AP 7th Class Social Notes Chapter 11 రహదారి భద్రత

Students can go through AP Board 7th Class Social Notes 11th Lesson రహదారి భద్రత to understand and remember the concept easily.

AP Board 7th Class Social Notes 11th Lesson రహదారి భద్రత

→ రహదారి ప్రమాదాలు అనగా ఏదైనా ఆకస్మిక సంఘటన వలన వాహనం లేదా ప్రయాణీకులు ప్రమాదవశాత్తు గాయపడటం లేదా మరణించడం మరియు భౌతిక ఆస్తులకు నష్టం కలగటం వంటివి.

→ నేటి ప్రపంచంలో రోడ్డు మరియు రవాణా ప్రతి మనిషి జీవితంలో అంతర్భాగంగా మారాయి.

→ ప్రస్తుత రవాణా వ్యవస్థ, దూరాలను తగ్గించింది కానీ మరోవైపు అది జీవితాలను ప్రమాదంలో పడవేసింది.

→ ప్రతి సంవత్సరం రోడ్డు ప్రమాదాలు లక్షలాది మంది ప్రాణాలు కోల్పోవడం మరియు కోట్లాదిమంది తీవ్రమైన గాయాలపాలవడానికి కారణమవుతున్నాయి.

→ అవగాహనా రాహిత్యం మరియు అజాగ్రత్త వల్ల ప్రజలు ఎక్కువ ప్రమాదాలకు గురియగుచున్నారు.

→ భారతదేశంలోని రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వశాఖ ప్రతి సంవత్సరం జనవరి నెలలో రోడ్డు భద్రతా వారోత్సవాలు నిర్వహిస్తుంది.

→ రహదారులపై గేదెలు, మేకలు, గొర్రెలు వంటి జంతువులను యథేచ్ఛగా వదిలివేయుట. దమ్ము చక్రాలతో ట్రాక్టర్లను నడుపుట వంటివి రహదారి ప్రమాదాలకు కారణాలు.

AP 7th Class Social Notes Chapter 11 రహదారి భద్రత

→ ట్రాఫిక్ గుర్తులు 3 రకాలు :

  1. తప్పనిసరిగా పాటించవలసిన గుర్తులు,
  2. సమాచార గుర్తులు,
  3. హెచ్చరిక గుర్తులు.

→ తప్పనిసరిగా పాటించవలసిన గుర్తులు ఎర్ర వృత్తాలు ఏమి చేయకూడదో తెలుపుతాయి.

→ సమాచార గుర్తులు – నీలం రంగు దీర్ఘచతురస్రంలోని గుర్తులు తెలియజేస్తాయి.

→ హెచ్చరిక గుర్తులు – ముక్కోణం లోపల ఉన్న గుర్తులు హెచ్చరిస్తాయి.

→ ట్రాఫిక్ లైట్ రంగు సంకేతాలు – ఎరుపు – ఆగండి, ఆరెంజ్ – వెళ్ళడానికి సిద్ధంగా ఉండండి; ఆకుపచ్చ – వాహనం ముందుకు వెళ్ళడానికి.

→ ఫుట్ పాత్, పాదచారుల ఉపయోగం కోసం రహదారికి ఇరువైపుల వేయబడింది.

→ ఒకే రహదారిపై ట్రాఫిక్ యొక్క రెండు దిశలను వేరు చేయడానికి రహదారిని రెండు భాగాలుగా విభజించారు. దీనిని రోడ్ డివైడర్ అంటారు.

→ జీబ్రా క్రాసింగ్ అంటే పాదచారులు రహదారిని సురక్షితంగా దాటే ప్రదేశం.

→ డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడపడం నేరం.

→ రహదారి భద్రత : రహదారి వాడకంలో వినియోగదారుల భద్రతను సూచిస్తుంది.

→ ఫుట్ పాత్ : రహదారికి ఇరువైపులా పాదచారులు నడవటానికి వీలుగా ఉండే దారి.

→ ఎరుపురంగు : గీత ముందు ఆగాలని సూచిస్తుంది.

→ ఆరెంజ్ రంగు : వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలని సూచిస్తుంది.

→ ఆకుపచ్చ రంగు : వాహనాన్ని కదిలించమని సూచిస్తుంది.

→ ట్రాఫిక్ విద్య : ట్రాఫిక్ నియమ నిబంధనలు సరళంగా, స్పష్టంగా తెలియజేయటం.

→ ట్రామా కేర్ : స్వల్ప లేక తీవ్ర గాయాలపాలైన క్షతగాత్రులకు హాస్పిటల్ కి తీసుకువెళ్ళిన వెంటనే ఇచ్చే తక్షణ చికిత్స.

→ ప్రథమ చికిత్స : ప్రమాదానికి గురైన వ్యక్తికి పూర్తి వైద్య సహాయం అందేలోగా ఇచ్చే ప్రాథమిక వైద్యం.

→ రోడ్డు డివైడర్ : ఇది సిమెంట్ దిమ్మలతో లేదా పెయింట్ తో రోడ్డును రెండు లేదా అంతకంటే ఎక్కువ భాగాలుగా విభజించేది.

→ జీబ్రా క్రాసింగ్ : ఇవి రోడ్డుకు సమాంతరంగా చిత్రించిన ప్రత్యామ్నాయ నలుపు మరియు తెలుపు చారలు. సాధారణంగా వీటిని జీబ్రా క్రాసింగ్ అని పిలుస్తారు. ఇది పాదచారులు రోడ్డును ఒక వైపు నుండి మరొక వైపుకు దాటడానికి ఉద్దేశించబడింది.

→ రైల్వే క్రాసింగ్ : రహదారి, రైల్వే లైనను కలిసే ప్రదేశం.

AP 7th Class Social Notes Chapter 11 రహదారి భద్రత

→ ట్రాఫిక్ : వ్యక్తులు, వస్తువులు, వాహనాలు మరియు పాదచారులు ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి పయనించేటప్పుడు ఏర్పడే రద్దీ.

→ పాదచారి : కాలి నడకన ప్రయాణించే వ్యక్తి.

→ రోడ్డు ప్రమాదం : ఒక వాహనం మరొక వాహనాన్ని లేదా వస్తువును ఢీ కొట్టడం.

→ కెర్బ్ డ్రిల్ : చిన్న పిల్లలు రహదారిని దాటుటకు ఆచరించాల్సిన పద్ధతి.

→ డ్రైవింగ్ లైసెన్స్ : వాహనాలను నడిపే నియమ నిబంధనలను పరిశీలించి ఇచ్చే అనుమతి పత్రం. వాహనదారులు దీనిని తప్పక పొందవలసి ఉంటుంది.

→ R.T.A. కార్యాలయం : Regional Transport Authority Office రీజనల్ ట్రాన్స్ పోర్ట్ అథారిటీ అధికారి వారి కార్యాలయము.

AP 7th Class Social Notes Chapter 11 రహదారి భద్రత 1

AP 7th Class Social Notes Chapter 11 రహదారి భద్రత 2

AP 7th Class Social Notes Chapter 10 రాష్ట్ర ప్రభుత్వం

Students can go through AP Board 7th Class Social Notes 10th Lesson రాష్ట్ర ప్రభుత్వం to understand and remember the concept easily.

AP Board 7th Class Social Notes 10th Lesson రాష్ట్ర ప్రభుత్వం

→ భారతదేశంలో మనకు రెండు స్థాయిలలో ప్రభుత్వం ఉంది. ఒకటి కేంద్రంలో, మరొకటి రాష్ట్రంలో ఉంది.

→ రాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్ర పరిపాలనకు బాధ్యత వహిస్తుంది.

→ రాష్ట్ర ప్రభుత్వం మూడు అంగాల ద్వారా పరిపాలన నిర్వహిస్తుంది.
అవి

  1. శాసన నిర్మాణ శాఖ,
  2. కార్య నిర్వాహక శాఖ,
  3. న్యాయ శాఖ. గవర్నరు.

→ శాసనసభ మరియు శాసన మండలిలను కలిపి శాసన నిర్మాణ శాఖ అంటారు.

→ చట్టాలను తయారుచేయడం శాసన నిర్మాణ శాఖ యొక్క ప్రాథమిక విధి.

→ భారతదేశంలో ప్రతి రాష్ట్రానికి ఒక గవర్నరు ఉంటారు.

→ ప్రధాన మంత్రి, కేంద్ర మంత్రి మండలి సిఫారసు మేరకు రాష్ట్రపతి అయిదు సంవత్సరాల పదవీ కాలానికి గవర్నర్ ని నియమిస్తారు.

→ ఆర్టికల్ 158 (33) ప్రకారం రెండు లేక ఎక్కువ రాష్ట్రాలకు ఒకే వ్యక్తిని గవర్నర్ గా నియమించవచ్చు.

AP 7th Class Social Notes Chapter 10 రాష్ట్ర ప్రభుత్వం

→ అన్ని అసెంబ్లీ నియోజక వర్గాలకు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహిస్తుంది.

→ MLA – శాసన సభ సభ్యుడు.

→ MLC – శాసన మండలి సభ్యుడు.

→ శాసన మండలి పరోక్షంగా ఎన్నుకోబడిన వారితో పనిచేస్తుంది.

→ 6 సంవత్సరాల పదవీ కాలం ముగిసిన 1/3 వ వంతు సభ్యులు పదవీ విరమణ చేయగా కొత్త సభ్యులు ఎన్నికవుతారు.

→ ఆర్టికల్ 171 (1) ప్రకారం ఒక రాష్ట్ర శాసన మండలి సభ్యుల సంఖ్య, ఆ రాష్ట్ర శాసనసభ సభ్యుల సంఖ్యలో 1/4 వ వంతుకు మించరాదు.

→ 1/12 వ వంతు మంది సభ్యులు ఉపాధ్యాయులచే ఎన్నుకోబడతారు.

→ శాసన సభకు ఆర్థికపర అంశాలలో ఎక్కువ అధికారాలు కలవు.

→ గవర్నర్ రాష్ట్రానికి అధిపతి.

→ గవర్నర్ అనుమతి తర్వాత మాత్రమే అన్ని బిల్లులు చట్టంగా మారతాయి.

→ ఆర్టికల్ 163 (1) ప్రకారం గవర్నర్ తన విధులను నిర్వర్తించడంలో సహాయపడడానికి మరియు సలహా ఇవ్వడానికి ముఖ్యమంత్రి నాయకత్వంలోని మంత్రి మండలి ఉండాలి.

→ ముఖ్యమంత్రి క్యాబినెట్ సభ్యులకు వివిధ మంత్రిత్వ శాఖలను కేటాయిస్తారు.

→ హైకోర్టు రాష్ట్ర స్థాయిలో అత్యున్నత న్యాయ విభాగం. రాష్ట్రంలోని చట్టాల అమలుకు బాధ్యత వహిస్తుంది.

→ భారత రాష్ట్రపతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని నియమిస్తారు, పదవీకాలం – 62 సంవత్సరాలు.

→ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధులు/అధికారాలు మూడు జాబితాలుగా విభజించబడ్డాయి.

  1. కేంద్ర జాబితా,
  2. రాష్ట్ర జాబితా,
  3. ఉమ్మడి జాబితా.

→ సాధారణంగా అధికార పక్షానికి చెందిన సభ్యుడు రాష్ట్ర శాసనసభ లేక శాసనమండలిలో బిల్లును ప్రవేశపెడతారు.

→ ఆర్థిక బిల్లును గవర్నరు ముందస్తు అనుమతి పొందిన తరువాత మాత్రమే శాసనసభలో ప్రవేశపెడతారు.

→ రెండు సభల ఆమోదం, గవర్నర్ ఆమోదం తెలిపి సంతకం చేసిన తరువాతనే బిల్లు చట్టంగా మారుతుంది.

→ చట్టాన్ని ‘గెజిట్’లో ప్రచురిస్తారు.

→ జిల్లా కలెక్టర్, జిల్లా పరిపాలనకు అధిపతి.

AP 7th Class Social Notes Chapter 10 రాష్ట్ర ప్రభుత్వం

→ జిల్లా స్థాయిలో ఉన్న కోర్టును జిల్లా కోర్టు అంటారు.

→ ప్రత్యామ్నాయ వివాద పరిష్కార యంత్రాంగాలలో లోక్ అదాలత్ ఒకటి.

→ లోక్ అదాలత్ కు లీగల్ సర్వీస్ అథారిటీస్ యాక్ట్ – 1987 ప్రకారం- చట్టబద్ధమైన హోదా ఇవ్వబడింది.

→ తహసీల్దార్ మండల స్థాయిలో ముఖ్య పరిపాలనా కార్యనిర్వాహణాధికారి.

→ గ్రామ రెవెన్యూ అధికారి గ్రామ స్థాయి పరిపాలనలో ముఖ్య పరిపాలనా కార్యనిర్వాహక అధికారి.

→ ప్రభుత్వం : ప్రభుత్వం అనేది రాజ్యం యొక్క ఒక లక్షణం. ఒక చట్టపరమైన నిర్మితి లేదా వ్యవస్థ. వివిధ విభాగాలతో నిర్దేశింపబడిన అధికార విధులను ప్రభుత్వం కొనసాగిస్తుంది.

→ శాసన నిర్మాణ శాఖ : చట్టాలు శాసనాలను తయారు చేసే శాఖ.

→ కార్యనిర్వాహక శాఖ : చట్టాలను శాసనాలను అమలు చేయు శాఖ.

→ న్యాయశాఖ : ప్రభుత్వం చేసిన చట్టాలు శాసనాలను వ్యాఖ్యానించడంతో పాటు వాటిని పరిరక్షించడం, అమలుకు బాధ్యత వహించు శాఖ.

→ సాధారణ ఎన్నికలు : శాసన సభ(ల) పదవీ కాలం పూర్తయిన తరువాత ఎన్నిక కోసం నిర్వహించే ఎన్నికలు.

→ : ఇది శాసనపరమైన/చట్టపరమైన ప్రతిపాదనల ముసాయిదా.

→ MLA : శాసన సభ సభ్యుడు (Member of Legislative Assembly).

→ MLC : శాసన మండలి సభ్యుడు (Member of Legislative Council).

→ ఎన్నికల సంఘం : దేశంలో / రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించు రాజ్యాంగబద్ధ సంస్థ.

→ మెజారిటీ : ఎక్కువ ఓట్లు / సీట్లు వచ్చినవారు.

AP 7th Class Social Notes Chapter 10 రాష్ట్ర ప్రభుత్వం

→ అధికార పార్టీ : ప్రజాస్వామ్య వ్యవస్థలో శాసనసభకు (చట్ట సభలకు) జరిగిన ఎన్నికల్లో మెజారిటి పొంది, అధికారం పొందిన పార్టీ.

→ ప్రతిపక్ష పార్టీ : రాజకీయంగా ఒకటి లేదా అంతకంటే ఎక్కువగానీ పార్టీలు అధికార పార్టీని వ్యతిరేకించే పార్టీలు.

→ సార్వత్రిక వయోజన ఓటు హక్కు : ఒక నిర్దిష్ట వయస్సు (18 సం||) నిండిన పౌరులందరికి ఏవిధమైన వివక్షత లేకుండా ఓటు హక్కు కల్పించడం.

→ రహస్య ఓటింగ్ విధానం : ఎన్నికల సమయంలో ఓటరు తను ఓటు వేసే విషయంలో గోప్యతను కల్గి ఉండటం.

→ లోక్ అదాలత్ : ప్రజా న్యాయ స్థానం, ప్రత్యామ్నాయ వివాద పరిష్కార యంత్రాంగంలో ఒకటి.

→ సివిల్ వివాదాలు : వ్యక్తుల మధ్య ఒప్పందాలు/నియమాల ఉల్లంఘన వల్ల ఏర్పడే వివాదం.
ఉదా : భూ, ఆస్తి, విడాకులు, అద్దె మొదలైనవి.

→ క్రిమినల్ వివాదాలు : చట్ట ఉల్లంఘనకు పాల్పడితే పోలీసులు పెట్టే కేసులు. ఉదా : దొంగతనం, లంచం, హత్య, దోపిడీ, లంచాలు ఇవ్వటం మొదలైనవి.

→ మేజిస్టీరియల్ అధికారాలు : న్యాయ, శాంతి భద్రతలకు సంబంధించిన అధికారాలు.

→ సుప్రీం కోర్టు : దేశంలోని అత్యున్నత న్యాయస్థానం.

