AP Inter 1st Year Botany Study Material Chapter 8 ఆవృతబీజాల వర్గీకరణ శాస్త్రం

Andhra Pradesh BIEAP AP Inter 1st Year Botany Study Material 8th Lesson ఆవృతబీజాల వర్గీకరణ శాస్త్రం Textbook Questions and Answers.

AP Inter 1st Year Botany Study Material 8th Lesson ఆవృతబీజాల వర్గీకరణ శాస్త్రం

అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ఒమేగా వర్గీకరణ శాస్త్రం అంటే ఏమిటి?
జవాబు:
స్వరూప లక్షణాల మీదనే కాకుండా పిండోత్పత్తి శాస్త్రం, కణశాస్త్రం, పరాగరేణు శాస్త్రం, వృక్ష రసాయనశాస్త్రం, సిరాలజి వంటి అనేక వృక్ష శాఖల నుంచి లభించే విషయాల మీద ఆధారపడి చేయు వర్గీకరణను ఒమేగా వర్గీకరణ శాస్త్రము అంటారు.

ప్రశ్న 2.
మొక్కల సహజ వర్గీకరణ శాస్త్రం అంటే ఏమిటి? దీన్ని అనుసరించిన శాస్త్రవేత్తల పేర్లు తెలపండి.
జవాబు:
వీలైనన్ని ఎక్కువ స్వరూప లక్షణాలను పరిగణలోనికి తీసుకొని చేయు వర్గీకరణను సహజ వర్గీకరణ అంటారు. దీనిని బెంథామ్ మరియు హుకర్లు ప్రతిపాదించారు.

ప్రశ్న 3.
సాంఖ్యక వర్గీకరణశాస్త్ర (Numerical Taxonomy) పరిధిని, ప్రాముఖ్యతను వివరించండి.
జవాబు:
గణితశాస్త్ర పద్ధతులను ఉపయోగించి వర్గీకరణ సముదాయాల మధ్య గల గమనించదగ్గ విభేదాలను, పోలికలను లెక్క కట్టటానికి ఉపయోగించే శాస్త్రంను సాంఖ్యక వర్గీకరణ శాస్త్రం అంటారు. ఈ పద్ధతిలో అన్ని లక్షణాలను సంఖ్య, సంకేతాలను నిర్ణయించి తరువాత సమాచారాన్ని క్రమ పద్ధతిలో విశ్లేషించడం జరుగుతుంది. ప్రతి లక్షణానికి సమానమైన ప్రాధాన్యత ఇస్తూ అదే సమయంలో వందలాది లక్షణాలను పరిగణించవచ్చు.

ప్రశ్న 4.
భూఫలనం అంటే ఏమిటి ? ఈ దృగ్విషయాన్ని ప్రదర్శించే మొక్క పేరు తెలపండి.
జవాబు:
మృత్తికలో ఫలం అభివృద్ధి చెందుటను భూఫలనం అంటారు. ఉదా : వేరుశనగ

ప్రశ్న 5.
ఫాబేసికి చెందిన మొక్కలలో కనిపించే పరాగ సంపర్క యాంత్రిక రకం పేరు తెలపండి. [Mar. ’14]
జవాబు:
ఫిస్టన్ యాంత్రికము

AP Inter 1st Year Botany Study Material Chapter 8 ఆవృతబీజాల వర్గీకరణ శాస్త్రం

ప్రశ్న 6.
సొలానమ్ మొక్క పుష్ప సంకేతం రాయండి
జవాబు:
AP Inter 1st Year Botany Study Material Chapter 8 ఆవృతబీజాల వర్గీకరణ శాస్త్రం 1

ప్రశ్న 7.
సొలానమ్ నైగ్రమ్ అండాశయం, సాంకేతిక వర్ణన ఇవ్వండి.
జవాబు:
ద్విఫలదళ, సంయుక్త, ద్విబిలయుత, ఊర్ధ్వ అండాశయము ఉబ్బిన స్థంభ అండన్యాసంపై అండాలు అమరి ఉంటాయి. ఫలదళాలు 45° ల కోణంలో ఏటవాలుగా అమరి ఉంటాయి.

ప్రశ్న 8.
ఆలియమ్ సెపా పరాగకోశాల సాంకేతిక వర్ణనను ఇవ్వండి.
జవాబు:
ఆలియమ్ సెఫాలో పరాగ కోణాలు, ద్వికక్షికం, పీఠసంయోజితము, అంతర్ముఖం, నిలువు స్పోటనము.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ఒక నమూనా పుష్పించే మొక్క పాక్షిక సాంకేతిక వర్ణనను క్లుప్తంగా రాయండి.
జవాబు:
మొక్క వర్ణనలో ఆకృతి, ఆవాసము, వేరు, కాండము, పత్రము, పుష్పాలు, క్షణాలు, ఫలము వివరిస్తారు. తరువాత పుష్పచిత్రం, పుష్ప సంకేతము ఇస్తారు. పుష్ప సంకేతంలో Br అనగా పుచ్చ సహితము, Ebr అనగా పుచ్చ రహితము, Brl లఘు పుచ్ఛ
AP Inter 1st Year Botany Study Material Chapter 8 ఆవృతబీజాల వర్గీకరణ శాస్త్రం 2 పుష్పభాగాల సంఖ్య, సంయుక్తమా లేక అసంయుక్తం, సంసంజనము లేక అసంజనం, కూడా పుష్ప సంకేతంలో సూచిస్తారు.

పుష్ప చిత్రంలో ప్రధాన అక్షం వైపు ఉన్న పుష్ప భాగాన్ని పరాంతభాగం అని, ప్రధాన అక్షాన్ని ఒక చుక్కతో పుష్ప చిత్రంపైన సూచిస్తారు. రక్షకపత్రావళి, ఆకర్షణపత్రావళి, కేసరావళి, అండకోశంలను ఏక కేంద్ర వలయాలుగా గీసి, రక్షక పత్రాలను వెలుపల వలయంలోను, మధ్యలో అండాశయం అడ్డుకోత పటం ద్వారా సూచిస్తారు. పుష్ప పుచ్ఛం, పుష్పం మొక్క పూర్వాంత భాగాన్ని సూచిస్తుంది. దీనిని పుష్ప చిత్రానికి పీఠం వైపు సూచిస్తారు.

ప్రశ్న 2.
ఫాబేసికి చెందిన మొక్కల అనావశ్యక పుష్ప అంగాలను వివరించండి. [Mar. ’14]
జవాబు:
ఫాబేసిలో అనావశ్యక అవయవాలు :
రక్షక పత్రావళి మరియు ఆకర్షణ పత్రావళి

రక్షక పత్రావళి :
రక్షక పత్రాలు 5, సంయుక్తము, చిక్కెన పుష్పరచన బేసిరక్షక పత్రం పూర్వాంతంలో ఉంటుంది.

ఆకర్షణ పత్రావళి :
ఆకర్షణ పత్రాలు – 5, అసంయుక్తం, పాపిలియోనేషియస్ రకము. పరాంతంలో ఉన్న ఆకర్షణపత్రం పెద్దది (ధ్వజము) పార్శ్వంగా ఉండే రెండు ఆకర్షణ పత్రాలు (బాహువులు) పూర్వాంతంలో రెండు ఉన్న ఆకర్షణపత్రాలు (ద్రోణులు) సంయుక్తమై ఆవశ్యక అంగాలను కప్పి ఉంచుతాయి. అవరోహక పుష్పరచన చూపుతాయి.

ప్రశ్న 3.
పుష్పచిత్రాన్ని గురించి వ్రాయండి.
జవాబు:
పుష్ప భాగాల సంఖ్య, వాటి అమరిక, ఒక భాగానికి మరియెక భాగానికి మధ్య సంబంధాలను పుష్ప చిత్రం తెలియచేస్తుంది. ప్రధాన అక్షం వైపు ఉండే పుష్ప భాగాన్ని పరాంతభాగం అని, ప్రధాన అక్షాన్ని ఒక చుక్క లేదా ఒక చిన్న వలయంతో పుష్ప చిత్రంపైన సూచిస్తారు. రక్షక, ఆకర్షణ, పత్రాలు, కేసరావళి, అండకోశాలను ఏక కేంద్రకవలయాలుగా గీసి, రక్షక పత్రాలను వెలుపలి వలయంలో చూపిస్తారు. అండకోశాన్ని పుష్ప చిత్రం మధ్యలో అండాశయం అడ్డుకోత ద్వారా చూపుతారు. పుష్ప పుచ్ఛం పుష్పం యొక్క పూర్వాంత భాగంలో ఉంటుంది. దీనిని పుష్ప చిత్రం పీఠ భాగం వైపున సూచిస్తారు.

ప్రశ్న 4.
లిలియేసికి చెందిన మొక్కల పుష్పభాగాలలోని ఆవశ్యక అంగాలను వివరించండి.
జవాబు:
లిలియేసిలో ఆవశ్యక అంగాలు = కేసరావళి, అండకోశము

ఎ) కేసరావళి :
6 కేసరాలు, రెండు వలయాలలో 3 చోప్పున ఉంటాయి. అసంయుక్తం పరిపత్రో పరిస్థితం, పరాగ కోశాలు ద్వికక్షితం, పీఠ సంయోజితం, అంతర్ముఖం, నిలువు స్పోటనం.

బి) అండకోశం :
త్రిఫలదళ, సంయుక్త, త్రిబిలయుతం, ఊర్థ్వ అండాశయము, అండాలు స్థంభ అండాన్యాసంపై అమరి ఉంటాయి. కీలము -అగ్రము, కీలాగ్రము త్రిశాఖాయుతము, శీర్షాకారం.

AP Inter 1st Year Botany Study Material Chapter 8 ఆవృతబీజాల వర్గీకరణ శాస్త్రం

ప్రశ్న 5.
బెంథామ్ అండ్ హుకర్ల వర్గీకరణలో ద్విదళ బీజ (డైకాటిలిడనే) తరగతి మీద లఘుటీక వ్రాయండి.
జవాబు:
బెంథామ్ మరియు హుకర్ల వర్గీకరణలో డైకాటిలిడనే అను తరగతిని మూడు ఉపతరగతులుగా విభజించారు. అవి :
ఎ) పాలిపెటాలే బి) గామోపెటాలే సి) మోనోక్లామిడే పాలిపెటాలే అను ఉపతరగతిలో థలామిఫ్లోరే (6) క్రమాలు డిస్కిఫ్లోరే (4) క్రమాలు, కాలిసిస్లోరే (5) క్రమాలు అను మూడు శ్రేణులుగా విభజించారు. గామోపెటాలేను ఇన్ఫెరే (3) క్రమాలు హెటిరోమిరే (3) క్రమాలు బైకార్పెల్లేటె (4) క్రమాలు అను 3 శ్రేణులుగా విభజించారు. మోనోక్లామిడేలో ఎనిమిది శ్రేణులు కలవు.

ప్రశ్న 6.
పుష్ప సమీకరణాన్ని విశదీకరించండి.
జవాబు:
పుష్ప భాగాలను కొన్ని సంకేతాలతో పుష్ప సమీకరణంలో చూపిస్తారు. Br అనగా పుచ్చ సహితము, Ebr అనగా పుచ్చ రహితము (పుచ్ఛాలు లేకుండుట), Brl- లఘు పుచ్ఛ సహితము, Ebrl- లఘుపుచ్ఛరహితము (లఘు పుచ్ఛాలు లోపించుట)
AP Inter 1st Year Botany Study Material Chapter 8 ఆవృతబీజాల వర్గీకరణ శాస్త్రం 3

ప్రశ్న 7.
ఫాబేసికి చెందిన మొక్కల ఆర్థిక ప్రాముఖ్యతను తెలపండి.
జవాబు:

  • కందులు (కజానస్ కజాన్), మినుములు (ఫెసియోలస్ ముంగో), పెసలు (ఫెసియోలస్ ఆరియస్), శనగలు (సైసర్ అరైటినయ్) మొదలైన అపరాల్లో (pulses) ప్రోటీన్లు అధికంగా ఉంటాయి.
  • డాలికాస్, గ్లైసిన్ల ఫలాలను కూరగాయలుగా వాడతారు.
  • పైసమ్, అరాబిన్ల విత్తనాలు తింటారు.
  • అరాఖిస్ హైపోజియా విత్తనాల నుంచి తీసే వేరుశనగ నూనెను, గ్లైసిన్ మాక్స్ విత్తనాల నుంచి తీసే సోయాబిన్ నూనెను వంటలకు వాడతారు.
  • అరిఖిస్ హైపోజియా నుంచి నూనె తీసిన తరువాత వచ్చే తెలగ పిండిని (oil cake) వంటకాల్లోను, పశువులకు ఆహారంగాను వాడతారు.
  • పొంగామియా పిన్నేటా విత్తనాల నుంచి వచ్చే నూనెను మందుల తయారీలో ఉపయోగిస్తారు.
  • ఆబ్రస్ ప్రికటోరియస్ విత్తనాలను కంసాలీలు తూకానికి వాడతారు.
  • చాలా మొక్కలు పశుగ్రాసంగా ఉపయోగపడతాయి (క్రొటలేరియా, ఫేసియోలస్)
  • నత్రజని స్థాపన ఆ శక్తి అధికంగా ఉండటం వల్ల చాలా పంటలను, పంటల మార్పిడికి ఉపయోగిస్తారు.
  • క్రొటలేరియా నుంచి లభించే నారలను తాళ్ళ తయారీకి ఉపయోగిస్తారు.
  • ట్రైగోనెల్లా విత్తనాలు వంటలలోను, మందుగాను ఉపయోగపడతాయి. లేక మెంతిఆకులను ఆకుకూరగా తింటారు.
  • ట్రైఫ్రోషియా, సెన్బానియా మొక్కలను హరిత ఎరువు (Green manure) గా వాడతారు.
  • ఇండిగోఫెరా నుండి నీలిమందు లభిస్తుంది.
  • టిరోకార్పస్ సాంటలైనస్ కలపను సంగీత వాయిద్యాల తయారీకి వాడతారు.
  • డాల్బెర్జియా లాటిఫోలియా కలపను ఫర్నిచర్ తయారీకి వాడతారు.

దీర్ఘ సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ఫాబేసికి చెందిన మొక్కల లక్షణాల్ని వివరించండి.
జవాబు:
శాఖీయ లక్షణాలు :
ఎ) ఆకృతి :
ఏక వార్షిక గుల్మాలు. కొన్ని పొదలు, మరికొన్ని వృక్షాలు కొన్ని తిరుగుడు తీగల ద్వారా కాని (డాలికస్) నులి తీగల సహయంతో (పైసమ్) కాని ఎగబాకుతాయి.

బి) ఆవాసము :
మధ్యరకపు మొక్కలు

సి) వేరు వ్యవస్థ :
తల్లి వేరువ్యవస్థ. వేళ్ళపై వేరు బుడిపెలు ఉండి, వాటిలో నత్రజని స్థాపన చేసే రైజోబియమ్ అను బ్యాక్టీరియమ్లు సహజీవనం చేస్తు ఉంటాయి.

కాండం :
వాయుగతం, నిటారుగా, మృదువుగా లేక దృఢంగా ఉంటుంది.

పత్రం :
ప్రకాండ సంబంధం ఏకాంతరం, పుచ్ఛసహిత, పుష్టోదరం, తల్పం వంటి పత్రపీఠం, సరళ లేక పిచ్ఛాకార సంయుక్త పత్రాలు.

పుష్ప లక్షణాలు :
పుష్ప విన్యాసం : సామాన్య అనిశ్చితం (క్రొటలేరియా)

పుష్పం :
పుచ్ఛసహిత, లఘు పుచ్ఛసహిత, వృంతసహిత, సంపూర్ణ పాక్షికం సౌష్టవయుతం, ద్విలింగ, పంచభాగయుత, పర్యండకోశ పుష్పాలు. పుష్పాసనం గిన్నె ఆకారంలో ఉంటుంది.

రక్షక పత్రావళి :
రక్షక పత్రాలు 5, సంయుక్తం, చిక్కెన పుష్పరచన, బేసిరక్షక పత్రం పూర్వాంతంలో ఉంటుంది.

ఆకర్షణ పత్రావళి :
పాపిలియోనెషియస్ ఆకారం ఆకర్షణ పత్రాలు 5, అసంయుక్తం, పరాంతంలో ఉన్న ఆకర్షణ పత్రం పెద్దదీగా ఉంటుంది. దీనినే ‘ధ్వజం’ అంటారు. పార్శ్వంగా ఉన్న రెండు ఆకర్షణ పత్రాలను ‘బహుపత్రాలు’ లేక ‘అలే’ అంటారు. పూర్వాంతంలో బాహువుల కింద ఉన్న రెండు పడవ ఆకార ఆకర్షణ పత్రాలను ‘ద్రోణి పత్రాలు’ అంటారు. ఇవి అవశ్యకాంగాలను కప్పి ఉంచుతాయి. అవరోహక పుష్పరచన చూపుతాయి.

కేసరావళి :
కేసరాలు పది, సాధారణంగా కేసరదండాలు సంయుక్తమై, ద్విబంధకంగా ((9) + 1) గాని (డాలికస్ పైసమ్) ఏకబంధకంగా గాని (క్రోటలేరియా) ఉండవచ్చు. పరాగకోశాలు ద్వికక్షికం, అంతరోన్ముఖం, నిలువు స్ఫోటనంలను చూపిస్తాయి.

అండకోశం :
ఏక ఫలదళయుతం, ఏకబిలయుత అండాశయం అర్థ నిమ్నం (క్రోటలేరియా) అనేక అండాలు ఉపాంత అండన్యాసం మీద రెండు నిలువు వరసల్లో అమరి ఉంటాయి. కీలం పొడవుగా ఉండి శీర్షం వద్ద వంపు తిరిగి ఉంటుంది. కీలాగ్రం సామాన్యం.

AP Inter 1st Year Botany Study Material Chapter 8 ఆవృతబీజాల వర్గీకరణ శాస్త్రం 4

పరాగ సంపర్కం :
పరపరాగ సంపర్కం, పైసమ్, లథిరస్లలో ఆత్మపరాగ సంపర్కం. పరపరాగ సంపర్కము ఫిస్టన్ యాంత్రికము ద్వారా జరుగుతుంది. అరాఖిస్లో భూఫలనము అవిదారకము.

ఫలము : ద్వివిదారక ఫలం

విత్తనము : అంకురచ్ఛద సహితము, రెండు బీజ దళాలు, ప్రొటీన్లు కలిగి ఉంటాయి.
AP Inter 1st Year Botany Study Material Chapter 8 ఆవృతబీజాల వర్గీకరణ శాస్త్రం 5

ప్రశ్న 2.
సొలనేసీకి చెందిన ముఖ్య లక్షణాల్ని వ్రాయండి.
జవాబు:
ఆకృతి :
ఏక వార్షికాలు లేక బహు వార్షిక గుల్మాలు, పొదలు (సెస్ట్రమ్)

ఆవాసం :
మధ్యరకపు మొక్కలు, సోలానం సూరతెన్స్

వేరు వ్యవస్థ :
తల్లి వేరు వ్యవస్థ

కాండము :
వాయుగతంగా, నిటారుగా పెరుగుతుంది. గుల్మాకారం, కాండంపై కేశాలు లేక ముళ్ళు ఉంటాయి. సొలానమ్ ట్యూబరోసమ్ భూగర్భంగా పెరిగే దుంపకాండం ఉంటుంది. పత్రవృతం కాండంతో ఆశ్లేషితం చూపిస్తుంది. కాండంలో ద్విసహ పార్శ్వ నాళికా పుంజాలు ఉంటాయి.

పత్రం :
పత్రాలు పుచ్ఛరహితం, వృంతసహితం, శాఖీయ భాగాలలో ఏకాంతరంగా ఉంటాయి. సాధారణంగా సరళ పత్రాలు లేదా తమ్మెలుగా చీలి ఉంటాయి. జాలాకార ఈనెల వ్యాపనం.

పుష్ప లక్షణాలు :
పుష్ప విన్యాసం :
సాధారణంగా గ్రీవస్థం లేదా శిఖరస్థం. నిశ్చిత పుష్ప విన్యాసం. సొలానమ్ జాతులలో గ్రీవస్థంగా ఏర్పడే వృశ్చికాకార సైమ్ దతూరలో శిఖరస్థం. ఏకాంతం, పొగాకులో పానికల్.

పుష్పం :
పుష్పాలు పుచ్ఛ సహితం లేదా పుచ్ఛరహితం, లఘు, పుచ్ఛరహితం, వృంతసహితం సంపూర్ణం, ద్విలింగకం పంచభాగయుతం, అండకోశాధస్థితం, సౌష్టవయుతం.

రక్షక పత్రావళి :
రక్షక పత్రాలు 5, సంయుక్తం, కవాటయుత పుష్పరచన. దీర్ఘకాలికం. ఉదా : సొలానమ్, కాప్సికమ్ ఆకర్షణ పత్రావళి : ఆకర్షణ పత్రాలు 5, సంయుక్తం, కవాటయుతం లేదా మెలితిరిగిన పుష్పరచన దతూర.

AP Inter 1st Year Botany Study Material Chapter 8 ఆవృతబీజాల వర్గీకరణ శాస్త్రం 6

కేసరావళి :
కేసరాలు 5, మకుటదళోపరిస్థితం, ఆకర్షణ పత్రాలలో ఏకాంతరంగా ఉంటాయి. పరాగకోశాలు పెద్దవి. ద్వికక్షికం, పీఠసంయోజితం అంతర్ముఖం,

అండకోశం :
ద్విఫలదళ సంయుక్తం, అండాశయం ఊర్ధ్వం, సాధారణంగా ద్విబిలయుతం, కాప్సికమ్ ఏకబిలయుతం, ఉబ్బిన అండాన్యాసస్థానంపై అనేక అండాలు స్తంభ అండన్యాసంలో అమరి ఉంటాయి. అగ్రకీలం, కీలాగ్రం శీర్షాకారం. 45° కోణంలో మెలితిరిగి ఉంటాయి. దీనివల్ల అండాశయం ఏటవాలుగా ఉన్నట్లు అనిపిస్తుంది.

AP Inter 1st Year Botany Study Material Chapter 8 ఆవృతబీజాల వర్గీకరణ శాస్త్రం 7

పరాగ సంపర్కం :
పుష్పాలు పుంభాగ ప్రథమోత్పత్తి చూపిస్తాయి కొన్ని సొలానమ్ జాతులలో స్త్రీ భాగ ప్రథమోత్పత్తి కనిపిస్తుంది. కీటక పరాగ సంపర్కం ద్వారా పరపరాగ సంపర్కం జరుగుతుంది.

ఫలము :
ఎక్కువ మృదుఫలం (కాప్సికమ్, సొలానమ్, లైకోపర్సికాన్) దతూర, నికోటియానాలలో పటభేదక గుళిక ఉంటుంది.

విత్తనం : విత్తనాలు అంకురచ్ఛదయుతం, బీజదళాలు రెండు.

AP Inter 1st Year Botany Study Material Chapter 8 ఆవృతబీజాల వర్గీకరణ శాస్త్రం

ప్రశ్న 3.
లిలియేసి కుటుంబం గురించి తెలపండి.
జవాబు:
శాఖీయ లక్షణాలు :
ఆవాసం :
ఈ కుటుంబంలో మధ్యరకం మొక్కలు (ఆలియమ్, లిల్లియమ్) ఎడారి మొక్కలు (ఆస్పరాగస్, ఆలో) ఉంటాయి.

ఆకృతి :
ఎక్కువగా బహువార్షిక గుల్మాలు, డ్రసీనా, యుక్కా, అలో వంటి ప్రజాతులలో పొదలు, వృక్షాలుగా పెరిగే జాతులు ఉంటాయి. కొన్ని బలహీనంగా ఉండి ఎగబ్రాకే మొక్కలు (స్మైలాక్స్) కూడా ఉంటాయి.

వేరు వ్యవస్థ :
అబ్బురపు వేళ్ళు ఉంటాయి. ఆస్పరాగస్లో దుంపవేళ్ళు గుత్తులుగా (Fasiculated) ఉంటాయి.

కాండం :
అనేక జాతులలో కాండం బహు వార్షిక భూగర్భ కాండం. అది లశునంగా గాని (సిల్లా, ఆలియమ్, లిల్లియమ్), కొమ్ముగా గాని (గ్లోరియోసా లేదా కందంగా గాని (కాల్చికమ్) ఉండవచ్చు. గ్లోరియోసా, స్మైలాక్స్ వంటి మొక్కలలో నులి తీగలతో ఎగబ్రాకే బలహీన కాండం ఉంటుంది. ఎడారి మొక్కలైన ఆస్పరాగస్, రస్కస్లలో కాండం క్లాడోఫిల్లుగా రూపాంతరం చెందుతుంది.

పత్రం :
మూల సంబంధంగా గాని (ఆలియమ్, లిలియమ్) ప్రకాండ సంబంధంగాగాని(స్మైలాక్స్, గ్లోరియోసా) ఉంటాయి. పత్ర విన్యాసం సాధారణంగా ఏకాంతరంగా (గ్లోరియోసా పత్ర పుచ్ఛాలు ఉండవచ్చు లేదా ఉండకపోవచ్చు పత్రాలు వృంతయుతం, సరళపత్రాలు, సమాంతర ఈనెల వ్యాపనం, స్మైలాక్స్లో జాలాకార ఈనెల వ్యాపనం ఉంటుంది.

పుష్ప లక్షణాలు :
పుష్ప విన్యాసం :
ముఖ్యంగా అనిశ్చిత పుష్పవిన్యాసం ఉంటుంది. పుష్పవిన్యాసం, అగ్రస్థంగా గాని, గ్రీవస్థంగా గాని ఏర్పడుతుంది సామాన్య అనిశ్చితం (ఆస్పరాగస్) గా గాని గుచ్చంగా గాని (ఆలియమ్, స్మైలాక్స్) ఉంటుంది

పుష్పం :
సాధారణంగా పుష్పాలు, పుచ్చసహితం, లఘు పుచ్చరహితం, వృంతయుతం, సౌష్టవ యుతం, సంపూర్ణం, ద్విలింగకం సమపరిపత్రయుతం, త్రిభాగయుతం, అండకోశాధస్థితం, స్మైలాక్స్, రస్కస్లలో ఏకలింగక పుష్పాలుంటాయి.

పరిపత్రావళి :
పరిపత్రాలు ఆరు, వలయానికి మూడు చొప్పున రెండు వలయాలలో ఉంటాయి. అసంయుక్తంగా గాని (ఆలియమ్) సంయుక్తంగా గాని (ఆస్పరాగస్) ఉంటాయి. ఇవి ఆకర్షణ పత్రాలలాగే ఉంటాయి. వెలుపలి వలయంలోని ” చేరి పరిపత్రంలో పూర్వాంతంలో ఉంటుంది. లోపలి వలయంలోని బేసి పరిపత్రం పరాంతంలో ఉంటుంది. కవాటయుత పుష్పరచన.

కేసరావళి :
కేసరాలు ఆరు, వలయానికి మూడు చొప్పున రెండు వలయాల్లో ఉంటాయి. స్వేచ్ఛగా గాని, పరిపత్రో పరిస్థితం (epiphyllous) గాగాని ఉండవచ్చు. (ఆస్పరాగస్) పరాగకోశాలు ద్వికక్షికం, పీఠ సంయోజితం, అంతర్ముఖం, నిలువు స్పోటనం.

అండకోశం :
త్రిఫలదళ సంయుక్త అండకోశం, అండాశయం ఊర్ధ్వం, త్రిబిలయుతం, అనేక అండాలు స్తంభ అండాన్యాసంపై అమరి ఉంటాయి. అగ్రకీలం సామాన్యం, కురచగా ఉంటుంది. కీలాగ్రం శీర్షాకారం లేదా మూడుగా చీలి ఉంటుంది.

AP Inter 1st Year Botany Study Material Chapter 8 ఆవృతబీజాల వర్గీకరణ శాస్త్రం 8

పరాగ సంపర్కం :
కీటక పరాగ సంపర్కం. పుష్పాల్లో పుంభాగ ప్రథమోత్పత్తి వల్ల గాని (ఆలియమ్) స్త్రీ భాగ ప్రథమోత్పత్తి (కాల్చికమ్) హెర్కోగమి వల్లగాని (గ్లోరియోసా) ఆత్మపరాగ సంపర్కం నిరోధించబడుతుంది.

ఫలం :
మృదు ఫలం గాని (ఆస్పరాగస్, స్మైలాక్స్) కక్ష్మా విదారక గుళికగాని (లిలియమ్) పటవిదారక గుళిక దాని (గ్లోరియోసా) ఉండవచ్చు.

విత్తనం :
ఏకబీజ దళయుతం, అంకురచ్ఛద సహితం, పిండం నిటారుగా గాని, ఒక్కొక్కసారి వంపు తిరిగి గాని ఉంటుంది. ఆలియమ్లో బహు పిండత (polyembryony) ఉంటుంది.
AP Inter 1st Year Botany Study Material Chapter 8 ఆవృతబీజాల వర్గీకరణ శాస్త్రం 9

ప్రశ్న 4.
మొక్కలను వర్గీకరించడానికి అవసరమైన లక్షణాలను వ్రాయండి. వాటిని క్లుప్తంగా వివరించండి.
జవాబు:
శాఖీయ లక్షణాలు :
AP Inter 1st Year Botany Study Material Chapter 8 ఆవృతబీజాల వర్గీకరణ శాస్త్రం 10
పీచువేరు వ్యవస్థ : కాండం పీఠభాగం నుండి వేర్లు గుంపుగా ఏర్పడతాయి.
ఉదా : ఏకదళబీజాలు

కాండము : వాయుగతము / భూగతము, నిటారుగా లేక సాగిలపడి పెరిగేవి, నులితీగలతో ఎగబాకేవి, కొక్కెములతో ఎగబాకే స్ట్రాగ్లర్స్, లయేనులు (దృఢంగా ఉండి ఎగబాకేవి) శాఖాయుతం లేక శాఖారహితము, ఆకుపచ్చ, గోధుమ లేక నలుపు వర్ణము.

పత్రము : ఉబ్బిన లేదా ఆచ్ఛాదన (కాండంను కప్పి ఉంచుతుంది)

పత్రపీఠం : పుచ్ఛసహిత – పుచ్చములు కలపత్రం

పత్రపుచ్చాలు : పుచ్ఛ సహిత – పుచ్చము లేని పత్రం

పత్రవృంతం : వృంతసహిత – వృంతం కల పత్రం
వృంతరహిత – వృంతం లేని పత్రం

పత్ర దళం : ఆకారము – అండాకారం / రేఖాకారము / మూత్రపిండాకారం, హృదయాకారము, బోలుగా, పొడవుగా ఉంటుంది.

ఈనెలవ్యాపనం : జాలాకార మధ్య ఈనె, పార్శ్వ ఈనెలు, చిరు ఈనెలు వల వలె ఉంటాయి – ద్విదళ బీజాలు

సమాంతర : మధ్య ఈనె నుండి వచ్చే పార్శ్వపు ఈనెలు అన్ని సమాంతరంగా ఉంటాయి. ఉదా : ఏకదళబీజాలు

పత్రరకము : సరళము – విభజన చెందని పత్రదళం కలది.
సంయుక్తము – పత్రదళం విభజనచెంది పత్రకాలుగా మారుతుంది.

పత్ర విన్యాసము : ఏకాంతర – ప్రతి కనుపు వద్ద 1 పత్రం ఏర్పడును
అభిముఖ – ప్రతికనుపు వద్ద 2 పత్రాలు ఏర్పడును
చక్రీయ – ప్రతి కనుపు వద్ద 2కన్నా ఎక్కువ పత్రాలు ఏర్పడి వలయాకారంలో ఉంటాయి.
AP Inter 1st Year Botany Study Material Chapter 8 ఆవృతబీజాల వర్గీకరణ శాస్త్రం 11

సంపూర్ణ : 4 పుష్ప భాగాలు కల పుష్పము

అసంపూర్ణ : ఏదేని ఒక పుష్ప భాగం లోపించిన పుష్పము.

అచక్రీయ : పుష్ప భాగాలు సర్పిలాకారంలో అమరి ఉంటాయి.

చక్రీయ : పుష్ప భాగాలు వలయాకారంలో అమరి ఉంటాయి.

అర్థచక్రీయ : K, C లు వలయాకారంలో, A మరియు G లు సర్పిలాకారంలో ఉంటాయి.

లైంగికత : ద్విలింగ : రెండు లైంగిక అవయవాలు (A, G) ఉండుట ఏకలింగ, పురుష A మాత్రమే ఉన్న పుష్పము.
ఏకలింగ స్త్రీ – G మాత్రమే వున్న పుష్పము

అండకోశాధస్థితి : ఊర్ధ్వ అండాశయము

పర్యండకోశ : అర్ధ ఊర్ధ్వ అండాశయము
అండకోశాపరిస్థిత – నిమ్న అండాశయము

సంఖ్యాపరంగా : త్రిభాగయుత : ప్రతి వలయంలో 3 భాగాలు

చతుర్భాగయుత : ప్రతి వలయంలో 4 భాగాలు

పంచభాగయుత : ప్రతి వలయంలో 5 భాగాలు

సౌష్టవము : సౌష్టవయుతం, పాక్షిక సౌష్టవయుతము

రక్షక పత్రావళి : 3/ 4/5 అసంయుక్తము/సంయుక్తము, కవాటయుత పుష్పరచన / మెలితిరిగిన పుష్ప రచన

ఆకర్షణ పత్రావళి : సంఖ్య, అసంయుక్తమా / సంయుక్తమా, కవాటయుత/మెలితిరిగిన పుష్పరచన

కేసరావళి : 4/5/10/ అనేకము, ఏకబంధకము (ఒక కట్టగా ఉంటాయి)

ద్విబందకము : 2 సమూహాలుగా ఉంటాయి.

బహుబందకం : 2 కన్నా ఎక్కువ సమూహాలుగా ఉంటాయి.

ద్వి కక్ష్యయుత : 2 లంబికలు కల పరాగకోశము

ఏకకక్ష్యయుత : 1 లంబిక కల పరాగకోశము

పీఠసంయోజిత : కేసరదండం, పరాగకోశ పీఠభాగంలో అతుక్కుని ఉంటుంది.

పృష్ట సంయోజిత : కేసర దండం పరాగకోశము ప్రక్కన అతుక్కుని ఉంటుంది.
నిలువు స్ఫోటనము (నిలువుగా పగులుట) / అడ్డుస్ఫోటనం అడ్డంగా పగులుతాయి / రంధ్ర స్ఫోటనం అగ్రభాగంలో ఉన్న రంధ్రం ద్వారా పరాగరేణువులు విడుదలవుతాయి.

అండకోశము ఏకఫలదళయుత : అండాశయంలో ఒక ఫలదళం ఉంటుంది.

ద్విఫలదళయుత : అండాశయంలో 2 ఫలదళాలు ఉంటాయి.

త్రి ఫలదళయుత : అండాశయంలో 3 ఫలదళాలు ఉంటాయి. చతుర్భుజ ఫలదళయుత : అండాశయంలో 4 ఫలదళాలు ఉంటాయి. పంచ ఫలదళయుత : అండాశయంలో 5 ఫలదళాలు ఉంటాయి.

బహు ఫలదళయుత : అండాశయంలో 5 కన్నా ఎక్కువ ఫలదళాలు ఉంటాయి. సంయుక్తము : అన్ని ఫలదళాలు కలసి ఉంటాయి.

అసంయుక్తము : అన్ని ఫలదళాలు విడిగా ఉంటాయి.

ఊర్ధ్వ అండాశయము : K, C, A లు అండాశయం కిందనుండి ఏర్పడతాయి.

అర్ధఊర్ధ్వ అండాశయము : K, C, A లు అండాశయం మధ్య నుండి ఏర్పడతాయి.

నిమ్న అండాశయము : K, C, A లు అండాశయం పై నుండి ఏర్పడతాయి.

అండాన్యాసము : ఉపాంత : అండాలు అండాశయ అంచులలో ఉంటాయి.

అక్షయ : అండాలు అండాశయ మధ్యలో ఉంటాయి.

పీఠ : అండం అండాశయ పీఠంలో ఉంటాయి.

కీలము : కోనకీలము : అండాశయం పై నుంచి ఏర్పడును

పార్శ్వకీలము : అండాశయం ప్రక్కనుంచి ఏర్పడును

కీలాగ్రం : గుండ్రము / ద్విభాజితము / కేశయుతము

AP Inter 1st Year Botany Study Material Chapter 8 ఆవృతబీజాల వర్గీకరణ శాస్త్రం

ప్రశ్న 5.
ఒక నమూనా పుష్పించే మొక్కను వర్గీకరణ శాస్త్ర దృష్టితో (Perspective) వివరించండి.
జవాబు:
AP Inter 1st Year Botany Study Material Chapter 8 ఆవృతబీజాల వర్గీకరణ శాస్త్రం 12
మొక్కను వర్ణించేటప్పుడు ఆకృతి, ఆవాసము, శాకీయ లక్షణాలు, పుష్ప లక్షణాలు, తర్వాత ఫలంను వర్ణిస్తారు. మొక్క వివిధ భాగాలను వర్ణించిన తర్వాత పుష్పచిత్రం, పుష్ప సమీకరణం ఇవ్వబడుతుంది. పుష్పభాగాలను కొన్ని సంకేతాల ద్వారా పుష్పసమీకరణంలో చూపుతారు.

పుష్ప సంకేతంలో Br అనగా పుచ్చ సహితము, Ebr అనగా పుచ్చ రహితము, Brl లఘు పుచ్ఛ సహితము, Ebrl లఘు పుచ్ఛ రహితము, © – సౌష్టవయుతము, % – పాక్షికసౌష్టవయుతము, రే – పురుష పుష్పము, స్త్రీ – పుష్పము, ధే – ద్విలింగ పుష్పము, K- రక్షక పత్రావళి, C- ఆకర్షణ పత్రావళి, P- పరిపత్రము, A- కేసరావళి, G- అండకోశం, G – ఊర్ధ్వ అండాశయము, G – అర్థ ఊర్థ్వ అండాశయము – G నిమ్న అండాశయము అని సూచన పుష్పభాగాల సంఖ్య, సంయుక్తమా లేక అసంయుక్తమా, సంసంజనము లేక అసంజనమా, కూడా పుష్ప సంకేతంలో సూచిస్తారు.

పుష్ప చిత్రంలో ప్రధాన అక్షం వైపు ఉన్న పుష్ప భాగాన్ని పరాంతభాగం అని, ప్రధాన అక్షాన్ని ఒక చుక్కతో పుష్ప చిత్రంపైన సూచిస్తారు. రక్షక పత్రావళి, ఆకర్షణ పత్రావళి, కేసరావళి, అండకోశాలను ఏక కేంద్ర వలయాలుగా గీసి, రక్షక పత్రాలను వెలుపల వలయంలోను, మధ్యలో అండాశయం అడ్డుకోత పటం ద్వారా సూచిస్తారు. పుష్ప పుచ్ఛం, పుష్పం మొక్క పూర్వాంత భాగాన్ని సూచిస్తుంది. దీనిని పుష్ప చిత్రానికి పీఠం వైపు సూచిస్తారు.

ప్రశ్న 6.
బెంథామ్ మరియు హుకర్ల మొక్కల వర్గీకరణ గురించి వ్రాయండి.
జవాబు:
బెంథామ్ మరియు హుకర్లు పుష్పించే మొక్కలను డైకాటిలిడనే (ద్విదళబీజాలు), జిమ్నో స్పెర్మే (వివృత బీజాలు), మోనోకాటిలిడనే (ఏకదళ బీజాలు) అను 3 తరగతులగా విభజించారు. డైకాటిలిడనేను పొలిపెటాలే, గామోపెటాలే, మోనోక్లామిడే అనే 3 ఉపతరగతులుగాను, పాలీపెటాలేను థలామిఫ్లోరే 6 క్రమాలతో, డిసిప్లోరే 4 క్రమాలతో, కాలిసిస్లోరే 5 క్రమాలతో విభజించారు. గామోపెటాలేను ఇన్ఫెరే 3 క్రమాలతోను హెటిరోమిరే (3 క్రమాలతో) బైకార్పల్లేటె – 4 క్రమాలతోను మూడు శ్రేణులుగాను, మోనోక్లామిడేను 8 శ్రేణులుగాను విభజించారు.

మోనోకాటిలిడనేను ఏడు శ్రేణులుగాను విభజించారు. పుష్పించు మొక్కలన్నీ ఇప్పుడు కుటుంబాలుగా వ్యవహరించబడుతున్న 202 సహజ క్రమాలుగా సముదీకరించబడినాయి. వీటిలో 165 ద్విదళబీజాలుగాను, 3 వివృత బీజాలుగాను, 34 ఏకదళ బీజాలకు చెందుతాయి.

ప్రశ్న 7.
వర్గీకరణ శాస్త్రము అంటే ఏమిటి? మొక్కల వివిధ వర్గీకరణ రకాల గురించి సంక్షిప్తంగా వివరించండి.
జవాబు:
లక్షణాలను వర్ణించుట, గుర్తించుట, నామీకరణం, వర్గీకరణ అనే అంశాలను గురించి చదివే శాస్త్రంను వర్గీకరణ శాస్త్రం అంటారు. వర్గీకరణలు 3 రకాలు.
1) కృత్రిమ వర్గీకరణ వ్యవస్థలు (Artificial systems of classification) :
ఇవి సహజ సంబంధాలతో నిమిత్తం లేకుండా బాహ్య స్వరూపం, పోషణ విధానం వంటి సులువుగా పోల్చగలిగిన కొన్ని లక్షణాల ఆధారంగా చేసిన వర్గీకరణ వ్యవస్థలు.
ఉదా : i) మొక్కలను బాహ్య స్వరూపం ఆధారంగా గుల్మాలు, పొదలు, వృక్షాలుగా తన హిస్టోరియా ప్లాంటారమ్ అనే పుస్తకంలో ధియోఫ్రాస్టస్ చేసిన వర్గీకరణ.
ii) లిన్నేయస్ ప్రతిపాదించిన లైంగిక వర్గీకరణ.

2) సహజ వర్గీకరణ వ్యవస్థలు (Natural systems of classification) :
ఇవి వీలైనన్ని ఎక్కువ బాహ్య లక్షణాలను ఆధారంగా చేసుకొని, మొక్కలలో గల సహజ సంబంధాలకు ప్రాధాన్యతనిస్తూ చేసిన వర్గీకరణ వ్యవస్థలు
ఉదా : డీజస్సు (De Jussieu), డి కండోల్ (de Candolle), బెంథామ్-హూకర్ల (Bentham & Hooker) వర్గీకరణ.

3) వర్గ వికాసవ్యవస్థలు (Plylogenetic system) :
మొక్కలలోని పరిణామ క్రమ ప్రవృత్తులను పరిగణలోనికి తీసుకుని చేసిన వర్గీకరణ. ఈ వ్యవస్థలో ఆదిమ లక్షణాలు, పరిణతి చెందిన లక్షణాలు గుర్తించబడినాయి. ఒక టాక్సాన్ స్థాయిని పరిగణించేటప్పుడు అన్ని లక్షణాలను విపులంగా పరిగణలోనికి తీసుకుంటారు. “ది నేచురలిఖెన్ ఫ్లాంజన్ ఫెమిలియన్” గ్రంథంలో ఎంగ్లర్ & ప్రాంటల్ ప్రతిపాదించిన వ్యవస్థ. ఫామిలీస్ ఆఫ్ ప్లవరింగ్ ప్లాంట్స్ పుస్తకంలో హబిన్సన్ (1954) ప్రతిపాదించిన వ్యవస్థలు ఉదాహరణలు. ఆధునికమైన వర్గవికాస వ్యవస్థగా ఆంజియోస్పెర్మిక్ ఫైలోజెనిటిక్ గ్రూప్ (APG) ను చెప్పవచ్చు.

AP Inter 1st Year Botany Study Material Chapter 7 పుష్పించే మొక్కలలో లైంగిక ప్రత్యుత్పత్తి

Andhra Pradesh BIEAP AP Inter 1st Year Botany Study Material 7th Lesson పుష్పించే మొక్కలలో లైంగిక ప్రత్యుత్పత్తి Textbook Questions and Answers.

AP Inter 1st Year Botany Study Material 7th Lesson పుష్పించే మొక్కలలో లైంగిక ప్రత్యుత్పత్తి

అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
పిండకోశంలోని స్త్రీ బీజకణ పరికరంలోని కణాలేవి?
జవాబు:

  1. స్త్రీ బీజ కణము,
  2. సహకణాలు

ప్రశ్న 2.
పరాగరేణువు యొక్క అవిరుద్ధ స్థితిని తెలుసుకొనే అండకోశ భాగాన్ని తెలపండి.
జవాబు:
కీలాగ్రము

ప్రశ్న 3.
బీజదళాలు, అండాంతఃకణజాలం నిర్వహించే ఉమ్మడి విధులను పేర్కొనండి.
జవాబు:
ఇవి కొంతవరకు రసభరితంగా ఉండి, ఆహార పదార్థాలను నిల్వ ఉంచుతాయి. ఇవి అభివృద్ధి చెందే – పిండంనకు పోషణకు ఉపయోగపడతాయి.

ప్రశ్న 4.
అండకోశంలోని ఏ భాగాలు ఫలాలు? విత్తనాలుగా అభివృద్ధి చెందుతాయి?
జవాబు:
అండాశయము – ఫలంగా, అండాలు – విత్తనాలుగా మారతాయి.

ప్రశ్న 5.
బహి పిండతలో, ఒక పిండం సహాయకణాల నుంచి, మరొకటి అండాంతః కణజాలం నుంచి ఏర్పడితే, దీనిలో ఏది ఏకస్థితికం, ఏది ద్వయస్థితికం?
జవాబు:
సహాయ కణాల నుంచి ఏర్పడే పిండం ఏకస్థితికము. అండాంతఃకణజాలం నుంచి ఏర్పడే పిండం ద్వయస్థితికము.

AP Inter 1st Year Botany Study Material Chapter 7 పుష్పించే మొక్కలలో లైంగిక ప్రత్యుత్పత్తి

ప్రశ్న 6.
ఫలదీకరణ జరగకుండా, అసంయోగజన్య పిండకోశం ఒక ద్వయస్థితిక పిండాన్ని ఏర్పరచగలదా? మీ సమాధానం అవును అయితే వివరించండి? ఎలా.
జవాబు:
ఫలదీకరణ జరగకుండా, అంసయోగజన్య పిండకోశం ఒక ద్వయస్థితిక పిండాన్ని ఏర్పరచగలదు. దీనివల్ల ఏర్పడిన పిండాలు జన్యురీత్యా జనకులను పోలి ఉంటాయి. ఇవి ఫలదీకరణం చెందని స్త్రీ బీజం నుండి లేక ప్రత్యక్షంగా అండాంతఃకణజాలం నుండి లేదా అండకవచాల నుండి గాని ఏర్పడతాయి.

ప్రశ్న 7.
మూడు కణాల దశలో విడుదలయ్యే పరాగరేణువులో కనిపించే మూడు కణాలు ఏవి?
జవాబు:
2 పురుష సంయోగబీజాలు, 1 శాఖీయ కణము

ప్రశ్న 8.
స్వయం విరుద్ధత (Self – incompatibility) అంటే ఏమిటి?
జవాబు:
పరాగరేణువులు అదే పుష్పంలోని కీలాగ్రంపై పడినప్పుడు మొలకెత్తబడకుండా ఉండుటను “స్వయం విరుద్ధత” అందురు.

ప్రశ్న 9.
స్వయం విరుద్ధత చూపే మొక్కలలో ఏ రకమైన పరాగ సంపర్కం జరుగుతుంది?
జవాబు:
అబ్యూటిరాన్ – లో పరపరాగ సంపర్కము.

ప్రశ్న 10.
8-కేంద్రకాలు, 7 కణాలతో ఉన్న పక్వ పిండకోశ పటాన్ని గీసి, ఈ కింద పేర్కొన్న వాటిని గుర్తించండి. ప్రతిపాదకణాలు, సహాయ కణాలు స్త్రీ బీజకణం, కేంద్రకకణం, ధ్రువ కేంద్రకాలు.
జవాబు:
AP Inter 1st Year Botany Study Material Chapter 7 పుష్పించే మొక్కలలో లైంగిక ప్రత్యుత్పత్తి 1

ప్రశ్న 11.
ఒక ఫలదీకరణ చెందిన అండంలో త్రయస్థితిక కణజాలం ఏది? ఈ త్రయస్థితిక స్థితి అనేది ఏ విధంగా సాధించబడింది?
జవాబు:
అంకురచ్ఛదము పిండకోశంలో 2వ పురుషబీజము ద్వయస్థితిక ద్వితీయ కేంద్రకంతో కలసి ప్రాథమిక అంకురచ్ఛద కేంద్రకము (3x) ఏర్పడుతుంది.

ప్రశ్న 12.
పరాగ సంపర్కం, ఫలదీకరణ అనేవి అసంయోగ జననంలో అవసరమా? కారణాలు తెల్పండి.
జవాబు:
అవసరం లేదు. ఆస్టరేసిలోని కొన్ని జాతులు, గడ్డిజాతులు ప్రత్యేక విధానం ద్వారా ఫలదీకరణ లేకుండా విత్తనాలను ఏర్పరుస్తాయి. ద్వయస్థితిక స్త్రీ బీజకణం క్షయకరణ విభజన చెందకుండా ఫలదీకరణ జరగకుండా పిండంగా అభివృద్ధి చెందుతుంది.

ప్రశ్న 13.
నీటి మొక్కలలో పరాగ సంపర్కం ఏవిధంగా జరుగుతుంది?
జవాబు:
వాలిన్నేరియాలో పరాగ సంపర్కం నీటి ఉపరితలంపై జరుగుతుంది. (ఊర్ధ్వజల పరాగ సంపర్కం). జోస్టర్లో పరాగ సంపర్కం నీటి లోపల జరుగుతుంది. (అథోః జల పరాగ సంపర్కం) గుర్రపుడెక్క నీటి కలువలలో కీటకాల ద్వారా లేదా గాలి ద్వారా పరాగ సంపర్కం జరుగుతుంది.

ప్రశ్న 14.
ఆనృత బీజ మొక్కల పుప్పొడి రేణువు ఏర్పరిచే రెండు పురుష కేంద్రకాల విధులను తెలండి.
జవాబు:
పుప్పొడి రేణువు నుండి ఏర్పడే 2 పురుషకేంద్రకాలలో, 1 స్త్రీబీజ కణంతో కలిసి సంయుక్త బీజంను ఏర్పరుస్తుంది. 2వ పురుష కేంద్రకము ద్వయస్థితిక ద్వితీయ కేంద్రకంతో కలసి ప్రాథమిక అంకురచ్ఛద కేంద్రకము ఏర్పడును.

ప్రశ్న 15.
ఆవృత బీజ పుష్పంలోని ఏయే భాగాలలో పురుష, స్త్రీ సంయోగ బీజదాలు అభివృద్ధి జరుగుతుంది? వాటి పేర్లను తెలపండి.
జవాబు:
పురుష సంయోగ బీజదము – పరాగకోశంను, స్త్రీ సంయోగ బీజదము అండంలోను అభివృద్ధి చెందుతాయి. సూక్ష్మ సిద్ధబీజం పురుష సంయోగబీజంగాను, స్థూలసిద్ధబీజం స్త్రీ సంయోగబీజదంగాను మారుతాయి.

AP Inter 1st Year Botany Study Material Chapter 7 పుష్పించే మొక్కలలో లైంగిక ప్రత్యుత్పత్తి

ప్రశ్న 16.
ఏక సిద్ధ బీజవర్థకాల (monosporic) స్త్రీ సంయోగ బీజద అభివృద్ధి అంటే ఏమిటి?
జవాబు:
అభివృద్ధి ఒకే ఒక సిద్ధబీజం నుండి ఏర్పడితే దాని ఏకసిద్ధ బీజ వర్థక స్త్రీ సంయోగబీజద అభివృద్ధి అందురు.

ప్రశ్న 17.
ఆత్మ పరాగ సంపర్కం నివారణకు పుష్పాలు ఏర్పరుచుకొన్న రెండు ముఖ్యమైన అనుకూలన విధానాలను తెలపండి.
జవాబు:
హెర్కొగమీ :
కేసరాలు, కీలాగ్రాలు వేరు వేరు ఎత్తులలో ఉంటాయి. దీనివల్ల పరపరాగ సంపర్కం జరుగుతుంది.
ఉదా : మందార.

భిన్న కీలత :
ఒకే మొక్కపై ఉన్న పుష్పాలలోని కీలాలు వేరు వేరు ఎత్తులలో ఉంటాయి. దీని వల్ల ఆత్మ పరాగసంపర్కం జరుగును.

ప్రశ్న 18.
ఫలదీకరణ చెందిన అండంలో, సంయుక్త బీజం ఎందువల్ల కొంతకాలం సుప్తావస్థ స్థితిలో ఉంటుంది?
జవాబు:
అభివృద్ధి చెందే పిండానికి పోషణ కొరకు కొంత అంకురచ్ఛిదం ఏర్పడేంతవరకు సంయుక్త బీజం సుప్తావస్థలో ఉంటుంది. కొన్ని శిలీంధ్రాలు, శైవలాలలో సంయుక్త బీజం మందమైన కవచంను ఏర్పరుచుకొని, ప్రతికూల పరిస్థితులను తట్టుకోవడానికి సుప్తావస్థలో ఉంటుంది. పిండంలోని సాధారణ జీవక్రియా సంబంధ చర్యలు మొదలవ్వగానే తగిన తేమ, ఆక్సిజన్ ఉన్నప్పుడు విత్తనాలు మొలకెత్తుతాయి.

ప్రశ్న 19.
వృద్ధికారక పదార్థాల్ని ఉపయోగించి ప్రేరిత అనిషేక ఫలమును ప్రోత్సహించిన, మీరు ఏ ఫలాలను ఈ ప్రేరిత అనిషేక ఫలనము కొరకు ఎంచుకొంటారు? ఎందువల్ల?
జవాబు:
అరటి, ద్రాక్షా, వీటిలో ఎక్కువ గుజ్జు ఉండుట వల్ల జ్యూస్ తయారీ పరిశ్రమలలో ఉపయోగిస్తారు.

ప్రశ్న 20.
స్కూటెల్లమ్ అంటే ఏమిటి? ఏరకం విత్తనాలలో అది ఉంటుంది?
జవాబు:
గడ్డిజాతి కుటుంబంలోని పిండంలో పెద్దదిగా డాలు ఆకారంలో ఉండే ఒకే బీజదళాన్ని స్కూటెల్లమ్ అంటారు. ఇది ఏకదళ బీజ విత్తనాలలో ఉంటుంది.

ప్రశ్న 21.
అంకురచ్ఛదయుతం, అంకురచ్ఛదరహిత విత్తనాలను సోదాహరణంగా నిర్వచించండి.
జవాబు:

అంకురచ్ఛదయుత విత్తనాలుఅంకురచ్చదరహిత విత్తనాలు
పరిపక్వమైన విత్తనంలో కోంతి అంకురచ్ఛిదం మిగిలి ఉంటుంది. ఆ విత్తనాలను అంకురచ్ఛదయుత విత్తనాలు అంటారు.
ఉదా : ఆముదం, కొబ్బరి
విత్తనం పరిపక్వం చెందేముందే అభివృద్ధి చెందుతున్న పిండం అంకురచ్ఛధాన్ని పూర్తిగా వినియోగించుకోవచ్చు. ఆ విత్తనాలను అంకురచ్ఛద రహిత విత్తనాలు అంటారు.
ఉదా : బఠాని, వేరుశనగ, చిక్కుడు.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ఆత్మ పరాగ సంపర్కం (ఆత్మ ఫలదీకరణ) నిరోధించడానికి ఒక వికసించే ద్విలింగ పుష్పం ఏర్పరుచుకున్న అనుకూలనాలలో మూడింటిని గురించి వ్రాయండి.
జవాబు:
1) భిన్నకాలిక పక్వత :
కొన్ని జాతులలో పుప్పొడి విడుదల కీలాగ్రం దాన్ని స్వీకరించుట సమకాలికంగా ఉండదు. సూర్య కాంతం మొక్కలో కీలాగ్రం పక్వదశకు చేరక ముందే పుప్పొడి విడుదల కావడం (పుంభాగ ప్రథమోత్పత్తి) లేదా దతూరలో కీలాగ్రం పక్వదశకు చేరినా పుప్పొడి విడుదల కాకపోవడం (స్త్రీ భాగ ప్రథమోత్పత్తి) జరుగుతుంది.

2) హెర్కోగమి :
ఒక పుష్పంలోని పరాగకోశాలు, కీలాగ్రము వేరు వేరు స్థానాలలో (మందార) లేదా వేరు వేరు దిశలలో (గ్లోరియోస) ఉండుట వల్ల ఆత్మ పరాగ సంపర్కం జరుగుతుంది.

3) ఆత్మ వంధ్యత్వము :
ఒక పుష్పంలోని పుప్పొడి అదే పుష్పంలోని కీలాగ్రం పై పడినప్పుడు అది మొలకెత్తబడకుండా లేదా పరాగనాళాలు పెరగకుండా అండాలలో ఫలదీకరణ నిరోధించబడును.

AP Inter 1st Year Botany Study Material Chapter 7 పుష్పించే మొక్కలలో లైంగిక ప్రత్యుత్పత్తి

ప్రశ్న 2.
కృత్రిమ సంకరణ పద్ధతిలో ఈ కింది సంభవాలను పరిశీలించడం జరిగింది. సంకరణ పద్ధతిలో పాటించే విధంగా, వీటిని ఒక సరియైన వరుస క్రమంలో అమర్చండి.
ఎ) రీ – బ్యాగింగ్, బి) జనకుల ఎంపిక, సి) బ్యాగింగ్, డి) కీలాగ్రంపై పుప్పొడి చల్చుట, ఇ) విపుం సీకరణ, ఎఫ్) పురుష మొక్క నుండి పుప్పొడిని సేకరించుట.
జవాబు:
ఎ) జనకుల ఎంపిక
బి) విపుంసీకరణ
సి) బ్యాగింగ్
డి) పురుషమొక్క నుండి పుప్పొడిని స్వీకరించుట
ఇ) కీలాగ్రంపై పుప్పొడిని చల్చుట
ఎఫ్) రీ – బ్యాగింగ్.

ప్రశ్న 3.
అండంలోనికి పరాగనాళం ప్రవేశించే వివిధ పద్ధతులను, పటాల సహాయంతో చర్చించండి.
జవాబు:
AP Inter 1st Year Botany Study Material Chapter 7 పుష్పించే మొక్కలలో లైంగిక ప్రత్యుత్పత్తి 2
పరాగనాళం అండాశయం నుంచి అండంలోకి 3 రకాలుగా ప్రవేశిస్తుంది.
1) రంధ్ర సంయోగం :
పరాగనాళం అండంపై భాగంలో ఉన్న అండ ద్వారం ద్వారా అండంలోకి ప్రవేశించడాన్ని “రంధ్ర సంయోగం” అంటారు.
ఉదా : ఒట్టీలియ, హైబిస్కస్.

2) చలజో సంయోగం :
కొన్ని మొక్కలలో పరాగనాళం చలాజా ద్వారా అండంలోకి ప్రవేశిస్తుంది.
ఉదా : కాజురైనా. దీనిని ట్రూబ్ అనే శాస్త్రవేత్త కనిపెట్టారు.

3) మధ్య సంయోగం :
ఒక్కొక్కసారి పరాగనాళం అండకవచం ద్వారా గాని, అండవృంతం ద్వారా గాని అండంలోకి ప్రవేశిస్తుంది. దీనినే మధ్య సంయోగం అంటారు.
ఉదా : కుకుర్బిట.

ప్రశ్న 4.
సూక్ష్మ సిద్ధ బీజ జననం, స్థూల సిద్ధబీజ జననంల మధ్య వ్యత్యాసాన్ని తెలపండి. వీటిలో ఏ రకమైన కణవిభజన జరుగుతుంది? ఈ రెండు సంఘటనలకు చివరగా ఏర్పడే నిర్మాణాలు ఏవి?
జవాబు:

సూక్ష్మ సిద్ధబీజ జననంస్థూల సిద్ధ బీజ జననం
సూక్ష్మ సిద్ధబీజ మాతృకణం క్షయకరణ విభజన చెంది సూక్ష్మసిద్ధ బీజ చతుష్కాలు ఏర్పడే ప్రక్రియను సూక్ష్మ సిద్ధ బీజక జననం అంటారు.స్థూల సిద్ధ బీజమాతృ కణము క్షయకరణ విభజన చెంది స్థూల సిద్ధబీజాలను ఏర్పరిచే ప్రక్రియను స్థూల సిద్ధబీజ జననం అంటారు.

పై రెండు సంఘటనలలో క్షయకరణ విభజన జరుగుతుంది. ఈ సంఘటనల చివర. సూక్ష్మ, స్థూల సిద్ధబీజములు ఏర్పడతాయి.

ప్రశ్న 5.
బ్యాగింగ్ పద్ధతి అంటే ఏమిటి? మొక్కల ప్రజనన కార్యక్రమంలో ఈ విధానం ఉపయోగాన్ని తెలపండి?
జవాబు:
విపుంసీకరణ చేసిన పుష్పాలను సరియైన పరిమాణంలో ఉన్న బట్టర్పేపర్తో తయారయిన సంచులతో మూసి వేయుటను బాగింగ్ (bagging) అంటారు.

కృత్రిమ ప్రజనన కార్యక్రమంలో స్త్రీ జనక మొక్కను ఎన్నుకొని దీనిలో ద్విలింగ పుష్పాలను మొగ్గదశలో ఉన్నప్పుడు పరాగ కోశాలను శ్రావణంతో తీసివేయుటను విపుంసీకరణ అంటారు. వెంటనే విపుంసీకరణ చేసిన పుష్పాలను బట్టర్పేపర్తో తయారుచేసిన సంచులతో మూసివేయాలి. దీనిని బాగింగ్ అంటారు. దీనివల్ల అవాంఛనీయ పరాగ కేశవులు కీలాగ్రంను చేరకుండా నిరోధించవచ్చు.

ప్రశ్న 6.
త్రిసంయోగం అంటే ఏమిటి? ఇది ఎక్కడ, ఎలా జరుగుతుంది? ఈ త్రిసంయోగంలో పాల్గొనే కేంద్రకాల పేర్లను పేర్కొనండి.
జవాబు:
పిండకోశంలోనికి ప్రవేశించిన 2 పురుషబీజాలలో, రెండవ పురుష బీజము, ద్వితీయ కేంద్రకము (2 ధృవ కేంద్రకాలు కలయిక) తో కలిసి ప్రాథమిక అంకురచ్చ కేంద్రకంను ఏర్పరుచుటను త్రి సంయోగము అంటారు. ఇది పిండ కోశంలో జరుగుతుంది. దీనిలో పురుషకేంద్రకము. 2 ధృవ కేంద్రకాలు పాల్గొంటాయి.

ప్రశ్న 7.
ఈ క్రింది వాటి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని చూపండి.
a) అధోబీజదళం ఉపరి బీజదళం
b) ప్రాంకుర కంచుకం, మూలాంకుర కంచుకం
c) అండ కవచం, బాహ్యబీజ కవచం (టెస్ట్రా)
d) పరిచ్ఛదం, ఫలకవచం
జవాబు:

a) అథోబీజదళం
పిండాక్షంలో బీజదళాల క్రింద ఉన్న స్థూపాకార భాగంను అథోబీజదళం అంటారు.
ఉపరి బీజదళం
పిండాక్షంలో బీజదళాలకు పైన ఉన్న భాగాన్ని ఉపరి బీజదళము అంటారు.
b) ప్రాంకుర కంచుకం
ఉపరిబీజదళంలోని ఒక ప్రకాండపు మొగ్గ కొన్ని పత్ర ఆద్యాలును కప్పుతూ బోలుగా ఉన్న పత్రం వంట నిర్మాణంను ప్రాకుర కంచుకం అంటారు.
మూలాంకుర కంచుకం
ప్రథమమూలం, వేరు తొడుగును కప్పుతూ ఉన్న విభేదనం చూపని పొరను మూలాంకుర కంచుకం అంటారు.
c) అండకవచం
అండమును కప్పుతూ ఉన్న రక్షణ కవచమును అండకవచం అంటారు.
బాహ్య బీజకవచం (టెస్టా)
ఫలదీకరణ తర్వాత, అండంలోని వెలుపలి అండ కవచము నుండి ఏర్పడేపొరను టెస్టా అంటారు.
d) పరిచ్ఛదం
అండాంతః కణజాలములో మిగిలిన దానిని పరిచ్ఛదం అంటారు. అంటారు.
ఫలకవచం
ఫలమునకు ఉన్న కవచమును ఫలకవచం దీనిలో బాహ్య, మధ్య, అంతర ఫలకవచాలు అంటారు.

AP Inter 1st Year Botany Study Material Chapter 7 పుష్పించే మొక్కలలో లైంగిక ప్రత్యుత్పత్తి

ప్రశ్న 8.
విపుంసీకరణ అంటే ఏమిటి? మొక్కల ప్రజనన కర్త ఎప్పుడు, ఈ పద్ధతిని ఉపయోగిస్తాడు? ఎందువలన?
జవాబు:
తల్లి మొక్కలుగా ఎంచుకున్న మొక్కలపై ఉన్న ద్విలింగ పుష్పాలు మొగ్గదశలో ఉన్నప్పుడు పరాగకోశాలు స్ఫోటనం చెందకముందే వాటిలోని పరాగ కోశాలను శ్రావణం సహాయంతో తీసి వేయుటను విపుంసీకరణ అంటారు.

సంకరణ ప్రయోగాలలో వాంఛనీయమైన పరాగ రేణువులను మాత్రమే పరాగసంపర్కం కోసం ఉపయోగిస్తూ కీలాగ్రాన్ని పంకిల పరిచే అవాంఛనీయ లేదా అవసరం లేని పుప్పొడి రేణువుల నుండి కాపాడటానికి విపుంసీకరణ చేస్తారు.

