని పరిష్కరించాలి.

ప్రశ్న 4.
“గుండెల్లోని ఆనందం కరిగి ముత్యాల్లా కన్నీటి రూపంలో రావడం” అంటే, మీకేమి అర్థమైంది ? ఇది ఏ ఏ సందర్భాల్లో జరుగుతుంది ? మీ అనుభవాలు తెల్పండి.
జవాబు:
కన్నుల వెంట నీరు రెండు సందర్భాల్లో వస్తుంది. దుఃఖం కలిగితే వస్తుంది. అలాకాక ఆనందం ఎక్కువగా వస్తే కన్నుల వెంట నీటి బిందువులు ముత్యాల్లా రాలుతాయి. వాటినే ఆనందబాష్పాలు అంటారు.
మనం ఊహించని మంచి మేలు జరిగితే, మనకు ఆనందబాష్పాలు వస్తాయి. అలాగే మనం విజయం సాధిస్తే ఆనందబాష్పాలు వస్తాయి.

నా అనుభవాలు :

  1. నాకు 10వ తరగతి పరీక్షల్లో రాష్ట్రస్థాయిలో మంచి ర్యాంకు వచ్చింది. అప్పుడు నాకు ఆనందబాష్పాలు వచ్చా యి.
  2. నాకు పాటల పోటీలో ప్రథమ బహుమతి వచ్చింది. ఆ బహుమతి ఇచ్చే సందర్భంలో ఆనాడు పాఠశాలకు వచ్చిన ముఖ్యమంత్రి గారి ఎదుట నాచే ఆపాట పాడించారు. ఆ బహుమతిని నాకు ముఖ్యమంత్రి గారు స్వయంగా ఇచ్చారు. ఆ సందర్భంలో నాకు ఆనందబాష్పాలు వచ్చాయి.

ప్రశ్న 5.
“ఒక వ్యక్తి బాధ్యతల్ని స్వీకరించే స్థితికి సమాజం ఎప్పుడు చేరుతుందో ?” అనే ఆవేదన సరైందేనా? ఎందుకు?
జవాబు:
సరైనది :
వ్యక్తి బాధ్యతను సమాజం స్వీకరించాలి. ఒక వ్యక్తిని రక్షించి, తీర్చిదిద్దవలసిన బాధ్యత తల్లిదండ్రులది. వారు తమ బాధ్యతను విస్మరిస్తే, ఆ బాధ్యతను సమాజం స్వీకరించాలి. వారికి రక్షణ కల్పించాలి. వారికి విద్యాబుద్ధులు నేర్పాలి. అప్పుడు వారు ప్రయోజకు లౌతారు. సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడతారు. ఆ విధంగా ఆదుకొందుకు ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, ధనవంతులు కొన్ని ‘ఆశ్రయ భవనాలను’ నిర్మించాలి. కొంతమంది ఉద్యోగులను కూడా నియమించాలి. అప్పుడే ఈ సమాజంలో అనాథలు, నిర్భాగ్యులు, నికృష్టజీవనులు ఉండరు. ముఖ్యంగా భావిభారత పౌరుల జీవితాలు ఆనందమయం అవుతాయి.

సరైనదికాదు :
పదిమంది వ్యక్తులు కలిస్తేనే సమాజం. అనేకమంది ఊహలకు రూపకల్పన సమాజం. సమాజంలో రకరకాల వ్యక్తులు ఉంటారు. రకరకాల అవసరాలు ఉన్నవారు ఉంటారు, అనేక రకాల మనస్తత్వాలు ఉంటాయి. ఎవరి బాధలు వారివి. ఎవరి ఆనందాలు వారివి. ఒకరికి బాధకలిగితే, సమాజం ఓదార్చాలి. ధైర్యం చెప్పాలి. సహాయం చేయాలి. వెన్నుదన్నుగా నిలబడాలి. కాని, బాధ్యతలను స్వీకరించకూడదు. అది బద్ధకాన్ని నేర్పుతుంది. ఎవరి పిల్లలను వారు పెంచుకోవాలి. తీర్చిదిద్దుకోవాలి. ఆర్థికంగా కాని, సామాజికంగా కాని సహాయం కావాలంటే సమాజం ఇవ్వాలి అంతేకాని, పిల్లలను పెంచే బాధ్యత కూడా సమాజమే స్వీకరిస్తే, వారు సోమరులుగా తయారౌతారు. పిల్లలను పట్టించుకోని పెద్దలను శిక్షించాలి. పిల్లల సంరక్షణకు చట్టాలు చేయాలి. కఠినంగా అమలుపరచాలి. అప్పుడే భావి భారతం ఆనందమయం అవుతుంది. పెద్దలకు బాధ్యత తెలుస్తుంది.
( గమనిక : పై వాటిలో ఏ అభిప్రాయమైనా చెప్ప వచ్చును. రెండూ చెప్పకూడదు.)

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 3 అరణ్యకాండ

AP State Board Syllabus AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం 3rd Lesson అరణ్యకాండ Textbook Questions and Answers.

AP State Syllabus SSC 10th Class Telugu Solutions ఉపవాచకం 3rd Lesson అరణ్యకాండ

10th Class Telugu ఉపవాచకం 3rd Lesson అరణ్యకాండ Textbook Questions and Answers

I. అవగాహన – ప్రతిస్పందన

సంఘటనా క్రమం

సంఘటనల ఆధారంగా వరుస క్రమంలో వాక్యాలను అమర్చడం.

1. అ) దండకారణ్యం పవిత్ర ప్రదేశం. ప్రశాంత ప్రదేశం.
ఆ) ఆశ్రమ సముదాయాన్ని చూడగానే అల్లెతాడును ధనుస్సు నుండి వేరుచేశాడు శ్రీరాముడు.
ఇ) పక్షులు, మృగాలు – సకల ప్రాణులకు సురక్షితమైన ప్రాంతం అది.
ఈ) అక్కడ లోకక్షేమం కోసం యజ్ఞయాగాలు జరుగుతున్నాయి.
జవాబులు
అ) దండకారణ్యం పవిత్ర ప్రదేశం, ప్రశాంత ప్రదేశం.
ఇ) పక్షులు, మృగాలు, సకల ప్రాణులకు సురక్షితమైన ప్రాంతం అది.
ఈ) అక్కడ లోకక్షేమం కోసం యజ్ఞయాగాలు జరుగుతున్నాయి.
ఆ) ఆశ్రమ సముదాయాన్ని చూడగానే అల్లెతాడును ధనుస్సు నుండి వేరుచేశాడు.

