AP Board 9th Class Social Solutions Chapter 22 మహిళా రక్షణ చట్టాలు

SCERT AP 9th Class Social Studies Guide Pdf 22nd Lesson మహిళా రక్షణ చట్టాలు Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Social Solutions 22nd Lesson మహిళా రక్షణ చట్టాలు

9th Class Social Studies 22nd Lesson మహిళా రక్షణ చట్టాలు Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
బాల్య వివాహాల దుష్ఫలితాలు ఏవి? (AS1)
జవాబు:
బాల్య వివాహాల దుష్ఫలితాలు :

  1. చిన్న వయసులో గర్భవతులు కావడం.
  2. ఆడ పిల్లల అక్రమ రవాణాకు, అమ్మకానికి అవకాశం ఏర్పడడం.
  3. చదువుకు ఆటంకం.
  4. శారీరక ఎదుగుదలకు ఆటంకం.
  5. కుటుంబ పోషణకై బాలకార్మికులుగా మారుట.
  6. మానసిక ఆరోగ్య సమస్యలు తలెత్తడం.
  7. వైకల్యంతో కూడిన శిశు జననాలు లేదా మృత శిశువులు జన్మించడం.
  8. ఎదుగుదల లేని పిల్లలను బలవంతంగా కుటుంబ వ్యవస్థలోకి నెట్టివేయడం.
  9. అధిక సంఖ్యలో గర్భ విచ్ఛిత్తి, గర్భస్రావం, నెలలు నిండక ముందే ప్రసవం జరగడం ఫలితంగా మాతృ మరణాలు, శిశు మరణాల సంఖ్య పెరగడం.

AP Board 9th Class Social Solutions Chapter 22 మహిళా రక్షణ చట్టాలు

ప్రశ్న 2.
గృహహింస ఎందుకు సర్వసాధారణమైంది? అది ఏయే రూపాల్లో కనిపిస్తుంది? కారణాలు రాయండి. (AS1)
జవాబు:
మన రాజ్యాంగం పౌరులందరికీ గౌరవంగా బ్రతికే హక్కును ఇచ్చింది. స్త్రీలు కూడా పౌరులే. స్త్రీలు కూడా గౌరవంగా బ్రతకాలి. వారిని దూషించకుండా, అవమానించకుండా ఉండాలి. స్త్రీలు చేసే పనిని గౌరవించి, వారి హక్కులు, స్వేచ్ఛా వాతావరణంలో అనుభవించేటట్లు పరిస్థితులు కల్పించాలి. ప్రతీ కుటుంబంలో స్త్రీలను శారీరకంగా, మానసికంగా దెబ్బ తీస్తున్నారు. స్త్రీ పై ఆధిపత్యం కోసం పద్ధతి ప్రకారం జరిపే చర్యల క్రమమే గృహహింస.

కారణాలు :

  1. స్త్రీలలో గల అమాయకత్వం.
  2. స్త్రీల రక్షణకు కల్పించే చట్టాలపై అవగాహన లేకపోవడం.
  3. స్త్రీలలో గల నిరక్షరాస్యత.
  4. పురుష అహంకార సమాజం.
  5. స్త్రీల పట్ల సమాజం చిన్న చూపు.
  6. స్త్రీకి స్త్రీయే శత్రువుగా మారటం.
  7. స్త్రీలలో గల నిరాసక్తత.

ప్రశ్న 3.
మీరు బాలికలు, మహిళల యొక్క వివిధ సమస్యల గురించి చదివారు. ఇలాంటి సమస్యలు మీ గ్రామంలో లేదా పట్టణంలో ఎప్పుడైనా గమనించారా? అయితే, ఏం చేయాలి? (AS4)
జవాబు:
మా గ్రామం మరియు మా పరిసర ప్రాంతాలలో బాల్య వివాహాలు, వరకట్నం, లైంగిక వేధింపులు గమనించాం.

మా గ్రామంలో వరకట్న సమస్య ప్రధానంగా కనిపిస్తుంది. ఇద్దరు ముగ్గురు ఆడపిల్లలు గల కుటుంబాలు, మధ్య తరగతి కుటుంబాలు చితికిపోతున్నాయి. వరుడ్ని వేలంలో కొన్నట్లు ఎవరు ఎక్కువ కట్నం ఇస్తే వారిని పెండ్లాడే సంస్కృతి కనిపిస్తుంది.

  1. ముందుగా సమాజంలో మార్పు రావాలి.
  2. స్త్రీల యొక్క గుణగణాలకు, కుటుంబ సాంప్రదాయాలకు ప్రాధాన్యత నివ్వాలి.
  3. వరకట్నం అడిగే పెద్దలను, వరుడ్ని పోలీసులకు అప్పజెప్పాలి.
  4. స్త్రీలలో మార్పు రావాలి.
  5. ఇంకా కట్నం కోసం వేధించే భర్తలను నిర్భయంగా పోలీసులకు, కోర్టులకు, స్వచ్ఛంద సంస్థల ముందుంచాలి.

ప్రశ్న 4.
బాలికలు, మహిళల సంరక్షణకై ప్రభుత్వం ఎన్నో చట్టాలు చేసింది. వాటిని సక్రమంగా అమలు చేయడానికి మీరిచ్చే సూచనలు ఏవి?
(లేదా)
బాలికలు, మహిళల అభివృద్ధి మరియు సంరక్షణకై ప్రభుత్వం ఎన్నో పథకాలు మరియు చట్టాల రూపకల్పన చేస్తుంది. వాటిని సక్రమంగా అమలు చేయటానికి మీరందించే సూచనలు ఏమిటి?
జవాబు:
అనాదిగా మవదేశం పురుషాధిక్యత గలది. స్త్రీలు అంటే చిన్న చూపు పురాతన కాలం నుండి కొనసాగుతుంది. అంతేకాకుండా స్త్రీలు ఎదుర్కొను అనేక సమస్యల నుండి, వేధింపుల నుండి, హింసల నుండి రక్షణకై అనేక చట్టాలు రూపొందించి, అండగా ఉంటూ అధికారులు, న్యాయస్థానాలు ఆదుకుంటున్నాయి.

అయితే చట్టాలు సక్రమంగా అమలు చేయడానికిగాను సలహాలు :

  1. చట్టాలపై స్త్రీలలో అవగాహన కలిగించడానికి గ్రామీణ ప్రాంత మహిళలలో చైతన్య కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి.
  2. అవగాహన సదస్సులు, బహిరంగ వేదికలలో చట్టాలపై వివరంగా తెలియజేయాలి.
  3. సమాచార సాధనాలైన రేడియో, టీ.వి, వార్తాపత్రికలు, సినిమాల ద్వారా చట్టాలపై అవగాహన కలిగించడానికి ఎక్కువ సమయం, స్థలం కేటాయించాలి.
  4. స్త్రీలు విద్యావంతులు కావాలి.
  5. పాఠశాల స్థాయి నుండే బాలికలలో చట్టాలపై పూర్తి అవగాహన కలిగించాలి.
  6. డ్వాక్రా, మహిళా సంఘాల సమావేశాలలో చట్టాలు – లభించే ప్రయోజనాలు, కల్పించే సౌకర్యాలు వివరించాలి.

AP Board 9th Class Social Solutions Chapter 22 మహిళా రక్షణ చట్టాలు

ప్రశ్న 5.
మహిళలు ఎదుర్కొనే సాధారణ సమస్యలపై ఒక వ్యాసం రాయండి.
జవాబు:
ఈ రోజుల్లో మహిళలు స్వేచ్ఛగా బయట తిరగడానికి సాహసించడం లేదు. ఆడ పిల్లలను చదివించడానికి బయట ప్రాంతాలకు పంపించడానికి కూడా తల్లిదండ్రులు భయపడుతున్నారు. ఇంట్లో తల్లిదండ్రుల, కుటుంబ సభ్యుల ఆంక్షలు, బయట ప్రపంచంలో మహిళలను వేధించడం, బాధించడం, తక్కువ చేసి మాట్లాడటం, ఆడవాళ్ళు కనిపిస్తే ఎగతాళి చేయడం, లైంగిక వేధింపులకు గురి చేయడం, మానసిక క్షోభకు గురిచేసే మాటలనడం, అవమానించడం, భయపెట్టి, బెదిరించి, మాయమాటలు చెప్పి, ప్రేమలో దించి, లొంగదీసుకొని, హత్యా నేరాలకు పాల్పడడం మనం నిత్యం చూస్తున్నాం. అంతేకాకుండా వరకట్నం పెండ్లి సమయంలోనే కాకుండా, వివాహానంతరం కూడా ఇంకా అధికంగా కట్నం తెమ్మని, లేకపోతే బలవంతంగా చంపడం జరుగుతుంది. అమ్మాయి జన్మిస్తే తల్లిని నిందించడం నిరంతరం మనం చూస్తూనే ఉన్నాం.

ప్రశ్న 6.
మీరు తహశీల్దారు అయితే, బాల్య వివాహాలను ఎలా అరికడతారు?
జవాబు:
బాల్యం జీవితాంతం గుర్తుండే తీపి గుర్తు. వెంటాడే సుందర దృశ్యం. బాల్యం మధురానుభూతులు అనుభవించక ముందే, చదువుకోవాలనే కోరిక తీరక ముందే, బాలబాలికల వివాహ వయస్సు రాకముందే అంటే బాలురకు 21 సం||లు బాలికకు 18 సం|| నిండక ముందే చాలా ప్రాంతాలలో బాల్యవివాహాలు జరుగుతున్నాయి.

నేనే తహశీల్దారును అయితే :

  1. నా మండల పరిధిలోగల ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలో గల విద్యార్థులలో చైతన్యం కల్గించే అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాను.
  2. పోలీస్ అధికారి, ప్లీడర్, ఒక డాక్టర్‌ను ప్రతీ గ్రామానికి పంపించి తల్లిదండ్రులకు బాల్య వివాహాల వలన కలిగే అనర్థాలు, బలవంతంగా వివాహాలు జరిపిస్తే వేసే శిక్షలు, ఎదురయ్యే ఆరోగ్య సమస్యలు వివరిస్తాను. (వారి ద్వారా)
  3. ఎక్కడైనా అవగాహన లోపంతో బాల్య వివాహాలు జరిగినట్లు వివిధ గ్రామాధికారులు ద్వారా తెలుసుకొని, మహిళా సంక్షేమ అధికారులు, స్వచ్ఛంద సంస్థల ద్వారా మనస్తత్వ నిపుణులచే కౌన్సిలింగ్ ఏర్పాటు చేస్తాను.
  4. ప్రతీ గ్రామంలో కూడా బాల్య వివాహాల నిరోధానికై కమిటినీ ఏర్పాటు చేసి, అంగన్‌వాడీ టీచర్, ANM, ఆశ వర్కర్, సామాజిక కార్యకర్తలు, డ్వాక్రా, మహిళా సంఘాల సభ్యులను కమిటీగా నియమించి నిరోధానికి కృషి చేస్తాను.
  5. ప్రతీ గ్రామ సభలో దండోరా వేయించి సామాజిక అవగాహన కలిగింపజేస్తాను.

ప్రశ్న 7.
మహిళలు ఎదుర్కొనే సమస్యలపై అవగాహన కొరకు ఒక కరపత్రాన్ని తయారుచేయండి. (AS6)
జవాబు:
మహిళలు ఎదుర్కొనే సమస్యలపై కరపత్రం :

ఆడదే ఆధారం – కాని వారికి లేదు సహకారం

సృష్టికి మూలకారణం ఆడది. ఆడది లేకుంటే ఈ సృలేదు. తల్లిగా, చెల్లిగా, భార్యగా సమాజానికి దశను, దిశను నిర్దేశించే ముహిళలు నేడు అణగదొక్కబడుతున్నారు. ఆత్మన్యూనతా భావంతో అడుగంటిపోతున్నారు. చివరకు ఆత్మహత్యలే ప్రధానమనుకుంటున్నారు.

అక్రమ రవాణా :
ఉద్యోగం ఇప్పిస్తామని, సినిమాలలో అవకాశాలు కల్పిస్తామని నమ్మబలికి, వేరే ప్రాంతాలకు తీసుకెళ్ళి, వ్యభిచార గృహాలకు విక్రయించి, హింసించి మహిళల జీవితాలతో ఆటలాడుకుంటున్నారు.

వరకట్నపు పిచాచి :
అమ్మాయి, అబ్బాయి వివాహం అనంతరం (వధూవరులు) ఆనందంగా జీవించడానికి పెండ్లి సమయంలో అత్తవారు ఇచ్చే కానుకలు రోజురోజుకు వెర్రితలలు వేసి నేడు వరకట్నంను వేలం వేస్తున్నారు. కట్నం ఇవ్వలేని తల్లిదండ్రులు, వారి ఆడపిల్లలకు పెండ్లిండ్లు చేయలేని సందర్భాలెన్నో. కొన్నిసార్లు వివాహాలు జరిపించినా, తదనంతరం అదనపు కట్నం కొరకు అమ్మాయిని వేధించడం, తిట్టడం, కొట్టడం, కొన్ని సందర్భాలలో చంపివేయడం చూస్తున్నాం. ఇది న్యాయమా?

గృహ హింస :
స్త్రీలు చేసే పనిని గౌరవించాలి, ఆదరించాలి, చేయూతనందించాలి. అలాకాకుండా నాలుగు గోడల మధ్య మహిళలను రకరకాల పద్ధతులతో హింసించి, మానసిక క్షోబకు గురిచేసి ఆత్మహత్యా విధానాలకు పురికొల్పుతూ, నిండు జీవితాలను బలిచేస్తున్నారు.

లైంగిక ఆత్యాచారాలు, వేధింపులు :
ఇటీవల కాలంలో మహిళలపై ఆత్యాచారాలు, లైంగిక వేధింపులు నిత్యకృత్యమై పోయాయి. ఆఫీసులలో, లైంగిక వేధింపులు తట్టుకోలేకపోతున్నారు. ఎదురు తిరిగిన వారిని యాసిడ్ తో దాడి చేస్తున్నారు. కనీస మర్యాద కూడా పాటించకుండా పశువులతో సమానంగా ప్రవర్తిస్తున్నారు.

మారాలి, సమాజం మారాలి. స్త్రీలను ఎక్కడ గౌరవిస్తామో, ఎక్కడ మర్యాదలు ఆందజేస్తామో ఆ సమాజమే బాగుపడుతుంది. ఇప్పటికైనా మహిళలకు అందించాలి సహకారం.

AP Board 9th Class Social Solutions Chapter 22 మహిళా రక్షణ చట్టాలు

ప్రశ్న 8.
పేజీ నెం. 275లోని ‘అత్యాచారం, లైంగిక వేధింపులు’ అంశం చదివి, వ్యాఖ్యానించండి.
జవాబు:
ఇటీవల కాలంలో విదేశీ సంస్కృతి వెర్రి తలలు వేసి మహిళలపట్ల చిన్నచూపు ఏర్పడి విచక్షణా జ్ఞానాన్ని మరచిపోయి, మహిళలపట్ల అనేక క్రూర చర్యలకు పాల్పడుతున్నారు. అందులో ప్రధానమైన దుశ్చర్య అత్యాచారాలు – లైంగిక వేధింపులు. స్వేచ్ఛగా, హాయిగా విహరించలేని, తిరగలేని దౌర్భాగ్యం మనకు మహిళల పట్ల కానవస్తుంది. రోజు రోజుకు మహిళల పట్ల జరుగుతున్న అత్యాచారాలు, ‘ వేధింపులు మానవత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి. ఇటీవల ఈ రకమైన వేధింపుల నిరోడానికి, లైంగిక, అత్యాచార నియంత్రణకు జస్టిస్ జె.యస్. వర్మ అధ్యక్షతన కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని నియుమించి ఫిబ్రవరి 2, 2013న దానిని రాష్ట్రపతి ఆర్డినెన్స్ జారీ చేశారు. దీని ప్రకారం

  1. ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడిన వారికి 20 సంవత్సరాల జైలుశిక్ష విధించబడుతుంది.
  2. మహిళలపై యాసిడ్ దాడి సమయంలో పెనుగులాటలో దాడి చేసినవారు మరణించినా మహిళలకు శిక్షలేదు.
  3. మహిళా పోలీస్ ద్వారా విచారణ జరుపబడుతుంది.
    ఈ విధంగా మహిళలకు రక్షణ కల్పించబడుతుంది.

9th Class Social Studies 22nd Lesson మహిళా రక్షణ చట్టాలు InText Questions and Answers

9th Class Social Textbook Page No.271

ప్రశ్న 1.
అప్పుడప్పుడు 15 సంవత్సరములు కూడా నిండని పిల్లలకు వారి ప్రమేయం, ఇష్టాయిష్టాలు చూడకుండా పెళ్ళిళ్లు చేస్తున్నారు. ఇలాంటివి ఎలా ఆపవచ్చు? ఎవరు సహాయం చేస్తారు?
జవాబు:
అప్పుడప్పుడూ గ్రామీణ పల్లె ప్రాంతాలలో 18 సం||లు పూర్తికాకుండా 13, 14, 15 సం||ల వయసులో బాల్య వివాహాలు జరుగుతున్నాయి. దీనికి ప్రధాన కారణం అవగాహనా లోపం, తల్లిదండ్రులలో, పిల్లలలో చైతన్యం లేకపోవడం, తదనంతర కష్టాలు, నష్టాలు వారికి తెలియకపోవడం. అంతేకాకుండా పిల్లల పుట్టిన తేదీ, వయస్సు విషయాలలో తల్లిదండ్రులకు పూర్తి సమాచారం లేకపోవడం. ఇలాంటి బాల్య వివాహాలు జరిగినట్లు మొదట గుర్తించేది గ్రామ కార్యదర్శి. గ్రామ కార్యదర్శి జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్, డివిజన్ స్థాయిలో ఆర్.డి.ఓ, మండల స్థాయిలో తహశీల్దారుకు తెలియజేస్తాడు. ఈ సందర్భంగా వారికి ఫిర్యాదు చేస్తాడు. పై అధికారుల సూచన మేరకు మహిళ సంక్షేమ అధికారి CDPO మరియు సబ్ ఇన్ స్పెక్టరు, సామాజిక కార్యకర్త, ఉపాధ్యాయులు మొ||వారు తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇవ్వడం ద్వారా పెళ్ళిళ్ళు ఆపవచ్చు.

9th Class Social Textbook Page No.273

ప్రశ్న 2.
మీ నివాస ప్రాంతంలో కట్నం కోసం మహిళలను వేధించడం గమనించారా? ఎలాంటి వేధింపులు జరుగుతున్నాయి? దీనిని నిరోధించాలంటే సమాజంలో ఎలాంటి మార్పులు రావాలి? ఎవరు బాధ్యత వహించాలి?
జవాబు:
మా ప్రాంతంలో కట్నం కోసం మహిళలను వేధించడం నిరంతరం చూస్తున్నాం. అదనపు కట్నం తెమ్మని అత్త మామలు, ఆడపడుచులు, భర్త తరచుగా వేధించడం, తిట్టడం, కొట్టడం, కొన్ని సందర్భాలలో బలవంతంగా చంపి, ఆత్మహత్యలుగా చిత్రీకరించడం చేస్తున్నారు. మరికొన్ని సందర్భాలలో ఈ మహిళలు ఈ వేధింపులు, బాధలు భరించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.

దీనిని నిరోధించాలంటే సమాజంలో ఖచ్చితంగా మార్పు రావాలి. వరకట్నం అనే సాంఘిక దురాచారం రూపు మాపడానికి రేపటి భావిభారత పౌరులైన విద్యార్థుల నుండే చైతన్యం రావాలి. చదువుకున్న వారిలో, తల్లిదండ్రులలో అవగాహన పెరగాలి. కట్నం వేధింపులకు విధించే శిక్షలు కఠినంగా ఉండాలి. దీనిని రూపుమాపడానికి సమాజంలో ఉన్న ప్రతీ ఒక్కరూ బాధ్యత వహించాలి.

AP Board 9th Class Social Solutions Chapter 22 మహిళా రక్షణ చట్టాలు

9th Class Social Textbook Page No.274

ప్రశ్న 3.
గృహ హింస ఎప్పుడో ఒకసారి అప్పుడప్పుడు మొదలై రాను రాను దురలవాటుగా మారిపోతుంది. హింస నుండి మరింత హింస పుడుతుంది. దీన్ని ఎలా ఆపవచ్చు? ఎవరు సహాయపడతారు?
జవాబు:
స్త్రీలు కూడా పౌరులే. స్త్రీలు గౌరవంగా బ్రతకడం, ఎవరూ దూషించకుండా, అవమానించకుండా ఉండడం, స్త్రీలు చేసే పనిని గౌరవించడమే కాకుండా వారికున్న హక్కులను అనుభవించేటట్లు పరిస్థితులు కల్పించడం సమాజంలోని ప్రతీ ఒక్కరి బాధ్యత.

ప్రారంభంలో చిన్న చిన్న మాటలతో అవమానించి, చులకన చేసి మాట్లాడి చివరకు శారీరక, మానసిక క్షోభకు గురిచేసి జీవితాన్ని దుర్భరం చేస్తున్నారు.

గృహహింస మొదట ప్రారంభం కుటుంబం నుండి ప్రారంభం అవుతుంది. కాబట్టి కుటుంబ సభ్యుల్లో మార్పు రావాలి. మానవత్వం వెల్లివిరియాలి. కుటుంబ సభ్యుల్లో మార్పు రానప్పుడు, గృహహింస అనేక రూపాల్లో బయట పడుతున్నప్పుడు, మహిళలు పోలీస్ అధికారికి గాని, జుడీషియల్ అధికారికిగాని, ఫస్ట్ క్లాస్/మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కు స్వయంగాగాని, ఫోన్ ద్వారాగాని, ఇ-మెయిల్ ద్వారాగాని ఫిర్యాదు చేయవచ్చు. గృహహింస జరిగినప్పుడు, జరుగుతున్నప్పుడు, జరుగుతుందని తెలిసినప్పుడు పై అధికారులకు తెలియచేస్తూ ఆపగలరు. నిరోధించగలరు. సహాయపడగలరు.

AP Board 9th Class Social Solutions Chapter 22 మహిళా రక్షణ చట్టాలు

ప్రాజెక్టు

ప్రశ్న 1.
పేదవారికి ఉచిత న్యాయ సహాయం పొందడానికి ప్రభుత్వం ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తుంది. మీకు సమీపంలో ఉన్న వకీలు/ప్లీడరును సంప్రదించి సమాచారం సేకరించండి.
జవాబు:
న్యాయం దృష్టిలో అందరూ సమానులే. ఏ పౌరుడు కూడా ఆర్థిక కారణాల మూలంగా, ఇతర బలహీనతల కారణంగా న్యాయాన్ని పొందే అవకాశాలను కోల్పోకుండా ఉండటం కోసం ప్రభుత్వం ఉచిత న్యాయ సహాయం’ అందిస్తుంది. ఇందులకై కేంద్రప్రభుత్వం 1976వ సం||లో భారత రాజ్యాంగానికి ఆర్టికల్ 39(ఎ) జత చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలను న్యాయ సహాయాన్ని అందించేలా చేయడానికి లోక్ అదాలత్ లను ఏర్పరచింది.

