AP Inter 2nd Year Maths 2B Solutions Chapter 6 సమాకలనం Ex 6(f)

Practicing the Intermediate 2nd Year Maths 2B Textbook Solutions Chapter 6 సమాకలనం Exercise 6(f) will help students to clear their doubts quickly.

AP Inter 2nd Year Maths 2B Solutions Chapter 6 సమాకలనం Exercise 6(f)

అభ్యాసం – 6(ఎఫ్)

I. కింది సమాకలనులను గణించండి.

ప్రశ్న 1.
∫ex (1 + x2) dx
సాధన:
∫ex (1 + x2) dx = ∫ex dx + ∫x2 . ex dx
= ex + (x2 . ex – 2 ∫x. ex dx)
= ex + x2 . ex – 2x. ex + 2ex + C
= ex(x2 – 2x + 3) + C

ప్రశ్న 2.
∫x2 e-3x dx
సాధన:
∫x2 e-3x dx = \(\frac{x^2 \cdot e^{-3 x}}{-3}\) + \(\frac{1}{3}\)∫e-3x. 2x dx
= –\(\frac{x^2 \cdot e^{-3 x}}{3}\) + \(\frac{2}{3}\)(\(\frac{x \cdot e^{-3 x}}{-3}\) + \(\frac{1}{3}\)∫e-3xdx)
= \(\frac{-x^2 \cdot e^{-3 x}}{3}\) – \(\frac{2}{9}\)x. e-3x – \(\frac{2}{27}\)e-3x + C
= \(\frac{-\mathrm{e}^{-3 x}}{27}\)(9x2 + 6x + 2) + C

AP Inter 2nd Year Maths 2B Solutions Chapter 6 సమాకలనం Ex 6(f)

ప్రశ్న 3.
∫x3 eax dx
సాధన:
AP Inter 2nd Year Maths 2B Solutions Chapter 6 సమాకలనం Ex 6(f) 1

II.

ప్రశ్న 1.
n ధన పూర్ణాంకం అయితే
∫xn e-x dx = -xne-x + n∫xn – 1e-x dx
అని చూపండి.
సాధన:
∫xn e-x dx = -xne-x + n∫xn – 1e-x dx
= -xn. e-x + n∫xn – 1e-x dx

ప్రశ్న 2.
పూర్ణాంకము n ≥ 2, 1 = | cosn x dx, అయితే In = \(\frac{1}{n}\) cosn-1 x sin x + \(\frac{n-1}{n}\) అని చూపండి.
సాధన:
In = ∫cosn x dx = ∫cosn – 1. cos x dx
= cosn – 1x. sin x – ∫ sin x. (n – 1) cosn – 2(-sin x) dx
= cosn – 1x. sin x + (n – 1)In – 2 – (n – 1)In
∴ In(1 + n – 1) = cosn – 1x. sin x + (n – 1)In – 2
In = \(\frac{\cos ^{n-1} x \sin x}{n}\) + \(\frac{n-1}{n}\)In-2

III.

ప్రశ్న 1.
ధన పూర్ణాంకము n ≥ 2, I<sub.n = ∫ cotn x dx, కు లఘూకరణ సూత్రాన్ని రాబట్టండి. దాని నుంచి ∫cot4 x dx విలువ రాబట్టండి. (A.P. Mar. ’16 (May ’11))
సాధన:
In = ∫ cotn x dx = ∫ cotn – 2x. cot2 x dx
= ∫cotn-2x. (cosec2x – 1) dx
= ∫cotn-2x. cosec2 x dx – In – 2
= –\(\frac{\cot ^{n-1} x}{n-1}\) – In – 2
n = 4 ⇒ I4 = –\(\frac{\cot ^3 x}{3}\) – I2
n = 2 ⇒ I2 = -cot x – I,sub>0 ఇక్కడ I0 = ∫dx = x
I2 = -cot x – x
I4 = \(-\frac{\cot ^3 x}{3}\) – (-cot x – x) + C
= \(-\frac{\cot ^3 x}{3}\) + cot x + x + C

AP Inter 2nd Year Maths 2B Solutions Chapter 6 సమాకలనం Ex 6(f)

ప్రశ్న 2.
ధన పూర్ణాంకము n ≥ 2, In = ∫ cosecn x dx కు లఘుకరణ సూత్రాన్ని రాబట్టండి. దాని నుంచి ∫ cosec x dx విలువ రాబట్టండి.
(T.S. Mar. ’16)
సాధన:
AP Inter 2nd Year Maths 2B Solutions Chapter 6 సమాకలనం Ex 6(f) 2
AP Inter 2nd Year Maths 2B Solutions Chapter 6 సమాకలనం Ex 6(f) 3

ప్రశ్న 3.
n ధనపూర్ణాంకం, పూర్ణాంకం m ≥ 2, Im,n = ∫sinmx cosn x dx అయితే
Im,n = –\(\frac{\sin ^{m-1} x \cos ^{n+1} x}{m+n}\) + \(\frac{m-1}{m+n}\)Im-2, n అని చూపండి.
సాధన:
AP Inter 2nd Year Maths 2B Solutions Chapter 6 సమాకలనం Ex 6(f) 4
AP Inter 2nd Year Maths 2B Solutions Chapter 6 సమాకలనం Ex 6(f) 5
AP Inter 2nd Year Maths 2B Solutions Chapter 6 సమాకలనం Ex 6(f) 6

AP Inter 2nd Year Maths 2B Solutions Chapter 6 సమాకలనం Ex 6(f)

ప్రశ్న 4.
∫ sin5 cos4 dx గణించండి.
సాధన:
లఘుకరణ సూత్రం
AP Inter 2nd Year Maths 2B Solutions Chapter 6 సమాకలనం Ex 6(f) 7

ప్రశ్న 5.
In = ∫(log x)ndx, అయితే In = x (log x)n – n. In-1, అని చూపి, దాని నుంచి ∫(log x)4 dx ను కనుక్కోండి.
సాధన:
సాధన:
In = ∫(log x)n dx
= (log x)n. x – ∫x . n . (log x)n – 1. \(\frac{1}{x}\) dx
= x. (log x)n – n ∫ (log x)<supn – 1 dx
= x (log x)n – n. In-1
I4 = x(log x)4 – 4. I3
I3 = (x log x)3 – 3. I2
I2 = (x log x)2 – 2. I1
I1 = x log x – x
I2 = (x(log x)2 – 2x log x + 2x
(x (log x)3 – 3(x (log x)2 – 2x log x + 2x)
= x. (log x)3 – 3x (log x)2 + 6x (log x) – 6x
I4 = x(log x)4 – 4[x. (log x)3 – 3x (log x)2 + 6x (log x) – 6x] + C
= x(log x)4 – 4(log x)3 + 12(log x)2 – 24 (log x) + 24] + C

AP Inter 1st Year History Study Material Chapter 8 మొగలుల యుగం

Andhra Pradesh BIEAP AP Inter 1st Year History Study Material 8th Lesson మొగలుల యుగం Textbook Questions and Answers.

AP Inter 1st Year History Study Material 8th Lesson మొగలుల యుగం

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
మొగల్’ చరిత్ర రచనకు ఉపయోగపడే ఆధారాలను వివరించండి.
జవాబు:
మొగల్ అను పదము ఒక వంశనామము. ఇది ‘మంగోల్’ అను పదము నుండి వచ్చింది. మంగోల్ అనే పదం నుండి మొగల్ అనే పదము రూపొందుటకు కారణమేమనగా మొగలులు మన దేశాన్ని పాలించే రోజుల్లో ఐరోపావారు వ్యాపార నిమిత్తం వచ్చి మొగల్ దర్బార్ను సందర్శించిరి. వారి సహజ నామమైన మంగోల్ అనే పదం వారివారి భాషలలో వేరువేరు రూపాలుగా పేర్కొనబడెను.

మొగల్ చరిత్రను తెలుసుకొనుటకు గల ఆధారాలు: భారతదేశ చరిత్రలో మొగలు చరిత్రకు అమిత ప్రాధాన్యత కలదు. ఈ చరిత్రకున్న ఆధారాలు ఏ చరిత్రకు లేవు. ఇందుకు కారణములు ఏమనగా,

  1. మొగల్ చక్రవర్తులలో అనేకులు సాహితీవేత్తలగుట వలన
  2. చక్రవర్తులు కవులను, పండితులను పోషించుట
  3. చక్రవర్తుల ఫర్మానాలు, ప్రభుత్వ ఆజ్ఞాపనా పత్రాలు
  4. యాత్రికులుగా భారతన్ను సందర్శించిన పెక్కు విదేశీ రచనలు.

మొగల్ చరిత్రకు లభ్యమగు ఆధారములను మూడు భాగాలుగా విభజించవచ్చు. అవి ఏమనగా,

  1. వాఙ్మయ ఆధారములు
  2. పురావస్తు ఆధారములు
  3. విదేశీ రచనలు

1. వాఙ్మయ ఆధారములు:
A) బాబరు హుమాయూన్ల కాలము:
తుజు – క్ – ఇ · బాబురి: మొగల్ యుగమున వ్రాయబడిన తొలి చారిత్రక గ్రంథము. బాబరు టర్కీ భాషలో రాసిన స్వీయచరిత్ర’, ‘తుజు-క్-ఇ-బాబురి’ ద్వారా బాబర్ కాలమునకు, హుమాయూన్ కాలమునకు తొలి జీవిత విశేషాలు తెలుస్తున్నవి.

తారీఖ్-ఇ-రషీది: దీనిని బాబరు బంధువగు ‘మీర్జా మహమ్మద్ హైదర్ దుఘాత్’ రాసెను. ఇందు బాబర్ దిగ్విజయములు, షేర్షా – హుమాయూన్ల సంఘర్షణ – కాశ్మీర్ చరిత్ర వర్ణించబడెను.

AP Inter 1st Year History Study Material Chapter 8 మొగలుల యుగం

హబీబ్-ఉన్-సియర్: దీనిని ‘ఖ్వాందాహర్ అమీర్’ వ్రాసెను. బాబరు గురించి హుమాయూన్ మొదటి మూడు సం॥ల పాలన గురించి వ్రాయబడెను.

తారీఖ్-ఇ-షాహి: దీనిని ‘అహ్మద్ యాద్గర్’ వ్రాసెను. ఇందు ఆఫ్ఘనులు, బాబరు, హుమాయూన్లతో పోరాడి, తిరిగి అధికారము పొందిన విధము తెలుస్తున్నది.

షైబానీ నామ: దీనిని ‘మహమ్మద్ పాలిప్’ రాసెను. ఇందు బాబర్కు, ఉజ్జెక్ పాలకుల మధ్యగల సంబంధాలు వర్ణింపబడినవి.

హుమాయూన్ నామ: దీనిని బాబరు కుమార్తెయగు “గుల్బదన్ బేగమ్” రాసెను. ఇందు బాబరు, హుమాయూన్లు తమ బంధుమిత్రులతో వ్యవహరించిన తీరు, వారి మనోభావములు వర్ణింపబడెను.

ఇంకను హుమాయూన్ గూర్చి తెలుసుకొనుటకు తారీఖ్-ఇ-హుమాయూన్, కానూన్-ఇ-హుమాయూన్ మొదలగు రచనలు తోడ్పడుచున్నవి. షేర్షాను గూర్చి తెలుసుకొనుటకు ‘అబ్బాష్వేణి’ రాసిన తారీఖ్-ఇ-షేర్షా ముఖ్యమైనది.

B) అక్బరు కాలము:
తారీఖ్-ఇ-అక్బరు షాహి: దీనిని అక్బరు రెవెన్యూశాఖ ఉద్యోగియైన హజీమహమ్మద్ ఆరిఫ్ కందాహరే వ్రాసెను. ఇందు అక్బరు వ్యక్తిత్వము, అతని పరిపాలనా విస్తరణ ఉంది.
అక్బరు నామ, ఐనీ- అక్బరీ: ఈ రెండు గ్రంథములను అక్బరు ఆస్థాన పండితుడు, అతని మిత్రుడగు ‘అబుల్ ఫజల్’ వ్రాసెను. మొగల్ చరిత్ర ఆధారములలో ఈ గ్రంథములు తలమానికవంటివి.

తబ్కాత్-ఇ-అక్బరీ: ఇది ఒక సామాన్య చారిత్రక గ్రంథము. దీనిని ‘మీర్ బక్షీ ఖ్వాజీ నిజాముద్దీన్” రాసెను. ఇందు మూడు సంపుటములు కలవు. ఇందు ఢిల్లీ సుల్తానత్ యుగము, బాబరు, హుమాయూన్, అక్బర్ పాలనా కాలము, ప్రాంతీయ రాజ్యాల చరిత్ర వివరించబడెను.

C) జహంగీర్ పాలనా కాలము:
తారీఖ్-ఇ-ఫెరిస్టా: దీనిని “మహమ్మద్ ఖాసిం ఫెరిస్టా” రాసెను. ఇందు జహంగీర్ సింహాసనం అధిష్టించు వరకు భారతదేశ ముస్లిం పాలనను గూర్చి మరియు దక్కను సుల్తానుల గురించి వర్ణించెను.

తుజుక్-ఇ-జహంగీర్: ఇది జహంగీర్ స్వీయచరిత్ర. జహంగీర్ వ్యక్తిత్వము, అతని పాలనా విశేషాలు తెలుసుకొనుటకు ఇది ఒక అమూల్యమైన గ్రంథము.
ముతమిధాఖాన్ రచించిన ‘ఇక్బాల్ నామా’
మహ్మదాలీ రాసిన ‘వాకిఆత్-జహంగరీ’
ఖ్వాజానియామతుల్లా రాసిన ‘తారీఖ్-ఇ-ఖాన్-జహనీ’
మొదలగు ఇతర రచనలు కూడా జహంగీరు కాలమునకు సంబంధించినవే.

D) షాజహాన్ కాలము:
షాజహాన్ ఆస్థానమును అలంకరించిన జగన్నాథ పండితుడు, జనార్థనభట్టు రచనలు, అబ్దుల్ హమీద్ లహరి రాసిన ‘బాదుషానామ’, మహమ్మద్ సలీ గ్రంథమగు ‘అమల్-ఇ-సాలీ’, ఇనాయత్ ఖాన్, మహమ్మద్ సాదిక్ల షాజహాన్నామా మొదలగునవి షాజహాన్ కాలమునకు సంబంధించిన రచనలు.

E) ఔరంగజేబు కాలము:
ఔరంగజేబు చరిత్ర రచనను నిషేదించిననూ అతని కాలమున పెక్కు చారిత్రక గ్రంథములు వెలువడుట అబ్బురము. అందు ముఖ్యమైనవి ‘ఆలంఘీర్ నామ’ దీనిని మీర్జా మహ్మద్ ఖాన్ రాసెను. ఇందు ఔరంగజేబు తొలి పది సంవత్సరాల పాలనా కాలము వర్ణించబడెను.

“మ అనిర్-ఇ-అలంఘ” దీనిని మహ్మద్ సాకే ముస్తయిద్’ వ్రాసెను. హకిరీ రాసిన ‘ఔరంగజేబు నామ’ అకిలాన్ వ్రాసిన ‘జఫర్-నామ-ఇ-ఆలంఘీర్’, ఔరంగజేబు రాసిన “ఫత్వా-ఇ-ఆలంఘీర్’ మొదలగు గ్రంథాలు ఔరంగజేబు కాలమునకు చెందినాయి.

2. పురావస్తు ఆధారములు:
A) శాసనములు: మొగల్ చక్రవర్తులు శాసనములను పెద్దగా వేయించలేదు. వేయించిన కొద్ది శాసనాలు వారి చరిత్రకు ప్రామాణికముగా ఉపయోగపడగలవు.

B) నాణెములు: మొగల్ చక్రవర్తులు ముద్రించిన నాణెములు చరిత్ర రచనకు ఎంతగానో తోడ్పడుతున్నాయి. జహంగీర్, నూర్జహాన్ నాణెములు నాటి ఆర్థిక పరిస్థితులను తెలుసుకొనుటకు ఉపయోగపడుచున్నవి.

C) భవన నిర్మాణము: మొగల్ చక్రవర్తులు నిర్మించిన అసంఖ్యాక కట్టడములు వారి కళాపోషణకు నిదర్శనము. అట్టి వానిలో ముఖ్యమైనవి ఆగ్రా కోట, ఎర్ర కోట, ఫతేపూర్ సిక్రీ, తాజ్మహల్, మయూర సింహాసనము మొదలగునవి.

3. విదేశీ రచనలు: మొగల్ యుగమున పెక్కు విదేశీవాసులు భారతదేశమును సందర్శించి తమ అనుభవాలను, నాటి కాల పరిస్థితులను తమ రచనలలో వర్ణించిరి.

A) ఆంగ్లేయులు: రాల్ఫ్ ఫిష్, జాన్ మిల్టన్ హర్, విలియం హాకిన్స్, విలియం ఫించ్, ఎడ్వర్డ్ టెర్రీ, సర్ థామస్ రో రచనలు జహంగీరు కాలమునకు ఆంగ్ల వర్తక కేంద్రస్థాపనా చరిత్రకు అమూల్యమైన ఆధారములు.

B) ఫ్రెంచి, బార్నియర్, టావెర్నియర్, థీవెనాన్: ఈ సందర్భంగా ఔరంగజేబు కాలంలో వచ్చిన జెర్నియార్ అనే ఫ్రెంచ్ యాత్రికుడు ఫ్రెంచ్ భాషలో వ్రాసిన మొగల్ సామ్రాజ్యంలో యాత్రలు అనునది ముఖ్యమైనదిగా పేర్కొనవచ్చు. ఇట్లు స్వదేశీయ, విదేశీయ రచనల్లో పెక్కు చారిత్రకాంశములు మొగల్ చరిత్రకు ఆధారములుగా ప్రకాశించుచున్నవి.

ప్రశ్న 2.
మొగల్ పరిపాలనలోని ప్రధాన అంశాలను తెలపండి.
జవాబు:
మొగల్ పాలనా వ్యవస్థకు రూపకల్పన చేసినవాడు అక్బర్. అక్బర్కు ప్రభుత్వ విధానాల్లో షేర్షా కొంతవరకు మార్గదర్శి. షేర్షా విధానాలను మెరుగుపరచి, కొత్త విధానాలను ప్రవేశపెట్టి, సమర్థవంతమైన పాలకునిగా అక్బర్ చక్రవర్తి మొగల్ చరిత్రలో కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్నాడు.

కేంద్ర ప్రభుత్వం: మొగల్ పరిపాలనా యంత్రాంగానికి చక్రవర్తి సర్వాధికారి. అధికారాలన్నీ అతడి చేతిలో కేంద్రీకృతమై ఉంటాయి. మొగల్ చక్రవర్తి ప్రాజ్ఞ నిరంకుశ ప్రభువు. “నా కింది ఉద్యోగులు నిర్వహించాల్సిన బాధ్యతలను నేను నిర్వహించనవసరం లేదు. పాలకుడు కింది ఉద్యోగులు తప్పులను దిద్దుకుంటూపోతూ తాను చేసే తప్పులను నివారించుకుంటే సరిపోతుంది” అని అక్బర్ చెప్పుకున్నాడు. ప్రభుత్వంలో చక్రవర్తికి (పాదుషాకు) సలహాలిచ్చేందుకు నలుగురు మంత్రులున్నారు. వారు:

1) వకీల్ లేక వకీల్-ఇ-ముత్లాక్ లేక ప్రధానమంత్రి: ఇతడు చక్రవర్తికి ముఖ్య సలహాదారు. అన్ని శాఖలను పర్యవేక్షిస్తాడు.

2) దివాన్ లేక వజీర్ లేక ఆర్థికమంత్రి: ఇతడు సామ్రాజ్య ఆర్థిక వనరులను పర్యవేక్షించేవాడు. భూమిశిస్తు ఇతర పన్నుల వసూలు, సామ్రాజ్య ఖర్చులు ఇతని పర్యవేక్షణలో ఉండేవి.

3) మీరక్షీ: ఇతడు యుద్ధ మంత్రి. పెద్ద ఉద్యోగులకు జీతాలను కూడా బట్వాడా చేసేవాడు. మన్సబార్ల పేర్లు, వారి హోదాలు, వారి జీతాలు ఇతడు నమోదు చేసుకొనేవాడు. రాజప్రాసాద రక్షణ నిమిత్తం గస్తీ ఉద్యోగులను నియమించేవాడు. రాష్ట్రాలలో వార్తాహరులను, గూఢచారులను నియమించటం కూడా ఇతని విధి.

4) సదర్-ఉస్-సదర్: మత విషయాలలో చక్రవర్తికి సలహాలివ్వడం, చక్రవర్తి దానధర్మాలను పర్యవేక్షించటం, ముఖ్య న్యాయాధీశునిగా వ్యవహరించటం ఇతడి విధులు.

రాష్ట్ర ప్రభుత్వం: పరిపాలనా సౌలభ్యం కొరకు మొగల్ సామ్రాజ్యం సుబాలుగా విభజింపబడింది. అక్బర్ కాలంలో దాదాపు 15 సుబాలుండేవి. ఒక రకంగా వీటిని రాష్ట్రాలుగా పరిగణించవచ్చు. రాష్ట్ర పరిపాలనా వ్యవస్థ, కేంద్ర పాలనావ్యవస్థకు ప్రతిరూపం లేక ప్రతీక అని చెప్పవచ్చు. సుబాను పాలించే అధికారి సుబేదార్. సుబాలో శాంతి భద్రతలు కాపాడే బాధ్యతను సుబేదార్ నిర్వహిస్తాడు. దివాన్, భక్షి, సదర్, ఖాజీ అను అధికారులు కూడా రాష్ట్రపాలనా నిర్వహణలో బాధ్యత స్వీకరిస్తారు. వారి విధులు కేంద్ర ప్రభుత్వంలో అదే పేరుగల అధికారుల విధులను పోలి ఉంటాయి.