→ హైకోర్టు : రాష్ట్రంలోని అత్యున్నత న్యాయస్థానం.

→ జిల్లా కోర్టు : జిల్లా స్థాయిలో అత్యున్నత న్యాయస్థానం.

→ CPC : సివిల్ ప్రొసీజర్ కోడ్.

→ CrPC : క్రిమినల్ ప్రొసీజర్ కోడ్.

→ నియోజక వర్గం : ఒక ప్రాంత పరిధిలో నివసిస్తున్న ఓటర్లందరూ తమ ప్రతినిధులను ఎన్నుకునే ఒక నిర్దిష్ట ప్రాంతం.

→ ద్విసభా వ్యవస్థ : రెండు శాసనసభలతో కూడిన ప్రభుత్వాన్ని ద్విసభా వ్యవస్థ అంటారు.

→ గెజిట్ : ప్రభుత్వ చర్యలు మరియు నిర్ణయాలను తెలియజేసే అధికారిక ప్రచురణ.

→ సమన్స్ : సభ సభ్యులందరినీ సమావేశపరచటం.

→ ప్రోరోగ్ : సభను నిరవధికంగా వాయిదా వేయడం.

→ బ్యూరోక్రసి : ప్రభుత్వ ఉద్యోగులు కీలక విధాన నిర్ణేతలుగా ఉన్న ప్రభుత్వ వ్యవస్థ.

AP 7th Class Social Notes Chapter 10 రాష్ట్ర ప్రభుత్వం

→ సయోధ్య / రాజీ కుదుర్చుకోవడం : న్యాయస్థానాల ప్రమేయం లేకుండా మధ్యవర్తుల ద్వారా వివాదాలు పరిష్కరించుకోవడం.

→ సర్వే రాళ్ళు : భూ సరిహద్దులను నిర్ణయించడం కొరకు ఏర్పాటు చేయబడిన గుర్తులు.

→ మ్యానిఫెస్టో : ఎన్నికల ముందు రాజకీయ పార్టీలు ప్రకటించే హామీల పత్రం.

→ సమావేశపరచడం : శాసనసభ సభ్యులందరినీ సమావేశపరచడం.

→ సంకీర్ణం : ప్రభుత్వ ఏర్పాటు కోసం రాజకీయ పార్టీలు కలవడం.

AP 7th Class Social Notes Chapter 10 రాష్ట్ర ప్రభుత్వం 1

1.
AP 7th Class Social Notes Chapter 10 రాష్ట్ర ప్రభుత్వం 2

2.
AP 7th Class Social Notes Chapter 10 రాష్ట్ర ప్రభుత్వం 3

AP 7th Class Social Notes Chapter 9 భారత రాజ్యాంగం – పరిచయం

Students can go through AP Board 7th Class Social Notes 9th Lesson భారత రాజ్యాంగం – పరిచయం to understand and remember the concept easily.

AP Board 7th Class Social Notes 9th Lesson భారత రాజ్యాంగం – పరిచయం

→ బ్రిటిషు పార్లమెంటు చేసిన చట్టాలలో, భారత ప్రభుత్వ చట్టం-1935 చాలా ముఖ్యమైన చట్టం.

→ 1928వ సంవత్సరంలో భారతదేశానికి రాజ్యాంగాన్ని రూపొందించడానికి భారత జాతీయ కాంగ్రెస్ సహా అన్ని పార్టీలు ఒక కమిటీని ఏర్పాటు చేసాయి.

→ ఈ కమిటీ చైర్మన్ గా మోతీలాల్ నెహ్రూ వ్యవహరించారు.

→ ఈ కమిటీ తన నివేదికను 1929వ సం||లో సమర్పించింది.

→ దీనిని నెహ్రూ నివేదిక అని పిలుస్తారు. ఇది మొదటి రాజ్యాంగపత్రంగా పరిగణించబడుతుంది.

→ 1931వ సం||లో, కరాచీలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం స్వతంత్ర భారతదేశం యొక్క రాజ్యాంగం ఎలా ఉండాలో ఒక తీర్మానాన్ని ఆమోదించింది.

→ నెహ్రూ నివేదిక మరియు కరాచీ తీర్మానం రెండూ సార్వత్రిక వయోజన ఓటు హక్కు స్వేచ్ఛ మరియు సమానత్వ హక్కుకు కట్టుబడి ఉన్నాయి.

AP 7th Class Social Notes Chapter 9 భారత రాజ్యాంగం – పరిచయం

→ భారత జాతీయ కాంగ్రెస్ ను 1885వ సంవత్సరంలో స్థాపించారు.

→ రాజ్యాంగాన్ని రూపొందించడానికి, ఎన్నుకోబడిన ప్రతినిధుల చేత ఏర్పడిన సభనే ‘రాజ్యాంగ సభ’ అంటారు.

→ 1946 కెబినేట్ మిషన్ ప్లాన్ ప్రకారం రాజ్యాంగ సభకు జూలై, 1946లో ఎన్నికలు జరిగాయి.

→ బ్రిటిషు పాలనలో ఉన్న రాష్ట్రాలు లేదా ప్రాంతాల నుండి 292 మంది సభ్యులను ఎన్నుకున్నారు.

→ స్వదేశీ సంస్థానాలు అన్ని కలిసి 93 మంది సభ్యులను సిఫార్సు చేసాయి.

→ ఢిల్లీ, అజ్మీర్ – మేవాడ్, కూర్గ్ మరియు బ్రిటిషు బెలూచిస్తాన్ నుండి నలుగురు సభ్యులను ఎన్నుకున్నారు.

→ దీంతో భారత రాజ్యాంగ సభ మొత్తం సభ్యుల సంఖ్య 389కి చేరుకున్నది.

→ ఈ 389 మంది సభ్యులలో 26 మంది షెడ్యూల్డ్ కులాలకు చెందినవారు, 9 మంది మహిళా సభ్యులు కలరు.

→ 1947 ఆగస్టులో దేశ విభజనతో రాజ్యాంగ సభను భారత రాజ్యాంగ సభ మరియు పాకిస్తాన్ రాజ్యాంగ సభగా విభజించారు.

→ భారత రాజ్యాంగ సభలో 299 మంది సభ్యులున్నారు.

→ డా|| బాబు రాజేంద్రప్రసాద్ రాజ్యాంగ సభ అధ్యక్షునిగా, తరువాత మొదటి రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు.

→ రెండోసారి రాష్ట్రపతిగా ఎన్నికైన ఏకైక వ్యక్తి డా॥ బాబు రాజేంద్రప్రసాద్ (1950-1962).

→ 1947, ఆగస్టు 29న డా|| B.R. అంబేద్కర్ అద్యక్షతన, ఏడుగురు సభ్యులతో కూడిన ముసాయిదా కమిటీని ఏర్పాటు చేసారు.

→ ముసాయిదా రాజ్యాంగాన్ని తయారుచేసి 1948లో రాజ్యాంగ సభకు సమర్పించారు.

→ ముసాయిదా రాజ్యాంగంలో 315 ప్రకరణలు మరియు ‘8’ షెడ్యూలు ఉన్నాయి.

→ రాజ్యాంగ సభ చేత 1949, నవంబర్ 26న భారత రాజ్యాంగం ఆమోదించబడి, 1950, జనవరి 26న అమల్లోకి వచ్చింది.

→ డా|| బి. ఆర్. అంబేద్కరను “భారత రాజ్యాంగ పిత”గా అభివర్ణిస్తారు.

→ డా|| బి.ఆర్. అంబేద్కర్ 1947లో స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి న్యాయశాఖామంత్రిగా నియమించబడ్డారు.

→ డా|| బి.ఆర్. అంబేద్కర్ 14 ఏప్రిల్, 1891న సెంట్రల్ ప్రావిన్సెస్లో జన్మించారు.

→ భారతదేశంలో రాజ్యాంగ దినోత్సవం ప్రతి సంవత్సరం నవంబర్ 26న జరుపుకొంటాము.

→ రాజ్యాంగ సభ మన రాజ్యాంగాన్ని తయారుచేయడానికి 2 సంవత్సరాల, 11 నెలల 18 రోజులు పట్టింది.

→ రాజ్యాంగం కలిగి ఉన్న ఉపోద్ఘాతమును ‘రాజ్యాంగ పీఠిక’ అంటారు.

→ 13 – 12 – 1946 న రాజ్యాంగ సభ ప్రారంభ సమావేశంలో జవహర్‌లాల్ నెహ్రూ “లక్ష్యాల తీర్మానం”ను ప్రతిపాదించాడు. ఇదే రాజ్యాంగ పీఠికకు మూల ఆధారం.

AP 7th Class Social Notes Chapter 9 భారత రాజ్యాంగం – పరిచయం

→ ‘సామ్యవాదం’, ‘లౌకిక’ పదాలు 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా పీఠికలో చేర్చబడ్డాయి.

→ హక్కులు అనేవి వ్యక్తుల సహేతుకమైన వాదనలు.

→ ప్రాథమిక హక్కులనేవి ఒక దేశం తన పౌరులను రక్షించడానికి రాజ్యాంగం ప్రకారం గుర్తించబడినవి.

→ భారత రాజ్యాంగంలో 3వ భాగంలో, ఆర్టికల్ 14 నుండి 32 వరకు ఆరు ప్రాథమిక హక్కులు ఉన్నాయి.

→ సమానత్వపు హక్కు (ప్రకరణ 14-18) అంటరానితనం రద్దు, బిరుదులు రద్దు అనే అంశాలు కలవు.

→ స్వేచ్ఛా హక్కు (ప్రకరణ 19-22) ఆరు రకాలైన స్వేచ్చలకు హామీ ఇస్తుంది.

→ పీడనాన్ని నిరోధించే హక్కు (ప్రకరణ 23-24) వెట్టి చాకిరి, బాల కార్మిక వ్యవస్థను నిషేధిస్తుంది.

→ మత స్వాతంత్ర్యపు హక్కు (ప్రకరణ 25-28) మత వ్యవహారాల్లో ప్రభుత్వం తటస్థంగా ఉంటుంది.

→ విద్యా సాంస్కృతికపు హక్కు (ప్రకరణ 29-30) మత, భాషా ప్రాతిపదికన విద్యా సంస్థలను ఏర్పాటు చేసుకునే హక్కు.

→ రాజ్యాంగ పరిహారపు హక్కు (ప్రకరణ 31-32) అన్ని ప్రాథమిక హక్కులను పరిరక్షించే హక్కు.

→ సమాచార హక్కు చట్టాన్ని (RTI) భారత పార్లమెంట్ 2005లో ఆమోదించింది.

→ 2002లో 86వ రాజ్యాంగ సవరణ ద్వారా భారత పార్లమెంట్ ఆమోదంతో రాజ్యాంగంలో విద్యను ప్రాథమిక హక్కుగా చెప్పే 21-A ప్రకరణను చేర్చారు.

→ బాలల ఉచిత మరియు నిర్బంధ విద్యాహక్కు చట్టాన్ని 2009లో భారత పార్లమెంటు ఆమోదించింది. ఈ చట్టం ఏప్రిల్ 1, 2010న అమల్లోకి వచ్చింది.

→ పౌరులందరి నైతిక బాధ్యతలుగా ‘విధులను’ నిర్వచించారు.

→ ప్రాథమిక విధులను 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 51ఎ, భాగం-43. లో పొందుపరిచారు.

→ ఈ ప్రాథమిక విధులు ‘రష్యా’ రాజ్యాంగం నుండి స్వీకరించబడ్డాయి.

→ విలువలు వ్యక్తుల ప్రవర్తనను నిర్ణయించే అంతర్గత ప్రమాణాలు. ఇవి మన చర్యలను ప్రేరేపిస్తాయి.

→ రాజ్యాంగం : దేశం యొక్క స్వభావం, ప్రభుత్వ రూపం, పౌరుల హక్కులు మరియు విధులను తెలియజేసే నిబంధనలతో కూడిన ప్రాథమిక చట్టం.

→ సర్వసత్తాక : బాహ్య మరియు అంతర్గత విషయాలపై నిర్ణయం తీసుకునే పూర్తి అధికారం.

→ సామ్యవాదం : సమాజంలో సామాజిక, ఆర్థిక మరియు రాజకీయ అసమానతలు తగ్గించడం ద్వారా సామాజిక న్యాయం అందించటం.

→ లౌకికవాదం : మత వ్యవహారాలలో ప్రభుత్వం జోక్యం చేసుకోకుండా తటస్థంగా ఉండటం.

→ ప్రజాస్వామ్యం : ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులచే ప్రభుత్వం నడపబడటం.

→ గణతంత్ర వ్యవస్థ : రాజ్యా ధినేత ప్రతి ఎన్నికల ద్వారా ఎన్నుకోబడితే అది గణతంత్ర వ్యవస్థ.

→ ప్రకరణ : (అధికరణ) రాజ్యాంగంలోని ఒక నిర్దిష్ట అంశంపై నిర్దిష్ట నియమం లేదా సూత్రాన్ని సూచిస్తుంది.

→ భాగం : ఒక భావనకు సంబంధించిన ప్రకరణల సముదాయమును సూచిస్తుంది.

→ షెడ్యూలు : ప్రకరణలలో పేర్కొనబడని అదనపు సమాచారం లేదా వివరాలను సూచిస్తుంది.

→ ప్రాథమిక హక్కులు : ఒక దేశం తన పౌరులను రక్షించడానికి రాజ్యాంగం ప్రకారం గుర్తించబడినవి.

→ హక్కులు : వ్యక్తుల సహేతుకమైన వాదనలు.

→ విధులు : పౌరుల యొక్క నైతిక బాధ్యతలు

→ రాజ్యాంగ సభ : రాజ్యాంగాన్ని రూపొందించడానికి, ఎన్నుకోబడిన ప్రతినిధులచే ఏర్పడిన సభ.

→ ముసాయిదా కమిటి : ముసాయిదా రాజ్యాంగాన్ని తయారు చేసే కమిటి. అంటే రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభ ఆమోదించక ముందు సభ సూచనలను గ్రంథస్తం చేయటం.

AP 7th Class Social Notes Chapter 9 భారత రాజ్యాంగం – పరిచయం

→ రాజ్యాంగ పీఠిక : రాజ్యాంగానికి ముందు మాట, ఉపోద్ఘాతం లాంటిది.

→ వయోజన ఓటు హక్కు : ఒక నిర్దిష్ట వయస్సు కల్గిన వారికి కల్పించే ఓటు హక్కు.

→ రాజ్యాంగ సవరణ : ఒక దేశ రాజ్యాంగాన్ని సవరించడం.

→ సౌభ్రాతృత్వం : సోదర భావంతో కలిసి ఉండటం.

→ ప్రావిన్స్ : బ్రిటిష్ పాలనలో, భారతదేశంలోని పరిపాలనా విభాగం.

→ స్వదేశీ సంస్థానం : ఇవి బ్రిటిష్ కాలంలో స్వదేశీ రాజ్యాలు.

→ పౌరుడు : ఒక రాష్ట్రం లేదా దేశంలో సభ్యుడు మరియు అక్కడ చట్టపరమైన హక్కులు ఉన్న వ్యక్తి.

→ పౌరసత్వం : ఒక నిర్దిష్ట దేశంలో పౌరుడికి ఉన్న స్థానం లేదా స్థితి.

→ సమాఖ్య : కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం మధ్య అధికార పంపిణీ.

→ ద్వంద్వ ప్రభుత్వం : రెండు వ్యవస్థలకు పాలనాధికారం ఉన్న ప్రభుత్వ విధానం.

AP 7th Class Social Notes Chapter 9 భారత రాజ్యాంగం – పరిచయం 1

1.
AP 7th Class Social Notes Chapter 9 భారత రాజ్యాంగం – పరిచయం 2

2.
AP 7th Class Social Notes Chapter 9 భారత రాజ్యాంగం – పరిచయం 3

3.
AP 7th Class Social Notes Chapter 9 భారత రాజ్యాంగం – పరిచయం 4

AP 7th Class Social Notes Chapter 8 భక్తి – సూఫీ

Students can go through AP Board 7th Class Social Notes 8th Lesson భక్తి – సూఫీ to understand and remember the concept easily.

AP Board 7th Class Social Notes 8th Lesson భక్తి – సూఫీ

→ భక్తి ఉద్యమం 8వ శతాబ్దంలో మొదలై 17వ శతాబ్దం వరకు కొనసాగింది.