న్యాయ సహాయం పొందడానికి అర్హులు :

  1. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు చెందినవారు.
  2. మానవ అక్రమ రవాణా బాధితులు, యాచకులు, స్త్రీలు, పిల్లలు, మతిస్థిమితం లేనివారు, అవిటివారు.
  3. ప్రకృతి వైపరీత్యాల బాధితులు, వ్యవసాయ, పారిశ్రామిక కార్మికులు.

రూ. 50,000 కంటే తక్కువ సాంవత్సరిక ఆదాయం కలవారు.

దరఖాస్తు చేసే విధానం :
జిల్లా కోర్టు, హైకోర్టు న్యాయసేవా అధికార సంస్థకు సహాయం కొరకు దరఖాస్తు చేస్తే సహాయం అందించబడుతుంది.

న్యాయ సహాయ విధానాలు :

  1. న్యాయవాదిచే ఉచితంగా న్యాయ సలహా ఇప్పించుట.
  2. న్యాయ సహాయం పొందిన వారికి కోర్టు ఫీజు, కేసుకు సంబంధించిన కోర్టు ఖర్చులు భరించడం.
  3. కేసులకు పరిశీలించిన మీదట, అవసరమైనచో దరఖాస్తుదారుని తరఫున న్యాయవాదులను నియమించి ఆయా కోర్టులలో కేసులు చేపట్టడం.
  4. న్యాయ సహాయం పొందినవారికి ఆయా కేసులలో తీర్పుల నకళ్ళు ఉచితంగా ఇవ్వడం, మొదలగు సహాయాలు అందించబడతాయి.

AP Board 9th Class Social Solutions Chapter 20 ప్రజాస్వామ్యం – రూపుదిద్దుకుంటున్న భావన

SCERT AP 9th Class Social Studies Guide Pdf 20th Lesson ప్రజాస్వామ్యం – రూపుదిద్దుకుంటున్న భావన Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Social Solutions 20th Lesson ప్రజాస్వామ్యం – రూపుదిద్దుకుంటున్న భావన

9th Class Social Studies 20th Lesson ప్రజాస్వామ్యం – రూపుదిద్దుకుంటున్న భావన Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
జవాబుదారీ, బాధ్యతాయుత, చట్టబద్ధ ప్రభుత్వం ఉండేలా ప్రజాస్వామ్యం ఎలా చూస్తుంది? (AS1)
జవాబు:

  1. ప్రజాస్వామ్యం అంటే అంతిమంగా ప్రజల నుంచి అధికారం పొంది, దానికి జవాబుదారీగా ఉండే ప్రభుత్వం.
  2. దీనిలో ప్రజాప్రతినిధులను ఎప్పటికప్పుడు కొంతకాలానికి ఎన్నుకుంటారు.
  3. ఎన్నికైన ప్రజాప్రతినిధులు వివిధ రకాలుగా ప్రజలకు జవాబుదారీగా ఉంటారు.
  4. ప్రజలు ఎన్నుకున్న శాసనసభలలో ప్రభుత్వ పక్ష ప్రతినిధులు తమ పనిని వివరించాలి, పనుల ప్రణాళికను ఈ శాసనసభలే ఆమోదించాలి.
  5. ప్రభుత్వం చేసిన పనికి సంబంధించిన సమాచారాన్ని ఏ పౌరుడైనా అడగవచ్చు. ఆ సమాచారాన్ని ఇవ్వవలసిన బాధ్యత ప్రభుత్వానిది. అన్నిటికీ మించి నిర్దిష్ట కాలం తరువాత మళ్ళీ ఎన్నికలుంటాయి.
  6. ప్రజాప్రతినిధులు మళ్ళీ ప్రజల మద్దతును పొందవలసి ఉంటుంది.
  7. వాళ్ళు చేసిన పనిని వివరించమని అడిగి అది సంతృప్తికరంగా లేనప్పుడు ప్రజలు వాళ్లను తిరస్కరించవచ్చు.

ప్రశ్న 2.
సామాజిక వైవిధ్యతలను కలుపుకుని వెళ్లే స్వభావాన్ని ప్రజాస్వామ్యాలు ఏ స్థితిలో ప్రదర్శిస్తాయి? (AS1)
జవాబు:

  1. ప్రజల పాలన అని. అన్నప్పుడు వయోజనులైన అందరూ అని అర్థం.
  2. వాళ్ళు పురుషులు కావచ్చు, స్త్రీలు కావచ్చు, ధనికులు కావచ్చు,. పేదవాళ్ళు కావచ్చు. నల్లవాళ్లు కావచ్చు, తెల్లవాళ్లు కావచ్చు, హిందువులు లేదా క్రిస్టియన్లు లేదా ముస్లింలు లేదా నాస్తికులు కావచ్చు. ఏ భాష మాట్లాడే వాళ్లేనా కావచ్చు. ఈ భావన ఏర్పడటానికి చాలాకాలం పట్టింది.
  3. సూచికగా ఎన్నికలలో ఓటు చేసే హక్కును తీసుకుందాం.
  4. మొదట్లో ఆస్తి ఉన్న కొంతమంది పురుషులకు మాత్రమే ఓటుహక్కు ఉండేది.
  5. క్రమేపీ కొన్ని దేశాలలో ఈ హక్కును పేదవాళ్ళకు కల్పించారు. ఆ తరువాత అది మహిళలకు లభించింది.
  6. చివరికి అన్ని మతాల, జాతుల వాళ్ళకు ఓటు హక్కు లభించింది.
  7. 1920 నుంచి అమెరికాలో శ్వేతజాతి మహిళలకు ఓటుహక్కు లభించింది.
  8. 1965 లో నల్లజాతీయులైన పౌరుల ఓటు హక్కుపై వివక్షతను తొలగించింది.
  9. న్యూజీలాండ్ 1893లోనే అన్ని వర్గాల ప్రజలకు ఓటుహక్కు కల్పించిన మొదటి దేశం.
  10. సార్వజనీన ఓటుహక్కు కల్పించిన తొలి పెద్ద దేశం యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్.

రాజకీయ సమానత్వం, అందరినీ కలుపుకోవటం అన్న మౌలిక సూత్రంపై ప్రజాస్వామ్యం ఆధారపడి ఉంది. ప్రజాస్వామ్యంలో వయోజనులైన ప్రతి ఒక్క పౌరునికి ఒక ఓటుహక్కు ఉండాలి. ప్రతి ‘ఓటుకు సమాన విలువ ఉండాలి.

AP Board 9th Class Social Solutions Chapter 20 ప్రజాస్వామ్యం – రూపుదిద్దుకుంటున్న భావన

ప్రశ్న 3.
కింద వ్యాఖ్యానాలను సమర్ధించటానికి వ్యతిరేకించటానికి మీ వాదనలు పేర్కొనండి : (AS2)
అ. పారిశ్రామిక దేశాలు ప్రజాస్వామ్య విధానాన్ని అనుసరించగలవు, కానీ పేద దేశాలు ధనిక దేశాలు కావాలంటే నియంతృత్వం ఉండాలి.
జవాబు:
పేద దేశాలు ధనిక దేశాలు కావాలంటే నియంతృత్వం కన్నా ప్రజాస్వామ్యం ఉంటేనే బాగుంటుంది.

కారణం ప్రజాస్వామ్య దేశాలలో ప్రభుత్వ కార్యక్రమాల రూపకల్పనలోను, ప్రభుత్వ విధానాలు, చట్టాలు తయారు చేయటంలో, వాటిని అమలు చేయటంలో ప్రజలు భాగస్వాములు కావాలి. ప్రజలందరూ బహిరంగంగా పాల్గొని తమ అవసరాలు, అభిప్రాయాలు స్పష్టంగా పేర్కొనేలా బహిరంగ చర్చలు జరపాలి తరువాత చట్టాలు, విధానాలు రూపొందించాలి ఆ విధంగా ప్రజల సంక్షేమ పథకాలు అమలు చేయటం వల్ల ప్రజలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా సమాన అవకాశాలు పొందుతారు. అందువలన పేద దేశాలు కూడా ధనిక దేశాలుగా మారతాయి.

పారదర్శకత (దాపరికం లేని పరిపాలన), అమలు జరిగినపుడు,. అవినీతి, అన్యాయం, లంచగొండితనం వంటివి లేనప్పుడు పేదదేశాలు ప్రజాస్వామ్యాన్ని అమలు చేసినప్పటికీ ధనిక దేశాలుగా మారతాయి.

అందువల్ల పేద దేశాలు ధనిక దేశాలు కావాలంటే నియంతృత్వం కన్నా ప్రజాస్వామ్యమే మేలు.

ఆ. పౌరుల మధ్య ఆదాయాలలో అసమానతలను ప్రజాస్వామ్యం తగ్గించలేదు.
జవాబు:

  1. సమాజం ధనిక – పేదలుగా, పైకులాలు – దళితులుగా విభజింపబడి ఉంటే రాజకీయ సమానత్వం అర్థరహితం అవుతుంది.
  2. ఉన్నత హెూదా, సంపద ఉన్నవాళ్ళు తమకు అనుకూలంగా ఓటు వేయమని మిగిలిన వాళ్లని తేలికగా ప్రభావితం చేయగలుగుతారు.
  3. చాలా కుటుంబాలలో ఆ కుటుంబానికి పెద్ద అయిన పురుషుడు మహిళలతో సహా కుటుంబ సభ్యులందరూ ఎవరికి ఓటు వేయాలో నిర్ణయిస్తారు.
  4. అమెరికా వంటి అనేక దేశాలలో అనేక ప్రసార సాధనాలు ధనిక కార్పొరేట్ సంస్థలు లేదా వ్యక్తుల చేతుల్లో ఉంటాయి.
  5. దేనిని ఎక్కువగా ప్రసారం చేస్తారు ? దేనిని విస్మరిస్తారు ? అన్న దానిని బట్టి వీళ్ళు ప్రజాభిప్రాయాన్ని తీర్చిదిద్దుతారు. ప్రభావితం చేస్తారు.
  6. సంపన్నులకు, శక్తిమంతులకు శాసనసభ్యులు, మంత్రులు అందుబాటులో ఉంటారు. కాబట్టి వాళ్ళు విధానాలను, కార్యక్రమాలను ప్రభావితం చేయగలుగుతారు.
  7. ఇంకోవైపున పేదలకు నిరక్షరాస్యులకు ప్రభుత్వ వర్గాలు ఈ విధంగా అందుబాటులో ఉండవు కాబట్టి అనేక దేశాల ప్రభుత్వాలు ధనికులకు అనుకూలంగా, పేదల ప్రయోజనాలకు విరుద్దంగా ఉండే విధానాలను అనుసరిస్తుంటాయి.
  8. కాబట్టి రాజకీయ సమానత్వంతో పాటు సామాజిక, ఆర్థిక సమానత్వం ఉంటే తప్ప పౌరుల మధ్య ఆదాయాలలో అసమానతలను ప్రజాస్వామ్యం తగ్గించలేదు.

ఇ. పేద దేశాలలోని ప్రభుత్వాలు పేదరికం తగ్గించటం, ఆరోగ్యం , విద్యల పై తక్కువ ఖర్చు చేసి, పరిశ్రమలకు, మౌలిక సదుపాయాలకు ఎక్కువ ఖర్చు చేయాలి.
జవాబు:
పేద దేశాలలోని ప్రభుత్వాలు పేదరికం తగ్గించటం, ఆరోగ్యం , విద్యలపై తక్కువ ఖర్చుచేసి, పరిశ్రమలకు మౌలిక సదుపాయాలకు ఎక్కువ ఖర్చు చేయడానికి కారణం.

అర్థశాస్త్ర పరిభాషలో వ్యయాలు రెండు రకాలు :

  1. ఉత్పాదక వ్యయం
  2. అనుత్పాదక వ్యయం

ఉత్పాదక వ్యయం అనగా పరిశ్రమలు, వ్యవసాయంపై చేసే వ్యయం.

అనుత్పాదక వ్యయం అనగా రోడ్లు, భవనాలపై చేసే వ్యయం.

అందువలన పేద దేశాలు ఉత్పాదక వ్యయం మీద ఎక్కువ ఖర్చు చేస్తాయి. అనుత్పాదక వ్యయంపై చేసే వ్యయం వలన అదనపు రాబడులు ఏమీరావు.

ఈ. ప్రజాస్వామ్యంలో పౌరులందరికీ ఒక ఓటు ఉంటుంది కాబట్టి ఆధిపత్యానికి, ఘర్షణలకు తావు ఉండదు.
జవాబు:
ప్రజాస్వామ్యంలో పౌరులందరికీ ఒక ఓటు ఉంటుంది. పౌరుల మధ్య ఓటు హక్కు విషయంలో ఏ విధమైన వ్యత్యాసం ఉండదు. ప్రతి ఓటుకీ సమాన విలువ ఉంటుంది.

పురుషులు, స్త్రీలు, ధనికులు, పేదలు, నల్లవాళ్ళు, తెల్లవాళ్ళు, హిందువులు, క్రిస్టియన్లు లేదా ముస్లింలు లేదా నాస్తికులు అయినా, ఏ భాష మాట్లాడేవారైనా ఎవరికైనా ఓటుహక్కు ఉంటుంది కాబట్టి ఏ విధమైన వ్యత్యాసం ఉండదు. కావున ఏ విధమైన ఆధిపత్యానికీ, ఘర్షణలకూ తావు ఉండదు.

ప్రశ్న 4.
ప్రజాస్వామ్యాన్ని అంచనా వేయటంలో కింద ఉన్న వాటిల్లో ఏది వర్తించదు? (AS1)
ప్రజాస్వామ్యంలో :
అ. స్వేచ్ఛాయుత ఎన్నికలు
ఆ. వ్యక్తి గౌరవం
ఇ. అధిక సంఖ్యాకుల పాలన
ఈ. చట్టం ముందు అందరూ సమానులు
జవాబు:
ఆ. వ్యక్తి గౌరవం .

AP Board 9th Class Social Solutions Chapter 20 ప్రజాస్వామ్యం – రూపుదిద్దుకుంటున్న భావన

ప్రశ్న 5.
ప్రజాస్వామ్యంలో రాజకీయ, సామాజిక అసమానతలపై అధ్యయనం ఈ కింది విషయాన్ని వెల్లడి చేస్తోంది. (AS1)
అ. ప్రజాస్వామ్యం, అభివృద్ధి కలిసి ఉంటాయి.
ఆ. ప్రజాస్వామ్యంలో అసమానతలు ఉంటాయి.
ఇ. నియంతృత్వంలో అసమానతలు ఉండవు
ఈ. ప్రజాస్వామ్యం కంటే నియంతృత్వం మంచిది.
జవాబు:
(ఆ) ప్రజాస్వామ్యంలో అసమానతలు ఉంటాయి.

ప్రశ్న 6.
ఆరు దేశాలకు సంబంధించిన సమాచారం దిగువన ఉంది. ఈ సమాచారాన్ని బట్టి ఆయా దేశాలను ఏ రకంగా వర్గీకరిస్తారు? ఒక్కొక్కదాని ఎదురుగా “ప్రజాస్వామికం’ లేదా ‘అప్రజాస్వామికం’ లేదా ‘ఖచ్చితంగా చెప్పలేం’ అని రాయండి. (AS1)
దేశం (అ) : దేశ అధికారిక మతాన్ని అంగీకరించని ప్రజలకు ఓటు హక్కు ఉండదు.
దేశం (ఆ) : ఒకే పార్టీ గత ఇరవై సంవత్సరాలుగా ఎన్నికలలో గెలుస్తోంది.
దేశం (ఇ) : గత ఎన్నికలలో అధికారంలో ఉన్న పార్టీ ఓడిపోయింది.
దేశం (ఈ) : సైన్యాధిపతి ఆమోదం లేకుండా సైన్యానికి సంబంధించిన చట్టాన్ని పార్లమెంటు చేయలేదు.
దేశం (ఉ) : న్యాయవ్యవస్థ అధికారాలను తగ్గిస్తూ పార్లమెంటు చట్టం చేయలేదు.
దేశం (ఊ) : దేశానికి సంబంధించి ముఖ్య ఆర్థిక నిర్ణయాలన్నీ కేంద్ర బ్యాంకు అధికారులు తీసుకుంటారు, వీటిని మంత్రులు మార్చలేరు.
జవాబు:
దేశం (అ) : ప్రజాస్వామికం
దేశం (ఆ) : ప్రజాస్వామికం
దేశం (ఇ) : ప్రజాస్వామికం
దేశం (ఈ) : అప్రజాస్వామికం
దేశం (ఉ) : ప్రజాస్వామికం
దేశం (ఊ) : అప్రజాస్వామికం

ప్రశ్న 7.
కింద ఉన్న ప్రతి వాక్యంలో ప్రజాస్వామిక, అప్రజాస్వామిక అంశాలు ఉన్నాయి. ప్రతి వాక్యానికి ఆ రెండింటినీ వేరుగా రాయండి. (AS1)
అ. ప్రపంచ వాణిజ్య సంస్థ నిర్ణయించిన నియంత్రణలకు లోబడి పార్లమెంటు కొన్ని చట్టాలు చేయాలని మంత్రి చెప్పారు. –  ప్రజాస్వామికం

ప్రపంచ వాణిజ్య సంస్థ నిర్ణయించిన నియంత్రణలకు లోబడి పార్లమెంటు . కొన్ని చట్టాలు చేయవలసిన అవసరం లేదు అని మంత్రి చెప్పారు. – అప్రజాస్వామికం

ఆ. పెద్ద ఎత్తున రిగ్గింగ్ జరిగిందని నివేదికలు వచ్చిన నియోజకవర్గంలో మళ్ళీ ఎన్నికలను నిర్వహించవలసిందిగా ఎన్నికల సంఘం ఆదేశించింది. – ప్రజాస్వామికం

పెద్ద ఎత్తున రిగ్గింగ్ జరిగిందని నివేదికలు వచ్చిన నియోజకవర్గంలో మళ్ళీ ఎన్నికలు నిర్వహించవలసిందిగా ఎన్నికల సంఘం ఆదేశించలేదు. – అప్రజాస్వామికం

పార్లమెంటులో మహిళల ప్రాతినిధ్యం ఏనాడూ 10 శాతం మించలేదు. ఈ కారణంగా పార్లమెంటులో మూడవ వంతు సీట్లు మహిళలకు కేటాయించాలని మహిళా సంఘాలు ఉద్యమం మొదలు పెట్టాయి. – ప్రజాస్వామికం

పార్లమెంటులో మహిళల ప్రాతినిధ్యం ఏనాడూ 10 శాతం మించలేదు. ఈ కారణంగా పార్లమెంటులో మూడవ వంతు సీట్లు మహిళలకు కేటాయించాలని మహిళా సంఘాలు ఉద్యమం మొదలు పెట్టలేదు. అసలు ఆ ప్రస్తావన కూడా తేలేదు. – అప్రజాస్వామికం

ప్రశ్న 8.
ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఉన్న కింది వాదనలకు మీ ప్రతిస్పందన రాయండి : (AS4)
అ. దేశంలో అత్యంత క్రమశిక్షణ ఉండి, అవినీతిలేని వ్యవస్థ సైన్యం ఒక్కటే. కాబట్టి దేశాన్ని సైన్యం పరిపాలించాలి.
జవాబు:
సైన్యం పరిపాలిస్తే బాగుంటుంది కానీ ప్రజల సమస్యలు సైన్యానికి అంతగా తెలియవు. తెలిసిన వాటిని చేయాలి అనే దృఢ సంకల్పం సైన్యానికి ఉండకపోవచ్చు. కారణం. సైన్యం అనేది ఉద్యోగస్వామ్యం మాత్రమే. ప్రజాసమస్యలు ప్రజాస్వామ్యంలోనే చక్కగా పరిష్కరింపబడతాయి. కానీ నాయకులలో అవినీతి, బంధుప్రీతి, లంచగొండితనం వంటి అంశాలు లేకపోతే ప్రజాస్వామ్యంలో దేశం త్వరితగతిన అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. ప్రజాస్వామ్యంలో నాయకులు ప్రజలనుండి వస్తారు కాబట్టి ప్రజాసమస్యలు బాగా పరిష్కరింపబడతాయి.

ఆ. అధిక సంఖ్యాకుల పాలన అంటే ఏమీ తెలియని ప్రజల పాలన. తక్కువ సంఖ్యలో ఉన్నప్పటికీ మనకు కావలసింది విజ్ఞుల పాలన.
జవాబు:
అధిక సంఖ్యాకుల పాలన ఆంటే ప్రజలందరి పాలన. అనగా ప్రత్యక్ష ప్రజాస్వామ్యం. ప్రజలందరు ప్రభుత్వ కార్యకలాపాలలో భాగస్వాములు కావడం.

తక్కువ సంఖ్యలో ఉన్నప్పటికీ మనకి కావలసింది విజ్ఞుల పాలన. అనగా ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం. ప్రజలు విజ్ఞులైన నాయకులను ఎన్నుకొని వారి ద్వారా పరిపాలింపబడడం. ఇలాంటి విధానం వలన సమయం ధనం ఆదా కావడానికి అవకాశం ఉంటుంది.

ఇ. ఆధ్యాత్మిక విషయాలలో మతగురువుల మార్గదర్శనం కోరుకున్నప్పుడు రాజకీయాల్లో కూడా మార్గదర్శనం చేయమని ఎందుకు అడగకూడదు? దేశాన్ని మతగురువులు పరిపాలించాలి.
జవాబు:
ఆధ్యాత్మిక విషయాలలో మత గురువులు. కానీ వారు రాజనీతిలో కాని రాజకీయాలలోకాని, సంక్షేమ పథకాల రూపకల్పనలో, కాని, వాటిని అమలు చేయడంలో కాని మత గురువులకు అవగాహన ఉండవలసిన అవసరం ఉండదు. కాబట్టి దాని పట్ల వారికి సరైన అవగాహన ఉండకపోవచ్చు. పైగా మత గురువులు మతపరమైన విషయాలపట్ల చూపించిన ప్రతిభ రాజకీయ, ప్రజాపాలన విషయాలలో చూపించకపోవచ్చును, మతం అనేది మత్తుమందు లాంటిది. రాజకీయాలు ఆ విధమైనవి కావు.

ప్రశ్న 9.
ప్రపంచ పటంలో ఈ క్రింది దేశాలను గుర్తించండి. (AS5)
అ) శ్రీలంక
ఆ) బెల్జియం
ఇ) రష్యా
ఈ) అమెరికా (యు.ఎస్.ఎ)
AP Board 9th Class Social Solutions Chapter 20 ప్రజాస్వామ్యం – రూపుదిద్దుకుంటున్న భావన 1

ప్రశ్న 10.
‘పౌరుల గౌరవం, స్వేచ్ఛ’ అనే శీర్షిక కింద గల మొదటి రెండు పేరాలు చదివి దిగువ ప్రశ్నకు సమాధానం ఇవ్వండి :
ప్రజాస్వామిక దేశంలో పౌరుల గౌరవం, స్వేచ్ఛ గురించి మీ సొంతమాటల్లో రాయండి. (AS2)
జవాబు:
వ్యక్తి గౌరవాన్ని, స్వేచ్ఛని కాపాడటంలో వివిధ రకాల ప్రభుత్వాలలో ప్రజాస్వామ్యం మెరుగైనది.

