AP Board 9th Class Social Solutions Chapter 8 భారతదేశంలో సేవా కార్యకలాపాలు

SCERT AP 9th Class Social Studies Guide Pdf 8th Lesson భారతదేశంలో సేవా కార్యకలాపాలు Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Social Solutions 8th Lesson భారతదేశంలో సేవా కార్యకలాపాలు

9th Class Social Studies 8th Lesson భారతదేశంలో సేవా కార్యకలాపాలు Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
1. ‘సేవా కార్యకలాపాలు’ అంటే ఏమిటి? (AS1)
జవాబు:

  1. సేవా కార్యకలాపాలు వ్యవసాయ, పారిశ్రామిక కార్యకలాపాలకు అవసరమైనటువంటివి.
  2. సేవా కార్యకలాపాలు ఉత్పత్తి చేసే సేవలు వరి లేక వస్త్రం లాగా కంటికి కనిపించవు. అయినప్పటికి వీరు ఒక ప్రత్యేకమైన సేవలను తమ పనుల ద్వారా ప్రజలకు, వ్యాపారాలకు అందిస్తారు.
  3. ఇక్కడ సేవ అనేది చేసిన పని స్వభావాన్ని తెలుపుతుంది.
  4. సేవ అనేది వస్తువు యొక్క ఉత్పత్తికి భిన్నమైనది.
    ఉదా : ఆసుపత్రిలో వైద్యులు చేసేది సేవ
    కిరాణాషాపులో వ్యాపారి చేసేది సేవ
    సంస్థలో అకౌంటెంట్ చేసేది సేవ
    వ్యా న్ డ్రైవర్ చేసేది సేవ
    బ్యాంకులు, రవాణా రంగాలు చేసేవి సేవలు.

ప్రశ్న 2.
ఏవైనా ఐదు సేవా కార్యకలాపాలమ రాసి, అవి ఎందుకు వ్యవసాయ, పారిశ్రామిక కార్యకలాపాల కిందికి రావో కారణాలు తెలపండి. (AS1)
జవాబు:
ఐదు సేవా కార్యకలాపాలు
1. వైద్యం :
వైద్యులు ఆసుపత్రిలో రోగులను పరీక్షించి, మందులను సూచించి వారి ఆరోగ్య పరిస్థితులను సమీక్షిస్తారు.

2. వ్యాపారం :
వస్తువులను సూల్ సేల్ దుకాణాల నుండి కొనుగోలు చేసి వినియోగదారులకు విక్రయించడం.

3. అకౌంటెంట్ :
ఖాతాలను పరిశీలించడం, చెల్లింపులను రశీదులను సరిచూసుకుంటూ ఆ బిల్లులు, ఖాతాలకు అనుకూలంగా ఉన్నాయో లేదో సరిచూడటం. ప్రతి యొక్క వ్యాపార సంస్థకు ఖాతాలను రాయడం, నిర్వహించడం.

4. డ్రైవర్ :
ఆటోలలో, వ్యా న్లలో ప్రయాణికులను ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి చేరవేయడం. సరకులను కూడా ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి చేరవేయడం.

5. ప్రభుత్వ పరిపాలన :
గ్రామాలు, నగర పంచాయతీలు, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల ద్వారా అందించే ప్రజాసేవలన్నీ పరిపాలన వర్గానికి చెందుతాయి.
ఉదా : పోలీసులు, గ్రామ పరిపాలనాధికారులు మొదలయినవారు.

పైన పేర్కొన్న వారు అందిస్తున్న సేవలు రైతులు, వ్యవసాయ కూలీలు, పరిశ్రమలలో పనిచేసే వారి పనులకు భిన్నంగా ఉన్నాయని మనం గమనించవచ్చు.
6. వీరు ఉత్పత్తి చేసే సేవలు వరి లేక వస్త్రం లాగా కంటికి కనిపించవు.

7. అయినప్పటికి వీరు ఒక ప్రత్యేకమైన సేవలను తమ పనుల ద్వారా ప్రజలకు, వ్యాపారాలకు అందిస్తారు.

8. ఇక్కడ సేవ అనేది చేసిన పని స్వభావాన్ని తెలుపుతుంది.

9. సేవ అనేది వస్తువు యొక్క ఉత్పత్తికి భిన్నమైనది.

AP Board 9th Class Social Solutions Chapter 8 భారతదేశంలో సేవా కార్యకలాపాలు

ప్రశ్న 3.
దేశ సమగ్రాభివృద్ధికి సేవా కార్యకలాపాలు ఎలా తోడ్పడతాయి? (AS1)
జవాబు:

  1. సేవా కార్యకలాపాలనేవి వ్యవసాయం లేదా పరిశ్రమలలో తయారవుతున్నట్లు వస్తువును ఉత్పత్తి చేయవు.
  2. ఇవి వ్యవసాయానికి, పరిశ్రమలకు, ప్రజలకవసరమైన ఎన్నో సేవలను చేస్తూ ఒక ప్రత్యేకమైన రీతిలో సహాయం చలాయి.
  3. రవాణ సమాచార సాధనాలు, బ్యాంకులు మొదలైన రంగాలు అభివృద్ధి చెందడం వలన వ్యవసాయక ఉత్పత్తులకు, పారిశ్రామిక ఉత్పత్తులకు ఉపయోగించడం మాత్రమేకాక వస్తువుల సరఫరాకు తగిన ఆర్థిక వనరులు అందించుటకు తద్వారా వాటి అభివృద్ధికి కారకాలు అవుతాయి.
  4. ప్రజలు మెరుగైన ఆదాయాలు ఆర్జించినపుడు వారి వినియోగ వ్యయంలో కూడా మార్పులు వస్తాయి.
  5. వారు ఎక్కువగా సేవాసంబంధమైన కార్యకలాపాలైన విద్య, వినోదం, ఆహారం, పర్యాటకం పైన ఎక్కువ ఖర్చు చేయడానికి ఆసక్తి చూపుతారు. అభివృద్ధికి అది ఒక చిహ్నం.

ప్రశ్న 4.
వ్యవసాయ, పారిశ్రామిక కార్యకలాపాలు సేవలతో ఎలా ముడిపడి ఉన్నాయి? (AS1)
జవాబు:

  1. సేవలు అనేవి వ్యవసాయానికి, పరిశ్రమలకు, ప్రజలకు అనేకానేక అవసరాలకు ఒక ప్రత్యేకమైన రీతిలో సహాయపడతాయి.
  2. వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్ కు తరలించడంలో, వీటిని కొంతమంది వ్యక్తుల సమూహం కొని వినియోగదారులకు నేరుగా లేదా రైస్ మిల్లులు, నూనె మిల్లులు వంటి ఇతర ఉత్పత్తిదారులకు అమ్మడం జరుగుతుంది.
  3. ఇవి అన్నీ సేవాసంస్థలైన రవాణా, వాణిజ్య, కార్యకలాపాల ద్వారా జరుగుతాయి.
  4. పారిశ్రామిక కార్యకలాపాలకు పట్టణాలలో, నగరాలలోని సిమెంట్ వ్యాపారులకు రైల్వేల ద్వారా సిమెంట్ కర్మాగారాల నుండి సిమెంట్ సంచులు రవాణా కాకపోతే భవన నిర్మాణాలు ఎలా జరుగుతాయి?
  5. కావున వ్యవసాయక, పారిశ్రామిక కార్యకలాపాలన్నీ సేవలపైనే ఆధారపడి ఉన్నాయి.

ప్రశ్న 5.
సేవారంగం పెరుగుదల సుస్థిరమైనది మరియు అది భారతదేశాన్ని ఒక ధనిక దేశంగా చేస్తుంది. ఈ వ్యాఖ్యతో నీవు ఏకీభవిస్తావా? విశదీకరించండి. (AS2)
జవాబు:

  1. భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలలో అభివృద్ధికి ప్రోత్సాహమనేది ఎన్నో వ్యవస్థాపక సౌకర్యాలతో ముడిపడి ఉంటుంది.
  2. ఇది అవస్థాపన సౌకర్యాలు, ఇతర సేవల విస్తరణను కలిగి ఉంటుంది.
  3. రవాణా సమాచార సాధనాలు, బ్యాంకులు మొదలైన విలువైన సేవల తరహాలోనే సేవా కార్యకలాపాల విలువ కూడా – పెరగాలని ఆశించడం సహజం.
  4. భారతదేశంలో ఉద్యోగాలు చేసే వారిలో 1/4వ వంతు సేవాకార్యకలాపాలే కలిగి ఉన్నారు.
  5. సేవాకలాపాల ఉద్యోగాలు ప్రజల జీవన స్థాయిలో పురోభివృద్ధికి ఒక కారణం.
  6. ప్రజలు మెరుగైన ఆదాయాలు ఆర్జించినపుడు వారి వినియోగ వ్యయంలో కూడా మార్పులు వస్తాయి.
  7. వారు ఎక్కువగా సేవా సంబంధమైన కార్యకలాపాలైన విద్య, వినోదం, ఆహారం, పర్యాటకం పైన ఎక్కువ ఖర్చు చేయడానికి ఆసక్తి చూపుతారు.

అందువలన సేవారంగం సుస్థిర వృద్ధి భారతదేశాన్ని ఒక ధనిక దేశంగా చేస్తుందనడంలో ఏ మాత్రం సందేహం లేదు.

AP Board 9th Class Social Solutions Chapter 8 భారతదేశంలో సేవా కార్యకలాపాలు

ప్రశ్న 6.
సేవారంగం కార్యకలాపాలు ఎందుకు ప్రాముఖ్యత సంతరించుకుంటున్నాయి? (AS1)
జవాబు:
సేవారంగ కార్యకలాపాలు ప్రాముఖ్యత సంతరించుకోవడానికి ప్రధాన కారణాలు :

  1. మారుతున్న పరిస్థితులకనుగుణంగా సమాచార, సాంకేతిక విజ్ఞానంలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి.
  2. మానవ జీవితం యాంత్రికమైనది.
  3. రవాణా, కమ్యూనికేషన్ వ్యవస్థ పూర్తిగా మారిపోయింది.
  4. సుదూర ప్రాంతాలను అతి తక్కువ సమయంలో చేరడానికి గాను, ఇంటర్నెట్, గ్లోబల్ విలేజ్ వంటి వాటి ద్వారా మానవ సమాజం చేరువైనది.
  5. అధునాతన వైద్య సదుపాయాలు అందుబాటులోనికి వచ్చాయి.
  6. అనేక రకాలుగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నాయి.

ప్రశ్న 7.
వ్యవసాయం, పరిశ్రమలు లేకుండా సేవా కార్యకలాపాలను ఒక స్థాయిని దాటి విస్తరించలేం. వివరించండి. (AS1)
జవాబు:

  1. ఆర్థిక వ్యవస్థలో ప్రాథమిక రంగమైన వ్యవసాయ రంగం, ద్వితీయ రంగమైన పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందితే తృతీయ రంగం సత్వర, సుస్థిర ప్రగతిని సాధిస్తుంది.
  2. ఆర్థిక వ్యవస్థ అనే ఇరుసుకు రెండు చక్రాల వంటివి వ్యవసాయ, పారిశ్రామిక రంగాలు. వీటి వలన ఉత్పాదక సామర్థ్యం పెరుగుతుంది.
  3. ఉత్పాదక సామర్థ్యం. ఉన్న చోట సేవారంగం సుస్థిర ప్రగతి సాధిస్తుంది.
  4. ప్రజలు మెరుగైన ఆదాయాలు పొందాలంటే వ్యవసాయ, పారిశ్రామిక రంగాలు అభివృద్ధి చెందాలి. అప్పుడు వారి వినియోగ వ్యయంలో మార్పులు వచ్చి సేవాకార్యకలాపాలైన విద్య, వినోదం, ఆహారం, పర్యాటకం వంటి వాటిపై ” ఖర్చు చేయడానికి ఆసక్తి చూపుతారు.
  5. అందువల్ల వ్యవసాయ, పారిశ్రామిక రంగాలు అభివృద్ధి చెందడం వల్ల సేవాకార్యకలాపాలు ఒకస్థాయిని దాటి విస్తరించగలవు.

ప్రశ్న 8.
భారతదేశంలో చదువుకున్నవారి నిరుద్యోగితను సేవారంగం ఎలా తగ్గించగలదు? (AS1)
జవాబు:

  1. సాంకేతిక పరిజ్ఞానంలో నిరంతర మార్పు ,సేవారంగాన్ని ముందుకు నడిపిస్తుంది.
  2. వ్యాపార నిర్వహణలో పొరుగు సేవల ద్వారా కొత్త తరహా ఉద్యోగ అవకాశాలను నిరుద్యోగ యువతకు కల్పిస్తోంది.
  3. టెలికమ్యూనికేషన్ల అనుసంధానాన్ని ఉపయోగించుకొని ఉద్యోగులు తాము ఉన్న చోటునుండి ప్రపంచంలో ఎక్కడ ఉన్న వారికైనా తమ సేవలను అందిస్తున్నారు.
  4. ప్రధాన నగరాలలో స్థాపించబడిన ఎన్నో ఐ.టి. సంస్థలు అత్యంత నిపుణులైన ఇంజనీర్లకు ఉద్యోగాలు కల్పించి ప్రత్యేకమైన సాఫ్ట్ వేర్ సేవలను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సంస్థలకు అందిస్తున్నాయి. వారికి ఇతర దేశాల నుండి ప్రాజెక్టులు వస్తాయి.
  5. వినోద పరిశ్రమ, వార్తా ప్రసార సంస్థలు, కేబుల్ టెలివిజన్ ఛానల్ లో ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నాయి.
  6. పట్టణాలలో, నగరాలలో ఇంటర్ నేట్ కేఫీలు, పబ్లిక్ టెలిఫోన్ బూత్ లు సర్వసాధారణంగా కన్పిస్తాయి.
  7. సాధారణంగా వాణిజ్య ప్రకటనల రంగం కూడా కొత్త ఉద్యోగ అవకాశాలు తీసుకువచ్చింది.

ప్రశ్న 9.
మీ ప్రాంతం నుండి ఎవరైనా పనివారు వలస వెళ్లారా? వారు ఎందుకు వలస వెళ్లారో కారణాలు తెలుసుకోండి. (AS3)
జవాబు:

  1. మా ప్రాంతం నుండి వలస వెళ్ళినవారు ఉన్నారు.
  2. వారు వివిధ రకాల పనుల నిమిత్తం వివిధ ప్రాంతాలకు వలస వెళ్ళినారు.
  3. ఉన్నత చదువులు చదువుకుని ఉన్నత ఉద్యోగాల కోసం వివిధ ప్రాంతాలకు వలస వెళ్ళినారు.
  4. అలాగే పనిపాటలు చేసుకునే వివిధ రకాల పనులు కోసం వలస వెళ్ళినారు.
  5. కూలి పనులు చేసుకునేవారు మా ప్రాంతంలో పని ఉన్నప్పుడు ఉండి పని లేని సమయంలో వేరే ప్రాంతాలకు వలస వెళ్ళి పనులు పూర్తయిన తదుపరి ప్రాంతానికి వస్తారు.

ప్రశ్న 10.
ఈ పాఠంలోని 9వ పేరా చదవండి (సేవా కార్యకలాపాలనేవి వ్యవసాయం….) ఈ కింది ప్రశ్నకు సమాధానం వ్రాయండి. వ్యవసాయం, పరిశ్రమలకు అవసరమైన, సేవా కార్యకలాపాలు ఏమిటి?
జవాబు:

  1. రోడ్లు, రైలు, జల, వాయు మార్గాలు అనగా రవాణా సౌకర్యాలను ఏర్పాటు చేయాలి.
  2. వైద్య, విద్యా సంస్థలను ఏర్పాటు చేయడం
  3. గిడ్డంగి సౌకర్యాలను కల్పించడం.
  4. రుణ సదుపాయాలను కల్పించడం.
  5. వ్యాపార సౌకర్యాలను ఏర్పాటుచేయడం.

ప్రశ్న 11.
పేజీ నెం. 104లోని పటాన్ని పరిశీలించి భారతదేశ అవుట్ లైన్ పటంలో సాఫ్ట్ వేర్ టెక్నాలజీ పార్కులు గల నగరాలను గుర్తించండి.
జవాబు:
AP Board 9th Class Social Solutions Chapter 8 భారతదేశంలో సేవా కార్యకలాపాలు 2

9th Class Social Studies 8th Lesson భారతదేశంలో సేవా కార్యకలాపాలు InText Questions and Answers

9th Class Social Textbook Page No.97

ప్రశ్న 1.
ఈ కింద ఎనిమిది రకాల సేవా కార్యకలాపాలు ఇవ్వబడ్డాయి. కొన్ని వివరాలు నింపి మిగిలినవి వదిలేయబడ్డాయి. మీ ఉపాధ్యాయుడితో చర్చించి ఆ ఖాళీలను పూరించండి.
జవాబు:
1. విద్య : సంస్థలు :
పాఠశాలలు, కళాశాలలు, విశ్వ విద్యాలయాలు, సాంకేతిక విద్యాసంస్థలు ఈ కోవకు చెందుతాయి. ఈ సంస్థలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, పరిపాలన సిబ్బంది, వారి కార్యకలాపాలు సేవలను అందిస్తాయి.

2. ఆరోగ్య, వైద్య సేవలు :
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, జిల్లా జనరల్ ఆసుపత్రులు, వివిధ రకాలైన వైద్య కేంద్రాలు, వృద్ధాశ్రమాలు మొ||నవి.

3. వర్తకం :
మన చుట్టూ చూస్తున్న వివిధ రకాల టోకు (సూల్ సేల్) చిల్లర వ్యాపార కార్యకలాపాలు, జాతీయ, అంతర్జాతీయ వ్యాపారం మొదలైనవి.

4. ప్రభుత్వ పరిపాలన :
గ్రామీణ, నగర పంచాయితీలు, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల ద్వారా అందించే ప్రజాసేవలన్నీ ఈ . వర్గానికి చెందుతాయి. ఉదా: పోలీస్ స్టేషన్లో పనిచేసే వ్యక్తులు, వివిధ ప్రభుత్వ విభాగాలలో చేస్తున్న వ్యక్తులు అంటే గ్రామ పరిపాలనాధికారులు, రెవెన్యూ ఇన్ స్పెక్టర్, తహసీల్దార్లు అన్ని రకాల న్యాయస్థానాలలో పనిచేయువారు, . అసిస్టెంట్లు, క్లలు, అకౌంటెంట్లు, టైపిస్టులు, ఫ్యూన్లు, డ్రైవర్లు మొదలగువారు.

5. రక్షణ రంగం :
త్రివిధ దళాలకు చెందిన సైనిక,నావిక, వైమానిక దళాలలో పనిచేయు వ్యక్తులు, వారి కార్యకలాపాలు ఈ కోవకు చెందుతాయి. బిఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్ పోలీసుల సేవల వంటివి కూడా వస్తాయి.

6. విత్త కార్యకలాపాలు :
బ్యాంకులు, వివిధ పొదుపు పథకాలు, తపాలా తంతి – వ్యవస్థ, జీవిత బీమా సంస్థ మొ||నవి.

7. వ్యక్తిగత సేవలు :
ఇళ్లలో పనిచేయు పనివారు, బట్టలు ఉతుకువారు, శుభ్రపరిచేవారు, అద్దకం సేవలు, క్షురకులు, బ్యూటీపార్లర్ నడిపేవారు, టైలరింగ్ పనివారు, ఫోటో, వీడియో స్టూడియోలో పనిచేయువారు.

8. ఇతర రకాల కార్యకలాలు :
వినోదం, సమాచార సాంకేతిక పరిశ్రమలు – చిత్ర నిర్మాణం, టీవీ సీరియళ్లలో పని చేయువారు. వార్తాపత్రికలు, టివి ఛానళ్లలో, వాణిజ్య ప్రకటన సంస్థలు, మీడియాలో పనిచేసేవారి పనులు కూడా సేవలకు చెందుతాయి.

9th Class Social Textbook Page No.100

ప్రశ్న 2.
1991 నుండి 2010 వరకు కొన్ని ప్రధాన తరగతులలో వివిధ సేవా కార్యకలాపాలలో పనిచేసే వారి సంఖ్యను (లక్షలలో) ఈ కింది పట్టిక చూపుతుంది. ఈ పట్టికను జాగ్రత్తగా చదివి కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.AP Board 9th Class Social Solutions Chapter 8 భారతదేశంలో సేవా కార్యకలాపాలు 1
1) 2010 సంవత్సరంలో ఏ సేవా కార్యకలాపం అత్యధిక ఉద్యోగితను కల్పించింది?
జవాబు:
సామాజిక, సాంఘిక, వ్యక్తిగత సేవలు.

2) గత సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగాల సంఖ్య పెరిగిందా లేదా తగ్గిందా? ఈ కాలంలో ఏ రకమైన ఉద్యోగాలు ప్రభుత్వం కల్పించింది?
జవాబు:
గత సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగాల సంఖ్య తగ్గింది. విత్త, బీమా సంస్థలు, స్థిరాస్తి వ్యాపారం మొదలగునవి మాత్రం 11.9 నుంచి 14.1 కి పెరిగాయి.

3) ప్రైవేటు సేవాకార్యకలాపాల్లో ప్రజలు ఎటువంటి ఉద్యోగాలను పొందగలిగారు?
జవాబు:
ప్రైవేట్ ఉద్యోగాల సంఖ్య పెరిగింది.

టోకు వర్తకం, చిల్లర వర్తకం, రవాణా గిడ్డంగులు, సమాచార రంగం, విత్త, బీమా సంస్థలు, స్థిరాస్తి వ్యాపారం మొదలైన వాటిల్లోనూ,

సామాజిక, సాంఘిక, వ్యక్తిగత సేవలు వంటి అంశాలలో ఉద్యోగాలు పెరిగాయి.

4) ప్రభుత్వ, ప్రైవేట్ వ్యవస్థలో కల్పిస్తున్న ఉద్యోగాలకు మధ్య ఏమైనా వ్యత్యాసాలు ఉన్నాయా? చర్చించండి.
జవాబు:

  1. టోకు వర్తకం, చిల్లర వర్తకం వంటి అంశాలలో ‘ప్రైవేట్ ఉద్యోగాలు ఎక్కువగా ఉండగా
  2. రవాణా గిడ్డంగులు, సమాచార రంగం వంటి అంశాలలో ప్రభుత్వ ఉద్యోగాలు ఎక్కువగా ఉండి, ప్రైవేట్ ఉద్యోగాలు తక్కువగా ఉన్నాయి.
  3. విత్త, బీమా సంస్థలు, స్థిరాస్తి వ్యాపార రంగాలలో ఒకప్పుడు ప్రైవేట్ ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు కన్నా తక్కువగా ఉండగా ఈ మధ్య కాలంలో ప్రభుత్వ ఉద్యోగాల కన్నా ప్రైయివేట్ ఉద్యోగాల సంఖ్య పెరిగింది.
  4. సామాజిక, సాంఘిక, వ్యక్తిగత సేవల రంగాలలో ప్రైవేట్ ఉద్యోగాలకన్నా ప్రభుత్వ ఉద్యోగాలు ఎక్కువగా ఉన్నాయి.

9th Class Social Textbook Page No.101

ప్రశ్న 3.
చిల్లర వర్తకంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులపై మీ అభిప్రాయం ఏమిటి? ఈ సమస్యను చక్కదిద్దడానికి ప్రభుత్వం ఏమైనా చేయగలుగుతుందా?
జవాబు:

  1. మా అభిప్రాయం ఏమనగా వీటి వల్ల లాభాలు, నష్టాలు ఉన్నాయి.
  2. మొత్తం మీద చూస్తే నష్టాల కంటే లాభాలే ఎక్కువ అని అంటారు.
  3. అంతేకాక కాలక్రమంలో మొదట్లో నష్టపోయిన వాళ్లు కూడా లాభపడతారు.
  4. పెద్ద, మధ్యతరగతి రైతులు ప్రారంభంలో ఎక్కువ లాభపడతారని, చిన్న రైతులు లేదా భూమి లేని కూలీలు నష్టపోతారని పేర్కొంటారు.
  5. అయితే పెద్ద సూపర్ మార్కెట్ల కొనుగోళ్ల వల్ల వ్యవసాయ ఉత్పత్తులకు గిరాకీ పెరిగి తత్ఫలితంగా వ్యవసాయ ఉత్పత్తి పెరుగుతుంది.
  6. దీని వల్ల కూలీలకు గిరాకీ పెరిగి క్రమంగా వ్యవసాయ కూలీ రేట్లు పెరుగుతాయి.

ఈ సమస్యను చక్కదిద్దడానికి ప్రభుత్వం చేపట్టే అంశాలు :

  1. ఆధునిక నిల్వ సౌకర్యాలను ప్రభుత్వం కూడా ఏర్పాటు చేస్తుంది.
  2. మార్కెట్ కొద్ది చేతులలో కేంద్రీకృతం కాకుండా చూస్తుంది.
  3. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఎప్పటికప్పుడు తన పర్యవేక్షణలో పెడుతుంది.

9th Class Social Textbook Page No.102

ప్రశ్న 4.
భారతదేశంలో విదేశీ కంపెనీలు చిల్లర దుకాణాలను ఏర్పరచడంపై మీ అభిప్రాయం ఏమిటి?’ అవి భారతదేశంలో ఉపాధి కల్పనకు ఏ విధంగా దోహదం చేస్తాయి?
జవాబు:
భారతదేశంలో విదేశీ కంపెనీలు సరకులు అమ్మడానికి చిల్లర దుకాణాలను ప్రారంభించడం జరిగింది.

  1. కాలక్రమంలో ఈ విదేశీ పెట్టుబడి కంపెనీలు తమ అధికారాన్ని దుర్వినియోగం చేసి తక్కువ ధరలకు తమ సరకును అమ్మే విధంగా రైతులపై ఒత్తిడి తెస్తాయి.
  2. సరైన నిల్వ సౌకర్యాలు లేని కారణంగా వ్యవసాయ ఉత్పత్తులలో 20 – 40% వృథా అవుతున్నాయి.
  3. విదేశీ చిల్లర వ్యాపారస్తులు కూడా రైతులతో ఒప్పందం కుదుర్చుకొని వడ్డీ వ్యాపారస్తుల కంటే తక్కువ వడ్డీకి అప్పులు సమకూర్చవచ్చు.
  4. మెరుగైన నిల్వ సౌకర్యాల కారణంగా బహుళజాతి కంపెనీలు పెద్ద మొత్తంలో సరకు కొనుగోలు చేయడంతో రైతులకు వడ్డీ వ్యాపారస్తులతో పోలిస్తే ఇది ప్రయోజనకారిగా ఉంటుంది.
  5. వీటి వలన ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. ఎంతో మందికి ఉపాధి కల్పించడానికి అవకాశాన్ని ఏర్పరచుతాయి.

AP Board 9th Class Social Solutions Chapter 8 భారతదేశంలో సేవా కార్యకలాపాలు

ప్రశ్న 5.
మీ ప్రాంతంలోని కొంతమంది చిల్లర వ్యాపారస్తులతో మాట్లాడండి. విదేశీ చిల్లర దుకాణాలపై వాళ్ల అభిప్రాయాలు గురించి తరగతిలో చర్చించండి.
జవాబు:

  1. బహుళజాతి సంస్థలు ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేయడం వలన వారు తక్కువ రేటుకు అమ్మినప్పటికి వారికి నష్టాలు రావు.
  2. అందువల్ల చిన్న దుకాణదారులు అమ్మే రేట్లతో పోలిస్తే తక్కువ రేట్లకు అమ్ముతారు.
  3. దానితో వినియోగదారులు చిన్న దుకాణాదారుల వద్దకు వెళ్ళకుండా చిల్లర వర్తకంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల షాపులకు వెళ్తారు.
  4. దానితో చిల్లర దుకాణదారులు తమ షాపులను మూసివేయాల్సి వస్తుంది.
  5. వాటిపై ఆధారపడినవారు ఉపాధిని కోల్పోతారు.
  6. నిల్వ సౌకర్యాల్లో పెద్ద పెద్ద చిల్లర వ్యాపారస్తులు ఆశించినంతగా పెట్టుబడులు పెట్టలేదు.
  7. అందువల్ల సంప్రదాయ చిల్లర వర్తకులు ఉపాధి కోల్పోతారు. దీనివల్ల మార్కెట్ కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతమవుతుంది.

ప్రశ్న 6.
రెండు నిలువు వరుసలతో ఒక పట్టిక తయారు చేసి అందులో భారతదేశంలో విదేశీ కంపెనీల చిల్లర దుకాణాల వల్ల కలిగే లాభాలను, నష్టాలను పేర్కొనండి.
జవాబు:

లాభాలు నష్టాలు
1. పెద్ద సూపర్ మార్కెట్లలో కొనుగోళ్ళ వల్ల వ్యవసాయ ఉత్పత్తులకు గిరాకీ పెరిగి తత్ఫలితంగా వ్యవసాయ ఉత్పత్తి పెరుగుతుంది. దీనివల్ల కూలీలకు గిరాకీ పెరిగి క్రమంగా వ్యవసాయ కూలీ రేట్లు పెరుగుతాయి. 1. నిల్వ సౌకర్యాల్లో పెద్ద పెద్ద చిల్లర వ్యాపారస్తులు ఆశించినంతగా పెట్టుబడులు పెట్టలేదు. అందువల్ల సంప్రదాయ చిల్లర వర్తకులు ఉపాది కోల్పోతారు. దీనివల్ల మార్కెట్ కొద్ది మంది చేతుల్లో కేంద్రీకృతమవుతుంది.
2. విదేశీ చిల్లర వ్యాపారస్తులు కూడా రైతులతో ఒప్పందం కుదుర్చుకొని వడ్డీ వ్యాపారస్తులు కంటే తక్కువ వడ్డీకి అప్పులు సమకూర్చవచ్చు. 2. విదేశీ పెట్టుబడి కంపెనీలు తమ అధికారాన్ని దుర్వినియోగం చేసి తక్కువ ధరలకు తమ సరుకును అమ్మే విధంగా రైతులపై ఒత్తిడి తెస్తాయి.
3. మెరుగైన నిల్వ సౌకర్యం కారణంగా బహుళజాతి కంపెనీలు పెద్ద మొత్తంలో సరకు కొనుగోలు చేయడంతో రైతులకు వడ్డీ వ్యాపారస్తులతో పోలిస్తే ఇది ప్రయోజనకారిగా ఉంటుంది. 3. నిల్వ సౌకర్యాలపై పెట్టుబడులు పెట్టడం ద్వారా వృథా అయ్యే శాతాన్ని సూపర్ మార్కెట్లు తగ్గిస్తాయనడంలో వాస్తవం లేదు.

ప్రశ్న 7.
భారతదేశంలో మరిన్ని వైద్య విద్యాసంస్థలను నెలకొల్పాల్సిన అవసరం ఏమిటి?
జవాబు:

  1. భారతదేశం ఆరోగ్య రంగంలో 64 లక్షల వృత్తి సేవానిపుణుల కొరతను ఎదుర్కొంటున్నది.
  2. ఒక్క ఉత్తరప్రదేశ్ లోనే 10 లక్షల ఆరోగ్య సంబంధ వృత్తి సేవానిపుణుల కొరత ఉంది.
  3. 2011 లో భారతదేశంలో ప్రతి 10 వేల జనాభాకు ఆరుగురు డాక్టర్లు ఉన్నారు.
  4. అదే నర్సులు, మంత్రసానుల విషయానికొస్తే ప్రతి 10 వేలమందికి 13 మంది ఉన్నారు.
  5. డాక్టరు, జనాభా నిష్పత్తి భారతదేశంలో 0.5 : 1000 కాగా, థాయ్ లాండ్లో 0.3, శ్రీలంకలో 0.4, చైనాలో 1.6, ఇంగ్లాండ్లో 5.4, అమెరికాలో 5.5 గా ఉంది.
  6. దంత సంబంధిత సాంకేతిక విజ్ఞానంలో 20 లక్షల మంది నిపుణుల కొరత ఉంది.
  7. పునరావాస వృత్తి సంబంధిత వృత్తినిపుణులలో 18 లక్షల మంది కొరత ఉంది.
  8. ఆపరేషన్లో మత్తుమందుకు సంబంధించిన నిపుణులు 9 లక్షలమంది కొరత ఉంది.
  9. వివిధ ఆరోగ్య కార్యకర్తలు సంబంధించిన నిపుణులు 9 లక్షలమంది కొరత ఉంది.
  10. వైద్య పరీక్షల సాంకేతిక నిపుణులు 2.4 లక్షల మంది కొరత ఉంది.
  11. ఆపరేషన్ సంబంధిత ఆరోగ్య నిపుణులు – 2 లక్షల మంది కొరత ఉంది.
  12. కంటికి సంబంధించిన కార్యకర్తలు 1.3 లక్షల మంది కొరత ఉంది.

వృత్తి, విద్యా కళాశాలలు, పాఠశాలల కేటాయింపుల్లో అసమానతల వల్ల అన్ని ప్రాంతాలలో సమానంగా లేరు.

అందువల్ల వైద్య, విద్యా సంస్థలను నెలకొల్పవలసిన అవసరం ఎంతైనా ఉంది.

AP Board 9th Class Social Solutions Chapter 8 భారతదేశంలో సేవా కార్యకలాపాలు

ప్రశ్న 8.
కొత్త వైద్య విద్యా సంస్థలను ప్రభుత్వ రంగంలో నెలకొల్పవచ్చా లేక ప్రైవేట్ రంగంలోనా? ఎందుకు?
జవాబు:
ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలోను స్థాపించవచ్చు.

ఎందుకనగా :

  1. ప్రభుత్వరంగంలో స్థాపించడం వలన పేద, మధ్యతరగతికి చెందిన ప్రతిభగల విద్యార్థినీ విద్యార్థులకు వైద్య విద్య అందుబాటులోకి వస్తుంది.
  2. ప్రైవేట్ రంగంలో స్థాపించినప్పటికి కొన్ని సీట్లను ప్రతిభగల పేద విద్యార్థులకు కేటాయించడం వల్ల వారికి న్యాయం చేకూరుతుంది.
  3. ప్రభుత్వం పైన నిర్వహణ ఖర్చు ఉండదు. ఆర్థిక భారమూ పడదు.

ప్రాజెక్టు

ప్రశ్న 1.
ఎవరైనా ఏడుగురు వ్యక్తులను కలసి వారి ఏ రంగంలో పనిచేస్తున్నారో తెలుసుకోండి. వారి పని గురించి సంక్షిప్తంగా వ్రాయండి. లేదా పోస్టరు తయారుచేయండి. వారి నివాస ప్రాంతానికి వారి పనికి మధ్య ఎలాంటి సంబంధాన్ని చూసారు.
జవాబు:

వ్యక్తి పేరు చేసే పని యొక్క స్వభావం వ్యవసాయం/పరిశ్రమ/సేవలు
1. రామారావు ప్రభుత్వ డాక్టరు సేవలు
2. కార్తికేయ ప్రభుత్వ సీనియర్ అసిస్టెంట్ సేవలు
3. వేణుగోపాలరావు ప్రైవేటు డాక్టర్ సేవలు
4. ముకుందరావు ప్రైవేటు డాక్టర్ సేవలు
5. మీరాబాయి ప్రభుత్వ సీనియర్ నర్సు సేవలు
6. పాపారావు రైతు వ్యవసాయం
7. బుచ్చమ్మ కార్మికురాలు పరిశ్రమ

వైద్య నిపుణుల కొరత గురించి ప్రభుత్వ ప్రయివేటు వైద్యశాలలయందు పైన పేర్కొన్న వ్యక్తులతో మాట్లాడగా వారు క్రింది విషయాలను వెల్లడి చేశారు.
అవి :

  1. మన దేశంలో, మన రాష్ట్రంలో, మన ప్రాంతంలో వైద్య నిపుణుల కొరత ఎంతైనా ఉంది.
  2. అనేక గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలకు ఇంకా డాక్టర్ అందుబాటులో లేడంటే ఆశ్చర్యపడవలసిన పనిలేదు.

AP Board 9th Class Social Solutions Chapter 7 భారతదేశంలో పరిశ్రమలు

SCERT AP 9th Class Social Studies Guide Pdf 7th Lesson భారతదేశంలో పరిశ్రమలు Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Social Solutions 7th Lesson భారతదేశంలో పరిశ్రమలు

9th Class Social Studies 7th Lesson భారతదేశంలో పరిశ్రమలు Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
మౌలిక సరుకుల పరిశ్రమలను నెలకొల్పటానికి ప్రభుత్వం ఎందుకు బాధ్యత తీసుకుంది? (AS1)
జవాబు:
మౌలిక సరుకుల పరిశ్రమలను నెలకొల్పటానికి ప్రభుత్వం బాధ్యత తీసుకొనటానికి గల కారణం :

  1. దేశం పారిశ్రామికీకరణ చెందాలంటే, వివిధ రకాల కర్మాగారాలు పెద్ద సంఖ్యలో అభివృద్ధి చెందాలంటే యంత్రాలు, విద్యుత్, ఖనిజాలు, ముడిలోహాలు రవాణా సౌకర్యాలు వంటి కొన్ని మౌలిక సౌకర్యాలు అవసరం.
  2. ఈ అవసరమైన సరుకులను – యంత్రాలు, విద్యుత్, ఖనిజాలు, ముడిలోహాలు రవాణా సౌకర్యాలను తయారు చేసే పరిశ్రమలను మౌలిక పరిశ్రమలంటారు.
  3. అనేక కర్మాగారాలకు అవసరమయ్యే మౌలిక సరుకులను ఈ మౌలిక పరిశ్రమలు అందిస్తాయి కాబట్టి ప్రభుత్వం ఈ పరిశ్రమలను స్థాపించటానికి బాధ్యత తీసుకుంది.

ప్రశ్న 2.
కొన్ని ప్రత్యేక ప్రాంతాలలోనే పరిశ్రమలు ఎందుకు నెలకొల్పబడ్డాయి? (AS1)
జవాబు:
కొన్ని ప్రత్యేక ప్రాంతాలలో పరిశ్రమలు నెలకొల్పబడడానికి కారణాలు :

  1. ముడి సరుకుల లభ్యత
  2. కూలీల అందుబాటు
  3. పెట్టుబడి
  4. విద్యుత్
  5. మార్కెట్ వంటి అంశాలను పరిగణనలోనికి తీసుకుని పరిశ్రమలను స్థాపించుతారు.
  6. అందువల్లనే పరిశ్రమలు అన్ని అంశాలు అనువుగా అందుబాటులో ఉండే ప్రదేశాల్లో లేదా తక్కువ ఖర్చుతో సమకూర్చుకోగల ప్రదేశాల్లో నెలకొల్పుతారు.

AP Board 9th Class Social Solutions Chapter 7 భారతదేశంలో పరిశ్రమలు

ప్రశ్న 3.
మౌలిక సరుకుల పరిశ్రమలు ఏవి? వినియోగ వస్తువుల పరిశ్రమలకూ వీటికీ తేడా ఏమిటి? (AS1)
జవాబు:
యంత్రాలు, విద్యుత్, ఖనిజాలు, ముడిలోహాలు, రవాణా సౌకర్యాలను తయారు చేసే పరిశ్రమలను మౌలిక పరిశ్రమలు ప్రజలు ఉపయోగించే వస్తువులను తయారు చేసే పరిశ్రమలను వినియోగ వస్తువుల పరిశ్రమలంటారు.

మౌలిక సరుకుల పరిశ్రమలు వినియోగ వస్తువుల పరిశ్రమలు
1. వీటిని ప్రజలు ప్రత్యక్షంగా వినియోగించుకోలేరు. 1. వీటిని ప్రజలు ప్రత్యక్షంగా వినియోగించుకోగలరు.
2. వీటిని ఉపయోగించి వినియోగ వస్తువులను ఉత్పత్తి చేయవచ్చును. 2. వీటిని ప్రజలు తమ అవసరాల కొరకు ఉపయోగించుకొంటారు.

ప్రశ్న 4.
ఖనిజ వనరులు ఉన్న పట్టణాలు / ప్రాంతాల పేర్లు విద్యార్థులచే గుర్తింపజేసి, అక్కడ ఎలాంటి పరిశ్రమలు స్థాపించవచ్చో వాళ్లని రాయమనండి. (AS1)
AP Board 9th Class Social Solutions Chapter 7 భారతదేశంలో పరిశ్రమలు 1
జవాబు:

ప్రశ్న 5.
అంతకుముందు ప్రభుత్వ రంగానికే పరిమితమైన అనేక పరిశ్రమలలోకి 1990లలో ప్రైవేటు సంస్థలను ప్రభుత్వం ఎందుకు అనుమతించింది? (AS4)
జవాబు:

  1. కర్మాగారాలలో తయారైన వినియోగ వస్తువులు దేశంలోకి దిగుమతి చేసుకునేలా ప్రభుత్వం చట్టాలను సడలించింది.
  2. భారతదేశంలో పారిశ్రామిక కార్యకలాపాలను ప్రత్యేకించి కొత్త వాణిజ్యవేత్తలను ప్రోత్సహించటానికి ప్రభుత్వ నియమాలను సరళీకృతం చేశారు.
  3. ప్రభుత్వ ఆధీనంలోని పరిశ్రమల సామర్థ్యాన్ని పెంచటానికి వాటిలో కొన్నింటిని అమ్మేశారు.
  4. ఈ పరిశ్రమల నిర్వహణకు ప్రభుత్వం కేటాయించే నిధులను కూడా తగ్గించేశారు.
  5. ప్రభుత్వ జోక్యం లేకుండా స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోటానికి ఈ కంపెనీలను అనుమతించసాగారు.
  6. కొత్త సాంకేతిక విజ్ఞానం దేశంలోకి వచ్చేలా, ఉత్పత్తి చేసిన సరుకులను విదేశాలకు ఎగుమతి చేసేలా ప్రోత్సహించడానికి విదేశీ, ప్రైవేటు, ప్రభుత్వ కంపెనీలను భారతదేశంలో పరిశ్రమలు స్థాపించటానికి ప్రోత్సహించసాగారు.

ప్రశ్న 6.
పారిశ్రామిక అభివృద్ధి వల్ల ఉపాధి కల్పన ఎలా ప్రభావితమైనది? (AS1)
జవాబు:

  1. పారిశ్రామిక సంస్థల సంఖ్య పెరిగింది. కానీ ఉపాధి ఆశించినంతగా పెరగలేదు. ఎక్కువగా చిన్న చిన్న ఉద్యోగాలే కల్పించబడ్డాయి.
  2. ప్రస్తుతం భారతదేశంలో సంఘటిత రంగంగా వ్యవహరించే రెండు లక్షల పెద్ద కర్మాగారాలున్నాయి.
  3. అసంఘటిత రంగంగా పేర్కొనే 3 కోట్ల చిన్న పారిశ్రామిక కేంద్రాలున్నాయి.
  4. ఇవన్నీ కలిపి దేశంలోని 46 కోట్ల కార్మికవర్గంలో అయిదింట ఒక వంతుకు ఉపాధి కల్పిస్తున్నాయి.
  5. కర్మాగారాలలో ఉపాధి పొందే కార్మికుల శాతాన్ని ఆ దేశ ఆర్థికాభివృద్ధికి ముఖ్యమైన సూచికగా పరిగణిస్తారు.
  6. కార్మికులకు మెరుగైన జీతాలు, మెరుగైనని సురక్షిత పని పరిస్థితులు, ఆరోగ్య వైద్య సదుపాయాలను పరిశ్రమల యాజమాన్యాలు కల్పించేలా భారతదేశంలో అనేక చట్టాలను చేశారు.
  7. అనేక కొత్త పరిశ్రమలు ఏర్పడతాయని, కాలక్రమంలో కార్మికులలో అధిక శాతం సంపాదన పెరుగుతుందని ఆశించారు.
  8. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఆరు దశాబ్దాలు గడిచినప్పటికి పరిశ్రమలలో ఉపాధి శాతం ఆశించినంతగా పెరగలేదు.
  9. అంతేగాకుండా కార్మికులలో చాలామంది చిన్న పారిశ్రామిక కేంద్రాలలో ఉపాధి పొందుతున్నారు.

AP Board 9th Class Social Solutions Chapter 7 భారతదేశంలో పరిశ్రమలు

ప్రశ్న 7.
పారిశ్రామిక అభివృద్ధి వల్ల ప్రభుత్వ ఆదాయం ఎలా ప్రభావితమైనది? (AS1)
జవాబు:
పారిశ్రామిక అభివృద్ధి వల్ల ప్రభుత్వ ఆదాయం ప్రభావితమైన విధానం :

  1. ప్రభుత్వ పారిశ్రామిక రంగాల విషయంలో పరిశ్రమల నిర్వహణకు ప్రతి సంవత్సరం కొన్ని నిధులు కేటాయించేవారు.
  2. కాలక్రమంలో ఇవి స్వతంత్రమైనా, ప్రభుత్వానికి ఆదాయం సమకూరుస్తాయని భావించేవారు.
  3. అనేక ప్రభుత్వ రంగ కర్మాగారాలలో పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఉండేది. వీటికి ప్రభుత్వం సహాయం నిరంతరం అవసరం అవుతూ ఉండేది.
  4. వీటి నిర్వహణలో ప్రభుత్వ జోక్యం కొనసాగుతూ ఉండేది. ఆశించిన దానికంటే వాటి పని చాలా నిరాశాజనకంగా ఉండేది.
  5. అందువల్ల అలాంటి వాటిని ప్రైవేటు పరం చేసి నూతన పారిశ్రామిక విధానం ప్రకారం అత్యుత్తమ లాభాలు పొందుతున్న సంస్థలను మాత్రమే దాని నియంత్రణలో ఉంచింది.

ప్రశ్న 8.
“పరిశ్రమల వల్ల పర్యావరణ సమస్యలు పెరుగుతాయి” చర్చించండి. (AS4)
జవాబు:

  1. పరిశ్రమల ఉత్పత్తి ప్రక్రియలో విద్యుత్, వివిధ రసాయనికాలు అవసరం అవుతాయి.
  2. ఉత్పత్తి క్రమంలో ఈ పరిశ్రమలు అనేక వ్యర్థాలను విడుదల చేస్తాయి.
  3. పారిశ్రామిక ప్రాంతాలలో ఇవి కాలుష్యానికి దారితీస్తున్నాయి.

ప్రశ్న 9.
పర్యావరణ కాలుష్యాన్ని నివారించేందుకు కొన్ని నినాదాలు రాయండి. (AS6)
(లేదా)
“పర్యావరణ కాలుష్య నివారణకై” ఏవైనా రెండు నినాదాలు రాయండి.
జవాబు:

  1. వృక్షో రక్షతి రక్షితః
  2. పర్యావరణ పరిరక్షణ – మనందరి బాధ్యత.
  3. మనిషికి ఆయువు పెరగాలి – అందుకే చెట్లను పెంచాలి.
  4. కాలుష్యాన్ని నివారించండి – పర్యావరణాన్ని కాపాడండి.
  5. సహజ ఎరువులను వాడండి – పుడమితల్లిని కాపాడండి.
  6. ప్రకృతి రక్షణే జీవాధారం – చెట్లే ప్రగతికి ప్రాణాధారం.
  7. హద్దులు లేని అనుబంధానికి అమ్మే ఒక అందం
    అంతులేని ఆనందానికి ప్రకృతితోనే బంధం.
  8. పరిసరమే మన చుట్టూ ఉండే చక్కని నేస్తం
    పర్యావరణం కాపాడటమే మన అందరి కర్తవ్యం.
  9. చెట్లు లేనిది బ్రతుకే లేదు
    మానవ జాతికి మెతుకే లేదు.
  10. గాలీ, నేలా, నీరు, నింగి జీవుల మనుగడకి ఆధారం.
    అడవులు నరికి పెంచే కాలుష్యం, ప్లాస్టిక్ వ్యర్థాలే మానవునికి దుఃఖకారణం.

AP Board 9th Class Social Solutions Chapter 7 భారతదేశంలో పరిశ్రమలు

ప్రశ్న 10.
పేజీ నెం. 83లోని రెండవ పేరాను (రేడియోసెట్ల నుంచి ……….. కీలకమవుతుంది) చదివి వ్యాఖ్యానించండి. (AS2)
జవాబు:
సమాచార సాంకేతిక విజ్ఞానం, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ భారతదేశాన్ని ఆసియా. ఖండంలో ప్రధమురాలిగా నిలబెట్టాయి. భారతదేశానికి ఎలక్ట్రానిక్స్ రాజధానిగా బెంగళూర్ ఎదిగింది. ముంబయి, ఢిల్లీ, హైదరాబాద్, పుణె, చెన్నై, కోల్ కత, లక్నో, కోయంబత్తూరు వంటి నగరాలు సమాచార విప్లవంలో దూసుకుపోతున్నాయి.

రేడియో సెట్ల నుండి టెలివిజన్ వరకు, టెలిఫోన్లు, చరవాణీలు, పేజర్లు, కంప్యూటర్లతో దేశం దూసుకుపోతోంది. ఈ ‘ రంగంలో 10 లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. ఈ రంగంలో 30% వరకు మహిళలు తమ నైపుణ్యాలను ప్రదర్శిస్తున్నారు. హార్డ్ వేర్, సాఫ్ట్ వేర్ రంగాలలో ప్రగతి కొనసాగి, విదేశీ మారక ద్రవ్యాన్ని సైతం ఈ రంగం ఆర్జిస్తుంది.