ప్రధాన నగరాలలో న్యాయ వ్యవహారాలను చూసేందుకు కొత్వాలు అనే ఉద్యోగి ఉండేవాడు. అతడు నగరాలలో శాంతి భద్రతలను కాపాడేవాడు. ప్రభుత్వ ఆజ్ఞలను అమలు పరిచేవాడు. విదేశీయుల కార్యకలాపాలను గమనించేవాడు. సర్కారు పాలన: “సుబాలు” సర్కారులుగా విభజింపబడ్డాయి. సర్కార్లను నేటి జిల్లాలతో పోల్చవచ్చు. సర్కార్లను పాలించడానికి ఈ క్రింది అధికార్లు ఉంటారు.

  • ఫౌజార్: ఇతడు సర్కారు అధిపతి, సైనికాధికారి, తిరుగుబాట్లను అణచివేసి రెవిన్యూ అధికారులకు సహాయం చేయడం ఇతని ముఖ్య విధులు.
  • అమల్ గుజార్: ఇతడు రెవిన్యూ శాఖాధిపతి. భూమిశిస్తు వసూలు చేయడం, ఋణాలను మంజూరు చేయడం ఇతని ముఖ్య విధులు.
  • ఖజానాదార్: ఇతడు కోశాధికారి. వసూలైన భూమిశిస్తును ఖజానాలో భద్రపరచి కేంద్రానికి జాగ్రత్తగా పంపడం ఇతని విధి.
  • బిలక్సీ: ఇతడు భూములకు, భూమిశిస్తులకు సంబంధించిన వివరాలను తయారుచేస్తాడు.

AP Inter 1st Year History Study Material Chapter 8 మొగలుల యుగం

పరగణా పాలన: సర్కార్లు పరగణాలుగా విభజింపబడ్డాయి. ఈ క్రింది అధికారులు పరగణాల యొక్క పరిపాలనను నిర్వహించేవారు.

  • షికార్: ఇతడు పరగణా యొక్క ముఖ్య కార్యనిర్వహణాధికారి. ఇతడు కూడా సైనికాధికారియే. పరగణా యొక్క శాంతిభద్రతలను పర్యవేక్షిస్తాడు.
  • అమీన్: ఇతడు రెవిన్యూ ఉద్యోగి. భూమిశిస్తు విషయాలను నిర్వహిస్తాడు.
  • కానుంగో: పట్వారీలపై అధికారి. ఇతడు భూములకు సంబంధించిన వివరాలను తయారుచేస్తాడు.
  • పోద్దార్: ఇతడు పరిగణా యొక్క కోశాధికారి.

గ్రామ పాలన: పరగణాలు గ్రామాలుగా విభజింపబడ్డాయి. గ్రామం పరిపాలనా వ్యవస్థలో తుది అంశము. ముఖద్దమ్, పట్వారీలు గ్రామాధికారులు. ముఖద్దమ్ శాంతిని పర్యవేక్షిస్తాడు. పట్వారీ భూమిశిస్తు వివరాలను తయారు చేస్తాడు. గ్రామాలలో పంచాయితీ విధానం అమలులో ఉండేది. పంచాయితీలు న్యాయనిర్వహణ బాధ్యతలను నిర్వహించేవి.

సైనికపాలన: మొగల్ చక్రవర్తులు సమర్థవంతమైన సైన్యమును పోషించిరి. వీరి సైనిక విధానమును ‘మన్సబారీ’ విధానమందురు. ‘మన్సబ్’ అంటే ‘హోదా’ లేదా ‘ఉద్యోగం’ అని అర్థం. ఒక విధముగా ఢిల్లీ సుల్తానుల జాగీర్దార్ విధానం వంటిది.

ఆర్థిక విధానం: మొగలుల ఆర్థిక విధానం సమర్థవంతమైనది. ఖరాజ్, ఖమ్స్, జకాత్, జిజియా అనే నాలుగు రకాల పన్నులు వసూలు చేసిరి.

భూమిశిస్తు విధానం: మొగలుల భూమిశిస్తు విధానానికి పూర్తి రూపాన్ని కల్గించినవారు అక్బర్ మరియు ఆయన రెవిన్యూ మంత్రి రాజాతోడరమల్. మొగలుల భూమిశిస్తు విధానంను ‘బందోబస్త్’ విధానమందురు.

న్యాయపాలన: చక్రవర్తితో కూడిన న్యాయమండలి మొగల్ రాజ్యంలో అత్యున్నత న్యాయస్థానం. అతి ముఖ్యమైన వివాదాలను ఈ న్యాయస్థానమే పరిష్కరించేది. చక్రవర్తియే ఉన్నత న్యాయాధీశుడు. ఉద్యోగులలో ప్రధాన ఖాజీ ఉన్నత న్యాయాధికారి. అతడు దిగువ న్యాయస్థానాల యొక్క న్యాయాధిపతులను నియమించేవాడు. ఆ న్యాయస్థానాల నుండి వచ్చే అప్పీళ్లను కూడా ప్రధాన ఖాజీ విచారించేవాడు. చీఫ్ సదర్ మత వివాదాలను పరిష్కరించేవాడు. రాష్ట్రాలలో (సుబాలలో) సదర్ క్రిమినల్ కేసులను, దివాన్ రెవిన్యూ వివాదాలను, ఖాజీ సివిల్ కేసులను పరిష్కరించేవారు. సర్కార్లలో ఫౌజ్దార్లు, ఖాజీలు, పరగణాలలో షికార్లు, అమీన్లు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించేవారు. గ్రామస్థాయిలో గ్రామ పంచాయితీలు నేర విచారణ చేసేవి.

ముగింపు: మొగలుల పాలనా విధానము ఉదారమైనది, సమర్థవంతమైనది. ప్రజాక్షేమాన్ని కాంక్షించేది. మహమ్మదీయుల పరిపాలనా వ్యవస్థ మొదటిసారిగా మొగలుల కాలంలోనే ఔన్నత్యాన్ని పొందింది.

ప్రశ్న 3.
మొగల్ సామ్రాజ్య పతనానికి గల కారణాలు చర్చించండి.
జవాబు:
రాజ్య విస్తీర్ణత, సైనిక పటిష్టత, ఆర్థికాభివృద్ధి, సాంస్కృతికాభివృద్ధి వల్ల ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేసిన మొగల్ సామ్రాజ్యం క్రీ.శ. 18వ శతాబ్దం ప్రారంభంలో విచ్ఛిన్నం కావడం ప్రారంభమైంది.

మొగల్ బాబర్ చేత స్థాపించబడి అక్బర్, జహంగీర్, షాజహాన్ పాలనల్లో దేదీప్యమానంగా వెలుగొందిన మొగల్ సామ్రాజ్యం ఔరంగజేబు రెండవ దశలోనూ, ఔరంగజేబు తరువాత పతనమైంది. ప్రసిద్ధ చరిత్రకారుడు వి.ఎ. స్మిత్ అన్నట్లు సామ్రాజ్యం అకస్మాత్తుగా పతనం కావడం ఆశ్చర్యం కలిగించవచ్చు. అయితే చరిత్రపై సాధారణ అవగాహన కలిగిన చరిత్ర విద్యార్థిగా గమనించినట్లయితే మొగల్ సామ్రాజ్యం అంత కాలం ఎలా ఉండగలిగింది అనే సందేహం కలగక మానదు”. కొంత మంది చరిత్రకారులు మొగల్ సామ్రాజ్య పతనానికి ఔరంగజేబుని పూర్తి బాధ్యుడుగా పేర్కొంటే మరికొందరు చరిత్రకారులు ఇతర కారణాలతోపాటు ఔరంగజేబు కొంతమేరకు బాధ్యుడని పేర్కొన్నారు.

ఔరంగజేబు తన పరిపాలన చివరి ఇరవై ఐదు సంవత్సరాలు దక్కన్లో తన అధికారాన్ని శాశ్వతంగా నెలకొల్పాలన్న అతడంతో నిరంతర దాడులు చేశాడు. దక్కన్లోనే మకాం పెట్టాడు. పరిపాలనా వ్యవస్థను నిర్లక్ష్యం చేశాడు. దీని వల్ల భారతదేశంలో మొగల్ అధికారం బలహీనమైంది.

ఔరంగజేబు తరువాత సింహాసనాన్ని అధిష్టించిన మొగల్ పాలకులు అసమర్థులు. ఔరంగజేబు కాలంలో మొదలైన గల్ రాజ్య పతనాన్ని అడ్డుకొనే శక్తి సామర్థ్యాలు వారికి లేవు. వారు మొగల్ అధికారుల చేతుల్లోనే కాకుండా, సావారి చేతుల్లో కూడా కీలుబొమ్మలుగా వ్యవహరించేవారు. వారు సామ్రాజ్యం కంటే కూడా విలాసాలపట్ల మక్కువ ఈ బరిచేవారు. అంతేకాకుండా భారతదేశంలోని అధిక ప్రజలు మొగలులను విదేశీయులుగా భావించడం వల్ల మొగల్ జ్లలకు వారి మద్దతు లభించలేదు. హిందూ మతంలోలాగా మొగలుల్లో వారసత్వ చట్టం లేకపోవడం వల్ల సింహాసనం కోసం వారసత్వ యుద్ధాలు జరిగాయి. అవి మొగల్ రాజ్య పతనానికి దోహదం చేశాయి.

సమైక్యతకు, సామర్థ్యానికి, ప్రతీకగా నిలిచిన మొగల్ కులీనవర్గం సుల్తాన్ల అసమర్థత కారణంగా వివిధ కూటములుగా విడిపోయాయి. స్వార్థపరులుగా తయారయ్యారు. పర్షియన్ షియాలు, సంప్రదాయ సున్నీలు, హిందూస్థానీ మొదలైన కూటములుగా విడిపోయి ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు పోరాటం చేయసాగారు.

మొగల్ సామ్రాజ్య పతనానికి అక్బర్ ప్రవేశపెట్టిన మనసబారీ విధానం ఒక కారణమైంది. మనసబారీ విధానం అక్బర్ కాలంలో మంచి ఫలితాలను ఇచ్చింది. అయితే అందులోని ప్రాథమిక లోపాల వల్ల ఈ విధానం భూస్వామ్య వ్యవస్థను పోలి సాధారణ సైనికుడు చక్రవర్తి కంటే కూడా మనసబారులపట్ల గౌరవం ప్రదర్శించేవారు. ఫలికంగా బైరాం ఖాన్, మహబత్ ఖాన్ వంటి వారు తిరుగుబాట్లు జరిపారు. వీటన్నింటివల్ల సైనిక పటిష్టత కోల్పోయింది. నీటన్నింటికి తోడు ఐరోపావారిని ఎదుర్కొనేందుకు నౌకాదళం పట్ల శ్రద్ధవహించకపోవడం కూడా మొగల్ పతనానికి కారణమైంది.

షాజహాన్ పాలనాకాలంలో వర్షాలు లేకపోవడం వల్ల, కరువుల వల్ల ఆర్థిక పరిస్థితి దెబ్బతింది. ఔరంగజేబు కాలంలో పరిస్థితి మరింత అధికమైంది. అసమర్థులైన కడపటి, మొగలుల కాలంలో ఆర్థిక స్థితి మరింత దిగజారింది. వీటికి తోడు అగ్నికి ఆజ్యంతోడైనట్లు నాదిర్ షా, అహ్మద్ షా అబ్దాలీ దండయాత్రలు ఆర్థిక స్థితిని కోలుకోలేకుండా చేశాయి. ఈ దండయాత్రలు మొగల్ సైనిక బలహీనతను ప్రపంచానికి చాటిచెప్పాయి. దీంతో మొగల్ సుబేదారులు స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకోసాగారు. హైదరాబాద్ నిజాం, బెంగాల్ ఆలీవర్దీఖాన్, ఔద్ సాదతాఖాన్లు స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకొన్నారు. ఈ విధంగా మొగల్ పాలకుల అసమర్థత, సమకాలీన రాజకీయ సంఘటనలు మొగల్ రాజ్య పతనానికి కారణాలయ్యాయి.

ప్రశ్న 4.
శివాజీ పరిపాలనపై ఒక వ్యాసం వ్రాయండి.
జవాబు:
పరిపాలన: శివాజీ కృషితో స్వతంత్ర మహారాష్ట్ర రాజ్యం ఏర్పడింది. శివాజీ గొప్ప వీరుడు. సైనిక నాయకుడే కాకుండా గొప్ప పాలకుడిగా కూడా పేరు పొందాడు.
శివాజీ పాలన సమానత్వం, న్యాయం, సహనంలపై ఆధారపడి కొనసాగింది. శివాజీ తన రాజ్యానికి ‘స్వరాజ్యం’ అని పెట్టాడు. తన రాజ్యం పరిసర ప్రాంతాల నుంచి చౌత్, సర్దేశముఖి వంటి పన్నులను వసూలు చేశాడు.

శివాజీ కేంద్రీకృత పాలనావ్యవస్థను ఏర్పాటు చేశాడు. చక్రవర్తి అయిన శివాజీ సర్వాధికారి. అధికారులను గమించే, తొలగించే అధికారం శివాజీకి ఉండేది. శివాజీ తనకు పరిపాలనలో సహకరించేందుకు ఎనిమిది మంది సభ్యులు గల అష్టప్రధానులు అనే మంత్రిమండలిని ఏర్పాటుచేశాడు. మంత్రులకు వివిధ శాఖలను కేటాయించాడు
అష్ట ప్రధానులు:

  • పీష్వా: ప్రధానమంత్రి – సాధారణ పాలనా వ్యవహారాలను చూసేవాడు.
  • అమాత్య: ఆర్థిక మంత్రి – ఆదాయ వ్యయాలు, బడ్జెట్ చూసేవాడు.
  • మంత్రి: ఆంతరంగిక వ్యవహారాల మంత్రి.
  • సచివ: సమాచారశాఖ మంత్రి.
  • సుమంత్: విదేశీ వ్యవహారాల మంత్రి.
  • పండితరావు దానధర్మాలు, ధర్మాదాయం.
  • సేవాపతి: సర్వసైన్యాధ్యక్షుడు.
  • న్యాయాధీశుడు: అత్యున్నత న్యాయాధికారి.

కేవలం సామర్థ్యాన్ని బట్టి మాత్రమే మంత్రిమండలిలో స్థానం లభించేది. వంశపారంపర్య హక్కు ఉండేది కాదు. మంత్రులు, పాలనా వ్యవహారాలతో పాటు అవసరమైనప్పుడు సైనిక విధులను కూడా నిర్వహించేవారు.

పరిపాలనా విభాగాలు: పరిపాలనా సౌలభ్యం కోసం శివాజీ తన స్వరాజ్యంను నాలుగు రాష్ట్రాలుగా విభజించి దాని పాలనకు వైశ్రాయ్ లేదా గవర్నర్ను నియమించాడు. రాష్ట్రాలను తిరిగి జిల్లాలుగా విభజించాడు. జిల్లాను తిరిగి గ్రామాలుగా విభజించాడు. గ్రామ పాలనకు పంచాయితి, పటేల్, కులకర్ణి అనే అధికారులు నిర్వహించేవారు.
వీటికి తోడు మొగల్ రాజ్యంలోని కొన్ని ప్రాంతాలు పరోక్షంగా శివాజీ ఆధీనంలో ఉండేవి. వారి నుంచి చౌత్ అనే పేరున పన్నులు వసూలు చేశాడు.

భూమిశిస్తు విధానం: శివాజీ జాగిర్దారీ విధానాన్ని రద్దుచేశాడు. మత సంస్థల భూములను శివాజీ స్వాధీనం చేసుకొని వాటికి నగదు చెల్లించాడు. భూమిని సర్వే చేయించి రైత్వారీ విధానాన్ని ప్రవేశపెట్టాడు. పన్నులను ధన రూపంలోగాని, ధాన్యరూపంలోగాని చెల్లించే అవకాశాన్ని కల్పించాడు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో రైతులకు రుణాలను ఇచ్చి, వాటిని సులభ వాయిదాల్లో తిరిగి చెల్లించే ఏర్పాటు చేశాడు.

AP Inter 1st Year History Study Material Chapter 8 మొగలుల యుగం

భూమి శిస్తుతోపాటు వాణిజ్య పన్నులు, నాణాల నుంచి ఆదాయం, చౌత్, సర్దేశముఖి మొదలైన వాటి ద్వారా ప్రభుత్వానికి ఆదాయం లభించేది. చౌత్ అనే 1/4 వ వంతు పన్ను యుద్ధాల నుంచి రక్షించినందున తన రాజ్య పరిసరాల్లోని వారి నుంచి వసూలు చేసేవాడు. 1/10 వ వంతు వసూలు చేసే సర్దేశముఖి రాజు పట్ల గౌరవంతో చెల్లించే పన్ను.
సైనిక పాలన: శివాజీ బలమంతా అతని సైన్యంపై ఆధారపడి ఉంది. శివాజీ ప్రతిభావంతమైన, అంకితభావం గల సైన్యాన్ని ఏర్పాటు చేసుకొన్నాడు. ముస్లిం పాలకులను మహారాష్ట్రకు దూరంగా ఉంచి హిందూ ధర్మాన్ని రక్షించడం ప్రధాన లక్ష్యంగా గల శివాజీ అందుకు అనువైన సైన్యాన్ని ఏర్పాటు చేసుకొన్నాడు. శివాజీ సైన్యంలో 45 వేల అశ్విక దళం, 60 వేల కాల్బలం, లక్షమందితో పదాతి దళం ఉండేది. వీటికి తోడు ఏనుగులు, ఒంటెలు, ఫిరంగి దళం కూడా ఉండేది.

జాగీరులకు బదులు మొదటిసారిగా ధనరూపంలో వేతనాలను చెల్లించేవారు. శివాజీ కోటల రక్షణకు ప్రత్యేక చర్యలను తీసుకొన్నాడు. సమర్థులైన వారికి బిరుదులు ఇవ్వడం, ప్రతిభావంతులకు అదనపు సౌకర్యాలను కల్పించడం వంటివి శివాజీ చేశాడు. యుద్ధరంగానికి స్త్రీలను తీసుకువెళ్ళడాన్ని నిషేధించాడు. దీన్ని ఉల్లంఘించిన వారికి మరణ శిక్ష విధించేవాడు. యుద్ధంలో స్వాధీనం చేసుకొన్న సొమ్మంతా చక్రవర్తికి అప్పగించాల్సి ఉండేది.

న్యాయపాలన: న్యాయ వ్యవస్థలో శివాజీ సంప్రదాయ పద్ధతులను పాటించాడు. సమన్యాయాన్ని అనుసరించాడు. ధనవంతుడు, పేదవాడు అనే తేడాలు కానీ, మత తేడాలు కానీ చూపించేవాడు కాదు. గ్రామస్థాయిలో గ్రామ పంచాయితీలు ” న్యాయపాలన చేసేవి. కేంద్ర స్థాయిలో న్యాయపాలన కోసం ‘న్యాయాధీశ్’ నియమించబడ్డాడు. కేసులు విచారించడంలోనూ, తీర్పులను ఇవ్వడంలోనూ ప్రాచీన హిందూ చట్టాలను పరిగణనలోకి తీసుకొనేవారు.

దేదీప్యమానంగా వెలుగొందుతూ ఉన్న మొగలులతో వీరోచితంగా పోరాడి శివాజీ విజయం సాధించాడు. గతంలో అనైక్యంగా చిన్నచిన్న భాగాలుగా ఉన్న హిందూమత శక్తులను ఉన్నతమైన ఆశయాలతో ఏకంచేశాడు.

వీటన్నింటికి తోడు శివాజీ గొప్ప రాజకీయవేత్త, చురుకైన నాయకుడు. జె.ఎన్. సర్కార్ అనే చరిత్రకారుడు అన్నట్లు “శివాజీ మహారాష్ట్రులకు వెలుగు మొగలుల పాలిట సింహస్వప్నం తన వారసులకు స్ఫూర్తిప్రదాతగా నిలిచాడు. శివాజీ గొప్పతనం అతని వ్యక్తిత్వంలోను ఆచరణలోనూ బయల్పడుతుంది”.

లఘు సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
బాబర్ నామ
జవాబు:
మధ్యయుగ భారతదేశ చరిత్రలో గణనీయమైన వ్యక్తులలో బాబరు ఒకడు. భారతదేశమున మొగలు సామ్రాజ్యమును స్థాపించిన ఘనుడు బాబరు. క్రీ.శ. 1483లో బాబరు ఫర్గానాయందు జన్మించెను. ఇతని తండ్రియగు ఉమర్ షేక్ మీర్జా మధ్యఆసియాలోని ఫర్గానా అను చిన్న రాజ్యమునకు అధిపతి. క్రీ.శ. 1494లో తన తండ్రి మరణానంతరము బాబరు 11 సం॥ల ప్రాయమున ఫర్గానా ప్రభువు అయ్యెను. తన మాతృదేశమున నిలువనీడలేక తన దృష్టిని ఆఫ్ఘనిస్తాన్ వైపు మరల్చి 1504లో కాబూల్ ఆక్రమించెను. భారతదేశ రాజకీయ పరిస్థితులు అనుకూలముగా ఉండుటచే క్రీ.శ. 1526లో మొదటి పానిపట్టు యుద్దమున ఢిల్లీ సుల్తాన్గు ఇబ్రహీంలోడిని ఓడించి, వధించి ఢిల్లీ, ఆగ్రాలను ఆక్రమించి భారతదేశమున మొగల్ సామ్రాజ్య స్థాపన చేసెను.

బాబరు పర్షియన్, టర్కీ భాషలలో గొప్ప పండితుడు. టర్కీ భాషలో బాబరు వ్రాసుకొన్న స్వీయచరిత్ర తుజ్-క్- ఇ – బాబురి (తన ఆత్మకథ). మొగల్ యుగమున వ్రాయబడిన తొలి చారిత్రక గ్రంథము. ఇందు బాబరు తురుష్క భాషలోనున్న ప్రావీణ్యము తెలియుచున్నది. తుజ్-క్-ఇ-బాబరి సమకాలీన పరిస్థితులకు దర్పణం పడుతుంది. బాబరు కాలమును, హుమాయున్ తొలి జీవిత విశేషములను తెలుసుకొనుటకు ఈ గ్రంథము అత్యంత దోహదపడుతుంది. అందువల్ల మధ్యయుగాలనాటి ఆత్మకథల్లో దీనికి గణనీయమైన ప్రాముఖ్యత ఉంది.