ప్రతి వ్యక్తికీ తోటి మానవుల నుంచి గౌరవం పొందాలని ఉంటుంది.

తనకు తగినంత మర్యాద ఇవ్వటం లేదని భావించినందువల్లనే తరచు వ్యక్తుల మధ్య ఘర్షణలు తలెత్తుతుంటాయి. • గౌరవం, స్వేచ్ఛల పట్ల నిబద్దతే ప్రజాస్వామ్యానికి పునాది. ప్రపంచ వ్యాప్తంగా ఈ విషయాన్ని కనీసం సూత్రబద్దంగానైనా ప్రజాస్వామిక దేశాలు గుర్తించాయి.

దీనిని వివిధ ప్రజాస్వామ్యాలలో వివిధ స్థాయిలలో సాధించారు. ఆధిపత్యం, పరాధీనత ఆధారంగా తరతరాలుగా నడిచిన సమాజాలలో అందరూ సమానం అని అంగీకరించటం అంత తేలికైన విషయం కాదు.

ప్రశ్న 11.
ప్రజలు ప్రజాస్వామ్యం కొరకు పోరాడడానికి గల కారణాలను తెల్పండి.
జవాబు:
తరతరాలుగా రాచరిక, నియంతృత్వ పరిపాలనపై ప్రజల గౌరవానికి, స్వేచ్ఛకు విలువ లేకుండా, ప్రజల భాగస్వామ్యంతో పరిపాలన కొనసాగించడంపై ప్రజలు ఎదిరించారు. పౌరుల హక్కులకు భంగం వాటిల్లినప్పుడు, బాధ్యత లేని పరిపాలన కొనసాగినప్పుడు ప్రజలు, రాచరిక పునాదులపై నడిచే ప్రభుత్వాలను, సైనిక పాలనలను సైతం ప్రజలు తిరస్కరించారు. సమానత్వ సూత్రంపై నడిచే, ప్రజల సంక్షేమం, ఉపాధి మెరుగుపరిచే ప్రజాస్వామ్యంపై ప్రజలు ఇష్టత చూపించారు. కుల ఆధారిత అసమానతలు, అత్యాచారాలు, వ్యక్తికి చట్టపర నైతిక విలువలు లేని పాలనను కాదని ప్రజాస్వామ్యం కావాలన్నారు.

AP Board 9th Class Social Solutions Chapter 20 ప్రజాస్వామ్యం – రూపుదిద్దుకుంటున్న భావన

ప్రశ్న 12.
మన పాఠశాలల్లో ప్రజాస్వామ్యం అమలు జరుగుతుందనడానికి కొన్ని ఉదాహరణలు ఇవ్వండి. (AS6)
జవాబు:
మన పాఠశాలల్లో ప్రజాస్వామ్యం జరుగుతుంది అనడానికి కొన్ని ఉదాహరణలు :

  1. మన పాఠశాలల్లో కులమతాలు, ధనిక, పేదాయని భేదం లేకుండా అందరికీ యూనిఫారమ్స్ ధారణ ద్వారా సమానత్వం లభిస్తుంది.
  2. అదేవిధంగా తరగతులు, ఆర్థిక స్తోమతతో సంబంధం లేకుండా అందరికీ మధ్యాహ్న భోజనం అందించబడుతుంది.
  3. అన్ని మతాల పండుగలకు ప్రాధాన్యతనిస్తూ ఆ రోజులలో సెలవును మంజూరు చేయడమే కాకుండా స్థానిక ప్రాంత పండుగలకు కూడా ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది.
  4. తరగతి నాయకుడి ఎన్నిక కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో మెజార్టీ విద్యార్ధుల అభిప్రాయం మేరకు, ఎన్నిక ప్రకారం ఎంపిక చేయడం జరుగుతుంది.
  5. పేదవారికి, వెనుకబడిన వారికి ఆర్థికంగా చేయూత నందించుటకుగాను స్కాలర్ షిప్స్, ఆర్థిక పథకాలు అందించడం జరుగుతుంది.

9th Class Social Studies 20th Lesson ప్రజాస్వామ్యం – రూపుదిద్దుకుంటున్న భావన InText Questions and Answers

9th Class Social Textbook Page No.247

ప్రశ్న 1.
పరిపాలనలో భాగస్వాములు కావటం ప్రజలకు ఎందుకు ఇష్టం ఉండదు? సరైన అవగాహన లేకపోవటం వల్లనా, ఆసక్తి లేకనా, లేక తమ అభిప్రాయానికి విలువ ఉండదని భావించటం వల్లనా?
జవాబు:

  1. ప్రజాస్వామ్యం అంటే ప్రజలు కేవలం ఎన్నికల్లో పాల్గొని, పాలకులను ఎన్నుకోవటం మాత్రమే కాదు.
  2. ప్రభుత్వ విధానాలు, చట్టాలు తయారు చేయటంలో, వాటిని అమలు చేయటంలో కూడా ప్రజలు భాగస్వాములు కావాలి.
  3. ప్రజలందరూ బహిరంగంగా పాల్గొని తమ అవసరాలు, అభిప్రాయాలు స్పష్టంగా పేర్కొనేలా బహిరంగ చర్చలు జరిపిన తరువాత ,చట్టాలు, విధానాలు రూపొందించినప్పుడు ఇది సాధ్యమవుతుంది.
  4. స్వతంత్ర పౌర సంఘాలుగా ఏర్పడి చట్టాలు, విధానాలు సమర్థంగా అమలు అయ్యేలా చూడటంలో ప్రజలు భాగస్వాములు కావాలి.
  5. అనేక దేశాలలో ఎన్నికైనా ప్రభుత్వాలు కూడా ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించవు. పైగా దానిని అడ్డుకుంటాయి.
  6. ప్రజలు కూడా దేశ వ్యవహారాలలో అంత ఆసక్తి చూపకుండా ఉదాసీనంగా ఉండిపోతారు.
  7. కారణం ప్రజలందరికి పరిపాలన పట్ల అవగాహన లేకపోవడం, ఆసక్తి చూపకపోవడం.
  8. ఒకవేళ ఆసక్తి చూపినా పాలకులు వారి అభిప్రాయాలను పరిగణనలోనికి తీసుకోకపోవడం.

9th Class Social Textbook Page No.248

ప్రశ్న 2.
ప్రపంచంలో అనేక ప్రభుత్వాలు ప్రజలకు పౌరహక్కులను ఇచ్చాయి. అయితే ప్రజల ఫోనులను టాపింగ్ చేయటం, వాళ్ళ ఉత్తరాలు చదవటం, వాళ్ళ కార్యకలాపాలపై నిఘా ఉంచటం వంటి చర్యలు చేపడతాయి. ఇది సరైనదేనా?
జవాబు:

  1. ప్రజాస్వామ్యానికి పౌరహక్కులు ఉండాలి.
  2. తెలుసుకోటానికి, చర్చించటానికి, స్వతంత్ర అభిప్రాయాలు ఏర్పరచుకోటానికి, వాటిని వ్యక్తపరచటానికి సంఘాలుగా ఏర్పడి తమ భావాల అమలుకు పోరాడటానికి పౌరులకు స్వేచ్ఛ ఉన్నప్పుడే వాళ్ళు నిర్ణయాలు తీసుకోవటంలో భాగస్వాములు అవుతారు.
  3. అంతేకాని ప్రజల ఫోనులను టాపింగ్ చేయటం, వాళ్ళ ఉత్తరాలు చదవటం, వాళ్ల కార్యకలాపాలపై నిఘా ఉంచడం వంటి చర్యల వల్ల వాళ్ళ భావ ప్రకటన స్వేచ్ఛను హరించివేయడమే అవుతుంది.
  4. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది సరైనదికాదు.

AP Board 9th Class Social Solutions Chapter 20 ప్రజాస్వామ్యం – రూపుదిద్దుకుంటున్న భావన

ప్రశ్న 3.
ప్రజాస్వామికంగా, ప్రజలందరి ప్రయోజనాల కోసం పనిచేసే ప్రభుత్వాలు ఉన్నప్పటికీ అనేక దేశాలలో తీవ్రస్థాయిలో అసమానతలు ఎందుకు కొనసాగుతున్నాయి?
జవాబు:

  1. అనేక దేశాల ప్రభుత్వాలు ధనికులకు అనుకూలంగా, పేదల ప్రయోజనాలకు విరుద్ధంగా ఉండే విధానాలను అనుసరిస్తూ ఉంటాయి.
  2. ప్రజాస్వామికంగా ప్రజలందరి ప్రయోజనాల కోసం పనిచేసే ప్రభుత్వాలు ఉన్నప్పటికీ అనేక దేశాలలో తీవ్ర స్థాయిలో అసమానతలు ఉండటానికి కారణాలు.
    అ) తరతరాలుగా వస్తున్న వారసత్వపు సంపద.
    ఆ) ఉన్నత వర్గాలకు చెందినవారు మంచి విద్య, ఉద్యోగావకాశాలు పొందడం.
    ఇ) సంపద మరికొంత సంపదను సముపార్జించి పెట్టడం.
    ఈ) ఉన్న వర్గాలకు చెందినవారు పారిశ్రామిక, వాణిజ్య వర్గాలపై ఆధిపత్యం చెలాయించడం.
    ఉ) ఆలోచనా విధానాలలోనూ మార్పులు రావడం.

9th Class Social Textbook Page No.250

ప్రశ్న 4.
మన దేశంలోని ఎన్నికలను ఉదాహరణగా తీసుకుందాం. ఒక ప్రాంతంలో ఉంటున్న వాళ్ళలో 1000 మందికి ఓటు హక్కు ఉందని అనుకుందాం. సాధారణంగా ఎన్నికల్లో 60 శాతం ఓటర్లు మాత్రమే తమ ఓటు హక్కుని ఉపయోగించుకుంటారు. అంటే ఎన్నికల్లో 600 మంది ఓటు వేస్తారు. ఎన్నికల్లో 10 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారని అనుకుందాం. గెలిచిన అభ్యర్థికి 250 ఓట్లు, రెండవ అభ్యర్థికి 200 ఓట్లు, మిగిలిన 8 మందికి కలిపి 150 ఓట్లు పడ్డాయని అనుకుందాం. 250 . ఓట్లు వచ్చిన వ్యక్తి గెలిచినట్లు ప్రకటిస్తారు. ఆ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజల ప్రయోజనాలకు, దృక్పథాలకు గెలిచిన అభ్యర్థి ఏ మేరకు ప్రాతినిధ్యం వహిస్తారు? గెలిచిన అభ్యర్థికి ఓటర్లలో 25 శాతం మద్దతు మాత్రమే ఉంది. ఇది న్యాయమైన ప్రజాస్వామిక ఏర్పాటేనా? నిర్ణయాలు తీసుకునే సంస్థలకు ప్రజల ప్రతినిధులను ఎన్నుకోటానికి మరో విధానం ఏమైనా ఉందా?
జవాబు:
మన దేశంలోని ఎన్నికలను ఉదాహరణగా తీసుకుందాం. ఒక ప్రాంతంలో ఉంటున్న వాళ్ళలో 1000కి ఓటుహక్కు ఉందని అనుకుందాం. సాధారణంగా ఎన్నికల్లో 60 శాతం ఓటర్లు మాత్రమే తమ ఓటుహక్కుని ఉపయోగించుకుంటారు. అనగా ఎన్నికల్లో 600 మంది ఓటు వేస్తారు. అయితే ఎన్నికల్లో 10 మంది అభ్యర్థులు పోటీచేస్తున్నారని అనుకుందాం. గెలిచిన అభ్యర్థికి 250 ఓట్లు, రెండవ అభ్యర్థికి 200 ఓట్లు, మిగిలిన 8 మందికి కలిపి 150 ఓట్లు పడ్డాయని అనుకుందాం. కానీ 250 ఓట్లు వచ్చిన వ్యక్తి గెలిచినట్లు ప్రకటిస్తారు. అయితే అతను ఆ 250 మందికి మాత్రమే ప్రతినిధిగా కాకుండా ప్రజలందరికి ప్రతినిధిగా వ్యవహరిస్తాడు.

ప్రజలందరికి అభిప్రాయాలను తెలుసుకుంటాడు. ప్రజలందరికి ప్రాతినిధ్యం వహిస్తాడు. ప్రజలందరికి సంక్షేమ పథకాలను వర్తింపచేస్తాడు. ప్రజలందరికి అవసరాలు తీర్చటానికి కృషి చేస్తాడు. అందువల్ల ఇది న్యాయమైన ప్రజాస్వామిక వ్యవస్థగానే కొనసాగుతుంది. నిర్ణయాలు తీసుకునే సంస్థలకు ప్రజల ప్రతినిధులను ఎన్నుకోటానికి మరో విధానం.

  1. ప్రజలకు ఓటు చేసే హక్కుతో పాటు తిరస్కరించే అధికారం కూడా ఇవ్వాలి.
  2. ఎక్కువమంది ప్రజలు తిరస్కరించిన అభ్యర్థి గెలిచినట్లు ప్రకటించరాదు.
  3. అనుకూలమైన ఓట్లతో పాటు వ్యతిరేకమైన ఓట్లను కూడా పరిగణనలోనికి తీసుకోవాలి.

9th Class Social Textbook Page No.254

ప్రశ్న 5.
సామాజిక, మత, భాషాపర వైవిధ్యతలను కలుపుకుని వెళ్ళటానికి ఈ రెండు (బెల్జియం, శ్రీలంక) దేశాలు అనుసరించిన మార్గాలను చర్చించండి.
జవాబు:
బెల్జియం, శ్రీలంకలు రెండు ప్రజాస్వామిక దేశాలే అయినప్పటికీ రెండు దేశాలు అధికారాన్ని పంచుకోవటంలో భిన్నమైన మార్గాలు అవలంబించాయి.

1) బెల్జియం :
వివిధ ప్రాంతాల ప్రజల ప్రయోజనాలు, భావనలను మన్నించినపుడే దేశం ఐక్యంగా ఉంటుందని బెల్జియం నాయకులు గుర్తించారు. ఈ అవగాహన కారణంగా అధికారాన్ని పంచుకోటానికి అందరికీ ఆమోదయోగ్యమైన ఏర్పాట్లు చేసుకున్నారు.

2) శ్రీలంక :
అధిక సంఖ్యలో ఉన్న ప్రజలు అధికారాన్ని పంచుకోటానికి ఇష్టపడక తమ ఆధిపత్యాన్ని ఇతరులపై రుద్దాలని ప్రయత్నించినపుడు దేశ సమైక్యత దెబ్బ తింటుందని, అంతర్యుద్ధాలు, పౌర యుద్ధాల కారణంగా దేశం వందల సంవత్సరాలు వెనుకబడుతుందని శ్రీలంక నిరూపించింది.

ప్రాజెక్టు

ప్రశ్న 1.
మీ ఉపాధ్యాయుని సహాయంతో తరగతి ప్రతినిధిని ఎన్నుకోటానికి తరగతిలో ఎన్నికలు నిర్వహించండి.

AP Board 9th Class Social Solutions Chapter 18 భారతదేశంపై వలసవాద ప్రభావం

SCERT AP 9th Class Social Studies Guide Pdf 18th Lesson భారతదేశంపై వలసవాద ప్రభావం Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Social Solutions 18th Lesson భారతదేశంపై వలసవాద ప్రభావం

9th Class Social Studies 18th Lesson భారతదేశంపై వలసవాద ప్రభావం Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
బ్రిటిష్ పాలనకు ముందు ప్రజలు అడవులను ఎలా ఉపయోగించుకున్నారు ? ఆ రోజుల్లో అడవులు, పూర్తిగా నాశనమయ్యే అవకాశం అంత ఎక్కువగా ఎందుకు లేదు? (AS1)
జవాబు:
అనాదిగా అడవులలో నివసిస్తున్న ప్రజలు, ఆదివాసీలు తమ రోజువారీ జీవితాలకు కావలసిన అనేక వస్తువులను అడవుల నుండి పొందేవాళ్ళు. ఒక విధంగా అడవుల యజమానులు వాళ్ళే. వేటాడడానికి దుంపలు, పళ్ళు, పూలు, మూలికలు సేకరించటానికి, పశువులను మేపుకోవడానికి అడవులను ఉపయోగించుకునే వాళ్ళు. లాభాల కోసం అడవిలో లభించే కలప, ఇతర వస్తువులను అమ్మే వాళ్ళుకాదు.

వ్యవసాయ భూముల కోసం అడవులను నరికినప్పటికీ రైతులు, ఆదివాసీల మధ్య ఘర్షణలు ఉన్నప్పటికీ అడవి కింద విస్తార భూభాగాలు ఉండేవి. అడవులను ఉపయోగించుకున్నప్పటికీ ప్రజలు వాటిని రక్షించే వాళ్ళు. కలపకు పెద్ద చెట్లు నరికి, కొత్త చెట్లను పెరగనిచ్చేవాళ్ళు. విచ్చలవిడిగా విశాల పరిధిలో అడవులను వాళ్ళు నరికెయ్యలేదు. అందువల్ల అడవులు పూర్తిగా నాశమయ్యే అవకాశం అంత ఎక్కువగా లేదు.

ప్రశ్న 2.
ఆదివాసీలు ఎవరికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు? తమ కోపాన్ని, నిరసననీ వాళ్ళు ఎలా వ్యక్తం చేశారు? కొన్ని – ఉదాహరణలు ఇవ్వండి. (AS1)
జవాబు:
బ్రిటిష్ పరిపాలనకు ముందు ఆదివాసీలు అడవిలో లభించే అనేక ఫలసాయాన్ని, అటవీ ఉత్పత్తులను అమ్ముకొని, జీవించేవాళ్ళు. లాభాల కోసం అడవిలో లభించే కలప, ఇతర వస్తువులను అమ్మేవాళ్ళు కాదు. కానీ బ్రిటిష్ వారి పాలనలో ఆదివాసీల జీవితాలు దుర్భరమైనాయి. వారి జీవన పరిస్థితులు పూర్తిగా దిగజారిపోయాయి. మధ్యప్రదేశ్, తక్కువ సంఖ్యలో ఉండడం వల్ల పారిశ్రామిక అభివృద్ధికి విదేశస్థులపై ఆధారపడవలసి వచ్చేది. స్వాతంత్ర్యం తరువాత . కూడా విద్యకు తగినంత ప్రాముఖ్యత ఇవ్వకపోవడం వల్ల అంతగా చదువుకోని కార్మికశక్తి పారిశ్రామిక అభివృద్ధికి ఆటంకంగా కొనసాగింది.

ఛత్తీస్ గఢ్ కు చెందిన బైగా, మురియా, గోండ్, భిల్ జాతులు, ఆంధ్రప్రదేశ్ కి చెందిన కోయ, రెడ్డి, కోలం జాతులు, ఒడిశాలోని సవర ఆదివాసీలు అటవీశాఖ లేదా గుత్తేదారుల వద్ద కూలీలుగా పనిచేయవలసి వచ్చేది. వడ్డీ వ్యాపారస్తుల వద, రైతుల పొలాల్లో వెట్టి కార్మికులుగా మారేవాళ్ళు, బయట నుండి వచ్చిన ప్రజలు ఆదివాసీల భూములను ఆక్రమించుకుని, హింసలకు గురి చేశారు. అటవీశాఖ అధికారులు జరిమానాలు విధించడం, చిన్న చిన్న కారణాలకు ప్రజలను కొట్టడం, బలవంతంగా ఇళ్ళలో చొరబడి వస్తువులను లాక్కోవడం, ఆడవారిపట్ల అసభ్యంగా ప్రవర్తించడం, లంచాలు తీసుకోవడం వంటి విషయాలు సాధారణమైపోయాయి.

ఇటువంటి ప్రతికూల పరిస్థితులకు వ్యతిరేకంగా ఆదివాసీలు అనేక ప్రాంతాలలో ప్రతిఘటించసాగారు. ఈ ప్రతిఘటనలలో పోలీసు స్టేషన్లు, అటవీశాఖ కేంద్రాలు, వడ్డీ వ్యాపారస్తుల ఇళ్ళు వంటివి తగలబెట్టేవాళ్ళు. అనేకసార్లు అడవిని తగలబెట్టేవాళ్ళు.
ఉదా : 1856 జార్ఖండ్ సంతాల్ తిరుగుబాట్లు.
1922 ఆంధ్రప్రదేశ్ కోయ తిరుగుబాట్లు.

AP Board 9th Class Social Solutions Chapter 18 భారతదేశంపై వలసవాద ప్రభావం

ప్రశ్న 3.
అదివానీ తిరుగుబాటులను బ్రిటిష్ పాలకులు ఏ విధంగా అణచివేశారు?
జవాబు:
అడవి హక్కులు అనుభవించడానికి, స్వేచ్ఛా జీవితం గడపడానికి బయట వ్యక్తుల దోపిడీల నుండి రక్షణ పొందడానికి, వేధింపుల నుండి బయటపడడానికి, అడవిలో హాయిగా నివసించడానికి గాను ఆదివాసీలు తిరుగుబాట్లు చేశారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా అనేక తిరుగుబాట్లు చేశారు. ప్రధానంగా జార్ఖండ్ కి చెందిన సంతాల్ ఆదివాసీలు బ్రిటిష్ పాలనను నిరసిస్తూ వ్యతిరేకించసాగారు. 1855-56లో సంతాలులు పెద్ద ఎత్తున తిరుగుబాటు చేశారు. జమిందారులను, వడ్డీ వ్యాపారస్తులను చంపి దోచుకోసాగారు. అయితే సంతాలుల వద్ద విల్లంబులు, బాణాలు తప్పించి వేరే ఆయుధాలు లేవు. తుపాకులున్న బ్రిటిష్ సైనికులను వాళ్ళు ఎక్కువ కాలం నిలువరించలేకపోయారు.

జార్బండ్ రాష్ట్రంలో ఉన్న చోటానాగపూర్ పీఠభూమిలోని ముండా ఆదివాసీలు 1874 – 1901 మధ్య ‘బిర్సా’ అనే యువకుడి నాయకత్వంలో బ్రిటిష్ పాలనను అంతం చేయాలనుకున్నారు. వడ్డీ వ్యాపారస్తులు, జమీందారులకు రక్షణ నిచ్చిన విదేశీ ప్రభుత్వాన్ని తరిమికొట్టాలనుకున్నారు. కానీ నాయకులను పట్టుకొని జైలుపాలు చేయటంతో చివరికి ముండా తిరుగుబాటును అణచివేయగలిగారు. 1900లో బిర్సాముండా జైలులో చనిపోయాడు.

