AP 8th Class Social Notes Chapter 2 సూర్యుడు – శక్తి వనరు

Students can go through AP Board 8th Class Social Notes 2nd Lesson సూర్యుడు – శక్తి వనరు to understand and remember the concept easily.

AP Board 8th Class Social Notes 2nd Lesson సూర్యుడు – శక్తి వనరు

→ భూమిపై ఎంతో వైవిధ్యత ఉంది.

→ రెండు ప్రదేశాల మధ్య గల ఉష్ణోగ్రతలలోని తేడాలు గాలులు, వానలను ప్రభావితం చేస్తాయి.

→ మొక్కలకు అనువైన వాతావరణాన్ని కల్పించడానికి హరితగృహాలు ఏర్పరుస్తారు.

→ సూర్యకిరణాలు భూమిపై ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా పడతాయి.

→ భూమిపై, నేల మీద, సముద్రాల మీద ఉష్ణోగ్రతలలో తేడా ఉంటుంది.

→ సూర్యుని నుండి భూమి పొందే వేడి వివిధ పద్ధతులలో వికిరణం చెందుతుంది. (భూవికిరణం)

→ అత్యధిక ఉష్ణోగ్రత లిబియాలోని అజీజియాలో 1992లో 57.8°C గా నమోదు అయ్యింది.

→ అత్యల్ప ఉష్ణోగ్రత అంటార్కిటికాలోని వ్లాడివోస్టోక్ కేంద్రంలో 1983 జులైలో – 89.2 °C గా నమోదు అయ్యింది.

→ ఉష్ణోగ్రతలను సిక్స్ గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణమాపకంతో కొలుస్తారు.

→ ఉష్ణోగ్రతలలోని తేడాలను ఉష్ణోగ్రతా పటాల ద్వారా తెలుసుకోవచ్చు.

→ భూమధ్యరేఖ నుండి ధృవాల వైపుకి వెళ్ళే కొలదీ ఉష్ణోగ్రత తగ్గుతుంది.

→ వాతావరణం : భూమిని ఆవరించియున్న వాయువుల పొరను వాతావరణం అంటారు.

→ భూమధ్యరేఖా ప్రాంతం : భూమధ్యరేఖకు దగ్గరగా ఇరువైపులా ఉన్న ప్రాంతం.

→ ఘనీభవనం : చల్లని ప్రదేశంలో వాతావరణంలోని గాలిలో ఉన్న నీరు గడ్డ కట్టడం.

→ సౌరవికిరణం : సూర్యుని నుండి విద్యుదయస్కాంత తరంగాలుగా విడుదలయ్యే శక్తి.

AP 8th Class Social Notes Chapter 2 సూర్యుడు – శక్తి వనరు

→ సూర్యపుటం : సూర్యుని నుండి విడుదల అయ్యే శక్తి కొంత భూమి వైపుకి ప్రసరిస్తుంది. అలా ప్రసరించినదానిలో భూమి స్వీకరించే దానిని ‘సూర్యపుటం’ అంటారు.

→ పతనకోణం : సూర్యకిరణాలు భూమిపై భూమధ్యరేఖా ప్రాంతం మీద 90° కోణంలో పడతాయి. ధృవాల వద్దకు పోయే కొద్దీ ఇవి ఏటవాలుగా పడతాయి. ఇలా కోణం పతనం చెందటం మూలంగా దీనిని పతన కోణం అంటారు.

→ ఉష్ణ సమతుల్యం : భూమి తను గ్రహించిన ఉష్ణరాశిలో కొంత వెనక్కి తిప్పి పంపుతుంది. దీని వలన వాతావరణం వేడెక్కుతుంది. ఇది భూమిపైన ఉష్ణాన్ని సమతుల్యం చేస్తుంది.

→ గరిష్ఠ ఉష్ణోగ్రత : ఏదేని ఒక రోజు ఒక ప్రదేశంలో ఉండే అధిక ఉష్ణోగ్రత.

→ కనిష్ఠ ఉష్ణోగ్రత : ఏదేని ఒక రోజు ఒక ప్రదేశంలో ఉండే అల్ప ఉష్ణోగ్రత.

→ ఉష్ణ విలోమనం : ఉష్ణోగ్రతా విస్తరణ కొన్ని అంశాలపై ఆధారపడి ఉంటుంది. కొన్నిచోట్ల దానికి వ్యతిరేకంగా జరుగుతుంది దానినే ఉష్ణోగ్రతా విలోమనం అంటారు.

→ భూగోళం వేడెక్కటం : వాతావరణంలోని కార్బన్ డై ఆక్సైడ్ పెరగడం మూలంగా భూమిపై ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. దీనినే ‘భూగోళం వేడెక్కడం’ అంటారు.

AP 8th Class Social Notes Chapter 2 సూర్యుడు – శక్తి వనరు 1

AP 8th Class Social Notes Chapter 1 పటాల అధ్యయనం – విశ్లేషణ

Students can go through AP Board 8th Class Social Notes 1st Lesson పటాల అధ్యయనం – విశ్లేషణ to understand and remember the concept easily.

AP Board 8th Class Social Notes 1st Lesson పటాల అధ్యయనం – విశ్లేషణ

→ ముఖ్యమని భావించే అంశాలను చూపించటానికి భౌగోళిక శాస్త్రజ్ఞులు పటాలను ఉపయోగిస్తారు.

→ పటాలకు ఎంతో చరిత్ర కలదు.

→ సుమేరియన్లు, బాబిలోనియన్లు, గ్రీకులు, అరబ్బులు మరియు చైనీయులు పూర్వకాలంలో పటాలను తయారుచేశారు.

→ పటాలు తయారుచేసే శాస్త్రాన్ని ‘కార్టోగ్రఫీ’ అంటారు.

→ అల్ ఇద్రిసి, టాలమీ, అనాక్సిమాండర్, హెకేటియస్ మరియు హెరిడోటస్ మొదలైన వారు ప్రపంచ ప్రఖ్యాత భూగోళ శాస్త్రవేత్తలు మరియు కార్టోగ్రాఫర్లు.

→ దూరాలలో వక్రీకరణలు ఉన్నప్పటికీ ఖండాల ఆకారం, దిశలు సరిగా చూపించే విధానాన్ని ‘గెరార్డస్ మెర్కేటర్’ రూపొందించారు. దీనినే మెర్కేటర్ ప్రక్షేపణం అని అంటారు.

→ ఐరోపా వలస పాలకులు శాస్త్రీయ బృందాలను, పటాలు తయారుచేయువారిని కలిపి వారి వలసలకు పంపారు.

→ సర్ జార్జ్ ఎవరెస్ట్ పేరు మీదుగా ‘ఎవరెస్టు శిఖరానికి ఆ పేరు వచ్చింది.

→ యుద్ధ సమయంలో పటాల విలువ, ఉపయోగం పెరుగుతాయి.

→ పటాలు అనేక రకాల అవసరాల కోసం తయారుచేయబడతాయి.

AP 8th Class Social Notes Chapter 1 పటాల అధ్యయనం – విశ్లేషణ

→ థీమాటిక్ లేదా నిర్దేశిత పటాలు ప్రత్యేకించి ఒక అంశంపై మాత్రమే కేంద్రీకృతమై ఉంటాయి.

→ ప్రతి పటంపై దానికి సంబంధించిన గుర్తులు, రంగులు, సంకేతాలు ఉపయోగించాలి.

→ జనాభా పటాలను రంగుల ఛాయా క్రమశ్రేణి ద్వారా తయారుచేయవచ్చు.

→ ఒకే రకమైన ఎత్తు కలిగిన ప్రదేశాలను కలుపు రేఖలను ఐసోలైన్స్ అంటారు.

→ పటాల సంకలనాన్ని అట్లాస్ అని అంటారు.

→ ప్రక్షేపణ : ఖండాల పరిమాణం, దూరాలలో వక్రీకరణలు ఉన్నప్పటికీ ఖండాల ఆకారం, దిశలు సరిగా చూపించే విధానాన్ని ‘ప్రక్షేపణ’ అని అంటారు.

→ సంకేతాలు : ఏదేని ఒక దానికి గుర్తుగా సూచించబడేది.

→ భూగోళ శాస్త్రవేత్త : భూగోళాన్ని గురించి, దానికి సంబంధించినంత వరకు మానవుల గురించి చదివిన వ్యక్తి.

→ కాంటూర్ : సముద్ర మట్టం నుంచి ఒకే ఎత్తులో ఉన్న ప్రదేశాలన్నింటినీ కలిపే వాటిని “కాంటూరు రేఖలు” అంటారు.

→ కార్టోగ్రఫీ : పటాలను తయారు చేసే శాస్త్రీయ విధానాన్ని “కార్టోగ్రఫీ” అంటారు.
AP 8th Class Social Notes Chapter 2 సూర్యుడు – శక్తి వనరు 2

AP 8th Class Social Notes Chapter 1 పటాల అధ్యయనం – విశ్లేషణ 1

AP 10th Class Social Notes Chapter 22 పౌరులు, ప్రభుత్వాలు

Students can go through AP Board 10th Class Social Notes 22nd Lesson పౌరులు, ప్రభుత్వాలు to understand and remember the concept easily.

AP Board 10th Class Social Notes 22nd Lesson పౌరులు, ప్రభుత్వాలు

→ సమాచార హక్కు చట్టం, 2005 లో ప్రభుత్వం ఆమోదించింది.

→ అయితే ఈ సమాచార హక్కు ప్రయోజనకారిగా ఉండాలంటే ఇందులో ప్రభుత్వ శాఖలు, హక్కులు సక్రమంగా పనిచేయాలి.

→ ప్రజాస్వామిక ప్రభుత్వాలు ప్రజలకు జవాబుదారీగా ఉంటాయి.

→ ఇంతకుముందు ప్రభుత్వ శాఖలు, వాటి సిబ్బంది జవాబుదారీతనం ప్రధానంగా ఎన్నికైన ప్రజా ప్రతినిధులకు పరిమితమై ఉండేది.

→ ప్రతి ప్రభుత్వశాఖ కొన్ని నియమ, నిబంధనల ఆధారంగా పనిచేస్తుంది.

→ ప్రతి ప్రభుత్వశాఖ కొన్ని రికార్డులను నిర్వహించాలి. తీసుకున్న నిర్ణయాల వివరణ ఉండాలి. వీటి మూలంగా అనేక రికార్డులు, డాక్యుమెంట్లు, మెమోలు, ఈ – మెయిల్స్, సర్క్యులర్లు, ఆదేశాలు, లాగ్ పుస్తకాలవంటివి తయారుచేయవలసి వస్తుంది.

→ సమాచార హక్కు చట్టం వల్ల ఇప్పుడు ప్రతి ప్రభుత్వశాఖ రికార్డులను నిర్వహించి, వాటిని అడిగిన పౌరులకు అందుబాటులో ఉంచాలి.

AP 10th Class Social Notes Chapter 22 పౌరులు, ప్రభుత్వాలు

→ ప్రతి ప్రభుత్వ శాఖలో ఒక పౌర సమాచార, ఒక అప్పిలేట్ అధికారి ఉంటారు.

→ ఆయా శాఖల పనిలో చట్టాలను ఉల్లంఘిస్తే చర్య తీసుకునే బాధ్యత సమాచార అధికారులకు ఉండదు. న్యాయస్థానాలకు ఉంటుంది.

→ ఈ సమాచార హక్కు చట్టం కొన్ని అంశాలను గోప్యంగా ఉంచుతుంది. ఉదా : దేశ సార్వభౌమత్వం, సైనిక దళాలు, భద్రతా సంస్థలు.

→ సమాచారం కొరకు చేతితో రాసిన ఉత్తరం కాని, ఎలక్ట్రానిక్ మెయిల్ రూపంలో కాని అడగవచ్చు.

→ సమాచారం కొరకు నామమాత్ర రుసుం 5-10 రూపాయల వరకు చెల్లించాలి. దారిద్ర్యరేఖకు దిగువన ఉంటే ఈ రుసుము చెల్లించనవసరం లేదు.

→ ప్రజలకు ఉచిత న్యాయ సేవలను అందించుటకు న్యాయసేవల ప్రాధికార చట్టం, 2002 ప్రకారం న్యాయ పీఠాలను ఏర్పాటు చేశారు.

→ దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న కేసులను ఎటువంటి ఖర్చు లేకుండా వెంటనే పరిష్కరించుకోవటానికి లోక్అదాలత్ మదులను ఏర్పాటు చేశారు.

→ న్యాయ సేవల ప్రాధికార సంస్థ, దేశంలోని బలహీన వర్గాలకు, స్త్రీలు, పిల్లలు మరియు అన్ని రకాల నష్టాలకు గురి అయిన వారికి ఉచిత న్యాయ సేవలను అందిస్తుంది.

→ లోక్ అదాలత్, సివిల్, క్రిమినల్, గృహహింస, భరణాలు వంటి అనేక కేసులను పరిష్కరిస్తుంది.

→ సమాచారం : ప్రతి వ్యక్తికి, ప్రభుత్వ సంస్థల నుండి ఏ విషయం గురించైనా సమాచారం సేకరించుకొనే అధికారం ఉంటుంది. సమాచార హక్కు చట్టంను 2005 లో కేంద్రప్రభుత్వం ఆమోదించింది.