ప్రశ్న 2.
హుమాయూన్
జవాబు:
బాబర్ మరణానంతరం మొగల్ సింహాసనాన్ని అధిష్టించినవాడు హుమాయూన్. ఇతడు బాబర్ పెద్ద కుమారుడు. హుమాయూన్ అనగా అదృష్టవంతుడని అర్థం. కానీ దీనికి భిన్నంగా అతడి జీవితం గడిచింది.

తొలి జీవితం: హుమాయూన్ 1508, మార్చి 6న జన్మించాడు. బాబర్ కుమారులు నలుగురిలో హుమాయూన్ పెద్దవాడు. తన తండ్రి కోరిక మేరకు హుమాయూన్ మొగల్ రాజ్యాన్ని సోదరులకు పంచాడు. సంభాల్న ఆస్కారీకి, ఆల్వార్ను హిందాల్కు, కాబూల్, కాందహార్ల ను కమ్రాన్కు ఇచ్చాడు. ఈ పంపకమే హుమాయూన్ కష్టాలకు మూలమైంది. కమ్రాన్ కాబూల్, కాందహార్ల తో తృప్తిపడక పంజాబును ఆక్రమించుకున్నాడు. సామ్రాజ్యాన్ని తన సోదరుల మధ్య పంపకం చేసినందువల్ల హుమాయూన్ ఆర్థికంగా, సైనికంగా బలహీనపడ్డాడు.

హుమాయూన్ బలహీనతలు: హుమాయూను కొన్ని వ్యక్తిగత బలహీనతలున్నాయి. అతడికి రాజకీయ చతురత, కార్యదీక్ష, సమయస్ఫూర్తి లేవు. నల్లమందుకు బానిస కావటమే కాక మితిమీరిన భోగలాలసత్వానికి కూడా లోనయ్యాడు.

సమస్యలు: పానిపట్టు, గోగ్రా యుద్ధాలలో బాబర్ చేతిలో ఓడిపోయిన ఆఫ్ఘన్లు తమ సార్వభౌమత్వాన్ని పునః ప్రతిష్టించుకోవటానికి తీవ్రమైన ప్రయత్నాలు మొదలుపెట్టారు. జాన్పూర్లో మహమ్మద్లోడీ, బెంగాల్లో నస్రతా, బీహార్లో షేర్ ఖాన్ బలం పుంజుకుని భారతదేశం నుంచి మొగలులను పారద్రోలటానికి చర్యలు ప్రారంభించారు.

హుమాయూన్ యుద్ధాలు: హుమాయూన్ రాజ్యానికి రాక మునుపే తండ్రితో పాటు పానిపట్టు, కాణ్వా యుద్ధా పాల్గొని మంచి అనుభవం గడించాడు. రాజ్యానికి వచ్చిన తరువాత కూడా అతడనేక యుద్ధాలు చేశాడు.

కలింజర్ దండయాత్ర (1530): కలింజర్ పాలకుడు తన శత్రువులైన ఆఫ్ఘన్లకు సహాయం చేశాడనే కారణంతో, హుమాయూన్ 1530లో కలింజర్పై దండెత్తి, విజయం సాధించాడు. కానీ, దాన్ని స్వాధీనపరుచుకొనక, నష్టపరిహారం మాత్రమే వసూలు చేసుకొన్నాడు. ఇది రాజనీతిజ్ఞతలేని చేష్ట.

దౌరా యుద్ధం: కలింజర్పై హుమాయూన్ దండెత్తినపుడు బీహార్లోని ఆఫ్ఘన్లు మహమ్మద్ డీ నాయకత్వం క్రింద మొగల్ రాష్ట్రమైన జాన్పుర్పై దాడిచేసి, ఆక్రమించారు. కానీ, కొద్దికాలంలోనే హుమాయూన్ ఆఫ్ఘన్లను డౌ యుద్ధంలో ఓడించి, దాన్ని తిరిగి స్వాధీనపరచుకొన్నాడు. మహమ్మద్ డీ బీహార్ కు పారిపోయాడు.

చునార్ యుద్ధం: బీహార్లో షేర్ఖాన్, చునార్ కోటను స్థావరంగా చేసుకొని తన సైనిక చర్యలను ముమ్మరం చేశాడు. షేర్ ఖాన్ ను అణచాలనే ఉద్దేశంతో హుమాయూన్ చుసార్ కోటను ముట్టడించాడు. కానీ, చునారు ఆక్రమించుకొనే సమయంలో షేర్ఫాన్ రాజకీయ చతురత ప్రదర్శించి హుమాయూన్తో సంధి చేసుకొనెను. అనంతరం హుమాయూన్ ఆగ్రా వెళ్లి దాదాపు ఒక సంవత్సరం పైగా విందులు, వినోదాలతో కాలం వృధా చేసుకొనెను. దీనితో బీహార్ లో షేర్ ఖాన్, గుజరాత్లో బహదూర్గా శక్తిని పుంజుకొని హుమాయూన్పై దాడికి సిద్ధమయ్యారు.

షేర్ఖాన్తో పోరాటం: గుజరాత్పై హుమాయూన్ దాడి చేస్తున్న తరుణంలో, షేర్భన్ బీహార్లో తన బలాన్ని పెంచుకొని 1537 నాటికి బెంగాల్ను ఆక్రమించి, హుమాయూన్కు కప్పం కట్టడం మానేశాడు. షేర్ ఖాన్ విజృంభణ తన సామ్రాజ్యం మనుగడకు ప్రమాదకరమని భావించిన హుమాయూన్, షేర్ఖాన్పై యుద్ధానికి సిద్ధపడ్డాదు. షేర్ ఖాస్ బెంగాల్లో ఉన్నందువల్ల హుమాయూన్ సులభంగా బీహార్ను ఆక్రమించుకోగలిగేవాడు. అలాగాక, చూనార్ దుర్గ ముట్టడిలో హుమాయూన్ చాలాకాలం వృథా చేసుకొన్నాడు. అనంతరం బెంగాల్ రాజధాని గౌర్ పైకి నడిచి, గాన్ని తన అధీనంలోకి తెచ్చుకొన్నాడు. గౌర్ ఆక్రమణానంతరం హుమాయూన్ ఎనిమిది నెలలు విలాసాలలో మునిగి తేలాడు. ఈలోపు షేర్ ఖాన్ హుమాయూను నిత్యావసర వస్తువులేవీ చేరకుండా ఢిల్లీ, బెంగాల్ల మధ్య రాకపోకలకు అడ్డంకులు కలిగించాడు. ఈ అరాచక పరిస్థితుల్లో హిందాల్ తనను తాను మొగల్ చక్రవర్తిగా ప్రకటించుకొన్నాడు. ఈ పరిస్థితుల్లో హుమాయూన్ రాజధానికి తిరుగు ప్రయాణం కట్టాడు.

చౌసా యుద్ధం (1539): రాజధాని చేరడానికి ప్రయాణంలో ఉన్న మొగల్ సైన్యం పైన షేర్ఖాన్ గంగానది ఒడ్డున ఉన్న చౌసా వద్ద 1539లో మెరుపు దాడి చేసి విజయం సాధించాడు. ఎలాగో తప్పించుకొని హుమాయ రాజధానికి చేరుకున్నాడు. ఆ తరువాత షేర్ ఖాన్ బీహార్, బెంగాల్లను పూర్తిగా తన ఆధీనంలోకి తెచ్చుకొని, వారికి స్వతంత్ర పాలకుడుగా ప్రకటించుకున్నాడు. ఈ విజయాలతో ఉత్తేజితుడైన షేర్ఖాన్ తన దృష్టిని ఢిల్లీ, ఆగ్రాం పై సారించాడు. ఇదే సమయంలో తన పేరును “షేర్ ” గా మార్చుకున్నాడు.
కనోజ్ యుద్ధం (1540): ఆగ్రావైపు వస్తున్న షేర్ ఖాన్ను ఎదుర్కోవడానికి, హుమాయూన్ రెండు లక్షల సైన్యంతో కనోజ్ చేరుకున్నాడు. 1540లో జరిగిన యుద్ధంలో హుమాయూన్కు పరాజయం సంభవించింది. షేర్షా ఢిల్లీ, ఆగ్రాలను ఆక్రమించాడు.

పైన పేర్కొనబడిన వివిధ అంశాలు హుమాయూన్ విపులతకు కారణమయ్యెను.

ప్రశ్న 3.
అబుల్ ఫజల్
జవాబు:
మన దేశ చరిత్రలో మొగల్ చరిత్రకు లభ్యమగు ఆధారములు ఏ యుగమున లేవు. అట్టి ఆధారములలో ముఖ్యమైనవి ఐని-ఇ-అక్బరీ.

దీనిని అక్బరు ఆస్థాన పండితులైన అబుల్ ఫజల్ వ్రాసెను. మొగల్ యుగ చరిత్ర ఆధారములలో ఈ గ్రంథము తలమానికం వంటిది. ఇందు మూడు సంపుటములు కలవు. మొదటి సంపుటము నందు తైమూర్ నుండి హుమాయూన్ వరకుగల మొగల్ వంశ చరిత్రను రెండు, మూడు సంపుటములందు అక్బరు పరిపాలనా విశేషముల గూర్చి వ్రాసెను.

ఐనీ-ఇ-అక్బరీ: దీనిని కూడా అబుల్ ఫజల్ మూడు సంపుటములుగా వ్రాసెను. ఇందు అక్బరు రాజకీయ విధానములు, పరిపాలనా విషయములు, ప్రజల జీవన స్థితిగతులు, అలవాట్లు సవిస్తరముగా వర్ణింపబడినవి. కనుకనే లూనియా (Luniya) పండితుడు “మొగల్ చరిత్ర వ్రాసే ఏ చరిత్రకారుడైనా ఈ గ్రంథమును సంప్రదింపకుండా ఎట్టి రచన చేయలేదు” అని చెప్పెను.

AP Inter 1st Year History Study Material Chapter 8 మొగలుల యుగం

అక్బరు తన బంధువులకు, కుటుంబ సభ్యులకు వ్రాసిన లేఖల సంకలనం. దీనిని కూడా అబుల్ ఫజల్ సంతరించెను.

తబ్కాత్-ఇ-అక్బరీ: ఇది ఒక సామాన్య చారిత్రక గ్రంథము. దీనిని మీర్భక్షి ఖ్వాజీ నిజాముద్దీన్ మూడు సంపుటములుగా వ్రాసెను. ఇందు ఢిల్లీ సుల్తానత్ యుగము, బాబరు, హుమాయూన్, అక్బరుల పాలనాకాలము, ప్రాంతీయ రాజ్యాల చరిత్ర వివరింపబడెను. గుజరాత్ చరిత్రకు ఇది ఒక అమూల్యమైన ఆధారము.

ప్రశ్న 4.
నూర్జహాన్
జవాబు:
మొగల్ సామ్రాజ్య చరిత్రలో ప్రముఖ పాత్ర వహించిన స్త్రీ నూర్జహాన్. 1611లో జహంగీర్కు నూర్జహాన్తో వివాహం జరిగినప్పటి నుంచి జహంగీర్ జీవితం, మొగల్ వంశ చరిత్ర కొత్త మలుపు తిరిగాయి. నూర్జహాన్ అసలు పేరు మెహరున్నీసా. ఈమె తండ్రి ఘియాస్ బేగ్, తల్లి అస్మత్ బేగం. ఘియాస్ బేగ్ పర్షియా దేశం నుంచి ఉపాధి కోసం భారతదేశం వచ్చి, అక్బర్ ఆస్థానంలో స్థానం పొంది కాబూల్ సుబాకు దివాన్ అయ్యాడు. మెహరున్నీసా అందగత్తె. మెహరున్నీసాకు అక్బర్ కుమారుడైన సలీంకు ప్రేమ కథనం ఉంది. వారి ప్రేమను ఇష్టపడని అక్బర్ ఆమెను షేర్ ఆఫ్ఘన్కు ఇచ్చి వివాహం చేసి, ఆ దంపతులను బెంగాల్లోని బర్వాన్కు పంపించాడని కొందరి అభిప్రాయం. అక్బర్ మరణానంతరం సలీం, జహంగీర్గా సింహాసనమధిష్టించిన తరువాత షేర్ ఆఫ్ఘన్ను వధించి, మెహరున్నీసాను వివాహమాడాడని మరొక కథనం ఉంది. ఆ వివాహం నాటికి ఆమె వయస్సు 33 సంవత్సరాలు. ఆమెకు యుక్తవయస్సు వచ్చిన లాడ్లీ బేగం అనే కుమార్తె కూడా ఉంది. జహంగీర్ మెహరున్నీసాను వివాహం చేసుకొన్న తరువాత నూర్మహల్ (ఇంటికి వెలుగు) నూర్జహాన్ (ప్రపంచానికి వెలుగు) అనే బిరుదులిచ్చాడు. వివాహానంతరం ఆమెకు సర్వాధికారాలు అప్పగించి విలాసవంతమైన జీవితం గడిపాడు.

నూర్జహాన్ అధికార దాహం: నూర్జహాన్ తన అధికారాన్ని పటిష్టం చేసుకోవటానికి అనేక చర్యలు తీసుకొంది. నాణేల మీద జహంగీర్ తో పాటు తన పేరును కూడా ముద్రించుకుంది. తన బంధువులకు, ఆశ్రితులకు ఉన్నత పదవులనిచ్చి ముఠాకు నాయకురాలైంది. తన తల్లిని తన ప్రధాన సలహాదారుగా నియమించుకుంది. తన కుమార్తె లాడ్లీ బేగంను జహంగీర్ మరొక కుమారుడు ప్రియార్కు ఇచ్చి వివాహం చేసింది. ఖుర్రం (షాజహాన్ ) ను కేంద్ర రాజకీయాల నుంచి కాందహార్కు పంపించటానికి ప్రయత్నించింది. దీనితో తిరుగుబాటు చేసిన ఖుర్రంను మహబతాన్ సాయంతో అణచివేసింది. ఖుర్రంపై సాధించిన విజయంతో మహబతాఖాన్ కీర్తి, ప్రతిష్టలు ఇనుమడించాయి. అదీగాక మహబతాన్, జహంగీర్ రెండో కుమారుడు పర్వేజ్ను సింహాసనం ఎక్కించాలనే లక్ష్యంతో ఉన్నాడు. దీనితో మహబతాఖాన్ మీద నూర్జహాన్ కక్ష సాధింపు చర్యలు ప్రారంభించింది. మహబతాఖాన్ ను దక్కన్ నుంచి బెంగాల్కు బదిలీ చేయించింది. దీనితో మహబతాఖాన్ తిరుగుబాటు చేసి, 1626లో జహంగీర్ను నూర్జహాన్ను బందీలుగా పట్టుకొని 3 నెలలకు పైగా పరిపాలన చేశాడు. దీనినే శతదిన పాలన అంటారు. కానీ నూర్జహాన్ మాయోపాయంతో ఖైదు నుంచి జహంగీర్ తోపాటు బయటపడింది. దీనితో ధైర్యం చెదిరిన మహబతాఖాన్ దక్కను పారిపోయి ఖుర్రంతో చేతులు కలిపాడు. అప్పటికే అనారోగ్యంతో బాధపడుతున్న జహంగీర్ 1627లో మరణించాడు. దీనితో సింహాసనం కోసం వారసత్వ యుద్ధం ప్రారంభమైంది.

చివరకు తన శత్రువులందర్నీ ఓడించి, 1628, జూలై 14న ఖుర్రం ఇదివరకే సంపాదించుకున్న “షాజహాన్” అనే బిరుదుతో సింహాసనం అధిష్టించాడు. నూర్జహాన్ తన ఆశలన్నీ అడియాసలయ్యాయని గ్రహించి రాజకీయాల నుంచి పూర్తిగా నిష్క్రమించింది. చివరి రోజుల్లో దైవచింనతలో గడిపి 1645లో లాహోర్ లో మరణించింది. ఏది ఏమైనప్పటికీ తన భర్త వ్యసనపరుడైనప్పుడు రాజ్యాన్ని ఇతరుల హస్తగతం కాకుండా నూర్జహాన్ కాపాడగలిగింది.

ప్రశ్న 5.
తాజ్మహల్
జవాబు:
షాజహాన్ గొప్ప భవన నిర్మాత. ఈ విషయంలో ఇతడి పాలనా కాలాన్ని రోమన్ చక్రవర్తి అగస్టస్ కాలంతో పోల్చడం జరిగింది. ఢిల్లీ, ఆగ్రా, కాబూల్ లో షాజహాన్ కాలానికి చెందిన కట్టడాలు సౌందర్యానికి, కళావైశిష్ట్యానికి నిదర్శనాలుగా నిలిచాయి. రాజధానిగా ఉండటానికి ఆగ్రాకు అర్హతలేదని భావించిన షాజహాన్, షాజహానాబాద్ అనే నూతన రాజధాని నగరాన్ని నిర్మింపచేశాడు. అదే ప్రస్తుత పాత ఢిల్లీ. షాజహాన్ నిర్మాణాల్లో ఆగ్రాలోని తాజ్మహల్, ఢిల్లీలోని ఎర్రకోట, అందులోని దివాన్ ఇ-ఆమ్, దివాన్-ఇ-ఖాన్, జామా మసీద్ ప్రధానమైనవి. షాజహాన్ నిర్మాణాలన్నింటిలో తలమానికమైంది, ఆగ్రాలో యమునా నది ఒడ్డున తన పట్టమహిషి ముంతాజ్ బేగం సంస్మరణార్థం నిర్మించిన తాజ్మహల్. దీనిని ప్రపంచ అద్భుత కట్టడాలలో ఒకటిగా భావిస్తారు. దీని నిర్మాణానికి ఇరవై రెండు సంవత్సరాలు పట్టింది. నాలుగున్నర మిలియన్ పౌన్లు ఖర్చయింది. ఉస్తాద్ అహ్మద్ దీని నిర్మాణంలో ప్రధాన భూమిక నిర్వహించిన వాస్తుశిల్పి. షాజహాన్ భవనాలన్నింటిలోను అలంకరణకు పేరుపొందింది.

ప్రశ్న 6.
పురంధర్ సంధి
జవాబు:
1665 సం॥లో మొగల్ సేనాని రాజా జైసింగ్క, మరాఠా నాయకుడు అయిన శివాజీకి మధ్య పురంధర్ వద్ద కుదిరిన సంధిని పురంధర్ సంధి అని అంటారు. ఈ సంధి ప్రకారం:

  1. శివాజీ తన స్వాధీనంలోని సాలీనా నాలుగు లక్షల రూపాయల ఆదాయాన్ని ఇచ్చే ఇరవై మూడు కోటలను మొగలులు స్వాధీనం చేసుకున్నారు.
  2. బీజపూర్తో మొగలులు చేసే యుద్ధాలలో సహాయం చేసేందుకు శివాజీ అంగీకరించాడు.
  3. తన కుమారుడు శంభూజీని ఐదువేల మంది అశ్వికులతో మొగల్ ఆస్థానానికి పంపేందుకు శివాజీ అంగీకరించాడు.
  4. 13 సంవత్సరాల కాలంలో నలభై లక్షల పన్నులను చెల్లించేందుకు శివాజీ అంగీకరించాడు.
  5. ఐదు లక్షల పన్నులను ఇచ్చే బీజపూర్ రాజ్యంలోని ప్రాంతాలపై శివాజీ అధికారాన్ని మొగలులు గుర్తించారు. ఈ సంధి వల్ల మొగలులు ప్రయోజనం పొందారు. వారి ప్రాభవం వృద్ధి చెందింది. దీనితో శివాజీ అవమానానికి గురి అయినాడు. పురంధర్ సంధి ప్రకారం రాజా జైసింగ్ ప్రోద్బలంతో ఆగ్రాలోని మొగల్ దర్బారును శివాజీ దర్శించాడు.

ప్రశ్న 7.
సాహూ
జవాబు:
శివాజీ మరణానంతరం అతని పెద్ద కుమారుడైన శంభూజీ 1680లో సింహాసనాన్ని అధిష్టించాడు. అతడు బలశాలే అయినా అసమర్థుడు కావడంవల్ల ఔరంగజేబు చేతిలో 1689లో మరణానికి గురయ్యాడు. అనంతరం అతని సవతి సోదరుడు రాజారాం సింహాసనాన్ని అధిష్టించాడు. రాజారాం సమర్థుడు కాకపోయినా రామచంద్ర పంథ్, శాంతాజీ ఘోర్పడే, దానాజీ జాదన్ వంటి సమర్థ అధికారుల సహకారంతో మొగలులను ధైర్యంతో ఎదుర్కొన్నాడు.

దురదృష్టవశాత్తు క్రీ.శ. 1700 సంవత్సరంలో రాజారామ్ మరణించడంతో అతడి భార్య తారాబాయి మహారాష్ట్రకు సారధ్యం వహించింది. ఔరంగజేబు మరణానంతరం సాహు బందిఖానా నుంచి విడుదల చేయడంతో తారాబాయి, సాహుల మధ్య వారసత్వ పోరాటం జరిగి సాహు విజయం సాధించాడు. ఫలితంగా మహారాష్ట్ర రాజ్యం కొల్హాపూర్, సతారాలుగా విడిపోయింది. సాహు 1713లో పీష్వాగా బాలాజీ విశ్వనాధ్ను నియమించాడు. పీష్వా పదవి వంశపారంపర్యమైంది. క్రమంగా పీష్వాలు మహారాష్ట్రకు నిజమైన పాలకులుగా మారారు.

