AP Board 7th Class Social Solutions Chapter 1 విశ్వం మరియు భూమి

SCERT AP 7th Class Social Study Material Pdf 1st Lesson విశ్వం మరియు భూమి Textbook Questions and Answers.

AP State Syllabus 7th Class Social Solutions 1st Lesson విశ్వం మరియు భూమి

7th Class Social 1st Lesson విశ్వం మరియు భూమి Textbook Questions and Answers

కింది తరగతులలోని విషయ పునశ్చరణ

పటాన్ని పరిశీలించి ఇవ్వబడిన ప్రశ్నలకు జవాబులు రాయండి.
AP Board 7th Class Social Solutions Chapter 1 విశ్వం మరియు భూమి 1

ప్రశ్న 1.
చిత్రంలో మీరు ఏమి గమనించారు?
జవాబు:
సూర్యుడు, నక్షత్రాలు, తోకచుక్కలు, పాలపుంత, సౌర కుటుంబాలు, గ్రహాలు.

ప్రశ్న 2.
వీటిలో పగటిపూట కనిపించేవి మరియు రాత్రి సమయంలో కనిపించేవి ఏవి?
జవాబు:
పగటిపూట కనిపించేవి – సూర్యుడు.
రాత్రిపూట కనిపించేవి – నక్షత్రాలు, చంద్రుడు, పాలపుంత, తోకచుక్కలు.

ప్రశ్న 3.
ఈ అంశాలన్నింటిని మనం సమష్టిగా ఏమని పిలుస్తాము?
జవాబు:
విశ్వం అని పిలుస్తాము.

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

I. క్రింది ప్రశ్నలకు జవాబులివ్వండి.

ప్రశ్న 1.
విశ్వం గురించి మీకు ఏమి తెలుసు?
జవాబు:

  1. ఊహించలేని అనేక అంశాలు కలిగి ఉన్న విస్తారమైన అంతరిక్షమును విశ్వం అంటారు.
  2. ఇందులో సూర్యుడు, గ్రహాలు, పాలపుంత అనే నక్షత్రవీధి మరియు ఇతర అన్ని నక్షత్ర వీధులు ఉన్నాయి.
  3. విశ్వం ఎంత పెద్దదో ఎవరికీ తెలియదు. విశ్వం వ్యాప్తి అనంతమైనది.
  4. విశ్వం అనే పదం లాటిన్ పదమైన “యూనివర్సమ్” నుండి ఉద్భవించింది. దీని అర్థం “మొత్తం పదార్థం” మరియు “మొత్తం అంతరిక్షం” అని.

ప్రశ్న 2.
సహజ పర్యావరణం అంటే ఏమిటి?
జవాబు:
సహజ వాతావరణంలో భూమి, నీరు, గాలి, మొక్కలు, జంతువుల వంటి జీవులు ఉంటాయి. ఈ సహజ పర్యావరణంలో శిలావరణము, జలావరణము, వాతావరణము మరియు జీవావరణము ఉంటాయి. పర్యావరణంలో ఇవి సహజ అంశాలు. వీటిని భూమి యొక్క సహజ ఆవరణములు అని కూడా అంటారు.

AP Board 7th Class Social Solutions Chapter 1 విశ్వం మరియు భూమి

ప్రశ్న 3.
“సహజ పర్యావరణం, మానవ నిర్మిత పర్యావరణానికి భిన్నంగా ఉంటుంది.” మీ సమాధానాన్ని సమర్ధించుకోండి.
జవాబు:
సహజ పర్యావరణం మానవ నిర్మిత పర్యావరణానికి భిన్నంగా ఉంటుంది.

  1. ఆదిమ మానవులు సహజ పరిసరాలతో మనుగడ సాగించటంలో తమను తాము అలవాటు చేసుకున్నారు. వారు సాధారణమైన జీవితాన్ని గడిపారు.
  2. వారి చుట్టూ ఉన్న ప్రకృతిని ఉపయోగించుకుని వారి అవసరాలను తీర్చుకున్నారు.
  3. స్థిర నివాసం మరియు. పారిశ్రామిక విప్లవం ఫలితంగా, మానవులు, సహజ వాతావరణాన్ని తమకు అనుకూలంగా ఎలా ఉపయోగించుకోవాలో మరియు ఎలా మార్చుకోవాలో నేర్చుకున్నారు.
  4. ఇది మానవ నిర్మిత పర్యావరణానికి సంబంధించిన అనేక అంశాలు ఏర్పడటానికి మరియు సహజ వాతావరణంలో మార్పులకు దారితీసింది.
  5. సహజ పర్యావరణం మానవ నిర్మిత పర్యావరణానికి భిన్నంగా ఉంటుంది.
  6. మానవులు తయారు చేసిన పరిసరాలను మానవ నిర్మిత పర్యావరణం అంటారు.
  7. సహజంగా ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన పరిసరాలను సహజ పర్యావరణం అనవచ్చు.
  8. మానవులు సహజ వాతావరణాన్ని తమకు అనుకూలంగా మార్చుకుని ఏర్పరచుకున్నదే మానవ నిర్మిత పర్యావరణం.
  9. సహజ పర్యావరణం భూమి మీద జీవుల మనుగడకు ఆధారం.
  10. మానవ నిర్మిత పర్యావరణం లేకపోయినా జీవనం సాగించవచ్చు కానీ, సహజ పర్యావరణం లేకపోతే జీవం లేదు, ఉండదు.

ప్రశ్న 4.
పర్యావరణ పరిరక్షణపై ఏవైనా రెండు నినాదాలు తయారు చేయండి.
జవాబు:

  1. పర్యావరణం పరిరక్షణ – సర్వజన సంరక్షణ.
  2. పర్యావరణాన్ని రక్షించండి – అది మిమ్మల్ని రక్షిస్తుంది.
  3. పచ్చని చెట్లు – ప్రగతికి మెట్లు.
  4. పర్యావరణ పరిరక్షణ – మన అందరి సంరక్షణ.
  5. మొక్క లేనిదే మెతుకే లేదు – మానవ జాతికి బ్రతుకే లేదు.

ప్రశ్న 5.
ఒకదానిపై ఒకటి ఆధారపడిన వివిధ మొక్కలు మరియు జంతువుల జాబితాను రాయండి.
జవాబు:

  1. జంతువులు మొక్కలపై ప్రాణవాయువు ఆక్సిజన్ (O2) మరియు ఇతర ఆహార పదార్థాల కోసం ఆధారపడతాయి. అలాగే చెట్లు ఆవాసాలుగా (షెల్టర్) ఉపయోగపడతాయి.
  2. మొక్కలు నేలలోని పోషకాల తయారీకి (హ్యూమస్), జంతువుల యొక్క విసర్జకాలపై, క్రుళ్ళిన జంతు కళేబరాలు మట్టిలో కలిసిపోయి అవి మొక్కలకు పోషకాలుగా ఉపయోగపడతాయి. జంతువులు వదిలిన కార్బన్ డయాక్సైడ్ ను మొక్కలు పీల్చుకుంటాయి.
  3. మేకలు, గొర్రెలు, గేదెలు, ఆవులు (పశువులన్నీ) – ‘గడ్డి’ని ఆహారంగా తీసుకుంటాయి.
  4. మానవుడు తన ఆహారం కోసం, ప్రాణవాయువు కోసం మొక్కలపై ఆధారపడతాడు.
  5. కోతులు, కుందేళ్ళు, చింపాంజీలు, కొండ ముచ్చులు మొ||నవి కాయలు, పండ్ల కోసం మొక్కలపై ఆధారపడతాయి.
  6. అలాగే మొక్కలు, జంతువులు వదలిన కార్బన్‌డయాక్సైడ్ (CO2)పై మరియు నేలలోని (జంతు విసర్జకాలతో ఏర్పడిన) పోషకాలపై ఆధారపడతాయి.

ప్రశ్న 6.
వాతావరణంలో మిళితమైన అంశాలలో ఇప్పుడు మార్పులు వస్తున్నాయి. కారణాలు చెప్పండి.
జవాబు:
వాతావరణం ఆక్సిజన్, నైట్రోజన్, కార్బన్ డై ఆక్సైడ్, ఆర్గాన్ మొ||న వాయువుల మిశ్రమం. భూమి ఏర్పడినప్పుడు ఇవి వాతావరణంలో ఉన్నాయి. వాతావరణంలో మిళితమైన అంశాలలో మార్పునకు కారణాలు :

  1. వాతావరణంలో క్రమక్రమంగా ఉష్ణోగ్రతలు పెరగటం వలన
  2. అగ్ని పర్వత ఉద్బోధన ప్రక్రియ కారణంగా, వెలువడిన వాయువుల కారణంగా
  3. కిరణజన్యసంయోగక్రియల కారణంగా, వ్యవసాయం చేయటం వలన
  4. మానవుల యొక్క కార్యకలాపాలైన శిలాజ ఇంధనాల వాడకం, పరిశ్రమల స్థాపన, అడవుల నిర్మూలనం గనుల త్రవ్వకం మొదలైన వాటి వలన
  5. రసాయన ఎరువుల వాడకం, పురుగు మందుల వాడకం వలన
  6. అణు విద్యుత్, థర్మల్ విద్యుత్ కర్మాగారాల స్థాపన వలన
  7. ముడి చమురు, సహజ వాయువు డ్రిల్లింగ్ వలన, వాడకం వలన
  8. ప్లాస్టిక్ మరియు ఇతర చెత్త, వ్యర్థ పదార్థాల వలన వాతావరణంలోని అంశాలలో మార్పులు వస్తున్నాయి.

ప్రశ్న 7.
శిలావరణంలో లభించే ఖనిజాల పరిరక్షణకై ఏవైనా రెండు నినాదాలు తయారు చేయండి.
జవాబు:

  1. మనవే కాదు సహజ వనరులు – ఉపయోగించుకోవాలి భావితరాలు
  2. ఖనిజాలు జాతికి నిధులు – సంరక్షించాలి సైనికులై ప్రజలు
  3. ఖనిజ సంపద దేశ సంపద – వాడాలి పొదుపుగా
  4. ఖనిజమే దేశానికి బలం – నడిపిస్తుంది దేశాన్ని అభివృద్ధి పథంలో

AP Board 7th Class Social Solutions Chapter 1 విశ్వం మరియు భూమి

II. సరియైన సమాధానాలను ఎంచుకోండి.

1. క్రింది వాటిలో మానవ పర్యావరణంలో భాగం కానిది ఏది?
ఎ) కర్మాగారం
బి) మతం
సి) సమాజం
డి) వీటిలో ఏదీ కాదు
జవాబు:
ఎ) కర్మాగారం

2. భిన్నమైన దానిని కనుగొనండి.
ఎ) మైదానాలు
బి) రహదారి
సి) లోయ
డి) నది
జవాబు:
బి) రహదారి

3. పర్యావరణానికి ముప్పు ఏది?
ఎ) చెట్ల పెంపకం
బి) పంటలు పండించడం
సి) వాహనాల వినియోగం
డి) అన్నీ
జవాబు:
సి) వాహనాల వినియోగం

4. ఇది భూమి లోపలి రెండవ పొర.
ఎ) భూ ప్రావారం
బి) భూ అంతర కేంద్రం
సి) భూ బాహ్య కేంద్రం
డి) భూ పటలం
జవాబు:
ఎ) భూ ప్రావారం

5. ఏ సిద్ధాంతం విశ్వం ఆవిర్భావానికి సంబంధించినది?
ఎ) భూ కేంద్రక సిద్ధాంతం
బి) సూర్య కేంద్రక సిద్ధాంతం
సి) మహా విస్ఫోటన సిద్ధాంతం
డి) పైవన్నీ
జవాబు:
సి) మహా విస్ఫోటన సిద్ధాంతం

II. జతపరుచుము.

గ్రూపు-ఎగ్రూపు-బి
1. శిలావరణంఅ) నీటితో కూడిన సహజమైన ఆవరణం
2. జీవావరణంఆ) భూమి చుట్టూ ఉన్న గాలి పొర
3. భూకేంద్రంఇ) భూమి, నీరు మరియు గాలి సంఘర్షణ చెందే ఇరుకైన ప్రాంతం
4. జలావరణంఈ) భూమి యొక్క రాతి పొర
5. వాతావరణంఉ) భూమి యొక్క లోతైన అంతర భాగం

జవాబు:

గ్రూపు-ఎగ్రూపు-బి
1. శిలావరణంఈ) భూమి యొక్క రాతి పొర
2. జీవావరణంఇ) భూమి, నీరు మరియు గాలి సంఘర్షణ చెందే ఇరుకైన ప్రాంతం
3. భూకేంద్రంఉ) భూమి యొక్క లోతైన అంతర భాగం
4. జలావరణంఅ) నీటితో కూడిన సహజమైన ఆవరణం
5. వాతావరణంఆ) భూమి చుట్టూ ఉన్న గాలి పొర

IV. కింది పట్టిక నింపండి.

పదంమాతృక (పదాలు) మరియు అర్థంగ్రహించబడిన భాష
జీవావరణంబయోస్ మరియు స్పెరా – జీవం & గోళం లేదా బంతిగ్రీకు
శిలావరణంలిథో మరియు స్పెరా – రాయి & గోళం లేదా బంతిగ్రీకు
జలావరణంహైదర్ మరియు స్పైరా – నీరు & గోళం లేదా బంతిగ్రీకు
వాతావరణంఅట్మోస్ మరియు స్పెరా – ఆవిరి & గోళం లేదా బంతిగ్రీకు
పర్యావరణంఎన్విరోనర్ మరియు స్పెరా – పొరుగు & గోళం లేదా బంతిఫ్రెంచి

పదబంధము

ఇచ్చిన సూచనలకు సంబంధించిన పదాలతో పజిల్ పరిష్కరించండి.
AP Board 7th Class Social Solutions Chapter 1 విశ్వం మరియు భూమి 2

నిలువు :
1. అన్ని జీవుల పరస్పర చర్య ద్వారా ఏర్పడిన వ్యవస్థ (6)
3. గాలి దుప్పటి (6)
5. మన పరిసరాలు (6)
6. ప్రాణ వాయువు (4)

అడ్డం :
2. భూమి యొక్క కఠినమైన ఉపరితల పొర (6)
4. జీవాన్ని కలిగి ఉన్న గ్రహం (2)
7. నీటి సహజ ఆవరణం (6)
8. మానవ నిర్మిత పర్యావరణం (3)
జవాబు:
AP Board 7th Class Social Solutions Chapter 1 విశ్వం మరియు భూమి 3

7th Class Social Studies 1st Lesson విశ్వం మరియు భూమి InText Questions and Answers

7th Class Social Textbook Page No.7

ప్రశ్న 1.
విశ్వం గురించి మరికొంత సమాచారం సేకరించండి.
జవాబు:

  1. భూమి, అంతరిక్షాన్ని కలిపి విశ్వం అంటారు. లేదా
  2. అనేక మిలియన్ల గెలాక్సీలు, నీహారికలు మరియు శూన్య ప్రదేశాల సముదాయాన్ని విశ్వం అని పిలుస్తారు.
  3. విశ్వం ఆవిర్భావం గురించి మొట్టమొదటగా జార్జిస్ లెమైటర్ అనే బెల్జియం దేశస్థుడు తన బిగ్ బ్యాంగ్ సిద్ధాంతంలో పేర్కొన్నారు.
  4. లక్షలు, కోట్ల సంఖ్యలో ఉండే నక్షత్రాల గుంపులను గెలాక్సీ అంటారు. అనేక కోట్ల గెలాక్సీలు మన విశ్వంలో ఉన్నాయి.

AP Board 7th Class Social Solutions Chapter 1 విశ్వం మరియు భూమి

ప్రశ్న 2.
అట్లాస్ మరియు ఇంటర్నెట్ ద్వారా విశ్వంలోని మరో రెండు గెలాక్సీల గురించి సమాచారాన్ని సేకరించండి.
జవాబు:

  1. మన దగ్గరలో ఉన్న లేదా సూర్యుడు భాగంగా ఉన్న గెలాక్సీని ‘పాలపుంత’ (Milkyway) లేదా ఆకాశ గంగ అంటారు.
  2. పాలపుంతకు దగ్గరలో ఉన్న గెలాక్సీ “ఆండ్రోమెడా”.
  3. ఆండ్రోమెడా’ గెలాక్సీని M31, NGC 224 అని అంటారు. ఇది సర్పిలాకారంలో ఉంటుంది.
  4. విశ్వంలో అతి పెద్ద గెలాక్సీ ‘హైడ్రా’, ఇందులో సుమారు 78 నక్షత్ర మండలాలు కలవు.
  5. విర్ల్ పూల్, పివీల్, సెంటరస్, లియో, ఉర్సామేజర్ మొ||న గెలాక్సీలు విశ్వంలో కలవు,

7th Class Social Textbook Page No.11

ప్రశ్న 3.
సమాచారాన్ని సేకరించి క్రింది పట్టికను పూరించండి.

గ్రహం పేరుసహజ ఉపగ్రహాల సంఖ్యగ్రహ లక్షణాలు

జవాబు:

గ్రహం పేరుసహజ ఉపగ్రహాల సంఖ్యగ్రహ లక్షణాలు
1. బుధుడు• సూర్యుడికి అతి దగ్గరగా గల గ్రహం
• అతిచిన్న గ్రహం, వేగంగా తిరిగే గ్రహం
• అత్యంత వేడి గల 2వ గ్రహం
2. శుక్రుడు• భూమికి అతి దగ్గరగా గల గ్రహం
• అత్యంత ప్రకాశవంతమైన గ్రహం
• భూమి కవల గ్రహం
3. భూమి1• జీవం కలిగిన ఏకైక గ్రహం
• జలయుత గ్రహం (Blue Planet)
• సూర్యుని నుండి 3వ గ్రహం
4. అంగారకుడు2• రెడ్ ప్లానెట్ అంటారు. (అరుణ గ్రహం)

• అంగారక గ్రహం పైకి MAM ప్రయోగం చేసింది భారత్.

5. బృహస్పతి79• అతిపెద్ద గ్రహం
• అత్యల్ప భ్రమణ కాలం గల గ్రహం
• నక్షత్ర గ్రహం అంటారు
6. శని82• అందమైన వలయాలు గల గ్రహం
• అత్యల్ప సాంద్రత గల గ్రహం
7. ఇంద్రుడు27• పరిమాణంలో 3వ పెద్ద గ్రహం
• శుక్రుడు లాగే తూర్పు నుండి పడమర వరకు తిరుగుతుంది.
• మీథేన్ ఎక్కువగా ఉంటుంది.
8. వరుణుడు (నెప్యూన్)14• అతిశీతల గ్రహం
• సూర్యుని నుండి దూరంగా గల గ్రహం
• పరిభ్రమణ కాలం అత్యధికం

ప్రశ్న 4.
పటం 1.6లోని విషయాలను గమనించి వాటిని దిగువ పట్టికలోని శీర్షికల కింద వర్గీకరించి రాయండి.

సహజ పర్యావరణంమానవ పర్యావరణంమానవ నిర్మిత పర్యావరణం

జవాబు:

సహజ పర్యావరణంమానవ పర్యావరణంమానవ నిర్మిత పర్యావరణం
నిర్జీవులు : నీరు (జలావరణం)వంతెనలు
భవనాలు
భూమి (శిలావరణం)ఉద్యానవనాలు
గాలి (వాతావరణం)వ్యక్తిగత కుటుంబంపరిశ్రమలు
సజీవులు : జంతువులుసమాజంస్మారక నిర్మాణాలు
మొక్కలుమతంరహదారులు మొ||నవి
కీటకాలువిద్య
పక్షులుఆర్థిక, రాజకీయ వ్యవస్థలు
మనుషులుమొ||నవి

7th Class Social Textbook Page No.15

ప్రశ్న 5.
చిత్రం 1.7 నుండి, సహజ పర్యావరణ అంశాలను గమనించి దిగువ పట్టికలో ఇచ్చిన శీర్షికల క్రింద ఆ అంశాలను రాయండి. మీరు కూడా మరికొన్ని అంశాలను జోడించవచ్చు.
AP Board 7th Class Social Solutions Chapter 1 విశ్వం మరియు భూమి 4
జవాబు:
AP Board 7th Class Social Solutions Chapter 1 విశ్వం మరియు భూమి 5

7th Class Social Textbook Page No.17

ప్రశ్న 6.
మీ ఉపాధ్యాయుడి సహాయంతో, అంతర్జాలం (ఇంటర్నెట్), గ్రంథాలయం (లైబ్రరీ) మొదలైన వివిధ వనరుల నుండి భూ స్వరూపాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి ఈ క్రింది పట్టికను పూరించండి.

మొదటి శ్రేణి భూస్వరూపాలురెండవ శ్రేణి భూస్వరూపాలుమూడవ శ్రేణి భూస్వరూపాలు

జవాబు:

మొదటి శ్రేణి భూస్వరూపాలురెండవ శ్రేణి భూస్వరూపాలుమూడవ శ్రేణి భూస్వరూపాలు
1. మహాసముద్రాలు
2. ఖండాలు
1. మైదాన ప్రాంతాలు
2. పీఠభూములు
3. పర్వతాలు
1. ‘V’ ‘U’ ఆకారపు లోయలు
2. గార్జెస్ & అగాధధరులు
3. జలపాతాలు, వరద మైదానాలు
4. ఆక్స్ బౌ సరస్సులు, డెల్టాలు
5. మెరైన్లు, అఖాతాలు, అగ్రములు
6. బీచు, సముద్రపు తోరణాలు
7. భృగువు, పుట్టగొడుగు రాళ్ళు
8. ఇన్సెల్ బర్గ్, లోయస్ మైదానాలు
9. ఇసుక దిబ్బలు మొదలైనవి.

ప్రశ్న 7.
మన దైనందిన జీవితంలో ఉపయోగించే వస్తువుల జాబితాను తయారుచేసి వాటికి సంబంధించిన ఖనిజాల పేర్లను రాయండి.
వస్తువుల పేర్లు సంబంధిత ఖనిజాలు
AP Board 7th Class Social Solutions Chapter 1 విశ్వం మరియు భూమి 6
జవాబు:

వస్తువుల పేర్లుసంబంధిత ఖనిజాలు
సీలు పాత్రలుఇనుము + కార్బన్
మోటార్ వాహనాలు, కేబుల్స్ఇనుము + క్రోమియం + నికెల్
విద్యుత్ పరికరాలు, ఫ్యూజులునిక్రోమ్
వంట పాత్రలు, గరిటెలుజర్మన్ సిల్వర్ (రాగి + జింక్ + నికెల్)
విగ్రహాలు, వంట పాత్రలు, నాణేలుకంచు (కాపర్ + తగరం)
యంత్ర భాగాలు, పాత్రలుఇత్తడి (రాగి + జింక్)
నాణేలు, ఫ్రేములు, విమానాల తయారీఅల్యూమినియం (బాక్సైట్)
తుపాకులు, బేరింగులుగన్ మెటల్ (రాగి + తగరం + జింక్)
ఆభరణాలు, నగలుబంగారం, వెండి

7th Class Social Textbook Page No.21

ప్రశ్న 8.
ప్రపంచ పటంలో మహా సముద్రాలను గుర్తించండి.
జవాబు:
AP Board 7th Class Social Solutions Chapter 1 విశ్వం మరియు భూమి 7

ప్రశ్న 9.
ప్రపంచ పటంలో ప్రధాన సముద్రాలను గుర్తించండి.
జవాబు:
AP Board 7th Class Social Solutions Chapter 1 విశ్వం మరియు భూమి 8

7th Class Social Textbook Page No.23

ప్రశ్న 10.
పారిశ్రామిక ప్రాంతం, ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ప్రాంతం మరియు పచ్చదనం కలిగిన ప్రాంతం వంటి వివిధ ప్రాంతాలలో ఆక్సిజన్ స్థాయిల గురించి ఇంటర్నెట్ ద్వారా సమాచారాన్ని సేకరించి, ఇందుకు కారణాలు మరియు ఆక్సిజన్ స్థాయిలను మెరుగుపరచడానికి చర్యలను సూచించండి.
జవాబు:

  1. పారిశ్రామిక ప్రాంతం, ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ప్రాంతంలో ఆక్సిజన్ స్థాయిలు తక్కువగా ఉన్నాయి. పరిశ్రమలు, ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కాలుష్యం ఎక్కువగా ఉంటుంది.
  2. పచ్చదనం (ఎక్కువ) కల్గిన ప్రాంతంలో ఆక్సిజన్ స్థాయిలు ఎక్కువగా ఉన్నాయి.
  3. పచ్చదనం (చెట్లు) కల్గిన ప్రాంతంలో చెట్లు ఆక్సిజన్ ను విడుదల చేయటం వలన అక్కడ ఆక్సిజన్ స్థాయిలు ఎక్కువగా ఉన్నాయి.

ఆక్సిజన్ స్థాయిలు మెరుగుపరచడానికి చర్యలు / సూచనలు :

  1. చెట్లు విరివిగా పెంచాలి.
  2. పారిశ్రామిక కాలుష్యాన్ని తగ్గించాలి.
  3. శిలాజ ఇంధనాల వాడకం తగ్గించాలి.
  4. CFCలను తగ్గించాలి.

AP Board 7th Class Social Solutions Chapter 1 విశ్వం మరియు భూమి

ప్రశ్న 11.
మీ పరిసరాలలోని వివిధ జీవరాశుల జాబితా తయారు చేసి వాటిని ఒక పట్టికలో మొక్కలు మరియు జంతువులుగా వర్గీకరించండి.
జవాబు:

మొక్కలుజంతువులు
తులసి, వేప, రావి, అశోక చెట్టు, జామ, మామిడి, చింత, సీతాఫలం, మర్రి, తుమ్మ, వెదురు, గులాబీ, టేకు, మందారం, గంధం చెట్టు, గానుగ, బొప్పాయి, జిల్లేడు, కొబ్బరి మొ||నవి.పులి, సింహం, నక్క తోడేలు, ఏనుగు, జింక, కుక్క గుర్రం, కంగారు, జిరాఫీ, చిరుత, పాండా, ఎలుగుబంటి, నీటి గుర్రం, హైనా, గొరిల్లా, కోతి, చింపాంజి, ఆవు, గేదె, ఎద్దు, మేక, గొ ర్రె మొ||నవి.

ప్రశ్న 12.
జీవావరణం, శిలావరణం మరియు జలావరణం మీద ఎలా ఆధారపడి ఉంది?
జవాబు:

  1. జీవావరణం ‘జీవం’ గాలి, నీరు,నేల పైనే ఆధారపడి ఉంది. ఇవి ఉంటేనే ‘జీవం’ ఉంటుంది. ఇవి లేని చోట నిర్జీవమే.
  2. శిలావరణం మరియు జలావరణంలు జీవావరణంతో అవినాభావ సంబంధం కల్గి ఉన్నాయి.
  3. జీవులకు ప్రాథమిక అవసరాలైన నీరు, నేల, (శిలావరణం, జలావరణం) ఇవి ఈ ఆవరణాల నుండే లభిస్తున్నాయి.

7th Class Social Textbook Page No.25

ప్రశ్న 13.
మీ పరిసరాలలోని మానవ పర్యావరణం యొక్క అంశాలను సేకరించి జాబితా తయారు చేయండి. అవి ఎలా ఏర్పడ్డాయో తెలుసుకోండి.
జవాబు:
మా పరిసరాలలోని మానవ పర్యావరణం యొక్క అంశాలు :

  1. కుటుంబం : చిన్న, పెద్ద, ఉమ్మడి కుటుంబాలు.
  2. సమాజం : గ్రామీణ, పట్టణ, గిరిజన మొ||న సమాజాలు.
  3. మతము : హిందూ, ఇస్లాం, క్రైస్తవం, సిక్కు జైన, బౌద్ధ మతాలు (ఆలయాలు, చర్చిలు, మసీదులు, గురుద్వారాలు).
  4. విద్యా అంశాలు : పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు.
  5. ఆర్థిక అంశాలు : బ్యాంకులు, బీమా సంస్థలు మొ||నవి.
  6. రాజకీయ అంశాలు : రాజధానులు, వివిధ పార్టీలు, ప్రభుత్వాలు.
    ఇవన్నీ మానవ అవసరాల నుండి ఏర్పడినాయి.

ప్రశ్న 14.
మీ పెద్దల నుండి, వారు మీ వయస్సులో ఉన్నప్పుడు సహజ వాతావరణం ఎలా ఉందనే దాని గురించి సమాచారాన్ని సేకరించండి.
జవాబు:
నాడు సహజ వాతావరణం ఎలా ఉండేదంటే :

  1. కాలుష్యరహిత వాతావరణం.
  2. పచ్చని పల్లెలు, కాలుష్యం లేని జలాలు.
  3. మితిమీరిన అభివృద్ధి, విధ్వంసం లేదు.
  4. గాలి, నీరు, నేల స్వచ్ఛంగా ఉండేవి.
  5. ఇన్ని పరిశ్రమలు, ఇంత పారిశ్రామికాభివృద్ధి లేదు.
  6. ప్రకృతి ఒడిలో వ్యవసాయం చేసేవారు (రసాయనాల వాడకం తక్కువ).
  7. జంతువులు స్వేచ్ఛగా విహరించేవి.
  8. వృక్షాలు విరివిగా ఉండేవి.

ప్రశ్న 15.
సేకరించిన సమాచారం ఆధారంగా ఒక పోస్టర్‌ను తయారు చేయండి.
జవాబు:
విద్యార్థులు స్వయంగా చేయగలరు.
ఉదా :
AP Board 7th Class Social Solutions Chapter 1 విశ్వం మరియు భూమి 9

7th Class Social Textbook Page No.27

ప్రశ్న 16.
వాయు కాలుష్యానికి కారణమయ్యే వివిధ మానవ కార్యకలాపాల జాబితాను రూపొందించండి.
జవాబు:
వాయు కాలుష్యానికి కారణమయ్యే మానవ కార్యకలాపాలు :

  1. పరిశ్రమల నుండి వచ్చే ధూళి, పొగ.
  2. వాహనాల నుండి వెలువడే కార్బన్లు (పొగ).
  3. ఏసిలు, రిఫ్రిజిరేటర్లు వాడకం వలన వెలువడే క్లోరోఫ్లోరో కార్బన్లు,
  4. అణువిద్యుత్ ప్లాంట్లు.
  5. శిలాజ ఇంధనాల వాడకం.
  6. బహిరంగ చెత్త, వ్యర్థాలను తగలబెట్టడం.
  7. అడవుల నిర్మూలన, వ్యవసాయ ప్రక్రియలో వాడే రసాయనాలు.