2. అ) తన తండ్రికి ఆత్మీయుడైన జటాయువునకు సీత రక్షణ బాధ్యత అప్పగించాడు. శ్రీరాముడు.
ఆ) కష్టాలతో కూడిన వనవాసానికి సీత కోరిరావడం.సాహసమని అభినందించాడు.
ఇ) శ్రీరాముడి రాకను గమనించి అగస్త్యుడు శిష్యసమేతంగా ఎదురువెళ్లాడు.
ఈ) అగస్త్యుడు శ్రీరామునకు దివ్యధనుస్సు, అక్షయతూణీరాలు, అమోఘమైన ఖడ్గాన్ని బహుకరించాడు.
జవాబులు
ఇ) శ్రీరాముడి రాకను గమనించి అగస్త్యుడు శిష్యసమేతంగా ఎదురువెళ్లాడు.
ఈ) అగస్త్యుడు శ్రీరామునకు దివ్యధనుస్సు, అక్షయతూణీరాలు, అమోఘమైన ఖడ్గాన్ని బహుకరించాడు.
ఆ) కష్టాలతో కూడిన వనవాసానికి సీత కోరిరావడం సాహసమని అభినందించాడు.
అ) తన తండ్రికి ఆత్మీయుడైన జటాయువునకు సీత రక్షణ బాధ్యత అప్పగించాడు శ్రీరాముడు.

3. అ) సీతాదేవి అడ్డు తొలగించుకోవాలని ఆమెపై దాడికి దిగింది.
ఆ) ఇంతలో ‘శూర్పణఖ’ అనే రాక్షసి అక్కడికి వచ్చింది.
ఇ) ఆలస్యం చేయకుండా శూర్పణఖను విరూపిని చేయమన్నాడు శ్రీరాముడు.
ఈ) శ్రీరాముని సౌందర్యానికి ముగ్ధురాలైంది శూర్పణఖ.
జవాబులు
ఆ) ఇంతలో ‘శూర్పణఖ’ అనే రాక్షసి అక్కడికి వచ్చింది.
ఈ) శ్రీరాముని సౌందర్యానికి ముగ్ధురాలైంది శూర్పణఖ.
అ) సీతాదేవి అడ్డు తొలగించుకోవాలని ఆమెపై దాడికి దిగింది.
ఇ) ఆలస్యం చేయకుండా శూర్పణఖను విరూపిని చేయమన్నాడు శ్రీరాముడు.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 3 అరణ్యకాండ

4. అ) ఖరదూషణ త్రిశరులు, పద్నాలుగు వేల మంది రాక్షసవీరులు రాముడి ధాటికి నిలువలేక యముడి ఇంటికి పోవడాన్ని భరించలేకపోయింది శూర్పణఖ.
ఆ) రావణుడు మళ్లీ మారీచుని వద్దకు వెళ్లాడు. సీతాపహరణకు బంగారులేడిగా మారి సహకరించమన్నాడు.
ఇ) ‘సౌందర్యవతి అయిన సీతకు తగిన భర్తవు నీవే’నని రావణుడిలో కొత్త ఆశలను రేకెత్తించింది. .
ఈ) శ్రీరాముని బలంతో తన బలాన్ని పోల్చుకున్నాడు రావణుడు.
జవాబులు
అ) ఖరదూషణ త్రిశరులు, పద్నాలుగు వేల మంది రాక్షస వీరులు .రాముడి ధాటికి నిలువలేక యముడి ఇంటికి పోవడాన్ని భరించలేకపోయింది శూర్పణఖ.
ఇ) ‘సౌందర్యవతి అయిన సీతకు తగిన భర్తవు నీవే’నని రావణుడిలో కొత్త ఆశలను రేకెత్తించింది.
ఈ) శ్రీరాముని బలంతో తన బలాన్ని పోల్చుకున్నాడు రావణుడు.
ఆ) రావణుడు మళ్లీ మారీచుని వద్దకు వెళ్లాడు. సీతాపహరణకు బంగారు లేడిగా మారి సహకరించమన్నాడు.

5. అ) మారీచుని కంఠధ్వనిని రామునిదిగా భావించి సీత ఆందోళన చెందింది.
ఆ) మారీచుడు బంగారులేడిగా మారి శ్రీరాముని ఆశ్రమ ప్రాంతంలో తిరుగుతున్నాడు.
ఇ) సీత ఇష్టాన్ని తోసివేయలేక ఆ మాయలేడిని చంపి అయినా సరే తేవడానికి సంసిద్ధుడయ్యాడు శ్రీరాముడు.
ఈ) తనకు అదెంతో నచ్చిందని, తీసుకురావాలని కోరింది సీత.
జవాబులు
ఆ) మారీచుడు బంగారులేడిగా మారి శ్రీరాముని ఆశ్రమ ప్రాంతంలో తిరుగుతున్నాడు.
ఈ) తనకు అదెంతో నచ్చిందని, తీసుకురావాలని కోరింది సీత.
ఇ) సీత ఇష్టాన్ని తోసివేయలేక ఆ మాయాలేడిని చంపి అయినా సరే తేవడానికి సంసిద్ధుడయ్యాడు శ్రీరాముడు.
అ) మారీచుని కంఠధ్వనిని రామునిదిగా భావించి సీత ఆందోళన చెందింది.