→ భక్తి అంటే దేవుని యందు ప్రేమ.

→ భక్తి రెండు రకాలుగా ఉంటుంది. అది సగుణ భక్తి, నిర్గుణ భక్తి.

→ సగుణ భక్తి అనగా భగవంతుని ఒక ఆకారంలో పూజించడం.

→ నిర్గుణ భక్తి అనగా భగవంతుని నిరాకారంగా పూజించడం.

→ భక్తి ఉద్యమాన్ని ఆదిశంకరాచార్యులు ప్రారంభించారు.

→ ఆదిశంకరాచార్యులు కేరళలోని కాలడి గ్రామంలో జన్మించారు. వీరు అద్వైత సిద్ధాంతాన్ని ప్రబోధించారు.

→ వివేక చూడామణి, సౌందర్యలహరి, శివానందలహరి, ఆత్మబోధలు ఆదిశంకరాచార్యుల వారి రచనలు.

AP 7th Class Social Notes Chapter 8 భక్తి – సూఫీ

→ రామానుజాచార్యులు శ్రీ పెరంబుదూలో క్రీ.శ. 1017లో జన్మించాడు.

→ రామానుజాచార్యులు విశిష్టాద్వైతాన్ని ప్రబోధించారు. శ్రీభాష్యం పేరుతో బ్రహ్మ సూత్రాలమ వ్యాఖ్యానించారు.

→ మధ్వాచార్యులు ద్వైత సిద్ధాంతాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చారు. ద్వైతమనగా రెండు అని అర్థం. దీని ప్రకారం బ్రహ్మ మరియు ఆత్మ రెండూ వేర్వేరు అంశాలు.

→ వల్లభాచార్యుల ఆలోచనా విధానాన్ని శుద్ద అద్వైతమంటారు.

→ రామానందుడు ప్రయాగలో జన్మించారు.

→ రామానందుని శిష్యుడు కబీర్.

→ హిందూ ముస్లింల సమైక్యత కొరకు ప్రయత్నించిన మొదటి సాధువుగా కబీర్ ని చెప్పవచ్చు.

→ సంత్ రవిదాస్ బెనారస్లో నివసించారు. “హరిలో అందరూ, అందరిలోనూ హరి” అనేది వీరి బోధనల సారాంశం.

→ మీరాబాయి రాజ కుటుంబంలో జన్మించి కృష్ణ భక్తి తత్వాన్ని ప్రచారం చేసింది.

→ మీరాబాయి సంత్ రవిదాస్ యొక్క శిష్యురాలు.

→ చైతన్య మహాప్రభుని ‘శ్రీ గౌరంగ’ అని కూడా పిలుస్తారు.

→ శంకర దేవుడు అస్సాం ప్రాంత సాధువు.

→ శంకరదేవుడు సాంఘిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు అన్ని వర్గాల ప్రజలు సమావేశమవడానికి సత్రాలు లేక మఠములు మరియు నామ ఘర్లను ప్రారంభించాడు.

AP 7th Class Social Notes Chapter 8 భక్తి – సూఫీ

→ సిక్కు మత స్థాపకుడు గురునానక్, కబీర్ బోధనలను ఈయన విశేషంగా అభిమానించాడు.

→ గురునానక్ లాహోర్ సమీపంలోని ‘తల్వండి’ గ్రామంలో క్రీ.శ. 1469లో జన్మించాడు.

→ జ్ఞానేశ్వర్ ‘భగవత్ దీపిక’ పేరుతో భగవద్గీతకు వ్యాఖ్యానాన్ని రాశాడు. దీనినే ‘జ్ఞానేశ్వరి’ అని కూడా అంటారు.

→ జ్ఞానేశ్వర్ మరాఠీ భాషలో బోధనలు చేశాడు.

→ మొల్లమాంబ ప్రసిద్ధ తెలుగు కవయిత్రి. రామాయణాన్ని తెలుగులో రాసింది.

→ తాళ్ళపాక అన్నమాచార్యగా ప్రసిద్ధిగాంచిన అన్నమయ్య కడప జిల్లాలోని తాళ్ళపాక గ్రామంలో జన్మించాడు.

→ అన్నమయ్యను పద కవితా పితామహుడు అంటారు.

→ అన్నమయ్య శ్రీవేంకటేశ్వరుడిని కీర్తిస్తూ 32 వేల సంకీర్తనలు రాశారని ప్రతీతి.

→ ఇస్లాం మతంలోని సాంఘిక మత సంస్కరణ ఉద్యమాన్ని ‘సూఫీ ఉద్యమం’ అంటారు.

→ సూఫీ అనే పదం ‘సాఫ్’ అనే అరబిక్ పదం నుంచి గ్రహించబడింది. సాఫ్ అనగా స్వచ్ఛత లేదా శుభ్రత.

→ ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ భారతదేశానికి చెందిన గొప్ప సూఫీ సాధువు.

→ ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ ద్వారా భారతదేశంలో ‘చిస్తీ’ పద్దతి స్థాపించబడింది.

→ ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ క్రీ.శ. 1143లో పర్షియాలోని ‘సీయిస్థాన్’లో జన్మించారు.

→ ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ క్రీ.శ. 1192లో భారతదేశాన్ని సందర్శించారు.

→ ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ వారి దర్గా రాజస్థాన్‌లోని ‘అజ్మీర్’లో ఉన్నది.

→ నిజాముద్దీన్ ఔలియా చిస్తీ సాధువులలో అత్యంత ప్రసిద్ధి గాంచినవాడు.

→ గోదాదేవి తిరుప్పావైని రచించెను.

→ వహదాత్-ఉల్-ఉజూద్ అనగా ఏకేశ్వరోపాసనని సూఫీతత్వం విశ్వసిస్తుంది.

→ జీవుడు దేవుడిలోని అంశ అని విశిష్టాద్వైతం చెప్పింది.

→ భక్తి : భక్తి అనగా దేవుని యందు ప్రేమ.

→ సగుణ భక్తి : భగవంతుని ఒక ఆకారంలో పూజించడం.

→ నిర్గుణ భక్తి : భగవంతుని నిరాకారంగా పూజించడం.

→ ద్వైత సిద్ధాంతం : ద్వైతమనగా రెండు. బ్రహ్మ మరియు ఆత్మ. రెండూ వేర్వేరు అంశాలని చెప్పే సిద్ధాంతం. జీవుడు వేరు మరియు దేవుడు వేరు.

→ అద్వైత సిద్ధాంతం : అంతా ఒక్కటే “బ్రహ్మం’ అని చెప్పే సిద్ధాంతం. బ్రహ్మం ఒక్కటే అంతా నిండి వుంది. జీవుడే దేవుడు.

→ విశిష్టాద్వైత సిద్ధాంతం : జీవుడు దేవుడిలోని అంశ.

→ బ్రహ్మ సూత్రాలు : వ్యాసుడు లేదా బాదరాయణుడు రచించాడు. బ్రహ్మ సూత్రాలనే వేదాంత సూత్రం అని కూడా అంటారు.

→ వచనములు : బసవేశ్వరుని రచనలను వచనములంటారు.

→ మఠములు : సన్యాస జీవితం గడుపు సాధువులుండు నివాసాలు.

AP 7th Class Social Notes Chapter 8 భక్తి – సూఫీ

→ గురు గ్రాంథ్ సాహెబ్ : సిక్కుల పవిత్ర గ్రంథం. దీనిని గురునానక్ రచించారు.

→ సూఫీ ఉద్యమం : ఇస్లాం మతంలోని సాంఘిక, మత సంస్కరణోద్యమం.

→ సూఫీ : సూఫీ పదం సాఫ్ అనే అరబిక్ పదం నుంచి గ్రహించబడింది. దీని అర్థం స్వచ్ఛత లేదా శుభ్రత.

→ సౌభ్రాతృత్వం : ప్రజలందరి మధ్య ‘సోదర భావం’.

→ ఉపనిషత్తులు : వీటికి వేదాంతాలు అని పేరు. ఇవి వేదాలలో చివరి భాగాలుగా చెప్పబడినవి.

→ నిగూఢార్థం : ప్రత్యేక ఆసక్తి లేదా జ్ఞానంతో కొందరు సాధకులు తెలుసుకున్న తత్వజ్ఞానం.

→ సమతా వాదం : అందరూ సమానమేనన్న ఆలోచనా విధానం.

→ పరవశం : వ్యక్తి తనను తాను మరచిపోయే భావాతీత స్థితి.

→ మోక్షం : భౌతిక విషయాలకు అతీతమైన చైతన్యాన్ని పొంది ఆత్మ భగవత్ సాన్నిధ్యాన్ని చేరడం.

AP 7th Class Social Notes Chapter 8 భక్తి – సూఫీ 1

1.
AP 7th Class Social Notes Chapter 8 భక్తి – సూఫీ 2

2.
AP 7th Class Social Notes Chapter 8 భక్తి – సూఫీ 3

3.
AP 7th Class Social Notes Chapter 8 భక్తి – సూఫీ 4

4.
AP 7th Class Social Notes Chapter 8 భక్తి – సూఫీ 5

AP 7th Class Social Notes Chapter 7 మొఘల్ సామ్రాజ్యం

Students can go through AP Board 7th Class Social Notes 7th Lesson మొఘల్ సామ్రాజ్యం to understand and remember the concept easily.

AP Board 7th Class Social Notes 7th Lesson మొఘల్ సామ్రాజ్యం

→ ఢిల్లీ సుల్తానులలో చివరి పాలకుడైన ఇబ్రహీం లోడీని క్రీ.శ. 1526లో పానిపట్టు యుద్ధంలో ఓడించి బాబర్ మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు.

→ క్రీ.శ. 1530లో బాబర్ మరణించెను.

→ మొఘల్ అనే పదం ‘మంగోల్’ అనే పదం నుంచి వచ్చింది.

→ బాబర్ తరువాత అతని కుమారుడు హుమాయూన్ సింహాసనానికి వచ్చెను.

→ షేర్షా క్రీ.శ. 1539లో చౌసా యుద్ధంలో మరియు క్రీ.శ. 1540లో జరిగిన కనౌజ్ యుద్ధంలో హుమాయూనన్ను ఓడించి ఇరాను తరిమివేసెను.

→ క్రీ. శ. 1555లో హుమాయూన్ తిరిగి ఢిల్లీని ఆక్రమించుకొనెను. క్రీ. శ. 1556లో మరణించెను.

→ షేర్షా సూర్ ఒక ఆప్షన్ నాయకుడు.

→ షేర్షా ఢిల్లీలో సూర్ రాజవంశాన్ని స్థాపించాడు.

→ షేర్షా తన సామ్రాజ్యాన్ని కాబూల్ నుండి బెంగాల్ మరియు మాళ్వా వరకు విస్తరించాడు.

→ అక్బర్ సంరక్షకుడు బైరాం ఖాన్.

→ క్రీ. శ. 1556లో రెండవ పానిపట్టు యుద్ధంలో అక్బర్, హేముని ఓడించినాడు.

→ మేవాడ్ పాలకుడైన మహారాణా ప్రతాప్, అక్బతో జీవితాంతం పోరాటం చేసాడు.

→ బీర్బల్, అక్బర్ సన్నిహితుడు. గొప్ప గాయకుడు మరియు కవి.

AP 7th Class Social Notes Chapter 7 మొఘల్ సామ్రాజ్యం

→ అహ్మద్ నగర్ రాణి అయిన చాంద్ బీబీ అక్బర్ అధికారాన్ని వ్యతిరేకించిన మహిళ.

→ జహంగీర్ అసలు పేరు ‘సలీమ్’.

→ షాజహాన్ జహంగీర్ కుమారుడు.

→ ఔరంగజేబు కాలంలో గురుతేజ్ బహదూర్, గురుగోవింద్ సింగ్ మరియు శివాజీ మొదలగువారు తిరుగుబాట్లు చేశారు.

→ ఔరంగజేబు క్రీ. శ. 1685లో బీజాపూర్, క్రీ.శ. 1687లో గోల్కొండను జయించాడు.

→ మొఘల్లది కేంద్రీకృత పరిపాలన, చక్రవర్తికే అన్ని అధికారాలు ఉండేవి.

→ అక్బర్ తన సామ్రాజ్యాన్ని అనేక సుబాలుగా విభజించి ప్రతి సుబాకు ఒక ‘సుబేదార్’ను నియమించాడు.

→ అక్బర్ తన రాజ్యా న్ని ’15’ సుబాలుగా విభజించాడు.

→ సుబాలను ‘సర్కారులుగా’, సర్కారులను ‘పరగణాలుగా విభజించాడు.

→ అక్బరు భూమిని సర్వే చేయించి, పండించిన పంట ప్రకారం పన్ను నిర్ణయించే వ్యవసాయ పద్ధతిని ప్రవేశపెట్టాడు.

→ భూమిని నాలుగు రకాలుగా విభజించి 1/3వ వంతు పంటను పన్నుగా వసూలు చేశారు.

→ అక్బర్ పాలనలో షేర్షా పరిపాలనా ముద్ర కొంత వరకు ప్రస్ఫుటమవుతుంది.

→ సైనిక విధానంలో అక్బర్ మన్సబ్ దారీ వ్యవస్థను ప్రవేశపెట్టాడు.

→ మన్నబ్ అంటే హోదా లేదా ర్యాంక్. ఇది 1) ర్యాంక్, 2) జీతాలు, 3) సైనిక బాధ్యతలు నిర్ధారించడానికి ఉపయోగించిన గ్రేడింగ్ పద్ధతి.

→ రాజపుత్రులలో ‘శిశోడియా’ వంశస్తులు మొఘలుల అధికారాన్ని అంగీకరించలేదు.

→ ఔరంగజేబు మరణానంతరము సామ్రాజ్యము విచ్ఛిన్నమైంది.

→ మొఘలులు సున్ని మతస్తులు. అక్బర్ మత సహనాన్ని పాటించాడు.

→ జిజియా పన్ను మరియు యాత్రికుల పన్నులను అక్బర్ రద్దు చేసాడు.

→ జిజియా పన్ను మరియు యాత్రికులపై పన్నులను ఔరంగజేబు తిరిగి విధించాడు.

→ ఔరంగజేబు ప్రజల నైతిక జీవనాన్ని పరిశీలించడానికి ‘ముతావాసిబ్’ అనే మతాధికారులను నియమించాడు.

→ అక్బర్ క్రీ. శ. 1575లో ఫతేపూర్ సిక్రీ వద్ద ‘ఇబాదత్ ఖానా’ అనే ప్రార్ధనా మందిరాన్ని నిర్మించాడు.

AP 7th Class Social Notes Chapter 7 మొఘల్ సామ్రాజ్యం

→ 1582 లో దీన్-ఇ-ఇలాహి అనే నూతన మతాన్ని అక్బర్ ప్రకటించాడు.

→ దీన్-ఇ-ఇలాహి అంటే ‘అందరితో శాంతి’ లేదా ‘విశ్వజనీన శాంతి’,

→ దీన్-ఇ-ఇలాహి మతంలో ’18’ మంది మాత్రమే చేరారు.

→ మొఘలులచే నియమించబడిన ప్రజాపనుల విభాగం సామ్రాజ్యంలో విస్తృతమైన రహదారి వ్యవస్థను రూపొందించింది.

→ వ్యవసాయ పన్ను ద్వారా వచ్చే ఆదాయం ముఖ్యమైన ఆదాయ వనరుగా ఉండేది.

→ షేర్షా సూర్ పాలనలో ప్రవేశపెట్టిన రూపాయి (వెండి నాణెం) మరియు దామ్ (రాగి నాణెం)లను మొఘలులు కొనసాగించారు.

→ మొఘల్ వ్యవస్థలో చెప్పుకోదగినది అక్బర్ కాలం నాటి రెవెన్యూ పాలన ‘జల్ట్’.

→ 1/3వ వంతు నుండి సగం వరకు భూమిశిస్తుగా నిర్ణయించారు.

→ అక్బర్ తన మత గురువు షేక్ సలీం ‘చిస్తి’ గౌరవార్థం రాజధానిని ఆగ్రా నుండి సిక్రీకి మార్చాలనుకున్నాడు.

→ ‘ఫతే’ అనగా విజయం

→ అక్బర్ ‘ఫతేబాద్’ అనే నగరాన్ని నిర్మించాడు. ఇదే ‘ఫతేపూర్ సిక్రి’.