AP Board 7th Class Social Solutions Chapter 1 విశ్వం మరియు భూమి

ప్రశ్న 17.
వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి చర్యలు సూచించండి.
జవాబు:
వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి తీసుకోవల్సిన చర్యలు :

  1. గృహాల నుండి, కర్మాగారాల నుండి కనీస స్థాయికి ఉద్గారాలను తగ్గించాలి.
  2. వాహనాల వినియోగం తగ్గించాలి. ప్రజా రవాణాను వినియోగించాలి.
  3. చెత్తను, వ్యర్థాలను శాస్త్రీయంగా రీసైకిల్/విద్యుత్ ఉత్పత్తి చేసే అవకాశాన్ని పరిశీలించాలి.
  4. రసాయన ఎరువులు, పురుగు మందుల వినియోగం తగ్గించి, ప్రకృతి సేద్యం వైపుకు మళ్ళాలి.
  5. అధికంగా చెట్లను నాటడం, పెంచడం చేయాలి.

ప్రశ్న 18.
మీ ఉపాధ్యాయుని సహాయంతో వాయు కాలుష్యానికి కారణమయ్యే సంఘటనలతో ఒక చిత్రాన్ని గీయండి.
జవాబు:
విద్యార్థులు స్వయంగా చేయగలరు.
ఉదా :
AP Board 7th Class Social Solutions Chapter 1 విశ్వం మరియు భూమి 10

ప్రశ్న 19.
నీటి కాలుష్యానికి కారణమయ్యే వివిధ మానవ కార్యకలాపాల జాబితాను రూపొందించండి.
జవాబు:
నీటి కాలుష్యానికి కారణమయ్యే మానవ కార్యకలాపాలు :

  1. పారిశ్రామిక కాలుష్యాలలో అనేక రకాల సేంద్రియ మరియు అకర్బన కాలుష్య కారకాలు ఉన్నాయి.
    ఉదా : కాగితం మరియు కాగితపు గుజ్జు, రంగులు వేసే వస్త్ర పరిశ్రమలు.
  2. ఎరువులు మరియు రసాయన పరిశ్రమలు కూడా నీటి కాలుష్యం సమస్యను తీవ్రమైన పర్యావరణ సమస్యగా మార్చాయి.
  3. చెత్త మరియు జీవ సంబంధ వ్యర్థాల కారణంగా, నీరు కలుషితం అవుతుంది.
  4. సముద్రాలలో ఓడల రవాణా కారణంగా చమురుతో సముద్రపు నీరు కలుషితం అవుతుంది.
  5. ఆమ్ల వర్షాల కారణంగా నీరు కలుషితం అవుతుంది. 6) ప్లాస్టిక్ వాడకం కారణంగా నీరు కలుషితం అవుతుంది.

ప్రశ్న 20.
నీటి కాలుష్యాన్ని తగ్గించటానికి చర్యలు సూచించండి.
జవాబు:
నీటి కాలుష్యాన్ని తగ్గించటానికి సూచనలు :

  1. పారిశ్రామిక ద్రవ వ్యర్థాలను రీసైకిల్ చేసి, బయటకు విడుదల చేయాలి.
  2. రసాయన ఎరువుల స్థానంలో సేంద్రియ ఎరువులను వాడాలి.
  3. చెత్త మరియు ఘన వ్యర్థాలను సురక్షిత పద్ధతుల్లో పారవేయాలి.
  4. సముద్ర జలాల్లోని ఓడల నిర్వహణ సమర్థవంతంగా చేయాలి.

ప్రశ్న 21.
నీటి కాలుష్యానికి సంబంధించిన సమాచారాన్ని, (వార్తాపత్రిక క్లిప్పింగులు మొదలైనవి) సేకరించి మీ తరగతి గదిలో ప్రదర్శించండి.
జవాబు:
విద్యార్థులు స్వయంగా తరగతి గదిలో చేయగలరు.

ప్రశ్న 22.
మీ ఉపాధ్యాయుల సహాయంతో, నీటి కాలుష్యానికి కారణమయ్యే సంఘటనలతో ఒక చిత్రాన్ని గీయండి.
జవాబు:
విద్యార్థులు స్వయంగా గీయగలరు.
ఉదా :
AP Board 7th Class Social Solutions Chapter 1 విశ్వం మరియు భూమి 11

ప్రశ్న 23.
సహజ వనరుల పరిరక్షణ గురించి రెండు నినాదాలు తయారు చేయండి.
జవాబు:

  1. సహజ వనరులు ప్రకృతి సంపద – దాని పరిరక్షణ మనందరి బాధ్యత.
  2. మనమే కాదు సహజ వనరులు – ఉపయోగించుకోవాలి భావితరాలు.
  3. సహజ వనరులు ప్రకృతి ప్రసాదించిన వరాలు – నిలుపుకోవాలి వాటిని తరతరాలు.
  4. వనరుల పరిరక్షణ – దేశాభివృద్ధికి సంరక్షణ.

ప్రశ్న 24.
నీటి సంరక్షణపై ఒక పోస్టర్ సిద్ధం చేయండి.
జవాబు:
విద్యార్థులు స్వయంగా గీయగలరు.
ఉదా :
AP Board 7th Class Social Solutions Chapter 1 విశ్వం మరియు భూమి 12

7th Class Social Textbook Page No.29

ప్రశ్న 25.
ప్రక్క చిత్రాన్ని గమనించి, మీ వ్యాఖ్య రాయండి.
AP Board 7th Class Social Solutions Chapter 1 విశ్వం మరియు భూమి 13
జవాబు:

  1. జలయమయమైన పట్టణం.
  2. నీట మునిగిన నగరం.
  3. వరద విలయ తాండవం.
  4. వరద కోరల్లో చిక్కిన నగరం.

ప్రశ్న 26.
విపత్తుల నివారణ గురించి రెండు నినాదాలు తయారు చేయండి.
జవాబు:

  1. మీ సంరక్షణే – దేశ సంరక్షణ.
  2. ఆపదలో, అవకాశం అంది పుచ్చుకో.
  3. ప్రతిక్షణం (జాగృతమై) చైతన్యం – మీ భవితకు భరోసా.
  4. ఊహించని విపత్తు – ముందుగానే ఊహించు.
  5. మీరు అప్రమత్తంగా ఉంటేనే – మీరు సజీవంగా ఉంటారు.

ప్రశ్న 27.
మీ ప్రాంతంలో ఈ మధ్య కాలంలో సంభవించిన విపత్తుల జాబితాను తయారు చేయండి.
జవాబు:
మా ప్రాంతంలో సంభవించిన విపత్తులు :

  1. భారీ వర్షాలు, తుఫానుల కారణంగా వరదలు సంభవించాయి (హుద్ హుద్, తిఖీ తుఫానులు).
  2. భూగర్భ జలాలు అడుగంటిపోవటం.
  3. కోల్డ్ స్టోరేజీలో అగ్నిప్రమాదం.
  4. కొండచరియలు విరిగిపడటం జరిగింది.
  5. రహదారి ప్రమాదాలు సంభవించటం.
  6. గతంలో సునామీ, భూకంపాలు వచ్చాయి.

ఆలోచించండి – ప్రతిస్పందించండి

7th Class Social Textbook Page No.7

ప్రశ్న 1.
గెలీలియో యొక్క పరిశీలనలు ఏమిటి?
జవాబు:

  1. ఇటలీ దేశానికి చెందిన గెలీలియో అన్న మేధావి దూరదర్శినికి మెరుగులు దిద్దాడు.
  2. దీనితో యాభై మైళ్ళ దూరంలో ఉన్న ఓడ అయిదు మైళ్ళు దూరాన ఉన్నంత స్పష్టంగా కనిపించేది. ఈ ఆ పరికరం ఖగోళశాస్త్ర అధ్యయనానికి సైతం తోడ్పడింది.
  3. గెలీలియో బాగా రాస్తాడు, చక్కగా ఉపన్యాసాలిస్తాడు. కాబట్టి విస్తృత ప్రజాదరణ పొందాడు.
  4. కోపర్నికస్ సిద్ధాంతాలు చర్చిస్తూ జ్యూపిటర్ ఉపగ్రహాలను, ఆ గ్రహ పరిభ్రమణాన్ని తాను స్వయంగా చూసిన విషయం శ్రోతలకు చెప్పేవాడు.
  5. లోలకంలోని సిద్ధాంతాలను గెలీలియో కనుగొనటంతో మరింత మెరుగైన గడియారాలు తయారు చేయగలిగారు.
  6. పీసాలో వాలి ఉన్న భవన శిఖరం నుంచి చేసిన ప్రయోగంలో బరువైన వస్తువులు, తేలికైన వస్తువులు ఒకే వేగంతో కిందకు పడతాయని అతడు నిరూపించాడు.

7th Class Social Textbook Page No.11

ప్రశ్న 2.
జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా ఎందుకు జరుపుకుంటున్నాం?
జవాబు:

  1. జూన్ 5న విశ్వవ్యాప్తంగా పర్యావరణ దినోత్సవం జరుపుకుంటారు.
  2. ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ పర్యావరణ కార్యక్రమాలు (UNEP) నిర్వహిస్తూ పర్యావరణంపై ప్రజలను జాగృతపరిచే ప్రయత్నాలు చేస్తుంది.
  3. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఐ.రా.స 1972లో ప్రారంభించింది.
  4. ఈ సందర్భంగా ఐ.రా.స ప్రపంచ దేశాలను ఆహ్వానించి ఒక సమ్మేళనం నిర్వహించింది.
  5. స్వీడన్లో నిర్వహించిన ఈ సమ్మేళనంలో సుమారు 119 దేశాలు పాల్గొన్నాయి.
  6. ప్రతి సంవత్సరం జూన్ 5న ఈ సమ్మేళనం జరుగుతుంది.

7th Class Social Textbook Page No.15

ప్రశ్న 3.
భూమి యొక్క సహజ ఆవరణములలో జీవావరణము ఎలా భిన్నంగా ఉంటుంది?
జవాబు:
భూమి యొక్క సహజ ఆవరణములలో జీవావరణము భిన్నంగా ఉంటుంది, ఎలా అంటే

  1. జీవంతో కళకళలాడే ఏకైక గ్రహం భూమి. భూమి యొక్క ఇతర మూడు ఆవరణలు కలిసిన చోటైన జీవావరణంలో ‘జీవం’ వర్ధిల్లుతుంది.
  2. ఆ జీవావరణమే తిరిగి ఈ మూడు ఆవరణాలను ప్రభావితం చేస్తుంది.
  3. మూడు ఆవరణాలతోనే కాకుండా వివిధ జీవరూపాల మధ్య కూడా పరస్పర సంబంధాలు ఉంటాయి.
    ఉదా : మొక్కలు, జంతువులు పరస్పరం ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉన్నాయి.

AP Board 7th Class Social Solutions Chapter 1 విశ్వం మరియు భూమి

ప్రశ్న 4.
ఇతర మూడు ఆవరణములు లేకుండా జీవావరణము మనుగడ సాగించలేదు. ఎందుకు?
జవాబు:

  1. సూర్యుడికి భూమి మరీ దగ్గరగా, మరీ దూరంగా లేనందున ‘జీవావరణములో అనువైన ఉష్ణోగ్రతలు – ఉండటం, నేల, నీరు, గాలి మూడు (ఆవరణాలు) కలిసి ఉండడం వల్ల ఒక భూమిపైన మాత్రమే జీవం సాధ్యమయింది.
  2. ఈ ఆవరణాలు ఒకదానితో ఒకటి ఆధారపడి ఉన్నాయి. అన్ని రూపాలలోని జీవులకు వాటి చుటూ ఉండే నేల, నీరు, గాలి, సూర్యరశ్నిలతో అవినాభావ సంబంధం ఉంది. వీటి నుండి ‘జీవం’ తనకు కావలసినవన్నీ పొందుతుంది.

7th Class Social Textbook Page No.17

ప్రశ్న 5.
ఏప్రిల్ ’22’ను ‘ప్రపంచ ధరిత్రీ దినోత్సవం’గా ఎందుకు జరుపుకుంటాము? మీ ఉపాధ్యాయుని సహాయంతో దాని ప్రాముఖ్యతను తెలుసుకోండి.
జవాబు:

  1. ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 22న ‘ధరిత్రీ దినోత్సవం’ జరుపుకుంటున్నారు.
  2. పర్యావరణం – భూమి పరిరక్షణ గురించి ప్రజల్లో అవగాహన కల్గించటమే దీని ముఖ్యోద్దేశ్యం.
  3. మొదట ఐ.రా.స 1969 మార్చిలో జాన్ మెక్కాల్ లో ప్రారంభించింది.
  4. తర్వాత అమెరికాకు చెందిన గేలార్డ్ నెల్సన్ ప్రారంభించారు. సెనెటర్ నెల్సన్ కి వచ్చిన ఆలోచనల ప్రతిరూపమే ధరిత్రీ దినోత్సవం.
  5. మన వాతావరణంలో జరిగే మార్పులను వివరిస్తూ మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో మన వంతు ఏమి చెయ్యాలో అందరికి తెలియజెప్పడానికి ఒక రోజంటూ ఉంటే బాగుంటుందని అనుకున్నారు.
  6. అలా 1970, ఏప్రిల్ 22న మొదటి ధరిత్రీ దినోత్సవం అమెరికాలో జరిగింది. ఇక అప్పటి నుండి ఆ తేది ఖరారైంది.

7th Class Social Textbook Page No.19

ప్రశ్న 6.
శిలావరణము యొక్క మరికొన్ని ఉపయోగాలు వ్రాయండి.
జవాబు:

  1. వ్యవసాయం మరియు మానవ నివాసాల కోసం మనం ఉపయోగించే ఆవరణం శిలావరణము.
  2. శిలావరణము యొక్క పలుచటి నేల పొర వ్యవసాయ అభివృద్ధికి సహాయపడుతుంది మరియు మనకు ఆహారాన్ని అందిస్తుంది.
  3. శిలావరణము యొక్క రాతి పొర పరిశ్రమలకు ఖనిజాలను అందిస్తూ, పారిశ్రామిక అభివృద్ధికి తోడ్పడుతుంది.
  4. ఇది అడవులు మరియు పశువుల మేత కోసం గడ్డి భూములను కూడ అందిస్తుంది.

ప్రశ్న 7.
శిలావరణములో మార్పుకు కారణమయ్యే మానవ కార్యకలాపాల జాబితాను తయారు చేయండి.
జవాబు:
శిలావరణములో మార్పుకు కారణమయ్యే మానవ కార్యకలాపాలు :

  1. వ్యవసాయం (ప్రధానంగా పోడు వ్యవసాయం), అడవుల నిర్మూలన.
  2. ఇటుకలు, సిమెంటుతో నగరాలు కట్టడం, గృహ నిర్మాణం.
  3. గనుల తవ్వకం.
  4. ఆనకట్టల (పాజిట్లు) నిర్మాణం.
  5. రోడ్ల నిర్మాణం, వాహనాల వినియోగం మొ||నవి.

ప్రశ్న 8.
శిలావరణమును రక్షించటానికి చర్యలను సూచించండి.
జవాబు:
శిలావరణమును రక్షించటానికి చర్యలు :

  1. ఖనిజాలను (లోహాలను) తిరిగి వినియోగించుకోవాలి. (RRR)
  2. సహజ (ప్రకృతి) శక్తిని వినియోగించుకోవటం.
  3. వాహనాల వినియోగం తగ్గించటం (ప్రజా రవాణాను ఉపయోగించటం).
  4. పోడు వ్యవసాయంను నిర్మూలించడం.
  5. సామాజిక అడవుల పెంపకం చేపట్టడం.

ప్రశ్న 9.
మార్చి 22ను “ప్రపంచ జల దినోత్సవం”గా ఎందుకు జరుపుకుంటాము? మీ ఉపాధ్యాయుడి సహాయంతో దాని ప్రాముఖ్యతను తెలుసుకోండి.
జవాబు:

  1. ప్రతి సం॥రం మార్చి 22ను ప్రపంచ జల దినోత్సవంగా జరుపుతున్నారు.
  2. మంచినీటి వనరుల సుస్థిరమైన నిర్వహణ గురించి చెప్పేందుకు ఈ రోజును నిర్వహిస్తున్నారు.
  3. 1992 బ్రెజిల్ లోని రియోడిజనీరోలో పర్యావరణం, అభివృద్ధిపై ఐక్యరాజ్యసమితి ఏర్పాటు చేసిన సమావేశం (UNCED) లో దీనిని ప్రతిపాదించారు.
  4. 1923, మార్చి 22న తొలి ప్రపంచ జలదినోత్సవం జరిగింది.

ప్రశ్న 10.
భూమిపై ఉన్న మొత్తం నీటిని ఎందుకు ఉపయోగించుకోలేకపోతున్నాము?
జవాబు:
భూమిపై ఉన్న మొత్తం నీటిని ఉపయోగించుకోలేకపోవటానికి కారణం.

  1. మొత్తం నీటిలో 97.25% ఉప్పునీరుగా మహాసముద్రాలలో ఉంది.
  2. కేవలం 2.75% మాత్రమే మంచినీరు. ఈ మంచి నీటిలో అధిక శాతం (68.7%) ధృవ ప్రాంతాల్లో మంచు పొరగా ఉంది.
  3. మంచినీటిలో 29, 9% భూగర్భ జలంగా ఉంది.
  4. పై కారణాల వల్ల భూమి మీద ఉన్న మొత్తం మంచి నీటిలో 0.26% మాత్రమే చెరువులు, ఆనకట్టలు, నదులలో ఉంది. మనకు అందుబాటులో ఉన్న నీళ్ళు ఇవే.

7th Class Social Textbook Page No.21

ప్రశ్న 11.
మీ పాఠశాలలో వివిధ ప్రయోజనాల కోసం నీటిని ఎలా ఉపయోగిస్తున్నారు ? నీరు వృథా అవుతున్న ప్రదేశాలు / సందర్భాలను గమనించండి.
జవాబు:
1) మా పాఠశాలలో త్రాగటానికి, వంట చేయడానికి, మొక్కలకు పోయటానికి, మరుగుదొడ్లను, పాఠశాల ఆవరణను శుభ్రపరచటానికి నీటిని ఉపయోగిస్తాం.

2) నీరు వృథా అవుతున్న ప్రదేశం / సందర్భం:
ఎ) మరుగుదొడ్ల వద్ద కాళ్ళు, చేతులు, మొఖం కడుగుతూ వృథా చేస్తున్నారు.
బి) భోజన ప్లేట్లు శుభ్రపరిచే దగ్గర వృథా చేస్తున్నారు.
సి) త్రాగునీరు పట్టుకునే దగ్గర, త్రాగేటప్పుడు (సగం త్రాగి సగం పారబోస్తున్నారు).
డి) కొన్ని సందర్భాలలో పైపు లీకవ్వటం మూలంగా కూడా నీరు వృథా అవుతుంది.

ప్రశ్న 12.
నీటి వినియోగంలో వృధాని అరికట్టడానికి ఏయే చర్యలు సూచిస్తారు?
జవాబు:
నీటి వృథాని అరికట్టడానికి తీసుకోవాల్సిన చర్యలు :

  1. పైపులలోని లీకేజులను నిర్మూలించాలి.
  2. మరుగుదొడ్లలో తక్కువ నీరు అవసరమయ్యే ఫ్లెష్ లను (కుళాయిలను) వాడాలి.
  3. సింకులలో నీటి వృథా తగ్గించాలి.
  4. మొక్కలకు కూడా నీటిని స్ప్రింక్లర్లు లాంటివి వినియోగించి వృథాను తగ్గించాలి.
  5. అవకాశమున్న చోట్ల నీటిని పునర్వినియోగించాలి.
  6. వర్షపు నీటిని సక్రమంగా నిల్వ ఉంచి, వినియోగించుకోవాలి.

AP Board 7th Class Social Solutions Chapter 1 విశ్వం మరియు భూమి

ప్రశ్న 13.
భూగర్భ జలాలను పెంచడానికి కొన్ని చర్యలు సూచించండి. ఐస్ మొత్తం కరిగిపోయినట్లయితే ఏమి జరుగుతుంది?
జవాబు:
భూగర్భ జలాలను పెంచడానికి సూచనలు :

  1. ఇంకుడు గుంతలు ఎక్కువగా తవ్వాలి.
  2. చెక్ డ్యాముల నిర్మాణం చేపట్టాలి.
  3. గడ్డి మొక్కలు, చెట్లను నాటడం, సంరక్షించడం చేయాలి.
  4. బోరు బావులపై నియంత్రణను ఉంచాలి. నీటిని వృథా చేయకూడదు.
  5. చెరువుల (పూడిక తీయటం) సమర్థ నిర్వహణ.
  6. కాంటూరు బండింగ్, కందకాలు తీయటం మొ||నవి.
  7. ధృవ ప్రాంతాలలో ఉన్న ఐస్ మొత్తం కరిగిపోయినట్లయితే కరిగిన మంచు నీరుగా మారి సముద్రాలలోకి చేరుతుంది. కావున ప్రపంచంలోని అన్ని సముద్ర మట్టాలు పెరుగుతాయి. సముద్ర మట్టం పెరిగినట్లయితే తీరప్రాంతాలతో సహా భూభాగం మొత్తం మునిగిపోయే ప్రమాదం కలదు.

ప్రశ్న 14.
సెప్టెంబరు 16ను “ప్రపంచ ఓజోన్ దినోత్సవం”గా ఎందుకు జరుపుకుంటాము?
జవాబు:

  1. ప్రతి సం||రం సెప్టెంబరు 16ను “ప్రపంచ ఓజోన్ దినోత్సవంగా ” జరుపుతున్నారు.
  2. భూమి మీద కాలుష్యం కారణంగా దెబ్బతింటున్న ఓజోన్ పొరను పరిరక్షించడం దీని ముఖ్య ఉద్దేశ్యం.
  3. ఓజోన్ పొరను దెబ్బతీస్తున్న పదార్థాల నియంత్రణకుగాను రూపొందించిన మాంట్రియల్ ప్రొటోకాల్ పై ప్రపంచ దేశాలు 1987, సెప్టెంబరు 16న సంతకాలు చేసాయి.
  4. అప్పటి నుండి ప్రతి సం|| సెప్టెంబరు 16ను ప్రపంచ ఓజోన్ దినోత్సవంగా జరుపుతున్నారు.

7th Class Social Textbook Page No.23

ప్రశ్న 15.
వాతావరణంలో కార్బన్ డై ఆక్సైడ్ స్థాయి పెరిగితే ఏమి జరుగుతుంది?
జవాబు:
వాతావరణంలో కార్బన్ డై ఆక్సెడ్ పెరిగినట్లయితే భూగోళం వేడెక్కటం జరుగుతుంది. కార్బన్ డై ఆక్సైడ్ హరిత గృహ వాయువు కాబట్టి భూతాపం పెరగటంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ విధంగా భూగోళం వేడెక్కినట్లయితే ధృవాల దగ్గర ఉన్న మంచు కరిగి సముద్ర మట్టాలు పెరుగుతాయి. వాతావరణ సమతౌల్యం దెబ్బ తిని అతివృష్టి, అనావృష్టి ఏర్పడతాయి.

ప్రశ్న 16.
వాతావరణంలో ఆక్సిజన్ స్థాయిని ఎలా పెంచుకోవచ్చు?
జవాబు:
వాతావరణంలో ఆక్సిజన్ (ప్రాణ వాయువు) స్థాయిని ముఖ్యంగా

  1. విరివిగా చెట్లను పెంచటం (సంరక్షించడం) ద్వారా
  2. వాహనాల వినియోగం, శిలాజ ఇంధనాల వినియోగం తగ్గించడం ద్వారా
  3. పారిశ్రామిక కాలుష్యాన్ని తగ్గించడం ద్వారా
  4. ఇంధనంగా హైడ్రోజన్ ని వాడటం, సౌరశక్తిని వినియోగించడం ద్వారా
  5. CFCలను తగ్గించుటకై ACలు, రిఫ్రిజిరేటర్లు వాడకం తగ్గించటం ద్వారా ఆక్సిజన్ స్థాయి పెంచవచ్చు.

ప్రశ్న 17.
“జీవావరణం” భూమి యొక్క “ప్రత్యేక సహజ ఆవరణం” గా ఎందుకు పరిగణించబడుతుంది?
జవాబు:

  1. ‘జీవావరణం’ లో మాత్రమే ‘జీవం’ కల్గి ఉంది.
  2. ‘జీవం’ అనేది మానవుడు సృష్టించలేడు. ప్రకృతి సిద్ధమైనది, సహజమైనది.
  3. మిగతా ఆవరణముల కన్నా జీవావరణం జీవం కల్గి ఉండటంతో ప్రత్యేకంగా పరిగణించబడుతుంది. మిగతా ఆవరణముల మనుగడ కూడా దీనిపై ఆధారపడి ఉన్నాయి.

ప్రశ్న 18.
జీవావరణమును రక్షించడానికి మీరు ఏ చర్యలు సూచిస్తారు?
జవాబు:
జీవావరణమును రక్షించడానికి సూచనలు :

  1. ప్రకృతి / సహజ వనరులను పొదుపుగా వినియోగించుకోవాలి.
  2. వృక్ష, జంతు సంపదను సంరక్షించుకోవాలి.
  3. మొక్కలను నాటి సంరక్షించాలి, సామాజిక అడవుల పెంపకం చేపట్టాలి.
  4. వివిధ రకాల జంతువుల సంరక్షణకై రిజర్వ్ ఫారెస్టు , వన్యప్రాణి సంరక్షణా కేంద్రాలను ఏర్పాటు చేయాలి.
  5. గాలి, నీరు, నేల కాలుష్యాన్ని తగ్గించాలి. లేకపోతే దీని ప్రభావం జీవావరణంపైనే పడుతుంది.

7th Class Social Textbook Page No.25

ప్రశ్న 19.
మానవ నిర్మిత పర్యావరణ స్థాపన సహజ వాతావరణంలో మార్పుకు ఎలా కారణమైంది? ఇది మనకు ఎలా హానికరం?
జవాబు:

  1. మానవులు తయారు చేసిన పరిసరాలను మానవ నిర్మిత పర్యావరణం అంటారు.
  2. భవనాలు, కర్మాగారాలు, ఉద్యానవనాలు, రోడ్లు, వంతెనలు, ప్రాజెక్టులు మొ||నవి వీనికి ఉదాహరణలు.
  3. ఈ మానవ నిర్మిత పర్యావరణ స్థాపన (కర్మాగారాలు, ప్రాజెలు, రోడ్ల నిర్మాణం, వ్యవసాయం మొ||న వాటి వల్ల) సహజ వాతావరణాన్ని కాలుష్యపు కోరల్లోకి నెట్టివేసింది.
  4. ఈ పర్యావరణ కాలుష్యం వలన అనారోగ్య సమస్యలు ఏర్పడటం, శీతోష్ణస్థితిలో మార్పులు సంభవించి అతివృష్టి, అనావృష్టి సంభవించటం వంటి హాని జరుగుతుంది.

ప్రశ్న 20.
సహజ పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఉందా? దానికి నీవు ఏమి చేయగలవు?
జవాబు:
సహజ పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

దీని కోసం నేనేమి చేయగలనంటే :

  1. మొక్కలు నాటడం, సంరక్షించడం (వన సంరక్షణ చేపట్టడం).
  2. వాహనాలను అత్యవసరమయితేనే వాడటం.
  3. శిలాజ ఇంధనాలను సాధ్యమయినంత తక్కువగా లేదా అస్సలు వాడకపోవటం.
  4. ఏసిలు, రిఫ్రిజిరేటర్ల వాడకం తగ్గించడం లేదా అస్సలు వాడకపోవడం.
  5. పారిశ్రామిక కాలుష్యాన్ని తగ్గించడానికి చర్యలు చేపట్టడం.

అన్వేషించండి

7th Class Social Textbook Page No.7

ప్రశ్న 1.
ఇంటర్నెట్ లో బిగ్ బ్యాంగ్ థియరీ గురించి అన్వేషించండి మరియు మీరు గమనించిన విషయాలతో జాబితా తయారు చేయండి.
జవాబు:

  1. విశ్వం యొక్క ఆవిర్భావం గురించి బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం వివరిస్తుంది.
  2. ఈ సిద్ధాంతంను మొదట జార్జిస్ లెమైటర్ అనే బెల్జియం దేశానికి చెందిన ఖగోళ శాస్త్రవేత్త ప్రతిపాదించాడు.
  3. ఈ విశ్వం 13.7 బిలియన్ సంవత్సరాల క్రితం ఒక చిన్న అణువు నుండి ప్రారంభమై నేటికీ విస్తరిస్తోందని తను సిద్ధాంతీకరించాడు.
  4. ఆ చిన్న అణువు అనంతమైన ఉష్ణోగ్రత మరియు సాంద్రత కలిగిన చిన్న బంతిలా ఉండేది.
  5. అణువు యొక్క ఉష్ణోగ్రత మరియు సాంద్రత పెరిగిన కారణంగా అది పేలిపోయి విశ్వమంతా చిన్న ముక్కలుగా విసిరివేయబడింది. ఫలితంగా విశ్వంలో నక్షత్రాలు, గెలాక్సీలు, గ్రహాలు, ఉపగ్రహాలు, ఖగోళ వస్తువులు ఏర్పడ్డాయి.