ప్రశ్న 11.
పేజీ నెం. 95లోని పటాన్ని పరిశీలించి, భారతదేశ అవుట్ లైన్ పటంలో మన దేశంలోని ఇనుము – ఉక్కు కర్మాగారాలను గుర్తించండి. (AS5)
జవాబు:
AP Board 9th Class Social Solutions Chapter 7 భారతదేశంలో పరిశ్రమలు 2

9th Class Social Studies 7th Lesson భారతదేశంలో పరిశ్రమలు InText Questions and Answers

9th Class Social Textbook Page No.76

ప్రశ్న 1.
ఇతర కర్మాగారాలు ముడి సరుకులుగా ఉపయోగించుకొనే వస్తువులను తయారు చేసే కర్మాగారాల జాబితా రాయండి.
జవాబు:
యంత్రాల పరిశ్రమ, విద్యుత్ పరిశ్రమ, ఖనిజాల పరిశ్రమ, ముడి లోహాలను శుద్ధి చేసే పరిశ్రమ రవాణా సౌకర్యాలను తయారు చేసే పరిశ్రమలు.

ప్రశ్న 2.
ఇతర కర్మాగారాల కోసం ఉత్పత్తి చేసే అనేక వస్తువులకు ఇనుము మౌలిక అవసరం. మీ చుట్టు పక్కల కనిపించే ఉదాహరణలతో దీనిని వివరించండి.
జవాబు:
ఇనుము మౌలిక అవసరం.
ఉదా : నేలను త్రవ్వే పలుగు, పార, కోయడానికి ఉపయోగించే కత్తులు, కొడవళ్లు, చాకులు బరిసెలు. ఇంటి నిర్మాణానికి ఉపయోగించే ” ఇనుపచువ్వలు.

వస్తువులను తయారు చేయడానికి ఉపయోగించే మేకులు, వివిధ రకాలైన ఫ్రేములు మొ||నవి.

AP Board 9th Class Social Solutions Chapter 7 భారతదేశంలో పరిశ్రమలు

ప్రశ్న 3.
కర్మాగారాలలో ఉపయోగించే యంత్రాలను మీరు చూశారా? వివిధ రకాల యంత్రాల చిత్రాలను సేకరించండి.
జవాబు:
కర్మాగారాలలో ఉపయోగించే యంత్రాలను మేము చూశాము. అవి :
బియ్యం మిల్లు, పత్తి మిల్లు, కారం పట్టేవి, పిండి పట్టేవి, నీరు లాగేవి మొ||నవి.

ప్రశ్న 4.
అనేక వస్తువుల ఉత్పత్తిలో పెట్రోలియం మౌలిక అవసరం ఎలా అవుతుందో తెలియజేసే చార్టుని తయారు చేయండి.
జవాబు:
AP Board 9th Class Social Solutions Chapter 7 భారతదేశంలో పరిశ్రమలు 3

ప్రశ్న 5.
‘మౌలిక’ అనే పదం అంటే ఏమిటో చర్చించండి. పరిశ్రమలకు మౌలిక అవసరాలు ఏమిటి?
జవాబు:
మౌలిక అంటే ముఖ్యమైనవి, ప్రధానమైనవి, ప్రాథమికమైనవి అనే అర్థాలు వస్తాయి. పరిశ్రమకు మౌలిక అవసరాలు ఏమిటనగా యంత్రాలు, విద్యుత్, ఖనిజాలు, ముడిలోహాలు, రవాణా సౌకర్యాలు వంటివి. ”

ప్రశ్న 6.
స్వాతంత్ర్య కాలంలో పారిశ్రామికీకరణ ద్వారా మనం ఏ లక్ష్యాలను సాధించాలని కోరుకున్నాం?
జవాబు:
స్వాతంత్ర్యకాలంలో పారిశ్రామికీకరణ ద్వారా మనం సాధించాలని అనుకున్న లక్ష్యాలు :

  1. పారిశ్రామిక కార్యకలాపాలు మొదలైతే పట్టణీకరణ మొదలవుతుంది.
  2. పట్టణాలలో మాత్రమే పట్టణ సమీప ప్రాంతాలలో పరిశ్రమలను స్థాపించి వాటిని అభివృద్ధి చేయడం.
  3. పారిశ్రామికీకరణ, పట్టణీకరణ జంటగా పురోగమిస్తాయి.
  4. పట్టణాలు సరుకులకు మార్కెట్ గా ఉండటమేగాక బ్యాంకింగ్, బీమా, రవాణా కార్మికులు, సలహాదారుల, ఆర్థిక సలహాలు వంటి సేవలను కూడా అందిస్తాయి.
  5. అందువల్ల గ్రామీణ ప్రాంతాలలో కూడా చిన్న తరహా పరిశ్రమలను ప్రోత్సహించి పారిశ్రామిక వాతావరణాన్ని కల్పించాలి.
  6. భారతదేశ జనాభా ప్రధానంగా గ్రామీణ జనాభా కావడం వలన గ్రామాలలో పరిశ్రమలను స్థాపించవలసిన అవసరం ఉన్నదని భావించడం.

9th Class Social Textbook Page No.77

ప్రశ్న 7.
టీ పొడి, టూత్ పేస్టు కవర్లు (Wrappers) సేకరించండి. వాటిమీద ఉన్న విషయాన్ని చదివి కింది ప్రశ్నలకు సమాధానాలివ్వండి.
………………. ని వ్యవసాయ ఆధారిత పరిశ్రమ ఉత్పత్తిగా పేర్కొనవచ్చు.
………………. ని ఖనిజ ఆధారిత పరిశ్రమ ఉత్పత్తిగా పేర్కొనవచ్చు.
జవాబు:
టీ పొడి, టూత్ పేస్ట్.

ప్రశ్న 8.
టూత్ పేస్ట్ కు ముడిసరుకులైన …………………….., ………………… లను మరో పరిశ్రమలో ఉత్పత్తి చేస్తారు. దానిని మౌలిక లేదా కీలక పరిశ్రమ అంటారు. ఇందుకు భిన్నంగా టూత్ పేస్ట్ వినియోగదారీ సరుకు కావడం వల్ల ఈ పరిశ్రమ వినియోగదారీ వస్తు పరిశ్రమ అంటారు.
జవాబు:
అల్యూమినియం ట్యూబు, కాల్షియం.

ప్రశ్న 9.
పరిశ్రమల యాజమానులు వ్యక్తులు కావచ్చు, వ్యక్తుల బృందం కావచ్చు. ఉదా : టీ ప్యాకెట్ల తయారీ యజమానులు …………….. కాగా టూత్ పేస్టు …………… ఇలాంటి పరిశ్రమను ప్రైవేటు రంగ పరిశ్రమ అంటారు. యాజమాన్యం ప్రభుత్వానికి చెందినట్లయితే దానిని, ప్రభుత్వరంగ పరిశ్రమ అంటారు. అలాంటి ప్రభుత్వ రంగ పరిశ్రమలకు రెండు ఉదాహరణలు …………..
జవాబు:
ప్రయివేటు వ్యక్తులు, పేస్ట్ తయారీ ;

  1. భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్
  2. భారత్ హెవీ ప్లేట్స్ అండ్ వెసల్స్ లిమిటెడ్.

AP Board 9th Class Social Solutions Chapter 7 భారతదేశంలో పరిశ్రమలు

ప్రశ్న 10.
పెద్ద సంఖ్యలో వ్యక్తులు కొన్ని పరిశ్రమలను పాలు, చెరకు, కొబ్బరి పీచు మొదలైన ముడి సరుకులను, వనరులను సమీకరించుకొని నిర్వహిస్తారు. ఇటువంటి పరిశ్రమలను ………… అంటారు.
జవాబు:
సహకార పరిశ్రమలు

9th Class Social Textbook Page No.78

ప్రశ్న 11.
నూలు వడకటం, ఖద్దరు నేయటానికి మహాత్మాగాంధీ ఎందుకు ప్రాధాన్యత నిచ్చారు?
జవాబు:
నూలు వడకటం, ఖద్దరు నేయటానికి మహాత్మాగాంధీ ప్రాధాన్యత ఇవ్వటానికి కారణం :

  1. మన దేశంలో ప్రాచీనమైన, అతి పెద్ద పరిశ్రమ నూలు వస్త్ర పరిశ్రమ.
  2. ఎక్కువమందికి జీవనోపాధి కల్పించే పరిశ్రమ నూలు పరిశ్రమ.
  3. అందరికి అవసరమైన వస్తువు బట్టలు. అందువల్ల ఇంగ్లాండ్ లో పారిశ్రామిక విప్లవం యంత్రాలపై – నేయబడిన వస్త్రాలను దిగుమతి చేసుకోవడంతో చేనేత కార్మికులకు ఉపాధి లేకుండా పోయింది.
  4. కావున చేనేత కార్మికులకు ఉపాధిని కల్పిస్తూ, మనకు కావలసిన వస్త్రాన్ని మనమే తయారు చేసుకుంటూ, వ్యాపార నిమిత్తం భారత దేశానికి వచ్చిన బ్రిటిష్ వారికి లాభం లేకుండా చేయడం వలన వారు మనదేశం నుండి వెళ్ళిపోవడానికి అవకాశం కల్పించగలము అనే నమ్మకంతో గాంధీగారు అలాంటి విధానానికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది.

9th Class Social Textbook Page No.80

ప్రశ్న 12.
పంచదార, బెల్లం పరిశ్రమలను ఎక్కడ స్థాపించాలి?
జవాబు:

  1. పంచదార, బెల్లం పరిశ్రమలు చెరకు పండే ప్రాంతాలలోనే స్థాపించాలి. కారణం చెరకు నరికిన తరువాత ఎక్కువ కాలం నిల్వ ఉంటే సుక్రోజ్ శాతం తగ్గిపోతుంది.
  2. అందువల్ల చెరకు నరికిన వెంటనే పరిశ్రమకు తరలించవలసి ఉంటుంది.
  3. కావున చెరకు పండే ప్రాంతాలలోనే. పంచదార, బెల్లం పరిశ్రమలను స్థాపించవలసి ఉంటుంది.

ప్రశ్న 13.
భారతదేశంలో తలసరి ఉక్కు వినియోగం ఎందుకు తక్కువగా ఉంది?
జవాబు:

  1. ఇనుము – ఉక్కు పరిశ్రమలు మౌలిక పరిశ్రమలు ఇతర భారీ, మధ్యతరహా, తేలికపాటి పరిశ్రమలన్నీ తమకు కావలసిన యంత్రాలకు వీటిపై ఆధారపడి ఉన్నాయి.
  2. అనేక రకాల ఇంజనీరింగ్ వస్తువులు, భవననిర్మాణ సామగ్రి, రక్షణ, వైద్య, దూరవాణి, శాస్త్రీయ పరికరాలు, అనేక వినియోగదారీ వస్తువుల వంటి వాటికి ఉక్కు అవసరం.
  3. కాని పైన పేర్కొనబడిన పరిశ్రమలు భారతదేశంలో చెప్పుకోదగినంత స్థాయిలో అభివృద్ధి చెందలేదు.
    అందువల్ల తలసరి ఉక్కు వినియోగ తక్కువగా ఉంది.

9th Class Social Textbook Page No.82

ప్రశ్న 14.
సిమెంట్ ఉత్పత్తి కర్మాగారాలను ఎక్కడ స్థాపించటం ఆర్థికంగా లాభసాటిగా ఉంటుంది?
జవాబు:
సిమెంట్ ఉత్పత్తి కర్మాగారాలను స్థాపించవలసిన ప్రదేశాలు :

  1. ప్రధాన ముడిపదార్థాలైన సున్నపురాయి, సిలికా, అల్యూమినియం, జిప్సం వంటి ముడి పదార్థాలు ఎక్కడ లభిస్తాయో సాధారణంగా సిమెంట్ పరిశ్రమలు అక్కడ స్థాపించవలసి ఉంటుంది.
  2. సిమెంట్ పరిశ్రమకు రైలు వంటి రవాణా సౌకర్యాలతో పాటు బాగా అభివృద్ధి చెందిన ప్రదేశం కూడా కావాలి.

AP Board 9th Class Social Solutions Chapter 7 భారతదేశంలో పరిశ్రమలు

ప్రశ్న 15.
గల్ఫ్ దేశాల మార్కెటుకి దగ్గరగా గుజరాత్ లో సిమెంట్ కర్మాగారాలు కొన్ని నెలకొని ఉన్నాయి. దేశంలోని ఇతర రాష్ట్రాలలో సిమెంట్ కర్మాగారాలు ఎక్కడ నెలకొని ఉన్నాయో తెలుసుకోండి. ఆ కర్మాగారాల పేర్లు తెలుసుకోండి.
జవాబు:

  1. మొదటి సిమెంట్ కర్మాగారాన్ని 1904లో చెన్నైలో నిర్మించారు.
  2. 1989లో ధర, పంపిణీలలో నియంత్రణలను తీసివేయటం, ఇతర విధానాలలో సంస్కరణల వల్ల సామర్థ్యం, ప్రక్రియ, సాంకేతిక విజ్ఞానం, ఉత్పత్తిలో గణనీయమైన ప్రగతి సాధించింది.
  3. సిమెంట్ నాణ్యత పెరగటంతో తూర్పు ఆసియా, గల్ఫ్ దేశాలలో, ఆఫ్రికా దక్షిణ ఆసియాలలో మన దేశ సిమెంటుకు గిరాకీ పెరిగింది.

సిమెంట్ పరిశ్రమ నెలకొని ఉన్న ప్రాంతాలు :

  1. తమిళనాడు : తలైయుత్తు అలంగులం, తలకపట్టి దాల్మియాపురం, పాలియూర్, వంకరిదుర్గ్, మధురై.
  2. మధ్యప్రదేశ్ : జముల్, సాత్నా, కల్ని, కైమూర్, బాన మూర్, ముంధర్ దేశంలోకెల్లా జముల్ ఫ్యాక్టరీ అతి పెద్దది.
  3. ఆంధ్రప్రదేశ్ : జగ్గయ్యపేట.
  4. తెలంగాణ : కరీంనగర్, కోదాడ.
  5. రాజస్థాన్ : లఖేరి బుంది, సవాయ్, మాధోపూర్ బితోర్ గద్, ఉదయపూర్.

9th Class Social Textbook Page No.84

ప్రశ్న 16.
దిగువ పట్టికను పూరించండి.
కొన్ని పరిశ్రమల గురించి తెలుసుకోవడానికి మీ ఉపాధ్యాయునితో చర్చించండి.
AP Board 9th Class Social Solutions Chapter 7 భారతదేశంలో పరిశ్రమలు 4
జవాబు:

పరిశ్రమ ప్రస్తుతం అవి ఉన్న రాష్ట్రాలు ఆయా రాష్ట్రాలలో అవి ఎందుకు ఉన్నాయి?
రసాయనిక పరిశ్రమ రసాయనిక ఎరువులు :
బీహార్ లోని సింద్రి, ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్ పూర్, తెలంగాణలోని రామగుండం, పంజాబ్ – నంగల్, హర్యానా – పానిపట్
ఆయా రాష్ట్రంలో ఎక్కువగా నెలకొల్పడానికి ప్రధాన కారణం – రసాయనాలు, విద్యుత్, పెట్రోలియం వంటి ఉత్పత్తులు ఆయా ప్రాంతాలలో విరివిగా దొరకడం.
ఎరువుల పరిశ్రమ సింథటిక్ దారాలు :
మహారాష్ట్ర – ముంబయి
గుజరాత్ – అహ్మదాబాద్
మధ్యప్రదేశ్ – గ్వాలియర్
తెలంగాణ – కాగజ్ నగర్పెట్రో కెమికల్స్ :
మహారాష్ట్ర – ట్రాంబే ధానే
గుజరాత్ – వడోదర
సిమెంట్ పరిశ్రమ తమిళనాడు – తలైయుత్తు అలిహలా
తలకపట్టి దాల్మియాపూర్
ఆంధ్రప్రదేశ్ – జగ్గయ్యపేట
తెలంగాణ – కరీంనగర్, కోదాడ
గుజరాత్ – సిక్కా, సూరీ
రాజస్థాన్ – లభేరి బుంది
సిమెంట్ పరిశ్రమకు కావలసిన సున్నపురాయి, సిలికా, అల్యూమినియం, జిప్సం వంటి ముడి పదార్థాలతో పాటు, అభివృద్ధి చెంది రవాణా సౌకర్యాలు
ఆటోమొబైల్ పరిశ్రమ మహారాష్ట్ర – ముంబయి, పుణె
పశ్చిమబెంగాల్ – కోల్ కత
తమిళనాడు – చెన్నై
ఉత్తరప్రదేశ్ – లక్నో
రోడ్లు, రవాణా అభివృద్ధి చెంది ఉండడం, ఎగుమతులు, దిగుమతులకు అనుకూల ప్రదేశాలు సాంకేతిక నైపుణ్యం గల, సాంకేతిక నైపుణ్యం లేని శ్రామికులు ఎక్కువగా ఉండడం.

9th Class Social Textbook Page No.88

ప్రశ్న 17.
రెండు ‘పై’ (Pie) చార్టులలోని మూడు రకాల ఆర్థిక రంగాలలో ‘ఉపాధిలో తేడాలు ఏమిటి ? :
(లేదా)
కింది “పై” చార్టు, వ్యవసాయ, పరిశ్రమలు మరియు సేవారంగం ద్వారా పొందుతున్న ఉపాధి శాతాలను తెలియజేస్తున్నది. చార్టును పరిశీలించి, ప్రశ్నకు సమాధానం రాయండి.
AP Board 9th Class Social Solutions Chapter 7 భారతదేశంలో పరిశ్రమలు 5
ప్రశ్న: 1972 – 73 మరియు 2009-2010 మధ్య ఉపాధి కల్పనలో వచ్చిన మార్పులు ఏమిటి?
జవాబు:
1972-73 సం||రం వ్యవసాయంపై ఆధారపడిన వారి శాతం – 74%.
2009-2010 సం||రం వ్యవసాయరంగంపై ఆధారపడిన వారి శాతం 53%.
కావున 1972 -73 సం||రంతో పోలిస్తే వ్యవసాయ రంగంపై ఆధారపడిన శాతం తగ్గింది.
1972 -73 పరిశ్రమలపై ఆధారపడిన వారి శాతం – 11%.
2009 – 10 సం||రంలో పరిశ్రమలపై ఆధారపడిన వారి శాతం – 22%.
కావున 1972 – 73 సంవత్సరంతో పోలిస్తే 2009-10 సం||రంలో పరిశ్రమలపై ఆధారపడిన వారి శాతం పెరిగింది.
1972 – 73 సం||రంలో సేవలపై ఆధారపడిన వారి శాతం – 13%.
2009 – 10 సం||రంలో సేవలపై ఆధారపడిన వారి శాతం – 25%.
కావున 1972 – 73 సంవత్సరంతో పోలిస్తే 2009 – 10 సం||రాల్లో సేవలపై ఆధారపడిన వారి శాతం పెరిగింది.
మొత్తం మీద 1972 – 73 సం||రానికి 2009 – 10 సం||రానికి తేడా ఏమనగా వ్యవసాయరంగంపై ఆధారపడిన వారి శాతం తగ్గగా మిగిలిన రంగాలపై ఆధారపడిన వారి శాతం పెరిగింది.

ప్రశ్న 18.
పారిశ్రామిక రంగం వారీగా ఉపాధి కల్పనలో ఎంత శాతం తేడా ఉంది?
జవాబు:
1972 – 73 లో పారిశ్రామిక రంగంపై ఆధారపడిన వారి శాతం – 11%
2009 – 10 లో పారిశ్రామిక రంగంపై ఆధారపడిన వారి శాతం – 22%
తేడా – 11%
AP Board 9th Class Social Solutions Chapter 7 భారతదేశంలో పరిశ్రమలు 6

ప్రశ్న 19.
పరిశ్రమలలో ఆశించినంతగా ఉపాధి పెరగలేదా? టీచరుతో చర్చించండి.
జవాబు:
పరిశ్రమలలో ఆశించినంతగా ఉపాధి పెరగలేదు. కారణం –
1972-73లో 11% ఉంటే 2009-10లలో 22 శాతానికి మాత్రమే పెరిగినది. అంటే 27 సం||రాలలో ఉపాధి కేవలం 11% మాత్రమే పెరిగినది.
AP Board 9th Class Social Solutions Chapter 7 భారతదేశంలో పరిశ్రమలు 7

9th Class Social Textbook Page No.90

రవాణా వాహనాలు, పంపులు ఉత్పత్తి, ….. 1950 – 2011
AP Board 9th Class Social Solutions Chapter 7 భారతదేశంలో పరిశ్రమలు 8

ప్రశ్న 20.
వివిధ కర్మాగారాలు తమ ఉత్పత్తులలో ఉపయోగించే వస్తువులు ఉత్పత్తి పెరుగుదలకు ఉదాహరణలు పేర్కొనండి.
జవాబు:
వాణిజ్య వాహనాలు 1950-51లో 9 మిలియన్లు ఉండగా 2010-11 నాటికి 753 మిలియన్లకి పెరిగింది.

మోటారు సైకిళ్ళు 1950-51లో ఏమీ లేవు. 1960-61లో 1 మిలియన్ మాత్రమే ఉండగా 2010-11 నాటికి 10. 527 మిలియన్లకు పెరిగాయి. అనగా పెరుగుదల గణనీయంగా ఉన్నది.

పంపులు 1950-51లో 35 మిలియన్లు ఉండగా 2010-11లో 3139 మిలియన్లకు పెరిగింది.

ట్రాక్టర్లు డీజిల్ తో నడిచేవి 1980-81కు ముందు లేవు. ఆ సంవత్సరం మాత్రం 71 మిలియన్లు ఉండగా 2010-11 నాటికి 465 మిలియన్లకు పెరిగింది. కాబట్టి పెరుగుదల పై విధంగా ఉన్నది.

AP Board 9th Class Social Solutions Chapter 7 భారతదేశంలో పరిశ్రమలు

ప్రశ్న 21.
గత 30 సంవత్సరాలలో వస్త్ర ఉత్పత్తి ఎంత పెరిగింది ? దీని ప్రభావం ఎలా ఉంటుంది ? మీ తరగతి గదిలో చర్చించండి.
జవాబు:
వస్త్రాల ఉత్పత్తి (మిలియన్ చదరపు మీటర్లలో)

సంవత్సరం నూలు వస్త్రాలు ఇతర వస్త్రాలు
1950-51 4900
1960-61 6000 100
1970-71 6500 1000
1980-81 8000 2000
1990-91 15000 8000
2000-01 20000 20000
2010-11 31000 30000

వస్త్రాలు మన అవసరాలకు ఉపయోగించడం మాత్రమే కాక ఇతర దేశాలకు దిగుమతి చేయడం జరుగుతుంది.

ప్రశ్న 22.
సిమెంటు, ఉక్కు ఉత్పత్తిని చూపించే పటాన్ని చూడండి. 1980 – 81 నుంచి ఇప్పటి వరకు వీటి ఉత్పత్తిలో పెరుగుదల తెలియజేయటానికి ఒక పట్టిక తయారు చేయండి. ఈ ఉత్పత్తి పెరగటం వల్ల కలిగిన ప్రయోజనాలను, నష్టాలను చర్చించండి.
జవాబు:

సంవత్సరం సిమెంట్ ఉత్పత్తి
(మిలియన్ టన్నులలో)
ఉక్కు ఉత్పత్తి
(మిలియన్ టన్నులలో)
1950-51 5 1
1960-61 10 2
1970-71 15 6
1980-81 20 8
1990-91 50 12
2000-01 100 30
2010-11 210 62

ఉక్కు ఉత్పత్తి పెరిగినది దీనివలన మౌలిక పరిశ్రమలు సంఖ్య పెరిగింది.

ఉత్పత్తి పెరగటం వల్ల కలిగిన లాభాలు :
సిమెంట్ ఉత్పత్తి పెరగటం వల్ల భవన నిర్మాణం రంగం పెరిగింది. మరియు ఎగుమతులు పెరిగాయి.

అరబ్ దేశాలకు మన సిమెంట్ ను ఎక్కువగా ఎగుమతి చేయడం జరుగుతున్నది.

నిర్మాణ రంగానికి కూడా ఉక్కును ఎక్కువగా ఉపయోగించడం జరుగుతున్నది.

నష్టాలు :
సున్నపురాయి, జిప్సమ్ నిల్వలు రోజు రోజుకు తరిగిపోతున్నాయి. అలాగే ఉక్కుకు కావలసిన ముడి ఇనుమును ఎక్కువగా ఎగుమతి చేయడం జరుగుతుంది.

ఇంకా పూర్తి స్థాయిలో ముడి ఇనుమును మన అవసరాలకు ఉపయోగించుకోగలిగితే ఇనుము – ఉక్కు పరిశ్రమ అభివృద్ధి చెందినట్లు అవుతుంది.

పట నైపుణ్యం

1. భారతదేశంలో ఉత్పత్తి చేయబడిన ఉక్కును 1950-51 నుండి. 2010-11 వరకు గ్రాఫ్ చిత్రంలో చూపించండి.
AP Board 9th Class Social Solutions Chapter 7 భారతదేశంలో పరిశ్రమలు 9

2. 1950-51 నుండి 2010-11 వరకు ఉత్పత్తి చేయబడిన సిమెంట్ ను గ్రాఫ్ చిత్రం ద్వారా చూపించండి.
AP Board 9th Class Social Solutions Chapter 7 భారతదేశంలో పరిశ్రమలు 10

3. 1950-51 నుండి 2010-11 వరకు ఉత్పత్తి చేయబడిన విద్యుత్ ను గ్రాఫ్ చిత్రం ద్వారా చూపించండి.
AP Board 9th Class Social Solutions Chapter 7 భారతదేశంలో పరిశ్రమలు 11

4. 1950-51 నుండి 2010-11 వరకు ఉత్పత్తి చేయబడిన వస్త్రాలను గ్రాఫ్ చిత్రం ద్వారా చూపించండి.
AP Board 9th Class Social Solutions Chapter 7 భారతదేశంలో పరిశ్రమలు 12

5. భారతదేశంలో లభించే ఇనుప ఖనిజ క్షేత్రాలను, ఇనుప ఖనిజ గనులను భారతదేశం పటంలో చూపించండి.
AP Board 9th Class Social Solutions Chapter 7 భారతదేశంలో పరిశ్రమలు 13

6. బొగ్గు లభించే ప్రాంతాలను భారతదేశ పటం నందు చూపించండి.
AP Board 9th Class Social Solutions Chapter 7 భారతదేశంలో పరిశ్రమలు 14

7. భారతదేశ పటం నందు ఇనుము – ఉక్కు కర్మాగారాల ప్రదేశాలను చూపించండి.
AP Board 9th Class Social Solutions Chapter 7 భారతదేశంలో పరిశ్రమలు 15

8. భారతదేశ పటం నందలి సాఫ్ట్ వేర్ టెక్నాలజీ పార్కులను గుర్తించండి.
AP Board 9th Class Social Solutions Chapter 7 భారతదేశంలో పరిశ్రమలు 16

ప్రాజెక్టు

ప్రశ్న 1.
మీ ప్రాంతంలోని వ్యవసాయ ఆధారిత పరిశ్రమను ఒకదానిని, ఖనిజ ఆధారిత పరిశ్రమను ఒకదానిని ఎంచుకోండి.
1) వాటిల్లో ఉపయోగించే ముడిసరుకులు ఏమిటి?
2) ఉత్పత్తిలో కావలసిన ఇతర ఉత్పాదకాలలో వేటికి రవాణా ఖర్చు కావాలి?
3) ఈ కర్మాగారాలు పర్యావరణ నియమాలను పాటిస్తున్నాయా?
జవాబు:
మా ప్రాంతంలోని వ్యవసాయ ఆధారిత పరిశ్రమ.

– పొగాకు పరిశ్రమ :

  1. వాటిలో ఉపయోగించే ముడి సరుకులు – పొగాకు.
  2. ఉత్పత్తిలో కావలసిన ఇతర ఉత్పాదకాలలో వేటికి రవాణా ఖర్చు కావాలి?
    పొగాకుకు రవాణా ఖర్చు కావాలి.

మరియు తయారుచేయబడిన సిగరెట్లు, బీడీలు, చుట్టలు వంటి వాటిని వివిధ ప్రాంతాలకు చేరవేయాలన్నా, మరియు సిగరెట్ పరిశ్రమ, బీడీల పరిశ్రమ, చుట్టల పరిశ్రమ ప్రాంతాలకు పొగాకును చేరవేయాలన్నా రవాణా ఖర్చు కావలసి ఉంటుంది.

ఈ కర్మాగారాలు పర్యావరణ నియమాలను అంతగా పాటించడం లేదనే చెప్పవచ్చును.

ఎందువలెనంటే పరిశ్రమల చుట్టు మొక్కలను పెంచడం లేదు.

పరిశ్రమ నందు వడిలివేయబడిన పదార్థాల డంపింగ్ యార్డ్ ద్వారా నాశనం చేయకుండా దగ్గరలోని కృష్ణానదిలోను, రోడ్ల ప్రక్కన వేయడంవల్ల ఆ పరిసర ప్రాంతాలు కాలుష్యానికి గురౌతున్నాయి.

మా ప్రాంతంలోని ఖనిజాధార పరిశ్రమ.

– సిమెంట్ పరిశ్రమ :
ప్రధాన ముడి సరుకులు : సున్నపురాయి, జిప్సం , బొగ్గు, డోలమైట్, పింగాణి మన్ను మొదలగునవి.

ఉత్పత్తిలో కావలసిన ఇతర ఉత్పాదకాలలో సున్నపురాయి, జిప్సం, డోలమైట్, పింగాణి మన్ను, బొగ్గు మొదలైన వాటి అన్నింటికి రవాణా ఖర్చు కావాలి.

సున్నపురాయి అధిక పరిమాణంలో కావాలి.

ఈ కర్మాగారాలు పర్యావరణ నియమాలను పాటిస్తున్నాయా?

అంతగా పాటించడం లేదనే చెప్పాలి. ఎందువలెనంటే ఈ పరిశ్రమ పనిచేస్తున్నప్పుడు దుమ్ము, ధూళి విపరీతంగా వస్తుంది.

అది గాలిలో కలిసి గాలిని కలుషితం చేస్తుంది.
అలాగే వ్యర్థ పదార్థాలను బయట ప్రదేశములందు వదలడం వలన బయటి ప్రదేశాలు రసాయనిక కాలుష్యానికి గురౌతున్నాయి.

AP Board 9th Class Social Solutions Chapter 6 భారతదేశంలో వ్యవసాయం

SCERT AP 9th Class Social Studies Guide Pdf 6th Lesson భారతదేశంలో వ్యవసాయం Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Social Solutions 6th Lesson భారతదేశంలో వ్యవసాయం

9th Class Social Studies 6th Lesson భారతదేశంలో వ్యవసాయం Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
ఏదైనా ఒక పానీయపు పంటను పేర్కొనీ దాని పెరుగుదలకు కావలసిన భౌగోళిక అంశాలను పేర్కొనండి. (AS1)
జవాబు:
పానీయపు పంట – తేయాకు :
భౌగోళిక అంశాలు :

  1. అయన, ఉప అయన ప్రాంతపు పంట.
  2. లోతైన, సారవంతమైన ఏటవాలు నేలలు ఉండి నీటి పారుదల వసతులు కలిగి హ్యూమస్, సేంద్రియ పదార్థం అధికంగా గల మృత్తికలు అత్యంత అనుకూలం.
  3. వెచ్చని, ఆర్ధ శీతోష్ణస్థితితో పాటు హిమరహిత వాతావరణం సంవత్సరం పొడవునా ఉండాలి.
  4. తరచుగా పడే వర్షపు జల్లులు సంవత్సరం పొడవునా విస్తరించి ఉంటే నాణ్యమైన తేయాకు పెరుగును.
  5. తేయాకు పంటకు అత్యధిక శ్రామికులు అవసరం.
  6. తేయాకు పండించే రాష్ట్రాలు అసోం, పశ్చిమబెంగాల్, తమిళనాడు, కేరళ.

ప్రశ్న 2.
సాగుభూమి యొక్క విస్తీర్ణం రోజు రోజుకు తగ్గుతున్నది. దీని పరిణామాలను ఊహించి రాయండి. (AS4)
జవాబు:
సాగుభూమి యొక్క విస్తీర్ణం రోజు రోజుకు తగ్గుతున్నది దీనికి కారణం :

  1. రియల్ ఎస్టేట్ రంగం విస్తరించడం.
  2. పంటలకన్నా ఇంటి నిర్మాణాలకు భూములను మారిస్తే ఎక్కువ ఆదాయం వస్తుంది అనే భావం.
  3. పారిశ్రామిక ప్రాంతాలుగా మార్చటం.

AP Board 9th Class Social Solutions Chapter 6 భారతదేశంలో వ్యవసాయం

ప్రశ్న 3.
భారతదేశంలో చిరుధాన్యాలు పండే ప్రాంతాలను గుర్తించండి. (AS5)
జవాబు:
భారతదేశంలో చిరుధాన్యాలు పండే ప్రాంతాలు.
AP Board 9th Class Social Solutions Chapter 6 భారతదేశంలో వ్యవసాయం 1

జొన్నలు : మహారాష్ట్ర
కర్ణాటక
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
మధ్యప్రదేశ్
సజ్జలు : రాజస్థాన్
ఉత్తరప్రదేశ్
మహారాష్ట్ర
గుజరాత్
హర్యానా
రాగులు : కర్ణాటక
తమిళనాడు

ప్రశ్న 4.
కనీస మద్దతు ధర (MSP) అంటే ఏమిటి? దీని అవసరం ఏమిటి? (AS1)
జవాబు:

  1. రైతు పండించిన పంటను వ్యాపారస్థులు చెప్పిన రేటుకు అమ్మవలసి ఉంటుంది.
  2. అలాంటి పరిస్థితులలో ప్రభుత్వం కనీస మద్దతు ధరను ప్రకటిస్తుంది.
  3. కారణం : ఒక్కొక్కసారి రైతు పండించటానికి అయిన ఖర్చు కూడా పరిగణనలోనికి తీసుకోకుండా, వ్యాపారస్థులు చాలా తక్కువ రేటు అడగడం.

అందువల్ల ప్రభుత్వం పంటను పండించటానికి రైతుకు ఎంత ఖర్చు అవుతుంది. ఎంత దిగుబడి వస్తుంది. అనే అంశాన్ని పరిగణనలోనికి తీసుకుని పండిన పంటకు కనీస మద్దతు ధర ప్రకటిస్తుంది.

ప్రశ్న 5.
భారత ప్రభుత్వం హరిత విప్లవానికి అన్ని రకాలుగా ఎందుకు సహకారాన్ని అందించినదో తెలపండి. (AS1)
జవాబు:
భారత ప్రభుత్వం హరిత విప్లవానికి అన్ని రకాలుగా సహకారాన్ని అందించడానికి గల కారణం :

  1. భారత దేశ జనాభా నానాటికి రెట్టింపు అవుతుంది.
  2. రెట్టింపు అవుతున్న జనాభాకు సరిపడ ఆహారధాన్యాల ఉత్పత్తి జరగడం లేదు.
  3. ప్రజలకు పూర్తి స్థాయిలో వ్యవసాయం ద్వారా ఉపాధి కల్పించలేకపోతున్నారు.
  4. వ్యవసాయం లాభసాటిగా ఉండటం లేదు.
  5. వ్యవసాయ విస్తీర్ణ భూమి శాతం రోజు రోజుకు తగ్గిపోతుంది.
  6. నీటి పారుదల సదుపాయాలు లేకపోవడం వలన పూర్తి స్థాయిలో వ్యవసాయం జరగడం లేదు.
  7. రసాయన ఎరువులను అందించవలసిన అవసరం ఏర్పడినది.
  8. రైతులకు ఋణసదుపాయం కల్పించవలసి వచ్చింది.
  9. పండిన పంటకు గిట్టుబాటు రేటు కల్పించవలసి వచ్చింది.
  10. తగిన మార్కెట్ సదుపాయం ఏర్పాటు చేయవలసివచ్చింది.

అందువల్ల భారత ప్రభుత్వం హరిత విప్లవానికి అన్ని రకాలుగా సహకారాన్ని అందజేసినది.

AP Board 9th Class Social Solutions Chapter 6 భారతదేశంలో వ్యవసాయం

ప్రశ్న 6.
భారతదేశం ఆహారధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధిని సాధించాల్సిన అవసరం ఉందని మీరు భావిస్తారా? చర్చించండి. (AS1)
జవాబు:

  1. ఆహారధాన్యాల విషయంలో దేశం స్వయం సమృద్ధిని సాధించింది.
  2. ఆహారధాన్యాల ఉత్పత్తి పెరగడం వలన ఇతర దేశాల నుండి ఆహారధాన్యాలను దిగుమతి చేసుకోవల్సిన అవసరం లేకుండా పోయింది.
  3. ప్రస్తుతం భారతదేశ దిగుమతిలో ఆహార పదార్థాల వాటా కేవలం 3% మాత్రమే.
  4. గడిచిన 7 దశాబ్దాలలో ఆహార ధాన్యాల ఉత్పత్తి 51 మిలియన్ టన్నుల నుండి 242 మిలియన్ టన్నులకు పెరిగింది.
  5. భారత, ఆహార సంస్థ ద్వారా భారత ప్రభుత్వం భారీగా ఆహార ధాన్యాలు నిల్వ చేస్తుంది.
  6. వీటిని కరవు కాటకాలు వచ్చినపుడు గాని, ఆహార ధాన్యాల కొరత ఏర్పడినపుడు గాని ఉపయోగిస్తారు.
  7. ఇలా సేకరించిన ధాన్యాన్ని దేశంలో ధాన్యం అందుబాటులో లేని ప్రాంతాలకు సరఫరా చేస్తారు.
  8. 1967లో ప్రభుత్వం దగ్గర ఉన్న మొత్తం ఆహారధాన్యాలు 19 లక్షల టన్నులు. 2010 – 11 సంవత్సరం నాటికి ఇది 220 లక్షల టన్నులకు పెరిగింది.
  9. మొత్తం ప్రపంచ ఆహార ధాన్యాల ఉత్పత్తిలో 1/10 వంతు మన దేశంలో ఉత్పత్తి అవుతుంది.

ప్రశ్న 7.
ఇతర ప్రాంతాలలోని వ్యవసాయానికి, వర్షాధార వ్యవసాయానికి తేడా ఏమిటి? (AS1)
జవాబు:

  1. ఇతర ప్రాంతాలలో నీటి పారుదల సదుపాయం ఉంటుంది. కాబట్టి పంటలు అన్ని రకాల అన్ని వేళలా పండించవచ్చును.
  2. కానీ వర్షాధార ప్రాంతంలో వ్యవసాయం వర్షం పై ఆధారపడటం వలన అన్ని రకాల పంటలు. పండించలేము.
  3. జొన్న, సజ్జ, వేరుశనగ, రాగులు, పత్తి, సోయాబీన్, కంది, శనగ మొ||న పంటలను మాత్రమే పండించగలము.
  4. వర్షాధార ప్రాంతంలో నీటిని వర్షం పడినపుడు వేగంగా ప్రవహించనీయకుండా చూడాలి.
  5. దీని వలన నీరు భూమికి ఇంకడానికి అవకాశం లభించి భూగర్భ జలం వృద్ధి చెందుతుంది.
  6. వనీకరణ, కరకట్టల నిర్మాణం, చెక్ డ్యామ్ లు, చెరువుల నిర్మాణం మొదలయిన కార్యక్రమాలు అమలు చేసి పంటలను పండించవచ్చును.
  7. అదే నీటిపారుదల కలిగిన ప్రాంతాలలో అంతగా కష్టపడాల్సిన అవసరం ఉండదు. అన్ని రకాల పంటలు పండించుకోవచ్చు.

ప్రశ్న 8.
‘శీతల పానీయాలలో క్రిమి సంహారకాలు కనబడ్డాయి.’ వంటి సంఘటనను గుర్తుకు తెచ్చుకున్నారా? ఇది క్రిమిసంహారకాల వాడకంతో ఏ సంబంధాన్ని కలిగి ఉంది? చర్చించండి. (AS4)
జవాబు:

  1. శీతల పానీయాలు నిల్వ ఉండటానికి ఉత్పత్తిదారులు క్రిమిసంహారకాలు వాడుతున్నారు. దాని వలన మానవులు వాటిని తాగినపుడు అనేక సమస్యలకు లోనౌతున్నారు.
  2. బయట పంటలపై క్రిమి సంహారకాలు ఉపయోగించినపుడు కూడా క్రిములు చావడంతో పాటు మొక్కలు కూడా ఆ మందులను కొంత వరకు గ్రహిస్తున్నాయి.
  3. మొక్కలు గ్రహించినది వాటి పంటలకు పంపిస్తున్నది అందువలన వాటిని తినడం వలన మానవులు అనేక రకాల జబ్బులకు లోనుకావలసి వస్తుంది.
  4. అలాగే శీతల పానీయాలలో కూడా పురుగుమందులను వాడటం వలన అనేక సమస్యలను ఎదుర్కొనవలసి వస్తుంది.

AP Board 9th Class Social Solutions Chapter 6 భారతదేశంలో వ్యవసాయం

ప్రశ్న 9.
నూతన వ్యవసాయ పద్ధతులలో రసాయనిక ఎరువులను ఎందుకు వాడుతున్నారు? వీటి వాడకం వల్ల నేల సారం ఎలా తగ్గుతుంది? నేలను సారవంతం చేయడానికి ప్రత్యామ్నాయ మార్గాలు ఏమిటి? (AS1)
జవాబు:
నూతన వ్యవసాయ పద్ధతులలో రసాయనిక ఎరువులను వాడటానికి కారణం.

  1. రసాయనిక ఎరువులు (సాధారణంగా నత్రజని, భాస్వరం, పొటాషియం వంటి ఖనిజాలను నీటిలో కరిగే రూపంలో కలిగి ఉండటం వల్ల ఇవి మొక్కలకు వెంటనే అందుబాటులోకి వస్తాయి.
  2. కానీ ఇవి నేలలో ఎక్కువ కాలం అందుబాటులో ఉండవు.
  3. ఇవి మట్టిలో నుండి నీటి ద్వారా లోపలి పొరలకు ఇంకి భూగర్భ జలాలను, నదులను, చెరువులను కలుషితం చేస్తాయి. వీటి వాడకం వల్ల నేలసారం తగ్గడానికి కారణం : రసాయనిక ఎరువులు నేలలోని బాక్టీరియా ఇతర సూక్ష్మజీవులను చంపేస్తాయి.

ప్రశ్న 10.
హరిత విప్లవం ఎందుకు కొన్ని ప్రాంతాలలో రైతులకు స్వల్పకాలంలో లాభాన్ని, దీర్ఘకాలంలో నష్టాన్ని ఎలా కలిగించింది?
జవాబు:
హరిత విప్లవం వలన అధిక దిగుబడి విత్తనాలు ప్రవేశపెట్టడం.
1. దీని వలన వ్యవసాయ సాగుభూమి విస్తీర్ణం పెరగలేదు. కానీ వ్యవసాయ ఉత్పత్తి పెరిగింది.

2. రసాయనిక ఎరువుల వినియోగం
వీటిని ఉపయోగించడం వలన తాత్కాలికంగా మెరుగైన ఉత్పత్తులు సాధించాము. కానీ దీర్ఘకాలికంగా భూములు నిస్సారవంతమైనవి.

3. డాక్టర్ మొదలైన యాంత్రాల వినియోగం.
యంత్రాలను ఉపయోగించడం వలన వ్యవసాయరంగంపై ఆధారపడిన కార్మికులు ఉపాధిని కోల్పోయారు.

4. నీటి పారుదల సదుపాయాలను కలిగించడం.
నీటి కొరత ఏర్పడింది. వివిధ ప్రాంతాల మధ్య అభిప్రాయ భేదాలు ఏర్పడ్డాయి.

5. క్రిమి సంహార మందుల వినియోగం
వీటి వలన జీవన సమతుల్యత దెబ్బతింది.
పై విధంగా హరితవిప్లవం వల్ల రైతులకు స్వల్పకాలంలో లాభించినా దీర్ఘకాలంలో కొన్ని ప్రాంతాలలో నష్టాలు వచ్చాయి.

ప్రశ్న 11.
వ్యవసాయదారుల ఆదాయంపై విదేశీ వర్తక ప్రభావం ఏమిటి? (AS1)
జవాబు:

  1. ప్రస్తుతం భారతదేశ వ్యవసాయ విధానాలలో చాలా గమనించదగిన మార్పులు వచ్చాయి.
  2. గతం కంటే ఎక్కువగా ఎగుమతులు, దిగుమతులు జరుగుతున్నాయి.
  3. అభివృద్ధి చెందిన దేశాలు విదేశీ వ్యాపారాన్ని అనుమతించమని చేసే ఒత్తిడి.
  4. ఈ అభివృద్ధి చెందిన దేశాలు వారి వ్యవసాయ మిగులు ఉత్పత్తిని ఎక్కువ సంఖ్యలో కొనుగోలుదారులున్న అభివృద్ధి చెందుతున్న దేశాలలో విక్రయించాలని కోరుకుంటున్నాయి.
  5. విదేశీ వ్యాపార విధానంలో వచ్చిన మార్పుల వలన ప్రస్తుతం అనేక పంటల క్రయ విక్రయాలు అంతర్జాతీయంగా జరుగుతున్నాయి.
    ఉదా : రైతులు కూరగాయలు, పండ్లు, పంచదార, బెల్లాన్ని ఎగుమతి చేయగలుగుతున్నారు.
  6. పై విధంగా అభివృద్ధి చెందిన దేశాలు తమ ఉత్పత్తులను అమ్ముకోవడం వలన అభివృద్ధి చెందుతున్న భారతదేశం వంటి దేశాలు నష్టపోతున్నాయి.

ప్రశ్న 12.
కింది తరగతుల్లో భూమి పంపిణీ గురించి చదివియున్నారు. ఆ భావాన్ని ఈ చిత్రం ఎలా ప్రతిబింబిస్తుంది? భారతీయ వ్యవసాయం దృష్టికోణంలో దీనిపై ఒక పేరా రాయండి. (AS1)
AP Board 9th Class Social Solutions Chapter 6 భారతదేశంలో వ్యవసాయం 2
జవాబు:
ఒంటరిగా నిలిచియున్న వ్యక్తి ఒక పెద్ద రైతు అయి ఉండవచ్చు. అయితే భూమి పంపిణీ కార్యక్రమం ద్వారా ఎక్కువ మంది నిలిచియున్న వారికి కొంత భూమిని పంచిపెట్టి ఉండవచ్చును. కానీ వారికి ఆ భూమి కేటాయించబడి ఉండదు. ఒక వేళ అది కేటాయించిన భూమి అయిన్నటికి బీడు భూమి అయి ఉండవచ్చును. దానితో వారంతా మా భూమి ఏది అని అడగటానికి వచ్చి ఉండవచ్చును. అప్పుడు ఆ పెద్ద రైతు వారికి మొహం చూపించకుండా పక్కకు నిలబడి ఉన్నాడు. (లేదా) వారికి కేటాయించిన భూమి బీడు భూమి కావడంతో మాకు ఇలాంటి భూమి ఎందుకు అని అడగటానికి వచ్చి ఉండవచ్చును. అప్పుడు వారికి సరైన సమాధానం చెప్పక పక్కకు తిరిగి ఉండవచ్చును.

ప్రశ్న 13.
పేజీ నెం. 70లోని “ఎరువుల సమస్యలు” అంశం చదివి, వ్యాఖ్యానించండి.
జవాబు:
నేల సారం, భూగర్భజలం వంటి పర్యావరణ వనరులు ఏర్పడడానికి ఎన్నో సంవత్సరాలు పడుతుంది. ఒకసారి వీటిని కోల్పోయామంటే తిరిగి పునరుద్ధరించడం కష్టం. రసాయనిక ఎరువులు నేలలోని బాక్టీరియా, ఇతర సూక్ష్మజీవులను చంపేస్తాయి. ఈ ఎరువులను వాడటం మొదలు పెట్టిన కొంత కాలానికి నేల మునుపటి కంటే తక్కువ సారాన్ని కలిగి ఉంటుంది. ఎక్కువ మోతాదులో రసాయనిక ఎరువులు వాడకం వలన మిత్ర కీటకాలు, మేలు చేసే జీవులు అంతరించి, భూసారం నిస్సారమౌతుంది.

దీనికి బదులుగా సేంద్రియ ఎరువు, పెంటకుప్పలో హ్యూమస్, సూక్ష్మజీవులు ఉంటాయి. సంప్రదాయ ఎరువులు వాడకం వలన ఆరోగ్యానికి సంబంధించి సమస్యలు దూరమౌతున్నాయి.

వ్యవసాయం ప్రధానంగా సహజ వనరులపై ఆధారపడిన నేపథ్యంలో భవిష్యత్తులో కూడా వ్యవసాయం ప్రగతి సాధించేలా పర్యావరణాన్ని కాపాడుకోవడానికి రసాయనిక ఎరువుల స్థానంలో సేంద్రియ ఎరువులు ఉపయోగించడం హర్షదాయకం.

ప్రశ్న 14.
ఓ నెం. 74లోని పటాన్ని పరిశీలించి, భారతదేశంలో అవుట్ లైన్ పటంలో వరి పండించే రాష్ట్రాలను గుర్తించండి. (AS5)
జవాబు:
AP Board 9th Class Social Solutions Chapter 6 భారతదేశంలో వ్యవసాయం 3

9th Class Social Studies 6th Lesson భారతదేశంలో వ్యవసాయం InText Questions and Answers

9th Class Social Textbook Page No.59

ప్రశ్న 1.
మన దేశంలో సాంద్ర జీవనాధార వ్యవసాయ విధానం అమలులో గల రాష్ట్రాలను పేర్కొనండి.
జవాబు:
సాంద్ర జీవనాధార వ్యవసాయం అమలులో గల రాష్ట్రాలు :

  1. పంజాబ్
  2. హర్యానా
  3. ఉత్తరప్రదేశ్
  4. పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో అమలులో ఉంది.

