AP Inter 2nd Year Zoology Study Material Chapter 6 జన్యు శాస్త్రం

Andhra Pradesh BIEAP AP Inter 2nd Year Zoology Study Material 6th Lesson జన్యు శాస్త్రం Textbook Questions and Answers.

AP Inter 2nd Year Zoology Study Material 6th Lesson జన్యు శాస్త్రం

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ప్లియోట్రోపి అంటే ఏమిటి ?
జవాబు:
ఒకే జన్యువు ఎక్కువ దృశ్యరూపాలను ప్రభావితం చేసే దృగ్విషయాన్నే ప్లియోట్రోపి అంటారు.
ఉదా: ఫినైల్ కీటోన్యూరియా

ప్రశ్న 2.
‘ABO’ రక్త గ్రూపులలో ఉండే ప్రతిజనకాలు ఏవి ? అవి ఎక్కడ ఉంటాయో తెలపండి.
జవాబు:
ABO రక్త గ్రూపులో ప్రతిజనకం – A (ఐసోఅగ్లూటినోజెన్-A), ప్రతిజనకం B (ఐసోఅగ్లూటినోజ్న్ – B) లు ఉంటాయి. ఈ ప్రతిజనకాలు RBC ఉపరితలం మీద ఉంటాయి.

AP Inter 2nd Year Zoology Study Material Chapter 6 జన్యు శాస్త్రం

ప్రశ్న 3.
ABO రక్త వర్గాలలోని ప్రతిదేహాలు ఏవి ? అవి ఎక్కడ ఉంటాయి ?
జవాబు:
ABO రక్తవర్గంలో యాంటి-A, యాంటి-B అనే ప్రతిదేశాలు ఉంటాయి. ఈ ప్రతిదేహాలు రక్తంలోని ప్లాస్మాలో ఉంటాయి.

ప్రశ్న 4.
బహుళయుగ్మ వికల్పాలు అంటే ఏమిటి ?
జవాబు:
ఒక జన్యువుకు సమజాత క్రోమోజోమ్లోని ఒకే స్థానం వద్ద రెండు కంటె ఎక్కువ యుగ్మ వికల్పాలు ఉంటే వాటిని బహుళ యుగ్మ వికల్పాలు అంటారు.
ఉదా: మానవులలో ABO రక్త వర్గాలు

ప్రశ్న 5.
ఎరిత్రోబ్లాస్టోసిస్ ఫీటాలిస్ అంటే ఏమిటి ?
జవాబు:
Rh కారకం అననుగుణ్యత వల్ల తల్లి గర్భంలో వృద్ధి చెందే భ్రూణంలో ఏర్పడే రోగనిరోధకతా అపస్థితినే ఎరిత్రోబ్లాస్టోసిస్ ఫీటాలిస్ అంటారు.
Rh+ve తండ్రికి, Rh-ve తల్లికి జన్మించే రెండవ శిశువులో ఈ అపస్థితి కలుగుతుంది.

ప్రశ్న 6.
ఒక శిశువు రక్త వర్గం ‘O’ తండ్రి రక్త వర్గం A, తల్లి రక్త వర్గం B అయితే జనకుల జన్యురూపాలను, జన్మించబోయే శిశువుల జన్యురూపాలను కనుక్కోండి.
జవాబు:
శిశువు రక్తం వర్గం ‘0’, దీని జన్యురూపం IOIO. ఈ యుగ్మ వికల్పాలలో ఒకటి తండ్రి నుంచి మరొకటి తల్లి నుంచి వస్తుంది. కాబట్టి తండ్రి రక్త వర్గం A కు జన్యురూపం IAIO గాను, తల్లిరక్త వర్గం -B కు జన్యురూపం IBIO గాను ఉంటుంది.
AP Inter 2nd Year Zoology Study Material Chapter 6 జన్యు శాస్త్రం 1

జన్మించబోయే శిశువుల జన్యురూపాలు:
IAIB — AB రక్త వర్గం
IAIO — A రక్త వర్గం
IBIO — B రక్త వర్గం
IOIO — O రక్త వర్గం

ప్రశ్న 7.
మానవులలో ABO రక్త సముదాయ వ్యవస్థ ఏర్పడటానికి జన్యు ఆధారమేమిటి ?
జవాబు:
I అనే జన్యువు యొక్క మూడు యుగ్మ వికల్పాలు రక్త వర్గం ఏర్పడటానికి కారణాలు అవి IAIB మరియు IO

IAIA / IAIO — A రక్త వర్గం
IBIB / IBIO — B రక్త వర్గం
IAIB — A రక్త వర్గం
IOIO — O రక్త వర్గాలకు జన్యు ఆధారాలు.

ప్రశ్న 8.
బహుజన్యు ఆనువంశికత అంటే ఏమిటి ?
జవాబు:
ఏదేని ఒక లక్షణం అనువంశికతను రెండు లేదా ఎక్కువ జన్యువులు ఒక సమూహంగా ఏర్పడి నియంత్రించే స్థితిని బహుజన్యు ఆనువంశికత అంటారు.
ఉదా: మానవుడిలో చర్మంరంగు, ఎత్తు, బరువు మొదలైనవి.

AP Inter 2nd Year Zoology Study Material Chapter 6 జన్యు శాస్త్రం

ప్రశ్న 9.
డ్రోసోఫిలాలోను మానవుడిలో Y క్రోమోజోమ్ ప్రాముఖ్యతను పోల్చండి.
జవాబు:
మానవుడిలో పురుష లింగ నిర్ధారణలో ‘Y క్రోమోజోమ్పై ఆధారపడి ఉంటుంది. కాబట్టి క్రోమోజోము బట్టి లింగ నిర్ధారణ జరుగుతుంది.
డ్రోసోఫిలంలో లింగ నిర్ధారణలో ‘Y’ క్రోమోజోమ్ పాత్రలేదు. కాని దానిపై ఉండే జన్యువులు పురుషఫలిత్వాన్ని చేకూర్చుతాయి.

ప్రశ్న 10.
విషమసంయోగబీజ, సమసంయోగబీజ లింగనిర్ధారణ మధ్య భేదమేమిటి ?
జవాబు:
విషమసంయోగబీజ లింగనిర్ధారణ

  1. లైంగిక క్రోమోజోమ్లు భిన్నంగా ఉన్నట్లయితే దానిని విషమసంయోగబీజోత్పాదకం అంటారు.
  2. ఇవి రెండు రకాల బీజాలను ఉత్పత్తి చేస్తాయి.
  3. ఇవి లింగ నిర్ధారణలో ముఖ్యపాత్ర వహిస్తాయి.

సమసంయోగబీజ లింగనిర్ధారణ

  1. లైంగిక క్రోమోజోమ్లు ఒక విధంగా ఉన్నట్లయితే దానిని సమసంయోగబీజోత్పాదకం అంటారు.
  2. ఇవి ఒకే రకమైన బీజాలను ఉత్పత్తి చేస్తాయి.
  3. వీటి అంతట ఇవి మాత్రమే లింగ నిర్ధారణను చేయలేవు.

ప్రశ్న 11.
ఏక – ద్వయస్థితిక (హప్లోడిప్లాయిడీ) అంటే ఏమిటి ?
జవాబు:
ఏక-ద్వయస్థితిక ఆధారంగా కీటకాలలో, చీమలలో కందిరీగలలో లింగనిర్ధారణ జరుగుతుంది. వీటిలో క్రోమోజోమ్ జంటల సంఖ్యను బట్టి సంతాన జీవి లింగలక్షణం నిర్ధారించబడుతుంది.

ఉదా: తేనెటీగలో ఫలదీకరణం చెందిన అండాలు (ద్వయస్థితిక) స్త్రీజీవులుగాను ఫలదీకరణం చెందని అండాలు (ఏకస్థితిక) పురుష ఈగలుగాను మారుతాయి. అంటే మగ ఈగలు సగం క్రోమోజోమ్ లు కలిగి ఏకస్థితిక లక్షణాన్ని, ఆడఈగలు రెండు జట్ల క్రోమోజోమ్లను కలిగి ద్వయస్థితిక లక్షణాన్ని ప్రదర్శిస్తాయి.

ప్రశ్న 12.
బార్ దేహాలు అంటే ఏమిటి ?
జవాబు:
స్త్రీ జీవులలో ఉండే రెండు ‘X’ క్రోమోజోమ్లలో ఒకటి పిండ ఆరంభదశలోనే సాంద్రీయంగా చుట్టలు చుట్టుకొని గాఢంగా అభిరంజకాన్ని స్వీకరించే హెటిరోక్రోమాటిన్ గా మారి క్రియారహితం అవుతుంది. ఈ హెటిరోక్రోమాటిన్గా మారిన ఈ X – క్రోమోజోము బార్ దేహం అంటారు. ఈ దృగ్విషయాన్ని మొదట ముర్రె L. బార్ తెలియజేశాడు.

ప్రశ్న 13.
క్లైన్ ఫెల్టర్స్ సిండ్రోమ్ అంటే ఏమిటి ? దాని కారియోటైప్ తెలపండి.
జవాబు:
23వ క్రోమోసోమ్ ట్రైసోమివల్ల ఈ జన్యు అపక్రమం ఏర్పడుతుంది. కైన్ఫెల్టర్స్ పురుషులలో ఒక X – క్రోమోజోమ్ అదనంగా ఉంటుంది.
కారియోటైప్: 47, XXY అని సూచిస్తారు.
లక్షణాలు: గడ్డాలు, మీసాలు పలుచగా ఉండటం, స్త్రీలవలే రొమ్ములు పెద్దగా, పిరుదులు గుండ్రంగా ఉంటాయి. ముష్కాలు పూర్ణాభివృద్ధి చెంది ఉండవు అందువల్ల వీరు వంధ్యాజీవులు

ప్రశ్న 14.
టర్నర్ సిండ్రోమ్ అంటే ఏమిటి ? దాని కారియోటైప్ తెలపండి.
జవాబు:
టర్నర్ సిండ్రోమ్లు అసంపూర్ణంగా అభివృద్ధి చెందిన స్త్రీలు, వీరిలో మొత్తం 45 క్రోమోజోమ్లు ఉంటాయి. అంటే వీరిలో సాధారణ సంఖ్య కంటే ఒక క్రోమోజోమ్ తక్కువగా ఉంటుంది. (మోనోసోమి 23)
కారియోటైప్: 45, × (44 + X O)
లక్షణాలు: మెడవెడల్పు ఉండి, రొమ్ములు చదునుగా, వెడల్పుగా ఉంటాయి.
వీరిలో స్త్రీబీజకోశాలు అభివృద్ధి చెంది ఉండవు.

ప్రశ్న 15.
డౌన్ సిండ్రోమ్ అంటే ఏమిటి ? అది ఎలా ఏర్పడుతుంది ?
జవాబు:
ఇది ప్రధానంగా కనిపించే ఆటోజోమ్ అపస్థితి. 21వ జత క్రోమోజోమ్లతో పాటు అదనంగా మరొక ప్రతి ఉండటం వల్ల ఈ జన్యు అపక్రమం ఏర్పడుతుంది.
కారియోటైప్: 47, XX + 21
లక్షణాలు: పొట్టి దేహం, గుండ్రటి చిన్నదైన తలను కలిగి పాక్షికంగా ఎప్పుడూ తెరుచుకొని ఉండే నీరు, గాడి కలిగిన నాలుక కలిగి ఉంటారు. మానసిక అభివృద్ధి కుంటుపడి ఉంటుంది.

ప్రశ్న 16.
లైయోనైజేషన్ అంటే ఏమిటి ?
జవాబు:
స్త్రీల దైహిక కణాలలో గల రెండు X క్రోమోజోమ్లలో ఒకటి మాత్రం క్రియాశీలంగా ఉండి మిగిలిన X – క్రోమోజోమ్ క్రియారహితమై బార్ దేహాలుగా మారిపోతాయి. ఈ విధంగా X – క్రోమోజోమ్ క్రియారహితంగా మారుటను లయోనైజేషన్ అంటారు.

ప్రశ్న 17.
లింగసహలగ్నత అనువంశికత అంటే ఏమిటి ?
జవాబు:
లైంగిక క్రోమోజోమ్లపై ఉండే జన్యువులతో నిర్ధారింపబడే లక్షణాల అనువంశికతనే లింగసహలగ్న అనువంశికత అంటారు.
ఉదా: వర్ణ అంధత్వం, హీమోఫీలియా మొదలైనవి.

ప్రశ్న 18.
అర్ధయుగ్మజ స్థితిని నిర్వచించండి.
జవాబు:
క్రోమోజోమ్ల అసమజాత భాగాలలో ఉండే జన్యువులస్థితిని అర్ధయుగ్మజ స్థితి అంటారు. ఈ జన్యువులకు సంబంధించిన యుగ్మ వికల్పాలు వాటి జత క్రోమోజోమ్లలో ఉండవు.
ఉదా: X – క్రోమోజోమ్పై మాత్రమే ఉండి Y క్రోమోజోమ్పై లేని జన్యువులు.
Y – క్రోమోజోమ్ పై మాత్రమే ఉండి X క్రోమోజోమ్పై లేని జన్యువులు.

ప్రశ్న 19.
క్రిస్ – క్రాస్ అనువంశికత అంటే ఏమిటి ?
జవాబు:
X – సహలగ్న అంతర్గత జన్యువులు తండ్రి నుంచి అతని కుమార్తెకు F, తరంలో చేరి, కుమారై ఆ లక్షణానికి వాహకంగా పనిచేసే, F తరంలో ఆమె కుమారులలో సగం మందికి అంతర్గత జన్యువులను అందిస్తుంది. ఈ విధంగా X- సహలగ్న అంతర్గత జన్యువులు F,, తరాన్ని దాటవేసి, F తరంలో ప్రస్ఫుటమవుటను క్రిస్-క్రాస్ అనువంశికత అంటారు.

ప్రశ్న 20.
లింగ – సహలగ్నత అంతర్గత లక్షణాలు పురుషులలోనే ఎక్కువగా కనిపించడానికి గల కారణమేమిటి.
జవాబు:
లింగ సహలగ్నత అంతర్గత లోణాలు X క్రోమోసోమ్ ద్వారా సంక్రమిస్తుంది. పురుషులలో ఒక X- క్రోమోజోమ్ మాత్రమే ఉండం వల్ల చాలావరకు పురుషలలో ఈ అంతర్గత లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. స్త్రీలలో రెండు X- క్రోమోజోమ్లు ఉండటం వల్ల వారు ఈ అపస్థితుల నుండి తప్పించుకునే అవకాశం ఉంటుంది.

AP Inter 2nd Year Zoology Study Material Chapter 6 జన్యు శాస్త్రం

ప్రశ్న 21.
లింగ పరిమితి లక్షణాలు ఏవి ?
జవాబు:
లింగపరిమితి జన్యువులు స్త్రీ, పురుష జీవులు రెండింటిలోనూ దైహిక క్రోమోజోమ్లపై ఉంటాయి. కాని అంతర్గత హార్మాన్ల వాతావరణం వల్ల ఈ లక్షణాల దృశ్యరూప వ్యక్తీకరణ ఒక లింగానికి మాత్రమే పరిమితమై ఉంటుంది. దీనినే లింగపరిమితి లక్షణాలు అంటారు.
ఉదా: పురుషులలో గడ్డం పెరగడం, స్త్రీలలో స్తనాలు అభివృద్ధి చెందడం, క్షీర ఉత్పత్తి మొదలైనవి.

ప్రశ్న 22.
లింగ ప్రభావిత లక్షణాలు ఏవి ?
జ:
ఆడ, మగ జీవుల దైహిక క్రోమోజోమ్లపై ఉండి వేర్వేరు లింగాలలో భిన్న దృశ్యరూప వ్యక్తీకరణలను కలిగి ఉండుటను లింగ ప్రభావిత లక్షణాలు అంటారు.
ఉదా: మానవులలో పాట్రన్ బట్టతల, డార్సెట్ కొమ్ముల గొర్రెలో కొమ్ములు.

ప్రశ్న 23.
మానవ జీనోంలో గల క్షార జతలు ఎన్ని ? మానవ జన్యువులోని సరాసరి క్షారజతలు ఎన్ని ?
జవాబు:
మానవ జీనోంలో 3,164.7 మిలియన్ల నత్రజని క్షారజంటలు ఉంటాయి.
ఒక జన్యువులో సరాసరి 3000 క్షార జంటలు ఉంటాయి.

ప్రశ్న 24.
VNTRS అంటే ఏమిటి ?
జవాబు:
ఇవి వివిధ సంఖ్యలలో నత్రజని క్షారాలు కలిగిన పొట్టి పునరపి DNA వరుసక్రమాలు. వీటిలో 10 నుంచి 100 వరకు న్యూక్లియోటైడ్లు మళ్ళీ మళ్ళీ పునరావృతమవుతూ ఉంటాయి. ఏ ఇద్దరి వ్యక్తులలోనూ వీటి వరుసక్రమాలు సమానంగా ఉండవు.

ప్రశ్న 25.
DNA ఫింగర్ ప్రింటింగ్ టెక్నాలజీ యొక్క రెండు అనువర్తనాలను పేర్కొనండి.
జవాబు:
మెడికో – లీగల్ వివాదాల పరిష్కారం: మాతృత్వాన్ని లేదా / మరియు పితృత్వాన్ని ఖచ్చితంగా కనుగొనవచ్చు. ఫోరెన్సిక్ విశ్లేషణ: దొంగలను, హంతకులను, మానభంగం చేసిన వారిని గుర్తించవచ్చు.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
జన్యుశాస్త్రం అభివృద్ధికి T.H మోర్గాన్ చేసిన కృషిని వివరించండి.
జవాబు:
క్రోమోజోమల్ అనువంశికా సిద్ధాంతాన్ని ప్రయోగపూర్వకంగా నిరూపించడానికి థామర్ మోర్గాన్ డ్రాసోఫిలా మెలనో గాస్టర్ అనే జాతి ఈగపై పరిశోధనలుచేసి లైంగిక ప్రత్యుత్పత్తి వల్ల కలిగే వైవిధ్యాలను బహిర్గతం చేసినాడు.

T.H మోర్గాన్ F తరం ద్విసంకరణ జాతిని, పరీక్షా సంకరణం చేయుటద్వారా ఏర్పడ్డ పిల్లజీవులలో ఎక్కువశాతం జనకుల దృశ్యరూపాలను పోలిఉంటాయిని, ఒకే క్రోమోజోమ్పై దగ్గరగా ఉంటే జన్యువులు సమలగ్నమై ఉంటాయని నిరూపించాడు మరియు క్రోమోజోమ్ సమలగ్న సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు.

లింగ సహలగ్నతను మొదటిసారి డ్రోసోఫిలా మోలనోగాస్టర్ T.H మోర్గాన్ గుర్తించాడు. ఈ పండ్ల ఈగలో తెల్ల కళ్ల రంగును నిర్ధాగించే జన్యువు X-క్రోమోజోమ్ ద్వారా సంతానానికి సంక్రమిస్తుంది అని వివరించాడు.

జన్యుశాస్త్రానికి ఈయన చేసిన కృషికి ఫలితంగా ఈయనను ఆధునిక జన్యుశాస్త్ర పితామహుడిగా అభివర్ణిస్తారు.

ప్రశ్న 2.
వంశవృక్ష విశ్లేషణ అంటే ఏమిటి ? దాని ఉపయోగమేమి ?’
జవాబు:
ఏదైనా ఒక నిర్దిష్ట లక్షణం రెండు లేదా అంతకంటే ఎక్కువ తరాల పాటు, ఒక కుటుంబానికి చెందిన పూర్వీకులలో ఏవిధంగా సంక్రమిస్తుందో నమోదు చేసిన చిత్రపటాన్ని వంశవృక్షం అంటారు. దీన్ని శాస్త్రీయ పద్ధతిలో అధ్యయనం చేయడాన్ని వంశవృక్ష విశ్లేషణ అంటారు.

ఉపయోగాలు:

  • వంశవృక్ష విశ్లేషణ పటంలోని దృశ్యరూపాలను అధ్యయనం చేయడం ద్వారా వాటి జన్యురూపాల అనువంశికతను నిర్ధారించవచ్చు.
  • ఒక దృశ్యరూపానికి సంబంధించిన జన్యురూపం ఎలా ఉంటుందో కూడా వంశవృక్ష విశ్లేషణ చేసి గ్రహించవచ్చు.
  • ఒక నిర్దిష్ట బహిర్గత లక్షణం లేదా అంతర్గత లక్షణం ఆనువంశికతా శైలిని తెలుసుకొనుటకు ఇది సహాయపడుతుంది.
  • వంశవృక్ష విశ్లేషణ ఆధారంగా మానవునిలో మయోటోనిక్ డిస్ట్రోఫి, కొడవలి కణ రక్తహీనత వ్యాధుల సంక్రమణను తెలుసుకొనవచ్చు.

ప్రశ్న 3.
మానవులలో లింగనిర్ధారణ ఏ విధంగా జరుగుతుంది ? [T.S. Mar. ’15]
జవాబు:
మానవులలో XX-XY రకం ద్వారా లింగ నిర్ధారణ జరుగుతుంది. మానవ కారియోటైప్లో 23 జతల క్రోమోజోమ్లు ఉంటాయి. వీటిలో 22 జతలు దైహిక క్రోమోజోమ్లు మిగిలిన ఒక జత లైంగిక క్రోమోజోమ్లు. దైహిక క్రోమోజోమ్లు స్త్రీ పురుషులలో ఒకే విధంగా ఉంటాయి. కానీ లైంగిక క్రోమోజోమ్లు భిన్నంగా ఉంటాయి. స్త్రీలో ఒక జత ‘X’ క్రోమోజోమ్లు గానూ (XX), పురుషుడిలో X, Y క్రోమోజోమ్లుగానూ (XY) ఉంటాయి. పురుషుల్లో శుక్రకణోత్పాదన సమయంలో రెండు రకాల శుక్రకణాలు ఉత్పత్తి అవుతాయి. మొత్తం శుక్రకణాలలో 50 శాతం X క్రోమోజోమ్లని మిగిలిన 50 శాతం ‘Y క్రోమోజోమ్లని కలిగి ఉంటాయి. కానీ స్త్రీలు కేవలం ఒకే రకం. అండకణాలను ఉత్పత్తి చేస్తారు. అన్ని అండ కణాలలో ఒక ‘X’ క్రోమోజోమ్ మాత్రం ఉంటుంది. అండకణాలను ఫలదీకరించే అవకాశం ‘X’ క్రోమోజోమ్ కలిగిన శుక్రకణాలకూ, Y క్రోమోజోమ్ కలిగిన శుక్రకణాలకూ సమానంగా ఉంటుంది.

అండకణం ‘X’ క్రోమోజోమ్్న కలిగిన శుక్రకణంతో ఫలదీకరణ చెందితే ఆడశిశువు, ‘Y’ క్రోమోజోమ్ కలిగిన శుక్రకణంతో ఫలదీకరణం చెందితే మగశిశువు గానూ సంయుక్త బీజకణం అభివృద్ధి చెందుతుంది. ఈ విధంగా మానవులలో పుట్టబోయే శిశువు లింగ లక్షణం శుక్రకణంపై ఆధారపడి ఉంటుంది.
AP Inter 2nd Year Zoology Study Material Chapter 6 జన్యు శాస్త్రం 2

ప్రశ్న 4.
ఎరిత్రో బ్లాస్టోసిస్ ఫిటాలిస్ ను వివరించండి. [A.P. & T.S. Mar.’17; A.P. Mar. ’16 Mar. ’14]
జవాబు:
Rh కారకం అననుగుణ్యత వల్ల తల్లి గర్భంలో వృద్ధి చెందే భ్రూణంలో ఏర్పడే రోగనిరోధకతా అపస్థితినే ఎరిత్రో బ్లాస్టోసిస్ ఫీటాలిస్ అంటారు.

AP Inter 2nd Year Zoology Study Material Chapter 6 జన్యు శాస్త్రం

సాధారణంగా ఈ అపస్థితి Rh+ve పురుషుడు Rh-ve స్త్రీని వివాహం చేసుకుంటే, వారికి జన్మించే రెండో Rh+ve గర్భస్థ శిశువులో సంభవించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే మొదటి శిశువు సాధారణంగా జన్మిస్తుంది. మొదటి శిశువు జనన సమయంలో విచ్ఛిన్నమైన జరాయువు ద్వారా Rh (భూణా రక్తం Rh-ve తల్లి రక్తంలోనికి ప్రవేశిస్తుంది. Rh ప్రతిజనకం లేని తల్లి రోగనిరోధక వ్యవస్థ Rh కారకం కలిగిన భ్రూణ రక్తాన్ని గుర్తించి సున్నితత్వం కలుగజేస్తుంది. ఈ విధంగా సున్నితత్వం చెందిన తల్లి రోగనిరోధక వ్యవస్థ Rh ప్రతిజనకానికి వ్యతిరేకంగా ప్రతిదేహాలను ఉత్పత్తి చేస్తుంది. ఇవి IG రకానికి చెందిన ఇమ్యునోగ్లోబులిన్లు. రెండవ గర్భంలో కూడా Rh+ve భ్రూణం ఏర్పడితే, తల్లి రక్తంలో ఏర్పడి ఉన్న Rh ప్రతిదేహాలు. జరాయువు ద్వారా భ్రూణ రక్తప్రసరణలోనికి ప్రవేశించి ఎర్రరక్తకణాలని విచ్ఛిన్నం చేస్తాయి. ఈ విచ్ఛిన్నం వల్ల విడుదలయ్యే హీమోగ్లోబిన్ ప్లాస్మాలో కలిసిపోతుంది. అందువల్ల కామెర్లు వ్యాధి వస్తుంది. రక్తకణాల విచ్ఛిన్నత వల్ల కలిగే లోటును భర్తీ చేయడానికి ఎముకమజ్జ, ప్లీహం, కాలేయంలో ఎర్రరక్త కణోత్పాదన జరుగుతుంది. ఫలితంగా అపరిపక్వ ఎర్రరక్త కణాలు అనగా ఎరిత్రోబ్లాస్ట్లు భ్రూణరక్త ప్రసరణలోకి విడుదలవుతాయి. దీనినే ఎరిత్రోబ్లాస్టోసిస్ ఫిటాలిస్ అంటారు.

ప్రశ్న 5.
ఏవైనా రెండు జన్యు అపస్థితులను తెలిపి, వాటి లక్షణాలను తెలియజేయండి.
జవాబు:
కొడవలి – కణ రక్తహీనత: కొడవలి – కణ రక్తహీనత దైహిక క్రోమోజోమ్ ద్వారా సంభవించే అంతర్గత జన్యు అపస్థితి. ఈ వ్యాధి కలిగిన వారి ఎర్రరక్తకణాలు తక్కువ ఆక్సిజన్ గల వాతావరణంలో అసాధారణంగా, ధృడంగా ఉండే కొడవలి ఆకారాన్ని పొందుతాయి.

హీమోగ్లోబిన్ అణువులోని బీటా గ్లోబిన్ పాలీపెప్టైడ్ శృంఖలాన్ని సంకేతించే DNA లో జరిగే బిందు ఉత్పరివర్తన ఫలితంగా ఈ వ్యాధి కలుగుతుంది. ఈ శృంఖలం యొక్క 6వ స్థానంలో గ్లుటామిక్ ఆమ్లం అనే అమైనో ఆమ్లం స్థానాన్ని వాలీన్ అనే అమైనో ఆమ్లం ప్రతిక్షేపించడం వల్ల కొడవలి కణ రక్తహీనత వ్యాధి కలుగుతుంది.

లక్షణాలు: కొడవలి రక్తకణాలు, పెలుసుదనంగా ఉండటం వల్ల ఇది త్వరగా విచ్ఛినం చెందుతాయి ఫలితంగా నికిల్ సెల్ ఎనిమియం వస్తుంది.
ఈ కొడవలి కణాలు ఒకదానితో ఒకటి అతుక్కొని, పోగుపడి సన్నని రక్తనాళాలలో రక్త ప్రవాహానికి అడ్డుపడతాయి. అందువల్ల శరీరక బలహీనత, నొప్పి, అవయవ హాని, కొన్ని సార్లు పక్షవాతం రావడానికి కారణమవుతాయి.

ఫీనైల్ కీటోన్యూరియా: ఇది దైహిక క్రోమోజోమ్ వల్ల కలిగే ఒక జీవక్రియా అపస్థితి, 12వ క్రోమోజోమ్పై ఉండే ఫినైల్ అలసిన్ హైడ్రాక్సిలేజ్ జన్యువులో కలిగే ఉత్పరివర్తన ఫలితంగా ఈ అపస్థితి ఏర్పడుతుంది. జన్యు ఉత్పరివర్తన వల్ల ఫినైల్ అలనిన్ హైడ్రాక్సిలేస్ అనే కాలేయ ఎన్ఎమ్ క్రియారహితమవుతుంది. సాధారణంగా ఈ ఎన్జైమ్ ఫినైల్ అలనిన్ అనే అమైనో ఆమ్లాన్ని టైరోసిన్గా మారుస్తుంది. ప్రభావిత వ్యక్తుల్లో ఈ ఎన్జైమ్ క్రియాశీలత క్షీణించటం వల్ల కణాల్లో ఫీనైల్ అలనిన్ పోగై ఫినైల్ పైరువేట్గాను, ఇతర ఉత్పన్నాలుగా మారుతుంది. ఇది మూత్రం ద్వారా విసర్జింపబడతాయి. దీన్ని పినైల్ కీటో న్యూరియా అంటారు.

లక్షణాలు: మెదడు కణజాలంలో ఈ జీవక్రియా పదార్థాలు సంచయనం కావడం వల్ల మానసిక అభివృద్ధి మందగిస్తుంది. సరిగ్గా నడవడం, మాట్లాడలేకపోవడం, పెరుగుదల సరిగ్గా లేకపోవడం మొదలైనవి.

ప్రశ్న 6.
ABO రక్తసముదాయాల జన్యు ఆధారాన్ని వివరించండి.
జవాబు:
మానవ 9వ దైహిక క్రోమోజోమ్ పై ఉండే I అనే జన్యువు మూడు యుగ్మ వికల్పాల అంతరచర్యల ఫలితంగా A, B, AB, O అనే నాలుగు దృశ్యరూపకాలు ఏర్పడతాయని బెర్టెయిన్ కనుగొన్నాడు. IA, IB యుగ్మ వికల్పాల వల్ల RBC ఉపరితలంపై A, B ప్రతిజనకాలు ఉత్పత్తి అవుతాయి. IO యుగ్మ వికల్పం ఎటువంటి ప్రతిజనకాన్ని ఉత్పత్తి చేయదు. IAIB లు బహిర్గత యుగ్మవికల్పాలు బహిర్గతత్వాన్ని చూపుతాయి. IO ఒక అంతర్గత యుగ్మవికల్పం. IAIB యుగ్మ వికల్పాలు సహబహిర్గతాలు. ఇవి రెండూ IO పై బహిర్గతను ప్రదర్శిస్తాయి.

(IA = IB > IO)

IA, IB, IO అనే యుగ్మవికల్పాలలో ఎవైనా రెండింటిని మాత్రం శిశువులు వారి తల్లిదండ్రులను నుంచి పొందుతారు. ఈ విధమైన సంక్రమణ వల్ల మూడు యుగ్మ వికల్పాలు మొత్తం ఆరు జన్యురూపాలు, నాలుగు రక్తవర్గాలు గల శిశువులను ఏర్పరచగలవు.
జన్యురూపాలు – IAIA, IAIO, IBIB, IBI0O, IAIB, IOIO,
దృశ్యరూపాలు – A, B, AB, O
A రక్త వర్గ జన్యురూపాలు – IAIA, IAIO
B రక్త వర్గ జన్యురూపాలు – IBIB, IBIO
AB రక్త వర్గ జన్యురూపం – IAIB
O రక్త వర్గ జన్యురూపం – IOIO

ప్రశ్న 7.
విషమ సంయోగబీజ పురుషలింగ నిర్ధారణను వివరించండి.
జవాబు:
ఈ విధానంలో పురుష జీవులు రెండు రకాల శుక్రకణాలను ఉత్పత్తి చేస్తాయి. అండంతో ఫలదీకరణం చెందే శుక్రకణాన్ని బట్టి లింగ నిర్ధారణ జరుగుతుంది. దీన్ని XX-XY పద్ధతి, XX-XO పద్ధతి అని రెండు రకాలుగా వివరించవచ్చు.

i) XX-XY – పద్ధతి: ఈ రకం లాగ నిర్ధారణ మానవుడిలోనూ, డ్రోసోఫిలాలోను కనిపిస్తుంది. స్త్రీ జీవి రెండు ‘X’ క్రోమోజోమ్లను కలిగి ఉండి అండోత్పత్తి జరిగినప్పుడు ‘X’ క్రోమోజోమ్ కలిగిన అండాలను ఉత్పత్తి చేస్తుంది. పురుషజీవి ‘XY’ క్రోమోజోమ్లను కలిగి ఉండి శుక్రకణోత్పత్తి జరిగినప్పుడు 50శాతం ‘X’ క్రోమోజోమ్లను కలిగిన శుక్రకణాలను 50 శాతం Y క్రోమోజోమ్ కలిగిన శుక్రకణాలను ఉత్పత్తి చేస్తుంది.

ఫలదీకరణ సమయంలో ‘X’ – అండం శుక్రకణంతో కలిస్తే పురుష జీవిగానూ (XY), X శుక్రకణంతో కలిస్తే Y – జీవి (XX) గానూ వృద్ధి చెందుతాయి.
AP Inter 2nd Year Zoology Study Material Chapter 6 జన్యు శాస్త్రం 3

(ii) XX-XO పద్ధతి: ఈ రకం లింగ నిర్ధారణ నల్లులు, బొద్దింకలు, మిడతలు వంటి కీటకాలలో జరుగుతుంది. వీటిలో స్త్రీజీవి రెండు ‘X’ క్రోమోజోమ్లు కలిగి ఉండి అండోత్పత్తి జరిగినపుడు ‘X’ క్రోమోజోమ్ కలిగిన అండాలను ఉత్పత్తి చేస్తుంది. పురుషజీవి’ ఒక ‘X’ క్రోమోజోమ్ మాృతమే కలిగి ఉండి శుక్రకణోత్పత్తి జరిగినప్పుడు సగం శుక్రకణాలు ‘X’ క్రోమోజోమ్ ఉండి మిగిలిన సగం ‘X’ క్రోమోజోమ్ లేని శుక్రకణాలను ఉత్పత్తి చేస్తాయి. ఫలదీకరణ సమయంలో ‘X’ – అండం, ‘X’- శుక్రకణంతో కలిస్తే స్త్రీజీవిగాను (XO), XX-క్రోమోజోమ్లోని శుక్రకణంతో కలిస్తే పురుషజీవి (XO) గాను వృద్ధి చెందుతాయి.
AP Inter 2nd Year Zoology Study Material Chapter 6 జన్యు శాస్త్రం 4

ప్రశ్న 8.
విషమ సంయోగబీజ స్త్రీ లింగ నిర్ధారణను వివరించండి.
జవాబు:
ఈ విధానంలో స్త్రీ జీవులు విషమసంయోగ బీజోత్పాదకంగానూ, పురుషజీవులు సమసంయోగ బీజోత్పాదకంగానూ ఉంటాయి. ఈ విధానంలో లింగనిర్ధారణను ZZ-ZW రకం ZO-ZZ రకం అని రెండుగా విభజించినారు.

AP Inter 2nd Year Zoology Study Material Chapter 6 జన్యు శాస్త్రం

ZZ−ZW పద్ధతి: ఈ రకం లింగ నిర్ధారణ పక్షులు, సరీసృపాలు, కొన్ని చేపలలో జరుగుతుంది. వీటిలో స్త్రీ జీవి సగభాగం W – క్రోమోజోమ్ అండాలను, సగభాగం Z – క్రోమోజోమ్ అండాలనూ ఉత్పత్తి చేస్తుంది. పురుషజీవి అన్ని Z- శుక్రకణాలను మాత్రమే ఉత్పత్తి చేస్తుంది. ఫలదీకరణలో Z- శుక్రకణం, Z అండంతో కలిస్తే పురుషజీవి (ZZ), W- అండంలో కలిస్తే స్త్రీ జీవి (ZW) ఏర్పడతాయి.
AP Inter 2nd Year Zoology Study Material Chapter 6 జన్యు శాస్త్రం 5

ZZ–ZO పద్ధతి: ఈ రకం లింగనిర్ధారణ సీతాకోకచిలుకలు, కొన్ని మాత్లలోనూ జరుగుతుంది. వీటిలో స్త్రీ జీవులు సగభాగం Z – అండాలను, సగభాగం అండాలు 2 క్రోమోజోమ్ లేకుండా (0- అండం) ఉత్పత్తి చేస్తాయి. పురుష జీవులు Z – శుక్రకణాలను ఉత్పత్తి చేస్తాయి. ఫలదీకరణ సమయంలో Z- శుక్రకణం, Z- అండంతో కలిస్తే పురుషజీవి (ZZ), O – అండంతో కలిస్తే స్త్రీజీవి (ZO) ఏర్పడతాయి.
AP Inter 2nd Year Zoology Study Material Chapter 6 జన్యు శాస్త్రం 6

ప్రశ్న 9.
డ్రోసోఫిలా లింగనిర్ధారణలో జన్యుతుల్య సిద్ధాంతాన్ని వివరించండి. [A.P. Mar. ’15]
జవాబు:
డ్రోసోఫిలాలో లింగనిర్ధారణను వివరించడానికి C.B బ్రిడ్జెస్ జన్యు సంతుల సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాడు. ఈ సిద్ధాంతం ప్రకారం డ్రోసోఫిలా లింగ లక్షణం X-క్రోమోసోమ్లపై ఉండే స్త్రీ జన్యువులకూ, ఆటోసోమ్లపై ఉండే పురుష జన్యువులకూ గల సంతులనంపై ఆధారపడి ఉంటుంది. పురుష లింగనిర్ధారణలో Y క్రోమోసోమ్కు ఎటువంటి పాత్రలేదు. కాని దానిపై ఉండే జన్యువులు పురుష ఫలత్వాన్ని చేకూర్చుతాయని బ్రిడ్జెస్ నిర్ధారించాడు. కాబట్టి డ్రోసోఫిలా లింగలక్షణం ఆ జీవిలోని X-క్రోమోసోమ్ల సంఖ్య మరియు ఆటోసోమ్ జంటల సంఖ్య నిష్పత్తిని అనుసరించి ఉంటుంది. దీన్ని లింగసూచిక నిష్పత్తి అంటారు.
AP Inter 2nd Year Zoology Study Material Chapter 6 జన్యు శాస్త్రం 7

పై సమీకరణంలో X -క్రోమోజోమ్ విలువ 1.5 గానూ ఒక ఆటోసోమ్ జంట పులింగ నిర్ధారిత విలువ 1 గానూ తీసుకుంటారు. డ్రోసోఫిలాలో లింగసూచిక నిష్పత్తి (X/A). 1.0గా ఉంటే స్త్రీ జీవిగానూ, 0.5గా ఉంటే పురుషజీవిగానూ వృద్ధి చెందుతాయి. (X/A) విలువ 0.5 కు, 1.0 కు మధ్య ఉంటే (1.5) అధిస్త్రీ జీవిగానూ, 0.5 కంటే తక్కువగా ఉండే అది అధిపురుషజీవి (0.33)గానూ అభివృద్ధి చెందుతాయి.
AP Inter 2nd Year Zoology Study Material Chapter 6 జన్యు శాస్త్రం 8

మరో ప్రయోగంలో బ్రిడ్జెస్ ఒక త్రయస్థితిక ఆడ డ్రోసోఫిలాను (3A-XXX), సాధారణ మగ డ్రోసోఫిలా (2AXY) తో సంపర్కపరచినపుడు వాటి సంతతిలో సాధారణ ద్వయస్థితిక స్త్రీ, పురుష జీవులతో పాటూ, త్రయస్థితిక ఆడజీవులు, సమలింగ జీవులు, అధిపురుషజీవులు, అధిస్త్రీ జీవులు లాంటి అసాధారణ ఈగలు ఏర్పడటాన్ని గమనించాడు.
AP Inter 2nd Year Zoology Study Material Chapter 6 జన్యు శాస్త్రం 9

ప్రశ్న 10.
మానవుడిలో లింగ సహలగ్నతా అంతర్గత లక్షణం సంక్రమణ విధానాన్ని తెలపండి.
జవాబు:
మానవులలో X- క్రోమోజోమ్ జన్యువులలో కొన్ని ఉత్పరివర్తనలకు లోనై అంతర్గత జన్యువులుగా మారతాయి. వీటి వల్ల కొన్ని అపస్థితులు కనిపిస్తాయి.
ఉదా: వర్ణాంధత్వం, హిమోఫిలియా మొదలైనవి.

వర్ణఅంధత్వం: ఇది X- సహలగ్న అంతర్గత అపస్థితి. మానవుడి కంటి రెటీనాలో ఎరుపు, ఆకుపచ్చ, రంగులను గుర్తించే శంఖుకణాలు ఉంటాయి. వర్ణాంధత్వం గలవారు ఎరుపు, ఆకుపచ్చ లేదా నీలి వర్ణాలలో ఏదో ఒక రంగును లేదా మూడు రంగులను గుర్తించలేకపోతారు.

సాధారణ దృష్టిగల ఒక స్త్రీ (XX), వర్ణాంధత్వం గల పురుషుడిని (XY) వివాహమాడినట్లయితే కుమారులు, కుమార్తెలందరూ సాధారణంగా ఉంటారు. కానీ కుమార్తెలు వర్ణాంధత్వ బహిర్గత జన్యువు ఉండే X- క్రోమోసోమ్న తల్లి నుంచి, దాని అంతర్గత జన్యువు ఉండే X-క్రోమోసోమ్ను తండ్రి నుంచి పొంది ఆ అపస్థితికి విషమయుగ్మజంగా ఉంటారు. వీరు వర్ణాంధత్వ అంతర్గత జన్యువుకు వాహకులుగా పనిచేస్తారు. ఒక వాహకస్త్రీ, సాధారణ దృష్టి గల పురుషుణ్ణి వివాహమాడినట్లయితే కుమార్తెలందరూ సాధారణ దృష్టిని కలిగి ఉంటారు. కాని కుమారులలో సగం మందికి వర్ణాంధత్వం సంక్రమిస్తుంది. మిగిలిన సగం మంది కుమారులు సాధారణ దృష్టిని కలిగి ఉంటారు.
AP Inter 2nd Year Zoology Study Material Chapter 6 జన్యు శాస్త్రం 10

వాహక స్త్రీ, సాధారణ దృష్టిగల పురుషుణ్ణి వివాహమాడినట్లయితే
AP Inter 2nd Year Zoology Study Material Chapter 6 జన్యు శాస్త్రం 11

హీమోఫీలియా: హీమోఫీలియా X- సహలగ్న అంతర్గత జన్యువు వల్ల కలిగే ఒక అపస్థితి. నిరవధిక రక్తస్రావం దీని లక్షణం. హీమోఫీలియా కలిగిన వ్యక్తులలో రక్త స్కందనం అలస్యంగా జరగడం కానీ, అసలు రక్తం గడ్డ కట్టకపోవడం గానీ జరుగుతుంది. ఫలితంగా కలిగిన నిరవధిక రక్తస్రావం వల్ల వారు మరణించే ప్రమాదముంది. దీనినే బ్లీడర్స్ వ్యాధి అని కూడా అంటారు.

హీమోఫీలియా లేని స్త్రీ కనుక హీమోఫీలియా గల పురుషుణ్ణి వివాహమాడినదో కుమారులు అందరూ హీమోఫీలియా లేకుండా ఉంటారు. కాని కుమార్తెలు వాహకులు. హీమోఫీలియా వాహకస్త్రీ, హీమోఫీలియా లేని పురుషుణ్ణి వివాహమాడినచో వారి కుమార్తెలందరికీ హీమోఫిలియా ఉండదు. కాని కుమారులులో 50 శాతం మందికి హీమోఫీలియా ఉంది. మిగిలిన 50 శాతం కుమారులు సాధారణంగా ఉంటారు.

AP Inter 2nd Year Zoology Study Material Chapter 6 జన్యు శాస్త్రం

ప్రశ్న 11.
మానవుడిలో లింగ ప్రభావిత లక్షణాల అనువంశికతను వివరించండి.
జవాబు:
ఆడ, మగ జీవుల దైహిక క్రోమోసోమ్లపై ఉండి వేర్వేరు లింగాలో భిన్న దృశ్యరూప వ్యక్తీకరణలను కలిగి ఉండి, ఒక లింగానికి చెందిన జీవులలో బహిర్గతంగానూ, వేరొక లింగానికి చెందిన జీవులలో అంతర్గతంగానూ సంక్రమించే జన్యువులను లింగ – ప్రభావిత జన్యువులు అంటారు. స్త్రీ, పురుష జీవులలోని లైంగిక హార్మోన్ల ప్రభావానికి జీవిలోని కణ వాతావరణం వేర్వేరుగా ప్రతిస్పందించడం దీనికి కారణమవుతుంది. విషమయుగ్మజ జన్యురూపాన్ని కలిగిన పురుషజీవులు ఒక రకమైన దృశ్యరూపాన్ని ప్రదర్శిస్తాయి. అదే జన్యురూపాన్ని కలిగిన స్త్రీ జీవులు దానికి భిన్నమైన దృశ్యరూపాన్ని ప్రదర్శిస్తాయి.
ఉదా: పురుషుడిలో బట్టతల
మానవునిలో బట్టతల వంశపారంపర్యత
AP Inter 2nd Year Zoology Study Material Chapter 6 జన్యు శాస్త్రం 12

బట్టతల పురుషుడు (విషమయుగ్మజ స్థితి) బట్టతల లేని (విషమయుగ్మజ స్థితి) స్త్రీతో వివాహము జరిగితే వారి సంతానం పురుషులలో 3:1 నిష్పత్తిలో స్త్రీలు అయితే 1:3 నిష్పత్తిలో బట్టతల కనిపిస్తుంది.
AP Inter 2nd Year Zoology Study Material Chapter 6 జన్యు శాస్త్రం 13
AP Inter 2nd Year Zoology Study Material Chapter 6 జన్యు శాస్త్రం 14

ప్రశ్న 12.
సాధారణ దృష్టి కలిగిన తల్లిదండ్రులకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. కుమారుడు వర్ణాంధతతో ఉన్నాడు కాని అతని పుత్రుడు సాధారణ దృష్టి కలిగి ఉన్నారు. కుమార్తె సాధారణ దృష్టితోనే ఉంది కాని ఆమెకు పుట్టిన మగ శిశువులలో ఒకరికి వర్ణాంధత, ఒకరికి సాధారణ దృష్టి సాంప్రాప్తమైనది. అయితే తల్లి, తండ్రి, కుమార్తె, కుమారుల జన్యురూపాలను వివరించండి.
జవాబు:
సాధారణ దృష్టి కలిగిన తల్లిదండ్రులకు కొడకు వర్ణాంధతతో, కూతురు సాధారణదృష్టితో ఉన్నారు. కాబట్టి వారి తల్లిదండ్రుల జన్యురూపం ఈ విధంగా ఉంటుంది.
తల్లి వాహకజీవి – X+X
తండ్రి – X+Y
AP Inter 2nd Year Zoology Study Material Chapter 6 జన్యు శాస్త్రం 15

పైన చూపబడిన దానిలో X-Y ” కలిగిన వర్ణాంధత కొడుకును సాధారణ స్త్రీతో వివాహం చేసినచో అతని కొడుకు సాధారణంగానే ఉంటాడు.
AP Inter 2nd Year Zoology Study Material Chapter 6 జన్యు శాస్త్రం 16
కొడుకులు అందరూ సాధారణంగానే ఉన్నారు.
సాధారణ చూపుగల కూతురుకు కలిగిన సంతానంలో ఆమె కొడుకులకు వర్ణాంధత వచ్చింది. కాబట్టి తాను వాహకంగా ఉన్నది అని తెలుస్తున్నది. అంటే తన జన్యురూపం X+X
పై కారణాలను బట్టి వారి జన్యురూపాలు ఈ క్రింది విధంగా ఉంటాయి.

తండ్రి జన్యురూపం — X+Y సాధారణం
తల్లి జన్యురూపం — X+X సాధారణ (వాహకము)
కొడుకు జన్యురూపం — XY వర్ణాందత
కూతురు జన్యురూపం — X+X సాధారణ (వాహకము)

ప్రశ్న 13.
వర్ణాంధత్వ తండ్రికి, సాధారణ దృష్టిగల సమయుగ్మజ తల్లికి జన్మించిన ఒక స్త్రీ ని వర్ణాంధత పురుషుడు వివాహమాడితే వారికి కలిగే ఆడసంతతిలో వర్ణాందత్వం సంక్రమించడానికి ఎంత సంభావ్యత ఉంది ?
జవాబు:
వర్ణాంధత పురుషుడికి, సాధారణ స్త్రీకి వివాహం జరిగింది. కాని స్త్రీ యొక్క తండ్రి వర్ణాంధత్వం కలిగిన వాడు కాబట్టి స్త్రీ వాహక జీవిగా ఉంటుంది. స్త్రీ యొక్క జన్యురూపం – X+X గా ఉంటుంది.
AP Inter 2nd Year Zoology Study Material Chapter 6 జన్యు శాస్త్రం 17
ఇక్కడ కూతుర్లు అందరూ వాహకాలగానే ఉంటారు. ఈ వాహకస్త్రీ, వర్ణాంధ పురుషుడుని వివాహమాడితే వారికి ఈ క్రింది విధంగా సంతానం ఉంటుంది.
AP Inter 2nd Year Zoology Study Material Chapter 6 జన్యు శాస్త్రం 18
పైన తెలిపిన దానిని బట్టి వారికి కలిగిన ఆడ సంతానంలో 50% (1/2) వారు వర్ణాంధత్వాన్ని కలిగి ఉంటారు.

AP Inter 2nd Year Zoology Study Material Chapter 6 జన్యు శాస్త్రం

ప్రశ్న 14.
విషమయుగ్మజ బట్టతల, హీమోఫీలియా లేని ఒక వ్యక్తి, బట్టతల లేని హీమోఫీలియా లేని సమయుగ్మజ స్త్రీని వివాహమాడితే వారికి కలిగే మగ సంతతిలో బట్టతల, హీమోఫీలియా సంభవించడానికి గల సంభవ్యత ఎంత ?
జవాబు:
విషమ యుగ్మజ బట్టతల, హీమోఫిలియా లేని వ్యక్తి జన్యురూపం – Bb X+Y
బట్టతలలేని హీమోఫీలియా గల సమయుగ్మజ స్త్రీ జన్యురూపం – bb XX
AP Inter 2nd Year Zoology Study Material Chapter 6 జన్యు శాస్త్రం 19

మొత్తం మగ సంతానంలో 50% మంది బట్టతల, హీమోఫిలియా గల వారు ఉంటారు.

ప్రశ్న 15.
మానవ జీనోం ప్రాజెక్ట్ ముఖ్య లక్షణాలను పేర్కొనండి.
జవాబు:
మానవ జీనోం ప్రాజెక్ట్ ముఖ్య లక్షణాలు

  1. మానవ జీనోంలో 3,164.7 మిలియన్ల నత్రజని క్షార జంటలు ఉంటాయి.
  2. మానవ జీనోంలో సుమారు 30,000 జన్యువులు ఉంటాయి.
  3. ఒక జన్యువులో సరాసరి 3000 నత్రజని క్షార జంటలు ఉంటాయి.
  4. కనుగొన్న జన్యువులలో సుమారు 50 శాతం జన్యువుల విధులు నిర్ధారించబడలేదు.
  5. జీనోం సుమారు 2% భాగం అన్ని ప్రోటీన్లకు సంకేతాలిస్తుంది.
  6. పునరపి వరుసక్రమాలు మానవ జీనోంలో అధిక భాగాన్ని ఆక్రమిస్తాయి.
  7. 1వ క్రోమోజోమ్ అధిక సంఖ్యలోనూ, (2,968) Y క్రోమోజోమ్ అతితక్కువ సంఖ్యలోనూ (231) జన్యువులను కలిగిఉంటాయి.
  8. శాస్త్రజ్ఞులు DNA లోని 1.4 మిలియన్ స్థానాల్లో ఏకక్షార భేదాలను గుర్తించారు. వీటిని ఏక న్యూక్లియోటైడ్ బహురూపకతలు (SNAPs) అంటారు.

SNPలను అధ్యయనం చేయడం ద్వారా మానవ పరిమాణామ క్రమాన్ని నిర్ధారించవచ్చు. అంతేకాకుండా వ్యాధి సన్నిహిత DNA వరుసక్రమాలు క్రోమోసోమ్లలో ఏఏ స్థానాలలో ఉన్నాయో కూడా వీటి ద్వారా కనుక్కోవచ్చు.

మానవ జీనోం ప్రాజెక్ట్ ప్రయోజనాలు:
జన్యురుగ్మతలకు కారణమైన జన్యువులను గుర్తించడానికి, వాటి జన్యుచిత్రాలను తయారుచేయడానికి, జన్యు వ్యాధులు గుర్తించి వాటికి చికిత్స, నివారణ చర్యలు సూచించడానికి HGP ఎంతగానో ఉపయోగపడుతుంది.

మానవజీనోం, ఇతర జీవుల జీనోం గురించిన సంపూర్ణ పరిజ్ఞానం వల్ల జన్యువ్యక్తీకరణ, కణాల పెరుగుదల, విభేదనం, జీవపరిణామం వంటి అంశాలు ఇంకా స్పష్టమవుతాయి.
వ్యాధులకు జన్యు ఆయుత్తత ఎంతవరకూ ఉందో తెలుసుకొని, జన్యుచికిత్స పద్ధతులు రూపొందిచవచ్చు.

వివిధ వ్యాధులకు సంబంధించి యుక్తతమ ఔషదాల రూపకల్పన చేయవచ్చు. ఈ ప్రక్రియ ద్వారా అణు వైద్యానికి పునాదులు వేయవచ్చు.
పైన తెలిపిన అంశాల వల్ల మానవ జీనోం ప్రాజెక్టును మెగా ప్రాజెక్ట్ అని అంటారు.

ప్రశ్న 16.
DNA ఫింగర్ ప్రింటింగ్ టెక్నాలజీలో అనుసరించే నియమ పద్ధతులను వివరించండి.
జవాబు:
DNA ఫింగర్ ప్రింటింగ్ ఉండే DNA అణువులోని నత్రజని క్షారాల వరుసక్రమాన్ని శాస్త్రీయంగా విశ్లేషించి, ఆ DNA ఏవ్యక్తి DNAని పోలి ఉంటుందో నిర్ధారించే పరీక్ష.

DNA ఫింగర్ ప్రింటింగ్ నియమ పద్ధతి:
1) DNA సంగ్రహణ/వేరుచేయడం: మొదటి దశలో నేరం జరిగిన ప్రాంతాల నుంచి సేకరించిన కణాల నుంచి కానీ, వ్యక్తుల వద్ద నుంచి సేకరించిన లాలాజలం, రక్తంలోని కణాల నుంచి సేకరించిన లాలాజలం, రక్తంలోని కణాలను నుంచి గాని ప్రత్యేక పద్ధతులలో DNA ని వేరుచేస్తారు.

2) DNA ఖండీకరణ: DNAను రిస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేస్ ఎంజైమ్లను ఉపయోగించి నిర్ధిష్ట స్థానాలలో ఖండించి చిన్న చిన్న ముక్కలుగా విడగొడతారు.

3) ఎలక్ట్రోఫోరెసిస్ ద్వారా DNA ఖండాలు వేరు చేయడం: వివిధ పరిమాణాలలో లభించిన DNA ముక్కలను, అగరోస్ జెల్ ఎలక్ట్రోఫోరెసిస్ పద్ధతిలో వ్యక్తిగత పట్టీలుగా వేరుచేస్తారు.

4) DNA స్వభావ వికలత: క్షార రసాయలను ఉపయోగించిగానీ, వేడిచేసిగానీ DNA పోచలను వేరుచేస్తారు.

5) బ్లాటింగ్: బ్లాటింగ్ పద్ధతి ద్వారా అగరోస్ జెల్పై గల DNA పోచలను నైట్రో సెల్యులోస్ కాగితా పైకి బదిలీ చేయబడతాయి.

6) ప్రోబ్ ద్వారా DNA ని గుర్తించడం: ప్రత్యేకంగా తయారు చేసుకొన్న రేడియో ధార్మిక ప్రోబ్లు; DNA పట్టీలలో మనకు అవసరమైన విశిష్ట DNA ముక్కలను గుర్తిస్తారు. ప్రోబ్లో వరుసక్రమం కలిగిన DNA అణువులు సంకరీకరణం చెందుతాయి. సంకరీకరణం చెందని DNA పట్టీలను నీటితో తొలగిస్తారు.

7) DNA ఫింగర్ ప్రింట్ తయారు చేయడం: ఆఖరు దశలో సంకర DNA అణువులు గల నైట్రో సెల్యులోస్ కాగితంపై ఒక ఫోటోగ్రాఫిక్ ఫిల్మ్ ను ఉంచుతారు. ప్రోబ్లని రేడియోధార్మిక పదార్థాల ప్రభావం వల్ల, గుర్తించబడిన DNA ఉండే స్థానానికి ఎదురుగా ఫోటోఫిల్పై DNA పట్టీ ప్రతిబింబం ఏర్పడుతుంది. ప్రతిబింబ స్థానంలోని DNA పట్టీనే మనం DNA ఫింగర్ ప్రింట్గా గా భావిస్తాం.

AP Inter 2nd Year Zoology Study Material Chapter 6 జన్యు శాస్త్రం

దీర్ఘ సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
బహుళయుగ్మ వికల్పాలు అంటే ఏమిటి ? వీటి అనువంశికతను ABO రక్త గ్రూపుల ఆధారంగా వివరించండి. [A.P. Mar. ’16 Mar. ’14]
జవాబు:
సాధారణంగా ఒక జన్యువుకుండే రెండు ప్రత్యామ్నాయ రూపాలను యుగ్మ వికల్పాలు అంటారు. ఒక జన్యువులోని రెండు యుగ్మ వికల్పాలు ద్వయస్థితిక జీవిలో 3 రకాల జన్యురూపాలను ఏర్పర్చగలుగుతాయి. కానీ, కొన్ని సార్లు ఒక జన్యువు రెండు కంటే ఎక్కువ యుగ్మవికల్పాలను కలిగి ఉండవచ్చు. ఒక జన్యువుకు సమజాత క్రోమోసోమ్లలోని ఒకే స్థానం వద్ద రెండు కంటె ఎక్కువ యుగ్మవికల్పాలు ఉంటే వాటిని బహుళ యుగ్మవికల్పాలు అంటారు. ఒక నిర్దిష్ట జీవి జనాభలో రెండు కంటె ఎక్కువ యుగ్మవికల్పాలు విస్తరించి ఉంటే, ఆ దృగ్విషయాన్ని బహుళ యుగ్మ వికల్పత అంటారు.

బహుళ యుగ్మ వికల్పాల వల్ల ఏర్పడే జన్యురూపాల సంఖ్యను క్రింది సమీకరణం ద్వారా తెలుసుకోవచ్చు.
జన్యురూపాల సంఖ్య = n(n + 1)/ 2
ఈ సమీకరణంలో n = యుగ్మ వికల్పాల సంఖ్య
కార్ల్ లాండ్నర్ మానవుడి రక్తంలో A, B ప్రతిజనకాలను మొదట గుర్తించి ABO రక్తవర్గాలను వెలుగులోకి తెచ్చాడు. ఎర్రరక్తకణ ప్లాస్మాత్వచంపై ప్రతిజనకం ఉనికిని ఆధారంగా చేసుకొని A, B, AB, O దృశ్యరూపాలు గల రక్తవర్గాలు నియంత్రించబడతాయి.

  • A రక్తవర్గపు వ్యక్తి ఎర్రరక్తకణాల ఉపరితలంపై (A) ప్రతిజనకం, ప్లాస్మాలో యాంటి B అనే ప్రతిదేహంని కలిగి ఉంటాయి.
  • B రక్తవర్గపు వ్యక్తి ఎర్రరక్తకణాలపై B- ప్రతిజనకం, ప్లాస్మాలో యాంటి – A అనే ప్రతిదేహం కలిగి ఉంటాడు.
  • AB రక్తవర్గాన్ని కలిగిన వ్యక్తుల ఎర్రరక్త కణాలపై A,B ప్రతిజనకాలు రెండూ ఉంటాయి. కానీ ప్లాస్మాలో ప్రతిదేహాలు ఉండవు.
  • ‘O’ రక్తవర్గ వ్యక్తుల ఎర్రరక్తకణాలపై ప్రతిజనకాలు ఉండవు. కానీ ప్లాస్మాలో యాంటి A, యాంటి B ప్రతిదేహాలు ఉంటాయి.
    AP Inter 2nd Year Zoology Study Material Chapter 6 జన్యు శాస్త్రం 20

మానవ 9వ దైహిక క్రోమోజోమ్పై ఉండే I అనే జన్యువు మూడు యుగ్మ వికల్పాల అంతరచర్యల ఫలితంగా ఈ నాలుగు దృశ్యరూపాలు (A, B, AB, O వర్గాలు) ఏర్పడతాయని బెరెయిన్ కనుగొన్నాడు. I అనే ఈ జన్యువుకు IA, IB,IO అనే మూడు యుగ్మవికల్పాలు ఉంటాయి. IA, IB యుగ్మ వికల్పాల వల్ల A.B ప్రతిజనకాలు ఉత్పత్తి అవుతాయి. IO యుగ్మవికల్పం ఎటువంటి ప్రతిజనకాన్ని ఉత్పత్తి చేయదు. IA, IB లు బహిర్గత యుగ్మ వికల్పాలు బహిర్గతత్వాన్ని చూపుతాయి. IO ఒక అంతర్గత యుగ్మవికల్పం. IA, IB యుగ్మవికల్పాలు సహబహిర్గతాలు. ఇవి రెండూ IO పై బహిర్గతను ప్రదర్శిస్తాయి. (IA=IB>IO). IA, IB, IO అనే యుగ్మవికల్పాలలో ఏదైనా రెండింటిని మాత్రం శిశువులు వారి తల్లిదండ్రుల నుంచి పొందుతారు. ఈ విధమైన సంక్రమణ వల్ల మూడు యుగ్మ వికల్పాలు మొత్తం ఆరు జన్యురూపాలు, నాలుగు రక్త వర్గాలు గల శిశువులను ఏర్పరచగలుగుతాయి.
AP Inter 2nd Year Zoology Study Material Chapter 6 జన్యు శాస్త్రం 21

ప్రశ్న 2.
లింగనిర్ధారణను క్రోమోసోమ్ల సిద్ధాంతం ఆధారంగా వివరించండి. [T.S. Mar. ’17]
జవాబు:
ఒకజీవి స్త్రీ జీవిగా కానీ, పురుషజీవిగా కాని లేదా ఉభయలింగ జీవిగా కానీ వృద్ధి చెందడానికి కారణమైన కారకాలను గురించి వివరించే అంశమే లింగనిర్ధారణ.

అధికశాతం జంతువులలో ఒక జత క్రోమోసోమ్లు లింగనిర్ధారణకు కారణమవుతాయి. వీటిని లైంగిక క్రోమోసోమ్లు లేదా అల్లోసోమ్లు అంటారు. లైంగిక క్రోమోసోమ్లు మినహా ఇతర క్రోమోసోమ్లను దైహిక క్రోమోసోమ్లు లేదా ఆటోసోమ్లు అంటారు. విషమ సంయోగబీజోత్పాదకాలతో లైంగిక క్రోమోసోమ్ల ఆధారంగా లింగ నిర్ధారణను స్థూలంగా రెండు రకాలుగా విభజించవచ్చు.

ఎ) పురుష విషమ సంయోగబీజ లింగనిర్ధారణ
బి) స్త్రీ విషమ సంయోగబీజ లింగనిర్ధారణ

ఎ) పురుష విషమ సంయోగ బీజలింగ నిర్ధారణ: ఈ విధానంలో పురుషజీవులు రెండు రకాల శుక్రకణాలను ఉత్పత్తి చేస్తాయి. అండంతో ఫలదీకరణం చెందే శుక్రకణాన్ని బట్టి లింగ నిర్ధారణ జరుగుతుంది. దీన్ని XX-XY పద్ధతి, XX-XO పద్ధతి అని రెండు రకాలుగా వివరించవచ్చు.

1) XX-XY పద్ధతి: ఈ రకం లింగ నిర్ధారణ మానవుడిలోనూ, డ్రోసోఫిలాలోను కనిపిస్తుంది. స్త్రీజీవి రెండు X క్రోమోసోమ్లను కలిగి ఉండి అండోత్పత్తి జరిగినప్పుడు ‘X’ క్రోమోసోమ్ కలిగిన అండాలను ఉత్పత్తి చేస్తుంది. పురుషజీవి XY క్రోమోసోమ్లను కలిగి ఉండి శుక్రకణోత్పత్తి జరిగినప్పుడు 50 శాతం X క్రోమోసోమ్ కలిగిన శుక్రకణాలను 50 శాతం Y క్రోమోసోమ్ కలిగిన శుక్రకణాలను ఉత్పత్తి చేస్తుంది. ఫలదీకరణ సమయంలో X-అండం, Y-శుక్రకణంతో కలిస్తే పురుషజీవిగానూ (XY), X- శుక్రకణంతో కలిస్తే స్త్రీ జీవి (XX)గాను వృద్ధి చెందుతాయి.
AP Inter 2nd Year Zoology Study Material Chapter 6 జన్యు శాస్త్రం 22

ii) XX-XO పద్ధతి: ఈ రకం లింగ నిర్ధారణ నల్లులు, బొద్దింకలు, మిడతలు లాంటి కీటకాలలో జరుగుతుంది. వీటిలో స్త్రీ జీవి రెండు ‘X’ క్రోమోజోమ్లు కలిగి ఉండి అండోత్పత్తి జరిగినప్పుడు X – క్రోమోజోమ్ కలిగిన అండాలను ఉత్పత్తి చేస్తుంది. పురుషజీవి ఒక X క్రోమోజోమ్ మాత్రమే కలిగి ఉండి శుక్రకణోత్పత్తి జరిగినప్పుడు సగం శుక్రణాలు X క్రోమోజోమ్ కలిగి ఉండి మిగిలిన సగం X- క్రోమోజోమ్ లేని శుక్రకణాలను ఉత్పత్తి చేస్తాయి. ఫలధీకరణ సమయంలో X- అండం, X-శుక్రకణంతో కలిస్తే స్త్రీ జీవిగాను (XX), X- క్రోమోజోమ్ లేని శుక్రకణంతో కలిస్తే పురుషజీవి (XO)గాను వృద్ధి చెందుతాయి.
AP Inter 2nd Year Zoology Study Material Chapter 6 జన్యు శాస్త్రం 23

స్త్రీ విషమ సంయోగబీజ లింగ నిర్ధారణ: ఈ విధానంలో స్త్రీ జీవులు విషమ సంయోగ బీజోత్పాదకంగానూ, పురుషజీవులు సమసంయోగ బీజోత్పాదకం గానూ ఉంటాయి. ఈ విధానంలో లింగనిర్ధారణను ZZ-ZW రకం, ZZ-ZO రకం అని రెండుగా విభజించినారు.

AP Inter 2nd Year Zoology Study Material Chapter 6 జన్యు శాస్త్రం

ZZ−ZW పద్ధతి: ఈ రకం లింగ నిర్ధారణ పక్షులు, సరీసృపాలు, కొన్ని చేపలలో జరుగుతుంది. వీటితో స్త్రీ జీవి సగభాగం Z- క్రోమోజోమ్ అండాలనూ, సగభాగం W- క్రోమోజోమ్ అండాలనూ ఉత్పత్తి చేస్తుంది. పురుషజీవి అన్ని Z- శుక్రకణాలను మాత్రమే ఉత్పత్తి చేస్తుంది. ఫలదీకరణలో Z-శుక్రకణం, Z-అండంతో కలిస్తే పురుషజీవి (ZZ), W-అండంతో కలిస్తే స్త్రీజీవి (ZW) ఏర్పడతాయి.
AP Inter 2nd Year Zoology Study Material Chapter 6 జన్యు శాస్త్రం 24

ZZ-ZO పద్ధతి: ఈ రకం లింగ నిర్ధారణ సీతాకోకచిలుకలు, కొన్ని మాత్లలోనూ జరుగుతుంది. వీటిలో స్త్రీ జీవులు సగభాగం Z- అండాలను, సగభాగం అండాలు ‘Z’ క్రోమోజోమ్ లేకుండా (O- అండం) ఉత్పత్తి చేస్తాయి. పురుషజీవులు Z- శుక్రకణాలను ఉత్పత్తి చేస్తాయి. ఫలదీకరణలో Z-శుక్రకణం, Z-అండంతో కలిస్తే పురుషజీవి (ZZ), O-అండంతో కలిస్తే స్త్రీజీవి (ZO) ఏర్పడతాయి.
AP Inter 2nd Year Zoology Study Material Chapter 6 జన్యు శాస్త్రం 25

ప్రశ్న 3.
క్రిస్ – క్రాస్ అనువంశికత అంటే ఏమిటి ? మానవుడిలో సంప్రాప్తించే ఒక లింగ సహలగ్నతా అంతర్గత లక్షణాన్ని వివరించండి. [A.P. Mar’17; T.S. Mar. ’16; A.P. & T.S. Mar. ’15]
జవాబు:
X సహలగ్న అంతర్గత జన్యువులు తండ్రి నుంచి అతని కుమార్తెకు F1 తరంలో చేరి, కుమార్తె ఆ లక్షణానికి వాహకంగా పనిచేసి, F2 తరంలో ఆమె కుమారులలో సగం మందికి అంతర్గత జన్యువును అందిస్తుంది. ఈ విధంగా X- సహలగ్న అంతర్గత జన్యువులు F1 – తరాన్ని దాటవేసి, F2 తరంలో ప్రస్ఫుటమవుతాయి. దీనినే క్రిస్-క్రాస్ అనువంశికత అంటారు.

పురుషులలో ఒక X- క్రోమోజోమ్ మాత్రమే ఉండటం వల్ల ఇవి చాలా వరకూ వారికే పరిమితమవుతాయి. స్త్రీలలో రెండు X- క్రోమోజోమ్లు ఉండడం వల్ల వారు ఈ అపస్థితుల నుంచి తప్పించుకొనే అవకాశం ఉంటుంది.
ఉదా: వర్ణ అంధత్వం

వర్ణ అంధత్వం: ఇది X- సహలగ్న అంతర్గత అపస్థితి. మానవుడి కంటి రెటీనాలో ఎరుపు, ఆకుపచ్చ, రంగులను గుర్తించే శంఖుకణాలు ఉంటాయి. వర్ణాంధత్వం గలవారు ఎరుపు, ఆకుపచ్చ లేదా నీలివర్ణాలలో ఏదో ఒక రంగును లేదా మూడు రండులను గుర్తించలేకపోతారు.

సాధారణ దృష్టి గల ఒక స్త్రీ (XX) వర్ణాంధత్వం గల పురుషుడిని (XY) వివాహమాడినట్లయితే, కుమారులు, కుమారైలు అందరూ సాధారణంగా ఉంటారు. కాని కుమార్తెలు వర్ణాంధత్వ బహిర్గత జన్యువు ఉండే X-క్రోమోజోమ్ను తల్లి నుంచి, దాని అంతర్గత జన్యువు ఉండే X-క్రోమోజోమ్ను తండ్రి నుంచి పొంది ఆ అపస్థితికి విషమయుగ్మజంగా ఉంటారు. వీరు వర్ణాంధత్వ అంతర్గత జన్యువుకు వాహకులుగా పనిచేస్తారు. ఒక వాహకస్త్రీ, సాధారణదృష్టి గల పురుషుణ్ణి వివాహమాడినట్లయితే – కుమార్తెలందరూ సాధారణ దృష్టిని కలిగి ఉంటారు. కాని కుమారులలో సగం మందికి వర్ణాంధత్వం సంక్రమిస్తుంది. మిగిలిన సగం మంది కుమారులు సాధారణ దృష్టిని కలిగి ఉంటారు.
AP Inter 2nd Year Zoology Study Material Chapter 6 జన్యు శాస్త్రం 26

వాహక స్త్రీ, సాధారణ దృష్టి గల పురుషుణ్ణి వివాహమాడినట్లయితే
AP Inter 2nd Year Zoology Study Material Chapter 6 జన్యు శాస్త్రం 27

X – సహలగ్న అంతర్గత లక్షణాలు:
పురుషుడు

  1. తండ్రి నుంచి కుమారునికి సంక్రమించవు.
  2. పురుషులే తరచుగా ఈ లక్షణములతో ప్రభావితమవుతారు.
  3. ప్రభావిత పురుషులు ఈ లక్షణాలను తమ తల్లి నుంచి పొందుతూ, వారి ఆడసంతతి అంతా తప్పనిసరిగా వాహకులు అవుతారు.
  4. విషమ యుగ్మజ స్త్రీల కుమారులలో 50 శాతం ఈ ఉత్పరివర్తన జన్యువును పొందటానికి అవకాశం ఉంటుంది.
  5. X – సహలగ్న అంతర్గత లక్షణాలన్నీ క్రిస్-క్రాస్ అనువంశికతను చూపుతాయి.
    ఉదా: వర్ణాంధత్వం, హీమోఫీలియా, డచిన్మస్కులార్ డిస్ట్రోన్.

ప్రశ్న 4.
మానవుడిలో సాధారణంగా కలిగే జన్యు అపస్థితులను గురించి వ్రాయండి.
జవాబు:
అనేక జన్యు అపస్థితులు మానవులలో కనిపిస్తాయి. వీటిని రెండు రకాలుగా వర్గీకరించవచ్చు అవి.

