AP Board 9th Class Social Solutions Chapter 12 యూరప్లో మారుతున్న సాంస్కృతిక సంప్రదాయాలు: 1300-1800

SCERT AP 9th Class Social Studies Guide Pdf 12th Lesson యూరప్లో మారుతున్న సాంస్కృతిక సంప్రదాయాలు: 1300-1800 Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Social Solutions 12th Lesson యూరప్లో మారుతున్న సాంస్కృతిక సంప్రదాయాలు: 1300-1800

9th Class Social Studies 12th Lesson యూరప్లో మారుతున్న సాంస్కృతిక సంప్రదాయాలు: 1300-1800 Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
ఈ అధ్యాయంలో పునరుజ్జీవనంపై చర్చ ప్రధానంగా ……… (ఇంగ్లాండ్ / ఇటలీ / ఫ్రాన్స్/ జర్మనీ). (AS1)
జవాబు:
ఇటలీ.

ప్రశ్న 2.
పునరుజ్జీవన కాలంలో కింద పేర్కొన్న భావనలలో వచ్చిన మార్పుల గురించి ఒక పదం లేదా ఒక వాక్యంతో రాయండి. (AS1)
జవాబు:
అ. మానవతావాదులు : మరణాంతర జీవితం గురించి కాక ప్రపంచం గురించి ఆసక్తి చూపారు.
ఆ. పుస్తకాలు : 14 శ॥ నుంచి 17 శ॥ వరకు కొత్త మానవతా సంస్కృతి వికసించింది.
ఇ. చిత్రకళలు : చుట్టు ప్రక్కల ప్రకృతి నుంచి ప్రజలను, ప్రదేశాలను పరిశీలించి చిత్రీకరించే వరకు.
ఈ. మానవులు : భౌతిక సంపద, అధికారం, కీర్తి నుంచి సత్ప్రవర్తన వరకు.
ఉ. మహిళలు : గృహసంరక్షణ ,నుంచి విద్య, ఆర్థికశక్తి, ఆస్తి సంపాదన వరకు.

AP Board 9th Class Social Solutions Chapter 12 యూరప్లో మారుతున్న సాంస్కృతిక సంప్రదాయాలు: 1300-1800

ప్రశ్న 3.
బైబిలును ముద్రించడం ద్వారా దేవుడు, చర్చిపై భావనలు ఎలా ప్రభావితం అయ్యాయి? (AS1)
జవాబు:
బైబిలు ముద్రించడానికి పూర్వం చేతితో రాసిన బైబిలు ఉండేది. ముద్రణ సాంకేతిక విజ్ఞానంపై పట్టు సాధించడం 16వశతాబ్దపు మహా విప్లవం. జర్మనీ దేశస్థుడు 1455లో జోహాన్స్ గుట్బెర్గ్ కార్యశాలలో బైబిలు 150 ప్రతులను ముద్రించాడు. కొత్త భావాలను ప్రచారం చేసే ముద్రిత పుస్తకం వెంటనే వందలాది పాఠకులను చేరుకుంది. ఇటలీ మానవతావాద సంస్కృతి యూరప్లో వేగంగా వ్యాపించటానికి ముద్రిత పుస్తకాలు అందుబాటులో ఉండటం ప్రధానకారణం.

ప్రజల ఆధ్యాత్మిక, సాంస్కృతిక జీవితాన్ని చర్చి శాసించిందని, చర్చికి అపార అధికారం, సంపద సమకూరి, అవినీతిమయం అయ్యిందని గ్రహించారు. విశ్వవిద్యాలయ పండితులు, చర్చి సభ్యులు కూడా మానవతా భావాలపట్ల ఆకర్షితులయ్యారు. సాధారణ మతానికి అనవసర ఆచారాలను తరువాత జోడించారని ఖండిస్తూ వాటిని త్యజించమని చెప్పారు. ఎక్కడో ఉన్న దేవుడు మనిషిని సృష్టించాడని, ‘ఇక్కడ’ ఇప్పుడు, ఆనందాన్వేషణలో జీవితాన్ని స్వేచ్ఛగా బతకమన్నాడని వాళ్ళు విశ్వసించారు.

ప్రశ్న 4.
మధ్యకాలంనాటి ఇటలీ నగరాలను ప్రస్తుత ఇటలీ నగరాలతో పోల్చండి. వాటి ప్రస్తుత పేర్లలో ఏమైనా తేడాలు ఉన్నాయా? (AS1)
జవాబు:
బైజాంటైన్ సామ్రాజ్యం, ఇస్లామిక్ దేశాల మధ్య వాణిజ్యం విస్తరించటంతో ఇటలీ తీరం వెంట రేవు పట్టణాలు పునరుద్ధరించబడ్డాయి. చైనా, పశ్చిమ యూరప్ దేశాలతో వ్యాపారం పెరగటంలో ఇటలీ నగరాలు కీలకపాత్ర పోషించాయి. ఈ నగరాలు తమను బలమైన సామ్రాజ్యంలో భాగంగా కాకుండా స్వతంత్ర పట్టణ దేశాలుగా చూడసాగాయి. వీటిల్లో “ఫ్లోరెన్స్” “వెనిస్”, గణతంత్రాలు కాగా, ఇంకా ఎన్నో యువరాజుల పాలనలోని నగరసభలుగా ఉండేవి. బాగా వర్ధిల్లిన నగరాలలో “వెనిస్” జెనోవాలు ముఖ్యమైనవి.

ఈ నగరాలలో మత గురువులు రాజకీయ ఆధిపత్యం చెలాయించే వాళ్ళు కాదు. బలమైన ప్యూడల్ భూస్వాములు కూడా ఇక్కడ లేరు. పట్టణ పరిపాలనలో ధనిక వ్యాపారులు, బ్యాంకర్లు చురుకుగా పాల్గొనేవారు. ఈ పట్టణాలను సైనిక నియంతలు పరిపాలించిన సమయంలో కూడా పట్టణ ప్రజలలో పౌరులమన్న భావన బలహీనపడలేదు.

ప్రస్తుత గ్రీకు నగరాలలో మానవతావాదం తాండవిస్తుంది. మరణాంతర జీవితం గురించేకాక, ఈ ప్రపంచం గురించి వాళ్ళు ఆసక్తి చూపారు. మనిషిని ఈ జీవితంలో ప్రభావితం చేసే ప్రకృతి సమస్తాన్ని, విజ్ఞాన శాస్త్రం, కళలు వంటి వాటిని ముఖ్యమైనవిగా నేటి ఇటలీ నగరాలు భావించాయి.

ప్రశ్న 5.
14,15వ శతాబ్దాలలో గ్రీకు, రోమను సంస్కృతులలో ఏ అంశాలను పునరుద్ధరించారు? (AS1)
జవాబు:
14, 15వ శతాబ్దాలలో గ్రీకు, రోమను సంస్కృతులలో అనేక అంశాలు పునరుద్ధరించారు. గ్రీకు సాహిత్యం మానవ జీవితంలో ఆసక్తిని కలిగించింది. గ్రీకు, గ్రీకు రోమను సంస్కృతి, శిల్పాలు, చిత్రకళ, భవనాలు, సాహిత్యం , తత్వశాస్త్రం, విజ్ఞానశాస్త్రం ఎంతో ఉన్నతంగా ఉండేవి. క్రైస్తవ మతాన్ని పాటించటానికి ప్రాధాన్యత నిచ్చిన రోమన్ కాథలిక్కు చర్చి ప్రజల సంస్కృతిని తీవ్రంగా ప్రభావితం చేసింది. ప్రజలను ఆలోచించవద్దని, మతగురువులు చెప్పింది నమ్మమని అది ఒత్తిడి చేసేది. పురాతన సాంస్కృతిక సంపద అంతా విస్మరింపబడి, కనుమరుగైపోయింది.

ఆ తరువాత పరిస్థితి మారింది. రైతాంగం, భూస్వాముల వర్గం చర్చి నియంత్రణను వ్యతిరేకించ సాగింది. భూస్వాముల, చర్చి ఆధిపత్యం తగ్గి ప్రజలు మరింత స్వేచ్చను అనుభవించసాగారు. చిత్రకళ, శిల్పం, ఇతర కళలు, సాహిత్యం వంటి వాటిల్లో కొత్త ధోరణులు బయలుదేరాయి. విజ్ఞానశాస్త్రం పునరుద్ధరించబడింది. రోమన్ సంస్కృతి అవశేషాలైన భవనాలు, శిల్పాలు వంటి వాటిని కళాకారులు అధ్యయనం చేయసాగారు. కళలు, శిల్పాలు, వృద్ధి చెంది సంస్కృతిని నిల్పాయి. మానవతా వాదంతో మనిషిలో సత్ప్రవర్తనకు ప్రాధాన్యతనిచ్చారు.

AP Board 9th Class Social Solutions Chapter 12 యూరప్లో మారుతున్న సాంస్కృతిక సంప్రదాయాలు: 1300-1800

ప్రశ్న 6.
మానవతావాద భావనలు ఇటలీలోని పట్టణాలను ముందుగా ఎందుకు ప్రభావితం చేశాయి? (AS1)
జవాబు:
1453లో కాన్స్టాంటినోపుల్ పతనం తర్వాత అనేక మంది గ్రీకు పండితులు తను సాహిత్యంతో ఇటలీకి పారిపోయారు. దీంతో పురాతన సాహిత్యం గ్రీకు భాషపట్ల ప్రజలకు ఆసక్తి కలిగింది. మానవతావాద భావనలు ముందుగా ఇటలీని పట్టణాలను ప్రభావితం చేశాయి. మనిషిని ఈ జీవితంలో ప్రభావితం చేసే ప్రకృతి సమస్తాన్ని, విజ్ఞానశాస్త్రం, కళలు వంటి వాటిని మానవత వాదులు ముఖ్యమైనవిగా చెప్పటంతో పట్టణవాసులు ఆకర్షితులయ్యారు. కొత్త విషయాలు, చట్టం, మతం వంటి వాటిని బోధించటానికి విశ్వవిద్యాలయాలు స్థాపించారు.

ఇటలీలోని పట్టణ విద్యావంతులు ఈ విషయాల పట్ల ఆసక్తి కనపరిచారు. మూఢనమ్మకాలపై ఆధారపడిన కొన్ని చర్చి ఆచారాలను మానవతావాదులు విమర్శించడం కూడా ఇటలీ పట్టణ వాసులను ఆకర్షించింది. చిత్రకళ, శిల్పంనకు అధిక ప్రాధాన్యతనిచ్చిన ఈ వాద
భావనలను పట్టణవాసులు స్వాగతించారు. భౌతిక సంపద, అధికారం, కీర్తి ఎల్ల ఇటలీవాసులు ఆకర్షితులయ్యారు.

ప్రశ్న 7.
మానవతావాద ఆలోచనల్లోని అంశాలు ఏమిటి? (AS1)
జవాబు:
పురాతన గ్రీకు సాహిత్యం మానవ జీవనం ఆసక్తిని కల్గించింది. వాళ్ళు నివసించిన ప్రపంచం వాళ్ళకి చాలా కీలకమైనదిగా అనిపించింది. మానవతావాదం మనిషి స్వభావం, ఆసక్తులకు సంబంధించినది కాబట్టి దీనిని అధ్యయనం చేసే విద్యార్థులను మానవతావాదులుగా పేర్కొన్నారు. మధ్యయుగాల పండితుల మాదిరి మరణాంతర జీవితం గురించి కాక ఈ ప్రపంచం గురించి మానవతావాదులు ఆసక్తి చూపారు. మానవతావాదం వల్ల డబ్బు, అధికారం సంపాదించడం ద్వారా మాత్రమే కాకుండా ఇతరత్రా తమ జీవితాలను మలచుకునే సామర్థ్యం మనుషులకుందని నమ్మసాగారు. మానవ స్వభావం బహుముఖమైనది అన్న విశ్వాసంతో ఈ భావన ముడిపడి ఉంది.

ప్రశ్న 8.
పక్కన ఉన్న పట్టిక పుస్తకాల ముద్రణలో వృద్ధి గురించి చెబుతుంది. దాని గురించి ఏం చెప్పగలరు? (AS3)
(లేదా)
గ్రాఫ్ ఆధారంగా పుస్తకాల ముద్రణ గూర్చి రాయండి.
AP Board 9th Class Social Solutions Chapter 12 యూరప్లో మారుతున్న సాంస్కృతిక సంప్రదాయాలు 1300-1800 1
జవాబు:
15వ శతాబ్దం ముందు వరకు చేతితో రాసిన ప్రతులు కొంతమంది చేతుల్లోనే ఉండేవి. ఇతర దేశాల ప్రజలు గొప్ప కళాకారుల చిత్రకళ, శిల్పాపత్రాలు, భవన 1450-1800 మధ్య కాలంలో విజ్ఞానం తెలుసుకోవాలంటే ఇటలీ వెళ్ళవలసి వచ్చేది. పత్రాలు చేతితో రాసిన – యూరప్ లో ప్రచురితమైన పుస్తకాలు పుస్తకాలు, పెయింటింగ్లు, యూరప్, అమెరికా పురావస్తుశాలల్లో, ఆర్ట్ గ్యాలరీలలో, మ్యూజియంలలో ఉండేవి. అయితే 1455 జోహాన్స్ గుటెన్బర్గ్ కార్యశాలలో బైబిలు 150 ప్రతులను ముద్రించారు.

“ముద్రణ సాంకేతిక విజ్ఞానంపై పట్టు సాధించటం 16వ శతాబ్దపు మహా విప్లవం”. 15 వ శతాబ్దం తరువాత చేతితో రాసిన పురాతన పుస్తకాలన్నింటిని ముద్రించారు. అచ్చు అయిన పుస్తకాలను కొనుక్కోవడానికి విద్యార్థులు ఆసక్తి చూపారు. అంతకు ముందెన్నడూ లేనంతగా భావాలు, అభిప్రాయాలు, సమాచారం విస్తారంగా వ్యాపించడంతో కొత్త భావాలను ప్రచారం చేసే ముద్రిత పుస్తకాలు వెంటనే లక్షలాది పాఠకులను చేరుకున్నాయి. నిదానంగా ప్రజలలో చదివే అలవాటు పెరిగింది. ఇటలీ మానవతా సంస్కృతిపై ఆసక్తి కనపరిచిన లక్షలాది మంది విద్యార్థులు, ప్రజలకు ముద్రిత పుస్తకాలపై ఆసక్తి పెరగడంతో 18 || నాటికి శతాబ్దం కోట్ల కొలది పుస్తకాలు ప్రచురితమయ్యాయి.

ప్రశ్న 9.
“ముద్రింపబడిన పుస్తకాలు మన జీవితాలలో ఇంకా ప్రముఖ పాత్రను పోషిస్తున్నాయి” అన్న వాక్యంతో మీరు ఏకీభవిస్తారా? మీ సమాధానానికి కారణాలు తెలపండి. (AS4)
జవాబు:
తాళపత్ర గ్రంథాలు, చేతితో రాసిన పుస్తకాలు పరిమితంగా ఉండడమే కాకుండా, వాటి సాహిత్యం , విజ్ఞానం , భాష చదవడానికి, అర్థం చేసుకోవడానికి సామాన్య ప్రజలకు, విద్యార్థులకు ఇబ్బందిగా ఉండేది. జోహాన్స్ గుటెన్బర్గ్ ముద్రణా యంత్రం కనిపెట్టడం, కాగితాన్ని కనుగొని అచ్చులతో ముద్రణ చేసిన చైనీయులకు ప్రపంచం ఋణపడి ఉంది. అతితక్కువ సమయంలో శాస్త్రసాంకేతిక విజ్ఞానం, శిల్పం, సాహిత్యం , మానవతావాదం, అభివృద్ధి చెందిన భూగోళం, తత్వం, వైద్యశాస్త్ర మూలాలను చదవడం వల్ల అవి మానవ జీవనంలో ప్రముఖ పాత్ర పోషించాయి. విశ్వరహస్యాలు, ఆవిష్కరణలు, నూతన సిద్ధాంతాలు, ప్రకృతి సమాజం, మూఢనమ్మకాలపై సమరం మొ||లగు విషయాలు ముద్రిత పుస్తకాల ద్వారా వెలుగుచూపించి, మానవ అభ్యున్నతికి తోడ్పాటునందించాయి.

AP Board 9th Class Social Solutions Chapter 12 యూరప్లో మారుతున్న సాంస్కృతిక సంప్రదాయాలు: 1300-1800

ప్రశ్న 10.
17వ శతాబ్దపు ఐరోపావాసులకు ప్రపంచం ఎలాగ భిన్నంగా అనిపించి ఉంటుందో వివరించండి. (AS1)
జవాబు:
13వ శతాబ్దం ప్రారంభం, 13 శతాబ్దం ముందు ఐరోపాలో పెద్ద సామ్రాజ్యాలు ఏవీ లేవు. పట్టణాలు కూడా క్షీణించాయి. రాజకీయ అధికారం సైనిక, భూస్వాముల చేతుల్లో ఉండేది. రైతాంగంలో అధికభాగం “కట్టు బానిసలుగా” ఉండేవాళ్ళు. ప్రజలు తీవ్ర అభద్రతాభావంలో ఉండేవారు. అయితే 17వ శతాబ్దంలో ఐరోపాలో అనేక నూతన పోకడలు, అనేక రంగాలలో ప్రగతి కనిపించింది. చైనా, అరేబియా, భారతదేశం, ఈజిప్టులతో ఐరోపావాసుల వ్యాపార వాణిజ్యాలు పునరుద్దరించబడ్డాయి. వ్యాపారస్తులు, చేతివృత్తి కళాకారులు నివసించే అనేక పట్టణాలు, నగరాలు ఏర్పడాయి. అనేక సంస్కరణలు, ఆవిష్కరణలు, రచనలు, రూపకల్పనలు చూసి ఐరోపా వాసులు సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. పునరుజ్జీవనం ద్వారా కొత్త మానవతా సంస్కృతి వికసించడం, సాహిత్యం , భవన నిర్మాణం, చిత్రకళలు వంటివి చూసి ఐరోపా వాసులు అమితానందం చెందారు.

ప్రశ్న 11.
పునరుజ్జీవన కాలం నాటి భవన నిర్మాణంలో రెండు ముఖ్యమైన అంశాలను చెప్పండి. (AS6)
జవాబు:
భవనాలలో పొడవాటి స్తంభాలు, కమానులు గుండ్రటి పైకప్పులను ఉపయోగించారు. భవన నిర్మాణంలో ఇది ఒక కొత్త శైలికి దారి తీసింది. వాస్తవానికి ఇది పురాతన రోమన్ శైలి పునరుద్ధరణ మాత్రమే. ఇప్పుడు దీనిని క్లాసికల్ (సాంప్రదాయం) గా వ్యవహరిస్తున్నారు. ఈ కాలంలో మరొక ముఖ్యమైన మార్పు అంతకుముందు కాలంలో మాదిరి కళాకారులు వాళ్ళ సభ్యులైన బృందం పేరుతో కాకుండా వ్యక్తిగతంగా వాళ్ళ పేరుతో ప్రసిద్ధిచెందసాగారు.

ప్రశ్న 12.
ప్రపంచ అవుట్ లైన్ పటంలో పేజీ నెం. 155 లోని భౌగోళిక అన్వేషణలను గుర్తించండి. (AS5)
జవాబు:
AP Board 9th Class Social Solutions Chapter 12 యూరప్లో మారుతున్న సాంస్కృతిక సంప్రదాయాలు 1300-1800 2

ప్రశ్న 13.
పేజీ నెం. 150 లోని నాల్గవ పేరాను చదివి, వ్యాఖ్యానించండి. (AS2)
జవాబు:
యూరప్లో మహిళల పాత్ర నామమాత్రమైనది. సంపన్న, కులీన కుటుంబాల పురుషులు ప్రజా జీవనంలో ముఖ్యపాత్ర పోషించారు. కుటుంబ వ్యవహారాల్లో, వ్యాపారాల్లో, ప్రజా జీవనంలో తమకు వారసులుగా తమ కొడుకులకు చదువులు చెప్పించేవాళ్ళు. అయితే వివాహ సమయంలో మహిళలు తెచ్చిన కట్నంతో పురుషులు తమ వ్యాపారాలను పెంచుకొన్నారు. – కట్న కానుకలు అందించలేని మహిళలు అవివాహితులుగానే ఉండి పోయేవారు. ప్రజా జీవనంలో మహిళల పాత్ర పరిమితమే కాకుండా, మహిళలను గృహ సంరక్షకులుగానే చూసేవారు.

అయితే కొన్ని సందర్భాల్లో పురుషులు ఇతర పనుల మీద బయటకు వెళ్ళేటప్పుడు మాత్రం మహిళలు, పురుషుల వ్యాపార లావాదేవీలు చూసేవారు.

పటనైపుణ్యం

1.
AP Board 9th Class Social Solutions Chapter 12 యూరప్లో మారుతున్న సాంస్కృతిక సంప్రదాయాలు 1300-1800 4 1

2.
AP Board 9th Class Social Solutions Chapter 12 యూరప్లో మారుతున్న సాంస్కృతిక సంప్రదాయాలు 1300-1800 2

9th Class Social Studies 12th Lesson యూరప్లో మారుతున్న సాంస్కృతిక సంప్రదాయాలు: 1300-1800 InText Questions and Answers

9th Class Social Textbook Page No.145

ప్రశ్న 1.
ఎనిమిదవ తరగతిలో హైదరాబాద్ రాజ్యంలోని జమిందారీ వ్యవస్థ, ‘వెట్టి’ గురించి చదివారు. యూరపులోని ‘కట్టు బానిసత్వం’తో దీనిని పోల్చండి.
జవాబు:
హైదరాబాద్ రాజ్యంలోని జమిందారీ వ్యవస్థలో కౌలుదారులు, భూస్వాముల వ్యవసాయంలో వెట్టి చాకిరి చేస్తూ, సరియైన ఆదాయం, కూలీ లేకుండ దుర్భర జీవనం సాగించేవాళ్ళు. కష్ట నష్టాలలో ఆదుకొనే భూస్వాములు లేక తరతరాలుగా “వెట్టి” బతుకులతో జీవనం సాగించేవారు. యూరప్ లో రాజకీయ అధికారం సైనిక, భూస్వాముల చేతుల్లో ఉండేది. రైతాంగాన్ని వాళ్ళు నియంత్రించేవాళ్ళు. రైతాంగంలో అధికభాగం “కట్టు బానిసలుగా” ఉండేవారు. యజమానుల అధీనంలో బందీలుగా, వాళ్ళ పొలాల్లో, కర్మాగారాలలో పనిచేయాల్సి వచ్చేది. వాళ్ళ తదుపున యుద్ధాలు కూడా చేయాల్సి వచ్చేది.

ప్రశ్న 2.
పట్టణాల అభివృద్ధికి వ్యాపారం ఎలా దోహదం చేస్తుంది?
జవాబు:
భూస్వాములు, ధనవంతులు, ఉన్నత వర్గాలకు చెందినవారు అధిక పెట్టుబడి పెట్టి వ్యాపారాలు పట్టణాలలో చేసేవారు తద్వారా వారి నివాసాలకు, వారి సుఖవంతమైన జీవనానికి, వలసవచ్చిన కార్మికులను ఆకర్షించడానికి విలువైన కట్టడాలు నిర్మించేవారు. పట్టణాల అభివృద్ధికి ప్రభుత్వానికి, పరిపాలకులకు తమవంతుగా లాభాలలో వచ్చిన వాటాలు విరాళంగా అందచేసేవారు.

ప్రశ్న 3.
పల్లెల్లో కంటే పట్టణాలలో కొత్త ఆలోచనలు గురించి తెలుసుకోటానికి, కొత్త విషయాలు ప్రయత్నించి చూడటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయా? చర్చించండి.
జవాబు:
గ్రామాలలో జీవన విధానం ఒకే విధంగా ఉంటూ ఒకే రకమైన వృత్తితో, కూలి పనులతో నిరంతరం జీవనం సాగించే వాళ్ళు. అయితే పట్టణాలలో తమ ప్రావీణ్యత, నైపుణ్యం, చాకచక్యం చూపించాలంటే కొత్త ఆలోచనలు వివరించాలి. వినూత్నంగా ఆలోచించే వారికి ఎక్కువ జీతాలు, హోదా కలుగుతుంది. తద్వారా వారు ఉన్నతంగా జీవించటానికి అవకాశం కలుగుతుంది. కాబట్టి విజ్ఞానంలో వస్తున్న మార్పులను గమనించి, తమ పనితనాన్ని మెరుగుపరచుకోవడానికి ప్రయత్నించాలి.

AP Board 9th Class Social Solutions Chapter 12 యూరప్లో మారుతున్న సాంస్కృతిక సంప్రదాయాలు: 1300-1800

ప్రశ్న 4.
బహార్ట్ ప్రకారం కింది వాటిలో ఏది ఆధునిక దృక్పథానికి చెందినది, ఏది మధ్యకాలం నాటికి చెందినది?
అ) తెలుసుకుని, తమ నిర్ణయాలు తాము తీసుకునే సామర్థ్యంలో నమ్మకం ………….. (ఆధునిక దృక్పథానికి చెందినది)
ఆ) మతపర పుస్తకాలు, మతగురువులలో విశ్వాసం ………………….. (మధ్యకాలం నాటిది).
ఇ) దేవుడు అన్ని విషయాలు తెలియచేస్తాడన్న నమ్మకం …………………… (మధ్యకాలం నాటిది)
ఈ) మానవుల హేతువాదంపై విశ్వాసం ………………….. (ఆధునిక దృక్పథం)

9th Class Social Textbook Page No.146

ప్రశ్న 5.
ఇటలీ పటంలో గణతంత్రాలను, మూడు నగర సభలను గుర్తించండి.
జవాబు:
AP Board 9th Class Social Solutions Chapter 12 యూరప్లో మారుతున్న సాంస్కృతిక సంప్రదాయాలు 1300-1800 4 1

9th Class Social Textbook Page No.147

ప్రశ్న 6.
మానవతావాదులు ఎవరు? వారు ఏమి బోధించారు?
జవాబు:
పురాతన గ్రీకు సాహిత్యం మనిషి స్వభావం, ఆసక్తులకు సంబంధించినది కాబట్టి దానిని అధ్యయనం చేసే విద్యార్థులను మానవతావాదులుగా పేర్కొన్నారు. మధ్యయుగాల పండితుల మాదిరి మరణానంతరం జీవితం గురించి కాక ఈ ప్రపంచం గురించి వాళ్ళు వివరించారు. మనిషిని ఈ జీవితంలో ప్రభావితం చేసే ప్రకృతి నమస్తాన్ని, విజ్ఞానశాస్త్రం, కళలు వంటి వాటిని మానవతావాదులు వివరించారు. మూఢనమ్మకాలపై ఆధారపడిన కొన్ని చర్చి ఆచారాలను విమర్శించారు.

9th Class Social Textbook Page No.149

ప్రశ్న 7.
16వ శతాబ్దపు ఇటలీ కళాకారులు తమ పనులలో ఉపయోగించుకున్న వివిధ శాస్త్రీయ అంశాలను వివరించండి.
జవాబు:
16వ శతాబ్దంలోని ఇటలీ భవన నిర్మాణం పురాతన రోము భవనాల నుంచి అనేక ప్రత్యేక లక్షణాలను అనుకరించడం జరిగింది. కొన్ని వందల సంవత్సరాల క్రితం స్త్రీ, పురుషుల శిల్పాలను మెచ్చుకుంటూ ఇటలీ శిల్పులు, ఆ సంప్రదాయాన్ని కొనసాగించాలని అనుకున్నారు. ఎముకల నిర్మాణాల గురించి అధ్యయనం చేయటానికి వైద్యశాస్త్ర ప్రయోగశాలలకు కళాకారులు వెళ్లేవాళ్లు. తమ బొమ్మలు, శిల్పాలు వాస్తవికంగా ఉండేలా చేయటానికి లియొనార్డో డా విన్సి వంటి కళాకారులు శరీర నిర్మాణ శాస్త్రాన్ని అధ్యయనం చేశారు. శరీర నిర్మాణ శాస్త్రం, రేఖాగణితం, భౌతిక శాస్త్రాలతో పాటు అందానికి సంబంధించిన బలమైన భావన ఇటలీ కళలకు ఒక ప్రత్యేకత.

9th Class Social Textbook Page No.150

ప్రశ్న 8.
అదే కాలంలో భారతదేశంలో ముద్రణా యంత్రం లేదు. శ్రీకృష్ణదేవరాయలు ఒక పుస్తకం రాసాడని అనుకుందాం. వివిధప్రాంతాలలోని పండితులకు అది ఎలా అందేది?
జవాబు:
శ్రీకృష్ణదేవరాయలు కాలంలో ముద్రణా యంత్రం లేకపోయినా రాయలు రాసిన పుస్తకం వివిధ ప్రాంతాలకు ఆయా ప్రాంతాల రాజోద్యోగులు, రాయబారులు, భటుల ద్వారా చేరవలసిన పండితులకు అందుతుంది.

AP Board 9th Class Social Solutions Chapter 12 యూరప్లో మారుతున్న సాంస్కృతిక సంప్రదాయాలు: 1300-1800

ప్రశ్న 9.
రాజులు, మతగురువులు ముద్రణ యంత్రం పట్ల ఎలా స్పందించి ఉంటారు? దానిని స్వాగతించి ఉంటారా లేక ఆందోళన చెంది ఉంటారా?
జవాబు:
క్రైస్తవ మతాన్ని పాటించటానికి ఒత్తిడి చేసి, చర్చి పోపు ఆధిపత్యాన్ని ప్రచారం చేసిన మతగురువులు, ప్రారంభంలో ప్రజలను ఆలోచించవద్దని, మతగురువులు చెప్పింది నమ్మమని ఒత్తిడి చేసారు. మత ఆధిపత్యం ప్రశ్నించడానికి అవకాశం ఉండేది కాదు. అయితే ముద్రణా యంత్రం రావడంతో రాజులు, మతగురువులు ఆందోళన చెందారు. ఫ్యూడలిజం, రాజుల నిరంకుశత్వం, మతాధికారుల మూఢాచారాలు, ముద్రణ వల్ల ప్రజల ఆలోచనలలో మార్పు వచ్చింది. ప్రజల భావాలు, అభిప్రాయాలు, సమాచారం విస్తారంగా ప్రజలలోకి వెళ్ళి తిరగబడతారని, మత గురువుల ఆధిపత్యాన్ని ఎదిరించి, ప్రశ్నిస్తారని ఆందోళన చెందారు.

9th Class Social Textbook Page No.151

ప్రశ్న 10.
పునరుజ్జీవనాన్ని కొత్త యుగం అని కూడా అంటారు. సుఖాలను కోరుకోవడం, సంపద, భోగాలను ఆశించటం, స్వార్థ ప్రయోజనంతో పనిచేయటం సరైనవేనని ప్రజలు భావించసాగారు. స్వార్థ ప్రయోజనాలను వ్యతిరేకిస్తూ, సంపద, సుఖాలను త్యజించాలంటూ ఉండే మత బోధనలకు ఇది విరుద్ధంగా ఉంది. పునరుజ్జీవన మానవతావాదులకున్న ఈ దృక్పథంతో మీరు ఏకీభవిస్తారా?
జవాబు:
పునరుజ్జీవనం కొత్త యుగమే కాకుండా ప్రజల మేధోపర ఆలోచనలకు, శాస్త్రీయ దృక్పథానికి, విచక్షణా జ్ఞానానికి పరాకాష్ట. అన్ని విషయాలు కూలంకషంగా చర్చించి, వివిధ దశలను, రకరకాల పుస్తకాలను పరిశీలించిన పిదప సుఖాలను కోరుకోవడం, సంపద భోగాలను ఆశించడం, అనుభవించడం, స్వార్థ ప్రయోజనంతో పనిచేయడం సరైనవేనని నేను ఏకీభవిస్తాను. మత. బోధకులు సుఖాలు త్యజించాలంటూ, వారు విలాసవంతమైన జీవనం సాగించారు. ప్రజల బలహీనతలతో మతం ముసుగును కొనసాగించారు. మానవతావాద సంస్కృతిలో మానవజీవితంపై భౌతిక సంపద, అధికారం, శారీరక సుఖాలు వంటివి కోరుకోదగినవే కాని త్యజించవలసిన అవసరం లేదని చెప్పారు. నేనూ ఏకీభవిస్తాను.

9th Class Social Textbook Page No.152

ప్రశ్న 11.
ఆ కాలం మహిళలు గ్రీకు, రోమన్ పుస్తకాలు చదివినందువల్ల ఏ ప్రయోజనం పొందారు?
జవాబు:
అ. గ్రీకు, రోమన్ పుస్తకాలు చదివినందువల్ల పురుషాధిక్య ప్రపంచంలో స్త్రీలు ఎలా ధైర్యంగా బ్రతకవచ్చో తెలుసుకున్నారు.
ఆ. స్వేచ్ఛ, సమానత్వం గుర్చి అవగాహన ఏర్పరచుకున్నారు.
ఇ. ఆస్తి, ఆర్థికశక్తి వలన మాత్రమే స్త్రీలు సుఖంగా జీవించగలరని తెలుసుకున్నారు.
ఈ. సమాజంలో గౌరవం పెరిగి ఉన్నతంగా జీవించగలమని తెలుసుకున్నారు.

9th Class Social Textbook Page No.154

ప్రశ్న 12.
కాథలిక్కు చర్చిని ఏ అంశాలలో ప్రొటెస్టెంటులు విమర్శించారు?
జవాబు:
అ. దేవునితో సంబంధం ఏర్పరచుకోవటానికి మతగురువు అవసరం లేదన్నారు.
ఆ. విశ్వాసం ఒక్కటే సరైన జీవనం, స్వర్గ ప్రవేశం కల్పించగలదని చెప్పారు.
ఇ. పాపపరిహార పత్రాలు అమ్మటం, కొనటం తప్పని చెప్పారు.
ఈ. చర్చి, పోప్ దురాశను విమర్శించారు.
ఉ. మతానికి అనవసర ఆచారాలు కూడదన్నారు.

AP Board 9th Class Social Solutions Chapter 12 యూరప్లో మారుతున్న సాంస్కృతిక సంప్రదాయాలు: 1300-1800

ప్రశ్న 13.
భారతదేశంలోని భక్తి ఉద్యమానికి, ప్రొటెస్టెంటు ఉద్యమానికి మధ్య ఏమైనా పోలికలు ఉన్నాయా? ఆ రెండింటి మధ్య తేడాలు ఏమైనా ఉన్నాయా?
జవాబు:
భగవంతుని యెడ ప్రేమ, సహనం, అహింస, తపస్సు, నిరాడంబరత్వాన్ని నమ్మిన వారు భక్తి ఉద్యమంలో దేవుడొక్కడే అని, రామ్, అల్లా, జీసస్ ఒక్కరేనని చెప్పారు. తమ పాటలు, తత్వాలు ద్వారా సామాన్య ప్రజలను ఆకర్షించారు. విగ్రహారాధన కూడదన్నారు. సంస్కారవంతమైన జీవనం ముఖ్యమన్నారు. ఇతరుల సేవతో తృప్తి పడాలన్నారు. జంతుబలులు, మూఢ విశ్వాసాలు వలదన్నారు. నిరాడంబర జీవనం కావాలన్నారు. అదేవిధంగా, ప్రొటెస్టెంట్ మతంలో దేవునితో సంబంధం ఏర్పరచుకోటానికి మతగురువు అవసరం లేదన్నారు. దేవునిపై విశ్వాస ముంచమన్నారు. ప్రజల నమ్మకాలపై మోసం చేయరాదన్నారు. పేదకు సేవ చేయటం ముఖ్యమన్నారు.

తేడాలు :

  1. భక్తి ఉద్యమంలో అన్ని మతాల సారం ఒక్కటేనన్నారు. కాని ప్రొటెస్టెంట్ లో క్రైస్తవ మతానికి ప్రాధాన్యత నిచ్చారు.
  2. భక్తి ఉద్యమం అన్ని ప్రాంతాలలో ప్రాచుర్యం పొందగా, ప్రొటెస్టెంట్ మతం పట్టణ ప్రాంతానికే పరిమితమైంది.

9th Class Social Textbook Page No.155

ప్రశ్న 14.
పునరుజ్జీవన కాలం నాటి ప్రముఖ శాస్త్రవేత్తలు ఎవరు? విజ్ఞాన శాస్త్రానికి వాళ్లు చేసిన కృషి ఏమిటి?
జవాబు:
రోజర్ బాకన్ :
లోహాలు, రసాయనాలతో అనేక ప్రయోగాలు చేసాడు. సత్యాన్ని తీవ్రంగా అన్వేషించాడు.

నికోలస్ కోపర్నికస్ :
ఖగోళశాస్త్ర వేత్త. వేధశాలను స్థాపించాడు. సూర్యుడి చుట్టూ తిరుగుతున్న అనేక గ్రహాలలో భూమి ఒకటని చెప్పాడు.

టోలమి : భూమి విశ్వానికి కేంద్రమని, నక్షత్రాలు, సూర్యుడు, గ్రహాలు దానిచుట్టూ తిరుగుతున్నవని వివరించాడు.

గెలీలియో : సూక్ష్మదర్శినికి మెరుగులు దిద్దాడు. లోలకంలోని సిద్ధాంతాలను కనుగొన్నాడు. బరువైన వస్తువులు, తేలికైన వస్తువులు ఒకే వేగంతో కిందకు పడతాయని నిరూపించాడు.

9th Class Social Textbook Page No.157

ప్రశ్న 15.
పటం చూసి సముద్ర మార్గాలలో వివిధ అన్వేషణల జాబితా తయారుచేయండి.
జవాబు:
పోర్చుగల్ నావికుడైన ప్రిన్స్ హెన్రీ ఆఫ్రికా పశ్చిమ తీరానికి కొత్త సముద్ర మార్గాన్ని కనుగొన్నాడు.

పోర్చుగల్ కి చెందిన బారొలొమ్యి డియాజ్ అన్న నావికుడు ఆఫ్రికాకి దక్షిణ భాగమైన గుడ్ హోప్ అగ్రం దాటి వెళ్ళాడు. వాస్కోడిగామా సముద్రంలో ఆఫ్రికాను చుట్టి ముట్టి 1498లో భారత్ లోని కాలికట్ తీరం చేరాడు. క్రిస్టఫర్ కొలంబస్ అట్లాంటిక్ సముద్రయానం తరువాత 1492లో అక్టోబర్ 12న ఒక దీవిని చేరుకున్నాడు. భారతదేశానికి తూర్పువైపుకి చేరుకున్నానని ఆ ప్రజలను ఇండియన్స్ అన్నాడు.

ఇటలీకి చెందిన అమెరిగో వెస్పూచి అన్న నావికుడు కొలంబస్ కనుగొన్నది ఆసియా కాదని, కొత్త ప్రపంచమని (అమెరికా) అని నిర్ధారించుకున్నాడు. ఫెర్డినాండ్ మాజిల్లాన్ (స్పెయిన్) ఓడలో ప్రపంచాన్ని చుట్టుముట్టి వచ్చాడు. అట్లాంటిక్ సముద్రం దాటి, పసిఫిక్ మహా సముద్రంలోని ఫిలిప్పైన్స్ దీవులను చేరుకున్నాడు.

ప్రాజెక్టు

ప్రశ్న 1.
పునరుజ్జీవన కాలం నాటి ప్రముఖ కళాకారుల చిత్రాలను సేకరించి, వాటిని ఒక పుస్తకంలో అంటించండి.
జవాబు:
AP Board 9th Class Social Solutions Chapter 12 యూరప్లో మారుతున్న సాంస్కృతిక సంప్రదాయాలు 1300-1800 3

ప్రశ్న 2.
సూర్యుడి చుట్టూ భూమి తిరగటం లేదని నమ్మే మతగురువుకి, గెలీలియోకి మధ్య సంభాషణను ఊహించి రాయండి. (T.Q.)
జవాబు:
సంభాషణ
మతగురువు : బైబిలు, చర్చి బోధనలకు విరుద్ధంగా మాట్లాడుతున్న పాపి గెలీలియోను పిలిపించండి.

గెలీలియో : సెలవివ్వండి పరిశుద్ధులారా!

మతగురువు : భూమి విశ్వానికి కేంద్రం కాదని అంటున్నారట, ఏం బ్రతకాలని లేదా?

గెలీలియో : మన్నించండి! మత గురువుగారు! నాకృషితో సూక్ష్మదర్శినిని కనుగొన్నాను. దీనితో యాభై మైళ్ళ దూరంలో ఉన్న ఓడ అయిదు మైళ్ళ దూరంలో ఉన్నంత స్పష్టంగా కనిపిస్తుంది. జ్యూపిటర్ ఉపగ్రహాలు, గ్రహ పరిభ్రమణాన్ని స్వయంగా చూసాను.

మతగురువు : కాదు కాదు మీ వ్యాఖ్యలు వెనక్కు తీసుకోండి లేదా కఠిన శిక్షలకు గురౌతారు. దీర్ఘకాల ఖైదుకి గురి కావలసి ఉంటుంది.

గెలీలియో : “భూమి కదలికలను నేను చూసాను”. గొణుక్కుంటూ బయటకు వచ్చేస్తాడు.

ప్రశ్న 3.
ముద్రణ యంత్రం నుంచి వచ్చే వివిధ ఉత్పత్తులను మనం ఏ ఏ విధాలుగా వాడుతున్నామో తెలియజేస్తూ ఒక నివేదిక తయారుచేయండి.
జవాబు:
ముద్రణా యంత్రం నుంచి వచ్చే వివిధ ఉత్పత్తులను మనం అనేక విధాలుగా వాడుతున్నాం. శాస్త్ర సాంకేతిక విజ్ఞానాన్వేషణకు, సాహిత్యం , శిల్పం, చిత్రలేఖనం, భవన నిర్మాణ లోతుల అధ్యయనానికి, అంతరిక్ష, భూగోళ, విశ్వాంతర రహస్యాల ఛేదనకు, ఆవిష్కరణలు, రచనలు అభివృద్ధికి, ఆధారాలు సేకరణకు తోడ్పడుతుంది. వైద్యం, విజ్ఞానశాస్త్రం, తత్వం, భూగోళశాస్త్ర అధ్యయనానికి తోడ్పాటునందించింది.

AP Board 9th Class Social Solutions Chapter 11 ప్రభుత్వ బడ్జెట్ – పన్నులు

SCERT AP 9th Class Social Studies Guide Pdf 11th Lesson ప్రభుత్వ బడ్జెట్ – పన్నులు Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Social Solutions 11th Lesson ప్రభుత్వ బడ్జెట్ – పన్నులు

9th Class Social Studies 11th Lesson ప్రభుత్వ బడ్జెట్ – పన్నులు Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
ప్రభుత్వానికి బడ్జెట్ ఎందుకు అవసరం ? బడ్జెట్ పన్నుల గురించి ఎందుకు మాట్లాడుతుంది? (AS1)
జవాబు:

  1. కేంద్ర ఆర్థిక మంత్రి పార్లమెంటులో ప్రవేశపెట్టే బడ్జెట్ రాబోవు ఆర్థిక సంవత్సరం ప్రభుత్వం వివిధ కార్యక్రమాలపై చేయబోయే ఖర్చును తెలుపుతుంది.
  2. ఈ ఖర్చులను భరించటానికి ఏ విధంగా ఆదాయాలను సేకరిస్తుందో కూడా తెలుపుతుంది.
  3. అందువలన ప్రభుత్వం రానున్న ఆర్థిక సంవత్సరానికి ఎంత ఆదాయం వస్తుంది. ఎంత వ్యయం చేయడంలోను ఒక ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తుంది. దీనినే “బడ్జెట్” అంటారు.
  4. ప్రభుత్వం ఆదాయ వ్యయాలపై ముందుచూపు లేకుండా వ్యవహరించినట్లయితే తరువాత ఇబ్బంది పడాల్సి వస్తుంది.
  5. వివిధ విధుల నిర్వహణకై ప్రభుత్వానికి చాలినంత డబ్బు అవసరం.
  6. ఆయా విధుల నిర్వహణకై కావాల్సిన డబ్బును ప్రజల నుండి పన్నుల రూపంలో సేకరిస్తుంది.
  7. ప్రభుత్వం వివిధ రకాల పన్నులను వసూలు చేస్తుంది.
  8. ఈ విధంగా వసూలు చేసిన పన్నులే ప్రభుత్వ రెవెన్యూ (ఆదాయం ) అవుతుంది.
  9. అందుకనే బడ్జెట్ లో పన్నుల ప్రస్తావన ఉంటుంది.

ప్రశ్న 2.
ఆదాయపు పన్ను, ఎక్సైజ్ సుంకానికి మధ్య వ్యత్యాసాలు ఏమిటి? (AS1)
జవాబు:

ఆదాయపు పన్ను ఎక్సైజ్ పన్ను
1. ప్రత్యక్ష పన్నుకు ఉదా : ఆదాయపు పన్ను. 1. పరోక్ష పన్నుకు ఉదా : ఎక్సైజ్ పన్ను.
2. వ్యక్తుల యొక్క వ్యక్తిగత ఆదాయం పై ఆదాయపు పన్ను విధించబడుతుంది. 2. ఉత్పత్తి అయిన వస్తువులు ఫ్యాక్టరీ ద్వారాన్ని దాటక ముందే ఎక్సెజ్ పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
3. ఆదాయపు పన్ను కొంత పరిమితిని మించి ఆర్జించే వారికే విధిస్తారు. 3. ఆ కర్మాగారపు యజమాని లేదా మేనేజర్ ఉత్పాదిత వస్తువుల పరిమాణం మేరకు ప్రభుత్వానికి పన్ను డబ్బు రూపంలో చెల్లించాల్సి ఉంటుంది.
4. వ్యక్తిగత ఆదాయాలకు కూలీలు, వేతనాలు, పింఛన్ల వంటి వివిధ రకాల వనరులుంటాయి. వ్యక్తులు బ్యాంకు నగదు నిల్వలపై వడ్డీని ఆర్జిస్తారు. కొందరు భవనాల వంటి ఆస్తులపై అద్దెను ఆర్జిస్తారు. వీటన్నింటినీ ఆదాయంగానే పరిగణిస్తారు. కాబట్టి వీరు కూడా పన్ను చెల్లించవలసి ఉంటుంది. 4. ఎక్సైజ్ సుంకాన్ని కర్మాగారం చెల్లిస్తుంది. కానీ అది వస్తువులు కొన్నవారిపై బదలాయింప బడుతుంది. ఆ కర్మాగార యజమానులు వారు చెల్లించిన పన్నులను ధరలో కలుపుకునే అమ్ముతారు.

AP Board 9th Class Social Solutions Chapter 11 ప్రభుత్వ బడ్జెట్ – పన్నులు

ప్రశ్న 3.
క్రింది వానిని జతపరచండి : (AS1)

గ్రూపు -ఎ గ్రూపు – బి
1. ఎక్సెజ్ సుంకం A) వ్యక్తుల వార్షిక ఆదాయంపై విధించేది.
2. అమ్మకపు పన్ను B) వ్యాపార, వాణిజ్య సంస్థల వార్షిక లాభాలపై విధించేది.
3. దిగుమతి సుంకం C) వస్తువు తయారీ లేదా ఉత్పత్తి మీద విధించేది.
4. ఆదాయపు పన్ను D) వస్తువుల అమ్మకం జరిగినపుడు విధించేది.
5. కార్పొరేట్ పన్ను E) విదేశాల నుండి వస్తువులు తీసుకురావడంపై విధించేది.

జవాబు:

గ్రూపు -ఎ గ్రూపు – బి
1. ఎక్సెజ్ సుంకం C) వస్తువు తయారీ లేదా ఉత్పత్తి మీద విధించేది.
2. అమ్మకపు పన్ను D) వస్తువుల అమ్మకం జరిగినపుడు విధించేది.
3. దిగుమతి సుంకం E) విదేశాల నుండి వస్తువులు తీసుకురావడంపై విధించేది.
4. ఆదాయపు పన్ను A) వ్యక్తుల వార్షిక ఆదాయంపై విధించేది.
5. కార్పొరేట్ పన్ను B) వ్యాపార, వాణిజ్య సంస్థల వార్షిక లాభాలపై విధించేది.

ప్రశ్న 4.
ఉక్కు, అగ్గిపెట్టెలు, గడియారాలు, వస్త్రం, ఇనుము వీటిలో వేటిమీద పన్నులు పెరిగితే అవి ఇతర వస్తువుల ధరలను . ఎక్కువ ప్రభావితం చేస్తాయి? ఎందుకు? (AS1)
జవాబు:
ఇనుము ధర పెరిగితే కింది పేర్కొన్న విధంగా ఇతర వస్తువుల ధరలు పెరుగుతాయి.

  1. వస్తువుల ధరలకు అన్ని రకాల పన్నులు కలుస్తూ ఉంటాయి.
  2. కానీ, కొన్ని ప్రత్యేక వస్తువులపై పన్నులు విధించడం వల్ల పెద్ద మొత్తంలో వస్తువుల ధరలు పెరుగుతాయి.
  3. ఉదా : సైకిళ్ల, తయారీకి ఉక్కు పైపులు కావాలి.
  4. ఉక్కు తయారీకిగాను ఉక్కు ఫ్యాక్టరీకి ఇనుము మరియు బొగ్గు కావాలి.
  5. ఒకవేళ ఇనుముపై ఎక్సెజ్ సుంకం పెరిగితే దాని ప్రభావం సైకిళ్ల ధరపై ఉంటుంది.
  6. ఇనుముతో తయారయ్యే వస్తువులన్నింటి ధరలూ పెరుగుతాయి.
  7. అంతేగాక ఉక్కును తయారు చేయడానికి ఇనుమునే వినియోగిస్తారు. కాబట్టి ఉక్కుతో తయారయ్యే వస్తువుల ధరలు కూడా పెరుగుతాయి.
  8. ఈ విధంగా ఇనుముపై పెంచిన పన్ను వివిధ అంశాలపై ప్రభావం చూపుతుంది.

ప్రశ్న 5.
సాధారణ ఆహార పదార్థాలైన ధాన్యం, పప్పులు, నూనెలను ప్రతి ఒక్కరూ ఉపయోగిస్తారు. ఈ వస్తువుల మీద పన్నులు విధించడం పేదవారి మీద చాలా ప్రభావం చూపుతుందని ఎలా చెప్పవచ్చు? (AS4)
జవాబు:

  1. వస్తువులు, సేవలపై పన్ను విధించే విధానంలో ధనికులు, పేదల మధ్య వ్యత్యాసం చూపడం కష్టమైన పని.
  2. అయినప్పటికీ కొన్ని వస్తువుల విషయంలో అవకాశం ఉంది.
  3. ఉదా : ధాన్యాలు, పప్పులు, కూరగాయలు, గుడ్డలు, కిరోసిన్, వంటనూనెలు, వంటగ్యాస్ వంటి అత్యవసర వస్తువులు ధనవంతులైనా, పేదవారైనా ప్రతి ఒక్కరూ కొంటారు.
  4. కానీ పేదలు వారి మొత్తం ఆదాయాన్ని దాదాపు వీటికే వినియోగించాల్సి ఉంటుంది. అవి నిత్యావసర వస్తువులు కాబట్టి వాటిని కొనకుండా ఉండలేరు. అవి లేకపోతే జీవనం కష్టం అవుతుంది. అందువల్ల పేదవారు తమ ఆదాయం మొత్తాన్ని వీటికి కేటాయించడం వలన వారికి ఏ విధమైన ఇతర ఆదాయముండదు.

AP Board 9th Class Social Solutions Chapter 11 ప్రభుత్వ బడ్జెట్ – పన్నులు

ప్రశ్న 6.
నలుగురు స్నేహితులు కలసి ఒక ఇంటిని అద్దెకు తీసుకుని ఆ అద్దెను నలుగురు కలసి చెల్లిద్దామనుకున్నారు. అద్దె నెలకు రూ. 2000. (AS1)
– వారి మధ్య ఆ అద్దె ఎలా పంచబడుతుంది?
– వారిలో ఇద్దరు నెలకు రూ. 3000, మరో ఇద్దరు రూ. 7000లు సంపాదిస్తున్నారని మనకు ముందే తెలుసు. ఈ వ్యయాన్ని వేరోక రకంగా వాటాలు వేస్తే, వారిలో ఒక్కొక్కరు అనుభవించే బాధ ఒకే విధంగా ఉంటుందా?
– అద్దె పంపకం ఎలా ఉంటే బాగుంటుందని నీవు భావిస్తున్నావు? ఎందుకు?
జవాబు:
సమానంగా పంచబడితే ఒక్కొక్కరికి రూ. 500 చొ||న వస్తుంది.
అలాగాక వారి ఆదాయం నిష్పత్తిని పరిగణనలోనికి తీసుకుంటే దాని ప్రకారం అద్దె పంచితే
(వారిలో ఇద్దరు నెలకు రూ. 3000, మరో ఇద్దరు రూ. 7000 లు సంపాదిస్తున్నారని మనకు ముందే తెలుసు.)
ఈ వ్యయాన్ని వేరొక రకంగా కాక వారి ఆదాయ నిష్పత్తి ప్రకారం పంచితే
3000 : 7000
రూ. 600 ‘లు రూ. 1400లు ప్రకారం పంచాలి.

అనగా 3000 రూపాయలు ఆదాయం పొందే ఇద్దరు (300 + 300) 600 రూపాయలు చెల్లిస్తే 7000 రూపాయలు ఆదాయం పొందేవారు (700 + 700) 1400 రూపాయలు చెల్లించాలి. ఆదాయ నిష్పత్తి ప్రకారం పంచితే బాగుంటుంది.

ప్రశ్న 7.
ఆదాయాలపై లేదా వస్తువులపై పన్ను, ఈ రెండింటిలో ధనికులు, పేదల మీద ఏది ఎక్కువ ప్రభావం చూపుతుంది? కారణాలతో వివరించండి. (AS1)
జవాబు:
ఆదాయాలపై లేదా’ వస్తువులపై పన్ను ఈ రెండింటిలో ధనికులు పేద మీద ఏది ఎక్కువ ప్రభావితం చూపుతుంది అనగా వస్తువులపై పన్ను ఎక్కువ ప్రభావం చూపుతుంది.

కారణం :
తక్కువ ఆదాయం వచ్చినా, ఎక్కువ ఆదాయం వచ్చినా తప్పనిసరిగా కొనవలసినది వస్తువులు.

వస్తువులపై పన్నులు తక్కువగా ఉంటే వస్తువులు చౌకగా లభిస్తాయి. పేదలు కూడా కొనడానికి తక్కువ ఆదాయం సరిపోతుంది. ఆదాయాలపై పన్నులు వేస్తే అధిక ఆదాయాలు పొందుతున్న కొంతమంది మీద మాత్రమే ఆ ప్రభావం పడుతుంది.

ప్రశ్న 8.
విలువ ఆధారిత పన్ను (VAT) వస్తువులపై పన్ను ఎగవేతను ఏ విధంగా తగ్గిస్తుంది? (AS1)
జవాబు:
VAT అనగా (Value Added Tax) విలువ ఆధారిత పన్ను.

  1. వ్యాట్ విధానంతో ఉన్న ప్రయోజనం వస్తువులపై పన్ను ఎగవేతను అరికట్టడం.
  2. అది ఎలా అనగా ఉత్పత్తిదారులు, వర్తకుల అమ్మకం, కొనుగోలుకు సంబంధించిన లావాదేవీల నమోదులో పారదర్శకత పెంపొందుతుంది.
  3. ప్రతి ఒక్కరూ సరైన రికార్డులను నిర్వహించడానికి కొనుగోలు సమయంలో బిల్లులను అడుగుతారు.
  4. ఎందుకంటే ముడి సరుకులపై ఇది వరకే పన్ను ‘చెల్లించామని వాటి ద్వారానే తెలియజేయవచ్చు.
  5. పన్నుల శాఖ అధికారులు కొనుగోలుదారులు, అమ్మకందారుల రికార్డులను పోల్చి చూడటానికి అవకాశం ఉంది. కాబట్టి సాధారణంగా జరిగే పన్ను ఎగవేత కష్టసాధ్యమవుతుంది.