ప్రశ్న 9.
అసంయోగ జననము అంటే ఏమిటి? దీని ప్రాముఖ్యతను తెలపండి.
జవాబు:
ఫలదీకరణ లేకుండా విత్తనాలు ఏర్పడుటను అసంయోగ జననము అంటారు. ఇది లైంగిక ప్రత్యుత్పత్తిని పోలిన అలైంగిక ప్రత్యుత్పత్తి విధానము. కొన్ని జాతులలో ద్వయస్థితిక స్త్రీ బీజకరణం క్షయకరణ విభజన చెందకుండా ఏర్పడి, ఫలదీకరణ జరగకుండా పిండంగా అభివృద్ధి చెందుతుంది. పరాగ సంపర్క సహకారులు లేకుండా, తీవ్ర వాతావరణ పరిస్థితులలో ఇది నిశ్చయంగా జరిగే ప్రత్యుత్పత్తి విధానము.

ప్రాముఖ్యత :

  1. దీనిలో క్షయకరణ విభజన జరగదు కావున లక్షణాల పృథక్కరణ, జన్యువున : సంయోజనాలు ఏర్పడదు, కావున వాటి లక్షణాలు కొన్ని తరాలు స్థిరంగా ఉంటాయి.
  2. సంకరజాతి విత్తనాలు పరిశ్రమలో అసంయోగ జననానికి మంచి ప్రాముఖ్యత ఉన్నది.

ప్రశ్న 10.
వివిధ రకాల అండాల గురించి క్లుప్తంగా వ్రాయండి.
జవాబు:
కవచయుత స్థూల సిద్ధబీజాశయాలను అండము అంటారు. ఆవృత బీజాలలో ముఖ్యంగా 3 రకాల అండాలు కనబడతాయి.
అవి.
AP Inter 1st Year Botany Study Material Chapter 7 పుష్పించే మొక్కలలో లైంగిక ప్రత్యుత్పత్తి 3
1) నిర్వక్ర అండం :
ఇది నిటారుగా ఉండే అండం. ఈ రకం అండంలో అండద్వారం, చలాజీ, అండవృంతం ఒకే నిలువ రేఖపై అమరి ఉంటాయి.
ఉదా : పాలిగోనమ్, పైపరేసి

2) వక్ర అండం :
ఇది తలకిందులైన అండం. దీనిలో అండ దేహం 180° కోణంలో వంపు తిరుగుటచే అండం తల కిందులై అండద్వారం అండవృంతానికి దగ్గరగా వస్తుంది.
ఉదా : సూర్యకాంతం కుటుంబం, ఆస్ట్రరేసి

3) కాంపైలోట్రోపస్ అండాలు: ఈ రకం అండాలలో అండదేహం అండవృంతానికి లంబకోణంలో ఉంటుంది. కాని అండాంతి కణజాలం మధ్య భాగంలో నోక్కుకోని పోవుట వల్ల అండద్వారం వైపుగల భాగం కిందికి వంపు తిరిగి ఉంటుంది. దీనిలో పిండకోశం కొద్దిగా వంపు తిరిగి ఉంటుంది.
ఉదా : చిక్కుడు కుటుంబం, (బాసికేసి).

దీర్ఘ సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ద్విదళబీజ మొక్కలోని సంయుక్త బీజం నుంచి వివిధ పిండాభివృద్ధి దశలను పటాలుగా గీయండి.
జవాబు:
AP Inter 1st Year Botany Study Material Chapter 7 పుష్పించే మొక్కలలో లైంగిక ప్రత్యుత్పత్తి 4

ప్రశ్న 2.
వికసించే పుష్పాలలో సాధ్యమయ్యే పరాగ సంపర్క రకాలను తెలపండి. వాటికి కారణాలను తెల్పండి.
జవాబు:
ఛాస్మోగమీ :
వికసించే పుష్పాలలో జరిగే పరాగ సంపర్కాన్ని వివృతసంయోగం (ఛాస్మోగమి) అంటారు. ఎక్కువ పుష్పాలలో అతి సాధారణ పరాగ సంపర్క విధానము, దీనిలో 2 రకాలు కలవు.

1) ఆత్మపరాగసంపర్కము :
ఒక పుష్పంలోని పరాగకోశాలలో గల పరాగరేణువులు అదే పుష్పంలోని కీలాగ్రం మీద పడుటను ఆత్మపరాగసంపర్కం అంటారు. ఇది జరగడం కోసం, పుష్పాల పుప్పొడి విడుదలలోను, కీలాగ్రం వాటిని గ్రహించుటలోను సమకాలీనతను పాటించాలి. అలాగే కీలాగ్రం, పరాగకోశాలు ఒకదానికొకటి దగ్గరగా ఉండాలి. ఇది వివృత సంయోగ, సంవృత సంయోగ పుప్పాలలోను జరుగుతుంది.

2) పరపరాగ సంపర్కము :
ఒక పుష్పంలోని పరాగరేణువులు వేరొక పుష్పంలోని కీలాగ్రం చేయుటను పరపరాగ సంపర్కం అంటారు. దీనిలో 2 రకాలు కలవు.

ఎ) భిన్నవృక్ష పరాగసంపర్కం :
ఒక పుష్పంలోని పరాగ కోశాలలోగల పరాగరేణువులు అదే మొక్క పై ఉన్న వేరొక పుష్పంలోని కీలాగ్రం మీద పడతాయి. ఇది క్రియాత్మక పరపరాగ సంపర్కమైనప్పటికి, పరాగరేణువులు అదే మొక్క నుండి రావటం వల్ల ఇది జన్యుపరంగా ఆత్మపరాగ సంపర్కం వంటిదే.

బి) ఏక వృక్ష పరాగసంపర్కం :
ఒక మొక్కపై ఉన్న పుష్పంలోని పరాగ రేణువులు అదే జాతికి చెందిన వేరొక మొక్క సై ఉన్న పుష్పంలోకి కీలాగ్రం మీద పడతాయి. దీనివల్ల జన్యుపరంగా వివిధ రకాల పరాగరేణువులు కీలాగ్రాన్ని చేరతాయి.

AP Inter 1st Year Botany Study Material Chapter 7 పుష్పించే మొక్కలలో లైంగిక ప్రత్యుత్పత్తి

ప్రశ్న 3.
భాగములు గుర్తించిన చక్కటి పట సహాయంతో ఆవృతబీజ పక్వాదశలోని పిండకోశమును వర్ణించండి. సహాయకణాల పాత్రను సూచించండి. [Mar. ’14]
జవాబు:
AP Inter 1st Year Botany Study Material Chapter 7 పుష్పించే మొక్కలలో లైంగిక ప్రత్యుత్పత్తి 5
స్థూల సిద్ధబీజ మాతృకణంలో క్షయకరణ విభజన వల్ల ఏర్పడిన 4 స్థూల సిద్ధబీజాలలో 3 నశించి, ఒకటి క్రియత్మకంగా ఉంటుంది. ఇది పిండకోశం అభివృద్ధిలో పాల్గొంటుంది. దీనిలోని కేంద్రకం సమవిభజన చెంది రెండు కేంద్ర కాలనిస్తుంది. ఇది పిండకోశంలో వ్యతిరేక ధృవాలవైపుకు చేరి; 2 కేంద్రకాల పిండకోశాన్ని ఏర్పరుస్తాయి. ఈ రెండు కేంద్రకాలలో మరొక 2 సమవిభజనలు జరిగి కేంద్రాలలో ఉన్న పిండకోశం ఏర్పడుతుంది. తర్వాత, వీటి చుట్టూ కవచాలు ఏర్పడి ఒక నమూనా స్త్రీ సంయోగబీజదం లేక పిండకోశం ఏర్పడుతుంది. మొత్తం 8 కేంద్రకాలలో ఆరుకేంద్రకాలచుట్టూ కణకవచాలు ఏర్పడి కణాలుగా అభివృద్ధి చెందుతాయి.

మిగిలిన రెండు స్త్రీబీజకణం కింద ఉన్న కేంద్ర కణంలో ఉంటాయి. వీటిని దృవ కేంద్రకాలు అంటారు. అండద్వారం కొనవైపు ఉన్న కణాలను స్త్రీబీజపరికరం అంటారు. దీనిలో ఒక స్త్రీ బీజకణం, రెండు సహాయకణాలు ఉంటాయి. సహాయకణాలలో పై వైపున ప్రత్యేక కణమందాలు ఉంటాయి. వీటిని ఫిలిఫారమ్ పరికరం అంటారు. ఇవి పరాగనాళాలు సహాయ కణాలలోనికి ప్రవేశించుటలో త్రోవచూపిస్తాయి. ఛలాజా వైపున ఉన్న 3 కణాలను ప్రతిపాదకకణాలు అంటారు. పక్వదశలో ఒక ఆవృత బీజ పిండకోశం 8 కేంద్రకాలతో ఉన్నప్పటికి, 7 కణాలతోనే ఉంటుంది. ఇది ఒకే ఒక స్థూలసిద్ధబీజం నుండి ఏర్పడుతుంది. కావున ఏకసిద్ధబీజవర్ధక పిండకోశం అంటారు.

ప్రశ్న 4.
సూక్ష్మసిద్ధబీజాశయ పటంగీసి, దానిని ఆవరించిన కుడ్య పొరలను గుర్తించండి. కుడ్యపొరల గూర్చి క్లుప్తంగా వ్రాయండి.
జవాబు:
AP Inter 1st Year Botany Study Material Chapter 7 పుష్పించే మొక్కలలో లైంగిక ప్రత్యుత్పత్తి 6
ఒక నమూనా ఆవృతబీజ పరాగకోశం ద్విలంబికంగా ఉండి, ప్రతి లంబికలో రెండు తమ్మెలు కలిగి ఉంటుంది. దీనిని ద్విక్షియుత పరాగకోశాలు అంటారు. పరాగకోశం అడ్డుకోతలో నాలుగు పార్శ్వాల నిర్మాణంగా కనిపిస్తుంది. దీని మూలల వద్ద 4 సూక్ష్మ సిద్ధబీజాశయాలు ఉంటాయి.

ప్రతి సూక్ష్మ సిద్ధబీజాశయము గుండ్రంగా కనిపిస్తుంది. ఇది నాలుగు పొరల కుడ్యంతో కప్పబడి ఉంటుంది. అవి 1) బాహ్యచర్మం 2) ఎండోదీసియమ్ 3) మధ్యవరుస 4) టపెటమ్

1) బాహ్య చర్మము :
ఇది ఏకకణ మందంలో ఉంటుంది. పుప్పొడి సంచుల మధ్యన ఉన్న కణాలు మాత్రం పలుచని గోడలతో ఉంటాయి. ఈ ప్రదేశాన్ని స్టోమియమ్ అంటారు. ఇది పుప్పొడి సంచుల స్ఫోటనంలో ఉపయోగపడతాయి.

2) ఎండోథీసియమ్ :
బాహ్య చర్మం క్రింద ఉన్న పొర. దీనిలోని కణాలు వ్యాసార్ధంగా సాగి తంతుయుత మందాలను కల్గి ఉండి, పక్వదశలో నీటిని కోల్పోయి కుచించుకుని పుప్పొడి సంచుల స్ఫోటనానికి సహకరిస్తాయి.

3) మన్యవరుసలు :
ఎండోథీషియం క్రింద 1 5 వరుసలలో పలుచని గోడలు కల కణాలు వరుసలు ఉంటాయి. ఇవి పరాగకోశ స్ఫోటనానికి సహకరిస్తాయి.

4) టపెటమ్ :
పరాగకోశ కుడ్యంలోని లోపలి పొర; దీనిలోని కణాలు పెద్దవిగా, ఎక్కువ కణ ద్రవ్యంలో, ఒకటికంటే ఎక్కువ కేంద్రకాలతో ఉంటాయి. ఇది అభివృద్ధిచెందుచున్న పరాగ రేణువులకు పోషకపదార్థాలను సరఫరాచేస్తుంది.

పుప్పొడి సంచి కుడ్యంలోపల సిద్ధబీజ జనక కణజాలం ఉంటుంది. దీనిలో క్షయకరణ విభజనలు జరిగి సూక్ష్మసిద్ధబీజ చతుష్కాలు ఏర్పడతాయి. దీనిని సూక్ష్మ సిద్ధబీజజననం అంటారు.

ప్రశ్న 5.
ఆవృతబీజ మొక్కలలో జరిగే ఫలదీకరణ విధానాన్ని వివరించండి.
జవాబు:
స్త్రీ, పురుష సంయోగబీజాల కలయికను ఫలదీకరణ అంటారు. ఆవృతబీజాలలో స్త్రీ సంయోగబీజదం అండంలో ఇమిడి ఉంటుంది. పురుష సంయోగబీజదం అయిన పరాగ రేణువులు పరాగ సంపర్కం ద్వారా సామాన్యంగా కీలాగ్రం మీద చేరతాయి. ఇవి కీలాగ్రంపైన మొలకెత్తి పరాగనాళాలను ఏర్పరుస్తాయి. ఈ పరాగనాళాలు కీలం ద్వారా పెరిగి అండాన్ని ప్రవేశించి, పిండకోశంలో పురుష సంయోగబీజాన్ని విడుదల చేస్తాయి.
AP Inter 1st Year Botany Study Material Chapter 7 పుష్పించే మొక్కలలో లైంగిక ప్రత్యుత్పత్తి 7

ఫలదీకరణ జరిగే విధానం :
ఆవృద బీజాలలో ఫలదీకరణ ఐద దశలలో పూర్తి అవుతుంది.

A. పరాగనాళం అండాశయం నుంచి అండము లోనికి ప్రవేశించడం :
పరాగనాళం అండాశయం నుంచి అండంలోకి మూడు రకాలుగా ప్రవేశిస్తుంది.

1. రంధ్ర సంయోగం :
పరాగ నాళం అండంపై భాగంలో ఉన్న అండ ద్వారా అండంలోకి ప్రవేశించడాన్ని రంధ్రసంయోగం అంటారు. ఇది చాలా మొక్కలలో సర్వసాధారణంగా జరిగే సంయోగం.
ఉదా : ఒట్టీలియ.

2. కలాజా సంయోగము :
పరాగనాళం కలాజా ద్వారా అండంలోనికి ప్రవేశిస్తుంది. దీనిని ట్రూబ్ అనే శాస్త్రవేత్త కాజురైనాలో కనిపెట్టారు.

3. మధ్య సంయోగము :
పరాగనాళం అండకవచం ద్వారా గాని, అండవృంతం ద్వారా గాని అండంలోనికి ప్రవేశిస్తుంది. ఉదా : కుకుర్భిటా.

B. పరాగనాళం పిండకోశములోనికి ప్రవేశించడం :
పై 3 పద్ధతులలో ఒక పద్ధతి ద్వారా పరాగనాళం అండంలోనికి ప్రవేశించిన తర్వాత, పిండకోశంలోనికి అండద్వార ప్రాంతం ద్వారా కాని స్త్రీ బీజకణం, సహాయ కణం మధ్య ద్వారా కాని, సహాయకణాన్ని ధ్వంసం చేసి కాని ప్రవేశిస్తుంది. పరాగనాళం పిండకోశంలోనికి చలించడానికి ఫిలిపార్మ్ పరికరం దిశాత్మక నిర్మాణంగా పనిచేస్తుంది.

C. పురుష సంయోగ బీజాలు పిండకోశములోనికి విడుదల కావటం :
పరాగనాళం పిండకోశంలోనికి ప్రవేశించిన తర్వాత పరాగనాళం కొన విచ్ఛిన్నం కావడం వల్ల లేదా నాళం చివరి భాగం నశించి పోవడం వల్ల కాని, పరాగనాళం అగ్రంలో రంధ్రం ఏర్పడుట వల్ల కాని, పరాగనాళంలో ఉన్న రెండు పురుష సంయోగబీజాలు, శాఖీయ కేంద్రకం పిండకోశంలోనికి విడుదలవుతాయి.

D. సంయోగ బీజాల సంపర్కము :
ఒక పురుష సంయోగబీజము (మొదటిది) స్త్రీ బీజకణంతో సంయోగం చెంది ద్వయస్థితిక కణమైన సంయుక్త బీజాన్ని ఏర్పరుస్తుంది. దీనిని నిజమైన ఫలదీకరణ అంటారు. దీనిని స్ట్రాస్ బర్జర్ 1884లో కనుక్కొన్నారు.

4. త్రిసంయోగం, ద్విఫలదీకరణం :
రెండవ పురుష సంయోగబీజ కేంద్రకము పిండకోశం మధ్యలో ఉన్న ద్వితీయ కేంద్రకంతో సంయోగం చెందుతుంది. ఫలితంగా త్వయస్థితిక ప్రాథమిక అంకురచ్ఛద కేంద్రకం ఏర్పడుతుంది. ఈ సంయోగంలో ఏకస్థితికంగా ఉన్న పురుష సంయోగబీజం, ద్వయస్థితిక దశలో ఉండే ద్వితీయ కేంద్రకంతో కలుస్తుంది. కాబట్టి దీనిని “త్రిసంయోగం” అంటారు.
AP Inter 1st Year Botany Study Material Chapter 7 పుష్పించే మొక్కలలో లైంగిక ప్రత్యుత్పత్తి 8

దీనిని మొదట నవాషిన్ అను శాస్త్రవేత్త లిల్లియమ్ ఫ్రిటిల్లేరియాలలో కనుగొనెను.

ఈ విధంగా ఆవృత బీజాల్లో పరాగనాళం నుంచి వెలువడ్డ రెండు సంయోగ బీజాలు సంయోగంలో పాల్గొంటాయి. మొదటి పురుష సంయోగబీజ కేంద్రకం స్త్రీ బీజకణంతోను, రెండవ పురుష సంయోగబీజ కేంద్రకం ద్వితీయ కేంద్రకం తోను కలిసి వరుసగా సంయుక్త బీజాన్ని, ప్రాథమిక అంకురచ్ఛద కేంద్రకాన్ని ఏర్పరచడం వల్ల రెండు సంయోగాలు జరిగినట్లు భావించారు.

దీనినే ద్విఫలదీకరణ అంటారు. దీనివలన ఫలవంతమైన అంకు రఛ్ఛదయుత విత్తనాలు ఏర్పడతాయి.

ప్రశ్న 6.
పరాగ సంపర్కానికి తోడ్పడే సహకారాల గురించి క్లుప్తంగా వ్రాయండి.
జవాబు:
పరాసంపర్కం జరగడానికి రెండు నిర్జీవ మరియు జీవ సహకారాల సహాయాన్ని మొక్కలు ఉపయోగించుకుంటాయి. ఎక్కువ శాతం మొక్కలు జీవసహకారుల ద్వారా పరాగ సంపర్కాన్ని జరుపుకుంటాయి.
I) నిర్జీవ పరాగసంపర్క సహకారులు :
గాలి, నీరు మొదలగునవి సహయపడతాయి.

a) వాయు పరాగసంపర్కం :
గాలి జరిగే పరాగ సంపర్కాన్ని వాయు పరాగ సంపర్కం అంటారు. ఇది సర్వ సామాన్యమైన నిర్జీవ పరాగ సంపర్కరకం. పుష్పాలు చిన్నవిగా, వర్ణరహితమైన, సువాసన లేకుండా, ద్విలింగకాలై, పుంభాగ ప్రధమోత్పతులు వంటి లక్షణాలు వాయు పరాగ సంపర్కానికి అనుకూలంగా ఉంటాయి.
ఉదా : గడ్డి జాతులలో వాయు పరాగ సంపర్కం సర్వసాధారణం

b) జలపరాగ సంపర్కం :
నీటిద్వారా మొక్కల్లో జరిగే పరాగ సంపర్కాన్ని జలపరాగ సంపర్కం అంటారు. ఇది రెండు
రకాలు అవి
1) ఊర్థ్వజల పరాగ సంపర్కం :
వాలిస్ నేరియా వంటి నీటిమొక్కల్లో స్త్రీ పుష్పాలు పొడవైన వృంతాల సహయంతో నీటిపై భాగానికి చేరగా పురుషపుష్పాలు లేదా పుప్పొడి రేణువులు నీటిపై విడుదలవుతాయి. ఇవి నీటి ప్రవాహంతో నిష్క్రియాత్మకంగా కదులుతూ చివరికి కొన్ని, స్త్రీ పుష్పాలను, కీలాగ్రాన్ని చేరతాయి. ఈ విధానాన్ని ఊర్థ్వజల పరాగ సంపర్కం అంటారు.

2) అథోజల పరాగ సంపర్కం :
నీటి యొక్క అడుగుతతిలంలో జరిగే పరాగ సంపర్కాన్ని అథోజల పరాగ సంపర్కం అంటారు.
ఉదా : సముద్రగడ్డిమొక్క జోస్టెరా.

II) జీవ పరాగ సంపర్క సహకారులు :
దీనిలో కీటకాలు, పక్షులు, గబ్బిలాలు, నత్తలు, జంతువులు మొదలగునవి పరాగ సంపర్కానికి సహాయపడతాయి.
a) కీటక పరాగ సంపర్కం :
కీటకాల ద్వారా జరిగే పరాగ సంపర్కం
ఉదా : తేనేటీగలు, చీమలు, పట్టుపురుగులు

b) పక్షి పరాగ సంపర్కం (ఆర్నిథోఫిలి) :
పక్షులు ద్వారా జరిగే పరాగ సంపర్కం ఉదా : తీతువు పిట్టలు, సన్బర్డ్స్

c) కీరోష్టిలిఫెలీ :
గబ్బిలాలు వల్ల జరిగే పరపరాగ సంపర్కాన్ని ‘కిరోస్టిలిఫెలీ’ అంటారు.

d) తెరోఫిలీ :
ఉడుతలు వల్ల జరిగే పరపరాగ సంపర్కాన్ని తెరోఫిలీ అంటారు.

e) ఒఫియోఫిలీ :
పాములు వల్ల జరిగే పరపరాగ సంపర్కాన్ని ఒఫియోఫిలీ అంటారు.

AP Inter 1st Year Botany Study Material Chapter 6 ప్రత్యుత్పత్తి విధానాలు

Andhra Pradesh BIEAP AP Inter 1st Year Botany Study Material 6th Lesson ప్రత్యుత్పత్తి విధానాలు Textbook Questions and Answers.

AP Inter 1st Year Botany Study Material 6th Lesson ప్రత్యుత్పత్తి విధానాలు

అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ఆవృత బీజ మొక్కల జీవిత చక్రంలో బహిర్గత దశ (Dominant phase) ఏది?
జవాబు:
ధ్వయస్థితిక సిద్ధ బీజద దశ.

ప్రశ్న 2.
భిన్న సిద్ధ బీజత అంటే ఏమిటి? ఆవృత బీజ మొక్క అభివృద్ధి చేసే రెండు రకాల సిద్ధ బీజాలను తెలపండి?
జవాబు:
ఒకటికంటె ఎక్కువ సిద్ధబీజాలు ఏర్పడుటను భిన్న సిద్ధ బీజత అంటాం. ఆవృత భీజమొక్కలలో సూక్ష్మ, స్థూల సిద్ధ బీజాలు ఏర్పడతాయి.

ప్రశ్న 3.
శైవలాలు, శిలీంధ్రాలలోని ప్రత్యుత్పత్తి విధానాలను తెలపండి.
జవాబు:
శైవలాలు (క్లామిడోమోనాస్) అలైంగిక ప్రత్యుత్పత్తి చలన సిద్ధ భీజాల ద్వారా, శిలీంధ్రాలలో (రైజోపస్) అలైంగిక ప్రత్యుత్పత్తి చలనరహిత సిద్ధబీజాల ద్వారా జరుగుతుంది. శైవలాలలో లైంగిక ప్రత్యుత్పత్తి పురుష, స్త్రీ సంయోగ బీజాల కలయిక వల్ల జరుగుతుంది. శిలీంధ్రాలలో లైంగిక ప్రత్యుత్పత్తి రెండు భిన్న తెగలకు చెందిన శిలీంధ్ర తంతువుల మధ్య జరుగును.

ప్రశ్న 4.
లివర్ వర్ట్స్లు (Liverworts) ఏవిధంగా శాకీయ ప్రత్యుత్పత్తిని జరుపుతాయి.
జవాబు:
లివర్ వర్ట్స్లు జెమ్మాలు ద్వారా శాఖీయ ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయి.

ప్రశ్న 5.
బ్యాక్టీరియమ్లు, ఈస్ట్లు, అలైంగిక ప్రత్యుత్పత్తి జరపటంకోసం చూపే రెండు లక్షణాలను తెలపండి?
జవాబు:

  1. బ్యాక్టీరియమ్లలో, ఈస్ట్లలో, అలైంగిక ప్రత్యుత్పత్తిలో ఏర్పడే సంతతి ఒకదానితో ఒకటి పోలి ఉండి, జనకానికి సరియైన నకలుగా ఉంటాయి.
  2. పెరుగుదల త్వరితంగా ఉంటుంది.

AP Inter 1st Year Botany Study Material Chapter 6 ప్రత్యుత్పత్తి విధానాలు

ప్రశ్న 6.
అలైంగిక ప్రత్యుత్పత్తి పద్ధతి ద్వారా ఏర్పడే సంతతిని ‘క్లోన్’ అని ఎందుకు మనం అంటాము ?
జవాబు:
రెండు జనకాలు ప్రత్యుత్పత్తిలో పాల్గొనకపోవడంవల్ల, ఏర్పడే మొక్కలు జనక మొక్కలను పోలి ఉంటాయి. కావున వాటిని క్లోన్లు అంటారు.

ప్రశ్న 7.
ఏకవార్షిక, బహువార్షిక మొక్కల మధ్య దేనిలో తక్కువ శైశవ దశ (Juvenile phase) ఉంటుంది. ఒక కారణాన్ని తెలపండి.
జవాబు:
ఏకవార్షిక మొక్కలు తక్కువ శైశవదశ ఉంటుంది. ఈ మొక్కలలో శాకీయ, లైంగిక మరియు జీర్ణత దశలు చక్కగా చూపుతాయి. బహూవార్షిక మొక్కలలో ఈ దశలు స్పష్టంగా ఉండవు.

ప్రశ్న 8.
ఒక పుష్పించే మొక్కలో లైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా జరిగే విధానంలోని క్రింది సంభవాలను ఒక క్రమపద్ధతిలో తిరిగి పొందుపరచండి. పిండజననం, ఫలదీకరణ, సంయోగ బీజ జననం, పరాగ సంపర్కం.
జవాబు:
సంయోగ బీజ జననము, పరాగ సంపర్కం, ఫలదీకరణ, పిండజననము.

ప్రశ్న 9.
బహూకణయుత జీవులలో కణవిభజన అనేది ఒక రకమైన ప్రత్యుత్పత్తి అవునా లేక కాదా అనే దానికి సరియైన కారణాలు తెలపండి ?
జవాబు:
బహూకణయుత జీవులలో కణవిభజన ప్రత్యుత్పత్తి విధానము కాదు. వాటిలో ప్రత్యుత్పత్తి శాకీయ, అలైంగిక మరియు లైంగిక విధానాలు ద్వారా జరుగుతుంది.

ప్రశ్న 10.
ఈ క్రింది వాటిలో ద్విలింగాశ్రయ, ఏకలింగాశ్రయ మొక్కలను గుర్తించండి. a) ఖర్జూరం, b) కొబ్బరి, c) కారా, d) మార్కాంషియా (Marchantia).
జవాబు:
a) ఖర్జూరం – ఏకలింగాశ్రయ
b) కొబ్బరి – ద్విలింగాశ్రయ
c) కారా – ద్విలింగాశ్రయ
d) మార్కాంషియా – ఏకలింగాశ్రయ

AP Inter 1st Year Botany Study Material Chapter 6 ప్రత్యుత్పత్తి విధానాలు

ప్రశ్న 11.
ఈ పట్టికలో ‘A’ లోని మొక్కలతో వాటి శాకీయ భాగాలున్న పట్టిక ‘B’ తో జతచేయండి. (IMP)

పట్టిక Aపట్టిక B
1) బ్రయోఫిల్లమ్a) ఆఫ్సెట్
2) అగేవ్b) కళ్లు
3) బంగాళాదుంపc) పత్ర మొగ్గలు
4) గుఱ్ఱపుడెక్కd) ముక్కలు కావడం
5) కారాe) పిలక మొక్కలు
6) మెంథాf) లఘ లశునాలు

జవాబు:

పట్టిక Aపట్టిక B
1) బ్రయోఫిల్లమ్a) పత్ర మొగ్గలు
2) అగేవ్b) లఘులశునాలు
3) బంగాళాదుంపc) కళ్ళు
4) గుఱ్ఱపుడెక్కd) ఆఫ్సెట్లు
5) కారాe) ముక్కలు కావడం
6) మెంథాf) పిలక మొక్కలు

ప్రశ్న 12.
ఈ క్రింది పుష్ప భాగాలు ఫలదీకరణ తరువాత ఏవిధంగా అభివృద్ధి చెందుతాయో తెలపండి?
a) అండాశయం
b) కేసరాలు
c) అండాలు
d) రక్షక పత్రావళి
జవాబు:
a) అండాశయము – ఫలంగా మారును
b) కేసరాలు – రాలిపోతాయి
c) అండాలు – విత్తనాలుగా మారును
d) రక్షక పత్రావళి – రాలిపోతాయి. కొన్ని మొక్కలలో ఫలాన్ని అంటిపెట్టుకుని ఉంటాయి. (వంగ)

ప్రశ్న 13.
‘వివిపారి’ (శిశు ఉత్పాదన) (vivipary) అనే దానిని ఒక ఉదాహరణతో నిర్వచించండి.
జవాబు:
కొన్ని మాంగ్రూవ్ మొక్కలలో విత్తనాలు తల్లి మొక్కలను అంటిపెట్టుకుని ఉండగానే అంకురిస్తాయి. దీనిని వివిపారి (శిశు ఉత్పాదన) అంటారు.
ఉదా : రైజోఫోరా.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ఉదాహరణలతో సంయోగ బీజజననం గురించి క్లుప్తంగా వ్రాయండి?
జవాబు:
ద్వయస్థితిక లేక ఏకస్థితిక పూర్వగామి కణాలు, కణ విభజన, కణవిభేదనము ద్వారా పరిపక్వ ఏకస్థితిక సంయోగ బీజాలను ఏర్పరిచే ప్రక్రియనే సంయోగ బీజజననం అంటారు. సంయోగబీజాలు రెండు రకాలుగా ఉంటాయి. అవి

1. సమసంయోగబీజాలు :
స్త్రీ, పురుష సంయోగబీజాలు రెండు గుర్తించలేనంతగా ఒకే విధంగా ఉండే వాటిని సమ సంయోగబీజాలు అని అంటారు.
ఉదా : క్లాడోఫోరా

2. భిన్నసంయోగబీజాలు :
లైంగిక ప్రత్యుత్పత్తి ఓరిపే అనేక జీవులలో ఏర్పడే సంయోగబీజాలు రెండూ, స్వరూపంలో భిన్నంగా ఉంటాయి. ఈ జీవులలో పురుష సంయోగబీజాన్ని – చలన పురుషబీజము లేదా పురుషబీజం అని, సంయోగబీజాన్ని – స్త్రీ బీజకణం అని పిలుస్తారు.
ఉదా : ప్వునేరియా, టెరిస్, సైకస్

ప్రశ్న 2.
జీవులలో లైంగికత్వం గురించి తెలపండి.
జవాబు:
జీవుల లైంగికత్వం అనేది ఒకే జీవి లేదా విరుద్ధ లింగాలకు చెందిన భిన్న జీవుల్లో నుంచి వచ్చే సంయోగబీజాల కలయిక ద్వారా లైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతుంది. లైంగికత్వం అనేది మొక్కల్లో వైవిధ్యంగా ఉంటూ అది ఆవృతి బీజాల్లో విభిన్న పుష్పరకాలు ఏర్పడటం వల్ల ఎక్కువగా ఉంటుంది. అవి ద్విలింగాశ్రయస్థితి, ఏకలింగాశ్రయస్థితిగా నిర్వచించవచ్చు.

ద్విలింగశ్రయస్థితి :
ఒకే మొక్కపై పురుష, స్త్రీ లైంగిక అవయవాలు ఏర్పడటాన్ని ద్విలింగాశ్రయ స్థితి అంటారు.
ఉదా : కుకుర్బిటా, కొబ్బరి.

ఏకలింగాశ్రయస్థితి :
పురుష, స్త్రీ లైంగిక అవయవాలు వేరు వేరు మొక్కలపై ఏర్పడటాన్ని ఏకలింగాశ్రయస్థితి అంటారు.
ఉదా : బొప్పాయి, ఖర్జూరం.

ఆవృతబీజాలలో లైంగికత్వం ఆధారంగా పుష్పాలను రెండురకాలుగా పేర్కొనవచ్చు అవి
1) పురుషపుష్పం :
కేసరావళి మాత్రమే కలిగిన ఏకలింగపుష్పాన్ని పురుషపుష్పం అంటారు.

2) స్త్రీ పుష్పం :
అండకోశాన్ని మాత్రమే కలిగిన ఏకలింగ పుష్పాన్ని స్త్రీపుష్పం అంటారు.

AP Inter 1st Year Botany Study Material Chapter 6 ప్రత్యుత్పత్తి విధానాలు

ప్రశ్న 3.
“కొన్ని మొక్కలలో ఫలాలు ఏర్పడడానికి ఫలదీకరణ అనేది అవశ్యకమైన (obliga – tory) సంఘటన కాదు”. ఈ వాక్యాన్ని వివరించండి.
జవాబు:
ఫలదీకరణం జరగకుండా పుష్పంలోని అండాశయం నుంచి ఫలం ఏర్పడటాన్ని అనిషేక ఫలనం అంటారు. ఇది అరటి, ద్రాక్ష, దోసలలో సాధారణంగా జరుగుతుంది. అనిషేక ఫలనము సహజంగా గాని లేదా ప్రేరితమైగాని ఉంటుంది. ఈ ప్రక్రియ ద్వారా విత్తన రహిత ఫలాలను వాణిజ్యపరంగా అభివృద్ధి చేయడంకోసం వినియోగిస్తారు. ఫలాలనిచ్చు పంట మొక్కలలో (టమాటో) అనిషేకజననము ముఖ్యమైనది. వాటిలో పుష్పాలపై ఆక్సిన్లు, జిబ్బరెల్లిన్లు, సైటోకైనిన్లు వంటి హార్మోనులను చల్లిన ఫలదీకరణ లేకుండానే ఫలాలు ఏర్పడతాయి. దీనిని కృత్రిమ అనిషేకజననం అంటారు. సహజకారకాలైన అల్పకాంతి, శీతల పరిస్థితులు కూడా అనిషేక ఫలాలను ఏర్పరుస్తాయి.

అనిషేకఫలాలు వల్ల ఉపయోగాలు :

  1. ఫలాలు పెద్దవిగా ఉంటాయి.
  2. తినుటకు సులభంగా ఉంటాయి. వ్యర్ధం ఉండదు.
  3. షెల్ఫ్ లైఫ్ ఎక్కువ కాలము ఉంటుంది.
  4. విత్తన రహిత ఫలాల్లో ఎక్కువ కరిగే పదార్థాలు ఉంటాయి. కావున ఫలదీకరణ అనేది అవశ్యకరమైన సంఘటనకాదు.

ప్రశ్న 4.
ఆవృత బీజ పుష్పంలో పరాగసంపర్కం, ఫలదీకరణ తరువాత ఏర్పడే మార్పులను తెలపండి? [Mar. ’14]
జవాబు:
ఆవృత బీజాలలో ఫలదీకరణ తర్వాత పుష్పంలో జరిగే మార్పులను ఫలదీకరణానంతర మార్పులు అంటారు.

  1. అండాశయం బాగా ఆహార పదార్థాలను సేకరించి ఫలంగా మారుతుంది.
  2. ఫలదీకరణం చెందిన అండాలు విత్తనాలుగా మారతాయి.
  3. సంయుక్త బీజం-పిండంగాను మారతాయి.
  4. ప్రాథమిక అంకురచ్ఛద కేంద్రకం – అంకురచ్ఛదంగాను మారతాయి.
  5. సహకణాలు, ప్రతిపాద కణాలు క్షీణిస్తాయి.
  6. అండవృంతము విత్తనవృంతంగాను మారుతుంది.
  7. బాహ్య అండకవచం బాహ్య బీజ కవచంగాను, (టెస్ట్గా), అంతర అండకవచం అంతర బీజకవచం (టెగ్మన్) గాను
  8. అండ ద్వారం – విత్తన ద్వారంగాను మారును.
  9. విత్తుచార- విత్తనచారగాను మారతాయి.
  10. పుష్పంలోని రక్షక పత్రావళి, ఆకర్షణ పత్రావళి, కేసరావళి, కీలం, కీలాగ్రం వడలి రాలిపోతాయి.

ప్రశ్న 5.
ఈ క్రింది పదాలను వివరించండి.
a) శైశవదశ
b) ప్రత్యుత్పత్తి దశ.
జవాబు:
శైశవ దశ :
అన్ని జీవులు జీవితంలో కొంత పెరిగి పక్వస్థితిలో ప్రత్యుత్పత్తి దశకు చేరుకునే ముందు దశను శాకీయ లేక శైశవ దశ అంటారు.

ప్రత్యుత్పత్తి దశ :
శైశవదశ తర్వాత, మొక్కలలో పుష్పాలు ఏర్పడుట ద్వారా గుర్తించేదశను ప్రత్యుత్పత్తి దశ అంటారు.

ప్రశ్న 6.
అలైంగిక, లైంగిక ప్రత్యుత్పత్తుల మధ్య తేడాలను గుర్తించండి. శాకీయ ప్రత్యుత్పత్తిని కూడా ఒక రకమైన అలైంగిక ప్రత్యుత్పత్తి రకంగా ఎందుకు పరిగణిస్తారు?
జవాబు:

అలైంగికలైంగిక
1) ఒక జనకుడు పాల్గొంటారు.1) ఇద్దరు జనకులు పాల్గొంటారు.
2) సంతతి ఒకదానితో ఒకటి పోలి ఉండి జనకానికి నకలుగా ఉంటాయి.2) సంతతిలో వైవిద్యాలు ఉంటాయి.
3) బాహ్య, అంతర ఫలదీకరణలు ఉండవు.3) ఫలదీకరణ జరుగును.
4) సంయోగ బీజాలు ఏర్పడవు.4) సంయోగ బీజాలు ఏర్పడతాయి.
5) అనువంశిక పదార్థాల కలయిక ఉండదు.5) అనువంశిక పదార్థాల కలయిక జరుగును.

బహూకణయుత లేదా సహనివేశక శైవలాలు, బూజులు, పుట్టగొడుగులలోని శరీరం కొంతభాగం ముక్కలై చిన్న చిన్న ఖండితాలుగా విడిపోతాయి. ఈ ఖండితాలు ప్రౌఢజీవిగా అభివృద్ధి చెందుతాయి. ఈ విధానమును ముక్కలు కావడం (fragmentation) అంటారు. కొన్ని మొక్కలలో ప్రత్యేక నిర్మాణాలు ఏర్పడి ప్రత్యుత్పత్తికి తోడ్పడతాయి. ఉదా : లివర్ వర్ట్స్లోని జెమ్మాలు.

పుష్పించే మొక్కలలో రన్నర్లు, స్టోలన్లు, పిలకమొక్కలు, ఆఫ్సెట్లు, భూగర్భ కాండాలైన కొమ్ము, కందం, దుంపకాండం లశునం, పత్ర రూపాంతరాలైన లఘులశునాలు, ప్రత్యుత్పత్తి పత్రాలు వంటి శాకీయ నిర్మాణాలు కూడా శాకీయ వ్యాప్తి ద్వారా కొత్త సంతతిని అభివృద్ధి చేసుకోగలవు. ఈ నిర్మాణాలను శాకీయ వ్యాప్తికారకాలు అంటారు. ఇవి ఏర్పడటానికి రెండు జనకాలు పాల్గొనకపోవడం వల్ల ఇది కూడా అలైంగిక పద్దతే.

AP Inter 1st Year Botany Study Material Chapter 6 ప్రత్యుత్పత్తి విధానాలు

ప్రశ్న 7.
ఈ క్రింది పుష్పించే మొక్క భాగాలను గుర్తించి, అవి ఏకస్థితికాలా (n) లేక ద్వయ స్థితికాలా (2n) అనేది వ్రాయండి.
a) అండాశయము
b) పరాగకోశం
c) స్త్రీ బీజకణం
e) పురుషసంయోగబీజం
d) పరాగరేణువు
f) సంయుక్తబీజం
జవాబు:
అండాశయము : ద్వయస్థితికము
పరాగకోశం : ద్వయస్థితికము
పురుష సంయోగ బీజకణం : ఏకస్థితికము
స్త్రీబీజకణం : ఏకస్థితికము
పరాగరేణవు : ఏకస్థితికము
సంయుక్త బీజము : ద్వయస్థితికము

ప్రశ్న 8.
ఆవృత బీజ మొక్క జీవిత చక్రంలోని దశల గురించి క్లుప్తంగా రాయండి.
జవాబు:
ఆవృతబీజ మొక్క జీవిత చక్రములో రెండు దశలు ఏకాంతరంగా ఏర్పడుతూ ఉంటాయి. అవి :
1) సిద్ధ బీజదదశ
2) సంయోగ బీజదదశ.

1) సిద్ధ బీజద దశ :
జీవిత చరిత్రలో ఇది ద్వయస్థితిక దశ. సంయుక్త బీజం నుండి ఏర్పడుతుంది. ఈ మొక్కపై ప్రత్యుత్పత్తి అంగాలు ఏర్పడతాయి.

2) సంయోగ బీజదదశ :
ఇది ఏకస్థితిక దశ. సిద్ధబీజ మాతృ కణాలు క్షయకరణ విభజన ఫలితంగా ఏర్పడిన సిద్ధబీజం నుంచి ఈ దశ ఏర్పడుతుంది. ఆవృతబీజాలలో సిద్ధబీజ మాతృ కణాలు రెండు రకములు. సూక్ష్మ సిద్ధబీజ మాతృకణాలు పరాగకోశములోను, స్థూలసిద్ధబీజ మతృకణాలు అండములోని అండాంతః కణజాలంలోను అభివృద్ధి చెందుతాయి. ఈ మతృకణాలలో క్షయకరణ విభజన జరగటం ద్వారా సూక్ష్మ, స్థూల సిద్ధబీజాలు ఏర్పడతాయి. సూక్ష్మ, స్థూల సిద్ధబీజాలు వరుసగా పురుష, స్త్రీ సంయోగ బీజదాలను ఏర్పరుస్తాయి. పురుష, స్త్రీ సంయోగ బీజదాలు వరుసగా పురుష, స్త్రీ బీజ కణాలను ఏర్పరుస్తాయి. పురుష సంయోగ బీజము, స్త్రీ బీజ కణముతో సంయోగము చెంది ద్వయస్థితిక సంయుక్త బీజము ఏర్పడుతుంది. అనేక సమవిభజనల అనంతరము విత్తనములో సంయుక్త బీజము పిండముగా ఏర్పడును. విత్తనము మొలకెత్తి సిద్ధబీజద మొక్క ఏర్పడును.

దీర్ఘ సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
అలైంగిక, లైంగిక ప్రత్యుత్పత్తుల మధ్య తేడాలను గూర్చి రాయండి. ఏకకణ జీవులు చూపే అలైంగిక ప్రత్యుత్పత్తి రకాలను వివరించండి?
జవాబు:

అలైంగికలైంగిక
1) ఒక జనకుడు పాల్గొంటారు.1) ఇద్దరు జనకులు పాల్గొంటారు.
2) సంతతి ఒకదానితో ఒకటి పోలి ఉండి జనకానికి నకలుగా ఉంటాయి.2) సంతతిలో వైవిద్యాలు ఉంటాయి.
3) బాహ్య, అంతర ఫలదీకరణలు ఉండవు.3) ఫలదీకరణ జరుగును.
4) సంయోగ బీజాలు ఏర్పడవు.4) సంయోగ బీజాలు ఏర్పడతాయి.
5) అనువంశిక పదార్థాల కలయిక ఉండదు.5) అనువంశిక పదార్థాల కలయిక జరుగును.

ప్రొటిస్టా, మొనెరా జీవులలో జనక కణం రెండుగా విభజన చెంది కొత్త సంతతిని ఉత్పత్తి చేస్తుంది. (ద్విధావిచ్ఛిత్తి) అనేక ఏకకణజీవులలో ద్విధావిచ్ఛిత్తి ద్వారా కణం రెండు భాగాలుగా విభజన చెంది, ప్రతి భాగము త్వరితంగా ప్రౌఢజీవిగా అభివృద్ధి చెందుతుంది. యూగ్లినా, బాక్టీరియం ఈస్ట్లలో అలైంగికోత్పత్తి ప్రరోహోత్పత్తి ద్వారా జరుగుతుంది.

ప్రశ్న 2.
పుష్పంలోని ఫలదీకరణాంతర మార్పుల గూర్చి వివరించండి.
జవాబు:
ఆవృత బీజాలలో ఫలదీకరణ తర్వాత పుష్పంలో జరిగే మార్పులను ఫలదీకరణానంతర మార్పులు అంటారు.

  1. అండాశయం బాగా ఆహార పదార్థాలను సేకరించి ఫలంగా మారుతుంది.
  2. ఫలదీకరణం చెందిన అండాలు విత్తనాలుగా మారతాయి.
  3. సంయుక్త బీజం-పిండంగాను మారుతుంది.
  4. ప్రాథమిక అంకురచ్ఛద కేంద్రకం అంకురచ్ఛదంగా మారుతుంది.
  5. సహకణాలు, ప్రతిపాద కణాలు క్షీణిస్తాయి.
  6. అండవృంతము విత్తనవృంతంగా మారుతుంది.
  7. బాహ్య అండకవచం బాహ్య బీజ కవచంగాను, (టెస్ట్గా), అంతర అండకవచం అంతర బీజకవచం (టెగ్మన్) గాను విత్తన ద్వారంగాను మారుతుంది.
  8. అండ ద్వారం
  9. విత్తుచార-విత్తనచారగాను మారతాయి.
  10. పుష్పంలోని రక్షక పత్రావళి, ఆకర్షణ పత్రావళి, కేసరావళి, కీలం, కీలాగ్రం వడలి రాలిపోతాయి.

అంకురచ్ఛదము :
ఆవృత బీజాలలో ఫలదీకరణ అనంతరం ప్రాథమిక అంకురచ్ఛద కేంద్రకం నుండి అంకురచ్ఛదం ఏర్పడుతుంది. ఇది అభివృద్ధి చెందే పిండాలకు పోషకాలను అందిస్తుంది. ఇది త్రయ స్థితికం కాని వివృత బీజాలలో అంకురచ్ఛదం ఫలదీకరణకు ముందుగా స్త్రీ సంయోగబీజకణజాలం నుంచి నేరుగా ఏర్పడుతుంది. ఇది ఏకస్థితికం.

పరిచ్ఛదము :
విత్తనం పక్వమయ్యేసరికి అంకురచ్ఛదంవలె, అండాంత కణజాలం హరించుకుపోతుంది. కాని కొన్ని విత్తనాలలో కొంత అండాంతకణజాలం మిగిలిపోతుంది. దానిని పరిచ్ఛదము అంటారు.
ఉదా : మిరియాలు, కలువ గింజలు.

Intext Question and Answers

ప్రశ్న 1.
జీవులకు ప్రత్యుత్పత్తి అనేది ఎందుకు అవసరం?
జవాబు:
ప్రత్యుత్పత్తి ఒక ముఖ్యమైన ప్రక్రియ. ఇది జరగనిదే, జీవుల సంతతి అంతరించిపోతుంది. తరతరాలు పెంపొందటానికి ప్రత్యుత్పత్తి అవసరము.

AP Inter 1st Year Botany Study Material Chapter 6 ప్రత్యుత్పత్తి విధానాలు

ప్రశ్న 2.
లైంగిక లేదా అలైంగిక ప్రత్యుత్పత్తి విధానంలో ఏది మేలైనది? ఎందువల్ల?
జవాబు:
లైంగిక ప్రత్యుత్పత్తి మేలైనది. వీటివల్ల ఏర్పడిన సంతతిలో ఉన్న వైవిధ్యాలవల్ల, అవి ఎక్కువకాలం జీవిస్తాయి.

ప్రశ్న 3.
అలైంగిక ప్రత్యుత్పత్తి పద్ధతి ద్వారా ఏర్పడే సంతతిని ‘క్లోన్’ అని ఎందుకంటారు?
జవాబు:
అలైంగిక విధానంలో ఏర్పడే సంతతి ఒకదానితో ఒకటి పోలి ఉండి, జనకానికి సరిఅయిన నకలుగా ఉంటాయి. కావున వాటిని ‘క్లోన్’లు అంటారు.

ప్రశ్న 4.
అలైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా ఏర్పడే సంతతి, లైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా ఏర్పడే సంతతితో ఏవిధంగా విభేదిస్తుంది?
జవాబు:
అలైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా ఏర్పడే సంతతి ఒకదానితో ఒకటి పోలివుండి జనకానికి సరిఅయిన నకలుగా ఉంటాయి. ఇవి వివిధ వాతావరణ పరిస్థితులలో జీవించే అవకాశం తక్కువగా ఉంటుంది.
లైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా ఏర్పడే సంతతిలో వైవిధ్యాలు ఎక్కువగా ఉంటాయి మరియు జనకులను పోలి ఉండవు. ఇవి వివిధ వాతావరణ పరిస్థితులలో జీవించే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

ప్రశ్న 5.
శాకీయ వ్యాప్తి అనగానేమి? సరియైన రెండు ఉదాహరణలు ఇవ్వండి.
జవాబు:
పుష్పించు మొక్కలలో శాకీయ వ్యాప్తి ఒకరకమైన అలైంగిక విధానము. జనకమొక్కలపై కొన్ని బహుకణయుత నిర్మాణాలు ఏర్పడి, రాలి నేలపై పడి ప్రౌఢ మొక్కలుగా అభివృద్ధి చెందుతాయి. ఇవి జన్యురీత్యా, బాహ్యస్వరూప రీత్యా జనకమొక్కలను పోలి ఉంటాయి. ఉదా : రణపాల, అల్లం, పసుపు, చామదుంప, జెమ్మా.

ప్రశ్న 6.
ఉన్నతమైన జీవులు సంక్లిష్టమైన నిర్మాణంలో ఉన్నప్పటికి లైంగిక ప్రత్యుత్పత్తిని ఆశ్రయిస్తాయి. ఎందువల్ల?
జవాబు:
లైంగిక ప్రత్యుత్పత్తి వల్ల ఏర్పడిన సంతతిలో వైవిధ్యాలు ఎక్కువగా ఉండుటవల్ల, అవి వివిధ వాతావరణ పరిస్థితులను తట్టుకొని జీవించగల్గుతాయి.

ప్రశ్న 7.
క్షయకరణ విభజన, సంయోగ బీజ జననంల మధ్య పరస్పర బంధం అనేది ఎల్లప్పుడు ఉంటుంది. ఎందువల్ల? వివరించండి.
జవాబు:
ఆవృత బీజాలలో క్షయకరణ విభజన సూక్ష్మ, స్థూలసిద్ధబీజ మాతృకణాలలో తప్పనిసరిగా జరగాలి. లేకుంటే పురుష స్త్రీ సంయోగబీజాలు ఏర్పడవు.

ప్రశ్న 8.
బాహ్య ఫలదీకరణాన్ని నిర్వచించండి. దీనిలోని నష్టాలను తెలపండి.
జవాబు:
జీవి దేహం బయట జరిగే సంయోగ బీజాల సంయోగాన్ని బాహ్య ఫలదీకరణ అంటారు. ఈ ప్రక్రియలో సంయుక్త బీజము జీవి దేహం వెలుపల ఏర్పడుతుంది. అవి అభివృద్ధిచెందే అవకాశాల వాతావరణ పరిస్థితులమీద ఆధారపడి ఉంటాయి.

ప్రశ్న 9.
గమన సిద్ధబీజం, సంయుక్త బీజంల మధ్య తేడాను తెలపండి.
జవాబు:
గమనసిద్ధబీజం 1) చలనసహిత, అలైంగిక సిద్ధబీజము. 2) కశాభాలు ఉంటాయి. ఉదా : శైవలాలు, శిలీంధ్రాలు. సంయుక్త బీజం 1) చలనరహిత, లైంగిక ప్రక్రియవల్ల ఏర్పడును. 2) కశాభాలు ఉండవు. ఉదా : లైంగిక ప్రత్యుత్పత్తి జరిపే మొక్కలు.

క్రియాశీలత

ప్రశ్న 1.
కుకుర్బిటా మొక్కలోని కొన్ని పుష్పాలను పరిశీలించి, పురుష, స్త్రీ పుష్పాలను గుర్తించండి. ఏకలింగ పుష్పాలను కలిగి ఉండే మరొక మొక్క మీకేదైనా తెలుసా?
జవాబు:
లూఫా సిలిండ్రికా, సిట్రుల్లస్, లాజినేరియా, కుకుమిస్లలో ఏకలింగ పుష్పాలు ఉంటాయి.

AP Inter 1st Year Botany Study Material Chapter 6 ప్రత్యుత్పత్తి విధానాలు

ప్రశ్న 2.
ద్విలింగక పుష్పం అంటే ఏమిటి? మీ దగ్గరి పరిసరాల నుంచి 5 ద్విలింగక పుష్పాలను సేకరించి మీ ఉపాధ్యాయుని సహాయంతో వాటి సాధారణ, శాస్త్రీయ నామాలను తెలుసుకోండి.
జవాబు:
పురుష, స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవాలు ఒకే మొక్కపై పుష్పంలో ఉంటే దానిని ద్విలింగక పుష్పం అంటారు.
ఉదా : 1) హైబిస్కస్ రోజా సైనెన్సిస్ మందార
2) గ్లోరియోసా సుపర్భా – అడవినాభి
3) ఉమ్మెత్త – దతూరమెటల్
4) చిక్కుడు – డాలికాస్ లాబ్లబ్
5) సోలానం మెలోంజినా వంగ

AP Inter 1st Year Botany Study Material Chapter 5 పుష్పించే మొక్కల స్వరూపశాస్త్రం

Andhra Pradesh BIEAP AP Inter 1st Year Botany Study Material 5th Lesson పుష్పించే మొక్కల స్వరూపశాస్త్రం Textbook Questions and Answers.

AP Inter 1st Year Botany Study Material 5th Lesson పుష్పించే మొక్కల స్వరూపశాస్త్రం

అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
పీచువేర్లకు, అబ్బురపు వేర్లకు గల భేదాలు రాయండి.
జవాబు:

పీచువేర్లుఅబ్బురపు వేర్లు
కాండము దిగువ భాగము నుండి గుంపుగా ఏర్పడు వేర్లను పీచువేర్లు అంటారు.ప్రథమ మూలము నుండి కాకుండా మొక్కలోని ఇతర భాగాల నుండి ఏర్పడే వేర్ల సముదాయమును అబ్బురపు వేర్లు అంటారు.

ప్రశ్న 2.
‘రూపాంతరం’ను నిర్వచించండి. మర్రి వృక్షం, మాంగ్రూప్ మొక్కలలో వేరు ఏవిధంగా రూపాంతరం చెందిందో తెలపండి.
జవాబు:
ప్రత్యేక విధులను నిర్వర్తించడానికి మొక్కలలో అంగాలలో ఏర్పడే నిర్మాణాత్మకమైన, శాశ్వత మార్పును రూపాంతరం అంటారు. మర్రి వృక్షంలో పెద్దశాఖల నుండి వేర్లు ఏర్పడి నేలలోనికి పెరిగి స్థంభాలవలె మారతాయి. వాటిని ఊడవేర్లు లేదా స్థంభాల వంటి వేర్లు అంటారు. మాంగ్రూవ్లలో అనేక వేర్లు భూమిపైకి, నిటారుగా పెరుగుతాయి. వీటిని శ్వాసమూలాలు అంటారు. ఇవి శ్వాసక్రియకు సహాయపడతాయి.

ప్రశ్న 3.
వృక్షోపజీవుల మొక్కలలో ఏరకం ప్రత్యేకమైన వేర్లు ఏర్పడతాయి ? వాటి విధిని తెలపండి.
జవాబు:
వృక్షోపజీవుల మొక్కలలో వెలమిన్ వేర్లు ఏర్పడి వాతావరణంలోని తేమను శోషించడానికి తోడ్పడతాయి.

ప్రశ్న 4.
క్రిసాంథిమమ్ (చామంతి) లో గల పిలక మొక్క, జాస్మిన్ (మల్లె) లో గల స్టోలను ఏవిధంగా విభేదిస్తుంది?
జవాబు:

పిలక మొక్కలుస్టోలన్లు
ప్రధాన అక్షం పీఠభాగము, భూగర్భ కాండ భాగాల నుండి పార్శ్వపుశాఖలు ఏర్పడి, కొంతవరకు మృత్తికలో సమాంతరంగా వృద్ధిచెంది, తరువాత ఏటవాలుగా పెరిగి భూమిపై పత్రయుత శాఖలను ఏర్పరుస్తాయి. ఈ శాఖలను పిలకమొక్కలు అంటారు.
ఉదా : చామంతి.
ప్రధాన అక్షం పీఠభాగం నుండి సున్నితమైన పార్శ్వపుశాఖలుఏర్పడి, కొంతకాలం వాయుగతంగా పెరిగిన తర్వాత వంగి భూమిని తాకినప్పుడు అబ్బురపు వేర్లను ఏర్పరుస్తాయి. ఈ శాఖలను స్టోలన్లు అంటారు.
ఉదా : మల్లె.

ప్రశ్న 5.
తల్పం వంటి పత్రపీఠం అంటే ఏమిటి? ఏ ఆవృత బీజపు కుటుంబ మొక్కలలో అవి కనిపిస్తాయి? [Mar. ’14]
జవాబు:
ఉబ్బివున్న పత్రపీఠంను తల్పం వంటి పత్రపీఠం అంటారు. ఇవి “లెగ్యుమినోసి” కుటుంబ మొక్కలలో కనిపిస్తుంది.

AP Inter 1st Year Botany Study Material Chapter 5 పుష్పించే మొక్కల స్వరూపశాస్త్రం

ప్రశ్న 6.
‘ఈనెల వ్యాపనం’ ను నిర్వచించండి. ద్విదళ బీజాలు, ఏకదళబీజాల నుంచి ఈనెల వ్యాపనంలో ఏవిధంగా విభేదిస్తాయి?
జవాబు:
పత్రదళంలో ఈనెలు, చిరు ఈనెలు అమరి ఉండే విధానాన్ని ఈనెల వ్యాపనము అంటారు. ద్విదళ బీజ పత్రాలలో చిరు ఈనెలు వలలాగా అమరి ఉంటాయి. దానిని జాలాకార ఈనెల వ్యాపనము అంటారు. ఏకదళబీజ పత్రాలలో చిరు ఈనెలు ఒకదానినొకటి సమాంతరంగా అమరి ఉంటాయి. దానిని సమాంతర ఈనెల వ్యాపనము అంటారు.

ప్రశ్న 7.
పిచ్ఛాకార సంయుక్త పత్రం, హస్తాకార సంయుక్త పత్రాన్ని ఏ విధంగా విభేదిస్తుంది? ఉదాహరణలతో వివరించండి.
జవాబు:
అనేక పత్రకాలు ఒకే విన్యాసాక్షంపై అమరి ఉన్నచో దానిని పిచ్ఛాకార సంయుక్త పత్రము అంటారు. ఉదా: వేప. పత్రకాలు, పత్ర వృంతం కోన భాగంలో సంలగ్నమైవున్న దానిని హస్తాకార సంయుక్త పత్రము అంటారు. ఉదా : బూరుగ.

ప్రశ్న 8.
కీటకాహారి మొక్కలలో కీటకాన్ని బంధించడానికి ఏ అంగం రూపాంతరం చెందింది? రెండు ఉదాహరణలు ఇవ్వండి.
జవాబు:
కీటకాహార మొక్కలలో, కీటకాన్ని బంధించడానికి పత్రాలు బోనులుగా మారతాయి. ఉదా : నెపంథిస్, డయోనియా.

ప్రశ్న 9.
మధ్యాభిసార, నిశ్చిత పుష్ప విన్యాసాల మధ్యగల భేదాన్ని తెలపండి.
జవాబు:

మధ్యాభిసార పుష్పవిన్యాసమునిశ్చిత పుష్పవిన్యాసము
1) పుష్పవిన్యాస అక్షం అనిశ్చితంగా పెరుగుతుంది.1) పుష్ప విన్యాస అక్షం నిశ్చితంగా పెరుగుతుంది.
2) పుష్పాలు అగ్రాభిసార క్రమంలో అమరి వుంటాయి.2) పుష్పాలు ఆధారాభిసార క్రమంలో అమరి వుంటాయి.
3) పుష్పాలు కేంద్రాభిసార క్రమంలో వికసిస్తాయి.3) పుష్పాలు కేంద్రాపసార క్రమంలో వికసిస్తాయి.

ప్రశ్న 10.
సయాథియమ్లోని గిన్నెవంటి నిర్మాణం స్వరూపాన్ని తెలపండి. ఏ కుటుంబంలో అది కనిపిస్తుంది?
జవాబు:
సయాథియమ్లో గిన్నెవంటి నిర్మాణము పరిచక్రపుచ్ఛావళి నుండి (పుష్ప పుచ్ఛాలు) ఏర్పడుతుంది. ఇది యూఫోర్బియేసి కుటుంబ మొక్కలలో కనిపిస్తుంది.

ప్రశ్న 11.
ఫిగ్ (మర్రి జాతి) వృక్షాలలో ఏ పుష్ప విన్యాసం కనిపిస్తుంది ? బ్లాస్టోఫాగా కీటకం ఆ వృక్షంలోని పుష్ప విన్యాసాన్ని ఎందుకు చేరుతుంది?
జవాబు:
ఫిగ్ (మర్రి జాతి) వృక్షంలో హైపనోడియమ్ పుష్పవిన్యాసము కనిపిస్తుంది. ‘బ్లాస్టోఫాగా’ అను కీటకము ఆ పుష్ప విన్యాసంలోని గాల్ పుష్పాలలో తన గుడ్లను పొదుగుతుంది.

AP Inter 1st Year Botany Study Material Chapter 5 పుష్పించే మొక్కల స్వరూపశాస్త్రం

ప్రశ్న 12.
సౌష్ఠవయుత పుష్పానికి, పాక్షిక సౌష్టవయుత పుష్పానికి గల భేదాన్ని తెలపండి.
జవాబు:

సౌష్టవయుత పుష్పముపాక్షిక సౌష్టవయుత పుష్పము
పుష్పాన్ని మధ్య నుంచి ఏ వ్యాసార్థం తలంనుంచైనా రెండు సమభాగాలుగా విభజించగలిగిన దానిని సౌష్టవయుత పుష్పం అంటారు.
ఉదా : ఉమ్మెత్త.
పుష్పాన్ని మధ్యనుంచి ఏదో ఒక తలంనుంచి మాత్రమే నిలువుగా రెండు సమభాగాలుగా విభజించగలిగితే దానిని పాక్షిక సౌష్టవయుత పుష్పం అంటారు.
ఉదా : చిక్కుడు.

ప్రశ్న 13.
బఠానీ మొక్కలో ఆకర్షణ పత్రాలు ఏవిధంగా అమరి ఉంటాయి? అటువంటి అమరికను ఏమంటారు?
జవాబు:
బఠాణీ, చిక్కుడు మొక్కలలో పుష్పాలలో ఐదు ఆకర్షణ పత్రాలు ఉంటాయి. వాటిలో అతిపెద్ద ఆకర్షణ పత్రం (ధ్వజం) రెండు పార్శ్వ ఆకర్షణ పత్రాలను (బాహువులు) కప్పి ఉంచుతుంది. ఈ రెండు బాహువులు తిరిగి పూర్వాంతంలో ఉన్న రెండు అతిచిన్నవైన ఆకర్షణ పత్రాలను (ద్రోణులు) కప్పి ఉంచుతాయి. ఈ రకము అమరికను “వెక్సిల్లరీ” లేక “పాపిలియోనేషియన్” పుష్పరచన అంటారు.

ప్రశ్న 14.
మకుదశోపరిస్థితం అంటే ఏమిటి? ఒక ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
కేశరాలు, ఆకర్షణ పత్రాలతో సంయుక్తమగుటను “మకుటదళో పరిస్థితము” అంటారు. ఉదా : వంగ.

ప్రశ్న 15.
అసంయుక్త, సంయుక్త అండాశయాల మధ్య భేదాలను తెలపండి.
జవాబు:

అసంయుక్త అండాశయంసంయుక్త అండాశయం
అండాశయంలో ఒకటి కంటే ఎక్కువ ఫలదళాలు ఉన్నప్పుడు, అవిస్వేచ్చగా ఉంటే, దానిని అసంయుక్త అండాశయం అంటారు.
ఉదా : గులాబీ.
అండాశయంలో ఒకటి కంటే ఎక్కువ ఫలదళాలు ఉన్నప్పుడు అవి కలిసివుంటే, దానిని సంయుక్త అండాశయం అంటారు.
ఉదా : టొమాటో.

ప్రశ్న 16.
‘అండాన్యాసం’ ను నిర్వచించండి. డయాంథర్లో ఏ రకం అండన్యాసం కనిపిస్తుంది?
జవాబు:
అండాశయంలో అండాలు అమరి ఉండే విధానాన్ని అండన్యాసం అంటారు. డయాంథస్ లో స్వేచ్ఛా కేంద్ర అండన్యాసం ఉంటుంది.

ప్రశ్న 17.
అనిషేక ఫలం అంటే ఏమిటి? అది ఏ విధంగా ఉపయోగపడుతుంది?
జవాబు:
ఫలదీకరణం చెందని అండాశయం నుండి ఏర్పడే ఫలాన్ని అనిషేకఫలం అంటారు. దీని ద్వారా వాణిజ్య పరంగా విత్తన రహిత ఫలాలను పొందవచ్చు.