7th Class Social Textbook Page No.9

ప్రశ్న 2.
అంతర్జాలం ద్వారా ఇద్దరు (ప్రాచీన మరియు ఆధునిక) భారతీయ ఖగోళ శాస్త్రవేత్తల గురించి సమాచారాన్ని సేకరించి తరగతి గదిలో చర్చించండి.
జవాబు:
1) ఆర్యభట్ట (476 – 650) :
గుప్తుల కాలం నాటి ప్రముఖ ఖగోళశాస్త్రవేత్త. గణితం, ఖగోళశాస్త్రంలో అనేక ఆవిష్కరణలు చేసాడు. ‘ఆర్యభట్టీయం’ అనే గ్రంథాన్ని రచించాడు. “సున్నా”ను ఆవిష్కరించి ప్రపంచ వ్యాప్తంగా భారతీయ గణిత ఖ్యాతిని తెలియజేసాడు. ‘పై’ విలువను లెక్క గట్టినాడు. గ్రహాల సంఖ్యను, సూర్య చంద్ర గ్రహణాలను గురించి నేటి పరికల్పనలకు దగ్గరగా వీరి ఆలోచనలున్నాయి. సూర్య చంద్ర గ్రహణాలకు కారణం ఛాయలేనని నాడే తెలియజేశాడు. భూమి ఆకారం, భూ చలనాలను గురించి కచ్చితంగా వివరించాడు. వీరి గొప్ప ప్రతిభకు గౌరవంగానే మన భారతదేశ మొట్టమొదటి ఉపగ్రహానికి ఆర్యభట్ట అని పేరు పెట్టారు.

2) సుబ్రహ్మణ్య చంద్రశేఖర్ (1910 – 1995) :
భారతదేశానికి నోబెల్ బహుమతి తీసుకువచ్చిన ప్రముఖ శాస్త్రవేత్త. వీరు 1910, అక్టోబర్ 10లో పంజాబులో జన్మించారు. 1922లో చెన్నైకు మారారు. సి.వి. రామన్ గారికి వీరు మనుమడు. అంతరిక్ష భౌతిక శాస్త్రంలో ఆసక్తి ఉండటం వలన దానిలో పరిశోధనలు చేపట్టారు. నక్షత్రాల పరిణామ దశల గురించి (పుట్టుక, పెరుగుట, రాలిపోవుట) వీరు చేసిన ఆవిష్కరణలకుగాను 1983 సంవత్సరంలో నోబెల్ బహుమతిని ప్రదానం చేసారు.

AP Board 7th Class Social Solutions Chapter 1 విశ్వం మరియు భూమి

ప్రశ్న 3.
గ్రంథాలయం ద్వారా లేదా అంతర్జాలం (ఇంటర్నెట్) ద్వారా ప్లూటో సౌర్యవ్యవస్థ నుండి ఎందుకు తొలగించబడింది అనే సమాచారాన్ని సేకరించండి.
జవాబు:
పూటో సౌరవ్యవస్థ నుండి ఎందుకు తొలగించబడిందంటే :

  1. తక్కువ ద్రవ్యరాశి కలిగి ఉండటం.
  2. ప్లూటో కన్నా ఎక్కువ ద్రవ్యరాశి గల (పెద్ద) మరో గ్రహం ఎరిసను కనుగొనటం.
  3. IAU (ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్) గ్రహానికి ఉండవలసిన లక్షణాలను నిర్వచించారు (ఆగస్ట్ 2006లో). వీరి ప్రకారం గ్రహానికుండవలసిన లక్షణాలు
    ఎ) ఖగోళ వస్తువు సూర్యుని చుట్టూ తిరుగుతుండాలి.
    బి) గుండ్రంగా వుండాలి
    సి) తన కక్ష్యలో ఏ ఇతర వస్తువులుండరాదు అంటే గురుత్వాకర్షణ శక్తి ఉండాలి. దీని ప్రకారం
  4. ప్లూటోకి తక్కువ ద్రవ్యరాశి మరియు గురుత్వాకర్షణ శక్తి ఉండటం వలన గ్రహంగా తొలగించి డ్వార్ఫ్ గ్రహంగా పరిగణిస్తున్నారు.

7th Class Social Textbook Page No.17

ప్రశ్న 4.
గ్రంథాలయ పుస్తకాలు లేదా అట్లాస్ ద్వారా వివిధ రకాల భూస్వరూపాల గురించి మరింత తెలుసుకోండి. ఇప్పుడు మీ ప్రాంతంలో గల వివిధ భూస్వరూపాలు ఎలా ఏర్పడ్డాయో తెలుసుకోవటానికి ప్రయత్నించండి. (పై భావన అవగాహన కోసం మీరు మీ ఉపాధ్యాయునితో చర్చించవచ్చు).
జవాబు:
1) వివిధ భూస్వరూపాలు :
మొదటి శ్రేణి భూస్వరూపాలు : ఖండాలు, మహా సముద్రాలు
ద్వితీయ శ్రేణి భూస్వరూపాలు : మైదానాలు, పీఠభూములు, పర్వతాలు

మూడవ శ్రేణి భూస్వరూపాలు :
ఎ) V ఆకారపు లోయలు, గార్జెస్, అగాథధరి, జలపాతాలు, దుముకుడు మడుగులు, వరద మైదానాలు, ఆక్స్‌బౌ సరస్సులు, డెల్టాలు.
బి) ‘U’ ఆకారపు లోయలు, మెరైన్లు.
సి) సముద్రపు గుహలు, సముద్రపు తోరణాలు, పేర్పుడు స్తంభాలు, బృగువు, అగ్రం, అఖాతం, బీన్లు.
డి) పుట్టగొడుగురాళ్ళు, ఇన్సెల్ బర్గ్, ఇసుక దిబ్బలు, లోయస్ మైదానాలు.

2) మా ప్రాంతంలో డెల్టా కలదు. ఇది (కృష్ణా) నది సముద్రంలో కలిసే ముందు రెండు పాయలుగా విడిపోయి, తనతో తీసుకు వచ్చిన మెత్తని మట్టి, ఇసుకను మేట వేస్తుంది. (ఒండ్రు). ఇలా ఏర్పడిన మైదానాలే డెల్టాలు. ఇవి ఒండ్రు మట్టితో ఏర్పడి, సారవంతంగా ఉంటాయి.

7th Class Social Textbook Page No.21

ప్రశ్న 5.
అంతర్జాలం (ఇంటర్నెట్), అట్లాస్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ నీటి వనరుల గురించి మరింత తెలుసుకోండి. (అవసరమైతే, మీ ఉపాధ్యాయులు లేదా పెద్దల సహాయం తీసుకోండి).
జవాబు:
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నీటి వనరులు :
మహా సముద్రాలు : పసిఫిక్, అట్లాంటిక్, హిందూ, ఆర్కిటిక్, అంటార్కిటిక్ (దక్షిణ) మహా సముద్రాలు.

సముద్రాలు :
మధ్యధరా సముద్రం, నల్ల సముద్రం, ఎర్ర సముద్రం, బాల్టిక్ సముద్రం, కాస్పియన్ సముద్రం, పసుపు సముద్రం, ఏజియన్ సముద్రం, అరేబియా సముద్రం, దక్షిణ చైనా సముద్రం, కరేబియన్ సముద్రం, బంగాళాఖాతం, బేరింగ్ సముద్రం, అడ్రియాటిక్ సముద్రం, అరల్ సముద్రం మొదలైనవి.

నదులు :
నైలు, అమేజాన్, యాంధీ, మిస్సిస్సిపి, కాంగో, డాన్యూబ్, ఓల్గా, మెకాంగ్, నైజర్, బ్రహ్మపుత్ర, గంగా, సింధూ, ఇరావడి, జాంబేజీ, కొలెరాడో, కొలంబియా, ఆరెంజ్, టైగ్రిస్, లింపోపో, బ్లూనెలు, గోదావరి, మహా, కృష్ణా, యమునా, సట్లెజ్, నర్మదా, తపతి, రైన్, చీనాబ్ నదులు ముఖ్యమైనవి.

సరస్సులు :
బైకాల్, టాంగ్యానికా, సుపీరియర్, విక్టోరియా, మచిగాన్, బైకాల్, ఓంటారియో, టిటికాకా, న్యాసా, దాల్, ఉరల్ మొదలైనవి.

7th Class Social Textbook Page No.23

ప్రశ్న 6.
అంతర్జాల విద్యా వనరుల ద్వారా వాతావరణం యొక్క వివిధ పొరలు, వాయు పీడనం మరియు వివిధ పవనాల గురించి మరింత తెలుసుకోండి. (అవసరమైతే, మీ ఉపాధ్యాయుని సహాయం తీసుకోండి).
జవాబు:
వాతావరణం (యొక్క) పొరలు :

  1. టోపో ఆవరణం,
  2. స్ట్రాటో ఆవరణం,
  3. మెసో ఆవరణం,
  4. థర్మో ఆవరణం,
  5. ఎక్సో ఆవరణం.

పీడన మండలాలు :

  1. భూమధ్య రేఖా అల్ప పీడన ప్రాంతం,
  2. ఉప అయన రేఖా అధిక పీడన ప్రాంతం,
  3. ఉప ధృవ అల్ప పీడన ప్రాంతం,
  4. ధృవ అయన రేఖా అధిక పీడన ప్రాంతం.

పవనాలు: ప్రపంచ పవనాలు :

  1. వ్యాపార పవనాలు,
  2. పశ్చిమ పవనాలు,
  3. ధృవ పవనాలు.

ఋతు పవనాలు : కాలాన్ని బట్టి వీచే పవనాలు

స్థానిక పవనాలు : చినూక్, ఫోన్, లూ, సైమూన్, యెమో, నార్వేస్టర్ల్, మిస్ట్రాల్, ప్యూనా, పాంపెరొ.

ప్రాజెక్టు పని

ప్రశ్న 1.
నీటి వినియోగం మరియు దాని వృథా గురించి మీ పరిసరాల నుండి సమాచారాన్ని సేకరించండి. నీటి వృథాను నియంత్రించడానికి సూచనలివ్వండి.
జవాబు:
1) మా పాఠశాలలో త్రాగటానికి, వంట చేయడానికి, మొక్కలకు పోయటానికి, మరుగుదొడ్లను, పాఠశాల ఆవరణను శుభ్రపరచానికి నీటిని ఉపయోగిస్తాం.

2) నీరు వృథా అవుతున్న ప్రదేశం / సందర్భం :
ఎ) మరుగుదొడ్ల వద్ద కాళ్ళు, చేతులు, మొఖం కడుగుతూ వృథా చేస్తున్నారు.
బి) భోజన ప్లేట్లు శుభ్రపరిచే దగ్గర వృథా చేస్తున్నారు.
సి) త్రాగునీరు పట్టుకునే దగ్గర, త్రాగేటప్పుడు సగం త్రాగి సగం పారబోస్తున్నారు.
డి) కొన్ని సందర్భాలలో పైపు లీకవ్వటం మూలంగా కూడా నీరు వృథా అవుతుంది.

నీటి వృథాని అరికట్టడానికి తీసుకోవాల్సిన చర్యలు :

  1. పైపులలోని లీకేజులను నిర్మూలించాలి.
  2. మరుగుదొడ్లలో తక్కువ నీరు అవసరమయ్యే ఫ్లెష్ లను (కుళాయిలను) వాడాలి.
  3. సింకులలో నీటి వృథా తగ్గించాలి.
  4. మొక్కలకు కూడా నీటిని స్ప్రింక్లర్లు లాంటివి వినియోగించి వృథా తగ్గించాలి.
  5. అవకాశమున్న చోట్ల నీటిని పునర్వినియోగించాలి.

AP 6th Class Social Important Questions Chapter 12 సమానత్వం వైపు

These AP 6th Class Social Important Questions 12th Lesson సమానత్వం వైపు will help students prepare well for the exams.

AP Board 6th Class Social 12th Lesson Important Questions and Answers సమానత్వం వైపు

ప్రశ్న 1.
వైవిధ్యం ఎలా ఏర్పడుతుంది?
జవాబు:
వైవిధ్యం ఎలా ఏర్పడుతుందంటే :

  • భారతదేశం అనేక భిన్నత్వాలు కలిగిన దేశం. మనం అనేక భాషలు మాట్లాడతాం. వివిధ రకాల ఆహారం తీసుకుంటాం. రక రకాల పండుగలు జరుపుకుంటాం. భిన్న మతాలను ఆచరిస్తాం.
  • అనేక వందల సంవత్సరాల క్రితం – ప్రజలు స్థిరనివాసం కొరకు, వ్యాపారం చేయుటకు కొత్త ప్రాంతాలను అన్వేషిస్తూ ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి ప్రయాణం చేశారు.
  • తరుచుగా వారు వారి కొత్త ప్రాంతాలలో స్థిరపడటం ప్రారంభించారు. దీని ఫలితంగా పాత, కొత్త సంస్కృతుల కలయిక వలన ఈ ప్రాంతాలు భిన్నత్వం కలిగిన ప్రాంతాలుగా మారాయి.
  • అదే విధంగా ప్రజలు వారు నివసించే భౌగోళిక ప్రాంతానికి అనుగుణంగా వారి జీవన విధానాలను మార్చు కున్నప్పుడు కూడా భిన్నత్వం ఏర్పడుతుంది.
  • ఉదాహరణకు సముద్ర తీరంలోని జీవనశైలి ఎడారి ప్రాంత జీవనశైలికి భిన్నంగా ఉంటుంది.
  • అదే విధంగా వారి పని రకం కూడా ఒక ప్రాంతానికి ఇంకొక ప్రాంతానికి భిన్నంగా ఉంటుంది.

ప్రశ్న 2.
వివక్షత ఎలా ఏర్పడుతుంది?
జవాబు:
వివక్షత ఎలా ఏర్పడుతుందంటే :

  • భారతదేశ వైవిధ్యాలతో కూడిన దేశం కానీ అన్ని వైవిధ్యాలకు తగిన ప్రాధాన్యత లభించటం లేదు.
  • మనం మనలాగే కనిపించే, మాట్లాడే దుస్తులు ధరించే, ఆలోచించే వ్యక్తులతో సురక్షితంగా, భద్రంగా ఉన్నట్లు భావిస్తాం.
    AP 6th Class Social Important Questions Chapter 12 సమానత్వం వైపు 1
  • మనం మనకు పరిచయం లేని కొత్త వ్యక్తులను చూసినపుడు వారిని అర్థం చేసుకోకుండానే వారి మీద కొన్ని ప్రత్యేకమైన అభిప్రాయాలను ఏర్పరుచుకుంటాం.
  • ఇలా ప్రజలు ప్రతికూల అభిప్రాయాలను, పక్షపాత ధోరణిని అవలంబించడం వలన వివక్షత ఏర్పడుతుంది.

AP 6th Class Social Important Questions Chapter 12 సమానత్వం వైపు

ప్రశ్న 3.
కుల వ్యవస్థ ఎలా ఏర్పడుతుంది? కుల వివక్షత అంటే ఏమిటి?
జవాబు:
కుల వ్యవస్థ ఎలా ఏర్పడిందంటే :

  • ప్రజలు జీవనోపాధి కొరకు బోధన, వడ్రంగి, కుమ్మరి, నేతపని, చేపలు పట్టుట, వ్యవసాయం వంటి వివిధ రకాల వృత్తులను చేపట్టారు.
  • కొన్ని రకాల వృత్తులకు మాత్రమే ఎక్కువ గౌరవం లభించేది.
  • శుభ్రపరచడం, చెత్తను పోగు చేయుట వంటి పనులు తక్కువ విలువ కలిగినవిగాను, ఆ వృత్తులు చేసే వ్యక్తులను దూరంగా ఉంచడం వంటివి చేసేవారు.
  • ఈ నమ్మకమే కులవ్యవస్థకు పునాది.

కుల వివక్షత అంటే:

  • కుల వ్యవస్థలో కొన్ని వర్గాలు లేదా సమూహాలు’ పై స్థాయిలో లేక కింది స్థాయిలో ఉంచబడ్డాయి.
  • పై స్థాయిలో ఉంచబడినవారు ఉన్నత కులాలుగాను తమను తాము అగ్ర కులాలుగాను ఉన్నతులుగాను భావించేవారు.
  • కింది స్థాయిలో ఉంచబడిన వారిని అనర్హులుగా, అణగారినవారిగాను పరిగణించారు.
  • అణగారినవారిగా పరిగణింపబడే వీరికి కేటాయింపబడిన వృత్తి తప్ప వేరే వృత్తి చేపట్టడానికి అనుమతి లేకుండా కులనియమాలు విధించబడ్డాయి.
  • అగ్రకులాల వారు అనుభవించే హక్కులు నిమ్న కులాల వారిని అనుభవించనీయకపోవడమే కుల వివక్షత.

ప్రశ్న 4.
స్త్రీ హక్కుల కోసం సావిత్రిబాయి ఫూలే చేసిన సేవలు ఏవి?
జవాబు:
AP 6th Class Social Important Questions Chapter 12 సమానత్వం వైపు 2

  • జనాభాలో సగభాగం స్త్రీలు ఉన్నప్పటికీ విద్య, ఉద్యోగ అవకాశాలు, కుటుంబ నిర్ణయాలు తీసుకోవడంలో సమాన అవకాశాలు కల్పించబడలేదు.
  • పుట్టుక రీత్యా స్త్రీ, పురుషులు ఇద్దరూ సమానులే కాబట్టి వారిద్దరికీ సమానమైన సాంఘిక, రాజకీయ, ఆర్థిక హక్కులు ఉంటాయి.
  • పలువురు సంఘసంస్కర్తలు స్త్రీ హక్కుల కోసం ప్రపంచ వ్యాప్తంగా, దేశ వ్యాప్తంగా పోరాడారు. అలా పోరాడిన వారిలో సావిత్రీబాయి ఫూలే ఒకరు.
  • ఆమె మహారాష్ట్రకు చెందిన భారతీయ సంఘ సంస్కర్త, విద్యావాది, కవయిత్రి. ఆమె భారతదేశ ప్రథమ మహిళా ఉపాధ్యాయినిగా కీర్తించబడ్డారు.
  • బ్రిటీష్ వారి పరిపాలనలో ఆమె తన భర్త జ్యోతిరావు ఫూలే తో కలిసి భారతదేశంలో స్త్రీ హక్కుల ఉద్యమంలో ప్రముఖ పాత్ర వహించారు.
  • ఆమెను “భారతీయ స్త్రీ వాద మాతా మహి” అని కీర్తిస్తారు.
  • ఫూలే తన భర్తతో కలిసి పూనెలోని భిడేవాడలో భారతదేశంలోనే ప్రథమ బాలికల పాఠశాలను స్థాపించారు.
  • కుల, లింగ వివక్షత వలన ప్రజలకు జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడారు.

ప్రశ్న 5.
ప్రాంతీయ వివక్షత అనగా నేమి?
జవాబు:
AP 6th Class Social Important Questions Chapter 12 సమానత్వం వైపు 3
ప్రాంతీయ వివక్షత అనగా :
ఇది ఒక వ్యక్తి నివాస స్థలం లేదా జన్మ స్థలం ఆధారంగా ఈ చూపే వివక్షత. ఉదాహరణకు గ్రామాల పట్ల పట్టణాలు, చిన్న పట్టణాల పట్ల పెద్ద నగరాలు, గిరిజన ప్రాంతాల పట్ల మైదాన ప్రాంతాలు చూపే వివక్ష. ఇది పక్షపాతం లేదా మూసధోరణి కారణంగా మొదలవుతుంది.

ప్రశ్న 6.
దివ్యాంగుల పట్ల వివక్షత అని దేనిని భావిస్తారు?
జవాబు:
PWD చట్టం – 2016 ప్రకారం నడవలేని, చూడలేని, వినలేని, మాట్లాడలేని వ్యక్తులను దివ్యాంగులుగా పరిగణిస్తారు. వారిలో కొందరు పుట్టుకతో లేదా ప్రమాదాలలో శరీర భాగాలను కోల్పోవచ్చు. కొంతమంది వారిని అగౌరవం లేదా అవమానం పాలు చేస్తారు. ఇలాంటి వాటిని దివ్యాంగుల పట్ల వివక్షతగా భావిస్తాం.
AP 6th Class Social Important Questions Chapter 12 సమానత్వం వైపు 4

ప్రశ్న 7.
భారతదేశంలో అసమానతలకు గల మూలకారణాలేమిటి?
జవాబు:
AP 6th Class Social Important Questions Chapter 12 సమానత్వం వైపు 5
ఈ అసమానతలు, వివక్షతలకు మూల కారణాలు :

  1. అవిద్య
  2. అధికారం
  3. నమ్మకాలు
  4. వృత్తులు
  5. సంపద
  6. సంప్రదాయాలు మన సమాజంలో ఈ అసమానతలను, వివక్షను సృష్టించాయి.

ప్రశ్న 8.
అసమానత (వివక్షత)ల ఫలితాలను పేర్కొనండి.
జవాబు:
అసమానతల ఫలితాలు :

  • అసమానతలు దీర్ఘకాలిక సామాజిక, ఆర్థిక అభివృద్ధిని దెబ్బతీస్తాయి.
  • అసమానతలు సామాజిక అశాంతికి దారితీస్తాయి.
  • అసమానతలు ప్రజల్ని పేదరికంలోకి నెట్టివేసి వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తాయి.
  • ఇది నేరాల పెరుగుదలకు, వ్యాధుల విస్తరణకు, పర్యావరణ క్షీణతకు దారితీస్తుంది.
  • సుస్థిర అభివృద్ధిని సాధించలేం.
  • ప్రపంచ వ్యాప్తంగా కొందరు వ్యక్తుల సామర్థ్యాలు వెలుగులోకి రాకుండానే ఉండిపోతాయి.

ప్రశ్న 9.
సమానత్వ సాధనకు రాజ్యాంగంలో పొందు పరిచిన అంశాలు ఏవి?
జవాబు:
సమానత్వ సాధనకు రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలు :

  • 14వ నిబంధన : చట్టం ముందు అందరూ సమానం.
  • 15(1)వ నిబంధన : మతం, జాతి, కులం, లింగం, పుట్టిన ప్రదేశం వంటి అంశాల ఆధారంగా రాజ్యం ఏ ఒక్క పౌరుని పట్ల వివక్షత చూపరాదు.
  • 16వ నిబంధన : ప్రభుత్వ రంగ ఉద్యోగాలలో అందరికీ సమానావకాశాలు.
  • 17వ నిబంధన : అంటరానితనాన్ని పాటించడం నిషేధం. దీన్ని పాటించినవారు చట్ట ప్రకారం శిక్షించబడతారు.
    అణచివేతకు గురైన వర్గాలకు సమాన స్థాయిని కల్పించేటందుకు రిజర్వేషన్లు కల్పించబడ్డాయి.
  • 21(ఎ) నిబంధన : 6-14 వయసులో ఉన్న బాలలందరికీ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య ప్రభుత్వం చట్టం ద్వారా మరియు సంక్షేమ కార్యక్రమాల ద్వారా రెండు విధాలుగా సమానత్వాన్ని సాధించడానికి ప్రయత్నిస్తుంది.

ప్రశ్న 10.
అసమానతలు, వివక్షతలూ లక్ష్యసాధనను అడ్డుకుంటాయా? ఒక ప్రముఖ వ్యక్తిని ఆధారంగా తీసుకుని (ఏ.పి.జే అబ్దుల్ కలాం) వివరించండి.
జవాబు:
AP 6th Class Social Important Questions Chapter 12 సమానత్వం వైపు 6
డా|| ఏ.పి.జె. అబ్దుల్ కలాం : డాక్టర్ ఏ.పి.జె. అబ్దుల్ కలాం భారతదేశపు 11వ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన గొప్ప శాస్త్రవేత్త మరియు గొప్ప రచయిత. ఒక పేద కుటుంబం నుండి వచ్చినప్పటికీ, జీవితంలో ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ ఆయన తన లక్ష్యాన్ని చేరుకున్నారు. ఆయన రాసిన ‘వింగ్స్ ఆఫ్ ఫైర్” అన్న పుస్తకంలో ఇలా అంటాడు. “మనమందరం లోపల ఒక దైవాగ్నితో జన్మించాం. ఈ అగ్నికి రెక్కలిచ్చి ప్రపంచమంతటినీ ఆ మంచితనపు వెలుగులతో నింపడానికి మనం ప్రయత్నించాలి” ఆయన ఇంకా ఇలా అంటారు “మనకందరికీ సమాన ప్రతిభ ఉండకపోవచ్చు కానీ మన ప్రతిభను అభివృద్ధి ఏ.పి.జె. అబుల్ కలాం చేసుకోవడానికి అందరమూ సమాన అవకాశాన్ని కలిగి ఉన్నాం”.

ప్రశ్న 11.
క్రింది వారి గురించి నీకేమి తెలుసో వివరించండి.
1) డా॥ ఆనందీబాయి జోషి 2) డా|| నెల్సన్ మండేలా
జవాబు:
1) డా|| ఆనందీబాయి జోషి :
భారతదేశపు తొలి మహిళా వైద్యురాలు. తన మగబిడ్డ పుట్టిన పదిరోజులకే వైద్యం అందక మరణించాడు. ఈ విషాదం తనను వైద్యవిద్య చదివేలా ప్రేరేపించింది. 1886లో వైద్యురాలిగా పట్టా అందుకున్నారు. భారతదేశానికి తిరిగివస్తూండగా ఆమె క్షయ వ్యాధికి గురయ్యారు. 1887లో పూనెలో మరణించారు.
AP 6th Class Social Important Questions Chapter 12 సమానత్వం వైపు 7

2) డా|| నెల్సన్ మండేలా :
దక్షిణాఫ్రికా పూర్వ అధ్యక్షుడైన నెల్సన్ మండేలా 27 సంవత్సరాల జైలు జీవితం తర్వాత 1990లో విడుదలయ్యారు. జాతివివక్ష విధానానికి విజయవంతంగా ముగింపు పలికారు. జాతిపరంగా విభజితమై ఉన్న దేశంలో శాంతిని నెలకొల్పారు. ప్రపంచవ్యాప్తంగా మానవహక్కుల ఉద్యమానికి నాయకత్వం వహించారు. 1990లో భారతరత్న అవార్డును స్వీకరించారు. ఆయనను “దక్షిణాఫ్రికా గాంధీ” అని పిలుస్తారు.
AP 6th Class Social Important Questions Chapter 12 సమానత్వం వైపు 8

AP 6th Class Social Important Questions Chapter 11 భారతీయ సంస్కృతి, భాషలు మరియు మతాలు

These AP 6th Class Social Important Questions 11th Lesson భారతీయ సంస్కృతి, భాషలు మరియు మతాలు will help students prepare well for the exams.

AP Board 6th Class Social 11th Lesson Important Questions and Answers భారతీయ సంస్కృతి, భాషలు మరియు మతాలు

ప్రశ్న 1.
‘సంస్కృతి’ భావనను వివరించండి.
జవాబు:
‘సంస్కృతి’ భావన :

  • ఒక కొత్త వ్యవస్థని సృష్టించుకోవడం కోసం ముందు తరాల వారసత్వాన్ని అందిపుచ్చుకుని దానిని భావితరాలకు అందించడానికి జరిగే నిరంతర ప్రక్రియే సంస్కృతి.
  • ఇది ఒక విలువైన మరియు ప్రత్యేకమైన సంపద, సామాజిక పరిణామంలో నిరంతరంగా కొనసాగే ప్రక్రియ.
  • ‘సంస్కృతి’ అను పదం యొక్క అర్థం విస్తృతమైనది. సమగ్రమైనది.
  • సమాజంలో సభ్యులుగా మానవుడు సంపాదించిన జ్ఞానం, నమ్మకాలు, కళలు, నీతులు, చట్టం, ఆచారాలు, అలవాట్లు, ఇతర సామర్థ్యాలలో సంస్కృతి ఉంటుంది.
  • సంస్కృతి అనేది సమాజంలో నివసించే ప్రజల జీవన విధానం.
  • సంస్కృతి యొక్క ముఖ్యాంశం సమూహంలో ప్రసారం చేయబడిన సంప్రదాయ ఆలోచనల మీద ఆధారపడి ఉంది.

ప్రశ్న 2.
లిపి మన దేశంలో ఎలా అభివృద్ధి చెందింది? కొన్ని ప్రసిద్ది రచనలు రాయండి.
జవాబు:

  • రాతి లిపి మనం చదవడానికి మరియు రాయడానికి ఉపయోగపడుతుంది. ప్రజలు పురాతన కాలంలో బట్టలు, ఆకులు, చెట్ల బెరడు మొదలైన వాటిపై రాసేవారు.
  • ఎండిన ఆకులపై రాయడానికి వారు సూది వంటి వాటిని ఉపయోగించేవారు.
  • ప్రారంభంలో వారు బొమ్మలు మరియు గుర్తులను గీసేవారు. క్రమక్రమంగా లిపి అభివృద్ధి చెందింది. అశోకుడు వేయించిన అన్ని శాసనాల్లోనూ ‘బ్రాహ్మీ’ లిపిని ఉపయోగించాడు.
  • ప్రసిద్ధ పురాణాలైన వాల్మీకి రామాయణం మరియు వ్యాస మహాభారతం సంస్కృతంలో రాయబడ్డాయి.
  • భాష అభివృద్ధి చెందటం వల్ల ప్రసిద్ధ రచనలు ఉనికిలోకి వచ్చాయి.
  • ఆర్యభట్ట ఆర్యభట్టీయం’ అనే పుస్తకం రాశారు.
  • ఆయుర్వేదానికి పునాది వేసిన పుస్తకాలు ‘చరక సంహిత’ మరియు సుశ్రుత సంహిత’. శస్త్రచికిత్సలపై రాయబడిన గ్రంథమే సుశ్రుత సంహిత.

AP 6th Class Social Important Questions Chapter 11 భారతీయ సంస్కృతి, భాషలు మరియు మతాలు

ప్రశ్న 3.
‘భిన్నత్వంలో ఏకత్వం’ అంటే ఏమిటి? భిన్నత్వానికి గల కారణాలు ఏవి?
జవాబు:
భారతీయ సంస్కృతిని ఒక ప్రత్యేకమైనదిగా పిలవడానికి ‘భిన్నత్వంలో ఏకత్వమే’ ప్రముఖమైనది. భారతీయ సంస్కృతి క్రియాశీలకం మరియు సమ్మిళితం.
AP 6th Class Social Important Questions Chapter 11 భారతీయ సంస్కృతి, భాషలు మరియు మతాలు 1

భిన్నత్వానికి గల కారణాలు :

  1. విశాలమైన దేశం.
  2. అనేక జాతుల అనుసంధానం.
  3. భౌగోళిక మరియు శీతోష్ణస్థితి అంశాలలో తేడాల కారణంగా వైవిధ్యం

ఎన్ని వైవిధ్యాలు ఉన్నప్పటికీ దేశ ప్రజలందరూ తామంతా భారతీయులమని భావిస్తారు. ఈ ఏకత్వ భావననే ‘భిన్నత్వంలో ఏకత్వం’ అని అంటారు.