ఆంధ్రప్రదేశ్ లో కోయ ఆదివాసీలు, బస్తర్, మరియా, మురియా ఆదివాసీలు, గోండ్, కోలం ఆదివాసీల తిరుగుబాట్లను ఉత్తరాఖండ్ లోని కుమావూ తిరుగుబాట్లను బ్రిటిష్ పాలకులు కుటిల కుతంత్రాలతో, ఆధునిక ఆయుధాలతో అణచివేశారు.

ప్రశ్న 4.
భారతదేశ వివిధ ప్రాంతాలలో ఆదివాసీల తిరుగుబాటులను తెలియజేసే కాల పట్టిక తయారుచేయండి. (AS3)
జవాబు:
భారతదేశ వివిధ ప్రాంతాలలో ఆదివాసీల తిరుగుబాటులను తెలియచేసే కాల పట్టిక :
1880 C : ఆంధ్రప్రదేశ్ లో కోయలు తిరుగుబాటు.
1866 – 56 : జార్ఖండ్ కి చెందిన సంతాల్ ఆదివాసీల తిరుగుబాట్లు.
1874 – 1901 : జార్ఖండ్ రాష్ట్రంలో ఉన్న చోటానాగపూర్ పీఠభూమిలోని ముండా ,ఆదివాసీల తిరుగుబాట్లు
1910 : మధ్యప్రదేశ్ లోని బస్తర్ లో మరియా, మురియా ఆదివాసీల తిరుగుబాట్లు.
1922 : ఆంధ్రప్రదేశ్ కోయ, కోలం ఆదివాసీల తిరుగుబాట్లు.
1940 : గోండ్, కోలం ఆదివాసీల తిరుగుబాట్లు.
1921 – 22 : ఉత్తరాఖండ్ లోని కుమావూ ప్రాంతంలోని ఆదివాసీల తిరుగుబాట్లు చేశారు.

ప్రశ్న 5.
బ్రిటిష్ ప్రభుత్వంతో భారతీయ పారిశ్రామికవేత్తలకు ఎటువంటి సమస్యలు ఉండేవి?
జవాబు:
బ్రిటిష్ ప్రభుత్వంతో భారతీయ సారిశ్రామిక వేత్తలకు ఎదురయిన సమస్యలు :

  • రోడ్డు, రైలు మార్గాలు, విద్యుత్, బొగ్గు, ఇనుము వంటి అనేక వనరులు, సౌకర్యాలు భారతీయ పారిశ్రామిక వేత్తలకు కావాలి. కానీ బ్రిటిష్ ప్రభుత్వం ఈ రంగాలపై తగినంత దృష్టి నిలపలేదు.
  • భారతీయ పారిశ్రామిక వేత్తలు తమకు కావలసిన యంత్రాలన్నింటినీ విదేశాల నుంచి కొనుగోలు చేయాల్సి వచ్చేది. యంత్రాలను తయారుచేసే పరిశ్రమలు భారతదేశంలో ఇంకా స్థాపించబడలేదు.
  • పరిశ్రమల అభివృద్ధికి శాస్త్రజ్ఞులు, ఇంజనీర్లు, సాంకేతిక నిపుణుల సహాయం కావాలి. చదువుకున్న కార్మికులు అన్ని స్థాయిలలో కావాలి. అయితే భారతదేశంలో చదువుకు అంత ప్రాముఖ్యత ఇవ్వలేదు. భారతీయ శాస్త్రజ్ఞులు, ఇంజనీర్లు తక్కువ సంఖ్యలో ఉండడం వల్ల పారిశ్రామిక అభివృద్ధికి విదేశస్థులపై ఆధారపడవలసి వచ్చేది. స్వాతంత్ర్యం తరువాత . కూడా విద్యకు తగినంత ప్రాముఖ్యత ఇవ్వకపోవడం వల్ల అంతగా చదువుకోని కార్మికశక్తి పారిశ్రామిక అభివృద్ధికి ఆటంకంగా కొనసాగింది.

ప్రశ్న 6.
బ్రిటిష్ పాలనలో పరిశ్రమలు నెలకొల్పటం భారతీయ కంపెనీల కంటే విదేశీ కంపెనీలకు ఎందుకు ఎక్కువ అవకాశాలు ఉండేవి ? కొన్ని కారణాలను పేర్కొనండి. (AS1)
జవాబు:
బ్రిటిష్ పాలనలో చాలా కార్మాగారాలు, బ్యాంకులు, ఓడలు వంటివి భారతీయుల చేతుల్లో కాకుండా బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. అందువల్ల ఈ కంపెనీలకు ఎన్నో ప్రయోజనాలు సమకూరాయి. బ్రిటిష్ ప్రభుత్వంలోని వివిధ . స్థాయిల అధికారులు, ఉద్యోగస్తులు, బ్రిటిష్ వాళ్లకు అందుబాటులో ఉండేవాళ్ళు. ఆ సౌకర్యం భారతీయ కంపెనీలకు లేదు. విదేశీ వ్యాపారం అంతా యూరపు కంపెనీల చేతుల్లో ఉన్నందువల్ల వాళ్ళకు ఎటువంటి నిధుల కొరతాలేదు. భారతదేశంలో సాంకేతిక నైపుణ్యం, పారిశ్రామికీకరణలో ప్రగతి సాధించే శాస్త్రజ్ఞులు, ఇంజనీర్లు విదేశీ కంపెనీలలో చాలా ఎక్కువ మంది ఉండేవాళ్ళు. తద్వారా భారతీయ కంపెనీల కంటే విదేశీ కంపెనీలకు ఎక్కువ అవకాశాలు ఉండేవి.

AP Board 9th Class Social Solutions Chapter 18 భారతదేశంపై వలసవాద ప్రభావం

ప్రశ్న 7.
కార్మిక చట్టాలు ముందుగా పిల్లలకు, ఆ తర్వాత మహిళలకు, చివరకు పురుషులకు చేశారు. వీటిని ఈ క్రమంలో ఎందుకు చేశారు?
జవాబు:
మిల్లులలో మరియు యంత్రాలలో పని ప్రతిరోజూ సూర్యోదయంతో మొదలయ్యి సూర్యాస్తమయం తరువాతే ముగిసేది. కార్మాగారపు వేడి, తేమ, మోత, ధూళితో రోజంతా గడిచేది. అనారోగ్యాలు, జబ్బులు, అంటువ్యాధులతో రోజూ వేసవిలో 14 గంటలు, శీతాకాలంలో 12 గంటలు పనిచేయవలసి వచ్చేది.

పై దుర్భర కష్టాలన్నీ పిల్లలు, స్త్రీలు కూడా అనుభవించారు. 1-12 సం||ల వయసుగల బాలలు భయంకరమైన పనులు చేసేవారు. బాల్యమంతా మిల్లులలో కరిగిపోయేది. పూవులాంటి పసి పిల్లల కన్నీళ్ళు తుడవాలని, బాల్య మాధుర్యాన్ని పిల్లలకు అందించాలని తలంచి పనిభారం నుండి ముందుగా విముక్తులను చేయడానికి పిల్లలకు చట్టాలు కల్పించారు.

అదే విధంగా మహిళలు కూడా, ఇంటి పని, వంట పని, కుటుంబ భారమంతా మోస్తూ మరల కర్మాగారాలలో 14 నుండి 18 గంటలు పురుషులతో పాటు పనిచేయడం అందులో గర్భిణులుగా, బాలింతలుగా ఉండటం వల్ల మహిళలు నరకయాతన అనుభవించే వాళ్ళు. దీనిని దృష్టిలో పెట్టుకుని మిల్లులలో పిల్లలు, మహిళలకే ఎక్కువగా దుర్భర పరిస్థితులు ఉన్నందున ముందుగా వాళ్ళకి విముక్తి చట్టాలు రూపొందించారు.

ప్రశ్న 8.
పారిశ్రామిక అభివృద్ధిని విద్య ఎలా ప్రభావితం చేస్తుంది ? తరగతిలో చర్చించండి. (AS6)
జవాబు:
చాలా దేశాలలో పరిశ్రమలు అభివృద్ధి చెందడానికి, సాంకేతిక విజ్ఞానంతో పయనించి, ప్రపంచ పోటీలో నిలదొక్కుకో సుకానికి ఆయా దేశాలు ముందుగా విద్యకు ప్రాధాన్యత నిచ్చాయి. ముఖ్యంగా, ఇంగ్లాడ్, జర్మనీ, ఫ్రాన్స్ వంటి దేశాలు పారిశ్రామిక అభివృద్ధికి, విద్యకు పెద్దపీట వేశాయి.

చదువుకున్న కార్మికులు అన్ని స్థాయిలలో ఉండాలి. అప్పుడే పారిశ్రామిక అభివృద్ధి సాగుతుంది. పరిశ్రమలు అభివృద్ధి చెందాలంటే శాస్త్రజ్ఞులు, ఇంజనీర్లు, విషయ నిపుణతగల సాంకేతిక నిపుణులు కావాలి. వీరంతా మేధావంతులుగా మారి పరిశ్రమలు వేగవంతం కావడంలో విద్య ప్రధాన భూమిక పోషిస్తుంది. వివేచనా జ్ఞానం, అద్భుత తెలివితేటలతో పరిశ్రమలను వివిధ స్థాయిలలో అభివృద్ధి చేసి, పోటీని తట్టుకోగలగాలి. కాబట్టి పారిశ్రామిక అభివృద్ధిని విద్య ముఖ్య భూమిక పోషిస్తుంది.

ప్రశ్న 9.
20వ శతాబ్దంలోని ప్రధాన పారిశ్రామిక పట్టణాలను భారతదేశ పటంలో గుర్తించండి. (AS5)
జవాబు:
నా శ్రామిక పట్టణాలు :

  1. ముంబై
  2. అహ్మదాబాద్
  3. జంషెడ్ పూర్
  4. చెన్నై (మద్రాస్)
  5. సూరత్
  6. హైదరాబాద్
  7. పూనె
  8. విశాఖపట్నం
  9. కోల్ కతా
  10. కాన్పూర్
  11. నాగపూర్
  12. ఇండోర్
  13. సేలం

AP Board 9th Class Social Solutions Chapter 18 భారతదేశంపై వలసవాద ప్రభావం 1

ప్రశ్న 10.
ఆదివాసీల తిరుగుబాట్లు ఎక్కడెక్కడ జరిగాయో తెలుసుకొని ఆ ప్రదేశాలను భారతదేశ పటంలో గుర్తించండి. (AS5)
జవాబు:
ఆదివాసీల తిరుగుబాట్లు జరిగిన ప్రదేశాలు పటంలో చూడండి.

  1. జార్ఖండ్
  2. చోటానాగపూర్ పీఠభూమి
  3. ఉత్తరాఖండ్
  4. చింతపల్లి
  5. ఆదిలాబాద్

AP Board 9th Class Social Solutions Chapter 18 భారతదేశంపై వలసవాద ప్రభావం 2

ప్రశ్న 11.
పేజీ నెం. 221లోని “ఆదివాసీ తిరుగుబాట్లు” అంశాన్ని చదివి, వాఖ్యానించండి. (AS2)
జవాబు:
అనాదిగా అడవులను ఆధారం చేసుకొని, అభివృద్ధికి ఆమడ దూరంలో ఆదివాసీలు జీవనం సాగించేవాళ్లు. మధ్యప్రదేశ్, చత్తీ కి చెందిన బైగా, మురియా, గోండ్, బిల్ జాతులు, ఆంధ్రప్రదేశ్ కి చెందిన కోయ, రెడ్డి, కోలం జాతులు, ఒడిశాలోని సవర జాతులు అటవీశాఖాదికారులు, గుత్తేదారుల వద్ద, లేదా వడ్డీ వ్యాపారస్తుల వద్ద వెట్టిచాకిరీ కార్మికులుగా శ్రమను చిందించేవారు. బాగా అభివృద్ధి చెందిన ప్రాంతాల నుండి మైదాన ప్రాంతం నుండి వచ్చిన ప్రజలు, గిరిజనుల భూములను చేజిక్కించుకుని, గిరిజనులను అణగదొక్కారు. అదేవిధంగా అటవీశాఖాధికారులు కూడా గిరిజనులను ఇబ్బందులకు గురిచేసి జరిమానాలు విధించి, చిన్న కారణాలకు సైతం ప్రజలను కొట్టడం, బలవంతంగా ఇళ్లల్లోకి చొరబడి వస్తువులను లాక్కోని, మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం నిత్యసత్యమైపోయాయి.

ఇటువంటి ప్రతికూల పరిస్థితులకు వ్యతిరేకంగా ఆదివాసీలు అనేక ప్రాంతాలలో ప్రతిఘటించసాగారు. దీనికిగాను వారు విప్లవ పంథాను ఎంచుకుని, పోలీస్ స్టేషన్లు, అటవీశాఖ కేంద్రాలు, వడ్డీ వ్యాపారస్తుల ఇళ్లు వంటిని తగలబెట్టేవారు. కొన్ని సందర్భాలలో అడవిని తగలబెట్టేవాళ్లు. ఈ తిరుగుబాట్లు 1856లో జార్ఖండ్ సంతాల్ ఆదివాసీలు, 1880, 1922 ఆంధ్రప్రదేశ్ కోయ ఆదివాసీలు, 1940లలో గోండ్, కోలం ఆదివాసీలు చేశారు.

9th Class Social Studies 18th Lesson భారతదేశంపై వలసవాద ప్రభావం InText Questions and Answers

9th Class Social Textbook Page No.220

ప్రశ్న 1.
బ్రిటిష్ పాలనకు ముందు ఆదివాసుల జీవనవిధానం, అడవులను వాళ్ళు ఉపయోగించుకున్న విధానాలను తెలియజేసే నాలుగు వాక్యాలను గుర్తించండి.
జవాబు:
అడవులలో ఆనందంగా జీవించే ఆదివాసీలే అడవులకు యజమానులు. తమ రోజూవారీ జీవనానికి కావలసిన అనేక ఉత్పత్తులు హాయిగా అడవుల నుండి పొందేవాళ్ళు. వేటాడుతూ, తమ ఆహారానికి అవసరమైన దుంపలు, పళ్ళు’ ఆరగిస్తూ, పూలు, వనమూలికలు సేకరిస్తూ, పశువులను మేపుకుంటూ అడవులను ఉపయోగించుకునే వాళ్ళు.

9th Class Social Textbook Page No.221

ప్రశ్న 2.
రైల్వే పట్టాలలో ఒకప్పుడు ఉపయోగించిన కలప స్లీపర్లను మీరు చూశారా? వీటికి బదులుగా ప్రస్తుతం ఏమి వాడుతున్నారు? ఈ మార్పు ఎందుకు చేయవలసి వచ్చింది? చర్చించండి.
జవాబు:
భారతదేశం బ్రిటిష్ పరిపాలనకు ముందు అడవులతో పచ్చని చెట్లతో వికసించేది. పరిశ్రమల అభివృద్ధి పేరుతో ఓడలు, గనుల నిర్మాణాలకు కలప కోసం అడవులలో లభించే చెట్లను నరికేవారు. రైలు మార్గాలు అభివృద్ధి చెందిన తరువాత, ప్రతి సంవత్సరం కొత్త రైలు మార్గాలు వేయటానికి ఒక కోటికి పైగా కలప స్లీపర్లు అవసరమయ్యేవి. తద్వారా అడవులు రానురాను అంతరించడమే కాకుండా అడవులు కనుమరుగయ్యే సూచనలు కనిపిస్తుండటంతో ప్రస్తుతం కలప స్లీపర్లకు బదులు ఇనుప స్లీపర్లను వాడుతూ, పర్యావరణాన్ని, ప్రకృతిని, అడవులను కాపాడుతున్నారు.

9th Class Social Textbook Page No.225

ప్రశ్న 3.
‘రక్షిత మార్కెటు’ అంటే ఏమిటో చర్చించండి.
జవాబు:
ఇతర దేశాల నుండి దిగుమతి అవుతున్న వస్తువులపై లేదా బట్టలపై పన్నులను విధించినట్లయితే విదేశీ వస్తు ధరలు పెరుగుతాయి. మన దేశంలో వస్తువులపై పన్ను విధించకుండా తక్కువ ఖరీదుకు వస్తువులను అమ్మినట్లయితే భారతదేశ వస్తువులకు విలువ, ప్రాధాన్యత, పనితనం కనిపించి వస్తువులు అమ్మటానికి అనువైన వాతావరణం కనిపిస్తుంది. దీనినే రక్షిత మార్కెట్ అంటారు.

AP Board 9th Class Social Solutions Chapter 18 భారతదేశంపై వలసవాద ప్రభావం

ప్రశ్న 4.
భారతదేశానికి వస్తున్న బ్రిటిష్ సరుకులపై పన్నులు విధించాలని భారతీయులు కోరసాగారు. ఇది న్యాయమైన కోరికేనా? భారతీయ, బ్రిటిష్ పరిశ్రమలతో ప్రభుత్వం సమానంగానే వ్యవహరించాలా?
జవాబు:
భారతదేశానికి వస్తున్న బ్రిటిష్ సరుకులపై పన్నులు విధించాలని భారతీయులు కోరడం న్యాయమైన కోరికే. ఎందుకంటే మన దేశంలో ముడి పదార్థాలను అతి చౌకగా కొని, వాటిని వారి దేశంలో వస్తువులుగా మార్చి , అధిక ధరలకు మన దేశ మార్కెట్లో అమ్మి మన సంపదనంతా వస్తు రూపంలో దోచుకుంటున్నారు. అదే విధంగా వారు తయారుచేసిన వస్తువులలో సాంకేతిక విజ్ఞానం, పనితనం కనిపించడం వలన ఎక్కువ మంది కొనుగోలుదారులను ఆకర్షించగలుగుతున్నాయి. పన్నులు విధించడం వల్ల బ్రిటిష్ వస్తు ఖరీదు పెరగడమే కాకుండా మన దేశ వస్తువుల అమ్మకాలు పెరుగుతాయి. కాబట్టి దోపిడీ పాలన గల బ్రిటిష్ పరిశ్రమల విషయంలో ప్రభుత్వం సమానంగా వ్యవహరించవలసిన అవసరం లేదు.

9th Class Social Textbook Page No.226

ప్రశ్న 5.
మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో భారత పరిశ్రమలు ఎందుకు వేగంగా వృద్ధి చెందాయి?
జవాబు:
మొదటి ప్రపంచ యుద్ధకాలంలో (1914-18) భారతదేశంలోని విదేశీ వస్తువుల దిగుమతి గణనీయంగా పడిపోయింది. సరుకు రవాణా ఓడలను యుద్ధ సంబంధ పనులకు మళ్ళించడం వల్ల ఓడల కొరత ఏర్పడడం ఒక కారణం. అంతేకాకుండా యూరప్ కర్మాగారాలలో యుద్దానికి కావలసిన వస్తువులను ఉత్పత్తి చేయసాగారు. దాంతో భారతదేశ మార్కెటు కోసం ఉత్పత్తి చేసే వస్తువులు తగ్గిపోయాయి.

ఈ పరిస్థితులలో భారతదేశంలో ఏర్పాటు చేసిన కర్మాగారాలు తమ ఉత్పత్తిని, అమ్మకాలను పెంచుకున్నాయి. ఈ అమ్మకాలతో ప్రేరణ పొంది పరిశ్రమలు వేగంగా వృద్ధి చెందాయి.

9th Class Social Textbook Page No.227

ప్రశ్న 6.
బ్రిటిష్ పాలనలో భారతదేశంలో ఏ పరిశ్రమలు స్థాపించారు?
జవాబు:
బ్రిటిష్ పాలనలో భారతదేశంలో నూలు, వస్త్ర పరిశ్రమ. జెంషెటాటా ఆధ్వర్యంలో జంషెడ్ పూర్ వద్ద ఉక్కు కర్మాగారం స్థాపించారు.

ప్రశ్న 7.
స్వాతంత్ర్య సమయంలో భారత పరిశ్రమల అభివృద్ధికి ఎదుర్కొన్న సమస్యలు ఏమిటి?
జవాబు:
భారతదేశ స్వాతంత్ర్య సమయంలో చాలా కర్మాగారాలు, బ్యాంకులు, ఓడలు వంటివి భారతీయుల చేతులలో లేవు. ఇవి చాలా ఎక్కువగా బ్రిటిష్ వారి అధీనంలో ఉండేవి. పరిశ్రమల అభివృద్ధికి కావలసిన అధికారాలు, ఉద్యోగస్తులు బ్రిటిష్ వాళ్ళకు అందుబాటులో ఉండేవాళ్ళు. ఇటువంటి మేధావులైన కార్మికులు మన దేశ పరిశ్రమలలో పనిచేసేవారు కాదు. పరిశ్రమల అభివృద్ధికి కావలసిన నిధులు కూడా మన పరిశ్రమలకు కొరతగా ఉండేవి. శాస్త్రజ్ఞులు, ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులు కూడా తగినంత మంది లేకపోవడం కూడా మన పరిశ్రమలు సమస్యలు ఎదుర్కోవడానికి కారణమైంది.

9th Class Social Textbook Page No.229

ప్రశ్న 8.
భారతదేశంలో తొలినాటి కర్మాగారాలలో కార్మికుల పని, విశ్రాంతికి సంబంధించిన నియమాలు ఏమిటి?
జవాబు:
మిల్లులలో పనిచేసే కార్మికుల పని ప్రతిరోజూ సూర్యోదయంతో మొదలయ్యి సూర్యాస్తమయం తరువాతే ముగిసేది. తెల్లవారకముందే నిద్రలేచి మిల్లులకు బారులు తీరిన కార్మికులు పని మొదలు పెడితే ఆపడమనేదే లేదు.

విశ్రాంతి చాలా తక్కువగా ఉండేది. 15 -20 నిమిషాలు భోజనానికి విశ్రాంతి ఉండేది. సూర్యుడు అస్తమించిన తరువాత చీకటిలో చూడటం అసాధ్యమైనప్పుడు మాత్రమే యంత్రాలతో ఆ రోజుకి పని ఆగేది. వారానికి ఒక రోజు సెలవులేదు. ముఖ్యమైన పండుగలకు మాత్రమే సెలవు ఇచ్చేవారు. మిగతా సమయంతా పనిలోనే కార్మికులు నిమగ్నమయ్యేవాళ్ళు.

AP Board 9th Class Social Solutions Chapter 18 భారతదేశంపై వలసవాద ప్రభావం

ప్రశ్న 9.
వేతనాల చెల్లింపునకు సంబంధించిన నియమాలు ఏమిటి?
జవాబు:
కార్మికులు ఉత్పత్తి చేసిన సరుకులను బట్టి కూలీ చెల్లించే వాళ్ళు. “ఎంత ఉత్పత్తి చేస్తే అంత కూలీ” అన్న నియమాన్ని యజమానులు అమలు చేశారు. ఒక్కొక్క సారి యంత్రాలు పనిచేయకపోయినా చెల్లింపులు ఉండవని చెప్పేవారు. నెల అయిన తరువాత కార్మికులకు మిల్లు యజమాని మొత్తం కూలీ చెల్లించేవాడు కాదు. మళ్ళీ నెల వరకు కొంత డబ్బు తన వద్దే అట్టే పెట్టుకొనే వాళ్ళు. ఇటువంటి పరిస్థితులలో ఎవరైనా కార్మికులు పనిమానేసి వెళ్లిపోవటం సాధ్యం అయ్యేది కాదు.