9th Class Social Textbook Page No.60

ప్రశ్న 2.
ఒక ప్రాంతంలో వాణిజ్య పంటగా, మరొక ప్రాంతంలో జీవనాధార వ్యవసాయంగా పండించే మరికొన్ని పంటలకు ఉదాహరణలు ఇవ్వండి.
జవాబు:
వరి హర్యానా, పంజాబలో వాణిజ్య పంట కాగా ఒడిశాలో జీవనాధార పంటగా పండిస్తున్నారు.

9th Class Social Textbook Page No.62

ప్రశ్న 3.
కందులు, బఠాణి, పెసలు, మసూర్, శనగలు, మినుములు, వేరుశనగ మొదలైన పప్పు ధాన్యాలలో ఖరీఫ్, రబీలలో పండే వాటిని వేరుచేయండి.
జవాబు:
ఖరీఫ్ కాలంలో పండే పప్పుధాన్యాలు కందులు, పెసలు, మినుములు, వేరుశనగ.
రబీ కాలంలో పండే పప్పు ధాన్యాలు బఠాణి, మసూర్, శెనగలు.

9th Class Social Textbook Page No.64

ప్రశ్న 4.
1. కింది పట్టికలో ముఖ్యమైన పంటలు, అవి పండే రాష్ట్రాల సమాచారం ఇవ్వబడింది. పూర్తి సమాచారం ఇవ్వలేదు. వాటి పూర్తి సమాచారాన్ని అట్లాస్, మీ టీచర్ సహాయంతో చర్చించి పట్టికను పూర్తిచేయండి.
2. ప్రతి పంటకు ప్రత్యేకమైన గుర్తును ( ⋅0⋅⋅) కేటాయించి, దానిని భారతదేశ రాజకీయ పటంలో గుర్తించి, ఆయా రాష్ట్రాలలో ఆయా పంటలు పండుటకు కారణాలను తరగతి గదిలో చర్చించండి.
AP Board 9th Class Social Solutions Chapter 6 భారతదేశంలో వ్యవసాయం 5
జవాబు:
AP Board 9th Class Social Solutions Chapter 6 భారతదేశంలో వ్యవసాయం 4

అధిక వాటాకు సహజమైన ఇతర కారణాలు :
1. వరి :

  1. అత్యధిక ఉష్ణోగ్రత, అధిక ఆర్ధతను కలిగి 100 సెం.మీ.ల సాంవత్సరిక వర్షపాతం పడే ప్రాంతాలలో బాగా పండుతుంది.
  2. తక్కువ వర్షపాతం ఉన్నప్పటికీ నీటి పారుదల బాగా ఉంటే వరి పండించవచ్చును.
  3. మన దేశంలో ఉత్తర మైదానాలు, ఈశాన్యప్రాంత మైదానాలు, తీరప్రాంతాలు, డెల్టా ప్రాంతాలు వరి పంటకు ప్రసిద్ధి.
  4. అందువల పశ్చిమ బెంగాల్,పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశాలలో అధికంగా పండుతుంది.

2. గోధమ :

  1. పంట కాలమంతా సమానంగా విస్తరించి ఉండే 50 నుండి 70 సెం.మీ వర్షపాతం అనుకూలం.
  2. మిత ఉష్ణోగ్రత ఉండి కోతకు వచ్చే సమయంలో వాతావరణం ప్రకాశవంతంగా ఉండాలి.
  3. గంగా సట్లెజ్ మైదాన ప్రాంతం, దక్కన్ పీఠభూమిలోని నల్లరేగడి ప్రాంతం, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ ముఖ్యమైన గోధుమ ఉత్పత్తి రాష్ట్రాలు.

3. చిరుధాన్యాలు :

  1. జొన్న, సజ్జ, రాగులు వంటి వాటిని చిరు ధాన్యాలు అంటారు. ఇవి ప్రధానంగా వర్షాధార పంటలు.
  2. జొన్నను అత్యధికంగా పండిస్తున్న రాష్ట్రం మహారాష్ట్ర, తరువాత కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్ ఇతర వరుస స్థానాలలో ఉన్నాయి.
  3. సజ్జ, ఇసుక నేలల్లోనూ, తేలికపాటి నల్లరేగడి నేలల్లో పండుతుంది. రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, హర్యానా సజ్జ పండించే రాష్ట్రాలు.

రాగి పంట శుష్క వాతావరణం గల అన్ని రకాల నేలల్లో పండుతుంది. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలలో బాగా పండుతుంది.

4. మొక్కజొన్న :

1. ఈ పంటకు 21°C నుండి 27°C ల ఉష్ణోగ్రత అవసరం.
పురాతన ఒండ్రునేలలు అత్యంత అనుకూలం.
బీహార్ లో రబీ కాలంలో పండిస్తారు.
అధిక దిగుబడి విత్తనాలు, రసాయనిక ఎరువులు, నీటిపారుదల సదుపాయాలు ఈ పంటకు బాగా అనుకూలమైనవి.

కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, బీహార్‌లో అధికంగా పండుతుంది.

5. పప్పుధాన్యాలు :
1. భారత దేశంలో పండే ముఖ్యమైన పప్పు ధాన్యాలు, కందులు, మినుములు, పెసలు, బఠాణి, మసూర్, శెనగలు.

తక్కువ వర్షపాతం గల శుష్క ప్రాంతాలలో సైతం పప్పు ధాన్యాలు పండుతాయి. లెగ్యూమినేసి కుటుంబానికి చెందిన ఈ మొక్కలన్నీ కూడా వాతావరణం నుండి నత్రజని గ్రహించి నేలలో, ప్రతిష్టాపన చేసి భూసారాన్ని పెంచుతాయి.

6. చెరకు :

  1. అధిక ఉష్ణోగ్రతలు (21°C నుండి 27°C), ఆర్ధత, 75 నుండి 100 సెం.మీ.ల సాంవత్సరిక వర్షపాతం నమోదు చేసే ప్రాంతాలు చెరకు పంటకు అనుకూలం.
  2. అల్ప వర్షపాతం గల ప్రాంతాలలో నీటి పారుదల తప్పనిసరి.
  3. మన దేశంలో ప్రధానంగా ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బీహార్,చెరకు పండించే రాష్ట్రాలు.

7. నూనెగింజలు :

  1. నూనె గింజలను అత్యధికంగా మన దేశంలోనే పండిస్తున్నారు. ప్రధానంగా వంట నూనెలుగా ఉపయోగిస్తారు.
  2. మరికొన్నింటిని సబ్బులు, సౌందర్య లేపనాలు, ఔషధ లేపనాలతో ముడిపదార్థాలుగా ఉపయోగిస్తారు.

8. ప్రత్తి :

  1. ప్రపంచంలో పత్తిని సాగు చేసిన మొదటి దేశం భారతదేశం.
  2. శుష్క వాతావరణం గల దక్కన్ పీఠభూమిలోని నల్లరేగడి నేలలు పత్తి పంటకు అత్యంత అనుకూలం.
  3. అధిక ఉష్ణోగ్రతలు, మిత వర్షపాతం కనీసం 210 రోజులు ‘మంచురహిత వాతావరణం ప్రత్తి పంటకు అనుకూలం.
  4. ఖరీఫ్ పంట అయినప్పటికీ పంట కాల వ్యవధి 6 నుండి 8 నెలలుగా ఉంటుంది.

AP Board 9th Class Social Solutions Chapter 6 భారతదేశంలో వ్యవసాయం 6

9th Class Social Textbook Page No.65

ప్రశ్న 5.
‘1971 – 2001 లలో వ్యవసాయదారులు, వ్యవసాయ కూలీలు ఎంత శాతం ఉన్నారో పై ‘దిమ్మ చిత్రం పూరించండి.
జవాబు:
AP Board 9th Class Social Solutions Chapter 6 భారతదేశంలో వ్యవసాయం 7
1971 లో వ్యవసాయదారులు – 62% 1971 లో వ్యవసాయ కూలీల శాతం – 38%
2001 లో వ్యవసాయదారులు – 54% 2001 లో వ్యవసాయ కూలీల శాతం – 46%

ప్రశ్న 6.
స్వయం ఉపాధి పొందేవారికి, పని కోసం చూసేవారి మధ్యగల తేడాలను మీ ప్రాంతంలో గల ఉదాహరణల ద్వారా చర్చించండి.
జవాబు:

  1. స్వయం ఉపాధి పొందే వారికి ఆదాయం వస్తుంది. ఉపాధి కల్పించబడుతుంది.
  2. వారు ఉపాధి పొందడం మాత్రమే కాక మరికొంత మందికి ఉపాధి కల్పించిన వారు అవుతారు.
  3. వారికి వారే యజమానులు కాబట్టి వారి శక్తియుక్తుల మేరకు పనిచేసి ఎక్కువ ఆదాయం పొందడానికి అవకాశం ఏర్పడుతుంది.
  4. పనికోసం చూసేవారికి ఉపాధి ఉండదు.
  5. ఆదాయం రాదు.
  6. ఎవరు పని కల్పిస్తారా అని ఎదురు చూస్తారు కాబట్టి పని అంతగా చేయలేరు.
  7. పనికోసం చూసే వారు ఎవరి కిందో పనిచేయవలసి ఉంటుంది.

AP Board 9th Class Social Solutions Chapter 6 భారతదేశంలో వ్యవసాయం

ప్రశ్న 7.
ఒకప్పటి వ్యవసాయదారుల కుటుంబాలు కొన్ని ఇప్పుడు వ్యవసాయ కూలీలు అవుతున్నాయని భావిస్తున్నావా? చర్చించండి.
జవాబు:
ఒకప్పటి వ్యవసాయదారుల కుటుంబాలు కొన్ని ఇప్పుడు వ్యవసాయ కూలీలు అవుతున్నాయని భావించటం లేదు. ఎందుకనగా భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం కాబట్టి ఒకప్పటి వ్యవసాయ కూలీలు కూడా నేడు వ్యవసాయ దారులుగా మారారు. కానీ ఒకప్పటి వ్యవసాయదారులు నేడు వ్యవసాయ కూలీలుగా మారలేదు. భూములు లేని వారికి కూడా భూ పంపిణీ చేసి భూ యజమానులుగా మార్చుతున్నారు.

9th Class Social Textbook Page No.67

ప్రశ్న 8.
అట్లాస్ సహాయంతో పైన పేర్కొన్న డ్యామ్ ను అవి నిర్మించబడిన నదులను భారతదేశ పటంలో గుర్తించండి.
జవాబు:

  1. భాక్రానంగల్ ప్రాజెక్టు – సట్లెజ్ నదిపై కలదు. – పంజాబ్ రాష్ట్రం
  2. దామోదర లోయపథకం – దామోదర్ నదిపై కలదు. – పశ్చిమ బెంగాల్ రాష్ట్రం
  3. హీరాకుడ్ ప్రాజెక్టు – మహానదిపై కలదు. – ఒడిషా రాష్ట్రం
  4. నాగార్జున సాగర్ ప్రాజెక్టు – కృష్ణానదిపై కలదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు
  5. గాంధీ సాగర్ – నర్మదానదిపై కలదు. మధ్యప్రదేశ్ రాష్ట్రం

AP Board 9th Class Social Solutions Chapter 6 భారతదేశంలో వ్యవసాయం 8

9th Class Social Textbook Page No.68

ప్రశ్న 9.
నూతన వ్యవసాయ విధానాలను ఏ ప్రాంతంలో మొట్టమొదటిడా అమలుచేయ ప్రయత్నించారు? దేశం మొత్తం ఎందుకు వర్తింపచేయలేదు?
జవాబు:
నూతన వ్యవసాయ విధానాలను మొట్టమొదట పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలలో అమలు చేశారు. అవి మైదాన ప్రాంతాలు కావడం వలన, మరియు సారవంతమైన నేలలు కావడం వలన ముందుగా అక్కడ అమలుచేయ ప్రయత్నించారు. అక్కడ విజయవంతం అయిన తరువాత మిగిలిన ప్రాంతాలలో ప్రవేశపెడదాం అనే భావనతో ఉండటం వలన దేశం మొత్తం వర్తింపచేయలేదు.

ప్రశ్న 10.
వర్షాధార వ్యవసాయానికి విభిన్న పద్దతులు ఎందుకు అవసరం?
జవాబు:

  1. నీటి పారుదల కలిగిన భూములలో అధిక దిగుబడి విత్తనాలే కాకుండా ఈ ప్రాంతాలు మనకు అనేక సవాళ్లు విసురుతున్నాయి.
  2. ఈ ప్రాంతాలలో పడిన వర్షపాతాన్ని సంరక్షించుకోవడం మొదటి బాధ్యత.
  3. పడిన వర్షపు నీరు వేగంగా ప్రవహించనీయకుండా చూడగలగాలి.
  4. దీని వలన నీరు భూమిలోకి ఇంకడానికి అవకాశం లభించి భూగర్భజలం వృద్ధి చెందుతుంది.
  5. వనీకరణ, కరకట్టల నిర్మాణం, చెక్ డ్యామ్ లు, చెరువుల నిర్మాణం మొదలైన కార్యక్రమాలు నీటి యాజమాన్య విధానంలో కలిసి ఉన్నాయి.

9th Class Social Textbook Page No.69

ప్రశ్న 11.
కరవు కాటకాలను అధిగమించడానికి అదనపు ఆహార నిల్వలు ఎలా సహకరిస్తాయి?
జవాబు:

  1. భారత ఆహార సంస్థ ద్వారా భారత ప్రభుత్వం గిడ్డంగులలో భారీగా ఆహార ధాన్యాలను నిల్వ చేస్తుంది.
  2. వీటిని కరవు కాటకాలు వచ్చినపుడుగాని, ఆహారధాన్యాల కొరత ఏర్పడినపుడు గాని ఉపయోగిస్తారు.
  3. ఇలా సేకరించిన ధాన్యాన్ని దేశంలో ధాన్యం అందుబాటులో లేని ప్రాంతాలకు సరఫరా చేస్తారు.

AP Board 9th Class Social Solutions Chapter 6 భారతదేశంలో వ్యవసాయం

ప్రశ్న 12.
రైతులు తమకు గల కొద్దిపాటి విస్తీర్ణంలో ఆహార ధాన్యాల దిగుబడిని ఎలా పెంచుకోగలిగారు?
జవాబు:
రైతులు అధిక మొత్తంలో ఆహార ధాన్యాలు, ఆహారేతర పంటలను ఒకే పొలంలో సాగు చేయడానికి హరితవిప్లవం తోడ్పడింది.

ప్రశ్న 13.
ఏ దశాబ్దాలలో ఆహార ధాన్యాల దిగుబడి వేగంగా పెరిగింది? దానికి సరైన కారణం ఏమై ఉండవచ్చు?
జవాబు:

  1. 1980 – 81 – 1990 – 91 దశాబ్దకాలంలో ఆహార ధాన్యాల దిగుబడి ఎక్కువగా ఉంది.
  2. కారణం హరిత విప్లవాన్ని ప్రవేశపెట్టడం.
  3. హరిత విప్లవంలో భాగంగా వివిధ అంశాలకు ప్రాధాన్యమివ్వడం.

9th Class Social Textbook Page No.71

ప్రశ్న 14.
హరిత విప్లవ సమయంలో రైతులు ఆహార ధాన్యాన్ని ఎగుమతి చేయడానికి భారత ప్రభుత్వం ఎందుకు అనుమతించలేదు?
జవాబు:

  1. భారతదేశ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి.
  2. కొరత ఏర్పడిన సందర్భంలో కేవలం ప్రభుత్వానికి మాత్రమే దిగుమతి చేసుకునే హక్కు ఉండేది.
  3. ప్రభుత్వం రైతాంగానికి కావలసిన ఉత్పాదకాలను చౌకగా అందజేయడం.
  4. వ్యవసాయ ఉత్పత్తులను కనీస మద్దతు ధరతో కొనడం.
  5. స్వదేశీ మార్కెట్ సదుపాయాన్ని కల్పించడం.
  6. వ్యవసాయం ద్వారా ఏదైన ఆదాయాన్ని కల్పించుట కొరకు.

ప్రశ్న 15.
ప్రభుత్వం ఎగుమతులను / దిగుమతులను ఎందుకు నిషేధించినది? ఈ విధానం భారతీయ రైతులకు ఏ విధంగా ఉపయోగపడింది?
జవాబు:

  1. భారతీయ వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడానికి
  2. భారతీయ రైతులు తమ ఉత్పత్తులు పెంచుకున్నారు.
  3. మార్కెట్లో గిట్టుబాటు రేటు లభించింది. తద్వారా ఆదాయం పెరిగింది.

ప్రాజెక్టు

ప్రశ్న 1.
మీ ప్రాంతంలో పండే పంటలు ఏవి ? వీటిలో ఏవి HYV వంగడాల ద్వారా, సాంప్రదాయ వంగడాల ద్వారా పెరుగుతాయి? ఈ క్రింది అంశాలను HYV వంగడాలు, సాంప్రదాయ వంగడాలతో పోల్చి చూడండి. (T.Q.)
అ) పంటకాలం ఆ) ఎన్నిసార్లు నీరందిస్తారు. ఇ) ఉత్పతి ఈ) ఎరువులు ఉ) వ్యాధులు ఊ) క్రిమి సంహారకాలు
జవాబు:
మా ప్రాంతంలో పండే పంటలు :
వరి, పెసర, మినుము, మొక్కజొన్న, జొన్న, సజ్జ మొదలగునవి. వీటిలో ఏవి HYV వంగడాల ద్వారా, సాంప్రదాయ వంగడాల ద్వారా పెరుగుతాయి అనగా ప్రస్తుతం అన్నియు HYV వంగడాల ద్వారా మాత్రమే పెరుగుతున్నాయి.

వరి :
HYV వంగడాలను ప్రవేశపెట్టడం ద్వారా తక్కువ పంటకాలంలో అధిక దిగుబడిని సాధించటానికి అవకాశమేర్పడు తుంది. ప్రాచీన సంప్రదాయ వంగడాలైతే పంటకాలం 6 నెలలు ఉంటుంది. తక్కువ దిగుబడి (ఉదా : 10 బస్తాల కన్నా తక్కువ) వస్తుంది. పెసర, మినుము, మొక్కజొన్న, జొన్న, సజ మొదలైన పంటల విషయంలో కూడా HYV వంగడాలను ప్రవేశపెట్టడం ద్వారా తక్కువ పంటకాలం అధిక దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది. మరియు అన్ని కాలాలయందు ఆయా పంటలను పండించడానికి అవకాశం ఏర్పడుతుంది.

AP Board 9th Class Social Solutions Chapter 6 భారతదేశంలో వ్యవసాయం

ప్రశ్న 2.
విద్యార్థులను రెండు జట్లుగా చేసి ఒక జట్టు వారు వ్యవసాయంలో సేంద్రియ ఎరువుల వాడకాన్ని సమర్థిస్తూ, ఇంకొక జట్టు వారు రసాయనిక ఎరువులు, పురుగు మందుల వాడకాన్ని సమర్థిస్తూ వాదనలు వినిపించండి. (డిబెట్ నిర్వహించండి.)
జవాబు:

AP Board 9th Class Social Solutions Chapter 5 జీవావరణం

SCERT AP 9th Class Social Studies Guide Pdf 5th Lesson జీవావరణం Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Social Solutions 5th Lesson జీవావరణం

9th Class Social Studies 5th Lesson జీవావరణం Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
జీవులను ఒక ప్రత్యేకమైన జీవావరణంగా వర్ణిస్తారు. వివరించండి. (AS1)
జవాబు:

  1. భూ శాస్త్రజ్ఞులు జీవాన్ని ఒక ప్రత్యేక ఆవరణంగా పరిగణిస్తారు. దీనినే “జీవావరణం” అంటారు.
  2. జీవంతో కళకళలాడే ఏకైక గ్రహం భూమి.
  3. అతి సూక్ష్మ బాక్టీరియా నుంచి అత్యంత పెద్దవైన మర్రి చెట్టు, నీలి తిమింగలాలు, ఏనుగులు వంటి జీవులు, పులులు మానవులతో భూమి విలసిల్లుతోంది.
  4. సూర్యుడికి భూమి మరీ దగ్గరగా, మరీ దూరంగా లేనందున ఇక్కడ అనువైన ఉష్ణోగ్రతలు ఉండటం.
  5. నేల, నీరు, గాలి మూడు కలిసి ఉండటం వల్ల ఒక్క భూమిపైన మాత్రమే జీవం సాధ్యమైంది. అందువల్ల జీవులతో కూడిన దానిని జీవావరణం అంటారు.

AP Board 9th Class Social Solutions Chapter 5 జీవావరణం

ప్రశ్న 2.
ఆధునిక కాలంలో పర్యావరణ సంక్షోభం సృష్టించబడుతున్నది. వాటి యొక్క ప్రభావాన్ని వివరించండి. (AS4)
(లేదా)
పర్యావరణ సంక్షోభ పరిణామాలను తెలపండి.
జవాబు:

  1. పారిశ్రామికీకరణం, వేగంగా వృద్ధి చెందుతున్న జనాభా, పట్టణీకరణ వల్ల ఖనిజాలు, అడవులు, నేల, రాళ్లు, గాలి వంటి ప్రకృతి వనరులు ఇంతకు ముందు కనీవిని ఎరగని స్థాయిలో దోపిడికి గురవుతున్నాయి.
  2. ఇదే క్రమంలో భూమిలో కోట్ల సంవత్సరాలుగా నిలవ ఉన్న ఇంధన వనరులను కొల్లగొడుతున్నారు.
  3. దీని వల్ల అడవులు వేగంగా తగ్గిపోతున్నాయి.
  4. ఖనిజ, చమురు, భూగర్భజలవనరులు అంతరించిపోతూ ఉన్నాయి.
  5. ప్రస్తుత జీవన విధానం సుస్థిరమైనది కాదని చాలా మంది శాస్త్రజ్ఞులు అంటున్నారు.
  6. ప్రకృతి వనరులను ఇదే తీరులో వినియోగించుకుంటూ పోతే మన పిల్లలు, వాళ్ల పిల్లలకు ఏమీ మిగలదు.
  7. మానవులు అభివృద్ధి, సంతోషం పేర్లతో ప్రకృతిని నాశనం చేస్తున్నారు.
  8. మానవుల వ్యాపార కార్యకలాపాల వల్ల భూమిపై ప్రతిజీవి, ప్రతి పదార్థమూ ప్రభావితం అవుతున్నాయి.
  9. ఇది ఇలాగే కొనసాగితే ఇతర జీవ జాతులకే కాక అంతిమంగా మనుషులకు కూడా ముప్పుగా పరిణమిస్తుంది.

ప్రశ్న 3.
సహజ వృక్ష సంపదను శీతోష్ణస్థితి ప్రభావితం చేస్తుంది. వివిధ రకాలైనటువంటి అడవులను, వాటిని ప్రభావితం చేసే శీతోష్ణస్థితులను వివరించండి. (AS1)
జవాబు:
AP Board 9th Class Social Solutions Chapter 5 జీవావరణం 1
AP Board 9th Class Social Solutions Chapter 5 జీవావరణం 2

ప్రశ్న 4.
అంతరించిపోతున్న అడవులను ఎలా సంరక్షించుకోవచ్చు? (AS6)
(లేదా)
అడవుల సంరక్షణకై ఏవేని రెండు మార్గాలను సూచించండి.
(లేదా)
ప్రస్తుతం అంతరించిపోతున్న అడవులను సంరక్షించుకొనుటకు నాలుగు సూచనలు రాయండి.
జవాబు:
అంతరించిపోతున్న అడవులను సంరక్షించుకొనే విధానం :

  1. పారిశ్రామిక ప్రాంతాల యందు, పాఠశాలల ఆవరణంలోను, కళాశాలల ఆవరణంలోను,ఇంటి ఆవరణంలోను, రోడ్లు కిరువైపుల, కాలువ గట్లపైన, నదుల గట్లపైన, ఖాళీస్థలాల యందు, మొక్కలను పెంచాలి.
  2. అడవుల అక్రమ నరికి వేతలను అరికట్టి ఆక్రమ రవాణాను పూర్తిగా ఆపుచేయాలి.
  3. అడవులను నరుకుతున్న ప్రదేశాల యందు మొక్కలను నాటాలి.
  4. మొక్కల పెరుగుదలకు అన్ని రకాల చర్యలు చేపట్టాలి.
  5. అడవుల ఆవశ్యకత గురించి ప్రజలకు తెలియజేయాలి.

ప్రశ్న 5.
పాఠ్యాంశాన్ని చదివి కింద పట్టిక నింపండి.
AP Board 9th Class Social Solutions Chapter 5 జీవావరణం 3
జవాబు:
AP Board 9th Class Social Solutions Chapter 5 జీవావరణం 4

ప్రశ్న 6.
ప్రపంచ పటంలో ఈ కింది దేశాలను గుర్తించండి.
1. న్యూజిలాండ్ .2. బ్రెజిల్ 3. ఆస్ట్రేలియా 4.ఉత్తర అమెరికా 5. చైనా 6. ఇండియా
జవాబు:
AP Board 9th Class Social Solutions Chapter 5 జీవావరణం 5

ప్రశ్న 7.
పేజీ నెం. 57లోని “వనరులు అంతరించిపోవడం” అంశం చదివి, వ్యాఖ్యానించండి.
జవాబు:
వనరులు అంతరించిపోవడం ఇటీవల చాలా తీవ్రమైంది. పారిశ్రామికీకరణ వేగంగా వృద్ధి చెందుతున్న జనాభా, పట్టణీకరణ వల్ల ఖనిజాలు, అడవులు, నేల, రాళ్లు, గాలి వంటి ప్రకృతి వనరులు కనీవినీ ఎరుగని రీతిలో, స్థాయిలో దోపిడీకి గురౌతున్నాయి. అదే విధంగా భూమిలో కోట్ల సంవత్సరాలుగా నిలవ ఉన్న ఇంధన వనరులు అనగా బొగ్గు, ముడిచమురు కొల్లగొడుతున్నారు. వనరులు అంతరించడం వలన అటు జీవ వైవిధ్యానికి కూడా పెను సవాలు ఎదురౌతుంది. అడవులు తగ్గిపోతూ, ఖనిజాలు, చమురు, భూగర్భజల వనరులు అంతరించిపోతున్నాయి. అభివృద్ధి ముసుగులో ప్రకృతి వనరులు అంతరించడం వల్ల భవిష్యత్తు తరాల భవిష్యత్తు చీకటిలో కొట్టుమిట్టాడుతుంది. పర్యావరణం కూడా కలుషితమౌతూ, మానవాళి మనుగడకే ముప్పు వాటిల్లుతుంది.

9th Class Social Studies 5th Lesson వాతావరణం InText Questions and Answers

9th Class Social Textbook Page No.51

ప్రశ్న 1.
గాలి, నీరు మీద మొక్కలు ఎలా ఆధారపడి ఉన్నాయో చెప్పండి ; మొక్కలు ఆ రెండింటిని ఎలా ప్రభావితం చేస్తాయో చెప్పండి.
జవాబు:

  1. అన్ని రూపాలలోని జీవులకు వాటి చుట్టూ ఉండే నేల, నీరు, గాలి, సూర్యరశ్మిలతో అవినాభావ సంబంధం ఉంది.
  2. వీటినుండి జీవం తనకు కావలసినవన్నీ పొందుతుంది, తిరిగి వాటిని గణనీయంగా ప్రభావితం చేస్తుంది.
  3. తమ చుట్టూ ఉన్న మూడు ఆవరణాలతోనే కాకుండా వివిధ జీవరూపాల మధ్య పరస్పర సంబంధాలు ఉంటాయి. ఇవన్నీ ఒక సంక్లిష్ట ‘ఆహార శృంఖలం’లో భాగం – అంటే ఒక రకమైన జీవరూపం మరొకదానికి ఆహారం అవుతుంది.
  4. అనేక రకాల జీవరూపాలు అత్యవసర పదార్థాలను ఒకదానితో ఒకటి పంచుకుంటూ పరస్పర ప్రయోజన సంబంధాలలో ఉంటాయి. వీటన్నిటికీ ఉదాహరణలు తెలుసుకుందాం.
  5. భూమి మీద ప్రాథమిక ఆహార ఉత్పత్తిదారులు మొక్కలు. సూర్యరశ్మిని ఉపయోగించుకుని ఇవి ఆహారం తయారుచేస్తాయి. వీటికి కావలసిన పోషకాలను నేలనుంచి, ప్రత్యేకించి ఇతర మొక్కలు, పశువుల వ్యర్థపదార్థాలు కుళ్లగా ఏర్పడిన సేంద్రియ మూలకాల నుంచి గ్రహిస్తాయి.
  6. నేలలో బ్యాక్టీరియా స్థిరీకరించిన నత్రజనిపై కూడా. ఇవి ఆధారపడతాయి. మొక్కలు తయారుచేసిన ఆహారాన్ని ‘శాకాహారులు’ అని పిలిచే జింక, ఆవు, మేక, ఏనుగు వంటి గడ్డి తినే జంతువులు తింటాయి.
  7. కుక్క, పిల్లి, డేగ, పులి వంటివి మాంసాహారులు, ఇవి శాకాహార జంతువులను తినడం వల్ల పరోక్షంగా మొక్కలపై ఆధారపడినవే. చనిపోయిన మొక్కలు, జంతువులు, వాటి వ్యర్థ పదార్థాలపై బ్యాక్టీరియా, శిలీంధ్రాలు వంటివి పనిచేసి సేంద్రియ మూలకాలుగా విచ్ఛిన్నం చేస్తాయి.
  8. మొక్కలు తమ ఎదుగుదలకు సేంద్రియ మూలకాలపై ఆధారపడతాయి. ఈ విధంగా జీవన చక్రం నిరంతరం కొనసాగుతూ ఉంటుంది.

AP Board 9th Class Social Solutions Chapter 5 జీవావరణం

ప్రశ్న 2.
దోమలు, సీతాకోకచిలుకలు వంటి పురుగులు రాళ్ళు లేదా మట్టి మీద, నీటి మీద ఏ విధంగా ఆధారపడి ఉన్నాయి? తిరిగి వాటిని అవి ఎలా ప్రభావితం చేస్తాయి?
జవాబు:

  1. దోమలు, సీతాకోకచిలుకలు వంటి పురుగులు రాళ్ళు లేదా మట్టి మీద, నీటి మీద ఆధారపడి ఉండటానికి కారణం దోమలు నీటి మీద నివసిస్తూ, గుడ్లు పెడుతూ తమ సంతానాన్ని వృద్ధి చేసుకుంటూ మానవుల, జంతువుల ఇతర విధములైన రక్తమును పీలుస్తూ జీవిస్తాయి.
  2. సీతాకోక చిలుకలు పుష్పాలలో మకరందాన్ని సేవిస్తూ జీవిస్తాయి. అలాగే ఇతర క్రిమికీటకాదులు తమతమ రీతులలో జీవనం చేస్తాయి.

9th Class Social Textbook Page No.55

ప్రశ్న 3.
మీ పరిసరాల్లో గట్టి కలప, మెత్తటి కలపతో చేసిన వస్తువులను గుర్తించండి.
జవాబు:
గట్టి కలపతో చేసిన వస్తువులు :
తలుపులు, కిటికీలు, మంచాలు, కుర్చీలు, బల్లలు, సోఫాలు, వివిధ రకాలైన గృహోపకరణాలు.

మెత్తటి కలపతో చేసినవి :
అగ్గి పుల్లలు, ప్యాకేజింగ్ పెట్టెలు.

ప్రశ్న 4.
మీ ప్రాంతంలో ఉండే చెట్ల పేర్లతో పాటు వాటి గురించి తెలుసుకోండి.
జవాబు:
మా ప్రాంతంలో ఉండే చెట్లు
మామిడి : కాయలు, కలపనిస్తుంది.
వేప : ఆరోగ్యప్రదాయిని, కలప, ఔషధాల సపోటానిస్తుంది.
చింత : కలప, చింతపండుకు ఉపయోగపడుతుంది.
సరుగుడు : కలపనిస్తుంది.
జీడిమామిడి : జీడిపప్పునిస్తుంది.
జామ : కాయలు, కలపనిస్తాయి.
సపోటా : కాయలనిస్తుంది.
ద్రాక్ష : పండ్లనిస్తుంది.
బాదం : పప్పునిస్తుంది.
మఱ్ఱి : కలపనిస్తుంది.

ప్రశ్న 5.
ప్రపంచ పటంలో ఎడారి ప్రాంతాలను గుర్తించండి.
జవాబు:

  1. సహారా ఎడారి
  2. కలహారి ఎడారి
  3. థార్ ఎడారి
  4. అరేబియన్ ఎడారి
  5. ఆస్ట్రేలియన్ ఎడారి
  6. అటకామా ఎడారి
  7. సోనోరన్ ఎడారి

AP Board 9th Class Social Solutions Chapter 5 జీవావరణం 6

9th Class Social Textbook Page No.56

ప్రశ్న 6.
వ్యవసాయం, పశుపోషణ మొదలు పెట్టినప్పుడు మనుషులు తమ చుట్టూ ఉన్న భూమి, నీరు, మొక్కలు, జంతువులను ఏ విధంగా ప్రభావితం చేసి ఉంటారో చర్చించండి.
జవాబు:

  1. మానవులు వ్యవసాయం, పశుపాలన మొదలు పెట్టినప్పుడు, పర్యావరణాన్ని మరింతగా ప్రభావితం చేయసాగారు.
  2. ఇత్తడి, ఇనుము వంటి లోహాల వినియోగం, నగరాల నిర్మాణంతో, పర్యావరణంతో మానవ సంబంధాలు మారిపోయాయి.
  3. అనతి కాలంలోనే ప్రజలు నీళ్లు నిల్వచేయటానికి చెరువులు, పొలాలకు నీళ్ళు ‘ మళ్లించటానికి కాలువలు, నదులకు ‘ అడ్డంగా ఆనకట్టలు వంటివి నిర్మించటం మొదలు పెట్టారు.
  4. వివిధ ప్రాంతాలను కలుపుతూ ప్రజలు రహదారులు వేశారు.
  5. మహా సముద్రాల మీద ఓడలు, పడవలతో ప్రయాణం చేశారు.

ప్రశ్న 7.
వాళ్లు ఏ ఇంధన వనరులను ఉపయోగించి ఉంటారు? వాటిని ఎలా పొంది ఉంటారు?
జవాబు:

  1. ఇంధన వనరుల కోసం పారిశ్రామిక దేశాలు ప్రపంచమంతటా వెదకసాగాయి.
  2. వాళ్లు ప్రపంచమంతా అన్వేషించి అన్ని రకాల వనరుల జాబితా తయారు చేశారు.
  3. లోతైన బావులు తవ్వి భూమి లోపల పొరల్లో ఏముందో చూశారు.
  4. అనతి కాలంలోనే భూమి అంతటా పెద్ద ఎత్తున గనుల తవ్వకం, అడవులు నరికి వేయటం, కర్మాగారాల నిర్మాణం, రోడ్లు వేయటం, వ్యవసాయ పొలాలుగా మార్చటం వంటివి చేపట్టారు.

AP Board 9th Class Social Solutions Chapter 5 జీవావరణం

ప్రశ్న 8.
నగరాలు నిర్మించటం వల్ల వాటి చుట్టూ నేల, నీళ్లు ఏ విధంగా ప్రభావితమై ఉంటాయి?
జవాబు:

  1. నగరాలు నిర్మించటం. వల్ల, పరిశ్రమలు స్థాపించటం వల్ల, జనాభా పెరుగుదల వల్ల ఖనిజాలు, అడవులు, నేల, రాళ్లు, గాలి వంటి ప్రకృతి వనరులు ఇంతకు ముందు కనీవినీ ఎరగని స్థాయిలో దోపిడికి గురవుతున్నాయి.
  2. నేల, నీళ్ళు కలుషితం అవుతున్నాయి.
  3. నేల వేడెక్కుతుంది. నీళ్ళు కలుషితం అవుతున్నాయి. వీటి వలన మానవుల జీవితం రోగాల బారిన పడుతుంది.
  4. శిలాజ ఇంధనాలను ఉపయోగించటం వల్ల ఆధునిక పరిశ్రమలు ఘన, ద్రవ,వాయు రూపాలలో వ్యర్థ పదార్థాలను విడుదల చేసి గాలి, నీరు, నేలను కలుషితం చేస్తున్నాయి.

ప్రశ్న 9.
భూమి స్వరూపాన్ని, నీటి చక్రాన్ని ఇది ఏ విధంగా ప్రభావితం చేస్తోంది?
జవాబు:

  1. కాలుష్యాల వల్ల కొంతకాలానికి మన పర్యావరణం విషపూరితం అవుతుంది.
  2. ముఖ్యమైన మార్పు ప్రపంచ వ్యాప్తంగా శీతోష్ణస్థితులు మారటం.
  3. దీనినే ప్రపంచం వేడెక్కటం అంటున్నారు.
  4. దీనితో వర్షాలు తగ్గిపోతున్నాయి.
  5. కాలుష్యం పెరిగిపోతుంది.
  6. మంచి నీటి ప్రవాహం ఏర్పడుతుంది.
  7. మరొక వైపు ధృవాల వద్ద మంచు సముద్రాల నీటి మట్టం పెరిగి దీవులు జలమయం అవుతాయి.
  8. శిలాజ ఇంధనాలను ఉపయోగించటం వల్ల బొగ్గు పులుసు వాయువుతో పాటు నైట్రోజన్ ఆక్సైడ్, సల్ఫర్ డై ఆక్సైడ్, ఆవిరై పోయే కర్బన మూలకాలు, భార లోహాలు వంటి ఇతర రసాయనాలు విడుదలవుతాయి.
  9. వీటి వల్ల గంధిక, కర్బన, నత్రిత ఆమ్లాలు విడుదలై ఆమ్ల వర్షాలు కురుస్తాయి. దీనితో జలచక్రం దెబ్బతింటుంది.

ప్రాజెక్టు

ప్రశ్న 1.
దగ్గరలోని పరిశ్రమను సందర్శించి దానినుంచి వెలువడుతున్న వాయు, ద్రవ, ఘన వ్యర్థ పదార్థాలను గమనించండి. వాటి వల్ల మొక్కలు, పశువులు ఏ విధంగా ప్రభావితం అవుతున్నాయో చుట్టుపక్కల ఉంటున్న వాళ్ళను అడిగి తెలుసుకోండి. సేకరించిన సమాచారాన్ని ఆధారం చేసుకొని ఒక నివేదిక తయారుచేసి తరగతిలో ప్రదర్శించండి.
జవాబు:

  1. మాకు దగ్గరలోని రవాణా పరికరాలు తయారుచేసే పరిశ్రమను సందర్శించడం జరిగింది.
  2. ఈ పరిశ్రమ బొగ్గు, చమురు నుంచి వచ్చే ఇంధనాలను పెద్ద ఎత్తున వినియోగిస్తారు.
  3. ఈ విధంగా శిలాజ ఇంధనాలను ఉపయోగించటం వల్ల బొగ్గుపులుసు వాయువుతో పాటు నైట్రోజన్ ఆక్సెడ్, సల్ఫర్ డై ఆక్సైడ్, ఆవిరైపోయే కర్బన మూలకాలు, భారీ లోహాలు వంటి ఇతర రసాయనాలు విడుదలవుతాయి.
  4. వీటివల్ల గంధిక, కర్బన, నత్రిత ఆమ్లాలు విడుదలై, దాని ఫలితంగా ఆమ్ల వర్షాలు కురుస్తాయి.
  5. ఈ పరిశ్రమ ఘన, ద్రవ, వాయు రూపాలలో వ్యర్థ పదార్థాలను విడుదల చేసి గాలి, నీటి (వాగులు, నదులు) వంటి ఉపరితల ప్రవాహాలను, బావులలోని భూగర్భ జలాలను నేలను కలుషితం చేస్తున్నాయి.
  6. ఇలాంటి కాలుష్యం వల్ల కొంత కాలానికి పర్యావరణం వేడెక్కుతుంది, శీతోష్ణస్థితులు మారిపోతాయి.
  7. ఈ ప్రభావం మొక్కలు, జంతువులు, మానవుల పై పడుతుంది.

ప్రశ్న 2.
మీ ప్రాంతంలో లేదా మీ గ్రామంలో అంతరించిపోతున్న జంతువులు లేదా పక్షులు వివరాలను సేకరించి, క్రింది పట్టికలో నింపి, తరగతి గదిలో చర్చించండి. అందుకు మీ తల్లిదండ్రుల, పెద్దల సహకారం తీసుకోండి.
AP Board 9th Class Social Solutions Chapter 5 జీవావరణం 7
జవాబు:

AP Board 9th Class Social Solutions Chapter 3 జలావరణం

SCERT AP 9th Class Social Studies Guide Pdf 3rd Lesson జలావరణం Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Social Solutions 3rd Lesson జలావరణం

9th Class Social Studies 3rd Lesson జలావరణం Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
భిన్నంగా ఉన్న దానిని గుర్తించి మీ ఎంపికకు కారణాన్ని వివరించండి. (AS1)
i) అ) బాష్పీభవనం ఆ) ద్రవీభవనం ఇ) లవణీకరణ ఈ) అవపాతం
జవాబు:
ఇ) భిన్నంగా ఉన్నది లవణీకరణ.
బాష్పీభవనం :
నేలమీదనున్న నీరు ఆవిరి కావటం ద్వారా వాతావరణంలోకి ప్రవేశించే ప్రక్రియలో నీరు ద్రవరూపం నుంచి వాయు రూపంలోకి మారడాన్ని బాష్పీభవనం అంటారు.

ద్రవీభవనం :
రవాణా చేయబడిన నీటి ఆవిరి ద్రవీభవనం చెంది చిన్న నీటి బిందువులుగా, మబ్బులుగా మారడాన్ని ద్రవీభవనం అంటారు.

అవపాతం :
అవపాతం అనగా వాతావరణంలోని నీరు భూమి ఉపరితలానికి చేరటం.
పై మూడు ఒకే తరగతికి చెందిన ప్రక్రియలు. కాబట్టి లవణీకరణ భిన్న ప్రక్రియ.

లవణీకరణ :
అనగా సముద్రనీటిలో ఉన్న ఉప్పదనం. ఉప్పు రుచిని చూపిస్తుంది.

ii) అ) ఫలకాలు ఆ) అపకేంద్రబలం ఇ) సౌరశక్తి ఈ) అవపాతం
జవాబు:
అ) భిన్నంగా ఉన్నది ఫలకాలు.
ఫలకాలు రెండవ పాఠ్యాంశానికి చెందిన అంశం.

ఆ) అపకేంద్ర బలం ఇ) సౌరశక్తి ఈ) అవపాతం
ఈ మూడు ఈ పాఠ్యాంశానికి సంబంధించిన అంశాలు.

AP Board 9th Class Social Solutions Chapter 3 జలావరణం

ప్రశ్న 2.
తప్పు వాక్యాలను సరిచేయండి. (AS1)
అ) సముద్రాలకు దగ్గరగా సముద్రపు అగాధాలు ఉంటాయి.
ఆ) మైదాన ప్రాంతంలో మాదిరిగానే సముద్రాలలోనూ ఉపరితల రూపాలు ఉంటాయి.
ఇ) శతాబ్దాలుగా భూమి మీద నుంచి కొట్టుకురావటం వల్ల సముద్రాలలో, అధికశాత లవణం ఏర్పడింది.
ఈ) ప్రపంచమంతటా మహాసముద్రాల నీళ్ళు ఒకే ఉష్ణోగ్రతను కలిగి ఉంటాయి.
జవాబు:
అ) సముద్రాలకు దగ్గరగా సముద్రపు అగాధాలు ఉంటాయి. ఇది సరైన వాక్యము కాదు.
జవాబు:
సముద్ర అగాధాలు సముద్రపు మధ్య భాగంలో కాకుండా ఖండాలకు దగ్గరగా ఉంటాయి.

ఆ) మైదాన ప్రాంతంలో మాదిరిగానే సముద్రాలలోను ఉపరితల రూపాలు ఉంటాయి.
జవాబు:
ఇది సరైన వాక్యము.

ఇ) శతాబ్దాలుగా భూమి మీద నుంచి కొట్టుకురావటం వల్ల సముద్రాలలో, అధికశాత లవణం ఏర్పడింది.
జవాబు:
ఇది సరైన వాక్యము.

ఈ) ప్రపంచమంతటా మహాసముద్రాల నీళ్ళు ఒకే ఉష్ణోగ్రతను కలిగి ఉంటాయి. ఇది సరైన వాక్యము కాదు.
జవాబు:
సముద్రపు లోతుల్లోకి వెళ్తున్న కొద్దీ ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. మొదటి కిలోమీటరు లోతుకి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతాయ.

ప్రశ్న 3.
మీరు నివసిస్తున్న ప్రాంతంపై సముద్ర తరంగాలు చూపే ఒక ప్రభావాన్ని వివరించండి. (AS6)
జవాబు:
మన దక్షిణ భారతదేశంపై సముద్ర ప్రవాహాలు నేరుగా కాకుండా పరోక్షంగా ప్రభావాన్ని చూపుతున్నాయి. భూమితో పోలిస్తే సముద్రాల మీద ఉష్ణోగ్రతలలో కొద్దిపాటి తేడాలే ఉంటాయి. ఈ ఉష్ణోగ్రతల తేడాల వల్ల సముద్ర ప్రవాహాలు ఏర్పడుతున్నాయి. ఈ – ఉష్ణోగ్రతలలో తేడాల వల్ల మా ప్రాంతంపై నైరుతి రుతుపవనాలు ప్రభావితమవుతున్నాయి. ఈ ప్రభావం వలన వర్షాలు, తుపానులు మా ప్రాంతంలో వస్తున్నాయి.

ప్రశ్న 4.
భూమిని నీలిగ్రహం అనడం సరైనదేనా? సముద్రాలను ప్రభావితం చేసే మీ చర్యల్లో ఒకదానిని వివరించండి. (AS1)
జవాబు:
భూమిని నీలిగ్రహం అనడం సరైనదే. కారణం ఇప్పటి వరకు నీరు ఉన్న గ్రహం భూమి మాత్రమే. అందువల్ల భూమిని జలయుత గ్రహం అంటారు.

సముద్రాలను ప్రభావితం చేసే మానవచర్యలు :

  1. భూమి మీద మానవుడు అనేక రకాల రసాయనాలను ఉపయోగిస్తున్నాడు. . వీటివలన సముద్రజలం కలుషితం అవుతుంది.
  2. భూమి మీద మానవుడు అనేక రకాల యంత్రాలను ఉపయోగించడం వలన అవి విడుదల చేసే వాయువుల వల్ల వాతావరణం వేడెక్కుతుంది. దానితో ధ్రువాల వద్ద ఉన్న మంచు కరిగి సముద్రాలలోనికి ప్రవేశిస్తుంది.
  3. దానితో సముద్రాల నీటిమట్టం పెరుగుతుంది. భూమి మీద తక్కువ ఎత్తులో ఉన్న దీవులు ముంపునకు గురౌతున్నాయి.

AP Board 9th Class Social Solutions Chapter 3 జలావరణం

ప్రశ్న 5.
సముద్రాల లవణీయతలో వ్యత్యాసాలు ఎందుకు ఉంటాయి? (AS1)
జవాబు:
సముద్రంలోని అధిక శాతం ఉప్పు నేల నుంచే వచ్చింది. లక్షల సంవత్సరాలపాటు సోడియం క్లోరైడ్ మూలకం ఉన్న కొండలపై వర్షంపడి వాగులు, నదులు ప్రవహించి దానిని సముద్రంలోకి చేర్చాయి. మహాసముద్రాలలోని ఉప్పు కొంతవరకు సముద్రపు అగ్ని పర్వతాల నుంచి, జల-ఉష్ణదారుల నుంచి వస్తుంది. సాధారణంగా సముద్రాల లవణీయతలో వ్యత్యాసాలు ఎందుకు ఉంటాయంటే ………………..

  • నీరు ఆవిరి కావటం, అవపాతాలలో తేడాలు వలన
  • తీర ప్రాంతంలో నదుల నుంచి ప్రవహించే మంచినీళ్ళు, ధృవప్రాంతాలలో మంచు గడ్డకట్టటం, కరగటంలో తేడాలు వలన
  • నీటిని ఇతర ప్రాంతాలకు తరలించే గాలుల వలన.
  • సముద్రపు ప్రవాహాలు / తరంగాల వలన వచ్చే తారతమ్యాల వలన లవణీయతలో తేడాలు కానవస్తాయి.