ప్రశ్న 9.
ఎక్సెజ్ సుంకానికి, దిగుమతి సుంకానికి మధ్యగల వ్యత్యాసాలేమిటి? (AS1)
జవాబు:

ఎక్సైజ్ సుంకం దిగుమతి సుంకం
1. ఎక్సైజ్ సుంకాలను ఫ్యాక్టరీలనుండి వసూలు చేస్తారు. 1. కస్టమ్స్ సుంకాలను అంతర్జాతీయ విమానాశ్రయాలు, నౌకాశ్రయాల నుండి వసూలు చేస్తారు.
2. ఫ్యాక్టరీలు వస్తువులు కొన్నవారిపై ఈ పన్నును బదలాయిస్తారు. 2. విదేశాలలో వస్తువులను కొని మన దేశానికి తెచ్చే వారిపై, మన దేశం నుండి ఇతర దేశాలకు వస్తువులను సరఫరా చేసేవారిపై విధించపబడుతుంది.
3. ఇది దేశీయ ఉత్పత్తులపై విధించబడుతుంది. దేశీయ ఉత్పత్తి వస్తువులు కొన్నవారిపై విధించబడుతుంది. 3. ఇది అంతర్జాతీయ వర్తకంలో వస్తువుల విక్రయాలపై విధించబడుతుంది.

ప్రశ్న 10.
ఇటీవలి కాలంలో బస్సు చార్జీలు ఒక్కసారిగా పెరిగాయా? అయితే దానికి గల కారణాలు తెలుసుకోండి.
జవాబు:
ఇటీవలి కాలంలో బస్సు చార్జీలు ఒక్కసారిగా పెరిగాయి
కారణాలు : డీజిల్, పెట్రోలు, రేట్లు పెరగడం
ఉద్యోగుల, కార్మికుల వేతనాలు పెరగడం
నిర్వహణ ఖర్చులు పెరగడం
బస్సులలో ప్రయాణించే ప్రయాణికులు తగ్గడం
విద్యార్ధులకు, వృద్ధులకు రాయితీలు ఇవ్వడం

ప్రశ్న 11.
‘ప్రత్యక్ష పన్నులు’ శీర్షిక క్రింద గల వ్యక్తుల యొక్క వ్యక్తిగత ఆదాయంపై) పేరాను చదివి కింది ప్రశ్నకు సమాధానం రాయండి. (AS2)
ఎక్కువ ఆదాయం సంపాదించేవారు ఎక్కువ పన్ను ఎందుకు చెల్లించాలి?
జవాబు:

  1. వ్యక్తుల యొక్క వ్యక్తిగత ఆదాయంపై ఆదాయపు పన్ను విధించబడుతుంది.
  2. వ్యక్తిగత ఆదాయాలకు కూలీలు, వేతనాలు, పింఛన్లు వంటి వివిధ రకాల, వనరులుంటాయి.
  3. వ్యక్తులు బ్యాంకు నగదు నిల్వలపై వడ్డీని ఆర్జిస్తారు. కాబట్టి వీరు కూడా పన్ను చెల్లించవలసి ఉంటుంది.
  4. ఆదాయపు పన్నును కొంత పరిమితిని మించి ఆర్జించే వారికే విధిస్తారు.
  5. ఈ పన్నును ఆర్జించిన ఆదాయంలో పరిమితి పోగా మిగిలిన దానిలో కొంతశాతం విధిస్తారు.
  6. ఎక్కువ ఆదాయాన్ని సంపాదించే వారు వారి ఆదాయాన్ని అనుసరించి ఎక్కువ నిష్పత్తిలో పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

దానివల్ల తక్కువ ఆదాయం వచ్చేవారు తక్కువ పన్ను, ఎక్కువ ఆదాయం వచ్చే వారు ఎక్కువ పన్ను చెల్లించుతారు. తద్వారా -పేదవారు మరింత పేదవారు కాకుండా, ధనవంతులు మరింత ధనవంతులు కాకుండా నిరోధించవచ్చు.

AP Board 9th Class Social Solutions Chapter 11 ప్రభుత్వ బడ్జెట్ – పన్నులు

ప్రశ్న 12.
మన ఆర్థిక వ్యవస్థపై నల్లధనం చూపే ప్రభావం ఏమిటి? (AS6)
జవాబు:
చాలా మంది ప్రజలు తమ మొత్తం ఆదాయాలను వెల్లడించకపోవడం లేదా ఉన్న దాని కంటే తక్కువ చూపి, ఆదాయాన్ని పైకి కనపడకుండా దాయడమే, ఆ దాచిన డబ్బును నల్లధనం (Black money) అంటారు. మన ఆర్థిక వ్యవస్థపై నల్లధనం విపరీత ప్రభావం చూపుతుంది. అది ఎట్లనగా ….

వాస్తవంగా ప్రజలు, ఫ్యాక్టరీ యజమానులు, వడ్డీ వ్యాపారస్తులు, వర్తకులు అధికంగా లాభాలు ఆర్జిస్తారు. కాని వాస్తవ లాభాలు చూపి, ప్రభుత్వానికి పన్నులు చెల్లించరు. వారికి వచ్చిన లాభాన్ని తక్కువ ఆదాయాలుగా చూపుతారు. ఈ విధంగా తమ వాస్తవ ఆదాయాన్ని చూపకుండా దాయడం వలన, ప్రభుత్వానికి ధనం చేకూరదు. వాస్తవంగా చెల్లించినట్లయితే ఆ ఆదాయంతో ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి, ధరలను తగ్గించి, సామాన్య ప్రజలకు చేయూతనందించవచ్చు. ఉత్పత్తి కన్నా తక్కువ ఉత్పత్తి జరిగినట్లు చూపి పన్ను నుండి తప్పించుకోవడం వలన ఆ వస్తువుల ధరలు పెరిగి ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావం చూపుతుంది. కొంతమంది వ్యాపారులు బిల్లులు సరిగ్గా ఇవ్వకుండా లేదా వాస్తవంగా అయిన వాటి కంటే తక్కువ అమ్మకాలు జరిగినట్లుగా చూపి ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేస్తున్నారు.

9th Class Social Studies 11th Lesson ప్రభుత్వ బడ్జెట్ – పన్నులు InText Questions and Answers

9th Class Social Textbook Page No.132

ప్రశ్న 1.
మీ నగరం/పట్టణం/గ్రామాల్లో ప్రభుత్వం ఏ పాత్రలను పోషిస్తుండడాన్ని మీరు గమనించారో చర్చించండి.
జవాబు:

  1. మా ప్రాంతాలలో పాఠశాలలు, కళాశాలలు, గ్రంథాలయాలు, ఆరోగ్య కేంద్రాలు తపాలా కార్యాలయాలు వంటి వివిధ ఇతర ప్రభుత్వ రంగ సంస్థలను ప్రభుత్వమే నెలకొల్పి నిర్వహిస్తున్నది.
  2. రోడ్డు, రైలు మార్గాల నిర్మాణం, ప్రభుత్వ రవాణా వ్యవస్థను ప్రభుత్వమే నిర్వహిస్తున్నది.
  3. నీటి సరఫరా, పారిశుద్ధ్యం, విద్యుత్ వంటి వాటి నిర్వహణలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నది.
  4. ఆరోగ్య, సేవలు, పరిశుభ్రత, విద్యుత్, ప్రజా రవాణా, పాఠశాలలు వంటివి ప్రభుత్వం సదుపాయాలుగా అందిస్తున్నది.
  5. రైతులు తమ పంట భూముల్లో నీటి పారుదలకై మోటారు పంపుసెట్ల ఏర్పాటుకు ఫ్యాక్టరీలు, కార్యాలయాలు, దుకాణాలు, మార్కెట్ల వంటి వాటిని నిర్వహిస్తున్నది.

ప్రశ్న 2.
ప్రభుత్వ ఖర్చు వివరాలను, మీ ప్రాంత వార్తాపత్రికల్లో సేకరించి జాబితా రాయండి.
జవాబు:
ప్రభుత్వ ఖర్చు వివరాలు :

  1. విద్యారంగం – 1200 కోట్లు
  2. ఆరోగ్యరంగం – 400 కోట్లు
  3. వ్యవసాయరంగం – 1000 కోట్లు
  4. గృహ నిర్మాణం, పట్టణాభివృద్ధి – 300 కోట్లు
  5. గ్రామీణాభివృద్ధి – 400 కోట్లు
  6. విద్యుత్, నీటి పారుదల వరదల నియంత్రణ – 600 కోట్లు
  7. ఎరువుల సబ్సిడీ – 200 కోట్లు
  8. రైల్వేలు, రవాణా, కమ్యూనికేషన్స్ – 600 కోట్లు.
  9. రక్షణ రంగం – 700 కోట్లు
  10. పరిపాలన ఖర్చులు – 800 కోట్లు

ప్రశ్న 3.
ప్రజా సేవలకు, ఇతర కార్యకలాపాల నిర్వహణకు ప్రభుత్వానికి డబ్బు ఎక్కడ నుండి లభిస్తుందో ఊహించగలరా?
జవాబు:

  1. వివిధ విధుల నిర్వహణకై ప్రభుత్వానికి చాలినంత డబ్బు అవసరం.
  2. ఈ విధంగా ప్రభుత్వం యొక్క ఆయా విధుల నిర్వహణకై కావాల్సిన డబ్బును ప్రజల నుండి పన్నుల రూపంలో సేకరిస్తుంది.
  3. ప్రభుత్వం వివిధ రకాల పన్నులను వసూలు చేస్తుంది.

9th Class Social Textbook Page No.134

ప్రశ్న 4.
పై విభాగంలోని సమాచారాన్ని ఉపయోగించి ప్రభుత్వం ఆహార సబ్సిడీపై ఎంత ఖర్చు చేసిందో లెక్కించండి.
ఈ డబ్బు దేనిపై, ఎందుకోసం ఖర్చు చేయబడిందో చర్చించండి.
AP Board 9th Class Social Solutions Chapter 11 ప్రభుత్వ బడ్జెట్ – పన్నులు 1
జవాబు:
ఆహార సబ్సిడీపై 3% ఖర్చు చేయడం జరిగింది.

ఆ డబ్బును పేదలకు కేటాయించిన బియ్యం, పప్పులు, గోధుమలు, చింతపండు, పంచదార వంటి నిత్యావసర ఆహార ధాన్యాలకు కేటాయించడం జరిగింది.

ప్రశ్న 5.
మీ ఉపాధ్యాయుల సహాయంతో పై (pie) చార్టులోని కొన్ని ఖర్చులను మొదటి విభాగంలో చర్చించిన ప్రభుత్వ పాత్రలకు అన్వయింపజేయండి.
జవాబు:
మొదటి విభాగంలో చర్చించిన ప్రభుత్వ పాత్ర

  1. ఆహారం సబ్సిడీ – 3%
  2. విద్య మొ||న విషయాలకు – 12%
  3. ఆరోగ్యం, పారిశుద్ధ్యం – 4%
  4. గృహ నిర్మాణం, పట్టణాభివృద్ధికి – 3%
  5. వినోదం వంటి ఇతరములకు – 21 %
    కేటాయించి ఖర్చు చేయడం జరిగింది.

ప్రశ్న 6.
స్వాతంత్ర్యానంతరం మన దేశ మొదటి బడ్జెట్ 1947-48 రూ. 197 కోట్లు. 2011-12లో బడ్జెట్ 23 లక్షల కోట్లు. బడ్జెట్ లో ఇంత మొత్తం పెరగడానికి కారణాలు ఏమై ఉంటాయి?
జవాబు:

  1. జనాభా పెరుగుదల
  2. ఉద్యోగస్తుల వేతనాలు పెరుగుదల
  3. ప్రభుత్వరంగ సంస్థల నిర్మాణ, నిర్వహణ పెరుగుదల
  4. వడ్డీ చెల్లింపుల పెరుగుదల
  5. రక్షణ వ్యయం పెరుగుదల
  6. పరిపాలనా ఖర్చుల పెరుగుదల
    పై విధంగా అన్ని రంగాలలో ఖర్చులు పెరగడం వలన బడ్జెట్ కేటాయింపులు పెరిగాయి. తద్వారా బడ్జెట్ మొత్తం పెరిగింది.

AP Board 9th Class Social Solutions Chapter 11 ప్రభుత్వ బడ్జెట్ – పన్నులు

ప్రశ్న 7.
ప్రభుత్వ బడ్జెట్ పై పార్లమెంట్ కు అధికారం, ఎందుకు ఇవ్వబడిందో ఆలోచించండి.
జవాబు:

  1. బడ్జెట్ అంశాలపై ప్రభుత్వాన్ని చట్టసభల ద్వారా నియంత్రించవచ్చు.
  2. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లోని వివిధ అంశాలపై చర్చలు జరిగిన అనంతరమే ప్రభుత్వ ప్రతిపాదనలను పార్లమెంటు ఆమోదించడం జరుగుతుంది.
  3. ప్రభుత్వ ఖర్చులకై డబ్బు విడుదలకు పార్లమెంటు అనుమతించాలి.
  4. అదే విధంగా పార్లమెంటు ఆమోదం లేనిదే ఏ రకమైన పన్నూ విధించరాదు. అందువలన బడ్జెట్ పై అధికారం పార్లమెంటుకు ఇవ్వబడింది.

ప్రశ్న 8.
రసాయన ఎరువులపై రాయితీలను తగ్గించడానికి ప్రభుత్వం వరుసగా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. దీని అర్థం ప్రభుత్వం ఇక ముందు వాటి ధరల అదుపు కొనసాగించకపోవచ్చు. రైతులు మార్కెట్ ధరలకు కొనుక్కోవలసి ఉంటుంది. ప్రస్తుతం ఎరువుల కంపెనీలకు తక్కువ ధరలకు అమ్మడం వల్ల వచ్చే నష్టాన్ని ప్రభుత్వం చెల్లిస్తుంది. ఎరువులపై రాయితీ ఎత్తివేయాల్సి వస్తే ఆ డబ్బు ప్రభుత్వ బడ్జెట్లోని ఇతర ముఖ్య విషయాలకు మళ్లించడానికి అవకాశం కలుగుతుంది. మరో వాదం కూడా ఉంది. ఎరువులపై రాయితీలు చిన్న రైతులకు లాభదాయకంగా లేవు, కానీ పెద్ద రైతులు అవసరానికి మించి వాడేవిధంగా ప్రోత్సహిస్తున్నాయి.
ఎరువులపై రాయితీలు రైతులకు బాగా ఉపయోగపడుతున్నాయని నమ్మే రైతుగా మిమ్మల్ని మీరు భావించుకొని ఈ కేసును ఎలా వాదిస్తారు ? ఆర్థికశాఖ మంత్రికి ఒక లేఖ రాయండి.
జవాబు:

విజయవాడ,
5-8-20xx.

భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిగారికి,

అయ్యా,
మేము రైతులం. మాకు ఎరువులపై ఇచ్చే సబ్సిడీ వలన మేము వ్యవసాయకంగా ఎంతో లబ్దిని పొందుతున్నాం. అధునాతన పద్ధతులలో వ్యవసాయం చేసి, అధిక దిగుబడులు సాధించడానికి ఈ సబ్సిడీ కార్యక్రమం మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహిస్తుంది. ఇప్పటికే వాతావరణ పరిస్థితులు అనుకూలించక, విత్తనాల రేట్లు పెరిగిపోయి, పండిన పంటకు గిట్టుబాటు రేటు లేక ఇబ్బందులు పడుతున్న మాకు ఎరువులపై ఉన్న సబ్సిడీలు ఎత్తివేస్తే వాటి రేట్లు పెరిగిపోయి వాటిని సరైన మోతాదులో వాడుకోలేక పంట దిగుబడి తగ్గిపోయి సరైన ఉత్పత్తులు సాధించలేక రైతులుగా మేమేంతో నష్టపోవలసి వస్తుంది. అందువలన తమరు మాయందు దయ ఉంచి ఎరువుల సబ్సిడీలను కొనసాగించి మా వ్యవసాయ ఆర్థికాభివృద్ధికి తోడ్పడతారని మిమ్మల్ని సహృదయపూర్వకంగా ప్రార్థించుచున్నాము..

ఇట్లు
మీ విధేయుడైన రైతు

9th Class Social Textbook Page No.135

ప్రశ్న 9.
పెట్రోల్, డీజిల్ వంటి వాటిని రవాణా వాహనాలకు, మోటారు పంపులకు, జనరేటర్ల వంటి వాటికి వినియోగిస్తాం. ఒకవేళ డీజిల్, పెట్రోల్ పై పన్ను పెరిగితే ఏమవుతుంది?
జవాబు:
పెట్రోల్, డీజిల్ వంటి వాటిని రవాణా వాహనాలకు మోటారు పంపులకు జనరేటర్ల వంటి వాటికి వినియోగిస్తాం.

  1. డీజిల్, పెట్రోల్ పై పన్ను పెరగడం వలన వాటి రేటు పెరుగుతుంది.
  2. దానితో డీజిల్ పెట్రోల్ పై ఆధారపడిన అన్ని వస్తువుల రేట్లు పెరుగుతాయి.
  3. రవాణా చార్జీలు పెరగడం వలన రవాణాపై ఆధారపడిన వస్తువుల రేట్లు పెరుగుతాయి.

9th Class Social Textbook Page No.136

ప్రశ్న 10.
టి.వి. ఉదాహరణలో, దాని ఖరీదులో ఎంత భాగం వినియోగదారుడు పన్నుగా చెల్లిస్తున్నాడు?
జవాబు:
ఎక్సెజ్ సుంకం రూపంలో 1200 రూపాయలు
అమ్మకం పన్ను రూపంలో 1650 రూపాయలు
మొత్తం కలిపి 2850 రూపాయలు పన్ను చెల్లిస్తున్నాడు.

ప్రశ్న 11.
ఒకే రకమైన ఉత్పత్తులను తయారు చేసేవారి ఇద్దరిలో ఒకరు పన్ను ఎగవేసినా, మరొక వ్యక్తి కంటే ఏ విధంగా ప్రయోజనం పొందుతాడు?
జవాబు:

  1. పన్ను కట్టడం వలన తక్కువ లాభం పొందుతాడు.
  2. పన్ను ఎగవేయడం వలన దానిని కూడా తన లాభంగా పొందవచ్చును.
  3. అంతేగాక పన్ను వేయడం వల్ల ఇతరులు ఉత్పత్తి చేసిన వస్తువులకన్నా తక్కువ ధరకే అమ్మవచ్చును.
  4. అలాంటి పరిస్థితులలో పన్ను ఎగవేతదారుడు ఎక్కువ వస్తువులను అమ్ముకోవచ్చును. దానితో అతనికి మంచి లాభం రావచ్చును.

AP Board 9th Class Social Solutions Chapter 11 ప్రభుత్వ బడ్జెట్ – పన్నులు

ప్రశ్న 12.
ఒకవేళ ఇనుముపై పన్ను పెంచితే దాని ప్రభావం ఇతర ఏ వస్తువులపై ఎలా పడుతుందో ఉదాహరణలివ్వండి.
జవాబు:

  1. ఇనుము రేటు పెరుగుతుంది.
  2. దానితో ఇనుముతో తయారయ్యే వస్తువులన్నింటి ధరలో పెరుగుతాయి.
  3. అంతేగాక ఉక్కును తయారు చేయడానికి ఇనుమునే వినియోగిస్తారు. కాబట్టి ఉక్కుతో తయారయ్యే వస్తువుల ధరలు కూడా పెరుగుతాయి.

9th Class Social Textbook Page No.138

ప్రశ్న 13.
విలువ ఆధారిత పన్నులపై మీ అభిప్రాయం ఏమిటి? చర్చించండి.
జవాబు:

  1. విలువ ఆధారిత పన్ను విధానంలో ఉత్పత్తిదారు చెల్లించే పన్ను తక్కువగా ఉంటుంది.
  2. ఎందుకనగా ముడి పదార్థాల విలువపై పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు.
  3. కర్మాగారాల్లో ఉత్పాదనాక్రమం ఇతర కర్మాగారాల్లో ఉత్పత్తి చేయబడిన ఎన్నో ఉత్పత్తులపై ఆధారపడి ఉంటుంది.
  4. ఈ పన్ను విధానం (వ్యాట్) లో ముడి పదార్థాలుగా ఉపయోగించే వాటిపై మళ్ళీ పన్ను విధించబడదు.
  5. ఉత్పత్తిదారులు, వర్తకుల అమ్మకం, కొనుగోలుకు సంబంధించిన లావాదేవీల నమోదులో పారదర్శకత పెంపొందుతుంది.
  6. ప్రతి ఒక్కరూ సరైన రికార్డులను నిర్వహించడానికి కొనుగోలు సమయంలో బిల్లులను అడుగుతారు. ఎందుకంటే ముడిసరుకులపై ఇదివరకే పన్ను చెల్లించామని వాటి ద్వారానే తెలియజేయవచ్చు.
  7. పన్నుల శాఖ అధికారులు. కొనుగోలుదారులు, అమ్మకందారుల రికార్డులను పోల్చి చూడటానికి అవకాశం ఉంది.

ప్రశ్న 14.
పూరించండి : తార, సాజీదా, ప్రీతిల కొనుగోళ్లపై పన్ను రేట్లు వేర్వేరు ఉన్నాయి. (ఒకే రకమైన / వేర్వేరు అలా ఎందుకు ఉన్నాయో తెలుసుకోండి.
జవాబు:
తార తన యొక్క పాఠశాల కంప్యూటర్ల కోసం సాయిరాం కంప్యూటర్స్ నుండి రెండు హార్డ్ డ్రైవ్ లను కొని తెచ్చింది. బిల్లులో విలువ ఆధారిత పన్ను కంటే ముందు రేటు రూ. 5,000 దీనికి 5% విలువ ఆధారిత పన్ను రూ. 250లు కలిపిన అనంతరం మొత్తం అమ్మకం ధర (వ్యాట్‌లతో) కలిపి రూ. 5,250 లు.

సాజీదా బ్యాటరీ రూ. 9,165లు కొనగా వ్యాట్ కలిపి 1,146 మొత్తం రూ 10,311లు చెల్లించెను.
ప్రీతి తన వంటగ్యాస్ సిలిండర్‌కు చెల్లించిన బిల్లులో వ్యాట్ లేదు.
ఎందుకంటే వంటగ్యాసు వ్యాట్ లేదు.
అందువలన పై వస్తువులపై పన్ను రేట్లు వేరువేరుగా ఉన్నాయి.

9th Class Social Textbook Page No.139

ఆదాయంపై పన్ను విధించడంలో సరైన విధానమేది?
ప్రశ్న 15.
ప్రతి ఒక్కరూ సమాన మొత్తాలను పన్నుగా చెల్లించడం సరైన విధానమని మీరు భావించి ఉంటారు. కింద పేర్కొన్న ముగ్గురు వ్యక్తులను గమనించండి.
AP Board 9th Class Social Solutions Chapter 11 ప్రభుత్వ బడ్జెట్ – పన్నులు 2
పై ముగ్గురిలో ప్రతి ఒక్కరూ సమాన .మొత్తం (రూ.50) పన్ను చెల్లించే విధానం వాస్తవంగా సరైనదా? జ్యోతి తన ఆదాయంతో కనీసం తన పిల్లల్ని కూడా సరిగా పోషించలేదు. ఆమె కూడా అదే మొత్తంలో పన్ను చెల్లించడం సరైనదేనా?
జవాబు:
ఈ రకమైన పన్నుల విధానం సరియైనది కాదు.

ప్రశ్న 16.
ప్రతి ఒక్కరు తమ ఆదాయంలో కొంత మొత్తం పన్నుగా చెల్లించడం సరైన విధానమని భావిస్తున్నారు కదా! ఉదాహరణకు ప్రతి ఒక్కరు 10% పన్ను చెల్లించాల్సి ఉంటే ఎంత చెల్లించాలో కనుక్కోండి.

వ్యక్తి నెలలో సంపాదించినవి (రూ.లలో) 10% పన్ను (రూ.లలో)
జ్యోతి 1,500 150
ఆసిఫ్ 8,000 800
నితీష్ 30,000 3000

ఇది సరైనదా? అయినప్పటికీ జ్యోతికి జీవించడానికి చాలినంత ఆదాయం లేదు. ఆసిఫ్ కు తన ఇల్లు మరమ్మతులు చేయించడానికి సరిపడా డబ్బు కలిగి ఉండకపోవచ్చు. కానీ నితీష్ 20% పన్ను చెల్లించినా తన కనీస అవసరాలకు పెద్ద . మొత్తంలో డబ్బు ఉంటుంది.
జవాబు:
ఇది సరికాదు.

AP Board 9th Class Social Solutions Chapter 11 ప్రభుత్వ బడ్జెట్ – పన్నులు

ప్రశ్న 17.
పన్నుల విధానాన్ని సరిచేయడానికి మరింత సరైన పద్ధతిని ఇప్పుడు మీరు చెప్పగల్గుతారు. కొంత పరిమితిని ఉదాహరణకు నెలకు రూ. 7,000 లకు మించి. సంపాదించే వారే పన్ను చెల్లించాలి. బాగా ఆర్జించేవారు వారి ఆదాయాల నుండి . ఎక్కువ నిష్పత్తిలో పన్ను చెల్లించాలని కూడా మీరు చెప్పగలుగుతారు.

మీరు సంపాదించే ఆదాయం (రూ.లలో) మీరు చెల్లించే పన్ను
7,000లు కన్నా తక్కువ 0%
7,001 నుండి 15,000 ల వరకు 10%
15,001 నుండి 25,000 ల వరకు 20%
25,000ల కన్నా ఎక్కువ 30%

కింది వారిలో ఒక్కొక్కరు ఎంత పన్ను చెల్లించాలో లెక్కించండి.

వ్యక్తి నెలలో సంపాదించినవి
(రూ. లలో)
నెలకు చెల్లించాల్సిన పన్ను
(రూ.లలో)
జ్యో తి 1,000
ఆసిఫ్ 6,000
నితీష్ 20,000 4000

ఇది సరైనదేనా?
1. సరైనది కాదు.

కారణం :

  1. మనిషి తన ప్రాథమిక అవసరాలు తీర్చుకోవడానికి కొంత డబ్బు అవసరం. దానిమీద పన్ను విధించరాదు.
  2. అందువలన ఒక స్థాయి ఆదాయం వరకు ఏ విధమైన పన్నూ విధించకుండా ఆ దశ దాటిన తరువాత పన్ను విధిస్తే బాగుంటుంది.
  3. కావున 3వ అంశంలో పేర్కొన్న విధంగా కొంత పరిమితి వరకు పన్ను విధించకుండా ఆ తరువాత విధిస్తూ ఉండాలి.
  4. అప్పుడు పన్నుల వలన పేదవారు ఇబ్బందిపడరు.

9th Class Social Textbook Page No.140

ప్రశ్న 18.
ప్రభుత్వం విధించే ప్రధానమైన పన్నుల గురించి మనం చదివాం. ఇచ్చిన సమాచారంతో కింద పట్టికను పూరించండి. ఆదాయం పన్ను 12%, కార్పొరేట్ పన్ను 24%, దిగుమతి సుంకం 10%, ఎక్సెజ్ పన్ను 16%, సేవాపన్ను 5%, అమ్మకపు పన్ను 23%, ఇతర పరోక్ష పన్నులు 10%.
ప్రభుత్వంచే వసూలు చేయబడే పన్నులు :

పన్నులు మొత్తం పన్ను యొక్క శాతం
ప్రత్యక్ష పన్నులు : 36%
ఆదాయం పన్ను 12%
కార్పొరేట్ పన్ను 24%
పరోక్ష పన్నులు : 64%
దిగుమతి పన్ను 10%
ఎక్సైజ్ పన్ను 16%
సేవా పన్ను 5%
అమ్మకం పన్ను 23%
ఇతర పన్నులు 10%
మొత్తం పన్నులు 100%

1. ఏ రకమైన పన్నులు ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయాన్ని సమకూరుస్తున్నాయి?
జవాబు:
పరోక్ష పన్నులు (64%)

2. క్రాంతికి సంవత్సరానికి రూ. 1,75,000ల ఆదాయం ఉంది. అతడు రూపాయలు రూ. 3000 పన్ను చెల్లించాలి. కమలేశ్ వార్షిక ఆదాయం 3,00,000 రూపాయలు. అతడు రూ. 5,500 ఆదాయం పన్ను చెల్లించాలి.
* ఎవరు ఎక్కువ. ఆదాయపు పన్ను చెల్లిస్తున్నారు?
జవాబు:
క్రాంతికి సంవత్సరాదాయం – 1,75,000 రూపాయలు
క్రాంతి చెల్లిస్తున్న ఆదాయపు పన్ను – 3,000 రూపాయలు
క్రాంతి చెల్లిస్తున్న ఆదాయపు పన్ను శాతం – 1.71%
కమలేశ్ వార్షికాదాయం – 3,00,000
కమలేశ్ చెల్లిస్తున్న ఆదాయపు పన్ను – 5,
కమలేశ్ చెల్లిస్తున్న ఆదాయపు పన్ను శాతం – 1.83%
అందువలన కమలేశ్ ఎక్కువ ఆదాయపు పన్ను చెల్లిస్తున్నారు.

* ఎవరు ఆదాయంలో ఎక్కువ భాగాన్ని పన్నుగా చెల్లించాలి?
జవాబు:
కమలేశ్

* ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కువ ఆదాయం ఉన్నవారు చెల్లించే పన్ను వారి ఆదాయంలో ……….. (తక్కువ/ఎక్కువ / సమానం) భాగం.
జవాబు:
ఎక్కువ

ప్రాజెక్టు

కొన్ని సబ్బులు, టూత్ పేస్టు, టాబ్లెట్స్ స్క్రిప్స్ లేదా ఎం.ఆర్.పి రాసి ఉన్న కొన్ని వస్తువుల ప్యాకింగ్ ను సేకరించి వాటిమీద రాసి ఉన్న ధరను, వాటిని అమ్ముతున్న ధరలను గురించి చర్చించండి. చిల్లర వర్తకుడు పొందుతున్న లాభాల గురించి మాట్లాడండి.
జవాబు:
లక్స్ – 20 రూ.
రెక్సోనా – 19 రూ
సంతూర్ – 16 రూ.
లిరిల్ – 25 రూ.
కోర్గెట్ 74-00 రూ.
పెప్సొడెంట్ – 70-00 రూ.
బబూల్ – 60-00 రూ.

వాటిపై ఎం.ఆర్.పి. పై విధంగా ఉండగా చిల్లర వర్తకుడు ఒక్కొక్కదానిపై దానిమీద ఉన్న ఎం.ఆర్.పి. రేటుకన్నా 2 లేదా 3 రూపాయలు ఎక్కువ రేటుకు అమ్ముతున్నాడు.

ప్రతి ఉత్పత్తి వస్తువుపైనా ఎం.ఆర్.పి. రేటుకన్నా 2 లేదా 3 రూపాయలు ఎక్కువ రేటుకు అమ్ముతున్నాడు.

ప్రతి ఉత్పత్తి వస్తువుల పైనా ఎం.ఆర్. పి. రేటుతోపాటు (అన్నిరకముల పన్నులను కలిపి) అని ఉంటుంది. కాబట్టి చిల్లర వర్తకుడు ఎం.ఆర్.పి. ఎక్కువ రేటుకు అమ్మవలసిన అవసరం లేదు. వారికి ఎం.ఆర్.పి రేటులోనే కొంత తగ్గించి ఇవ్వడం జరుగుతుంది. ఆ లాభం సరిపోతుంది. కానీ చిల్లర వర్తకుడు మరికొంత అదనపు ఆదాయాన్ని రాబట్టడం కోసం ఆ విధంగా ఎక్కువ రేటుకు అమ్ముతున్నాడు.

AP Board 9th Class Social Solutions Chapter 10 ధరలు – జీవనవ్యయం

SCERT AP 9th Class Social Studies Guide Pdf 10th Lesson ధరలు – జీవనవ్యయం Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Social Solutions 10th Lesson ధరలు – జీవనవ్యయం

9th Class Social Studies 10th Lesson ధరలు – జీవనవ్యయం Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
ధరలను నియంత్రించాల్సిన ఆవశ్యకత ఏమిటి? (AS1)
జవాబు:

  1. ధరలను నియంత్రించకపోతే స్థిరమైన ఆదాయం కలిగిన పెన్షనర్లు, రోజువారి వేతనదారులు, చేతి పనివారు, చిన్న అమ్మకందారులు, చిన్న పరిశ్రమలలోని కార్మికులు, తక్కువ ఆదాయం కలిగిన ప్రైవేటు ఉద్యోగులు నిరంతరం పెరిగే ధరల వలన దీర్ఘకాలంలో తీవ్ర ప్రభావానికి గురవుతారు.
  2. దీనినే ద్రవ్యోల్బణం అంటారు.
  3. ద్రవ్యోల్బణ కాలంలో కూడా ఈ వ్యక్తుల ఆదాయం మారదు.
  4. కాబట్టి వారు తమ వినియోగాన్ని బలవంతంగా తగ్గించుకోవాలి.
  5. అప్పటికే వారి జీవన ప్రమాణం తక్కువ. ఇప్పుడు ద్రవ్యోల్బణం వారి జీవన ప్రమాణాన్ని మరింత తగ్గించింది. ఇది వారిని ఇంకా పేదరికంలోనికి నెడుతుంది. అందువలన ధరలను నియంత్రించాల్సిన అవసరం ఉంది.

ప్రశ్న 2.
వస్తువులను ఉత్పత్తి చేసేవారు, అమ్మేవారు ధరలను ఎలా నిర్ణయిస్తారు? (AS1)
జవాబు:
వస్తువులను ఉత్పత్తి చేసేవారు తమ వస్తువుల ఉత్పత్తికయ్యే వ్యయాన్ని పరిగణనలోనికి తీసుకుంటారు. మరియు వారి లాభాలను కొంత మేర కలుపుకుంటారు. ఆ వస్తువులను అమ్మేవారు వారి యొక్క లాభాలను కూడా కలుపుకుని వస్తువుల యొక్క ధరలను నిర్ణయిస్తారు.

పై విధంగా వస్తువులను ఉత్పత్తిదారులు, అమ్మకందారుల యొక్క లాభాలు మరియు ఉత్పత్తికయ్యే ఖర్చులను పరిగణన లోనికి తీసుకుని ధరలను నిర్ణయించడం జరుగుతుంది.

AP Board 9th Class Social Solutions Chapter 10 ధరలు – జీవనవ్యయం

ప్రశ్న 3.
జీవన వ్యయం, జీవన ప్రమాణానికి మధ్యగల తేడా ఏమిటి? (AS1)
జవాబు:

  1. జీవన ప్రమాణం అనగా మానవుల కొనుగోలు శక్తి.
  2. జీవన వ్యయం అనగా మానవులు చేసే ఖర్చులు. 3. స్థిరమైన ఆదాయం కలిగిన పెన్షనర్లు, రోజువారి వేతనదారులు, చేతిపనివారు, చిన్న అమ్మకందారులు, చిన్న పరిశ్రమలలోని కార్మికులు, తక్కువ ఆదాయం కలిగిన ప్రైవేట్ ఉద్యోగులు, నిరంతరం పెరిగే ధరల వలన దీర్ఘకాలంలో తీవ్ర ప్రభావానికి గురవుతారు. దీనినే ద్రవ్యోల్బణం అంటారు.
  3. ఈ ద్రవ్యోల్బణ కాలంలో కూడా వ్యక్తుల ఆదాయం మారదు.
  4. కాబట్టి వారు తమ వినియోగాన్ని బలవంతంగా తగ్గించుకోవాలి.
  5. అప్పటికీ వారి జీవన ప్రమాణం తక్కువ. ఇప్పుడు ద్రవ్యోల్బణం వలన వారి జీవన వ్యయం పెరిగి వారిని పేదరికంలోనికి నెట్టింది.

ప్రశ్న 4.
జీవన వ్యయంలో పెరుగుదల ఎవరిపై ఎక్కువ ప్రభావం చూపుతుంది? ఎందుకు? (AS4)
జవాబు:
జీవన వ్యయంలో పెరుగుదల ఈ క్రింది వారిపై ప్రభావం చూపుతుంది :

  1. స్థిరమైన ఆదాయం కలిగిన పెన్షనర్లు
  2. రోజువారి వేతనదారులు
  3. చేతి పనివారు
  4. చిన్న అమ్మకందారులు
  5. చిన్న పరిశ్రమలలోని కార్మికులు
  6. తక్కువ ఆదాయం కలిగిన ప్రయివేట్ ఉద్యోగులు.

వీరి ఆదాయంలో మార్పు లేకపోవడం వలన జీవన వ్యయం పెరగడం వలన అప్పుల పాలవుతారు.

ప్రశ్న 5.
ద్రవ్యోల్బణ కాలంలో ఏ సమూహాలు ఎక్కువ ఆదాయాన్ని పొందుతాయి? (AS4)
జవాబు:

  1. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలలో, కొన్ని సంస్థలలో పనిచేసే ఉద్యోగులు కరవు భత్యం (డి.ఎ)ను అదనంగా పొందుతారు.
  2. ధరలు ఒక శాతం వరకు పెరిగినప్పుడు వారి వేతనం కూడా పెరుగుతుంది.
  3. ఎందుకంటే ప్రభుత్వం వారికి డి.ఎ.ను చెల్లిస్తుంది.
  4. తద్వారా ద్రవ్యోల్బణంతో పాటు వారి ఆదాయం పెరుగుతుంది.
  5. వ్యాపార కార్యకలాపాలు చేసే ప్రజలు వారు అమ్మే వస్తువుల ధరలు పెంచడం ద్వారా అధిక జీవన వ్యయంను రాబట్టుకుంటారు.
    ఉదా : పంచదార ధర పెరిగితే స్వీట్సు అమ్మేవారు ధరలను పెంచుతారు. టీ అమ్మేవారు కప్పు టీ – ధరను పెంచుతారు.
  6. డైక్లీనర్లు, కర్షకులు, లాయర్లు, డాక్టర్లు మొదలగు వివిధ సేవలను అందించే ప్రజలు ధరలు పెరిగినప్పుడు వారి ఫీజును కూడా పెంచుతారు.
  7. అధిక ధనవంతులు, కార్పొరేట్ రంగంలో పనిచేసే వారిపైన పెరిగిన ధరలు ప్రభావం చూపలేవు.

ప్రశ్న 6.
టోకు ధరల సూచిక (WPI), వినియోగదారుల ధరల సూచిక (CPI) కంటే ఏవిధంగా భిన్నమైనది? (AS1)
జవాబు:

  1. టోకు ధరల సూచికలో అన్ని వస్తువులు (ఉత్పాదక వస్తువులు, వినియోగ వస్తువులు) వస్తాయి.
  2. వినియోగదారుల ధరల సూచికలో వినియోగదారుల వస్తువుల ధరలు, చిల్లర ధరలు వస్తాయి.
  3. కావున ప్రధాన తేడా టోకు ధరల సూచికలోనే ఇమిడియున్నది. వినియోగదారుల ధరల సూచికలో ఆ తేడా లేదు.

ప్రశ్న 7.
ఆహార ద్రవ్యోల్బణం, వినియోగదారుల ధరల సూచికల మధ్యగల భేదమేమి? (AS1)
జవాబు:
ఆహార ధరల సూచికను.ఆహార పదార్థాల ధరలలో పెరుగుదలను అంచనా వేయుటకు ఉపయోగిస్తారు. దీనినే ఆహార ద్రవ్యోల్బణం అంటారు. ఆహార ధరల సూచికలో బియ్యం, గోధుమ, కూరగాయలు, పంచదార, పాలు, గుడ్లు, మాంసం, చేపలు, ఆహార పదార్థాల తయారీకి ఉపయోగపడే వంటనూనెల టోకు ధరలు ఉంటాయి.

కొన్నిసార్లు లాభార్జన ప్రధాన ఆశయంగా గల వ్యాపారస్తులు చాలా వస్తువులు ముఖ్యంగా నిత్యావసర వస్తువుల ధరలు అక్రమంగా పెంచుతారు.

వినియోగదారులైన శ్రామికుల వేతనంలో పెరుగుదల లేకుంటే వారు మార్కెట్లో వస్తువులను కొనలేరు. నిత్యావసర వస్తువులైన గోధుమలు, బియ్యం, పాలు మొదలైన వాటి విషయంలో కొరత సంభవిస్తే ప్రజలకు ఇబ్బంది కలిగిస్తుంది.

AP Board 9th Class Social Solutions Chapter 10 ధరలు – జీవనవ్యయం

ప్రశ్న 8.
వినియోగదారుల ధరల సూచిక యొక్క ఉపయోగాలు ఏమిటి? (AS1)
జవాబు:

  1. జీవన వ్యయంలో పెరుగుదలను తెలుసుకోవటానికి ఉపయోగపడుతుంది.
  2. వినియోగదారులు ఉపయోగించే వస్తువుల ధరలు పెరిగితే వాటిని నియంత్రించడానికి తగిన చర్యలు చేపట్టడానికి ఉపయోగపడుతుంది.
  3. ప్రభుత్వం ఎగుమతి దిగుమతుల విధానం ద్వారా ఆహార పదార్థాల ధరలు పెరిగినప్పుడు ఆ వస్తువుల ఎగుమతిని పూర్తిగా నిషేధిస్తుంది లేదా కొంత పరిమితిని విధిస్తుంది.
  4. ఏవైనా వస్తువులు కొరతగా ఉంటే ప్రభుత్వం ఇతర దేశాల నుంచి తెప్పించి మార్కెట్ ధరల కంటే తక్కువ ధరలకు నేషనల్ అగ్రికల్చరల్ కో ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లాంటి సహకార సంఘాల ద్వారా అందిస్తుంది.

ప్రశ్న 9.
వినియోగదారుల ధరల సూచికను లెక్కించుటకు ఐదు అంశాలను రాయండి. (AS1)
జవాబు:

  1. తల్లిదండ్రులు కొనుగోలు చేసిన ప్రతి వస్తువు యొక్క ధరలను వ్రాయుట.
  2. ప్రతి నెల అంతే మొత్తంలో కొన్నారని ఊహించుకొంటే, కాని ఈ నెల ధరలు పెరగడం వలన అంతే మొత్తంలో వస్తువుల రేట్లు విపరీతంగా పెరిగాయి.
  3. అంటే రోజువారీ వినియోగంలో రిటైల్ స్థాయిలోను లేదా చిల్లర వ్యాపారుల స్థాయిలోను ధరల తీరుతెన్నులను తెలిపే వినియోగదారుల సూచి.
  4. ఆర్థిక – గణాంకాల డైరెక్టరేట్ వివిధ మార్కెట్లలో ధరలను సేకరిస్తుంది.
  5. ఒక కుటుంబ బడ్జెట్ లోని ప్రాముఖ్యత గల వస్తువులపై చేసే ఖర్చును లెక్కించే విధంగానే వినియోగదారుల ధరల సూచికను కూడా లెక్కిస్తారు.
  6. గత నెలలో నాలుగు వస్తువుల సరాసరి ధరల స్థాయి 100. అది ఇప్పుడు 123. 3కి పెరిగింది. అంటే దీని అర్థం గత నెలతో పోలిస్తే ఇంట్లో వినియోగించుకొనే ఈ నాలుగు వస్తువుల ధరల స్థాయి ఈ నెలలో 23.3% పెరిగింది.

ప్రశ్న 10.
ధరల పాలనా యంత్రాంగం (APM), కనీస మద్దతు ధర (MSP) కంటే ఎలా భిన్నమైనది? (AS1)
జవాబు:
ధరల పాలనా యంత్రాంగం :
వస్తువులకు ధరలు పెరగకుండా నియంత్రిస్తుంది. వినియోగదారులకు వినియోగ వస్తువుల యొక్క ధరలను అందుబాటులో ఉంచుతుంది. అనగా వారి కొనుగోలు శక్తికి అనుకూలంగా వ్యవహరిస్తుంది.

కనీస మద్దతు ధర :
రైతులు పంటలు పండించటానికి అయిన ఖర్చులను వారి యొక్క శ్రమను పరిగణనలోకి తీసుకుని రైతులు నష్టపోకుండా వారు పండించిన ధాన్యానికి, ఇతర ఉత్పత్తులకు ప్రభుత్వం కనీస ధరను ప్రకటించి కొనుగోలు చేస్తుంది.

ఆ విధంగా రెండు విభిన్న ధోరణులను కలిగి ఉంటుంది.

AP Board 9th Class Social Solutions Chapter 10 ధరలు – జీవనవ్యయం

ప్రశ్న 11.
‘ధరలను నియంత్రించడంలో ప్రభుత్వ పాత్ర’ అనే శీర్షిక కింద గల 6వ పేరాను చదివి ఈ ప్రశ్నకు జవాబు రాయండి. ప్రభుత్వ రాబడిని ధరల పాలనా యంత్రాంగం (APM) ఎలా ప్రభావితం చేస్తుంది? చర్చించండి. (AS2)
జవాబు:

  1. ప్రభుత్వ రాబడిని ధరల పాలనా యంత్రాంగం ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా ప్రభావితం చేస్తున్నది.
  2. ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా పంపిణీ చేసే వస్తువుల ధరలు మార్కెట్ లోని ధరల కన్నా తక్కువగా ఉంటాయి.
  3. వీటి ధరలలో తేడా లేదా సబ్సిడీని ప్రభుత్వం భరిస్తుంది.
  4. చౌక ధరల దుకాణాల నుండి పేద ప్రజలు వస్తువులను కొనడానికి వీలు కల్పించడమే కాకుండా, నిత్యావసర వస్తువుల ధరలు మార్కెట్లో విచక్షణారహితంగా పెరగకుండా నియంత్రిస్తుంది.
  5. నిత్యావసర వస్తువుల అక్రమ నిల్వలను నిరోధించి, వాటి ధరలను సహేతుకమైన స్థాయిలలో ఉంచడం, వాటి లభ్యతను సులభతరం చేయడం కోసం ప్రభుత్వమే ధరలను నిర్ణయించి, అవే ధరలకు మార్కెట్లో వస్తువులను విక్రయించాలని వ్యాపారస్తులను అదేశిస్తుంది.
  6. ప్రభుత్వం నిర్ణయించిన ధరను ఎవరైతే పాటించరో వారిపై వివిధ చట్టాల ద్వారా జరిమానా విధిస్తుంది.
  7. కిరోసిన్, డీజిల్, LPG, CNG, PNG మొదలగు వాటికి ప్రభుత్వం కొంతమేర లేదా మొత్తంగా సబ్సిడీ ఇచ్చి ధరల పాలనా యంత్రాంగం ద్వారా విక్రయిస్తుంది.

ప్రశ్న 12.
మీ కుటుంబం వినియోగించే ఐదు రకాల వస్తువులను లేదా సేవలను తీసుకొని మీ కుటుంబానికి సంబంధించిన వినియోగదారుల ధరల సూచికను తయారుచేయండి. (AS3)
జవాబు:
AP Board 9th Class Social Solutions Chapter 10 ధరలు – జీవనవ్యయం 1
వినియోగదారుల ధరల సూచికలను రాయండి. ………………. 100%
గత నెలతో పోలిస్తే మీ కుటుంబం మొత్తం ఖర్చులో ఎంత మార్పు వచ్చింది?
గత నెలలో 1630 రూపాయల వ్యయం జరగగా ఈ నెల 2020 వ్యయం జరిగింది.
అనగా 2020 – 1630 = 390 రూపాయలు తేడా వచ్చింది.
అనగా అవే వస్తువులకు అదే పరిమాణానికి అదనంగా 390 రూపాయలు చెల్లించవలసి వచ్చింది.

ప్రశ్న 13.
ఈ కింది వాక్యాలలో తప్పొప్పులను గుర్తించండి. (AS1)
జవాబు:
అ. ద్రవ్యోల్బణం ప్రజల జీవన ప్రమాణ స్థాయిని పెంచుతుంది. (తప్పు)
ఆ. ద్రవ్యం యొక్క కొనుగోలు శక్తిలోని మార్పు ఆ ద్రవ్యం విలువను తెలుపుతుంది. (ఒప్పు)
ఇ. జీవన వ్యయంలో వచ్చిన మార్పు పెన్షనర్ల జీవన ప్రమాణంపై ఎటువంటి ప్రభావం చూపదు. (తప్పు)
ఈ. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డి.ఎ. ను పెంచడం ద్వారా ద్రవ్యోల్బణం నుండి వారు మినహాయింపు పొందుతారు. (ఒప్పు)
ఉ. వినియోగ వస్తువుల ధరలలో వచ్చిన మార్పులను మాత్రమే టోకు ధరల సూచిక లెక్కిస్తుంది. (ఒప్పు)

ప్రశ్న 14.
పారిశ్రామిక వస్తువుల టోకు ధరల సూచికలు ఈ కింది పట్టికలో ఇవ్వబడ్డాయి. వీటి ద్వారా రేఖాపటం గీసి, కింది ప్రశ్నలకు జవాబులు రాయండి. (AS3)
AP Board 9th Class Social Solutions Chapter 10 ధరలు – జీవనవ్యయం 2
AP Board 9th Class Social Solutions Chapter 10 ధరలు – జీవనవ్యయం 3
అ. గత కొన్ని సంవత్సరాలుగా ఏ వస్తువుల ధరలు నిలకడగా పెరుగుతున్నాయి?
జవాబు:
ఎరువులు, సిమెంట్, ధరలు నిలకడగా పెరుగుతున్నాయి.

ఆ. నూలు వస్త్రం, ఎరువుల ధరలు నెమ్మదిగా పెరగడానికి గల కారణాలు ఏమిటి?
జవాబు:
నూలు వస్త్రం, ఎరువుల ధరలు నెమ్మదిగా పెరగడానికి గల కారణాలు :

  1. నూలు వస్త్రం, ఎరువుల వాడకంలో ఒక్కసారిగా వేగవంతంగా మార్పురాదు.
  2. నూలు వస్త్రం, ఎరువుల ఉత్పత్తి కూడా ఒక్కసారిగా పడిపోదు.
  3. అందువలన నూలు వస్త్రం, ఎరువుల ధరలు నెమ్మదిగా పెరుగుతాయి.

ఇ. పై వస్తువుల విషయంలో ప్రభుత్వం ఏవైనా చర్యలు తీసుకుందా? ఎలా?
జవాబు:

  1. వస్తువుల ఉత్పత్తి పెంచడానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుంది.
  2. వస్తువుల కొరత ఏర్పడినపుడు విదేశాల నుండి దిగుమతి చేసుకుని వాటిని మార్కెట్ ధరల కంటే తక్కువ ధరలకు నేషనల్ అగ్రికల్చరల్ కో ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లాంటి సహకార సంఘాల ద్వారా అందిస్తుంది.
  3. ఎప్పుడైనా వ్యాపారులు అక్రమ నిల్వల ద్వారా కృత్రిమ కొరతను సృష్టిస్తే ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకుంటుంది.

ప్రశ్న 15.
ప్రజా పంపిణీ వ్యవస్థ సక్రమ నిర్వహణకై సలహాలను సూచిస్తూ మీ తహశీల్దారుకు ఒక లేఖ రాయండి. (AS6)
జవాబు:

తహశీల్దారుకు ఉత్తరం

To:
తహశీల్దార్ వార్కి
సాలూరు.
విజయనగరం.

From:
టి. అప్పారావు
సాలూరు.
అయ్యా

విషయం : ప్రజా పంపిణీ వ్యవస్థ సక్రమ నిర్వహణకై తమ సహకారానికై సూచనలు.

పేద ప్రజల ఆహార భద్రతకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ముఖ్యమైన పథకం ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS – Public Distribution System). ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రభుత్వం నిత్యావసర వస్తువులైన గోధుమలు, బియ్యం , పంచదార, వంట నూనెలు సకాలంలో మాకు అందడం లేదు. ప్రతి నెల 1వ తేదీ నాటికి సరకులు డీలర్ల ద్వారా అందించేందుకు ముందు నెలాఖరు. నాటికి డి.డి.లు పూర్తి చేసి మొదటి వారానికి పంపిణీ జరిగేటట్లు చేయవలెను. చాలా మంది డీలర్లు అక్రమ నిల్వలను చీకటి మార్కెట్లో విక్రయిస్తున్నారు, నిరోధించగలరు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అందజేయు సరకులు నాణ్యతగా ఉండడం లేదు. కొన్ని సందర్భాలలో అవి అనారోగ్యం తెచ్చి పెడుతున్నాయి.

పై సూచనలు, సలహాలు ప్రజలందరివిగా భావించి, వాటిని సరిదిద్ది ప్రజా పంపిణీ వ్యవస్థను దిగ్విజయం చేయ ప్రార్థన.

ఇట్లు
టి. అప్పారావు.

9th Class Social Studies 10th Lesson ధరలు – జీవనవ్యయం InText Questions and Answers

9th Class Social Textbook Page No.121

ప్రశ్న 1.
రేపు ఉపాధ్యాయ దినోత్సవం అనుకోండి. మీ తరగతిలోని విద్యార్థులు ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహించుటకు, నీకు రూ. 200 ఇచ్చి స్వీట్లు, బిస్కెట్లు తెమ్మని మార్కెట్ కు పంపించారు అని అనుకుందాం. మార్కెట్లో ధరలను చూస్తే ఒక స్వీట్ ప్యాకెట్ ధర రూ. 60, బిస్కట్ ప్యాకెట్ ధర రూ. 20 ఉంది. నీవు రెండు స్వీట్ ప్యాకెట్లు కొన్నచో, మిగతా డబ్బులతో ఎన్ని బిస్కట్ ప్యాకెట్లు కొనగలవు? వాటికి ఎంత చెల్లించావు?
జవాబు:
మొత్తం తీసుకెళ్ళినది – రూ. 200
ఒక స్వీట్ ప్యాకెట్ ధర – రూ. 60
రెండు స్వీట్ ప్యాకెట్ల ధర – 2 × 60 = రూ. 120
బిస్కెట్ ప్యాకెట్ ధర – రూ. 20
రెండు స్వీట్ ప్యాకెట్లు కొనగా మిగిలినది – 200 – 120 = 80 రూపాయలు
80 రూపాయలకు ప్యాకెట్ 20 రూ. చొప్పున కొనగా నాలుగు బిస్కెట్ ప్యాకెట్లు వస్తాయి. అనగా
4 × 20 = 80 రూపాయలు
కావున 200 రూపాయలకు కొని తెచ్చినది.
AP Board 9th Class Social Solutions Chapter 10 ధరలు – జీవనవ్యయం 4

ప్రశ్న 2.
నీవు పాఠశాలకు తిరిగి వచ్చిన తర్వాత, మీ తరగతి విద్యార్థులు “ఎందుకు ఇన్ని తక్కువ ప్యాకెట్లు కొని తెచ్చావు ? ప్రతిది ఐదు ప్యాకెట్లు తీసుకురావల్సింది.” అని అన్నారు.
జవాబు:
అప్పుడు నేను ప్రతిది ఐదు ప్యాకెట్లు తీసుకురావడానికి నేను తీసుకెళ్ళిన 200 రూపాయలకు 2 స్వీట్ ప్యాకెట్లు మరియు 4 బిస్కెట్ ప్యాకెట్లు మాత్రమే వచ్చాయి.
రేట్లు పెరిగాయి అని నేను పై వివరాలు తెలిపాను.

ప్రశ్న 3.
అందుకుగాను, నీవు స్వీట్లు బిస్కెట్ ప్యాకెట్ల ధరల గురించి చెప్పినప్పుడు వారు ఆశ్చర్యపోయారు. మీ తరగతిలో ఒకరు ఈ విధంగా అన్నారు. “గత సంవత్సరం మనం స్వీటు ప్యాకెట్‌కు రూ. 30, బిస్కెట్ ప్యాకెట్‌కు రూ. 10 చెల్లించాం కదా.”
జవాబు:
గత సంవత్సరం ధరలతో పోలిస్తే ఈ సంవత్సరం రేట్లు రెట్టింపు అయ్యాయి. అందువలన 2 స్వీట్ ప్యాకెట్లు, 4 బిస్కెట్ ప్యాకెట్లు మాత్రమే వచ్చాయి. కారణం రేట్లు రెట్టింపు కావడమే.