AP Inter 1st Year Botany Study Material Chapter 5 పుష్పించే మొక్కల స్వరూపశాస్త్రం

ప్రశ్న 18.
మామిడిలో ఏ రకం ఫలం ఉంది? అది కొబ్బరి ఫలాన్ని ఏ విధంగా విభేదిస్తుంది?
జవాబు:
‘మామిడి’లో ‘టెంకెగల ఫలం’ ఉంటుంది. మామిడిలో బాహ్య ఫల కవచం పలుచగా, మధ్య ఫలకవచం కండగల్గి, విధంగా లోపల టెంకెలాంటి అంతరఫలకవచంతో ఉంటుంది. కొబ్బరిలో మధ్య ఫలకవచము పీచులాగా ఉంటుంది.

ప్రశ్న 19.
కొన్ని ఫలాలను అనృత ఫలాలు అని ఎందుకు అంటారు? రెండు ఉదాహరణలను ఇవ్వండి.
జవాబు:
అండాశయంతోపాటు, పుష్పంలో ఏ ఇతర భాగాలైనా ఫలంగా మారిన, వాటిని అనృతఫలాలు అంటారు.
ఉదా : ఆపిల్లో పుష్పాసనం నుంచి అనృతఫలం ఏర్పడుతుంది. జీడిమామిడిలో పుష్పవృంతం నుంచి అనృతఫలం ఏర్పడుతుంది.

ప్రశ్న 20.
ఒకే విత్తనంగల శుష్క ఫలాలను ఏర్పరచే రెండు మొక్కల పేర్లను తెలపండి.
జవాబు:

  1. వరి
  2. జీడి మామిడి
  3. గడ్డి చేమంతి.

ప్రశ్న 21.
షైజోకార్పిక్ శుష్క ఫలాలను నిర్వచించండి. ఒక ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
ఫలాలు పక్వదశలో పగిలి ఒక్క విత్తనం కల మొక్కలు ఏర్పడుతాయి. దానిని షైజోకార్పిక్ శుష్క ఫలాలు అంటారు. ఉదా : అకేసియా, ఆముదం.

ప్రశ్న 22.
‘ఫలాంశం’ను నిర్వచించండి. ఏ మొక్కలో అది ఏర్పడుతుంది?
జవాబు:
షైజోకార్పిక్ ఫలాలలోని ఒక విత్తనం కల మొక్కలను ఫలాంశాలు అంటారు.
ఉదా : అకేసియా.

ప్రశ్న 23.
సంకలిత ఫలాలు అని వేటిని అంటారు? రెండు ఉదాహరణలు తెలపండి.
జవాబు:
సీతాఫలంలో అనేక ఫలదళాలు స్వేచ్ఛగా ఉంటాయి. ప్రతిఫలదళం ఒక చిరుఫలంగా అభివృద్ధి చెందుతుంది. అటువంటి గుమిగూడిన ఫలాలను సంకలిత ఫలాలు అంటారు.
ఉదా : అనోనా, నరవేలియా.

ప్రశ్న 24.
పుష్ప విన్యాసం అంతా ఒక ఫలంగా ఏర్పరచే మొక్కను తెలపండి. అటువంటి ఫలాన్ని ఏమంటారు? [Mar. ’14]
జవాబు:
పైన్ ఆపిల్ (ఆనాస). దీనిలోని ఫలమును సంయోగఫలము అంటారు.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
వేరులోని వివిధ మండలాలను పటం సహాయంతో వివరించండి.
జవాబు:
వేరులో నాలుగు మండలాలు కనిపిస్తాయి. అవి :
AP Inter 1st Year Botany Study Material Chapter 5 పుష్పించే మొక్కల స్వరూపశాస్త్రం 1
1) వేరు తొడుగు మండలము :
వేరు కొనభాగమును కప్పుతూ ఉన్న టోపీ వంటి నిర్మాణమును వేరు తొడుగు అంటారు. ఇది వేరు మృత్తికలోకి చొచ్చుకు పోయేటప్పుడు వేరు కొనను రక్షిస్తుంది.

2) విభజన జరిగే మండలము :
వేరు తొడుగుపైన ఈ మండలం ఉంటుంది. దీనిలోని కణాలు చిన్నవిగా, పలుచని కణకవచాలు కలిగి, చిక్కని కణద్రవ్యంతో ఉంటాయి. ఇవి మరల, మరల విభజన చెందుతూ క్రొత్త కణాలను ఏర్పరుస్తాయి.

3) పొడవు పెరిగే మండలము :
విభజన జరిగే మండలానికి సమీపంగా ఉన్న కణాలు పొడవుగా సాగి పరిమాణంలో పెరుగుట ద్వారా వేరు పొడవు ఎదగటానికి తోడ్పడతాయి.

4) ముదిరిన మండలము :
ఈ ప్రాంతంలోని వేరు కణాలు క్రమేణా విభేదన చెంది పక్వమవుతాయి. కావున దీనిని ముదిరిన మండలం అంటారు. దీనిలోని కొన్ని బాహ్య చర్మ కణాల నుండి చాలా సన్నని, సున్నితమైన దారాల వంటి మూలకేశాలు ఏర్పడతాయి. ఇవి నేల నుండి నీరు, ఖనిజలవణాలను శోషించడానికి తోడ్పడతాయి.

AP Inter 1st Year Botany Study Material Chapter 5 పుష్పించే మొక్కల స్వరూపశాస్త్రం

ప్రశ్న 2.
“మొక్కలోని భూగర్భ భాగాలన్నీ వేర్లు కావు” ఈ వాక్యాన్ని బలపరచండి.
జవాబు:
కొన్ని మొక్కలలో కాండాలు మృత్తికలోనికి పెరిగి, ఆహారపదార్థాలను నిల్వచేయడమే కాకుండా, పెరుగుదలకు, ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని దీర్ఘకాలికతను చూపే అంగాలుగాను పనిచేస్తాయి. అంతేకాక శాఖీయ ప్రత్యుత్పత్తికి మరియు గడ్డితినే జంతువుల నుండి రక్షణ పొందుతాయి. భూగర్భ కాండాలపై కనుపులు, కనుపు నడిమిలు, మొగ్గలు, పొలుసాకులు ఉంటాయి. కావున మొక్కలోని భూగర్భ భాగాలన్ని వేర్లు కావు అని చెప్పవచ్చు.
ఉదా : బంగాళదుంపలోని దుంపకాండము, అల్లంలోని కొమ్ము, చేమదుంపలోని కందము, ఉల్లిలోని లశునము.

ప్రశ్న 3.
పత్ర విన్యాసంలోని వివిధ రకాలను ఉదాహరణలతో వివరించండి.
జవాబు:
కాండంపైన లేదా శాఖలపైన పత్రాలు అమరి ఉండే విధానాన్ని పత్రవిన్యాసం అంటారు. ఇవి మూడు రకాలు.

1) ఏకాంతర పత్రవిన్యాసము :
ప్రతి కణుపు వద్ద ఒకే పత్రం ఏకాంతరంగా ఏర్పడుతుంది.
ఉదా : మందార, ఆవ

2) అభిముఖ పత్రవిన్యాసము :
ప్రతి కణుపు వద్ద రెండు పత్రాలు ఏర్పడి, ఎదురెదురుగా అమరి ఉంటాయి. ఉదా : జిల్లేడు, జామ

3) చక్రియ పత్రవిన్యాసము :
ప్రతి కణుపు వద్ద రెండు కంటే ఎక్కువ పత్రాలు ఏర్పడి వలయంగా అమరి ఉంటాయి. ఉదా : గన్నేరు, ఆలోస్టోనియ.

ప్రశ్న 4.
పత్రరూపాంతరాలు మొక్కలకు ఏవిధంగా తోడ్పడతాయి?
జవాబు:
పత్రరూపాంతరాలు మొక్కలకు అనేక విధాలుగా ఉపయోగపడతాయి. అవి
1) నులితీగలు :
బలహీనకాండం కల మొక్కలైన బఠాణీలో పత్రాలు నులితీగలుగా మారి మొక్క ఎగబాకుటకు తోడ్పడతాయి.

2) కంటకాలు :
ఎడారి మొక్కలలో భాష్పోత్సేకమును తగించుటకు, రక్షణకు పత్రాలు కంటకాలుగా మారతాయి.
ఉదా : కాక్టై

3) పొలుసాకులు :
నీరుల్లి, వెల్లుల్లిలలో పత్రాలు ఆహార పదార్థాలను నిల్వచేసి, కండగల పత్రాలుగా మారతాయి.

4) ప్రభాసనము :
ఆస్ట్రేలియన్ అకేసియాలో పత్రాలు పిచ్చాకార సంయుక్త పత్రాలుగా ఉంటాయి. వీటిలో గల పత్రకాలు చిన్నవిగా ఉండి లేతదశలో రాలిపోతాయి. ఆ మొక్కలోని పత్రవృంతాలు విస్తరించి ఆకుపచ్చగా మారి ఆహార పదార్థాలను తయారు చేస్తాయి. వాటిని ప్రభాసనము అంటారు.

5) బోను పత్రాలు :
కొన్ని మొక్కలలో కీటకాలను బంధించుట కొరకు పత్రాలు బోనులుగా రూపాంతరం చెంది, వాటిని చంపి, నత్రజని సంబంధ పదార్థాలను గ్రహిస్తాయి.
ఉదా : నెఫంథిస్, డయోనియా.

6) ప్రత్యుత్పత్తి పత్రాలు :
బ్రయోఫిల్లమ్ పత్రపు అంచులలో గల గుంటలలో పత్రోపరిస్థిత మొగ్గలు ఏర్పడి, పత్రం నుండి విడిపోయేటప్పుడు అబ్బురపు వేర్లను ఏర్పరుచుకుని స్వతంత్ర మొక్కలుగా పెరిగి శాఖీయ ప్రత్యుత్పత్తికి తోడ్పడతాయి.
AP Inter 1st Year Botany Study Material Chapter 5 పుష్పించే మొక్కల స్వరూపశాస్త్రం 2

ప్రశ్న 5.
ఏవైనా రెండు రకాల ప్రత్యేక పుష్పవిన్యాసాలను వివరించండి.
జవాబు:
సయాథియమ్ :
ఈ ప్రత్యేక పుష్పవిన్యాసం ఒకే పుష్పంలా కనిపిస్తుంది. ఇది యుఫర్బియేసి కుటుంబ మొక్కలలో కనిపిస్తుంది. పుష్పవిన్యాసాన్ని ఆవరించి లోతైన గిన్నెవంటి పరిచక్రపుచ్ఛావళి ఉంటుంది. దీని వెలుపలి భాగంలో మకరంద గ్రంథులు ఉంటాయి. గిన్నె మధ్యభాగంలో పొడవైన వృంతంగల త్రిఫలదళ సంయుక్త అండకోశం ఉంటుంది. ఇది స్త్రీ పుష్పం. దీనిచుట్టూ అనేక పురుషపుష్పాలు వృశ్చికాకార సైవ్లో అమరిఉంటాయి. ప్రతీ పురుషపుష్పం ఒక్కొక్క వృంతయుత కేసరాన్ని పోలి ఉంటుంది. స్త్రీ, పురుషపుష్పాలు పరిపత్రరహితాలు. పుష్పాలు కేంద్రాపసారక్రమంలో అమరి ఉంటాయి.
ఉదా : యుఫర్బియా, పోయిన్సెట్టియా.

హైపస్ థోడియమ్ :
ఇది ఒక ఫలాన్ని పోలిన పుష్పవిన్యాసం. దీనిలో పుష్పవిన్యాసాక్షం సంక్షిప్తమై ఉబ్బి, రసభరితమైన గిన్నెవంటి నిర్మాణాన్ని ఏర్పరుస్తుంది. దీని అగ్రంలో చిన్నరంధ్రం ఉంటుంది. ఈ పుష్పవిన్యాస వృంతం లోపలి కవచంపై అనేక సూక్ష్మమైన, వృంతరహిత, ఏకలింగక పుష్పాలు అభివృద్ధి చెందుతాయి. పురుషపుష్పాలు అగ్ర రంధ్రానికి దగ&గరగాను, స్త్రీ పుష్పాలు క్రింది భాగంలోను ఏర్పడతాయి. వీటి మధ్యలో కొన్ని వంధ్య స్త్రీ పుష్పాలుంటాయి. వీటిని ‘గాల్ పుష్పాలు’ అంటారు. ఈ పుష్పాలు వికసించే పద్ధతి నిర్ణీత క్రమంలో ఉండదు.
ఉదా : ఫైకస్

AP Inter 1st Year Botany Study Material Chapter 5 పుష్పించే మొక్కల స్వరూపశాస్త్రం

ప్రశ్న 6.
పుష్పభాగాలు పుష్పాసనం మీద అమరి ఉన్న విధానాన్ని బట్టి వర్ణించండి.
జవాబు:
పుష్పాసనంపై అండాశయ స్థానమును ఇతర పుష్పభాగాలలో పోల్చిపుష్పాలను మూడు రకాలుగా వర్గీకరించారు. అవి :
1) అండకోశాథస్థిత పుష్పము :
పుష్పాసనం అగ్రభాగంలో అండకోశం ఉంటుంది. మిగిలిన పుష్పభాగాలు దాని కింద అమరి ఉంటాయి. దీనిలోని అండాశయాన్ని ఊర్థ్వము అంటారు. ఉదా : ఆవాలు, వంగ

2) పర్యండ కోశ పుష్పము :
పుష్పాసనం మధ్యలో అండకోశం అమరి ఉండి, మిగిలిన పుష్పభాగాలు, పుష్పాసనం అంచునుండి ఒకే ఎత్తులో అమరి ఉంటాయి. దీనిలోని అండాశయాన్ని అర్థ-ఊర్ధ్వ అంటారు.
ఉదా : గులాబీ, బఠాణీ

3) అండకోశోపరిస్థిత పుష్పము :
పుష్పాసనం అంచు పైకి పెరిగి, అండాశయాన్ని పూర్తిగా ఆవరించి ఉంటుంది. మిగిలిన పుష్పభాగాలు అండాశయం పైనుంచి ఏర్పడతాయి. దీనిలో అండాశయాన్ని నిమ్నం అని అంటారు.
ఉదా : జామ, దోస
AP Inter 1st Year Botany Study Material Chapter 5 పుష్పించే మొక్కల స్వరూపశాస్త్రం 3

ప్రశ్న 7.
“రక్షకపత్రాలు, ఆకర్షణపత్రాలు కలిగిన ఆవృతబీజ మొక్కల పుష్పాలు రక్షక, ఆకర్షణపత్రాలు వాటి వలయాల్లోని అమరికలో విభేదిస్తాయి” వివరించండి.
జవాబు:
పుష్పం మొగ్గదశలో ఉన్నప్పుడు, రక్షకపత్రావళి, ఆకర్షణ పత్రావళి అమరి ఉన్న విధానాన్ని పుష్పరచన అంటారు. దీనిలో 4 రకములు కలవు.
AP Inter 1st Year Botany Study Material Chapter 5 పుష్పించే మొక్కల స్వరూపశాస్త్రం 4
1) కవాటయుత పుష్పరచన :
రక్షక లేక ఆకర్షణ పత్రాలు ఒక వలయంలో అంచుల వద్ద తాకి ఒకదానికొకటి అతివ్యాప్తంగా గాకుండా ఉంటాయి.
ఉదా : జిల్లేడు.

2) మెలితిరిగిన పుష్పరచన :
రక్షక, ఆకర్షణ పత్రాల ఒక భాగము అంచుదాని పక్కనే ఉన్న భాగపు అంచును కప్పుతూ అతివ్యాప్తంగా ఉంటుంది.
ఉదా : పత్తి,

3) ఇంబ్రికేట్ పుష్పరచన :
రక్షక ఆకర్షణ పత్రాల అంచులు ఏదో ఒక దిశలోగాకుండా, ఒకదానికొకటి అతివ్యాప్తమై ఉంటాయి.
ఉదా : కాసియా

4) వెక్సిల్లరీ :
బఠాణీ, చిక్కుడు పుష్పాలలో ఐదు ఆకర్షణ పత్రాలు ఉంటాయి. ఒక పెద్ద ఆకర్షణ పత్రము (ధ్వజం) రెండు పార్శ్వ ఆకర్షణ పత్రాలును (బాహువులు) కప్పిఉంచుతుంది. ఈ రెండు బాహువులు తిరిగి’ పూర్వాంతంలో ఉన్న రెండు అతి చిన్నవైన ఆకర్షణ పత్రాలను (ద్రోణులు) కప్పి ఉంచుతాయి.
ఉదా : చిక్కుడు, బఠాణీ.

ప్రశ్న 8.
పుష్పించే మొక్కలలోని నాలుగు అండన్యాస రకాలను వర్ణించండి.
జవాబు:
అండాశయంలో అండాలు అమరి ఉండే విధానాన్ని అండన్యాసం అంటారు. దీనిలో 5 రకాలు కలవు.
1) ఉపాంత అండన్యాసము :
అండన్యాస స్థానము అండాశయపు ఉదరపు అంచువెంట గట్టు లాంటి నిర్మాణాన్ని ఏర్పరచి, దానిపై రెండు వరుసలలో అండాలను కలిగి ఉంటుంది.
ఉదా : బఠాణీ

2) అక్షియ అండన్యాసం :
బహూబిలయుత అండాశయంలో అండన్యాసస్థానం అక్షయంగా ఉండి, దానిపై అండాలు అతుక్కుని ఉంటాయి.
ఉదా : టొమాటో

3) కుడ్య అండన్యాసము :
అండాలు, అండాశయం లోపలి గోడలపైగాని, పరధీయ భాగపై గాని అభివృద్ధి చెంది ఉంటాయి. ఏకబిలయుత అండాశయంలో అనృతకుడ్యం ఏర్పడుట వల్ల ద్విబిలయుతము అవుతుంది.
ఉదా : ఆవ

4) స్వేచ్ఛాకేంద్ర అండన్యాసము :
పటరహిత కేంద్రీయ అక్షంమీద అండాలు ఏర్పడతాయి.
ఉదా : డయాంథస్

5) పీఠ అండన్యాసము :
అండన్యాస స్థానము అండాశయ పీఠంనుంచి వృద్ధి చెంది, ఒకే అండాన్ని కల్గిఉంటుంది.
ఉదా : పొద్దు తిరుగుడు.
AP Inter 1st Year Botany Study Material Chapter 5 పుష్పించే మొక్కల స్వరూపశాస్త్రం 5

ప్రశ్న 9.
మీరు అధ్యయనం చేసిన కండగల ఫలాలను క్లుప్తంగా వర్ణించండి.
జవాబు:
అభివృద్ధి చెందిన తర్వాత పక్వమయ్యే ఫలాలను కండగల ఫలాలు అంటారు. ఇవి 5 రకాలు.
1) మృదుఫలము :
ఇది ద్విఫలదళ లేక బహుఫలదళ సంయుక్త అండకోశము నుంచి అభివృద్ధి చెందుతుంది. దీనిలో మధ్య ఫలకవచము, అంతఃఫలకవచం సంయుక్తమై గుజ్జును ఏర్పరుస్తాయి. విత్తనాలు గట్టిగా ఉంటాయి.
ఉదా : టొమాటో, జామ

2) పెపో :
ఇవి త్రిఫలదళ, సంయుక్త నిమ్న అండాశయం నుంచి ఏర్పడుతుంది. బాహ్య ఫలకవచము పెచ్చులాగా, మధ్యఫలకవచము కండ కలిగి, అంతఃఫలకవచము మెత్తగాను ఉంటాయి.
ఉదా : దోస

3) పోమ్ :
ఈ ఫలము ద్వి లేక బహుఫలదళ, సంయుక్త నిమ్న అండాశయము నుంచి ఏర్పడి, కండ గల పుష్పాసనంతో ఆవరించబడి ఉంటుంది. అంతః ఫలకవచము గట్టిగా సాగే భాగంగా ఉంటుంది.
ఉదా : ఆపిల్

4) హెస్పిరీడియమ్ :
ఈ ఫలకము బహూఫలదళ సంయుక్త, ఊర్థ్వ అండాశయము నుంచి ఏర్పడుతుంది. బాహ్యఫలకవచము చర్మిలమై తైలగ్రంథులతో ఉంటుంది. మధ్యఫలకవచము పలుచని కాగితము వలె, అంతఃఫలకవచము రసభరితకేశాలను కలిగి ఉంటాయి.
ఉదా : నిమ్మ.

5) టెంకెగల ఫలము :
ఈ ఫలం ఏకఫలదళ, ఊర్థ్వ అండాశయము నుంచి ఏర్పడి ఒక విత్తనాన్ని కలిగి ఉంటుంది. మామిడిలో బాహ్య ఫలకవచము పలుచగా, మధ్యఫలకవచము కండగల తినే భాగంగా, అంతఃఫలకవచము గట్టి టెంకెలాగా ఉంటాయి. ‘కొబ్బరిలో మధ్యఫలకవచము పీచులాగా ఉంటుంది.
AP Inter 1st Year Botany Study Material Chapter 5 పుష్పించే మొక్కల స్వరూపశాస్త్రం 6

ప్రశ్న 10.
మీరు అధ్యయనం చేసిన వివిధ రకాల శుష్కఫలాలను ఉదాహరణలతో వర్ణించండి.
జవాబు:
అభివృద్ధి చెందిన తర్వాత, ఎండిపోయి లేదా కండరహితంగా ఉండే ఫలాలను శుష్కఫలాలు అంటారు. ఇవి 3 రకాలు.
1) శుష్కవిధారక ఫలాలు :
పక్వదశలో ఎండి, పగిలి విత్తనాలను విడుదల చేస్తాయి. ఉదా : చిక్కుడు, బఠాణీలలో ఫలాలు వృష్టోదర తలాలలో పగిలి రెండు భాగాలుగా విడిపోతాయి. వాటిని ద్వివిదారక ఫలాలు అంటారు. పత్తి దత్తూరలలో గుళిక అనేక విధాలుగా పగిలి విత్తనాలను విడుదల చేస్తుంది.
AP Inter 1st Year Botany Study Material Chapter 5 పుష్పించే మొక్కల స్వరూపశాస్త్రం 7

2) శుష్క అవిధారక ఫలాలు :
ఇవి ఒక విత్తనం మాత్రమే కలిగి, ఫలకవచం క్షీణించిన తర్వాత విత్తనాన్ని విడుదల చేస్తాయి.
ఉదా : a) వరిలో ఫలకవచము, బీజ కవచము సంయుక్తమై అంటాయి. దీనిని కవచబీజకము అంటారు.
b) జీడి మామిడిలో పెంకులాంటి ఫలకవచము కలిగి బహుఫలదళ సంయుక్త అండాశయం నుంచి ఏర్పడిన పెంకుగల ఫలం ఉంటుంది.
c) గడ్డి చేమంతిలో ఒక విత్తనం కల ‘సిప్సెలా’ ఫలము దీర్ఘకాలిక కేశగుచ్ఛము కలిగి ఉంటుంది.
AP Inter 1st Year Botany Study Material Chapter 5 పుష్పించే మొక్కల స్వరూపశాస్త్రం 8
c) బిదుర ఫలాలు : ఫలము అభివృద్ధి చెందిన తర్వాత ఒక విత్తనం కల ముక్కలుగా పగిలే ఫలాలు.
AP Inter 1st Year Botany Study Material Chapter 5 పుష్పించే మొక్కల స్వరూపశాస్త్రం 9
ఉదా : అకేసియా, ఆముదము

దీర్ఘ సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
వేరును నిర్వచించండి. వేరు వ్యవస్థలోగల రకాలను తెలపండి. వివిధ విధులను నిర్వర్తించడానికి వేరు ఏ విధంగా రూపాంతరం చెందిందో వివరించండి.
జవాబు:
పిండంలోని ప్రథమ మూలము నేరుగా సాగి మృత్తికలోకి ప్రాథమిక వేరుగా పెరుగుతుంది. ఆవృత బీజాలలో రెండు రకాల వేరు వ్యవస్థలు ఉంటాయి.
అవి :
1. తల్లివేరు వ్యవస్థ
2. పీచువేరు వ్యవస్థ

1) తల్లివేరు వ్యవస్థ :
ప్రథమ మూలము నుండి ఏర్పడిన ప్రాథమిక వేరు మృత్తికలోనికి పెరిగి, ద్వితీయ, తృతీయలాంటి అనేక క్రమాల వేర్లను పార్శ్వంగా కలిగి తల్లివేరు వ్యవస్థగా మారుతుంది. ఇది ద్విదళ బీజ మొక్కలలో కనిపిస్తుంది.

2) పీచువేరు వ్యవస్థ :
ప్రథమ మూలము నుండి ఏర్పడిన తల్లివేరు స్వల్పకాలికంగా ఉండి దాని స్థానంలో అనేక సంఖ్యలో వేర్లు కాండము దిగువ భాగం నుంచి ఏర్పడతాయి. ఇది ఏకదళ బీజ మొక్కలలో కనిపిస్తుంది.
AP Inter 1st Year Botany Study Material Chapter 5 పుష్పించే మొక్కల స్వరూపశాస్త్రం 10

వేరు రూపాంతరాలు :
కొన్ని మొక్కలలో వేర్లు నీరు, ఖనిజలవణాల శోషణ, సరఫరా కాకుండా ఇతర విధులు నిర్వర్తించడానికి వాటి ఆకారం, నిర్మాణంలో మార్పు చెందుతాయి. వాటిని వేరు రూపాంతరాలు అంటారు. ఇవి
వివిధ రకాలు :
1) నిల్వవేర్లు :
క్యారట్, టర్నిప్లలో తల్లివేర్లు, చిలకడదుంపలలో అబ్బురపు వేర్లు. ఆస్పరాగస్ లో పీచువేర్లు ఆహార పదార్థములను నిల్వచేయుట వల్ల ఉబ్బుతాయి.

2) ఊడవేర్లు :
మర్రి వృక్షంలో శాఖల నుంచి అబ్బురపు వేర్లు ఏర్పడి, నేలలోకి పెరిగి క్రమంగా స్థంబాలవవె మారతాయి. వాటిని ఊడవేర్లు లేదా స్థంభాల వంటి వేర్లు అంటారు.

3) ఊతవేర్లు :
మొక్కజొన్న, చెరకులలో వేర్లు కాండము కింది కణుపుల నుండి ఏర్పడి, ఆధారాన్నిస్తాయి.

4) శ్వాసవేర్లు :
రైజోఫోరా, అవిసీనియా వంటి బురద ప్రాంతాలలో పెరిగే మాంగ్రూవ్లలో అనేక వేర్లు భూమిపైకి పెరిగి, శ్వాసక్రియకు అవసరమైన ఆక్సిజన్ పొందుటకు సహాయపడతాయి.

5) వృక్షోపజీవవేర్లు :
ఇతర మొక్కలపై పెరిగే వృక్షోపజీవులలో అబ్బురపు వేర్లు ఏర్పడి వాతావరణంలోని తేమను శోషిస్తాయి. వాటిని వెలమిన్ వేర్లు అంటారు.

6) పరాన్న జీవవేర్లు :
విస్కమ్, స్ట్రెగా వంటి మొక్కలలో (పాక్షిక పర్నాజీవులు) హాస్టోరియల్ అనేవేర్లు ఆతిథేయి దారువులోనికి ప్రవేశించి నీరు, ఖనిజలవణాలను శోషిస్తాయి. కస్క్యూట, రఫ్టీసియావంటి మొక్కలలో (సంపూర్ణ పరాన్నజీవులు) హస్టోరియల్ వేర్లు ఆతిథేయి దారువు, పోషక కణజాలములోనికి ప్రవేశించి, నీరు, ఖనిజ లవణాలు, పోషక పదార్థాలను శోషిస్తాయి.

7) బుడిపెలు కల వేర్లు :
ఫాబేసి కుటుంబానికి చెందిన మొక్కలో వాతావరణంలోని నత్రజనిని మొక్కలలో స్థాపించడానికి ‘రైజోబియమ్’ అనే బాక్టీరియమ్, వాటి వేరు వ్యవస్థలో నివాసం ఉంటూ బుడిపెలను ఏర్పరుస్తుంది.

8) కిరణజన్య సంయోగక్రియా వేర్లు :
టీనియోఫిల్లమ్ వంటి కొన్ని మొక్కలలో వేర్లు పత్రహరితం కలిగి కిరణజన్య సంయోగక్రియ జరుపుకుంటాయి.
AP Inter 1st Year Botany Study Material Chapter 5 పుష్పించే మొక్కల స్వరూపశాస్త్రం 11

ప్రశ్న 2.
వివిధ విధులను నిర్వర్తించడం కోసం కాండం ఏ విధంగా అనేక రకాలుగా రూపాంతం చెందిందో వివరించండి. [Mar. ’14]
జవాబు:
వివిధ విధులు నిర్వర్తించడానికి కాండము వివిధ రకాలుగా రూపాంతరం చెందుతుంది. కొన్ని మొక్కలలో కాండము మృత్తికలోనికి పెరిగి ఆహార పదార్థములను నిల్వ చేయుటమే కాక, పెరుగుదలకు, ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని దీర్ఘకాలికత చూపుటకు, శాఖీయ వ్యాప్తికి తోడ్పడతాయి. వాటిని భూగర్భ కాండరూపాంతరాలు అంటారు.
ఉదా : బంగాళదుంపలో దుంపకాండము, అల్లంలో కొమ్ము, చేమ దుంపలో కందము, నీరుల్లిలో లశునము. కొన్ని మొక్కలలో వాయుగత కాండాలు అనేక రూపాంతరాలను చూపిస్తాయి. అవి
AP Inter 1st Year Botany Study Material Chapter 5 పుష్పించే మొక్కల స్వరూపశాస్త్రం 12

  1. దోస, గుమ్మడిలో గ్రీవపు మొగ్గల నుంచి, ద్రాక్షలో కొనమొగ్గనుంచి ఏర్పడే సున్నితమైన చుట్టుకుని ఉన్న నిర్మాణాలు ఏర్పడి, ఎగబాకుటలో తోడ్పడతాయి.
  2. కాండపు మొగ్గులు చేవదేరిన, నిటారు, మొనదేలిన ముళ్ళుగా మారి గడ్డితిని జంతువుల నుండి రక్షించుకుంటాయి.
  3. వర్షాభావ ప్రాంతాలలోని కొన్ని మొక్కలలో కాండాలు రూపాంతరం చెంది రసభరితమై బల్లపరుపుగా ఉండే (బ్రహ్మజెముడు) లేదా స్థూపాకారంగా (యుఫోర్బియ) లేదా సూదులవంటి (సరుగుడు) నిర్మాణాలుగా మారతాయి. వాటిలో పత్రాలు కంటకాలు లేక పొలుసులుగా రూపాంతరం చెంది భాష్పోత్సేకాన్ని తగ్గిస్తాయి. కావున వాటి కాండాలు పత్రహరితాన్ని కలిగి కిరణజన్య సంయోగక్రియను జరుపుకుంటాయి. వాటిని పత్రాభాకాండాలు అంటారు. ఆస్పరాగస్ నిర్ణీత పెరుగుదల కల శాఖలు కిరణజన్య సంయోగక్రియ జరుపుతాయి. వాటిని క్లాడోఫిల్స్ అంటారు.
  4. కొన్ని మొక్కలలో (డయాస్కోరియా) లో శాకీయ మొగ్గలు, లేదా పూమొగ్గలు (అగేవ్) ఆహార పదార్థాలను నిల్వ చేస్తాయి. అవి తల్లి మొక్కనుంచి విడిపోయినప్పుడు, నేలను తాకి అబ్బురపు వేర్లను ఏర్పరుచుకుని శాకీయ ప్రత్యుత్పత్తికి తోడ్పడతాయి.

AP Inter 1st Year Botany Study Material Chapter 5 పుష్పించే మొక్కల స్వరూపశాస్త్రం 13
కొన్ని ఉపవాయుగత కాండాలలో శాకీయ ప్రత్యుత్పత్తికి ఉపయోగపడే నిర్మాణాలు ఏర్పడతాయి అవి :
AP Inter 1st Year Botany Study Material Chapter 5 పుష్పించే మొక్కల స్వరూపశాస్త్రం 14

1) రన్నర్లు :
కొన్ని గడ్డిమొక్కలు, ఆక్సాలిస్లో ఉపవాయుగత కాండాలు కొత్త ప్రదేశాలకు విస్తరించి, వృద్ధ బాగాలు నశించినపుడు కొత్త మొక్కలను ఏర్పరుస్తాయి. వాటిని రన్నర్లు అంటారు.

2) స్టోలన్లు :
నీరియమ్, మల్లెలులలో ప్రధాన అక్షం పీఠభాగం నుండి సున్నితమైన పార్శ్వశాఖలు ఏర్పడి వాయుగతంగా పెరిగిన తర్వాత, వంగి భూమిని తాకినప్పుడు అబ్బురపు వేర్లను ఏర్పరుచుకుని కొత్త మొక్కగా పెరుగుతాయి.

3) ఆఫ్సెట్లు :
పిస్టియా, ఐకార్నియా వంటి నీటి పై తేలేమొక్కలలో ఒక కణుపు. మధ్యమండల పార్శ్వశాఖ ఏర్పడుతుంది. ప్రతికణుపు వద్ద రోజెట్ క్రమంలో ఉండే పత్రాలను, చక్రాభ కాండం పీఠభాగం నుంచి ఏర్పడిన సంతులనంజరిపే వేర్లను కలిగి ఉంటుంది.

4) సక్కర్లు :
అరటి, అనాసలలో ప్రధాన అక్షం పీఠభాగము భూగర్భ కాండాల నుండి పార్శ్వశాఖలు ఏర్పడి, కొంతవరకు నేలలో సమాంతరంగా పెరిగి తర్వాత ఏటవాలుగా భూమిపైకి వచ్చి పత్రయుత శాఖలను ఏర్పరుస్తాయి. వీటిని పిలకమొక్కలు అంటారు.

AP Inter 1st Year Botany Study Material Chapter 5 పుష్పించే మొక్కల స్వరూపశాస్త్రం

ప్రశ్న 3.
వివిధ రకాల మధ్యాభిసార పుష్పవిన్యాసాలను వివరించండి.
జవాబు:
మధ్యాభిసార పుష్పవిన్యాసములో అనేకరకములు కలవు అవి :
1) మధ్యాభిసార :
పుష్పవిస్యాస అక్షము శాఖారహితంగా లేదా శాఖాయుతంగా సరళంగా ఉండి, అనేక వృంతసహిత పుచ్చసహిత పుష్పాలను అగ్రాభిసార క్రమంలో కల్గి ఉంటుంది.
ఉదా : జనుము, మామిడి

2) సమశిఖి :
పుష్పవిన్యాసఅక్షం పొడవుగా అనేక పుష్పాలను అగ్రాభిసార క్రమంలో ఏర్పడుస్తుంది. పుష్పాలు వివిధ – కణుపుల వద్ద ఏర్పడినప్పటికి, పుష్పవృంతాలు వేర్వేరు పొడవుల్లో ఉండుటవల్ల, పుష్పాలన్నీ ఒకే ఎత్తులో అమరి ఉంటాయి.
ఉదా : కాసియా, కాలిఫ్లవర్

3) గుచ్చము :
పుష్పవిన్యాస అక్షం కొనభాగంలో పుష్పాలన్ని ఒకే స్థానం నుంచి ఉద్భవించినట్లు కనిపిస్తాయి. ఇవి పరిచక్రపూచ్ఛావః అనే పుచ్చాల వలయంచే కప్పబడి ఉంటుంది.
ఉదా : నీరుల్లి, కారట్ (ఏపియేసి)

4) కంకి :
పుష్పవిన్యాస అక్షం పై అనేక వృంతరహిత పుష్పాలు అగ్రాభిసార క్రమంలో అమరి ఉంటాయి.
ఉదా : ఉత్తరేణి, గడ్డి (పోయేసి)

5) స్పాడిక్స్ :
పుష్ప విన్యాసం, మట్టి అనే పుష్పపుచ్చ రూపాంతరంతో రక్షించబడుతూ, వృంతరహిత, ఏకలింగక, వంధ్య పుష్పాలను అగ్రాభిసార క్రమంలో కలిగి ఉంటుంది.
ఉదా : అరటి, కొబ్బరి

6) శీర్షవత్ పుష్పవిన్యాసము :
కుచించుకు పోయిన పుష్పవిన్యాస అక్షంపై ఏకలింగక, ద్విలింగక, వృంతరహిత పుష్పాలు కేంద్రాభిసారంగా వృద్ధి చెందుతాయి.
ఉదా : గడ్డి చేమంతి, పొద్దుతిరుగుడు.
AP Inter 1st Year Botany Study Material Chapter 5 పుష్పించే మొక్కల స్వరూపశాస్త్రం 16

Intext Question and Answers

ప్రశ్న 1.
ఏ మొక్కలోని భూగర్భ కాండము, మృత్తికలో భూమికి సమాంతరంగా పెరుగుతూ దీర్ఘకాలికంగా జీవించడానికి తోడ్పడుతుంది?
జవాబు:
అల్లం – జింజిబర్ అఫీషినాలిస్

ప్రశ్న 2.
సూదుల వంటి పత్రాభకాండాలు ఏ మొక్కలో ఉంటాయి?
జవాబు:
సరుగుడు (కాజురైనా)

ప్రశ్న 3.
నెఫంథిస్ వంటి మొక్కలు ఎందుకు కీటకాలను బంధిస్తాయి?
జవాబు:
నత్రజని – కొరకు

ప్రశ్న 4.
ఆస్టరేసి కుటుంబపు మొక్కలలో గల స్వాభావిక పుష్పవిన్యాసాన్ని తెలపండి?
జవాబు:
శీర్షవత్ విన్యాసము

ప్రశ్న 5.
తన పుష్పవిన్యాసంలో అతి తక్కువ సంఖ్యలో పుష్పాలను కలిగిన ఒక మొక్క పేరు తెలపగలరా?
జవాబు:
మందార (హైబిస్కస్ రోజా సైనెన్సిస్)

AP Inter 1st Year Botany Study Material Chapter 5 పుష్పించే మొక్కల స్వరూపశాస్త్రం

ప్రశ్న 6.
ఏ కుటుంబంలో నగ్న పుష్పాలు కనిపిస్తాయి?
జవాబు:
యుఫోర్బియేసి – సయాథియమ్

ప్రశ్న 7.
మర్రి వృక్షాలలోని ఏ పుష్పాలలో బ్లాస్టోఫాగా కీటకం గుడ్లు పెడుతుంది?
జవాబు:
గాల్ పుష్పాలలో

ప్రశ్న 8.
కెన్నా పుష్పాలు ఏ రకం సౌష్ఠవాన్ని చూపిస్తాయి?
జవాబు:
సౌష్టవ రహితము

ప్రశ్న 9.
బఠానీ పుష్పాల్లో ద్రోణి ఆకర్షణ పత్రాలు పుష్పానికి ఎటువైపు ఉంటాయి?
జవాబు:
పూర్వాంతంలో

ప్రశ్న 10.
చిక్నైన పుష్పరచనలో ఆకర్షణపత్రాలు కప్పిన అంచులకు, కప్పబడిన అంచులకు గల నిష్పత్తి ఎంత?
జవాబు:
5 : 4

ప్రశ్న 11.
పీఠ అండాన్యాసంలో ఎన్ని అండాలు అతుక్కొని ఉంటాయి?
జవాబు:
1

ప్రశ్న 12.
జీడిమామిడి మొక్కలో ఏ పుష్పభాగం అనృత ఫలాన్ని ఏర్పరుస్తుంది?
జవాబు:
పుష్పవృంతం

ప్రశ్న 13.
ఏ మొక్క గట్టి టెంకులాగా ఉండే అంతః ఫలకవచము, రసభరిత, తినే మృధ్య, ఫలకకవచాన్ని కలిగి ఉంటుంది?
జవాబు:
మామిడి

ప్రశ్న 14.
స్పాడిక్స్ పుష్ప విన్యాసంలో ‘మట్టి’ స్వరూపం?
జవాబు:
పుష్ప పుచ్చ రూపాంతరము

ప్రశ్న 15.
ఒకే పుష్పంలోని అసంయుక్త అండాశయం నుంచి వృద్ధి చెందే ఫలం ఏ రకానికి చెందుతుంది?
జవాబు:
సంకలిత ఫలము

AP Inter 1st Year Botany Study Material Chapter 4 వృక్షరాజ్యం

Andhra Pradesh BIEAP AP Inter 1st Year Botany Study Material 4th Lesson వృక్షరాజ్యం Textbook Questions and Answers.

AP Inter 1st Year Botany Study Material 4th Lesson వృక్షరాజ్యం

అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
శైవలాల వర్గీకరణకు ఆధారం ఏమిటి?
జవాబు:
వర్ణ పదార్థాలు, నిల్వ ఆహార పదార్థ రకాలు ఆధారంగా శైవలాలు విభజితము అయ్యాయి.

ప్రశ్న 2.
లివర్వర్ట్ మాస్, ఫెర్న్, వివృతబీజ, ఆవృతబీజ మొక్కలలో క్షయకరణ విభజన ఎప్పుడు, ఎక్కడ జరుగుతుంది?
జవాబు:
లివర్ వర్ట్లలో :
క్షయకరణ విభజన సిద్ధబీజదంలో జరుగుతుంది. ఫలితంగా గుళికలో సిద్ధబీజాలు ఏర్పడతాయి.

మాస్ మొక్కలలో :
సిద్ధబీజదంలోని సిద్ధబీజ మాతృ కణాలలో క్షయకరణ విభజన జరుగుతుంది.

ఫెర్న్ మొక్కలలో :
క్షయకరణ విభజన స్థూల, సూక్ష్మ సిద్ధబీజాశయాలలో జరిగి, స్థూల మరియు సూక్ష్మ సిద్ధబీజాలు ఏర్పడతాయి.

వివృత బీజాలలో :
క్షయకరణ విభజనలు సూక్ష్మ, స్థూల సిద్ధబీజ మాతృకణాలలో జరుగుతాయి.

ఆవృత బీజాలలో :
క్షయకరణ విభజనలు సూక్ష్మ సిద్ధబీజ మాతృకణం (పరాగ కోసం) మరియు స్థూలసిద్ధ మాతృకణం (అండం) లో జరుగుతాయి.

ప్రశ్న 3.
సంయుక్త సంయోగానికి, త్రి సంయోగానికి గల భేదం ఏమిటి ?
జవాబు:

సంయుక్త సంయోగంత్రిసంయోగము
పిండకోశంలో విడుదలయిన రెండు పురుషబీజాలలో, ఒక పురుషబీజం, స్త్రీ బీజంతో కలసి సంయుక్త బీజం ఏర్పడుతుంది. దీనిని సంయుక్త సంయోగం అని అంటారు.పిండంలో విడుదల అయిన రెండు పురుష బీజాలలో రెండవ పురుషబీజము, ద్వయస్థితిక ద్వితీయ కేంద్రకంతో, కలసి ప్రాధమిక అంకు రచ్ఛదం ఏర్పడుతుంది. దీనిని త్రి సంయోగం అంటారు.

ప్రశ్న 4.
పురుష బీజాశయం, స్త్రీ బీజాశయానికి గల తేడా ఏమిటి?
జవాబు:

పురుష బీజాశయముస్త్రీ బీజాశయము
i) ఇది గన ఆకారంలో ఉంటుంది.i) ఇది కూజా ఆకారంలో ఉంటుంది.
ii) ద్వికశాఖయుత పురుష బీజాలు ఏర్పడతాయి.ii) ఒకే ఒక స్త్రీ బీజం ఏర్పడుతుంది.

ప్రశ్న 5.
‘మాస్’ మొక్కల్లో గల రెండు సంయోగబీజద దశలు ఏవి? అవి వేటినుంచి వృద్ధి చెందుతాయో తెలపండి.
జవాబు:
మాస్ మొక్కలలో సంయోగబీజదంలో రెండు దశలు కలవు.
అవి :

  1. సిద్ధబీజం నుంచి నేరుగా ఏర్పడే శైశవదశ లేదా ప్రథమతంతువు.
  2. ప్రథమ తంతువు యొక్క పార్శ్వ అబ్బురపు మొగ్గ నుంచి పెరిగే ప్రౌఢ దశకు చెందిన పత్రాలు కల సంయోగ బీజదం (gametophore)

AP Inter 1st Year Botany Study Material Chapter 4 వృక్షరాజ్యం

ప్రశ్న 6.
గోధుమ వర్ణ, ఎరుపు వర్ణ శైవలాల్లో ఉన్న నిలువ ఆహార పదార్థాలను తెలుపండి.
జవాబు:
గోధుమ వర్ణశైవలాలలో నిల్వ ఆహారము లామినారిన్ లేదా మానిటాల్ రూపంలో ఉంటుంది.ఎరుపువర్ణ శైవలాలలో నిల్వ ఆహారము ఫ్లోరిడియన్ పిండి పదార్థం రూపంలో ఉంటుంది.

ప్రశ్న 7.
గోధుమ వర్ణ, ఎరుపు వర్ణ శైవలాల్లో ఆ రంగులకు కారణమైన పదార్థాల పేర్లు తెలుపండి.
జవాబు:
‘ఫియోఫైసీ’ శైవలాలకు గోధుమ రంగు – ఫ్యూకోజాంధిన్ వల్ల కల్గుతుంది. రోడోఫైసీ శైవలాలకు ఎరుపురంగు – ఫైకోఎరిత్రిన్ వల్ల కల్గుతుంది.

ప్రశ్న 8.
బ్రయోఫైటా మొక్కల్లోని వివిధ శాకీయోత్పత్తి విధానాలను తెలపండి.
జవాబు:
బ్రయోఫైట్లులో శాఖీయ ప్రత్యుత్పత్తి ముక్కలు అగుటద్వారా, లేదా జెమ్మాల ద్వారా లేదా ద్వితీయ ప్రథమ తుంతువుపై ఏర్పడే మొగ్గల ద్వారా జరుగుతుంది.

ప్రశ్న 9.
వివృతబీజాల్లో ఉన్న అండ కవచయుత స్థూల సిద్ధబీజాశయాన్ని ఏమంటారు? స్థూల సిద్ధబీజాశయంలోపల ఎన్ని స్త్రీ సంయోగ బీజదాలు ఏర్పడతాయి?
జవాబు:
వివృత బీజాలలో అండకవచయుత స్థూల సిద్ధబీజాశయాన్ని అండము అంటారు. స్థూల సిద్ధబీజాశయంలో ఒక బహుకణయుత స్త్రీ సంయోగబీజదం ఏర్పడి రెండులేక ఎక్కువ స్త్రీ బీజాశయాలను కల్గి ఉంటుంది.

ప్రశ్న 10.
వివృత బీజ మొక్కల్లో శిలీంధ్ర మూలాలు, ప్రవాళాభ వేళ్లు ఉండే మొక్కలను వరసలో తెలపండి.
జవాబు:
వివృత బీజాల్లో శిలీంధ్ర మూలాలు కల మొక్క = పైనస్
వివృత బీజాల్లో ప్రవాళాభ వేళ్లు కల మొక్క = సైకస్

ప్రశ్న 11.
ఈ కింది వాటిలో ఏ నాలుగింటికైనా క్రోమోసోమ్ సంఖ్యా స్థితులను తెలపండి.
a) మాస్ మొక్కలోని ప్రథమ తంతుకణం
b) ద్విదళ బీజాల్లోని ప్రాథమిక అంకురచ్ఛద కేంద్రకం
c) మాస్ మొక్కలోని పత్రకణం
d) ఫెర్న్ మొక్కలోని ప్రథమాంకురం
e) మార్కాంషియాలోని జెమ్మాకణం
f) ఏకదళ బీజ విభాజ్య కణం
g) లివర్ వర్ట్ లోని స్త్రీబీజ కణం
h) ఫెర్న్లోని సంయోగబీజం
జవాబు:
a) మాసె మొక్కలోని ప్రథమతంతుకణం = ఏకస్థితికణము
b) ద్విదళ బీజాల్లోని ప్రాథమిక అంకురచ్చద కేంద్రకము = త్రయస్థితికము
c) మాస్మిక్కలలో పత్రకణం = ఏకస్థితికము
d) ఫెర్న్ మొక్కలోని ప్రథమాంకురం = ఏకస్థితికము
e) మార్కంషియాలోని జెమ్మాకణం = ఏకస్థితికము
f) ఏకదళబీజ విభాజ్య కణం = ద్వయస్థితికము
g) లివర్ వర్ట్ లోని స్త్రీబీజ కణం = ఏకస్థితికము.
h) ఫెర్న్లోని సంయోగ బీజం = ద్వయస్థితికము

ప్రశ్న 12.
టెరిడోఫైటాలోని నాలుగు తరగతులను ఒకొక్క ఉదాహరణతో తెలపండి.
జవాబు:

  1. సిలోప్సిడా = సైలోటం
  2. లైకాప్సిడా = లైకోపోడియం
  3. స్ఫినోప్సిడా = ఈక్విజిటం
  4. టెరోప్సిడా = టెరిస్

AP Inter 1st Year Botany Study Material Chapter 4 వృక్షరాజ్యం

ప్రశ్న 13.
రాతి ఉపరితలంపై పెరిగే మొట్టమొదటి జీవులు ఏవి ? ‘పీట్’ ను అందించే ‘మాస్’ మొక్క ప్రజాతి నామం ఏది?
జవాబు:
మాస్ మొక్కలు లైకెనులు కలసి సహానివేశానికి తోడ్పడతాయి. ఉదా : స్పాగ్నం

ప్రశ్న 14.
సైకస్లోని ఫెర్న్ లక్షణాలను తెల్పండి.
జవాబు:

  1. లేత పత్రాలు వలితకిసలయ విన్యాసం చూపుట
  2. రామెంటా కలిగి ఉండటం
  3. బహుశైలికాయుత పురుష సంయోగబీజాలు
  4. స్త్రీ బీజాశయాలను కలిగి ఉండటం

ప్రశ్న 15.
బ్రయోఫైటా మొక్కలకు వృక్షరాజ్య ‘ఉభయచరాలు’ అని ఎందుకు అంటారు?
జవాబు:
బ్రయోఫైటా తేమగల ప్రదేశాలలో పెరగడంవల్ల లైంగిక ప్రత్యుత్పత్తికి నీటిపై ఆధారపడుటవల్ల వీటిని వృక్షరాజ్యపు ఉభయచరాలు అంటారు.

ప్రశ్న 16.
a) ఏకద్వయస్థితిక, b) ద్వయస్థితిక జీవిత చక్రాలు కల్గిన శైవలాలను పేర్కొనండి.
జవాబు:
ఏకద్వయ స్థితిక జీవిత చక్రం కల శైవలము = ఎక్టోకార్పస్, ద్వయ స్థితిక జీవిత చక్రంగల శైవలము = ఫ్యూకస్

AP Inter 1st Year Botany Study Material Chapter 4 వృక్షరాజ్యం

ప్రశ్న 17.
ఏకకణ, సహనివేశ, తంతురూప శైవలాలకు ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
క్లామిడోమోనాస్, వాల్వాక్స్, స్పైరోగైరా

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ఎరుపువర్ణ, గోధుమవర్ణ శైవలాల మధ్య తేడాలను తెలపండి. [Mar. ’14]
జవాబు:

ఎరుపు వర్ణ శైవలాలుగోధుమ వర్ణ శైవలాలు
1) ఇవి రోడోఫైసీ తరగతికి చెందుతాయి.1) ఇవి ఫియోఫైసీ తరగతికి చెందుతాయి.
2) ఎక్కువ జాతులు సముద్ర జలాల్లో ఉంటాయి.2) ఇవి మంచి నీటిలోనూ సముద్రజలాల్లోను ఉంటాయి.
3) కణకవచము సెల్యులోజ్ పెక్టిన్ మరియు పాలీసల్ఫైడ్ ఎస్టర్స్తో నిర్మితము.3) కణకవచము సెల్యులోజ్ మరియు ఆల్జిన్తో నిర్మితము.
4) తంతు దేహం బహుకణయుతము.4) దేహము సరళ శాఖాయుతంగాగాని, తంతు రూపంగా గాని ఉంటుంది.
5) కశాభాలు ఉండవు.5) కశాభాలు 2, అసమానము పార్శ్వము.
6) వీటిలో క్లోరోఫిల్ a, d ఫైకోఎరిత్రిన్ వర్ణద్రవ్యాలు ఉంటాయి.6) వీటిల్లో క్లోరోఫిల్ a, C కరోటినాయిడ్లు, జాంథోఫిల్స్ ఉంటాయి.
7) ఆహార పదార్థాలు ఫ్లోరిడియన్ పిండి పదార్థ రూపంలో ఉంటాయి.7) ఆహార పదార్థాలు లామినారిన్ లేదా మానిటాల్ రూపంలో ఉంటాయి.
8) అలైంగిక ప్రత్యుత్పత్తి నిశ్చల సిద్ధబీజాల ద్వారా జరుగును.8) అలైంగిక ప్రత్యుత్పత్తి ద్వికశాభయుత గమన సిద్ధబీజాల ద్వారా జరుగును.
9) లైంగిక ప్రత్యుత్పత్తి నిశ్చల సంయోగ బీజాలద్వారా జరుగును.
ఉదా : పాలిసైఫోనియా పోర్ఫైరా
9) లైంగిక ప్రత్యుత్పత్తి చలన సంయోగ జరుగును.
ఉదా : ఎక్టోకార్పస్, ఫ్యూకస్

ప్రశ్న 2.
లివర్ వర్ట్స్, మాస్ మొక్కల మధ్య తేడాలు తెలపండి.
జవాబు:

లివర్ వర్ట్సలుమాస్లు
1) మొక్క దేహం థాలస్ వలె, సాగిలబడి పృష్టోదర విభేదనం కలిగి ఆధారాన్ని అంటిపెట్టుకుని ఉంటుంది.1) ప్రౌఢదశకు చెందిన సంయోగబీజదం నిటారుగా ఉండి, సర్పిలాకారంలో ఉన్న పత్రాలను శాఖాయుతమైన బహుకణయుత రైజాయిడ్ల ద్వారా నేలలో స్థిరీకరించబడతాయి.
2) శాకీయ ప్రత్యుత్పత్తి ముక్కలవడం వల్ల లేదా జెమ్మాల ద్వారా జరుగుతుంది.2) శాఖీయ ప్రత్యుత్పత్తి ముక్కలవడం వల్ల లేదా జమ్మాల లేదా ద్వితీయ ప్రథమ తంతువులోని మొగ్గల ద్వారా ద్వారా జరుగుతుంది.
3) స్త్రీ, పురుష బీజాశయాలు ఒకే థాలస్ మీదా లేక వేర్వేరు థాలస్ల మీద ఏర్పడతాయి.3) లైంగిక అవయవాలు పత్రయుత గామిటోఫోర్ పైన ఏర్పడతాయి.
4) సహతంతువులు ఉండవు.4) సహతంతువులు ఉంటాయి.
5) గుళికలో ఇలేటర్లు ఉంటాయి. ఇవి సిద్ధబీజ వ్యాప్తికి సహకరిస్తాయి.5) గుళికలో పరిముఖ దంతాలు ఉంటాయి. ఇవి సిద్ధబీజ వ్యాప్తిలో సహకరిస్తాయి.
6) సిద్ధబీజాలు మొలకెత్తి స్వేచ్ఛగా జీవించే సంయోగ బీజదం ఏర్పడుతుంది.
ఉదా : మార్కాన్షియా
6) సిద్ధబీజం మొలకెత్తి ఆకుపచ్చని, శాఖాయుత ప్రథమ తంతువును ఏర్పరుస్తుంది. ఉదా : ఫ్యూనేరియా

ప్రశ్న 3.
సమసిద్ధ బీజ, భిన్న సిద్ధబీజ టెరిడోఫైట్లు అంటే ఏమిటి? రెండు ఉదాహరణలు ఇవ్వండి.
జవాబు:
సమసిద్ధబీజ మొక్కలు :
ఒకేరకమైన సిద్ధబీజాలను ఏర్పరిచే మొక్కలు ఉదా : లైకోపోడియం, టెరిస్

భిన్నసిద్ధబీజ మొక్కలు :
సూక్ష్మ, స్థూల సిద్ధబీజాలును ఏర్పరిచే మొక్కలు ఉదా : సెలాజినెల్లా, సాల్వినియా.

AP Inter 1st Year Botany Study Material Chapter 4 వృక్షరాజ్యం

ప్రశ్న 4.
భిన్న సిద్ధబీజత అంటే ఏమిటి ? దాని ప్రాముఖ్యం గురించి క్లుప్తంగా వ్రాయండి. రెండు ఉదాహరణలు ఇవ్వండి.
జవాబు:
భిన్నమైన సిద్ధబీజాలు ఏర్పడటను భిన్నసిద్ధబీజత అంటారు.

ప్రాముఖ్యత :

  1. సూక్ష్మ సిద్ధబీజ మాతృకణాల నుండి ఏర్పడే సూక్ష్మసిద్ధ బీజాలు చిన్నవిగా 0.015 – 0.05mµ ఉంటాయి. స్థూల సిద్ధబీజ మాతృకణం నుంచి ఏర్పడే స్థూల సిద్ధబీజాలు పెద్దవిగా 1-5 mµ ఉంటాయి.
  2. సూక్ష్మసిద్ధబీజము పురుష సంయోగ బీజదంగాను, స్థూలసిద్ధబీజం స్త్రీసంయోగ బీజదంగాను ఏర్పడతాయి.
  3. సిద్ధబీజదంపై స్త్రీ సంయోగ బీజదం ఉంటుంది.
  4. స్త్రీ సంయోగ బీజదంపై సంయుక్త బీజం ఏర్పడి, పిండంగా మారుతుంది.
  5. స్త్రీ సంయోగ బీజదంలో ఎక్కువ ఆహారం నిల్వ ఉంటుంది. ఉదా : సెలాజినెల్లా, సాల్వినియా.

ప్రశ్న 5.
శైవలాలు, బ్రయోఫైటా మొక్కల ఆర్థిక ప్రాముఖ్యాన్ని వివరించండి.
జవాబు:

  1. శైవలాల ఆర్థిక ప్రాముఖ్యత : కిరణజన్య సంయోగక్రియ ద్వారా భూమిపై జరిగే కర్బన స్థాపనలో కనీసం సగభాగం శైవలాలద్వారా జరుగుతుంది. దీనివల్ల చుట్టు పక్కల వాతావరణంలో ఆక్సిజన్ స్థాయిని పెంచుతాయి.
  2. పోరైరా, లామినేరియా, సర్గాసమ్లాంటి శైవలాలు ఆహారంగా ఉపయోగపడతాయి.
  3. కొన్ని గోధుమ, ఎరుపు వర్ణ సముద్ర శైవలాలు నీటిని పట్టి ఉంచే హైడ్రోకార్బన్లను ఉత్పత్తి చేస్తాయి.
    ఉదా : ఆల్జిన్, కర్రాజీన్.
  4. జెలిడియం, గ్రాసిలేరియా వంటి శైవలాల నుండి జున్నుగడ్డి (Agar) లభిస్తుంది. ఇది సూక్ష్మజీవులను పెంచడానికి ఐస్క్రీమ్లు, జెల్లీల తయారీలోను వాడతారు.
  5. లామినేరియా వంటి కెలనుండి అయోడిన్ను సేకరిస్తారు.
  6. క్లోరెల్లా, స్పైరులినా వంటి ఏకకణ శైవలాలను అంతరిక్షయాత్రికులు ఆహారంగా ఉపయోగిస్తున్నారు.

బ్రయోఫెట్లు ఆర్థిక ప్రాముఖ్యత :

  1. కొన్ని మాస్లు శాకాహారులైన క్షీరదాలకు, పక్షులకు ఇతర జంతువులకు ఆహారంగా ఉపయోగపడతాయి.
  2. స్ఫాగ్నం అనేమాస్ జాతులు ఇంధనంగా వాడబడుతున్న “పీట్” ను ఇస్తాయి. ఇది నీటిని నిలుపుకునే శక్తిని కల్గిఉంటుంది.
    కావున జీవ పదార్థాలను ఇతర ప్రదేశాలకు రవాణా చేయడంలో ఉపయోగిస్తారు.
  3. మాస్ మొక్కలు, లైకేన్లతో కలిసి బండరాళ్ళపై సహనివేశానికి తోడ్పడే మొట్టమొదటి జీవులు.
  4. ఇవి రాతిముక్కలను విచ్ఛిన్నం చేసి, మొక్కల అనుక్రమకంలో ప్రధాన పాత్ర వహిస్తాయి.
  5. మాస్ మొక్కలు మృత్తిక ఉపరితలంపైన ఒక మందమైన చాప వంటి నిర్మాణంగా ఏర్పడి, మృత్తిక క్రమక్షయాన్ని నివారిస్తాయి.

ప్రశ్న 6.
ఏకదళ, ద్విదళ బీజాలను ఏ విధంగా గుర్తిస్తారు?
జవాబు:

ఏకదళబీజాలుద్విదళ బీజాలు
1) విత్తనంలో ఒకే ఒక బీజదళం ఉంటుంది.1) విత్తనంలో బీజదళాలు ఉంటాయి.
2) పీచు వేరు వ్యవస్థ ఉంటుంది.2) తల్లివేరు వ్యవస్థ ఉంటుంది.
3) పత్రాలలో సమాంతర ఈనెల వ్యాపనం ఉంటుంది.3) పత్రాలలో జాలాకార ఈనెల వ్యాపనం ఉంటుంది.
4) పుష్పాలు త్రిభాగయుతము4) పుష్పాలు చతుర్భాగ లేక పంచ భాగయుతము.
5) పుష్పాలు ఏక పరి పత్రయుతము5) పుష్పాలు ద్విపరి పత్రియుతము.

ప్రశ్న 7.
ప్రథమాంకురం గురించి క్లుప్తంగా వివరించండి.
జవాబు:
టెరిడోఫైట్లలో సిద్ధబీజాలు మొలకెత్తి అతిచిన్న బహుకణయుత స్వయం పోషక థాలస్ వంటి నిర్మాణం కల “ప్రథమాంకురం” అనే సంయోగ బీజదంగా అభివృద్ధి చెందుతాయి. ఇవి పెరగటానికి చల్లని, తేమగల, నీడ ప్రాంతాలు అవసరము. ఈ పరిస్థితులు, ఫలదీకరణకు నీటి అవసరం దృష్ట్యా. టెరిడోఫైటా మొక్కల వ్యాప్తి అతి తక్కువ భౌగోళిక ప్రాంతాలకు పరిమితమై ఉంటుంది. సంయోగబీజదాలు ఆంథరీడియం, ఆర్కీగోనియం అనే పురుష, స్త్రీ లైంగికావయవాల్ని కలిగి ఉంటాయి. ఇవి బహుకణ యుతాలు, కంచుక యుతాలు, వృంత రహితాలు.

ప్రశ్న 8.
ఈ కింది వాని పటాలు గీసి, భాగాలను గుర్తించండి.
a) లివర్ వర్ట్ స్త్రీ, పురుష థాలస్లు
b) ఫ్యునేరియా మొక్క సంయోగ బీజదం, సిద్ధబీజదం.
జవాబు:
AP Inter 1st Year Botany Study Material Chapter 4 వృక్షరాజ్యం 1

దీర్ఘ సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
‘ఆర్కిగోనియం’ ను కలిగిన మూడు విభాగాలను తెలుపుతూ వాటిలో ఒకదాని జీవితచక్రం గురించి సంగ్రహంగా వివరించండి.
జవాబు:
బ్రయోఫైట్లు, టెరిడోఫైట్లు, వివృత బీజాలులో ఆర్కిగోనియాలు కలవు.

బ్రయోఫైట్లలో జీవిత చక్రం :
బ్రయోఫైటా మొక్కల ప్రధాన దేహం ఏకస్థితికము. ఇది సంయోగ బీజాలను ఉత్పత్తి చేస్తుంది. కనుక సంయోగ బీజదం అంటారు. వీటిలోని లైంగిక అవయవాలు బహుకణయుతంగా, కంచుకాన్ని, వృంతాన్ని కలిగి ఉంటాయి. పురుషబీజాశయాన్ని ఆంథరీడియం అంటారు. ఇది ద్వికశాభయుత చలన పురుష బీజాలను ఉత్పత్తి చేస్తాయి. స్త్రీ బీజాశయము (ఆర్కిగోనియం) కూజా ఆకారంలో ఉండి ఒక అండకణాన్ని ఉత్పత్తి చేస్తుంది. చలన పురుష బీజాలు నీటిలో విడుదలై స్త్రీ బీజాశయాన్ని చేరతాయి. ఒక చలన పురుష బీజం ఒక స్త్రీ బీజకణంతో సంయోగం చెంది సంయుక్త బీజాన్ని ఏర్పరుస్తుంది. దీనిని జాయిడోగమి అంటారు.

సంయుక్త బీజము బహుకణ నిర్మతమైన సిద్ధబీజదంను ఏర్పరుస్తుంది. సిద్ధబీజదం, సంయోగ బీజదం నుంచి ఆహారాన్ని గ్రహిస్తుంది. దీనిలోని కొన్ని కణాలు సిద్ధబీజ మాతృకణాలుగా మారి, క్షయకరణ విభజన చెంది ఏకస్థితిక సిద్ధబీజాలును ఏర్పరుస్తాయి. ఇవి మొలకెత్తి సంయోగబీజదాన్ని ఏర్పరుస్తాయి. సంయోగబీజదాలు, సిద్ధబీజదాలు చాలా విభేదాన్ని చూపిస్తాయి. కావున బ్రయోఫైట్లు బిన్నరూప ఏకాంతర జీవితదశలను ప్రదర్శిస్తాయి. ఇటువంటి జీవిత చక్రాన్ని “ఏకద్వయస్థితిక జీవిత చక్రం” అంటారు.