ప్రశ్న 4.
భారత రాజ్యాంగం గుర్తించి భాషలు ఎన్ని? అవి ఏవి?
జవాబు:
భారత రాజ్యాంగం 22 భాషలను గుర్తించినది (8వ షెడ్యూల్)
AP 6th Class Social Important Questions Chapter 11 భారతీయ సంస్కృతి, భాషలు మరియు మతాలు 2

ప్రశ్న 5.
భారతదేశంలో ‘మతం’ పరిణామం గూర్చి రాయండి.
జవాబు:
భారతదేశంలో అనేక మతాలు ఉన్నప్పటికీ భారతీయులంతా కలిసిమెలిసి జీవిస్తున్నారు.

  • ఎక్కడైతే ప్రజలు నివాసముంటారో, అక్కడ కొన్ని రకాల ఆచారాలు మరియు సంప్రదాయాలు ప్రారంభమవుతున్నాయి.
  • ఈ ఆచారాలు మరియు సంప్రదాయాలు, వనరులు, పర్యావరణం, వాతావరణ పరిస్థితులు మొదలైన వాటిపై ఆధారపడి ఉంటాయి.
  • నేటి మత విశ్వాసాలు కూడా ఇటువంటి ఆచార సంప్రదాయాలపై ఆధారపడి ఉన్నాయి.
  • అయినప్పటికీ ప్రపంచంలోని అన్ని సమాజాల్లోనూ కొన్ని ఆచార వ్యవహారాలు సాధారణంగా ఉన్నాయి.
  • మతం అనేది ఒక ఆధ్యాత్మిక చింతన. ఇది సుఖమయ జీవితం గడపటానికి కొన్ని విలువులను పాటించమనిబోధిస్తుంది.

ప్రశ్న 6.
హిందూ మతం గురించి, ప్రధాన లక్షణాలు గూర్చి తెల్పండి.
జవాబు:
హిందూ మతం :

  • ప్రపంచంలోని మతాలలో హిందూ మతం చాలా పురాతనమైనది. ఇది ఒక జీవన విధానం మరియు దీనిని “సనాతన ధర్మం” అనికూడా పిలుస్తారు.
    AP 6th Class Social Important Questions Chapter 11 భారతీయ సంస్కృతి, భాషలు మరియు మతాలు 3
  • విశ్వమానవ మూల సూత్రాలపై ఆధారపడినదే హిందూ మతం.
  • హిందూ మతంలో అనేక రకాల పూజా విధానాలు కలవు. అనేక మార్గాల ద్వారా భగవంతుడిని చేరవచ్చు.
  • అన్ని జీవులలో మరియు నిర్జీవులలో కూడా భగవంతుడు ఉన్నాడని ఈ మతం తెలియజేస్తుంది.
  • వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, రామాయణం మరియు మహాభారతం హిందువుల పవిత్ర గ్రంథాలు.
  • విష్ణువు, శివుడు, ఆదిశక్తి, రాముడు మరియు కృష్ణుడు హిందువులు ఆరాధించే దేవతలు.
  • సంక్రాంతి, దసరా, దీపావళి మొదలైనవి హిందువులు జరుపుకునే కొన్ని పండుగలు.
  • భారతదేశంలోని అమర్‌నాథ్, బద్రీనాథ్, వారణాసి, పూరి, సింహాచలం, శ్రీశైలం, భద్రాచలం, తిరుమల, కంచి మదురై, శబరిమలై, రామేశ్వరం వంటి అనేక దేవాలయాలను హిందువులు సందర్శిస్తారు.

హిందూ మత ప్రధాన లక్షణాలు :

  • మానవసేవే మాధవ సేవ.
  • విశ్వమానవ కుటుంబం. (వసుదైక కుటుంబం)
  • ఏకాగ్రత ద్వారా మోక్షాన్ని పొందడం. (తపస్సు)
  • చతుర్విధ పురుషార్థాలను అభ్యసించడం (ధర్మం, అర్థం, కామం, మోక్షం వంటి నాలుగు రకాల అభ్యాసాలు) ‘హిందూ’ అనే పదం ‘సింధు’ అనే పదం నుండి వచ్చింది.
  • నాలుగు ఆశ్రమాలను ఆచరించడం వాటి పేర్లు బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, వానప్రస్థం, సన్యాసం.

ప్రశ్న 7.
తిరుమల తిరుపతి వెంకటేశ్వరస్వామి ఆలయం గూర్చి నీకు ఏమి తెలుసు?
జవాబు:

  • ప్రపంచంలో అత్యధికంగా సందర్శించే పవిత్ర ప్రదేశాలలో చిత్తూరు జిల్లాలోని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఒకటి. ఇది శేషాచలం కొండలలో కలదు. దీనిని హిందువులు పవిత్ర దేవాలయంగా భావిస్తారు.
    AP 6th Class Social Important Questions Chapter 11 భారతీయ సంస్కృతి, భాషలు మరియు మతాలు 4
  • హిందువుల ప్రకారం, విష్ణువు యొక్క అవతారమే శ్రీ వెంకటేశ్వర స్వామి.
  • ఇక్కడి దేవుణ్ణి శ్రీనివాస, గోవింద మరియు బాలాజీ అని పిలుస్తారు.
  • తిరుమలలోని శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రసిద్ది చెందినవి.

ప్రశ్న 8.
జైన మతం ఆవిర్భావం గురించి, సిద్ధాంతాల గురించి వివరించండి.
జవాబు:
జైన మతం :

  • జైన మతం ఒక ప్రాచీన భారతీయ మతం.
  • ఈ మతాన్ని అనుసరించే వారిని జైనులు అంటారు.
  • ఇరవై నాలుగు మంది ‘తీర్థంకరులు’ ఈ మతాన్ని బాగా ప్రాచుర్యంలోకి తెచ్చారు.
  • జైన అనే పదం ‘జిన’ అనే సంస్కృత పదం నుండి వచ్చింది.
  • మహావీరుడు మిక్కిలి ప్రసిద్ధిచెందిన తీర్థంకరుడు అతను ఒక యువరాజు.
  • అతను ఆధ్యాత్మిక విషయాల గురించి ఎక్కువగా తెలుసుకోవడానికి అన్నింటినీ వదిలి, 12 సంవత్సరాలు అనేక ప్రదేశాలను సత్యాన్వేషణ కోసం సందర్శించాడు.
  • జైన మతం యొక్క ప్రధాన లక్ష్యం ‘మోక్షం’ సాధించడం.
  • కైవల్యం లేదా జినను సాధించినప్పుడు, ఆత్మ కర్మల నుండి విముక్తి పొందుతుంది.
  • ఆ ఆనంద స్థితినే ‘మోక్షం’ అంటారు. తీర్థంకరులు జైనులకు ఆధ్యాత్మిక గురువులు. మహావీరుడు చివరి తీర్థంకరుడు.
  • మహావీరుని బోధనలను అతని అనుచరులు అనేక గ్రంథాలలో సంకలనం చేశారు. ఆ గ్రంథాలను ‘అంగాలు’, అంటారు. ‘అంగాలు’ జైనుల పవిత్ర గ్రంథాలు.

జైన మత సిద్ధాంతాలు : (పంచ వ్రతాలు)

  1. అహింస – Non violence
  2. సత్యం – Truthfulness
  3. ఆస్తేయం – Non-stealing
  4. అపరిగ్రహం – Non-possessiveness
  5. బ్రహ్మచర్యం – Centeredness

ఈ జాబితాలో బ్రహ్మచర్యమును మహావీరుడు చేర్చాడు. పై ఐదు సిద్ధాంతాలను అనుసరించడానికి, మహావీరుడు మూడు మార్గాలను సూచించాడు. వాటిని త్రిరత్నాలు అంటారు.

త్రిరత్నాలు :

  1. సమ్యక్ దర్శనం – సరైన విశ్వాసం
  2. సమ్యక్ జ్ఞానం – సరైన జ్ఞానం
  3. సమ్యక్ చరిత్ర – సరైన ప్రవర్తన

AP 6th Class Social Important Questions Chapter 11 భారతీయ సంస్కృతి, భాషలు మరియు మతాలు

ప్రశ్న 9.
గోమఠేశ్వర ఆలయం గురించి నీ కేమి తెలుసు?
జవాబు:
AP 6th Class Social Important Questions Chapter 11 భారతీయ సంస్కృతి, భాషలు మరియు మతాలు 5

  • గోమఠేశ్వర ఆలయం కర్ణాటకలోని శ్రావణబెళగొళ వద్ద ఉంది.
  • ఇది చారిత్రక జైన దేవాలయం.
  • గోమఠేశ్వర విగ్రహం ప్రపంచంలోనే అతిపెద్ద ఏకశిలా విగ్రహాలలో ఒకటి.
  • దీని ఎత్తు 57 అడుగులు. దీనిని బాహుబలి అంటారు.

ప్రశ్న 10.
సాంచి స్థూపం గురించి నీకేమి తెలుసు?
జవాబు:

  • సాంచి వద్ద ఉన్న స్థూపం గొప్ప బౌద్ధ స్మారక కట్టడాలలో ఒకటి.
  • ఇది బౌద్ధ కళ మరియు నిర్మాణ శైలిని తెలియజేస్తుంది.
  • ఇది భారతదేశంలో గల పురాతన రాతి నిర్మాణాలలో ఒకటి.
  • దీనిని క్రీస్తుపూర్వం మూడో శతాబ్దంలో అశోక చక్రవర్తి నిర్మించాడు.
  • ఇది మధ్య భారతదేశంలో సంరక్షించబడిన పురాతన స్థూపాలలో ఒకటిగా పరిగణించబడుతున్నది.
    AP 6th Class Social Important Questions Chapter 11 భారతీయ సంస్కృతి, భాషలు మరియు మతాలు 6

ప్రశ్న 11.
బౌద్ధమత ఆవిర్భావం, బౌద్ధమత బోధనల గురించి వివరించండి.
జవాబు:
బౌద్ధమతం :

  • బౌద్ధమత స్థాపకుడు గౌతమ బుద్ధుడు. అతను లుంబిని వనం (నేపాల్)లో జన్మించాడు.
  • అతని మొదటి పేరు సిద్ధార్థుడు.
  • జ్ఞానోదయం అయిన తరువాత బుద్ధుడయ్యాడు.
  • సిద్ధార్థుడు కపిలవస్తు పాలకుడైన, శుదోధనుడు మరియు అతని రాణి మాయాదేవికి జన్మించాడు.
  • సిద్ధార్థుడికి యశోదరతో వివాహం జరిగింది. ఆ దంపతులకు “రాహుల్”. అనే కుమారుడు జన్మించాడు.
  • ఒకరోజు సిద్ధార్థుడు తన ప్రయాణంలో ఒక రోగి, ఒక వృద్ధుడు, ఒక సన్యాసి మరియు ఒక మృతదేహాన్ని చూశాడు. అప్పుడు సిద్ధార్థుడు జీవితం యొక్క నిజమైన స్వభావాన్ని తెలుసుకున్నాడు.
  • అతను తన రాజ్యాన్ని మరియు కుటుంబాన్ని విడిచిపెట్టి అడవికి వెళ్ళాడు. అతను సత్యం మరియు శాంతికోసం పరిశోధించాడు.
  • కఠినమైన ధ్యానంలో కూర్చున్నాడు. 6 సంవత్సరాల తరువాత, అతనికి జ్ఞానోదయం అయింది.
  • అతను జ్ఞానోదయం పొందిన చెట్టుకు ‘బోధి వృక్షం’ అని పేరు పెట్టారు. ఉత్తరప్రదేశ్ లోని కుశినగర్ లో సిద్ధార్థుడు స్వర్గస్థుడైనాడు.
  • బుద్ధుని ప్రకారం, మోక్షం సాధించడమే జీవిత పరమార్థం. మోక్షాన్ని బలుల ద్వారా లేదా ప్రార్థనల ద్వారా సాధించలేము.
  • మధ్యే మార్గం (అష్టాంగ మార్గం)ను అనుసరించడం ద్వారా మోక్షం సాధించవచ్చని తెలిపాడు. అహింసా సిద్ధాంతాలపై బౌద్ధమతం ఆధారపడి ఉంది.
  • త్రిపీఠకాలు బౌద్ధమత పవిత్ర గ్రంథాలు. అవి బుద్ధుని జీవితం, బోధనలు మరియు తాత్విక ఉపన్యాసాల సమాహారం. గౌతమ బుద్ధుని బోధలను ఆర్య సత్యాలు అంటారు.

ఆర్య సత్యాలు :

  • ప్రపంచం దుఃఖమయం.
  • దుఃఖం కోరికల వల్ల కలుగుతుంది.
  • కోరికలను త్యజించడం ద్వారా మోక్షం పొందవచ్చు.
  • అష్టాంగ మార్గాన్ని పాటించడం ద్వారా మోక్షాన్ని సులభంగా పొందవచ్చు.

AP 6th Class Social Important Questions Chapter 11 భారతీయ సంస్కృతి, భాషలు మరియు మతాలు

ప్రశ్న 12.
క్రైస్తవ మత సిద్ధాంతం గురించి వివరించండి.
జవాబు:
క్రైస్తవ మతం ప్రపంచ వ్యాప్తంగా విస్తృతంగా ఆచరింపబడే మతం. క్రైస్తవుల పవిత్ర గ్రంథం బైబిలు.

క్రైస్తవ మత సిద్ధాంతం :

  • మానవులందరూ దేవుని పిల్లలు.
  • పాపాలు చేయకుండా పవిత్రమైన జీవితాన్ని గడపండి.
  • నిన్ను నీవు ప్రేమించుకున్నట్లు నీ పొరుగువారిని కూడా ప్రేమించండి.
  • ఒక చెంపపై కొట్టినప్పుడు, మరొక చెంప చూపించు. మానవ సేవే మాధవ సేవ.

ప్రశ్న 13.
ఇస్లాం మత ప్రవక్త అయిన మహమ్మద్ ప్రవక్త గురించి, వారి బోధనల గూర్చి తెలుపుము.
జవాబు:
AP 6th Class Social Important Questions Chapter 11 భారతీయ సంస్కృతి, భాషలు మరియు మతాలు 7

  • మహమ్మదు ప్రవక్త లేదా అల్లా యొక్క దూతగా భావిస్తారు.
  • అల్లా యొక్క బోధనలు ‘ఖురాన్’ అనే పుస్తకంలో రాయబడింది.
  • ఇది ముస్లింల పవిత్ర గ్రంథం.
  • మహమ్మద్ ప్రవక్త మానవులందరూ సోదరులని బోధించాడు.
  • సమస్త మానవాళికి ప్రేమ యొక్క ప్రాముఖ్యతను తెలియజెప్పాడు.
  • మహమ్మద్ ప్రవక్త దేవుడు ఒక్కడే అని బోధించాడు.

మహమ్మద్ ప్రవక్త బోధనలు :

  • మానవులందరూ అల్లాచే సృష్టించబడ్డారు.
  • మానవులందరూ దేవుని ముందు సమానం.
  • దేవునికి ఆకారం లేదు కాబట్టి విగ్రహారాధన సరియైనది కాదు.
  • ప్రతి ముస్లిం దేవుని సేవకునిగా మారి నిజాయితీగా ఉండాలి.

ప్రశ్న 14.
ఈ క్రింది వానిని గురించి నీకేమి తెలుసో వ్రాయండి.
ఎ) సెయింట్ పీటర్స్ బసిలికా (చర్చి)
బి) కాబా
సి) స్వర్ణదేవాలయం
జవాబు:
ఎ) సెయింట్ పీటర్స్ బసిలికా (చర్చి) :
ప్రపంచంలోని ప్రసిద్ధ చర్చి రోమన్ కాథలిక్ చర్చి. ఇది వాటికన్ నగరంలో కలదు. రోమన్ కాథలిక్ చర్చికి అధిపతిని పోప్ అంటారు. వాటికన్ నగరం ప్రపంచంలోనే అతి చిన్న దేశం.
AP 6th Class Social Important Questions Chapter 11 భారతీయ సంస్కృతి, భాషలు మరియు మతాలు 8

బి) కాబా :
ప్రసిద్ధ మక్కా మసీదు (సౌదీ అరేబియా) మధ్యలో ఉన్న భవనమే కాబా. ముస్లింలకు పవిత్రమైన నగరం మక్కా ముస్లిం భక్తులు తమ జీవిత కాలంలో కనీసం ఒక్కసారైనా హజ్ (తీర్థయాత్ర)కు మక్కాకు వెళ్ళాలనుకుంటారు.
AP 6th Class Social Important Questions Chapter 11 భారతీయ సంస్కృతి, భాషలు మరియు మతాలు 9

సి) స్వర్ణదేవాలయం :
పంజాబ్ లోని అమృతసర్ నగరంలో స్వర్ణదేవాలయం ఉంది. ఇది పవిత్రమైన గురుద్వారా మరియు సిక్కులకు అత్యంత ముఖ్యమైన పుణ్యక్షేత్రం.
AP 6th Class Social Important Questions Chapter 11 భారతీయ సంస్కృతి, భాషలు మరియు మతాలు 10

ప్రశ్న 15.
సిక్కుమతం గురించి వివరించండి.
జవాబు:

  • సిక్కు మతం స్థాపకుడు గురునానక్.
  • సిక్కు అనేది ఒక విశ్వాసం మరియు దాని అనుచరులను “సిక్కులు” అంటారు.
  • సిక్కు అనే పదానికి విద్యార్థి లేదా శిష్యుడు అని అర్థం.
  • సిక్కుల “పదిమంది గురువులలో” మొదటివాడు గురునానక్.
  • సిక్కుల ఆలయాన్ని ‘గురుద్వారా’ అంటారు. సిక్కుల పవిత్ర గ్రంథం ‘గురుగ్రంథ్ సాహెబ్’.

ప్రశ్న 16.
భారతదేశంలోని ప్రధాన భాషలను అవి మాట్లాడే రాష్ట్రాలలో గుర్తించండి.
జవాబు:

  1. జమ్ముకాశ్మీర్ – కాశ్మీరి
  2. పంజాబ్ – పంజాబి
  3. గుజరాత్ గుజరాతి
  4. మహారాష్ట్ర – మరాఠి
  5. గోవా – కొంకణి
  6. కర్ణాటక – కన్నడ
  7. తమిళనాడు – తమిళం
  8. కేరళ – మళయాళం
  9. ఆంధ్రప్రదేశ్ – తెలుగు
  10. తెలంగాణ – తెలుగు
  11. ఒడిషా – ఒడియా
  12. పశ్చిమ బెంగాల్ – బెంగాలీ
  13. అసోం – అస్సామి
  14. సిక్కిం – నేపాలి
  15. నాగాలాండ్ – నాగామి
  16. మణిపూర్ – మణిపురి
  17. మిజోరాం – మిజో
  18. మేఘాలయా – ఖాసి
  19. అరుణాచల్ ప్రదేశ్ – నైషి
  20. మిగతా రాష్ట్రాలలో – హిందీ

AP 6th Class Social Important Questions Chapter 11 భారతీయ సంస్కృతి, భాషలు మరియు మతాలు 11

ప్రశ్న 17.
వర్థమాన మహావీరుడు, గౌతమ బుద్ధుడు, వీరి యొక్క జననం, జన్మస్థలం, తల్లిదండ్రులు, జీవిత భాగస్వామి, బిరుదులు, మరణం గూర్చి తెల్పుము.
జవాబు:
i) వర్థమాన మహావీరుడు :
పేరు : వర్థమానుడు
జననం : క్రీ.పూ. 599
జన్మస్థలం : వైశాలి
తల్లిదండ్రులు : సిద్ధార్థ, త్రిషాల
జీవిత భాగస్వామి : యశోద
బిరుదులు : మహావీర జిన
మరణం : క్రీ.పూ. 527

ii) గౌతమ బుద్ధుడు
పేరు : సిద్దారుడు
జననం : క్రీ.పూ. 563
జన్మస్థలం : లుంబిని
తల్లిదండ్రులు : సుదోధనుడు, మాయాదేవి
జీవిత భాగస్వామి : యశోధర
కుమారుడు : రాహుల్
బిరుదులు : గౌతముడు, బుద్ధుడు
మరణం : క్రీ.పూ. 483

AP 6th Class Social Important Questions Chapter 11 భారతీయ సంస్కృతి, భాషలు మరియు మతాలు

ప్రశ్న 18.
భారతదేశ సంస్కృతి మరియు వారసత్వం గూర్చి తెలిపి, వాని సమైక్యత ఎలా సాధ్యమైంది? (సాధ్యమైంది)
జవాబు:

  • భారతదేశం సువిశాలమైనది. మన దేశంలో అనేక మతాలు, కులాలు, తెగలు, భాషలు, నృత్యరీతులు, శిల్పకళలు, ఆహారం, వేషధారణ, ఆచారాలు మరియు సంప్రదాయాలు కలవు. భారతదేశానికి గొప్ప సంస్కృత మరియు వారసత్వం కలదు. ఇది ఒక విభిన్నమైనది. ప్రపంచంలో దీనికి ఒక ప్రత్యేక గుర్తింపు కలదు.
  • భారతదేశంలో సంప్రదాయాలు ఒక ప్రాంతానికి మరొక ప్రాంతానికి వేరు వేరుగా ఉంటాయి.
  • ఇది అనేక ఆచార సంప్రదాయాల సమ్మిళితం.
  • భారతదేశంలో అనేక ఆచార, సాంప్రదాయాలు ఉన్నప్పటికీ, భారతీయులందరి మధ్య సోదర భావం కలదు.
  • అన్ని మతాలవారు ఇతర మతపరమైన వేడుకల్లో చురుకుగా పాల్గొంటారు. ఉదాహరణకు దీపావళి, హోలీ, కడప దర్గాలోని ఉరుసు ఉత్సవం, రక్షాబంధన్ మరియు నెల్లూరులోని రొట్టెల పండుగ. దీనిద్వారా ప్రాథమికంగా అన్ని మతాలు సమానమని, చివరికి దేవుని సన్నిధికి దారితీస్తున్నాయనే వాస్తవాన్ని అంగీకరిస్తున్నారు.
  • ఒక మతం వారు తమ సొంత ఉనికిని కోల్పోకుండా ఇతర మతాలతో కలిసి ఒకే వేదికపై చేసే సహజీవనం ఇది.

ప్రశ్న 19.
బౌద్ధ, జైన మతాలలోని కొన్ని సారూప్యాలను వ్రాయండి.
జవాబు:

  1. ఈ రెండు మతాల వ్యవస్థాపకులు గణసంఘాలలో జన్మించారు.
  2. ఇద్దరూ చిన్నవయస్సులోనే ఇంటిని వదిలి పరివ్రాజకులయ్యారు.
  3. ఇద్దరూ ధ్యానం, తపస్సు ద్వారా జ్ఞానాన్ని పొందారు.
  4. రెండు మతాలు సత్య, అహింసలను బోధించాయి.
  5. రెండు మతాలు వ్యక్తిత్వ ఉన్నతి ప్రభోదించాయి.

ప్రశ్న 20.
వైవిధ్యభరితమైన వారసత్వమున్న భారతదేశంలో నివసించటం మీ జీవితాన్ని ఎలా సుసంపన్నం చేస్తుంది?
జవాబు:
భారతదేశంలో జన్మించడం, జీవించడమే నాకు పెద్ద సంపద క్రింద లెక్క. ఇక్కడ పుట్టిన వేదాలు మనిషినేగాక మానును కూడా ఎలా గౌరవించాలో చెబుతాయి. వేదాంతాలు ‘నేను’ అంటే ఏమిటో తెలియచేస్తాయి. ఇక్కడ పుట్టిన బౌద్దం, ఇక్కడకొచ్చిన క్రైస్తవం తోటి మానవుణ్ణి, జంతువును కూడా ఎలా ప్రేమించాలో చెబుతాయి. ఇక్కడ కొచ్చిన ఇస్లాం చెడు మీద మంచి విజయం ఎలా సాధించాలో చెబుతుంది. ఇలాంటి వారసత్వమున్న దేశంలో జీవించడం నాకు కోట్ల ఆస్తితో సమానం.

ప్రశ్న 21.
వేర్వేరు మతాలలోని ఏకత్వాన్ని తెలిపే అంశాల పట్టికను తయారు చేయండి.
జవాబు:
వేర్వేరు మతాలలోని ఏకత్వాన్ని తెలిపే అంశాల పట్టిక :

  1. మార్గాలు, మతాలు వేరైనా దేవుడొక్కడే.
  2. చాలా మతాలవారికి శుక్రవారం మంచిరోజు.
  3. పూజా సమయానికి ముందు శరీరాన్ని శుభ్రపరచుకోవడం.
  4. భగవంతుని ధ్యానించే వారు ఆ సమయంలో తలపైన వస్త్రాన్ని కప్పుకోవడం.
  5. మండల (40 రోజుల) దీక్షలు పాటించడం. (ఈస్టర్, అయ్యప్ప 41 దినములు, రంజాన్ 30 దినములు).
  6. భగవంతుని పునరుత్థానాన్ని అందరూ నమ్మడం.
  7. అహింస, సత్యపాలన మొదలైనవి ఆచరించడం మొదలగునవి.

ప్రశ్న 22.
కరెన్సీ నోటును చూసి దానిపైనున్న వివిధ లిపులను గుర్తించండి. ఏయే భాషలలో దీనిమీద రాసి ఉన్నాయి. ఒకే లిపిలో వివిధ భాషలు రాసి ఉన్నాయి. అవి ఏవి?
జవాబు:
ఉదా : 20 రూపాయల నోటును తీసుకుంటే దానిమీద 15 భాషలలో వ్రాయబడి ఉన్నది.

  1. అస్సామీ – కుడిటక.
  2. బెంగాలీ – కుడిటక
  3. గుజరాతీ – వీస్ రుపియా
  4. కన్నడ – ఇప్పట్టురుపయగలు
  5. కాశ్మీరీ – ఊహ్ రోపియి
  6. కొంకణి – వీస్ రుపియా
  7. మళయాళం – ఇరుపట్ రూపా
  8. మరాఠీ – వీస్ రుపియా
  9. నేపాలీ – బీస్ రుపియా
  10. ఒరియా – బకాదాహకా
  11. పంజాబ్ – వీహ్ రుపయే.
  12. సంస్కృతం – వింశతి రూప్యకా
  13. తమిళం – ఇరుపదు రూపాయ్
  14. తెలుగు – ఇరువది రూపాయలు
  15. ఉర్దు – బీస్ రుపియాన్

వీటిలో అస్సామీ, బెంగాలీ ఒకే లిపిలోనూ, గుజరాతీ, మరాఠీ, కొంకణి ఒకే లిపిలో ఉన్నాయి.

ప్రశ్న 23.
మీ పరిసరాలలో భిన్నత్వం ఉందని తెలిపే రెండు ఉదాహరణలు తెలపండి.
జవాబు:
మా పరిసరాలలో భిన్నత్వం ఉందని తెలపడానికి ఈ క్రింది రెండు అంశాలు ఉదాహరణలు.

  1. మాది ఆంధ్రప్రదేశ్ లో ఒక నగరం. మేమంతా తెలుగువారము. కాని మానగరంలో అనేక భాషలవారున్నారు. ఇందుకు
    ఉదా : మా ఊరిలో ఉన్న తమిళపాఠశాల, గురునానక్ కాలని.
  2. మాది భారతదేశము. ఎక్కువమంది హిందువులుండే దేశము. కాని ఇక్కడ అనేక మతాలవారున్నారు. ఇందుకు
    ఉదా : కాశీలో విశ్వేశ్వరుని మందిరము, నాగపట్నంలో వేళాంగిణీ మాత చర్చి, జుమ్మా మసీదు.

AP 6th Class Social Important Questions Chapter 11 భారతీయ సంస్కృతి, భాషలు మరియు మతాలు

ప్రశ్న 24.
మత విశ్వాసాల మధ్య గల పోలికలను, భేదాలను పట్టిక రూపంలో రాయండి.
జవాబు:
పోలికలు :

  1. అందరి భావాలు దేవుడొక్కడే అని చెబుతున్నాయి.
  2. పరలోక జీవితాన్ని విశ్వసిస్తున్నాయి.
  3. ప్రేమ తత్వాన్ని బోధిస్తున్నాయి.
  4. తోటి ప్రాణి మంచిని కోరుతున్నాయి.

భేదాలు:

  1. భగవంతుని రూపాలలో భేదాలున్నాయి.
  2. ప్రార్థనా విధానాలలో భేదాలున్నాయి.
  3. ‘పునర్జన్మ’ సిద్ధాంతం నమ్మికలో భేదాలున్నాయి.
  4. మతాన్ని అర్థం చేసుకోవటంలో కూడా భేదాలున్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్కరకంగా అర్థం చేసుకుని వాటిని వ్యాఖ్యానిస్తున్నారు.

ప్రశ్న 25.
ప్రపంచ పటంలో ఈ క్రింది వాటిని గుర్తించండి.
అ) జెరూసలేం ఆ) మక్కా ఇ) కేరళ రాష్ట్రం ఈ) చెన్నె ఉ) సింధూనది ఊ) రోమ్ ఎ) అమృతసర్
జవాబు:
AP 6th Class Social Important Questions Chapter 11 భారతీయ సంస్కృతి, భాషలు మరియు మతాలు 12

AP 6th Class Social Important Questions Chapter 10 స్థానిక స్వపరిపాలన

These AP 6th Class Social Important Questions 10th Lesson స్థానిక స్వపరిపాలన will help students prepare well for the exams.

AP Board 6th Class Social 10th Lesson Important Questions and Answers స్థానిక స్వపరిపాలన

ప్రశ్న 1.
భారతదేశంలో స్థానిక స్వపరిపాలనా ఏర్పాటు చేసిన విధమును వివరించండి.
జవాబు:
భారతదేశంలో స్థానిక స్వపరిపాలన, రాష్ట్ర స్థాయి కంటే దిగువన ఉన్న ప్రభుత్వ అధికార పరిధిని సూచిస్తుంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 40 స్థానిక స్వపరిపాలవను సూచిస్తుంది. ఈ ఆర్టికల్ మన జాతిపిత గాంధీజీ అభిప్రాయాలకు అనుగుణంగా రాజ్యాంగంలో చేర్చబడింది. భారత పార్లమెంట్ రెండు సవరణలు చేసింది. 1992వ సంవత్సరంలో చేయబడిన 73వ రాజ్యాంగ సవరణ గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక స్వపరిపాలనను, 74వ సవరణ పట్టణ ప్రాంతాల్లో స్థానిక స్వపరిపాలనలను ఏర్పాటు చేశాయి. ఈ సవరణల ప్రకారం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంచాయితీ రాజ్ చట్టం 1994ను చేసి రాష్ట్రంలోని గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో స్థానిక స్వపరిపాలనను ఏర్పాటు చేసింది.