6. అ) చివరకు రావణుడు ఖడ్గంతో జటాయువు రెక్కలను, కాళ్లను నరికివేశాడు.
ఆ) సన్యాసి వేషాన్ని వదిలి పదితలలతో భయంకరమైన నిజస్వరూపంతో సీత ఎదుట నిలిచాడు.
ఇ) యతి రూపంలో వచ్చిన రావణుణ్ణి ఆసనం మీద కూర్చుండబెట్టి సముచితంగా అతిథి మర్యాదలు చేసింది సీత.
ఈ) రావణుడు సీతాదేవిని తీసుకుని ఆకాశమార్గం పట్టాడు.
జవాబులు
ఇ) యతి రూపంలో వచ్చిన రావణుణ్ణి ఆసనంమీద కూర్చుండబెట్టి సముచితంగా అతిథి మర్యాదలు చేసింది సీత.
ఆ) సన్యాసి వేషాన్ని వదిలి పదితలలతో భయంకరమైన నిజస్వరూపంతో సీత ఎదుట నిలిచాడు.
అ) చివరకు రావణుడు ఖడ్గంతో జటాయువు రెక్కలను, కాళ్లను నరికివేశాడు.
ఈ) రావణుడు సీతాదేవిని తీసుకొని ఆకాశమార్గం పట్టాడు.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 3 అరణ్యకాండ

7. అ) మారీచుణ్ణి వధించి శ్రీరాముడు వెనుదిరిగాడు.
ఆ) రావణుడు సీతాదేవిని తీసుకొని ఆకాశమార్గం పట్టాడు.
ఇ) జటాయువు రావణుణ్ణి ఎదిరించాడు.
ఈ) లక్ష్మణుడు వెళ్ళడాన్ని గమనించాడు రావణుడు.
జవాబులు
ఈ) లక్ష్మణుడు వెళ్ళడాన్ని గమనించాడు రావణుడు.
ఆ) రావణుడు సీతాదేవిని తీసుకొని ఆకాశమార్గం పట్టాడు.
ఇ) జటాయువు రావణుణ్ణి ఎదిరించాడు.
అ) మారీచుణ్ణి వధించి శ్రీరాముడు వెనుదిరిగాడు.

8. అ) మారీచుడు బంగారు లేడిగా మారి సీత నివాసం ఉండే ప్రాంతానికి వచ్చాడు.
ఆ) శ్రీరాముని రాకను గమనించి అగస్త్యుడు శిష్య సమేతంగా ఎదురువెళ్ళాడు.
ఇ) ఒకనాడు శ్రీరాముడు పురాణకథా ప్రసంగంలో ఉన్నాడు.
ఈ) విరాధుని మాట ప్రకారం శ్రీరాముడు సీతా లక్ష్మణులతో కలిసి బయల్దేరాడు.
జవాబులు
ఈ) విరాధుని మాట ప్రకారం శ్రీరాముడు సీతా లక్ష్మణులతో కలిసి బయల్దేరాడు.
ఆ) శ్రీరాముని రాకను గమనించి అగస్త్యుడు శిష్య సమేతంగా ఎదురువెళ్ళాడు.
ఇ) ఒకనాడు శ్రీరాముడు పురాణకథా ప్రసంగంలో ఉన్నాడు.
అ) మారీచుడు బంగారులేడిగా మారి సీత నివాసం ఉండే ప్రాంతానికి వచ్చాడు.

9. అ) రావణుడు సీతను తీసుకొని ఆకాశమార్గంలో వెళ్ళాడు.
ఆ) లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు చెవులు కోశాడు.
ఇ) పంచవటిలో జీవనం ప్రశాంతంగా గడుస్తున్నది.
ఈ) సీతారామలక్ష్మణులకు మహర్షులు సాదర స్వాగతం పలికారు.
జవాబులు
ఈ) సీతారామలక్ష్మణులకు మహర్షులు సాదర స్వాగతం పలికారు.
ఇ) పంచవటిలో జీవనం ప్రశాంతంగా గడుస్తున్నది.
ఆ) లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు చెవులు కోశాడు.
అ) రావణుడు సీతను తీసుకొని ఆకాశమార్గంలో వెళ్ళాడు.

పాత్ర స్వభావాలు

1. శరభంగ మహర్షి :
శరభంగుడు మహాతపస్వి. దైవసాక్షాత్కారం పొందినవాడు. శ్రీరాముని చూసి శ్రీరామదర్శనం కోసమే తాను వేచివున్నానన్నాడు. తన తపఃఫలాన్నంతా శ్రీరామునికి ధారపోశాడు.

2. అగస్త్యుడు :
అగస్త్యుడు తపశ్శక్తి సంపన్నుడు. ఆకాశాన్ని తాకిన వింధ్య పర్వత గర్వాన్ని అణచినవాడు. ‘అగమ్ స్తంభయతీతి అగస్త్యః’ పర్వతాన్ని స్తంభింపజేసినవాడు కనుక అగస్త్యుడయ్యాడు.

3. జటాయువు :
ఒక పెద్ద గ్రద్ద. సంపాతికి తమ్ముడు. దశరథునికి మిత్రుడు. శ్రీరాముడు ఇతనికి సీత సంరక్షణ బాధ్యతను అప్పగించాడు. రావణాసురుడు సీతను అపహరించి తీసుకొని వెడుతుంటే నిరోధించాడు. గాయాల పాలయ్యాడు. శ్రీరామునికి విషయాన్ని వివరించాడు. శ్రీరాముని చేతిలో కన్నుమూశాడు.

4. కబంధుడు :
ఒక రాక్షసుడు. ఇతని చేతిలో చిక్కితే ఎవ్వరూ తప్పించుకోలేరు. రావణుడు అపహరించిన సీతాదేవి దొరికే ఉపాయాన్ని శ్రీరామునకు చెప్పాడు.

5. మారీచుడు :
మారీచుడు తాటకి అనే రాక్షసికి కుమారుడు. విశ్వామిత్రుడి యజ్ఞవేదికపై రక్తం కురిపించిన దుష్టుడు.

సీతాపహరణకై తనకు సాయం చేయమని రావణుడు మారీచుని కోరాడు. రాముడు సింహం వంటివాడని రాముణ్ణి కవ్వించడం కొరివితో తలగోక్కోడం వంటిదని, రావణునికి మారీచుడు హితవు చెప్పాడు.

రావణుడు తన మాట వినకపోతే చంపుతానని మారీచుని బెదిరించాడు.

రావణుని చేతిలో చావడం కంటే రాముని చేతిలో చస్తే తన జన్మ తరిస్తుందని మారీచుడు భావించాడు. బంగారు లేడిగా మారి సీతాపహరణకు రావణునికి సాయం చేశాడు. శ్రీరాముని బాణం దెబ్బకు మారీచుడు మరణించాడు. వేటకు వచ్చే రాజులను మాయలేడి రూపంలో మారీచుడు చంపేవాడు.

6. శబరి :
శబరి తపస్సిద్ధురాలు, జ్ఞానవయోవృద్ధురాలు. శ్రీరామదర్శనంతో ఆమె తనువు పులకించింది. పంపాతీరంలో దొరికే పండ్లను స్వామికి సమర్పించింది. తన జన్మ ధన్యమైనట్లు భావించింది. శ్రీరాముడి అనుమతిని పొంది తన దేహాన్ని అగ్నికి ఆహుతి చేసి అగ్నికాంతితో ఊర్ధ్వలోకాలకు వెళ్ళింది.