AP Inter 1st Year Botany Study Material Chapter 4 వృక్షరాజ్యం

ప్రశ్న 2.
వివృత బీజాల ముఖ్యలక్షణాలను వివరించండి.
జవాబు:

  1. ఇవి పిండయుతమైన, నాళికా కణజాలంగల ఆర్కిగోనియమ్లను కలిగిన పుష్పించే మొక్కలు.
  2. ఇవి మధ్యరకపు వృక్షాలు లేక పొడవైన వృక్షాలు లేక పొదలుగా ఉంటాయి.
  3. తల్లి వేరు వ్యవస్థ ఉంటుంది. పైనస్లో వేళ్ళలో శిలీంధ్ర మూలాలు ఉంటాయి. సైకస్ వంటి జాతులలో సయనో- బాక్టీరియమ్లు కల ప్రత్యేకమైన ప్రవాళాల వేర్లు ఉంటాయి.
  4. కాండము శాఖారహితం (సైకస్) లేక శాఖాయుతంగా (పైనస్) ఉంటాయి.
  5. పత్రాలు సరళంగాగాని, సంయుక్తంగాగాని, ఉంటాయి.
  6. అంతర్నిర్మాణంలో కాండంలో నిజమైన ప్రసరణ స్థంభం ఉంటుంది. నాళికాపుంజాలు సంయుక్తం, సహపార్శ్వం, వివృతం.
  7. దారువులో దారునాళాలు, పోషక కణజాలంలో సహకణాలు ఉండవు.
  8. కాండం, వేరులలో ద్వితీయ వృద్ధి జరుగుతుంది.
  9. వివృత బీజాలలో సూక్ష్మ, స్థూల సిద్ధబీజాలు (భిన్నసిద్ధ బీజత) కలిగి ఉంటాయి.
  10. సిద్ధబీజాలు, సిద్ధబీజాశయాలలోను, ఇవి సిద్ధబీజాశయ పత్రాలపై ఉంటాయి. ఈ పత్రాలు ఒక అక్షంపై సర్పిలాకారంలో అమరి శంకువు లేక స్ట్రోబిలస్ గా ఉంటాయి.
  11. పురుష మొక్కపై ఉండే సూక్ష్మ సిద్ధబీజాశయాలను కల్గిన సూక్ష్మసిద్ధబీజాశయ పత్రాలు పురుష శంకుగా ఏర్పడతాయి.
  12. సూక్ష్మ సిద్ధబీజాలు/పరాగరేణువులు పురుషసంయోగబీజదాన్నిస్తాయి.
  13. అండాలు కల స్థూల సిద్ధబీజాశయ పత్రాలు కలిగిన శంకును స్త్రీ స్ట్రోబిలస్ అంటారు.
  14. స్థూల సిద్ధబీజము స్త్రీ సంయోగ బీజదంగా పని చేస్తుంది.
  15. పరాగ సంపర్కం : ప్రత్యక్షం, గాలి ద్వారా జరుగును.
  16. దీనిలో సైకడోప్సిడా, కోనిఫెరాప్సిడా, నీటాప్సిడా అను 3 తరగతులు కలవు.

ప్రశ్న 3.
టెరిడోఫైటా మొక్కల ముఖ్యలక్షణాలను తెలపండి.
జవాబు:

  1. నాళికా కణజాలాలను కలిగిన నేల మీద నివసించే మొక్కలలో మొట్ట మొదటవి.
  2. ఇవి పిండాన్ని ఏర్పరచే, ఆర్కిగోనియంలు గల నాళికా కణజాలయుత పుష్పించని మొక్కలు.
  3. ఇవి చల్లని, తేమ నీడగల ప్రాంతాలలో, కొన్ని ఇసుక నేలల్లో పెరుగుతాయి.
  4. టెరిడోఫైట్లలో ప్రధాన మొక్క నిజమైన వేర్లు, కాండము పత్రాలు కల సిద్ధ బీజదము.
  5. అబ్బురపు వేర్లు వ్యవస్థ కలిగి ఉంటాయి.
  6. ప్రథమ ప్రసరణ స్థంభం లేదా నాళాకార ప్రసరణ స్థంభం లేదా సొలెనోస్టీల్ లేదా డిస్ట్రియోస్టీల్ ఉంటుంది.
  7. పత్రాలు చిన్నవిగా లేదా పెద్దవిగా (ఫ్రెర్న్లు) ఉంటాయి.
  8. సిద్ధబీజదాలలో సిద్ధబీజాశయాలు ఉన్న ఫలవంతమైన పత్రాలను సిద్ధ బీజాశయ పత్రాలు అంటారు.
  9. ఎక్కువ టెరిటోఫైటా మొక్కలు సమసిద్ధబీజయుతాలు – కాని సెలాజినెల్లా, సాల్వినియాలలో భిన్న సిద్ధబీజత ఉంటుంది.
  10. సిద్ధబీజం మొలకెత్తి స్వయంపోషక ప్రధమాంకురం ఏర్పడుతుంది.
  11. ప్రధమాంకురంపై పురుష, స్త్రీ బీజాశయాలు ఏర్పడతాయి.
  12. లైంగిక అవయవాలు బహుకణ యుతాలు, కంచుకయుతాలు, వృంత రహితాలు.
  13. చలన పురుషబీజము, స్త్రీ బీజకణంతో సంయోగం చెంది సంయుక్త బీజం ఏర్పడుతుంది.
  14. సంయుక్త బీజం మొలకెత్తి సిద్ధబీజదంగా వృద్ధి చెందుతుంది.

ప్రశ్న 4.
మొక్కల జీవితచక్రాలు, ఏకాంతర దశల గురించి వివరించండి.
జవాబు:
మొక్కలలో ఏకస్థితిక, ద్వయస్థితిక కణాలు సమవిభజన ద్వారా విభజన చెందుతాయి. దీనివల్ల రెండు విభిన్నమైన ఏకస్థితిక ద్వయస్థితిక మొక్కల దేహాలు ఏర్పడతాయి. ఏకస్థితిక మొక్క దేహం సమవిభజన ద్వారా సంయోగ బీజాలను ఉత్పత్తి చేస్తుంది. దీనిని సంయోగ బీజదం అంటారు. ఫలదీకరణ తర్వాత సంయుక్తబీజం కూడ సమవిభజన ద్వారా ద్వయస్థితిక సిద్ధబీజదాన్ని ఇస్తుంది. సిద్ధబీజదాలు క్షయకరణ విభజన ద్వారా సిద్ధబీజాలను ఉత్పత్తి చేస్తాయి. ఇవి సమవిభజనలు చెంది ఏకస్థితిక మొక్కను ఏర్పరుస్తాయి. ఈ విధంగా ఏకస్థితిక సంయోగ బీజదం, ద్వయ స్థితిక సిద్ధబీజదంతో ఏకాంతరంగా ఉంటాయి. వివిధ రకాల మొక్కలు వివిధ రకాల జీవిత చక్రాలు చూపుతాయి.
ఉదా :1) వాల్వాక్స్, స్పైరోగైరా, కొన్ని క్లామిడోమోనస్ వంటి శైవలాలు ఏకస్థితిక జీవిత చక్రంను చూపుతాయి. దీనిలో సంయుక్త బీజంలో క్షయకరణ విభజన వల్ల ఏకస్థితిక సిద్ధబీజాలు ఏర్పడతాయి. ఇవి సమవిభజన చెంది సంయోగ బీజదాన్నిస్తాయి. కావున ఈ మొక్కలలో స్వతంత్ర జీవనం గడిపే సంయోగ బీజదమే ప్రధానమైన దశ.

2) కొన్ని జాతులలో ద్వయస్థితిక సిద్ధబీజదం స్వయం పోషకంగా స్వతంత్ర జీవనం కలిగి ప్రబలంగా ఉంటుంది.

ఏకస్థితికదశ సంయోగ బీజాలకు మాత్రమే పరిమితమై ఉంటుంది. దీనిని ద్వయస్థితిక జీవితచక్రం అంటారు. ఉదా : కొన్ని టెరిడోఫైటా మొక్కలు, విత్తనాలు కల అన్ని మొక్కలలో సంయోగ బీజదము కొన్ని కణాలు కలిగి ఉంటుంది. దీనికి ద్వయ – ఏక స్థితికం అంటారు.

3) బ్రయోఫైటా మొక్కలు ఏక ద్వయ స్థితిక జీవిత చక్రంను చూపుతాయి. దీనిలో బహుకణ నిర్మిత ప్రబలమైన సంయోగ బీజదశ, సంయోగ బీజదంపై ఆధారపడి ఉండే సిద్ధబీజద దశ కలిగి ఉంటాయి. ఉదా : ఎక్టోకార్పస్, లామినేరియా.

AP Inter 1st Year Botany Study Material Chapter 4 వృక్షరాజ్యం

ప్రశ్న 5.
వివృత బీజాలు, ఆవృత బీజాలు రెండూ విత్తనాలను కలిగిన మొక్కలైనప్పటికీ వాటిని వేర్వేరుగా ఎందుకు వర్గీకరించారు?
జవాబు:

వివృత బీజాలు, ఆవృతబీజాలు విత్తనాలు కలిగి ఉన్నప్పటికి వాటి మధ్య బాహ్యంగా అంతరంగా మార్పులు కలవు. అవి :

వివృత బీజాలుఆవృత బీజాలు
1) గుల్మములు ఉండవు.1) ఎక్కువ మొక్కలు గుల్మములు.
2) ప్రత్యుత్పత్తి భాగాలను శంఖువులు అంటారు.2) ప్రత్యుత్పత్తి భాగాలు పుష్పాలు.
3) శంఖువులు ఏక లింగములు.3) పుష్పాలు ఏక లేక ద్విలింగాశ్రయులు.
4) అండాలు నగ్నంగా ఉంటాయి.4) అండాలు అండాశయంలో దాగి ఉంటాయి.
5) పరాగ రేణువులు అండాలను ప్రత్యక్షంగా చేరతాయి.5) పరాగ రేణువులు కీలాగ్రంను చేరతాయి.
6) పురుష సంయోగ బీజదంలో ప్రథమాంకుర కణాలు ఉంటాయి.6) ప్రథమాంకుర కణాలు ఉండవు.
7) స్త్రీ బీజాశయాలు ఉంటాయి.7) స్త్రీబీజాశయాలు ఉండవు.
8) ఫలదీకరణ ఒక్కసారి జరుగును.8) ఫలదీకరణ 2 సార్లు జరుగును.
9) స్త్రీ సంయోగ బీజదమే అంకురచ్చదంగా వ్యవహరిస్తుంది. ఫలదీకరణకు ముందు ఏర్పడుతుంది. ఇది ఏకస్థితికము.9) అంకురచ్చదం ఫలదీకరణకు తర్వాత ఏర్పడుతుంది. ఇది త్రయ స్థితికము
10) పిండ జననంలో స్వేచ్ఛా కేంద్రక విభజనలు జరుగుతాయి.10) స్వేచ్ఛాకేంద్రక విభజనలు ఉండవు.
11) దారునాళాలు, సహకణాలు ఉండవు.11) దారు నాళాలు సహకణాలు ఉంటాయి.
12) శాఖీయ ప్రత్యుత్పత్తి అరుదుగా జరుగుతుంది.12) శాఖీయ ప్రత్యుత్పత్తి సాధారణము.

AP Inter 1st Year Botany Study Material Chapter 3 మొక్కల విజ్ఞానం – వృక్షశాస్త్రం

Andhra Pradesh BIEAP AP Inter 1st Year Botany Study Material 3rd Lesson మొక్కల విజ్ఞానం – వృక్షశాస్త్రం Textbook Questions and Answers.

AP Inter 1st Year Botany Study Material 3rd Lesson మొక్కల విజ్ఞానం – వృక్షశాస్త్రం

అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
‘బొటనీ’ అనే పదం ఏ విధంగా వాడుకలోకి వచ్చిందో వివరించండి.
జవాబు:
బోటనీ అనే గ్రీకు పదం బౌస్సికీన్ (Bouskein) అనే పదం నుండి ఏర్పడింది. బౌస్సికీన్ అంటే పశువుల చేత మేయబడేది అని అర్థం. బోస్కిన్ అను పదము బొటానే గాను, బొటానే అనే పదం క్రమంగా బోటనీ అనే పదంగా రూపాంతరం చెందింది.

ప్రశ్న 2.
పరాశరుడు రచించిన పుస్తకాల పేర్లు తెలిపి వాటిలోని ముఖ్యాంశాలను వివరించండి.
జవాబు:
కృషిపరాశరంలో (వ్యవసాయం) పంట మొక్కలు, కలుపు మొక్కలు గురించి వివరించబడ్డాయి. వృక్షాయుర్వేదంలో ఎన్నో రకాల అడవులు గురించి; మొక్కల బాహ్య, అంతర్నిర్మాణ లక్షణాలు; ఔషధ మొక్కల గురించి వివరించబడ్డాయి.

ప్రశ్న 3.
వృక్షశాస్త్ర పిత అని ఎవరిని అంటారు ? అతను రచించిన గ్రంథం ఏది?
జవాబు:
థియోఫ్రాస్టస్ ను వృక్షశాస్త్ర పిత అని పిలుస్తారు. అతను దీ హిస్టోరియా ప్లాంటారమ్ అనే గ్రంథాన్ని రచించాడు.

ప్రశ్న 4.
హెర్బలిస్టులు అంటే ఎవరు? వారు రచించిన గ్రంథాలేవి?
జవాబు:
సజీవంగా, సహజ ఆవరణలో ఉన్న ఔషద మొక్కలను సాంకేతికంగా వర్ణన చేయు శాస్త్రజ్ఞులను హెర్బలిస్టులు అంటారు. వీరు రచించిన గ్రంథాలను హెర్బల్స్ అంటారు. పుక్స్, బ్రన్ఫెల్స్, బోవెల్ అనువారు ప్రముఖ హెర్బలిస్టులు.

ప్రశ్న 5.
వృక్ష వర్గీకరణ శాస్త్రాభివృద్ధికి కెరోలస్ వాన్ లిన్నేయస్ చేసిన కృషి ఏమిటి?
జవాబు:
కెరోలస్ వాన్ లిన్నేయస్ వృక్షవర్గీకరణ శాస్త్రాన్ని అభివృద్ధి చేశాడు. ఈయన స్పిషీస్ ప్లాంటారమన్ను రచించి ద్వినామ నామీకరణ విధానాన్ని వాడుకలోకి తెచ్చాడు. ఈయన లైంగిక వర్గీకరణ విధానాన్ని ప్రతిపాదించాడు.

AP Inter 1st Year Botany Study Material Chapter 3 మొక్కల విజ్ఞానం – వృక్షశాస్త్రం

ప్రశ్న 6.
మెండల్ను ‘జన్యుశాస్త్ర పిత’ గా ఎందుకు పరిగణిస్తున్నారు?
జవాబు:
బఠాణి మొక్కలపై సంకరణ ప్రయోగాలు జరపటం వల్ల; అనువంశిక సూత్రాలను ప్రవేశపెట్టటం వల్ల మెండల్ జన్యుశాస్త్ర పితగా ప్రసిద్ధికెక్కాడు.

ప్రశ్న 7.
కణాన్ని కనుక్కొన్నదెవరు? ఆయన రచించిన పుస్తకం ఏమిటి?
జవాబు:
రాబర్ట్ హుక్ కణాన్ని మొదటిసారి కనుగొన్నాడు. ఆయన మైక్రోగ్రాఫియా అనే గ్రంథాన్ని రచించాడు.

ప్రశ్న 8.
పురావృక్ష శాస్త్రం అంటే ఏమిటి ? దాని ఉపయోగం ఏమిటి? [Mar. 14]
జవాబు:
మొక్కల శిలాజాల గురించి అధ్యయనం చేయు శాస్త్రమును “పురావృక్షశాస్త్రము” అందురు. దీనివల్ల మొక్కలలో పరిణామక్రమాన్ని అర్థం చేసుకోవచ్చు.

ప్రశ్న 9.
హరితసహిత, స్వయంపోషక థాలోఫైట్ల హరితరహిత, పరపోషకత థాలోఫైట్లకు సంబంధించిన వృక్షశాస్త్ర విభాగాలను తెలపండి.
జవాబు:
పత్రహరితయుత, స్వయంపోషక థాలోఫైటా మొక్కలను అధ్యయనం చేసే విభాగాన్ని శైవలశాస్త్రం (ఫైకాలజీ) అంటారు. పత్రహరితరహిత, పరపోషిత థాలోఫైటా మొక్కలను అధ్యయనం చేసే విభాగాన్ని శిలీంధ్రశాస్త్రం (మైకాలజీ) అంటారు.

ప్రశ్న 10.
లైకెన్లలో సహజీవనం చేసే మొక్కల సముదాయాలు ఏవి? లైకెన్ల అద్యయనాన్ని ఏమంటారు?
జవాబు:
లైకెన్లలో సహజీవనం గడిపే భాగస్వామి మొక్కల వర్గాలు శైవలాలు, శిలీంధ్రాలు. లైకెన్లను గురించి అధ్యయనం చేసే విభాగాన్ని లైకెనాలజీ అంటారు.

ప్రశ్న 11.
ఏ మొక్కల సముదాయాన్ని నాళికాకణజాలయుత పుష్పించని మొక్కలు అంటారు? వీటి అద్యయనానికి సంబంధించిన వృక్షశాస్త్రశాఖ పేరేమిటి?
జవాబు:
టెరిడోఫైటాకు చెందిన మొక్కలను నాళికాయుత పుష్పించని మొక్కలు అంటారు. వాటిని అధ్యయనం చేసే విభాగాన్ని అంటారు.

AP Inter 1st Year Botany Study Material Chapter 3 మొక్కల విజ్ఞానం – వృక్షశాస్త్రం

ప్రశ్న 12.
ఏ మొక్కల సముదాయాన్ని వృక్ష రాజ్యపు ఉభయచరాలు అని అంటారు? వాటిని అద్యయనం చేసే విభాగాన్ని ఏమంటారు?
జవాబు:
మొట్టమొదటగా నేలమీద పెరిగిన మొక్కలను (వృక్షరాజ్యపు ఉభయచరాలు) బ్రయోఫైట్లు అంటారు. వాటిని అధ్యయనం చేసే విభాగాన్ని బ్రయాలజీ అంటారు.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
వ్యవసాయ, ఉద్యానవన, ఔషధపరంగా వృక్షశాస్త్ర పరిధిని క్లుప్తంగా వర్ణించండి.
జవాబు:

  1. హరితవిప్లవం ద్వారా వ్యాధి నిరోధక, కీటక నిరోధక పంటలను జీవ సాంకేతిక పద్ధతులలో అభివృద్ధి పరిచి, జనాభా పెరుగుదల, వనరుల తరుగుదల వంటి సమస్యలను చాలా వరకు పరిష్కరించవచ్చు.
  2. సంకరణం, జన్యు ఇంజనీరింగ్ ప్రయోగాల ద్వారా వృక్షశాస్త్రంలోని వ్యవసాయము, అటవీసంపద, ఉద్యానవన, పుష్పోత్పత్తి తాంటి అనువర్తన శాస్త్రాలలో మంచి పురోగతి సాధించవచ్చు.
  3. సాగు మొక్కలైన వరి, గోధుమ, మొక్కజొన్న, చెరుకులలో కొత్త వంగడాలను ఏర్పరచడానికి క్రొత్త ప్రజనన పద్ధతులు ఉపయోగపడును.
  4. వృక్ష వ్యాధి శాస్త్రంలో జరిపిన పరిశోధనల ఫలితాలు మొక్కల్లో వచ్చే అనేక వ్యాధులను నివారించడం, నిర్మూలనకు ‘ఉపయోగపడతాయి.
  5. మొక్కల వృద్ధి నియంత్రికాల పాత్ర, వాటి పరిజ్ఞానం వల్ల వ్యవసాయ, ఉద్యాన వనరంగాల్లో అభివృద్ధి సాధించడమైంది.
  6. కణజాల, అవయవవర్ధనం వల్ల అతితక్కువ సమయంలో అధిక సంఖ్యలో మొక్కలను ప్రయోగశాలలో ఉత్పత్తిచేయవచ్చు.
  7. వృక్షశాస్త్ర అభివృద్ధి వల్ల బట్టలు, కాగితం, చక్కెర లాంటి ఎన్నో, పరిశ్రమలు వృద్ధిచెందాయి.
  8. ఆర్నికా, సింకోనా, వేప, దతురా, డిజిటాలిస్, రావుల్ఫియా, తులసి మొదలైన ఔషధ విలువలు గల మొక్కల పరిజ్ఞానం, వాటిని మానవుని ఆరోగ్య సంరక్షణ కోసం ఉపయోగించుటలో దోహదపడును.
  9. సూక్ష్మజీవనాశక పదార్థాలైన పెనిసిలిన్, జీవకీటకనాశినిలు, స్పైరులినా, క్లోరెల్లా లాంటి ఏకకణ ప్రోటీన్ల ఉత్పత్తి కూడా ఆయా పదార్థాలనిచ్చే మొక్కల విస్తృత అధ్యయనం వల్ల సాధ్యమవుతుంది.

ప్రశ్న 2.
వృక్షశరీర ధర్మ శాస్త్రాన్ని ఉదాహరణగా తీసుకొని వృక్షశాస్త్ర పరిధిని వివరించండి.
జవాబు:

  1. మొక్కల పోషణలో మూలకాలపాత్ర తెలియుట వల్ల రసాయన ఎరువులను ఉపయోగించి, మూలకలోపాలను అధిగమించి అధిక దిగుబడులు సాధించవచ్చు.
  2. మొక్కల వృద్ధి నియంత్రికాల పాత్ర, వాటి పరిజ్ఞానం వల్ల కలుపు మొక్కలు నివారణ, విత్తనాలు సుప్తావస్థను తొలగించుట స్పినాచ్ వంటి ఆకుకూరలు ఎక్కువ కాలం నిల్వ ఉంచడం, అరటి, ఆపిల్, పుచ్చకాయ లాంటి పళ్ళు కృత్రిమంగా పక్వానికి వచ్చేట్లు చేయటం, శాఖీయోత్పత్తి కోసం కాండపు ఖండికలతో వేళ్ళను ప్రేరేపించడం జరిపి వ్యవసాయ, ఉద్యాన వనరంగాలలో అభివృద్ధి సాధించడమైనది.

AP Inter 1st Year Botany Study Material Chapter 3 మొక్కల విజ్ఞానం – వృక్షశాస్త్రం

ప్రశ్న 3.
వృక్ష స్వరూప శాస్త్రంలోని వివిధ శాఖలు, వాటి లక్షణాలను రాయండి.
జవాబు:
మొక్కలలో వివిధ భాగాల అధ్యయనానికి వర్ణనకు సంబంధించిన శాస్త్రము. ఇది మొక్కల వర్గీకరణకు మౌలిక ఆధారము దీనిలో “2 రకాలు” కలవు.

1) బాహ్యస్వరూప శాస్త్రము:
మొక్క భాగాలైన వేరు, కాండం, పత్రం, పుష్పం, ఫలం, విత్తనం బాహ్యస్వరూప లక్షణాలను అధ్యయనం చేసి వర్ణించుట.

2) అంతరస్వరూప శాస్త్రము :
వివిధ భాగాల అంతర్నిర్మాణాన్ని తెలిపే శాస్త్రము. దీనిలో “2 రకాలు” కలవు
a) కణజాల శాస్త్రము : మొక్కలోని వివిధ కణజాలాలను అధ్యయనం చేసే విభాగము.
b) అంతర్నిర్మాణ శాస్త్రము : మొక్కల్లోని వేరు, కాండం, పత్రం, పుష్పంలోని అంతర్నిర్మాణ వివరాలకు సంబంధించినది.

దీర్ఘ సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
వృక్షశాస్త్రంలోని వివిధ శాఖల పరిధిని సోదాహరణంగా వివరించండి.
జవాబు:

  1. వ్యవసాయము : హరిత విప్లవం ద్వారా వ్యాధి నిరోధక కీటక నిరోధక పంటలను జీవ సాంకేతిక పద్ధతులలో అభివృద్ధి చేసి జనాభా పెరుగుదల, వనరుల తరుగుదల వంటి సమస్యలను పరిష్కరించవచ్చు.
  2. సంకరణం జన్యు ఇంజనీరింగ్ ప్రయోగాల ద్వారా వృక్షశాస్త్రంలోని వ్యవసాయం, అటవీసంపద, ఉద్యానవన పుష్పోత్పత్తి లాంటి అనువర్తన శాస్త్రాలలో పురోగతి సాధించవచ్చు.
  3. సాగు మొక్కలైన వరి, గోధుమ, మొక్కజొన్న, చెరకులలో కొత్త వంగడాలను ఏర్పరచడానికి కొత్త ప్రజనన పద్ధతులు ఉపయోగపడతాయి.

వృక్షవ్యాధి శాస్త్రము :
మొక్కలలో వచ్చే అనేక వ్యాధులను నివారించడం, నిర్మూలనకు వృక్షవ్యాధి శాస్త్రంలో జరిపిన ఫలితాలు ఉపయోగపడతాయి.

వైద్య రంగం :

  1. ఆర్నికా, సింకోనా, వేప, దతురా, రావుల్ఫియా, తులసి, కలబంద వంటి ఔషధ విలువలు కల మొక్కల పరిజ్ఞానం వాటిని మానవ ఆరోగ్య సంరక్షణ కోసం ఉపయోగించవచ్చు.
  2. సూక్ష్మజీవనాశక పదార్థాలైన పెనిసిలిన్, జీవ కీటకనాశినిలు, ఏకకణ ప్రోటీన్ల ఉత్పత్తి చేయవచ్చు.

వాతావరణ కారకాలు :

  1. హరిత గృహ ప్రభావాన్ని విరివిగా మొక్కలునాటుట ద్వారా నియంత్రించడం, బయోరెమిడియేషన్ ద్వారా మృత్తికా కాలుష్యాన్ని పూతికాహారుల ద్వారా పోషక పదార్థాల పునశ్చక్రీయం, రసాయన ఎరువుల వల్ల కలిగే మృత్తిక, నీటి కాలుష్యాలను అరికట్టుట కోసం జీవఎరువులు వాడుట, మృత్తిక క్రమక్షయాన్ని తగ్గించడంకోసం ఇసుకను పట్టుకొనే మొక్కలను పెంచడం.
  2. క్లోరెల్లా లాంటి శైవలాలను అంతరిక్ష పరిశోధనలో వ్యోమగాముల ఆహారంగా ఉపయోగించుట, సముద్ర కలుపుమొక్కల నుంచి అయోడిన్, అగార్-అగార్ తయారు చేయుట సమకాలీన ప్రపంచంలో వృక్షశాస్త్రానికి ఉన్న అవకాశాలను సూచిస్తాయి.

వాణిజ్య ఉత్పత్తులు :

  1. వాణిజ్యపరంగా ప్రాముఖ్యం ఉన్న కలప, నారలు, కాఫీ, తేయాకు లాంటి పానీయాలు సుగంధ ద్రవ్యాలు, రబ్బరు, జిగురు పదార్థాలు, రెసిన్లు అద్దకాలు, సుగంధతైలాలు లాంటి పదార్థాలు, వాటిని సక్రమంగా వినియోగించుకోవడానికి మొక్కల పరిజ్ఞానం ఉపయోగపడును.
  2. వృక్షశాస్త్రం అభివృద్ధి వల్ల బట్టలు, కాగితం, ఆయుర్వేద ఔషధాలు, చక్కెర లాంటి పరిశ్రమలు వృద్ధిచెందాయి.

AP Inter 1st Year Botany Study Material Chapter 2 జీవశాస్త్ర వర్గీకరణ

Andhra Pradesh BIEAP AP Inter 1st Year Botany Study Material 2nd Lesson జీవశాస్త్ర వర్గీకరణ Textbook Questions and Answers.

AP Inter 1st Year Botany Study Material 2nd Lesson జీవశాస్త్ర వర్గీకరణ

అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
డయాటమ్లలో కణకవచ స్వభావం ఏది?
జవాబు:
డయాటమ్ కణకవచము సిలికాతో నిర్మితమై ఉండుట వల్ల నాశనం చెందవు.

ప్రశ్న 2.
వైరాయిడ్లకూ, వైరస్లకూ ఉన్న తేడాలు ఏమిటి? [Mar. ’14]
జవాబు:

వైరాయిడ్లువైరస్లు
ప్రోటీన్ కవచం లేకుండా, కేంద్రకామ్లము (RNA) మాత్రమే కల వైరస్లను వైరాయిడ్లు అంటారు.
ఉదా : పొటాటో స్పిండిల్ ట్యూబర్ వైరస్.
ప్రోటీన్ కవచము, కేంద్రకామ్లము కల జీవులను వైరస్లు అంటారు.
ఉదా : TMV

ప్రశ్న 3.
ఫైకోబయాంట్, మైకోబయాంట్ అనే పదాలు వేటిని తెలియజేస్తాయి?
జవాబు:
లైకెన్లోని శైవల భాగస్వామిని ఫైకోబయాంట్ అని, లైకెన్లోని శిలీంధ్ర భాగస్వామిని మైకోబయాంట్ అని అంటారు.

ప్రశ్న 4.
శైవల మంజరి (algal bloom), ఎరుపు అలలు (Red tides) అనే పదాలు వేటిని సూచిస్తాయి?
జవాబు:
సయనోబాక్టీరియమ్లలో సహనివేశకాలు, ట్రైకోమ్లు లేదా తంతువులు జిగురుపొరతో కప్పబడి, కలుషితమైన నీటిలో ఇవి మంజరులను ఏర్పరుస్తాయి. వీటిని శైవల మంజరులు అంటారు. ఉదా : నాస్టాక్, అనబీనా, గోనియోలాక్స్ లాంటి ఎరుపు రంగులోని డైనో ప్లాజెల్లేట్లు అతి త్వరితగతిలో వృద్ధి చెందడంవల్ల సముద్రమంతా ఎరుపు రంగులో (మధ్యదరా సముద్రములోని ఎరుపు అలలు) కనబడుతుంది.

ప్రశ్న 5.
పరపోషిత బాక్టీరియమ్లకు గల రెండు ఆర్థిక ప్రాముఖ్యం గల ఉపయోగాలను తెలపండి.
జవాబు:
పరపోషిత బాక్టీరియాలు పాల నుంచి పెరుగు తయారీకి, జీవనాశక పదార్థాల ఉత్పత్తి, లెగ్యూమ్ వేర్లలో నత్రజని స్థాపనలకు తోడ్పడతాయి.

AP Inter 1st Year Botany Study Material Chapter 2 జీవశాస్త్ర వర్గీకరణ

ప్రశ్న 6.
వ్యవసాయ భూములలో పంటల పెంపుదలకు ‘సయనోబాక్టీరియమ్లను ఉపయోగించడంలో ఇమిడి ఉన్న ఉద్దేశ్యం ఏమిటి?
జవాబు:
సయనోబాక్టీరియమ్లు వ్యవసాయ భూములలో పెంచిన నత్రజని స్థాపన జరిగి, నేలలు సారవంతమై పంట దిగుబడి పెరుగుతుంది మరియు ఇవి ఆక్సిజనిక్ కిరణజన్య సంయోగక్రియ చూపుతాయి.

ప్రశ్న 7.
మొక్కలు స్వయంపోషితాలు. పాక్షికంగా పరపోషితాలైన కొన్ని మొక్కలను తెలపండి.
జవాబు:
పాక్షికంగా పరపోషితాలు అయిన మొక్కలు :
విస్కం, లోరాంధస్, స్ట్రెగా.

ప్రశ్న 8.
ఐదు రాజ్యాల వర్గీకరణను ఎవరు ప్రతిపాదించారు? ఈ వర్గీకరణలో నిజ కేంద్రక జీవులు ఎన్ని రాజ్యాలలో ఉన్నాయి?
జవాబు:
5 రాజ్యాలు వర్గీకరణను ఆర్. హెచ్. విటాకర్ (1969) ప్రతిపాదించారు. దీనిలో 4 రాజ్యాలు (ప్రొటిస్టా, శిలీంధ్రాలు, మొక్కలు జంతువులు) నిజకేంద్రక జీవులను కలిగి ఉన్నాయి.

ప్రశ్న 9.
విటాకర్ వర్గీకరణలో పాటించిన ముఖ్యమైన ప్రాతిపదికలు ఏవి?
జవాబు:
విటాకర్ వర్గీకరణలో కణ నిర్మాణము, థాలస్ సంవిధానము, పోషణ రకము, ప్రత్యుత్పత్తి, వర్గవికాస సంబంధాలు ముఖ్యమైన ప్రాతిపదికలు.

ప్రశ్న 10.
మైకోప్లాస్మా కలిగించే రెండు వ్యాధులను తెలపండి.
జవాబు:
మొక్కలలో మైకోప్లాస్మాలు వల్ల మంత్రగత్తె, చీపురు కట్ట (witches broom), పశువులలో పూరోనిమోనియా, మానవులలో మైకోప్లాస్మల్ యురిథ్రెటిస్ అను వ్యాధులు కలుగుతాయి.

AP Inter 1st Year Botany Study Material Chapter 2 జీవశాస్త్ర వర్గీకరణ

ప్రశ్న 11.
జిగురు బూజులంటే ఏమిటి? జిగురు బూజుల దృష్ట్యా ప్లాస్మోడియం అంటే ఏమిటో వివరించండి?
జవాబు:
జిగురు బూజులు ప్రొటిస్టా రాజ్యానికి చెందిన పూతికాహార జీవులు బహుకేంద్రకయుతమైన జీవపదార్థము ప్లాస్మా త్వచంలో కప్పబడి, అనుకూల పరిస్థితుల్లో ప్లాస్మోడియమ్ అనే సముచ్ఛయనం (aggregation) ఏర్పడుతుంది.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
యూగ్లినాయిడ్ల లక్షణాలు ఏవిటి?
జవాబు:

  1. యూగ్లినాయిడ్లు ఎక్కువగా నిల్వవున్న నీటిలో పెరిగే మంచినీటి జీవులు.
  2. ప్రోటీన్ అధికంగా వున్న ‘పెల్లికిల్’ అను పలుచని పొర ఉండటం వలన వీటి శరీరం సమ్యతను ప్రదర్శిస్తుంది.
  3. ఇవి ఒక పొడవు, ఒక పొట్టి కశాభాలను కల్గి ఉంటాయి.
  4. కణం పూర్వ భాగంలో గల అంతర్వలనంలో సైటోస్టోం (కణం నోరు) సైటోఫారింక్స్, రిజర్వాయర్ అను భాగాలు ఉంటాయి.
  5. రిజర్వాయర్ త్వచంపై కాంతి సూక్ష్మగ్రాహ్యత కల స్టిగ్మా లేదా కంటి చుక్కను కలిగి ఉంటుంది.
  6. సూర్యకాంతి లభించనప్పుడు పరపోషితాలుగా ఇతర చిన్నజీవులను భక్షిస్తాయి.
  7. ఇవి అనుదైర్ఘ్య ద్విథా విచ్ఛిత్తి ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయి.

ప్రశ్న 2.
క్రైసోఫైట్ల ముఖ్య లక్షణాలు, ప్రాముఖ్యతలను తెలపండి?
జవాబు:
క్రైసోఫైట్లో డయాటమ్లు, బంగారు రంగు శైవలాలు ఉన్నాయి. ఇవి మంచినీరు, సముద్రపు నీటి పరిసరాలలో పెరుగుతాయి. ఇవి చాలా వరకు కిరణజన్య సంయోగక్రియను జరుపుకుంటాయి. డయాటమ్లలో కణకవచము రెండు అతివ్యాప్తమైన పలుచని పెంకువంటి నిర్మాణాలను కలిగి సబ్బుపెట్టెలాగా ఉంటుంది. పైదాన్ని ఎపిథీకా అని, క్రింది దాన్ని హైపోథీకా అని అంటారు. వీటి గోడలు సిలికాతో నిర్మితమై ఉండుట వల్ల నాశనం చెందవు. ఇవి నివసించే ఆవాసాలలో అత్యధిక పాళ్ళలో కణకవచ నిక్షేపాలు మిగిలి ఉంటాయి. అనేక సంవత్సరాలు ఇటువంటి పదార్థాలు సంచయనం చెందుటవల్ల ‘డయాటమేసియస్ మృత్తిక’ లేక ‘కైసిల్గర్’ అని అంటారు.

ప్రాముఖ్యత :
సిలికాను కలిగి ఉండుట వల్ల, పాలిష్ చేయటానికి, నూనెలు, ద్రవాల్ని వడగట్టటానికి వాడతారు. మహా సముద్రాలలో డయాటమ్లు ప్రముఖ ఉత్పత్తిదారులు.

ప్రశ్న 3.
డైనోఫ్లాజెల్లేట్ ల గురించి క్లుప్తంగా తెలపండి.
జవాబు:

  1. డైనోఫ్లాజెల్లేట్లు ఉప్పు నీటిలో పెరుగుతూ, కిరణజన్య సంయోగక్రియ జరుపుకుంటాయి.
  2. కణకవచాల బాహ్యతలంపై ధృడమైన సెల్యూలోస్ పలకలుంటాయి.
  3. వీటికి రెండు కశాభాలు ఉంటాయి. అవి బొంగరం వంటి చలనాలను చూపిస్తాయి. కావున వీటిని విర్లింగ్ విప్లు అంటారు.
  4. కేంద్రకం అంతర్దశలో కూడా సాంద్రీకరణ చెందిన క్రోమోసోమ్లను కలిగి ఉంటుంది. క్రోమోసోమ్లలో హిస్టోన్లు ఉండవు.
  5. కొన్ని డైనోఫ్లాజెల్లేట్ (నాక్టిల్యూకా) లు జీవసందీప్తిని ప్రదర్శిస్తాయి.
  6. గోనియాలాక్స్ వంటి డైనోఫ్లాజెల్లేట్లు అతి త్వరితగతిలో చెందుటవల్ల, ఆ సముద్రమంతా ఎరుపురంగులో కనబడుతుంది (మధ్యధరా సముద్రములోని ఎరుపు అలలు)
  7. వీటి నుండి వెలువడే విషపదార్థాలు చేపల వంటి సముద్రజీవులను చంపగలవు.

AP Inter 1st Year Botany Study Material Chapter 2 జీవశాస్త్ర వర్గీకరణ

ప్రశ్న 4.
మన దైనందిన జీవితంలో శిలీంధ్రాల పాత్రను గురించి రాయండి. [Mar. ’14]
జవాబు:
మన దైనందిన జీవితంలో శిలీంధ్రాల వల్ల లాభాలు, నష్టాలు కలవు. అవి :

లాభాలు :

  1. ఈస్ట్ వంటి ఏకకణ శిలీంధ్రాలు రొట్టె, బీర్ తయారీలో ఉపయోగపడతాయి.
  2. కొన్ని శిలీంధ్రాలు, “పెనిసిలియం” వంటి సూక్ష్మ జీవనాశక పదార్థాలకు మూలము.
  3. అగారికస్ వంటి శిలీంధ్రాలు తినదగిన పుట్టగొడుగులుగా లభిస్తాయి.

నష్టాలు :

  1. కొన్ని శిలీంధ్రాల వల్ల కమలాపండ్లు కుళ్ళిపోతాయి.
  2. రొట్టెలపై బూజు ఏర్పడి, పాడైపోతుంది.
  3. ఆవాల ఆకులపై తెల్ల మచ్చలు ఆల్బుగో అను శిలీంధ్రం వల్ల ఏర్పడతాయి.
  4. కొన్ని శిలీంధ్రాలు (‘పక్సీనియా’) గోధుమ కుంకుమ తెగులును కలుగచేస్తాయి.

దీర్ఘ సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
మీరు చదివిన శిలీంధ్రాలలో వివిధ తరగతుల ముఖ్య లక్షణాలు తెలిపి, వాటిని పోల్చండి.
జవాబు:
సాధారణ లక్షణాలు :
I. ఫైకోమైసిటీస్

  1. ఇవి నీటి ఆవాసాలలోను, తడి, తేమ ప్రాంతాలలోని కుళ్ళే కొయ్యపైనా లేదా మొక్కలపై అవికల్ప పరాన్నజీవులుగా పెరుగుతాయి. వీటిని శైవలశిలీంధ్రాలు అని కూడా అంటారు.
  2. శిలీంధ్రజాలము విభాజక పటరహితం మరియు సీనోసైటిక్గా ఉంటుంది.
  3. అలైంగిక ప్రత్యుత్పత్తి గమన సిద్ధబీజాలు లేక చలనరహిత సిద్ధబీజాల ద్వారా జరుగుతుంది.
  4. రెండు సంయోగబీజాల కలయిక ఫలితంగా సంయుక్త సిద్ధబీజం ఏర్పడుతుంది. ఉదా : మ్యూకార్, రైజోపస్, ఆల్బుగో.

II. ఆస్కోమైసిటీస్

  1. వీటిని సాక్ఫంగై అని అంటారు.
  2. ఇవి ఏకకణయుతాలు (ఉదా : ఈస్ట్) లేదా బహుకణయుతాలు. (ఉదా : పెనిసిలియం)
  3. ఇవి పూతికాహరులు, విచ్ఛిన్నకారులు, పరాన్నజీవులు లేదా కోప్రోఫిలస్ (పేడపై పెరిగేవి)
  4. శిలీంధ్రజాలము శాఖాయుతము, విభాజకయుతము.
  5. అలైంగికంగా కొనిడియంల ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయి.
  6. లైంగికంగా ఆస్కోస్పోరులు ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయి.
    ఉదా : ఆస్పర్జిల్లస్, క్లావిసెప్స్, పెనిసిలియం.

III. బెసీడియోమైసిటీస్

  1. వీటిని పుట్టగొడుగులు, బ్రాకెట్ఫంగై లేదా పఫ్బల్స్ లేదా క్లబ్ ఫంగై అంటారు.
  2. ఇవి మట్టి, దుంగలు, చెట్లు మోదులు, సజీవ మొక్కల శరీరాలలో పరాన్నజీవులుగా పెరుగుతాయి.
  3. శిలీంధ్ర జాలము శాఖాయుతము, విభాజకయుతము.
  4. శాకీయ ప్రత్యుత్పత్తి ముక్కలవటం ద్వారా జరుగుతుంది.
  5. లైంగిక అవయవాలు ఉండవు.
  6. రెండు వేర్వేరు జన్యురూపాలకు చెందిన శిలీంధ్ర తంతువుల శారీరక కణాల సంయోగం ద్వారా ప్లాస్మోగమీ జరుగుతుంది.
    ఉదా : అగారికస్, యుస్టిలాగో, పాలిపోరస్.

IV. డ్యుటిరోమైసిటీస్

  1. వీటిని ఇంపర్ఫెక్ట్ ఫంగై అని అంటారు.
  2. కొన్ని పూతికాహారులుగా లేదా పరాన్న జాతులుగా ఉంటాయి. ఎక్కువ జాతులు విచ్ఛిన్నకారులుగా ఉంటూ ఖనిజాల చక్రీకరణలో తోడ్పడతాయి.
  3. శిలీంధ్రజాలము శాఖాయుతము, విభాజకయుతము.
  4. ఇవి అలైంగికంగా కొనిడియంల ద్వారా, శాకీయంగాను ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయి.
  5. లైంగిక దశలను గుర్తించిన తర్వాత, వీటిని వేరొక తరగతులలోకి మారుస్తారు.
    ఉదా : ఆల్టర్నేరియా, కొల్లెటో ట్రైఖమ్, ట్రెఖోడెర్మా.

ప్రశ్న 2.
మీరు చదివిన మొనీరాలోని వివిధ సముదాయాలను క్లుప్తంగా వివరించండి.
జవాబు:
మొనీరా రాజ్యంలో ఆర్కిబాక్టీరియమ్లు, యూబాక్టీరియమ్లు మైకోప్లాస్మా, ఆక్టినోమైసిటీస్ వంటి అన్ని కేంద్రక పూర్వజీవులు చేర్చబడినాయి.

I. ఆర్కిబాక్టీరియమ్ :

  1. ఇవి అధిక లవణయుత ప్రాంతాలు, వేడినీటి చలమలు మరియు బురద ప్రదేశాలలో నివసిస్తాయి.
  2. కణ కవచంలో సూడోమ్యూరిన్ ఉంటుంది.
  3. కణ కవచంలో శాఖాయుత లిపిడ్ శృంఖలాలుంటాయి.
  4. ఆవులు, గేదెలు లాంటి రూమినేట్ జంతువుల జీర్ణాశయంలో జీవిస్తూ, వాటి పేడ నుండి మీథేన్ గ్యాస్ ను ఉత్పత్తిచేయటానికి మిథనోజెన్లు తోడ్పడతాయి.

II. యూబాక్టీరియమ్ :

  1. ఇవి సర్వత్రా వ్యాపించి ఉన్నాయి. వేడినీటి చలమలు, ఎడారులు, మంచు, లోతైన సముద్రాలలో పరాన్న జాతులుగాను, మరికొన్ని సహజ జాతులుగాను నివసిస్తాయి.
  2. ఆకారమును బట్టి, గోళాకారము (కోకస్), దండాకారము (బాసిల్లస్), సర్పిలాకారము (స్పైరిల్లం) మరియు కామా (విబ్రియో) ఆకారంలో ఉంటాయి.
  3. కణ కవచము పెఫ్టిడోగ్లైకాన్ తో నిర్మితము.
  4. కణ త్వచంలో మీసోసోమ్లు ఉంటాయి.
  5. వీటిలో ప్రధాన జన్యుపదార్థమైన న్యూక్లియాయిడ్, 70’s రకపు రైబోసోమ్లు ఉంటాయి.
  6. కొన్ని యూ బాక్టీరియాలు స్వయంపోషితాలు. ఎక్కువ పరాన్న జీవులుగా ఉంటాయి.
  7. నాస్టాక్, అనబీనా వంటి నీలి ఆకుపచ్చ శైవలాలు సహనివేశాలుగా తంతువులుగా ఉంటూ హెటిరోసిస్ట్లలో నత్రజని స్థాపనలో తోడ్పడతాయి.
  8. ఇవి కలుషిత నీటిలో శైవల మంజరులు ఏర్పరుస్తాయి.

III. మైకోప్లాస్మాలు :

  1. ఇవి పూర్తిగా కణకవచం లేకుండా బహుళరూపాలలో ఉండే జీవులు.
  2. జీవ కణాలన్నింటిలోను అతి చిన్నవి. ఆక్సిజన్ లేని పరిస్థితులను కూడా తట్టుకోగలవు.
  3. ఇవి మొక్కలలో మంత్రగత్తె చీపురుకట్ట, పశువులలో పూరోనిమోనియా, మానవులలో మైకోప్లాస్మల్ యురిథ్రెటిస్ అను వ్యాధులు కలుగచేస్తాయి.

IV. ఆక్టినోమైసిటిస్ :

  1. ఇవి శాఖాయుత, తంతురూప బాక్టీరియమ్లు.
  2. కణకవచంలో మైకోలిక్ ఆమ్లాన్ని కలిగి ఉంటాయి.
  3. ఇది ఎక్కువగా పూతికాహార జీవులు లేదా విచ్ఛిన్నకారులు.
  4. మైకోబాక్టీరియమ్, కొరినిబాక్టీరియమ్ లు పరాన్న జీవులు.
  5. స్ట్రెప్టోమైసిస్ ప్రజాతులు నుండి అనేక సూక్ష్మ జీవనాశకాలు తయారుచేస్తాయి.

AP Inter 1st Year Botany Study Material Chapter 2 జీవశాస్త్ర వర్గీకరణ

ప్రశ్న 3.
ప్రొటిస్టాలోని వివిధ సముదాయాల ముఖ్యలక్షణాలను సోదాహరణగా రాయండి.
జవాబు:
I. క్రైసోఫైట్లు :
క్రైసోఫైట్లో డయాటమ్లు, బంగారు రంగు శైవలాలు ఉన్నాయి. ఇవి మంచినీరు, సముద్రపు నీటి పరిసరాలలో పెరుగుతాయి. ఇవి చాలా వరకు కిరణజన్య సంయోగక్రియను జరుపుకుంటాయి. డయాటమ్లలో కణకవచము రెండు అతివ్యాప్తమైన పలుచని పెంకువంటి నిర్మాణాలను కలిగి సబ్బుపెట్టెలాగా ఉంటుంది. పైదాన్ని ఎపిథీకా అని, కింది దాన్ని హైపోథీకా అని అంటారు. వీటి గోడలు సిలికాతో నిర్మితమై ఉండుట వల్ల నాశనం చెందవు. ఇవి నివసించే ఆవాసాలలో అత్యధిక పాళ్ళలో కణకవచ నిక్షేపాలు-మిగిలి ఉంటాయి. అనేక సంవత్సరాలు ఇటువంటి పదార్థాలు సంచయనం చెందుటవల్ల ‘డయాటమేసియస్ మృత్తిక లేక ‘కైసిల్గాగర్’ అని అంటారు.

ప్రాముఖ్యత :
సిలికాను కలిగి ఉండుట వల్ల, పాలిష్ చేయటానికి, నూనెలు, ద్రవాల్ని వడగట్టటానికి వాడతారు. మహా సముద్రాలలో డయాటమ్లు ప్రముఖ ఉత్పత్తిదారులు.

II. డైనోఫ్లాజెల్లేట్లు :

  1. డైనోఫ్లాజెల్లేట్లు ఉప్పు నీటిలో పెరుగుతూ, కిరణజన్య సంయోగక్రియ జరుపుకుంటాయి.
  2. కణకవచాల బాహ్యతలంపై దృడమైన సెల్యూలోస్ పలకలుంటాయి.
  3. వీటికి రెండు కశాభాలు ఉంటాయి.’ అవి బొంగరం వంటి చలనాలను చూపిస్తాయి. కావున వీటిని విర్లింగ్ విప్లు అంటారు.
  4. కేంద్రకం అంతర్ధశలో కూడా సాంద్రీకరణ చెందిన క్రోమోసోమ్లను కలిగి ఉంటుంది. క్రోమోసోమ్లలో హిస్టోన్లు ఉండవు.
  5. కొన్ని డైనోఫ్లాజెల్లేట్ (నాక్టిల్యూకా) లు జీవ సందీప్తిని ప్రదర్శిస్తాయి.
  6. గోనియాలాక్స్ వంటి డైనోఫ్లాజెల్లేట్లు అతి త్వరితగతిలో చెందుటవల్ల, ఆ సముద్రమంతా ఎరుపురంగులో కనబడుతుంది (మధ్యదరా సముద్రములోని ఎరుపు అలలు)
  7. వీటి” నుండి వెలువడే విషపదార్థాలు చేపల వంటి సముద్రజీవులను చంపగలవు.

III. యూగ్లినాయిడ్లు :

  1. యూగ్లినాయిడ్లు ఎక్కువగా నిల్వవున్న నీటిలో పెరిగే మంచినీటి జీవులు,
  2. ప్రోటీన్ అధికంగా వున్న ‘పెల్లికిల్’ అను పలుచని పొర ఉండటం వలన వీటి శరీరం నమ్యతను ప్రదర్శిస్తుంది.
  3. ఇవి ఒక పొడవు, ఒక పొట్టి కశాభాలను కల్గి ఉంటాయి.
  4. కణం పూర్వ భాగంలో గల అంతర్వలనంలో సైటోస్టాం (కణం నోరు) సైటోఫారింక్స్, రిజర్వాయర్ అను భాగాలు ఉంటాయి.
  5. రిజర్వాయర్ త్వచంపై కాంతి సూక్ష్మగ్రాహ్యత కల స్టిగ్మా లేదా కంటి చుక్కను కలిగి ఉంటుంది.
  6. సూర్యకాంతి లభించనప్పుడు పరపోషితాలుగా ఇతర చిన్నజీవులను భక్షిస్తాయి.
  7. ఇవి అనుదైర్ఘ్య ద్విధా విచ్ఛిత్తి ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయి.

IV. జిగురు బూజులు :

  1. ఇవి ప్రొటిస్టాకు చెందిన పూతికాహార జీవులు. బహుకేంద్రకయుతమైన జీవపదార్థము ప్లాస్మాత్వచంచే కప్పబడి ఉంటుంది.
  2. అనుకూల పరిస్థితులలో ఇవి సముచ్ఛయనం చెంది ప్లాస్మోడియమ్ ఏర్పడుతుంది.
  3. ప్రతికూల పరిస్థితులలో ప్లాస్మోడియమ్ విభేదన చెంది ఫలనాంగాలు ఏర్పడతాయి. ఇవి వాటి కొనలలో సిద్ధబీజాలను కలిగి ఉంటాయి.
  4. సిద్ధబీజాలు అత్యధిక నిరోధకతను కలిగి ప్రతికూల పరిస్థితులలో కూడా అనేక సంవత్సరాలు జీవించగలవు.

V. ప్రోటోజోవన్లు :

  1. ఇవి పరభక్షితాలుగా లేదా పరాన్నజీవులుగా జీవిస్తాయి.
  2. వీటికి కణకవచము ఉండదు.
  3. జీవపదార్థము ప్లాస్మాత్వచంచే ఆవరించబడి ఉంటుంది.
  4. అమీబాయిడ్ ప్రోటోజోవన్ లు మంచినీరు, సముద్రపు నీరు లేదా తడినేలలో జీవిస్తాయి. ఇవి అమీబావలె మిధ్యాపాదాలను ఏర్పరిచి ఆహారంను బంధిస్తాయి.
  5. ఫ్లాజెల్లేటెడ్ ప్రోటోజోవన్లు ఇవి స్వేచ్ఛగా గానీ పరాన్నజీవులుగా గానీ ఉంటాయి.
  6. ఇవి కశాభాలను కలిగి ఉంటాయి.
  7. పరాన్నజీవులుగా పెరిగే ట్రిపానోసోమా – నిద్రా వ్యాధిని కలుగచేస్తుంది.
  8. సీలియేటెడ్ ప్రోటోజోవన్లు : ఇవి చురుకుగా చలించే నీటిజీవులు.
  9. వీటిలోని గుంట కణం యొక్క ఉపరితలం వెలుపలికి తెరుచుకొని ఉంటుంది.
    ఉదా : పారమీసియమ్.

స్పోరోజోవన్లు :
సంక్రామక సిద్ధబీజం లాంటి దశలను కలిగి ఉంటాయి. ప్లాస్మోడియమ్ – మలేరియాను కలిగించి మానవ జనాభాను అస్తవ్యస్తం చేసే ప్రభావం కలిగి ఉంటుంది.

Intext Question and Answers

ప్రశ్న 1.
వీటి రెండు ఆర్థిక ప్రాముఖ్యం గల ఉపయోగాలను తెలపండి.
a) పరపోషిత బాక్టీరియమ్లు
b) ఆర్కి బాక్టీరియమ్లు
జవాబు:
a) పరపోషిత బాక్టీరియమ్లు :
ఇవి పాల నుంచి పెరుగు తయారీ, జీవనాశక పదార్థాలు ఉత్పత్తి, లెగ్యూమ్ వేర్లలో నత్రజని స్థాపనలో తోడ్పడతాయి.

b) ఆర్కిబాక్టీరియమ్లు :
ఆవులు, గేదెలు లాంటి రూమినేట్ జంతువుల జీర్ణాశయంలో జీవిస్తూ వాటి పేడ నుండి మీథేన్ గ్యాస్ నన్ను ఉత్పత్తి చేస్తాయి.

ప్రశ్న 2.
ఈ కింది వాటి ఆధారంగా శిలీంధ్ర రాజ్యంలోని తరగతులను పోల్చండి
a) పోషణ విధానము
b) ప్రత్యుత్పత్తి పద్ధతి
జవాబు:
a) పోషణ ఆధారంగా :
i) ఫైకోమైసిటీస్: అవికల్ప పరాన్నజీవులు.
ii) ఆస్కోమైసిటీస్ : పూతికాహారులు, విచ్ఛిన్నకారులు.
iii) బెసిడియోమైసిటీస్ : పరాన్నజాతులు
iv) డ్యుటిరోమైసిటీస్ : పూతికాహారులు, విచ్ఛిన్నకారులు.

b) ప్రత్యుత్పత్తి ఆధారంగా :
i) ఫైకోమైసిటీస్ phycomycetes :
అలైంగిక గమనసిద్ధ బీజాల ద్వారా, లైంగికంగా – సంయోగ బీజాల ద్వారా.

ii) ఆస్కోమైసిటీస్ :
అలైంగికంగా కొనీడియాల ద్వారా, లైంగికంగా ఆస్కోస్ఫోరుల ద్వారా.

iii) బెసీడియోమైసిటీస్ :
అలైంగికంగా ముక్కలగుట ద్వారా, లైంగికంగా శాకీయ కణాల సంపర్కం వల్ల.

iv) డ్యుటిరోమైసిటీస్ :
అలైంగికంగా కొనిడియంల ద్వారా.

AP Inter 1st Year Botany Study Material Chapter 2 జీవశాస్త్ర వర్గీకరణ

ప్రశ్న 3.
నిర్మాణం జన్యుపదార్థ స్వభావం దృష్ట్యా వైరస్ల ను గురించి క్లుప్తంగా రాయండి. ఏవైనా నాలుగు సాధారణ వైరస్ వ్యాధులను తెలపండి.
జవాబు:
వైరస్లలో కేంద్రకామ్లము, ప్రోటీన్లు ఉంటాయి. కేంద్రకామ్లము సంక్రమణ స్వభావంతో RNA లేక DNA గా ఉంటుంది. ప్రోటీను భాగము ఒక తొడుగులాగా ఉంటుంది. దీన్ని కాప్సిడ్ అంటారు. ఇది మధ్య ఉన్న కేంద్రకామ్లాన్ని చుట్టి ఉంటుంది.

కొన్ని వైరస్ వ్యాధులు :

  1. టొబాకో మొజాయిక్ వ్యాధి
  2. పొటాటో స్పిండిల్ ట్యూబర్ వ్యాధి
  3. హ్యూమన్ ఇమ్యునో వైరస్
  4. గొర్రెలలో పీ వ్యాధి

ప్రశ్న 4.
వైరస్లు, జీవులా లేదా నిర్జీవ పదార్థాలా ? అనే విషయాన్ని గురించి మీ తరగతిలో ఒక చర్చా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయండి.
జవాబు:
వైరస్లు వాస్తవంగా సజీవులు కాదు. జీవకణం వెలుపల అచేతనంగా ఉండి స్ఫటిక నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. ఇవి అవికల్ప పరాన్న జాతులుగా ఉంటాయి.

ప్రశ్న 5.
నీకు కాకతాళీయకంగా ఒక పాత భద్రపరచబడిన లేబుల్ ని శాశ్వత గాజుపలక దొరికింది. దీన్ని గుర్తించడానికి సూక్ష్మదర్శిని కింద ఉంచినప్పుడు ఈ కింది లక్షణాలను గుర్తించావు.
a) ఏకకణ నిర్మిత శరీరం b) స్పష్టమైన కేంద్రకం c) ద్వికశాభయుత పరిస్థితి ఒక కశాభం నిలువుగానూ, మరొకటి అడ్డంగానూ ఉంది. దీనిని దేనిగా గుర్తిస్తావు? అది ఏ రాజ్యానికి చెందిందో తెలుపగలవా?
జవాబు:
ప్రొటిస్టియన్ కణము. అని ప్రొటిస్టా రాజ్యానికి చెందుతుంది.

ప్రశ్న 6.
కలుషిత నీటిలో అత్యధికంగా నాస్టాక్, ఆసిల్లటోరియా వంటి మొక్కలుంటాయి. కారణాలను తెలపండి.
జవాబు:
కలుషిత నీటిలోని ఆక్సిజనిక్ కిరణజన్య సంయోగక్రియను జరుపుతాయి. మరియు నత్రజని స్థాపనలో తోడ్పడతాయి. నీటిలోని భారమూలకాలను తొలగిస్తాయి.

ప్రశ్న 7.
ఐదు రాజ్యాల వర్గీకరణ ప్రకారం చాలా తేడా ఉన్నప్పటికీ సయనోబాక్టీరియమ్లు, పరపోషిత బాక్టీరియమ్లు రెండు మొనీరా రాజ్యంలో యూబాక్టీరియమ్ల కింద చేర్చారు. ఈ రెండు రకాలు వర్గాలనూ ఒకే రాజ్యంలో చేర్చడం సమంజసమా? అయితే ఎందువల్ల?
జవాబు:
సయనోబాక్టీరియాలు, పరపోషితబాక్టీరియమ్లను మొనీరా రాజ్యంలో యూబాక్టీరియమ్ కింద చేర్చడం సమంజసమే. ఎందువల్లననగా అవి రెండు నత్రజని స్థాపనలో పాల్గొంటాయి.

ప్రశ్న 8.
మీరు గమనించిన ఏ లక్షణాల వల్ల ట్రిపోనోజోమాను ప్రోటిస్టా రాజ్యంలో చేర్చగలరు?
జవాబు:
ఇవి స్వేచ్ఛగా లేక పరాన్న జాతులుగా ఉంటాయి. ఇవి కశాభాలను కలిగి ఉంటాయి.

AP Inter 1st Year Botany Study Material Chapter 2 జీవశాస్త్ర వర్గీకరణ

ప్రశ్న 9.
జీవిత చరిత్రలోని ఒక దశలో ఆస్కోమైసిటీస్కు చెందిన శిలీంధ్రాలు క్లీస్టోథీసియం, పెరిథీసియం లేదా అపోథీసియం అనే ఫలనాంగాలను ఉత్పత్తి చేస్తాయి. ఈ మూడు రకాల ఫలనాంగాలు ఒకదానినుంచి మరొకటి ఏవిధంగా వేరుగా ఉంటాయి?
జవాబు:
ముఖరంధ్రం లేని గుండ్రటి ఆస్కోకార్ను క్లీసోథీసియం అంటారు. కూజా ఆకారంలో ఉండి కొనభాగంలో తెరుచుకునే ఆస్కోకార్ను పెరిథీసియం అంటారు. కప్పు లేదా సాసర్ ఆకారంలో ఈ ఆస్కోకార్ప్న అపోథీసియం అంటారు.

AP Inter 1st Year History Study Material Chapter 9 భక్తి, సూఫీ సంప్రదాయాలు (క్రీ.శ. 8 – 16 శతాబ్ధాలు)

Andhra Pradesh BIEAP AP Inter 1st Year History Study Material 9th Lesson భక్తి, సూఫీ సంప్రదాయాలు (క్రీ.శ. 8 – 16 శతాబ్ధాలు) Textbook Questions and Answers.

AP Inter 1st Year History Study Material 9th Lesson భక్తి, సూఫీ సంప్రదాయాలు (క్రీ.శ. 8 – 16 శతాబ్ధాలు)

లఘు సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
భక్తి ప్రబోధకుల ప్రధాన లక్షణాలను తెలపండి.
జవాబు:
ప్రాచీన కాలం నుంచి మధ్యయుగం వరకు నడిచిన భక్తి ఉద్యమంలో క్రింది ప్రధాన లక్షణాలను గమనించవచ్చు.
1) ఈశ్వరుని ఏకత్వంపై గాఢానురక్తి ప్రధాన లక్షణం. ఇందులో ముక్తి సాధనకై భగవంతుడి కృపను పొందడమే భక్తుడి లక్ష్యంగా భావించబడింది.

2) పూజా పునస్కారాలు, కర్మకాండలను వ్యతిరేకించిన భక్తి ఉద్యమకారులు పవిత్రమైన మనస్సు, జీవనం, మానవత్వం, భక్తి వంటివి అనుసరించడం ద్వారా భగవంతుడి కృపను పొందవచ్చు అని బోధించారు.

3) భక్తి ఉద్యమకారులు ఏకేశ్వరోపాసనను బోధించారు. కొందరు సగుణోపాసనను, మరికొందరు నిర్గుణోపాసనను ప్రోత్సహించారు. వైష్ణవుల్లో సగుణోపాసన ప్రసిద్ధమైంది. వారు శ్రీమహావిష్ణువు అవతారాలైన రాముడు లేదా కృష్ణుడిని తమ దేవుడిగా భావించారు. కాగా నిర్గుణోపాసన విగ్రహారాధనను వ్యతిరేకించింది. దేవుడు సర్వాంతర్యామి, మానవుల హృదయాల్లోనే భగవంతుడు ఉన్నాడు అని వారు ప్రచారం చేశారు. సగుణోపాసన, నిర్గుణోపాసనలను రెండింటినీ చిన్న మార్పులతో శంకరాచార్యుడి అద్వైత సిద్ధాంతములో చెప్పబడ్డాయి.

4) ఉత్తర, దక్షిణ భారతదేశ భక్తి ఉద్యమకారులు జ్ఞానం పొందడం ‘భక్తి’లో భాగంగా చెప్పారు. నిజమైన జ్ఞానాన్ని పొందేందుకు గురువు అవసరమని వారు బోధించారు.

5) భక్తి ఉద్యమకారులందరూ కుల వ్యవస్థను వ్యతిరేకించారు. అందువల్ల తక్కువ కులాలవారికి వారు ఆశాజ్యోతి అయ్యారు. భక్తి ఉద్యమకారుల్లో అధికమంది తక్కువ వర్గాల నుంచి వచ్చిన వారు కావడం విశేషం. నామదేవుడు (1270-1350), దర్జీ కుటుంబం, తుకారామ్ (1601-1649) శూద్ర కుటుంబం, కబీర్ దాస్ ముస్లిం మతంలోని నేతకుటుంబం నుంచి వచ్చారు.

6) భక్తి ఉద్యమకారులు పూజారులు పెత్తనాన్ని, సంస్కృత భాషను వ్యతిరేకించారు. ప్రజల భాషలోనే తమ సిద్ధాంతాలను ప్రచారం చేశారు. అందువల్ల బెంగాలీ, గుజరాతీ, మరాఠి, హిందీ వంటి ప్రాంతీయ భాషలకు స్వర్ణయుగం ప్రారంభమై అభివృద్ధి చెందాయి.

ప్రశ్న 2.
రామానందుడు, కబీర్లు భక్తి ఉద్యమానికి చేసిన సేవను వివరించండి.
జవాబు:
రామానందుడు : భక్తి ఉద్యమ ప్రవక్తలలో మొదటివాడు రామానందుడు. తమ సొంత బ్రాహ్మణ కులానికి చెందినవారి ఆధిపత్యాన్ని తిరస్కరించాడు. గంగాతీర ప్రాంతంలో తన సిద్ధాంత ప్రచారానికి హిందీ భాషను ఉపయోగించారు. రామానుజాచార్యుల విశిష్టాద్వైత మతాన్ని స్వీకరించి మరింత ప్రచారం కల్పించాడు. సాంఘిక దురాచారాలను, కర్మకాండలను తిరస్కరించిన రామానందుడు సంస్కృతం, హిందీ భాషకు ప్రాధాన్యం ఇచ్చాడు. తన రచన ‘ఆనంద భాష్యం’లో శూద్రులు వేదాలను అధ్యయనం చేయడాన్ని గుర్తించలేదు. తక్కువకులం వారిని శిష్యులుగా స్వీకరించాడు. ఇతని శిష్యుల్లో ధర్మాజాట్, సేనానాయి బ్రాహ్మణుడు, రవిదాస్ చర్మకారుడు, కబీర్ మహ్మదీయుడు, మహిళలు కూడా తన శిష్యులయ్యారు. వారిలో పద్మావతి, సురస్త్రీలు.