AP Board 9th Class Social Solutions Chapter 10 ధరలు – జీవనవ్యయం

ప్రశ్న 4.
గత సంవత్సర కాలంలో ఏమి జరిగింది? రెండు వస్తువుల ధరలు పెరిగాయి. కావున రూ. 200 తో అవే వస్తువులను తక్కువ మొత్తంలో కొనుగోలు చేయాల్సి వస్తుంది.
జవాబు:
గత సంవత్సరంలో వస్తువుల రేట్లు తక్కువగా ఉన్నాయి.
ఈ సంవత్సరం వస్తువుల రేట్లు గత సంవత్సరంతో పోలిస్తే రెట్టింపు అయ్యాయి.
అందువలన తక్కువ మొత్తంలో వస్తువులను కొనుగోలు చేయాల్సి వచ్చింది.

ప్రశ్న 5.
ఒకవేళ మీ ఉపాధ్యాయులు, ఈ సంవత్సరం 5 స్వీట్స్, 5 బిస్కెట్ ప్యాకెట్లు కొనమంటే, వాటి కోసం మీరు ఎంత చెల్లించాల్సి ఉంటుంది?
జవాబు:

  1. 5 ప్యాకెట్ల స్వీట్స్ కోసం = రూ. 5 × 60 = 300 రూపాయలు
  2. 5 ప్యాకెట్ల బిస్కెట్స్ కోసం = రూ. 5 × 20 = 100 రూపాయలు
  3. నీవు చెల్లించాల్సిన మొత్తం = రూ. 400 రూపాయలు
  4. గత సంవత్సరంతో పోలిస్తే ఎంత ఎక్కువ మీరు చెల్లించాల్సి ఉంటుంది?

గత సంవత్సరం చెల్లించినది :
5 స్వీట్ ప్యాకెట్ల రేటు = 5 × 30 = 150 రూపాయలు
5 బిస్కెట్ ప్యాకెట్ల రేటు = 5 × 10 = 50 రూపాయలు
మొత్తం = 200 రూపాయలు
గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం 200 రూపాయలు
అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.

డబ్బుతో మనం వాస్తవంగా కొనగలిగిన వస్తుసేవల సంఖ్యను ద్రవ్యం యొక్క కొనుగోలు శక్తి అంటారు. ద్రవ్యోల్బణ కాలంలో వాస్తవ ఆదాయం, ద్రవ్యం యొక్క కొనుగోలు శక్తి పడిపోతుంది. పై ఉదాహరణను బట్టి గత సంవత్సరం ఇవే వస్తువులు ఐదు చొప్పున కేవలం రూ. 200 మాత్రమే చెల్లించారు. కాని ఇప్పుడు మీరు అదే వస్తువులను కొనడానికి . ‘ ఎక్కువ చెల్లించాలి, కాబట్టి మీరు ఈ రెండు రకాల వస్తువులను తక్కువగా కొనుగోలు చెయ్యాల్సి వస్తుంది.

  • గత సంవత్సరం రూ. 200 = 5 స్వీట్ ప్యాకెట్లు + 5 బిస్కెట్ ప్యాకెట్లు
  • ఈ సంవత్సరం రూ. 200 = 2 స్వీట్ ప్యాకెట్లు + 4 బిస్కెట్ ప్యాకెట్లు
  • మరో రకంగా చెప్పాలంటే రూ. 200 లతో చేసే కొనుగోలు శక్తి లేదా డబ్బు విలువ పడిపోయింది. కాబట్టి మీరు అదే డబ్బుతో తక్కువ వస్తువులనే కొనగలిగారు. ఎందుకంటే వాటి ధరలు పెరిగాయి.

9th Class Social Textbook Page No.123

* ప్రతిరోజు క్రమం తప్పకుండా మీ కుటుంబం ఉపయోగించే కొన్ని వస్తువుల లేదా సేవల పేర్లను రాయండి.
ప్రస్తుతం వాటి ధరలను, గత సంవత్సరం అవే వస్తువుల ధరలను పరిశీలించండి. వాటి మధ్య గల తేడా ఏమిటి? . దీనికిగాను మీ తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల సహాయం తీసుకోండి.

వాటి మధ్యగల తేడా :
వస్తువుల రేటు గత సంవత్సరపు రేట్లతో పోలిస్తే ఈ సంవత్సరం అన్ని వస్తువుల రేట్లు పెరిగాయి.

కారణం :
ద్రవ్యం విలువ తగ్గడం, ద్రవ్యోల్బణం రేటు పెరగడం, జనాభా పెరగడం, వస్తూత్పత్తి వనరులు జనాభా పెరిగినంత వేగంగా పెరగక పోవడం.

9th Class Social Textbook Page No.126

ప్రశ్న 1.
2005-06లో వరి ధర రూ. 20 కిలో కొంటే 2011లో ఎంత చెల్లించాలి?
2005-06లో కిలో వరి. బియ్యం – 20 రూపాయలు.
2011లో కిలో వరి బియ్యం – 40 రూపాయలు.

AP Board 9th Class Social Solutions Chapter 10 ధరలు – జీవనవ్యయం

ప్రశ్న 2.
ఏ సంవత్సరంలో పప్పుదినుసుల ధరలు అధికంగా పెరిగాయి?
జవాబు:
2006-07 సంవత్సరంలో పప్పుదినుసుల ధరలు అధికంగా పెరిగాయి.

ప్రశ్న 3.
ప్రత్తి ధరలో ఎంత శాతం పెరుగుదల ఉంది?
జవాబు:
100 శాతం పెరుగుదల ఉంది.

ప్రశ్న 4.
ఏ వస్తువు ధర హెచ్చు, తగ్గులు లేకుండా నిలకడగా ఉంది?
జవాబు:
వంటనూనెలు

AP Board 9th Class Social Solutions Chapter 9 ద్రవ్య వ్యవస్థ – ఋణం

SCERT AP 9th Class Social Studies Guide Pdf 9th Lesson ద్రవ్య వ్యవస్థ – ఋణం Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Social Solutions 9th Lesson ద్రవ్య వ్యవస్థ – ఋణం

9th Class Social Studies 9th Lesson ద్రవ్య వ్యవస్థ – ఋణం Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
పేద కుటుంబాలలో చాలా కుటుంబాలు అనియత వనరుల నుండి రుణాలు పొందుతాయి. అనియత రుణాలపై ధనిక కుటుంబాలు చాలా తక్కువగా ఆధారపడతాయి. ఈ వాక్యాలను మీరు సమర్థిస్తారా? మీ సమాధానాన్ని సమర్థించడానికి పేజీ నెం. 114 లోని సమాచారాన్ని ఉపయోగించండి. (AS3)
(లేదా)
భారతదేశంలో నియత, అనియత రుణదాతలు రుణాన్ని అందించే విషయంలో చాలా తేడా ఉంది. నియత రుణ సంస్థలు ప్రభుత్వం, ఆర్.బి.ఐ. రూపొందించిన నియమ నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తూ తమ ఖాతాదారులచే కూడా ఈ నిబంధనలను పాటింపచేస్తారు. కాని అనియత వడ్డీ వ్యాపారులు ఎటువంటి ప్రభుత్వ నిబంధనలను పాటించకుండా తమ స్వంత పద్ధతులను పాటిస్తారు. రుణగ్రహీతలు తీసుకున్న అప్పును చెల్లించలేకపోయిన పక్షములో నియత రుణదాతలు అప్పును తిరిగి రాబట్టడానికి వారిపై ఎటువంటి చట్టపరమైన చర్యనైనా చేపడతారు. కాని అనియత రుణదాతలు అప్పును తిరిగి రాబట్టడానికి చట్టవ్యతిరేక మరియు ఎటువంటి చర్యనైనా చేపడతారు. ఈ కారణాల వలన అప్పుడప్పుడు రుణగ్రహీతలు ఆత్మహత్య చేసుకుంటున్నారు. నియత రుణ సంస్థలతో పోలిస్తే అనియత రుణదాతలు అధిక వడ్డీ రేటు వసూలు చేస్తున్నారు.

బ్యాంకులు, సహకార సంస్థలు అధికంగా రుణాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. దీని వలన ఎక్కువ మంది తక్కువ వడ్డీకి రుణాలు పొంది “అధిక ఆదాయాన్ని పొందగల్గుతారు. వారు పంటలను పండించగల్గడం, వ్యాపారం చేయడం, చిన్న తరహా పరిశ్రమలను స్థాపించడం మొదలగునవి చేయగలుగుతారు. ప్రతి ఒక్కరికి తక్కువ వడ్డీ రేటు, అప్పును తిరిగి చెల్లించే సామర్థ్యం వంటివి కల్గించడం దేశాభివృద్ధికి ప్రధాన అంశాలుగా పనిచేస్తాయి.
ప్రశ్న : “ధనిక కుటుంబాల వారు నియత రుణదాతల నుండి స్వల్ప వడ్డీకి రుణాలు పొందుతుండగా, పేదకుటుంబాల వారు అనియత రుణదాతలకు అధిక వడ్డీ చెల్లించవలసి వస్తున్నది” వ్యాఖ్యానించండి.
జవాబు:
నియత రుణాలు :
1. బ్యాంకుల ద్వారా, సహకార సంస్థల ద్వారా పొందే రుణాలు :
అనియత రుణాలు :
1. వడ్డీ వ్యాపారస్థులు, వర్తకులు, యజమానులు – బంధువులు, స్నేహితులు ద్వారా పొందే రుణాలు. పేద కుటుంబాలలో చాలా కుటుంబాలు అనియత వనరుల నుండి రుణాలు పొందుతాయి. అనియత రుణాలపై ధనిక కుటుంబాలు చాలా తక్కువగా ఆధారపడతాయి. ఈ వాక్యాలను నేను సమర్థిస్తాను.

కారణం :
పేద కుటుంబాల వారికి బ్యాంకుల గురించిన సమాచారం అంతగా తెలియదు. బ్యాంకులలో జరిగే లావాదేవీలు కూడా పేద కుటుంబాల వారికి తెలియదు. బ్యాంకులు అంటే ధనికులకు
చెందినవి వారి అపోహ.

పైగా బ్యాంకుల ద్వారా ఋణాలు ఇవ్వడానికి పుచీకత్తులు’ అడుగుతారు అవి పేద కుటుంబాల వారి వద్ద ఉండవు. అందువలన ప్రైవేటు వ్యాపారస్తులను నమ్ముకుని వారి వద్ద మోసపోతారు.

పట్టిక – 1 ను పరిశీలిస్తే ఈ విషయం తెలుస్తుంది.
బ్యాంకులను ఎవరు వినియోగించుకుంటున్నారంటే…..
జీతం తీసుకునే ఉద్యోగులు,
పంటలు బాగా పండించే పెద్ద రైతులు,
వ్యాపారం చేసే వ్యాపారస్థులు,
బ్యాంకులలో డబ్బులు దాచుకుంటూ ఉండగా

బ్యాంకుల నుంచి రుణాలు పొందుతున్న వారు, కార్లు కొనుక్కునేవారు. ట్రాక్టర్లు కొనుక్కునేవారు, ఎరువులను కొనుగోలు చేసేవారు, ఇళ్లు కట్టుకునేవారు. వీరంతా ధనికులు. అందువలన బ్యాంకులావాదేవీలు అన్నియు నిర్వహించేవారు ఎక్కువగా ధనికులు మాత్రమే.

పేదవారు బ్యాంకులు వద్దకు వెళ్ళకుండానే ప్రైవేటు వ్యక్తుల వద్ద రుణాలు పొందుతూ ఉంటారు.

AP Board 9th Class Social Solutions Chapter 9 ద్రవ్య వ్యవస్థ – ఋణం

ప్రశ్న 2.
రుణాలపై అధిక వడ్డీరేట్లు ఎందుకు హానికరం? (AS1)
జవాబు:
రుణాలపై అధిక వడ్డీరేట్లు హానికరం ఎందుకు అనగా –

  1. ఒక్కొక్కసారి మనం తీసుకున్న దానికన్నా వడ్డీ అధికం అవుతుంది.
  2. మొత్తం తిరిగి చెల్లించాలంటే అది రుణగ్రహీతలకు భారం అవుతుంది.
  3. రుణం ద్వారా పొందిన ప్రయోజనం కన్నా రుణగ్రహీతలకు వడ్డీ చెల్లించే భారం అధికం అవుతుంది.
  4. వడ్డీ రేట్లు అధికంగా ఉండటం వలన రైతులు తమ పంటలు పాడైపోతున్నా చూస్తూ ఉంటారు. కానీ రుణాలు తీసుకుని వాటికి తగిన చర్యలు చేపడదాము అని అనుకోరు. అందువలన వడ్డీరేట్లు ప్రజలకు అందుబాటులో ఉంటే ధనాన్ని వడ్డీకి తీసుకుని అభివృద్ధికరమైన పనులు చేయడానికి వారికి అవకాశం ఏర్పడుతుంది.

ప్రశ్న 3.
పేదల కోసం గల స్వయం సహాయక బృందాల ప్రధాన ఉద్దేశం ఏది? మీ సొంత వాక్యాల్లో వివరించండి. (AS4)
జవాబు:
పేదవారికి రుణాలు అందజేయడానికి కొత్త పద్ధతులు అవలంబిస్తున్నారు.

  1. పేదవారిని సమీకృతం చేయడం
  2. ముఖ్యంగా స్త్రీలకోసం, వారు పొదుపు చేసే డబ్బును సేకరించడం.
  3. దీనికోసం స్వయం సహాయక బృందాలను ఏర్పాటుచేసి నిర్వహించడం.
  4. ప్రతి స్వయం సహాయక బృందంలో 15 నుండి 20 మంది ఒకే ప్రాంతానికి చెందినవారు సభ్యులుగా ఉంటూ నిరంతరం కలుస్తూ, వారి డబ్బును పొదుపు చేస్తారు.
  5. ప్రతి ఒక్కరూ 25 రూ||ల నుండి 100 లేదా అంతకన్నా ఎక్కువ వారి వారి సామర్థ్యాలను బట్టి పొదుపు చేస్తారు.
  6. సభ్యుల్లో ఎవరికైనా రుణం అవసరమైతే తమ బృందం నుండి అందరూ కలసి దాచుకున్న సొమ్ము నుండి అప్పుగా పొందవచ్చు.
  7. బృంద సభ్యులు అప్పు తీసుకున్న వారి నుండి వడ్డీ వసూలు చేస్తారు.
  8. ఈ వడ్డీ వ్యాపారులు వసూలు చేసే వడ్డీలకన్నా తక్కువగా ఉంటుంది.
  9. 1 లేదా 2 సం||రాల పాటు బృందంలోని సభ్యులందరూ క్రమం తప్పకుండా పొదుపు చేస్తే వారికి రుణం పొందే అర్హత వస్తుంది.
  10. బ్యాంకులతో ఉండే ఈ సంబంధం అందరికీ ఇచ్చే రుణాల మొత్తాన్ని పెంచడానికి దోహదపడుతుంది.
  11. బృందం పేరుమీద బ్యాంకులు రుణాలను అందజేస్తాయి.
  12. అదే విధంగా బృందాలు తీసుకున్న అప్పును అందరు కలసి తిరిగి చెల్లించే హామీని బ్యాంకులకు ఇస్తాయి.
  13. రుణాలను పొందడం, డబ్బును పొదుపు చేయడం వంటి విషయాలను బృందం చర్చించి నిర్ణయిస్తుంది.
  14. ఎవరైనా సభ్యులు అప్పును సరిగా చెల్లించకపోతే ఆ విషయాన్ని బృందమే పర్యవేక్షిస్తుంది. ఈ ఏర్పాట్ల వలన పేద మహిళలకు బ్యాంకులు పూచీకత్తు లేకుండానే రుణాలు ఇవ్వడానికి ముందుకు వస్తాయి.

ప్రశ్న 4.
బ్యాంకర్ తో మాట్లాడి పట్టణ ప్రాంత ప్రజలలో ఎవరు ఎక్కువ రుణాలు ఎందుకోసం పొందుతారో తెలుసుకోండి. (AS3)
జవాబు:
బ్యాంకుల నుండి పట్టణ ప్రాంత ప్రజలలో ఎక్కువ రుణాలు పొందుతున్న వారు:

  1. వ్యాపారస్థులు
  2. పారిశ్రామికవేత్తలు
  3. ప్రభుత్వ ఉద్యోగస్థులు
  4. ఆర్థికవేత్తలు

AP Board 9th Class Social Solutions Chapter 9 ద్రవ్య వ్యవస్థ – ఋణం

ప్రశ్న 5.
స్వయం సహాయక బృందాల ద్వారా వచ్చే రుణానికి, బ్యాంక్ ద్వారా వచ్చే రుణానికి తేడాలేమిటి? (AS1)
జవాబు:

  1. స్వయం సహాయక బృందాల ద్వారా వచ్చే రుణాలు సమష్టిగా ఉంటాయి. అదే విధంగా బృందాలు తీసుకున్న అప్పును అందరు కలిసి తిరిగి చెల్లించే హామీని బ్యాంకులకు ఇస్తాయి.
  2. రుణాలను పొందడం, డబ్బును పొదుపు చేయడం వంటి విషయాలను బృందం చర్చించి నిర్ణయిస్తుంది.
  3. రుణాలు షరతులను బృందమే నిర్ణయిస్తుంది.
  4. అప్పును తిరిగి చెల్లించడం బృందం సభ్యులందరి సమిష్టి బాధ్యత.
  5. ఎవరైనా సభ్యులు అప్పును సరిగా చెల్లించకపోతే ఆ విషయాన్ని బృందమే పర్యవేక్షిస్తుంది. అదే బ్యాంకు ద్వారా వచ్చే రుణాలు బృందాలతో సంబంధం ఉండదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు. వద్దు అనుకుంటే ఆగిపోవచ్చు. లేదా చెల్లించాల్సి వచ్చినప్పుడు చెల్లించవచ్చు. అనగా వ్యక్తిగత రుణాలు ఆ వ్యక్తి యొక్క అవసరాలను బట్టి ఉంటాయి.

ప్రశ్న 6.
పేజీ నెం. 115 లోని స్వయం సహాయక బృందాల ……. గురించి ఉన్న మూడవ పేరా చదివి ఈ కింది ప్రశ్నకు జవాబు రాయండి. (AS2)
మీ ప్రాంతంలో స్వయం సహాయక బృందాలు ఏ విధంగా పనిచేస్తున్నాయి?
(లేదా)
“స్వయం సహాయక బృందాలు గ్రామీణ, పట్టణ పేద ప్రజలకు కేంద్రంగా పనిచేస్తాయి. మహిళలు స్వయంకృషితో ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి మాత్రమే కాకుండా వివిధ సామాజిక సమస్యలైన ఆరోగ్యం, పోషణ, గృహహింస మొదలైన వాటిని చర్చించి సరియైన చర్యలు తీసుకునే వేదికగా కూడా స్వయం సహాయక బృందాల సమావేశాలు తోడ్పడతాయి.” పై అభిప్రాయంతో మీరు ఏకీభవిస్తున్నారా? మీ జవాబును వివరించండి.
జవాబు:
మా ప్రాంతంలోని స్వయం సహాయక బృందాలు పనిచేసే విధానం :

  1. స్వయం సహాయక బృందాలలోని సభ్యులు రుణాలను పొంది స్వయం ఉపాధిని పొంది స్వయం ఉపాధిని ఏర్పరచుకుంటున్నారు.
  2. బృంద సభ్యులు చిన్న చిన్న మొత్తాలను రుణాలుగా పొందుతారు.
  3. ఉదా:- పూచీకత్తుగా ఉంచిన భూమిని తిరిగి పొందడం, పెట్టుబడులను సంపాదించడం. (ఉదా: విత్తనాలు, ఎరువులు, ముడిసరుకులు, బట్టలు, నగలు కొనుగోలు మొదలైన వాటికి)
  4. గృహోపకరణాల కొనుగోలు నిమిత్తం, కుట్టుమిషన్, మగ్గం, పశువులు మొదలగు ఆస్తుల సంపాదన కోసం రుణాలు పొందుతారు.
  5. స్వయం సహాయక బృందాలు గ్రామీణ, పట్టణ పేదప్రజలకు కేంద్రంగా పనిచేస్తాయి.
  6. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి మాత్రమేకాక వివిధ సామాజిక సమస్యలైన ఆరోగ్యం, పోషణ, గృహహింస – మొదలయిన వాటిని చర్చించి సరియైన చర్యలు తీసుకునే విధంగా కూడా స్వయం సహాయక బృందాలు పనిచేస్తున్నాయి.

ప్రశ్న 7.
రైతుల అవసరాలు తీర్చడంలో బ్యాంకులు అందజేసే సేవలు ఏమిటి?
జవాబు:
రైతుల అవసరాలను తీర్చడంలో బ్యాంకులు అందజేసే సేవలు ప్రముఖపాత్ర వహిస్తున్నాయి. పూర్వ కాలంలో అవసరాలకి, ప్రస్తుత కాల వ్యవసాయ అవసరాలకి చాలా తేడా కన్పిస్తుంది. పూర్వ కాలంలో వ్యవసాయానికి కావలసిన ఉత్పాదకాలలో చాలా వాటిని రైతులే స్వయంగా సమకూర్చుకునే వారు. సొంత పశువులనే పొలం దున్నడానికి, ఇంటి మనుషులే వ్యవసాయ కూలీలుగా తమ పొలంలో పండిన పంటనే విత్తనాలుగా, తమ పశువుల కొట్టం నుండే ఎరువులను తయారు చేసుకోవడం మొదలైన పనులు చేసేవారు. నవీన వ్యవసాయ పద్ధతులకు అధికమైన ధనం అవసరం.

విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు కొనడం కోసం అలాగే పొలం దున్నడం, విత్తనాలు నాటడం, పంటకోత కోయడం మొదలైన వ్యవసాయ పనులు చేసే యంత్రాల కోసం, కూలీల జీతాల కోసం ఎక్కువ డబ్బు అవసరం. దీనికి అనుగుణంగా బ్యాంకులు, రైతుల అవసరాలకు తగ్గట్లు, కాలానుగుణంగా ఋణాలు అందించి, వ్యవసాయ పురోభివృద్ధికి, రైతుల అవసరాలు తీర్చడంలో బ్యాంకులు ముందుంటున్నాయి.

9th Class Social Studies 9th Lesson ద్రవ్య వ్యవస్థ – ఋణం InText Questions and Answers

9th Class Social Textbook Page No.105

ప్రశ్న 1.
డిమాండ్ డిపాజిట్లను నగదుగా ఎందుకు పరిగణిస్తారు?
జవాబు:

  1. డిమాండ్ డిపాజిట్లు నగదు, యొక్క వివిధ లక్షణాలకు దారితీస్తుంది.
  2. నగదుకు బదులుగా చెక్కుల రూపంలో లేదా వివిధ ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా చెల్లింపులు జరుగుతాయి.
  3. కరెన్సీ నోట్లు మొదలైన వివిధ నగదు రూపాల లాగానే ఈ డిపాజిట్ల ద్వారా జమచేసిన డబ్బును తిరిగి తీసుకోవడం లేదా చెల్లింపులు జరపటం లాంటి విషయాలను నగదు రూపంలో గాని, చెక్కుల రూపంలోగాని చేయవచ్చు.
  4. చెల్లింపులు జరపడంలో డిమాండ్ డిపాజిట్లు అధిక ,వినియోగం వలన అధునిక ఆర్థిక వ్యవస్థలో ఇవి కరెన్సీ, నగదుకు ప్రతిరూపంలో ఉన్నాయి. ప్రస్తుత కాలంలోని డబ్బు యొక్క వివిధ రూపాలైన కరెన్సీ, డిపాజిట్లు ఆధునిక బ్యాంకింగ్ వ్యవస్థతో దగ్గర సంబంధం కలిగి ఉన్నాయి.

AP Board 9th Class Social Solutions Chapter 9 ద్రవ్య వ్యవస్థ – ఋణం

ప్రశ్న 2.
బ్యాంక్ డిపాజిట్లను కూడా ప్రభుత్వం బీమా చేస్తుంది. వివరాలు సేకరించండి.
జవాబు:
ప్రతి బ్యాంక్ తన డిపాజిట్ దారుల తరఫున “డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్” కు ఇన్సూరెన్స్ చేస్తుంది. ఏదైనా విపత్కర పరిస్థితులలో బ్యాంకు మూసివేయవలసి వస్తే ఒక లక్ష రూపాయలవరకు డిపాజిట్ దారులకు బీమా లభిస్తుంది. ప్రజలకు బ్యాంకులపై నమ్మకం కలుగచేయుటకొరకు బ్యాంక్ డిపాజిట్లను కూడా ప్రభుత్వం బీమా చేస్తుంది.

ప్రశ్న 3.
బ్యాంకులలో జమ చేసే ఫిక్స్ డిపాజిట్లు నగదు లాగా పనిచేస్తాయి. చర్చించండి.
జవాబు:

  1. బ్యాంకులలో దాచుకొనే డబ్బుకు, ఫిక్స్ డిపాజిట్లకు ప్రభుత్వం రక్షణ కల్పిస్తుంది.
  2. వివిధ లావాదేవీలపై అనుమతిస్తూ, ప్రజలకు బ్యాంకులపై నమ్మకం కలిగిస్తుంది.
  3. ఫిక్స్ డిపాజిట్లపై ఎప్పుడు కావాలంటే అప్పుడు ఋణాలను వెంటనే పొందవచ్చు. వాటిని తిరిగి చెల్లించవచ్చు. లేక నిర్ణీతకాలం అయిన తరువాత రుణమును మినహాయించి తిరిగి మొత్తం సొమ్మును పొందవచ్చును. అందువలన ఫిక్స్ డిపాజిట్లు కూడా నగదు లాగా పనిచేస్తాయి.

9th Class Social Textbook Page No.107

ప్రశ్న 4.
డిపాజిట్ దారులందరు ఒకేసారి బ్యాంకు నుండి తమ డబ్బును తిరిగి ఇవ్వవలసినదిగా కోరితే ఏమౌతుంది?
జవాబు:

  1. ఏమీ జరగదు. కారణం బ్యాంకు స్థాపించబోయే ముందు కొంత పైకమును రిజర్వుబ్యాంక్ ఆఫ్ ఇండియాకు డిపాజిట్ గా చెల్లించాలి. మరియు బ్యాంకులు వ్యాపారం చేస్తూ ఉంటాయి కాబట్టి లాభాల బాటలోనే నడుస్తాయి.
  2. బ్యాంకులు డిపాజిట్ చేసిన మొత్తం కన్నా ఎక్కువగా డిపాజిట్లను సేకరించరాదు.
  3. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా పెట్టిన షరతులను అంగీకరించి డిపాజిట్ల పరిధి ఎక్కువగా ఉండరాదు.
  4. అందువలన డిపాజిట్ దారులు ఒకేసారి డిపాజిట్ చేసిన సొమ్ము మొత్తము అడిగినా బ్యాంకులు ఇవ్వగలవు.

ప్రశ్న 5.
బ్యాంకు నుండి రుణం తీసుకున్న వ్యక్తితో మాట్లాడండి. రుణాన్ని ఏ అవసరానికి తీసుకున్నాడో బ్యాంకు వారిని ఏ విధంగా కలిసాడో తెలుసుకోండి?
జవాబు:

  1. బ్యాంకు నుండి రుణం తీసుకున్న సుమ అనే వ్యక్తితో మాట్లాడాను.
  2. ఆమె రుణాన్ని ఇల్లు నిర్మించడానికి తీసుకున్నది.
  3. ఆమె ఎలా రుణాన్ని తీసుకుంది అనగా ముందుగా బ్యాంకు మేనేజర్ గారి వద్దకు వెళ్ళి నేను ఇల్లు నిర్మించదలచాను. నేను ప్రభుత్వ ఉద్యోగిని అని చెప్పి రుణం ఇవ్వమని అడిగాను అంది.
  4. ఆ తరువాత ఆమెను డిఫ్యూటి మేనేజర్ హోదాలో ఉన్న ఒక ఆఫీసర్ దగ్గరకు పంపగా ఆయన రుణం ఇవ్వడానికి ఏమి కావాలో చెప్పారు.
  5. కావలసినవి :
    1. జీతమునకు సంబంధించిన వివరాలతో కూడిన సర్టిఫికెట్
    2. ఇంటి స్థలమునకు చెందిన రిజిస్ట్రేషన్ పత్రం.
    3. న్యాయపరమైన అర్హత గల పత్రము.
    4. ఆ స్థలమును ఎవరికీ అన్యాక్రాంతము చేయలేదని రుజువు చేసే పత్రం.
    5. సంబంధిత అధికారుల చేత ఇల్లు నిర్మించుకోవటానికి కావలసిన అనుమతి పత్రం.
    6. ఇంజనీరు చేత రూపొందించబడిన ఇంటి నిర్మాణం యొక్క ఆకృతి పత్రము వంటివి తీసుకువచ్చి బ్యాంకువారికి అప్పగించిన తరువాత పై అధికారులు వాటిని పరిశీలించిన తరువాత రుణమును పొందవచ్చును అని చెప్పారని ఆమె తెలియపరిచినది.

AP Board 9th Class Social Solutions Chapter 9 ద్రవ్య వ్యవస్థ – ఋణం

ప్రశ్న 6.
బ్యాంక్ మేనేజర్ తో మాట్లాడి వారు ఏ ఏ రుణాలు ఇచ్చారో ఏ ఏ వాటికి రుణాలు ఇవ్వకూడదో చర్చించండి.
జవాబు:
1. బ్యాంక్ మేనేజర్ తో మాట్లాడితే ఆయన ఇవ్వవలసిన రుణాలను గురించి, ఇవ్వకూడని రుణాలను గురించి వివరించి చెప్పారు.

ఇవ్వవలసిన రుణాలు :

  1. వ్యక్తిగత రుణాలు,
  2. ఇళ్లు నిర్మించడానికి రుణాలు,
  3. కార్లు కొనుగోలు చేయడానికి రుణాలు,
  4. గృహోపకరణాలు కొనుగోలు చేయడానికి,
  5. చదువుకోడానికి,
  6. రైతులకు సంబంధించినవి,
  7. వ్యాపారులకు సంబంధించినవి,
  8. పారిశ్రామికవేత్తలకు సంబంధించినవి.

ఇవ్వకూడని రుణాలు :

  1. ఒకసారి తనఖా పెట్టిన తరువాత మరల తనఖా పెట్టవలసి వస్తే వాటిని పరిశీలించాలి.
  2. దివాళా తీసిన వారికి
  3. స్థిర నివాసం లేనివారికి ఋణాలను ఇవ్వరాదు.

ప్రశ్న 7.
ప్రజలు వారి డబ్బును బ్యాంకులలోనే కాకుండా ఇతర సంస్థలైన గృహ సముదాయ సంస్థలు, కంపెనీలు పోస్టాఫీసు పథకాలు మొదలైన వాటిలో కూడా జమ చేస్తారు. బ్యాంక్ డిపాజిట్ల కన్నా ఇవి ఏ విధంగా విభిన్నమో చర్చించండి.
జవాబు:

  1. బ్యాంక్ డిపాజిట్లలో కరెంట్ డిపాజిట్లు, ఫిక్స్ డిపాజిట్లు వంటి రకరకాల డిపాజిట్లు ఉంటాయి.
  2. ఇతర సంస్థలలో నిర్ణీత కాలపరిమితి ననుసరించి డిపాజిట్లు ఉంటాయి.
  3. వడ్డీ రేట్లలలో కూడా తేడాలుంటాయి.
  4. వాటిని బ్యాంకులలో హామీగా చూపించి రుణాలు పొందవచ్చును.
  5. ఇతర సంస్థల యందు లావాదేవీలు సులభంగా ఉంటాయి. చిన్న చిన్న మొత్తాలలో కూడా పొదుపు చేయవచ్చును. ఆ విధంగా పొదుపుచేసిన మొత్తం ఒకేసారి పొందవచ్చును.
  6. బీమా సంస్థలలో పొదుపు చేసేటప్పుడు పొదుపు చేసే వ్యక్తి ప్రమాదవశాత్తు మరణిస్తే తదుపరి పొదుపు చేయవలసిన అవసరం లేకుండానే ఆ మొత్తం పొదుపు డబ్బును పొందవచ్చును.
  7. బ్యాంకులలో అయితే ఆ విధంగా ఉండదు. అందువలన బ్యాంక్ కార్యకలాపాలకు, ఇతర బీమా, గృహ సముదాయ పోస్టాఫీసు పథకాలకు కొంత వ్యత్యాసం ఉంది.

9th Class Social Textbook Page No.108

ప్రశ్న 8.
కింది పట్టికను పూరించండి.
జవాబు:

అలీషా స్వప్న
రుణాలు ఎందుకవసరం? చెప్పులు తయారీదారుడు. పట్టణంలో పెద్ద వ్యాపారస్థుడు నెలరోజుల సమయంలో 3 వేల జతల షూస్ తయారుచేసి ఇవ్వమని ఆర్డర్ ఇచ్చాడు. గడువు లోపల ఇచ్చిన పని పూర్తి చేయడానికి పేస్టింగ్ గ్రీజు పూయడం, స్టిచ్చింగ్ (చెప్పులు కుట్టడం) మొ||న పనుల కోసం, మరి కొంత మంది పని వారికి నియమించుకోవాలి. ఇంకా చెప్పుల తయారీకి కావలసిన ముడి సరుకులు కొనాలి అందువలన అప్పు చేశాడు. స్వప్న ఒక చిన్న రైతు. తన 3 ఎకరాల భూమిలో వేరుశనగను పండిస్తుంది. పంట పండిన తరువాత వచ్చే డబ్బుతో తను అప్పును తీర్చవచ్చు అనే ఆశతో పంటకయ్యే ఖర్చును వ్యాపారస్థుని నుండి అప్పుగా పొందింది.
రుణం తీసుకోవడం వలన ఎటువంటి హాని జరగవచ్చు? అలీషా అనుకున్న సమయంలో చెప్పులుకుట్టి వ్యాపారస్థునికి ఇచ్చాడు. కాబట్టి లాభం పొందాడు. వేసిన పంట చీడకు గురైనందువలన ఏ విధమైన ఆదాయం రాకపోగా పెట్టిన పెట్టుబడి వృథా అయినది. అందువలన నష్టపోయి అప్పు తీర్చలేని పరిస్థితి ఎదురైంది.
ఫలితమేమిటి? లాభం పొందడం నష్టాలలో చిక్కుకోవడం, కష్టాలలో పడిపోవడం జరిగింది.

ప్రశ్న 9.
అలీషాకు వరుసగా ప్రతి సంవత్సరం ఆర్డర్లు వస్తే ఆరు సంవత్సరాల తరువాత అతను ఎటువంటి స్థితికి చేరుతాడు?
జవాబు:

  1. ఆర్థికంగా ఉన్నత స్థితికి చేరుకుంటాడు.
  2. తరువాత ఆర్డర్లు వచ్చిన అప్పు తీసుకునే అవకాశం ఉండదు.
  3. చిన్న కుటీర పరిశ్రమ లాంటి దానిని స్థాపించడానికి అవకాశం ఉంటుంది.
  4. దానిలో అతను మాత్రమే ఉపాధి పొందడం కాక ఇతరులకు ఉపాధి కల్పిస్తాడు.

AP Board 9th Class Social Solutions Chapter 9 ద్రవ్య వ్యవస్థ – ఋణం

ప్రశ్న 10.
స్వప్న నష్టాల స్థితికి చేరడానికి కారణాలు ఏవి? కింది అంశాలను చర్చించండి.
క్రిమి సంహారక మందులు, వడ్డీవ్యాపారుల పాత్ర, శీతోష్ణస్థితి.
జవాబు:
1. క్రిమిసంహారక మందులు :
ఉపయోగించిన ఈ మందుల వల్ల చీడపోవడం లేదు – కారణం నాణ్యత లోపం, కలీ మందుల వ్యాపారం వంటివి. అందువలన రైతు నష్టపోవడం జరుగుతుంది.

2. వడ్డీ వ్యాపారుల పాత్ర :
రైతులకు అధిక వడ్డీలకు రుణాలను ఇచ్చి పంటలు పండిన తరువాత తమకు అమ్మమనే షరతు పెడతారు. తక్కువ రేటుకు కొంటారు. ఎక్కువ రేటుకు అమ్ముకుంటారు. ఆ విధంగా వారు రెండు విధాలుగా లబ్ధి పొందుతారు.

3. శీతోష్ణస్థితి :
పంటలు పండటానికి వాతావరణం అనుకూలించాలి. అందుకే భారతీయ రైతు ఋతుపవనాలతో జూదం ఆడతాడు అంటారు. సకాలంలో వర్షాలు పడి పంటలు పండితే రైతు గెలిచినట్లు, పడవలసిన సమయంలో వర్షాలు పడక పడరాని సమయంలో వర్షాలు పడి అనావృష్టి, అతివృష్టి వంటి పరిస్థితులు ఏర్పడితే నష్టపోవాల్సి ఉంటుంది. అందువలన రైతులపై ప్రభావం చూపే ప్రధాన అంశాలుగా క్రిమిసంహారక మందులను, వడ్డీ వ్యాపారులను, శీతోష్ణస్థితి వంటి అంశాలను పేర్కొనవచ్చు.

9th Class Social Textbook Page No.109

ప్రశ్న 11.
ప్రజలు అనేక సామాజిక, సాంస్కృతిక విషయాల కోసం రుణాలు తీసుకుంటారు. వివాహ సమయాలలో చేసే అధిక ఖర్చుల కోసం వధూవరుల ఇద్దరి కుటుంబాలు అప్పు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మీ ప్రాంతంలోని ప్రజలు చేసే అప్పులకు ఇతర కారణాలు ఉన్నాయని మీరు భావిస్తున్నారా? మీ పెద్దలు, ఉపాధ్యాయుల నుండి సమాచారాన్ని సేకరించి తరగతిలో చర్చించండి.
జవాబు:
ఇతర కారణాలు ఉన్నాయి. అవి :

  1. అప్పటికే అప్పులలో ఉండటం,
  2. పంటలు సరిగా పండక అప్పులు తీర్చకపోవడం,
  3. ఆభరణాలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం,
  4. కట్న, కానుకలకు అప్పులు చేయడం,
  5. తామే గొప్పగా కనిపించాలి అని అనుకోవడం,
  6. అనారోగ్య పరిస్థితులకు లోనుకావడం వంటి అంశాల వలన కూడా అప్పులు చేస్తారు.

9th Class Social Textbook Page No.110

ప్రశ్న 12.
రుణదాతలు అప్పు ఇవ్వడానికి ఎందుకు పూచీకత్తును అడుగుతారు?
జవాబు:

  1. అప్పు తీసుకునేవారు తమ సొంత ఆస్తులైన భూమి, భవనాలు, వాహనం, పశుసంపద, బ్యాంకులలో డిపాజిట్లు మొదలైన వాటిని పూచీకత్తుగా చూపిస్తారు.
  2. ఇవన్నీ అప్పు పూర్తిగా తీర్చే వరకు రుణదాతకు హామీగా ఉపయోగపడతాయి.

ప్రశ్న 13.
అప్పు తీసుకోవడంలో పూచీకత్తు పేదవారిపై ఎటువంటి ప్రభావాన్ని చూపుతుంది?
జవాబు:

  1. అప్పు తీసుకోవడంలో పూచీకత్తు ప్రధానపాత్ర పోషిస్తుంది.
  2. పూచీకత్తు లేకపోతే ఎవరూ వడ్డీకి ఇవ్వడానికి ముందుకు రారు.
  3. ఒకవేళ ఇచ్చినా ఎక్కువ వడ్డీ వసూలు చేస్తారు.
  4. పేదవారిని తమ వద్ద పనిచేయమని ఒత్తిడి చేస్తారు.
  5. తక్కువ కూలీ ఇస్తారు. తప్పనిసరి పరిస్థితులలో వారు చెప్పే షరతులకు అంగీకరించాల్సి ఉంటుంది.

AP Board 9th Class Social Solutions Chapter 9 ద్రవ్య వ్యవస్థ – ఋణం

ప్రశ్న 14.
సరియైన సమాధానమును ఎంచుకొని ఖాళీలను పూరించండి.
అప్పు తీసుకునేటప్పుడు రుణగ్రహీతలు సులభమైన షరతుల కోసం ఎదురుచూస్తారు. దీని అర్థం ……….. (అధిక / అత్యల్ప) వడ్డీరేటు, ………….. (సులభమైన / కష్టమైన) షరతులతో కూడిన చెల్లింపులు, ……………….. (తక్కువ / ఎక్కువ) సంఖ్యలో చూపాల్సిన పూచీకత్తుగా ఉపయోగపడే ఆస్తులు.
జవాబు:
అత్యల్ప, సులభమైన, తక్కువ.

9th Class Social Textbook Page No.111

ప్రశ్న 15.
పై ఉదాహరణలలో రుణం పొందడానికి ఉపయోగపడే వనరుల జాబితాను రాయండి.
జవాబు:

  1. భూమికి సంబంధించిన వివరాల పత్రం.
  2. పండిన పంటను దాచినట్లు చూపే పత్రం.

ప్రశ్న 16.
అందరికీ రుణం తక్కువ వడ్డీ రేటుతో లభిస్తుందా? ఎవరెవరికి లభిస్తుంది?
జవాబు:
అందరికీ రుణం తక్కువ వడ్డీకి లభించదు.

ఎవరికి లభిస్తుంది అనగా : పంట పొలాలున్న రైతులకు, వ్యాపారస్థులకు, పారిశ్రామికవేత్తలకు, ఇటీవలికాలంలో ఏర్పడిన స్వయం సహాయక బృందాలకు, పండిన పంటలను గోదాములలో దాచినట్లు చూపే హామీపత్రాలు ఉన్న రైతులకు తక్కువ వడ్డీ రేట్లకు బ్యాంకులు రుణాలు అందిస్తాయి.
సరియైన సమాధానం వద్ద (✓) గుర్తును ఉంచండి.
అ. కాలం గడిచే కొద్దీ రమ చేసిన అప్పు
– పెరుగుతుంది. (✓)
– స్థిరంగా ఉంటుంది.
– తగ్గుతుంది.

ఆ. బ్యాంకు నుండి రుణం పొందిన కొద్ది మందిలో అరుణ్ కూడా ఒకడు. దీనికి కారణం
– అతను విద్యావంతుడు.
– బ్యాంకు అడిగే పూచీకత్తును ప్రతి ఒక్కరూ సమర్పించలేరు. (✓)
– వడ్డీ వ్యాపారులు, బ్యాంకులు విధించే వడ్డీరేటు ఒక్కటే.
– బ్యాంకు రుణం పొందుటకు ఎటువంటి దస్తావేజులు (పత్రాలు) అవసరం లేదు.

ప్రశ్న 17.
మీ ప్రాంతంలోని కొందరిని కలిసి మీ దగ్గర ఉన్న రుణ ఏర్పాట్ల వివరాలు సేకరించండి. రుణ షరతులలో ఉన్న తేడాలను నమోదు చేయండి.
జవాబు:
నమ్మకం కలిగిన వ్యాపారస్థుల నుండి, భూస్వాముల నుండి బ్యాంకులు ఏ విధమైన హామీలు లేకపోయినా పెద్ద మొత్తంలో రుణాలు ఇవ్వడానికి ముందుకు వస్తాయి.

అదే పేదవారు అయితే బ్యాంకులకు నమ్మకం ఉండదు. అందువలన వారినీ పూచీకత్తులు అడుగుతాయి.

పూచీకత్తులు చూపించిన తదుపరి రుణాలను అందజేస్తాయి.

ప్రశ్న 18.
శివకామి, అరుణ్, రమ, వాసులకు సంబంధించిన కింది వివరాలు పట్టికలో నింపండి.
జవాబు:
AP Board 9th Class Social Solutions Chapter 9 ద్రవ్య వ్యవస్థ – ఋణం 1

9th Class Social Textbook Page No.114

ప్రశ్న 19.
నియత, అనియత వనరుల నుండి పొందే రుణాలలో గల భేదాలు ఏవి?
జవాబు:

  1. ధనిక కుటుంబాలు తక్కువ వడ్డీతో నియత రుణాలను పొందుతూ ఉంటే పేద కుటుంబాలు అధిక వడ్డీతో అనియత రుణాలను పొందుతున్నారు.
  2. అనగా నియత వనరులు ధనికులకు అందుబాటులో ఉన్నాయి. పేదలకు అందుబాటులో లేవు.
  3. నియత వనరులు తక్కువ వడ్డీరేటుకు లభిస్తాయి. అనియత వనరులకు ఎక్కువ వడ్డీరేటు ఉంటుంది.
  4. నియత వనరులు బ్యాంకులు ద్వారా, సహకార సంస్థల ద్వారా పొందే రుణాలు.
  5. అనియత వనరులు వడ్డీ వ్యాపారస్థుల ద్వారా, వర్తకుల ద్వారా, యజమానుల ద్వారా, బంధువుల ద్వారా, స్నేహితుల ద్వారా పొందే రుణాలు.

ప్రశ్న 20.
ప్రతి ఒక్కరికి సముచితమైన వడ్డీ రేట్లతో ఉన్న రుణాలు ఎందుకు అందుబాటులో ఉండాలి?
జవాబు:

  1. పేదవారు అనియత రుణాలపై ఆధారపడటం వలన ఒక్కొక్కసారి తీసుకున్న మొత్తం సొమ్ము కన్నా వడ్డీ ఎక్కువగా ఉంటుంది.
  2. దానితో వారు తిరిగి చెల్లించడానికి చాలా ఇబ్బంది పడతారు. అందువలన వడ్డీరేటు ఎల్లప్పుడు తక్కువగా ఉండాలి.
  3. వడ్డీరేటు తక్కువగా ఉండే రుణాలు నియత రుణాలు. అనగా బ్యాంకులు, సహకార సంస్థలు ఇచ్చేవి.
  4. అందువలన నియత వనరుల రుణాలు మరిన్ని ప్రదేశాలకు విస్తరించి ప్రతి ఒక్కరూ పొందేలా ఉండాలి.
  5. దానితో పేదప్రజలు తక్కువ వడ్డీపై రుణాలను పొందగలుగుతారు.

AP Board 9th Class Social Solutions Chapter 9 ద్రవ్య వ్యవస్థ – ఋణం

ప్రశ్న 21.
ఆర్.బి.ఐ లాగానే అనియత రుణాలకు పర్యవేక్షణాధికారి ఉండాలా? ఈ పని ఎందుకు కష్టతరం?
జవాబు:

  1. ఆర్.బి.ఐ లాగానే అనియత రుణాలకు పర్యవేక్షణాధికారి ఉండాలి. కానీ చాలా కష్టం.
  2. ఎందుకంటే అనియత రుణాలు ఎవరు ఇచ్చారు? ఎవరు తీసుకున్నారు? అనేది వివాదాస్పదం అయితే తప్ప ఎవరికీ తెలియదు.
  3. ఏ వడ్డీ వ్యాపారస్థుడైనా లేదా ఏ ధనవంతుడైనా మేము ఇంత పైకము వడ్డీకి ఇచ్చాము అని సమాచారాన్ని ఎవరికీ చెప్పరు.
  4. అంతేకాక ఆ లావాదేవీలన్నీ అనధికారికంగా జరుగుతాయి. అధికారికంగా వెల్లడి చేయరు.
    అందువలన పర్యవేక్షణాధికారి ఉండలేరు.

ప్రశ్న 22.
ఆంధ్రప్రదేశ్ రైతుల నిస్పృహకు పేదవారికి నియత రుణాలు తక్కువగా అందడం కూడా ఒక కారణమా? చర్చించండి.
జవాబు:

  1. అవును, అదీ ఒక కారణమే ఎందుకో మన ప్రభుత్వం చెప్పినంతగా బ్యాంకులు వ్యవసాయదారులకు రుణాలు ఇవ్వడం లేదు.
  2. వ్యవసాయం చేసే వారిలో ఎక్కువ మంది కౌలు రైతులు ఉండటం, వారికి యజమాన్యపు హక్కు లేకపోవడం వలన వారికి రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు ముందుకు రావడం లేదు.
  3. దానితో వారు నిరాశ నిస్పృహలతో ప్రయివేటు వ్యక్తులను ఆశ్రయించి ఎక్కువ వడ్డీకి రుణాలను పొందవలసి వస్తున్నది.

9th Class Social Textbook Page No.115

ప్రశ్న 23.
బ్యాంకు నుండి పొందే రుణానికి స్వయం సహాయక బృంద సభ్యురాలిగా పొందే రుణానికి గల భేదాలు ఏమిటి?
జవాబు:

  1. బ్యాంకు నుండి పొందే రుణం వ్యక్తిగతం. :
  2. స్వయం సహాయక బృంద సభ్యురాలుగా పొందే రుణం సమష్టిది.
  3. బ్యాంకు నుండి రుణాన్ని వ్యక్తిగతంగా ఎప్పుడైనా తిరిగి చెల్లించవచ్చు.
  4. స్వయం సహాయక బృంద సభ్యురాలుగా పొందే రుణం సభ్యులందరితో కలసి సమష్టిగా చెల్లించాలి.
  5. బ్యాంకు నుండి పొందేది వ్యక్తిగత బాధ్యత. 6. స్వయం సహాయక బృందం పొందేది సమష్టి బాధ్యత.

ప్రశ్న 24.
కొన్ని స్వయం సహాయక బృందాలు’ వారి సభ్యులు తీసుకునే రుణాలకు అధిక వడ్డీని వసూలు చేస్తాయి. ఈ చర్య సరియైనదేనా? చర్చించండి.
జవాబు:

  1. సరియైనది కాదు ఎందువలననగా అన్ని స్వయం సహాయక బృందాలూ ఒకే రకమైన వడ్డీలు వసూలు చేయాలి.
  2. అందరీ పట్లా సమానత పాటించాలి.
  3. ఏ విధమైన వ్యత్యాసం చూపించరాదు.
  4. దానితో వారిలో ఆత్మస్టెర్యం పెరిగి ధైర్యంతో కొత్త కొత్త పనులు చేయడానికి, నూతన ఉత్పత్తులు చేయడానికి ముందుకు వస్తారు.

AP Board 9th Class Social Solutions Chapter 9 ద్రవ్య వ్యవస్థ – ఋణం

ప్రశ్న 25.
స్వయం సహాయక బృందాల సమాఖ్య యొక్క పాత్ర ఏమిటి?
జవాబు:

  1. స్వయం సహాయక బృందాలు గ్రామీణ, పట్టణ పేదప్రజలకు కేంద్రంగా పనిచేస్తాయి.
  2. మహిళలు స్వయం కృషితో ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి మాత్రమే కాకుండా వివిధ సామాజిక సమస్యలైన ఆరోగ్యం , పోషణ, గృహ హింస మొదలైన వాటిని చర్చించి సరియైన చర్యలు తీసుకునే వేదికగా కూడా స్వయం సహాయక బృందాల సమావేశాలు తోడ్పడతాయి.

ప్రాజెక్టు

మీ ప్రాంతంలో ఏ రైతు అయినా ఆత్మహత్య చేసుకున్నాడా? అయితే దానికి కారణాలను తెల్సుకొని ఒక రిపోర్టు తయారు చేసి, వార్తాపత్రికలలో దీనికి సంబంధించిన వార్తలను సేకరించి మీ తరగతి గదిలో చర్చించండి.

మా ప్రాంతంలో ఒకప్పుడు రామయ్య అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. దానికి కారణం అప్పట్లో అనావృష్టి పరిస్థితి ఏర్పడి ఆరుగాలం శ్రమించి కష్టపడి వేసుకున్న పంట చేతికి రాక ఎండిపోతే దానికి పెట్టిన పెట్టుబడి తీర్చలేక ఆత్మహత్య చేసుకున్నాడు.

రిపోర్టు :

అయ్యా,
న్యూస్ పేపర్ మేనేజర్ గారికి
మా ప్రాంతంలో ఒకప్పుడు తీవ్రమైన దుర్భిక్ష పరిస్థితి నెలకొన్నది. వర్షాలు లేక నదులు ఎండిపోయి కాలువల ద్వారా నీరు రాక బావులలో సైతం ఊటలేక ‘చెరువులు ఎండిపోయి తత్ఫలితంగా పొలాలలో వేసిన పంటలు ఎండిపోయి, రైతులు పెట్టిన పెట్టుబడి రాక కుమార్తె పెండ్లి కుదుర్చుకొని పంట పండితే వాటిని అమ్మగా వచ్చిన డబ్బుతో కుమార్తెకు కట్నకానుకలు ఇచ్చి వివాహం చేద్దామనికొని నిర్ణయించుకున్న రామయ్య అనే రైతు చివరికి పెట్టిన పెట్టుబడి కూడా రాక వేసిన పంట ఎండిపోవడం చూసి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. కాబట్టి మేనేజర్ గారు దీనిని వార్తా పత్రికలయందు ప్రచురించి ఇలాంటి నిర్ణయాలు ఎవరిని తీసుకోవద్దు, బ్రతికి ఉంటే ఈ సంవత్సరం పంట పండకపోయిన వచ్చే సంవత్సరం పండుతుంది. ప్రభుత్వం ‘ఈసారి ముందుగానే పరిస్థితిని అంచనావేసి తగిన నిర్ణయాలు తీసుకొని చక్కని ప్రణాళికను రూపొందించి రైతులను ఆదుకుంటుంది, ప్రకృతి సహకరిస్తుంది’ అని రైతులకు తెలియజేయండి. వారిలో మనో ధైర్యాన్ని నింపండి.

ఇట్లు,
రామతేజ,
9వ తరగతి.

AP Board 9th Class Social Solutions Chapter 8 భారతదేశంలో సేవా కార్యకలాపాలు

SCERT AP 9th Class Social Studies Guide Pdf 8th Lesson భారతదేశంలో సేవా కార్యకలాపాలు Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Social Solutions 8th Lesson భారతదేశంలో సేవా కార్యకలాపాలు

9th Class Social Studies 8th Lesson భారతదేశంలో సేవా కార్యకలాపాలు Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
1. ‘సేవా కార్యకలాపాలు’ అంటే ఏమిటి? (AS1)
జవాబు:

  1. సేవా కార్యకలాపాలు వ్యవసాయ, పారిశ్రామిక కార్యకలాపాలకు అవసరమైనటువంటివి.
  2. సేవా కార్యకలాపాలు ఉత్పత్తి చేసే సేవలు వరి లేక వస్త్రం లాగా కంటికి కనిపించవు. అయినప్పటికి వీరు ఒక ప్రత్యేకమైన సేవలను తమ పనుల ద్వారా ప్రజలకు, వ్యాపారాలకు అందిస్తారు.
  3. ఇక్కడ సేవ అనేది చేసిన పని స్వభావాన్ని తెలుపుతుంది.
  4. సేవ అనేది వస్తువు యొక్క ఉత్పత్తికి భిన్నమైనది.
    ఉదా : ఆసుపత్రిలో వైద్యులు చేసేది సేవ
    కిరాణాషాపులో వ్యాపారి చేసేది సేవ
    సంస్థలో అకౌంటెంట్ చేసేది సేవ
    వ్యా న్ డ్రైవర్ చేసేది సేవ
    బ్యాంకులు, రవాణా రంగాలు చేసేవి సేవలు.

ప్రశ్న 2.
ఏవైనా ఐదు సేవా కార్యకలాపాలమ రాసి, అవి ఎందుకు వ్యవసాయ, పారిశ్రామిక కార్యకలాపాల కిందికి రావో కారణాలు తెలపండి. (AS1)
జవాబు:
ఐదు సేవా కార్యకలాపాలు
1. వైద్యం :
వైద్యులు ఆసుపత్రిలో రోగులను పరీక్షించి, మందులను సూచించి వారి ఆరోగ్య పరిస్థితులను సమీక్షిస్తారు.

2. వ్యాపారం :
వస్తువులను సూల్ సేల్ దుకాణాల నుండి కొనుగోలు చేసి వినియోగదారులకు విక్రయించడం.