ప్రశ్న 6.
మానవ మనుగడ మహాసముద్రాలతో ఏ విధంగా ముడిపడి ఉంది? (AS6)
(లేదా)
సముద్రాలు మానవ జీవితాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాయి?
జవాబు:
భూమి మీద అధిక శాతం జీవులు నీటిలో ఉన్నాయి. నీటిలో ఉన్న అన్ని జీవాలను గుర్తించే ప్రక్రియను మానవులు ఇంకా పూర్తి చేయలేదు. పురాతన కాలం నుంచి మానవులు తమ ఆహారం కోసం, జీవనోపాధి కోసం సముద్రాలపై ఆధారపడేవారు. అనంతమైన ఉప్పు, మత్స్య సంపదను సముద్రాలు అందిస్తాయి. ఇసుక, గులక రాళ్ళు వంటి వాటిని ఇళ్ళకు, పరిశ్రమలలో ఉపయోగిస్తారు. క్లోరిన్, ఫ్లోరిన్, అయోడిన్ వంటి ఖనిజాలను మానవులు సముగ్రాల నుంచి వెలికి తీస్తున్నారు. సముద్ర అలలతో విద్యుత్ ను ఉత్పత్తి చేస్తున్నారు. సముద్రగర్భం నుంచి చమురు వెలికి తీస్తున్నారు. సముద్రం నుంచి ముత్యాలు, రత్నాలు కూడా లభిస్తున్నాయి. శతాబ్దాలుగా సముద్ర తీరాలలో నాగరికతలు వెల్లివిరిశాయి. సముద్రఁ పై ప్రయాణాలు చేస్తూ దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు ఏర్పడ్డాయి.

ప్రశ్న 7.
ఓ నెం. 35లోని పటాన్ని పరిశీలించి, కొన్ని ఉష్ణ, శీతల ప్రవాహాలను రాయండి. (AS5)
AP Board 9th Class Social Solutions Chapter 3 జలావరణం 1
జవాబు:
ఉష్ణప్రవాహాలు

  1. కురోషివో సముద్ర ప్రవాహం
  2. తూర్పు ఆస్ట్రేలియా సముద్ర ప్రవాహం
  3. కరేబియన్ సముద్ర ప్రవాహం
  4. మెక్సికన్ గల్ఫ్ సముద్ర ప్రవాహం
  5. బ్రెజిల్ సముద్ర ప్రవాహం
  6. పాక్ లాండ్ సముద్ర ప్రవాహం
  7. భారతీయ ప్రతి ప్రవాహం
  8. మడగాస్కర్ సముద్ర ప్రవాహం
  9. మెజబిక్ సముద్ర ప్రవాహం

శీతల ప్రవాహాలు

  1. కురైల్ ప్రవాహం
  2. పెరువియన్ సముద్ర ప్రవాహం
  3. లాబ్రడార్ సముద్ర ప్రవాహం
  4. బెంగ్యులా సముద్ర ప్రవాహం
  5. అసలహాన్ సముద్ర ప్రవాహం

AP Board 9th Class Social Solutions Chapter 3 జలావరణం

ప్రశ్న 8.
పేజి నెం. 33, 34లోని ‘వనరులుగా మహాసముద్రాలు’ అంశం చదివి, వాఖ్యానించండి. (AS2)
జవాబు:
మానవ జీవితంలో అతి ప్రధానమైన అంశం వనరులుగా మహాసముద్రాలు. ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. అనాదిగా మానవుడు సముద్రాల మీదనే ఆధారపడి జీవనం సాగిస్తున్నాడు. అతి ప్రధానమైన నాగరికతలన్నీ సముద్ర తీరాలలోనే వెలిశాయి. అతి విలువైన, అతి ఖరీదైన ముత్యాలు, రత్నాలు వంటి అమూల్యమైన వస్తువులకు సముద్రాలే ఆధారం. అతి ప్రధానమైన విద్యుత్ ఉత్పత్తికి సముద్రాలే కారకాలు. పెట్రోలియం వంటి అతి విలువైన ఖనిజ వనరులకు సముద్రాలే కీలకాధారం. మత్స్య సంపదను మన దేశానికే కాకుండా ఇతర దేశాలకు ఎగుమతి చేసి విదేశీ మారక ద్రవ్యాన్ని సముపార్జించి పెడుతున్నాయి.

అయితే ఇటీవలి కాలంలో సముద్రాలు కూడా కలుషితమౌతూ, దోపిడీకి గురౌవుతున్నాయి. తిమింగలాల వంటి పెద్ద జంతువులు అంతరించిపోతున్నాయి. ప్లాస్టిక్, ఇతర వ్యర్థ పదార్థాలు సముద్రాలలో పారవేస్తూ వాటిని కలుషితం చేస్తున్నారు.

9th Class Social Studies 3rd Lesson జలావరణం InText Questions and Answers

9th Class Social Textbook Page No.32

ప్రశ్న 1.
బాల్టిక్ సముద్రంలో తక్కువ లవణీయత ఉండటానికి గల కారణాలను పేర్కొనండి.
జవాబు:
బాల్టిక్ సముద్రంలో తక్కువ లవణీయత ఉండటానికి గల కారణాలు :

  1. నదులు వచ్చి ఎక్కువగా కలుస్తాయి.
  2. హిమానీనదాలు కలుస్తాయి.
  3. మంచు కరిగి ఆ నీరు వచ్చి ఎక్కువగా కలుపుంది. 4) నీరు చాలా తక్కువగా ఆవిరి అవుతుంది.
    అందువలన బాల్టిక్ సముద్రంలో తక్కువ లవణీయత ఉంటుంది.

ప్రాజెక్టు

ప్రశ్న 1.
పసిఫిక్, అట్లాంటిక్ హిందూ మహాసముద్రాలలో కనపడే ప్రవాహాల జాబితా తయారుచేయండి. వివిధ మహాసముద్రాలలోని ఉష్ణ, శీతల ప్రవాహాలను గుర్తించి క్రింది పట్టికలో నమోదు చేయండి.
AP Board 9th Class Social Solutions Chapter 3 జలావరణం 2
జవాబు:
AP Board 9th Class Social Solutions Chapter 3 జలావరణం 3

AP Board 9th Class Social Solutions Chapter 2 భూమి – ఆవరణములు

SCERT AP 9th Class Social Studies Guide Pdf 2nd Lesson భూమి – ఆవరణములు Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Social Solutions 2nd Lesson భూమి – ఆవరణములు

9th Class Social Studies 2nd Lesson భూమి – ఆవరణములు Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
ఖాళీలను పూరించండి. (AS1)
1. జలావరణం …………………………….. సంబంధించినది.
2. శిలావరణం ………………………… సంబంధించినది.
3. వాతావరణం ……………………….. సంబంధించినది.
4. జీవావరణం ……………………….. సంబంధించినది.
జవాబు:

  1. నీటికి
  2. శిలలకు
  3. వాయువులకు
  4. జీవులకు

ప్రశ్న 2.
శిలావరణం నేపథ్యంలో కింద ఇచ్చిన వాటిలో సరిపోనిది ఏమిటి? మీ ఎంపికకు కారణం పేర్కొనండి. (AS1)
‘బైసన్ గార్జ్, గ్రాండ్ కాన్యన్, థార్ ఎడారి
జవాబు:
థార్ ఎడారి శిలావరణం నేపథ్యానికి సరిపోదు.

కారణాలు :
థార్ ఎడారి అంతా ఇసుకతో ఏర్పడినది.
ఇక్కడ ఏ విధమైన రాతి పొరలు భూ ఉపరితల భాగంలో లేవు.
అందువలన ఇది శిలావరణం నేపథ్యానికి సరిపోదు.

AP Board 9th Class Social Solutions Chapter 2 భూమి – ఆవరణములు

ప్రశ్న 3.
శిలావరణం ఎలా ఏర్పడింది? (AS1)
జవాబు:

  1. శిలావరణం ఏర్పడిన విధానము : భూమిలో ఘనీభవించిన పొర, లేదా గట్టిగా ఉండే పై పొర ఇది.
  2. దీంట్లో రాళ్ళు, ఖనిజ లవణాలు ఉండి మందపాటి మట్టి పొర ఉంటుంది.
  3. ఈ ఆవరణాన్ని ఇంగ్లీషులో ,లితోస్పియిర్ అంటారు. లితో అంటే గ్రీకు భాషలో రాయి లేదా శిల అని అర్థం.
  4. ‘స్పేయిరా’ గోళం లేదా బంతి అని అర్థం. అనగా ఈ పొర చదునుగా ఉండే ఉపరితలం కాదు.
  5. ఎత్తైన కొండలు, పీఠభూములు, మైదాన ప్రాంతాలు, లోయలు నీటితో నిండిన లోతైన అగాధాలు వంటివి ఉండటం మీరు మ్యాపుల్లో చూసే ఉంటారు.
  6. వీటిల్లో పలు అంశాలు గాలి, నీటి ప్రభావాల వల్ల రూపుదిద్దుకున్నాయి.
  7. ఈ పై పొరలోని కొంత భాగం దుమ్ము వంటి వాటి రూపంలో గాలిలో కలిసి ఉంటుంది.

ప్రశ్న 4.
ఖండ ఫలకాలు ఎలా ఏర్పడ్డాయి? అవి అంతిమంగా ఎలా అంతరించిపోతాయి? (AS1)
జవాబు:

  1. ఎన్నో సంవత్సరాల సునిశిత అధ్యయనం ద్వారా ఖండాలు, మహాసముద్రాలు కూడా “ఫలకాలు” అనే అతి పెద్ద రాళ్ళ మీద ఉన్నాయని శాస్త్రజ్ఞులు తెలుసుకున్నారు.
  2. భూమిలో పెద్ద ఫలకాలు, అనేక చిన్న ఫలకాలు ఉన్నాయి.
    పెద్ద ఫలకాలకు ఉదా : ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఇండో – ఆస్ట్రేలియా, అంటార్కిటిక్, యూరేసియా, పసిఫిక్. చిన్న ఫలకాలకు ఉదా : నాజ్ కా, అరేబియా వంటివి.
  3. ఈ ఫలకాలు వాస్తవంగా మధ్య పొరమీద తేలుతూ ఉంటాయి. ఇవి నిరంతరం నెట్టబడుతూ ఉంటాయి.
  4. అందువల్ల అవి మెల్లగా కదులుతూ ఉంటాయి.
  5. అవి చాలా నిదానంగా కదులుతూ ఉంటాయి. కాబట్టి వాటి కదలిక మనకు తెలియదు.
  6. ఈ కదలిక ఫలితంగా ఒక ఫలకం పక్కనున్న మరొక ఫలకాన్ని నెడుతూ ఉంటుంది.
  7. రెండు ఫలకాలు కలిసే చోట ఒకదానినొకటి నెట్టుకుంటాయి. ఒక దాని మీద మరొకటి ఎంతో ఒత్తిడి చూపుతుంది.
  8. ఒక ఫలకం కిందికి మధ్య పొరలోకి వెళితే మరొక ఫలకం పైకి నెట్టబడి పర్వత శ్రేణులు ఏర్పడతాయి.
  9. ఈ ఫలకాల కదలికను ఫలక చలనాలు అంటారు. ఈ ప్రక్రియ వల్ల భూకంపాలు వంటివి సంభవిస్తాయి.

ప్రశ్న 5.
నదీ ప్రభావం వల్ల ఏర్పడే భూస్వరూపాలను పేర్కొనండి. (AS1)
జవాబు:
నదీ ప్రభావం వల్ల ఏర్పడే భూస్వరూపాలు :

  1. ఎత్తైన కొండలలో నది పుట్టిన చోటు నుంచే దాని ప్రభావం మొదలవుతుంది.
  2. వాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో నదీ ప్రవాహం వేగంగా ఉండి కొండను నిలువుగా కోతకు గురిచేస్తుంది.
  3. దీని ఫలితంగా లోతైన లోయ ఏర్పడుతుంది. ఇది కింద సన్నగా పైగా వెడల్పుగా ఉంటుంది. దీనిని సాధారణంగా “V” ఆకారపు లోయ అంటారు.
  4. రాళ్ళు చాలా గట్టిగా ఉన్న ప్రాంతాలలో నది తన ప్రవాహ మార్గాన్ని సన్నటి, లోతైన లోయగా కోస్తుంది.
  5. దీని అంచులు నిటారుగా ఉంటాయి. వీటిని “గార్జెస్” అంటారు.
  6. మరొక ముఖ్యమైన రూపాన్ని ‘అగాధదరి అంటారు. దీనిలో నది అంచులు తీవ్ర వాలుతో చాలా లోతుకు కోతకు గురవుతాయి. అగాధదరిలో కింద కంటే పై భాగం ఎక్కువ వెడల్పుగా ఉంటుంది.
  7. వాలులో తేడాలు బాగా ఎక్కువగా ఉండే పర్వత ప్రాంతాలలో జలపాతాలు అధిక సంఖ్యలో ఉంటాయి.
  8. జలపాతంలో నీళ్లు ఎంతో శక్తితో కిందకు పడతాయి. ఆ నీళ్లు కిందపడే చోట “దుముకు మడుగు” ఏర్పడుతుంది.
  9. నదికి వరదలు వచ్చినపుడు అది నేలను కోతకు గురిచేస్తుంది. వరద తగ్గుముఖం పట్టినపుడు కోసిన మట్టిని వేరేచోట మేట వేస్తుంది. దీనిని “ఒండ్రు” అంటారు.
  10. మెలిక తిరిగిన భాగం నది నుంచి తెగిపోయి ఒక చెరువులాగా ఏర్పడుతుంది. ఇటువంటి వాటిని ‘ఆక్స్ బౌ సరస్సు’ అంటారు.
  11. సముద్రాన్ని నది చేరుకున్నప్పుడు దాంట్లో మేటవేయని రేణువులు ఉంటే అవి నదీ ముఖంలో మేట వేయబడి డెల్టా ప్రాంతం ఏర్పడుతుంది.

AP Board 9th Class Social Solutions Chapter 2 భూమి – ఆవరణములు

ప్రశ్న 6.
కింద పేర్కొన్న విధంగా పట్టిక తయారుచేసి సమాచారాన్ని నింపండి. భూమి బయటి మార్పుల నేపథ్యంలో మీకు కనిపించే తేడాలు, పోలికలను వివరించడానికి ఒక పేరా రాయండి. (AS3)
జవాబు:
AP Board 9th Class Social Solutions Chapter 2 భూమి – ఆవరణములు 1

ప్రశ్న 7.
మీ పరిసరాల్లో హిమానీనదాలు ఎందుకు కనిపించవు? (AS1)
జవాబు:

  1. హిమాలయాలు, ఆల్బ్ వంటి బాగా చలిగా ఉండే ప్రాంతాలలో మంచు బాగా కురుస్తుంది.
  2. అక్కడ వర్షానికి బదులు మంచు కురుస్తుంది.
  3. మంచు పోగుబడి గడ్డగా మారుతుంది.
  4. అలా పోగుపడుతున్న క్రమంలో అది కింది వైపు మెల్లగా కదలటం మొదలు పెడుతుంది.
  5. అలా ప్రయాణించి కొంచెం వెచ్చగా ఉండే ప్రాంతాన్ని చేరుకునే సరికి మంచు కరిగి చిన్న నది మొదలవుతుంది.
  6. హిమాలయాలలోని గంగోత్రి హిమానీనదం నుంచి గంగానది ఈ విధంగానే ఏర్పడుతుంది.
  7. మా పరిసరాల్లో హిమానీనదాలు ఎందుకు లేవు అనగా ఇక్కడ హిమాలయాలు, ఆల్బ్ వంటి బాగా చలిగా ఉండే ప్రాంతాలు లేవు.
  8. అందువలన మా ప్రాంతాల్లో హిమానీనదాలు లేవు.

ప్రశ్న 8.
బీలు ఎలా ఏర్పడతాయి? కొన్ని బీచ్ పేర్లు రాయండి.
జవాబు:
సముద్ర అలలు తీరం వెంట మేటవేసే పదార్థాల వల్ల బీచ్లు ఏర్పడతాయి.
ఉదా: విశాఖపట్టణంలోని రామకృష్ణ బీచ్
మచిలీపట్నంలోని మంగినపూడి బీచ్
చెన్నైలోని మెరీనా బీచ్

ప్రశ్న 9.
ఏడారుల విస్తరణకు మానవ జీవన విధానం ఏ విధంగా కారణమౌతున్నది?
జవాబు:
ఏడారుల విస్తరణకు మానవ జీవన విధానం ప్రధాన కారణం
కారణాలు :

  1. పారిశ్రామిక విప్లవం తరువాత పరిశ్రమల స్థాపన సంఖ్య పెరిగింది.
  2. పరిశ్రమల నుండి విడుదలయ్యే కార్బన్ మోనాక్సైడ్ వంటి వాయువుల వల్ల వాతావరణం వేడెక్కుతుంది.
  3. అలాగే మానవుని రవాణా సాధనాల సంఖ్య, మోటారు వాహనాల సంఖ్య విపరీతంగా పెరిగింది.
  4. దీంతో ఈ రవాణా సాధనాలు విడుదల చేసే కార్బన్ మోనాక్సైడ్ వంటి వాయువుల వల్ల వాతావరణం వేడెక్కుతుంది.
  5. అలాగే మానవుని విలాస జీవితానికి ఆలవాలమైన రిఫ్రిజిరేటర్లు, కూలర్లు, ఎయిర్ కండిషన్స్ సంఖ్య నానాటికి పెరుగుతుండడంతో అవి విడుదలచేసే వాయువుల వల్ల కూడా వాతావరణం వేడెక్కుతుంది.

ఈ విధంగా వాతావరణం వేడెక్కడం వల్ల వర్షపాతం తగ్గిపోతుంది. వర్షపాతం తగ్గిపోవడం వల్ల భూ ఉపరితలం ఎడారిగా మారిపోతుంది. కావున ఎడారుల విస్తరణకు మానవ జీవన విధానం ప్రధాన కారణం.

AP Board 9th Class Social Solutions Chapter 2 భూమి – ఆవరణములు

ప్రశ్న 10.
ఇవి ఏ శ్రేణి భూస్వరూపాలలో తెలియజేయండి. (AS1)
జవాబు:

భూ స్వరూపం భూస్వరూప శ్రేణి
1. హిమాలయ పర్వతాలు రెండవ శ్రేణి భూస్వరూపం
2. పసిఫిక్ మహాసముద్రం మొదటి శ్రేణి భూస్వరూపం
3. ఆసియా ఖండం మొదటి శ్రేణి భూస్వరూపం
4. బైసన్ గార్జ్ మూడవ శ్రేణి భూస్వరూపం
5. జోగ్ జలపాతం మూడవ శ్రేణి భూస్వరూపం
6. రాఖీ పర్వతాలు రెండవ శ్రేణి భూస్వరూపం
7. హిందూ మహాసముద్రం మొదటి శ్రేణి భూస్వరూపం
8. గొప్ప విధీర్ణధరి మూడవ శ్రేణి భూస్వరూపం

ప్రశ్న 11.
పటం – 2ను చూసి ప్రపంచ పలకలను గీయండి.
జవాబు:
AP Board 9th Class Social Solutions Chapter 2 భూమి – ఆవరణములు 2

ప్రశ్న 12.
ఓ నెం. 20 లోని (ప్రవహిస్తున్న …….. క్రమక్షయం అని అంటారు) క్రమక్షయం పేరాను చదివి వాఖ్యానించండి. (AS2)
జవాబు:
ప్రవహిస్తున్న నీటికి, గాలికి ఎంతో శక్తి ఉంటుంది. అది రాళ్ళను నిదానంగా కరిగించి వేస్తుంది. మట్టి పై పొరలను తొలగించివేస్తుంది. వాన, నది, ప్రవహిస్తున్న భూగర్భజలం, సముద్ర అలలు, హిమానీ నదులు వంటి అనేక రూపాలలో నీళ్ళు ప్రభావం చూపుతాయి. గాలి కూడా స్థిరమైన గాలులు, ఈదురు గాలులు, తుపాను గాలులు వంటి అనేకరూపాలను తీసుకుంటుంది. గాలి, నీటి శక్తుల కారణంగా భూమి ఉపరితలం పై పొరలు కొట్టుకుపోవడాన్ని క్రమక్షయం అని అంటారు.

9th Class Social Studies 2nd Lesson భూమి – ఆవరణములు InText Questions and Answers

9th Class Social Textbook Page No.14

ప్రశ్న 1.
బెరైటీస్, బొగ్గు వంటి ఖనిజాల తవ్వకం గురించి మీరు చదివారు. ఇది శిలావరణాన్ని, జలావరణాన్ని, వాతావరణాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది?
జవాబు:
శిలావరణాన్ని ప్రభావితం చేసే విషయం :
శిలలను కూడా ధ్వంసం చేసి బెరైటీస్, బొగ్గు వంటి ఖనిజాలను వెలికి తీస్తున్నారు.

జలావరణాన్ని ప్రభావితం చేసే విషయం :
బొగ్గు వలన జలావరణం కలుషితం అవుతుంది. జలావరణం వలన బెరైటీస్ గనులు దెబ్బతింటున్నాయి.

వాతావరణాన్ని ప్రభావితం చేసే విషయం :
బొగ్గు, బెరైటీస్ వలన వాతావరణం కలుషితం అవుతుంది.

ప్రశ్న 2.
రోగాలు నయం చేయడానికి మనుషులు అధిక సంఖ్యలో యాంటిబయాటిక్ మందులు తీసుకుంటున్నారు. ఇది శిలావరణాన్ని, జలావరణాన్ని, వాతావరణాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది?
జవాబు:

  1. మనుషులు అధిక సంఖ్యలో తీసుకునే యాంటిబయాటిక్ మందులు తయారుచేసే ఫ్యాక్టరీలు వివిధ రకాల రసాయనాలను విడుదల చేస్తాయి.
  2. ఈ రసాయనాల వలన శిలావరణం, జలావరణం, వాతావరణాల సమతుల్యత దెబ్బతింటుంది.
  3. మనుషులు వీటిని అధికంగా వాడటం వలన కొన్ని సూక్ష్మజీవులు, వైరస్లు నశించిపోతాయి. మరికొన్ని వాతావరణంలోనికి విడుదల చేయబడతాయి. తద్వారా భూమ్యావరణములు కలుషితమవుతాయి.

AP Board 9th Class Social Solutions Chapter 2 భూమి – ఆవరణములు

ప్రశ్న 3.
అనేక శాస్త్రీయ పదాల మూలాలు గ్రీకు భాషలో ఉండటం మీరు గమనించి ఉంటారు. ఇలా ఎందుకు ఉంది? మీ టీచరుతో చర్చించండి.
జవాబు:
శాస్త్ర, సాంకేతిక రంగాలకు మూలం గ్రీకు నాగరికత. గ్రీకు భాష కూడా ప్రాచీనమైనది. గ్రీకు తత్త్వవేత్తలు ఆయా ఆంశాలను గురించి వివరించి చెప్పడమే గాక ప్రయోగ పూర్వకంగా ఋజువు చేయడానికి ప్రయత్నించారు. అందువలన ప్రాచీన పదాలు ఎక్కువగా గ్రీకు భాష నుండి ఉద్భవించాయి.

9th Class Social Textbook Page No.15

ప్రశ్న 4.
వాన ఎలా పడుతుంది?
జవాబు:
భూమి ఉపరితలంపై ఉన్న నీరు ఆవిరై మేఘంగా ఏర్పడి, ఆ మేఘాలు చల్లదనానికి నీటిని నిల్వ ఉంచుకోక వర్షం రూపంలో భూమిపైకి మరల నీటిని వదులుతాయి. ఆ విధంగా వర్షం కురుస్తుంది.

ప్రశ్న 5.
డెల్టాలు ఎలా ఏర్పడతాయి?
జవాబు:
సముద్రాన్ని నది చేరుకున్నప్పుడు దాంట్లో మేటవేయని రేణువులు ఉంటే అవి నదీ ముఖంలో మేటవేయబడి డెల్టా ప్రాంతం ఏర్పడుతుంది. ఈ ప్రాంతం గ్రీకు అక్షరం డెల్టా (A) రూపంలో ఉంటుంది. కాబట్టి దానికి ఆ పేరు వచ్చింది.

AP Board 9th Class Social Solutions Chapter 2 భూమి – ఆవరణములు

ప్రశ్న 6.
భూకంపాలు, అగ్నిపర్వతాలు ఎలా సంభవిస్తాయి?
జవాబు:
భూకంపాలు సంభవించే విధానం :

  1. భూమికి సంబంధించి ఫలకాలు వాస్తవంగా మధ్య పొర మీద తేలుతూ ఉంటాయి.
  2. ఇవి నిరంతరం నెట్టబడుతూ ఉంటాయి. అందుకే అవి మెల్లగా కదులుతూ ఉంటాయి.
  3. అవి చాలా నిదానంగా కదులుతూ ఉంటాయి. కాబట్టి వాటి కదలిక మనకు తెలియదు.
  4. ఈ కదలిక ఫలితంగా ఒక ఫలకం పక్కనున్న మరొక ఫలకాన్ని నెడుతూ ఉంటుంది.
  5. రెండు ఫలకాలు కలిసేచోట ఒకదానినొకటి నెట్టుకుంటాయి.
  6. ఒక దాని మీద మరొకటి ఎంతో ఒత్తిడి చూపుతుంది.
  7. ఒక ఫలకం కిందికి మధ్య పొరలోకి వెళితే మరొక ఫలకం పైకి నెట్టబడి పర్వత శ్రేణులు ఏర్పడతాయి.
  8. ఈ ఫలకాల కదలికను ఫలక చలనాలు అంటారు. ఈ ప్రక్రియ వల్ల భూకంపాలు వంటివి సంభవిస్తాయి.

AP Board 9th Class Social Solutions Chapter 2 భూమి – ఆవరణములు 3
అగ్నిపర్వతాలు సంభవించే విధానం :
భూ గర్భంలోని శిలాద్రవం అనుకూల పరిస్థితులలో గొట్టం వలె ఉండే భాగాల నుండి బయటకు వస్తుంది. బయటికి ప్రవహించిన శిలాద్రవం ముఖద్వారం చుట్టూ ఘనీభవించి ఒక శంఖాకార పర్వత నిర్మాణంగా ఏర్పడుతుంది. దీనినే అగ్ని పర్వతం అంటారు.

ప్రశ్న 7.
కొండలు ఎందుకు ఉన్నాయి?
జవాబు:
ఒక ఫలకను ఇంకొక ఫలక నెట్టడం వలన కొండలు ఏర్పడుతున్నాయి.

ప్రశ్న 8.
నదుల వెంట లోయలు, అగాధాలు వంటివి ఎందుకు ఉన్నాయి?
జవాబు:

  1. వాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో నదీ ప్రవాహం వేగంగా ఉండి కొండను నిలువుగా కోతకు గురిచేస్తుంది. దీని ఫలితంగా లోతైన లోయ ఏర్పడుతుంది. అందువల్ల నదుల వెంట లోయలు ఏర్పడతాయి.
  2. రాళ్ళు చాలా గట్టిగా ఉన్న ప్రాంతాలలో నది తన ప్రవాహ మార్గాన్ని సన్నటి లోతైన లోయగా కోస్తుంది. దీని అంచులు నిటారుగా ఉంటాయి. అగాధాలలో పైన ఎక్కువ వెడల్పుగాను, కింద భాగం సన్నగాను ఉంటాయి. అందువల్ల అగాధాలు వంటివి కూడా నదుల వెంట ఉంటాయి.

ప్రశ్న 9.
గాలులు ఎలా వీస్తాయి?
జవాబు:
గాలులు ఎల్లప్పుడు అధిక పీడన ప్రాంతం నుండి అల్ప పీడన ప్రాంతం వైపు వీస్తాయి.

9th Class Social Textbook Page No.17

ప్రశ్న 10.
హిమాలయ, ఆండిస్, రాకీ పర్వత శ్రేణులను పటం మీద గుర్తించండి. అవి అక్కడే ఎందుకు ఏర్పడ్డాయి? కారణాలు సూచించండి.
జవాబు:
AP Board 9th Class Social Solutions Chapter 2 భూమి – ఆవరణములు 4
1. హిమాలయాలు ఏర్పడటానికి కారణం :
యూరేసియా ఫలకాన్ని ఇండియా ఫలకం నెట్టటం వల్లనే హిమాలయ పర్వతాలు ఏర్పడ్డాయి.

AP Board 9th Class Social Solutions Chapter 2 భూమి – ఆవరణములు 5
2. అండీస్ పర్వతాలు ఏర్పడటానికి కారణం :
దక్షిణ అమెరికా ఫలకాన్ని ఇండో- ఆస్ట్రేలియా ఫలకం నెట్టటం వల్లనే ఆండీస్ పర్వతాలు ఏర్పడ్డాయి.

AP Board 9th Class Social Solutions Chapter 2 భూమి – ఆవరణములు 6
3. రాకీ పర్వతాలు ఏర్పడటానికి కారణం :
ఉత్తర అమెరికా ఫలకాన్ని యూరేసియా ఫలకం నెట్టటం వల్లనే రాకీ పర్వతాలు ఏర్పడ్డాయి.

ప్రశ్న 11.
భూమి మీద శిలలు అన్నీ మహాసముద్ర మధ్యమిట్ట ప్రాంతంలోనే ఏర్పడ్డాయా?
జవాబు:
భూమి మీద గుట్టలన్నీ మహసముద్ర మధ్యమిట్ట ప్రాంతంలోనే ఏర్పడ్డాయి.

  1. సముద్రాలలోని భూమి పై పొరను అధ్యయనం చేస్తున్న భూ శాస్త్రజ్ఞులు పసిఫిక్ మహాసముద్రం వంటి కొన్ని మహా సముద్రాలలోని, మధ్య భాగంలో మిట్టలు, పర్వత శ్రేణులు ఉన్నాయని కనుగొన్నారు.
  2. మధ్య పొరల నుంచి పైకి లేచే లావా వల్ల ఇవి ఏర్పడుతున్నాయి.
  3. మిట్టప్రాంతంలో నేలపైకి నెట్టబడి బీటలు వారటం వల్ల బసాల్ట్ రాళ్ళతో కూడిన సముద్రపు కొత్తనేల తయారవుతుంది.
  4. ఆ తరువాత ఇది మిట్టనుంచి రెండు వైపులా పక్కలకు విస్తరిస్తుంది. అంటే మన భూమి మీద మహాసముద్ర మధ్య ప్రాంతంలోని మిట్టలలో అత్యంత తాజాగా ఏర్పడిన పై పొర ఉంటుంది.

ప్రశ్న 12.
భూగర్భవేత్తలు హిమాలయాల్లో సముద్ర జీవుల శిలాజాలను కనుగొన్నారు. వీటిల్లో చాలా వాటిని ‘సాలగ్రామాలు’ (శివలింగాకారంలో) గా ఇళ్లల్లో పూజిస్తారు. ఈ శిలాజాలు హిమాలయాల్లో ఎందుకు ఉన్నాయి?
జవాబు:

  1. ఖండఫలకాలు జరిగేటప్పుడు ఖండాల అంచులలో ఉన్న శిలాద్రవం పైకి వచ్చి పర్వతాలు ఏర్పడతాయి.
  2. హిమాలయాలు ప్రపంచంలో నూతన ముడుత పర్వతాలు.
  3. యురేసియా ఫలకాన్ని ఇండియా ఫలకం నెట్టడం వల్లనే హిమాలయ పర్వతాలు ఏర్పడ్డాయి.
  4. కనుక సముద్ర జీవుల శిలాజాలు నూతనంగా ఏర్పడిన హిమాలయాల్లోనే ఉన్నాయి.

AP Board 9th Class Social Solutions Chapter 2 భూమి – ఆవరణములు

ప్రశ్న 13.
భూమి మీద జరుగుతున్న ఇటువంటి పెనుమార్పులు మన అనుభవంలోకి ఎందుకు రావటం లేదు? అవి మనల్ని ప్రభావితం చేయకపోవడంవల్లనా? ఈ మార్పులు అసలు మనల్ని ఏరకంగానైనా ప్రభావితం చేస్తాయా?
జవాబు:
భూమి మీద జరుగుతున్న ఇటువంటి పెనుమార్పులు కొన్ని వందల, వేల సంవత్సరాలకు జరుగుతుంటాయి. అప్పటికి మానవుల జీవిత కాలం చాలదు. అందువల్ల అవి మన అనుభవంలోకి రావడం లేదు. అవి మనల్ని ప్రభావితం చేయటం లేదు. ఈ మార్పులు మనల్ని మన తరువాత తరాల్ని అనేక రకాలుగా ప్రభావితం చేస్తాయి. జీవన విధానాన్ని మార్చివేస్తాయి.

9th Class Social Textbook Page No.19

ప్రశ్న 14.
అగ్నిపర్వతం పేలుడు వల్ల ఆ ప్రాంతంలో సంభవించే నష్టాలను ఊహించి రాయండి.
జవాబు:
అగ్నిపర్వతాలు పేలడం వల్ల ఆ ప్రాంతంలో సంభవించే నష్టాలు :

  1. అగ్ని పర్వతాలు పేలడం వల్ల సమీప ప్రాంతాలలో కూడా ధన, ప్రాణ నష్టాలు సంభవిస్తాయి.
  2. పంటలు నాశనమౌతాయి, జలాలు కలుషితమౌతాయి.
  3. బూడిద, అనేక రకాల వాయువులు, ధూళితో వాతావరణం కలుషితమవుతుంది.

9th Class Social Textbook Page No.20

ప్రశ్న 15.
శిలలోని అంతర్భాగం బయటిభాగం కంటే ఎందుకు కఠినంగా ఉంటుంది?
జవాబు:
శిలలోని అంతర్భాగం బయటిభాగం కంటే కఠినంగా ఉండటానికి గల కారణాలు :

  1. రాళ్ళు వేడెక్కినప్పుడు వ్యాకోచిస్తాయి. చల్లబడినప్పుడు సంకోచిస్తాయి.
  2. ఇది ప్రతి పగలూ, రాత్రి, వేసవి, శీతా కాలాల్లో సంవత్సరాల తరబడి జరుగుతూ ఉంటుంది.
  3. పైన ఉన్న రాళ్ళు సంకోచించి, వ్యాకోచించి తిరిగి సంకోచిస్తూ ఉండటం వల్ల అవి పెళుసుగా మారి ముక్కలవుతాయి.
  4. నీళ్ళు, గాలిలోని తేమ కూడా ఈ ప్రక్రియకు దోహదం చేస్తుంది.
  5. అందువలన అంతర్భాగం గట్టిగా ఉంటుంది.

9th Class Social Textbook Page No.21

ప్రశ్న 16.
ఆనకట్టలు కట్టటానికి గార్జెస్ అనువుగా ఉంటాయి. ఎందుకో చెప్పండి.
జవాబు:

  1. రాళ్ళు (శిలలు) చాలా గట్టిగా ఉన్న ప్రాంతాలలో నది తన ప్రవాహ మార్గాన్ని సన్నటి, లోతైన లోయగా కోస్తుంది. దీని అంచులు నిటారుగా ఉంటాయి. వీటిని గార్జెస్ అంటారు.
  2. గార్జెస్ వద్ద ఆనకట్టలు కట్టడానికి అనుకూలంగా ఉంటుంది. కారణం
  3. నదులు సన్నగా ఉంటాయి.
  4. రెండు వైపులా నిటారుగా రాళ్ళు ఉంటాయి. ఇవి కోతకు గురికాకుండా ఆనకట్టలు ఉంటాయి.
  5. అందువల్ల ఇవి ఆనకట్టలు నిర్మించడానికి అనుకూలంగా ఉంటాయి.

9th Class Social Textbook Page No.22

ప్రశ్న 17.
జలపాతాలు ఎలా ఉపయోగపడతాయో వివరించండి.
జవాబు:

  1. వినోద పర్యటనానికి ఉపయోగపడతాయి.
  2. జలవిద్యుత్ ప్రాజెక్టులు నిర్మించడానికి అనువుగా ఉంటాయి.

AP Board 9th Class Social Solutions Chapter 2 భూమి – ఆవరణములు

ప్రశ్న 18.
మన రాష్ట్రంలోని జలపాతాల వివరాలు సేకరించండి.
జవాబు:

  1. విశాఖపట్టణం జిల్లాలోని రణజిల్లెడ జలపాతం.
  2. గుంటూరు జిల్లాలోని మాచర్ల వద్ద ఎత్తిపోతల జలపాతం.

ప్రశ్న 19.
కొన్ని జలపాతాల చిత్రాలు సేకరించండి.
జవాబు:
AP Board 9th Class Social Solutions Chapter 2 భూమి – ఆవరణములు 7
AP Board 9th Class Social Solutions Chapter 2 భూమి – ఆవరణములు 8

9th Class Social Textbook Page No.23

ప్రశ్న 20.
పర్వత, మైదాన ప్రాంతాలలో నదీ ప్రవాహంలోని పోలికలు, తేడాలు పేర్కొనండి. ఈ రెండింటి మధ్య సంబంధం ఏమిటి?
జవాబు:
పర్వత ప్రాంతాలు :

  1. వాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో నదీ ప్రవాహం వేగంగా ఉండి కొండను నిలువుగా కోతకు గురిచేస్తుంది.
  2. ‘V’ ఆకారపు లోయలను ఏర్పరుస్తాయి.
  3. రాళ్ళు చాలా గట్టిగా ఉన్న ప్రాంతాలలో నది తన ప్రవాహ మార్గాన్ని సన్నటి లోతైన లోయగా కోస్తుంది. వీటిని గార్డెన్ అంటారు.
  4. వాలులో తేడాలు బాగా ఎక్కువగా ఉండే పర్వత ప్రాంతాలలో జలపాతాలు అధిక సంఖ్యలో ఉంటాయి.

మైదాన ప్రాంతాలు :

  1. మైదాన ప్రాంతంలో వాలు చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి నదీ ప్రవాహ వేగం తగ్గుతుంది.
  2. అప్పుడు బరువైన రేణువులను తీసుకువెళ్ళే శక్తి నదికి ఉండదు.
  3. నదికి వరదలు వచ్చినపుడు అది నేలను కోతకు గురిచేస్తుంది.
  4. వరద తగ్గుముఖం పట్టినపుడు కోసిన మట్టిని వేరేచోట మేట వేస్తుంది.
  5. మైదాన ప్రాంతాలలో నది తరచూ తన ప్రవాహ దారిని మారుస్తూ ఉంటుంది.
  6. మైదాన ప్రాంతాలలో నదులు డెల్టాలను ఏర్పరచుతాయి.

రెండింటి మధ్య సంబంధం :

  1. కొండలలో పడిన వర్షపు నీరు నదులలో ప్రవహించి మైదాన ప్రాంతాలలో డెల్టాలను ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుంది.
  2. కొండల ప్రాంతంలో నదీప్రవాహ వేగం ఎక్కువగా ఉండటం వలన సారవంతమైన పై పొర కొట్టుకు వచ్చి మైదాన ప్రాంతాలలో నదీ ప్రవాహ వేగం తక్కువగా ఉంటుంది కాబట్టి దానిని అక్కడ మేట వేయగలదు.
  3. దాని వలన సారవంతమైన మైదానాలు ఏర్పడి తద్వారా పంటలు బాగా పండటానికి అవకాశం ఉంటుంది.

AP Board 9th Class Social Solutions Chapter 2 భూమి – ఆవరణములు

ప్రశ్న 21.
పర్వత ప్రాంతాలతో పోలిస్తే వరద మైదానాలు మానవ ఆవాసానికి ఎందుకు అనువుగా ఉంటాయి?
జవాబు:

  1. కొండ ప్రాంతాలు ఎత్తైన ప్రాంతాలు. ఇవి మానవ నివాసానికి అనువైన ప్రాంతాలు కావు.
  2. ఇవి ఎగుడు దిగుడు స్థలాకృతులను కలిగి ఉంటాయి.
  3. అందువలన వ్యవసాయం చేయడానికి, పంటలు.పండించడానికి అనువైనవి కావు.
  4. శిలా నిర్మితమై ఉంటుంది. కాబట్టి మొక్కలు నాటటానికి అనుకూలంగా ఉండవు.
  5. అదే వరద మైదానాలు అయితే బల్లపరుపుగా ఉంటాయి.
  6. విశాలంగా ఉంటాయి. నీటిని నిలువ చేసుకోడానికి అనుకూలంగా ఉంటాయి.
  7. సారవంతమైన నేలలు ఉంటాయి.
  8. పంటలు సమృద్ధిగా పండుతాయి.
  9. ఇళ్లు నిర్మించడానికి అనుకూలంగా ఉంటాయి. నివాస యోగ్యాలుగా ఉంటాయి. కనుక ప్రజలు కొండ ప్రాంతాల్లో కన్నా మైదాన ప్రాంతాలలోనే ఎక్కువగా నివసిస్తారు.

ప్రశ్న 22.
వరద మైదానాలలో ఉండటంలోని ప్రమాదాలు ఏమిటి?
జవాబు:
వరద మైదానాలలో ఉండటంలోని ప్రమాదాలు :

  1. తరచుగా వరదలు వస్తాయి.
  2. పంటలు పాడైపోతాయి.
  3. ఒక్కొక్కసారి చెట్లు, ఇళ్లు కూలిపోతాయి.
  4. జంతువులు, వస్తువులు కొట్టుకుపోతాయి.
  5. ప్రాణనష్టం, ఆస్తినష్టం జరుగుతుంది.
  6. కనుక వరద మైదానాలలో ఉండటం వలన పై ప్రమాదాలు ఎదురవుతాయి.

ప్రశ్న 23.
కొండ లేదా వరద మైదానాల్లో నివసిస్తున్న ప్రజల గురించి మీరు చదివిన దానిని గుర్తుకు తెచ్చుకోండి.
జవాబు:

  1. కొండ ప్రాంతాలలో గిరిజనులు, ఆదిమ వాసులు నివసిస్తారు.
  2. వారికి అంతగా నాగరికత తెలియదు.
  3. ఇప్పుడిప్పుడే పోడు వ్యవసాయం చేస్తున్నారు.
  4. అటవీ ఉత్పత్తులపై ఆధారపడి జీవనం కొనసాగిస్తారు.
  5. రవాణా సౌకర్యాలను కల్పించడం కష్టంతో కూడుకున్న పని.
  6. మైదాన ప్రాంతాలలో నాగరీకులు నివసిస్తారు.
  7. అధునాతన, వ్యవసాయ పరికరాలను ఉపయోగించి వ్యవసాయం చేస్తారు.
  8. అధిక దిగుబడులను సాధిస్తారు.
  9. అధునాతన రవాణా సౌకర్యాలను సులభంగా ఏర్పాటు చేసుకోవచ్చు.
  10. పరిశ్రమలను స్థాపించవచ్చు. పారిశ్రామిక ఉత్పత్తులను ఉత్పత్తి చేయవచ్చు.

9th Class Social Textbook Page No.25

ప్రశ్న 24.
లోయస్ మైదానాలను డెల్టాతో పోల్చండి. వాటి మధ్య పోలికలు తేడాలు ఏమిటి?
జవాబు:
లోయస్ మైదానాలు:

  1. మెత్తగా ఉండే దుమ్ము ఎడారులను దాటి, కొట్టుకెళ్ళి పక్క భూముల మీద పడుతుంది. ఇటువంటి నేలను ”లోయస్” అంటారు.
  2. ఇది చక్కటి ఒండ్రు. దీంట్లో సున్నం చాలా ఎక్కువగా ఉంటుంది.
  3. రేణువులు ఒకదానితో ఒకటి అతుక్కుని ఉండి అదే సమయంలో దానికి నీళ్లు బాగా ఇంకిపోయే గుణముంటుంది.
  4. లోయస్ మేటతో ఏర్పడిన మైదానాలను లోయస్ మైదానాలు అంటారు.

డెల్టాలు :
1. సముద్రాన్ని నది చేరుకునేటప్పుడు దాంట్లో మేట వేయని రేణువులు ఉంటే అవి నదీ ముఖంలో మేట వేయబడి డెల్టా ప్రాంతం ఏర్పడుతుంది.

ఈ ప్రాంతం గ్రీకు అక్షరం డెల్టా (∆) రూపంలో ఉంటుంది. కాబట్టి దానికి ఆ పేరు వచ్చింది.

పోలికలు :

  1. రెండూ ఇసుక రేణువులతో ఏర్పడినవే.
  2. రెండింటిలోనూ నీరు త్వరగా ఇంకిపోతుంది.
  3. రెండింటిలోనూ ఒండ్రు ఉంటుంది.

తేడాలు :

లోయస్ మైదానాలు డెల్టా
1. లోయస్ దుమ్ముతో ఏర్పడినది. 1. డెల్టా నదులు తీసుకొచ్చిన ఒండ్రుతో ఏర్పడినది.
2. లోయలో సున్నం ఉంటుంది. 2. డెల్టాలలో గవ్వల రూపంలో సున్నం ఉంటుంది.
3. లోయలో నీరు ఎక్కువగా ఇంకిపోతుంది. 3. డెల్టాలలో నీరు ఎక్కువగా ఇంకిపోదు. నదులు ఎల్లప్పుడు ప్రవహిస్తూ ఉంటాయి. కాబట్టి నీరు ఎక్కువగా ఉంటుంది.

AP Board 9th Class Social Solutions Chapter 2 భూమి – ఆవరణములు

ప్రాజెక్టు

ప్రశ్న 1.
వివిధ వార్తాపత్రికలు, మ్యాగజైన్స్ ద్వారా భూకంపాలు, అగ్ని పర్వతాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి ఒక క్రమంలో అమర్చండి. ఇవి ఏ విధంగా ఏర్పడతాయి? మానవ జీవనాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి?
జవాబు:
అగ్ని పర్వతాలు ఎలా ఏర్పడతాయి అనగా :

  1. భూమి లోపలికి పోయేకొలది ప్రతి 32 మీటర్లకు 1°C ఉష్ణోగ్రత పెరుగుతుంది.
  2. అందువల్ల భూమిలోపల కొన్ని ప్రదేశాలలో శిలలు కరిగిపోయి శిలాద్రవంగా (మాగ్మా) గా మారతాయి.
  3. ఈ మాగ్మా పైన కార్బన్ డై ఆక్సైడ్, సల్ఫర్ డై ఆక్సైడ్ లాంటి వాయువులు ఉత్పత్తి అయి యుగ్మాను ఒత్తిడి చేసినందున మాగ్మా బలహీనంగా ఉన్న భూ పొరలను చీల్చుకుంటూ ఒక రంధ్రం చేస్తూ బయటపడి శంఖువు ఆకారంలో ఘనీభవించి అగ్ని పర్వతాలు ఏర్పడతాయి.

మానవ జీవనాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి. అనగా

  1. అగ్ని పర్వతాలు ఉద్భేదనము చెందిన ప్రాంతాలలోనూ సమీప పరిసర ప్రాంతాలలో కూడ ధన, ప్రాణ నష్టాలు సంభవిస్తాయని మనందరకూ తెలుసు.
  2. అయితే ఆ తరువాత ఎంతోకాలంపాటు ఈ అగ్నిపర్వతాలు ఉద్భేదనము ఫలితంగా మానవ జాతి అనేక విధాలుగా లాభం పొందుతుంది.
  3. ఈ ఉద్భేదనము ఫలితముగా భూమి లోతుల నుండే విలువైన ఖనిజాలు భూమి ఉపరితలానికి దగ్గరగా తీసుకుని రాబడతాయి.
  4. ఈ ప్రదేశాలలో సారవంతమైన నేలలు ఏర్పడతాయి.
    ఉదా : భారతదేశంలోని డెక్కన్ ట్రాప్స్ ప్రాంతంలో ఏర్పడిన నల్లరేగడి నేలలు నూనెగింజలు, ప్రత్తి మొదలైన వాణిజ్య పంటలకు నిలయాలుగా ఉన్నాయి.

AP Board 9th Class Social Solutions Chapter 1 భూమి – మనం

SCERT AP 9th Class Social Studies Guide Pdf 1st Lesson భూమి – మనం Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Social Solutions 1st Lesson భూమి – మనం

9th Class Social Studies 1st Lesson భూమి – మనం Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
అట్లాస్ లో భారతదేశ పటాన్ని చూసి కింది ప్రదేశాల అక్షాంశ, రేఖాంశాలను గుర్తించండి. (AS5)
1. కన్యాకుమారి : ……………………., ………………………….
2. ఇంఫాల్ ……………………….., ……………………………
3. జైసల్మేర్ ……………………………, …………………………
4. పూనా ……………………………., …………………………
5. పాట్నా ……………………………, ………………………….
జవాబు:
1. 8°35′ ఉత్తర అక్షాంశం, 77°36′ తూర్పు రేఖాంశం.
2. 24°44′ ఉత్తర అక్షాంశం, 93°58′ తూర్పు రేఖాంశం.
3. 26° 55′ ఉత్తర అక్షాంశం, 70° 54′ తూర్పు రేఖాంశం.
4. 18°32′ ఉత్తర అక్షాంశం, 73°52′ తూర్పు రేఖాంశం.
5. 27°34′ ఉత్తర అక్షాంశం, 81°46′ తూర్పు రేఖాంశం.

ప్రశ్న 2.
అక్షాంశ, రేఖాంశాలతో సరిపోయే పదాలను గుర్తించండి. (AS1)
జవాబు:

అక్షాంశాలు రేఖాంశాలు
సమాంతర రేఖలు నిలువురేఖలు
వృత్తాలు అర్ధవృత్తాలు
ఉహాజనిత రేఖలు ఉహాజనిత రేఖలు
అడ్డంగా గీయబడినవి కాలాన్ని నిర్ణయిస్తాయి.

ప్రశ్న 3.
క్రింద ఉన్న ప్రపంచ కాల మండలాల పటం చూడండి. (AS5)
AP Board 9th Class Social Solutions Chapter 1 భూమి - మనం 1
(అ) మీరు విజయవాడ నుండి పారిస్ కి వెళుతుంటే ఏ కాల మండలానికి ప్రయాణిస్తున్నారు?
జవాబు:
పశ్చిమానికి ప్రయాణించడం జరుగుతుంది.

(ఆ) హైదరాబాదు నుంచి టోక్యోకి వెళుతుంటే ఏ కాల మండలానికి ప్రయాణిస్తున్నారు?
జవాబు:
తూర్పునకు ప్రయాణించడం జరుగుతుంది.