కబీర్ (1440–1510) : కబీర్ మధ్యయుగంలోని ప్రముఖ సంఘ, మతసంస్కర్త. రామానందుడి శిష్యుల్లో కబీర్ విప్లవ భావాలు కలవాడు. తన గురువు సాంఘిక సిద్ధాంతానికి అచరణాత్మక రూపును ప్రసాదించాడు. కబీర్ కులవ్యవస్థను ఖండించాడు. ఇతడు విగ్రహారాధనను, కర్మకాండలను ఖండించాడు. తీర్థయాత్రలను చేయడాన్ని వ్యతిరేకించాడు. మహిళల పరదా పద్ధతిని తిరస్కరించాడు. కబీర్ సాధారణ జీవనాన్ని విశ్వసించాడు. కబీర్ స్వయంగా బట్టలు కుట్టి వాటిని మార్కెట్లో విక్రయించాడు. ఆయనకు ‘లోయ్’ అనే మహిళతో వివాహం అయ్యింది. ఆయన కుమారుడు కమల్. ఆలోచనా పరుడు, భక్తుడు, దేవుడు ఒక్కడే అని కబీర్ విశ్వాసం. రాముడు, రహీం ఒక్కరే అని ప్రచారం చేశాడు. హిందూ-ముస్లింల మధ్య మైత్రి సాధించడానికి కబీర్ తీవ్రంగా కృషి చేశాడు. “హిందూ, ముస్లింలు ఇద్దరూ సర్వోన్నతమైన భగవంతుడి బిడ్డలు అని స్పష్టంగా అనేకసార్లు గట్టిగా చెప్పిన మొట్టమొదటి సాంఘిక, మతసంస్కర్త కబీర్” అని కె.ఎస్. లాల్ అనే పండితుడు పేర్కొన్నాడు. కబీర్ శిష్యులను “కబీర్ పంథీస్” అని అంటారు. కబీర్ రచించిన దోహాలకు ‘బీజక్’ అని పేరు. వీరు ఇరువురు ఒకే మట్టితో చేసిన రెండు కుండల వంటి వారని కబీర్ పేర్కొన్నాడు. ‘పవిత్రమైన హృదయం లేకుండా విగ్రహాన్ని ఆరాధించడం వల్ల, గంగానదిలో స్నానమాచరించడం వల్ల ప్రయోజనం ఏముంది ? మక్కాకు యాత్ర చేయడం వల్ల ప్రయోజనం ఏముంది ? అని కబీర్ ప్రశ్నించాడు.

ప్రశ్న 3.
సూఫీ మతాన్ని నిర్వచించి, దాని లక్షణాలను వివరించండి.
జవాబు:
మధ్యయుగ భారతదేశంలో భక్తి ఉద్యమం లాగానే సూఫీ ఉద్యమం కూడా హిందూ ముస్లింలను ఒకే వేదికపైకి తేవటానికి ప్రయత్నించింది. ముస్లిం మత విశ్వాసానికి మరొక పేరే సూఫీమతం. అరేబీయాలో సూఫీ మతం ప్రారంభమై తరువాత భారతదేశానికి వ్యాప్తి చెందింది. సూఫీమతాన్ని భారతదేశానికి తెచ్చిన ఘనత అరబ్బులకే దక్కుతుంది.
క్రీ.శ 19వ శతాబ్దంలో ‘సూఫీఇజం’ అనే ఆంగ్లపదం వాడుకలోని వచ్చింది. సూఫీ అనే పదం ‘తసావూఫ్’ అనే ఇస్లాం గ్రంథాల్లో ఉంది. ‘సపా’ అనే పదం నుంచి సూఫీ ఆవిర్భవించిందని కొందరు పండితులు అభిప్రాయపడ్డారు. మరికొందరు ‘సుఫా’ అనే పదం నుంచి ఆవిర్భవించిందని పేర్కొన్నారు. ‘సుఫా’ అంటే మహ్మద్ మసీదు వెలుపల ఆయన శిష్యులు మత సమావేశాలను జరిపే ‘అరుగు’ అని అర్థం. బస్రాకు చెందిన జహీజ్ మొదటిసారిగా సూఫీ అనే పదాన్ని ఉపయోగించాడు. క్రీ.శ 10వ శతాబ్దం కంటే పూర్వం సూఫీ మతం అరేబియా, పర్షియా ప్రజల సాంఘిక, మత జీవనాన్ని ప్రభావితం చేసింది. భగవంతుడిని ప్రేమించడమే అతన్ని చేరే ప్రధాన మార్గమని సూఫీ బోధకుల దృఢ నమ్మకం. ఎక్కువ మంది సూఫీ బోధకులు సమాజానికి దూరంగా ఏకాంతంగా గడిపి మోక్ష సాధనకై ప్రయత్నించారు. ఉలేమాల ఆధిపత్యాన్ని వారి ఖురాన్ వర్గీకరణను సూఫీ బోధకులు వ్యతిరేకించారు. ఉలేమాలు ఖురాన్ వాస్తవ స్ఫూర్తి అయిన ప్రజాస్వామ్య సమానత్వ భావాలకు వ్యతిరేకంగా వ్యవహరించేవారు. సూఫీ బోధకులు హిందూ, జైన, బౌద్ధ, క్రైస్తవ, జొరాస్ట్రియన్ మతాల వల్ల ప్రభావితులయ్యాయి.

హిజ్రా యుగానికి చెందిన మొదటి రెండు శతాబ్దాల్లో సూఫీ బోధకులు పశ్చాత్తాపం, దేవుడిపై విశ్వాసం వంటి ప్రాథమిక సూత్రాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. వారు కఠిన నియమాలను పాటించారు. మంచి ప్రవర్తన, స్వయంకృషి, సమానత్వాన్ని బోధించారు. వారు గురువులను ‘పీర్ ‘గా గౌరవంగా పిలిచేవారు. వారు బహుమతులను స్వీకరించక దయ, నిరాడంబరత, సహనం, దైవంపై అపార విశ్వాసం, మోక్షాలను విశ్వసించారు.

ప్రశ్న 4.
చిట్టీ, సూఫీ బోధకుల విజయాలను చర్చించండి.
జవాబు:
భారతదేశంలోని చిట్టీ, సూఫీ బోధకుల్లో ఖ్వాజా మొయినుద్దీన్ శిష్యులైన షేక్ హమీదుద్దీన్, షేక్ కుతుబుద్దీన్ భక్తియార్ కాకిలు ప్రధానమైనవారు. వారు సమానత్వాన్ని బోధిస్తూ సామాన్య జీవితాన్ని గడిపారు. శాకాహారులైన వారు స్థానిక హిందువులతో సన్నిహితంగా మెలిగారు. రాజపోషణ, దానాలు తీసుకోవడాన్ని వారు వ్యతిరేకించారు. గాత్ర, వాయిద్య సంగీతాలలో గొప్ప ఆధ్యాత్మికత ఉన్నట్లువారు పేర్కొన్నారు. భక్తియార్ కాకికి ఆధ్యాత్మిక సంగీతం అంటే ఇష్టం. సూఫీ బోధకులు తమ ఆశ్రమాల్లో ఏర్పాటు చేసిన హిందూ, ముస్లిం సంగీత విభావరులు అశేష ప్రజానీకాన్ని ఆకట్టుకొన్నాయి.

షేక్ ఫరీద్ లేదా బబాఫరీద్ ఢిల్లీ సుల్తానుల కాలానికి చెందిన మరొక సూఫీ బోధకుడు. అతడు అతి సామాన్య జీవితాన్ని గడిపాడు. భక్తి బోధకుల సంగీతాన్ని ఇష్టపడేవాడు. ఆయన శిష్యుల్లో నిజాముద్దీన్ అలియా ముఖ్యుడు. ఢిల్లీలోని ఘజియాపూర్లో తన కేంద్రాన్ని ఏర్పాటు చేశాడు.

హజరత్ నిజాముద్దీన్ వినయశీలి. ఇతడు అత్యంత సామాన్య జీవితాన్ని గడిపాడు. పేదవారిని ప్రేమించాడు. ఢిల్లీ సుల్తానుల బహుమానాలను ఆయన తిరస్కరించాడు. నసీరుద్దీన్ చిరాగ్, షేక్ సలీం చిష్టిలు ఆయన ప్రధాన శిష్యులు. షేక్ సలీమ్ చిష్టీ అక్బర్ సమకాలీకుడు. ఇతని సిద్ధాంతాలు, జీవనవిధానం అక్బర్ను తీవ్రంగా ప్రభావితం చేశాయి. అక్బర్ స్వయంగా ఫతేపూర్ సిక్రిని సందర్శించి చిష్టీ ఆశీస్సులను పొందాడు. తనకు కుమారుడు జన్మించాక అతనికి సలీమ్ అని అక్బర్ నామకరణం చేశాడు. చిష్తీ సమాధిపై అక్బర్ నిర్మించిన దర్గా ఉరుసు సందర్భంగా అన్ని ప్రాంతాల, అన్ని మతాల ప్రజలను విశేషంగా ఆకర్షిస్తూ ఉంది.

ప్రశ్న 5.
సుహ్రవర్థీ సిల్సిలా గురించి వ్రాయండి.
జవాబు:
సుహ్రవర్థి సిల్సిలా రెండవ ప్రసిద్ధ శాఖ. ఈశాన్య వాయువ్య భారతదేశంలో విలసిల్లింది. ముల్తాన్ దీవి ప్రధాన కేంద్రమైన తరువాత కాలంలో ‘సింధు’కు విస్తరించింది. భారతదేశంలో దీన్ని ముల్తాన్కు చెందిన షేక్ బహఉద్దీన్ స్థాపించాడు. ఆయన ముస్లిం విజ్ఞాన కేంద్రాలతో పాటు మక్కా – మదీనా, సమర్ఖండ్, బాగ్దాద్లను సందర్శించి ప్రజలు వారి సంస్కృతిని గురించి అనేక విషయాలను తెలుసుకొని తన గురువు షేక్ షహబుద్దీన్ సుహ్రవర్థీ (బాగ్దాద్)ని అనుకరించాడు. పేదరికంలో జీవించడాన్ని వ్యతిరేకించటంతో పాటు కఠిన ఉపవాసాన్ని తిరస్కరించాడు. ఆయన క్రీ.శ 1262లో మరణించాడు. షేక్ బహానంద్ దీన్ జకారియా సుహ్రవర్దీ మరణానంతరం ఈ సిల్సిలా రెండు భాగాలుగా చీలిపోయింది. అతని కుమారుడు బదర్ ఉద్దీన్ ఆరిఫ్ నాయకత్వంలో ముల్తాన్ శాఖ, సయ్యద్ జలాలుద్దీన్ సురఖ్ బుఖారి నాయకత్వంలో ఉచ్ శాఖలుగా విడిపోయాయి. సుహ్రవర్థీ సిల్సిలా చాలా విషయాల్లో చిష్టీ సిల్సిలాను వ్యతిరేకించింది. సుహ్రవర్ధలు పాలకుల మన్నన పొంది వారిచే కానుకలను స్వీకరించడం వంటివి చేశారు. వారు పేద, సామాన్య ప్రజలను గురించి పట్టించుకోలేదు.

సుహ్రవర్దీ సిల్సిలా తమ దర్గాలలో కేవలం సంపన్నులు, ఉన్నత వర్గాల సందర్శకులనే అనుమతించారు. మూడవ ప్రధానమైన సిల్సిలా ‘నక్షాబందీ సిల్సిలా’ దీన్ని ఖ్వాజాపీర్ మహ్మద్ స్థాపించాడు. ఇతడి శిష్యుడైన ఖ్వాజా బాకీభిల్లా భారతదేశం అంతటా దీన్ని వ్యాప్తి చేశాడు. పరిషత్ న్యాయానికి ప్రాధాన్యత ఇచ్చిన వీరు చిష్టీ సిల్సిలాలు, ఇతర సిల్సిలాలు ముస్లింలలో ప్రవేశపెట్టిన మార్పులను వ్యతిరేకించారు. ఈ సిల్సిలాతో పాటు ఖాద్రీ, ఫిరదౌసియా సిల్సిలాలు కూడా సమాజంలోని కొన్ని వర్గాల్లో ప్రత్యేక స్థానాన్ని పొందాయి.

ప్రశ్న 6.
భక్తి, సూఫీ ఉద్యమాలు సమాజంపై ఎటువంటి ప్రభావాన్ని చూపాయో వివరించండి.
జవాబు:
భక్తి, సూఫీ ఉద్యమకారుల బోధనలు భారతీయులకు కొత్త వేదికను సమకూర్చాయి. వీరి ఉదార, మానవతావాద బోధనలు అనేకమంది సామాన్యులను ఆకర్షించాయి. వీరి భావనలు బ్రాహ్మణుల, పూజారుల మౌల్వీల ఆధిపత్యాన్ని ప్రశ్నించాయి. ప్రజల భాషల్లో బోధన చేసి వీరు సామాన్యులను ఆకట్టుకున్నారు. కబీర్, నానక్ వంటి భక్తి ఉద్యమకారుల ముస్లింల మధ్య ఉన్న విభేదాలను తగ్గించాయి. అన్ని వర్గాల ప్రజలకు నీతితో కూడిన ఆత్మ విశ్వాసంతో జీవించాలని పిలుపునివ్వడంతో పాటు కుల వ్యవస్థను వ్యతిరేకించారు. వీరి విధానాల సమానత్వాన్ని బోధించి మత మార్పిడులను నిరోధించాయి. భక్తి, సూఫీ సన్యాసులు తమ నిరాడంబర జీవితం, పవిత్రమైన వ్యక్తిత్వం ద్వారా పరస్పరం ప్రభావితులయ్యారని ప్రముఖ చరిత్రకారుల యూసఫ్ హుస్సేన్ ఎ.ఎల్. శ్రీవాత్సవ, ఆర్.సి. మంజూందార్, జె.ఎన్. సర్కార్ వంటి వారు అభిప్రాయపడ్డారు. వారిరువురూ హిందూ ముస్లింల మధ్య పెరుగుతున్న స్పర్ధను తగ్గించేందుకు కృషి చేశారు. ఈ ఉద్యమాల వల్ల ప్రాంతీయ భాషలు అభివృద్ధి చెందడంతోపాటు సమాజానికి కొత్త ఆశలు, రూపం ప్రసాదించబడ్డాయి.

సంక్షిప్త సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ఆళ్వారులు, నాయనార్లు
జవాబు:
క్రీ.శ. 6వ శతాబ్ద కాలంలో తమిళదేశంలో ఆళ్వారులు (వైష్ణవాచార్యులు), నాయనార్ల (శైవాచార్యులు) నాయకత్వంలో వాస్తవంగా భక్తి ఉద్యమం ప్రారంభమైంది. వారు వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ వారి దేవతలను గురించి పాటలు పాడుతూ భక్తిని ప్రచారం చేశారు.

ఆళ్వార్లు, నాయనార్లు కులవ్యవస్థను బ్రాహ్మణుల ఆధిపత్యాన్ని వ్యతిరేకించినట్లు కొందరు పండితులు అభిప్రాయపడ్డారు. తొండరిప్పొడి ఆళ్వారు, అప్పార్ అనే నాయనార్లు కులవ్యవస్థను వ్యతిరేకించడంతోపాటు ఉపయోగంలేని గోత్రాలు, శాస్త్రాలను తిరస్కరించారు. స్త్రీ అయిన ఆండాళ్ (ఆళ్వారు) తన రచనల్లో విష్ణువును ప్రస్తుతించింది. కరైకాల్ అమ్మయార్ (నాయనారు) మోక్ష సాధనకు కఠినమైన సన్యాసాన్ని అనుసరించింది. వీరిద్దరూ తమ రచనల్లో సనాతన సాంఘిక కట్టుబాట్లను వ్యతిరేకించారు.

ప్రశ్న 2.
శంకరాచార్యుడు
జవాబు:
భక్తి ఉద్యమ ప్రబోధకుల్లో శ్రీ శంకరాచార్యులను ఆద్యులుగా చెప్పవచ్చు. శంకరాచార్యుడు బోధించిన సిద్ధాంతం అద్వైత సిద్ధాంతంగా ప్రసిద్ధిచెందింది. బెనారస్క చెందిన గోవిందయోగి బోధనలు శంకరాచార్యుడిని ప్రభావితం చేశాయి. శంకరాచార్యుడు హిందూమతానికి నూతన తాత్వికతను జోడించాడు. శంకరాచార్యుడు చేసిన ప్రయత్నాలు హిందూ మతస్తులకు నమ్మకాన్ని కల్పించడంతోపాటు మతాన్ని వదిలి వెళ్ళినవారు తిరిగివచ్చేలా చేశాయి. ఈ విధంగా శంకరాచార్యుడు భక్తి ఉద్యమానికి పునాదులువేసి నూతన హిందూమత రక్షకుడుగా పేరుపొందారు. మోక్షం పొందేందుకు జ్ఞాన మార్గాన్ని శంకరాచార్యులు బోధించాడు. అయితే శంకరాచార్యుల బోధనలు, సిద్ధాంతాలు సామాన్యుడికి అర్థమయ్యేలా లేకపోవడంతో తర్వాత భక్తి ప్రబోధకులు ప్రజలకు అర్థమయ్యే మార్గాన్ని బోధించేందుకు పూనుకొన్నారు.

ప్రశ్న 3.
రామానుజాచార్యుడు
జవాబు:
భక్తి ఉద్యమకారుల్లో శంకరాచార్యుని తరవాత రామానుజాచార్యుడు ప్రధానమైనవారు. మోక్షం సాధించేందుకు శంకరాచార్యుని జ్ఞాన మార్గాన్ని కాదని మోక్ష మార్గాన్ని బోధించాడు. తన గురువు యాదవ్ ప్రకాశ్ బోధించిన ఈ ప్రపంచమంతా మాయ, సంపూర్ణ ఏకేశ్వరోపాసన వంటి సిద్ధాంతాలను రామానుజాచార్యుడు వ్యతిరేకించాడు.
భగవంతుడిని చేరుకొనేందుకు ‘భక్తి’ ప్రధానమైన మార్గం. అన్ని కులాల వారు వారికి ఇష్టమైన దేవుడిని ఆరాధించేందుకు అర్హులేనని రామానుజాచార్యుడు బోధించాడు. ఈయన 120 సంవత్సరాల వయస్సులో సమాధి అయ్యారు.

ప్రశ్న 4.
గురునానక్
జవాబు:
కాలూరామ్, తృష్ణాదేవి దంపతులకు క్రీ.శ 1469 లో తల్వాండిలో గురునానక్ జన్మించాడు. ఆయన భార్య సులాఖని. వారికి శ్రీచంద్, లక్ష్మీచంద్ అనే కుమారులు కలిగారు. ఢిల్లీ సుల్తానుల పాలనలోని సుల్తాన్పూర్ రాష్ట్ర ధాన్యాగారంలో గురునానక్ పనిచేశాడు. క్రీ.శ. 1494 సంవత్సరంలో గురునానక్కు జ్ఞానోదయం అయ్యింది.
గురునానక్ పండితుడు, పర్షియా, హిందీ, పంజాబీ భాషలను అధ్యయనం చేశాడు. గురునానక్ బోధనలన్నీ ‘ఆదిగ్రంథ్’ అనే పుస్తక రూపంలో వెలువడ్డాయి. హిందూ, ముస్లింల ఐక్యతను ప్రచారం చేసిన గురునానక్ పేద ప్రజల కోసం ఆశ్రమాలను ఏర్పాటు చేశాడు. గురునానక్ అనుచరులు ఈ ఆశ్రమాలను నిర్వహించి పేదవారికి ఆహారాన్ని | సమకూర్చారు. చివరకు గురునానక్ అనుచరులు సిక్కు అనే మతాన్ని ఏర్పాటుచేశారు.

ప్రశ్న 5.
చైతన్యుడు.
జవాబు:
‘శ్రీ గౌరంగ’ అనే పేరుతో కూడా ప్రసిద్ధికెక్కిన చైతన్యుడు బెంగాలుకు చెందిన వైష్ణవ ఉద్యమకారుడు, సంఘసంస్కర్త. 25 సంవత్సరాల వయస్సులో కేశవభారతి నుంచి సన్యాసం స్వీకరించిన చైతన్యుడు పూరి, సోమనాథ్, ద్వారక, పండరీపురం, మధుర, బృందావనంలో పర్యటించి అక్కడ ప్రజల సంప్రదాయాలను పరిశీలించాడు. చివరకు ఒరిస్సాలోని పూరిలో స్థిరపడ్డాడు. సర్వాంతర్యామి ఒక్కడేనని అతడే శ్రీకృష్ణుడు లేదా హరి అని చైతన్యుడు బోధించాడు. ప్రేమ, భక్తి, గానం, నృత్యాల ద్వారా భగవంతుడిని చేరుకోవచ్చు అని ప్రబోధించాడు. కుల వ్యవస్థను వ్యతిరేకించి విశ్వమానవ సోదర ప్రేమచాటాడు. ఇతడు బెంగాలీ భాషలో ‘శిక్ష అస్తక్’ రచించాడు. బ్రహ్మచర్యాన్ని ‘సన్యాసులు’ అనుసరించాలని, సంకీర్తనలను గానం చేయాలనే అంశాలను అనుచరులచేత ఆచరింపచేశాడు.

ప్రశ్న 6.
మీరాబాయి
జవాబు:
క్రీ.శ. 16వ శతాబ్ద ప్రారంభంలో ఆవిర్భవించిన మహిళా భక్తిబోధకురాలు మీరాబాయి. మేర్తా పాలకుడు రతన్ సింగ్ రాథోడ్ ఏకైక కుమార్తె అయిన మీరాబాయి 18 సంవత్సరాల వయస్సులో 1516 సంవత్సరంలో మేవాడ్ రాజైన రాణాసంగా కుమారుడు భోజోజ్ని వివాహం చేసుకొంది. చిన్నతనం నుంచే మత విశ్వాసాన్ని కలిగిన ఆమె తన పూర్వీకుల లాగానే కృష్ణుడిని ఆరాధించింది. భర్త మరణానంతరం మామగారి నుంచి కష్టాలను ఎదుర్కొన్న ఆమె చివరకు తన జీవితాన్ని కృష్ణుడి ఆరాధనకు అంకితం చేసి పాటలు పాడటం ప్రారంభించింది. బృందావనంలో స్థిరపడి మరణించేవరకు అక్కడే ఉంది.

ప్రశ్న 7.
షేక్ ఫరీద్
జవాబు:
షేక్ ఫరీద్ లేదా బాబా ఫరీద్ (క్రీ.శ 1175 – 1265) ఢిల్లీ సుల్తానుల కాలానికి చెందిన మరొక సూఫీ బోధకుడు. అతడు అతి సామాన్య జీవితాన్ని గడిపాడు. భక్తి బోధకుల సంగీతాన్ని ఇష్టపడేవాడు. ఆయన శిష్యుల్లో నిజాముద్దీన్ అలియా ముఖ్యుడు. ఢిల్లీలోని ఘజియాపూర్లో తన కేంద్రాన్ని ఏర్పాటు చేశాడు.

ప్రశ్న 8.
షేక్ సలీం చిష్టీ
జవాబు:
షేక్ సలీం చిష్టీ అక్బర్ చక్రవర్తి సమకాలికుడు. సలీం చిష్టీ సిద్ధాంతాలు, జీవన విధానం అక్బర్ను తీవ్రంగా ప్రభావితం చేశాయి. అక్బర్ స్వయంగా ఫతేపూర్ సిక్రీని సందర్శించి చిష్టీ ఆశీస్సులను పొందాడు. తనకు కుమారుడు జన్మించాక అతనికి సలీం అని అక్బర్ నామకరణం చేశాడు. చిట్టీ సమాధిపై అక్బర్ నిర్మించిన దర్గా ఉరుసు సందర్భంగా అన్ని ప్రాంతాల, అన్ని మతాల ప్రజలను విశేషంగా ఆకర్షిస్తూ ఉంది.

ప్రశ్న 9.
భక్తి సాహిత్యం
జవాబు:
భారతీయ సమాజంలోని అన్ని వర్గాలను భక్తి ఉద్యమం ఆకర్షించింది. ఈ ఉద్యమం ప్రజలకు ఒక నూతన మార్గాన్ని చూపింది. భక్తి ఉద్యమకారులు పూజారుల పెత్తనాన్ని, సంస్కృత భాషను వ్యతిరేకించారు. ప్రజల భాషలోనే తమ సిద్ధాంతాలను ప్రచారం చేశారు. అందువల్ల బెంగాలీ, గుజరాతీ, మరాఠీ, హిందీ వంటి ప్రాంతీయ భాషలకు స్వర్ణయుగం ప్రారంభమై అభివృద్ధి చెందింది.

AP Inter 1st Year History Study Material Chapter 7 ఢిల్లీ సుల్తానుల యుగం ( క్రీ.శ. 1206 – 1526)

Andhra Pradesh BIEAP AP Inter 1st Year History Study Material 7th Lesson ఢిల్లీ సుల్తానుల యుగం ( క్రీ.శ. 1206 – 1526) Textbook Questions and Answers.

AP Inter 1st Year History Study Material 7th Lesson ఢిల్లీ సుల్తానుల యుగం ( క్రీ.శ. 1206 – 1526)

లఘు సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
తురుష్కుల దండయాత్రల ఫలితాలు.
జవాబు:
భారతదేశ చరిత్రలో అరబ్బుల సింధు విజయము “సత్ఫలితాలివ్వని ఘన విజయము” అని స్టాన్లీ లేనప్పూల్ వర్ణించాడు.
1) అరబ్బులు విశాల భారతదేశమున అత్యల్ప భాగమును మాత్రమే జయించుట వలన అది పెద్దగా గుర్తించబడలేదు.

2) పటిష్టమైన వర్ణవ్యవస్థ గల హిందువులు, అరబ్బుల సాంగత్యమును పరిహసించారు.

3) అరబ్బులు ఎంత ప్రయత్నించినను ఇస్లాంను ఇండియాలో వ్యాప్తి చేయలేకపోయారు. కాని తరువాత ముస్లిం విజేతలకు మార్గదర్శకులయ్యారు.

4) హిందువుల కంటే సాంస్కృతికంగా వెనుకబడి వున్న అరబ్బులు హిందూవేదాంతం, ఖగోళ శాస్త్రము, గణితము, వైద్యము మొదలగు శాస్త్రాలను వారి నుండి అభ్యసించారు. బ్రహ్మసిద్ధాంతము, పంచతంత్రము, చరకసంహిత వంటి గ్రంథాలు అరబ్బీ భాషలోకి అనువదించబడ్డాయి. అరబ్బులు భారతీయ చిత్రకారులను, శిల్పులను, పండితులను ఆదరించారు. మొత్తము మీద కొన్ని ప్రాచీన కట్టడాలు తప్ప అరబ్బుల దండయాత్ర భారతదేశమున మిగిల్చినదేమీ లేదు. కాని అరబ్బుల విజయం నుంచి హిందువులు మాత్రం ఎటువంటి గుణపాఠాన్ని గ్రహించలేకపోయారు. మహమ్మదీయులలోని సమతాభావాన్ని గాని, ఐకమత్యాన్నిగాని, వారి యుద్ధతంత్రాన్నిగాని నేర్చుకోలేకపోవటం వల్ల తరువాత కాలంలో తురుష్కుల దండయాత్రలను తిప్పికొట్టలేకపోయారు.

ప్రశ్న 2.
రజియా సుల్తానా.
జవాబు:
ఢిల్లీ సింహాసనాన్ని అధిష్టించిన ఏకైక మహారాణి సుల్తానా రజియా. ఇలుట్మిష్ కొడుకులు సమర్థులు కానందువల్ల తన వారసురాలిగా తన కుమార్తె రజియాను సుల్తానుగా ప్రకటించాడు. కాని ఇల్లుట్మిష్ మరణానంతరం ఢిల్లీ. సర్దారులు ఇల్టుట్మిష్ కొడుకుల్లో పెద్దవాడైన ఫిరోజ్ షాను ఢిల్లీ సుల్తాన్ గా ప్రకటించారు. అయితే అతడు వ్యసనపరుడు కావటంచేత అతడి తల్లి షా తుర్కాన్ పాలించసాగింది. కాని ఆమె అవినీతిపరురాలవటం చేత రజియా సైనికదళ సానుభూతితో ఫిరోజ్న వధించి, ఢిల్లీ సింహాసనాన్ని (క్రీ.శ. 1236-1240) అధిష్టించింది. ఈమె గొప్ప ధైర్యసాహసాలున్న స్త్రీ, సైన్యాలను నడపటంలోను, ప్రభుత్వ నిర్వహణలోను కడు సమర్థురాలు. కాని ఒక స్త్రీ సుల్తాను కావటం తురుష్క సర్దారులు అవమానంగా భావించారు. ఇల్ల్యుట్మిష్ కాలంలో బానిసలుగా చేరిన వీరు క్రమంగా అమీరులై తమ ప్రాబల్యమును పెంచుకొని ఒక కూటమిగా ఏర్పడ్డారు. ఈ కూటమినే చిహల్గనీ అంటారు. ఈ కూటమి రజియాకు వ్యతిరేకంగా కుట్రలు పన్నసాగింది. చిహల్గానీ నిరంకుశాధికారాలను నిర్మూలించి, సుల్తాన్ అధికారమును పెంపొందించటానికి రజియా కొన్ని చర్యలు చేపట్టింది. తురుష్కులు కాని వారికి అనేక ఉన్నతోద్యోగములలో నియమించింది. రాష్ట్ర గవర్నర్లుగా కొత్త వారిని ఎంపిక చేసింది. మాలిక్ యాకూబ్ అనే అబిసీనియా బానిసను అత్యంత గౌరవప్రదమైన అశ్వదళాధిపతిగా నియమించి అతని పట్ల ప్రత్యేక అభిమానాన్ని ప్రదర్శించింది. రజియా యాకూబ్పై అభిమానము చూపటాన్ని సహించలేని ఢిల్లీ సర్దారులు రజియాను పదవీచ్యుతురాలిగా చేయుటకు భటిండా రాష్ట్ర పాలకుడైన కబీర్ ఖాన్ చేతులు కలిపి రజియాపై కుట్రచేసి ఆమెను అంతము చేయదలచారు. ఈ విషయము తెలిసిన రజియా అపార సైనిక బలముతో బయలుదేరి మొదట లాహోర్ పాలకుడైన కబీర్ ఖాన్ తిరుగుబాటును అణచివేసింది. కాని అల్ తునియా చేతిలో ఓటమి పొంది బందీగా చిక్కుకుంది. ఢిల్లీ సర్దారులు యాకూబ్ను వధించారు. అంతట రజియా ఢిల్లీ నుంచి పారిపోయి అజ్ఞునియాను వివాహం చేసుకొని పెద్ద సైన్యాన్ని సమకూర్చుకొని ఢిల్లీపై దండెత్తింది. కాని మార్గమధ్యంలోనే రజియా, అల్ తునియాలు హత్యకు (క్రీ.శ 1240) – గురయ్యారు.

AP Inter 1st Year History Study Material Chapter 7 ఢిల్లీ సుల్తానుల యుగం ( క్రీ.శ. 1206 - 1526)

ప్రశ్న 3.
బాల్బన్ రాజధర్మ స్వరూపం.
జవాబు:
ఢిల్లీ సుల్తాన్ హోదాను, అధికారాన్ని, సార్వభౌమత్వాన్ని పరిరక్షించడానికి ఇనుమడింపచేయడానికి బాల్బన్ తన రాజకీయ అభిప్రాయాలను ఆచరణలో పెట్టి విజయం సాధించాడు. బాల్బన్ ‘రాజరికం దైవదత్తం’ అని ప్రగాఢంగా విశ్వసించాడు. ‘నియాబత్-ఇ-ఖుదాయి’ (కింగ్ ఈజ్ వైస్ రిజెన్సీ ఆఫ్ గాడ్ ఆన్ ఎర్త్) ‘రాజు భూమండలంపై భగవంతుని ప్రతినిధి, నీడ అని అతని భావం’, సుల్తాన్ హోదాకు గౌరవస్థానం కల్పించి, ప్రజల్లో, సర్దారుల్లో, ఉన్నతాధికారుల్లో అతనంటే ప్రత్యేక గౌరవభావన పెంపొందించి బాల్బన్ అనేక కొత్త ఆచారాలు, సంప్రదాయాలు, నియమ నిబంధనలు ప్రవేశపెట్టాడు. రాజరికం ‘నిరంకుశత్వానికి ప్రతిబింబం’ అని తన కుమారుడైన బుఖాన్కు బోధించాడు. తాను ‘జిల్లీ ఇల్హా’ (భగవంతుని నీడ) అని ప్రకటించాడు. సుల్తాన్ పట్ల గౌరవాన్ని పెంపొందించాలన్న లక్ష్యంతో పర్షియన్ సుల్తానుల దర్బారులో ఆచరణలో ఉన్న ‘జమిన్ బోస్’, ‘పాయిబోస్’ సుల్తాన్కు సాష్టాంగ నమస్కారం చేయడం లేదా సుల్తాన్ పాదాలను గాని సింహాసనాన్ని గాని ముద్దుపెట్టుకోవడం వంటి పద్ధతులు ప్రవేశపెట్టాడు. సుల్తాన్ అన్ని వేళలా రాజదర్పం ఉట్టిపడేలా రాజదుస్తుల్లో కనబడాలని కోరుకొన్నాడు. తాను సుల్తాన్ గా పదవి చేపట్టిన తరువాత తన హోదాకు తగిన అధికారులతోనే మాట్లాడేవాడు. బహిరంగంగా సమావేశాల్లో నవ్వేవాడు కాదు. దర్బారులో మద్యం సేవన, జూదం ఆడటం నిషేధించాడు. క్రమశిక్షణకు ప్రాధాన్యత కల్పించాడు. తాను ముద్రించిన నాణాలపై ఖలీఫా పేరును ముద్రించాడు. సుల్తాన్ పట్ల ప్రజలు, అధికారులు గౌరవంతో ప్రేమతో వ్యవహరించాలనీ, అదే విధంగా సుల్తాన్ ప్రజలను తన కన్నబిడ్డల్లా భావించి వారి సంక్షేమానికి సర్వవేళలా శ్రమించాలని పేర్కొన్నాడు. పటిష్టమైన క్రమశిక్షణ కలిగిన సైన్యం రాజ్య రక్షణకు అత్యావశ్యకమని గుర్తించి అనేక సైనిక సంస్కరణలు చేశాడు. ‘దివాన్-ఇ-ఆరీజ్’ (సైన్య వ్యవహారాలు) శాఖాధిపతులుగా తనకు విశ్వాసపాత్రుడైన ఇమాద్-ఉల్-ముల్క్న నియమించాడు. సైనికులకు జీతభత్యాల ఏర్పాటు చేశాడు. జాగీరులను రద్దుచేయించాడు. ప్రతి సైనికుడికి శిక్షణ ఇవ్వాల్సిన బాధ్యత దివాన్-ఇ-అరీజ్ శాఖకు, ఉన్నత సైనికాధికారులకు అప్పగించాడు. కోటలను నిర్మించారు. పాత కోటలకు మరమ్మత్తులు చేయించాడు.

ప్రశ్న 4.
అల్లావుద్దీన్ – ఖిల్జీ మార్కెటింగ్ సంస్కరణలు.
జవాబు:
అల్లావుద్దీన్ సంస్కరణలన్నింటిలో అత్యంత ఉత్తమమైనవి, ప్రశంసలందుకొన్నవి, అతను ప్రవేశపెట్టిన మార్కెట్ సంస్కరణలు. ఇందుకు ముఖ్యకారణం, ప్రభుత్వం చెల్లించే జీతంలో ఒక సాధారణ సైనికుడు సుఖంగా జీవించడానికి వీలుగా నిత్యావసర వస్తువుల ధరలను అదుపులో పెట్టాలని నిర్ణయించాడు. వస్తువుల ధరలను నిర్ణయించడమే కాకుండా ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే వ్యాపారులు సరుకులను అమ్మాలని అల్లావుద్దీన్ నిర్దేశించాడు. ఈ నియమాలను ఉల్లంఘించిన వారిని, తప్పుడు తూకాలు, కొలతలు వాడిన వారిని ఇతడు అతి కఠినంగా శిక్షించేవాడు. వ్యాపారస్థులు వారు అమ్మే వ్యాపార వస్తువులను ముందుగా ప్రకటించి, వారి పేర్లతో ప్రభుత్వం దగ్గర రిజిష్టర్ చేసుకోవాలని ఆదేశించాడు. వ్యాపారస్థులపై అజమాయిషీకి “దివానీ రియాసత్’, ‘షహనాయి మండి’ అను ఇద్దరు అధికారులను నియమించాడు. ఘనత : పరిపాలనలో మొట్టమొదటిసారిగా ఖచ్చితమైన సంస్కరణలు ప్రవేశపెట్టినవాడు అల్లావుద్దీన్. తన పాలనా సంస్కరణల ద్వారా అల్లావుద్దీన్ భారతదేశంలో తురుష్క సామ్రాజ్య పునాదులను పటిష్టపరిచాడు.

ప్రశ్న 5.
మహ్మద్ – బీన్ – తుగ్లక్ సంస్కరణలు.
జవాబు:
జునాఖాన్ మహమ్మద్ బీన్ తుగ్లక్ అనే బిరుదుతో క్రీ.శ. 1325లో ఢిల్లీ సింహాసనమధిష్టించి 1351 వరకు రాజ్యమేలాడు. ఢిల్లీ సుల్తానులలోనే గాక, మధ్యయుగ చక్రవర్తులందరిలో ప్రత్యేకమయిన వ్యక్తిత్వము ఉన్నవాడు తుగ్లక్.
పరిపాలనా సంస్కరణలు :
1) అంతర్వేది ప్రాంతంపై పన్నుల హెచ్చింపు: మహమ్మద్ బీన్ తుగ్లక్ తన రాజ్య ఆర్థిక పరిస్థితిని మెరుగు పరచుటకై గంగా, యమునా, అంతర్వేది ప్రాంతంలో పన్నులను విపరీతముగా పెంచాడు. పుల్లరి, ఇంటిపన్ను, భూమిశిస్తు అమితముగా విధించుటయే గాక క్రూరముగా వసూలు చేశాడు. అసలే కరువుతో కటకటలాడుతున్న ప్రజలు ఈ పన్నుల భారము భరించలేక భూములు వదిలివెళ్ళారు. ఆ తరువాత సుల్తాన్ వారికి సహాయ కార్యక్రమాలు చేపట్టినప్పటికీ అవి ఫలించలేదు. ప్రజలలో సుల్తాన్ పట్ల విరక్తి కలిగింది.

2) వ్యవసాయ శాఖ ఏర్పాటు: మహమ్మద్ బీన్ తుగ్లక్ బంజరు భూములను సాగులోకి తెచ్చుట కొరకు వ్యవసాయ శాఖను ఏర్పరచాడు. ఇందుకుగాను ప్రభుత్వము 60 లక్షల రూపాయలు ఖర్చు చేసింది. కాని ఉద్యోగుల అవినీతి వలన ఈ పథకం విఫలమైంది.

3) రాజధానిని మార్చుట : మంగోలుల దండయాత్రలకు దూరముగా దేశమునకు మధ్యభాగంలో రాజధాని వుండటం మంచిదని తుగ్లక్ తలచి తన రాజధానిని ఢిల్లీ నుండి దేవగిరికి మార్చాడు. ఢిల్లీ పౌరులందరు తమ వస్తు, వాహనాలతో దేవగిరికి తరలివెళ్ళాలని ఆజ్ఞ జారీ చేశాడు. 700 కిలోమీటర్ల ప్రయాణంలో ప్రజలు అనేక కష్టనష్టాలు అనుభవించారు. అనేకమంది మార్గమధ్యంలో మరణించారు. దేవగిరికి దౌలతాబాద్ అని నామకరణం చేశాడు. కాని మహమ్మదీయులు ఎవ్వరూ చిరకాలము అచ్చట వుండటానికి ఇష్టపడకపోవటం వలన ఈ పథకం కూడా విఫలమైంది. పైపెచ్చు ఢిల్లీలో సైనిక దళాలు లేవని తెలిసి మంగోలుల దండయాత్రలు పెరిగాయి. సుల్తాన్కు కూడా దౌలతాబాద్ వాతావరణం సరిపడలేదు. అందువలన పౌరులందరు మరల ఢిల్లీకి పోవాలని శాసించాడు. సుల్తాన్ చర్య వృథా ప్రయాసకు చిహ్నమని నిశితంగా విమర్శించారు.

AP Inter 1st Year History Study Material Chapter 7 ఢిల్లీ సుల్తానుల యుగం ( క్రీ.శ. 1206 - 1526)

4) రాగి నాణేల ముద్రణ : నాణేల సంస్కరణలో సుల్తాన్కు ఆసక్తి ఎక్కువ. అతడు విభిన్నమైన నాణేలను ముద్రించి, వాని విలువలు భిన్నంగా నిర్ణయించాడు. రాగి నాణేలను ముద్రించి వాని విలువలను వెండి, బంగారు నాణెములతో సమానం చేశాడు. ఫలితంగా స్వార్థపరులైన ప్రజలంతా సొంతంగా నాణెములు ముద్రించుట మొదలుపెట్టారు. వారు బంగారం, వెండి దాచి, రాగి నాణెములు తయారుచేయుట ప్రారంభించారు. దీని ఫలితంగా డబ్బు విలువ పడిపోయి వస్తువుల ధరలు పెరిగాయి. వీరి చర్యలను సుల్తాన్ అరికట్టలేకపోయాడు. విదేశీ వర్తకులు ఈ నాణెములు నిరాకరించుటచేత, వర్తక వాణిజ్యాలు స్తంభించాయి. అరాచక పరిస్థితులేర్పడటం చేత రాగి నాణేలను ఉపసంహరించవలసి వచ్చింది. రాగి నాణేలకు బంగారు, వెండి నాణెములు ఇచ్చుటచే ప్రభుత్వ ధానాగారం ఖాళీ అయింది.

5) న్యాయపాలన: మహమ్మద్ బీన్ తుగ్లక్ మత విధానమునందు సామరస్య ధోరణి ప్రదర్శించాడు. మత సిద్ధాంతాలను పట్టించుకోక లౌకిక సూత్రాలపై పాలన సాగించాడు. మహమ్మదీయేతరుల పట్ల మత సహనం పాటించిన తొలి ముస్లిం పాలకుడు ఇతడే.

విదేశాంగ విధానము : దురదృష్టవశాత్తు ఇతని విదేశాంగ విధానం కూడా ఘోరంగా విఫలమైంది.
1) ఖురాసాన్ దండయాత్ర : ఖురాసాన్ ప్రముఖులచే ప్రేరేపింపబడి మహమ్మద్ బిన్ తుగ్లక్ ఖురాసాన్, ఇరాన్ ట్రాన్-ఆగ్జియానా ప్రాంతాలను జయించదలచాడు. అందుకు పెద్ద సైన్యమును సిద్ధపరచి ఒక ఏడాది జీతాన్ని ముందుగానే చెల్లించాడు. కాని తగిన నిధులు లేకపోవుటచే ఈ ప్రయత్నం నుండి విరమించవలసి వచ్చింది.

2) నాగర్ కోట, కారాజాల్ విషయములు : పంజాబులోని భాంగ్రా జిల్లాయందలి నాగర్ కోటను తుగ్లక్ జయించాడు. హిమాలయ ప్రాంతంలోని కారాజాల్ను ఆక్రమించుటకు పెద్ద సైన్యాన్ని పంపాడు. విపరీతమైన జన, ధన నష్టములకు ఓర్చి, ఢిల్లీ సైన్యం కారజాల్ను ఆక్రమించింది.

3) మంగోలులకు లంచములు ఇచ్చుట : మహమ్మద్ బిన్ తుగ్లక్ మంగోలులను ఎదిరించలేక వారికి లంచములు ఇచ్చి, శాంతింపచేయుటకు ప్రయత్నించాడు. సుల్తాన్ బలహీనతను గమనించిన మంగోలులు వారి దాడులను అధికం చేశారు.
తిరుగుబాట్లు : సుల్తాను చేపట్టిన పాలనా సంస్కరణల వల్ల, క్రూరమైన శిక్షల వల్ల విసుగు చెందిన గవర్నర్లు తిరుగుబాట్లు చేయసాగారు. మొత్తం మీద 22 తిరుగుబాట్లు జరిగాయి. మాబార్, వరంగల్, బెంగాల్ స్వాతంత్ర్యం పొందాయి. విజయనగర, బహమనీ రాజ్యాలు దక్షిణాపథంలో స్థాపించబడ్డాయి. సింధు ప్రాంతంలో జరిగిన తిరుగుబాటును అణచుటకు వెళ్ళిన మహమ్మద్ క్రీ.శ. 1351 లో థట్టా సమీపంలో మరణించాడు. అంతటితో “ప్రజలకు అతని పీడ, అతనికి ప్రజల పీడ” తొలగింది.

ప్రశ్న 6.
ఢిల్లీ సుల్తానుల కాలంలో ఆర్థిక పరిస్థితులు.
జవాబు:
భారతదేశం ముస్లిం దాడులకు ముందు అపార సిరిసంపదలతో తులతూగుతుండేది. కాని వీరి అధికార స్థాపన అనంతరం ఆర్థికంగా చాలా నష్టపోయింది. అల్బెరూనీ, ఇబన్ బటూటా, మార్కోపోలో మొదలైన వారి వర్ణనలు ఆనాటి పట్టణ ఆర్థిక వ్యవస్థ విశేషాలను తెలియజేస్తున్నాయి. ఆధునిక చరిత్రకారులైన ఆచార్య ఇర్ఫాన్హాబీబ్, ఆచార్య యూసుఫ్ హుస్సేన్, డా॥ సతీష్ చంద్రల రచనలు ఢిల్లీ సుల్తానుల కాలం నాటి గ్రామీణ జీవనాన్ని, ఆర్థిక స్థితిగతులను వివరిస్తున్నాయి. వ్యవసాయమే ఆనాటి ప్రధాన వృత్తి. చేతివృత్తులు, కుల వృత్తులు ఆదరణ పొందాయి. అనేక కొత్త పట్టణాలు, నిర్మించబడ్డాయి. వర్తక వ్యాపారం బాగా అభివృద్ధి చెందింది. ఆహార ధాన్యాలు, పండ్లు, పూలు పుష్కలంగా పండించారు. పత్తి పంట ఉత్తర భారతదేశంలో ప్రధానంగా పండించారు. ఇబన్ బటూటా నీరు పుష్కలంగా ఉండి, సారవంతమైన ప్రాంతాల్లో రైతులు ఏడాదికి మూడు పంటలు కూడా పండించారని పేర్కొన్నాడు.

గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, సామాజిక వ్యవస్థ వీరి కాలంలో విచ్ఛిన్నమైంది. నిరంతర దాడులు, అధిక పన్నుల భారం ప్రజలను పీడించింది. వస్త్రాల ఉత్పత్తి కొంత మందికి జీవనభృతి కల్పించింది. సామాన్య ప్రజానీకం దుర్లభజీవనఁ గడిపారు. ప్రజలపై ఢిల్లీ సుల్తానులు విపరీత పన్నులు విధించారు. కొన్ని ప్రాంతాల్లో లోహ పరిశ్రమ కొనసాగింది. అల్లావుద్దీన్ ఖిల్జీ మార్కెటింగ్ సంస్కరణలు కొంతమేరకు సైనికుల సంక్షేమానికి ఉపయోగపడ్డాయి. మహ్మద్-బీన్-తుగ్లక్ భూమిశిస్తు, టోకెన్ కరెన్సీ సంస్కరణలు విఫలమయ్యాయి. స్వదేశీ, విదేశీ వ్యాపారం భారీ ఎత్తున కొనసాగింది. బెంగాల్ నుంచి మేలురకం బియ్యం మలబార్, గుజరాతు సరఫరా చేయడమైంది. గోధుమలు, అవధ్, కారా, అలహాబాద్లలో భారీగా పండించేవారు. రవాణా వ్యవస్థ అంతగా అభివృద్ధిచెందలేదు. ఎడ్లబండ్లపై, గుర్రాలపై సరుకుల రవాణా జరిగేది. ముల్తాన్, లాహోర్, దేవగిరి, ఢిల్లీ, సింధ్ ముఖ్య వర్తక కేంద్రాలు. తూర్పు ఆసియా దేశాలతో చైనాతో విదేశీ వర్తకం కొనసాగేది. జిటాల్, టంకా ప్రధాన నాణాలు. దేవాలయాలు, మసీదులు కూడా సొంత మాణ్యాలు, స్థిరాస్తులు కలిగి ఉండేవి. ముస్లిందాడుల వల్ల హిందూ మతసంస్థల ఆర్థిక స్థితి క్షీణించింది.

ప్రశ్న 7.
ఫిరోజ్ షా – తుగ్లక్ ఆంతరంగిక విధానం.
జవాబు:
మహమ్మద్ బీన్ తుగ్లక్ మరణానంతరం అతని పినతండ్రి కుమారుడు ఫిరోజ్ తుగ్లక్ ఢిల్లీ సింహాసనాన్ని (క్రీ.శ. 1351-1388) అధిష్టించాడు. అధికారంలోకి వచ్చిన వెంటనే మహమ్మద్ బీన్ తుగ్లక్ వైఫల్యానికి దారితీసిన కారణాలను గుర్తించి వాటిని సరిదిద్దటానికి పూనుకున్నాడు.
1) యమునా నది నుంచి హిస్సార్ వరకు, సట్లేజ్ నుండి గాగ్రా వరకు, సిరూర్ పరిసర ప్రాంతాల నుంచి హన్సీ వరకు, గాగ్రా నుంచి ఫిరోజాబాద్ వరకు, యమునా నది నుంచి ఫిరోజాబాద్ వరకు మొత్తం ఐదు కాలువలను త్రవ్వించి నీటి వనరులను కల్పించి, బంజరు భూములను సాగులోనికి తీసుకువచ్చి వ్యవసాయమును అభివృద్ధి చేశాడు. దీనివల్ల నీటి పారుదల పన్ను రూపంలో చాలా ఆదాయం రావటమే కాక బంజరు భూములు సాగువల్ల భూమి శిస్తు కూడా గణనీయంగా పెరిగింది.

2) ఫతేబాద్, హిస్సార్, ఫిరోజాబాద్, జౌన్పూర్ మొదలగు నగరాలను నిర్మించాడు. ఢిల్లీ చుట్టూ 1200 ఉద్యానవనాలను వేయించాడు. మహమ్మదీయ పకీర్లకు, హిందూ సన్యాసులకు ఎంతో ధనాన్ని విరాళాలుగా ఇచ్చాడు. దివానీ ఖైరత్ అనే పేర ఒక భవనాన్ని నిర్మించి దానిలో పేద మహమ్మదీయ బాలికలకు వివాహాలు జరిపించేవాడు.

AP Inter 1st Year History Study Material Chapter 7 ఢిల్లీ సుల్తానుల యుగం ( క్రీ.శ. 1206 - 1526)

3) సిద్ధ సైన్యాన్ని ఏర్పాటు చేయక సామంతరాజులు సరఫరా చేసే సైన్యం మీదనే ఆధారపడ్డాడు.

4) సైనికులకు జాగీర్లను ఇచ్చే పద్దతిని తిరిగి ప్రవేశపెట్టాడు. దీనివల్ల ప్రతిభ ఆధారంగా సైనికులను నియమించే పద్ధతి అంతమొంది అదీ సుల్తానత్ పతనానికి ఒక కారణమైంది.

5) బానిసల అవసరాల కోసం ఒక ప్రత్యేక శాఖను ఏర్పాటు చేశాడు. ఈ శాఖ కింద 1,80,000 మంది బానిసలుండేవారు. వీరి నిర్వహణ ఖజానాకు చాలా భారమైంది. పైగా బానిసలు రాజ్య వ్యవహారాల్లో జోక్యం చేసుకొని అనేక కుట్రలు చేసి సుల్తానత్ పతనానికి కారకులయ్యారు.

6) శిస్తును వసూలు చేసుకొనే అధికారాన్ని సర్దారులకు ఇచ్చి వారి అభిమానాన్ని పొందాడు.

7) కఠిన శిక్షలను రద్దు చేశాడు.

8) రాజ్య వ్యవహారాలలో ఉలేమాల జోక్యాన్ని అనుమతించాడు. మత మౌఢ్యంతో హిందువుల పట్ల అసహనవైఖరిని అవలంబించాడు. వారి నుంచి జిజియా పన్నును వసూలు చేశాడు. ఒరిస్సాలో వున్న భువనేశ్వర ఆలయం, మాళ్వా, నాగర్కోటలలోని దేవాలయాలను ధ్వంసం చేశాడు. ఇతడు సున్నీ మతస్థుడైనందువల్ల షియాల పట్ల కూడా కఠినవైఖరి అవలంబించాడు. ఈ మతవిధానం ప్రజల్లో ఇతని పట్ల వ్యతిరేకత పెరగడానికి కారణమైంది.

ప్రశ్న 8.
ఢిల్లీ సుల్తానుల కాలంలో వాస్తు – శిల్పకళ.
జవాబు:
ఢిల్లీ సుల్తానుల యుగంలో భారతదేశంలో ఒక కొత్తతరహా వాస్తు శిల్పకళ రూపుదిద్దుకొంది. ఢిల్లీలో, అజ్మీర్, లాహోర్, దౌలతాబాద్, ఫిరోజాబాద్ లో ఢిల్లీ సుల్తానులు వారి అధికారులు అనేక మసీదులు, కోటలు, రాజభవనాలు, కార్యాలయాలు నిర్మించారు. ఇస్లామిక్ వాస్తుకళ ముఖ్య లక్షణాలు 1. ఆర్చ్ & డోమ్ 2. సున్నపు మట్టిని గచ్చుగా వాడటం, 3. రాతిని, జిప్సంని వాడటం, 4. అలంకరణ అరేబియా, మధ్య ఆసియా, పర్షియా మొదలైన దేశాల నుంచి మేస్త్రీలు, వాస్తు శిల్పులు భారతదేశానికి ఆహ్వానించబడ్డారు. ఢిల్లీలో కుతుబుద్దీన్ ఐబక్ నిర్మించిన కువ్వత్-ఉల్-ఇస్లాం-మసీద్ ఒక గొప్ప కట్టడం.

కుతుబ్మనార్ ఒక మహోన్నత కట్టడం. దీని నిర్మాణ లక్ష్య నమాజ్ కోసం, ఇరుగుపొరుగు ముస్లింలను ఆహ్వానించడానికి ఉద్దేశించింది. సుప్రసిద్ధ వాస్తు మేధావి పెర్గూసన్ దీని నిర్మాణ కౌశల్యాన్ని ఎంతో ప్రశంసించాడు. అల్లావుద్దీన్ ఖిల్జీ, అలియా దర్వాజాను, ఢిల్లీలో నిజాముద్దీన్ ఔలియా మసీదు నిర్మించాడు. సిరి పట్టణాన్ని అల్లావుద్దీన్ ఖిల్జీ కట్టించాడు. ఇబన్ బటూటా ఇక్కడి రాజప్రాసాద సౌందర్యాన్ని ఎంతో పొగిడాడు. నసీముద్దీన్ లాల్గుంబద్ అనే భవనాన్ని కట్టించాడు. ఢిల్లీలోని మోతీమసీదు సికిందర్ లోడీ వజీరైన ముబారక్షా కట్టించాడు. ఈ విధంగా ఢిల్లీ సుల్తానుల కాలంలో ఇండో- ఇస్లామిక్ అనే కొత్త శైలి వాస్తుకళ రూపుదిద్దుకొంది.

సంక్షిప్త సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
అరబ్ సింధ్ ఆక్రమణ.
జవాబు:
అరబ్బుల దండయాత్ర నాటికి సింధు ప్రాంతమును దాహిర్ పాలించుచున్నాడు. అతడు అసమర్ధుడు, బలహీనుడు కావటం చేత అతని పాలన ప్రజారంజకముగా లేదు.
సింధూను జయించుటకు రెండుసార్లు బలీయమైన సైన్యదళములను హజాజ్ పంపాడు. కాని అరబ్బు సేనాపతులు రెండుసార్లు ఓడిపోయారు. తుదకు హజాజ్ తన అల్లుడైన మహమ్మద్ బీన్ ఖాసిం అనువానిని అపారసైన్యంతో పంపాడు. ఖాసిమ్ యువకుడు, శక్తిశాలియైన సేనాధిపతి.

ఖాసిం 25,000 అరబ్బు సైన్యముతో దేబాల్ను ఆక్రమించి దారుణ రక్తపాతానికి తలపడ్డాడు. ఇస్లాంమతము స్వీకరించని వారిని కత్తికి బలి ఇచ్చాడు. నెరూన్, శ్వాన్, శీలమ్ ప్రాంతములు తేలికగా ఆక్రమించుకున్నాడు. తుదకు క్రీ.శ. 712లో రోర్ యుద్ధరంగంలో దాహిర్ మరణించాడు. ఆ తరువాత బ్రాహ్మణాబాదు, సింధూ రాజధానియైన ఆలోర్ను ఖాసిం వశపరచుకున్నాడు. ఇట్లు సింధూ ప్రాంతాన్ని ఆక్రమించి, ముల్తాన్ను కూడా జయించాడు. కనోజ్పై దండెత్తుటకు ప్రయత్నములు చేయుచున్నప్పుడు ఖాసింను ఖలీఫా వెనుకకు పిలిపించి క్రూరముగా చంపాడు.

ప్రశ్న 2.
మహమ్మద్ ఘోరీ.
జవాబు:
ఘజనీ వంశ పరిపాలన తరువాత ఘోరీ వంశం సుల్తానులు అధికారంలోకి వచ్చారు. హీరాట్-ఘజనీ రాజ్యాల మధ్య పర్వత పంక్తుల్లో కేంద్రీకృతమై ఉన్న చిన్న రాజ్యంపై ఘోరీలు అధికారం నెలకొల్పారు. ఘోరీ వంశ మూల పురుషుడు ఘియాజుద్దీన్ మహ్మద్. ఇతడు కడపటి ఘజనీల నుంచి ఘజనీ రాజ్యాన్ని ఆక్రమించాడు. దాని రాష్ట్రపాలకుడిగా తన సోదరుడైన ముయిజుద్దీన్ ను నియమించాడు. చరిత్రలో ఇతడే మహ్మద్ ఘోరీగా కీర్తి గడించాడు. క్రీ.శ. 1173వ సం॥లో ఇతడు ఘోరీ రాజ్య సింహాసనం అధిష్టించాడు. మహ్మద్ ఘోరీ సమర్థ నాయకుడు, గొప్ప సేనాధిపతి.

AP Inter 1st Year History Study Material Chapter 7 ఢిల్లీ సుల్తానుల యుగం ( క్రీ.శ. 1206 - 1526)

ప్రశ్న 3.
ఆల్బెరూనీ.
జవాబు:
ఆల్బెరూనీ మహమ్మద్ గజనీ ఆస్థానకవి, పర్షియా దేశస్థుడు. సంస్కృత పండితుడు. మహమ్మద్ వెంట భారతదేశానికి వచ్చాడు. తారిఖ్-ఉల్-హింద్ అనే గ్రంథాన్ని రచించాడు.

ప్రశ్న 4.
జియాఉద్దీన్ – బరనీ
జవాబు:
తారీఖ్-ఇ-ఫిరోజ్ షాహి గ్రంథ రచయిత జియా-ఉద్దీన్-బరౌనీ. ఉన్నత విద్యావంతులైన కుటుంబానికి చెందిన బరౌనీ, తండ్రి ముయిద్-ఉల్-ముల్క్, మామయ్య అలా-ఉల్-ముల్క్లు, బాల్బన్, జలాలుద్దీన్ ఖిల్జీ, అల్లావుద్దీన్ ఖిల్జీ మొదలైన సుల్తానుల సేవలో వివిధ పదవులు నిర్వహించినందువల్ల బరేనీకి సుల్తానులతో సన్నిహిత సంబంధాలుండేవి. ఇతడి రచన 14వ శతాబ్దం నాటి రాజకీయ వ్యవస్థ, ఆర్థిక విధానాలు, సాంఘిక స్థితిగతులు, న్యాయ విధానం మొదలైన అంశాల గురించి విలువైన సమాచారం అందిస్తుంది. బానిస, ఖిల్జీ, తుగ్లక్ వంశ సుల్తానుల వివిధ విధానాలను వివరించే గొప్ప రచనే తారీఖ్-ఇ-ఫిరోజ్-షాహి.

ప్రశ్న 5.
కుతుబ్మనార్.
జవాబు:
కుతుబుద్దీన్ ఐబక్ దీనిని భక్తియార్ ఖాదిర్ అను సూఫీ సన్యాసి గౌరవార్ధం దీనిని ప్రారంభించగా ఇల్లుట్మిష్ దీనిని పూర్తి చేశాడు. ఇది ఢిల్లీలోని మొహరేవి వద్ద కలదు. దీని ఎత్తు 71.4 మీటర్లు. భారత్ పశ్చిమాసియా భవన నిర్మాణ సాంప్రదాయాలు అన్నీ దీనిలో ఉన్నాయి.

ప్రశ్న 6.
మంగోల్ దాడుల ప్రభావం.
జవాబు:
మంగోలులు ఒక సంచార జాతి. వారు ప్రథమం నుండి ఢిల్లీపై దాడులు జరిపి, తీవ్రనష్టం కలిగించారు. ముఖ్యముగా ఇల్టుట్మిష్ వీరి దాడి నుంచి తన రాజనీతిజ్ఞతతో ఢిల్లీని కాపాడెను. బాల్బన్ వీరి దాడుల నుంచి ఢిల్లీని కాపాడుటకు గట్టి ప్రయత్నం చేసెను. అయితే తన కుమారుడిని మంగోలాడుల వల్ల కోల్పోయెను. అల్లావుద్దీన్ ఖిల్జీ | కాలములో కూడా వీరు దాడులు జరిపి, ఢిల్లీకి తీవ్రనష్టము కల్గించారు.

ప్రశ్న 7.
టోకెన్ కరెన్సీ సంస్కరణలు.
జవాబు:
మహ్మద్-బీన్-తుగ్లక్ ఢిల్లీ సింహాసనము అధిష్టించేనాటికి అతని సామ్రాజ్యంలో వెండి, బంగారు లోహాలతో చేసిన టంకా, జిటాల్ వంటి నాణాలు వాడుకలో ఉన్నాయి. కాని అదేకాలంలో బంగారం, వెండి లోహాల తీవ్రకొరత ఏర్పడింది. ఈ సమస్యను అధిగమించడానికై సుల్తాన్ కొత్త పథకం రూపొందించాడు. కాని స్పష్టమైన మార్గ నిర్దేశనాలు లేనందువల్ల రాగి, ఇత్తడి నాణాలు ప్రతి కంసాలి ఇంట్లో ముద్రించబడ్డాయి. ద్రవ్యం విలువ గణనీయంగా పడిపోయింది. తప్పును గ్రహించిన సుల్తాన్ టోకెన్ కరెన్సీని రద్దు చేశాడు. అప్పటికే చాలా నకిలీ నాణాలు మార్కెట్లో చెలామణి అయ్యాయి. చివరకు ఈ పథకాన్ని సుల్తాన్ రద్దు చేశాడు.

ప్రశ్న 8.
మొదటి పానిపట్ యుద్దం.
జవాబు:
బాబర్ భారతదేశ ఆక్రమణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసుకొన్నాడు. 1525లో దౌలతాన్ను తరిమివేసి పంజాబ్ను స్వాధీనపరచుకున్నాడు. ఆ తరువాత తన సైన్యాన్ని ఢిల్లీ వైపుకు నడిపించాడు. ఢిల్లీ పాలకుడైన ఇబ్రహీంలోడీ ఒక లక్ష సైన్యంతో పానిపట్టు వద్ద బాబర్కు ఎదురునిలిచాడు. 1526 ఏప్రియల్ 21న ఈ ప్రదేశం వద్ద జరిగిన మొదటి పానిపట్టు యుద్ధంలో ఇబ్రహీంలోడీ వధించబడ్డాడు. ఢిల్లీ, ఆగ్రాలు బాబర్ వశమయ్యాయి. మొదటి పానిపట్టు యుద్ధం చారిత్రాత్మకమైనది. లోడీ సైనిక పాటవం సర్వనాశనమైంది. భారతదేశంలో మొగల్ సామ్రాజ్య స్థాపన జరిగింది. హిందూస్థాన్ సార్వభౌమత్వం ఆఫ్ఘనుల నుంచి మొగలుల చేతిలోకి పోయింది. మొగలుల వారసత్వం భారతదేశంలో 200 సంవత్సరాలు కొనసాగింది. మొగల్ పరిపాలనవల్ల భారతదేశంలో హిందూ, ముస్లిం సంస్కృతులు సంగమం చెంది మిశ్రమ సంస్కృతి విరాజిల్లింది.

మొదటి పానిపట్టు యుద్ధంలో బాబర్ విజయానికి అనేక పరిస్థితులు దోహదం చేశాయి. ఇబ్రహీంలోడీ అనుసరించిన అనుచిత రాజకీయ విధానం బాబర్కు సహకరించింది. బాబర్ యుద్ధ వ్యూహం, శతఘ్ని దళం, సుశిక్షితులైన సైనికులు బాబర్ విజయానికి దోహదపడ్డారు.