పీష్వాల రాజ్యానికి పునాదులు వేసిన బాలాజీ విశ్వనాధ్న మహారాష్ట్ర సామ్రాజ్య రెండవ స్థాపకుడిగా పిలుస్తారు. బాలాజీ విశ్వనాధ్ తరువాత అతడి కుమారుడు మొదటి బాజీరావు 1720లో సింహాసనాన్ని అధిష్టించాడు. బలమైన సైన్యంతో మొదటి బాజీరావు కృష్ణా, గోదావరి మధ్య ప్రాంతాన్ని మహారాష్ట్రులు కిందకి తెచ్చాడు. హిందూ రాజ్యాన్ని ఏర్పాటు చేయాలని ఇతని ఆశయం. ‘మరాఠా కూటమి’ని ఏర్పాటుచేసిన బాజీరావు గుజరాత్, మాళ్వ, బుందేల్ఖండ్లను ఆక్రమించి ఢిల్లీపై దృష్టి కేంద్రీకరించాడు. అయితే లక్ష్యాన్ని సాధించక ముందే 42 సంవత్సరాల వయస్సులో 1740 సంవత్సరంలో మొదటి బాజీరావు మరణించాడు.

ప్రశ్న 8.
బాలాజీ విశ్వనాధ్
జవాబు:
శివాజీ మరణానంతరం మహారాష్ట్ర సామ్రాజ్యం అంతర్యుద్ధం వలన పతనావస్థకు చేరుకుంది. ఆ కల్లోల పరిస్థితులలో శివాజీ వదిలివెళ్ళిన బాధ్యతలను, ఆయన ఆశయాలను నెరవేర్చటమేగాక, పతనావస్థలో ఉన్న మహారాష్ట్ర రాజ్యాన్ని, సంస్కృతిని కాపాడిన ఘనత పీష్వాలకు దక్కింది. ఈ పీష్వాల వంశమూలపురుషుడు బాలాజీ విశ్వనాధ్ (1713-1720). మహారాష్ట్ర రాజ్యాన్ని, సంస్కృతిని మొదటగా కాపాడిన ఘనుడు బాలాజీ విశ్వనాధ్. ఛత్రపతి సాహుచే పీష్వాగా నియమించబడిన విశ్వనాధ్ సువిశాల సామ్రాజ్యాన్ని స్థాపించి, భారతీయ చరిత్రలో మహారాష్ట్రులకు విశిష్ట స్థానాన్ని సంపాదించాడు. మహారాష్ట్రుల నౌకాదళాధిపతియైన కన్హోజీతో ఒక సంధి కుదుర్చుకొని పోర్చుగీసు వారిని, ఆంగ్లేయులను ఓడించాడు. సయ్యద్ సోదరులతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకొని ఒకప్పుడు శివాజీకి చెందిన భూభాగాలన్నింటిని తిరిగి మొగలాయిల నుండి సంపాదించాడు. మహారాష్ట్రుల కూటమిని ఏర్పరచి మహారాష్ట్రులలో ఐక్యత సాధించాడు. ఇతని విధానాల వలన దేశంలో మహారాష్ట్రుల ప్రాబల్యం పెరిగింది. తన ఆశయాలు పూర్తిగా నెరవేరకమునుపే బాలాజీ విశ్వనాధ్ మరణించాడు.

ప్రశ్న 9.
మూడవ పానిపట్టు యుద్ధం
జవాబు:
అహమ్మదా అబ్దాలీ, మహారాష్ట్రుల సామ్రాజ్యకాంక్ష మూడో పానిపట్టు యుద్ధానికి దారితీసింది. 1757లో ఆఫ్ఘనిస్తాన్కు చెందిన అహమ్మద్ అబ్దాలీ పంజాబ్ను ఆక్రమించుకొని, తన కుమారుడైన తైమూరాను రాష్ట్రపాలకుడిగా నియమించాడు. పీష్వా బాలాజీ బాజీరావు సోదరుడు రఘునాథరావు. మహారాష్ట్ర ప్రభువు మలహరరావ్ హోల్కర్ లు కలిసి పంజాబ్పై దాడిచేసి, అక్కడి నుండి తైమూర్గాను తరిమివేశారు. దీనితో అహమ్మదా అబ్దాలీ, మహారాష్ట్రుల మధ్య యుద్ధం అనివార్యమైంది. 1761 నవంబరులో చారిత్రాత్మకమైన పానిపట్టు మైదానంలో మహారాష్ట్ర, ఆఫ్ఘన్ సైన్యాలు తలపడ్డాయి. ఈ యుద్ధంలో ఆఫ్ఘన్లు తిరుగులేని విజయం సాధించారు. సదాశివరావ్, విశ్వాసరావ్ అంతటి మహారాష్ట్ర వీరులు సైతం నేలకొరిగారు. వేలకొలది మహారాష్ట్ర సైనికులు యుద్ధభూమిలో మరణించారు. 40,000 మంది సైన్యం యుద్ధఖైదీలుగా పట్టుబడ్డారు. ఈ యుద్ధం వల్ల నష్టపోని మహారాష్ట్ర కుటుంబం లేదని జె. ఎన్. సర్కార్ వ్రాశాడు. ఈ పరాజయ వార్త విన్న కొద్దికాలానికే పీష్వా బాలాజీ బాజీరావు కృంగిపోయి మరణించాడు.

AP Inter 1st Year History Study Material Chapter 8 మొగలుల యుగం

సదాశివరావు అహంభావపూరిత స్వభావం, మహారాష్ట్ర నాయకులలో ఐకమత్యం లేకపోవటం, రొహిల్లాలు, అయోధ్య నవాబు వంటి స్వదేశీయులు అబ్దాలీకి సహాయపడటం, అటువంటి సహాయం మహారాష్ట్రులకు లేకపోవటం, సేనానిగా అబ్దాలీ ప్రదర్శించిన నైపుణ్యం, అబ్దాలీ విజయానికి, మహారాష్ట్రుల పతనానికి దోహదం చేశాయి.
మూడో పానిపట్టు యుద్ధం మహారాష్ట్రులకు ఘోరమైన సైనిక పరాజయం. దీనితో మహారాష్ట్రులు అజేయులన్న భావన పటాపంచలైంది. పీష్వా అధికారం క్షీణించి మహారాష్ట్ర సమాఖ్య విచ్ఛిన్నమైనది. ఈ యుద్ధం వలన విజృంభిస్తున్న మహారాష్ట్ర సామ్రాజ్యం అతలాకుతలమైపోయింది. హిందుపదేపదేహి అనే మహారాష్ట్రుల నినాదం గాలిలో కలిసిపోయింది. మొగల్ సామ్రాజ్యం ఇంకా నిర్వీర్యమైపోయింది. మహారాష్ట్రుల వైఫల్యం, మొగలుల బలహీనత ఆంగ్లేయులకు సహకరించాయి. వారిని ఎదిరించి నిలువగలిగిన శక్తి భారతదేశంలో ఎక్కడా లేకుండా పోయింది.

ప్రశ్న 10.
చౌత్, సర్దేశముఖి
జవాబు:
భూమిశిస్తు విధానంలో శివాజీ తనకు ముందు రాజా తోడర్ మల్, మాలిక్ అంబర్లు అనుసరించిన విధానాన్నే చాలా వరకు అనుసరించాడు. భూమిని సర్వే చేయించి, పండిన పంటలో 40 శాతాన్ని శిస్తుగా నిర్ణయించాడు. జమిందారీ విధానాన్ని రద్దుచేసి రైత్వారీ విధానాన్ని ప్రవేశపెట్టాడు. శిస్తును రైతులు ధనరూపంలోగాని, ధాన్యరూపంలోగాని చెల్లించవచ్చు. అవసర కాలంలో రైతులకు వాయిదాల పద్ధతిపై అప్పులు ఇచ్చాడు. విత్తనాలు, పశువుల పెంపకం కూడా చేశాడు. కానీ, వాటి విలువలను వాయిదాల పద్ధతి మీద ప్రభుత్వ అధికారులు తిరిగి రాబట్టుకునేవారు. స్వరాజ్ వెలుపల తాను నేరుగా పాలించని ప్రజల నుంచి చౌత్, సర్దేశముఖ్ అనే రెండు పన్నులను వసూలు చేశాడు. చౌత్ అంటే స్వరాజ్యం వెలుపల ఉన్న భూములు ఆదాయంపై 1/4 వంతు, సర్దేశముఖి అంటే ఆదాయంపై 1/10వ వంతు శిస్తుగా వసూలు చేశాడు. ఈ విధంగా వసూలైన ధనాన్ని మరాఠా రాజ్య నిర్మాణానికి వినియోగించాడు.

AP Inter 2nd Year History Study Material Chapter 4 భూఖండ మధ్య ప్రాంత ఇస్లామ్ సామ్రాజ్యం

Andhra Pradesh BIEAP AP Inter 2nd Year History Study Material 4th Lesson భూఖండ మధ్య ప్రాంత ఇస్లామ్ సామ్రాజ్యం Textbook Questions and Answers.

AP Inter 2nd Year History Study Material 4th Lesson భూఖండ మధ్య ప్రాంత ఇస్లామ్ సామ్రాజ్యం

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
మహ్మద్ ప్రవక్త జీవిత విశేషాలు గూర్చి సంక్షిప్తంగా తెలియజేయుము. ఆయన ఏమి బోధించెను ?
జవాబు:
అరేబియాలోని ఎడారి ప్రాంతంలో గల మక్కా నగరంలో క్రీ.శ. 570లో ఖురేషి జాతికి చెందిన హాష్మయిట్ కుటుంబంలో మహ్మద్ జన్మించాడు. బాల్యంలోనే తల్లిదండ్రులను కోల్పోయాడు. అనాథ అయిన మహమ్మదు అతని మేనమామ అబూతాలిబ్ పెంచాడు. మామతోపాటు వర్తక వ్యాపారాలలో పాల్గొని మంచి సామర్థ్యం సంపాదించాడు. దక్షిణ అరేబియా, సిరియా వంటి అనేక ప్రాంతాలలో వర్తక బిడారులతో, విస్తృతంగా పర్యటించాడు.

ఖదీజా అనే బాగా డబ్బున్న వితంతువు వద్ద ప్రతినిధిగా చేరి కొద్ది కాలంలోనే ఆమె అభిమానాన్ని, ప్రేమను చూరగొని ఆమెను వివాహమాడాడు. మహమ్మద్ నిరంతరం ఆలోచనా నిమగ్నుడై ఉండేవాడు. మక్కా సమీపంలో ధ్యానం చేసేవాడు. జీవిత సత్యాలకై అన్వేషించాడు. మహ్మద్కు తన 40వ ఏట నిజమార్గం లభించింది. మహ్మద్ తనకు కలిగిన సత్యానుభూతితో ప్రవక్తగా మారాడు. తాను దేవుని దూతనని (రసూల్) భావించాడు. మహ్మద్కు కలిగిన దైవానుభూతితో ‘అల్లా’ ఒక్కడే దేవుడని తాను అల్లా యొక్క ప్రవక్తను అని విశ్వసించాడు. అట్లాగే బోధించాడు. ఇటువంటి విశ్వాసులందరినీ ఒక జనసామాన్యంగా తయారు చేసాడు.

మక్కా ఒక వ్యాపారకేంద్రంగానే కాక పవిత్రమైన దేశంగా మారింది. మక్కాలోని ‘కబ్బా’ అనే ఒక దీర్ఘచతురస్రాకారం రాయి ముసల్మానులకు పవిత్ర స్థలమయింది. ఇస్లాం అనగా దేవుని వలన శాంతిని పొందుట.

AP Inter 2nd Year History Study Material Chapter 4 భూఖండ మధ్య ప్రాంత ఇస్లామ్ సామ్రాజ్యం

ఇస్లాం మత లక్షణాలు: దైవం యొక్క ఏకత్వాన్ని, ఆధిక్యతను అంగీకరిస్తూ ఆయనకు సేవలు చేయడం ద్వారా శాంతిని సాధించవచ్చు. అల్లా అనే ఒకే ఒక దేవుడున్నాడని, ఆయన సర్వాధికుడని ఇస్లాం చెబుతుంది. ప్రపంచంలోని ముసల్మానులందరూ సమానులే. వారు సోదర సమానులు. ఏకేశ్వరోపాసన ఇస్లాంలో కనిపిస్తుంది. విగ్రహారాధన లేదు. ఇస్లాంలో పూజారులు లేరు. వారి ఆరాధనలో సులభమైన పద్ధతులు కలవు. ప్రతిరోజు ప్రార్థన, ప్రతి ముసల్మాను తన మతవిధిగా దేవుని పేరుతో పేదలకు దానధర్మాలు చేయుట, దొంగతనాలు చేయకుండుట వంటి నియమాలు అనుసరించాలి. మహ్మద్ చెప్పిన సర్వసమానత్వం కులీనులకు కంటగింపుగా మారింది. ఆ వర్గం మహ్మద్ను అనేక ఇబ్బందులకు గురి చేసింది. ప్రాణాపాయం నుండి తప్పించుకొనుటకు క్రీ.శ.622లో మహ్మద్ మక్కాను వదిలి మదీనాకు ప్రవాసం పోయాడు. ఈ ప్రవాసాన్ని ‘హిజరా’ పేరుతో ముసల్మానుల కేలండర్ ప్రథమ సంవత్సరంగా గుర్తించారు. క్రీ.శ. 632లో మహ్మద్ మరణించే నాటికి అరేబియా అంతా ఒక్కటై గొప్ప మత సమైక్యతను సాధించింది. మహమ్మదీయులు తమ మత ప్రచారం, వ్యాప్తి పట్ల తీవ్రమైన ఉత్సాహం, ఉద్రేకం కలిగి ఉండేవారు.

మహ్మద్ ప్రవక్త బోధనలు: ఈ నూతన మత సారాంశం వారి పవిత్ర గ్రంథమైన ఖురాన్తో కనుగొనవచ్చు. అరబిక్ భాషలో ఖురాన్ అనగా కంఠస్తం చేయడం. మహ్మద్ విగ్రహారాధనను ఖండించాడు. అల్లాను విశ్వసించే భక్తులు సహోదరులు వలె జీవించాలి. దేవుని దృష్టిలో అందరూ సమానులే. ‘లా ఇలాహ ఇల్ అల్లా మహమ్మద్ ఉర్
రసూల్ అల్లా (అల్లా తప్ప మరో దేవుడు లేడు) మహ్మద్ అతని ప్రవక్త, ఇది వారి ప్రార్థనాగీతం, దీని పునఃచరణనే కల్మా అంటారు. మహ్మద్ యొక్క స్వంత తెగ ఖురేషీకి చెందినవారు మక్కాలో నివసించి కాబాపై అధికారం చలాయించారు. ప్రతి ముసల్మాను రోజుకు ఐదుసార్లు ప్రార్థన చేయాలి. దీనినే నమాజ్ అంటారు. శుక్రవారం మధ్యాహ్నం తప్పనిసరిగా మసీదులో ప్రార్ధన చేయాలి.

ఇస్లాం మతానికి పవిత్రమైన రంజాన్ నెలలో సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఉపవాసం ఉండి ఎటువంటి ఆహారం తీసుకోరాదు. ప్రతి ముసల్మాను తన మత విధిగా, దేవునికి కానుకగా పేదలకు దానం చేయాలి. ఈ పవిత్రమైన చర్యను ‘జకాత్’ అంటారు. ప్రతి మహమ్మదీయుడు తన జీవితకాలంలో ఒక పర్యాయమైన మక్కాలోని పవిత్ర స్థలాన్ని సందర్శించాలి. ఈ తీర్థయాత్రనే ‘హజీ’ అంటారు. ఇవి కాక మరికొన్ని నియమాలను, ఆచారాలను ముసల్మానులు ఆచరించాలి. అణకువ, దాతృత్వం, నిజాయితీ, మహిళల పట్ల, తల్లిదండ్రుల పట్ల గౌరవం, బానిసలపై కారుణ్యం, జంతువులపై దయ, మధ్యపానం, జూదంలకు దూరంగా ఉండటం వంటి సద్గుణాలకు ప్రాధాన్యత ఇవ్వబడింది.

ఇస్లాం మతం హేతువాదానికి ప్రాధాన్యత ఇచ్చింది. మంత్రతంత్రాలు, అర్థం కాని ఆధ్యాత్మిక సూత్రాలు ఇందులో లేవు. అందరూ సమానులే అన్న సిద్దాంతం ఇస్లాం ఉదారవాదానికి ప్రతీక. మహమ్మదీయులలో విశ్వమానవ సౌభ్రాతృత్వం, దేవునికి మనిషికి మధ్య గల ప్రీతిపాత్రమైన సంబంధం వంటి అనేక లక్షణాలు ఇస్లాం మతాన్ని ప్రపంచ మతాలలో ఒక గొప్ప మానవతామతంగా తీర్చిదిద్దాయి.

ప్రశ్న 2.
ఇస్లాం వారసత్వం గురించి వివరింపుము.
జవాబు:
రోమన్ సామ్రాజ్యం వలె విస్తరణలోను, వివిధ రకాలైన ప్రజలతో కూడుకొని అరబ్ లేదా ఇస్లాం సామ్రాజ్యం కూడా ప్రసిద్ధిగాంచింది. స్పెయిన్, ఉత్తర ఆఫ్రికా, మధ్యప్రాచ్యం, దక్షిణ ఆసియా ప్రాంతాలకు చెందిన ప్రజలు అరబ్ సామ్రాజ్యంలో అంతర్భాగం. ప్రాజ్ఞులైన ఎందరో ఈ రాజ్యాన్ని పాలించారు. వారిలో హరున్-అల్-రషీద్, ఆయన కుమారుడు మామున్లు మిక్కిలి ఖ్యాతి గాంచారు. హరున్-అల్-రషీద్ పాండిత్యం, కళలు, సాహిత్యం, విజ్ఞానం, వర్తక వ్యాపారులను ప్రోత్సహించాడు.

విద్య: అరబ్బుల ఇస్లాం సామ్రాజ్యంలో గర్వించదగిన బాగ్దాద్, కైరో, డమాస్కస్, కార్గోవా, సెవిలె, బార్సిలోనా వంటి చోట్ల గొప్ప విద్యాకేంద్రాలుండేవి. వీరు ప్రాచీన గ్రీకు మహాకావ్యాలు హైందవుల గణిత గ్రంథాలను తర్జుమా చేసారు. మహమ్మదీయులు ‘మదర్సాలు’ అనే విద్యాకేంద్రాలు స్థాపించారు. మదర్సాలు మసీదులకు అనుబంధ కేంద్రాలుగా అభివృద్ధి చెందాయి. భారతీయులు ఖగోళ, గణిత శాస్త్రాలలో చేసిన కృషి అరబ్బులనెంతో ఆకర్షించింది. అరబ్బుల ద్వారా ఈ జ్ఞానం యూరపు అందింది. డా. ఇబిన్సినా (980-1037) యొక్క వైద్యగ్రంథాలు అరబ్ దేశాలలో విస్తృతంగా అధ్యయనం చేయబడింది. అవిసెన్నా రచించిన “అలనూన్, ఫిల్ టిబ్” అనే వైద్య గ్రంథంలో 760 రకాల మందులు గురించి పేర్కొన్నారు. ఈ వైద్య గ్రంథం యూరప్లో పాఠ్యగ్రంథంగా చేయబడింది.

అరబ్బులు సంఖ్యామానాన్ని భారతీయుల వద్ద నేర్చుకున్నారు. వారి ద్వారా యూరప్ కు చేరింది. గణితశాస్త్రంలో అరబ్బులు మరిన్ని పరిశోధనలు చేసారు. కళ్ళ జబ్బులు, అంటురోగాల వ్యాప్తికి మందులు కనిపెట్టారు. బస్రాకు చెందిన ‘అల్హసన్’ అనే శాస్త్రజ్ఞుడు దృష్టికి సంబంధించిన మూలగ్రంథాన్ని రచించాడు. ఇది తదుపరి లాటిన్లోకి అనువదించబడి ‘ఆప్లికేథెసారస్’గా ప్రసిద్ధిచెందింది.

ఉత్పత్తులు: అరబ్బులు పేపర్ తయరీ, బ్లాక్ ముద్రణ విధానాలు చైనా వారి నుండి గ్రహించారు. వీరి ద్వారా ఐరోపా వారు గ్రహించారు. అనేక రసాయన సమ్మేళనాలను కనుగొన్నారు. నత్రికామ్లం, సల్ఫ్యూరిక్ఆమ్లం, సిల్వర్ నైట్రేట్ మొదలైన రసాయనాలు తయారుచేసారు. ‘మస్లిన్’ వస్త్రం తయారీ రంగంలో ప్రసిద్ధిగాంచారు. పారసీక తివాచీలు, చర్మకారుల తయారీలు జగత్ప్రసిద్ధి చెందాయి. ఆయుధాలను అందంగా తీర్చిదిద్దడంలో వీరిది అందెవేసిన చేయి. బాకులు, కటారులు మణిఖచితమైన అందాన్ని సంతరించుకున్నాయి.

ప్రయాణాలు, విదేశీ వ్యాపారం: అరబ్బులు అలవాటుపడిన బాటసారులుగా గుర్తింపు పొందారు. వారు వస్తు, విశేషాలతో చైనా, భారతదేశాలకు బిడారులుగా వెళ్ళేవారు. భూ, సముద్ర మార్గాల ద్వారా సుదూర ప్రాంతాలకు దీర్ఘప్రయాణాలు చేసేవారు. అల్బేరూని, ఐఇబన్ బతూత, అల్ ఇద్రిసి వంటి ప్రయాణీకులు ఇట్టివారే. నావికాబలంలోను, సముద్రయానంలోను, నూతన ప్రదేశాల అన్వేషణలో అరబ్బులు అగ్రగణ్యులు. ఈ సముద్రప్రయాణాలు వర్తక, వ్యాపారాలకు ప్రోత్సాహాన్నిచ్చాయి. ఇండియా, చైనా, తీర ఆఫ్రికాతో విస్తృత వాణిజ్య సంబంధాలు పెరిగాయి. అరబ్బులు తమ ప్రత్యేక ఉత్పత్తులను విదేశీ విపణులలో అమ్మేవారు. రగ్గులు, తివాచీలు, పరిమళ వస్తువులు, మల్లుసెల్లాలు, గాజుగుడ్డలు, పండ్ల పానీయాలు మొదలైన వాటికి గిరాకీ. బాగ్దాద్ సిరిసంపదలతో తులతూగుతూ గొప్ప ఖ్యాతినార్జించింది.