3. అకౌంటెంట్ :
ఖాతాలను పరిశీలించడం, చెల్లింపులను రశీదులను సరిచూసుకుంటూ ఆ బిల్లులు, ఖాతాలకు అనుకూలంగా ఉన్నాయో లేదో సరిచూడటం. ప్రతి యొక్క వ్యాపార సంస్థకు ఖాతాలను రాయడం, నిర్వహించడం.

4. డ్రైవర్ :
ఆటోలలో, వ్యా న్లలో ప్రయాణికులను ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి చేరవేయడం. సరకులను కూడా ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి చేరవేయడం.

5. ప్రభుత్వ పరిపాలన :
గ్రామాలు, నగర పంచాయతీలు, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల ద్వారా అందించే ప్రజాసేవలన్నీ పరిపాలన వర్గానికి చెందుతాయి.
ఉదా : పోలీసులు, గ్రామ పరిపాలనాధికారులు మొదలయినవారు.

పైన పేర్కొన్న వారు అందిస్తున్న సేవలు రైతులు, వ్యవసాయ కూలీలు, పరిశ్రమలలో పనిచేసే వారి పనులకు భిన్నంగా ఉన్నాయని మనం గమనించవచ్చు.
6. వీరు ఉత్పత్తి చేసే సేవలు వరి లేక వస్త్రం లాగా కంటికి కనిపించవు.

7. అయినప్పటికి వీరు ఒక ప్రత్యేకమైన సేవలను తమ పనుల ద్వారా ప్రజలకు, వ్యాపారాలకు అందిస్తారు.

8. ఇక్కడ సేవ అనేది చేసిన పని స్వభావాన్ని తెలుపుతుంది.

9. సేవ అనేది వస్తువు యొక్క ఉత్పత్తికి భిన్నమైనది.

AP Board 9th Class Social Solutions Chapter 8 భారతదేశంలో సేవా కార్యకలాపాలు

ప్రశ్న 3.
దేశ సమగ్రాభివృద్ధికి సేవా కార్యకలాపాలు ఎలా తోడ్పడతాయి? (AS1)
జవాబు:

  1. సేవా కార్యకలాపాలనేవి వ్యవసాయం లేదా పరిశ్రమలలో తయారవుతున్నట్లు వస్తువును ఉత్పత్తి చేయవు.
  2. ఇవి వ్యవసాయానికి, పరిశ్రమలకు, ప్రజలకవసరమైన ఎన్నో సేవలను చేస్తూ ఒక ప్రత్యేకమైన రీతిలో సహాయం చలాయి.
  3. రవాణ సమాచార సాధనాలు, బ్యాంకులు మొదలైన రంగాలు అభివృద్ధి చెందడం వలన వ్యవసాయక ఉత్పత్తులకు, పారిశ్రామిక ఉత్పత్తులకు ఉపయోగించడం మాత్రమేకాక వస్తువుల సరఫరాకు తగిన ఆర్థిక వనరులు అందించుటకు తద్వారా వాటి అభివృద్ధికి కారకాలు అవుతాయి.
  4. ప్రజలు మెరుగైన ఆదాయాలు ఆర్జించినపుడు వారి వినియోగ వ్యయంలో కూడా మార్పులు వస్తాయి.
  5. వారు ఎక్కువగా సేవాసంబంధమైన కార్యకలాపాలైన విద్య, వినోదం, ఆహారం, పర్యాటకం పైన ఎక్కువ ఖర్చు చేయడానికి ఆసక్తి చూపుతారు. అభివృద్ధికి అది ఒక చిహ్నం.

ప్రశ్న 4.
వ్యవసాయ, పారిశ్రామిక కార్యకలాపాలు సేవలతో ఎలా ముడిపడి ఉన్నాయి? (AS1)
జవాబు:

  1. సేవలు అనేవి వ్యవసాయానికి, పరిశ్రమలకు, ప్రజలకు అనేకానేక అవసరాలకు ఒక ప్రత్యేకమైన రీతిలో సహాయపడతాయి.
  2. వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్ కు తరలించడంలో, వీటిని కొంతమంది వ్యక్తుల సమూహం కొని వినియోగదారులకు నేరుగా లేదా రైస్ మిల్లులు, నూనె మిల్లులు వంటి ఇతర ఉత్పత్తిదారులకు అమ్మడం జరుగుతుంది.
  3. ఇవి అన్నీ సేవాసంస్థలైన రవాణా, వాణిజ్య, కార్యకలాపాల ద్వారా జరుగుతాయి.
  4. పారిశ్రామిక కార్యకలాపాలకు పట్టణాలలో, నగరాలలోని సిమెంట్ వ్యాపారులకు రైల్వేల ద్వారా సిమెంట్ కర్మాగారాల నుండి సిమెంట్ సంచులు రవాణా కాకపోతే భవన నిర్మాణాలు ఎలా జరుగుతాయి?
  5. కావున వ్యవసాయక, పారిశ్రామిక కార్యకలాపాలన్నీ సేవలపైనే ఆధారపడి ఉన్నాయి.

ప్రశ్న 5.
సేవారంగం పెరుగుదల సుస్థిరమైనది మరియు అది భారతదేశాన్ని ఒక ధనిక దేశంగా చేస్తుంది. ఈ వ్యాఖ్యతో నీవు ఏకీభవిస్తావా? విశదీకరించండి. (AS2)
జవాబు:

  1. భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలలో అభివృద్ధికి ప్రోత్సాహమనేది ఎన్నో వ్యవస్థాపక సౌకర్యాలతో ముడిపడి ఉంటుంది.
  2. ఇది అవస్థాపన సౌకర్యాలు, ఇతర సేవల విస్తరణను కలిగి ఉంటుంది.
  3. రవాణా సమాచార సాధనాలు, బ్యాంకులు మొదలైన విలువైన సేవల తరహాలోనే సేవా కార్యకలాపాల విలువ కూడా – పెరగాలని ఆశించడం సహజం.
  4. భారతదేశంలో ఉద్యోగాలు చేసే వారిలో 1/4వ వంతు సేవాకార్యకలాపాలే కలిగి ఉన్నారు.
  5. సేవాకలాపాల ఉద్యోగాలు ప్రజల జీవన స్థాయిలో పురోభివృద్ధికి ఒక కారణం.
  6. ప్రజలు మెరుగైన ఆదాయాలు ఆర్జించినపుడు వారి వినియోగ వ్యయంలో కూడా మార్పులు వస్తాయి.
  7. వారు ఎక్కువగా సేవా సంబంధమైన కార్యకలాపాలైన విద్య, వినోదం, ఆహారం, పర్యాటకం పైన ఎక్కువ ఖర్చు చేయడానికి ఆసక్తి చూపుతారు.

అందువలన సేవారంగం సుస్థిర వృద్ధి భారతదేశాన్ని ఒక ధనిక దేశంగా చేస్తుందనడంలో ఏ మాత్రం సందేహం లేదు.

AP Board 9th Class Social Solutions Chapter 8 భారతదేశంలో సేవా కార్యకలాపాలు

ప్రశ్న 6.
సేవారంగం కార్యకలాపాలు ఎందుకు ప్రాముఖ్యత సంతరించుకుంటున్నాయి? (AS1)
జవాబు:
సేవారంగ కార్యకలాపాలు ప్రాముఖ్యత సంతరించుకోవడానికి ప్రధాన కారణాలు :

  1. మారుతున్న పరిస్థితులకనుగుణంగా సమాచార, సాంకేతిక విజ్ఞానంలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి.
  2. మానవ జీవితం యాంత్రికమైనది.
  3. రవాణా, కమ్యూనికేషన్ వ్యవస్థ పూర్తిగా మారిపోయింది.
  4. సుదూర ప్రాంతాలను అతి తక్కువ సమయంలో చేరడానికి గాను, ఇంటర్నెట్, గ్లోబల్ విలేజ్ వంటి వాటి ద్వారా మానవ సమాజం చేరువైనది.
  5. అధునాతన వైద్య సదుపాయాలు అందుబాటులోనికి వచ్చాయి.
  6. అనేక రకాలుగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నాయి.

ప్రశ్న 7.
వ్యవసాయం, పరిశ్రమలు లేకుండా సేవా కార్యకలాపాలను ఒక స్థాయిని దాటి విస్తరించలేం. వివరించండి. (AS1)
జవాబు:

  1. ఆర్థిక వ్యవస్థలో ప్రాథమిక రంగమైన వ్యవసాయ రంగం, ద్వితీయ రంగమైన పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందితే తృతీయ రంగం సత్వర, సుస్థిర ప్రగతిని సాధిస్తుంది.
  2. ఆర్థిక వ్యవస్థ అనే ఇరుసుకు రెండు చక్రాల వంటివి వ్యవసాయ, పారిశ్రామిక రంగాలు. వీటి వలన ఉత్పాదక సామర్థ్యం పెరుగుతుంది.
  3. ఉత్పాదక సామర్థ్యం. ఉన్న చోట సేవారంగం సుస్థిర ప్రగతి సాధిస్తుంది.
  4. ప్రజలు మెరుగైన ఆదాయాలు పొందాలంటే వ్యవసాయ, పారిశ్రామిక రంగాలు అభివృద్ధి చెందాలి. అప్పుడు వారి వినియోగ వ్యయంలో మార్పులు వచ్చి సేవాకార్యకలాపాలైన విద్య, వినోదం, ఆహారం, పర్యాటకం వంటి వాటిపై ” ఖర్చు చేయడానికి ఆసక్తి చూపుతారు.
  5. అందువల్ల వ్యవసాయ, పారిశ్రామిక రంగాలు అభివృద్ధి చెందడం వల్ల సేవాకార్యకలాపాలు ఒకస్థాయిని దాటి విస్తరించగలవు.

ప్రశ్న 8.
భారతదేశంలో చదువుకున్నవారి నిరుద్యోగితను సేవారంగం ఎలా తగ్గించగలదు? (AS1)
జవాబు:

  1. సాంకేతిక పరిజ్ఞానంలో నిరంతర మార్పు ,సేవారంగాన్ని ముందుకు నడిపిస్తుంది.
  2. వ్యాపార నిర్వహణలో పొరుగు సేవల ద్వారా కొత్త తరహా ఉద్యోగ అవకాశాలను నిరుద్యోగ యువతకు కల్పిస్తోంది.
  3. టెలికమ్యూనికేషన్ల అనుసంధానాన్ని ఉపయోగించుకొని ఉద్యోగులు తాము ఉన్న చోటునుండి ప్రపంచంలో ఎక్కడ ఉన్న వారికైనా తమ సేవలను అందిస్తున్నారు.
  4. ప్రధాన నగరాలలో స్థాపించబడిన ఎన్నో ఐ.టి. సంస్థలు అత్యంత నిపుణులైన ఇంజనీర్లకు ఉద్యోగాలు కల్పించి ప్రత్యేకమైన సాఫ్ట్ వేర్ సేవలను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సంస్థలకు అందిస్తున్నాయి. వారికి ఇతర దేశాల నుండి ప్రాజెక్టులు వస్తాయి.
  5. వినోద పరిశ్రమ, వార్తా ప్రసార సంస్థలు, కేబుల్ టెలివిజన్ ఛానల్ లో ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నాయి.
  6. పట్టణాలలో, నగరాలలో ఇంటర్ నేట్ కేఫీలు, పబ్లిక్ టెలిఫోన్ బూత్ లు సర్వసాధారణంగా కన్పిస్తాయి.
  7. సాధారణంగా వాణిజ్య ప్రకటనల రంగం కూడా కొత్త ఉద్యోగ అవకాశాలు తీసుకువచ్చింది.

ప్రశ్న 9.
మీ ప్రాంతం నుండి ఎవరైనా పనివారు వలస వెళ్లారా? వారు ఎందుకు వలస వెళ్లారో కారణాలు తెలుసుకోండి. (AS3)
జవాబు:

  1. మా ప్రాంతం నుండి వలస వెళ్ళినవారు ఉన్నారు.
  2. వారు వివిధ రకాల పనుల నిమిత్తం వివిధ ప్రాంతాలకు వలస వెళ్ళినారు.
  3. ఉన్నత చదువులు చదువుకుని ఉన్నత ఉద్యోగాల కోసం వివిధ ప్రాంతాలకు వలస వెళ్ళినారు.
  4. అలాగే పనిపాటలు చేసుకునే వివిధ రకాల పనులు కోసం వలస వెళ్ళినారు.
  5. కూలి పనులు చేసుకునేవారు మా ప్రాంతంలో పని ఉన్నప్పుడు ఉండి పని లేని సమయంలో వేరే ప్రాంతాలకు వలస వెళ్ళి పనులు పూర్తయిన తదుపరి ప్రాంతానికి వస్తారు.

ప్రశ్న 10.
ఈ పాఠంలోని 9వ పేరా చదవండి (సేవా కార్యకలాపాలనేవి వ్యవసాయం….) ఈ కింది ప్రశ్నకు సమాధానం వ్రాయండి. వ్యవసాయం, పరిశ్రమలకు అవసరమైన, సేవా కార్యకలాపాలు ఏమిటి?
జవాబు:

  1. రోడ్లు, రైలు, జల, వాయు మార్గాలు అనగా రవాణా సౌకర్యాలను ఏర్పాటు చేయాలి.
  2. వైద్య, విద్యా సంస్థలను ఏర్పాటు చేయడం
  3. గిడ్డంగి సౌకర్యాలను కల్పించడం.
  4. రుణ సదుపాయాలను కల్పించడం.
  5. వ్యాపార సౌకర్యాలను ఏర్పాటుచేయడం.

ప్రశ్న 11.
పేజీ నెం. 104లోని పటాన్ని పరిశీలించి భారతదేశ అవుట్ లైన్ పటంలో సాఫ్ట్ వేర్ టెక్నాలజీ పార్కులు గల నగరాలను గుర్తించండి.
జవాబు:
AP Board 9th Class Social Solutions Chapter 8 భారతదేశంలో సేవా కార్యకలాపాలు 2

9th Class Social Studies 8th Lesson భారతదేశంలో సేవా కార్యకలాపాలు InText Questions and Answers

9th Class Social Textbook Page No.97

ప్రశ్న 1.
ఈ కింద ఎనిమిది రకాల సేవా కార్యకలాపాలు ఇవ్వబడ్డాయి. కొన్ని వివరాలు నింపి మిగిలినవి వదిలేయబడ్డాయి. మీ ఉపాధ్యాయుడితో చర్చించి ఆ ఖాళీలను పూరించండి.
జవాబు:
1. విద్య : సంస్థలు :
పాఠశాలలు, కళాశాలలు, విశ్వ విద్యాలయాలు, సాంకేతిక విద్యాసంస్థలు ఈ కోవకు చెందుతాయి. ఈ సంస్థలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, పరిపాలన సిబ్బంది, వారి కార్యకలాపాలు సేవలను అందిస్తాయి.

2. ఆరోగ్య, వైద్య సేవలు :
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, జిల్లా జనరల్ ఆసుపత్రులు, వివిధ రకాలైన వైద్య కేంద్రాలు, వృద్ధాశ్రమాలు మొ||నవి.

3. వర్తకం :
మన చుట్టూ చూస్తున్న వివిధ రకాల టోకు (సూల్ సేల్) చిల్లర వ్యాపార కార్యకలాపాలు, జాతీయ, అంతర్జాతీయ వ్యాపారం మొదలైనవి.

4. ప్రభుత్వ పరిపాలన :
గ్రామీణ, నగర పంచాయితీలు, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల ద్వారా అందించే ప్రజాసేవలన్నీ ఈ . వర్గానికి చెందుతాయి. ఉదా: పోలీస్ స్టేషన్లో పనిచేసే వ్యక్తులు, వివిధ ప్రభుత్వ విభాగాలలో చేస్తున్న వ్యక్తులు అంటే గ్రామ పరిపాలనాధికారులు, రెవెన్యూ ఇన్ స్పెక్టర్, తహసీల్దార్లు అన్ని రకాల న్యాయస్థానాలలో పనిచేయువారు, . అసిస్టెంట్లు, క్లలు, అకౌంటెంట్లు, టైపిస్టులు, ఫ్యూన్లు, డ్రైవర్లు మొదలగువారు.

5. రక్షణ రంగం :
త్రివిధ దళాలకు చెందిన సైనిక,నావిక, వైమానిక దళాలలో పనిచేయు వ్యక్తులు, వారి కార్యకలాపాలు ఈ కోవకు చెందుతాయి. బిఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్ పోలీసుల సేవల వంటివి కూడా వస్తాయి.

6. విత్త కార్యకలాపాలు :
బ్యాంకులు, వివిధ పొదుపు పథకాలు, తపాలా తంతి – వ్యవస్థ, జీవిత బీమా సంస్థ మొ||నవి.

7. వ్యక్తిగత సేవలు :
ఇళ్లలో పనిచేయు పనివారు, బట్టలు ఉతుకువారు, శుభ్రపరిచేవారు, అద్దకం సేవలు, క్షురకులు, బ్యూటీపార్లర్ నడిపేవారు, టైలరింగ్ పనివారు, ఫోటో, వీడియో స్టూడియోలో పనిచేయువారు.

8. ఇతర రకాల కార్యకలాలు :
వినోదం, సమాచార సాంకేతిక పరిశ్రమలు – చిత్ర నిర్మాణం, టీవీ సీరియళ్లలో పని చేయువారు. వార్తాపత్రికలు, టివి ఛానళ్లలో, వాణిజ్య ప్రకటన సంస్థలు, మీడియాలో పనిచేసేవారి పనులు కూడా సేవలకు చెందుతాయి.

9th Class Social Textbook Page No.100

ప్రశ్న 2.
1991 నుండి 2010 వరకు కొన్ని ప్రధాన తరగతులలో వివిధ సేవా కార్యకలాపాలలో పనిచేసే వారి సంఖ్యను (లక్షలలో) ఈ కింది పట్టిక చూపుతుంది. ఈ పట్టికను జాగ్రత్తగా చదివి కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.AP Board 9th Class Social Solutions Chapter 8 భారతదేశంలో సేవా కార్యకలాపాలు 1
1) 2010 సంవత్సరంలో ఏ సేవా కార్యకలాపం అత్యధిక ఉద్యోగితను కల్పించింది?
జవాబు:
సామాజిక, సాంఘిక, వ్యక్తిగత సేవలు.

2) గత సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగాల సంఖ్య పెరిగిందా లేదా తగ్గిందా? ఈ కాలంలో ఏ రకమైన ఉద్యోగాలు ప్రభుత్వం కల్పించింది?
జవాబు:
గత సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగాల సంఖ్య తగ్గింది. విత్త, బీమా సంస్థలు, స్థిరాస్తి వ్యాపారం మొదలగునవి మాత్రం 11.9 నుంచి 14.1 కి పెరిగాయి.

3) ప్రైవేటు సేవాకార్యకలాపాల్లో ప్రజలు ఎటువంటి ఉద్యోగాలను పొందగలిగారు?
జవాబు:
ప్రైవేట్ ఉద్యోగాల సంఖ్య పెరిగింది.

టోకు వర్తకం, చిల్లర వర్తకం, రవాణా గిడ్డంగులు, సమాచార రంగం, విత్త, బీమా సంస్థలు, స్థిరాస్తి వ్యాపారం మొదలైన వాటిల్లోనూ,

సామాజిక, సాంఘిక, వ్యక్తిగత సేవలు వంటి అంశాలలో ఉద్యోగాలు పెరిగాయి.

4) ప్రభుత్వ, ప్రైవేట్ వ్యవస్థలో కల్పిస్తున్న ఉద్యోగాలకు మధ్య ఏమైనా వ్యత్యాసాలు ఉన్నాయా? చర్చించండి.
జవాబు:

  1. టోకు వర్తకం, చిల్లర వర్తకం వంటి అంశాలలో ‘ప్రైవేట్ ఉద్యోగాలు ఎక్కువగా ఉండగా
  2. రవాణా గిడ్డంగులు, సమాచార రంగం వంటి అంశాలలో ప్రభుత్వ ఉద్యోగాలు ఎక్కువగా ఉండి, ప్రైవేట్ ఉద్యోగాలు తక్కువగా ఉన్నాయి.
  3. విత్త, బీమా సంస్థలు, స్థిరాస్తి వ్యాపార రంగాలలో ఒకప్పుడు ప్రైవేట్ ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు కన్నా తక్కువగా ఉండగా ఈ మధ్య కాలంలో ప్రభుత్వ ఉద్యోగాల కన్నా ప్రైయివేట్ ఉద్యోగాల సంఖ్య పెరిగింది.
  4. సామాజిక, సాంఘిక, వ్యక్తిగత సేవల రంగాలలో ప్రైవేట్ ఉద్యోగాలకన్నా ప్రభుత్వ ఉద్యోగాలు ఎక్కువగా ఉన్నాయి.

9th Class Social Textbook Page No.101

ప్రశ్న 3.
చిల్లర వర్తకంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులపై మీ అభిప్రాయం ఏమిటి? ఈ సమస్యను చక్కదిద్దడానికి ప్రభుత్వం ఏమైనా చేయగలుగుతుందా?
జవాబు:

  1. మా అభిప్రాయం ఏమనగా వీటి వల్ల లాభాలు, నష్టాలు ఉన్నాయి.
  2. మొత్తం మీద చూస్తే నష్టాల కంటే లాభాలే ఎక్కువ అని అంటారు.
  3. అంతేకాక కాలక్రమంలో మొదట్లో నష్టపోయిన వాళ్లు కూడా లాభపడతారు.
  4. పెద్ద, మధ్యతరగతి రైతులు ప్రారంభంలో ఎక్కువ లాభపడతారని, చిన్న రైతులు లేదా భూమి లేని కూలీలు నష్టపోతారని పేర్కొంటారు.
  5. అయితే పెద్ద సూపర్ మార్కెట్ల కొనుగోళ్ల వల్ల వ్యవసాయ ఉత్పత్తులకు గిరాకీ పెరిగి తత్ఫలితంగా వ్యవసాయ ఉత్పత్తి పెరుగుతుంది.
  6. దీని వల్ల కూలీలకు గిరాకీ పెరిగి క్రమంగా వ్యవసాయ కూలీ రేట్లు పెరుగుతాయి.

ఈ సమస్యను చక్కదిద్దడానికి ప్రభుత్వం చేపట్టే అంశాలు :

  1. ఆధునిక నిల్వ సౌకర్యాలను ప్రభుత్వం కూడా ఏర్పాటు చేస్తుంది.
  2. మార్కెట్ కొద్ది చేతులలో కేంద్రీకృతం కాకుండా చూస్తుంది.
  3. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఎప్పటికప్పుడు తన పర్యవేక్షణలో పెడుతుంది.

9th Class Social Textbook Page No.102

ప్రశ్న 4.
భారతదేశంలో విదేశీ కంపెనీలు చిల్లర దుకాణాలను ఏర్పరచడంపై మీ అభిప్రాయం ఏమిటి?’ అవి భారతదేశంలో ఉపాధి కల్పనకు ఏ విధంగా దోహదం చేస్తాయి?
జవాబు:
భారతదేశంలో విదేశీ కంపెనీలు సరకులు అమ్మడానికి చిల్లర దుకాణాలను ప్రారంభించడం జరిగింది.

  1. కాలక్రమంలో ఈ విదేశీ పెట్టుబడి కంపెనీలు తమ అధికారాన్ని దుర్వినియోగం చేసి తక్కువ ధరలకు తమ సరకును అమ్మే విధంగా రైతులపై ఒత్తిడి తెస్తాయి.
  2. సరైన నిల్వ సౌకర్యాలు లేని కారణంగా వ్యవసాయ ఉత్పత్తులలో 20 – 40% వృథా అవుతున్నాయి.
  3. విదేశీ చిల్లర వ్యాపారస్తులు కూడా రైతులతో ఒప్పందం కుదుర్చుకొని వడ్డీ వ్యాపారస్తుల కంటే తక్కువ వడ్డీకి అప్పులు సమకూర్చవచ్చు.
  4. మెరుగైన నిల్వ సౌకర్యాల కారణంగా బహుళజాతి కంపెనీలు పెద్ద మొత్తంలో సరకు కొనుగోలు చేయడంతో రైతులకు వడ్డీ వ్యాపారస్తులతో పోలిస్తే ఇది ప్రయోజనకారిగా ఉంటుంది.
  5. వీటి వలన ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. ఎంతో మందికి ఉపాధి కల్పించడానికి అవకాశాన్ని ఏర్పరచుతాయి.

AP Board 9th Class Social Solutions Chapter 8 భారతదేశంలో సేవా కార్యకలాపాలు

ప్రశ్న 5.
మీ ప్రాంతంలోని కొంతమంది చిల్లర వ్యాపారస్తులతో మాట్లాడండి. విదేశీ చిల్లర దుకాణాలపై వాళ్ల అభిప్రాయాలు గురించి తరగతిలో చర్చించండి.
జవాబు:

  1. బహుళజాతి సంస్థలు ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేయడం వలన వారు తక్కువ రేటుకు అమ్మినప్పటికి వారికి నష్టాలు రావు.
  2. అందువల్ల చిన్న దుకాణదారులు అమ్మే రేట్లతో పోలిస్తే తక్కువ రేట్లకు అమ్ముతారు.
  3. దానితో వినియోగదారులు చిన్న దుకాణాదారుల వద్దకు వెళ్ళకుండా చిల్లర వర్తకంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల షాపులకు వెళ్తారు.
  4. దానితో చిల్లర దుకాణదారులు తమ షాపులను మూసివేయాల్సి వస్తుంది.
  5. వాటిపై ఆధారపడినవారు ఉపాధిని కోల్పోతారు.
  6. నిల్వ సౌకర్యాల్లో పెద్ద పెద్ద చిల్లర వ్యాపారస్తులు ఆశించినంతగా పెట్టుబడులు పెట్టలేదు.
  7. అందువల్ల సంప్రదాయ చిల్లర వర్తకులు ఉపాధి కోల్పోతారు. దీనివల్ల మార్కెట్ కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతమవుతుంది.

ప్రశ్న 6.
రెండు నిలువు వరుసలతో ఒక పట్టిక తయారు చేసి అందులో భారతదేశంలో విదేశీ కంపెనీల చిల్లర దుకాణాల వల్ల కలిగే లాభాలను, నష్టాలను పేర్కొనండి.
జవాబు:

లాభాలు నష్టాలు
1. పెద్ద సూపర్ మార్కెట్లలో కొనుగోళ్ళ వల్ల వ్యవసాయ ఉత్పత్తులకు గిరాకీ పెరిగి తత్ఫలితంగా వ్యవసాయ ఉత్పత్తి పెరుగుతుంది. దీనివల్ల కూలీలకు గిరాకీ పెరిగి క్రమంగా వ్యవసాయ కూలీ రేట్లు పెరుగుతాయి. 1. నిల్వ సౌకర్యాల్లో పెద్ద పెద్ద చిల్లర వ్యాపారస్తులు ఆశించినంతగా పెట్టుబడులు పెట్టలేదు. అందువల్ల సంప్రదాయ చిల్లర వర్తకులు ఉపాది కోల్పోతారు. దీనివల్ల మార్కెట్ కొద్ది మంది చేతుల్లో కేంద్రీకృతమవుతుంది.
2. విదేశీ చిల్లర వ్యాపారస్తులు కూడా రైతులతో ఒప్పందం కుదుర్చుకొని వడ్డీ వ్యాపారస్తులు కంటే తక్కువ వడ్డీకి అప్పులు సమకూర్చవచ్చు. 2. విదేశీ పెట్టుబడి కంపెనీలు తమ అధికారాన్ని దుర్వినియోగం చేసి తక్కువ ధరలకు తమ సరుకును అమ్మే విధంగా రైతులపై ఒత్తిడి తెస్తాయి.
3. మెరుగైన నిల్వ సౌకర్యం కారణంగా బహుళజాతి కంపెనీలు పెద్ద మొత్తంలో సరకు కొనుగోలు చేయడంతో రైతులకు వడ్డీ వ్యాపారస్తులతో పోలిస్తే ఇది ప్రయోజనకారిగా ఉంటుంది. 3. నిల్వ సౌకర్యాలపై పెట్టుబడులు పెట్టడం ద్వారా వృథా అయ్యే శాతాన్ని సూపర్ మార్కెట్లు తగ్గిస్తాయనడంలో వాస్తవం లేదు.

ప్రశ్న 7.
భారతదేశంలో మరిన్ని వైద్య విద్యాసంస్థలను నెలకొల్పాల్సిన అవసరం ఏమిటి?
జవాబు:

  1. భారతదేశం ఆరోగ్య రంగంలో 64 లక్షల వృత్తి సేవానిపుణుల కొరతను ఎదుర్కొంటున్నది.
  2. ఒక్క ఉత్తరప్రదేశ్ లోనే 10 లక్షల ఆరోగ్య సంబంధ వృత్తి సేవానిపుణుల కొరత ఉంది.
  3. 2011 లో భారతదేశంలో ప్రతి 10 వేల జనాభాకు ఆరుగురు డాక్టర్లు ఉన్నారు.
  4. అదే నర్సులు, మంత్రసానుల విషయానికొస్తే ప్రతి 10 వేలమందికి 13 మంది ఉన్నారు.
  5. డాక్టరు, జనాభా నిష్పత్తి భారతదేశంలో 0.5 : 1000 కాగా, థాయ్ లాండ్లో 0.3, శ్రీలంకలో 0.4, చైనాలో 1.6, ఇంగ్లాండ్లో 5.4, అమెరికాలో 5.5 గా ఉంది.
  6. దంత సంబంధిత సాంకేతిక విజ్ఞానంలో 20 లక్షల మంది నిపుణుల కొరత ఉంది.
  7. పునరావాస వృత్తి సంబంధిత వృత్తినిపుణులలో 18 లక్షల మంది కొరత ఉంది.
  8. ఆపరేషన్లో మత్తుమందుకు సంబంధించిన నిపుణులు 9 లక్షలమంది కొరత ఉంది.
  9. వివిధ ఆరోగ్య కార్యకర్తలు సంబంధించిన నిపుణులు 9 లక్షలమంది కొరత ఉంది.
  10. వైద్య పరీక్షల సాంకేతిక నిపుణులు 2.4 లక్షల మంది కొరత ఉంది.
  11. ఆపరేషన్ సంబంధిత ఆరోగ్య నిపుణులు – 2 లక్షల మంది కొరత ఉంది.
  12. కంటికి సంబంధించిన కార్యకర్తలు 1.3 లక్షల మంది కొరత ఉంది.

వృత్తి, విద్యా కళాశాలలు, పాఠశాలల కేటాయింపుల్లో అసమానతల వల్ల అన్ని ప్రాంతాలలో సమానంగా లేరు.

అందువల్ల వైద్య, విద్యా సంస్థలను నెలకొల్పవలసిన అవసరం ఎంతైనా ఉంది.

AP Board 9th Class Social Solutions Chapter 8 భారతదేశంలో సేవా కార్యకలాపాలు

ప్రశ్న 8.
కొత్త వైద్య విద్యా సంస్థలను ప్రభుత్వ రంగంలో నెలకొల్పవచ్చా లేక ప్రైవేట్ రంగంలోనా? ఎందుకు?
జవాబు:
ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలోను స్థాపించవచ్చు.

ఎందుకనగా :

  1. ప్రభుత్వరంగంలో స్థాపించడం వలన పేద, మధ్యతరగతికి చెందిన ప్రతిభగల విద్యార్థినీ విద్యార్థులకు వైద్య విద్య అందుబాటులోకి వస్తుంది.
  2. ప్రైవేట్ రంగంలో స్థాపించినప్పటికి కొన్ని సీట్లను ప్రతిభగల పేద విద్యార్థులకు కేటాయించడం వల్ల వారికి న్యాయం చేకూరుతుంది.
  3. ప్రభుత్వం పైన నిర్వహణ ఖర్చు ఉండదు. ఆర్థిక భారమూ పడదు.

ప్రాజెక్టు

ప్రశ్న 1.
ఎవరైనా ఏడుగురు వ్యక్తులను కలసి వారి ఏ రంగంలో పనిచేస్తున్నారో తెలుసుకోండి. వారి పని గురించి సంక్షిప్తంగా వ్రాయండి. లేదా పోస్టరు తయారుచేయండి. వారి నివాస ప్రాంతానికి వారి పనికి మధ్య ఎలాంటి సంబంధాన్ని చూసారు.
జవాబు:

వ్యక్తి పేరు చేసే పని యొక్క స్వభావం వ్యవసాయం/పరిశ్రమ/సేవలు
1. రామారావు ప్రభుత్వ డాక్టరు సేవలు
2. కార్తికేయ ప్రభుత్వ సీనియర్ అసిస్టెంట్ సేవలు
3. వేణుగోపాలరావు ప్రైవేటు డాక్టర్ సేవలు
4. ముకుందరావు ప్రైవేటు డాక్టర్ సేవలు
5. మీరాబాయి ప్రభుత్వ సీనియర్ నర్సు సేవలు
6. పాపారావు రైతు వ్యవసాయం
7. బుచ్చమ్మ కార్మికురాలు పరిశ్రమ

వైద్య నిపుణుల కొరత గురించి ప్రభుత్వ ప్రయివేటు వైద్యశాలలయందు పైన పేర్కొన్న వ్యక్తులతో మాట్లాడగా వారు క్రింది విషయాలను వెల్లడి చేశారు.
అవి :

  1. మన దేశంలో, మన రాష్ట్రంలో, మన ప్రాంతంలో వైద్య నిపుణుల కొరత ఎంతైనా ఉంది.
  2. అనేక గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలకు ఇంకా డాక్టర్ అందుబాటులో లేడంటే ఆశ్చర్యపడవలసిన పనిలేదు.

AP Board 9th Class Social Solutions Chapter 7 భారతదేశంలో పరిశ్రమలు

SCERT AP 9th Class Social Studies Guide Pdf 7th Lesson భారతదేశంలో పరిశ్రమలు Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Social Solutions 7th Lesson భారతదేశంలో పరిశ్రమలు

9th Class Social Studies 7th Lesson భారతదేశంలో పరిశ్రమలు Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
మౌలిక సరుకుల పరిశ్రమలను నెలకొల్పటానికి ప్రభుత్వం ఎందుకు బాధ్యత తీసుకుంది? (AS1)
జవాబు:
మౌలిక సరుకుల పరిశ్రమలను నెలకొల్పటానికి ప్రభుత్వం బాధ్యత తీసుకొనటానికి గల కారణం :

  1. దేశం పారిశ్రామికీకరణ చెందాలంటే, వివిధ రకాల కర్మాగారాలు పెద్ద సంఖ్యలో అభివృద్ధి చెందాలంటే యంత్రాలు, విద్యుత్, ఖనిజాలు, ముడిలోహాలు రవాణా సౌకర్యాలు వంటి కొన్ని మౌలిక సౌకర్యాలు అవసరం.
  2. ఈ అవసరమైన సరుకులను – యంత్రాలు, విద్యుత్, ఖనిజాలు, ముడిలోహాలు రవాణా సౌకర్యాలను తయారు చేసే పరిశ్రమలను మౌలిక పరిశ్రమలంటారు.
  3. అనేక కర్మాగారాలకు అవసరమయ్యే మౌలిక సరుకులను ఈ మౌలిక పరిశ్రమలు అందిస్తాయి కాబట్టి ప్రభుత్వం ఈ పరిశ్రమలను స్థాపించటానికి బాధ్యత తీసుకుంది.

ప్రశ్న 2.
కొన్ని ప్రత్యేక ప్రాంతాలలోనే పరిశ్రమలు ఎందుకు నెలకొల్పబడ్డాయి? (AS1)
జవాబు:
కొన్ని ప్రత్యేక ప్రాంతాలలో పరిశ్రమలు నెలకొల్పబడడానికి కారణాలు :

  1. ముడి సరుకుల లభ్యత
  2. కూలీల అందుబాటు
  3. పెట్టుబడి
  4. విద్యుత్
  5. మార్కెట్ వంటి అంశాలను పరిగణనలోనికి తీసుకుని పరిశ్రమలను స్థాపించుతారు.
  6. అందువల్లనే పరిశ్రమలు అన్ని అంశాలు అనువుగా అందుబాటులో ఉండే ప్రదేశాల్లో లేదా తక్కువ ఖర్చుతో సమకూర్చుకోగల ప్రదేశాల్లో నెలకొల్పుతారు.

AP Board 9th Class Social Solutions Chapter 7 భారతదేశంలో పరిశ్రమలు

ప్రశ్న 3.
మౌలిక సరుకుల పరిశ్రమలు ఏవి? వినియోగ వస్తువుల పరిశ్రమలకూ వీటికీ తేడా ఏమిటి? (AS1)
జవాబు:
యంత్రాలు, విద్యుత్, ఖనిజాలు, ముడిలోహాలు, రవాణా సౌకర్యాలను తయారు చేసే పరిశ్రమలను మౌలిక పరిశ్రమలు ప్రజలు ఉపయోగించే వస్తువులను తయారు చేసే పరిశ్రమలను వినియోగ వస్తువుల పరిశ్రమలంటారు.

మౌలిక సరుకుల పరిశ్రమలు వినియోగ వస్తువుల పరిశ్రమలు
1. వీటిని ప్రజలు ప్రత్యక్షంగా వినియోగించుకోలేరు. 1. వీటిని ప్రజలు ప్రత్యక్షంగా వినియోగించుకోగలరు.
2. వీటిని ఉపయోగించి వినియోగ వస్తువులను ఉత్పత్తి చేయవచ్చును. 2. వీటిని ప్రజలు తమ అవసరాల కొరకు ఉపయోగించుకొంటారు.

ప్రశ్న 4.
ఖనిజ వనరులు ఉన్న పట్టణాలు / ప్రాంతాల పేర్లు విద్యార్థులచే గుర్తింపజేసి, అక్కడ ఎలాంటి పరిశ్రమలు స్థాపించవచ్చో వాళ్లని రాయమనండి. (AS1)
AP Board 9th Class Social Solutions Chapter 7 భారతదేశంలో పరిశ్రమలు 1
జవాబు:

ప్రశ్న 5.
అంతకుముందు ప్రభుత్వ రంగానికే పరిమితమైన అనేక పరిశ్రమలలోకి 1990లలో ప్రైవేటు సంస్థలను ప్రభుత్వం ఎందుకు అనుమతించింది? (AS4)
జవాబు:

  1. కర్మాగారాలలో తయారైన వినియోగ వస్తువులు దేశంలోకి దిగుమతి చేసుకునేలా ప్రభుత్వం చట్టాలను సడలించింది.
  2. భారతదేశంలో పారిశ్రామిక కార్యకలాపాలను ప్రత్యేకించి కొత్త వాణిజ్యవేత్తలను ప్రోత్సహించటానికి ప్రభుత్వ నియమాలను సరళీకృతం చేశారు.
  3. ప్రభుత్వ ఆధీనంలోని పరిశ్రమల సామర్థ్యాన్ని పెంచటానికి వాటిలో కొన్నింటిని అమ్మేశారు.
  4. ఈ పరిశ్రమల నిర్వహణకు ప్రభుత్వం కేటాయించే నిధులను కూడా తగ్గించేశారు.
  5. ప్రభుత్వ జోక్యం లేకుండా స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోటానికి ఈ కంపెనీలను అనుమతించసాగారు.
  6. కొత్త సాంకేతిక విజ్ఞానం దేశంలోకి వచ్చేలా, ఉత్పత్తి చేసిన సరుకులను విదేశాలకు ఎగుమతి చేసేలా ప్రోత్సహించడానికి విదేశీ, ప్రైవేటు, ప్రభుత్వ కంపెనీలను భారతదేశంలో పరిశ్రమలు స్థాపించటానికి ప్రోత్సహించసాగారు.

ప్రశ్న 6.
పారిశ్రామిక అభివృద్ధి వల్ల ఉపాధి కల్పన ఎలా ప్రభావితమైనది? (AS1)
జవాబు:

  1. పారిశ్రామిక సంస్థల సంఖ్య పెరిగింది. కానీ ఉపాధి ఆశించినంతగా పెరగలేదు. ఎక్కువగా చిన్న చిన్న ఉద్యోగాలే కల్పించబడ్డాయి.
  2. ప్రస్తుతం భారతదేశంలో సంఘటిత రంగంగా వ్యవహరించే రెండు లక్షల పెద్ద కర్మాగారాలున్నాయి.
  3. అసంఘటిత రంగంగా పేర్కొనే 3 కోట్ల చిన్న పారిశ్రామిక కేంద్రాలున్నాయి.
  4. ఇవన్నీ కలిపి దేశంలోని 46 కోట్ల కార్మికవర్గంలో అయిదింట ఒక వంతుకు ఉపాధి కల్పిస్తున్నాయి.
  5. కర్మాగారాలలో ఉపాధి పొందే కార్మికుల శాతాన్ని ఆ దేశ ఆర్థికాభివృద్ధికి ముఖ్యమైన సూచికగా పరిగణిస్తారు.
  6. కార్మికులకు మెరుగైన జీతాలు, మెరుగైనని సురక్షిత పని పరిస్థితులు, ఆరోగ్య వైద్య సదుపాయాలను పరిశ్రమల యాజమాన్యాలు కల్పించేలా భారతదేశంలో అనేక చట్టాలను చేశారు.
  7. అనేక కొత్త పరిశ్రమలు ఏర్పడతాయని, కాలక్రమంలో కార్మికులలో అధిక శాతం సంపాదన పెరుగుతుందని ఆశించారు.
  8. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఆరు దశాబ్దాలు గడిచినప్పటికి పరిశ్రమలలో ఉపాధి శాతం ఆశించినంతగా పెరగలేదు.
  9. అంతేగాకుండా కార్మికులలో చాలామంది చిన్న పారిశ్రామిక కేంద్రాలలో ఉపాధి పొందుతున్నారు.

AP Board 9th Class Social Solutions Chapter 7 భారతదేశంలో పరిశ్రమలు

ప్రశ్న 7.
పారిశ్రామిక అభివృద్ధి వల్ల ప్రభుత్వ ఆదాయం ఎలా ప్రభావితమైనది? (AS1)
జవాబు:
పారిశ్రామిక అభివృద్ధి వల్ల ప్రభుత్వ ఆదాయం ప్రభావితమైన విధానం :

  1. ప్రభుత్వ పారిశ్రామిక రంగాల విషయంలో పరిశ్రమల నిర్వహణకు ప్రతి సంవత్సరం కొన్ని నిధులు కేటాయించేవారు.
  2. కాలక్రమంలో ఇవి స్వతంత్రమైనా, ప్రభుత్వానికి ఆదాయం సమకూరుస్తాయని భావించేవారు.
  3. అనేక ప్రభుత్వ రంగ కర్మాగారాలలో పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఉండేది. వీటికి ప్రభుత్వం సహాయం నిరంతరం అవసరం అవుతూ ఉండేది.
  4. వీటి నిర్వహణలో ప్రభుత్వ జోక్యం కొనసాగుతూ ఉండేది. ఆశించిన దానికంటే వాటి పని చాలా నిరాశాజనకంగా ఉండేది.
  5. అందువల్ల అలాంటి వాటిని ప్రైవేటు పరం చేసి నూతన పారిశ్రామిక విధానం ప్రకారం అత్యుత్తమ లాభాలు పొందుతున్న సంస్థలను మాత్రమే దాని నియంత్రణలో ఉంచింది.

ప్రశ్న 8.
“పరిశ్రమల వల్ల పర్యావరణ సమస్యలు పెరుగుతాయి” చర్చించండి. (AS4)
జవాబు:

  1. పరిశ్రమల ఉత్పత్తి ప్రక్రియలో విద్యుత్, వివిధ రసాయనికాలు అవసరం అవుతాయి.
  2. ఉత్పత్తి క్రమంలో ఈ పరిశ్రమలు అనేక వ్యర్థాలను విడుదల చేస్తాయి.
  3. పారిశ్రామిక ప్రాంతాలలో ఇవి కాలుష్యానికి దారితీస్తున్నాయి.

ప్రశ్న 9.
పర్యావరణ కాలుష్యాన్ని నివారించేందుకు కొన్ని నినాదాలు రాయండి. (AS6)
(లేదా)
“పర్యావరణ కాలుష్య నివారణకై” ఏవైనా రెండు నినాదాలు రాయండి.
జవాబు:

  1. వృక్షో రక్షతి రక్షితః
  2. పర్యావరణ పరిరక్షణ – మనందరి బాధ్యత.
  3. మనిషికి ఆయువు పెరగాలి – అందుకే చెట్లను పెంచాలి.
  4. కాలుష్యాన్ని నివారించండి – పర్యావరణాన్ని కాపాడండి.
  5. సహజ ఎరువులను వాడండి – పుడమితల్లిని కాపాడండి.
  6. ప్రకృతి రక్షణే జీవాధారం – చెట్లే ప్రగతికి ప్రాణాధారం.
  7. హద్దులు లేని అనుబంధానికి అమ్మే ఒక అందం
    అంతులేని ఆనందానికి ప్రకృతితోనే బంధం.
  8. పరిసరమే మన చుట్టూ ఉండే చక్కని నేస్తం
    పర్యావరణం కాపాడటమే మన అందరి కర్తవ్యం.
  9. చెట్లు లేనిది బ్రతుకే లేదు
    మానవ జాతికి మెతుకే లేదు.
  10. గాలీ, నేలా, నీరు, నింగి జీవుల మనుగడకి ఆధారం.
    అడవులు నరికి పెంచే కాలుష్యం, ప్లాస్టిక్ వ్యర్థాలే మానవునికి దుఃఖకారణం.

AP Board 9th Class Social Solutions Chapter 7 భారతదేశంలో పరిశ్రమలు

ప్రశ్న 10.
పేజీ నెం. 83లోని రెండవ పేరాను (రేడియోసెట్ల నుంచి ……….. కీలకమవుతుంది) చదివి వ్యాఖ్యానించండి. (AS2)
జవాబు:
సమాచార సాంకేతిక విజ్ఞానం, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ భారతదేశాన్ని ఆసియా. ఖండంలో ప్రధమురాలిగా నిలబెట్టాయి. భారతదేశానికి ఎలక్ట్రానిక్స్ రాజధానిగా బెంగళూర్ ఎదిగింది. ముంబయి, ఢిల్లీ, హైదరాబాద్, పుణె, చెన్నై, కోల్ కత, లక్నో, కోయంబత్తూరు వంటి నగరాలు సమాచార విప్లవంలో దూసుకుపోతున్నాయి.

రేడియో సెట్ల నుండి టెలివిజన్ వరకు, టెలిఫోన్లు, చరవాణీలు, పేజర్లు, కంప్యూటర్లతో దేశం దూసుకుపోతోంది. ఈ ‘ రంగంలో 10 లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. ఈ రంగంలో 30% వరకు మహిళలు తమ నైపుణ్యాలను ప్రదర్శిస్తున్నారు. హార్డ్ వేర్, సాఫ్ట్ వేర్ రంగాలలో ప్రగతి కొనసాగి, విదేశీ మారక ద్రవ్యాన్ని సైతం ఈ రంగం ఆర్జిస్తుంది.

ప్రశ్న 11.
పేజీ నెం. 95లోని పటాన్ని పరిశీలించి, భారతదేశ అవుట్ లైన్ పటంలో మన దేశంలోని ఇనుము – ఉక్కు కర్మాగారాలను గుర్తించండి. (AS5)
జవాబు:
AP Board 9th Class Social Solutions Chapter 7 భారతదేశంలో పరిశ్రమలు 2

9th Class Social Studies 7th Lesson భారతదేశంలో పరిశ్రమలు InText Questions and Answers

9th Class Social Textbook Page No.76

ప్రశ్న 1.
ఇతర కర్మాగారాలు ముడి సరుకులుగా ఉపయోగించుకొనే వస్తువులను తయారు చేసే కర్మాగారాల జాబితా రాయండి.
జవాబు:
యంత్రాల పరిశ్రమ, విద్యుత్ పరిశ్రమ, ఖనిజాల పరిశ్రమ, ముడి లోహాలను శుద్ధి చేసే పరిశ్రమ రవాణా సౌకర్యాలను తయారు చేసే పరిశ్రమలు.

ప్రశ్న 2.
ఇతర కర్మాగారాల కోసం ఉత్పత్తి చేసే అనేక వస్తువులకు ఇనుము మౌలిక అవసరం. మీ చుట్టు పక్కల కనిపించే ఉదాహరణలతో దీనిని వివరించండి.
జవాబు:
ఇనుము మౌలిక అవసరం.
ఉదా : నేలను త్రవ్వే పలుగు, పార, కోయడానికి ఉపయోగించే కత్తులు, కొడవళ్లు, చాకులు బరిసెలు. ఇంటి నిర్మాణానికి ఉపయోగించే ” ఇనుపచువ్వలు.

వస్తువులను తయారు చేయడానికి ఉపయోగించే మేకులు, వివిధ రకాలైన ఫ్రేములు మొ||నవి.

AP Board 9th Class Social Solutions Chapter 7 భారతదేశంలో పరిశ్రమలు

ప్రశ్న 3.
కర్మాగారాలలో ఉపయోగించే యంత్రాలను మీరు చూశారా? వివిధ రకాల యంత్రాల చిత్రాలను సేకరించండి.
జవాబు:
కర్మాగారాలలో ఉపయోగించే యంత్రాలను మేము చూశాము. అవి :
బియ్యం మిల్లు, పత్తి మిల్లు, కారం పట్టేవి, పిండి పట్టేవి, నీరు లాగేవి మొ||నవి.

ప్రశ్న 4.
అనేక వస్తువుల ఉత్పత్తిలో పెట్రోలియం మౌలిక అవసరం ఎలా అవుతుందో తెలియజేసే చార్టుని తయారు చేయండి.
జవాబు:
AP Board 9th Class Social Solutions Chapter 7 భారతదేశంలో పరిశ్రమలు 3

ప్రశ్న 5.
‘మౌలిక’ అనే పదం అంటే ఏమిటో చర్చించండి. పరిశ్రమలకు మౌలిక అవసరాలు ఏమిటి?
జవాబు:
మౌలిక అంటే ముఖ్యమైనవి, ప్రధానమైనవి, ప్రాథమికమైనవి అనే అర్థాలు వస్తాయి. పరిశ్రమకు మౌలిక అవసరాలు ఏమిటనగా యంత్రాలు, విద్యుత్, ఖనిజాలు, ముడిలోహాలు, రవాణా సౌకర్యాలు వంటివి. ”

ప్రశ్న 6.
స్వాతంత్ర్య కాలంలో పారిశ్రామికీకరణ ద్వారా మనం ఏ లక్ష్యాలను సాధించాలని కోరుకున్నాం?
జవాబు:
స్వాతంత్ర్యకాలంలో పారిశ్రామికీకరణ ద్వారా మనం సాధించాలని అనుకున్న లక్ష్యాలు :

  1. పారిశ్రామిక కార్యకలాపాలు మొదలైతే పట్టణీకరణ మొదలవుతుంది.
  2. పట్టణాలలో మాత్రమే పట్టణ సమీప ప్రాంతాలలో పరిశ్రమలను స్థాపించి వాటిని అభివృద్ధి చేయడం.
  3. పారిశ్రామికీకరణ, పట్టణీకరణ జంటగా పురోగమిస్తాయి.
  4. పట్టణాలు సరుకులకు మార్కెట్ గా ఉండటమేగాక బ్యాంకింగ్, బీమా, రవాణా కార్మికులు, సలహాదారుల, ఆర్థిక సలహాలు వంటి సేవలను కూడా అందిస్తాయి.
  5. అందువల్ల గ్రామీణ ప్రాంతాలలో కూడా చిన్న తరహా పరిశ్రమలను ప్రోత్సహించి పారిశ్రామిక వాతావరణాన్ని కల్పించాలి.
  6. భారతదేశ జనాభా ప్రధానంగా గ్రామీణ జనాభా కావడం వలన గ్రామాలలో పరిశ్రమలను స్థాపించవలసిన అవసరం ఉన్నదని భావించడం.

9th Class Social Textbook Page No.77

ప్రశ్న 7.
టీ పొడి, టూత్ పేస్టు కవర్లు (Wrappers) సేకరించండి. వాటిమీద ఉన్న విషయాన్ని చదివి కింది ప్రశ్నలకు సమాధానాలివ్వండి.
………………. ని వ్యవసాయ ఆధారిత పరిశ్రమ ఉత్పత్తిగా పేర్కొనవచ్చు.
………………. ని ఖనిజ ఆధారిత పరిశ్రమ ఉత్పత్తిగా పేర్కొనవచ్చు.
జవాబు:
టీ పొడి, టూత్ పేస్ట్.

ప్రశ్న 8.
టూత్ పేస్ట్ కు ముడిసరుకులైన …………………….., ………………… లను మరో పరిశ్రమలో ఉత్పత్తి చేస్తారు. దానిని మౌలిక లేదా కీలక పరిశ్రమ అంటారు. ఇందుకు భిన్నంగా టూత్ పేస్ట్ వినియోగదారీ సరుకు కావడం వల్ల ఈ పరిశ్రమ వినియోగదారీ వస్తు పరిశ్రమ అంటారు.
జవాబు:
అల్యూమినియం ట్యూబు, కాల్షియం.

ప్రశ్న 9.
పరిశ్రమల యాజమానులు వ్యక్తులు కావచ్చు, వ్యక్తుల బృందం కావచ్చు. ఉదా : టీ ప్యాకెట్ల తయారీ యజమానులు …………….. కాగా టూత్ పేస్టు …………… ఇలాంటి పరిశ్రమను ప్రైవేటు రంగ పరిశ్రమ అంటారు. యాజమాన్యం ప్రభుత్వానికి చెందినట్లయితే దానిని, ప్రభుత్వరంగ పరిశ్రమ అంటారు. అలాంటి ప్రభుత్వ రంగ పరిశ్రమలకు రెండు ఉదాహరణలు …………..
జవాబు:
ప్రయివేటు వ్యక్తులు, పేస్ట్ తయారీ ;

  1. భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్
  2. భారత్ హెవీ ప్లేట్స్ అండ్ వెసల్స్ లిమిటెడ్.

AP Board 9th Class Social Solutions Chapter 7 భారతదేశంలో పరిశ్రమలు

ప్రశ్న 10.
పెద్ద సంఖ్యలో వ్యక్తులు కొన్ని పరిశ్రమలను పాలు, చెరకు, కొబ్బరి పీచు మొదలైన ముడి సరుకులను, వనరులను సమీకరించుకొని నిర్వహిస్తారు. ఇటువంటి పరిశ్రమలను ………… అంటారు.
జవాబు:
సహకార పరిశ్రమలు

9th Class Social Textbook Page No.78

ప్రశ్న 11.
నూలు వడకటం, ఖద్దరు నేయటానికి మహాత్మాగాంధీ ఎందుకు ప్రాధాన్యత నిచ్చారు?
జవాబు:
నూలు వడకటం, ఖద్దరు నేయటానికి మహాత్మాగాంధీ ప్రాధాన్యత ఇవ్వటానికి కారణం :

  1. మన దేశంలో ప్రాచీనమైన, అతి పెద్ద పరిశ్రమ నూలు వస్త్ర పరిశ్రమ.
  2. ఎక్కువమందికి జీవనోపాధి కల్పించే పరిశ్రమ నూలు పరిశ్రమ.
  3. అందరికి అవసరమైన వస్తువు బట్టలు. అందువల్ల ఇంగ్లాండ్ లో పారిశ్రామిక విప్లవం యంత్రాలపై – నేయబడిన వస్త్రాలను దిగుమతి చేసుకోవడంతో చేనేత కార్మికులకు ఉపాధి లేకుండా పోయింది.
  4. కావున చేనేత కార్మికులకు ఉపాధిని కల్పిస్తూ, మనకు కావలసిన వస్త్రాన్ని మనమే తయారు చేసుకుంటూ, వ్యాపార నిమిత్తం భారత దేశానికి వచ్చిన బ్రిటిష్ వారికి లాభం లేకుండా చేయడం వలన వారు మనదేశం నుండి వెళ్ళిపోవడానికి అవకాశం కల్పించగలము అనే నమ్మకంతో గాంధీగారు అలాంటి విధానానికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది.