  1. మెండీలియన్ అపస్థితులు
  2. క్రోమోజోమ్ అపస్థితులు

I. మెండీలియన్ అపస్థితులు: మెండల్ జన్యు సూత్రాలను అనుసరించి సంక్రమించే అపస్థితులను మెండీలియన్ అపస్థితులుగా పేర్కొంటారు. DNA నిర్మాణంలో కలిగే బిందు ఉత్పరివర్తనం కారణంగా జన్యువులో మౌలిక లోపం ఏర్పడి, అది వ్యాధి కారక లక్షణాలను కారణం అవుతుంది.

మానవులలో తరచుగా కనిపించే హీమోఫీలియా, సిస్టిక్ ఫైబ్రోసిస్, కొడవలి కణ రక్తహీనత, వర్ణ అంధత్వం, ఫీనైల్ కీటోన్యూరియా, థాలస్సీమియా, ఆల్బినిజం మొదలైనవి కొన్ని జన్యు అపస్థితులు.

1. హీమోఫీలియా: హీమోఫిలియా X- సహలగ్న అంతర్గత అపస్థితి. దీని మూలంగా రక్తం గడ్డకట్టే లక్షణాన్ని కోల్పోయి రక్తస్రావం జరుగుతూనే ఉంటుంది. అందుకే దీన్ని రక్తస్రావ వ్యాధి లేదా బ్లీడర్స్ వ్యాధి అంటారు. దీనిలో 3 రకాలు ఉన్నాయి. హీమోఫీలియా -A స్కందన కారకం VIII లోపం వల్ల కలుగుతుంది. హీమోఫీలియా -B స్కందనకారకం IX లోపం వల్ల కలుగుతుంది. ఇవి రెండూ X-సహలగ్న అంతర్గత జన్యులోపం వల్ల కలుగుతాయి. హీమోఫీలియా C స్కందన కారకం XI లోపం వల్ల సంభవిస్తుంది. ఈ అస్వస్థతకి కారణం దైహిక క్రోమోజోమ్ అంతర్గత జన్యులోపం. హీమోఫీలియా వ్యాధి స్త్రీల కంటే పురుషులకే ఎక్కువగా కలుగుతుంది.

AP Inter 2nd Year Zoology Study Material Chapter 6 జన్యు శాస్త్రం

వ్యాధి లక్షణాలు: వీరిలో ఏ చిన్న గాయమైనా రక్తం గడ్డకట్టకుండా స్రవిస్తుంది లేదా గడ్డ కట్టడానికి ఎక్కువ సమయం పడుతుంది.

2. కొడవలి కణ రక్తహీనత: కొడవలి కణ రక్తహీనత దైహిక క్రోమోజోమ్ ద్వారా సంభవించే అంతర్గత జన్యు అపస్థితి. ఈ వ్యాధి కలిగిన వారి ఎర్రరక్తకణాలు తక్కువ ఆక్సిజన్ గల వాతావరణంలో అసాధారణంగా, దృఢంగా ఉండే కొడవలి ఆకారాన్ని పొందుతాయి. వీరి హీమోగ్లోబిన్ అణువులోని బీటా గ్లోబిన్ పాలివైప్టైడ్ శృంఖలాన్ని సంకేతించే DNAలో జరిగే బిందు ఉత్పరివర్తన ఫలితంగా ఈ వ్యాధి కలుగుతుంది. ఈ శృంఖలం యొక్క 6వ స్థానంలోని గ్లుటామిక్ ఆమ్లం అనే అమైనో ఆమ్లం స్థానాన్ని “వాలీన్” అనే అమైనో ఆమ్లం ప్రతిక్షేపించడం వల్ల కొడవలి కణ రక్తహీనత వ్యాధి కలుగుతుంది.

వ్యాధి లక్షణాలు: కొడవలి ఒకదానితో ఒకటి అతుక్కొని, పొగుపడి సన్నని రక్తనాళాలలో రక్త ప్రవాహానికి అడ్డుపడతాయి. అందువల్ల శరీరక బలహీనత, నొప్పి, అవయవహాని, కొన్ని సార్లు పక్షవాతం రావడానికి కారణమవుతాయి.

3. ఫీనైల్ కీటోన్యూరియం: ఇది ఆటోజోమ్ పై ఉండే అంతర్గత జన్యువు వల్ల కలిగే ఒక జీవక్రియ అపస్థితి. జన్యు ఉత్పరివర్తన వల్ల ఫీనైల్ అలనిన్ హైడ్రాక్సిలేజ్ అనే కాలేయ ఎన్జైమ్ క్రియారహితమవుతుంది. సాధారణంగా ఈ ఎంజైమ్ ఫీనైల్ అలనిన్ అనే అమైనో ఆమ్లాన్ని టైరోసిన్గా మారుస్తుంది. ప్రభావిత వ్యక్తుల్లో ఈ ఎన్జైమ్ క్రియాశీలత క్షీణించటం వల్ల కణాల్లో ఫీనైల్ అలనీన్ పోగై ఫీనైల్ పైరువేట్గాను, ఇతర ఉత్పన్నాలుగా మారుతుంది. ఇది మూత్రంలో కూడా కనిపిస్తాయి. వ్యాధిలక్షణాలు: మానసిక అభివృద్ధి మందగించడం, సరిగ్గా మాట్లాడటం, నడవలేక పోవటం, పెరుగుదల లోపించడం మొదలైనవి.

4. వర్ణాంధత్వం: ఇది X- సహలగ్న అంతర్గత అపస్థితి. వీరు ఎరుపు, ఆకుపచ్చ, నీలి వర్ణాలలో ఏదో ఒక రంగును లేదా మూడు రంగులను గుర్తించలేరు. ఈ అపస్థితిని నియంత్రించే అంతర్గత జన్యువులు X- క్రోమోజోమ్పై ఉంటాయి.
వ్యాధి లక్షణాలు:
ప్రొటనోపియా – ఎరుపు రంగును గుర్తించలేకపోవుట
డ్యూటెరనోపియా – ఆకుపచ్చ రంగును గుర్తించలేకపోవుట
ట్రైటనోపియా – నీలిరంగును గుర్తించలేకపోవుట

5. థలాస్సీమియా: ఇది అనేక జన్యు అపస్థితుల వల్ల ఏర్పడే అనీమియా వ్యాధి హీమోగ్లోబిన్ ఏర్పరిచే గ్లోబిన్ జన్యువులోని ఇంట్రాన్లలో ఏర్పడే బిందు ఉత్పరివర్తనాల వల్ల ఈ అపస్థితి కలుగుతుంది.
వ్యాధి లక్షణాలు: వీరిలో తక్కువ పరిమాణంలో హీమోగ్లోబిన్ సంశ్లేషణ, తక్కువ సంఖ్యలో ఎర్రరక్తకణాల ఉత్పత్తి కావడం దీని లక్షణాలు.

6. సిస్టిక్ ఫైబ్రోసిస్: ఇది సర్వసాధారణంగా కనిపించే ఒక అంతర్గత జన్యు అపస్థితి. ఈ జన్యులోపం ఆ గ్రంధులలోని ఉపకళా కణాల ప్లాస్మా త్వచం ద్వారా నీరు, లవణాల పారగమ్యతను ప్రభావితం చేస్తుంది.
వ్యాధి లక్షణాలు: అధిక క్లోరైడ్ గాఢత వల్ల ఊపిరితిత్తులు, క్లోమం, జీర్ణనాళం మొదలైన ముఖ్య అవయవాలలో చిక్కని జిగురుగా ఉన్న శ్లేష్మం ఎక్కువై అనేక ఇబ్బందులను కలిగించడమే కాక మరణానికి కూడా దారితీస్తుంది.

II. క్రోమోజోమ్ అపస్థితులు: క్రోమోజోమ్ సంఖ్యలోగానీ, నిర్మాణంలోగానీ, కలిగే లోపాల వల్ల క్రోమోజోమ్ అపస్థితులు కలుగుతాయి.
లైంగిక క్రోమోజోమ్ అపస్థితులు:
1) క్లైన్ ఫెల్టర్ సిండ్రోమ్: వీరిలో ఒక ‘X’ క్రోమోజోమ్ అధనంగా ఉంటుంది. అంటే వీరిలో మొత్తం 47 క్రోమోజోమ్లు (44A + XXY ) ఉంటాయి.
లక్షణాలు: ఇటువంటి అసాధారణ పురుషలలో స్త్రీల ద్వితయలైంగిక లక్షణాలు కనిపిస్తాయి. స్త్రీల వలే రొమ్ములు . పెద్దగా, పిరుదులు గుండ్రంగా ఉంటాయి. ముష్కాలు పూర్ణాభివృద్ధి చెంది ఉండవు.

2) టర్నర్ సిండ్రోమ్: వీరిలో మొత్తం 45 క్రోమోజోమ్లు (44A + X) ఉంటాయి. వీరిలో సాధారణ సంఖ్య కంటె ఒక క్రోమోజోమ్ తక్కువ ఉంటుంది.
వ్యాధి లక్షణాలు: వీరు పొట్టిగా ఉండి, మెడ వెడల్పుగా ఉబ్బినట్లుగా ఉంటుంది. వీరి రొమ్ములు చదునుగా, వెడల్పుగా ఉంటాయి. వీరిలో స్త్రీ బీజకోశాలు సరిగ్గా వృద్ధి చెంది ఉండవు.

దైహిక క్రోమోజోమ్ అపస్థితులు:
1) డౌన్ సిండ్రోమ్: 21వ జత క్రోమోజోమ్లతో పాటూ అదనంగా మరొక ప్రతి ఉండటం వల్ల ఈ జన్యు అపక్రమం ఏర్పడుతుంది. దీని కారియోటైప్ 47, XX +21
లక్షణాలు: పొట్టిదేహం, గుండ్రని చిన్నదైన తల, ఎప్పుడూ తెరుచుకుని ఉండేనోరు గాడి కలిగిన నాలుక కలిగి ఉండి మానసిక అభివృద్ధి కుంటుపడి ఉంటుంది.

2) ఎడ్వర్డ్ సిండ్రోమ్: దీని కారియోటైమ్ 47, XX + 18. 18వ క్రోమోజోమ్ అదనపు ప్రతి ఉండటం వల్ల ఈ క్రోమోజోమ్ అపక్రమం ఏర్పడుతుంది.
లక్షణాలు: జన్మించిన నవజాత శిశువులలో హార్ధిక అసాధారణతలు, మూత్రపిండ క్రియాత్మక రుగ్మతలు లాంటి తీవ్రలోపాలు కలిగిఉండి కొద్దికాలం మాత్రమే జీవిస్తారు.

3) పటౌ సిండ్రోమ్: పటౌ సిండ్రోమ్ కారియోటైప్ 47, XX + 13. 13వ క్రోమోజోమ్ అదనపు ప్రతి ఉండటం వల్ల ఈ సిండ్రోమ్ కలుగుతుంది.
లక్షణాలు: గుండె, మూత్రపిండ లోపాలు, మెదడు అసాధారణతలు మొదలైన లక్షణాలు కలిగి ఉంటారు. వీరు జన్మించిన కొద్ది రోజులలో మరణిస్తారు.

ప్రశ్న 5.
మానవ జీనోం ప్రాజెక్టును మెగా ప్రాజెక్ట్ అని ఎందుకు అంటారో వివరించండి.
జవాబు:
మానవ జీనోం ప్రాజెక్టు (HGP) మానవ DNA వరుసక్రమాన్ని అధ్యయనం చేసే ఒక మహా ప్రణాళిక ఇది 1990 సంవత్సరం అక్టోబర్ లో మొదలైన ఒక అంతర్జాతీయ ప్రయత్నం.

13 సం||ల ప్రణాళికలను అమెరికా సంయుక్త రాష్ట్రాల శక్తి విభాగం, అమెరికా జాతీయ ఆరోగ్యసంస్థ వారు సమన్వయ పరిచారు. ఈ ప్రణాళిక తొలిఏళ్ళలో వెల్కం ట్రస్ట్ ప్రధాన వాటాదారుగా జపాన్, ప్రాన్స్, జర్మనీ చైనా మొదలైన దేశాల శాస్త్రవేత్తలు సంయుక్త సహకారులుగా ఉండేవారు.

HGP 2003వ సంవత్సరానికి పూర్తయింది. ఈ ప్రాజెక్టు మొత్తం ఖర్చు 3 బిలియన్ డాలర్లు.

HGP లక్ష్యాలు:

  • మానవుడి జీనోమ్లోని సుమారు 20,000 – 25,000 జన్యువులను గుర్తించడం.
  • మానవుడి జీనోమ్ లేని 3 బిలియన్ల నత్రజని క్షారాల వరుసక్రమం నిర్ధారించడం.
  • జీవశాస్త్ర దత్తాంశ విశ్లేషణకు పరికరాలను/పద్ధతులను మెరుగుపర్చడం.
  • ఈ ప్రాజెక్టు వల్ల ఉద్భవించే నైతిక, న్యాయ, సాంఘిక అంశాలకు పరిష్కార మార్గాలు తెలియజేయడం.

DNA వరుసక్రమం:
ఒక జీవికి చెందిన మొత్తం జన్యు సమాచారాన్ని కలిగిన DNAను జీనోం అంటారు. సాధారణంగా ఏకస్థితిక క్రోమోజోమ్లలోని DNAని జీనోంగా పరిగణిస్తారు.

మానవుడిలో 24 భిన్న క్రోమోజోమ్లలో (22A+XY) ఉండే 3 బిలియన్ల నత్రజని క్షారాల జంటలు (A;G,T,C) “కచ్ఛితమైన DNA వరుస అమరికనే DNA వరుసక్రమం అంటారు.

DNA వరుసక్రమాన్ని కనుక్కోవడానికి, ఒక కణంలోని మొత్తం DNAని వేరుపరచి, దాని సాపేక్షంగా చిన్న పరిమాణంలో గల ఖండాలు లేదా ముక్కలుగా మార్చి ప్రత్యేక వాహకాలు ద్వారా తగిన అతిథేయిలో ప్రవేశపెట్టి క్లోనింగ్ ద్వారా అధికసంఖ్యలో DNA ప్రతులను తయారుచేస్తారు. వీటిని నత్రజని క్షారాల వరుసక్రమం తెలుసుకోవడానికి ఉపయోగిస్తారు.

బ్యాక్టీరియా, ఈస్ట్ను ఈ ప్రక్రియలో ఆతిధేయిగా వినియోగించుకొంటారు.

ఈస్ట్ కృత్రిమ క్రోమోజోమ్ (YAC), బ్యాక్టీరియా కృత్రిమ క్రోమోజోమ్ (BAC) లను వాహకాలుగా ఉపయోగించుకొంటారు. “ఫ్రెడరిక్ సాంగర్” అభివృద్ధి చేసిన ప్రయోగసూత్రం ఆధారంగా తయారుచేసిన స్వయంచాలక DNA వరుసక్రమ యంత్రాల సహాయంతో క్లోనింగ్ చేయబడిన DNA ఖండాల వరుసక్రమాన్ని కనుక్కొంటారు.

ఈ వరుసక్రమాలను వరుసస్థానాలలో ఉంచడం మానవ సాధ్యం కాదు. దీనికోసం ప్రత్యేక కంప్యూటర్ ప్రోగ్రామ్లను ఉపయోగించి, వాటి ద్వారా కనుగొన్న వరుసక్రమాన్ని ప్రతి క్రోమోజోమ్కు అన్వయిస్తారు.

మానవ జీనోం ప్రాజెక్ట్ ముఖ్యలక్షణాలు:
జన్యురుగ్మతలకు కారణమైన జన్యువులను గుర్తించడానికి, వాటి జన్యుచిత్రాలను తయారుచేయడానికి, జన్యువ్యాధులు గుర్తించి వాటికి చికిత్స, నివారణ చర్యలు సూచించడానికి HGP ఎంతగానో ఉపయోగపడుతుంది.

మానవ జీనోం, ఇతరజీవుల జీనోం గురించిన సంపూర్ణ పరిజ్ఞానం వల్ల జన్యు వ్యక్తీకరణ, కణాల పెరుగుదల, విభేదనం, జీవపరిణామం వంటి అంశాలు ఇంకా స్పష్టమవుతాయి.
వ్యాధులకు జన్యు అయుత్తత ఎంతవరకూ ఉందో తెలుసుకొని, జన్యు చికిత్స పద్ధతులు రూపొందించవచ్చు.

వివిధ వ్యాధులకు సంబంధించి యుక్తతమ ఔషదాల రూపకల్పన చేయవచ్చు. ఈ ప్రక్రియ ద్వారా అణువైద్యానికి పునాదులు వేయవచ్చు.

పైన తెలిపిన అంశాల వల్ల మానవజీనోం ప్రాజెక్టును మెగా ప్రాజెక్ట్ అని అంటారు.

AP Inter 2nd Year Zoology Study Material Chapter 6 జన్యు శాస్త్రం

ప్రశ్న 6.
DNA ఫింగర్ ప్రింటింగ్ టెక్నాలజీ అంటే ఏమిటి ? దాని అనువర్తనాలను పేర్కొనండి. [T.S. Mar. ’16]
జవాబు:
DNA ఫింగర్ ప్రింటింగ్ ప్రింటింగ్ అంటే DNA అణువులోని నత్రజని క్షారాల వరుసక్రమాన్ని శాస్త్రీయంగా విశ్లేషించి ఆ DNA ఏ వ్యక్తి DNA ని పోలి ఉంటుందో నిర్ధారించే పరీక్ష.

మానవుడి DNA అణువులో 3 బిలియన్ల న్యూక్లియోటైడ్ లు ఉంటాయి. వీటిలో 99% పైగా ఇతర వ్యక్తుల DNAను పోలి ఉంటుంది. ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండే వ్యక్తిగత వైవిధ్యాలు కేవలం 0.1 శాతం న్యూక్లియోటైడ్లలోనే ప్రధానంగా కనిపిస్తుంది. ఈ విధమైన వ్యక్తిగత విశిష్టతే DNA ఫింగర్ ప్రింటింగ్కు మూలాధారం.

DNA ఫింగర్ ప్రింటింగ్ విధానంలో 4 రకాల వరుస క్రమాలను మార్కర్లుగా వాడతారు. అవి RFLPలు, VNTRలు, STRలు, SNPలు. వీటినే జన్యుమార్కర్లు అంటారు.

RFLP: రిస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేస్ అనే ఎనజైమ్లను ఉపయోగించి DNA అణువును నిర్దేశిత ప్రాంతంలో ఖండించి ముక్కలుగా చేస్తారు. వీటినే RFLP అంటారు.

VNTR: ఇవి వివిధ సంఖ్యలలో నత్రజని క్షారాలు కలిగిన పొట్టి పునరపి DNA వరుసక్రమాలు. వీటిలో 10 నుంచి 100 వరకూ న్యూక్లియోటైడ్లు మళ్ళీ, మళ్ళీ పునరావృతమవుతూ ఉంటాయి. ఏ ఇద్దరి వ్యక్తులలోనూ వీటి వరుసక్రమాలు సమానంగా ఉండవు.

STR: ఇవి అతి పొట్టి పునరపి ప్రమాణాలు. ఇవి 10 నుంచి 30 సార్లు పునరావృతమవుతాయి. VNTR ల కంటె ఎక్కువగా వీటినే DNA ఫింగర్ ప్రింటింగ్లో విశ్లేషిస్తారు.

SNP: ఇవి DNA లో బిందు ఉత్పరివర్తనాల ఫలితంగా ఏర్పడే ఏకక్షార బేధాలు. ప్రతివ్యక్తి DNA లోనూ వేర్వేరు స్థానాలలో ఇవి ఏర్పడటం వల్ల విశిష్ట DNA మార్కర్లుగా వీటిని గుర్తిస్తారు.

DNA పింగర్ ప్రింటింగ్ నియమ పద్ధతి:
1) DNA సంగ్రహణ / వేరు చేయడం: మొదటి దశలో నేరం జరిగిన ప్రాంతాల నుంచి సేకరించిన కణాల నుంచి కానీ, వ్యక్తుల వద్ద నుంచి సేకరించిన లాలాజలం, రక్తంలోని కణాలనుంచి సేకరించిన లాలాజలం, రక్తంలోని కణాలను నుంచి గాని ప్రత్యేక పద్ధతులలో DNAని వేరుచేస్తారు.

2) DNA ఖండీకరణ: DNA ను రిస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజ్ ఎంజైమ్లను ఉపయోగించి నిర్దిష్ట స్థానాలలో ఖండించి చిన్న చిన్న ముక్కలుగా విడగొడతారు.

3) ఎలక్ట్రోఫోరెసిస్ ద్వారా DNA ఖండాలు వేరుచేయడం: వివిధ పరిమాణాలలో లభించిన DNA ముక్కలను, అగరోస్ జెల్ ఎలక్ట్రోఫోరెసిస్ పద్ధతిలో వ్యక్తిగత పట్టీలుగా వేరుచేస్తారు.

4) DNA స్వభావ వికలత: క్షార రసాయలను, ఉపయోగించిగానీ, వేడిచేసిగానీ DNA పోచలను వేరుచేస్తారు.

5) బ్లాటింగ్: బ్లాటింగ్ పద్ధతి ద్వారా అగరోజ్ జెల్పై గల DNA పోచలను నైట్రోసెల్యులోస్ కాగితాల పైకి బదిలీ చేయబడతాయి.

6) ప్రోబ్ ద్వారా DNA ని గుర్తించడం: ప్రత్యేకంగా తయారు చేసుకొన్న రేడియోధార్మిక ప్రోబ్లు; DNA పట్టీలలో మనకు అవసరమైన విశిష్ట DNA ముక్కలను గుర్తిస్తారు. ప్రోబ్లో వరుసక్రమం కలిగిన DNA అణువులు సంకరీకరణం చెందుతాయి. సంకరీకరణం చెందని DNA పట్టీలను నీటితో తొలగిస్తారు.

7) DNA ఫింగర్ ప్రింట్ తయారు చేయడం: ఆఖరు దశలో సంకర DNA అణువులు గల నైట్రో సెల్యూలోజ్ కాగితంపై ఒక ఫోటోగ్రాఫిక్ ఫిల్మ్ ను ఉంచుతారు. ప్రోబ్లలోని రేడియోధార్మిక పదార్థాల ప్రభావం వల్ల, గుర్తించబడిన DNA ఉండే స్థానానికి ఎదురుగా ఫోటోఫిల్పై DNA పట్టీ ప్రతిబింబం ఏర్పడుతుంది. ప్రతిబింబ స్థానంలోని DNA పట్టీనే మనం DNA ఫింగర్ ప్రింట్ గా భావిస్తాం.

DNA ఫింగర్ ప్రింటింగ్ ప్రక్రియ:

AP Inter 2nd Year Zoology Study Material Chapter 6 జన్యు శాస్త్రం 28

DNA ఫింగర్ ప్రింటింగ్ అనువర్తనాలు:

  1. వన్యప్రాణి సంరక్షణ: విలుప్తతకు గురి కాబోయే జాతుల పరిరక్షణకు DNA ఫింగర్ ప్రింటింగ్ ఉపయోగపడుతుంది. అందుకోసం వాటి DNA రికార్డులను సంరక్షిస్తారు.
  2. వంశవృక్ష విశ్లేషణ: వివిధ తరాలలో ఒక జన్యువు సంక్రమించే విధానం తెలుసుకోవచ్చు.
  3. మానవశాస్త్ర అధ్యయనం: మానవ జనాభాల ఉత్పత్తి, వలస చెందిన విధానాన్ని అర్థం చేసుకోవచ్చు.
  4. మెడికో – లీగల్ వివాదాల పరిష్కారం: మాతృత్వాన్ని లేదా/మరియు పితృత్వాన్ని ఖచ్చితంగా కనుగొనవచ్చు.
  5. ఫోరెన్సిక్ విశ్లేషణ: దొంగలను, హంతకులను, మానభంగం చేసిన వారిని గుర్తించవచ్చు.
  6. వర్గవికాస చరిత్ర: జీవుల వర్గవికాస చరిత్రను తెలుసుకోవచ్చు.

AP Inter 2nd Year Zoology Study Material Chapter 7 జీవ పరిణామం

Andhra Pradesh BIEAP AP Inter 2nd Year Zoology Study Material 7th Lesson జన్యు శాస్త్రం Textbook Questions and Answers.

AP Inter 2nd Year Zoology Study Material 7th Lesson జన్యు శాస్త్రం

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
పాన్ స్పెర్మియా అంటే ఏమిటి ? [T.S. Mar. ’17]
జవాబు:
పాన్ స్పెర్మియా సిద్ధాంతాన్ని ఆర్హీనియస్ ప్రతిపాదించాడు. ఈ సిద్ధాంతం ప్రకారం జీవం నిరోధకశక్తి కలిగిన సిద్ధబీజాలైన కాస్మోజువా లేదా పాన్స్పెర్మియా రూపంలో విశ్వమంతటా ఉండేవని, అనుకోకుండా ఇవి భూమిని చేరాయని చెబుతుంది.

ప్రశ్న 2.
జీవ పూర్వద్రవం పదాన్ని నిర్వచించండి. దీనినెవరు ఆవిష్కరించారు ?
జవాబు:
జీవ పూర్వద్రవం అనే పదాన్ని J.B.S హాల్డేన్ ఆవిష్కరించాడు. హాల్డేన్ సముద్రాన్ని జీవపూర్వద్రవంగా పేర్కొన్నాడు. అన్ని సేంద్రియ పదార్థాలు అయిన చక్కెరలు, అమైనో ఆమ్లాలు, ఫాటీ ఆమ్లాలు – ఫ్యూరిన్, పిరమిడిన్లు ఏర్పడుటకు అవసరమైన అన్ని చర్యలు సముద్రంలోనే జరుగుతాయని అందుచే ఆయన సముద్రాన్ని జీవపూర్వ ద్రవం అని పేర్కొన్నాడు.

ప్రశ్న 3.
నిజకేంద్రక జీవులు ఏ విధంగా పరిణామం చెందాయి ?
జవాబు:
నిజకేంద్రక జీవులు రెండు పద్ధతుల ద్వారా ఏర్పడ్డాయి.

  1. కేంద్రక పూర్వ జీవులు ఆదిమ నిజకేంద్రక జీవులతో సహజీవనం చేస్తూ పరిణామ క్రమంలో మైటోకాండ్రియా, హరితరేణువు లాంటి కణాంగాలుగా ఏర్పడ్డాయి.
  2. కేంద్రక పూర్వజీవుల ప్లాస్మాత్వచం అంతర్వర్తనం చెందడం ద్వారా త్వచనిర్మిత కణాంగాలు ఏర్పడ్డాయి.

AP Inter 2nd Year Zoology Study Material Chapter 7 జీవ పరిణామం

ప్రశ్న 4.
యురే, మిల్లర్లు తమ ప్రయోగంలో ప్రాథమిక వాతావరణాన్ని అనుకరించడానికి మిశ్రమంలో ఉపయోగించిన సంఘటనాంశాలేవి ?
జవాబు:
యురే, మిల్లర్లు తమ ప్రయోగంలో ప్రాథమిక వాతావరణాన్ని అనుకరించడానికి వారు అమ్మోనియా మీధేన్, నీటి ఆవిరి, హైడ్రోజన్ల మిశ్రమాన్ని తీసుకున్నారు.

ప్రశ్న 5.
మీరు అధ్యయనం చేసిన ఏవేని నాలుగు సజీవ సేతువులను తెలపండి ?
జవాబు:
జంతు రాజ్యంలో రెండు జీవ సమూహాల లక్షణాలను కలిగి ఉండే మధ్యాంతర జీవులను సంధాన సేతువులు/సజీవ సేతువులు అంటారు. ఇవి స్పష్టంగా పరిణామ పథాన్ని వివరిస్తాయి.

  • m అనెలిడా, ఆర్థ్రోపొడా వర్గాల మధ్య పెరిపేటస్
  • m సరీసృపాలు, క్షీరదాలకు మధ్య ప్రోటోథీరియా జీవులు.

ప్రశ్న 6.
జీవ జన్యు సిద్ధాంతాన్ని (పునరావృత సిద్ధాంతాన్ని) నిర్వచించిదానికి ఒక ఉదాహరణను పేర్కొనండి. [T.S. Mar. ’17]
జవాబు:
జీవ జన్యు సిద్ధాంతాన్ని ఎర్నెస్ట్ హెకెల్ ప్రతిపాదించాడు. ఈ సిద్ధాంతం ప్రకారం ఒక జీవి జీవిత చరిత్ర ఆ జీవి వర్గవికాస చరిత్రను పునరావృతం చేస్తుంది.

ఉదా : ఉభయచరాల టాడ్పోల్ డింభకం బాహ్య, అంతర లక్షణాలలో చేపను పోలి ఉంటుంది. ఈ డింభకానికి చేపల లాగ తోక, రెండు గదుల హృదయం, మొప్పలు ఉంటాయి. తరువాత ఈ డింభకం పైన చెప్పిన లక్షణాలు లేని కప్పగా రూపవిక్రియం చెందుతుంది.

ప్రశ్న 7.
అటావిజమ్ను ఉదాహరణతో నిర్వచించండి. [T.S. Mar. ’16]
జవాబు:
అభివృద్ధి చెందిన దశలో అవశేషావయవాలు ఆకస్మికంగా ఏర్పడే విధానాన్ని అటావిజమ్ అంటారు.
ఉదా : శిశువు తోకను కలిగి ఉండటం. ఈ విధంగా ఆకస్మికంగా ఏర్పడ్డ అవశేషావయవాలను అటావిస్టిక్ అవయవాలంటారు.

ప్రశ్న 8.
లామార్క్ ఆర్జిత గుణాల అనువంశిక వాదానికి వ్యతిరేకంగా రెండు ఉదాహరణలు పేర్కొనండి.
జవాబు:

  1. క్రీడాకారులలో అభివృద్ధి చెందిన కండరాలు తరువాత తరానికి సంక్రమించడం జరగదు.
  2. ఆభరణాల అలంకరణ కోసం చెవి తమ్మెలకు రంధ్రాలు పొడవడం భారతదేశంలో కొన్ని శతాబ్దాల నుంచి ఆచరణలో ఉంది. కానీ ఏ ఆడశిశువు రంధ్రాలతో కూడిన చెవి తమ్మెలతో జన్మించలేదు.

ప్రశ్న 9.
ప్రకృతి వరణం అనే ఆలోచన విధానాన్ని రూపొందించడంలో డార్విన్ను ప్రభావితం చేసిన వారెవరు ?
జవాబు:
ఛార్లెస్ రాబర్ట్ డార్విన్ మూడు ప్రచురణల వల్ల ప్రభావితుడయ్యాడు.

  1. థామస్ మాల్తూస్ రచించిన “ఎన్ ఎస్సే ఆన్ ది ప్రిన్సిపిల్ ఆప్ పాపులేషన్”.
  2. సర్ ఛార్లెస్ లయల్ రచించిన “ప్రిన్సిపల్ ఆఫ్ జియాలజి”.
  3. ఆల్ఫ్రెడ్ రస్సెల్ వాలెస్ రచించిన “ఆన్ ది టెండెన్సీ ఆఫ్ వెరైటిస్ టు డిపార్ట్ ఫ్రమ్ ఒరిజినల్ టైప్స్”.

AP Inter 2nd Year Zoology Study Material Chapter 7 జీవ పరిణామం

ప్రశ్న 10.
డార్విన్, లామార్క్ సిద్ధాంతాలలో ఏకీభవించే అంశం ఏది ?
జవాబు:
డార్విన్, లామార్క్ సిద్ధాంతాలలో ఏకీభవించే అంశం వైవిధ్యాలను కలిగి ఉండడం.

ప్రశ్న 11.
జన్యుభారం అంటే ఏమిటి ? ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
జనాభాలో హానికరమైన యుగ్మ వికల్పాలు లేదా జన్యువులు ఉండటాన్ని జన్యు భారం అంటారు.
ఉదా : సికిల్ సెల్ ఎనీమియా కారక జన్యువు. సమయుగ్మజ సికిల్సెల్ జన్యువును కలిగిన మానవులు ఎనీమియా వల్ల త్వరగా మరణిస్తారు.

ప్రశ్న 12.
అనాజెనిసిస్, క్లాడోజెనిసిస్ అంటే ఏమిటి వివరించండి.
జవాబు:
అనాజెనిసిస్ : ఒకే వంశీయ క్రమంలో ఒక జాతి నుంచి కొత్త జాతి ఉత్పన్నమయితే ఆ పరిణామాన్ని అనాజెనిసిస్ అంటారు.

క్లాజోజెనిసిస్ : ఒక జాతి శాఖలుగా విడిపోయి రెండు లేదా అంతకంటే ఎక్కువ కొత్త జాతులు ఏర్పడితే దాన్ని క్లాడోజెనిసిస్ అంటారు.

ప్రశ్న 13.
తోక లేని కోతి, మానవుడి లాంటి ప్రైమేట్ల శాస్త్రీయ నామాన్ని తెలపండి. ఏ మానవుడి లాంటి ప్రైమేట్ మొట్టమొదటగా శరీరాన్ని ఆచ్ఛాదన చేసుకొన్నాడు ?
జవాబు:
తోకలేని కోతి శాస్త్రీయ నామం – డ్రయోపితికస్
మానవుడి లాంటి ప్రైమేట్ శాస్త్రీయనామం – రామాపితికస్
శరీరాన్ని ఆచ్ఛాదన చేసుకొన్న మానవుడి లాంటి ప్రైమేట్ – హోమోనియాండర్ థాలెన్సిస్

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
నిర్మాణసామ్య, క్రియాసామ్య అవయవాలు గురించి వివరించండి. [A.P. Mar. 17; A.P. & T.S. Mar. ’15]
జవాబు:
నిర్మాణసామ్య అవయవాలు : నిర్మాణం, ఆవిర్భావంలో సామ్యముండి వేర్వేరు విధులను నిర్వర్తించే అవయవాలను నిర్మాణసామ్య అవయవాలు అంటారు. ఉదా : వివిధ సకశేరుకాలు పూర్వాంగాలైన తిమింగలం తెడ్డు, గబ్బిలం పెటాజియం, గుర్రం పూర్వాంగం, పిల్లి పంజా, మానవుడు చేయి మొదలైనవి వాటి అంతర్నిర్మాణంలో ఒకే రకమైన ఎముకల అమరిక కలిగి ఉన్నప్పటికీ వాటి బాహ్య స్వరూపం, విధులలో వాటి జీవన విధానానికి అనుకూలంగా భిన్నత్వాన్ని ప్రదర్శిస్తాయి.
AP Inter 2nd Year Zoology Study Material Chapter 7 జీవ పరిణామం 1
క్రియాసామ్య అవయవాలు : నిర్మాణం, ఏర్పడే విధానంలో తేడాలున్నప్పటికీ ఒకే రకమైన విధిని నిర్వర్తించే అంగాలను క్రియాసామ్య అంగాలు అంటారు.
AP Inter 2nd Year Zoology Study Material Chapter 7 జీవ పరిణామం 2

ప్రశ్న 2.
ఉత్పరివర్తన సిద్ధాంతం గురించి లఘుటీక రాయండి. [A.P. Mar. ’15]
జవాబు:
ఉత్పరివర్తన అనే పదాన్ని ప్రతిపాదించిన హ్యూగోడివ్రీస్ అనే వృక్ష శాస్త్రవేత్త, ఉత్పరివర్తన సిద్ధాంతాన్ని వివరించాడు. ఉత్పరివర్తనం అనేది జీవులలో హఠాత్తుగా, యాదృచ్ఛికంగా కలిగే మార్పు. ఈ మార్పు అనువంశికతను పాటిస్తుంది. ఇతను ఈనోథీరా లామార్కియానా మొక్కలో నాలుగు రూపాలున్నాయని కనుగొన్నాడు.
ఈ. బ్రివిస్టైలిస్ – చిన్న కీటకం
ఈ. లెవిఫోలియంలో – నునుపైన ఆకులు
ఈ. జైగాస్ లో – పెద్ద రూపం
ఈ. ననెల్లాలో – మరుగుజ్జు రూపం
ఈ లక్షణాలు సంతాన తరాలకు అందజేయబడ్డాయి.

AP Inter 2nd Year Zoology Study Material Chapter 7 జీవ పరిణామం

ఉత్పరివర్తన సిద్ధాంతంలోని ముఖ్యాంశాలు :

  1. సహజంగా ప్రజననం జరిపే జనాభాలోని జీవులలో కాలానుగుణంగా ఉత్పరివర్తనాలు సంభవిస్తాయి.
  2. ఉత్పరివర్తనాలు వాటి తల్లిదండ్రులకు భిన్నతను చూపుతాయి.
  3. ఉత్పరివర్తనాలు అనువంశికతను చూపుతాయి.
  4. డార్విన్ చెప్పిన అస్థిరమైన వైవిధ్యాలు, డీగ్రీస్ ఉదాహరించిన ఉత్పరి వర్తనాలు విరుద్దమయినవి.
  5. ఉత్పరివర్తనాలు స్వేచ్ఛగా అన్ని దిశలలో జరుగుతాయి. అందువల్ల జీవపరిమాణం కూడా లక్ష్యం లేకుండా జరుగుతుంది.
  6. ఉత్పరివర్తనాలు ప్రకృతి వరణానికి గురిఅవుతాయి.
  7. ఉత్పరివర్తనాలు విచ్ఛిన్నంగా ఉండి తరతరాలుగా సంచితం కావు.
    8. ఉత్పరివర్తనాలు పరిపూర్ణమైనవి. అందువల్ల మాధ్యమిక దశలు ఉండవు.

ప్రశ్న 3.
పారిశ్రామిక శ్యామలత్వం ఆధారంగా డార్విన్ ప్రకృతివరణ సిద్ధాంతాన్ని వివరించండి. [A.P. & T.S. Mar.’17, ’16; T.S. Mar. ’15 Mar. ’14]
జవాబు:
ప్రకృతి వరణం సంభవిస్తుందని తెలపడానికి ప్రయోగాత్మక నిదర్శనం పెప్పర్డ్ మాత్-బిస్టన్ బెట్యూలేరియా ప్రదర్శించే పారిశ్రామిక శ్యామలత్వం. ఈ మాత్లు రెండు రకాల బాహ్య వర్ణాలు కలిగి ఉంటాయి. బూడిద, నలుపు, ఇంగ్లాండ్లో పారిశ్రామిక విప్లవానికి ముందు, బూడిద రంగు మాత్లు అధికంగా ఉండేవి. పారిశ్రామిక విప్లవ కాలంలో పారిశ్రామిక నగరాలైన బర్మింగ్ హామ్లో నలుపు రంగు మాత్లు అధికంగా, బూడిద రంగు మాత్లు తక్కువగా ఉండేవి. జీవశాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం, పారిశ్రామికీకరణ వల్ల, బొగ్గును ఎక్కువ మండించడంతో ఎక్కువ మసి విడుదలై చెట్ల బెరడులు నల్లగా మారాయి. దీని వల్ల బూడిదరంగు మాత్లు నల్ల బెరడుపై పక్షులకు సులభంగా కనిపించి వాటికి ఆహారంగా మారాయి. దీనివల్ల జనాభాలో బూడిదరంగు మాత్ల సంఖ్య తగ్గి నలుపురంగు మాత్ల సంఖ్య పెరిగింది. అంటే నలుపు మాత్ల కు ప్రకృతి “ధనాత్మక వరణపీడనాన్ని” ప్రసాదించింది.

“బెర్నార్డ్ కెటెల్వెల్” అనే బ్రిటీష్ పర్యావరణ శాస్త్రవేత్త, ఈ సిద్ధాంతాన్ని ప్రయోగాత్మకంగా పరిశీలించాడు. ఈ ప్రయోగానికి బిస్టన్ బెట్యూలేరియా నలుపు, బూడిద రంగు రూపాలను పోగు చేశాడు. బూడిదరంగు, నలుపురంగు మాత్లను సమానసంఖ్యలో రెండు సమూహాలుగా చేసి, ఒక సమూహాన్ని కాలుష్యపూరితమైన బర్మింగ్హామ్ పట్టణంలో, రెండో సమూహాన్ని కాలుష్యరహితమైన డోర్సెట్లో వదిలాడు. కొద్ది రోజుల తర్వాత మాత్లను పట్టుకోగా, కాలుష్య ప్రాంతంలో ఎక్కువ నలుపు రంగు మాత్లు, కాలుష్య రహిత ప్రాంతంలో ఎక్కువ బూడిద రంగుమాత్లు ఉన్నాయి. ఈ బేధానికి కారణం కాలుష్యపూరితమైన బర్మింగ్హామ్ పట్టణంలో పరభక్ష మెలనిక్ రూపాల దేహం రంగు, చెట్టు బెరడు రంగులో కలిసి పోవడంవల్ల వాటిని భక్షించే పక్షులకు సులభంగా కనిపించలేదు. కాలుష్య రహిత గ్రామప్రాంతమైన డోర్సెట్లో బూడిదరంగు మాత్లను మనుగడ సాగించే అవకాశం ఎక్కువ.

దీనికి కారణం వీటి శరీరపు రంగు లేతరంగు పరిసరాలలో కలిసిపోవడమే. దీన్నిబట్టి మాత్లకు ప్రకృతివరణం వల్ల విభేదీకృత మనుగడ జరుగుతుందని అర్థమవుతుంది.

ప్రశ్న 4.
జీవపరిణామంలో వివిధ వరణాల పాత్రను చర్చించండి.
జవాబు:
పకృతివరణం జీవపరిణామంలో పాల్గొంటుంది. ప్రకృతివరణం ఎలాంటి జన్యుమార్పులను కలిగించదు. కాని జన్యుమార్పులు జరిగితే వాటిలో ఉపయుక్తమైన వాటిని ఆమోదిస్తుంది. హానికరమైన వాటిని తిరస్కరిస్తుంది.
ఇది మూడు రకాలు

  1. స్థిరీకరణవరణం
  2. దిశాయుతవరణం
  3. విచ్ఛిత్తివరణం

స్థిరీకరణవరణం లేదా అభికేంద్ర వరణం : ఈ రకమైన వరణం స్థిరమైన పర్యావరణంలో సంభవిస్తుంది. ఈ విధానంలో జనాభా యొక్క దృశ్యరూప విస్తరణలో సగటు దృశ్యరూప జీవుల వరణం జరిగి రెండు చివరలలో ఉన్న యోగ్యత లేని జీవులు తొలగించబడతాయి. కాబట్టి ఈ వరణం జాతుల ఉత్పత్తికి దారితీసే పరిణామ మార్పులను ప్రోత్సహించక తరతరాలుగా జనాభాలో దృశ్యరూప స్థిరత్వాన్ని నిలుపుతుంది. ఈ వరణం వల్ల దృశ్యరూప విలువ స్థిరంగా అధిక కాలం ఉంటుంది.

ఉదా : ఇంగ్లాండ్లో జన్మించిన నవజాత శిశువుల బరువులను పెద్ద సాంపిల్ పరిశీలించగా సగటు బరువు అయిన 8 పౌండ్ల కంటే అతి తక్కువ, అతి ఎక్కువ బరువు ఉన్న పిల్లల్లో మరణాలు అధికంగా సంభవించాయి అంటే స్థిరీకరణం సగటు బరువు ఉన్న పిల్లల్లోనే జరిగింది.

దిశాయుతవరణం : ఈ రకమైన వరణం క్రమంగా మార్పులు కలిగే పర్యావరణంలో సంభవిస్తుంది. దృశ్యరూప విస్తరణలో ఒక అంత్యంలో జీవులు క్రమంగా తొలగించబడి, ఇంకొక అంత్యంలో క్రమంగా వరణం గావించబడతాయి. ఈ వరణంలో సగటు సార్థక విలువ క్రమేణా దృశ్య రూప విస్తరణ ఒక అంత్యం నుంచి మరో అంత్యం వైపుకు జరుగుతుంది. ఉదాహరణకు జిరాఫీలలో మెడ పొడవు సగటు విలువ క్రమంగా పొడవు మెడ లక్షణం వైపుకు జరిగింది. ఒకసారి దృశ్యరూప సగటు విలువ కొత్త యుక్తతమ వాతావరణ పరిస్థితులలో ఏకీభవించినప్పుడు దిశాయుత వరణం ఆగి స్థిరీకరణవరణం ప్రారంభమవుతుంది. జిరాఫీలో పొడవు మెడ లక్షణం ఈ విధంగా స్థిరపడింది. DDT కి దోమలు నిరోధక శక్తిని వృద్ధి చేసుకోవడమనేది దిశాయుతవరణానికి మరొక ఉదాహరణ.

విచ్ఛిత్తివరణం : సమజాతీయ వాతావరణం విషమ జాతీయ వాతావరణంగా మారడం లేదా తరచూ మారుతున్న పరిసరాల వల్ల ఈ రకమైన వరణం సంభవిస్తుంది. ఈ వరణంలో దృశ్యరూప విస్తరణ ‘మధ్యమం’ నుంచి తొలగించబడి అంత్యాలను చేరుతుంది. అంటే అంత్యాల వద్ద గల జీవులు వరణం గావించబడి సగటు దృశ్యరూప జీవులు తొలగించబడతాయి. దీనివల్ల జనాభా రెండు లేదా మూడు ఉపజనాభాలు, జాతి జనాభాలుగా విచ్ఛిత్తి చెందుతాయి. ఇది ఒక అసాధారణ వరణ పద్ధతి అయినప్పటికీ రెండు లేదా మూడు జాతుల ఏర్పాటుకు దారితీస్తుంది. దీనినే ఉపయుక్త వికిరణం అంటారు.

ఉదా : నలుపు, తెలుపు దేహ వర్ణం గల కుందేళ్ళు. ఎక్కువగా నల్లటి, తెల్లటి రాళ్ళు గలిగిన పరిసరాలలో కొన్ని తెల్లటి కుందేళ్ళను, కొన్ని నల్లటి కుందేళ్ళను, ఎక్కువగా బూడిద వర్ణ కుందేళ్ళను వదిలిపెట్టామనుకోండి. నల్లటి కుందేళ్ళు నల్ల రాళ్ళ మధ్య, తెల్లటి కుందేళ్ళు తెల్లరాళ్ళ మధ్య దాగి వాటి భోజ్యజీవుల నుంచి తప్పించుకొంటాయి. కాని బూడిద వర్ణ కుందేళ్ళు బాగా గుర్తించబడి భోజ్య జీవులకు ఆహారమవుతాయి. క్రమంగా బూడిద వర్ణ కుందేళ్ళు అంతరించిపోతాయి. మిగిలిన రెండూ వృద్ధి చెందుతాయి.

ప్రశ్న 5.
నియోడార్వినిజం గురించి లఘుటీక రాయండి.
జవాబు:
R.A. ఫిషర్, సేవాల్ రైట్, ఎర్నేస్ట్మయర్లు నియోడార్వినిజమ్ లేదా జన్యు సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ఈ సిద్ధాంతం ప్రకారం ఐదు ప్రాథమిక కారకాలు జీవపరిణామంలో పాల్గొంటాయి. అవి :

  1. జన్యు ఉత్పరివర్తనాలు
  2. క్రోమోజోమల్ ఉత్పరివర్తనాలు
  3. జన్యుపునఃసంయోజనాలు
  4. ప్రకృతివరణం
  5. ప్రత్యుత్పత్తి వివక్తత.

i) జన్యుఉత్పరివర్తనాలు : జన్యు నిర్మాణంలో జరిగే మార్పులను జన్యు ఉత్పరివర్తనాలు లేదా బిందు ఉత్పరివర్తనాలు అంటారు. ఇవి జీవుల దృశ్యరూప లక్షణాలను మారుస్తాయి. ఈ విధంగా జన్యు ఉత్పరివర్తనాలు సంతానంలో వైవిధ్యాలను ఏర్పరచగలుగుతాయి.

ii) క్రోమోజోమల్ ఉత్పరివర్తనాలు: క్రోమోజోమల్ నిర్మాణంలో పరిత్యాగం, సంకలనం, ద్విగుణీకరణం, విలోమం లేదా స్థానాంతరణ కారణంగా కలిగే మార్పులను క్రోమోజోమల్ ఉత్పరివర్తనాలు అంటారు. అది కూడా జీవుల దృశ్యరూపాలలో వైవిధ్యాలను కలిగిస్తాయి. దీని ఫలితంగా సంతానంలో వైవిధ్యాలు కనిపిస్తాయి.

AP Inter 2nd Year Zoology Study Material Chapter 7 జీవ పరిణామం

iii) జన్యు పునఃసంయోజనాలు : జన్యువుల పునఃసంయోజనాలు క్షయకరణ విభజనలో వినిమయం వల్ల కలుగుతాయి. ఇవి ఒకే జాతిలోని జీవుల మధ్య వైవిధ్యాలు కలగడానికి కారణమవుతాయి. ఈ విధంగా అనువంశిక వైవిధ్యాలు కలగడానికి సహకరిస్తాయి.

iv)ప్రకృతి వరణం : ప్రకృతి వరణం ఎలాంటి జన్యు మార్పులను కలిగించదు కాని జన్యు మార్పులు జరిగితే వాటిలో ఉపయుక్తమైన వాటిని ఆమోదిస్తుంది. హానికరమైన వాటిని తిరస్కరిస్తుంది.

v) ప్రత్యుత్పత్తి వివక్తత : జనాభాల మధ్య జన్యు మార్పిడి జరగకుండా ఉండటాన్ని ప్రత్యుత్పత్తి వివక్తత అంటారు. అది కొత్త జాతి ఆవిర్భావానికి, ఆ జాతి ప్రత్యేకతను సంరక్షించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది.

ప్రశ్న 6.
100 కుందేళ్లు హార్డీ వెయిన్బర్గ్ జనాభాలో, 24 సమయుగ్మజ పొడవు చెవికుందేళ్ళు, పొట్టి చెవి లక్షణం పొడవు చెవి లక్షణానికి అంతర్గత లక్షణం. ఒక జన్యువుకు కేవలం రెండు యుగ్మవికల్పాలు ఉన్నాయి. అంతర్గత యుగ్మ వికల్పం పౌనఃపున్యం కనుక్కోండి.
జవాబు:
కుందేళ్ళ సంఖ్య = 100
బహిర్గత సమయుగ్మజ పొడవు చెవి కుందేళ్ళు= 24
బహిర్గత సమయుగ్మజ పొడవు చెవి కుందేళ్ళ పౌనఃపున్యం= P2 = 1/100 × 24 = 0.24
బహిర్గత యుగ్మవికల్ప పౌనఃపున్యం  (P) = 0.49
అంతర్గత యుగ్మ వికల్ప పౌనఃపున్యం (q) = 1 -0.49 = 0.51 (q = 1- p)
అంతర్గత యుగ్మవికల్ప పౌనఃపున్యం = 0.51

ప్రశ్న 7.
జన్యు విస్ధాపన అంటే ఏమిటి ? స్థాపక జీవుల ప్రభావం ఉదాహరణగా తీసుకొని జెనెటిక్ విస్థాపనను వివరించండి. [T.S. & A.P. Mar. ‘ 16]
జవాబు:
జన్యు విస్థాపన : చిన్న జనాభాలో వరణం వల్ల కాకుండా యాదృచ్ఛికంగా జన్యు పౌనఃపున్యంలో జరిగే మార్పును జన్యు విస్థాపన అంటారు.

ఒక జన్యువు కేవలం రెండు యుగ్మ వికల్పాలను కలిగి ఉండి ఒక యుగ్మ వికల్పపు పౌనఃపున్యం 1% (q = 0.01) అయినట్లయితే చిన్న జనాభాలో ఆ యుగ్మవికల్పాన్ని యాదృచ్ఛికంగా కోల్పోయే అవకాశం ఎక్కువ. అంతిమ ఫలితం స్థిరీకరణ. లేదా నష్టపోవడం అనేది ఆ జనాభా పరిమాణంపై ఆధారపడి ఉంటుంది. జన్యు విస్థాపన తక్కువ పౌనఃపున్యం కలిగిన యుగ్మవికల్పాలను తొలగించడం ద్వారా జన్యు వైవిధ్యాల పరిమాణాన్ని తగ్గిస్తుంది. జన్యు విస్థాపనను స్థాపక జీవుల ప్రభావం, అవాంతర ప్రభావం వల్ల ఉదాహరణీకరించవచ్చు.

స్థాపక జీవుల ప్రభావం (Founder effect) : చిన్న జీవుల సమూహం మూల జనాభా నుంచి వేరయి కొత్త సహనివేశాన్ని వివక్త ప్రాంతంలో ప్రారంభిస్తే వాటిని కొత్త జనాభా స్థాపకులు (Founders) అంటారు. వీటి సంతాన జీవుల పౌనఃపున్యాలు తమ పూర్వీక పితృజనాభా పౌనఃపున్యాలకంటే, వాటిని ప్రారంభించిన స్థాపకుల పౌనఃపున్యాలను పోలి ఉంటాయి.

ఉదాహరణకు దాదాపు 100% రెడ్ ఇండియన్లు +ve రక్త సముదాయాన్ని కలిగి ఉంటారు. అంటే వారి పూర్వీకులైన రెడ్ ఇండియన్ తెగలోని పూర్వీకులు అధికంగా Ove సముదాయం కలిగి ఉండి ఇతర జనాభాల నుంచి ప్రత్యుత్పత్తిపరంగా తమని తాము వేరుచేసుకొన్నారు.

దీర్ఘ సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
జాతిని నిర్వచించి, అల్లోపాట్రిక్, సింహా ్యజిక్ పద్ధతులలో జాతుల ఉత్పత్తిని సోదాహరణంగా వివరించండి.
జవాబు:
జీవశాస్త్ర సిద్ధాంతం ప్రకారం జాతి అంటే “ఒక నిర్ణీత ప్రాంతంలో జీవిస్తూ, వాటిలో అవి అంతర ప్రజననం (inter breeding) జరుపుకొనే శక్తి కలిగిన లేదా అంతర ప్రజననం జరుపుకొని వాటినే పోలిన ఫలవంతమైన సంతతిని ఉత్పత్తి చేయగల జీవుల జనాభా”.

ఒక జాతికి చెందిన జీవులు ఒకే విధమైన జన్యు నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. ప్రధానంగా జీవుల ఉత్పత్తిని రెండు రకాలుగా విభజించవచ్చు అవి : 1. అల్లోపాట్రిక్ 2. సింపాట్రిక్ రకాలు

1. అల్లోపాట్రిక్ జాతుల ఉత్పత్తి (Allopatric speciation) : దీనిని ఇతర భూభాగ జాతుల ఉత్పత్తి అని పేర్కొనవచ్చు. ఈ సిద్ధాంతం ప్రకారం భౌగోళిక వివక్తత వల్ల కొత్త జాతులు ఏర్పడతాయి. ఒక విస్తృతమైన జాతికి చెందిన జీవుల మధ్య సహజ సిద్ధం ?, కాలక్రమేపి, నదులు, పర్వతాలు, అగ్నిపర్వత పేలుళ్లు, ఎడారులు వంటి భౌగోళిక అవరోధాలు ఏర్పడి ఆ జనాభాను చిన్న చిన్న ఉపజనాభాలుగా విడగొడతాయి. ఇవి ప్రత్యుత్పత్తి వివక్తత చెంది, వాటి నుంచి నూతన జాతులు ఆవిర్భవిస్తాయి.
AP Inter 2nd Year Zoology Study Material Chapter 7 జీవ పరిణామం 3
ఉదా : 1)డార్విన్ ఫించ్లు : ఒకప్పుడు పసిఫిక్ మహాసముద్రంలోని గాలపోగాస్ ద్వీపంలో ఒకే జాతికి చెందిన ఫించ్లు అనే చిన్న పిచ్చుకల వంటి పక్షులు ఉండేవి. కాలక్రమేపి సముద్రమట్టంలో జరిగే హెచ్చుతగ్గుల వల్ల గాలపోగాస్ ద్వీపం అనేక చిన్న దీవులుగా విడిపోయింది. ఫలితంగా ఫించ్ పక్షులు కూడా వివిధ సమూహాలుగా వివక్తత చెందాయి. ఈ విధంగా ఏర్పడిన భౌతిక అవరోధాల కారణంగా ఆ పక్షులు స్వేచ్ఛగా సంపర్కం జరుపుకోలేకపోయాయి. అంటే వాటి మధ్య ప్రత్యుత్పత్తి వివక్తత జరిగింది. స్వేచ్ఛా లైంగిక ప్రత్యుత్పత్తికి అవరోధం ఏర్పడటం వల్ల వాటి మధ్య జన్యుమార్పిడి నిరోధించబడింది. ఆయా ద్వీపాలలోని పరిసరాలకనుగుణంగా వాటి జన్యు సంపుటిలో స్వల్ప మార్పులు ఏర్పడుతూ వచ్చాయి. కాలానుగుణంగా జన్యు మార్పులు సంచితమై కొత్తజాతి ఫించ్లు ఉద్భవించాయి. ఈ విధంగా ఒకే జాతికి చెందిన ఫించ్ పక్షుల నుంచి 24 జాతులు ఏర్పడ్డాయని డార్విన్ పేర్కొన్నాడు.

AP Inter 2nd Year Zoology Study Material Chapter 7 జీవ పరిణామం

2. సింపాట్రిక్ జాతుల ఉత్పత్తి : దీన్ని అదే భూభాగం జాతుల ఉత్పత్తి అని పేర్కొనవచ్చు. ఈ రకం జాతుల ఉత్పత్తి భౌగోళికంగా ఒకే నిర్దేశిత భూభాగంలో జీవించి ఉండే జీవుల నుంచే జరుగుతుంది. సాధారణంగా ఒకే ప్రాంతంలో ఉన్నప్పటికీ, ఆ జీవులు సమూహాలుగా ఏర్పడి వివిధ నిచ్లను ఆక్రమించుకుంటాయి. కొన్ని జీవులు నీటిలో ఉంటే, కొన్ని భూమిపై జీవిస్తాయి. అదేవిధంగా కొన్ని ఒక మొక్కపై జీవిస్తే, అదే జాతికి చెందిన జీవులు కొన్ని ఇతర మొక్కల పై ఆధారపడతాయి. అందువల్ల వాటి మధ్య ప్రత్యుత్పత్తి వివక్తత ఏర్పడి, ఒకదానితో ఒకటి లైంగికంగా కలవవు. అదేకాక, ఒకే భూభాగంలో జీవించే కొన్ని జాతుల జీవులు లైంగిక ఎంపికను ప్రదర్శిస్తాయి. అంటే అవి వాటికి ఇష్టం ఉండే జీవితో మాత్రమే అంతర ప్రజననం జరుపుకుంటాయి. ఈ కారణంగా వాటిమధ్య జన్యుమార్పిడి కొరవడి కొత్తజాతులు ఏర్పడతాయి.
AP Inter 2nd Year Zoology Study Material Chapter 7 జీవ పరిణామం 4

సింపాట్రిక్ జాతుల ఉత్పత్తి ప్రధానంగా మొక్కలలో కనిపిస్తుంది. వీటిలో బహుస్థితికత, అంటే క్రోమోజోమ్ల జట్ల సంఖ్య పెరిగి కొత్త జాతులు ఏర్పడుతూ ఉంటాయి. త్రయస్థితిక, చతుస్థితిక, షటిస్థితిక యొక్క జాతులు ఈ విధంగా ఏర్పడినవే. జంతువులలో సింపాట్రిక్ జాతులు ఉత్పత్తి అరుదుగా కనిపిస్తుంది. అయితే కొన్ని రకాల కీటకాలలో నూతన జాతులు ఈ పద్ధతిలో ఏర్పడతాయి.

ఉదాహరణకు అమెరికా దేశంలో పండ్ల చెట్లపై జీవించే ఆపిల్ మాగల్గగలలో సింపాట్రిక్ జాతుల ఉత్పత్తిని గమనించవచ్చు. ఈ కీటకాలు హాథోర్న్ అనే ఆపిల్ వంటి పండ్ల చెట్లపై జీవించేవి. అయితే 200 సంవత్సరాల క్రితం వలసదారులు అన్యదేశీయ ఆపిల్ చెట్లను అమెరికాలో ప్రవేశపెట్టారు. కొన్ని హాథోర్న్ మాగట్లు కొత్త ఆపిల్ చెట్లలో ఆవాసాన్ని ఏర్పరచుకొన్నాయి. ఒకప్పుడు స్వేచ్ఛగా సంపర్కించే ఈ కీటకాలు, విడివిడిగా అంతర ప్రజననం చేసుకోవడం ప్రారంభించాయి. అంటే వాటి మధ్య ప్రత్యుత్పత్తి వివక్తత ఏర్పడి జన్యుప్రవాహం నిరోధించబడింది. ఫలితంగా ఆపిల్ మాగట్లు అనే కొత్తజాతి ఏర్పడింది. ప్రస్తుతం అమెరికాలో హాథోర్న్ మాగట్లు, ఆపిల్ మాగట్లు అనే రెండు జాతుల కీటకాలు ఒకే భూభాగంలో మనకు పక్కపక్కనే కనిపిస్తాయి.

ప్రశ్న 2.
ప్రత్యుత్పత్తి వివక్తతను సవివరంగా వర్ణించండి.
జవాబు:
ప్రత్యుత్పత్తి వివక్తత : జీవుల మధ్య అంతర ప్రజననాన్ని, సంకరీకరణాన్ని నివారించే అవరోధాన్ని ప్రత్యుత్పత్తి వివక్తత అంటారు. ఇది జీవ జనాభాల మధ్య జన్యుపరస్పర మార్పిడిని నిరోధించి, సంకరజాతులు ఏర్పడకుండా చేసి జాతి విశిష్టతను కాపాడుతుంది. ప్రత్యుత్పత్తి వివక్తత వల్ల ఒక జీవ జనాభాలో సంభవించే ఉత్పరివర్తనలు, వరణం, జన్యు పునఃసంయోజనం, జన్యు విస్థాపన మొదలయిన పరిణామ బలాలు ఇతర జీవ జనాభాలను ప్రభావితం చేయవు. ఈ కారణంగా జాతుల ఉత్పత్తిలో ప్రత్యుత్పత్తి వివక్తతకు చాలా ప్రాధాన్యత ఉంది.

ప్రత్యుత్పత్తి వివక్తత ప్రధానంగా రెండురకాలు. అవి 1. సంయుక్తబీజ పూర్వ వివక్తత 2. సంయుక్తబీజ పరవివక్తత.
1. సంయుక్తబీజ పూర్వ వివక్తత : ఇందులో జరిగే వివక్తత వల్ల స్త్రీ, పురుష బీజకణాలు కలవవు; ఫలదీకరణ జరగదు; సంయుక్త బీజం ఏర్పడే అవకాశమే ఉండదు. ఈ వివక్తత కింద పేర్కొన్న ఐదు పద్ధతులలో జరుగుతుంది.
i) భౌగోళిక వివక్తత : ఇందులో భౌగోళిక అవరోధాల వల్ల వివక్తత జరుగుతుంది. ఉదా : డార్విన్ ఫించ్లు భౌగోళిక వివక్తత వల్ల వేరు చేయబడి కొత్తజాతులేర్పడినాయి.

ii) జీవావరణ లేదా ఆవాస వివక్తత (ecological or habitat isolation) : ఇందులో జీవులు, జీవావరణ పరంగా వేర్వేరు ఆవాసాలలో జీవించడం వల్ల వివక్తత చెందుతాయి. ఉదా : గడ్డి భూములలో జీవించే సింహాలు, దట్టమైన అడవులలో జీవించే పులులు ఒకదానితో ఒకటి కలవవు.

iii) ప్రవర్తనాయుత వివక్తత (behavioural isolation) : ఇందులో జీవులు, చూపే భిన్న ప్రవర్తనల వల్ల వేరుచేయబడతాయి. ఉదా : సింహాలు గుంపులుగా సంచరిస్తే, పులులు ఒంటరిగా తిరుగుతూ ఉంటాయి.

iv) యాంత్రిక వివక్తత (mechanical isolation) : జీవుల బాహ్య జననాంగాలలో కనిపించే భిన్నత్వం వల్ల వాటి మధ్య ప్రత్యుత్పత్తి వివక్తత ఏర్పడుతుంది. ఉదా : బొద్దింకలు, మిడతలలోని బాహ్యజననాంగాలు వేర్వేరు అమరిక కలిగి ఉండటం వల్ల అవి రెండూ సంగమింప జాలవు.

v) బీజకణ వివక్తత (gametic isolation): కణ త్వచంలో విశిష్ట గ్రాహక ప్రోటీన్ లు ఏర్పడ్డం వల్ల విభిన్న జాతులకు చెందిన స్త్రీ, పురుష బీజకణాలు ఫలదీకరణలో పాల్గొనవు. ఉదా : సాగర జలంలో అనేక జీవుల బీజకణాలు ఉన్నప్పటికీ, సీఅర్చిన్ శుక్రకణం, అదేజాతికి చెందిన అండాన్ని మాత్రమే ఫలదీకరిస్తుంది.

AP Inter 2nd Year Zoology Study Material Chapter 7 జీవ పరిణామం

2. సంయుక్తబీజ పర వివక్తత (post – zygotic isolation) : సంయుక్తబీజం ఏర్పడిన తరువాత జరిగే వివక్తతను సంయుక్తబీజ పర వివక్తత అంటారు. ఇది నాలుగు రకాలు.
i) సంకర విఫలం (hybrid failure) : ఇందులో స్త్రీ, పురుష బీజకణాలు కలుస్తాయి. కానీ జన్యు అననుగుణ్యత (Genetic incompatibility) వల్ల వాటి జన్యు పదార్థాలు కలవవు.

ii) సంకర అసమర్థత (hybrid inviability) : ఇందులో సంకర జాతులేర్పడతాయి. కానీ అవి పరిపక్వత చెందవు. ఉదా : ఉత్తర అమెరికాలో జీవించే రానాపైపియన్స్ (Rana pipiens) అనే కప్పకు చెందిన ఉత్తర దక్షిణ తెగలు కలిసినప్పుడు ఏర్పడే సంకర కప్ప.

iii) సంకర వంధ్యత్వం (hybrid sterility) : సంకరజీవి వంధ్యత్వం కలిగి ఉంటుంది. క్రియాత్మక బీజకణాలను ఉత్పత్తి చేయజాలదు. ఉదా : మగగాడిదకు, ఆడగుర్రానికి పుట్టే మ్యూల్ (mule) అనే సంకరజీవి.

iv) సంకర భంగం (Hybrid breakdown) : ఇందులో F తరానికి చెందిన సంకరజీవులు ఫలవంతంగా ఉంటాయి. కానీ F2 తరంలో ఫలవంతమైన సంతతి ఏర్పడదు. ఉదా : సంకరపత్తి, సంకర వరి వంగడాలు.

ప్రశ్న 3.
డార్విన్ ప్రకృతివరణ సిద్ధాంతాన్ని వివరించండి.
జవాబు:
డార్విన్ ప్రకృతివరణ సిద్ధాంతం : డార్విన్ తన సిద్ధాంతాన్ని జాతుల ఆవిర్భావం అనే గ్రంధంలో ప్రచురించాడు.
డార్విన్ ప్రకృతి వరణ సిద్ధాంతం “పరిణామం” అంటే ఏమిటో ఖచ్చితంగా వివరించలేదు. కాని ప్రకృతిలో పరిణామం ఏవిధంగా సంభవిస్తుందో వివరిస్తుంది. ఈ సిద్ధాంతం పరిణామం హఠాత్తుగా కాకుండా క్రమేణా జరిగే జీవప్రక్రియ అని చెప్తుంది. డార్విన్ ప్రకృతివరణ సిద్ధాంతం అనేక వాస్తవాలపైన, పరిశీలనలపైన, అనుమతుల పైన ఆధారపడి ఉంటుంది. అవి.

i) అధికోత్పత్తి లేదా అత్యధిక ఫలనశక్తి : ప్రతి జీవి తన జనాభాను అత్యధిక ప్రమాణంలో పెంచుకొంటుంది. ఉదాహరణకు పేరమీషియం రోజుకి మూడు లేదా నాలుగుసార్లు ద్విధావిచ్ఛిత్తి ద్వారా విభజన చెందుతుంది. ఈ రేటు ప్రకారం 9000వ తరం నాటికి ఏర్పడిన పిల్ల పేరమీషియంల జీవపదార్థ పరిమాణం భూమి కంటే 10,000 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఒక రుతువులో సాల్మన్ చేప 28మిలియన్ల గుడ్లు, సముద్ర నక్షత్రం ఒక మిలియన్ గుడ్లు పెడతాయి. అన్ని గుడ్ల నుంచి డింభకాలు ఏర్పడి ప్రత్యుత్పత్తి జరిపినట్లయితే, కొన్ని తరాలలోనే అన్ని’ సముద్రాలు ఈ జీవులతో నిండిపోతాయి. అతి నెమ్మదిగా ప్రత్యుత్పత్తి జరిపే ఏనుగు కూడా ఎలాంటి అదుపు లేకుంటే 800వ తరం తరువాత 19 మిలియన్ల సంతానాన్ని కలిగి ఉంటుంది.

ii) జనాభాలో స్థిరత్వం : ప్రకృతిలో అధికోత్పత్తి ఉన్నప్పటికీ ఏ జాతి జనాభా కూడా అసహజమైన రీతిలో అత్యధికంగా పెరగడం లేదు. కారణం పిల్లజీవులు ప్రత్యుత్పత్తి దశకు చేరుకొనేలోపే పెద్ద సంఖ్యలో మరణిస్తాయి. ఎందుకంటే జనాభా పెరిగే పద్ధతిలో ఆ జనాభాకు కావలసిన నిష్పత్తిలో ఆహారం, ఇతర సౌకర్యాలు పెరగడం లేదు. కాబట్టి ప్రతి జాతి జనాభా ఇంచుమించు స్థిరంగా ఉంటుంది.

iii)మనుగడ కోసం పోరాటం : ఆహారం పరిమితంగా ఉండటం వల్ల జనాభాలోని జీవుల మధ్య తీవ్రమైన పోటీ ఏర్పడుతుంది. దీన్నే డార్విన్ మనుగడ కోసం పోరాటం అని వర్ణించాడు. ఇది మూడు రకాలుగా ఉంటుంది.

1. జాత్యాంతర పోరాటం లేదా సజాతి సంఘర్షణ : ఒకే జాతిలోని జీవుల మధ్య జరిగే ‘సంఘర్షణను’ జాత్యాంతర పోరాటం అంటారు. ఈ పోరాటం ఆహారం, నివాసం, సంగమ భాగస్వామి కోసం ఉంటుంది. ప్రత్యుత్పత్తి రేటును ఈ పోరాటం అతి తీవ్రంగా అదుపులో ఉంచుతుంది. ఉదా : రెండు పులుల మధ్య పోరాటం.

2. జాతుల మధ్య పోరాటం లేదా విజాతి సంఘర్షణ : వేర్వేరు జాతులకు చెందిన జీవుల మధ్య సంఘర్షణను జాతుల మధ్య పోరాటం లేదా విజాతి సంఘర్షణ అంటారు. వివిధ జాతులు ఒకే రకమైన ఆహారపు అలవాట్లను కలిగి ఉంటాయి. కాబట్టి ఈ సంఘర్షణ ప్రధానంగా ఆహారం, ఆశ్రయం కోసం జరుగుతుంది. ఉదా : తోడేలు, నక్క మధ్య పోరాటం.

3. పరిసరాలతో సంఘర్షణ : జీవులు నిరంతరం ప్రకృతి వైపరీత్యాలు అంటే తుఫానులు, వరదలు, భూకంపాలు, సునామీలు, అగ్ని పర్వతాల పేలుళ్లు లాంటి వాటితో పోరాడుతూనే ఉంటాయి. ఈ విధంగానే అతి దీర్ఘకాయం కలిగిన సరీసృపాలైన డైనోసార్లు క్రెటేసియస్ కాలంలోని వాతావరణ మార్పులను తట్టుకోలేక నశించిపోయాయి.

iv) విశ్వవ్యాప్త వైవిధ్యాలు : ఏ రెండు జీవులు ఒకే విధంగా ఉండవు. ఒకే తల్లిదండ్రుల సంతానం కూడా వేరుగా ఉంటుంది. ఈ వైవిధ్యాలు ఉపయోగకరంగా గాని, హానికరంగా గాని, తటస్థంగా గాని ఉండవచ్చు. ఉపయుక్తమైన వైవిధ్యాలు జీవి మనుగడ కోసం జరిపే పోరాటంలో సహాయపడతాయి. ఇలాంటి వైవిధ్యాలు తరువాతి తరానికి అందజేయబడతాయి.

v) ప్రకృతి వరణం : డార్విన్ ప్రకారం హానికరమైన వైవిధ్యాలు గల జీవులు ప్రత్యుత్పత్తి పరంగా తక్కువ విజయవంతం అవుతాయి. ఉపయుక్త వైవిధ్యాలు గల జీవులు అధిక ప్రత్యుత్పత్తి జరపగల శక్తి కలిగియుండి ఫలవంతమైన సంతానాన్ని ఏర్పరుస్తాయి. ఇలాంటి జీవులు ఉత్తమ యోగ్యత గల జీవులు. ఇవి మాత్రమే మనుగడ సాగిస్తాయి. మనుగడ కోసం పోరాటంలో ఎంత యెగ్యత కలిగినప్పటికీ తక్కువ ఫలవంతమైన జీవులు ముందు తరాలలో కనిపించవు. దీనినే ప్రకృతి వరణం అంటారు.

