AP 6th Class Social Notes Chapter 2 గ్లోబు – భూమికి నమూనా

Students can go through AP Board 6th Class Social Notes 2nd Lesson గ్లోబు – భూమికి నమూనా to understand and remember the concept easily.

AP Board 6th Class Social Notes 2nd Lesson గ్లోబు – భూమికి నమూనా

→ పురాతన గ్లోబును 1492లో మార్టిన్ బెహైమ్ రూపొందించాడు.

→ అధునిక గ్లోబును 1570లో టకీ-ఆల్-దిన్ రూపొందించాడు.

→ ప్రపంచంలో మొట్టమొదటి అతుకులు లేని గ్లోబును జహంగీర్ సామ్రాజ్యంలో మొఘల్ శాస్త్రవేత్తలు రూపొందించారు.

→ గ్లోబల్ అనే పదం ‘గ్లోబస్’ అనే లాటిన్ పదం నుండి వచ్చింది, గోళం అని దాని అర్థం.

→ గ్లోబుకు మధ్య భాగంలో అడ్డంగా గ్లోబును రెండు సమభాగాలు చేస్తూ ఒక ఊహా రేఖ పోతుంది. దీనిని భూమధ్యరేఖ 14 (0° అక్షాంశం) అంటారు.

→ భూమధ్యరేఖకు ఉత్తరంగా ఉన్న అర్థభాగాన్ని ఉత్తరార్ధగోళమనీ, దక్షిణంగా ఉన్న అర్థభాగాన్ని దక్షిణార్ధ గోళమని అంటారు.

→ భూమధ్య రేఖకు సమాంతరంగా గీసిన రేఖలను అక్షాంశాలు అంటారు.

→ భూమధ్య రేఖకు ఉత్తరంగా 90° అక్షాంశాలు, దక్షిణంగా 90° అక్షాంశాలు ఉన్నాయి.

AP 6th Class Social Notes Chapter 2 గ్లోబు – భూమికి నమూనా

→ 23½° ఉత్తర అక్షాంశంను కర్కటరేఖ అంటారు.

→ 23½° దక్షిణ అక్షాంశంను మకరరేఖ అంటారు.

→ 66½° ఉత్తర అక్షాంశంను ఆర్కిటిక్ వలయం అంటారు.

→ 66½°° దక్షిణ అక్షాంశంను అంటార్కిటిక్ అంటారు.

→ 90° ఉత్తర అక్షాంశంను ఉత్తర ధృవం అంటారు.

→ 90° దక్షిణ అక్షాంశంను దక్షిణ ధృవం అంటారు.

→ అక్షాంశం అను పదం ‘లాటిట్యూడో’ అనే లాటిన్, పదం నుండి వచ్చింది. దీని అర్థం వెడల్పు, మందం, పరిధి, పరిమాణం.

→ రేఖాంశం అను పదం ‘లాంగిట్యూడో’ అనే లాటిన్ పదం నుండి వచ్చింది. దీని అర్థం పొడవు, నిడవి, వ్యవధి.

→ గ్లోబు మీద అక్షాంశాలకు లంబంగా గీసినట్లు ఉన్న రేఖలను రేఖాంశాలు అంటారు.

→ 0° రేఖాంశాన్ని ముఖ్య రేఖాంశం/ ప్రామాణిక రేఖాంశం లేదా గ్రీనిచ్ రేఖాంశం అంటారు.

→ 0° రేఖాంశానికి వ్యతిరేక దిశలో 180° రేఖాంశం ఉంటుంది. దీనిని అంతర్జాతీయ దినరేఖ అంటారు.

→ గ్రీనిచ్ రేఖాంశానికి తూర్పుగా ఉన్న అర్ధగోళాన్ని తూర్పు అర్ధగోళమని, పశ్చిమంగా ఉన్న అర్ధగోళాన్ని పశ్చిమార్ధ గోళమని అంటారు.

→ 180 తూర్పు రేఖాంశాలు, 180 పశ్చిమ రేఖాంశాలు మొత్తం 360 రేఖాంశాలున్నాయి.

AP 6th Class Social Notes Chapter 2 గ్లోబు – భూమికి నమూనా

→ భూమి తన అక్షంపై తన పడమర నుండి తూర్పుకు గంటకు 1610 కి.మీ. వేగంతో తిరుగుతుంది. దీనినే భూ భ్రమణం అంటారు.

→ భూమి తన అక్షంపై తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరిగి రావడాన్ని ‘భూ పరిభ్రమణం’ అంటారు.

→ భూ భ్రమణానికి 23 గం||ల 56 ని॥ల 4.09 (సుమారు 24 గం॥లు) పడుతుంది.

→ భూపరిభ్రమణానికి 3651/4 రోజులు పడుతుంది.

→ లీపు సం॥రంలో 366 రోజులుంటాయి.

→ మార్చి 21 మరియు సెప్టెంబరు 23 తేదీలలో సూర్యకిరణాలు భూమధ్యరేఖపై నిట్టనిలువుగా పడతాయి. ఈ రెండు తేదీలను విషవత్తులు అంటారు.

→ జూన్ 21న కర్కటరేఖ మీద, డిసెంబరు 22న మకరరేఖ మీద సూర్యుని కిరణాలు నిట్టనిలువుగా పడతాయి.

→ భూమికి మరియు సూర్యునికి మధ్యలో చంద్రుడు వస్తే సూర్యగ్రహణం ఏర్పడుతుంది.

→ చంద్రుడు భూమి యొక్క వెనక భాగంలోనికి లేదా భూమి నీడలోనికి వెళ్ళినపుడు చంద్రగ్రహణం సంభవిస్తుంది.

→ అక్షం : ఒక వస్తువు తన చుట్టూ తాను తిరగడానికి ఉండే ఒక ఊహారేఖ.

→ భూమధ్యరేఖ : 0° అక్షాంశం.

→ కర్కటరేఖ : 23½° ఉత్తర అక్షాంశం.

→ మకరరేఖ : 23½° దక్షిణ అక్షాంశం.

→ ఆర్కిటిక్ వలయం : 66½° ఉత్తర అక్షాంశం.

→ అంటార్కిటిక్ వలయం : 66½° దక్షిణ అక్షాంశం.

→ ఉత్తర ధృవం : 90° భూమికి ఉత్తర భాగాన ఉన్న చివరి ప్రాంతం.

→ దక్షిణ ధృవం : 90° భూమికి దక్షిణ భాగాన ఉన్న చివరి ప్రాంతం.

AP 6th Class Social Notes Chapter 2 గ్లోబు – భూమికి నమూనా

→ మధ్యాహ్న రేఖలు : ఉత్తర దక్షిణ ధృవాలను కలుపుతూ ఉండే రేఖాంశాలు. ఇవి మధ్యాహ్నాన్ని సూచిస్తాయి.

→ గ్రీనిచ్ / ప్రామాణిక రేఖాంశం : 0° రేఖాంశం

→ అంతర్జాతీయ దినరేఖ : 180° తూర్పు మరియు పశ్చిమ రేఖాంశం.

→ అక్షాంశాలు : భూమధ్యరేఖకు సమాంతరంగా గీయబడిన ఊహారేఖలు.

→ రేఖాంశాలు : ఉత్తర, దక్షిణ ధృవాలను కలుపుతూ గీయబడిన ఊహారేఖలు.

→ ఉత్తరార్ధగోళం . : భూమధ్యరేఖకు ఉత్తరంగా ఉన్న భూమి యొక్క అర్ధభాగం.

→ దక్షిణార్ధగోళం : భూమధ్యరేఖకు దక్షిణంగా ఉన్న భూమి యొక్క అర్ధభాగం.

→ తూర్పు అర్ధగోళం : ప్రామాణిక రేఖాంశానికి తూర్పుగా ఉన్న భూమి యొక్క అర్ధభాగం.

→ పశ్చిమార్ధగోళం : ప్రామాణిక రేఖాంశానికి పశ్చిమంగా ఉన్న భూమి యొక్క అర్ధభాగం.

→ ఋతువులు : వాతావరణంలో మార్పుల ఆధారంగా సంవత్సరాన్ని ఋతువులుగా విభజించారు.

→ సూర్యగ్రహణం : సూర్యునికి భూమికి మధ్యగా చంద్రుడు వెళుతూ ఇవి మూడూ ఒక సరళరేఖ మీదకు వచ్చినప్పుడు సూర్యగ్రహణం సంభవిస్తుంది.

→ చంద్రగ్రహణం : . సూర్యునికి చంద్రునికి మధ్యగా భూమి వెళుతూ ఇవి మూడూ ఒక సరళరేఖ మీదకు వచ్చినప్పుడు చంద్రగ్రహణం సంభవిస్తుంది.

→ గ్లోబ్ : భూమి యొక్క నమూనా.

AP 6th Class Social Notes Chapter 2 గ్లోబు – భూమికి నమూనా

→ గ్లోబల్ : గ్లోబల్ అనే పదం ‘గ్లోబస్’ అనే లాటిన్ పదం నుండి వచ్చింది. దీని అర్ధం గోళం.