ప్రశ్న 2.
ఆంధ్రప్రదేశ్ లో స్థానిక స్వపరిపాలన గ్రామీణ ప్రాంతాల్లో ఎన్ని స్థాయిల్లో కలదు? అవి ఏవి?
జవాబు:
ఆంధ్రప్రదేశ్ పంచాయితీ రాజ్ చట్టం 1994 గ్రామీణ ప్రాంతాల్లో మూడు అంచెల స్థానిక స్వపరిపాలనలను ఏర్పాటు చేసింది. అవి గ్రామ స్థాయిలో గ్రామ పంచాయితీ, మండల స్థాయిలో మండల ప్రజా పరిషత్ మరియు – జిల్లా స్థాయిలో జిల్లా ప్రజా పరిషత్.

AP 6th Class Social Important Questions Chapter 10 స్థానిక స్వపరిపాలన

ప్రశ్న 3.
గ్రామ పంచాయితీలోని వార్డుల గురించి తెలుపుము.
జవాబు:
సాధారణంగా ప్రతి గ్రామాన్ని కొన్ని వార్డులు (వీధులు, కాలనీలు)గా విభజిస్తారు. ప్రతి వార్డులో ఓటర్ల సంఖ్య దాదాపు సమానంగా ఉంటుంది. ప్రతివార్డు నుంచి ఒక సభ్యుడు గ్రామపంచాయితీకి ఎన్నికవుతారు. అతనిని “వార్డు సభ్యుడు” అని పిలుస్తారు. ఈ విధంగా ప్రతి వీధి / ప్రాంతం నుంచి ఒక వ్యక్తి గ్రామ పంచాయితీకి ప్రాతినిధ్యం వహిస్తారు. ప్రతి గ్రామ పంచాయితీకి జనాభాను బట్టి 5 నుంచి 21 మంది వరకు వార్డు సభ్యులుంటారు. 21 సంవత్సరాలు నిండిన వారు గ్రామ పంచాయితీ ఎన్నికలలో పోటీ చేయవచ్చు.

ప్రశ్న 4.
గ్రామ పంచాయితీల్లో రిజర్వేషన్లు ఏ విధంగా అమలవుతున్నాయి?
జవాబు:
ఇంతకుముందు మన సమాజంలో స్త్రీలు ఎన్నికలలో పోటీచేయడం, వార్డు మెంబరు గానో, సర్పంచ్ గానో ఎన్నిక కావడం అంత సులభం కాదు. ఎందుకంటే స్థానిక సంస్థలలో పురుషుల ఆధిక్యం ఉంది. దీనివల్ల సగం జనాభాకు ప్రాతినిధ్యం లేకుండా పోయింది. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని పార్లమెంట్ స్త్రీలకు స్థానిక సంస్థలలో 1/3 వంతు స్థానాలను కేటాయించింది. మన రాష్ట్రంలో మహిళలకు రిజర్వేషన్లు 50% కు పెంచడం జరిగింది.

అలాగే షెడ్యూల్డ్ కులాలకు, షెడ్యూల్డ్ తెగలకు, వెనుకబడిన తరగతులకు వారి జనాభా ప్రాతిపదిక ప్రకారం స్థానాలు కేటాయించారు. ఆ విధంగా గ్రామీణ, గిరిజన ప్రాంతాలలో ఈ సంస్థలలో అన్ని వర్గాలవారికీ ప్రాతినిధ్యం లభిస్తుంది.

ప్రశ్న 5.
గ్రామ సర్పంచ్ గురించి నీకేమి తెలుసు?
జవాబు:
సర్పంచ్ గ్రామ పంచాయితీకి పెద్ద. గ్రామానికి మొదటి పౌరుడు. గ్రామ పంచాయితీ నిర్ణయాలను అమలు చేసే బాధ్యత సర్పంది. రోజువారి కార్యకలాపాలు కూడా సర్పంచ్ ఆధ్వర్యంలోనే జరుగుతాయి. గ్రామ పంచాయితీకి వచ్చే ఆదాయం, వ్యయాలకు కూడా సర్పంచే బాధ్యత వహిస్తాడు. ఆ విధంగా సర్పంచ్ గ్రామ పంచాయితీలో చాలా బాధ్యతలు కలిగి ఉంటాడు. చాలా గ్రామాలలో సర్పంచ్ క్రియాశీలకంగా ఉండడం వల్ల అభివృద్ధి చెందిన విషయం మనకు తెలుసు.

ప్రశ్న 6.
గ్రామ పంచాయితీ విధులను తెలుపుము.
జవాబు:
గ్రామ పంచాయితీ విధులు :
AP 6th Class Social Important Questions Chapter 10 స్థానిక స్వపరిపాలన 1

  • నీటి వనరులు, రోడ్లు, మురుగునీరు, పాఠశాల భవనాలు ఎరియు ఇతర ఉమ్మడి వనరుల నిర్మాణం మరియు నిర్వహణ
  • స్థానికంగా పన్నులు విధించటం మరియు వసూలు చేయడం.
  • ఉషాధికి సంబంధించిన ప్రభుత్వ పథకాలను అమలు చేయడం

ప్రశ్న 7.
గ్రామ పంచాయితీ ఆర్థిక వనరులను గూర్చి తెల్పండి.
జవాబు:
గ్రామ పంచాయితీ ఆర్థిక వనరులు :

  • ఇళ్ళు, మార్కెట్, స్థలాలు మొదలైన వాటిపై పన్నులు వసూలు.
  • రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా పరిషత్ మరియు మండల పరిషత్ ల నుండి మంజూరయే నిధులు మరియు రుణాలు.
  • స్థానిక ప్రజల నుండి విరాళాలు.

AP 6th Class Social Important Questions Chapter 10 స్థానిక స్వపరిపాలన

ప్రశ్న 8.
గ్రామ సచివాలయం ఏర్పాటు, లక్ష్యాలను వివరించండి.
జవాబు:
మన రాష్ట్రంలో అక్టోబర్ 2, 2019న గ్రామ సచివాలయ వ్యవస్థ ప్రారంభించబడింది. ప్రతి 2000 మందికి ఒక గ్రామ సచివాలయం ఏర్పాటు చేయబడింది. ప్రతి గ్రామ సచివాలయంలో 11 మంది గ్రామ నిర్వాహకులు (ఉద్యోగులు) ఉంటారు. గ్రామ సచివాలయం యొక్క ప్రధాన లక్ష్యం ప్రజలకు సమర్ధవంతంగా, పారదర్శకంగా మరియు జవాబుదారీతనంతో ప్రభుత్వ సేవలను అందించడం, సేవలు గ్రామ వాలంటీర్ల ద్వారా వారికి కేటాయింపబడిన ఇళ్ళకు అందించడం జరుగుతుంది.

ప్రశ్న 9.
ఆంధ్రప్రదేశ్ లోని మొదటి పురపాలక సంఘం గురించి మీకు తెలుసా?
జవాబు:
ఆంధ్రప్రదేశ్ లోని మొదటి పురపాలక సంఘం గురించి తెలుసు, అది భీముని పట్నం పురపాలక సంఘం. దీనినే భీమిలి అని కూడా పిలుస్తారు. ఇది విశాఖపట్నం జిల్లాలో ఉంది. దీనిని 1861లో స్థాపించారు. ఇది 2011లో 150వ వార్షికోత్సవాన్ని జరుపుకుంది. ఇది భారతదేశంలోని పురాతన మునిసిపాలిటీలలో ఒకటి.

ప్రశ్న 10.
మండల పరిషత్, జిల్లా పరిషత్ల నిర్మాణం గూర్చి వివరించండి.
జవాబు:
మండల పరిషత్, జిల్లా పరిషల నిర్మాణం: ప్రతి మండలంలో సుమారు 20 నుండి 40 గ్రామ పంచాయితీలు ఉంటాయి. జిల్లాలోని అన్ని మండల పరిషత్తులు జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో పనిచేస్తాయి. మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ (MPTCS) సభ్యులను ఓటర్లు నేరుగా ఎన్నుకుంటారు. మండల పరిషత్ లో కొందరు సభ్యులు (కో – ఆప్టెడ్ సభ్యులు) నియమించబడతారు. మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ (MPTC) సభ్యులు తమలో ఒక సభ్యుడిని’ మండలాధ్యక్షునిగాను, మరొకరిని ఉపాధ్యాక్షుని గాను పరోక్ష ఎన్నిక ద్వారా ఎన్నుకుంటారు. జిల్లా పరిషత్ సభ్యులను జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజక వర్గాల (ZPTCS) నుండి ఓటర్లు నేరుగా ఎన్చుకొంటారు. జిల్లా పరిషత్ కొంతమంది సభ్యులు (కో- ఆప్టెడ్ సభ్యులు) నియమించబడతారు. జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల (ZPTC) సభ్యులు తమలో ఒకరిని జిల్లా పరిషత్ చైర్మన్ గాను, మరొకరిని వైస్ ఛైర్మన్ గాను పరోక్ష ఎన్నిక ద్వారా ఎన్నుకొంటారు. జిల్లా పరిషత్ మరియు మండల పరిషత్ జిల్లాలోని పంచాయితీల కార్యకలాపాలను సమన్వయం చేస్తాయి. పంచాయితీల ప్రణాళికలను ఆమోదించి నిధుల కేటాయింపును సమన్వయపరుస్తాయి.

ప్రశ్న 11.
నగర పంచాయితీ, పురపాలక సంఘంల నిర్మాణం గూర్చి వివరించండి.
జవాబు:
నగర పంచాయితీ నిర్మాణం : ప్రతి నగర పంచాయితీలో వార్డు కౌన్సిలర్లు మరియు ఛైర్మతో ఒక కమిటీ ఉంటుంది. ప్రతి నగర పంచాయితీ కమిటీలో కనీసం పదిమంది ఎన్నుకోబడిన వార్డు సభ్యులు మరియు ముగ్గురు నామినేటెడ్ సభ్యులు ఉంటారు. నగర పంచాయితీ నోటిఫైడ్ ఏరియా కమిటీ (N.A.C.) సభ్యులు ఆయా వార్డుల నుండి వయోజన ఓటు హక్కు ప్రాతిపదికన ఐదు సంవత్సరాలకొకసారి ఎన్నుకోబడతారు.’ షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన తరగతులకు మరియు మహిళలకు సీట్లు కేటాయించబడ్డాయి. ‘కౌన్సిలర్లు లేదా వార్డు సభ్యులు ప్రత్యక్ష ఎన్నికల ద్వారా నగర పంచాయితీలోని వార్డుల నుండి ఎన్నుకోబడతారు. పురపాలక సంఘం నిర్మాణం : ప్రతి మున్సిపాలిటీలో ఎన్నిక కాబడిన సభ్యులు అయిన “కౌన్సిలర్లు” మరియు నామినేటెడ్ సభ్యులతో ఒక మున్సిపల్ కౌన్సిల్ ఉంటుంది. మునిసిపల్ కౌన్సిలను ఏర్పాటుచేయడానికి గాను, మున్సిపాలిటీ యొక్క ప్రాంతాన్ని వార్డులుగా విభజిస్తారు. ప్రతి ఐదేళ్ళకొకసారి వార్డు కౌన్సిలర్లను నేరుగా ఎన్నుకుంటారు. ఈ కౌన్సిలర్లు మరియు కౌన్సిల్ యొక్క ఇతర సభ్యులు కలిసి మున్సిపల్ ఛైర్మనను పరోక్ష ఎన్నిక ద్వారా ఎన్నుకుంటారు.

AP 6th Class Social Important Questions Chapter 10 స్థానిక స్వపరిపాలన

ప్రశ్న 12.
పురపాలక సంఘం ఏ విధంగా పనిచేస్తుందో సోదాహరణంగా వివరించండి.
జవాబు:
పురపాలక సంఘాలు చాలా పనులు చేస్తాయి. ఉదా : నీటి సరఫరా, వీధి దీపాలు, కొత్త రోడ్లు వేయడం, మరమ్మత్తులు, మురికి కాలువల మరమ్మత్తు, నిర్వహణ, చెత్తను తొలగించడం, పాఠశాలలను నడపడం, చౌకదుకాణాలు, ఆసుపత్రుల నిర్వహణ మొదలయినవే కాకుండా ఇంకా ఎన్నో రకాల అభివృద్ధి పనులు చేస్తాయి. ఇవన్నీ చేయడానికి మానవ వనరులు అవసరం చాలా ఉంది. కేవలం, కౌన్సిలర్లు / కార్పొరేటర్ల వల్ల ఈ పనులు కావు. ఈ పనుల కోసం పురపాలక సంఘాలు చాలా మంది ఉద్యోగులను, అధికారులను, అకౌంటెంట్లను, గుమస్తాలను నియమిస్తుంది.

అలాగే ప్రతి మున్సిపాలిటీని ఎన్నో విభాగాలుగా విభజిస్తారు. ప్రతి విభాగానికి ఒక అధికారిని నియమించి ఆయనకు బాధ్యతలు అప్పజెప్పుతారు. ఉదాహరణకు నీటి సరఫరా విభాగం, విద్యుత్ సరఫరా విభాగం మొదలయినవి పురపాలక సంఘంలో విభాగాలు. మరి కౌన్సిలర్లు ఏం చేస్తారు అని ఆశ్చర్యపోతున్నారా? నిజానికి కౌన్సిలర్లు ప్రజలతో ఎల్లప్పుడు కలిసి ఉండి వారి అవసరాలు, సమస్యలు పురపాలక సమావేశంలో చర్చిస్తారు.

వివిధ రకాల పనులు చేపట్టడానికి పురపాలక సంఘానికి కొన్ని కమిటీలు ఉంటాయి. వీటిలో కౌన్సిలర్లకు ముఖ్య భూమిక ఉంటుంది. ఈ కమిటీలు వివిధ విభాగాలు చేస్తున్న పనిని పరిశీలిస్తాయి. ఇది పురపాలక ప్రణాళికను కూడా తయారు చేస్తాయి. తరువాత ప్రతిపాదనలను తయారు చేసి, పురపాలక సంఘాల సమావేశంలో చర్చించి అన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఈ నిర్ణయాలను అధికారులు, ఉద్యోగులు అమలుపరుస్తారు. ప్రతివార్డు కౌన్సిలరూ తన వార్డు సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తారు. అలా చేస్తూనే ప్రజలతో మమేకమై వాళ్ళ సమస్యలపట్ల సానుకూల దృక్పథం కలిగి ఉంటారు.

ప్రశ్న 13.
పురపాలక సంఘంనకు నిధులు ఎలా సమకూరతాయి?
జవాబు:
పురపాలక సంఘం నిధులు :
పురపాలక సంఘం ఎన్నో రకాల పన్నులను విధిస్తుంది. ఉదా : ఇంటి పన్ను, నీటి పన్ను, వీధి దీపాలపై పన్ను, దుకాణాలపై పన్ను, సినిమా టికెట్ల మీద పన్ను మొదలైనవి. పన్నుల మీద వచ్చే ఆదాయం పురపాలక సంస్థల పనులకు సరిపోదు. ఈ సంస్థ ప్రభుత్వం మంజూరు చేసే నిధులపై ఆధారపడుతుంది. ప్రభుత్వం ఎన్నో రకాల పనులకు (రోడ్లు వేయడానికి, నీటి ట్యాంక్ నిర్మించడానికి, మున్సిపాలిటీ రోజువారీ పనులకు) నిధులను మంజూరు చేస్తుంది.

AP 6th Class Social Important Questions Chapter 10 స్థానిక స్వపరిపాలన

ప్రశ్న 14.
మున్సిపల్ కార్పోరేషన్ నిర్మాణం గూర్చి తెలుపుము.
జవాబు:
మున్సిపల్ కార్పోరేషన్ నిర్మాణం : ప్రతి మున్సిపల్ కార్పోరేషన్ “కార్పొరేటర్లు” అని పిలువబడే ఎన్నుకోబడిన సభ్యులు మరియు నామినేటెడ్ సభ్యులను కలిగి ఉంటుంది. మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు కోసం, మున్సిపల్ కార్పొరేషన్ యొక్క ప్రాంతాన్ని విభాగాలుగా (వార్డులు) విభజిస్తాయి. ప్రతి వార్డు నుండి కార్పొరేటర్లు ప్రతి ఐదు సంవత్సరాలకు నేరుగా ఎన్నుకోబడతారు. ఈ కార్పొరేటర్లు మరియు ఇతర సభ్యులు కలిసి కార్పొరేషన్ మేయర్‌ను పరోక్ష ఎన్నిక ద్వారా ఎన్నుకొంటారు.

ప్రశ్న 15.
క్రింది ఫ్లోచార్టును పరిశీలించి, క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానము లివ్వండి.
AP 6th Class Social Important Questions Chapter 10 స్థానిక స్వపరిపాలన 2
i) ఒక పట్టణం జనాభా 4,80,000. అయితే ఆ పట్టణం ఏ స్థానిక సంస్థ అవుతుంది.?
జవాబు:
మున్సిపల్ కార్పోరేషన్

ii) NAC అనగా నేమి?
జవాబు:
నోటిఫైడ్ ఏరియా కౌన్సిల్ (కమిటి)

iii) 40,000 నుండి 3,00,000 జనాభా ఉన్న స్థానిక సంస్థనేమంటారు?
జవాబు:
పురపాలక సంఘం

iv) దేని ఆధారంగా పట్టణ స్థానిక సంస్థలను 3 రకాలుగా విభజించారు?
జవాబు:
జనాభా ప్రాతిపదికన

పట నైపుణ్యం

ప్రశ్న 16.
a) పటాన్ని గుర్తించుట :
ఈ క్రింది వాటిని గుర్తించుము. 1. ఆంధ్రప్రదేశ్ సరిహద్దు రాష్ట్రాలు 2. రాష్ట్ర రాజధాని
AP 6th Class Social Important Questions Chapter 10 స్థానిక స్వపరిపాలన 3

b) పటాన్ని చదువుట :
ఈ క్రింది పటాన్ని గమనించి ప్రశ్నలకు సమాధానములు వ్రాయుము.
AP 6th Class Social Important Questions Chapter 10 స్థానిక స్వపరిపాలన 4

1. అనంతపురానికి ఉత్తరాన ఉన్న జిల్లా ఏది?
జవాబు:
కర్నూలు

2. ఆంధ్రప్రదేశ్ లో ఉత్తరాన ఉన్న జిల్లా ఏది?
జవాబు:
శ్రీకాకుళం

3. ఒడిశాను ఆనుకుని ఉన్న ఒక జిల్లా పేరు వ్రాయుము.
జవాబు:
శ్రీకాకుళం

4. పశ్చిమ గోదావరి, గుంటూరుకు మధ్యన ఉన్న జిల్లా ఏది?
జవాబు:
కృష్ణా జిల్లా

5. నీ వుండే జిల్లాకు ఎరుపు రంగు వేయుము.
జవాబు:
విద్యార్థి కృత్యం

AP 6th Class Social Important Questions Chapter 9 ప్రభుత్వం

These AP 6th Class Social Important Questions 9th Lesson ప్రభుత్వం will help students prepare well for the exams.

AP Board 6th Class Social 9th Lesson Important Questions and Answers ప్రభుత్వం

ప్రశ్న 1.
ప్రభుత్వం అనగా నేమి? సాధారణంగా ప్రభుత్వం ఎన్ని విభాగాలు కల్గి ఉంటుంది? అవి ఏవి?
జవాబు:
ఒక దేశాన్ని లేదా ఒక రాష్ట్రాన్ని నియంత్రిస్తూ, వారి కొరకు నిర్ణయాలను తీసుకునే ప్రజల సమూహాని “ప్రభుత్వం” అంటారు. సాధారణంగా ప్రభుత్వం మూడు విభాగాలను కలిగి ఉంటుంది. అవి :

  1. శాసన నిర్మాణ శాఖ
  2. కార్యనిర్వహక శాఖ
  3. న్యాయశాఖ

AP 6th Class Social Important Questions Chapter 9 ప్రభుత్వం 1

ప్రశ్న 2.
ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఎన్ని రకాలు కలవు? అవి ఏవి? వివరించుము.
జవాబు:
ప్రస్తుత ప్రపంచంలో చాలా దేశాలలో ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. భారతదేశం కూడా ప్రజాస్వామ్య దేశం. ప్రజాస్వామ్యంలో రెండు రకాలు ఉన్నాయి. అవి :

ప్రత్యక్ష ప్రజాస్వామ్యం :
ప్రజలు నేరుగా నిర్ణయం తీసుకోవడంలో పాల్గొంటారు.
ఉదాహరణకి :
స్విట్జర్లాండ్. ఈ దేశంలో పౌరుల ఒక ప్రదేశంలో సమావేశమై నిర్ణయాలు తీసుకుంటారు లేదా చట్టాలు చేస్తారు. ఇక్కడ తక్కువ జనాభా ఉన్నందున ఇది సాధ్యమైంది.

పరోక్ష ప్రజాస్వామ్యం (ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం) :
ప్రజాస్వామ్యం యొక్క ఈ రూపంలో, ప్రజలు తమ ప్రతినిధుల ద్వారా పరోక్షంగా నిర్ణయం తీసుకోవడంలో పాల్గొంటారు. అధికంగా జనాభా ఉండటం వల్ల, భారతదేశంతో సహా చాలా దేశాలు పరోక్ష ప్రజాస్వామ్యాన్ని అనుసరిస్తున్నాయి.

AP 6th Class Social Important Questions Chapter 9 ప్రభుత్వం

ప్రశ్న 3.
ఎన్నికలు అనగానేమి? ప్రజాస్వామ్యంలో ఎన్నికల పాత్ర ఏమిటి?
జవాబు:
ఎన్నికలు :
ప్రతినిధిని ఎన్నుకునే విధానాన్ని “ఎన్నికలు” అంటారు. పరోక్ష ప్రజాస్వామ్య విజయం ఎన్నికలపై ఆధారపడి ఉంటుంది. ఎన్నికలు ఇక్కడ కీలకపాత్ర పోషిస్తాయి. కాబట్టి, ఎన్నికలు స్వేచ్చగా మరియు నిష్పక్షపాతంగా జరగాలి.
AP 6th Class Social Important Questions Chapter 9 ప్రభుత్వం 2

ప్రశ్న 4.
భారతదేశంలో విశ్వజనీన ఓటుహక్కుల గూర్చి తెలుపుము.
జవాబు:
భారతదేశంలో స్వాతంత్ర్యానికి ముందు మహిళలకు మరియు కొన్ని వర్గాల ప్రజలకు ఓటు హక్కు లేదు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 326 ప్రకారం, ఒక నిర్దిష్ట వయస్సు (ప్రస్తుతం 18 సంవత్సరాలు) పొందిన అందరికీ ఓటు హక్కు ఉంది. (విశ్వజనీన వయోజన ఓటుహక్కు).

ప్రశ్న 5.
భారతదేశంలో ఎన్ని స్థాయిల్లో ప్రభుత్వం ఉంది? ఎందుకు అలా ఏర్పాటు చేసారు?
జవాబు:
భారతదేశం అత్యధిక జనాభా కలిగిన విశాలమైన దేశం. కాబట్టి దేశ వ్యాప్తంగా ప్రజల అవసరాలు మరియు ఆ సమస్యలను గుర్తించడం కష్టం. కాబట్టి, వివిధ సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం వివిధ స్థాయిలలో పనిచేస్తుంది. అవి :
1. జాతీయ స్థాయి – కేంద్ర ప్రభుత్వం,
2. రాష్ట్ర స్థాయి – రాష్ట్ర ప్రభుత్వం,
3. స్థానిక స్థాయి – స్థానిక ప్రభుత్వం.

AP 6th Class Social Important Questions Chapter 9 ప్రభుత్వం 3

ప్రశ్న 6.
వివిధ రకాల ప్రభుత్వ రూపాల గురించి సవివరంగా తెల్పండి.
జవాబు:
వివిధ రకాల ప్రభుత్వాలు :
రాచరికం మరియు ప్రజాస్వామ్యం వంటి అనేక రకాల ప్రభుత్వాలు ప్రాచీన కాలం నుండి నేటి వరకు పనిచేస్తున్నాయి.

రాచరికం :
మునుపటి అధ్యాయంలో అశోకుడు, చంద్రగుప్తుడు వంటి చక్రవర్తులు లేదా రాజులు పరిపాలించిన సామ్రాజ్యాలు గురించి మీరు తెలుసుకున్నారు. ఒకరాజు లేదా రాణి చేసే పాలనను “రాచరికం” అంటారు. రాజు లేదా రాణి వారసత్వంగా అధికారంలోకి వస్తారు. ఉదాహరణకు అశోకుడు, తన తండ్రి బిందుసారుడు తరువాత అధికారంలోకి వచ్చాడు. కొంతమంది చక్రవర్తులు అన్ని అధికారాలను తామే కలిగి ఉంటారు.

కానీ మరికొందరు ప్రభుత్వంలోని ఇతర శాఖల అధికారులతో పంచుకుంటారు. కాబట్టి, పౌరులకు రాజును బట్టి హక్కులు మరియు సౌకర్యాలు ఉండవచ్చు. ఉదాహరణకు ప్రజలు ఇతర రాజుల పాలన కంటే అశోకుని పాలనలో ఎక్కువ స్వేచ్ఛ మరియు సౌకర్యాలను పొందారు.

ప్రజాస్వామ్యం :
ఇది ప్రజలు నడుపుతున్న ప్రభుత్వ రూపం. ఇక్కడ ప్రతి పౌరుడికి ఓటు వేయడానికి అనుమతి ఉంది. అందువల్ల అతను / ఆమె నేరుగా లేదా వారి ప్రతినిధుల ద్వారా నిర్ణయాలు తీసుకోవడంలో లేదా చట్టాలు, తీసుకోవడంలో పాల్గొంటారు. రాచరికం వంటి ఇతర రకాల ప్రభుత్వాలలో కంటే ప్రజాస్వామ్యంలోని పౌరులు ఎక్కువ హక్కులు మరియు సౌకర్యాలు పొందుతారు. ఇక్కడ అధికారం వారసత్వంగా పొందలేము.

ప్రశ్న 7.
క్రింద ఇవ్వబడిన ఫ్లోచార్టును పరిశీలించి, ఇచ్చిన ప్రశ్నలకు సరియైన సమాధానలివ్వండి.
AP 6th Class Social Important Questions Chapter 9 ప్రభుత్వం 4
ఎ) భారతదేశంలో ఏ విధమైన ప్రజాస్వామ్యం కలదు?
జవాబు:
పరోక్ష ప్రజాస్వామ్యం

బి) ప్రత్యక్ష ప్రజాస్వామ్యం ఏ దేశంలో కలదు?
జవాబు:
స్విట్జర్లాండ్.

సి) పరోక్ష ప్రజాస్వామ్యంలో చట్టాలు, నియమాలు ఎవరు రూపొందిస్తారు?
జవాబు:
ఎన్నికైన ప్రతినిధులు

డి) ప్రస్తుతం భారతదేశంలో ఎన్ని సం||రాలకు ఓటు హక్కు లభిస్తుంది?
జవాబు:
18 సం||రాలకు పై బడినవారికి. ప్రజాస్వామ్యం రకాలు (ఫ్లోచార్టు)

AP 6th Class Social Important Questions Chapter 9 ప్రభుత్వం

ప్రశ్న 8.
క్రింది చిత్రంను పరిశీలించి, ఇవ్వబడిన ప్రశ్నలకు సరియైన జవాబు లివ్వండి.
AP 6th Class Social Important Questions Chapter 9 ప్రభుత్వం 5
ఎ). చిత్రంలోని వ్యక్తి ఏ దేశ అధ్యక్షుడు?
జవాబు:
అమెరికా

బి) ప్రజాస్వామ్యానికి జన్మస్థలం ఏది?
జవాబు:
గ్రీసు.

సి) ప్రజాస్వామ్యం అనగానేమి?
జవాబు:
ప్రజల యొక్క ప్రజల చేత, ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వమే ప్రజాస్వామ్యం.

డి) చిత్రంలోని వ్యక్తి ఎవరు?
జవాబు:
అబ్రహం లింకన్.

ప్రశ్న 9.
ఈ క్రింది పటాన్ని గమనించి ప్రశ్నలకు సమాధానములు వ్రాయుము.
AP 6th Class Social Important Questions Chapter 9 ప్రభుత్వం 6
1. భారతదేశంలో ఉత్తరాన ఉన్న రాష్ట్రం ఏది?
జవాబు:
భారతదేశంలో ఉత్తరాన ఉన్న రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్,

2. అండమాన్, నికోబార్ దీవులు ఏ సముద్రంలో ఉన్నాయి?
జవాబు:
అండమాన్, నికోబార్ దీవులు బంగాళాఖాతంలో ఉన్నాయి.

3. గోవా ఏ సముద్రం ఒడ్డున ఉన్నది?
జవాబు:
గోవా అరేబియా సముద్రం ఒడ్డున ఉన్నది.

4. భారతదేశం మధ్యలో ఉన్న రాష్ట్రమేది?
జవాబు:
భారతదేశం మధ్యలో ఉన్న రాష్ట్రం మధ్యప్రదేశ్,

5. నాగాలాండకు, మిజోరంకు మధ్యన ఏ రాష్ట్రం కలదు?
జవాబు:
నాగాలాండకు, మిజోరంకు మధ్యన ఉన్న రాష్ట్రం మణిపూర్.

6. భారతదేశానికి సరిహద్దుగా ఉన్న రాచరిక దేశం ఏది?
జవాబు:
భూటాన్.

AP 6th Class Social Important Questions Chapter 8 రాజ్యాలు మరియు సామ్రాజ్యాలు

These AP 6th Class Social Important Questions 8th Lesson రాజ్యాలు మరియు సామ్రాజ్యాలు will help students prepare well for the exams.