సంఘటన ద్వారా గ్రహించుట

ప్రశ్న 1.
“అన్నా! ఈ దైన్యాన్ని వదులు. అదే మనకు మేలుచేస్తుంది” అను లక్ష్మణుని మాటలను బట్టి, మీరేం గ్రహించారో తెలుపండి.
జవాబు:
రావణుడు సీతాదేవిని అపహరించాడు. రాముడు సీతావియోగంతో బాధపడుతున్నాడు. రామలక్ష్మణులు సీతను వెదకుతూ, అందమైన పంపాసరస్సు దగ్గరకు వచ్చారు. ఆ అందమైన ప్రకృతిని చూచి, శ్రీరాముడు మరింతగా విరహ బాధపడ్డాడు.

అప్పుడు రాముడు దైన్యాన్ని విడిచిపెడితే, మేలు కలుగుతుందని చెప్పి, లక్ష్మణుడు రాముని ఊరడించాడు. లక్ష్మణుడు చెప్పినట్లు, కష్టాలు వచ్చినపుడు అధైర్యపడకుండా ప్రయత్నం చేస్తే మంచి ఫలితం ఉంటుందనీ, ఉత్సాహం ఉన్న వాడికి అసాధ్యం ఏమీ ఉండదనీ, ఉత్సాహం ఉన్న వాళ్ళు ఎలాంటి కష్టాలు వచ్చినా, వెనుకడుగు వేయరనీ, నేను గ్రహించాను.

ప్రశ్న 2.
‘నీ చేతిలో చావడం కన్నా, శ్రీరాముని చేతిలో చావడమే నయం’ అన్న మారీచుని మాటలను బట్టి, మీరు ఏమి గ్రహించారు?
జవాబు:
రావణుడు మారీచుని దగ్గరకు వచ్చి, సీతను అపహరించడానికి తనకు సాయం చేయుమని కోరాడు. రాముడి జోలికి వెళ్ళడం మంచిది కాదని, మారీచుడు రావణునికి హితువు చెప్పి పంపాడు.

కాని రావణుడు మళ్ళీ మారీచుడి దగ్గరకు వచ్చి, బంగారు లేడి రూపం ధరించి, సీతాపహరణానికి తనకు సాయం చెయ్యమని కోరాడు. తాను చెప్పినట్లు చెయ్యకపోతే, మారీచుని చంపుతానని రావణుడు చెప్పాడు.

రావణుడు చెప్పినట్లు చేసినా చెయ్యకపోయినా, మారీచుడికి మరణం తప్పని పరిస్థితి వచ్చింది.

అందుకే మారీచుడు మూర్ఖుడయిన రావణుడి చేతిలో చావడం కన్నా, ధర్మాత్ముడూ, మహావీరుడూ అయిన రాముడి చేతిలో చావడమే మంచిదని నిశ్చయించుకున్నాడు. రాముడి చేతిలో మరణిస్తే తన జన్మ తరిస్తుందని, మారీచుడు అనుకున్నాడు. దీనిని బట్టి దుర్మార్గుని చేతిలో చావడం కన్న, మంచివాడి చేతిలో మరణం పొందడం మంచిదని నేను గ్రహించాను. మారీచుడు రాక్షసుడయినా, మంచి చెడ్డలు తెలిసిన వాడని గ్రహించాను.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 3 అరణ్యకాండ

ప్రశ్న 3.
‘క్రూరులైన దుష్టులతో పరిహాసం పనికి రాదు’ అని శూర్పణఖ విషయంలో రాముడు పలికిన దానిని బట్టి మీరేమి గ్రహించారు?
జవాబు:
క్రూరులు అత్యంత ప్రమాదకారులు. వారితో పరిహాసం ఎన్నటికీ పనికిరాదు. దానివల్ల ఎన్నో అనర్థాలు కలుగుతాయి. వారు ఎదుటివారిని చులకనగా చూస్తారు. చనువుగా ప్రవర్తిస్తారు. మన సామర్థ్యాన్ని తక్కువగా అంచనా వేస్తారు.

క్రూరులతో సహవాసం చేయడం వల్ల వ్యక్తిత్వం నశిస్తుంది. సమాజంలో గౌరవం. అందువల్ల రాముడు చెప్పినట్లుగా క్రూరులతో సహవాసం పనికిరాదు.

ప్రశ్న 4.
“మహాత్ములారా! మీరు నన్ను ప్రార్థించడం తగదు. ఆజ్ఞాపించాలి. మీ ఆజ్ఞలను నేను శిరసా వహిస్తాను” అని రాముడు మునులతో అన్న మాటను బట్టి, మీరు ఏమి గ్రహించారో రాయండి.
జవాబు:
శ్రీరాముడు వనవాస కాలంలో సుతీక్ష మహర్షిని కలిశాడు. తరువాత అక్కడి మునులు అందరూ రాముడిని కలిసి, రాక్షసులు చేసే అకృత్యాలను గూర్చి చెప్పారు. రాక్షసుల బారినుండి తమ్ము రక్షింపుమని వారు రాముని ప్రార్థించారు.

అప్పుడు రాముడు ఆ మునులతో తన్ను ప్రార్థించడం తగదనీ, ఆజ్ఞాపించమనీ మునులు చెప్పినట్లు రాక్షసులను తాను సంహరిస్తాననీ, మునులకు అభయం ఇచ్చాడు.

దీనిని బట్టి శ్రీరాముడు మునుల మాటలను చాలా గౌరవించేవాడని, మునుల మాటలను ఆజ్ఞగా గ్రహించి వారు చెప్పినట్లు చేసేవాడని గ్రహించాను.

శ్రీరామునకు మునీశ్వరులపై భక్తి గౌరవములు హెచ్చుగా ఉండేవని గ్రహించాను. రాముడు మహావీరుడని గ్రహించాను.

ప్రశ్న 5.
“నన్ను అపహరించి నీ చావును నీవే కొని తెచ్చుకోకు” అని సీత, రావణుని హెచ్చరించిన మాటలను బట్టి, నీవేమి గ్రహించావో చెప్పు.
జవాబు:
రావణుడు సన్న్యాసి వేషంతో సీతవద్దకు వచ్చి, తనను భర్తగా స్వీకరిస్తే, గొప్ప భోగభాగ్యాలు అనుభవించవచ్చునని సీతకు ఆశచూపాడు.