→ అక్బర్ గుజరాత్ విజయాలకు జ్ఞాపకార్థంగా బులంద్ దర్వాజాను నిర్మించాడు.

→ ఎర్రకోట షాజహాన్ కాలం నాటి మొఘలుల సృజనాత్మక శైలికి తార్కాణం.

→ షాజహాన్ తన భార్య అయిన ముంతాజ్ ప్రేమకు గుర్తుగా తాజ్ మహల్ నిర్మించాడు.

→ ఖురాన్, ఫత్వా-ఇ-ఆలంగిరి మొదలైన ఇస్లామిక్ చట్టాలను స్వదేశీ భాషలలో బోధించటానికి ‘మక్తాబ్’ పాఠశాలలను నిర్మించారు మొఘలులు.

→ పర్షియన్ భాష అధికార భాషగా చలామణి అయినది.

→ బాబర్ ‘బాబర్ నామా’ను రచించాడు.

→ అబుల్ ఫజల్ ‘అయిన్-ఇ-అక్బరీ’, ‘అక్బర్ నామా’ అనే గ్రంథాలను రచించాడు.

→ తుజుక్-ఇ-జహంగీరీ అనే గ్రంథం జహంగీర్ ఆత్మకథ.

→ ప్రముఖ హిందీ కవి తులసీదాస్ రామాయణాన్ని ‘రామచరిత మానస్’ అనే పేరుతో హిందీలో రచించాడు.

→ మొఘలుల కాలంలో మినియేచర్ చిత్రకళ ప్రారంభమైంది.

→ అక్బర్ ఆస్థానంలో ‘తాన్ సేన్’ అనే సంగీత కళాకారుడు కలడు.

→ అక్బర్ ఆస్థానంలో 36 మంది సంగీతకారులు ఉన్నట్లు అబుల్ ఫజల్ పేర్కొన్నాడు.

→ మొఘల్ సామ్రాజ్యం క్రీ. శ. 1857లో బహదూర్ షా-II కాలంలో పతనమైంది.

→ జహంగీర్ పోషణలో చిత్రకళ అత్యున్నత స్థాయికి చేరుకుంది.

→ మరాఠా రాజ్య స్థాపకుడు. ‘శివాజీ’.

AP 7th Class Social Notes Chapter 7 మొఘల్ సామ్రాజ్యం

→ శివాజీ పూనే సమీపంలో శివనేరి కోటలో జన్మించాడు.

→ శివాజీ తండ్రి షాజీ భోంస్లే, తల్లి జిజియా బాయి.

→ శివాజీ సమర్థ రామదాస్ మరియు ఇతర మహారాష్ట్ర సాధువుల బోధనలచే ప్రభావితుడైనాడు.

→ శివాజీ దాదాజీ కొండదేవ్, తానాజీ మాల్ సురే వద్ద యుద్ధ విద్యలనభ్యసించాడు.

→ శివాజీ తన 19వ ఏట బీజాపూర్ సుల్తాన్ మహ్మద్ ఆదిల్ షా మరణానంతరం తోరణదుర్గంను జయించాడు.

→ బీజాపూర్ సుల్తాన్ శివాజీని అణచివేయడానికి తన సేనాధిపతి అఫలాఖానను పంపించాడు. కాని శివాజీ అతనిని సంహరించాడు.

→ ఔరంగజేబు శివాజీని, అణచడానికి తన సేనాని షయిస్తఖానను దక్కను పంపించాడు. కాని శివాజీ ఇతనిని కూడా ఓడించాడు.

→ ఔరంగజేబు తర్వాత రాజా జైసింగ్ నాయకత్వంలో పెద్ద సైన్యాన్ని శివాజీ పైకి పంపగా, శివాజీ ఓడింపబడ్డాడు.

→ రాయగఢ్ లో శివాజీకి ‘ఛత్రపతి’ బిరుదు ఇవ్వబడింది.

→ శివాజీకి పరిపాలనలో అష్టప్రధానులు అనే మంత్రులు సహాయపడ్డారు.

→ అష్టప్రధానులలో ప్రధానమంత్రిని ‘పీష్వా’ అని పిలిచేవారు.

→ శివాజీ మరణానంతరం ఏర్పడిన సంక్షోభంను పీష్వాలు విజయవంతంగా అధిగమించారు.

→ సుబాలు : మొఘల్ సామ్రాజ్యంలోని విభాగాలు (రాష్ట్రాలు).

→ సుబేదార్ : ‘సుబాకు’ అధికారి.

→ సర్కారులు : సుబా యొక్క భాగాలు (జిల్లాలు).

→ పరగణాలు : సర్కారు యొక్క భాగాలు (మండలాలు / తాలూకాలు)

→ రూపాయి : వెండి నాణెం

→ దామ్ : రాగి నాణెం

→ మన్సబ్దార్ : సైనిక హోదా (ర్యాంక్) కలిగి అక్బర్ పరిపాలన బాధ్యతను పంచుకునే అధికారులు.

→ సున్నీ మతం : ఇస్లాంలోని ఒక సంప్రదాయ మతం.

→ జిజియా పన్ను : ముస్లిం పాలనలో హిందువులు’ చెల్లించే పన్ను.

AP 7th Class Social Notes Chapter 7 మొఘల్ సామ్రాజ్యం

→ ముతావాసిబ్ : ప్రజల నైతిక జీవనాన్ని పరిశీలించడానికి ఔరంగజేబు నియమించిన మత అధికారులు.

→ దీన్-ఇ-ఇలాహి : “అందరితో శాంతి” లేదా “విశ్వజనీన శాంతి”, అక్బర్ ప్రకటించిన నూతన మతము.

→ జబ్త్ : అక్బర్ కాలంలో తోడర్మల్ ప్రవేశపెట్టిన రెవెన్యూ విధానము.

→ ఫతే : ఫతే అనగా విజయం.

→ బులంద్ దర్వాజ : గుజరాత్ విజయాలకు జ్ఞాపకార్థంగా అక్బర్ నిర్మించిన కట్టడము.

→ తాజ్ మహల్ : షాజహాన్ తన భార్య జ్ఞాపకార్థం పాలరాతితో కట్టించిన సమాధి.

→ ఖురాన్ : ఇస్లాంల పవిత్ర గ్రంథము.

→ మక్తాబ్ : ఖురాన్, ఇస్లామిక్ చట్టాలను బోధించే పాఠశాల.

→ నవరత్నాలు : అక్బర్ ఆస్థానంలోని (కవులు) కళాకారులు తొమ్మిది మందిని నవరత్నాలు అంటారు.

→ ఛత్రపతి : శివాజి (మహరాజ్)కి రాయగఢ్ లో ఇవ్వబడిన బిరుదు.

→ పీష్వా : శివాజి పరిపాలనలో ప్రధాన మంత్రిని పీష్వా అంటారు.

AP 7th Class Social Notes Chapter 7 మొఘల్ సామ్రాజ్యం

→ అష్ట ప్రధానులు : శివాజి పాలనలో సహాయపడే ఎనిమిది మంది మంత్రులు (అధికారులు).

→ రాజపుత్రులు : ఉత్తర భారతదేశంలో ధైర్యసాహసాలు కలిగిన శక్తివంతమైన రాజవంశములు.

→ పోరాట యోధుడు : ధైర్యుడైన లేదా అనుభవజ్ఞుడైన సైనికుడు లేదా పోరాట యోధుడు.

→ రీజెంట్ : ఒక చక్రవర్తి మైనర్ లేదా అసమర్ధుడు అయినప్పుడు ఒక రాష్ట్రాన్ని పరిపాలించడానికి నియమించబడిన వ్యక్తి.

→ మత విశ్వాసి : మత విశ్వాసాన్ని విశ్వసించే లేదా ఆచరించే వ్యక్తి.

→ గెరిల్లా యుద్ధం : కొంత మంది సైనికుల ఆకస్మిక దాడి, ఒక యుద్ధ వ్యూహం.

→ వ్యవసాయిక : వ్యవసాయ భూముల యాజమాన్యం మరియు వాడకానికి సంబంధించినది.

AP 7th Class Social Notes Chapter 7 మొఘల్ సామ్రాజ్యం 1

1.
AP 7th Class Social Notes Chapter 7 మొఘల్ సామ్రాజ్యం 2

3.
AP 7th Class Social Notes Chapter 7 మొఘల్ సామ్రాజ్యం 3

4.
AP 7th Class Social Notes Chapter 7 మొఘల్ సామ్రాజ్యం 4

AP 7th Class Social Notes Chapter 6 విజయనగర సామ్రాజ్యం

Students can go through AP Board 7th Class Social Notes 6th Lesson విజయనగర సామ్రాజ్యం to understand and remember the concept easily.

AP Board 7th Class Social Notes 6th Lesson విజయనగర సామ్రాజ్యం

→ విజయనగర సామ్రాజ్యం క్రీ.శ. 1336 నుండి క్రీ.శ. 1646 వరకు 200 సంవత్సరాలకు పైగా భారతదేశ చరిత్రలో గొప్ప స్థానాన్ని ఆక్రమించింది.

→ 14, 16 శతాబ్దాలలో మొత్తం దక్షిణ భారతదేశంలో విస్తరించిన, ప్రపంచంలో రెండవ అతి పెద్ద రాజధాని నగరం కల సామ్రాజ్యపు రాజధాని.

→ లండన్, పారిస్ కంటే పెద్దదిగా పేరుగాంచింది. విజయనగర సామ్రాజ్యానికి ‘హంపి’ రాజధానిగా ఉండేది.

→ విజయనగరం ఆ కాలంలో ప్రపంచంలోనే అత్యంత ధనిక రాజ్యం.

→ క్రీ.శ. 1336లో సంగమ వంశానికి చెందిన మొదటి హరిహర రాయలు మొదటి బుక్క రాయలు చేత విద్యారణ్య స్వామి వారి ప్రోత్సాహముతో విజయనగర సామ్రాజ్యం స్థాపించబడింది.

→ మొదటి హరిహర, బుక్కరాయలు మొదటగా వరంగల్లుకు చెందిన కాకతీయ రాజు రెండవ ప్రతాపరుద్రుని ఆస్థానంలో క్రీ.శ. 1323లో పని చేశారు.

AP 7th Class Social Notes Chapter 6 విజయనగర సామ్రాజ్యం

→ క్రీ.శ. 1336లో విజయనగరము అనే కొత్త నగరాన్ని ‘తుంగభద్ర’ నదికి దక్షిణ ఒడ్డున స్థాపించారు.

→ హంపి వద్ద ఉన్న శిథిలాలు 1805లో ఇంజనీర్, పూరాతత్వవేత్త అయిన కల్నల్ కొలిన్ మెకంజీ కాలంలో వెలుగులోకి వచ్చాయి.

→ సంగమ రాజవంశంలో గొప్ప పాలకుడు ‘రెండవ దేవరాయలు’.

→ రెండవ దేవరాయలను ప్రౌఢ దేవరాయలు అని కూడా అంటారు.

→ రెండవ దేవరాయలు కళింగ సైన్యాన్ని ఓడించాడు. కొండవీడును స్వాధీనం చేసుకుని రాజమండ్రి వరకు తన అధికారాన్ని సుస్థిరం చేశాడు.

→ సంగమ రాజవంశం తరువాతి రెండవ రాజవంశం సాళువ రాజవంశం.

→ సాళువ వంశం సాళువ నరసింహరాయలచే స్థాపించబడింది.

→ తుళువ రాజవంశం విజయనగర సామ్రాజ్యంలోని మూడవ రాజవంశం.

→ శ్రీకృష్ణ దేవరాయలు విజయ నగరాన్ని పాలించిన పాలకులలో చాలా శక్తివంతమైన పాలకుడు.

→ తుళువ వంశ స్థాపకుడు వీర నరసింహరాయలు.

→ శ్రీకృష్ణ దేవరాయలు తుళువ వంశానికి చెందినవాడు.

→ శ్రీకృష్ణ దేవరాయలు విదేశీ వాణిజ్యం యొక్క ప్రాధాన్యతను అర్థం చేసుకుని ఓడల ద్వారా వ్యాపారాన్ని అభివృద్ధి చేసాడు.

→ ‘దివానీ’ యుద్ధంలో ముస్లిం సైన్యాలు శ్రీకృష్ణదేవరాయల చేత నిర్ణయాత్మకంగా ఓడించబడ్డాయి.

→ క్రీ.శ. 1520లో ఆదిల్ షాను ఓడించి రాయచూర్ నగరాన్ని స్వాధీనం చేసుకున్నాడు.

→ శ్రీకృష్ణ దేవరాయలు పోర్చుగీసు మరియు అరబ్ వ్యాపారులతో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగించాడు.

→ సాహిత్యం, కళలను గొప్పగా పోషించి, శ్రీకృష్ణదేవరాయలు ‘ఆంధ్ర భోజుడు’ అని పిలువబడ్డాడు.

→ “దేశ భాషలందు తెలుగు లెస్స” అని శ్రీకృష్ణదేవరాయలు పలికాడు.

AP 7th Class Social Notes Chapter 6 విజయనగర సామ్రాజ్యం

→ అష్ట దిగ్గజములు అని పిలువబడే ఎనిమిది మంది ప్రముఖ పండితులు శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో ఉండేవారు.

→ ‘ఆంధ్ర కవితా పితామహుడు’ అని అల్లసాని పెద్దనను పిలిచేవారు. అతని రచనల్లో ‘మను చరిత్ర’, ‘హరికథాసారం’ ముఖ్యమైనవి.

→ శ్రీకృష్ణ దేవరాయలు స్వయంగా కవి. తెలుగులో ‘ఆముక్త మాల్యద’ సంస్కృతంలో జాంబవతి కళ్యాణం, ఉషా పరిణయం ఈయన ముఖ్యమైన రచనలు.

→ విజయనగరంలో విఠలస్వామి, హజారా రామస్వామి ఆలయాలను కూడా శ్రీకృష్ణదేవరాయలు నిర్మించాడు.

→ విజయనగరంలో తన తల్లి నాగలాంబ జ్ఞాపకార్థం నాగలాపురం అనే కొత్త నగరాన్ని కూడా నిర్మించాడు.

→ విజయనగర సామ్రాజ్యం యొక్క నాల్గవ మరియు చివరి రాజవంశం అరవీడు / అరవీటి రాజవంశం.

→ తళ్ళికోట యుద్ధం తర్వాత విజయనగర సామ్రాజ్యం క్షీణించింది.

→ విజయనగర రాజుల పాలనలో రాజు సంపూర్ణ అధికారాన్ని కల్గి ఉండేవాడు.

→ ఈ సామ్రాజ్యాన్ని మండలాలు, నాడులు, స్థలాలు, గ్రామాలుగా విభజించారు.

→ మండల పాలకుని ‘మండలేశ్వరుడు’ లేదా ‘నాయక్’ అని పిలిచేవారు.

→ సాధారణంగా ఉత్పత్తిలో 1/6 (ఆరవ వంతు) వ భూమి శిస్తుగా నిర్ణయించారు.

→ సైన్యంలోని ఉన్నత స్థాయి అధికారులను నాయకులు లేదా పాలిగార్లు అని పిలిచేవారు.

→ పాలిగార్ల సేవలకు బదులుగా వారికి భూమి మంజూరు చేయబడింది. ఈ భూములను ‘అమరం’ అని పిలిచేవారు.

→ విజయనగర సామ్రాజ్యంలో కోటలను, సాయుధ దళాలను నియంత్రించే సైనిక అధికారులను అమర నాయకులు అంటారు.

AP 7th Class Social Notes Chapter 6 విజయనగర సామ్రాజ్యం

→ సైనికుల జీతాలు సాధారణంగా నగదు రూపంలో చెల్లించేవారు.

→ వీరు యుద్ధంలో విష వాయువులను గుర్తించడానికి “పక్షులను” ఉపయోగించేవారు.

→ కుమార కంపన భార్య గంగాదేవి ‘మధురా విజయం’ అనే ప్రసిద్ధ రచన చేసింది.

→ వ్యవసాయం ప్రజల ప్రధాన వృత్తిగా కొనసాగింది.

→ “వరాహ” అనునది ప్రధాన బంగారు నాణెం.

→ మలబార్ తీరంలో అనేక నౌకాశ్రయాలు ఉండేవి. వాటిలో ప్రధానమైనది ‘కన్ననూర్’.