→ భూభ్రమణం : భూమి తన అక్షంపై తాను పడమర నుండి తూర్పుకు గంటకు 1610 కి.మీ. వేగంతో తిరుగుతుంది. దీనినే భూభ్రమణం అంటారు.

→ భూపరిభ్రమణం : భూమి తన అక్షంపై తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరిగి రావడాన్ని భూపరిభ్రమణం అంటారు.

→ విషవత్తులు : సూర్యకిరణాలు భూమధ్యరేఖపై నిట్టనిలువుగా పడే మార్చి 21 మరియు సెప్టెంబరు 23 తేదీలలో భూమి అంతటా రాత్రి, పగలు సమానంగా ఉంటాయి. ఈ రెండు తేదీలను విషవత్తులు అంటారు.

→ గ్రహణం : సూర్యుని పైన లేదా చంద్రుని పైనా నీడపడినట్లు కనబడటాన్నే గ్రహణం అంటారు.

→ ధృవాలు : భూమికి రెండువైపులా ఉండే స్థిర బిందువులు (చుక్కలు)
ఉదా : ఉత్తర, దక్షిణధృవాలు.

→ లీపు సంవత్సరం : సాధారణ సం||రంలో 365 రోజులుంటే, లీపు సం||రంలో 366 రోజులుంటాయి.

AP 6th Class Social Notes Chapter 2 గ్లోబు – భూమికి నమూనా 1

AP 8th Class Social Notes Chapter 15 చట్టం, న్యాయం – ఒక సన్నివేశ అధ్యయనం

Students can go through AP Board 8th Class Social Notes 15th Lesson చట్టం, న్యాయం – ఒక సన్నివేశ అధ్యయనం to understand and remember the concept easily.

AP Board 8th Class Social Notes 15th Lesson చట్టం, న్యాయం – ఒక సన్నివేశ అధ్యయనం

→ చట్టాలను ప్రభుత్వాలు చేస్తాయి.

→ చట్టాలను కార్యనిర్వాహక వర్గం అమలు చేస్తుంది.

→ నివేదికలో రాసిన సమాచారాన్ని SHO పైకి చదివి వినిపించాలి.

→ కేసు తీసుకోడానికి SHO నిరాకరిస్తే నేరుగా DCP లేదా మేజిస్ట్రేటు దగ్గరకు వెళ్ళి పిర్యాదు చేయవచ్చు.

→ నిందితులను మేజిస్ట్రేటు ముందు హాజరు పరచడానికి లాకలో పెడతారు.

→ భూమి, ఆస్తి, ఆదాయాలపై ఉన్న ప్రజల హక్కులు, ప్రజల మధ్య ఉన్న సంబంధాలకు సంబంధించినవి సివిల్ వివాదాలు అవుతాయి.

→ క్రిమినల్ కేసులన్నింటినీ పోలీసులు చేపడతారు.

→ న్యాయస్థానంలో ప్రభుత్వ న్యాయవాది ప్రభుత్వ ప్రయోజనాలకు ప్రతినిధిగా ఉంటాడు.

AP 8th Class Social Notes Chapter 15 చట్టం, న్యాయం – ఒక సన్నివేశ అధ్యయనం

→ చట్టం ముందు అందరూ సమానులే అని చట్టం చెబుతోంది.

→ రాజ్యాంగంలో ముఖ్యమైన అంశం కార్యనిర్వాహక, న్యాయ, శాసన అధికారాలను వేరుచేయటం.

→ పోలీసులు న్యాయ రంగంలో భాగం కాదు. కార్య నిర్వాహక రంగానికి చెందినవాళ్ళు.

→ దేశంలోని అత్యున్నతమైన సుప్రీంకోర్టు కొత్తఢిల్లీలో ఉంటుంది. దీనికి అధిపతిగా ప్రధాన న్యాయమూర్తి ఉంటారు.

→ క్రింది కోర్టు తీర్పుపై పై కోర్టుకు అప్పీలు చేసుకోవచ్చు.

→ నిందితుడు : నేరం మోపబడినవాడు

→ ఎఫ్.ఐ.ఆర్ : తొలి సమాచార నివేదిక

→ నేరం : చట్ట వ్యతిరేక చర్య

→ విచారణ : మంచి, చెడులను తర్కించి చూడటం

→ అరెస్టు : నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకోవడం.

→ సమన్లు : కోర్టుకు హాజరుకమ్మని పంపే ఆర్డర్లు.

→ సాక్షి : ఏదేనీ ఒక సంఘటనను కంటితో చూసినవారు

→ న్యాయవిచారణ : న్యాయస్థానంలో జరిగే విచారణ

→ తీర్పు : న్యాయమూర్తి అన్ని వాదనలు విన్నాక వెలిబుచ్చే అభిప్రాయం

→ అప్పీలు / అభ్యర్థన : న్యాయం జరుపమని న్యాయస్థానాన్ని వేడుకోవటం.

→ ఒప్పంద ఉల్లంఘన : ఇరువురు లేక అంతకన్నా ఎక్కువమంది ఒక ఒప్పందంలో ఉండి, దానిని తప్పడం.

AP 8th Class Social Notes Chapter 15 చట్టం, న్యాయం – ఒక సన్నివేశ అధ్యయనం

→ వాజ్యదారు (క్లయింటు) : కోర్టులో కేసు వేసిన వారు.

→ ప్రభుత్వ న్యాయవాది : ప్రభుత్వం తరఫున వాదించే వ్యక్తి

→ బెయిలు : జైలులో ఉన్న వ్యక్తిని, కొన్ని హామీలు ఇచ్చి బయటకు తీసుకురావడానికి ‘బెయిలు’ అవసరం.

→ మెజిస్ట్రేటు : న్యాయమూర్తి

→ బాధితులు : వివిధ రకాలుగా బాధింపబడినవారు.

AP 8th Class Social Notes Chapter 15 చట్టం, న్యాయం – ఒక సన్నివేశ అధ్యయనం 1

AP 6th Class Social Notes Chapter 1 సౌర కుటుంబంలో మన భూమి

Students can go through AP Board 6th Class Social Notes 1st Lesson సౌర కుటుంబంలో మన భూమి to understand and remember the concept easily.

AP Board 6th Class Social Notes 1st Lesson సౌర కుటుంబంలో మన భూమి

→ సూర్యుడు, చంద్రుడు, రాత్రి ఆకాశంలో మెరుస్తున్న వస్తువులన్నింటినీ ఖగోళ వస్తువులు అంటారు.

→ సొంతంగా వేడి, కాంతిని కలిగి ఉండి” వాటిని పెద్ద మొత్తంలో విడుదల చేసే ఖగోళ వస్తువులను నక్షత్రాలు ” అంటారు.

→ భూమి ఒక గ్రహం. భూమికి దగ్గరగా ఉన్న నక్షత్రం సూర్యుడు.

→ భూమి వేడి, కాంతిని సూర్యుని నుండి పొందుతుంది.

→ మన సౌర కుటుంబంలో 8 గ్రహాలున్నాయి.

→ ఉత్తర దిక్కును సూచించే నక్షత్రం ధృవ నక్షత్రం.

→ సప్తర్షి నక్షత్రరాశి సహాయంతో ధృవ నక్షత్రాన్ని గుర్తించవచ్చు.

→ సూర్యుని ఉపరితలంపై దాదాపు 6000°C ఉష్ణోగ్రత ఉంటుంది.

AP 6th Class Social Notes Chapter 1 సౌర కుటుంబంలో మన భూమి

→ భూమి నుండి సూర్యుడు సుమారు 15 కోట్ల కి.మీ. దూరంలో ఉంది.

→ సూర్యుడు భూమి కంటే 13లక్షల రెట్లు పెద్దగా ఉంటుంది.

→ గ్రహాలు సూర్యుని చుట్టూ తిరిగే స్థిర మార్గాలను కక్ష్య అంటారు.

→ సూర్యుడికి దగ్గరగా ఉన్న నాలుగు (బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు) గ్రహాలను అంతర గ్రహాలు అంటారు.

→ సూర్యునికి చివరిగా ఉన్న నాలుగు (గురుడు, శని, ఇంద్రుడు, వరుణుడు) గ్రహాలను బాహ్యగ్రహాలు అంటారు.

→ సూర్యునికి దగ్గరగా ఉన్న గ్రహం బుధుడు.

→ సూర్యునికి దూరంగా ఉన్న గ్రహం వరుణుడు.

→ శుక్రుడిని భూమికి కవల గ్రహం (ఎర్త్-ట్విన్)గా పరిగణిస్తారు.

→ గ్రహాలలో పెద్దది బృహస్పతి.

→ గ్రహాలలో చిన్నది బుధుడు.

→ భూమి సూర్యుని నుండి మూడవ గ్రహం, పరిమాణంలో ఐదవ పెద్ద గ్రహం.

→ భూమి జియోయిడ్ ఆకారం కల్గి ఉంది.

AP 6th Class Social Notes Chapter 1 సౌర కుటుంబంలో మన భూమి

→ భూమి ఉపరితలం మూడింట రెండువంతుల నీటితో కప్పబడి ఉంది.