AP Inter 1st Year History Study Material Chapter 7 ఢిల్లీ సుల్తానుల యుగం ( క్రీ.శ. 1206 - 1526)

ప్రశ్న 9.
ఢిల్లీ సుల్తానుల కాలంలో సాహిత్య వికాసం.
జవాబు:
ఢిల్లీ సుల్తానుల అధికార స్థాపనతో భారతదేశంలో స్వదేశీ భాషలకు ఆదరణ కరువైంది. పర్షియన్, అరబిక్ భాషలు సుల్తానుల ఆదరణ, పోషణ పొందాయి. ఈ భాషలో అనేక గొప్ప రచనలు జరిగాయి. ఉర్దూ అవతరించింది. స్వదేశీ పదాల కలయికతో ఉర్దూ బాగా ఆదరణ పొందింది. భక్తి-సూఫీ ఉద్యమకారులు స్థానిక భాషల్లో వారి బోధనలు కొనసాగించారు. దీంతో హిందీ, అవధ్, మరాఠి, కన్నడ, తమిళ, మైథిలీ, బెంగాలీ భాషలు అభివృద్ధి సాధించాయి. సామాన్య ప్రజలు వారు మాట్లాడుకొనే భాషలోనే భక్తి ప్రబోధకులు భక్తి మార్గాన్ని, ఐక్యత, మానవతా విలువలను, ప్రబోధించారు. దీంతో వారిలో సోదరభావం పెంపొందింది.

ప్రశ్న 10.
ఢిల్లీ సుల్తాన్ల పతనం.
జవాబు:
క్రీ.శ. 1206లో కుతుబుద్దీన్ ఐబక్ తో ప్రారంభమైన ఢిల్లీ సుల్తానుల పాలన సుమారు మూడువందల ఇరవై ఏళ్ళపాటు కొనసాగి ఇబ్రహీం లోడీతో క్రీ.శ. 1526లో ముగిసింది. ఈ సుదీర్ఘ కాలంలో దేశంలో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఐదు వంశాల పాలన కొనసాగింది. సుల్తాన్ల పతనానికి అనేక కారణాలు దోహదం చేశాయి.

  1. సామ్రాజ్య విస్తీర్ణం గణనీయంగా పెరిగినప్పటికీ, సుల్తానులు అన్ని ప్రాంతాలపై కేంద్ర అధికారాన్ని సమర్ధంగా చెలాయించలేకపోవటం.
  2. సుల్తాన్ స్వార్ధపూరిత విధానాలు, సర్దారుల తిరుగుబాట్లు.
  3. స్థానిక ప్రజల అభిమానం పొందలేకపోవడం, హిందూమత వ్యతిరేక విధానాలు.
  4. రాష్ట్రాల పాలకుల తిరుగుబాట్లు.
  5. సైన్యంలో క్షీణించిన పట్టుదల.
  6. మహ్మద్-బీన్-తుగ్లక్ విధానాల వైఫల్యం.
  7. తైమూర్ దండయాత్ర.
  8. దక్షిణాపథంలో వెలమ, రెడ్డి, విజయనగర, బహమనీ రాజ్యాల
  9. మితిమీరిన పన్నుల భారం.
  10. ముస్లిం వర్గాల్లో ఉన్న విభేదాలు మొదలైనవి.

AP Inter 1st Year History Study Material Chapter 6 దక్కన్, దక్షిణ భారతదేశం, క్రీ.శ. 10వ శతాబ్దం వరకు

Andhra Pradesh BIEAP AP Inter 1st Year History Study Material 6th Lesson దక్కన్, దక్షిణ భారతదేశం, క్రీ.శ. 10వ శతాబ్దం వరకు Textbook Questions and Answers.

AP Inter 1st Year History Study Material 6th Lesson దక్కన్, దక్షిణ భారతదేశం, క్రీ.శ. 10వ శతాబ్దం వరకు

లఘు సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
క్రీ.శ. 8వ శతాబ్దం వరకు గల దక్కన్ చరిత్రను అధ్యయనం చేయడానికి సహకరించే ముఖ్య ఆధారాలను చర్చించండి.
జవాబు:
దక్కన్, దక్షిణ భారతదేశ చరిత్రను అధ్యయనం చేసేందుకు అనేక సాహిత్య ఆధారాలతోపాటు శాసనాలు దోహదపడుతున్నాయి సంగం యుగంలోని తమిళ రచనల్లో తోలకప్పియార్ రచించిన ‘తోలకప్పియం’ అనే వ్యాకరణ గ్రంథం సంగం యుగం నాటి సామాజిక, సాంస్కృతిక స్థితులను గురించి విలువైన సమాచారం అందిస్తోంది. ప్రసిద్ధ తమిళ రచయిత తిరువళ్ళువార్ రచించిన ‘తిరుక్కురల్’ తమిళ దేశానికి బైబిల్ వంటిది. ఈ రచన ఆ కాలం నాటి సాంఘిక జీవనం, నైతిక విలువలకు అద్దం పడుతుంది.

శాతవాహనుల కాలంనాటి రాజకీయ, సాంఘిక, ఆర్థిక, మత పరిస్థితులకు మత్స్య, వాయు, విష్ణు, బ్రహ్మ పురాణాలు, గుణాడ్యుడి బృహత్కథ, హాలుడి గాథా సప్తసతి, వాత్సాయనుడి కామసూత్రాలు, మెగస్తనీస్ ఇండికా పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీలతోపాటు ప్లినీ, టాలేమీ రచనలు అద్దం పడుతున్నాయి. మొదటి మహేంద్రవర్మ ‘మత్తవిలాసప్రహసనం’ అనే గొప్ప కావ్యాన్ని రచించాడు. భారవి ‘కిరాతార్జునీయం’ దండిన్ ‘దక్షకుమార చరిత్ర’ అనే గ్రంథాలు తమిళ ప్రజల సాంఘిక, మత, జీవనానికి సంబంధించిన విలువైన సమాచారాన్ని అందించాయి. చైనా యాత్రికుడు హుయానా త్సాంగ్ రచనలు పల్లవ, చాళుక్య యుగాలకు చెందిన విలువైన చారిత్రక విషయాలను వెల్లడించాయి.

శాసనాలు కూడా దక్షిణ భారతదేశ పాలకులకు సంబంధించిన విలువైన సమాచారాన్ని అందిస్తున్నాయి. శాతవాహనుల శాసనాలు నాసిక్, కార్లే, బెడ్స, అమరావతి, ధరణీకోట, నానాఘాట్, కొండాపూర్, పైథాన్, భట్టిప్రోలు, నాగార్జున కొండల్లో లభించాయి. వీటిలో శాతవాహనుల సాంఘిక, ఆర్థిక, రాజకీయ, మత విషయాలు వివరించబడ్డాయి.

చాళుక్యుల శాసనాల్లో బాదామి చాళుక్యుల ఐహోలు శాసనం రెండవ పులకేశి హర్షవర్ధనుడిపై సాధించిన విజయాన్ని వివరిస్తుంది. ఈ శాసనాలతో పాటు నాణాలు కూడా దక్షిణ భారతదేశ చరిత్ర అధ్యయనానికి ఎంతో ఉపయోగపడుతున్నాయి.

AP Inter 1st Year History Study Material Chapter 6 దక్కన్, దక్షిణ భారతదేశం, క్రీ.శ. 10వ శతాబ్దం వరకు

ప్రశ్న 2.
సంగం యుగంలోని ప్రధాన అంశాలను వివరించండి.
జవాబు:
సంగం యుగంలో ఈ క్రింది అంశాలు కలవు. అవి.
రాజకీయ వ్యవస్థ: నాడు నిరంకుశ రాజరికపు వ్యవస్థ అమల్లో వుంది. రాజుకు సర్వాధికారాలు ఉండేవి. సభ అనే ప్రజాసభ పరిపాలన, న్యాయ వ్యవహారాల్లో రాజుకు సలహాలను ఇచ్చేది. గ్రామపాలనను గ్రామ సంఘాలు నిర్వహించేవి. చతురంగ బలాలతో పాటు రాజు నౌకాదళాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాడు. యుద్ధంలో పాల్గొనడం, యుద్ధంలో వీరమరణం పొందడం గౌరవప్రదమైందిగా భావించేవారు.

సాంఘిక,ఆర్థిక, మతజీవనం: చాతుర్వర్ణ వ్యవస్థ అమల్లో ఉండేది. వనం, వరైని, తుడియం, కడంబన్ అనేవి చతుర్వర్ణాలు. అయితే వర్ణ వ్యవస్థ నిరంకుశంగా ఉండేది కాదు. సమాజంలో బ్రాహ్మణులు గౌరవప్రదమైన స్థానాన్ని అనుభవించేవారు. వ్యాపారులు, సంపన్నులు సుఖమయమైన జీవితాన్ని గడిపారు. బానిస వ్యవస్థ అమలులో ఉన్నట్లు
ఆధారాలున్నాయి.

వ్యవసాయం ప్రజల ప్రధాన వృత్తి, పశుపోషణ, కుండల తయారి, నేతపని వంటి వృత్తులు కూడా ఉండేవి. ప్రజల ఆర్థిక జీవనాన్ని శ్రేణులు క్రమబద్ధీకరించేవి. శ్రామికులు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వలస వెళ్ళే పద్ధతి అమలులో వుంది.

ప్రజల మత జీవనంలో వైదిక పద్ధతి, తమిళ సంప్రదాయం మిళితమై కనిపిస్తాయి. ప్రాచీన తమిళులు ప్రకృతి శక్తులు, సర్పాలు, వివిధ పిశాచాలను ఆరాధించేవారు. దేవతలకు యజ్ఞయాగాలను సమర్పించారు. దేవాలయ పూజా విధానంలో సంగీత, నృత్యాలు భాగంగా ఉండేవి. నాడు ప్రజలు శైవమతాన్ని అధికంగా అవలంబించారు. శివుడు, సుబ్రహ్మణ్యస్వామి ప్రధాన దేవతలు.

సాహిత్యం: సంగం యుగంలో తమిళ సాహిత్య చరిత్ర ప్రారంభమైంది. ‘తోలకప్పియం’ అనే వ్యాకరణ గ్రంథాన్ని ‘తోలకప్పియార్’ రచించాడు. ‘కురల్’ అనే ప్రసిద్ధ కావ్యాన్ని తిరువళ్ళువార్ రచించాడు. నైతిక విలువలతో కూడిన ఈ కావ్యం తమిళుల జీవితాల్లో ప్రధాన పాత్ర పోషించింది. జైన, బౌద్ధ కవులు, రచయితలు కూడా సంగం సాహిత్యాభివృద్ధికి కృషి చేశారు.

ప్రశ్న 3.
గౌతమీపుత్ర శాతకర్ణి గొప్పతనాన్ని అంచనా వేయండి.
జవాబు:
శాతవాహన పాలకులలో గౌతమీపుత్ర శాతకర్ణి (క్రీ.శ. 78-102) 23వ వాడు. ఇతని తల్లి గౌతమీ బాలశ్రీ వేయించిన నాసిక్ శాసనం వలన ఇతని ఘనతను తెలుసుకోవచ్చు. ఈ శాసనం వలన ఇతడు శక, యవన, పహ్లవ, క్షహరాట వంశాలను నాశనం చేశాడని, శాతవాహన వంశ ప్రతిష్టను పునరుద్ధరించాడని తెలుస్తున్నది. గౌతమీ బాలశ్రీ మరొక నాసిక్ శాసనంలో తాను గొప్ప చక్రవర్తికి తల్లినని, మరొక రాజుకు “మహారాజ పితామహి”నని చెప్పుకుంది. దీనిని బట్టి శాతకర్ణి గొప్ప యుద్ధవీరుడని తెలుస్తున్నది. ఇతడు అనేక క్షత్రియ రాజవంశాలను జయించి “క్షత్రియ దర్పమానమర్ధన” అనే బిరుదు ధరించాడు. మూడు సముద్రాల మధ్య ప్రాంతాన్ని జయించి “త్రిసముద్రతోయ పీతవాహన” అను బిరుదును ధరించాడు. మహారాష్ట్ర, ఉత్తర కొంకణ, సౌరాష్ట్ర, మాళవ, విదర్భ రాజ్యాలు ఇతని ఆధీనంలో ఉన్నాయి. నాసిక్ శాసనాల వలన గౌతమీపుత్ర శాతకర్ణి ప్రజల కష్టసుఖాలను తెలుసుకొని న్యాయబద్ధంగా పన్నులు విధించేవాడని, పేదవారికి, బ్రాహ్మణులకు భూదానాలు చేసేవాడని తెలుస్తున్నది. ఈ శాసనాలే గౌతమీపుత్ర శాతకర్ణికి వర్ణవ్యవస్థ మీద ప్రగాఢమైన నమ్మకముందని, బ్రాహ్మణ కులాన్ని వర్ణసంకరం కాకుండా రక్షించాడని, “ఏకబ్రాహ్మణుడు” అనే బిరుదు ధరించాడని పేర్కొన్నాయి. ఇతడికి ఉన్న “ఆగమనిలయ” అను బిరుదు వల్ల ఇతనికి ఆగమశాస్త్రాలపై అవగాహన ఉన్నట్లు తెలుస్తున్నది. ఈ కారణాల వలన గౌతమీపుత్ర శాతకర్ణి శాతవాహనుల్లో గొప్పవాడని చెప్పవచ్చు.

AP Inter 1st Year History Study Material Chapter 6 దక్కన్, దక్షిణ భారతదేశం, క్రీ.శ. 10వ శతాబ్దం వరకు

ప్రశ్న 4.
పల్లవ పాలకులైన మహేంద్రవర్మ, మొదటి నరసింహ వర్మ సాధించిన విజయాలను చర్చించండి.
జవాబు:
మొదటి మహేంద్రవర్మ (క్రీ.శ. 600-630): ఇతను సింహవిష్ణువు కుమారుడు. గొప్ప యోధుడు. ఇతను ఉత్తరాన కృష్ణానది వరకు తన అధికారాన్ని విస్తరింపచేశాడు. ఇతని కాలంలోనే పల్లవులకు చాళుక్యులకు మధ్య స్పర్థ ఆరంభమైంది. క్రీ.శ. 630లో చాళుక్య రాజైన రెండోపులకేశి పల్లవ రాజ్యం మీద దండెత్తి, పుల్లలూరు యుద్ధంలో మహేంద్రవర్మను ఓడించాడు. యుద్ధం తర్వాత కొద్ది కాలానికే మహేంద్రవర్మ మరణించాడు. మహేంద్రవర్మ బహుముఖ ప్రజ్ఞాశాలి. ఇతను మొదట జైనమతస్థుడైనప్పటికీ తర్వాత అప్పార్ బోధనలవల్ల శైవమతస్థుడయ్యాడు. ఇతను కవి. ‘మత్త విలాస ప్రహసన’మనే నాటకాన్ని రచించాడు. సంగీతంలో ఆసక్తి, ప్రవేశమూ ఉన్నవాడు. వాస్తు, శిల్ప, చిత్ర లేఖనాలను పోషించాడు. ఇన్ని విశిష్ట గుణాలున్నవాడవటం వల్ల ఇతను ‘చిత్రకారపులి’ అని, ‘విచిత్రచిత్తుడ’నే ప్రశంసనందుకొన్నాడు.

మొదటి నరసింహవర్మ (క్రీ.శ. 630-668): ఇతను మహేంద్రవర్మ కుమారుడు. పల్లవ రాజులందరిలోనూ అగ్రగణ్యుడు. సింహాసనమెక్కిన వెంటనే నరసింహవర్మ చాళుక్యుల దండయాత్రను ఎదుర్కోవలసి వచ్చింది. క్రీ.శ. 641లో రెండో పులకేశి పల్లవ రాజ్యంపైకి దండెత్తినప్పుడు పల్లవసేనలు అతణ్ణి ఓడించి తరమడమేకాక నరసింహవర్మ నాయకత్వంలో బాదామి వరకు నడిచి పులకేశిని వధించి బాదామిని దోచుకొన్నాయి. తర్వాత చోళ, పాండ్య ప్రభువులు నరసింహవర్మకు సామంతులయ్యారు. ఈ విజయాలకు నిదర్శనంగా నరసింహవర్మ ‘వాతాపికొండ’, ‘మహామల్ల’ బిరుదులను ధరించాడు.

నరసింహవర్మ కూడా తండ్రి మహేంద్రవర్మలాగా సారస్వతాన్నీ, వాస్తు, లలిత కళలనూ పోషించాడు. ఇతను మహామల్లపురం (మహాబలిపురం)లో ఏకశిలా రథాలనే దేవాలయాలను నిర్మింపచేశాడు. సంస్కృతంలో ‘కిరాతార్జునీయం’ అనే కావ్యాన్ని రచించిన భారవి కవిని ఇతను ఆదరించినట్లుగా తెలుస్తున్నది. నరసింహవర్మ కాలంలోనే హుయాన్ త్సాంగ్ అనే చైనా యాత్రికుడు కాంచీపురాన్ని దర్శించాడు. పల్లవుల రాజ్యాన్ని తమిళ దేశంగా వర్ణిస్తూ ఇక్కడి ప్రజలు నీతిపరులని, సత్యప్రియులని, శ్రమజీవులని, వీరికి విద్యావ్యాసాంగాలలో శ్రద్ధాసక్తులు అధికమని చెప్పాడు. కాంచీపురంలో దాదాపు 100 బౌద్ధారామాలు, 80 దేవాలయాలు ఉన్నట్లుగా కూడా ఇతను తెలిపాడు. నలందా విశ్వవిద్యాలయానికి ఆచార్యుడైన ధర్మపాలుడి జన్మస్థలం కాంచీపురమని ఇతను రాశాడు.

ప్రశ్న 5.
పల్లవయుగంలోని రాజకీయ, సామాజిక ప్రధాన అంశాలను వివరించండి.
జవాబు:
పల్లవుల రాజకీయ వ్యవస్థ: పల్లవులు దక్షిణ భారతదేశంలో సువిశాల సామ్రాజ్యాన్ని స్థాపించారు. భారతదేశ సాంస్కృతిక చరిత్రలో పల్లవయుగం గొప్పదశ. భారతదేశ సాంస్కృతిక ఐక్యత వీరి కాలంలో జరిగింది. పల్లవులు సంప్రదాయ నిరంకుశ రాజరిక వ్యవస్థను ఏర్పాటు చేశారు. పరిపాలనా వ్యవస్థకు రాజే ప్రధాన సూత్రధారి. రాజుకు సర్వాధికారాలు ఉండేవి. అయినా నిరంకుశుడు కాదు. ధర్మాన్ని రక్షిస్తూ ఉండేవాడు. దైనందిన పరిపాలనలో రాజుకు అనేకమంది అధికారులు సహకరించేవారు. పరిపాలనా సౌలభ్యం కోసం రాజ్యాన్ని రాష్ట్రాలు, కొట్టాలు, గ్రామాలుగా విభజించారు. భూమిశిస్తు రాజ్యానికి ప్రధాన ఆదాయం. దీనికి తోడు వాణిజ్య పన్నులు, వస్తువులపై పన్నుల ద్వారా ఆదాయం లభించేది.

మతాభివృద్ధి: పల్లవులు వైదిక మతాభిమానులు. వీరిలో చాలామంది శైవులు. రాజసింహుడు వంటి కొంతమంది వైష్ణవ మతాభిమానులుండేవారు. శైవులను నాయనార్లని పిలిచేవారు. వీరిలో ‘అప్పార్’, ‘సంబంధార్’, ‘సుందరమూర్తి’, ‘మాళిక్కవాళగర్’ మొదలైనవారు శైవమత వ్యాప్తికి ఈ యుగంలో అంకితమయ్యారు. విప్రనారాయణ, తిరుమంగై మొదలైన ఆళ్వారులు వైష్ణవమత వ్యాప్తికి అంకితమయ్యారు. పల్లవ యుగంలో తిరుపతి, శ్రీరంగం మొదలైన వైష్ణవ క్షేత్రాలు భక్తులను ఆకర్షించాయి. జైన, బౌద్ధమతాలు కూడా ఈ యుగంలో విలసిల్లాయి. కాంచీపురంలో 180 బౌద్ధారామాలున్నట్లు హుయాన్ త్సాంగ్ రాశాడు. అయితే శైవమతం, వైష్ణవమతాల వ్యాప్తితో జైన, బౌద్ధమతాలు కొంతవరకు క్షీణించాయి.

విద్యాసారస్వతాల ప్రగతి: ప్రాచీన పల్లవుల కాలంలో సంస్కృతం రాజభాష అయింది. నవీన పల్లవులు తమ శాసనాలన్నిటినీ సంస్కృతంలోనే వేయించారు. వీరు ఘటికలను స్థాపించి, సంస్కృతాన్ని, వైదిక విద్యలను పోషించారు. ఈ ఘటికల్లో చతుర్విద విద్యలు అంటే అన్వీక్షకి (Philosophy), త్రయీ (Three vedas), వార్తా (Economics), దండనీతి (Politics) బోధించేవారు. కాంచీపుర ఘటికా స్థానం, దేశవ్యాప్తంగా ప్రసిద్ధి వహించి, దూర ప్రాంతాల నుంచి విద్యార్థులను ఆకర్షించింది. సంస్కృత కవులైన భారవి, దండి వీరి కాలం వారే. విద్యలతోబాటు, తమిళదేశంలో నాట్య సంగీతాల్లో కూడా విశేషమైన కృషి జరిగింది. ఆనాటి వాఙ్మయంలో మృదంగం, యాళి, విరళి మొదలైన వాయిద్యాల పేర్లున్నాయి.

వాస్తు శిల్పాల్లో పల్లవుల కృషి: దక్షిణ భారతదేశంలో వాస్తు చరిత్ర పల్లవుల కాలంలోనే ప్రారంభమైందని విన్సెట్ స్మిత్ అభిప్రాయం. మనోహరమైన భారతీయ శిల్పరీతుల్లో పల్లవశైలి ఒకటి. వీరి కాలంనాటి శిల్పాలు, నిర్మాణాలు అపురూప కళాఖండాలు. ముఖ్యంగా కొండను తొలిచి ఆలయాలను నిర్మించే అద్భుతమైన కొత్త పద్ధతిని, మహేంద్రవర్మ తమిళ దేశంలో ప్రవేశపెట్టాడు. ఇదే పద్ధతిలో నరసింహవర్మ మహామల్లవరం (మహాబలిపురం)లో పంచపాండవుల రథాలను తొలిపించాడు. రాజసింహుడు మహాబలిపురంలో తీరదేవాలయాన్ని, కాంచీపురంలో కైలాసనాథ ఆలయాన్ని నిర్మించాడు. పల్లవుల వాస్తు ప్రత్యేకత కైలాసనాథ ఆలయంలో ప్రతిబింబిస్తుంది. శిల్పాల్లో మహామల్లపురంలో ఉన్న ”గంగావతరణ’ శిల్పం విదేశీ కళావిమర్శకుల ప్రశంసలందుకున్నది.

AP Inter 1st Year History Study Material Chapter 6 దక్కన్, దక్షిణ భారతదేశం, క్రీ.శ. 10వ శతాబ్దం వరకు

ప్రశ్న 6.
రెండవ పులకేశి గొప్పతనాన్ని అంచనా వేయండి.
జవాబు:
రెండోపులకేశి (క్రీ.శ. 609-642): రెండో పులకేశి బాదామి చాళుక్యుల్లోనే గాక ప్రసిద్ధ భారతీయ చక్రవర్తుల్లో ఒకడు. గౌతమీపుత్ర శాతకర్ణి తర్వాత దక్షిణాపథాన్ని పూర్తిగా జయించి ఏలిన మొదటి సార్వభౌముడు రెండో పులకేశి. ఇతని విజయాలను రవికీర్తి అనే జైన పండితుడు ‘ఐహోలు’ (ఐహోళి) శాసనంలో వివరించాడు. అధికారాన్ని సుస్థిరం చేసుకున్న తర్వాత, రెండో పులకేశి దిగ్విజయ యాత్రలు సాగించాడు. ఇతడు బనవాసి, కొంకణ రాజ్యాలను జయించాడు. లాట, మాళవ, అళుప (ఉడిపి మండలం), ఘూర్జర ప్రభువులనణచి సామంతులుగా చేసుకున్నాడు. దక్షిణ కోసల, కళింగ రాజ్యాల మీద దండయాత్రలను నిర్వహించాడు. పిష్ఠపురం, కునాల (కొల్లేరు) యుద్ధాల్లో విజయాన్ని సాధించి వేంగిని ఆక్రమించాడు. అనంతరం తన తమ్ముడైన కుబ్జవిష్ణువర్ధనుణ్ణి ఈ ప్రాంతానికి రాజుగా నియమించాడు. పులకేశి మరణం తర్వాత, వేంగీ పాలకులు స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకుని, తూర్పు చాళుక్యులు లేదా వేంగీ చాళుక్యులుగా ప్రసిద్ధి గాంచారు. తర్వాత ఇతడు చేర, చోళ, పాండ్యరాజుల మైత్రిని సంపాదించి, పల్లవ రాజ్యంపై దండెత్తి, మహేంద్రవర్మను పుల్లలూరు యుద్ధంలో ఓడించాడు. చాళుక్య, పల్లవ రాజ్యాల మధ్య సంఘర్షణకు ఇది నాంది. పులకేశి విజయాలన్నిటిలో ఘనమైంది హర్షవర్ధనుణ్ణి ఓడించడం. ‘సకల ఉత్తరాపథేశ్వరుడైన, హర్షవర్ధనుడు దక్షిణాపథాన్ని జయించాలని దండెత్తి వచ్చినప్పుడు పులకేశి అతణ్ణి నర్మదానది ఒడ్డున ఓడించి ‘పరమేశ్వర’ బిరుదును స్వీకరించాడు.

ఈ విజయ పరంపరలతో పులకేశి కీర్తి ప్రతిష్ఠలు దిగంతాలకు వ్యాపించాయి. పారశీక చక్రవర్తి రెండో ఖుస్రూ పులకేశి శక్తి సామర్థ్యాలను గురించి విని అతనితో దౌత్య సంబంధాలను నెలకొల్పుకున్నాడు. అజంతా మొదటి గుహలోని రెండు చిత్రాలు, ఈ రాయబారాలకు సంబంధించినవేనని కొందరి అభిప్రాయం. క్రీ.శ. 640-641 ప్రాంతంలో చైనా యాత్రికుడైన హుయాన్సాంగ్ చాళుక్య రాజ్యాన్ని దర్శించి తన అనుభవాలను వివరించాడు. పులకేశి సామ్రాజ్యం సారవంతమై, సిరి సంపదలతో తులతూగుతున్న దేశమని అతను తెలిపాడు. అక్కడి ప్రజలు యుద్ధప్రియులని, మేలు చేసిన వారిపట్ల కృతజ్ఞులై ఉంటారని వారికోసం ప్రాణాలను సైతం ఇవ్వడానికి సంసిద్ధులవుతారని, అలాగే కీడు తలపెట్టిన వారిపై ప్రతీకారం తీర్చుకోనిదే నిద్రపోరని అతను వివరించాడు. వారి రాజు పు-లో-కే-షి (పులకేశి) క్షత్రియ వీరుడని, తన ప్రజలను, సైనిక బలాన్ని చూసుకుని అతడు గర్విస్తాడని, పొరుగు రాజ్యాలంటే అతనికి లక్ష్యం లేదని అతను వర్ణించాడు.

ఇన్ని గొప్ప విజయాలను సాధించిన పులకేశి జీవితం విషాదాంతమైంది. క్రీ.శ. 641లో పులకేశి రెండోసారి పల్లవరాజ్యం మీద దండెత్తినపుడు పల్లవరాజైన నరసింహవర్మ పులకేశిని బాదామి వరకు తరిమి వధించాడు. ఈ పరాజయం నుంచి బాదామి చాళుక్యులు ఒక శతాబ్దం వరకు కోలుకోలేదు.

ప్రశ్న 7.
అమోఘవర్ష సాధించిన విజయాలను చర్చించండి.
జవాబు:
రాష్ట్రకూట పాలకుల్లో మొదటి అమోఘవర్ష (క్రీ.శ. 814-878) గొప్ప పాలకుడు. ఇతడు మూడవ గోవిందుడి కుమారుడు. అతడు స్థానిక పాలకులు, సామంతుల తిరుగుబాట్లను అణచివేశాడు. అతడు వేంగి పాలకుడు విజయాదిత్యుడితో వివాహ సంబంధాలను ఏర్పాటు చేసుకున్నాడు. గంగరాజును ఓడించాడు. అతడు స్వయంగా గొప్పకవి, కవిపండిత పోషకుడు. కన్నడంలో ‘కవిరాజమార్గం’ అనే వ్యాకరణ గ్రంథాన్ని రచించాడు. ‘మంఖేడ్’ అనే నూతన రాజధాని నగరాన్ని నిర్మింపచేశాడు. అమోఘవర్ష తరువాత అతని కుమారుడైన రెండవ కృష్ణుడు సింహాసనాన్ని అధిష్టించాడు. రెండవ కృష్ణుడి పాలనాకాలంలో రాష్ట్రకూట రాజ్యం ప్రాభావాన్ని సంతరించుకొన్నది. చివరకు రాష్ట్ర కూట రాజ్యాన్ని (క్రీ.శ. 974-975 సం॥లో) తూర్పు చాళుక్య రాజు రెండవ శైలుడు అంతమొందించి కళ్యాణి చాళుక్య రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు.

ప్రశ్న 8.
రాజరాజ చోళుడు సాధించిన విజయాలను వివరించండి.
జవాబు:
మొదటి రాజరాజు కాలం నుంచి చోళ రాజ్యంలో నూతన శకం ప్రారంభమైంది. రాజరాజు అనేక ఘన విజయాలను సాధించి చోళ రాజ్యాన్ని మహాసామ్రాజ్యంగా విస్తరింపచేశాడు. రాజరాజుకు ‘జయంగొండ’, ‘చోళమార్తాండ’ మొదలైన బిరుదులున్నాయి. పాండ్యులను, చేర రాజులను ఓడించి వారి సామ్రాజ్య భాగాలైన కొడమలై, కొళ్ళంలను యుద్ధం చేసి ఆక్రమించాడు. నౌకాదళంతో దాడి చేసి, మలయా ద్వీపాన్ని ఆక్రమించడమే కాకుండా శ్రీలంక మీద అనూరాధపురాన్ని (ఉత్తర సింహళం) నాశనం చేశాడు. ఉత్తర సింహళానికి “ముమ్ముడి చోళమండల”మని నామకరణం చేశాడు. ఇతని కాలంలోనే కళ్యాణి చాళుక్యులకు, వేంగీ చాళుక్యులకు పోరు ప్రారంభమైంది. రాజరాజు వేంగీ చాళుక్యులకు మద్దతునిచ్చి తన ప్రాబల్యాన్ని వేంగీలో నెలకొల్పాడు.

రాజరాజు తన సామ్రాజ్యాన్ని విస్తరింపచేయడమే కాకుండా క్రమబద్ధమైన పాలనా విధానాన్ని ప్రవేశపెట్టాడు. పంటపొలాలను సర్వేచేయించి, న్యాయసమ్మతమైన పన్నులను వసూలు చేశాడు. రాజరాజు శివభక్తుడు. తంజావూర్లో ‘రాజరాజేశ్వర’మనే పేరున్న బృహదీశ్వరాలయాన్ని నిర్మించాడు. శైవుడైనప్పటికీ రాజరాజు పరమత సహనం ఉన్నవాడు. శైలేంద్ర రాజైన శ్రీమార విజయోత్తుంగ వర్మకు నాగపట్టణంలో బౌద్ధ విహారాన్ని నిర్మించడానికి అనుమతినివ్వడమే కాకుండా ఆ విహారానికి ఒక గ్రామాన్ని దానం చేశాడు. ఇతను లలితకళల అభివృద్ధికి కూడా ఎంతో కృషి చేశాడు.

AP Inter 1st Year History Study Material Chapter 6 దక్కన్, దక్షిణ భారతదేశం, క్రీ.శ. 10వ శతాబ్దం వరకు

ప్రశ్న 9.
మొదటి రాజేంద్ర చోళుడి విజయాలను చర్చించండి.
జవాబు:
మొదటి రాజేంద్రుడు (క్రీ.శ. 1014-1044): రాజరాజు తరువాత చోళ సింహాసనాన్ని అధిష్టించినవాడు అతని కుమారుడు రాజేంద్ర చోళుడు. ఇతడు తండ్రిని మించిన శూరుడుగా కీర్తి ప్రతిష్టలను పొందాడు. అతడు తండ్రివలెనే దిగ్విజయ యాత్రలు సాగించి సామ్రాజ్య వ్యాప్తికి పాటుపడ్డాడు. మొదట పాండ్య, చేర రాజ్యములను జయించాడు. ఆ తరువాత సింహళముపై నౌకాదండయాత్రలు సాగించి దానినంతటిని జయించి తన ఆధిపత్యము క్రిందకు తెచ్చాడు. చాళుక్యరాజ్యంలో జరిగిన వారసత్వ యుద్ధాల్లో వేంగి చాళుక్యుల పక్షాన నిలిచి రాజరాజ నరేంద్రునకు సహాయం చేశాడు. రాజరాజనరేంద్రునికి తన కుమార్తె అమ్మంగదేవినిచ్చి వివాహం చేశాడు. తరువాత గంగానది వరకు దండయాత్రలు చేసి, బెంగాల్ పాలవంశీయుడైన మహీపాలుని ఓడించి “గంగైకొండచోళ” అను బిరుదు ధరించాడు. ఈ విజయానికి గుర్తుగా “గంగైకొండ చోళాపురము” అను నగరాన్ని నిర్మించి దానిని తన రాజధానిగా చేసుకున్నాడు. తరువాత గొప్ప నౌకాబలమును రూపొందించుకొని జావా, సుమత్రా ప్రాంతములను పాలించే శ్రీవిజయ సామ్రాజ్యాధినేతయైన సంగ్రామ విజయోత్తుంగవర్మను ఓడించి, అతని రాజధాని కడారం స్వాధీనం చేసుకొన్నాడు. ఈ విజయమునకు చిహ్నంగా “కడారంకొండ” అనే బిరుదును ధరించాడు. ఇట్టి దిగ్విజయముల వలన రాజేంద్రచోళుడు భారతదేశ సుప్రసిద్ధ పాలకులలో ఒకడుగా కీర్తిని పొందాడు. ఇతడు తన తండ్రివలె గొప్ప పరిపాలనాదక్షుడు. వ్యవసాయాభివృద్ధి కొరకు అనేక నీటివనరులను ఏర్పరచాడు. వైదిక కళాశాలను స్థాపించి, దాని పోషణకు కొంత భూభాగమును దానము చేశాడు. ఇతడు గొప్ప భవన నిర్మాత. ప్రజాసంక్షేమ పాలన సాగించి, “తండ్రిని మించిన తనయుడు” అనే కీర్తిని పొందాడు. ఇతడు శిల్పకళను ఆదరించాడు. గంగైకొండ చోళపురంలో ఒక శివాలయాన్ని నిర్మించాడు.

ప్రశ్న 10.
చోళుల స్థానిక స్వపరిపాలనలోని గొప్ప అంశాలను తెలియచేయండి.
జవాబు:
చోళుల పాలనా వ్యవస్థలోని ముఖ్య లక్షణం వారి స్థానిక స్వపరిపాలనా విధానం. చోళుల గ్రామ పరిపాలననే “స్థానిక స్వపరిపాలన” అని కూడా అంటారు. మొదటి పరాంతకుని ఉత్తరమేరూర్ శాసనంలోను, కులోత్తుంగుని శాసనాల్లోను చోళుల గ్రామ పాలనా పద్ధతి వివరించబడింది.

గ్రామ పాలన: చోళుల సామ్రాజ్యంలో ప్రతి గ్రామానికి స్వయం పాలనాధికారం ఉంది. ప్రతి గ్రామంలోను గ్రామ పెద్దల సభ వుండేది. ఈ గ్రామ సభ స్వరూప స్వభావాలను గ్రామ గ్రామానికి మారుతుండేవి.

గ్రామ సభలు: చోళుల కాలంలో గ్రామాల్లో మూడు రకాల సభలుండేవి. అవి: 1) ఊర్. 2) సభ. 3) నగరం. ఊర్ అనే సభలో గ్రామంలోని భూస్వాములందరూ సభ్యులే. “సభ”లో బ్రాహ్మణ అగ్రహారంలోని వారు మాత్రమే సభ్యులుగా ఉండేవారు. ‘నగరం’ అనేది వర్తకులకు సంబంధించిన సభ. బ్రాహ్మణ అగ్రహారంలోని సభ్యులకు దేవాలయమే సమావేశపు స్థలం. కొన్ని గ్రామాల్లో ప్రత్యేకించి కచేరీలుండేవి.

సభ్యుల ఎన్నిక: చోళుల కాలంలో ప్రతి గ్రామాన్ని 30 వార్డులుగా విభజించారు. ప్రతి వార్డు నుండి ఒక సభ్యుడ్ని లాటరీ పద్ధతిపై ఎన్నుకునేవారు. ఈ సభ్యులను గ్రామసభ ఉపసంఘాలుగా నియమించేది. చెరువులు, సత్రాలు, ఆలయాలు, తోటలు, పాఠశాలలు, నేర విచారణ, పన్నుల వసూలు మొదలైన వాటికి ప్రత్యేక ఉపసంఘాలుండేవి. “పంచదార వారియం” అనే ఉపసంఘం మిగిలిన సంఘాల కార్యక్రమాలను పరిశీలించేది.

అర్హతలు: గ్రామసభలోని సభ్యుల అర్హతలను గురించి ప్రత్యేక నిబంధనావళిని రూపొందించి అమలు చేశారు. సభ్యులుగా ఎన్నుకోబడుటకు ఒక వ్యక్తికి కొన్ని అర్హతలుండాలి. అతడు

  1. 30 నుండి 70 సంవత్సరాల లోపు వయస్సు కలిగి వుండాలి.
  2. విద్యావంతుడై వుండాలి.
  3. సొంత ఇల్లు కలిగి భూమికి యజమానై వుండాలి.

అనర్హతలు: గ్రామసభ సభ్యులకు కొన్ని అర్హతలతో పాటు కొన్ని అనర్హతలు కూడా నిర్దేశించారు. గ్రామసభకు ఎన్నుకోబడదలచుకున్న వ్యక్తి

  1. పంచ మహాపాపాలు చేసినవాడై ఉండకూడదు.
  2. గత మూడు సంవత్సరాలుగా ఏ ఉపసంఘంలోను సభ్యుడిగా ఉండరాదు.
  3. ఒకసారి సభ్యుడిగా ఉండి లెక్కలను సరిగా అప్పగించని వాడు కూడా అనర్హుడే.
  4. నేరస్తులు వారి బంధువులు కూడా ఈ ఎన్నికల్లో పాల్గొనకూడదు.

గ్రామ సభ అధికారాలు: గ్రామంలోని భూములపై యాజమాన్యపు హక్కు సభకు ఉన్నది. పన్నులను విధించుట, అడవులను నరికించి కొత్త భూములను సాగులోకి తీసుకువచ్చుట మొదలగునవి ఈ సభ ముఖ్య విధులు. వీటితోపాటు భూమి, నీటి తగవులను పరిష్కరించుట, నేరాలను విచారించుట కూడా దీని విధులుగా చెప్పుకోవచ్చు. అయితే ఆదాయ వనరులు తక్కువ కావటంతో కేంద్ర ప్రభుత్వమే రహదారులు నిర్మించగా వాటిపై అజమాయిషీని సభ నిర్వహించేది. గ్రామసభలకు సలహాలివ్వటానికి అధికారులుండేవారు. కేంద్ర ప్రభుత్వము యొక్క అనవసర జోక్యము ఈ సభలలో ఉండేది కాదు.

AP Inter 1st Year History Study Material Chapter 6 దక్కన్, దక్షిణ భారతదేశం, క్రీ.శ. 10వ శతాబ్దం వరకు

ముగింపు: చోళుల గ్రామ పాలన సమర్థవంతమైనది, ఆదర్శవంతమైనది. చోళులు గ్రామ పరిపాలనను ఏర్పరచి అందులో ప్రజలను భాగస్వాములను చేయటం వల్ల పాలనలో ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య సమన్వయం సాధ్యపడింది.

సంక్షిప్త సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
దక్కన్, దక్షిణ భారతదేశం అనే పదాలను నిర్వచించండి.
జవాబు:
‘దక్కన్’ అనే పదానికి భాషాపరంగా భారతదేశ భూభాగంలోని దక్షిణ, ద్వీపకల్పభాగం అని అర్థం. క్రీ.శ. 1945సం||లో హైద్రాబాద్ లో జరిగిన దక్షిణ భారతదేశ చరిత్ర సమావేశంలో దక్కన్ భౌగోళిక సరిహద్దులను పేర్కొన్నారు. దీని ప్రకారం ఉత్తరాన తపతి నది నుంచి దక్షిణాన చివరి భూభాగం వరకు, తూర్పు సముద్రం నుంచి పడమర సముద్రం వరకు ఉన్న భూభాగమే దక్కన్. సాధారణంగా వింధ్య పర్వతాలు, నర్మదానదికి దక్షిణాన తూర్పు నుంచి పడమర వరకు ఉన్న భూభాగాన్ని దక్షిణ భారతదేశంగా వ్యవహరిస్తారు.

ప్రశ్న 2.
సంగం యుగం నాటి సాహిత్యం
జవాబు:
సంగం యుగంలో తమిళ సాహిత్య చరిత్ర ప్రారంభమైంది. ‘తోలకప్పియం’ అనే వ్యాకరణ గ్రంథాన్ని తోలకప్పియార్ రచించాడు. ‘కురల్’ అనే ప్రసిద్ధ కావ్యాన్ని తిరువళ్ళువార్ రచించాడు. నైతిక విలువలతో కూడిన ఈ కావ్యం తమిళుల జీవితాల్లో ప్రధానపాత్ర పోషించింది. జైన, బౌద్ధ కవులు, రచయితలు కూడా సంగం సాహిత్యాభివృద్ధికి కృషి చేశారు.

ప్రశ్న 3.
కరికాల చోళుడు.
జవాబు:
చోళ రాజుల్లో కరికాల చోళుడు (క్రీ.శ.190) గొప్పవాడు. అతను ‘వెన్ని’ వహైప్పరండలై యుద్ధాలలో చేర, పాండ్య రాజులపై గొప్ప విజయాన్ని సాధించాడు. పూహర్ (కావేరీ పట్టణం) అనే నూతన రాజధాని నగరాన్ని నిర్మింపచేశాడు. ప్రజాసంక్షేమానికి కృషి చేసి వ్యవసాయ, వ్యాపార వాణిజ్యాలను ప్రోత్సహించాడు. శ్రీరంగం సమీపంలో కావేరీనదిపై ఆనకట్టను నిర్మింపచేసి వ్యవసాయానికి నీటిపారుదల వసతిని కల్పించాడు. వైదిక మతాన్ని ప్రోత్సహించి యజ్ఞయాగాలను నిర్వహించాడు.

ప్రశ్న 4.
శాతవాహనుల శిల్పకళ
జవాబు:
శాతవాహనుల కాలంలో శిల్పకళ బాగా అభివృద్ధి చెందింది. ఆంధ్రదేశంలో బౌద్ధ విహారాలు, చైత్యాలు, స్థూపాలు, అధికంగా నిర్మించబడ్డాయి.. బుద్ధుడు లేదా బౌద్ధ భిక్షువుల అవశేషాలపై నిర్మించిన గొప్ప నిర్మాణమే స్తూపం. చైత్యం ఆరాధన ప్రదేశం. ప్రస్తుత గుంటూరు జిల్లాలోని కృష్ణానది తీరంలోగల అమరావతిలో ఉప స్థూపం శాతవాహనుల కాలం నాటి శిల్పకళావైభవానికి నిదర్శనంగా నిలుస్తుంది.

AP Inter 1st Year History Study Material Chapter 6 దక్కన్, దక్షిణ భారతదేశం, క్రీ.శ. 10వ శతాబ్దం వరకు

ప్రశ్న 5.
శాతవాహనుల కాలంలో మతం
జవాబు:
హిందువులు ఉన్నత స్థితిలో ఉండేవారు. వారిలో కొందరు శైవులు, మరికొందరు వైష్ణవులు. పశుపతి, గౌరి, రుద్రుడు, పార్వతి, లక్ష్మీనారాయణులను దైవాలుగా ప్రజలు పూజించేవారని గాథాసప్తశతి పేర్కొంది. అయితే వారందరిలోనూ త్రివిక్రముణ్ణి గొప్ప దైవంగా పేర్కొంది. కృష్ణుడి కథలు, లీలలు కూడా పరిచితమే. ఈ దేవతలతోబాటు, ఇంద్రుడు, చంద్రుడు, సూర్యుడు, వరుణుడు, కుబేరుడు మొదలైన దేవతల ప్రసక్తి కూడా ఉంది.

రాజులు వైదిక మత క్రతువులను నిర్వహించేవారు. పుణ్యక్షేత్రాలను దర్శించడం, పుణ్యతీర్థాల్లో స్నానమాచరించడం వాడుకలోకి తెచ్చారు. బావులు, చెరువులను తవ్వించడం, బాటలకిరువైపుల చెట్లను నాటించడం, మార్గమధ్యంలో సేద తీర్చుకోవడానికి సత్రాలు కట్టించడం, మత సంస్థలకు విరాళాలు ఇవ్వడం, బ్రాహ్మణులకు ఎన్నో రకాల దానాలు చేయడం ఆనాటి రాజులు చేపట్టిన ప్రజాహిత కార్యక్రమాలు.

బౌద్ధమతానికి కూడా విశేష ప్రజాదరణ లభించింది. ముఖ్యంగా రాణుల ప్రోత్సాహంలో, బౌద్ధభిక్షువులు అంకిత భావంతో ప్రచారం చేయడం వల్ల బౌద్ధమతం ఎంతో అభివృద్ధి చెందినది.

ప్రశ్న 6.
ఐహోలు శాసనం
జవాబు:
ఐహోల్ కర్ణాటక రాష్ట్రములో ఉన్నది. ఈ ప్రదేశంలో పశ్చిమ చాళుక్యరాజు రెండవ పులకేశి యొక్క సేనాని రవికీర్తి వేయించిన “ఐహోల్” శాసనం ఉంది. ఈ శాసనంలో రెండవ పులకేశి యొక్క దిగ్విజయ యాత్ర, హర్షునిపై అతని విజయం వర్ణించబడ్డాయి. ఐహోల్లో పశ్చిమ చాళుక్యుల నాటి దేవాలయాలున్నాయి.

ప్రశ్న 7.
పల్లవుల శిల్పకళ
జవాబు:
భారతీయ వాస్తు శిల్పకళా రంగాల్లో పల్లవుల కళకు విశిష్ట స్థానం ఉంది. భారతీయ శిల్పకళ దక్షిణ భారతదేశంలో పల్లవులతోనే ప్రారంభమైందని చెప్పవచ్చు. కట్టడాల్లో రాతిని ఎక్కువగా ఉపయోగించింది మొట్టమొదటగా పల్లవులే కావటం విశేషం. కాంచీపురం, మహాబలిపురం పల్లవుల కాలం నాటి గొప్ప శిల్పకళా కేంద్రాలు. మహేంద్రవర్మ అనేక ఏకశిలా ఆలయాలను నిర్మింపచేశాడు. అందుకు మహాబలిపురంలోని వరాహ, దుర్గ గుహలు చక్కని తార్కాణం. మొదటి నరసింహవర్మ మహాబలిపురంలో అద్భుతమైన ఏడు పగోడాలను నిర్మింపచేశాడు. వీటినే ఏడు రథాలు అంటారు. కాంచీపురంలోని కైలాసనాథ ఆలయం, మహాబలిపురంలోని తీర దేవాలయాలు పల్లవుల నిర్మాణశైలికి, శిల్పకళకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.

AP Inter 1st Year History Study Material Chapter 6 దక్కన్, దక్షిణ భారతదేశం, క్రీ.శ. 10వ శతాబ్దం వరకు

ప్రశ్న 8.
బృహదీశ్వర ఆలయం
జవాబు:
తంజావూరులోని బృహదీశ్వరాలయాన్ని చోళరాజు మొదటి రాజరాజు క్రీ.శ. 1009లో నిర్మించాడు. ఇది శివాలయం. ఇది భారతదేశ నిర్మాణాలన్నింటిలో పెద్దది. దీని విమానం ఎత్తు 200 అడుగులు. ఈ ఆలయం వెలుపలి గోడల నిండా మనోహరమైన శిల్పాలు, లోపలి భాగంలో వర్ణచిత్రాలు ఉన్నాయి. ఈ ఆలయం దక్షిణ భారతదేశ ఆలయ వాస్తు సాంప్రదాయానికి మకుటాయమానం వంటిది.

AP Inter 1st Year History Study Material Chapter 5 క్రీ.శ. 3వ శతాబ్దం నుంచి క్రీ.శ. 7వ శతాబ్దం వరకు రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిస్థితులు, సంస్కృతి

Andhra Pradesh BIEAP AP Inter 1st Year History Study Material 5th Lesson క్రీ.శ. 3వ శతాబ్దం నుంచి క్రీ.శ. 7వ శతాబ్దం వరకు రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిస్థితులు, సంస్కృతి Textbook Questions and Answers.

AP Inter 1st Year History Study Material Chapter 5 క్రీ.శ. 3వ శతాబ్దం నుంచి క్రీ.శ. 7వ శతాబ్దం వరకు రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిస్థితులు, సంస్కృతి

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
మౌర్యుల పరిపాలనపై వ్యాసం వ్రాయండి.
జవాబు:
భారతదేశంలో ప్రప్రథమంగా ఒక నిర్దిష్టమైన పరిపాలనా విధానాన్ని ఏర్పాటు చేసింది మౌర్యులే. వీరి పాలనావిధానాన్ని తెలుసుకోవటానికి కౌటిల్యుని ‘అర్థశాస్త్రం’, మెగస్తనీస్ ‘ఇండికా’ గ్రంథం ముఖ్య ఆధారాలు.
1. కేంద్ర ప్రభుత్వం: మౌర్య పాలనావ్యవస్థలో చక్రవర్తి సర్వోన్నత అధికారి. అతడే ఉన్నత కార్యనిర్వహణాధికారి, శాసనాధికారి, న్యాయాధికారి కూడా. స్వధర్మాన్ని అమలుచేయటం, ప్రజల ప్రాణాలను కాపాడటం, వ్యవసాయం, వాణిజ్యం, పరిశ్రమల ప్రగతికి కృషిచేయటం, న్యాయాన్ని పంచటం, విదేశీ వ్యవహారాల నిర్వహణ, సాహిత్య, లలితకళల పోషణ మొదలైన విషయాలను రాజు ఆచరించవలసిన ముఖ్య ధర్మాలుగా పరిగణించారు. మౌర్య చక్రవర్తులు నిరంకుశులైనప్పటికి ప్రజాసంక్షేమాన్ని ధ్యేయంగా పెట్టుకొని పాలించారు. “ప్రజల సుఖమే తన సుఖంగా, వారి కష్టాలే తన కష్టాలుగా చక్రవర్తి భావించాలి” అని కౌటిల్యుడు చెప్పడాన్నిబట్టి మౌర్య చక్రవర్తి నియంతగా వ్యవహరించి ఉండకపోవచ్చునని భావించవచ్చు.

ఎ) మంత్రిపరిషత్తు: పరిపాలనలో చక్రవర్తికి సలహాలను ఇవ్వడం కోసం ఒక మంత్రిపరిషత్తు ఉండేది. మంత్రిపరిషత్తు సభ్యుల్లో మంత్రి, పురోహితుడు, యువరాజు, సేనాపతి మొదలగువారు ముఖ్యులు. మంత్రిపరిషత్తును విధిగా సంప్రదించాలనే నిబంధన లేనప్పటికి ప్రజాసంక్షేమాన్ని ధ్యేయంగా పెట్టుకొని సాధారణంగా మంత్రుల సూచనలను చక్రవర్తి పాటించేవాడు.

బి) ప్రజా సభలు: మౌర్య చక్రవర్తులు ప్రజాభిప్రాయాలకు విలువనిచ్చేవారు. నాడు పౌరసభ, జానపదసభ అనే ప్రజాప్రతినిధులతో కూడిన సభలుండేవి. ఆ సభలను సమావేశపరచి వాటితో ప్రభుత్వ కార్యక్రమాలను చర్చించేవారు. అశోకుని కాలంలో ధర్మ ప్రచారార్థం ధర్మమహామాత్రులు అను ప్రత్యేక అధికారులు నియమింపబడ్డారు. ప్రభుత్వ వ్యవహారాలు 32 శాఖలుగా విభజించబడి అధ్యక్షుల ఆధ్వర్యంలో నిర్వహించబడేవి.

సి) సైనిక వ్యవస్థ: మౌర్యులు సమర్థవంతమైన సైనిక వ్యవస్థను నిర్మించారు. మౌర్య సైన్యంలో 6 లక్షల కాల్బలం, 30 వేల అశ్వదళం, 9 వేల గజబలం, 8 వేల రథాలు వున్నట్లు గ్రీకు చరిత్రకారులు పేర్కొన్నారు. సైన్యానికి అనుబంధంగా నౌకాదళం కూడా ఉంది. సైనిక పర్యవేక్షణ బాధ్యతను 30 మంది సభ్యులున్న ఒక సంఘానికి అప్పగించారు. ఈ సంఘం ఐదేసి సభ్యులు గల 6 ఉపసంఘాలుగా విడివడి గజ, అశ్వక, రథ, పదాతి, నౌకాదళాల రవాణా, సరఫరా శాఖల నిర్వహణా బాధ్యతలను చేపట్టేది. మౌర్యుల కాలంలో గూఢచారి దళం కూడా అప్రమత్తతతో పనిచేసి, కీలకమైన రహస్య సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి అందించేది.

AP Inter 1st Year History Study Material Chapter 5 క్రీ.శ. 3వ శతాబ్దం నుంచి క్రీ.శ. 7వ శతాబ్దం వరకు రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిస్థితులు, సంస్కృతి

డి) భూమిశిస్తు: మౌర్య సామ్రాజ్యానికి ప్రధానమైన ఆదాయం భూమిశిస్తు నుండి లభించేది. పండిన పంటలో 6 నుంచి 4వ వంతు వరకు భూమిశిస్తుగా వసూలు చేసేవారు. అశోకుడు బౌద్ధమతము యెడల భక్తితో లుంబినీ వనములో భూమిశిస్తును 8వ వంతుకు తగ్గించాడు. రాచపొలాలు, గనులు, నౌకాకేంద్రాలు, తదితర మార్గాల నుంచి కూడా ప్రభుత్వానికి ఆదాయం లభించేది. గోపుడు భూమిశిస్తును వసూలు చేసేవాడు. ఆదాయశాఖకు ముఖ్య అధికారి సమాహర్త. ప్రభుత్వ ఆదాయంలో 4వ వంతు ఉద్యోగుల జీతాలు, ప్రజాపనుల పద్దుల క్రింద ఖర్చయ్యేది.

ఇ) న్యాయపాలన: మౌర్యుల పాలనలో చక్రవర్తీ సామ్రాజ్యానికి ఉన్నత న్యాయాధిపతి. రాజాస్థానమే అత్యున్నత న్యాయస్థానం. ఆస్తి తగాదాలు మొదలగు సివిల్ కేసుల పరిష్కారానికి ధర్మస్థియ అను న్యాయస్థానాలు కృషిచేసేవి. అపరాధ విచారణ కోసం కంటకశోధన అనే క్రిమినల్ న్యాయస్థానాలుండేవి. నేరస్తులను దివ్యపరీక్షల ద్వారా విచారించేవారు. శిక్షలు కఠినంగా ఉండేవి. అయితే అశోక చక్రవర్తి కాలంలో ఈ కాఠిన్యాన్ని కొంతవరకు సడలించారు.

2. రాష్ట్ర ప్రభుత్వం: పరిపాలనా సౌలభ్యం కోసం మౌర్య సామ్రాజ్యాన్ని జనపదాలుగా విభజించారు. అశోకుని కాలంలో తక్షశిల, అవంతి, పాటలీపుత్రం, గిర్నార్లు రాజధానులుగా గల ఉత్తరాపథ జనపదాలు, ఉజ్జయిని, కళింగ, సౌరాష్ట్ర అను దక్షిణాపథ జనపదాలు వుండేవి. జనపదాలకు పాలకులుగా రాజకుమారులను నియమించేవారు. జనపదాన్ని తిరిగి ఆహారాలు, విషయాలు, ప్రదేశాలుగా విభజించారు. ప్రదేశానికి అధికారి ప్రాదేశికుడు. పరిపాలనా యంత్రాంగానికి గ్రామమే ప్రాతిపదిక. గ్రామానికి అధికారి గ్రామికుడు.

3. నగరపాలన: మౌర్యుల కాలంలో నగరపాలన గురించి మెగస్తనీస్ తన ఇండికా అను గ్రంథంలో పేర్కొన్నాడు. పాటలీపుత్ర నగరపాలన గురించి, సైనిక మండలుల గురించి సవివరంగా వర్ణించాడు. ఈ కాలంలో నగరపాలనకు ఒక విశిష్ట స్థానం ఉంది. నగరపాలనను నాగరికుడు అనే అధికారి నిర్వహించేవాడు. పాటలీపుత్ర నగరపాలన నిర్వహణలో నాగరికుడికి 30 మంది సభ్యులున్న ఒక సంఘం తోడ్పడేది. ఈ సంఘం ఐదేసి సభ్యులు గల 6 పంచాయితీలుగా ఏర్పడి 1) పరిశమ్రలు 2) విదేశీయుల సౌకర్యాలు 3) జనన, మరణాల లెక్కలు 4) వాణిజ్యం, వ్యాపారం, తూనికలు, కొలమానాలు 5) వస్తువిక్రయం 6) సుంకాల వసూలు అనే శాఖలకు సంబంధించిన విధులను నిర్వహించేది.

ముగింపు: మౌర్యుల పాలనలో కొన్ని గుణదోషములున్నాయి. ఉద్యోగుల పీడన, కఠిన శిక్షలు ఇందులోని లోపాలు. పౌర, సైనిక శాఖలు వేర్వేరుగా ఉండటం, సమర్థవంతమైన నగరపాలన, ప్రజాసంక్షేమ పాలన అనునవి. ఇందులోని సుగుణాలు. మౌర్యుల పరిపాలనా విధానం ఉత్తమము, ఉదారము, ఆదర్శప్రాయమైనది. వీరి పాలన మొఘలుల పాలన కంటే విశిష్టమైనదని వి.ఎ. స్మిత్ అను పండితుడు వ్యాఖ్యానించాడు. నేటి పాలనా వ్యవస్థలోని మౌలికాంశాలు మౌర్యులనాటివే అని సర్దార్ కె.ఎమ్. పణిక్కర్ అభిప్రాయపడ్డాడు.

ప్రశ్న 2.
గుప్తుల పాలనా లక్షణాలు పరిశీలించండి.
జవాబు:
గుప్త చక్రవర్తులు ఉత్తర భారతదేశమున రాజకీయ ఐక్యతను సాధించి సుభిక్షమైన పాలనావ్యవస్థను ప్రవేశపెట్టారు. వీరి పాలనలో ప్రజలకు ప్రభుత్వ ఉద్యోగుల బాధ లేదు. ఫాహియాన్ “గుప్త పాలన ఉదారమైనది, ప్రభుత్వము ప్రజల విషయములో అనవసరముగా జోక్యం చేసుకొనెడిది కాదు” అని పేర్కొన్నాడు. అట్టి ఉదాత్త పాలనలో ప్రజలు సుఖశాంతులను అనుభవించారనుట అతిశయోక్తి కాదు.

కేంద్ర ప్రభుత్వము: గుప్త సామ్రాజ్యమునకు సర్వాధికారి చక్రవర్తి. గుప్త చక్రవర్తులు మహేశ్వర్, మహారాజాధిరాజా, పరమభట్టారక మొదలగు బిరుదులు ధరించారు. రాచరికం వంశపారంపర్యంగా లభించేది. రాజు దైవాంశ సంభూతుడని ప్రజలు విశ్వసించారు. రాజు నిరంకుశుడైనా ప్రజాక్షేమమే తన క్షేమముగా భావించేవాడు. పరిపాలనలో రాజుకు సలహాలు ఇవ్వడానికి ఒక మంత్రిమండలి ఉండేది. ఈ మండలిలో 1. మహాప్రధానామాత్యుడు 2. సచివుడు 3. కుమారామాత్యుడు 4. సంధి విగ్రహకుడు 5. మహాదండ నాయకుడు 6. రణభండారికుడు అనే ఉద్యోగులుండేవారు. వీరే కాకుండా కంచుకి అనే ఉద్యోగి చక్రవర్తికి, మంత్రిమండలికి మధ్యవర్తిగా వ్యవహరించేవాడు. ఉద్యోగుల నియామకంలో కుల, మత భేదములను పాటింపక అభ్యర్థుల శక్తిసామర్థ్యములను పరిగణనలోనికి తీసుకునేవారు. ఈ కాలంలో గూఢచారి వ్యవస్థ అమలులో ఉంది.

AP Inter 1st Year History Study Material Chapter 5 క్రీ.శ. 3వ శతాబ్దం నుంచి క్రీ.శ. 7వ శతాబ్దం వరకు రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిస్థితులు, సంస్కృతి

రాష్ట్ర ప్రభుత్వం: పరిపాలనా సౌలభ్యం కోసం గుప్త చక్రవర్తులు తమ సామ్రాజ్యాన్ని భుక్తులుగా, భుక్తులను విషయాలుగా, విషయాలను ప్రదేశాలుగా విభజించారు. భుక్తికి అధిపతిని ఉపరిక అని పిలిచేవారు. విషయానికి అధిపతి విషయపతి. విషయపాలనలో విషయపతికి సహకరించేందుకు 5గురు సభ్యులు గల సభ సహాయపడేది. వారు నగరశ్రేష్టి, సార్ధవాహుడు, ప్రథమకులికుడు, ప్రథమ కాయస్థుడు, పుస్తపాలడు మొదలైనవారు. పాలనా వ్యవస్థలో చివరిది గ్రామము. గ్రామానికి పెద్ద గ్రామికుడు. గ్రామ పాలనలో గ్రామ పంచాయితీ అతడికి తోడ్పడేది.

నగరపాలన: నగర పరిపాలనకు గుప్తుల కాలంలో ప్రత్యేక ఏర్పాటు ఉంది. నగర పరిపాలనాధికారిని ”పురపాలుడు’ అనేవారు. పరిపాలనలో అతనికి సహాయపడేందుకు ఒక నగరసభ ఉండేది.

భూమిశిస్తు: గుప్త చక్రవర్తులకు ఆదాయం ముఖ్యంగా భూమిశిస్తు నుండి లభించేది. పండిన పంటలో 1/3వ వంతు పంటను భూమిశిస్తుగా నిర్ణయించేవారు. భూమిశిస్తును భాగకర, ఉద్యంగ అనేవారు. భూమిశిస్తుతో పాటు వృత్తిపన్ను, ఉప్పుపన్ను, వర్తక సుంకం, వాణిజ్య పన్నులు, రేవులు, అడవులు, గనులు మొదలగు వానిపై కూడా ప్రభుత్వానికి ఆదాయం లభించేది.

న్యాయపాలన: గుప్త పాలకులు ప్రజలకు నిష్పక్షపాతమైన, సమర్థవంతమైన పాలనను అందించారు. న్యాయ వ్యవహారాలలో చక్రవర్తి మాటకు తిరుగులేదు. ఆయనే ఉన్నత న్యాయాధీశుడు. న్యాయశాఖలో మహాదండ నాయకుడు, మహాక్షపతిలక వంటి న్యాయాధికారులుండేవారు. రాజదండన కఠినంగా ఉండేది కాదు. కాని తిరుగుబాటు చేసిన వారిపట్ల కఠినంగా వ్యవహరించేవారు. శిక్షగా వారి కుడిభుజాన్ని ఖండించేవారు లేదా కళ్ళు పీకించేవారు. మరణదండన తప్పనిసరైనప్పుడు అట్టివారిని ఏనుగులతో తొక్కించి చంపేవారు.

సైనిక వ్యవస్థ: గుప్త సామ్రాజ్యానికి చక్రవర్తే సర్వసైన్యాధ్యక్షుడు. గుప్త చక్రవర్తులు సంప్రదాయంగా అనుసరించబడుతున్న చతురంగ బలాలను పోషించారు. సైనిక రంగంలో సేనాపతి, మహాసేనాపతి, దండనాయకుడు మొదలైన ఉద్యోగులుండేవారు.

ముగింపు: గుప్తుల పరిపాలనలో అధికార వికేంద్రీకరణ చోటుచేసుకుంది. రాష్ట్రపాలకులు ఎక్కువ అధికారాలు అనుభవించారు. ప్రభువులు ప్రజాక్షేమాన్ని దృష్టిలో వుంచుకొని పరిపాలన సాగించటం గుప్త పాలనలోని విశేషం.

ప్రశ్న 3.
పుష్యభూతి వంశస్థుల పాలనలో రాజకీయ పరిస్థితులను వివరించండి.
జవాబు:
గుప్త సామ్రాజ్య పతనం తర్వాత దాని శిథిలాలపై ఉత్తర భారతదేశంలో అనేక చిన్నచిన్న స్వతంత్ర రాజ్యాలు వెలిశాయి. అవన్నీ దాదాపు ఒకప్పుడు గుప్త సామ్రాజ్యానికి సామంత రాజ్యాలుగా ఉన్నటువంటివే. అలాంటి రాజ్యాలలో ఒకటి స్థానేశ్వర రాజ్యం.

గుప్తులకు సామంతులుగా ఉన్న ఈ రాజ్య పాలకులు బలపడి ఇతర సామంత పాలకులను తమ అధికార పరిధిలోకి తెచ్చుకుని ఉత్తర భారతదేశంలో మళ్ళీ రాజకీయ సమైక్యతను, సుస్థిరతను సాధించగలిగారు. పుష్యభూతి వంశస్థులు స్థానేశ్వరాన్ని రాజధానిగా చేసుకుని స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించగా ఈ వంశంలోనివాడైన హర్షవర్ధనుడి కాలంలో ఉత్తరాపథం తిరిగి మహోన్నత దశకు చేరుకుంది.