మారతాయని డార్విన్ భావించాడు. ప్రకృతి ద్వారా ఎన్నుకోబడిన అన్ని వైవిధ్యాలు ఒక తరం నుంచి మరొక తరంలోకి సంచితమవుతాయి. ఈ విధమైన సంచితం దీర్ఘకాలంలో ఒక జీవిలో అనేక మార్పులను తీసుకొస్తుంది. దీనివల్ల ఆ జీవి నిజ జనక జాతులతో ఇక ఏ మాత్రం అంతర ప్రజననం చెందదు. ఈ విధమైన ప్రత్యుత్పత్తి పరంగా వివక్తత చెందిన జీవి ఒక ‘కొత్త జాతి’ గా పరిగణించబడుతుంది.

డార్విన్ సిద్ధాంతానికి అభ్యంతరాలు :

  • ఏ యాంత్రికాల వల్ల వైవిధ్యాలు సంభవిస్తాయో వివరించడంలో విఫలమయింది.
  • డార్వినిజమ్ యోగ్యతమాల స్థారక జీవనం గురించి వివరించింది కానీ యోగ్యత ఏవిధంగా సంభవిస్తుందో వివరించలేదు.
  • అవశేషాల ఉనికిని వివరించలేదు.
  • జీవులలో అధిక ప్రత్యేకీకరణం చెందిన అవయవాల గురించి వివరించలేదు.
  • డార్వినిజమ్ ప్రధానంగా అనువంశికత చెందని, తరచుగా మారే చిన్నచిన్న డోలన వైవిధ్యాలకు ప్రాముఖ్యాన్ని ఇచ్చింది.
  • ఇది శాఖీయ వైవిధ్యాలకు, బీజ వైవిధ్యాలకు మధ్య గల భేదాన్ని గుర్తించలేదు.
  • డార్విన్ జీవ పరిణామంలో జరిగే స్థూల వైవిధ్యాల ప్రాముఖ్యాన్ని గుర్తించలేదు.

ప్రశ్న 4.
జన్యుపరంగా జీవావరణ విధానాన్ని, వివరించండి.
జవాబు:
ఒక జీవి దృశ్యరూపాన్ని నిర్ణయించేది దాని జన్యురూపం, జన్యురూపంలో కలిగే మార్పులు దృశ్యరూపంలలో ప్రతిబింబిస్తాయి. లైంగిక ప్రత్యుత్పత్తి విధానంలో తల్లితండ్రుల జన్యువులు పునఃసంయోజనం చెందడం వల్ల వారి సంతతిలో వైవిధ్యాలు ఏర్పడతాయి. అదే విధంగా ప్రతిజాతికి ఒక నిర్థిష్ట జన్యురూపం ఉంటుంది. దీనిలో మార్పులు జరిగితే ఒకజాతి, మరొకజాతిగా మారిపోతుంది. ఈ విధంగా జరిగే జన్యుపరివర్తన వల్లనే నూతన జాతులు ఏర్పడుతూ ఉంటాయి. ఇదే జీవపరిణామ ప్రక్రియలో కీలక అంశం. R.A. ఫిషర్, సేవాల్ట్, ఎర్నెస్ట్ మయర్లు డార్విన్ అనంతర ఆవిష్కరణలను దృష్టిలో పెట్టుకొని ప్రకృతి వరణాన్ని వివరించారు. ఈ సిద్ధాంతం ప్రకారం ఐదు ప్రాథమిక కారకాలు జీవపరిణామంలో పాల్గొంటాయి అవి.

  1. జన్యు ఉత్పరివర్తనాలు,
  2. క్రోమోజోమల్ ఉత్పరివర్తనాలు
  3. జన్యుపునః సంయోజనాలు
  4. ప్రకృతి వరణం
  5. ప్రత్యుత్పత్తి వివక్తత.

AP Inter 2nd Year Zoology Study Material Chapter 7 జీవ పరిణామం

వీటికి అదనంగా హార్డీవెయిన్ బర్డ్ సమతాస్థితి, జన్యు విస్ధాపన కారకాలు కూడా పాల్గొంటాయి..
i) జన్యు ఉత్పరి వర్తనాలు : జన్యు నిర్మాణంలో జరిగే మార్పులను జన్యు ఉత్పరివర్తనాలు లేదా బిందు ఉత్పరి వర్తనాల అంటారు. ఈ ఉత్పరివర్తనాలు అనువంశికతను పాటిస్తుంది. అది జీవుల దృశ్యరూప లక్షణాలను మారుస్తాయి. ఈ విధంగా జన్యు ఉత్పరివర్తనాలు సంతానంలో వైవిధ్యాలను ఏర్పరచగలుగుతాయి.

ii) క్రోమోజోమల్ ఉత్పరివర్తనాలు: క్రోమోజోమల్ నిర్మాణంలో పరిత్యాగం, సంకలనం, ద్విగుణీకరణం, విలోమం, లేదా స్థానాంతరణలకారణంగా కలిగి మార్పులను క్రోమోజోమల్ ఉత్పరివర్తనాలు అంటారు. ఇవి కూడా జీవుల దృశ్యరూపంలో వైవిధ్యాలను కలిగిస్తాయి. దీని ఫలితంగా సంతానంలో వైవిధ్యాలు కనిపిస్తాయి.

iii) జన్యుపునఃసంయోజనాలు : జన్యువుల పునఃసంయోజనాలు క్షయకరణ విభజనలో వినిమయం వల్ల కలుగుతాయి. ఇవి ఒకే జాతిలోని జీవుల మధ్య వైవిధ్యాలు కలగడానికి కారణమవుతాయి. ఈ విధంగా అనువంశిక వైవిధ్యాలు కలగడానికి సహకరిస్తాయి.

iv)ప్రకృతివరణం : ప్రకృతివరణం ఎలాంటి జన్యుమార్పులను కలిగించదు. కాని జన్యుమార్పులు జరిగితే వాటిలో ఉపయుక్తమైన వాటిని ఆమోదిస్తుంది. హానికరమైన వాటిని తిరస్కరిస్తుంది. పరిణామంలో దాన్ని ఒక చాలకశక్తిగా పరిగణిస్తారు.

v) ప్రత్యుత్పత్తి వివక్తత : జీవుల మధ్య అంతరప్రజనాన్ని, సంకరీకరణాన్ని నివారించే ఆవరోధాన్ని ప్రత్యుత్పత్తి వివక్తత అంటారు. ఇది జీవ జనాభాల మధ్య జన్యుమార్పిడిని నిరోధించి సంకరజాతులు ఏర్పడకుండా చేసి జాతి విశిష్టతను కాపాడుతుంది. ప్రత్యుత్పత్తి వివక్తత వల్ల ఒక జీవజనాభాలో సంభవించే ఉత్పరివర్తనాలు, వరణం, జన్యుపునః సంయోజనం, జన్యు విస్ధాపన మొదలైన పరిణామ బలాలు ఇతర జీవ జానాభాలను ప్రభావితం చేయవు.

vi) హార్డీ వెయిన్ బర్గ్ సమతాస్థితి : జాతుల ఆవిర్భావం జరిగే జన్యు పరివర్తన రెండు అంశాలలో జరుగుతుంది. అవి జన్యు సంపుటి, జన్యు పౌనఃపున్యం. ఒక జనాభాలోని మొత్తం జన్యువులు వాటి యుగ్మ వికల్పాల సంఖ్యను జన్యు సంపుటి అంటారు. ఒక లక్షణాన్ని నియంత్రించే జన్యుసంపుటిలో ఒక యుగ్మ వికల్పం నిష్పత్తిని జన్యుపౌనఃపున్యం అంటారు. ఒకజాతి జనాభాలో జన్యు సంపుటి, జన్యు పౌనఃపున్యాలు సమతాస్థితిలో ఉంటే పరిణామం జరగదు. కొత్త జాతులు ఏర్పడవు. వాటి జన్యుతుల్యత మారితే పరిణామం జరిగి నూతన జాతులేర్పడతాయి.

జన్యు సంపుటి, జన్యు పౌనఃపున్యాల మధ్య ఉండే సంబంధాన్ని హార్డ్ వెయిన్ బర్డ్ సూత్రం వివరిస్తుంది. ఈ సూత్రం ప్రకారం బాహ్యబలాలు మార్చనంతవరకూ, ఒక జనాభాలోని జన్యురూప, జన్యు పౌనఃపున్యాల యుగ్మ వికల్పాల పౌనఃపున్యాల నిష్పత్తులు తరతరాలుగా మారకుండా ఉంటాయి. అంటే బాహ్య ప్రేరణలు పనిచేయకపోతే ఒక జన్యువు సంబంధించినంత వరకూ, జనాభా సమతాస్థితిని పొందుతుంది అని అర్థం.

vii) జన్యువిస్ధాపన : చిన్న జనాభాలో వరణం వల్ల కాకుండా యాదృచ్ఛికంగా జన్యు పౌనఃపున్యంలో జరిగే మార్పులను జన్యువిస్థాపన అంటారు. ఒక జన్యువు కేవలం రెండుయుగ్మ వికల్పాలను కలిగి ఉండి ఒక యుగ్మ వికల్పపు పౌనఃపున్యం 1% అయినట్లయితే చిన్న జనాభాలో ఆ యుగ్మ వికల్పాన్ని యాదృచ్ఛికంగా కోల్పోయే అవకాశం ఎక్కువ. అంతిమ ఫలితం స్థిరీకరణ లేదా నష్టపోవడం అనేది ఆ జనాభా పరిమాణం పై ఆధారపడి ఉంటుంది. తక్కువ పౌనఃపున్యం కలిగిన యుగ్మ వికల్పాలను తొలగించడం ద్వారా జన్యువైవిధ్యాల పరిమాణాన్ని తగ్గిస్తుంది.

ప్రశ్న 5.
జీవం ఆవిర్భావం ఏవిధంగా జరిగిందో ప్రయోగపూర్వకంగా వివరించండి.
జవాబు:
జీవ ఆవిర్భావాన్ని వివరించడానికి అనేక సిద్ధాంతాలు ప్రతిపాదించబడ్డాయి. వీటిలో అతి ముఖ్యమైనది జీవపరిణామ సిద్ధాంతం. ఈ సిద్ధాంతాన్ని AI. ఒపారిన్ ప్రతిపాదించగా, J.B.S. హాల్డేన్ సమర్థించాడు. ఈ సిద్ధాంతం ప్రకారం ప్రాథమిక జీవుల ఆవిర్భావం అకర్బన పదార్థాల నుంచి మెరుపులలోని విద్యుత్ శక్తి, అతినీలలోహిత, రేడియో ధార్మికత, అగ్నిపర్వతాల విస్ఫోటనం మొదలైన భౌతిక శక్తుల చర్యల వల్ల యాదృచ్ఛికంగా జరిగింది. ఈ విధంగా జీవుల పుట్టుక ఒక రసాయన పరిణామం. ఇది తరువాత జీవ పరిమాణానికి దారి తీసింది.

జీవరసాయన పరిణామం: భూమి సుమారు 4.5 నుంచి 5 బిలియన్ల సంవత్సరాల క్రితం ఏర్పడింది. అప్పటి భూమి ఉష్ణోగ్రత 5000°C నుండి 6000°C, అది కొన్ని మిలియన్ల సంవత్సరాలు క్రమేణా చల్లబడింది. ఈ తరుణంలో తేలికగా ఉండే మూలకాలైన హీలియం హైడ్రోజన్, నైట్రోజన్, కార్బన్ లాంటి మూలకాలు ఉపరితలంపైకి వ్యాపించి ప్రాథమిక వాతావరణాన్ని ఏర్పాటు చేసాయి. ఈ ప్రాథమిక వాతావరణం వేడిగా, అధిక పరిమాణంలో హైడ్రోజను కలిగి ఉండి స్వేచ్ఛా ఆక్సిజస్ లేకుండా ఉండేది. ఇలాంటి వాతావరణాన్ని క్షయీకరణ వాతావరణం అంటారు. క్రమేణా వాతావరణం చల్లబడటం వల్ల దానిలోని మూలకాలు ఒకదానితో ఒకటి చర్యనొంది సంయోజక పదార్థాలైన మీథేన్, అమ్మోనియా మొదలైనవి ఏర్పడ్డాయి. క్రమేణా ఉష్ణోగ్రత మరింత చల్లబడటం వల్ల నీటిఆవిరి సాంద్రీకరణం చెంది వర్షంగా మారి భూమిపై కాలువలు, నదులుగా ప్రవహించి చివరగా సముద్రాలలో నిలువ ఉన్నాయి. వాతావరణంలోని అమ్మోనియా, మీథేన్ లాంటివి భూమిపై గల ఖనిజ శిలలు వర్షపు నీటిలో కరిగి సముద్రాలలోకి చేర్చబడ్డాయి. అత్యంత ప్రభావితంగా చర్యలు జరిపే CH, CH, స్వేచ్ఛా రాడికల్స్ సాంద్రీకరణ చెంది వివిధ రకాలైన హైడ్రోకార్బన్లను ఏర్పరచాయి. ఈ హైడ్రోకార్బన్లు అమ్మోనియా, నీరు మొదలైన వాటితో చర్య జరిపి సరళ కర్బన అణువులైన చక్కెరలు, అమైనో ఆమ్లాలు, కొవ్వు ఆమ్లాలు, ప్యూరిన్లు, పిరమిడిన్లు ఏర్పడ్డాయి. ప్యూరిన్లు, పిరమిడిన్లు న్యూక్లియోసైడ్లు, న్యూక్లియోటైడ్లను ఏర్పరచాయి. ఈ చర్యలన్నీ సముద్ర జలంలో జరిగాయి. J.B.S. హాల్డేన్ దీన్ని ‘జీవ పూర్వద్రవం’ (Prebiotic soup) లేదా ‘ఉష్ణ సజల పులుసు’ (hot dilute soup) గా అభివర్ణించాడు. జీవ పూర్వద్రవంలోని ఈ సరళ సేంద్రియ అణువులు బృహదణువులైన పాలీశాకరైడ్లు, ప్రోటీన్లు, కొవ్వులు, కేంద్రకామ్లాలను ఏర్పరచాయి. కేంద్రకామ్లాలు ప్రోటీన్ల తో కలిసి బృహదణువులైన న్యూక్లియో ప్రోటీన్లుగా ఏర్పడ్డాయి.

రసాయన జీవోత్పత్తిని ప్రయోగాత్మకంగా పరిశీలించడం :
AI. ఒపారిన్ వివరించిన రసాయన జీవోత్పత్తిని స్టాన్లీ మిల్లర్, హారాల్డ్ యురే అనుకరణ ప్రయోగం ద్వారా విజయవంతంగా నిరూపించారు. ప్రయోగశాలలో ప్రాథమిక వాతావారణాన్ని ఏర్పరచడానికి ప్రయత్నించారు. వారు అమ్మోనియా, మీథేన్, నీటి ఆవిరి, హైడ్రోజన్ల మిశ్రమాన్ని (ప్రాథమిక వాతావరణానికి అనుకరణ) ఒక ఉత్సర్గ కక్ష్యలో బంధించి విద్యుత్ ఉత్సర్గం జరపడానికి (spark chamber) (పిడుగు పడినప్పుడు జరిగే విద్యుత్ ఉత్సర్గానికి అనుకరణ) ఎలక్ట్రోడ్లు అమర్చారు. ఎలక్ట్రోడ్ నుంచి విద్యుత్ ఘాతాల వల్ల శక్తిని అందజేసారు (విద్యుత్ ఉత్సర్గ అనుకరణ). ఉత్సర్గ కక్ష్య (గాజుగది లేదా ఫ్లాస్క్) ను ఒకవైపు మరుగుతున్న నీటిని కలిగిన గదికి, మరొక వైపు ద్రవీకారి (condenser tube) (హాల్డేన్ ద్రవం లేదా వర్షపు నీటికి అనుకరణ) సంగ్రహణ నాళికాభాగానికి కలిపారు. కొన్ని రోజుల తరువాత దీనిలో అనేక సంక్లిష్ట సేంద్రియ పదార్థాలైన గ్లైసిన్, ఎలనిన్, ఆస్పర్టిక్ ఆమ్లం లాంటి ఆమ్లాలున్నట్లు కనుగొన్నారు. ఈ తరువాత ఇదే రకమైన ప్రయోగాలలో అన్ని రకాల అమైనో ఆమ్లాలు, హైడ్రోజన్ సయనైడ్ను ఉపయోగించిన ప్రయోగంలో ఎడినిన్, ఇతర నత్రజని క్షారాలు కూడా ఏర్పడినట్లు గమనించారు.
AP Inter 2nd Year Zoology Study Material Chapter 7 జీవ పరిణామం 5

AP Inter 2nd Year Zoology Study Material Chapter 7 జీవ పరిణామం

ప్రాథమిక జీవకణాల ఆవిర్భావం (origin of primary living cells) :
దీనిలో రెండు అంశాలు వివరించడం జరిగింది. (i) జీవపూర్వ నిర్మాణాలు లేదా ప్రోటోబయాంట్లు ఏర్పడటం. (ii) జీవపూర్వ నిర్మాణాల నుంచి జీవకణాలు ఏర్పడటం.
(i) జీవపూర్వ నిర్మాణాలు లేదా ప్రోటోబయాంట్లు ఏర్పడటం : అణువుల మధ్య గల ఆకర్షణ బలాల వల్ల సంక్లిష్ట సేంద్రియ అణువుల నుంచి కొల్లాయిడల్ సమూహాలైన కోసర్వేట్లు, బుడగలాంటి బిందువులు ఏర్పడ్డాయి. కొన్ని రకాల రసాయన వ్యవస్థీకరణాల (స్వేచ్ఛా జన్యువులు) వల్ల ఇవి పరిసరాల నుంచి అణువులను గ్రహించే సామర్థ్యాన్ని పొందాయి. తరవాత ఇవి కొవ్వు త్వచాలను ఏర్పరచుకొన్నాయి. వీటిలోని కొన్ని ప్రోటీన్లు, ఎన్జైమ్ లక్షణాలను సంతరించుకోవడం వల్ల అణువులు త్వరగా బహుగుణీకృతం కావడం మొదలయింది.

జీవులు ఏర్పడటం : ‘జీవ పూర్వ చిక్కటి ద్రవం’ నుంచి స్వేచ్ఛా జన్యువులు కర్బన పదార్థాలను శోషించడం మొదలుపెట్టి అవాయు పరపోషక జీవులుగా పరిణామం చెందాయి. ప్రథమ జీవుల్లో ఒకటి రెండు DNA అణువులు ఉన్న న్యూక్లియో ప్రోటీన్ ముద్దలుండి, కేంద్రక పూర్వ జీవులను పోలి ఉండేవి. ఈ పరిణామ క్రమంలో రసాయనిక స్వయం పోషకాలు ఏర్పడ్డాయి. కొన్ని బ్యాక్టీరియాలు సముద్ర జలాల్లోని మెగ్నీషియం పోరపైరిన్ నుంచి బ్యాక్టీరియల్ పత్రహరితాన్ని సంశ్లేషం గావించాయి. ఇవి మొదట ఆక్సిజన్ జననరహిత కాంతి పోషకాలుగా, తరువాత ఆక్సిజన్ సహిత స్వయం పోషకాలుగా పరిణామం చెందాయి. ఆక్సిజన్ సహిత స్వయం పోషకాలు విడుదల చేసిన ఆక్సిజన్ కారణంగా క్షయీకరణ వాతావరణం క్రమేపి ఆక్సీకరణ గుణం గల వాతావరణంగా మారింది.
ఈ పరిణామ క్రమంలో నిజకేంద్రక జీవులు రెండు పద్ధతుల ద్వారా ఏర్పడ్డాయి.

  1. కేంద్రక పూర్వజీవులు ఆదిమ నిజకేంద్రక జీవులతో సహజీవనం చేస్తూ పరిణామక్రమంలో మైటోకాండ్రియా, హరితరేణువులు లాంటి కణాంగాలు ఏర్పడ్డాయి.
  2. కేంద్రక పూర్వజీవుల ప్లాస్మాత్వచం అంతర్వర్తనం చెందడం ద్వారా త్వచ నిర్మిత కణాంగాలు ఏర్పడ్డాయి.

AP Inter 2nd Year Zoology Study Material Chapter 5(b) ప్రత్యుత్పత్తి సంబంధ ఆరోగ్యం జన్యుశాస్త్రం

Andhra Pradesh BIEAP AP Inter 2nd Year Zoology Study Material  Lesson (b) ప్రత్యుత్పత్తి సంబంధ ఆరోగ్యం జన్యుశాస్త్రం Textbook Questions and Answers.

AP Inter 2nd Year Zoology Study Material Lesson (b) ప్రత్యుత్పత్తి సంబంధ ఆరోగ్యం జన్యుశాస్త్రం

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
లైంగిక సంపర్క వ్యాధులు సోకకుండా తీసుకొనే నివారణ చర్యలను తెలపండి. [A.P. Mar. ’17]
జవాబు:
లైంగిక సంపర్క వ్యాధులు సోకకుండా తీసుకొనే నివారణ చర్యలు :

  1. తెలియని భాగస్వామి / బహుభాగస్వాములతో లైంగిక సంబంధాన్ని పెట్టుకోకపోవడం.
  2. సంపర్క సమయంలో కండోమ్లను తప్పక ఉపయోగించడం.
  3. లైంగిక సంపర్క వ్యాధులను ప్రాథమిక దశలో గుర్తించడంలో నిష్ణాతుడైన వైద్యుణ్ణి సంప్రదించి ఒకవేళ వ్యాధి సంక్రమించినట్లయితే సంపూర్ణ చికిత్సను పొందడం.

ప్రశ్న 2.
జనాభా విస్ఫోటనానికి రెండు కారణాలు తెల్పండి.
జవాబు:

  • నిరక్షరాస్యత.
  • గర్భనిరోధక పద్ధతుల పై అవగాహన లేక పోవడం.
  • అతిచిన్న వయస్సులో వివాహం జరగడం.
  • ఆరోగ్య సంరక్షణ పద్ధతులు పెరగడం, మరణ రేటు తగ్గడం మొదలైనది.

AP Inter 2nd Year Zoology Study Material Chapter 5(b) ప్రత్యుత్పత్తి సంబంధ ఆరోగ్యం జన్యుశాస్త్రం

ప్రశ్న 3.
MTP అనేది నిజానికి జనాభా నియంత్రణకై ఉద్దేశించబడింది కాదు అయినా భారత ప్రభుత్వం ఎందుకు MTP ని చట్టబద్ధం చేసింది ? [T.S. Mar. ’15, ’14]
జవాబు:
గర్భం పూర్తి కాకుండానే ఉద్దేశపూర్వకంగా, వాంఛితంగా గర్భాన్ని వైద్యరీత్యా తీసివేయడాన్ని MTP లేదా ప్రేరేపిత గర్భస్రావం అంటారు. కొన్ని సందర్భాలలో గర్భం కొనసాగడం వల్ల తల్లికి గాని, పిండానికి గాని లేదా ఇద్దరికి అపాయం, ప్రాణహాని ఉన్నప్పుడు MTP తప్పనిసరి. అందువల్ల 1971లో భారత ప్రభుత్వం MTP దుర్వినియోగం కాకుండా కొన్ని నియంత్రణలు, నింబంధనలను విధించి చట్టబద్దత కల్పించింది.

ప్రశ్న 4.
‘ఉల్బద్రవ పరీక్ష’ (ఆమ్నియో సెంటిసిస్) అంటే ఏమిటి ? ఉల్బద్రవ పరీక్ష ద్వారా కనుక్కొనే రెండు అవక్రమాల పేర్లను పేర్కొనండి. A.P. Mar. ’17, ’16 Mar. ’14
జవాబు:
గర్భస్థ శిశువు (పిండం)లో జన్యులోపాలను కనుక్కొనే రోగ నిర్ధారక పరీక్షను ఉల్బద్రవ పరీక్ష అంటారు. ఈ విధానంలో వైద్యుడు పొడవైన ఇంజెక్షన్ సూదిని జాగ్రత్తగా తల్లి ఉదరకుడ్యం గుండా ఉల్బకోశంలోకి ప్రవేశపెట్టి కొంత ఉల్బద్రవ నమూనాను సేకరిస్తారు. ఉల్బద్రవాన్ని సెంట్రిఫ్యూజ్ చేయడం వల్ల పిండ కణాలను వేరు చేసి, కణాలను వర్ధనం చేసి క్రోమోసోమ్ల కేరియోటైప్ ను తయారు చేసి వ్యాధి నిర్ధారణ చేస్తారు. ఉల్బద్రవ పరీక్షను సాధారణంగా డౌన్, ఎడ్వర్డ్స్, టర్నర్, క్లెన్ఫల్టర్ సిండ్రోమ్ వంటి అపస్థితులను కనుక్కొనుటకు ఉపయోగిస్తారు.

ప్రశ్న 5.
క్షీరోత్పాదక రుతుస్రావ నిరోధక పద్ధతి వల్ల కలిగే లాభాలను పేర్కొనండి.
జవాబు:
ప్రసవం అయిన తరువాత పాల ఉత్పత్తి జరుగుతున్నప్పుడు సాధారణంగా అండోత్సర్గం జరగదు. దీనినే క్షీరోత్పాదక రుతుస్రావ నిరోధకం అంటారు.
లాభాలు :

  1. పాలను ఇస్తున్నంత వరకూ గర్భధారణ అవకాశం దాదాపు శూన్యం (సుమారు 6నెలలు)
  2. చనుపాలు వల్ల బిడ్డకు రోగనిరోధకత పెరగడం, అలర్జీల నుంచి రక్షణ పొందడం మొదలైనవి.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
మానవుల్లో సాధారణంగా వచ్చే లైంగిక సంపర్క వ్యాధులను సంక్షిప్తంగా వివరించండి.
జవాబు:
లైంగిక సంపర్కం ద్వారా వ్యాపించే అంటువ్యాధులను సమిష్టిగా లైంగిక సంపర్క వ్యాదులు లేదా సుఖవ్యాధులు లేదా ప్రత్యుత్పత్తి మార్గ అంటువ్యాధులు అంటారు.
సాధారణమైన లైంగిక సంపర్క వ్యాధులు (STDs), వాటికి కారణమైన జీవులు హెపటైటిస్ – బి, జననాంగ హెర్పెస్, HIV సంక్రమణ తప్ప మిగిలిన పై వ్యాధులను తొలిదశలో గుర్తించి సరియైన చికిత్స చేసినట్లయితే నయం చేయబడతాయి.

వ్యాధి పేరు — కారణమైన జీవి
1. గనేరియా — 1. నైసెరియా గనేరియా
2. సిఫిలిస్ — 2. ట్రైపోనిమా పాల్లిడిమ్
3. జననాంగ హెర్పెస్ — 3. హెర్పెస్ సింప్లెక్స్ వైరస్ (HSV)
4. జననాంగ కంతులు, గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్ — 4. హ్యూమన్ పాపిల్లోమా వైరస్ (HPV)
5. ట్రైకోమోనియాసిస్ — 5. ట్రైకోమోనాస్ వెజినాలిస్
6. క్లామిడియాసిస్ — 6. క్లామిడియా ట్రాకోమాటిస్
7. హెపటైటిస్ — 7. HBV
8. AIDS / HIV సంక్రమణ — 8. HIV

AP Inter 2nd Year Zoology Study Material Chapter 5(b) ప్రత్యుత్పత్తి సంబంధ ఆరోగ్యం జన్యుశాస్త్రం

లైంగిక సంపర్క వ్యాధులు సాధారణంగా వ్యాపించే మార్గాలు :

  1. వ్యాధి సోకిన వారికి వాడిన ఇంజక్షన్ సూదులు వాడడం.
  2. శస్త్రచికిత్స పనిముట్లు ఇంకొకరికి ఉపయోగించడం.
  3. వ్యాధిసోకిన రక్తాన్ని మార్పిడి చేసినప్పుడు.
  4. వ్యాధి సోకిన తల్లి నుండి పిండానికి సోకడం మొదలైనవి.

లైంగిక సంపర్క వ్యాధుల తొలి సాధారణ లక్షణాలు :

  • జననాంగ ప్రాంతంలో దురద.
  • రసికారడం.
  • కొద్ది పాటి నొప్పి, వాయడం మొదలైనవి.
    చికిత్స చేయించని యెడల ఇది స్త్రీలలో జటిల లక్షణాలకు దారి తీస్తాయి. అవి
  • శ్రోణి ఉజ్వలన వ్యాధులు.
  • గర్భస్రావాలు, గర్భాశయ బాహ్య గర్భధారణ.
  • వంధ్యత్యం లేదా ప్రత్యుత్పత్తి మార్గ క్యాన్సర్ మొదలైనవి.
    సాధారణంగా ఈ వ్యాధులు 15-24 వయస్సు గల వ్యక్తులలో లైంగిక సంపర్క వ్యాధులు ఎక్కువగా కనిపిస్తాయి.

నియంత్రణ నియమాలు :

  1. తెలియని భాగస్వామి / బహుభాగస్వాములతో లైంగిక సంబంధాన్ని పెట్టుకోకపోవడం.
  2. సంపర్క సమయంలో కండోమ్లను తప్పక ఉపయోగించడం
  3. లైంగిక సంపర్క వ్యాధులను ప్రాథమిక దశలో గుర్తించడంలో నిష్ణాతుడైన వైద్యుణ్ణి సంప్రదించి ఒకవేళ వ్యాధి సంక్రమించినట్లయితే సంపూర్ణ చికిత్స పొందడం.

ప్రశ్న 2.
గర్భనిరోధక శస్త్ర చికిత్స పద్ధతులను విశదీకరించండి.
జవాబు:
శస్త్రచికిత్స విధానంలో గర్భధారణను నివారించడాన్ని గర్భనిరోధక లేదా వంధ్యీకరణ శస్త్రచికిత్స అంటారు. పురుషులలో వంధ్యీకరణ విధానాన్ని ‘వేసెక్టమీ’ అని, స్త్రీలలో అయితే ‘ట్యూబెక్టమీ’ అని అంటారు.

1) వేసెక్టమీ : ముష్కగోణి మీద చిన్న గాటు చేసి రెండు వైపులా ఉన్న శుక్రవాహికలను కత్తిరించి, కొద్ది భాగం తీసివేసి లేదా కత్తిరించిన చివరలు ముడివేసి వాటిని యథాస్థానంలో ఉంచి గాటును మూసివేస్తారు. ఈవిధంగా శుక్రకణాలు శుక్రాశయంలోకి రావడం నివారించబడుతుంది. కాబట్టి వేసెక్టమీ చేయించుకొన్న పురుషుల శుక్రంలో శుక్రకణాలు ఉండవు, అనుబంధ గ్రంథుల స్రావం మాత్రమే ఉంటుంది.
AP Inter 2nd Year Zoology Study Material Chapter 5(b) ప్రత్యుత్పత్తి సంబంధ ఆరోగ్యం జన్యుశాస్త్రం 1

2) ట్యూబెక్టమీ : ట్యూబెక్టమీ స్త్రీలలో పొత్తి కడుపుకు గాటు ద్వారా గాని, యోని ద్వారంగుండా గాని చేయవచ్చు. గర్భాశయానికి ఇరువైపులా ఉండే ఫాలోపియన్ నాళాలను కత్తిరించి చిన్న భాగాన్ని తీసివేయడం లేదా కత్తించిన చివరలను మూసివేయడం జరుగుతుంది. దీని వల్ల అండాలు ఫాలోపియన్ నాళాలలోకి ప్రవేశించవు, కాబట్టి గర్భధారణ జరగదు.
AP Inter 2nd Year Zoology Study Material Chapter 5(b) ప్రత్యుత్పత్తి సంబంధ ఆరోగ్యం జన్యుశాస్త్రం 2

AP Inter 2nd Year Zoology Study Material Chapter 5(b) ప్రత్యుత్పత్తి సంబంధ ఆరోగ్యం జన్యుశాస్త్రం

ప్రశ్న 3.
కింది వాటిలో రెండింటికి లఘుటీకలను రాయండి.
ఎ) ఐ.వి.ఎఫ్. (IVF)
బి) ఐ.సి.యస్.ఐ. (ICSI)
సి) ఐ.యు.డి.లు (IUDs)
జవాబు:
ఎ) ఐ.వి.ఎఫ్. (IVF) : స్త్రీ శరీరం బయట అండాన్ని శుక్రకణాలతో ఫలదీకరింప చేయడాన్ని దేహ బాహ్య ఫలదీకరణం అంటారు. ఫలితంగా ఏర్పడిన తొలి పిండ దశను తరువాత అభివృద్ధి కోసం తల్లి గర్భాశయంలోకి బదిలిచేస్తారు. ఈ పద్ధతినే టెస్ట్యూబ్ బేబి విధానం అని అంటారు.

ఈ పద్ధతిలో భార్య / స్త్రీ దాత నుంచి అండాన్ని, భర్త / పురుష దాత నుంచి శుక్రబీజ కణాన్ని సేకరించి ప్రయోగశాలలో స్త్రీ దేహ సారూప్య పరిస్థితులు కలిపించి రెండు బీజకణాలను కలిపి సంయుక్త బీజం ఏర్పరచడానికి ప్రేరేపిస్తారు. ఒకవేళ తల్లి గర్భాశయం దేహం బయట ఉత్పత్తి చేసిన పిండాన్ని స్వీకరించడానికి అనువుగా లేనట్లయితే, ఈ పిండాన్ని పెంచడానికి ఇష్టపడిన మరొక స్త్రీ (అరువు తల్లి) గర్భాశయంలోకి బదిలీ చేయవచ్చు.

బి) ఐ.సి.యస్.ఐ. (ICSI) (జీవద్రవ్యంలోకి శుక్రకణాలను ఇంజెక్ట్ చేయడం ) : ఈ పద్ధతిలో శుక్రకణాలను సూక్ష్మ దర్శిక సూది సహాయంతో నేరుగా అండ కణద్రవ్యంలోకి ఇంజెక్ట్ చేస్తారు. తరువాత పిండాన్ని తరువాతి అభివృద్ధికై గర్భాశయం లేదా ఫాలోపియన్ నాళంలోకి బదిలీ చేస్తారు. శుక్రకణోత్పత్తి తక్కువగా ఉండి శుక్రకణాల సంఖ్య తక్కువగా ఉన్న దంపతులకు ఈ పద్ధతి ద్వారా సహాయం అందించబడుతుంది.

సి) ఐ.యు.డి.లు (IUDs) (గర్భాశయాంతర సాధనాలు) : ఈ సాధనాలను (IUDs) యోని ద్వారా గర్భాశయంలోక వైద్యులు లేదా శిక్షణ పొందిన నర్సులు ప్రవేశపెడతారు.

(IUDs) రకం — ఉదాహరణ.
1. ఔషధ రహిత — 1. లిప్సెస్ లూప్
2. రాగిని విడుదల చేసేవి — 2. CuT, Cu 7, మల్టీలోడ్ 375
3. హార్మోన్లను విడుదల చేసేవి — 3. ప్రొజెస్టాసెర్ట్, LNG – 20.

ఈ IUDSలు గర్భాశయంలోని తెల్లరక్త కణాలను ప్రేరేపించి శుక్రకణాలను భక్షింపచేస్తాయి. IUDSల నుండి విడుదలైన కాపర్ అయాన్లు శుక్రకణాల కదలికలను, జీవన సామర్థ్యాన్ని ఫలదీకరణ సామర్థ్యాన్ని అణచివేస్తాయి. వీటికి అదనంగా విడుదల చేసే IUDSలు గర్భాశయాన్ని పిండ ప్రతిస్థాపనకు, గర్భాశయ ముఖ ద్వారాన్ని గర్భధారణను వాయిదా వేయడానికి, శుక్రకణాలకు ప్రతికూలంగా ఉండేటట్లు చేస్తాయి. IUDSలు అనేవి ఆలస్యంగా సంతానం, శిశువుల మధ్య ఎక్కువ వ్యవధి కావాలనుకొనే స్త్రీలకు అనువైన గర్భనిరోధకాలు. ఇది భారతదేశంలో అత్యధిక ఆదరణ పొందిన గర్భ నిరోధక విధానం.

ప్రశ్న 4.
సంతానసాఫల్యత లేని దంపతులు సంతానాన్ని పొందడానికి సహాయపడే పద్ధతులను కొన్నింటిని తెల్పండి.
జవాబు:
ఒక వ్యక్తి గర్భదారణకు తన వంతు పాత్ర పోషించలేని జీవ సంబంధ అసామర్థ్యాన్ని సంతాన రాహిత్యం అంటారు. వీటికి శారీరక, జన్యుపర, కొన్ని రకాల వ్యాధులు మొదలైనవి కారణాలు కావచ్చు. వీటిలో కొన్ని చికిత్స ద్వారా సరిచేయలేక పోవచ్చు. అటువంటి వారికి ప్రత్యుత్పత్తి సహాయక సాంకేతిక (ART) పద్ధతుల ద్వారా పిల్లలు కలిగించడానికి సహాయ పడవచ్చు. అవి :

1) శరీర బాహ్య ఫలదీకరణం, పిండబదిలీ (IVF – ET) : స్త్రీ శరీరం బయట అండాన్ని శుక్రకణాలతో ఫలదీకరింప చేయడాన్ని దేహ బాహ్య ఫలదీకరణం అంటారు. ఫలితంగా ఏర్పడిన తొలిపిండ దశను అభివృద్ధి కోసం తల్లి గర్భాశయంలోకి బదిలీ చేస్తారు. ఈ పద్ధతినే టెస్ట్యూబ్ బేబీ విధానం అంటారు. ఈ పద్ధతిలో భార్య / స్త్రీ దాత నుంచి అండాన్ని, భర్త / పురుష దాత నుంచి శుక్రబీజాన్ని సేకరించి ప్రయోగశాలలో స్త్రీ దేహ సారుప్య పరిస్థితులు కల్పించి రెండు బీజకణాలను కలిపి సంయుక్త బీజం ఏర్పడడానికి ప్రేరేపిస్తారు. ఉత్పత్తి అయిన ఈ పిండాన్ని పెంచడానికి తల్లి లేదా అరువుతల్లి గర్భాశయంలోకి ప్రవేశపెడతారు.

2) ఫాలోపియన్ నాళాంతర సంయుక్త బీజ బదిలీ (ZIFT) : ఈ పద్ధతిలో అండాన్ని సేకరించి, శరీర బాహ్య ఫలదీకరణ గావించి ఏర్పడిన సంయుక్త బీజాలు స్త్రీ ఫాలోపియన్ నాళంలోకి తరువాతి అభివృద్ధికై బదిలీ చేస్తారు.

3) ఫాలోపియన్ నాళాంతర సంయోగ బీజ బదిలీ (GIFT) : స్త్రీ బీజకోశ వ్యాధులు / లోపాల వల్ల కొంత మంది స్త్రీలు అండాన్ని ఉత్పత్తి చేయలేరు. కాని ఫలదీకరణకు, తరువాత పిండాభివృద్ధికి అవసరమయ్యే సరైన గర్భాశయ వాతావరణాన్ని కలిగి ఉంటారు. అట్లాంటి సందర్భాలలో అనుకూల దాత నుంచి అండాన్ని సేకరించి పై వాతావరణం గల గ్రహీత ఫాలోపియన్ నాళంలోకి బదిలీ చేస్తారు. ఈ పద్దతినే GIFT అంటారు.

4) కణజీవద్రవ్యంలోకి శుక్రకణాలను ఇంజెక్ట్ చేయడం (ICSI) : ఈ పద్ధతిలో శుక్రకణాలను సూక్ష్మదర్శిక సూది సహాయంతో నేరుగా అండ కణద్రవ్యంలోకి ఇంజెక్ట్ చేస్తారు. తరువాత పిండాన్ని అభివృద్ధికై గర్భాశయం లేదా ఫాలోఫియన్ నాళంలోకి బదిలీ చేస్తారు.

5) కృత్రిమ శుక్ర నివేషణం (AI) : పురుష భాగస్వామికి స్త్రీ ప్రత్యుత్పత్తి మార్గంలోకి శుక్రకణాలను విడుదల చేసే సామర్థ్యం లేనప్పుడు ఈ పద్ధతిని ఉపయోగిస్తారు. ఈ విధానంలో పురుష భాగస్వామి / భర్త / దాత నుంచి శుక్రాన్ని సేకరించి స్త్రీ గర్భాశయంలోకి ప్రవేశపెట్టి అండాన్ని ఫలదీకరణ చేయిస్తారు.

AP Inter 2nd Year Zoology Study Material Chapter 5(b) ప్రత్యుత్పత్తి సంబంధ ఆరోగ్యం జన్యుశాస్త్రం

ప్రశ్న 5.
పాఠశాలల్లో లైంగిక విద్య అవసరమా ? ఎందుకు ?
జవాబు:
పాఠశాలల్లో లైంగిక విద్య అవసరం. పాఠశాలల్లో లైంగిక విద్యను ప్రవేశపెట్టడం వల్ల యౌవనులకు లైంగికత, తత్సంబంధ విషయాలపై సరియైన అవగాహన ఏర్పడుతుంది. ప్రత్యుత్పత్తి అవయవాలు, యౌవనం, దానికి సంబంధించిన మార్పులు, లైంగిక పరిశుభ్రత, సురక్షిత, ఆరోగ్యకరమైన లైంగిక సాధనాలు, HIV / AIDS హైపటైటిస్ – బి, హెర్పెస్ లాంటి లైంగిక సంపర్క వ్యాధులు మొదలైన వాటిపై ప్రజలకు ముఖ్యంగా యౌవనులకు సరియైన సమాచారం ఇవ్వడం వల్ల ప్రత్యుత్పత్తి సంబంధ ఆరోగ్యకర జీవితాన్ని గడుపుతారు. అంతేకాకుండా లైంగిక విద్య ద్వారా, పెళ్ళీడు వయస్సులో వారికి అందుబాటులో ఉన్న జననియంత్రణ పద్ధతులు, గర్భిణీస్త్రీల సంరక్షణ, శిశుజననాంతర మాతృ, శిశుసంరక్షణ, స్తన పోషణ ప్రాముఖ్యం మొదలగు వాటి గురించి తెలుస్తుంది. అలాగే ఆడ, మగ శిశువులకు సమాన ప్రాధాన్యత మొదలైన విషయాల గురించి తెలియజేయబడుతుంది. ఇవి ఆరోగ్యవంతమైన కుటుంబాలను కావలసిన పరిమాణంలో అభివృద్ధి చేయడానికి సహాయపడుతుంది. సమాజంలో అనియంత్రిత జనాభా పెరుగుదల, సామాజిక రుగ్మతలైన లైంగిక దుర్వినియోగం, లైంగిక సంబంధ నేరాలు మొదలైన వాటిపై అవగాహన ఏర్పడుతుంది.

AP Inter 2nd Year Zoology Study Material Chapter 5(a) మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థ

Andhra Pradesh BIEAP AP Inter 2nd Year Zoology Study Material  Lesson 5(a) మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థ Textbook Questions and Answers.

AP Inter 2nd Year Zoology Study Material Lesson 5(a) మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థ

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
మానవుడిలో ముష్కాలు ఎక్కడ ఉంటాయి ? ప్రతి ముష్కాన్ని ఆవరించి ఉండే రక్షణ కవచాలేవి ?
జవాబు:

  1. ఒక జత ముష్కాలు ఉదరకుహరం బయట ముష్కగోణిలో వ్రేలాడుతూ ఉంటాయి.
  2. ముష్కాలను ఆవరించి ఉండే రక్షణ కవచాలు. ట్యూనికా ఆల్బుజీనియా మరియు ట్యూనికా వెజైనాలిస్.

ప్రశ్న 2.
ముష్కగోణులలోని కుహారాలను, ఉదరకుహరంతో కలిపే నాళాలను ఏమంటారు ? ముష్కాలను తమస్థానంలో నిలిపి 2 ఉంచే నిర్మాణాలేవి ?
జవాబు:

  1. ముష్కగోణులలోని కుహరాలను, ఉదరకుహంతో కలిపే నాళాలు వాంక్షణ నాళం
  2. ముష్కాన్ని ముష్కగోణిలో నిలిపి ఉంచుతూ గుబర్నాక్యులమ్, శుక్రదండం అనే నిర్మాణాలుంటాయి.

AP Inter 2nd Year Zoology Study Material Chapter 5(a) మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థ

ప్రశ్న 3.
మానవ శుక్రోత్పాద నాళికలలోని సెర్టోలి కణాల, లీడిగ్ కణాల విధులేమిటి ? [A.P. & T.S. Mar. ’15]
జవాబు:
సెర్టోలి కణాలు: ఇవి అభివృద్ధి చెందుతున్న శుక్రకణాలకు పోషణ అందిస్తాయి. మరియు ఇన్హిబిన్ అనే హార్మోన్ను స్రవిస్తాయి. ఈ హార్మోన్ FSH హార్మోన్ ఉత్పత్తిని నిరోధిస్తుంది.
లీడిగ్ కణాలు: ఇవి పురుష లైంగిక హార్మోన్ అయిన ఆండ్రోజెన్స్ ను ఉత్పత్తి చేస్తాయి. వీటిలో టెస్టోస్టిరాన్ ముఖ్యమైంది. ఈహార్మోన్ ద్వితియ లైంగిక లక్షణాలు అభివృద్ధిని శుక్రకణోత్పత్తిని నియంత్రిస్తుంది.

ప్రశ్న 4.
మానవుడిలో సంపర్కావయవం ఏది ? దానిలో ఉండే మూడు రకాల కణజాల స్తంభాల పేరేమిటి ?
జవాబు:
మానవుడిలో సంపర్కావయవం – మేహనం
మేహనంలో నిలువుగా మూడు స్పంజికా కణజాలపు స్తంభాలు ఉంటాయి అవి: కార్పోరా కావెర్నోసా’ అనే రెండు పృష్టభాగంలోని స్తంభాలు, ఈ రెండు స్తంభాల కింద ఉదర మధ్య భాగంలో కార్పస్ స్పాంజియోజమ్ అనే ఒక స్తంభం.

ప్రశ్న 5.
స్పెర్మియేషన్, స్పెర్మియోజెనిసిస్ అంటే ఏమిటి ?
జవాబు:
స్పెర్మియోజెనిసిస్: ఏకస్థితిక చలన రహిత శుక్రోత్పాదకాలు విబేధనం చెంది చలన సహిత శుక్రకణాలుగా రూపాంతరం చెందే ప్రక్రియను స్పెర్మియోజెనిసిస్ అంటారు.
స్పెర్మియోషన్: క్రియాశీలక శుక్రకణాలు శుక్రోత్పాదక నాళికల నుంచి శుక్రోత్పాదనాళికా కుహరంలోకి విడుదల ప్రక్రియను స్పెర్మియేషన్ అంటారు.

ప్రశ్న 6.
అండోత్సర్గం తరువాత పగిలిన పుటికలో సంచితమై ఉన్న పసుపు కణాల ముద్దను ఏమంటారు ? అది స్రవించే హార్మోన్ ఏది ? దాని విధి ఏమిటి ? [A.P. Mar. ’16]
జవాబు:

  1. అండోత్సర్గం తరువాత పగిలిన పుటికలో సంచితమై ఉన్న పసుపు కణాల ముద్దను – కార్పస్లూటియం అంటారు.
  2. కార్పస్ లూటియం ప్రొజెస్టిరాన్ అనే హార్మోను స్రవిస్తుంది.

విధులు:

  1. పిండ ప్రతిస్థాపనకు అవసరమయ్యే ఎండోమెట్రియమ్ ఎదుగుదలను ప్రేరేపిస్తుంది.
  2. ఇది అండోత్సర్గాన్ని నివారించి గర్భాశయ కండరాల సంకోచాలను నిరోధించి గర్భాన్ని నిలిచేటట్లు చేస్తుంది.

ప్రశ్న 7.
గర్భావధి అంటే ఏమిటి ? మానవుడిలో గర్భావధి ఎంత ?
జవాబు:

  1. గర్భం అభివృద్ధి చెందే కాలాన్ని గర్భావధి కాలం అంటారు
  2. మానవుడిలో గర్భావధి కాలం అండం ఫలదీకరణం జరిగిన రోజు నుంచి సుమారు 266 రోజులు (38వారాలు) కాలం పడుతుంది.

ప్రశ్న 8.
పిండ ప్రతిస్థాపన అంటే ఏమిటి ?
జవాబు:
ట్రోపోబ్లాస్ట్ కణాలు గర్భాశయాల గోడలోకి చొచ్చుకొని పోయి, గర్భాశయరక్త కేశ నాళికలకు సన్నిహితంగా మారుతాయి. ఈ విధంగా పిండం గర్భాశయపు గోడకు అతకబడటాన్ని పిండ ప్రతిస్థాపన అంటారు.

AP Inter 2nd Year Zoology Study Material Chapter 5(a) మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థ

ప్రశ్న 9.
ఎపిబ్లాస్ట్, హైపోబ్లాస్ట్ల మధ్య వ్యత్యాసం ఏమిటి ?
జవాబు:
పిండ చక్రాభం లోపలి తలాన అంటే కుహరం ఎదురు తలంలో ఒక స్తరంగా ఏర్పడుతుంది. ఈ స్తరం హైపోబ్లాస్ట్గా రూపొందుతుంది. ఇది భవిష్యత్తులో పిండ బాహ్య అంతస్త్వచాన్ని ఏర్పరుస్తుంది. మిగిలిన పిండ చక్ర భాగాన్ని ఎపిబ్లాస్ట్ అంటారు.

ప్రశ్న 10.
ముష్కాల, స్త్రీ బీజకోశాలను ఒక్కొదానికి రెండు ముఖ్య విధులు రాయండి.
జవాబు:
ముష్కాలు: ఇవి ప్రాథమిక పురుష లైంగిక అవయవాలు.

  1. ఇది శుక్రకణాలను ఉత్పత్తి చేస్తుంది.
  2. ముష్కాలలోని లీడిగ్ కణాలు పురుష లైంగిక హార్మోన్ అయిన టెస్టోస్టిరాన్ను ఉత్పత్తి చేస్తుంది. ఈహార్మోన్ ద్వితియ లైంగిక లక్షణాలు అభివృద్ధిని, శుక్రకణోత్పత్తిని నియంత్రిస్తుంది.

స్త్రీ బీజకణాలు: ఇది ప్రాథమిక స్త్రీ లైంగిక అవయవాలు.

  1. స్త్రీ బీజకోశాలు రుతుచక్ర సమయంలో స్త్రీ బీజకణాలను (అండాలను) ఉత్పత్తి చేస్తాయి.
  2. ఇవి స్త్రీ లైంగిక హార్మోన్లు అయిన ఈస్ట్రోజెన్ మరియు ప్రొజెస్టిరాన్లను ఉత్పత్తి చేస్తుంది.

ప్రశ్న 11.
శుక్రకణం పటం గీచి భాగాలను గుర్తించండి.
జవాబు:
AP Inter 2nd Year Zoology Study Material Chapter 5(a) మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థ 1

ప్రశ్న 12.
శుక్రద్రవంలోని ముఖ్యమైన అనుఘటకాలు ఏవి ?
జవాబు:
శుక్రద్రవం చిక్కగా క్షారయుతంగా ఉండి, ప్రక్టోజ్, ప్రోటీన్లు, సిట్రిక్ ఆమ్లం, అకర్బన పాస్ఫేట్, పొటాషియం, ప్రోస్టాగ్లాండిన్లు, విటమిన్ ‘సి’ లను కలిగి ఉంటుంది. శుక్రద్రవంను శుక్రాశయాలు స్రవిస్తాయి.

ప్రశ్న 13.
రుతుచక్రం అంటే ఏమిటి ? రుతుచక్రాన్ని క్రమపరిచే హార్మోన్లు ఏవి ?
జవాబు:
ప్రైమేట్స్లోని స్త్రీ జీవులలో జరిగే ప్రత్యుత్పత్తి వలయాన్ని రుతుచక్రం అంటారు. రుతు చక్రాన్ని ముఖ్యంగా నాలుగు

  1. ల్యూటినైజింగ్ హార్మోన్ (LH)
  2. ఈస్ట్రోజన్ మరియు
  3. ఫాలిక్యూలర్ స్టిములేటింగ్ హార్మోన్ (FSH)
  4. ప్రొజెస్టిరాన్.

ప్రశ్న 14.
ప్రసవం అంటే ఏమిటి ? ప్రసవంలో పాల్గొనే హార్మోన్లు ఏవి ?
జవాబు:
భ్రూణం పరిపూర్ణంగా ఎదిగిన తరువాత, గర్భాశయ కండరాల సంకోచ సడలికలు శిశువును, జరాయువును గర్భాశయం నుండి బయటకు నెట్టి వేస్తాయి. దీన్నే ప్రసవం అంటారు.
ప్రసవ సమయంలో ఆక్సిటోసిన్ ముఖ్య పాత్రవహిస్తుంది.

AP Inter 2nd Year Zoology Study Material Chapter 5(a) మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థ

ప్రశ్న 15.
ఒక ఆడకుక్క ఆరు (6) పిల్లలను జన్మనిచ్చిందనుకుంటే ఆ కుక్క స్త్రీబీజకోశం ఎన్ని అండాలను విడుదల చేసి ఉండొచ్చు.
జవాబు:
6 పిల్లలకు జన్మనిచ్చిన ఆడకుక్క, అండోత్సర్గ సమయంలో ఆ కుక్క స్త్రీబీజకోశం 6′ అండాలను విడుదల చేసి ఉంటుంది.

ప్రశ్న 16.
శుక్రకణాల ‘కెపాసిటేషన్’ అంటే ఏమిటి ?
జవాబు:
శుక్రకణాలు స్త్రీ జననేంద్రియ మార్గంలో కొన్ని మార్పులకు లోనైన తరువాత అండాన్ని ఫలదీకరించే సామర్థ్యాన్ని పొందుతాయి. ఈ మార్పులను కెపాసిటేషన్ అంటారు.

ప్రశ్న 17.
మానవ పిండాభివృద్ధిలో ‘కాంపాక్షన్’ అంటే ఏమిటి ? A.P. Mar. ’15
జవాబు:
కాంపాక్షన్ అనేది మానవపిండాభివృద్ధి జరిగే ప్రక్రియ. ఈ ప్రక్రియ వల్ల మారూలా లోని ఖండితాలు దగ్గరగా లాగబడి సాంద్రంగా అమరుతాయి. సంయుక్త బీజ ఖండితాలు రెండు రకాల కణాలుగా తయారవుతాయి. అవి:

  1. ఉపరితల బల్లపరపు కణాలు
  2. అంతరకణ సముదాయం.

ప్రశ్న 18.
మానవ పిండాభివృద్ధిలో ‘అంతర్వలనం’, ‘ఇంగ్రెషన్’ (ప్రవేశం)ల మధ్య వ్యత్యాసం ఏమిటి ?
జవాబు:
అంతర్వలనం: పిండాభివృద్ధి దశలో బ్లాస్టులా గ్రాస్టులాగా మార్పు చెందుతున్నప్పుడు ఒక కణాల సమూదాయం లోపలి వైపు పెరగడం, లోపలికి మెలితిరగడం జరుగుతుంది. దీన్నే అంతర్వలనం అంటారు.

ప్రవేశం: గ్రాస్ట్రులేషన్ దశలో ఎపిబ్లాస్ట్ నుంచి భవిష్యత్ అంతస్వచ కణాలు లోపలి వైపు వలసపోవడం.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
మానవ ‘ముష్కం’ సూక్ష్మ నిర్మాణాన్ని వివరించండి.
జవాబు:
ఒకజత అండాకార ముష్కాలు ఉదరకుహరం బయట ముష్కగోణిలో వేలాడుతూ ఉంటాయి. ఇవి ప్రాథమిక లైంగిక అవయవాలు. ముష్కగోణి ముష్కాలకు రక్షణనిస్తూ శుక్రకణోత్పత్తికి కావలసిన ఉష్ణోగ్రత (శరీర ఉష్ణోగ్రత కంటే 2 నుంచి 2.5°C తక్కువ) ఉండేటట్లు సహాయపడుతుంది.

ప్రతి ముష్కాన్ని ఆవరించి ట్యూనికా ఆల్బుజీనియా అనే తంతుయుత కణజాలకవచం ఉంటుంది. ఇది ముష్కంలోకి వ్యాపించి అడ్డు విభాజకాలను ఏర్పరిచి ముష్కాన్ని లంబికలుగా విభజిస్తుంది. ప్రతి ముష్కంలో సుమారు 250 ముష్కలంబికలు ఉంటాయి. ప్రతీ లంబికలో 1 నుంచి 3 మెలికలు తిరిగి ఉండే శుక్రోత్పాదక నాళికలు ఉంటాయి. ప్రతి ముష్కబాహ్య తలాన్ని ఆవరించి సీరస్ త్వచం అనే ఆంత్రవేష్టన పొర ఉంటుంది. దీన్ని ట్యూనికా వెజైనాలిస్ అంటారు.

ప్రతి శుక్రోత్పాదక నాళికను ఆవరించి జనన ఉపకళ ఉంటుంది. దీనిలో విభేదనం చెందని మాతృకణాలు అనే పురుషబీజ మాతృకణాలు ఉంటాయి. శుక్ర మాతృకణాలు విభజన చెంది ప్రాథమిక స్పెర్మటోసైట్లను ఏర్పరుస్తాయి. ఇవి క్షయకరణ విభజన చెంది శుక్రకణాలు లేదా పురుషబీజకణాలను ఏర్పరుస్తాయి. శుక్రకణాల మధ్య సెర్టోలీకణాలు అనే పోషక కణాలు ఉంటాయి. ఇవి అభివృద్ధి చెందే శుక్రకణాలకు పోషణను అందిస్తాయి. సెర్టోలి కణాలు ‘ఇసాబిన్’ అనే హార్మోన్ను కూడా స్రవిస్తాయి, ఈహార్మోన్ (FSH) ఉత్పత్తిని నిరోధిస్తుంది. శుక్రోత్పాదక నాళికల బయట ఉన్న ప్రాంతాలను మధ్యాంతర ప్రదేశాలు అంటారు. ఈ ప్రదేశాలలో లీడిగ్ కణాలు ఉంటాయి. ఇది ఆండ్రోజెన్స్న ఉత్పత్తి చేస్తాయి. శుక్రోత్పాదక నాళికలు రీటేముష్కలం ద్వారా శుక్రనాళికలలోకి తెరచుకొంటాయి.

AP Inter 2nd Year Zoology Study Material Chapter 5(a) మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థ

ప్రశ్న 2.
మానవ ‘స్త్రీ బీజకోశం’ సూక్ష్మ నిర్మాణాన్ని వివరించండి.
జవాబు:
స్త్రీ బీజకోశాలు ప్రాథమిక స్త్రీ లైంగిక అవయవాలు. ఒక జత స్త్రీ బీజకోశాలు ఉదర కింది భాగంలోని శ్రేణి కుహరంలో గర్భాశయానికి ఇరువైపులా ఒక్కొక్కటి చొప్పున ఉంటాయి. మీసోఒవేరియం అనే ద్విస్తరిత ఆంత్రవేష్టనం మడత స్త్రీ బీజకోశానికి ఉదర కుహర కుడ్యానికి బంధిస్తుంది.

స్త్రీ బీజకోశాలను ఆవరించి ఉండే సరళ ఘనాకార ఉపకళను స్త్రీ బీజకోశ జనన ఉపకళ అంటారు. నిజానికి ఇది ఆంత్రవేష్టన పొర. ఈ పొర కింద మందంగా ఉన్న సంయోజక కణజాలపు గుళిక ఉంటుంది. దీన్ని ట్యూనికా ఆల్బుజీనియా అంటారు. స్త్రీ బీజకోశంలోని స్ట్రోమా బయటి వల్కలం, లోపలి దవ్వ అనే రెండు నిర్ధిష్టమైన భాగాలుగా విడగొట్టబడి ఉంటుంది. వల్కలం మందుగా ఉండి, వివిధ దశలలో అభివృద్ధి చెందుతున్న అండాశయ పుటికలు ఉండటం వల్ల కణికాయుతంగా కనిపిస్తుంది. దవ్వ వదులుగా ఉన్న సంయోజక కణజాలం. దీనిలో రక్తనాళాలు, శోషరస నాళాలు, నాడీ తంతువులు అధికంగా ఉంటాయి.

ప్రశ్న 3.
మానవ ‘స్త్రీ’లో గ్రాఫియన్ పుటికను వివరించండి.
జవాబు:
స్త్రీ బీజకోశ ఉపరితలం నుంచి అనేక గుండ్రని ఉబ్బెత్తుల వంటి నిర్మాణాలుంటాయి. వీటిని గ్రాఫియన్ పుటికలు అని అంటారు.

ప్రత్యుత్పత్తి కాలంలో ద్వితీయ పుటికలో ఉన్న ప్రాథమిక అండ మాతృకణం పరిమాణంలో పెరుగుతూ క్షయకరణ విభజన – I నుపూర్తి చేసుకొని, ఒక స్థూల ఏకస్థితిక ద్వితీయ అండమాతృకణం మరియు ఒక సూక్ష్మ ఏకస్థితిక ప్రథమ దృవ దేహం ఏర్పడుతుంది. ఈ ద్వితీయ అండ మాతృకణం, ప్రాథమిక అండ మాతృకణంలోని అధిక పోషకత కలిగిన కణపదార్థాన్ని ఎక్కువ మొత్తంలో ఉంచుకొంటుంది. అప్పుడు క్షయకరణ విభజన II ఆరంభమై మధ్యస్థ దశలో ఆగిపోతుంది. ద్వితీయ పుట్టిక తరువాతి మార్పులకు గురై పరిపక్వ పుట్టికను ఏర్పరుస్తుంది. దీన్ని గ్రాఫియన్ పుటిక అంటారు.

ద్రవంతో నిండి ఉన్న కుహరాన్ని ఏస్ట్రమ్ అని అంటారు. అండమాతృకణాన్ని ఆవరించి ఉన్న కణాల సమూహాన్ని కుమ్యులస్ ఊఫోరస్ అంటారు. పుటిక బయట వ్యాపించి సాంద్రీకరించి ఉన్న సంయోజక కణజాలంను బయటి తొడుగు అని, దానిలో లోపలి ఉన్న స్ట్రోమా కణాల లోపలితొడుగు అని అంటారు.

స్త్రీ బీజకోశంలో గ్రాఫియన్ పుటిక పగిలి ద్వితీయ అండ మాతృకణం విడుదల చేస్తుంది. దీన్ని అండోత్సర్గం అంటారు.

ప్రశ్న 4.
మానవ పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ పటం గీచి భాగాలను పేర్కొనండి.
జవాబు:
AP Inter 2nd Year Zoology Study Material Chapter 5(a) మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థ 2

ప్రశ్న 5.
మానవ స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ పటం గీచి, భాగాలను పేర్కొనండి.
జవాబు:
AP Inter 2nd Year Zoology Study Material Chapter 5(a) మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థ 3

ప్రశ్న 6.
శుక్రకణోత్పాదక నాళిక నిర్మాణాన్ని వివరించండి.
జవాబు:
ప్రతిముష్కంలో సుమారు 250 ముష్కలంబికలుంటాయి. ప్రతి లంబికలో 1నుంచి 3 మెలికలు తిరిగి ఉండే శుక్రోత్పాదక నాళికలు ఉంటాయి. ప్రతీ శుక్రోత్పాదక నాళికను ఆవరించి. జనన ఉపకళ ఉంటుంది. దీనిలో విభేదనం చెందని శుక్రమాతృకణాలు అనే పురుషబీజ మాతృకణాలు ఉంటాయి. శుక్ర మాతృకణాలు విభజన చెంది ప్రాథమిక స్పెర్మటోసైట్లను ఏర్పరుస్తాయి. ఇవి క్షయకరణ విభజన చెంది శుక్రకణాలు లేదా పురుషబీజకణాలను ఏర్పరుస్తాయి. శుక్ర మాతృ కణాల మధ్య సెర్టోలి కణాలు అనే పోషక కణాలు ఉంటాయి. ఇవి అభివృద్ధి చెందే శుక్రకణాలను పోషణను అందిస్తాయి. సెర్టోలి కణాలు ‘ఇన్హిబిన్’ అనే హార్మోన్ను కూడా స్రవిస్తాయి. ఈ హార్మోన్ FSH ఉత్పత్తిని నిరోధిస్తుంది. శుక్రోత్పాదక నాళికల బయట ఉన్న ప్రాంతాలను మధ్యాంతర ప్రదేశాలు అంటారు. ఈ ప్రదేశాలలో లీడిగ్ కణాలు ఉంటాయి. ఈ లీడిగ్ కణాలు ఆండ్రోజెన్సన్ను ఉత్పత్తి చేస్తాయి. ఈ హార్మోన్ ద్వితీయ లైంగిక లక్షణాల అభివృద్ధిని శుక్రకణోత్పత్తిని నియంత్రిస్తుంది. శుక్రోత్పాదక నాళికలు రీటేముష్కం ద్వారా శుక్రనాళికలలోకి తెరచుకుంటాయి.
AP Inter 2nd Year Zoology Study Material Chapter 5(a) మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థ 4
AP Inter 2nd Year Zoology Study Material Chapter 5(a) మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థ 5

ప్రశ్న 7.
శుక్రకణోత్పాదన అంటే ఏమిటి ? మానవుడిలో జరిగే శుక్రకణోత్పత్తిని గురించి సంక్షిప్తంగా వివరించండి.
జవాబు:
పురుషులలో జరిగే బీజకణోత్పత్తిని శుక్రకణోత్పత్తి అని అంటారు. ముష్కంలోని శుక్రమాతృకణాలనే అపరిపక్వ పురుష బీజకణాలు యౌవన దశ ఆరంభం నుంచి శుక్రకణోత్పత్తి ద్వారా శుక్రకణాలను ఉత్పత్తి చేస్తాయి. శుక్రోత్పాదక నాళికలలో ఉన్న శుక్రమాతృకణ మూలకణాలు సమవిభజనల ద్వారా విభజన చెంది, వాటి సంఖ్యను వృద్ధి చేసుకుంటాయి. ప్రతీ శుక్రమాతృకణ మూలకణం ద్వయస్థితిక స్థితిలో ఉండి 46 క్రోమోజోమ్లను కలిగి ఉంటుంది. కొన్ని శుక్ర మాతృకణ మూలకణాలు ప్రాథమిక శుక్రమాతృ కణాలుగా అభివృద్ధి చెంది క్షయకరణ విభజన చెందుతాయి.
AP Inter 2nd Year Zoology Study Material Chapter 5(a) మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థ 6

ఒక ప్రాథమిక శుక్రమాతృకణం దాని మొదటి క్షయకరణ విభజన జరిపి ఒకే పరిమాణంలో ఉన్న 23 క్రోమోజోమ్లు గల ఏకస్థితిక ద్వితీయ శుక్రమాతృ కణాలను ఏర్పరుస్తాయి. ఈ ద్వితీయ శుక్రమాతృకణాలు ద్వితీయ క్షయకరణ విభజనను జరిపి నాలుగు ఒకే పరిమాణంలో ఉన్న ఏకస్థితిక చలన రహిత శుక్రోత్పాదకాలను ఉత్పత్తి చేస్తాయి. ఈ చలన రహిత శుక్రకణాలు విభేదనం చెంది చలనసహిత శుక్రకణాలుగా రూపాంతరం చెందుతాయి. ఈ ప్రక్రియను శుక్రకణ జననం అంటారు. శుక్రజననం తరువాత, శుక్రకణాల తలలు సెర్టోలి కణాల కణద్రవ్యలలో అంతస్థగితంగా ఉంటాయి. చివరికి ఈ క్రియాశీలక శుక్రకణాలు శుక్రకణోత్పాదక నాళికల నుంచి శుక్రోత్పాదనాళిక కుహరంలోకి విడుదల అవుతాయి. దీనినే శుక్రకణాల విడుదల అంటారు.

శుక్రకణోత్పత్తి యౌవనదశ ఆరంభంలో “గొనాడో ట్రోపిన్ విడుదల హార్మోన్” (GnRH) ను హైపోథాలమస్ అధికంగా స్రవించడం వల్ల శుక్రకణోత్పత్తి ప్రారంభమవుతుంది. అధిక స్థాయిలో ఉన్న GnRH పూర్వ పిట్యూటరీని ప్రేరేపించి FSH, LH లను స్రవింపజేస్తుంది. LH లీడిగ్ కణాల పై పనిచేసి ఆండ్రోజెన్లను స్రవింపజేయడాన్ని ప్రేరేపిస్తుంది. ఈ ఆండ్రోజెన్స్లు తిరిగి శుక్రకణోత్పత్తిని ప్రేరేపిస్తాయి. FSH సెర్టోలి కణాల పై పనిచేసి, కొన్ని కారకాలను విడుదల చేయించుట ద్వారా శుక్రకణ జననానికి సహాయపడతాయి.

AP Inter 2nd Year Zoology Study Material Chapter 5(a) మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థ

ప్రశ్న 8.
అండోత్పత్తి అంటే ఏమిటి ? స్త్రీలో జరిగే అండోత్పత్తిని సంక్షిప్తంగా వివరించండి.
జవాబు:
పరిణితి చెందిన స్త్రీ బీజకణాలు ఏర్పడే విధానాన్ని అండోత్పత్తి అంటారు. పిండం అభివృద్ధి చెందుతున్నప్పుడే ప్రతి భ్రూణ స్త్రీ బీజకోశంలో అండకణోత్పత్తి ఆరంభమై రెండు మిలియన్ల అండమాతృకణాలు ఏర్పడి తరువాత విభజనలు జరగకుండా నిలిచిపోతాయి. శిశుజననం తరువాత అండ మాతృకణాలు కొత్తవి ఏర్పడటం జరగదు. ఈ కణాలు విభజనను ప్రారంభించి క్షయకరణ విభజన -I లోని ప్రథమదశ -1 లోనే ఆగిపోతాయి. ఈ దశలోని కణాలను ప్రాథమిక అండ మాతృకణాలు అంటారు. వీటిలో చాలా వరకు క్షీణించి యవ్వన దశకు వచ్చేసరికి 60,000 – 80,000 పుటికలు మాత్రమే ప్రతి స్త్రీ బీజకోశంలో మిగిలిపోతాయి. తరువాత ఈ పుటికలు గ్రాన్యులోసా కణాలచే ఆవరించబడతాయి. ఈ అభివృద్ధి దశలోని పుటికలను ప్రాథమిక పుటికలు అంటారు.
AP Inter 2nd Year Zoology Study Material Chapter 5(a) మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థ 7

క్రమంగా ప్రాథమిక పుటికలను ఆవరించిన గ్రాన్యులోసా కణాలతో కూడిన పొరలు అధికమై, థీకా అనే కొత్త పొర ఏర్పడుతుంది.

ఈపుటికలను ద్వితీయ పుటికలు అంటారు. ద్వితీయ పుటికలు వెంటనే తృతియ పుటికలుగా మార్పుచెంది, ద్రవంతో నిండిన కుహారాన్ని ఏర్పర్చుకొంటుంది. ఈ కుహరాన్ని ఎస్ట్రమ్ అంటారు. ఈ కుహరం పరిమాణంలో పెరగడంవల్ల పుటిక కుడ్యం పలుచగా మారుతుంది. పుటిక వ్యాపించి కొద్ది గ్రాన్యులోసా స్తరం చుట్టూ ఉన్న స్ట్రోమా కణాలు సాంద్రీకరణం చెంది లోపలి తొడుగు ఏర్పరుస్తాయి. తరువాత ఈ లోపలి తొడుగును ఆవరిస్తూ కొంత సంయోజక కణజాలం సాంద్రీకరణ చెంది ఇంకొక పొర ఏర్పడుతుంది. దీన్ని బయటి తొడుగు అంటారు. లోపలి తొడుగు కణాలు ఈస్ట్రోజన్లు అనే హార్మోన్లను స్రవిస్తాయి. ఈదశలో ద్వితీయ పుటికలో ఉన్న ప్రాథమిక అండ మాతృకణం పరిమాణంలో పెరుగుతూ క్షయకరణ విభజన – I ను పూర్తి చేస్తుంది. ఇది అసమాన విభజన, దీని ఫలితంగా ఒక స్థూల ఏకస్థితిక ద్వితీయ అండ మాతృకణం, ఒక సూక్ష్మ ఏకస్థితిక ప్రథమ ధృవ దేహం ఏర్పడతాయి. ఈ ద్వితీయ అండ మాతృకణం, ప్రాథమిక అండ మాతృకణంలోని అధిక పోషకత కలిగిన కణపదార్థాన్ని ఎక్కువ మొత్తంలో ఉంచుకుంటుంది. అప్పుడు క్షయకరణ విభజన -II ఆరంభమై మధ్యస్థ దశలో ఆగిపోతుంది. ద్వితీయ పుటిక తరువాతి మార్పులకు గురై పరిపక్వ పుటికను ఏర్పరుస్తుంది. దీన్ని గ్రాఫియన్ పుటిక అంటారు. స్త్రీ బీజకోశంలోని ఈ పుటిక పగిలి అండాన్ని విడుదల చేస్తుంది. దీన్ని అండోత్సర్గం అంటారు.

ప్రశ్న 9.
గ్రాఫియన్ పుటిక నిర్మాణం పటం గీచి, భాగాలను గుర్తించండి.
జవాబు:
AP Inter 2nd Year Zoology Study Material Chapter 5(a) మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థ 8

ప్రశ్న 10.
మానవ సమాజంలో స్త్రీలు ఆడపిల్లలను కంటున్నందుకు తరచూ నిందించబడతారు. ఎందుకు ఇది నిజంకాదో మీరు తెలుపగలరా ?
జవాబు:
శిశువు ఆడ, మగ అనేది తండ్రి మీద ఆధారపడి ఉంటుంది. కాని తల్లి దీనికి కారణం కాదు. శిశువు యొక్క లింగనిర్ధారణ ఫలదీకరణం సమయంలోనే నిర్దేశించబడుతుంది.
పురుషులు XY అనే లింగ క్రోమోజోములను, స్త్రీలు XX అనే లింగక్రోమోజోములను కలిగి ఉంటారు. కాబట్టి స్త్రీలు ‘X క్రోమోజోమ్ కలిగిన అండాలను, పురుషులు 50% X క్రోమోజోమ్ కలిగిన శుక్రకణాలను మిగిలిన 50% Y క్రోమోజోమ్ కలిగిన శుక్రకణాలను ఉత్పత్తి చేస్తారు. ఫలదీకరణ సమయంలో X – అండం, Y క్రోమోజోమ్ కలిగిన శుక్రకణంతో కలిస్తే మగ శిశువు గాను (XY), X – క్రోమోజోమ్ కలిగిన శుక్రకణంతో కలిస్తే ఆడశిశువుగాను వృద్ధి చెందుతుంది.
AP Inter 2nd Year Zoology Study Material Chapter 5(a) మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థ 9

పై వివరణను బట్టి శిశువు లింగనిర్ధారణ తండ్రి పై ఆధారపడి ఉంటుంది. కాని తల్లి మీద కాదు. కాబట్టి ఆడ పిల్లలను కంటున్నందుకు స్త్రీలను నిందించడం తప్పు.