AP Board 6th Class Social 8th Lesson Important Questions and Answers రాజ్యాలు మరియు సామ్రాజ్యాలు

ప్రశ్న 1.
క్రింది వారిని గురించి నీకు తెలిసిన రెండు వాక్యాలు రాయండి.
1) మెగస్తనీస్ 2) కౌటిల్యుడు
జవాబు:
1) మెగస్తనీస్ :
మెగస్తనీస్ ఒక గ్రీకు రాయబారి. అతను చంద్రగుప్త మౌర్యుని కొలువులో ఉండేవాడు. అతను ‘ఇండికా’ అనే గ్రంథాన్ని రచించాడు. ఇది మౌర్యుల కాలపరిస్థితులు. వారి పరిపాలన గురించి తెలుసుకోవడానికి ఒక ఆధార గ్రంథం.

2) కౌటిల్యుడు :
కౌటిల్యుడిని ‘విష్ణుగుప్తుడు’ మరియు ‘చాణక్యుడు’ అని కూడా పిలుస్తారు. అతను చంద్రగుప్త మౌర్యుని ప్రధానమంత్రి ‘అర్థశాస్త్రము’ అతను రచించిన ప్రముఖ గ్రంథం.

ప్రశ్న 2.
అశోకుని శిలాశాసనాల గురించి తెల్పండి. ఏదైనా ఒక శాసనం గురించి విపులంగా వివరించండి.
జవాబు:
AP 6th Class Social Important Questions Chapter 8 రాజ్యాలు మరియు సామ్రాజ్యాలు 1
13వ నంబరు రాతి శాసనంలో అశోకుడు కళింగయుద్ధం గురించి ప్రస్తావించడం జరిగింది. ‘దిగువ శిలా శాసనాన్ని పరిశీలించండి. ప్రాకృత లిపిలో అక్షరాలతో చెక్కబడిన శిలాశాసనం యొక్క అర్థం తెలుగులో ఈ కింది విధంగా భావించవచ్చును.

ఒక స్వతంత్ర రాజ్యాన్ని జయించినప్పుడు లక్షలమంది చని పోతారు మరియు అంతకంటే ఎక్కువ సంఖ్యలో సైనికులు బందీలుగా దొరుకుతారు. అందువలనే నేను విచారంగా ఉన్నాను. బలంతో కన్నా ధర్మం ద్వారా ప్రజలను గెలుచుకొనుటే ఉత్తమమైనదని నేను విశ్వసిస్తున్నాను. నేను ఈ శాంతి సందేశాన్ని భవిష్యత్ తరాల కొరకు లిఖిస్తున్నాను. దీనివలన నా వారసులు ఎవ్వరూ కూడా యుద్ధం గురించి ఆలోచించరు. దానికి బదులుగా వారు ధర్మాన్ని వ్యాప్తి చేయడం గురించే ఆలోచిస్తారు. (ధర్మము అనే పదాన్ని ప్రాకృత భాషలో ‘దమ్మము’ అని పిలుస్తారు.)

అశోకుడు ఇలాంటి చాలా శిలాశాసనాలను తన రాజ్యంలోని వివిధ ప్రాంతాలలో చెక్కించాడు. ధర్మాన్ని ప్రజలకు తెలియజేయడమే ఈ శిలాశాసనాల ముఖ్య ఉద్దేశం. అశోకుడు శిలాశాసనాలపై చెక్కబడి ఉన్న ధర్మ సూత్రాలను నిరక్షరాస్యులకు తెలియజెప్పేందుకు ప్రత్యేక అధికారులను నియమించాడు.

AP 6th Class Social Important Questions Chapter 8 రాజ్యాలు మరియు సామ్రాజ్యాలు

ప్రశ్న 3.
అశోకుడు ప్రజల కొరకు చేపట్టిన ప్రజోపయోగ కార్యక్రమాలేవి?
జవాబు:
నీరు, ఆహారం పవిత్రమైనవని అశోకుడు ఒక బౌద్ధ సన్యాసి ద్వారా తెలుసుకున్నాడు. తన ప్రజలందరికీ అందాలని సంకల్పించుకున్నాడు. అనంతరం అశోకుడు రోడ్డుకు రెండువైపులా చెట్లు నాటించాడు. చెట్లు రోడ్లపై ప్రయాణించేవారికి నీడను ఇవ్వడంతోపాటు ఆకలితో ఉన్నవారికి పండ్లను ఇవ్వడం ద్వారా ఆకలిని తీర్చేవి. ప్రజలకు మంచినీటి సౌకర్యం కల్పించేందుకు బావులు తవ్వించాడు.

అశోకుని కాలంలో ప్రజలకు మంచి రవాణా సౌకర్యాలు కలవు. రహదారులు తన సువిశాల సామ్రాజ్యంలోని వేర్వేరు సంస్కృతులు గల ప్రజలను కలిపాయి. రవాణా మరియు వాణిజ్య సౌకర్యాలు సులభతరమయ్యాయి. విశాలమైన భారతదేశంలో రాజకీయ ఐక్యత సాధ్యమైంది. మనుషులు, జంతువులకు కూడా వైద్య సంరక్షణ కొరకు వైద్యశాలలు ఏర్పాటు చేయబడినవి.

ప్రశ్న 4.
శాతవాహనుల గురించి నీకు ఏమి తెలియును, వాణిజ్యము, మతము గూర్చి ప్రాధాన్యతనిస్తూ వ్రాయుము.
జవాబు:
శాతవాహనులు :
మౌర్య సామ్రాజ్యం పతనమైన తరువాత దక్కన్ ప్రాంతంలో అనేక తెగల పెద్దలు ఆ ప్రాంతాన్ని చిన్నచిన్న రాజ్యాలుగా విభజించుకొని పరిపాలన ప్రారంభించారు. అలా ఏర్పడిన రాజులలో శాతవాహనులు ఒకరు. శాతవాహనులు నర్మదా నది నుంచి కృష్ణా, గోదావరి పరీవాహక ప్రాంతం వరకు పెద్ద రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోగలిగారు. గుంటూరు జిల్లాలోని అమరావతి సమీపంలోని ధాన్యకటకం’ నుండి పరిపాలించారు. అది కృష్ణానదీ తీరంలో కలదు.

శాతవాహన కాలంలో ఉన్న ఓడ నాణేలు ప్రసిద్ది చెందినవి. అవి సముద్ర వ్యాపారంలో ఆంధ్రుల యొక్క నైపుణ్యాన్ని మరియు నౌకాదళ శక్తిని తెలియజేస్తాయి. అంతర్జాతీయ వ్యాపారంపై శాతవాహనులు మంచి పట్టును కలిగి ఉన్నారు. రోమ్ దేశాలతో వీరికి మంచి వ్యాపార సంబంధాలు కలవు.

శాతవాహనులు హిందూమతాన్ని అనుసరించారు. బౌద్ధమతాన్ని కూడా ప్రోత్సహించారు. నాగార్జునకొండ మరియు అమరావతి శాతవాహన కాలం నాటి ప్రసిద్ధ బౌద్ధ క్షేత్రాలు. ప్రముఖ బౌద్ధ వేదాంతి ఆచార్య నాగార్జునుడు వీరి కాలంలో నివసించి ఉన్నాడని చెప్పబడుతున్నది.

ప్రశ్న 5.
చాళుక్యులు వాస్తు శిల్పకళకు చేసిన సేవను వివరింపుము. పట్టడగల్ లోని దేవాలయం గురించి వర్ణింపుము.
జవాబు:
చాళుక్యులు వాస్తుశిల్పకళకు ఎంతో సేవ చేశారు. వారి కాలంలో ‘వెశారా’. అను నూతన వాస్తుశిల్ప కళారీతి అభివృద్ధి చెందింది. దక్షిణ భారతదేశములోని ‘ద్రవిడ మరియు ఉత్తర భారతదేశంలోని ‘నగారా’ వాస్తుశిల్ప కళాకృతుల మేలి కలయికే ‘వెశారా’. పల్లవ రాజైన మొదటి మహేంద్రవర్మ రెండవ పులకేశిని యుద్ధంలో ఓడించి కావేరి నదిని దాటి వెళ్ళాడు. చోళ, చేత, పాండ్య రాజులతో చాళుక్యులు మంచి స్నేహసంబంధాలు నెలకొల్పారు.
AP 6th Class Social Important Questions Chapter 8 రాజ్యాలు మరియు సామ్రాజ్యాలు 2
కర్ణాటకలోని బాగల్ కోట్ జిల్లాలోని ఒక చిన్న గ్రామం పట్టడగల్. ఈ గ్రామంలో పది దేవాలయాలు కలవు. అందులో నాలుగు దేవాలయాలు నగర నిర్మాణ శైలిలో ఉండగా మరొక నాలుగు దేవాలయాలు ద్రవిడ నిర్మాణ శైలిలో ఉన్నవి. విరూపాక్ష దేవాలయం మరియు సంగమేశ్వర ఆలయం ద్రవిడ నిర్మాణ శైలిలో ఉండగా, పాపనాథ ఆలయం నగారా నిర్మాణ శైలిలో ఉన్నది.

ప్రశ్న 6.
చాళుక్యులు గురించి నీకు ఏమి తెలియును?
జవాబు:
చాళుక్యులు :
దక్షిణ మరియు మధ్య’ భారతదేశంలో ఎక్కువ భాగాలను క్రీ.పూ. 600-1200 మధ్య చాళుక్యరాజులు పరిపాలించారు. తొలి చాళుక్యరాజులలో ఒకరైన రెండవ పులకేశి కర్ణాటకలోని బాదామిని రాజధానిగా చేసుకొని పరిపాలించాడు. రెండవ పులకేశి మరొక ప్రసిద్ది చెందిన చాళుక్యరాజు. నర్మదా నది ఒడ్డున జరిగిన యుద్ధంలో హర్ష చక్రవర్తి ఇతనిని ఓడించాడు. ఈ విజయాన్ని కర్ణాటకలోని బాగల్ కోట్ జిల్లాలోని ఐహోలు శిలాశాసనములో పేర్కొనబడినది. రెండవ పులకేశి కొలువులో ఉన్న రవికీర్తి ఐహోలు శాసనాన్ని తయారు చేశాడు.

ప్రశ్న 7.
క్రింది పటమును పరిశీలించి ప్రశ్నలకు సమాధానములు ఇవ్వండి.
AP 6th Class Social Important Questions Chapter 8 రాజ్యాలు మరియు సామ్రాజ్యాలు
అ. అజంతా, ఎల్లోరా గుహలు ఏ రెండు నదుల మధ్య ఉన్నాయి?
జవాబు:
తపతి, గోదావరి.

ఆ. గుప్తుల రాజధాని నగరం ఏది?
జవాబు:
పాటలీపుత్ర

ఇ. గుప్తుల కాలంలోని ముఖ్యమైన రేవు పట్టణం ఏది?
జవాబు:
జరుకచ్చా.

ఈ. అమరావతి ఏ నది ఒడ్డున ఉన్నది?
జవాబు:
కృష్ణానది.

AP 6th Class Social Important Questions Chapter 8 రాజ్యాలు మరియు సామ్రాజ్యాలు

ప్రశ్న 8.
ఈ క్రింది వాటిని గుర్తించండి.
1. పాటలీపుత్ర
2. కళింగ
3. ఉజ్జయిని
4. సువర్ణగిరి
5. తక్షశిల
AP 6th Class Social Important Questions Chapter 8 రాజ్యాలు మరియు సామ్రాజ్యాలు 3

AP 6th Class Social Important Questions Chapter 7 సామ్రాజ్యాలు, గణతంత్రాల ఆవిర్భావం

These AP 6th Class Social Important Questions 7th Lesson సామ్రాజ్యాలు, గణతంత్రాల ఆవిర్భావం will help students prepare well for the exams.

AP Board 6th Class Social 7th Lesson Important Questions and Answers సామ్రాజ్యాలు, గణతంత్రాల ఆవిర్భావం

ప్రశ్న 1.
ఉపనిషత్తుల గురించి వివరించుము.
జవాబు:
వేదాలలో ఉపనిషత్తులు ఒక భాగం. ఉపనిషత్తులనగా అర్థం ‘వచ్చి చేరువగా కూర్చోవడం, ఇవి ఉపాధ్యాయులు – మరియు విద్యార్థుల మధ్య సంభాషణలు. “మనం ఎక్కడి నుంచి వచ్చాము? లేదా మరణం తరువాత మనం ఎక్కడకు వెళతాము?” వంటి ప్రశ్నలకు ఈ పుస్తకాలు సమాధానాలు ఇచ్చే ప్రయత్నం చేశాయి.

ప్రశ్న 2.
మహాజన పదాలలో నగర ప్రజల జీవన విధానంను వివరించండి.
జవాబు:
మహాజన పదాలలో నగర జీవనం :
మహాజనపదాలలోని పట్టణాలలో ఇప్పటివలే తమ జీవనానికి ఇతరుల కోసం కష్టపడి పని చేసే శ్రామిక పేదలు ఎక్కువగా ఉంటారు. వారిలో కొంతమంది బానిస సేవకులు, మిగతావారు వస్తువులు తయారు చేసి అమ్మే వృత్తి పనివారు. ఈ వృత్తి పనివారు ఏం తయారు చేసేవారు? అన్ని ప్రముఖ నగరాలలో ఎంతో గిరాకీ ఉండే అందమైన కుండలను తయారు చేసేవారు. చక్కని వస్త్రాలను నేసి మహాజనపదాలలోని ధనవంతులకు అమ్మేవారు. వాళ్ళు బంగారం, వెండి ఆభరణాలను కూడా తయారు చేసేవారు. పురావస్తు తవ్వకాలలో వారు చేసిన ఇనుము, రాగి, ఇత్తడి వంటి లోహాలతో చేసిన పాత్రలు, పరికరాలు బయల్పడ్డాయి.

వారు చెక్కతో బళ్ళను, గృహోపకరణాలను తయారు చేసేవారు. సైనికులు, గణకులు, తాపీ పనివారు, గుర్రాల శిక్షకులు, ఊడ్చేవారు. నీటిని తెచ్చేవారు. చెక్కతోను, ఏనుగు దంతంతోను బొమ్మలు తయారుచేసే అనే రకాల పనివాళ్ళు ఉండేవారు. వీళ్ళు తయారు చేసిన వస్తువులలో కొన్ని మాత్రమే తవ్వకాలలో బయటపడ్డాయి. పుస్తకాల ద్వారా వాళ్ళ గురించి మరింత తెలుసుకోవచ్చు.

వృత్తి పనివారు ఉత్పత్తి చేసిన వస్తువులను కొని గృహపతులకు వాటిని ఎక్కువ లాభానికి అమ్మే వ్యాపారస్థులు కూడా ఉండేవారు. అంతేకాక వివిధ దేశాలలో ప్రత్యేకంగా లభించే వస్తువులను తీసుకువచ్చి ఆయా జనపదాలలో అమ్మేవారు. వాళ్ళు వ్యాపార నిమిత్తం పరివారంతో పాటూ ఎద్దులు, గాడిదలు, ఒంటెలతో వారాలు, నెలలపాటు నదులు, మైదానాలు, కొండలు మహా ఎడారుల్లో సైతం ప్రయాణించేవారు. వాళ్ళకు వచ్చిన అపార లాభాలతో పెద్ద భవంతులలో డజన్ల కొద్దీ సేవకులతో, బానిసలతో పని చేయించుకుంటూ విలాసవంతమైన జీవనం సాగించేవారు.

AP 6th Class Social Important Questions Chapter 7 సామ్రాజ్యాలు, గణతంత్రాల ఆవిర్భావం

ప్రశ్న 3.
‘గణ’ అనగానేమి?
జవాబు:
‘గణ’ అనే పదానికి సమాన హోదా ఉన్నవారు అని అర్థం. ‘సంఘ’ అంటే ‘శాసన సభ’ . గణ – సంఘాలు ఒక ఉన్నత సమూహం పాలించే ఒక చిన్న భౌగోళిక ప్రాంతమే గణ రాజ్యం.

ప్రశ్న 4.
రాజ్యం అంటే ఏమిటి?
జవాబు:
“రాజ్యం” అంటే రాజు లేదా రాణి పాలించే భూభాగం. ఒక రాజ్యంలో (రాజరికం) ఒక కుటుంబం వంశ పారంపర్యంగా చాలా కాలం పాటు పాలిస్తే అది రాజవంశం అవుతుంది. సాధారణంగా ఈ రాజ్యాలు సనాతన వైదిక సంప్రదాయాలకు కట్టుబడి ఉంటాయి.

ప్రశ్న 5.
‘వజ్ర’ గణకు ప్రాధాన్యత నిస్తూ, గణ రాజ్యంలోని పాలనా విధానము, పతనము గురించి వివరించుము.
జవాబు:
మగధ రాజ్యానికి ఉత్తరంగా గణతంత్ర ప్రభుత్వాన్ని కలిగిన వజ్జి మహాజనపదం ఉండేది. రాజ్యంలో ఒకే పరిపాలకుడు కాక్, ఒక పరిపాలకుల బృందం ఉండేది. కొన్ని సందర్భాలలో వేలమంది కలిసి పాలన చేసేవారు. ప్రతి ఒక్కరూ తమను ‘రాజు’ అని పిలుచుకునేవారు. వాళ్ళు సంప్రదాయాలను పాటిస్తూ అందరూ సమావేశమై అందరికీ సంబంధించిన అంశాలపై వాదోపవాదాల తరువాత నిర్ణయాలు తీసుకునేవారు. మహిళలకు, బానిసలకు, సేవకులకు ఈ సమావేశాలలో పాల్గొనే అవకాశం ఉండేది కాదు. బుద్ధుడు, మహావీరుడు గణాలకు చెందినవారు. ప్రఖ్యాత బోధకులయిన వీరిని అన్ని మహాజనపదాలూ గౌరవించేవి. ఈ గణ రాజ్యాలను జయించటానికి రాజులు ఎంతగా ప్రయత్నించినా 1500 సంవత్సరాల పాటు అవి మనగలిగాయి. చివరకు గుప్త రాజులు గణ రాజ్యాలను జయించారు.
AP 6th Class Social Important Questions Chapter 7 సామ్రాజ్యాలు, గణతంత్రాల ఆవిర్భావం 1

ప్రశ్న 6.
గాంధార శిల్పకళ గురించి నీకేమి తెలియును?
జవాబు:
గాంధార శిల్పకళ :
గాంధార శిల్పకళ తక్షశిల చుట్టూ ఉన్న ప్రాంతంలో అభివృద్ధి చేయబడింది. ఇది గ్రీకు కళతో ప్రభావితమైనది.
AP 6th Class Social Important Questions Chapter 7 సామ్రాజ్యాలు, గణతంత్రాల ఆవిర్భావం 2
ఈ శిల్పం యొక్క ప్రత్యేక లక్షణాలు వాస్తవికత, సరైన కొలతలతో, సున్నితమైన పనితనం. చాలా గౌతమ బుద్దుని చిత్రాలు ఈ శైలిలో చెక్కబడినవి.

ప్రశ్న 7.
ఈ చిత్రం సుమారు 2000 సంవత్సరాల కాలంనాటి సాంచి స్థూపానికి చెందినది. ఈ చిత్రంలో రాజును ఎలా గుర్తిస్తావు?
AP 6th Class Social Important Questions Chapter 7 సామ్రాజ్యాలు, గణతంత్రాల ఆవిర్భావం
జవాబు:
రాజు పట్టణ కోట నుండి గుర్రాల రథం ద్వారా వస్తున్నాడు. రథసారధి చాలా సాదాసీదాగా ఉన్నాడు. ప్రక్కన ఉన్న వ్యక్తి ప్రత్యేక అలంకరణలో ఉండడం మూలంగా ఆయనను రాజుగా గుర్తిస్తాను.

ప్రశ్న 8.
ప్రక్క పటాన్ని గమనించి క్రింది ప్రశ్నలకు సమాధానములు వ్రాయుము.
AP 6th Class Social Important Questions Chapter 7 సామ్రాజ్యాలు, గణతంత్రాల ఆవిర్భావం 3
1. అస్మక ఏ నది ఒడ్డున కలదు?
జవాబు:
అస్మక గోదావరి నది ఒడ్డున ఉన్నది.

2. అవంతికి ఉత్తరాన ఉన్న జనపదం ఏమి?
జవాబు:
అవంతికి ఉత్తరాన ఉన్న జనపదం ‘మత్స్య’.

3. కోసల, వజ్జిలకు మధ్యలో ఉన్న జనపదం ఏది?
జవాబు:
కోసల, వజ్జికి మధ్యలో ఉన్న జనపదం మలయ లేదా మల్ల జనపదం.

4. ఈ జనపదాలు భారతదేశానికి ఏ భాగాన ఎక్కువగా ఉన్నాయి?
జవాబు:
ఈ జనపదాలు భారతదేశానికి ఉత్తర భాగాన ఎక్కువగా ఉన్నాయి.

5. దక్షిణ భారతదేశంలో మహాజనపదం ఏమి?
జవాబు:
దక్షిణ భారతదేశంలో మహాజనపదం ‘అస్మక’.

ప్రశ్న 9.
ప్రక్క పటాన్ని గమనించి ప్రశ్నలకు జవాబులు వ్రాయండి.
AP 6th Class Social Important Questions Chapter 7 సామ్రాజ్యాలు, గణతంత్రాల ఆవిర్భావం 4

1. ‘కాంభోజ’ కు దక్షిణాన ఉన్న మహాజనపదం ఏది?
జవాబు:
గాంధారా

2. ‘నేపాల్’ సరిహద్దులో ఉన్నటువంటి మహాజనపదాలు ఏవి?
జవాబు:
కోసల, మలయ, వట్టి

3. ఈ మహాజనపదాల పేర్లతో ‘చేప’ అని అర్ధం వచ్చేది ఏది?
జవాబు:
మత్స్య

AP 6th Class Social Important Questions Chapter 6 తొలి నాగరికతలు

These AP 6th Class Social Important Questions 6th Lesson తొలి నాగరికతలు will help students prepare well for the exams.

AP Board 6th Class Social 6th Lesson Important Questions and Answers తొలి నాగరికతలు

ప్రశ్న 1.
సింధూలోయ నాగరికత ఏ ప్రాంతాల మధ్య, ఎప్పుడు వికసించింది?
జవాబు:
సింధూనది మరియు ఘగ్గర్ – హక్రా నదీ ప్రాంతంలో సింధూలోయ నాగరికత వికసించింది. ఈ నదులు ప్రవహించిన గుర్తులను ఉపగృహ దృశ్యాలు మరియు ఇతర ఆధారాల ద్వారా కనుగొనడం జరిగింది. పంజాబ్ హరియానా, గుజరాత్, రాజస్థాన్ మరియు మహారాష్ట్రలోని సుమారు 1500 ప్రదేశాలలో బయటపడినది. అంతేగాక ఆఘనిస్థాన్, పంజాబ్, సింధూ బెలూచిస్తాన్ (పాకిస్తాన్) ప్రాంతాల్లో కూడా ఈ నాగరికత బయటపడింది. హరప్పా నాగరికత క్రీ.పూ. 2500 – 1700 సంవత్సరాల మధ్య వికసించింది.

ప్రశ్న 2.
సింధూ నాగరికత నాటి పట్టణ ప్రణాళిక సౌకర్యాలను గురించి వివరిస్తూ మహాస్నానవాటిక గూర్చి ప్రాధాన్యత ఇవ్వండి.
జవాబు:
AP 6th Class Social Important Questions Chapter 6 తొలి నాగరికతలు 1
హరప్పా నాగరికత కాలం నాటి నగరాలన్నియు ప్రణాళికాబద్ధంగా నిర్మించబడినవి. నగరాలకు రక్షణగా కోటలు ఉండేవి. పట్టణాలలో విశాలమైన రహదారులు కలవు మరియు ప్రజలందరికీ మంచినీటి కొరకు బావులు ఉండేవి. మొహంజోదారోలో గొప్ప స్నానవాటిక (ప్రజలు అందరూ స్నానాలు చేయడానికి విశాలమైన కొలను) కలదు, దీనికి నాలుగు వైపుల గదులు కలవు. పవిత్రమైన మత సమ్మేళనాలు జరిగే రోజులలో ప్రజలందరూ ఒక చోటకు చేరినప్పుడు ఈ స్నానవాటికను ఉపయోగిస్తారు. హరప్పా నగరంలో ఆరు పెద్ద ధాన్యాగారాలు మరియు కార్మికులకు నివాస సముదాయాలు కలవు. లోథాల్ నగరంలో అతిపెద్ద నౌకాశ్రయం కలదు.

ప్రశ్న 3.
సింధూ ప్రజల సాంఘిక జీవనం గురించి వివరించండి.
జవాబు:
సాంఘిక జీవనం :
స్త్రీలు, పురుషులు కూడా అలంకరణ పట్ల శ్రద్ధ చూపేవారు. స్త్రీలు కంఠాభరణాలు, మోచేతి ఆభరణాలు, చేతి వేళ్ళకు రింగులు, గాజులు, చెవి రింగులు, ముక్కు పుడకలు ధరించేవారు. స్త్రీలకు అలంకరణ సామగ్రి గురించి, పరిమళద్రవ్యాల గురించి తెలుసు.

వినోదాలు :
నాట్యం, చదరంగం ఆడటం, సంగీతం, గోళీలు, పాచికలు ఆడటం సింధూ ప్రజల వినోదాలు. ఎద్దుల పోటీలు వీరి యొక్క ప్రధాన వినోదం. పిల్లలు బొమ్మలు మరియు ఎద్దుల బండ్ల బొమ్మలతో ఆడుకొనేవారు.

నైపుణ్యాలు :
చిన్న చిన్న అమ్మతల్లి విగ్రహాలను మట్టితో అందంగా తయారుచేసేవారు. నాట్యకత్తె విగ్రహం మరియు బాగా గడ్డం (పూజారి) పెంచిన వ్యక్తి యొక్క రాతి విగ్రహం వంటివి ఈ కాలంలో కనిపించేవి.

AP 6th Class Social Important Questions Chapter 6 తొలి నాగరికతలు

ప్రశ్న 4.
ఆర్యుల జన్మస్థానము గురించి పండితులు వెలిబుచ్చిన అభిప్రాయాలను తెల్పుము.
జవాబు:
ఆర్యుల పుట్టు పూర్వోత్తరాల గురించి అనేక సిద్ధాంతాలు కలవు. ఆర్యులు మధ్య ఆసియా, ఆర్కిటిక్ ప్రాంతం మరియు ఆర్ట్స్ పర్వతాలలోని తూర్పు భాగం నుంచి వచ్చారని కొంతమంది చరిత్రకారుల అభిప్రాయం. ఆర్యులు ఇండో యూరోపియన్ సమూహాలకు చెందినవారేనని ఒక అభిప్రాయమూ కలదు. కొంతమంది చరిత్రకారులలో ఆర్యుల స్వస్థలం భారతదేశమే అనే అభిప్రాయము కలదు.

ప్రశ్న 5.
వైదిక వాజ్మయము (వేద సాహిత్యము) గురించి నీకేమి తెలియును?
జవాబు:
1. ఋగ్వేదము :
ఋషులు సంకలనం చేసిన శ్లోకాల సముదాయం

2. యజుర్వేదము :
యజ్ఞయాగాది క్రతువులలో పాటించవలసిన నియమాల గురించి తెలియ జేయును.

3. సామవేదము :
ఇది పాటల రూపంలో ఉన్న ప్రార్థనల యొక్క సంకలనం, భారతీయ సంగీతము యొక్క మూలాలు ఇందులో కలవు.

4. అధర్వణ వేదము :
ఇది శ్లోకాలు మరియు పాటల సంకలనం. వేదాలే కాక బ్రాహ్మణాలు, ఉపనిషత్తులు, అరణ్యకాలు మరియు రామాయణ మహాభారతాలు కలవు.

5. బ్రాహ్మణాలు : వేదాలలోని శ్లోకాలు, క్రతువులు మరియు తత్వాల గురించి గద్య రూపములో కలదు.

6. అరణ్యకాలు :
విద్యావాదము, క్రతువులు, సంస్కారాల గురించి తెలియజేయును.

7. ఉపనిషత్తులు :
ఆత్మ, ప్రకృతి యొక్క రహస్యాల గురించి తెలియజేసే మాతృక గ్రంథాలు.

ప్రశ్న 6.
వేదకాలం నాటి మత విశ్వాసాల గురించి వివరించండి.
జవాబు:
తొలివేదకాలం :
ఆర్యులు దేవుడు ఒక్కడే అని నమ్మేవారు. దేవుడిని అనేక విధాలుగా ఆరాధించి చేరుకోవచ్చని నమ్మేవారు. ప్రపంచమంతా ఒకే చైతన్యం (ఆత్మ) వ్యాపించి ఉంటుందని నమ్మేవారు. ప్రతి వ్యక్తి దేవుని అంశతో జన్మించాడని వీరి నమ్మకం. వీరు యజ్ఞాలు చేసేవారు.

మలి వేదకాలం :
మతపరమైన కార్యక్రమాలు సంక్లిష్టమయ్యాయి. యజ్ఞాలు, యాగాలు తరచుగా చేసేవారు. విష్ణువు, శివుడు, స్కంధుడు మొదలైన దేవతలను పూజించేవారు. లక్ష్మి, సరస్వతి, పార్వతి మొ||న ఇతర దేవతలు ప్రాముఖ్యత పొందారు.

ప్రశ్న 7.
తొలి, మలి వేదకాలం నాటి రాజకీయ జీవనం గూర్చి తెలుపుము.
జవాబు:
తొలి వేదకాలం నాటి రాజకీయ జీవనం : ఆర్యులు తెగలుగా నివసించేవారు. తెగల నాయకుడిని ‘రాజన్’ అంటారు. రాజు నియంతలాగా పరిపాలించేవాడు కాదు. రాజుకు పరిపాలనా విషయములో సలహాలు ఇచ్చేందుకు ‘సభ’ మరియు ‘సమితి’ అను రెండు సభలు ఉండేవి. రాజు ప్రజల యొక్క సంక్షేమాన్ని చూసేవాడు.