రావణుని మాటలకు, సీత మండిపడింది. సీత మహా పతివ్రత. రావణుడు సీతను అపహరించి తీసుకొని వెడితే, అతడు తన చావును తాను కోరి తెచ్చుకున్నట్లే అని, సీత నిజాన్ని చెప్పిందని గ్రహించాను. రావణుడు సీతాపహరణం చేయకపోతే అతనికి మరణమే లేదని గ్రహించాను.

సీత మాటలను బట్టి ఆమె మహా ధైర్యం కలదనీ, నిర్భయంగా రావణుని వంటి రాక్షసుణ్ణి తిరస్కరించి మాట్లాడగలదనీ, , సత్యమూ హితమూ ఆమె బోధించిందనీ, నేను అర్థం చేసుకున్నాను.

ప్రశ్న 6.
రావణుడు సీతను అపహరించే సందర్భంలో జటాయువు చేసిన ప్రయత్నం నుండి మీరు ఏమి గ్రహించారు?
జవాబు:
రామలక్ష్మణులు లేని సమయంలో రావణుడు సన్యాసి వేషంలో సీతాదేవి సమీపానికి వచ్చాడు. నిజ స్వరూపాన్ని ప్రదర్శించాడు. లొంగిపొమ్మని బెదిరించాడు. కోపంతో రావణుడు సీతను తీసికొని రథంలో కూర్చుండబెట్టుకొని ఆకాశ మార్గంలో ప్రయాణిస్తున్నాడు.

అది గమనించిన జటాయువు రావణుని ఎదిరించాడు. వారిద్దరి మధ్య పోరాటం జరిగింది. చివరకు రావణుని చేతిలో మరణించాడు. మిత్రధర్మం కోసం అవసరమైతే ప్రాణాలను అర్పించడానికి సిద్ధపడాలని గ్రహించాను. ఆపదల్లో ఉన్న వారిని, ముఖ్యంగా స్త్రీలను తప్పక రక్షించాలని గ్రహించాను.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 3 అరణ్యకాండ

ప్రశ్న 7.
శ్రీరాముడిని భక్తితో సేవించి తరించిన శబరి వ్యక్తిత్వం నుండి మీరేమి గ్రహించారు?
జవాబు:
సీతను అన్వేషిస్తూ రామలక్ష్మణులు అరణ్యమార్గంలో ప్రయాణిస్తున్నారు. మార్గమధ్యలో శబరి ఆశ్రమానికి వచ్చారు. శబరి శ్రీరాముని రాకకై ఎదురుచూస్తున్నది. శ్రీరాముని దర్శనంతో ఆనందాన్ని పొందింది. ఫలాలతో శ్రీరాముడిని సేవించింది. పండ్లను పరిశుభ్రం చేసి అందించింది. అగ్నిలో తన శరీరాన్ని దహింపజేసుకొంది. ఊర్ధ్వ లోకాలకు వెళ్ళింది. శబరి వ్యక్తిత్వం వల్ల దైవాన్ని భక్తి, శ్రద్ధలతో సేవించాలని, ఇంటికి వచ్చిన వారిని అతిథి మర్యాదలతో సేవించాలని గ్రహించాను.

విషయాత్మక ప్రశ్నలు

ఈ క్రింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో సమాధానాలు రాయండి. .

ప్రశ్న 1.
‘క్రూరులైన దుష్టులతో పరిహాసం పనికిరాదు’ ఈ మాట ఎవరు ఎవరితో ఎప్పుడు అన్నారు?
జవాబు:
పంచవటిలో శూర్పణఖ విషయంలో శ్రీరాముడు లక్ష్మణునితో అన్నాడు. ఆమె రావణుడి చెల్లెలు. శ్రీరాముడి సౌందర్యానికి ముగ్ధురాలైంది. తనను చేపట్టమంది. తమకు అడ్డుగా ఉన్న సీతాలక్ష్మణులను చంపి తింటానన్నది. శ్రీరాముడు పరిహాసంగా లక్ష్మణుని వద్దకు వెళ్లమన్నాడు. లక్ష్మణుడు కూడా పరిహాసం చేశాడు. సీతపై దాడికి దిగింది.

అప్పుడు క్రూరులైన దుష్టులతో పరిహాసం పనికిరాదు. శూర్పణఖను విరూపిని చేయమని లక్ష్మణుని రాముడు ఆజ్ఞాపించాడు. లక్ష్మణుడు తన అన్న ఆజ్ఞను అమలుపరిచాడు.

ప్రశ్న 2.
మారీచుని పరిస్థితి ‘ముందు నుయ్యి, వెనుక గొయ్యి’గా ఎందుకు మారింది?
జవాబు:
సీతాపహరణం చేయాలనుకొన్నాడు రావణుడు. మారీచుని బంగారులేడిగా మారమన్నాడు. రామబాణం రుచి తెలిసిన మారీచుడు తిరస్కరించాడు. రావణుడు చంపుతానన్నాడు. బంగారులేడిగా మారితే రాముడు చంపుతాడు. మారకపోతే రావణుడు చంపుతాడు. అప్పుడు మారీచుని పరిస్థితి ‘ముందు నుయ్యి వెనుక గొయ్యి’గా మారింది. శ్రీరాముని చేతిలో మరణిస్తే జన్మ ధన్యమవుతుందని భావించి బంగారు లేడిగా మారడానికి అంగీకరించాడు. అతని కోరిక తీరింది.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 3 అరణ్యకాండ

ప్రశ్న 3.
‘ఉత్సాహమున్న వానికి అసాధ్యం లేదు’ అని ఎవరు ఎవరితో ఏ సందర్భంలో అన్నారు?
జవాబు:
సీతాదేవిని రావణాసురుడు ఎత్తుకెళ్లాడు. ఆమె జాడ తెలియక రామలక్ష్మణులు వెతుకుతున్నారు. వెతుకుతూ, వెతుకుతూ పంపా సరోవర ప్రాంతాన్ని చేరుకొన్నారు. ఆ ప్రాంతం చాలా అందంగా ఉంది. దానితో శ్రీరాముని బాధ పెరిగింది. అప్పుడు లక్ష్మణుడు అన్నగారి దైన్యాన్ని పోగొట్టడానికి పలికిన వాక్యమిది.