9th Class Social Textbook Page No.80

ప్రశ్న 12.
పంచదార, బెల్లం పరిశ్రమలను ఎక్కడ స్థాపించాలి?
జవాబు:

  1. పంచదార, బెల్లం పరిశ్రమలు చెరకు పండే ప్రాంతాలలోనే స్థాపించాలి. కారణం చెరకు నరికిన తరువాత ఎక్కువ కాలం నిల్వ ఉంటే సుక్రోజ్ శాతం తగ్గిపోతుంది.
  2. అందువల్ల చెరకు నరికిన వెంటనే పరిశ్రమకు తరలించవలసి ఉంటుంది.
  3. కావున చెరకు పండే ప్రాంతాలలోనే. పంచదార, బెల్లం పరిశ్రమలను స్థాపించవలసి ఉంటుంది.

ప్రశ్న 13.
భారతదేశంలో తలసరి ఉక్కు వినియోగం ఎందుకు తక్కువగా ఉంది?
జవాబు:

  1. ఇనుము – ఉక్కు పరిశ్రమలు మౌలిక పరిశ్రమలు ఇతర భారీ, మధ్యతరహా, తేలికపాటి పరిశ్రమలన్నీ తమకు కావలసిన యంత్రాలకు వీటిపై ఆధారపడి ఉన్నాయి.
  2. అనేక రకాల ఇంజనీరింగ్ వస్తువులు, భవననిర్మాణ సామగ్రి, రక్షణ, వైద్య, దూరవాణి, శాస్త్రీయ పరికరాలు, అనేక వినియోగదారీ వస్తువుల వంటి వాటికి ఉక్కు అవసరం.
  3. కాని పైన పేర్కొనబడిన పరిశ్రమలు భారతదేశంలో చెప్పుకోదగినంత స్థాయిలో అభివృద్ధి చెందలేదు.
    అందువల్ల తలసరి ఉక్కు వినియోగ తక్కువగా ఉంది.

9th Class Social Textbook Page No.82

ప్రశ్న 14.
సిమెంట్ ఉత్పత్తి కర్మాగారాలను ఎక్కడ స్థాపించటం ఆర్థికంగా లాభసాటిగా ఉంటుంది?
జవాబు:
సిమెంట్ ఉత్పత్తి కర్మాగారాలను స్థాపించవలసిన ప్రదేశాలు :

  1. ప్రధాన ముడిపదార్థాలైన సున్నపురాయి, సిలికా, అల్యూమినియం, జిప్సం వంటి ముడి పదార్థాలు ఎక్కడ లభిస్తాయో సాధారణంగా సిమెంట్ పరిశ్రమలు అక్కడ స్థాపించవలసి ఉంటుంది.
  2. సిమెంట్ పరిశ్రమకు రైలు వంటి రవాణా సౌకర్యాలతో పాటు బాగా అభివృద్ధి చెందిన ప్రదేశం కూడా కావాలి.

AP Board 9th Class Social Solutions Chapter 7 భారతదేశంలో పరిశ్రమలు

ప్రశ్న 15.
గల్ఫ్ దేశాల మార్కెటుకి దగ్గరగా గుజరాత్ లో సిమెంట్ కర్మాగారాలు కొన్ని నెలకొని ఉన్నాయి. దేశంలోని ఇతర రాష్ట్రాలలో సిమెంట్ కర్మాగారాలు ఎక్కడ నెలకొని ఉన్నాయో తెలుసుకోండి. ఆ కర్మాగారాల పేర్లు తెలుసుకోండి.
జవాబు:

  1. మొదటి సిమెంట్ కర్మాగారాన్ని 1904లో చెన్నైలో నిర్మించారు.
  2. 1989లో ధర, పంపిణీలలో నియంత్రణలను తీసివేయటం, ఇతర విధానాలలో సంస్కరణల వల్ల సామర్థ్యం, ప్రక్రియ, సాంకేతిక విజ్ఞానం, ఉత్పత్తిలో గణనీయమైన ప్రగతి సాధించింది.
  3. సిమెంట్ నాణ్యత పెరగటంతో తూర్పు ఆసియా, గల్ఫ్ దేశాలలో, ఆఫ్రికా దక్షిణ ఆసియాలలో మన దేశ సిమెంటుకు గిరాకీ పెరిగింది.

సిమెంట్ పరిశ్రమ నెలకొని ఉన్న ప్రాంతాలు :

  1. తమిళనాడు : తలైయుత్తు అలంగులం, తలకపట్టి దాల్మియాపురం, పాలియూర్, వంకరిదుర్గ్, మధురై.
  2. మధ్యప్రదేశ్ : జముల్, సాత్నా, కల్ని, కైమూర్, బాన మూర్, ముంధర్ దేశంలోకెల్లా జముల్ ఫ్యాక్టరీ అతి పెద్దది.
  3. ఆంధ్రప్రదేశ్ : జగ్గయ్యపేట.
  4. తెలంగాణ : కరీంనగర్, కోదాడ.
  5. రాజస్థాన్ : లఖేరి బుంది, సవాయ్, మాధోపూర్ బితోర్ గద్, ఉదయపూర్.

9th Class Social Textbook Page No.84

ప్రశ్న 16.
దిగువ పట్టికను పూరించండి.
కొన్ని పరిశ్రమల గురించి తెలుసుకోవడానికి మీ ఉపాధ్యాయునితో చర్చించండి.
AP Board 9th Class Social Solutions Chapter 7 భారతదేశంలో పరిశ్రమలు 4
జవాబు:

పరిశ్రమ ప్రస్తుతం అవి ఉన్న రాష్ట్రాలు ఆయా రాష్ట్రాలలో అవి ఎందుకు ఉన్నాయి?
రసాయనిక పరిశ్రమ రసాయనిక ఎరువులు :
బీహార్ లోని సింద్రి, ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్ పూర్, తెలంగాణలోని రామగుండం, పంజాబ్ – నంగల్, హర్యానా – పానిపట్
ఆయా రాష్ట్రంలో ఎక్కువగా నెలకొల్పడానికి ప్రధాన కారణం – రసాయనాలు, విద్యుత్, పెట్రోలియం వంటి ఉత్పత్తులు ఆయా ప్రాంతాలలో విరివిగా దొరకడం.
ఎరువుల పరిశ్రమ సింథటిక్ దారాలు :
మహారాష్ట్ర – ముంబయి
గుజరాత్ – అహ్మదాబాద్
మధ్యప్రదేశ్ – గ్వాలియర్
తెలంగాణ – కాగజ్ నగర్పెట్రో కెమికల్స్ :
మహారాష్ట్ర – ట్రాంబే ధానే
గుజరాత్ – వడోదర
సిమెంట్ పరిశ్రమ తమిళనాడు – తలైయుత్తు అలిహలా
తలకపట్టి దాల్మియాపూర్
ఆంధ్రప్రదేశ్ – జగ్గయ్యపేట
తెలంగాణ – కరీంనగర్, కోదాడ
గుజరాత్ – సిక్కా, సూరీ
రాజస్థాన్ – లభేరి బుంది
సిమెంట్ పరిశ్రమకు కావలసిన సున్నపురాయి, సిలికా, అల్యూమినియం, జిప్సం వంటి ముడి పదార్థాలతో పాటు, అభివృద్ధి చెంది రవాణా సౌకర్యాలు
ఆటోమొబైల్ పరిశ్రమ మహారాష్ట్ర – ముంబయి, పుణె
పశ్చిమబెంగాల్ – కోల్ కత
తమిళనాడు – చెన్నై
ఉత్తరప్రదేశ్ – లక్నో
రోడ్లు, రవాణా అభివృద్ధి చెంది ఉండడం, ఎగుమతులు, దిగుమతులకు అనుకూల ప్రదేశాలు సాంకేతిక నైపుణ్యం గల, సాంకేతిక నైపుణ్యం లేని శ్రామికులు ఎక్కువగా ఉండడం.

9th Class Social Textbook Page No.88

ప్రశ్న 17.
రెండు ‘పై’ (Pie) చార్టులలోని మూడు రకాల ఆర్థిక రంగాలలో ‘ఉపాధిలో తేడాలు ఏమిటి ? :
(లేదా)
కింది “పై” చార్టు, వ్యవసాయ, పరిశ్రమలు మరియు సేవారంగం ద్వారా పొందుతున్న ఉపాధి శాతాలను తెలియజేస్తున్నది. చార్టును పరిశీలించి, ప్రశ్నకు సమాధానం రాయండి.
AP Board 9th Class Social Solutions Chapter 7 భారతదేశంలో పరిశ్రమలు 5
ప్రశ్న: 1972 – 73 మరియు 2009-2010 మధ్య ఉపాధి కల్పనలో వచ్చిన మార్పులు ఏమిటి?
జవాబు:
1972-73 సం||రం వ్యవసాయంపై ఆధారపడిన వారి శాతం – 74%.
2009-2010 సం||రం వ్యవసాయరంగంపై ఆధారపడిన వారి శాతం 53%.
కావున 1972 -73 సం||రంతో పోలిస్తే వ్యవసాయ రంగంపై ఆధారపడిన శాతం తగ్గింది.
1972 -73 పరిశ్రమలపై ఆధారపడిన వారి శాతం – 11%.
2009 – 10 సం||రంలో పరిశ్రమలపై ఆధారపడిన వారి శాతం – 22%.
కావున 1972 – 73 సంవత్సరంతో పోలిస్తే 2009-10 సం||రంలో పరిశ్రమలపై ఆధారపడిన వారి శాతం పెరిగింది.
1972 – 73 సం||రంలో సేవలపై ఆధారపడిన వారి శాతం – 13%.
2009 – 10 సం||రంలో సేవలపై ఆధారపడిన వారి శాతం – 25%.
కావున 1972 – 73 సంవత్సరంతో పోలిస్తే 2009 – 10 సం||రాల్లో సేవలపై ఆధారపడిన వారి శాతం పెరిగింది.
మొత్తం మీద 1972 – 73 సం||రానికి 2009 – 10 సం||రానికి తేడా ఏమనగా వ్యవసాయరంగంపై ఆధారపడిన వారి శాతం తగ్గగా మిగిలిన రంగాలపై ఆధారపడిన వారి శాతం పెరిగింది.

ప్రశ్న 18.
పారిశ్రామిక రంగం వారీగా ఉపాధి కల్పనలో ఎంత శాతం తేడా ఉంది?
జవాబు:
1972 – 73 లో పారిశ్రామిక రంగంపై ఆధారపడిన వారి శాతం – 11%
2009 – 10 లో పారిశ్రామిక రంగంపై ఆధారపడిన వారి శాతం – 22%
తేడా – 11%
AP Board 9th Class Social Solutions Chapter 7 భారతదేశంలో పరిశ్రమలు 6

ప్రశ్న 19.
పరిశ్రమలలో ఆశించినంతగా ఉపాధి పెరగలేదా? టీచరుతో చర్చించండి.
జవాబు:
పరిశ్రమలలో ఆశించినంతగా ఉపాధి పెరగలేదు. కారణం –
1972-73లో 11% ఉంటే 2009-10లలో 22 శాతానికి మాత్రమే పెరిగినది. అంటే 27 సం||రాలలో ఉపాధి కేవలం 11% మాత్రమే పెరిగినది.
AP Board 9th Class Social Solutions Chapter 7 భారతదేశంలో పరిశ్రమలు 7

9th Class Social Textbook Page No.90

రవాణా వాహనాలు, పంపులు ఉత్పత్తి, ….. 1950 – 2011
AP Board 9th Class Social Solutions Chapter 7 భారతదేశంలో పరిశ్రమలు 8

ప్రశ్న 20.
వివిధ కర్మాగారాలు తమ ఉత్పత్తులలో ఉపయోగించే వస్తువులు ఉత్పత్తి పెరుగుదలకు ఉదాహరణలు పేర్కొనండి.
జవాబు:
వాణిజ్య వాహనాలు 1950-51లో 9 మిలియన్లు ఉండగా 2010-11 నాటికి 753 మిలియన్లకి పెరిగింది.

మోటారు సైకిళ్ళు 1950-51లో ఏమీ లేవు. 1960-61లో 1 మిలియన్ మాత్రమే ఉండగా 2010-11 నాటికి 10. 527 మిలియన్లకు పెరిగాయి. అనగా పెరుగుదల గణనీయంగా ఉన్నది.

పంపులు 1950-51లో 35 మిలియన్లు ఉండగా 2010-11లో 3139 మిలియన్లకు పెరిగింది.

ట్రాక్టర్లు డీజిల్ తో నడిచేవి 1980-81కు ముందు లేవు. ఆ సంవత్సరం మాత్రం 71 మిలియన్లు ఉండగా 2010-11 నాటికి 465 మిలియన్లకు పెరిగింది. కాబట్టి పెరుగుదల పై విధంగా ఉన్నది.

AP Board 9th Class Social Solutions Chapter 7 భారతదేశంలో పరిశ్రమలు

ప్రశ్న 21.
గత 30 సంవత్సరాలలో వస్త్ర ఉత్పత్తి ఎంత పెరిగింది ? దీని ప్రభావం ఎలా ఉంటుంది ? మీ తరగతి గదిలో చర్చించండి.
జవాబు:
వస్త్రాల ఉత్పత్తి (మిలియన్ చదరపు మీటర్లలో)

సంవత్సరం నూలు వస్త్రాలు ఇతర వస్త్రాలు
1950-51 4900
1960-61 6000 100
1970-71 6500 1000
1980-81 8000 2000
1990-91 15000 8000
2000-01 20000 20000
2010-11 31000 30000

వస్త్రాలు మన అవసరాలకు ఉపయోగించడం మాత్రమే కాక ఇతర దేశాలకు దిగుమతి చేయడం జరుగుతుంది.

ప్రశ్న 22.
సిమెంటు, ఉక్కు ఉత్పత్తిని చూపించే పటాన్ని చూడండి. 1980 – 81 నుంచి ఇప్పటి వరకు వీటి ఉత్పత్తిలో పెరుగుదల తెలియజేయటానికి ఒక పట్టిక తయారు చేయండి. ఈ ఉత్పత్తి పెరగటం వల్ల కలిగిన ప్రయోజనాలను, నష్టాలను చర్చించండి.
జవాబు:

సంవత్సరం సిమెంట్ ఉత్పత్తి
(మిలియన్ టన్నులలో)
ఉక్కు ఉత్పత్తి
(మిలియన్ టన్నులలో)
1950-51 5 1
1960-61 10 2
1970-71 15 6
1980-81 20 8
1990-91 50 12
2000-01 100 30
2010-11 210 62

ఉక్కు ఉత్పత్తి పెరిగినది దీనివలన మౌలిక పరిశ్రమలు సంఖ్య పెరిగింది.

ఉత్పత్తి పెరగటం వల్ల కలిగిన లాభాలు :
సిమెంట్ ఉత్పత్తి పెరగటం వల్ల భవన నిర్మాణం రంగం పెరిగింది. మరియు ఎగుమతులు పెరిగాయి.

అరబ్ దేశాలకు మన సిమెంట్ ను ఎక్కువగా ఎగుమతి చేయడం జరుగుతున్నది.

నిర్మాణ రంగానికి కూడా ఉక్కును ఎక్కువగా ఉపయోగించడం జరుగుతున్నది.

నష్టాలు :
సున్నపురాయి, జిప్సమ్ నిల్వలు రోజు రోజుకు తరిగిపోతున్నాయి. అలాగే ఉక్కుకు కావలసిన ముడి ఇనుమును ఎక్కువగా ఎగుమతి చేయడం జరుగుతుంది.

ఇంకా పూర్తి స్థాయిలో ముడి ఇనుమును మన అవసరాలకు ఉపయోగించుకోగలిగితే ఇనుము – ఉక్కు పరిశ్రమ అభివృద్ధి చెందినట్లు అవుతుంది.

పట నైపుణ్యం

1. భారతదేశంలో ఉత్పత్తి చేయబడిన ఉక్కును 1950-51 నుండి. 2010-11 వరకు గ్రాఫ్ చిత్రంలో చూపించండి.
AP Board 9th Class Social Solutions Chapter 7 భారతదేశంలో పరిశ్రమలు 9

2. 1950-51 నుండి 2010-11 వరకు ఉత్పత్తి చేయబడిన సిమెంట్ ను గ్రాఫ్ చిత్రం ద్వారా చూపించండి.
AP Board 9th Class Social Solutions Chapter 7 భారతదేశంలో పరిశ్రమలు 10

3. 1950-51 నుండి 2010-11 వరకు ఉత్పత్తి చేయబడిన విద్యుత్ ను గ్రాఫ్ చిత్రం ద్వారా చూపించండి.
AP Board 9th Class Social Solutions Chapter 7 భారతదేశంలో పరిశ్రమలు 11

4. 1950-51 నుండి 2010-11 వరకు ఉత్పత్తి చేయబడిన వస్త్రాలను గ్రాఫ్ చిత్రం ద్వారా చూపించండి.
AP Board 9th Class Social Solutions Chapter 7 భారతదేశంలో పరిశ్రమలు 12

5. భారతదేశంలో లభించే ఇనుప ఖనిజ క్షేత్రాలను, ఇనుప ఖనిజ గనులను భారతదేశం పటంలో చూపించండి.
AP Board 9th Class Social Solutions Chapter 7 భారతదేశంలో పరిశ్రమలు 13

6. బొగ్గు లభించే ప్రాంతాలను భారతదేశ పటం నందు చూపించండి.
AP Board 9th Class Social Solutions Chapter 7 భారతదేశంలో పరిశ్రమలు 14

7. భారతదేశ పటం నందు ఇనుము – ఉక్కు కర్మాగారాల ప్రదేశాలను చూపించండి.
AP Board 9th Class Social Solutions Chapter 7 భారతదేశంలో పరిశ్రమలు 15

8. భారతదేశ పటం నందలి సాఫ్ట్ వేర్ టెక్నాలజీ పార్కులను గుర్తించండి.
AP Board 9th Class Social Solutions Chapter 7 భారతదేశంలో పరిశ్రమలు 16

ప్రాజెక్టు

ప్రశ్న 1.
మీ ప్రాంతంలోని వ్యవసాయ ఆధారిత పరిశ్రమను ఒకదానిని, ఖనిజ ఆధారిత పరిశ్రమను ఒకదానిని ఎంచుకోండి.
1) వాటిల్లో ఉపయోగించే ముడిసరుకులు ఏమిటి?
2) ఉత్పత్తిలో కావలసిన ఇతర ఉత్పాదకాలలో వేటికి రవాణా ఖర్చు కావాలి?
3) ఈ కర్మాగారాలు పర్యావరణ నియమాలను పాటిస్తున్నాయా?
జవాబు:
మా ప్రాంతంలోని వ్యవసాయ ఆధారిత పరిశ్రమ.

– పొగాకు పరిశ్రమ :

  1. వాటిలో ఉపయోగించే ముడి సరుకులు – పొగాకు.
  2. ఉత్పత్తిలో కావలసిన ఇతర ఉత్పాదకాలలో వేటికి రవాణా ఖర్చు కావాలి?
    పొగాకుకు రవాణా ఖర్చు కావాలి.

మరియు తయారుచేయబడిన సిగరెట్లు, బీడీలు, చుట్టలు వంటి వాటిని వివిధ ప్రాంతాలకు చేరవేయాలన్నా, మరియు సిగరెట్ పరిశ్రమ, బీడీల పరిశ్రమ, చుట్టల పరిశ్రమ ప్రాంతాలకు పొగాకును చేరవేయాలన్నా రవాణా ఖర్చు కావలసి ఉంటుంది.

ఈ కర్మాగారాలు పర్యావరణ నియమాలను అంతగా పాటించడం లేదనే చెప్పవచ్చును.

ఎందువలెనంటే పరిశ్రమల చుట్టు మొక్కలను పెంచడం లేదు.

పరిశ్రమ నందు వడిలివేయబడిన పదార్థాల డంపింగ్ యార్డ్ ద్వారా నాశనం చేయకుండా దగ్గరలోని కృష్ణానదిలోను, రోడ్ల ప్రక్కన వేయడంవల్ల ఆ పరిసర ప్రాంతాలు కాలుష్యానికి గురౌతున్నాయి.

మా ప్రాంతంలోని ఖనిజాధార పరిశ్రమ.

– సిమెంట్ పరిశ్రమ :
ప్రధాన ముడి సరుకులు : సున్నపురాయి, జిప్సం , బొగ్గు, డోలమైట్, పింగాణి మన్ను మొదలగునవి.

ఉత్పత్తిలో కావలసిన ఇతర ఉత్పాదకాలలో సున్నపురాయి, జిప్సం, డోలమైట్, పింగాణి మన్ను, బొగ్గు మొదలైన వాటి అన్నింటికి రవాణా ఖర్చు కావాలి.

సున్నపురాయి అధిక పరిమాణంలో కావాలి.

ఈ కర్మాగారాలు పర్యావరణ నియమాలను పాటిస్తున్నాయా?

అంతగా పాటించడం లేదనే చెప్పాలి. ఎందువలెనంటే ఈ పరిశ్రమ పనిచేస్తున్నప్పుడు దుమ్ము, ధూళి విపరీతంగా వస్తుంది.

అది గాలిలో కలిసి గాలిని కలుషితం చేస్తుంది.
అలాగే వ్యర్థ పదార్థాలను బయట ప్రదేశములందు వదలడం వలన బయటి ప్రదేశాలు రసాయనిక కాలుష్యానికి గురౌతున్నాయి.

AP Board 9th Class Social Solutions Chapter 6 భారతదేశంలో వ్యవసాయం

SCERT AP 9th Class Social Studies Guide Pdf 6th Lesson భారతదేశంలో వ్యవసాయం Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Social Solutions 6th Lesson భారతదేశంలో వ్యవసాయం

9th Class Social Studies 6th Lesson భారతదేశంలో వ్యవసాయం Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
ఏదైనా ఒక పానీయపు పంటను పేర్కొనీ దాని పెరుగుదలకు కావలసిన భౌగోళిక అంశాలను పేర్కొనండి. (AS1)
జవాబు:
పానీయపు పంట – తేయాకు :
భౌగోళిక అంశాలు :

  1. అయన, ఉప అయన ప్రాంతపు పంట.
  2. లోతైన, సారవంతమైన ఏటవాలు నేలలు ఉండి నీటి పారుదల వసతులు కలిగి హ్యూమస్, సేంద్రియ పదార్థం అధికంగా గల మృత్తికలు అత్యంత అనుకూలం.
  3. వెచ్చని, ఆర్ధ శీతోష్ణస్థితితో పాటు హిమరహిత వాతావరణం సంవత్సరం పొడవునా ఉండాలి.
  4. తరచుగా పడే వర్షపు జల్లులు సంవత్సరం పొడవునా విస్తరించి ఉంటే నాణ్యమైన తేయాకు పెరుగును.
  5. తేయాకు పంటకు అత్యధిక శ్రామికులు అవసరం.
  6. తేయాకు పండించే రాష్ట్రాలు అసోం, పశ్చిమబెంగాల్, తమిళనాడు, కేరళ.

ప్రశ్న 2.
సాగుభూమి యొక్క విస్తీర్ణం రోజు రోజుకు తగ్గుతున్నది. దీని పరిణామాలను ఊహించి రాయండి. (AS4)
జవాబు:
సాగుభూమి యొక్క విస్తీర్ణం రోజు రోజుకు తగ్గుతున్నది దీనికి కారణం :

  1. రియల్ ఎస్టేట్ రంగం విస్తరించడం.
  2. పంటలకన్నా ఇంటి నిర్మాణాలకు భూములను మారిస్తే ఎక్కువ ఆదాయం వస్తుంది అనే భావం.
  3. పారిశ్రామిక ప్రాంతాలుగా మార్చటం.

AP Board 9th Class Social Solutions Chapter 6 భారతదేశంలో వ్యవసాయం

ప్రశ్న 3.
భారతదేశంలో చిరుధాన్యాలు పండే ప్రాంతాలను గుర్తించండి. (AS5)
జవాబు:
భారతదేశంలో చిరుధాన్యాలు పండే ప్రాంతాలు.
AP Board 9th Class Social Solutions Chapter 6 భారతదేశంలో వ్యవసాయం 1

జొన్నలు : మహారాష్ట్ర
కర్ణాటక
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
మధ్యప్రదేశ్
సజ్జలు : రాజస్థాన్
ఉత్తరప్రదేశ్
మహారాష్ట్ర
గుజరాత్
హర్యానా
రాగులు : కర్ణాటక
తమిళనాడు

ప్రశ్న 4.
కనీస మద్దతు ధర (MSP) అంటే ఏమిటి? దీని అవసరం ఏమిటి? (AS1)
జవాబు:

  1. రైతు పండించిన పంటను వ్యాపారస్థులు చెప్పిన రేటుకు అమ్మవలసి ఉంటుంది.
  2. అలాంటి పరిస్థితులలో ప్రభుత్వం కనీస మద్దతు ధరను ప్రకటిస్తుంది.
  3. కారణం : ఒక్కొక్కసారి రైతు పండించటానికి అయిన ఖర్చు కూడా పరిగణనలోనికి తీసుకోకుండా, వ్యాపారస్థులు చాలా తక్కువ రేటు అడగడం.

అందువల్ల ప్రభుత్వం పంటను పండించటానికి రైతుకు ఎంత ఖర్చు అవుతుంది. ఎంత దిగుబడి వస్తుంది. అనే అంశాన్ని పరిగణనలోనికి తీసుకుని పండిన పంటకు కనీస మద్దతు ధర ప్రకటిస్తుంది.

ప్రశ్న 5.
భారత ప్రభుత్వం హరిత విప్లవానికి అన్ని రకాలుగా ఎందుకు సహకారాన్ని అందించినదో తెలపండి. (AS1)
జవాబు:
భారత ప్రభుత్వం హరిత విప్లవానికి అన్ని రకాలుగా సహకారాన్ని అందించడానికి గల కారణం :

  1. భారత దేశ జనాభా నానాటికి రెట్టింపు అవుతుంది.
  2. రెట్టింపు అవుతున్న జనాభాకు సరిపడ ఆహారధాన్యాల ఉత్పత్తి జరగడం లేదు.
  3. ప్రజలకు పూర్తి స్థాయిలో వ్యవసాయం ద్వారా ఉపాధి కల్పించలేకపోతున్నారు.
  4. వ్యవసాయం లాభసాటిగా ఉండటం లేదు.
  5. వ్యవసాయ విస్తీర్ణ భూమి శాతం రోజు రోజుకు తగ్గిపోతుంది.
  6. నీటి పారుదల సదుపాయాలు లేకపోవడం వలన పూర్తి స్థాయిలో వ్యవసాయం జరగడం లేదు.
  7. రసాయన ఎరువులను అందించవలసిన అవసరం ఏర్పడినది.
  8. రైతులకు ఋణసదుపాయం కల్పించవలసి వచ్చింది.
  9. పండిన పంటకు గిట్టుబాటు రేటు కల్పించవలసి వచ్చింది.
  10. తగిన మార్కెట్ సదుపాయం ఏర్పాటు చేయవలసివచ్చింది.

అందువల్ల భారత ప్రభుత్వం హరిత విప్లవానికి అన్ని రకాలుగా సహకారాన్ని అందజేసినది.

AP Board 9th Class Social Solutions Chapter 6 భారతదేశంలో వ్యవసాయం

ప్రశ్న 6.
భారతదేశం ఆహారధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధిని సాధించాల్సిన అవసరం ఉందని మీరు భావిస్తారా? చర్చించండి. (AS1)
జవాబు:

  1. ఆహారధాన్యాల విషయంలో దేశం స్వయం సమృద్ధిని సాధించింది.
  2. ఆహారధాన్యాల ఉత్పత్తి పెరగడం వలన ఇతర దేశాల నుండి ఆహారధాన్యాలను దిగుమతి చేసుకోవల్సిన అవసరం లేకుండా పోయింది.
  3. ప్రస్తుతం భారతదేశ దిగుమతిలో ఆహార పదార్థాల వాటా కేవలం 3% మాత్రమే.
  4. గడిచిన 7 దశాబ్దాలలో ఆహార ధాన్యాల ఉత్పత్తి 51 మిలియన్ టన్నుల నుండి 242 మిలియన్ టన్నులకు పెరిగింది.
  5. భారత, ఆహార సంస్థ ద్వారా భారత ప్రభుత్వం భారీగా ఆహార ధాన్యాలు నిల్వ చేస్తుంది.
  6. వీటిని కరవు కాటకాలు వచ్చినపుడు గాని, ఆహార ధాన్యాల కొరత ఏర్పడినపుడు గాని ఉపయోగిస్తారు.
  7. ఇలా సేకరించిన ధాన్యాన్ని దేశంలో ధాన్యం అందుబాటులో లేని ప్రాంతాలకు సరఫరా చేస్తారు.
  8. 1967లో ప్రభుత్వం దగ్గర ఉన్న మొత్తం ఆహారధాన్యాలు 19 లక్షల టన్నులు. 2010 – 11 సంవత్సరం నాటికి ఇది 220 లక్షల టన్నులకు పెరిగింది.
  9. మొత్తం ప్రపంచ ఆహార ధాన్యాల ఉత్పత్తిలో 1/10 వంతు మన దేశంలో ఉత్పత్తి అవుతుంది.

ప్రశ్న 7.
ఇతర ప్రాంతాలలోని వ్యవసాయానికి, వర్షాధార వ్యవసాయానికి తేడా ఏమిటి? (AS1)
జవాబు:

  1. ఇతర ప్రాంతాలలో నీటి పారుదల సదుపాయం ఉంటుంది. కాబట్టి పంటలు అన్ని రకాల అన్ని వేళలా పండించవచ్చును.
  2. కానీ వర్షాధార ప్రాంతంలో వ్యవసాయం వర్షం పై ఆధారపడటం వలన అన్ని రకాల పంటలు. పండించలేము.
  3. జొన్న, సజ్జ, వేరుశనగ, రాగులు, పత్తి, సోయాబీన్, కంది, శనగ మొ||న పంటలను మాత్రమే పండించగలము.
  4. వర్షాధార ప్రాంతంలో నీటిని వర్షం పడినపుడు వేగంగా ప్రవహించనీయకుండా చూడాలి.
  5. దీని వలన నీరు భూమికి ఇంకడానికి అవకాశం లభించి భూగర్భ జలం వృద్ధి చెందుతుంది.
  6. వనీకరణ, కరకట్టల నిర్మాణం, చెక్ డ్యామ్ లు, చెరువుల నిర్మాణం మొదలయిన కార్యక్రమాలు అమలు చేసి పంటలను పండించవచ్చును.
  7. అదే నీటిపారుదల కలిగిన ప్రాంతాలలో అంతగా కష్టపడాల్సిన అవసరం ఉండదు. అన్ని రకాల పంటలు పండించుకోవచ్చు.

ప్రశ్న 8.
‘శీతల పానీయాలలో క్రిమి సంహారకాలు కనబడ్డాయి.’ వంటి సంఘటనను గుర్తుకు తెచ్చుకున్నారా? ఇది క్రిమిసంహారకాల వాడకంతో ఏ సంబంధాన్ని కలిగి ఉంది? చర్చించండి. (AS4)
జవాబు:

  1. శీతల పానీయాలు నిల్వ ఉండటానికి ఉత్పత్తిదారులు క్రిమిసంహారకాలు వాడుతున్నారు. దాని వలన మానవులు వాటిని తాగినపుడు అనేక సమస్యలకు లోనౌతున్నారు.
  2. బయట పంటలపై క్రిమి సంహారకాలు ఉపయోగించినపుడు కూడా క్రిములు చావడంతో పాటు మొక్కలు కూడా ఆ మందులను కొంత వరకు గ్రహిస్తున్నాయి.
  3. మొక్కలు గ్రహించినది వాటి పంటలకు పంపిస్తున్నది అందువలన వాటిని తినడం వలన మానవులు అనేక రకాల జబ్బులకు లోనుకావలసి వస్తుంది.
  4. అలాగే శీతల పానీయాలలో కూడా పురుగుమందులను వాడటం వలన అనేక సమస్యలను ఎదుర్కొనవలసి వస్తుంది.

AP Board 9th Class Social Solutions Chapter 6 భారతదేశంలో వ్యవసాయం

ప్రశ్న 9.
నూతన వ్యవసాయ పద్ధతులలో రసాయనిక ఎరువులను ఎందుకు వాడుతున్నారు? వీటి వాడకం వల్ల నేల సారం ఎలా తగ్గుతుంది? నేలను సారవంతం చేయడానికి ప్రత్యామ్నాయ మార్గాలు ఏమిటి? (AS1)
జవాబు:
నూతన వ్యవసాయ పద్ధతులలో రసాయనిక ఎరువులను వాడటానికి కారణం.

  1. రసాయనిక ఎరువులు (సాధారణంగా నత్రజని, భాస్వరం, పొటాషియం వంటి ఖనిజాలను నీటిలో కరిగే రూపంలో కలిగి ఉండటం వల్ల ఇవి మొక్కలకు వెంటనే అందుబాటులోకి వస్తాయి.
  2. కానీ ఇవి నేలలో ఎక్కువ కాలం అందుబాటులో ఉండవు.
  3. ఇవి మట్టిలో నుండి నీటి ద్వారా లోపలి పొరలకు ఇంకి భూగర్భ జలాలను, నదులను, చెరువులను కలుషితం చేస్తాయి. వీటి వాడకం వల్ల నేలసారం తగ్గడానికి కారణం : రసాయనిక ఎరువులు నేలలోని బాక్టీరియా ఇతర సూక్ష్మజీవులను చంపేస్తాయి.

ప్రశ్న 10.
హరిత విప్లవం ఎందుకు కొన్ని ప్రాంతాలలో రైతులకు స్వల్పకాలంలో లాభాన్ని, దీర్ఘకాలంలో నష్టాన్ని ఎలా కలిగించింది?
జవాబు:
హరిత విప్లవం వలన అధిక దిగుబడి విత్తనాలు ప్రవేశపెట్టడం.
1. దీని వలన వ్యవసాయ సాగుభూమి విస్తీర్ణం పెరగలేదు. కానీ వ్యవసాయ ఉత్పత్తి పెరిగింది.

2. రసాయనిక ఎరువుల వినియోగం
వీటిని ఉపయోగించడం వలన తాత్కాలికంగా మెరుగైన ఉత్పత్తులు సాధించాము. కానీ దీర్ఘకాలికంగా భూములు నిస్సారవంతమైనవి.

3. డాక్టర్ మొదలైన యాంత్రాల వినియోగం.
యంత్రాలను ఉపయోగించడం వలన వ్యవసాయరంగంపై ఆధారపడిన కార్మికులు ఉపాధిని కోల్పోయారు.

4. నీటి పారుదల సదుపాయాలను కలిగించడం.
నీటి కొరత ఏర్పడింది. వివిధ ప్రాంతాల మధ్య అభిప్రాయ భేదాలు ఏర్పడ్డాయి.

5. క్రిమి సంహార మందుల వినియోగం
వీటి వలన జీవన సమతుల్యత దెబ్బతింది.
పై విధంగా హరితవిప్లవం వల్ల రైతులకు స్వల్పకాలంలో లాభించినా దీర్ఘకాలంలో కొన్ని ప్రాంతాలలో నష్టాలు వచ్చాయి.

ప్రశ్న 11.
వ్యవసాయదారుల ఆదాయంపై విదేశీ వర్తక ప్రభావం ఏమిటి? (AS1)
జవాబు:

  1. ప్రస్తుతం భారతదేశ వ్యవసాయ విధానాలలో చాలా గమనించదగిన మార్పులు వచ్చాయి.
  2. గతం కంటే ఎక్కువగా ఎగుమతులు, దిగుమతులు జరుగుతున్నాయి.
  3. అభివృద్ధి చెందిన దేశాలు విదేశీ వ్యాపారాన్ని అనుమతించమని చేసే ఒత్తిడి.
  4. ఈ అభివృద్ధి చెందిన దేశాలు వారి వ్యవసాయ మిగులు ఉత్పత్తిని ఎక్కువ సంఖ్యలో కొనుగోలుదారులున్న అభివృద్ధి చెందుతున్న దేశాలలో విక్రయించాలని కోరుకుంటున్నాయి.
  5. విదేశీ వ్యాపార విధానంలో వచ్చిన మార్పుల వలన ప్రస్తుతం అనేక పంటల క్రయ విక్రయాలు అంతర్జాతీయంగా జరుగుతున్నాయి.
    ఉదా : రైతులు కూరగాయలు, పండ్లు, పంచదార, బెల్లాన్ని ఎగుమతి చేయగలుగుతున్నారు.
  6. పై విధంగా అభివృద్ధి చెందిన దేశాలు తమ ఉత్పత్తులను అమ్ముకోవడం వలన అభివృద్ధి చెందుతున్న భారతదేశం వంటి దేశాలు నష్టపోతున్నాయి.

ప్రశ్న 12.
కింది తరగతుల్లో భూమి పంపిణీ గురించి చదివియున్నారు. ఆ భావాన్ని ఈ చిత్రం ఎలా ప్రతిబింబిస్తుంది? భారతీయ వ్యవసాయం దృష్టికోణంలో దీనిపై ఒక పేరా రాయండి. (AS1)
AP Board 9th Class Social Solutions Chapter 6 భారతదేశంలో వ్యవసాయం 2
జవాబు:
ఒంటరిగా నిలిచియున్న వ్యక్తి ఒక పెద్ద రైతు అయి ఉండవచ్చు. అయితే భూమి పంపిణీ కార్యక్రమం ద్వారా ఎక్కువ మంది నిలిచియున్న వారికి కొంత భూమిని పంచిపెట్టి ఉండవచ్చును. కానీ వారికి ఆ భూమి కేటాయించబడి ఉండదు. ఒక వేళ అది కేటాయించిన భూమి అయిన్నటికి బీడు భూమి అయి ఉండవచ్చును. దానితో వారంతా మా భూమి ఏది అని అడగటానికి వచ్చి ఉండవచ్చును. అప్పుడు ఆ పెద్ద రైతు వారికి మొహం చూపించకుండా పక్కకు నిలబడి ఉన్నాడు. (లేదా) వారికి కేటాయించిన భూమి బీడు భూమి కావడంతో మాకు ఇలాంటి భూమి ఎందుకు అని అడగటానికి వచ్చి ఉండవచ్చును. అప్పుడు వారికి సరైన సమాధానం చెప్పక పక్కకు తిరిగి ఉండవచ్చును.

ప్రశ్న 13.
పేజీ నెం. 70లోని “ఎరువుల సమస్యలు” అంశం చదివి, వ్యాఖ్యానించండి.
జవాబు:
నేల సారం, భూగర్భజలం వంటి పర్యావరణ వనరులు ఏర్పడడానికి ఎన్నో సంవత్సరాలు పడుతుంది. ఒకసారి వీటిని కోల్పోయామంటే తిరిగి పునరుద్ధరించడం కష్టం. రసాయనిక ఎరువులు నేలలోని బాక్టీరియా, ఇతర సూక్ష్మజీవులను చంపేస్తాయి. ఈ ఎరువులను వాడటం మొదలు పెట్టిన కొంత కాలానికి నేల మునుపటి కంటే తక్కువ సారాన్ని కలిగి ఉంటుంది. ఎక్కువ మోతాదులో రసాయనిక ఎరువులు వాడకం వలన మిత్ర కీటకాలు, మేలు చేసే జీవులు అంతరించి, భూసారం నిస్సారమౌతుంది.

దీనికి బదులుగా సేంద్రియ ఎరువు, పెంటకుప్పలో హ్యూమస్, సూక్ష్మజీవులు ఉంటాయి. సంప్రదాయ ఎరువులు వాడకం వలన ఆరోగ్యానికి సంబంధించి సమస్యలు దూరమౌతున్నాయి.

వ్యవసాయం ప్రధానంగా సహజ వనరులపై ఆధారపడిన నేపథ్యంలో భవిష్యత్తులో కూడా వ్యవసాయం ప్రగతి సాధించేలా పర్యావరణాన్ని కాపాడుకోవడానికి రసాయనిక ఎరువుల స్థానంలో సేంద్రియ ఎరువులు ఉపయోగించడం హర్షదాయకం.

ప్రశ్న 14.
ఓ నెం. 74లోని పటాన్ని పరిశీలించి, భారతదేశంలో అవుట్ లైన్ పటంలో వరి పండించే రాష్ట్రాలను గుర్తించండి. (AS5)
జవాబు:
AP Board 9th Class Social Solutions Chapter 6 భారతదేశంలో వ్యవసాయం 3

9th Class Social Studies 6th Lesson భారతదేశంలో వ్యవసాయం InText Questions and Answers

9th Class Social Textbook Page No.59

ప్రశ్న 1.
మన దేశంలో సాంద్ర జీవనాధార వ్యవసాయ విధానం అమలులో గల రాష్ట్రాలను పేర్కొనండి.
జవాబు:
సాంద్ర జీవనాధార వ్యవసాయం అమలులో గల రాష్ట్రాలు :

  1. పంజాబ్
  2. హర్యానా
  3. ఉత్తరప్రదేశ్
  4. పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో అమలులో ఉంది.

9th Class Social Textbook Page No.60

ప్రశ్న 2.
ఒక ప్రాంతంలో వాణిజ్య పంటగా, మరొక ప్రాంతంలో జీవనాధార వ్యవసాయంగా పండించే మరికొన్ని పంటలకు ఉదాహరణలు ఇవ్వండి.
జవాబు:
వరి హర్యానా, పంజాబలో వాణిజ్య పంట కాగా ఒడిశాలో జీవనాధార పంటగా పండిస్తున్నారు.

9th Class Social Textbook Page No.62

ప్రశ్న 3.
కందులు, బఠాణి, పెసలు, మసూర్, శనగలు, మినుములు, వేరుశనగ మొదలైన పప్పు ధాన్యాలలో ఖరీఫ్, రబీలలో పండే వాటిని వేరుచేయండి.
జవాబు:
ఖరీఫ్ కాలంలో పండే పప్పుధాన్యాలు కందులు, పెసలు, మినుములు, వేరుశనగ.
రబీ కాలంలో పండే పప్పు ధాన్యాలు బఠాణి, మసూర్, శెనగలు.

9th Class Social Textbook Page No.64

ప్రశ్న 4.
1. కింది పట్టికలో ముఖ్యమైన పంటలు, అవి పండే రాష్ట్రాల సమాచారం ఇవ్వబడింది. పూర్తి సమాచారం ఇవ్వలేదు. వాటి పూర్తి సమాచారాన్ని అట్లాస్, మీ టీచర్ సహాయంతో చర్చించి పట్టికను పూర్తిచేయండి.
2. ప్రతి పంటకు ప్రత్యేకమైన గుర్తును ( ⋅0⋅⋅) కేటాయించి, దానిని భారతదేశ రాజకీయ పటంలో గుర్తించి, ఆయా రాష్ట్రాలలో ఆయా పంటలు పండుటకు కారణాలను తరగతి గదిలో చర్చించండి.
AP Board 9th Class Social Solutions Chapter 6 భారతదేశంలో వ్యవసాయం 5
జవాబు:
AP Board 9th Class Social Solutions Chapter 6 భారతదేశంలో వ్యవసాయం 4

అధిక వాటాకు సహజమైన ఇతర కారణాలు :
1. వరి :

  1. అత్యధిక ఉష్ణోగ్రత, అధిక ఆర్ధతను కలిగి 100 సెం.మీ.ల సాంవత్సరిక వర్షపాతం పడే ప్రాంతాలలో బాగా పండుతుంది.
  2. తక్కువ వర్షపాతం ఉన్నప్పటికీ నీటి పారుదల బాగా ఉంటే వరి పండించవచ్చును.
  3. మన దేశంలో ఉత్తర మైదానాలు, ఈశాన్యప్రాంత మైదానాలు, తీరప్రాంతాలు, డెల్టా ప్రాంతాలు వరి పంటకు ప్రసిద్ధి.
  4. అందువల పశ్చిమ బెంగాల్,పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశాలలో అధికంగా పండుతుంది.

2. గోధమ :

  1. పంట కాలమంతా సమానంగా విస్తరించి ఉండే 50 నుండి 70 సెం.మీ వర్షపాతం అనుకూలం.
  2. మిత ఉష్ణోగ్రత ఉండి కోతకు వచ్చే సమయంలో వాతావరణం ప్రకాశవంతంగా ఉండాలి.
  3. గంగా సట్లెజ్ మైదాన ప్రాంతం, దక్కన్ పీఠభూమిలోని నల్లరేగడి ప్రాంతం, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ ముఖ్యమైన గోధుమ ఉత్పత్తి రాష్ట్రాలు.

3. చిరుధాన్యాలు :

  1. జొన్న, సజ్జ, రాగులు వంటి వాటిని చిరు ధాన్యాలు అంటారు. ఇవి ప్రధానంగా వర్షాధార పంటలు.
  2. జొన్నను అత్యధికంగా పండిస్తున్న రాష్ట్రం మహారాష్ట్ర, తరువాత కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్ ఇతర వరుస స్థానాలలో ఉన్నాయి.
  3. సజ్జ, ఇసుక నేలల్లోనూ, తేలికపాటి నల్లరేగడి నేలల్లో పండుతుంది. రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, హర్యానా సజ్జ పండించే రాష్ట్రాలు.

రాగి పంట శుష్క వాతావరణం గల అన్ని రకాల నేలల్లో పండుతుంది. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలలో బాగా పండుతుంది.

4. మొక్కజొన్న :

1. ఈ పంటకు 21°C నుండి 27°C ల ఉష్ణోగ్రత అవసరం.
పురాతన ఒండ్రునేలలు అత్యంత అనుకూలం.
బీహార్ లో రబీ కాలంలో పండిస్తారు.
అధిక దిగుబడి విత్తనాలు, రసాయనిక ఎరువులు, నీటిపారుదల సదుపాయాలు ఈ పంటకు బాగా అనుకూలమైనవి.

కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, బీహార్‌లో అధికంగా పండుతుంది.

5. పప్పుధాన్యాలు :
1. భారత దేశంలో పండే ముఖ్యమైన పప్పు ధాన్యాలు, కందులు, మినుములు, పెసలు, బఠాణి, మసూర్, శెనగలు.

తక్కువ వర్షపాతం గల శుష్క ప్రాంతాలలో సైతం పప్పు ధాన్యాలు పండుతాయి. లెగ్యూమినేసి కుటుంబానికి చెందిన ఈ మొక్కలన్నీ కూడా వాతావరణం నుండి నత్రజని గ్రహించి నేలలో, ప్రతిష్టాపన చేసి భూసారాన్ని పెంచుతాయి.

6. చెరకు :

  1. అధిక ఉష్ణోగ్రతలు (21°C నుండి 27°C), ఆర్ధత, 75 నుండి 100 సెం.మీ.ల సాంవత్సరిక వర్షపాతం నమోదు చేసే ప్రాంతాలు చెరకు పంటకు అనుకూలం.
  2. అల్ప వర్షపాతం గల ప్రాంతాలలో నీటి పారుదల తప్పనిసరి.
  3. మన దేశంలో ప్రధానంగా ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బీహార్,చెరకు పండించే రాష్ట్రాలు.

7. నూనెగింజలు :

  1. నూనె గింజలను అత్యధికంగా మన దేశంలోనే పండిస్తున్నారు. ప్రధానంగా వంట నూనెలుగా ఉపయోగిస్తారు.
  2. మరికొన్నింటిని సబ్బులు, సౌందర్య లేపనాలు, ఔషధ లేపనాలతో ముడిపదార్థాలుగా ఉపయోగిస్తారు.

8. ప్రత్తి :

  1. ప్రపంచంలో పత్తిని సాగు చేసిన మొదటి దేశం భారతదేశం.
  2. శుష్క వాతావరణం గల దక్కన్ పీఠభూమిలోని నల్లరేగడి నేలలు పత్తి పంటకు అత్యంత అనుకూలం.
  3. అధిక ఉష్ణోగ్రతలు, మిత వర్షపాతం కనీసం 210 రోజులు ‘మంచురహిత వాతావరణం ప్రత్తి పంటకు అనుకూలం.
  4. ఖరీఫ్ పంట అయినప్పటికీ పంట కాల వ్యవధి 6 నుండి 8 నెలలుగా ఉంటుంది.

AP Board 9th Class Social Solutions Chapter 6 భారతదేశంలో వ్యవసాయం 6

9th Class Social Textbook Page No.65

ప్రశ్న 5.
‘1971 – 2001 లలో వ్యవసాయదారులు, వ్యవసాయ కూలీలు ఎంత శాతం ఉన్నారో పై ‘దిమ్మ చిత్రం పూరించండి.
జవాబు:
AP Board 9th Class Social Solutions Chapter 6 భారతదేశంలో వ్యవసాయం 7
1971 లో వ్యవసాయదారులు – 62% 1971 లో వ్యవసాయ కూలీల శాతం – 38%
2001 లో వ్యవసాయదారులు – 54% 2001 లో వ్యవసాయ కూలీల శాతం – 46%

ప్రశ్న 6.
స్వయం ఉపాధి పొందేవారికి, పని కోసం చూసేవారి మధ్యగల తేడాలను మీ ప్రాంతంలో గల ఉదాహరణల ద్వారా చర్చించండి.
జవాబు:

  1. స్వయం ఉపాధి పొందే వారికి ఆదాయం వస్తుంది. ఉపాధి కల్పించబడుతుంది.
  2. వారు ఉపాధి పొందడం మాత్రమే కాక మరికొంత మందికి ఉపాధి కల్పించిన వారు అవుతారు.
  3. వారికి వారే యజమానులు కాబట్టి వారి శక్తియుక్తుల మేరకు పనిచేసి ఎక్కువ ఆదాయం పొందడానికి అవకాశం ఏర్పడుతుంది.
  4. పనికోసం చూసేవారికి ఉపాధి ఉండదు.
  5. ఆదాయం రాదు.
  6. ఎవరు పని కల్పిస్తారా అని ఎదురు చూస్తారు కాబట్టి పని అంతగా చేయలేరు.
  7. పనికోసం చూసే వారు ఎవరి కిందో పనిచేయవలసి ఉంటుంది.

AP Board 9th Class Social Solutions Chapter 6 భారతదేశంలో వ్యవసాయం

ప్రశ్న 7.
ఒకప్పటి వ్యవసాయదారుల కుటుంబాలు కొన్ని ఇప్పుడు వ్యవసాయ కూలీలు అవుతున్నాయని భావిస్తున్నావా? చర్చించండి.
జవాబు:
ఒకప్పటి వ్యవసాయదారుల కుటుంబాలు కొన్ని ఇప్పుడు వ్యవసాయ కూలీలు అవుతున్నాయని భావించటం లేదు. ఎందుకనగా భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం కాబట్టి ఒకప్పటి వ్యవసాయ కూలీలు కూడా నేడు వ్యవసాయ దారులుగా మారారు. కానీ ఒకప్పటి వ్యవసాయదారులు నేడు వ్యవసాయ కూలీలుగా మారలేదు. భూములు లేని వారికి కూడా భూ పంపిణీ చేసి భూ యజమానులుగా మార్చుతున్నారు.

9th Class Social Textbook Page No.67

ప్రశ్న 8.
అట్లాస్ సహాయంతో పైన పేర్కొన్న డ్యామ్ ను అవి నిర్మించబడిన నదులను భారతదేశ పటంలో గుర్తించండి.
జవాబు:

  1. భాక్రానంగల్ ప్రాజెక్టు – సట్లెజ్ నదిపై కలదు. – పంజాబ్ రాష్ట్రం
  2. దామోదర లోయపథకం – దామోదర్ నదిపై కలదు. – పశ్చిమ బెంగాల్ రాష్ట్రం
  3. హీరాకుడ్ ప్రాజెక్టు – మహానదిపై కలదు. – ఒడిషా రాష్ట్రం
  4. నాగార్జున సాగర్ ప్రాజెక్టు – కృష్ణానదిపై కలదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు
  5. గాంధీ సాగర్ – నర్మదానదిపై కలదు. మధ్యప్రదేశ్ రాష్ట్రం

AP Board 9th Class Social Solutions Chapter 6 భారతదేశంలో వ్యవసాయం 8

9th Class Social Textbook Page No.68

ప్రశ్న 9.
నూతన వ్యవసాయ విధానాలను ఏ ప్రాంతంలో మొట్టమొదటిడా అమలుచేయ ప్రయత్నించారు? దేశం మొత్తం ఎందుకు వర్తింపచేయలేదు?
జవాబు:
నూతన వ్యవసాయ విధానాలను మొట్టమొదట పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలలో అమలు చేశారు. అవి మైదాన ప్రాంతాలు కావడం వలన, మరియు సారవంతమైన నేలలు కావడం వలన ముందుగా అక్కడ అమలుచేయ ప్రయత్నించారు. అక్కడ విజయవంతం అయిన తరువాత మిగిలిన ప్రాంతాలలో ప్రవేశపెడదాం అనే భావనతో ఉండటం వలన దేశం మొత్తం వర్తింపచేయలేదు.

ప్రశ్న 10.
వర్షాధార వ్యవసాయానికి విభిన్న పద్దతులు ఎందుకు అవసరం?
జవాబు:

  1. నీటి పారుదల కలిగిన భూములలో అధిక దిగుబడి విత్తనాలే కాకుండా ఈ ప్రాంతాలు మనకు అనేక సవాళ్లు విసురుతున్నాయి.
  2. ఈ ప్రాంతాలలో పడిన వర్షపాతాన్ని సంరక్షించుకోవడం మొదటి బాధ్యత.
  3. పడిన వర్షపు నీరు వేగంగా ప్రవహించనీయకుండా చూడగలగాలి.
  4. దీని వలన నీరు భూమిలోకి ఇంకడానికి అవకాశం లభించి భూగర్భజలం వృద్ధి చెందుతుంది.
  5. వనీకరణ, కరకట్టల నిర్మాణం, చెక్ డ్యామ్ లు, చెరువుల నిర్మాణం మొదలైన కార్యక్రమాలు నీటి యాజమాన్య విధానంలో కలిసి ఉన్నాయి.

9th Class Social Textbook Page No.69

ప్రశ్న 11.
కరవు కాటకాలను అధిగమించడానికి అదనపు ఆహార నిల్వలు ఎలా సహకరిస్తాయి?
జవాబు:

  1. భారత ఆహార సంస్థ ద్వారా భారత ప్రభుత్వం గిడ్డంగులలో భారీగా ఆహార ధాన్యాలను నిల్వ చేస్తుంది.
  2. వీటిని కరవు కాటకాలు వచ్చినపుడుగాని, ఆహారధాన్యాల కొరత ఏర్పడినపుడు గాని ఉపయోగిస్తారు.
  3. ఇలా సేకరించిన ధాన్యాన్ని దేశంలో ధాన్యం అందుబాటులో లేని ప్రాంతాలకు సరఫరా చేస్తారు.

AP Board 9th Class Social Solutions Chapter 6 భారతదేశంలో వ్యవసాయం

ప్రశ్న 12.
రైతులు తమకు గల కొద్దిపాటి విస్తీర్ణంలో ఆహార ధాన్యాల దిగుబడిని ఎలా పెంచుకోగలిగారు?
జవాబు:
రైతులు అధిక మొత్తంలో ఆహార ధాన్యాలు, ఆహారేతర పంటలను ఒకే పొలంలో సాగు చేయడానికి హరితవిప్లవం తోడ్పడింది.

ప్రశ్న 13.
ఏ దశాబ్దాలలో ఆహార ధాన్యాల దిగుబడి వేగంగా పెరిగింది? దానికి సరైన కారణం ఏమై ఉండవచ్చు?
జవాబు:

  1. 1980 – 81 – 1990 – 91 దశాబ్దకాలంలో ఆహార ధాన్యాల దిగుబడి ఎక్కువగా ఉంది.
  2. కారణం హరిత విప్లవాన్ని ప్రవేశపెట్టడం.
  3. హరిత విప్లవంలో భాగంగా వివిధ అంశాలకు ప్రాధాన్యమివ్వడం.