AP 10th Class Social Notes Chapter 22 పౌరులు, ప్రభుత్వాలు

→ అప్పిలేట్ అధికారి : ప్రతి ప్రభుత్వ శాఖలో ఒక అప్పిలేట్ అధికారి ఉంటారు. ఈయన రాష్ట్ర పౌర సమాచార కార్యాలయానికి జవాబుదారీగా ఉంటారు.

→ రికార్డు ప్రభుత్వ అధికారి : సమాచార హక్కు చట్టం వల్ల ఇప్పుడు ప్రతి ప్రభుత్వశాఖ రికార్డులను నిర్వహించి, వాటిని అడిగిన పౌరులకు అందుబాటులో ఉంచాలి. కావున ఈ రికార్డులను నిర్వహించడానికి
ఒక ప్రభుత్వ అధికారి ఉంటాడు.

→ పారదర్శకత : పౌరులు అడగకుండానే ప్రతి శాఖ తమకు సంబంధించిన కొన్ని వివరాలను స్వచ్చందంగా ప్రజలకు బహిర్గతం చెయ్యాలి. దీనివల్ల ఆ శాఖ పని పారదర్శకత ఏర్పడి అవినీతిని అరికడుతుంది.

→ న్యాయసేవ : ప్రజలకు అనగా బలహీన వర్గాలకు ఉచిత న్యాయ సేవలు అందించటమే న్యాయసేవ. న్యాయ సేవల ప్రాధికార చట్టం 2002 ప్రకారం ‘న్యాయ సేవా పీఠాలను ఏర్పాటు చేశారు.

→ లోక్ అదాలత్ : కోర్టులలో దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న కేసులను ఎటువంటి ఖర్చు లేకుండా వెంటనే పరిష్కరించుట కొరకు ఈ లోక్ ఆదాలను ఏర్పాటుచేశారు. ‘న్యాయ సేవల పీఠాల చట్టం 19879 1994 లోనూ, 2002 లోనూ సవరించి, దాని ప్రకారం లోక్ అదాలతను ఏర్పాటుచేశారు.

→ గృహ హింస : మహిళలకి గృహ హింసకు సంబంధించిన కేసులను లోక్ అదాలత్ చేపట్టి త్వరితంగా పరిష్కరిస్తుంది. ఎటువంటి రుసుమును లోక్ అదాలత్ తీసుకోదు.

AP 10th Class Social Notes Chapter 22 పౌరులు, ప్రభుత్వాలు

→ సివిల్ కేసులు : అన్ని రకాల ఆస్తి పాస్తులకు సంబంధించిన సివిల్ కేసులను లోక్ ఆదాలత్ పరిష్కరిస్తుంది. ఈ కేసులకు కూడా లోక్ అదాలత్ ఎటువంటి రుసుము తీసుకోకుండానే పరిష్కరిస్తుంది.

→ బాల నేరస్తుల గృహం : బాల నేరస్తుల న్యాయచట్టం, 1986లోని సెక్షన్ 2, క్లాజు (జె) ప్రకారం బాలనేరస్తుల గృహం వంటి కేసులకు సంబంధించిన న్యాయసేవల సంస్థ ద్వారా ఉచిత న్యాయసేవలను అందిస్తుంది.

→ ప్రభుత్వ అధికారి : ప్రతి ప్రభుత్వశాఖలో ఒక ప్రభుత్వాధికారి సమాచారాన్ని అందించడానికి ఉంటాడు. అతనినే పౌర సమాచార అధికారి అంటాము.

AP 10th Class Social Notes Chapter 22 పౌరులు, ప్రభుత్వాలు

AP 10th Class Social Notes Chapter 21 సమకాలీన సామాజిక ఉద్యమాలు

Students can go through AP Board 10th Class Social Notes 21st Lesson సమకాలీన సామాజిక ఉద్యమాలు to understand and remember the concept easily.

AP Board 10th Class Social Notes 21st Lesson సమకాలీన సామాజిక ఉద్యమాలు

→ రెండవ ప్రపంచ యుద్ధం తరువాత చాలా దేశాలలోని కొంతమంది ప్రజలు సమాన హక్కులకు నోచుకోని వారు , ఉన్నారు. వీరు తమ హక్కులు కోరుతూ ముందుకు రావడంతో అనేక దేశాలలో ఉద్యమాలు ఆవిర్భవించాయి.

→ 1960 ప్రాంతంలో అమెరికాలోని నల్లవారు పౌరహక్కుల కొరకు డా॥ మార్టిన్ లూథర్ కింగ్ ఆధ్వర్యంలో ఉద్యమం జరిపినారు.

→ చాలా కాలం పోరాటం తరువాత అమెరికా ఈ జాతి వివక్షతను రద్దు చేస్తూ పౌరహక్కుల చట్టాలు చేసింది. ఇప్పుడు నల్లవారికి తెల్లవారితో సమాన హక్కులు ఉన్నాయి.

→ USSR లోని ప్రజలు సోషలిస్ట్ ప్రభుత్వాలను వ్యతిరేకిస్తూ స్వేచ్ఛను కోరుతూ మానవహక్కుల ఉద్యమం లేవదీశారు. తూర్పు యూరపులోని చాలా ప్రాంతాలలో ఇటువంటి ఉద్యమాలు చేయుట జరిగింది.

→ USSR అధ్యక్షుడు ‘గోర్బచేవ్’ ప్రజలకు మరింత స్వేచ్ఛను కల్పిస్తూ ‘గ్లాస్ నోస్త్’ అనే సంస్కరణలను చేసినారు.

→ 1970 – 1980 ల మధ్య యుద్ధాలకు, అణ్వాయుధాలకు వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు జరిగాయి.

AP 10th Class Social Notes Chapter 21 సమకాలీన సామాజిక ఉద్యమాలు

→ అమెరికా 1945 ఆగస్టులో జపాన్లోని హిరోషిమా, నాగసాకి లపై అణుబాంబులు వేసింది. దీని మూలంగా జరిగిన దారుణాన్ని ప్రపంచం అంతా చూసింది. అయినప్పటికి అమెరికా, USSR, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలు ఆయుధాలను పెంచుకుంటూనే పోయారు.

→ అమెరికా వియత్నాంతో చేస్తున్న యుద్ధాన్ని అమెరికా సైనికులు నిరసించినారు. సైన్యంలో చేరే వయసున్న యువకులు “మేము సైన్యంలోకి వెళ్లం” అని వ్యతిరేకించారు. వియత్నాం ప్రజలు ఉద్యమాలు చేశారు. అమెరికా చివరకు 1975లో వియత్నాంతో యుద్ధాన్ని విరమించింది.

→ అణ్వాయుధ పోటీ మూలంగా ప్రపంచమంతా యుద్ధభీతితో వణికిపోయింది. అమెరికా, USSR ల మీద ఆయుధ నియంత్రణ కొరకు ఒత్తిడి పెరిగింది.

→ ప్రచ్ఛన్న యుద్ధానికి ముగింపుగా 1991లో START ఒప్పందం చేసుకుని ఆయుధాలను నియంత్రించారు.

→ 1991లో USSR రద్దు అయ్యి రష్యా ఆవిర్భవించింది. ప్రచ్ఛన్న యుద్ధం ముగిసిపోయింది.

→ USSR లోని చెర్నోబిల్ లో అణుకర్మాగారంలో జరిగిన ప్రమాదం మూలంగా చాలా ప్రాంతాలు కాలుష్యానికి గురి అయ్యాయి.

→ 1990 నుంచి ‘ప్రపంచీకరణ’, ‘నయా ఉదారవాదం’ అన్న పేర్లతో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక, రాజకీయ మార్పుల వల్ల రైతులు, గిరిజనులు, పేదవారు, భూమి లేనివారు తీవ్ర ప్రభావితమయ్యారు.

→ 1971లో అమెరికా చేసిన అణు పరీక్షకు వ్యతిరేకంగా గ్రీన్ పీస్ ఉద్యమం ఆవిర్భవించింది.

→ వాతావరణ కాలుష్యం వల్ల ఓజోను పొర దెబ్బతిని భూమి వేడెక్కుతుంది. దీని మూలంగా ధృవాల వద్ద ఉన్న మంచు టోపీలు కరిగి ప్రపంచంలోని సముద్రాలలో నీటి మట్టాలు పెరుగుతాయి. తద్వారా తీరప్రాంతాలు ముంపుకు గురికావచ్చు.

→ 1984లో భోపాల్ గ్యాస్ దుర్ఘటన బాధితులకు ఇప్పటికీ సరైన నష్టపరిహారం లభించలేదు. బాధితులు ఇంకా ఉద్యమం చేస్తూనే ఉన్నారు.

→ ‘నర్మదా బచావో’ ఉద్యమ నాయకులు ఆనకట్టల నిర్మాణాన్నే వ్యతిరేకిస్తున్నారు.

→ ఆనకట్టల నిర్మాణంలో నిర్వాసితులైన ప్రజలకు సరైన పునరావాసం కల్పించబడలేదు. ఆ ప్రజలను ఎవరూ పట్టించుకోలేదు. ఈ కారణంగానే అనేక పర్యావరణ ఉద్యమాలు ఆవిర్భవించాయి.

→ 1980లో సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ స్థాపించబడింది.

AP 10th Class Social Notes Chapter 21 సమకాలీన సామాజిక ఉద్యమాలు

→ మానవ హక్కులు, సామాజిక న్యాయం కొరకు మహిళలు ఉద్యమాలు చేశారు.

→ ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా దూబగుంట గ్రామ మహిళలు సారాను వ్యతిరేకిస్తూ ఉద్యమాలు చేసి 1993లో సారాపై నిషేధాన్ని విధించుటకు కారణమైనారు.

→ మణిపూర్ మహిళలు మానవ హక్కుల కొరకు చేస్తున్న ‘మైరా పై బీ’ ఉద్యమం ఇంకా కొనసాగుతూనే ఉంది.

→ పౌరహక్కులు : దీర్ఘకాలంగా సమాన హక్కులకు నోచనివాళ్లు తమ హక్కులు కోరుటనే పౌరహక్కులు అంటారు.
ఉదా : ఓటు హక్కు, అమెరికాలోని పౌరహక్కుల ఉద్యమం, నల్లజాతి వారు వివక్షతతో కూడిన చట్టాలను శాంతియుతంగా ఉల్లంఘించటం.

→ సహాయనిరాకరణ : అమెరికాలోని పౌరహక్కుల పోరాటం 1960 లలో తీవ్రదశకు చేరుకుంది. పెద్ద ఎత్తున ప్రదర్శనలు, ఊరేగింపులతో పాటు సహాయనిరాకరణ అనగా వివక్షతతో కూడిన చట్టాలను శాంతియుతంగా ఉల్లంఘించటం. వివక్షతతో కూడిన సేవలు అంటే శ్వేతజాతి, నల్లజాతి వాళ్లకి వేరువేరుగా సీట్లు ఉన్న బస్సులను బహిష్కరించటం.

→ ప్రజలను వేరు చెయ్యటం : ప్రజలను వేరుచెయ్యటం అంటే పాఠశాలల్లో, బస్సులలో బహిరంగ ప్రదేశాలలో, ఉద్యోగాలలో, గృహ వసతిలో, ఓటు హక్కులో సైతం వివక్షత చూపటం.
ఉదా : అమెరికాలో నల్లజాతి వారిని శ్వేతజాతి వారి నుండి వేరుచేసి చూసారు.

→ అస్థిర పరచటం : కాలుష్య పరిశ్రమలను స్థాపించుట మూలంగా, గనుల త్రవ్వకం మూలంగా ఆనకట్టలను నిర్మించడం మూలంగా ఆ ప్రాంతాలలో ఉన్న ప్రజలు, జంతువులు, అడవులు అన్ని కూడా అస్థిరపరచబడుతున్నాయి. ప్రజలు నిర్వాసితులవుతున్నారు.

→ యుద్ధ వ్యతిరేకత : అమెరికా, వియత్నాంతో చేసిన యుద్ధంలో 8 లక్షల సైనికులు, 30,00,000 పౌరులు చనిపోయారు. అమెరికాకు ఎటువంటి నష్టం జరుగలేదు. అమెరికాకు ఏ మాత్రం ప్రమాదకరం కానీ అమాయకమైన ప్రజలపై బాంబులు వెయ్యడం అటు సైనికులకు, ఇటు సైనికుల తల్లిదండ్రులకు అయిష్టంగా ఉంటూ, వారిలో యుద్ధ వ్యతిరేకత ఏర్పడింది. అమెరికా అంతా యుద్ధ వ్యతిరేక నిరసనలు ఉప్పొంగాయి.

→ సైన్యంలో చేరే వయస్సు : అమెరికాలో దృఢకాయులైన అందరూ తప్పనిసరిగా కొంతకాలం పాటు సైన్యంలో పనిచెయ్యాలనే చట్టం ఉంది. అయితే అమెరికా వియత్నాంతో యుద్ధం కొనసాగిస్తున్నంత వరకు “సైన్యంలో చేరే వయసున్న యువకులమైన మేము” సైన్యములో చేరం అని సైన్యంలో చేరే వయసున్న వారు తిరస్కరించినారు.