మలి వేదకాలం నాటి రాజకీయ జీవనం :
మలి వేద కాలంలో రాజు మరింత శక్తిమంతుడైనాడు. ‘సభ’ మరియు సమితులు తమ ప్రాధాన్యతను కోల్పోయాయి. రాజరికం వారసత్వంగా మారింది. రాజులు తన రాజ్యాన్ని విస్తరించడానికి అశ్వమేథ, రాజసూయ యాగాలు చేసేవారు.

AP 6th Class Social Important Questions Chapter 6 తొలి నాగరికతలు

ప్రశ్న 8.
ఆర్యుల గురించి తెలుసుకోవడానికి ఆధారాలు
ఆర్యుల గురించి తెలుసుకోవడానికి ప్రధాన ఆధారం వేద సాహిత్యం
AP 6th Class Social Important Questions Chapter 6 తొలి నాగరికతలు 2
పైన ఇవ్వబడిన సమాచారం ఆధారంగా క్రింది ప్రశ్నలకు సరియైన సమాధానములు రాయండి.
1) వేదాలు ఎన్ని? అవి ఏవి?
జవాబు:
వేదాలు నాలుగు, అవి ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణవేదం

2) ఇతిహాసాలు ఎన్ని? అవి ఏవి?
జవాబు:
ఇతిహాసాలు రెండు అవి రామాయణం, మహాభారతం.

3) పై సమాచారం ఆధారంగా ఏమి తెలుసుకోవచ్చు?
జవాబు:
ఆర్యుల గురించి తెలుసుకోవచ్చు.

4) ఆది కావ్యం అని దేనినంటారు?
జవాబు:
రామాయణం.

5) మహాభారతాన్ని ఎవరు రచించారు?
జవాబు:
వేద వ్యాసుడు.

AP 6th Class Social Important Questions Chapter 5 సంచార జీవనం నుండి స్థిర జీవనం

These AP 6th Class Social Important Questions 5th Lesson సంచార జీవనం నుండి స్థిర జీవనం will help students prepare well for the exams.

AP Board 6th Class Social 5th Lesson Important Questions and Answers సంచార జీవనం నుండి స్థిర జీవనం

ప్రశ్న 1.
వేట, ఆహార సేకరణ సులభమైన విషయంగా నీవు భావిస్తున్నావా? అవును/కాదు. మీ జవాబును సమర్థించుము.
జవాబు:
ఈ వేట, ఆహార సేకరణ అంత సులభమైన విషయం కాదు. చెట్లు లేదా మొక్కల ద్వారా ఆహార సేకరణ చేయాలంటే వాటి భాగాలలో దేన్ని తింటారో తెలిసి ఉండాలి. పండ్లు ఏ కాలంలో పక్వానికి వస్తాయో తెలియాలి. వేటాడటానికి, ఆ ప్రాంతంలో సంచరించే జంతువులు, పక్షుల అలవాట్లు, జీవన విధానం వేటగాళ్ళకు తెలిసి ఉండాలి. వేటాడే సమయంలో అప్రమత్తత చురుకుదనం, ఏకాగ్రత ఉండాలి. ఈ విషయాలను ఆది మానవులు తమ పూర్వీకుల నుండి పాటల రూపంలో, కథల రూపంలో తెలుసుకునేవారు. వాటిని తమ సంతతికి తెలియ
జేసేవారు, ఆది మానవులు జంతు చర్మాలను, ఆకులను దుస్తులుగా వాడేవారు.

ప్రశ్న 2.
ఆది మానవులు సంచార జీవనం గడపటానికి కారణమేమిటి?
జవాబు:
ఆది మానవులు సంచార జీవనం గడిపేవారని మనం తెలుసుకున్నాం. ఒక ప్రాంతంలో మొక్కల ద్వారా, జంతువుల ద్వారా లభించే ఆహారం పూర్తిగా అయిపోయేంత వరకు వారు అక్కడే ఉండి తర్వాత ఆహారం కొరకు మరొక ప్రాంతానికి వెళ్ళేవారు. సాధారణంగా వివిధ కారణాల వల్ల జంతువులు ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వలస వెళుతుంటాయి. ఆహార అన్వేషణలో భాగంగా ఆది మానవులు వాటిని వేటాడుతూ వెళ్లేవారు. కొన్ని ప్రత్యేక కాలములోనే చెట్లు పండ్లనిస్తాయి. తమ మనుగడ కోసం, ఆహార సేకరణలో భాగంగా ఆది మానవులు పండ్లు దొరికే ప్రాంతానికి వెళ్లేవారు. మానవులు, జంతువులు, మొక్కలు జీవించడానికి నీరు అవసరం. వేసవి కాలంలో నీటి వనరులయిన సరస్సులు, కుంటలు, నదులు, ఎండిపోతాయి. కావున నీరు లభించే ప్రాంతానికి ఆది మానవులు వలస వెళ్లేవారు.

AP 6th Class Social Important Questions Chapter 5 సంచార జీవనం నుండి స్థిర జీవనం

ప్రశ్న 3.
అది మానవులు నిప్పును దేనికి ఉపయోగించారు?
జవాబు:
ఆది మానవులు నిప్పును కనుగొన్నారు. నిప్పుతో ఆహారాన్ని వండుకొని తినే విధానానికి నాంది పలికింది. క్రూర మృగాలను తరిమివేయడానికి, తాము నివసించే గుహలలో వేడిని, వెలుగును నింపడానికి, చెక్కను గట్టిపరచి ఉపయోగించడానికి నిప్పు వారికి ఉపయోగపడింది. ఈ విధంగా నిప్పు ఆది మానవులకు అనేక విధాలుగా – ఉపయోగపడింది. కావున వారు నిప్పును పవిత్రంగా భావించారు.

ప్రశ్న 4.
ఆది మానవుల గురించి మనం ఎలా తెలుసుకోగలం?
జవాబు:
పురావస్తు తవ్వకాలలో లభించిన (దొరికిన) పనిముట్లు ద్వారా మనం ఆది మానవుల గురించి తెలుసుకోవచ్చు. వారు రాళ్లతోను, కర్రలతోనూ, ఎముకలతోనూ తయారు చేసిన పనిముట్లను విస్తృతంగా ఉపయోగించారు. ఈ పరికరాలను వారు జంతువుల చర్మం తీయడానికి, చర్మం శుభ్రం చేయడానికి ఉపయోగించారు. రాతి పనిముట్లను జంతువుల నివాసం ఎముకలు కోయడానికి వాడారు. భూమిలో నుంచి ఆహారంగా ఉపయోగించే దుంపలను, వేర్లను తవ్వి తీయడానికి ఈ పరికరాలను ఉపయోగించారు. జంతువుల వేటకు విల్లు, అంబులను (ధనుస్సు, బాణాలను) తయారు చేసుకొన్నారు. ఈ పరికరాలతో వారి వేట సులువుగా సాగేది.

ప్రశ్న 5.
పురావస్తు శాస్త్రవేత్తలు అంటే ఎవరు? ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలోని గుహల ప్రత్యేకత ఏమిటి?
జవాబు:
ప్రాచీన కాలంలో ప్రజలు నివసించిన ప్రదేశాలలో నేలను తవ్వినప్పుడు దొరికిన పురాతన సామగ్రి, ఎముకలు, పాత్రలు, భవనాలు, అవశేషాలను అధ్యయనం చేసేవారిని ‘పురావస్తు శాస్త్రవేత్తలు’ అంటారు. పురావస్తు శాస్త్రజ్ఞులు కర్నూలు జిల్లా గుహలలో ఆది మానవులకు చెందిన అనేక రాతి పనిముట్లను కనుగొన్నారు. ఈ జిల్లాలో బేతంచర్ల, బనగానపల్లె ప్రాంతాలలో కొన్ని వందల గుహలు ఉన్నాయి. విశ్రాంతి తీసుకోవడానికి, రాతి పనిముట్లను దాచుకోవడానికి ఈ గుహలను ఆదిమానవులు కొన్నివేల సంవత్సరాలు ఉపయోగించారు.

జంతువుల ఎముకలు, రాతి పనిముట్లు ముఖ్యంగా సూక్ష్మరాతి పరికరాలు, ఎముకలతో చేసిన పనిముట్లని, ఈ గుహలలో పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఎముకలతో చేసిన’ పనిముట్లు ఈ గుహలలో తప్ప భారత ఉపఖండంలో ఎక్కడా దొరకలేదు.

ప్రశ్న 6.
ఆది మానవుల చిత్రకళ గురించి నీకు ఏమి తెలుసు?
జవాబు:
ఆది మానవులు గుహలలోనూ, రాతి స్థావరాలలోనూ నివసించేవారు. గుహల గోడలపై, రాతిస్థావరాలపై ఆది మానవులు జంతువులను, వారు వేటాడే సంఘటనలనూ చిత్రించారు. వారు కొన్ని రకాల రంగు రాళ్లను పిండి చేసి, జంతువుల కొవ్వును కలిపి చిత్రాలు వేయడానికి అవసరమైన రంగులను తయారు చేసుకునేవారు. చిత్రించడానికి వెదురు కుంచెలను ఉపయోగించేవారు.

ప్రశ్న 7.
ఆది మానవుల కాలంలో ఏది వ్యవసాయానికి నాంది పలికింది?
జవాబు:
క్రమంగా పచ్చదనం విస్తరించడంతో ఏ ప్రాంతాలలో ఆహారానికి అనువైన మొక్కలు పెరుగుతున్నాయో, విత్తనా నుంచి కొత్త మొక్కలు ఎలా మొలకెత్తుతున్నాయో మానవులు, పరిశీలన చేయడం ప్రారంభించారు. తమకు కావలసిన గింజలను ఏరుకొని, వాటిని విత్తి, ఆహారపు మొక్కలుగా పండించడం క్రమక్రమంగా నేర్చుకున్నారు. ఇది వ్యవసాయానికి నాంది పలికింది. మానవులు వరి, గోధుమ, బార్లీ, పప్పులు, పెసలు, సెనగ, మునగ పంటలను పండించారు.

AP 6th Class Social Important Questions Chapter 5 సంచార జీవనం నుండి స్థిర జీవనం

ప్రశ్న 8.
ఆది మానవులు సంచార జీవనం నుండి స్థిర జీవనంను ఎందుకు ఏర్పరచుకున్నారు?
జవాబు:
ఆది మానవులు వ్యవసాయం చేసే సమయంలో కొన్ని విషయాలు గమనించారు. విత్తనాల నుండి మొక్కలు రావడం, వాటి నుండి పంట చేతికి రావడానికి కొన్ని రోజులు, కొన్ని వారాలు, కొన్ని నెలలు లేదా కొన్ని సంవత్సరాలు పడుతుందని గమనించారు. పంటలకు నీరు పెట్టడానికి, జంతువులు, పక్షుల నుండి వాటిని : కాపాడటానికి పంట పండే ప్రదేశాలలో ప్రజలు నివాసం ఏర్పరచుకున్నారు.

ప్రశ్న 9.
వ్యవసాయ, పశుపోషకులు ఉపయోగించిన పనిముట్ల గురించి వివరంగా తెల్పండి.
జవాబు:
ఆనాటి వ్యవసాయదారులకు అడవులను చదును చేయడానికి పనిముట్లు అవసరమయ్యాయి. వీటిని నవీన రాతి పనిముట్లుగా పురావస్తు శాస్త్రవేత్తలు అంటారు. ఆనాటి వ్యవసాయ దారులు అనువైన రాతిని మరొక రాతిపై సాన పెట్టడం ద్వారా గొడ్డళ్లు లాంటి పరికరాలను తయారు చేసుకొన్నారు. ఇలా సాన పెట్టిన గొడ్డళ్ళకు కొయ్య పెట్టి బిగించేవారు. వీటితో చెట్లను నరికేవారు. ఈ కొత్త రాతి పనిముట్లతో వ్యవసాయం చేసిన కాలాన్ని నవీన శిలాయుగం లేదా కొత్త రాతి యుగం అంటారు. రుబ్బురోలు, రోకలితో ధాన్యంను మరియు ఇతర మొక్కల ఉత్పత్తులు దంచేవారు.

AP 6th Class Social Important Questions Chapter 4 ఆంధ్రప్రదేశ్ – భూస్వరూపాలు

These AP 6th Class Social Important Questions 4th Lesson ఆంధ్రప్రదేశ్ – భూస్వరూపాలు will help students prepare well for the exams.

AP Board 6th Class Social 4th Lesson Important Questions and Answers ఆంధ్రప్రదేశ్ – భూస్వరూపాలు

ప్రశ్న 1.
పర్వతాలు అనగానేమి? వీని గురించి నీకేమి తెలుసు?
జవాబు:
AP 6th Class Social Important Questions Chapter 4 ఆంధ్రప్రదేశ్ – భూస్వరూపాలు
భూ ఉపరితలంపై సహజమైన అత్యధిక ఎత్తు కలిగిన ప్రాంతాలు పర్వతాలు పర్వతాలు కింది భాగంలో విశాలంగానూ, పై భాగంలో చిన్న శిఖరాన్ని కలిగి ఉంటాయి. పరిసరాల కంటే ఇవి బాగా ఎత్తులో, కొన్నిసార్లు మబ్బుల కంటే ఎత్తుగా ఉంటాయి. పర్వతాలపై ఎక్కువ ఎత్తుకి వెళ్లేకొద్దీ శీతోష్ణస్థితి చల్లగా ఉంటుంది. భారతదేశం హిమాలయాల వంటి పెక్కు ఉన్నత పర్వత శ్రేణులను కలిగి ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎత్తయిన భూస్వరూపాలలో ఎక్కువ – భాగం కొండలు.

ప్రశ్న 2.
పీఠభూములు అంటే ఏవి? ఇక్కడ శీతోష్ణస్థితి పరిస్థితి ఎలా ఉంటుంది?
జవాబు:
AP 6th Class Social Important Questions Chapter 4 ఆంధ్రప్రదేశ్ – భూస్వరూపాలు
పీఠభూములు అనగా ఎత్తుగా ఉండి సమతలంగా ఉండే ప్రదేశాలు. ఇవి పరిసరాల కంటే ఎత్తయిన సమ ఉపరితలం గల బల్లపరుపు భూములు. పీఠభూములు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ వైపుల నిటారుగా ఉండి సున్నితమైన వాలు కలిగి ఉంటాయి. ప్రపంచంలో అత్యంత ఎత్తులో ఉన్న కొన్ని పీఠభూములలో శీతోష్ణస్థితి కఠినంగా ఉండి నివాస యోగ్యమైన పరిస్థితులు లేవు. ‘తక్కువ ఎత్తులో ఉండే మిగిలిన పీఠభూములలో చాలా అనుకూల పరిస్థితులు ఉన్నాయి.

AP 6th Class Social Important Questions Chapter 4 ఆంధ్రప్రదేశ్ – భూస్వరూపాలు

ప్రశ్న 3.
పీఠభూములు ఆర్థికంగా ఏ విధంగా లాభదాయకమైనవని చెప్పవచ్చు?
జవాబు:
సాధారణంగా పీఠభూములు ఖనిజసంపదను కలిగి ఉంటాయి. అందువలన ఎక్కువ భాగం గనులు పీఠభూములలోనే ఉంటాయి. సున్నపురాయి, మాంగనీస్, రాతినార, ఇనుపఖనిజం, బంగారం, వజ్రాలు, గ్రాఫైట్, డోలమైట్, క్వార్ట్ సిలికా మొదలగు ఖనిజాలు పీఠభూమి ప్రాంతాలలో లభిస్తాయి. దక్కన్ పీఠభూమి లావా పీఠభూమి. ఈ లావా పీఠభూములు పత్తి పండించడానికి అనుకూలమైన సారవంతమైన నల్లరేగడి నేలలకి ప్రసిద్ధి. పీఠభూములు అనేక సుందర దృశ్యాలతో ప్రధాన పర్యాటక ఆకర్షణలుగా నిలిచి ఉన్నాయి.

ప్రశ్న 4.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సరిహద్దులను తెలియజేస్తూ, ఆంధ్రప్రదేశ్ గురించి మీకు తెలిసిన విశేషాలు రాయండి.
జవాబు:
భారతదేశంలో గల 28 రాష్ట్రాలలో ఇది ఆగ్నేయ దిక్కులో గల ఒక రాష్ట్రం. భారతదేశపు తూర్పు తీర మైదానాన్ని ఆనుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నది. ఉత్తరాన చత్తీస్ఫడ్, ఒడిశా రాష్ట్రాలు, దక్షిణాన తమిళనాడు, పశ్చిమాన తెలంగాణా, నైఋతిలో కర్ణాటక, తూర్పున బంగాళాఖాతం దీనికి సరిహద్దులు. ఆంధ్రప్రదేశ్ తీరరేఖ పొడవు 972 కిలోమీటర్లు కాగా 2011 జనాభా లెక్కల ప్రకారం ఇది భారతదేశంలో విస్తీర్ణత పరంగ ఏడవ పెద్ద రాష్ట్రం, జనాభా పరంగా పదవ పెద్ద రాష్ట్రం. కోస్తా ఆంధ్ర, రాయలసీమ అనే రెండు ప్రాంతాలను ఆంధ్రప్రదేశ్ కలిగి ఉన్నది.

1. కోస్తా ఆంధ్ర :
ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతాన్ని ఆనుకుని ఉన్న 9 జిల్లాలను కోస్తా ఆంధ్రగా పిలుస్తారు. ఈ ప్రాంతం కృష్ణా, గోదావరి, పెన్నా డెల్టాల వలన ఏర్పడిన సారవంతమైన నేలలను, అధిక జన సాంద్రతను కలిగి ఉన్నది.

2. రాయలసీమ :
ఈ ప్రాంతం రాతిపొరలు, పొడి నేలలతో కూడిన 4 జిల్లాల సమాహారం. ఇక్కడి అల్ప మరియు అనిశ్చిత వర్షపాతం వ్యవసాయానికి అంతగా అనుకూలం కాదు.

ప్రశ్న 5.
పోలవరం ప్రాజెక్ట్ ముంపు మండలాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంకు సంబంధించిన ఏ మండలాలు ఆంధ్రప్రదేశ్ లో విలీనం చేయబడ్డాయి?
జవాబు:
పోలవరం ప్రాజెక్టు నిర్మించడం వలన తెలంగాణా రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలోని ముంపు మండలాలు ఆంధ్రప్రదేశ్ లో విలీనం చేయబడినవి. వరరామ చంద్రపురం, కూనవరం, చింతూరు, భద్రాచలం మండలాలు తూర్పు గోదావరి జిల్లాలోనూ, బూర్గుంపాడు, కుక్కునూరు, వేలేరుపాడు మండలాలు పశ్చిమ గోదావరి జిల్లాలోనూ విలీనం చేయబడినవి.

ప్రశ్న 6.
తూర్పు కనుమలను వివిధ జిల్లాల్లో స్థానికంగా ఏ పేర్లతో వ్యవహరిస్తారో రాయండి.
జవాబు:

తూర్పు కనుమలను వివిధ జిల్లాల్లో స్థానికంగా క్రింది పేర్లతో వ్యవహరిస్తారు.

కొండల పేర్లుజిల్లా పేరు
1. యారాడ మరియు అనంతగిరి కొండలువిశాఖపట్నం
2. బైసన్ కొండలు మరియు పాపి కొండలుతూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు
3. మొగల్ రాజపురం, కొండపల్లి కొండలుకృష్ణ
4. బేరంకొండ, నాగార్జున కొండ, కోటప్పకొండగుంటూరు
5. వేలికొండలుఎస్.పి.ఎస్. ఆర్. నెల్లూరు
6. నల్లమల్ల, ఎర్రమలకర్నూలు
7. వేలికొండలు, పాలకొండలువై.ఎస్.ఆర్. కడప
9. శేషాచలం, హార్సిలీ కొండలుచిత్తూరు
10. పెనుకొండ, మడకశిరకొండలుఅనంతపురం

AP 6th Class Social Important Questions Chapter 4 ఆంధ్రప్రదేశ్ – భూస్వరూపాలు 1

ప్రశ్న 7.
“ఆంధ్రాకాశ్మీర్” అని ఏ ప్రాంతాన్ని పిలుస్తారు? ఇది ఎక్కడ ఉంది?
జవాబు:
AP 6th Class Social Important Questions Chapter 4 ఆంధ్రప్రదేశ్ – భూస్వరూపాలు 2
లమ్మసింగి/లంబసింగి, విశాఖపట్నం మన్య ప్రాంతంలోని చింతపల్లి మండలంలో మారుమూల ప్రాంతం. ఇక్కడ చలికాలంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. దీనిని ‘ఆంధ్రాకాశ్మీర్’గా పిలుస్తారు.

ప్రశ్న 8.
పోడు వ్యవసాయం గురించి రాయండి.
జవాబు:
కొండ ప్రాంతాలలో ‘పోడు’ అనేది ఒక గిరిజన వ్యవసాయ పద్ధతి. దీనినే ‘స్థల మార్పిడి’ వ్యవసాయం లేదా ‘ఝూమ్’ వ్యవసాయం అని కూడా పిలుస్తారు. ఈ పద్ధతిలో, ప్రజలు అడవిలో కొంత ప్రాంతాన్ని చదును చేసి కొన్ని సంవత్సరాల పాటు పంటలు పండిస్తారు. తరువాత భూసారం తగ్గడం వలన వేరే స్థలానికి మారతారు. జొన్న, మొక్కజొన్న మొదలగు పంటలను ఈ పద్ధతిలో పండిస్తారు.

ప్రశ్న 9.
గిరిజనులు అడవులపై ఏ విధంగా ఆధారపడతారు?
జవాబు:
పోడు వ్యవసాయం, పెరటి తోటలనుండి వచ్చే దిగుబడి వీరి కుటుంబాలు సంవత్సరం పొడవునా జీవించడానికి సరిపోదు. కాబట్టి వివిధ రకాల అటవీ ఉత్పత్తుల సేకరణ, వేట వారి జీవినంలో కీలక భూమికను పోషిస్తాయి. వివిధ రకాల పళ్లు దుంపలు, గింజలు ఆకుకూరలు సేకరించడానికి, చిన్న జంతువులను వేటాడడానికి అడవిపైనే ఆధారపడతారు.

ప్రశ్న 10.
ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఏదైనా ఒక గిరిజన సమూహం గూర్చి వివరించండి.
జవాబు:
వ్యవసాయం పూర్వ ఆర్థిక వ్యవస్థను ఆచరిస్తున్న చెంచులు ఒక గిరిజన సమూహం. భారత ప్రభుత్వం వీరిని ఒక నిర్దిష్ట హానికర తెగగా గుర్తించింది. వారు ప్రాచీన కాలం నుండి నల్లమల అటవీ ప్రాంత నివాసులు. సాంప్రాదాయకంగా వారు వేటగాళ్లు. వీరు ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు, గుంటూరు, ప్రకాశం జిల్లాలలో వ్యాపించారు.
AP 6th Class Social Important Questions Chapter 4 ఆంధ్రప్రదేశ్ – భూస్వరూపాలు 3
ప్రభుత్వం వీరిని స్థిర వ్యవసాయంలోకి తీసుకురావడానికి వారి వ్యవసాయ కార్యకలాపాలకు మద్దతు ఇవ్వడం ద్వారా చాలా ప్రయత్నాలు చేస్తోంది. వారిలో విద్యను ప్రోత్సహించడానికి ప్రభుత్వం అనేక పాఠశాలలను నివాస సౌకర్యాలతో నడుపుతోంది. ప్రభుత్వం 1989లో శ్రీశైలంలో ఇంటెగ్రేటెడ్ గిరిజన అభివృద్ధి సంస్థ యొక్క ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. వారి మౌఖిక సాహిత్యం మానవ భావాలు మరియు ఆలోచనల యొక్క పురాతన రికార్డులలో ఒకటిగా పరిగణించబడుతుంది. (The chenchus by – Haimendorf పుస్తకం ఆధారంగా)

ప్రశ్న 11.
రాయలసీమ ప్రాంతం ఎందుకు కరవు పీడిత ప్రాంతంగా ఉన్నది?
జవాబు:
ఆంధ్రప్రదేశ్ లోని పీఠభూమి ప్రాంతం దక్కన్ పీఠభూమిలోని తూర్పుభాగానికి చెందినది కాగా రాయలసీమ ఈ ప్రాంతంలో కలదు. ఈ ప్రాంతంలో వర్షపాతం తక్కువగా ఉంటుంది. ఇక్కడ అల్ప, అనిశ్చిత వర్షపాతంతో బాటు చాలాసార్లు అసలు వర్షమే కురవకపోవడం సర్వ సాధారణం. అందువలనే ఇది కరవుపీడిత ప్రాంతంగా ఉన్నది.

ప్రశ్న 12.
రాయలసీమ (పీఠభూమి) ప్రాంతంలోని నేలల గురించి వివరించండి.
జవాబు:
ఇక్కడి నేలలు నల్లరేగడి, లేటరైట్, ఎర్రనేలలు మరియు ఇసుకనేలల రకానికి చెందినవి. కడప, కర్నూలు జిల్లాల్లో నల్లరేగడి నేలలు కలవు. రాయలసీమ ప్రాంతంలో అక్కడక్కడ ఉన్న ఎర్రమట్టి నేలలకు వీటిని నిల్వ ఉంచుకునే , సామర్థ్యం లేకపోవడంతో భూమిని సాగు చేయకుండానే వదిలివేస్తారు. పీఠభూమి ప్రాంతాలలో అక్కడక్కడ ఉండే చౌడు నేలల్లో ఎక్కువగా సున్నం, క్షారలవణాలు ఉంటాయి. కాబట్టి ఆ నేలలు పంటలు పండించడానికి అనుకూలంగా ఉండవు.

AP 6th Class Social Important Questions Chapter 4 ఆంధ్రప్రదేశ్ – భూస్వరూపాలు

ప్రశ్న 13.
రాయలసీమ (పీఠభూమి) ప్రాంతంలోని నీటి వనరుల గురించి తెలియజేయండి.
జవాబు:
పీఠభూమి ప్రాంతాలలో వర్షాలు తక్కువగా కురవడం వల్ల రైతులు వర్షపునీటిని నిల్వ చేసుకుంటారు. భూగర్భజలాలను వాడుకుంటారు. పూర్వకాలంలో వర్షపునీటిని నిల్వ ఉంచుకోవడానికి చెరువులు తవ్వేవారు. పీఠభూమి ప్రాంతాలలో సహజంగా ఉండే అగాధాలు, చిన్న కొండలవలన చెరువులను నిర్మించడం సులభం. చిన్న చిన్న చెరువులు నీటిని నిల్వచేయడానికి ఉపయోగపడితే, నూతులు భూగర్భ జలాలని వెలికి తీయడానికి ఉపయోగపడతాయి. ఇటీవల కాలంలో రైతులు ఎక్కువగా నూతులకు బదులు గొట్టపు బావులను వాడుతున్నారు. అయితే పీఠభూమి ప్రాంతంలో గొట్టపుబావులను తవ్వడం చాలా ఖర్చుతో కూడిన పని. కొద్దిమంది రైతులు మాత్రమే ఎక్కువ ధనాన్ని దీనికొరకు వెచ్చించగలుగుతున్నారు. ఎక్కువ భూములున్న 5-10 శాతం రైతులకు మాత్రమే గొట్టపు బావులున్నాయి. మిగిలిన వారు వర్షం పైనే ఆధారపడుతున్నారు. పెరుగుతున్న గొట్టపుబావుల సంఖ్య వలన భూగర్భ జల మట్టాలు తగ్గిపోతున్నాయి.

ప్రశ్న 14.
ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు తీర మైదాన స్వరూపం గురించి వివరించండి.
జవాబు:
ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు తీర మైదానం కృష్ణా గోదావరి డెల్టాలో తప్ప శ్రీకాకుళంలోని వంశధార, నెల్లూరులోని పెన్నా డెల్టా ప్రాంతాలలో ఇరుకుగా ఉంటుంది. ఈ మైదానాలలో ప్రసిద్ధి పొందిన (కొల్లేరు మంచినీటి సరస్సు), పులికాట్ (ఉప్పునీటి సరస్సు) సరస్సులు కలవు. కొల్లేరు సరస్సు పశ్చిమ గోదావరి జిల్లాలోనూ, పులికాట్ సరస్సు నెల్లూరు జిల్లాలోనూ కలదు.

ఆంధ్రప్రదేశ్ లోని ఈ విశాల తీరమైదానం రైతులకు, వ్యవసాయానికి గొప్ప కానుక వంటిది. ఇక్కడ వ్యవసాయం ప్రధాన వృత్తి మాత్రమే కాక మైదాన ప్రాంతంలోని చాలాభాగంలో ఒకటి కంటే ఎక్కువ పంటలను పండిస్తారు. అందువలనే ఈ ప్రాంతం అధిక జనాభాకీ జనసాంద్రతకీ కూడా పెట్టింది పేరు.

ప్రశ్న 15.
అత్యల్ప వర్షపాతం మరియు భూగర్భజలం తగ్గుదల వలన ఎటువంటి ముప్పు పొంచి ఉందో తెల్పండి.
జవాబు:
అత్యల్ప వర్షపాతం మరియు భూగర్భ జలాలు తగ్గుముఖం పట్టడంతో అనంతపురం జిల్లాలోని కొన్ని ప్రాంతాలు తీవ్ర నీటి కొరతను ఎదుర్కొంటున్నాయి. ఉదా : రాయదుర్గం, కళ్యాణదుర్గం మొదలగు ప్రాంతాలు. ఈ ప్రాంతాలలోని నేలలు క్రమంగా రాతిమయంగా మారిపోవడమే కాక ఎడారీకరణ ముప్పు కూడా పొంచి ఉంది.

ప్రశ్న 16.
క్రింది వానిని ఉదాహరణలతో నిర్వచించండి.
1) నగదు పంట 2) ఆహార పంట 3) ఆక్వాకల్చర్ (జలసేద్యం) దీనివలన ఏర్పడే సమస్యలు ఏవి?
జవాబు:
1. నగదు పంట :
ఇది రైతుకి ఎక్కువ ఆదాయాన్ని లాభాన్ని ఇచ్చేది. వీటిని వ్యాపార / వాణిజ్య పంటలుగా కూడా వ్యవహరిస్తారు.
ఉదా : వేరుశనగ, పసుపు, చెరకు, పొగాకు మొదలగునవి.