ప్రశ్న 10.
ఏ కారణాల వల్ల కార్మికుల వేతనాలను తగ్గించేవాళ్ళు?
జవాబు:
కార్మికులకు జరిమానాలు విధించేవాళ్ళు. ప్రతీ చిన్న విషయానికి, పనికి ఆలస్యంగా వచ్చారని, బట్ట పాడైపోయిందని, కార్మికులు చిత్తశుద్ధితో పనిచేయలేదని యజమానికి అనిపించినా జరిమానాలు విధించి, కార్మికులకు నెలలో రావలసిన వేతనం నుంచి మినహాయించే వాళ్ళు.

9th Class Social Textbook Page No.230

ప్రశ్న 11.
కార్మికులు సమ్మె ఎందుకు చేసేవాళ్ళు?
జవాబు:
కార్మికుల దుర్భర పరిస్థితుల నుండి తమ హక్కుల సాధన కొరకు సమ్మె చేసేవారు.

  • కొన్ని సందర్భాలలో తమ వేతనాలు తగ్గించినందుకు నిరసనగా, ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సమ్మె చేశారు.
  • అంతేకాకుండా మారుతున్న కాలానికి అనుగుణంగా, తమ జీవన విధానం కొరకు వేతనాలను పెంచమని సమ్మె చేశారు.
  • మరి ముఖ్యంగా కార్మికులు వేతనాలు, హక్కుల కోసమే కాకుండా బ్రిటిష్ పాలకుల నిరంకుశ పాలన నుండి విముక్తి కొరకు సమ్మెల ద్వారా కార్మికులు స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నారు.

ప్రశ్న 12.
ఇతర చర్యలకు బదులు సమ్మెనే ఆయుధంగా ఎందుకు ఉపయోగించే వాళ్ళు?
జవాబు:
ఈ సమ్మె చేయడం ద్వారా పరిశ్రమలు మూతబడతాయి.

  • ఉత్పత్తి నిలిచిపోతుంది. ఈ పరిశ్రమలకు, కంపెనీకి కోట్లలో నష్టం వస్తుంది.
  • కంపెనీ ఉత్పత్తులపై సమాజంలో చెడు ప్రభావం పడుతుంది.
  • నిరంకుశ నిర్ణయాలు గల యజమానుల నుండి మార్పు కొరకు సమ్మెనే ఎంచుకుంటారు.

సమ్మె ద్వారా వచ్చే నష్టం కంటే వారి కోరికలు తీర్చడమే ప్రధానమని యజమానులు భావించి, కార్మికుల కోర్కెలు తీరుస్తారు. నిరసనలు, ఉపన్యాసాలు, ఊరేగింపుల ద్వారా కంపెనీ యజమానులలో మార్పురాదు. కాబట్టి బలమైన ఆయుధం సమ్మెనే కార్మికులు ఎంచుకుంటారు.

9th Class Social Textbook Page No.231

ప్రశ్న 13.
మీరు ఏ సంవత్సరంలో పుట్టారు? కాల పట్టికలో దానిని గుర్తించండి. మీ తల్లిదండ్రులు, తాత, అవ్వలు, వీలైతే కొంతమంది వృద్ధ బంధువులు పుట్టిన సంవత్సరాలను కూడా గుర్తించండి.
జవాబు:
నేను 1999లో జన్మించాను. మా నాన్నగారు 1963లో జన్మించారు. మా అమ్మగారు 1965లో జన్మించారు. మా తాతగారు 1943లో, మా అవ్వ 1939లో జన్మించారు.

AP Board 9th Class Social Solutions Chapter 18 భారతదేశంపై వలసవాద ప్రభావం

ప్రశ్న 14.
వాళ్ళలో ఎవరైనా ఏదైనా కార్మిక చట్టాల వల్ల ప్రయోజనం పొందారేమో కనుక్కోండి.
జవాబు:
మా తాతగారు షుగర్ ఫ్యాక్టరీ (పంచదార పరిశ్రమ) లో పనిచేసేవారు. ఈ కార్మిక చట్టాల వలన పనిగంటలు తగ్గాయని, చాలా విషయాలలో కంపెనీ యజమానులు ప్రయోజనం కల్పించారని, వైద్య సదుపాయాలు మరియు విశ్రాంతికి తగిన అవకాశాలు కల్పించారని చెప్పారు.

ప్రశ్న 15.
మొదట్లో కార్మికుల సంక్షేమంపై భారతదేశంలోని విద్యావంతులు ఎందుకు అంతగా దృష్టి పెట్టలేదు?
జవాబు:

  • కార్మికులకు స్థిర ఆదాయాలు, సెలవు వంటి సౌకర్యాలు కల్పిస్తే మిల్లు ఉత్పత్తి తగ్గిపోతుందని,
  • యజమానుల ఖర్చులు పెరిగిపోతాయని,
  • దీనివల్ల కార్మాగారాలలో ఉత్పత్తి చేసే వస్తువుల ఖర్చు పెరిగిపోతుందని,

ఇదే జరిగితే బ్రిటన్ నుంచి వచ్చే వస్తువులు తేలికగా అమ్ముడయ్యి, భారతదేశంలో పరిశ్రమల ప్రగతి కుంటుపడుతుందని కార్మికుల సంక్షేమంపై అంతగా దృష్టి పెట్టలేదు.

ప్రశ్న 16.
కార్మిక చట్టాలు పారిశ్రామికవేత్తలను ఏ విధంగా ప్రభావితం చేసి ఉంటాయి?
జవాబు:
కార్మిక చట్టాలు పారిశ్రామికవేత్తలను భయందోళనకు గురిచేశాయి. కార్మిక చట్టాల వల్ల పని గంటలు తగ్గడమే కాకుండా విశ్రాంతి గంటలు పెరగడం వలన ఉత్పత్తి తగ్గుతుందని, వారిలో ఐక్యత, సమ్మెవంటి హక్కులు ద్వారా మిల్లు యజమానులకు ఖర్చులు పెరిగి, నష్టాలు వచ్చే ప్రమాదముందని భయపడ్డారు.

ప్రశ్న 17.
బ్రిటిష్ పారిశ్రామికవేత్తలు భారతదేశంలో పరిశ్రమల అభివృద్ధిని వ్యతిరేకించారు. అయినప్పటికీ వాళ్ళు భారతదేశ కార్మికుల పక్షాన నిలబడ్డారు. ఎందుకు?
జవాబు:
బ్రిటిష్ పారిశ్రామిక ఉత్పత్తులపై భారతదేశంలో పన్నులు విధించడం వల్ల వాళ్ళ వస్తూత్పత్తి ధరలు పెరగసాగాయి. కానీ భారతదేశంలో అధిక కార్మికులు తక్కువ వేతనానికి అధిక పని గంటలు పనిచేసి అధికోత్పత్తి సాధించడమే కాకుండా తక్కువ ధరకు భారతీయ ఉత్పత్తులు లభిస్తున్నాయి. కాబట్టి కార్మికులకు మరిన్ని హక్కులు, సౌకర్యాలు కల్పించి, పని గంటలు తగ్గించి, వేతనాలు పెంచినట్లయితే భారతీయ వస్తువుల ధరలు పెరిగి, తమ ఉత్పత్తులపై కొనుగోలు శక్తి పెరిగి అధిక లాభాలు పొందవచ్చని భావించారు.

ప్రశ్న 18.
బ్రిటిషు కాలంలో ఏ వయస్సు లోపల పిల్లలను కార్మికులుగా పెట్టుకోకుండా చేశారు?
జవాబు:
9 సం||ల లోపు పిల్లలను కార్మికులుగా పిల్లలను పెట్టుకోకుండా చేశారు.

ప్రశ్న 19.
ప్రస్తుత చట్టాల ప్రకారం ఏ వయస్సు లోపల పిల్లలను కార్మికులుగా పెట్టుకోకూడదు?
జవాబు:
14 సంవత్సరాల లోపు పిల్లలను కర్మాగారాలలో నియమించకూడదు.

ప్రశ్న 20.
కార్మిక చట్టాల ప్రకారం పిల్లలు, మహిళలు, పురుషులు రోజుకి ఎన్ని గంటల పాటు పనిచేయాలి?
జవాబు:

  1. కార్మిక చట్టాల ప్రకారం పిల్లలతో రోజుకి 7 గంటల కంటే ఎక్కువ పని చేయించకూడదు.
  2. మహిళా కార్మికులతో రోజుకి 11 గంటలకు మించి పనిచేయించకూడదు.
  3. పురుష కార్మికులతో రోజుకి 12 గంటల కంటే ఎక్కువ పని చేయించకూడదు.

9th Class Social Textbook Page No.232

ప్రశ్న 21.
బ్రిటిష్ కాలంలో భారతదేశంలో ఏర్పడిన రెండు ముఖ్యమైన కార్మిక సంఘాలు ఏవి?
జవాబు:
1920 ల నుంచి కార్మిక సంఘాలు ఏర్పడ్డాయి.

  1. సోషలిస్టు భావాలతో ఏర్పడిన “గిర్నికాంగార్ యూనియన్”.
  2. అహ్మదాబాదులో గాంధీజీ ప్రభావంతో ఏర్పడిన శక్తివంతమైన కార్మిక సంఘం “మజూర్ మహాజన్”.

AP Board 9th Class Social Solutions Chapter 18 భారతదేశంపై వలసవాద ప్రభావం

ప్రశ్న 22.
కార్మికులకు కార్మిక సంఘం ఎందుకు ముఖ్యమైనది? చర్చించండి.
జవాబు:

  1. కార్మికుల సంక్షేమం కోసం.
  2. తమ హక్కుల సాధన కొరకు.
  3. మెరుగైన వేతనాలు సాధించుకోడానికి.
  4. మిల్లు యజమానులతో ఒప్పందాలు కుదుర్చుకోడానికి.
  5. కార్మికులకు ప్రమాదాలు, మరణాలు సంభవించినప్పుడు, మెరుగైన నష్టపరిహారాలు యజమానుల నుండి పొందడానికి.

ప్రాజెక్టు

ప్రశ్న 1.
అటవీ శాఖకు వెళ్ళి అడవులను ఎలా కాపాడుకోవాలి, స్థానిక ప్రజలు, కర్మాగారాలు వాటిని జాగ్రత్తగా ఎలా వినియోగించుకోవాలి అనే అంశాలపై ఒక అధికారితో ముఖాముఖి నిర్వహించండి.
జవాబు:
అటవీ శాఖకు వెళ్ళి ‘అడవులను కాపాడుకోవాల్సిన విధం, స్థానిక ప్రజలు, కర్మాగారాలు వాటిని జాగ్రత్తగా ఎలా వినియోగించుకోవాలి అనే అంశాలపై ఒక అధికారితో ముఖాముఖి :

నేను – అటవీ శాఖాధికారిగారూ….. అడవులను ఎలా కాపాడుకోవాలి?

అటవీ శాఖాధికారి – అడవులను నరకరాదు. అవి మన జాతీయ సంపద.

నేను – మన కలప అవసరాలు అడవుల ద్వారానే కదా తీరేది.

అటవీ శాఖాధికారి – అడవులనుండి మనకు కలప లభిస్తున్నప్పటికి, అడవులను విచ్చలవిడిగా నరకరాదు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితులలో నరకవలసి వచ్చిన వాటి స్థానంలో మొక్కలను నాటాలి.

నేను – అంటే చెట్లను నరుకుతున్న ప్రదేశాలలో క్రొత్త మొక్కలను నాటవలసి ఉంటుందన్నమాట.

అటవీ శాఖాధికారి – అంతేకాదు, మనం నివసిస్తున్న ప్రదేశాలందు ఖాళీగా ఉన్న ప్రాంతాలలోను, ఆ పాఠశాలల, కళాశాలల ఆవరణములలోని పారిశ్రామిక ప్రాంతాలయందు, రోడ్లకిరువైపుల నదులు, కాలువగట్లపైన మొక్కలను నాటవలసి ఉంటుంది.

నేను – మొక్కలను పెంచడం వలన ఇంకా ఏమైనా ఉపయోగాలు ఉన్నాయా?

అటవీ శాఖాధికారి – అనేక ఉపయోగాలు ఉన్నాయి. పర్యావరణం పరిరక్షించబడుతుంది. వర్షాలు సంభవిస్తాయి. వరదలను అరికట్టడం జరుగుతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే వృక్షో రక్షతి రక్షితః – వృక్షాలను మనం రక్షిస్తే అవి మనలను రక్షిస్తాయి.

ప్రశ్న 2.
మీకు దగ్గరలో ఉన్న ఒక కర్మాగారాన్ని సందర్శించి దాని చరిత్ర, సాంకేతిక విజ్ఞానం ఎలా మారింది, కార్మికులు ఎక్కడ నుంచి వస్తారు తెలుసుకోండి. కొంతమంది కార్మికులు, యాజమాన్య ప్రతినిధులతో మాట్లాడి వాళ్ళ దృక్పథాలు తెలుసుకోండి.

పట నైపుణ్యాలు

AP Board 9th Class Social Solutions Chapter 18 భారతదేశంపై వలసవాద ప్రభావం 3
అల్లూరి సీతారామరాజు
తూర్పు గోదావరి, విశాఖపట్నం జిల్లాల సరిహద్దు ప్రాంతాలలో సీతారామరాజు గిరిజన తిరుగుబాటుకు నాయకత్వం వహించారు. బెంగాలీ విప్లవకారుల దేశభక్తితో స్ఫూర్తి పొంది, చింతపల్లి, రంపచోడవరం, కె.డి. పేట, రాజవొమ్మంగి, అడ్డతీగల, నర్సీపట్నం, అన్నవరం పోలీస్ స్టేషన్లపై రాజు దాడులు చేశారు. గిరిజనుల సంక్షేమం కోసం కృషిచేసిన రాజును మంప గ్రామం వద్ద బ్రిటిష్ ప్రభుత్వం కాల్చి చంపింది.

AP Board 9th Class Social Solutions Chapter 18 భారతదేశంపై వలసవాద ప్రభావం 4
కొమరం భీం
సీతారామరాజు పోరాటంతో, బిర్సాముండా తిరుగుబాటుతో స్ఫూర్తి పొంది, నిజాంకి వ్యతిరేకంగా పోరాటం మొదలు పెట్టాడు. గొండు, కోయ యువకులతో భీం గెరిల్లా సైన్యాన్ని ఏర్పాటు చేశాడు. ఆయుధాలను ప్రయోగించడంలో గిరిజన ప్రజలకు శిక్షణ ఇచ్చాడు. జోడేఘాట్ అడవులలో ఒక పౌర్ణమి రోజున నిజాం సైన్యంతో జరుగుతున్న పోరాటంలో కొమరం భీం వీరమరణం పొందారు.

AP 9th Class Social Important Questions Chapter 1 భూమి – మనం

These AP 9th Class Social Important Questions 1st Lesson భూమి – మనం will help students prepare well for the exams.

AP Board 9th Class Social 1st Lesson Important Questions and Answers భూమి – మనం

9th Class Social 1st Lesson 1 Mark Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
కక్ష్య అనగానేమి?
జవాబు:
సూర్యుడి చుట్టూ భూమి తిరిగే దారినే ‘కక్ష్య’ అంటారు. ఈ పరిభ్రమణం ఒకే తలంలో ఉంటుంది. దీనిని కక్ష్య తలం అంటారు.

ప్రశ్న 2.
‘సంవత్సరం’ అనగానేమి?
జవాబు:
ఈ వేగంతో సూర్యుని చుట్టూ ఒక పరిభ్రమణం పూర్తిచేయటానికి 365¼ రోజులు పడుతుంది. దీనిని మనం ‘సంవత్సరం’ అంటాం.

ప్రశ్న 3.
సంస్కృతంలో భూమికి గల పేర్లు ఏవి?
జవాబు:
సంస్కృతంలో భూమి, పృథ్వి, ధరణి, అవని, పుడమి వంటి పేర్లు భూమికి ఉన్నాయి. భారతీయ భాషలలో భూమికి ఉన్న పేర్లు ఈ సంస్కృత మూలాల్లోంచి వచ్చినవే.

ప్రశ్న 4.
భూమిని ఎన్ని పొరలుగా విభజింపవచ్చును?
జవాబు:
భూమిని ప్రధానంగా భూపటలం, భూప్రావారం, భూ కేంద్ర మండలం అని మూడు పొరలుగా విభజించవచ్చును.

ప్రశ్న 5.
భూపటలం అని దేనినంటారు?
జవాబు:
మనం భూమి బయటిపొర మీద నివసిస్తున్నాం, దీనిని భూపటలం అంటాం. భూపటలం 30 – 100 కిలోమీటర్ల మందం ఉంది.

ప్రశ్న 6.
భూప్రావారం గురించి రాయండి.
జవాబు:
భూప్రావారం భూమి లోపల 100 కి.మీ. నుంచి 2,900 కి.మీ. వరకు ఉంటుంది. దీనిలో సిలికేట్లు అనే రసాయనాలు ఉంటాయి.

ప్రశ్న 7.
భూకేంద్రమండలం ఎక్కడ వరకు ఉంటుంది? దీనిలో ఏమి ఉన్నాయి?
జవాబు:
భూ కేంద్ర మండలం 2,900 కి.మీ. నుండి 6,376 కి.మీ. వరకు ఉంటుంది. దీంట్లో ప్రధానంగా ఇనుము, వంటి భార ఘన పదార్థాలు ఉంటాయి.

ప్రశ్న 8.
ఖండచలన సిద్ధాంతాన్ని ఎవరు, ఎందుకు ప్రతిపాదించారు?
జవాబు:
ఖండాలు, మహాసముద్రాల ప్రస్తుత స్థితిని కొంతమేరైనా వివరించటానికి 20వ శతాబ్ద ఆరంభంలో జర్మనీకి చెందిన ఉల్కాపాత భూ శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ వెజినర్ ఖండచలన సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు.

AP 9th Class Social Important Questions Chapter 1 భూమి – మనం

ప్రశ్న 9.
వెజినర్ పాంజియాను గురించి ఏమి చెప్పాడు?
జవాబు:
పాంజియా అనే ఈ మహాఖండం లారెన్షియా (ప్రస్తుత ఉత్తర అమెరికా, గ్రీన్‌లాండ్, భారత ఉపఖండానికి ఉత్తరంగా ఉన్న యూరేసియా మొత్తం) గోండ్వానా భూమి (ప్రస్తుత దక్షిణ అమెరికా, ఆఫ్రికా, మడగాస్కర్, భారతదేశం, అరేబియా, మలేసియా, తూర్పుఇండీస్, ఆస్ట్రేలియా, అంటార్కిటికా) అనే రెండు భాగాలుగా విడిపోయిందని వెజిగ్ ప్రతిపాదించాడు.

ప్రశ్న 10.
గ్రిడ్ అనగానేమి?
జవాబు:
గ్లోబు మీద అక్షాంశాలు, రేఖాంశాలు గీసి ఉంటాయి. ఈ నిలువు, అడ్డ గీతలతో గళ్లు ఏర్పడతాయి. దీనిని ‘గ్రిడ్’ అంటారు.

ప్రశ్న 11.
భూమధ్యరేఖ అని దేనినంటారు?
జవాబు:
భూమికి మధ్యలో అడ్డంగా వెళ్లే వృత్తాన్ని భూమధ్యరేఖ అంటారు. ఇది ఉత్తర, దక్షిణ ధృవాల నుంచి సమ దూరాలలో ఉంటుంది. ఇది భూమిని రెండు సమ భాగాలుగా చేస్తుంది కాబట్టి దీనిని భూమధ్యరేఖ అంటారు. దీనిని 0° అక్షాంశంగా గుర్తిస్తారు.

ప్రశ్న 12.
అక్షాంశాలను ఎలా సూచిస్తారు?
జవాబు:
రేఖాశాస్త్రంలో కోణాలను సూచించినట్లే అక్షాంశాలను కూడా డిగ్రీలు (ి)నిమిషాలు (‘) సెకండ్ల (‘) లో సూచిస్తారు. 13. లాటిట్యూడ్ అంటే ఏమిటి ? జ. ఇంగ్లీషులో ‘లాటిట్యుడ్’ అనే పదం ‘వెడల్పు’ అనే అర్థం సూచించే లాటిన్ పదం అయిన ‘లాటిట్యుడో’ నుంచి వచ్చింది.

ప్రశ్న 14.
ఉత్తరార్ధ గోళం, దక్షిణార్ధ గోళం అని వేటిని అంటారు?
జవాబు:
భూమధ్యరేఖకు, ఉత్తర ధృవానికి మధ్య ఉన్న భూమి సగభాగాన్ని ఉత్తరార్ధగోళం అంటారు. భూమధ్యరేఖకు దక్షిణ ధృవానికి మధ్య ఉన్న సగభాగాన్ని దక్షిణార్ధగోళం అంటారు.

ప్రశ్న 15.
వివిధ అక్షాంశాల పేర్లు రాయండి.
జవాబు:
23½° ఉత్తర అక్షాంశంను కర్కటరేఖ అని, 23½° దక్షిణ అక్షాంశాన్ని మకరరేఖ అని, 66½° ఉత్తర అక్షాంశంను ఆర్కిటిక్ వలయం అని, 66½° దక్షిణ అక్షాంశాన్ని అంటార్కిటిక్ వలయం అని అంటారు.

ప్రశ్న 16.
లాంగిట్యూడ్ అంటే ఏమిటి?
జవాబు:
రేఖాంశాన్ని ఇంగ్లీషులో లాంగిట్యూడ్ అంటారు. దీని మూలం ‘పొడవు’ అనే అర్థం ఉన్న ‘లాంగిట్యుడో’ అన్న లాటిన్ పదం. రేఖాంశం పటం పొడవును లేదా ఎత్తును సూచిస్తుంది.

ప్రశ్న 17.
ప్రామాణిక రేఖాంశం లేదా గ్రీనిచ్ మెరిడియన్ అంటే ఏమిటి?
జవాబు:
ఇంగ్లాండ్ లోని ‘గ్రీన్ విజ్’లోని నక్షత్రశాల గుండాపోయే రేఖాంశాన్ని 0° మెరిడియన్ లేదా ప్రామాణిక రేఖాంశం లేదా గ్రీనిచ్ మెరిడియన్ అంటారు.

ప్రశ్న 18.
మెరిడియన్ అంటే ఏమిటి?
జవాబు:
మెరిడియన్ అంటే మధ్యాహ్నం అని అర్థం. ఇది మెరిడియాసిస్ అనే లాటిన్ పదం నుండి వచ్చింది. రేఖాంశాలను మధ్యాహ్నరేఖలని కూడా అంటారు.