→ భూమిని నీలి గ్రహం అంటారు.

→ జీవులు జీవించడానికి అత్యంత అనుకూలమైన గ్రహం భూమి.

→ కాంతి సెకనుకు 3,00,000 కి.మీ. వేగంతో ప్రయాణిస్తుంది.

→ సూర్యుని కాంతి భూమిని చేరుకోవడానికి ఎనిమిది (8) నిమిషాలు పడుతుంది.

→ భూమి నాలుగు ప్రధాన ఆవరణలు శిలావరణం, జలావరణం, వాతావరణం, జీవావరణం కలిగి ఉంది.

→ వాతావరణంలో నత్రజని (78%) మరియు ఆక్సిజన్ (21%), కార్బన్ డయాక్సెడ్, హైడ్రోజన్, హీలియం, ఆర్గాన్, ఓజోన్ వంటి వాయువులు ఉన్నాయి.

→ గ్రహాల చుట్టూ తిరిగే ఖగోళ వస్తువులను ఉపగ్రహాలు అంటారు.

→ బుధుడు, శుక్రుడు గ్రహాలకు ఉపగ్రహాలు లేవు.

→ భూమికి కల ఏకైక ఉపగ్రహం చంద్రుడు.

→ చంద్రుడు భూమికి 3,84,000 కి.మీ. దూరంలో ఉంది.

→ చంద్రుడు భూమి చుట్టూ ఒకసారి తిరగడానికి 27 రోజులు పడుతుంది.

AP 6th Class Social Notes Chapter 1 సౌర కుటుంబంలో మన భూమి

→ చంద్రుని ఉపరితలంపై అడుగు పెట్టిన మొదటి వ్యక్తి అమెరికాకు చెందిన నీల్ ఆర్న్ స్ట్రాంగ్. ఇతను జులై 21, 1969న చంద్రునిపై అడుగుపెట్టాడు.

→ అంతరిక్షంలో ఉన్న కొన్ని భారతీయ ఉపగ్రహాలు ఇన్సాట్, IRS, EDUSAT మొదలైనవి.

→ భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) శ్రీహరికోటలోని తన ప్రయోగ కేంద్రం నుండి ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రవేశపెడుతుంది.

→ మంగళయాన్ (మార్స్ ఆర్బిటర్ మిషన్ -MOM) అంగారక కక్ష్యకు సెప్టెంబర్ 24, 2014న చేరుకుంది.

→ అంగారక గ్రహం, బృహస్పతి కక్ష్యల మధ్య గ్రహశకలాలు కన్పిస్తాయి.

→ సూర్యుని చుట్టూ తిరిగే చిన్న చిన్న రాళ్ళను ఉల్కలు అంటారు.

→ హేలి తోకచుక్క ప్రతి 76 సం||రాలకు ఒకసారి భూమికి దగ్గరగా వస్తుంది.

→ హేలి తోకచుక్క చివరిసారిగా 1986లో కనిపించింది, మరలా ఇది 2061లో కన్పిస్తుంది.

→ కొన్ని కోట్ల నక్షత్రాల సమూహంను గెలాక్సీ అంటారు. దీనినే ‘పాలపుంత’ / ‘ఆకాశగంగ’ అనికూడా అంటారు.

→ గెలాక్సీ : కోట్లాది నక్షత్రాల సమూహం, దీనినే పాలపుంత, ఆకాశగంగా అని కూడా అంటారు.

→ గ్రహ శకలాలు : అంగారకుడు, బృహస్పతి మధ్యగల గ్రహ శిథిలాలు.

AP 6th Class Social Notes Chapter 1 సౌర కుటుంబంలో మన భూమి

→ ఉల్కలు : సూర్యుని చుట్టూ తిరిగే చిన్న చిన్న రాళ్ళు.

→ ఉపగ్రహాలు : గ్రహాల చుట్టూ తిరిగే ఖగోళ వస్తువులు.

→ కక్ష్య : సూర్యుని చుట్టూ గ్రహాలు తిరిగే మార్గం.

→ జియోయిడ్ : భూమి వంటి ఆకారం.

→ శిలావరణం : రాళ్ళు, నేలలతో కూడిన భూమి యొక్క ఘన బాహ్య పొర.

→ జలావరణం : భూమిపై గల జల భాగాలు.

→ వాతావరణం : వాయువుల పొర.

→ జీవావరణం : భూమిపై గల మొక్కలు, జంతువులు, ఇతర జీవరాశి.

→ నక్షత్రరాశులు : వివిధ నక్షత్రాల సమూహాలతో ఏర్పడిన నమూనాలను నక్షత్రరాశులు అంటారు.

→ ఖగోళ వస్తువులు : సూర్యుడు, చంద్రుడు, రాత్రి ఆకాశంలో మెరుస్తున్న వస్తువులన్నింటినీ ఖగోళ వస్తువులు అంటారు.

→ నక్షత్రాలు : సొంతంగా వేడి, కాంతిని కలిగి ఉండి వాటిని పెద్ద మొత్తంలో విడుదల చేసే పెద్ద ఖగోళ వస్తువులను నక్షత్రాలు అంటారు.

→ ధృవ నక్షత్రం : ఉత్తర దిక్కును సూచించే ఉత్తర నక్షత్రంనే ధృవ నక్షత్రం అంటారు.

→ అంతర గ్రహాలు : సూర్యుడికి దగ్గరగా ఉన్న (బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు) నాలుగు గ్రహాలను అంతర గ్రహాలు అంటారు.

→ బాహ్య గ్రహాలు : సూర్యునికి దూరంగా ఉన్న (గురుడు, శని, ఇంద్రుడు, వరుణుడు) నాలుగు గ్రహాలను బాహ్య గ్రహాలు అంటారు.

AP 6th Class Social Notes Chapter 1 సౌర కుటుంబంలో మన భూమి

→ గ్రహాలలో పెద్దది : బృహస్పతి (గురుడు)

→ గ్రహాలలో చిన్నది : బుధుడు

→ భూమికి కవల గ్రహం : శుక్రుడు

→ నీలి గ్రహం : భూమి

→ భూమికి గల ఏకైక సహజ ఉపగ్రహం : చంద్రుడు

→ తోకచుక్కలు : తల, తోకతో కనిపించే ఖగోళ వస్తువులను తోకచుక్కలు అంటారు.

→ కృత్రిమ ఉపగ్రహం : మానవులచే (శాస్త్రవేత్తలతో) కృత్రిమంగా నిర్మితమైన ఉపగ్రహం.

AP 6th Class Social Notes Chapter 1 సౌర కుటుంబంలో మన భూమి

AP 8th Class Social Notes Chapter 14 పార్లమెంటు – కేంద్ర ప్రభుత్వం

Students can go through AP Board 8th Class Social Notes 14th Lesson పార్లమెంటు – కేంద్ర ప్రభుత్వం to understand and remember the concept easily.

AP Board 8th Class Social Notes 14th Lesson పార్లమెంటు – కేంద్ర ప్రభుత్వం

→ రాజ్యాంగం దేశ పరిపాలనకు పార్లమెంటరీ తరహా విధానాన్ని రూపొందించింది.

→ కొత్త ఢిల్లీలో పార్లమెంటు భవనంలో సమావేశాల సమయంలో జరిగే చర్చలను లోక్ సభ టీ.వీ. ఛానల్ ప్రసారం చేస్తుంది.

→ 1986లో పార్లమెంటు జాతీయ విద్యా విధానాన్ని రూపొందించింది.

→ పార్లమెంటుకి ప్రభుత్వం జవాబుదారీగా ఉంటుంది.

→ పార్లమెంట్ లో 2 సభలున్నాయి – లోకసభ, రాజ్యసభ.

→ రాజ్యాంగం ప్రకారం అనేక విషయాలలో లోకసభకు అత్యున్నత అధికారాలున్నాయి.

→ భారతదేశంలో మొదటి ఎన్నికలు 1951 – 52 లో జరిగాయి. స్వేచ్ఛగా ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల సంఘాన్ని – ఏర్పాటు చేశారు.

→ ఓటు వేసేటప్పుడు ఎవరి స్వంత నిర్ణయం వారు తీసుకోవాలి.

→ లోకసభకు యిప్పటి వరకూ 15 సార్లు ఎన్నికలు జరిగాయి.

→ చట్టాలు చేయాల్సిన విషయాలను మూడుగా విభజించారు – కేంద్ర, రాష్ట్ర, ఉమ్మడి జాబితాలు.

→ అన్ని రాష్ట్రాల శాసనసభ్యులు, పార్లమెంటు ఉభయ సభ సభ్యులు రాష్ట్రపతిని ఎన్నుకుంటారు.

→ పార్లమెంటుకు 2 అధికారాలు కలవు. శాసన అధికారం, కార్యనిర్వహణాధికారం.

→ ప్రధాన మంత్రిని లోకసభ సభ్యులు ఎన్నుకుంటారు, ప్రభుత్వంలోని కార్యనిర్వాహక వర్గంగా మంత్రివర్గం పని చేస్తుంది.