→ సాయుధీకరణ : వియత్నాం యుద్ధం ముగిసిన తరువాత మరిన్ని దేశాలు అణ్వాయుధాల నిల్వలలో ఒకదానితో ఒకటి పోటీ పడటంతో ఆయుధ పోటీ పెరిగింది.

AP 10th Class Social Notes Chapter 21 సమకాలీన సామాజిక ఉద్యమాలు

→ పునరావాసం : ఆనకట్టలు కట్టే పథకాల వల్ల నిర్వాసితులయ్యే ప్రజలకు సరైన పునరావాసం కల్పించాలని కోరసాగారు.

→ నష్టపరిహారం : ఆనకట్టలు కట్టే పథకాలలో నిర్వాసితులయ్యే ప్రజలు కేవలం భూములున్న వాళ్లకే కాకుండా, అక్కడ ఉంటున్న వాళ్లందరికీ న్యాయమైన నష్టపరిహారం చెల్లించాలని కోరసాగారు.

→ సారా వ్యతిరేకత : ఆంధ్రప్రదేశ్, నెల్లూరు జిల్లా దూబగుంట గ్రామంలోని మహిళలు, వారి భర్తలు సారా తాగి సొమ్మంతా ఖర్చు చేస్తున్నారని సారాకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని తీసుకువచ్చారు. సారా వేలం పాటలను ఆపించారు. సారాని నిషేధించేలా చేసారు.

→ ప్రజాస్వా మిక : ప్రపంచంలోని చాలా దేశాలు ప్రజాస్వామ్య దేశాలే. సామాజిక ఉద్యమాలు సాధారణంగా రాజకీయ పార్టీలకు దూరంగా ఉండి ఒక ఆశయం కోసం కలిసి పనిచేస్తాయి. తరచు ఈ సామాజిక ఉద్యమాల కార్యక్రమాలను భూస్వామ్య, ప్రజాస్వామిక పద్ధతుల్లో రూపొందిస్తారు.

భాగస్వామ్యం : సామాజిక ఉద్యమాలనేవి ఒక ప్రత్యేక ఆశయం కోసం ఆవిర్భవిస్తాయి. అయితే ఈ సామాజిక ఉద్యమాలలో సామాన్య ప్రజల సహకారం, భాగస్వామ్యం లేనిదే ఉద్యమాలు విజయం సాధించలేవు.

AP 10th Class Social Notes Chapter 21 సమకాలీన సామాజిక ఉద్యమాలు

AP 10th Class Social Notes Chapter 20 ప్రపంచ యుద్దాల తరువాత ప్రపంచం, భారతదేశం

Students can go through AP Board 10th Class Social Notes 20th Lesson ప్రపంచ యుద్దాల తరువాత ప్రపంచం, భారతదేశం to understand and remember the concept easily.

AP Board 10th Class Social Notes 20th Lesson ప్రపంచ యుద్దాల తరువాత ప్రపంచం, భారతదేశం

→ రెండవ ప్రపంచయుద్ధం తరువాత ప్రపంచం రెండు శిబిరాలుగా విడిపోయింది.
1) యుఎస్ఎస్ఆర్ కూటమి (కమ్యూనిస్ట్ వర్గం).
2) అమెరికా కూటమి (పెట్టుబడిదారి వర్గం).

→ రెండవ ప్రపంచయుద్ధం మూలంగా అమెరికా శక్తిమంతమైన దేశంగా ఆవిర్భవించిందని అమెరికా అధ్యక్షుడు “హారీట్రూమన్” అన్నాడు.

→ రెండవ ప్రపంచయుద్ధ వినాశనం, ఒక అంతర్జాతీయ శాంతి సంస్థ స్థాపనకు మూలమైంది.

→ ఐక్యరాజ్య సమితి ప్రపంచ శాంతి స్థాపన కొరకు 1945లో ఏర్పడింది.

→ రెండవ ప్రపంచయుద్ధం తరువాత అనేక ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలు స్వాతంత్ర్యాన్ని సంపాదించుకున్నాయి.

→ ఐక్యరాజ్యసమితిలో శాశ్వత దేశాలైన చైనా, ఫ్రాన్స్, బ్రిటన్, రష్యా, అమెరికాలకు ‘వీటో’ అధికారం ఉంది.

→ రెండవ ప్రపంచయుద్ధం తరువాత ప్రపంచం రెండు కూటాలుగా విడిపోయింది (అమెరికా-రష్యా). ఈ రెండు దేశాలు మధ్య చాలాకాలం ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగింది.

AP 10th Class Social Notes Chapter 20 ప్రపంచ యుద్దాల తరువాత ప్రపంచం, భారతదేశం

→ ప్రచ్ఛన్న యుద్ధంలో భాగంగా అమెరికా, రష్యాలు ఆయుధాలను సమకూర్చుకున్నారు. పరోక్ష యుద్ధాలు చేశారు. ఉపగ్రహాలను అంతరిక్షంలోనికి పంపించారు. సైనిక ఒప్పందాలు చేసుకున్నారు.
ఉదా : నాటో, వార్సా..

→ ప్రచ్ఛన్న యుద్ధకాలంలో ప్రపంచం అణ్వాయుధ యుద్ధ విధ్వంస నీడలో బితుకు బితుకుమంటూ ఉంది.

→ ప్రచ్ఛన్న యుద్ధ నేపథ్యంలో భారతదేశం ఈ రెండు అగ్రరాజ్య కూటాలలో చేరకుండా ప్రత్యేకంగా అలీనోద్యమాన్ని రూపొందించుకున్నది.

→ 1964లో జోర్డాన్లో పాలస్తీనా విముక్తి సంఘం PLO ఆవిర్భవించింది.

→ ప్రచ్ఛన్న యుద్ధం ముగింపుగా యుఎస్ఎస్ఆర్ 1991లో రద్దు అయి, ప్రపంచం ఏకధృవ ప్రపంచంగా మారిపోయింది.

→ భారతదేశం పొరుగున ఉన్న దేశాల పట్ల ‘పెద్దన్న’ పాత్ర వహిస్తుందని చిన్న దేశాల ఆరోపణ.

→ సైనిక ఒప్పందాలు : రెండవ ప్రపంచయుద్ధం తరువాత ప్రపంచం, యుఎస్ఎస్ఆర్ (రష్యా) మరియు అమెరికా శిబిరాలుగా విడిపోయింది. ఈ రెండు వర్గాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం ఏర్పడింది. ఈ ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో రష్యా, అమెరికా వర్గాలు అనేక సైనిక ఒప్పందాలు చేసుకొని, చాలా దేశాలను వారి వారి కూటములలో చేర్చుకున్నారు.
ఉదా : నాటో (NATO), వార్సా (WARSA).

AP 10th Class Social Notes Chapter 20 ప్రపంచ యుద్దాల తరువాత ప్రపంచం, భారతదేశం

→ పరోక్ష యుద్ధం : ప్రచ్ఛన్న యుద్ధకాలంలో అమెరికా, రష్యాలు ప్రత్యక్ష యుద్దాలు చేసుకోలేదు. స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న దేశాలలో రెండు విరోధ బృందాలకు ఈ రెండు శిబిరాలలో చేరాక శిబిరం మద్దతు ఇవ్వసాగింది. దీంతో ఆయా యుద్ధాలలో ఈ రెండు శిబిరాలు పరోక్ష యుద్ధాలు చేస్తున్నాయి.

→ ఆయుధ పోటీ : ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో, ఆయుధ పరిశోధనల పైనా, ఖండాంతర క్షిపణులు, విధ్వంసకర అణ్వాయుధాల నిల్వల పైనా అమెరికా, రష్యాలు పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేశాయి. ఈ రెండు దేశాలలో ఒక్కొక్క దాని దగ్గర ప్రపంచాన్ని పలుమార్లు మట్టుపెట్టుగల అణ్వాయుధాలు ఉన్నాయి.

→ ఏకధృవ ప్రపంచం : ప్రచ్ఛన్న యుద్ధానికి ముగింపుగా 1991లో, యుఎస్ఎస్ఆర్ అధ్యక్షుడు మిహాయిల్ గోర్బచేవ్ యుఎస్ఎస్ఆర్‌ను రద్దుపరచినాడు. అందులోని రాజ్యాలు స్వతంత్ర దేశాలు అయ్యాయి. యుఎస్ఎస్ఆర్ కుప్పకూలటంతో ప్రపంచ రాజకీయాలలో కొత్త యుగం ఆరంభమయ్యింది. అది ఏక ధృవ ప్రపంచంగా మారింది.

→ ద్విధృవ ప్రపంచం : రెండవ ప్రపంచయుద్ధం తరువాత రెండు ప్రధాన సైద్ధాంతిక రాజకీయ శిబిరాలు ఏర్పడ్డాయి. యుఎస్ఎస్ఆర్ నేతృత్వంలో కమ్యూనిస్టు శిబిరం, అమెరికా నేతృత్వంలో ప్రజాస్వామిక – పెట్టుబడిదారి శిబిరం. ఈ రెండు శిబిరాలు ప్రపంచంలోని దేశాలను వారి వారి శిబిరాలలో చేర్చుకొనుటకు అనేక ప్రయత్నాలు చేశాయి. చివరికి ప్రపంచమంతా రెండు ధృవాలుగా విడిపోయింది.

→ వలసపాలిత దేశాల విముక్తి : సామ్రాజ్య కాంక్షతో బలమైన దేశాలు వెనుకబడిన ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాల మీద ఆధిపత్యం చెలాయించాయి. ఈ దేశాలలోని ప్రజలు అనేక ఉద్యమాలు, పోరాటాలు చేసి ఈ ఆధిపత్య దేశాల నుండి స్వాతంత్ర్యం సంపాదించుటనే వలసపాలిత దేశాల విముక్తి అంటారు.

→ వీటో : ఐక్యరాజ్య సమితిలోని భద్రతా సమితిలో శాశ్వత సభ్యులైన చైనా, ఫ్రాన్స్, బ్రిటన్, యుఎస్ఎస్ఆర్ (ఇప్పుడు రష్యా), అమెరికాలకు వీటో పవర్ ఉంది. అంటే ఐక్యరాజ్య సమితి తీర్మానాలను తిరస్కరించే అధికారాన్నే వీటో అధికారం అంటారు.

→ జాతి వైరుధ్యాలు : శ్రీలంకలో ప్రధానంగా రెండు జాతుల ప్రజలున్నారు.

  1. సింహళం మాట్లాడే ప్రజలు
  2. తమిళం మాట్లాడే ప్రజలు. ఈ రెండు వర్గాల మధ్య అపనమ్మకం కారణంగా ఘర్షణలు తీవ్రమయ్యాయి. ఈ రెండు వర్గాల మధ్య వైరుధ్యాలనే జాతి వైరుధ్యాలని అంటారు.

AP 10th Class Social Notes Chapter 20 ప్రపంచ యుద్దాల తరువాత ప్రపంచం, భారతదేశం

→ పంచశీల : శాంతి, అహింస, సహజీవనం అనేవి మన విదేశాంగ నీతి సూత్రాలు. 1954లో టిబెట్టు విషయమై భారతదేశం, చైనాలు చేసుకొన్న ఒడంబడికలో శాంతియుత సహజీవన సూత్రం వివరించబడింది. దీన్నే పంచశీల అంటారు. ఇవి ఐదు సూత్రాలు.

  1. ఒకరి సర్వసత్తాకతని, భౌగోళిక సమగ్రతను మరొకరు గౌరవించటం.
  2. ఇతర దేశాల అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం.
  3. దాడులకు దిగకపోవటం, వివాదాలను పరస్పర అవగాహనతో పరిష్కరించుకోవటం.
  4. అంతర్జాతీయ సంబంధాలలో పరస్పర గౌరవం, సహకారాల కోసం కృషి చేయటం.
  5. శాంతియుత సహజీవనాన్ని ప్రోత్సహించటం.

శాంతి : యుద్ధాలు, యుద్ధభయం లేని ప్రపంచంలో శాంతి ఉంటుంది.

AP 10th Class Social Notes Chapter 20 ప్రపంచ యుద్దాల తరువాత ప్రపంచం, భారతదేశం

AP 10th Class Social Notes Chapter 19 రాజకీయ ధోరణుల ఆవిర్భావం : 1977-2000

Students can go through AP Board 10th Class Social Notes 19th Lesson రాజకీయ ధోరణుల ఆవిర్భావం : 1977-2000 to understand and remember the concept easily.

AP Board 10th Class Social Notes 19th Lesson రాజకీయ ధోరణుల ఆవిర్భావం : 1977-2000

→ 1975-86 మధ్య కాలం భారతదేశ ప్రజాస్వామ్యానికి పరీక్షాకాలం వంటిది.

→ 1975-85 మధ్య కాలం భారతదేశం ఏకపార్టీ ప్రజాస్వామ్యంలోకి జారిపోకుండా సమర్థవంతంగా నివారించింది.

→ 1975-85 మధ్య కాలంలో పర్యావరణ ఉద్యమం, స్త్రీవాద ఉద్యమం, పౌరహక్కుల ఉద్యమం, సాహిత్య ఉద్యమం వంటి ఉద్యమాలు మొదలై సామాజిక మార్పునకు బలమైన చోదకశక్తులుగా మారాయి.