ప్రశ్న 4.
శూర్పణఖ ఎవరు? ఆమె అవమానం పొందడానికి కారణమేమిటో తెల్పండి.
జవాబు:
శూర్పణఖ ఒక రాక్షసి. ఈమె రావణునికి చెల్లెలు. శ్రీరాముని అందానికి మురిసిపోయి తనను పెళ్ళి చేసుకోమన్నది. అందుకు అడ్డంగా ఉన్న సీతను, లక్ష్మణుని చంపితింటానన్నది. రాముడు ఆమెను పరిహాసంగా లక్ష్మణుని వద్దకు పంపించాడు. లక్ష్మణుడు తాను అన్నగారి సేవకుణ్ణని, తనను పెళ్ళాడితే ఆమెకూడా తనతోబాటే అన్నకు దాస్యం చేయాల్సి వస్తుందని చెప్పి రాముణే పెళ్ళాడమని పంపాడు. సీత ఉండటం వల్లే రాముడు తనను నిరాకరించాడనుకొని సీతను చంపడానికి దాడి చేసింది. ప్రమాదాన్ని గుర్తించిన లక్ష్మణుడు అన్న ఆదేశంపై శూర్పణఖ ముక్కు, చెవులు కోసి ఆమెను విరూపిని చేశాడు. అలా తన రాక్షసత్వం వలన శూర్పణఖ రామలక్ష్మణులను కోరి అవమానం పొందింది.

వ్యాసరూప ప్రశ్నలు

ఈ క్రింది ప్రశ్నలకు 10 లేక 12 వాక్యాల్లో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
పంచవటిలో సీతారామలక్ష్మణుల జీవితం ఎలా సాగిందో వివరించండి.
జవాబు:
అగస్త్య మహర్షి మాటపై, సీతారామలక్ష్మణులు, పంచవటికి చేరారు. లక్ష్మణుడు పంచవటిలో పర్ణశాలను నిర్మించాడు. సీత రక్షణ బాధ్యతను రాముడు, జటాయువుకు అప్పగించాడు. పంచవటిలో వారి జీవితం సుఖంగా సాగుతోంది. రావణుని చెల్లెలు శూర్పణఖ అక్కడకు వచ్చి, రాముడిని తనను చేపట్టమంది. లక్ష్మణుడు అన్న ఆజ్ఞతో శూర్పణఖ ముక్కు చెవులు కోశాడు. శూర్పణఖ సోదరుడైన ఖరుడి వద్దకు వెళ్ళి చెప్పింది. ఖరుడు 14 వేల మంది రాక్షసులతో రాముడి చేతిలో యుద్ధంలో మరణించాడు.

అకంపనుడు అనే గూఢచారి ఖరుడి మరణవార్త రావణుడికి అందించి రాముని భార్య సీతను అపహరించమని రావణుడికి సలహా చెప్పాడు. శూర్పణఖ వెళ్ళి రావణుడిని రెచ్చగొట్టింది.

రావణుడు మారీచుడిని మాయలేడిగా సీతారాములు ఉన్న పర్ణశాల వద్దకు పంపాడు. సీత ఆ లేడిని తెచ్చి ఇమ్మని రాముడిని కోరింది. రాముడు వెళ్ళి మాయలేడిని చంపాడు. మాయలేడి ‘సీతా! లక్ష్మణా! అంటూ అరచి రాముడి చేతిలో మరణించింది.

రాముడు ఆపదలో ఉన్నాడని సీత లక్ష్మణుడిని రాముని వద్దకు పంపింది. అదే సమయంలో సన్యాసి వేషంలో రావణుడు పర్ణశాలలో ఒంటరిగా ఉన్న సీతను బలాత్కారంగా తన రథంలో కూర్చోబెట్టి తీసుకువెడుతున్నాడు. సీత, ‘రామా, రామా’ అని కేకలు వేసింది. జటాయువు రావణుడిని ఎదిరించి, అతడి చేతిలో దెబ్బతింది. రావణుడు సీతను తన లంకా నగరానికి తీసుకువెళ్ళాడు.

రామలక్ష్మణులు ఆశ్రమానికి తిరిగి వచ్చారు. సీత జాడ తెలియక వారు దుఃఖించారు.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 3 అరణ్యకాండ

ప్రశ్న 2.
మాయలేడి వలన సీతారాములకు కష్టాలు వచ్చాయని ఎలా చెప్పగలవు?
జవాబు:
రావణుడు పంచవటిలో ఉన్న సీతాదేవిని అపహరించాలనుకున్నాడు. రావణుడు మారీచుడిని బెదరించి, బంగారులేడి రూపంలో అతడిని రాముడి ఆశ్రమ ప్రాంతానికి పంపాడు. సీత ఆ జింకను చూసి ఇష్టపడింది. లక్ష్మణుడు అది మాయా మృగం అని చెప్పాడు. సీత ఆ లేడిని తెచ్చి ఇమ్మని పట్టుపట్టింది.

సీత ఇష్టాన్ని కాదనలేక, ఆ మాయలేడిని చంపి అయినా తేడానికి రాముడు వెళ్ళాడు. రాముడు ఎంత ప్రయత్నించినా లేడి అందకుండా పరుగుదీసింది. దానితో రాముడు లేడిపై బాణాన్ని వేశాడు. ఆ లేడి ‘సీతా! లక్షణా!’ అని అరుస్తూ చచ్చింది.

మాయలేడి కంఠ ధ్వని రాముడిది అని, సీత కంగారుపడి, రాముడికి సాయంగా లక్ష్మణుడిని పంపింది. లక్ష్మణుడు తప్పనిసరి పరిస్థితులలో సీతను విడిచి, రాముడి దగ్గరకు వెళ్ళాడు.

అదే అదనుగా రావణుడు సన్యాసి వేషంలో పర్ణశాలకు వచ్చి సీతను బలవంతంగా తీసుకుపోయాడు. కాబట్టి సీతారాముల కష్టానికి మాయలేడియే కారణం అని చెప్పగలము.