→ నిర్ణయాలు అమలు చేసే బాధ్యత మంత్రిత్వశాఖ అధికారులది.

AP 8th Class Social Notes Chapter 14 పార్లమెంటు – కేంద్ర ప్రభుత్వం

→ శాసనసభ : రాష్ట్రంలో ఓటర్లచే ఎన్నుకోబడిన సభ్యులచే ఏర్పడు సభ.

→ లోక్సభ : దేశంలోని ఓటర్లచే ఎన్నుకోబడిన సభ్యులచే ఏర్పడే సభ. దానిలో మెజారిటీ పక్షం నాయకుడు ‘ప్రధాన మంత్రి’ అవుతారు. దీనినే దిగువసభ అని కూడా అంటారు.

→ రాజ్య సభ : దీనిని ఎగువసభ అని అంటారు. దీనిలోని సభ్యులను రాష్ట్రాల శాసనసభల సభ్యులు ఎన్నుకుంటారు. కొందరు నామినేట్ చేయబడతారు. వీరు అన్నిరంగాలలో మేధావులు అయి ఉంటారు.

→ ఎన్నికల సంఘం : భారతదేశంలో స్వయం ప్రతిపత్తి కలిగిన సంఘం. ఇది దేశంలో ఎన్నికలు నిర్వహిస్తుంది.

→ మంత్రిమండలి : ఎన్నిక కాబడిన, నియమించబడిన ఎమ్.పి. ల నుండి మంత్రివర్గ సభ్యులను (రాజ్యసభ, లోకసభ) ప్రధానమంత్రి ఎంపిక చేస్తాడు. వీరిని మంత్రిమండలి అంటారు.

→ కేంద్ర జాబితా : కేంద్ర పార్లమెంట్ మాత్రమే చట్టాలు చేయగల విషయాలను కేంద్ర జాబితా అంటారు.

→ రాష్ట్ర జాబితా : రాష్ట్ర శాసనసభ మాత్రమే చట్టాలు చేయగల విషయాలను రాష్ట్ర జాబితా అంటారు.

→ ఉమ్మడి జాబితా : పార్లమెంటు, రాష్ట్ర శాసనసభలు రెండూ చట్టాలు చేయగల విషయాలను ఉమ్మడి జాబితా అంటారు.

AP 8th Class Social Notes Chapter 14 పార్లమెంటు – కేంద్ర ప్రభుత్వం 1

AP 8th Class Social Notes Chapter 13 భారత రాజ్యాంగం

Students can go through AP Board 8th Class Social Notes 13th Lesson భారత రాజ్యాంగం to understand and remember the concept easily.

AP Board 8th Class Social Notes 13th Lesson భారత రాజ్యాంగం

→ మన నాయకులు బ్రిటిషు వలస పాలనకి వ్యతిరేకంగా పోరాడుతున్నప్పుడు దేశ భవిష్యత్తు, ప్రభుత్వం రాచరిక పాలనలో కాకుండా ప్రజాస్వామికంగా ఉండాలని కోరుకున్నారు.

→ రాజ్యాంగం అన్నది దేశాన్ని ఎలా పరిపాలించాలి, చట్టాలు ఎలా చేయాలి, వాటిని ఎలా మార్చాలి, ప్రభుత్వం ఎలా ఏర్పడుతుంది, పౌరుల పాత్ర ఏమిటి, వాళ్ళ హక్కులు ఏమిటి వంటి నియమాలను కలిగి ఉంటుంది.

→ మత కల్లోలాల వల్ల దేశవిభజన జరిగింది. దేశం మరిన్ని ముక్కలు కాకుండా ఒకటిగా ఉండటానికి నాయకులు కృషి చేశారు.

→ చట్టం ముందు ప్రజలందరూ సమానులుగా ఉంటారు. అందరికీ కొన్ని ప్రాథమిక హక్కులు ఉంటాయి.

→ స్వాతంత్ర్యం రాకముందే 1928 లో మోతీలాల్ నెహ్రూ, భారత జాతీయ కాంగ్రెసుకు చెందిన మరో 8 మంది కలిసి భారతరాజ్యాంగాన్ని రాశారు.

→ ఎన్నికైన ప్రజా ప్రతినిధులతో ఏర్పడిన రాజ్యాంగసభ రాజ్యాంగాన్ని రాసింది. రాజ్యాంగసభ సభ్యులు దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి వచ్చారు.

→ స్వాతంత్ర్య పోరాటానికి స్ఫూర్తినిచ్చి, మార్గదర్శకంగా నిలిచిన విలువలే భారతదేశ ప్రజాస్వామ్యానికి పునాదిగా నిలిచాయి.

→ భారత రాజ్యాంగంలోని అన్ని అంశాలకు పీఠిక మార్గదర్శకం చేస్తుంది. రాజ్యాంగంలో ఇదేకాక ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక హక్కులు ఉన్నాయి.

→ ఈ రాజ్యాంగం మనకు పార్లమెంటరీ ప్రభుత్వ విధానాన్ని ఇచ్చింది. మన దేశం సమాఖ్యవ్యవస్థను కలిగి ఉంది.

→ అంతిమంగా, రాజ్యాంగం అన్నది మారుతూ, సజీవంగా ఉండే పత్రం. 2011 వరకు మన రాజ్యాంగానికి 97 సవరణలు చేశారు.

AP 8th Class Social Notes Chapter 13 భారత రాజ్యాంగం

→ రాచరికం : రాజుల పాలన

→ ప్రతినిధి : ఒకరి లేదా కొందరి తరఫున నియమించబడినవారు లేదా ఎన్నుకోబడినవారు.

→ వివక్ష : వేరుగా చూడటం ఉదా : లింగ వివక్ష వర్ణ వివక్ష.

→ స్వయం ప్రతిపత్తి : స్వతంత్రంగా వ్యవహరించడం. (రాజ్యాంగ బద్దంగా)

→ రాజ్యాంగం : భారతదేశం నమ్మిన మౌలిక సూత్రాలు, దేశాన్ని పరిపాలించే విధానాలు, ఒక పుస్తకంలో పొందుపరిచారు. అదే భారత రాజ్యాంగం.

→ సర్వసత్తాక : అంతర్గత, విదేశీ వ్యవహారాలన్నింటిలో నిర్ణయాలు తీసుకోడానికి, చట్టాలు చేయటానికి భారతదేశానికి పూర్తి హక్కు ఉంటుంది. బయటి శక్తులు ఏవీ భారతదేశానికి చట్టాలు రూపొందించలేవు.

→ సమాఖ్య వ్యవస్థ : ఒక కేంద్ర ప్రభుత్వం దాని క్రింద రాష్ట్రస్థాయి ప్రభుత్వాలు ఉన్న వ్యవస్థను సమాఖ్య వ్యవస్థ అంటారు.

→ రాష్ట్రం : కేంద్రానికి లోబడి క్రింది స్థాయిలో ఉన్న ప్రభుత్వ పరిధిలో కచ్చితమైన హద్దులు కలిగిన భూభాగం.

→ ముసాయిదా : చిత్తుప్రతి. రాజ్యాంగాన్ని ముందుగా డా|| బి.ఆర్. అంబేద్కర్ నేతృత్వంలో చర్చ నిమిత్తం తయారుచేసిన ప్రతి.

→ గణతంత్రం : ఎన్నికైన వ్యక్తి దేశాధినేత అవుతాడు. అంతేకాని రాజ్యా లలో మాదిరి ‘ వారసత్వంగా అధికారం రాదు.

→ లౌకిక : మత ప్రమేయం లేకుండుట.

→ సౌభ్రాతృత్వం : ప్రజలందరి మధ్య ఐక్యత, సోదర భావన పెంపు. తోటి పౌరులను పరాయివారిగా భావించకుండా తక్కువ చేయకుండా ఉండుట.

→ సవరణ : మార్పులు చేయుట.

AP 8th Class Social Notes Chapter 13 భారత రాజ్యాంగం 1

AP 8th Class Social Notes Chapter 12 భారత ఎన్నికల వ్యవస్థ

Students can go through AP Board 8th Class Social Notes 12th Lesson భారత ఎన్నికల వ్యవస్థ to understand and remember the concept easily.

AP Board 8th Class Social Notes 12th Lesson భారత ఎన్నికల వ్యవస్థ

→ ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం మన భారతదేశం.

→ దేశంలో ఎన్నికలను ‘భారత ఎన్నికల సంఘం’ నిర్వహిస్తుంది.

→ భారత ఎన్నికల సంఘం 1950, జనవరి 25న ఏర్పడింది. ఇది ఒక స్వయం ప్రతిపత్తి గల రాజ్యాంగ సంస్థ.

→ ఓటర్ల జాబితాను రూపొందించడం, దేశంలో ఎన్నికల నిర్వహణ ఈ సంఘం పని.

→ ఎన్నికల సంఘం రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 (6) ప్రకారం రాష్ట్రపతి, గవర్నర్ల అనుమతితో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సిబ్బందిని ఎన్నికల నిర్వహణ కోసం తీసుకుంటుంది.