→ భారతదేశంలో అత్యవసర పరిస్థితికి ముగింపు పలికిన ఎన్నికలు 1977 సాధారణ ఎన్నికలు.

→ 1977 సాధారణ ఎన్నికలలో కాంగ్రెస్ కి వ్యతిరేకంగా అన్ని ప్రధాన ప్రతిపక్ష పార్టీలు కలిసి పోటీచేయాలని నిర్ణయించాయి.

→ కాంగ్రెస్ (ఓ), స్వతంత్ర పార్టీ, భారతీయ జనసంఘ్, భారతీయ లోక్ దళ్, సోషలిస్టు పార్టీలు విలీనమై జనతాపార్టీగా ఏర్పడాలని నిర్ణయించాయి.

→ కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలు అన్నీ ఒక తాటి కిందకు వచ్చి ఎన్నికలలో పోటీ చేయటంలో జయప్రకాష్ నారాయణ్, ఆచార్య జె.బి. కృపలాని వంటి సీనియర్ నాయకులు ముఖ్యపాత్ర పోషించారు.

→ మొదటిసారి జాతీయస్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఓటమిని చవిచూసిన ఎన్నికలు 1977 సాధారణ ఎన్నికలు.

AP 10th Class Social Notes Chapter 19 రాజకీయ ధోరణుల ఆవిర్భావం 1977-2000

→ 1977 సాధారణ ఎన్నికలలో గెలిచిన జనతాపార్టీ 9 రాష్ట్రాలలోని కాంగ్రెస్ ప్రభుత్వాలను తొలగించింది.

→ 1977 సాధారణ ఎన్నికల తరువాత అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికలలో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, బీహార్ రాష్ట్రాలలో జనతాపార్టీ, పశ్చిమ బెంగాల్ లో సిపిఐ(ఎం), తమిళనాడులో డి.ఎం.కె. గెలిచింది.

→ ప్రజాస్వామ్యాన్ని, స్వేచ్ఛని పునరుద్ధరిస్తామన్న వాగ్దానంతో జనతాపార్టీ అధికారంలోకి వచ్చింది.

→ జనతాపార్టీ తరపున భారత ప్రధానమంత్రి పదవిని చేపట్టింది మొరార్జీ దేశాయి.

→ 1980లో జరిగిన సాధారణ ఎన్నికలలో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వచ్చింది.

→ భారతీయ రైతులపై ప్రత్యేక శ్రద్ధ అవసరం అన్న సోషలిస్టులతో ఏర్పడిన పార్టీ – భారతీయ లోక్ దళ్.

→ ఇందిరాగాంధీ విధానాలను వ్యతిరేకించి కాంగ్రెస్లోని సంప్రదాయవాద వర్గం ఏర్పరచిన పార్టీ – కాంగ్రెస్ (ఓ).

→ పెను భూసంస్కరణలకు, కార్మిక సంఘాలు, సోషలిస్టు విధానాలకు కృషిచేస్తున్న పార్టీ సి.పి.ఐ (ఎం).

→ తమిళనాడులో ఉన్న పార్టీ – ద్రవిడ మున్నేట్ర కజగం (డి.ఎం.కె).

→ హిందూ జాతీయతావాద పార్టీ – జనసంఘ్.

→ సిక్కుల కోసం ప్రత్యేకంగా పనిచేస్తున్న పార్టీ – శిరోమణి అకాలీ దళ్.

→ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించటానికి ఉపయోగించే ఆర్టికల్ – 356.

→ ఎన్.టి. రామారావు 1982లో తన 60వ పుట్టినరోజునాడు తెలుగుదేశం పార్టీ (తె.దే.పా) ని స్థాపించారు.

AP 10th Class Social Notes Chapter 19 రాజకీయ ధోరణుల ఆవిర్భావం 1977-2000

→ పేదలకు రెండు రూపాయలకు కిలో బియ్యం, ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం, మద్యపాన నిషేధం వంటి పేదల సంక్షేమ పథకాలను ఎన్.టి. రామారావు ప్రకటించారు.

→ రాజకీయ అస్థిరత, బయటివారి రాకతో తమ సంఖ్య తగ్గుతుందనీ భయం కారణంగా, అస్సోం ప్రజలలో ఏర్పడిన అసంతృప్తి 1970 లో సామాజిక ఉద్యమంగా మారింది.

→ 1984లో రాజీవ్ గాంధీ చొరవతో కేంద్రప్రభుత్వం అఖిల అసోం విద్యార్థి సంఘం ఒక ఒప్పందంపై సంతకాలు చేశారు.

→ బెంగాలీలు, అస్సోమీయుల మధ్య మొదలైన సమస్య ఒక సున్నిత అంశంగా తయారై, సంక్లిష్ట అంతర్గత జాతిఘర్షణలకు దారితీసింది.

→ కేంద్రంలో జనతాపార్టీ ప్రభుత్వం ఉండగా 1978లో అకాలీ దళ్ కొన్ని తీర్మానాలు చేసి వాటిని అమలు చెయ్యాలని కేంద్రప్రభుత్వాన్ని కోరింది.

→ 1984లో ప్రధానమంత్రి ఇందిరాగాంధీ హత్యకు గురయ్యింది.

→ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీకి ఎస్.ఎ.డి నాయకుడైన సంత్ లాంగోవాల్ కి మధ్య ఒక ఒప్పందం కుదిరింది.

→ 1986 ఏప్రిల్ లో అకల్ తఖ్ వద్ద సమావేశంలో ఖలిస్తాను స్వతంత్ర దేశంగా ప్రకటించారు.

→ 1984లో రాజీవ్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ అంతకుముందెన్నడు లేనంతగా ఎన్నికలలో ఘనవిజయం సాధించింది.

→ రాజీవ్ గాంధీ భారతదేశంలో ‘టెలికం విప్లవం’ను ఆరంభించారు.

→ భర్త నుంచి విడాకులు పొందిన షా బానో అన్న మహిళ వేసిన కేసులో 1985లో సుప్రీంకోర్టు ఆమె మాజీ భర్త ఆమెకు భరణం చెల్లించాలని తీర్పు ఇచ్చింది.

AP 10th Class Social Notes Chapter 19 రాజకీయ ధోరణుల ఆవిర్భావం 1977-2000

→ రామ జన్మభూమి-బాబ్రీ మసీదు వివాదం ఏమనగా అది రాముని జన్మస్థలం అని, అంతకు ముందు అక్కడ ఉన్న గుడిని పడగొట్టి మసీదు కట్టారని హిందువులు భావించగా, అది నిజం కాదని, అది తమ ప్రార్థనాస్థలమని ముస్లిములు పేర్కొంటున్నారు.

→ ఉత్తరప్రదేశ్, హర్యానాలోని రైతులు మహేంద్రసింగ్ తికాయత్ నేతృత్వంలోనూ, మహారాష్ట్రలోని రైతులు శరద్ జోషీ నాయకత్వంలోనూ పోరాడసాగారు.

→ 1989లో జరిగిన ఎన్నికలలో ‘కాంగ్రెసేతర రాజకీయ శక్తులకు పరిపాలన, రాజకీయ రంగాలలో అవినీతి ప్రధాన ప్రచార అంశం.

→ 1989లో వి.పి.సింగ్ నేతృత్వంలో జనతాదళ్ తో మొదటి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది.

→ 1977లో పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ఎన్నికలలో సి.పి.ఎం.కి చెందిన జ్యోతిబసు గెలిచి వామపక్ష ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశారు. ఆపరేషన్ బర్గా అనగా కౌలుదార్లను భూస్వాములు బలవంతంగా ‘తొలగించటానికి వీలు లేకుండా పోవడం.

→ మండల్ కమిషన్ నివేదికను అనుసరించి, సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతులకు ప్రభుత్వ ఉద్యోగాలలో 27% రిజర్వేషన్లు కల్పించింది వి.పి.సింగ్ ప్రభుత్వం.

→ స్థానిక స్వపరిపాలనకు రాజ్యాంగ గుర్తింపునిస్తూ 1992వ సంవత్సరంలో పి.వి. నరసింహారావు నేతృత్వంలో ఏర్పడిన ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేసింది.

→ 73వ రాజ్యాంగ సవరణతో గ్రామస్థాయిలో, 74వ రాజ్యాంగ సవరణతో పట్టణ మరియు నగరాల స్థాయిలో ప్రభుత్వాలను సార్వత్రిక వయోజన ఓటింగ్ ద్వారా మొట్టమొదటిసారి ఎన్నుకున్నారు.

→ బి.జె.పి నాయకుడైన ఎల్.కె. అద్వానీ 1990లో సోమనాథ్ నుంచి అయోధ్య వరకు రథయాత్ర చేపట్టాడు.

→ 1991లో వి.పి.సింగ్ ప్రభుత్వం పడిపోయినప్పుడు భారతదేశం తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటూ ఉంది.

→ 1992లో పి.వి. నరసింహారావు నేతృత్వంలో కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది.

→ ప్రాంతీయ ఆకాంక్షలు : ప్రాంతాలకు సంబంధించిన కోరికలు, స్వయం ప్రతిపత్తితో ప్రాంతీయ ప్రయోజనాలు కాపాడుకోవడం, స్థానిక ప్రయోజనాలకు చెందిన కోరికలు.

AP 10th Class Social Notes Chapter 19 రాజకీయ ధోరణుల ఆవిర్భావం 1977-2000

→ సంకీర్ణ ప్రభుత్వాలు : 2 లేదా అంతకు మించి జాతీయ మరియు ప్రాంతీయ పార్టీలు ఒక సమూహంగా ఏర్పడి, ఏర్పాటుచేసిన ప్రభుత్వాలు.

→ మతతత్వ వాదం : తమ మతమే గొప్పది అని నమ్మే భావన. తమ మత అస్తిత్వం ఆధారంగా దేశాన్ని నిర్మించాలనే భావన. అన్ని మతాలకు తమ మతమే మార్గదర్శకం అనే భావన.

→ అధిక సంఖ్యాక వర్గం : అత్యధిక సంఖ్యలో ఉన్న ఒకే వర్గానికి చెందిన ప్రజలు; ఒకే మతం, ఆచారాలు, సంప్రదాయాలు పాటిస్తున్న ప్రజలు ఎక్కువగా ఉండటం.

→ అల్ప సంఖ్యాక వర్గం : తక్కువ సంఖ్యలో ఒకే వర్గానికి చెందిన ప్రజలు; ఒకే మతం, ఆచారాలు, సంప్రదాయాలు పాటిస్తున్న ప్రజలు తక్కువగా ఉండటం.

→ అత్యవసర పరిస్థితి : సాధారణ పాలనలో వైఫల్యం చెందినప్పుడు విధించే పరిస్థితి.

→ ఏకపార్టీ ప్రజాస్వామ్యం : ప్రజలు ఎల్లప్పుడు ఒకే పార్టీకి అధికారాన్ని అప్పగించటం.

→ సోషలిస్టులు : సమాజంలోని పౌరులందరు సమానమేనని, పేద, ధనికవర్గాల మధ్య ఆర్థిక వ్యత్యాసాలు ఉండరాదని తెలియజేసేవారు.

→ హిందూ జాతీయవాదులు : హిందూ జాతీయతను పరిరక్షించాలి అని భావించేవారు.

→ కమ్యూనిస్టులు : శ్రమ చేసేవానికే శ్రమ యొక్క ఫలితం అందాలి అని భావించేవారు

→ బి.ఎల్.డి. : భారతీయ లోకదళ్

→ ఈ సి.పి.ఐ (ఎం) : భారతీయ కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

→ డి.ఎం.కె : ద్రవిడ మున్నేట్ర కజగం

→ ఎస్.ఎ.డి : శిరోమణి అకాలీ దళ్

→ ఎ.ఎ.ఎయు : అఖిల అస్సోం విద్యార్థి సంఘం

→ ఎ.జి.పి : అస్సోం గణపరిషత్

→ రాష్ట్రపతి పాలన : రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగం ప్రకారం రాష్ట్రాన్ని పాలించలేకపోతోందని గవర్నర్ అభిప్రాయపడితే రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రధానమంత్రి సలహాతో రాష్ట్రపతి తొలగించి పాలనా బాధ్యతను చేపట్టమని గవర్నర్‌ను కోరి పరిపాలన సాగించడం.

→ అంతర్గత వలస ప్రాంతం : ఒక ప్రాంతం వారు మరొక ప్రాంతంపై అధికారాన్ని చెలాయించటం.
ఉదా : బెంగాల్ ప్రాంతం వారు. అసోం ప్రాంతంపై అధికారాన్ని చెలాయించుట.

AP 10th Class Social Notes Chapter 19 రాజకీయ ధోరణుల ఆవిర్భావం 1977-2000

→ టెలికం విప్లవం : ఉపగ్రహ సాంకేతిక విజ్ఞానంతో దేశంలో టెలిఫోనిక్ నెట్వర్క్ వేగంగా విస్తరించడం.

→ విధాన పక్షపాతం : ప్రభుత్వం తీసుకునే కొన్ని విధానాల వల్ల కొద్దిమంది ప్రజలకు మేలు జరిగి, మిగతా వారికి ఏ విధమైన మేలు జరగకపోగా, ఒక్కోసారి కీడు జరిగే పరిస్థితి.