ప్రశ్న 3.
కబంధుడు అనే రాక్షసుడు శ్రీరామునకు ఉపకారం చేశాడని ఎలా చెప్పగలవు?
జవాబు:
కబంధుడు క్రౌంచారణ్యంలో ఉన్న ఒక రాక్షసుడు. ఇతడికి తల, మెడ లేవు. ఇతడి కడుపు భాగంలో ముఖం ఉండేది. రొమ్ము భాగంలో ఒకే కన్ను ఉండేది. ఇతనికి యోజనం పొడవు వ్యాపించిన చేతులు ఉండేవి. ఆ చేతులతో వాడు పక్షులను, మృగాలను పట్టి తినేవాడు.

కంబంధుడు రామలక్ష్మణులను తన చేతులతో పట్టుకొని తినబోయాడు. కబంధుడి చేతులకు చిక్కితే, ఎవరూ తప్పించుకోలేరు. కాని రామలక్ష్మణులు ఖడ్గాలతో కబంధుడి చేతులు నరికారు. అప్పుడు కబంధుడు తనకు శాపం వల్ల రాక్షసరూపం వచ్చిందనీ, తన శరీరాన్ని దహిస్తే తనకు దివ్యజ్ఞానం వస్తుందనీ రామలక్ష్మణులకు చెప్పాడు.

రామలక్ష్మణులు కబంధుడి శరీరాన్ని దహనం చేశారు….ఆ జ్వాలల నుండి కబంధుడు దివ్యదేహంతో వచ్చి, సీత దొరికే ఉపాయాన్ని రామలక్ష్మణులకు చెప్పాడు. సుగ్రీవుడితో స్నేహం చెయ్యమని వారికి చెప్పాడు. సుగ్రీవుని స్నేహంతో రాముడు సీతను తిరిగి తెచ్చుకున్నాడు. దీనినిబట్టి కబంధుడు రామలక్ష్మణులకు ఉపకారం చేశాడని చెప్పగలం.

ప్రశ్న 4.
సీతారాముల దండకారణ్యవాస వృత్తాంతాన్ని తెలపండి. (సీతారాములు పంచవటిని చేరిన వృత్తాంతం)
జవాబు:
సీతారామలక్ష్మణులు దండకారణ్యంలో ప్రవేశించారు. అక్కడ ఎన్నో మునుల ఆశ్రమాలు ఉన్నాయి. అక్కడ యజ్ఞయాగాలు జరుగుతున్నాయి. మునులు వీరికి స్వాగతం పలికారు.

వీరు దండకవనం మధ్యకు చేరారు. ‘విరాధుడు’ అనే రాక్షసుడు సీతారామలక్ష్మణులపై పడ్డాడు. రామలక్ష్మణులను తన భుజాలపై వేసుకొని వాడు తీసుకుపోతున్నాడు. సీత ఏడ్చింది. రామలక్ష్మణులు విరాధుని భుజాలు నరికివేశారు. విరాధుడు కుప్పకూలాడు. విరాధుణ్ణి గోతిలో పాతిపెడదామని వారు అనుకున్నారు. విరాధుడు తాను తుంబురుడిననీ, శాపంవల్ల రాక్షసుడుగా అయ్యానని చెప్పి, శరభంగమహర్షిని దర్శించమనీ, తనను గోతిలో పూడ్చమనీ రామలక్ష్మణులకు చెప్పాడు.

రామలక్ష్మణులు విరాధుణ్ణి పూడ్చి, శరభంగ మహర్షి ఆశ్రమానికి వెళ్ళారు. శరభంగ మహర్షి రామదర్శనం కోసం వేచి చూస్తున్నాడు. తన తపః ఫలాన్ని రాముడికి ధారపోశాడు. సుతీక్ష మహర్షిని దర్శించమని ఆయన చెప్పాడు.

సీతారామలక్ష్మణులు సుతీక్ష మహర్షిని దర్శించారు. ఆయన రామదర్శనం కోసం ఎదురు చూస్తున్నాడు. ఆ మహర్షి తన తపస్సును రామునికి ధారపోశాడు. ఈ విధంగా దండకారణ్యంలోని మునుల ఆశ్రమాలను దర్శిస్తూ, సీతారామలక్ష్మణులు పదిసంవత్సరాలు వనవాసం చేశారు. వారు తిరిగి సుతీక్ష.. మహర్షి ఆశ్రమానికి వెళ్ళారు. ఆయన అగస్త్యుని సోదరునీ, అగస్త్య మహర్షినీ దర్శనం చేసుకోమని రామలక్ష్మణులకు చెప్పాడు.

సీతారామలక్ష్మణులు అగస్త్య భ్రాత (సోదరుడు) ఆశ్రమాన్ని దర్శించారు. తరువాత అగస్త్యుని దర్శించారు. అగస్త్య మహర్షి శిష్యులతో రామునికి స్వాగతం పలికాడు. ఆయన రామునికి దివ్య ధనుస్సు, అక్షయ తూణీరాలు, ఖడ్గమును ఇచ్చాడు. రామునకు జయం కల్గుతుందని ఆశీర్వదించాడు.

రాముడు తాము నివసించడానికి తగిన ప్రదేశాన్ని సూచించమని అగస్త్యుణ్ణి కోరాడు. ఆ మహర్షి గోదావరీ తీరంలో ఉన్న ‘పంచవటి’ లో ఉండమని వారికి సూచించాడు. రామలక్ష్మణులకు మార్గమధ్యంలో ‘జటాయువు’ కనబడింది. దానికి సీత రక్షణ బాధ్యతను వారు అప్పగించారు. పంచవటిలో ఆశ్రమం నిర్మించుకొని వారు అక్కడ నివసించారు.

ప్రశ్న 5.
సీతాపహరణం గురించి రాయండి.
(లేదా)
రావణుడు మారీచుని సాయంతో సీతాదేవిని అపహరించిన వృత్తాంతాన్ని రాయండి.
జవాబు:
‘సీతారాములు పంచవటిలో సుఖంగా జీవిస్తున్నారు. రావణుని చెల్లెలు శూర్పణఖ అక్కడకు వచ్చి రాముడి అందానికి మోహపడి తన్ను భార్యగా స్వీకరించమని రాముణ్ణి కోరింది. లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు, చెవులు కోశాడు. శూర్పణఖ దండాకారణ్యంలో ఉన్న సోదరుడు ఖరుడికి ఆ విషయం చెప్పింది. ఖరుడు పంపిన యోధులనూ, ఖరదూషణులనూ మొత్తం 14 వేల మంది రాక్షసులను రాముడు గడియలో చంపాడు.