9th Class Social Textbook Page No.71

ప్రశ్న 14.
హరిత విప్లవ సమయంలో రైతులు ఆహార ధాన్యాన్ని ఎగుమతి చేయడానికి భారత ప్రభుత్వం ఎందుకు అనుమతించలేదు?
జవాబు:

  1. భారతదేశ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి.
  2. కొరత ఏర్పడిన సందర్భంలో కేవలం ప్రభుత్వానికి మాత్రమే దిగుమతి చేసుకునే హక్కు ఉండేది.
  3. ప్రభుత్వం రైతాంగానికి కావలసిన ఉత్పాదకాలను చౌకగా అందజేయడం.
  4. వ్యవసాయ ఉత్పత్తులను కనీస మద్దతు ధరతో కొనడం.
  5. స్వదేశీ మార్కెట్ సదుపాయాన్ని కల్పించడం.
  6. వ్యవసాయం ద్వారా ఏదైన ఆదాయాన్ని కల్పించుట కొరకు.

ప్రశ్న 15.
ప్రభుత్వం ఎగుమతులను / దిగుమతులను ఎందుకు నిషేధించినది? ఈ విధానం భారతీయ రైతులకు ఏ విధంగా ఉపయోగపడింది?
జవాబు:

  1. భారతీయ వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడానికి
  2. భారతీయ రైతులు తమ ఉత్పత్తులు పెంచుకున్నారు.
  3. మార్కెట్లో గిట్టుబాటు రేటు లభించింది. తద్వారా ఆదాయం పెరిగింది.

ప్రాజెక్టు

ప్రశ్న 1.
మీ ప్రాంతంలో పండే పంటలు ఏవి ? వీటిలో ఏవి HYV వంగడాల ద్వారా, సాంప్రదాయ వంగడాల ద్వారా పెరుగుతాయి? ఈ క్రింది అంశాలను HYV వంగడాలు, సాంప్రదాయ వంగడాలతో పోల్చి చూడండి. (T.Q.)
అ) పంటకాలం ఆ) ఎన్నిసార్లు నీరందిస్తారు. ఇ) ఉత్పతి ఈ) ఎరువులు ఉ) వ్యాధులు ఊ) క్రిమి సంహారకాలు
జవాబు:
మా ప్రాంతంలో పండే పంటలు :
వరి, పెసర, మినుము, మొక్కజొన్న, జొన్న, సజ్జ మొదలగునవి. వీటిలో ఏవి HYV వంగడాల ద్వారా, సాంప్రదాయ వంగడాల ద్వారా పెరుగుతాయి అనగా ప్రస్తుతం అన్నియు HYV వంగడాల ద్వారా మాత్రమే పెరుగుతున్నాయి.

వరి :
HYV వంగడాలను ప్రవేశపెట్టడం ద్వారా తక్కువ పంటకాలంలో అధిక దిగుబడిని సాధించటానికి అవకాశమేర్పడు తుంది. ప్రాచీన సంప్రదాయ వంగడాలైతే పంటకాలం 6 నెలలు ఉంటుంది. తక్కువ దిగుబడి (ఉదా : 10 బస్తాల కన్నా తక్కువ) వస్తుంది. పెసర, మినుము, మొక్కజొన్న, జొన్న, సజ మొదలైన పంటల విషయంలో కూడా HYV వంగడాలను ప్రవేశపెట్టడం ద్వారా తక్కువ పంటకాలం అధిక దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది. మరియు అన్ని కాలాలయందు ఆయా పంటలను పండించడానికి అవకాశం ఏర్పడుతుంది.

AP Board 9th Class Social Solutions Chapter 6 భారతదేశంలో వ్యవసాయం

ప్రశ్న 2.
విద్యార్థులను రెండు జట్లుగా చేసి ఒక జట్టు వారు వ్యవసాయంలో సేంద్రియ ఎరువుల వాడకాన్ని సమర్థిస్తూ, ఇంకొక జట్టు వారు రసాయనిక ఎరువులు, పురుగు మందుల వాడకాన్ని సమర్థిస్తూ వాదనలు వినిపించండి. (డిబెట్ నిర్వహించండి.)
జవాబు:

AP Board 9th Class Social Solutions Chapter 5 జీవావరణం

SCERT AP 9th Class Social Studies Guide Pdf 5th Lesson జీవావరణం Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Social Solutions 5th Lesson జీవావరణం

9th Class Social Studies 5th Lesson జీవావరణం Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
జీవులను ఒక ప్రత్యేకమైన జీవావరణంగా వర్ణిస్తారు. వివరించండి. (AS1)
జవాబు:

  1. భూ శాస్త్రజ్ఞులు జీవాన్ని ఒక ప్రత్యేక ఆవరణంగా పరిగణిస్తారు. దీనినే “జీవావరణం” అంటారు.
  2. జీవంతో కళకళలాడే ఏకైక గ్రహం భూమి.
  3. అతి సూక్ష్మ బాక్టీరియా నుంచి అత్యంత పెద్దవైన మర్రి చెట్టు, నీలి తిమింగలాలు, ఏనుగులు వంటి జీవులు, పులులు మానవులతో భూమి విలసిల్లుతోంది.
  4. సూర్యుడికి భూమి మరీ దగ్గరగా, మరీ దూరంగా లేనందున ఇక్కడ అనువైన ఉష్ణోగ్రతలు ఉండటం.
  5. నేల, నీరు, గాలి మూడు కలిసి ఉండటం వల్ల ఒక్క భూమిపైన మాత్రమే జీవం సాధ్యమైంది. అందువల్ల జీవులతో కూడిన దానిని జీవావరణం అంటారు.

AP Board 9th Class Social Solutions Chapter 5 జీవావరణం

ప్రశ్న 2.
ఆధునిక కాలంలో పర్యావరణ సంక్షోభం సృష్టించబడుతున్నది. వాటి యొక్క ప్రభావాన్ని వివరించండి. (AS4)
(లేదా)
పర్యావరణ సంక్షోభ పరిణామాలను తెలపండి.
జవాబు:

  1. పారిశ్రామికీకరణం, వేగంగా వృద్ధి చెందుతున్న జనాభా, పట్టణీకరణ వల్ల ఖనిజాలు, అడవులు, నేల, రాళ్లు, గాలి వంటి ప్రకృతి వనరులు ఇంతకు ముందు కనీవిని ఎరగని స్థాయిలో దోపిడికి గురవుతున్నాయి.
  2. ఇదే క్రమంలో భూమిలో కోట్ల సంవత్సరాలుగా నిలవ ఉన్న ఇంధన వనరులను కొల్లగొడుతున్నారు.
  3. దీని వల్ల అడవులు వేగంగా తగ్గిపోతున్నాయి.
  4. ఖనిజ, చమురు, భూగర్భజలవనరులు అంతరించిపోతూ ఉన్నాయి.
  5. ప్రస్తుత జీవన విధానం సుస్థిరమైనది కాదని చాలా మంది శాస్త్రజ్ఞులు అంటున్నారు.
  6. ప్రకృతి వనరులను ఇదే తీరులో వినియోగించుకుంటూ పోతే మన పిల్లలు, వాళ్ల పిల్లలకు ఏమీ మిగలదు.
  7. మానవులు అభివృద్ధి, సంతోషం పేర్లతో ప్రకృతిని నాశనం చేస్తున్నారు.
  8. మానవుల వ్యాపార కార్యకలాపాల వల్ల భూమిపై ప్రతిజీవి, ప్రతి పదార్థమూ ప్రభావితం అవుతున్నాయి.
  9. ఇది ఇలాగే కొనసాగితే ఇతర జీవ జాతులకే కాక అంతిమంగా మనుషులకు కూడా ముప్పుగా పరిణమిస్తుంది.

ప్రశ్న 3.
సహజ వృక్ష సంపదను శీతోష్ణస్థితి ప్రభావితం చేస్తుంది. వివిధ రకాలైనటువంటి అడవులను, వాటిని ప్రభావితం చేసే శీతోష్ణస్థితులను వివరించండి. (AS1)
జవాబు:
AP Board 9th Class Social Solutions Chapter 5 జీవావరణం 1
AP Board 9th Class Social Solutions Chapter 5 జీవావరణం 2

ప్రశ్న 4.
అంతరించిపోతున్న అడవులను ఎలా సంరక్షించుకోవచ్చు? (AS6)
(లేదా)
అడవుల సంరక్షణకై ఏవేని రెండు మార్గాలను సూచించండి.
(లేదా)
ప్రస్తుతం అంతరించిపోతున్న అడవులను సంరక్షించుకొనుటకు నాలుగు సూచనలు రాయండి.
జవాబు:
అంతరించిపోతున్న అడవులను సంరక్షించుకొనే విధానం :

  1. పారిశ్రామిక ప్రాంతాల యందు, పాఠశాలల ఆవరణంలోను, కళాశాలల ఆవరణంలోను,ఇంటి ఆవరణంలోను, రోడ్లు కిరువైపుల, కాలువ గట్లపైన, నదుల గట్లపైన, ఖాళీస్థలాల యందు, మొక్కలను పెంచాలి.
  2. అడవుల అక్రమ నరికి వేతలను అరికట్టి ఆక్రమ రవాణాను పూర్తిగా ఆపుచేయాలి.
  3. అడవులను నరుకుతున్న ప్రదేశాల యందు మొక్కలను నాటాలి.
  4. మొక్కల పెరుగుదలకు అన్ని రకాల చర్యలు చేపట్టాలి.
  5. అడవుల ఆవశ్యకత గురించి ప్రజలకు తెలియజేయాలి.

ప్రశ్న 5.
పాఠ్యాంశాన్ని చదివి కింద పట్టిక నింపండి.
AP Board 9th Class Social Solutions Chapter 5 జీవావరణం 3
జవాబు:
AP Board 9th Class Social Solutions Chapter 5 జీవావరణం 4

ప్రశ్న 6.
ప్రపంచ పటంలో ఈ కింది దేశాలను గుర్తించండి.
1. న్యూజిలాండ్ .2. బ్రెజిల్ 3. ఆస్ట్రేలియా 4.ఉత్తర అమెరికా 5. చైనా 6. ఇండియా
జవాబు:
AP Board 9th Class Social Solutions Chapter 5 జీవావరణం 5

ప్రశ్న 7.
పేజీ నెం. 57లోని “వనరులు అంతరించిపోవడం” అంశం చదివి, వ్యాఖ్యానించండి.
జవాబు:
వనరులు అంతరించిపోవడం ఇటీవల చాలా తీవ్రమైంది. పారిశ్రామికీకరణ వేగంగా వృద్ధి చెందుతున్న జనాభా, పట్టణీకరణ వల్ల ఖనిజాలు, అడవులు, నేల, రాళ్లు, గాలి వంటి ప్రకృతి వనరులు కనీవినీ ఎరుగని రీతిలో, స్థాయిలో దోపిడీకి గురౌతున్నాయి. అదే విధంగా భూమిలో కోట్ల సంవత్సరాలుగా నిలవ ఉన్న ఇంధన వనరులు అనగా బొగ్గు, ముడిచమురు కొల్లగొడుతున్నారు. వనరులు అంతరించడం వలన అటు జీవ వైవిధ్యానికి కూడా పెను సవాలు ఎదురౌతుంది. అడవులు తగ్గిపోతూ, ఖనిజాలు, చమురు, భూగర్భజల వనరులు అంతరించిపోతున్నాయి. అభివృద్ధి ముసుగులో ప్రకృతి వనరులు అంతరించడం వల్ల భవిష్యత్తు తరాల భవిష్యత్తు చీకటిలో కొట్టుమిట్టాడుతుంది. పర్యావరణం కూడా కలుషితమౌతూ, మానవాళి మనుగడకే ముప్పు వాటిల్లుతుంది.

9th Class Social Studies 5th Lesson వాతావరణం InText Questions and Answers

9th Class Social Textbook Page No.51

ప్రశ్న 1.
గాలి, నీరు మీద మొక్కలు ఎలా ఆధారపడి ఉన్నాయో చెప్పండి ; మొక్కలు ఆ రెండింటిని ఎలా ప్రభావితం చేస్తాయో చెప్పండి.
జవాబు:

  1. అన్ని రూపాలలోని జీవులకు వాటి చుట్టూ ఉండే నేల, నీరు, గాలి, సూర్యరశ్మిలతో అవినాభావ సంబంధం ఉంది.
  2. వీటినుండి జీవం తనకు కావలసినవన్నీ పొందుతుంది, తిరిగి వాటిని గణనీయంగా ప్రభావితం చేస్తుంది.
  3. తమ చుట్టూ ఉన్న మూడు ఆవరణాలతోనే కాకుండా వివిధ జీవరూపాల మధ్య పరస్పర సంబంధాలు ఉంటాయి. ఇవన్నీ ఒక సంక్లిష్ట ‘ఆహార శృంఖలం’లో భాగం – అంటే ఒక రకమైన జీవరూపం మరొకదానికి ఆహారం అవుతుంది.
  4. అనేక రకాల జీవరూపాలు అత్యవసర పదార్థాలను ఒకదానితో ఒకటి పంచుకుంటూ పరస్పర ప్రయోజన సంబంధాలలో ఉంటాయి. వీటన్నిటికీ ఉదాహరణలు తెలుసుకుందాం.
  5. భూమి మీద ప్రాథమిక ఆహార ఉత్పత్తిదారులు మొక్కలు. సూర్యరశ్మిని ఉపయోగించుకుని ఇవి ఆహారం తయారుచేస్తాయి. వీటికి కావలసిన పోషకాలను నేలనుంచి, ప్రత్యేకించి ఇతర మొక్కలు, పశువుల వ్యర్థపదార్థాలు కుళ్లగా ఏర్పడిన సేంద్రియ మూలకాల నుంచి గ్రహిస్తాయి.
  6. నేలలో బ్యాక్టీరియా స్థిరీకరించిన నత్రజనిపై కూడా. ఇవి ఆధారపడతాయి. మొక్కలు తయారుచేసిన ఆహారాన్ని ‘శాకాహారులు’ అని పిలిచే జింక, ఆవు, మేక, ఏనుగు వంటి గడ్డి తినే జంతువులు తింటాయి.
  7. కుక్క, పిల్లి, డేగ, పులి వంటివి మాంసాహారులు, ఇవి శాకాహార జంతువులను తినడం వల్ల పరోక్షంగా మొక్కలపై ఆధారపడినవే. చనిపోయిన మొక్కలు, జంతువులు, వాటి వ్యర్థ పదార్థాలపై బ్యాక్టీరియా, శిలీంధ్రాలు వంటివి పనిచేసి సేంద్రియ మూలకాలుగా విచ్ఛిన్నం చేస్తాయి.
  8. మొక్కలు తమ ఎదుగుదలకు సేంద్రియ మూలకాలపై ఆధారపడతాయి. ఈ విధంగా జీవన చక్రం నిరంతరం కొనసాగుతూ ఉంటుంది.

AP Board 9th Class Social Solutions Chapter 5 జీవావరణం

ప్రశ్న 2.
దోమలు, సీతాకోకచిలుకలు వంటి పురుగులు రాళ్ళు లేదా మట్టి మీద, నీటి మీద ఏ విధంగా ఆధారపడి ఉన్నాయి? తిరిగి వాటిని అవి ఎలా ప్రభావితం చేస్తాయి?
జవాబు:

  1. దోమలు, సీతాకోకచిలుకలు వంటి పురుగులు రాళ్ళు లేదా మట్టి మీద, నీటి మీద ఆధారపడి ఉండటానికి కారణం దోమలు నీటి మీద నివసిస్తూ, గుడ్లు పెడుతూ తమ సంతానాన్ని వృద్ధి చేసుకుంటూ మానవుల, జంతువుల ఇతర విధములైన రక్తమును పీలుస్తూ జీవిస్తాయి.
  2. సీతాకోక చిలుకలు పుష్పాలలో మకరందాన్ని సేవిస్తూ జీవిస్తాయి. అలాగే ఇతర క్రిమికీటకాదులు తమతమ రీతులలో జీవనం చేస్తాయి.

9th Class Social Textbook Page No.55

ప్రశ్న 3.
మీ పరిసరాల్లో గట్టి కలప, మెత్తటి కలపతో చేసిన వస్తువులను గుర్తించండి.
జవాబు:
గట్టి కలపతో చేసిన వస్తువులు :
తలుపులు, కిటికీలు, మంచాలు, కుర్చీలు, బల్లలు, సోఫాలు, వివిధ రకాలైన గృహోపకరణాలు.

మెత్తటి కలపతో చేసినవి :
అగ్గి పుల్లలు, ప్యాకేజింగ్ పెట్టెలు.

ప్రశ్న 4.
మీ ప్రాంతంలో ఉండే చెట్ల పేర్లతో పాటు వాటి గురించి తెలుసుకోండి.
జవాబు:
మా ప్రాంతంలో ఉండే చెట్లు
మామిడి : కాయలు, కలపనిస్తుంది.
వేప : ఆరోగ్యప్రదాయిని, కలప, ఔషధాల సపోటానిస్తుంది.
చింత : కలప, చింతపండుకు ఉపయోగపడుతుంది.
సరుగుడు : కలపనిస్తుంది.
జీడిమామిడి : జీడిపప్పునిస్తుంది.
జామ : కాయలు, కలపనిస్తాయి.
సపోటా : కాయలనిస్తుంది.
ద్రాక్ష : పండ్లనిస్తుంది.
బాదం : పప్పునిస్తుంది.
మఱ్ఱి : కలపనిస్తుంది.

ప్రశ్న 5.
ప్రపంచ పటంలో ఎడారి ప్రాంతాలను గుర్తించండి.
జవాబు:

  1. సహారా ఎడారి
  2. కలహారి ఎడారి
  3. థార్ ఎడారి
  4. అరేబియన్ ఎడారి
  5. ఆస్ట్రేలియన్ ఎడారి
  6. అటకామా ఎడారి
  7. సోనోరన్ ఎడారి

AP Board 9th Class Social Solutions Chapter 5 జీవావరణం 6

9th Class Social Textbook Page No.56

ప్రశ్న 6.
వ్యవసాయం, పశుపోషణ మొదలు పెట్టినప్పుడు మనుషులు తమ చుట్టూ ఉన్న భూమి, నీరు, మొక్కలు, జంతువులను ఏ విధంగా ప్రభావితం చేసి ఉంటారో చర్చించండి.
జవాబు:

  1. మానవులు వ్యవసాయం, పశుపాలన మొదలు పెట్టినప్పుడు, పర్యావరణాన్ని మరింతగా ప్రభావితం చేయసాగారు.
  2. ఇత్తడి, ఇనుము వంటి లోహాల వినియోగం, నగరాల నిర్మాణంతో, పర్యావరణంతో మానవ సంబంధాలు మారిపోయాయి.
  3. అనతి కాలంలోనే ప్రజలు నీళ్లు నిల్వచేయటానికి చెరువులు, పొలాలకు నీళ్ళు ‘ మళ్లించటానికి కాలువలు, నదులకు ‘ అడ్డంగా ఆనకట్టలు వంటివి నిర్మించటం మొదలు పెట్టారు.
  4. వివిధ ప్రాంతాలను కలుపుతూ ప్రజలు రహదారులు వేశారు.
  5. మహా సముద్రాల మీద ఓడలు, పడవలతో ప్రయాణం చేశారు.

ప్రశ్న 7.
వాళ్లు ఏ ఇంధన వనరులను ఉపయోగించి ఉంటారు? వాటిని ఎలా పొంది ఉంటారు?
జవాబు:

  1. ఇంధన వనరుల కోసం పారిశ్రామిక దేశాలు ప్రపంచమంతటా వెదకసాగాయి.
  2. వాళ్లు ప్రపంచమంతా అన్వేషించి అన్ని రకాల వనరుల జాబితా తయారు చేశారు.
  3. లోతైన బావులు తవ్వి భూమి లోపల పొరల్లో ఏముందో చూశారు.
  4. అనతి కాలంలోనే భూమి అంతటా పెద్ద ఎత్తున గనుల తవ్వకం, అడవులు నరికి వేయటం, కర్మాగారాల నిర్మాణం, రోడ్లు వేయటం, వ్యవసాయ పొలాలుగా మార్చటం వంటివి చేపట్టారు.

AP Board 9th Class Social Solutions Chapter 5 జీవావరణం

ప్రశ్న 8.
నగరాలు నిర్మించటం వల్ల వాటి చుట్టూ నేల, నీళ్లు ఏ విధంగా ప్రభావితమై ఉంటాయి?
జవాబు:

  1. నగరాలు నిర్మించటం. వల్ల, పరిశ్రమలు స్థాపించటం వల్ల, జనాభా పెరుగుదల వల్ల ఖనిజాలు, అడవులు, నేల, రాళ్లు, గాలి వంటి ప్రకృతి వనరులు ఇంతకు ముందు కనీవినీ ఎరగని స్థాయిలో దోపిడికి గురవుతున్నాయి.
  2. నేల, నీళ్ళు కలుషితం అవుతున్నాయి.
  3. నేల వేడెక్కుతుంది. నీళ్ళు కలుషితం అవుతున్నాయి. వీటి వలన మానవుల జీవితం రోగాల బారిన పడుతుంది.
  4. శిలాజ ఇంధనాలను ఉపయోగించటం వల్ల ఆధునిక పరిశ్రమలు ఘన, ద్రవ,వాయు రూపాలలో వ్యర్థ పదార్థాలను విడుదల చేసి గాలి, నీరు, నేలను కలుషితం చేస్తున్నాయి.

ప్రశ్న 9.
భూమి స్వరూపాన్ని, నీటి చక్రాన్ని ఇది ఏ విధంగా ప్రభావితం చేస్తోంది?
జవాబు:

  1. కాలుష్యాల వల్ల కొంతకాలానికి మన పర్యావరణం విషపూరితం అవుతుంది.
  2. ముఖ్యమైన మార్పు ప్రపంచ వ్యాప్తంగా శీతోష్ణస్థితులు మారటం.
  3. దీనినే ప్రపంచం వేడెక్కటం అంటున్నారు.
  4. దీనితో వర్షాలు తగ్గిపోతున్నాయి.
  5. కాలుష్యం పెరిగిపోతుంది.
  6. మంచి నీటి ప్రవాహం ఏర్పడుతుంది.
  7. మరొక వైపు ధృవాల వద్ద మంచు సముద్రాల నీటి మట్టం పెరిగి దీవులు జలమయం అవుతాయి.
  8. శిలాజ ఇంధనాలను ఉపయోగించటం వల్ల బొగ్గు పులుసు వాయువుతో పాటు నైట్రోజన్ ఆక్సైడ్, సల్ఫర్ డై ఆక్సైడ్, ఆవిరై పోయే కర్బన మూలకాలు, భార లోహాలు వంటి ఇతర రసాయనాలు విడుదలవుతాయి.
  9. వీటి వల్ల గంధిక, కర్బన, నత్రిత ఆమ్లాలు విడుదలై ఆమ్ల వర్షాలు కురుస్తాయి. దీనితో జలచక్రం దెబ్బతింటుంది.

ప్రాజెక్టు

ప్రశ్న 1.
దగ్గరలోని పరిశ్రమను సందర్శించి దానినుంచి వెలువడుతున్న వాయు, ద్రవ, ఘన వ్యర్థ పదార్థాలను గమనించండి. వాటి వల్ల మొక్కలు, పశువులు ఏ విధంగా ప్రభావితం అవుతున్నాయో చుట్టుపక్కల ఉంటున్న వాళ్ళను అడిగి తెలుసుకోండి. సేకరించిన సమాచారాన్ని ఆధారం చేసుకొని ఒక నివేదిక తయారుచేసి తరగతిలో ప్రదర్శించండి.
జవాబు:

  1. మాకు దగ్గరలోని రవాణా పరికరాలు తయారుచేసే పరిశ్రమను సందర్శించడం జరిగింది.
  2. ఈ పరిశ్రమ బొగ్గు, చమురు నుంచి వచ్చే ఇంధనాలను పెద్ద ఎత్తున వినియోగిస్తారు.
  3. ఈ విధంగా శిలాజ ఇంధనాలను ఉపయోగించటం వల్ల బొగ్గుపులుసు వాయువుతో పాటు నైట్రోజన్ ఆక్సెడ్, సల్ఫర్ డై ఆక్సైడ్, ఆవిరైపోయే కర్బన మూలకాలు, భారీ లోహాలు వంటి ఇతర రసాయనాలు విడుదలవుతాయి.
  4. వీటివల్ల గంధిక, కర్బన, నత్రిత ఆమ్లాలు విడుదలై, దాని ఫలితంగా ఆమ్ల వర్షాలు కురుస్తాయి.
  5. ఈ పరిశ్రమ ఘన, ద్రవ, వాయు రూపాలలో వ్యర్థ పదార్థాలను విడుదల చేసి గాలి, నీటి (వాగులు, నదులు) వంటి ఉపరితల ప్రవాహాలను, బావులలోని భూగర్భ జలాలను నేలను కలుషితం చేస్తున్నాయి.
  6. ఇలాంటి కాలుష్యం వల్ల కొంత కాలానికి పర్యావరణం వేడెక్కుతుంది, శీతోష్ణస్థితులు మారిపోతాయి.
  7. ఈ ప్రభావం మొక్కలు, జంతువులు, మానవుల పై పడుతుంది.

ప్రశ్న 2.
మీ ప్రాంతంలో లేదా మీ గ్రామంలో అంతరించిపోతున్న జంతువులు లేదా పక్షులు వివరాలను సేకరించి, క్రింది పట్టికలో నింపి, తరగతి గదిలో చర్చించండి. అందుకు మీ తల్లిదండ్రుల, పెద్దల సహకారం తీసుకోండి.
AP Board 9th Class Social Solutions Chapter 5 జీవావరణం 7
జవాబు:

AP Board 9th Class Social Solutions Chapter 3 జలావరణం

SCERT AP 9th Class Social Studies Guide Pdf 3rd Lesson జలావరణం Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Social Solutions 3rd Lesson జలావరణం

9th Class Social Studies 3rd Lesson జలావరణం Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
భిన్నంగా ఉన్న దానిని గుర్తించి మీ ఎంపికకు కారణాన్ని వివరించండి. (AS1)
i) అ) బాష్పీభవనం ఆ) ద్రవీభవనం ఇ) లవణీకరణ ఈ) అవపాతం
జవాబు:
ఇ) భిన్నంగా ఉన్నది లవణీకరణ.
బాష్పీభవనం :
నేలమీదనున్న నీరు ఆవిరి కావటం ద్వారా వాతావరణంలోకి ప్రవేశించే ప్రక్రియలో నీరు ద్రవరూపం నుంచి వాయు రూపంలోకి మారడాన్ని బాష్పీభవనం అంటారు.

ద్రవీభవనం :
రవాణా చేయబడిన నీటి ఆవిరి ద్రవీభవనం చెంది చిన్న నీటి బిందువులుగా, మబ్బులుగా మారడాన్ని ద్రవీభవనం అంటారు.

అవపాతం :
అవపాతం అనగా వాతావరణంలోని నీరు భూమి ఉపరితలానికి చేరటం.
పై మూడు ఒకే తరగతికి చెందిన ప్రక్రియలు. కాబట్టి లవణీకరణ భిన్న ప్రక్రియ.

లవణీకరణ :
అనగా సముద్రనీటిలో ఉన్న ఉప్పదనం. ఉప్పు రుచిని చూపిస్తుంది.

ii) అ) ఫలకాలు ఆ) అపకేంద్రబలం ఇ) సౌరశక్తి ఈ) అవపాతం
జవాబు:
అ) భిన్నంగా ఉన్నది ఫలకాలు.
ఫలకాలు రెండవ పాఠ్యాంశానికి చెందిన అంశం.

ఆ) అపకేంద్ర బలం ఇ) సౌరశక్తి ఈ) అవపాతం
ఈ మూడు ఈ పాఠ్యాంశానికి సంబంధించిన అంశాలు.

AP Board 9th Class Social Solutions Chapter 3 జలావరణం

ప్రశ్న 2.
తప్పు వాక్యాలను సరిచేయండి. (AS1)
అ) సముద్రాలకు దగ్గరగా సముద్రపు అగాధాలు ఉంటాయి.
ఆ) మైదాన ప్రాంతంలో మాదిరిగానే సముద్రాలలోనూ ఉపరితల రూపాలు ఉంటాయి.
ఇ) శతాబ్దాలుగా భూమి మీద నుంచి కొట్టుకురావటం వల్ల సముద్రాలలో, అధికశాత లవణం ఏర్పడింది.
ఈ) ప్రపంచమంతటా మహాసముద్రాల నీళ్ళు ఒకే ఉష్ణోగ్రతను కలిగి ఉంటాయి.
జవాబు:
అ) సముద్రాలకు దగ్గరగా సముద్రపు అగాధాలు ఉంటాయి. ఇది సరైన వాక్యము కాదు.
జవాబు:
సముద్ర అగాధాలు సముద్రపు మధ్య భాగంలో కాకుండా ఖండాలకు దగ్గరగా ఉంటాయి.

ఆ) మైదాన ప్రాంతంలో మాదిరిగానే సముద్రాలలోను ఉపరితల రూపాలు ఉంటాయి.
జవాబు:
ఇది సరైన వాక్యము.

ఇ) శతాబ్దాలుగా భూమి మీద నుంచి కొట్టుకురావటం వల్ల సముద్రాలలో, అధికశాత లవణం ఏర్పడింది.
జవాబు:
ఇది సరైన వాక్యము.

ఈ) ప్రపంచమంతటా మహాసముద్రాల నీళ్ళు ఒకే ఉష్ణోగ్రతను కలిగి ఉంటాయి. ఇది సరైన వాక్యము కాదు.
జవాబు:
సముద్రపు లోతుల్లోకి వెళ్తున్న కొద్దీ ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. మొదటి కిలోమీటరు లోతుకి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతాయ.

ప్రశ్న 3.
మీరు నివసిస్తున్న ప్రాంతంపై సముద్ర తరంగాలు చూపే ఒక ప్రభావాన్ని వివరించండి. (AS6)
జవాబు:
మన దక్షిణ భారతదేశంపై సముద్ర ప్రవాహాలు నేరుగా కాకుండా పరోక్షంగా ప్రభావాన్ని చూపుతున్నాయి. భూమితో పోలిస్తే సముద్రాల మీద ఉష్ణోగ్రతలలో కొద్దిపాటి తేడాలే ఉంటాయి. ఈ ఉష్ణోగ్రతల తేడాల వల్ల సముద్ర ప్రవాహాలు ఏర్పడుతున్నాయి. ఈ – ఉష్ణోగ్రతలలో తేడాల వల్ల మా ప్రాంతంపై నైరుతి రుతుపవనాలు ప్రభావితమవుతున్నాయి. ఈ ప్రభావం వలన వర్షాలు, తుపానులు మా ప్రాంతంలో వస్తున్నాయి.

ప్రశ్న 4.
భూమిని నీలిగ్రహం అనడం సరైనదేనా? సముద్రాలను ప్రభావితం చేసే మీ చర్యల్లో ఒకదానిని వివరించండి. (AS1)
జవాబు:
భూమిని నీలిగ్రహం అనడం సరైనదే. కారణం ఇప్పటి వరకు నీరు ఉన్న గ్రహం భూమి మాత్రమే. అందువల్ల భూమిని జలయుత గ్రహం అంటారు.

సముద్రాలను ప్రభావితం చేసే మానవచర్యలు :

  1. భూమి మీద మానవుడు అనేక రకాల రసాయనాలను ఉపయోగిస్తున్నాడు. . వీటివలన సముద్రజలం కలుషితం అవుతుంది.
  2. భూమి మీద మానవుడు అనేక రకాల యంత్రాలను ఉపయోగించడం వలన అవి విడుదల చేసే వాయువుల వల్ల వాతావరణం వేడెక్కుతుంది. దానితో ధ్రువాల వద్ద ఉన్న మంచు కరిగి సముద్రాలలోనికి ప్రవేశిస్తుంది.
  3. దానితో సముద్రాల నీటిమట్టం పెరుగుతుంది. భూమి మీద తక్కువ ఎత్తులో ఉన్న దీవులు ముంపునకు గురౌతున్నాయి.

AP Board 9th Class Social Solutions Chapter 3 జలావరణం

ప్రశ్న 5.
సముద్రాల లవణీయతలో వ్యత్యాసాలు ఎందుకు ఉంటాయి? (AS1)
జవాబు:
సముద్రంలోని అధిక శాతం ఉప్పు నేల నుంచే వచ్చింది. లక్షల సంవత్సరాలపాటు సోడియం క్లోరైడ్ మూలకం ఉన్న కొండలపై వర్షంపడి వాగులు, నదులు ప్రవహించి దానిని సముద్రంలోకి చేర్చాయి. మహాసముద్రాలలోని ఉప్పు కొంతవరకు సముద్రపు అగ్ని పర్వతాల నుంచి, జల-ఉష్ణదారుల నుంచి వస్తుంది. సాధారణంగా సముద్రాల లవణీయతలో వ్యత్యాసాలు ఎందుకు ఉంటాయంటే ………………..

  • నీరు ఆవిరి కావటం, అవపాతాలలో తేడాలు వలన
  • తీర ప్రాంతంలో నదుల నుంచి ప్రవహించే మంచినీళ్ళు, ధృవప్రాంతాలలో మంచు గడ్డకట్టటం, కరగటంలో తేడాలు వలన
  • నీటిని ఇతర ప్రాంతాలకు తరలించే గాలుల వలన.
  • సముద్రపు ప్రవాహాలు / తరంగాల వలన వచ్చే తారతమ్యాల వలన లవణీయతలో తేడాలు కానవస్తాయి.

ప్రశ్న 6.
మానవ మనుగడ మహాసముద్రాలతో ఏ విధంగా ముడిపడి ఉంది? (AS6)
(లేదా)
సముద్రాలు మానవ జీవితాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాయి?
జవాబు:
భూమి మీద అధిక శాతం జీవులు నీటిలో ఉన్నాయి. నీటిలో ఉన్న అన్ని జీవాలను గుర్తించే ప్రక్రియను మానవులు ఇంకా పూర్తి చేయలేదు. పురాతన కాలం నుంచి మానవులు తమ ఆహారం కోసం, జీవనోపాధి కోసం సముద్రాలపై ఆధారపడేవారు. అనంతమైన ఉప్పు, మత్స్య సంపదను సముద్రాలు అందిస్తాయి. ఇసుక, గులక రాళ్ళు వంటి వాటిని ఇళ్ళకు, పరిశ్రమలలో ఉపయోగిస్తారు. క్లోరిన్, ఫ్లోరిన్, అయోడిన్ వంటి ఖనిజాలను మానవులు సముగ్రాల నుంచి వెలికి తీస్తున్నారు. సముద్ర అలలతో విద్యుత్ ను ఉత్పత్తి చేస్తున్నారు. సముద్రగర్భం నుంచి చమురు వెలికి తీస్తున్నారు. సముద్రం నుంచి ముత్యాలు, రత్నాలు కూడా లభిస్తున్నాయి. శతాబ్దాలుగా సముద్ర తీరాలలో నాగరికతలు వెల్లివిరిశాయి. సముద్రఁ పై ప్రయాణాలు చేస్తూ దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు ఏర్పడ్డాయి.

ప్రశ్న 7.
ఓ నెం. 35లోని పటాన్ని పరిశీలించి, కొన్ని ఉష్ణ, శీతల ప్రవాహాలను రాయండి. (AS5)
AP Board 9th Class Social Solutions Chapter 3 జలావరణం 1
జవాబు:
ఉష్ణప్రవాహాలు

  1. కురోషివో సముద్ర ప్రవాహం
  2. తూర్పు ఆస్ట్రేలియా సముద్ర ప్రవాహం
  3. కరేబియన్ సముద్ర ప్రవాహం
  4. మెక్సికన్ గల్ఫ్ సముద్ర ప్రవాహం
  5. బ్రెజిల్ సముద్ర ప్రవాహం
  6. పాక్ లాండ్ సముద్ర ప్రవాహం
  7. భారతీయ ప్రతి ప్రవాహం
  8. మడగాస్కర్ సముద్ర ప్రవాహం
  9. మెజబిక్ సముద్ర ప్రవాహం

శీతల ప్రవాహాలు

  1. కురైల్ ప్రవాహం
  2. పెరువియన్ సముద్ర ప్రవాహం
  3. లాబ్రడార్ సముద్ర ప్రవాహం
  4. బెంగ్యులా సముద్ర ప్రవాహం
  5. అసలహాన్ సముద్ర ప్రవాహం

AP Board 9th Class Social Solutions Chapter 3 జలావరణం

ప్రశ్న 8.
పేజి నెం. 33, 34లోని ‘వనరులుగా మహాసముద్రాలు’ అంశం చదివి, వాఖ్యానించండి. (AS2)
జవాబు:
మానవ జీవితంలో అతి ప్రధానమైన అంశం వనరులుగా మహాసముద్రాలు. ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. అనాదిగా మానవుడు సముద్రాల మీదనే ఆధారపడి జీవనం సాగిస్తున్నాడు. అతి ప్రధానమైన నాగరికతలన్నీ సముద్ర తీరాలలోనే వెలిశాయి. అతి విలువైన, అతి ఖరీదైన ముత్యాలు, రత్నాలు వంటి అమూల్యమైన వస్తువులకు సముద్రాలే ఆధారం. అతి ప్రధానమైన విద్యుత్ ఉత్పత్తికి సముద్రాలే కారకాలు. పెట్రోలియం వంటి అతి విలువైన ఖనిజ వనరులకు సముద్రాలే కీలకాధారం. మత్స్య సంపదను మన దేశానికే కాకుండా ఇతర దేశాలకు ఎగుమతి చేసి విదేశీ మారక ద్రవ్యాన్ని సముపార్జించి పెడుతున్నాయి.

అయితే ఇటీవలి కాలంలో సముద్రాలు కూడా కలుషితమౌతూ, దోపిడీకి గురౌవుతున్నాయి. తిమింగలాల వంటి పెద్ద జంతువులు అంతరించిపోతున్నాయి. ప్లాస్టిక్, ఇతర వ్యర్థ పదార్థాలు సముద్రాలలో పారవేస్తూ వాటిని కలుషితం చేస్తున్నారు.

9th Class Social Studies 3rd Lesson జలావరణం InText Questions and Answers

9th Class Social Textbook Page No.32

ప్రశ్న 1.
బాల్టిక్ సముద్రంలో తక్కువ లవణీయత ఉండటానికి గల కారణాలను పేర్కొనండి.
జవాబు:
బాల్టిక్ సముద్రంలో తక్కువ లవణీయత ఉండటానికి గల కారణాలు :

  1. నదులు వచ్చి ఎక్కువగా కలుస్తాయి.
  2. హిమానీనదాలు కలుస్తాయి.
  3. మంచు కరిగి ఆ నీరు వచ్చి ఎక్కువగా కలుపుంది. 4) నీరు చాలా తక్కువగా ఆవిరి అవుతుంది.
    అందువలన బాల్టిక్ సముద్రంలో తక్కువ లవణీయత ఉంటుంది.

ప్రాజెక్టు

ప్రశ్న 1.
పసిఫిక్, అట్లాంటిక్ హిందూ మహాసముద్రాలలో కనపడే ప్రవాహాల జాబితా తయారుచేయండి. వివిధ మహాసముద్రాలలోని ఉష్ణ, శీతల ప్రవాహాలను గుర్తించి క్రింది పట్టికలో నమోదు చేయండి.
AP Board 9th Class Social Solutions Chapter 3 జలావరణం 2
జవాబు:
AP Board 9th Class Social Solutions Chapter 3 జలావరణం 3

AP Board 9th Class Social Solutions Chapter 2 భూమి – ఆవరణములు

SCERT AP 9th Class Social Studies Guide Pdf 2nd Lesson భూమి – ఆవరణములు Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Social Solutions 2nd Lesson భూమి – ఆవరణములు

9th Class Social Studies 2nd Lesson భూమి – ఆవరణములు Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
ఖాళీలను పూరించండి. (AS1)
1. జలావరణం …………………………….. సంబంధించినది.
2. శిలావరణం ………………………… సంబంధించినది.
3. వాతావరణం ……………………….. సంబంధించినది.
4. జీవావరణం ……………………….. సంబంధించినది.
జవాబు:

  1. నీటికి
  2. శిలలకు
  3. వాయువులకు
  4. జీవులకు

ప్రశ్న 2.
శిలావరణం నేపథ్యంలో కింద ఇచ్చిన వాటిలో సరిపోనిది ఏమిటి? మీ ఎంపికకు కారణం పేర్కొనండి. (AS1)
‘బైసన్ గార్జ్, గ్రాండ్ కాన్యన్, థార్ ఎడారి
జవాబు:
థార్ ఎడారి శిలావరణం నేపథ్యానికి సరిపోదు.

కారణాలు :
థార్ ఎడారి అంతా ఇసుకతో ఏర్పడినది.
ఇక్కడ ఏ విధమైన రాతి పొరలు భూ ఉపరితల భాగంలో లేవు.
అందువలన ఇది శిలావరణం నేపథ్యానికి సరిపోదు.

AP Board 9th Class Social Solutions Chapter 2 భూమి – ఆవరణములు

ప్రశ్న 3.
శిలావరణం ఎలా ఏర్పడింది? (AS1)
జవాబు:

  1. శిలావరణం ఏర్పడిన విధానము : భూమిలో ఘనీభవించిన పొర, లేదా గట్టిగా ఉండే పై పొర ఇది.
  2. దీంట్లో రాళ్ళు, ఖనిజ లవణాలు ఉండి మందపాటి మట్టి పొర ఉంటుంది.
  3. ఈ ఆవరణాన్ని ఇంగ్లీషులో ,లితోస్పియిర్ అంటారు. లితో అంటే గ్రీకు భాషలో రాయి లేదా శిల అని అర్థం.
  4. ‘స్పేయిరా’ గోళం లేదా బంతి అని అర్థం. అనగా ఈ పొర చదునుగా ఉండే ఉపరితలం కాదు.
  5. ఎత్తైన కొండలు, పీఠభూములు, మైదాన ప్రాంతాలు, లోయలు నీటితో నిండిన లోతైన అగాధాలు వంటివి ఉండటం మీరు మ్యాపుల్లో చూసే ఉంటారు.
  6. వీటిల్లో పలు అంశాలు గాలి, నీటి ప్రభావాల వల్ల రూపుదిద్దుకున్నాయి.
  7. ఈ పై పొరలోని కొంత భాగం దుమ్ము వంటి వాటి రూపంలో గాలిలో కలిసి ఉంటుంది.

ప్రశ్న 4.
ఖండ ఫలకాలు ఎలా ఏర్పడ్డాయి? అవి అంతిమంగా ఎలా అంతరించిపోతాయి? (AS1)
జవాబు:

  1. ఎన్నో సంవత్సరాల సునిశిత అధ్యయనం ద్వారా ఖండాలు, మహాసముద్రాలు కూడా “ఫలకాలు” అనే అతి పెద్ద రాళ్ళ మీద ఉన్నాయని శాస్త్రజ్ఞులు తెలుసుకున్నారు.
  2. భూమిలో పెద్ద ఫలకాలు, అనేక చిన్న ఫలకాలు ఉన్నాయి.
    పెద్ద ఫలకాలకు ఉదా : ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఇండో – ఆస్ట్రేలియా, అంటార్కిటిక్, యూరేసియా, పసిఫిక్. చిన్న ఫలకాలకు ఉదా : నాజ్ కా, అరేబియా వంటివి.
  3. ఈ ఫలకాలు వాస్తవంగా మధ్య పొరమీద తేలుతూ ఉంటాయి. ఇవి నిరంతరం నెట్టబడుతూ ఉంటాయి.
  4. అందువల్ల అవి మెల్లగా కదులుతూ ఉంటాయి.
  5. అవి చాలా నిదానంగా కదులుతూ ఉంటాయి. కాబట్టి వాటి కదలిక మనకు తెలియదు.
  6. ఈ కదలిక ఫలితంగా ఒక ఫలకం పక్కనున్న మరొక ఫలకాన్ని నెడుతూ ఉంటుంది.
  7. రెండు ఫలకాలు కలిసే చోట ఒకదానినొకటి నెట్టుకుంటాయి. ఒక దాని మీద మరొకటి ఎంతో ఒత్తిడి చూపుతుంది.
  8. ఒక ఫలకం కిందికి మధ్య పొరలోకి వెళితే మరొక ఫలకం పైకి నెట్టబడి పర్వత శ్రేణులు ఏర్పడతాయి.
  9. ఈ ఫలకాల కదలికను ఫలక చలనాలు అంటారు. ఈ ప్రక్రియ వల్ల భూకంపాలు వంటివి సంభవిస్తాయి.

ప్రశ్న 5.
నదీ ప్రభావం వల్ల ఏర్పడే భూస్వరూపాలను పేర్కొనండి. (AS1)
జవాబు:
నదీ ప్రభావం వల్ల ఏర్పడే భూస్వరూపాలు :

  1. ఎత్తైన కొండలలో నది పుట్టిన చోటు నుంచే దాని ప్రభావం మొదలవుతుంది.
  2. వాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో నదీ ప్రవాహం వేగంగా ఉండి కొండను నిలువుగా కోతకు గురిచేస్తుంది.
  3. దీని ఫలితంగా లోతైన లోయ ఏర్పడుతుంది. ఇది కింద సన్నగా పైగా వెడల్పుగా ఉంటుంది. దీనిని సాధారణంగా “V” ఆకారపు లోయ అంటారు.
  4. రాళ్ళు చాలా గట్టిగా ఉన్న ప్రాంతాలలో నది తన ప్రవాహ మార్గాన్ని సన్నటి, లోతైన లోయగా కోస్తుంది.
  5. దీని అంచులు నిటారుగా ఉంటాయి. వీటిని “గార్జెస్” అంటారు.
  6. మరొక ముఖ్యమైన రూపాన్ని ‘అగాధదరి అంటారు. దీనిలో నది అంచులు తీవ్ర వాలుతో చాలా లోతుకు కోతకు గురవుతాయి. అగాధదరిలో కింద కంటే పై భాగం ఎక్కువ వెడల్పుగా ఉంటుంది.
  7. వాలులో తేడాలు బాగా ఎక్కువగా ఉండే పర్వత ప్రాంతాలలో జలపాతాలు అధిక సంఖ్యలో ఉంటాయి.
  8. జలపాతంలో నీళ్లు ఎంతో శక్తితో కిందకు పడతాయి. ఆ నీళ్లు కిందపడే చోట “దుముకు మడుగు” ఏర్పడుతుంది.
  9. నదికి వరదలు వచ్చినపుడు అది నేలను కోతకు గురిచేస్తుంది. వరద తగ్గుముఖం పట్టినపుడు కోసిన మట్టిని వేరేచోట మేట వేస్తుంది. దీనిని “ఒండ్రు” అంటారు.
  10. మెలిక తిరిగిన భాగం నది నుంచి తెగిపోయి ఒక చెరువులాగా ఏర్పడుతుంది. ఇటువంటి వాటిని ‘ఆక్స్ బౌ సరస్సు’ అంటారు.
  11. సముద్రాన్ని నది చేరుకున్నప్పుడు దాంట్లో మేటవేయని రేణువులు ఉంటే అవి నదీ ముఖంలో మేట వేయబడి డెల్టా ప్రాంతం ఏర్పడుతుంది.

AP Board 9th Class Social Solutions Chapter 2 భూమి – ఆవరణములు

ప్రశ్న 6.
కింద పేర్కొన్న విధంగా పట్టిక తయారుచేసి సమాచారాన్ని నింపండి. భూమి బయటి మార్పుల నేపథ్యంలో మీకు కనిపించే తేడాలు, పోలికలను వివరించడానికి ఒక పేరా రాయండి. (AS3)
జవాబు:
AP Board 9th Class Social Solutions Chapter 2 భూమి – ఆవరణములు 1

ప్రశ్న 7.
మీ పరిసరాల్లో హిమానీనదాలు ఎందుకు కనిపించవు? (AS1)
జవాబు:

  1. హిమాలయాలు, ఆల్బ్ వంటి బాగా చలిగా ఉండే ప్రాంతాలలో మంచు బాగా కురుస్తుంది.
  2. అక్కడ వర్షానికి బదులు మంచు కురుస్తుంది.
  3. మంచు పోగుబడి గడ్డగా మారుతుంది.
  4. అలా పోగుపడుతున్న క్రమంలో అది కింది వైపు మెల్లగా కదలటం మొదలు పెడుతుంది.
  5. అలా ప్రయాణించి కొంచెం వెచ్చగా ఉండే ప్రాంతాన్ని చేరుకునే సరికి మంచు కరిగి చిన్న నది మొదలవుతుంది.
  6. హిమాలయాలలోని గంగోత్రి హిమానీనదం నుంచి గంగానది ఈ విధంగానే ఏర్పడుతుంది.
  7. మా పరిసరాల్లో హిమానీనదాలు ఎందుకు లేవు అనగా ఇక్కడ హిమాలయాలు, ఆల్బ్ వంటి బాగా చలిగా ఉండే ప్రాంతాలు లేవు.
  8. అందువలన మా ప్రాంతాల్లో హిమానీనదాలు లేవు.

ప్రశ్న 8.
బీలు ఎలా ఏర్పడతాయి? కొన్ని బీచ్ పేర్లు రాయండి.
జవాబు:
సముద్ర అలలు తీరం వెంట మేటవేసే పదార్థాల వల్ల బీచ్లు ఏర్పడతాయి.
ఉదా: విశాఖపట్టణంలోని రామకృష్ణ బీచ్
మచిలీపట్నంలోని మంగినపూడి బీచ్
చెన్నైలోని మెరీనా బీచ్

ప్రశ్న 9.
ఏడారుల విస్తరణకు మానవ జీవన విధానం ఏ విధంగా కారణమౌతున్నది?
జవాబు:
ఏడారుల విస్తరణకు మానవ జీవన విధానం ప్రధాన కారణం
కారణాలు :

  1. పారిశ్రామిక విప్లవం తరువాత పరిశ్రమల స్థాపన సంఖ్య పెరిగింది.
  2. పరిశ్రమల నుండి విడుదలయ్యే కార్బన్ మోనాక్సైడ్ వంటి వాయువుల వల్ల వాతావరణం వేడెక్కుతుంది.
  3. అలాగే మానవుని రవాణా సాధనాల సంఖ్య, మోటారు వాహనాల సంఖ్య విపరీతంగా పెరిగింది.
  4. దీంతో ఈ రవాణా సాధనాలు విడుదల చేసే కార్బన్ మోనాక్సైడ్ వంటి వాయువుల వల్ల వాతావరణం వేడెక్కుతుంది.
  5. అలాగే మానవుని విలాస జీవితానికి ఆలవాలమైన రిఫ్రిజిరేటర్లు, కూలర్లు, ఎయిర్ కండిషన్స్ సంఖ్య నానాటికి పెరుగుతుండడంతో అవి విడుదలచేసే వాయువుల వల్ల కూడా వాతావరణం వేడెక్కుతుంది.

ఈ విధంగా వాతావరణం వేడెక్కడం వల్ల వర్షపాతం తగ్గిపోతుంది. వర్షపాతం తగ్గిపోవడం వల్ల భూ ఉపరితలం ఎడారిగా మారిపోతుంది. కావున ఎడారుల విస్తరణకు మానవ జీవన విధానం ప్రధాన కారణం.

AP Board 9th Class Social Solutions Chapter 2 భూమి – ఆవరణములు

ప్రశ్న 10.
ఇవి ఏ శ్రేణి భూస్వరూపాలలో తెలియజేయండి. (AS1)
జవాబు:

భూ స్వరూపం భూస్వరూప శ్రేణి
1. హిమాలయ పర్వతాలు రెండవ శ్రేణి భూస్వరూపం
2. పసిఫిక్ మహాసముద్రం మొదటి శ్రేణి భూస్వరూపం
3. ఆసియా ఖండం మొదటి శ్రేణి భూస్వరూపం
4. బైసన్ గార్జ్ మూడవ శ్రేణి భూస్వరూపం
5. జోగ్ జలపాతం మూడవ శ్రేణి భూస్వరూపం
6. రాఖీ పర్వతాలు రెండవ శ్రేణి భూస్వరూపం
7. హిందూ మహాసముద్రం మొదటి శ్రేణి భూస్వరూపం
8. గొప్ప విధీర్ణధరి మూడవ శ్రేణి భూస్వరూపం

ప్రశ్న 11.
పటం – 2ను చూసి ప్రపంచ పలకలను గీయండి.
జవాబు:
AP Board 9th Class Social Solutions Chapter 2 భూమి – ఆవరణములు 2

ప్రశ్న 12.
ఓ నెం. 20 లోని (ప్రవహిస్తున్న …….. క్రమక్షయం అని అంటారు) క్రమక్షయం పేరాను చదివి వాఖ్యానించండి. (AS2)
జవాబు:
ప్రవహిస్తున్న నీటికి, గాలికి ఎంతో శక్తి ఉంటుంది. అది రాళ్ళను నిదానంగా కరిగించి వేస్తుంది. మట్టి పై పొరలను తొలగించివేస్తుంది. వాన, నది, ప్రవహిస్తున్న భూగర్భజలం, సముద్ర అలలు, హిమానీ నదులు వంటి అనేక రూపాలలో నీళ్ళు ప్రభావం చూపుతాయి. గాలి కూడా స్థిరమైన గాలులు, ఈదురు గాలులు, తుపాను గాలులు వంటి అనేకరూపాలను తీసుకుంటుంది. గాలి, నీటి శక్తుల కారణంగా భూమి ఉపరితలం పై పొరలు కొట్టుకుపోవడాన్ని క్రమక్షయం అని అంటారు.

9th Class Social Studies 2nd Lesson భూమి – ఆవరణములు InText Questions and Answers

9th Class Social Textbook Page No.14

ప్రశ్న 1.
బెరైటీస్, బొగ్గు వంటి ఖనిజాల తవ్వకం గురించి మీరు చదివారు. ఇది శిలావరణాన్ని, జలావరణాన్ని, వాతావరణాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది?
జవాబు:
శిలావరణాన్ని ప్రభావితం చేసే విషయం :
శిలలను కూడా ధ్వంసం చేసి బెరైటీస్, బొగ్గు వంటి ఖనిజాలను వెలికి తీస్తున్నారు.

జలావరణాన్ని ప్రభావితం చేసే విషయం :
బొగ్గు వలన జలావరణం కలుషితం అవుతుంది. జలావరణం వలన బెరైటీస్ గనులు దెబ్బతింటున్నాయి.

వాతావరణాన్ని ప్రభావితం చేసే విషయం :
బొగ్గు, బెరైటీస్ వలన వాతావరణం కలుషితం అవుతుంది.

ప్రశ్న 2.
రోగాలు నయం చేయడానికి మనుషులు అధిక సంఖ్యలో యాంటిబయాటిక్ మందులు తీసుకుంటున్నారు. ఇది శిలావరణాన్ని, జలావరణాన్ని, వాతావరణాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది?
జవాబు:

  1. మనుషులు అధిక సంఖ్యలో తీసుకునే యాంటిబయాటిక్ మందులు తయారుచేసే ఫ్యాక్టరీలు వివిధ రకాల రసాయనాలను విడుదల చేస్తాయి.
  2. ఈ రసాయనాల వలన శిలావరణం, జలావరణం, వాతావరణాల సమతుల్యత దెబ్బతింటుంది.
  3. మనుషులు వీటిని అధికంగా వాడటం వలన కొన్ని సూక్ష్మజీవులు, వైరస్లు నశించిపోతాయి. మరికొన్ని వాతావరణంలోనికి విడుదల చేయబడతాయి. తద్వారా భూమ్యావరణములు కలుషితమవుతాయి.