→ వామపక్ష పార్టీలు : బడుగు, బలహీన వర్గాలకు రాజకీయ, ఆర్థిక, సామాజిక న్యాయ అంశాలను అత్యధికంగా అమలుచేయాలనే ప్రధాన ఉద్దేశం గల పార్టీలు.

→ ఆపరేషన్ బర్గా : కౌలుదార్లను భూస్వాములు బలవంతంగా తొలగించటానికి వీలులేకుండా చేసిన చర్య.

→ మండల్ కమిషన్ : సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతులకు ప్రభుత్వ ఉద్యోగాలలో 27% రిజర్వేషన్ కల్పించాలని నివేదించిన కమిటీ.

→ లౌకికరాజ్యం : రాజ్యపాలన నిర్వహణలో మతం ప్రమేయం లేకుండుట.

→ సరళీకృత ఆర్థిక విధానం : ప్రభుత్వ ఖర్చును తగ్గించుకొని, విదేశీ సరకులపై పరిమితులను తగ్గించి, ప్రైవేటు రంగానికి ప్రాధాన్యత ఇవ్వటం.

→ బహుళ పార్టీ వ్యవస్థ : రెండు లేదా అంతకన్నా ఎక్కువ పార్టీలు కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే వ్యవస్థ.

→ ప్రజాస్వామ్యం : ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలే ఎన్నుకున్న ప్రభుత్వ వ్యవస్థ ఉండడం.

→ దేశ ఐక్యత : దేశంలోని ప్రజలందరూ కలసిమెలసి జీవించడం.

→ పర్యావరణ ఉద్యమం : పర్యావరణ సమతుల్యతను కాపాడడానికి జరిపే ఉద్యమం.

AP 10th Class Social Notes Chapter 19 రాజకీయ ధోరణుల ఆవిర్భావం 1977-2000

→ స్త్రీవాద ఉద్యమం : స్త్రీలకు అన్ని విషయాలలో సమాన హోదా కోసం పోరాడడం.

→ పౌరహక్కుల ఉద్యమం : ప్రజల ప్రాథమిక హక్కులను పరిరక్షించుట కొరకు జరిగేది.

→ సాహిత్య ఉద్యమం : మంచి రచనలతో ప్రజలను ముందుకు నడిపించడం.

→ రామ జన్మభూమి – బాబ్రీ మసీదు వివాదం : అది రాముని జన్మస్థలం అని, అంతకు ముందు అక్కడ ఉన్న గుడిని పడగొట్టి మసీదు కట్టారని హిందువుల వాదన కాగా, అది నిజం కాదని, ఇది తమ ప్రార్థనా స్థలమని ముస్లింల వాదన.

→ వామపక్ష ప్రభుత్వం : అణగారిన వర్గాలకు ప్రభుత్వాధికారం సంక్రమించాలనే ప్రభుత్వం.

AP 10th Class Social Notes Chapter 19 రాజకీయ ధోరణుల ఆవిర్భావం 1977-2000 1
AP 10th Class Social Notes Chapter 19 రాజకీయ ధోరణుల ఆవిర్భావం 1977-2000 2

AP 10th Class Social Notes Chapter 18 స్వతంత్ర భారతదేశం (మొదటి ముప్ఫై సంవత్సరాలు-1947-1977)

Students can go through AP Board 10th Class Social Notes 18th Lesson స్వతంత్ర భారతదేశం (మొదటి ముప్ఫై సంవత్సరాలు-1947-1977) to understand and remember the concept easily.

AP Board 10th Class Social Notes 18th Lesson స్వతంత్ర భారతదేశం (మొదటి ముప్ఫై సంవత్సరాలు-1947-1977)

→ రాజకీయాలలో ఒక వ్యక్తి – ఒక ఓటు – ఒకే విలువ అని అంబేద్కర్ అన్నారు.

→ మొదటి సాధారణ ఎన్నికలు నిరక్షరాస్యత మూలంగా సవాలుగా నిలిచాయి.

→ రోజువారీ జీవితం నుంచి కొన్ని గుర్తులను ఉపయోగించి మొదటి ఎన్నికలను నిర్వహించారు.

→ 1952, 1957, 1967లలో జరిగిన మొదటి మూడు సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ ఘన విజయం సాధించగా, ఇతర పార్టీలు కాంగ్రెస్ కి సమీపంలోకి కూడా రాలేదు.

→ అనేక రాష్ట్రాలలో వివిధ భాషలు మాట్లాడే ప్రజలు నివసించేవారు. అదే విధంగా ఒకే భాషను మాట్లాడేవారు వివిధ రాష్ట్రాలలో నివసించేవారు.

→ తెలుగు మాట్లాడే ప్రజలు అందరికంటే తీవ్ర ఉద్యమాన్ని చేపట్టారు.

→ బ్రిటిష్ పాలనలో ఆంధ్రమహాసభ క్రియాశీలంగా పనిచేసింది.

AP 10th Class Social Notes Chapter 18 స్వతంత్ర భారతదేశం (మొదటి ముప్ఫై సంవత్సరాలు-1947-1977)

→ 1953లో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సంఘాన్ని (SRC) వేశారు. దీనిలో ఫజల్ ఆలి, కె.ఎం. పణిక్కర్, హృదయనాథ్ కుంజులు సభ్యులుగా ఉన్నారు.

→ 1956లో పార్లమెంటు రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం ఆమోదించబడింది.

→ స్వాతంత్ర్యం వచ్చిన తరువాత భూసంస్కరణలను అమలు చేశారు. కానీ ఇవి దేశమంతా మనస్ఫూర్తిగా అమలు జరగలేదు.

→ ప్రణాళికాబద్ధ అభివృద్ధి ద్వారా కులం, మతం, ప్రాంతం వంటి విభజన ధోరణులు తగ్గి భారతదేశం బలమైన, ఆధునిక దేశంగా ఎదుగుతుందని నెహ్రూ ఆశించాడు.

→ భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ప్రచ్ఛన్న యుద్ధం మొదలై ప్రపంచమంతా రష్యా కూటమి (USSR) లేదా అమెరికా (USA) గా విడిపోయింది.

→ భారతదేశం, ఇండోనేషియా, ఈజిప్టు, యుగోస్లేవియా మొదలైన దేశాలు కలసి ‘అలీన విధానాన్ని నిర్మించారు.

→ పంచశీల సూత్రాలను నెహ్రూ రూపొందించాడు.

→ 1962 లో చైనాతో, 1965 లో పాకిస్థాన్, 1971లో మళ్ళీ పాకిస్థాన్‌తో భారతదేశం యుద్ధం చేయవలసి వచ్చింది.

→ 1964 లో నెహ్రూ చనిపోయిన తరువాత లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రి అయ్యాడు. 1965 లో శాస్త్రి అకాల మరణం తరువాత ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయ్యింది.

→ తమిళనాడులో హిందీ వ్యతిరేక ఉద్యమం తీవ్రంగా పరిణమించినపుడు శాస్త్రి గారు ఉద్యమాన్ని శాంతి పరచటానికి అనేక మినహాయింపులు ప్రకటించారు.

AP 10th Class Social Notes Chapter 18 స్వతంత్ర భారతదేశం (మొదటి ముప్ఫై సంవత్సరాలు-1947-1977)

→ 1967లో అనేక రాష్ట్రాలలో కాంగ్రెస్ ఓడిపోగా వివిధ ప్రతిపక్ష పార్టీలు అధికారంలోకి వచ్చాయి.

→ ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమం ప్రారంభమయ్యింది.

→ భారతదేశంలో జమ్ము-కాశ్మీరు ప్రత్యేక ప్రతిపత్తి ఉంది.

→ భారత్ 1971లో బంగ్లాదేశ్ కు సహకరిస్తూ పాక్ తో యుద్ధం చేసింది. బంగ్లాదేశ్ స్వాతంత్ర్యం సంపాదించుకుంది.

→ “గరీబీ హటావో” అనే నినాదంతో ఇందిరాగాంధీ 1971 సార్వత్రిక ఎన్నికలలో రికార్డుస్థాయిలో విజయం సాధించింది. ప్రతిపక్షమే లేకుండా పోయింది.

→ ఇందిరాగాంధీ అనేక ప్రైవేటు బ్యాంకులను జాతీయం చేసింది. రాజ భరణాలను రద్దు చేసింది. చమురు ధరలు, ద్రవ్యోల్బణం, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, ఆహార కొరత, నిరుద్యోగం వంటి సమస్యలను ఎదుర్కొంది.

→ జయప్రకాశ్ నారాయణ్ ఆధ్వర్యంలో అనేక ప్రతిపక్షాలు ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా ఉద్యమించాయి.

→ ఇందిరాగాంధీ అత్యవసర పరిస్థితి విధించి అనేక సమస్యలను ఎదుర్కొన్నది.

→ రాజ్యాంగానికి 42 వ సవరణ చేయుట జరిగింది.

→ మనం స్థిరమైన ప్రజాస్వామ్యాన్ని సాధించామని చెప్పవచ్చు. అయితే ఇప్పటికీ కుల వివక్ష, లింగ వివక్ష కొనసాగుతున్నాయి.

AP 10th Class Social Notes Chapter 18 స్వతంత్ర భారతదేశం (మొదటి ముప్ఫై సంవత్సరాలు-1947-1977)

→ రాష్ట్రాల పునఃవ్యవస్థీకరణ : రాష్ట్రాల పునఃవ్యవస్థీకరణ కంటే ముందు ప్రత్యేక తెలుగురాష్ట్రం కోరుతూ 58 రోజులు నిరాహారదీక్ష చేసిన పొట్టి శ్రీరాములు 1952 అక్టోబరులో చనిపోవడంతో 1953 ఆగష్టులో రాష్ట్రాల పునఃవ్యవస్థీకరణ సంఘాన్ని (ఎస్.ఆర్.సి) వేశారు. దీనిలో ఫజల్ ఆలి, కె.ఎం. పణిక్కర్, హృదయనాథ్ కుంజులు సభ్యులుగా ఉన్నారు. భాషా ప్రాతిపదికన రాష్ట్రాల ఏర్పాటును సిఫారసు చేసింది. ఈ సంఘ సిఫారసుల మేరకు భాషా ప్రాతిపదికన రాష్ట్రాల పునఃవ్యవస్థీకరణ జరిగింది.

→ ఒక పార్టీ ఆధిపత్యం : స్వాతంత్ర్యం వచ్చిన తరువాత 1952, 1957, 1962లలో జరిగిన మూడు సార్వత్రిక ఎన్నికలలో భారత జాతీయ కాంగ్రెస్ అఖండ విజయాలు సాధించింది. 70% పైగా స్థానాలను గెలుచుకుంది. కాంగ్రెస్ పార్టీ విభిన్న దృక్పథాలు, ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఇతర పార్టీలు ఉన్నాయి. ఎన్నికలలో పోటీ చేశాయి. కానీ కాంగ్రెస్ ని సవాలు చేయగలిగే సంఖ్యలో స్థానాలను గెలుచుకోలేక పోవడంతో ఒక పార్టీ ఆధిపత్యం ఏర్పడింది.

→ అత్యవసర పరిస్థితి :
అత్యవసర పరిస్థితులు మూడు రకాలు :

  1. జాతీయ అత్యవసర పరిస్థితి
  2. రాష్ట్రస్థాయిలో రాజ్యాంగ సంక్షోభం ఏర్పడినప్పుడు విధించే రాష్ట్రపతి పాలన
  3. ఆర్థిక అత్యవసర పరిస్థితి

అత్యవసర పరిస్థితి ప్రభావం :

  1. ప్రాథమిక హక్కులను నిలిపివేయవచ్చు.
  2. కేంద్ర కార్యనిర్వాహక వర్గం సలహామేరకు రాష్ట్ర కార్యనిర్వాహక వర్గం పాలనను కొనసాగించవలసి ఉంటుంది. పార్లమెంటు రాష్ట్ర జాబితాలోని అంశంపై అయినా శాసనం చేయవచ్చు. ఎటువంటి మార్పులనైనా రాష్ట్రపతి చేయవచ్చు.

AP 10th Class Social Notes Chapter 18 స్వతంత్ర భారతదేశం (మొదటి ముప్ఫై సంవత్సరాలు-1947-1977)

→ ప్రాంతీయ ఉద్యమాలు : ఇందిరాగాంధీ పరిపాలన కాలంలో దేశంలో వివిధ రాష్ట్రాలలో ప్రాంతీయ భావాలు తిరిగి ఊపందుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేక తెలంగాణ కొరకు ఉద్యమాలు చేయసాగారు. 1969 డిసెంబరులో అసోంలోని ఖాసి, జైంతియా, గారో గిరిజన ప్రాంతాలలో ఉద్యమ ఫలితంగా మేఘాలయ ఏర్పడింది. 1966లలో ఉమ్మడి రాజధాని అయిన చండీఘర్ తమకు ఇమ్మని పంజాబ్ కోరింది. మహారాష్ట్రలోని బొంబాయి మహారాష్ట్ర వాసులకే చెందాలని శివసేన ఉద్యమం ప్రారంభించింది. కాశ్మీరు, నాగాలాండులలో కూడా ఉద్యమాలు జరిగాయి.