AP Inter 2nd Year History Study Material Chapter 4 భూఖండ మధ్య ప్రాంత ఇస్లామ్ సామ్రాజ్యం

కళలు, వాస్తు నిర్మాణాలు: అరబ్బులు గొప్ప భవన నిర్మాతలు. అరబ్బుల కళలు ఇరాన్, బైజాంటిన్ సామ్రాజ్యాలచే ప్రభావితం చెందాయి. నిర్మాణంలో వీరిది ప్రత్యేకశైలి. వీరి వాస్తుశిల్పికళా ప్రక్రియలు మసీదులలోనే కాక పుస్తక భాండాగారాలలో, వైద్యశాలల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. నాటి ప్రసిద్ధిగాంచిన నిర్మాణాలలో అల్ హమ్ర్బా (స్పెయిన్లోని గ్రనడా వద్ద), అల్కాజర్ (సెవిల్ వద్ద), గొప్పమసీదు (బాగ్దాద్)లో కలవు. డోమ్, ఆర్చి, మినారట్ల నిర్మాణ ప్రక్రియ వారి వాస్తు శైలికి నిదర్శనం. ఖురాన్ మానవులను, జంతువులను సూచించే బొమ్మలను నిషేధించినందున మహమ్మదీయ కళాకారులు రాజభవనాలు, మసీదు లోపల, వెలుపల గోడలపై చెక్కుడు పనితనాన్ని చూపారు. రాజభవనాల చుట్టూ అందమైన తోటలు, ఎగజిమ్మే నీటి ఊటలు నిర్మించుకున్నారు. సుందరంగా తీర్చిదిద్దినట్లుగా రాయడాన్ని వారు ఒక కళగా అభ్యసించారు. దీనిని కాలిగ్రఫి అన్నారు.

సాహిత్యం, చరిత్ర: అరబ్బుల సాహితీ సేవ వర్ణనాతీతం. అలబారి ‘అన్నాల్స్ ఆఫ్ ది అపోస్టల్స్ మరియు రాజులు’ అనే గ్రంథాన్ని రచించాడు. ఉమర్ ఖయ్యమ్ రాసిన రుబాయత్, ఫిరదౌసీ – షానామా, అరేబియన్ రాత్రులు అనే వేయిన్కొక్క కథలు నాటి సాహితీసంస్కృతికి అద్దం పడతాయి. అరేబియన్ రాత్రులు ప్రపంచంలోని అనేక భాషలలోకి అనువాదమైంది. ఇంకా లుల్డూరీ రచించిన అన్సాబ్ అల్ అష్రఫ్, తబారీ రచించిన తారిఖ్-అల్-రసూల్, వాల్ ములుక్ గొప్ప గ్రంథాలుగా ఖ్యాతిగాంచాయి. అల్బెరూనీ రచన ‘తహకీక్ మలీల్ – హింద్’ లో ఇస్లాంకు అతీతంగా ఇతర సంస్కృతి యొక్క విలువను ప్రస్తుతించే ప్రయత్నం చేయబడింది.

ఆర్థిక రీతి: వ్యవసాయ భూములు రాజ్యాధీనం. భూమి శిస్తు రాజ్యాదాయంలో అధిక భాగం. భూమిశిస్తు (ఖరజ్) పంటలో 1/2 నుండి 1/5 వరకు ఉండేది. మహమ్మదీయ రైతులు ఆధీనంలో గల భూమిపై 1/10వ వంతు పన్ను వసూలు చేసారు. అన్యమతస్థులపై పన్నుల భారం విపరీతంగా ఉండేవి. రకరకాల పంటలు పండించేవారు. యూరపు వాటి ఎగుమతులు కూడా జరిగేవి. మధ్యధరా, హిందూ మహాసముద్రాల మధ్య ఎన్నో వ్యాపార కేంద్రాలు అభివృద్ధి చెందాయి. చైనా, ఇండియా, యూరప్ల మధ్య జరిగే నౌకా మార్గ వ్యాపారం అరబ్బు, ఇరానియన్ వర్తకుల హస్తగతమై ఉండేది. ఆనాటి వాణిజ్యం ప్రధానంగా రెండు మార్గాల గుండా సాగేది.

1) ఎర్ర సముద్రం, పర్షియన్ అఖాతం మీదుగా, 2) ఇరానియన్ వర్తకుల ఆధ్వర్యంలో సిల్క్ రూట్ గుండా చైనాకు ప్రయాణం చేసేవారు. ఈ వ్యాపారంలో బంగారు, వెండి నాణేలు చలామణీలో కొనసాగాయి. సుడాన్ నుండి బంగారం, మధ్య ఆసియా నుండి వెండి లభించేవి. అరువు పత్రాలు సక్ (ఆధునిక కాలపు చెక్కు) వంటివి వర్తకులు, బ్యాంకర్లు ద్రవ్య మార్పిడికి వాడేవారు.

ఈ విధంగా మధ్యయుగ చరిత్రలో అరబ్బులు ప్రముఖ స్థానాన్ని ఆక్రమించారు. వీరి ద్వారా ఐరోపా వారు భారతీయుల పరిజ్ఞానాన్ని, గ్రీసువారి మహాకావ్యాలను గురించి తెలుసుకున్నారు.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ఖలీఫా
జవాబు:
క్రీ.శ 632లో మహమ్మద్ మరణాంతరం అరేబియాలోని ప్రముఖులు అబూబాకర్ అనే మహమ్మద్ ప్రవక్త స్నేహితుడిని అతని వారసునిగా గుర్తించారు. అతన్ని ఖలీఫా లేదా కాలిఫ్ అని పిలిచేవారు. ఖలీఫా అనే అరబిక్ పదానికి వారసుడు అనే అర్థం ఉంది. అబూబాకర్ తర్వాత ‘ఉమర్’ ఖలీఫా అయ్యాడు. ఖలీఫా అంటే యావత్ ముస్లిం ప్రపంచానికి రాజకీయ, మతపరంగా మహ్మద్ ప్రవక్తకు వారసుడుగా గుర్తింపబడిన వ్యక్తి. అతనికి మత, రాజకీయ అధికారాలు ఉండేవి. మొదటి నలుగురు ఖలీఫాల తర్వాత ఖలీఫా పదవి వంశపారంపర్యమైంది. ‘ఉమయ్యద్లు, ”అబ్బాసిడ్లు,’ ‘ఆట్టోమన్లు’ సుదీర్ఘకాలం ఖలీఫాలుగా ఉన్నారు. ఒక శతాబ్దకాలంలో ఖలీఫాలు ఇరాన్, సిరియా, ఈజిప్ట్, మధ్య ఆసియా, ఉత్తర ఆఫ్రికా, స్పెయిన్ ప్రాంతాలలో అతి విశాలమైన సామ్రాజ్యాన్ని స్థాపించారు. మతప్రచారం పట్ల వారికున్న ఉత్సాహం, భాగ్యవంతమైన ప్రదేశాలనాక్రమించుకోవాలనే కోరిక వారి అద్భుత విజయాలకు కారణమయింది. సుదీర్ఘకాలం కొనసాగిన ఖలీఫా వ్యవస్థను మొదట ప్రపంచ యుద్ధం తర్వాత ఆధునిక టర్కీ జాతిపిత అయిన ముస్తాఫా కమాల్పాషా 1923లో రద్దు చేసాడు.

ప్రశ్న 2.
క్రూసేడులు.
జవాబు:
క్రీ.శ. 638లో జెరూసలేంను అరబ్బులు ఆక్రమించారు. అయినప్పటకీ క్రైస్తవ యాత్రికులు ఏసుక్రీస్తు జీవితానికి సంబంధించిన పవిత్ర స్థలాలు చూడటానికి అనుమతించబడ్డారు. క్రీ.శ.11వ శతాబ్ది మధ్యకాలానికి పరిస్థితులు మారిపోయాయి. ఐరోపా క్రైస్తవులు, అరబ్బులు మధ్య పరంపరాగత ఘర్షణలు తలెత్తాయి.

సెలుక్ తురుష్కులు మధ్య ప్రాచ్యంలో మత దురహంకారంతో క్రైస్తవ యాత్రికులను బాదించసాగారు. వీరి దుర్మార్గాలను విని చలించిపోయిన ‘పోప్ రెండవ అర్బన్’ క్రైస్తవ రాజ్యాలన్నీ కలిసి తురుష్కులను ఎదుర్కోవాలని ప్రబోధించాడు. పవిత్రభూమిని (పాలస్తీనా) విముక్తి చేయాలని ఆదేశించాడు. ఇది కాస్తా రెండు శతాబ్దాల పాటు రెండు ఏకేశ్వరోపాసన మతాల మధ్య భీకర యుద్ధాలకు, ఎంతో రక్తపాతానికి దారి తీసింది.

AP Inter 2nd Year History Study Material Chapter 4 భూఖండ మధ్య ప్రాంత ఇస్లామ్ సామ్రాజ్యం

విశేష క్రైస్తవ ప్రజానీకం పవిత్రయుద్ధానికి సిద్ధమయ్యారు. కులీనులు, వర్తకులు, సైన్యాధికారులు, నేరస్థులు, భూస్వాములు, జులాయిలు, సాహసికులు ఇలా ఎందరో యుద్ధంలో చేశారు. ఫ్రాన్స్, ఇటలీ సైన్యాలు 1099 నాటికి జెరూసలేంను ఆక్రమించుకోవడం జరిగింది. క్రీ.శ 1187 నాటికి సలాదిన్ చక్రవర్తి తిరిగి జెరూసలేంను ఆక్రమించుకున్నాడు. క్రైస్తవ, మహమ్మదీయుల మధ్య నాలుగు ప్రధాన యుద్ధాలు జరిగాయి. కానీ రెండు శతాబ్దాల పోరాటం తరువాత కూడా జెరూసలేం తురుష్కుల చేతిలో ఉండిపోయింది. అంతటా ఇస్లాం వ్యాపించింది. క్రైస్తవుల సంస్కృతి, యుద్ధ పద్ధతులకన్నా ముస్లింల నాగరికత బలమైనదని నిరూపితమయింది. క్రూసేడులలో పాల్గొనుట వలన ప్రభువులు, భూస్వాములు మరణించడంకాని, దరిద్రులవడం కాని జరిగి భూస్వామ్య వ్యవస్థ క్షీణించింది. ఐరోపాలో పోప్ ఆధిక్యత తగ్గింది. క్రూసేడులు మతం వల్ల ఉత్తేజితమై, వర్తక వ్యాపార అభివృద్ధితో పారిశ్రామిక ప్రగతితో, సాంస్కృతిక పునరుజ్జీవనంతో ముగిసాయి.

ప్రశ్న 3.
మధ్య ఇస్లాం ప్రాంతాలు ఆర్థిక రీతి.
జవాబు:
వ్యవసాయ భూములు రాజ్యాధీనం. భూమిశిస్తు రాజ్యాదాయంలో అధికభాగం. భూమిశిస్తు(ఖరజ్) పంటలో 1/2 నుండి 1/5 వరకు ఉండేది. మహమ్మదీయ రైతు ఆధీనంలో గల భూమిపై ఆదాయంలో 1/10వ వంతు వసూలు చేస్తే అన్యమతస్థులపై పన్నుభారం విపరీతంగా ఉండేది. పాలకులు కేటాయించిన భూములను ‘ఇక్తా’లు అనేవారు.
నైలునది లోయలో రాజ్యం ఆధీనంలో గల సాగునీటి వనరులు ఉండేవి. ప్రత్తి, నారింజ, అరటి వంటి అనేక రకాలు పండించబడేవి. యూరప్కు ఎగుమతులు కూడా జరిగేవి. నాడు కూఫా, బస్రా, కైరో, బాగ్దాద్, డమాస్కస్లు ప్రసిద్ధి చెందిన నగరాలు.

మధ్యదరా, హిందూ మహా సముద్రాల మద్య ఎన్నో వ్యాపార కేంద్రాలు అభివృద్ధి చెందాయి. చైనా, ఇండియా, యూరప్ మధ్య జరిగే నౌకా వ్యాపారం అరబ్బు, ఇరానియన్ వర్తకుల హస్తగతమై ఉండేది. ఆనాటి వాణిజ్యం రెండు ప్రధాన మార్గాల గుండా జరిగేది. 1) ఎర్ర సముద్రం పర్షియన్ అఖాతం మీదుగా 2) ఇరానియన్ వర్తకుల ఆధిపత్యంలోని సిల్క్ రూట్ గుండా సమర్ఖండ్ల మీదుగా చైనాకు ప్రయాణం చేసేవారు. ఈ వ్యాపార అల్లిక మార్గంలో ట్రాన్స్ ఆక్సియానా ఒక ప్రముఖ గొలుసు లేదా వలయం. నాటి వ్యాపారంలో బంగారు, వెండి నాణేలు చలామణిలో కొనసాగాయి. సుడాన్ నుండి బంగారం, మధ్య ఆసియాలోని జరఫన్య నుండి వెండి లభించేది. అరువు పత్రాలు, చెట్లు వాటి వర్తకులు, బ్యాంకర్లు ద్రవ్యమార్పిడికి ఉపయోగించారు.

ప్రశ్న 4.
ఇస్లాం మత కట్టడాలు.
జవాబు:
అరబ్బులు గొప్ప భవన నిర్మాతలు. అరబ్బుల కళలు ఇరాన్, బైజాంటియన్ సామ్రాజ్యాలచే ప్రభావితం చెందాయి. వారు ప్రత్యేకమైన నిర్మాణశైలి కలిగి ఉన్నారు. వారి వాస్తు శిల్పకళా ప్రక్రియలు మసీదులలోనే కాక పుస్తక భాండాగారాలలో, వైద్యశాలల్లో, విద్యాసంస్థలలో ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. పరిపాలకుల ఆదరణలో ఎన్నో గొప్ప భవనాలు రూపు దిద్దుకున్నాయి. నాటి ప్రసిద్ధ కట్టడాలలో ‘అల్హమ్రా భవనం (స్పెయిన్లోని గ్రనడా వద్ద), అల్కాజర్ (సెవిలె వద్ద) గొప్పమసీదు (బాగ్దాద్) కలవు. డోమ్, ఆర్చి, మినారట్ల ప్రక్రియ వారి వాస్తుశైలికి నిదర్శనం.

ఖురాన్ మానవులను, జంతువులను సూచించే బొమ్మలను నిషేధించినందున మహమ్మదీయ కళాకారులు రాజభవనాల, మసీదుల లోపలి, బయటి గోడలపై చెక్కుడు పనితనాన్ని చూపారు. మసీదు, రాజభవనాల చుట్టూ అందమైన తోటలు, ఎగజిమ్మే నీటి ఊటలు నిర్మించారు. వారి రాజభవనాలలో రోమన్, ససానియన్ కళావిశేషాల్ని మేళవించారు. వాటిలో మితిమీరిన అలంకరణ కన్పిస్తుంది. అబ్బాసిడ్లు సమర్రాలో నిర్మించిన సామ్రాజ్య నగరం తోటలతో, ప్రవహించే నీటి ఊటలతో బహుసుందరంగా ఉండేది.

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ఇస్లాం కాలెండర్.
జవాబు:
ఇస్లాం కాలెండరే హిజరీ కాలెండర్ అంటారు. క్రీ.శ. 622లో హిజరా యుగం ప్రారంభమయింది. ఈ యుగంలో AH (Anno Hegirae(లాటిన్) In the year of the Hijra)తో గుర్తించబడుతోంది. మహమ్మద్ క్రీ.శ. 622లో మక్కా నుండి మదీనాకు ప్రవాసం పోవడాన్ని ‘హిజరా’ గా గుర్తించారు. ఇస్లాం కాలెండర్, చాంద్రమానాన్ని అనుసరించి ఉంటుంది. 12 నెలలు 354 రోజులు ఉంటాయి.

AP Inter 2nd Year History Study Material Chapter 4 భూఖండ మధ్య ప్రాంత ఇస్లామ్ సామ్రాజ్యం

ప్రశ్న 2.
ఫాతిమా.
జవాబు:
ఫాతిమా మహమ్మద్ ప్రవక్తకు, ఖదీజాకు జన్మించిన కుమార్తె. క్రీ.శ 604లో జన్మించింది. ఫాతిమాను ‘ఆలీ’ వివాహమాడాడు. మహ్మద్ ప్రవక్త (తండ్రి)తో ఎంతో సన్నిహితంగా ఉంటూ, తండ్రి కష్టకాలంలో తోడుగా ఉంది. భర్తను పిల్లలను ఎంతో ప్రేమగా చూసుకొనేది. మహ్మద్ ప్రవక్తకు వారసులు ఫాతిమా ద్వారానే వ్యాపించారు. ఈ విధంగా యావత్ ముస్లిం ప్రపంచంలో ‘ఫాతిమా’ ఒక ఆదర్శమహిళగా గుర్తింపు పొందింది.

ప్రశ్న 3.
ఖురాన్.
జవాబు:
మహ్మద్ ప్రవక్త స్థాపించిన నూతన మత సారాంశం ‘ఖురాన్’ అనే మత గ్రంథంలో కనుగొనవచ్చు. అరబిక్ భాషలో ఖురాన్ అనగా కంఠస్తం చేయడం. ఇస్లాం మత సిద్ధాంతాలకు మూలాధారం ఖురాన్.

అరబిక్ భాషలోని ఖురాన్ 114 అధ్యాయాలు (సురలు)గా విభజింపబడింది. అరబ్బు సంప్రదాయాన్ని బట్టి మహ్మద్ ప్రవక్తకు భగవంతుడు తెలియజేసిన సందేశాల సంపుటియే ఖురాన్. ప్రస్తుతం లభిస్తున్న ఖురాన్లలో అత్యంత ప్రాచీనమైనది. 9వ శతాబ్దానికి చెందినది. ప్రపంచంలోని మేటి గ్రంథాలలో ఒకటిగా ఖురాన్ గుర్తింపు పొందింది.

ప్రశ్న 4.
వైద్య సూత్రాలు.
జవాబు:
వైద్య శాస్త్రంలో అరబ్బుల ప్రగతి గణనీయమైనది. అవిసెన్నా రచించిన ‘అలనూన్ఫెల్ టిబ్’ అన వైద్యగ్రంథంలో 760 రకాల మందుల గురించి పేర్కొన్నారు. లంకణం పరమౌషధమని, కొన్ని వ్యాధులు ఉపవాసం చేయుట ద్వారా తగ్గిపోతాయని ఈ గ్రంథం పేర్కొంది.

ప్రశ్న 5.
షహనామ.
జవాబు:
షానామ అనే దీర్ఘ చారిత్రక కావ్యాన్ని గొప్ప పారశీక కవి ఫిరదౌసి రచించాడు. దాదాపు 60,000 పద్యాలతో ఉన్న ఈ కావ్యంలో ప్రాచీన పర్షియాను పాలించిన రాజుల యొక్క చరిత్ర వివరించబడింది. క్రీ.శ. 977లో ప్రారంభించిన ఈ కావ్యం క్రీ.శ. 1010 సంవత్సరంలో పూర్తయింది. సాహిత్య చరిత్రలోని అత్యుత్తమ కావ్యాలలో ఒకటిగా ఫిరదౌసి
నిలిచింది.

AP Inter 2nd Year History Study Material Chapter 4 భూఖండ మధ్య ప్రాంత ఇస్లామ్ సామ్రాజ్యం

ప్రశ్న 6.
మదర్సాలు.
జవాబు:
మదర్సా అనే అరబిక్ పదానికి విద్యాసంస్థ అని అర్థం. మహమ్మదీయులు మదర్సాలు అనే విద్యా కేంద్రాలుగా స్థాపించారు. మదర్సాలు మసీదులకు అనుబంధ కేంద్రాలుగా వృద్ధి పొందాయి. బాగ్దాద్ లో గల ‘ముస్తాన్ సిరియా’ మదర్సా 1233లో నెలకొల్పబడింది. అలెగ్జాండ్రియా, సిరియా, మెసపిటోమియాలోని మదర్సాలలో గ్రీకుతత్త్వ శాస్త్రం, గణితం, వైద్యశాస్త్రం బోధింపబడేది. అనువాదం అనేది మదర్సాలలోని ముఖ్య ప్రక్రియలు ఒకటి. అనేక భారతీయ ఖగోళ, గణిత, వైద్య గ్రంథాలు ఇలా అనువాదం చేయబడ్డాయి.

AP Inter 2nd Year History Study Material Chapter 1 తొలికాలపు మానవ చరిత్ర

Andhra Pradesh BIEAP AP Inter 2nd Year History Study Material 1st Lesson తొలికాలపు మానవ చరిత్ర Textbook Questions and Answers.

AP Inter 2nd Year History Study Material 1st Lesson తొలికాలపు మానవ చరిత్ర

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1. హోమినాయిడ్స్కు హోమోనిడ్స్కు గల భేదాలు తెలపండి.
జవాబు:
2.4 మిలియన్ సంవత్సరాల క్రితం ప్రైమేట్స్లో ఒక భాగమైన హోమినాయిడ్స్ ఉద్భవించినట్లు తెలుస్తుంది. హోమోనిడ్స్, హోమినాయిడ్స్ నుండి ఆవిర్భవించడం వలన కొన్ని సారూప్యాలు కనిపించినా, కొన్ని భేదాలు కూడా ఉన్నాయి.
హోమినాయిడ్స్

  1. చిన్న మెదడు.
  2. నాలుగు కాళ్ళపై నడిచే జీవి అయితే ముందరి కాళ్ళు సులువుగా ఉండేవి.
  3. చేతులు అంత సులువుగా ఉండేవి కావు.

హోమోనిడ్స్

  1. పెద్ద మెదడు
  2. నిలువుగా నిలబడి, రెండు కాళ్ళపై నడిచే వ్యక్తి.
  3. చేతులు ఉపయోగించి పనిచేస్తూ భిన్నంగా ఉండేవారు.