AP Board 9th Class Social Solutions Chapter 2 భూమి – ఆవరణములు

ప్రశ్న 3.
అనేక శాస్త్రీయ పదాల మూలాలు గ్రీకు భాషలో ఉండటం మీరు గమనించి ఉంటారు. ఇలా ఎందుకు ఉంది? మీ టీచరుతో చర్చించండి.
జవాబు:
శాస్త్ర, సాంకేతిక రంగాలకు మూలం గ్రీకు నాగరికత. గ్రీకు భాష కూడా ప్రాచీనమైనది. గ్రీకు తత్త్వవేత్తలు ఆయా ఆంశాలను గురించి వివరించి చెప్పడమే గాక ప్రయోగ పూర్వకంగా ఋజువు చేయడానికి ప్రయత్నించారు. అందువలన ప్రాచీన పదాలు ఎక్కువగా గ్రీకు భాష నుండి ఉద్భవించాయి.

9th Class Social Textbook Page No.15

ప్రశ్న 4.
వాన ఎలా పడుతుంది?
జవాబు:
భూమి ఉపరితలంపై ఉన్న నీరు ఆవిరై మేఘంగా ఏర్పడి, ఆ మేఘాలు చల్లదనానికి నీటిని నిల్వ ఉంచుకోక వర్షం రూపంలో భూమిపైకి మరల నీటిని వదులుతాయి. ఆ విధంగా వర్షం కురుస్తుంది.

ప్రశ్న 5.
డెల్టాలు ఎలా ఏర్పడతాయి?
జవాబు:
సముద్రాన్ని నది చేరుకున్నప్పుడు దాంట్లో మేటవేయని రేణువులు ఉంటే అవి నదీ ముఖంలో మేటవేయబడి డెల్టా ప్రాంతం ఏర్పడుతుంది. ఈ ప్రాంతం గ్రీకు అక్షరం డెల్టా (A) రూపంలో ఉంటుంది. కాబట్టి దానికి ఆ పేరు వచ్చింది.

AP Board 9th Class Social Solutions Chapter 2 భూమి – ఆవరణములు

ప్రశ్న 6.
భూకంపాలు, అగ్నిపర్వతాలు ఎలా సంభవిస్తాయి?
జవాబు:
భూకంపాలు సంభవించే విధానం :

  1. భూమికి సంబంధించి ఫలకాలు వాస్తవంగా మధ్య పొర మీద తేలుతూ ఉంటాయి.
  2. ఇవి నిరంతరం నెట్టబడుతూ ఉంటాయి. అందుకే అవి మెల్లగా కదులుతూ ఉంటాయి.
  3. అవి చాలా నిదానంగా కదులుతూ ఉంటాయి. కాబట్టి వాటి కదలిక మనకు తెలియదు.
  4. ఈ కదలిక ఫలితంగా ఒక ఫలకం పక్కనున్న మరొక ఫలకాన్ని నెడుతూ ఉంటుంది.
  5. రెండు ఫలకాలు కలిసేచోట ఒకదానినొకటి నెట్టుకుంటాయి.
  6. ఒక దాని మీద మరొకటి ఎంతో ఒత్తిడి చూపుతుంది.
  7. ఒక ఫలకం కిందికి మధ్య పొరలోకి వెళితే మరొక ఫలకం పైకి నెట్టబడి పర్వత శ్రేణులు ఏర్పడతాయి.
  8. ఈ ఫలకాల కదలికను ఫలక చలనాలు అంటారు. ఈ ప్రక్రియ వల్ల భూకంపాలు వంటివి సంభవిస్తాయి.

AP Board 9th Class Social Solutions Chapter 2 భూమి – ఆవరణములు 3
అగ్నిపర్వతాలు సంభవించే విధానం :
భూ గర్భంలోని శిలాద్రవం అనుకూల పరిస్థితులలో గొట్టం వలె ఉండే భాగాల నుండి బయటకు వస్తుంది. బయటికి ప్రవహించిన శిలాద్రవం ముఖద్వారం చుట్టూ ఘనీభవించి ఒక శంఖాకార పర్వత నిర్మాణంగా ఏర్పడుతుంది. దీనినే అగ్ని పర్వతం అంటారు.

ప్రశ్న 7.
కొండలు ఎందుకు ఉన్నాయి?
జవాబు:
ఒక ఫలకను ఇంకొక ఫలక నెట్టడం వలన కొండలు ఏర్పడుతున్నాయి.

ప్రశ్న 8.
నదుల వెంట లోయలు, అగాధాలు వంటివి ఎందుకు ఉన్నాయి?
జవాబు:

  1. వాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో నదీ ప్రవాహం వేగంగా ఉండి కొండను నిలువుగా కోతకు గురిచేస్తుంది. దీని ఫలితంగా లోతైన లోయ ఏర్పడుతుంది. అందువల్ల నదుల వెంట లోయలు ఏర్పడతాయి.
  2. రాళ్ళు చాలా గట్టిగా ఉన్న ప్రాంతాలలో నది తన ప్రవాహ మార్గాన్ని సన్నటి లోతైన లోయగా కోస్తుంది. దీని అంచులు నిటారుగా ఉంటాయి. అగాధాలలో పైన ఎక్కువ వెడల్పుగాను, కింద భాగం సన్నగాను ఉంటాయి. అందువల్ల అగాధాలు వంటివి కూడా నదుల వెంట ఉంటాయి.

ప్రశ్న 9.
గాలులు ఎలా వీస్తాయి?
జవాబు:
గాలులు ఎల్లప్పుడు అధిక పీడన ప్రాంతం నుండి అల్ప పీడన ప్రాంతం వైపు వీస్తాయి.

9th Class Social Textbook Page No.17

ప్రశ్న 10.
హిమాలయ, ఆండిస్, రాకీ పర్వత శ్రేణులను పటం మీద గుర్తించండి. అవి అక్కడే ఎందుకు ఏర్పడ్డాయి? కారణాలు సూచించండి.
జవాబు:
AP Board 9th Class Social Solutions Chapter 2 భూమి – ఆవరణములు 4
1. హిమాలయాలు ఏర్పడటానికి కారణం :
యూరేసియా ఫలకాన్ని ఇండియా ఫలకం నెట్టటం వల్లనే హిమాలయ పర్వతాలు ఏర్పడ్డాయి.

AP Board 9th Class Social Solutions Chapter 2 భూమి – ఆవరణములు 5
2. అండీస్ పర్వతాలు ఏర్పడటానికి కారణం :
దక్షిణ అమెరికా ఫలకాన్ని ఇండో- ఆస్ట్రేలియా ఫలకం నెట్టటం వల్లనే ఆండీస్ పర్వతాలు ఏర్పడ్డాయి.

AP Board 9th Class Social Solutions Chapter 2 భూమి – ఆవరణములు 6
3. రాకీ పర్వతాలు ఏర్పడటానికి కారణం :
ఉత్తర అమెరికా ఫలకాన్ని యూరేసియా ఫలకం నెట్టటం వల్లనే రాకీ పర్వతాలు ఏర్పడ్డాయి.

ప్రశ్న 11.
భూమి మీద శిలలు అన్నీ మహాసముద్ర మధ్యమిట్ట ప్రాంతంలోనే ఏర్పడ్డాయా?
జవాబు:
భూమి మీద గుట్టలన్నీ మహసముద్ర మధ్యమిట్ట ప్రాంతంలోనే ఏర్పడ్డాయి.

  1. సముద్రాలలోని భూమి పై పొరను అధ్యయనం చేస్తున్న భూ శాస్త్రజ్ఞులు పసిఫిక్ మహాసముద్రం వంటి కొన్ని మహా సముద్రాలలోని, మధ్య భాగంలో మిట్టలు, పర్వత శ్రేణులు ఉన్నాయని కనుగొన్నారు.
  2. మధ్య పొరల నుంచి పైకి లేచే లావా వల్ల ఇవి ఏర్పడుతున్నాయి.
  3. మిట్టప్రాంతంలో నేలపైకి నెట్టబడి బీటలు వారటం వల్ల బసాల్ట్ రాళ్ళతో కూడిన సముద్రపు కొత్తనేల తయారవుతుంది.
  4. ఆ తరువాత ఇది మిట్టనుంచి రెండు వైపులా పక్కలకు విస్తరిస్తుంది. అంటే మన భూమి మీద మహాసముద్ర మధ్య ప్రాంతంలోని మిట్టలలో అత్యంత తాజాగా ఏర్పడిన పై పొర ఉంటుంది.

ప్రశ్న 12.
భూగర్భవేత్తలు హిమాలయాల్లో సముద్ర జీవుల శిలాజాలను కనుగొన్నారు. వీటిల్లో చాలా వాటిని ‘సాలగ్రామాలు’ (శివలింగాకారంలో) గా ఇళ్లల్లో పూజిస్తారు. ఈ శిలాజాలు హిమాలయాల్లో ఎందుకు ఉన్నాయి?
జవాబు:

  1. ఖండఫలకాలు జరిగేటప్పుడు ఖండాల అంచులలో ఉన్న శిలాద్రవం పైకి వచ్చి పర్వతాలు ఏర్పడతాయి.
  2. హిమాలయాలు ప్రపంచంలో నూతన ముడుత పర్వతాలు.
  3. యురేసియా ఫలకాన్ని ఇండియా ఫలకం నెట్టడం వల్లనే హిమాలయ పర్వతాలు ఏర్పడ్డాయి.
  4. కనుక సముద్ర జీవుల శిలాజాలు నూతనంగా ఏర్పడిన హిమాలయాల్లోనే ఉన్నాయి.

AP Board 9th Class Social Solutions Chapter 2 భూమి – ఆవరణములు

ప్రశ్న 13.
భూమి మీద జరుగుతున్న ఇటువంటి పెనుమార్పులు మన అనుభవంలోకి ఎందుకు రావటం లేదు? అవి మనల్ని ప్రభావితం చేయకపోవడంవల్లనా? ఈ మార్పులు అసలు మనల్ని ఏరకంగానైనా ప్రభావితం చేస్తాయా?
జవాబు:
భూమి మీద జరుగుతున్న ఇటువంటి పెనుమార్పులు కొన్ని వందల, వేల సంవత్సరాలకు జరుగుతుంటాయి. అప్పటికి మానవుల జీవిత కాలం చాలదు. అందువల్ల అవి మన అనుభవంలోకి రావడం లేదు. అవి మనల్ని ప్రభావితం చేయటం లేదు. ఈ మార్పులు మనల్ని మన తరువాత తరాల్ని అనేక రకాలుగా ప్రభావితం చేస్తాయి. జీవన విధానాన్ని మార్చివేస్తాయి.

9th Class Social Textbook Page No.19

ప్రశ్న 14.
అగ్నిపర్వతం పేలుడు వల్ల ఆ ప్రాంతంలో సంభవించే నష్టాలను ఊహించి రాయండి.
జవాబు:
అగ్నిపర్వతాలు పేలడం వల్ల ఆ ప్రాంతంలో సంభవించే నష్టాలు :

  1. అగ్ని పర్వతాలు పేలడం వల్ల సమీప ప్రాంతాలలో కూడా ధన, ప్రాణ నష్టాలు సంభవిస్తాయి.
  2. పంటలు నాశనమౌతాయి, జలాలు కలుషితమౌతాయి.
  3. బూడిద, అనేక రకాల వాయువులు, ధూళితో వాతావరణం కలుషితమవుతుంది.

9th Class Social Textbook Page No.20

ప్రశ్న 15.
శిలలోని అంతర్భాగం బయటిభాగం కంటే ఎందుకు కఠినంగా ఉంటుంది?
జవాబు:
శిలలోని అంతర్భాగం బయటిభాగం కంటే కఠినంగా ఉండటానికి గల కారణాలు :

  1. రాళ్ళు వేడెక్కినప్పుడు వ్యాకోచిస్తాయి. చల్లబడినప్పుడు సంకోచిస్తాయి.
  2. ఇది ప్రతి పగలూ, రాత్రి, వేసవి, శీతా కాలాల్లో సంవత్సరాల తరబడి జరుగుతూ ఉంటుంది.
  3. పైన ఉన్న రాళ్ళు సంకోచించి, వ్యాకోచించి తిరిగి సంకోచిస్తూ ఉండటం వల్ల అవి పెళుసుగా మారి ముక్కలవుతాయి.
  4. నీళ్ళు, గాలిలోని తేమ కూడా ఈ ప్రక్రియకు దోహదం చేస్తుంది.
  5. అందువలన అంతర్భాగం గట్టిగా ఉంటుంది.

9th Class Social Textbook Page No.21

ప్రశ్న 16.
ఆనకట్టలు కట్టటానికి గార్జెస్ అనువుగా ఉంటాయి. ఎందుకో చెప్పండి.
జవాబు:

  1. రాళ్ళు (శిలలు) చాలా గట్టిగా ఉన్న ప్రాంతాలలో నది తన ప్రవాహ మార్గాన్ని సన్నటి, లోతైన లోయగా కోస్తుంది. దీని అంచులు నిటారుగా ఉంటాయి. వీటిని గార్జెస్ అంటారు.
  2. గార్జెస్ వద్ద ఆనకట్టలు కట్టడానికి అనుకూలంగా ఉంటుంది. కారణం
  3. నదులు సన్నగా ఉంటాయి.
  4. రెండు వైపులా నిటారుగా రాళ్ళు ఉంటాయి. ఇవి కోతకు గురికాకుండా ఆనకట్టలు ఉంటాయి.
  5. అందువల్ల ఇవి ఆనకట్టలు నిర్మించడానికి అనుకూలంగా ఉంటాయి.

9th Class Social Textbook Page No.22

ప్రశ్న 17.
జలపాతాలు ఎలా ఉపయోగపడతాయో వివరించండి.
జవాబు:

  1. వినోద పర్యటనానికి ఉపయోగపడతాయి.
  2. జలవిద్యుత్ ప్రాజెక్టులు నిర్మించడానికి అనువుగా ఉంటాయి.

AP Board 9th Class Social Solutions Chapter 2 భూమి – ఆవరణములు

ప్రశ్న 18.
మన రాష్ట్రంలోని జలపాతాల వివరాలు సేకరించండి.
జవాబు:

  1. విశాఖపట్టణం జిల్లాలోని రణజిల్లెడ జలపాతం.
  2. గుంటూరు జిల్లాలోని మాచర్ల వద్ద ఎత్తిపోతల జలపాతం.

ప్రశ్న 19.
కొన్ని జలపాతాల చిత్రాలు సేకరించండి.
జవాబు:
AP Board 9th Class Social Solutions Chapter 2 భూమి – ఆవరణములు 7
AP Board 9th Class Social Solutions Chapter 2 భూమి – ఆవరణములు 8

9th Class Social Textbook Page No.23

ప్రశ్న 20.
పర్వత, మైదాన ప్రాంతాలలో నదీ ప్రవాహంలోని పోలికలు, తేడాలు పేర్కొనండి. ఈ రెండింటి మధ్య సంబంధం ఏమిటి?
జవాబు:
పర్వత ప్రాంతాలు :

  1. వాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో నదీ ప్రవాహం వేగంగా ఉండి కొండను నిలువుగా కోతకు గురిచేస్తుంది.
  2. ‘V’ ఆకారపు లోయలను ఏర్పరుస్తాయి.
  3. రాళ్ళు చాలా గట్టిగా ఉన్న ప్రాంతాలలో నది తన ప్రవాహ మార్గాన్ని సన్నటి లోతైన లోయగా కోస్తుంది. వీటిని గార్డెన్ అంటారు.
  4. వాలులో తేడాలు బాగా ఎక్కువగా ఉండే పర్వత ప్రాంతాలలో జలపాతాలు అధిక సంఖ్యలో ఉంటాయి.

మైదాన ప్రాంతాలు :

  1. మైదాన ప్రాంతంలో వాలు చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి నదీ ప్రవాహ వేగం తగ్గుతుంది.
  2. అప్పుడు బరువైన రేణువులను తీసుకువెళ్ళే శక్తి నదికి ఉండదు.
  3. నదికి వరదలు వచ్చినపుడు అది నేలను కోతకు గురిచేస్తుంది.
  4. వరద తగ్గుముఖం పట్టినపుడు కోసిన మట్టిని వేరేచోట మేట వేస్తుంది.
  5. మైదాన ప్రాంతాలలో నది తరచూ తన ప్రవాహ దారిని మారుస్తూ ఉంటుంది.
  6. మైదాన ప్రాంతాలలో నదులు డెల్టాలను ఏర్పరచుతాయి.

రెండింటి మధ్య సంబంధం :

  1. కొండలలో పడిన వర్షపు నీరు నదులలో ప్రవహించి మైదాన ప్రాంతాలలో డెల్టాలను ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుంది.
  2. కొండల ప్రాంతంలో నదీప్రవాహ వేగం ఎక్కువగా ఉండటం వలన సారవంతమైన పై పొర కొట్టుకు వచ్చి మైదాన ప్రాంతాలలో నదీ ప్రవాహ వేగం తక్కువగా ఉంటుంది కాబట్టి దానిని అక్కడ మేట వేయగలదు.
  3. దాని వలన సారవంతమైన మైదానాలు ఏర్పడి తద్వారా పంటలు బాగా పండటానికి అవకాశం ఉంటుంది.

AP Board 9th Class Social Solutions Chapter 2 భూమి – ఆవరణములు

ప్రశ్న 21.
పర్వత ప్రాంతాలతో పోలిస్తే వరద మైదానాలు మానవ ఆవాసానికి ఎందుకు అనువుగా ఉంటాయి?
జవాబు:

  1. కొండ ప్రాంతాలు ఎత్తైన ప్రాంతాలు. ఇవి మానవ నివాసానికి అనువైన ప్రాంతాలు కావు.
  2. ఇవి ఎగుడు దిగుడు స్థలాకృతులను కలిగి ఉంటాయి.
  3. అందువలన వ్యవసాయం చేయడానికి, పంటలు.పండించడానికి అనువైనవి కావు.
  4. శిలా నిర్మితమై ఉంటుంది. కాబట్టి మొక్కలు నాటటానికి అనుకూలంగా ఉండవు.
  5. అదే వరద మైదానాలు అయితే బల్లపరుపుగా ఉంటాయి.
  6. విశాలంగా ఉంటాయి. నీటిని నిలువ చేసుకోడానికి అనుకూలంగా ఉంటాయి.
  7. సారవంతమైన నేలలు ఉంటాయి.
  8. పంటలు సమృద్ధిగా పండుతాయి.
  9. ఇళ్లు నిర్మించడానికి అనుకూలంగా ఉంటాయి. నివాస యోగ్యాలుగా ఉంటాయి. కనుక ప్రజలు కొండ ప్రాంతాల్లో కన్నా మైదాన ప్రాంతాలలోనే ఎక్కువగా నివసిస్తారు.

ప్రశ్న 22.
వరద మైదానాలలో ఉండటంలోని ప్రమాదాలు ఏమిటి?
జవాబు:
వరద మైదానాలలో ఉండటంలోని ప్రమాదాలు :

  1. తరచుగా వరదలు వస్తాయి.
  2. పంటలు పాడైపోతాయి.
  3. ఒక్కొక్కసారి చెట్లు, ఇళ్లు కూలిపోతాయి.
  4. జంతువులు, వస్తువులు కొట్టుకుపోతాయి.
  5. ప్రాణనష్టం, ఆస్తినష్టం జరుగుతుంది.
  6. కనుక వరద మైదానాలలో ఉండటం వలన పై ప్రమాదాలు ఎదురవుతాయి.

ప్రశ్న 23.
కొండ లేదా వరద మైదానాల్లో నివసిస్తున్న ప్రజల గురించి మీరు చదివిన దానిని గుర్తుకు తెచ్చుకోండి.
జవాబు:

  1. కొండ ప్రాంతాలలో గిరిజనులు, ఆదిమ వాసులు నివసిస్తారు.
  2. వారికి అంతగా నాగరికత తెలియదు.
  3. ఇప్పుడిప్పుడే పోడు వ్యవసాయం చేస్తున్నారు.
  4. అటవీ ఉత్పత్తులపై ఆధారపడి జీవనం కొనసాగిస్తారు.
  5. రవాణా సౌకర్యాలను కల్పించడం కష్టంతో కూడుకున్న పని.
  6. మైదాన ప్రాంతాలలో నాగరీకులు నివసిస్తారు.
  7. అధునాతన, వ్యవసాయ పరికరాలను ఉపయోగించి వ్యవసాయం చేస్తారు.
  8. అధిక దిగుబడులను సాధిస్తారు.
  9. అధునాతన రవాణా సౌకర్యాలను సులభంగా ఏర్పాటు చేసుకోవచ్చు.
  10. పరిశ్రమలను స్థాపించవచ్చు. పారిశ్రామిక ఉత్పత్తులను ఉత్పత్తి చేయవచ్చు.

9th Class Social Textbook Page No.25

ప్రశ్న 24.
లోయస్ మైదానాలను డెల్టాతో పోల్చండి. వాటి మధ్య పోలికలు తేడాలు ఏమిటి?
జవాబు:
లోయస్ మైదానాలు:

  1. మెత్తగా ఉండే దుమ్ము ఎడారులను దాటి, కొట్టుకెళ్ళి పక్క భూముల మీద పడుతుంది. ఇటువంటి నేలను ”లోయస్” అంటారు.
  2. ఇది చక్కటి ఒండ్రు. దీంట్లో సున్నం చాలా ఎక్కువగా ఉంటుంది.
  3. రేణువులు ఒకదానితో ఒకటి అతుక్కుని ఉండి అదే సమయంలో దానికి నీళ్లు బాగా ఇంకిపోయే గుణముంటుంది.
  4. లోయస్ మేటతో ఏర్పడిన మైదానాలను లోయస్ మైదానాలు అంటారు.

డెల్టాలు :
1. సముద్రాన్ని నది చేరుకునేటప్పుడు దాంట్లో మేట వేయని రేణువులు ఉంటే అవి నదీ ముఖంలో మేట వేయబడి డెల్టా ప్రాంతం ఏర్పడుతుంది.

ఈ ప్రాంతం గ్రీకు అక్షరం డెల్టా (∆) రూపంలో ఉంటుంది. కాబట్టి దానికి ఆ పేరు వచ్చింది.

పోలికలు :

  1. రెండూ ఇసుక రేణువులతో ఏర్పడినవే.
  2. రెండింటిలోనూ నీరు త్వరగా ఇంకిపోతుంది.
  3. రెండింటిలోనూ ఒండ్రు ఉంటుంది.

తేడాలు :

లోయస్ మైదానాలు డెల్టా
1. లోయస్ దుమ్ముతో ఏర్పడినది. 1. డెల్టా నదులు తీసుకొచ్చిన ఒండ్రుతో ఏర్పడినది.
2. లోయలో సున్నం ఉంటుంది. 2. డెల్టాలలో గవ్వల రూపంలో సున్నం ఉంటుంది.
3. లోయలో నీరు ఎక్కువగా ఇంకిపోతుంది. 3. డెల్టాలలో నీరు ఎక్కువగా ఇంకిపోదు. నదులు ఎల్లప్పుడు ప్రవహిస్తూ ఉంటాయి. కాబట్టి నీరు ఎక్కువగా ఉంటుంది.

AP Board 9th Class Social Solutions Chapter 2 భూమి – ఆవరణములు

ప్రాజెక్టు

ప్రశ్న 1.
వివిధ వార్తాపత్రికలు, మ్యాగజైన్స్ ద్వారా భూకంపాలు, అగ్ని పర్వతాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి ఒక క్రమంలో అమర్చండి. ఇవి ఏ విధంగా ఏర్పడతాయి? మానవ జీవనాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి?
జవాబు:
అగ్ని పర్వతాలు ఎలా ఏర్పడతాయి అనగా :

  1. భూమి లోపలికి పోయేకొలది ప్రతి 32 మీటర్లకు 1°C ఉష్ణోగ్రత పెరుగుతుంది.
  2. అందువల్ల భూమిలోపల కొన్ని ప్రదేశాలలో శిలలు కరిగిపోయి శిలాద్రవంగా (మాగ్మా) గా మారతాయి.
  3. ఈ మాగ్మా పైన కార్బన్ డై ఆక్సైడ్, సల్ఫర్ డై ఆక్సైడ్ లాంటి వాయువులు ఉత్పత్తి అయి యుగ్మాను ఒత్తిడి చేసినందున మాగ్మా బలహీనంగా ఉన్న భూ పొరలను చీల్చుకుంటూ ఒక రంధ్రం చేస్తూ బయటపడి శంఖువు ఆకారంలో ఘనీభవించి అగ్ని పర్వతాలు ఏర్పడతాయి.

మానవ జీవనాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి. అనగా

  1. అగ్ని పర్వతాలు ఉద్భేదనము చెందిన ప్రాంతాలలోనూ సమీప పరిసర ప్రాంతాలలో కూడ ధన, ప్రాణ నష్టాలు సంభవిస్తాయని మనందరకూ తెలుసు.
  2. అయితే ఆ తరువాత ఎంతోకాలంపాటు ఈ అగ్నిపర్వతాలు ఉద్భేదనము ఫలితంగా మానవ జాతి అనేక విధాలుగా లాభం పొందుతుంది.
  3. ఈ ఉద్భేదనము ఫలితముగా భూమి లోతుల నుండే విలువైన ఖనిజాలు భూమి ఉపరితలానికి దగ్గరగా తీసుకుని రాబడతాయి.
  4. ఈ ప్రదేశాలలో సారవంతమైన నేలలు ఏర్పడతాయి.
    ఉదా : భారతదేశంలోని డెక్కన్ ట్రాప్స్ ప్రాంతంలో ఏర్పడిన నల్లరేగడి నేలలు నూనెగింజలు, ప్రత్తి మొదలైన వాణిజ్య పంటలకు నిలయాలుగా ఉన్నాయి.

AP Board 9th Class Social Solutions Chapter 1 భూమి – మనం

SCERT AP 9th Class Social Studies Guide Pdf 1st Lesson భూమి – మనం Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Social Solutions 1st Lesson భూమి – మనం

9th Class Social Studies 1st Lesson భూమి – మనం Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
అట్లాస్ లో భారతదేశ పటాన్ని చూసి కింది ప్రదేశాల అక్షాంశ, రేఖాంశాలను గుర్తించండి. (AS5)
1. కన్యాకుమారి : ……………………., ………………………….
2. ఇంఫాల్ ……………………….., ……………………………
3. జైసల్మేర్ ……………………………, …………………………
4. పూనా ……………………………., …………………………
5. పాట్నా ……………………………, ………………………….
జవాబు:
1. 8°35′ ఉత్తర అక్షాంశం, 77°36′ తూర్పు రేఖాంశం.
2. 24°44′ ఉత్తర అక్షాంశం, 93°58′ తూర్పు రేఖాంశం.
3. 26° 55′ ఉత్తర అక్షాంశం, 70° 54′ తూర్పు రేఖాంశం.
4. 18°32′ ఉత్తర అక్షాంశం, 73°52′ తూర్పు రేఖాంశం.
5. 27°34′ ఉత్తర అక్షాంశం, 81°46′ తూర్పు రేఖాంశం.

ప్రశ్న 2.
అక్షాంశ, రేఖాంశాలతో సరిపోయే పదాలను గుర్తించండి. (AS1)
జవాబు:

అక్షాంశాలు రేఖాంశాలు
సమాంతర రేఖలు నిలువురేఖలు
వృత్తాలు అర్ధవృత్తాలు
ఉహాజనిత రేఖలు ఉహాజనిత రేఖలు
అడ్డంగా గీయబడినవి కాలాన్ని నిర్ణయిస్తాయి.

ప్రశ్న 3.
క్రింద ఉన్న ప్రపంచ కాల మండలాల పటం చూడండి. (AS5)
AP Board 9th Class Social Solutions Chapter 1 భూమి - మనం 1
(అ) మీరు విజయవాడ నుండి పారిస్ కి వెళుతుంటే ఏ కాల మండలానికి ప్రయాణిస్తున్నారు?
జవాబు:
పశ్చిమానికి ప్రయాణించడం జరుగుతుంది.

(ఆ) హైదరాబాదు నుంచి టోక్యోకి వెళుతుంటే ఏ కాల మండలానికి ప్రయాణిస్తున్నారు?
జవాబు:
తూర్పునకు ప్రయాణించడం జరుగుతుంది.

ప్రశ్న 4.
భూమి ఏర్పడటం, దాని నిర్మాణం గురించి అధ్యయనం చేయటం ఎందుకు కష్టమైనది? (AS1)
జవాబు:
భూమి ఏర్పడటం, దాని నిర్మాణం గురించి అధ్యయనం చేయటం కష్టం ఎందువల్లనంటే …

  1. భూమి పుట్టుక మీద భిన్నాభిప్రాయాలుండటం.
  2. ప్రారంభంలో భూమి చలనం లేకుండా స్థిరంగా ఉందని, మిగిలినవి అన్నీ దానిచుట్టూ తిరుగుతున్నాయని భావించారు.
  3. 500 సం||రాల క్రితం శాస్త్రజ్ఞులు ఒక కొత్త అవగాహనకు వచ్చారు.
  4. భూమి విశ్వానికి మధ్యలో లేదని, వాస్తవానికి అది సూర్యుని చుట్టూ తిరుగుతోందని, ఆ సూర్యుడు కూడా తిరుగుతూ ఉన్నాడని, ఆకాశంలో అసంఖ్యాకంగా ఉన్న నక్షత్రాలు వాస్తవానికి సూర్యుళ్లని తెలుసుకున్నారు.
  5. నక్షత్రాలు కూడా పుడతాయని, పెరుగుతాయని, చివరికి చనిపోతాయని తెలుసుకున్నారు.
  6. పెద్ద విస్ఫోటనంతో 1370 కోట్ల సంవత్సరాల క్రితం విశ్వం ఆవిర్భవించిందని, కొన్ని వందల కోట్ల సం||రాల తరువాత అంతరించిపోతుందని అభిప్రాయపడ్డారు.
  7. భూమి పుట్టుక అధ్యయనం చేయడానికి సరైన శాస్త్ర విజ్ఞానం కూడా అంతగా ఇంకా అభివృద్ధి చెందలేదు.
  8. శాస్త్రీయ పరికరాలు ఇంకా కనిపెట్టవలసిన అవసరం ఉంది.
  9. ఇంకా ఎన్నో అంశాలు ఋజువు కావలసి ఉంది.

AP Board 9th Class Social Solutions Chapter 1 భూమి - మనం

ప్రశ్న 5.
క్రింది పేరాను చదివి కింది ప్రశ్నకు సమాధానం రాయండి. (AS2)
కేంద్ర భాగంలో ఉండే పదార్థం అగ్నిపర్వతాల నుండి సముద్ర తలంలోని పగుళ్ల నుండి పైకి వచ్చి, చల్లబడి భూమి పై పొరగా మారుతుంది. భూమిలో అనేక ప్రాంతాలలో పై పొర తిరిగి మధ్యపొరలోకి ప్రవేశించి ద్రవంగా మారుతుంది. ఈ విధంగా భూపటలం నిత్యం ఏర్పడుతూ, నశిస్తూ ఉండటం భూమి ఇంకా సక్రియంగా ఉందన్న వాస్తవాన్ని వెల్లడి చేస్తుంది. భూమి లోపలి పొరల్లోని ప్రక్రియల వల్ల ఏర్పడే భూకంపాలు, అగ్నిపర్వతాలు, భూమి లోపలికి కుంగటం, కొండల పైకి లేవటం వంటి వాటి ద్వారా మనం నివసిస్తున్న పైపొర నిత్యం మారుతూనే ఉంది.
ప్ర. భూమి ఇప్పటికీ క్రియాశీలకంగా ఉందని మీరు ఎలా చెప్పగలరు.? అయితే కారణాలు ఏమిటి?
జవాబు:
భూమి ఇప్పటికీ క్రియాశీలకంగా ఉంది.

కారణాలు :

  1. కేంద్రభాగంలో ఉండే పదార్థం అగ్నిపర్వతాల నుండి సముద్ర తలంలోని పగుళ్ల నుండి పైకి వచ్చి, చల్లబడి భూమిపై పొరగా మారుతుంది.
  2. భూమిలో అనేక ప్రాంతాలలో పై పొర తిరిగి మధ్య పొరలోకి ప్రవేశించి ద్రవంగా మారుతుంది.
  3. ఈ విధంగా భూ పటలం నిత్యం ఏర్పడుతూ, నశిస్తూ ఉండటం భూమి ఇంకా సక్రియంగా ఉందన్న వాస్తవాన్ని వెల్లడి చేస్తుంది.
  4. భూమి లోపలి పొరల్లోని ప్రక్రియల వల్ల ఏర్పడే భూకంపాలు, అగ్నిపర్వతాలు, భూమి లోపలికి కుంగటం, కొండలు పైకి లేవటం వంటి వాటి ద్వారా మనం నివసిస్తున్న పై పొర నిత్యం మారుతునే ఉంది. అందువల్ల భూమి ఇంకా క్రియాశీలకంగా ఉంది.

ప్రశ్న 6.
గ్రిడ్ అనగా నేమి? అది మనకు ఎలా సహాయపడుతుంది? (AS1)
జవాబు:
గ్లోబు మీద అక్షాంశాలు, రేఖాంశాలు గీసి ఉంటాయి. ఈ నిలువు, అడ్డ గీతలతో గళ్లు ఏర్పడతాయి. దీనిని గ్రిడ్
అంటారు. గ్రిడ్ మనకు ఏ విధంగా సహాయపడుతుందనగా: – 1. ఈ గళ్ల సహాయంతో పటం మీద ఒక ప్రదేశాన్ని గుర్తించగలం. 2. దాని గురించి ఎన్నో విషయాలు తెలుసుకోగలం. ఉదా : అక్కడ ఎంత వేడిగా ఉన్నది, ఎంత చల్లగా ఉన్నది, అక్కడికి చేరుకోవటానికి ఏ దిశగా ప్రయాణం చేయాలి.
ఏ క్షణంలో అక్కడ సమయం ఎంత ఉంటుంది వంటి అంశాలను తెలుసుకోవచ్చు.

ప్రశ్న 7.
కింది వాని మధ్యగల తేడాలు వివరించండి. (AS1)
జవాబు:
ఆ) స్థానిక కాలం – ప్రామాణిక కాలం
ఆ) భూమధ్యరేఖ – ప్రామాణిక కాలం

అ) స్థానిక కాలం :

  1. భూభ్రమణం వల్ల భూమి మీద ఉన్న ఏ స్థలమైనా 24 గంటలలో ఒకసారి సూర్యునికి ఎదురుగా వస్తుంది.
  2. అంటే ప్రతి రేఖాంశం ఒక దినంలో ఒకసారి సూర్యునికి ఎదురుగా వస్తుంది.
  3. అప్పుడు ఆ రేఖాంశంపై ఉన్న ప్రాంతాలకు మధ్యాహ్నం సరిగ్గా 12 గంటలు అవుతుంది.
  4. ఈ సమయాన్ని ఆ ప్రాంతం యొక్క స్థానిక కాలం అంటారు.

ప్రామాణిక కాలం :

  1. ప్రతి దేశానికి ఒక ప్రామాణిక కాలాన్ని నిర్ణయించారు.
  2. దీని వల్ల కాలాన్ని గుర్తించడం సులభమౌతుంది.
  3. సాధారణంగా ప్రామాణిక కాలాన్ని నిర్ధారించడానికి ఆ దేశం మధ్యగా పోయే రేఖాంశాన్ని గుర్తిస్తారు.
  4. ఆ రేఖాంశం యొక్క స్థానిక కాలాన్ని ఆ దేశమంతటికి ప్రామాణిక కాలంగా వర్తింపజేస్తారు.

ఆ) భూమధ్యరేఖ :

  1. భూమికి మధ్యలో అడ్డంగా వెళ్లే వృత్తాన్ని భూమధ్యరేఖ. అంటారు.
  2. ఇది ఉత్తర, దక్షిణ ధృవాల నుంచి సమదూరాలలో ఉంటుంది.
  3. ఇది భూమిని రెండు సమభాగాలుగా చేస్తుంది. కాబట్టి దీనిని భూమధ్య రేఖ అంటారు.
  4. దీనిని 0° అక్షాంశంగా గుర్తిస్తారు.

ప్రామాణిక రేఖాంశం :

  1. ఇంగ్లాండ్ లోని గ్రీన్ విచ్ (Greenwich – ఉచ్చారణ గ్రీనిచ్) లోని నక్షత్రశాల గుండాపోయే రేఖాంశాన్ని 0° మెరిడియన్ లేదా ప్రామాణిక రేఖాంశం లేదా గ్రీనిచ్ మెరిడియన్ అంటారు.
  2. ఆ కాలంలో ప్రపంచంలో అధిక భాగాన్ని ఇంగ్లాండ్ పరిపాలిస్తుండేది. దాంతో వాళ్ళు అనుసరిస్తున్న విధానాన్ని మిగిలిన అందరూ అనుసరించటం మొదలుపెట్టారు.

AP Board 9th Class Social Solutions Chapter 1 భూమి - మనం

ప్రశ్న 8.
భారతదేశంలో ప్రతి రాష్ట్రం తమ స్థానిక సమయం పాటిస్తే ఎలాంటి సమస్యలు వస్తాయి? (AS1)
జవాబు:
భారతదేశంలో ప్రతి రాష్ట్రం తమ స్థానిక సమయాన్ని పాటిస్తే –

  1. సమయం విషయంలో గందరగోళం నెలకొంటుంది.
  2. సమయాన్ని నిర్ణయించటం మరింత క్లిష్టమవుతుంది.
  3. ఒక గంట వ్యవధితో దేశాన్ని పలు కాల మండలాలుగా విభజిస్తారు.

ప్రశ్న 9.
మీ ఉపాధ్యాయుల సహాయంతో నేపాల్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, మలేషియా, జపాన్ దేశాల ప్రామాణిక రేఖాంశాన్ని గుర్తించండి. (AS5)
జవాబు:
నేపాల్ ప్రామాణిక రేఖాంశం – 82° 30′ తూర్పు రేఖాంశం (+ 5.45 యుటిసి)
పాకిస్థాన్ ప్రామాణిక రేఖాంశం – 74°22 తూర్పు రేఖాంశం (యుటిసి + 6 గం)
బంగ్లాదేశ్ ప్రామాణిక రేఖాంశం – 90° 24 తూర్పురేఖాంశం (యుటిసి + 4 గం)
ఇంగ్లాండ్ ప్రామాణిక రేఖాంశం – 0°07 పశ్చిమరేఖాంశం (యుటిసి + 1 గం).
మలేషియా ప్రామాణిక రేఖాంశం – 105° తూర్పురేఖాంశం (యుటిసి + 8 గం)
జపాన్ ప్రామాణిక రేఖాంశం – 135° తూర్పురేఖాంశం (యుటిసి + 9 గం)

ప్రశ్న 10.
భూ పరిరక్షణ కోసం ఆలోచింపజేసే ఒక పోస్టరు తయారుచేయండి.
జవాబు:
AP Board 9th Class Social Solutions Chapter 1 భూమి - మనం 2
భూ పరిరక్షణ కోసం ఆలోచింపజేసే పోస్టర్

9th Class Social Studies 1st Lesson భూమి – మనం InText Questions and Answers

9th Class Social Textbook Page No.2

ప్రశ్న 1.
సుదూరంగా ఉన్న నక్షత్రాలు, పాలపుంతల రహస్యాల గురించీ, విశ్వం ఆవిర్భావం గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి ఈనాటి మానవులకు ఎందుకు ఉంది?
జవాబు:

  1. వేల సంవత్సరాలుగా మనుషులు ఆకాశంలోకి చూస్తూ అక్కడ మెరిసే వాటి గురించి తెలుసుకోటానికి ప్రయత్నిస్తున్నారు.
  2. ఆకాశంలో సంచరిస్తూ ఉండే సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు ఇతర నక్షత్రాలలో పోలిస్తే ఎప్పుడూ ఒకే దూరంలో ఉండే నక్షత్రాలు. ఇవి ఏమిటి? వీటికీ మనకూ సంబంధం ఏమిటి? ఇవి మనల్ని ఎలా ప్రభావితం చేస్తాయి? వంటి వాటిని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించారు.
  3. ఆకాశంలో గల వీటి కదలికలను, ఘటనలను నమోదు చేస్తూ అవి ఏమిటో, అవి ఎలా కదులుతున్నాయో అర్థం చేసుకోటానికి ప్రయత్నించారు. అందువల్ల విశ్వం ఆవిర్భావం గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి ఈనాటి మానవులకు ఉంది.

AP Board 9th Class Social Solutions Chapter 1 భూమి - మనం

ప్రశ్న 2.
విశ్వం మధ్యలో భూమి ఉందనీ, సృష్టిలో ముఖ్యమైనది మానవులనీ మొదట భావించేవాళ్లు. ఈ అనంత విశ్వంలో మనం అతి చిన్న నలుసు మాత్రమేనని తెలుసుకోవటం వల్ల అది మనపై ఎటువంటి ప్రభావం చూపుతుంది?
జవాబు:

  1. మొదట్లో భూమి చలనం లేకుండా స్థిరంగా ఉందనీ, మిగిలినవన్నీ దాని చుట్టూ తిరుగుతున్నాయని భావించారు.
  2. వేల సంవత్సరాలుగా ఇలాగే ఉంది కాబట్టి ఎటువంటి మార్పులూ లేకుండా భూమి, నక్షత్రాలు, సూర్యుడు శాశ్వతంగా ఇలాగే ఉంటాయని భావించారు.
  3. కానీ తరువాత భూమి విశ్వానికి మధ్యలో లేదని, వాస్తవానికి అది సూర్యుని చుట్టూ తిరుగుతోందని, ఆ సూర్యుడు కూడా తిరుగుతూ ఉన్నాడని, ఆకాశంలో అసంఖ్యాకంగా ఉన్న నక్షత్రాలు వాస్తవానికి సూర్యుళ్లని తెలుసుకున్నారు.
  4. నక్షత్రాలు కూడా పుడతాయని, పెరుగుతాయని, చివరికి చనిపోతాయని కూడా గత వంద సంవత్సరాల కాలంలో అర్థం చేసుకున్నారు. ఇది మనపై చూపే ప్రభావం ఏదీ శాశ్వతం కాదని, అనంత విశ్వంలో మనం చాలా చిన్న నలుసులం మాత్రమేనని అర్థమవుతుంది. కావున మనకు తెలిసినది తక్కువ అని, తెలియాల్సిందే ఎక్కువ అని కూడా అర్థమౌతుంది.

9th Class Social Textbook Page No.3

ప్రశ్న 3.
భూమి మీద కాలాలు ఏర్పడటానికి గల కారణాలను కింది వానిలో గుర్తించండి.
1. అక్షంపై రోజుకు ఒకసారి భూమి తన చుట్టూ తాను తిరగడం
2. భూమి చుట్టూ చంద్రుడు నెలకు ఒకసారి తిరగటం
3. అక్షంపై సూర్యుడు తన చుట్టూ తాను తిరగటం
4. సూర్యుని చుట్టూ భూమి పరిభ్రమణం
5. కక్ష్య తలంతో పోలిస్తే భూమి అక్షం వంగి ఉండటం
6. భూమి గోళాకారంలో ఉండటం
7. సంవత్సర పరిభ్రమణ కాలంలో సూర్యుడి నుండి భూమి ఉండే దూరం
జవాబు:
1. అక్షంపై రోజుకు ఒకసారి భూమి తన చుట్టూ తాను తిరగడం
2. సూర్యుని చుట్టూ భూమి పరిభ్రమణం
3. కక్ష్య తలంతో పోలిస్తే భూమి అక్షం వంగి ఉండటం
4. భూమి గోళాకారంలో ఉండటం

9th Class Social Textbook Page No.4

ప్రశ్న 4.
భూమి అకస్మాత్తుగా ఏర్పడిందని అనుకుంటున్నారా లేక అది ఒక సుదీర్ఘ, సంక్లిష్ట ప్రక్రియల ఫలితంగా ఏర్పడిందని అనుకుంటున్నారా?
జవాబు:
భూమి ఒక సుదీర్ఘ సంక్లిష్ట ప్రక్రియల ఫలితంగానే ఏర్పడింది.

  1. ఎక్కువమంది శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం సుమారుగా 450 కోట్ల సంవత్సరాల క్రితం భూమి ఏర్పడటం మొదలయ్యింది.
  2. భూమి అనేక దశలలో మార్పు చెంది, ప్రస్తుత రూపాన్ని సంతరించుకుంది.
  3. పరిభ్రమిస్తున్న ధూళి, మేఘాల గోళంగా మొదలై, ద్రవ దశ గుండా పరిణమించింది.
  4. ఆ దశలో భూమి చాలా వేడిగా ఉండేది.
  5. విశ్వం నుంచి పెద్ద పెద్ద రాళ్ళు, ఇతర పదార్థాలు దానిని ఢీకొంటూ ఉండేవి.
  6. ఆ విధంగా భూమి పరిమాణం పెరిగింది.
  7. భూమి అత్యంత వేడిమి గల ద్రవంగా ఉండేది.
  8. బరువైన పదార్థాలు ద్రవరూప కేంద్రభాగంగా మారితే, తేలిక పదార్థాలు పైకి లేచి చల్లబడ్డాయి. కాల క్రమంలో ద్రవరూప కేంద్రాన్ని కప్పుతూ తేలికైన, చల్లబడిన పదార్థాలతో పై పొర ఏర్పడింది.

AP Board 9th Class Social Solutions Chapter 1 భూమి - మనం

ప్రశ్న 5.
అనేక యాదృచ్చిక ఘటనల ఫలితంగా భూమి మీద మానవులు రూపొందారని కొంతమంది నమ్ముతారు. లేకుంటే భూమి మీద ప్రాణం ఏర్పడి ఉండేదే కాదు. వాళ్ళతో మీరు ఏకీభవిస్తారా? మీ కారణాలను పేర్కొనండి.
జవాబు:
మా కారణాలు కూడా శాస్త్రవేత్తలు తెల్పినవే.

  1. భూమి చరిత్రలో సగం కాలం ఎటువంటి ప్రాణీ లేకుండా నిర్జీవంగా గడిచింది.
  2. ఆ తరువాత సముద్రాలలో జీవం మొదలైంది.
  3. లక్షల సంవత్సరాల పరిణామక్రమంలో మనుషులతో సహా అనేక రకాల మొక్కలు, జంతువులు రూపొందాయి.

9th Class Social Textbook Page No.5

ప్రశ్న 6.
భూప్రావారంను అధ్యయనం చేయటానికి మనం దాని వరకు ప్రయాణించలేం. అయితే భూప్రావారంలోని పదార్థాల ద్వారా దాన్ని అధ్యయనం చేయవచ్చు. ఈ పదార్థాలు ఏమిటో, వాటిని ఎలా పొందవచ్చో చెప్పండి.
జవాబు:
భూప్రావారం:

  1. ఈ పొర భూమి లోపల 100 కిలోమీటర్ల నుంచి మొదలుకొని 2900 కిలోమీటర్ల వరకు ఉంటుంది.
  2. భూ ప్రావారంలో పై పొర తేలుతూ ఉంటుంది.
  3. ఇందులో ప్రధానంగా సిలికేట్లు అనే రసాయనాలు ఉంటాయి.
  4. అగ్నిపర్వతాలు విస్ఫోటనం చెందటం వలన మరియు యంత్రాలను భూ అంతర్భాగంలోనికి పంపడం ద్వారా వీటిని పొందవచ్చు.

9th Class Social Textbook Page No.7

ప్రశ్న 7.
ప్రపంచ పటాన్ని జాగ్రత్తగా గమనించండి. ‘జిగ్ సా పజిల్’ లోని రెండు ముక్కలుగా ఏవైనా రెండు ఖండాలు కనిపిస్తున్నాయా? ఆ ఖండాలు ఏవి?
జవాబు:
జిగ్ సా పజిల్ లోని రెండు ముక్కలుగా కనిపించే రెండు ఖండాలు:

  1. లారెన్షియా
  2. గోండ్వానా భూమి.

ప్రశ్న 8.
ఆస్ట్రేలియా ఏ దిశవైపునకు కదిలింది?
జవాబు:
దక్షిణం వైపునకు కదిలింది.

AP Board 9th Class Social Solutions Chapter 1 భూమి - మనం

ప్రశ్న 9.
భారతదేశం ఏ దిశవైపునకు కదిలింది?
జవాబు:
తూర్పు వైపునకు కదిలింది.

9th Class Social Textbook Page No.8

ప్రశ్న 10.
కింద ఇచ్చిన పటం ఆధారంగా దిగువ పట్టిక నింపండి.
AP Board 9th Class Social Solutions Chapter 1 భూమి - మనం 3

అర్ధ గోళం ఖండాలు
ఉత్తరార్ధగోళం
పశ్చిమార్ధగోళం
దక్షిణార్ధగోళం
తూర్పు అర్ధగోళం

జవాబు:

అర్ధ గోళం ఖండాలు
ఉత్తరార్ధగోళం ఉత్తర అమెరికా, ఆసియా, ఐరోపా, ఆఫ్రికాలో సగభాగం.
పశ్చిమార్ధగోళం ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా.
దక్షిణార్ధగోళం దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియా, ఆఫ్రికాలో సగభాగం, అంటార్కిటికా.
తూర్పు అర్ధగోళం ఆఫ్రికా, ఐరోపా, ఆసియా, ఆస్ట్రేలియా, అంటార్కిటికా.

9th Class Social Textbook Page No.12

ప్రశ్న 11.
అట్లాస్ చూసి ఈ దేశాలలో ఎన్ని ప్రామాణిక కాల మండలాలు (Time Zones) ఉన్నాయో తెలుసుకోండి.
అమెరికా, ఆస్ట్రేలియా, రష్యా, జపాన్, జింబాబ్వే, చిలీ.
జవాబు:

  1. అమెరికా : ఐదు ప్రామాణిక కాలమండలాలు ఉన్నవి. అవి -9, -3, -2, -6, -5 మండలాలు.
  2. ఆస్ట్రేలియా : మూడు ప్రామాణిక కాల మండలాలు ఉన్నవి. అవి +8, +9, +10 మండలాలు.
  3. రష్యా : పది ప్రామాణిక కాలమండలాలు ఉన్నవి. అవి +3, +4, +5, +6, +7, +8, +9, +10, +11, +12 మండలాలు.
  4. జపాన్ : ఒకే ఒక్క ప్రామాణిక కాలమండలం ఉంది. అది +9 మండలం.
  5. జింబాబ్వే : ఒకే ఒక్క ప్రామాణిక కాలమండలం ఉంది. అది +2 మండలం.
  6. చిలీ : ఒకే ఒక్క ప్రామాణిక కాలమండలం ఉంది. అది -5 మండలం.

ప్రశ్న 12.
హైదరాబాదులోని ఒక కాల్ సెంటరులో స్వాతి పనిచేస్తోంది. ఆమె క్లయింటులు అమెరికాలో ఉన్నారు. కంప్యూటర్ సమస్యలకు సంబంధించి క్లయింటుల ప్రశ్నలకు ఆమె సమాధానాలు ఇస్తుంది. ఆమె ఎప్పుడూ రాత్రివేళల్లోనే పనిచేస్తుంది. ఎందుకని ? భూగోళశాస్త్రాన్ని ఉపయోగించి తెలుసుకోండి.
జవాబు:

  1. భారతదేశము తూర్పు అర్ధగోళంలోనూ, అమెరికా పశ్చిమార్ధగోళంలోనూ ఉంది.
  2. రెండు దేశాల మధ్య దాదాపు 12 గంటల కాల వ్యత్యాసం ఉంది.
  3. అమెరికా వాళ్ల మధ్యాహ్న 12 గంటల సమయం, మనకు అర్ధరాత్రి 12 గంటల సమయమవుతుంది.
  4. అందువలన స్వాతి ఎప్పుడూ వాళ్లకు పగటివేళలయిన, మన రాత్రివేళల్లోనే, పనిచేయవలసి వస్తుంది.

AP Board 9th Class Social Solutions Chapter 1 భూమి - మనం

ప్రశ్న 13.
మెదడుకు మేత :
గ్రీన్ విచ్ (0) వద్ద మధ్యాహ్నం 12 : 00 అయితే ఈ దిగువ ప్రదేశాల్లో స్థానిక సమయం ఎంతో తెలుసుకోండి :
(అ) ముంబయి (73° తూ.రే) ; (ఆ) షికాగో (87° 30 ప.రే) ; (ఇ) సిడ్నీ ‘(151° తూ.రే.).
జవాబు:
ఒక్కొక్క రేఖాంశానికి సమయ వ్యత్యాసం 4 ని||లు.
(అ) ముంబయి (73° తూ.రే) :

  1. 73 × 4 = 292 నిమిషాలు = 4 గం||ల 52 ని॥లు
  2. తూర్పు రేఖాంశము గ్రీన్ విచ్ కు పైన ఉంటుంది. కనుక 4 గం|| 52 ని||లు కలుపవలసి ఉంటుంది.
  3. 12-00 + 4-52 = 16-52 అనగా స్థానిక సమయం సాయంత్రం 4 గం|| 52 ని||లు.

(ఆ) షికాగో (87° 30 ప.రే) :

  1. 87.30 × 4 = 87½ × 4 = 350 నిమిషాలు = 5 గం|| 50 ని||
  2. పశ్చిమ రేఖాంశము గ్రీన్ కు క్రింద ఉంటుంది. కనుక 5 గం|| 50 ని||లు తీసివేయవలసి ఉంటుంది.
  3. 12.00 – 5.50 = 6 గం|| 10 ని||
    అందువలన స్థానిక సమయం ఉదయం 6గం|| 10ని||

(ఇ) సిడ్నీ (151° తూ.రే.) :

  1. 151 × 4 = 604 ని||లు = 10 గం|| 4 ని||
  2. తూర్పు రేఖాంశము గ్రీన్ విచ్ కు పైన ఉంటుంది.
  3. 12.00 + 10 – 04 = 22-04
    అనగా స్థానిక సమయం రాత్రి 10 గం|| 4 ని||

AP Board 9th Class Biology Solutions 8th Lesson వ్యవసాయోత్పత్తుల పెంపుదల – మన ముందున్న సవాళ్లు

SCERT AP 9th Class Biology Guide Pdf Download 8th Lesson వ్యవసాయోత్పత్తుల పెంపుదల – మన ముందున్న సవాళ్లు Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Biology 8th Lesson Questions and Answers వ్యవసాయోత్పత్తుల పెంపుదల – మన ముందున్న సవాళ్లు

9th Class Biology 8th Lesson వ్యవసాయోత్పత్తుల పెంపుదల – మన ముందున్న సవాళ్లు Textbook Questions and Answers

అభ్యసనాన్ని మెరుగుపరుచుకోండి

ప్రశ్న 1.
మన దేశంలో ధాన్యం ఉత్పత్తిలో పెంపుదల సాధించాలంటే ఏమి చేయాలో సూచించండి. (AS 1)
(లేదా)
ఒక పక్క జనాభా విపరీతంగా పెరిగిపోతుంది. కాని పంటలు పండే భూమి మాత్రం తగ్గిపోతుంది. మరి పెరుగుతున్న జనాభాకు సరిపడేలా ఆహారోత్పత్తి పెంచాలంటే చేపట్టాల్సిన పరిష్కార మార్గాలు సూచించండి.
జవాబు:

  1. సాగుభూమి విస్తీర్ణాన్ని పెంచడం.
  2. ప్రస్తుతం సాగుచేస్తున్న భూమినందు ఉత్పత్తిని పెంచడం.
  3. ఎక్కువ దిగుబడినిచ్చే వరి సంకర జాతులను అభివృద్ధి చేయడం.
  4. వివిధ వాతావరణ పరిస్థితులలో పెరిగే నూతన రకములను ఉత్పత్తి చేయడానికి వరి మొక్క జన్యు వైవిధ్యమును పరిరక్షించడం.
  5. మంచి నీటిపారుదల పద్ధతులు, సరియైన యాజమాన్య పద్ధతులను పాటించాలి.
  6. పోషక పదార్థములను సక్రమముగా వినియోగించడానికి వరి పంట.యాజమాన్య పద్ధతులను అవలంబించాలి.
  7. సేంద్రియ ఎరువులను ఉపయోగించాలి.
  8. పంటమార్పిడి, మిశ్రమ పంటల పద్ధతులను అవలంబించాలి.