→ ఎన్నికల సంఘం సభ్యుల పదవీకాలం 6 సం||రాలు లేదా 65 సం|| వయస్సు పూర్తి అయ్యేవరకు.

→ భారత ఎన్నికల సంఘం త్రిసభ్య సంస్థ. ఇది రాజకీయ వ్యవస్థలో ప్రముఖ పాత్ర వహిస్తుంది.

→ T.N. శేషన్ (1990 – 1996) కాలంలో ఈ సంఘం అవినీతిని అంతం చేయడానికి ప్రయత్నించి, ప్రజాభిమానాన్ని చూరగొంది.

→ రాజ్యాంగంలోని 15వ భాగంలోని ఆర్టికల్ 324లో ఎన్నికల సంఘం నిర్మాణం, అధికార విధులు వివరించబడ్డాయి.

AP 8th Class Social Notes Chapter 12 భారత ఎన్నికల వ్యవస్థ

→ ఎన్నికల కమిషన్ పాక్షిక న్యాయస్థానంగా పనిచేస్తుంది.

→ ఓటర్లందరిని కలిపి ఎలక్టోరేట్ అంటారు.

→ ఎన్నికల కమిషన్ నియమావళి ప్రకారం ఎన్నికలు జరిగే సంవత్సరంలో ఆ ఏడాది జనవరి 1 నాటికి 18 సం||లు నిండిన వారు కుల, మత, లింగ, భాషాపరమైన భేదాలు లేకుండా ఓటరుగా నమోదు చేసుకోవచ్చు. దీనినే సార్వజనీన ఓటింగ్ హక్కు అంటారు.

→ 1988 సం||రానికి ముందు ఓటు హక్కు కనీస వయస్సు 21 సం||లు, 61వ రాజ్యాంగ సవరణ ప్రకారం 18 సం||లుకు తగ్గించారు.

→ ఎన్నికలలో పొందిన ఓట్ల శాతాన్ని బట్టి పార్టీలను ప్రాంతీయ, జాతీయ పార్టీలుగా ఎన్నికల సంఘం గుర్తిస్తుంది.

→ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అతిక్రమిస్తే ఎన్నికల అనుచిత ప్రవర్తనగా పరిగణించి క్రమశిక్షణా చర్యలు తీసుకుంటారు.

→ నియోజక వర్గంలో ఎన్నికలు నిర్వహించడానికి, పర్యవేక్షించడానికి ‘రిటర్నింగ్ అధికారి’ ఉంటారు.

→ పోలింగ్ స్టేషన్లలో విధులు నిర్వహించడానికి ‘ప్రిసైడింగ్ ఆఫీసర్’ను నియమిస్తారు.

→ ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి దేశం లేదా రాష్ట్ర స్థాయిలో జరిగే ఎన్నికలను సాధారణ ఎన్నికలు అంటారు.

→ ఒకటి లేదా కొన్ని ఖాళీలకు నిర్వహించే ఎన్నికలను ఉపఎన్నికలు అంటారు.

→ 5 సంవత్సరాల పూర్తికాలం గడవక ముందే శాసనసభకు లేదా పార్లమెంటుకు ఎన్నికలు నిర్వహిస్తే వాటిని ‘మధ్యంతర ఎన్నికలు’ అంటారు.

→ 2013లో ‘నోటా’ను ప్రవేశ పెట్టారు

→ EVM లలో ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్‌ ట్రయల్ సౌకర్యంను కల్పించటానికి EC నిర్ణయం తీసుకుకున్నది.

→ ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం : పాల నిర్ణయాలు తీసుకోవడంలో, ప్రజా సంక్షేమ విధానాల రూపకల్పనలో ప్రజల తరపున ప్రజా ప్రతినిధులు పాల్గొనే వ్యవస్థను ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం అంటారు.

→ ఎన్నికల సంఘం : భారతదేశంలో ఎన్నికలు సజావుగా నిర్వహించే స్వతంత్రమైన రాజ్యాంగబద్ధ సంస్థ ఎన్నికల సంఘం.

→ ఎన్నికల ప్రవర్తనా నియమావళి : స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు, ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన రోజు నుండి ఎన్నికలు జరిగే రోజు వరకు వివిధ రాజకీయ పక్షాలు, అభ్యర్థులు, ప్రజలు పాటించవలసిన నియమ నిబంధనలను ఎన్నికల ప్రవర్తన నియమావళి అంటారు.

→ రిటర్నింగ్ అధికారి : ఒక నియోజక వర్గంలో ఎన్నికలు నిర్వహించు అధికారి.

→ ప్రిసైడింగ్ అధికారి : పోలింగ్ బూతు నిర్వహించు అధికారి.

AP 8th Class Social Notes Chapter 12 భారత ఎన్నికల వ్యవస్థ

→ సార్వత్రిక వయోజక ఓటుహక్కు : ప్రజలు తమ ప్రతినిధులను ఎన్నుకోడానికి భారత రాజ్యాంగం, ఓటుహక్కు (326 అధికరణ)ను ప్రసాదించింది. దీని ప్రకారం జాతి, కుల, మత, లింగ, విద్య, ఆర్థిక స్థితి, వర్గం, ప్రాంతం వంటి భేదాలు లేకుండా 18 సం||రాలు నిండినా ప్రతి ఒక్కరు ఓటు హక్కు పొందుతారు.

→ EVM : ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్

→ ప్రాంతీయ పార్టీ : రాష్ట్రంలో జరిగే ఎన్నికలలో మొత్తం పోలైన ఓట్లలో మూడు శాతం ఓట్లను లేదా మూడు శాసన సభ స్థానాలను పొందితే ఎన్నికల సంఘం ఒక పార్టీని ప్రాంతీయ పార్టీగా గుర్తిస్తుంది.

→ జాతీయ పార్టీ : సాధారణ ఎన్నికల్లో కనీసం నాలుగు రాష్ట్రాల్లో మొత్తం పోలైన ఓట్లలో ఆరు శాతం ఓట్లు పొందినా, లేదా నాలుగు వేరు వేరు రాష్ట్రాల నుండి కనీసం పదకొండు లోక్సభ సీట్లను సాధించిన పార్టీని ఎన్నికల సంఘం జాతీయ పార్టీగా గుర్తిస్తుంది.

→ NOTA : ఎన్నికలప్పుడు బాలెట్ పేపర్‌లోకానీ EVMలో కాని ఉండే ఒక గురు. దీనికరం. పైన ఉన్నవారిని ఎవరినీ నేను ఎన్నుకోవడం లేదు అని. (None of the Above)

→ నియోజక వర్గం : ఒక చట్టపరమైన సభకు (అసెంబ్లీ లేదా పార్లమెంటు) ఒక నాయకుడిని ఎన్నుకుని పంపడానికి ప్రాంతాలని భాగాలుగా విభజిస్తారు. ఆ భాగాలనే నియోజక వర్గం అంటారు.

AP 8th Class Social Notes Chapter 12 భారత ఎన్నికల వ్యవస్థ 1

AP 8th Class Social Notes Chapter 11B జాతీయోద్యమం : మలి దశ 1919 – 1947

Students can go through AP Board 8th Class Social Notes 11Bth Lesson జాతీయోద్యమం : మలి దశ 1919 – 1947 to understand and remember the concept easily.

AP Board 8th Class Social Notes 11Bth Lesson జాతీయోద్యమం : మలి దశ 1919 – 1947

→ గాంధీజీ భారతదేశానికి వచ్చే నాటికే గౌరవప్రదమైన నాయకుడిగా గుర్తింపు పొందాడు.

→ ఈయన కాంగ్రెసులో ఏ వర్గంలో చేరకుండా సొంత రాజకీయ కార్యక్రమాలను రూపొందించుకున్నాడు.

→ 1906లో ముస్లింలీగ్, 1915లో ముస్లిం మహాసభ ఏర్పడింది.

→ ఏప్రిల్ 13, 1919న పంజాబ్ లోని అమృత్ సర్ లో జరిగిన జలియన్ వాలాబాగ్ మారణకాండ బ్రిటిషు ప్రభుత్వ ఆకృత్యాలకు పరాకాష్ఠ.

→ 1921-22 నాటికి సహాయ నిరాకరణ ఉద్యమం ఊపందుకుంది.

→ ఆంధ్రాలో జాతీయతా కార్యక్రమాలకు గుంటూరు జిల్లా కేంద్రంగా మారింది.

→ 1922లో చౌరిచౌరా సంఘటనకు నిరసనగా గాంధీజీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని నిలిపివేశాడు.

→ ఉప్పు సత్యాగ్రహంతో దేశమంతా నూతనోత్తేజం రగిలింది.

→ రెండవ ప్రపంచ యుద్ధం 1939లో మొదలయ్యి 1945లో ముగిసింది.

→ 1942లో క్విట్ ఇండియా ఉద్యమం. బ్రిటిషు వారిని గడగడలాడించింది.