ప్రశ్న 11.
మానవ పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో సంబంధం ఉన్న అనుబంధ గ్రంథులను వివరించండి.
జవాబు:
పురుష అనుబంధ గ్రంథులు వరుసగా ఒక జత శుక్రాశయాలు, ఒక పౌరుషగ్రంథి, బల్బో యూరెత్రల్ గ్రంథులు.

1. శుక్రాశయాలు: ఇవి శ్రోణి ప్రాంతంలో మూత్రాశయం పరాంత కింది భాగంలో ఉండే ఒకజత సాధారణ నాళాకార గ్రంథులు ప్రతీశుక్రాశయం ఆవైపు శుక్ర వాహికలోకి అది పౌరుషగ్రంథిలోకి ప్రవేశించే ముందు తెరుచుకుంటుంది. శుక్రకోశాలు స్రవించే స్రావం శుక్రద్రవం ఘనపరిమాణంలో సుమారు 60శాతం ఉంటుంది. ఇది చిక్కగా, క్షారయుతంగా, ఉండి ఫ్రక్టోజ్, ప్రోటీన్లు, సిట్రిక్ఆమ్లం, అకర్బనాఫాస్పేట్, పొటాషియం, ప్రోస్టాగ్లాండిన్లు, విటమిన్-సి లను కలిగి ఉంటుంది. ఈ ద్రవం స్కలన నాళంలో శుక్రంతో కలిసినప్పటి నుంచి ఫ్రక్టోజ్ దానికి శక్తి వనరుగా పనిచేస్తుంది. ప్రోస్టాగ్లాండిన్లు ఫలదీకరణకు, అండంవైపు శుక్రకణాల కదలికలకు సహాయపడతాయి. శుక్రాశయాల స్రావం క్షారంగా ఉండటం వల్ల యోనిలో సహజంగా ఉండే ఆమ్లత్వాన్ని తటస్తీకరిస్తుంది.

AP Inter 2nd Year Zoology Study Material Chapter 5(a) మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థ

2. పౌరుషగ్రంథి: మూత్రాశయం కింద పౌరుషగ్రంథి ఉంటుంది. ఇది ప్రసేకపు మొదటి భాగాన్ని ఆవరించి, దాని స్రావాలను అనేక వాహికల ద్వారా ప్రసేకంలోకి పంపుతుంది. మానవుడిలో పౌరుషగ్రంథి శుక్రద్రవంలో 15-30 శాతం భాగాన్ని స్రవిస్తుంది. దీని స్రావం తేటగా, స్వల్ప ఆమ్లత్వంతో ఉండి శుక్రకణాలను ఉత్తేజపరచడంలో, పోషణ అందించడంలో సహాయపడుతుంది.

3. బల్బోయూరెత్రల్ గ్రంథులు: పౌరుషగ్రంథి కింద, ప్రకానికి ఇరువైపులా బఠాణి గింజ పరిమాణంలో మేహనం మొదలయ్యే చోట ఒక జత బల్బోయూరెత్రల్ గ్రంథులు లేదా కౌపర్ గ్రంథులు ఉంటాయి. వీటి స్రావం తేటగా, జారేటట్టుగా, క్షారత్వంతో ఉంటుంది. పురుషులలో లైంగిక ప్రేరణ ప్రారంభమైనప్పుడు ఈ గ్రంథుల స్రావం స్రవించబడి ప్రసేకంలో మూత్రం వల్ల కలిగిన ఆమ్లత్వాన్ని తటస్థీకరించి ప్రసేకాన్ని, మేహనం చివరకు జారేటట్టు చేయడం వల్ల సంపర్కంలో ఒరిపిడి తగ్గి శుక్రం ప్రసేకం ద్వారా సులభంగా జారడం జరుగుతుంది. ఇది శుక్రద్రవానికి క్షారత్వాన్నిచ్చి, యోని ఆమ్లత్వాన్ని తటస్థీకరిస్తుంది.

ప్రశ్న 12.
స్త్రీలోని జరాయువు నిర్మాణం, విధులను తెల్పండి.
జవాబు:
పిండ ప్రతిస్థాపన జరిగిన తరువాత ట్రోఫోబ్లాస్ట్ నుంచి వెళ్ళవంటి నిర్మాణాలు ఏర్పడి గర్భాశయ అంతర ఉపకళలోకి చొచ్చుకొనిపోతాయి. వీటిని పరాయు ముషకాలు అంటారు. పరాయు చుషకాలు, గర్భాశయ కణజాలం ఒకదానితో ఒకటి వేళ్ళలాగా అల్లుకొని అత్యంత సన్నిహిత సంబంధమేర్పరుచుకొని ఎదుగుతున్న పిండానికి, తల్లికి మధ్యన ఒక నిర్మాణాత్మక, క్రియాత్మక ప్రమాణమైన జరాయువును ఏర్పరుస్తాయి. మాతృ, భ్రూణ రక్త ప్రవాహాలు ఒకదానిలో ఒకటి కలవవు. అవి జరాయువుస్తరాల చేత వేరుచేయబడతాయి.

జరాయువులో రెండు ముఖ్య భాగాలుంటాయి. గర్భాశయ అంతర ఉపకళ నుంచి ఏర్పడిన మాతృ భాగం, పిండ బాహ్యత్వచాల నుంచి ఏర్పడిన పిండభాగం జరాయువులోని మాతృభాగంలో వరుసగా

  1. గర్భాశయ ఉపకళా కణజాలం
  2. గర్భాశయ సంయోజక కణజాలం
  3. గర్భాశయ కేశనాళికాయుత ఎండోథీలియం ఉంటాయి.

పిండ భాగంలో వరుసగా:

  1. భ్రూణ పరాయు ఉపకళా కణజాలం
  2. భ్రూణ సంయోజక కణజాలం
  3. భ్రూణ కేశనాళికాయుత ఎండోథీలియం ఉంటాయి.

మానవుల్లో పిండ బాహ్యత్వచాలైన అళిందం, పరాయువు కలిసి జరాయువు ప్రసరణను ఏర్పరుస్తాయి. ఈ రకాన్ని అళిందపరాయు జరాయువు అంటారు. ఈ జరాయువు చక్రాభ రకానికి చెందినది. ఇందులో చూషకాలు ప్రారంభదశలో పరాయువు ఉపరితలం మొత్తం సమానంగా విస్తరించి క్రమేణా ఇవి పిండ చక్రాభం పృష్టతలానికి పరిమితమవుతాయి. జరాయువులో కణజాలాల అమరిక ప్రకారం ఇది హీమోకోరియల్ రకానికి చెందింది. అంటే పిండ పరాయువు చూషకాలు నేరుగా మాతృకణంతో సంబంధాన్ని ఏర్పరుచుకుంటాయి. ప్రసవ సమయంలో జరాయువులోని పిండ త్వచాలతో పాటు గర్భాశయ కుడ్యకణజాలం కూడా విచ్ఛేదన చెంది విసర్జించబడటం వల్ల అధికంగా రక్తస్రావ జరుగుతుంది. కాబట్టి దీన్ని పతఃజరాయువు అంటారు.

విధులు:

  1. జరాయువు పిండాభివృద్ధికి కావలసిన ఆక్సిజన్, పోషక పదార్థాలను మాతృరక్తం నుంచి గ్రహించి CO2, విసర్జక పదార్ధాలను మాతృరక్తంలోకి విడుదల చేస్తుంది.
  2. అంతఃస్రావక గ్రంథిగా పనిచేస్తూ ప్రొజెస్టిరాన్ హార్మోను స్రవించి 4వ నెల నుంచి గర్భధారణను కాపాడుతుంది.
  3.  జరాయువు ఈస్ట్రోజనను స్రవించి గర్భాశయం పెరుగుదలకు, క్షీరగ్రంథుల అభివృద్ధికి తోడ్పడుతుంది.
  4. hCG ను ఉత్పత్తి చేసి, LH (లూటినైజింగ్ హార్మోన్) చేసే చర్యలను నిర్వహిస్తుంది.
  5. జరాయువు మానవజరాయు లాక్టోజన్ ను విడుదల చేసి భ్రూణ అభివృద్ధిలో సహాయపడుతుంది.
  6. జరాయువు మాతృ ప్రతిరక్షకాలైన IgG లను పిండానికి రవాణా చేసి, పిండం యొక్క రోగనిరోధకతను పెంచుతుంది.

దీర్ఘ సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
పటం సహాయంతో మానవ స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ గురించి వివరించండి. [A.P. & T.S. Mar. ’15]
జవాబు:
స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఒక జత స్త్రీ బీజకోశాలు, ఒక జత స్త్రీ బీజవాహికలు, గర్భాశయం, యోని, బాహ్య జనాంగాలు శ్రోణి ప్రాంతంలో ఉంటాయి. ఈ వ్యవస్థలోని భాగాలు ఒక జత క్షీరగ్రంథులతో నిర్మాణాత్మకంగా, క్రియాత్మకంగా, సమాకలనం చెంది అండోత్సర్గం, ఫలదీకరణం, గర్భధారణ, శిశుజననం, సంతాన పాలన మొదలయిన ప్రత్యుత్పత్తి విధులు నిర్వర్తిస్తాయి.

స్త్రీ బీజకోశాలు: స్త్రీ బీజకోశాలు స్త్రీ బీజకణాలను (అండాలు), వివిధ స్తిరాయిడ్ హార్మోన్ల (స్త్రీ బీజకోశ హార్మోన్లు)ను ఉత్పత్తి చేసే ప్రాథమిక స్త్రీ లైంగిక అవయవాలు. ఒక జత స్త్రీ బీజకోశాలు ఉదర క్రింది భాగంలోని శ్రోణి కుహరంలో గర్భాశయానికి ఇరువైపులా ఒక్కొక్కటి చొప్పున ఉంటాయి.

స్త్రీ బీజకోశాలను ఆవరించి ఉండే సరళ ఘనాకార ఉపకళను స్త్రీ బీజకోశ జనన ఉపకళ ఉంటారు. నిజానికి ఇది ఆంత్రవేష్టన పొర. ఈ పొర కింద మందంగా ఉన్న సంయోజక కణజాలపు గుళిక ఉంటుంది. దీన్ని ‘ట్యూనికా ఆల్బుజీనియా’ అంటారు. స్త్రీ బీజకోశంలోని స్ట్రోమా బయటి వల్కలం లోపలి దవ్వ అనే రెండు నిర్దిష్టమైన భాగాలుగా విడగొట్టబడి ఉంటుంది.

వల్కలం మందంగా ఉండి, వివిధ దశలలో అభివృద్ధి చెందుతున్న అండాశయ పుటికలు ఉండటం వల్ల కణికాయుతంగా కనిపిస్తుంది. దవ్వ వదులుగా ఉన్న సంయోజక కణజాలం. దీనిలో రక్తనాళాలు, శోషరస నాళాలు, నాడీ తంతువులు అధికంగా ఉంటాయి.

AP Inter 2nd Year Zoology Study Material Chapter 5(a) మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థ

ఫాలోపియన్నాళాలు (స్త్రీ బీజవాహికలు): ఫాలోపియన్ నాళాలు ఒక జత ఉంటాయి. ప్రతీ ఫాలోపియన్ నాళం కండర నిర్మితమై, బీజకోశ పరిధి నుంచి గర్భాశయం వరకు వ్యాపించి ఉంటుంది. స్త్రీబీజకోశం సమీపంలో గరాటు ఆకారంలో ఉన్న ఫాలోపియన్ భాగాన్ని కాలాంచిక అంటారు. దీని వెలుపలి అంచున ఉన్న ఫింబ్రియే అనే సన్నటి వేళ్లలాంటి నిర్మాణాలు ||923 అండోత్సర్గం తరువాత శరీర కుహరంలో విడుదలైన అండాలను సేకరిస్తాయి. కాలంచిక స్త్రీ బీజవాహిక తరవాతి భాగమైన కలశికలోకి, కలశిక చివరిభాగమైన సన్నటి గ్రీవం (ఇస్తుమస్ – (isthumus) ద్వారా గర్భాశయంలోకి తెరచుకొంటుంది. ఫాలోపియన్ నాళంలోని కలశికలో అండం ఫలదీకరింపబడుతుంది. ఫాలోపియన్ నాళంలో జరిగే అంతరాంగ చలనం వల్ల అండం లేదా సంయుక్త బీజ గర్భాశయం వైపుకు పంపబడుతుంది.
AP Inter 2nd Year Zoology Study Material Chapter 5(a) మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థ 10

గర్భాశయం: గర్భాశయం శ్రోణి ప్రాంతంలో మూత్రాశయానికి, పురీషనాళానికి మధ్య విశాలంగా, ధృడంగా కండరయుతమై, అధిక ప్రసరణ గల తల క్రిందులైన పియర్ ఆకారం పరిమాణంలో ఉండే కోశం లాంటి నిర్మాణం. ఇది శ్రోణి కుడ్యానికి, మీసోమెట్రియం అనే ఆంత్రవేష్టనంతో ఏర్పడ్డ బంధకాల సహాయంతో అతికి ఉంటుంది. గర్భాశయం దాని కింద ఇరుకుగా ఉన్న గర్భాశయ ముఖద్వారం గుండా యోనిలోకి తెరచుకొంటంది. గర్భాశయ ముఖద్వారంలోని సన్నటి కుల్యను గర్భాశయ ముఖద్వార కుల్య అంటారు. ఇది యోనితో కలసి శిశుజనన మార్గాన్ని ఏర్పరుస్తుంది.
AP Inter 2nd Year Zoology Study Material Chapter 5(a) మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థ 11

గర్భాశయ కుడ్యం మూడు కణజాలపు పొరలతో నిర్మితమైంది. వెలుపలి పలుచగా ఉన్న పొరను పరిఉపకళ అని, మధ్య మందంగా ఉన్న నునుపు కండరాలు పొరను కండర ఉపకళ అని, లోపలి గ్రంథియుతంగా ఉన్న పొరను అంతర ఉపకళ అని అంటారు. గర్భాశయ ఎండోమోట్రియం రుతు చక్రంలో చక్రీయ మార్పులకు లోనైతే ప్రసవ సమయంలో గర్భాశయ మయోమెట్రియం ధృడమైన సంకోచాలను ప్రదర్శిస్తుంది.

యోని: యోని విశాలంగా ఉండే తంతు కండరయుత నాళం. ఇది గర్భశయ ముఖద్వారం నుంచి అళిందం (లోపలి పెదవుల మధ్య ఉన్న ప్రదేశం) వరకు వ్యాపిస్తుంది. దీని లోపలి తలం కెరటిన్ రహిత స్తరిత శల్కల ఉపకళను కలిగి ఉంటుంది. ఇది అధిక ప్రసరణ కలిగి యోనిరంధ్రం ద్వారా అళిందం వద్ద తెరచుకొంటుంది.

యోని పరివృతం: యోని చుట్టూ ఉన్న ప్రాంతాన్ని ఉల్వా లేదా యోని పరివృతం అంటారు. ఇది స్త్రీ బాహ్య జననాంగాలను సూచిస్తున్న ప్రాంతం, ఆళిందం రెండు రంధ్రాలను కలిగి ఉంటుంది. అవి ఊర్ధ్వ బాహ్య ప్రసేక రంధ్రం, నిమ్న యోనిరంధ్రం, యోనిరంధ్రం హైమన్ (కన్నెపొర) అనే శ్లేష్మపొరచే పాక్షికంగా మూయబడి ఉంటుంది.
అళిందం రెండు జతల చర్మపు మడతలచే ఆవరించబడుతుంది. అవి పలుచని లోపలి పెదువులు, పెద్దగా మందంగా ఉండే బయటి పెదవులు. లోపలి పెదవులు కలిసే పై భాగంలో ఒక సున్నితమైన స్తంబించగల గుహ్యంగాంకురం అనే నిర్మాణం ఉంటుంది. ఇది పురుష మేహనానికి సమజాతం. బయటి పెదవులపై భాగంలో ఉండే ఉబ్బత్తు ప్రాంతాన్ని మాన్స్ప్యూబిస్ అంటారు. దీనిచర్మంపై జఘనరోమాలు, చర్మం కింద కొవ్వు కణజాల దిండు ఉంటుంది.

స్త్రీ జననేంద్రియ అనుబంధ గ్రంథులు: స్త్రీలలో ప్రత్యుత్పత్తి అనుబంధ గ్రంథులు వరుసగా 1. బార్తొలిన్ గ్రంథులు, 2. స్కీన్ గ్రంథులు, 3. క్షీరగ్రంథులు.

  1. బార్తొలిన్ గ్రంథులు: అళింద కుడ్యంలో యోని రంధ్రానికి కొద్ది క్రిందుగా ఇరువైపులా అమరి ఒకజత బార్తొలిన్ గ్రంథులు ఉంటాయి. వీటి శేష్మస్రావం యోని మార్గాన్ని సులభంగా జారేటట్లు చేస్తుంది.
  2. స్కీన్ గ్రంథులు: యోని పూర్వాంతకుడ్యం వద్ద, ప్రసేకం కింద ఈ గ్రంథులు ఉంటాయి. ఇది ప్రేరేపించబడినపుడు క్షార, జిగట ద్రవాన్ని స్రవిస్తాయి.
  3. క్షీరగ్రంథులు: క్రియాత్మక క్షీరగ్రంథులు ఉండటం ఆడక్షారదాల ప్రత్యేక లక్షణం ఇవి గ్రంథియుత కణజాలాన్ని వివిధ మొత్తాలలో కొవ్వు కణజాలాన్ని కలిగి ఉంటాయి. క్షీరగ్రంథులు శిశుజననాంతరం మాత్రమే పనిచేయడం ప్రారంభిస్తాయి.

ప్రశ్న 2.
పటం సహాయంతో మానవ “పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థను” ను వివరించండి. [A.P. & T.S. Mar.’17, ’16 Mar. ’14 ]
జవాబు:
పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ప్రత్యుత్పత్తి ప్రక్రియలో పాల్గొనే అనేక లైంగిక అవయాలు శ్రోణి ప్రాంతంలో ఉంటాయి. అవి ఒక జత ముష్కాలు, అనుబందగ్రంథులు, అనుబంధ నాళాలు, బాహ్య జననాంగాలు.

ముష్కాలు: ఒక జత అండాకార మష్కాలు, ఉదరకుహరం బయట ముష్కగోణిలో వేలాడుతూ ఉంటాయి. ముష్కగోణి, ముష్కాలకు రక్షణనిస్తూ శుక్రకణోత్పత్తికి కావలసిన ఉష్ణోగ్రత ఉండేటట్లు చేస్తుంది. ముష్కగోణి కుహరం వాంక్షణ నాళం ద్వారా ఉదరకుహరంతో కలసి ఉంటుంది. ముష్కాన్ని ముష్కగోణిలో నిలిపి ఉంచుతూ గుబర్నాక్యులమ్, శుక్రదండం అనే నిర్మాణాలుంటాయి. ముష్కాన్ని ఆవరించి ట్యూనికా ఆల్బుజీనియా అనే తంతుయుత కణజాల కవచం ఉంటుంది. ఇది ముష్కంలోకి వ్యాపించి అడ్డు విభాజకాలను ఏర్పరచి ముష్కన్ని లంబికలుగా విభజిస్తుంది. ప్రతి లంబికలో 1-3 మెలికలు తిరిగి ఉండే శుక్రోత్పదక నాళికలు ఉంటాయి. ప్రతీ ముష్కబాహ్య తలాన్ని ఆవరించి ట్యూనికా వెజైనాలిస్ అనే త్వచం ఉంటుంది.

శుక్రోత్పాదక నాళికలు: శుక్రోత్పాదక నాళికను ఆవరించి జనన ఉపకళ ఉంటుంది. దీనిలో విభేదనం చెందని శుక్రమాతృకణాలు ఉంటాయి. ఇవి క్షయకరణ విభజన చెంది శుక్రకణాలను ఏర్పరుస్తాయి. శుక్రమాతృకణాల మధ్య సెర్టోలి కణాలు అనే పోషక కణాలు ఉంటాయి. ఇవి అభివృద్ధి చెందే శుక్రకణాలకు పోషణను అందిస్తాయి. శుక్రోత్పాదక నాళికలు బయట ప్రాంతంలో ఉన్న లీడిగకణాలు ఆండ్రోజన్స్న ఉత్పత్తి చేస్తాయి. శుక్రోత్పాదక నాళికలు రీటేముష్కం ద్వారా శుక్రనాళికలలోకి తెరచుకుంటాయి.
AP Inter 2nd Year Zoology Study Material Chapter 5(a) మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థ 12

ఎపిడిడైమిస్: ముష్కం నుంచి శుక్రనాళికలు బయటికి వచ్చి సన్నని ముష్క పరాంత తలం వెంబడి చుట్టలు చుట్టుకొని ఉన్న నాళంతోకి తెరచుకొంటాయి. ఈ నాళాన్ని ‘ఎపిడిడైమిస్’ అంటారు. ఇది శుక్రకణాలను తాత్కాలికంగా నిలవచేయడానికి, శుక్రకణాలు పరిపకత్వకు రావడానికి కావలసిన సమయాన్ని కలుగజేస్తుంది.

శుక్రవాహికలు (Vasa Deferentia): రెండు శుక్రవాహికలు ఎడమ, కుడి వైపున ఒక్కోటి ఉండి ఆ వైపున ఎపిడిడైమిస్, స్కలన నాళాలను కలుపుతూ శుక్రకణ రవాణాలో ఉపయోగపడతాయి. శుక్రవాహిక సన్నగా, పొడవుగా ఉండే కండరయుతమైన నాళం. ఇది పుచ్చ ఎపిడిడైమిస్ నుంచి బయలుదేరి వాంక్షణ నాళం ద్వారా ఉదర కుహరంలోకి ప్రవేశించి, మూత్రాశయం పై నుంచి శిక్యంలా మారి శుక్రాశయం నుంచి వచ్చే వాహికతో కలసి స్కలన నాళంను ఏర్పరుస్తుంది. రెండు వైపుల నుంచి వచ్చే స్కలననాళాలు శుక్రకణాలను, శుక్రాశయాలు స్రవించిన ద్రవాన్ని రవాణా చేస్తూ పౌరుషగ్రంథి మధ్యభాగంలో కలసి ప్రసేకంలోకి తెరచుకొంటాయి. ప్రసేకం శుక్రకణాలను బయటికి రవాణా చేస్తుంది.

ప్రసేకం: పురుషులలో ప్రసేకం మూత్ర, జననేంద్రియ వాహికలు కలసి ఏర్పడిన అంత్యనాళం. ప్రసేకం మూత్రాశయం నుంచి ప్రారంభమై మేహనం ద్వారా వ్యాపించి యూరెత్రర్మీటస్ (urethral meatus) అనే రంధ్రం ద్వారా బయటికి తెరచుకొంటుంది. మూత్రం, స్కలింపబడిన శుక్రం రెండూ ప్రసేకం ద్వారా ప్రయాణించి బయటికి వస్తాయి.

మేహనం: మేహనం, ముష్కగోణి పురుషులలోని బాహ్య జననాంగాలు. మేహనం మూత్రనాళంగానే కాకుండా స్త్రీ జీవి యోనిలో శుక్రద్రవాన్ని విడుదల చేసే ప్రవేశ్యాంగం గా కూడా పనిచేస్తుంది. మానవ మేహనంలో నిలువుగా ఉన్న మూడు స్పంజికా కణజాలపు స్తంభాలు ఉంటాయి. అవి కార్పోరా కావెర్నోసా అనే రెండు పృష్ట భాగంలోని స్తంభాలు, ఈ రెండు స్తంభాల కింద ఉదర మధ్య భాగంలో ‘కార్పస్ స్పాంజియోజమ్’ అనే ఒక స్తంభం. చర్మం, అధశ్చర్మపొర మూడు నిలువుగా ఉన్న కణజాలపు స్తంభాలు ఆవరించి ఉంటాయి. ప్రత్యేకించిన కణజాలం ఉండటం వల్ల మేహనం నిటారుగా, కడ్డీలాగా మారి శుక్రాన్ని విడుదల చేయడంలో సహాయపడుతుంది. ఉబ్బి, బల్బులాగా ఉన్న మేహనం చివరి భాగాన్ని గ్లాన్స్ మేహనం అని, దాన్ని ఆవరించి వదులుగా ఉన్న చర్మం మడుతలను ముందు చర్మం (ప్రెప్యూస్) అని అంటారు.

AP Inter 2nd Year Zoology Study Material Chapter 5(a) మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థ

పురుష అనుబంధ జననేంద్రియ గ్రంధులు:
పురుష అనుబంధ గ్రంధులు వరుసగా:

  1. ఒక జత శుక్రాశయాలు
  2. ఒక పౌరుగ్రంధి
  3. ఒక జత బల్బోయూరెత్రల్ గ్రంధులు

శుక్రాశయాలు (Seminal Vesicles): శుక్రాశయాలు శ్రోణి ప్రాంతంలో మూత్రాశయం పరాంత కింది భాగంలో ఉండే ఒక జత సాధారణ నాళాకారగ్రంథులు. ప్రతీ శుక్రాశయం ఆ వైపు శుక్రవాహికలోకి అది పౌరుషగ్రంథిలోకి ప్రవేశించే ముందు తెరచుకొంటుంది. శుక్రకోశాలు స్రవించే స్రావం శుక్రద్రవం ఘనపరిమాణంలో సుమారు 60 శాతం ఉంటుంది.
ఇది చిక్కగా, క్షారయుతంగా, ఉండి ఫ్రక్టోజ్, ప్రోటీన్లు, సిట్రిక్ ఆమ్లం ఆకర్బన ఫాస్పేట్ (Pi) పొటాషియం, ప్రోస్టాగ్లాండిన్లు, విటమిన్ ‘సి’ లను కలిగి ఉంటుంది. ఈ శుక్రద్రవంలో ప్రక్టోజ్ శక్తి వనరుగా, ప్రాస్టాగ్లాంజిన్లు ఫలదికరణకు వీలు కల్పించుటకు సహాయపడుతుంది. శుక్రాశయాలస్రావం క్షారంగా ఉండటంవల్ల యోనిలో సహజంగా ఉండే ఆమ్లత్వాన్ని తటస్థీకరిస్తుంది.

పౌరుషగ్రంథి: మూత్రాశయం కింద పౌరుషగ్రంథి ఉంటుంది. ఇది ప్రసేకపు మొదటి భాగాన్ని ఆవరించి, దాని స్రావాలను అనేక వాహికల ద్వారా ప్రసేకంలోకి పంపుతుంది. మానవుడిలో పౌరుషగ్రంథి శుక్రద్రవంలో 15-30 శాతం భాగాన్ని స్రవిస్తుంది. దీని స్రావ తేటగా, స్వల్ప ఆమ్లత్వంతో ఉండి శుక్రకణాలను ఉత్తేజపరచడంలో, పోషణ అందించడంలో సహాయపడుతుంది.

బల్బోయూరెత్రల్ గ్రంథులు: పౌరుషగ్రంథి కింద, ప్రసేకానికి ఇరుప్రక్కలా బఠాణిగింజ పరిమాణంలో మేహనం మొదలయ్యేచోట ఒక జత బల్బోయూరెత్రల్ గ్రంథులు ఉంటాయి. వీటి స్రావం తేటగా, జారేటట్టుగా ఉంటుంది. ఇది సంపర్కసమయంలో ఒరిపిడి తగ్గించి, ప్రసేకం సులభంగా జారెటట్లు చేస్తుంది.

ప్రశ్న 3.
మానవ పిండాభివృద్ధిలోని వివిధ సంఘటనల గురించి వ్యాసం రాయండి.
జవాబు:
మానవుడిలో పిండాభివృద్ధి వివిధ దిశలలో జరుగుతుంది. అవి

  1. ఫలదీకరణం
  2. గాస్ట్రులేషన్
  3. అవయవోత్పత్తి
  4. జరాయువు ఏర్పడటం
  5. గర్భధారణ మరియు ప్రసవం

1) ఫలదీకరణం: ఫలదీకరణం, ఫాలోపియన్ నాళ కలాశికలో జరుగుతుంది. ఎప్పుడైతే చలనరహిత శుక్రకణం పరిణితి చెందిన అండాన్ని చేరుకొంటుందో అది కరోనా రేడియేటా జోనాసెల్యుసిడాలను చేధించుకొని లోనికి ప్రవేశిస్తుంది. అనేక జోనా శుక్రకణాలు జోనాపెల్యుసిడాను చేధించి పరిపీతిక ప్రదేశంలోకి చేరినప్పటికి, ఒక శుక్రకణం మాత్రమే అండంలోకి ప్రవేశిస్తుంది. అండంలోకి శుక్రకణం ప్రవేశం వల్ల ద్వితీయ అండమాతృకణం ప్రేరేపించబడి రెండవ క్షయకరణ విభజన పూర్తవుతుంది. రెండు బీజాల కేంద్రకంలు కలిసి సంయుక్త కేంద్రాన్ని ఏర్పరుస్తాయి. దీన్ని ‘సింకేరియాన్’ అంటారు. ఫలదీకరణం చెందిన అండాన్ని సంయుక్తబీజం అంటారు.
AP Inter 2nd Year Zoology Study Material Chapter 5(a) మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థ 13

a) విదళనం: పిండాభివృద్ధి మొదటి దశ సంయుక్త బీజం విధజనాలు జరపడం. మానవుడిలో అండాలు మైక్రోలెసిథల్ రకానికి చెందడం వల్ల విదళనం పూర్ణ భంజిత, పరిభ్రమణ, అనిర్ధారిత, అసమాన పద్ధతిలో జరుగుతుంది. సంయుక్త బీజం గర్భాశయం వైపుకు స్త్రీబీజవాహికలోని గ్రీవం గుండా చలిస్తున్నప్పుడు విదళనం మొదలవుతుంది. విదళనం వల్ల ఏర్పడిన పిల్ల కణాలను సంయుక్తబీజ ఖండితాలు అంటారు.

b) మారులా: 8-16 సంయుక్త బీజ ఖండితాలతో ఉండే పిండం మల్బరీ పండులాగా ఉంటుంది. కాబట్టి దీన్ని మారులా అంటారు. మారులా ఫాలోపియన్ నాళంలో అభివృద్ధి చెందుతూ గర్భాశయాన్ని చేరుతుంది. అసమాన విదళనం వల్ల సూక్ష్మ, స్థూల సంయుక్త బీజ ఖండితాలు ఏర్పడతాయి. కాంపాక్షన్ ప్రక్రియ వల్ల మారులాలోని ఖండితాలు దగ్గరగా లాగబడి సాంద్రంగా అమరుతాయి. సంయుక్త బీజ ఖండితాలు రెండు రకాల కణాలుగా తయారవుతాయి. అవి (1) ఉపరితల బల్లపరుపు కణాలు (2) అంతర కణ సముదాయం. ఉపరితల బల్లపరుపు కణాలు ట్రోఫోబ్లాస్ట్ లేదా పోషక బహిస్త్వచంగా ఏర్పడి చూషకాలను ఏర్పరుచుకొని పిండాన్ని గర్భాశయ గోడకు అతికిస్తాయి. అంతర కణ సముదాయం, పిండాన్ని ఏర్పరిచే రూపోత్పాదక కణాలుగా మారుతాయి. దీనితో కణవిభేదనం మొదలవుతుంది.

c) బ్లాస్టోసిస్ట్: గర్భాశయ కుహరం నుంచి కొంత ద్రవం మారులాలోకి ప్రవేశించి, పాక్షికంగా అంతర కణ సముదాయ కణాలను ట్రోఫోబ్లాస్ట్ నుంచి వేరుచేస్తుంది. ద్రవ పరిమాణం పెరుగుతున్నకొద్దీ, మారులా ఒక కోశంగా తయారవుతుంది. ట్రోపోబ్లాస్ట్ కణాలు బల్లపరుపుగా మారతాయి. అంతరకణ సముదాయం లోపల ఒకేవైపున ట్రోఫోబ్లాస్టికి అతికి ఉంటుంది. దీన్ని పిండ లేదా జాంతవధ్రువం అంటారు. ఇప్పుడు మారులా బ్లాస్టోసిస్ట్గా మారుతుంది. అంతర కణ సముదాయం పైభాగాన ఉన్న ట్రోఫోబ్లాస్ట్ కణాలను రాబర్ కణాలు అంటారు.
AP Inter 2nd Year Zoology Study Material Chapter 5(a) మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థ 14

d) ప్రతిస్థాపన: బ్లాస్టోసిస్ట్ని ఆవరించి ఉండే జోనాపెల్యుసిడా క్రమంగా అదృశ్యమవుతుంది. ఫలితంగా ట్రోఫోబ్లాస్ట్ గర్భాశయ అంతర ఉపకళకు అతికి, దానిలో పూర్తిగా అంతర్గతం అయ్యేవరకు చొచ్చుకొనిపోతుంది. దీన్ని మధ్యాంతర ప్రతిస్థాపన అంటారు. ఫలదీకరణం జరిగిన 6వ రోజున ప్రతిస్థాపన ఆరంభమవుతుంది. ప్రతిస్థాపనకు ట్రోఫోబ్లాస్ట్ ఉత్పత్తిచేసే ప్రోటియాలైటిక్ ఎన్జైమ్లు, గర్భాశయ శ్లేష్మస్తరం సహాయపడతాయి.

e) ద్విపటలికా పిండి చక్రాభం ఏర్పడటం: రెండవ వారాంతానికి బ్లాస్టోసిస్ట్ ప్రతిస్థాపన పూర్తి అవుతుంది. అంతర కణ సముదాయం పిండి చక్రాభంగా మారుతుంది. వెంటనే రాబర్ కణాలు అదృశ్యమై పిండ చక్రాభం బహిర్గతమవుతుంది. పిండ చక్రాభం లోపలి కింది భాగం నుంచి కొన్ని కణాలు డీలామినేషన్ ద్వారా వేరై పిండ చక్రాభం లోపలి తలాన అంటే కుహరం ఎదురు తలంలో ఒక స్తరంగా ఏర్పడతాయి. ఈ కణాల స్తరం హైపోబ్లాస్ట్ గా రూపొంది భవిష్యత్తులో పిండ బాహ్య అంతస్త్వచాన్ని ఏర్పరుస్తుంది. మిగిలిన పిండ చక్రాభ భాగాన్ని ఎపిబ్లాస్ట్ అంటారు. కాబట్టి ఈ పిండి చక్రాన్ని “ద్విపటలికా పిండ చక్రాభం” అంటారు. ఇది పిండంగా మారుతుంది. ట్రోపోబ్లాస్ట్ కింద ఈ హైపోబ్లాస్ట్ పొర చివరికి ఒక కుహరాన్ని ఆవరిస్తుంది. ఈ కుహరాన్ని సొన సంచి లేదా నాభికోశం అంటారు. ఇంతలో పిండాచక్రాభం మందం పుచ్ఛభాగం వైపుకు పెరుగుతుంది. క్రమంగా పిండ చక్రాభం అండాకారంగా మారుతుంది.

2) గాస్ట్రులేషన్: గాస్ట్రులేషన్ ప్రక్రియలో పిండంలోని కణాల విభేదనం, కదలికలు జరుగుతాయి.
a) త్రిపటలికా పిండం – ప్రాథమిక జనన స్తరాలు ఏర్పడటం: ఎన్ఐలోని కొన్ని భవిష్యత్ అంతస్త్వచ కణాలు ప్రవేశం చెంది, పిండం హైపోబ్లాస్ట్ కణాలను స్థానభ్రంశం చేసి అంతస్త్వచంగా ఏర్పడతాయి. భవిష్యత్ మధ్యస్త్వచ కణాలు ఆది మడతల వద్దకు చేరి, ఆదికుల్య ద్వారా అంతర్వలనం చెంది, ఎన్లాస్ట్, ఎండోకర్స్గా మధ్యకు చేరతాయి. ఈ విధంగా ఎపిబ్లాస్ట్ నుంచి మధ్యస్త్వచం వేరైన తరువాత ఎప్లస్ ను బాహ్యస్త్వచం అంటారు. ఎస్ఇ బ్లాస్ట్, హైపోబ్లాస్ట్కు మధ్య ఉన్న కుహరంలోకి ఎపిబ్లాస్ట్ కణాలు చొరబడటాన్ని గాస్ట్రులేషన్ అంటారు. గాస్ట్రులేషన్ ప్రక్రియ ద్విపటలికా పిండ చక్రాన్ని “త్రిపటలికా పిండ చక్రాభం” గా మారుతుంది.

పిండ బాహ్య త్వచాలు: మానవ పిండాభివృద్ధిలో ఇతర ఉల్బదారులలో లాగా నాలుగు రకాల పిండ బాహ్య త్వచాలు లేదా భ్రూణ త్వచాలు ఏర్పడతాయి. అవి పరాయువు, ఉల్బం, ఆళిందం, సొనసంచి. గ్రాస్టులేషన్ పూర్తయి, అన్ని పిండ బాహ్య త్వచాలు ఏర్పడిన తరువాత పిండాభివృద్ధి తరువాత దశ అవయవాలు ఏర్పడటంతో ప్రారంభమవుతుంది.

3) అవయవోత్పత్తి: అవయవాల ఉత్పత్తి వివిధ దశలలో జరుగుతుంది.
పృష్ఠవంశం, నాడీనాళం ఏర్పడుట: పృష్ఠవంశ మధ్యస్త్వచ కణాలు హెన్పన్స్ కణుపు వద్దకు కేంద్రీకృతమై అంతర్వలనం చెంది పృష్ట వంశ అవశేష్ఠంగా ముందుకు వ్యాపిస్తాయి. తరువాత ఈ నిర్మాణం గట్టి కడ్డీ లాంటి పృష్ఠ వంశంగా మార్పు చెందుతుంది. ఈ పిండ అక్షాస్థిపంజర స్థానంలో కశేరు దండం ఏర్పడుతుంది. పృష్ఠవంశ మధ్యస్త్వచం దానిపై ఉన్న బహిస్త్వచ కణాలను ప్రేరేపించి నాడీఫలకాన్ని ఏర్పరుస్తుంది. ఈ ఫలకం పృష్ఠవంశం వైపుకు అంతర్వర్తనం చెంది నాడీగాడి ఏర్పడి దీని పార్శ్వ ఉపాంతాలు నాడీ మడతలుగా మారి ముందుకు సాగి పృష్ఠ మధ్యరేఖ వద్ద కలవడం వల్ల నాడీనాళం ఏర్పడుతుంది. దీన్నే న్యూరులేషన్ అంటారు.

మధ్యస్త్వచ విభేదనం, సీలోమ్ ఏర్పడటం: వెలుపలి బాహ్యస్త్వచం, లోపలి అంతస్త్వచం మధ్యలో పిండాంతస్త మధ్యస్త్వచం అన్నివైపులా విస్తరిస్తుంది. పృష్ఠవంశానికి, నాడీ నాళానికి ఇరువైపులా ఉన్న ఆయత మధ్యస్త్వచ స్తంభాన్ని ఎపిమియర్ అంటారు. ఆంత్రనాళాన్ని చుట్టి ఉన్న మధ్యస్త్వచాన్ని హైపోమియర్ అంటారు. ఈ రెండింటి మధ్యగల మధ్యస్త్వచాన్ని మీసోమియర్ అంటారు.

AP Inter 2nd Year Zoology Study Material Chapter 5(a) మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థ

ఎపిమియర్ క్రమంగా ఖండీభవనం చెంది సోమైట్లను ఏర్పరుస్తుంది. ప్రతీసోమైట్ మయోటోమ్, స్లీరోటోమోమ్, డెర్మోటోమ్ విభేదనం చెందుతాయి. స్త్రీ రోటోమ, వెన్నెముక గాను, డెర్మోటోమ్ అంతశ్చర్మం, సంయోజక కణజాలం గాను, మయోటోమ్ నియంత్రిత కండరాలుగాను విబేధనం చెందుతాయి. మీసోమియర్ మూత్రజననేంద్రియ అవయవాలను, వాటి నాళాలను ఏర్పరుస్తాయి. హైపోమియర్ వెలుపలి సొమాటిక్, లోపలి సాంక్నిక్, మధ్యస్త్వచ పొరలుగా చీలుతుంది. ఈ రెండు పొరల మధ్య ఏర్పడిన కుహరం పిండాంతస్థ కుహరం, పిండి కుహరం నుంచి హృదయావరణ, పుపుసి, ఆంత్రవేష్టని కుహరాలు ఏర్పడతాయి.

4) జరాయువు ఏర్పడటం: పిండ ప్రతిస్థాపన జరిగిన తరువాత ట్రోఫోబ్లాస్ట్ నుంచి వేళ్ళ వంటి నిర్మాణాలు ఏర్పడి గర్భాశయ అంతర ఉపకళలోకి చొచ్చుకొనిపోతాయి. వీటిని పరాయు చూషకాలు అంటారు. పరాయు చూషకాలు, గర్భాశయ కణజాలు, ఒకదానితో ఒకటి వేళ్లలాగా అల్లుకొని అత్యంత సన్నిహిత సంబంధమేర్పరుచుకొని ఎదుగుతున్న పిండానికి, తల్లికి మధ్యన ఒక నిర్మాణాత్మక, క్రియాత్మక ప్రమాణమైన జరాయువును ఏర్పరుస్తాయి.

  • జరాయువు పిండాభివృద్ధికి కావలసిన O2, పోషక పదార్థాలను, మాతృ రక్తం నుంచి గ్రహించి CO2కను విసర్జక పదార్థాలను మాతృ రక్తంలోకి విడుదల చేస్తాయి.
  • జరాయువు ప్రొజెస్టిరాన్ ను స్రవించి గర్భధారణను కాపాడుతుంది.
  • సొమాటో మెమ్మెట్రోపిన్ను విడుదలచేసి భ్రూణ అభివృద్ధిలో సహాయపడుతుంది.

5) గర్భధారణ: పిండ గర్భాశయాంతర అభివృద్ధిని గర్భధారణ అంటారు. గర్భం అభివృద్ధి చెందే కాలాన్ని గర్భావధి కాలం అంటారు. గర్భావధి కాలం 266 రోజులు లేదా 38 వారాలు పడుతుంది.
గర్భావధిని సులువుగా ఉండటానికి 3 త్రైమాసాలుగా విభజించవచ్చు. మొదట త్రైమాసంలో అవయవాల ఉత్పత్తి జరిగి, శరీర అంగాలు అభివృద్ధి జరుగుతుంది.

  • గర్భధారణ జరిగిన మొదట నెల చివరన – హృదయం ఏర్పడుతుంది.
  • రెండవ నెల చివరన – పిండంలో కాళ్ళు, చేతులు వాటి వేళ్ళు వృద్ధి చెందుతాయి.
  • మూడవ నెలలో- ముఖ్య అవయవ వ్యవస్థలు ఏర్పడతాయి.
  • ఐదవ నెలలో – భ్రూణ కదలికలు, తల మీద వెంట్రుకలు రావడం.
  • ఆరవ నెల చివరలో – సున్నితమైన రోమాలతో శరీరం కప్పి ఉండటం, కనురెప్పలు తెరవడం, కనురెప్ప వెంట్రుకలు ఏర్పడటం జరుగుతాయి.
  • తొమ్మిదవ నెలలో – భ్రూణం పరిపూర్ణంగా ఎదిగి, ప్రసవం కోసం సిద్ధంగా ఉంటుంది.

6) ప్రసవం: పురిటి నొప్పులు క్రమంగా దృఢంగా లయబద్ధంగా జరిగి, గర్భాశయ కండరాల సంకోచ సడలికల వల్ల శిశువును, జరాయువును గర్భాశయం నుంచి బయటకు నెట్టివేస్తాయి. దీన్నే ప్రసవం అంటారు.

AP Inter 2nd Year Zoology Study Material Chapter 4(b) రోగనిరోధక వ్యవస్థ

Andhra Pradesh BIEAP AP Inter 2nd Year Zoology Study Material  Lesson 4(b) రోగనిరోధక వ్యవస్థ Textbook Questions and Answers.

AP Inter 2nd Year Zoology Study Material Lesson 4(b) రోగనిరోధక వ్యవస్థ

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
రోగనిరోధకత, రోగనిరోధక వ్యవస్థలను నిర్వచించండి.
జవాబు:
1) వ్యాధికారక జీవులకు వ్యతిరేకంగా పోరాడే అతిది లేదా జీవి యొక్క సామర్ధ్యాన్ని రోగనిరోధకత అంటారు. 2) హానికర, సంక్రమణ జీవులు అయిన బ్యాక్టీరియా, వైరస్, పరాన్నజీవులు, శీలీంధ్రాల నుంచి దేహానికి రక్షణ కలిగించే అవయవాలను, కణాలను, ప్రోటీన్లను కలిసి ఏర్పడిన వ్యవస్థనే రోగనిరోధక వ్యవస్థ అంటారు.

ప్రశ్న 2.
శరీరంలోని అవిశిష్ఠి రక్షణ రేఖలను నిర్వచించండి .
జవాబు:
శరీరంలో అవిశిష్ఠ రక్షణ రేఖలు. ప్రథమ రక్షణ రేఖలుగా పనిచేస్తాయి. వీటినే స్వాభవిక రోగనిరోధకత అనికూడా అంటారు. ఇది జీవులపుట్టుకతోనే కలిగి ఉండే రోగనిరోధక శక్తి. దీనిలో నాలుగు రకాల అవరోధాలుండి రక్షణక్రియా యంత్రాలుగా తోడ్పడతాయి. అవి:

  1. భౌతిక అవరోధాలు
  2. శరీరధర్మపరమైన అవరోధాలు
  3. కణపరమైన అవరోధాలు
  4. సైటోకైన్ అవరోధాలు

AP Inter 2nd Year Zoology Study Material Chapter 4(b) రోగనిరోధక వ్యవస్థ

ప్రశ్న 3.
పరిపక్వ B – కణాలు, క్రియాశీల B – కణాలు మధ్య గల భేదాలను తెలపండి.
జవాబు:
పరిపక్వ B – కణాలు

  1. ఇవి అస్థిమజ్జ కాండకణాల నుండి ఉద్భవించి పరిపక్వ B – కణాలుగా అభివృద్ధి చెందుతాయి.
  2. పరిపక్వ B -కణాలు వాటి ప్లాస్మాత్వచం ఉపరితలం పై ప్రతిదేహాలను ప్రదర్శిస్తాయి.
    ఇది ప్రతిజనకాలను గుర్తించి వాటిని అంతర్గతం చేసుకొని ప్రక్రియీకరణ చేసి, T – కణాలకు MHC II ప్రోటీన్ల ద్వారా సమర్పిస్తాయి.

క్రియాశీల B – కణాలు

  1. క్రియాశీల B – కణాలు, పరిపక్వB – కణాల నుండి ఏర్పడతాయి.
  2. క్రియాశీల B కణాలు విభేదన మరియు విభజన చేంది. ప్లాస్మాకణాలు, జ్ఞప్తికణాలను ఏర్పరుస్తాయి. ప్లాస్మా కణాలు ప్రతిదేహాలను ఉత్పత్తి చేసి, ప్రతి జనకాలను తొలగించుతాయి.

ప్రశ్న 4.
ఏవైనా నాలుగు ఏకకేంద్రక ఫాగోసైట్ల (భక్షక కణాల ) పేర్లు రాయండి.
జవాబు:

  1. హిస్టియోసైట్లు సంయోజక కణ జాలంలో ఉంటాయి.
  2. కూఫర్ కణాలు – కాలేయంలో ఉంటాయి.
  3. మైక్రోగ్లియల్ కణాలు – మెదడులో ఉంటాయి.
  4. మిసెంగియల్ కణాలు – మూత్రపిండంలో ఉంటాయి.

ప్రశ్న 5.
పరిపూరక ప్రోటీన్లు అంటే ఏవి ? [A.P. Mar. ’17]
జవాబు:
ఇవి ప్లాస్మాలోనూ, కణత్వచ ఉపరితలం పైన ఉండే అచేతన ప్రోటీన్లు వీటిని రోగనిరోధక వ్యవస్థ లేదా సూక్ష్మ జీవులు చైతన్యపరుస్తాయి. చైతన్యమైన పరిపూరక ప్రోటీన్లు బ్యాక్టీరియం కుడ్యం పై వలయాల రూపంలో అతుకొని త్వచదాడి సంక్లిష్టం (MAC) ను ఏర్పరుస్తాయి. ఇవి బ్యాక్టీరియా త్వచం పై రంధ్రాలు చేస్తాయి. ఈ రంధ్రాల ద్వారా కణబాహ్య ద్రవ్యం బ్యాక్టీరియంలోకి ప్రవేశించి, బ్యాక్టీరియం ఉబ్బి చనిపోతుంది. కొన్ని పరిపూరక ప్రోటీన్లు ఉజ్వలనం కలుగజేయడం ద్వారా కూడా రక్షణనిస్తాయి.

ప్రశ్న 6.
అప్పుడే జన్మించిన శిశువులకు ‘కొలోస్ట్రమ్’ అత్యావశ్యకం నిరూపించండి. [T.S. Mar. ’17, ’16]
జవాబు:
ప్రసవించిన తల్లి మొదటి కొద్ది రోజులిచ్చు పసుపు రంగు చనుపాలను కొలోస్ట్రమ్ లేదా ముర్రుపాలు అంటారు. ఇవి అప్పుడే జన్మింఛిన శిశువుకు ఇవ్వడం అవసరం ఎందుకంటే, దీనిలో IgA రకపు ప్రతిదేహాలు అధికంగా ఉండి శిశువుకు రోగ నిరోధకతను కల్పిస్తాయి.

ప్రశ్న 7.
పెర్ఫోరిన్స్, గ్రానై జైమ్స్ మధ్య గల భేదాలు తెల్పండి. [A.P. Mar.’17]
జవాబు:
పెర్ఫోరిన్స్: ఇవి క్రియాశీల TC కణాల నుండి విడుదలై, మార్పుచెందిన కణాల ప్లాస్మాత్వచాలలో రంధ్రాలు చేస్తాయి. ద్వారా నీరు లోనికి ప్రవేశించి, కణదేహం ఉబ్బి చివరకు పగిలి నశిస్తుంది.

గ్రామ్స్: ఇవి కూడా క్రియాశీల Tc కణాల నుండి విడుదలై, సంక్రమణ దేహకణాలలోనికి ప్రవేశించి ప్రణాళికాబద్ద కణ మరణంను కలుగజేస్తుంది. దీనినే అపోటోసిన్ అంటారు.

ప్రశ్న 8.
ఆప్సనైజేషన్ అంటే ఏమిటి ?
జవాబు:
చైతన్య పరచబడిన పరిపూరక ప్రోటీన్లు బ్యాక్టీరియం ఉపరితలంపై అచ్చాదనం / పూతలాగా అంటుకుంటాయి. ఈ ప్రక్రియను ఆప్సనైజైషన్ అంటారు. దీనివల్ల భక్షక కణాలు బ్యాక్టీరియా వైపు ఆకర్షింపబడి వాటిని భక్షిస్తాయి.

AP Inter 2nd Year Zoology Study Material Chapter 4(b) రోగనిరోధక వ్యవస్థ

ప్రశ్న 9.
వివిధ రకాల రోగనిరోధక అపస్థితుల పేర్లు రాయండి.
జవాబు:
వివిధ రకాల రోగనిరోధక అపస్థితులు:

  1. రోగనిరోధకత లోపం వల్ల వచ్చే అపస్థితులు
  2. అతిసున్నితత్వ అపస్థితులు
  3. స్వయం రోగనిరోధకత అపస్థితులు
  4. అంటుతిరస్కరణ చర్యలు.

ప్రశ్న 10.
ప్రతిజనకం, ప్రతిదేహాలను నిర్వచించండి.
జవాబు:
ప్రతిజనకం: దేహంలో గుర్తించగలిగే రోగనిరోధక అనుక్రియను కలుగజేసే పదార్థాన్ని ప్రతిజనకం అంటారు. సాధారణంగా ప్రోటీన్లు, పాలిశాకరైడ్లు ప్రతిజనకాలుగా పనిచేస్తాయి.

ప్రతిదేహం: వ్యాధిజనక జీవులకు లేదా ప్రతిజనకాలను ప్రేరణగా B – లింఫోసైట్లు ఉత్పత్తి చేసే ప్రోటీన్లను ప్రతిదేహాలు అంటారు.

ప్రశ్న 11.
ఎపిటోప్, పారాటోప్ అంటే ఏమిటో వివరించండి.
జవాబు:
ఎపిటోప్: ప్రతిదేహంతో బంధితమయ్యే ప్రతిజనకపు భాగాన్ని ఎపిటోప్ అంటారు.
పారాటోప్: ప్రతిజనకంతో బంధితమయ్యే ప్రతిదేహ భాగాన్ని పారాటోప్ అంటారు.

ప్రశ్న 12.
రెండు ప్రతిజనక కణాలను పేర్కొనండి.
జవాబు:
ప్రతిజనకాల ఉనికిని బట్టి ఇవి

  1. స్వేచ్ఛా / ప్రసరణ ప్రతిజనకాలు: ఇదిదేహ ద్రవాలలో ప్రసరణం చెందుతాయి.
  2. కణాంతర ప్రతిజనకాలు: ఇవి సాంక్రమిక కణం లోపల ఉండే ప్రతిజనకాలు.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
B – కణాల గురించి లఘుటీక రాయండి. [Mar. ’14]
జవాబు:
B – లింఫోసైట్లు అస్థిమజ్జ కాండ కణాల నుంచి ఉద్భవిస్తాయి. క్షీరదాలలో అస్థిమజ్ఞ, భ్రూణపు కాలేయంలోనూ, పక్షులలో బర్సాఫాబ్రిసియస్లోనూ పరిణితి చెంది B- కణాలుగా మారతాయి. పరిణితి చెందిన B- కణాలు ప్రతిదేహాలను సంశ్లేషించి వాటిని (Ig M మరియు Ig D) త్వచ ఉపరితలం పై ప్రదర్శిస్తాయి. ఇవే ప్రతిజననక గ్రాహకాలుగా పనిచేస్తాయి. ఇవి ద్వితీయ లింఫాయిడ్ అవయవాలలో పరిణితి చెందిన B – కణాలు క్రీయాశీల B– కణాలుగా మారుతాయి. తరువాత ఇది ప్లాస్మాకణాలు మరియు జ్ఞప్తికణాలుగా మారుతాయి. ప్లాస్మాకణాలు, ప్రతిజనకాలకు వ్యతిరేకంగా ప్రతిదేహాలను ఉత్పత్తి చేస్తాయి. కానీ జ్ఞప్తికణాలు శోషరస కణువులలో కొన్ని దశాబ్ధాల వరకు జీవించి ఉంటాయి. అదే ప్రతిజనకం రెండవ సారి దేహంలోకి ప్రవేశించినప్పుడు జ్ఞప్తికణాలు వేగంగా విభజన, విభేదనం చెంది రెండవతరం క్రియాశీల క్లోన్లు ఏర్పడతాయి. దీనినే ద్వితీయ రోగనిరోధక అనుక్రియ అంటారు. B కణాలు ముఖ్యంగా హ్యుమోరల్ లేదా దేహద్రవనిర్వర్తిత రోగ నిరోదకతలో పాల్గొంటాయి.

ప్రశ్న 2.
ఇమ్యూనోగ్లోబ్యులిన్స్ గురించి లఘుటీక రాయండి. [T.S. Mar. ’15]
జవాబు:
వ్యాధి జనక జీవులకు లేదా ప్రతిజనకాలకు ప్రేరణగా B – లింఫోసైట్లు ప్రతిదేహాలు అనే ప్రోటీన్ అణువులను ఉత్పత్తి చేస్తాయి. వీటిని ఇమ్యునోగ్లోబ్యులిన్లు అంటారు. ప్రతిజనక – ప్రతిదేహ చర్య జరిపేటప్పుడు ప్రతిజనకం బందితమయ్యే ప్రతిదేహ భాగాన్ని పారాటోప్ అంటారు.

AP Inter 2nd Year Zoology Study Material Chapter 4(b) రోగనిరోధక వ్యవస్థ

ప్రతిదేహాలు రెండురకాలు అవి

  1. స్వేచ్ఛా లేదా ప్రసరణ ప్రతిదేహాలు: ఇవి దేహద్రవాలు అనగా సీరమ్, లింపులలో ఉంటాయి.
  2. ప్లాస్మాత్వచం పై బందింపబడిన ప్రతిదేహాలు: ఇది పరిణితి చెందిన B కణాల త్వచ ఉపరితలంపై ఉంటాయి.

ఇమ్యునోగ్లోబ్యులిన్ నిర్మాణం: ఇమ్యునోగ్లోబ్యులిన్ ‘Y’ ఆకారపు అణువు దీనిలో. నాలుగు పాలిపెప్టైడ్ గొలుసులుంటాయి.

AP Inter 2nd Year Zoology Study Material Chapter 4(b) రోగనిరోధక వ్యవస్థ 1

అందులో రెండు సరూప, పొట్టి, తేలికపాటి గొలుసులు (L) మిగిలిన రెండూ సరూప, పొడవాటి భారగొలుసులు (H) కాబట్టి ప్రతిదేహం నిర్మాణాన్ని H2, L2 అమరికగా సూచిస్తారు. ఒకదానితో మరొకటి డైసల్ఫైడ్ బంధాలతో బంధించబడి ఉంటాయి. ప్రతిదేహం ఒక చివరను Fab ఖండం లేదా ప్రతిజనక బంధన ఖండం అని వేరొక చివరను Fc ఖండం లేదా స్ఫటికీకరణం చెందే ఖండం లేదా నిర్మాణాన్ని బట్టి ప్రతిదేహాలు అయిదురకాలు అవి IgG, IgA, IgM, IgD మరియు IgE. వీటిలో IgG, IgD, IgE లు ఏకాణుకరూపంగానూ, IgA ద్విఅణుక రూపంలోనూ, IgM పంచఅణుక రూపంలోనూ ఉంటాయి.

ప్రశ్న 3.
సహజ లేదా స్వాభావిక రోగ నిరోధకతలోని వివిధ రకాల అవరోధాలను వివరించండి. [T.S. Mar. ’17]
జవాబు:
పుట్టుకతోనే కలిగి ఉండే రోగనిరోధక శక్తిని సహజ లేదా స్వాభావిక రోగనిరోధకత అంటారు. ఈ నిరోధకత దేహంలో సూక్ష్మజీవుల దాడి జరగకముందే ఏర్పడుతుంది. కాబట్టి అవిశిష్టంగా ఉంటుంది.

దీనిలో నాలుగు రకాల అవరోధాలుండి రక్షణక్రియా యంత్రాలుగా తోడ్పడతాయి. అవి:
ఎ) భౌతిక అవరోధాలు: చర్మం, శ్లేష్మస్తరాలు ప్రధాన భౌతిక అవరోధాలు. చర్మం సూక్ష్మజీవుల ప్రవేశాన్ని నిరోధిస్తుంది. శ్వాస, జఠరాంత్ర, మూత్రజననేంద్రియ నాళాల లోపలి తలంలో ఉండే శ్లేష్మస్తరాలు దేహంలో ప్రవేశించిన సూక్ష్మజీవులను బంధిస్తాయి.

బి) శరీరధర్మపరమైన అవరోధాలు: జీర్ణాశయంలో స్రవించే HCl, లాలాజలం, కన్నీరు మొదలయిన దేహ స్రావకాలు ప్రధాన శరీరధర్మపరమైన అవరోధాలు. ఇవి సూక్ష్మజీవుల పెరుగుదలను నిరోధిస్తాయి.

సి) కణపరమైన అవరోధాలు: రక్తంలో బహురూప కేంద్రక ల్యూకోసైట్లు, మోనోసైటులు, సహజ హంతకకణాలు, కణజాలాలలోని మాక్రోఫ్రేజ్లు మొదలయిన కణాలు ప్రధాన కణపరమైన అవరోధాలు. ఇవి సూక్ష్మజీవులను భక్షించి రక్షణ కల్పిస్తాయి.

డి) సైటోకైన్ అవరోధాలు: రోగనిరోధక కణాలు సైటోకైనిన్లను స్రవిస్తాయి. ఇవి కణ విభజనను, కణవిభేదనను ప్రేరేపిస్తాయి. కొన్ని సైటోకైన్లు పొరుగునున్న కణాలను వైరస్ సంక్రమణ నుంచి రక్షిస్తాయి.

ప్రశ్న 4.
హ్యుమోరల్ లేదా దేహద్రవనిర్వర్తిత రోగనిరోధకత సంవిధానాన్ని వివరించండి.
జవాబు:
ప్రతి జనకానికి ప్రేరణ చెందిన B – కణాలు విశిష్ఠ ప్రతిదేహాలను ఉత్పత్తి చేసి ప్లాస్మా, శోషరసం మొదలయిన దేహ ద్రవాలలోకి విడుదల చేస్తాయి. ప్రతిదేహాల ద్వారా జరిగే రోగ నిరోధకతను హ్యూమోరల్ లేదా దేహద్రవనిర్వర్తిత రోగనిరోధకత అంటారు.

దేహద్రవ నిర్వర్తిత రోగనిరోధకతా సంవిధానం: మన శరీరంలోకి ప్రతిజనకం ప్రవేశించినప్పుడు అది ద్వితీయ లింఫాయిడ్ అవయవాలను చేరతాయి. అక్కడ స్వేచ్ఛా ప్రతిజనకాలు B- కణాలపై ఉండే ప్రతిజనక గ్రాహకాల Fab చివరలు ప్రతిజనకాలతో బంధనం చెంది, చైతన్యవంతమవుతాయి. B కణాలు గ్రాహకాలకు బంధింపబడిన ప్రతిజనకాలను అంతర్గతం చేసుకొని దాన్ని ప్రక్రియీకరణ చేసి, ప్రతిజనక తునకలను రెండవ తరగతి MHC అణువులతో తమ త్వచ ఉపరితలంపై ప్రదర్శిస్తాయి. సరియైన TH కణాలు ఈ ప్రతిజనక MHC – II సంక్లిష్టాన్ని గుర్తించి దానితో కలిసి ఇంటర్ల్యుకిన్లను స్రవిస్తాయి.

AP Inter 2nd Year Zoology Study Material Chapter 4(b) రోగనిరోధక వ్యవస్థ

దీనివల్ల B కణాలు విభేదనం చెంది విస్తృత విభజన ద్వారా క్రియాశీల B – కణాలు ఏర్పడతాయి. ఇవి తరువాత ప్లాస్మాకణాలు, జ్ఞప్తి కణాలను ఏర్పరుస్తాయి. ప్లాస్మాకణాలు ప్రతిదేహాలను ఉత్పత్తి చేసి ప్రతి జనకంతో పోరాడతాయి. ఈ చర్యను ప్రాథమిక రోగనిరోధక అనుక్రియ అంటారు. అదే ప్రతిజనకం రెండవసారి దేహంలోని ప్రవేశించినప్పుడు జ్ఞప్తి కణాలు వేగంగా విభజన, విభేదనం చెంది రెండవ తరం ప్లాస్మాకణాలను, కణాలను ఏర్పరుస్తాయి. ఈ ప్లాస్మాకణాలు ప్రతిదేహాలను ఉత్పత్తి చేస్తాయి.
AP Inter 2nd Year Zoology Study Material Chapter 4(b) రోగనిరోధక వ్యవస్థ 2

ఈ ఉత్పత్తి అయిన విశిష్ఠ ప్రతిదేహాలు ప్రతిజనకంతో బంధనం చెంది ప్రతిజనక – ప్రతిదేహ సంక్లిష్టం ఏర్పడుతుంది. ఈ సంవిధానం 4 రకాలుగా జరుగుతుంది. అవి తటస్థీకరణం, గుచ్ఛీకరణం, అవక్షేపం మరియు పరిపూరక ప్రోటీన్లను చైతన్యపరచడం. ఈవిధంగా దేహ ద్రవ నిర్వర్తిత రోగనిరోధకత ప్రతిజనక – ప్రతిదేహ చర్యల ద్వారా విశిష్ట రక్షణతోపాటు స్థూల భక్షక కణాలు పరిపూరక ప్రోటీన్ల సహాయంతో అవిశిష్ఠ రక్షణ కూడా కలుగజేస్తుంది.

ప్రశ్న 5.
కణనిర్వర్తిత రోగనిరోధకత సంవిధానాన్ని వివరించండి.
జవాబు:
T – లింఫోసైట్ల చర్యల వల్ల జరిగే రోగనిరోధక అనుక్రియాలను కణనిర్వర్తిత రోగనిరోధకత అంటారు. ఈ విధానంలో T – లింఫోసైట్లు దేహంలోని మార్పు చెందిన స్వీయకణాలపై దాడిచేసి నిర్మూలిస్తాయి. అంతేకాక కణనిర్వర్తిత రోగనిరోధకత దేహంలోని స్వ, పర కణాలను గుర్తిస్తుంది.

కణనిర్వర్తిత రోగనిరోధకత సంవిధానం: కణ నిర్వర్తిత రోగనిరోధకత ప్రతిజనక సమర్పణ చర్యతో ప్రారంభమవుతుంది. ఈచర్య ఫలితంగా మొదటి TH కణాలు ఆ తరువాత T కణాల చైతన్యవంతమై రోగ నిరోధక సంవిధానం కొనసాగుతుంది. a) ప్రతిజనక ప్రక్రియీకరణ సమర్పణ: స్థూలభక్షక కణాలు, B కణాలు మార్పు చెందిన స్వీయకణాల త్వచ ఉపరితలం పై ఉండే విశిష్ఠ ప్రతిజనకాలను గుర్తిస్తాయి. వీటిలో ప్రతిజనకాలు రెండు విధాలుగా ఏర్పడతాయి. (i) సాంక్రమిక కణాలలోనికి ప్రవేశించిన సూక్ష్మజీవులు జీర్ణించబడి, చిన్న చిన్న ముక్కలుగా ఏర్పడతాయి. వీటిలోని ప్రోటీన్లు MHC లతో కలిసి వెలుపలికి వచ్చి ప్లాస్మాత్వచం ఉపరితలంపై అతుక్కొంటాయి. (ii) ఇతర మార్పు చెందిన స్వీయ కణాలలో కొత్త ప్రోటీన్లు ఏర్పడి అవికూడా MHC ప్రోటీన్లతోపాటు కణ ఉపరితలాన్ని చేరుకుంటాయి. ఈచర్యనే ప్రతిజనక ప్రక్రియీకరణం అంటారు.

b) T కణాలు క్రియాశీలమవడం: ప్రతిజనక సమర్పక కణాలు TH కణాలు వద్దకు చేరినప్పుడు వాటి గ్రాహకాలు ప్రతిజనకానికి బంధించబడతాయి. వెంటనే ప్రతిజనక సమర్పక కణం IL-I ను విడుదల చేస్తుంది. ఇది TH కణాన్ని చైతన్యవంతం చేస్తుంది. ఈవిధంగా క్రియాశీలమైన TH కణం IL-II ను విడుదల చేస్తుంది. ఇది TH కణాలలో కణవిభజనను ప్రేరేపిస్తుంది. దీని ఫలితంగా క్రియాశీల TH జ్ఞప్తి కణాల క్లోన్లు ఏర్పడతాయి. క్రియాశీల TH కణాలు B – లింపోసైట్లను ప్రేరేపించి వాటి నుంచి ప్రతిదేహాల ఉత్పత్తిని అధికం చేస్తాయి.
AP Inter 2nd Year Zoology Study Material Chapter 4(b) రోగనిరోధక వ్యవస్థ 3

c) T కణాలు క్రియాశీలమవడం: TH కణాల నుండి విడుదలైన IL-II, Tc కణాలను కూడా చైతన్యవంతం చేస్తాయి. చైతన్యం చెందిన Tc కణాలు కణ విభజన జరిపి క్రియశీల Tc కణాలు జ్ఞప్తి కణాలు క్లోన్లు ఏర్పడతాయి.

AP Inter 2nd Year Zoology Study Material Chapter 4(b) రోగనిరోధక వ్యవస్థ

అదే సమయంలో క్రియాశీల Tc కణాల, నుంచి పెర్ఫోరిన్లు, గ్రానైజైమ్లు అనే ప్రోటీన్లు విడుదలవుతాయి. పెర్ఫోరిన్లు మార్పుచెందిన స్వీయ కణాల ప్లాస్మాత్వచాలలో రంధ్రాలు చేస్తాయి. వీటి ద్వారా నీరు లోపలికి ప్రవేశించి కణదేహం ఉబ్బి చివరకు పగిలి నశిస్తుంది. గ్రామ్లు సంక్రమణ దేహ కణాలలోనికి ప్రవేశించి ప్రణాళికాబద్ద కణ మరణంను కలుగజేస్తుంది. దీనినే అపోటోసిస్ అంటారు.

అదే ప్రతిజనకం రెండవసారి దేహంలోనికి ప్రవేశిస్తే జ్ఞప్తి కణాలు అత్యంత వేగంగా విభేదనం, విభజన చెంది రెండవతరం జ్ఞప్తి, క్రియశీల, క్లోన్లు ఏర్పడతాయి. ఇవి కూడా కణవిచ్ఛిన్న క్రియను కొనసాగిస్తాయి. జ్ఞప్తికణాలు శోషరస కణుపులలో దశాబ్ధాల పాటు నిల్వ ఉంటాయి.
AP Inter 2nd Year Zoology Study Material Chapter 4(b) రోగనిరోధక వ్యవస్థ 4

ప్రశ్న 6.
HIV ఏవిధంగా AIDS ను కలుగజేస్తుందో వివరించండి. [A.P. Mar. ’15]
జవాబు:
AIDS అంటే అక్వయిర్డ్ ఇమ్యునోడెఫిషియన్సీ సిండ్రోమ్. ఇది జన్మతః కాని, బదిలీచెందే, లైంగిక సంపర్కం ద్వారా సంక్రమించే ప్రాణాంతక వ్యాధి. ఇది హ్యూమన్ ఇమ్యునోడెఫిషియన్సీ వైరస్ వల్ల కలుగుతుంది. HIV ఒక రిట్రోవైరస్. దీని మధ్య భాగంలో జన్యుపదార్ధంగా రెండు ssRNA అణువులు ఉంటాయి.

AP Inter 2nd Year Zoology Study Material Chapter 4(b) రోగనిరోధక వ్యవస్థ

సంవిధానం: HIV మానవశరీరంలోకి ప్రవేశించి సహాయక T – కణాలు, మాక్రోఫెజ్లు, డెండ్రైటిక్ కణాలపై దాడి చేస్తుంది. ఈ కణాలలో HIV లోని RNA రివర్స్ ట్రాన్స్ క్రిప్టేజ్ ఎన్జైమ్ సహాయంతో తిరోఅనులేఖన ప్రక్రియ ద్వారా యుగళపోచల వైరల్ DNA ను సంశ్లేషణ చేస్తుంది. ఈ వైరల్ DNA వైరల్ ఎంజైమ్ ఇంటిగ్రేస్ సహాయంతో ఆతిథేయి కణ DNA అణువుతో కలిసిపోయి ప్రోవైరస్ ఏర్పడుతుంది. ఈ ప్రోవైరస్ కొంతకాలం తరువాత వైరస్ రేణువులను ఉత్పత్తి చేస్తుంది. ఈవిధంగా సాంక్రమిక మానవ కణాలు వైరస్ రేణువులను నిరంతరం ఉత్పత్తి చేసే HIV ఉత్పత్తి కర్మగారాలుగా పనిచేస్తాయి. ఆతిథేయి కణాల నుండి ఏర్పడ్డ క్రొత్త వైరస్లు రక్తంలోకి విడుదలై కొత్త TH కణాలపై దాడి చేస్తాయి. దీని ఫలితంగా HIV సాంక్రమిక మానవుడి దేహంతో TH కణాల సంఖ్య రానురాను తగ్గిపోతూ రోగనిరోదకత లోపానికి దారి తీస్తుంది. చివరకు AIDS ను కలుగజేస్తుంది.

AP Inter 2nd Year Zoology Study Material Chapter 4(a) అంతస్రావక వ్యవస్థ, రసాయన సమన్వయం

Andhra Pradesh BIEAP AP Inter 2nd Year Zoology Study Material Lesson 4(a) అంతస్రావక వ్యవస్థ, రసాయన సమన్వయం Textbook Questions and Answers.

AP Inter 2nd Year Zoology Study Material Lesson 4(a) అంతస్రావక వ్యవస్థ, రసాయన సమన్వయం

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ఆక్రోమెగాలి అంటే ఏమిటి ? ఈ అపస్థితిని కలుగజేసే హార్మోన్ పేరు రాయండి. [T.S. Mar. ’17; A.P. Mar. ’15]
జవాబు:
పూర్వ పిట్యూటరీ నుంచి మానవ పెరుగుదల హార్మోన్ అధికోత్పత్తి ప్రౌఢ మానవులలో జరిగితే, ఆ లక్షణాన్ని ఆక్రోమెగాలి అంటారు. ఈ స్థితిలో చేతులు కాళ్లు, దవడ ఎముకలు, ముక్కు ఎముకల కొనలోని మృదులాస్థి అధికంగా పెరిగి వారి ముఖం గొరిల్లా ముఖం లాగా కనిపిస్తుంది. ఈ అపస్థితికి కారణం మానవ పెరుగుదల హార్మోన్ అధికోత్పత్తి.