→ పశ్చిమాన అరేబియా, పర్షియా, దక్షిణాఫ్రికా మరియు పోర్చుగల్ మరియు తూర్పున బర్మా, మలయా ద్వీపకల్పం మరియు చైనాతో వాణిజ్య సంబంధాలు వృద్ధి చెందాయి.

→ పత్తి, పట్టు, సుగంధ ద్రవ్యాలు, బియ్యం, ఇనుము, సురేకారం మరియు చక్కెర ఎగుమతులలో ప్రధాన వస్తువులు.

→ గుర్రాలు, ముత్యాలు, రాగి, పగడము, పాదరసం, చైనా పట్టు మరియు వెల్వెట్ వస్త్రాలను దిగుమతి చేసుకొన్నారు.

→ ఓడల నిర్మాణ కళ అభివృద్ధి చెందింది.

→ శ్రీకృష్ణ దేవరాయలు కాలంలో పోర్చుగీసు యాత్రికులైన డువార్టే బార్బోసా మరియు డొమింగో పేర్లు విజయనగరాన్ని సందర్శించారు.

→ దేవరాయ-II కాలంలో ఇటాలియన్ యాత్రికుడు నికోలో కాంటి మరియు పర్షియన్ యాత్రికుడు అబ్దుల్ రజాట్లు విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించారు.

→ విఠల స్వామి దేవాలయము, హజారా రామాలయం దేవాలయాలు కాంచీపురంలోని వరద రాజ దేవాలయము మరియు ఏకాంబర నాథ దేవాలయాలు విజయనగర రాజుల నిర్మాణ శైలి గొప్పతనానికి ఉదాహరణలుగా నిలుస్తాయి.

→ తిరుపతిలో శ్రీకృష్ణదేవరాయలు మరియు అతని రాణుల యొక్క లోహ చిత్రాలు లోహాల పనితనానికి ఉదాహరణలు.

→ ఈ కాలంలో కర్ణాటక సంగీత సాంప్రదాయం అభివృద్ధి చెందింది.

→ విద్యారణ్య స్వామి ‘సంగీత సర్వస్వం’ అనే గ్రంథాన్ని రాశారు.

AP 7th Class Social Notes Chapter 6 విజయనగర సామ్రాజ్యం

→ ప్రౌఢ దేవరాయలు రాసిన ‘మహానాటక సుధానిధి’ అను రచన కూడా సంగీతానికి చెందినదే.

→ కర్ణాటక సంగీత త్రయం దీక్షితార్, శ్యామశాస్త్రి మరియు త్యాగరాజ స్వామి తంజావూరు ఆస్థానానికి చెందినవారు.

→ భరతనాట్యం భరత ముని చేత పరిచయం చేయబడింది.

→ సిద్ధేంద్ర యోగి ప్రవేశపెట్టిన ‘కూచిపూడి’, ‘పేరిణి’ నాట్యం కూడా ఈ కాలంలో ప్రాచుర్యం పొందాయి.

→ భాగవతం నుండి ప్రత్యేకంగా ఉద్భవించిన ఇతివృత్తాలతో ‘యక్షగానమనే’ నృత్య రూపకం కూడా ప్రజాధరణ పొందింది.

→ ఆళియరామ రాయలు పాలనలో మహ్మదీయ సంయుక్త దళాలు కూటమిగా ఏర్పడి క్రీ.శ. 1565లో ‘తళ్ళికోట’ వద్ద అతనిని ఓడించాయి.

→ తళ్ళికోట యుద్ధాన్నే రాక్షస తంగడి యుద్ధం అని కూడా అంటారు.

→ విజయనగర రాజ్యానికి చివరి పాలకుడు మూడవ శ్రీరంగ రాయలు.

→ రెడ్డి రాజులు క్రీ.శ. 1325 నుండి 1448 వరకు వంద సంవత్సరాల పాటు తీరప్రాంతంతో పాటు మధ్య ఆంధ్రాను పాలించారు.

→ వీరి మొదటి రాజధాని “అద్దంకి’, తరువాత దానిని ‘కొండవీడు’కు మార్చారు.

→ ఆంధ్ర మహాభారతమును రచించిన కవిత్రయములో ఒకరైన ‘ఎర్రాప్రగడ’ ప్రోలయ వేమారెడ్డి ఆస్థాన కవిగా ఉండేవాడు. ఆయనకు ప్రబంధ పరమేశ్వరుడు అనే బిరుదు ఉంది.

→ అల్లావుద్దీన్ బహ్మన్‌షా క్రీ.శ. 1347లో బహమనీ రాజ్యాన్ని స్థాపించాడు.

→ అల్లావుద్దీన్ బహ్మను హసన్ గంగూ అని కూడా పిలుస్తారు. ఇతని రాజధాని ‘గుల్బర్గా’.

→ అహ్మదాలిషా రాజధానిని గుల్బర్గా నుండి ‘బీదర్’కు మార్చాడు.

→ మూడవ మహ్మద్ షా విజయానికి కారణం ఆయన మంత్రి మహమూద్ గవాన్ సేవలు, సలహాలు.

→ మహమూద్ గవాన్ పర్షియన్ వ్యాపారి.

→ మూడవ మహమ్మద్ షా క్రీ.శ. 1482లో మరణించాడు.

→ మూడవ మహమ్మద్ షా తర్వాత బహమనీ సామ్రాజ్యం అహ్మద్ నగర్, బీరార్, బీదర్, బీజాపూర్, గోల్కొండ అనే ఐదు భాగాలుగా విడిపోయింది.

→ దో ఆబ్ (అంతర్వేది) : రెండు నదుల మధ్య ప్రాంతం.

→ అష్ట దిగ్గజములు : శ్రీకృష్ణ దేవరాయల ఆస్థానమంధళి, ఎనిమిది మంది కవులు / పండితులు.

→ మండలేశ్వరుడు : మండల పాలకుడు.

→ అశ్విక దళం : గుర్రాలపై కూర్చొని యుద్ధం చేసే సైన్యంలోని ఒక దళం.

→ పాలిగార్లు : సైన్యంలోని ఉన్నత స్థాయి అధికారులు

→ అమరం : పాలిగార్ల సేవలకు బదులు మంజూరు చేయబడిన భూమి.

→ అమర నాయకులు : కోటలను, సాయుధ దళాలను నియంత్రించే సైనిక అధికారులు.

→ వరాహ : విజయనగర సామ్రాజ్యంలోని బంగారు నాణెం.

→ కన్ననూర్ : మలబార్ తీరంలోని ప్రధానమైన నౌకాశ్రయం.

→ రాయగోపురం : ఎత్తైన ఆలయ ముఖద్వారం.

AP 7th Class Social Notes Chapter 6 విజయనగర సామ్రాజ్యం

→ కర్ణాటక సంగీత త్రయం : దీక్షితార్, శ్యామశాస్త్రి మరియు త్యాగరాజ స్వామి.

→ కస్టమ్ సుంకాలు : ఎగుమతులు, దిగుమతులపై పన్నులు.

→ నాడులు : మండలం యొక్క విభాగాలు (ప్రస్తుత జిల్లా స్థాయి)

→ అంతర్వేది : రెండు నదుల మధ్య ఉన్న భూభాగము.

→ ఫిరంగులు : యుద్ధాలలో ఉపయోగించే పెద్ద శక్తివంతమైన తుపాకులు.

→ నాయక : చక్రవర్తి తరపున పౌర మరియు సైనిక విధులను నిర్వర్తించేవారు.

→ వ్యాపారులు : అమ్మకము మరియు కొనుగోళ్ళు చేసేవారు.

→ దండయాత్ర : సాయుధ దళాల దాడి, ఆక్రమణ లేదా ముట్టడి.

1.
AP 7th Class Social Notes Chapter 6 విజయనగర సామ్రాజ్యం 1

2.
AP 7th Class Social Notes Chapter 6 విజయనగర సామ్రాజ్యం 2

3.
AP 7th Class Social Notes Chapter 6 విజయనగర సామ్రాజ్యం 3

4.
AP 7th Class Social Notes Chapter 6 విజయనగర సామ్రాజ్యం 4

AP 7th Class Social Notes Chapter 5 కాకతీయ రాజ్యం

Students can go through AP Board 7th Class Social Notes 5th Lesson కాకతీయ రాజ్యం to understand and remember the concept easily.

AP Board 7th Class Social Notes 5th Lesson కాకతీయ రాజ్యం

→ మధ్యయుగ కాలంలో దక్షిణ భారతదేశంలో ఐదు ముఖ్యమైన రాజ్యాలు ఆవిర్భవించాయి. అవి :

→ కల్యాణి చాళుక్యులు, యాదవులు, కాకతీయులు, హోయసల మరియు పాండ్య రాజ్యాలు.

→ కల్యాణి చాళుక్య వంశ స్థాపకుడు రెండవ తైలపుడు. వీరి రాజధాని బీదర్ జిల్లాలో గల బసవ కళ్యాణి.

→ వీరు సంస్కృత, కన్నడ భాషలను ప్రోత్సహించారు.

→ బిల్హణుడు విక్రమాంకదేవ చరిత్రను రాశాడు.

→ రన్నడు అను ప్రసిద్ధ కన్నడ కవి వీరి ఆస్థానానికి చెందినవాడు.

→ కల్యాణి చాళుక్యులు ఘటికులు అనే విద్యా సంస్థలను స్థాపించారు.

→ యాదవులు మొదట కళ్యాణి చాళుక్యుల సామంతులుగా పనిచేశారు.

→ యాదవుల రాజధాని దేవగిరి.

AP 7th Class Social Notes Chapter 5 కాకతీయ రాజ్యం

→ బిల్లమ యాదవ రాజవంశం స్థాపకుడు.

→ సింఘన యాదవ రాజులలో సుప్రసిద్ధుడు.

→ హోయసాలుల ద్వారా సముద్రంనకు చెందినవారు.

→ బిత్తుగ విష్ణువర్ధన కాలంలో వీరు ప్రాముఖ్యత పొందారు.

→ ద్వైత సిద్ధాంతం – మధ్వాచార్యులు, విశిష్టాద్వైతము – రామానుజాచార్యులు అనుసరించారు.

→ పాండ్యులు ‘మదురై’ ను రాజధానిగా చేసుకుని పాలించారు.

→ పాండ్య రాజైన కులశేఖరుడు శ్రీలంక వరకు విజయవంతమైన దండయాత్రను పూర్తి చేసాడు.

→ మార్కోపోలో అను వెన్నీసు యాత్రికుడు కులశేఖరుని పాలనా కాలములో సందర్శించి అతని పాలనను ప్రశంసించాడు.

→ కాకతీయులు మొదట్లో రాష్ట్రకూటులు మరియు పశ్చిమ చాళుక్యులకు సామంతులుగా పనిచేశారు.

→ ‘కాకతి’ అనే దేవతను ఆరాధించిన కారణంగా వీరికి కాకతీయులు అను పేరు వచ్చింది.

→ ‘కాకతి’ దుర్గా దేవి యొక్క మరొక రూపం.

→ కాకతీయ రాజవంశం ‘గుంద్యెన’ చేత స్థాపించబడింది.

→ కాకతీయులు తమ మొదటి రాజధానిగా ‘హనుమకొండ’ నుండి పాలన ప్రారంభించారు.

→ కాకతీయ రాజు రుద్రదేవుడు కొత్త రాజధాని ఓరుగల్లును నిర్మించటముతో తమ రాజధానిని హనుమకొండ నుండి ఓరుగల్లుకు మార్చారు.

→ వీరిని ఆంధ్ర రాజులు అని కూడా పిలుస్తారు.

→ మొదటి తెలుగు గ్రంథముగా పిలువబడుతున్న ‘శ్రీమదాంధ్ర మహాభారతం’ రచించిన ‘తిక్కన’ ఈ కాలమునకు చెందినవాడు.

→ కాళేశ్వరము (తెలంగాణ), శ్రీశైలము (రాయలసీమ), ద్రాక్షారామం (తీర ఆంధ్ర ప్రాంతము)లను కలిపి త్రిలింగ దేశం అంటారు.

→ ఓరుగల్లు ప్రస్తుత పేరు వరంగల్, ప్రాచీన నామం – ఏకశిలా నగరం.

→ రెండవ ప్రోలరాజు (క్రీ.శ. 1116-1157) పాలన కాకతీయ చరిత్రలో ముఖ్యమైన మైలురాయి.

AP 7th Class Social Notes Chapter 5 కాకతీయ రాజ్యం

→ రుద్రదేవుని (క్రీ.శ. 1158-1195) విజయాలు హనుమకొండ శాసనంలో వివరించబడ్డాయి.

→ రుద్రదేవుడు సంస్కృత భాషలో ‘నీతి సారము’ అనే గ్రంథం రాశాడు.

→ రుద్రదేవుడు హనుమకొండలో వెయ్యి స్తంభాల గుడిని నిర్మించాడు.

→ రుద్రదేవుడు స్థాపించిన ఓరుగల్లు అతని వారసులకు రాజధానిగా మారింది.

→ గణపతి దేవుడు (క్రీ.శ. 1199-1162)కు “మహా మండలేశ్వర” అనే బిరుదు కలదు.

→ కాకతీయ పాలకులలో గణపతి దేవుడు అత్యంత శక్తివంతమైనవాడు.

→ గోదావరి ప్రాంతం నుండి మొదలుకొని చెంగల్పట్టు వరకు మరియు ఎలగందల నుండి సముద్రం వరకు తన సామ్రాజ్యాన్ని (గణపతి దేవుడు) నిర్మించాడు.

→ ‘మోటుపల్లి’ శాసనాన్ని గణపతి దేవుడు జారీ చేశాడు.

→ గణపతి దేవుడు ఓరుగల్లు కోట నిర్మాణమును పూర్తి చేసాడు.

→ ‘అన్నపక్షి’ అనే సంస్కృత పదం పౌరాణిక పక్షి హంసను సూచిస్తుంది.

→ హంస కాకతీయ కళాతోరణం పైన రెండు వైపులా ఉంచబడింది.

→ క్రీ.శ. 1262లో రుద్రమదేవి పాలన ప్రారంభమైంది.

→ రుద్రమదేవి ఆస్థానాన్ని సందర్శించిన ఇటాలియన్ యాత్రికుడు మార్కోపోలో ఆమె పరిపాలనా సామర్థ్యాన్ని ప్రశంసించినాడు.

→ ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న నిడదవోలు పాలకుడు ‘చాళుక్య వీరభద్రుడు’ని వివాహం చేసుకుంది.

→ రుద్రమదేవి తన మనవడు ప్రతాపరుద్రుని తదుపరి వారసుడిగా ప్రకటించింది.

→ రుద్రమదేవికి గల ఇతర పేర్లు రుద్రమాంబ, రుద్రదేవ మహారాజు.

→ కాకతీయుల రాజ్యపాలన సైనిక ప్రాతిపదికగా నిర్వహించబడింది.

→ తమ రాజ్య భాగాలను చిన్న విభాగాలుగా విభజించి నాయంకరులు అనే సైనిక నాయకులను వాటి పరిపాలకులుగా నియమించారు.

→ ప్రతాపరుద్రుని కాలం నాటికి దాదాపు 172’ మంది నాయంకరులు వుండేవారు.

→ గ్రామ పరిపాలన విభాగాలను ‘స్థల’ మరియు ‘నాడు’ అనే రెండు ప్రధాన తరగతులుగా విభజించారు.

→ పది నుండి అరవై వరకు గ్రామాల సమూహాన్ని ‘స్థల’ అంటారు.

→ కొన్ని స్థలాల కలయికతో ఏర్పాటు చేయబడిన ప్రాంతాన్ని ‘నాడు’ అంటారు.

→ ‘ఆయగార్లు’ అని పిలువబడే గ్రామ అధికారులు గ్రామాల పాలనను పర్యవేక్షించేవారు.

AP 7th Class Social Notes Chapter 5 కాకతీయ రాజ్యం

→ గ్రామము ప్రాథమిక పరిపాలనా విభాగము.

→ గ్రామంలోని భూమి సంబంధ రికార్డులను పర్యవేక్షించే అధికారి ‘కరణం’.

→ గ్రామ రక్షక భటుడు ‘తలారి’.

→ రాజుకి చెందిన ప్రభుత్వ భూమిని ‘రాచ పొలం’ అంటారు.