AP Inter 2nd Year History Study Material Chapter 1 తొలికాలపు మానవ చరిత్ర

ప్రశ్న 2.
ఆదిమ మానవుని ఆహారపు అలవాట్లు.
జవాబు:
ఆదిమానవుడు ఆహారాన్ని వివిధ రకాలుగా సంపాదించుకున్నాడు. ఉదా: ఆహార సేకరణ, ఆహారాన్ని పోగు చేసుకోవడం, వేట, చేపలు పట్టడం.

ఆహార సేకరణ: ఆహార సేకరణలో విత్తనాలు, బెర్రీలు, పండ్లు, నట్స్ ట్యూబర్స్ మొదలగునవి. మనకు ఎముక అవశేషాలు బాగా లభించినా, మొక్కల అవశేషాలు తక్కువగానే లభించాయి.

ఆహారాన్ని పోగుచేయడం: తొలినాటి హోమోనిడ్లు సహజంగా చనిపోయిన జంతువుల మాంసం లేక ఇతర జంతువులు, పక్షులు మొదలయినవి చంపి తినగా మిగిలిన మాంసం, ఎముకలు పోగుచేసుకున్నారు.

వేట: వేట అనే ప్రక్రియ దాదాపు ఐదు లక్షల సంవత్సరాల నాటిదని తెలుస్తుంది. ఒక పథకం ప్రకారం వేటాడి పెద్ద పెద్ద జంతువులను చంపడం యొక్క ఆధారాలు ఇంగ్లాండ్ లోని బాక్స్ గ్రేవ్, జర్మనీలోని షోనినిజెన్ ప్రాంతాలలో లభించాయి.
చేపలు పట్టుట: ఇది చాలా ముఖ్య ఆహారము. చేపలు, మనుషుల ఎముకలు వివిధ ప్రాంతాలలో లభించాయి.

ప్రశ్న 3.
ప్రాచీన మానవులు తయారుచేసిన పనిముట్లను తెలపండి.
జవాబు:
సుమారు 4 లక్షల సంవత్సరాల నుంచి లక్షా పాతికవేల సంవత్సరాల క్రితం వరకు ప్రాచీన మానవులు వాడిన వేలాది పనిముట్లు లభించాయి. ఉదాహరణకు కెన్యాలో వేలాది చేతి గొడ్డళ్ళు, ప్లేక్ పనిముట్లు లభించాయి. ఈ పనిముట్లను ఆహార సేకరణ, వినియోగం కొరకు ఉపయోగించేవారు.

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ఆస్ట్రలోపిథికస్.
జవాబు:
ఆస్ట్రలోపిథికస్ అనే పదము లాటిన్ మరియు గ్రీకు పదాలనుండి వచ్చింది. లాటిన్ పదం ‘ఆస్ట్రిల్’ అనగా దక్షిణ మరియు గ్రీకు పదమైన పిథకస్ అనగా ‘ఏప్’ అని ‘ఆస్ట్రలోపిథకస్’ అనగా ‘దక్షిణప్రాంత ఏప్’ అని అర్థం. ఆస్ట్రలోపిథికస్ రెండు కాళ్ళ మీద నడవటం వలన చేతులతో పిల్లలను కని, బరువులు మోయడానికి వీలుపడింది. కాళ్ళ శక్తి పొదుపు కావడంతో అది పరిగెత్తడానికి కాలక్రమేణా ఉపయోగపడింది.

ప్రశ్న 2.
హోమో సేపియన్స్.
జవాబు:
జర్మనీలోని హెడెల్బర్గీ పట్టణంలో హోమో అవశేషాలు దొరకటం వలన అతనిని హోమో హెడెల్ బర్గెన్సిస్ అని నియాండర్ లోయలో దొరికిన అవశేషాల వలన అతని హోమోసెపియన్ నియాండర్తలనినీస్ అని పిలిచారు. హోమో సేపియన్లకు పెద్ద మెదడు, చిన్న దవడ, చిన్న పళ్ళు ఉంటాయి. మెదడు పరిమాణం పెరిగే కొద్దీ జ్ఞాపకశక్తి,
తెలివితేటలు పెరిగాయి. హోమోసేపియన్ల తొలి ఆధారాలు ఆఫ్రికాలో లభించాయి.

ప్రశ్న 3.
ఆహార సేకరణ.
జవాబు:
ప్రాచీన మానవుడు తనకు లభించిన వాటిని ఆహారం కోసం సేకరించుకొనేవాడు. ఆహారసేకరణలో విత్తనాలు, బెర్రీలు, పండ్లు, నట్స్, ట్యూబర్స్ మొదలైనవి. పరిశోధనలో ఎముకల అవశేషాలు బాగా లభించాయి. మొక్కల అవశేషాలు తక్కువగా లభించాయి. ఇప్పటివరకు పురావస్తు శాస్త్రవేత్తలు మానవుని తొలినాటి కార్బొనైజ్ డ్ విత్తనాల ఆధారాలు తక్కువగానే కనుగొన్నారు.

AP Inter 2nd Year History Study Material Chapter 1 తొలికాలపు మానవ చరిత్ర

ప్రశ్న 4.
నియాండర్తల్ మనిషి.
జవాబు:
నియాండర్తల్ మానవుడు నేటి ఆధునిక మానవజాతియైన హోమో సేపియన్లకు సన్నిహితుడు. జర్మనీలోని నియాండర్ లోయలో ఇతనికి సంబంధించిన అవశేషాలు లభించడం వలన ‘నియాండర్తల్ మనిషి’ అని పిలిచారు. ఇతని శాస్త్రీయ నామం ‘హోమో నియాండర్తలనిస్’ విశాలమైన దవడ, వెడల్పాటి ముక్కు, హోమో సేపియన్లకున్నంత పెద్ద మెదడు ఉండేది.

AP Inter 2nd Year Chemistry Notes Chapter 12 C,H,O లు ఉన్న కర్బన సమ్మేళనాలు

Students can go through AP Inter 2nd Year Chemistry Notes 12th Lesson C, H, O లు ఉన్న కర్బన సమ్మేళనాలు will help students in revising the entire concepts quickly.

AP Inter 2nd Year Chemistry Notes 12th Lesson C,H,O లు ఉన్న కర్బన సమ్మేళనాలు

→ హైడ్రోకార్టన్లలో హైడ్రోజన్ స్థానంలో – OH సమూహ మార్పిడి వలన ఆల్కహాల్లు, ఫీనాల్లు ఏర్పడును.

→ హైడ్రోకార్టన్లో హైడ్రోజన్ స్థానంలో ఆల్కాక్సీ (లేదా) ఎరైలాక్సీ సమూహాల మార్పిడి వలన ఈథర్లు ఏర్పడతాయి.

→ ఆల్కహాల్లు మరియు ఫీనాల్లలో – OH సమూహాల సంఖ్యను ఆధారంగా మోనోహైడ్రిక్, డైహైడ్రిక్ (లేదా) పాలీ హైడ్రిక్ ఆల్కహాల్గా వర్గీకరించారు.

→ Csp3 – OH బంధం గల సమ్మేళనాలను 1°, 2° మరియు 3° -ఆల్కహాల్లు, ఎల్లైలిక్, బెంజైలిక్ ఆల్కహాల్లు అంటారు.

→ Csp2 – OH బంధం గల సమ్మేళనాలను వినైలిక్ ఆల్కహాల్లు అంటారు.

→ బంధింపబడిన ఆల్కైల్ సమూహం ఆధారంగా ఈథర్లను సౌష్ఠవ, అసౌష్ఠవ ఈథర్ లుగా వర్గీకరించారు.

→ ఆల్కహాల్లను ఆమ్ల ఉత్ప్రేరణ ఆర్ద్రీకరణ, హైడ్రోబోరేషన్, ఆక్సీకరణం, కార్గోనైల్ సమ్మేళనాల క్షయకరణం, గ్రిగా నార్డ్ కారకం నుండి పొందవచ్చు.

→ ఆల్కహాలు మరియు ఫీనాలు సమాన అణుభారం ఉన్న హైడ్రోకార్టన్లు, ఈథర్లకంటే బాష్పీభవన స్థానాలు ఎక్కువగా ఉంటాయి.

AP Inter 2nd Year Chemistry Notes Chapter 12 C,H,O లు ఉన్న కర్బన సమ్మేళనాలు

→ ఫీనాల్లను హేలో ఎరీన్లు, డై ఎజోనియం లవణాలు, క్యుమీన్ నుండి తయారుచేయవచ్చు.

→ ఫినాక్సైడ్ అయాన్ రెజోనెన్స్ స్థిరీకరణ వలన ఫీనాల్లు ఆల్కహాల్ కంటే ఎక్కువ ఆమ్లస్వభావం కలిగి ఉంటాయి.

→ కోలె చర్య : ఫీనాల్ NaOH తో చర్యజరిపి తరువాత CO2 తో ఆమ్లయానకంతో చర్యజరిపి సాలిసిలిక్, ఆమ్లం ఏర్పరచును.

→ రీమర్ – టీమన్ చర్య : ఫీనాల్ క్లోరోఫారంతో క్షారసమక్షంలో చర్యజరిపి సాలిసిలాల్డిహైడ్ను ఏర్పరచును.

→ ఈథర్లను ఆల్కహాల్ నిర్జలీకరణ, విలియంసన్ సంశ్లేషణ ద్వారా తయారుచేస్తారు.

→ విలియంసన్ సంశ్లేషణ : ఆలెల్ హాలైడ్లను సోడియం ఆల్కాక్సైడ్ తో చర్యజరిపి ఈథర్లను ఏర్పరచును.

→ α- హైడ్రోజన్ కలిగి ఉన్న కార్బాక్సిలిక్ ఆమ్లాలు క్లోరిన్ లేదా బ్రోమిన్లు తక్కువ పరిమాణం ఎర్ర ఫాస్ఫరస్ సమక్షంలో చర్య జరిపి α- హాలోకార్బాక్సిలిక్ ఆమ్లాలు ఏర్పరచును. దీనినే హెల్ – వోల్ హర్డ్ – జెలెన్స్కీ (HvZ) చర్య అంటారు.
AP Inter 2nd Year Chemistry Notes Chapter 12 C,H,O లు ఉన్న కర్బన సమ్మేళనాలు 1

→ గాటర్మన్ – కోచ్ చర్య ద్వారా : బెంజీన్, దాని ఉత్పన్నాలను అనార్థ అల్యూమినియమ్ క్లోరైడ్ లేదా క్యూప్రస్ క్లోరైడ్ సమక్షంలో కార్టన్ మోనాక్సైడ్, హైడ్రోజన్ క్లోరైడ్తో చర్చ జరిపి బెంజాల్డిహైడ్, ప్రతిక్షేపిత బెంజాల్డిహైడ్లుగా మార్చవచ్చు.

→ ఆల్డీహైడ్లు, కీటోన్లు న్యూక్లిమోఫిలిక్ సంకలన చర్యలు జరుపుతాయి.

→ టాలెన్స్ కారకం : అపుడే తయారు చేసిన అమ్మోనికల్ సిల్వర్నైట్రేట్ ద్రావణాన్ని టాలెన్స్ కారకం అంటారు. ఆల్టీహైడ్ను టాలెన్స్ కారకంతో వేడిచేస్తే పరీక్షనాళిక గోడలపై మెరిసే వెండిపొర ఏర్పడుతుంది.

→ ఫెహిలింగ్ కారకం ఫెహిలింగ్ A + ఫెహిలింగ్ B కారకాలు
ఫెహిలింగ్ – A CuSO జల ద్రావణం
ఫెహిలింగ్ B – సోడియం పొటాషియం టార్టరేట్ (రోచల్లీ లవణం)
ఎసిటాల్టీహైడ్ ఫెహిలింగ్ కారకంతో చర్య జరిపి ఎర్రటి జేగురు అవక్షేపం ఏర్పరచును

→ మిశ్రమ ఆల్డాల్ సంఘననం : ఆల్జాల్ సంఘనన చర్యలో రెండు వేరువేరు ఆల్డిహైడ్లు లేదా కీటోన్లు పాల్గొంటే ఆ చర్యను మిశ్రమ ఆర్డాల్ సంఘననం అంటారు. రెండు అణువుల్లోను – హైడ్రోజన్లు ఉంటే నాలుగు ఉత్పన్నాల మిశ్రమం ఏర్పడుతుంది. ఉదాహరణకు ఇథనాల్, ప్రొపనాల్ల మిశ్రమ ఆల్దాల్ సంఘననంలో ఏర్పడే ఉత్పన్నాలను చూడండి.

AP Inter 2nd Year Chemistry Notes Chapter 12 C,H,O లు ఉన్న కర్బన సమ్మేళనాలు

→ కెనిజారో చర్య : α -హైడ్రోజన్లు లేని ఆల్డిహైడ్లను బలమైన గాఢ క్షారంతో వేడిచేస్తే స్వయం ఆక్సీకరణం, ne క్షయకరణం (disproportionation) చర్యలకు అవి లోనవుతాయి. ఈ చర్యలో ఒక అల్డిహైడ్ అణువు ఆల్కహాల్గా క్షయకరణం చెందితే ఇంకొక అణువు ఆక్సీకరణం చెంది కార్టాక్సిలిక్ ఆమ్ల లవణాన్ని ఇస్తుంది.

→ డీకార్బాక్సిలీకరణం : కార్టాక్సిలిక్ ఆమ్లాల సోడియమ్ లవణాలను సోడాలైమ్ (3:1 నిష్పత్తిలో NaOH & CaO) తో వేడిచేస్తే కార్బన్ డయాక్సైడ్ను విలోపనం చేసి హైడ్రోకార్టాన్లను ఏర్పరుస్తాయి. ఈ చర్యను డీకారక్సిలీకరణం అంటారు.

AP Inter 2nd Year Chemistry Notes Chapter 13 నైట్రోజన్లో ఉన్న కర్బన సమ్మేళనాలు

Students can go through AP Inter 2nd Year Chemistry Notes 13th Lesson నైట్రోజన్లో ఉన్న కర్బన సమ్మేళనాలు will help students in revising the entire concepts quickly.

AP Inter 2nd Year Chemistry Notes 13th Lesson నైట్రోజన్లో ఉన్న కర్బన సమ్మేళనాలు

→ ఎమీన్లు అమోనియా ఉత్పన్నాలు. ఇవి అమోనియాలో ఒకటి లేదా రెండు హైడ్రోజన్లు ఆల్కైల్ సమూహాలతో మార్పిడి వల్ల ఏర్పడతాయి.

→ అమోనియాలో ఒక హైడ్రోజన్ పరమాణువు ఆల్కైల్ సమూహలతో మార్పిడి చెందితే 1° ఎమీన్లు ఏర్పడతాయి. రెండు హైడ్రోజన్లు మార్పిడి ద్వారా 2° ఎమీన్లు ఏర్పడతాయి. మూడు హైడ్రోజన్లు మార్పిడి ద్వారా 3° – ఎమీన్ లు ఏర్పడతాయి.

→ ఎమీన్ ను నైట్రోసమ్మేళనాల క్షయకరణ చర్య, ఎమైడ్ల క్షయకరణం, గేబ్రియల్ థాలిమైడ్ చర్య, హాఫ్మన్ బ్రోమమైడ్ చర్య ద్వారా పొందవచ్చు.

→ అమోనియా కన్నా ఆల్మైల్ ఎమీన్లు బలమైన క్షారాలు (+ I ప్రభావం వలన)

→ ఎలిఫాటిక్ (లేదా) ఏరోమాటిక్ 1° – ఎమైన్లు క్లోరోఫాం మరియు KOH (ఆల్కహాల్) తో చర్య జరిపి ఐసో సయనైడ్లను ఏర్పరచును. (కార్ల్టల్ ఎమీన్ చర్చ)

→ ఎరోమాటిక్ ఎమీన్లు నైట్రస్ ఆమ్లంతో 0–5°C వద్ద చర్చ జరిపి డయజోనియం లవణాలను ఏర్పరచును (డయజోటీకరణ)

AP Inter 2nd Year Chemistry Notes Chapter 13 నైట్రోజన్లో ఉన్న కర్బన సమ్మేళనాలు

→ బెంజీన్ సల్ఫోనైల్ క్లోరైడ్ను హిన్స్బర్గ్ కారకం అంటారు. ఇది 10, 20, 3° – ఎమీన్లను వేరుచేయుటకు ఉపయోగపడును.

→ డయజోనియం లవణాలు Cu(I) అయాన్ సమక్షంలో హేలోబెంజీన్, సయనో బెంజీన్లను ఏర్పరచుటను సాండ్ మేయర్ చర్య అంటారు.

→ డయజోనియం లవణాలు హేలోజన్ ఆమ్ల సమక్షంలో చర్య జరిపి హాలో బెంజీన్ న్ను ఏర్పరచుటను గాటర్మన్ చర్య అంటారు.

→ బెంజీన్ డయజోనియం క్లోరైడ్ ఫినాల్తో చర్య జరిపి P- హైడ్రాక్సీ ఎజోబెంజీన్ ను ఏర్పరచును. ఈ రకమైన చర్యలను యుగళీకరణ చర్యలు అంటారు.

AP Inter 2nd Year Physics Notes Chapter 16 సంసర్గ వ్యవస్థలు

Students can go through AP Inter 2nd Year Physics Notes 16th Lesson సంసర్గ వ్యవస్థలు will help students in revising the entire concepts quickly.

AP Inter 2nd Year Physics Notes 16th Lesson సంసర్గ వ్యవస్థలు

→ ఒక చోటునుండి మరొకచోటుకు సమాచారాన్ని (లేదా) సందేశాన్ని బదిలీ చేసే (లేదా) గ్రహించే ప్రక్రియను సంసర్గం అంటారు.

→ మాధ్యమం ద్వారా ప్రసారం అవుతున్న సంకేతం సత్వాన్ని కొలవడాన్ని క్షీణనం (Attenuation) అంటారు.

→ ఒక రూపంలోని శక్తిని మరో రూపంలోకి మార్చే సాధనాన్ని శక్తి రూపాంతరణి అంటారు.

→ ఒక పరికరం పనిచేసే పౌనఃపున్యాల వ్యాప్తిని పట్టీ వెడల్పు అంటారు.

→ సందేశ సంకేతాన్ని ఛానల్ ద్వారా ప్రసారానికి, తదనంతరం సంగ్రహణానికి యోగ్యమైనదిగా మార్చే ప్రక్రియను ప్రసారిణి చేస్తోంది.

→ పరారుణ వికిరణం భూవాతావరణంలో బంధితమవుతుంది. అందువల్ల భూమి వేడిగా ఉంటుంది. దీనినే హరితగృహప్రభావం అంటారు.

→ తక్కువ పౌనఃపున్యాలు గల ఆడియో సంకేతాలను, అధిక పౌనఃపున్యాలు గల వాహక తరంగంతో కలిపే ప్రక్రియను మాడ్యులేషన్ అంటారు..

→ మాడ్యులేషన్ తరంగం నుండి సమాచారాన్ని తిరిగి పొందడాన్ని డీమాడ్యులేషన్ అంటారు.

→ భూమి చుట్టూ ఉండే వాయు పొరను ఐనో ఆవరణం అంటారు.

→ రేడియో తరంగాలు ప్రసార స్టేషన్ నుండి గ్రాహక స్టేషన్కు నేరుగా భూమి ద్వారా ప్రయాణించే తరంగాలను భూతరంగాలు అంటారు.

AP Inter 2nd Year Physics Notes Chapter 16 సంసర్గ వ్యవస్థలు

→ ఐనో ఆవరణం నుండి పరావర్తనం చెందిన తరంగాలు ప్రసార స్టేషన్ నుండి గ్రాహక స్టేషన్కు చేరతాయి. వీటిని ఆకాశ తరంగాలు అంటారు.

→ ‘దూరం నుండి వస్తువు యొక్క పరిమాణం, రంగు, స్వభావం మరియు ప్రాంతం సమాచారాన్ని తెలుసుకునే పద్ధతిని రిమోట్ సెన్సింగ్ అంటారు.

→ హెర్ట్జ్ ఆంటెన్నా పొడవు (l) = \(\frac{\lambda}{2}=\frac{c}{2 v}\)

→ మార్కోని ఆంటెన్నా యొక్క పొడవు (l) = \(\frac{\lambda}{4}=\frac{c}{4 v}\)

→ dT = \(\sqrt{2 R h_T}=\sqrt{2 R h_R}\)

→ కంపన పరిమితి మాడ్యులేషన్ మాడ్యులేషన్ సూచిక (ma)
AP Inter 2nd Year Physics Notes Chapter 16 సంసర్గ వ్యవస్థలు 1

→ కంపన పరిమితి మాడ్యులేషన్ పట్టీ వెడల్పు = 2 × మాడ్యులేషన్ సంకేతం పౌనఃపున్యం

→ పౌనఃపున్య మాడ్యులేషన్లో మాడ్యులేషన్ సూచిక (mf)
AP Inter 2nd Year Physics Notes Chapter 16 సంసర్గ వ్యవస్థలు 2

→ పౌనఃపున్య మాడ్యులేషన్ కంపన పరిమితి = 2n × మాడ్యులేషన్ సంకేతం పౌనఃపున్యం

AP Inter 2nd Year Physics Notes Chapter 15 అర్ధవాహక ఎలక్ట్రానిక్స్, పదార్థాలు, పరికారాలు, సరళవలయాలు

Students can go through AP Inter 2nd Year Physics Notes 15th Lesson అర్ధవాహక ఎలక్ట్రానిక్స్, పదార్థాలు, పరికారాలు, సరళవలయాలు will help students in revising the entire concepts quickly.

AP Inter 2nd Year Physics Notes 15th Lesson అర్ధవాహక ఎలక్ట్రానిక్స్, పదార్థాలు, పరికారాలు, సరళవలయాలు

→ ఒక ఆర్టిటాల్కు సంబంధించిన అతిదగ్గరగా ఉన్న అన్ని శక్తిస్థాయిల సమూహాన్ని శక్తి పట్టీ అంటారు.