ప్రశ్న 2.
యాంటిడైయూరిటిక్ హార్మోన్ అని దేనినంటారు ? దీన్ని స్రవించే గ్రంథి పేరు రాయండి.
జవాబు:
వాసోప్రెస్సిన్ హార్మోన్నే యాంటిడైయూరిటిక్ హార్మోన్ అని అంటారు. ఇది పరపిట్యూటరీ నుండి స్రవించబడుతుంది.

ప్రశ్న 3.
బాల్యంలో పరిమాణం పెరుగుతూ, యుక్త వయస్సులో పరిమాణం తగ్గే గ్రంథి పేరేమి ? సాంక్రమణ జరిగినప్పుడు ఈ గ్రంథి పోషించే పాత్ర ఏమిటి ?
జవాబు:
థైమస్ గ్రంథి శిశువు జన్మించినప్పుడు చిన్నదిగా ఉండి శిశువు పెరిగే కొద్ది పెద్దదవుతూ యౌవనారంభంలో గరిష్ట పరిమాణం చేరుతుంది. ప్రౌఢదశలో ఇది కుచించుకుపోయి జన్మించినప్పుడు ఉన్న పరిమాణంలాగా చిన్నదవుతుంది.

సాంక్రమణ జరిగినప్పుడు ఇది రోగనిరోధక వ్యవస్థ అభివృద్ధిలో ప్రముఖపాత్ర వహిస్తుంది. ఇది థైమోసిన్ హార్మోన్ను స్రవించి T – లింఫోసైట్ల విభేదనంలో పాల్గొని కణ నిర్వర్తిత రోగనిరోధకతకు మరియు ప్రతిదేహాలు ఏర్పడటంలో సహాయపడి దేహద్రవ నిర్వర్తిత రోగనిరోధకతకు దోహదం చేస్తుంది.

ప్రశ్న 4.
డయాబెటిస్ ఇన్సిపిడస్, డయాబెటిస్ మెల్లిటస్ మధ్య గల భేదాన్ని వివరించండి. [T.S. & A.P. Mar. ’16 Mar. ’14]
జవాబు:
డయాబెటిస్ ఇన్సిపిడస్: ఇది వాసోప్రెస్సిన్ న్యూనత వల్ల ఏర్పడే అపసవ్యత. అధిక మూత్రోత్పత్తి, అధిక నీటి విసర్జన, తీవ్రదాహం దీని లక్షణాలు. మూత్రంలో చక్కెర విడుదల కాదు కేవలం నీరు మాత్రమే విసర్జితమవుతుంది.

డయాబెటిస్ మెల్లిటస్: ఇది ఇన్సులిన్ అల్పోత్పత్తి వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయి పెరుగుతుంది. దీన్ని హైపర్ గ్లైసీమియా అంటారు. ఈ స్థితి చాలాకాలం కొనసాగితే డయాబెటిస్ మెల్లిటస్ అనే వ్యాధికి దారితీస్తుంది. ఈ వ్యాధిలో మూత్రం ద్వారా గ్లూకోజ్ విసర్జన జరుగుతుంది.

ప్రశ్న 5.
లాంగర్ హాన్స్ పుటికలని వేటినంటారు ?
జవాబు:
క్లోమ గ్రంథిలోని అంతస్రావక భాగాన్ని లాంగరోన్స్ పుటికలు అంటారు. ఈ భాగంలో 1 2 మిలియన్ల లాంగర్ హాన్స్ పుటికలను కలిగి ఉంటుంది. లాంగర్ హాన్స్ పుటికలో ac – కణాలు, B-కణాలని రెండు రకాల కణాలుంటాయి. 0 – కణాలు గ్లూకగాన్ హార్మోను, B -కణాలు ఇన్సులిన్ హార్మోన్ ను స్రవిస్తాయి.

ప్రశ్న 6.
ఇన్సులిన్ షాక్ అంటే ఏమిటి ? [A.P. Mar. ’15]
జవాబు:
ఇన్సులిన్ అధికోత్పత్తి లేదా అధికస్రావత వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయి పడిపోతుంది. దీన్ని ఇన్సులిన్ షాక్ అంటారు.

ప్రశ్న 7.
పోరాట, పలాయన హార్మోనని దేనినంటారు ? [T.S. Mar. ’15]
జవాబు:
ఎపినెఫ్రిన్ మరియు నార్ఎపినెఫ్రిన్లను పోరాట, పలాయన హార్మోన్లని అంటారు. ఎందుకంటే ఇవి ఒత్తిడి, అత్యవసర పరిస్థితులకు అనుక్రియగా స్రవించబడతాయి:

ప్రశ్న 8.
ఆండ్రోజెన్లని వేటినంటారు ? వీటిని స్రవించే కణాలేవి ?
జవాబు:
ఆండ్రోజెన్లు పురుష లైంగిక హార్మోన్లు వీటిలో ప్రధానమైంది టెస్టోస్టిరావి ముష్కాలలో గల లీడిగ్ కణాలనుండి స్రవించబడతాయి.

ప్రశ్న 9.
ఎరిత్రోపోయిటిన్ అంటే ఏమిటి ? దీని విధి ఏమిటి ? [Mar. ’14]
జవాబు:
ఎరిత్రోపోయిటిన్ ఒక పెప్టైడ్ హార్మోన్, ఇది మూత్రపిండంలో ఉండే రక్తనాళికా గుచ్ఛ సన్నిధి పరికరం నుండి స్రవించబడుతుంది. ఇది అస్థిమజ్జలో ఎర్రరక్తకణోత్పాదనక్రియను ప్రేరేపిస్తుంది.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
మానవులలో అంతస్రావక గ్రంథులను, అవి స్రవించే హార్మోన్లను పేర్కొనండి.
జవాబు:
1) హైపోథలామస్: ఇది థైరాయిడ్ విడుదల హార్మోన్, కార్టికోట్రోఫిన్ విడుదల హార్మోన్, గొనాడోట్రోఫిన్ విడుదల హార్మోన్, పెరుగుదల హార్మోన్ విడుదల హార్మోన్, పెరుగుదల హార్మోన్ నిరోధక హార్మోన్, ప్రొలాక్టిన్ విడుదల నిరోధక హార్మోన్.

2) పిట్యూటరీ గ్రంథిని రెండు భాగాలుగా విడదీయవచ్చు. అవి: 1) పూర్వ పిట్యూటరీ మరియు పరపిట్యూటరీ. ఎ) పూర్వ పిట్యూటరీ: పూర్వ పిట్యూటరీ ఆరు ముఖ్య పెప్టైడ్ హార్మోనులను స్రవిస్తుంది. అవి పెరుగుదల హార్మోను, ప్రొలాక్టిన్, థైరాయిడ్ ప్రేరక హార్మోన్, ఎడ్రినోకార్టికోట్రోపిక్ హార్మోన్, పుటికాప్రేరక హార్మోన్, ల్యుటినైజింగ్ హార్మోన్. బి) పరపిట్యూటరీ: ఇది రెండురకాల హార్మోనులను స్రవిస్తుంది. అవి. ఆక్సిటోసిన్ మరియు వాసోప్రెస్సిన్లు.

3) పీనియల్ గ్రంథి: ఈ గ్రంథి మెలటోనిన్ అనే హార్మోను స్రవిస్తుంది.

4) థైరాయిడ్ గ్రంథి: థైరాయిడ్ గ్రంథి థైరాక్సిన్, టెట్రాఐడోథైరోనిన్, కాల్సిటోనిన్ అనే హార్మోన్లను స్రవిస్తుంది.

5) పారాథైరాయిడ్ గ్రంథి: పారాథైరాయిడ్ అనే పెప్టైడ్ హార్మోన్ ను స్రవిస్తుంది.

6) థైమస్ గ్రంథి: ఇది థైమోసిన్ హార్మోన్ను స్రవిస్తుంది.

7) ఎడ్రినల్ లేదా అధివృక్క గ్రంథి: వీటిలో రెండు కణజాలాలు ఉంటాయి. పరిధీయ కణజాలాన్ని అధివృక్క వల్కలం అని, లోపలి కణజాలాన్ని అధివృక్క దవ్వ అని అంటారు.
అధివృక్క వల్కలం: ఇది గ్లూకోకార్డికాయిడ్లు, మినరలో కార్డికాయిడ్లు, ఆండ్రోజెన్స్ మరియు ఈస్ట్రోజెన్ హార్మోన్లను స్రవిస్తుంది.
అధివృక్క దవ్వ: ఎపినెఫ్రిన్ మరియు నార్ఎపినెఫ్రిన్లను ఉత్పత్తి చేస్తుంది.

8) క్లోమం: క్లోమం గ్లూకగాస్ మరియు ఇన్సులిన్ హార్మోనులను స్రవిస్తుంది.

9) ముష్కాలు: ఆండ్రోజెన్లు మరియు టెస్టోస్టిరాన్ హార్మోన్లను స్రవిస్తుంది.

10) స్త్రీ బీజకోశాలు: ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరాన్ అనే రెండు స్టిరాయిడ్ హార్మోన్లను ఉత్పత్తి చేస్తాయి.

ప్రశ్న 2.
న్యూరో అంతస్రావక అవయవం లాగా హైపోథలామస్ ఏ విధంగా పని చేస్తుందో వివరించండి.
జవాబు:
హైపోథలామస్, పూర్వ మెదడులోని ద్వారగోపు ఆధార భాగం. దీని కింది వైపు పిట్యూటరీ గ్రంథి అతికి ఉంటుంది. ఈవిధంగా హైపోథలామస్ నాడీ, అంతస్రావక వ్యవస్థలను అనుసంధానం చేస్తుంది.

హైపోథలామస్లో అనేక నాడీస్రావక కణాల సముదాయాలు ఉంటాయి. వీటిని కేంద్రకాలు అంటారు. ఇవి రెండు రకాల న్యూరోహార్మోన్లను స్రవిస్తాయి. అవి: విడుదల హార్మోన్లు మరియు నిరోధక హార్మోన్లు.

1) విడుదల హార్మోన్లు: ఇవి పిట్యూటరీ హార్మోన్ల విడుదలను ప్రేరేపిస్తాయి.
ఉదా: (i) థైరోట్రోపిన్ విడుదల హార్మోన్లు: ఇది పూర్వ పిట్యూటరీను ప్రేరేపించి థైరాయిడ్ స్టిములేటింగ్ హార్మోన్ ఉత్పత్తి అయ్యేటట్లు చేస్తుంది.
(ii) పెరుగుదల హార్మోన్ విడుదల హార్మోన్ల లు: ఇది పిట్యూటరీని ప్రేరేపించి పెరుగుదల హార్మోన్ విడుదలను గావిస్తుంది.

2) నిరోధక హార్మోన్లు: ఇవి పిట్యూటరీ హార్మోన్ల విడుదలను నిరోధిస్తాయి.
(i) పెరుగుదల హార్మోన్ నిరోధక హార్మోన్: ఈ హార్మోన్ పిట్యూటరీ నుంచి పెరుగుదల హార్మోన్ విడుదలను నిరోధిస్తుంది.
(ii) ప్రొలాక్టిన్ విడుదల నిరోధక హార్మోన్: పూర్వ పిట్యూటరీ గ్రంథి నుండి ప్రొలాక్టిన్ విడుదలను నిరోధిస్తుంది.

ప్రశ్న 3.
పిట్యూటరీ గ్రంథి స్రావకాల గురించి వివరించండి.
జవాబు:
పిట్యూటరీ లేదా పీయూష గ్రంథిని హైపోఫైసిస్ అని అంటారు. పిట్యూటరీ గ్రంథిని పూర్వ పిట్యూటరీ మరియు పర పిట్యూటరీగా విభజించవచ్చు.
పూర్వ పిట్యూటరీ: పూర్వ పిట్యూటరీ ఆరు ముఖ్య పెప్టైడ్ హార్మోన్లను స్రవిస్తుంది. ఇవి

  1. పెరుగుదల హార్మోన్: ఇది కాలేయ కణాలను ప్రేరేపించి ఇన్సులిన్ లాంటి పెరుగుదల కారకాలను విడుదల చేస్తుంది. ఇవి అస్థికణాల విభజనను ప్రేరేపించి ఎముకలు పొడుగయ్యేటట్లు చేస్తాయి. తద్వారా దేహ పెరుగుదలకు తోడ్పడుతుంది.
  2. ప్రొలాక్టిన్: ఇది స్త్రీలలో క్షీర గ్రంథుల పెరుగుదలకు, క్షీరోత్పత్తికి తోడ్పడుతుంది.
  3. థైరాయిడ్ ప్రేరక హార్మోన్: ఇది థైరాయిడ్ గ్రంథిని ప్రేరేపించి థైరాయిడ్ హార్మోన్ సంశ్లేషణ విడుదలకు తోడ్పడుతుంది.
  4. ఎడ్రినో కార్టికోట్రోపిక్ హార్మోన్: ఇది అధివృక్క వల్కలాన్ని ప్రేరేపించి గ్లూకోకార్టికాయిడ్లు అనే స్టిరాయిడ్ హార్మోన్ల సంశ్లేషణకు, వాటి విడుదలకు తోడ్పడుతుంది.
  5. పుటికాప్రేరక హార్మోన్: ఇది స్త్రీలలో స్త్రీబీజకోశ పుటికల పెరుగుదల, అభివృద్ధిని ప్రేరేపిస్తుంది. పురుషులలో ఇది ఆండ్రోజెన్లతో కలసి శుక్రజననాన్ని నియంత్రిస్తుంది.
  6. ల్యుటినైజింగ్ హర్మోన్: ఇది పురుషులలో ముష్కాలలో ఉండే లీడిగ్ కణాలను ప్రేరేపించి ఆండ్రోజెన్ అనే పురుష హార్మోన్ల విడుదలకు దోహదం చేస్తుంది. స్త్రీలలో స్త్రీబీజకోశాలను ప్రేరేపించి ఈస్ట్రోజెన్; ప్రొజెస్టిరాన్ హార్మోనులను ఉత్పత్తి చేస్తుంది.

పరపిట్యూటరీ: ఇది ఆక్సిటోసిన్, వాసోప్రెస్సిన్ అనే రెండు హార్మోనులను నిల్వ ఉంచి విడుదల చేస్తుంది.

ఆక్సిటోసిన్: స్త్రీలలో ప్రసవసమయంలో ఇది గర్భాశయపు నునుపు కండరాలలో బలమైన సంకోచాలను కలుగజేసి సుఖ ప్రసవమయ్యేటట్లు చేస్తుంది. ప్రసవం తరువాత తల్లి వక్షోజాల నుంచి క్షీరం చిందించడానికి తోడ్పడుతుంది. వాసోప్రెస్సిన్: మూత్రపిండంపై ప్రభావాన్ని చూపుతుంది. నెఫ్రాన్లోని దూరాగ్ర సంవళిత నాళికను ప్రేరేపించి, దాని ద్వారా నీరు, ఎలక్ట్రోలైట్ల పునఃశోషణను వేగవంతం చేసి నీటి నష్టాన్ని నివారిస్తుంది.

ప్రశ్న 4.
పిట్యూటరీ కుబ్జులు, థైరాయిడ్ మరుగుజ్జులను తులనాత్మకంగా వివరించండి.
జవాబు:
పిట్యూటరీ కుబ్జులు

  1. శిశువులలో పిట్యూటరీ గ్రంథి నుండి పెరుగుదలహార్మోన్ తక్కువగా ఉత్పత్తి అయినప్పుడు పెరుగుదల నిలిచిపోయి పిట్యూటరీ కుబ్జులుకు దారితీస్తుంది.
  2. శిశువులలో పెరుగుదల హార్మోన్ లోపించడం వల్ల పెరుగుదల నిలిచిపోయి, అసాధారణంగా పొట్టిగా ఉంటారు. (మరుగుజ్జుతనం ఏర్పడుతుంది).
  3. పిట్యూటరీ కుబ్జులు లైంగికంగా, మేధోపరంగా సాధారణ మానవులు లాగా ఉంటారు.
  4. సరియైన సమయంలో వీరికి పెరుగుదల హార్మోన్ ఇచ్చినప్పుడు వీరిలో ఎముకల పెరుగుదల కనిపిస్తుంది.

థైరాయిడ్ మరుగుజ్జులు

  1. గర్భం దాల్చిన స్త్రీలలో థైరాయిడ్ హార్మోన్లు ఉత్పత్తి తక్కువగా ఉన్నప్పుడు, గర్భస్థ శిశువులో భౌతికంగా, మానసికంగా అభివృద్ధి లోపించి థైరాయిడ్ మరుగుజ్జుతనంకు దారితీస్తుంది.
  2. పుట్టుకతోనే థైరాయిడ్ హార్మోన్లు లోపించడం వల్ల, పెద్దతల, పొట్టికాళ్ళు, బయటకు పొడుచుకు వచ్చిన నాలుక, శారీరక మందకొండితనం, పొడి చర్మం అల్పబుద్ధి నిష్పత్తి వంటి లక్షణాలు కనిపిస్తాయి.
  3. వీరికి చికిత్స అందించని యెడల పిల్లలు మరుగుజ్జుతనంగా ఉండి, మానసిక మాంద్యం మరియు లైంగికంగా వంధ్యత్వం కలిగి ఉంటారు.
  4. ముందుగా చికిత్స అందించడం వల్ల వీరిలో సాధారణ పెరుగుదల మరియు అభివృద్ధి కనిపించును.

ప్రశ్న 5.
శరీరంలో హైపోథైరాయిడిజమ్, హైపర్ థైరాయిడిజమ్ ఎటువంటి ప్రభావం చూపుతాయో వివరించండి. [A.P. Mar. 17; T.S. & A.P. Mar. 16]
జవాబు:
హైపోథైరాయిడిజమ్: ఆహారంలో అయోడిన్ లోపం వల్ల థైరాయిడ్ గ్రంథి ఉబ్బి థైరాయిడ్ హార్మోన్ల (T3,T) ఉత్పత్తి తగ్గిపోతుంది. ఈ లక్షణాన్ని హైపోథైరాయిడిజమ్ అంటారు. దీనినే సరళగాయిటర్ అనికూడా అంటారు.

గర్భం దాల్చిన స్త్రీలలో ఈ స్థితి ఏర్పడితే గర్భస్థ శిశువులో అభివృద్ధి లోపించి, క్రెటినిజమ్ అనే అపస్థితి ఏర్పడుతుంది. దీనివల్ల పెరుగుదల లోపం, మానసిక మాంద్యం, అల్పబుద్ధి నిష్పత్తి, అసాధారణ చర్మం, చెవిటి – మూగత్వం లాంటి లక్షణాలు కలుగుతాయి.

ప్రౌఢ స్త్రీలలో హైపోథైరాయిడిజమ్ వల్ల రుతుచక్ర క్రమం తప్పుతుంది. ప్రౌఢ మానవులలో మిక్సిడిమా అనే అసాధారణ స్థితి ఏర్పడుతుంది. ఈ స్థితిలో మానసిక, శారీరక మందకొడితనం, ఉబ్బిన ముఖం, పొడిచర్మం మొదలైన లక్షణాలు కలుగుతాయి. హైపర్ థైరాయిడిజమ్: థైరాయిడ్ గ్రంథి అతిక్రియాశీలత వల్లగానీ, క్యాన్సర్ వల్లగానీ, గ్రంథిలో కణుతులు ఏర్పడటం వల్లగానీ, థైరాక్సిన్ హార్మోన్ అధికోత్పత్తి జరుగుతుంది. ఈ లక్షణాన్ని హైపర్ థైరాయిడిజమ్ అంటారు.

ఈ స్థితిలో జీవక్రియారేటు పెరుగుతుంది. కంటి వెనుక కణజాలంలో ద్రవం సంచితం కావడం వల్ల కళ్ళు ఉబ్బి ముందుకు పొడుచుకొని వస్తాయి. ఈ స్థితిని ఎక్సాప్తాల్మిక్ గాయిటర్ అంటారు. హైపర్ థైరాయిడిజమ్ స్థితిలో జీవక్రియారేటు పెరుగుదలతోపాటు, హృదయ స్పందన రేటు పెరగడం, నరాల బలహీనత, అధికంగా చెమటపట్టడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి.

ప్రశ్న 6.
అడిసన్స్ వ్యాధి, కుషింగ్స్ సిండ్రోమ్ల గురించి రాయండి. [T.S. Mar. ’17]
జవాబు:
అడిసన్స్ వ్యాధి: అడ్రినల్ వల్కలం స్రవించే గ్లూకోకార్డికాయిడ్ల అల్పోత్పత్తి వల్ల అడిసన్స్ వ్యాధి కలుగుతుంది. ఈ వ్యాధిగ్రస్తులలో చర్మంపై కంచువర్ణ మచ్చలు ఏర్పడతాయి. అంతేకాకుండా బరువు కోల్పోవడం, కండర బలహీనత, కండర అలసట, రక్తపీడనం తగ్గిపోవడం మొదలైన లక్షణాలు కూడా కనిపిస్తాయి. వ్యాధిగ్రస్తుడు ఒత్తిడికి ప్రతిస్పందించలేడు.

కుషింగ్స్ సిండ్రోమ్: అడ్రినల్ వల్కలం స్రవించే కార్టిసాల్ లేదా ఇతర గ్లూకోకార్డికాయిడ్ల అధికోత్పత్తి వల్ల కుషింగ్స్ సిండ్రోమ్ అనే అపస్థితి కలుగుతుంది. దీనిలో కండర ప్రోటీన్ల విచ్ఛిత్తి జరిగి కండరాలు బలహీనపడతాయి. ముఖం, అంగాలు, వీపు ప్రాంతాలలో కొవ్వు నిక్షేపం జరుగుతుంది. అందువల్ల ముఖం గుండ్రంగా చంద్రబింబాకారంగానూ, అంగాలు కదురాకృతిగానూ మారతాయి. వీపుపై మూపురం, డోలన ఉదరం మొదలైన లక్షణాలు కూడా ఈ వ్యాధిగ్రస్తులలో ఏర్పడతాయి. రక్తంలో కార్టిసాల్స్ స్థాయి పెరగడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయి పెరిగి కాలేయంలో అధిక గ్లైకోజెన్ నిక్షేపణలు ఏర్పడతాయి. దీని ఫలితంగా అధిక శరీరబరువు పొందుతారు.

ప్రశ్న 7.
డయాబెటిక్ రోగి మూత్రంలో చక్కెర ఎందుకు విసర్జితమవుతుంది ?
జవాబు:
క్లోమగ్రంథి స్రవించే ఇన్సులిన్ అల్పోత్పత్తి వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయి పెరుగుతుంది. దీన్ని హైపర్ గ్లైసీమియా అంటారు. ఈ స్థితి చాలా కాలం కొనసాగితే డయాబెటిస్ మెల్లిటస్ అనే వ్యాధికి దారితీస్తుంది.

డయాబెటిక్ రోగి మూత్రం ద్వారా గ్లూకోజ్ విసర్జనం జరుగుతుంది. దీనిని గ్లైకోసూరియా అంటారు. దీనికి కారణం మూత్రపిండాలు రక్తంలో గల గ్లూకోజ్ ద్రవలవణ సమతాస్థితి కాపాడుటలో ముఖ్యపాత్ర వహిస్తాయి. మూత్రపిండాలలోని గ్లామరులస్ ద్వారా రక్తము గాలనం చేసినపుడు ప్రాథమిక మూత్రం ఏర్పడుతుంది. ఇందులో గల లవణాలు, గ్లూకోజ్ పునః శోషణ చేయబడి రక్తంలో కలుస్తాయి. అయితే రక్తంలో గల గ్లూకోజ్ విలువలు 160-180 mg/dl ల కంటే అధికంగా ఉన్నప్పుడు (హైపర్ గ్లైసీమియా), ప్రాథమిక మూత్రంలో గల గ్లూకోజ్ అంతా పునఃశోషణ చేయబడదు. అందువల్ల మూత్రంలో గ్లూకోజ్ ఉండి బయటకు విసర్జింపబడుతుంది.

ప్రశ్న 8.
పురుష, స్త్రీ లైంగిక హార్మోన్లను వాటి చర్యలను వివరించండి.
జవాబు:
మానవుని వివిధ దశలలో ద్వితీయ లైంగిక లక్షణాల అభివృద్ధి, మార్పులకు అవసరమయ్యే హార్మోన్లను లైంగిక హార్మోన్లు అంటారు.

పురుష లైంగిక హార్మోన్లు:
ఆండ్రోజెన్లు: ఆండ్రోజెన్లు, ముష్కాలలో గల లీడిగ్ కణాల నుండి ఉత్పత్తి అవుతాయి. అతి స్వల్పం మొత్తంలో పురుషులు ఇరువురిలో అధివృక్క గ్రంథుల నుండి కూడా స్రవించబడుతుంది.

విధులు:

  1. పురుష ప్రత్యుత్పుత్తి అవయవాల పెరుగుదలకు, అభివృద్ధి, పరిణితి, విధి నిర్వహణకు అవసరం.
  2. పురుష లైంగిక ప్రవర్తనకు, శుక్రజననాన్ని ప్రేరేపించుటలో ఈ హార్మోన్లు ముఖ్య పాత్ర వహిస్తాయి.
  3. ఈ హార్మోన్లు కండర అభివృద్ధికి, ముఖం, బాహు మూలాలలో రోమాలేర్పడటం, ఉగ్రప్రవర్తన, పురుష కంఠధ్వని మొదలైన ద్వితీయ లైంగిక లక్షణాలను కలిగిస్తాయి.
  4. ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్ల జీవన చర్యలలో పాల్గొని, సంశ్లేషణ లేదా నిర్మాణాత్మాక ప్రభావాలను కలిగిస్తాయి.

స్త్రీ లైంగిక హార్మోన్ల లు:

  1. ఈస్ట్రోజెన్లు: అభివృద్ధి చెందే స్త్రీ బీజకోశపుటికలు, ఈస్ట్రోజెన్ హార్మోన్లను సంశ్లేషణ చేసి స్రవిస్తాయి.

విధులు:

  1. స్త్రీలలో ద్వితీయ లైంగిక అవయవాల అభివృద్ధి, క్రియలను, స్త్రీ బీజకోశ పుటికల అభివృద్ధిని క్షీరగ్రంథుల అభివృద్ధిని ద్వితీయలైంగిక లక్షణాలను ప్రేరేపిస్తుంది.
  2. రుతుచక్రం నిర్వహణలోనూ ముఖ్యపాత్ర వహిస్తుంది.
  3. ఈస్ట్రోజెన్ స్త్రీ లైంగిక ప్రవర్తనను కూడా నియంత్రిస్తుంది.
  4. ఈస్ట్రోజెన్ ప్రోటీన్ల సంశ్లేషణను, కాల్షిఫికేషన్ మరియు ఎముకల పెరుగుదలను కూడా ప్రేరేపిస్తుంది.

2) ప్రొజెస్టిరాన్: ఇది కార్పస్ల్యూటియమ్, జరాయువులలో సంశ్లేషణం చెంది స్రవించబడుతుంది.
విధులు: గర్భాశయ గోడలో బ్లాస్టోసిస్ట్ ప్రతిస్థాపన కోసం గర్భాశయాన్ని సిద్ధం చేస్తుంది.

  1. గర్భాశయ కండరాల సంకోచాన్ని నిరోధిస్తుంది. మరియు శిశువు జన్మించే వరకు గర్భధారణను కొనసాగిస్తుంది.
  2. ఇది క్షీర గ్రంథులలో ఆల్వియోలై ఏర్పాటును ప్రేరేపించి క్షీరోత్పత్తికి కూడా తోడ్పడుతుంది.

3) ఫాలిక్యులార్ స్టిములేటింగ్ మరియు ల్యూటినైజింగ్ హార్మోన్లు: స్త్రీ, పురుషులు ఇరువురిలో పూర్వపిట్యూటరీ నుండి ఉత్పత్తి అవుతాయి.
విధులు: ఇవి ముఖ్యంగా ద్వితీయ లైంగిక లక్షణాలు అభివృద్ధికి ముఖ్య పాత్రవహిస్తాయి.

ప్రశ్న 9.
హార్మోన్ చర్యా విధానం గురించి రాయండి.
జవాబు:
హార్మోనులు ప్రాథమిక వార్తావాహకాలు. ఇవి హార్మోన్ గ్రాహకాలతో పరస్పర చర్య జరిపి ద్వితీయ వార్తావాహకాలను ఏర్పరిచి వాటి ద్వారా కణములో జీవక్రియలను నియంత్రిస్తుంది.
కొవ్వులలో కరగని హైడ్రోఫిల్లిక్ హార్మోన్ల చర్యావిధానం:

  1. ఈ హార్మోన్ కణత్వచం ద్వారా కణంలోకి ప్రవేశించలేదు. కాబట్టి అది కణ ఉపరితలంపై ఉండే త్వచ గ్రాహకాలకు బంధించబడి G – ప్రోటీన్ ను ప్రేరేపిస్తుంది.
  2. ఈ బంధన చర్య ఫలితంగా G ప్రోటీన్ GTP తో బంధించబడి అడినైల్ సైక్లేస్ అనే త్వచ ఎంజైమును ఉత్తేజపరుస్తుంది.
  3. ఉత్తేజపరచబడిన అడినైల్ సైక్లేస్ ATP నుంచి చక్రీయ అడినోసిన్ మోనోఫ్రాస్ఫేట్ను ఏర్పరుస్తుంది.
  4. ఇది ద్వితీయ వార్తాహరిగా పనిచేసి ప్రోటీన్ కైనేస్ – A అనే ఎన్జైమ్ ను క్రియాశీలంగా మారుస్తుంది.
  5. క్రియాశీలమైన ప్రోటీన్ కైనేస్ – A, క్రియాశీల రహితంగా ఉన్న ఎంజైమ్ను క్రియాశీలంగా మారుస్తుంది. ఈ ఎంజైమ్ జీవక్రియలలో ముఖ్య పాత్ర వహిస్తుంది. ఉదా: ఎపినెఫ్రిన్

కొవ్వులలో కరిగే హార్మోన్ల చర్యా విధానం: కొవ్వులలో కరిగే హార్మోన్లు సులువుగా కణ త్వచం ద్వారా వ్యాపనం చెందగలవు.
AP Inter 2nd Year Zoology Study Material Chapter 4(a) అంతస్రావక వ్యవస్థ, రసాయన సమన్వయం 1

  1. కొవ్వులో కరిగే హార్మోన్ కణంలోకి ప్రవేశించిన తరువాత, కణాంతస్థ గ్రాహకాలతో బంధించబడుతుంది. దీని ఫలితంగా హార్మోన్ – గ్రాహక సంక్లిష్టం ఏర్పడుతుంది.
  2. ఈ సంక్లిష్టం కేంద్రకాన్ని చేరి అక్కడ DNA ను బంధింపబడి mRNA ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది.
  3. ఈ m-RNA కణద్రవ్యంలోకి వచ్చి ప్రోటీన్ సంశ్లేషణకు తోడ్పడుతుంది.
  4. ఈ విధంగా ఉత్పత్తి అయిన ప్రోటీన్లు వివిధ జీవక్రియలో పాల్గొంటాయి. ఉదా: ఆల్డోస్టిరాన్.

AP Inter 2nd Year Zoology Study Material Chapter 3(b) నాడీ నియంత్రణ, సమన్వయం

Andhra Pradesh BIEAP AP Inter 2nd Year Zoology Study Material  Lesson 3(b) నాడీ నియంత్రణ, సమన్వయం Textbook Questions and Answers.

AP Inter 2nd Year Zoology Study Material Lesson 3(b) నాడీ నియంత్రణ, సమన్వయం

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
మానవ మెదడును కప్పి ఉంచే రక్షణ పొరల పేర్లు తెలపండి.
జవాబు:
మానవ మెదడు మూడు సంయోజక కణజాలపు పొరలచే కప్పబడి ఉంటుంది. ఈ రక్షణ పొరలన్నింటిని కలిపి మెనింజెస్ అంటారు.

  1. వరాశిక
  2. లౌతికళ
  3. మృద్వి

ప్రశ్న 2.
కార్పస్కెల్లోసమ్ అంటే ఏమిటి ? [A.P. Mar. ‘ 17; T.S. Mar. ’15]
జవాబు:
కుడి, ఎడమ మస్తిష్కార్థ గోళాలు రెంటినీ కలుపుతూ లోపలివైపున వల్కలం కిందగా బల్లపరుపు మయలిన్ సహిత నాడీ పట్టీ ఉంటుంది. దీన్ని కార్పస్కెల్లోసమ్ అంటారు.

AP Inter 2nd Year Zoology Study Material Chapter 3(b) నాడీ నియంత్రణ, సమన్వయం

ప్రశ్న 3.
ఆర్బోరి ్వటే గురించి మీరు తెలుసుకున్నదేమిటి ?
జవాబు:
అనుమస్తిష్కంలో ఉండే తెలుపు వర్ణ పదార్థం అనేక శాఖలు కలిగి చెట్టులాగా ఉంటుంది. అందువల్ల అనుమస్తిష్కపు తెలుపు పదార్థాన్ని ఆర్బోరిటే (జీవవృక్షం) అని అంటారు.

ప్రశ్న 4.
సహానుభూత వ్యవస్థను ఉరఃకటి విభాగం అంటారు. ఎందువల్ల ? [T.S. Mar. ’17; A.P. Mar. ’16]
జవాబు:
పూర్వ నాడీసంధి నాడీకణాలు వెన్నుపాములోని ఉరః కటి ప్రాంతంలోని బూడిద వర్ణ పదార్థంలో ఉంటాయి. అందువల్ల సహానుభూత విభాగాన్ని ఉరః కటి విభాగం అంటారు.

ప్రశ్న 5.
సహసహానుభూత వ్యవస్థను కపాల త్రిక విభాగం అంటారు. ఎందువల్ల ?
జవాబు:
సహ సహానుభూత నాడీ విభాగానికి ఒక నిర్దిష్ట నిర్మాణం ఉండదు. అయితే దీనికి చెందిన నాడీ సంధి పూర్వ నాడీకణాల కణదేహాలు మెదడులోనూ, వెన్నుపాము త్రికనాడీ ప్రాంతంలోనూ ఉంటాయి. అందువల్లనే సహసహానుభూత విభాగాన్ని కపాల త్రిక విభాగం అంటారు.

ప్రశ్న 6.
పరమ అనుద్రిక్తతా వ్యవధి, సాపేక్ష అనుద్రిక్తతా వ్యవధి మధ్య ఉండే భేదాలు రాయండి.
జవాబు:

  • పరమ అనుద్రిక్తతా వ్యవధిలో ప్రేరణ బలం ఎంత అధికంగా ప్రయోగించినా క్రియాశక్మం ఏర్పడదు.
  • సాపేక్ష అనుద్రిక్తతా వ్యవధిలో ప్రేరణ బలం త్రెషోల్డ్ కన్నా ఎక్కువగా ఉంటే క్రియాశక్మం ఏర్పడుతుంది.

ప్రశ్న 7.
పూర్ణ లేదా శూన్య అనుక్రియ అంటే ఏమిటి ?
జవాబు:
ప్రేరణ బలం త్రెషోల్డ్ కంటే తక్కువగా ఉన్నప్పుడు, నాడీ కణంలో క్రియాశక్మం ఏర్పడదు. కానీ త్రెషోల్డ్ తగినంతగా ఉన్నప్పుడు లేదా ఎక్కువగా ఉన్నప్పుడు కూడా క్రియాశక్మం ఏర్పడుతుంది. ఈ లక్షణాన్నే పూర్ణ లేదా శూన్య అనుక్రియ అంటారు.

ప్రశ్న 8.
రసాయనికంగా, క్రియాత్మకంగా కంటిలోని దండకణాలు, శంఖుకణాలు మధ్య భేదం ఏమిటి ?
జవాబు:
దండకణాల్లో విటమిన్ – ఎ ఉత్పన్నం అయిన ఎర్రని రోడాప్సిన్ ప్రోటీన్ ఉంటుంది. ఇది మసక చీకటిలో దృష్టికి ఉపయోగపడుతుంది. శంఖు కణాల్లో అయోడాప్సిన్ అనే దృశ్య వర్ణ ద్రవ్యం ఉంటుంది. ఇది ఫోటాప్సిన్ అనే ప్రోటీన్ నిర్మితం. శంఖు కణాలు పగటి పూట దృష్టికి, రంగులు గుర్తించడానికి ఉపయోగపడతాయి.

ప్రశ్న 9.
అంధచుక్క, పసుపుచుక్క మధ్య భేదం ఏమిటి ?
జవాబు:
నేత్రపటలం పరాంత మధ్య భాగాన్ని పసుపుచుక్క అంటారు. పసుపుచుక్క మధ్య భాగంలో ఉండే చిన్న లోతైన ప్రదేశాన్ని ఫోవియా సెంట్రాలిస్ అంటారు. దీనిలో శంఖు కణాలు మాత్రమే ఉంటాయి. నడిచేటప్పుడు, చదివేటప్పుడు, వాహనాన్ని నడిపేటప్పుడు ఫోవియా తీక్షణ దృష్టికి తోడ్పడుతుంది.

నేత్రపటలం, నేత్రనాడి కలిసే ప్రాంతాన్ని అంధచుక్క అంటారు. ఈ ప్రాంతంలో ఏ విధమైన కాంతి గ్రాహకాలు ఉండవు. అందువల్ల ఈ ప్రదేశంలో ప్రతిబింబాలు ఏర్పడవు.

AP Inter 2nd Year Zoology Study Material Chapter 3(b) నాడీ నియంత్రణ, సమన్వయం

ప్రశ్న 10.
కోర్టి అంగం అంటే ఏమిటి ? [A.P. Mar. ’17, ’15]
జవాబు:
కర్ణావర్తనం ఉపకళ బేసిల్లార్ త్వచం పై ఒక జ్ఞానగట్టును ఏర్పరుస్తుంది. దీనినే కోర్టి అంగం అంటారు. దీనిలో శ్రవణ గ్రాహకాలుగా పనిచేసే రోమ కణాలు ఉంటాయి.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
మానవ వెన్నుపాము అడ్డుకోత చక్కని పటం గీచి, భాగాలు గుర్తించండి. [T.S. Mar. 16; A.P. & T.S. Mar. ’15]
జవాబు:
AP Inter 2nd Year Zoology Study Material Chapter 3(b) నాడీ నియంత్రణ, సమన్వయం 1

ప్రశ్న 2.
దైహిక నాడీవ్యవస్థ, స్వయంచోదిత నాడీవ్యవస్థల మధ్య తేడాలు రాయండి.
జవాబు:
దైహిక నాడీవ్యవస్థ

  1. దైహిక నాడీ వ్యవస్థ బాహ్య పరిసరాల ఉద్దీపనలకు అనుగుణంగా అస్థికండరాల చర్యలను నియంత్రిస్తుంది.
  2. దీనిలో జ్ఞాన, చాలక నాడీకణాలు రెండూ ఉంటాయి.
  3. దైహిక నాడీవ్యవస్థ చర్యలన్నీ ఇచ్ఛాపూర్వకంగా, నియంత్రితంగా జరుగుతాయి.
  4. ఈ వ్యవస్థలో జ్ఞాన కణాలు, వివిధ బాహ్యగ్రాహకాల నుంచి జ్ఞాన ప్రచోదనాలను సేకరించి కేంద్ర నాడీ వ్యవస్థకు చేరవేస్తాయి. కేంద్ర నాడీవ్యవస్థ తన ప్రతిస్పందనలను చాలక నాడీకణాల ద్వారా అస్థి కండరాలకు పంపిస్తుంది. తద్వారా సంకోచించి తగిన చర్యలు తీసుకొంటుంది.
  5. అసిటైల్ కొలైన్ నాడీ అభివాహకాలుగా పనిచేస్తాయి.

స్వయంచోదిత నాడీవ్యవస్థ

  1. స్వయంచోదిత నాడీవ్యవస్థ దేహంలోని అంతర్గత పరిసరాలకు అనుగుణంగా నునుపు, హృదయ కండరాలను క్రమబద్దీకరిస్తుంది.
  2. చాలావరకు దీనిలో చాలక నాడీకణాలు ఉంటాయి.
  3. వీటి చర్యలన్నీ అనియంత్రితమైనప్పటికినీ మెదడు ల ని మజ్జాముఖం, అధోపర్యంకం వీటిని పర్య వేక్షిస్తూ ఉంటాయి.
  4. ఈ వ్యవస్థ ఒక చాలక వ్యవస్థగా పనిచేస్తుంది. అంత రంగ అవయవాలైన జీర్ణ, హృదయ, ప్రసరణ, విసర్జన, అంతస్రావక, ప్రత్యుత్పత్తి వ్యవస్థల చర్యలన్నీ స్వయంచోదిత నాడీవ్యవస్థ ఆధీనంలోనే ఉంటాయి.
  5. అసిటైల్ కొలైన్ లేదా నార్ఎపినెఫ్రిన్లు నాడీ అభివాహకాలుగా పనిచేస్తాయి

ప్రశ్న 3.
మానవుడి కంటిలోని నేత్రపటలం (రెటీనా) గురించి రాయండి.
జవాబు:
నేత్రపటలం, నేత్రగోళంలోని లోపలి పొర. దీనిలో వర్ణయుత ఉపకళ, నాడీప్రాంతం అనే రెండు భాగాలు ఉంటాయి. వర్ణయుత ఉపకళ ఒక మెలనిన్ ఆచ్ఛాదం. నాడీ ప్రాంతంలో మూడు పొరలుంటాయి. అవి కాంతి గ్రాహకస్తరం, ద్విధ్రువ కణ స్తరం, నాడీసంధి కణస్తరం.

కాంతిగ్రాహకస్తరంలో దండకణాలు, శంఖుకణాలు అనే రెండు రకాల కాంతి గ్రాహకాలుంటాయి. దండకణాల్లో విటమిన్ – ఎ ఉత్పన్నాలు అయిన రోడాప్సిన్ ఉంటుంది. ఇది మసక చీకటిలో దృష్టికి ఉపయోగపడుతుంది. శంఖు కణాల్లో అయోడాప్సిస్ అనే దృశ్యవర్ణద్రవ్యం ఉంటుంది. ఇది ఫోటాప్సిన్ అనే ప్రోటీన్ నిర్మితం. శంఖు కణాలు పగటి పూట దృష్టికి రంగులు గుర్తించడానికి ఉపయోగపడతాయి. ఇవి ఎరుపు, నీలం, ఆకుపచ్చ వర్ణాలను గుర్తిస్తాయి.

నేత్రపటలం పరాంత మధ్య భాగాన్ని పసుపుచుక్క అంటారు. పసుపు చుక్క మధ్యభాగంలో ఉండే చిన్న లోతైన ప్రదేశాన్ని ‘ఫోనియా సెంట్రాలిస్’ అంటారు. దీనిలో శంఖుకణాలు మాత్రమే ఉంటాయి. ఇవి నడిచేటప్పుడు, చదివేటప్పుడు, వాహనాన్ని నడిపేటప్పుడు, ఫోవియా తీక్షణ దృష్టికి తోడ్పడుతుంది. నేత్రపటలం, నేత్రనాడి కలిసే ప్రాంతాన్ని అంధచుక్క అంటారు. ఈ ప్రాంతంలో ఏ విధమైన కాంతి గ్రాహకాలుండవు. అందువల్ల ఈ ప్రదేశంలో ప్రతిబింబాలు ఏర్పడవు.

ప్రశ్న 4.
నాడీకణ సంధి అభివహనాన్ని విశదీకరించండి.[T.S. Mar.’17; A.P. Mar. ’16]
జవాబు:
ఒక కణం నుంచి మరో నాడీ కణానికి ప్రచోదనలు ప్రత్యేకమైన సంధుల ద్వారా అభివహనం చెందుతాయి. వీటినే నాడీ కణ సంధులు అంటారు. నాడీకణ సంధులు రెండు రకాలు. అవి : విద్యుత్ నాడీకణ సంధులు, రసాయన నాడీకణ సంధులు. విద్యుత్ నాడీకణ సంధులు : విద్యుత్ నాడీకణ సంధిలో నాడీకణ సంధి పూర్వ, పర త్వచాలు, రసాయన నాడీకణ సంధి కన్నా సన్నిహితంగా దగ్గరగా ఉంటాయి. ఈ విద్యుత్ నాడీకణ సంధిలో పాల్గొనే రెండు నాడీకణాల మధ్య నాడీ ప్రచోదనాలు విద్యుత్ తరంగాల రూపంలో అంతర సంధులు అనే ప్రత్యేక నిర్మాణాల ద్వారా ప్రసరిస్తాయి. విద్యుత్ నాడీ కణ సంధి ద్వారా నాడీ ప్రచోదన, రసాయన నాడీకణ సంధి కంటే ఎక్కువ వేగంగా జరుగుతుంది.

AP Inter 2nd Year Zoology Study Material Chapter 3(b) నాడీ నియంత్రణ, సమన్వయం

రసాయన నాడీ కణ సంధులు: రసాయన నాడీకణ సంధి ద్వారా ప్రచోదనాల ప్రసారానికి నాడీ అభివాహకాలు అనే రసాయనాలు ఉపయోగపడతాయి. తంత్రికాక్షపు అంత్యాలు ఈ నాడీ అభివాహకాలతో నిండిన ఆశయాలను కలిగి ఉంటాయి. నాడీ ప్రచోదనం తంత్రికాక్షపు అంత్యాన్ని చేరిన వెంటనే, నాడీసంధి పూర్వ కణత్వచం విధ్రువణం చెందుతుంది. ఫలితంగా కాల్షియం వోల్టేజ్ గేటెడ్ ఛానళ్ళు తెరుచుకుంటాయి. ఈ ఛానళ్ళ ద్వారా కాల్షియం అయాన్లు లోనికి ప్రవేశించి నాడీకణ సంధి ఆశయాలలో రంధ్రాలు కలుగచేస్తాయి. అవి నాడీకణ త్వచం వద్దకు చేరి దానితో కలిసిపోయి నాడీ అభివాహకాన్ని కణ బహిష్కరణ అనే చర్య ద్వారా నాడీకణ సంధి చీలికలోనికి విడుదల చేస్తాయి.

అభివాహకం పర నాడీకణ సంధి త్వచంలో ఉండే నిర్దిష్ట గ్రాహకాలతో బంధితమవుతుంది. ఫలితంగా అది విధ్రువణం చెంది క్రియాశక్మం ఏర్పడి ఆ కణం వెంబడి వహనం చెందుతుంది. ఎసిటైల్ కోలిన్ ప్రధాన నాడీ అభివహనంగా పనిచేస్తుంది. ఎపినెఫ్రిన్, డోపమైన్, సెరటోనిన్ వంటి రసాయనాలు నిరోధక లేదా ఉత్తేజక నాడీ అభివాహకంగా పనిచేస్తాయి. గ్లైసీన్, GABAలు నిరోధక నాడీ అభివాహకాలుగా పనిచేస్తాయి.

నాడీకణ సంధి పరత్వచంలో లైగాండ్ గేటెడ్ ఛానళ్ళు ఉంటాయి. వీటికి రసాయన అభివాహకాలు బంధించబడినప్పుడు అయాన్ ఛానళ్ళు తెరచుకొని వాటి ద్వారా Na+ మొదలైన అయాన్లు నాడీకణసంధి పరనాడీకణం లోనికి ప్రవేశించి కొత్త నాడీ ప్రచోదనాన్ని కలిగిస్తాయి.
AP Inter 2nd Year Zoology Study Material Chapter 3(b) నాడీ నియంత్రణ, సమన్వయం 2

ప్రశ్న 5.
అంతరంగాలపై సహానుభూత నాడీవ్యవస్థ, సహసహానుభూత నాడీవ్యవస్థల ప్రభావంలో గల భేదాలు పేర్కొనండి.
జవాబు:
సహానుభూత నాడీవ్యవస్థ

  1. వెన్నుపాము ఉరః, కటి ప్రాంతాల నుంచి ఏర్పడుతుంది.
  2. నాడీ సంధులన్నీ కలసి రెండు గొలుసుల లాగా ఏర్పడతాయి.
  3. నాడీసంధి పూర్వ తంత్రికాక్షాలు పొట్టివిగానూ, నాడీసంధి పరతంత్రికాక్షాలు పొడవుగానూ ఉంటాయి.
  4. నాడీసంధి పర తంత్రికాక్షాల అంత్యాల నుంచి నార్ఎపినెఫ్రిన్ (norepinephrine) లేదా నార్ అడ్రినాలిన్(noradrenalin) అనే నాడీ అభివాహకం (neurotransmitter) విడుదల అవుతుంది. అందువల్ల వీటిని అడ్రినర్జిక్ నాడులు (adrenergic nerves) అంటారు.
  5. ఒత్తిడి సమయంలో చైతన్యవంతమై దేహాన్ని ఒత్తిడిని ఎదుర్కోవడానికి సిద్ధం చేస్తుంది.
  6. సాధారణంగా ఈ వ్యవస్థ ప్రభావం ఉత్తేజపరచడం.

సహసహానుభూత నాడీవ్యవస్థ

  1. మెదడు కపాల ప్రాంతం, వెన్నుపాము త్రిక ప్రాంతాల నుంచి ఏర్పడుతుంది.
  2. నాడీ సంధులు విడివిడిగానే ఉంటాయి.
  3. నాడీ సంధి పూర్వ తంత్రికాక్షాలు పొడవుగానూ, నాడీ సంధి పరతంత్రికాక్షాలు పొట్టివిగానూ ఉంటాయి.
  4. నాడీసంధి పర తంత్రికాక్షాల అంత్యాల నుంచి ఎసిటైల్ కోలిన్ అనే నాడీ అభివాహకం విడుదల అవుతుంది. అందువల్ల వీటిని కొలెనర్జిక్ నాడులు (cholinergic nerves) అంటారు.
  5. విరామ సమయంలో చైతన్యంగా ఉంటుంది. ఒత్తిడి తరువాత సాధారణ స్థితికి తీసుకువస్తుంది.
  6. సాధారణంగా ఈ వ్యవస్థ ప్రభావం నిరోధించడం.

దీర్ఘ సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
మానవుడి మెదడు నిర్మాణం, విధులను గురించి సంక్షిప్త వివరణ రాయండి.
జవాబు:
మెదడు సమాచార విశ్లేషణ, నియంత్రణ కేంద్రం. ఇది కపాల కుహరంలో భద్రపరచబడి, మూడు సంయోజక కణజాలపు పొరలు లేదా కపాల పొరలచే కప్పబడి ఉంటుంది. అవి : వరాశిక, లౌతికళ, మృద్వి, మెదడు రక్షణ పొరలన్నింటిని కలిపి ‘మెనింజెస్’ అంటారు.
“మెదడును మూడు ప్రధాన భాగాలుగా విభజించవచ్చు. అవి :

  1. పూర్వ మెదడు
  2. మధ్య మెదడు
  3. అంత్య మెదడు

AP Inter 2nd Year Zoology Study Material Chapter 3(b) నాడీ నియంత్రణ, సమన్వయం

1) పూర్వ మెదడు : పూర్వ మెదడులో ఘ్రాణ లశునం, మస్తిష్కం, ద్వారగోర్థం అనే మూడు భాగాలుంటాయి.
i) ఘ్రాణ లశునం : ఘ్రాణ ఉపకళ నుంచి వాసనకు సంబంధించిన ప్రచోదనాలను ఘ్రాణ లశునాలు గ్రహిస్తాయి.
ii) మస్తిష్కం : మెదడులో ఎక్కువ భాగం మస్తిష్కం ఆక్రమిస్తుంది. ఇది నిలువుగా ‘ఆయత విదరం’ చే కుడి, ఎడమ మస్తిష్కార్థ గోళాలుగా విభజింపబడుతుంది. మస్తిష్కార్ధ గోళాలు రెండింటినీ కలుపుతూ లోపలివైపున వల్కలం కిందగా బల్లపరపు మయలిన్ సహిత నాడీ పట్టీ ఉంటుంది. దీన్ని ‘కార్పస్ కెల్లోసమ్’ అంటారు. కార్పస్ కెల్లోసమ్ కుడి, ఎడమ మస్తిష్కార్ధ గోళాల మధ్య సమన్వయాన్ని చేకూరుస్తుంది. మస్తిష్కం ఉపరితలం బూడిద వర్ణ పదార్థాన్ని కలిగి ఉంటుంది. దీన్ని మస్తిష్క వల్కలం అంటారు. మస్తిష్క వల్కలంలో నాడీకణ దేహాలు సాంద్రీకరించబడి ఉంటాయి.
AP Inter 2nd Year Zoology Study Material Chapter 3(b) నాడీ నియంత్రణ, సమన్వయం 3

మస్తిష్క వల్కలం ఉపరితలంలో అనేక మడతలు గాడులను కలిగి ఉంటుంది. ఈ మడతలను ‘గైరి’ అని, మడతల మధ్యగల లోతైన గాడులను ‘సల్పి’ అని అంటారు. గైరి, సల్పీలు మస్తిష్క వల్కలం ఉపరితల వైశాల్యాన్ని అధికం చేస్తాయి. మస్తిష్క వల్కలంలో జ్ఞాన, చాలక, అనుబంధ ప్రదేశాలు అనే మూడు క్రియాత్మక ప్రదేశాలు ఉంటాయి.

  • జ్ఞానప్రదేశాలు : జ్ఞాన ప్రచోదనలను స్వీకరించి విశ్లేషణ చేస్తాయి.
  • చాలక ప్రదేశాలు : అనియంత్రిత కండరాల కదలికలను నియంత్రిస్తాయి.”
  • అనుబంధ ప్రదేశాలు : ఇవి అత్యంత సంక్లిష్టమైన జ్ఞాపకశక్తి, సమాచార కేంద్రంగా పనిచేస్తుంది.

మస్తిష్క దవ్వలో మయలిన్ సహిత తంత్రికాక్షాలు ఉంటాయి. అందువల్ల అది తెల్లగా ఉంటుంది. ప్రతి మస్తిష్కార్ధ గోళం 4 లంబికలుగా విభజింపబడి ఉంటుంది. అవి పూర్వ లంబిక, పార్శ్వ లంబిక, శంఖు లంబిక, అనుకపాల లంబిక.

iii) ద్వార గోర్థం : పూర్వ మెదడులో పరభాగమే ద్వారగోర్థం. దీనిలో ఊర్థ్వ పర్యంకం, పర్యంకం, అధో పర్యంకం అనే మూడు ప్రధాన భాగాలు ఉంటాయి.

ఎ) ఊర్థ్వ పర్యంకం : ద్వార గోర్ధం పై కప్పును ఊర్ధ్వ పర్యంకం అంటారు. దీనిలో నాడీరహిత భాగం వరాశికతో కలిసి పూర్వ రక్త ప్లక్షంను ఏర్పరుస్తుంది. పూర్వరక్త ప్లక్షం వెనుకభాగంలో ఊర్థ్వ పర్యంకంపై “పీనియల్ వృంతం”, దాని చివర గుండ్రని పీనియల్ గ్రంథి ఉంటాయి.

బి) పర్యంకం : మధ్య మెదడుకు పై స్థానంలో పర్యంకం ఉంటుంది. ఇది జ్ఞాన, చాలక ప్రచోదనాల సమన్వయ కేంద్రంగా పనిచేస్తుంది.

సి) అధోపర్యంకం : పర్యంకం ఉదర ఆధార కుడ్యాన్ని అధోపర్యంకం అంటారు. అధోపర్యంకం కింది వైపు ఒక గరాటు వంటి కాలాంచిక ఉంటుంది. దీని చివరిలో పీయూష గ్రంథి ఉంటుంది. అధోపర్యంకంలో అనేక నాడీ స్రావక కణాలుంటాయి. వీటి నుంచి అధోపర్యంక హార్మోన్లు స్రవించబడతాయి. అధోపర్యంకం స్వయంచోదిత నాడీవ్యవస్థ నియంత్రణ, సమన్వయ కేంద్రంగా పనిచేస్తూ ద్రవాభిసరణ, ఉష్ణ నియంత్రణ, దప్పిక, ఆకలి, తృప్తి వంటి చర్యలను సమన్వయం చేస్తుంది.

2) మధ్యమెదడు : మధ్యమెదడు అధోపర్యంకం, పాన్స్వరోలి మధ్యగా ఉంటుంది. మధ్య మెదడు ఉదరతలంలో ఒక జత ఆయత నాడీ తంతువుల పట్టీలుంటాయి. వీటిని సెరిబ్రల్ పెడన క్కుల్స్ అంటారు. ఇవి మస్తిష్కార్ధ గోళాలను పాన్స్ వరోలితో కలుపుతాయి. మధ్య మెదడు పృష్ఠభాగంలో నాలుగు లంబికలుండే కార్పోరా క్వాడ్రిజమైనా అనే నిర్మాణం ఉంటుంది. దీని పూర్వాంతంలో పెద్దవిగా ఉండే రెండు లంబికలను సుపీరియల్ కాలిక్యులి అని, పరాంతంలోని చిన్నవిగా ఉండే రెండు లంబికలను ఇన్ఫీరియర్ కాలిక్యులి అనీ అంటారు. ఇవి దృష్టి, శ్రవణ విధులను నియంత్రిస్తాయి.

3) అంత్య మెదడు : అంత్య మెదడులో అనుమస్తిష్కం, పాన్స్వరోలి, మజ్జాముఖం అను భాగాలుంటాయి.
అనుమస్తిష్కం : ఇది మెదడులో రెండవ అతిపెద్ద భాగం. దీనిలో రెండు అనుమస్తిష్కార్ధ గోళాలు, మధ్య భాగంలో వర్మిస్ ఉంటాయి.

ఎ) అనుమస్తిష్కం : ప్రతి అనుమస్తిష్కార్ధ గోళంలో మూడు లంబికలుంటాయి. అవి : పూర్వాంత లంబిక, పరాంత లంబిక, ఫ్లాక్యులార్ లంబిక అనుమస్తిష్కంలో ఉండే తెలుపు వర్ణ పదార్థం అనేక శాఖలు కలిగి చెట్టులాగా ఉంటుంది. అందువల్ల అనుమస్తిష్కపు తెలుపు పదార్థాన్ని ఆర్బోర్ విటే అంటారు. దీని చుట్టూ బూడిద వర్ణ పదార్థం ఒక పొరలాగా అమరి ఉంటుంది.

బి) పాన్వరోలి : ఇది అనుమస్తిష్కానికి ముందుగా, మజ్జా ముఖానికి వెనుకగా మధ్య మెదడు కింద ఉంటుంది. దీనిలోని నాడీ తంతువులు ఇరువైపులా అనుమస్తిష్కార్ధ గోళాల మధ్య ఒక వంతెన లాగా ఏర్పడి ఉంటాయి. ఇది అనుమస్తిష్కానికీ, వెన్నుపాముకు మిగతా మెదడు అన్నింటికీ మధ్య ఒక పునః ప్రసార కేంద్రంగా పనిచేస్తుంది. పాన్స్వరోలి న్యూమోటాక్సిక్ కేంద్రం శ్వాస కండరాల కదలికలను నియంత్రించి, తద్వారా ఉచ్ఛ్వాస క్రియలో ఒక వ్యక్తి పీల్చే వాయువుల ఘనపరిమాణాన్ని క్రమపరుస్తుంది.

AP Inter 2nd Year Zoology Study Material Chapter 3(b) నాడీ నియంత్రణ, సమన్వయం

సి) మజ్ఞాముఖం : ఇది మెదడు పరాంతభాగం. పాన్స్వరోలి వద్ద ప్రారంభమై వెన్నుపాముగా కొనసాగుతుంది. దీనిలో పరాంత రక్తపక్షం ఉంటుంది. హృదయ స్పందన, శ్వాసక్రియ, మింగడం, వాంతి, దగ్గు, తుమ్ము, వెక్కిళ్ళు మొదలైన వాటి నియంత్రణా కేంద్రాలు మజ్జాముఖంలో ఉంటాయి.
మధ్యమెదడు, పాన్స్వరోలి, మజ్జాముఖాలను కలిపి మెదడు మూలం అని కూడా అంటారు.

ప్రశ్న 2.
నాడీ ప్రచోదనం స్వభావాన్ని, వహన విధానాన్ని సరైన చిత్రపటాల సహాయంతో వివరించండి.
జవాబు:
నాడీ తంతువును ఉత్తేజ పరచడానికి కావలసిన ప్రేరణను త్రెషోల్డ్ ప్రేరణ అంటారు. ఈ ప్రేరణ వలన నాడీ తంతువులలో జీవక్రియా తరంగము ప్రసారితమయ్యేటప్పుడు జరుగు భౌతిక, రసాయనిక చర్యల సముదాయాన్ని నాడీ ప్రచోదనము అంటారు.

1) నాడీ ప్రచోదనం స్వభావం, ఆవిర్భావం : గ్రాహకాలు అనేక రకాలైన ఉత్తేజనాలను గ్రహించి నాడీ కణాల ద్వారా మెదడుకు పంపుతాయి. ఉత్తేజనాల స్థాయి త్రెషోల్డ్ విలువ కంటే ఎక్కువగా ఉన్నప్పుడు నాడీకణంలో విద్యుత్ ప్రేరణ ఏర్పడుతుంది. ఈ విద్యుత్ ప్రేరణ నాడీ కణంలో జరిగే విద్యుత్ సంఘటనకు మూలాధారము. నాడీకణంలో జరిగే ముఖ్యమైన విద్యుత్ సంఘటనలు ఈ క్రింది విధంగా ఉంటాయి. అవి : i) విరామశక్మం, ii) క్రియాశక్మం.

i) విరామశక్మం : విరామస్థితిలో ఉండే సమయంలో నాడీకణాల ప్లాస్మాత్వచం వెలుపలి వైపు, ధనావేశాన్ని, లోపలివైపు ఋణావేశాన్ని కలిగి ఉంటుంది. విరామ సమయంలో నాడీత్వచంలో కనిపించే ఈ స్థితిని ధ్రువితస్థితి అంటారు. ఈ స్థితిలో కనిపించే విద్యుదావేశాల్లో భేదాన్ని విరామశక్మం అంటారు. నాడీకణాలలో విరామశక్మం విలువ దాదాపు 70 మిల్లీ వోల్టులు ఉంటుంది. దీనికి కారణం నాడీకణానికి వెలుపల, అంటే కణ బాహ్య ద్రవంలో అధిక మొత్తంలో Na+, Cl అయాన్లు, కణత్వచం లోపలివైపు అధిక మొత్తంలో K+ అయాన్లు, ఋణావేశం కలిగిన ప్రోటీన్ లు, స్వేచ్ఛా అమైనోఆమ్లాలు, కార్బాక్సిల్ ఆన్ అయాన్లు విస్తరించి ఉండటం. ఈ విధంగా ఋణావేశం నాడీకణ బాహ్య ద్రవ్యం కంటే నాడీకణ త్వచం లోపలివైపు అధికంగా ఉండటం వల్ల నాడీత్వచం లోపలి తలంలో 70 మిల్లీ వోల్టుల ఋణశక్మం కొనసాగించబడుతుంది.

ii) క్రియాశక్మం : నాడీ ప్రచోదనం ఒక నాడి ద్వారా ప్రసరించే సమయంలో దానిలోని విరామశక్మం తాత్కాలికంగా మాయమై, ఆస్థానంలో క్రియాశక్మం అనే ఒక విద్యుత్ దృగ్విషయం ఏర్పడుతుంది. ఈ సమయంలో నాడీకణం లోపలి, వెలుపలి తలాలలో విద్యుదావేశాలు మారిపోతాయి. ఫలితంగా నాడీత్వచం లోపలివైపు ధనావేశం, వెలుపలి వైపు ఋణావేశం ఏర్పడతాయి. ఈ విధమైన విద్యుదావేశాల మార్పును ఆసిల్లో స్కోప్ అనే పరికరంతో నమోదు చేసినప్పుడు లభించే చిత్రపటాన్ని క్రియాశక్మం అంటారు. దీన్ని విశ్లేషించడం ద్వారా నాడీ ప్రచోదనాన్ని అవగాహన చేసుకోవచ్చు.
AP Inter 2nd Year Zoology Study Material Chapter 3(b) నాడీ నియంత్రణ, సమన్వయం 4

ధ్రువిత స్థితిలో ఉండే నాడీకణాన్ని ప్రేరేపించినప్పుడు క్రియాశ్మకం ఏర్పడుతుంది. ఆ సమయంలో సోడియం అయాన్లు నాడీకణంలోకి ప్రవేశిస్తాయి. నాడీత్వచం వోల్టేజ్ పెరిగినప్పుడు దానిలో ఉండే వోల్టేజ్ సున్నిత సోడియం ఛానళ్ళు తెరచుకోవడం వల్ల సోడియం అయాన్లు లోనికి ప్రవేశించి ధనావేశాన్ని కలిగిస్తాయి. ఫలితంగా విరామశక్మం ఋణావేశాన్ని కోల్పోయి, ధనావేశాన్ని పొందుతుంది. అదే సమయంలో – 70 మి. వోల్టులు ఉన్న విరామత్వచ శక్మం దాదాపు +40 మి|| వోల్టులు వరకూ పెరుగుతుంది. ఈ స్థితిని విధ్రువణం అంటారు. ప్రారంభంలో విధృవణం నాడీత్వచం కొంతభాగంలో ఏర్పడినా క్రమంగా అధోనాడీ అక్షీయ తంతువు చివరి వరకూ విస్తరిస్తుంది. అందువల్ల క్రియాశక్మాన్ని స్వయం ప్రసారశీల విధ్రువణ తరంగం అంటారు. విధ్రువణం చెందిన నాడీత్వచంలో అధిక వోల్టేజ్ ఏర్పడటం వల్ల వోల్టేజ్ సున్నిత పొటాషియం ఛానళ్ళు తెరుచుకుంటాయి. వీటి K+ అయాన్లు వెలుపలికి చేరుకొని త్వచ విరామశక్మాన్ని తిరిగి ద్వారా 70 మి. వోల్టులకు పునరుద్ధరిస్తాయి. ఈ స్థితిని పునఃధ్రువణం అంటారు.

AP Inter 2nd Year Zoology Study Material Chapter 3(b) నాడీ నియంత్రణ, సమన్వయం

2) నాడీ ప్రచోదన వహనం: నాడీకణాలలో ఆవిర్భవించే క్రియాశక్మాన్నే నాడీప్రచోదనం అంటారు. నాడీ ప్రచోదనం ఒక విధ్రువణ తరంగం వలే నాడీత్వచం ఉపరితలం వెంబడి తంత్రికాక్షం చివరి వరకు ప్రసరిస్తుంది. నాడీ ప్రచోదనం వహనం చెందే పద్ధతిని రెండు సిద్ధాంతాల ద్వారా వివరిస్తారు. అవి : i) స్థానిక వలయ సిద్ధాంతం ii) లంఘన వహన సిద్ధాంతం.

i) స్థానిక వలయ సిద్ధాంతం: ఈ సిద్ధాంతం మయలిన్ రహిత తంత్రికాక్షాలలో నాడీ ప్రచోదనం వహనం చెందే విధానాన్ని వివరిస్తుంది. ఈ సిద్ధాంతం ప్రకారం క్రియాశక్మం స్థానిక విద్యుద్వలయాల రూపంలో స్వయం ప్రేరణ పద్ధతిలో ప్రసరణ చెందుతుంది. ఈ పద్ధతిలో A బిందువు వద్ద ఏర్పడిన ధనాత్మక అయాన్లు B బిందువు వద్ద ఉండే ఋణాత్మక అయాన్లను ఆకర్షించి లాక్కొంటాయి. అంటే క్రియాశక్మం ఒక విధ్రువణ ప్రాంతం నుంచి దాని పక్కనే ఉండే ధ్రువిత ప్రాంతానికి ప్రసరిస్తుంది. ఈ విధంగా తంత్రికాక్ష జీవపదార్థంలో ధన, ఋణ అయాన్లు వాటి స్థానాలు మార్చుకోవడం వల్ల స్థానిక విద్యుద్వలయాలు ఏర్పడతాయి. ఈ ప్రక్రియ తంత్రికాక్షం పొడవునా పునరావృతమవుతుంది.
AP Inter 2nd Year Zoology Study Material Chapter 3(b) నాడీ నియంత్రణ, సమన్వయం 5

ii) లంఘన వహన సిద్ధాంతం: ఈ సిద్ధాంతం మయలిన్ సహిత తంత్రికాక్షాలలో జరిగే నాడీ ప్రచోదన వహన విధానాన్ని వివరిస్తుంది. మయలిన్ ఆచ్ఛాదం గల తంత్రికాక్షాల చుట్టూ ష్వాన్ కణాలు ఒక వరుసక్రమంలో అమరి ఉంటాయి. ప్రతి రెండు ష్వాన్ కణాల మధ్య రాన్వియర్ కణుపులు అనే నగ్న ప్రాంతాలు ఉంటాయి. ఈ ప్రాంతాలలో మాత్రమే విధ్రువణం జరిగి క్రియాశక్మం ఏర్పడుతుంది. ష్వాన్ కణాలు అవహన ఆచ్ఛాదాలుగా పనిచేయడం వల్ల ఆ ప్రాంతాలలో విధ్రువణ జరుగదు. అందువల్ల ఒక కణుపు వద్ద ఏర్పడ్డ క్రియాశక్మం దాని పక్కన ఉండే మరొక కణపు వద్దకు దూకుతూ ప్రసరిస్తుంది. ఈ ప్రక్రియలో ఏర్పడ్డ కణుపు వద్ద ఏర్పడ్డ ధనావేశం వల్ల Na+ ఛానళ్ళు తెరచుకొని సోడియం అయాన్లు లోనికి ప్రవేశిస్తాయి. ఫలితంగా ఆ కణుపు వద్ద క్రియాశక్మం ఏర్పడుతుంది. అనంతరం అక్కడి నుంచి Na+ లు పక్కన ఉండే కణుపు వద్దకు లంఘిస్తాయి. అక్కడ రెండవ క్రియాశక్మం ఏర్పడుతుంది. ఈ చర్యలు గొలుసుకట్టు ప్రతి చర్యల లాగా నిరవధికంగా సాగుతూ విధ్రువణ తరంగాన్ని తంత్రికాక్షం చివరి వరకూ వ్యాపిస్తాయి.
AP Inter 2nd Year Zoology Study Material Chapter 3(b) నాడీ నియంత్రణ, సమన్వయం 6

3) వహన వేగం : నాడీ ప్రచోదన ప్రసరణ వేగం రెండు అంశాలపై ఆధారపడి ఉంటుంది. అవి తంత్రికాక్ష వ్యాసం, మయలిన్ ఆచ్ఛాదం. సన్నటి తంత్రికాక్షాలలో కంటే ఎక్కువ వ్యాసం కలిగిన వాటిలో నాడీ ప్రచోదనం వేగంగా ప్రసరిస్తుంది. అదే విధంగా మయలిన్ ఆచ్ఛాదం ఉండే తంత్రికాక్షాలలో నాడీ ప్రచోదనం మరింత వేగంగా ప్రసరిస్తుంది. అకశేరుకాలలోని మయలిన్ రహిత తంతువులలో నాడీ ప్రచోదన వేగం ఒక సెకనుకు 20 నుంచి 30 మీటర్లు ఉండగా సకశేరుకాలలోని మయలిన్ తంతువులలో సెకనుకు దాదాపు 120 మీటర్లు వేగంతో ప్రసరిస్తుంది.

AP Inter 2nd Year Zoology Study Material Chapter 3(a) కండర – అస్థిపంజర వ్యవస్థ

Andhra Pradesh BIEAP AP Inter 2nd Year Zoology Study Material Lesson 3(a) కండర – అస్థిపంజర వ్యవస్థ Textbook Questions and Answers.

AP Inter 2nd Year Zoology Study Material Lesson 3(a) కండర – అస్థిపంజర వ్యవస్థ

కండరం

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
కండరం, నాడికి సంబంధించి ‘చాలక ప్రమాణం’ అంటే ఏమిటి ?
జవాబు:
ఒక చాలక నాడీకణం అక్షీయ తంతువులోని టీలోడెండ్రైట్లు అంతమయ్యే కండర తంతువు భాగాన్ని ‘చాలక ప్రమాణం’ అంటారు.

ప్రశ్న 2.
త్రయావ్యవస్థ అంటే ఏమిటి ? [T.S. Mar. ’16, ’15 Mar. 14]
జవాబు:
ప్రతి T – నాళికను సార్కోప్లాజమిక్ రెటిక్యులమ్ యొక్క అంత్యసిస్టర్నేలు సన్నిహితంగా చుట్టి ఉంటాయి. ఒక T – నాళిక దానికి సన్నిహితంగా ఉన్న రెండు సిస్టర్నేలను కలిపి త్రయావ్యవస్థ అంటారు.

AP Inter 2nd Year Zoology Study Material Chapter 3(a) కండర – అస్థిపంజర వ్యవస్థ

ప్రశ్న 3.
ఏక్టిన్, మయోసిన్ మధ్య భేధమేమి ? [A.P. Mar. ’15]
జవాబు:
ఏక్టిన్

  1. ఏక్టిన్ ఒక సన్నని సంకోచశీల ప్రోటీన్
  2. ఏక్టిన్ కాంతివంతపు పట్టీలో ఉంటుంది. దీనినే సమప్రసారక పట్టీ అంటారు.
  3. ప్రతి ఏక్టిన్ తంతువులోనూ రెండు తంతుయుత F-ఏక్టిన్ తంతువులు కుండలిగా చుట్టుకొని ఉంటాయి. అవి ట్రోపోమయోసిన్, ట్రోపోనిన్ ప్రోటీన్లు.