AP 8th Class Social Notes Chapter 11B జాతీయోద్యమం : మలి దశ 1919 – 1947

→ సుభాష్ చంద్రబోస్ స్వరాజ్య ఉద్యమకారుడు, విప్లవవాద జాతీయవాది. ఆయన రాస్ బిహారీ బోస్ సహకారంతో భారత జాతీయ సైన్యాన్ని ప్రారంభించాడు.

→ స్వాతంత్ర్యం పొందడం మన బలం. విభజనకు గురవటం మన ఓటమి.

→ జాతీయవాదం : చిన్న సమూహాల కంటే జాతి పెద్దది. ఏ మతము లేని వాళ్ళతో సహా అందరి ప్రయోజనాలను కోరుకునేదే జాతీయవాదం.

→ లౌకిక : జాతీయవాదాన్నే లౌకికవాదం అని అంటారు.

→ ఉగ్రవాది : ఆయుధాలు పట్టి ఎవరైనా ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించేవారు, శాంతి భద్రతలకు విఘాతం కల్గించేవారు.

→ అతివాదం : స్వాతంత్ర్యం కోసం ఎవరినీ అర్థించవలసిన అవసరం లేదని, అది మన జన్మహక్కు అని బ్రిటిషు విధానాల్ని నిరసించి ఉద్యమాలు చేసినవారు.

→ సత్యాగ్రహం : గాంధీజీ నడిపించిన అహింసాయుత మార్గం. ఇది హింసకు ఎదురు తిరగటం కాక, వారికి ఎదురు నిలబడి గెలవటం.

→ సహాయ నిరాకరణ : ప్రభుత్వం లేదా అధికారవర్గం సవ్యంగా పాలించాలంటే పాలితులు కూడా , సహకరించాలి. అలాంటి సహకారాన్ని ఇవ్వడాన్ని ప్రజలు నిరాకరించటం.

→ శాసనోల్లంఘనం : ప్రభుత్వం చేసిన శాసనాలను ప్రజలు అంగీకరించి అమలు జరిగేలా చూడాలి అలాకాక వాటిని వ్యతిరేకించడం.

→ ఉపఖండం : ఖండానికి ఉన్న అన్ని లక్షణాలను కలిగి ఉన్న వాటిని ‘ఉపఖండం’ అని అంటారు.
ఉదా : భారతదేశం ఉపఖండం.

AP 8th Class Social Notes Chapter 11B జాతీయోద్యమం మలి దశ 1919 – 1947 1

AP 8th Class Social Notes Chapter 11A జాతీయోద్యమం : తొలి దశ 1885 – 1919

Students can go through AP Board 8th Class Social Notes 11Ath Lesson జాతీయోద్యమం : తొలి దశ 1885 – 1919 to understand and remember the concept easily.

AP Board 8th Class Social Notes 11Ath Lesson జాతీయోద్యమం : తొలి దశ 1885 – 1919

→ భారతదేశంలో జాతీయోద్యమం ఒక చారిత్రక ఘటన.

→ 1857 తిరుగుబాటు బ్రిటిషు పాలనని వ్యతిరేకించింది కానీ దేశానికి ఒక కొత్త దార్శనికతను ఇవ్వలేకపోయింది.

→ ఆంగ్ల విద్యావ్యాప్తితో ఒక కొత్త చైతన్యం రూపుదిద్దుకొనసాగింది.

→ 1866 నుండి 1885 మధ్య భారతీయుల సమస్యలపై వివిధ సంఘాలు ఏర్పాటు అయ్యాయి.

→ 1885 నుండి 1905 వరకు భా.జా. కాం. మితవాద దశగా పేర్కొన్నారు. ఈ దశలోని నాయకులు విన్నపాలు, అర్జీలు, ఆందోళనలు అన్న విధానాలను అవలంబించారు.

→ 1903లో కర్జన్ బెంగాలను తూర్పు, పశ్చిమ బెంగాల్ గా విభజించాలని చేసిన ప్రతిపాదన, జాతీయ భావాలను పెద్ద ఎత్తున రగిల్చింది.

→ స్వదేశీ ఉద్యమం వల్ల భారతీయ పరిశ్రమలకు మంచి ఊపు వచ్చింది. వస్త్ర పరిశ్రమ ఊపందుకుంది.

→ ‘స్వరాజ్యం నా జన్మహక్కు దానిని సాధించి తీరతాను’ అనే ప్రఖ్యాత నినాదాన్ని తిలక్ ఇచ్చాడు.

→ 1907లో కాంగ్రెస్ రెండుగా చీలింది.

→ తిలక్ అనిబిసెంట్ తో కలిసి ‘హోంరూల్’ ఉద్యమం ప్రారంభించాడు.

AP 8th Class Social Notes Chapter 11A జాతీయోద్యమం : తొలి దశ 1885 – 1919

→ 1916లో కాంగ్రెస్ రెండు వర్గాలు ఐక్యమయ్యాయి.

→ కృష్ణాపత్రిక స్వాతంత్ర్యోద్యమం అన్ని దశలలో పనిచేసింది.

→ 1914-1918 మధ్య మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది.

→ మొదటి ప్రపంచ యుద్ధం చివరలో గాంధీజీ దక్షిణాఫ్రికా నుంచి తిరిగి వచ్చి భారత స్వాతంత్ర్యోద్యమంలో భాగమయ్యాడు.

→ సార్వభౌమాధికారం : ప్రజలందరూ కలిసి ఒక జాతిగా ఉండి, వారి మీద వారికే అధికారాన్ని కలిగి ఉండటం, ఇతరుల ప్రమేయం లేకుండటం.

→ జాతి వివక్షత : బ్రిటిష్ వారు భారతీయుల పట్ల కలిగియున్నది. నల్లవారు, తెల్లవారు అనే వివక్షత. ఇది ఐరోపా ఖండంలోని వారికందరికీ ఉన్నది.

→ తీర్మానం : ఒక వ్యక్తి గాని, ఒక సమూహం గాని చేసుకున్న లేదా తీసుకున్న నిర్ణయం.

→ మితవాదులు : కేవలం విన్నపాలు, అర్జీలు, ఆందోళనల ద్వారా కొంచెం మెరుగైన జీవితాన్ని ఆశించినవారు.

→ వినతిపత్రాలు/అర్జీలు : ఏదైనా ఒక న్యాయబద్ధమైన కోరికను తీర్చమని కోరే పత్రం.

→ స్వదేశీ : విదేశీవి కానివన్నీ స్వదేశీ వే.

→ బహిష్కరణ : కొన్ని వస్తువులను గాని, కొంతమంది మనుషులను గాని, దూరంగా ఉంచి, ఉపయోగించకుండుట వారిని కలవకుండుట.

→ పికెటింగ్ : ఏదేనా ఒక దుకాణాన్ని ఇతరులు ప్రవేశించకుండా అడ్డుకొనుట, వ్యక్తిని కదలకుండా ఉంచుట (ముఖ్యంగా సమ్మె కాలంలో).

→ స్వరాజ్యం : సంపూర్ణ స్వేచ్ఛా స్వాతంత్ర్యం.

→ నిరసన : నచ్చని విషయాన్ని తెలపటం.

→ అతివాదం : తిలక్ వంటి నాయకులు కొన్ని అతివాద పద్ధతుల ద్వారా స్వాతంత్ర్యాన్ని తేచ్చే పద్ధతి.

AP 8th Class Social Notes Chapter 11A జాతీయోద్యమం తొలి దశ 1885 – 1919 1

AP 8th Class Social Notes Chapter 10 బ్రిటిష్, నిజాంల పాలనలో భూస్వాములు, కౌలుదార్లు

Students can go through AP Board 8th Class Social Notes 10th Lesson బ్రిటిష్, నిజాంల పాలనలో భూస్వాములు, కౌలుదార్లు to understand and remember the concept easily.

AP Board 8th Class Social Notes 10th Lesson బ్రిటిష్, నిజాంల పాలనలో భూస్వాములు, కౌలుదార్లు

→ ‘ఖుద్ ఖాఫ్’ అంటే సొంతంగా జమీందారులు సాగు చేసుకునే భూములు.

→ భారతదేశం పై, బ్రిటిష్ వాళ్ళు ఆధిపత్యం పొందిన తరువాత యుద్ధాలకు, వాణిజ్యానికి డబ్బులు సమకూర్చుకోవటానికి భూమి శిస్తును సాధ్యమైనంత పెంచాలని అనుకున్నారు.

→ కారన్‌వాలిస్ గవర్నరు జనరల్ 1793లో కంపెనీ శాశ్వతశిస్తు నిర్ణయ ఒప్పందం ప్రవేశపెట్టింది. దీని ద్వారా శిస్తు జమీందార్లు వసూలు చేస్తారు.

→ దీర్ఘకాలంలో జమీందారులు శిస్తు కట్టలేక ఋణగ్రస్తులై బాధలు అనుభవించారు.

→ 19వ శతాబ్దం నాటికి శిస్తు విధానాన్ని మరొకసారి మార్చటం తప్పనిసరి అన్న అభిప్రాయానికి చాలామంది కంపెనీ అధికారులు వచ్చారు.