→ నీటి వసతి గలిగిన భూమిని వెలిపొలం (వెలిచేను) అనేవారు.

→ వివిధ రకాల పండ్ల చెట్లతో కూడిన భూమి – తోట పొలం (తోట భూమి).

→ ప్రభుత్వ భూమిని కౌలు ప్రాతిపదికన సాగు చేసిన రైతులు ‘అర్ధశిరి’ అని పిలువబడ్డారు.

→ ‘ఇల్లరి’ అనేది కాకతీయుల నాటి గృహ పన్ను.

→ ‘పుల్లరి’ అనేది కాకతీయుల నాటి అటవీ ఉత్పత్తులపై పన్ను.

→ ‘అడ్డపట్టు సుంకం’ అనేది కాకతీయుల నాటి గొర్రెల మందపై విధించిన పన్ను.

→ పన్ను వసూలు కోసం కాకతీయులు ‘సుంకాధికారి’ అనే వారిని నియమించారు.

→ విదేశీ వాణిజ్యం అభివృద్ధి చేసే ఉద్దేశ్యంతో ‘మోటుపల్లి’ నౌకాశ్రయాన్ని అభివృద్ధి చేశారు.

→ నేరుగా చక్రవర్తికి చెల్లించవలసిన పన్నులు. దరిశనం, అప్పనం, ఉపకృతి అను పన్నులు.

→ కాకతీయుల కాలంలో శైవ మతం బాగా ప్రసిద్ది చెందింది.

→ మల్లికార్జున పండితారాధ్యుడు ‘శివతత్వసారము’ అనే గ్రంథాన్ని రచించాడు.

→ కాకతీయుల కాలంలో ‘పేరిణి’ ప్రసిద్ధ నాట్యం. పద్మశ్రీ నటరాజ రామకృష్ణ ఈ నృత్యంలో ప్రఖ్యాతిగాంచారు.

→ పాల్కురికి సోమనాథుడు ‘బసవ పురాణం’ అనే గ్రంథాన్ని రచించాడు.

→ నన్నెచోడుడు ‘కుమారసంభవం’ అనే గ్రంథాన్ని రచించాడు.

→ విద్యానాథుడు సంస్కృతంలో ‘ప్రతాపరుద్రీయము’ అనే గ్రంథాన్ని రచించాడు.

→ జయాపసేనాని సంస్కృతంలో ‘గీత రత్నావళి’ ‘నృత్య రత్నావళి’ అనే గ్రంథాలు రచించాడు.

→ వల్లభరాయుడు తెలుగులో ‘క్రీడాభిరామం’ అనే గ్రంథాన్ని రచించాడు.

AP 7th Class Social Notes Chapter 5 కాకతీయ రాజ్యం

→ వెయ్యి స్తంభాల ఆలయాన్ని ‘రుద్రేశ్వర’ ఆలయం అంటారు. ఇది హనుమకొండలో ఉంది.

→ వెయ్యి స్తంభాల ఆలయాన్ని రుద్రదేవుడు నిర్మించాడు. ‘ఏకశిలా’ నంది ఈ ఆలయ ప్రధాన ఆకర్షణ.

→ వరంగల్ ప్రాంతంలోని ‘పాలంపేట’ గ్రామానికి సమీపంలో రామప్ప ఆలయం కలదు.

→ రేచర్ల రుద్రుడు రామప్ప ఆలయాన్ని నిర్మించాడు.

→ ఈ ఆలయంలో విష్ణువు మరియు శివుడులను ఒకే చోట ఆరాధించటం ప్రసిద్ది.

→ ఈ ఆలయంలో నల్ల గ్రానైట్ రాయితో నిర్మించిన విగ్రహాలు కలవు.

→ స్తంభాల పైన చెక్కిన శిల్పాలతో మండప నిర్మాణము, అంతరాలయము మరియు గర్భగుడి నిర్మాణ నమూనాలను అనుసరించారు. ఈ శైలిని ‘త్రికూట పద్ధతి’ అని కూడా అంటారు.

→ క్రీ.శ. 1323లో ఉలుగ్ ఖాన్ నాయకత్వంలో ఢిల్లీ సుల్తానులు కాకతీయ రాజ్యాన్ని ఆక్రమించుకున్నారు. ప్రతాపరుద్రుని ఖైదు చేశారు.

→ ‘విలస’ శాసనము ఢిల్లీ సుల్తానులు, కాకతీయులపై చేసిన దండయాత్రల గురించి, ‘ముసునూరి నాయకుల’ గురించి తెల్పుతుంది.

→ ముసునూరి నాయకుల్లో ఒకరైన ప్రోలయ నాయకుడు ‘రేకపల్లె’ రాజధానిగా అధికారంలోకి వచ్చాడు.

→ ముసునూరి కాపయ నాయకుడు క్రీ.శ. 1336లో తుగ్లక్ పాలనను వరంగల్ నుండి తరిమికొట్టడానికి తిరుగుబాటును నడిపించాడు.

→ ఘటికలు : మధ్యయుగం నాటి విద్యా సంస్థలు / కళాశాలలు.

→ సామంతులు : చక్రవర్తికి కప్పం చెల్లించే రాజులు.

→ ద్వైతము : రెండుగా ఉన్నవి (ఆత్మ, పరమాత్మ).

→ అద్వైతము : ఒక్కటి మాతమ్రే (పరమాత్మ).

→ చరిత్రకారుడు : మానవులకి సంబంధించిన గడచిన సంఘటనల గురించి అధ్యయనం చేసి వ్రాసే వ్యక్తి.

→ పురావస్తు శాస్త్రవేత్త : పురాతన భవనాలు, అవశేషాలు, శిల్పం, శాసనాలు మరియు పురావస్తు త్రవ్వకాల గురించి అధ్యయనం చేసే వ్యక్తి.

→ కాకతీయులు : ‘కాకతి’ అనే దేవతను ఆరాధించిన వారు కాకతీయులు.

→ త్రిలింగ దేశం : కాళేశ్వరము (తెలంగాణ), శ్రీశైలము (రాయలసీమ), ద్రాక్షారామం (కోస్తా ఆంధ్రలను) కలిపి త్రిలింగ దేశం అంటారు.

→ దివిసీమ : కృష్ణానది బంగాళాఖాతంలో కలిసే ముందు రెండు పాయలుగా విడిపోతుంది. ఈ రెండు పాయల మధ్య ప్రాంతమే దివిసీమ.

→ అన్నపక్షి : పౌరాణిక పక్షి ‘హంస’

AP 7th Class Social Notes Chapter 5 కాకతీయ రాజ్యం

→ మార్కోపోలో : ఇటాలియన్ యాత్రికుడు రుద్రమదేవి ఆస్థానాన్ని సందర్శించాడు.

→ నాయంకరులు : కాకతీయుల చిన్న విభాగాలకు పరిపాలకులుగా నియమించబడిన సైనిక నాయకులు.

→ స్థల : పది నుండి అరవై వరకు గ్రామాల సమూహం.

→ నాడు : కొన్ని స్థలాల కలయికతో ఏర్పాటు చేయబడిన ప్రాంతం నాడు.

→ ఆయగార్లు : గ్రామ పాలనను పర్యవేక్షించే గ్రామ అధికారులు.

→ కరణం : గ్రామంలోని భూమి సంబంధ రికార్డులను పర్యవేక్షించే అధికారి.

→ రెడ్డి : గ్రామ పెద్ద.

→ తలారి : గ్రామ రక్షక భటుడు.

→ రాచపొలం : రాజుకి చెందిన ప్రభుత్వ భూమి.

→ వెలిపొలం (వెలిచేను) : నీటి వసతి గలిగిన భూమి.

→ తోట పొలం (తోట భూమి) : వివిధ రకాల పండ్ల చెట్లతో కూడిన భూమి.

→ ‘అర్ధశిరి’ : ప్రభుత్వ భూమిని కౌలు ప్రాతిపదికన సాగుచేసిన రైతులు.

→ ‘ఇల్లరి’ : గృహపన్ను.

→ పుల్లరి : అటవీ ఉత్పత్తులపై పన్ను.

→ అడ్డపట్టు సుంకం : గొర్రెల మందపై విధించిన పన్ను.

→ సుంకాధికారి : పన్నులు వసూలు చేయటం కోసం నియమించిన అధికారి.

→ పేరిణి నాట్యం : యుద్ధ సమయంలో ప్రదర్శించే కాకతీయుల నాటి ప్రసిద్ధ నాట్యం.

→ ఏకశిలా నంది : ఒకే రాయిపై చెక్కిన నంది విగ్రహము.

→ సప్త స్వరాలు : ఏడు స్వరములు (స,రి,గ,మ,ప,ద,ని).

→ విలాస శాసనము : ముసునూరి నాయకుల గూర్చి తెలుపు శాసనము.

→ ఇతిహాసాలు : రామాయణం, మహాభారతం భారతదేశ ఇతిహాసాలు.

→ త్రికూట పద్దతి : మండపము, అంతరాలయము మరియు గర్భగుడి ఇలాంటి మూడు నిర్మాణ నమూనాలతో నిర్మితమైన శైలిని త్రికూట పద్ధతి అంటారు.

→ వారసత్వం : పూర్వీకుల నుండి అందించబడినది.

→ రేకపల్లె : పాపికొండల సమీపంలో శబరి నది లోయలో కల్గిన ప్రాంతం.

→ సామంత ప్రభువులు : చక్రవర్తి ఆదేశాలు లేదా సూచనలను విధేయతతో అనుసరిస్తూ అతని అధీనంలో ఉన్నవారు.

→ పోషకులు : సంస్కృతిని మరియు వారసత్వంను పెంపొందించడానికి తమ సహాయాన్ని మద్దతును ఇచ్చిన పాలకులు.

→ వీర శైవం : హిందూ మతం నుండి మధ్య యుగములో నూతనముగా ఆవిర్భవించిన ఒక శాఖ.

→ శాసనం : లిఖించబడిన ఒక చారిత్రక సంఘటన లేదా ఆదేశము.

AP 7th Class Social Notes Chapter 5 కాకతీయ రాజ్యం

→ శోభ : ప్రకాశవంతమైన శిల్పకళా ప్రదర్శన.

→ రాజవంశం : ఒకే సంతతికి చెందిన పాలకులు వారసత్వ పాలన చేయుట.

→ సయోధ్య కుదరని సామంత ప్రభువులు : చక్రవర్తికి అవిధేయులుగా ఉన్నవారు.

→ శాంతి ఒప్పందము : యుద్ధము. ముగింపు తరువాత కొనసాగడానికి మరియు అనుసరించడానికి కుదుర్చుకున్న అంగీకారము.

→ వారసుడు : వంశ పారంపర్యంగా బాధ్యతలు చేపట్టే అర్హత కలిగిన వ్యక్తి.

→ తెగ : ఒక సాధారణ పూర్వీకుల నుండి వచ్చిన వారి సమూహం.

1.

AP 7th Class Social Notes Chapter 5 కాకతీయ రాజ్యం 1

2.
AP 7th Class Social Notes Chapter 5 కాకతీయ రాజ్యం 2

3.
AP 7th Class Social Notes Chapter 5 కాకతీయ రాజ్యం 3

4.
AP 7th Class Social Notes Chapter 5 కాకతీయ రాజ్యం 4

AP 7th Class Social Notes Chapter 4 ఢిల్లీ సుల్తానులు

Students can go through AP Board 7th Class Social Notes 4th Lesson ఢిల్లీ సుల్తానులు to understand and remember the concept easily.

AP Board 7th Class Social Notes 4th Lesson ఢిల్లీ సుల్తానులు

→ క్రీ. శ. 13వ శతాబ్దము నుండి 16వ శతాబ్దం వరకు ఢిల్లీ సుల్తానులు భారతదేశానికి ఢిల్లీ నగరాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించారు.

→ గతాన్ని అధ్యయనం చేయడమే చరిత్ర.

→ చారిత్రక ఆధారాలను స్థూలంగా రెండు రతాలుగా వర్గీకరించారు. అవి :

  1. పురావస్తు ఆధారాలు,
  2. వాజ్మయ (లిఖిత) ఆధారాలు.

→ ప్రాచీన యుగం – క్రీ.శ. 8వ శతాబ్దం వరకు
మధ్య యుగం – క్రీ.శ. 8 నుండి 18 శతాబ్దం వరకు
ఆధునిక యుగం – క్రీ.శ. 18వ శతాబ్దం నుండి ప్రస్తుతం

→ తోమార వంశానికి చెందిన రాజపుత్రులు దిల్లిక లేదా దిల్లికాపుర (ప్రస్తుత ఢిల్లీ) నిర్మించి రాజధానిగా చేసుకుని పరిపాలించారు.

→ క్రీ.శ. 1192వ సంవత్సరంలో మహ్మద్ ఘోరి రెండవ తతాయివ్ యుద్ధంలో పృథ్వీరాజ్ చౌహాన్ ను ఓడించి ఢిల్లీని స్వాధీనం చేసుకున్నాడు.

→ మహ్మద్ ఘోరి హత్యానంతరం అతని ప్రతినిధి అయిన కుతుబుద్దీన్ ఐబక్ మామ్లుక్ లేదా బానిస వంశాన్ని క్రీ. శ. 1206లో ఢిల్లీ పాలకునిగా ఢిల్లీ సుల్తానుల సామ్రాజ్యాన్ని స్థాపించాడు.

AP 7th Class Social Notes Chapter 4 ఢిల్లీ సుల్తానులు

→ మొదట లాహోర్ రాజధానిగా ఢిల్లీ సామ్రాజ్యాన్ని ఐబక్ స్థాపించాడు.

→ ఇల్ టుట్ మిష్ కాలంలో రాజధాని ఢిల్లీకి మార్చబడినది.

→ ఇల్ టుట్ మిష్ ఢిల్లీకి తొలి సర్వ స్వతంత్ర పాలకునిగా, ఢిల్లీ సామ్రాజ్యానికి అసలైన స్థాపకునిగా పరిగణింపబడతాడు.

→ ఇల్ టుట్ మిష్ తరువాత ఇతని కుమార్తె రజియా సుల్తానా ఢిల్లీ సింహాసనాన్ని అధిష్టించారు.

→ బానిస వంశ పరిపాలన ‘కైకుబాదు’ కాలంలో ముగిసింది.

→ సుల్తానా రజియా (1236 – 1239) ఢిల్లీని పాలించిన ఏకైక మహిళ.

→ ఖిల్జీ వంశ స్థాపకుడు జలాలుద్దీన్ ఖిల్జీ.

→ అల్లావుద్దీన్ ఖిల్జీ (1296- 1316) గూఢచారి వ్యవస్థను స్థాపించాడు.

→ అల్లావుద్దీన్ ఖిల్జీ దక్షిణ భారతదేశాన్ని జయించడానికి మాలిక్ కాఫర్ ఆధ్వర్యంలో సైన్యాన్ని పంపించాడు.

→ అల్లావుద్దీన్ ఖిల్జీ మార్కెట్ సంస్కరణల్లో భాగంగా వస్తువుల ధరను క్రమబద్ధీకరించాడు.

→ అల్లావుద్దీన్ ఖిల్జీ గుర్రాలు బదిలీ కాకుండా వాటిపై ముద్ర వేసే పద్ధతిని ప్రవేశపెట్టాడు.

→ చంగిజ్ ఖాన్ మంగోలియన్లను ఏకం చేసి 1206వ సంవత్సరంలో మంగోల్ రాజ్యాన్ని స్థాపించాడు.

→ మంగోలులు క్రీ.శ. 1221-1368 వరకు భారతదేశంపై అనేక సార్లు దండయాత్ర చేసారు.

→ ఖిల్జీలలో చివరి పాలకుడైన ‘ఖుస్రూ’ పాలనను అంతం చేసి ఘియాసుద్దీన్ తుగ్లక్, తుగ్లక్ వంశాన్ని స్థాపించాడు.

→ మహ్మద్ బీన్ తుగ్లక్ (1324-1351) రాజధానిని ఢిల్లీ నుండి దేవగిరి (దౌలతాబాద్)కి మార్చాడు. రాగి నాణాలు ముద్రించాడు. వ్యవసాయ సంస్కరణలు చేపట్టాడు.

AP 7th Class Social Notes Chapter 4 ఢిల్లీ సుల్తానులు

→ సయ్యద్ వంశ స్థాపకుడు కిజర్ ఖాన్.