ప్రశ్న 4.
భూమి ఏర్పడటం, దాని నిర్మాణం గురించి అధ్యయనం చేయటం ఎందుకు కష్టమైనది? (AS1)
జవాబు:
భూమి ఏర్పడటం, దాని నిర్మాణం గురించి అధ్యయనం చేయటం కష్టం ఎందువల్లనంటే …

  1. భూమి పుట్టుక మీద భిన్నాభిప్రాయాలుండటం.
  2. ప్రారంభంలో భూమి చలనం లేకుండా స్థిరంగా ఉందని, మిగిలినవి అన్నీ దానిచుట్టూ తిరుగుతున్నాయని భావించారు.
  3. 500 సం||రాల క్రితం శాస్త్రజ్ఞులు ఒక కొత్త అవగాహనకు వచ్చారు.
  4. భూమి విశ్వానికి మధ్యలో లేదని, వాస్తవానికి అది సూర్యుని చుట్టూ తిరుగుతోందని, ఆ సూర్యుడు కూడా తిరుగుతూ ఉన్నాడని, ఆకాశంలో అసంఖ్యాకంగా ఉన్న నక్షత్రాలు వాస్తవానికి సూర్యుళ్లని తెలుసుకున్నారు.
  5. నక్షత్రాలు కూడా పుడతాయని, పెరుగుతాయని, చివరికి చనిపోతాయని తెలుసుకున్నారు.
  6. పెద్ద విస్ఫోటనంతో 1370 కోట్ల సంవత్సరాల క్రితం విశ్వం ఆవిర్భవించిందని, కొన్ని వందల కోట్ల సం||రాల తరువాత అంతరించిపోతుందని అభిప్రాయపడ్డారు.
  7. భూమి పుట్టుక అధ్యయనం చేయడానికి సరైన శాస్త్ర విజ్ఞానం కూడా అంతగా ఇంకా అభివృద్ధి చెందలేదు.
  8. శాస్త్రీయ పరికరాలు ఇంకా కనిపెట్టవలసిన అవసరం ఉంది.
  9. ఇంకా ఎన్నో అంశాలు ఋజువు కావలసి ఉంది.

AP Board 9th Class Social Solutions Chapter 1 భూమి - మనం

ప్రశ్న 5.
క్రింది పేరాను చదివి కింది ప్రశ్నకు సమాధానం రాయండి. (AS2)
కేంద్ర భాగంలో ఉండే పదార్థం అగ్నిపర్వతాల నుండి సముద్ర తలంలోని పగుళ్ల నుండి పైకి వచ్చి, చల్లబడి భూమి పై పొరగా మారుతుంది. భూమిలో అనేక ప్రాంతాలలో పై పొర తిరిగి మధ్యపొరలోకి ప్రవేశించి ద్రవంగా మారుతుంది. ఈ విధంగా భూపటలం నిత్యం ఏర్పడుతూ, నశిస్తూ ఉండటం భూమి ఇంకా సక్రియంగా ఉందన్న వాస్తవాన్ని వెల్లడి చేస్తుంది. భూమి లోపలి పొరల్లోని ప్రక్రియల వల్ల ఏర్పడే భూకంపాలు, అగ్నిపర్వతాలు, భూమి లోపలికి కుంగటం, కొండల పైకి లేవటం వంటి వాటి ద్వారా మనం నివసిస్తున్న పైపొర నిత్యం మారుతూనే ఉంది.
ప్ర. భూమి ఇప్పటికీ క్రియాశీలకంగా ఉందని మీరు ఎలా చెప్పగలరు.? అయితే కారణాలు ఏమిటి?
జవాబు:
భూమి ఇప్పటికీ క్రియాశీలకంగా ఉంది.

కారణాలు :

  1. కేంద్రభాగంలో ఉండే పదార్థం అగ్నిపర్వతాల నుండి సముద్ర తలంలోని పగుళ్ల నుండి పైకి వచ్చి, చల్లబడి భూమిపై పొరగా మారుతుంది.
  2. భూమిలో అనేక ప్రాంతాలలో పై పొర తిరిగి మధ్య పొరలోకి ప్రవేశించి ద్రవంగా మారుతుంది.
  3. ఈ విధంగా భూ పటలం నిత్యం ఏర్పడుతూ, నశిస్తూ ఉండటం భూమి ఇంకా సక్రియంగా ఉందన్న వాస్తవాన్ని వెల్లడి చేస్తుంది.
  4. భూమి లోపలి పొరల్లోని ప్రక్రియల వల్ల ఏర్పడే భూకంపాలు, అగ్నిపర్వతాలు, భూమి లోపలికి కుంగటం, కొండలు పైకి లేవటం వంటి వాటి ద్వారా మనం నివసిస్తున్న పై పొర నిత్యం మారుతునే ఉంది. అందువల్ల భూమి ఇంకా క్రియాశీలకంగా ఉంది.

ప్రశ్న 6.
గ్రిడ్ అనగా నేమి? అది మనకు ఎలా సహాయపడుతుంది? (AS1)
జవాబు:
గ్లోబు మీద అక్షాంశాలు, రేఖాంశాలు గీసి ఉంటాయి. ఈ నిలువు, అడ్డ గీతలతో గళ్లు ఏర్పడతాయి. దీనిని గ్రిడ్
అంటారు. గ్రిడ్ మనకు ఏ విధంగా సహాయపడుతుందనగా: – 1. ఈ గళ్ల సహాయంతో పటం మీద ఒక ప్రదేశాన్ని గుర్తించగలం. 2. దాని గురించి ఎన్నో విషయాలు తెలుసుకోగలం. ఉదా : అక్కడ ఎంత వేడిగా ఉన్నది, ఎంత చల్లగా ఉన్నది, అక్కడికి చేరుకోవటానికి ఏ దిశగా ప్రయాణం చేయాలి.
ఏ క్షణంలో అక్కడ సమయం ఎంత ఉంటుంది వంటి అంశాలను తెలుసుకోవచ్చు.

ప్రశ్న 7.
కింది వాని మధ్యగల తేడాలు వివరించండి. (AS1)
జవాబు:
ఆ) స్థానిక కాలం – ప్రామాణిక కాలం
ఆ) భూమధ్యరేఖ – ప్రామాణిక కాలం

అ) స్థానిక కాలం :

  1. భూభ్రమణం వల్ల భూమి మీద ఉన్న ఏ స్థలమైనా 24 గంటలలో ఒకసారి సూర్యునికి ఎదురుగా వస్తుంది.
  2. అంటే ప్రతి రేఖాంశం ఒక దినంలో ఒకసారి సూర్యునికి ఎదురుగా వస్తుంది.
  3. అప్పుడు ఆ రేఖాంశంపై ఉన్న ప్రాంతాలకు మధ్యాహ్నం సరిగ్గా 12 గంటలు అవుతుంది.
  4. ఈ సమయాన్ని ఆ ప్రాంతం యొక్క స్థానిక కాలం అంటారు.

ప్రామాణిక కాలం :

  1. ప్రతి దేశానికి ఒక ప్రామాణిక కాలాన్ని నిర్ణయించారు.
  2. దీని వల్ల కాలాన్ని గుర్తించడం సులభమౌతుంది.
  3. సాధారణంగా ప్రామాణిక కాలాన్ని నిర్ధారించడానికి ఆ దేశం మధ్యగా పోయే రేఖాంశాన్ని గుర్తిస్తారు.
  4. ఆ రేఖాంశం యొక్క స్థానిక కాలాన్ని ఆ దేశమంతటికి ప్రామాణిక కాలంగా వర్తింపజేస్తారు.

ఆ) భూమధ్యరేఖ :

  1. భూమికి మధ్యలో అడ్డంగా వెళ్లే వృత్తాన్ని భూమధ్యరేఖ. అంటారు.
  2. ఇది ఉత్తర, దక్షిణ ధృవాల నుంచి సమదూరాలలో ఉంటుంది.
  3. ఇది భూమిని రెండు సమభాగాలుగా చేస్తుంది. కాబట్టి దీనిని భూమధ్య రేఖ అంటారు.
  4. దీనిని 0° అక్షాంశంగా గుర్తిస్తారు.

ప్రామాణిక రేఖాంశం :

  1. ఇంగ్లాండ్ లోని గ్రీన్ విచ్ (Greenwich – ఉచ్చారణ గ్రీనిచ్) లోని నక్షత్రశాల గుండాపోయే రేఖాంశాన్ని 0° మెరిడియన్ లేదా ప్రామాణిక రేఖాంశం లేదా గ్రీనిచ్ మెరిడియన్ అంటారు.
  2. ఆ కాలంలో ప్రపంచంలో అధిక భాగాన్ని ఇంగ్లాండ్ పరిపాలిస్తుండేది. దాంతో వాళ్ళు అనుసరిస్తున్న విధానాన్ని మిగిలిన అందరూ అనుసరించటం మొదలుపెట్టారు.

AP Board 9th Class Social Solutions Chapter 1 భూమి - మనం

ప్రశ్న 8.
భారతదేశంలో ప్రతి రాష్ట్రం తమ స్థానిక సమయం పాటిస్తే ఎలాంటి సమస్యలు వస్తాయి? (AS1)
జవాబు:
భారతదేశంలో ప్రతి రాష్ట్రం తమ స్థానిక సమయాన్ని పాటిస్తే –

  1. సమయం విషయంలో గందరగోళం నెలకొంటుంది.
  2. సమయాన్ని నిర్ణయించటం మరింత క్లిష్టమవుతుంది.
  3. ఒక గంట వ్యవధితో దేశాన్ని పలు కాల మండలాలుగా విభజిస్తారు.

ప్రశ్న 9.
మీ ఉపాధ్యాయుల సహాయంతో నేపాల్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, మలేషియా, జపాన్ దేశాల ప్రామాణిక రేఖాంశాన్ని గుర్తించండి. (AS5)
జవాబు:
నేపాల్ ప్రామాణిక రేఖాంశం – 82° 30′ తూర్పు రేఖాంశం (+ 5.45 యుటిసి)
పాకిస్థాన్ ప్రామాణిక రేఖాంశం – 74°22 తూర్పు రేఖాంశం (యుటిసి + 6 గం)
బంగ్లాదేశ్ ప్రామాణిక రేఖాంశం – 90° 24 తూర్పురేఖాంశం (యుటిసి + 4 గం)
ఇంగ్లాండ్ ప్రామాణిక రేఖాంశం – 0°07 పశ్చిమరేఖాంశం (యుటిసి + 1 గం).
మలేషియా ప్రామాణిక రేఖాంశం – 105° తూర్పురేఖాంశం (యుటిసి + 8 గం)
జపాన్ ప్రామాణిక రేఖాంశం – 135° తూర్పురేఖాంశం (యుటిసి + 9 గం)

ప్రశ్న 10.
భూ పరిరక్షణ కోసం ఆలోచింపజేసే ఒక పోస్టరు తయారుచేయండి.
జవాబు:
AP Board 9th Class Social Solutions Chapter 1 భూమి - మనం 2
భూ పరిరక్షణ కోసం ఆలోచింపజేసే పోస్టర్

9th Class Social Studies 1st Lesson భూమి – మనం InText Questions and Answers

9th Class Social Textbook Page No.2

ప్రశ్న 1.
సుదూరంగా ఉన్న నక్షత్రాలు, పాలపుంతల రహస్యాల గురించీ, విశ్వం ఆవిర్భావం గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి ఈనాటి మానవులకు ఎందుకు ఉంది?
జవాబు:

  1. వేల సంవత్సరాలుగా మనుషులు ఆకాశంలోకి చూస్తూ అక్కడ మెరిసే వాటి గురించి తెలుసుకోటానికి ప్రయత్నిస్తున్నారు.
  2. ఆకాశంలో సంచరిస్తూ ఉండే సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు ఇతర నక్షత్రాలలో పోలిస్తే ఎప్పుడూ ఒకే దూరంలో ఉండే నక్షత్రాలు. ఇవి ఏమిటి? వీటికీ మనకూ సంబంధం ఏమిటి? ఇవి మనల్ని ఎలా ప్రభావితం చేస్తాయి? వంటి వాటిని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించారు.
  3. ఆకాశంలో గల వీటి కదలికలను, ఘటనలను నమోదు చేస్తూ అవి ఏమిటో, అవి ఎలా కదులుతున్నాయో అర్థం చేసుకోటానికి ప్రయత్నించారు. అందువల్ల విశ్వం ఆవిర్భావం గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి ఈనాటి మానవులకు ఉంది.

AP Board 9th Class Social Solutions Chapter 1 భూమి - మనం

ప్రశ్న 2.
విశ్వం మధ్యలో భూమి ఉందనీ, సృష్టిలో ముఖ్యమైనది మానవులనీ మొదట భావించేవాళ్లు. ఈ అనంత విశ్వంలో మనం అతి చిన్న నలుసు మాత్రమేనని తెలుసుకోవటం వల్ల అది మనపై ఎటువంటి ప్రభావం చూపుతుంది?
జవాబు:

  1. మొదట్లో భూమి చలనం లేకుండా స్థిరంగా ఉందనీ, మిగిలినవన్నీ దాని చుట్టూ తిరుగుతున్నాయని భావించారు.
  2. వేల సంవత్సరాలుగా ఇలాగే ఉంది కాబట్టి ఎటువంటి మార్పులూ లేకుండా భూమి, నక్షత్రాలు, సూర్యుడు శాశ్వతంగా ఇలాగే ఉంటాయని భావించారు.
  3. కానీ తరువాత భూమి విశ్వానికి మధ్యలో లేదని, వాస్తవానికి అది సూర్యుని చుట్టూ తిరుగుతోందని, ఆ సూర్యుడు కూడా తిరుగుతూ ఉన్నాడని, ఆకాశంలో అసంఖ్యాకంగా ఉన్న నక్షత్రాలు వాస్తవానికి సూర్యుళ్లని తెలుసుకున్నారు.
  4. నక్షత్రాలు కూడా పుడతాయని, పెరుగుతాయని, చివరికి చనిపోతాయని కూడా గత వంద సంవత్సరాల కాలంలో అర్థం చేసుకున్నారు. ఇది మనపై చూపే ప్రభావం ఏదీ శాశ్వతం కాదని, అనంత విశ్వంలో మనం చాలా చిన్న నలుసులం మాత్రమేనని అర్థమవుతుంది. కావున మనకు తెలిసినది తక్కువ అని, తెలియాల్సిందే ఎక్కువ అని కూడా అర్థమౌతుంది.

9th Class Social Textbook Page No.3

ప్రశ్న 3.
భూమి మీద కాలాలు ఏర్పడటానికి గల కారణాలను కింది వానిలో గుర్తించండి.
1. అక్షంపై రోజుకు ఒకసారి భూమి తన చుట్టూ తాను తిరగడం
2. భూమి చుట్టూ చంద్రుడు నెలకు ఒకసారి తిరగటం
3. అక్షంపై సూర్యుడు తన చుట్టూ తాను తిరగటం
4. సూర్యుని చుట్టూ భూమి పరిభ్రమణం
5. కక్ష్య తలంతో పోలిస్తే భూమి అక్షం వంగి ఉండటం
6. భూమి గోళాకారంలో ఉండటం
7. సంవత్సర పరిభ్రమణ కాలంలో సూర్యుడి నుండి భూమి ఉండే దూరం
జవాబు:
1. అక్షంపై రోజుకు ఒకసారి భూమి తన చుట్టూ తాను తిరగడం
2. సూర్యుని చుట్టూ భూమి పరిభ్రమణం
3. కక్ష్య తలంతో పోలిస్తే భూమి అక్షం వంగి ఉండటం
4. భూమి గోళాకారంలో ఉండటం

9th Class Social Textbook Page No.4

ప్రశ్న 4.
భూమి అకస్మాత్తుగా ఏర్పడిందని అనుకుంటున్నారా లేక అది ఒక సుదీర్ఘ, సంక్లిష్ట ప్రక్రియల ఫలితంగా ఏర్పడిందని అనుకుంటున్నారా?
జవాబు:
భూమి ఒక సుదీర్ఘ సంక్లిష్ట ప్రక్రియల ఫలితంగానే ఏర్పడింది.

  1. ఎక్కువమంది శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం సుమారుగా 450 కోట్ల సంవత్సరాల క్రితం భూమి ఏర్పడటం మొదలయ్యింది.
  2. భూమి అనేక దశలలో మార్పు చెంది, ప్రస్తుత రూపాన్ని సంతరించుకుంది.
  3. పరిభ్రమిస్తున్న ధూళి, మేఘాల గోళంగా మొదలై, ద్రవ దశ గుండా పరిణమించింది.
  4. ఆ దశలో భూమి చాలా వేడిగా ఉండేది.
  5. విశ్వం నుంచి పెద్ద పెద్ద రాళ్ళు, ఇతర పదార్థాలు దానిని ఢీకొంటూ ఉండేవి.
  6. ఆ విధంగా భూమి పరిమాణం పెరిగింది.
  7. భూమి అత్యంత వేడిమి గల ద్రవంగా ఉండేది.
  8. బరువైన పదార్థాలు ద్రవరూప కేంద్రభాగంగా మారితే, తేలిక పదార్థాలు పైకి లేచి చల్లబడ్డాయి. కాల క్రమంలో ద్రవరూప కేంద్రాన్ని కప్పుతూ తేలికైన, చల్లబడిన పదార్థాలతో పై పొర ఏర్పడింది.

AP Board 9th Class Social Solutions Chapter 1 భూమి - మనం

ప్రశ్న 5.
అనేక యాదృచ్చిక ఘటనల ఫలితంగా భూమి మీద మానవులు రూపొందారని కొంతమంది నమ్ముతారు. లేకుంటే భూమి మీద ప్రాణం ఏర్పడి ఉండేదే కాదు. వాళ్ళతో మీరు ఏకీభవిస్తారా? మీ కారణాలను పేర్కొనండి.
జవాబు:
మా కారణాలు కూడా శాస్త్రవేత్తలు తెల్పినవే.

  1. భూమి చరిత్రలో సగం కాలం ఎటువంటి ప్రాణీ లేకుండా నిర్జీవంగా గడిచింది.
  2. ఆ తరువాత సముద్రాలలో జీవం మొదలైంది.
  3. లక్షల సంవత్సరాల పరిణామక్రమంలో మనుషులతో సహా అనేక రకాల మొక్కలు, జంతువులు రూపొందాయి.

9th Class Social Textbook Page No.5

ప్రశ్న 6.
భూప్రావారంను అధ్యయనం చేయటానికి మనం దాని వరకు ప్రయాణించలేం. అయితే భూప్రావారంలోని పదార్థాల ద్వారా దాన్ని అధ్యయనం చేయవచ్చు. ఈ పదార్థాలు ఏమిటో, వాటిని ఎలా పొందవచ్చో చెప్పండి.
జవాబు:
భూప్రావారం:

  1. ఈ పొర భూమి లోపల 100 కిలోమీటర్ల నుంచి మొదలుకొని 2900 కిలోమీటర్ల వరకు ఉంటుంది.
  2. భూ ప్రావారంలో పై పొర తేలుతూ ఉంటుంది.
  3. ఇందులో ప్రధానంగా సిలికేట్లు అనే రసాయనాలు ఉంటాయి.
  4. అగ్నిపర్వతాలు విస్ఫోటనం చెందటం వలన మరియు యంత్రాలను భూ అంతర్భాగంలోనికి పంపడం ద్వారా వీటిని పొందవచ్చు.

9th Class Social Textbook Page No.7

ప్రశ్న 7.
ప్రపంచ పటాన్ని జాగ్రత్తగా గమనించండి. ‘జిగ్ సా పజిల్’ లోని రెండు ముక్కలుగా ఏవైనా రెండు ఖండాలు కనిపిస్తున్నాయా? ఆ ఖండాలు ఏవి?
జవాబు:
జిగ్ సా పజిల్ లోని రెండు ముక్కలుగా కనిపించే రెండు ఖండాలు:

  1. లారెన్షియా
  2. గోండ్వానా భూమి.

ప్రశ్న 8.
ఆస్ట్రేలియా ఏ దిశవైపునకు కదిలింది?
జవాబు:
దక్షిణం వైపునకు కదిలింది.

AP Board 9th Class Social Solutions Chapter 1 భూమి - మనం

ప్రశ్న 9.
భారతదేశం ఏ దిశవైపునకు కదిలింది?
జవాబు:
తూర్పు వైపునకు కదిలింది.

9th Class Social Textbook Page No.8

ప్రశ్న 10.
కింద ఇచ్చిన పటం ఆధారంగా దిగువ పట్టిక నింపండి.
AP Board 9th Class Social Solutions Chapter 1 భూమి - మనం 3

అర్ధ గోళం ఖండాలు
ఉత్తరార్ధగోళం
పశ్చిమార్ధగోళం
దక్షిణార్ధగోళం
తూర్పు అర్ధగోళం

జవాబు:

అర్ధ గోళం ఖండాలు
ఉత్తరార్ధగోళం ఉత్తర అమెరికా, ఆసియా, ఐరోపా, ఆఫ్రికాలో సగభాగం.
పశ్చిమార్ధగోళం ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా.
దక్షిణార్ధగోళం దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియా, ఆఫ్రికాలో సగభాగం, అంటార్కిటికా.
తూర్పు అర్ధగోళం ఆఫ్రికా, ఐరోపా, ఆసియా, ఆస్ట్రేలియా, అంటార్కిటికా.

9th Class Social Textbook Page No.12

ప్రశ్న 11.
అట్లాస్ చూసి ఈ దేశాలలో ఎన్ని ప్రామాణిక కాల మండలాలు (Time Zones) ఉన్నాయో తెలుసుకోండి.
అమెరికా, ఆస్ట్రేలియా, రష్యా, జపాన్, జింబాబ్వే, చిలీ.
జవాబు:

  1. అమెరికా : ఐదు ప్రామాణిక కాలమండలాలు ఉన్నవి. అవి -9, -3, -2, -6, -5 మండలాలు.
  2. ఆస్ట్రేలియా : మూడు ప్రామాణిక కాల మండలాలు ఉన్నవి. అవి +8, +9, +10 మండలాలు.
  3. రష్యా : పది ప్రామాణిక కాలమండలాలు ఉన్నవి. అవి +3, +4, +5, +6, +7, +8, +9, +10, +11, +12 మండలాలు.
  4. జపాన్ : ఒకే ఒక్క ప్రామాణిక కాలమండలం ఉంది. అది +9 మండలం.
  5. జింబాబ్వే : ఒకే ఒక్క ప్రామాణిక కాలమండలం ఉంది. అది +2 మండలం.
  6. చిలీ : ఒకే ఒక్క ప్రామాణిక కాలమండలం ఉంది. అది -5 మండలం.

ప్రశ్న 12.
హైదరాబాదులోని ఒక కాల్ సెంటరులో స్వాతి పనిచేస్తోంది. ఆమె క్లయింటులు అమెరికాలో ఉన్నారు. కంప్యూటర్ సమస్యలకు సంబంధించి క్లయింటుల ప్రశ్నలకు ఆమె సమాధానాలు ఇస్తుంది. ఆమె ఎప్పుడూ రాత్రివేళల్లోనే పనిచేస్తుంది. ఎందుకని ? భూగోళశాస్త్రాన్ని ఉపయోగించి తెలుసుకోండి.
జవాబు:

  1. భారతదేశము తూర్పు అర్ధగోళంలోనూ, అమెరికా పశ్చిమార్ధగోళంలోనూ ఉంది.
  2. రెండు దేశాల మధ్య దాదాపు 12 గంటల కాల వ్యత్యాసం ఉంది.
  3. అమెరికా వాళ్ల మధ్యాహ్న 12 గంటల సమయం, మనకు అర్ధరాత్రి 12 గంటల సమయమవుతుంది.
  4. అందువలన స్వాతి ఎప్పుడూ వాళ్లకు పగటివేళలయిన, మన రాత్రివేళల్లోనే, పనిచేయవలసి వస్తుంది.

AP Board 9th Class Social Solutions Chapter 1 భూమి - మనం

ప్రశ్న 13.
మెదడుకు మేత :
గ్రీన్ విచ్ (0) వద్ద మధ్యాహ్నం 12 : 00 అయితే ఈ దిగువ ప్రదేశాల్లో స్థానిక సమయం ఎంతో తెలుసుకోండి :
(అ) ముంబయి (73° తూ.రే) ; (ఆ) షికాగో (87° 30 ప.రే) ; (ఇ) సిడ్నీ ‘(151° తూ.రే.).
జవాబు:
ఒక్కొక్క రేఖాంశానికి సమయ వ్యత్యాసం 4 ని||లు.
(అ) ముంబయి (73° తూ.రే) :

  1. 73 × 4 = 292 నిమిషాలు = 4 గం||ల 52 ని॥లు
  2. తూర్పు రేఖాంశము గ్రీన్ విచ్ కు పైన ఉంటుంది. కనుక 4 గం|| 52 ని||లు కలుపవలసి ఉంటుంది.
  3. 12-00 + 4-52 = 16-52 అనగా స్థానిక సమయం సాయంత్రం 4 గం|| 52 ని||లు.

(ఆ) షికాగో (87° 30 ప.రే) :

  1. 87.30 × 4 = 87½ × 4 = 350 నిమిషాలు = 5 గం|| 50 ని||
  2. పశ్చిమ రేఖాంశము గ్రీన్ కు క్రింద ఉంటుంది. కనుక 5 గం|| 50 ని||లు తీసివేయవలసి ఉంటుంది.
  3. 12.00 – 5.50 = 6 గం|| 10 ని||
    అందువలన స్థానిక సమయం ఉదయం 6గం|| 10ని||

(ఇ) సిడ్నీ (151° తూ.రే.) :

  1. 151 × 4 = 604 ని||లు = 10 గం|| 4 ని||
  2. తూర్పు రేఖాంశము గ్రీన్ విచ్ కు పైన ఉంటుంది.
  3. 12.00 + 10 – 04 = 22-04
    అనగా స్థానిక సమయం రాత్రి 10 గం|| 4 ని||

AP Board 9th Class Biology Solutions 8th Lesson వ్యవసాయోత్పత్తుల పెంపుదల – మన ముందున్న సవాళ్లు

SCERT AP 9th Class Biology Guide Pdf Download 8th Lesson వ్యవసాయోత్పత్తుల పెంపుదల – మన ముందున్న సవాళ్లు Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Biology 8th Lesson Questions and Answers వ్యవసాయోత్పత్తుల పెంపుదల – మన ముందున్న సవాళ్లు

9th Class Biology 8th Lesson వ్యవసాయోత్పత్తుల పెంపుదల – మన ముందున్న సవాళ్లు Textbook Questions and Answers

అభ్యసనాన్ని మెరుగుపరుచుకోండి

ప్రశ్న 1.
మన దేశంలో ధాన్యం ఉత్పత్తిలో పెంపుదల సాధించాలంటే ఏమి చేయాలో సూచించండి. (AS 1)
(లేదా)
ఒక పక్క జనాభా విపరీతంగా పెరిగిపోతుంది. కాని పంటలు పండే భూమి మాత్రం తగ్గిపోతుంది. మరి పెరుగుతున్న జనాభాకు సరిపడేలా ఆహారోత్పత్తి పెంచాలంటే చేపట్టాల్సిన పరిష్కార మార్గాలు సూచించండి.
జవాబు:

  1. సాగుభూమి విస్తీర్ణాన్ని పెంచడం.
  2. ప్రస్తుతం సాగుచేస్తున్న భూమినందు ఉత్పత్తిని పెంచడం.
  3. ఎక్కువ దిగుబడినిచ్చే వరి సంకర జాతులను అభివృద్ధి చేయడం.
  4. వివిధ వాతావరణ పరిస్థితులలో పెరిగే నూతన రకములను ఉత్పత్తి చేయడానికి వరి మొక్క జన్యు వైవిధ్యమును పరిరక్షించడం.
  5. మంచి నీటిపారుదల పద్ధతులు, సరియైన యాజమాన్య పద్ధతులను పాటించాలి.
  6. పోషక పదార్థములను సక్రమముగా వినియోగించడానికి వరి పంట.యాజమాన్య పద్ధతులను అవలంబించాలి.
  7. సేంద్రియ ఎరువులను ఉపయోగించాలి.
  8. పంటమార్పిడి, మిశ్రమ పంటల పద్ధతులను అవలంబించాలి.

ప్రశ్న 2.
రసాయన ఎరువుల కంటే జీవ ఎరువులు ఏ విధంగా మెరుగైనవి? (AS 1)
జవాబు:

  1. జీవ ఎరువులు సహజ పోషకాలను నేలకు అందిస్తాయి.
  2. నేల నిర్మాణాన్ని మరియు నేల సేంద్రియ పదార్థాన్ని జీవ ఎరువులు పెంచుతాయి.
  3. జీవ ఎరువులు నీటి నిల్వ సామర్థ్యాన్ని మరియు నేల గట్టిపడే సమస్యలను తగ్గిస్తాయి.
  4. నేల మరియు నీటి కోరివేతను జీవ ఎరువులు తగ్గిస్తాయి.
  5. పంట యొక్క ఉత్పత్తిని జీవ ఎరువులు పెంచుతాయి.
  6. జీవ ఎరువుల వాడకం ద్వారా నేలలో హ్యూమస్ శాతం పెరిగి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి.

ప్రశ్న 3.
అ) అధిక దిగుబడినిచ్చే పంటలు పండించడానికి, రసాయన ఎరువులు ఎక్కువ వాడడం వలన కలిగే దుష్ఫలితాలు ఏమిటి? (AS 1)
జవాబు:

  1. రసాయనిక ఎరువులు సరస్సులు, నదులు మరియు వాగులను కలుషితం చేస్తాయి.
  2. నేలలో జీవించే వానపాములతో సహా ఇతర జీవులను నాశనం చేస్తాయి.
  3. రసాయనిక ఎరువులను వినియోగించుట ద్వారా కేవలం 20 నుండి 30 సంవత్సరాలు మాత్రమే అధిక ఉత్పత్తిని సాధించగలం.
  4. ఆ తరువాత నేల మొక్కల పెరుగుదలకు అనుకూలించదు.
  5. నేల సారాన్ని రసాయన ఎరువులు పాడు చేస్తాయి.
  6. రసాయన ఎరువుల వాడకం వలన పంటలు వ్యాధులకు గురి అవుతాయి.
  7. కొన్ని మొక్కలు పోషక పదార్థాలను గ్రహించడాన్ని నిరోధిస్తాయి.
  8. రసాయన ఎరువులు ఉపయోగించి పండించిన ఆహార పదార్థాలు అంత రుచికరంగా ఉండవు.

ఆ) అధిక దిగుబడినిచ్చే వంగడాలను రసాయన ఎరువులు లేకుండా పెంచవచ్చా? ఎలా? (AS 1)
జవాబు:

  1. అవును. అధిక దిగుబడినిచ్చే వంగడాలను రసాయన ఎరువులు లేకుండా పెంచవచ్చును.
  2. రసాయన ఎరువులు మరియు కృత్రిమంగా తయారయిన కీటక నాశనులకు బదులుగా జీవ ఎరువులను ఉపయోగించుట ద్వారా మనము అధికోత్పత్తిని పొందవచ్చు.

AP Board 9th Class Biology Solutions 8th Lesson వ్యవసాయోత్పత్తుల పెంపుదల – మన ముందున్న సవాళ్లు

ప్రశ్న 4.
విత్తనాలు విత్తడానికి ముందు తప్పనిసరిగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏవి? (AS 1)
జవాబు:

  1. విత్తనాలు విత్తే ముందు నేలను సిద్ధపరచాలి.
  2. నేలను వదులుగా చేయడానికి, గట్టిగా ఉన్న మట్టి గడ్డలను పగలగొట్టడానికి నేలను దున్నాలి.
  3. విత్తనాలు చల్లే ముందు నీళ్ళు పెట్టాలి. .
  4. నేలలో పుట్టే లేదా విత్తనముల ద్వారా వచ్చే వ్యాధులను అరికట్టడానికి విత్తన శుద్ధి చేయాలి.

ప్రశ్న 5.
వర్షాభావ పరిస్థితులు అధికంగా ఉండే ప్రదేశంలో మీ పొలం ఉంటే దానిలో ఏ రకమైన పంటలు పండిస్తావు? ఎలా పండిస్తావు? (AS 1)
జవాబు:

  1. జొన్న, సజ్జ, కంది, పెసలు, ఉలవలు మొదలగు పంటలను వర్షాభావ పరిస్థితులు గల మా పొలంలో పండిస్తాను.
  2. వర్షపు నీటిని సంరక్షించడం, చెక్ డ్యాంలను నిర్మించడం, డ్రిప్ ఇరిగేషన్ పద్ధతి, వాటర్ షెడ్ పథకము మరియు నేల మరియు నీటి సంరక్షణ పద్ధతుల ద్వారా పై పంటలను పండిస్తాను.

ప్రశ్న 6.
కాలానుగుణంగా ఆశించే కీటకాలు పంట పొలాన్ని నాశనం చేయకుండా ఏ రకమైన జాగ్రత్తలు తీసుకుంటారు? (AS 1)
జవాబు:

  1. సాధారణంగా రైతులు కృత్రిమంగా తయారుచేసిన ఎరువులు, కీటకనాశనులు ఉపయోగించి పంటలపై వచ్చే కీటకాలను అదుపులో ఉంచుతారు.
  2. కొందరు కీటకాలను చేతితో ఏరివేయడం ద్వారా కీటకాల బారి నుండి పంట పొలాన్ని రక్షిస్తారు.
  3. కీటకాలకు హాని కలిగించే పరభక్షక కీటకాలను ఉపయోగించి పంట పొలం నాశనం కాకుండా చూస్తారు.
  4. చేతితో కీటకాలను ఏరి వేసే పద్ధతిలో పంటపొలం మధ్యలో దీపపుతెరలు ఉంచడంవల్ల కీటకాలన్నీ దాని ఆకరణకు లోనై ఒకే చోటికి చేరతాయి. ఇలా చేయడం వల్ల వాటిని ఏరివేయడం సులభం.
  5. కీటకనాశనులను అవసరమైన సందర్భాలలో వినియోగించడం వల్ల కూడా పంటపొలాన్ని కీటకాలు నాశనం చేయకుండా చూడవచ్చు.

ప్రశ్న 7.
ఒక రైతు తన పొలంలో చాలా కాలంగా ఒకే క్రిమిసంహారక మందును ఉపయోగిస్తున్నాడు. అయితే కింది వాటిపై దాని ప్రభావం ఏ విధంగా ఉంటుంది? (AS 2)
అ) కీటకాల జనాభా
ఆ) నేల ఆవరణ వ్యవస్థ
జవాబు:
అ) కీటకాల జనాభా :

  1. రైతు క్రిమిసంహారక మందును ఎక్కువకాలం ఉపయోగించడం వలన కీటకాలు వ్యాధి నిరోధకతను పెంచుకుంటాయి.
  2. అందువలన కీటకాల జనాభా పెరుగుతుంది.

ఆ) నేల ఆవరణ వ్యవస్థ :

  1. క్రిమి సంహారకాలను ఎక్కువకాలం ఉపయోగించడం వల్ల ఆ మందులు నేలలోనే ఉండిపోతాయి.
  2. ఆ మందులు నేలలోని పురుగులను చంపివేస్తాయి. తద్వారా పంట దిగుబడి తగ్గుతుంది.
  3. నేలలో లవణాల శాతం పెరిగి నేల ఆవరణ వ్యవస్థ దెబ్బ తింటుంది.

ప్రశ్న 8.
రామయ్య తన పొలానికి భూసార పరీక్ష చేయించాడు. పోషకాల నిష్పత్తి 34-20-45గా ఉంది. ఈ నిష్పత్తి చెరకు పండించడానికి అనుకూలమేనా? ఏ రకమైన పంటలు పండించడానికి ఈ పొలం అనుకూలమని భావిస్తావు? (AS 2)
జవాబు:

  1. రామయ్య పొలము చెరకు పంట పండించడానికి అనుకూలం కాదు.
  2. ఎందుకంటే చెరకు పంట పండించడానికి నేలలో 90% నత్రజని ఉండాలి, కాని రామయ్య పొలంలో కేవలం 34% నత్రజని మాత్రమే ఉంది.
  3. భాస్వరము 20% ఉండడం వలన మొక్కజొన్నను, పొటాషియం 45% ఉండడం వలన వేరుశనగ పంటను పండించవచ్చు.

ప్రశ్న 9.
మీ సమీపంలోని పొలానికి వెళ్ళి రైతులు కలుపు నివారణకు పాటిస్తున్న పద్ధతులు గురించిన సమాచారం సేకరించి నివేదిక రాయండి. (AS 3)
జవాబు:
కలుపు నివారణకు పాటిస్తున్న పద్ధతులు :

రైతు పేరు నివారణ పద్ధతి
1. రామారావు కూలీలతో చేతితో ఏరివేయిస్తున్నాడు.
2. వెంకటయ్య ఈ రైతుది మెట్ట పొలం అయినందున గుంటక వంటి పరికరాలు వాడి నివారణ చేస్తున్నాడు.
3. సోమేశం కలుపు నాశకాలను చల్లి నివారణ చేస్తున్నాడు.
4. శ్రీనివాసరావు దుక్కిలోనే కలుపు వినాశకాలను వాడి, దున్ని కలుపును రాకుండా నివారిస్తున్నాడు.

ఈ నాలుగు పద్ధతులను చాలా మంది రైతులు పాటించుటను గమనించాను.

AP Board 9th Class Biology Solutions 8th Lesson వ్యవసాయోత్పత్తుల పెంపుదల – మన ముందున్న సవాళ్లు

ప్రశ్న 10.
మీ ప్రాంతంలోని ప్రధానమైన కలుపు మొక్కల జాబితా తయారుచేయండి. వాటిలో వేర్వేరు పంటలలో పెరిగే కలుపు మొక్కలను కింది పట్టికలో నమోదు చేయండి. (AS 4)
జవాబు:
ప్రధానమైన కలుపు మొక్కల జాబితా :
సైనోడాన్ డాక్టలాన్ (గరిక), సైపరస్ రొటండస్ (తుంగ), డిజిటారియా లాంగిఫోలియా, డాక్టలో క్లీనియమ్ కలోనమ్, సెటేరియా గ్లూకా, సైపరస్ డిఫార్మిస్, ఐకోర్నియా క్రాసిప్స్ (బుడగ తమ్మ), సాల్వీనియా మొలస్టా, ఆల్టర్ నాంతిర సెసైలిస్ (పొన్నగంటి), సెలోషియా అర్జెన్షియా (గురంగుర) లూకాస్ ఏస్పిరా (తుమ్మి), పోర్చు లేక ఒలరేషియా (పావలికూర), క్లియోమ్ విస్కోసా (కుక్కవామింట), సొలానమ్ నైగ్రమ్ (బ్లాక్ నైట్ షేడ్), అర్జిమోన్ మెక్సికానా (బాలరక్కొస), ఎబుటిలాన్ ఇండికమ్ (తుత్తురి బెండ), యూఫోర్బియా హిరా (పచ్చబొట్లు), వెర్నోనియా సిన్నోరా, ఇఖ్ నోక్లోవా కొలోనమ్ (ఉడలు), కొమ్మెలైనా బెంగాలెన్సిస్ (వెన్నవెదురు), అవినాఫాట్యువ (అడవియవలు), ఇళ్ల నోక్లోవా క్రస్ గల్లి (నీటిగడ్డి), ఎల్యు సైన్ ఇండికా (గూ గ్రాస్), ఎభిరాంథిస్ ఏస్పిరా (ఉత్తరేణి), ఇక్లిష్టా ప్రోస్టేట (గుంట కలగర లేదా) భృంగరాజ మొదలగునవి.

పంట రకం పంటపై పెరిగే కలుపు మొక్కలు
వరి గరిక, తుంగ, బుడగ తమ్మ, పొన్నగంటి
వేరుశనగ గురంగుర, గరిక, తుంగ, తుత్తురి బెండ, వెన్న వెదురు, కుక్కవామింట, తుమ్మి, పావలికూర, బాలరక్కిస.
మినుములు గరిక, తుంగ, తుత్తురి బెండ, వెన్న వెదురు, సాల్వీనియా మొలస్టా, పచ్చబొట్లు, బంగారు తీగ.
మొక్కజొన్న పచ్చబొట్లు, సొలానమ్ నైగ్రమ్, గరిక, తుంగ
పెసలు ఉడలు, గరిక, తుంగ, బాలరక్కొస, పావలికూర

ప్రశ్న 11.
మీ గ్రామ పటం గీచి, నీటివనరులను గుర్తించండి. నీవు ఒక మంచి రైతుగా వాటిని ఎలా ఉపయోగిస్తావు? ఏ ఏ వ్యవసాయ పద్ధతులను పాటిస్తావు? (AS 5)
జవాబు:
AP Board 9th Class Biology Solutions 8th Lesson వ్యవసాయోత్పత్తుల పెంపుదల – మన ముందున్న సవాళ్లు 1
నేను ఒక మంచి రైతుగా ఆ నీటి వనరులను సక్రమ పద్ధతిలో ఉపయోగిస్తాను. నీటివనరులు తక్కువగా ఉంటే బిందుసేద్యం పద్ధతిని ఉపయోగిస్తాను.

ప్రశ్న 12.
రసాయన ఎరువులు శిలీంధ్రనాశకాలు, కీటకనాశకాలు, కలుపు మందులు అధిక మోతాదులో వినియోగిస్తే పర్యావరణంపై కలిగే పరిణామాలు ఏమిటి? (AS 6)
జవాబు:

  1. మనం కీటకనాశనులు, శిలీంధ్రనాశకాలను, కలుపు మందులను అధిక మొత్తంలో వాడడం వలన ఈ మందులు నేలలోనే మిగిలిపోతాయి.
  2. వర్షాలు పడినప్పుడు నేల నుండి నీటిలో కరిగి నీటి వనరులను కూడా కలుషితం చేస్తాయి.
  3. నేల పొరలోకి దిగి నేలను కలుషితం చేసాయి.
  4. ఈ మందులను పొలంలో చల్లే రైతులు తరచుగా వీటి ప్రభావానికి గురి అయ్యి ఆరోగ్యంపై దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపుతాయి. కొన్నిసార్లు మరణం కూడా సంభవించవచ్చు.
  5. కీటకనాశనులు ఉపయోగపడే కీటకాలతో సహా మొత్తం కీటకాలను నాశనం చేస్తాయి.
  6. అధిక మొత్తంలో రసాయన ఎరువులు, కీటక నాశనులు, కలుపు ందులను వాడడం వలన కొంత కాలానికి నేల పంట పండించడానికి ఉపయోగపడదు.

ప్రశ్న 13.
“జీవ వైవిధ్యానికి సేంద్రియ ఎరువులు సహాయపడతాయి”. దీనిని నీవెలా సమర్థిస్తావు? (AS 6)
జవాబు:

  1. నేల మరియు నేలలో ఉండే జీవులపై జరిగిన జీవశాస్త్ర అధ్యయనము సేంద్రియ సేద్యమునకు అనుకూలమని నిరూపించబడినది.
  2. రసాయన పదార్థాలను, వృక్ష మరియు జంతు సంబంధమైన వ్యర్థాల నుండి బాక్టీరియా మరియు శిలీంధ్రాలు నేల పోషక పదార్థములను విడగొడతాయి.
  3. అంతేకాకుండా బాక్టీరియా మరియు శిలీంధ్రాలు ఆరోగ్యకరమైన దిగుబడిని ఇవ్వడానికి మరియు భవిష్యత్తుల్లో పండించబోయే పంటలకు అనుకూలమైన నేలను అందిస్తాయి.

ప్రశ్న 14.
“ఎక్కువ మోతాదులో శిలీంధ్రనాశకాలు వాడితే జీవవైవిధ్యం, పంట దిగుబడిపై తీవ్రమైన ప్రమాదం కలుగుతుంది”. దీనిని నీవెలా సమర్థిస్తావు? (AS 6)
జవాబు:

  1. ఎక్కువ మోతాదులో శిలీంధ్రనాశకాలు వాడితే అవి ఎక్కువ భాగం మృత్తికలలో చేరి మృత్తికలోని జీవులను నాశనం చేస్తాయి.
  2. వర్షము కురిసినప్పుడు మృత్తిక నుండి వర్షపు నీటి ద్వారా చెరువులు, నదులలోని నీటిలోకి చేరి జలజీవులకు హాని కలుగచేస్తాయి.
  3. ఈ మందులను పొలంలో చల్లే రైతులు తరుచుగా వీటి ప్రభావానికి గురి కావడం జరుగుతుంది. కొన్ని రసాయనిక పదార్థాలు శరీరంలోకి ప్రవేశించి, కొన్నిసార్లు ప్రాణాపాయం కలుగుతుంది.
  4. క్రిమి సంహారక మందులను పంటలపై చల్లినప్పుడు అవి పరాగ సంపర్కానికి ఉపయోగపడే కీటకాలను కూడా చంపివేస్తాయి.

AP Board 9th Class Biology Solutions 8th Lesson వ్యవసాయోత్పత్తుల పెంపుదల – మన ముందున్న సవాళ్లు

ప్రశ్న 15.
అధిక దిగుబడినిచ్చే వంగడాలను ఉపయోగించడం వలన కలిగే ప్రతికూల ప్రభావం ఏమిటి? (AS 7)
జవాబు:
అధిక దిగుబడినిచ్చే వంగడాలను ఉపయోగించడం వలన
i) అవి ఎక్కువ మొత్తంలో నేల నుండి పోషకాలను వినియోగించుకుంటాయి.
ii) నిరంతరం ఉపయోగించడం వలన నేల సారాన్ని కోల్పోతుంది.
iii) సారాన్ని పెంచటానికి రసాయన ఎరువులు వాడాల్సి ఉంటుంది.
iv) ఇది వ్యవసాయ ఖర్చును పెంచుతుంది.

ప్రశ్న 16.
రసాయన ఎరువులు ఉపయోగిస్తున్న రైతుకు సేంద్రియ ఎరువులు ఉపయోగించే విధంగా ఏ రకంగా వివరించి ఒప్పిస్తావు? (AS 7)
జవాబు:

  1. పోషక పదార్థాలు తిరిగి నేలలో కలిసే విధంగా మరియు మట్టిగడ్డలు చిన్నవిగా చేయడానికి జీవ ఎరువులు తోడ్పడతాయి.
  2. నేలలో ఉండే జీవుల మనుగడను జీవ ఎరువులు ఎక్కువ చేస్తాయి.
  3. సేంద్రీయ ఎరువులు పంట దిగుబడి ఎక్కువ వచ్చే విధంగా చేస్తాయి.
  4. నేల యొక్క సహజ సమతౌల్యాన్ని కాపాడతాయి.
  5. కొన్ని పంటలకు వ్యాధులు సోకకుండా నివారిస్తాయి.
  6. పర్యావరణానికి హాని చేయని మిత్రులుగా సేంద్రియ ఎరువులు ఉంటాయి.

పైన పేర్కొన్న సేంద్రియ ఎరువుల యొక్క ఉపయోగాలను రైతుకు స్పష్టంగా వివరించి, వాటినే ఉపయోగించేలా ఆ రైతును ఒప్పిస్తాను.

ప్రశ్న 17.
వెంకటాపురం అనే గ్రామం తీవ్ర వర్షాభావ పరిస్థితులున్న ప్రాంతం. సోమయ్య తన పొలంలో చెరకును పండించాలనుకుంటున్నాడు. ఇది లాభదాయకమా? కాదా? వివరించండి. (AS 7)
జవాబు:

  1. సోమయ్య తన పొలంలో చెరకును పండించాలనుకోవడం లాభదాయకం కాదు.
  2. ఎక్కువ నీటి లభ్యత కలిగిన ప్రదేశాలలో మాత్రమే చెరకు పండుతుంది.
  3. నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రదేశాలలో ఆరుతడి పంటలు పండించడం లాభదాయకం.

ప్రశ్న 18.
“సహజ కీటకనాశన పద్ధతులు జీవ వైవిధ్యానికి దోహదం చేస్తాయి”. వ్యాఖ్యానించండి. (AS 7)
జవాబు:

  1. కొన్ని రకాల కీటకాలు మనకు హాని కలిగించే, నష్టం కలిగించే కీటకాలను అదుపులో ఉంచుతాయి. వీటిని మిత్ర కీటకాలు అంటారు.
    ఉదా : సాలెపురుగు, డ్రాగన్ ప్లే, క్రిసోపా మొదలగునవి.
  2. ట్రైకో డెర్మా బాక్టీరియం కాండం తొలిచే పురుగు గుడ్లలో నివసిస్తుంది.
  3. పొగాకును తినే గొంగళి పురుగు, ధాన్యాన్ని తినే గొంగళిపురుగు వంటి వాటిని గ్రుడ్ల దశలోనే బాక్టీరియాతో నాశనం చేయవచ్చు.
  4. బాసిల్లస్ తురంజనిసిన్ వంటి కొన్ని రకాల బాక్టీరియాలు కీటకాలను నాశనం చేస్తాయి.
  5. కొన్ని రకాల మిశ్రమ పంటలు కీటకాలను, వ్యాధులను అదుపులో ఉంచుతాయి.
  6. అందువలన సహజ కీటక నాశన పద్దతులు జీవ వైవిధ్యానికి దోహదం చేస్తాయి. దీని ద్వారా కేవలం హానికరమైన కీటకాలు మాత్రమే చనిపోతాయి.