2. ఆహార పంట :
ఆహార పంటలు సామాన్యంగా వినియోగం కొరకు సాగు చేసేవి.
ఉదా : వరి, చిరుధాన్యాలు, కూరగాయలు – వీటిని కూడా వినియోగానికి పోగా మిగిలిన వాటిని అమ్ముతారు.

3. ఆక్వాకల్చర్ (జలసేద్యం) :
ఆహారం కొరకు జలచరాలను పెంచుటను (సాగు చేయుటను) ‘ఆక్వాకల్చర్’ అంటారు. ఉదా : రొయ్యలు, చేపలు, పీతలు మొదలగునవి. ఇటీవలికాలంలో కోస్తా జిల్లాల్లో చాలామంది రైతులు ఆక్వాకల్చర్ వైపు మొగ్గు చూపుతున్నారు. వరి పండించే పొలాలను చాలాభాగం చేపల చెరువులుగా మారుస్తున్నారు. ఈ రకమైన మార్పు నీటి కాలుష్యానికి తద్వారా వరి పండించే పొలాలకి నీరు అందించే చెరువులలోని నీరు కలుషితం కావడానికి కారణమవుతోంది.

ప్రశ్న 17.
క్రింద ఇవ్వబడిన ఆంధ్రప్రదేశ్ పటం పరిశీలించి ఇచ్చిన ప్రశ్నలకు సరియైన సమాధానములివ్వండి.
జవాబు:
AP Board 6th Class Social Solutions Chapter 4 ఆంధ్రప్రదేశ్ – భూస్వరూపాలు 7
1) రాయలసీమలో ఎన్ని జిల్లాలు కలవు?
జవాబు:
4

2) కోస్తా ఆంధ్రాలో ఎన్ని జిల్లాలు కలవు?
జవాబు:
9

3) ఆంధ్రప్రదేశ్ కు ఏ దిక్కున ఎక్కువ రాష్ట్రాలతో సరిహద్దు కలదు?
జవాబు:
ఉత్తరం

4) డెల్టా ఏ జిల్లాలో ఉన్నాయి?
జవాబు:
ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు.

5) తూర్పు దిక్కున సరిహద్దుగా ఏమి ఉంది?
జవాబు:
బంగాళాఖాతం.

AP 6th Class Social Important Questions Chapter 3 పటములు

These AP 6th Class Social Important Questions 3rd Lesson పటములు will help students prepare well for the exams.

AP Board 6th Class Social 3rd Lesson Important Questions and Answers పటములు

ప్రశ్న 1.
చిత్తు చిత్రం, మాన చిత్రం (పటం)నకు వ్యత్యాసమేమి?
జవాబు:

చిత్తుచిత్రంపటం
చిత్తు చిత్రం అనేది ముఖ్యంగా స్కేల్ ఉపయోగించ కుండా గుర్తు ఉన్న దాన్ని బట్టి అప్పటికప్పుడు పరిశీలించి గీస్తారు. ఈ చిత్తు చిత్రంలో స్కేల్, దిక్కులు చూపకండానే గీయవచ్చు.పటం అనగా మొత్తం భూమిని గాని లేదా అందులోని ఒక భాగం గురించి గానీ ఒక సమ ఉపరితలంపై స్కేలుకి అనుగుణంగా చూపడానికి ఉపయోగించేది. దిక్కులు, స్కేలు, చిహ్నాలు మొదలైనవి ఇందులోని ముఖ్యమైన అంశాలు.

ప్రశ్న 2.
గ్లోబు, పటాలను ఏయే సందర్భాలలో ఉపయోగిస్తామో వివరించండి.
జవాబు:
గ్లోబుని ఉపయోగించడంలో కొన్ని పరిమితులు ఉన్నాయి. భూమి యొక్క ఆకృతిని ఒకే మొత్తంగా అధ్యయనం చేయాలని అనుకున్నప్పుడు మాత్రమే గ్లోబు ఉపయోగకరంగా ఉంటుంది. కానీ దేశం, రాష్ట్రం, జిల్లా, నగరం – ఇలా ఒక్కొక్క భాగాన్ని గురించి తెలుసుకోవాలని అనుకున్నప్పుడు గ్లోబు ఉపయోగం తక్కువ. అటువంటి పరిస్థితులలో మనం పటాలను ఉపయోగిస్తాం.

ప్రశ్న 3.
మీరు ఉదయిస్తున్న సూర్యునికి ఎదురుగా నిలబడి, ప్రధాన దిక్కులు ఏవో వివరించండి.
జవాబు:
ఉదయిస్తున్న సూర్యునికి ఎదురుగా నిలబడినట్లయితే ఎదురుగా ఉన్నది తూర్పుదిక్కు వెనుక అంటే వీపుభాగం వైపు వున్నది పడమరనీ, ఎడమవైపు ఉన్నది ఉత్తర దిక్కునీ, కుడివైపు ఉన్నది దక్షిణ దిక్కునీ సూచిస్తుంది. ఈ , నాలుగు దిక్కుల్లోనూ ఉత్తర దిక్కుని ప్రధానదిక్కుగా భావిస్తాం. అందువలనే అన్ని పటాలలోనూ కుడిచేతివైపు పైన N అనే అక్షరం, బాణం గుర్తు ఉంటాయి. మనకి ఉత్తరదిక్కు తెలిస్తే, మిగిలిన దిక్కులని సులభంగా కనుక్కోవచ్చును. ప్రధాన దిక్కులు నాలుగు – ఉత్తరం, దక్షిణం, తూర్పు మరియు పడమర, వీటిని ప్రధాన దిక్కులు అంటారు.

AP 6th Class Social Important Questions Chapter 3 పటములు

ప్రశ్న 4.
‘స్కేలు’ అనగానేమి? దీనిని ఎందుకు ఉపయోగిస్తాం?
జవాబు:
స్కేల్ పటంలోని మరొక ముఖ్యమైన అంశం. భూమిపై కల వాస్తవ దూరానికీ పటంలో చూపబడిన దూరానికీ కల నిష్పత్తినే ‘స్కేలు’ అని పిలుస్తాం. పటంలో రెండు ప్రాంతాల మధ్య కల దూరాన్ని లెక్కించడానికి స్కేల్ ఉపయోగిస్తాం.

ప్రశ్న 5.
పటాలు ఎన్ని రకాలు? అవి ఏవి? వివరణాత్మకంగా తెల్పండి.
జవాబు:
పటంలో చూపిన అంశం లేదా వాటి ఉపయోగాన్ని బట్టి పటాలను మూడు రకాలుగా వర్గీకరించవచ్చు.

  1. రాజకీయ పటాలు
  2. భౌతిక పటాలు
  3. విషయ నిర్దేశిత పటాలు.

1. రాజకీయ పటాలు :
గ్రామాలు, నగరాలు, పట్టణాలు, జిల్లాలు, రాష్ట్రాలు మరియు దేశాల సరిహద్దులను చూపేవి రాజకీయ పటాలు.

2. భౌతిక పటాలు :
పర్వతాలు, పీఠభూములు, మైదానాలు, సముద్రాలు, నదులు, ఎడారులు వంటి భౌగోళిక స్వరూపాలను గూర్చి వివరిస్తాయి.

3. విషయ నిర్దేశిత పటాలు :
ఈ పటాలను భూమి వినియోగం, ఉష్ణోగ్రత, వర్షపాతం, జనాభా, నేలలు, అడవులు, పంటలు, ఖనిజాలు, పరిశ్రమలు, రైలుమార్గాలు, రోడ్డు మార్గాలు, జల మార్గాలు వంటి కొన్ని నిర్దిష్ట అంశాలను గురించి వివరించడానికి ఉపయోగిస్తారు.

ప్రశ్న 6.
స్కేల్ ఆధారంగా పటాలలో రకాలు ఎన్ని? అవి ఏవి? సోదాహరణంగా వివరించండి.
జవాబు:
స్కేల్ ఆధారంగా పటాలలో రకాలు :
అ. పెద్ద తరహా పటాలు : ఇవి చిన్న ప్రాంతాలను గురించి తెలియజేస్తాయి. వీటిని భూనైసర్గిక పటాలు (topo graphic maps) భూ సరిహద్దులను తెలిపే పటాలు (cadastral maps) గా విభజించవచ్చును. భూసరిహద్దులను తెలిపే పటాలు వ్యక్తిగత ఆస్తికి చెందినవి కాగా భూనైసర్గిక పటాలు భూ ఉపరితలం యొక్క వివరాలను చూపుతాయి.

ఆ. చిన్న తరహా పటాలు :
ఇవి పెద్ద ప్రాంతాలను గురించి తెలియజేస్తాయి. ప్రపంచం, ఖండాలు లేదా దేశాలు మొదలగునవి. ఇవి రెండు రకాలు – గోడ పటాలు మరియు అట్లాస్. గోడ పటాలు అట్లాస్ కంటే పరిమాణంలో పెద్దవిగా ఉంటాయి. వాటిని తరగతి గదిలో బోధన కొరకు మరియు పరిపాలనా పరంగాను ఉపయోగిస్తారు. అవి రాజకీయ విభాగాలు, భౌగోళిక అంశాలు వంటి సాధారణ మరియు ముఖ్యమైన అంశాలను చూపుతాయి.

AP 6th Class Social Important Questions Chapter 3 పటములు

ప్రశ్న 7.
జి.పి.ఎస్ మరియు వెబ్ ఆధారిత పటాల వలన ఎటువంటి సమాచారం పొందవచ్చు?
జవాబు:
AP 6th Class Social Important Questions Chapter 3 పటములు 1
జి.పి.ఎస్ అనగా ప్రస్తుతం విశ్వంలో మనం ఉన్న స్థానాన్ని తెలుసుకునే వ్యవస్థ (Global Positioning System) భూమ్మీద ఉండే వస్తువులను గుర్తించడానికి 10 ఇది చాలా ముఖ్యమైన సాంకేతిక వ్యవస్థ.

వెబ్ ఆధారిత పటాల ద్వారా ప్రపంచంలోని అన్ని భౌగోళిక ప్రాంతాలు, ప్రదేశాలు గురించి పూర్తి సమాచారాన్ని పొందవచ్చును. సాంప్రదాయక పటాలకి అదనంగా ఈ పటాల ద్వారా అనేక ప్రదేశాలను ఉపగ్రహ, విహంగ వీక్షణ చేయవచ్చును.

ప్రశ్న 8.
ఖండాలు అనగానేమి? ఖండాలు ఎన్ని అవి ఏవి? మహాసముద్రాలు అనగానేమి? మహాసముద్రాలు ఎన్ని అవి ఏవి? వీటిని ప్రపంచ పటంలో గుర్తించండి.
జవాబు:
విశాల భూభాగాలను ఖండాలు అని, జలభాగాలను మహాసముద్రాలు అని పిలుస్తాం. ఆసియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, అంటార్కిటికా, ఐరోపా మరియు ఆస్ట్రేలియా ఖండాలు కాగా పసిఫిక్, అట్లాంటిక్, హిందూ మహాసముద్రం, అంటార్కిటిక్ మరియు ఆర్కిటిక్ మహాసముద్రాలు.
AP 6th Class Social Important Questions Chapter 3 పటములు 2

ప్రశ్న 9.
బ్రాడ్ గేజ్ రైల్వే, కచ్చారోడ్లు, పక్కారోడ్లు, చెట్లు, ఇళ్ళు, నదులను, మాన చిత్రంలో ఏ విధమైన చిహ్నాలు/గుర్తులతో చూపిస్తారో వాటిని గీయండి.
జవాబు:
AP 6th Class Social Important Questions Chapter 3 పటములు 3

ప్రశ్న 10.
పై మాన చిత్రాన్ని పరిశీలించి క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సరియైన సమాధానము లిమ్ము.
AP 6th Class Social Important Questions Chapter 3 పటములు 4
i) చర్చికి ఏ దిశలో నది ప్రవహిస్తుంది?
జవాబు:
తూర్పు

ii) మసీదు ఏ గ్రామంలో ఉంది?
జవాబు:
బొందపల్లి.

iii) ఏ రెండు గ్రామాల మధ్య పోలీస్ స్టేషన్ కలదు?
జవాబు:
రామాపురం, కృష్ణాపురం

iv) కృష్ణాపురంలోని దేవాలయానికి వెళ్ళటానికి ఎటువంటి రోడ్డు కలదు?
జవాబు:
కచ్చారోడ్డు.

v) పై చిత్రంలో ఎటువంటి రైలుమార్గంను సూచిస్తుంది?
జవాబు:
బ్రాడ్ గేజ్ రైల్వే

vi) రైలు మార్గానికి ఉత్తరాన ఉన్న గ్రామమేది?
జవాబు:
బొందపల్లి

vii) పై పటంలోని పాఠశాలలో మీరు ఉన్నారని అనుకోండి. పాఠశాల నుంచి బయటకు వస్తుంటే ఏ దిశ వైపుకి నడుస్తుంటారు?
జవాబు:
దక్షిణ దిశలో

viii) నది ఒడ్డున ఉన్న ప్రార్ధన మందిరం ఏమిటి?
జవాబు:
(గుడి) దేవాలయం

AP Inter 2nd Year Zoology Study Material Chapter 1(b) Breathing and Exchange of Gases

Andhra Pradesh BIEAP AP Inter 2nd Year Zoology Study Material Lesson 1(b) Breathing and Exchange of Gases Textbook Questions and Answers.

AP Inter 2nd Year Zoology Study Material Lesson 1(b) Breathing and Exchange of Gases

Very Short Answer Questions

Question 1.
Define vital capacity. What is its significance?
Answer:
Vital capacity :
The maximum volume of air a person can breathe in after forced expiration. This includes ERV (Expiratory Reserve Volume), TV (Tidal Volume), and IRV (Inspiratory Reserve Volume) (or) the maximum volume of air a person can breathe out after forced inspiration (VC = TV + IRV + ERV).

Question 2.
What is the volume of air remaining in the lungs after a normal expiration?
Answer:
The volume of air that remains in the lungs after a normal expiration is called ‘Functional Residual Capacity (FRC)’.
FRC = ERV + RV
ERV = 1000 to 1100 ml
RV = 1100 to 1200 ml. So
FRC = 2100 to 2300 ml.

Question 3.
Diffusion of oxygen occurs in the alveolar region only and not in other parts of respiratory system. How do you justify the statement?
Answer:
Alveoli are primary sites of exchange of gas by simple diffusion. Aleveolar region is having enough pressure gradient to facilitate diffusion of gases. Other regions of the respiratory system doesn’t have the required pressure gradient.

High pO2, low pCO2. lesser H+ concentration, low temperature conditions in alveoli favourable for diffusion of O2 ahd formation of oxyhaemoglobin. Solubility of gases as well as thickness of the membrane are also some of the important factors that can effect the ratio of diffusion.

Question 4.
What is the effect of pCO2 on oxygen transport?
Answer:
pCO2 plays an important role in the transport of oxygen. At the alveolus, the low pCO2 and high pO2 favours the formation of oxyhaemoglobin. At the tissues, the high pCO2 and low pO2 favours the dissociation of oxygen from oxyhaemoglobin. Hence, the affinity of haemoglobin for oxygen is enhanced by the decrease of pCO2 in blood. Therefore, oxygen is transported in blood as oxyhaemoglobin and oxygen dissociates from it at the tissues.

AP Inter 2nd Year Zoology Study Material Chapter 1(b) Breathing and Exchange of Gases

Question 5.
What happens to the respiratory process in man going up a hill?
Answer:
When a man is going up a hill or doing some strenous exercise then there is more consumption of oxygen and resulting in more demand of oxygen. As a result there is an increased breathing rate to fill the gap.

Question 6.
What is tidal volume? Find out the tidal volume in a healthy human, in an hour?
Answer:
Tidal Volume (TV) :
Volume of air inspired (or) expired during normal inspiration (or) expiration. It is approximately 500 ml i.e., a healthy man can inhale (or) exhale approximately 6000 to 8000 ml of air per minute (or) 3,60,000 to 4,80,000 ml per hour.

Question 7.
Define oxyhaemoglobin dissociation curve. Can you suggest any reason for its sigmoidal pattern?
Answer:
The oxyhaemoglobin dissociation curve is a graph showing the percentage of oxyhaemoglobin at various partial pressures of oxygen.

Reasons for Sigmoidal pattern :
In alveoli, where there is a high pO2, low pCO2 lesser H+ and low temperature, the factors are all favourable for formation of oxyhaemoglobin. In the tissues where low pO2, high pCO2, high H+ concentration and higher temperature exist, the conditions are favourable for dissociation of oxygen from oxyhaemoglobin under these conditions. Oxygen dissociation curve shift away from the Y-axis and form sigmoid curve.

Question 8.
What are conchae?
Answer:
These are curved bones that make up the upper portion of the nasal cavity. There are different conchae in the nose, such as interior concha, medial concha and superior concha. The nasal concha bones are also referred’to as turbinate pones.

Question 9.
What is meant by chloride shift?
Answer:
Chloride shift:
It refers to the exchange of chloride and bicarbonate ions between erythrocytes and plasma. It is also called Hamburger’s phenomenon.

Question 10.
Mention any two occupational respiratory disorders and their causes in human beings?
Answer:
Occupational respiratory disorders ate caused by exposure of the body to the harmful substances.
E.g.:
1) Asbestosis:
It occurs due to chronic exposure to asbestos dust in the people Working in asbestos factory.

2) Silicosis :
It occurs because of long term exposure to ‘silica dust’ in the people working in mining industries, quarries etc.,

Question 11.
Name the muscles that help in normal breathing movements?
Answer:
Muscles of diaphragm and external inter-costal muscles help in the process of normal breathing movements.

Question 12.
Draw a diagram of oxyhaemoglobin dissociation curve?
Answer:
AP Inter 2nd Year Zoology Study Material Chapter 1(b) Breathing and Exchange of Gases 1

Short Answer Questions

Question 1.
Explain the process of inspiration and expiration under normal conditions.
Answer:
Inspiration : Intake of atmospheric air into the lungs is called inspiration. It is an active process, as it takes place by the contraction of the muscles of the diaphragm and the external inter-costal muscles which extend in between the ribs. The contraction of diaphragm increases the volume of thoracic chamber in the anterio posterior axis. The contraction of external inter costal muscles lifts up the ribs and sternum causing an increase in the dorso- ventral axis.

The overall increase in the thoracic volume causes a similar increase in the pulmonary volume. An increase in the pulmonary volume decreases the intra-pulmonary pressure to less than that of the atmosphere, which forces the air from the outside to move into the lungs, that is inspiration.

Expiration :
Release of alveolar air to the exterior is called expiration. It is a passive process. Relaxation of the diaphragm and external inter-costal muscles returns the diaphragm and sternum to their normal positions, and reduces the thoracic volume and thereby the pulmonary volume. This leads to an increase in the intra-pulmonary pressure to slightly above that of the atmospheric pressure, causing the expulsion of air from the lungs, that is called expiration.

Question 2.
What are the major transport mechanisms for CO2? Explain.
Answer:
Carbondioxide is transported in three ways.
1. In dissolved state :
7% of CO2 is transported in dissolved state through plasma.
CO2 + H2O → H2CO3.

2. As Carbamino compounds:
About 20-25% of CO2 combine directly with free amino group of haemoglobin and forms Carbamino haemoglobin in a reversible manner.
Hb – NH2 + CO2 → Hb – NHCOO + H+.
pCO2 and pO2 could affect the binding of CO2 to haemoglobin.
— when pCO2 is high and pO2 is low as in the tissues, binding of more CO2 occurs.
— when pCO2 is low and p02 is high as in the alveoli, dissociation of CO2 carbamino
– haemoglobin takes place, (i.e., CO2 which is bound to haemoglobin from the tissues is delivered at the alveoli)

3. As Bicarbonates :
About 70% of CO2 is transported as bicarbonate. RBCs contain a very high concentration of the enzyme, carbonic anhydrase and a minute quantity of the same is present in plasma too. This enzyme facilitates the following reaction in both the directions.
AP Inter 2nd Year Zoology Study Material Chapter 1(b) Breathing and Exchange of Gases 2

At the tissues where partial pressure of CO2 is high due to catabolism, CO2 diffuses into the blood and forms carbonic acid which dissociates into HCO3 + H+

At the alveolar site where pCO2 is low, the reaction proceeds in the opposite direction leading to the formation of CO2 and water. Thus CO2 is mostly trapped as bicarbonate at the tissues and transported to the alveoli where it is dissociated out as CO2.

Every 100 ml of deoxygenated blood delivers approximately 4 ml of CO2 to the alveolar air.

AP Inter 2nd Year Zoology Study Material Chapter 1(b) Breathing and Exchange of Gases

Question 3.
How is respiratory movements regulated in man?
Answer:
In human beings the respiratory movements are regulated by neural system.
1. A special centre present in the medulla region of brain, called ‘respiratory rhythm centre’ is primarily responsible for this regulation.

2. Another centre present in the pons of the brain stem called ‘pneumotaxic centre’ can moderate the functions of the respiratory rhythm centre. Neural signal from and this centre can reduce the duration of inspiration and thereby alter the respiration rate.

3. A chemo-sensitive area is situated adjacent to the respiratory rhythm centre which is highly sensitive to CO2 and H+. Increase in these substances can activate this centre, which inturn can send signals to the respiratory rhythm centre to make necessary adjustments in the respiratory process by which these substances can be eliminated.

4. Receptors associated with aortic arch and carotid artery also recognize changes in CO2 and H+ concentration and send necessary signals to the respiratory rhythm centre for necessary actions.

The role of oxygen in the regulation of the respiratory rhythm is quite insignificant.

Question 4.
Distinguish between a) IRV and ERV b) Inspiratory capacity and Expiratory capacity c) Vital capacity and Total lung capacity.
Answer:
a) IRV and ERV:
IRV (Inspiratory Reserve Volume) :
The maximum volume of air that can be inhaled during forced breathing, in addition to the tidal volume. This is about 2500 ml to 3000 ml.

ERV (Expiratory Reserve Volume) :
The maximum volume of air that can be exhaled during forced breathing in addition to the ‘tidal volume’. This is about 1000 ml to 1100 ml.

b) Inspiratory capacity and Expiratory capacity :
Inspiratory capacity (IC) :
The total volume of air, a person can inhale after normal expiration’. This includes tidal volume and inspiratory reserve volume.
IV = TV + IRV
It is about 3000 ml to 3500 ml.

Expiratory capacity (EC) :
The total volume of air, a person can expire after a ‘normal inspiration’. This includes tidal volume and expiratory reserve volume.
EC = TV + ERV

c) Vital capacity and Total lung capacity:
Vital capacity (VC) :
The maximum volume of air a person can breathe in after ‘forced expiration’. This includes ERV TV and IRV (or) the maximum volume of air, a person can > breathe out after forced inspiration.
VC = TV + IRV + ERV

Total lung capacity (TLC) :
The total volume of air accommodated in the lungs at the end of forced inspiration.
This includes RV ERV, TV and IRV
TLC = ERV + IRV + TV + RV (or)

Question 5.
Describe disorders of respiratory system.
Answer:
Disorders of respiratory system.

1) Asthma:
Asthma is a difficulty in breathing caused due to inflammation of bronchi and bronchioles. Symptoms include coughing, difficulty in breathing and wheezing.

2) Emphysema:
It is a chronic disorder in which alveolar walls are damaged and their walls coalesce due to which respiratory surface area of exchange of gases is decreased. One of the major causes of this

3) Bronchitis :
Bronchitis is the inflammation of the bronchi, resulting in the swelling of mucus lining of bronchi, increased mucus production and decrease in the diameter of bronchi. Symptoms include chronic cough with thick sputum.

4) Pneumonia :
The infection of lungs caused by Streptococcus pneumoniae and also by certain Virus, Fungi, Protozoans and Mycoplasmas. Symptoms include inflammation of lungs, accumulation of mucus in alveoli and impaired exchange of gases, leading to death if untreated.

Occupational dissorders :
These are caused by exposure of the body to the harmful substances.
E.g.:
i) Asbestosis:
It occurs due to chronic exposure to asbestos dust in the people working in asbestos industry.

ii) Silicosis :
It occurs because of long term exposure to silica dust.

iii) Siderosis :
It occurs due to deposition of iron particles in tissues.

iv) Black lung disease :
It develops from inhalation of coal dust.

Long Answer Questions

Question 1.
Describe the respiratory system in man.
Answer:
The human respiratory system composed of external nostrils, nasal chambers, nasopharynx, larynx, trachea, bronchi, bronchioles and lungs. It is responsible for the process of respiration that is vital to the survival of living beings.

1) External nostrils :
A pair of external nostrils opens out above the upper lip. They lead into nasal chambers through the nasal passages.

2) Nasal chambers:
They lie above the palate and are separated from each other by a nasal septum. Each nasal chamber can be differentiated into three parts gamely; i) Vestibular part – which has hair and sabaceous gland’s to prevent the entry of dust particles, ii) Respiratory part – involved in the conditioning the temperature, iii) Olfactory part – is fined by an Olfactory epithelium.

3) Naso-pharynx :
Nasal chambers lead into nasopharynx through a pair of internal nostrils. Nasopharynx is a portion of pharynx, the common chamber for the passage of food and air. Nasopharynx leads into oropharynx, and opens through glottis of larynx into the trachea.

4) Larynx :
This is also called voice box or Adam’s apple, connects the pharynx with the trachea. Larynx is the organ of voice as well as an air passage extending from the root of the tongue to the trachea. It is well developed in man. It consist of a) Vocal cord b) Glottis c) Epiglottis.
a) Vocal cord : These are muscular folds that projects from lateral walls.
b) Glottis : Narrow passage between the true and false vocal cords of the larynx.
c) Epiglottis : It is a thin leaf like elastic cartilaginous flap attached to the thyroid cartilage to prevent the entry of food into the larynx through the glottis.

5) Trachea :
Trachea is also called windpipe. It is a straight tube extending upto the mid-thoracic cavity. The wall of the trachea is supported by 16-20 ‘C’ shaped rings of hyaline cartilage. These rings are incomplete dorsally and keep the trachea always open preventing collapse. Internally the trachea is lined by pseudostratified ciliated epithelium.

6) Bronchi and Bronchioles :
On entering the mid thoracic cavity, trachea divides into right and left primary bronchi. Each primary bronchus enters the corresponding lung and divides into secondary bronchi that further divides into tertiary bronchi. Each tertiary bronchus divides and redivides to form primary, secondary, tertiary, terminal and respiratory bronchioles. Each respiratory bronchiole terminates in a cluster of alveolar ducts which ends in alveolar sacs.
AP Inter 2nd Year Zoology Study Material Chapter 1(b) Breathing and Exchange of Gases 3

7) Lungs :
These are paired, situated in the thoracic chamber which is anatomically an air tight chamber. Lungs are covered by a doubled layered pleura with pleural fluid between them. It reduces friction on the lung surface. The outer pleural membrane is in close contact with the thoracic lining where as the inner pleural membrane is in contact with lung’s surface. The part starting with external nostrils upto the terminal bronchioles constitute the conducting part, whereas the alveoli and their ducts form the respiratory or exchange part of respiratory system. The conducting part transports the atmospheric air to the alveoli, clears it from foreign particles, humidifies and also bring the inhaled air to the body temperature. Exchange part is the site of actual diffusion of and between blood and atmospheric air.

AP Inter 2nd Year Zoology Study Material Chapter 1(b) Breathing and Exchange of Gases

Question 2.
Write an essay on the transport of oxygen and carbondioxide by blood.
Answer:
Blood is the medium for the transport of oxygen and carbondioxide.

Transport of oxygen :
Oxygen is transported from the lungs to the tissues through the plasma and RBC of the blood. 100 ml of oxygenated blood can deliver 5 ml of O2 to the tissues under norpial condtions.

i) Transport of oxygen through plasma:
About 3% of O2 is carried through the blood plasma in dissolved state.

ii) Transport of oxygen by RBC :
about 97% of oxygen is transported by the . haemoglobin of RBC in the blood. Haemoglobin is a red coloured iron containing pigment present in the RBCs. Each haemoglogin molecule can carry a maximum of four molecules of oxygen. Binding of oxygen with haemoglobin is primarily related to the partial pressure of O2. At lungs, where the partial pressure of O2 is high, oxygen binds to haemoglobin in a reversible manner to form oxyhaemoglobin. This is called oxygenation of haemoglobin.
Hb + 4O2 -» Hb (O2)4.

At the tissues, where the partial pressure of O2 is low oxyhaemoglobin dissociates into haemoglobin and oxygen. The other factors such as partial-pressure of CO2, H+ concentration (pH), and the temperature influence the binding of oxygen with haemoglobin. For example in alveoli high pO2, low pCO2 high H+ concentration lower temperature are favourable for formation of oxyhaemoglobin. In tissues low pO2, high pCO2 high H+ concentration and high temperature conditions are favourable for. dissociation, of oxygen from oxyhaemoglobin.

Transport of Carbondioxide:
Carbondioxide is transported in three ways,
1. In dissolved state :
7% of CO2 is transported in dissolved state through plasma.
CO2 + H2O → H2CO2.

2. As Carbamino compounds:
About 20-25% of CO2 combine directly with free amino group of haemoglobin and forms Carbmino haemoglobin in a reversible, manner.
Hb – NH2 + CO2 → Hb – NHCOO +H+.

pCO2 and pO2 could affect the binding of CO2 to haemoglobin.

— when pC02 is high and pO2 is low as in the tissues, binding of more CO2 occurs.
— when pCO2 is low and pO2 is high as in the alveoli, dissociation of CO2 carbamino – haemoglobin takes place, (i.e., CO2 which is bound to haemoglobin from the tissues is delivered at the alveoli)

3. As Bicarbonates :
About 70% of CO2 is transported as bicarbonate. RBCs contain a very high concentration of the enzyme carbonic anhydrase and a minute quantity of the same is present in plasma too. This enzyme facilitates the following reaction in both the directions.
AP Inter 2nd Year Zoology Study Material Chapter 1(b) Breathing and Exchange of Gases 4

At the tissues where partial pressure of CO2 is high due to catabolism, CO2 diffuses into the blood and forais carbonic acid which dissociates into HCO3 + H+

At the alveolar site where pCO2 is low, the reaction proceeds in the opposite direction leading to the formation of CO2 and water. Thus CO2 is mostly trapped as bicarbonate at the tissues’and transported to the alveoli where it is dissociated out as CO2.

Every 100 ml of deoxygenated blood delivers approximately 4 ml of CO2 to the alveolar air.