→ ఒక పదార్థంలో సంయోజక ఎలక్ట్రాన్ల తో పూర్తిగా (లేదా) పాక్షికంగా నింపబడి ఉన్న పట్టీని సంయోజక పట్టీ అంటారు.

→ ఒక పదార్థంలో పూర్తిగా ఖాళీగా ఉండే పట్టీని వాహక పట్టీ అంటారు.

→ సంయోజక పట్టీ మరియు వాహక పట్టీ మధ్య అంతరం : అది ఏమంటే వాహక పట్టీ యొక్క నిన్న శక్తి నుంచి సంయోజక పట్టీ అధికశక్తుల మధ్యగల భేదం అని అర్థం. దీనినే నిషిద్ధ శక్తి అంతరం అంటారు.

→ వాహకాలలో సంయోజకపట్టీ, వహన పట్టీతో అతిపాతం చెంది ఉంటుంది.

→ సంయోజక పట్టీ, వహన పట్టీల మధ్య శక్తి అంతరం 5 eV లు, అంతకంటే ఎక్కువ ఉన్నట్లయితే వాటిని బంధకాలు అంటారు.

→ నిషిద్ధ శక్తి అంతరం 1 eV ఉన్న వాటిని అర్థవాహకాలు అంటారు.

→ సంయోజనీయ బంధంలో ఎలక్ట్రాన్ ఖాళీ చేసిన ప్రాంతాన్ని రంధ్రం అంటారు. దీనికి ధనాత్మక ఆవేశం ఉంటుంది. విద్యుత్ క్షేత్రంలో రంధ్రం, ఎలక్ట్రాన్కు వ్యతిరేకంగా ప్రయాణిస్తుంది. రంధ్రాలు సంయోజక పట్టీలో ఉంటాయి. రంధ్రాలు విద్యుత్ క్షేత్ర దిశలో ప్రయాణిస్తాయి. ఎలక్ట్రాన్లు విద్యుత్ క్షేత్రానికి వ్యతిరేకంగా ప్రయాణిస్తాయి.

→ స్వభావజ అర్థవాహకాలలో రంధ్రాల సాంద్రత (np) లకు వహన ఎలక్ట్రాన్ల ల సాంద్రత ne కు సమానం.

→ అర్థవాహకం మాలిన్యీకరణం చెందిన దానిని అస్వభావజ అర్థవాహకం అంటారు. దీని ద్వారా వాహకత్వం పెరుగుతుంది.

→ అస్వభావజ అర్ధవాహకాలు రెండు రకాలు

  • n రకం అర్ధవాహకం
  • p – రకం అర్ధవాహకం.

AP Inter 2nd Year Physics Notes Chapter 15 అర్ధవాహక ఎలక్ట్రానిక్స్, పదార్థాలు, పరికారాలు, సరళవలయాలు

→ ఒక పరిశుద్ధమైన చతుస్సంయోజక అర్ధవాహకానికి పంచసంయోజక మాలిన్యాన్ని కలిపితే n అస్వభావజ అర్ధవాహకం ఏర్పడుతుంది. పంచసంయోజక మాలిన్యాలు

  • ఫాస్ఫరస్
  • ఆర్సెనిక్
  • ఆంటిమోని.

→ పంచసంయోజక మాలిన్యం వహన ఎలక్ట్రాన్లను ఇస్తుంది. వీటిశక్తిస్థాయిలు వహన పట్టీకి దగ్గరలో ఉంటాయి. ఈ శక్తి స్థాయిలను దాత శక్తి స్థాయిలు అంటారు. పంచసంయోజక మాలిన్యాన్ని దాత మాలిన్యం అంటారు.

→ n -రకం అస్వభావజ అర్థవాహకంలో వహన ఎలక్ట్రాన్ల సాంద్రత (n) రంధ్రాల సాంద్రతకు (n) చాలా ఎక్కువగా ఉంటుంది.

→ త్రి సంయోజక మాలిన్యాన్ని పరిశుద్ధ సిలికాన్కు (లేదా) జెర్మేనియమ్కు కలిపితే వచ్చే దానిని p – రకం అస్వభావజ అర్థవాహకం అంటారు. త్రిసంయోజక మాలిన్యాలు బోరాన్, అల్యూమినియం, ఇండియమ్ మరియు గ్వాలియం.

→ త్రిసంయోజక మాలిన్యం రంధ్రాలను ఏర్పరుస్తుంది. వీటి శక్తిస్థాయి సంయోజక పట్టీకి పైన దగ్గరగా ఉంటాయి. ఈ శక్తి స్థాయిలను గ్రహీత స్థాయిలు అంటారు. త్రిసంయోజక మాలిన్యాన్ని గ్రహీత మాలిన్యం అంటారు.

→ p – రకం అర్థవాహకాలలో రంధ్రాలు అధిక సంఖ్యాక ఆవేశవాహకాలు మరియు ఎలక్ట్రాన్లు అల్పసంఖ్యాక ఆవేశవాహకాలు.

→ p – n సంధి దగ్గర ప్రాంతాన్ని లేమిపొర అంటారు. దీనిలో రంధ్రాలు మరియు వాహక ఎలక్ట్రానులు ఉండవు. దీని వెడల్పు 1 μm.

→ p – n సంధి వద్ద ఏర్పడిన పొటెన్షియల్ భేదాన్ని అవరోధ పొటెన్షియల్ అని అంటారు.

→ డయోడ్ పురో బయాస్ లో ఉన్నప్పుడు, లేమిపొర వెడల్పు అవరోధ పొటెన్షియల్ ఎత్తు మరియు నిరోధకం తగ్గుతుంది. అధిక సంఖ్యాక ఆవేశాల వల్ల విసరణ విద్యుత్ ప్రవహిస్తుంది. ఈ విద్యుత్ మిల్లీ ఆంపియర్లో ఉంటుంది.

→ డయోడ్ తిరోబయాస్లో ఉన్నప్పుడు లేమిపొర, అవరోధ పొటెన్షియల్ ఎత్తు మరియు నిరోధకం పెరుగుతుంది. అల్పసంఖ్యాక ఆవేశాల ప్రవాహం వలన డ్రిఫ్ట్ విద్యుత్ ప్రవహిస్తుంది. ఈ విద్యుత్తు సిలికాన్ లో nA లో జెర్మేనియంలో mA లో ఉంటుంది.

→ ఏకాంతర విద్యుత్ ప్రవాహాన్ని ఏకముఖ విద్యుత్ ప్రవాహంగా మార్చే ప్రక్రియనే ఏకధిక్కరణం అంటారు. అర్ధతరంగ ఏకధిక్కరణి దక్షత 40.6 %

→ పూర్ణతరంగ ఏకధిక్కరణిలో ఏకముఖ విద్యుత్ రెండు అర్థచక్రాలలోను ప్రవహిస్తుంది. పూర్ణతరంగ ఏకధిక్కరణి దక్షత 81.2%.

→ తిరోబయాస్లో గల p – n సంధిలో ఏ పొటెన్షియల్ వద్ద విచ్ఛేదనం జరుగుతుందో ఆ వోల్టేజిని విచ్ఛేదన వోల్టేజి (లేదా) జీనర్ వోల్టేజి అంటారు.

→ డయోడ్లలో రెండు రకాల విచ్ఛేదనాలు జరుగుతాయి. అవలాంచి విచ్ఛేదనం, జీనర్ విచ్ఛేదనం.

AP Inter 2nd Year Physics Notes Chapter 15 అర్ధవాహక ఎలక్ట్రానిక్స్, పదార్థాలు, పరికారాలు, సరళవలయాలు

→ జీనర్ డయోడ్, p n డయోడ్ మాదిరిగానే పురోబయాస్లో విద్యుత్ ప్రవహింపచేస్తుంది. మరియు తిరోబయాస్లో అనువర్తిత బాహ్యవోల్టేజి జీనర్ విచ్ఛేదన వోల్టేజికి మించినప్పుడు కూడా విద్యుత్ ప్రసరణ జరుగుతుంది. జీనర్ డయోడ్ను వోల్టేజి నియంత్రిణిగా వాడతారు.

→ ట్రాన్సిస్టర్లో మూడు భాగాలుంటాయి. (i) ఉద్గారకం (E) (ii) ఆధారం (B) (iii) సేకరణి (C)
ఉద్గారకాన్ని అత్యధికంగా మాదీకరణం చేస్తారు.
ఆధారాన్ని అతి స్వల్పంగా మాదీకరణం చేస్తారు.
సేకరణిని ఒక మోస్తరుగా మాదీకరణం చేస్తారు.

→ ట్రాన్సిస్టర్లు రెండు రకాలు

  • p-n-p ట్రాన్సిస్టరు
  • n-p-n ట్రాన్సిస్టరు.

ట్రాన్సిస్టర్ విన్యాసాలు మూడు రకాలు అవి

  • ఉమ్మడి ఆధార విన్యాసం
  • ఉమ్మడి ఉద్గార విన్యాసం
  • ఉమ్మడి సేకరణి విన్యాసం

→ ట్రాన్సిస్టరు మాములుగా పనిచేయడానికి ఉద్గార-ఆధారాల మధ్య సంధి పురో బయాస్ లోను, సేకరణి సంధి తిరోబయాస్లోలో కలపాలి.

→ ట్రాన్సిస్టర్ మరియు డయోడ్లో విద్యుత్ ప్రవాహం రంధ్రాలు మరియు ఎలక్ట్రాన్ల వల్ల జరిగితే, బాహ్య వలయంలో మాత్రం ఎలక్ట్రాన్ల వల్లనే జరుగుతుంది.

→ ఉమ్మడి ఉద్గార ప్రవాహ వర్ధక గుణకం (B) ను సేకరణి విద్యుత్ మార్పుకు, ఆధార విద్యుత్ లోని మార్పులకు గల నిష్పత్తి
ఇది 20 నుండి 100 మధ్య ఉంటుంది.
ట్రాన్సిస్టర్ను వర్ధకంగా ఉపయోగిస్తారు.

→ వివిధ రకాలైన ద్వారాలు ఏమిటంటే

  • AND ద్వారం
  • OR ద్వారం
  • NOT ద్వారం
  • NOR ద్వారం మరియు
  • NAND ద్వారాలు.

→ రెండు నివేశన టెర్మినల్లు High (1) లో ఉన్నప్పుడే నిర్గమనంలో High (1) వచ్చే లాజిక్ వలయాన్ని AND ద్వారం అంటారు.

→ ఒకటి (లేదా) రెండు నివేశన టెర్మినల్లు high (1) లో ఉన్నట్లయితే నిర్గమనంలో high (1) వచ్చే లాజిక్ వలయాన్ని OR ద్వారం అంటారు.

AP Inter 2nd Year Physics Notes Chapter 15 అర్ధవాహక ఎలక్ట్రానిక్స్, పదార్థాలు, పరికారాలు, సరళవలయాలు

→ నిర్గమనంలో వచ్చే విలువ నివేశన విలువకు విరుద్ధంగా వచ్చే లాజిక్ వలయాన్ని NOT ద్వారం అంటారు.

→ OR ద్వారం నిర్గమనంలో NOT ద్వారాన్ని కలిపితే NOR ద్వారం లభిస్తుంది. NOR ద్వారం NOT ద్వారం.

→ నిర్ణీతమైన అభిలక్షణాలు కలిగిన ఎలక్ట్రానిక్ వలయాన్ని లాజిక్ ద్వారం అంటారు.

AP Inter 2nd Year Physics Notes Chapter 14 కేంద్రకాలు

Students can go through AP Inter 2nd Year Physics Notes 14th Lesson కేంద్రకాలు will help students in revising the entire concepts quickly.

AP Inter 2nd Year Physics Notes 14th Lesson కేంద్రకాలు

→ కేంద్రకంలోని ప్రోటాన్ల సంఖ్యను పరమాణు సంఖ్య Z అంటారు.

→ కేంద్రకంలోని ప్రోటాన్లు మరియు న్యూట్రాన్ల సంఖ్యను ద్రవ్యరాశి సంఖ్య A అంటారు.

→ కేంద్రకంలోని ప్రోటాన్లు మరియు న్యూట్రాన్లను న్యూక్లియాన్లు అంటారు. కేంద్రకంను రూథర్ ఫర్డ్ కనుగొన్నాడు.

→ పరమాణు పరిమాణం 10-10 m.

→ కేంద్రకం పరిమాణం 10-15 m.

→ న్యూక్లియాన్ ల వ్యాసార్థము A1/3 కు అనులోమానుపాతంలో ఉండును. ఇక్కడ A ద్రవ్యరాశి సంఖ్య.
R ∝ A1/3.
∴ R = R0A1/3;
R0 = 1.1 × 10-15 m.

→ కేంద్రకంలోని విడివిడి ప్రోటాన్లు, న్యూట్రాన్ల ద్రవ్యరాశుల మొత్తానికి, ఆ కేంద్రకం వాస్తవ ద్రవ్యరాశికి మధ్య ఉండే వ్యత్యాసాన్నే ద్రవ్యరాశి లోపం అంటారు. ద్రవ్యరాశి లోపంను పరమాణు ద్రవ్యరాశి ప్రమాణం (u) తో తెల్పుతారు. ఒక పరమాణు ద్రవ్యరాశి ప్రమాణం 126 C పరమాణు ద్రవ్యరాశికి \(\frac{1}{12}\) రెట్లు సమానము. ఒక పరమాణు ద్రవ్యరాశి ప్రమాణము 1.660565 × 10-27 kg కు సమానం. ఇది 931.5 MeV శక్తికి సమానం.

→ ఒక కేంద్రకంలో ప్రోటాన్లు మరియు న్యూట్రాన్ల ను విడగొట్టుటకు కావల్సిన శక్తిని బంధనశక్తి అంటారు. బంధనశక్తి = Δm.c2 ఇక్కడ Δm ద్రవ్యరాశి లోపము, C కాంతి వేగము.

→ అస్థిరమైన కేంద్రకాలు స్థిరత్వాన్ని పొందడానికై స్వచ్ఛందంగా α, β, γ – కిరణాలను వెలువరించే ప్రక్రియనే సహజ రేడియో ధార్మికత అంటారు.

→ α – కణాలు ధనాత్మక విద్యుదావేశిత కణాల్ని కలిగి ఉంటాయి. ఇందులోని ప్రతి కణం పీలియం కేంద్రకమై ఉంటుంది. β – కణాలు రుణ విద్యుదావేశిత కణాలైన ఎలక్ట్రాన్లను కలిగి ఉంటాయి. γ – కిరణాలు అత్యధిక శక్తిగల ఫోటాన్లను కలిగి ఉంటాయి.

AP Inter 2nd Year Physics Notes Chapter 14 కేంద్రకాలు

→ ఒక రేడియోధార్మిక ఐసోటోప్, సగానికి విఘటనం చెందటానికి పట్టుకాలంను రేడియోధార్మిక అర్థ జీవిత కాలం T అంటారు. T = 0.693/λ, ఇక్కడ λ విఘటన స్థిరాంకం.

→ ఒక సెకనులో జరిగే విఘటనాల సంఖ్యను ఆ రేడియోధార్మిక పదార్థం యొక్క క్రియాశీలత అంటారు.

→ ఆరంభంలో ఉన్న అన్ని కేంద్రకాల మొత్తం జీవిత కాలాన్ని కేంద్రక మొత్తం సంఖ్యచే భాగిస్తే వచ్చేది సగటు జీవిత కాలం (τ) i.e., τ = 1/λ.

→ న్యూక్లియాన్ ల మధ్య ఆకర్షణ బలమే కేంద్రక బలము. ఈ బలం కేంద్రకంలోని ప్రోటానులు మరియు న్యూట్రానులను దగ్గరగా ఉండేటట్లు చేస్తుంది.

→ కృత్రిమ పద్ధతులలో ఒక మూలకాన్ని వేరొక మూలకంగా పరివర్తన చేసే విధానాన్నే కృత్రిమ పరివర్తన అంటారు. దీనిని రూథర్వర్డ్ కనుగొన్నాడు.

→ చాడ్విక్ ద్వారా న్యూట్రాన్ ఆవిష్కరణకు దారితీసిన కేంద్రక చర్య 94Be + 42He + 126C + 10n + Q.

→ ఒక భారయుత కేంద్రకం మధ్యస్థ ద్రవ్యరాశులుగల రెండు కేంద్రక శకలాలుగా విడిపోవడాన్నే కేంద్రక విచ్ఛిత్తి అంటారు.

235U కేంద్రకం ఉష్ట్రీయ న్యూట్రాన్లు, అధిక ధ్రుతి న్యూట్రాన్లు రెండింటితోను విచ్ఛిత్తి పొందుతుంది. కాని 232Th న్యూట్రాన్లు సూత్రం అధిక ధ్రుతి న్యూట్రాన్లతోను విచ్ఛిత్తినొందుతుంది. అయితే 239Pu ఉష్ట్రీయ న్యూట్రాన్లు అధిక ధ్రుతి న్యూట్రాన్లు రెండింటితోను విచ్ఛితినొందుతుంది.

→ శృంఖల చర్య : ఒక కేంద్రకం యొక్క విచ్ఛిత్తిలో ఉత్పత్తి అయ్యే న్యూట్రానులు తిరిగి తన పక్కనున్న ఇతర కేంద్రకాలలో విచ్ఛిత్తికి దోహదం చేస్తాయి. తద్వారా పెద్దమొత్తంలో న్యూట్రాన్ల ఉత్పత్తి జరిగి విచ్ఛిత్తికర పదార్థమంతా విఘటనం చెందేదాక కేంద్రక విచ్ఛిత్తి ప్రక్రియ కొనసాగుతుంది. దీనినే శృంఖల చర్య అంటారు.

→ ప్రత్యుత్పాదన కారకం (K) : ప్రస్తుత సంఘటనలో ఉత్పత్తి అయిన న్యూట్రాన్ల సంఖ్యకు అంతకు ముందు సంఘటనలో ఉత్పత్తి అయిన న్యూట్రాన్ల సంఖ్యకు గల నిష్పత్తినే న్యూట్రాన్ ప్రత్యుత్పాదన కారకం (K) అంటారు.

→ నియంత్రిత శృంఖల చర్య : యురేనియం ద్రవ్యరాశి, ఒక నిర్దిష్టమైన ద్రవ్యరాశికి సమానమైన లేక అంతకన్నా ఎక్కువ రాశియున్న శృంఖల చర్య కొనసాగుతుంది. ఈ ద్రవ్యరాశిని సందిగ్ధ ద్రవ్యరాశి అంటారు.

→ మితకారి : అధిక ధ్రుతి న్యూట్రాన్లను ఉష్ణయ శక్తి విలువలకు తగ్గించగలిగే అల్ప పరమాణు సంఖ్యగల ద్రవ్యాన్నే మితకారి అంటారు. భారజలం (D2O), గ్రాఫైట్, బెరిలియం మొదలైనవి.

→ నియంత్రణ కడ్డీలు : నియంత్రణ కడ్డీలు న్యూట్రాన్లను శోషణం చేసి విచ్ఛిత్తిరేటును నియంత్రిస్తుంది. కాడ్మియం మరియు బొరాన్లను నియంత్రణ కడ్డీలుగా ఉపయోగిస్తారు.

→ రక్షణ కవచం : విచ్ఛిత్తి చర్యలో, బీటా మరియు గామా కిరణాలు న్యూట్రాన్ లతోపాటు ఉద్గారమవుతాయి. స్టీలు, లెడ్, కాంక్రీటు గోడలను రియాక్టర్ చుట్టూ నిర్మించి, వికిరణ తీవ్రతను శోషించుటకు మరియు తగ్గించుటకు ఉపయోగిస్తారు.

→ శీతలీకరణి : రియాక్టర్ యొక్క క్రియాశీల కోర్లో విచ్ఛిత్తి కారణంగా ఉత్పత్తి అయ్యే ఉష్ణాన్ని గ్రహించడానికి శీతలీకరణులను వాడతారు. అధిక పీడనాలలో ఉంచిన నీరు లేదా ద్రవీకృత సోడియంలను శీతలీకరణులుగా వాడతారు.

→ విద్యుదుత్పత్తి రియాక్టర్లు : కేంద్రక రియాక్టర్ అంతర్భాగంలో అత్యధిక పరిమాణంలో ఉష్ణం వెలువడుతుంది. ఈ రియాక్టర్లు నీటిని ఉపయోగించుకుంటూ పనిచేసే విస్తృతమైన శీతలీకరణ వ్యవస్థలను కలిగి ఉంటాయి. ఈ శీతలీకరణ వ్యవస్థలలోని నీరు ఉష్ణాన్ని గ్రహిస్తుంది. తద్వారా ఆవిరి ఉత్పత్తి అవుతుంది. ఈ ఆవిరి టర్టైన్లను నడిపించటానికి తోడ్పడుతుంది. అప్పుడు విద్యుచ్ఛక్తి ఉత్పత్తి అవుతుంది. ఇట్లాంటి రియాక్టర్లనే విద్యుదుత్పత్తి రియాక్టర్లు అంటారు.

AP Inter 2nd Year Physics Notes Chapter 14 కేంద్రకాలు

→ కేంద్రక రియాక్టర్ ఉత్పత్తిచేసే సామర్థ్యం, P = \(\left(\frac{\mathrm{n}}{\mathrm{t}}\right)\)E ఇక్కడ \(\left(\frac{\mathrm{n}}{\mathrm{t}}\right)\) = ఒక సెకనులో సంభవించే విచ్ఛిత్తుల సంఖ్య, E = ఒక్క విచ్ఛిత్తిలో విడుదలయ్యే శక్తి P = \(\left(\frac{\mathrm{n}}{\mathrm{t}}\right)\) 200 MeV = \(\left[\frac{\mathrm{n}}{\mathrm{t}}\right]\)200 × 106 × 1.6 × 10-19J.