→ రైతు అంటే భూమిని సాగుచేసేవాడు. ‘రైత్వారీ’ అంటే రైతులకు సాగు హక్కు ఇవ్వటం.

→ భారీ నీటి సాగు పథకాలలో పెట్టుబడులు పెట్టడం ప్రభుత్వ విధి అని కొంతమంది బ్రిటిష్ పరిపాలకులు భావించారు.

AP 8th Class Social Notes Chapter 10 బ్రిటిష్, నిజాంల పాలనలో భూస్వాములు, కౌలుదార్లు

→ సర్ ఆర్థర్ కాటన్ అవిశ్రాంత కృషి వల్ల 1849లో ధవళేశ్వరం వద్ద గోదావరినదిపై ఆనకట్ట, 1854లో విజయవాడ వద్ద కృష్ణానదిపై ఆనకట్ట కట్టారు.

→ భూమి నుంచి ఆదాయాన్ని పెంచాలన్న కోరికతో భూమిశిస్తును రెవెన్యూ అధికారులు గణనీయంగా పెంచేశారు.

→ వలసపాలనలో భూస్వాములు వారి సొంత భూములలో రైతాంగంతో బలవంతంగా, డబ్బులు ఇవ్వకుండా పనిచేయించుకునే వాళ్ళు. దీనినే వెట్టి అని అంటారు.

→ నిజాం పాలనలోని హైదరాబాదు రాష్ట్రంలో జాగీర్దారులు, సంస్థానాలు, ఇనాందారులు వంటి మధ్య స్థాయి పెత్తందారులు చాలామంది ఉండేవాళ్ళు.

→ హైదరాబాదును పాలించిన నిజాంలు బ్రిటిష్ పాలన కింద వాళ్ళ విధానాలను అనుసరించాల్సివచ్చేది.

→ బ్రిటిష్ పాలనలో కరవులు, తీవ్ర ఆహార కొరతల వల్ల తరచు సంక్షోభాలు తలెత్తేవి.

→ వలస పాలనలో దేశంలోని వివిధ ప్రాంతాలలోని రైతులు, భూస్వాములు, వ్యాపారస్థులు, అధికారులకు వ్యతిరేకంగా పోరాటాలు చేశారు.

→ భూస్వాములు : జమీందారులు తమ భూములను రైతాంగానికి ఇచ్చి పంటలో కొంత భాగం కానీ, ముందుగా నిర్ణయించిన కౌలుకి గాని ఇచ్చేవారు. ఈ రకంగా భూమి పొందిన వారిని భూస్వాములు అంటారు.

→ వడ్డీ వ్యాపారస్తులు : ప్రజల అవసరాలకు సొమ్మును అప్పుగా ఇచ్చి (తనఖా పై) దానికి గాను వడ్డీ తీసుకునేవారు.

→ జాగీర్లు : నిజాం పాలనలో హైదరాబాదు రాష్ట్రంలో కొంతమంది భూస్వాములుండేవారు. వీరిని జాగీర్ దారులు అనే వాళ్ళు. వీళ్ళ ఆధీనంలో ప్రాంతాలను జాగీర్లు అంటారు.

→ సంస్థానం : బ్రిటిష్ వారి కాలంలో భారతదేశంలో కొన్ని ప్రాంతాలు స్వదేశీయుల ఆధీనంలో ఉండేవి. వీటిని సంస్థానం అనేవారు. వీరు బ్రిటిష్ వారికి కప్పాలు చెల్లించేవారు.

AP 8th Class Social Notes Chapter 10 బ్రిటిష్, నిజాంల పాలనలో భూస్వాములు, కౌలుదార్లు

→ ఇనాందారులు : వీరు కూడా మధ్య స్థాయి పెత్తందారులు. నిజాం వీరిని మెచ్చి కొంత ప్రాంతాన్ని ‘ఇనాం’గా ఇచ్చేవాడు. ఇలా ‘ఇనాం’ను పొందిన వారిని ఇనాందారులు అంటారు.

→ పట్టా : ఏదేని ఒక స్థలంపై యాజమాన్యపు హక్కును స్పష్టం చేస్తూ ప్రభుత్వం ఇచ్చే కాగితపు ఆదేశమే పట్టా.

→ రైత్వారీ : రైత్వారీ అంటే రైతులకు సాగు హక్కు ఇవ్వటం.

→ దేశముఖ్ : హైదరాబాదు రాష్ట్రంలో (వలస పాలనలో) భూమిశిస్తు వసూలు చేయువారు.

AP 8th Class Social Notes Chapter 10 బ్రిటిష్, నిజాంల పాలనలో భూస్వాములు, కౌలుదార్లు 1

AP 8th Class Social Notes Chapter 9 ప్రజారోగ్యం – ప్రభుత్వం

Students can go through AP Board 8th Class Social Notes 9th Lesson ప్రజారోగ్యం – ప్రభుత్వం to understand and remember the concept easily.

AP Board 8th Class Social Notes 9th Lesson ప్రజారోగ్యం – ప్రభుత్వం

→ రోగాలను నివారించడానికి, వైద్యం చెయ్యడానికి ఆరోగ్య కేంద్రాలు, ఆసుపత్రులు, రోగ నిర్ధారణకు పరీక్షా కేంద్రాలు, అంబులెన్సు సదుపాయాలు, రక్తనిధి వంటివి అవసరం అవుతాయి.

→ రోగాలను నివారించడానికి టీకాలతో పాటు తగినంత ఆహారం, శుభ్రమైన తాగునీరు, పారిశుద్ధ్యం, శుభ్రమైన వాతావరణం కావాలి.

→ భారతదేశం ఔషధాలు తయారుచేయడంలో ప్రపంచంలో 4వ పెద్ద దేశం.

→ ఆరోగ్య సదుపాయాలను 1) ప్రజా ఆరోగ్య సేవలు 2) ప్రైవేటు ఆరోగ్య సేవలు అంటూ ప్రధానంగా రెండుగా విభజించవచ్చు.

→ గ్రామస్థాయిలో ఒక ‘ఆశ’ ప్రభుత్వ కార్యకర్త ఉంటారు.

→ అంగన్‌వాడీ కేంద్రంలో చిన్నపిల్లలకు పోషకాహారంతో పాటు టీకాలు కూడా అందిస్తారు.

→ మండలస్థాయిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉంటాయి.

→ దేశ జనాభాలో 20% మంది మాత్రమే వాళ్ళు జబ్బుపడినప్పుడు అవసరమైన మందులు కొనగల స్థితిలో ఉన్నారు.

→ జీవనానికి, మంచి ఆరోగ్యానికి నీళ్ళు తప్పనిసరి. రక్షిత మంచినీటి ద్వారా అనేక రోగాలను నివారించవచ్చు.

→ ఆరోగ్య సేవలు, పారిశుద్ధ్యం, విద్యుత్తు, ప్రజారవాణా, పాఠశాలలు మౌలిక సదుపాయాలలోనికి వస్తాయి. వీటినే ప్రజాసదుపాయాలు అంటారు.

→ మెరుగైన పోషకాహారం అంటే రోగనిరోధకశక్తి బాగా ఉంటుందని అర్థం.

AP 8th Class Social Notes Chapter 9 ప్రజారోగ్యం – ప్రభుత్వం

→ ప్రజా ఆరోగ్య సేవలు : ఆరోగ్య కేంద్రాలు, ఆసుపత్రులతో కూడి ప్రభుత్వం నిర్వహించేవే ప్రజా ఆరోగ్య సేవలు.

→ ప్రాంతీయ ఆసుపత్రి : డివిజన్ స్థాయిలో 100 పడకలతో ఉన్న ఆసుపత్రి.

→ ప్రజాసదుపాయాలు : నీటి లాగానే ప్రతి ఒక్కరికి అందించాల్సిన ఇతర మౌలిక సదుపాయాలు ఉన్నాయి. ఆరోగ్య సేవలు, పారిశుద్ధ్యం, విద్యుత్తు, ప్రజా రవాణా, పాఠశాలలు కూడా ఈ జాబితాలోకి వస్తాయి. వీటిని ప్రజాసదుపాయాలు అంటారు.

→ పోషకాహారం : మనందరం ఆరోగ్యంగా ఉండటానికి, రోజువారీ పనులు చేయటానికి, రోగాల బారిన పడకుండా ఉండటానికి ప్రతి ఒక్కళ్లకీ శరీరంలో కొంత కొవ్వు పదార్థం అవసరం. దీనినే పోషకాహారం అంటారు.

→ ఆరోగ్యశ్రీ పథకం : తెల్లకార్డున్న వారందరికీ ఈ పథకం క్రింద ప్రయివేటు ఆసుపత్రులలో కూడా ఉచితవైద్యం అందుతుంది.

→ అంగన్ వాడీ కేంద్రాలు : 3 నుండి 5 సం||లలోపు బాలబాలికలందరికీ ఇక్కడ విద్య, పోషకాహారం లభించేలా ప్రభుత్వం చూస్తుంది.

→ రోగనిరోధక శక్తి : ఏదైనా ఒక వ్యాధి శరీరంలోకి ప్రవేశించినపుడు, దానిని నిరోధించే శక్తి మన శరీరానికి కొంత ఉంటుంది.