ప్రశ్న 19.
ప్రామాణిక సమయం అనగానేమి?
జవాబు:
కొన్ని దేశాలు తమ దేశం గుండా వెళ్లే ఒక రేఖాంశాన్ని ఎంచుకుని ఆ రేఖాంశం వద్ద సమయాన్ని దేశమంతటికీ వర్తింపచేస్తారు, దీనిని ఆ దేశ ప్రామాణిక సమయం అంటారు.

AP 9th Class Social Important Questions Chapter 1 భూమి – మనం

ప్రశ్న 20.
IST అనగానేమి?
జవాబు:
IST అనగా భారతదేశ ప్రామాణిక సమయం (Indian Standard Time).

ప్రశ్న 21.
యాంటీ మెరీడియన్ అనగానేమి?
జవాబు:
0° రేఖాంశమునకు వ్యతిరేక దిశలో 180° లలో ఉన్న రేఖాంశమును యాంటీ మెరీడియన్ అని పిలుస్తారు. అవి 180° తూర్పు రేఖాంశము మరియు 180° లలో ఉన్న పశ్చిమ రేఖాంశములు.

9th Class Social 1st Lesson 2 Marks Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
ఒక ప్రదేశం యొక్క అక్షాంశాలు, మరియు రేఖాంశాలు తెలుసుకోవడం ఎందుకు ముఖ్యం? అది ఏవిధంగా ఉపయోగపడుతుంది?
జవాబు:

  1. ఒక ప్రాంతం గూర్చి పూర్తి సమాచారం తెలుసుకోవాలంటే ఆ ప్రాంతం యొక్క అక్షాంశ రేఖాంశాల గూర్చి తెలుసుకోవాలి.
  2. అక్షాంశాల సహాయంతో ఆ ప్రాంతం యొక్క ఉనికిని తెలుసుకోవచ్చును.
  3. మరియు ఆ ప్రాంతం యొక్క శీతోష్ణస్థితిని కూడా తెలుసుకోవచ్చు.
  4. రేఖాంశాల సహాయంతో ఆ ప్రాంతంలో సమయాన్ని తెలుసుకోవచ్చును.

AP 9th Class Social Important Questions Chapter 1 భూమి – మనం

ప్రశ్న 2.
జినర్ మహాఖండమైన పాంజియా రెండు ఖండాలుగా విడిపోయిందని ప్రతిపాదించాడు –
అవి 1) లారెన్షియా
2) గోండ్వానా భూమి మీద ఉన్న ప్రస్తుతం ఉన్న రూపం, స్థానంలోకి రావడానికి కొన్ని మిలియన్ల సంవత్సరాలు పట్టింది.

1) లారెన్షియా :
ఉత్తర అమెరికా, గ్రీన్‌లాండ్, భారత ఉపఖండానికి ఉత్తరంగా ఉన్న యురేషియా మొత్తం.

2) గోండ్వానా :
దక్షిణ అమెరికా, ఆఫ్రికా, మడగాస్కర్, భారతదేశం, అరేబియా, మలేషియా, తూర్పు ఇండీస్, ఆస్ట్రేలియా, అంటార్కిటికా

పైన ఉన్న సమాచారాన్ని అధ్యయనం చేసి, క్రింది ప్రశ్నలకు జవాబులు రాయండి.
ఎ) గోండ్వానా నుండి ఏర్పడి, ప్రస్తుతం ఆసియా ఖండంలో భాగంగా ఉన్న ఏవైనా రెండు భూభాగాలను పేర్కొనుము.
బి) ప్రస్తుతం ఉన్న యూరప్ ఏ భాగం నుండి ఏర్పడింది?
జవాబు:
ఎ) భారతదేశం, అరేబియా, మలేషియా మొ||వి.
బి) ప్రస్తుతం ఉన్న యూరప్ లారెన్షియా భాగం నుండి ఏర్పడింది.

ప్రశ్న 3.
గ్లోబు చిత్రమును గీచి, దానిమీద ప్రత్యేక పేర్లు కలిగిన అన్ని అక్షాంశములను గుర్తించుము.
జవాబు:
AP 9th Class Social Important Questions Chapter 1 భూమి – మనం 1

9th Class Social 1st Lesson 4 Marks Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
భూమి అంతర్నిర్మాణం గూర్చి వివరించండి (లేదా) భూమి అంతర్గత నిర్మాణమును వర్ణించుము.
జవాబు:
భూమి అంతః మరియు బాహ్య భాగాన్ని కలిపి 3 పొరలుగా విభజించడం జరిగింది.
అవి :

  1. భూ పటలం
  2. భూ ప్రావారం
  3. భూ కేంద్ర మండలం.

1) భూ పటలం :
భూమి యొక్క బాహ్య పొర అయిన భూపటలం మీద మనం నివసిస్తున్నాం. ఈ భూపటలం యొక మందం 30-100 కిలోమీటర్లు. ఈ భూ పటలం వివిధ రకాల శిలలతో నిర్మితమైనది.

2) భూ ప్రావారం :
భూ ప్రావారం భూమి లోపల 100 కి.మీ. నుండి 2,900 కి.మీ. వరకు ఉంటుంది. దీనిలో – సిలికేట్లు అనే రసాయనాలు ఉంటాయి.

3) భూ కేంద్ర మండలం :
భూ కేంద్ర మండలం రెండు భాగాలుగా విభజింపబడింది. 1) బాహ్య కేంద్రం, 2) అంతః కేంద్రం.

బాహ్య కేంద్రం :
2,900 నుండి 5, 100 కి.మీ. వరకు ఉంటుంది. దీనిలో నికెల్ మరియు ఐరన్ ఉన్నాయి.

అంతః కేంద్రం :
5,100 నుండి 6,376 కి. మీ. వరకు ఉంటుంది. ఇక్కడ ఇనుము మరియు బంగారం ఎక్కువగా ఉంటుంది.

Inter 1st Year Maths 1B Formulas PDF Download

Inter 1st Year Maths 1B Formulas PDF: Here we have created a list of Telangana & Andhra Pradesh BIEAP TS AP Intermediate Inter 1st Year Maths 1B Formulas PDF Download just for you. To solve mathematical problems easily, students should learn and remember the basic formulas based on certain fundamentals such as algebra, arithmetic, and geometry.

Get a unique way of solving the maths problem, which will make you learn how the equation came into existence. This is the better way of memorizing and applying the Intermediate 1st Year Maths 1B Formulas PDF. Math formulas are expressions that have been created after several decades of research that help to solve questions quickly.

Students can also go through Intermediate 1st Year Maths 1B Textbook Solutions and Inter 1st Year Maths 1B Important Questions for exam preparation.

Intermediate 1st Year Maths 1B Formulas PDF Download

We present you with Inter 1st Year Maths 1B Formulas PDF for your reference to solve all important mathematical operations and questions. Also, each formula here is given with solved examples.

  1. Inter 1st Year Maths 1B Locus Formulas
  2. Inter 1st Year Maths 1B Transformation of Axes Formulas
  3. Inter 1st Year Maths 1B The Straight Line Formulas
  4. Inter 1st Year Maths 1B Pair of Straight Lines Formulas
  5. Inter 1st Year Maths 1B Three Dimensional Coordinates Formulas
  6. Inter 1st Year Maths 1B Direction Cosines and Direction Ratios Formulas
  7. Inter 1st Year Maths 1B The Plane Formulas
  8. Inter 1st Year Maths 1B Limits and Continuity Formulas
  9. Inter 1st Year Maths 1B Differentiation Formulas
  10. Inter 1st Year Maths 1B Applications of Derivatives Formulas

Inter 1st Year Maths 1B Blue Print Weightage

Here students will find Intermediate 1st Year Maths 1B Formulas for each and every topic and also get an idea of how that equation was developed. Thus, you will not have to memorize formulas, as you understand the concept behind them. Use these Inter 1st Year Maths 1B Formulas to solve problems creatively and you will automatically see an improvement in your mathematical skills.

AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 7 d and f Block Elements & Coordination Compounds

Students get through AP Inter 2nd Year Chemistry Important Questions 7th Lesson d and f Block Elements & Coordination Compounds which are most likely to be asked in the exam.

AP Inter 2nd Year Chemistry Important Questions 7th Lesson d and f Block Elements & Coordination Compounds

Very Short Answer Questions

Question 1.
What are transition elements? Give examples.
Answer:
Transition elements are the elements which contains partially filled d-subshells in their ionic state (or) in their elementary state. Eg : Mn, Co, Ag etc.

Question 2.
Write the general electronic configuration of transition elements.
Answer:
General electronic configuration of transition elements is (n – 1)d1-10 ns1-2.

AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 7 d and f Block Elements & Coordination Compounds

Question 3.
Why are Mn2+ compounds more stable than Fe2+ towards oxidation to their +3 state ?
Answer:
Mn+2 has electronic configuration [Ar] 4s0 3d5.
Fe+2 has electronic configuration [Ar] 4s0 3d6.

  • Mn+2 has half filled d-subshell which is more stable.
    Hence Mn+2 compounds are more stable than Fe+2 toward oxidation to their +3 state.

Question 4.
Why Zn2+ is diamagnetic whereas Mn2+ is paramagnetic ?
Answer:

  • Zn+2 electronic configuration is [Ar] 4s03d10. It has no unpaired electrons. So it is dia magnetic.
  • Mn+2 electronic configuration is [Ar] 4s03d5. It has five unpaired electrons so it is paramagnetic.

Question 5.
Write ‘spin only’ formula to calculate the magnetic moment of transition metal ions.
Answer:
Spin only formula to calculate the magnetic moment of transition metal ions is
μ = \(\sqrt{n(n+2)}\) BM BM = Bohr Magneton.

AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 7 d and f Block Elements & Coordination Compounds

Question 6.
Claculate the ‘spin only’ magnetic moment of \(\mathrm{Fe}^{2+}(\mathrm{aq})\) ion. (Board Model Paper) (AP Mar. ’17)
Answer:
Fe+2 ion has electronic configuration [Ar] 4s03d6.
It has four unpaired electrons n = 4.
Spin only magnetic moment μ = \(\sqrt{n(n+2)}\) BM = \(\sqrt{4(4+2)}\) = \(\sqrt{24}\) BM = 4.89 BM

Question 7.
Aqueous Cu2+ ions are blue in colour, where as aqueous Zn2+ ions are colourless. Why ?
Answer:

  • Electronic configuration of Cu+2 ion is [Ar] 4s03d9. It contains one unpaired electron due to presence of this unpaired electron aq. Cu+2 ions are blue in colour.
  • Electronic configuration of Zn+2 ion is [Ar] 4s03d10. It contains no unpaired electrons, due to absence of unpaired electrons aq. Zn+2 ions are colourless.

Question 8.
What are complex compounds ? Give examples.
Answer:
Complex compounds : Transition metal atoms or ions form a large number of compounds in which anions or neutral groups are bound to metal atom or ion through co-ordinate covalent bonds. Such, compounds are called co-ordination compounds (or) complex compounds.
Eg. : [Fe(CN)6]4-, [Co(NH3)6]3+

Question 9.
What is an alloy? Give example.
Answer:
Alloy : An intimate mixture having physical properties similar to that of the metal formed by a metal with other metals or metalloids or sometimes a non metal is called as an alloy.
Eg.: Invar — 64% Fe, 35% Ni, Mn 8cc in traces
Nichrome — 60% Ni,, 25% Fe, 15% Cr.

Question 10.
What is lanthanoid contraction ? (IPE 2016(TS))
Answer:
The slow decrease of atomic and ionic radii in lanthanides with increase in atomic number is called lanthanide contraction.

AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 7 d and f Block Elements & Coordination Compounds

Question 11.
What is mischmetall ? Give its composition and uses. (AP Mar. ’16)
Answer:
Mischmetall is an alloy which consists of a lanthanoid metal (~ 95%) and iron (~ 5%) and traces of S, C, Ca and Al.

  • It is used in Mg- based alloy to produce bullets, shell and lighter flint.

Question 12.
What is a coordination polyhedron ?
Answer:
The spatial arrangement of the ligands which are directly bonded to the central atom or ions defines the geometry about the central atom is called co-ordination polyhedron.
Eg.: Octahedral, tetrahedral etc.

Question 13.
What is a ligand ? (TS Mar. ’18) (IPE 2014)
Answer:
Ligand : A co-ordinating entity which is bound to the central atom by donating electron pairs is called a ligand. Eg.: Cl, NH3, CN etc.

Question 14.
What is a chelate ligand ? Give example.
Answer:
The ligands which can form two co-ordinate covalent bonds through two donor atoms are called bidentate ligands. These bidentate ligands are also called chelate ligands.
Eg.: C2\(\mathrm{O}_4^{-2}\), \(\mathrm{CO}_3^{-2}\) etc.

Question 15.
What is an ambidentate ligand ? Give example. (TS Mar. ’18) (IPE 2016(AP))
Answer:
A unidentate ligand containing two possible donor atoms can co-ordinate through either of donor atoms. Such ligands are called ambidentate ligands. Eg : \(\mathrm{NO}_2^{-}\)

Question 16.
[Cr(NH3)6]3+ is paramagnetic while [Ni(CN)4]2- is diamagnetic. Why ?
Answer:

  • [Cr(NH3)6]3+ is paramagnetic due to the presence of three unpaired electrons.
  • [Ni(CN)4]2- is diamagnetic due to the absence of unpaired electrons.

AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 7 d and f Block Elements & Coordination Compounds

Question 17.
Which metal in the first series of transition metals exhibits +1 oxidation state most frequently and why ?
Answer:
Copper exhibits +1 oxidation state most frequently because Cu+ has electronic configuration [Ar] 4s03d10 which has a fulfilled d-subshell which is more stable.

Question 18.
Why do transition elements exhibit more than one Oxidation state (variable oxidation states) ?
Answer:
Transition elements exhibits more than one oxidation state.
Reason :

  • The energy difference between (n – 1) d subshell and ns subshell is very low. So both of these subshells complete to lose the electrons.

Question 19.
CuSO4.5H2O is blue in colour where as anhydrous CuSO4 is colourless. Why ? (IPE 2014)
Answer:
CuSO4.5H2O is blue in colour whereas anhydrous CuSO4 is colourless because in the absence of ligand, crystal field splitting doesnot occurs.

Question 20.
Give the formula the following complexes.
a) Potassium hexacyano ferrate (III)
b) Tetra carbonyl nickel (O) (IPE 2016 (TS))
Answer:
a) K3 [Fe (CN)6]
b) [Ni(CO)4]

Question 21.
Scandium is a transition element. But Zinc is not. Why ? (IPE 2014)
Answer:
Scandium has electronic configuration [Ar] 4s23d1.
Zinc has electronic configuration [Ar] 4s23d10.
Scandium has one unpaired d-electron where as Zinc has zero unpaired d-electrons so Scandium is transition element but Zinc is not.

Question 22.
What are interstitial compounds ? (IPE 2015)
Answer:
Interstitial compounds are non-stichiometric compounds which are formed when non-metals like H, C, N etc., are heated with transition elements. In these compounds the non-metal atoms occupy the interstitial species of metal atoms. Ex : TiH0.54

Question 23.
In what way is the electronic configuration of transition elements different from non transition elements ?
Answer:

  • The general electronic configuration of transition elements is (n – 1) d1-10 ns1-2.
  • The general electronic configuration of non-transition elements is (n – 1)d10 ns2.

Question 24.
Even though silver has d10 configuration, it is regarded as transition element. Why ?
Answer:
The outer electronic configuration of silver is – 4d105s1. It is having general electronic configuration of a transition element (n – 1) d1-10 ns1-2.
So silver is a transition element.

Question 25.
Though Sc is a transition element, it does not exhibit variable oxidation state. Why ?
Answer:
Scandium has electronic configuration [Ar] 4s23d1. It has only one unpaired d-electron. So it does not exhibits variable oxidation state. It exhibits +3 stable oxidation state.

AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 7 d and f Block Elements & Coordination Compounds

Question 26.
Why is it difficult to obtain M3+ oxidation state in Ni, Cu and Zn ?
Answer:

  • Ni has electronic configuration [Ar] 4s23d8.
    Ni+2 has electronic configuration [Ar] 4s03d8.
    It is difficult to remove an electron from 3d8. So, Ni+3 is difficult to obtain. (Ni has high negative enthalpy of hydration).
  • Cu has electronic configuration [Ar] 4s13d10.
    Cu+ has electronic configuration [Ar] 3d10.
    It is difficult to remove the electrons from 3d10 (stable). So, Cu+3 is difficult to obtain.
  • Zn has electronic configuration [Ar] 4s23d10.
    Zn+2 has electronic configuration [Ar] 4s03d10.
    It is difficult to remove the electron from 3d10 (stable). So Zn+3 is difficult to obtain.

Question 27.
Cu+2 forms halides like CuF2, CuCl2 and CuBr2 but not CuI2. Why ?
Answer:
Cu+2 forms halides like CuF2, CuCl2 and CuBr2 but not CuI2 because Cu+2 oxidises I to I2.
2Cu+2 + 4I → Cu2I2 + I2.

Question 28.
Why is Cr2+ reducing and Mn3+ oxidizing even though both have the same d4 electronic configuration ?
Answer:
Cr+2 is reducing as its configuration changes from d4 to d3, the latter having a half filled t2g level. On the other hand the change from Mn+2 to Mn+3 results in the half filled (d5) configuration which has extra stability.

Question 29.
What is meant by ‘disproportionation’ ? Give an example of disproportionation reaction in aqueous solution.
Answer:
The reactions in which only one element undergo both oxidation as well as reduction are called disproportionation reactions.

  • When a particular oxidation state becomes less stable relative to other oxidation states, one lower, one higher, it is said to undergo disproportionation.
    Eg: Cu+ ion is not stable in aqueous solution because it undergo disproportionation in aqueous solution.

AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 7 d and f Block Elements & Coordination Compounds 7

Question 30.
Why do the transition metals readily form alloys?
Answer:
Because of similar atomic or ionic radii and similar characterstic properties of transition elements alloys are readily formed by these elements.

Question 31.
How do the Ionic character and acidic nature vary among the oxides of first transition series?
Answer:

  • As the oxidation number of a metal increases ionic character decreases in case of transition elements. Eg: Mn2O7 is a covalent green oil.
  • In CrO3 and V2O5 the acidic character is predominant.
  • V2O5 is however amphoteric though mainlý acidic V2O5 reacts with alkali as well as acids to give \(\mathrm{VO}_4^{-3}\) and \(\mathrm{VO}_4^{-3}\).
  • CrO is basic.
  • Mn2O7 gives HMnO4 and CrO3 gives H2CrO4 and H2Cr2O7.

AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 7 d and f Block Elements & Coordination Compounds

Question 32.
What are the different oxidation s.tates exhibited by the lanthanoids?
Answer:

  • Lanthanoids exhibits +2, +3 states majorly. Sometimes +2 and +4 states exhibited in solid compounds.
  • The common oxidation state of lanthanoids is +3.

Question 33.
What is difference between a double salt and a complex compound?
Answer:
Double salts dissociate into simple ions completely when dissolved in water while complex compounds dissociate to give complex ion and the counter ions.

Question 34.
What is meant by coordination number.
Answer:
Co-ordination Number is the number of ligands present around a central metal atom or ion in a complex Ex : The co-ordination number of Co in [Co(NH3)3 Cl3] is six.

Question 35.
Using IUPAC norms write the systematic names of the following.

  1. [CO(NH3)6]Cl3
  2. [Pt(NH3)2Cl(NH2CH3)]Cl
  3. [Ti(H2O)6]3+ and
  4. [NiCl4]2-

Answer:

  1. Hexa amine cobalt (III) chloride
  2. Diamine chloride (methyl amine) platinum (II) chloride
  3. Hexa aquo titanium (III) ion
  4. Tetra chloro nickelate (III) ion

Question 36.
Calculate the magnetic moment of a divalent ion in aqueous solution if its atomic number is 25. (IPE 2016 (AP)) (AP Mar. ’16)
Solution:
With atomic number 25, the divalent ion in aqueous solution will have d5 configuration (five unpaired electrons). The magnetic moment, μ is
μ = \(\sqrt{5(5+2)}\) = 5.92 BM

Short Answer Questions

Question 1.
Write the characteristic properties of transition elements.
Answer:
Transition elements exhibits typical characteristic properties.

  • Electronic configurations.
  • Para and ferro magnetic properties.
  • Alloy forming ability.
  • Complex forming ability.
  • Interstitial compounds.
  • Variable oxidation states.
  • Formation of coloured hydrated ions.
  • Catalytic property.
  • Metallic character.

AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 7 d and f Block Elements & Coordination Compounds

Question 2.
What is lanthanoid contraction ? What are the consequences of lanthanoid contraction ? (AP Mar. ’17) (IPE Mar. 15 (TS), 14 B.I.E)
Answer:
Lanthanoid contraction : The overall decrease in atomic and ionic radii from lanthanum to leutetium is observed in the lanthanoids. This phenomenon is called lanthanoid contraction. It is due to the fact that with every additional proton in the nucleus, the corresponding electron goes into a 4f-subshell. This is too diffused to screen the nucleus as effectively as the more localised inner shell. Hence, the attraction of the nucleus for the outermost electrons increases steadily with the atomic number.

Consequences of Lanthanoid Contraction : The important consequences of lanthanoid contraction are as follows :

i) Basic character of oxides and hydroxides : Due to the lanthanoid contraction, the covalent nature of La-OH bond increases and thus, the basic character of oxides and hydroxides decreases from La(OH)3 to Lu(OH)3.

ii) Similarity in the size of elements of second and third transition series : Because of lanthanoid contraction, elements which follow the third transition series are considerably smaller than would otherwise be expected. The normal size increases from Sc → Y → La and disappears after lanthanides. Thus, pairs of elements such as Zr/Hf, Nb/Ta and Mo/w are almost identical in size.
Due to almost similar size, such pairs have very similar properties which makes their separation difficult.

iii) Separation of lanthanoids : Due to lanthanoid contraction, there is a difference in some properties of lanthanoid like solubility, degree of hydration and complex formation. These difference enable the separation of lanthanoids by ion exchange method.

Question 3.
Explain Werner’s theory of coordination compounds with suitable examples. (Mar. ’14) (TS Mar. ’15) (IPE – May. 2015 (TS), ’14 B.I.E)
Answer:
Werner’s theory :
Postulates :

1) Every complex compound has a central metal atom (or) ion.

2) The central metal shows two types of valencies namely primary valency and secondary valency.

A) Primary valency : The primary valency is numerically equal to the oxidation state of the metal. Species or groups bound by primary valencies undergo complete ionization. These valencies are identical with ionic bonds and are non-directional. These valencies are represented by discontinuous lines (….)
Eg. : CoCl3 contains Co3+ and 3Cl ions. There are three Primary Valencies or three ionic bonds.

B) Secondary Valency : Each metal has a characteristic number of Secondary Valencies. They are directed in space around the central metal.
The number of Secondary Valencies is called Coordination number (C.N.) of the metal. These valencies are directional in nature.
For example in CoCl3. 6NH3
Three Cl ions are held by Primary Valencies and 6NH3 molecules are held by Secondary Valencies. In CuSO4.4NH3 complex \(\mathrm{SO}_4^{2-}\) rion is held by two Primary Valencies and 4NH3 molecules are held by Secondary Valencies.