పుష్యభూతి వంశ చరిత్ర: మహాశివభక్తుడైన పుష్యభూతి ఈ వంశానికి మూలపురుషుడైనందువల్ల, ఈ వంశానికి ఆ పేరు వచ్చినట్లు బాణుని “హర్షచరిత్ర” వల్ల తెలుస్తున్నది. ఈ వంశంలో మూడోతరంవాడైన ఆదిత్యవర్ధనుడి కుమారుడు ప్రభాకరవర్ధనుడు. ఇతను “మహారాజాధిరాజు” బిరుదాన్ని ధరించాడు. ప్రభాకరవర్ధనుణ్ణి ‘హూణ హరిణకేసరి” అంటూ
”హర్షచరిత్ర’ వర్ణించింది. ఇతని పట్టపురాణి యశోమతీదేవి మాళవరాజైన యశోధర్ముడి కుమార్తె కావడం వల్ల యశోధర్ముడితోపాటు ప్రభాకరవర్ధనుడు కూడా హూణులతో పోరాటంలో పాల్గొన్నాడని భావించవచ్చు. ప్రభాకరవర్ధనుడికి రాజ్యశ్రీ అనే కుమార్తె, రాజ్యవర్ధనుడు, హర్షవర్ధనుడనే కుమారులున్నారు. కుమార్తె రాజ్యశ్రీని మౌఖరీ రాజైన గృహవర్మకిచ్చి వివాహం జరిపించాడు.

క్రీ.శ. 604లో స్థానేశ్వర రాజ్యంపై హూణులు దండెత్తినప్పుడు, ప్రభాకరవర్ధనుడు తన పెద్ద కుమారుడు రాజ్యవర్ధనుణ్ణి హూణులను ఎదుర్కొనేందుకు పంపాడు. వారిపై విజయాన్ని సాధించి రాజ్యవర్ధనుడు రాజ్యానికి తిరిగి వచ్చేసరికి ప్రభాకరవర్ధనుడు జబ్బుచేసి మరణించాడని, యశోమతి సతీసహగమనం చేసిందని తెలిసింది. ఈ కారణంగా రాజ్యవర్ధనుడు పట్టాభిషక్తుడయ్యాడు.

ఇదేసమయంలో మాళవ రాజైన దేవగుప్తుడు గౌడ రాజైన శశాంకుడితో కలిసి కనోజ్పై దండెత్తి రాజ్యశ్రీ భర్త గృహవర్మను వధించాడు. ఇది తెలుసుకున్న రాజ్యవర్ధనుడు సైన్యంతో కనోజ్పై దండెత్తి దేవగుప్తుణ్ణి ఓడించాడు. రాజ్యశ్రీని బందిఖానా నుంచి విడిపించడానికి ముందే, దురదృష్టవశాత్తు రాజ్యవర్ధనుడు శశాంకుడి కుట్రకు బలయ్యాడు. ఇటువంటి పరిస్థితుల్లో హర్షవర్ధనుడు స్థానేశ్వర సింహాసనాన్ని అధిష్టించాడు.

AP Inter 1st Year History Study Material Chapter 5 క్రీ.శ. 3వ శతాబ్దం నుంచి క్రీ.శ. 7వ శతాబ్దం వరకు రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిస్థితులు, సంస్కృతి

రాజకీయ పరిస్థితులు: హర్షవర్ధనుడు గొప్ప విజేతగాను, గొప్ప పరిపాలనదక్షుడిగాను పేరుపొందాడు. హర్ష చరిత్ర, సి-యూ-కి గ్రంథాల్లో హర్షుణ్ణి ఆదర్శవంతమైన ప్రభువుగా వర్ణించారు. హర్షుడు పరిపాలనలో స్వయంగా శ్రద్ధ వహించాడు. రాజ్యంలో స్వయంగా పర్యటించి, ప్రజల కష్టసుఖాలను స్వయంగా విచారించి, తక్షణమే న్యాయం చేకూర్చేవాడు. ప్రజాహిత కార్యక్రమాలను నిర్వహించడంలో హర్షుడికి వ్యవధి చాలేది కాదని, సి-యూ-కి గ్రంథంలో వివరంగా ఉంది.

పరిపాలన సౌలభ్యం కోసం సామ్రాజ్యాన్ని భుక్తులుగాను, భుక్తులను విషయాలుగాను, విషయాలను గ్రామాలు గాను విభజించారు. పాలనా విధానంలోను, విద్యా, సాంస్కృతిక రంగాల్లోను హర్షుడు గుప్తయుగం సంప్రదాయాలనే అనుసరించాడు. రాజుకు సలహాలిచ్చి సహాయం చేయడానికి మంత్రిపరిషత్ ఉండేది. ప్రభుత్వ విధానంలో మంత్రి పరిషత్కు గౌరవప్రదమైన స్థానం ఉంది. వారసత్వాన్ని నిర్ణయించడానికి కూడా మంత్రిపరిషత్తుకు అధికారం ఉంది. హర్షచరిత్ర నుంచి, శాసనాల నుంచి అనేకమంది ఉద్యోగుల పేర్లు తెలుస్తున్నాయి. వారిలో మహాసంధి-విగ్రహాధికృత (యుద్ధ వ్యవహారాలు), రాజస్థానీయ (విదేశీ వ్యవహారాలు), మహాబలాధికృత (సేనాపతి), ఆయుక్తక, భోగక (పన్నుల వసూలు), భాండాగారాధికృత (కోశాధికారి) మొదలైనవారు ముఖ్యులు. వీరికి జీతాలకు బదులు భూములను ఇచ్చేవారు. సైనికోద్యోగులకు మాత్రం జీతాలిచ్చేవారు.

భుక్తికి అధికారి ఉపరిక. ఇతనికే ‘భోగపతి’ అనికూడా పేరు ఉంది. విషయానికి అధికారి ‘విషయపతి’. ఇతనిని ‘కుమారామాత్య’ అనికూడా పిలిచేవారు. గ్రామమే ప్రభుత్వానికి పునాది. గ్రామంలో అక్షపడలిక, కరణిక అనేవారు ఉద్యోగులు. వీరికి గ్రామ వృద్ధుల సహకారం ఉండేది.

ఆదాయం: భూమిశిస్తు రాజ్యానికి ముఖ్య ఆదాయం. ప్రజలపై పన్నుల భారం ఎక్కువగా ఉండేది కాదు. పంటలో ఆరోవంతును మాత్రమే పన్నుగా వసూలుచేసేవారు. పన్నులను ధాన్యరూపంగాగాని, ధనరూపంగాగాని చెల్లించవచ్చు. బాటల మీద, రేవుల మీద సుంకాలుండేవి. వస్తువుల అమ్మకాల మీద కూడా పన్నులు ఉండేవి. అయితే ఇవి ఆయా వస్తువుల బరువులనుబట్టి, విలువలనుబట్టి ఉండేవి. ఈ విధంగా వస్తువుల బరువు ఆధారం చేసుకొని వసూలు చేసే అమ్మకం పన్నునే ‘తుల్యమేయ’ అన్నారు. పన్నులను వసూలు చేయడానికి ధ్రువాధికరణ, గౌల్మిక మొదలైన ఉద్యోగులు ఉండేవారు. ప్రభుత్వాదాయాన్ని ముఖ్యంగా నాలుగు పద్దుల మీద ఖర్చు పెట్టేవారు. అవి: 1. ప్రభుత్వ యంత్రాంగం 2. రాజప్రాసాదం 3. పండిత సత్కారం 4. దానధర్మాలు.

హర్షయుగంలో నేరాలు ఎక్కువని తెలుస్తున్నది. ఆ కారణంగా శిక్షాస్మృతి కఠినతరమైంది. దేశద్రోహ నేరానికి యావజ్జీవ కారాగార శిక్ష, సాంఘిక నియమావళిని ధిక్కరించిన వారికి, తల్లిదండ్రుల పట్ల అవిధేయులైన వారికి అంగచ్ఛేద శిక్షగాని లేదా దేశబహిష్కార శిక్షగాని అమలుపరిచేవారు. చిన్నచిన్న నేరాలకు జరిమానాలను విధించేవారు. నేర నిర్ణయానికి ‘దివ్య పరీక్షలుండేవి. రాజ పట్టాభిషేకం వంటి విశేష సందర్భాల్లో బాధితులను విడిచిపెట్టే ఆచారం ఉండేది.

సైన్యం: హర్షుడు పెద్ద సైన్యాన్ని పోషించాడు. సైన్యంలో చతురంగ బలాలుండేవి. క్రమంగా రథానికి ప్రాముఖ్యం తగ్గింది. హర్షుని సైన్యంలో 5000 ఏనుగులు, 2000 అశ్వాలు, 50,000 కాల్బలం ఉన్నట్లు తెలుస్తున్నది.

ప్రశ్న 4. క్రీ.పూ. 3 నుంచి క్రీ.శ. 7వ శతాబ్దం వరకు భారతదేశ ఆర్థిక పరిస్థితిని పరిశీలించండి.
జవాబు:
క్రీ.పూ. 3 నుంచి క్రీ.శ. 7 వరకు గల ఆర్థిక పరిస్థితులు:
మౌర్యుల ఆర్థిక వ్యవస్థ:
1) వ్యవసాయం: మౌర్యుల కాలంలో వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందింది. పన్నులు వసూలు చేయడంతో ఆర్థిక, సాంఘిక భద్రత ఉన్నట్లు భావించారు. రాజు తన సొంతభూముల ద్వారానే కాకుండా, రాజ్య భూముల నుంచి కూడా పన్నులు వసూలుచేసేవారు. రాజ్య ప్రధాన ఆదాయం పంటలో 1/4 నుంచి 1/6 వ వంతు శిస్తుగా వసూలు చేసేవారు. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి శిస్తులు మారేవి. మధ్యవర్తులు లేకుండా అధికారులే స్వయంగా శిస్తు వసూలు చేసేవారు.

2) పారిశ్రామిక వృత్తులు:
లోహ పరిశ్రమ: వివిధ రకాల లోహాలను ఇనుము, రాగి, తగరం, బంగారం, వెండి లోహాలను తమ పరిజ్ఞానంతో వెలికితీసి వివిధ రకాలైన వస్తువులు తయారుచేశారు. దారు (కొయ్య) పరిశ్రమ, రాతి పరిశ్రమ, వస్త్ర పరిశ్రమ వంటివి. మధుర, కాశీ, పాటలీపుత్రం, వంగ, మహీశ మొదలైన నగరాల్లో కుండల తయారీ, మౌర్య రాజ్యంలోని వివిధ ప్రాంతాలలోనూ అభివృద్ధి చెందింది.

3) కుషాణుల పాలనలో వర్తక, వాణిజ్యం: మౌర్యుల కాలానికి భిన్నంగా క్రీ.పూ. 200 నుంచి క్రీ.శ. 300 కాలంలో అనేక చిన్నరాజ్యాలు ముఖ్యంగా విదేశీ రాజ్యాలు ఏర్పడ్డాయి. అందుకే సనాతన చరిత్రకారులు ఈ కాలాన్ని ‘అంధయుగం’గా భావించారు. అయితే ఆధునిక చరిత్రకారులు ఈ కాలాన్ని ‘భారతదేశ వాణిజ్యయుగం’గా చెప్పారు. ఎందుకంటే ఆ కాలంలో వర్తక వాణిజ్యాలు చాలా బాగా అభివృద్ధి చెందినాయి.

4) గుప్తుల కాలం నాటి ఆర్థిక వ్యవస్థ: మౌర్యులలాగా గాక, గుప్తులు గొప్ప బిరుదులను ధరించారు. ‘మహారాజాధిరాజ’ అనే బిరుదు వల్ల చిన్న రాజ్యాలు, రాజులు ఉండేవారని తెలుస్తుంది. గుప్తులు జయించిన చాలా రాజ్య భాగాలు భూస్వాముల పాలనలో ఉండేవి. బెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్ రాజ్యభాగాలు కేంద్రంగా గుప్త సామ్రాజ్య పాలన జరిగింది.

AP Inter 1st Year History Study Material Chapter 5 క్రీ.శ. 3వ శతాబ్దం నుంచి క్రీ.శ. 7వ శతాబ్దం వరకు రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిస్థితులు, సంస్కృతి

5) భూస్వామ్య అంశాల అభివృద్ధి:

  • భూదానాలు చేయడం: పురోహితులకు దేవాలయాల భూములు, గ్రామాలు విరాళాలుగా ఇచ్చి, పన్నులు వసూలు, పాలనాధికారులు ఇవ్వడంతో అది వికేంద్రీకరణకు దారితీసింది. సేద్యపు కూలీల అణచివేత, దానం చేసిన గ్రామాల ప్రజల అణచివేతతో వారిపై పెత్తనం పెరిగింది.
  • సేద్యపు బానిసలు: భూదానాలు భూస్వామ్య వ్యవస్థకు దారితీసింది. చాలా శాసనాల్లో సేద్యపు బానిసత్వం గురించి తెలిపారు. భూములు అమ్మినప్పుడు ఇతరులకు ఇచ్చినప్పుడు దానితో సేద్యపు బానిసలను కూడా ఇచ్చారు.

6) పుష్యభూతి పాలనలో ఆర్థికవ్యవస్థ: పుష్యభూతి వంశపాలనలో ఆర్థికవ్యవస్థ స్వయంసమృద్ధిగా, మరింత భూస్వామ్య విధానాలతో ఉండేది. గుప్తుల కాలంలో ప్రారంభమైన వర్తక, వాణిజ్య క్షీణత, హర్షుని కాలంలో కూడా కొనసాగింది. వర్తక కేంద్రాలు క్షీణత నాణాల కొరత, వర్తక సంఘాలు లేకపోవటం దీనికి ఉదాహరణ. చేతివృత్తులు, ఇతర పరిశ్రమలు దెబ్బతిన్నాయి. తత్ఫలితంగా వ్యవసాయం కూడా పరోక్షంగా దెబ్బతిన్నది.

ప్రశ్న 5.
మౌర్యుల నుంచి పుష్యభూతి వంశం వరకు జరిగిన కళ, శిల్ప, నిర్మాణ అభివృద్ధిని చర్చించండి.
జవాబు: మౌర్యుల కళలు:
1) స్తంభాలు, శిల్ప నిర్మాణాలు: మౌర్యుల కళకు చాలా అందమైన నిర్మాణాత్మక నిదర్శనాలుగా అశోకుడు నిర్మించిన స్తంభాలు ఉన్నాయి. అశోకుని శాసనాలతో కూడిన స్తంభాలు, స్థూపాలు నగరాల్లో, కూడళ్లలో ప్రతిష్టించాడు. స్తంభాలను రెండు రకాలైన రాతితో నిర్మించారు. అవి:

  1. మధుర ప్రాంతానికి చెందిన ఎరుపు, తెలుపు మచ్చలలో ఉన్న ఇసుక రాయితో కొన్ని నిర్మించబడ్డాయి.
  2. బాగా పొడిచేసిన ఇసుకరాయి, బనారస్ సమీపంలోని చూనార్ వద్ద లభ్యం అవుతుంది. ఎక్కడైతే స్తంభాలు నిర్మిస్తారో అక్కడికి మధుర, చూనార్ నుంచి రాతిని రవాణాచేసి, అక్కడ శిల్పకారులు, తక్షశిల నుంచి వచ్చిన వారు తమ నైపుణ్యంతో చెక్కారు.

2) స్తూపాలు: స్తూపం అనేది ఇటుక లేదా రాయితో నిర్మించిన అర్ధగోళాకార నిర్మాణం. క్రింద గుండ్రని ఆధారపీఠం ఉంటుంది. చుట్టూ గొడుగు ఆకారం సార్వభౌమాధికారానికి గుర్తుగా ఉంటుంది. అశోకుడు భారతదేశంలోను, ఆఫ్ఘనిస్థాన్లలో ఎనభై నాలుగువేల స్థూపాలు నిర్మించాడు. క్రీ.శ. 7వ శతాబ్దంలో హుయన్ త్సాంగ్ తన భారత పర్యటనలో వీటిని చాలావరకు చూశాడు. వీటిలో మంచి ఉదాహరణగా చెప్పదగింది భోపాల్ సమీపంలోని సాంచి స్తూపం.

3) గుహలు: మౌర్యుల కట్టడాల్లో ముఖ్యమైనవి గుహలు. గట్టిరాళ్ళు, చీలిన రాళ్ళతో చెక్కబడినవి. గుహల లోపలి గోడలు బాగా నునుపుగా, అద్దంలాగా ఉంటాయి. ఈ అద్భుత కట్టడాలు సన్యాసుల నివాసగృహాలు, అసెంబ్లీ గదుల వలె ఉపయోగపడ్డాయి.

గాంధార, మధుర అమరావతి శిల్ప నిర్మాణాలు:
A. గాంధార శిల్పం:
1) కాలం, ప్రదేశం, పోషకులు: క్రీ.పూ. 1వ శతాబ్దం మధ్యకాలం నుండి క్రీ.శ. 5వ శతాబ్దం చివరి వరకు గాంధార ప్రాంతంలో ఉన్న అద్భుత శిల్పాలను గాంధార శిల్పాలు అంటారు. భారతీయ గ్రీకు శిల్పకళా సమ్మిళిత నిర్మాణంగా చెబుతారు. బాక్ట్రియా గ్రీకు రాజులు, వాయువ్య భారతం నుంచి ఆవిర్భవించాయి. శకులు, కుషాణులు
వీటి పోషకులు.

2) గాంధార శిల్ప లక్షణాలు: గ్రీకు, రోమన్ సంప్రదాయాల్లో బుద్ధుని విగ్రహాలు నిర్మించబడ్డాయి. మానవ శరీరాన్ని చాలా సహజంగా శిల్పులు చెక్కారు. కండరాలు, మీసాలు, ఉంగరాల జుత్తు మొదలైనవి చక్కగా ఉంటాయి.

B. మధుర శిల్పం: జైనమతం స్ఫూర్తితో ధ్యానంలో ఉన్న దిగంబర తీర్థంకరుల శిల్పాలను మధుర శిల్పులు నిర్మించారు. మొదట్లో బుద్ధుని, బోధిసత్వుని ప్రతిమలు నిర్మించారు. తర్వాత కాలంలో మత భావనలు ప్రదర్శితమయ్యేట్లు నిర్మించారు. బుద్ధుని ప్రతిమలు బిగుతు కండరాలు, బలమైన శరీరంతో హుందాగా, భక్తిభావంతో ఉండే విగ్రహాలను మధుర శిల్పులు నిర్మించారు. వైదిక దేవతలైన శివుడు, విష్ణువు, పార్వతి, లక్ష్మీ ప్రతిమలు కూడా ఈ శిల్పశైలిలో నిర్మించడం జరిగింది.

C. అమరావతి శిల్పం: అమరావతి స్తూపం దీనికి గొప్ప ఉదాహరణ. సున్నపురాయి సొబగులు, బుద్ధుని జీవితానికి సంబంధించిన చిత్రాలు, స్వతంత్రంగా ఉన్న బుద్ధుని విగ్రహాలు చుట్టూ ప్రదర్శితం అవుతాయి. భారతీయ శిల్పానికి అది గొప్ప మకుటంలాంటిది.

గుప్తుల కాలం నాటి సంస్కృతి:
1) నిర్మాణాలు: భారతీయ నిర్మాణాలలో గుప్తుల కాలానికి ప్రత్యేక స్థానం ఉంది. నగర, ద్రావిడ పద్ధతుల్లో గుప్తుల కళ భారతీయ నిర్మాణ చరిత్ర వైభవానికి ప్రతీకగా నిలిచింది.
a. రాతి గుహలు: అజంతా, ఎల్లోరా, బాగ్ గుహలు రాతి గుహలకు ప్రతీకలుగా నిలుస్తాయి.
b. దేవాలయాలు: దేవాలయాల్లో ముఖ్యమైనవి.

  1. చతురస్రాకార చదరపు పైకప్పు దేవాలయం.
  2. రెండో అంతస్తు (విమాన) గల చతురస్రాకార చదరపు పైకప్పు దేవాలయం.
  3. ఒక శిఖరంతో చతురస్రాకార దేవాలయం.
  4. దీర్ఘచతురస్రాకార దేవాలయం.
  5. వృత్తాకార దేవాలయం.

AP Inter 1st Year History Study Material Chapter 5 క్రీ.శ. 3వ శతాబ్దం నుంచి క్రీ.శ. 7వ శతాబ్దం వరకు రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిస్థితులు, సంస్కృతి

నచనాకుధార వద్ద గల పార్వతీ దేవాలయం, భూమ్రా వద్ద గల శివాలయం రెండో రకం దేవాలయానికి చెందినవి. మధ్యప్రదేశ్లోని దేవఘడ్, భట్టార్గాంవ్ దేవాలయాలు మూడో రకానికి చెందినవి. వీటి ప్రాధాన్యత ఏమిటంటే గర్భగుడిపైన శిఖరం ఉంటుంది. ఇది నగరశిల్ప నిర్మాణశైలి.

గుప్తుల కళ: గుప్తుల కాలం శిల్ప కళారంగం స్వర్ణయుగంగా ప్రసిద్ధిచెందింది. భవనాలు, దేవాలయాలు, స్తంభాలు, స్తూపాలు అనేకం నిర్మించారు. వీరు నిర్మించిన అద్భుతమైన దేవాలయాల్లో హూణులు, ముస్లిం దాడుల తరువాత మిగిలినవి

  1. ఝాన్సీ జిల్లాలోని దేవఘడ్ వద్దగల దశావతార దేవాలయం.
  2. మధ్యప్రదేశ్లోని భూమారా వద్దగల శివాలయం.

పెర్సీ బ్రౌన్ అభిప్రాయంలో భిట్టర్గావ్ దేవాలయ శిల్ప నిర్మాణం సుదీర్ఘ సంప్రదాయానికి ప్రతీకగా ఉంది. ఇంకా కొన్ని స్తూపాలు, గుహలు, విహారాలు కూడా నిర్మించబడ్డాయి. సారనాధ్ స్తూపం, అజంతా, ఉదయగిరి గుహలు ఆనాటి గొప్ప నిర్మాణాలు. అందమైన బుద్ధుని విగ్రహాలు రాతితో, లోహంతో, బంకమట్టితో చేయడంతోపాటు వివిధ పౌరాణిక బొమ్మలు రాతిపై అందంగా చెక్కారు.

శిల్ప నిర్మాణం:
a. రాతి శిల్పం: సారనాధ్ బుద్ధ విగ్రహం, ఉదయగిరి వద్దగల గుహ ప్రవేశ ద్వారం వద్దగల వరాహ ప్రతిమ చక్కటి ఉదాహరణలు. గ్వాలియర్ వద్ద ఒక నృత్యకారిణితో మహిళా సంగీత విద్వాంసులు చిత్రాలు అద్భుతమైనవి.

b. లోహ నిర్మాణం: 18 అడుగుల ఎత్తైన బుద్ధుని రాగి విగ్రహం, క్రీ.శ. 6వ శతాబ్దంలో బీహారులో నలంద వద్ద నిర్మించారు. సుల్తాన్ గంజ్ లోని బుద్ధ విగ్రహం 7/2 అడుగుల ఎత్తు ఉంది. ఢిల్లీలో మెహరోలి వద్ద ఉన్న ఇనుప స్తంభం గుప్తుల సాంకేతిక పరిజ్ఞానానికి మచ్చుతునక.
కనిష్కుడు గొప్ప భవన నిర్మాత. కనిష్కపురం, పురుషపురం అనే రెండు నగరాలను నిర్మించాడు.

ప్రశ్న 6.
గుప్తుల కాలాన్ని ‘స్వర్ణయుగం’ అని ఎందుకు అంటారు ?
జవాబు:
ప్రాచీన భారతదేశ చరిత్రలో గుప్తుల కాలాన్ని స్వర్ణయుగమంటారు. ఈ కాలాన్ని గ్రీస్ చరిత్రలోని పెరిక్లిస్ యుగంతోను, రోమన్ చరిత్రలోని అగస్టస్ యుగంతోను పోలుస్తారు. ఈ యుగంలో భారతదేశం అన్ని రంగాల్లోను అభివృద్ధిని సాధించింది.

రాజకీయ ఐక్యత: గుప్తపాలకులు ఉత్తర భారతదేశాన్ని అనైక్యత నుండి కాపాడి, దేశ సమైక్యతను సాధించారు. మొదటి చంద్రగుప్తుడు, సముద్రగుప్తుడు, చంద్రగుప్త విక్రమాదిత్యుడు మొదలగు పాలకులు తమ దిగ్విజయ యాత్రల ద్వారా దేశ రాజకీయ ఏకీకరణను సాధించారు.

విజ్ఞులైన చక్రవర్తులు: గుప్త చక్రవర్తులు సమర్థులు, పండితులు, శూరులు. వీరిలో సముద్రగుప్తుడు అగ్రగణ్యుడు. ఇతడు అజేయుడైన వీరుడే కాక మంచి కవి కూడా. గుప్త చక్రవర్తులందరూ మత సహనమును పాటించారు. వీరి వ్యక్తిగత ప్రతిభాసంపత్తి గుప్తయుగము స్వర్ణయుగము కావటానికి దోహదపడింది.

ఆర్థికాభివృద్ధి: గుప్తుల సమర్థవంతమైన పాలన వలన రాజ్యంలో సుఖశాంతులు ఏర్పడి ఆర్థికాభివృద్ధి జరిగింది. ప్రజలు సంపన్నులై, సంతోషంగా జీవించేవారని ఫాహియాన్ పేర్కొన్నాడు. శిక్షలు స్వల్పంగా ఉండేవి. బాటసారులకు దొంగల భయం లేకుండా ఉండేది. స్వదేశీ, విదేశీ వాణిజ్యం పురోగమించుటచే దేశసంపద పెరిగింది. పరిశ్రమలు వర్ధిల్లాయి. వ్యవసాయమునకు మంచి ప్రోత్సాహం లభించింది.

మతసామరస్యము:
ఎ) గుప్త చక్రవర్తులు హిందువులవటంతో అశ్వమేథము మొదలగు వైదిక కర్మలను ఆచరించారు. త్రిమూర్తులకు ప్రాధాన్యతనిచ్చారు. గుప్తుల ఇష్టదైవం విష్ణువు కనుక విష్ణుపురాణం, విష్ణుస్మృతి, భాగవతం మున్నగు గ్రంథములు ఆదరింపబడ్డాయి. శివుడు, లక్ష్మి, పార్వతి, సరస్వతి మున్నగు దేవతలను కూడా వీరు పూజించారు. ఈ కాలంలో సగుణోపాసనకు ప్రాముఖ్యం పెరిగింది.

బి) తాము వైదిక మతమును అవలంబించినప్పటికి గుప్త చక్రవర్తులు జైన, బౌద్ధమతముల యెడల అపారమైన సహనాన్ని పాటించారు. ప్రసిద్ధ బౌద్ధపండితుడైన వసుబంధుని సముద్రగుప్తుడు ఆదరించాడు. సింహళ ప్రభువు మేఘవర్ణుడు భారతదేశములో బౌద్ధవిహారము నిర్మించుటకు ఇతడు అనుమతించాడు. కుమారగుప్తుడు నలందా బౌద్ధ విశ్వవిద్యాలయమును స్థాపించాడు. నాటి బౌద్ధ, జైన ప్రతిమలు అసంఖ్యాకముగా లభించుటయే గుప్తుల మత సహనమునకు తార్కాణం. కాలక్రమేణా బౌద్ధమతం క్షీణించింది. మహాయాన బౌద్ధమతము హిందూమత శాఖవలె తోచుటయే ఇందుకు కారణం. జైనమతం మాత్రమే కొన్ని ప్రాంతాలలో కొనసాగింది. గుప్తులు ఉన్నత ఉద్యోగాలలో మత ప్రమేయం లేకుండా బౌద్ధులను, జైనులను నియమించారు.

సారస్వతాభివృద్ధి: గుప్తుల కాలంలో సంస్కృత భాష పూర్తి వికాసాన్ని పొందింది. సముద్రగుప్తుడు స్వయంగా కవి. “కవిరాజు” అను బిరుదాంకితుడు. సముద్రగుప్తుని సేనాని హరిసేనుడు అలహాదాబ్ ప్రశస్థి శాసనాన్ని వ్రాశాడు. రెండో చంద్రగుప్తుని ఆస్థానంలో ‘నవరత్నాలు’ అనే కవులుండేవారు. వారు 1) కాళిదాసు 2) అమరసింహుడు 3) శంకు 4) ధన్వంతరి 5) క్షపణికుడు 6) భేతాళభట్టు 7) ఘటకర్షకుడు 8) వరరుచి 9) వరాహమిహిరుడు. కాళిదాసు రచించిన ‘అభిజ్ఞాన శాకుంతల’మనే కావ్యం అనేక ప్రపంచ భాషల్లోకి అనువదించబడింది. ‘మృచ్ఛకటికం’ నాటకాన్ని రచించిన శూద్రకుడు ఈ కాలంవాడే. నాడు వసుబంధు, దిజ్ఞాగుడు, బుద్ధపాలితుడు, భావవివేకుడు వంటి బౌద్ధ రచయితలు నిరుపమానమైన రచనలు చేశారు. ఈ రచనల ద్వారా ఆనాటి రాజాస్థాన జీవితం, ప్రభువర్గాల జీవన విధానం గురించి తెలుస్తుంది.

AP Inter 1st Year History Study Material Chapter 5 క్రీ.శ. 3వ శతాబ్దం నుంచి క్రీ.శ. 7వ శతాబ్దం వరకు రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిస్థితులు, సంస్కృతి

విజ్ఞాన శాస్త్రాభివృద్ధి: విజ్ఞానశాస్త్రంలో కూడా గుప్తుల కాలం అద్భుతమైన ప్రగతిని సాధించింది. ఆర్యభట్టు ‘సూర్యసిద్దాంత’మనే గ్రంథాన్ని, వరాహమిహిరుడు ‘బృహత్సంహిత’ అనే గ్రంథాన్ని రచించారు. బ్రహ్మగుప్తుడు గురుత్వాకర్షణ శక్తిని కనిపెట్టి తన పుస్తకం ద్వారా దానిని లోకానికి వెల్లడి చేశాడు. వైద్యశాస్త్రాభివృద్ధికి విశేషంగా కృషిచేసిన శుశ్రుతుడు, వాగ్భటుడు, ధన్వంతరి మొదలైనవారు గుప్తులకాలం వారే.

కళాభివృద్ధి: గుప్తుల కాలంలో కళలు కూడా పరాకాష్టనందుకొన్నాయి. ఈ కాలంలో జరిగిన నిర్మాణాలన్నీ మతం వలన ప్రేరేపితమైనవే. ఉదా: దేవఘర్లోని దశావతార దేవాలయం, తిగావా, భూమారా ఆలయాలు, సాంచి, సారనాధ్ లోని బౌద్ధాలయాలు ఈ కాలంలో వాస్తుకళ సాధించిన ప్రగతికి నిదర్శనాలు. గుప్తుల కాలంలో శిల్పకళ కూడా పరిపక్వతను పొందింది. అజంతా గుహల్లోని కొన్ని కుడ్యచిత్రాలు ఈ కాలానికి చెందినవే. లోహాలతో విగ్రహాలను, ఉక్కుతో స్తంభాలను పోతపోయడంలోను, రకరకాల అందమైన నాణాల తయారీలో కూడా గుప్తయుగం తన ప్రత్యేకతను నిలబెట్టుకొంది.

ముగింపు: గుప్తుల యుగం భారతదేశ చరిత్రలో ఒక విశిష్టయుగం. ఈ విశిష్టత ప్రధానంగా సాహిత్యం, విజ్ఞానశాస్త్రాలు కళారంగాలలో కనిపిస్తుంది.

7. క్రీ.పూ. 3వ శతాబ్దం నుంచి క్రీ.శ. 7వ శతాబ్దం వరకు జరిగిన సాహిత్యాభివృద్ధిని తెలపండి. జవాబు: మౌర్యుల కాలంలో విద్యారంగంలో చాలా అభివృద్ధి జరిగింది. ప్రజలను విద్యావంతులను చేయడానికి పాలకులు చాలా శ్రద్ధ తీసుకొన్నారు. అశోకుని శాసనాలు సామాన్య ప్రజలు కూడా చదివి అర్థం చేసుకొనేట్లు ఉంటాయి. ప్రాచీన భారతదేశంలో తక్షశిల అతిప్రాచీన విద్యాలయం. ఇది బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు సమానంగా విద్యాభ్యాసం చేయగల అత్యంత ప్రామాణిక విశ్వ విద్యాలయం. భారతదేశం నలుమూలల నుంచేగాక, ఇతర దేశాల నుంచి కూడా విద్యార్థులు కుల, మత, భేదాలు లేకుండా తక్షశిలకు వచ్చి విద్యాభ్యాసం చేశారు.

సారస్వత కార్యక్రమాలు: సారస్వత సంబంధ ప్రగతిలో మౌర్యుల కాలం ఉన్నత ప్రగతి సాధించింది. అశోకుని శాసనాల ద్వారా రెండు లిపులు ఉన్నట్లు తెలుస్తోంది. అవి బ్రహ్మ, ఖరోష్ఠి, కౌటిల్యుడు వ్రాసిన ‘అర్థశాస్త్రం’, భద్రుడు వ్రాసిన ‘కల్ప సూత్రాలు’, బౌద్ధ గ్రంథాలు కథావస్తువు, ధర్మ సూత్రాలు, గృహ సూత్రాలు ఈ కాలంలో రచించబడ్డాయి. కౌటిల్యుని ‘అర్థశాస్త్రం’ మౌర్యుల కాలంనాటి ప్రసిద్ధ గ్రంథం. మౌర్యుల పరిపాలన గురించి సమాచారం ఈ గ్రంథంలో ఉంది.

కనిష్కుడు – గొప్ప సాహిత్య పోషకుడు: కనిష్కుడు గొప్ప సాహిత్య, కళాపోషకుడు. అతడి ఆస్థానంలో చాలామంది పండితులు పోషణను అందుకొన్నారు. అశ్వఘోషుడు, నాగార్జునుడు, వసుమిత్రుడు, చరకుడు సుప్రసిద్ధ బౌద్ధ పండితులు. కనిష్కుడు ఆస్థానంలో ఉన్న అశ్వఘోషుడు వ్రాసిన గ్రంథాలు “బుద్ధచరిత్ర”, “సౌందరానంద కావ్యం”, “సరిపుత్త ప్రకరణ” ముఖ్యమైనవి. నాగార్జునుడు, వసుమిత్రుడు, చరకుడు తమ గ్రంథాలను సంస్కృతంలో వ్రాశారు. కనిష్కుని కాలంలో సంస్కృత భాష విరాజిల్లింది. కనిష్కుడు గొప్ప భవన నిర్మాత. కనిష్కపురం (కాశ్మీరు), పురుషపురం అనే రెండు నగరాలను నిర్మించాడు. బుద్ధుడి విగ్రహాలను గాంధార శిల్ప శైలిలో నిర్మింపజేశాడు. గ్రీకు – భారతీయ శిల్పకళా సమ్మేళనమే గాంధార శిల్పం.

గుప్తుల సారస్వతాభివృద్ధి గుప్తుల కాలంలో సంస్కృతభాష పూర్తి వికాసాన్ని పొందింది. సముద్రగుప్తుడు స్వయంగా కవి. “కవిరాజు” అను బిరుదాంకితుడు. సముద్రగుప్తుని సేనాని హరిసేనుడు అలహాబాద్ ప్రశస్తి శాసనాన్ని వ్రాశాడు. రెండో చంద్రగుప్తుని ఆస్థానంలో “నవరత్నాలు” అనే కవులుండేవారు. 1) కాళిదాసు 2) అమరసింహుడు 3) శంకు 4) ధన్వంతరి 5) క్షపణికుడు 6) భేతాళభట్టు 7) ఘటకర్షకుడు 8) వరరుచి 9) వరాహమిహిరుడు. కాళిదాసు రచించిన “అభిజ్ఞాన శాకుంతలం’ అనే కావ్యం అనేక ప్రపంచ భాషల్లోకి అనువదించబడింది. “మృచ్ఛకటికం” నాటకాన్ని రచించిన శూద్రకుడు ఈ కాలం వాడే. నాడు వసుబంధు, దిజ్ఞాగుడు, బుద్ధపాలితుడు, భావవివేకుడు వంటి బౌద్ధ రచయితలు నిరుపమానమైన రచనలు చేశారు. ఈ రచనల ద్వారా ఆనాటి రాజాస్థాన జీవితం, ప్రభు వర్గాల జీవన విధానం గురించి తెలుస్తుంది.

పుష్యభూతి వంశస్తుల సాంస్కృతిక ప్రగతి: హర్షుడు గొప్ప సాహిత్య, కళా పోషకుడు స్వయంగా పండితుడు. డా॥ రాయిచౌదరి హర్షుని గురించి ఇలా చెప్పాడు. “హర్షుడు గొప్ప సేనాపతి, పరిపాలనాదక్షుడు. మతపోషకుడిగా, సాహిత్య పోషకుడిగా ప్రఖ్యాతిగాంచాడు. విద్యా బోధనకు, పండితుల పోషణకు ఉదారంగా విరాళాలిచ్చాడు. సంస్కృతంలో హర్షవర్ధనుడు ‘నాగానందం’, ‘రత్నావళి’, ‘ప్రియదర్శిక’ అనే గ్రంథాలు వ్రాశాడు. అతడి ఆస్థానంలో ఉన్న బాణభట్టు గొప్ప పండితుడు. హర్షుడు ఉదార దానాల ద్వారా విద్యావ్యాప్తికి కృషిచేశాడు. నలంద విశ్వవిద్యాలయ పోషణకు వంద గ్రామాలను దానం చేశాడు. చాలామంది విద్యార్థులు సుదూర ప్రాంతాలైన చైనా, టిబెట్, మంగోలియా దేశాల నుంచి విద్యాభ్యాసం కోసం వచ్చారు. ఈ విశ్వవిద్యాలయంలో 1500 మంది అధ్యాపకులు ఉన్నారు. శీలభద్రుడు విశ్వవిద్యాలయ అధ్యక్షులు వేదాలు, వ్యాకరణం, ఖగోళశాస్త్రం, గణితం, జ్యోతిష్యం, సాహిత్యం, నైతిక విలువల బోధన సంస్కృత భాషలో చేశారు. హుయన్ త్సాంగ్ ఈ విశ్వవిద్యాలయ విద్యార్థి, ధర్మపాలుడు, చంద్రపాలుడు, గుణమతి, స్త్రీర్మతి, ధ్యాన్ చంద్ర, కమల్ శీల మొదలైనవారు ఆచార్యులు. డా॥ R.C. మజుందార్ అభిప్రాయంలో “హర్షుడు యుద్ధం, శాంతి, కళలలో సమాన ప్రతిభ కలిగి ఉన్నాడు. కలం, కత్తి సమానంగా వాడగల నిపుణుడు, మేధావి అతడు”.

AP Inter 1st Year History Study Material Chapter 5 క్రీ.శ. 3వ శతాబ్దం నుంచి క్రీ.శ. 7వ శతాబ్దం వరకు రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిస్థితులు, సంస్కృతి

లఘు సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
మౌర్యులకు చెందిన ప్రధాన చారిత్రక ఆధారాలు తెలపండి.
జవాబు:
భారతదేశ చరిత్రలో మౌర్య వంశానికి ఒక విశిష్టస్థానం ఉంది. ఈ వంశంవారు ప్రప్రథమంగా సువిశాల సామ్రాజ్యాన్ని స్థాపించి దేశ సమైక్యతను చాలావరకు సాధించారు. తత్ఫలితంగా మౌర్య సామ్రాజ్య స్థాపనతో ఉత్తర భారతదేశ చరిత్రలో సామ్రాజ్యాల యుగం ప్రారంభమైనది. తమిళ, కేరళ ప్రాంతాలు మినహా మిగిలిన భారతదేశమంతా వీరి సార్వభౌమాధిపత్యం క్రిందికి రావడం గమనించదగ్గ విషయం. వీరు సమర్థవంతమైన పాలనావ్యవస్థను రూపొందించి ప్రజారంజకంగా పాలించారు. విశ్వమానవ కళ్యాణం, పరమత సహనం, శాంతి, అహింస, సర్వ మానవ సౌభ్రాతృత్వం వంటి ఉదాత్త లక్ష్యసాధనకు చివరి వరకు అహోరాత్రులు కృషిచేసిన విశ్వవిఖ్యాతులైన సామ్రాట్టులో అగ్రగణ్యుడైన అశోక చక్రవర్తి ఈ వంశానికి చెందినవాడు. ఇటువంటి మౌర్యుల చరిత్రను తెలుసుకొనుటకు ఈ క్రింది చారిత్రక ఆధారాలు ప్రధానమైనవి. అవి:

మౌర్యుల చరిత్ర అధ్యయనానికి ఉపకరించే ప్రధానమైన ఆధారాలు. శిలలపై రాతిస్తంభాలపై కనిపించే అశోకుడి శాసనాలు, కౌటిల్యుడు రచించిన అర్థశాస్త్రం గ్రీకు రచయితల రచనలు. అంతేగాక పురాణాలు బౌద్ధమత గ్రంథాలు, ‘ముద్రారాక్షసం’ అనే నాటకం కూడా వీరి చరిత్ర అధ్యయనానికి ఉపయోగపడుతున్నాయి.

ప్రశ్న 2.
చంద్రగుప్త మౌర్యుడు మొదటి జాతీయ పాలకుడు – చర్చించండి.
జవాబు:
మౌర్య సామ్రాజ్య స్థాపకుడు చంద్రగుప్త మౌర్యుడు. ఇతడు చాణిక్యుని నేతృత్వంలో సకల విద్యాపారంగతుడై ఉత్తమ సైనికుడిగా రూపుదిద్దుకున్నాడు. చంద్రగుప్త మౌర్యుడు రెండు ఘనకార్యాలు సాధించాడు. మొదటిది వాయువ్య భారతదేశాన్ని గ్రీకుల నుంచి స్వాధీనం చేసుకోవటం కాగా, నందరాజులను ఓడించి మగధను ఆక్రమించటం రెండవది. అలెగ్జాండర్ భారతదేశమును వదిలివెళ్ళిన పిమ్మట చాణక్య, చంద్రగుప్త మౌర్యుడు మొదటగా పంజాబ్ ప్రాంతంలో ధైర్యసాహసాలకు పేరుబడ్డ జాతులవారిని చేరదీసి ఒక శక్తివంతమైన సైన్యమును సమకూర్చుకున్నారు. ఈ సైన్యం సహాయంతో చంద్రగుప్త మౌర్యుడు ప్రథమంగా గ్రీకులను పారద్రోలి పంజాబును విదేశీపాలన నుండి విముక్తి చేశాడు. ఆ తరువాత నందరాజు నిరంకుశత్వాన్ని నిర్మూలించి మగధ సింహాసనాన్ని అధిష్టించి మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించాడు. జైన, బౌద్ధ ఐతిహ్యాల ప్రకారం చంద్రగుప్త మౌర్యుడు రెండుసార్లు మగధపై దండయాత్ర జరిపాడని, రెండవ దండయాత్రలో విజయం సాధించి సామ్రాజ్య స్థాపనగావించాడని తెలుస్తున్నది. క్రీ.పూ. 305లో భారతదేశముపై దండెత్తి వచ్చిన గ్రీకు సేనాని సెల్యూకస్ నికటార్ను ఓడించి అతని వద్ద నుండి కాబూల్, కాందహార్, హీరట్, బెలూచిస్థాన్లను వశపరచుకొన్నాడు. చంద్రగుప్త మౌర్యుడు 6 లక్షల సైన్యంతో భారతదేశమంతటిని జయించాడని ప్లూటార్క్ అనే గ్రీకు చరిత్రకారుడు పేర్కొన్నాడు. ఈ దండయాత్రల వలన చంద్రగుప్త మౌర్యుని మౌర్య సామ్రాజ్యం పశ్చిమాన పర్షియా నుండి తూర్పున బీహార్ వరకు, దక్షిణాన తిరునల్వేలి జిల్లా వరకు విస్తరించింది.

భారతదేశంలోని అధిక భాగాలను ఒకే సామ్రాజ్య పరిధిలోనికి తీసుకొనివచ్చిన ఘనత చంద్రగుప్తు మౌర్యునికే దక్కుతుంది. అందువలన భారతదేశ చరిత్రలో చంద్రగుప్తమౌర్యుని జాతీయ పాలకుడుగా భావిస్తారు.

ప్రశ్న 3.
అశోకుని గొప్పతనాన్ని సంక్షిప్తంగా వివరించండి.
జవాబు:
భారతీయ చక్రవర్తులలోనే గాక ప్రపంచ చక్రవర్తులలో కూడా ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నవాడు అశోకుడు. అశోకుని కాలంలో మౌర్య సామ్రాజ్యం ఆసేతు హిమాచల పర్యంతం విస్తరించింది.

తొలి జీవితం: అశోకుడు బిందుసారుని కుమారుడు. తండ్రి మరణానంతరం క్రీ.పూ. 273లో మౌర్య సింహాసనాన్ని అధిష్టించాడు. అయితే అశోకుడికి, అతని సోదరులకు మధ్య సింహాసనం కోసం పోరాటం జరగటం వల్ల అశోకుడు తన పట్టాభిషేకాన్ని క్రీ.పూ. 269లో జరుపుకున్నాడు. సింహళ చరిత్ర గ్రంథాలు అశోకుని స్వభావం క్రూరమైనదని, తండ్రి మరణానంతరం తన 99 మంది సోదరులను వధించి సింహాసనాన్ని ఆక్రమించాడని వివరిస్తున్నాయి. అయితే అశోకుడు ఒక శిలాశాసనంలో తన సోదరుల, బంధువుల సంక్షేమానికి తీసుకున్న శ్రద్ధను ప్రస్తావించాడు. కాబట్టి అశోకుని వ్యక్తిత్వాన్ని మార్చటంలో బౌద్ధమతం యొక్క గొప్పదనాన్ని నొక్కిచెప్పటం కోసం ఈ ఐతిహ్యాన్ని సృష్టించారని, అది వాస్తవం కాదని కొందరు చరిత్రకారుల అభిప్రాయం.

AP Inter 1st Year History Study Material Chapter 5 క్రీ.శ. 3వ శతాబ్దం నుంచి క్రీ.శ. 7వ శతాబ్దం వరకు రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిస్థితులు, సంస్కృతి

అశోకుని చరిత్రకు ఆధారాలు: అశోకుని ఉదాత్త లక్ష్యాలు, ఆదర్శాలు, పరిపాలనా కాలంలోని ముఖ్య సంఘటనలను తెలుసుకోవడానికి అతడు దేశంలో వివిధ ప్రాంతాల్లో వేయించిన శిలాస్తంభ శాసనాలు ఎంతో ఉపకరిస్తాయి. ఈ శాసనాలు బ్రాహ్మీలిపిలో వున్నాయి. బౌద్ధమత గ్రంథాలైన “మహావంశ”, “దివ్యావదాన” కూడా అశోకుని చరిత్రకు సంబంధించిన అంశాలను వివరిస్తాయి. అశోకుడు తన శాసనాలలో తనను ‘దేవానాంప్రియ’ (దేవతలకు ప్రియమైనవాడు), ‘ప్రియదర్శి’ (చక్కని రూపం కలవాడు) అని చెప్పుకున్నాడు.

కళింగ యుద్ధం: అశోకుడు మౌర్య సింహాసనాన్ని అధిష్టించక పూర్వం ఉజ్జయిని పాలకుడుగా పనిచేసి పరిపాలనానుభవాన్ని గడించాడు. పట్టాభిషేకం జరుపుకున్న 9 సంవత్సరాలకు (క్రీ.పూ. 261) సామ్రాజ్య విస్తరణకాంక్షతో కళింగపై దండెత్తాడు. అందుకు కారణం మగధ సామ్రాజ్యంలో భాగంగా వున్న కళింగ, నందరాజుల పతనంతో స్వతంత్రించింది. పైగా దక్షిణ భారతదేశానికి వున్న, భూ, జల మార్గాలు కళింగ ద్వారా వుండటం వల్ల దానిని స్వాధీనం చేసుకోదలిచాడు. క్రీ.పూ. 261లో జరిగిన కళింగ యుద్ధంలో లక్షమంది హతులైనట్లు, లక్షన్నర మంది ఖైదీలుగా పట్టుబడినట్లు అశోకుడు తన 13వ శిలాశాసనంలో పేర్కొన్నాడు. ఈ విజయంతో కళింగ మౌర్య సామ్రాజ్యంలో అంతర్భాగమైంది. కళింగ యుద్ధం అశోకునిలో వినూత్నమైన హృదయ పరివర్తనను తెచ్చింది. చండాశోకుడు ధర్మాశోకుడుగా మారాడు. ఇకముందు యుద్ధాలు చేయకూడదని, ధర్మప్రచారం, ప్రజాసంక్షేమం కోసం పాటుపడాలని నిశ్చయించుకొన్నాడు. ఉపగుప్తుడనే బౌద్ధమతాచార్యుని వద్ద బౌద్ధమత దీక్ష తీసుకున్నాడు. రెండు సంవత్సరాల తరువాత బౌద్ధ భిక్షువుగా మారి బుద్ధగయ, లుంబిని, కపిలవస్తు, శ్రావస్తి, కుశ నగరాలను సందర్శించాడు. బౌద్ధభిక్షువుగానే రాజ్యభారాన్ని నిర్వహించాడు.

సామ్రాజ్య విస్తీర్ణం: అశోకుని సామ్రాజ్యం సువిశాలమైనది. తమిళనాడు, అస్సాం ప్రాంతాలు మినహా మిగిలిన భారతదేశమంతా అశోకుని సామ్రాజ్యంలో భాగంగా వుంది. భారతదేశం వెలుపలి ప్రాంతాలైన కాబూల్, కాందహార్, హీరత్, బెలూచిస్థాన్లు ఇతని సామ్రాజ్యంలో చేరివున్నాయి.

బౌద్ధమత వ్యాప్తి: బౌద్ధమతాన్ని స్వీకరించిన తరువాత అశోకుడు స్వదేశంలోను, విదేశాల్లోను బౌద్ధధర్మ ప్రచారం కోసం సంఘాలను ఏర్పాటు చేశాడు. బౌద్ధ ధర్మసూత్రాలను శిలలు, స్తంభాలపై చెక్కించి జనసమ్మర్ధ ప్రదేశాలలో, యాత్రాస్థలాల్లో వాటిని నెలకొల్పాడు. అహింసా సిద్ధాంతానికి అనుగుణంగా జంతు బలులు, వేటలు, మాంసాహార వంటకాలను నిషేధించాడు. పాటలీపుత్రంలో మూడవ బౌద్ధ సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. ధర్మబోధన చేయటానికి ధర్మ మహామాత్రులనే ప్రత్యేక అధికారులను నియమించాడు. మత ప్రచారకులను ఈజిప్టు, మాసిడోనియా, సైప్రస్, ఎపిరస్ మొదలైన దేశాలకు పంపాడు.

అశోకుని ధర్మం: తన సామ్రాజ్య పటిష్టత కోసం అశోకుడు ఒక ధర్మాన్ని ప్రవచించాడు. అశోకుని ఆదర్శాలు, ఆలోచనలు అశోకుని ధర్మంలో కనిపిస్తాయి. అన్ని మతాల మహోన్నత ఆదర్శాలకు ఈ ధర్మం అద్దంపడుతుంది. ఈ ధర్మసూత్రాల్లో ప్రధానమైనవి: జీవహింస చేయరాదు. ఇతరుల విశ్వాసాలు, భావాలపట్ల సహనాన్ని చూపాలి. సర్వప్రాణులపట్ల కరుణ, జాలి చూపాలి. బానిసలు, సేవకుల పట్ల దయతో మెలగాలి. గృహస్థులను, బ్రాహ్మణులను, సన్యాసులను దయతో సత్కరించాలి. వారికి ధనసహాయాన్ని చెయ్యాలి. మాటలను అదుపులో పెట్టుకొని ఇతరుల మతాన్ని గౌరవించటం ద్వారానే తమ మతాన్ని, మత పలుకుబడిని పెంచుకోవాలి. ఈ సార్వజనీనమైన సూత్రాలను ఆచరించినట్లయితే మానవుడు సత్ప్రవర్తన, నైతికతలను సాధించి మోక్షాన్ని పొందుతాడు.

అశోకుని పరిపాలన: అశోకుడు తన సామ్రాజ్యంలో రాష్ట్రస్థాయిలో పరిపాలనా వికేంద్రీకరణను ప్రవేశపెట్టాడు. పరిపాలనలో అతనికి యువరాజు, రాజకుమారుడు, కుమార, ఆర్యపుత్ర మొదలైనవారు సహాయపడేవారు. తక్షశిల, ఉజ్జయిని, వైశాలిలను రాష్ట్రాలకు కేంద్రాలుగా చేసి వాటికి కుమారులను రాష్ట్రపాలకులుగా నియమించాడు. రాజ్య వ్యవహారాల్లో రాజుదే తుదినిర్ణయం. న్యాయవిచారణలో అశోకుడు న్యాయమూర్తుల జాగు, అసహనాలను తొలగించి ప్రశంసనీయమైన మార్పులను ప్రవేశపెట్టాడు.

ప్రశ్న 4.
అశోకుని ధర్మము అంటే ఏమిటి ?
జవాబు:
అశోకుని కాలంలో వివిధ మతశాఖలు సామాజిక ఉద్రిక్తతను సృష్టించాయి. నగరాల్లో వ్యాపారవర్గాలు బలపడటంవల్ల నూతన సామాజిక స్థితి ఏర్పడింది. సామ్రాజ్య సువిశాలత్వం కూడా కొన్ని సమస్యలను సృష్టించింది. ఇటువంటి పరిస్థితులను ఎదుర్కొని, దేశ సమైక్యతను సాధించటానికి ఒక క్రొత్త విధానం కావలసి వచ్చింది. అందువలననే అశోకుడు తన ధర్మాన్ని ప్రతిపాదించాడు.

అశోకుని ఆదర్శాలు, ఆలోచనలు అతనిలో కనిపిస్తాయి. బౌద్ధధర్మం, అశోకుని ధర్మం ఒకటి కాదు. ప్రజలకు సులభంగా అర్థమయ్యే ప్రాకృత భాషలో అశోకుడు తన ధర్మాన్ని శిలాశాసనాల్లో పొందుపరిచాడు. అన్ని మతాల మహోన్నత ఆదర్శాలకు ఈ ధర్మం అద్దం పడుతుంది. అశోకుని ధర్మం ముఖ్యంగా మానవుల ప్రవర్తన, నీతికి సంబంధించిన నియమావళికి వర్తిస్తుంది. ఈ ధర్మసూత్రాల్లో ప్రధానమైనవి:

  1. జీవహింస చేయరాదు.
  2. ఇతరుల విశ్వాసాలు, భావాలపట్ల సహనాన్ని చూపాలి.
  3. సర్వప్రాణులపట్ల కరుణ, జాలి చూపాలి.
  4. బానిసలు, సేవకులపట్ల దయతో మెలగాలి.
  5. గృహస్థులను, బ్రాహ్మణులను, సన్యాసులను దయతో సత్కరించాలి. వారికి ధనసహాయాన్ని చేయాలి.
  6. మాటలను అదుపులో పెట్టుకొని ఇతరుల మతాన్ని గౌరవించటం ద్వారా తమ మతాన్ని, మత పలుకుబడిని పెంచుకోవాలి.

ఈ సార్వజనీనమైన సూత్రాలను ఆచరించినట్లయితే మానవుడు సత్ప్రవర్తన, నైతికతలను సాధించి మోక్షాన్ని పొందుతాడు. అశోకుడు కర్మకాండను, మూఢాచారాలను ఖండించాడు.

AP Inter 1st Year History Study Material Chapter 5 క్రీ.శ. 3వ శతాబ్దం నుంచి క్రీ.శ. 7వ శతాబ్దం వరకు రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిస్థితులు, సంస్కృతి

ప్రశ్న 5.
భారతదేశ ఆర్థిక, సాంస్కృతిక జీవనంలో కుషాణుల కాలానికి గల ప్రాధాన్యత తెలపండి.
జవాబు:
కనిష్కుడి ఆస్థానం ఎంతోమంది పండితులకు ఆశ్రయం కల్పించింది. పార్శ్వుడు, వసుమిత్రుడిలాంటి బౌద్ధ పండితులు నాల్గవ బౌద్ధసంగీతిని నిర్వహించారు. ‘బుద్ధచరిత్ర’, ‘సౌందరనందం’ అనే గ్రంథాలు వ్రాసిన అశ్వఘోషుడు గొప్ప తత్వవేత్త, కవి. మహాయాన మతాన్ని ప్రచారం చేసిన నాగార్జునుడు కూడా కనిష్కుని కాలంవాడే. వీరిరువురు కనిష్కుని ఆదరణ అందుకొన్నారు. కనిష్కుడు మత గ్రంథాలనే కాకుండా లౌకిక గ్రంథాలు, శాస్త్రాలను కూడా ఆదరించాడు.

మాతంగుడనే రాజకీయ దురంధరుడు కనిష్కుడి అమాత్యుడు. ‘చరక సంహిత’ను రచించిన చరకుడు కనిష్కుని ఆస్థాన వైద్యుడు. ఈ చరక సంహితలో రోగనిర్ధారణ, రకరకాల రోగాలు, అవి రావడానికి కారణాలు, రక్తప్రసరణ-పరీక్ష, మానవ శరీరశాస్త్రం, పిండోత్పత్తి (embryology) మొదలైనవి విపులీకరించడం వల్ల పారశీకం మొదలైన భాషల్లోకి ఈ గ్రంథం అనువాదాలు వెలువడ్డాయి.

కళాసేవ: అశోకుడిలాగా ఎన్నో శిల్పాలు చెక్కించడానికి, కట్టడాలు నిర్మించడానికి, చిత్రాలు గీయించడానికి కనిష్కుడు పూనుకొన్నాడు. ‘కనిష్కపురం’ లోని 13 అంతస్తుల స్తంభం (Tower), మధురలోని శిల్పాలు, ‘పురుషపురం’ లోని బౌద్ధవిహారం, స్తూపం ఎంతో ప్రసిద్ధిచెందాయి. రాజధాని పురుషపురంలో 400 అడుగుల ఎత్తు గోపురం నిర్మించి అందులో నిలువెత్తు బుద్ధ విగ్రహం ప్రతిష్టించాడు. గాంధార శిల్పం ఇతని కాలంలోనే ఉచ్ఛస్థితికి చేరుకుంది. శిల్పాలకు మధుర కేంద్రమయింది. అనేక భంగిమలలో బుద్ధుని ప్రతిమలు మలచబడ్డాయి.

కనిష్కుడు విదేశీయుడైనా 41 సంవత్సరాల సుదీర్ఘపాలనలో భారతదేశ చరిత్రలో గొప్ప చక్రవర్తిగా పేరు తెచ్చుకున్నాడు. చరిత్రలో ఉత్తమ స్థానాన్ని సంపాదించుకున్నాడు. అతని తర్వాత వచ్చిన రాజుల (హనిష్కుడు, వసిష్కుడు) బలహీనత వల్ల, కుషాణుల రాజ్యం అంతరించింది.

ప్రశ్న 6.
గుప్తుల కాలానికి సంబంధించిన ప్రధాన చారిత్రక ఆధారాలను తెలపండి.
జవాబు:
కుషాణ సామ్రాజ్య పతనానంతరం భారతదేశంలో, ప్రత్యేకించి ఉత్తర భారతదేశంలో, క్రీ.శ. 4వ శతాబ్ది వరకు ఏ రాజ వంశము సామ్రాజ్యాధికారాన్ని నెలకొల్పలేదు. క్రీ.శ. 4వ శతాబ్ది ప్రథమార్థంలో గుప్త సామ్రాజ్య స్థాపన మగధలో జరిగింది. అంతవరకు, ఈ ప్రాంతమంతటా చిన్నచిన్న రాజ్యాల వ్యవస్థ కొనసాగింది. ఈ చిన్నచిన్న రాజ్యాల్లో రాజకీయ అస్థిరత్వం నెలకొనడంతో రాజకీయ ఆధిక్యత కోసం ఇక్కడి రాజులు తరచు యుద్ధాలు చేశారు. ఇటువంటి రాజకీయ కల్లోల పరిస్థితుల్లో, రాజకీయంగా, సాంస్కృతికంగా, దేశాన్ని సమైక్యపరిచి అన్నివిధాలా స్వర్ణయుగాన్ని సృష్టించడానికి కృషి చేసినవారు గుప్తులు. వీరు క్రీ.శ. 4వ శతాబ్ది నుంచి క్రీ.శ. 6వ శతాబ్ది మధ్య వరకు, భారతదేశాన్ని
పరిపాలించారు.

గుప్తుల కాలంనాటి ప్రాచీన భారతదేశ చరిత్ర రచనకు ఆధారాలు అనేకం ఉన్నాయి. ఆ ఆధారాలను మూడు విభాగాలు చేయవచ్చు. అవి 1. గ్రంథాలు 2. శాసనాలు 3. జ్ఞాపకచిహ్నాలు, ముద్రలు, కళాఖండాలు, చిత్రాలు, నాణాలు మొదలైనవి.

గ్రంథాల్లో ముఖ్యమైనవి, విశాఖదత్తుడు రచించిన ‘ముద్రారాక్షసం’, ‘దేవి చంద్రగుప్తం’ మొదలైన స్వదేశీ గ్రంథాలు, హుయాన్ త్సాంగ్, ఫాహియాన్ అనే విదేశీ రాయబారులు రచించిన సి-యూ-కి, షో-కువో-కి అనేవి.

శాసనాల్లో ముఖ్యమైనవి రెండో చంద్రగుప్తుడి కాలంనాటి ఉదయగిరి గుహల్లోని శాసనాలు, మధుర శిలా శాసనం, సాంచి శిలా శాసనం మొదలైనవి. ఇవి ఆనాటి ప్రభుత్వ విధానాన్ని, మత విధానాన్ని తెలియజేస్తాయి. జునాగఢ్ శాసనం, ఇండోర్ రాగి రేకు శాసనం, స్కంధగుప్తుని గురించి తెలుపుతున్నాయి.

ఇంకా గుప్తుల కాలంనాటి జ్ఞాపక చిహ్నాలైన అజంతా, ఎల్లోరా గుహల్లోని చిత్రలేఖనం, వారు ప్రవేశపెట్టిన వివిధ రకాలైన నాణాలు వారి ఆర్థిక, సాంస్కృతిక రంగాల ప్రగతిని తెలియజేస్తున్నాయి.

ప్రశ్న 7.
సముద్రగుప్తునిపై సంక్షిప్త వ్యాసం రాయండి.
జవాబు:
గుప్తచక్రవర్తులలో సముద్రగుప్తుడు (క్రీ.శ. 335-380) అగ్రగణ్యుడు. సముద్రగుప్తుని విజయాలను, వ్యక్తిత్వాన్ని అతడు జారీచేసిన శాసనాల ఆధారంగా తెలుసుకోవచ్చు.

తొలి జీవితం: సముద్రగుప్తుడు మొదటి చంద్రగుప్తుడు, కుమారదేవీలకు జన్మించాడు. మొదటి చంద్రగుప్తుడు తన వారసుడిగా సముద్రగుప్తుడిని నియమించాడు. కాని సముద్రగుప్తుడు జ్యేష్ఠుడు కానందున వారసత్వయుద్ధం జరిగిందని, అందులో తన అన్న “కచుని” సముద్రగుప్తుడు ఓడించాడని కొందరు చరిత్రకారుల అభిప్రాయం. కాని “కచుడు” అనునది సముద్రగుప్తునికి గల మరియొక పేరని కొందరు చరిత్రకారులు అభిప్రాయపడ్డారు.

సైనిక విజయాలు: సముద్రగుప్తుడు గొప్ప విజేత. విదేశీదాస్యం నుంచి భారతదేశానికి విముక్తిని కలిగించి భారతదేశమంతటిని ఒకే పాలన క్రిందకు తీసుకురావాలని ఇతడు ఆశించాడు. ఇతని ఆస్థాన పండితుడు, సేనాపతి అయిన హరిసేనుడు అలహాబాద్ లో అశోక స్తంభం మీద వ్రాయించిన “అలహాబాద్ ప్రశస్థి” ద్వారా ఇతని సైనిక విజయాలను తెలుసుకోవచ్చు. దీని ప్రకారం సముద్రగుప్తుని విజయాలను మూడు భాగాలుగా విభజించవచ్చు. అవి: 1) మొదటి ఆర్యావర్త విజయాలు 2) దక్షిణభారత విజయాలు 3) రెండో ఆర్యావర్త విజయాలు.

1) మొదటి ఆర్యావర్త విజయాలు: సింహాసనాన్ని అధిష్ఠించిన వెంటనే సముద్రగుప్తుడు తన అధికారాన్ని ధిక్కరించిన ఉత్తర భారతంలోని రాజులను జయించి పాటలీపుత్రంలో తన అధికారాన్ని సుస్థిరం చేసుకున్నాడు. ఈ యుద్ధాల్లో సముద్రగుప్తుడు ఓడించిన రాజులు: అహిచ్ఛత్రాన్ని పాలిస్తున్న అచ్యుతుడు, గ్వాలియర్ సమీపంలో పద్మావతీపురాన్ని పాలిస్తున్న నాగసేనుడు, మధురాపురాధీశుడైన గణపతి నాగుడు, ఇంకా చంద్రవర్మ, రుద్రదేవ వంటి మొత్తం 9 మంది రాజులను అణచి సముద్రగుప్తుడు తన అధికారాన్ని సుస్థిరం చేసుకున్నాడు. ఇతని పరాక్రమాన్ని గుర్తించి సరిహద్దు రాజ్యాలైన సమతట, కామరూప, నేపాల్, దావక, కర్రిపుర మొదలైన రాజ్యపాలకులు సముద్రగుప్తుడితో మైత్రి చేసుకున్నారు. మాళవ, యౌధేయ, అభీర వంటి గణరాజ్యాలు ఇతని ఆధిపత్యాన్ని అంగీకరించాయి. ఈ విజయాల ఫలితంగా ఇతని సామ్రాజ్యం హిమాలయాల నుంచి ‘భిల్సా’ వరకు, పంజాబ్ నుంచి బెంగాల్ వరకు విస్తరించింది.