మయోసిన్

  1. మయోసిన్ ఒక దళసరి సంకోచశీల ప్రోటీన్
  2. మయోసిన్; నిష్కాంతి పట్టీలో ఉంటుంది. దీనినే అసమ ప్రసారక పట్టీ అంటారు.
  3. ప్రతి మయోసిన్, మీరోమయోసిన్ అనే మోనోమర్లతో తయారయ్యి ఉంటుంది. ప్రతి మీరోమయోసిన్లో తల, తోక అనే రెండు ప్రధాన భాగాలుంటాయి.

ప్రశ్న 4.
ఎర్రని కండర తంతువులు, తెల్లని కండర తంతువుల మధ్య ఉండే భేదాలను తెల్పండి.
జవాబు:
ఎర్రని కండర తంతువులు

  1. ఎరుపు కండర తంతువులు పలుచగా ఉండి పరిమాణంలో పెద్దవిగా ఉంటాయి.
  2. ఈ కండర తంతువులలో మయోగ్లోబిన్ అధికంగా ఉండటం వల్ల ఎర్రని వర్ణంలో కనిపిస్తాయి.
  3. ఈ తంతువులలో మైటోకాండ్రియంల సంఖ్య అధికంగా ఉంటుంది.
  4. వీటిని వాయుకండరాలు అని అంటారు.

తెల్లని కండర తంతువులు

  1. తెల్లని కండర తంతువులు దళసరిగా ఉండి పరిమాణంలో తక్కువగా ఉంటాయి.
  2. ఈకండర తంతువులలో మయోగ్లోబిన్ తక్కువగా ఉండటంవల్ల పాలిపోయి తెల్లని వర్ణంలో కనిపిస్తాయి
  3. ఈ తంతువులలో మైటోకాండ్రియాలు తక్కువ సంఖ్యలో ఉంటుంది.
  4. వీటిని అవాయు కండరాలు అంటారు.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
కండర సంకోచానికి సంబంధించి జారుడు తంతు సిద్ధాంతాన్ని గురించి లఘుటీక రాయండి.
జవాబు:
కండర సంకోచించే విధానాన్ని జారుడు తంతు సిద్ధాంతం ద్వారా వివరించవచ్చు. జారుడు తంతు సిద్ధాంతాన్ని జేన్ హన్సన్, హ్యుగ్ హక్సలె అనే శాస్త్రవేత్తలు ప్రతిపాదించారు ఈ సిద్ధాంతం ప్రకారం కండర సంకోచ సమయంలో సన్నని ఏక్టిస్ తంతువులు, దళసరి మయోసిన్ తంతువుల మీదుగా / మధ్యగా జారడం జరుగుతుంది.

ప్రతి కండర సూక్ష్మ తంతువులో ఏక్టిన్, మయోసిన్ అనే కండర ప్రోటిన్లు అమరిక వల్ల నిష్కాంతి, కాంతి పట్టీలుగా ఏర్పడి చారలుగా కనిపిస్తాయి. కాంతివంతపు పట్టీని ‘T – పట్టీ అంటారు. ఇందులో పలుచని సంకోచించే ఏక్టిన్ ప్రోటీన్ ఉంటుంది. నిష్కాంతి పట్టీని ‘A’ – పట్టీ అంటారు. ‘A’ – పట్టీలో మయోసిన్ అనే ప్రోటీన్ ఉంటుంది. T పట్టీ మధ్యభాగంలోని స్థితిస్థాపక ‘Z’- గీత ఉంటుంది. A పట్టీ మధ్య భాగంలో ఏక్టిన్ తంతువులు లేని ప్రాంతాన్ని ‘H’ – మండలం అంటారు. ఈ మండలంలో సన్నని తంతువులు లేనందువల్ల మిగతా ‘A’ పట్టీ కంటే కొంచెం లేత వర్ణంలో ఉంటుంది.

కండర సంకోచ సమయంలో, మయోసిన్ తలభాగం ఏక్టిన్ చైతన్య స్థానంలో బంధితమయ్యి, అడ్డువంతెన ఏర్పడుతుంది. మయోసిన్ అడ్డు వంతెనలతో బంధింపబడిన ఏక్టిన్ తంతువులు ‘A’ పట్టీ మధ్య భాగంలోకి లాగబడతాయి. ఏక్టిన్ తంతువులను పట్టీ ఉన్న ‘Z’ గీతలు కూడా రెండు వైపుల నుంచి లోనికి లాగబడతాయి. అందువల్ల ‘T’ పట్టీ పొడవు తగ్గిపోతుంది. కాని ‘A’ పట్టీ పొడవు మాత్రం యధాతధంగా ఉండిపోతుంది. ఈ సమయంలో సన్నని ఏక్టిన్ తంతువులు దళసరి ‘A’ పట్టీలోనికి లోతుగా లాగటం వల్ల ‘H’ మండలం సన్నగా మారుతుంది. సార్కోమియర్ పొడవు తగ్గి పొట్టిగా మారుతుంది. దీనినే కండర సంకోచం అంటారు.

AP Inter 2nd Year Zoology Study Material Chapter 3(a) కండర – అస్థిపంజర వ్యవస్థ

ప్రశ్న 2.
కండర సంకోచంలోని ముఖ్యమైన దశలను వివరించండి.
జవాబు:
కండర సంకోచ సమయంలో సన్నని ఏక్టిన్ తంతువులు, దళసరి మయోసిన్ తంతువుల మీదుగా / మధ్యగా జారుతుంది. కండర సంకోచంలో ముఖ్యమైన దశలు:
1) కేంద్ర నాడీ వ్యవస్థ నుంచి చాలక నాడీ తంతువుల ద్వారా నాడీ ప్రచోదనం కండర తంతువులను చేరినప్పుడు కండరం ఉద్దీపనం చెంది సంకోచం ప్రారంభమవుతుంది.

2) ఈనాడీ ప్రచోదనం అసిటైల్ కొలైన్ ద్వారా సార్కోప్లాజమిక్ రెటిక్యులమ్లోని సిస్టర్నేలను చేరడం వల్ల వాటి నుండి సార్కోప్లాజమ్ లోనికి ‘కాల్షియం అయాన్లు’ విడుదలవుతాయి.

3) సార్కోప్లాజమ్ లోనికి కాల్షియం అయాన్లు విడుదల కాగానే ఏక్టిన్ చైతన్యస్థానాలు బహిర్గతం అవుతాయి. ATP జలవిశ్లేషణ ఫలితంగా పొందిన శక్తిని ఉపయోగించుకొని, మయోసిన్ తల ఏక్టిన్ చైతన్యస్థానంతో బంధితమవుతుంది.

4) మయోసిన్ అడ్డువంతెనలతో బంధింపబడిన ఏక్టిన్ తంతువులు, దళసరి ‘A’ పట్టీలోనికి లోతుగా లాగబడటం వల్ల ‘H’ మండలం సన్నగా మారుతుంది. సార్కోమియర్ పొడవు తగ్గి పొట్టిగా మారుతుంది. దీనినే కండర సంకోచం అంటారు.

5) కండర సంకోచం తరువాత, మయోసిన్ తిరిగి తన సాధారణ స్థితిలోచేరి ADPని విడుదల చేస్తుంది. ఒక కొత్త ATP మయోసిన్ తలతో బంధింతమవడం వల్ల అడ్డువంతెన విడిపోతుంది. మరియు Ca+2 అయాన్ల గాఢత తగ్గిపోతుంది. ఈకారణంగా సార్కోమియర్ పొడవు యధాస్థితికి వస్తుంది. దీన్నే సడలడం అంటారు.

ప్రశ్న 3.
అస్థి కండర నిర్మాణాన్ని వివరించండి.
జవాబు:
1) మనదేహంలోని అస్థికండరం / రేఖిత కండరం అనేక కండర కట్టలు లేదా ఫాసికిల్లలో నిర్మితమై ఉంటుంది. ప్రతి ఫాసికల్లో అనేక స్థూపాకార కండర తంతువులు లేదా కండర కణాలు ఉంటాయి. అన్ని ఫాసికిల్స్ను కప్పి ఉంచుతూ కొల్లా జెన్ నిర్మితమైన ఫాసియా అనే సంయోజక కణజాలపు త్వచం ఉంటుంది.

కండర తంతువు సూక్షమమ నిర్మాణం :

  1. కండర కణాలు పొడవైన తంతువుల లాగా ఉంటాయి. కండర తంతువు ప్లాస్మాత్వచాన్ని సొర్కోలెమ్మా అని దీని జీవపదార్థాన్ని సార్కోప్లాజమ్ అని అంటారు.
  2. రేఖిత కండరతంతువు బహు కేంద్రక సిన్సిషియల్ స్థితిని ప్రదర్శిస్తుంది. పిండదశలో ఏకకేంద్రక మయోబ్లాస్ట్ కణాలు అనేకం కలసి ఒక కండర తంతువును ఏర్పర్చడం వల్ల అది బహుకేంద్రక స్థితిని పొందుతుంది.
  3. కండర తంతువు యొక్క సార్కోలెమ్మా కిందిభాగంలో పరిధీయంగా అనేక కేంద్రకాలు ఉండటం కండర తంతువు ప్రత్యేకత.
  4. కండర తంతువులోని అంతర్జీవ ద్రవ్యజాలకాన్ని సార్కోప్లాజమిక్ రెటిక్యులమ్ అంటారు. ఇందులో కాల్షియం అయాన్లు నిలువ ఉంటాయి.
  5. కండర తంతువులోని సార్కోప్లాజంలో అనేక కండర సూక్ష్మతంతువులు ఒకదాని కొకటి సమాంతరంగా అమరి ఉంటాయి.

ప్రశ్న 4.
సంకోచశీల ప్రోటీన్లను గురించి లఘు వాఖ్య రాయండి.
జవాబు:
ఏక్టిన్ మరియు మయోసిన్లు సంకోచశీల ప్రోటీన్లు
ఏక్టిన్ :

  1. ప్రతి ఏక్టిన్ తంతువులోనూ రెండు తంతుయుత F – ఏక్టిన్ ‘తంతువులు కుండలిగా చుట్టుకొని ఉంటాయి.
  2. ప్రతి F – ఏక్టిన్ తంతువులో అనేక గోళాకార ప్రమాణాలు ఉంటాయి. వీటిని G – ఏక్టిన్ అంటారు. ఇది ఒక వరుసక్రమంలో పాలీమరీకరణం చెందడం వల్ల F – ఏక్టిన్ ఏర్పడుతుంది.
  3. ఏక్టిన్ తంతువులకు సమాంతరంగా ట్రోపోమయోసిన్, ట్రోపోనిన్ అనే మరో రెండు ప్రోటీన్లు కూడా అమరి ఉంటాయి. వీటిలో ట్రోపోమయోసిన్ F – ఏక్టిన్ తంతువు పొడవుగా అమరి ఉంటుంది. కాని ట్రోపోనిన్ సంక్లిష్ట ప్రోటీన్ మాత్రం నిర్ణీత అవధులలో ట్రోపోమయోసిన్ పై అమరి ఉంటుంది.
  4. ట్రోపోనిన్ మూడు ఉప ప్రమాణాలుంటాయి. అవి Tn – T, Tn – I మరియు In – C, Tn – T, ట్రోపోమయోసిన్తో, Tn – C; Ca2+ అయాన్లతో బంధింపబడతాయి. ట్రోపోనిన్ – I (Tn – I) ఉప ప్రమాణం ట్రోపోమయోసిన్ ద్వారా ఏక్టిన్ తంతువు పై ఉండే ‘మయోసిన్ బంధన స్థలాలను కప్పి ఉంచడాన్ని స్థిరపరుస్తుంది. కాల్షియం అయాన్లు ట్రోపోనిన్తో బంధించబడినప్పుడు ఈ అడ్డు తొలగించబడి మయోసిన్ బంధన స్థలాలు బహిర్గతమవుతుంది.
  5. ఈ విధంగా బహిర్గతమైన చైతన్య స్థానాలతో మయోసిన్ తలలు బంధించబడినప్పుడు కండరం సంకోచిస్తుంది. ఈకారణంగానే ట్రోపోనిన్, ట్రోపోమయోసిన్లను నియంత్రణ ప్రోటీన్లు అంటారు.

మయోసిన్ :-

  1. మయోసిన్ ఒక చాలక ప్రోటీన్ ఇది ATP అణువులలోని రసాయనిక శక్తిని యాంత్రికశక్తి గా మార్చే శక్తి కలిగి ఉంటుంది.
  2. ప్రతి దళసరి మయోసిన్ తంతువు పాలీమరీకరణం చెందిన ప్రోటీన్ నిర్మాణం. దీనిలో మీరోమయోసిన్లు అనే మోనోమర్లు ఉంటాయి.
  3. ప్రతి మీరోమయోసిన్లో తల, తోక అనే రెండు ప్రధాన భాగాలుంటాయి. తల గోళాకారంలో ఉండి, పొట్టిగా ఉండే భుజం లేదా మెడను కలిగి ఉంటుంది.
  4. తల, మెడ భాగాలను కలిపి భారపు మీరోమయోసిన్ అనీ, తోకను తేలిక మీరోమయోసిన్ అనీ అంటారు.
  5. మెడ భాగం తల, తోకలను కలుపుతూ వాటి మధ్య తేలికగా వంగే నిర్మాణంగా పనిచేస్తుంది.
  6. ప్రతి దళసరి మయోసిన్ తంతువులో సుమారు 200-300 వరకూ మయోసిన్ అణువులుంటారు.
  7. మయోసిన్ తల, మెడ భాగాలు మయోసిన్ తంతువుల పై అక్కడక్కడ బయటికి చొచ్చుకొని వచ్చి ఉపరితలంపై లాగా కనిపిస్తాయి. వీటిని అడ్డు భుజాలు లేదా అడ్డువంతేనలు అంటారు.
  8. ప్రతి అడ్డు వంతెన తలలో రెండు బంధన తలాలు ఉంటాయి. ఒకటి ATP కి, మరొకటి ఏక్టిన్ తంతువు పైగల చైతన్య స్థానంతో బంధితం కావడానికి ఉపయోగపడతాయి.

ప్రశ్న 5.
కండర తంతువు అతిసూక్ష్మ నిర్మాణం చక్కని పటం గీయండి.
జవాబు:
AP Inter 2nd Year Zoology Study Material Chapter 3(a) కండర – అస్థిపంజర వ్యవస్థ 1

ప్రశ్న 6.
కండర ఖండితం (సార్కోమియర్) చక్కని పటం గీచి భాగాలను గుర్తించండి.
జవాబు:
AP Inter 2nd Year Zoology Study Material Chapter 3(a) కండర – అస్థిపంజర వ్యవస్థ 2

AP Inter 2nd Year Zoology Study Material Chapter 3(a) కండర – అస్థిపంజర వ్యవస్థ

ప్రశ్న 7.
కోరివలయం- అంటే ఏమిటి ? ప్రక్రియ గురించి వివరించండి.
జవాబు:
కండరాలలో అవాయు గ్లైకాలిసిన్ జరిగినపుడు లాక్టిక్ ఆమ్లము ఏర్పడి, కాలేయంనకు చేరుతుంది. అక్కడ గ్లూకోజ్ మారుతుంది. ఏర్పడిన ఈ గ్లూకోజ్ మరల రేఖిత కండరాలను చేరి లాక్టిక్ ఆమ్లముగా మారుతుంది. ఈవిధంగా రేఖిత కండరానికి, కాలేయానికి మధ్య జరిగే ద్వంద్వ రవాణాను ‘కోరివలయం’ అంటారు.
AP Inter 2nd Year Zoology Study Material Chapter 3(a) కండర – అస్థిపంజర వ్యవస్థ 3

కోరివలయం: కండర సంకోచం వేగంగా జరిగే సమయంలో ఏర్పడిన. లాక్టిక్ ఆమ్లం పాక్షికంగా మాత్రమే కండరంలో ఆక్సీకరణ చెందుతుంది. ఎక్కువభాగం లాక్టిక్ ఆమ్లం రక్తం ద్వారా కాలేయానికి చేరి అక్కడ అది పైరువిక్ ఆమ్లంగా మార్చబడుతుంది. దీని నుంచి గ్లూకోనియోజెనిసిస్ ద్వారా గ్లూకోజ్ ఏర్పడుతుంది. ఈవిధంగా ఏర్పడిన గ్లూకోజ్ రక్తం ద్వారా తిరిగి కండరాలకు చేరి, కండర సంకోచంలో వినియోగించబడుతుంది. కండర సంకోచం నిలిచిన సందర్భంలో ఈ గ్లూకోజ్ నిలవ గ్లైకోజెన్ గ్లైకోజెనిసిస్ ద్వారా మారి నిలవ చేయబడుతుంది. ఈ విధంగా కండరానికి, కాలేయానికి మధ్య జరిగే ద్వంద్వరవాణాను ‘కోరివలయం’ అంటారు.

దీర్ఘ సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
కండర సూక్ష్మ, నిర్మాణాన్ని సంకోచ ప్రక్రియను వివరించండి.
జవాబు:
1) మనదేహంలోని అస్థికండరం / రేఖిత కండరం అనేక కండర కట్టలు లేదా ఫాసికిల్లలో నిర్మితమై ఉంటుంది. ప్రతి ఫాసికల్లో అనేక స్థూపాకార కండర తంతువులు లేదా కండర కణాలు ఉంటాయి. అన్ని ఫాసికిల్స్ను కప్పి ఉంచుతూ కొల్లా జెన్తో నిర్మితమైన ఫాసియా అనే సంయోజక కణజాలపు త్వచం ఉంటుంది.
AP Inter 2nd Year Zoology Study Material Chapter 3(a) కండర – అస్థిపంజర వ్యవస్థ 4

కండర తంతువు సూక్షమమ నిర్మాణం:

  1. కండర కణాలు పొడవైన తంతువుల లాగా ఉంటాయి. కండర తంతువు ప్లాస్మాత్వచాన్ని సొర్కోలెమ్మా అని దీని జీవపదార్థాన్ని సార్కోప్లాజమ్ అని అంటారు.
  2. రేఖిత కండరతంతువు బహు కేంద్రక సిన్సిషియల్ స్థితిని ప్రదర్శిస్తుంది. పిండదశలో ఏకకేంద్రక మయోబ్లాస్ట్ కణాలు అనేకం కలసి ఒక కండర తంతువును ఏర్పర్చడం వల్ల అది బహుకేంద్రక స్థితిని పొందుతుంది.
  3. కండర తంతువు యొక్క సార్కోలెమ్మా కిందిభాగంలో పరిధీయంగా అనేక కేంద్రకాలు ఉండటం కండర తంతువు ప్రత్యేకత.
  4. కండర తంతువులోని అంతర్జీవ ద్రవ్యజాలకాన్ని సార్కోప్లాజమిక్ రెటిక్యులమ్ అంటారు. ఇందులో కాల్షియం అయాన్లు నిలువ ఉంటాయి.
  5. కండర తంతువులోని సార్కోప్లాజంలో అనేక కండర సూక్ష్మతంతువులు ఒకదాని కొకటి సమాంతరంగా అమరి ఉంటాయి.
  6. ప్రతి కండర సూక్ష్మ తంతువులో ఏక్టిన్, మయోసిన్ అనే కండర ప్రోటీన్ల అమరిక వల్ల నిష్కాంతి, కాంతి పట్టీలుగా ఏర్పడి చారలుగా కనిపిస్తాయి.
  7. కాంతివంతపు పట్టీని ‘I’ – పట్టీ అంటారు. ఇందులో పలుచని సంకోచించే ఏక్టిన్ ప్రోటీన్ ఉంటుంది.
  8. నిష్కాంతి పట్టీని ‘A’ – పట్టీ అంటారు. A పట్టీలో మయోసిన్ అనే ప్రోటీన్ ఉంటుంది.
  9. 1 పట్టీ మధ్య భాగంలోని స్థితిస్థాపక ‘Z’ – గీత ఉంటుంది.
  10. ‘A’ పట్టీ మధ్యభాగంలో ఏక్టిన్ తంతువులు లేని ప్రాంతాన్ని ‘H’ – మండలం అంటారు.

ఈ మండలంలో సన్నని తంతువులు లేనందువల్ల మిగతా ‘A’ పట్టీ కంటే కొంచెం లేత వర్ణంలో ఉంటుంది.

కండరం సంకోచించే ప్రక్రియ:-
కండరం సంకోచించే విధానాన్ని స్లైడింగ్ ఫిలిమెంట్ సిద్ధాంతం లేదా జారుడు తంతు సిద్ధాంతం ద్వారా వివరించవచ్చు. ఈ సిద్ధాంతం ప్రకారం కండర సంకోచ సమయంలో సన్నని ఏక్టివ్ తంతువులు, దళసరి మయోసిన్ తంతువుల మీదుగా / మధ్యగా జారడం జరుగుతుంది.

AP Inter 2nd Year Zoology Study Material Chapter 3(a) కండర – అస్థిపంజర వ్యవస్థ

కండర సంకోచ ప్రక్రియలో ముఖ్య దశలు:-
i) కండర ఉద్దీపనం:

  1. కేంద్రనాడీ వ్యవస్థు నుంచి చాలక నాడీ తంతువుల ద్వారా నాడీ ప్రచోదనం కండర తంతువులను చేరినప్పుడు కండరం ఉద్దీపనం చెంది సంకోచం ప్రారంభమౌతుంది.
  2. ఈ నాడీ ప్రచోదనం అసిటైల్ కొలైన్ ద్వారా సార్కోప్లాజమిక్ రెటిక్యులమ్ లోని సిస్టర్నేలను చేరడం వల్ల, వాటి నుండి సార్కోప్లాజమ్ లోనికి “కాల్షియం” అయాన్లు విడుదలవుతాయి.

ii) అడ్డువంతెనలు ఏర్పడటం:

  1. సార్కోప్లాజమ్ లోనికి కాల్షియం అయాన్లు విడుదల కాగానే అవి ట్రోపోనిన్ ఉపప్రమాణం (Tn – C) తో బంధించబడతాయి. దీని ఫలితంగా, ఏక్టిన్ చైతన్యస్థానాలు బహిర్గతం అవుతాయి.
  2. ATP జలవిశ్లేషణ ఫలితంగా పొందిన శక్తిని ఉపయోగించుకొని మయోసిన్ తల ఏక్టిన్ చైతన్యస్థానంతో బందితమవుతుంది.

iii) పవర్ స్ట్రోక్:
AP Inter 2nd Year Zoology Study Material Chapter 3(a) కండర – అస్థిపంజర వ్యవస్థ 5

  1. మయోసిస్ అడ్డు వంతెనలతో బంధింపబడిన ఏక్టిన్ తంతువులు సార్కోమియర్ లోని A – పట్టీ మధ్యభాగంలోనికి లాగబడతాయి.
  2. ఏక్టిన్ తంతువులను పట్టీ ఉన్న Z గీతలు కూడా రెండు వైపుల నుంచి లోనికి లాగబడతాయి. అందువల్ల ‘I’ పట్టీ పొడవు తగ్గిపోతుంది. కాని ‘A’ పట్టీ పొడవు మాత్రం యధాతధంగా ఉండిపోతుంది.
  3. ఈ సమయంలో సన్నని ఏక్జిన్ తంతువులు దళసరి ‘A’ పట్టీలోనికి లోతుగా లాగబడటం వల్ల ‘H’ మండలం సన్నగా మారుతుంది. సార్కోమియర్ పొడవు తగ్గి పొట్టిగా మారుతుంది. దీనినే కండర సంకోచం అంటారు.

iv) రికవరీ స్ట్రోక్:
జారుడు తంతువులు

  1. రివకరిస్ట్రోక్ మయోసిన్ తిరిగి తన సాధారణ స్థితిని చేరి, ADP ని విడుదల చేస్తుంది.
  2. ఒక కొత్త ATP మయోసిన్ తలతో బందితమవడం వల్ల అడ్డువంతెన విడిపోతుంది.
  3. ఈ కొత్త ATP, ATP ఏజ్ (ATPase) వల్ల జలవిశ్లేషణ చెంది అడ్డువంతెన వలయం పునరావృతం అవుతుంది. దీనివల్ల ఏక్టిన్ తంతువులు జారుతూ ఉండడం అధికం అవుతుంది.

v) కండరం సడలడం:

  1. కండరానికి చాలక నాడీ ప్రచోదనం ఆగిన వెంటనే కాల్షియం అయాన్ల గాఢత తగ్గుతుంది. ఫలితంగా ట్రోపోనిస్ నుంచి Ca+2 అయాన్లు వైదొలుగుతాయి. అందువల్ల ట్రోపోమయోసిన్ తిరిగి ఏక్టిన్ తంతువులపై నున్న చైతన్యస్థానాలను కప్పివేయడంతో అవి మరుగున పడతాయి.
  2. ఫలితంగా ఏక్టిన్ తంతువుల పై నున్న చైతన్యస్థానాలు మయోసిన్ తలతో బంధితమయ్యే అవకాశం ఉండదు. కారణంగా ‘Z’ త్వచం తిరిగి తన యధాస్థితిని చేరుతుంది. దీన్ని సడలడం అంటారు.

ప్రశ్న 2.
కండర సంకోచ సమయంలోని అంశాలను వరుసక్రమంలో వివరించండి.
జవాబు:
కండర సంకోచ సమయంలో సన్నని ఏక్టిన్ తంతువులు, దళసరి మయోసిన్ తంతువుల మీదుగా / మధ్యగా జారడం జరుగుతుంది.

కండర సంకోచ సమయంలో వివిధ అంశాలు:
1. కేంద్రక నాడీ వ్యవస్థ (CNS) నుంచి చాలక నాడీ తంతువుల ద్వారా నాడీ ప్రచోదనం కండర తంతువులను చేరినప్పుడు కండరం ఉద్దీపన చెంది సంకోచం ప్రారంభమౌతుంది.

2. నాడీ ప్రచోదన కండర నాడీ సంధిని చేరగానే అసిటైల్ కొలైన్ అనే నాడీ అభివాహకం విడుదలై సార్కోలెమ్మ వద్ద క్రియాశక్మం ఉత్పత్తి అవుతుంది.

3. ఈ క్రియాశక్మం త్రయా వ్యవస్థ ద్వారా సార్కోప్లాజమిక్ రెటిక్యులమ్ లోని సిస్టర్నేలను చేరడం వల్ల వాటి నుంచి సార్కోప్లాజమ్ లోనికి కాల్షియం అయాన్లు విడుదల అవుతాయి.

4. సార్కోప్లాజమ్ లోనికి కాల్షియం అయాన్లు విడుదల కాగానే అది ట్రోపోనిన్ ఉపప్రమాణం. Tn – Cతో బంధింపబడతాయి. దీని ఫలితంగా, ట్రోపోమయోసిన్ సంక్లిష్టం స్థానభ్రంశం చెంది ఏక్టిన్ చైతన్య స్థానాలు బహిర్గతం అవుతాయి.

5. ATP జలవిశ్లేషణ ఫలితంగా పొందిన శక్తిని ఉపయోగించుకొని, మయోసిన్ల ఏక్టిన్ చైతన్య స్థానంతో బంధితమవుతుంది.

6. మయోసిన్ అడ్డువంతెనలతో బంధింపబడిన ఏక్టిన్ తంతువులు సార్కోమియర్లోని A-పట్టీ మధ్యభాగంలోనికి లాగబడతాయి. ఏక్టిన్ తంతువులను పట్టీ ఉన్న Z గీతలు కూడా రెండు వైపుల నుంచి లోనికి లాగబడతాయి. అందువల్ల I-పట్టీ పొడవు తగ్గిపోతుంది. కాని ‘A’ పట్టీ పొడవు మాత్రం యధాతధంగా ఉండిపోతుంది.

7. ఈ సమయంలో సన్నని ఏక్టిన్ తంతువులు దళసరి A- పట్టీలోనికి లోతుగా లాగబడటం వల్ల ‘H’ సన్నగా మారుతుంది. సార్కోమియర్ పొడవు తగ్గి పొట్టిగా మారుతుంది. దీనినే కండర సంకోచం అంటారు.

AP Inter 2nd Year Zoology Study Material Chapter 3(a) కండర – అస్థిపంజర వ్యవస్థ

కండర సంకోచం ఆగిపోవడంలో వివిధ అంశాలు:-

1) అసిటైల్ కొలైన ఎస్టరేజ్ చర్య వల్ల నాడీ ప్రచోదన కండరనాడీ సంధి దగ్గర ఉన్న అసిటైల్ కొలైన్ విడిపోతుంది. ఈ చర్య వల్ల కండరానికి చాలక నాడీ ప్రచోదన ఆగిపోతుంది.

2) నాడీ ప్రబోదన ఆగిన వెంటనే కాల్షియం అయాన్లు తిరిగి సార్కోప్లాజమిక్ రెటిక్యులమ్ సిస్టర్నెలలోనికి Ca+2 ATP ఏజ్ ఎన్ఎమ్ ద్వారా పంప్ చేయబడటం వల్ల సార్కోప్లాజమ్లో Ca+2 అయాన్ల గాఢత తగ్గుతుంది. ఫలితంగా ట్రోపోనిస్ నుంచి Ca+2 అయాన్లు వైదొలుగుతాయి.

3) అందువల్ల ట్రోపోమయోసిన్ తిరిగి ఏక్టిన్ తంతువుల పై నున్న చైతన్య స్థానాలను కప్పివేయడంతో అవి మరుగునపడతాయి.

4) ఫలితంగా ఏక్టిన్ తంతువుల పై నున్న చైతన్యస్థానాలు మయోసిన్ తలతో బంధితమయ్యే అవకాశం ఉండదు. ఈకారణంగా ‘Z’ త్వచం తిరిగి తన యధాస్థితిని చేరుతుంది. దీన్నే ‘సడలడం’ అంటారు.

అస్థి పంజరం

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
రెండు కపాల సూదనాల పేర్లు తెలిపి, అవి ఉండే ప్రదేశాలను పేర్కొనండి.
జవాబు:

  1. కిరీట సూదనం: ఇది లాలాటికా మరియు కుడ్యార్థుల మధ్య ఉంటుంది.
  2. లాంబ్దాయిడ్ సూధనం: ఇది కుడ్యాస్థులు మరియు అనుకపాలాస్థి. మధ్య ఉంటుంది.

ప్రశ్న 2.
కపాలంలో కీలక ఎముక ఏది ? అది ఎక్కడ ఉంటుంది.
జవాబు:
స్పీనకీయం – ఇది కపాలంలో ఇతర ఎముకలన్నింటితోను అనుసంధానం చెందడం వల్ల దీన్ని కీలకమైన ఎముకగా పేర్కొనవచ్చు. ఇది కపాలం పీఠ మధ్యభాగంలో ఉంటుంది.

ప్రశ్న 3. మానవ పుర్రెను ద్వికందయుత పుర్రె అనడానికి కారణమేమి ? [Mar. ’14]
జవాబు:
పుర్రెలో గల రెండు అనుకపాలాస్థులు మధ్య గల మహావిహారం రంధ్రాన్ని ఆవరించి ఇరువైపుల రెండు అనుకపాల కందాలు ఉంటాయి. అందువల్ల మానవ పుర్రెను ద్వికందయుత పుర్రె అంటారు.

ప్రశ్న 4.
మానవుడి చెవిలోని అస్థిఖండాల పేర్లు, పరిణామ రీత్యా వాటి పుట్టుకను పేర్కొనండి. [T.S. & A.P. Mar.’16]
జవాబు:

  1. కూటకం ఇది క్రింది దవడలోని ఆర్టికులార్ రూపాంతరం
  2. దాగిలి ఇది ప్రలంబం యొక్క రూపాంతరం
  3. కర్ణాంతరాస్థి – ఇది అదోహనువు యొక్క రూపాంతరం

ప్రశ్న 5.
కింది వాటి మధ్య ఉండే కీళ్ల రకాలను పేర్కొనండి.
a) శీర్షధరం / అక్షకశేరుక
b) మణిబంధకాస్థి / కరాబాస్థి
జవాబు:
a) శీర్షధరం / అక్షకశేరుక మధ్య – బొంగరపుకీలు
b) మణిబంధకాస్థి / కరాబాబ్ది మధ్య – శాడిల్కీలు

ప్రశ్న 6.
కింది వాటి మధ్య ఉండే కీళ్ల రకాలను పేర్కొనండి.
a) శీర్షధరం / అక్షకశేరుకం
b) తొడ ఎముక / ఉదూఖలం
జవాబు:
a) శీర్షధరం / అక్షకశేరుక: బొంగరపు కీలు
b) తొడఎముక – ఉదూఖలం:- బంతి గిన్నే కీలు

ప్రశ్న 7.
కింది ఎముకల మధ్య కీలు ఏది ?
a) కపాల ఎముకలు
b) చీలమండ ఎముకలు
జవాబు:
a) కపాల ఎముకల మధ్యలో – సూదనం (పైదబస్కీలు ) ఉంటుంది.
ఉదా: కిరీటసూదనం, లాంబ్దయిడ్ సూదనం
b) చీలమండ ఎముకల మధ్యలో – జారెడుకీలు ఉంటుంది.

AP Inter 2nd Year Zoology Study Material Chapter 3(a) కండర – అస్థిపంజర వ్యవస్థ

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
మానవ కపాలంలోని ఎముకలను పేర్కొనండి.
జవాబు:
కపాలం మొదడును రక్షించే పెట్టెలాంటి నిర్మాణమే కపాలం. ఇది మొత్తం 8 బల్లపరపు చదునైన ఎముకలచే నిర్మితమై ఉంటుంది. అవి.

  1. లలాటికాస్థి (1):- ఈఎముకు నుదురు, కపాలం పూర్వ ఉదరభాగాన్ని, నేత్రగుళిక పై భాగాన్ని ఏర్పరుస్తుంది.
  2. కుడ్యాస్థులు: (2):- ఇవి కపాలకుహరం పై కప్పును, పక్క భాగాలను ఏర్పరుస్తాయి.
  3. కణతాస్థులు: (2):- ఇవి కపాలం యొక్క పార్శ్వభాగాలను, ఉదరభాగాన్ని ఏర్పరుస్తాయి.
  4. అనుకపాలాస్థులు: (1):- ఇవి కపాలం పరాంత పీఠభాగాన్ని ఏర్పరుస్తాయి.
  5. స్ఫీనకీయం (1):- ఇది కపాలం పీఠమధ్యభాగంలో ఉంటుంది. ఇది కపాలంలోని ఇతర ఎముకలన్నింటితోను అనుసందానం చెందడం వల్ల దీన్ని కీలకమైన ఎముకగా పేర్కొనవచ్చు.
  6. సేవకం (1):- ఇది కపాలం పీఠభాగపు పూర్వాంతంలోని ఎముక.

ప్రశ్న 2.
మానవుడి పర్శుకల పై లఘుటీక రాయండి.
జవాబు:
మనవ ఛాతిలో 24 పర్శుకలు, 12 జతలుగా అమరి ఉంటాయి.
ఈ ఎముకలు ఛాతిభాగంలో గల అవయవాల చుట్టూ అమరి వాటికి రక్షణిస్తాయి. ప్రతి పర్ముక బల్లపరుపుగా ఉండి పృష్ఠతలంలో వెన్నెముకతోనూ, ఉదరతలంలో ఉరోస్థితోను అతికి ఉంటుంది. ఈ పర్శుకలను మూడు రకాలుగా విభజించారు.
AP Inter 2nd Year Zoology Study Material Chapter 3(a) కండర – అస్థిపంజర వ్యవస్థ 6

1. నిజపర్శుకలు లేదా కశేరు ఉరోస్థి పర్శుకలు: మొదటి ఏడుజతల పర్శుకలను నిజపర్శుకలు అంటారు. ఇవి పృష్టి తలంలో ఉరఃకశేరుకలతోనూ, ఉదర తలంలో ఉరోస్థితోనూ కచాభ మృదులాస్థి సహాయంతో అతికి ఉంటాయి.

2. మిథ్యాపర్శుకలు: మిగిలిన పర్ముకలను మిథ్యా పర్శుకలు అంటారు. వీటిలో 8వ, 9వ, 10వ జత పర్శుకలు నేరుగా ఉరోస్థితో కలవకుండా 7వ జత పర్ముకకు చెందిన కచాభ మృదులాస్థి ద్వారా ఉరోస్థితో కలుస్తాయి. అందువల్ల వీటిని కశేరు మృదులాస్థి పర్శుకలు లేదా మిథ్యాపర్చుకలు అందురు.

3. ప్లవక పర్శుకలు: చివరి రెండు జతల పర్శుకలు (11వ మరియు 12వ) ఉదరతలంలో ఉరోస్థితో కాని, పూర్వభాగపు పర్శుకలతో కాని అంటి ఉండవు. ఇవి ఉదరతలంలో స్వేచ్ఛగా ఉంటాయి. అందువల్ల వీటిని ప్లవక పర్శుకలు అంటారు. ఉరః కశేరుకలు, పర్శుకలు, ఉరోస్థి కలసి పర్శుకల బోనును ఏర్పరుస్తాయి.

ప్రశ్న 3.
మానవుడి పూర్వాంగపు ఎముకలను పేర్కొనండి.
జవాబు:
మానవుడిలో ఒక్కో పూర్వాంగము 30 ఎముకలను కలిగి ఉంటాయి. అవి:

  1. భుజాస్థి (1):- పూర్వాంగపు ఎముకలో పొడవైన ఎముక, ఇది భుజము నుండి మోచేయి వరకు ఉంటుంది. 2) రత్ని మరియు అరత్ని (1) అమరి ఉంటాయి.
  2. ఈ ఎముకలు ముంజేయి ఎముకలు ఇవి మోచేయి మరియు మణికట్టు మధ్యలో
  3. మణిబంధకాస్థులు (8): ఇది మణికట్టు ఎముకలు, ఇవి ఎనిమిది ఎముకలు.
  4. కరభాస్థులు (5): కరభస్థులు 5, ఇవి అరచేతి ఎముకలు
  5. అంగుళ్యాస్థులు (14): ఇవి మొత్తం 14 ఎముకలు. ఇవి చేతివ్రేళ్ళలో అమరి ఉన్న ఎముకలు. ఒక్కొక్క వ్రేలిలో 3 చొప్పున ఉండి, బ్రొటన వ్రేలిలో మాత్రం రెండు ఎముకలుంటాయి.

ప్రశ్న 4.
మానవుడి కాలిలోని ఎముకలను పేర్కొనండి.
జవాబు:
మానవుడి కాలిలో (చరమాంగంలో) 30 ఎముకలుంటాయి. అవి

  1. తుంటి ఎముక లేదా తొడ ఎముక (1):- ఇది తొడ భాగంలో ఉంటుంది. ఇవి మానవశరీరంలో కెల్లా పొడవైన మరియు దృఢమైన ఎముక.
  2. అంతర్జంఘిక మరియు బహిర్జంఘిక (1.1):- ఈ రెండు ఎముకలు మోకాలికి, చీలమండ మధ్యలో అమరి ఉండి క్రింది కాలిని ఏర్పరుస్తాయి.
  3. చీలమండ ఎముకలు (7):- ఈ ఎముకలు కలిసి కాలి చీలమండను ఏర్పరుస్తాయి.
  4. ప్రపాదార్థికలు (5):- ఇవి నాళకారపు ఎముకలు.
  5. అంగుళ్యాస్థులు (14):- ప్రతిపాదం 14 అంగుళ్యాస్థులను కలిగి ఉంటాయి. ప్రతికాలి వ్రేలిలో మూడు ఎముకలు చొప్పున ఉంటాయి. కాని బ్రొటన వ్రేలిలో రెండు ఎముకలు మాత్రమే ఉంటాయి.
  6. మోకాలి చిప్ప (1):- మోకాలి కీలును కప్పి ఉంచే గిన్నె లాంటి ఎముక.

ప్రశ్న 5.
మానవుడి పూర్వాంగపు ఎముకల పటాన్ని గీయండి.
జవాబు:
AP Inter 2nd Year Zoology Study Material Chapter 3(a) కండర – అస్థిపంజర వ్యవస్థ 7

AP Inter 2nd Year Zoology Study Material Chapter 3(a) కండర – అస్థిపంజర వ్యవస్థ

ప్రశ్న 6.
శ్రేణి మేఖల చక్కని పటాన్ని గీయండి.
జవాబు:
AP Inter 2nd Year Zoology Study Material Chapter 3(a) కండర – అస్థిపంజర వ్యవస్థ 8

ప్రశ్న 7.
సైనోవియల్ కీళ్లు నిర్మాణాన్ని చక్కని పటం ద్వారా వివరించండి.
జవాబు:
రెండు ఎముకల సంధితలాల వద్ద సైనోవియల్ ద్రవం నిండిన సైనోవియల్ కుహరం కలిగి ఉండే కీళ్ళను సైనోవియల్ కీళ్ళు అంటారు.

సైనోవియల్ కీలు నిర్మాణం: సైనోవియల్ కీలును కప్పి ఉంచుతూ రెండు పొరలతో ఏర్పడిన సైనోవియల్ గుళిక ఉంటుంది. గుళిక వెలుపలి పొర క్రమరహిత తంతుయుత సంయోజక కణజాలంతో ఏర్పడి అధిక కొల్లాజెన్ తంతువులతో ఉంటుంది. ఈ పొర రెండు పర్యస్థికలను కలుపుతూ కీళ్లు సాగే గుణాన్ని నిరోధించి స్థానభ్రంశం చెందకుండా నిరోధిస్తుంది. స్థితిస్థాపక తంతువులతో కూడిన ఈ పొరలోని కొన్ని తంతువులు కట్టలుగా కలిసి బంధకాలుగా ఏర్పడతాయి.
AP Inter 2nd Year Zoology Study Material Chapter 3(a) కండర – అస్థిపంజర వ్యవస్థ 9

సైనోవియల్ గుళిక లోపలిపొర ఏరియోలార్ కణజాలంతో ఏర్పడుతుంది. ఈ పొర చిక్కని సైనోవియల్ ద్రవాన్ని స్రవిస్తుంది. సైనోవియల్ ద్రవంలో హయలురోనిక్ ఆమ్లం, భక్షక కణాలు మొదలైనవి ఉంటాయి. సైనోవియల్ ద్రవం కీళ్ల వద్ద కందెనగా పనిచేసి ఎముకల మధ్య రాపిడిని తగ్గిస్తుంది.

దీర్ఘ సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
మానవుడి అక్షాస్థిపంజరాన్ని గురించి వివరించండి ? [A.P. Mar. ’17] [Mar. ’14]
జవాబు:
దేహంలో ప్రధానాక్షంగా ఏర్పడిన అస్థి పంజరాన్ని అక్షాస్థిపంజరం అంటారు. ఇది 80 ఎముకలచే ఏర్పడుతుంది. దీనిలో పుర్రె, వెన్నెముక, ఉరోస్థి పర్శుకలు అనే భాగాలుంటాయి.
1) పుర్రె (Skull): పుర్రెలోని మొత్తం 22 ఎముకలు. కపాల, ముఖ ఎముకల సమూహాలుగా ఉంటాయి.
కపాలం: మెదడును రక్షించే పెట్టె లాంటి నిర్మాణమే కపాలం. ఇది మొత్తం 8 బల్లపరుపు ఎముకలచే నిర్మితమై ఉంటుంది. అవి

  1. లలాటికాస్థి (1): ఈ ఎముక నుదురు, కపాలం పూర్వ ఉదరభాగాన్ని, నేత్రగుళిక పైభాగాన్ని ఏర్పరుస్తుంది.
  2. కుడ్యార్థులు (2): ఇవి కపాలకుహరం పై కప్పును, పక్క భాగాలను ఏర్పరుస్తాయి.
  3. కణతాస్థులు (2): ఇవి కపాలం యొక్క పార్శ్వభాగాలను, ఉదరభాగాన్ని ఏర్పరుస్తాయి.
  4.  అనుకపాలాస్థులు (1): ఇవి కపాలం పరాంత పీఠభాగాన్ని ఏర్పరుస్తాయి.
  5. స్ఫీనకీయం (1): ఇది కపాలం పీఠ మధ్య భాగంలో ఉంటుంది. ఇది కపాలంలోని ఇతర ఎముకలన్నింటితోను అనుసంధానం చెందడం వల్ల దీన్ని కీలకమైన ఎముకగా పేర్కొనవచ్చు.
  6. సేవకం: ఇది కపాలం పీఠభాగపు పూర్వాంతం లోని ఎముక.

AP Inter 2nd Year Zoology Study Material Chapter 3(a) కండర – అస్థిపంజర వ్యవస్థ

ముఖఎముకలు: పుర్రె ముఖ ప్రాంతంలో 14 ఎముకలు ఉంటాయి.

  1. నాసికాస్థులు (2): ఇవి ముక్క పై వారధిని ఏర్పరిచే ఒకజత ఎముకలు
  2. జంభాకలు (2): ఇది పై దవడను ఏర్పరిచే జంట ఎముకలు.
  3. జైగోమాటిక్ ఎముకలు (2): ఇవి చెంపలకు ఆధారాన్ని ఇచ్చే జంట ఎముకలు.
  4. అశ్రు అస్థులు (2): ఇవి నేత్ర గుళికలలో అశ్రు గ్రంధులకు ఆధారాన్నిచ్చే ఎముకలు. ఇవి ముఖభాగంలో ఉండే అతి చిన్న ఎముకలు.
  5. తాల్వాస్థులు (2): ఇవి ఘనతాలువు పరాంతభాగాన్ని ఏర్పరచే జంట ఎముకలు
  6. నాసికాశంఖువులు (2): ఇవి నాసికాకక్ష్య పార్శ్వతలాన్ని ఆవరించి ఉండే చుట్ట వంటి ఎముకలు.
  7. సిరిక (1): ఇది నాసికాకుహరం ఉదర తలంలో ఉండే త్రిభుజాకార ఎముక.
  8. హనువు (1): ఇది కింది దవడలో ఉండే ‘U’ ఆకారపు ఎముక. పుర్రె మొత్తం ఎముకలలో కదిలే ఎముక ఇది ఒక్కటి మాత్రమే.
    AP Inter 2nd Year Zoology Study Material Chapter 3(a) కండర – అస్థిపంజర వ్యవస్థ 10

2) వెన్నెముక: మానవుని వెన్నెముకలో 26 వెన్నుపూసలు లేదా కశేరుకలు ఒక వరుస క్రమంలో ఉంటాయి.
ప్రతి కశేరుకంలో మధ్యభాగంలో ఒక ఖాళీ ప్రదేశం ఉంటుంది. దీన్ని నాడీకులు అంటారు. దీని ద్వారా వెన్నుపాము ప్రయాణిస్తుంది. పుర్రె వద్ద ప్రారంభించి. వెన్నుముకను గ్రీవాకశేరుకలు (7), ఉరఃకశేరుకలు (12), కటికశేరుకలు (5), త్రికం (1) సంయుక్త, అనుత్రిక (1) సంయుక్త ప్రాంతాలుగా విభజించవచ్చు. త్రికం, ఐదు త్రిక కశేరుకలు కలవడం వల్ల ఏర్పడిన త్రిభుజాకార ఎముక. అలాగే అనుత్రికం, నాలుగు కశేరుకలు కలిసిపోవడం వల్ల ఏర్పడిన త్రిభుజాకార ఎముక.

3) ఉరోస్థి: ఇది వక్షం ఉదర మధ్యరేఖలో అమరి ఉండే బల్లపరపు ఎముక. దీనిలో మూడుభాగాలుంటాయి. దీని అగ్రభాగాన్ని మెనూబ్రియం అనీ, మధ్యభాగాన్ని దేహం అని పరాంతంలోని నిమ్నభాగాన్ని జిఫాయిడ్ కీలితం అని అంటారు. ఉరోస్థి ఉరఃపర్శుకలు, ఉదరపర్శుకలు అంటిపెట్టుకోవడానికి ఆదార తలాన్ని ఇస్తాయి.

4) పర్శుకలు: మనవ ఛాతిలో 24 పర్శుకలు, 12 జతలుగా అమరి ఉంటాయి. ఈ ఎముకలు ఛాతిభాగంలో గల అవయవాల చుట్టూ అమరి వాటికి రక్షణిస్తాయి. ప్రతి పర్ముక బల్లపరుపుగా ఉండి పృష్ఠతలంలో వెన్నెముకతోనూ, ఉదరతలంలో ఉరోస్థితోను అతికి ఉంటుంది. ఈ పర్శుకలను మూడు రకాలుగా విభజించారు.
i) నిజపర్శుకలు లేదా కశేరు – ఉరోస్థి పర్శుకలు: మొదటి ఏడుజతల పర్శుకలను నిజపర్శుకలు అంటారు. ఇవి పృష్టి తలంలో ఉరఃకశేరుకలతోనూ, ఉదరతలంలో ఉరోస్థితోనూ కఛాభ మృదులాస్థి సహాయంతో అతికి ఉంటాయి.

ii) మిథ్యాపర్శుకలు: మిగిలిన పర్శుకలను మిథ్యా పర్శుకలు అంటారు. వీటిలో 8వ, 9వ, 10వ జతపర్శుకలు నేరుగా ఉరోస్థితో కలవకుండా 7వ జత పర్ముకకు చెందిన కచాభ మృదులాస్థి ద్వారా ఉరోస్థితో కలుస్తాయి. అందువల్ల వీటిని కశేరు మృదులాస్థి పర్శుకలు లేదా మిథ్యాపర్శుకలు అందురు.

iii) ప్లవక పర్ముకలు: చివరి రెండు జల సర్ముకలు (11వ మరియు 12వ) ఉదరతలంలో ఉరోస్థితో కాని, పూర్వభాగపు పర్శుకలతో కాని అంటి ఉండవు. ఇది ఉదరతలంలో స్వేచ్ఛగా ఉంటాయి. అందువల్ల వీటిని ప్లవక పర్శుకలు అంటారు. ఉరః కశేరుకలు, పర్శుకలు, ఉరోస్థి కలసి పర్శుకల బోనును ఏర్పరుస్తాయి.
AP Inter 2nd Year Zoology Study Material Chapter 3(a) కండర – అస్థిపంజర వ్యవస్థ 11

AP Inter 2nd Year Zoology Study Material Chapter 2(b) విసర్జక పదార్థాలు, వాటి విసర్జన

Andhra Pradesh BIEAP AP Inter 2nd Year Zoology Study Material  Lesson 2(b) విసర్జక పదార్థాలు, వాటి విసర్జన Textbook Questions and Answers.

AP Inter 2nd Year Zoology Study Material Lesson 2(b) విసర్జక పదార్థాలు, వాటి విసర్జన

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
మూత్రపిండంలోపలికి, వెలుపలికి వెళ్ళే రక్తనాళాల పేర్లను తెలపండి.
జవాబు:
మూత్రపిండంలోనికి వచ్చే రక్తనాళం – వృక్కధమని
మూత్రపిండం నుండి బయటకు వచ్చే నాళం – వృక్కసిర

ప్రశ్న 2.
వృక్క శృంగాలు, వృక్క సూక్ష్మాంకురాలు అంటే ఏమిటి ?
జవాబు:
మూత్రపిండం దవ్వభాగంలో ఉన్న శంఖాకార నిర్మాణాలను వృక్క శృంగాలు అంటారు. వృక్క శృంగాల యొక్క మొనదేలిన కొనలను వృక్క సూక్ష్మాంకురాలు అని అందురు.

AP Inter 2nd Year Zoology Study Material Chapter 2(b) విసర్జక పదార్థాలు, వాటి విసర్జన

ప్రశ్న 3.
బెర్టిని స్తంభాలు అంటే ఏమిటి ? [T.S. Mar. ’17]
జవాబు:
మూత్రపిండం దవ్వభాగంలో ఉన్న శంఖాకార వృక్క శృంగాలను వేరుచేస్తూ వల్కల ప్రొతాలు (Projections) ఉంటాయి. వీటిని బెర్టిని స్తంభాలు అంటారు.

ప్రశ్న 4.
మూత్రపిండంలో క్రియాత్మక, నిర్మాణాత్మక ప్రమాణం ఏది? దీనిలోని రెండు ముఖ్యమైన నిర్మాణాత్మక ప్రమాణాలు ఏవి?
జవాబు:
మూత్రపిండం యొక్క క్రియాత్మక, నిర్మాణాత్మక ప్రమాణం – నెప్రాన్ లేదా వృక్కప్రమాణం. వృక్కప్రమాణంలో రెండు ముఖ్యమైన భాగాలుంటాయి. అవి 1. మాల్ఫీగియన్ దేహం 2. సంవళిత నాళం

ప్రశ్న 5.
వల్కలం, జక్స్ మెడుల్లరీ నెఫ్రాన్స్ మధ్య తేడాలు తెలుపండి.
జవాబు:
చాలా వృక్క ప్రమాణాల యొక్క మాల్ఫీగియదేహం వృక్క వల్కలలో ఉండి, హెన్లీశిక్యం చాలా చిన్నగా ఉండి కొద్ది భాగం దవ్వలోకి వ్యాపించి వుంటుంది. ఇలాంటి వాటిని వల్కల వృక్క ప్రమాణాలు అంటారు. వల్కల వృక్క ప్రమాణాలలో వాసారెక్టా ఉండదు లేదా క్షీణించి ఉంటుంది.

కొన్ని వృక్క ప్రమాణాలు వృక్క దవ్వకు దగ్గరగా ఉండి, హెనీ శిక్యాలు చాలా పొడవుగా ఉండి దవ్వ లోపలి భాగానికి చేరతాయి. వీటిని జక్స్ మెడుల్లరీ వృక్క ప్రమాణాలు అంటారు. వీటిలో బాగా అభివృద్ధి చెందిన వాసారెక్టా ఉంటుంది.

ప్రశ్న 6.
గుచ్ఛగాలనాన్ని నిర్వచించండి. [A.P. Mar. ’17 Mar. ’14]
జవాబు:
బౌమన్ గుళిక కుహరంలేని ద్రవపు నికర పీడనం కంటే గ్లోమిరులన్లోని నికర పీడనం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల రక్తంలోని నీళ్ళు, నీటిలో కరిగిన పదార్థాలు బౌమన్ గుళికల కుడ్యాల లోని స్తరాల ద్వారా పీడనగాలనం చెంది బౌమన్ గుళిక కుహరంలోకి చేరుతాయి. ఈ ప్రక్రియనే గుచ్ఛగాలనం అంటారు.

ప్రశ్న 7.
కేశనాళికా గుచ్ఛగాలన రేటును నిర్వచించండి.
జవాబు:
రెండు మూత్రపిండాలు నిమిషానికి ఉత్పత్తిచేసే గాలిత ద్రవ పరిమాణాన్ని కేశనాళికా గుచ్ఛ గాలితరేటు అంటారు. ఆరోగ్యవంతుడైన వ్యక్తిలో గాలితరేటు సుమారు 125 మి.లీ/ని ఉంటుంది.

ప్రశ్న 8.
తప్పనిసరి పునఃశోషణ అంటే ఏమిటి ? ఇది నెఫ్రాన్లోని ఏ భాగంలో జరుగుతుంది ?
జవాబు:
ఆరోగ్యవంతుడైన వ్యక్తిలో కేశనాళిక గుచ్ఛగాలనరేటు సుమారు 125 మి॥లీ/ని॥ అంటే రోజుకు 180 లీ॥ ఉంటుంది. ఇందులో 85% గాలిత ద్రవం ఎప్పుడూ, ఎలాంటి నియంత్రణ లేకుండా హెన్లీ శిక్యపు అవరోహ, ఆరోహనాళిక ద్వారా పునఃశోషణ చెందుతుంది. దీనినే తప్పని సరి పునఃశోషణ అంటారు.

ప్రశ్న 9.
జక్స్ గ్లామరులార్ కణాలు, మాక్యుల డెన్సాల తేడాలను తెలపండి.
జవాబు:
మాక్యులడెన్సా పక్క భాగంతో పాటు అభివాహి ధమనిక గోడలు నునుపు కండర కణాలుగా రూపాంతరం చెందుతాయి. ఈ కణాలను జక్స్ గ్లామరులార్ కణాలు అందురు.
దూరాగ్ర సంవళిత నాళిక అభివాహి ధమనితో అతుక్కుంటుంది. ఈ భాగంలో నాళిక భాగంలోని కణాలు బాగా దట్టంగా ఉంటాయి. వీటి అన్నింటిని కలిపి మాక్యులా డెనా అందురు.

ప్రశ్న 10.
జక్ట్స్ గ్లామరులార్ పరికరం అంటే ఏమిటి ?
జవాబు:
మాక్యుల డెన్సా జక్స్ గ్లామరులార్ కణాలు కలిసి ఏర్పడిన దానిని జక్ట్స్ గ్లామరులార్ పరికరం అంటారు.

ప్రశ్న 11.
రెనిన్, రెన్నిన్ ఎన్జైముల మధ్యతేడా ఏమిటి ? [T.S. & A.P. Mar 16]
జవాబు:
రెనిన్: జక్టా గ్లామరులార్ పరికరంలోని జక్టా గ్లామరులార్ కణాలు రెనిన్ అనే ఎన్జైము స్రవిస్తాయి. ఈ ఎన్జైమ్ ఆంజియోటెన్సినోజనన్ను ఆంజియోటెన్సిన్గా మారుస్తుంది.
రెన్నిన్: ఇది శిశువుల జఠర రసంలో ఉండే ఒక ఎన్ఎమ్. ఇది పాలలోని కెసిన్ అనే ప్రోటీన్ ను, కాల్షియం అయానుల సమక్షంలో కాల్షియం పారాకేసినేట్గా మారుస్తుంది.

AP Inter 2nd Year Zoology Study Material Chapter 2(b) విసర్జక పదార్థాలు, వాటి విసర్జన

ప్రశ్న 12.
ద్రవాభిసరణ క్రమత అంటే ఏమిటి ?
జవాబు:
నీరు, నీటిలో కరిగి ఉండే ద్రావితాలను సమతాస్థితిలో ఉంచుట కొరకు నిర్వహించే ప్రక్రియను ద్రవాభిసరణ క్రమత అంటారు.

ప్రశ్న 13.
మూత్రం ఏర్పడటంలో కర్ణిక నాట్రియురిటిక్ పెప్టైడ్ పాత్ర ఏమిటి ? .
జవాబు:
అధికంగా రక్తం యొక్క పరిమాణం పెరగడం వల్ల, గుండె కుడి కర్ణికలో రక్త ప్రవాహం పెరిగి దాని గోడలు సాగడం వల్ల కర్ణికా నాట్రియురిటిక్ పెప్టైడ్ విడుదల అవుతుంది. ఇది సమీప సంవళిత నాళం వద్ద నీరు, Na* ల శోషణను తగ్గిస్తుంది.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
భూచర జీవులు సాధారణంగా యూరియోటెలిక్ లేదా యూరికోటెలిక్ కాని అమ్మోనోటెలిక్ కావు. ఎందుకు ?
జవాబు:
ప్రోటీన్లు న్యూక్లికామాల విచ్ఛిన్నక్రియలో అమ్మోనియా ఉప ఉత్పన్నంగా ఏర్పడుతుంది. నీటిలభ్యతను బట్టి అమ్మోనియా అదేరూపంలో లేదా యూరియా, యూరికామ్లంగా మార్చబడి విసర్జింపబడుతుంది.

అమ్మోనియా అత్యంత విషపూరితమైనది. నీటిలో అమ్మోనియా కరగడం వల్ల నీటిలభ్యత అధికంగా ఉండటం వల్ల జలచరజీవులు అమ్మోనియా రూపంలోనే విసర్జిస్తాయి. ఒక గ్రాము అమ్మోనియా విసర్జనకు సుమారు 300 500ml గ్రాముల నీరు అవసరం అవుతుంది.

భూచర జీవులు నీటి సంరక్షణకై అమ్మోనియాను తక్కువ విష ప్రభావం గల నత్రజని వ్యర్థాలైన యూరియా మరియు యూరిక్ ఆమ్లాల రూపంలో మార్చి విసర్జిస్తాయి. యూరియా అమ్మోనియా కంటే 10,000 రెట్లు తక్కువ విష ప్రభావం కలది. మరియు విసర్జన క్రియలో అమ్మోనియా కంటే పదిరెట్ల తక్కువ నీరు సరిపోతుంది.

అలాగే యూరిక్లామ విసర్జనకు అమ్మోనియా విసర్జనకంటే యాభైరెట్లు తక్కువ నీరు అవసరం. కాబట్టి నీరు తక్కువగా లభించే జీవులు లేదా భూచర జీవులు సాధారణంగా యూరియోటెలిక్ లేదా యూరికోటెలిక్.

ప్రశ్న 2.
నత్రజని విసర్జకాలను అనుసరించి సకశేరుకాలను ఉదాహరణలతో గుర్తించండి.
జవాబు:
నత్రజని విసర్జకాలను అనుసరించి సకశేరుకాలను మూడు రకాలుగా వర్గీకరించారు. అవి
1. అమ్మోనోటెలిక్ జంతువులు: అమ్మోనియాను ముఖ్య నత్రజని వ్యర్థపదార్థంగా విసర్జించే జంతువులను అమ్మోనోటెలిక్ జంతువులని అంటారు.
ఉదా: అస్థి చేపలు

2. యూరియోటెలిక్ జంతువులు: యూరియాను ముఖ్య నత్రజని వ్యర్థంగా విసర్జించే జంతువులను యూరియోటెలిక్ జంతువులు అని అంటారు.
ఉదా: వానపాములు, మృదులాస్థి చేపలు, చాలావరకు ఉభయ చరాలు, క్షీరదాలు యూరియాను విసర్జిస్తాయి.

3. యూరికోటెలిక్ జంతువులు: యూరిక్ ఆమ్లాన్ని ముఖ్య నత్రజని వ్యర్ధంగా విసర్జించే జంతువులను యూరికోటెలిక్
జంతువులు అని అంటారు.
ఉదా: సరీసృపాలు, పక్షులు

ప్రశ్న 3.
మూత్రపిండం నిలువుకోత పటం గీచి భాగాలను గుర్తించండి.
జవాబు:
AP Inter 2nd Year Zoology Study Material Chapter 2(b) విసర్జక పదార్థాలు, వాటి విసర్జన 1

ప్రశ్న 4.
మానవ మూత్రపిండం అంతర్నిర్మిణాన్ని వివరించండి.
జవాబు:
మూత్రపిండం చిక్కుడు గింజ ఆకారంలో ఉండి, వెలుపలితలం కుంభాకారంగాను, లోపలి తలం మధ్య హైలమ్ అనే లోతైన నొక్కుతో ఉంటుంది.

  • మూత్రపిండం నిలువుకోతలో రెండు నిర్దిష్ట భాగాలు కనిపిస్తాయి. అది వెలుపలి వల్కలం, లోపలి దవ్వ
  • దవ్వ అనేక శంఖాకార నిర్మాణాలుగా విభజింపబడుతుంది. వీటిని వృక్క శృంగాలు అని అంటారు.
  • ఈ వృక్క శృంగాలను వేరుచేస్తూ వల్కల ప్రొతాలు ఉంటాయి. వీటిని బెర్టిని స్తంభాలు అంటారు.
  • వృక్కశృంగాల మొనదేలిన కొనలను వృక్క సూక్ష్మాంకురాలు అంటారు.
  • ప్రతి వృక్క శృంగ ఆధారం వల్కలం, దవ్వ మధ్యగల సరిహద్దు నుంచి ఏర్పడి వృక్క సూక్ష్మాంకురంలో అంతమవుతుంది.
  • గరాటు ఆకారద్రోణి ఏర్పర్చిన కప్పులాంటి కేలిసెస్లోకి వృక్క సూక్ష్మాంకురాలు చొచ్చుకొని ఉంటాయి. ద్రోణి మూత్రపిండం వెలుపలికి మూత్రనాళంగా ఏర్పడుతుంది.
  • మూత్రపిండంలో సుమారు ఒక మిలియన్ నిర్మాణాత్మక, క్రియాత్మక వృక్క ప్రమాణాలు ఉంటాయి.
  • మూత్ర పిండంలో గల హైలమ్ ద్వారానే వృక్కధమని నాడులు, మూత్రపిండంలోనికి అలాగే వృక్కసిర, వృక్కనాళం బయటకి వస్తాయి.

AP Inter 2nd Year Zoology Study Material Chapter 2(b) విసర్జక పదార్థాలు, వాటి విసర్జన

ప్రశ్న 5.
మూత్రవిసర్జనను తెలపండి.
జవాబు:
మూత్రాన్ని విసర్జించే ప్రక్రియను మూత్రవిసర్జన (మిక్టురిషన్) అంటారు. ఇందులో ఉన్న నాడీ యాంత్రికతను మిక్టురిషన్ రిఫ్లెక్స్ అంటారు.
వృక్క ప్రమాణాలలో ఏర్పడిన మూత్రం మూత్రనాళాల ద్వారా మూత్రాశయాన్ని చేరి నిల్వ ఉంటుంది. కేంద్రనాడీ వ్యవస్థ నుంచి నియంత్రిత ప్రేరణ వచ్చే వరకు మూత్రం నిల్వ ఉంటుంది. ఈ సంకేతం మూత్రాశయం మూత్రంతో నిండుతూ సాగడం వల్ల ప్రారంభమవుతుంది. ఫలితంగా దాని గోడలలోని సాగుదలను గుర్తించే గ్రాహకాలు ఉత్తేజితమై మొదడుకు ప్రచోదనాలను పంపుతాయి. ఫలితంగా కేంద్రనాడీవ్యవస్థ చాలక సంకేతాలు మూత్రశయ నునుపు కండరాల సంకోచాన్ని, ప్రసేక సంవరణి సడలింపును ఏకకాలంలో కలుగజేసి మూత్రాన్ని విడుదల చేయిస్తాయి.

ప్రశ్న 6.
మూత్రపిండం విధులలో జక గ్లామరులార్ పరికరం పాత్ర ఏమిటి ?
జవాబు:
మాక్యుల డెనా, జెక్ట్స్ గ్లామరులార్ కణాలు కలిసి జక గ్లామరులార్ పరికరం ఏర్పడుతుంది. కేశనాళిక గుచ్ఛరక్త ప్రవాహం | రక్తపీడనం పడిపోయినప్పుడు జక్ట్స్ గ్లామరులార్ కణాలు చైతన్యపరచబడి రక్తంలోని రెనిన్ అనే ఎన్జైమ్ను విడుదల అయ్యేలా చేస్తుంది. ఈ ఎన్జైమ్ ఆంజియోటెన్సినోజనను ఆంజియోటెన్సిన్ – Iగా, ఆంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎన్జైమ్ వల్ల ఆంజియోటెన్సిన్ II గా మారుతుంది. ఆంజియోటెన్సిన్ -II అధివృక్క గ్రంథిలోని వల్కలాన్ని ప్రేరేపించి ఆల్డోస్టిరాన్ హార్మోన్ ను స్రవించేటట్లు చేస్తుంది. ఆల్డోస్టిరాన్ దూరాగ్ర సంవళిత నాళం, సంగ్రహణనాళం నుంచి Na+, నీటిపున:శోషణను ప్రేరేపించడం వల్ల మూత్రంలో వీటి నష్టం జరగదు. అంతేకాకుండా K+ అయాన్లను స్రవించడంలో ఆల్డోస్టిరాన్ ముఖ్యపాత్ర వహిస్తుంది. ‘దీని వల్ల రక్తపీడనం, కేశనాళికాగుచ్ఛ ‘గాలిత రేటు పెరుగుతాయి. ఈ క్లిష్ట యాంత్రికను రెనిన్ – ఆంజియోటెన్సిన్ – ఆల్డోస్టిరాన్ వ్యవస్థ అంటారు.

ప్రశ్న 7.
ప్రతి ప్రవాహ యాంత్రికతను గురించి వ్రాయండి.
జవాబు:
క్షీరదాలు గాఢ మూత్రాన్ని ఉత్పత్తి చేసే సామర్థ్యం కలిగి ఉంటాయి. హెన్లీ శిక్యం, వాసారెక్టా దీనిలో ప్రముఖపాత్ర వహిస్తాయి. హెనీ శిక్యంలోని రెండు నాళాలలో వృక్క గాలిత ద్రవం వ్యతిరేకదిశలో ప్రవహించి ప్రతి ప్రవాహాన్ని ఏర్పరుస్తుంది. వాసారెక్టాలో కూడా రక్తం ఇదే తరహాలో ప్రవహిస్తుంది. హెన్లీశిక్యం, వాసారెక్టాలు దగ్గరగా ఉండటం, వృక్క ద్రవం, రక్తం మధ్య ప్రతి ప్రవాహం వల్ల దవ్వ మధ్యాంతర లోపల ఆస్మోలారిటి పెంచడానికి దోహదపడతాయి. ఇది వల్కలంలో 300 m Osm//లీ నుంచి దవ్వలో దాదాపు 1200 m Osm//లీ॥ ఉంటుంది. ఈ ప్రవణతకు కారణం NaCl, యూరియా. NaCl హెన్లీ శిక్యం ఆరోహ నాళిక నుంచి బయటికి వచ్చి వాసారెక్టా అవరోహనాళం రక్తంలోకి చేరుతుంది. తరువాత వాసారెక్టా ఆరోహ నాళిక నుంచి NaCl మధ్యాంతరం చేరుతుంది. హెన్లీశిక్యం ఆరోహనాళిక లోకి కొద్దిపాటి యూరియా ప్రవేశించి, తిరిగి సంగ్రహణ నాళం ద్వారా మధ్యాంతరం చేరుతుంది. పైన వివరించిన రవాణా చర్యలన్నీ హెన్లీశిక్యం, వాసారెక్టాలలో ప్రత్యేక అమరిక ద్వారా ఏర్పడిన ప్రతి ప్రవాహ యాంత్రికత వల్ల సాధ్యమవుతుంది. ఈ యాంత్రికత దవ్వ మధ్యాంతరంలో గాఢత ప్రవణతను కొనసాగించడానికి తోడ్పడుతుంది. మధ్యాంతర ప్రవణత వల్ల సంగ్రహణ నాళంలోని నీరు ద్రవాభిసరణ వల్ల దవ్వలోకి, దాని నుంచి వాసారెక్టాలోకి ప్రవహించడం వల్ల గాఢమైన మూత్రం ఏర్పడటం జరుగుతుంది. మానవుడిలో మొదటగా ఏర్పడిన గాలిత ద్రవానికి నాలుగు రెట్లు గాఢమైన మూత్రం ఏర్పడుతుంది.

ప్రశ్న 8.
గ్లామరులార్ గాలనరేటు స్వీయ నియంత్రణ యాంత్రికతను తెలపండి.
జవాబు:
మూత్రపిండాలు, గ్లామరూలార్ గాలనారేటు నియంత్రణకు స్వీయ నియంత్రణ వ్యవస్థను కలిగి ఉంటుంది. ఈ స్వీయ నియంత్రణను జక్స్ గ్లామరూలర్ పరికరం నిర్వహిస్తుంది. ప్రతివృక్క ప్రమాణంలో అభివాహి ధమనిక దూరస్థ సంవళిత నాళికతో సంబంధాన్ని ఏర్పర్చుకొనే ప్రాంతంలో జక్స్ గ్లామరులార్ పరికరం ఉంటుంది. మాక్యులడెనా, జెక్టా గ్లామరులార్ కణాలు కలిసి జక్స్ గ్లామరులార్ పరికరం ఏర్పడుతుంది.

కేశనాళికా గుచ్ఛ రక్త ప్రవాహం / రక్తపీడం లేదా గాలనరేటు పడిపోయినప్పుడు జక్స్ గ్లామరులార్ కణాలు చైతన్యపరచబడి రక్తంలోని రెనిన్ అనే ఎన్జైమ్ విడుదల అయ్యెలా చేస్తుంది. ఈ ఎన్జైమ్ ఆంజియోటెన్సినన్ను ఆంజియోటెన్సిన్ – I గా, ఆంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎన్జైమ్ వల్ల ఆంజియోటెన్సిన్ – II గా మారుతుంది. ఆంజియోటెన్సిన్ – II అధివృక్క గ్రంథిలోని వల్కలాన్ని ప్రేరేపించి ఆల్డోస్టిరాన్ హార్మోనును స్రవించేటట్లు చేస్తుంది. ఆల్డోస్టిరాన్ దూరాగ్ర సంవళిత నాళం, సంగ్రహణ నాళం నుంచి Na+, నీటి పునఃశోషణను ప్రేరేపించడం వల్ల మూత్రంలో వీటి నష్టం జరగదు. అంతేకాకుండా K+ అయాన్లను స్రవించడంలో ఆల్డోస్టిరాన్ ముఖ్యపాత్ర వహిస్తుంది. దీనివల్ల రక్తపీడనం మరియు గ్లామరులార్ గాలన రేటు పెరుగుతాయి.

ప్రశ్న 9.
విసర్జనలో కాలేయం, ఊపిరితిత్తులు, చర్మం పాత్రను వివరించండి.
జవాబు:
మూత్రపిండాలకు అదనంగా కాలేయం, ఊపిరితిత్తులు మరియు చర్మం వ్యర్థ పదార్థాల విసర్జనకు తోడ్పడతాయి.
కాలేయం: కాలేయం మన శరీరంలో అతి పెద్ద గ్రంథి. వయసుడిగిన (RBC) ల నుంచి విచ్ఛిత్తి చెందిన హీమోగ్లోబిన్ ను బైల వర్ణకాలైన, బైల్రూబిన్, బైల్వర్డిన్ మారుస్తుంది. ఈ వర్ణకాలు పైత్యరసంలో ఆహారనాళాన్ని చేరి విసర్జింపబడతాయి. కాలేయం కొలెస్టిరాల్, పతనం చెందిన స్టిరాయిడ్ హార్మోన్లను, కొన్ని విటమిన్లను, మందులను పైత్యరసంతో పాటు విసర్జిస్తుంది. ఊపితిత్తులు: సాధారణ స్థితిలో ఊపిరితిత్తులు రోజుకు 18 లీ॥ CO2 ను 300 500 మి॥లీ నీటిని (తేమ) వెలుపలికి పంపుతాయి. అంతేకాకుండా బాష్పశీల పదార్థాలను ఊపిరితిత్తులు వెలుపలికి పంపిస్తాయి.