9th Class Biology 8th Lesson వ్యవసాయోత్పత్తుల పెంపుదల – మన ముందున్న సవాళ్లు Textbook InText Questions and Answers

9th Class Biology Textbook Page No. 115

ప్రశ్న 1.
బిందుసేద్యం వంటి నీటి సరఫరా పద్ధతి, పంటలకు, రైతులకు ఎలా ఉపయోగపడుతుందో ఆలోచించండి.
జవాబు:

  1. నీటి వృథాను అరికట్టడానికి బిందుసేద్యం (Drip Irrigation) అత్యంత ప్రయోజనకరమైన పద్ధతి.
  2. బిందుసేద్యం పద్ధతిలో నీరు చిన్న చిన్న గొట్టాల గుండా సరఫరా అవుతుంది.
  3. ఈ గొట్టాలకు అక్కడక్కడ సన్నటి రంధ్రాలుంటాయి.
  4. ఈ రంధ్రాల గుండా నీరు చుక్కలు చుక్కలుగా పడుతుంది.
  5. ఈ పద్ధతి ద్వారా ఎరువులను వృథా కాకుండా మొక్కలకు అందించవచ్చును.

9th Class Biology Textbook Page No. 115

ప్రశ్న 2.
వాటర్ షెడ్ పథకం భూగర్భజలాలను పెంచడానికి ఎంతగానో తోడ్పడుతుంది. దీనిని నీవు ఎట్లా సమర్థిస్తావు?
జవాబు:

  1. వాటర్ షెడ్ తో పంటలకి కావల్సిన నీళ్ళు ఇవ్వడమే కాకుండా చుట్టూ ఉన్న జంతువులకి, పశువులకి, పక్షులకి నీళ్ళందించవచ్చు.
  2. నేలలో తేమ శాతాన్ని పెంచవచ్చు.
  3. నేలపై మట్టి కొట్టుకుపోకుండా ఆపడానికి కూడా పాటర్ షెడ్ ఉపయోగపడుతుంది.
  4. కొండవాలు ప్రాంతాల్లో, ఎత్తైన గుట్టల్లో పడ్డ వాన నీళ్ళని సద్వినియోగం చేసుకొని, చుట్టూ ఉన్న ఆవాసంలో అన్ని అవసరాలకి నీళ్ళని అందించే ఏకైక మార్గం వాటర్‌షెడ్.

AP Board 9th Class Biology Solutions 8th Lesson వ్యవసాయోత్పత్తుల పెంపుదల – మన ముందున్న సవాళ్లు

9th Class Biology Textbook Page No. 121

ప్రశ్న 3.
వర్మీ కంపోస్టు ఎరువు రసాయనిక ఎరువుల కంటే ఎలా మేలైనది?
జవాబు:

  1. రసాయనిక ఎరువుల వలన నేలకలుషితం, వాతావరణ కలుషితం జరుగుతుంది.
  2. రసాయనిక ఎరువులు వాడిన ఆహార పదార్థాలు తినడం వలన మానవుల ఆరోగ్యం పాడవుతుంది.
  3. కాని వర్మీ కంపోస్టు వాడడం వలన ఎలాంటి కాలుష్య లేదా ఆరోగ్య సమస్యలు ఏర్పడవు. అందువలన వర్మీ కంపోస్టు ఎరువు రసాయనిక ఎరువులకంటే చాలా మేలైనది.

9th Class Biology Textbook Page No. 109

ప్రశ్న 4.
a) నెలకు ఎంత ధాన్యం మీ ఇంట్లో అవసరం అవుతుందో అంచనా వేయటానికి ప్రయత్నించండి.
జవాబు:
నెలకు మా ఇంట్లో సుమారుగా 50 కి.గ్రా. ధాన్యం ఖర్చు అవుతుంది. సంవత్సరానికి 600 కి.గ్రా. ధాన్యం అవసరమవుతుంది.

b) ఆ ధాన్యం పండటానికి ఎంత నేల అవసరమో ఊహించంది.
జవాబు:
600 కి.గ్రా. ధాన్యం పండటానికి సుమారు 1.4 చ.కి.మీ. నేల అవసరమవుతుంది.

9th Class Biology Textbook Page No. 109

ప్రశ్న 5.
ఈ క్రింది పట్టికను పరిశీలించి ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
AP Board 9th Class Biology Solutions 8th Lesson వ్యవసాయోత్పత్తుల పెంపుదల – మన ముందున్న సవాళ్లు 2
a) ఏ దశాబ్దంలో జనాభా పెరుగుదల అధికంగా ఉంది?
జవాబు:
1961-1971 దశాబ్దంలో జనాభా పెరుగుదల అధికంగా ఉంది.

b) ఏ దశాబ్దంలో ఆహారధాన్యాల ఉత్పత్తి అధికంగా ఉంది?
జవాబు:
1981-1991 దశాబ్దంలో ఆహారధాన్యాల ఉత్పత్తి అధికంగా ఉంది.

c) పై పట్టికలో ఏయే తేడాలు మీరు గమనించారు?
జవాబు:
జనాభా పెరుగుదలతో సమానంగా ఆహారధాన్యాల ఉత్పత్తి పెరగటం లేదు.

d) పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆహారధాన్యాల ఉత్పత్తి జరుగుతున్నదా?
జవాబు:
లేదు, జనాభా పెరుగుదలకు అనుగుణంగా ఆహారధాన్యాల ఉత్పత్తి జరగటం లేదు.

e) ఏ దశాబ్దంలో జనాభా పెరుగుదలకు అనుగుణంగా ఆహారధాన్యాల ఉత్పత్తి సంతృప్తికరంగా లేదు?
జవాబు:
1991-2001 దశాబ్దంలో జనాభా పెరుగుదలకు అనుగుణంగా ఆహారధాన్యాల ఉత్పత్తి జరగలేదు. పెరుగుదల రేటు కేవలం 0.56 మాత్రమే.

f) తగినంత ఆహారధాన్యాల ఉత్పత్తి జరగకపోతే ఏమి జరుగుతుంది?
జవాబు:
తగినంత ఆహారధాన్యాల ఉత్పత్తి జరగకపోతే, దేశంలో తీవ్ర ఆహార కొరత ఏర్పడుతుంది.

g) 1991-2001 దశాబ్దంలో జనాభాని పోల్చితే సగమే ఆహారధాన్యాల, ఉత్పత్తి జరిగింది. ఫలితంగా ఆ దశాబ్దంలో ఏం జరిగి ఉంటుందని నీవు భావిస్తున్నావు?
జవాబు:
1991-2001 దశాబ్దంలో జనాభా పెరుగుదలకు సమానంగా ఆహారధాన్యాల ఉత్పత్తి జరుగలేదు. దానివలన దేశంలో తీవ్ర కరువు పరిస్థితి నెలకొని ఉండి ఉంటుంది. ప్రజలు ఆహార కొరతను ఎదుర్కొని ఉంటారు.

9th Class Biology Textbook Page No. 110

ప్రశ్న 6.
ఆహారధాన్యాల ఉత్పత్తిలో పెంపుదలకు మీరిచ్చే సూచనలు రాయండి.
జవాబు:

  1. మంచి నాణ్యమైన వ్యాధి నిరోధకత కలిగిన వంగడాలు పంటకు ఎన్నుకోవాలి.
  2. నీటి వనరుల ఆధారంగా నేల స్వభావం పరిశీలించి సరైన పంటను ఎన్నుకోవాలి.
  3. సహజ ఎరువులకు ప్రాధాన్యమివ్వాలి.
  4. వ్యాధుల నివారణకు సహజ నియంత్రణ పద్ధతులు పాటించాలి.
  5. పంట మార్పిడి, అంతర పంటలకు ప్రాధాన్యమివ్వాలి.
  6. యంత్రాలు, ఆధునిక సాంకేతికతను వాడటం వలన అధిక దిగుబడి సాధించవచ్చు.

9th Class Biology Textbook Page No. 111

ప్రశ్న 7.
అధిక ఆహార ఉత్పత్తి సాధించటానికి కొన్ని పరిష్కార మార్గాలు చూపండి.
జవాబు:

  1. సాగునేల విస్తీర్ణాన్ని పెంచడం.
  2. ప్రస్తుతం సాగులో ఉన్న నేలలోనే అధిక దిగుబడి సాథించడం.
  3. అధిక దిగుబడిని ఇచ్చే వంగడాలను అభివృద్ధి చేయడం.
  4. పంట మార్పిడి చేయడం.
  5. మిశ్రమ పంటలు పండించడం.
  6. స్వల్పకాలిక పంటలు పండించడం.

ఎ) పై వాటిలో ఏది ప్రయోజనకరమో చర్చించండి.
జవాబు:

  1. సాగునేల విస్తీర్ణాన్ని పెంచటం వలన అడవులను నరికివేయాల్సి వస్తుంది. కావున సరైన చర్యకాదు.
  2. ప్రస్తుతం సాగులో ఉన్న నేలలోనే అధిక దిగుబడి సాధించటం ప్రయోజనకర పద్దతి..
  3. ఈ పద్ధతిలోది, వంగడాల అభివృద్ధి, పంటమార్పిడి, మిశ్రమ పంటలు వంటి అన్ని పద్ధతులూ ఇమిడి ఉంటాయి.

9th Class Biology Textbook Page No. 112

ప్రశ్న 8.
ఈ క్రింది గ్రాఫ్ ను పరిశీలించి ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
AP Board 9th Class Biology Solutions 8th Lesson వ్యవసాయోత్పత్తుల పెంపుదల – మన ముందున్న సవాళ్లు 3
a) పై గ్రాఫ్ ఆధారంగా పంట దిగుబడిలో నీటిపారుదల ప్రాముఖ్యతను వివరించండి.
జవాబు:

  1. నీటిపారుదల పంటకు అత్యంత అవసరము.
  2. నీటిపారుదల సక్రమంగా ఉన్నప్పుడు పంట దిగుబడి బాగా ఉంది.
  3. సరిపడినంత ఎరువులు అందించినప్పటికి, నీటిపారుదల సక్రమంగా లేకుంటే మంచి దిగుబడి పొందలేము.

b) ఒకే పరిమాణంలో నత్రజని అందించినప్పటికీ నీటిపారుదల కల్పించిన పొలంలో, నీటిపారుదల కల్పించని పొలంలో పంట దిగుబడిలో తేడాలున్నాయా? ఉంటే అవి ఏమిటి?
జవాబు:

  1. తేడాలు ఉన్నాయి. ఒకే పరిమాణంలో నత్రజని అందించినప్పటికీ సరైన నీటిపారుదల ఉన్న పంటలు అధిక దిగుబడిని ఇచ్చాయి.
  2. నీటిపారుదల సక్రమంగా లేని పంటలు, ఎరువులు అందించినప్పటికీ సరైన దిగుబడిని ఇవ్వలేదు.

9th Class Biology Textbook Page No. 113

ప్రశ్న 9.
ఈ క్రింది గ్రాఫ్ ను పరిశీలించి ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
AP Board 9th Class Biology Solutions 8th Lesson వ్యవసాయోత్పత్తుల పెంపుదల – మన ముందున్న సవాళ్లు 4
a) పై గ్రాఫ్ లో ఏ నెలల్లో మొక్కలు అధిక నీటిని ఆవిరి రూపంలో విడుదల చేస్తున్నాయో గుర్తించండి.
జవాబు:
మే మరియు జూన్ నెలల్లో మొక్కల నుండి నీరు ఆవిరి రూపంలో అధికంగా కోల్పోతున్నాయి.

b) కొన్ని నెలలలో వర్షాలు అధికంగా ఉన్నప్పటికీ మొక్కలు విడుదలచేసే నీటి ఆవిరి పరిమాణం ఒకే విధంగా ఉంటుందా?
జవాబు:
వర్షాలు ఉన్నప్పుడు పగటి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి. అందువలన మొక్కలు విడుదల చేసే నీటి ఆవిరి పరిమాణం తక్కువగా ఉంటుంది.

c) నీరు అధికంగా లభిస్తే మొక్కలపై నీటి ప్రభావం ఏవిధంగా ఉంటుంది?
జవాబు:

  1. నీరు అధికంగా లభించినపుడు మొక్కలు వేగంగా పెరుగుతాయి.
  2. భూమి నుండి పోషకాలను బాగా గ్రహించగలుగుతాయి.

AP Board 9th Class Biology Solutions 8th Lesson వ్యవసాయోత్పత్తుల పెంపుదల – మన ముందున్న సవాళ్లు

9th Class Biology Textbook Page No. 114

ప్రశ్న 10.
a) వాతావరణం వేడిగా ఉన్నప్పుడు పత్ర రంధ్రాలు మూసుకొని పోతాయనుకున్నాం కదా ! మరి ఇది కార్బన్ డై ఆక్సైడ్ శోషణపై ఏ ప్రభావాన్ని చూపుతుంది?
జవాబు:

  1. వాతావరణం వేడిగా ఉన్నప్పుడు పత్ర రంధ్రాలు మూసుకొనిపోతాయి.
  2. అందువలన CO2 శోషణ మొక్కలలో తగ్గుతుంది.

b) కార్బన్ డై ఆక్సైడ్ శోషణ రేటులో మార్పు మొక్కలపై ఏ విధమైన ప్రభావం చూపుతుంది?
జవాబు:
కార్బన్ డై ఆక్సైడ్ శోషణ రేటు తగ్గటం వలన మొక్కలలో ఆహారోత్పత్తి తగ్గుతుంది. దీనివలన మొక్కల పెరుగుదల తగ్గుతుంది. కొత్త కొమ్మలు, ఆకులు ఏర్పడవు.

c) ఇలాంటి సమయంలో మొక్కలకు నీళ్ళు లేకపోతే ఏమౌతుంది?
జవాబు:
ఇలాంటి సమయంలో మొక్కలకు నీళ్ళు లేకపోతే మొక్కల ఆరోగ్యం పాడైపోతుంది. పంట దిగుబడి తీవ్రంగా తగ్గుతుంది.

9th Class Biology Textbook Page No. 114

ప్రశ్న 11.
వ్యవసాయానికి నీరు ప్రధాన అవసరం. మీ గ్రామంలో వ్యవసాయం కోసం ఉన్న ముఖ్యమైన నీటి వనరులు ఏమున్నాయి? రైతులు వాటిని ఎలా ఉపయోగించుకుంటున్నారు?
జవాబు:

  1. మా గ్రామంలో వ్యవసాయం కొరకు కాలువలు, చెరువులు ఉన్నాయి.
  2. వర్షపునీరు చెరువును చేరి నిల్వ చేయబడుతుంది.
  3. ఈ నీటిని పంటకాలువల ద్వారా పంట పొలాలకు మళ్ళించి వ్యవసాయం చేస్తారు.
  4. మా గ్రామంలో కొంత ప్రాంతం సాగర్ కాలువ కింద సాగుబడిలో ఉంది.

9th Class Biology Textbook Page No. 114

ప్రశ్న 12.
వరి పండించటానికి అధిక పరిమాణంలో నీరు అవసరం. ఇలా నీరు ఎక్కువగా అవసరమయ్యే పంటల పేర్లు చెప్పగలరా?
జవాబు:
వరితోపాటుగా గోధుమ, చెరకు వంటి పంటలకు అధిక నీరు అవసరమౌతుంది.

9th Class Biology Textbook Page No. 115

ప్రశ్న 13.
తక్కువ నీరు కావలసిన పంటల పేర్ల జాబితా రాయండి.
జవాబు:
ప్రత్తి, జనపనార, సజ్జలు, మొక్కజొన్న, కొబ్బరి, మినుములు, పెసలు, వేరుశనగలకు తక్కువ నీరు అవసరం.

9th Class Biology Textbook Page No. 116

ప్రశ్న 14.
a) ఒక పొలంలో చాలా సంవత్సరాల పాటు ఒకే పంట సాగుచేస్తూ ఉంటే, నేలలోని పోషకాలు ఏమౌతాయి?
జవాబు:
ఒక పొలంలో చాలా సంవత్సరాల పాటు ఒకే పంట సాగుచేస్తే ఒకే విధమైన పోషకాలు శోషించబడి, నేలలో పోషకాల కొరత ఏర్పడుతుంది. అందువలన పంట దిగుబడి విపరీతంగా తగ్గుతుంది.

b) కోల్పోయిన పోషకపదార్థాలను నేల తిరిగి ఎలా పొందుతుంది?
జవాబు:
నేల కోల్పోయిన పోషకపదార్థాలను వృక్ష, జంతు వ్యర్థాలు కుళ్ళటం వలన హ్యూమస్ రూపంలో తిరిగి పొందుతుంది. కానీ ఇది చాలా నెమ్మదైన ప్రక్రియ. అందువలన రైతులు రసాయన ఎరువులు వాడుతున్నారు. ఇవి ఖర్చుతో కూడుకొని నేల ఆరోగ్యాన్ని పాడుచేస్తాయి.

9th Class Biology Textbook Page No. 116

ప్రశ్న 15.
ఒక రైతు తన పొలంలో గత 5 సంవత్సరాల నుండి చెరకు పంటను పండిస్తున్నాడు. మరో రైతు మొదటి సంవత్సరం చెరకు పంట, రెండవ సంవత్సరం సోయా చిక్కుళ్ళు, మూడవ సంవత్సరం తిరిగి చెరకు పంట పండించాడు. ఏ పొలంలో పోషకపదార్థాలు నశిస్తాయి? ఎందుకు?
జవాబు:
వరుసగా ఐదు సంవత్సరాలు చెరకు పండించిన రైతు పొలంలో పోషకాలు లోపిస్తాయి. చెరకు ఒకే విధమైన పోషకాలను ప్రతి సంవత్సరం నేల నుండి గ్రహిస్తుంది. కావున నేలలో ఆ పోషకాలు తగ్గిపోయి, పోషకాల కొరత ఏర్పడుతుంది.

పంట మార్పిడి పాటించటం వలన నేలలోని పోషకాల వినియోగం మారి, పోషకాలు పునరుద్ధరింపబడతాయి. పంట మార్పిడి విధానంలో లెగ్యూమినేసి పంటలు మంచి ఫలితాలను ఇస్తాయి.

AP Board 9th Class Biology Solutions 8th Lesson వ్యవసాయోత్పత్తుల పెంపుదల – మన ముందున్న సవాళ్లు

9th Class Biology Textbook Page No. 118

ప్రశ్న 16.
తమలపాకులను మిశ్రమపంటలుగా మాత్రమే పండిస్తారు. ఎందుకు?
జవాబు:

  1. తమలపాకు మొక్క తీగవలె ఉండి ఎత్తు మొక్కలకు అల్లుకొంటుంది.
  2. నేల అంతా ఖాళీగా ఉండుట వలన అంతర పంటకు అనుకూలంగా ఉంటుంది.
  3. అందువలన తమలపాకుతో పాటు పెసర, మినుము వంటి మిశ్రమపంటలు పండిస్తారు.
  4. దీనివలన రైతుకు రెండు పంటలు పండి ఆర్థికలాభం చేకూరుతుంది.
  5. నేలలో పోషకాలు పునరుద్ధరింపబడతాయి.

9th Class Biology Textbook Page No. 118

ప్రశ్న 17.
లెగ్యూమినేసి జాతికి చెందిన పంటల పేర్లు కొన్నింటిని చెప్పండి.
జవాబు:
చిక్కుడు, మినుము, పెసర, వేరుశనగ, పిల్లి పెసర వంటి పంటలు లెగ్యూమినేసి జాతికి చెందుతాయి. ఇవి నేలలో నత్రజనిని స్థాపించి పోషక విలువలను పెంచుతాయి.

9th Class Biology Textbook Page No. 118

ప్రశ్న 18.
నత్రజని స్థాపన చేసే బాక్టీరియాల పేర్లను తెలుసుకోండి.
జవాబు:
రైజోబియం, అజటో బాక్టర్, నైట్రోమోనాస్, సూడోమోనాస్ వంటి బాక్టీరియాలు నత్రజని స్థాపనకు తోడ్పడుతాయి. ఇవి వాతావరణంలోని నత్రజనిని నైట్రేట్లుగా మార్చి మొక్కలకు అందిస్తాయి.

9th Class Biology Textbook Page No. 122

ప్రశ్న 19.
ఈ క్రింది పట్టిక పరిశీలించి, ప్రశ్నలకు సమాధానాలు రాయంది.
జవాబు:
AP Board 9th Class Biology Solutions 8th Lesson వ్యవసాయోత్పత్తుల పెంపుదల – మన ముందున్న సవాళ్లు 5

a) పై పట్టిక నుండి మీరు ఏం గ్రహించారు?
జవాబు:
నత్రజని స్థాపనలో బాక్టీరియాతో పాటు, శైవలాలు కూడా పాల్గొంటున్నాయి. మరికొన్ని బాక్టీరియాలు, శైవలాలు, శిలీంధ్రాలు, ఫాస్పరస్ ను మొక్కలకు అందిస్తున్నాయి.

b) ఏ మూలకాలు అధికంగా సంశ్లేషణ చేయబడతాయి?
జవాబు:
నత్రజని నేలలో అధికంగా సంశ్లేషణ చేయబడుతుంది.

9th Class Biology Textbook Page No. 123

ప్రశ్న 20.
ఈ క్రింది పట్టికను పరిశీలించి, ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
AP Board 9th Class Biology Solutions 8th Lesson వ్యవసాయోత్పత్తుల పెంపుదల – మన ముందున్న సవాళ్లు 6
a) పై పట్టిక ఆధారంగా చూస్తే మనం 50 కి.గ్రా.ల యూరియాను నేలకు అందిస్తే 23 కి.గ్రా. నత్రజని (466) నేలలోకి పునరుద్ధరింపబడుతుంది. అంతే పరిమాణంలో నత్రజని పొందాలంటే ఎంత అమ్మోనియం సల్ఫేట్ నేలలో కలపాలి?
జవాబు:
అంతే పరిమాణంలో (23 కి.గ్రా. ) నత్రజని పొందాలంటే సుమారు 100 కి.గ్రా. అమ్మోనియం సల్ఫేట్ (యూరియా)ను నేలలో కలపాలి.

b) 50 కి.గ్రా.ల సూపర్ ఫాస్ఫేట్ నేలలో కలిపితే ఎంత ఫాస్పేట్ నేలలోకి చేరుతుంది?
జవాబు:
50 కి.గ్రా. ల సూపర్ ఫాస్ఫేట్ నేలలో కలిపితే, 4 నుండి 4.5 కి.గ్రా. ఫాస్పేట్ నేలలోకి చేరుతుంది.

AP Board 9th Class Biology Solutions 8th Lesson వ్యవసాయోత్పత్తుల పెంపుదల – మన ముందున్న సవాళ్లు

9th Class Biology Textbook Page No. 123

ప్రశ్న 21.
స్థానిక వరి రకం (బంగారు తీగ) మరియు హైబ్రిడ్ వరి రకం (IR – 3) పై నత్రజని ఎరువులను చల్లడం వల్ల కలిగే ప్రభావాన్ని కింది స్లో చూడండి.
AP Board 9th Class Biology Solutions 8th Lesson వ్యవసాయోత్పత్తుల పెంపుదల – మన ముందున్న సవాళ్లు 7
a) నత్రజని ఎరువుల ప్రభావం బంగారు తీగ మరియు IR- 8 వరి రకాలపై చూపే ప్రభావంలో తేడా ఏమిటి?
జవాబు:

  1. నత్రజని ఎరువుల ప్రభావం, స్థానిక వరి రకం బంగారు తీగపై వ్యతిరేక ప్రభావం చూపింది.
  2. ఎరువు మోతాదు పెరిగేకొలది పంట దిగుబడి పూర్తిగా తగ్గిపోయింది.
  3. వరి రకం IR – 8 మీద నత్రజని ప్రభావం సానుకూలంగా ఉంది.
  4. నత్రజని ఎరువు మోతాదు పెరిగే కొలది హైబ్రిడ్ రకం IR-8 లో దిగుబడి కూడా పెరుగుతూ వచ్చింది.

9th Class Biology Textbook Page No. 125

ప్రశ్న 22.
మనుషుల ఆరోగ్యంపై క్రిమిసంహారులు, కలుపు నాశకాలు ఏ విధమైన ప్రభావాన్ని చూపుతాయి?
జవాబు:

  1. మనుషుల ఆరోగ్యంపై క్రిమిసంహారులు తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి.
  2. క్రిమిసంహారులను పిచికారి చేసే సమయంలో ఊపిరితిత్తులు తీవ్ర విష ప్రభావానికి లోనవుతాయి.
  3. వీటి వలన అనేక చర్మవ్యాధులు, ఊపిరితిత్తుల సమస్యలు ఏర్పడుతున్నాయి.
  4. కొన్ని హానికర రసాయనాలు నాడీవ్యవస్థను, రక్తప్రసరణ వ్యవస్థను దెబ్బతీస్తున్నాయి.

9th Class Biology Textbook Page No. 126

ప్రశ్న 23.
ఈ మధ్యకాలంలో పొద్దుతిరుగుడు పంటలో రైతులు చేతిగుడ్డతో పుష్పాలను అద్దుతూ పోతున్నారు. ఈ పరిస్థితి ఎందుకు ఏర్పడిందో చెప్పగలరా?
జవాబు:

  1. రైతులు విచక్షణారహితంగా కీటకనాశనులు వాడటం వలన ఉపయోగకర కీటకాలు కూడా మరణించాయి.
  2. అందువలన మొక్కలలో పరాగసంపర్కం జరుగక పంట దిగుబడి తగ్గిపోయింది.
  3. దీనిని అధిగమించటానికి రైతులు పొద్దుతిరుగుడు పంటలలో చేతిగుడ్డతో పుష్పాలను అద్ది కృత్రిమ పరాగసంపర్కం చేయాల్సి వచ్చింది.

9th Class Biology Textbook Page No. 126

ప్రశ్న 24.
పంట పొలంలో కీటక నిర్మూలన గురించి స్నేహితులతో చర్చించండి. ప్రత్యామ్నాయాలు సూచించండి.
జవాబు:

  1. కీటక నిర్మూలన కొరకు కీటక నాశకాలు వాడటం వలన అవి పంట ఉత్పత్తులు, పర్యావరణంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి.
  2. దీనిని అధిగమించటానికి రైతులు సహజ నియంత్రణ పద్ధతులు పాటించాలి.
  3. వెల్లుల్లి రసం, N.P.U ద్రావణం వంటి బయో పెస్టిసైడ్స్ వాడాలి.
  4. వ్యాధి క్రిములను తినే మిత్ర కీటకాలను ప్రోత్సహించాలి.
  5. పంట మార్పిడి విధానం, విత్తనశుద్ధి పద్ధతులలో వ్యాధులను ఎదుర్కొనవచ్చు.
  6. ఆకర్షక పంటలు వేసి కీటకాల తాకిడి తగ్గించవచ్చు.

AP Board 9th Class Biology Solutions 8th Lesson వ్యవసాయోత్పత్తుల పెంపుదల – మన ముందున్న సవాళ్లు

9th Class Biology Textbook Page No. 127

ప్రశ్న 25.
పత్తి పొలాలలో జనుము మరియు బంతిపూలను ఎందుకు పండిస్తారో మీరు చెప్పగలరా?
జవాబు:

  1. పత్తి పొలాలలో జనుమును మరియు బంతిపూలను ఆకర్షక పంటగా పండిస్తారు.
  2. ఇవి కీటకాలను సులభంగా ఆకర్షిస్తాయి.
  3. అందువలన ప్రధానపంటలు కీటకాల నుండి రక్షింపబడతాయి.
  4. కీటకాలను ఎదుర్కొనటానికి ఇదొక సహజ నియంత్రణ పద్ధతి.

9th Class Biology 8th Lesson వ్యవసాయోత్పత్తుల పెంపుదల – మన ముందున్న సవాళ్లు Textbook Activities (కృత్యములు)

కృత్యం – 1

1. బాష్పోత్సేకము
1) ఒక పాలిథిన్ సంచిని తీసుకోవాలి.
2) ఆరోగ్యంగా ఉన్న మొక్క ఆకులను సంచిలో కప్పి ఉంచి దారంతో కట్టాలి.
3) 4-5 గంటలపాటు దానిని పరిశీలిస్తూ ఉండాలి.
AP Board 9th Class Biology Solutions 8th Lesson వ్యవసాయోత్పత్తుల పెంపుదల – మన ముందున్న సవాళ్లు 8

పరిశీలనలు :

  1. ఆకులను పాలిథిన్ సంచితో కప్పి ఉంచినప్పుడు మొక్క ఎంత మొత్తంలో నీటిని నీటి ఆవిరి రూపంలో గాలిలోనికి విడుదల చేస్తుందో చూడవచ్చు.
  2. పిండి పదార్థాలను తయారుచేయడానికి మొక్క తాను పీల్చుకున్న నీటిలో 0.1 శాతం నీటిని మాత్రమే వినియోగించుకుంటుంది.
  3. బాష్పోత్సేకము రేటు రాత్రి కంటే పగలు ఎక్కువగా ఉంటుంది.

కృత్యం – 2

2. a) మీ గ్రామ చిత్రపటాన్ని గీసి, గ్రామంలోని ముఖ్యమైన నీటి వనరులను గుర్తించండి.
జవాబు:
AP Board 9th Class Biology Solutions 8th Lesson వ్యవసాయోత్పత్తుల పెంపుదల – మన ముందున్న సవాళ్లు 9

b) ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల పటంలో నాగార్జున సాగర్ కుడి, ఎడమ కాలువ మార్గాలను చూపండి. ఏ ఏ జిల్లాలకు నీటి వసతి లభిస్తుందో గుర్తించండి.
జవాబు:
AP Board 9th Class Biology Solutions 8th Lesson వ్యవసాయోత్పత్తుల పెంపుదల – మన ముందున్న సవాళ్లు 10

కృత్యం – 3

3. మీ ప్రాంతంలో పంట పొలాల్లో కల్పించే ప్రముఖమైన కలుపు మొక్కల జాబితా తయారుచేయండి. అవి ఏ పంటతో పాటు పెరుగుతాయో రాయండి.
జవాబు:
కలుపు మొక్కల జాబితా :
సైనోడాన్ డాక్టలాన్, సైపరస్ రొటండస్ (తుంగ), డిజిటారియా లాంగిఫోలిమా, డాక్టలోనియమ్ కలోనమ్, సెటేరియా గ్లూకా, సైపరస్ డిఫార్మిస్, ఐకోర్నియా క్రాసిప్స్ (బుడగతమ్మ), సాల్వీనియా మొలస్టా, ఆల్టర్ నాంతిర సెసైలిస్ (పొన్నగంటి), సెలోషియా అర్జెన్షియా (గురంగుర), లూకాస్ ఏస్పిరా (తుమ్మి), పోర్చులేక ఒలరేషియా (పావలికూర), క్లియోమి విస్కోసా (కుక్కవామింటా), సొలానమ్ నైగ్రమ్ (బ్లాక్ నైట్ షేడ్), అర్జిమోన్ మెక్సికానా (బాలరక్కొస) ఎబుటిలాన్ ఇండికమ్ (తుత్తురి బెండ), యూఫోర్బియా హిరా (పచ్చబొట్లు), వెర్నోనియా సిన్నోరా, ఇఖనోక్లోవ కొలానమ్ (ఉడలు), కొమ్మలైనా బెంగా లెన్సిస్ (వెన్నవెదురు), అవినా ఫాట్యువ (అడవియవలు), ఇఖనోక్లోవ క్రస్ గల్లి (నీటి గడ్డి), ఎల్యుసైన్ ఇండికా (గూ గ్రాస్), ఎకిరాంథిస్ ఏస్పిరా (ఉత్తరేణి), ఇక్లిష్టా ప్రోస్టేట (గుంటకలగర లేదా బృంగరాజ) మొదలగునవి.

పంట రకం పంటపై పెరిగే కలుపు మొక్కలు
వరి గరిక, తుంగ, బుడగ తమ్మ, పొన్నగంటి
వేరుశనగ గురంగుర, గరిక, తుంగ, తుత్తురి బెండ, వెన్న వెదురు, కుక్కవామింట, తుమ్మి, పావలికూర, బాలరక్కిస.
మినుములు గరిక, తుంగ, తుత్తురి బెండ, వెన్న వెదురు, సాల్వీనియా మొలస్టా, పచ్చబొట్లు, బంగారు తీగ.
మొక్కజొన్న పచ్చబొట్లు, సొలానమ్ నైగ్రమ్, గరిక, తుంగ
పెసలు ఉడలు, గరిక, తుంగ, బాలరక్కొస, పావలికూర

ప్రయోగ కృత్యములు.

ప్రయోగశాల కృత్యము – 1

1. 1) తృణధాన్యాలు, పప్పు ధాన్యాలు, కూరగాయలు పండ్లలో ప్రతిదానికి ఉదాహరణ తీసుకోండి.
2) ముందుగా వాటిలో ఉన్న లక్షణాలను రాయండి.
3) ఆ పంటలలో ఏ మార్పులు మీరు కోరుకుంటున్నారో రాయండి. మీరు కోరుకుంటున్న మార్పులకు తగిన కారణాలు రాయండి.
AP Board 9th Class Biology Solutions 8th Lesson వ్యవసాయోత్పత్తుల పెంపుదల – మన ముందున్న సవాళ్లు 11

2. సొంత హైబ్రిడ్ పుష్పాలను ఉత్పత్తి చేయటం:
జవాబు:

  1. 5 లేక 6 ఎరుపు రంగు పుష్పాల (చంద్రకాంత) మొక్కలను ఎంపిక చేసుకోవాలి.
  2. మిగిలిన పుష్పాలన్నింటిని తెంచివేయాలి.
  3. ప్రతి పుష్పానికి ఉండే కేసరావళిని తొలగించాలి.
  4. పసుపు రంగు పుష్పాన్ని తీసుకొని, ఎరుపురంగు పుష్పంలో ఉండే కీలాగ్రంపై రుద్ది పరాగ సంపర్కం జరపాలి. (సాయంత్రం వేళల్లో చేయాలి)
  5. సంకరణం చేసిన మొక్కలను గుర్తించడానికి ఆ పుష్పాలుండే కాండాలకు తాడు కాని, దారం కాని గుర్తుగా కట్టాలి. ఎందుకంటే కొద్ది రోజుల్లో ఆ పుష్పాల నుండి ఏర్పడే గింజలను సేకరించాల్సి ఉంటుంది.
  6. ఒక వారం రోజుల్లో నల్లని విత్తనాలు ఏర్పడతాయి.
  7. విత్తనాలను రెండు వారాలపాటు ఎండనిచ్చి వేరొక కుండలో నింపాలి.
  8. కొత్త మొక్క పెరిగి పుష్పించే వరకు జాగ్రత్తగా సంరక్షించాలి.
  9. ఆ మొక్క నుండి ఏర్పడే పుష్పాలను పరిశీలించాలి.

పరిశీలనలు :
మొక్క నుండి ఏర్పడే పుష్పాలు నారింజ రంగులో ఉంటాయి. ఎరుపు మరియు పసుపు రంగు పుష్పాల కలయికతో నారింజ రంగు పుష్పాలు ఏర్పడతాయి.

AP Board 9th Class Social Solutions Chapter 24 రోడ్డు భద్రతా విద్య

SCERT AP 9th Class Social Studies Guide Pdf 24th Lesson రోడ్డు భద్రతా విద్య Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Social Solutions 24th Lesson రోడ్డు భద్రతా విద్య

9th Class Social Studies 24th Lesson రోడ్డు భద్రతా విద్య Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
వాహన చోదకులు ఏ విధమైన ధృవపత్రాలను తమ వెంట ఉంచుకోవాలి? ఏ విధమైన నైపుణ్యాలు భద్రతాపరమైన డ్రైవింగ్ కు అవసరం.? (AS1)
జవాబు:
వాహన చోదకులు ఈ క్రింది పేర్కొన్న ధ్రువపత్రాలను తమ వెంట ఉంచుకోవాలి.

  1. డ్రైవింగ్ లైసెన్స్
  2. వాహన రిజిస్ట్రేషన్
  3. వాహనం యొక్క ఇన్స్యూరెన్స్
  4. వాహనం యొక్క కాలుష్యరహిత ధ్రువపత్రం

భద్రతాపరమైన డ్రైవింగ్ కు నైపుణ్యాలు :

  1. రక్షిత, ప్రయాణానికి ఎల్లప్పుడూ హెల్మెట్ ధరించాలి.
  2. ట్రాఫిక్ సిగ్నల్స్ ను అతిక్రమించరాదు.
  3. భారీ వాహనదారులు తప్పనిసరిగా సీటు బెల్ట్ లు ఉపయోగించాలి.
  4. తమ వాహనాన్ని మంచి స్థితిలో ఉంచుకోవాలి.
  5. ఎడమవైపు నుంచి వాహనాలను దాటరాదు.

ప్రశ్న 2.
ట్రాఫిక్ గుర్తులను ఒకవేళ ఎవరైనా పాటించకుండా వెళితే ఏమవుతుంది? (AS1)
జవాబు:

  1. ట్రాఫిక్ గుర్తులను పాటించకపోవడం వలన ప్రమాదాలు జరగటానికి అవకాశం ఉంటుంది.
  2. ప్రమాదాలు ఒక్కొక్కసారి తీవ్ర గాయాలకు, అంగవైకల్యానికి దారితీయవచ్చు.
  3. ఘోర ప్రమాదాలు జరిగి విలువైన ప్రాణాలను కోల్పోవటానికి అవకాశం ఉంటుంది.
  4. ట్రాఫిక్ గుర్తులను పాటించకపోవడం వలన మనకు మాత్రమేగాక ఎదుటివారికి కూడా హాని జరగవచ్చు.
  5. విలువైన వాహనాలు దెబ్బతింటాయి.
  6. అందువల్ల ట్రాఫిక్ గుర్తులను పాటిస్తూ మన ప్రాణాలను కాపాడుకుంటూ, ఎదుటివారి ప్రాణాలకు కూడా రక్షణ కల్పిస్తే మానవ జీవితానికి సార్థకత చేకూరుతుంది.

AP Board 9th Class Social Solutions Chapter 24 రోడ్డు భద్రతా విద్య

ప్రశ్న 3.
రోడ్డు భద్రతకుగాను మీ ప్రాంతంలో తీసుకుంటున్న చర్యలను సూచించండి. (AS4)
జవాబు:
రోడ్డు భద్రతకుగాను మా ప్రాంతంలోని వివిధ వర్గాల వారు తీసుకుంటున్న చర్యలు :
డ్రైవర్ తీసుకుంటున్న చర్యలు :

  1. ఎడమవైపున ఉండి కుడివైపున వేగంగా వెళ్లే వాహనాలకు దారి వదులుతున్నారు.
  2. ఎడమవైపు నుంచి వాహనాలను దాటరు.
  3. రక్షిత ప్రయాణానికి ఎల్లప్పుడూ హెల్మెట్ ధరిస్తారు.
  4. తక్కువ కార్బన్ మోనాక్సైడ్ వదిలే వాహనాలనే ఉపయోగిస్తున్నారు.
  5. అనవసరంగా హారన్ మోగించరు.
  6. భారీ వాహనదారులు తప్పనిసరిగా సీటు బెల్టులు ఉపయోగిస్తున్నారు.
  7. ట్రాఫిక్ సిగ్నలను అతిక్రమించరు.
  8. తమ వాహనాన్ని మంచి స్థితిలో ఉంచుతారు.
  9. ఆల్కహాల్ సేవించి వాహనాలను నడపరు.
  10. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలను నడపరు.

పాదచారులు పాటిస్తున్న నిబంధనలు :

  1. పాదచారులకు నిర్దేశించిన మార్గంలోనే నడుస్తారు. ఒకవేళ అలాంటి ప్రత్యేక మార్గం లేకుంటే, రోడ్డు ఇరుకుగా ఉంటే రోడ్డుకు కుడివైపునే ఎదురుగా వస్తున్న వాహనాలను పరిశీలిస్తూ నడుస్తారు.
  2. రాత్రివేళ బయట రోడ్డుపై నడుస్తున్నప్పుడు తప్పనిసరిగా ప్రతిబింబించే దుస్తులను ధరిస్తారు.
  3. రాత్రివేళల్లో నడిచేటప్పుడు విధిగా టార్చిలైట్ దగ్గర ఉంచుకుంటారు.
  4. రోడ్డును దాటునపుడు ఎడమవైపు, కుడివైపు చూసి వాహనాలు రాకుండా ఉన్నప్పుడు దాటుతారు.
  5. ఒకవేళ వాహనాలు రెండువైపులా, వస్తూ ఉంటే అవి వెళ్లే వరకు వేచి ఉంటారు.
  6. వాహనాలు రాకుండా ఉన్నప్పుడు వేగంగా నడుచుకుంటూ రోడ్డును దాటుతారు. రెండువైపులా వాహనాలు వస్తున్నాయో లేదో గమనిస్తారు.
  7. రోడ్డును దాటుటకు జీబ్రా క్రాసింగ్ ను ఉపయోగిస్తారు.
  8. రోడ్డుపై నడుస్తున్నపుడు, రోడ్డును దాటుతున్నపుడు మొబైల్ ఫోన్ ను ఉపయోగించరు.
  9. ట్రాఫిక్ పోలీస్ సహాయంతో రోడ్డును దాటుతారు.

ప్రశ్న 4.
తప్పనిసరిగా, జాగ్రత్తపడే, సమాచార నిమిత్తం ఉన్న ట్రాఫిక్ గుర్తులను ఉదాహరణలతో వివరించండి. (AS1)
జవాబు:
ట్రాఫిక్ గుర్తులు :

  1. తప్పనిసరిగా పాటించవలసిన గుర్తులు
  2. సమాచార గుర్తులు
  3. జాగ్రత్తపరచే గుర్తులు.

AP Board 9th Class Social Solutions Chapter 24 రోడ్డు భద్రతా విద్య 4

ప్రశ్న 5.
కమల ఒక నూతన వాహనాన్ని కొనాలని భావించింది. ఆమెకు ఏ విధమైన ధ్రువపత్రాలు రిజిస్ట్రేషన్ సమయంలో అవసరమవుతాయో వివరించండి. (AS1)
జవాబు:
కమల ఒక నూతన వాహనాన్ని కొనాలని భావించినప్పుడు ఆమెకు తాత్కాలిక రిజిస్ట్రేషన్ సమయంలో అవసరమైన ధ్రువపత్రాలు :

  1. అమ్మకం చేసినట్లుగా డీలర్ నుంచి ధ్రువపత్రం
  2. రోడ్డుపై నడపటానికి వీలైనది అని తెలిపే ధ్రువీకరణ పత్రం
  3. వాహన బీమా ధ్రువపత్రం
  4. కాలుష్య నియంత్రణ ధ్రువపత్రం
  5. నివాస రూఢీ ధ్రువపత్రం

శాశ్వత రిజస్ట్రేషన్ :
తాత్కాలిక రిజిస్ట్రేషన్ చేయించేటపుడు సమర్పించిన ధ్రువీకరణ పత్రాలను నిర్ణీత దరఖాస్తుతో పాటుగా ఆర్.టి.ఏ అధికారులకు ఒక నెలలోపుగా సమర్పించి శాశ్వత రిజిస్ట్రేషన్ పొందవచ్చు.

AP Board 9th Class Social Solutions Chapter 24 రోడ్డు భద్రతా విద్య

ప్రశ్న 6.
రాము తన వాహన రిజిస్ట్రేషన్ నెంబర్‌ను వేరే వాహనానికి మార్చాలని భావించాడు. ఇది చేయవచ్చా చేయకూడదా? ఎందుకో వివరించండి. (AS6)
జవాబు:
రాము తన వాహన రిజిస్ట్రేషన్ నెంబర్ ను వేరే వాహనానికి మార్చడానికి వీల్లేదు. ఒక వాహన రిజిస్ట్రేషన్ నెంబర్‌కు, వేరొక రిజిస్ట్రేషన్ నెంబర్‌కు పోలిక ఉండదు.

అలా మార్చడం వలన :

  1. ప్రమాదాలు జరిగిన సమయంలో ఇబ్బందులు ఎదురౌతాయి.
  2. నియమ నిబంధనలకు వ్యతిరేకం.
  3. ఒక్కొక్క నెంబరు ప్రారంభం ఒక్కొక్క వాహనానికి వేరేగా ఉంటుంది.
  4. రిజిస్ట్రేషన్ సందర్భంలో ఆర్.టి.ఏ. అధికారులకు అప్పగించిన ధృవపత్రాలలో తేడా రాకూడదు.
  5. అలా మార్చిన వాహనాలను ఆర్.టి.ఏ. అధికారులు సీజ్ చేస్తారు.

కాబట్టి ఒక వాహన రిజిస్ట్రేషన్ నెంబర్ ను వేరొక రిజిస్ట్రేషన్ నెంబరుకు మార్చకూడదు.

ప్రశ్న 7.
రోడ్డు భద్రతా ఆవశ్యకతను వివరించండి. (AS1)
జవాబు:

  1. జనాభా, పారిశ్రామికీకరణ, నగరీకరణ, గ్లోబలైజేషన్ వంటి వాటి పెరుగుదల వాహనాల రద్దీని కూడా పెంచింది.
  2. అందువల్ల రవాణా సులభతరం కావడానికి ఒక క్రమబద్ధీకరణ అవసరం.
  3. క్రమబద్ధీకరణ అనగా రోడ్డును ఉపయోగించే వారందరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించడమే.
  4. రోడ్డు భద్రతా నియమాలను పాటించడం రోడ్డును ఉపయోగించుకునే ప్రతి ఒక్కరి బాధ్యత.
  5. రోడ్డు భద్రతా నియమాలను పాటించకపోతే ప్రాణాంతకమైన ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంది.
  6. రోడ్డు భద్రతా నియమాలను పాటించడం ద్వారా మనం సుఖంగా ఉండడమే గాక తోటి ప్రయాణికులను కూడా సుఖంగా ఉంచవచ్చును.

ప్రశ్న 8.
పేజీ నెం. 286లోని ‘ప్రమాద బాధితులు – వయస్సు’ పట్టిక చదివి అత్యధిక కేసులు నమోదైన వయస్సు వారిని గుర్తించి, బార్ ను గీయండి. (AS3)
జవాబు:
AP Board 9th Class Social Solutions Chapter 24 రోడ్డు భద్రతా విద్య 5

ప్రశ్న 9.
పేజీ నెం. 287లోని ‘ట్రాఫిక్ ఇబ్బందులు’ అంశాన్ని చదివి, వ్యాఖ్యానించండి. (AS2)
జవాబు:
ఇప్పుడు ప్రతీ పట్టణంలో, నగరాలలో అతి ముఖ్యమైన సమస్య ట్రాఫిక్ ఇబ్బందులు (గందరగోళం) తెల్లవారి లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు వివిధ పనులు నిమిత్తం, ఉద్యోగ రీత్యా ప్రజలు వాహనాలనే ఉపయోగించే తమ ప్రయాణాలు చేయడం వలన ట్రాఫిక్ జాంకు కారణమౌతుంది. విద్యార్థులు, ఉపాధ్యాయులు, శ్రామికులు, డాక్టర్లు ఇలా ఎందరో వివిధ పనుల నిమిత్తం బయలుదేరి ట్రాఫిక్ లో చిక్కుకుని బాధలు అనుభవిస్తుంటారు. డ్రైనేజీ నిర్మాణం సక్రమంగా లేకపోవడం, వీధుల్లో సంచరించే జంతువులు, పండ్లు, కూరగాయల వ్యాపారులు, వాహనదారులు ముఖ్యంగా కారు, ఆటో రిక్షా వారు “నిలుపుటకు వీలులేదు” అనే ప్రదేశంలో వాహనాలు నిలుపుట వల్ల ట్రాఫిక్ జాంకు కారణమౌతున్నాయి.

కాబట్టి వీలైనంత వరకు దగ్గర పనులకు నడవడం ద్వారా కొంత వరకు ఈ ఇబ్బందులను అధిగమించవచ్చు.

9th Class Social Studies 24th Lesson రోడ్డు భద్రతా విద్య InText Questions and Answers

9th Class Social Textbook Page No.286

ప్రశ్న 1.
ఏ గ్రూపు వయస్సు వారిపై ఎక్కువ కేసులు ఉన్నాయి? ఎందుకో మీరు చెప్పగలరా?
జవాబు:
25 – 30 సం||రాల మధ్య వయస్కులపై ఎక్కువ కేసులు ఉన్నాయి. వారిపై ఎక్కువ కేసులు ఉండటానికి కారణం :

  1. ప్రతి విషయంలోనూ ఈ వయస్సువారు దుడుకుతనంతో వ్యవహరిస్తారు.
  2. తనకు నచ్చినట్లే చేయాలనే స్వభావం ఎక్కువగా కలిగి ఉంటారు.
  3. వివిధ అవసరాల నిమిత్తం రోడ్డును ఎక్కువగా ఉపయోగిస్తున్నది కూడా ఈ వయస్సు వారే.
  4. ఈ వయస్సులోనివారు స్వతంత్రతను ఎక్కువగా కోరుకోవడంతో వారు ప్రమాదాలను కూడా ఎక్కువగా ఎదుర్కోవలసి వస్తున్నది.
  5. కాబట్టి ఈ వయస్సు వారే ఎక్కువగా ప్రమాదాలకు గురౌతున్నారు.