3) Some negative ligands, depending upon the complex, may satisfy both primary and secondary valencies. Such ligands, in a complex, which satisfy both primary as well as secondary valencies do not ionize.

4) The primary valency of a metal is known as its outer sphere of attraction or ionizable valency while the Secondary valencies are known as the inner sphere of attraction or coordination sphere. Groups bound by secondary valencies do not undergo ionization in the complex.
Example to Clarify Werner’s Theory

AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 7 d and f Block Elements & Coordination Compounds 1
AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 7 d and f Block Elements & Coordination Compounds 2

AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 7 d and f Block Elements & Coordination Compounds

Question 4.
Using IUPAC norms write the formulas for the following.

  1. Tetrahydroxozincate (II)
  2. Hexaaminecobalt (III) sulphate
  3. Potassium tetrachloropalladate (II) and
  4. Potassium tri(oxalato) chromate (III) (IPE – May. 2015 (AP, TS), 14)

Answer:

  1. Tetrahydroxozincate (II) ion – [Zn(OH)4]-2
  2. Hexa amine cobalt (III) sulphate – [Co(NH3)6]2 (SO4)3
  3. Potassium tetrachioro palladate (II) – K2[PdCl4]
  4. Potassium tri(oxalato) chromate (III) – K3[Cr(C2O4)3]

Question 5.
What are homoleptic and heteroleptic complexes ? Give one example for each.
Answer:
Homoleptic complexes : These are the complexes in which a metal is bound by only ore kind of ligands, eg. : [Co(NH3)6]3+
Heteroleptic complexes: These are the complexes in which a metal is bound by more than one kind of ligands, eg. : [Co(NH3)4Cl2]+

Question 6.
Give the geometrical shapes of the following complex entities

  1. [CO(NH3)6]3+
  2. [Ni(CO)4]
  3. [Pt Cl4]2- and
  4. [Fe(CN)6]4-.

Answer:

  1. Geometrical shape of [CO(NH3)6]3+ is octahedral.
  2. Geometrical shape of [Ni(CO)4] is tetrahedral.
  3. Geometrical shape of [PtCl4]2- is square planar.
  4. Geometrical shape of [Fe(CN)6]-4 is octahedral.

Question 7.
Using IUPAC norms write the systematic names of the following.

  1. K4[Fe(CN)6]
  2. [Cu(NH3)4]SO4
  3. [Ti (H2O)6]3+ and
  4. [NiCl4]2-.

Answer:

  1. K4[Fe(CN)6] – Potassium hexa cyanao ferrate (II)
  2. [Cu(NH3)4]SO4 – Tetra amine copper (II) sulphate
  3. [Ti (H2O)6]3+ and – Hexa aquo titanium (III) ion
  4. [NiCl4]2- – Tetra chloro nickelate (II) ion

Question 8.
Explain the terms
(i) Ligand
(ii) Coordination number
(iii) Coordination entity
(iv) Central metaf atom/ion.
Answer:
i) Ligand : The ions, or molecules bound to the central atom/ion in the coordination entity are called ligands. These may be

a) simple ions such as Cl
b) small molecules such as H2O or NH3
c) large molecules such as H2N.CH2CH2NH2 or N(CH2CH2NH2)3 or even
d) macro-molecules, such as proteins.

On the basis of the numberof donor atoms available for coordination, the ligands can be classified as :

a) Unidentate : One donor atom, Eg. AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 7 d and f Block Elements & Coordination Compounds 3 etc.
b) Bidentate : Two donor atoms, Eg.: H2NCH2CH2NH2
(ethane-1, 2-diamine or en), C2\(\mathrm{O}_4^{2-}\) (oxalate), etc.
c) Polydentate : More than two donor atoms, Eg. : N(CH2CH2NH2)3 EDTA, etc.

ii) Coordination number : The coordination number (CN) of metal ion in a complex can be defined as the number of ligands or donor atoms to which the metal is directly bonded.
Eg : In [Ptcl6]2-, CN of Pt = 6, In [Ni(NH3)4]2+, CN of Ni = 4.

iii) Coordination entity: A central metal atoms or ions bonded to a fixed number of molecules or ions (ligands) is known as coordination entity. For example [CoCl3(NH3)3]. Ni(CO)4], etc.

iv) Central metal atom/ion : In a coordination entity, the atom/ion to which a fixed no. of ions/groups are bound in a definite geometrical arrangement around it is called central metal atom or ion. Eg : K4[Fe(CN)6] ‘Fe’ is central metal.

Question 9.
Explain the terms

  1. Unidentate ligand
  2. Bidentate ligand
  3. Polydentate ligand and
  4. Ambidentate ligand giving one example for each.

Answer:

  1. Unidentate : The negative ion or neutral molecule having only one donor atom is called unidentate ligand
    Eg : AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 7 d and f Block Elements & Coordination Compounds 4 etc.
  2. Bidentate (or didentate) : The ions or molecules having two donor atoms are called
    AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 7 d and f Block Elements & Coordination Compounds 5
  3. Polydentate ligands : Ligands having more than one donor atom in the coordinating group and are capable of forming two or more coordinate bonds with same central atom simultaneously are called poly dentate ligands. Eg : C2\(\mathrm{O}_4^{-2}\).
  4. Ambidentate: Ligand which can ligate through two different atoms is called ambidentate ligand. Eg : \(\mathrm{NO}_2^{-}\), \(\mathrm{SCN}^{-}\) ions. \(\mathrm{NO}_2^{-}\) ion can coordinate either through nitrogen or through oxygen to a central metal atom/ion. Similarly, \(\mathrm{SCN}^{-}\) ion can coordinate through the sulphur or nitrogen atom.
    AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 7 d and f Block Elements & Coordination Compounds 6

AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 7 d and f Block Elements & Coordination Compounds

Question 10.
Explain the colour and para magnetic property of transition elements.
Answer:
Transition elements having unpaired electrons in d-orbitals are coloured. The colour is due to d-d transitions of electrons. Electrons are excited from lower set of d-orditals to higher set of d- orbitals by absorbing energy from visible light and emits complementary colour which is the colour of the ion. Transition elements are ions having atleast one unpaired electron in d-orbitals are para magnetic. The extent of para magnetic property is expressed in terms of magnetic moment (μ). μ = \(\sqrt{n(n+2)}\) where n is number of unpaired electrons present in d- orbitals.

Question 11.
Explain different types of isomerism exhibited by Co-ordination compounds, giving suitable examples.
Answer:
Isomerism in Co-ordination compounds : Isomers are compounds that have the same chemical formula but different arrangement of atoms. Two principal types of isomerism are known among co-ordination compounds namely stereo isomerism and structural isomerism.

a) Stereoisomerim : Stereoisomerism is a form of isomerism in which two substances have the same composition and structure but differ in the relative spatial positions of the ligands. This can be sub divided into two classes namely.
i) Geometrical isomerism and
ii) optical isomerism

b) Structural isomerism :
i) Linkage isomerism
ii) Co-ordination isomerism
iii) Ionisation isomerism
iv) Hydrate isomerism

a) (i) Geometrical isomerism :

  • Geometrical isomerism arises in Co-ordination complexes due to different possible geometric arrangements of the ligands.
  • This isomerism found in complexes with Co-ordination numbers 4 and 6.
  • In a square planar complex of formula [Mx2L2] the two ligands may be arranged in adjacent to each other in a cis isomer (or) opposite to each other in a trans isomer.
    AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 7 d and f Block Elements & Coordination Compounds 8
  • Square planar complex of type [MAB XL] shows three isomers two-cis and one trans. (A, B, X, L are unidentate ligands is square planar complex).
  • Geometrical isomerism is not possible in tetrahedral geometry.
  • In octahedral complex of formula [MX2L4] in which two ligands X may be oriented cis or trans to each other.
    AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 7 d and f Block Elements & Coordination Compounds 9
  • Another type of geometrical isomerism occurs in octahedral Co-ordination compounds of type [Ma3b3] if three donor atoms of the same ligands occupy adjacent positions at the comers of an octahedral face then it is facial (fac) isomer. When the positions occupied are around the meridian of the octahedran then it is meridonial (mer) isomer.
    AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 7 d and f Block Elements & Coordination Compounds 10

a(ii) Optical isomerism : Optical isomerism arises when two isomers of a compound exist such that one isomer is a mirror image of the other isomer. Such isomers are called optical isomers or enantiomers. The molecules or ions that cannot be superimposed are called chiral.

The two forms are called dextro (d) and laevo (l) depending upon the direction they rotate the plane of polarised light in a polarimeter (d rotates to the right, l to the left). Optical isomerism is common in octahedral complexes involving bidentate ligands.

b(i) Linkage isomerism: Linkage isomerism arises in Co-ordination compound containing ambidentate ligand. A simple example is provided by complexes containing the thiocyanate ligand-NCS, which may bind through the nitrogen to give M-NCS or through sulphur to give M-SCN.
eg. : [Mn(CO)5SCN] and [Mn(CO)5NCS]

(ii) Co-ordinate isomerism : This type isomerism arises from the interchange of ligands between cationic and anionic entities of different metal ions present in a complex.
eg. : [CO(NH3)6] [Cr(CN)6] and [Co(CN)6] [Cr(NH3)6]

(iii) Ionisation isomerism: This form of isomerism arises when the counter ion in a complex salt is itself a potential ligand and can displace a ligand which can then become the counter ion.
eg. : [Co(NH3)5SO4] Br and [Co(NH3)5Br]SO4

(iv) Hydrate isomerism : This form of isomerism is known as ‘hydrate isomerism since water is involved as a solvent. Hydrate isomers differ by whether or not a hydrate molecule is directly bonded to the metal ion or merely present as free solvent molecules in the crystal lattice.

Question 12.
What is meant by chelate effect ? Give example.
Answer:
When a didentate or a polydentate ligand contains donor atoms positioned in such a way that when they coordinate with the central metql ion, a 5-or 6-membered ring is formed, the effect is known as chelate effect. Example
AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 7 d and f Block Elements & Coordination Compounds 11

Question 13.
Discuss the nature of bonding and magnetic behaviour in the following co-ordination entities on the basis of valence bond theory.
(i) [Fe(CN)6]4-
(ii) [FeF6]3-
(iii) [Co(C2O4)3]3- and
(iv) [CoF6]3-
Answer:
i) [Fe(CN)6]4- : In this complex Fe is present as Fe2+.
Fe = [Ar] 3d64s2
Outer configuration of Fe2+ = 3d64s0
AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 7 d and f Block Elements & Coordination Compounds 12
CN being strong field ligand, pair up the unpaired d electrons Thus, two 3d-orbital are now available for CN ions.
AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 7 d and f Block Elements & Coordination Compounds 13
Since, all the electrons are paired, the complex is diamagnetic. Moreover (n – 1) d-orbitals are involved in bonding, so, it is an inner orbital or low spin complex.

ii) [FeF6]3- : In this complex, the oxidation state of Fe is + 3.
AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 7 d and f Block Elements & Coordination Compounds 14
F- is not a strong field ligand. It is a weak field ligand, so no pairing occurs. Thus, 3d- orbitals are not available to take part in bonding.
AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 7 d and f Block Elements & Coordination Compounds 15
Because of the presence of five unpaired electrons, the complex is paramagnetic. Moreover, nd-orbitals are involved in bonding, so it is an outer orbital or high spin complex.

iii) [Co(C2O4)3]3- : In this complex, the oxidation state of Co is + 3.
Outer configuration of Co = 3d7 4s2
Co3+ = 3d64s0
AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 7 d and f Block Elements & Coordination Compounds 16
Oxalate ion being a strong field ligand pair up the 3d electrons, thus two out of the five 3d-orbitals are available for oxalate ions.
AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 7 d and f Block Elements & Coordination Compounds 17
Since, all the electrons are paired, this complex is diamagnetic. It is an inner orbital complex because of the involvement of (n – 1) d-orbital for bonding,

iv) [CoF6]3- : In this complex, Co is present as Co3+
Outer configuration of Co3+ = 3d6 4s0
AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 7 d and f Block Elements & Coordination Compounds 18
Because of the presence of four unpaired electrons, the complex is paramagnetic. Since, nd orbitals take part in bonding, it is an outer orbital complex or high spin complex.

AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 7 d and f Block Elements & Coordination Compounds

Question 14.
What is spectrochemical series ? Explain the difference between a weak field ligand and a strong field ligand.
Answer:
The arrangement of ligands in order of their increasing field strengths, i.e., increasing crystal field splitting energy (CFSE) values is called spectrochemical series.
AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 7 d and f Block Elements & Coordination Compounds 19

The ligands with a small value of CFSE (Δ0) are called weak field ligands. For such ligands Δ0 < P where P is the pairing energy. Whereas the ligands with a large value of CFSE are called strong field ligands. In case of such ligands Δ0 > R

When ligands approach a transition metal ion, the d-orbitals split into two sets (t2g and eg), one with lower energy and the other with higher energy. The difference of energy between the two sets of orbitals is called crystal field splitting energy, Δ0 for octahedral field and Δt for tetrahedral field.

If Δ0 < P (pairing energy), the 4th electron enters one of the eg orbitals giving the configuration \(t_{2 g}^3 e_g^1\) thereby forming high spin complex. Such ligands for which Δ0 < P are known as weak field ligands.
If Δ0 > P, the 4th electron pairs up in one of the t2g orbitals giving the configuration \(t_{2 g}^3 e_g^1\), thus forming low spin complexes. Such ligands for which Δ0 > P are called strong field ligands.

Question 15.
Explain the terms
(i) Ligand
(ii) Coordination number
(iii) Coordination entity
(iv) Central metal atom/ion.
Answer:
i) Ligand : The ions or molecules bound to the central atom/ion in the coordination entity are called ligands. These may be
a) simple ions such as Cl
b) small molecules such as H2O or NH3
c) large molecules such as H2NCH2CH2NH2 or N(CH2CH2NH2)3 or even
d) macro-molecules, speh as proteins.
On the basis of the number of donor atoms available for coordination, the ligands can be classified as :

a) Unidentate : One donor atom, Eg.: AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 7 d and f Block Elements & Coordination Compounds 20 etc.
b) Bidentate : Two donor atoms, Eg.: H2NCH2CH2NH2
(ethane-1, 2-diamine or en), C2\(\mathrm{C}_2 \mathrm{O}_4^{2-}\) (oxalate), etc.
c) Polydentate: More than, two donor atoms, Eg.: N(CH2CH2NH2)3 EDTA etc.

ii) Coordination number: The coordination number (CN) of metal ion in a complex can be defined as thê number of ligands or donor atoms to which the metal is directly bonded.
Eg: In [PtCl6]2-, CN of Pt = 6, In [Ni(NH3)4]2+, CN of Ni = 4.

iii) Coordination entity : A central metal atoms or ion bonded to a fixed number of molecules or ions (ligands) is known as coordination entity. For example [COCl3(NH3)3]. Ni(CO)4], etc.

iv) Central metal atom/ion: In a coordination entity, the atom/ion to which a fixed no. of ions/groups are bound in a definite geometrical arrangement around it is called central metal atom or ion. Eg: K4[Fe(CN)6] ‘Fe’ is central metal.

AP 10th Class Social Important Questions Chapter 2 అభివృద్ధి భావనలు

These AP 10th Class Social Studies Important Questions 2nd Lesson అభివృద్ధి భావనలు will help students prepare well for the exams.

AP Board 10th Class Social 2nd Lesson Important Questions and Answers అభివృద్ధి భావనలు

10th Class Social 2nd Lesson ½ Mark Important Questions and Answers in Telugu Medium

1. ఆదాయ రీత్యా ప్రస్తుతము భారతదేశ స్థితి ఏమిటి?
జవాబు:
మధ్యస్థ ఆదాయం గల దేశం.

2. రాష్ట్రాల బడ్జెట్ లో చదువుపై ఎక్కువ ఖర్చు చేస్తున్న రాష్ట్రం ఏది?
జవాబు:
హిమాచల్ ప్రదేశ్.

3. 2013 మానవాభివృద్ధి సూచిక ప్రకారం భారతదేశం ఏ స్థానంలో ఉంది?
జవాబు:
136

4. భారతదేశంలోని ఏ రాష్ట్రంలో పాఠశాల విద్యా విప్లవం ప్రారంభమయినది?
జవాబు:
హిమాచల్ ప్రదేశ్.

5. స్త్రీలను పురుషులతో సమానంగా చూడక పోవటాన్ని ఏమంటారు?
జవాబు:
తలసరి ఆదాయం

AP 10th Class Social Important Questions Chapter 2 అభివృద్ధి భావనలు

6. దేశాలను వర్గీకరించటానికి ప్రపంచ బ్యాంక్ చేత ఉపయోగించబడిన సూచిక ఏది?
జవాబు:
తలసరి ఆదాయం

7. మానవాభివృద్ధి చరిత్ర పరిణామక్రమ కాల సూచి ప్రకారం వేట, సేకరణ ఎప్పటి నుండి ప్రారంభమయింది?
జవాబు:
2,00,000 సం||లు.

8. ‘కుడంకుళం’ ఏ రాష్ట్రంలో కలదు?
జవాబు:
తమిళనాడు (తిరునల్వేలి జిల్లా)

9. ‘ఐవరీకోస్ట్’ దేశం ఏ ఖండంలో ఉంది?
జవాబు:
ఆఫ్రికా.

10. దేశం మొత్తం ఆదాయాన్ని దేశ జనాభాతో భాగిస్తే …….. వస్తుంది.
జవాబు:
లింగ వివక్షత.

11. తలసరి ఆదాయం =?
జవాబు:
AP 10th Class Social Important Questions Chapter 2 అభివృద్ధి భావనలు 4

12. 2012 సం||రానికి 1035 అమెరికన్ డాలర్ల కంటే తక్కువ ఆదాయం ఉన్న దేశాలను ఏమని అంటారు?
జవాబు:
తక్కువ ఆదాయ దేశాలు.

13. 2012 సం||రానికి 12,600 అమెరికన్ డాలర్ల కంటె ఎక్కువ ఆదాయం ఉన్న దేశాలను ఏమని పిలుస్తారు?
జవాబు:
అధిక ఆదాయ దేశాలు.

14. పోలికకు ‘సగటు’ ఉపయోగకరంగా ఉన్న ఇది ఏమి వెల్లడి చేయదు?
జవాబు:
ప్రజల మధ్య అంతరాలను.

15. అక్షరాస్యత శాతంను గణించేటపుడు ఎన్ని సం||రాలకు మించి వయస్సు ఉన్న వాళ్ళను లెక్కలోకి తీసుకుంటారు?
జవాబు:
7 సం||లు.

AP 10th Class Social Important Questions Chapter 2 అభివృద్ధి భావనలు

16. నికర హాజరు శాతం లెక్కించడానికి ఎన్ని సం||రాల వయస్సు పిల్లల్లో బడికి హాజరవుతున్న పిల్లల శాతంను తీసుకుంటారు?
జవాబు:
6 – 17 సం||లు.

17. సజీవంగా పుట్టిన ప్రతి వెయ్యి మంది పిల్లల్లో సం||రం పూర్తి అయ్యేసరికి ఎంత మంది చనిపోతున్నారో తెలియజేసే సంఖ్యను ఏమంటారు?
జవాబు:
శిశు మరణాల రేటు.

18. మానవాభివృద్ధి సూచికలో మొత్తం ఎన్ని దేశాలలో ఆయా దేశాల స్థానాన్ని ఇస్తుంది?
జవాబు:
177.

19. 2005 సం||లో భారతదేశంలో రాష్ట్ర ప్రభుత్వాలు విద్య పై సగటున ప్రతి విద్యార్థిపై ఎన్ని రూపాయలు ఖర్చు పెట్టాయి?
జవాబు:
₹1049

20. లింగ వివక్షత తక్కువగా ఉన్న రాష్ట్రం ఏది?
జవాబు:
హిమాచల్ ప్రదేశ్.

21. UNDPని విస్తరింపుము.
జవాబు:
ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమము.

22. HDI ని విస్తరింపుము.
జవాబు:
మానవాభివృద్ధి సూచిక.

23. మానవాభివృద్ధి చరిత్ర పరిణామక్రమ కాలసూచి ప్రకారం పారిశ్రామికీకరణ మొదలై ఎన్ని సం||రాల ని తెలుస్తుంది?
జవాబు:
400 సం||లు కు పూర్వం

24. మానవాభివృద్ధి చరిత్ర పరిణామ క్రమ కాలసూచి ప్రకారం వ్యవసాయం మొదలై ఎన్ని సం||రాలని తెలుస్తుంది?
జవాబు:
12000 సం||లు.

25. అబిద్ జాన్ పట్టణం ఏ దేశంలో కలదు?
జవాబు:
ఐవరి కోస్ట్.

26. దేశ వాసులందరి ఆదాయము మొత్తం కలిపి ఏమి అంటాము?
జవాబు:
జాతీయాదాయము.

27. ఒక దేశంలోని ప్రజలు మరో దేశ ప్రజల కంటే మెరుగ్గా ఉన్నారా లేదా అనే విషయం తెలుసుకోవడానికి దేనిని పోలుస్తాం?
జవాబు:
సగటు ఆదాయం

28. పశ్చిమాసియా దేశాలు, మరికొన్ని చిన్నదేశాలు మినహా ‘ధనిక దేశాలను’ సాధారణంగా ఏ దేశాలని అంటారు?
జవాబు:
అభివృద్ధి చెందిన

AP 10th Class Social Important Questions Chapter 2 అభివృద్ధి భావనలు

29. దశాబ్దం క్రితం భారతదేశం. ఏ ఆదాయ దేశాల జాబితాలో ఉండేది?
జవాబు:
తక్కువ ఆదాయం

30. ఆయు:ప్రమాణం, తలసరి ఆదాయం మనకంటే ఎక్కువ ఉన్న మన పొరుగు దేశమేది?
జవాబు:
శ్రీలంక

31. పాఠశాల విద్యలో ఎన్ని సం||లు గడపటం అన్నది హిమాచల్ ప్రదేశ్ పిల్లలకు నియమంగా మారిపోయింది?
జవాబు:
10 సం||లు

32. 2012 సం||రానికి 1036 – 12599 అమెరికన్ డాలర్ల మధ్య తలసరి ఆదాయం ఉన్న దేశాలన్నీ ఏ దేశాల జాబితాలోకి వస్తాయి?
జవాబు:
మధ్య ఆదాయ దేశాలు.

33. దూర ప్రదేశంలో ఉద్యోగం వస్తే జీతమే కాకుండా పరిగణనలోకి తీసుకునే ఏదైనా ఒక అంశం రాయండి.
జవాబు:
కుటుంబానికి ఉండే సదుపాయాలు, పని పరిస్థితులు, క్రమం తప్పకుండా పని దొరకడం.