2) దక్షిణ భారత విజయాలు: మొదటి ఆర్యావర్త యుద్ధాల తరువాత సముద్రగుప్తుడు దక్షిణభారతంపై దండెత్తాడు. ఈ దండయాత్రలో సముద్రగుప్తుడు 12 మంది రాజ్యపాలకులను ఓడించి వారి రాజ్యాలను తిరిగి వారికే అప్పగించాడు. ఆ పాలకులు 1) కోసల పాలకుడైన మహేంద్రరాజు 2) మహాకాంతార పాలకుడైన వ్యాఘ్రరాజు 3) ఏరండపల్లి దమనుడు 4) పిష్టపుర రాజు మహేంద్రుడు 5) కొత్తూరును పాలించే స్వామిదత్తుడు 6) దేవరాష్ట్ర పాలకుడైన కుబేరుడు 7) వేంగి పాలకుడైన హస్తివర్మ 8) పాలక్క రాజైన ఉగ్రసేనుడు 9) కేరళ రాజ్యాన్ని పాలించే మంత్రరాజు 10) కుశస్థలపురం పాలకుడు ధనంజయుడు11) అవముక్త పాలకుడు నీలరాజు 12) కంచిని పాలించిన విష్ణుగోపుడు.
సముద్రగుప్తుని ఈ దండయాత్ర మార్గాన్ని గురించి చరిత్రకారులలో భిన్నాభిప్రాయాలు వున్నాయి.

AP Inter 1st Year History Study Material Chapter 5 క్రీ.శ. 3వ శతాబ్దం నుంచి క్రీ.శ. 7వ శతాబ్దం వరకు రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిస్థితులు, సంస్కృతి

3) రెండో ఆర్యావర్త విజయాలు: సముద్రగుప్తుడు దక్షిణ భారత విజయాల్లో మునిగివున్న సమయంలో ఉత్తరభారతంలోని రాజులు వాకాటక రాజు రుద్రసేనుని నాయకత్వంలో తిరుగుబాటు చేశారు. సముద్రగుప్తుడు వారిని “కౌశాంబి” యుద్ధంలో ఓడించి, అశ్వమేధయాగాన్ని చేసి సామ్రాట్టుగా ప్రకటించుకున్నాడు. ఈ విజయాలను గుర్తించి మధ్యభారతంలోని అనేక అటవీ రాజ్యాల అధిపతులు ఇతని ఆధిపత్యాన్ని అంగీకరించారు.

ఇట్టి విజయ పరంపరల వలన చరిత్రకారులు సముద్రగుప్తుని ఇండియన్ నెపోలియన్ అని కీర్తించారు.

ఇతర దేశాలతో సంబంధాలు: విజేతగా సముద్రగుప్తుడి కీర్తి, ప్రతిష్టలు విదేశాలకు కూడా వ్యాపించాయి. అనేకమంది విదేశీరాజులు ఇతనితో దౌత్య సంబంధాలనేర్పరుచుకొన్నారు. సింహళరాజైన మేఘవర్ణుడు క్రీ.శ. 351లో ఇతని ఆస్థానానికి రాయబారులను, కానుకలను పంపడమే కాకుండా తన దేశం నుంచి భారతదేశం వచ్చే బౌద్ధ యాత్రికుల కోసం బుద్ధగయ సమీపంలో ఒక విహారాన్ని నిర్మింపజేశాడు.

ప్రశ్న 8.
గుప్తుల పాలనలో సమాజం, ఆర్థిక స్థితి, మతం వివరించండి.
జవాబు:
సమాజం: సామాజిక ఏర్పాటుకు కుల వ్యవస్థ ఆధారం. సమాజం నాలుగు వర్గాలుగా విభజించబడింది. బ్రాహ్మణులు, క్షత్రియ, వైశ్య, శూద్రులు. బ్రాహ్మణులు సమాజంలో ఉన్నత స్థానంలో గౌరవించబడ్డారు. చక్రవర్తులు కూడా వీరిని సత్కరించేవారు. అనేక విషయాల్లో పురోహితుడే చక్రవర్తికి ప్రధాన సలహాదారుడు. బ్రాహ్మణుల తరువాత క్షత్రియులు, వైశ్యులు గౌరవ స్థానాల్లో ఉన్నారు. ‘చండాలుర’ గురించి ఫాహియాన్ తెలిపాడు. సాధారణంగా వారు వేటగాళ్ళు, మత్స్యకారులు, కసాయి వారు అయి ఉండవచ్చని తెలుస్తుంది.

స్త్రీ స్థానం: కొన్ని అంశాల్లో స్త్రీ హోదా గుప్తుల కాలంనాటి సమాజంలో తగ్గింది. బాల్య వివాహాలు విస్తారంగా జరిగేవి. ‘సతీసహగమనం’ క్రమంగా వాడుకలోకి వచ్చింది.

ఆర్థిక వ్యవస్థ: మౌర్యులలాగా గాక గుప్తులు గొప్ప బిరుదులను ధరించారు. ‘మహారాజాధిరాజ’ అనే బిరుదు వల్ల చిన్న రాజ్యాలు, రాజులు ఉండేవారని తెలుస్తుంది. గుప్తులు జయించిన చాలా రాజ్య భాగాలు భూస్వాముల పాలనలో ఉండేవి. బెంగాలు, బీహారు, ఉత్తరప్రదేశ్ రాజ్య భాగాలు కేంద్రంగా గుప్త సామ్రాజ్య పాలన జరిగింది.

పెద్ద కేంద్ర సైన్యం, అధికార వర్గం లేకపోవడం: మౌర్యులకు భిన్నంగా, గుప్తులకు పెద్ద వ్యవస్థీకృత సైన్యం లేదు. భూస్వాములు పంపే సైన్యమే గుప్తుల సైన్యంలో ప్రధాన భాగం. అదేవిధంగా అధికార వర్గం కూడా లేదు. వీటివల్ల పాలనా యంత్రాంగంపై చక్రవర్తి నియంత్రణ తగ్గింది.

భూస్వామ్య అంశాల అభివృద్ధి:

  • భూదానాలు చేయడం: పురోహితులకు, దేవాలయ భూములు, గ్రామాలు విరాళాలుగా ఇచ్చి, పన్నులు వసూలు, పాలనాధికారులు ఇవ్వడంతో అది వికేంద్రీకరణకు దారితీసింది. సేద్యపు కూలీల అణచివేత, దానం చేసిన గ్రామాల ప్రజల అణచివేతతో వారిపై పెత్తనం పెరిగింది.
  • సేద్యపు బానిసత్వం: భూదానాలు, భూస్వామ్య వ్యవస్థకు దారితీసింది. చాలా శాసనాల్లో సేద్యపు బానిసత్వం గురించి తెలిపారు. భూములు అమ్మినప్పుడు, ఇతరులకు ఇచ్చినప్పుడు దానితోపాటు సేద్యపు బానిసలను కూడా ఇచ్చారు.

ప్రశ్న 9.
హర్షవర్ధుని గొప్పతనాన్ని అంచనా వేయండి.
జవాబు:
గుప్త సామ్రాజ్యం పతనానంతరం ఉత్తర భారతదేశం అనేక చిన్న స్వతంత్ర రాజ్యాలుగా విడిపోయింది. వాటిలో ఒకటి స్థానేశ్వర రాజ్యం. స్థానేశ్వర పాలకులలో హర్షుడు ప్రముఖుడు. (క్రీ.శ. 606-647). హర్షుడు తన జైత్రయాత్ర ద్వారా ఉత్తర భారత రాజకీయ ఏకీకరణను సాధించాడు.

చారిత్రక ఆధారాలు: హర్షుని చరిత్రను తెలుసుకోవటానికి బాణుడు రచించిన హర్షచరిత్ర, హుయాన్ త్సాంగ్ రచించిన సి-యూ-కి, హర్షుడు వేయించిన బన్సీభేరా, మధుబన్, సోనేపట్ శాసనాలు ముఖ్య ఆధారాలు. హర్షుడు రచించిన నాటకాలు కూడా నాటి సాంఘిక పరిస్థితులను వివరిస్తాయి.

తొలి జీవితం: హర్షుడు పుష్యభూతి వంశస్థుడు. ఇతడి తండ్రి ప్రభాకర వర్ధనుడు. ప్రభాకర వర్థనుడి మరణానంతరం హర్షుని సోదరుడు రాజ్యవర్ధనుడు రాజ్యానికి వచ్చాడు. అయితే గౌడ శశాంకుని కుట్రకు రాజ్యవర్ధనుడు బలైపోయాడు. అంతట క్రీ.శ. 606 లో హర్షుడు తన 16వ ఏట స్థానేశ్వర రాజ్య సింహాసనాన్ని ‘రాజపుత్ర’ అను బిరుదుతో అధిష్టించాడు.

తొలి ఘనకార్యాలు: సింహాసనానికి వచ్చిన వెంటనే హర్షుడు కామరూప దేశాధిపతియైన భాస్కరవర్మతో మైత్రిని పొందాడు. తరువాత మాళవ, గౌడాధీశులను ఓడించాడు. వింధ్య అడవులకు పారిపోయి ఆత్మహత్య చేసుకోవాలనుకున్న తన సోదరి రాజ్యశ్రీని రక్షించాడు. అంతట కనోజ్ మంత్రి పరిషత్ విన్నపం మేరకు స్థానేశ్వరం, కనోజ్ రాజ్యాలను కలిపి “శ్రీలాదిత్య” అను బిరుదుతో పరిపాలనను ప్రారంభించాడు. తన రాజధానిని స్థానేశ్వరం నుంచి కనోజ్కు మార్చాడు. క్రీ.శ. 606 నుండి 647 వరకు హర్షుడు రాజ్యశ్రీతో కలిసి పాలించినట్లు తెలుస్తున్నది.

జైత్రయాత్రలు: శూరుడైన హర్షుడు విశాల సైన్యాన్ని సమకూర్చుకొని 6 సంవత్సరాలపాటు నిరంతరంగా దిగ్విజయ యాత్ర సాగించి సామ్రాజ్యాన్ని విస్తరింపచేసినట్లు హుయాన్ త్సాంగ్ పేర్కొన్నాడు. మొదట గృహవర్మ మరణానికి కారకుడైన మాళవరాజు దేవగుప్తుడిని తొలగించి, అతని తమ్ముడు మాధవగుప్తుడికి సింహాసనాన్ని అప్పగించి తనకు సామంతుడిగా చేసుకున్నాడు. వల్లభిరాజు ధృవసేనుడిని ఓడించి అతనికి తన కుమార్తెని ఇచ్చి వివాహం చేశాడు. క్రీ.శ. 637లో తూర్పు ప్రాంతానికి దండయాత్రలకు వెళ్ళి వంగ, మగధ, గంజామ్ (ఒరిస్సా) ప్రాంతాలను పాలిస్తున్న శశాంకుడిని ఓడించాడు.

పులకేశి చేతిలో ఓటమి: ఉత్తరాపథంలో తన అధికారాన్ని సుస్థిరం చేసుకొని దక్షిణాపథాన్ని కూడా జయించాలని హర్షుడు నిర్ణయించుకున్నాడు. ఈ ఆలోచనతో దక్షిణాపథంపై దండయాత్రకు బయలుదేరాడు. కాని పశ్చిమ చాళుక్య ప్రభువైన రెండవ పులకేశి హర్షుని నర్మదానదీ తీరప్రాంతంలో ఓడించి వెనుకకు మళ్ళించాడు. నర్మదానది ఇరువురి రాజ్యాలకు మధ్య సరిహద్దు అయింది. ఈ విషయాన్ని రెండవ పులకేశి తన ఐహోల్ శాసనంలో వివరించాడు.

రాజ్య విస్తీర్ణం: హర్షుని సామ్రాజ్యంలో తూర్పు పంజాబ్, ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమబెంగాల్, గంజామ్ ప్రాంతాలు మాత్రమే చేరాయి. రెండవ పులకేశి తన ఐహోల్ శాసనంలో హర్షుని “సకలోత్తరపధేశ్వరుని”గా వర్ణించటాన్ని బట్టి ఉత్తర భారతదేశమంతా హర్షుని ఆధీనంలో ఉన్నట్లుగా తెలుస్తున్నది.

AP Inter 1st Year History Study Material Chapter 5 క్రీ.శ. 3వ శతాబ్దం నుంచి క్రీ.శ. 7వ శతాబ్దం వరకు రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిస్థితులు, సంస్కృతి

పాలన: హర్షుడు సమర్ధవంతుడైన పాలకుడు. ప్రజాసంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ చూపాడు. ప్రజల స్థితిగతులను కనుగొనుటకు అతడు విస్తృతంగా పర్యటించేవాడు. హర్షుడు విరామమెరుగక రాజ్యభారాన్ని నిర్వహించేవాడని హుయాన్ త్సాంగ్ వ్రాశాడు. హర్షుడు తన సామ్రాజ్యాన్ని భుక్తులుగాను, విషయాలుగాను, గ్రామాలుగాను విభజించాడు. పండిన పంటలో 6వ వంతును మాత్రమే పన్నుగా వసూలు చేసేవాడు. హర్షుని శిక్షాస్మృతి కఠినంగా ఉండేది. నేరములు అధికంగా ఉండేవి. హర్షుని సైన్యంలో 5వేల ఏనుగులు, 2వేల గుర్రాలు, 50వేల కాల్బలము ఉన్నట్లు తెలుస్తున్నది.

దాన ధర్మాలు: బీదలకు దానధర్మములు చేయుటలో హర్షుడు అశోకుని అనుసరించాడు. రోగులకు, బాటసారులకు అనేక సౌకర్యములు కల్పించాడు. ప్రయాగలో మహామోక్షపరిషత్తును ఐదేండ్లకొకసారి జరుపుచూ, సర్వస్వదానము అను మహావ్రతమును చేశాడు. అందు మొదటిరోజు బుద్ధుని, రెండవ రోజు సూర్యుని, మూడవ రోజు శివుని పూజించి 5 లక్షల జనులకు దానధర్మములు చేశాడు.

విద్యా, సారస్వత పోషణ: హర్షుడు విద్యా, సారస్వతాలను కూడా ఆదరించాడు. నలందా విశ్వవిధ్యాలయానికి 100 గ్రామాలను దానం చేశాడు. పండిత పోషణకు తన ఆదాయంలో 4వ వంతును వినియోగించాడు. హర్షుడు స్వయంగా కవి. ఇతడు రత్నావళి, నాగానందం, ప్రియదర్శిక అనే నాటకాలను రచించాడు. ఇతని ఆస్థాన కవి బాణుడు “హర్షచరిత్ర”, “కాదంబరి” అను వచన కావ్యాలను రచించాడు. సుభాషిత శతకాన్ని రచించిన భర్తృహరి, సూర్య శతకాన్ని రచించిన మయూరుడు, మతంగ దివాకరుడు హర్షుని ఆస్థానంలోనే వారే.

ఘనత: ప్రాచీన చరిత్రలో అగ్రగణ్యులైన చక్రవర్తులలో హర్షుడు ఒకడు. ఇతడు బహుముఖ ప్రజ్ఞాశాలి. విజేతగా, సామ్రాజ్య నిర్మాతగా, ధర్మతత్పరుడిగా, ఉదార పాలకుడిగా, సాహితీవేత్తగా, విద్యాభిమానిగా హర్షుడు విశిష్ట స్థానాన్ని ఆక్రమించాడు. ఇతనిలో అశోకుడు, సముద్రగుప్తుడు, భోజరాజువంటి ప్రముఖుల విశిష్ట లక్షణాలన్నీ ఉన్నాయి. గుప్త యుగానికి, రసపుత్ర యుగానికి మధ్య వారధిగా హర్షుని చరిత్రకారులు పేర్కొన్నారు.

సంక్షిప్త సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
కౌటిల్యుని ‘అర్థశాస్త్రం’
జవాబు:
అర్థశాస్త్ర రచయిత కౌటిల్యుడు. ఇతడు చంద్రగుప్త మౌర్యుని ప్రధానమంత్రి. మౌర్యుల చరిత్రను తెలుసుకొనుటకు గల ఆధారములలో అర్థశాస్త్రము ప్రముఖమైనది. అర్థశాస్త్రమనగా ఆర్థికశాస్త్రము కాదు. ఇది రాజనీతి శాస్త్రము. ఇందు చక్రవర్తి యొక్క విధులు, సైనిక విధానము, దండనీతి మొదలగు అంశములు పేర్కొనబడెను. అయితే రాజనీతి అంశములతోపాటు ఆర్థిక విషయములు కూడా పేర్కొనబడెను. అర్థశాస్త్రమందు కౌటిల్యుడు “రాజ్యమును సంపాదించుటకు కుటిల మార్గములను” కూడా పేర్కొనెను. అటులనే చెరువులో గల చేపలు నీరు త్రాగకుండా ఎట్లు ఉండలేవో, ప్రభుత్వ ఉద్యోగులు లంచాలు కూడా తీసుకోకుండా ఉండలేరు అని పేర్కొనెను.

ప్రశ్న 2.
ఇండికా
జవాబు:
చంద్రగుప్త మౌర్యుని ఆస్థానంలో గ్రీకు రాజైన సెల్యూకస్ రాయబారి మెగస్తనీస్. భారతదేశంలో ఉన్నంతకాలం తాను చూచిన, విన్న విషయాలను ఇండికా అను పేరుతో గ్రంథస్తం చేశాడు. అయితే ఇండికాలోని కొన్ని భాగాలు మాత్రమే నేడు లభ్యమౌతున్నాయి. ఈ గ్రంథం వల్ల నాటి పాలనావిధానం, సామాజిక, ఆర్థిక పరిస్థితులు తెలుస్తున్నాయి. భారతదేశంలో బానిసవ్యవస్థ లేదని, భారతీయులలో 7 కులాలవారున్నారని మెగస్తనీస్ ఈ గ్రంథంలో పేర్కొన్నాడు. పాటలీపుత్ర నగరపాలన గురించి, సైనిక మండలుల గురించి మెగస్తనీస్ సవివరంగా వివరించాడు. ఇతడు విదేశీయుడు. ఇతనికి భారతీయ సంస్కృతీ పరిజ్ఞానం పూజ్యం కాబట్టి ఇతని రచనను స్వవిమర్శతో స్వీకరించవలసి ఉంటుంది.

ప్రశ్న 3.
ధమ్మ మహామాత్రులు
జవాబు:
అశోకుడు నూతన నైతిక నియమావళిని ప్రజలముందుంచాడు. ప్రజల నైతికతను అభివృద్ధి చేయాలనుకొన్నాడు. తన మతాన్ని వ్యాప్తిచేయడానికి ‘ధమ్మ మహామాత్రులు’ అనే ఉద్యోగులను నియమించాడు. 13వ శిలాశాసనంలో అశోకుడు ధమ్మ మహామాత్రుల నియామకం గురించి ఇలా అన్నాడు. “అన్ని మత శాఖలకు ధమ్మ మహామాత్రులను నియమించాను వారు అన్ని ధార్మిక ప్రదేశాలను పరిరక్షిస్తూ ఉంటారు. ప్రజలకు తన మత నైతిక నియమావళిని బోధించడమే వారి విధి. మానవుల సంక్షేమం, వివిధ మత, ధార్మిక కార్యక్రమాల అమలుకు కృషిచేయాలి”. 6వ శిలాశాసనంలో ‘ధమ్మ మహామాత్రుల పనితీరుపై పర్యవేక్షణ కోసం తగిన ఏర్పాట్లు అశోకుడు చేశాడు’ అని పేర్కొనబడింది.

ప్రశ్న 4.
కళింగ యుద్ధం
జవాబు:
కళింగ ప్రాభవం తగ్గించడానికి అశోకుడు కళింగ యుద్ధం (క్రీ.పూ. 261) చేశాడు. అనేకమంది చంపబడటం తీవ్ర రక్తపాతానికి దారితీసింది. చివరికి అశోకుడు యుద్ధంలో గెలిచాడు. కళింగ యుద్ధ వివరాలు అశోకుని 13వ శాసనంలో ఉన్నాయి. ఇది చాలా ప్రాధాన్యత ఉన్న యుద్ధంగా గుర్తించబడింది. ఎందుకంటే ఈ యుద్ధానంతరం అశోకుడు ధర్మ అశోకుడిగా గుర్తించబడ్డాడు.

AP Inter 1st Year History Study Material Chapter 5 క్రీ.శ. 3వ శతాబ్దం నుంచి క్రీ.శ. 7వ శతాబ్దం వరకు రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిస్థితులు, సంస్కృతి

ప్రశ్న 5.
సారనాధ్
జవాబు:
అశోకుడు నిర్మించిన స్తంభాలలో మిక్కిలి ప్రఖ్యాతి గాంచినది సారనాధ్ స్తంభం. సారనాధ్ స్తంభంపై గంట, ఫలక, నాలుగు దిక్కులను తెలిపే నాలుగు జంతువులు (ఏనుగు, గుర్రం, ఎద్దు, సింహం) ఉన్నాయి. జంతువుల మధ్య ధర్మచక్రం ఉంది. వీటికిపైన నాలుగు సింహాల ప్రతిమలు ఉన్నాయి. అవి నాలుగు దిక్కులకు అభిముఖంగా, తమ వెనుక భాగాలు ఒకదానితో ఒకటి తాకుతున్నట్లుగా నిలిచి ఉన్నాయి. స్తంభపీఠం అంచులచుట్టూ మృగాలు, పుష్పాలు, పక్షులు మనోహరంగా చిత్రించబడి ఉన్నాయి. నాలుగు సింహాలలో మూడు మాత్రమే మనకు కనిపిస్తాయి. సింహాల క్రింద భాగంలో ‘సత్యమేవజయతే’ (సత్యమే జయిస్తుంది) అని వ్రాసి ఉంది.’ ఈ సూక్తిని మండకోపనిషత్ నుండి గ్రహించారు. ఈ సారనాధ్ సింహాల కిరీటాన్ని భారత ప్రభుత్వం అధికార చిహ్నంగా స్వీకరించింది.

ప్రశ్న 6.
ఫాహియాన్
జవాబు:
గుప్త చక్రవర్తి చంద్రగుప్త విక్రమాదిత్యుని కాలంలో భారతదేశాన్ని సందర్శించిన చైనా యాత్రికుడు ఫాహియాన్. బుద్ధుడు జన్మించిన పవిత్రభూమిని చూడాలని, బుద్ధుని ధాతువులను, బౌద్ధ గ్రంథాలను సేకరించాలని ఇతడు భారతదేశం వచ్చాడు. గుప్తుల కాలంనాటి భారతదేశ స్థితిగతులను తన పో-కూ-వో-కి అను గ్రంథంలో వివరించాడు.

ప్రశ్న 7.
అలహాబాద్ స్తంభ శాసనము
జవాబు:
అలహాబాద్ ప్రశస్థిని సముద్రగుప్తుని సేనాని హరిసేనుడు సంస్కృతభాషలో వ్రాయించాడు. ఇది ఒక శాసనం రూపంలో ఉంది. దీనిలో సముద్రగుప్తుని దిగ్విజయాలు వివరించబడ్డాయి. దీనిని కావ్యశైలిలో రచించారు. ఇది అలహాబాద్ లోని అశోక స్తంభంపై వ్రాయబడి ఉంది.

ప్రశ్న 8.
కాళిదాసు
జవాబు:
గుప్త చక్రవర్తి చంద్రగుప్త విక్రమాదిత్యుని ఆస్థానమును అలంకరించిన నవరత్నములు అను కవులలో అగ్రగణ్యుడు కాళిదాసు. కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలము, కుమార సంభవము, విక్రమోర్వశీయము, మేఘసందేశము, మాళవికాగ్నిమిత్రము మొదలగు ప్రముఖ గ్రంథములు రచించాడు.

ప్రశ్న 9.
అజంతా గుహలు
జవాబు:
భారతీయ నిర్మాణాలలో గుప్తుల కాలానికి ప్రత్యేక స్థానం ఉంది. నగర, ద్రావిడ పద్దతుల్లో గుప్తుల కళ భారతీయ నిర్మాణ చరిత్ర వైభోగానికి ప్రతీకగా నిలిచిన అజంతా గుహలు ముఖ్యమైనవి. ఈ అజంతా గుహలు మహారాష్ట్రలో కలవు. ఈ గుహల నిర్మాణం ఆనాటి కళానైపుణ్యమునకు నిదర్శనం.

ప్రశ్న 10.
కనిష్కుడు
జవాబు:
కనిష్కుడు గొప్ప సాహిత్య కళాపోషకుడు. అతడి ఆస్థానంలో చాలామంది పండితులు పోషణను అందుకొన్నారు. అశ్వఘోషుడు, నాగార్జునుడు, వసుమిత్రుడు, చరకుడు సుప్రసిద్ధ బౌద్ధ పండితులు. కనిష్కుని ఆస్థానంలో ఉన్న అశ్వఘోషుడు రాసిన గ్రంథాలు ‘బుద్ధ చరిత్ర’, ‘సౌందరానంద కావ్యం’ ముఖ్యమైనవి. ఇతని కాలంలో సంస్కృత భాష విరాజిల్లింది. కనిష్కుడు గొప్ప భవన నిర్మాత, కనిష్కపురం, పురుషపురం అనే రెండు నగరాలను నిర్మించాడు.

ప్రశ్న 11.
గాంధార శిల్పం
జవాబు:
భారతదేశ వాయువ్య ప్రాంతంలో సింధూ నదికి ఇరువైపులావున్న ప్రాంతాన్ని గాంధారము అంటారు. ఈ ప్రాంతంలో ఉద్భవించిన కళను గాంధార కళ అంటారు. ఇక్కడి బౌద్ధశిల్పాలు భారతీయ, గ్రీకో-రోమన్ లక్షణాలను కలిగివుంటాయి. కనుక భారతీయ, గ్రీకు, రోమన్ శిల్పకళల సమ్మేళనాన్ని గాంధార శిల్పకళ అంటారు. ఈ శిల్పంలో మలచబడిన బుద్ధుని విగ్రహాలకు పలుచని వస్త్రాలు, రోమన్ ఉంగరాల జుట్టు, సహజత్వం, కండలు తిరిగిన శరీర భాగాలు ఎంతో అందంగా ఉంటాయి. అందువల్లనే గాంధార శిల్పికి భారతీయుల హృదయము, గ్రీకుల నేర్పరితనము ఉన్నాయని అంటారు. ఈ కళ ఇండో-గ్రీకుల కాలంలో భారతదేశంలోకి ప్రవేశించింది. కుషాణుల కాలంలో, ముఖ్యంగా కనిష్కుని కాలంలో ఉచ్ఛస్థితికి చేరుకుంది.

ప్రశ్న 12.
మధుర కళ
జవాబు:
జైన మతం స్ఫూర్తితో ధ్యానంలో ఉన్న దిగంబర తీర్థంకరుల శిల్పాలను మధుర శిల్పులు నిర్మించారు. మొదట్లో బుద్ధుని, బోధిసత్వుని ప్రతిమలు నిర్మించారు. తర్వాత కాలంలో, మత భావనలు ప్రదర్శితమయ్యేటట్లు నిర్మించారు. బుద్ధుని ప్రతిమలు బిగుతు కండరాలు, బలమైన శరీరంతో హుందాగా, భక్తి భావంతో ఉండే విగ్రహాలను మధుర శిల్పులు నిర్మించారు. వైదిక దేవతలైన శివుడు, విష్ణువు, పార్వతి, లక్ష్మీ ప్రతిమలు కూడా ఈ శిల్ప శైలిలో నిర్మించడం జరిగింది.

ప్రశ్న 13.
హుయన్సాంగ్
జవాబు:
హర్షుని కాలంలో భారతదేశాన్ని సందర్శించిన చైనా యాత్రికుడు హుయన్ త్సాంగ్ (క్రీ.శ. 630-644). ఇతడు దేశంలోని అనేక ప్రాంతాల్లో, బౌద్ధమత పవిత్ర స్థలాల్లో నలందా విశ్వవిద్యాలయంలో గడిపి అనేక బౌద్ధ గ్రంథాలను అధ్యయనం చేశాడు. హర్షునికి సన్నిహితుడైనాడు. హర్షుడు కనోజ్, ప్రయాగలలో జరిపిన మోక్ష పరిషత్లలో పాల్గొన్నాడు. భారతదేశంలో అనేక బౌద్ధ గ్రంథాలను, బుద్ధుని ధాతువులను సేకరించాడు. తన పర్యటన అనుభవాలను సి-యూ-కి అను గ్రంథంగా రచించాడు. ఈ గ్రంథం హర్షుని రాజ్యంలోని రాజకీయ, సాంఘిక, మత పరిస్థితులను వివరిస్తుంది.

 

ప్రశ్న 14.
మహామోక్ష పరిషత్
జవాబు:
హర్షుడు ప్రయాగ వద్ద ప్రతి 5 సంవత్సరములకొకసారి సర్వస్వదాన కార్యక్రమాన్ని నిర్వహించేవాడు. దీనినే మహామోక్ష పరిషత్ అంటారు. ఇటువంటి పరిషత్లను హర్షుడు ఆరింటిని జరిపాడు. క్రీ.శ. 643లో జరిగిన 6వ పరిషత్కు హుయాన్ త్సాంగ్ హాజరయ్యాడు. ఈ పరిషత్తులో హర్షుడు తన సర్వస్వాన్ని బ్రాహ్మణులకు, అనాథలకు పంచి, కట్టుగుడ్డలతో రాజధానికి తిరిగి వచ్చేవాడట.

AP Inter 1st Year History Study Material Chapter 5 క్రీ.శ. 3వ శతాబ్దం నుంచి క్రీ.శ. 7వ శతాబ్దం వరకు రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిస్థితులు, సంస్కృతి

ప్రశ్న 15.
హూణులు
జవాబు:
హూణులు చైనా పరిసర ప్రాంతాలకు చెందిన అనాగరిక మోటుజాతి ప్రజలు. వీరిలో నల్లహూణులు, తెల్లహూణులు అను రెండు శాఖలవారున్నారు. తెల్లహూణులు భారతదేశముపై దాడిచేసి గుప్తుల సామ్రాజ్యంలో శాంతిభద్రతలకు అంతరాయం కలిగించారు. వీరిలో తోరమాణుడు, మిహిరకులుడు ముఖ్యులు. వీరి దండయాత్రల వలన గుప్త సామ్రాజ్యం బలహీనపడింది. గణతంత్ర రాజ్యాలు అంతరించాయి. బౌద్ధమతం నాశనమైంది. కాలక్రమంలో హూణులు క్షత్రియులుగా గుర్తింపు పొందారు.

ప్రశ్న 16.
బాణుని ‘హర్ష చరిత్ర’
జవాబు:
హర్షచరిత్ర అను గ్రంథాన్ని హర్షుని ఆస్థానకవి బాణుడు రచించాడు. మహాశివభక్తుడైన ‘పుష్యభూతి’ ఈ వంశానికి మూలపురుషుడైనందువల్ల హర్షుని వంశానికి పుష్యభూతి వంశమని పేరు వచ్చినట్లు ఈ గ్రంథం వల్ల తెలుస్తున్నది. ఈ గ్రంథం హర్షుని తండ్రి ప్రభాకరవర్ధనుని ‘హూణ హరిణకేసరి’ అని వర్ణించింది. ఈ గ్రంథము హర్షుని జీవితమును, |అతని పాలనాకాలం నాటి దేశ, కాల పరిస్థితులను తెలుసుకొనుటకు ఎంతగానో ఉపయోగపడుతుంది.

AP Inter 1st Year History Study Material Chapter 4 తొలి సమాజాలు, మతోద్యమాలు

Andhra Pradesh BIEAP AP Inter 1st Year History Study Material 4th Lesson తొలి సమాజాలు, మతోద్యమాలు Textbook Questions and Answers.

AP Inter 1st Year History Study Material 4th Lesson తొలి సమాజాలు, మతోద్యమాలు

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
క్రీ.పూ. 6వ శతాబ్దంలో సాంఘిక, వర్గ విభేదాలను, సాంఘిక పురోగతిని వర్ణించండి.
జవాబు:
సమాజాలు: క్రీ.పూ. 6వ శతాబ్దం నాటికి తెగల సంస్కృతి తెరమరుగై సమాజంలో వర్ణవ్యవస్థ అమల్లోకి వచ్చింది. సమాజంలో బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అనే నాలుగు వర్ణాలు ఏర్పడ్డాయి. వర్ణాశ్రమ ధర్మాలు అమల్లోకి వచ్చాయి. ఋగ్వేదంలోని పురుష సూక్తం వర్ణ విభజనను, బ్రాహ్మణుల ఆధిక్యాన్ని పేర్కొంది.
పురుష సూక్తంలో ప్రజాపతి దేహం నుంచి నాలుగు వర్ణాలు ఆవిర్భవించినట్లు చెప్పబడింది.

బ్రాహ్మణులు – తల నుంచి
క్షత్రియులు – దేహం నుంచి
వైశ్యులు – తొడల నుంచి
శూద్రులు – పాదాల నుంచి ఏర్పడ్డారని పేర్కొంది

వర్ణధర్మాన్ని ప్రజలు ఉల్లంఘించడంతో ధర్మశాస్త్రాలు, ధర్మసూత్రాలను తయారుచేశారు. వీటన్నింటివల్ల దుష్టులను శిక్షించి, శిష్టులను రక్షించడం అనేది రాజు కర్తవ్యంగా మారింది. ఫలితంగా రాజుకు న్యాయాధికారాలు లభించాయి. నాడు నాలుగు వర్ణాలే నాలుగు కులాలుగా మారాయి. వీరిలో బ్రాహ్మణులు ఉన్నత వర్గంగా, శూద్రులు తక్కువ వర్గంగా పేరుపొందారు.

రక్త సంబంధం వివాహాలు: రక్త సంబంధీకులందరూ కుటుంబంలో ఉండేవారు. కొన్ని కుటుంబాల్లో రక్త సంబంధీకులనే వివాహం చేసుకొనే ఆచారం ఉండేది. తొలి సమాజాల్లోని కుటుంబ వ్యవస్థ కుటుంబీకుల సంబంధాలను తెలుసుకోవడం కష్టం.

ఈ కాలంలో పితృస్వామ్య వ్యవస్థ అమలులో ఉండేది. ఆడపిల్లలను భారంగా భావించేవారు. రక్త సంబంధం ఉన్న వారిని కాకుండా ఇతరులను వివాహం చేసుకొనేందుకు ఆసక్తి కనబరిచేవారు ‘కన్యాదానం’ చేయడం ఆచారమైంది. అయితే మారుతున్న వ్యవస్థ ఫలితంగా ఈ ఆచారాలను ప్రశ్నించడం ఆరంభమైంది. ఇలాంటి స్థితిలో ధర్మసూత్రాలు, ధర్మశాస్త్రాలు ఏర్పడ్డాయి. మనుస్మృతిలో ఎనిమిది రకాల వివాహ పద్ధతులు వివరించబడ్డాయి.

AP Inter 1st Year History Study Material Chapter 4 తొలి సమాజాలు, మతోద్యమాలు

సామాజిక విభేదాలు: ధర్మశాస్త్రాలు, ‘వర్ణధర్మాలు’, ‘వృత్తిధర్మాలను’ వివరించాయి. పుట్టుకను బట్టి వర్ణం నిర్ణయించబడుతుంది. మనదేశంలో ఈ కాలంలోనే న్యాయవ్యవస్థ ఏర్పడింది. వర్ణ ధర్మాలను బట్టి సివిల్, క్రిమినల్ శిక్షల్లో హెచ్చుతగ్గులు ఉండేవి. వర్ణ ధర్మాలను బట్టి సమాజంలో గౌరవం, పదవులు, వివాహాలు నిర్ణయింపబడ్డాయి. వర్ణ ధర్మాలను ఉల్లంఘించిన శూద్రులకు శిక్షలు అమానుషంగా ఉండేవి: ఉదా: తలలు తీసివేయడం, నాలుక కోయడం, కంటికి కన్ను, పంటికి పన్నుగా ఉండేవి. శూద్రులు, ద్విజులకు బానిసలుగా, వ్యవసాయ కూలీలుగా ఉండటం వల్ల వారిని తాకడం, స్నేహం చేయడం, వివాహాలు చేసుకోవడం నిషేధంగా ఉండేది.

వర్ణ తారతమ్యాలు: ఈ క్రింది పట్టిక పని విభజనను తెలుపుతుంది.

1. బ్రాహ్మణులు – 1. వేదాల అధ్యయనం, బోధన, యజ్ఞ యాగాదులు చేయటం, బహుమతుల స్వీకరణ.
2. క్షత్రియులు – 2. యుద్ధాలు చేస్తూ ప్రజలను రక్షించడం పరిపాటి.
3. వైశ్యులు – 3. వేదాధ్యయనం, యజ్ఞయాగాదుల నిర్వహణ, వ్యవసాయ వ్యాపారాల నిర్వహణ.
4. శూద్రులు – 4. పై మూడు వర్ణాల వారికి సేవలు, వ్యవసాయ కార్యక్రమాల నిర్వహణ.

సామాజిక పురోగతి: వర్ణాలు నాలుగుగా విభజింపబడినట్లు పై పట్టిక తెలియజేస్తుంది. అయితే సమాజ పురోగతిలో జాతులు కూడా కలిసిపోయాయి. ఇతర గ్రంథాల్లో జాతులను కూడా వర్ణాలుగా పేర్కొనడమైంది. వర్ణాలు నాలుగుగా విభజింపబడగా, జాతులకు నిర్దిష్ట సంఖ్య లేదు. జాతులను వర్ణాలుగా బ్రాహ్మణులు ఒప్పుకునేవారు కాదు. ఉదా: బంగారుపని చేసే కొందరు నిషాధుల్ని ‘స్వర్ణకారు’ అనడానికి బ్రాహ్మణులు ఒప్పుకొనేవారు కాదు. అందువల్ల ‘జాతులు ‘శ్రేణులుగా’ ఏర్పడి అన్ని వృత్తులు నిర్వహించేవారు. శూద్రులు ఈ కాలానికి సేవకుల స్థాయి నుంచి వ్యవసాయదారులుగా పురోగమించారు.

సమాజంలో స్త్రీల పరిస్థితి: మనుస్మృతి, ధర్మశాస్త్రాల ప్రకారం స్త్రీలకు ఆస్తిలో భాగం లేదు. వివాహ సందర్భంలో స్త్రీలకు ఇచ్చే కానుకలను వారు స్త్రీ ధనంగా పొందవచ్చు. ఈ ధనంపై స్త్రీకి పూర్తి హక్కులు ఉంటాయి. దీనిపై భర్తకు హక్కు లేదు. మనుస్మృతి భర్త అనుమతి లేకుండా స్త్రీలు ఆస్తి కలిగి ఉండటం నేరంగా పేర్కొంది.

స్త్రీలు బయట సమూహం నుంచి వివాహం చేసుకోవడాన్ని ‘ఎక్సోగమి’ అంటారు. తండ్రి ‘కన్యాదానం’ చేయడాన్ని ముఖ్య బాధ్యతగా, గౌరవ మర్యాదలుగా భావించి సరైన సమయంలో వివాహం చేసేవారు. ఆర్థిక వ్యవస్థలో వచ్చిన మార్పుల వల్ల దూర ప్రాంతాలలో ఏర్పడిన వర్తక సంబంధాల వల్ల సంప్రదాయాలు, విశ్వాసాలు, విమర్శలకు దారితీయడంతో బ్రాహ్మణులు క్రీ.పూ. 600వ సం||లో వివాహ వ్యవస్థలో మార్పులు తెచ్చారు.

ప్రశ్న 2.
బ్రాహ్మణ మతంలోని గోత్రం, రక్త సంబంధం, వివాహ పద్ధతులను చర్చించండి.
జవాబు:
క్రీ.పూ. 6వ శతాబ్దం నాటికి తెగల సంస్కృతి తెరమరుగై సమాజంలో వర్ణవ్యవస్థ అమల్లోకి వచ్చింది. సమాజంలో బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అనే నాలుగు వర్ణాలు ఏర్పడ్డాయి. వర్ణాశ్రమ ధర్మాలు అమల్లోకి వచ్చాయి. ఋగ్వేదంలోని పురుషసూక్తం వర్ణ విభజనను, బ్రాహ్మణుల ఆధిక్యాన్ని పేర్కొంది. నాలుగు వర్ణాలే నాలుగు కులాలుగా మారాయి. వీరిలో బ్రాహ్మణులు ఉన్నతవర్గంగా, శూద్రులు తక్కువ వర్గంగా పేరుపొందారు. క్రీ.పూ. 1000వ సం॥లో బ్రాహ్మణులు రూపొందించిన మరొక సామాజిక విధానం గోత్రం.

గోత్రం: గోత్రం అనే పద్ధతి బ్రాహ్మణులతో ప్రారంభమై, బ్రాహ్మణ వ్యవస్థలోనే కొనసాగుతూ ఉంది. అసలు ‘గోత్రం’ అనే పదానికి అర్థం ‘ఆవులకు సంబంధించినది’. బహుశా ఆవులను బట్టి ఆ సమూహ బ్రాహ్మణులు ఆయా గోత్రాలను పెట్టుకొని ఉండవచ్చు. ఆ తరువాత కాలంలో గోత్రం సమూహ పెద్ద పేరుతో కొనసాగింది. చాలాకాలం తరువాత ఏడుమంది ఋషుల పేర్లతో గోత్రనామాలు ఏర్పడినట్లు గృహ్య సూత్రాలు పేర్కొంటున్నాయి. సగోత్రీకులు అంటే ఒకే గోత్రం వారు వివాహం చేసుకోకూడదు అని చెప్పబడింది.

రక్త సంబంధం: కుటుంబంలోని వారందరూ ఆహారం, పని, వనరులు, పూజా కార్యక్రమాలను పంచుకొనేవారు. రక్త సంబంధీకులందరూ కుటుంబంలో ఉండేవారు. కొన్ని కుటుంబాల్లో రక్త సంబంధీకులనే వివాహం చేసుకొనే ఆచారం ఉండేది. తొలి సమాజాల్లోని కుటుంబ వ్యవస్థ, కుటుంబీకుల మధ్య సంబంధాలను తెలుసుకోవడం కష్టం. సంస్కృత గ్రంథాల ప్రకారం ‘కులం’ కుటుంబాలకు గుర్తింపును ఇస్తుంది. వంశం అనేది వారి ‘పుట్టుకను’ తెలియజేస్తుంది.

వివాహాలు: ఈ కాలంలో పితృస్వామ్య వ్యవస్థ అమలులో ఉండేది. ఆడపిల్లలను భారంగా భావించేవారు. రక్త సంబంధం ఉన్న వారిని కాకుండా ఇతరులను వివాహం చేసుకొనేందుకు ఆసక్తి కనబరిచేవారు. ‘కన్యాదానం’ చేయడం ఆచారమైంది. అయితే మారుతున్న ఆర్థిక వ్యవస్థ ఫలితంగా ఈ ఆచారాలను ప్రశ్నించడం ఆరంభమైంది. ఇలాంటి స్థితిలోనే ధర్మసూత్రాలు, ధర్మశాస్త్రాలు ఏర్పడ్డాయి. మనుస్మృతిలో ఎనిమిది రకాల వివాహ పద్ధతులు వివరించబడ్డాయి.

వివాహ రీతులు:

  1. ఎండోగమి – అదే ప్రాంతానికి చెందిన వారిని వివాహం చేసుకోవడం.
  2. ఎక్సోగమి – ఇతర ప్రాంతాల వారిని వివాహం చేసుకోవడం.
  3. పోలోగమి – బహుభార్యత్వ
  4. పోలయాండ్రి – బహు భర్తృత్వం

మొదలగు వివాహ రీతులు 6వ శతాబ్దంలో అమలులో ఉండేవి.

ప్రశ్న 3.
జైనమత బోధనలను, భారత సమాజంపై వాటి ప్రభావాన్ని వర్ణించండి.
జవాబు:
జైనమతం, బౌద్ధమతం కంటే ప్రాచీనమైనది. జైనమత ప్రబోధకులను తీర్థంకరులు అంటారు. వారు 24 మంది. వారిలో మొదటి తీర్థంకరుడు ఋషభనాథుడు. 23వ తీర్థంకరుడు పార్శ్వనాథుడు. 24వ వాడైన మహావీరుడు ఆఖరి తీర్థంకరుడు. మహావీరుడు జైనమత స్థాపకుడు కాదని, ఆ మతాన్ని సంస్కరించి చక్కని రూపాన్ని అందించినవాడని జైనుల విశ్వాసం.

వర్ధమాన మహావీరుడు: వర్ధమాన మహావీరుడు జైనమత 24వ తీర్థంకరుడు. మహావీరుని అసలు పేరు వర్ధమానుడు. అతడు క్రీ.పూ. 540వ సంవత్సరంలో వైశాలి సమీపంలోని కుంద గ్రామంలో జ్ఞాత్రిక క్షత్రియ వంశంలో సిద్ధార్థుడు, త్రిశలకు జన్మించాడు. ఇతని భార్య యశోద, కుమార్తె ప్రియదర్శిని. వర్ధమానుడు 30 ఏళ్ళు నిండకముందే జీవిత సుఖాలను వదిలి, ఇంటి నుంచి నిష్క్రమించి, సత్యాన్వేషణ కోసం బయలుదేరాడు. 12 సంవత్సరాల కఠిన తపస్సు చేసి జ్ఞానోదయాన్ని పొందాడు. పరిపూర్ణ జ్ఞానము పొందిన పిమ్మట ‘జినుడు’ అని, ధైర్యసాహసములతో తపస్సు సాగించుటచేత “మహావీరుడని”, మహాజ్ఞాని అయినందువల్ల “కేవలుడు” అని సమస్త భవబంధములను తెంచుకొనుటచే ‘నిగ్రంథుడ’ని పిలువబడ్డాడు. మహావీరుడని “జినుడు” (జయించినవాడు) అను బిరుదు నుంచి ఈ మతానికి జైనమతమనే పేరు వచ్చింది. మానవుల మోక్షసాధన కోసం మహావీరుడు పంచవ్రతాలను, త్రిరత్నాలను, సల్లేఖన వ్రతమును బోధించాడు. వీటిని ఆచరించుట ద్వారా మానవులు మోక్షము లేదా కేవలావస్థను పొందగలరని బోధించాడు. తన సందేశాన్ని నిర్విరామంగా ప్రచారం చేస్తూ మహావీరుడు తన 72వ ఏట పావా అనే నగరములో హస్తిపాలుడనే రాజు గృహములో క్రీ.పూ. 468లో మరణించాడు.

AP Inter 1st Year History Study Material Chapter 4 తొలి సమాజాలు, మతోద్యమాలు

మహావీరుని బోధనలు:
1) పంచవ్రతాలు: జైనమత 23వ తీర్థంకరుడైన పార్శ్వనాథుడు నాలుగు సూత్రములను బోధించాడు. అవి: ఎ) జీవహింస చేయరాదు. బి) అసత్యమాడరాదు. సి) దొంగతనము చేయరాదు. డి) ఆస్తిపాస్తులు వుండరాదు. ఈ నాలుగు సూత్రాలకు లేక వ్రతాలకు 24వ తీర్థంకరుడైన మహావీరుడు బ్రహ్మచర్యము అనే ఐదవ సూత్రాన్ని జోడించాడు. ఈ ఐదు సూత్రాలను పంచవ్రతాలు లేక పంచకళ్యాణాలు అంటారు.

2) త్రిరత్నాలు: పంచవ్రతాలతోపాటు త్రిరత్నాలను కూడా మోక్ష సాధనకోసం పాటించాలని మహావీరుడు ప్రబోధించాడు. అవి: ఎ) సమ్యక్ దర్శనం లేక సరియైన విశ్వాసం. బి) సమ్యక్ జ్ఞానం లేక సరియైన జ్ఞానం. సి) సమ్యక్ చరిత్ర లేక సరియైన క్రియ. తీర్థంకరుల బోధనలకై శ్రద్ధను కలిగివుండటమే సమ్యక్ దర్శనము. వాటిలో సత్యాన్ని గ్రహించటమే సమ్యక్ జ్ఞానము. వాటిని పాటించడమే సమ్యక్ చరిత్ర. ఈ మూడింటిని త్రిరత్నాలు అంటారు. వీటిని అనుసరించుట ద్వారా దుఃఖలేశం లేని మోక్షం లేదా కైవలావస్థను మానవుడు పొందగలుగుతాడు.

3) సల్లేఖనా వ్రతం: పార్శ్వనాథుడు చేతన, అచేతన వస్తువులన్నింటిలో జీవముందని బోధించాడు. ఆత్మ శరీరమంతటా వ్యాపించి ఉంటుందని తపస్సు మాత్రమే కర్మ బంధాన్ని తొలగిస్తుందని చెప్పాడు. ప్రాపంచిక బంధాల నుంచి, కర్మ నుంచి విముక్తిని సాధించటమే మోక్షమని ఆయన ప్రవచించాడు. కర్మచేయటం ద్వారా కర్మఫలాన్ని అనుభవించటం కోసం పునర్జన్మను ఎత్తవలసి వస్తుందని, కనుక కర్మను నాశనం చేయటం ద్వారానే మోక్షప్రాప్తిని పొందగలమని ఆయన బోధించాడు. కనుక ఉపవాసములచేత శరీరమును శుష్కింపచేసుకొని ప్రాణత్యాగము చేయటం ద్వారా కర్మను అణచివేయవచ్చునని ఆయన బోధించాడు. ఈ ప్రక్రియనే “సల్లేఖనా వ్రతము” అంటారు.

4) కైవల్యం: జైనమతం యొక్క అంతిమ లక్ష్యం కైవల్యం లేక మోక్షము. పంచవ్రతాలను, త్రిరత్నాలను, సల్లేఖనా వ్రతమును ఆచరించుట ద్వారా మోక్షాన్ని సాధించవచ్చునని ఆయన ప్రవచించాడు. దుఃఖరహితము, అనంత సౌఖ్యప్రదము అయినదే మోక్షము. దీనినే కైవల్యావస్థ అంటారు. కైవల్యావస్థ పొందుట ద్వారా మానవుడు కర్మ, పునర్జన్మ వలయము నుండి శాశ్వత విముక్తిని పొందగలుగుతాడు.

5) ఇతర సూత్రాలు: జైనమతం కర్మ సిద్ధాంతాన్ని, పునర్జన్మ సిద్ధాంతాన్ని నమ్ముతుంది. దేవుడున్నాడా లేదా అనే విషయానికి ఈ మతంలో ప్రాముఖ్యత లేదు. మోక్షాన్ని పొందటం, ఆత్మశుద్ధి, భవబంధ విముక్తి అనే వైదిక మత సూత్రాలపై ఆధారపడివుంది. వర్థమాన మహావీరుడు వర్ణవ్యవస్థను ఖండించలేదు. నాటి సామాజిక అసమానతలకు ఆలవాలమైన వర్ణవ్యవస్థను వ్యతిరేకించకుండా పూర్వజన్మ సుకృతాన్నిబట్టి మానవుడు అగ్ర లేక అధమ వర్ణాల్లో జన్మిస్తాడని అభిప్రాయపడ్డాడు. జైనమతం జంతు బలులను, బ్రాహ్మణ ఆధిక్యతను, వేదాల ఆధిక్యతను నిరసించినది.

జైనమత వ్యాప్తి: జైనమత ప్రచారం కోసం మహావీరుడు జైన సంఘాన్ని స్థాపించాడు. స్త్రీ, పురుషులిద్దరు ఈ సంఘంలో సభ్యులు కావచ్చు. ఈ సంఘాలలో జైన భిక్షువులే కాక, తమ మత సూత్రాల ప్రకారం జీవితం గడుపుతూ విరాళాలు, కానుకల ద్వారా ఆ సంస్థలను పోషించే ఉపాసకులు కూడా వుండేవారు. మహావీరుడు సంవత్సరంలో నెలలు పర్యటన చేస్తూ తన బోధనలను ప్రచారం చేసేవాడు. జైనమతానికి రాజాదరణ కూడా లభించింది. మగధ పాలకులైన హర్యంక, నందవంశ రాజులు, చంద్రగుప్త మౌర్యుడు, కడపటి మౌర్యరాజైన సంప్రతి జైనమతాన్ని పోషించారు. భారతదేశంలో జైనమతం రాజస్థాన్, గుజరాత్, కర్ణాటక రాష్ట్రాలలో బాగా ప్రచారంలో వుంది.

ప్రశ్న 4.
బౌద్ధమత బోధనలను, భారత సమాజంపై వాటి ప్రభావాన్ని వర్ణించండి.
జవాబు:
క్రీ.పూ. భారతదేశంలో జనించిన అనేక మతాలలో బౌద్ధమతం ఒకటి. దీని స్థాపకుడు గౌతమబుద్ధుడు. గౌతమబుద్ధుని జీవితం: గౌతమబుద్ధుని అసలు పేరు సిద్ధార్థుడు. ఇతడు క్రీ.పూ. 563వ సం||లో ‘శాక్య’ వంశమునకు చెందిన శుద్దోధనుడు, మాయాదేవీలకు లుంబినీవనమున జన్మించాడు. చిన్నతనమునే తల్లిని కోల్పోయి సవతి తల్లి ప్రజాపతి గౌతమిచే పెంచబడి ‘గౌతముడు’ అని పిలువబడ్డాడు. ఇతనికి ‘యశోధర’ అను రాకుమార్తెతో వివాహం జరిగింది. వారి కుమారుడు ‘రాహులుడు’.

మహా పరిత్యాగము: సిద్ధార్థుడు తన 29వ ఏట ఒక ముదుసలిని, రోగిని, శవాన్ని, సన్యాసిని చూచి వైరాగ్యానికి లోనై సకల సంపదలను, భోగభాగ్యాలను, భార్యాబిడ్డలను వదిలి ఇల్లు విడిచి వెళ్ళాడు. ఈ సంఘటనతో అతని మనస్సు వికలమైంది. ప్రపంచమంతా దుఃఖమయమని, జీవితము అశాశ్వతమని గ్రహించి బవబంధములను తెంచుకొని అడవులకు వెళ్ళి సన్యసించాడు. ఈ సంఘటననే ‘మహా పరిత్యాగము’ లేక ‘మహాభినిష్క్రమణము’ అంటారు.

జ్ఞానోదయమును పొందుట సన్యసించిన పిమ్మట సిద్ధార్థుడు సత్యాన్వేషణకై గయను చేరి అచ్చట ఒక అశ్వత్థ వృక్షము క్రింద 40 రోజులు ధ్యానము చేసి జ్ఞానమును పొందాడు. ఈ సంఘటనకే సంబోధి అని పేరు. అప్పటి నుండి సిద్ధార్థుడు బుద్ధుడు అని పిలువబడినాడు. బుద్ధుడు అనగా జ్ఞానము పొందినవాడు అని అర్ధము. బుద్ధుని శాక్యముని అని, తథాగతుడు అని పిలుస్తారు. నాటి నుండి అశ్వత్థ వృక్షము బోధి వృక్షముగాను, గయ బుద్ధగయగాను ప్రసిద్ధి చెందాయి.

ధర్మచక్ర ప్రవర్తనము: బుద్ధుడు గయ నుండి సారనాథ్ చేరి సమీపమున గల జింకల తోటలో తన పూర్వ సహవాసులైన బ్రాహ్మణులకు మొదటిసారిగా తాను ఆర్జించిన జ్ఞానాన్ని ఉపదేశించాడు. ఈ సంఘటననే ధర్మచక్ర ప్రవర్తనము అంటారు. అప్పటి నుండి అనేక సంవత్సరములు బుద్ధుడు తన బోధనలను ప్రచారం చేశాడు. తన శిష్యులలో ప్రముఖులైన వారిని సంఘంలో ఏర్పరచాడు.

నిర్వాణం: విస్తృతంగా బౌద్ధమతాన్ని ఉత్తరాపథమంతటా ప్రచారం చేసి బుద్ధుడు తన 80వ ఏట మల్ల రాజధానియైన కుశి నగరమున క్రీ.పూ. 483లో నిర్వాణం పొందాడు.

AP Inter 1st Year History Study Material Chapter 4 తొలి సమాజాలు, మతోద్యమాలు

బుద్ధుని బోధనలు: బుద్ధుని బోధనల ప్రకారం మానవ జీవితం కార్యకారణ సంబంధంతో ముడిపడి ఉన్నది. మానవుడు చేసిన కర్మఫలము వలననే ఈ శరీరము మరల మరల జన్మనెత్తవలసి వస్తున్నది. కర్మ ఆచరణకు కోర్కెలే మూలము. అజ్ఞానము వలన కోర్కెలు జనించుచున్నాయి. కోర్కెల వలన మానవుడు కర్మలు ఆచరిస్తాడు. ఈ కర్మ ఫలితమే పునర్జన్మ. పునర్జన్మలేని సుఖమైన, ప్రశాంతమైన జీవనమే నిర్వాణము అని బుద్ధుడు బోధించాడు. నిర్వాణ సాధనకు మానవుడు ఆర్య సత్యములను గ్రహించి అష్టాంగ మార్గమును, దశసూత్ర నీతిని పాటించవలెను.

ఆర్య సత్యములు: గౌతమ బుద్ధుడు తన దివ్య పరిజ్ఞానము వలన నాలుగు ప్రధానమైన సత్యములను గ్రహించాడు. వీటినే ఆర్య సత్యములు అంటారు. అవి:

  1. ప్రపంచమంతా దుఃఖమయము.
  2. దుఃఖమునకు కారణము కోర్కెలు.
  3. దుఃఖమును అంతము చేయుటకు కోర్కెలను నిరోధించవలెను.
  4. కోర్కెలను నిరోధించుటకు అష్టాంగమార్గమును అవలంబించవలెను.

అష్టాంగ మార్గము: నిర్వాణమును పొందుటకు మానవుడు తన నిత్య జీవితంలో ఈ అష్టాంగ మార్గమును అనుసరించిన చాలని బుద్ధుడు బోధించాడు. అవి: 1) సరియైన విశ్వాసము 2) సరియైన జ్ఞానము 3) సరియైన వాక్కు 4) సరియైన క్రియ 5) సరియైన జీవనము 6) సరియైన ప్రయత్నం 7) సరియైన ఆలోచన 8) సరియైన ధ్యానము. అష్టాంగ మార్గము ద్వారా ప్రతి వ్యక్తీ శీలసంపదను పెంపొందించుకొని జ్ఞాని కాగలడు. ఈ మార్గము అందరికీ అందుబాటులో ఉండుటచే దీనిని మధ్యేమార్గం అని అంటారు.

దశసూత్ర నీతి: ఆర్యసత్యములు, అష్టాంగ మార్గములతోపాటు బుద్ధుడు పది అంశములు గల దశసూత్ర నీతిని ప్రబోధించాడు. ఈ సూత్రాలు:

  1. జీవహింస చేయరాదు
  2. అసత్యమాడరాదు.
  3. దొంగతనము చేయరాదు.
  4. ఆస్తిపాస్తులు సమకూర్చుకొనరాదు.
  5. బ్రహ్మచర్యను పాటించవలెను.
  6. మత్తు పదార్దములు సేవించరాదు.
  7. పరుష వాక్యములు వాడరాదు.
  8. ఇతరుల ఆస్తులను కోరరాదు.
  9. అవినీతి పనులు చేయరాదు.
  10. విలాసాలను విడనాడాలి.

నిర్వాణము: ఆర్యసత్యములను గ్రహించి, అష్టాంగ మార్గమును, దశసూత్ర నీతిని ఆదరించటం వలన మానవుడు మోక్షమును పొందుటకు అర్హుడవుతాడు. మోక్షమనగా పునర్జన్మలేని జన్మరాహిత్యము. దీనినే బుద్ధుడు నిర్వాణంగా పేర్కొన్నాడు. నిర్వాణ సాధనే ప్రతి వ్యక్తి ధ్యేయం కావలెను అని బుద్ధుడు బోధించాడు.

బౌద్ధమతతత్వం: బుద్ధుడు భగవంతుని ఉనికిని గురించి, ఆత్మను గురించి మౌనం వహించాడు. హిందూమతమందలి కర్మ, పునర్జన్మ, మోక్ష సిద్ధాంతాలను అంగీకరించాడు. మహావీరుని వలె బుద్ధుడు కూడా యజ్ఞయాగాదులను, జంతుబలులను, బ్రాహ్మణుల ఆధికత్యను ఖండించాడు. వేదములను ప్రామాణిక గ్రంథములుగా బుద్ధుడు అంగీకరించాడు.

ముగింపు: ప్రపంచమునకు శాంతి సందేశమునందించుటకు అవతరించిన మహాపురుషులలో సుప్రసిద్ధుడు గౌతమ బుద్ధుడు. కామ, క్రోధములతో, హింసాత్మక చర్యలతో కొట్టుమిట్టాడుతున్న మానవకోటిని ధర్మం, అహింస, కరుణ, మానవత అనే మహోన్నత ఆశయాలతో తీర్చిదిద్దుటకు అవతరించిన పుణ్య పురుషుడు. అందువల్లనే ఆసియా జ్యోతియని, ప్రపంచ జ్యోతియని శ్లాఘించబడ్డాడు.

సంక్షిప్త సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
వర్ణ వ్యవస్థ సమాజం
జవాబు:
ధర్మశాస్త్రాలు, ధర్మసూత్రాలు ‘వర్ణధర్మాలు’ ‘వృత్తి ధర్మాలను’ వివరించాయి. పుట్టుకను బట్టి వర్ణం నిర్ణయించబడుతుంది. వర్ణ ధర్మాలను బట్టి సివిల్, క్రిమినల్ శిక్షల్లో హెచ్చుతగ్గులు ఉండేవి. వర్ణ ధర్మాలను బట్టి సమాజంలో గౌరవం, పదవులు, వివాహాలు నిర్ణయింపబడ్డాయి. వర్ణ ధర్మాలను ఉల్లంఘించిన శూద్రులకు శిక్షలు అమానుషంగా ఉండేవి. ఉదా: తలలు తీసివేయడం, నాలుక కోయడం.

ప్రశ్న 2.
జాతి అంటే ఏమిటి ?
జవాబు:
ఒకే రకమైన మానసిక భావాలను కలిగి ఉమ్మడి లక్ష్యంతో నివసించే ప్రజా సముదాయమే జాతి. ఒక రాజ్యంలో నివసించే ప్రజలందరూ ఒకే ఉమ్మడి రక్త సంబంధం, పుట్టుకలకు సంబంధించినవారు కాకపోవచ్చు. అయినప్పటికీ పరస్పర గౌరవంతో కూడిన జాతులుగా మెలుగుతున్నాయని చెప్పవచ్చును.

AP Inter 1st Year History Study Material Chapter 4 తొలి సమాజాలు, మతోద్యమాలు

ప్రశ్న 3.
రక్త సంబంధం
జవాబు:
కుటుంబంలోని వారందరూ ఆహారం, పని, వనరులు, పూజా కార్యక్రమాలను పంచుకొనేవారు. రక్త సంబంధీకులందరూ కుటుంబంలో ఉండేవారు. కొన్ని కుటుంబాల్లో రక్త సంబంధీకులనే వివాహం చేసుకొనే ఆచారం ఉండేది. ఈ కాలంలో పితృస్వామ్య వ్యవస్థ అమలులో ఉండేది. ఆడపిల్లలను భారంగా భావించేవారు. రక్త సంబంధం ఉన్న వారిని కాకుండా ఇతరులను వివాహం చేసుకొనేందుకు ఆసక్తి కనబరిచేవారు.

ప్రశ్న 4.
త్రిరత్నాలు
జవాబు:
జైనమత సూత్రాలను త్రిరత్నాలు అని అంటారు. అవి:

  1. సరైన నమ్మకం
  2. సరైన జ్ఞానం
  3. సరైన శీలం.

ప్రశ్న 5.
బౌద్దమత సూత్రాలు
జవాబు:
బుద్ధుడు నాలుగు ఆర్య సత్యాలను ప్రబోధించాడు. అవి:

  1. ప్రపంచం దుఃఖమయం.
  2. దుఃఖానికి కోరికలు కారణం.
  3. కోరికలను నిరోధిస్తే దుఃఖం నశిస్తుంది.
  4. దానికి మార్గం ఉన్నది. అదే అష్టాంగ మార్గం.

ప్రశ్న 6.
అజవికులు
జవాబు:
అజవికుల ప్రచారకుడు మక్కలి గోసలి. ఇతడు నగ్నంగా తిరుగుతూ, తాగుతూ ఉండేవాడు. ఇతని విపరీత ధోరణి వల్ల ప్రజలకు ఎక్కువగా చేరలేదు. ఏదీ మానవుడి చేతిలో లేదు. జరగాల్సింది జరిగి తీరుతుంది’ అని ఈ బాబావారి నమ్మకం. ఈ అజవికులు ఒక సన్యాస వర్గంగా ఏర్పడి తమ మత ప్రచారం చేశారు. మక్కలి గోసలి గురువు పురాణ కశ్యపుడు.

ప్రశ్న 7.
తీర్థంకరులు
జవాబు:
జైనమతంలో మొత్తం 24 మంది తీర్థంకరులు కలరు. వీరిలో మొదటివాడు వృషభనాథుడు. 23వ తీర్థంకరుడు పార్శ్వనాథుడు, 24వ తీర్థంకరుడు వర్థమాన మహావీరుడు. తీర్థంకరులు అనగా ‘మత గురువులు’ లేదా జీవనస్రవంతిని దాటుటకు మార్గాన్ని చూపించేవారని అర్థం.

AP Inter 1st Year History Study Material Chapter 4 తొలి సమాజాలు, మతోద్యమాలు

ప్రశ్న 8.
బహుభార్యత్వం
జవాబు:
బహు భార్యత్వం అనగా ఒక వ్యక్తి ఎక్కువ మంది స్త్రీలను వివాహం చేసుకొనుట. దీనినే ‘పోలోగమి’ అని కూడా అంటారు. పూర్వం ఋగ్వేద, మలివేద కాలంలో రాజులలో ఈ పద్ధతి ఉండేది.

ప్రశ్న 9.
ఎక్సోగమి
జవాబు:
స్త్రీలు బయట సమూహం నుంచి వివాహం చేసుకోవడాన్ని ఎక్సోగమి అని అంటారు. తండ్రి. ‘కన్యాదానం’ చేయడాన్ని ముఖ్య బాధ్యతగా, గౌరవ మర్యాదలుగా భావించి, సరైన సమయంలో వివాహం చేసేవారు.