→ సయ్యద్ వంశ చివరి పాలకుడు ఆలమ్ షా బహలాల్ చేతిలో ఓడిపోవటంతో లోడి వంశ పాలన సంక్రమించింది. ఢిల్లీ సుల్తానులలో చివరి పాలకుడైన ఇబ్రహీం లోడీని మొఘల్ వంశస్థుడైన బాబర్ ఓడించి, భారతదేశంలో మొఘల్ వంశ స్థాపన చేసాడు.

→ తుగ్లక్ వంశ పాలనా కాలంలో క్రీ. శ. 1398వ సంవత్సరంలో తైమూర్ భారతదేశంపై దండయాత్ర చేసి ఢిల్లీని స్వాధీనపరచుకున్నాడు.

→ ఢిల్లీ సుల్తానుల కాలంలో సుల్తాన్ సర్వాధికారి.

→ ఢిల్లీ సుల్తానుల కాలంలో షరియత్ లేదా ఇస్లామిక్ నిబంధనల ప్రకారం పరిపాలన జరుగుతుంది.

→ రాజ్యాన్ని ఇకాలు, పరగణాలు, షికు మరియు గ్రామాలుగా విభజించారు.

→ గ్రామ పరిపాలనలో కేంద్రం జోక్యం చేసుకోదు.

→ ఇల్ టుట్ మిష్ సైనిక అవసరాల కోసం బానిసలను కొనుగోలు చేసేవాడు. పర్షియాలో ఈ పద్ధతిని ‘బందగాన్’ అని పిలుస్తారు.

→ ఇల్ టుట్ మిష్ కాలంలో చిహల్ గని సర్దారులు కీలక పాత్ర పోషించారు.

→ పరిపాలనలో సహకరించడం కోసం టర్కిష్ ప్రభువులతో కూడిన వ్యవస్థనే తుర్కాన్-ఇ-చిహల్ గని లేదా చాలీసా అనేవారు.

→ ఢిల్లీ సుల్తానులు తమ రాజ్యాన్ని ఇకాలుగా విభజించారు.

→ ఇక్తా సైనికాధికారులను ఇక్తాదార్లు లేదా ముకీలు అంటారు.

→ ఇక్తాదార్ పదవి వారసత్వముగా ఉండేది కాదు, తరచుగా బదిలీలు ఉండేవి.

→ వ్యవసాయము ప్రధాన వృత్తి. 1/3వ వంతు శిస్తు చెల్లించాలి.

→ పత్తి, ముత్యాలు, ధాన్యం, నీలిమందు మొదలైనవి ప్రధాన ఎగుమతులు.

→ టంకా (వెండి), జిటాల్ (రాగి) నాణేలు ప్రామాణిక నాణేలుగా వాడుకలో ఉండేవి.

→ ఢిల్లీ సుల్తానుల కాలంలో అరబిక్ మరియు ఇస్లాం శైలుల మిశ్రమంతో కూడిన వాస్తు నిర్మాణాలు, కళలు అభివృద్ధి చెందాయి.

→ స్వదేశీ నిర్మాణాలలో ట్రూబీట్ పద్ధతి తర్వాత అర్క్యుట్ పద్ధతి ప్రవేశపెట్టబడింది.

→ కుతుబ్ మినార్‌ను కువ్వత్-ఉల్-ఇస్లాం మసీదు ఆవరణలో నిర్మించారు.

→ కుతుబ్ మినారను కుతుబుద్దీన్ ఐబక్, ఇల్ టుట్ మిషన్లు కట్టించి సూఫి సన్యాసి అయిన కుతుబుద్దీన్ భక్తియార్ ఖాకీకి అంకితం ఇచ్చారు.

→ అలైదర్వాజాను అల్లావుద్దీన్ ఖిల్జీ కువ్వత్-ఉల్-ఇస్లామ్ మసీదుకు దక్షిణ ద్వారం వలే నిర్మించాడు.

→ తారిక్-అల్-హింద్ (భారతదేశ చరిత్ర) అనే గ్రంథాన్ని అల్ బెరూని రచించాడు.

→ అమీర్ ఖుస్రూ అనేక ద్విపద పద్యాలు రచించాడు.

AP 7th Class Social Notes Chapter 4 ఢిల్లీ సుల్తానులు

→ అమీర్ ఖుస్రూకు భారతదేశపు చిలుక (టుటి-ఐ-హింద్) అనే బిరుదు కలదు.

→ 1398 తైమూరు దండయాత్రలలో దేశ సంపదని తరలించి వేశారు.

→ క్రీ.శ. 1526లో మొఘల్ పాలకుడైన బాబర్ మొదటి పానిపట్టు యుద్ధంలో ఇబ్రహీం లోడీని ఓడించాడు.

→ బానిస వంశం-కుతుబుద్దీన్ ఐబక్ స్థాపకుడు, కాలం : 1206-1290

→ ఖిల్జీ వంశం-జలాలుద్దీన్ ఖిల్జీ స్థాపకుడు, కాలం : 1290-1320

→ తుగ్లక్ వంశం-ఘియాజుద్దీన్ తుగ్లక్ స్థాపకుడు, కాలం : 1321-1414

→ సయ్యద్ వంశం-కిజరిన్ స్థాపకుడు, కాలం : 1414-1451

→ లోడి వంశం-బహలాల్ లోడి స్థాపకుడు, కాలం : 1451-1526

→ చరిత్ర : గతాన్ని అధ్యయనం చేయడమే చరిత్ర.

→ పురావస్తు ఆధారాలు : పురావస్తు సముదాయములైన (నాణాలు, శాసనాలు, స్మారకాలు, కళాఖండములు) ప్రాచీన నాగరికతా అవశేష సంపద.

→ వాజ్మయ ఆధారాలు : లిఖిత ఆధారాలు, సాహిత్య (సారస్వత) ఆధారాలు.

→ ప్రాచీన యుగం : 8వ శతాబ్దం వరకు

→ మధ్య యుగం : 8 నుండి 18వ శతాబ్దం వరకు

→ ఆధునిక యుగం : 18వ శతాబ్దం నుండి ప్రస్తుతం

→ వజీరులు : ఢిల్లీ సుల్తానుల మంత్రులు

→ సంచార జాతులు : ‘ఒక చోట స్థిర నివాసం ఏర్పరుచుకోని జాతులు. నిరంతరం ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్ళేటటువంటివారు.

→ సుల్తాన్ : రాజ్యంలో సర్వాధికారి (రాజు).

→ చిహల్గని : పరిపాలనలో సహకరించడం కొరకు టర్కిష్ ప్రభువులతో కూడిన వ్యవస్థ. దీనిని ఇల్ టుట్ మిష్ ప్రారంభించాడు.

→ బందగాన్ : సైనిక అవసరాల కోసం బానిసలను కొనుగోలు చేసే పద్ధతిని పర్షియాలో బందగాన్ అంటారు.

→ ఇక్షాలు : ఢిల్లీ సుల్తానుల కాలం నాటి రాష్ట్రాలు.

→ ఇక్టాదార్ (ముక్తీలు) : ఇకాల యొక్క సైనికాధికారులు.

AP 7th Class Social Notes Chapter 4 ఢిల్లీ సుల్తానులు

→ ట్రూబీట్ శైలి : రెండు నిలువు స్తంభాలపై అడ్డంగా ఒక దూలము పెట్టి దానిపై కప్పులు, తలుపులు, కిటికీలు మొదలైనవి తయారుచేయబడేవి.

→ ఆర్క్యుట్ శైలి : తలుపులు, కిటికీలపై ప్రత్యేకంగా ఉండి వాటిపై గల బరువును మోయునట్లుగా ఆర్చి నిర్మాణం ఉంటుంది.

→ రాజవంశం : వారసత్వంగా వచ్చే పాలకుల పరంపర.

→ ప్రకటన : అధికారికంగా వెల్లడి చేసిన సమాచారం.

→ దోహాలు : రెండు పంక్తులలో వ్రాయబడిన పద్యాలు. వీటిలో పాదంలోని పదాలు, లయ దాదాపు సమానంగా ఉంటాయి.

→ కార్యానా : పరిశ్రమలు / కార్యశాలలు

→ షరియత్ : ఇస్లాం న్యాయ సూత్రాలు

1.
AP 7th Class Social Notes Chapter 4 ఢిల్లీ సుల్తానులు 1

2.
AP 7th Class Social Notes Chapter 4 ఢిల్లీ సుల్తానులు 2

3.
AP 7th Class Social Notes Chapter 4 ఢిల్లీ సుల్తానులు 3

4.
AP 7th Class Social Notes Chapter 4 ఢిల్లీ సుల్తానులు 4

AP 6th Class Social Notes Chapter 12 సమానత్వం వైపు

Students can go through AP Board 6th Class Social Notes 12th Lesson సమానత్వం వైపు to understand and remember the concept easily.

AP Board 6th Class Social Notes 12th Lesson సమానత్వం వైపు

→ భారతదేశం అనేక భిన్నత్వాలు కలిగిన దేశం.

→ ప్రజలు మత విశ్వాసాలు, వారి శరీర ఛాయ, వారు ఏ ప్రాంతం నుండి వచ్చారు, వారు ధరించే దుస్తులు వంటి చాలా విషయాలలో పక్షపాతంగా వ్యవహరిస్తారు.

→ వివక్షత రకాలు : కుల, మత, ప్రాంతీయ, జాతి, లింగ, దివ్యాంగ, వివక్షతలు.

→ ప్రపంచంలో ఎనిమిది ప్రధాన మతాలు ప్రాచుర్యంలో ఉండి ఆచరించబడుతున్నాయి.

→ అగ్రకులాల వారు అనుభవించే హక్కులు నిమ్నకులాల వారిని అనుభవించనీయక పోవడమే కుల వివక్షత.

→ దళితులను ప్రభుత్వం షెడ్యూల్డ్ కులాలు (SC) గా పరిగణిస్తుంది.

→ స్త్రీలు (మహిళలు, బాలికల) పట్ల చూపే వివక్షత లింగ వివక్షత.

→ సావిత్రిబాయి పూలే భారతదేశ ప్రథమ మహిళా ఉపాధ్యాయునిగా కీర్తించబడ్డారు.

→ సావిత్రిబాయి ఫూలేను ‘భారతీయ స్త్రీవాద మాతామహి’ అని కీర్తిస్తారు.

→ సావిత్రిబాయి ఫూలే భారతదేశంలోనే ప్రథమ బాలికల పాఠశాలను స్థాపించారు.

AP 6th Class Social Notes Chapter 12 సమానత్వం వైపు

→ వ్యక్తి యొక్క చర్మపు రంగు లేదా జాతి లేదా మూలం ఆధారంగా చూపే వివక్షతను జాతి వివక్షత అంటారు.

→ వ్యక్తి నివాస స్థలం లేదా జన్మస్థలం ఆధారంగా చూపే వివక్షత ప్రాంతీయ వివక్షత.

→ PWD చట్టం – 2016 ప్రకారం నడవలేని, చూడలేని, మాట్లాడలేని వ్యక్తులను దివ్యాంగులుగా పరిగణిస్తారు.

→ అవిద్య, అధికారం, నమ్మకాలు, వృత్తులు, సంపద, సంప్రదాయాలు మన సమాజంలో అసమానతలను వివక్షతను. సృష్టించాయి.

→ సతీసహగమనం 1829లో నిషేధించబడింది.

→ భారతదేశపు తొలి మహిళా వైద్యురాలు ఆనందిబాయి జోషి.

→ “దక్షిణాఫ్రికా గాంధీగా” నెల్సన్ మండేలాను పిలుస్తారు. ఈయన 1990లో భారతరత్న అవార్డును స్వీకరించారు.

→ భారత రాజ్యాంగంలోని 14వ నిబంధన ప్రకారం చట్టం ముందు అందరు సమానం.

→ భారత రాజ్యాంగంలోని 16వ నిబంధన ప్రకారం ప్రభుత్వ రంగ ఉద్యోగాలలో అందరికీ సమానావకాశాలు.

→ భారత రాజ్యాంగంలోని 17వ నిబంధన ప్రకారం అంటరానితనాన్ని పాటించడం నిషేధం, నేరం కూడా.

→ 21-(A) ప్రకారం 6-14 సం||రాల వయస్సులోని బాలబాలికలందరికి ఉచిత ప్రాథమిక విద్య.

AP 6th Class Social Notes Chapter 12 సమానత్వం వైపు

→ 15(1) ప్రకారం మతం, జాతి, కులం, లింగం, పుట్టిన ప్రదేశం వంటి అంశాల ఆధారంగా రాజ్యం ఏ ఒక్క పౌరుని పట్ల వివక్షత చూపరాదు.

→ ప్రభుత్వం సమానత్వాన్ని సాధించడానికి 1) చట్టాలు 2) సంక్షేమ కార్యక్రమాలనే రెండు మార్గాలను అనుసరిస్తుంది.

→ డాక్టర్ APJ అబ్దుల్ కలాం భారతదేశపు 11వ అధ్యక్షుడిగా ఉన్నారు.

→ డాక్టర్ APJ అబ్దుల్ కలాం ‘వింగ్స్ ఆఫ్ ఫైర్’ అన్న పుస్తకం రాశారు.

→ 2016లో బ్రెజిల్ లోని రియో డి జెనిరో లో జరిగిన పారా ఒలింపిక్స్ లో పురుషుల హైజం లో ‘మరియప్పన్ ఆ తంగవేలు బంగారు పతకాన్ని సాధించారు.

→ ‘సింధుతాయి’ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతులమీదుగా ‘నారీశక్తి’ పురస్కారాన్ని అందుకుంది.

→ లింగ సమానత్వం : స్త్రీ పురుషులను సమానంగా చూడటం.

→ అంటరానితనం : కొందరు తక్కువ కులం వారని అనబడే వాళ్లను దూరంగా ఉంచే దురాచారం.

→ అపార్టీడ్/జాతి వివక్ష : జాతి ఆధారంగా వివక్ష చూపడం.

→ సుస్థిర అభివృద్ధి : భవిష్యత్ తరాల అభివృద్ధి అవకాశాలు దెబ్బతినకుండా ప్రస్తుత తరాల అవసరాలను తీర్చడం.

→ వివక్షత : జాతి, మతం, కులం, లింగం వంటి అంశాల ఆధారంగా కొందరిని అన్యాయంగా అసమానంగా, చూడటం.

→ పక్షపాతం : ఇతరులను ప్రతికూల ధోరణిలోను, నాసిరకం, హీనంగాను చూడటం. తనవారిని ఏ సందర్భంలోనైనా సమర్థించడం.

→ మూసధోరణి : మనం వ్యక్తులను గానీ, సంఘాన్ని గానీ ఒక కోణంలో నుండి మాత్రమే చూడటాన్ని మూసధోరణి అంటారు.

→ మత వివక్షత : కొన్ని ప్రత్యేక మతాలు ఆచరించేవారిని చిన్నచూపు చూడటం వారి ఆచార, సాంప్రదాయాలను విమర్శించడం.

→ కుల వివక్షత : అగ్ర కులాల వారు అనుభవించే హక్కులు, నిమ్న కులాల వారిని అనుభవించనీయక పోవడమే కుల వివక్షత. (కుల ప్రాతిపదిక వివక్షతను చూపడం కుల వివక్షత)

→ లింగ వివక్షత : స్త్రీ, పురుషులలో ఒకరిని ఎక్కువగాను (అంటే పురుషులను ఎక్కువగాను) ఒకరిని తక్కువగాను చూడటాన్ని లింగ వివక్షత అంటారు.

→ అసమానత : రెండింటి మధ్యలో గాని లేదా ఇద్దరి మధ్యగాని తేడా.

AP 6th Class Social Notes Chapter 12 సమానత్వం వైపు

→ ప్రాంతీయ వివక్షత : ఒక వ్యక్తి నివాస స్థలం లేదా జన్మ స్థలం ఆధారంగా చూపే వివక్షత.

→ దివ్యాంగుల పట్ల వివక్షత : నడవలేని, చూడలేని, వినలేని, మాట్లాడలేని వ్యక్తుల పట్ల చూపే వివక్షత.

→ ప్రవేశిక : భారత రాజ్యాంగ పీఠిక లేదా ముందుమాట. ఇది రాజ్యాంగం యొక్క లక్ష్యాలను తెలుపుతుంది.