ప్రశ్న 2.
20 – 25, 25 – 30 వయస్సు వారిపై ఎన్ని కేసులు ఉన్నాయి?
జవాబు:
AP Board 9th Class Social Solutions Chapter 24 రోడ్డు భద్రతా విద్య 2

9th Class Social Textbook Page No.287

ప్రశ్న 3.
ఈ చిత్రాన్ని పరిశీలించి ప్రమాదాలకు గురైన వాహనాల యొక్క సమాచారంతో మీ తరగతిలో చర్చించండి.
AP Board 9th Class Social Solutions Chapter 24 రోడ్డు భద్రతా విద్య 1

హైదరాబాద్ నగరం

ద్విచక్ర వాహనాల ప్రమాదాల శాతం 30%
త్రిచక్ర వాహనాల ప్రమాదాల శాతం 11%
నాలుగు చక్రాల వాహనాల ప్రమాదాల శాతం 28%
డి.సి.యంల ప్రమాదాల శాతం 3%
తెలియని వాహనాల ప్రమాదాల శాతం 5%
ఆర్టీసీ బస్సుల ప్రమాదాల శాతం 11%
ప్రైవేట్ బస్సుల ప్రమాదాల శాతం 1%
ట్రక్కుల ప్రమాదాల శాతం 5%
టెంపోట్రాలి ప్రమాదాల శాతం 2%
ఇతరములు 4%
మొత్తం ప్రమాదాల సంఖ్య 2577

ప్రశ్న 4.
ఏ రకమైన వాహనాలు ఎక్కువ ప్రమాదాలకు కారణం అయ్యాయి. ఎందుకో చెప్పగలవా?
జవాబు:
ద్విచక్రవాహనాలు ఎక్కువ ప్రమాదాలకు కారణం అయ్యాయి. ఎందుకంటే

  1. యువకులు ఆ వాహనాలను ఎక్కువగా ఉపయోగించటం.
  2. వారు రోడ్డు నియమ నిబంధనలను పాటించకపోవటం.
  3. ద్విచక్ర వాహనాలకు ప్రమాదం జరగటం సులభతరం.

AP Board 9th Class Social Solutions Chapter 24 రోడ్డు భద్రతా విద్య

ప్రశ్న 5.
రోడ్డు నియమ నిబంధనలు అంటే ఏమిటో మీ తరగతి గదిలో చర్చించండి.
జవాబు:

  1. రోడ్డు నియమ నిబంధనలు అనగా రోడ్డుపై వెళ్ళువారు తప్పనిసరిగా పాటించాల్సిన జాగ్రత్తలు.
  2. అలా పాటించకపోతే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.
  3. కారణం జనాభా విపరీతంగా పెరగడం వలన, రోడ్లు ఇరుకుగా ఉండటం వలన, రోడ్డు పైకి వచ్చే వారి సంఖ్య పెరుగుతుంది కాబట్టి ప్రమాదాల సంఖ్య పెరుగుతుంది.
  4. రోడ్డు పైకి వచ్చేవారు ఎవరికి ఇష్టం వచ్చిన రీతిలో వారు త్వరగా వెళ్ళాలి అనే భావంతో ప్రయాణించడం వలన ప్రమాదాల సంఖ్య పెరుగుతుంది.
  5. రోడ్డు ప్రమాదాలను నివారించాలంటే రోడ్డుపైకి వచ్చేవారు కొన్ని నియమ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి. దానితో ప్రమాదాలను నివారించడానికి అవకాశం ఉంటుంది.

9th Class Social Textbook Page No.288

ప్రశ్న 6.
డ్రైవింగ్ లైసెన్స్ ఎందుకు తప్పనిసరిగా కలిగి ఉండాలి?
జవాబు:
డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలను నడపరాదు. ఇది ఎవ్వరికీ, మినహాయింపు కాదు.
డ్రైవింగ్ లైసెన్స్ రకాలు :
1) లెర్నర్ లైసెన్స్ :
ఇది తాత్కాలికమైనది. డ్రైవింగ్ నేర్చుకొనుటకు ఆరునెలల కాల పరిమితితో దీనిని జారీ చేస్తారు.

2) శాశ్వత లైసెన్స్ :
తాత్కాలిక లైసెన్స్ జారీచేసిన ఒక నెల తరువాత నుంచి శాశ్వత లైసెన్స్ పొందుటకు అర్హత లభిస్తుంది. డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చేటప్పుడు డ్రైవింగ్ చేసే విధానం అంతా పరిశీలించి ఇస్తారు కాబట్టి రోడ్డుపై వాహనాలు నడిపేవారికి డ్రైవింగ్ వచ్చి ఉండాలి మరియు డ్రైవింగ్ విధి విధానాలు తెలిసిఉండాలి. కావున రోడ్డుపై వాహనాలు నడుపువారికి డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి.

9th Class Social Textbook Page No.290

ప్రశ్న 7.
మీ టీచర్ సహాయంతో రోడ్డు ఉపరితలంపై సూచించే గుర్తులను ఆర్.టి.ఏ అధికారులు / ట్రాఫిక్ పోలీసుల నుంచి సేకరించి వివిధ గుర్తుల ద్వారా కలిగే ప్రయోజనాలను మీ తరగతి గదిలో చర్చించండి.
జవాబు:
రోడ్డుపైన సూచించే గుర్తులు :
రోడ్డు ఉపరితలంపై పొదచారుల కోసం, వాహన చోదకులకు మార్గ నిర్దేశనం చేయుటకు ఈ గుర్తులు ఉపయోగిస్తారు. రోడ్డుపై గందరగోళాన్ని, అగమ్యాన్ని నివారించడానికి ఒకే విధమైన గుర్తులను ఉపయోగిస్తారు.

1) పాదచారుల దారి :
రోడ్డుకు ఇరువైపులా పాదచారులు నడవటానికి వీలుగా ఉండే దారి. ఇది సుమారు రెండు మీటర్లు వెడల్పు ఉంటుంది.

2) డివైడర్ :
రోడ్డును రెండు సమాన భాగాలుగా విభజించేది.

3) జీబ్రా క్రాసింగ్ :
పాదచారులు రోడ్డును ఒక వైపు నుంచి మరొక వైపునకు దాటడానికి ఉద్దేశించినది.

రోడ్డుపై సూచించే గుర్తుల వల్ల ప్రయోజనాలు :

  1. పాదచారుల దారి మీదకు వాహనాలు ఏవీ రావు కాబట్టి పాదచారులు నడవటానికి అనుకూలంగా ఉంటుంది. ఏ విధమైన ప్రమాదాలు సంభవించవు.
  2. రోడ్డును రెండు సమానభాగాలుగా విభజించటం వలన ఏ విధమైన రాకపోకలకు అవాంతరాలు ఎదురుకావు మరియు ప్రమాదాలు జరగవు.
  3. జీబ్రా క్రాసింగ్ అనేది పాదచారులు రోడ్డు దాటవలసిన ప్రదేశము. వాహనాలు జీబ్రా క్రాసింగ్ గుర్తులున్నచోట నెమ్మదిగా వెళ్తాయి కాబట్టి పాదచారులు రోడ్డు దాటవలసి వస్తే ఇక్కడే దాటాలి. దీనితో ప్రమాదాలు నివారించబడతాయి.

ప్రాజెక్టు

ప్రశ్న 1.
మీకు అందుబాటులో ఉన్న ట్రాఫిక్ పోలీస్ / ఆర్.టి.ఎ అధికారులను అడిగి క్రింది విషయాలు సేకరించండి.
AP Board 9th Class Social Solutions Chapter 24 రోడ్డు భద్రతా విద్య 3
మీ ప్రాంతంలో ట్రాఫిక్ పరిస్థితులను తరగతి గదిలో చర్చించండి.
జవాబు:
AP Board 9th Class Social Solutions Chapter 24 రోడ్డు భద్రతా విద్య 6

AP Board 9th Class Social Solutions Chapter 23 విపత్తుల నిర్వహణ

SCERT AP 9th Class Social Studies Guide Pdf 23rd Lesson విపత్తుల నిర్వహణ Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Social Solutions 23rd Lesson విపత్తుల నిర్వహణ

9th Class Social Studies 23rd Lesson విపత్తుల నిర్వహణ Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
ప్రకృతి ప్రమాదాలు ఏవిధంగా విపత్తులు మారుతున్నాయో వివరించండి. (AS1)
జవాబు:

  1. ప్రణాళికలు లేకుండా నగరాలు విస్తరించడం.
  2. మురుగునీరు పోవడానికి సరైన సౌకర్యం లేకపోవడం.
  3. జనాభా వేగంగా పెరగడం.
  4. మానవుల నిర్లక్ష్యం వల్ల లేదా కావాలని ఒక వ్యక్తి లేదా బృందం చేసే పనుల వల్ల విపత్తులు సంభవిస్తున్నాయి.
  5. ఈ విపత్తులు వల్ల ప్రాణనష్టం జరుగుతుంది.
  6. దేశ ఉత్పాదక, ఆర్థిక సామర్థ్యంపై దీర్ఘకాల ప్రభావం ఉంటుంది.
  7. వీటితోపాటు రోడ్డు, రైలు, విమాన ప్రమాదాలు జరగడం వల్ల వాటివల్ల విలువైన ప్రాణ, ఆస్థి నష్టాలు సంభవిస్తున్నాయి.
  8. వీటితోపాటు అగ్నిప్రమాదాలు, వరదలు, కరవుకాటకాలు, భూకంపాలు వంటి విపత్తులు సంభవించి ప్రాణ, ఆస్తినష్టాలు జరుగుతున్నాయి.

ప్రశ్న 2.
ఉగ్రవాదం అనగానేమి? వారి యొక్క లక్ష్యాలు ఏమిటి? (AS1)
జవాబు:
ఉగ్రవాదం అనగా :
హింసాత్మక చర్యల ద్వారా ప్రజలను, పాలకులను, దేశాధినేతలను బెదిరిస్తూ, తమ కోర్కెలను సాధించుకొనేందుకు చేపట్టే ఉగ్ర భయంకర దుష్ట చేష్టలనే ఉగ్రవాదము అంటారు.

ఉగ్రవాదం యొక్క లక్ష్యాలు :

  1. యుద్ధం, అంతర్గత పౌర యుద్ధాలు పెచ్చుమీరిపోయి ప్రాణ, ఆస్తి నష్టాలకు కారణము కావడం.
  2. అల్లర్లను సృష్టించి, ప్రశాంత వాతావరణం లేకుండా చేయడం.
  3. సైనికులను, సామాన్య ప్రజానీకాన్ని భయ భ్రాంతులకు గురి చేయడం.
  4. రక్తపాతాన్ని సృష్టించడం.
  5. మందు పాతరలు పెట్టి రైళ్ళను పడగొట్టడం, వంతెనలు పేల్చడం, సైనికులను చంపడం వంటివి చేయడం.
  6. పిల్లలు కూడా నిత్యం దాడులకు భయపడుతూ గడుపుతుంటారు.

AP Board 9th Class Social Solutions Chapter 23 విపత్తుల నిర్వహణ

ప్రశ్న 3.
అగ్నిప్రమాదాల నుంచి రక్షణ పొందడానికి మనం’ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
జవాబు:
అగ్నిప్రమాదాల నుంచి రక్షణ పొందడానికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు :

  1. నిప్పు లేదా పొగ చూసినప్పుడు అలారం మోగించండి / హెచ్చరిక జారీ చేయండి.
  2. సాధ్యమైనంత త్వరగా భవనం నుంచి బయటకు వెళ్లండి. వీలైతే మిమ్మల్ని కప్పుకోండి. వరండాలో బయటకు తప్పించుకునే మార్గంలో ఎటువంటి అడ్డంకులు లేకుండా చూడండి.
  3. ఫోను ఎక్కడుందో తెలుసుకుని 101కి ఫోన్ చేయండి. నిదానంగా, స్థిమితంగా మీ చిరునామా చెప్పి అగ్నిమాపక దళాన్ని పంపించమని అడగండి.
  4. పొగ ఉన్నప్పుడు నేలమీద పాకుతూ వెళ్లండి. వేడిగాలి, పొగ పైకి లేస్తాయి కాబట్టి నేల దగ్గర గాలి బాగుంటుంది.
  5. మీరు బైటకు వెళ్లేదారి మూసివేసి ఉంటే కిటికీ ఉన్న ఒక గదిలోకి వెళ్లండి. తలుపు వేసి పొగ లోపలికి రాకుండా చేయండి. కిటికీ తలుపు తెరిచి సహాయం కోసం అరవండి.
  6. తలుపు మూసి ఉంటే మంటలు వేగంగా వ్యాప్తి చెందకుండా అడ్డుకుంటాయి. భవనాన్ని ఖాళీ చేస్తున్నప్పుడు అందరికంటే వెనకనున్న వాళ్లు తలుపులు వేసుకుంటూ రావాలి.
  7. విద్యుత్తు స్విచ్చులన్నీ తీసేసి ఉంచాలి. మెయిన్ స్విచ్ ను కట్టెయ్యటం ఉత్తమం.
  8. అతుకులు, పలు ఉన్న విద్యుత్తు తీగలు, కేబుళ్లకోసం చూడండి. ఇవి ప్రమాదకరమైనవి కాబట్టి వీటిని వెంటనే మార్చాలి. ప్లగ్ పాయింట్లు కిందకల్లా ఉంటే, ప్రత్యేకించి ప్రాథమిక తరగతుల్లో వాటికీ టేపు వేసేసి ఉంచాలి. లేకపోతే చిన్నపిల్లలు వాటిల్లో వేళ్లు పెట్టినప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశముంది.
  9. బడిలో ప్రమాదకరంగా వేలాడుతున్న విద్యుత్తు తీగలను గమనించండి. ఏవైనా గోడలు నెమ్ముకుంటూ ఉంటే వాటిని వెంటనే మరమ్మతు చేసి, విద్యుత్తు తీగలను మార్చివేయాలి. నిప్పు, లేదా పొగ చూసినప్పుడు అలారం మోగించండి/హెచ్చరిక జారీ చేయండి.
  10. సాధ్యమైనంత త్వరగా భవనం నుంచి బయటకు వెళ్లండి. వీలైతే మిమ్మల్ని కప్పుకోండి. వరండాలో బయటకు తప్పించుకునే మార్గంలో ఎటువంటి అడ్డంకులు లేకుండా చూడండి.

చేయగూడనివి :

  1. మీ బొమ్మలు, పెంపుడు జంతువులు వంటి వాటికోసం అగ్నిప్రమాదానికి గురైన భవనం లోపలికి మళ్లీ వెళ్లవద్దు. అగ్నిమాపకదళం మీకంటే వేగంగా ముఖ్యమైన వాటిని బయటకు తీసుకురాగలరు.
  2. మంచం కిందగానీ, అలమర లోపలగానీ ఎప్పుడూ దాక్కోవద్దు. పెద్దగా అరుస్తూ భవనం నుంచి బయటకు వెళ్లాలి.
  3. చాపలు, తివాచీ వంటి వాటికింద నుంచి విద్యుత్తు తీగలు, కేబుళ్లు వంటివి తీస్తే అవి పాడైపోయి ప్రమాదాలకు దారి తీయవచ్చు. ఈ పరిస్థితి ఎక్కువగా పాఠశాల పరిపాలనా విభాగంలో ఎదురవుతూ ఉంటుంది.
  4. తేలికగా కాలిపోవటానికి వీలుండే కర్టెన్లు, ఇతర వస్తువులకు దగ్గరగా విద్యుత్తు బల్బులు అమర్చగూడదు.

ప్రశ్న 4.
రోడ్డు ప్రమాదాలకు ప్రధానమైన కారణాలేవి? వాటిని తగ్గించడానికి మనం ఎలాంటి చర్యలు తీసుకోవాలి?
జవాబు:
రోడ్డు ప్రమాదాలకు ప్రధానమైన కారణాలు :

  1. నిర్లక్ష్యంగా వాహనాలను నడపడం.
  2. ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించటం.
  3. తాగి వాహనం నడపటం.
  4. వాహనాలు సరైన స్థితిలో ఉండక పోవటం.
  5. వాతావరణ పరిస్థితులు సరిగా లేకపోవటం.

రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి మనం తీసుకోవాల్సిన చర్యలు :

  1. మద్యం సేవించి వాహనాలను నడపరాదు.
  2. వాహనాలను నడిపేవారు మందులను తీసుకుంటూ నడపరాదు.
  3. అలసిపోయి ఉన్నవారు, అలసట ఉన్నవారు వాహనాలను నడపరాదు.
  4. జబ్బుపడినవారు, గాయాల పాలైన వారు వాహనాలను నడపరాదు.
  5. కోపంగా లేదా ఆందోళనగా ఉన్నవారు వాహనాలను నడపరాదు.
  6. రోడ్డు మీద అసహనంగా ఉండరాదు. రోడ్డు మీద పరుగులు తీయరాదు.
  7. మలుపు / మూల వద్ద రోడ్డును ఎప్పుడూ దాటరాదు.
  8. బస్సు / వాహనం ఎక్కటానికి పరుగులు పెట్టరాదు.
  9. ట్రాఫిక్ సిగ్నళ్ళు ఉన్నచోట, జీబ్రా క్రాసింగ్ ఉన్నచోట మాత్రమే రోడ్డు దాటాలి.
  10. బస్సు పూర్తిగా ఆగిన తరువాత ఎక్కాలి. క్యూ పద్ధతి పాటించాలి.

మొదలైన చర్యలు జాగ్రత్తగా పాటించడం వలన రోడ్డు ప్రమాదాలను అరికట్టవచ్చును.

ప్రశ్న 5.
ఉగ్రవాదుల దాడుల వలన ఆస్తి, ప్రాణ నష్టం జరుగుతుంది. వీరి చర్యలను అరికట్టడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏవి?
జవాబు:
ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో వారి చర్యలను అరికట్టడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు :

  1. రవాణా వాహనాలలో, బహిరంగ ప్రదేశాలలో ఎవరికీ చెందని సూట్ కేసు, సంచి వంటిని గమనిస్తే పోలీసులకు తెలియజేయాలి. ఎందుకంటే వాటిలో పేలుడు పదార్థాలు ఉండవచ్చు.
  2. “100” నంబరుకి పోలీస్ కంట్రోలు రూమ్ కి ఫోన్ చేయాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరికీ ఫోన్ చేసే హక్కు ఉంది. తద్వారా ప్రమాదాన్ని వారి ద్వారా నివారించవచ్చు.
  3. పోలీసులకు తెలియజేసిన పిదప అనుమానాస్పద వస్తువులపై నిఘా ఉంచాలి. ఇతరులను కూడా దాని నుంచి దూరంగా ఉండమని చెప్పాలి.
  4. అనుమానాస్పదంగా సంచరించే వ్యక్తులు వారి ప్రవర్తనపై, నిలిపి ఉన్న వాహనాల పట్ల అప్రమత్తంగా ఉండాలి.
  5. పౌరుల భద్రత అందరికీ సంబంధించిన విషయం కాబట్టి భద్రత పట్ల అవగాహన కల్పించటానికి వివిధ సంస్థలు తమ విధి విధానాలు ప్రకటిస్తూ ప్రజలను జాగృతం చేయాలి.
  6. ఉగ్రవాదాన్ని ఎదుర్కోటానికి, క్షేమకర జీవితం గడపటానికి పోలీసులు కొన్ని పోస్టర్లు జారీ చేస్తారు. వాటి గురించి తెలుసుకుని వాటిని జీవితంలో అనుసరించాలి.

AP Board 9th Class Social Solutions Chapter 23 విపత్తుల నిర్వహణ

ప్రశ్న 6.
రైలు ప్రమాదాలకు గల కారణాలను గుర్తించండి. (AS1)
జవాబు:
ప్రపంచంలో ఎక్కువ రైలు మార్గాలు ఉన్న దేశాలలో భారతదేశం ఒకటి. భారతదేశంలో రైలు ప్రమాదాలు కూడా పెరుగుతున్నాయి. తరుచుగా జరిగే రైలు ప్రమాదాలకు గల కారణాలు :

  1. రైలు ప్రమాదాలకు కారణాలలో రైలు పట్టాలు తప్పటం ఒకటి.
  2. రైలు మార్గాల నిర్వహణ సక్రమంగా లేకపోవడం.
  3. విద్రోహ చర్యలు, కారణంగా కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి.
  4. మానవ పొరపాట్లు, అప్రమత్తంగా లేకపోవడం.
  5. గ్యాస్, పెట్రోల్, బొగ్గు, నూనె వంటి మండే పదార్థాల రవాణా కారణంగా కూడా రైలు ప్రమాదాలు జరుగుతున్నాయి.
  6. రైలులో పొగత్రాగడం, సిగరెట్, బీడీ వంటి వాటి వలన కూడా అగ్ని ప్రమాదాలు రైలులో జరుగుటకు కారణం.
  7. కాపలాలేని రైల్వే క్రాసింగ్ వద్ద కూడా ప్రమాదాలకు మూలమౌతున్నాయి.

ప్రశ్న 7.
మీ గ్రామంలో, పాఠశాలలో, మీ ఇంటి దగ్గర సంభవించగల ప్రమాదాలను గుర్తించండి. (AS4)
జవాబు:
మా గ్రామంలో, పాఠశాలలో, మా ఇంటి దగ్గర సంభవించగల ప్రమాదాలు :

  1. మలుపు / మూలల దగ్గర రోడ్డు దాటేటప్పుడు.
  2. పాఠశాల వదిలి పెట్టిన సమయం.
  3. బస్సు / వాహనం ఎక్కడానికి పరుగులు తీసే సమయం.
  4. బడివాళ్ళు నిర్దేశించిన బస్సులు తప్పించి ఇతర బస్సులు ఎక్కే సమయం.
  5. ట్రాఫిక్ సిగ్నళ్ళు పాటించకపోవడం.
  6. జీబ్రా క్రాసింగ్ గుర్తులున్న చోటనే రోడ్డును దాటకపోవడం వంటి సమయాలు.

ప్రశ్న 8.
భారతదేశ పటంలో ఉగ్రవాదుల దాడులకు గురైన ఈ కింది నగరాలను గుర్తించండి. (AS5)
జవాబు:
ఎ) ముంబై బి) హైదరాబాద్ సి) భాగల్ పూర్ డి) కుంభకోణం ఇ) బెంగళూరు
AP Board 9th Class Social Solutions Chapter 23 విపత్తుల నిర్వహణ 1

ప్రశ్న 9.
మీకు తెలిసిన ఒక ప్రమాద సంబంధ వైపరీత్యం గురించి రాయండి. (AS6)
జవాబు:
ఇటీవల కాలంలో మా జిల్లాలో అత్యంత దురదృష్టకరమైన రైలు ప్రమాదం జరిగింది. దీని కారణంగా సుమారు 20 మంది ప్రాణాలు కోల్పోగా, 50 మంది వరకు గాయాలపాలయ్యారు. విజయనగరం దగ్గరి గొట్లాం సమీపంలో రాత్రి 7 గంటల సమయంలో బొకారో ఎక్స్ ప్రెస్ రైలులో పొగచిమ్మగా, పెద్ద ప్రమాదం రైలులో సంభవిస్తుందని తోటి ప్రయాణికులలో అలజడులు రేగగా, ఆ పుకార్లు షికార్లు చేసి భయంతో ప్రయాణీకులు గొలుసులాగి, ఎదురుగా పట్టాలపై పరిగెత్తసాగారు. అదే సమయంలో విజయవాడ వెళుతున్న రాయగడ పాసింజర్ ఈ ప్రయాణీకులను ఢీకొనగా అక్కడికక్కడే చనిపోయారు. ఇది నాకు తెలిసిన ఇటీవల జరిగిన అత్యంత ప్రమాద సంబంధ వైపరీత్యం.

AP Board 9th Class Social Solutions Chapter 23 విపత్తుల నిర్వహణ

ప్రశ్న 10.
పేజీ నెం. 281లోని ‘అగ్ని ప్రమాదం’ అంశం చదివి వ్యాఖ్యానించండి. (AS2)
జవాబు:
ప్రతి సంవత్సరం అగ్ని ప్రమాదాల కారణంగా సుమారు 30,000 మంది చనిపోతున్నారు. వేడిమి, ఇంధనం, ప్రాణ వాయువు – ఈ మూడు కలిసినపుడు అగ్ని ప్రమాదం జరుగుతుంది. ఈ మూడింటిలో ఏదో ఒకటి అందకుండా చేయడం ద్వారా నిప్పును ఆపవచ్చు. ఇటీవల కాలంలో అగ్ని ప్రమాదాలు సంభవించి విలువైన ప్రాణాలు, ఆస్తి నష్టం సంభవిస్తున్నాయి. మానవ నిర్లక్ష్యం, లేదా అవగాహన లోపం వల్ల అగ్ని ప్రమాదాలు జరిగి విపరీత నష్టాలకు మూలమౌతున్నాయి.
ఉదా :
తమిళనాడులోని కుంభకోణంలోని పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదంలో 93 మంది బాలలు చనిపోయారు. అగ్ని ప్రమాదం జరిగినపుడు ఏం చేయాలో టీచర్లకు, విద్యార్థులకు తెలియకపోవడం, అవగాహన లేకపోవడం వల్ల విలువైన ప్రాణాలు కోల్పోయారు. అగ్ని ప్రమాదాలపై ప్రజలకు విద్యార్థులకు, ఉపాధ్యాయులకు అవగాహన ఉంటే ఇటువంటి సందర్భాలలో అపాయం నుంచి తప్పించుకోవచ్చు.

9th Class Social Studies 23rd Lesson భారతదేశంపై వలసవాద ప్రభావం InText Questions and Answers

9th Class Social Textbook Page No.277

ప్రశ్న 1.
ప్రకృతి వైపరీత్యాల వల్ల ఏర్పడే విపత్తులు ఎంతవరకు సహజమైనవి? దీని గురించి ఎప్పుడైనా విశ్లేషించారా? ముంబాయిలోని వరదలను ఉదాహరణగా తీసుకుందాం. పెద్ద ఎత్తున జరిగిన ఆస్తి, ప్రాణ నష్టాలకు కారణాలు ఏమిటి? భారీ వర్షాల కారణంగా పెద్ద ఎత్తున విధ్వంసం జరిగిందా?
జవాబు:
ప్రకృతి వైపరీత్యాలనేవి కొంతవరకు సహజమైనవి. కొంతవరకు మానవ తప్పిదాల వల్ల జరుగుతున్నాయి.

మానవులు చేసే తప్పులను దిద్దుకుంటే కొన్ని వైపరీత్యాలను నివారించవచ్చు. ముంబయిలోని వరదలను ఉదాహరణగా తీసుకుంటే పెద్ద ఎత్తున జరిగిన ఆస్తి, ప్రాణ నష్టాలకు కారణాలు :

  1. ఏ ప్రణాళికా లేకుండా నగరం విస్తరించటం.
  2. మురుగునీరు పోవటానికి సరైన సౌకర్యం లేకపోవటం.
  3. జనాభా వేగంగా పెరగటం వంటి కారణాల వలన, భారీ వర్షాల వలన పెద్ద ఎత్తున విధ్వంసం జరిగింది.

దేశ ఉత్పాదక, ఆర్థిక సామర్థ్యం పైన కూడా దీర్ఘకాల ప్రభావం పడింది. ప్రకృతి వైపరీత్యాలలో సహజమైనవాటికి ఉదాహరణగా వరదలు, కరవు కాటకాలు, భూకంపాలు, అగ్నిపర్వతాల విస్ఫోటనం వంటి అంశాలను పేర్కొనవచ్చు.

అగ్నిప్రమాదాలు, రోడ్డు, రైలు, విమాన ప్రమాదాలు వంటి వాటిని మానవ కారక వైపరీత్యాలుగా చెప్పవచ్చును.

9th Class Social Textbook Page No.279, 280

ప్రశ్న 2.
రైలు ప్రమాదాలను తగ్గించటానికి పాటించవలసిన భద్రతా చర్యలు ఏవి?
జవాబు:
రైలు ప్రమాదాలను తగ్గించటానికి పాటించవలసిన భద్రతా చర్యలు :

  1. రైల్వే క్రాసింగ్ దగ్గర సిగ్నల్ కోసం చూడండి. రైలు గేటును గమనిస్తూ ఉండండి.
  2. గార్డులేని రైల్వే క్రాసింగ్ దగ్గర వాహనం దిగి రెండువైపులా చూసిన తరవాత పట్టాలు దాటాలి.
  3. రైల్వే క్రాసింగ్ వద్ద గేటు కింద నుంచి దూరి పట్టాలు దాటరాదు.
  4. ప్రయాణీకులను తరలించడానికి వీలుకాని వంతెన మీద, సొరంగాల వద్ద రైలును, రైలింజన్ డ్రైవర్లు ఆపకూడదు.
  5. మండే గుణమున్న పదార్థాలను రైలులో తీసుకెళ్ళరాదు.
  6. నడుస్తున్న రైలులో తలుపు దగ్గర నిలబడరాదు. బయటకు తొంగి చూడరాదు.
  7. ఆగి ఉన్నలేదా కదులుతున్న రైలులోంచి మీ తల, చేతులు బయటపెట్టరాదు.
  8. స్టేషనులో రైలు పట్టాల మీదుగా దాటరాదు. ప్లాట్ ఫారం మారటానికి ఉద్దేశించిన పాదచారుల వంతెనను ఉపయోగించండి.
  9. అనుమానాస్పద వస్తువులను తాకరాదు. పట్టాలమీద, రైల్వే యార్డులలో ఆటలు ఆడవద్దు. రైలుబోగీలు ఉన్నట్టుండి కదలడం వల్ల అక్కడ ఉన్నవారు ప్రమాదానికి గురవుతారు.
  10. కదులుతున్న రైలు మీదకి ఎటువంటి వస్తువులు విసరవద్దు. దీనివల్ల తీవ్రగాయాలు అవుతాయి.

9th Class Social Textbook Page No.281

ప్రశ్న 3.
విమానం ఎక్కినప్పుడు పాటించవలసిన విషయాలు ఏవి?
జవాబు:

  1. ప్రయాణ సమయంలో పాటించవలసిన భద్రతలను తెలియచేస్తున్నప్పుడు శ్రద్ధగా వినండి.
  2. మీరు కూర్చున్న ముందు సీటు జేబులో ఉండే భద్రతా వివరాల కార్డును జాగ్రత్తగా చదవండి.
  3. దగ్గరలో అత్యవసర ద్వారం ఎక్కడ ఉందో తెలుసుకోండి. దానిని ఎలా తెరవాలో తెలుసుకోండి.
  4. సీటులో కూర్చుని ఉన్నప్పుడు తప్పనిసరిగా సీటుబెల్టు పెట్టుకుని ఉండండి.

AP Board 9th Class Social Solutions Chapter 23 విపత్తుల నిర్వహణ

ప్రశ్న 4.
విమాన ప్రమాదం జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏవి?
జవాబు:

  1. ప్రశాంతంగా ఉండండి. విమాన సిబ్బంది చెపుతున్నది విని, అనుసరించండి. మీకు సహాయం చేయటం క్యాబిన్ సిబ్బంది ముఖ్యమైన బాధ్యత.
  2. అత్యవసర ద్వారాన్ని తెరవటానికి ముందు. కిటికీ నుండి బయటకు చూడండి బయట మంటలు ఉంటే తలుపు తెరవవద్దు. తలుపు తెరిస్తే మంటలు లోపలికి వ్యాపిస్తాయి. బయటకు వెళ్ళటానికి ఉన్న మరొక దారిని ఉపయోగించండి.
  3. పొగ పైకి లేస్తుందని గుర్తుంచుకోండి. కాబట్టి క్యాబిన్లో పొగ ఉంటే నేలమీదకి ఉండండి.
  4. నేలలో ఉండే అత్యవసర దీపాలను అనుసరించండి. ఇవి బయటకు వెళ్లే ద్వారాలను సూచిస్తాయి.
  5. మీ దగ్గర గుడ్డ | రుమాలు ఉంటే ముక్కు, మూతికి అడ్డంగా పెట్టుకోండి.

9th Class Social Textbook Page No.283

ప్రశ్న 5.
సమీప అగ్నిమాపక కేంద్రానికి వెళ్ళి అగ్నిప్రమాదాలు తగ్గించటంలో మీరు పాటించగల మెలకువల గురించి తెలుసుకోండి.
జవాబు:
సమీప అగ్నిమాపక కేంద్రానికి వెళ్ళి అగ్ని ప్రమాదాలను తగ్గించటంలో మేము పాటించగల మెలకువలు గురించి తెలుసుకున్నాము. అవి :

  1. నిప్పుతో ఆటలాడరాదు.
  2. నిప్పు అవసరము తీరిన వెంటనే ఆర్పవలెను.
  3. సిగరెట్లు, బీడీలు కాల్చువారు కూడా సిగరెట్టు, బీడీ కాల్చుకుని మండుతున్న అగ్గిపుల్లను విసిరేసి వెళ్లిపోతారు. అది ప్రక్కన ఉన్న చెత్త చెదారంతో కలిసిపోయి పెద్ద పెద్ద మంటలు రావడానికి అవకాశం ఉంటుంది.
  4. అలాగే సిగరెట్లు, బీడీలు కాల్చుకుని ఆర్పివేయకుండా విసిరేసి వెళ్ళిపోతారు. దాని వలన కూడా పెద్ద పెద్ద మంటలు రావడానికి అవకాశం ఉంటుంది.
  5. గ్రామీణ ప్రాంతాల యందు కట్టెల పొయ్యి మీద అన్నం, కూరలు వండి, నిప్పును ఆర్పకుండా వారు వేరే పనులలో నిమగ్నమైపోతారు. అలాంటి సమయాలలో కూడా పెద్ద పెద్ద మంటలు ఏర్పడవచ్చును.
  6. అలాంటి పరిస్థితులు వీలైనంత వరకు తటస్థపడకుండా జాగ్రత్తలు వహించాలి.
  7. అతుకులు, పట్టీలు ఉన్న విద్యుత్ తీగలు ఉపయోగించరాదు.

ప్రశ్న 6.
ఉగ్రవాద దాడి జరిగినప్పుడు మీరు పాటించవలసిన విషయాలు ఏవి?
జవాబు:

  1. ప్రశాంతంగా ఉండండి. ఉద్రేకానికి లోనవ్వవద్దు.
  2. స్థానిక అత్యవసర అధికారుల సూచనలు పాటించండి.
  3. వార్తల కోసం, సూచనల కోసం రేడియో వినండి. లేదా టీ.వి. చూడండి.
  4. మీ దగ్గరలో దాడులు జరిగితే ఎవరికైనా గాయాలు అయ్యాయేమో చూడండి. ప్రథమచికిత్స చేయండి. తీవ్ర గాయాలైన వారికి సహాయం అందేలా చూడండి.
  5. దెబ్బతిన్న పరికరాలను ఆపివేయండి.
  6. పెంపుడు జంతువులను కట్టేసి ఉంచండి. లేదా గదిలో బంధించి ఉంచండి.
  7. మీ కుటుంబ మిత్రులకు ఫోను చేయండి. ప్రాణానికి ముప్పు ఉంటే తప్పించి మళ్ళీ ఫోను ఉపయోగించవద్దు.
  8. మీ చుట్టు పక్కల వాళ్ళ గురించి, ప్రత్యేకించి వృద్ధులు, వైకల్యం ఉన్న వాళ్ళ గురించి ఆరా తీయండి.

9th Class Social Textbook Page No.284

ప్రశ్న 7.
భారతదేశంలో ఇటీవల కాలంలో ఉగ్రవాదులు జరిపిన దుశ్చర్యలను గుర్తించండి. అవి చిన్న పిల్లల మీద చూపే ప్రభావాన్ని
వివరించండి. జ. భారతదేశంలో ఇటీవల కాలంలో ఉగ్రవాదులు జరిపిన దుశ్చర్యలు : .

  1. ముంబయిలో తాజ్ హోటల్ పై ఉగ్రవాదులు చేసిన దాడులు.
  2. హైదరాబాద్ లోని బాంబు పేలుళ్ళు.
  3. బెంగళూరులోని ‘బాంబు పేలుళ్ళు.

ఉగ్రవాదుల దాడులు చిన్న పిల్లల మీద అనేక రకాలుగా ప్రభావాన్ని చూపుతున్నాయి. ఉగ్రవాదులు దాడులు చేసే ప్రాంతాలలో పిల్లలు నిత్యం దాడులకు భయపడుతూ గడుపుతుంటారు.

పిల్లలు పాఠశాలకు హాజరు కావటానికి, సాధారణ జీవితాలు గడపటానికి అవకాశాలు లేకుండా పోతున్నాయి.

AP Board 9th Class Social Solutions Chapter 23 విపత్తుల నిర్వహణ

ప్రాజెక్టు

ప్రశ్న 1.
పత్రికలు, మ్యాగజైన్స్ ద్వారా ఇటీవల సంభవించిన మానవ విపత్తులు సమాచారాన్ని సేకరించండి. ఒకవేళ అలాంటి ప్రమాదాలు మీ ప్రాంతంలో సంభవిస్తే నష్ట నివారణకు ఎలాంటి చర్యలు తీసుకొంటారు.?
జవాబు:
మానవ విపత్తులు సంభవించిన సమయంలో సహాయక చర్యలు చేపట్టడం జరుగుతుంది. ఒక మానవునిగా తోటి మానవుని ఆదుకోవటానికి అన్ని రకాల సహాయక చర్యలు చేపట్టడం జరుగుతుంది.

వారికి బట్టలు సరఫరా చేయటం కాని, ఆహార పదార్థాలు సరఫరా చేయటం కాని, ఇతర గృహనిర్మాణ సామానులు కాని, గృహోపకరణములు గానీ సరఫరా చేయటం జరుగుతుంది.

పశువులకు పశుగ్రాసం నష్టం వాటిల్లితే దానిని అందజేయడం జరుగుతుంది.

ప్రశ్న 2.
ఉగ్రవాదం వలన సంభవించే వివిధ రకాల నష్టాలను పట్టిక ద్వారా చూపండి.
జవాబు:
ఉగ్రవాదం – వివిధ రకాల నష్టాలు

  1. మానవ జీవనం అస్తవ్యస్తం అవుతుంది.
  2. జనజీవనం అల్లకల్లోలం
  3. వందల మంది మరణాలు
  4. వేలమంది క్షత్రగాత్రులు
  5. కోట్ల విలువైన ఆస్తినష్టాలు
  6. ప్రపంచ మేధావులలో అభద్రతా భావాలు
  7. పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలలో భయాందోళనలు
  8. అమాయక ప్రజల ఆర్తనాదాలు
  9. మత సామరస్య విఘాతం
  10. అభివృద్ధి కుంటుపడటం.

AP Board 9th Class Social Solutions Chapter 22 మహిళా రక్షణ చట్టాలు

SCERT AP 9th Class Social Studies Guide Pdf 22nd Lesson మహిళా రక్షణ చట్టాలు Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Social Solutions 22nd Lesson మహిళా రక్షణ చట్టాలు

9th Class Social Studies 22nd Lesson మహిళా రక్షణ చట్టాలు Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
బాల్య వివాహాల దుష్ఫలితాలు ఏవి? (AS1)
జవాబు:
బాల్య వివాహాల దుష్ఫలితాలు :

  1. చిన్న వయసులో గర్భవతులు కావడం.
  2. ఆడ పిల్లల అక్రమ రవాణాకు, అమ్మకానికి అవకాశం ఏర్పడడం.
  3. చదువుకు ఆటంకం.
  4. శారీరక ఎదుగుదలకు ఆటంకం.
  5. కుటుంబ పోషణకై బాలకార్మికులుగా మారుట.
  6. మానసిక ఆరోగ్య సమస్యలు తలెత్తడం.
  7. వైకల్యంతో కూడిన శిశు జననాలు లేదా మృత శిశువులు జన్మించడం.
  8. ఎదుగుదల లేని పిల్లలను బలవంతంగా కుటుంబ వ్యవస్థలోకి నెట్టివేయడం.
  9. అధిక సంఖ్యలో గర్భ విచ్ఛిత్తి, గర్భస్రావం, నెలలు నిండక ముందే ప్రసవం జరగడం ఫలితంగా మాతృ మరణాలు, శిశు మరణాల సంఖ్య పెరగడం.

AP Board 9th Class Social Solutions Chapter 22 మహిళా రక్షణ చట్టాలు

ప్రశ్న 2.
గృహహింస ఎందుకు సర్వసాధారణమైంది? అది ఏయే రూపాల్లో కనిపిస్తుంది? కారణాలు రాయండి. (AS1)
జవాబు:
మన రాజ్యాంగం పౌరులందరికీ గౌరవంగా బ్రతికే హక్కును ఇచ్చింది. స్త్రీలు కూడా పౌరులే. స్త్రీలు కూడా గౌరవంగా బ్రతకాలి. వారిని దూషించకుండా, అవమానించకుండా ఉండాలి. స్త్రీలు చేసే పనిని గౌరవించి, వారి హక్కులు, స్వేచ్ఛా వాతావరణంలో అనుభవించేటట్లు పరిస్థితులు కల్పించాలి. ప్రతీ కుటుంబంలో స్త్రీలను శారీరకంగా, మానసికంగా దెబ్బ తీస్తున్నారు. స్త్రీ పై ఆధిపత్యం కోసం పద్ధతి ప్రకారం జరిపే చర్యల క్రమమే గృహహింస.

కారణాలు :

  1. స్త్రీలలో గల అమాయకత్వం.
  2. స్త్రీల రక్షణకు కల్పించే చట్టాలపై అవగాహన లేకపోవడం.
  3. స్త్రీలలో గల నిరక్షరాస్యత.
  4. పురుష అహంకార సమాజం.
  5. స్త్రీల పట్ల సమాజం చిన్న చూపు.
  6. స్త్రీకి స్త్రీయే శత్రువుగా మారటం.
  7. స్త్రీలలో గల నిరాసక్తత.

ప్రశ్న 3.
మీరు బాలికలు, మహిళల యొక్క వివిధ సమస్యల గురించి చదివారు. ఇలాంటి సమస్యలు మీ గ్రామంలో లేదా పట్టణంలో ఎప్పుడైనా గమనించారా? అయితే, ఏం చేయాలి? (AS4)
జవాబు:
మా గ్రామం మరియు మా పరిసర ప్రాంతాలలో బాల్య వివాహాలు, వరకట్నం, లైంగిక వేధింపులు గమనించాం.

మా గ్రామంలో వరకట్న సమస్య ప్రధానంగా కనిపిస్తుంది. ఇద్దరు ముగ్గురు ఆడపిల్లలు గల కుటుంబాలు, మధ్య తరగతి కుటుంబాలు చితికిపోతున్నాయి. వరుడ్ని వేలంలో కొన్నట్లు ఎవరు ఎక్కువ కట్నం ఇస్తే వారిని పెండ్లాడే సంస్కృతి కనిపిస్తుంది.

  1. ముందుగా సమాజంలో మార్పు రావాలి.
  2. స్త్రీల యొక్క గుణగణాలకు, కుటుంబ సాంప్రదాయాలకు ప్రాధాన్యత నివ్వాలి.
  3. వరకట్నం అడిగే పెద్దలను, వరుడ్ని పోలీసులకు అప్పజెప్పాలి.
  4. స్త్రీలలో మార్పు రావాలి.
  5. ఇంకా కట్నం కోసం వేధించే భర్తలను నిర్భయంగా పోలీసులకు, కోర్టులకు, స్వచ్ఛంద సంస్థల ముందుంచాలి.

ప్రశ్న 4.
బాలికలు, మహిళల సంరక్షణకై ప్రభుత్వం ఎన్నో చట్టాలు చేసింది. వాటిని సక్రమంగా అమలు చేయడానికి మీరిచ్చే సూచనలు ఏవి?
(లేదా)
బాలికలు, మహిళల అభివృద్ధి మరియు సంరక్షణకై ప్రభుత్వం ఎన్నో పథకాలు మరియు చట్టాల రూపకల్పన చేస్తుంది. వాటిని సక్రమంగా అమలు చేయటానికి మీరందించే సూచనలు ఏమిటి?
జవాబు:
అనాదిగా మవదేశం పురుషాధిక్యత గలది. స్త్రీలు అంటే చిన్న చూపు పురాతన కాలం నుండి కొనసాగుతుంది. అంతేకాకుండా స్త్రీలు ఎదుర్కొను అనేక సమస్యల నుండి, వేధింపుల నుండి, హింసల నుండి రక్షణకై అనేక చట్టాలు రూపొందించి, అండగా ఉంటూ అధికారులు, న్యాయస్థానాలు ఆదుకుంటున్నాయి.

అయితే చట్టాలు సక్రమంగా అమలు చేయడానికిగాను సలహాలు :

  1. చట్టాలపై స్త్రీలలో అవగాహన కలిగించడానికి గ్రామీణ ప్రాంత మహిళలలో చైతన్య కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి.
  2. అవగాహన సదస్సులు, బహిరంగ వేదికలలో చట్టాలపై వివరంగా తెలియజేయాలి.
  3. సమాచార సాధనాలైన రేడియో, టీ.వి, వార్తాపత్రికలు, సినిమాల ద్వారా చట్టాలపై అవగాహన కలిగించడానికి ఎక్కువ సమయం, స్థలం కేటాయించాలి.
  4. స్త్రీలు విద్యావంతులు కావాలి.
  5. పాఠశాల స్థాయి నుండే బాలికలలో చట్టాలపై పూర్తి అవగాహన కలిగించాలి.
  6. డ్వాక్రా, మహిళా సంఘాల సమావేశాలలో చట్టాలు – లభించే ప్రయోజనాలు, కల్పించే సౌకర్యాలు వివరించాలి.

AP Board 9th Class Social Solutions Chapter 22 మహిళా రక్షణ చట్టాలు

ప్రశ్న 5.
మహిళలు ఎదుర్కొనే సాధారణ సమస్యలపై ఒక వ్యాసం రాయండి.
జవాబు:
ఈ రోజుల్లో మహిళలు స్వేచ్ఛగా బయట తిరగడానికి సాహసించడం లేదు. ఆడ పిల్లలను చదివించడానికి బయట ప్రాంతాలకు పంపించడానికి కూడా తల్లిదండ్రులు భయపడుతున్నారు. ఇంట్లో తల్లిదండ్రుల, కుటుంబ సభ్యుల ఆంక్షలు, బయట ప్రపంచంలో మహిళలను వేధించడం, బాధించడం, తక్కువ చేసి మాట్లాడటం, ఆడవాళ్ళు కనిపిస్తే ఎగతాళి చేయడం, లైంగిక వేధింపులకు గురి చేయడం, మానసిక క్షోభకు గురిచేసే మాటలనడం, అవమానించడం, భయపెట్టి, బెదిరించి, మాయమాటలు చెప్పి, ప్రేమలో దించి, లొంగదీసుకొని, హత్యా నేరాలకు పాల్పడడం మనం నిత్యం చూస్తున్నాం. అంతేకాకుండా వరకట్నం పెండ్లి సమయంలోనే కాకుండా, వివాహానంతరం కూడా ఇంకా అధికంగా కట్నం తెమ్మని, లేకపోతే బలవంతంగా చంపడం జరుగుతుంది. అమ్మాయి జన్మిస్తే తల్లిని నిందించడం నిరంతరం మనం చూస్తూనే ఉన్నాం.

ప్రశ్న 6.
మీరు తహశీల్దారు అయితే, బాల్య వివాహాలను ఎలా అరికడతారు?
జవాబు:
బాల్యం జీవితాంతం గుర్తుండే తీపి గుర్తు. వెంటాడే సుందర దృశ్యం. బాల్యం మధురానుభూతులు అనుభవించక ముందే, చదువుకోవాలనే కోరిక తీరక ముందే, బాలబాలికల వివాహ వయస్సు రాకముందే అంటే బాలురకు 21 సం||లు బాలికకు 18 సం|| నిండక ముందే చాలా ప్రాంతాలలో బాల్యవివాహాలు జరుగుతున్నాయి.

నేనే తహశీల్దారును అయితే :

  1. నా మండల పరిధిలోగల ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలో గల విద్యార్థులలో చైతన్యం కల్గించే అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాను.
  2. పోలీస్ అధికారి, ప్లీడర్, ఒక డాక్టర్‌ను ప్రతీ గ్రామానికి పంపించి తల్లిదండ్రులకు బాల్య వివాహాల వలన కలిగే అనర్థాలు, బలవంతంగా వివాహాలు జరిపిస్తే వేసే శిక్షలు, ఎదురయ్యే ఆరోగ్య సమస్యలు వివరిస్తాను. (వారి ద్వారా)
  3. ఎక్కడైనా అవగాహన లోపంతో బాల్య వివాహాలు జరిగినట్లు వివిధ గ్రామాధికారులు ద్వారా తెలుసుకొని, మహిళా సంక్షేమ అధికారులు, స్వచ్ఛంద సంస్థల ద్వారా మనస్తత్వ నిపుణులచే కౌన్సిలింగ్ ఏర్పాటు చేస్తాను.
  4. ప్రతీ గ్రామంలో కూడా బాల్య వివాహాల నిరోధానికై కమిటినీ ఏర్పాటు చేసి, అంగన్‌వాడీ టీచర్, ANM, ఆశ వర్కర్, సామాజిక కార్యకర్తలు, డ్వాక్రా, మహిళా సంఘాల సభ్యులను కమిటీగా నియమించి నిరోధానికి కృషి చేస్తాను.
  5. ప్రతీ గ్రామ సభలో దండోరా వేయించి సామాజిక అవగాహన కలిగింపజేస్తాను.

ప్రశ్న 7.
మహిళలు ఎదుర్కొనే సమస్యలపై అవగాహన కొరకు ఒక కరపత్రాన్ని తయారుచేయండి. (AS6)
జవాబు:
మహిళలు ఎదుర్కొనే సమస్యలపై కరపత్రం :

ఆడదే ఆధారం – కాని వారికి లేదు సహకారం

సృష్టికి మూలకారణం ఆడది. ఆడది లేకుంటే ఈ సృలేదు. తల్లిగా, చెల్లిగా, భార్యగా సమాజానికి దశను, దిశను నిర్దేశించే ముహిళలు నేడు అణగదొక్కబడుతున్నారు. ఆత్మన్యూనతా భావంతో అడుగంటిపోతున్నారు. చివరకు ఆత్మహత్యలే ప్రధానమనుకుంటున్నారు.