→ జాతీయీకరణ : సామాజిక, ఆర్థిక మార్పు సాధించాలన్న లక్ష్యంతో అనేక ప్రైవేటు బ్యాంకులను జాతీయం చేస్తూ ఇందిరాగాంధీ ప్రకటన చేసింది. దీని మూలంగా సామాన్య ప్రజలందరూ ఈ || బ్యాంకుల సేవలను ఉపయోగించుకోవచ్చు.

AP 10th Class Social Notes Chapter 18 స్వతంత్ర భారతదేశం (మొదటి ముప్ఫై సంవత్సరాలు-1947-1977) 1
AP 10th Class Social Notes Chapter 18 స్వతంత్ర భారతదేశం (మొదటి ముప్ఫై సంవత్సరాలు-1947-1977) 2

AP 10th Class Social Notes Chapter 17 స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణం

Students can go through AP Board 10th Class Social Notes 17th Lesson స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణం to understand and remember the concept easily.

AP Board 10th Class Social Notes 17th Lesson స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణం

→ నేపాల్, జపాన్, భారత రాజ్యాంగాలు మూడు కూడా ప్రజాక్షేమాన్ని, వ్యక్తి యొక్క సర్వతోముఖాభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యతనిచ్చాయని తెలుస్తుంది.

→ నేపాల్ లో 2007లో రాచరికం రద్దు అయింది. రాజ్యాంగాన్ని రూపొందించే ప్రక్రియ 2007లో ప్రారంభమై ఇంతవరకు (2014) కూడా పూర్తి కాలేదు.

→ భారతదేశంలో రాజ్యాంగసభకు 1946లో ఎన్నికలు జరిగినాయి. బ్రిటిష్ రాష్ట్రాల నుండి, సంస్థానాల నుండి సభ్యులను ఎన్నుకొనుట జరిగింది.

→ 1947 ఆగష్టు 14న పాకిస్తాన్ ఏర్పడింది. 1947 ఆగష్టు 15న భారతదేశం ఏర్పడింది. దీనివలన రాజ్యాంగసభ పాకిస్థాన్ రాజ్యాంగసభగా, భారత రాజ్యాంగసభగా విడిపోయింది.

→ ముసాయిదా సంఘం 1947లో డా|| బి.ఆర్. అంబేద్కర్ అధ్యక్షతన ఏర్పడింది.

→ ముసాయిదా సంఘం, రాజ్యాంగాన్ని రూపొందించింది. చివరిగా 1949 నవంబరు 26న రాజ్యాంగాన్ని రాజ్యాంగసభ ఆమోదించింది.

→ రాజ్యాంగం 1950 జనవరి 26 నుంచి అమలులోకి వచ్చింది.

→ ముసాయిదా రాజ్యాంగంలో 315 అధికరణాలు, 8 షెడ్యూళ్ళు ఉన్నాయి.

→ ముసాయిదా, రాజ్యాంగంపై ప్రజాస్పందనల కోసం 8 నెలల పాటు రాజ్యాంగాన్ని ప్రజల ముందు ఉంచింది.

→ మన రాజ్యాంగం ప్రకారం మనది పార్లమెంటరీ, సమాఖ్య వ్యవస్థ అని చెప్పవచ్చు.

→ పార్లమెంటరీ విధానంలో నామమాత్ర అధ్యక్షుడు ఉంటాడు. వాస్తవాధికారాలు ప్రధానమంత్రి మరియు అతని మంత్రులు నిర్వర్తిస్తారు.

AP 10th Class Social Notes Chapter 17 స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణం

→ అమెరికా అధ్యక్ష విధానంలో అధ్యక్షుడే సర్వాధికారి. అన్ని అధికారాలను అధ్యక్షుడే నిర్వర్తిస్తాడు. అతని కింద వివిధ శాఖలకు సెక్రటరీలు బాధ్యత వహిస్తారు.

→ భారత అధ్యక్షుడికి మంత్రులకు పార్లమెంటులో మద్దతు ఉన్నంతవరకు మంత్రులను తొలగించే అధికారం లేదు.

→ రాజ్యాంగ రూపాలు రెండు రకాలు – 1) ఏకీకృత రాజ్యాంగం 2) సమాఖ్య విధానం.

→ మనది సమాఖ్య విధానం. దీని ప్రకారం కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలుంటాయి. అవి సర్వసత్తాకమైనవి. కేంద్ర, రాష్ట్రాల మధ్య అధికార విభజన కూడా జరిగింది.

→ మన సమాఖ్య విధానంలో ఏకపౌరసత్వం ఉంది. ఏకీకృత, అత్యున్నత న్యాయస్థానం ఉంది. దేశం మొత్తానికి వర్తించే అఖిల భారత సర్వీసులను కూడా కేంద్రమే నియమిస్తుంది.

→ కేంద్ర, రాష్ట్రాల మధ్య అధికారాలను కేంద్ర, రాష్ట్ర ఉమ్మడి జాబితాలుగా విభజించుట జరిగింది.

→ కొంతమంది రాజ్యాంగాన్ని “1935 భారత చట్టానికి నకలు” అని విమర్శించినారు.

→ షెడ్యూల్డ్ తరగతులు, షెడ్యూల్డ్ తెగలకు రాజ్యాంగంలో రిజర్వేషన్లను కల్పించినారు.

→ “లౌకిక, సామ్యవాదం” అనే పదాలను 1976లో 42వ సవరణ ద్వారా రాజ్యాంగ ప్రవేశికలో చేర్చారు.

→ ముసాయిదా సంఘం : రాజ్యాంగం జాతి ప్రాణమే కాక ఆ జాతి ప్రజల ఆశయాలను ప్రతిబింబిస్తుంది. రాజ్యాంగ సభ, రాజ్యాంగాన్ని రూపొందించటానికి ముందుగా రాజ్యాంగ ప్రతిని’ రూపొందించుట కొరకు ఈ “ముసాయిదా సంఘం” ను 1947, ఆగస్టు 29న డా॥ బి. ఆర్. అంబేద్కర్ అధ్యక్షతన ఏర్పాటు చేయడం జరిగింది.

→ రాజ్యాంగ సభ : రాజ్యాంగ సభ అంటే దేశ రాజ్యాంగం రూపొందించే చర్చా వేదిక. దేశ ప్రాథమిక చట్టాన్ని రూపొందించే వ్యవస్థగా రాజ్యాంగ సభకు ప్రత్యేక హోదా ఉంటుంది.
1) మన దేశ రాజ్యాంగాన్ని నిర్మించుకొనుటకు రాజ్యాంగ సభ, 1946, డిసెంబరు 9న మొదటి సమావేశం జరిపింది.
2) రాజ్యాంగ సభకు 1946 జూలైలో ఎన్నికలు జరిగాయి. 1947 ఆగష్టులో దేశ విభజనతో రాజ్యాంగ సభను కూడా భారత్, పాక్ రాజ్యాంగ సభలుగా విభజించారు.

AP 10th Class Social Notes Chapter 17 స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణం

→ ప్రవేశిక : రాజ్యాంగ మూలతత్వాన్ని సంగ్రహంగా తెల్పే ఈ ప్రవేశిక “ఉపోద్ఘాతం” వంటిది. రాజ్యాంగంలో పొందుపరచిన సిద్ధాంతాలు, భావనలు, రాజ్యాంగ లక్ష్యాలు, ప్రయోజనాలు ఈ ప్రవేశిక ద్వారా తెలుసుకోవచ్చు.

→ ఉభయపద్దు : సమాఖ్య ప్రభుత్వ విధానం యొక్క ముఖ్య లక్షణం “అధికారాల విభజన.” రాజ్యాంగం అధికారాలను కేంద్ర, రాష్ట్రాల మధ్యనే కాకుండా ‘ఉభయపద్దు’ గా విభజించింది. ఈ ఉభయపద్దును “ఉమ్మడి జాబితా” అంటాము. ఇందులో 47 అంశాలుంటాయి. ఈ అంశాల మీద కేంద్రం, రాష్ట్రం రెండూ చట్టాలు చేయవచ్చు. అయితే కేంద్రం చేసే చట్టానికి విరుద్ధంగా రాష్ట్రం చట్టం చేస్తే కేంద్రం చేసిన చట్టమే చెల్లుబాటవుతుంది.

→ ఏకీకృత, సమాఖ్య సిద్ధాంతాలు: 1) ప్రభుత్వంలో ప్రభుత్వాధికారమంతా కేంద్ర ప్రభుత్వానికే ఉంటే అది “ఏకీకృత సిద్ధాంత” మని అంటాం.
2) ప్రభుత్వాధికారాలు కేంద్ర, రాష్ట్రాల మధ్య రాజ్యాంగబద్ధంగా పంపిణీ అయితే దానిని “సమాఖ్య సిద్ధాంత”మని అంటాం.

→ పౌరసత్వం : ఆధునిక రాజ్యాలలో రెండు విధాలైన ప్రజలున్నారు. వారు దేశీయులు మరియు విదేశీయులు. “ఏ ప్రజలు దేశంలో పౌర, రాజకీయ హక్కులను అనుభవిస్తుంటారో వారిని ఆ దేశ పౌరులని” అంటారు. విదేశీయులకు మానవతా దృష్ట్యా పౌరహక్కులను మాత్రమే కల్పిస్తారు. కాబట్టి ‘పౌరసత్వం’ అనే హోదాను రాజ్యం పౌరునికి కల్పించుటచే అతను పౌర, రాజకీయ హక్కులు అనుభవించగలడు. భారతదేశంలో ఏక పౌరసత్వం (భారత పౌరసత్వం ) ఉంది.

→ అధ్యక్ష, పార్లమెంటరీ తరహా వ్యవస్థ :
1) అధ్యక్ష విధానం : ఈ విధానంలో శాసనసభ, కార్యనిర్వాహక వర్గాలు రెండూ స్వతంత్రంగా వ్యవహరిస్తాయి. కార్యనిర్వాహక వర్గం శాసనసభలో భాగం కాదు. అధ్యక్షుడే ప్రధాన కార్యనిర్వాహణాధికారి. అతడే వాస్తవ అధికారి. అధ్యక్షుడే అన్ని అధికారాలను స్వయంగా కాని, మంత్రుల ద్వారా కాని చెలాయిస్తాడు.

2) పార్లమెంటరీ వ్యవస్థ : ఈ విధానంలో కార్యనిర్వాహక శాఖకు, శాసనశాఖకు సన్నిహిత సంబంధం ఉంటుంది. శాసనశాఖ నుంచే కార్యనిర్వాహక శాఖ ఏర్పడుతుంది. శాసన శాఖకు బాధ్యత వహిస్తుంది. అధ్యక్షుడు నామమాత్రంగా ఉంటాడు. వాస్తవాధికారాలు ప్రధానమంత్రి మరియు ఇతర మంత్రులు నిర్వర్తిస్తారు.

AP 10th Class Social Notes Chapter 17 స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణం

→ సవరణ : చట్టాలను అప్పుడప్పుడు సవరించాల్సిన అవసరం ఏర్పడుతుందని రాజ్యాంగ నిర్మాతలు గుర్తించి, రాజ్యాంగంలోని అధికరణాలను సవరించటానికి అవకాశం కల్పించింది. ఈ సవరణలను పార్లమెంటు 2/3 వంతు మెజారిటీతో ఆమోదించాలి. సవరణలను దేశ అధ్యక్షుడు ఆమోదించాలి.

→ కేంద్ర జాబితా : సమాఖ్య విధానంలో అధికారాలు కేంద్ర, రాష్ట్ర ఉమ్మడి అధికారాలుగా విభజింపబడినాయి. కేంద్ర జాబితాలో 97 అంశాలున్నాయి. ఈ అంశాలపై కేంద్రమే చట్టాలు చేస్తుంది. అవి దేశానికంతటికి వర్తిస్తాయి.
ఉదా : రక్షణ, రైల్వేలు, తంతి తపాలా వంటివి.

→ రాష్ట్ర జాబితా : రాష్ట్ర జాబితాలో 60 అంశాలున్నాయి. వాటి మీద రాష్ట్ర ప్రభుత్వమే చట్టాలు చేయగలదు.
ఉదా : పోలీసు, ప్రజా ఆరోగ్యం , జైళ్ళు మొదలైనవి.

AP 10th Class Social Notes Chapter 17 స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణం

AP 10th Class Social Notes Chapter 16 భారతదేశ జాతీయోద్యమం-దేశ విభజన, స్వాతంత్య్రం: 1939-1947

Students can go through AP Board 10th Class Social Notes 16th Lesson భారతదేశ జాతీయోద్యమం-దేశ విభజన, స్వాతంత్య్రం: 1939-1947 to understand and remember the concept easily.

AP Board 10th Class Social Notes 16th Lesson భారతదేశ జాతీయోద్యమం-దేశ విభజన, స్వాతంత్య్రం: 1939-1947

→ రెండవ ప్రపంచయుద్ధం 1939లో ప్రారంభమైనది. ఈ సమయంలో అనేక రాష్ట్రాలలో కాంగ్రెస్ ప్రభుత్వాలు పాలిస్తున్నాయి.

→ 1935లో బ్రిటిషు భారత ప్రభుత్వ చట్టాన్ని ఆమోదించింది.

→ 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం ఓటువేసే అధికారాన్ని చాలా కొద్దిమందికే ఇచ్చారు. రాష్ట్ర శాసనసభలకు 12%, కేంద్రసభకు 1% ప్రజలకే ఓటు హక్కు లభించింది.