ప్రశ్న 2.
రసాయన ఎరువుల కంటే జీవ ఎరువులు ఏ విధంగా మెరుగైనవి? (AS 1)
జవాబు:

  1. జీవ ఎరువులు సహజ పోషకాలను నేలకు అందిస్తాయి.
  2. నేల నిర్మాణాన్ని మరియు నేల సేంద్రియ పదార్థాన్ని జీవ ఎరువులు పెంచుతాయి.
  3. జీవ ఎరువులు నీటి నిల్వ సామర్థ్యాన్ని మరియు నేల గట్టిపడే సమస్యలను తగ్గిస్తాయి.
  4. నేల మరియు నీటి కోరివేతను జీవ ఎరువులు తగ్గిస్తాయి.
  5. పంట యొక్క ఉత్పత్తిని జీవ ఎరువులు పెంచుతాయి.
  6. జీవ ఎరువుల వాడకం ద్వారా నేలలో హ్యూమస్ శాతం పెరిగి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి.

ప్రశ్న 3.
అ) అధిక దిగుబడినిచ్చే పంటలు పండించడానికి, రసాయన ఎరువులు ఎక్కువ వాడడం వలన కలిగే దుష్ఫలితాలు ఏమిటి? (AS 1)
జవాబు:

  1. రసాయనిక ఎరువులు సరస్సులు, నదులు మరియు వాగులను కలుషితం చేస్తాయి.
  2. నేలలో జీవించే వానపాములతో సహా ఇతర జీవులను నాశనం చేస్తాయి.
  3. రసాయనిక ఎరువులను వినియోగించుట ద్వారా కేవలం 20 నుండి 30 సంవత్సరాలు మాత్రమే అధిక ఉత్పత్తిని సాధించగలం.
  4. ఆ తరువాత నేల మొక్కల పెరుగుదలకు అనుకూలించదు.
  5. నేల సారాన్ని రసాయన ఎరువులు పాడు చేస్తాయి.
  6. రసాయన ఎరువుల వాడకం వలన పంటలు వ్యాధులకు గురి అవుతాయి.
  7. కొన్ని మొక్కలు పోషక పదార్థాలను గ్రహించడాన్ని నిరోధిస్తాయి.
  8. రసాయన ఎరువులు ఉపయోగించి పండించిన ఆహార పదార్థాలు అంత రుచికరంగా ఉండవు.

ఆ) అధిక దిగుబడినిచ్చే వంగడాలను రసాయన ఎరువులు లేకుండా పెంచవచ్చా? ఎలా? (AS 1)
జవాబు:

  1. అవును. అధిక దిగుబడినిచ్చే వంగడాలను రసాయన ఎరువులు లేకుండా పెంచవచ్చును.
  2. రసాయన ఎరువులు మరియు కృత్రిమంగా తయారయిన కీటక నాశనులకు బదులుగా జీవ ఎరువులను ఉపయోగించుట ద్వారా మనము అధికోత్పత్తిని పొందవచ్చు.

AP Board 9th Class Biology Solutions 8th Lesson వ్యవసాయోత్పత్తుల పెంపుదల – మన ముందున్న సవాళ్లు

ప్రశ్న 4.
విత్తనాలు విత్తడానికి ముందు తప్పనిసరిగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏవి? (AS 1)
జవాబు:

  1. విత్తనాలు విత్తే ముందు నేలను సిద్ధపరచాలి.
  2. నేలను వదులుగా చేయడానికి, గట్టిగా ఉన్న మట్టి గడ్డలను పగలగొట్టడానికి నేలను దున్నాలి.
  3. విత్తనాలు చల్లే ముందు నీళ్ళు పెట్టాలి. .
  4. నేలలో పుట్టే లేదా విత్తనముల ద్వారా వచ్చే వ్యాధులను అరికట్టడానికి విత్తన శుద్ధి చేయాలి.

ప్రశ్న 5.
వర్షాభావ పరిస్థితులు అధికంగా ఉండే ప్రదేశంలో మీ పొలం ఉంటే దానిలో ఏ రకమైన పంటలు పండిస్తావు? ఎలా పండిస్తావు? (AS 1)
జవాబు:

  1. జొన్న, సజ్జ, కంది, పెసలు, ఉలవలు మొదలగు పంటలను వర్షాభావ పరిస్థితులు గల మా పొలంలో పండిస్తాను.
  2. వర్షపు నీటిని సంరక్షించడం, చెక్ డ్యాంలను నిర్మించడం, డ్రిప్ ఇరిగేషన్ పద్ధతి, వాటర్ షెడ్ పథకము మరియు నేల మరియు నీటి సంరక్షణ పద్ధతుల ద్వారా పై పంటలను పండిస్తాను.

ప్రశ్న 6.
కాలానుగుణంగా ఆశించే కీటకాలు పంట పొలాన్ని నాశనం చేయకుండా ఏ రకమైన జాగ్రత్తలు తీసుకుంటారు? (AS 1)
జవాబు:

  1. సాధారణంగా రైతులు కృత్రిమంగా తయారుచేసిన ఎరువులు, కీటకనాశనులు ఉపయోగించి పంటలపై వచ్చే కీటకాలను అదుపులో ఉంచుతారు.
  2. కొందరు కీటకాలను చేతితో ఏరివేయడం ద్వారా కీటకాల బారి నుండి పంట పొలాన్ని రక్షిస్తారు.
  3. కీటకాలకు హాని కలిగించే పరభక్షక కీటకాలను ఉపయోగించి పంట పొలం నాశనం కాకుండా చూస్తారు.
  4. చేతితో కీటకాలను ఏరి వేసే పద్ధతిలో పంటపొలం మధ్యలో దీపపుతెరలు ఉంచడంవల్ల కీటకాలన్నీ దాని ఆకరణకు లోనై ఒకే చోటికి చేరతాయి. ఇలా చేయడం వల్ల వాటిని ఏరివేయడం సులభం.
  5. కీటకనాశనులను అవసరమైన సందర్భాలలో వినియోగించడం వల్ల కూడా పంటపొలాన్ని కీటకాలు నాశనం చేయకుండా చూడవచ్చు.

ప్రశ్న 7.
ఒక రైతు తన పొలంలో చాలా కాలంగా ఒకే క్రిమిసంహారక మందును ఉపయోగిస్తున్నాడు. అయితే కింది వాటిపై దాని ప్రభావం ఏ విధంగా ఉంటుంది? (AS 2)
అ) కీటకాల జనాభా
ఆ) నేల ఆవరణ వ్యవస్థ
జవాబు:
అ) కీటకాల జనాభా :

  1. రైతు క్రిమిసంహారక మందును ఎక్కువకాలం ఉపయోగించడం వలన కీటకాలు వ్యాధి నిరోధకతను పెంచుకుంటాయి.
  2. అందువలన కీటకాల జనాభా పెరుగుతుంది.

ఆ) నేల ఆవరణ వ్యవస్థ :

  1. క్రిమి సంహారకాలను ఎక్కువకాలం ఉపయోగించడం వల్ల ఆ మందులు నేలలోనే ఉండిపోతాయి.
  2. ఆ మందులు నేలలోని పురుగులను చంపివేస్తాయి. తద్వారా పంట దిగుబడి తగ్గుతుంది.
  3. నేలలో లవణాల శాతం పెరిగి నేల ఆవరణ వ్యవస్థ దెబ్బ తింటుంది.

ప్రశ్న 8.
రామయ్య తన పొలానికి భూసార పరీక్ష చేయించాడు. పోషకాల నిష్పత్తి 34-20-45గా ఉంది. ఈ నిష్పత్తి చెరకు పండించడానికి అనుకూలమేనా? ఏ రకమైన పంటలు పండించడానికి ఈ పొలం అనుకూలమని భావిస్తావు? (AS 2)
జవాబు:

  1. రామయ్య పొలము చెరకు పంట పండించడానికి అనుకూలం కాదు.
  2. ఎందుకంటే చెరకు పంట పండించడానికి నేలలో 90% నత్రజని ఉండాలి, కాని రామయ్య పొలంలో కేవలం 34% నత్రజని మాత్రమే ఉంది.
  3. భాస్వరము 20% ఉండడం వలన మొక్కజొన్నను, పొటాషియం 45% ఉండడం వలన వేరుశనగ పంటను పండించవచ్చు.

ప్రశ్న 9.
మీ సమీపంలోని పొలానికి వెళ్ళి రైతులు కలుపు నివారణకు పాటిస్తున్న పద్ధతులు గురించిన సమాచారం సేకరించి నివేదిక రాయండి. (AS 3)
జవాబు:
కలుపు నివారణకు పాటిస్తున్న పద్ధతులు :

రైతు పేరు నివారణ పద్ధతి
1. రామారావు కూలీలతో చేతితో ఏరివేయిస్తున్నాడు.
2. వెంకటయ్య ఈ రైతుది మెట్ట పొలం అయినందున గుంటక వంటి పరికరాలు వాడి నివారణ చేస్తున్నాడు.
3. సోమేశం కలుపు నాశకాలను చల్లి నివారణ చేస్తున్నాడు.
4. శ్రీనివాసరావు దుక్కిలోనే కలుపు వినాశకాలను వాడి, దున్ని కలుపును రాకుండా నివారిస్తున్నాడు.

ఈ నాలుగు పద్ధతులను చాలా మంది రైతులు పాటించుటను గమనించాను.

AP Board 9th Class Biology Solutions 8th Lesson వ్యవసాయోత్పత్తుల పెంపుదల – మన ముందున్న సవాళ్లు

ప్రశ్న 10.
మీ ప్రాంతంలోని ప్రధానమైన కలుపు మొక్కల జాబితా తయారుచేయండి. వాటిలో వేర్వేరు పంటలలో పెరిగే కలుపు మొక్కలను కింది పట్టికలో నమోదు చేయండి. (AS 4)
జవాబు:
ప్రధానమైన కలుపు మొక్కల జాబితా :
సైనోడాన్ డాక్టలాన్ (గరిక), సైపరస్ రొటండస్ (తుంగ), డిజిటారియా లాంగిఫోలియా, డాక్టలో క్లీనియమ్ కలోనమ్, సెటేరియా గ్లూకా, సైపరస్ డిఫార్మిస్, ఐకోర్నియా క్రాసిప్స్ (బుడగ తమ్మ), సాల్వీనియా మొలస్టా, ఆల్టర్ నాంతిర సెసైలిస్ (పొన్నగంటి), సెలోషియా అర్జెన్షియా (గురంగుర) లూకాస్ ఏస్పిరా (తుమ్మి), పోర్చు లేక ఒలరేషియా (పావలికూర), క్లియోమ్ విస్కోసా (కుక్కవామింట), సొలానమ్ నైగ్రమ్ (బ్లాక్ నైట్ షేడ్), అర్జిమోన్ మెక్సికానా (బాలరక్కొస), ఎబుటిలాన్ ఇండికమ్ (తుత్తురి బెండ), యూఫోర్బియా హిరా (పచ్చబొట్లు), వెర్నోనియా సిన్నోరా, ఇఖ్ నోక్లోవా కొలోనమ్ (ఉడలు), కొమ్మెలైనా బెంగాలెన్సిస్ (వెన్నవెదురు), అవినాఫాట్యువ (అడవియవలు), ఇళ్ల నోక్లోవా క్రస్ గల్లి (నీటిగడ్డి), ఎల్యు సైన్ ఇండికా (గూ గ్రాస్), ఎభిరాంథిస్ ఏస్పిరా (ఉత్తరేణి), ఇక్లిష్టా ప్రోస్టేట (గుంట కలగర లేదా) భృంగరాజ మొదలగునవి.

పంట రకం పంటపై పెరిగే కలుపు మొక్కలు
వరి గరిక, తుంగ, బుడగ తమ్మ, పొన్నగంటి
వేరుశనగ గురంగుర, గరిక, తుంగ, తుత్తురి బెండ, వెన్న వెదురు, కుక్కవామింట, తుమ్మి, పావలికూర, బాలరక్కిస.
మినుములు గరిక, తుంగ, తుత్తురి బెండ, వెన్న వెదురు, సాల్వీనియా మొలస్టా, పచ్చబొట్లు, బంగారు తీగ.
మొక్కజొన్న పచ్చబొట్లు, సొలానమ్ నైగ్రమ్, గరిక, తుంగ
పెసలు ఉడలు, గరిక, తుంగ, బాలరక్కొస, పావలికూర

ప్రశ్న 11.
మీ గ్రామ పటం గీచి, నీటివనరులను గుర్తించండి. నీవు ఒక మంచి రైతుగా వాటిని ఎలా ఉపయోగిస్తావు? ఏ ఏ వ్యవసాయ పద్ధతులను పాటిస్తావు? (AS 5)
జవాబు:
AP Board 9th Class Biology Solutions 8th Lesson వ్యవసాయోత్పత్తుల పెంపుదల – మన ముందున్న సవాళ్లు 1
నేను ఒక మంచి రైతుగా ఆ నీటి వనరులను సక్రమ పద్ధతిలో ఉపయోగిస్తాను. నీటివనరులు తక్కువగా ఉంటే బిందుసేద్యం పద్ధతిని ఉపయోగిస్తాను.

ప్రశ్న 12.
రసాయన ఎరువులు శిలీంధ్రనాశకాలు, కీటకనాశకాలు, కలుపు మందులు అధిక మోతాదులో వినియోగిస్తే పర్యావరణంపై కలిగే పరిణామాలు ఏమిటి? (AS 6)
జవాబు:

  1. మనం కీటకనాశనులు, శిలీంధ్రనాశకాలను, కలుపు మందులను అధిక మొత్తంలో వాడడం వలన ఈ మందులు నేలలోనే మిగిలిపోతాయి.
  2. వర్షాలు పడినప్పుడు నేల నుండి నీటిలో కరిగి నీటి వనరులను కూడా కలుషితం చేస్తాయి.
  3. నేల పొరలోకి దిగి నేలను కలుషితం చేసాయి.
  4. ఈ మందులను పొలంలో చల్లే రైతులు తరచుగా వీటి ప్రభావానికి గురి అయ్యి ఆరోగ్యంపై దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపుతాయి. కొన్నిసార్లు మరణం కూడా సంభవించవచ్చు.
  5. కీటకనాశనులు ఉపయోగపడే కీటకాలతో సహా మొత్తం కీటకాలను నాశనం చేస్తాయి.
  6. అధిక మొత్తంలో రసాయన ఎరువులు, కీటక నాశనులు, కలుపు ందులను వాడడం వలన కొంత కాలానికి నేల పంట పండించడానికి ఉపయోగపడదు.

ప్రశ్న 13.
“జీవ వైవిధ్యానికి సేంద్రియ ఎరువులు సహాయపడతాయి”. దీనిని నీవెలా సమర్థిస్తావు? (AS 6)
జవాబు:

  1. నేల మరియు నేలలో ఉండే జీవులపై జరిగిన జీవశాస్త్ర అధ్యయనము సేంద్రియ సేద్యమునకు అనుకూలమని నిరూపించబడినది.
  2. రసాయన పదార్థాలను, వృక్ష మరియు జంతు సంబంధమైన వ్యర్థాల నుండి బాక్టీరియా మరియు శిలీంధ్రాలు నేల పోషక పదార్థములను విడగొడతాయి.
  3. అంతేకాకుండా బాక్టీరియా మరియు శిలీంధ్రాలు ఆరోగ్యకరమైన దిగుబడిని ఇవ్వడానికి మరియు భవిష్యత్తుల్లో పండించబోయే పంటలకు అనుకూలమైన నేలను అందిస్తాయి.

ప్రశ్న 14.
“ఎక్కువ మోతాదులో శిలీంధ్రనాశకాలు వాడితే జీవవైవిధ్యం, పంట దిగుబడిపై తీవ్రమైన ప్రమాదం కలుగుతుంది”. దీనిని నీవెలా సమర్థిస్తావు? (AS 6)
జవాబు:

  1. ఎక్కువ మోతాదులో శిలీంధ్రనాశకాలు వాడితే అవి ఎక్కువ భాగం మృత్తికలలో చేరి మృత్తికలోని జీవులను నాశనం చేస్తాయి.
  2. వర్షము కురిసినప్పుడు మృత్తిక నుండి వర్షపు నీటి ద్వారా చెరువులు, నదులలోని నీటిలోకి చేరి జలజీవులకు హాని కలుగచేస్తాయి.
  3. ఈ మందులను పొలంలో చల్లే రైతులు తరుచుగా వీటి ప్రభావానికి గురి కావడం జరుగుతుంది. కొన్ని రసాయనిక పదార్థాలు శరీరంలోకి ప్రవేశించి, కొన్నిసార్లు ప్రాణాపాయం కలుగుతుంది.
  4. క్రిమి సంహారక మందులను పంటలపై చల్లినప్పుడు అవి పరాగ సంపర్కానికి ఉపయోగపడే కీటకాలను కూడా చంపివేస్తాయి.

AP Board 9th Class Biology Solutions 8th Lesson వ్యవసాయోత్పత్తుల పెంపుదల – మన ముందున్న సవాళ్లు

ప్రశ్న 15.
అధిక దిగుబడినిచ్చే వంగడాలను ఉపయోగించడం వలన కలిగే ప్రతికూల ప్రభావం ఏమిటి? (AS 7)
జవాబు:
అధిక దిగుబడినిచ్చే వంగడాలను ఉపయోగించడం వలన
i) అవి ఎక్కువ మొత్తంలో నేల నుండి పోషకాలను వినియోగించుకుంటాయి.
ii) నిరంతరం ఉపయోగించడం వలన నేల సారాన్ని కోల్పోతుంది.
iii) సారాన్ని పెంచటానికి రసాయన ఎరువులు వాడాల్సి ఉంటుంది.
iv) ఇది వ్యవసాయ ఖర్చును పెంచుతుంది.

ప్రశ్న 16.
రసాయన ఎరువులు ఉపయోగిస్తున్న రైతుకు సేంద్రియ ఎరువులు ఉపయోగించే విధంగా ఏ రకంగా వివరించి ఒప్పిస్తావు? (AS 7)
జవాబు:

  1. పోషక పదార్థాలు తిరిగి నేలలో కలిసే విధంగా మరియు మట్టిగడ్డలు చిన్నవిగా చేయడానికి జీవ ఎరువులు తోడ్పడతాయి.
  2. నేలలో ఉండే జీవుల మనుగడను జీవ ఎరువులు ఎక్కువ చేస్తాయి.
  3. సేంద్రీయ ఎరువులు పంట దిగుబడి ఎక్కువ వచ్చే విధంగా చేస్తాయి.
  4. నేల యొక్క సహజ సమతౌల్యాన్ని కాపాడతాయి.
  5. కొన్ని పంటలకు వ్యాధులు సోకకుండా నివారిస్తాయి.
  6. పర్యావరణానికి హాని చేయని మిత్రులుగా సేంద్రియ ఎరువులు ఉంటాయి.

పైన పేర్కొన్న సేంద్రియ ఎరువుల యొక్క ఉపయోగాలను రైతుకు స్పష్టంగా వివరించి, వాటినే ఉపయోగించేలా ఆ రైతును ఒప్పిస్తాను.

ప్రశ్న 17.
వెంకటాపురం అనే గ్రామం తీవ్ర వర్షాభావ పరిస్థితులున్న ప్రాంతం. సోమయ్య తన పొలంలో చెరకును పండించాలనుకుంటున్నాడు. ఇది లాభదాయకమా? కాదా? వివరించండి. (AS 7)
జవాబు:

  1. సోమయ్య తన పొలంలో చెరకును పండించాలనుకోవడం లాభదాయకం కాదు.
  2. ఎక్కువ నీటి లభ్యత కలిగిన ప్రదేశాలలో మాత్రమే చెరకు పండుతుంది.
  3. నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రదేశాలలో ఆరుతడి పంటలు పండించడం లాభదాయకం.

ప్రశ్న 18.
“సహజ కీటకనాశన పద్ధతులు జీవ వైవిధ్యానికి దోహదం చేస్తాయి”. వ్యాఖ్యానించండి. (AS 7)
జవాబు:

  1. కొన్ని రకాల కీటకాలు మనకు హాని కలిగించే, నష్టం కలిగించే కీటకాలను అదుపులో ఉంచుతాయి. వీటిని మిత్ర కీటకాలు అంటారు.
    ఉదా : సాలెపురుగు, డ్రాగన్ ప్లే, క్రిసోపా మొదలగునవి.
  2. ట్రైకో డెర్మా బాక్టీరియం కాండం తొలిచే పురుగు గుడ్లలో నివసిస్తుంది.
  3. పొగాకును తినే గొంగళి పురుగు, ధాన్యాన్ని తినే గొంగళిపురుగు వంటి వాటిని గ్రుడ్ల దశలోనే బాక్టీరియాతో నాశనం చేయవచ్చు.
  4. బాసిల్లస్ తురంజనిసిన్ వంటి కొన్ని రకాల బాక్టీరియాలు కీటకాలను నాశనం చేస్తాయి.
  5. కొన్ని రకాల మిశ్రమ పంటలు కీటకాలను, వ్యాధులను అదుపులో ఉంచుతాయి.
  6. అందువలన సహజ కీటక నాశన పద్దతులు జీవ వైవిధ్యానికి దోహదం చేస్తాయి. దీని ద్వారా కేవలం హానికరమైన కీటకాలు మాత్రమే చనిపోతాయి.

9th Class Biology 8th Lesson వ్యవసాయోత్పత్తుల పెంపుదల – మన ముందున్న సవాళ్లు Textbook InText Questions and Answers

9th Class Biology Textbook Page No. 115

ప్రశ్న 1.
బిందుసేద్యం వంటి నీటి సరఫరా పద్ధతి, పంటలకు, రైతులకు ఎలా ఉపయోగపడుతుందో ఆలోచించండి.
జవాబు:

  1. నీటి వృథాను అరికట్టడానికి బిందుసేద్యం (Drip Irrigation) అత్యంత ప్రయోజనకరమైన పద్ధతి.
  2. బిందుసేద్యం పద్ధతిలో నీరు చిన్న చిన్న గొట్టాల గుండా సరఫరా అవుతుంది.
  3. ఈ గొట్టాలకు అక్కడక్కడ సన్నటి రంధ్రాలుంటాయి.
  4. ఈ రంధ్రాల గుండా నీరు చుక్కలు చుక్కలుగా పడుతుంది.
  5. ఈ పద్ధతి ద్వారా ఎరువులను వృథా కాకుండా మొక్కలకు అందించవచ్చును.

9th Class Biology Textbook Page No. 115

ప్రశ్న 2.
వాటర్ షెడ్ పథకం భూగర్భజలాలను పెంచడానికి ఎంతగానో తోడ్పడుతుంది. దీనిని నీవు ఎట్లా సమర్థిస్తావు?
జవాబు:

  1. వాటర్ షెడ్ తో పంటలకి కావల్సిన నీళ్ళు ఇవ్వడమే కాకుండా చుట్టూ ఉన్న జంతువులకి, పశువులకి, పక్షులకి నీళ్ళందించవచ్చు.
  2. నేలలో తేమ శాతాన్ని పెంచవచ్చు.
  3. నేలపై మట్టి కొట్టుకుపోకుండా ఆపడానికి కూడా పాటర్ షెడ్ ఉపయోగపడుతుంది.
  4. కొండవాలు ప్రాంతాల్లో, ఎత్తైన గుట్టల్లో పడ్డ వాన నీళ్ళని సద్వినియోగం చేసుకొని, చుట్టూ ఉన్న ఆవాసంలో అన్ని అవసరాలకి నీళ్ళని అందించే ఏకైక మార్గం వాటర్‌షెడ్.

AP Board 9th Class Biology Solutions 8th Lesson వ్యవసాయోత్పత్తుల పెంపుదల – మన ముందున్న సవాళ్లు

9th Class Biology Textbook Page No. 121

ప్రశ్న 3.
వర్మీ కంపోస్టు ఎరువు రసాయనిక ఎరువుల కంటే ఎలా మేలైనది?
జవాబు:

  1. రసాయనిక ఎరువుల వలన నేలకలుషితం, వాతావరణ కలుషితం జరుగుతుంది.
  2. రసాయనిక ఎరువులు వాడిన ఆహార పదార్థాలు తినడం వలన మానవుల ఆరోగ్యం పాడవుతుంది.
  3. కాని వర్మీ కంపోస్టు వాడడం వలన ఎలాంటి కాలుష్య లేదా ఆరోగ్య సమస్యలు ఏర్పడవు. అందువలన వర్మీ కంపోస్టు ఎరువు రసాయనిక ఎరువులకంటే చాలా మేలైనది.

9th Class Biology Textbook Page No. 109

ప్రశ్న 4.
a) నెలకు ఎంత ధాన్యం మీ ఇంట్లో అవసరం అవుతుందో అంచనా వేయటానికి ప్రయత్నించండి.
జవాబు:
నెలకు మా ఇంట్లో సుమారుగా 50 కి.గ్రా. ధాన్యం ఖర్చు అవుతుంది. సంవత్సరానికి 600 కి.గ్రా. ధాన్యం అవసరమవుతుంది.

b) ఆ ధాన్యం పండటానికి ఎంత నేల అవసరమో ఊహించంది.
జవాబు:
600 కి.గ్రా. ధాన్యం పండటానికి సుమారు 1.4 చ.కి.మీ. నేల అవసరమవుతుంది.

9th Class Biology Textbook Page No. 109

ప్రశ్న 5.
ఈ క్రింది పట్టికను పరిశీలించి ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
AP Board 9th Class Biology Solutions 8th Lesson వ్యవసాయోత్పత్తుల పెంపుదల – మన ముందున్న సవాళ్లు 2
a) ఏ దశాబ్దంలో జనాభా పెరుగుదల అధికంగా ఉంది?
జవాబు:
1961-1971 దశాబ్దంలో జనాభా పెరుగుదల అధికంగా ఉంది.

b) ఏ దశాబ్దంలో ఆహారధాన్యాల ఉత్పత్తి అధికంగా ఉంది?
జవాబు:
1981-1991 దశాబ్దంలో ఆహారధాన్యాల ఉత్పత్తి అధికంగా ఉంది.

c) పై పట్టికలో ఏయే తేడాలు మీరు గమనించారు?
జవాబు:
జనాభా పెరుగుదలతో సమానంగా ఆహారధాన్యాల ఉత్పత్తి పెరగటం లేదు.

d) పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆహారధాన్యాల ఉత్పత్తి జరుగుతున్నదా?
జవాబు:
లేదు, జనాభా పెరుగుదలకు అనుగుణంగా ఆహారధాన్యాల ఉత్పత్తి జరగటం లేదు.

e) ఏ దశాబ్దంలో జనాభా పెరుగుదలకు అనుగుణంగా ఆహారధాన్యాల ఉత్పత్తి సంతృప్తికరంగా లేదు?
జవాబు:
1991-2001 దశాబ్దంలో జనాభా పెరుగుదలకు అనుగుణంగా ఆహారధాన్యాల ఉత్పత్తి జరగలేదు. పెరుగుదల రేటు కేవలం 0.56 మాత్రమే.

f) తగినంత ఆహారధాన్యాల ఉత్పత్తి జరగకపోతే ఏమి జరుగుతుంది?
జవాబు:
తగినంత ఆహారధాన్యాల ఉత్పత్తి జరగకపోతే, దేశంలో తీవ్ర ఆహార కొరత ఏర్పడుతుంది.

g) 1991-2001 దశాబ్దంలో జనాభాని పోల్చితే సగమే ఆహారధాన్యాల, ఉత్పత్తి జరిగింది. ఫలితంగా ఆ దశాబ్దంలో ఏం జరిగి ఉంటుందని నీవు భావిస్తున్నావు?
జవాబు:
1991-2001 దశాబ్దంలో జనాభా పెరుగుదలకు సమానంగా ఆహారధాన్యాల ఉత్పత్తి జరుగలేదు. దానివలన దేశంలో తీవ్ర కరువు పరిస్థితి నెలకొని ఉండి ఉంటుంది. ప్రజలు ఆహార కొరతను ఎదుర్కొని ఉంటారు.

9th Class Biology Textbook Page No. 110

ప్రశ్న 6.
ఆహారధాన్యాల ఉత్పత్తిలో పెంపుదలకు మీరిచ్చే సూచనలు రాయండి.
జవాబు:

  1. మంచి నాణ్యమైన వ్యాధి నిరోధకత కలిగిన వంగడాలు పంటకు ఎన్నుకోవాలి.
  2. నీటి వనరుల ఆధారంగా నేల స్వభావం పరిశీలించి సరైన పంటను ఎన్నుకోవాలి.
  3. సహజ ఎరువులకు ప్రాధాన్యమివ్వాలి.
  4. వ్యాధుల నివారణకు సహజ నియంత్రణ పద్ధతులు పాటించాలి.
  5. పంట మార్పిడి, అంతర పంటలకు ప్రాధాన్యమివ్వాలి.
  6. యంత్రాలు, ఆధునిక సాంకేతికతను వాడటం వలన అధిక దిగుబడి సాధించవచ్చు.

9th Class Biology Textbook Page No. 111

ప్రశ్న 7.
అధిక ఆహార ఉత్పత్తి సాధించటానికి కొన్ని పరిష్కార మార్గాలు చూపండి.
జవాబు:

  1. సాగునేల విస్తీర్ణాన్ని పెంచడం.
  2. ప్రస్తుతం సాగులో ఉన్న నేలలోనే అధిక దిగుబడి సాథించడం.
  3. అధిక దిగుబడిని ఇచ్చే వంగడాలను అభివృద్ధి చేయడం.
  4. పంట మార్పిడి చేయడం.
  5. మిశ్రమ పంటలు పండించడం.
  6. స్వల్పకాలిక పంటలు పండించడం.

ఎ) పై వాటిలో ఏది ప్రయోజనకరమో చర్చించండి.
జవాబు:

  1. సాగునేల విస్తీర్ణాన్ని పెంచటం వలన అడవులను నరికివేయాల్సి వస్తుంది. కావున సరైన చర్యకాదు.
  2. ప్రస్తుతం సాగులో ఉన్న నేలలోనే అధిక దిగుబడి సాధించటం ప్రయోజనకర పద్దతి..
  3. ఈ పద్ధతిలోది, వంగడాల అభివృద్ధి, పంటమార్పిడి, మిశ్రమ పంటలు వంటి అన్ని పద్ధతులూ ఇమిడి ఉంటాయి.

9th Class Biology Textbook Page No. 112

ప్రశ్న 8.
ఈ క్రింది గ్రాఫ్ ను పరిశీలించి ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
AP Board 9th Class Biology Solutions 8th Lesson వ్యవసాయోత్పత్తుల పెంపుదల – మన ముందున్న సవాళ్లు 3
a) పై గ్రాఫ్ ఆధారంగా పంట దిగుబడిలో నీటిపారుదల ప్రాముఖ్యతను వివరించండి.
జవాబు:

  1. నీటిపారుదల పంటకు అత్యంత అవసరము.
  2. నీటిపారుదల సక్రమంగా ఉన్నప్పుడు పంట దిగుబడి బాగా ఉంది.
  3. సరిపడినంత ఎరువులు అందించినప్పటికి, నీటిపారుదల సక్రమంగా లేకుంటే మంచి దిగుబడి పొందలేము.

b) ఒకే పరిమాణంలో నత్రజని అందించినప్పటికీ నీటిపారుదల కల్పించిన పొలంలో, నీటిపారుదల కల్పించని పొలంలో పంట దిగుబడిలో తేడాలున్నాయా? ఉంటే అవి ఏమిటి?
జవాబు:

  1. తేడాలు ఉన్నాయి. ఒకే పరిమాణంలో నత్రజని అందించినప్పటికీ సరైన నీటిపారుదల ఉన్న పంటలు అధిక దిగుబడిని ఇచ్చాయి.
  2. నీటిపారుదల సక్రమంగా లేని పంటలు, ఎరువులు అందించినప్పటికీ సరైన దిగుబడిని ఇవ్వలేదు.

9th Class Biology Textbook Page No. 113

ప్రశ్న 9.
ఈ క్రింది గ్రాఫ్ ను పరిశీలించి ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
AP Board 9th Class Biology Solutions 8th Lesson వ్యవసాయోత్పత్తుల పెంపుదల – మన ముందున్న సవాళ్లు 4
a) పై గ్రాఫ్ లో ఏ నెలల్లో మొక్కలు అధిక నీటిని ఆవిరి రూపంలో విడుదల చేస్తున్నాయో గుర్తించండి.
జవాబు:
మే మరియు జూన్ నెలల్లో మొక్కల నుండి నీరు ఆవిరి రూపంలో అధికంగా కోల్పోతున్నాయి.

b) కొన్ని నెలలలో వర్షాలు అధికంగా ఉన్నప్పటికీ మొక్కలు విడుదలచేసే నీటి ఆవిరి పరిమాణం ఒకే విధంగా ఉంటుందా?
జవాబు:
వర్షాలు ఉన్నప్పుడు పగటి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి. అందువలన మొక్కలు విడుదల చేసే నీటి ఆవిరి పరిమాణం తక్కువగా ఉంటుంది.

c) నీరు అధికంగా లభిస్తే మొక్కలపై నీటి ప్రభావం ఏవిధంగా ఉంటుంది?
జవాబు:

  1. నీరు అధికంగా లభించినపుడు మొక్కలు వేగంగా పెరుగుతాయి.
  2. భూమి నుండి పోషకాలను బాగా గ్రహించగలుగుతాయి.

AP Board 9th Class Biology Solutions 8th Lesson వ్యవసాయోత్పత్తుల పెంపుదల – మన ముందున్న సవాళ్లు

9th Class Biology Textbook Page No. 114

ప్రశ్న 10.
a) వాతావరణం వేడిగా ఉన్నప్పుడు పత్ర రంధ్రాలు మూసుకొని పోతాయనుకున్నాం కదా ! మరి ఇది కార్బన్ డై ఆక్సైడ్ శోషణపై ఏ ప్రభావాన్ని చూపుతుంది?
జవాబు:

  1. వాతావరణం వేడిగా ఉన్నప్పుడు పత్ర రంధ్రాలు మూసుకొనిపోతాయి.
  2. అందువలన CO2 శోషణ మొక్కలలో తగ్గుతుంది.

b) కార్బన్ డై ఆక్సైడ్ శోషణ రేటులో మార్పు మొక్కలపై ఏ విధమైన ప్రభావం చూపుతుంది?
జవాబు:
కార్బన్ డై ఆక్సైడ్ శోషణ రేటు తగ్గటం వలన మొక్కలలో ఆహారోత్పత్తి తగ్గుతుంది. దీనివలన మొక్కల పెరుగుదల తగ్గుతుంది. కొత్త కొమ్మలు, ఆకులు ఏర్పడవు.

c) ఇలాంటి సమయంలో మొక్కలకు నీళ్ళు లేకపోతే ఏమౌతుంది?
జవాబు:
ఇలాంటి సమయంలో మొక్కలకు నీళ్ళు లేకపోతే మొక్కల ఆరోగ్యం పాడైపోతుంది. పంట దిగుబడి తీవ్రంగా తగ్గుతుంది.

9th Class Biology Textbook Page No. 114

ప్రశ్న 11.
వ్యవసాయానికి నీరు ప్రధాన అవసరం. మీ గ్రామంలో వ్యవసాయం కోసం ఉన్న ముఖ్యమైన నీటి వనరులు ఏమున్నాయి? రైతులు వాటిని ఎలా ఉపయోగించుకుంటున్నారు?
జవాబు:

  1. మా గ్రామంలో వ్యవసాయం కొరకు కాలువలు, చెరువులు ఉన్నాయి.
  2. వర్షపునీరు చెరువును చేరి నిల్వ చేయబడుతుంది.
  3. ఈ నీటిని పంటకాలువల ద్వారా పంట పొలాలకు మళ్ళించి వ్యవసాయం చేస్తారు.
  4. మా గ్రామంలో కొంత ప్రాంతం సాగర్ కాలువ కింద సాగుబడిలో ఉంది.

9th Class Biology Textbook Page No. 114

ప్రశ్న 12.
వరి పండించటానికి అధిక పరిమాణంలో నీరు అవసరం. ఇలా నీరు ఎక్కువగా అవసరమయ్యే పంటల పేర్లు చెప్పగలరా?
జవాబు:
వరితోపాటుగా గోధుమ, చెరకు వంటి పంటలకు అధిక నీరు అవసరమౌతుంది.

9th Class Biology Textbook Page No. 115

ప్రశ్న 13.
తక్కువ నీరు కావలసిన పంటల పేర్ల జాబితా రాయండి.
జవాబు:
ప్రత్తి, జనపనార, సజ్జలు, మొక్కజొన్న, కొబ్బరి, మినుములు, పెసలు, వేరుశనగలకు తక్కువ నీరు అవసరం.

9th Class Biology Textbook Page No. 116

ప్రశ్న 14.
a) ఒక పొలంలో చాలా సంవత్సరాల పాటు ఒకే పంట సాగుచేస్తూ ఉంటే, నేలలోని పోషకాలు ఏమౌతాయి?
జవాబు:
ఒక పొలంలో చాలా సంవత్సరాల పాటు ఒకే పంట సాగుచేస్తే ఒకే విధమైన పోషకాలు శోషించబడి, నేలలో పోషకాల కొరత ఏర్పడుతుంది. అందువలన పంట దిగుబడి విపరీతంగా తగ్గుతుంది.

b) కోల్పోయిన పోషకపదార్థాలను నేల తిరిగి ఎలా పొందుతుంది?
జవాబు:
నేల కోల్పోయిన పోషకపదార్థాలను వృక్ష, జంతు వ్యర్థాలు కుళ్ళటం వలన హ్యూమస్ రూపంలో తిరిగి పొందుతుంది. కానీ ఇది చాలా నెమ్మదైన ప్రక్రియ. అందువలన రైతులు రసాయన ఎరువులు వాడుతున్నారు. ఇవి ఖర్చుతో కూడుకొని నేల ఆరోగ్యాన్ని పాడుచేస్తాయి.

9th Class Biology Textbook Page No. 116

ప్రశ్న 15.
ఒక రైతు తన పొలంలో గత 5 సంవత్సరాల నుండి చెరకు పంటను పండిస్తున్నాడు. మరో రైతు మొదటి సంవత్సరం చెరకు పంట, రెండవ సంవత్సరం సోయా చిక్కుళ్ళు, మూడవ సంవత్సరం తిరిగి చెరకు పంట పండించాడు. ఏ పొలంలో పోషకపదార్థాలు నశిస్తాయి? ఎందుకు?
జవాబు:
వరుసగా ఐదు సంవత్సరాలు చెరకు పండించిన రైతు పొలంలో పోషకాలు లోపిస్తాయి. చెరకు ఒకే విధమైన పోషకాలను ప్రతి సంవత్సరం నేల నుండి గ్రహిస్తుంది. కావున నేలలో ఆ పోషకాలు తగ్గిపోయి, పోషకాల కొరత ఏర్పడుతుంది.

పంట మార్పిడి పాటించటం వలన నేలలోని పోషకాల వినియోగం మారి, పోషకాలు పునరుద్ధరింపబడతాయి. పంట మార్పిడి విధానంలో లెగ్యూమినేసి పంటలు మంచి ఫలితాలను ఇస్తాయి.

AP Board 9th Class Biology Solutions 8th Lesson వ్యవసాయోత్పత్తుల పెంపుదల – మన ముందున్న సవాళ్లు

9th Class Biology Textbook Page No. 118

ప్రశ్న 16.
తమలపాకులను మిశ్రమపంటలుగా మాత్రమే పండిస్తారు. ఎందుకు?
జవాబు:

  1. తమలపాకు మొక్క తీగవలె ఉండి ఎత్తు మొక్కలకు అల్లుకొంటుంది.
  2. నేల అంతా ఖాళీగా ఉండుట వలన అంతర పంటకు అనుకూలంగా ఉంటుంది.
  3. అందువలన తమలపాకుతో పాటు పెసర, మినుము వంటి మిశ్రమపంటలు పండిస్తారు.
  4. దీనివలన రైతుకు రెండు పంటలు పండి ఆర్థికలాభం చేకూరుతుంది.
  5. నేలలో పోషకాలు పునరుద్ధరింపబడతాయి.

9th Class Biology Textbook Page No. 118

ప్రశ్న 17.
లెగ్యూమినేసి జాతికి చెందిన పంటల పేర్లు కొన్నింటిని చెప్పండి.
జవాబు:
చిక్కుడు, మినుము, పెసర, వేరుశనగ, పిల్లి పెసర వంటి పంటలు లెగ్యూమినేసి జాతికి చెందుతాయి. ఇవి నేలలో నత్రజనిని స్థాపించి పోషక విలువలను పెంచుతాయి.

9th Class Biology Textbook Page No. 118

ప్రశ్న 18.
నత్రజని స్థాపన చేసే బాక్టీరియాల పేర్లను తెలుసుకోండి.
జవాబు:
రైజోబియం, అజటో బాక్టర్, నైట్రోమోనాస్, సూడోమోనాస్ వంటి బాక్టీరియాలు నత్రజని స్థాపనకు తోడ్పడుతాయి. ఇవి వాతావరణంలోని నత్రజనిని నైట్రేట్లుగా మార్చి మొక్కలకు అందిస్తాయి.

9th Class Biology Textbook Page No. 122

ప్రశ్న 19.
ఈ క్రింది పట్టిక పరిశీలించి, ప్రశ్నలకు సమాధానాలు రాయంది.
జవాబు:
AP Board 9th Class Biology Solutions 8th Lesson వ్యవసాయోత్పత్తుల పెంపుదల – మన ముందున్న సవాళ్లు 5

a) పై పట్టిక నుండి మీరు ఏం గ్రహించారు?
జవాబు:
నత్రజని స్థాపనలో బాక్టీరియాతో పాటు, శైవలాలు కూడా పాల్గొంటున్నాయి. మరికొన్ని బాక్టీరియాలు, శైవలాలు, శిలీంధ్రాలు, ఫాస్పరస్ ను మొక్కలకు అందిస్తున్నాయి.

b) ఏ మూలకాలు అధికంగా సంశ్లేషణ చేయబడతాయి?
జవాబు:
నత్రజని నేలలో అధికంగా సంశ్లేషణ చేయబడుతుంది.

9th Class Biology Textbook Page No. 123

ప్రశ్న 20.
ఈ క్రింది పట్టికను పరిశీలించి, ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
AP Board 9th Class Biology Solutions 8th Lesson వ్యవసాయోత్పత్తుల పెంపుదల – మన ముందున్న సవాళ్లు 6
a) పై పట్టిక ఆధారంగా చూస్తే మనం 50 కి.గ్రా.ల యూరియాను నేలకు అందిస్తే 23 కి.గ్రా. నత్రజని (466) నేలలోకి పునరుద్ధరింపబడుతుంది. అంతే పరిమాణంలో నత్రజని పొందాలంటే ఎంత అమ్మోనియం సల్ఫేట్ నేలలో కలపాలి?
జవాబు:
అంతే పరిమాణంలో (23 కి.గ్రా. ) నత్రజని పొందాలంటే సుమారు 100 కి.గ్రా. అమ్మోనియం సల్ఫేట్ (యూరియా)ను నేలలో కలపాలి.

b) 50 కి.గ్రా.ల సూపర్ ఫాస్ఫేట్ నేలలో కలిపితే ఎంత ఫాస్పేట్ నేలలోకి చేరుతుంది?
జవాబు:
50 కి.గ్రా. ల సూపర్ ఫాస్ఫేట్ నేలలో కలిపితే, 4 నుండి 4.5 కి.గ్రా. ఫాస్పేట్ నేలలోకి చేరుతుంది.

AP Board 9th Class Biology Solutions 8th Lesson వ్యవసాయోత్పత్తుల పెంపుదల – మన ముందున్న సవాళ్లు

9th Class Biology Textbook Page No. 123

ప్రశ్న 21.
స్థానిక వరి రకం (బంగారు తీగ) మరియు హైబ్రిడ్ వరి రకం (IR – 3) పై నత్రజని ఎరువులను చల్లడం వల్ల కలిగే ప్రభావాన్ని కింది స్లో చూడండి.
AP Board 9th Class Biology Solutions 8th Lesson వ్యవసాయోత్పత్తుల పెంపుదల – మన ముందున్న సవాళ్లు 7
a) నత్రజని ఎరువుల ప్రభావం బంగారు తీగ మరియు IR- 8 వరి రకాలపై చూపే ప్రభావంలో తేడా ఏమిటి?
జవాబు:

  1. నత్రజని ఎరువుల ప్రభావం, స్థానిక వరి రకం బంగారు తీగపై వ్యతిరేక ప్రభావం చూపింది.
  2. ఎరువు మోతాదు పెరిగేకొలది పంట దిగుబడి పూర్తిగా తగ్గిపోయింది.
  3. వరి రకం IR – 8 మీద నత్రజని ప్రభావం సానుకూలంగా ఉంది.
  4. నత్రజని ఎరువు మోతాదు పెరిగే కొలది హైబ్రిడ్ రకం IR-8 లో దిగుబడి కూడా పెరుగుతూ వచ్చింది.

9th Class Biology Textbook Page No. 125

ప్రశ్న 22.
మనుషుల ఆరోగ్యంపై క్రిమిసంహారులు, కలుపు నాశకాలు ఏ విధమైన ప్రభావాన్ని చూపుతాయి?
జవాబు:

  1. మనుషుల ఆరోగ్యంపై క్రిమిసంహారులు తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి.
  2. క్రిమిసంహారులను పిచికారి చేసే సమయంలో ఊపిరితిత్తులు తీవ్ర విష ప్రభావానికి లోనవుతాయి.
  3. వీటి వలన అనేక చర్మవ్యాధులు, ఊపిరితిత్తుల సమస్యలు ఏర్పడుతున్నాయి.
  4. కొన్ని హానికర రసాయనాలు నాడీవ్యవస్థను, రక్తప్రసరణ వ్యవస్థను దెబ్బతీస్తున్నాయి.

9th Class Biology Textbook Page No. 126

ప్రశ్న 23.
ఈ మధ్యకాలంలో పొద్దుతిరుగుడు పంటలో రైతులు చేతిగుడ్డతో పుష్పాలను అద్దుతూ పోతున్నారు. ఈ పరిస్థితి ఎందుకు ఏర్పడిందో చెప్పగలరా?
జవాబు:

  1. రైతులు విచక్షణారహితంగా కీటకనాశనులు వాడటం వలన ఉపయోగకర కీటకాలు కూడా మరణించాయి.
  2. అందువలన మొక్కలలో పరాగసంపర్కం జరుగక పంట దిగుబడి తగ్గిపోయింది.
  3. దీనిని అధిగమించటానికి రైతులు పొద్దుతిరుగుడు పంటలలో చేతిగుడ్డతో పుష్పాలను అద్ది కృత్రిమ పరాగసంపర్కం చేయాల్సి వచ్చింది.

9th Class Biology Textbook Page No. 126

ప్రశ్న 24.
పంట పొలంలో కీటక నిర్మూలన గురించి స్నేహితులతో చర్చించండి. ప్రత్యామ్నాయాలు సూచించండి.
జవాబు:

  1. కీటక నిర్మూలన కొరకు కీటక నాశకాలు వాడటం వలన అవి పంట ఉత్పత్తులు, పర్యావరణంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి.
  2. దీనిని అధిగమించటానికి రైతులు సహజ నియంత్రణ పద్ధతులు పాటించాలి.
  3. వెల్లుల్లి రసం, N.P.U ద్రావణం వంటి బయో పెస్టిసైడ్స్ వాడాలి.
  4. వ్యాధి క్రిములను తినే మిత్ర కీటకాలను ప్రోత్సహించాలి.
  5. పంట మార్పిడి విధానం, విత్తనశుద్ధి పద్ధతులలో వ్యాధులను ఎదుర్కొనవచ్చు.
  6. ఆకర్షక పంటలు వేసి కీటకాల తాకిడి తగ్గించవచ్చు.

AP Board 9th Class Biology Solutions 8th Lesson వ్యవసాయోత్పత్తుల పెంపుదల – మన ముందున్న సవాళ్లు

9th Class Biology Textbook Page No. 127

ప్రశ్న 25.
పత్తి పొలాలలో జనుము మరియు బంతిపూలను ఎందుకు పండిస్తారో మీరు చెప్పగలరా?
జవాబు:

  1. పత్తి పొలాలలో జనుమును మరియు బంతిపూలను ఆకర్షక పంటగా పండిస్తారు.
  2. ఇవి కీటకాలను సులభంగా ఆకర్షిస్తాయి.
  3. అందువలన ప్రధానపంటలు కీటకాల నుండి రక్షింపబడతాయి.
  4. కీటకాలను ఎదుర్కొనటానికి ఇదొక సహజ నియంత్రణ పద్ధతి.

9th Class Biology 8th Lesson వ్యవసాయోత్పత్తుల పెంపుదల – మన ముందున్న సవాళ్లు Textbook Activities (కృత్యములు)

కృత్యం – 1

1. బాష్పోత్సేకము
1) ఒక పాలిథిన్ సంచిని తీసుకోవాలి.
2) ఆరోగ్యంగా ఉన్న మొక్క ఆకులను సంచిలో కప్పి ఉంచి దారంతో కట్టాలి.
3) 4-5 గంటలపాటు దానిని పరిశీలిస్తూ ఉండాలి.
AP Board 9th Class Biology Solutions 8th Lesson వ్యవసాయోత్పత్తుల పెంపుదల – మన ముందున్న సవాళ్లు 8

పరిశీలనలు :

  1. ఆకులను పాలిథిన్ సంచితో కప్పి ఉంచినప్పుడు మొక్క ఎంత మొత్తంలో నీటిని నీటి ఆవిరి రూపంలో గాలిలోనికి విడుదల చేస్తుందో చూడవచ్చు.
  2. పిండి పదార్థాలను తయారుచేయడానికి మొక్క తాను పీల్చుకున్న నీటిలో 0.1 శాతం నీటిని మాత్రమే వినియోగించుకుంటుంది.
  3. బాష్పోత్సేకము రేటు రాత్రి కంటే పగలు ఎక్కువగా ఉంటుంది.

కృత్యం – 2

2. a) మీ గ్రామ చిత్రపటాన్ని గీసి, గ్రామంలోని ముఖ్యమైన నీటి వనరులను గుర్తించండి.
జవాబు:
AP Board 9th Class Biology Solutions 8th Lesson వ్యవసాయోత్పత్తుల పెంపుదల – మన ముందున్న సవాళ్లు 9

b) ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల పటంలో నాగార్జున సాగర్ కుడి, ఎడమ కాలువ మార్గాలను చూపండి. ఏ ఏ జిల్లాలకు నీటి వసతి లభిస్తుందో గుర్తించండి.
జవాబు:
AP Board 9th Class Biology Solutions 8th Lesson వ్యవసాయోత్పత్తుల పెంపుదల – మన ముందున్న సవాళ్లు 10

కృత్యం – 3

3. మీ ప్రాంతంలో పంట పొలాల్లో కల్పించే ప్రముఖమైన కలుపు మొక్కల జాబితా తయారుచేయండి. అవి ఏ పంటతో పాటు పెరుగుతాయో రాయండి.
జవాబు:
కలుపు మొక్కల జాబితా :
సైనోడాన్ డాక్టలాన్, సైపరస్ రొటండస్ (తుంగ), డిజిటారియా లాంగిఫోలిమా, డాక్టలోనియమ్ కలోనమ్, సెటేరియా గ్లూకా, సైపరస్ డిఫార్మిస్, ఐకోర్నియా క్రాసిప్స్ (బుడగతమ్మ), సాల్వీనియా మొలస్టా, ఆల్టర్ నాంతిర సెసైలిస్ (పొన్నగంటి), సెలోషియా అర్జెన్షియా (గురంగుర), లూకాస్ ఏస్పిరా (తుమ్మి), పోర్చులేక ఒలరేషియా (పావలికూర), క్లియోమి విస్కోసా (కుక్కవామింటా), సొలానమ్ నైగ్రమ్ (బ్లాక్ నైట్ షేడ్), అర్జిమోన్ మెక్సికానా (బాలరక్కొస) ఎబుటిలాన్ ఇండికమ్ (తుత్తురి బెండ), యూఫోర్బియా హిరా (పచ్చబొట్లు), వెర్నోనియా సిన్నోరా, ఇఖనోక్లోవ కొలానమ్ (ఉడలు), కొమ్మలైనా బెంగా లెన్సిస్ (వెన్నవెదురు), అవినా ఫాట్యువ (అడవియవలు), ఇఖనోక్లోవ క్రస్ గల్లి (నీటి గడ్డి), ఎల్యుసైన్ ఇండికా (గూ గ్రాస్), ఎకిరాంథిస్ ఏస్పిరా (ఉత్తరేణి), ఇక్లిష్టా ప్రోస్టేట (గుంటకలగర లేదా బృంగరాజ) మొదలగునవి.

పంట రకం పంటపై పెరిగే కలుపు మొక్కలు
వరి గరిక, తుంగ, బుడగ తమ్మ, పొన్నగంటి
వేరుశనగ గురంగుర, గరిక, తుంగ, తుత్తురి బెండ, వెన్న వెదురు, కుక్కవామింట, తుమ్మి, పావలికూర, బాలరక్కిస.
మినుములు గరిక, తుంగ, తుత్తురి బెండ, వెన్న వెదురు, సాల్వీనియా మొలస్టా, పచ్చబొట్లు, బంగారు తీగ.
మొక్కజొన్న పచ్చబొట్లు, సొలానమ్ నైగ్రమ్, గరిక, తుంగ
పెసలు ఉడలు, గరిక, తుంగ, బాలరక్కొస, పావలికూర

ప్రయోగ కృత్యములు.

ప్రయోగశాల కృత్యము – 1

1. 1) తృణధాన్యాలు, పప్పు ధాన్యాలు, కూరగాయలు పండ్లలో ప్రతిదానికి ఉదాహరణ తీసుకోండి.
2) ముందుగా వాటిలో ఉన్న లక్షణాలను రాయండి.
3) ఆ పంటలలో ఏ మార్పులు మీరు కోరుకుంటున్నారో రాయండి. మీరు కోరుకుంటున్న మార్పులకు తగిన కారణాలు రాయండి.
AP Board 9th Class Biology Solutions 8th Lesson వ్యవసాయోత్పత్తుల పెంపుదల – మన ముందున్న సవాళ్లు 11

2. సొంత హైబ్రిడ్ పుష్పాలను ఉత్పత్తి చేయటం:
జవాబు:

  1. 5 లేక 6 ఎరుపు రంగు పుష్పాల (చంద్రకాంత) మొక్కలను ఎంపిక చేసుకోవాలి.
  2. మిగిలిన పుష్పాలన్నింటిని తెంచివేయాలి.
  3. ప్రతి పుష్పానికి ఉండే కేసరావళిని తొలగించాలి.
  4. పసుపు రంగు పుష్పాన్ని తీసుకొని, ఎరుపురంగు పుష్పంలో ఉండే కీలాగ్రంపై రుద్ది పరాగ సంపర్కం జరపాలి. (సాయంత్రం వేళల్లో చేయాలి)
  5. సంకరణం చేసిన మొక్కలను గుర్తించడానికి ఆ పుష్పాలుండే కాండాలకు తాడు కాని, దారం కాని గుర్తుగా కట్టాలి. ఎందుకంటే కొద్ది రోజుల్లో ఆ పుష్పాల నుండి ఏర్పడే గింజలను సేకరించాల్సి ఉంటుంది.
  6. ఒక వారం రోజుల్లో నల్లని విత్తనాలు ఏర్పడతాయి.
  7. విత్తనాలను రెండు వారాలపాటు ఎండనిచ్చి వేరొక కుండలో నింపాలి.
  8. కొత్త మొక్క పెరిగి పుష్పించే వరకు జాగ్రత్తగా సంరక్షించాలి.
  9. ఆ మొక్క నుండి ఏర్పడే పుష్పాలను పరిశీలించాలి.

పరిశీలనలు :
మొక్క నుండి ఏర్పడే పుష్పాలు నారింజ రంగులో ఉంటాయి. ఎరుపు మరియు పసుపు రంగు పుష్పాల కలయికతో నారింజ రంగు పుష్పాలు ఏర్పడతాయి.