అక్రమ రవాణా :
ఉద్యోగం ఇప్పిస్తామని, సినిమాలలో అవకాశాలు కల్పిస్తామని నమ్మబలికి, వేరే ప్రాంతాలకు తీసుకెళ్ళి, వ్యభిచార గృహాలకు విక్రయించి, హింసించి మహిళల జీవితాలతో ఆటలాడుకుంటున్నారు.

వరకట్నపు పిచాచి :
అమ్మాయి, అబ్బాయి వివాహం అనంతరం (వధూవరులు) ఆనందంగా జీవించడానికి పెండ్లి సమయంలో అత్తవారు ఇచ్చే కానుకలు రోజురోజుకు వెర్రితలలు వేసి నేడు వరకట్నంను వేలం వేస్తున్నారు. కట్నం ఇవ్వలేని తల్లిదండ్రులు, వారి ఆడపిల్లలకు పెండ్లిండ్లు చేయలేని సందర్భాలెన్నో. కొన్నిసార్లు వివాహాలు జరిపించినా, తదనంతరం అదనపు కట్నం కొరకు అమ్మాయిని వేధించడం, తిట్టడం, కొట్టడం, కొన్ని సందర్భాలలో చంపివేయడం చూస్తున్నాం. ఇది న్యాయమా?

గృహ హింస :
స్త్రీలు చేసే పనిని గౌరవించాలి, ఆదరించాలి, చేయూతనందించాలి. అలాకాకుండా నాలుగు గోడల మధ్య మహిళలను రకరకాల పద్ధతులతో హింసించి, మానసిక క్షోబకు గురిచేసి ఆత్మహత్యా విధానాలకు పురికొల్పుతూ, నిండు జీవితాలను బలిచేస్తున్నారు.

లైంగిక ఆత్యాచారాలు, వేధింపులు :
ఇటీవల కాలంలో మహిళలపై ఆత్యాచారాలు, లైంగిక వేధింపులు నిత్యకృత్యమై పోయాయి. ఆఫీసులలో, లైంగిక వేధింపులు తట్టుకోలేకపోతున్నారు. ఎదురు తిరిగిన వారిని యాసిడ్ తో దాడి చేస్తున్నారు. కనీస మర్యాద కూడా పాటించకుండా పశువులతో సమానంగా ప్రవర్తిస్తున్నారు.

మారాలి, సమాజం మారాలి. స్త్రీలను ఎక్కడ గౌరవిస్తామో, ఎక్కడ మర్యాదలు ఆందజేస్తామో ఆ సమాజమే బాగుపడుతుంది. ఇప్పటికైనా మహిళలకు అందించాలి సహకారం.

AP Board 9th Class Social Solutions Chapter 22 మహిళా రక్షణ చట్టాలు

ప్రశ్న 8.
పేజీ నెం. 275లోని ‘అత్యాచారం, లైంగిక వేధింపులు’ అంశం చదివి, వ్యాఖ్యానించండి.
జవాబు:
ఇటీవల కాలంలో విదేశీ సంస్కృతి వెర్రి తలలు వేసి మహిళలపట్ల చిన్నచూపు ఏర్పడి విచక్షణా జ్ఞానాన్ని మరచిపోయి, మహిళలపట్ల అనేక క్రూర చర్యలకు పాల్పడుతున్నారు. అందులో ప్రధానమైన దుశ్చర్య అత్యాచారాలు – లైంగిక వేధింపులు. స్వేచ్ఛగా, హాయిగా విహరించలేని, తిరగలేని దౌర్భాగ్యం మనకు మహిళల పట్ల కానవస్తుంది. రోజు రోజుకు మహిళల పట్ల జరుగుతున్న అత్యాచారాలు, ‘ వేధింపులు మానవత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి. ఇటీవల ఈ రకమైన వేధింపుల నిరోడానికి, లైంగిక, అత్యాచార నియంత్రణకు జస్టిస్ జె.యస్. వర్మ అధ్యక్షతన కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని నియుమించి ఫిబ్రవరి 2, 2013న దానిని రాష్ట్రపతి ఆర్డినెన్స్ జారీ చేశారు. దీని ప్రకారం

  1. ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడిన వారికి 20 సంవత్సరాల జైలుశిక్ష విధించబడుతుంది.
  2. మహిళలపై యాసిడ్ దాడి సమయంలో పెనుగులాటలో దాడి చేసినవారు మరణించినా మహిళలకు శిక్షలేదు.
  3. మహిళా పోలీస్ ద్వారా విచారణ జరుపబడుతుంది.
    ఈ విధంగా మహిళలకు రక్షణ కల్పించబడుతుంది.

9th Class Social Studies 22nd Lesson మహిళా రక్షణ చట్టాలు InText Questions and Answers

9th Class Social Textbook Page No.271

ప్రశ్న 1.
అప్పుడప్పుడు 15 సంవత్సరములు కూడా నిండని పిల్లలకు వారి ప్రమేయం, ఇష్టాయిష్టాలు చూడకుండా పెళ్ళిళ్లు చేస్తున్నారు. ఇలాంటివి ఎలా ఆపవచ్చు? ఎవరు సహాయం చేస్తారు?
జవాబు:
అప్పుడప్పుడూ గ్రామీణ పల్లె ప్రాంతాలలో 18 సం||లు పూర్తికాకుండా 13, 14, 15 సం||ల వయసులో బాల్య వివాహాలు జరుగుతున్నాయి. దీనికి ప్రధాన కారణం అవగాహనా లోపం, తల్లిదండ్రులలో, పిల్లలలో చైతన్యం లేకపోవడం, తదనంతర కష్టాలు, నష్టాలు వారికి తెలియకపోవడం. అంతేకాకుండా పిల్లల పుట్టిన తేదీ, వయస్సు విషయాలలో తల్లిదండ్రులకు పూర్తి సమాచారం లేకపోవడం. ఇలాంటి బాల్య వివాహాలు జరిగినట్లు మొదట గుర్తించేది గ్రామ కార్యదర్శి. గ్రామ కార్యదర్శి జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్, డివిజన్ స్థాయిలో ఆర్.డి.ఓ, మండల స్థాయిలో తహశీల్దారుకు తెలియజేస్తాడు. ఈ సందర్భంగా వారికి ఫిర్యాదు చేస్తాడు. పై అధికారుల సూచన మేరకు మహిళ సంక్షేమ అధికారి CDPO మరియు సబ్ ఇన్ స్పెక్టరు, సామాజిక కార్యకర్త, ఉపాధ్యాయులు మొ||వారు తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇవ్వడం ద్వారా పెళ్ళిళ్ళు ఆపవచ్చు.

9th Class Social Textbook Page No.273

ప్రశ్న 2.
మీ నివాస ప్రాంతంలో కట్నం కోసం మహిళలను వేధించడం గమనించారా? ఎలాంటి వేధింపులు జరుగుతున్నాయి? దీనిని నిరోధించాలంటే సమాజంలో ఎలాంటి మార్పులు రావాలి? ఎవరు బాధ్యత వహించాలి?
జవాబు:
మా ప్రాంతంలో కట్నం కోసం మహిళలను వేధించడం నిరంతరం చూస్తున్నాం. అదనపు కట్నం తెమ్మని అత్త మామలు, ఆడపడుచులు, భర్త తరచుగా వేధించడం, తిట్టడం, కొట్టడం, కొన్ని సందర్భాలలో బలవంతంగా చంపి, ఆత్మహత్యలుగా చిత్రీకరించడం చేస్తున్నారు. మరికొన్ని సందర్భాలలో ఈ మహిళలు ఈ వేధింపులు, బాధలు భరించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.

దీనిని నిరోధించాలంటే సమాజంలో ఖచ్చితంగా మార్పు రావాలి. వరకట్నం అనే సాంఘిక దురాచారం రూపు మాపడానికి రేపటి భావిభారత పౌరులైన విద్యార్థుల నుండే చైతన్యం రావాలి. చదువుకున్న వారిలో, తల్లిదండ్రులలో అవగాహన పెరగాలి. కట్నం వేధింపులకు విధించే శిక్షలు కఠినంగా ఉండాలి. దీనిని రూపుమాపడానికి సమాజంలో ఉన్న ప్రతీ ఒక్కరూ బాధ్యత వహించాలి.

AP Board 9th Class Social Solutions Chapter 22 మహిళా రక్షణ చట్టాలు

9th Class Social Textbook Page No.274

ప్రశ్న 3.
గృహ హింస ఎప్పుడో ఒకసారి అప్పుడప్పుడు మొదలై రాను రాను దురలవాటుగా మారిపోతుంది. హింస నుండి మరింత హింస పుడుతుంది. దీన్ని ఎలా ఆపవచ్చు? ఎవరు సహాయపడతారు?
జవాబు:
స్త్రీలు కూడా పౌరులే. స్త్రీలు గౌరవంగా బ్రతకడం, ఎవరూ దూషించకుండా, అవమానించకుండా ఉండడం, స్త్రీలు చేసే పనిని గౌరవించడమే కాకుండా వారికున్న హక్కులను అనుభవించేటట్లు పరిస్థితులు కల్పించడం సమాజంలోని ప్రతీ ఒక్కరి బాధ్యత.

ప్రారంభంలో చిన్న చిన్న మాటలతో అవమానించి, చులకన చేసి మాట్లాడి చివరకు శారీరక, మానసిక క్షోభకు గురిచేసి జీవితాన్ని దుర్భరం చేస్తున్నారు.

గృహహింస మొదట ప్రారంభం కుటుంబం నుండి ప్రారంభం అవుతుంది. కాబట్టి కుటుంబ సభ్యుల్లో మార్పు రావాలి. మానవత్వం వెల్లివిరియాలి. కుటుంబ సభ్యుల్లో మార్పు రానప్పుడు, గృహహింస అనేక రూపాల్లో బయట పడుతున్నప్పుడు, మహిళలు పోలీస్ అధికారికి గాని, జుడీషియల్ అధికారికిగాని, ఫస్ట్ క్లాస్/మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కు స్వయంగాగాని, ఫోన్ ద్వారాగాని, ఇ-మెయిల్ ద్వారాగాని ఫిర్యాదు చేయవచ్చు. గృహహింస జరిగినప్పుడు, జరుగుతున్నప్పుడు, జరుగుతుందని తెలిసినప్పుడు పై అధికారులకు తెలియచేస్తూ ఆపగలరు. నిరోధించగలరు. సహాయపడగలరు.

AP Board 9th Class Social Solutions Chapter 22 మహిళా రక్షణ చట్టాలు

ప్రాజెక్టు

ప్రశ్న 1.
పేదవారికి ఉచిత న్యాయ సహాయం పొందడానికి ప్రభుత్వం ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తుంది. మీకు సమీపంలో ఉన్న వకీలు/ప్లీడరును సంప్రదించి సమాచారం సేకరించండి.
జవాబు:
న్యాయం దృష్టిలో అందరూ సమానులే. ఏ పౌరుడు కూడా ఆర్థిక కారణాల మూలంగా, ఇతర బలహీనతల కారణంగా న్యాయాన్ని పొందే అవకాశాలను కోల్పోకుండా ఉండటం కోసం ప్రభుత్వం ఉచిత న్యాయ సహాయం’ అందిస్తుంది. ఇందులకై కేంద్రప్రభుత్వం 1976వ సం||లో భారత రాజ్యాంగానికి ఆర్టికల్ 39(ఎ) జత చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలను న్యాయ సహాయాన్ని అందించేలా చేయడానికి లోక్ అదాలత్ లను ఏర్పరచింది.

న్యాయ సహాయం పొందడానికి అర్హులు :

  1. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు చెందినవారు.
  2. మానవ అక్రమ రవాణా బాధితులు, యాచకులు, స్త్రీలు, పిల్లలు, మతిస్థిమితం లేనివారు, అవిటివారు.
  3. ప్రకృతి వైపరీత్యాల బాధితులు, వ్యవసాయ, పారిశ్రామిక కార్మికులు.

రూ. 50,000 కంటే తక్కువ సాంవత్సరిక ఆదాయం కలవారు.

దరఖాస్తు చేసే విధానం :
జిల్లా కోర్టు, హైకోర్టు న్యాయసేవా అధికార సంస్థకు సహాయం కొరకు దరఖాస్తు చేస్తే సహాయం అందించబడుతుంది.

న్యాయ సహాయ విధానాలు :

  1. న్యాయవాదిచే ఉచితంగా న్యాయ సలహా ఇప్పించుట.
  2. న్యాయ సహాయం పొందిన వారికి కోర్టు ఫీజు, కేసుకు సంబంధించిన కోర్టు ఖర్చులు భరించడం.
  3. కేసులకు పరిశీలించిన మీదట, అవసరమైనచో దరఖాస్తుదారుని తరఫున న్యాయవాదులను నియమించి ఆయా కోర్టులలో కేసులు చేపట్టడం.
  4. న్యాయ సహాయం పొందినవారికి ఆయా కేసులలో తీర్పుల నకళ్ళు ఉచితంగా ఇవ్వడం, మొదలగు సహాయాలు అందించబడతాయి.

AP Board 9th Class Social Solutions Chapter 20 ప్రజాస్వామ్యం – రూపుదిద్దుకుంటున్న భావన

SCERT AP 9th Class Social Studies Guide Pdf 20th Lesson ప్రజాస్వామ్యం – రూపుదిద్దుకుంటున్న భావన Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Social Solutions 20th Lesson ప్రజాస్వామ్యం – రూపుదిద్దుకుంటున్న భావన

9th Class Social Studies 20th Lesson ప్రజాస్వామ్యం – రూపుదిద్దుకుంటున్న భావన Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
జవాబుదారీ, బాధ్యతాయుత, చట్టబద్ధ ప్రభుత్వం ఉండేలా ప్రజాస్వామ్యం ఎలా చూస్తుంది? (AS1)
జవాబు:

  1. ప్రజాస్వామ్యం అంటే అంతిమంగా ప్రజల నుంచి అధికారం పొంది, దానికి జవాబుదారీగా ఉండే ప్రభుత్వం.
  2. దీనిలో ప్రజాప్రతినిధులను ఎప్పటికప్పుడు కొంతకాలానికి ఎన్నుకుంటారు.
  3. ఎన్నికైన ప్రజాప్రతినిధులు వివిధ రకాలుగా ప్రజలకు జవాబుదారీగా ఉంటారు.
  4. ప్రజలు ఎన్నుకున్న శాసనసభలలో ప్రభుత్వ పక్ష ప్రతినిధులు తమ పనిని వివరించాలి, పనుల ప్రణాళికను ఈ శాసనసభలే ఆమోదించాలి.
  5. ప్రభుత్వం చేసిన పనికి సంబంధించిన సమాచారాన్ని ఏ పౌరుడైనా అడగవచ్చు. ఆ సమాచారాన్ని ఇవ్వవలసిన బాధ్యత ప్రభుత్వానిది. అన్నిటికీ మించి నిర్దిష్ట కాలం తరువాత మళ్ళీ ఎన్నికలుంటాయి.
  6. ప్రజాప్రతినిధులు మళ్ళీ ప్రజల మద్దతును పొందవలసి ఉంటుంది.
  7. వాళ్ళు చేసిన పనిని వివరించమని అడిగి అది సంతృప్తికరంగా లేనప్పుడు ప్రజలు వాళ్లను తిరస్కరించవచ్చు.

ప్రశ్న 2.
సామాజిక వైవిధ్యతలను కలుపుకుని వెళ్లే స్వభావాన్ని ప్రజాస్వామ్యాలు ఏ స్థితిలో ప్రదర్శిస్తాయి? (AS1)
జవాబు:

  1. ప్రజల పాలన అని. అన్నప్పుడు వయోజనులైన అందరూ అని అర్థం.
  2. వాళ్ళు పురుషులు కావచ్చు, స్త్రీలు కావచ్చు, ధనికులు కావచ్చు,. పేదవాళ్ళు కావచ్చు. నల్లవాళ్లు కావచ్చు, తెల్లవాళ్లు కావచ్చు, హిందువులు లేదా క్రిస్టియన్లు లేదా ముస్లింలు లేదా నాస్తికులు కావచ్చు. ఏ భాష మాట్లాడే వాళ్లేనా కావచ్చు. ఈ భావన ఏర్పడటానికి చాలాకాలం పట్టింది.
  3. సూచికగా ఎన్నికలలో ఓటు చేసే హక్కును తీసుకుందాం.
  4. మొదట్లో ఆస్తి ఉన్న కొంతమంది పురుషులకు మాత్రమే ఓటుహక్కు ఉండేది.
  5. క్రమేపీ కొన్ని దేశాలలో ఈ హక్కును పేదవాళ్ళకు కల్పించారు. ఆ తరువాత అది మహిళలకు లభించింది.
  6. చివరికి అన్ని మతాల, జాతుల వాళ్ళకు ఓటు హక్కు లభించింది.
  7. 1920 నుంచి అమెరికాలో శ్వేతజాతి మహిళలకు ఓటుహక్కు లభించింది.
  8. 1965 లో నల్లజాతీయులైన పౌరుల ఓటు హక్కుపై వివక్షతను తొలగించింది.
  9. న్యూజీలాండ్ 1893లోనే అన్ని వర్గాల ప్రజలకు ఓటుహక్కు కల్పించిన మొదటి దేశం.
  10. సార్వజనీన ఓటుహక్కు కల్పించిన తొలి పెద్ద దేశం యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్.

రాజకీయ సమానత్వం, అందరినీ కలుపుకోవటం అన్న మౌలిక సూత్రంపై ప్రజాస్వామ్యం ఆధారపడి ఉంది. ప్రజాస్వామ్యంలో వయోజనులైన ప్రతి ఒక్క పౌరునికి ఒక ఓటుహక్కు ఉండాలి. ప్రతి ‘ఓటుకు సమాన విలువ ఉండాలి.

AP Board 9th Class Social Solutions Chapter 20 ప్రజాస్వామ్యం – రూపుదిద్దుకుంటున్న భావన

ప్రశ్న 3.
కింద వ్యాఖ్యానాలను సమర్ధించటానికి వ్యతిరేకించటానికి మీ వాదనలు పేర్కొనండి : (AS2)
అ. పారిశ్రామిక దేశాలు ప్రజాస్వామ్య విధానాన్ని అనుసరించగలవు, కానీ పేద దేశాలు ధనిక దేశాలు కావాలంటే నియంతృత్వం ఉండాలి.
జవాబు:
పేద దేశాలు ధనిక దేశాలు కావాలంటే నియంతృత్వం కన్నా ప్రజాస్వామ్యం ఉంటేనే బాగుంటుంది.

కారణం ప్రజాస్వామ్య దేశాలలో ప్రభుత్వ కార్యక్రమాల రూపకల్పనలోను, ప్రభుత్వ విధానాలు, చట్టాలు తయారు చేయటంలో, వాటిని అమలు చేయటంలో ప్రజలు భాగస్వాములు కావాలి. ప్రజలందరూ బహిరంగంగా పాల్గొని తమ అవసరాలు, అభిప్రాయాలు స్పష్టంగా పేర్కొనేలా బహిరంగ చర్చలు జరపాలి తరువాత చట్టాలు, విధానాలు రూపొందించాలి ఆ విధంగా ప్రజల సంక్షేమ పథకాలు అమలు చేయటం వల్ల ప్రజలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా సమాన అవకాశాలు పొందుతారు. అందువలన పేద దేశాలు కూడా ధనిక దేశాలుగా మారతాయి.

పారదర్శకత (దాపరికం లేని పరిపాలన), అమలు జరిగినపుడు,. అవినీతి, అన్యాయం, లంచగొండితనం వంటివి లేనప్పుడు పేదదేశాలు ప్రజాస్వామ్యాన్ని అమలు చేసినప్పటికీ ధనిక దేశాలుగా మారతాయి.

అందువల్ల పేద దేశాలు ధనిక దేశాలు కావాలంటే నియంతృత్వం కన్నా ప్రజాస్వామ్యమే మేలు.

ఆ. పౌరుల మధ్య ఆదాయాలలో అసమానతలను ప్రజాస్వామ్యం తగ్గించలేదు.
జవాబు:

  1. సమాజం ధనిక – పేదలుగా, పైకులాలు – దళితులుగా విభజింపబడి ఉంటే రాజకీయ సమానత్వం అర్థరహితం అవుతుంది.
  2. ఉన్నత హెూదా, సంపద ఉన్నవాళ్ళు తమకు అనుకూలంగా ఓటు వేయమని మిగిలిన వాళ్లని తేలికగా ప్రభావితం చేయగలుగుతారు.
  3. చాలా కుటుంబాలలో ఆ కుటుంబానికి పెద్ద అయిన పురుషుడు మహిళలతో సహా కుటుంబ సభ్యులందరూ ఎవరికి ఓటు వేయాలో నిర్ణయిస్తారు.
  4. అమెరికా వంటి అనేక దేశాలలో అనేక ప్రసార సాధనాలు ధనిక కార్పొరేట్ సంస్థలు లేదా వ్యక్తుల చేతుల్లో ఉంటాయి.
  5. దేనిని ఎక్కువగా ప్రసారం చేస్తారు ? దేనిని విస్మరిస్తారు ? అన్న దానిని బట్టి వీళ్ళు ప్రజాభిప్రాయాన్ని తీర్చిదిద్దుతారు. ప్రభావితం చేస్తారు.
  6. సంపన్నులకు, శక్తిమంతులకు శాసనసభ్యులు, మంత్రులు అందుబాటులో ఉంటారు. కాబట్టి వాళ్ళు విధానాలను, కార్యక్రమాలను ప్రభావితం చేయగలుగుతారు.
  7. ఇంకోవైపున పేదలకు నిరక్షరాస్యులకు ప్రభుత్వ వర్గాలు ఈ విధంగా అందుబాటులో ఉండవు కాబట్టి అనేక దేశాల ప్రభుత్వాలు ధనికులకు అనుకూలంగా, పేదల ప్రయోజనాలకు విరుద్దంగా ఉండే విధానాలను అనుసరిస్తుంటాయి.
  8. కాబట్టి రాజకీయ సమానత్వంతో పాటు సామాజిక, ఆర్థిక సమానత్వం ఉంటే తప్ప పౌరుల మధ్య ఆదాయాలలో అసమానతలను ప్రజాస్వామ్యం తగ్గించలేదు.

ఇ. పేద దేశాలలోని ప్రభుత్వాలు పేదరికం తగ్గించటం, ఆరోగ్యం , విద్యల పై తక్కువ ఖర్చు చేసి, పరిశ్రమలకు, మౌలిక సదుపాయాలకు ఎక్కువ ఖర్చు చేయాలి.
జవాబు:
పేద దేశాలలోని ప్రభుత్వాలు పేదరికం తగ్గించటం, ఆరోగ్యం , విద్యలపై తక్కువ ఖర్చుచేసి, పరిశ్రమలకు మౌలిక సదుపాయాలకు ఎక్కువ ఖర్చు చేయడానికి కారణం.

అర్థశాస్త్ర పరిభాషలో వ్యయాలు రెండు రకాలు :

  1. ఉత్పాదక వ్యయం
  2. అనుత్పాదక వ్యయం

ఉత్పాదక వ్యయం అనగా పరిశ్రమలు, వ్యవసాయంపై చేసే వ్యయం.

అనుత్పాదక వ్యయం అనగా రోడ్లు, భవనాలపై చేసే వ్యయం.

అందువలన పేద దేశాలు ఉత్పాదక వ్యయం మీద ఎక్కువ ఖర్చు చేస్తాయి. అనుత్పాదక వ్యయంపై చేసే వ్యయం వలన అదనపు రాబడులు ఏమీరావు.

ఈ. ప్రజాస్వామ్యంలో పౌరులందరికీ ఒక ఓటు ఉంటుంది కాబట్టి ఆధిపత్యానికి, ఘర్షణలకు తావు ఉండదు.
జవాబు:
ప్రజాస్వామ్యంలో పౌరులందరికీ ఒక ఓటు ఉంటుంది. పౌరుల మధ్య ఓటు హక్కు విషయంలో ఏ విధమైన వ్యత్యాసం ఉండదు. ప్రతి ఓటుకీ సమాన విలువ ఉంటుంది.

పురుషులు, స్త్రీలు, ధనికులు, పేదలు, నల్లవాళ్ళు, తెల్లవాళ్ళు, హిందువులు, క్రిస్టియన్లు లేదా ముస్లింలు లేదా నాస్తికులు అయినా, ఏ భాష మాట్లాడేవారైనా ఎవరికైనా ఓటుహక్కు ఉంటుంది కాబట్టి ఏ విధమైన వ్యత్యాసం ఉండదు. కావున ఏ విధమైన ఆధిపత్యానికీ, ఘర్షణలకూ తావు ఉండదు.

ప్రశ్న 4.
ప్రజాస్వామ్యాన్ని అంచనా వేయటంలో కింద ఉన్న వాటిల్లో ఏది వర్తించదు? (AS1)
ప్రజాస్వామ్యంలో :
అ. స్వేచ్ఛాయుత ఎన్నికలు
ఆ. వ్యక్తి గౌరవం
ఇ. అధిక సంఖ్యాకుల పాలన
ఈ. చట్టం ముందు అందరూ సమానులు
జవాబు:
ఆ. వ్యక్తి గౌరవం .

AP Board 9th Class Social Solutions Chapter 20 ప్రజాస్వామ్యం – రూపుదిద్దుకుంటున్న భావన

ప్రశ్న 5.
ప్రజాస్వామ్యంలో రాజకీయ, సామాజిక అసమానతలపై అధ్యయనం ఈ కింది విషయాన్ని వెల్లడి చేస్తోంది. (AS1)
అ. ప్రజాస్వామ్యం, అభివృద్ధి కలిసి ఉంటాయి.
ఆ. ప్రజాస్వామ్యంలో అసమానతలు ఉంటాయి.
ఇ. నియంతృత్వంలో అసమానతలు ఉండవు
ఈ. ప్రజాస్వామ్యం కంటే నియంతృత్వం మంచిది.
జవాబు:
(ఆ) ప్రజాస్వామ్యంలో అసమానతలు ఉంటాయి.

ప్రశ్న 6.
ఆరు దేశాలకు సంబంధించిన సమాచారం దిగువన ఉంది. ఈ సమాచారాన్ని బట్టి ఆయా దేశాలను ఏ రకంగా వర్గీకరిస్తారు? ఒక్కొక్కదాని ఎదురుగా “ప్రజాస్వామికం’ లేదా ‘అప్రజాస్వామికం’ లేదా ‘ఖచ్చితంగా చెప్పలేం’ అని రాయండి. (AS1)
దేశం (అ) : దేశ అధికారిక మతాన్ని అంగీకరించని ప్రజలకు ఓటు హక్కు ఉండదు.
దేశం (ఆ) : ఒకే పార్టీ గత ఇరవై సంవత్సరాలుగా ఎన్నికలలో గెలుస్తోంది.
దేశం (ఇ) : గత ఎన్నికలలో అధికారంలో ఉన్న పార్టీ ఓడిపోయింది.
దేశం (ఈ) : సైన్యాధిపతి ఆమోదం లేకుండా సైన్యానికి సంబంధించిన చట్టాన్ని పార్లమెంటు చేయలేదు.
దేశం (ఉ) : న్యాయవ్యవస్థ అధికారాలను తగ్గిస్తూ పార్లమెంటు చట్టం చేయలేదు.
దేశం (ఊ) : దేశానికి సంబంధించి ముఖ్య ఆర్థిక నిర్ణయాలన్నీ కేంద్ర బ్యాంకు అధికారులు తీసుకుంటారు, వీటిని మంత్రులు మార్చలేరు.
జవాబు:
దేశం (అ) : ప్రజాస్వామికం
దేశం (ఆ) : ప్రజాస్వామికం
దేశం (ఇ) : ప్రజాస్వామికం
దేశం (ఈ) : అప్రజాస్వామికం
దేశం (ఉ) : ప్రజాస్వామికం
దేశం (ఊ) : అప్రజాస్వామికం

ప్రశ్న 7.
కింద ఉన్న ప్రతి వాక్యంలో ప్రజాస్వామిక, అప్రజాస్వామిక అంశాలు ఉన్నాయి. ప్రతి వాక్యానికి ఆ రెండింటినీ వేరుగా రాయండి. (AS1)
అ. ప్రపంచ వాణిజ్య సంస్థ నిర్ణయించిన నియంత్రణలకు లోబడి పార్లమెంటు కొన్ని చట్టాలు చేయాలని మంత్రి చెప్పారు. –  ప్రజాస్వామికం

ప్రపంచ వాణిజ్య సంస్థ నిర్ణయించిన నియంత్రణలకు లోబడి పార్లమెంటు . కొన్ని చట్టాలు చేయవలసిన అవసరం లేదు అని మంత్రి చెప్పారు. – అప్రజాస్వామికం

ఆ. పెద్ద ఎత్తున రిగ్గింగ్ జరిగిందని నివేదికలు వచ్చిన నియోజకవర్గంలో మళ్ళీ ఎన్నికలను నిర్వహించవలసిందిగా ఎన్నికల సంఘం ఆదేశించింది. – ప్రజాస్వామికం

పెద్ద ఎత్తున రిగ్గింగ్ జరిగిందని నివేదికలు వచ్చిన నియోజకవర్గంలో మళ్ళీ ఎన్నికలు నిర్వహించవలసిందిగా ఎన్నికల సంఘం ఆదేశించలేదు. – అప్రజాస్వామికం

పార్లమెంటులో మహిళల ప్రాతినిధ్యం ఏనాడూ 10 శాతం మించలేదు. ఈ కారణంగా పార్లమెంటులో మూడవ వంతు సీట్లు మహిళలకు కేటాయించాలని మహిళా సంఘాలు ఉద్యమం మొదలు పెట్టాయి. – ప్రజాస్వామికం

పార్లమెంటులో మహిళల ప్రాతినిధ్యం ఏనాడూ 10 శాతం మించలేదు. ఈ కారణంగా పార్లమెంటులో మూడవ వంతు సీట్లు మహిళలకు కేటాయించాలని మహిళా సంఘాలు ఉద్యమం మొదలు పెట్టలేదు. అసలు ఆ ప్రస్తావన కూడా తేలేదు. – అప్రజాస్వామికం

ప్రశ్న 8.
ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఉన్న కింది వాదనలకు మీ ప్రతిస్పందన రాయండి : (AS4)
అ. దేశంలో అత్యంత క్రమశిక్షణ ఉండి, అవినీతిలేని వ్యవస్థ సైన్యం ఒక్కటే. కాబట్టి దేశాన్ని సైన్యం పరిపాలించాలి.
జవాబు:
సైన్యం పరిపాలిస్తే బాగుంటుంది కానీ ప్రజల సమస్యలు సైన్యానికి అంతగా తెలియవు. తెలిసిన వాటిని చేయాలి అనే దృఢ సంకల్పం సైన్యానికి ఉండకపోవచ్చు. కారణం. సైన్యం అనేది ఉద్యోగస్వామ్యం మాత్రమే. ప్రజాసమస్యలు ప్రజాస్వామ్యంలోనే చక్కగా పరిష్కరింపబడతాయి. కానీ నాయకులలో అవినీతి, బంధుప్రీతి, లంచగొండితనం వంటి అంశాలు లేకపోతే ప్రజాస్వామ్యంలో దేశం త్వరితగతిన అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. ప్రజాస్వామ్యంలో నాయకులు ప్రజలనుండి వస్తారు కాబట్టి ప్రజాసమస్యలు బాగా పరిష్కరింపబడతాయి.

ఆ. అధిక సంఖ్యాకుల పాలన అంటే ఏమీ తెలియని ప్రజల పాలన. తక్కువ సంఖ్యలో ఉన్నప్పటికీ మనకు కావలసింది విజ్ఞుల పాలన.
జవాబు:
అధిక సంఖ్యాకుల పాలన ఆంటే ప్రజలందరి పాలన. అనగా ప్రత్యక్ష ప్రజాస్వామ్యం. ప్రజలందరు ప్రభుత్వ కార్యకలాపాలలో భాగస్వాములు కావడం.

తక్కువ సంఖ్యలో ఉన్నప్పటికీ మనకి కావలసింది విజ్ఞుల పాలన. అనగా ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం. ప్రజలు విజ్ఞులైన నాయకులను ఎన్నుకొని వారి ద్వారా పరిపాలింపబడడం. ఇలాంటి విధానం వలన సమయం ధనం ఆదా కావడానికి అవకాశం ఉంటుంది.

ఇ. ఆధ్యాత్మిక విషయాలలో మతగురువుల మార్గదర్శనం కోరుకున్నప్పుడు రాజకీయాల్లో కూడా మార్గదర్శనం చేయమని ఎందుకు అడగకూడదు? దేశాన్ని మతగురువులు పరిపాలించాలి.
జవాబు:
ఆధ్యాత్మిక విషయాలలో మత గురువులు. కానీ వారు రాజనీతిలో కాని రాజకీయాలలోకాని, సంక్షేమ పథకాల రూపకల్పనలో, కాని, వాటిని అమలు చేయడంలో కాని మత గురువులకు అవగాహన ఉండవలసిన అవసరం ఉండదు. కాబట్టి దాని పట్ల వారికి సరైన అవగాహన ఉండకపోవచ్చు. పైగా మత గురువులు మతపరమైన విషయాలపట్ల చూపించిన ప్రతిభ రాజకీయ, ప్రజాపాలన విషయాలలో చూపించకపోవచ్చును, మతం అనేది మత్తుమందు లాంటిది. రాజకీయాలు ఆ విధమైనవి కావు.

ప్రశ్న 9.
ప్రపంచ పటంలో ఈ క్రింది దేశాలను గుర్తించండి. (AS5)
అ) శ్రీలంక
ఆ) బెల్జియం
ఇ) రష్యా
ఈ) అమెరికా (యు.ఎస్.ఎ)
AP Board 9th Class Social Solutions Chapter 20 ప్రజాస్వామ్యం – రూపుదిద్దుకుంటున్న భావన 1

ప్రశ్న 10.
‘పౌరుల గౌరవం, స్వేచ్ఛ’ అనే శీర్షిక కింద గల మొదటి రెండు పేరాలు చదివి దిగువ ప్రశ్నకు సమాధానం ఇవ్వండి :
ప్రజాస్వామిక దేశంలో పౌరుల గౌరవం, స్వేచ్ఛ గురించి మీ సొంతమాటల్లో రాయండి. (AS2)
జవాబు:
వ్యక్తి గౌరవాన్ని, స్వేచ్ఛని కాపాడటంలో వివిధ రకాల ప్రభుత్వాలలో ప్రజాస్వామ్యం మెరుగైనది.

ప్రతి వ్యక్తికీ తోటి మానవుల నుంచి గౌరవం పొందాలని ఉంటుంది.

తనకు తగినంత మర్యాద ఇవ్వటం లేదని భావించినందువల్లనే తరచు వ్యక్తుల మధ్య ఘర్షణలు తలెత్తుతుంటాయి. • గౌరవం, స్వేచ్ఛల పట్ల నిబద్దతే ప్రజాస్వామ్యానికి పునాది. ప్రపంచ వ్యాప్తంగా ఈ విషయాన్ని కనీసం సూత్రబద్దంగానైనా ప్రజాస్వామిక దేశాలు గుర్తించాయి.

దీనిని వివిధ ప్రజాస్వామ్యాలలో వివిధ స్థాయిలలో సాధించారు. ఆధిపత్యం, పరాధీనత ఆధారంగా తరతరాలుగా నడిచిన సమాజాలలో అందరూ సమానం అని అంగీకరించటం అంత తేలికైన విషయం కాదు.

ప్రశ్న 11.
ప్రజలు ప్రజాస్వామ్యం కొరకు పోరాడడానికి గల కారణాలను తెల్పండి.
జవాబు:
తరతరాలుగా రాచరిక, నియంతృత్వ పరిపాలనపై ప్రజల గౌరవానికి, స్వేచ్ఛకు విలువ లేకుండా, ప్రజల భాగస్వామ్యంతో పరిపాలన కొనసాగించడంపై ప్రజలు ఎదిరించారు. పౌరుల హక్కులకు భంగం వాటిల్లినప్పుడు, బాధ్యత లేని పరిపాలన కొనసాగినప్పుడు ప్రజలు, రాచరిక పునాదులపై నడిచే ప్రభుత్వాలను, సైనిక పాలనలను సైతం ప్రజలు తిరస్కరించారు. సమానత్వ సూత్రంపై నడిచే, ప్రజల సంక్షేమం, ఉపాధి మెరుగుపరిచే ప్రజాస్వామ్యంపై ప్రజలు ఇష్టత చూపించారు. కుల ఆధారిత అసమానతలు, అత్యాచారాలు, వ్యక్తికి చట్టపర నైతిక విలువలు లేని పాలనను కాదని ప్రజాస్వామ్యం కావాలన్నారు.

AP Board 9th Class Social Solutions Chapter 20 ప్రజాస్వామ్యం – రూపుదిద్దుకుంటున్న భావన

ప్రశ్న 12.
మన పాఠశాలల్లో ప్రజాస్వామ్యం అమలు జరుగుతుందనడానికి కొన్ని ఉదాహరణలు ఇవ్వండి. (AS6)
జవాబు:
మన పాఠశాలల్లో ప్రజాస్వామ్యం జరుగుతుంది అనడానికి కొన్ని ఉదాహరణలు :

  1. మన పాఠశాలల్లో కులమతాలు, ధనిక, పేదాయని భేదం లేకుండా అందరికీ యూనిఫారమ్స్ ధారణ ద్వారా సమానత్వం లభిస్తుంది.
  2. అదేవిధంగా తరగతులు, ఆర్థిక స్తోమతతో సంబంధం లేకుండా అందరికీ మధ్యాహ్న భోజనం అందించబడుతుంది.
  3. అన్ని మతాల పండుగలకు ప్రాధాన్యతనిస్తూ ఆ రోజులలో సెలవును మంజూరు చేయడమే కాకుండా స్థానిక ప్రాంత పండుగలకు కూడా ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది.
  4. తరగతి నాయకుడి ఎన్నిక కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో మెజార్టీ విద్యార్ధుల అభిప్రాయం మేరకు, ఎన్నిక ప్రకారం ఎంపిక చేయడం జరుగుతుంది.
  5. పేదవారికి, వెనుకబడిన వారికి ఆర్థికంగా చేయూత నందించుటకుగాను స్కాలర్ షిప్స్, ఆర్థిక పథకాలు అందించడం జరుగుతుంది.

9th Class Social Studies 20th Lesson ప్రజాస్వామ్యం – రూపుదిద్దుకుంటున్న భావన InText Questions and Answers

9th Class Social Textbook Page No.247

ప్రశ్న 1.
పరిపాలనలో భాగస్వాములు కావటం ప్రజలకు ఎందుకు ఇష్టం ఉండదు? సరైన అవగాహన లేకపోవటం వల్లనా, ఆసక్తి లేకనా, లేక తమ అభిప్రాయానికి విలువ ఉండదని భావించటం వల్లనా?
జవాబు:

  1. ప్రజాస్వామ్యం అంటే ప్రజలు కేవలం ఎన్నికల్లో పాల్గొని, పాలకులను ఎన్నుకోవటం మాత్రమే కాదు.
  2. ప్రభుత్వ విధానాలు, చట్టాలు తయారు చేయటంలో, వాటిని అమలు చేయటంలో కూడా ప్రజలు భాగస్వాములు కావాలి.
  3. ప్రజలందరూ బహిరంగంగా పాల్గొని తమ అవసరాలు, అభిప్రాయాలు స్పష్టంగా పేర్కొనేలా బహిరంగ చర్చలు జరిపిన తరువాత ,చట్టాలు, విధానాలు రూపొందించినప్పుడు ఇది సాధ్యమవుతుంది.
  4. స్వతంత్ర పౌర సంఘాలుగా ఏర్పడి చట్టాలు, విధానాలు సమర్థంగా అమలు అయ్యేలా చూడటంలో ప్రజలు భాగస్వాములు కావాలి.
  5. అనేక దేశాలలో ఎన్నికైనా ప్రభుత్వాలు కూడా ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించవు. పైగా దానిని అడ్డుకుంటాయి.
  6. ప్రజలు కూడా దేశ వ్యవహారాలలో అంత ఆసక్తి చూపకుండా ఉదాసీనంగా ఉండిపోతారు.
  7. కారణం ప్రజలందరికి పరిపాలన పట్ల అవగాహన లేకపోవడం, ఆసక్తి చూపకపోవడం.
  8. ఒకవేళ ఆసక్తి చూపినా పాలకులు వారి అభిప్రాయాలను పరిగణనలోనికి తీసుకోకపోవడం.

9th Class Social Textbook Page No.248

ప్రశ్న 2.
ప్రపంచంలో అనేక ప్రభుత్వాలు ప్రజలకు పౌరహక్కులను ఇచ్చాయి. అయితే ప్రజల ఫోనులను టాపింగ్ చేయటం, వాళ్ళ ఉత్తరాలు చదవటం, వాళ్ళ కార్యకలాపాలపై నిఘా ఉంచటం వంటి చర్యలు చేపడతాయి. ఇది సరైనదేనా?
జవాబు:

  1. ప్రజాస్వామ్యానికి పౌరహక్కులు ఉండాలి.
  2. తెలుసుకోటానికి, చర్చించటానికి, స్వతంత్ర అభిప్రాయాలు ఏర్పరచుకోటానికి, వాటిని వ్యక్తపరచటానికి సంఘాలుగా ఏర్పడి తమ భావాల అమలుకు పోరాడటానికి పౌరులకు స్వేచ్ఛ ఉన్నప్పుడే వాళ్ళు నిర్ణయాలు తీసుకోవటంలో భాగస్వాములు అవుతారు.
  3. అంతేకాని ప్రజల ఫోనులను టాపింగ్ చేయటం, వాళ్ళ ఉత్తరాలు చదవటం, వాళ్ల కార్యకలాపాలపై నిఘా ఉంచడం వంటి చర్యల వల్ల వాళ్ళ భావ ప్రకటన స్వేచ్ఛను హరించివేయడమే అవుతుంది.
  4. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది సరైనదికాదు.

AP Board 9th Class Social Solutions Chapter 20 ప్రజాస్వామ్యం – రూపుదిద్దుకుంటున్న భావన

ప్రశ్న 3.
ప్రజాస్వామికంగా, ప్రజలందరి ప్రయోజనాల కోసం పనిచేసే ప్రభుత్వాలు ఉన్నప్పటికీ అనేక దేశాలలో తీవ్రస్థాయిలో అసమానతలు ఎందుకు కొనసాగుతున్నాయి?
జవాబు:

  1. అనేక దేశాల ప్రభుత్వాలు ధనికులకు అనుకూలంగా, పేదల ప్రయోజనాలకు విరుద్ధంగా ఉండే విధానాలను అనుసరిస్తూ ఉంటాయి.
  2. ప్రజాస్వామికంగా ప్రజలందరి ప్రయోజనాల కోసం పనిచేసే ప్రభుత్వాలు ఉన్నప్పటికీ అనేక దేశాలలో తీవ్ర స్థాయిలో అసమానతలు ఉండటానికి కారణాలు.
    అ) తరతరాలుగా వస్తున్న వారసత్వపు సంపద.
    ఆ) ఉన్నత వర్గాలకు చెందినవారు మంచి విద్య, ఉద్యోగావకాశాలు పొందడం.
    ఇ) సంపద మరికొంత సంపదను సముపార్జించి పెట్టడం.
    ఈ) ఉన్న వర్గాలకు చెందినవారు పారిశ్రామిక, వాణిజ్య వర్గాలపై ఆధిపత్యం చెలాయించడం.
    ఉ) ఆలోచనా విధానాలలోనూ మార్పులు రావడం.

9th Class Social Textbook Page No.250

ప్రశ్న 4.
మన దేశంలోని ఎన్నికలను ఉదాహరణగా తీసుకుందాం. ఒక ప్రాంతంలో ఉంటున్న వాళ్ళలో 1000 మందికి ఓటు హక్కు ఉందని అనుకుందాం. సాధారణంగా ఎన్నికల్లో 60 శాతం ఓటర్లు మాత్రమే తమ ఓటు హక్కుని ఉపయోగించుకుంటారు. అంటే ఎన్నికల్లో 600 మంది ఓటు వేస్తారు. ఎన్నికల్లో 10 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారని అనుకుందాం. గెలిచిన అభ్యర్థికి 250 ఓట్లు, రెండవ అభ్యర్థికి 200 ఓట్లు, మిగిలిన 8 మందికి కలిపి 150 ఓట్లు పడ్డాయని అనుకుందాం. 250 . ఓట్లు వచ్చిన వ్యక్తి గెలిచినట్లు ప్రకటిస్తారు. ఆ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజల ప్రయోజనాలకు, దృక్పథాలకు గెలిచిన అభ్యర్థి ఏ మేరకు ప్రాతినిధ్యం వహిస్తారు? గెలిచిన అభ్యర్థికి ఓటర్లలో 25 శాతం మద్దతు మాత్రమే ఉంది. ఇది న్యాయమైన ప్రజాస్వామిక ఏర్పాటేనా? నిర్ణయాలు తీసుకునే సంస్థలకు ప్రజల ప్రతినిధులను ఎన్నుకోటానికి మరో విధానం ఏమైనా ఉందా?
జవాబు:
మన దేశంలోని ఎన్నికలను ఉదాహరణగా తీసుకుందాం. ఒక ప్రాంతంలో ఉంటున్న వాళ్ళలో 1000కి ఓటుహక్కు ఉందని అనుకుందాం. సాధారణంగా ఎన్నికల్లో 60 శాతం ఓటర్లు మాత్రమే తమ ఓటుహక్కుని ఉపయోగించుకుంటారు. అనగా ఎన్నికల్లో 600 మంది ఓటు వేస్తారు. అయితే ఎన్నికల్లో 10 మంది అభ్యర్థులు పోటీచేస్తున్నారని అనుకుందాం. గెలిచిన అభ్యర్థికి 250 ఓట్లు, రెండవ అభ్యర్థికి 200 ఓట్లు, మిగిలిన 8 మందికి కలిపి 150 ఓట్లు పడ్డాయని అనుకుందాం. కానీ 250 ఓట్లు వచ్చిన వ్యక్తి గెలిచినట్లు ప్రకటిస్తారు. అయితే అతను ఆ 250 మందికి మాత్రమే ప్రతినిధిగా కాకుండా ప్రజలందరికి ప్రతినిధిగా వ్యవహరిస్తాడు.

ప్రజలందరికి అభిప్రాయాలను తెలుసుకుంటాడు. ప్రజలందరికి ప్రాతినిధ్యం వహిస్తాడు. ప్రజలందరికి సంక్షేమ పథకాలను వర్తింపచేస్తాడు. ప్రజలందరికి అవసరాలు తీర్చటానికి కృషి చేస్తాడు. అందువల్ల ఇది న్యాయమైన ప్రజాస్వామిక వ్యవస్థగానే కొనసాగుతుంది. నిర్ణయాలు తీసుకునే సంస్థలకు ప్రజల ప్రతినిధులను ఎన్నుకోటానికి మరో విధానం.

  1. ప్రజలకు ఓటు చేసే హక్కుతో పాటు తిరస్కరించే అధికారం కూడా ఇవ్వాలి.
  2. ఎక్కువమంది ప్రజలు తిరస్కరించిన అభ్యర్థి గెలిచినట్లు ప్రకటించరాదు.
  3. అనుకూలమైన ఓట్లతో పాటు వ్యతిరేకమైన ఓట్లను కూడా పరిగణనలోనికి తీసుకోవాలి.

9th Class Social Textbook Page No.254

ప్రశ్న 5.
సామాజిక, మత, భాషాపర వైవిధ్యతలను కలుపుకుని వెళ్ళటానికి ఈ రెండు (బెల్జియం, శ్రీలంక) దేశాలు అనుసరించిన మార్గాలను చర్చించండి.
జవాబు:
బెల్జియం, శ్రీలంకలు రెండు ప్రజాస్వామిక దేశాలే అయినప్పటికీ రెండు దేశాలు అధికారాన్ని పంచుకోవటంలో భిన్నమైన మార్గాలు అవలంబించాయి.

1) బెల్జియం :
వివిధ ప్రాంతాల ప్రజల ప్రయోజనాలు, భావనలను మన్నించినపుడే దేశం ఐక్యంగా ఉంటుందని బెల్జియం నాయకులు గుర్తించారు. ఈ అవగాహన కారణంగా అధికారాన్ని పంచుకోటానికి అందరికీ ఆమోదయోగ్యమైన ఏర్పాట్లు చేసుకున్నారు.

2) శ్రీలంక :
అధిక సంఖ్యలో ఉన్న ప్రజలు అధికారాన్ని పంచుకోటానికి ఇష్టపడక తమ ఆధిపత్యాన్ని ఇతరులపై రుద్దాలని ప్రయత్నించినపుడు దేశ సమైక్యత దెబ్బ తింటుందని, అంతర్యుద్ధాలు, పౌర యుద్ధాల కారణంగా దేశం వందల సంవత్సరాలు వెనుకబడుతుందని శ్రీలంక నిరూపించింది.

ప్రాజెక్టు

ప్రశ్న 1.
మీ ఉపాధ్యాయుని సహాయంతో తరగతి ప్రతినిధిని ఎన్నుకోటానికి తరగతిలో ఎన్నికలు నిర్వహించండి.