AP Inter 2nd Year Zoology Study Material Chapter 2(b) విసర్జక పదార్థాలు, వాటి విసర్జన

చర్మం: మానవుడి చర్మంలోని రెండు రకాల గ్రంధులు వాటి స్రావకాలతో కొన్ని పదార్థాలను విసర్జిస్తాయి.
i) స్వేదగ్రంథులు: స్వేదం(చెమట)ను స్రవిస్తాయి. శరీర ఉపరితలానికి చలువ చేయడం దీని ప్రథమ విధి, అంతేకాకుండా
ఇది (NaCl) కొద్దిపాటి యూరియాను, లాక్టిక్ ఆమ్లాన్ని మొదలైన వాటిని తొలగిస్తుంది.

ii) చర్మవసాగ్రంథులు: తైలగ్రంథులు “సీబం” ను స్రవిస్తాయి. దీని ద్వారా స్టీరాల్స్, హైడ్రోకార్బన్స్, వాక్స్లను తొలగిస్తాయి. ఈ స్రావకం చర్మంపై రక్షణగా తైలం పూతను ఏర్పరుస్తుంది.

ప్రశ్న 10.
క్రింది వాటిని పేర్కొనండి.
(a) ప్రాథమిక వృక్కాలు ఉన్న కార్డేటాజీవి.
జవాబు:
సిపాలో కార్డెటా

(b) మానవుడి మూత్రపిండంలో దవ్య శృంగాల మధ్యకు చొచ్చుకొని ఉన్న వల్కల భాగం.
జవాబు:
బెర్టిని స్తంభాలు

(c) హెన్లీ శిక్యానికి సమాంతరంగా ఉన్న కేశ రక్తనాళికల వల.
ప్రశ్న
వాసారెక్టా

(d) హరిత గ్రంథులను విసర్జక నిర్మాణాలుగా కలిగి ఉన్న అకశేరుకం.
ప్రశ్న
క్రస్టేషియన్లు

దీర్ఘ సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
మానవ విసర్జక వ్యవస్థను, వృక్క ప్రమాణం నిర్మాణాన్ని వివరించండి. (T.S) (Mar. ’15)
జవాబు:
మానవుడి విసర్జక వ్యవస్థలో ఒక జత మూత్రపిండాలు, ఒక జత మూత్రనాళాలు, ఒక మూత్రాశయం, ప్రసేకం ఉంటాయి.
AP Inter 2nd Year Zoology Study Material Chapter 2(b) విసర్జక పదార్థాలు, వాటి విసర్జన 2

మూత్రపిండాలు: ఇవి చిక్కుడు గింజ ఆకారంలో, ముదురు ఎరుపు రంగులో కశేరుదండానికి ఇరువైపులా చివరి ఉర:కశేరుకం, మూడవ కటి కశేరుకం మధ్యలో తిరో ఆంత్రవేష్టన త్వచంతో ఆవరించబడి శరీరకుడ్యానికి అతుక్కొని ఉంటాయి. కాలేయం వల్ల ఎడమ మూత్రపిండం కంటే కుడి వైపుది కొద్దిగా దిగువగా అమరి ఉంటుంది.
మూత్రపిండం వెలుపలి తలం కుంభాకారంగాను లోపలితలం పుటాకారంగా ఉండి మధ్యలో హైలమ్ అనే నొక్కు ఉంటుంది. హైలమ్ ద్వారానే వృక్కధమని, నాడులు మూత్రపిండంలోకి, వృక్కసిర వృక్కనాళం బయటికి వస్తాయి. మూత్రపిండాన్ని ఆవరించి దృడమైన తంతుయుత గుళిక ఉండి లోపలి మృదుతలాన్ని రక్షిస్తుంది.

మూత్రనాళాలు: ఇవి మూత్రపిండాల ద్రోణి నుంచి వెలువడే సన్నటి తెల్ల నాళాలు. వీటి కుడ్యాల తలం మధ్యాంతర ఉపకళచే ఏర్పడింది. ఇవి కిందికి ప్రయాణించి మూత్రాశయంలోకి తెరచుకుంటాయి.

మూత్రాశయం: మూత్రాశయం బేరిపండు ఆకారంలో గల కండరయుత అవయవం. ఇది ఉదర కుహరం దిగువ మధ్యభాగంలో ఉండే నిలువ కోశం. మూత్రాశయ మెడభాగం ప్రసేకంలోకి ప్రవేశిస్తుంది. ప్రసేకం స్త్రీలలో యోని రంధ్రం వద్ద, పురుషులలో మేహనం కొన వద్ద తెరచుకొంటుంది.

AP Inter 2nd Year Zoology Study Material Chapter 2(b) విసర్జక పదార్థాలు, వాటి విసర్జన

వృక్క ప్రమాణ నిర్మాణం: ఒక్కొక్క మూత్రపిండంలో సుమారు ఒక మిలియన్ నిర్మాణాత్మక, క్రియాత్మక వృక్క ప్రమాణాలు ఉంటాయి. ప్రతి వృక్క ప్రమాణంలో మాల్ఫీగియన్ దేహం మరియు వృక్కనాళిక అనే రెండు భాగాలుంటాయి.

i) మాల్ఫీజియన్ దేహం: ఇది మూత్రనాళిక ప్రారంభభాగం మూత్రపిండ వల్కలంలో ఉంటుంది. దీనిలో భౌమన్ుళిక, రక్తకేశనాళికాగుచ్ఛం అనే రెండు భాగాలుంటాయి.
AP Inter 2nd Year Zoology Study Material Chapter 2(b) విసర్జక పదార్థాలు, వాటి విసర్జన 3
a) బౌమన్ గుళిక: బౌమన్ గుళిక రెండుపొరలలో నిర్మితమైన గిన్నె వంటి భాగం. ప్రతిపొర ఒక వరుసలో ఉన్న వల్కల ఉపకళతో ఏర్పడుతుంది. బౌమన్ గుళిక లోపలి పాదాకణాలు అనే ప్రత్యేక కణాలను కలిగి ఉంటుంది.

b) రక్త కేశనాళికాగుచ్ఛం: బౌమన్ గుళికలో ఇమిడి ఉన్న సాంద్రీయ రక్తనాళికాప్లక్షాన్ని రక్తకేశనాళికాగుచ్ఛం లేదా గ్లోమెరులస్ అంటారు. ఇది వృక్క ధమని నుంచి ఏర్పడిన అభివాహి వృక్క ధమనికచే ఏర్పడుతుంది. రక్తనాళికా గుచ్ఛం నుండి రక్తాన్ని తక్కువ వ్యాసం గల అపవాహి వృక్క ధమనిక తీసుకుపోతుంది. బౌమన్ గుళిక లోపలి పొరలో గల పాద కణాలు ప్రతి కేశనాళికను చుట్టి ఉంటాయి. పాదకణాలు చిక్కైన అమరికతో గాలన చీలికలు లేదా చీలిక రంధ్రాలు అనే సూక్ష్మ అంతరాలను ఏర్పరుస్తాయి. కేశనాళికల అంతర సరకణాలకు అనేక రంధ్రాలు లేదా సుషిరాలు ఉంటాయి.

ii) వృక్క నాళిక: ఇది బౌమన్ గుళిక వెనుకగల మెడభాగం నుండి ఏర్పడిన సన్నని, పలుచని నాళిక. వృక్కనాళికను ముఖ్యంగా మూడు భాగాలుగా గుర్తించవచ్చు అవి సమీప సంవళిత నాళిక, హెన్లీశిక్యం మరియు దూరాగ్ర సంవళిత నాళిక.

a) సమీప సంవళిత నాళిక: ఇది బౌమన్ గుళిక తరువాత మెలికలు తిరిగిన/ నాళికా భాగం. వల్కలంతో దవ్వ సరిహద్దుకు దగ్గరగా ఉంటుంది.

b) హెన్లీశిక్యం: ఇది సమీప సంవళిత నాళిక తరువాత ప్రారంభమయ్యే “U” ఆకారంలో ఉన్న సన్నటి నాళిక. ఇది దవ్వ పరిధీయ భాగంలో ప్రారంభమై దవ్వ ద్వారా ప్రయాణించి శృంగాలలోకి ప్రవేశిస్తుంది. హెన్లీశిక్యంలో అవరోహనాళిక, ‘ఆరోహనాళిక అను భాగాలుంటాయి. ఆరోహనాళిక పూర్వభాగం పలుచగా, పరభాగం మందంగా ఉంటాయి. మందమైన ఆరోహనాళిక దూరాగ్ర సంవళిత నాళికతో కలుస్తుంది.

c) దూరాగ్ర సంవళిత నాళిక: ఈ నాళం వల్కలం లోపలి అంచుకు దగ్గరగా ఉండి మెలికలు తిరిగిన నాళికాభాగం. ఈ నాళం వల్కలంలో ప్రారంభ సంగ్రహణ నాళంలోకి దారి తీస్తుంది.

సంగ్రహణ నాళం: ప్రారంభ సంగ్రహణ నాళాలు కొన్ని కలిసి నిటారు సంగ్రహణ నాళంగా ఏర్పడి దవ్వ శృంగాల గుండా ప్రయాణిస్తుంది. దవ్వలో ప్రతి శృంగ నాళికలు కలిసి బెల్లిని నాళం ఏర్పడుతుంది. ఈ నాళం చివరిగా వృక్క సూక్ష్మాంకురం అగ్రభాగాన తెరచుకుంటుంది. ఈ నాళంలేని పదార్థాలు వృక్క కేలిక్స్ ద్వారా వృక్క ద్రోణిలోకి పంపబడతాయి.

వృక్క ప్రమాణం యొక్క కేశనాళికా వ్యవస్థ: రక్తనాళికా గుచ్ఛం నుండి వెలువడిన అపవాహి ధమనిక వృక్క నాళిక చుట్టూ చక్కటి పరినాళికా కేశనాళికా ప్లక్షం వలను ఏర్పరుస్తుంది. హెన్లీశిక్యాన్ని ఆవరించిన పరినాళికా కేశనాళికా ప్లక్షాన్ని వాసారెక్టా అంటారు. వల్కల వృక్క ప్రమాణాలలో వాసారెక్టా ఉండదు. లేదా బాగా క్షీణించి ఉంటుంది. జట్టా మెడుల్లరీ వృక్క ప్రమాణాలలో బాగా అభివృద్ధి చెందిన వాసారెక్టా ఉంటుంది.

ప్రశ్న 2.
మూత్రం ఏర్పడే విధానాన్ని వివరించండి.
జవాబు:
మూత్రం ఏర్పడే విధానంలో మూడు ప్రక్రియలు ఉంటాయి అవి

  1. గుచ్ఛగాలనం
  2. వరణాత్మక పునఃశోషణం
  3. నాళికాస్రావం.

1. గుచ్ఛగాలనం: బౌమన్ గుళికలో రక్తనాళికా గుచ్ఛం ద్వారా రక్త గాలన ప్రక్రియ మూత్రం ఏర్పడే విధానంలో మొదటిదశ. ఈ ప్రక్రియలో రక్తంలోని ప్లాస్మా (ప్రోటీన్లు తప్ప) వడపోత పీడనం వల్ల బౌమన్ గుళిక కుడ్యాలలోని స్తరాల గుండా సూక్ష్మగాలనం చేయబడి బౌమన్ గుళిక కుహరంలోకి చేరుతుంది. దీన్ని గుచ్ఛగాలనం అంటారు.
రక్తకేశనాళికా గుచ్ఛం ద్వారా ప్రవహించే రక్త జలస్థితిక పీడనం 60 మి.మీ. Hg ఉంటుంది. దీనికి వ్యతిరేకంగా రక్త కొల్లాయిడ్ ఆస్మాటిక్ పీడనం 32 మి.మీ. Hg, గుళిక జలస్థితిక పీడనం 18 మి.మీ. Hg ఉంటాయి. నికర వడపోత పీడనం 10 మి.మీ. Hg (60 – (32 + 18) = 10). మూత్రపిండాలు నిముషానికి సరాసరి 1100 1200 మి.లీ. రక్తాన్ని గాలనం చేస్తాయి. ఇది సుమారుగా 1/5 వంతు హార్దిక వెలువరింతకు సమానం. ఈ పీడనం వల్ల రక్తం రక్తకేశనాళికల అంతరస్తర కణాలు, బౌమన్ గుళిక ఆధార స్తరం, పాదకణాలు కలిసి ఏర్పరచిన మూడు పొరల గాలన స్తరం గుండా వడపోయబడుతుంది. రక్తం చీలిక రంధ్రాలు లేదా సుషిరాలద్వారా నికర వడపోత పీడనం వల్ల గాలనం జరుగుతుంది. కాబట్టి దీన్ని సూక్ష్మగాలనం అంటారు. గాలిత ద్రవంలో ప్రోటీన్లు తప్ప ప్లాస్మా పదార్థాలు అన్నీ ఉంటాయి. ఫలితంగా ఏర్పడిన ద్రవాన్ని కేశ నాళికా గుచ్ఛ గాలిత ద్రవం లేదా ప్రాథమిక మూత్రం అంటారు. ఇది వల్కల ద్రవానికి అల్పగాఢతలో ఉంటుంది. ఈ ద్రవం వృక్కనాళిక తరవాతి భాగంలోకి ప్రవేశిస్తుంది.

AP Inter 2nd Year Zoology Study Material Chapter 2(b) విసర్జక పదార్థాలు, వాటి విసర్జన

2. వరణాత్మక పునఃశోషణం: ఆరోగ్యకరమైన వ్యక్తిలో గాలితరేటు సుమారు 125 మి॥లీ॥/ని. ఇందులో సుమారు 99% గాలిత ద్రవం వృక్కనాళికల ద్వారా పునఃశోషణ చెందుతుంది. ఈ ప్రక్రియలో అవసరమైన పదార్థాలు శోషించబడి వ్యర్థాలు వదిలి వేయబడతాయి. దీన్ని వరణాత్మక పునఃశోషణం అంటారు. దాదాపు 85% గాలిత ద్రవం ఎప్పుడూ, ఎలాంటి నియంత్రణ లేకుండా పునఃశోషణం చెందుతుంది. దీన్ని తప్పనిసరి పునఃశోషణ అంటారు. ఇది సమీప సంవళిత నాళిక, హెనీశక్యం అవరోహ నాళికలో జరుగుతుంది. మిగిలిన గాలిత ద్రవం పునఃశోషణ నియంత్రణ ద్వారా జరుగుతుంది.

3. నాళికాస్రావం: మూత్రం ఏర్పడే సమయంలో నాళికా కణాలు H+, K+, NH4+ లను గాలిత ద్రవంలోకి స్రవిస్తాయి. మూత్రం ఏర్పడే విధానంలో నాళికా స్రావం కూడా ముఖ్యపాత్ర వహిస్తుంది. ఎందుకంటే ఇది శరీరద్రవాల అయాన్ల, ఆమ్ల-క్షార సమతుల్యతకు తోడ్పడుతుంది.

వృక్క ప్రమాణంలోని వివిధ భాగాలలో వరణాత్మక పునఃశోషణం నాళికాస్రావం క్రింది విధంగా జరుగుతుంది.
AP Inter 2nd Year Zoology Study Material Chapter 2(b) విసర్జక పదార్థాలు, వాటి విసర్జన 4
i) సమీప నాళికా పునఃశోషణ: ఈ భాగంలో అవసర పోషకాలు 70 80% విద్యుద్విశ్లేషకాలు, నీరు పునః శోషణం చెందుతాయి. Na+t సక్రియ రవాణా ద్వారా వల్కల మధ్యాంతర ద్రవంలోకి రవాణాచేయబడుతుంది. రుణావేశాలైన Cl అయాన్లు ధనావేశాన్ని అనుసరిస్తూ నిష్క్రియా పద్ధతిలో రవాణా చెందుతాయి. గ్లూకోజ్, అమైనో ఆమ్లాలు ద్వితీయ సక్రియ రవాణా చెందుతాయి. నీరు ద్రవాభిసరణతో చలిస్తుంది.

సమీప నాళిక గాలిత ద్రవంలోకి H+ అమ్మోనియాను వరణాత్మకంగా స్రవిస్తుంది. HCO3 ని శోషణం చేస్తుంది. దీనివల్ల శరీరద్రవాల pH, అయాన్ల సమతుల్యతకు తోడ్పడుతుంది.

ii) హైన్లీశిక్యంలో: ఈ భాగంలో పునఃశోషణం తక్కువ జరుగుతుంది. హెన్లీశిక్యపు అవరోహ నాళం నీటికి పారగమ్యంగాను విద్యుత్ విశ్లేషకాలకు అపార గమ్యంగాను ఉంటుంది. ఫలితంగా గాలిత ద్రవం దవ్వలోపలికి చేరే కొద్దీ దాని గాఢత పెరుగుతుంది. ఆరోహ నాళికలో రెండు ప్రత్యేక భాగాలుంటాయి. అవి సమీప పలుచటి భాగం, దూరాగ్ర మందమైనభాగం. సమీపభాగంలో NaCl వ్యాపనంలో మధ్యాంతర ద్రవంలోకి నిష్క్రియ రవాణా చెందుతుంది. దూరాగ్ర భాగం NaCl ను సక్రియ రవాణాలో వెలుపలికి పంపుతుంది. ఆరోహ నాళిక నీటికి పారగమ్యత చూపదు. కాబట్టి గాలిత ద్రవం దూరస్థ సంవళిత నాళం దిశగా ప్రయాణిస్తూ క్రమంగా విలీనం అవుతుంది.

iii) దూరాగ్ర సంవళిత నాళికలో: ఈ భాగంలొ Na+, నీరు, నిబంధనయుత పద్ధతిలో పునఃశోషణ చెందుతాయి. నీటిపునఃశోషణ పరిస్థితులను బట్టి మారుతూ ADH ద్వారా నియంత్రించబడుతుంది. ఈ నాళానికి HCO3 పునఃశోషణ, సామర్థ్యం కలిగి ఉండి పరినాళికా కేశనాళికా పక్షం నుంచి H+, K+, NH4+ లను నాళికా కుహరంలోకి స్రవిస్తుంది. దీనివల్ల రక్తంలో PH, Na – K సమతుల్యతను కాపాడుతుంది.

AP Inter 2nd Year Zoology Study Material Chapter 2(b) విసర్జక పదార్థాలు, వాటి విసర్జన

iv) సంగ్రహ నాళం: ఈ భాగం పెద్ద మొత్తంలో నీటిపునఃశోషణం జరుపకలిగి గాఢ మూత్రాన్ని ఉత్పత్తి చేయగలుగుతుంది. దవ్వ మధ్యాంతర భాగానికి కొంత యూరియాను అనుమతించి దాని ఆస్మోలారిటీని కాపాడుతుంది. H+, K+ అయాన్ల వరణాత్మక స్రావంతో రక్తంలో PH అయాన్ల సమతుల్యతను కాపాడుతుంది. ADH సహాయంతో జరిగే వైకల్పిక నీటి పునః శోషణతో గాలిత ద్రవం మూత్రంగా మారుతుంది. మూత్రం రక్తం కంటే అధిక గాఢతను కలిగి ఉంటుంది. ఇది వెలుపలికి పంపించబడుతుంది.

AP Inter 2nd Year Zoology Study Material Chapter 2(a) శరీరద్రవాలు, ప్రసరణ

Andhra Pradesh BIEAP AP Inter 2nd Year Zoology Study Material  Lesson 2(a) శరీరద్రవాలు, ప్రసరణ Textbook Questions and Answers.

AP Inter 2nd Year Zoology Study Material Lesson 2(a) శరీరద్రవాలు, ప్రసరణ

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
సిరాకర్ణికా కణుపును లయారంభకం అని ఎందుకు అంటారు ?
జవాబు:
సిరాకర్ణికా కణుపులో ప్రత్యేక హృదయ కండర కణాలు ఉంటాయి. ఇది బాహ్య ప్రేరణ లేకుండా క్రియాశక్మాలను ఉత్పత్తి చేయగలదు. కాబట్టి సిరాకర్ణికా కణుపును లయారంభకం అంటారు.

ప్రశ్న 2.
గుండె పనిచేయడంలో కర్ణికా – జఠరికా కణుపు, కర్ణికా జఠరికా కట్ట ప్రాముఖ్యాన్ని తెలపండి.
జవాబు:
కర్ణికా-జఠరికా కణుపు, కర్ణికా జఠరిక కట్ట. జఠరికల సంకోచాన్ని కలిగించుటలో ముఖ్యపాత్ర వహిస్తాయి. సిరాకర్ణికా కణుపు నుంచి క్రియాశక్మాలు కర్ణికా జఠరికా కణువును చేరతాయి. ఇవి బండిల్ ఆప్ హిస్, దీని శాఖలు, పుర్కింజే పోగుల ద్వారా జఠరిక కండరాల్లో ప్రసరిస్తాయి. ఇది జఠరికల సంకోచాన్ని కలిగిస్తుంది. ఇది సుమారు 0.3 సెకన్లు ఉంటుంది.

AP Inter 2nd Year Zoology Study Material Chapter 2(a) శరీరద్రవాలు, ప్రసరణ

ప్రశ్న 3.
మానవుడిలో కుడి, ఎడమ కర్ణికా జఠరికా రంధ్రాలను ఆవరించిన కవాటాలను పేర్కొనండి. (T.S) (Mar. ’15)
జవాబు:
కుడి కర్ణికా జఠరికా కవాటం వద్ద త్రిపత్ర కవాటం, ఎడమ కర్ణికా జఠరికా రంధ్రం వద్ద ద్విపత్ర కవాటం లేదా మిట్రల్ కవాటం ఉంటుంది.

ప్రశ్న 4.
మానవుడి గుండెలో థెబేషియస్ కవాటం ఎక్కడ ఉంటుంది ?
జవాబు:
కరోనరి కోటరం కుడి కర్ణికలోకి తెరచుకొనే రంధ్రం థెబేషియన్ కవాటం ఆవరించి ఉంటుంది.

ప్రశ్న 5.
మానవుడి గుండె జఠరికల నుండి ఏర్పడిన మహాధమనులను తెలపండి.
జవాబు:
పుపుస చాపం – కుడి జఠరిక ఎడమ పూర్వ భాగం నుంచి బయలుదేరుతుంది.
ఎడమ దైహిక చాపం – ఎడమ జఠరిక నుండి బయలుదేరుతుంది.

ప్రశ్న 6.
గుండె శబ్దాలను పేర్కొని అవి ఎప్పుడు వెలువడతాయో తెల్పండి.
జవాబు:

  • గుండె ‘లబ్ – డబ్’ అనే శబ్దాలను వెలువరిస్తుంది.
  • మొదటి శబ్దం లబ్: జఠరికల సంకోచం వల్ల వాటిలో పీడనం పెరగడంతో కర్ణికా జఠరికా కవాటాలు మూసుకొంటాయి. కాబట్టి రక్తం వెనకకు ప్రవహించదు. ఫలితంగా మొదటి శబ్దం ‘లబ్’ వినిపిస్తుంది.
  • రెండవ శబ్దం డబ్: జఠరికలు సడలడం వల్ల జఠరికలలోని పీడనం తగ్గి పుపుస, దైహిక చాపాల్లోని అర్థ చంద్రాకార కవాటాలు మూసుకొంటాయి. కాబట్టి రక్తం వెనకకు ప్రవహించదు. ఫలితంగా గుండె రెండో శబ్దం ‘డబ్’ వినిపిస్తుంది.

ప్రశ్న 7.
హార్దిక వలయం, హార్దిక వెలువరింతను నిర్వచించండి.
జవాబు:
హార్దిక వలయం: ఒక హృదయ స్పందన మొదలు కావడం నుంచి మరొక హృదయ స్పందన మొదలయ్యే వరకు జరిగే హృదయ ప్రక్రియలను హార్దిక వలయం అంటారు.

హార్దిక వెలువరింత: నిమిషానికి ప్రతి జఠరిక ప్రసరణలోకి పంప్ చేసే రక్త ఘనపరిమాణాన్ని హార్దిక వెలువరింత అంటారు. ఇది సుమారు 5 లీటర్లు.

ప్రశ్న 8.
ద్వంద్వ ప్రసరణ అంటే ఏమిటి ? దీని ప్రాముఖ్యాన్ని తెలపండి.
జవాబు:
జఠరికలు ఆమ్లజనియుత, ఆమ్లజని రహిత రక్తాన్ని వేర్వేరుగా దైహిక, పుపుస ప్రసరణ మార్గాలలోనికి పంపిస్తాయి. ఈ ప్రసరణలో ఆమ్లజనియుత రక్తం మాత్రమే దేహభాగాలకు ప్రసరింపబడుతుంది. ఒక పూర్తి ప్రసరణ వలయంలో రక్తం గుండె ద్వారా రెండుసార్లు ప్రసరిస్తుంది. ఈ రకం ప్రసరణను ద్వంద్వ ప్రసరణ అంటారు.

  • పుపుస ప్రసరణ ద్వారా ఆమ్లజని రహిత రక్తాన్ని ఊపిరితిత్తులకు పంపి అక్కడ నుంచి ఆమ్లజని సహిత రక్తాన్ని గుండె స్వీకరిస్తుంది.
  • దైహిక ప్రసరణ కణజాలకు పోషకాలను, O2 ఇతర ఆవశ్యక పదార్థాలను అందించి CO2, ఇతర హానికర పదార్థాలను సేకరిస్తుంది.

AP Inter 2nd Year Zoology Study Material Chapter 2(a) శరీరద్రవాలు, ప్రసరణ

ప్రశ్న 9.
ధమనులు సిరల కంటే ఎందుకు ఎక్కువ స్థితిస్థాపకతతో ఉంటాయి ?
జవాబు:

  • ధమనులలో ప్రవహించే రక్తం అధిక పీడనం కలిగి ఉంటుంది. అందువల్ల వాటిని తట్టుకొనేందుకు నిర్మాణాత్మంగా ధమనుల కుడ్యం మధ్య కంచుకంలో ఎలాస్టిన్ తంతువులు, నునుపు కండరాలు ఉండటం వల్ల మందంగా ఉండి సిరల కంటే అధిక స్థితిస్థాపకతను కల్గి ఉంటాయి.
  • సిరలలో రక్త పీడనం తక్కువగా ఉండటం వల్ల వీటి కుడ్యం పలుచగా ఉండి స్వల్ప స్థితిస్థాపకతను కల్గి ఉంటాయి.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
మానవ హృదయం కర్ణికలను గురించి వివరించండి.
జవాబు:

  • కర్ణికలు ‘పలుచని గోడలుగల ‘స్వీకరణ గదులు. ఎడమ కర్ణిక కంటే కుడి కర్ణిక పెద్దది.
  • రెండు కర్ణికలను వేరుచేస్తూ పలుచని కర్ణికాంతర పటలం ఉంటుంది. పిండదశలో ఈ పటలానికి ఫొరామెన్ ఒవేల్ అనే చిన్న రంధ్రం ఉంటుంది.
  • శిశువు జన్మించి ఊపిరితిత్తులు పని చేయడం ప్రారంభించగానే ఆ రంధ్రం మూసుకు పోయి ఒక గర్తం మిగులుతుంది. దీన్ని ఫోసా ఒవాలిస్ అంటారు. ఒకవేళ రంధ్రం సరిగా మూసుకుపోనట్లయితే దాన్ని పేటెంట్ ఫొరామెన్ ఒవేల్ అంటారు.
  • కుడి కర్ణిక దేహంలోని వివిధ భాగాల నుంచి (ఊపిరితిత్తులు తప్ప) ఆమ్లజనిరహిత రక్తాన్ని స్వీకరిస్తుంది.
  • ఊర్ధ్వ మహాసిర దేహపూర్వభాగం నుంచి, అథోః మహాసిర దేహ పరభాగం నుంచీ, హృదయ కోటరం గుండె గోడల నుంచి ఆమ్లజనిరహిత రక్తాన్ని కుడికర్ణికలోకి చేరుస్తాయి.
  • కరోనరి కోటరం కుడి కర్ణికలోకి తెరుచుకొనే రంధ్రం థెబేసియస్ కవాటం ఆవరించి ఉంటుంది.
  • అథోః మహాసిర కుడి కర్ణికలోకి తెరుచుకునే రంధ్రం యుస్టాచియన్ కవాటంచే ఆవరించి ఉంటుంది. పిండ దశలో ఈ కవాటం పరమహాసిర ద్వారా వచ్చే రక్తాన్ని ఫొరామెన్ ఒవేల్ ద్వారా ఎడమ కర్ణికలోకి పంపుతుంది. ప్రౌఢదశలో ఇది అభివృద్ధి చెందక క్రియారహితంగా ఉంటుంది.
  • ఊర్ధ్వ మహాసిర కుడి కర్ణికలోకి తెరుచుకొనే రంధ్రం వద్ద కవాటాలు ఉండవు. ఊపిరితిత్తుల నుంచి ఆమ్లజనియుత రక్తాన్ని రెండు జతల పుపుస సిరలు గ్రహించి, వేర్వేరు రంధ్రాల ద్వారా ఎడమ కర్ణికలోకి తెరుచుకుంటాయి.
  • కర్ణికలను, జఠరికలను వేరుచేస్తూ కర్ణికా జఠరికా పటలం ఉంటుంది. దీనికి కుడి, ఎడమ కర్ణికా జఠరికా రంధ్రాలు ఉంటాయి.
  • ఎడమ రంధ్రం దగ్గర ద్విపత్ర కవాటం, కుడి రంధ్రం దగ్గర త్రిపత్ర కవాటం ఉంటాయి.

ప్రశ్న 2.
మానవ హృదయం జఠరికలను గురించి వివరించండి.
జవాబు:

  • మానవుని గుండెలో పైభాగంలో గల రెండు కర్ణికలకు దిగువ కొద్దిగా పెద్ద పరిమాణంలో రెండు జఠరికలు ఉంటాయి. రెండు జఠరికలూ జఠరికా పటలంతో వేరు చేయబడి ఉంటాయి.
  • జఠరికల గోడలు మందంగా ఉండి రక్తాన్ని పంప్ చేయడానికి తోడ్పడతాయి. ఎడమ జఠరిక గోడలు కుడి జఠరిక గోడల కంటే మందంగా ఉంటాయి.
  • జఠరికల లోపలి తలం కండరాలతో ఏర్పడి గట్లతో ఉంటుంది. వీటిని కాలమ్నే కార్నే అంటారు.
  • కొన్ని గట్లు పెద్దగా, శంఖాకారంగా ఉంటాయి. వీటిని పాపిల్లరీ కండరాలు అంటారు. ఈ కండరాలు స్నాయురజ్జువులు లేదా హృదయ స్ట్రింగ్ కు కలపబడి ఉంటాయి.
  • ఈ కొల్లాజెన్ కీలితాలు పాపిల్లరీ కండరాలను త్రిపత్ర, మిట్రల్ కవాటాలకు కలుపుతాయి. ఇవి జఠరిక సంకోచ సమయంలో కర్ణికా జఠరికా కవాటాలు కర్ణికలలోకి వెళ్ళనివ్వకుండా నిరోధిస్తాయి.

ప్రశ్న 3.
మావన హృదయం నిలువు కోత పటం గీచి భాగాలను గుర్తించండి.
జవాబు:
AP Inter 2nd Year Zoology Study Material Chapter 2(a) శరీరద్రవాలు, ప్రసరణ 1
ప్రశ్న 4.
హార్దిక వలయ సంఘటనలను క్లుప్తంగా రాయండి.
జవాబు:
ఒక హృదయ స్పందన మొదలు కావడం నుండి మరొక హృదయ స్పందన మొదలయ్యే వరకు జరిగే హృదయ ప్రక్రియలను హార్దిక వలయం అంటారు. ఇది మూడు దశలలో జరుగుతుంది. అవి. కర్ణికల సంకోచం, జఠరికల సంకోచం, హార్ధిక విస్ఫారం
i) కర్ణికల సంకోచం : ఇది సుమారు 0.1 సెకన్లు ఉంటుంది.

  • సిరాకర్ణికా కణుపు జనింపజేసిన క్రియాశక్మం ఏకకాలంలో రెండు కర్ణికలను ప్రేరేపించి కర్ణికా సంకోచాన్ని కలిగిస్తుంది.
  • కర్ణికా సంకోచం సుమారు 30% రక్తాన్ని మాత్రమే జఠరికలలో నింపుతుంది. మిగతా రక్తం కర్ణికా సంకోచం ప్రారంభం కంటే ముందే జఠరికలలోకి ప్రవహిస్తుంది.

ii) జఠరికల సంకోచం : ఇది సుమారు 0.3 సెకన్లు ఉంటుంది.

  • ఈ దశలో జఠరికలు సంకోచం జరిగి, అదే సమయంలోనే కర్ణికలు సడలుతాయి.
  • జఠరికల సంకోచంవల్ల వాటిలో పీడనం పెరగడంతో కర్ణికా జఠరికా కవాటాలు మూసుకుంటాయి. కాబట్టి రక్తం వెనకకు ప్రవహించదు. ఫలితంగా గుండె మొదటి శబ్దమైన ‘లబ్’ వినిపిస్తుంది.
  • జఠరికలలో పీడనం ఇంకా పెరగడం వల్ల పుపుస, దైహిక చాప అర్థ చంద్రాకార కవాటాలు బలవంతంగా తెరవబడతాయి. అందువల్ల జఠరికలోని రక్తం థమనీ చాపాలలోకి ప్రవహించి ప్రసరణ పదంలోకి ప్రవేశిస్తుంది.

iii) హార్ధిక విస్ఫారం : ఇది సుమారు 0.4 సెకన్లు ఉంటుంది.

  • జఠరికలు సడలడం వల్ల జఠరికలలోని పీడనం తగ్గి పుపుస, దైహిక చాపాల్లోని అర్ధచంద్రాకార కవాటాలు మూసుకొంటాయి. కాబట్టి రక్తం వెనుకకు ప్రవహించదు. ఫలితంగా గుండె రెండో శబ్ధమైన ‘డబ్’ వినిపిస్తుంది.
  • జఠరికలలో పీడనం కర్ణికలలోని పీడనం కంటే తగ్గగానే కర్ణికలోకి మహాసిరలు, పుపుస సిరల ద్వారా చేరిన రక్తం
    కలుగజేసే పీడనం వల్ల కర్ణికా జఠరికా కవాటాలు తెరచుకోవడంతో జఠరికలు రక్తంతో నిండటం ఆరంభమవుతుంది. ఇప్పుడు గుండెలోని అన్ని గదులు విరామ స్థితిలో ఉంటాయి. దీనితో ఇంకొక హార్దిక వలయం ప్రారంభమవుతుంది. సాధారణ మానవుడిలో గుండె నిమిషానికి సరాసరి 72 సార్లు కొట్టుకుంటుంది. కాబట్టి హార్దిక వలయం అవధి 0.8 సెకన్లు.

ప్రశ్న 5.
రక్తస్కందన యాంత్రికం గురించి వివరించండి.
జవాబు:
రక్తనాళానికి గాయమైనప్పుడు అనేక శరీరధర్మ యంత్రాంగాలు రక్తస్రావ నివారణ కోసం చైతన్యవంతమవుతాయి. రక్తనాళం తెగినప్పుడు రక్తం కొల్లాజన్ తంతువులకు బహిర్గతం కావడం వల్ల రక్త స్కందనం ప్రారంభమవుతుంది.
రక్త స్కందన సంవిధానం : ఇది మూడు దశలలో జరుగుతుంది.
i) ప్రోత్రాంబిన్ ఉత్తేజకం ఏర్పడుట : ఇది రెండు పథాలలో ఏర్పడుతుంది.
a) అంతర్జన్య పథం : ఇది రక్తనాళానికి గాయమై రక్తం కొల్లాజిన్కు బహిర్గతమైనప్పుడు జరుగుతుంది. ఇది కారకం XII ను ఉత్తేజితం చేస్తుంది. ఈ కారకం ఇంకొక స్కందన కారకాన్ని ఉత్తేజితం చేస్తుంది. ఈ విధంగా ఒక చర్య ఇంకొక చర్యను ఉత్తేజితం చేస్తూ జలపాత చర్యలు జరిగి చివరగా ప్రోత్రాంబిన్ ఉత్తేజితం ఏర్పడుతుంది.

b) బహిర్జన్య పథం : ఇది దెబ్బతిన్న ప్రసరణ కుడ్యం లేదా ప్రసరణ బాహ్య కణజాలం రక్తాన్ని తాకినప్పుడు జరుగుతుంది. ఈ చర్య దెబ్బతిన్న కణజాలం నుంచి త్రాంబోప్లాస్టిన్ విడుదలను ఉత్తేజపరుస్తుంది. దీనితో కారకం – VII ఉత్తేజితమై జలపాత చర్యలు జరిపి చివరగా ప్రోత్రాంబిన్ ఉత్తేజితం ఏర్పడుతుంది.

ii) ప్రోత్రాంబిన్ క్రియాశీలం చేయుట: ప్రోత్రాంబిన్ ఉత్తేజితం Ca++ అయాన్ల సమక్షంలో క్రియారహిత ప్రోత్రాంబిన్ ను క్రియాశీల త్రాంబిన్గా మారుస్తుంది.

AP Inter 2nd Year Zoology Study Material Chapter 2(a) శరీరద్రవాలు, ప్రసరణ

iii) కరిగే ఫైబ్రినోజనన్ను ఫైబ్రిన్ గా మార్చుట: కరిగే ఫైబ్రినోజన్ ను త్రాంబిన్ కరిగే ఫైబ్రిన్గా మారుస్తుంది. ఇందులో బలహీనమైన హైడ్రోజన్ బంధాలతో సంధించబడిన అనేక ఫైబ్రిన్ మోనోమర్లు ఉంటాయి. ఫైబ్రిన్ స్టెబిలైజింగ్ కారకం నుంచి విడుదలైన కారకం -XIII వదులైన హైడ్రోజన్ బంధాలను సంయోజన బంధాలుగా మారుస్తుంది. ఫలితంగా కరగని ఫైబ్రిన్ దారాల వల లాంటి నిర్మాణం ఏర్పడుతుంది. ఇది అన్ని వైపులా విస్తరించి దెబ్బతిన్న తలాలకు అంటుకొని రక్తకణాలను, ఫలకికలను బంధిస్తుంది. కొద్ది నిమిషాల అనంతరం రక్తం గడ్డకడుతుంది.

ప్రశ్న 6.
సిరాకర్ణికా కణుపు, కర్ణికా జఠరికా కణుపు భేదాలను తెలపండి.
జవాబు:
సిరాకర్ణికా కణుపు:

  • కుడికర్ణిక కుడి పైభాగాన ఊర్ధ్వ మహాసిర రంధ్రం వద్ద సిరాకర్ణికా కణుపు ఉంటుంది.
  • ఇది బాహ్య ప్రేరణ లేకుండా క్రియాశక్మాలను ఉత్పత్తి చేయగలదు. కాబట్టి లయారంభకం అంటారు.
  • సిరాకర్ణికా కణుపు జనింపజేసిన క్రియాశక్మం ఏక కాలంలో రెండు కర్ణికలను ప్రేరేపించి కర్ణికా సంకోచాన్ని కలిగిస్తుంది.

కర్ణికా జఠరికా కణుపు:

  • కుడి కర్ణిక ఎడమవైపు కిందుగా కర్ణికా జఠరికా విభాజకం వద్ద కర్ణికా జఠరికా కణుపు ఉంటుంది.
  • కర్ణికా జఠరికా కణుపు క్రియాశక్మాలను సిరాకర్ణికా కణుపు నుంచి గ్రహించి జఠరిక కండరాలకు చేరవేస్తుంది. కాబట్టి కర్ణికా జఠరికా కణుపు ఒక రిలేపాయింట్.
  • సిరాకర్ణికా కణుపు నుంచి క్రియాశక్మాలు కర్ణికా జఠరికా కణుపును చేరతాయి.
  • ఇవి బండిల్ ఆఫ్ హిస్, దీని శాఖలు, పుర్కింజే పోగుల ద్వారా జఠరిక కండరాలలోకి ప్రసరిస్తాయి. ఇవి జఠరికల సంకోచాన్ని కలిగిస్తుంది.

ప్రశ్న 7.
ధమనులు, సిరల మధ్య తేడాలు గుర్తించండి.
జవాబు:
ధమనులు

  1. గుండె నుంచి ఆమ్లజనియుత రక్తాన్ని దేహ భాగాలకు తీసుకువెళతాయి. (ఒక్క పుపుస ధమని తప్ప)
  2. ఇవి లేత ఎరుపు రంగులో ఉంటాయి.
  3. శరీరం లోపల ఉంటాయి.
  4. ధమనుల కుడ్యం మధ్య కంచుకంలో ఎలాస్టిన్ తంతువులు, నునువు కండరాలు ఉండటంవల్ల మందంగా ఉంటుంది.
  5. ఇరుకైన కుహరం.
  6. కవాట రహితం.
  7. రక్తం అధిక పీడనం, కుదుపులతో ప్రవహిస్తుంది.
  8. ధమనులు కేశనాళికలతో అంతమవుతాయి.
  9. మరణించిన సమయంలో ధమనులు ఖాళీగా ఉంటాయి.

సిరలు

  1. ఆమ్లజని రహిత రక్తాన్ని గుండెకు చేరుస్తాయి.
    (ఒక్క పుపుస సిర తప్ప)
  2. ఇవి ముదురు ఎరుపు రంగులో ఉంటాయి.
  3. శరీరం ఉపరితలంలో ఉంటాయి.
  4. మధ్య కంచుకంలో ఎలాస్టిన్ తంతువులు, కండరాలు తక్కువగా ఉండటంవల్ల వీటికుడ్యం పలుచగా ఉంటుంది.
  5. విశాలమైన కుహరం.
  6. కవాట సహితం.
  7. రక్తం నెమ్మదిగా తక్కువ పీడనంతో ప్రవహిస్తుంది.
  8. సిరలు కేశనాళికలతో ప్రారంభమవుతాయి.
  9. మరణించిన సమయంలో సిరలు రక్తంతో నిండి ఉంటాయి.

దీర్ఘ సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
మానవుడి గుండె నిర్మాణాన్ని చక్కటి పటాలతో వివరించండి. [T.S. Mar.’17; T.S. & A.P. Mar. ’16; Mar. ’14]
జవాబు:
మానవుడి గుండె మందమైన కండరయుత గోడలు గల స్పందించే అవయవం. ఇది ఉరఃపంజరంలోని ఊపిరితిత్తుల మధ్యగల మీడియాస్టీనం అనే కుహరంలో ఉంటుంది. దీని అగ్రం కొద్దిగా ఎడమవైపుకు వంగి ఉంటుంది. ఇది బిగించిన పిడికిలి పరిమాణంలో ఉంటుంది.

AP Inter 2nd Year Zoology Study Material Chapter 2(a) శరీరద్రవాలు, ప్రసరణ

గుండెను ఆవరించి రెండు పొరలతో ఏర్పడిన హృదయావరణ త్వచం ఉంటుంది. వెలుపలి పొరను తంతుయుత హృదయావరణం, లోపలి పొరను సీరస్ హృదయావరణం అంటారు. సీరస్ హృదయావరణంలో రెండు త్వచాలు ఉంటాయి. అవి వెలుపలి కుడ్యస్తరం, లోపలి అంతరాంగస్తరం. ఈ రెండు త్వచాలను వేరుచేస్తూ హృదయావరణ కుహరం ఉండి, హృదయావరణ ద్రవంతో నిండి ఉంటుంది. ఈ ద్రవం రెండు పొరల మధ్య రాపిడిని తగ్గించి గుండె స్వేచ్ఛా కదలికలను అనుమతిస్తుంది.

మానవుడి గుండెలో నాలుగు గదులు ఉంటాయి. అవిపై భాగంలోగల రెండు కర్ణికలు, వీటి దిగువ కొద్దిగా పెద్ద పరిమాణంలో రెండు జఠరికలు ఉంటాయి. ‘కర్ణికలను, జఠరికలను వేరుచేస్తూ ఉండే లోతైన అడ్డు గాడిని, కరోనరి సల్కస్ అంటారు.
AP Inter 2nd Year Zoology Study Material Chapter 2(a) శరీరద్రవాలు, ప్రసరణ 1

i) కర్ణికలు: ఇవి పలుచని గోడలు గల ‘స్వీకరణ గదులు. ఎడమ కర్ణిక కంటే కుడి కర్ణిక పెద్దది. రెండు కర్ణికలను వేరు చేస్తూ పలుచని కర్ణికాంతర పటలం ఉంటుంది. పిండదశలో ఈ పటలానికి ఫొరామెన్ ఒవేల్ అనే రంధ్రం ఉంటుంది. శిశువు జన్మించి ఊపిరితిత్తులు పనిచేయడం ప్రారంభించగానే ఈ రంధ్రం మూసుకొని పోయి ఆ ప్రాంతంలో ఫోసా ఒవాలిస్ అనే గర్తం మిగులుతుంది. ఒకవేళ ఈ రంధ్రం సరిగా మూసుకుపోనట్లయితే దాని పేటెంట్ ఫొరామెన్ ఒవేల్ అంటారు.
కుడికర్ణిక దేహంలోని వివిధ భాగాల నుండి (ఊపిరితిత్తులు తప్ప) ఆమ్లజని రహిత రక్తాన్ని స్వీకరిస్తుంది. ఊర్ధ్వ మహాసిర దేహపూర్వ భాగం నుంచి, అథోః మహాసిర దేహ పరభాగం నుంచి, హృదయ కోటరం గుండె గోడల నుంచి ఆమ్లజని రహిత రక్తాన్ని కుడి కర్ణికలోకి చేరుస్తాయి. కరోనరి కోటరం కుడి కర్ణికలోకి తెరుచుకొనే రంధ్రం థెబేసియస్ కవాటం ఆవరించి ఉంటుంది. అథోః మహాసిర కుడి కర్ణికలోకి తెరుచుకొనే రంధ్రం యుస్టాచియన్ కవాటంచే ఆవరించి ఉంటుంది. ఊర్థ్వ మహాసిర కుడికర్ణికలోకి తెరుచుకొనే రంధ్రం వద్ద కవాటాలు ఉండవు. ఊపిరితిత్తుల నుంచి ఆమ్లజనియుత రక్తాన్ని రెండు జతల పుపుస సిరలు గ్రహించి, వేర్వేరు రంధ్రాల ద్వారా ఎడమ కర్ణికలోకి తెరుచుకొంటాయి.
కర్ణికలను, జఠరికలను వేరుచేస్తూ కర్ణికా జఠరికా పటలం ఉంటుంది. దీనికి కుడి, ఎడమ కర్ణికా జఠరికా రంధ్రాలు ఉంటాయి. ఎడమ రంధ్రం దగ్గర ద్విపత్ర కవాటం, కుడి రంధ్రం దగ్గర త్రిపత్ర కవాటం ఉంటాయి.

ii) జఠరికలు: జఠరికలు గోడలు మందంగా ఉండి రక్తాన్ని పంప్ చేయడానికి తోడ్పడతాయి. రెండు జఠరికలు జఠరికాంతర పటంలతో వేరుచేయబడి ఉంటాయి. ఎడమ జఠరిక గోడలు కుడి జఠరిక గోడల కంటే మందంగా ఉంటాయి. జఠరికల లోపలి తలం కండరాలతో ఏర్పడి గట్లతో ఉంటుంది. వీటిని కాలమ్నే కార్నే అంటారు. కొన్ని గట్లు పెద్దగా, శంఖాకారంగా ఉంటాయి. వీటిని పాపిల్లరీ కండరాలు అంటారు. ఈ కండరాలు స్నాయురజ్జువులకు కలపబడి ఉంటాయి. ఈ కొల్లాజెన్ కీలితాలు పాపిల్లరీ కండరాలను త్రిపత్ర, ద్విపత్ర కవాటాలకు కలుపుతాయి. ఇవి జఠరిక సంకోచ సమయంలో కర్ణికా జఠరికా కవాటాలు కర్ణికలలోనికి వెళ్ళనివ్వకుండా నిరోధిస్తాయి.

కణుపు కణజాలం: హృదయంలో కణుపు కణజాలం అనే ప్రత్యేక హృదయ కండరాలు విస్తరించి ఉంటాయి. అవి.

  1. సిరాకర్ణికా కణుపు (SAN): ఇది కుడికర్ణిక కుడిపై భాగాన ఊర్థ్వ మహాసిర రంధ్రం వద్ద ఉంటుంది.
  2. కర్ణికా జఠరికా కణువు (AVN): ఇది కుడికర్ణిక ఎడమ వైపు కిందుగా కర్ణికా జఠరికా విభాజకం వద్ద ఉంటుంది.

iii) ధమనీచాపాలు: మానవ హృదయంలో రెండు ధమనీచాపాలను కలిగి ఉంటుంది.

a) పుపుస చాపం: ఇది కుడి జఠరిక ఎడమ పూర్వభాగం నుంచి బయలుదేరుతుంది. ఇది ఆమ్లజని రహిత రక్తాన్ని ఊపిరితిత్తులకు చేరవేస్తుంది. కుడి జఠరిక పుపుస చాపం లోకి తెరచుకొనే రంధ్రం దగ్గర పుపుస కవాటం ఉంటుంది.

b) ఎడమదైహిక చాపం: ఇది ఎడమ జఠరిక నుంచి బయలుదేరి ఆమ్లజని సహిత రక్తాన్ని శాఖల ద్వారా వివిధ భాగాలకు సరఫరా చేస్తుంది. ఎడమజఠరిక దైహిక చాపంలోనికి తెరచుకొనే రంధ్రం దగ్గర మహాధమనీ కవాటం ఉంటుంది.

ఒక్కొక్క కవాటంలో మూడు అర్థ చంద్రాకార మడతలు ఉంటాయి. పుపుస చాపం, దైహిక చాపం ఒకదానికొకటి తాకేచోట తంతుయుత రజ్జువుచేత కలపబడి ఉంటాయి. దీన్నే లిగమెంటం ఆర్టీరియోజం అంటారు. ఇది పిండదశలో పుపుస చాపాన్ని, దైహిక చాపాన్ని కలిపే డక్టస్ ఆర్టీరియోసస్ అవశేషం.

AP Inter 2nd Year Zoology Study Material Chapter 2(a) శరీరద్రవాలు, ప్రసరణ

ప్రశ్న 2.
మానవుడి గుండె పనిచేసే విధానాన్ని వివరించండి. [A.P. Mar.’ 17, ’15; T.S. Mar. ’16]
జవాబు:
మానవుడి గుండె లయబద్దంగా సంకోచ, వ్యాకోచాలు చెందుతూ హార్దిక వలయం ద్వారా రక్తాన్ని అవిరామంగా సరఫరా చేసే అవయవం.
హృదయంలో కణుపు కణజాలం మరియు క్రియాశక్మాల ఉత్పత్తి:
హృదయంలో కణుపు కణజాలం అనే ప్రత్యేక హృదయ కండరాలు విస్తరించి ఉంటాయి. అవి
i) సిరా కర్ణికా కణుపు (SAN): కుడి కర్ణిక కుడిపై భాగాన ఊర్థ్వ మహాసిర రంధ్రం వద్ద సిరా కర్ణికా కణుపు ఉంటుంది.

ii) కర్ణికా జఠరికా కణుపు (AVN): కుడి కర్ణిక ఎడమవైపు కిందుగా కర్ణికా జఠరికా విభాజకం వద్ద ఉంటుంది. బండిల్ ఆఫ్ హిస్ అనే కణుపు పోగులు కర్ణికా జఠరికా కణుపు నుంచి అంతర జఠరికా విభాజకంలోకి వ్యాపిస్తాయి. ఇది కుడి, ఎడమ శాఖలుగా చీలుతుంది. ఈ శాఖలు పుర్కింజే అనే చిన్న తంతువులుగా చీలి జఠరికా కండరాలలోకి విస్తరిస్తాయి.

సిరా కర్ణికా కణుపులో ప్రత్యేక హృదయ కండరకణాలు ఉంటాయి. ఇవి బాహ్య ప్రేరణ లేకుండా క్రియాశక్మాలను ఉత్పత్తి చేయగలదు. కాబట్టి లయారంభంకం అంటారు. కర్ణికా జఠరికా కణుపు క్రియాశక్మాలను సిరా కర్ణికా కణుపు నుంచి గ్రహించి జఠరిక కండరాలకు చేరవేస్తుంది. కాబట్టి కర్ణికా జఠరికా కణుపు ఒక రిలేపాయింట్.

హార్దిక వలయం: ఒక హృదయ స్పందన మొదలు కావడం నుంచి మరొక హృదయ స్పందన మొదలయ్యే వరకు జరిగే హృదయ ప్రక్రియలను హార్దిక వలయం అంటారు. ఇది మూడు దశలలో జరుగుతుంది. అవి

  1. కర్ణికల సంకోచం
  2. జఠరికల సంకోచం
  3. హార్ధిక విస్ఫారం.

మొదట గుండె యొక్క నాలుగు గదులు విశ్రాంతి దశ (ఉమ్మడి విస్ఫార దశ)లో ఉంటాయి.

i) కర్ణికల సంకోచం: ఇది సుమారు 0.1 సెకన్లు ఉంటుంది.

  • సిరాకర్ణికా కణుపు జనింపచేసిన క్రియాశక్మం ఏక కాలంలో రెండు కర్ణికలను ప్రేరేపించి కర్ణికా సంకోచాన్ని కలిగిస్తుంది.
  • కర్ణికా సంకోచం సుమారు 30% రక్తాన్ని మాత్రమే జఠరికలలో నింపుతుంది. మిగతా రక్తం కర్ణికా సంకోచం ప్రారంభం కంటే ముందే జఠరికలోనికి ప్రవహిస్తుంది.

ii) జఠరికల సంకోచం: ఇది సుమారు 0.3 సెకన్లు ఉంటుంది.

  • సిరాకర్ణికా కణుపు నుంచి క్రియాశక్మాలు కర్ణికా జఠరికా కణుపుకు చేరతాయి. ఇవి బండిల్ ఆఫ్ హిస్, దీని శాఖలు, పుర్కింజే పోగుల ద్వారా జఠరిక కండరాల్లోకి ప్రసరిస్తాయి. ఇది జఠరికల సంకోచాన్ని కలిగిస్తుంది.
  • జఠరికల సంకోచ సమయంలో కర్ణికలు సడలుతాయి.
  • జఠరికల సంకోచం వల్ల వాటిలో పీడనం పెరగడంతో కర్ణికా జఠరికా కవాటాలు మూసుకొంటాయి. కాబట్టి రక్తం వెనకకు ప్రవహించదు. ఫలితంగా గుండె మొదటి శబ్దమైన ‘లబ్’ వినిపిస్తుంది.
  • జఠరికల పీడనం ఇంకా పెరగడం వల్ల పుపుస, దైహిక చాప అర్ధచంద్రాకార కవాటాలు బలవంతంగా తెరవబడతాయి. అందువల్ల జఠరికలోని రక్తం ధమనీ చాపాలలోకి ప్రవహించి ప్రసరణ పధంలోకి ప్రవేశిస్తుంది.

iii) హార్ధిక విస్ఫారం: ఇది సుమారు 0.4 సెకన్లు ఉంటుంది.

  • జఠరికలు సడలడం వల్ల జఠరికలలోని పీడనం తగ్గి పుపుస, దైహిక చాపాల్లోని అర్థ చంద్రాకార కవాటాలు మూసుకొంటాయి. కాబట్టి రక్తం వెనుకకు ప్రవహించదు. ఫలితంగా గుండె రెండో శబ్దమైన ‘డబ్’ వినిపిస్తుంది.
  • జఠరికలోని పీడనం కర్ణికలలోని పీడనం కంటే తగ్గగానే కర్ణికలోకి మహాసిరలు, పుపుస సిరల ద్వారా చేరిన రక్తం కలుగజేసే పీడనం వల్ల కర్ణికా జఠరికా కవాటాలు తెరచుకోవడంతో జఠరికలు రక్తంతో నిండటం ఆరంభమవుతుంది. ఇప్పుడు గుండెలోని అన్ని గదులు విరామస్థితిలో (ఉమ్మడి విస్ఫార దశ) ఉంటాయి. దీనితో ఇంకొక హార్ధిక వలయం ప్రారంభమవుతుంది.
  • సాధారణంగా మానవుడి గుండె నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటుంది. కాబట్టి హార్దిక వలయం అవధి 0.8 సెకన్లు.

AP Inter 2nd Year Zoology Study Material Chapter 2(a) శరీరద్రవాలు, ప్రసరణ

ద్వంద్వ ప్రసరణం: కుడి జఠరిక పంప్ చేసిన రక్తం పుపుస ధమనిలోకి, ఎడమ జఠరిక పంప్ చేసిన రక్తం మహాధమనిలోకి చేరుతుంది. పుపుస ధమనిలోకి పంప్ చేయబడిన ఆమ్లజనిరహిత రక్తం ఊపిరితిత్తులకు చేరుతుంది. ఆమ్లజనియుత రక్తం పుపుస సిరల ద్వారా ఎడమ కర్ణికకు చేరుతుంది. ఈ ప్రసరణ పథాన్ని పుపుస ప్రసరణ అంటారు. ఆమ్లజనియుత రక్తం మహాధమని నుంచి ధమనులు, ధమనికలు, కేశనాళికల ద్వారా కణజాలాన్ని చేరుతుంది. అక్కడి నుంచి ఆమ్లజని రహిత రక్తం కేశనాళికలు, సిరికలు, సిరలు, మహాసిరల ద్వారా కుడికర్ణికను చేరుతుంది. ఈ ప్రసరణ పథాన్ని దైహిక ప్రసరణ అంటారు.

AP Inter 2nd Year Zoology Study Material Chapter 1(b) శ్వాసించడం, వాయువుల వినిమయం

Andhra Pradesh BIEAP AP Inter 2nd Year Zoology Study Material Lesson 1(b) శ్వాసించడం, వాయువుల వినిమయం Textbook Questions and Answers.

AP Inter 2nd Year Zoology Study Material Lesson 1(b) శ్వాసించడం, వాయువుల వినిమయం

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
వైటల్ కెపాసిటిని నిర్వచించి దాని ప్రాముఖ్యం ఏమిటి ?
జవాబు: వైటల్ కెపాసిటి : బలవంతపు నిశ్వాసం తరువాత పీల్చగల గాలి గరిష్ఠ పరిమాణం ఇందులో ERV, TV, IRVలు ఉంటాయి. బలవంతంగా గాలిని ఉచ్ఛ్వాసించిన తరువాత గరిష్ఠస్థాయిలో శ్వాసించిన గాలి ఘనపరిమాణం.
VC = TV + IRV + ERV.

ప్రశ్న 2.
మామూలు నిశ్వాసంలో ఊపిరితిత్తులలో మిగిలిన గాలి ఘనపరిమాణం ఎంత ?
జవాబు:
సాధారణ నిశ్వాసం తరువాత ఊపిరితిత్తులలో మిగిలి ఉన్న గాలి ఘనపరిమాణాన్ని క్రియాత్మక అవశేషసామర్థ్యం (FRC) అంటారు.
FRC = ERV + RV.
ERV = 1000 to 1100 మి.లీ.
RV = 1100 to 1200 మి.లీ. కావున
FRC = 2100 to 2300 మి.లీ.

AP Inter 2nd Year Zoology Study Material Chapter 1(b) శ్వాసించడం, వాయువుల వినిమయం

ప్రశ్న 3.
ఆక్సిజన్ వ్యాపనం వాయుకోశ ప్రాంతంలో మాత్రమే జరుగుతుంది. శ్వాసవ్యవస్థ మిగిలిన భాగాలలో జరగదు. మీరు దీన్ని ఏ విధంగా సమర్థిస్తారు ?
జవాబు:
ఊపిరితిత్తులలోని వాయుకోశాలు వాయువుల వినిమయం జరిగే ప్రాథమిక ప్రాంతాలు. వాయుకోశాలు వాయువులు వ్యాపనం చెందడానికి కావలసిన పీడనాన్ని కలిగి ఉంటాయి.
వాయుకోశాలలో గల అధిక pO2, తక్కువ pCO2 స్వల్ప H+ గాఢత, తక్కువ ఉష్ణోగ్రతలు O2 వ్యాపనం చెంది ఆక్సీహీమోగ్లోబిన్ ఏర్పడుటకు అనుకూల పరిస్థితులను ఏర్పరుస్తుంది. ఇవేకాకుండా పాక్షిక పీడనం, వాయువుల ద్రావణీయత, శ్వాసత్వచ మందం, ఆవరణిక తలం మరియు విసరణ దూరం కారకాలుగా వ్యాపనం రేటును ప్రభావితం చేస్తాయి.

ప్రశ్న 4.
ఆక్సిజన్ రవాణాలో pCO2 ప్రభావం ఏమిటి ?
జవాబు:
pCO2 ఆక్సిజన్ రవాణాలో ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. వాయుకోశాలలో pO2 అధికంగా ఉండి pCO2 తక్కువగా, H+ గాఢత స్వల్పంగా, ఉష్ణోగ్రత తక్కువగా ఉండటం వల్ల ఆక్సీహిమోగ్లోబిన్ ఏర్పడటానికి అనుకూలంగా ఉంటుంది. కణజాలాలలో pO2 తక్కువగా pCO2ఎక్కువగా H+ గాఢత ఎక్కువగా అధిక ఉష్ణోగ్రత ఉండటంవల్ల ఆక్సీహీమోగ్లోబిన్ వియోజనం చెంది ఆక్సిజన్ విడుదలవడానికి అనుకూలంగా ఉంటుంది. కావున రక్తంలో CO2 గాఢత తక్కువగా ఉన్నప్పుడు అధికంగా “ఆక్సిజన్ హీమోగ్లోబిన్ బంధమేర్పర్చుకుంటుంది. రక్తంలో ఆక్సిజన్ ఆక్సీహీమోగ్లోబిన్గా కణజాలాలకు రవాణా అయ్యి అక్కడ ఆక్సీజన్
విడుదల చేయబడతుంది.

ప్రశ్న 5.
మానవుడు కొండలను ఎక్కుతున్నప్పుడు శ్వాసక్రియ ఏవిధంగా జరుగుతుంది ?
జవాబు:
మానవుడు కొండలను ఎక్కుతున్నప్పుడు లేదా అధికశ్రమతో కూడిన వ్యాయామం చేసినపుడు, శరీరంలో అధిక మొత్తంలో ఆక్సిజన్ వినియోగించబడి, ఆక్సిజన్ ఆవశ్యకత ఏర్పడుతుంది. ఫలితంగా శ్వాసక్రియ రేటు పెరుగుతుంది.

ప్రశ్న 6.
టైడల్ వాల్యూమ్ అంటే ఏమిటి ? ఆరోగ్యవంతుడైన మానవుడిలో టైడల్ వాల్యూమ్ (సుమారు విలువ) ఒక గంటకు ఎంత ఉంటుంది ?
జవాబు:
టైడల్ వాల్యూమ్ (TV) : సాధారణ ఉచ్ఛ్వాస లేదా నిశ్వాసాలలో పీల్చుకొనే లేదా వదిలివేసే గాలి ఘనపరిమాణం. ఇది సుమారు 500 మి॥లీ. ఉంటుంది. ఆరోగ్యవంతుడైన మానవుడు నిమిషానికి 6000 నుంచి 8000 మి.లీ. (లేదా) గంటకు 3,60,000 నుండి 4,80,000 మి.లీ. గాలిని ఉచ్ఛ్వాసించడం లేదా నిశ్వాసించడం జరుగుతుంది.

ప్రశ్న 7.
ఆక్సీహీమోగ్లోబిన్ వియోగ వక్రరేఖను నిర్వచించండి. సిగ్మాయిడల్ వ్యూహనానికి మీరు ఎదైనా కారణాన్ని సూచించగలరా ?
జవాబు:
ఆక్సీహీమోగ్లోబిన్ వియోగ వక్రరేఖ, ఆక్సిజన్ పాక్షిక పీడనానికి, హీమోగ్లోబిన్ సంతృప్త శాతానికి మధ్యగల సంబంధాన్ని తెలియజేస్తుంది. ఆక్సీహీమోగ్లోబిన్తో సంతృప్త శాతాన్ని pO2 వ్యతిరేకంగా వక్రరేఖను గీసినప్పుడు సిగ్మాయిడ్ రేఖ ఏర్పడుతుంది. ఈ రేఖను ఆక్సీహీమోగ్లోబిన్ వియోజన వక్రరేఖ అంటారు.

సిగ్మాయిడల్ వ్యూహనానికి కారణాలు : వాయుకోశాలలో PO2 అధికంగా ఉండి pCO2 తక్కువగా, H+ గాఢత స్వల్పంగా, ఉష్ణోగ్రత తక్కువగా ఉండటం వల్ల ఆక్సీహీమోగ్లోబిన్ ఏర్పడటానికి అనుకూలంగా ఉంటుంది. కణజాలాలలో pO2 తక్కువగా, pO2 ఎక్కువగా pH+ గాఢత ఎక్కువగా, అధిక ఉష్ణోగ్రత ఉండటం వల్ల ఆక్సీహీమోగ్లోబిన్ వియోజనం చెంది ఆక్సిజన్ విడుదలవడానికి అనుకూలంగా ఉంటుంది. ఈ పరిస్థితులలో ఆక్సిజన్ వియోజన వక్రరేఖ Y- అక్షం నుంచి దూరంగా (కుడివైపుకు విస్థాపనం చెందుతుంది.

AP Inter 2nd Year Zoology Study Material Chapter 1(b) శ్వాసించడం, వాయువుల వినిమయం

ప్రశ్న 8.
కాంకే అంటే ఏమిటి ?
జవాబు:
నాసికా కొటరము (Nasal cavity) లో పైభాగాన మూడు పలుచటి మెలితిరిగిన అస్థిఫలకాలు ఉంటాయి. వీటినే కాంకే లేదా టర్బినల్ అంటారు. వీటిలో అధికంగా రక్తకేశనాళికలు ఉండి శ్లేష్మకణాలు గల స్తంభాకార శైలికాయుత ఉపకళ ఆవరించబడి ఉంటుంది.

ప్రశ్న 9.
క్లోరైడ్ విస్తాపం అంటే ఏమిటి ? [A.P. Mar. ’16 Mar. ’14]
జవాబు:
అయాన్ల సమతాస్థితి సాధించడానికి ఎర్రరక్త కణాలు, ప్లాస్మాలమధ్య క్లోరైడ్, బై కార్బనేట్ అయాన్ల వినిమయం జరుగుతుంది. ఈ ప్రక్రియనే క్లోరైడ్ విస్తాపం లేదా హాంబర్గర్ దృగ్విషయం అని అంటారు.

ప్రశ్న 10.
ఏవైన రెండు వృత్తిపర శ్వాసరుగ్మతలను (occupational respiratory, disorders) తెలిపి, అవి మానవుడిలో కలుగచేసే లక్షణాలను తెలపండి.
జవాబు:
వృత్తిపర శ్వాసరుగ్మతలు కొన్ని పరిశ్రమల నుంచి వెలువడిన హానికర పదార్థాలు, శ్వాసవ్యవస్థలోకి వెళ్ళినప్పుడు కలుగుతాయి. ఆస్బెస్టాసిస్ : ఆస్బెస్టాస్ పరిశ్రమలో పనిచేసేవారు, ఆస్బెస్టాస్ ధూళికి దీర్ఘకాలం గురికావడంవల్ల ఈ వ్యాధి కలుగుతుంది. సిలికోసిస్ : గనులు, క్వారీస్ లో పనిచేసేవారు, ఎక్కువకాలం ఇసుక ధూళికి గురికావడం వల్ల సిలికోసిస్ వ్యాధి కలుగుతుంది.

ప్రశ్న 11.
మామూలు శ్వాసకదలికలకు తోడ్పడే కండరాలేవి ?
జవాబు:
విభాజక పటల కండరాలు మరియు వెలుపలి పర్ముకాంతర కండరాలు మామూలు శ్వాస కదలికలకు తోడ్పడతాయి.

ప్రశ్న 12.
ఆక్సీహీమోగ్లోబిన్ వియోజన రేఖ పటం గీయండి.
జవాబు:
AP Inter 2nd Year Zoology Study Material Chapter 1(b) శ్వాసించడం, వాయువుల వినిమయం 1

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
సాధారణ పరిస్థితులలో ఉచ్ఛ్వాస, నిశ్వాసాలను వివరించండి. [T.S. Mar. ’15]
జవాబు:
ఉచ్ఛ్వాసం : పరిసరాలలోని గాలిని ఊపిరితిత్తులలోకి పీల్చడాన్ని ఉచ్ఛ్వాసం అంటారు. ఇది క్రియాశీల ప్రక్రియ. ఈ ప్రక్రియలో విభాజక పటల కండరాలు, పర్శుకల మధ్యగల వెలుపలి పర్శుకాంతర కండరాలు సంకోచిస్తాయి. విభాజక పటలం సంకోచించడం వల్ల పూర్వ పర అక్షంలో ఉరఃకుహర ఘనపరిమాణం పెరుగుతుంది. వెలుపలి పర్శుకాంతర కండరాల సంకోచం వల్ల పర్శుకలు, ఉరోస్థి పైకి లేవడం వల్ల ఉరఃకుహరం పృష్టోదర అక్షంలో విశాలమవుతుంది. ఫలితంగా ఉరఃకుహర ఘనపరిమాణం దానితోబాటు పుపుస ఘనపరిమాణం పెరుగుతాయి.

AP Inter 2nd Year Zoology Study Material Chapter 1(b) శ్వాసించడం, వాయువుల వినిమయం

నిశ్వాసం : వాయుకోశాల్లోని గాలి బయటికి విడుదల కావడాన్ని నిశ్వాసం అంటారు. ఇది నిష్క్రియ ప్రక్రియ. విభాజక పటలం వెలుషలి పర్శుకాంతర కండరాలు సడలడం వల్ల విభాజక పటలం ఉరోస్థి తిరిగి యథాస్థానాన్ని చేరుకోవడం వల్ల ఉరః కుహర ఘనపరిమాణం, దానివల్ల పుపుస ఘనపరిమాణం తగ్గుతాయి. దీనివల్ల పుపుస అంతర పీడనం వాతావరణ పీడనం కంటే కొద్దిగా పెరుగుతుంది. దీని ఫలితంగా ఊపిరితిత్తుల నుంచి గాలి బయటికి పంపబడుతుంది. ఇదే నిశ్వాసం.

ప్రశ్న 2.
CO2 రవాణాకు వివిధ యంత్రాంగాలు ఏవి ? వివరించండి. [T.S. Mar. ’17]
జవాబు:
కార్బన్ డయాక్సైడ్ మూడు రకాలుగా రవాణా అవుతుంది.
(i) ద్రావణ స్థితిలో : 7శాతం CO2 ప్లాస్మాలో కరిగి ద్రావణ స్థితిలో రవాణా చేయబడుతుంది.
CO2+ H2O → H2CO3

(ii) కార్బమైనో సంయోగ పదార్థాలుగా : దాదాపు 20-25 శాతం CO2 నేరుగా హీమోగ్లోబిన్లోని అమైనో సముదాయంతో ఉత్రమణీయంగా కలవడం వల్ల కార్బమైనో హీమోగ్లోబిన్ ఏర్పడుతుంది.
Hb – NH2 + CO2 → Hb – NHCOO + H+

ఈ విధంగా హీమోగ్లోబిన్ తో CO2 బంధమేర్పరచుకోవడం CO2 పాక్షిక పీడనంపై ఆధారపడి ఉంటుంది. ఎప్పుడైతే కణజాలాలలోలాగా pCO2 అధికంగా, pO2 తక్కువగా ఉంటుందో అప్పుడు అధికంగా CO2 హీమోగ్లోబిన్ బంధమేర్పరచు కొంటుంది. వాయుకోశాలలాగా PCO2 తక్కువగా, pO2 అధికంగా ఉన్నప్పుడు, కార్బమైనో హీమోగ్లోబిన్ నుంచి CO2 వియోజనం చెందుతుంది. అంటే CO2 హీమోగ్లోబిన్తో కణజాలాలలో కలిసి వాయుకోశాలలో విడుదలవుతుంది. CO2 ప్లాస్మా ప్రోటీన్లతో కలవడంవల్ల కూడా కార్బమైనో సంయోగ పదార్థాలు ఏర్పడతాయి.

(iii) బై కార్బనేట్గా : సుమారు 70 శాతం CO2 బై కార్బనేట్గా రవాణా అవుతుంది. ఎర్రరక్తకణాలలో కార్బోనిక్ ఎనైహైడ్రేజ్ అనే ఎన్ఎమ్ చాలా అధికంగా ఉంటుంది. ఈ క్రింది ఎన్జైమ్ చర్యను ఉత్రమణీయంగా జరుపుతుంది.
AP Inter 2nd Year Zoology Study Material Chapter 1(b) శ్వాసించడం, వాయువుల వినిమయం 2

విచ్ఛిన్నక్రియ ఫలితంగా కణజాలాలలో CO2 పాక్షిక పీడనం అధికంగా ఉంటుంది. CO2 రక్తంలోని RBC లోనికి వ్యాపనం చెంది, కార్బానిక్ ఆమ్లాన్ని ఏర్పరుస్తుంది. ఇది HCO3 + H+ అయాన్లుగా వియోజనం చెందుతుంది. వాయుకోశాల దగ్గర pCO2 తక్కువగా ఉండటం వల్ల ఈ చర్య వ్యతిరేక దిశలో జరిగి CO2 నీటిని ఏర్పరుస్తుంది. ఈ విధంగా కణజాలాలలో CO2 బైకార్బనేట్గా మార్చబడి, రక్తం ద్వారా వాయుకోశాలకు రవాణా చేయబడి వాయుకోశాల్లో తిరిగి నీరు, CO2 గా విడిపోయి బయటికి విడుదల చేయబడుతుంది. ప్రతి 100 మి॥లీ. సిరా రక్తం సుమారు 4 మి॥లీ. CO2 ను వాయుకోశాల్లోని గాలిలోకి విడుదల చేస్తుంది.