→ 1937లో ఎన్నికలు నిర్వహించినపుడు 8 రాష్ట్రాలలో కాంగ్రెస్, ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది.

→ అనేకమంది కాంగ్రెస్ నాయకులు హిట్లర్, ముస్సోలినిని, ఫాసిజాన్ని వ్యతిరేకించారు.

→ రెండవ ప్రపంచయుద్ధ సమయంలో బ్రిటన్ లో “కన్సర్వేటివ్” పార్టీకి చెందిన విస్టన్ చర్చిల్ ప్రధానమంత్రిగా ఉన్నాడు.

→ 1937లో జరిగిన ఎన్నికలలో అనేక రాష్ట్రాలలో కాంగ్రెస్ ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది.

→ 1939లో రెండవ ప్రపంచయుద్ధం ప్రారంభమైంది.

→ భారతీయులతో సంప్రదించకుండా భారత ప్రజలు యుద్ధంలో ఇంగ్లాండుకు సహాయం చేయాలనే వైస్రాయి ప్రకటనకు నిరసనగా కాంగ్రెస్ ప్రభుత్వాలు 1939లో రాజీనామా చేశాయి.

AP 10th Class Social Notes Chapter 16 భారతదేశ జాతీయోద్యమం-దేశ విభజన, స్వాతంత్య్రం: 1939-1947

→ బ్రిటిష్ ‘విభజించి పాలించు’ అన్న సిద్ధాంతాన్ని పాటించింది.

→ ‘విభజించి పాలించు’ సూత్ర ప్రాతిపదికగా ముస్లిం లీగును ప్రోత్సహించి కాంగ్రెస్ ప్రాముఖ్యాన్ని తగ్గించసాగింది.

→ 1906 లో ముస్లింలీగు ఏర్పడింది.

→ 1909 నుంచి ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలను బ్రిటిష్ ఏర్పాటు చేసింది.

→ కులం, వర్గ భేదాలను అధిగమించి హిందువులనందరినీ ఏకం చేయడానికి కృషి చేసినవి, హిందూ మహాసభ, ఆర్.ఎస్.ఎస్‌లు.

→ “సారే జహాసే అచ్ఛా హిందూస్తాన్ హమారా” అన్న కవిత రాసిన ఉర్దూ కవి “మహ్మద్ ఇక్బాల్” 1930లో వాయవ్య ముస్లిం రాష్ట్ర ఆవశ్యకత గురించి మాట్లాడినాడు.

→ పాకిస్తాన్ లేదా పాకిస్తాన్ (పంజాబ్, ఆఫ్ఘన్, కాశ్మీరు, సింద్, బెలుచిస్తాన్ ఇంగ్లీష్ అక్షరాల నుంచి ఏర్పడింది) అన్న ఆ పేరును పంజాబీ ముస్లిం చౌదరి రెహ్మత్ ఆలి రూపొందించాడు.

→ 1942 లో క్రిప్స్ భారతదేశం వచ్చి, కొన్ని ప్రతిపాదనలు చేసాడు.

→ 1942 ఆగష్టులో “క్విట్ ఇండియా” ఉద్యమాన్ని గాంధీజీ ప్రారంభించారు.

→ సుభాష్ చంద్రబోస్ 1942లో జపానులో భారతీయ సైనికులతో ఒక సైన్యాన్ని తయారుచేశాడు.

→ 1946 ఫిబ్రవరి 16న బొంబాయి రేవులోని రాయల్ నౌకాదళంలోని భారత సైనికులు బ్రిటిష్ అధికారుల ప్రవర్తన పట్ల నిరసనగా నిరాహారదీక్ష చేపట్టారు.

→ హైదరాబాదులో కమ్యూనిస్టు పార్టీ తెలంగాణ ప్రాంత రైతుల ఉద్యమానికి నాయకత్వం వహించింది.

AP 10th Class Social Notes Chapter 16 భారతదేశ జాతీయోద్యమం-దేశ విభజన, స్వాతంత్య్రం: 1939-1947

→ 1946 లో జరిగిన రాష్ట్ర ప్రభుత్వ ఎన్నికలలో కేంద్రంలో రిజర్వు చేసిన 30 స్థానాలనూ, రాష్ట్రంలో 442 స్థానాలను ముస్లిం లీగు గెలుచుకుంది.

→ 1946 లో సాధారణ నియోజక వర్గాలలో కాంగ్రెస్ పార్టీ ముస్లిమేతర ఓట్లలో 91 శాతంతో విజయం సాధించింది.

→ 1946 మార్చిలో కాబినెట్ మిషన్ భారతదేశం వచ్చింది.

→ ముస్లిం లీగు 1946 ఆగష్టు 16ను ప్రత్యక్ష కార్యాచరణ దినంగా ప్రకటించింది.

→ 1947 ఫిబ్రవరిలో మౌంట్ బాటెన్ వైస్రాయిగా వచ్చాడు.

→ మౌంట్ బాటెన్ ముస్లింలు అధిక సంఖ్యలో ఉన్న పంజాబు, బెలూచిస్తాన్, తూర్పు బెంగాల్ లను పాకిస్తాన్ గా విభజించి, 1947 ఆగష్టు 14న పాకిస్తాన్ కు, భారతదేశానికి ఆగష్టు 15న స్వాతంత్ర్యాన్ని ప్రకటించడం జరిగింది.

→ భారతదేశం ప్రజాస్వామిక లౌకికరాజ్యంగా ఆవిర్భవించింది.

→ దేశ విభజన మూలంగా వలసలు జరిగి 1.5 కోట్ల హిందూ, ముస్లింలు నిర్వాసితులయ్యారు.

→ 1948 జనవరి 30న “నాథూరాం గాడ్సే” గాంధీజీని హత్య చేసినాడు.

→ బ్రిటిష్ ఇండియాలో ఉన్న 550 స్వదేశీ సంస్థానాలను స్వాతంత్ర్యానంతరం భారతదేశంలో విలీనం చేసే కార్యక్రమానికి “సర్దార్ పటేల్” నాయకత్వం వహించాడు.

→ 1971లో భారత ప్రభుత్వం రాజ భరణాలను, బిరుదులను రద్దు చేసింది.

→ రాజ్య ( డొమీనియన్) ప్రతిపత్తి : జామీనియన్ ప్రతిపత్తి” అనే అంశం 1942లో భారతదేశానికి వచ్చిన “సర్ స్టాఫర్డ్ క్రిప్స్” రాయబారంలోని ముఖ్య అంశం. దీని ప్రకారం రెండవ ప్రపంచ యుద్ధం ముగియగానే భారతదేశానికి “సార్వభౌమాధికారం కలిగిన రాజ్య ప్రతిపత్తి” ఇస్తామని చెప్పారు. డొమీనియన్ ప్రతిపత్తికి అనుగుణంగా ఒక రాజ్యాంగ నిర్మాణసభ సమావేశమై రాజ్యాంగాన్ని రూపొందిస్తుంది. కాని ఈ రాజ్యాంగాన్ని బ్రిటిష్ అమలుచేస్తుంది. దీని ప్రకారం ఏదైనా రాష్ట్రం కాని, ప్రాంతం కాని, సంస్థానాలు కాని తమకు ఇష్టం అయితే ఇందులో చేరవచ్చు లేదా స్వతంత్ర రాజ్యాలుగా ఉండవచ్చు. ఈ సూచనలు భారతదేశాన్ని ముక్కలుగా విభజిస్తాయని కాంగ్రెస్, ముస్లిం లీగులు భావించి, వీటిని తిరస్కరించినారు.

→ విభజించి పాలించు : శీఘ్రంగా పెరిగిపోతున్న జాతీయోద్యమాన్ని ఎదుర్కోవడానికి, దానిని నిలువరించడానికి బ్రిటిష్ ప్రభుత్వం ఈ “విభజించి పాలించు” అనే విధానాన్ని అవలంభించింది. ఈ బ్రిటిష్ విధానాన్ని పాటించి, కాంగ్రెస్ వ్యతిరేక ఉద్యమాలను ప్రోత్సహించింది. హిందూ-ముస్లిం మధ్య మత వైరుధ్యాన్ని పోషించింది. కమ్యూనల్ ఎలక్టరేట్లను ప్రవేశపెట్టడం ద్వారా విద్యావంతులు మరియు సాధారణ ప్రజానీకం మధ్య శత్రుత్వాన్ని పెంచి పోషించారు. అతివాదులకు వ్యతిరేకంగా మితవాదులను ప్రోత్సహించారు. ఇటువంటి విభజించే విధానాలను బ్రిటిష్ వారు పాటించినారు.

AP 10th Class Social Notes Chapter 16 భారతదేశ జాతీయోద్యమం-దేశ విభజన, స్వాతంత్య్రం: 1939-1947

→ ప్రత్యేక నియోజకవర్గం : 1906లో ప్రత్యేక ముస్లిం లీగు ఏర్పాటు జరిగింది. బ్రిటిష్ వారు ముస్లింలకు “ప్రత్యేక సదుపాయాలు చేస్తూ ప్రత్యేక ముస్లిం నియోజక వర్గాలను 1909 మింటో మార్లే సంస్కరణలలో” భాగంగా చేశారు. దీని ప్రకారం ముస్లింలు ఎన్నుకోబడి, శాసనసభలలోకి వెళ్ళడానికి అవకాశం కలిగింది.

→ ద్విజాతి సిద్ధాంతం : భారతదేశంలోని ప్రజలందరూ హిందూ, ముస్లిం జాతులుగా విభజింపబడుటను “ద్విజాతి సిద్ధాంతం” అంటారు. హిందువులు ప్రత్యేక జాతి, ముస్లింలు ప్రత్యేక జాతి అని వీరిద్దరి ఆశయాలు వేరని చెప్పడమే ద్విజాతి సిద్ధాంతం.

→ కమ్యూనల్ అవార్డు : దళిత కులాలకు ప్రత్యేక ఎలక్టోరేట్లను ఏర్పాటు చేయుటనే “కమ్యూనల్ అవార్డు” అంటారు. దీని ప్రకారం దళితవర్గాలు స్వయంగా ఎంపిక చేసుకొన్న పేర్ల జాబితా నుంచి కామన్ జాయింట్ నియోజక వర్గాల ద్వారా భర్తీ చేయవలసి ఉంది. రిజర్వ్ చేసిన స్థానాల సంఖ్య దాదాపు రెట్టింపు అయింది.

AP 10th Class Social Notes Chapter 16 భారతదేశ జాతీయోద్యమం-దేశ విభజన, స్వాతంత్య్రం 1939-1947 1
AP 10th Class Social Notes Chapter 16 భారతదేశ జాతీయోద్యమం-దేశ విభజన, స్వాతంత్య్రం 1939-1947 2

AP 10th Class Social Notes Chapter 15 వలస పాలిత ప్రాంతాలలో జాతి విముక్తి ఉద్యమాలు

Students can go through AP Board 10th Class Social Notes 15th Lesson వలస పాలిత ప్రాంతాలలో జాతి విముక్తి ఉద్యమాలు to understand and remember the concept easily.

AP Board 10th Class Social Notes 15th Lesson వలస పాలిత ప్రాంతాలలో జాతి విముక్తి ఉద్యమాలు

→ సంప్రదాయ పాలకులు : రాజులు, చక్రవర్తులు.

→ యూరపులో కొత్త భావనలు : జాతీయతావాదం, ప్రజాస్వామ్యం, సోషలిజం.

→ ప్రాభవ ప్రాంతాలు : చట్టాలు వర్తించక, పన్ను చెల్లించక, సైనిక దళాలను కలిగి ఉండడం.

→ సన్, మిన్, చుయి : జాతీయతావాదం, ప్రజాస్వామ్యం, సామ్యవాదం.

→ మే నాలుగు ఉద్యమం : వర్సయిల్స్ శాంతి సమావేశం నిర్ణయాలను నిరసిస్తూ బీజింగ్ లో నిరసన ప్రదర్శన (1919 మే 4)

→ ఆడపిల్లల పాదాలు కట్టివెయ్యటం : ఆడపిల్లల పాదాలు పూర్తిగా పెరగకుండా నిరోధించే క్రూరమైన సంప్రదాయం

→ చైనా రెండు సంక్షోభాలు : 1. నేలలు నిస్సారం, అడవుల నరికివేత
2. దోపిడీపూరిత కౌలు, రుణభారం.

→ గ్రామీణ మహిళా సంఘాలు : గ్రామీణ మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే కమిటీలు.

→ రైతాంగ సైన్యం : భూస్వామ్యాన్ని అంతం చెయ్యడానికి పోరాడే రైతుల సమ్మేళనం.

→ రైతాంగ పాఠశాలలు : రాజకీయ విద్య, అక్షరాస్యతను వ్యాప్తి చేసే రైతుల పాఠశాలలు.

→ నాపాలం : మనుషులకు తీవ్ర నష్టం కలిగించే ప్రమాదకరమైన బాంబు.

→ భూసంస్కరణలు : భూ పంపిణీలో ఉన్న అసమానతలు తొలగించి, భూమిలేని పారికి భూమిని పంచి పెట్టడం.

→ భూస్వామ్యవాదం : భూమి అంతా కొంతమంది వ్యక్తుల అధీనంలో కేంద్రీకరింపబడడం.