→ సతీసహగమనం : చనిపోయిన భర్త చితిలో భార్య సజీవంగా దూకి ఆత్మాహుతి గావించడం.

→ అణగారిన వర్గాలు : సమాజంలో కింది స్థాయిలో ఉంచబడిన కొన్ని వృత్తుల, కులాలవారు.

→ వైవిధ్యం : వినూత్నంగా / తేడాగా ఉన్నది. మిగతా వాటిలా కాకుండా వేరేగా ఉన్నది.

AP 6th Class Social Notes Chapter 12 సమానత్వం వైపు 1

AP 7th Class Science Notes 10th Lesson Changes Around Us

Students can go through AP Board 7th Class Science Notes 10th Lesson Changes Around Us to understand and remember the concept easily.

AP Board 7th Class Science Notes 10th Lesson Changes Around Us

→ In our daily life we might have noticed many changes,.

→ Changes are of different types.

→ Which changes are brought by nature are called natural changes.

→ Which were taken place by the involvement of human beings are called man made changes.

→ Changes which occur in short duration of time are called feist changes.

→ Changes which takes longer duration of time to happen are called slow changes.

→ The changes in which the formed substance can be converted into their original substance are called Reversible changes.

AP 7th Class Science Notes 10th Lesson Changes Around Us

→ Ice converting to water, water converting to steam are reversible changes.

→ Changes in which we cannot get the original substance by reversing the experimental conditions are called irreversible changes.

→ Ripening of fruits is irreversible change.

→ The changes are repeating at regular intervals of time and which can be predicted are called periodic changes.

→ Formation of day and night, occurrence of seasons are periodic changes.

→ Changes which do not occur at regular intervals of time and which cannot be predicted are called non periodic changes.

→ Flowers changing to fruits and curding of milk are useful changes.

→ The changes that occurs only in size, colour and shape of the substance but not in chemical composition are called physical changes.

→ The process of separating a soluble solid from the solution by heating or evaporating is called crystallization.

→ During a physical change, no new substances are formed. The chemical properties of a substance do not change.

→ A physical change is usually temporary and reversible in nature.

→ In a physical change, the chemical properties of a substance do not change.

→ In a physical change, change in physical properties such as colour, shape and size of a substance may undergo a change.

AP 7th Class Science Notes 10th Lesson Changes Around Us

→ Changes that occur with the formation of new substance with different chemical composition or transformation of a substance into another substance with the evolution or absorption of heat or light energy are termed as chemical changes.

→ During chemical change new substances are formed.

→ Chemical composition of the substance changes.

→ Heat, light may be Released or absorbed.

→ A colour change may take place and sound may be produced.

→ When iron reacts with atmospheric oxygen and moisture it forms a new substance called Iron oxide as rust layer on articles made of Iron. This process is known as rusting.

→ Iron + Oxygen (from air) + Water → Rust (Iron oxide)

→ The process of depositing zinc on metals is called Galvanisation.

→ The process of separating a soluble solid from the solution on heating is called Crystallization.

→ Reversible change : The changes in which the formed substances can be converted into their original substance are called reversible change.

→ Irreversible change : Changes in which we can not get the original substance by reversing the experimental condition.

→ Periodic change : Changes that are repeating at regular intervals of time and -which can be predicted are called periodic changes.

→ Non periodic change : Changes that qre not repeating at regular intervals of time and which cannot be predicted are called non – periodic changes.

→ Physical change : Change occur only in size, colour and shape of the substance and no change in chemical composition.

AP 7th Class Science Notes 10th Lesson Changes Around Us

→ Crystallization : The process of separating a soluble solid from the solution on heating is called crystallization.

→ Chemical change : When a material undergoes a change in its composition, it is called a chemical change.

→ Galvanization : The process of depositing zinc over metals is called Galvanization.

→ Rusting : The process of formation of a reddish yellow coloured coating formed on iron objects when exposed to moist air.

→ Global warming : The drastic increase in the emission of carbon dioxide by the burning of fossil fuels.

AP 7th Class Science Notes 10th Lesson Changes Around Us 1

AP 6th Class Social Notes Chapter 7 సామ్రాజ్యాలు, గణతంత్రాల ఆవిర్భావం

Students can go through AP Board 6th Class Social Notes 7th Lesson సామ్రాజ్యాలు, గణతంత్రాల ఆవిర్భావం to understand and remember the concept easily.

AP Board 6th Class Social Notes 7th Lesson సామ్రాజ్యాలు, గణతంత్రాల ఆవిర్భావం

→ హిమాలయాలకు మరియు దక్కన్ పీఠభూమి మధ్య గంగ, యమున నదులు ప్రవహిస్తున్నాయి. దీనిని గంగా నదీలోయ అంటారు.

→ తెగలను సంస్కృతంలో ‘జన’ అని, వారు స్థిరపడిన ప్రాంతాన్ని ‘జనపదం’ అని పిలుస్తారు.

→ గంగా, యమున నదుల వెంట ప్రజలు 2700 సం||రాలలో పెద్ద సంఖ్యలో స్థిరపడటం ప్రారంభించారు.

→ గంగా మైదానంలో ఇనుము యొక్క విస్తృతమైన ఉపయోగం పెద్ద ప్రాదేశిక ప్రాంతాలు ఏర్పడటానికి పరిస్థితులను సృష్టించింది.

→ గ్రామాలు మరియు పట్టణాల యొక్క పెద్ద సమూహాలను ‘మహాజన పదాలు’ లేదా ‘పెద్ద జనపదాలు’ అని పిలిచేవారు.

→ గోదావరి నదీ తీరాన నెలకొన్న జనపదం అస్మిక.

AP 6th Class Social Notes Chapter 7 సామ్రాజ్యాలు, గణతంత్రాల ఆవిర్భావం

→ గాంధార జనపదం జీలం నదీ తీరాన నెలకొని ఉంది.

→ వేదాలలో ఉపనిషత్తులు ఒక భాగం.

→ మహాజనపదం నాటి వ్యవసాయం చేసే భూ యజమానులను గృహపతి లేదా ‘గహపతి’ అనేవారు.

→ ఇనుప నాగలి వినియోగం, వరి నారు పోసే పద్దతి ఈ కాలంలో వ్యవసాయంలోని రెండు ప్రధాన మార్పులు.

→ బట్టలు మరియు దుప్పట్లు నేసే పనివారిని ‘సాలివారు’ అనేవారు.

→ నాటి మట్టికుండలను ‘పెయింటెడ్ గ్రేవేర్’ అని పిలుస్తారు.

→ చాలా మహాజన పదాలను రాజులు పరిపాలించేవారు.

→ వ్యవసాయం చేసే గృహపతుల నుంచి రాజులు 1/6వ వంతు పంటను పన్నుగా వసూలు చేసేవారు. దీనిని ‘భాగ’ అని పిలిచేవారు.

→ ప్రతీనెల ఒకరోజు ఉచితంగా పనిచేయడం ద్వారా వృత్తిపనివారు, రాజుకు పన్నులు చెల్లించేవారు.

→ ఈ కాలంలోనే నాణేలను ఉపయోగించడం ప్రారంభమైనది.

→ ‘గణ’ అనే పదానికి సమాన హోదా ఉన్నవారు అని అర్థం.

→ ‘సంఘ’ అంటే శాసనసభ.

→ గణ-సంఘాలు ఒక ఉన్నత సమూహం పాలించే ఒక చిన్న భౌగోళిక ప్రాంతమే గణరాజ్యం.

→ రాజ్యం అంటే రాజు లేదా రాణి పాలించే భూభాగం.

AP 6th Class Social Notes Chapter 7 సామ్రాజ్యాలు, గణతంత్రాల ఆవిర్భావం

→ మహాజన పదాలలో మగధ శక్తివంతమైన రాజ్యం

→ వజ్జి గణ రాజ్యా నికి ఉదాహరణగా చెప్పవచ్చు.

→ గణ రాజ్యంలో ఒకే పరిపాలకుడు కాక, ఒక పరిపాలకుల బృందం ఉండేది.

→ మహిళలకు, బానిసలకు, సేవకులకు గణ సమావేశాలలో పాల్గొనే అవకాశం లేదు.

→ ఈ గణ రాజ్యాలు 1500 సం||రాల పాటు మనగలిగాయి, చివరకు గుప్త రాజులు గణ రాజ్యాలను జయించారు.

→ అలెగ్జాండర్ (గ్రీస్) మాసిడోనియా పాలకుడు.

→ అలెగ్జాండర్ ఈజిప్టు మరియు పశ్చిమ ఆసియా యొక్క భాగాలను జయించి భారత ద్వీపకల్పానికి చేరుకుని బియాస్ నదీతీరం వరకూ వచ్చాడు.

→ గాంధార శిల్పకళ తక్షశిల చుట్టూ ఉన్న ప్రాంతంలో అభివృద్ధి చేయబడింది.

→ గాంధార శిల్పకళ బౌద్ధ (గౌతమ బుద్ధుని చిత్రాలు) మతానికి చెందనది.

→ పురావస్తు శాస్త్రం : పురావస్తు శాస్త్రం అంటే పూర్వీకుల జీవన విధానాలను గురించి శాస్త్రీయంగా విశ్లేషించే ఒక అధ్యయన శాస్త్రం.

→ గణ రాజ్యం : అనేక ప్రాంతాల పాలకులు, సభ్యులు ఉన్న ఒక రాజ్య వ్యవస్థ.

→ సంఘం : ఒక సంస్థ లేదా సంఘం

→ దిగానికాయ : బౌద్ధ వాజ్మయంలోని సుత్త పీఠికలో గల అయిదు నికాయలలో మొదటిది.

→ మధ్యమనికాయ : బౌద్ధ వాజ్మయంలోని సుత్త పీఠికలో గల అయిదు నికాయలలో రెండవది.

→ జనపదం : భారతదేశంలో మొదట్లో గంగా-సింధూ మైదానంలో వ్యవసాయం చేస్తూ అనేక తెగలు స్థిరపడ్డాయి. వీరిని సంస్కృతంలో ‘జన’ అని వారు స్థిరపడిన ప్రాంతాన్ని ‘జనపదం’ అని అంటారు.

AP 6th Class Social Notes Chapter 7 సామ్రాజ్యాలు, గణతంత్రాల ఆవిర్భావం

→ మహాజనపదం : పెద్ద పెద్ద జనపదాలను మహాజనపదాలు అంటారు.

→ దాసులు : యుద్ధంలో బందీలైనవారు నాడు రైతులకు అమ్మబడేవారు. వారిని బానిసలని, దాసులని అంటారు.

→ భర్తుకా : ఇంటిలోనూ, పొలంలోనూ కూలి తీసుకుని పనిచేసేవారు.

→ గృహపతి : (గహపతి) వ్యవసాయం చేసే భూయజమానిని గృహపతి అంటారు.

→ గణతంత్ర రాజ్యం : ఎన్నుకోబడిన వ్యక్తి పరిపాలించే రాజ్యం.

→ ఉపనిషత్తులు : ‘వచ్చి చేరువగా కూర్చోవడం’ అని అర్థం. ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల మధ్య సంభాషణలు.

→ సాలివారు : బట్టలు మరియు దుప్పట్లు నేసే పనివారు

→ కమ్మరి : ఇనుప వస్తువులను తయారు చేసేవారు.

→ కుమ్మరి : కుండలు తయారు. చేసేవారు.

AP 6th Class Social Notes Chapter 7 సామ్రాజ్యాలు, గణతంత్రాల ఆవిర్భావం

→ పెయింటెడ్ గ్రేవేర్ : నాటి కుమ్మరులు మట్టితో తయారు చేసిన ప్రత్యేక కుండలు, పాత్రలు

→ ఆవిర్భావం : గృహపతుల నుండి రాజు పన్ను రూపంలో వసూలు చేసే పంట భాగం (1/6 వంతు)

→ గాంధార శిల్పకళ : గాంధార శిల్పకళ తక్షశిల చుట్టూ ఉన్న ప్రాంతంలో అభివృద్ధి చేయబడింది. ఇది గ్రీకు కళతో ప్రభావితమైనది.

→ మగధ రాజ్యం : గంగానదికి ఇరువైపుల విస్తరించిన రాజ్యం . అన్ని జనపనదాలలో శక్తివంతమైన రాజ్యం.

AP 6th Class Social Notes Chapter 7 సామ్రాజ్యాలు, గణతంత్రాల ఆవిర్భావం 1

AP 8th Class Social Notes Chapter 24 విపత్తులు – నిర్వహణ

Students can go through AP Board 8th Class Social Notes 24th Lesson విపత్తులు – నిర్వహణ to understand and remember the concept easily.

AP Board 8th Class Social Notes 24th Lesson విపత్తులు – నిర్వహణ

→ ప్రపంచంలో విపత్తులకు ఎక్కువ గురయ్యే దేశాలలో భారతదేశం ఒకటి.

→ ఒకే ప్రాంతం అనేక ప్రమాదాలకు గురి అవుతుంటే దానిని ‘పలు ప్రమాదాల ప్రాంతం’ అంటారు.

→ విపత్తులను ఎదుర్కోవటానికి ప్రజలు సిద్ధంగా లేకపోతే నష్ట తీవ్రత ఎక్కువగా ఉంటుంది.

AP 8th Class Social Notes Chapter 24 విపత్తులు – నిర్వహణ 1

→ విపత్తులపై నియంత్రణ, వాటి నుండి కోలుకునే మార్గాలు అందించటం మొదలైన వాటిని కలిపి విపత్తుల యాజమాన్యం అంటారు.

→ విపత్తుల యాజమాన్యంలో ఉపాధ్యాయులు, విద్యార్ధులు ముఖ్య పాత్ర పోషిస్తారు.

AP 8th Class Social Notes Chapter 23 క్రీడలు : జాతీయత, వాణిజ్యం

→ జపాన్ భాషలో ‘సునామీ’ అంటే ‘రేవు అలలు’ అని అర్థం.

→ సునామీ గురించి ముందే హెచ్చరికలు జారీ చేయవచ్చు.

→ కరవు వర్షపాతం లోపం వల్ల ఏర్పడే ప్రకృతి విపత్తు.

→ అధిక లేదా తక్కువ వర్షపాతం అన్నది 70-100 సంవత్సరాల సగటు సాధారణ వర్షపాతంతో పోల్చి చెబుతారు.

→ కొన్ని ప్రాంతాలు అవి ఉన్న భౌగోళిక స్థితుల వల్ల తక్కువ వర్షపాతం పడటానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. వీటిని కరవు పీడిత ప్రాంతాలు అంటారు.

→ కరవు ప్రభావం మెల్లగా తీవ్ర పరిణామాలకు దారి తీస్తుంది.

→ పట్టణ ప్రాంతాల్లో ఇంటి పైకప్పుపై పడే వర్షపు నీటిని జాగ్రత్తగా నిలువ చేయాలి.

→ కరవు ప్రభావాలను తగ్గించటానికి ప్రభుత్వం కరవు పీడిత ప్రాంతాలలో సమగ్ర వాటర్ షెడ్ యాజమాన్య పథకాలను (IWMP) అమలు చేస్తోంది.

→ పలు ప్రమాదాల ప్రాంతం : ఒక ప్రాంతం అందులోని ప్రజలు ఒకటి కంటే ఎక్కువ ప్రమాదాలకు గురికావచ్చు. ఇటువంటి ప్రాంతాలను పలు ప్రమాదాల ప్రాంతం అంటారు.

AP 8th Class Social Notes Chapter 23 క్రీడలు : జాతీయత, వాణిజ్యం

→ మానవ నిర్మిత ప్రమాదం : మానవుల చర్యల కారణంగా ఏర్పడే ప్రమాదం. ఉదా : భోపాల్ గ్యాస్ విషాదం.

కరవు : వర్షపాత లోపం వల్ల ఏర్పడే ప్రకృతి వైపరీత్యం.

→ పురుగుల సమస్య : ఉన్నట్టుండి పురుగులు పంటలను ఆశించడం లేదా మిడతలు లాంటివి దాడి చేయటం.

→ పర్యా వరణ క్షీణత : పర్యావరణ అంశాలైన గాలి, నీరు, వాతావరణంలోని సుగుణాత్మక అంశాలు క్షీణించుట.

→ క్షామము : వర్షపాత లోపం వల్ల ఏర్పడే ప్రకృతి విపత్తు

AP 8th Class Social Notes Chapter 24 విపత్తులు – నిర్వహణ 2