→ సూర్యునిలో శక్తికి మూలం: సూర్యుడు, నక్షత్రాలు అనేక బిలియన్ సంవత్సరాల నుండి చాలా హెచ్చు పరిమాణంలో శక్తిని ఉద్గారిస్తున్నాయి. సూర్యుడు మరియు నక్షత్రాలలో ఉష్ణోగ్రత 107 K లేక అంతకన్నా ఎక్కువ ఉన్నప్పుడు కేంద్రక సంలీన ప్రక్రియ జరిగి శక్తి వెలువడుతుంది.

→ 1 u = 1.660539 × 10-27 kg

→ కేంద్రక వ్యాసార్థం R = RA1/3 ఇక్కడ R = 1.2 × 10-15 m

→ ద్రవ్యరాశి లోపము ΔM = [Zmp + (A – Z) mn] – M

→ బంధన శక్తి E = ΔM × 931.5 (MeV లో)

→ న్యూక్లియాన్కు బంధనశక్తి Eb = \(\frac{\mathrm{E}_{\mathrm{b}}}{\mathrm{A}}\)

→ ప్యాకింగ్ భిన్నం = \(\frac{\Delta \mathrm{M}}{\mathrm{A}}\)

→ రేడియోధార్మిక నియమము \(\frac{\mathrm{dN}}{\mathrm{dt}}\) = -λN (లేక N = N0e-λt)

→ రేడియోధార్మిక పదార్థ క్రియాశీలత R = –\(\frac{\mathrm{dN}}{\mathrm{dt}}\) (లేక R = R0e-λt)

AP Inter 2nd Year Physics Notes Chapter 14 కేంద్రకాలు

→ రేడియోధార్మిక పదార్థ అర్థ జీవితకాలము T1/2 = \(\frac{0.693}{\lambda}\)

→ రేడియోధార్మిక పదార్థ సరాసరి కాలం τ = \(\frac{1}{\lambda}\) (లేక T = 0.693 τa)

AP Inter 2nd Year Chemistry Notes Chapter 1 ఘనస్థితి

Students can go through AP Inter 2nd Year Chemistry Notes 1st Lesson ఘనస్థితి will help students in revising the entire concepts quickly.

AP Inter 2nd Year Chemistry Notes 1st Lesson ఘనస్థితి

→ ఒక పదార్థం స్వాభావిక రీతిలో ఘటక నిర్మాణాత్మక యూనిట్లు నిర్దిష్ట జ్యామితీయ క్రమంలో అమర్చబడియున్న దాన్ని స్ఫటిక ఘన పదార్థం అంటారు.

→ ఒక ఘన పదార్థంలో ఒక పరమాణువు (లేదా) అయాన్కి అత్యంత సమీపంలో ఉన్న పరమాణువులు లేదా అయాన్ల సంఖ్యను దాని ‘సమన్వయ సంఖ్య’ అంటారు.

→ తన ప్రభావం ఉన్నంత మేరకు లోహపు అయాను, చలిస్తున్న ఎల క్ట్రాన్ లతో బంధించి వుంచే బలాలను లోహబంధం అంటారు.

→ Be, Mg, Cd, CO, Zn, Ti, Tl లకు షట్కోణీయ సన్నిహిత కూర్పు (hcp) వుంటుంది. వీటికి కోఆర్డినేషన్ సంఖ్య 12.

→ Na, K, Rb, Cs, Ba, Cr, Mo, W లకు అంతఃకేంద్రిత ఘన రచన (bcc) వుంటుంది.

→ Al, Cu, Au, Pb, Pt, Ni, Ca లకు గోళాల ఫలక కేంద్రిత ఘనరచన (fcc) వుంటుంది.

→ అస్ఫాటిక పదార్థాలలో దీర్ఘ విస్తృత క్రమాలు వుండవు. గలన క్వార్టజ్ను త్వరగా చల్లారిస్తే అస్ఫాటిక ఘనపదార్థం వస్తుంది.

→ అస్ఫాటిక పదార్థాలలో స్ఫటిక నిర్మాణాలుగానీ యూనిట్ సెల్లుగానీ ఉండవు.

AP Inter 2nd Year Chemistry Notes Chapter 1 ఘనస్థితి

→ స్ఫటిక ప్రదేశంలో బిందువులు మళ్ళీ మళ్ళీ వస్తూ క్రమమైన పద్ధతిలో అమరివుంటే దాన్ని ప్రాదేశిక జాలకం అంటారు.

→ త్రిమితీయ మౌలిక నిర్మాణాన్ని “యూనిట్ సెల్” అంటారు.
యూనిట్ సెల్లో బిందువు ఉంటే “మధ్యస్థమయిన యూనిట్ సెల్” అంటారు.

→ స్ఫటికాలను ‘7’ స్ఫటిక వ్యవస్థలుగా విభజించవచ్చు.

→ nλ = 2d sin θ బ్రాగ్ సమీకరణం

→ యూనిట్ సెల్ మూలన ఉన్న జాలక బిందువును 8 యూనిట్ సెల్లు పంచుకొంటాయి.

→ స్ఫటిక పదార్థం సాంద్రతను (ρ) = \(\frac{z M}{N_o a^3}\) ఫార్ములాతో కనుగొనవచ్చు.
ρ = సాంద్రత, z = యూనిట్ సెల్లో పరమాణువుల సంఖ్య, M = జాలక కణం అణుభారం, a = యూనిట్ సెల్ పొడవు.

→ త్రిమితీయంగా ఉన్న పొరల మధ్య ఖాళీలను ‘రంధ్రాలు’ అంటారు. రెండు రకాల రంధ్రాలు సాధ్యం కావచ్చు. అవి టెట్రాహెడ్రల్ రంధ్రాలు, అష్టభుజీయ రంధ్రాలు.

→ స్ఫటిక లోపాల వల్ల స్ఫటిక ధర్మాలు ప్రభావితమవుతాయి.

→ స్పటిక లోపాలు : ఆంతరికలోపాలు, బాహ్యలోపాలు, బిందులోపాలు మరియు విస్తరణలోపాలు.

→ జాలకం సాధారణ స్థానం నుంచి ఒక పరమాణువు లేదా అయాన్ ను తీసివేస్తే వచ్చే బిందు లోపాన్ని షాట్కీలోపం అంటారు. ఈ లోపం అధిక అయానిక స్వభావం గల సమ్మేళనాల్లో ఉంటుంది.

→ సాధారణ జాలక స్థానంలో ఉండే పరమాణువు లేదా అయాన్గాని ఇతర స్థానాల వద్దకు మారతాయి. ఈ బిందు లోపాన్ని ఫ్రెంకెల్ లోపం అంటారు.

→ లోహాల విద్యుద్వాహకత వాటి పరిమాణంలో ఉన్న వేలన్సీ ఎలక్ట్రాన్ల సంఖ్య పై ఆధారపడుతుంది.

→ లోహం వాహకత ఉష్ణోగ్రత పెరిగితే తక్కువవుతుంది. జాలక బిందువుల్లో కంపనాలు పెరగటం వలన ఇది జరగవచ్చు.

→ శుద్ధ ‘Si’ అవిద్యుద్వాహకం. ‘B’ లేదా ‘AS’ కలిపితే అర్థవాహకం అవుతుంది.

→ ‘Ge’ వాహకత మార్చడానికి B, P, As లను చేర్చడాన్ని ‘డోపింగ్’ అంటారు.

→ V (లేదా) 15 వ గ్రూపు మూలకంతో డోపింగ్ జరిపిన సిలికాన్ను ‘n’ రకం అర్ధవాహకం అంటారు.

→ రంధ్రాన్ని సృష్టించే పదార్థాలతో డోపింగ్ చేసిన సిలికాన్ న్ను ‘P’ రకం అర్ధవాహకం అంటారు.

AP Inter 2nd Year Chemistry Notes Chapter 1 ఘనస్థితి

→ పారా అయస్కాంత పదార్థాలు వర్తిత అయస్కాంత క్షేత్రంలోకి ఆకర్షితమవుతాయి.

→ ఫెర్రో అయస్కాంత పదార్థాలు వర్తిత అయస్కాంత క్షేత్రాన్ని తీసివేస్తే కూడా శాశ్వత అయస్కాంత ధర్మాలను చూపిస్తాయి.
ఉదా : Fe, Co, Ni లు.

AP Inter 2nd Year Chemistry Notes Chapter 2 ద్రావణాలు

Students can go through AP Inter 2nd Year Chemistry Notes 2nd Lesson విద్యుత్ రసాయనశాస్త్రం – రసాయన గతికశాస్త్రం will help students in revising the entire concepts quickly.

AP Inter 2nd Year Chemistry Notes 2nd Lesson విద్యుత్ రసాయనశాస్త్రం – రసాయన గతికశాస్త్రం

→ రెండు లేదా అంతకంటే ఎక్కువ అనుఘటకాల సజాతీయ మిశ్రమాన్ని ద్రావణం అంటారు. దీని సంఘటనం కొన్ని పరిధిలలో మారుతూ ఉండును.

→ మోల్ భాగం : ఒక ద్విగుణాత్మక ద్రావణంలోని ఒక అనుఘటకం (ద్రావితం/ ద్రావణి) మోల్లల సంఖ్యకు, ద్రావణంలోని మొత్తం అనుఘటకాల మోత్ల సంఖ్యకు గల నిష్పత్తినే ఆ అనుఘటక మోల్ భాగం అంటారు.

→ మోలారిటీ : ఒక లీటరు ద్రావణంలో కరిగి ఉన్న ద్రావిత మోల్ల సంఖ్యను మోలారిటీ అంటారు.

→ మోలాలిటీ : ఒక కిలోగ్రామ్ ద్రావణిలో ఉన్న ద్రావిత మోల్ల సంఖ్యను మోలాలిటీ అంటారు.

→ హెన్రీ నియమం : స్థిర ఉష్ణోగ్రత వద్ద ద్రవంలో వాయువు ద్రావణీయత, ద్రవం లేదా ద్రావణం ఉపరితలంపై ఉన్న వాయువు పాక్షిక పీడనానికి అనులోమానుపాతంలో ఉంటుంది.

→ ఎ) రౌల్ట్ (బాష్పశీల ద్రావితం) : బాష్పశీల ద్రవాల ద్రావణంలోని ప్రతి అనుఘటక పాక్షిక బాష్పపీడనం, ఆ అనుఘటకం మోల్ భాగానికి అనులోమానుపాతంలో ఉంటుంది.
బి) రౌల్ట్ నియమం (అబాష్పశీల ద్రావితం) : అబాషశీల ద్రావితం కలిగియున్న విలీన ద్రావణంలోని సాపేక్ష బాష్పపీడన నిమ్నత, ద్రావిత మోల్భాగానికి సమానమౌతుంది.

→ ఆదర్శ ద్రావణం : అన్ని గాఢతల అవధులలో రౌల్టి నియమాన్ని పాటించే ద్రావణాలను ఆదర్శ ద్రావణాలు అంటారు. ఆదర్శ ద్రావణాలలో ద్రావిత, ద్రావణిల మధ్య రసాయన చర్యలు జరగవు.

→ ఎబులియోస్కోపిక్ స్థిరాంకం : అబాష్పశీల ద్రావితం కలిగియున్న ఒక మోలాల్ ద్రావణంలో పరిశీలించబడిన బాష్పీభవన స్థాన నిమ్నతను ఎబులియోస్కోపిక్ స్థిరాంకం (లేదా) మోలాల్ ఉన్నతి స్థిరాంకం అంటారు.

→ క్రయోస్కోపిక్ స్థిరాంకం : అబాష్పశీల ద్రావితం కలిగి ఉన్న ఒక మోలాల్ ద్రావణంలో పరిశీలించబడిన ఘనీభవన స్థాన నిమ్నతను క్రయోస్కోపిక్ స్థిరాంకం (లేదా) మోలాల్ నిమ్నత స్థిరాంకం అంటారు.

→ ద్రవాభిసరణ పీడనం : ద్రావణి, ద్రావణం అర్ధ ప్రవేశ్యక పొరతో వేరుపరచినపుడు ద్రావణి ద్రావణంలోకి ప్రవేశించకుండా నివారించుటకు ఉపయోగించు పీడనాన్ని ద్రవాభిసరణ పీడనం అంటారు.

AP Inter 2nd Year Chemistry Notes Chapter 2 ద్రావణాలు

→ ఐసోటోనిక్ ద్రావణాలు : “ఒక స్థిర ఉష్ణోగ్రత వద్ద ఉన్న ద్రావణాలలో ద్రవాభిసరణ పీడనం సమానంగా ఉన్నట్లయితే వాటిని “ఐసోటోనిక్ ద్రావణాలు” అంటారు.

→ ద్రవ్యరాశి శాతం
AP Inter 2nd Year Chemistry Notes Chapter 2 ద్రావణాలు 1

→ ఘనపరిమాణ శాతం
AP Inter 2nd Year Chemistry Notes Chapter 2 ద్రావణాలు 2

→ ppm
AP Inter 2nd Year Chemistry Notes Chapter 2 ద్రావణాలు 3

→ మోల్ భాగం
AP Inter 2nd Year Chemistry Notes Chapter 2 ద్రావణాలు 4

→ మోలారిటీ (M)
AP Inter 2nd Year Chemistry Notes Chapter 2 ద్రావణాలు 5

→ మోలాలిటీ (m)
AP Inter 2nd Year Chemistry Notes Chapter 2 ద్రావణాలు 6

→ రౌల్ట్ నియమం (విలీన ద్రావణాలకు) = \(\frac{P_0-P_s}{P_o}=\frac{n_s}{n_0}=\frac{w}{m} \times \frac{M}{w}\)

→ బాష్పీభవన స్థాన ఉన్నతి (ΔTb) = \(\frac{K_b \times 1000 \times w}{m \times W}\)

→ ఘనీభవన స్థాన నిమ్నత (ΔTf) = \(\frac{\mathrm{K}_{\mathrm{f}} \times 1000 \times \mathrm{W}}{\mathrm{m} \times \mathrm{W}}\)

AP Inter 2nd Year Chemistry Notes Chapter 2 ద్రావణాలు

→ ద్రవాభిసరణ పీడనం (π) = CRT

→ వాంట్ హాఫ్ గుణకం (i)
AP Inter 2nd Year Chemistry Notes Chapter 2 ద్రావణాలు 7

AP Inter 2nd Year Chemistry Notes Chapter 3 విద్యుత్ రసాయనశాస్త్రం – రసాయన గతికశాస్త్రం

Students can go through AP Inter 2nd Year Chemistry Notes 3rd Lesson విద్యుత్ రసాయనశాస్త్రం – రసాయన గతికశాస్త్రం will help students in revising the entire concepts quickly.

AP Inter 2nd Year Chemistry Notes 3rd Lesson విద్యుత్ రసాయనశాస్త్రం – రసాయన గతికశాస్త్రం

→ ఏ పరికరాలైతే అయత్నీకృతంగా జరిగే రిడాక్స్ చర్యలను ఉపయోగించి రసాయనశక్తిని విద్యుత్ శక్తిగా మార్పు చేస్తాయో వాటిని గాల్వనిక్ ఘటాలు లేదా వోల్టాయిక్ ఘటాలు అంటారు.
ఉదా : డానియల్ ఘటం

→ ఏ ఎలక్ట్రోడ్ యొక్క పొటెన్షియల్ అయితే తెలిసి ఉంటుందో దానిని ప్రమాణ ఎలక్ట్రోడ్ లేదా ప్రమాణ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ అంటారు.
ఒక అర్థఘటం యొక్క పొటెన్షియల్ను హైడ్రోజన్ ఎలక్ట్రోడ్తో కలిపి కనుగొంటాము.

→ నెర్నెస్ట్ సమీకరణం E = E° + \(\frac{\mathrm{RT}}{\mathrm{nF}}\)ln[Mn+]

→ మోలార్ వాహకత్వం : ఒక మీటరు లేదా ఒక సెం.మీ ప్రమాణ దూరం ద్వారా వేరు చేయబడిన రెండు సమాంతర ఎలక్ట్రోడ్ మధ్య ఆవృతమై ఉండే ఒక మోలార్ భారం కలిగి ఉండే విద్యుత్ విశ్లేష్యక ద్రావణం వాహకతను మోలార్ వాహకత్వం (A) అంటారు.

→ ఒక విద్యుత్ విశ్లేష్యకం అవధిక మోలార్ విద్యుత్వాహకత్వం, విశ్లేష్యకం సమకూర్చిన కాటయాన్ల ఆనయాన్ల వ్యక్తిగత వాహకత్వాల మొత్తానికి సమానం.
Λ°m(AB) = Λ°A+ + Λ°B

→ ఫారడే విద్యుద్విశ్లేష్యణ ప్రక్రియ మొదటి నియమం : విద్యుద్విశ్లేషణ ప్రక్రియలో ఎలక్ట్రోడ్ వద్ద జరిగే రసాయన చర్య పరిమాణం విద్యుద్వీశ్లేషక పదార్థంలో ప్రసారమయ్యే విద్యుత్ పరిమాణానికి అనులోమానుపాతంలో ఉంటుంది.
m ∝ Q; m = c × t

→ ఫారడే విద్యుద్విశ్లేషణ ప్రక్రియ రెండవ నియమం: విద్యుద్విశ్లేషణంలో భిన్న విద్యుద్విశ్లేష్యక ద్రావణాల ద్వారా సమాన పరిమాణంలో విద్యుత్ ప్రవహిస్తే ఎలక్ట్రోడ్ వద్ద వెలువడే భిన్న పదార్థాల పరిమాణాలు, వాటి రసాయనిక తుల్య భారాలకు అనులోమానుపాతంలో ఉంటాయి.
m ∝ E

→ ప్రైమరీ బ్యాటరీ : ఏ బ్యాటరీలైతే కొంత కాలం వాడిన తరువాత ఘటక చర్యలు పూర్తయిపోయి పని చేయడం ఆగిపోతాయో వాటిని ప్రైమరీ బ్యాటరీలు అంటారు.
ఉదా : లెక్లాంచి ఘటం, అనార్ధ ఘటం.

→ సెకండరీ బ్యాటరీ : ఏ బ్యాటరీని అయితే డిస్చార్జ్ అయిపోయిన దాన్ని తిరిగి చార్జ్ చేసి వాడుకోవచ్చో దానిని సెకండరీ బ్యాటరీ అంటారు.
ఉదా : సెకండరీ బ్యాటరీకి ముఖ్యమైన ఉదాహరణ లెడ్ నిక్షేప బ్యాటరీ. బ్యాటరీ వాడకంలో ఉన్నప్పుడు కింది ఘటచర్యలు చోటు చేసుకుంటాయి.

AP Inter 2nd Year Chemistry Notes Chapter 3 విద్యుత్ రసాయనశాస్త్రం - రసాయన గతికశాస్త్రం

→ ఇందన ఘటం : విద్యుత్ రసాయన ప్రక్రియ ఆధారంగా ఇంధనం ఆక్సీకరణ వ్యవస్థలోని రసాయన శక్తిని ప్రత్యక్షంగా విద్యుత్ శక్తిగా మార్చే గాల్వానిక్ ఘటమే ఇంధన ఘటం అంటారు.

→ లోహక్షయం : ఒక లోహం, అది ప్రకృతిలో సహజంగా లభించే సమ్మేళన రూపంలో స్వచ్ఛందంగా మారిపోవడానికి ప్రదర్శించే సంసిద్ధతను లోహక్షయం అంటారు.

→ చర్యవేగం (లేదా) చర్యరేటు: ఒక ప్రమాణ చర్యాకాలం వ్యవధిలో క్రియాజనకాల గాఢతలలో లేదా క్రియాజన్యాల గాఢతలలో కలిగే మార్పుని చర్య వేగం అంటారు.

→ రేటు నియమం : క్రియాజనకాల గాఢతల పదాల మీద చర్యరేటు ఏవిధంగా ఆధారపడి ఉంటుంది అనే విషయాన్ని తెలిపే గణిత సమీకరణాన్ని రేటు సమీకరణం (లేదా) రేటు నియమం అంటారు.

→ చర్యక్రమాంకం : “ఒక చర్య రేటు సమీకరణంలో వివిధ గాఢత పదాల ఘాతాల మొత్తాన్ని, ఆ చర్యకు చెందిన చర్యా క్రమాంకం అంటాం.”

→ చర్య అణుత : “ఏక కాలంలో తాడనాలు జరిపి రసాయన చర్యను జరపడానికి దోహదం చేసే ఈ ప్రాథమిక చర్యలో పాల్గొనే క్రియాజనక పరమాణువులు (లేదా) అయాన్లు (లేదా) అణువుల సంఖ్యను ఆ ప్రాథమిక చర్య అణుత అంటారు”.

→ వాయు స్థితిలో ఉండే ప్రథమ క్రమాంక చర్యలకు ఉదాహరణలు
N2O5(వా) → N2O4(వా) + \(\frac{1}{2}\)O2(వా)
SO2C2(వా) → SO2(వా) + Cl2(వా)

→ ఏ ప్రథమ క్రమాంక చర్యలలో అయితే అణుత ఒకటికన్నా ఎక్కువ ఉంటుందో వాటిని మిథ్యా ప్రథమ క్రమాంక చర్యలు అంటారు.

→ అర్హీనియస్ సమీకరణం
k = A × e-Ea/RT
k = రేటు స్థిరాంకం
Ea = ఉత్తేజిత శక్తి
R = వాయు స్థిరాంకం
T = ఉష్ణోగ్రత

AP Inter 2nd Year Chemistry Notes Chapter 3 విద్యుత్ రసాయనశాస్త్రం - రసాయన గతికశాస్త్రం

→ చర్యా ఉష్ణోగ్రతను 10°C పెంచితే, రేటు స్థిరాంకం రెండు రెట్లు అగును. (కొన్ని సందర్భాలలో మూడు రెట్లు అగును)

→ ఒక చర్యలో కాలంతోపాటు క్రియాజనకాల ఆరంభ గాఢత విలువ దీనిలో సగం విలువకు సమానం అనడానికి అవసరమయ్యే కాలాన్ని అర్థాయువు కాలం అంటారు. ఉదా : C-14 యొక్క రేడియో ధార్మిక వియోజన అర్ధాయువు 5730 సం॥రాలు.