AP 10th Class Social Notes Chapter 15 వలస పాలిత ప్రాంతాలలో జాతి విముక్తి ఉద్యమాలు

→ నూతన ప్రజాస్వామ్యం : భూస్వామ్యవాదానికి సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా అన్ని వర్గాలతో కలిపి ఏర్పడినది.

→ వెట్టి కార్మికులు : తక్కువ వేతనంతో పని చేయించడం గాని, ప్రతిఫలం ఏమీ ఇవ్వకుండా బానిసలుగా గాని పని చేయించడం.

→ రసాయనిక ఆయుధాలు : విషపూరిత మందులు, ఒకేసారి వేలమందిని చంపే అత్యంత విషపూరిత పదార్ధం కలిగిన ఆయుధాలు ఈ బలహీన ప్రజాస్వామ్యం : అవినీతి, మానవహక్కుల ఉల్లంఘన, సైనిక పాలన గల దానిని బలహీన ప్రజాస్వామ్యం అంటాం.

→ ఖండాంతర ఆఫ్రికావాదం : దేశ, తెగ తేడాలు లేకుండా ఆఫ్రికా ప్రజలందరినీ ఏకం చేయడం.

→ 1902 : పెకింగ్ విశ్వవిద్యాలయం ఏర్పాటు

→ 1918 : లెనిన్ కొమిటర్న్ ఏర్పాటు

→ 1919 : మే నాలుగు ఉద్యమం (బీజింగ్)

→ 1919 : చైనాలో 5 లక్షల మందితో పారిశ్రామిక కార్మికవర్గం ఏర్పాటు

→ 1921 : చైనా కమ్యూనిస్టు పార్టీ ఏర్పాటు

→ 1923 : నైజీరియా జాతీయ ప్రజాస్వామిక పార్టీ ఆవిర్భావం

→ 1931 : వియత్నాం ప్రపంచంలో మూడవ అతి పెద్ద బియ్యం ఎగుమతి

→ 1937 : చైనా పై జపాన్ దండెత్తడం

AP 10th Class Social Notes Chapter 15 వలస పాలిత ప్రాంతాలలో జాతి విముక్తి ఉద్యమాలు

→ 1940 : జపాన్ వియత్నాం ఆక్రమణ

→ 1945 : అమెరికాకి జపాన్ దాసోహం

→ 1945 : వియత్నాంలో జాతీయవాద కార్మికసంఘం జాతీయ సమ్మె

→ 1949 : చైనా ప్రజల గణతంత్రం ఏర్పాటు

→ 1950 : చైనాలో భూసంస్కరణలు అమలు

→ 1963 : నైజీరియా స్వాతంత్ర్యం

→ 1974 : పారిస్‌లో శాంతి ఒప్పందంపై సంతకాలు

→ 1999 : నైజీరియాలో ప్రజాస్వామిక ప్రభుత్వం ఏర్పాటు

AP 10th Class Social Notes Chapter 14 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-II

Students can go through AP Board 10th Class Social Notes 14th Lesson ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-II to understand and remember the concept easily.

AP Board 10th Class Social Notes 14th Lesson ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-II

→ రష్యాలో ప్రణాళికలు : స్టాలిన్

→ రష్యా విప్లవం : బోల్షివిక్

→ రష్యా పాలకులు : జార్

→ రష్యాలో రాజీ ధోరణి అవలంబించేవారు : మెన్షివిక్‌లు

→ రష్యా పార్లమెంట్ : డ్యూమా

→ రష్యన్ విప్లవం : మార్చి విప్లవం

AP 10th Class Social Notes Chapter 12 సమానత – సుస్థిర అభివృద్ధి

→ రష్యన్ సమాజంలో మార్పు కోరే సంఘాలు : సోవియట్‌లు

→ రష్యన్ మహిళా విప్లవ నాయకురాలు : మార్ఫావాసిలేవా

→ రష్యాలో 3 సం||లలో ఉక్కు కర్మాగారం నెలకొల్పిన ప్రదేశం : మాగ్నిటౌగోర్క్స్

→ ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్టు విప్లవాన్ని ప్రోత్సహించటానికి ఏర్పడినది : కొమిటర్న్

→ రష్యన్ విప్లవంలోని ఆదర్శాలను విమర్శించినవాడు : జార్జ్ ఆర్వెల్

→ సోషలిజం : స్వేచ్ఛ, సమానత్వం, ప్రకృతి వనరులు, సామాజిక నియంత్రణలో ఉండాలనే సిద్ధాంతం సోషలిజం.

→ కమ్యూనిజం : ఉత్పత్తి పంపిణీ, వినియోగాలలో కార్మికులను భాగస్వాములను చేస్తూ లాభ, నష్టాలలో కార్మికులకు ప్రాధాన్యత ఇచ్చే సిద్ధాంతం.

→ విప్లవం : మార్పు, ప్రగతి కొరకు నిరసనలు, ఆందోళనలు చేస్తూ ఉద్యమాలు చేరుకునే అత్యున్నత దశ విప్లవం.

→ అధికార కేంద్రీకరణ : అధికారం కొద్దిమంది చేతులలో కాకుండా అనేకులను భాగస్వామ్మును చేస్తూ చేసే అధికారాల పంపిణీ.

AP 10th Class Social Notes Chapter 12 సమానత – సుస్థిర అభివృద్ధి

→ బోల్షివిక్ : రష్యా విప్లవాన్ని “బోల్షివిక్” అంటారు. రష్యాలో శాంతిని వెళతొల్పి, సంక్షేమాన్ని అమలుచేసి, లెనిన్ చే స్థాపించబడిన రష్యా కమ్యూనిస్టు పార్టీలో ఒక బృందం.

→ భూముల ఏకీకరణ : భూములు, పరికరాలు, యంత్రాలు, పశువులను ఉమ్మడి సొత్తుగా భావించి చిన్న, పెద్ద రైతుల భూములను కలిపి చేసే ఉమ్మడి వ్యవసాయ విధానం.

→ పునరావాసం : తమ సొంత నివాసాలను, ఆస్తులను ఆక్రమించి, వాటికి బదులుగా వేరే ప్రాంతంలో ఆశ్రయం కల్పించడం.

→ సంస్కరణ – స్వాధీనత : ప్రస్తుతమున్న విధానాలను మార్పుచేసి, తమకు అనుకూలమైన విధంగా అమలుచేసి, తమ అధీనంలో ఉంచుకోవడం.

→ సంక్షేమ రాజ్యం : ప్రజల ఇక్కట్లు, బాధలు తొలిగించి, వారు ఆనందంగా, సంతోషంగా ఉపాధి అవకాశాలతో జీవించేందుకు పథకాలు అమలుచేసి, ప్రజలను సుఖశాంతులతో ఉంచేదాన్ని “సంక్షేమరాజ్యం” అంటాం.

→ సిద్ధాంత బోధన : ఇప్పుడున్న కార్యక్రమాలకు అదనంగా జీవన విధానంలో మార్పు తెచ్చేందుకు, తమ సంఘం(సంస్థ ద్వారా అమలుచేసే కార్యాచరణను వివరించి, ప్రజలలో మార్పు తీసుకురావడం.

→ ప్రచారం : ప్రజా సంక్షేమానికి తదుపరి చేపట్టబోయే పథకాలు లేదా ప్రస్తుతం తాము చేస్తున్న కార్యక్రమాలను ప్రజలలోకి తీసుకెళ్లి, అవగాహన కలిగించడం.

→ జాతి ఆధిపత్యం : అన్ని దేశాలకంటే తమ దేశమే గొప్పదని, తామే అందరికీ ఆదర్శమని, తామే విశ్వ విజేతలమని తమకు తాము అహంకారంతో మెలిగే విధానం.

AP 10th Class Social Notes Chapter 12 సమానత – సుస్థిర అభివృద్ధి

→ రష్యాలో సోషలిజంపై చర్చలు : 1850 – 1880

→ రష్యా సోషల్ ప్రజాస్వామిక కార్మికుల పార్టీ ఏర్పాటు : 1898

→ రక్తసిక్త ఆదివారం విప్లవం : 1905

→ మార్చి 2 – జార్ చక్రవర్తి పరారీ
అక్టోబర్ 24 – పెట్రోగ్రాలో బోల్షివిల తిరుగుబాటు : 1917

→ పౌరయుద్ధం : 1918-20

→ కొమ్మిర్న్ ఏర్పాటు : 1919

→ లెనిన్ వారసుడిగా స్టాలిన్ అధికారానికి వచ్చుట, లెనిన్ మరణం : 1924

→ రష్యాలో మొదటి పంచవర్ష ప్రణాళిక ప్రారంభం : 1928

→ భూముల ఏకీకరణ ప్రారంభం : 1929

AP 10th Class Social Notes Chapter 14 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 భాగం-II 1
AP 10th Class Social Notes Chapter 14 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 భాగం-II 2

AP 9th Class Social Notes Chapter 19 విస్తరిస్తున్న ప్రజాస్వామ్యం

Students can go through AP Board 9th Class Social Notes 19th Lesson విస్తరిస్తున్న ప్రజాస్వామ్యం to understand and remember the concept easily.

AP Board 9th Class Social Notes 19th Lesson విస్తరిస్తున్న ప్రజాస్వామ్యం

AP 9th Class Social Notes Chapter 19 విస్తరిస్తున్న ప్రజాస్వామ్యం 1
ఉత్తర ఆఫ్రికాలో లిబియా ఒక పేద దేశం. 1951లో స్వాతంత్ర్యం పొందింది. స్వాతంత్ర్యం అనంతరం అధికారాన్ని రాజు ఇద్రిస్ వశమైంది. విస్తారమైన ముడిచమురు నిధులకు లిబియా ప్రసిద్ది. లిబియా ప్రజలు వ్యవసాయం, ఎడారులలో పశువుల పాలనపై ఆధారపడినారు. సైనిక నియంత్రణలో 1969లో మువమ్మర్ గఢాఫి నియంత్రృత్వపాలన పిదప 2012 లిబియా పటం నవంబర్ 14న కొత్త ప్రభుత్వం ప్రమాణస్వీకారం చేసింది.

AP 9th Class Social Notes Chapter 19 విస్తరిస్తున్న ప్రజాస్వామ్యం 2
ప్రపంచ వాణిజ్యకేంద్రంగా, టేకు, కలప, బియ్యం వంటి ఆహారధాన్యాలు, తగరం వంటి ఖనిజాలు, కెంపులు, నీలాలు వంటి విలువైన రాళ్ళకు బర్మా ప్రసిద్ధి. మనకు స్వాతంత్ర్యం వచ్చిన అయిదు నెలలకు బర్మాకు స్వాతంత్ర్యం వచ్చింది. బర్మన్ జాతి నాయకుడైన ఆంగ్ సాన్ (ఆంగ్ సాన్ సూకి తండ్రి) దేశానికి స్వాతంత్ర్యం సంపాదించాడు. తదుపరి సైన్యాధిపతి జనరల్ నేవిన్ దేశ అధికార ఆక్రమణ. ప్రజాస్వామ్య పునరుద్ధరణ. 1988 నుండి ఆంగ్ సాన్ సూకి ప్రజా ఉద్యమం. ఇంకా ప్రజాస్వామ్య ప్రభుత్వ సాధన కొరకు ఉద్యమాలు మయన్మార్ (బర్మా) కొనసాగుతూ ఉన్నాయి.

AP 9th Class Social Notes Chapter 19 విస్తరిస్తున్న ప్రజాస్వామ్యం

→ సంచార పశు పోషకులు : వివిధ ప్రాంతాలు తిరుగుతూ పశువుల్ని జీవనాధారంగా చేసుకొని జీవించేవాళ్ళు.

→ పట్టణీకరణ : గ్రామీణ ప్రాంత ప్రజలు వివిధ వృత్తుల రీత్యా పట్టణాలకు వచ్చి స్థిరపడడాన్ని పట్టణీకరణ అంటారు.

→ రాజకీయ అవినీతి : బంధుప్రీతి, కులరాజకీయాలు, వంశపారంపర్య రాజకీయాలు చేస్తూ, నీతి నియమాలు లేని పాలన.

→ గృహ నిర్బంధం : ఇంటినే జైలుగా చేసి బయట ప్రపంచాన్ని చూపించకపోవడం.

→ నియంతృత్వం : ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా పాలకుల స్వప్రయోజనాలే ధ్యేయంగా గల పాలన.

→ రాచరికం : వంశపారంపర్యం గల రాజుల ఆధ్వర్యంలో జరిగే పరిపాలన.

→ భూస్వామ్యం : అధిక భూములు కలిగి నిరంకుశత్వంతో సమాజానికి ప్రాతినిధ్యం వహించే దోపిడీ స్వభావం గలవారు.

→ కలహాలు : తగవులు.

→ చరమగీతం : అంతం చేయడం.

→ ఆంక్షలు : కట్టుబాట్లు.

AP 9th Class Social Notes Chapter 19 విస్తరిస్తున్న ప్రజాస్వామ్యం

→ ఊడిగం : బానిస పనులు, వెట్టిచాకిరి పనులు.

AP 9th Class Social Notes Chapter 19 విస్తరిస్తున్న ప్రజాస్వామ్యం 3