ప్రశ్న 3.
మానవుడిలో శ్వాసకదలికలు ఏవిధంగా నియంత్రించబడతాయి ? [Mar. ’14]
జవాబు:
దేహకణజాలాల అవసరాలకు అనుగుణంగా శ్వాస లయలను నిర్వహించగల, సవరింపగల సమర్థత మానవుడికి ఉంది. ‘దీనికి నాడీ వ్యవస్థ తోడ్పడుతుంది.
1. మెదడులోని మజ్జాముఖంలో ఒక ప్రత్యేక కేంద్రం ఉంటుంది. దీన్ని ‘శ్వాస లయ జనక కేంద్రం’ అంటారు. శ్వాస లయలు దీని నియంత్రణలో ఉంటాయి.

2. మెదడు కాండంలోని పాన్లో మరొక కేంద్రం ఉంటుంది. దీన్ని ‘న్యూమోటాక్సిక్ కేంద్రం’ అంటారు. ఇది తగిన రీతిలో శ్వాస లయబద్ధ కేంద్రం విధులను సవరించగలుగుతుంది. ఈ కేంద్రపు నాడీ సంకేతాలు, నిశ్వాస అవధిని తగ్గించి శ్వాసరేటును మార్చగలుగుతుంది.

3. శ్వాసలయ కేంద్రం పక్కన ‘రసాయన జ్ఞాన ప్రాంతం ఉంటుంది. ఇది CO2, హైడ్రోజన్ అయాన్లకు సున్నితత్వాన్ని కలిగి ఉంటుంది. ఇవి ఎక్కువైనప్పుడు ఈ కేంద్రం చైతన్యవంతం అయి శ్వాసలయబద్ద కేంద్రానికి సంకేతాలను పంపి, శ్వాస ప్రక్రియలో అవసరమైన సవరింపులను చేసి, ఈ పదార్థాలను వెలుపలికి పంపబడేట్లు చేస్తుంది.

4. మహాధమని చాపం, కారోట ధమనులపై గల రసాయన గ్రహకాలు కూడా CO2 H+ అయాన్ల గాఢతలో కలిగే మార్పులను గుర్తించి తగిన చర్యల కోసం అవసరమైన సంకేతాలను శ్వాసలయ కేంద్రానికి పంపుతాయి. CO2 H+ అయాన్ల గాఢత అధికమైనప్పుడు శ్వాసరేటు, దీర్ఘత పెరుగుతాయి. శ్వాసలయ నియంత్రణలో ఆక్సిజన్ కు ప్రాముఖ్యత లేదు.

AP Inter 2nd Year Zoology Study Material Chapter 1(b) శ్వాసించడం, వాయువుల వినిమయం

ప్రశ్న 4.
క్రింది వాటి మధ్య భేదమేమిటి ?
a) IRV, ERV
b) ఇన్స్పిరేటరీ సామర్థ్యం, ఎక్స్పిరేటరీ సామర్థ్యం
c) వైటల్ కెపాసిటి, పూర్ణ పుపుస సామర్థ్యం
జవాబు:
a) IRV మరియు ERV :
బలవంతంగా ఊపిరి
IRV (ఉచ్ఛ్వాస నిలవ ఘనపరిమాణం – Inspiratory Reserve Volume) : పీల్చినప్పుడు టైడల్ వాల్యూమ్ కంటే అధికంగా పీల్చుకోగలిగిన గాలి ఘనపరిమాణాన్ని ఉచ్ఛ్వాస నిలవ ఘనపరిమాణం అంటారు. ఇది సుమారు 2500 మి॥లీ. నుంచి 3000 మి॥లీ. వరకు ఉంటుంది.

ERV (నిశ్వాస నిలవ ఘనపరిమాణం – Expiratory Reserve Volume) : బలవంత నిశ్వాసంలో టైడల్ వాల్యూమ్ కంటే అధికంగా బయటికి వదలగలిగిన గాలి ఘనపరిమాణాన్ని నిశ్వాస నిలవ ఘనపరిమాణం అంటారు.
ఇది సుమారు 1000 మి॥లీ. నుంచి 1100 మి.లీ. వరకు ఉంటుంది.

b) ఇన్స్పిరేటరీ సామర్థ్యం, ఎక్స్పిరేటరి సామర్థ్యం :
ఇన్స్పిరేటరి సామర్థ్యం (IC) : సాధారణ నిశ్వాసం తరువాత ఒక వ్యక్తి లోపలికి పీల్చగల గాలి మొత్తం ఘనపరిమాణాన్ని ఇన్స్పిరేటరి సామర్థ్యం లేదా ఉచ్ఛ్వాస సామర్థ్యం అంటారు. ఇది టైడల్ వ్యాల్యూమ్, ఉచ్ఛ్వాస నిలవ ఘనపరిమాణాల మొత్తం.
IC = TV + IRV
ఇది సుమారు 3000 మి.లీ. నుండి 3500 మి.లీ. వరకు ఉంటుంది.
ఎక్స్పిరేటరీ సామర్థ్యం (EC) : సాధారణ ఉచ్ఛ్వాసం తరువాత ఒక వ్యక్తి బయటికి వదలగలిగిన గాలి ఘనపరిమాణాన్ని ఎక్స్పిరేటరీ సామర్థ్యం అంటారు.
EC – TV + ERV

c) వైటల్ కెపాసిటి (VC) : బలవంతపు నిశ్వాసం తరువాత పీల్చగల గాలి గరిష్ఠ ఘనపరిమాణాన్ని వైటల్ కెపాసిటీ అంటారు. ఇందులో ERV, TV, IRV లు ఉంటాయి. బలవంతంగా గాలిని ఉచ్ఛ్వాసించిన తరువాత గరిష్ట స్థాయిలో శ్వాసించిన గాలి ఘనపరిమాణం,
VC = TV + IRV + ERV
పూర్ణ పుపుస సామర్థ్యం : బలవంతపు ఉచ్ఛ్వాసం తరువాత ఊపిరితిత్తులలో అమరిన గాలి మొత్తం ఘనపరిమాణం ఇందులో RV, ERV, TV, IRV లేదా వైటల్ సామర్థ్యం + అవశేషపరిమాణం.
TLC = VC+ RV (లేదా) TLC = ERV + IRV + TV + RV

ప్రశ్న 5.
శ్వాస వ్యవస్థ రుగ్మతలను వివరించండి. [A.P. Mar.’17, ’15; T.S. & A.P. Mar. ’16]
జవాబు:
1) ఉబ్బసవ్యాధి : శ్వాసనాళం, శ్వాసనాళికలలో వాపు ఏర్పడటం వల్ల శ్వాసించడం కష్టంగా ఉంటుంది. శ్వాసనాళం, శ్వాసనాళికా గోడలలోని నునుపు కండరాలలో ఈడ్పులాంటి లక్షణాలు కనిపిస్తాయి. దగ్గు, ఈల లాంటి శబ్దం, ఛాతి బిగపట్టినట్లుగా ఉండి శ్వాసించడం కష్టంగా ఉంటుంది. ఆస్తమాలో ఎలర్జీని కలుగజేసే కారకాలు, హిస్టమిన్ వంటి వాపును కలుగచేసే పదార్థాలను విడుదల చేయించడం వల్ల శ్వాసనాళాలు కుచించుకుపోయి శ్వాసించడం కష్టమవుతుంది.

2) ఎంఫైసీమా : ఇది దీర్ఘరుగ్మత, ఇందులో వాయుకోశ గోడలు శిథిలమయి, కలిసిపోవడం వల్ల వాయువుల వినిమయం జరిగే శ్వాసతలం తగ్గుతుంది. ఊపిరితిత్తులు పెద్దగా మారి, వాయుకోశాలు తగ్గి, అధిక తంతుయుత కణజాలాన్ని, తక్కువ స్థితిస్థాపకతను కలిగి ఉంటాయి. దీనికి ముఖ్యకారణం పొగతాగడం.

3) బ్రాంకైటిస్ : శ్వాసనాళికలలో వాపు ఏర్పడటం, దీనిఫలితంగా శ్వాసనాళికలోని శ్లేష్మస్తరంలో వాపు ఏర్పడటం వల్ల శ్లేష్మం ఉత్పత్తి అధికమై, శ్వాసనాళిక వ్యాసం తగ్గుతుంది. దీర్ఘకాలం దగ్గు, దీనితో చిక్కటి శ్లేష్మం / కఫం ఏర్పడతాయి.

4) న్యుమోనియా : స్ట్రెప్టోకోకస్ న్యుమోనియే అనే బ్యాక్టీరియా ఊపిరితిత్తులలో సంక్రమణ వల్ల కలుగుతుంది. కొన్ని రకాల వైరస్లు, శిలీంధ్రాలు, ప్రోటోజోవన్లు, మైకోప్లాస్మాలు కూడా ఈ వ్యాధిని కలుగజేస్తాయి. ఊపిరితిత్తులలో వాపు, వాయుకోశాలలో శ్లేష్మం చేరడం, తగ్గడం వాయువుల వినిమయం దీని లక్షణాలు. చికిత్స చేయనట్లయితే మరణించడం జరుగుతుంది.
వృత్తిపర శ్వాస రుగ్మతలు : ఇవి కొన్ని పరిశ్రమల నుంచి వెలువడిన హానికర పదార్థాలు, శ్వాసవ్యవస్థలోకి వెళ్ళినప్పుడు కలుగుతాయి.

  1. ఆస్బెస్టాసిస్ : ఆస్బెస్టాస్ పరిశ్రమలో పనిచేసేవారు, ఆస్బెస్టాస్ ధూళికి దీర్ఘకాలం గురికావడం వల్ల ఈ వ్యాధి కలుగుతుంది.
  2. సిలికోసిస్ : గనులు, క్వారిస్లలో పనిచేసేవారు, ఎక్కువ కాలం ఇసుక ధూళికి (సిలికా) గురికావడం వల్ల సిలికోసిస్ వ్యాధి కలుగుతుంది.
  3. సిడిరోసిస్ : కణజాలాలలో ఇనుపరేణువులు పొందుపర్చబడటం వల్ల ఈ వ్యాధి కలుగుతుంది.
  4. నలుపు ఊపిరితిత్తి వ్యాధి : ఈ వ్యాధి ధూళి, బొగ్గు పీల్చడం వల్ల కలుగుతుంది. ఇది బొగ్గు గనులలో ఎక్కువకాలం పనిచేసే కార్మికులలో సాధారణంగా కనిపిస్తుంది.

AP Inter 2nd Year Zoology Study Material Chapter 1(b) శ్వాసించడం, వాయువుల వినిమయం

దీర్ఘ సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
మానవుడి శ్వాస వ్యవస్థను వివరించండి.
జవాబు:
మానవుడి శ్వాసవ్యవస్థలో, బాహ్య నాసికారంధ్రాలు, నాసికా కక్ష్యలు, నాసికాగ్రసని, స్వరపేటిక, వాయునాళం, శ్వాసనాళాలు, శ్వాసనాళికలు మరియు ఊపిరితిత్తులు వంటి నిర్మాణాలుంటాయి.
1. బాహ్య నాసికారంధ్రాలు : ఒక జత బాహ్య నాసికారంధ్రాలు పైపెదవి పైన వెలుపలికి తెరచుకొని ఉంటాయి. ఇవి నాసికా కక్ష్యల్లోకి నాసికా మార్గం ద్వారా తెరచుకుంటాయి.

2. నాసికాకక్ష్యలు : ఇవి తాలువుకు పై భాగాన ఉండి నాసికా విభాజకం వల్ల వేరుచేయబడతాయి. ప్రతి నాసికా కక్ష్యలో మూడు భాగాలను గుర్తించవచ్చు. అవి

  1. అళిందభాగం : దీనిలో రోమాలు, చర్మవసాగ్రంథులు ఉండి, దుమ్ము, ధూళి రేణువులు ప్రవేశించకుండా నిరోధిస్తాయి.
  2. శ్వాసభాగం : ఇది లోపలికి పీల్చిన గాలి ఉష్ణోగ్రతను నియంత్రించే నిబంధనకారిగా పనిచేస్తుంది.
  3. ఘ్రాణభాగం : ఇవి ఘ్రాణ ఉపకళతో ఆవరించబడి ఉంటాయి.

3. నాసికాగ్రసని : నాసికాకక్ష్యలు ఒక జత అంతర నాసికా రంధ్రాల ద్వారా మృదుతాలువు పై గల నాసికా గ్రసనిలోకి తెరచుకొంటాయి. నాసికాగ్రసని, గ్రసనిలోని ఒక భాగం దీని లోపలితలం శైలికామయ ఉపకళతో ఆవరించబడి ఉండి పీల్చిన గాలిని శుభ్రపరుస్తుంది. దీనిలోనికి యుస్టేచియన్ నాళం తెరచుకొంటుంది. దీని తరువాత భాగం ముఖగ్రసనిలోకి తెరచుకొంటుంది. ఇది ఆహారానికి, గాలికి ఐక్యమార్గం. ముఖగ్రసని స్వరపేటికా గ్రసనిలోకి తెరచుకొంటుంది. ఇక్కడ ఆహార మార్గం, వాయు మార్గం, నిర్దిష్టంగా ఏర్పడి ఆహార మార్గం ఆహారవాహికలోకి, వాయు మార్గం కంఠబిలం ద్వారా వాయునాళంలోకి తెరచుకుంటాయి.

4. స్వరపేటిక : స్వరపేటిక ధ్వని ఉత్పత్తికి సహాయపడే మృదులాస్థి పేటిక. అందువల్ల దీన్ని ధ్వనిపేటిక లేదా ఆడమ్స్ ఆపిల్ అని కూడా అంటారు. ఇది గ్రసనిని వాయునాళాన్ని కలుపుతుంది. స్వరపేటిక ధ్వనిని ఉత్పత్తిచేసి మరియు గాలి ప్రయాణించే అవయవం. ఇది నాలుక అడుగుభాగాన మొదలై వాయునాళం వరకు ఉంటుంది. ఇది a) స్వరతంత్రులు/ స్వరముడతలు, కంఠబిలం మరియు c) ఉపజిహ్వికలను కలిగి ఉంటుంది.

  • స్వరతంత్రులు / స్వరముడతలు : ఇవి థైరాయిడ్ మృదులాస్థికి, ప్రకోణ మృదులాస్థులకు మధ్య విస్తరించి ఉన్న ఒక జత పలుచని పసుపురంగు స్థితిస్థాపక తంతువులు.
  • కంఠబిలం : ఇది మిథ్యా స్వరతంత్రులు మరియు నిజస్వరతంత్రుల మధ్య సన్నని మార్గం.
  • ఉపజిహ్విక : ఇది థైరాయిడ్ మృదులాస్థికి అతికి ఉన్న పలుచని ఆకులాంటి స్థితిస్థాపక మృదులాస్థి దళం. ఇది ఆహారాన్ని స్వరపేటికలోకి కంఠబిలం ద్వారా పోకుండా నిరోధిస్తుంది.

5) వాయునాళం : వాయునాళం ఉరఃకుహరం మధ్యభాగం వరకు విస్తరించే నిటారునాళం. దీని గోడలకు ఆధారంగా 20 ‘C’ ఆకారపు కాచాభ మృదులాస్థి వలయాలు ఉంటాయి. ఈ వలయాలు పృష్ఠ తలంలో అసంపూర్ణంగా ఉండి, వాయునాళం ముకుళించడాన్ని నిరోధిస్తూ ఎల్లప్పుడూ తెరుచుకొని ఉండేటట్లు చేస్తాయి. వాయునాళపు లోపలి తలం మిథ్యాస్తరిత శైలికామయ ఉపకళతో ఆవరించి ఉంటుంది.

6) శ్వాసనాళాలు, శ్వాసనాళికలు : వాయునాళం ఉరఃకుహరం మధ్యలో అయిదో ఉరఃకశేరుక స్థాయి వద్ద రెండుగా చీలి కుడి, ఎడమ శాఖలను ఏర్పరుస్తుంది. వీటిని ప్రాథమిక శ్వాసనాళాలు అంటారు. ప్రతి ప్రాథమిక శ్వాసనాళం తనవైపున ఉన్న ఊపిరితిత్తిలోకి ప్రవేశించి ద్వితీయ శ్వాసనాళాలు, ఇవి మరిన్ని శాఖలుగా చీలి తృతీయ శ్వాసనాళాలను ఏర్పరుస్తాయి. ప్రతి తృతీయ శ్వాసనాళం అనేకసార్లు విభజన చెంది క్రమంగా ప్రాథమిక, ద్వితీయ, తృతీయ, చివరి శ్వాసనాళికలను ఏర్పరుస్తాయి. ప్రతి శ్వాసనాళిక వాయుకోశాలతో అంతమయ్యే వాయుకోశగోణుల గుంపులోకి తెరచుకుంటుంది.

7) ఊపిరితిత్తులు : కుడి, ఎడమ ఊపిరితిత్తులు ఉరఃకుహరంలో అమరి ఉంటాయి. ఊపిరితిత్తులను ఆవరించి రెండు పొరలు కలిగిన పుపుస త్వచం ఉంటుంది. ఇది ఊపిరితిత్తుల తలంపై రాపిడిని తగ్గిస్తుంది. వెలుపలి పుపుసత్వచం ఉరః కుహరంతో లోపలి పుపుసత్వచం ఊపిరితిత్తులతో సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉంటాయి. బాహ్యనాసికా రంధ్రాల నుంచి శ్వాసనాళికల వరకు విస్తరించిన భాగం వాహికా భాగంగా, వాయుకోశాలు, వాటి నాళికలు కలిసి వినిమయ భాగంగా ఏర్పడతాయి. వాహికా భాగం పరిసరాలలోని గాలిని వాయుకోశాలలోకి రవాణా చేస్తుంది. ఇది ఉచ్ఛ్వసించిన గాలిలో ఉండే ధూళి రేణువులను తొలగించి తేమను చేర్చి దాని ఉష్ణోగ్రతను శరీర ఉష్ణోగ్రతకు తీసుకువస్తుంది. వినిమయ భాగం నిజమైన వ్యాపన ప్రాంతం. ఇక్కడ ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ వినిమయం రక్తం, వాతావరణంలోని గాలి మధ్యన జరుగుతుంది.
AP Inter 2nd Year Zoology Study Material Chapter 1(b) శ్వాసించడం, వాయువుల వినిమయం 3

ప్రశ్న 2.
రక్తంలో ఆక్సిజన్, కార్బన్ డై ఆక్సైడ్ రవాణా గురించి వ్యాసం వ్రాయండి.
జవాబు:
రక్తం ఆక్సిజన్ మరియు కార్బన్ డై ఆక్సైడ్ మాధ్యమంగా పనిచేస్తుంది.
1. ఆక్సిజన్ రవాణా : ఆక్సిజన్ న్ను ఊపిరితిత్తుల నుంచి కణజాలాలకు రక్తంలోని ప్లాస్మా, ఎర్రకర్తకణాలు రవాణా చేస్తాయి. సాధారణ పరిస్థితులలో ప్రతి 100 మి॥లీ. ఆమ్లజనియుత రక్తం కణజాలాలకు 5 మి.లీ. ఆక్సిజన్ విడుదల చేస్తుంది.
i) ప్లాస్మా ద్వారా ఆక్సిజన్ రవాణా : సుమారు 3 శాతం ఆక్సిజన్ రక్తంలోని ప్లాస్మాలో కరిగిన స్థితిలో, రవాణా చెందుతుంది.

ii) RBC ద్వారా ఆక్సిజన్ రవాణా : సుమారు 97 శాతం ఆక్సిజన్ ను రక్తంలోని ఎర్రరక్తకణాలు రవాణా చేస్తాయి. ఎర్రరక్తకణాలలో హీమోగ్లోబిన్ అనే ఇనుమును కలిగిన ఎరుపు రంగు వర్ణకం ఉంటుంది. ప్రతి హీమోగ్లోబిన్ అణువు నాలుగు ఆక్సిజన్ అణువులను రవాణా చేయగలుగుతుంది. ఆక్సిజన్ హీమోగ్లోబిన్తో బంధించబడటం ప్రాథమికంగా O2 పాక్షిక పీడనంపై ఆధారపడి ఉంటుంది. ఊపిరితిత్తులలో O2 పాక్షిక పీడనం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆక్సిజన్, హీమోగ్లోబిన్ ఉత్రమణీయంగా బంధించబడి ఆక్సీహీమోగ్లోబిన్ ను ఏర్పరుస్తుంది. దీన్ని హీమోగ్లోబిన్ ఆమ్లజనీకరణం అంటారు.
Hb + 4O2 ⇌ Hb (O2)4.

కణజాలాలలో O2 పాక్షిక పీడనం తక్కువగా ఉంటుంది. కాబట్టి ఆక్సీహీమోగ్లోబిన్ వియోగం చెంది ఆక్సిజన్ను విడుదల చేస్తుంది. ఆక్సిజన్ హీమోగ్లోబిన్ బంధించబడటాన్ని CO2 పాక్షిక పీడనం, H+ అయాన్ల గాఢత (pH), ఉష్ణోగ్రత ప్రభావితం చేస్తాయి.

AP Inter 2nd Year Zoology Study Material Chapter 1(b) శ్వాసించడం, వాయువుల వినిమయం

ఉదాహరణ : వాయుకోశాలలో pO2 అధికంగా ఉండి CO2 తక్కువగా, H+ గాఢత స్వల్పంగా (pH అధికంగా) ఉష్ణోగ్రత తక్కువగా ఉండటం వల్ల ఆక్సీహీమోగ్లోబిన్ ఏర్పడటానికి అనుకూలంగా ఉంటుంది.

కణజాలాలలో pO2 తక్కువగా pCO2 ఎక్కువగా, H+ గాఢత ఎక్కువగా (తక్కువ pH), అధిత ఉష్ణోగ్రత ఉండటం వల్ల ఆక్సీహీమోగ్లోబిన్ వియోజనం చెంది ఆక్సిజన్ విడుదలవడానికి అనుకూలంగా ఉంటుంది.

కార్బన్ డైఆక్సైడ్ రవాణా: కార్బన్ డైయాక్సైడ్ మూడు రకాలుగా రవాణా అవుతుంది.
(i) ద్రావణ స్థితిలో : 7శాతం CO2 ప్లాస్మాలో కరిగి ద్రావణ స్థితిలో రవాణా చేయబడుతుంది.
CO2 + H2O → H2CO3

(ii) కార్భమైనో సంయోగ పదార్థాలుగా : దాదాపు 20-25 శాతం CO2 నేరుగా హీమోగ్లోబిన్లోని అమైనో సముదాయంతో ఉత్రమణీయంగా కలవడం వల్ల కార్బమైనో హీమోగ్లోబిన్ ఏర్పడుతుంది.
Hb – NH2 + CO2 → Hb – NHCOO + H+.

ఈవిధంగా హీమోగ్లోబిన్ CO2 బంధమేర్పరుచుకోవడం CO2 పాక్షిక పీడన పై ఆధారపడి ఉంటుంది. ఎప్పుడైతే కణజాలాలలోలాగా pCO2 అధికంగా pO2 తక్కువగా ఉంటుందో అప్పుడు అధికంగా CO2 హీమోగ్లోబిన్తో బంధమేర్పరుచుకొంటుంది. వాయు కోశాలలాగా pCO2 తక్కువగా pO2 అధికంగా ఉన్నప్పుడు కార్బమైనో హీమోగ్లోబిన్ నుంచి CO2 వియోజనం చెందుతుంది. అంటే CO2 హీమోగ్లోబిన్ కణజాలాలలో కలిసి వాయుకోశాలలో విడుదలవుతుంది. CO2 ప్లాస్మా ప్రోటీన్లతో కలవడంవల్ల కూడా కార్బమైనో సంయోగ పదార్థాలు ఏర్పడతాయి.

(iii) బై కార్బనేట్గా : సుమారు 70 శాతం CO2 బై కార్బనేట్ గా రవాణా అవుతుంది. ఎర్రరక్తకణాలలో కార్బోనిక్ ఎనైడ్రేజ్ అనే ఎన్జైమ్ చాలా అధికంగా ఉంటుంది. ఈ క్రింది ఎన్జైమ్ చర్యను ఉత్రమణీయంగా జరుపుతుంది.
AP Inter 2nd Year Zoology Study Material Chapter 1(b) శ్వాసించడం, వాయువుల వినిమయం 2

విచ్ఛిన్నక్రియ ఫలితంగా కణజాలాలలో CO2 పాక్షిక పీడనం అధికంగా ఉంటుంది. CO2 రక్తంలోని RBC లోనికి వ్యాపనం చెంది, కార్బానిక్ ఆమ్లాన్ని ఏర్పరుస్తుంది. ఇది HCO3, H+ అయాన్లుగా వియోజనం చెందుతుంది. వాయుకోశాల దగ్గర pCO2 తక్కువగా ఉండటంవల్ల ఈ చర్య వ్యతిరేక దిశలో జరిగి CO2, నీటిని ఏర్పరుస్తుంది. ఈ విధంగా కణజాలాలలో CO2 బైకార్బనేట్ గా మార్చబడి, రక్తం ద్వారా వాయుకోశాలకు రవాణా చేయబడి వాయుకోశాల్లో తిరిగి నీరు, CO2 గా విడిపోయి బయటికి విడుదల చేయబడుతుంది. ప్రతి 100 మి॥లీ. సిరా రక్తం సుమారు 4 మి॥లీ. CO2ను వాయుకోశాల్లోని గాలిలోకి విడుదల చేస్తుంది.

AP Inter 2nd Year Zoology Study Material Chapter 1(a) జీర్ణక్రియ, శోషణం

Andhra Pradesh BIEAP AP Inter 2nd Year Zoology Study Material  Lesson 1(a) జీర్ణక్రియ, శోషణం Textbook Questions and Answers.

AP Inter 2nd Year Zoology Study Material Lesson 1(a) జీర్ణక్రియ, శోషణం

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
మానవ ప్రౌఢదశలోని దంత ఫార్ములాను తెలపండి. [T.S. Mar. ’15]
జవాబు:
మానవ ప్రౌఢదశలో 32 దంతాలుంటాయి. ప్రతి దవడ సమభాగములో ఉండే దంతాలు I.C.P.M, క్రమంలో అమరి ఉంటాయి. వీటిని దంత ఫౌర్ములాతో పేర్కొంటారు.
మానవ ప్రౌడదశలో దంత ఫార్ములా
\(\frac{2123}{2123}\)
= 32

ప్రశ్న 2.
పైత్యరసంలో జీర్ణ ఎన్జైమ్లు ఉండవు. అయినా జీర్ణక్రియలో ముఖ్యమైంది. ఎలా ? [T.S. Mar. ’16]
జవాబు:
పైత్యరసంలో జీర్ణ ఎన్జైమ్లు ఉండవు, కాని పైత్యరస లవణాలైన సోడియం, పొటాషియం గ్లికోకోలేట్లు, టారోకోలేట్లు ఉంటాయి. పైత్యరసంలో గల ఈ లవణాలు కొవ్వులను ఎమల్సీకరిస్తాయి మరియు లైపేజ్ అనే ఎన్జైములను ఉత్తేజితపరుస్తాయి. ఈ లైపేజ్లు ఎమల్సీకరించిన కొవ్వు పదార్థాలను కొవ్వు ఆమ్లాలు, గ్లిసరాల్గా విడగొడతాయి.

ప్రశ్న 3.
కైమోట్రిప్సిన్ పాత్రను వివరించండి. ఇదే రకానికి చెంది ఇదే గ్రంధి స్రవించిన రెండు ఎన్జైములను పేర్కొనండి.
జవాబు:
కైమోట్రిప్సిన్ ప్రోటీన్లు ప్రోటియోజెస్ మరియు పెప్టోన్ల జీర్ణక్రియలో ముఖ్యపాత్ర వహించి వాటిని ట్రై మరియు డైపెప్టైడ్లుగా మారుస్తుంది. కైమోట్రిప్సిన్, ట్రిప్సిన్ మరియు కార్బాక్సి పెప్టిడేజ్లు ఎండో పెప్టైడేజ్లు. ఇవి క్లోమము నుండి స్రవించబడి ప్రోటీన్ల జీర్ణక్రియలో తోడ్పడతాయి.

AP Inter 2nd Year Zoology Study Material Chapter 1(a) జీర్ణక్రియ, శోషణం

ప్రశ్న 4.
జీర్ణాశయంలో HCI స్రవించకపోతే ఏమి జరుగుతుందో వివరించండి.
జవాబు:
జీర్ణాశయంలో గోడలలోగల ఆక్సింటిక్ కణాలు HC ను స్రవిస్తాయి. HC/ ప్రోటీన్ల జీర్ణక్రియలో ముఖ్యపాత్ర వహిస్తుంది. HC/ ఆమ్ల pHని కలుగజేస్తుంది. ఇది పెప్సిన్ చర్యకు శ్రేష్టితమ pH మరియు క్రియారహిత పెప్సినోజనన్ను క్రియాశీల పెప్సిన్గా మారుస్తుంది. అందువలన జీర్ణాశయంలో HCI స్రవించకపోతే పెప్సిన్ క్రియారహితంగానే (పెప్సినోజన్) ఉంటుంది. ఇది ప్రోటీన్ల జీర్ణక్రియపై ప్రభావాన్ని చూపుతుంది.

ప్రశ్న 5.
గర్తదంతి (the codont) ద్వివార దంతి పదాలను వివరించండి.
జవాబు:
గర్తదంతి : మానవుడిలో దవడ ఎముక గర్తాలలో ఇమిడి ఉన్న దంతాలను గర్తదంతి అంటారు.
ద్వివార దంతి : మానవుడితో సహా అనేక క్షీరదాలలో దంతాలు వాటి జీవితకాలంలో రెండుసార్లు ఉద్భవిస్తాయి. బాల్యదశలో తాత్కాలిక పాలదంతాలు లేదా ఊడిపోయే దంతాలు, ప్రౌఢదశలో వాటి స్థానంలో శాశ్వత దంతాలు. ఈ రకం విన్యాసాన్ని ద్వివారదంత విన్యాసం అంటారు.

ప్రశ్న 6.
స్వయం ఉత్ప్రేరణ అంటే ఏమిటి ? రెండు ఉదాహరణలు ఇవ్వండి. [A.P. & T.S. Mar. 17; A.P. Mar. 15]
జవాబు:
ఒక ఉత్ప్రేరక చర్యలో అంతిమంగా ఏర్పడిన ఒక పదార్థం, అదే చర్యకు ఉత్ప్రేరకంగా పాత్రవహించి చర్యను జరిపిన దానిని స్వయం ఉత్ప్రేరకం అంటారు.
ఎంటి రోకైనెజ్
AP Inter 2nd Year Zoology Study Material Chapter 1(a) జీర్ణక్రియ, శోషణం 1

ప్రశ్న 7.
కైమ్ అంటే ఏమిటి ?
జవాబు:
జీర్ణాశయంలో పాక్షికంగా జీర్ణమై, ఆమ్ల లక్షణాలున్న ఆహారాన్ని కైమ్ అంటారు.

ప్రశ్న 8.
మానవుడిలోని వివిధ రకాల లాలాజల గ్రంథులను పేర్కొని అవి నోటిలో ఏ ప్రాంతాల్లో ఉన్నాయో తెలపండి.
జవాబు:
మానవుడిలో మూడు జతల లాలాజల గ్రంథులు ఉంటాయి. అవి

  1. పెరోటిడ్ గ్రంథులు ఇవి వెలుపలి చెవి పీఠభాగంలో ఉంటాయి.
  2. అధోజంభికా గ్రంథులు
  3. అధో జిహ్వికా గ్రంథులు

ఇవి క్రింది దవడ మూల భాగంలో ఉంటాయి.
నాలుక క్రింది భాగంలో ఉంటాయి.

AP Inter 2nd Year Zoology Study Material Chapter 1(a) జీర్ణక్రియ, శోషణం

ప్రశ్న 9.
మానవుడి నాలుకపై గల వివిధ సూక్ష్మాంకురాలను పేర్కొనండి.
జవాబు:
నాలుక పై భాగంలో చిన్నగా ముందుకు పొడుచుకొని వచ్చే నిర్మాణాలను సూక్ష్మాంకురాలు అంటారు. మానవుడి నాలుకపై మూడు రకాల సూక్ష్మాంకురాలు ఉంటాయి. అవి
1. ఫంజీఫామ్ సూక్ష్మాంకురాలు 2. తంతురూప సూక్ష్మాంకురాలు 3. సర్కంవెల్లేట్ సూక్ష్మాంకురాలు

ప్రశ్న 10.
మానవుడి దేహంలో అత్యంత కఠిన పదార్ధం ఏది ? అది ఏవిధంగా ఏర్పడుతుంది ?
జవాబు:
దంతానికి కిరీట భాగంలో డెంటినన్ను ఆవరించి పింగాణి పొర ఉంటుంది. ఈ పింగాణి పొర మానవ దేహంలో అతి దృఢమైన పదార్థం. దీన్ని బహిస్త్వచం నుంచి ఏర్పడిన ఎమియోబ్లాస్ట్లు స్రవిస్తాయి.

ప్రశ్న 11.
మానవుడి జీర్ణనాళంలో అవశేష అవయవంగా ఉండి, శాకాహారులలో బాగా అభివృద్ధి చెందిన ఈ భాగం ఏది ? ఇం ఏ రకపు కణజాలంతో ఏర్పడుతుంది ?
జవాబు: ఉండూకం మానవుని జీర్ణనాళంలో అవశేష అవయవం. ఇది అంధనాళం నుంచి పొడుచుకుని వచ్చే సన్నటి వేలు లాంటి నాళికాయుత నిర్మాణం. ఇది శాఖాహారులలో బాగా అభివృద్ధి చెంది, సెల్యూలోస్ జీర్ణక్రియలో ముఖ్యపాత్ర వహిస్తుంది. ఉండూకం లింపాయిడ్ కణజాలంను కలిగి ఉంటుంది. ఇవి రోగ నిరోధక వ్యవస్థలో ముఖ్యపాత్ర వహిస్తాయి.

ప్రశ్న 12.
మింగడం, నమలడం మధ్య బేధాన్ని తెల్పండి.
జవాబు:
మింగడం : తీసుకున్న ఆహారం మింగడం మూడు దశలలో జరుగుతుంది.

  1. నమిలిన ఆహారాన్ని ముద్దగా సేకరించడం.
  2. ఈ ఆహారపు ముద్దను గ్రసని ద్వారా ఆహారవాహిక పూర్వాంతరానికి చేర్చడం.
  3. ఆహార వాహిక నుండి జీర్ణాశయమునకు చేరుతుంది.

నమలడం : తీసుకున్న ఆహారాన్ని కొరకడం, చీల్చడం, నమలడం ద్వారా చిన్న చిన్న ముక్కలుగా చేస్తుంది. దంతాలు నమలడం వల్ల, నాలుక కలపడం వల్ల లాలాజలంతో కలిసి ఆహారం మెత్తగా, ముద్దగా మారుతుంది.

ప్రశ్న 13.
నీళ్ళ విరేచనాలు, మలబద్దకం మధ్య భేదాన్ని తెలపండి.
జవాబు:
నీళ్ళ విరేచనాలు : అసాధారణ ఆంత్ర కదలికలు, పలుచని ద్రవరూప మలవిసర్జన దీని లక్షణం. ఆహార శోషణ తగ్గి అధిక నీటి నష్టం జరగడం వల్ల దేహం నిర్జలీకరణకు గురువుతుంది.
మలబద్దకం : పెద్దపేగు కదలికలు తక్కువ కావడం వల్ల మలం పురీషనాళంలో నెమ్మదిగా కదులుతూ ఎక్కువ నీటిని కోల్పోవడం వల్ల గట్టిగా మారుతుంది. దీనివల్ల మలవిసర్జన కష్టమవుతుంది. నీటిని తక్కువగా తాగడం, ఆహారంలో పీచు పదార్థం తగ్గడం, ఎక్కువ కంగారుపడటం కూడా దీనికి కారణాలు.

ప్రశ్న 14.
ఆంత్రమూలంలోని శ్లేష్మస్తరం స్రవించే రెండు హార్మోనులను పేర్కొనండి.
జవాబు:
సెక్రిటిన్, కొలెసిస్టోకైనిన్ (CCK) హార్మోనులు ఆంత్రమూలం శ్లేష్మస్తరం నుండి స్రవించబడతాయి.

ప్రశ్న 15.
శోషణ, స్వాంగీకరణం మధ్య భేదాన్ని తెలపండి.
జవాబు:
శోషణ : జీర్ణక్రియ ఫలితంగా ఏర్పడిన అంత్యపదార్థాలు పేగు గోడలలోని శ్లేష్మస్తరంలోకి, దాని నుంచి రక్తం లేదా శోషరసంలో గ్రహించబడడాన్ని శోషణ అంటారు. ఇది నిష్కియ, సక్రియా యంత్రాంగాల ద్వారా జరుగుతుంది.

స్వాంగీకరణం : శోషణం చెందిన జీర్ణ పదార్థాలు చివరి కణజాలాలకు చేరి, జీవ పదార్థ అనుఘటకాలుగా మార్చబడతాయి. ఇవి శక్తి ఉత్పాదన, పెరుగుదల మరమ్మత్తు చేయడానికి వినియోగపడతాయి. ఈ విధానాన్నే ‘స్వాంగీకరణం’ అంటారు.

AP Inter 2nd Year Zoology Study Material Chapter 1(a) జీర్ణక్రియ, శోషణం

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
దంతం నిలువుకోత పటం గీచి, భాగాలు గుర్తించండి.
జవాబు:
AP Inter 2nd Year Zoology Study Material Chapter 1(a) జీర్ణక్రియ, శోషణం 2

ప్రశ్న 2.
జీర్ణాశయంలో మాంసకృత్తుల జీర్ణక్రియను వివరించండి. [T.S. Mar. ’16; A.P. Mar. ’15]
జవాబు:
మాంసకృత్తుల జీర్ణక్రియ జీర్ణాశయంలో మొదలవుతుంది. జీర్ణాశయమును చేరిన ఆహారం ఆమ్ల గుణం గల జఠర రసంతో కలుపబడి, జీర్ణాశయం గోడలలోని కండరాల చర్యవల్ల బాగా చిలకబడి ‘క్రైమ్’ ఏర్పడుతుంది. జఠర రసంలో శ్లేష్మం, బైకార్బోనేట్లు ఉంటాయి. ఇవిశ్లేష్మస్తర ఉపకళను లూబ్రికేట్ చేయడంలోనూ, గాడ HCL నుండి కాపాడటంలోను ముఖ్యపాత్ర వహిస్తాయి.

గాఢ HCl ఆమ్ల pH ని (1.8) కలుగజేస్తుంది. ఇది పెస్సిన్ చర్యకు కావలసిన శ్రేష్ఠతమ pH ఇస్తుంది. జఠర రసంలోని ప్రోఎన్జైమ్లు పెప్సినోజన్, ప్రోరెనిన్లు, హైడ్రోక్లోరిక్ ఆమ్ల సమక్షంలో పెప్సిన్, రెనిన్ అనే చైతన్యవంత ఎన్ఎమ్లుగా మారతాయి. పెప్సిన్ మాంసకృత్తులను ప్రోటియోజ్లు పెప్టోన్లుగా విడగొడుతుంది. రెనిన్, శిశువు జఠరరసం లోగల ప్రోటయోలైటిక్ ఎన్ఎమ్. ఇది పాలలోని కెసీన్ అనే ప్రోటీన్ను, కాల్షియం అయానుల సమక్షంలో కాల్షియం పారకేసినేట్ గా మారుస్తుంది. పెప్సిన్ కాల్షియం పారాకేసినేట్ను పెప్టోన్లుగా మారుస్తుంది. జీర్ణాశయంలో మాంసకృత్తుల జీర్ణక్రియ నాలుగు గంటల సమయం పాటు జరుగుతుంది.
AP Inter 2nd Year Zoology Study Material Chapter 1(a) జీర్ణక్రియ, శోషణం 3

ప్రశ్న 3.
మాంసకృత్తుల జీర్ణక్రియలో క్లోమరస పాత్రను వివరించండి.
జవాబు:
క్లోమరసం క్లోమము నుండి స్రవించబడి, మాంసకృత్తుల జీర్ణక్రియలో ముఖ్యపాత్ర వహిస్తుంది. క్లోమరసంలో ప్రోఎమైన ట్రిప్సినోజన్, కైమోట్రిప్సినోజన్ మరియు ప్రోకార్బాక్సి పెప్టిడేజ్ వంటి ప్రోటీన్ హైడ్రోలైజింగ్ ఎంజైములు ఉంటాయి. కాని ఇవి క్రియాశీలరహితంగా ఉంటాయి.

ట్రిప్సినోజనన్ను ఆంత్ర శ్లేష్మస్తరం స్రవించే ఎంటిరోకైనేజ్ అనే ఎన్జైమ్ ఉత్తేజితం చేసి క్రియాశీల ట్రిప్సిన్గా మారుస్తుంది. ఇది తిరిగి క్లోమరసంలోని ఇతర ఎన్ఎమ్లను క్రియాశీలంగా చేయడమే కాకుండా స్వయం ఉత్ప్రేరణ (auto catalysis) ద్వారా ట్రిప్సినోజన్ ను ట్రిప్సిన్ గా మారుస్తుంది.
AP Inter 2nd Year Zoology Study Material Chapter 1(a) జీర్ణక్రియ, శోషణం 4

క్లోమరసం యొక్క కైమోట్రిప్సిన్, ట్రిప్సిన్ కార్బాక్సి పెప్టిడేజ్లు, క్రైమ్ లో గల ప్రోటీన్లు, ప్రోటియోజ్లు, పెప్టోన్లపై పనిచేసి వాటిని ట్రై మరియు డై పెప్టైడ్లుగా మారుస్తాయి. ఇవి మరల ట్రై మరియు డై పెప్టిడేజ్ల చేత జలవిశ్లేషణ చెంది అంత్య పదార్థాలు అయిన అమైనో ఆమ్లాలను ఏర్పరుస్తాయి.
AP Inter 2nd Year Zoology Study Material Chapter 1(a) జీర్ణక్రియ, శోషణం 5

AP Inter 2nd Year Zoology Study Material Chapter 1(a) జీర్ణక్రియ, శోషణం

ప్రశ్న 4.
పాలిశాకరైడ్, డైశాకరైడ్లు ఏవిధంగా జీర్ణమవుతాయి ?
జవాబు:
మనం తీసుకొనే ఆహారంలో పిండిపదార్థాలైన స్టార్చ్ గ్లైకోజన్ వంటి పాలిశాకరైడ్లు, డై శాకరైడ్లు ఉంటాయి. ఈ పిండి పదార్థాల జీర్ణక్రియ ఆస్యకుహరంలో ప్రారంభమవుతుంది.

  • ఆస్యకుహరంలో పిండిపదార్థాల జీర్ణక్రియ: ఆస్యకుహరంలో ఆహారం నమలడం వల్ల లాలాజలంతో కలియును. లాలాజలంలో గల పిండిపదార్థాలను జల విశ్లేషణ చేసే టయలిన్/ లాలాజల ఎమైలేజ్ వంటి ఎన్జైములు స్టార్చ్ వంటి పిండి పదార్థాలను (30%) జలవిశ్లేషణ జరిపి మాల్టోజ్ వంటి డై శాకరైడ్లుగా మారుస్తుంది.
    AP Inter 2nd Year Zoology Study Material Chapter 1(a) జీర్ణక్రియ, శోషణం 6
  • జీర్ణాశయంలో పిండిపదార్థాల జీర్ణక్రియ : జీర్ణాశయంలో పిండిపదార్థాలు జీర్ణం కావు. జఠర రసంలో పిండి పదార్థాలను విడగొట్టు (జీర్ణింపజేయు) ఎన్జైములు లేవు. కాని, అధిక ఆమ్ల pH వల్ల కొంత సుక్రోజ్ జల విశ్లేషణ చెందవచ్చు.
  • చిన్న ప్రేగులో పిండిపదార్థాల జీర్ణక్రియ : చిన్న ప్రేగును చేరిన పిండి పదార్థాలు క్లోమ మరియు ఆంత్ర రసాలతో బాగుగా కలియును.

లాలాజలంలో ఎమైలేజ్ చర్య జరపగా మిగిలిన 70% పిండిపదార్ధాలను క్లోమరసంలోని ఎమైలేజ్ జలవిశ్లేషణ జరిపి మాల్టోజ్ (డైశాకరైడ్)గా మారుస్తుంది. ఆంత్రరసంలోని మాల్టేజ్ దాన్ని గ్లూకోజ్ గా మారుస్తుంది. ఇంతేకాకుండా ఆంత్రరసంలోని సుక్రేజ్, లాక్టేజ్లు డైశాకరైడ్లైన సుక్రోజ్, లాక్టోజ్లపై చర్యజరిపి మోనోశాకరైడ్లను ఏర్పరుస్తాయి.
AP Inter 2nd Year Zoology Study Material Chapter 1(a) జీర్ణక్రియ, శోషణం 7

ప్రశ్న 5.
మీ ఆహారంలో వెన్న తీసుకుంటే, అది ఏవిధంగా జీర్ణం అవుతుందో, శోషణం చెందుతుందో వివరించండి.
జవాబు:
వెన్నలో కొవ్వు పదార్థం ఉంటుంది. కొవ్వు పదార్థాలు జీర్ణాశయంలో జీర్ణంకాని స్థితిలోనే ఉంటాయి.

చిన్న పేగులో కొవ్వు పదార్థాల జీర్ణక్రియ: చిన్న పేగులో, కొవ్వు పదార్థాలు పూర్తిస్థాయిలో జీర్ణమవుతాయి. చిన్న పేగును చేరిన కొవ్వు పదార్ధాలు, పైత్యరసం మరియు క్లోమరసంలో గల శక్తివంతమైన లైపేజ్ చర్య వల్ల జీర్ణమవుతాయి. పైత్యరస లవణాలు సోడియం/పొటాషియం గ్లెకోకోలేట్టు మరియు టారోకోలేట్లు కొవ్వు పదార్థాలను ఎమల్సీకరిస్తాయి. ఎమల్సీ కరణం వల్ల కొవ్వు పదార్థాలు చిన్నచిన్న సూక్ష్మమైసెల్లెలుగా విడగొట్టబడతాయి. క్లోమరసంలోని లైపేజ్ (స్ట్రియాప్సిన్), ఆంత్రరసంలోని లైపేజ్లు ఎమల్సీకరించిన కొవ్వు పదార్థాలను కొవ్వు ఆమ్లాలు, గ్లిసరాల్ ను విడగొట్టబడతాయి.
AP Inter 2nd Year Zoology Study Material Chapter 1(a) జీర్ణక్రియ, శోషణం 8

శోషణ : కొవ్వు ఆమ్లాలు, మోనోడైగ్లిజరైడ్లు నీటిలో కరుగవు. ఇవి రక్తంలోకి నేరుగా శోషణం చెందలేవు. ఇవి మొదట సూక్ష్మ బిందువులుగా మార్చబడతాయి. వీటిని మైసెల్లేలు అంటారు. ఇవి పేగు శ్లేష్మస్తర కణాలలోకి వ్యాపనం ద్వారా ప్రవేశిస్తాయి. ఉపకళ కణంలో మోనోగ్లిజరైడ్లు, కొవ్వు ఆమ్లాలు తిరిగి ట్రైగ్లిజరైడ్లుగా సంశ్లేషణం చెంది, కొద్ది మొత్తంలో ఫాస్ఫోలిపిడ్లు, కొలెస్టిరాల్తో కలిసి ప్రోటీన్లతో ఆవరింపబడి చిన్న చిన్న కొవ్వు గుళికల రూపంలో మారతాయి. వీటినే కైలోమైక్రాన్లు అంటారు. ఇవి ఆంత్ర సూక్ష్మ చూషకాలలో ఉండే లాక్టియల్ అనే శోషరస సూక్ష్మనాళికలోనికి కణ బహిష్కరణ (exocytosis) పద్ధతిలో ప్రవేశిస్తాయి. శోషరస నాళాలు చివరికి శోషణం చెందిన కొవ్వు పదార్థాలను అధోజత్రుకాసిర, ఉరఃనాళం ద్వారా రక్త ప్రవాహంలోకి విడుదల చేస్తాయి. ఈ కైలో మైక్రాన్లు ఎండోథీలియల్ గోడల నుంచి విడుదలైన లైపోప్రోటీన్ లైపేజ్ ఎన్ఎమ్ చర్య ద్వారా విచ్ఛిన్నం చెంది కొవ్వు ఆమ్లాలు, గ్లిసరాల్ గా మారతాయి. ఇవి ఎడిపోస్ కణజాలంలోని ఎడిపోసైట్లలోకి వ్యాపనం చెంది తటస్థ కొవ్వుగా, కాలేయంలోకి వ్యాపనం చెంది కణజాల కొవ్వుగా నిలువ ఉంటాయి.

AP Inter 2nd Year Zoology Study Material Chapter 1(a) జీర్ణక్రియ, శోషణం

ప్రశ్న 6.
కాలేయం విధులను పేర్కొనండి. [AP TS Mar 15]
జవాబు:
కాలేయం అనేక విధులను నిర్వహిస్తుంది. అవి సంశ్లేషణ (synthesis) నిలువ, అనేక స్రావాలను స్రవించడం. అవి కింది విధంగా ఉంటాయి.
1. కాలేయం, పసుపు ఆకుపచ్చ రంగులో ఉన్న పైత్యరసాన్ని స్రవిస్తుంది. పైత్యరసం సోడియం /పోటాషియం గ్లైకోకోలేట్లు, టారోకోలెట్ల వంటి లవణాలను కలిగి ఉంటుంది. ఇవి కొవ్వుల జీర్ణక్రియలో తోడ్పడతాయి.

2. కాలేయం, కార్బోహైడ్రేట్ల జీవక్రియలో ముఖ్యపాత్ర వహిస్తుంది.
a) గ్లైకోజెనిసిస్ : గ్లూకోజ్ నుండి గ్లైకోజన్ ఏర్పడుట
b) గ్లైకోజినోలైసిన్ : గ్లైకోజన్ విచ్ఛిన్నం చెంది గ్లూకోజ్ను ఏర్పర్చుట
c) గూకోనియోజెనిసిస్ : వివిధ అమైనో ఆమ్లాలు, లాక్టిక్ ఆమ్లం, గ్లిసరాల్ నుండి గ్లూకోజ్ సంశ్లేషణం చెందుట

3. కొలెస్టిరాల్, ట్రైగ్లిసరైడ్ల సంశ్లేషణలో కాలేయం ముఖ్యపాత్ర వహిస్తుంది.

4. ఆమైనో ఆమ్లాలను డి-ఎమినేషన్ చేసి విడుదలైన అమ్మోనియాను ఆర్నిథిన్ వలయం ద్వారా యూరియాగా మారుస్తుంది.

5. ఆహారం ద్వారా ప్రేగులోకి ప్రవేశించిన విష పదార్థాలను విషరహితంగా మారుస్తుంది.

6. కాలేయం ఉష్ణక్రమత అవయవంగా పనిచేస్తుంది.

7. పిండ దశలో కాలేయం రక్త కణోత్పాదక అంగంగా ప్రౌఢదశలో ఎర్రరక్తకణ విచ్ఛిత్తి అంగంగా పనిచేస్తుంది.

8. కాలేయం ప్లాస్మా ప్రోటీన్లను సంశ్లేషిస్తుంది. అవి ఆల్బుమిన్, గ్లోబ్యులిన్లు రక్త స్కందన కారకాలైన ఫైబ్రినోజన్, ప్రోత్రాంబిస్ మొదలైనవి మరియు ప్రతి రక్తస్కందకం అయిన హెపారిన్ ను కూడా ఉత్పత్తి చేస్తుంది.

9. వాయు రహిత కండర సంకోచంలో ఏర్పడిన లాక్టిక్ ఆమ్లాన్ని కోరి వలయం ద్వారా గ్లెకోజన్ గా మారుస్తుంది.

10. కుఫర్ కణాలు పెద్దవైన భక్షక కణాలు. ఇవి కాలేయంలోకి ప్రవేశించిన అనవసర పదార్థాలను, సూక్ష్మజీవులను క్రిమిభక్షణ (phagocytic) పద్ధతిలో తొలగిస్తాయి.

దీర్ఘ సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
మానవుడి జీర్ణవ్యవస్థలో వివిధ రకాల ఆహార పదార్థాల జీర్ణక్రియా విధానాన్ని వివరించండి.
జవాబు:
సంక్లిష్టమైన శోషింపబడలేని ఆహార పదార్థాలు, సరళమైన శోషించబడగలిగిన సరళరూపంలోకి మార్చబడే విధానాన్నే జీర్ణక్రియ అంటారు. జీర్ణక్రియ అనేది యాంత్రిక, జీవరసాయన ప్రక్రియల ద్వారా జరుగుతుంది.

I. ఆస్యకుహరంలో జీర్ణక్రియ: ఆస్యకుహరం రెండు ప్రధాన విధులను నిర్వహిస్తుంది. అవి ఆహారాన్ని నమలడం, మింగడంలో ‘సహాయపడటం. దంతాలు నమలడం వల్ల, నాలుక కలపడం వల్ల, లాలాజలం నీటిని సమకూర్చి శ్లేష్మంతో లూబ్రికేట్ చేయడం వల్ల ఆహారం మెత్తగా, ముద్దగా మారుతుంది. దీన్నే “బోలస్” అంటారు. లాలాజలంలో నీరు, Nat, K+, CIF, HCO3 వంటి విద్యుత్ విశ్లేష్యకాలు, శ్లేష్మం, ఎన్జైములైన లాలాజల ఎమైలేజ్ (టయలిన్), లైసోజైములు ఉంటాయి. పిండి పదార్థాలు జీర్ణక్రియ లాలాజల ఎమైలేజ్తో (టయలిన్) ఆస్యకుహరంలో ప్రారంభమవుతుంది. ఇది సుమారు 30% పిండిపదార్థాన్ని జలవిశ్లేషణ జరిపి డైశాకరైడ్ అయిన మాల్టోజ్ గా మారుస్తుంది.
AP Inter 2nd Year Zoology Study Material Chapter 1(a) జీర్ణక్రియ, శోషణం 9
లైసోజైము ఆహారంలో ఉన్న బ్యాక్టీరియాను నశింపజేస్తుంది.

II. జీర్ణాశయంలో జీర్ణక్రియ: ఆస్యకుహరం నుండి ‘బోలస్’ జీర్ణాశయమును చేరుతుంది. జీర్ణాశయములో పిండి పదార్థాల జీర్ణక్రియ ఆగి, మాంసకృతుల జీర్ణక్రియ మొదలవుతుంది. జీర్ణాశయంలో ఆహారం ఆమ్ల గుణం గల జఠరరసంతో కలుపబడి, జీర్ణాశయం గోడలలోని కండరాల చర్యవల్ల బాగా చిలకబడి కైమ్’ ఏర్పడుతుంది. జఠరరసంలో శ్లేష్మం, బైకార్బోనేట్లు ఉంటాయి. ఇవి శ్లేష్మస్తర ఉపకళను లూబ్రికేట్ చేయడంలోనూ, గాఢ HCI నుంచి కాపాడటంలోను ముఖ్యపాత్ర వహిస్తాయి. గాఢ HC౭ ఆమ్ల pH ని (1.8) కలుగజేస్తుంది. ఇది పెప్సిన్ చర్యకు కావలసిన శ్రేష్ఠతమ pH ఇస్తుంది. జఠర రసంలోని ప్రోఎన్జైములు పెప్సినోజన్, ప్రోరెనిన్లు, హైడ్రోక్లోరిక్ ఆమ్ల సమక్షంలో పెప్సిన్, రెనిన్ అనే చైతన్యవంత ఎన్జైములుగా మారుతాయి. పెప్సిన్ మాంసకృత్తులను ప్రోటియోజ్లు, పెప్టోన్లుగా విడగొడుతుంది. రెనిన్ శిశువు జఠరరసంలోగల ప్రోటియోలైటిక్ ఎన్ఎమ్. ఇది పాలలోని కెసీన్ అనే ప్రోటీన్ ను, కాల్షియం అయానుల సమక్షంలో కాల్షియం పారాకేసినేట్గా మారుస్తుంది. పెప్సిన్ కాల్షియం పారాకేసినేట్ను పెప్టోన్లుగా మారుస్తుంది. జీర్ణాశయంలో మాంసకృత్తుల జీర్ణక్రియ నాలుగు గంటల సమయంపాటు జరుగుతుంది.
AP Inter 2nd Year Zoology Study Material Chapter 1(a) జీర్ణక్రియ, శోషణం 10

III. చిన్న పేగులో జీర్ణక్రియ : చిన్న పేగు కుడ్యంలోని బాహ్య కండర స్తరంలోని కండరాలు అనేక రకాల కదలికలను కలుగజేస్తాయి. ఈ కదలికలు పైత్యరసం, క్లోమరసం, ఆంత్రరసాలను కైమ్తో బాగా కలపడం వల్ల పేగులో జీర్ణక్రియ సులువుగా జరుగుతుంది. క్లోమం స్రవించే శ్లేష్మం, బైకార్బోనేట్లు ఆంత్ర శ్లేష్మస్తరాన్ని ఆమనీబి మాధ్యమం నుంచి రక్షిస్తూ ఆమ్ల మాధ్యమాన్ని క్షారయుతంగా మార్చి ఎన్ జైమ్ చర్యలకు కావలసిన క్షారమాధ్యమాన్ని కలుగజేస్తాయి. ఆంత్రమూలం సమీపాగ్ర భాగంలోని కణాలు ఎక్కువ మోతాదులో బైకార్బోనేట్లను ఉత్పత్తి చేసి జఠర రసాన్ని పూర్తిగా తటస్థీకరించి ఆంత్రంలోకి ఆమ్ల ప్రవేశం లేకుండా చేస్తాయి. క్లోమరస, ఆంత్రరస ఎన్జైములు క్షార మాధ్యమంలోనే సమర్ధవంతంగా పనిచేస్తాయి.

AP Inter 2nd Year Zoology Study Material Chapter 1(a) జీర్ణక్రియ, శోషణం

i) ప్రోటీన్ల జీర్ణక్రియ : క్లోమరసంలో ప్రోఎన్జైములైన ట్రిప్సినోజన్, కైమోట్రిప్సినోజన్, మరియు ప్రోకార్బాక్సి పెప్టిడేజ్ వంటి క్రియాశీల రహిత ప్రోటీన్ హైడ్రోలైజింగ్ ఎన్జైములు ఉంటాయి. ట్రిప్సినోషన్ను ఆంత్ర శ్లేష్మస్తరం స్రవించే ఎంటిరోకైనేజ్ అనే ఎన్ జైమ్ ఉత్తేజితం చేసి క్రియాశీల ట్రిప్సిన్గా మారుస్తుంది. ఇవి తిరిగి క్లోమరసంలోని ఇతర ఎన్జైములను క్రియాశీలంగా చేయడమే కాకుండా స్వయం ఉత్ప్రేరణ (auto catalysis) ద్వారా ట్రిప్సినోజన్ ను ట్రిప్సిన్ గా మారుస్తుంది.
AP Inter 2nd Year Zoology Study Material Chapter 1(a) జీర్ణక్రియ, శోషణం 11
క్లోమరసం యొక్క కైమోట్రిప్సిన్, ట్రిప్సిన్, కార్బాక్సీ పెప్టిడేజ్లు, క్రైమ్ లోగల ప్రోటీన్లు, ప్రోటియోన్లు, పెప్టోన్లపై పనిచేసి వాటిని ట్రై మరియు డై పెప్టైడ్లుగా మారుస్తాయి. ఇవి మరల ట్రై మరియు డై పెప్టిడేజ్ల చేత జల విశ్లేషణ చెంది అంత్య పదార్థాలు అయిన అమైనో ఆమ్లాలను ఏర్పరుస్తాయి.
AP Inter 2nd Year Zoology Study Material Chapter 1(a) జీర్ణక్రియ, శోషణం 12
AP Inter 2nd Year Zoology Study Material Chapter 1(a) జీర్ణక్రియ, శోషణం 13

ii) కొవ్వుల జీర్ణక్రియ : కొవ్వు పదార్థాలను పైత్యరస లవణాలు ఎమల్సీకరిస్తాయి. ఎమల్సీ. కరణం వల్ల కొవ్వు పదార్థాలు చిన్న చిన్న సూక్ష్మ మైసెల్లెలుగా విడగొట్టబడతాయి. క్లోమరసంలోని లైపేజ్ (స్ట్రియాప్సిన్), ఆంత్రరసం లైపేజ్లు ఎమల్సీకరించిన కొవ్వు పదార్థాలను కొవ్వుఆమ్లాలు మరియు గ్లిజరాల్ ను విడగొట్టబడతాయి.
AP Inter 2nd Year Zoology Study Material Chapter 1(a) జీర్ణక్రియ, శోషణం 14

iii) కార్బోహైడ్రేట్ల జీర్ణక్రియ: కైమ్ లో పిండి పదార్థాలను (మిగిలిన 70%) క్లోమరసంలోని ఎమైలేజ్ జలవిశ్లేషణ జరిపి మాల్టోజ్ మారుస్తుంది. ఆంత్రరసంలోని మాల్టేజ్ దాన్ని గ్లూకోజ్ మారుస్తుంది. ఇంతేకాకుండా ఆంత్రరసంలోని సుక్రేజ్, లాక్టేజ్, డైశాకరైడ్లైన ‘సుక్రోజ్, లాక్టోజ్లపై చర్య జరిపి మోన్ శాకరైడ్లను ఏర్పరుస్తాయి.
AP Inter 2nd Year Zoology Study Material Chapter 1(a) జీర్ణక్రియ, శోషణం 15

iv) కేంద్రకామ్లాల జీర్ణక్రియ: క్లోమరసంలోని న్యూక్లియేజ్లు కేంద్రకామ్లాలను న్యూక్లియోటైడ్ లు, నూక్లియోసైడ్లుగా మారుస్తాయి. ఆంత్రరసంలో న్యూక్లియోటైడేజ్, న్యూక్లియోసైడేజ్ ఎంజైములు ఉంటాయి. ఇవి న్యూక్లియోటైడ్, న్యూక్లియోసైడ్లను పెంటోజ్ చక్కెర, నత్రజని క్షారాలుగా మారుస్తాయి.

జీర్ణక్రియ ఫలితంగా ఏర్పడిన అంత్య పదార్థాలు పేగు గోడలలోని శ్లేష్మస్తరంలోకి శోషించబడి, దాని నుండి రక్తం లేదా శోషరసంలోకి గ్రహించబడతాయి. ఇవి నిష్క్రియ (passive), సక్రియ (active) రవాణా యంత్రాంగాల ద్వారా శోషించబడతాయి.

ప్రశ్న 2.
మానవ జీర్ణవ్యవస్థ పటం గీచి, భాగాలు గుర్తించి, వివరించండి.
జవాబు:
మానవ జీర్ణవ్యవస్థ వివిధ అంగాల మరియు కణజాలాల సమూహము ఇవి సంక్లిష్టమైన శోషించబడలేని ఆహార పదార్థాలు, సరళమైన శోషించబడగలిగిన సరళ రూపంలోకి మార్చును.
మానవ జీర్ణవ్యవస్థలో ఆహార నాళం, అనుబంధగ్రంధులు ఉంటాయి.
ఆహారనాళం/ జీర్ణనాళం:
మానవ ఆహారనాళం పూర్వభాగంలో నోటితో మొదలై పర భాగంలో పాయువుతో అంతమవుతుంది. ఆహారనాళం యొక్క భాగాలు :

  1. నోరు మరియు ఆస్యకుహరం
  2. గ్రసని
  3. ఆహారవాహిక
  4. జీర్ణాశయం
  5. చిన్న ప్రేగు
  6. పెద్ద పేగు

AP Inter 2nd Year Zoology Study Material Chapter 1(a) జీర్ణక్రియ, శోషణం 16

1. నోరు మరియు ఆస్యకుహరం : నోరు ఆహారనాళంలో మొదటి భాగము. నోటిని ఆవరించి కదిలే పై, క్రింది పెదవులను కలిగి వుంటుంది. నోరు ఆస్యకుహరంలోకి తెరచుకుంటుంది. తాలువు ఉదర ఆస్యకుహరాన్ని పృష్ఠ నాసికా కక్ష్య నుండి వేరు చేయడం వల్ల, ఆహారం నమలడం, శ్వాసించడం ఏక కాలంలో జరుగుతాయి. దవడ ఎముకపై నాలుగు రకాల దంతాలు ఉంటాయి. నాలుక ఆస్యకుహరం ఆధారం దగ్గర అతికి ఉంటుంది.

(i) దంతాలు : దంతాలు బాహ్య – మధ్యత్వచం నుంచి ఉద్భవిస్తాయి. మానవుని ప్రౌఢదశలో 32 శాశ్వత దంతాలు ఉంటాయి. ఇవి నాలుగు రకాలు. అవి : కుంతకాలు (Incisors), రదనికలు (Canines), అగ్ర చర్వణకాలు (Premolars) చర్వణకాలు (Molars). ఇవి ఆహారాన్ని కొరకడానికి, చీల్చడానికి, నమలడానికి ఉపయోగపడతాయి.
ఈ దంతాల అమరికను దంతఫార్ములాతో పేర్కొంటారు.
మానవ ప్రౌఢదశలో దంత ఫార్ములా = \(\frac{2123}{2123}\)= 32

AP Inter 2nd Year Zoology Study Material Chapter 1(a) జీర్ణక్రియ, శోషణం

(ii) నాలుక : నాలుక స్వేచ్ఛగా కదిలే, కండరయుతమైన జ్ఞానాంగం. ఇది ఆస్య కుహర అడుగు భాగంలో ఫ్రెన్యులమ్ అనే మడతలాంటి కణజాలంతో అతికి ఉంటుంది. నాలుక పై భాగంలో చిన్నగా ముందుకు పొడుచుకొని వచ్చే నిర్మాణాలను సూక్ష్మాంకురాలు అంటారు. వీటిలో కొన్ని రుచిగుళికలను (taste buds) కలిగి ఉంటాయి. నాలుక పళ్లను శుభ్రపరచడానికి, లాలాజలాన్ని ఆహారంతో కలపడానికి, రుచిని గుర్తించడానికి, మింగడానికి, మాట్లాడటానికి సహాయపడుతుంది.

2. గ్రసని : ఆస్యకుహరం పొట్టిగా ఉండే గ్రసనిలోకి తెరుచుకుంటుంది. ఇది ఆహారం, గాలి ప్రయాణించే ఐక్య మార్గం. మృదు తాలువు గ్రసనిని, నాసికా గ్రసని, ఆస్య గ్రసని, స్వరపేటికా గ్రసనిగా విభజిస్తుంది. ఆహార వాహిక, వాయునాళం స్వరపేటికా గ్రసనిలోకి తెరుచుకుంటాయి. వాయునాళం స్వరపేటికా గ్రసనిలోకి కంఠబిలం (glottis) ద్వారా తెరచుకుంటుంది. మృదులాస్థితో తయారైన ఉపజిహ్విక (epiglottis) ఆహారాన్ని మింగేటప్పుడు కంఠబిలంలోకి ప్రవేశించకుండా నిరోధిస్తుంది.

3. ఆహారవాహిక : ఆహారవాహిక పలుచని, పొడవైన నాళం. ఇది మెడ, ఉరః కుహరం విభాజక పటలం ద్వారా పరభాగానికి ప్రయాణించి, జీర్ణాశయములోకి తెరచుకుంటుంది. కండరయుతమైన జఠర-ఆహారవాహిక లేదా హృదయ సంవరణి, ఆహారవాహిక జీర్ణాశయంలోకి తెరచుకోవడాన్ని నియంత్రిస్తుంది.

4. జీర్ణాశయం : జీర్ణాశయం వెడల్పైన స్పీతి చెందగల కండరయుత సంచిలాంటి ‘J’ ఆకారపు నిర్మాణం. ఇది ఉదర కుహర పూర్వభాగంలో ఎడమవైపున విభాజక పటలానికి కింద అమరి ఉంటుంది. ఇది మూడు ముఖ్యభాగాలను కలిగి ఉంటుంది. పూర్వ హార్థిక భాగంలోకి ఆహారవాహిక తెరచుకుంటుంది. మధ్య భాగమైన ఫండిక్ జీర్ణక్రియకు ముఖ్యమైనభాగం. పర జఠరనిర్గమ భాగం చిన్నప్రేగు మొదటి భాగంలోనికి జఠర నిర్గమ రంధ్రం ద్వారా తెరచుకుంటుంది. ఈ రంధ్రాన్ని నియంత్రించ డానికి జఠర నిర్గమ సంవరిణి ఉంటుంది.

5. చిన్న పేగు : ఆహారనాళంలో చిన్న పేగు చాలా పొడవుగా ఉండే భాగం. దీనిలో వరుసగా మూడు భాగాలను గుర్తించవచ్చు. ఇవి సమీపాగ్రంలో ఆంత్రమూలం, మధ్యలో పొడవుగా, మెలికలు పడిన జెజునం, దూరాగ్రంలో ఎక్కువగా మెలికలు తిరిగిన శేషాంత్రికం ఉంటాయి. ఆంత్రమూలంలోకి ఐక్య కాలేయం – క్లోమనాళం తెరచుకుంటుంది. శేషాంత్రికం పెద్ద పేగులోకి తెరచుకుంటుంది.

6. పెద్ద పేగు : ఈ భాగంలో అంధనాళం, కొలాన్, పురీషనాళం ఉంటాయి. అంధనాళం చిన్న అంధకోశాన్ని కలిగి సహజీవనం చేసే సూక్ష్మజీవులకు ఆతిథ్యం ఇస్తుంది. అంధనాళం నుండి పొడుచుకొని వచ్చే సన్నని, వేలువంటి నాళికాయుత నిర్మాణాన్ని క్రిమిరూప ఉండూకం అంటారు. అందనాళం కొలాన్ లోకి తెరచుకొంటుంది. ఇది ఆరోహ, అడ్డు, అవరోహ భాగాలుగా, సిగ్మాయిడ్ కొలాన్ ఏర్పడి, పురీషనాళంగా మారుతుంది. పురీషనాళం చిన్న విస్ఫాత తిత్తిలాంటి నిర్మాణం. ఇది పాయుకాలువగా ముందుకు సాగి, పాయువు ద్వారా బయటకు తెరచుకుంటుంది.

జీర్ణగ్రంథులు :
1. లాలాజల గ్రంథులు : మానవునిలో మూడు జతల లాలాజల గ్రంథులు ఉంటాయి. అవి
1. పెరోటిడ్ గ్రంథులు 2. అధో జంబికా గ్రంథులు 3. అధో జహ్వికా గ్రంథులు
ఈ గ్రంథులు లాలాజలాన్ని స్రవిస్తాయి. లాలాజలంలో నీరు, విద్యుత్ విశ్లేషకాలు, శ్లేష్మం, ఎన్జైములైన – ఎమైలేజ్, లైసోజైమ్లు ఉంటాయి.

2. జఠర గ్రంథులు : ఇవి జీర్ణాశయం గోడలలో ఉపకళా తలానికి దిగువగా ఉంటాయి. ఇవి మూడు రకాలు అవి.
1. హార్దిక గ్రంథులు ఇవి శ్లేష్మాన్ని స్రవిస్తాయి.
2. జఠర నిర్గమ గ్రంథులు – ఇవి శ్లేష్మాన్ని మరియు గాస్ట్రిన్ హార్మోన్ను స్రవిస్తాయి.
3. ఫండిక్/ ఆక్సింటిక్ గ్రంథులు ఇవి శ్లేష్మాన్ని, ప్రోఎన్జైములైన పెప్సినోజన్ మరియు ప్రోరెనిన్లను, HCI, ఇంట్రిన్సిక్ కారకాన్ని మరియు కొంత గ్యాస్ట్రిక్ లైపేజ్న కూడా స్రవిస్తాయి.

3. ఆంత్ర గ్రంథులు : ఇవి రెండు రకాలు
1. బ్రన్నర్ గ్రంథులు
2. లీబర్ కూన్ గుహికలు
ఇవి ఆంత్ర రసాన్ని స్రవిస్తాయి. ఆంత్ర రసంలో పెప్టిడేజ్లు, డైశాకరైడేజ్లు మరియు ఎంటిరోకైనేజ్లు ఉంటాయి.

4. కాలేయం : కాలేయం దేహంలోని అతిపెద్ద గ్రంథి. కాలేయం పైత్యరసాన్ని స్రవిస్తుంది. పైత్యరసంలో పైత్యరస లవణాలు ఉంటాయి. ఇవి కొవ్వుల జీర్ణక్రియలో తోడ్పడతాయి.

AP Inter 2nd Year Zoology Study Material Chapter 1(a) జీర్ణక్రియ, శోషణం

5. క్లోమం : క్లోమం మానవ దేహంలో రెండవ అతిపెద్ద గ్రంథి. క్లోమంలోని నాళ గ్రంథి భాగం క్లోమరసాన్ని స్రవిస్తుంది. క్లోమరసంలో సోడియంబైకార్బనేట్, ప్రొఎన్జైములైన ట్రిప్సినోజన్, కైమోట్రిప్సినోజన్, ప్రోకార్బాక్సి పెప్టిడేజ్, ఎన్జైములైన 0:- ఎమైలైజ్ (స్టియాప్సిన్), న్యూక్లియేజ్లోన DNase, RNase లు ఉంటాయి.