→ ఆశ కార్యకర్త : గ్రామస్థాయిలో ప్రభుత్వ ఆరోగ్య సేవలను అందించే కార్యకర్త.

AP 8th Class Social Notes Chapter 9 ప్రజారోగ్యం – ప్రభుత్వం 1

AP 8th Class Social Notes Chapter 8 జీవనోపాధులు – సాంకేతిక విజ్ఞాన ప్రభావం

Students can go through AP Board 8th Class Social Notes 8th Lesson జీవనోపాధులు – సాంకేతిక విజ్ఞాన ప్రభావం to understand and remember the concept easily.

AP Board 8th Class Social Notes 8th Lesson జీవనోపాధులు – సాంకేతిక విజ్ఞాన ప్రభావం

→ మనం అత్యంతాధునిక సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించుకుంటున్నాం.

→ పారిశ్రామిక విప్లవం వలన 18, 19 శతాబ్దాలలో పెనుమార్పులు వచ్చాయి.

→ ఆవిరియంత్రం వల్ల కర్మాగారాల్లో పని విధానం మారిపోయింది.

→ సాంకేతిక విజ్ఞానంలో మార్పు ఒక కొత్త ఉత్పత్తికి దారితీయవచ్చు.

→ యంత్రాల వినియోగం కూడా కొత్త ఉద్యోగాలకు దారితీస్తుంది.

→ సాంకేతిక విజ్ఞానాన్ని అన్నివేళలా స్వాగతించరు.

→ స్వాతంత్ర్యం తరువాత ప్రభుత్వం ఆనకట్టలు కట్టి సాగునీటి సౌకర్యాలు మెరుగుపరచసాగింది.

→ వ్యవసాయక యంత్రాలను ఉపయోగించడం వలన ఉత్పత్తి ప్రక్రియ గణనీయంగా మారింది.

→ వరికోత యంత్రం వల్ల రైతులు కూలీలపై ఆధారపడటం తగ్గింది.

→ భారతదేశంలో మిల్లుల ద్వారా వస్త్ర ఉత్పత్తిని బ్రిటిషు వాళ్ళు మొదలు పెట్టారు.

→ చేనేతలో క్షీణత అనేది స్పష్టంగా కనిపించే ఒక ప్రధానమైన మార్పు.

AP 8th Class Social Notes Chapter 8 జీవనోపాధులు – సాంకేతిక విజ్ఞాన ప్రభావం

→ సాంకేతిక విజ్ఞాన మార్పులు సేవారంగాన్ని కూడా ప్రభావితం చేస్తాయి.

→ భారతదేశంలో టెలీకమ్యూనికేషన్ నెట్ వర్క్ ప్రపంచంలో మూడవ అతి పెద్దది.

→ ప్రభుత్వ కంపెనీలకు కాక అనేక ప్రైవేట్ కంపెనీలు ల్యాండ్ లైన్, మొబైల్ ఫోన్ సేవలను అందిస్తున్నాయి.

→ సాంకేతిక విజ్ఞానం : ఏదైనా పని విధానం మెరుగుపరచుట లేదా ఏదైనా ఎలా చేయబడింది అనే జ్ఞానాన్ని రోజువారీ జీవితావసరాలకు ఉపయోగించుకుంటే అది సాంకేతిక విజ్ఞానం అవుతుంది.

→ ఆవిష్కరణ : ఒక కొత్త యంత్రాన్ని లేదా ఉత్పత్తి విధానాన్ని తొలిసారిగా కనుక్కొన్నప్పుడు దానిని ఆవిష్కరణ అంటారు.

→ సాగునీటి సౌకర్యాలు : పంట పొలాలకు రకరకాలుగా నీరందించడంను సాగునీటి సౌకర్యాలు అంటారు.

→ రసాయనిక ఎరువులు, పురుగు మందులు : పంటలు బాగా పెరిగి ఎక్కువ దిగుబడినివ్వడానికి రసాయనిక ఎరువులు వాడతారు. పంటలకు పట్టిన చీడ, పీడలకు పురుగు మందులు వాడతారు.

→ వ్యవసాయ పనులు : పొలం దున్నటం, నారుపోయడం, నాట్లు, కలుపు తీయటం, పాయలెయ్యడం, కోత, కుప్ప వేయడం, నూర్పిడి, ఆరబెట్టడం మొదలైనవన్నీ వ్యవసాయ పనులు.

→ సేవలు : వ్యవసాయ, వ్యాపార రంగాలకు సహాయపడేవి, అన్ని వ్యాపార కలాపాల్ని కలిపి సేవలు అని చెప్పవచ్చు.
ఉదా : విద్య, వైద్యం, రవాణా మొ||నవి.

AP 8th Class Social Notes Chapter 8 జీవనోపాధులు – సాంకేతిక విజ్ఞాన ప్రభావం 1
AP 8th Class Social Notes Chapter 8 జీవనోపాధులు – సాంకేతిక విజ్ఞాన ప్రభావం 2

AP 8th Class Social Notes Chapter 7 ద్రవ్యం, బ్యాంకింగ్

Students can go through AP Board 8th Class Social Notes 7th Lesson ద్రవ్యం, బ్యాంకింగ్ to understand and remember the concept easily.

AP Board 8th Class Social Notes 7th Lesson ద్రవ్యం, బ్యాంకింగ్

→ వస్తుమార్పిడిలో డబ్బు లేకుండానే వస్తువులను నేరుగా, ఒకదానితో మరొకటి మార్చుకుంటారు.

→ డబ్బును వినియోగిస్తే సరుకుల మార్పిడిలో సమస్యలుండవు. డబ్బు మాధ్యమంగా పనిచేస్తుంది.

→ సంచి లేదా పర్సులలో డబ్బును ఎక్కడికైనా తీసుకెళ్ళవచ్చు. అది రవాణాకు అనుకూలమైనది.

→ కాలక్రమంలో అరుదైన, ఆకర్షణీయమైన లోహాలను మార్పిడి మాధ్యమంగా ప్రజలు ఉపయోగించడం మొదలు పెట్టారు.

→ రోమన్ల కాలంలో “బీసెంట్” అనే బంగారు నాణెం ప్రామాణికంగా ఉండేది.

→ 17వ శతాబ్దంలో యూరలో ఆమ్ స్టర్ డాంలో ‘బ్యాంక్ ఆఫ్ ఆమ్ స్టర్ డామ్’ను ప్రారంభించారు.

→ ప్రజలు బ్యాంకులలో దాచుకునే డబ్బును ‘జమ’ అంటారు.

→ డబ్బులు చెల్లించడానికి తీసుకోవడానికి చెక్కులను విస్తృతంగా ఉపయోగిస్తున్నారు.

→ కరెంటు ఖాతా నుంచి ఎన్నిసార్లయినా డబ్బులు తీసుకోవచ్చు.

→ ప్రస్తుతం కంప్యూటర్లు, ఇంటర్నెట్లను అంతటా వాడుతున్నారు.

AP 8th Class Social Notes Chapter 7 ద్రవ్యం, బ్యాంకింగ్

→ బ్యాంకు అనేది ఒక వాణిజ్య సంస్థ. ప్రజలు పొదుపు చేసిన డబ్బు జమల రూపంలో బ్యాంకులోకి వస్తుంది.

→ వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తలు, రైతులు, చేతివృత్తిదారులు వంటి అనేకమందికి బ్యాంకులు అప్పులిస్తాయి.

→ వస్తుమార్పిడి : వస్తుమార్పిడిలో డబ్బు లేకుండానే, వస్తువులను నేరుగా ఒకదానితో మరొకటి మార్చుకుంటారు.

→ డబ్బు రూపాలు : నాణేలు, రశీదులు, హుండీలు, చెక్కులు, డ్రాఫులు మొదలైనవన్నీ డబ్బు రూపాలే.

→ జమలు : ఎవరికైనా ఇవ్వవలసిన సొమ్మును తిరిగి కొంత యిచ్చినా, తమ సొమ్మును బ్యాంక్ లాంటి సంస్థల్లో దాచినా, వీటిని జమలు అంటారు.

→ పొదుపు : భవిష్యత్తులోని అవసరాలను దృష్టిలో ఉంచుకొని తమ ఆదాయంలోని కొంత మొత్తంను దాచుకోవడాన్ని పొదుపు అంటారు.

→ అప్పు / రుణం : తమ ఆర్థిక అవసరాల కోసం ఇతరుల దగ్గర నుండి లేదా ఋణసంస్థల నుండి డబ్బును తీసుకోవడం.

→ వడ్డీ : అప్పు తీసుకున్న సొమ్ముపై వాడుకున్నందుకుగాను కొంత శాతం సొమ్మును ఋణదాతకు ఇవ్వడం.

→ చెక్కు : డబ్బులు చెల్లించడానికి, తీసుకోవడానికి ఉపయోగపడేది. (బ్యాంకు ద్వారా)

AP 8th Class Social Notes Chapter 7 ద్రవ్యం, బ్యాంకింగ్ 1