‘అకంపనుడు’ అనే గూఢచారి దండకలో రాక్షససంహారం జరిగిందని రావణునకు వార్త చేర్చాడు. రావణుడు రాముణ్ణి చంపుతానన్నాడు. రాముణ్ణి చంపడం దేవాసురులకు కూడా అసాధ్యం అని అకంపనుడు చెప్పాడు. సీతను అపహరించమని సూచించాడు. రావణుడు మారీచుని సాయం అడిగాడు. మారీచుడు రాముణ్ణి కవ్వించవద్దని రావణునికి సలహా చెప్పాడు. శూర్పణఖ, తన అన్న రావణుడికి, సీతను అపహరించమని చెప్పింది.

రావణుడు తిరిగి మారీచుడి దగ్గరకు వెళ్ళి, సీతాపహరణకు బంగారు లేడిగా మారి తనకు సాయం చెయ్యమని అడిగాడు. మారీచుడు హితం చెప్పినా, రావణుడు వినలేదు. తనకు సాయపడకపోతే మారీచుని చంపుతానన్నాడు రావణుడు.

దానితో మారీచుడు బంగారు లేడిగా మారి రాముని ఆశ్రమ ప్రాంతంలో తిరిగాడు. సీత బంగారు లేడిని చూసి ముచ్చటపడింది.

ఆ బంగారు లేడిని పట్టి తెమ్మని, సీత రాముని కోరింది. అది మాయలేడి అని లక్ష్మణుడు చెప్పాడు. రాముడు, సీత మాట కాదన లేక లక్ష్మణుణ్ణి సీతకు కాపలాగా ఉంచి, తాను లేడి కోసం వెళ్ళాడు. మాయలేడి రామునికి దొరకలేదు. రాముడు దానిపై బాణం వేశాడు. మాయలేడి చస్తూ “హా సీతా ! హా లక్ష్మణా !” అని అరిచింది.

ఆ ధ్వని విని సీత రాముడు ఆపదలో చిక్కుకున్నాడని లక్ష్మణుడిని రామునికి సాయంగా వెళ్ళమని చెప్పింది. లక్ష్మణుడు కాదంటే, అతణ్ణి సీత నిందించింది. లక్ష్మణుడు సీతను విడిచి వెళ్ళాడు. ఇదే అదనుగా రావణుడు సన్యాసి వేషంలో సీత ఉన్న ఆశ్రమానికి వచ్చి, తాను రావణుడిని అని చెప్పి సీతను బలవంతంగా తన లంకా నగరానికి తీసుకుపోయాడు.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 3 అరణ్యకాండ

ప్రశ్న 6.
రామలక్ష్మణులు సీతను అన్వేషిస్తూ పంపా సరస్సు తీరానికి చేరిన వృత్తాంతాన్ని రాయండి.
జవాబు:
మారీచుణ్ణి చంపి, శ్రీరాముడు వెనుకకు ఆశ్రమానికి బయలుదేరాడు. దారిలో లక్ష్మణుడు కనబడ్డాడు. సీతను ఒంటరిగా విడిచి వచ్చావేమిటని రాముడు అడిగాడు. లక్ష్మణుడు జరిగిన విషయం చెప్పాడు. రామలక్ష్మణులు ఆశ్రమానికి వెళ్ళి, సీతను వెదికారు. వనమంతా వెదికారు. సీత జాడ కనబడలేదు. సీత జాడ చెప్పమని రాముడు ప్రకృతిని ప్రార్థించాడు. శ్రీరాముడు సీతా వియోగాన్ని భరించలేక ఏడ్చాడు. లక్ష్మణుడు రాముడిని ఓదార్చాడు.

రామలక్ష్మణులకు రక్తంతో తడిసిన జటాయువు కనిపించాడు. అతడిని చూసి గద్ద రూపంలో ఉన్న రాక్షసుడనీ, అతడే సీతను తిని ఉంటాడని వారు భ్రాంతి పడ్డారు. జటాయువు జరిగినది చెప్పాడు. రావణుడు సీతను అపహరించాడనీ, రావణుడే తనను దెబ్బ తీశాడనీ, జటాయువు వారికి చెప్పాడు. జటాయువు మరణించాడు. రాముడు జటాయువుకు అంత్యక్రియలు చేశాడు.

రామలక్ష్మణులు “క్రౌంచారణ్యం” చేరుకున్నారు. అక్కడ వారికి ఒక రాక్షసుడు కనబడ్డాడు. వాడికి తల, మెడ లేదు. వాడి ముఖం వాడి కడుపులో ఉంది. రొమ్ముమీద ఒకే కన్ను ఉంది. వాడి చేతులు యోజనం పొడుగున్నాయి. ఆ చేతులతో వాడు పక్షులను, మృగాలను పట్టి తింటాడు. అతడి పేరు ‘కబంధుడు’.

‘కబంధుడు’ రామలక్ష్మణులను చేతులతో పట్టుకున్నాడు. వాడి చేతుల్లో చిక్కితే, ఎవడూ తప్పించుకోలేడు. వాడు రామలక్ష్మణుల్ని తినడానికి నోరు తెరచాడు. వారు కబంధుని భుజాలు నరికిపారవేశారు. కబంధుడు కుప్పకూలాడు. శాపం వల్ల తనకు వికృత రూపం వచ్చిందని కబంధుడు వారికి చెప్పాడు.

రామలక్ష్మణులు రావణుని గురించి కబంధుణ్ణి అడిగారు. కబంధుడు తన శరీరాన్ని దహిస్తే తనకు దివ్యజ్ఞానం వస్తుందనీ, అప్పుడు రావణుడి గురించి చెప్పగలననీ చెప్పాడు. రామలక్ష్మణులు కబంధుడి శరీరానికి అగ్ని సంస్కారం చేశారు. కబంధుడు దివ్యదేహంతో వచ్చి, సీతాదేవి దొరికే ఉపాయాన్ని వారికి చెప్పాడు. సుగ్రీవుడితో స్నేహం చేయమన్నాడు. కబంధుడు స్వర్గానికి వెళ్ళాడు.

రామలక్ష్మణులు శబరి ఆశ్రమానికి వెళ్ళారు. శబరి రాముడికి పండ్లు పెట్టింది. తరువాత శబరి తన శరీరాన్ని అగ్నికి ఆహుతి చేసి ఊర్థ్వలోకాలకు వెళ్ళింది. రామలక్ష్మణులు ఈ విధంగా పంపా సరస్సుకు చేరారు.