34. మహిళలు అనేక రకాల ఉద్యోగాలు చేపట్టటానికి, వ్యాపారాలు నిర్వహించటానికి వారికి కల్పించాల్సిన ముఖ్యమైన సదుపాయం ఏది?
జవాబు:
భద్రత

35. 2012 సం||రంలో పంజాబు రాష్ట్ర తలసరి ఆదాయం ఎంత?
జవాబు:
₹78,000

36. 2012 సం||రంలో హిమాచల్ ప్రదేశ్ తలసరి ఆదాయం ఎంత?
జవాబు:
₹74,000

37. 2011 జనాభా లెక్కల ప్రకారం పంజాబు రాష్ట్ర అక్షరాస్యత శాతం ఎంత?
జవాబు:
77%

38. 2011 జనాభా లెక్కల ప్రకారం హిమాచల్ ప్రదేశ్ అక్షరాస్యత శాతం ఎంత?
జవాబు:
84%

39. 2006 సం||రంలో బీహార్ రాష్ట్రంలోని శిశుమరణాలు 1000కి ఎంత ఉన్నాయి?
జవాబు:
62.

40. 2006 సం||రంలో పంజాబు రాష్ట్రంలోని శిశుమరణాలు 1000 కి ఎంత ఉన్నాయి?
జవాబు:
42.

41. శిశు మరణాల రేటును తగ్గించటానికి చేపట్టాల్సిన ఏదైనా ఒక చర్యను తెల్పండి.
జ. మౌలిక ఆరోగ్య సదుపాయాలు, విద్య సౌకర్యాలు కల్పించాలి.

42. 2018 సం||రం లెక్కల ప్రకారం భారతదేశ తలసరి ఆదాయం ఎంత?
జవాబు:
3285

43. 2018 సం||రం లెక్కల ప్రకారం శ్రీలంక తలసరి పంజాబ్ ఆదాయం ఎంత?
జవాబు:
$ 5170

44. హిమాచల్ ప్రదేశ్ లో ఆడ పిల్లలు కూడా అత్యధిక బీహార్ సంఖ్యలో చదువుకోడానికి ఒక కారణం తెల్పండి.
జవాబు:
వివక్షత లేకపోవటం, తల్లిదండ్రుల ఆలోచనా విధానంలో మార్పు రావటం.

45. ఆడ పిల్లల చదువు వల్ల వచ్చే ప్రయోజనంను ఒకటి రాయండి.
జవాబు:
ఆత్మవిశ్వాసం కనబరుస్తారు, ఆడవాళ్ళ మాటకు ప్రాధాన్యత ఉంటుంది, స్వతంత్రంగా ఆలోచిస్తారు.

46. 2006 సం||రంలో హిమాచల్ ప్రదేశ్లో 6 సం||లు దాటిన ఆడపిల్లల్లో బడికి వెళ్ళిన వారి శాతం ఎంత?
జవాబు:
60%

47. 2006 సం॥రంలో హిమాచల్ ప్రదేశ్ లో 6 సం||లు దాటిన మగపిల్లల్లో బడికి వెళ్ళిన వారి శాతం ఎంత?
జవాబు:
75%

48. “2006 సం||రంలో భారతదేశంలో 6 సం||లు దాటిన ఆడపిల్లల్లో బడికి వెళ్ళిన వారి శాతం ఎంత?
జవాబు:
40%

AP 10th Class Social Important Questions Chapter 2 అభివృద్ధి భావనలు

49. క్రింది వానిలో సరికాని వ్యాఖ్యను గుర్తించి, రాయండి.
→ వర్షధార రైతులు సరియైన వర్షాలు కోరుతారు.
→ గ్రామీణ కార్మికులు మెరుగైన కూలీని కోరుతారు.
→ ధనిక రైతులు గ్రామాల్లోనే స్థిరపడాలని కోరుతారు.
→ ధనిక కుటుంబ అమ్మాయి స్వేచ్ఛను కోరుతుంది.
జవాబు:
ధనిక రైతులు గ్రామాల్లోనే స్థిరపడాలని కోరుతారు.

50. క్రింది వానిలో మానవాభివృద్ధి సూచిక (HDI) పరిగణనలోకి తీసుకోని అంశాలను గుర్తించి, రాయండి.
విద్య, వైద్యం, తలసరి ఆదాయం, జాతీయాదాయం
జవాబు:
జాతీయాదాయం

51. 2018లో భారతదేశంలో ఆయు:ప్రమాణం ఎన్నిసం||రాలు?
జవాబు:
65.8 సం||రాలు

52. క్రింది వాక్యాలను పరిగణించండి.
i) వేరు వేరు వ్యక్తులకు వేరు వేరు అభివృద్ధి లక్ష్యాలు ఉండవచ్చు.
ii) ఒకరికి అభివృద్ధి అయినది మరొకరికి కూడా అభివృద్ధి అవుతుంది.
పై వాక్యా లలో సరైనది ఏది?
A) (i) మాత్రమే
B) (ii) మాత్రమే
C) (i) మరియు (ii)
D) రెండూ కావు
జవాబు:
4-0 మాత్రమే

53. ఇవ్వబడిన పట్టికను పరిశీలించి క్రింది ప్రశ్నకు సమాధానము వ్రాయుము.
పట్టిక 3: కొన్ని రాష్ట్రాల తలసరి ఆదాయం

రాష్ట్రం 2012 సం||లో తలసరి ఆదాయం (రూ.లో)
పంజాబ్ 78,000
హిమాచల్ ప్రదేశ్ 74,000
బీహార్ 25,000

ప్ర : ఏ రాష్ట్రం అభివృద్ధి చెందినదిగా భావించవచ్చు?
జవాబు:
పంజాబు

54. ఇవ్వబడిన పట్టికను పరిశీలించి క్రింది ప్రశ్నకు సమాధానము వ్రాయుము.
AP 10th Class Social Important Questions Chapter 2 అభివృద్ధి భావనలు 5
ప్ర : ‘క’ దేశం సగటు ఆదాయం ఎంత?
జవాబు:
10,000/-
ప్ర: ‘గ’ దేశం సగటు ఆదాయం ఎంత?
జవాబు:
10,000/-

55. ఇవ్వబడిన పట్టికను పరిశీలించి క్రింది ప్రశ్నకు సమాధానము వ్రాయుము.
AP 10th Class Social Important Questions Chapter 2 అభివృద్ధి భావనలు 6
ప్ర. ఆడపిల్లల్లో 5సం|| కంటే ఎక్కువ కాలం బడికి వెళ్ళిన వారి శాతం 1993 నుండి 2006 నాటికి ఎంత శాతం పెరిగింది?
జవాబు:
21%.

10th Class Social 2nd Lesson 1 Mark Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
క్రింది పట్టికను పరిశీలించి a, b, c, d ప్రశ్నలకు జవాబులు రాయండి.
AP 10th Class Social Important Questions Chapter 2 అభివృద్ధి భావనలు 1
a) సగటు విద్యాకాలం ఎక్కువగా ఉన్న రెండు దేశాలు ఏవి?
b) భారత్ కంటే మెరుగైన ర్యాంకింగ్ ఉన్న రెండు ఆసియా దేశాలు ఏవి?
c) ప్రపంచ సగటు జీవితకాలం కంటే వెనుకబడిన దేశాలు ఏవి?
d) భారత్, బంగ్లాదేశ్, పాకిస్థాన్లలో సగటు విద్యాకాలం తక్కువగా ఉండడానికి కారణాలేవి?
జవాబు:
a) సగటు విద్యాకాలం ఎక్కువగా ఉన్న రెండు దేశాలు : నార్వే, అమెరికా.

b) భారత్ కంటే మెరుగైన ర్యాంకింగ్ ఉన్న రెండు ఆసియా దేశాలు : శ్రీలంక, చైనా

c) ప్రపంచ సగటు జీవిత కాలం కంటే వెనుకబడిన దేశాలు : భారత్, బంగ్లాదేశ్, పాకిస్థాన్.

d) 1. ఈ దేశాలలో పేదరికం ఎక్కువగా ఉండడం.
2. గ్రామీణ జనాభా ఎక్కువగా ఉండడం.
3. అక్షరాస్యత ప్రాధాన్యత తెలియకపోవడం వలన సగటు విద్యాకాలం తక్కువగా ఉంది.

ప్రశ్న 2.
తమిళనాడులోని కుడంకుళం అణు విద్యుత్ కేంద్ర స్థాపనకు వ్యతిరేకంగా నిరసన ఉద్యమాలు చెలరేగడానికి గల కారణమేమి?
(లేదా)
తమిళనాడులోని కుడంకుళం అణు విద్యుత్ కేంద్రం స్థాపనను ప్రజలు ఎందుకు వ్యతిరేకించారు?
జవాబు:
తీర ప్రాంత పరిరక్షణ, రేడియోధార్మిక, వినాశకర ప్రమాదం నుండి రక్షణ కొరకు కుడంకుళం అణు విద్యుత్ కేంద్ర స్థాపనకు వ్యతిరేకంగా నిరసన ఉద్యమాలు చెలరేగాయి.
(లేదా )
రక్షణ, భద్రత మరియు జీవనోపాధుల పరిరక్షణ కోసం ప్రజలు అణు విద్యుత్ కేంద్ర స్థాపనను వ్యతిరేకించారు.

AP 10th Class Social Important Questions Chapter 2 అభివృద్ధి భావనలు

ప్రశ్న 3.
“అభివృద్ధికి సంబంధించి ఇద్దరు వ్యక్తులకు లేదా బృందాలకు పరస్పర విరుద్ధమైన కోరికలు ఉండవచ్చు.” ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
అభివృద్ధికి సంబంధించి విరుద్ధమైన కోరికలు – ఉదాహరణ : ఎక్కువ కరెంటు కోసం భారీ డామ్ లు కట్టాలని పారిశ్రామికవేత్తలు కోరవచ్చు. కానీ తమ భూములు మునిగిపోతాయని గిరిజన తెగలు దీనిని వ్యతిరేకించవచ్చు.

ప్రశ్న 4.
కుడంకుళం అణు విద్యుత్ కేంద్రం ఎక్కడ ఉంది?
జవాబు:
తమిళనాడు రాష్ట్రం, తిరునల్వేలి జిల్లాలో ఉంది.

ప్రశ్న 5.
తలసరి ఆదాయం అనగానేమి?
జవాబు:
దేశం మొత్తం ఆదాయాన్ని (జాతీయాదాయం) ఆ దేశ జనాభాతో భాగించగా వచ్చేదే ఆ దేశ తలసరి ఆదాయం. దీనినే “సగటు ఆదాయం ” అని కూడా అంటారు.

ప్రశ్న 6.
ప్రపంచ బ్యాంకు అభివృద్ధి నివేదిక ప్రకారం ఎన్ని అమెరికన్ డాలర్ల కంటే ఎక్కువ తలసరి ఆదాయం ఉన్న దేశాలను అధిక ఆదాయ లేదా ధనిక దేశాలు అంటారు?
జవాబు:
2012 సంవత్సరానికి 12,600 అమెరికన్ డాలర్లు లేదా అంతకంటే ఎక్కువ.

ప్రశ్న 7.
ప్రపంచ బ్యాంకు అభివృద్ధి నివేదిక ప్రకారం 1,035 అమెరికన్ డాలర్ల కంటే తక్కువ తలసరి ఆదాయం ఉన్న దేశాలను ఇలా పిలుస్తారు.
జవాబు:
తక్కువ ఆదాయ దేశాలు లేదా పేద దేశాలు.

ప్రశ్న 8.
“సగటు” యొక్క ప్రధాన లోపం ఏమిటి?
జవాబు:
సగటు పోలికకు ఉపయోగకరంగా ఉన్నా అది ప్రజల మధ్య అంతరాలను వెల్లడి చేయదు.

ప్రశ్న 9.
2012 సం||లో పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, బీహార్ రాష్ట్రాల యొక్క తలసరి ఆదాయాలు ఎంత?
జవాబు:
పంజాబ్ – ₹78,000
హిమాచల్ ప్రదేశ్ – ₹74,000
బీహార్ – ₹ 25,000

ప్రశ్న 10.
అక్షరాస్యత శాతం అనగానేమి?
జవాబు:
ఏడు సంవత్సరాలు, అంతకుమించిన వయస్సు వాళ్లల్లో అక్షరాస్యతను తెలియజేయునది అక్షరాస్యత శాతం.

AP 10th Class Social Important Questions Chapter 2 అభివృద్ధి భావనలు

ప్రశ్న 11.
నికర హాజరు శాతం ఏమి తెలియజేయును?
జవాబు:
6-17 సంవత్సరాల వయస్సు పిల్లల్లో బడికి హాజరవుతున్న పిల్లల శాతంను “నికర హాజరు శాతం” అంటారు.

ప్రశ్న 12.
శిశుమరణాల రేటు అనగానేమి?
జవాబు:
సజీవంగా పుట్టిన ప్రతి వెయ్యిమంది పిల్లల్లో సంవత్సరం పూర్తి అయ్యేసరికి ఎంతమంది చనిపోతున్నారో తెలియజేయు సంఖ్య.

ప్రశ్న 10.
ఆయు:ప్రమాణ రేటు దేనిని తెలియజేయును?
జవాబు:
వ్యక్తి జీవించే సగటు కాలమును తెలియజేయును.

ప్రశ్న 13.
UNDP అనగానేమి?
జవాబు:
ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమము (United Nations Development Programme)

ప్రశ్న 14.
మానవాభివృద్ధి సూచికలేవి?
జవాబు:
విద్యాసాయి, ఆరోగ్య స్థితి, తలసరి ఆదాయాలు మానవాభివృద్ధి సూచికలు.

ప్రశ్న 15.
మానవ అభివృద్ధి సూచిక (2013) లో మొత్తం ఎన్ని దేశాలకు స్థానాన్ని ఇచ్చారు?
జవాబు:
మానవ అభివృద్ధి సూచికలో మొత్తం 177 దేశాలకు స్థానం ఇచ్చారు.

ప్రశ్న 16
ఏ రాష్ట్రంలో పాఠశాల విద్య విప్లవంగా పరిగణించబడుతుంది?
జవాబు:
హిమాచల్ ప్రదేశ్ లో పాఠశాల విద్య విప్లవంగా పరిగణించబడుతుంది.

ప్రశ్న 17.
2005 సం||లో భారతదేశంలో రాష్ట్ర ప్రభుత్వాలు సగటున ప్రతి విద్యార్థిపై ఎంత ఖర్చు పెట్టారు? హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం ఎంత ఖర్చు చేసింది?
జవాబు:
1,049 రూ.లు, 2,005 రూ.లు వరుసగా

ప్రశ్న 18.
హిమాచల్ ప్రదేశ్ పిల్లలకు ఏది నియమంగా మారిపోయింది?
జవాబు:
పాఠశాల విద్యలో పది సం||రాలు గడపటం అనేది నియమంగా మారిపోయింది.

ప్రశ్న 19.
హిమాచల్ ప్రదేశ్ లో లింగ వివక్షత తక్కువగా ఉండుటకు ఒక కారణం చెప్పండి.
జవాబు:
హిమాచల్ ప్రదేశ్ లో మహిళలు ఇంటి బయట ఉద్యోగాలు చేయడం, చురుకుగా పనిచేస్తున్న మహిళా మండలులు.

AP 10th Class Social Important Questions Chapter 2 అభివృద్ధి భావనలు

ప్రశ్న 20.
ఆదాయాన్ని పొందడమే కాకుండా ప్రజలు ఏ ఇతర అంశాలను కోరుకుంటున్నారు?
జవాబు:
సమానత, స్వేచ్ఛ, భద్రత, ఇతరుల నుంచి గౌరవం పొందడం వంటి అంశాలు కోరుకుంటున్నారు.

10th Class Social 2nd Lesson 2 Marks Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
భూమి లేని గ్రామీణ కార్మికులు ఏ ఏ అభివృద్ధి లక్ష్యాలను, ఆకాంక్షలను నిర్దేశించుకుంటారు?
జవాబు:
భూమి లేని గ్రామీణ కార్మికుల అభివృద్ధి లక్ష్యాలు :

  1. ఎక్కువ రోజుల పని, మెరుగైన కూలి.
  2. స్థానిక పాఠశాలలో తమ పిల్లలకు నాణ్యమైన విద్యను ఆశించడం.
  3. సామాజిక వివక్షత లేకపోవడం, వాళ్ళు కూడా గ్రామంలో నాయకులు కాగలగడం.
  4. తమ ఆవాస ప్రాంతంలో సరైన మౌలిక సదుపాయాలు ఆశించడం.

ప్రశ్న 2.
వివిధ వర్గాల ప్రజల అభివృద్ధి లక్ష్యాలు భిన్నంగా ఉంటాయనడానికి ఉదాహరణలివ్వండి.
జవాబు:
వివిధ వర్గాల ప్రజల అభివృద్ధి లక్ష్యాలు భిన్నంగా ఉంటాయనడానికి ఉదాహరణలు :

వివిధ వర్గాల ప్రజలు అభివృద్ధి లక్ష్యాలు
భూమి లేని గ్రామీణ కార్మికులు ఎక్కువ పనిరోజులు, ఎక్కువ జీతం, పిల్లలకు నాణ్యమైన విద్య, సామాజిక వివక్షత లేకపోవడం.
ధనిక రైతులు పంటలకు అధిక మద్దతు ధరలు, పిల్లలు విదేశాల్లో స్థిరపడడం.
వర్షాధార రైతులు చాలినంత వర్షపాతం.
పట్టణ నిరుద్యోగిత యువత ఎక్కువ జీతం వచ్చే ఉద్యోగం.
గనుల తవ్వక ప్రాంతంలోని ఆదివాసీలు వారి జీవనాధారం, వనరులను పరిరక్షించుకోవడం.
తీరప్రాంతంలోని చేపలు పట్టే వ్యక్తి చేపలు పట్టడానికి కావలసిన అనుకూల వాతావరణం.

ప్రశ్న 3.
అభివృద్ధిని కొలవడానికి గల వివిధ సూచికలు ఏవి? వాటిలో నీవు దేనితో ఏకీభవిస్తావు?
జవాబు:
అభివృద్ధిని కొలవడానికి గల వివిధ సూచికలు:

  • తలసరి ఆదాయం
  • సగటు ఆయుః ప్రమాణం
  • సగటున బడిలో గడిపిన సంవత్సరాలు
  • పాఠశాల విద్యలో ఉండే సంవత్సరాలు
  • విద్యా స్థాయి (అక్షరాస్యత రేటు)
  • ఆరోగ్య స్థితి
  • ఉద్యోగితా స్థాయి
  • పంపిణీ న్యాయం
  • జీవన ప్రమాణ స్థాయి మొదలైనవి.

పై వాటిలో అన్నిటితో నేను ఏకీభవిస్తున్నాను. సంపూర్ణ అభివృద్ధికి ఇవన్నీ కొలమానాలని నా అభిప్రాయం.

AP 10th Class Social Important Questions Chapter 2 అభివృద్ధి భావనలు

ప్రశ్న 4.
‘హిమాచల్ ప్రదేశ్ లో పాఠశాల విప్లవం’ గురించి మీరేమి గ్రహించారు?
జవాబు:

  1. హిమాచల్ ప్రదేశ్ ప్రజలు, ప్రభుత్వం విద్యపై చాలా ఆసక్తి చూపారు.
  2. అనేక పాఠశాలలను ప్రారంభించారు.
  3. విద్య చాలా వరకు ఉచితంగా లభించేటట్లు చూశారు.
  4. ప్రభుత్వ బడ్జెట్లో విద్యకు ఎక్కువ వాటా కేటాయించారు.
  5. పాఠశాలల్లో అన్ని కనీస సదుపాయాలు ఉండేలా చూశారు.
  6. అధికశాతం పిల్లలకు పాఠశాల అనుభవం సంతోషదాయకంగా ఉంది.

ప్రశ్న 5.
మానవాభివృద్ధిని కొలవడానికి ఏయే అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నారు?
జవాబు:
మానవాభివృద్ధిని కొలవడానికి పరిగణనలోకి తీసుకునే అంశాలు :

  • తలసరి ఆదాయం
  • ఆయుః ప్రమాణం
  • అక్షరాస్యత
  • శిశుమరణాలు – జనన రేటు
  • జీవన ప్రమాణం
  • ప్రజారోగ్యం

ప్రశ్న 6.
ఆదాయమే కాకుండా ప్రజలు ఇంకా ఏమి కోరుకుంటారు?
జవాబు:
ఆదాయమే కాకుండా ప్రజలు ఇంకా కోరుకునేవి
1) సమానత
2) స్వేచ్ఛ
3) భద్రత
4) ఇతరుల నుండి గౌరవం పొందడం

ప్రశ్న 7.
ప్రపంచ బ్యాంకు తన ప్రపంచ అభివృద్ధి నివేదిక ప్రకారం తలసరి ఆదాయం ప్రామాణికంగా ఎలా వర్గీకరించారు? భారతదేశం ఏ జాబితాలో ఉంది?
జవాబు:

  1. దేశాలను వర్గీకరించటానికి ప్రపంచ బ్యాంకు తన ప్రపంచ అభివృద్ధి నివేదికలో ఈ ప్రామాణికాన్ని ఉపయోగించింది.
  2. 2012 సంవత్సరానికి 12,600 అమెరికన్ డాలర్లు లేదా అంతకంటే ఎక్కువ తలసరి ఆదాయం ఉన్న దేశాలను “అధిక ఆదాయ దేశాలు” లేక ధనిక దేశాలు అంటారు.
  3. అదే విధంగా 2012లో 1,035 అమెరికన్ డాలర్ల కంటే తక్కువ తలసరి ఆదాయం ఉండే దేశాలను “తక్కువ ఆదాయ దేశాలు” అంటారు.
  4. అయితే ఒక దశాబ్దం క్రితం భారతదేశం తక్కువ ఆదాయ దేశాల జాబితాలో ఉండేది. చాలా ఇతర దేశాలకంటే భారతదేశ తలసరి ఆదాయం వేగంగా పెరగటంతో దాని స్థానం మెరుగుపడింది.

AP 10th Class Social Important Questions Chapter 2 అభివృద్ధి భావనలు

ప్రశ్న 8.
వ్యక్తులకు ఆదాయమే కాకుండా ఎటువంటి లక్ష్యాలు ఉన్నాయి?
జవాబు:

  1. వ్యక్తులను, ఆకాంక్షలను, లక్ష్యాలను చూసినప్పుడు మెరుగైన ఆదాయమే కాకుండా భద్రత, ఇతరులతో గౌరవింపబడటం, సమానంగా చూడబడటం, స్వేచ్చ వంటి లక్ష్యాలు కూడా ఉన్నాయని తెలిసింది.
  2. అదేవిధంగా, ఒక దేశం లేదా ఒక ప్రాంతం గురించి ఆలోచించినప్పుడు సగటు ఆదాయమే కాకుండా ఇతర ముఖ్యమైన ప్రామాణికాలు కూడా ఉన్నాయని తెలుస్తుంది.

ప్రశ్న 9.
పట్టిక : కొన్ని రాష్ట్రాలకు సంబంధించి కొన్ని తులనాత్మక గణాంకాలు
AP 10th Class Social Important Questions Chapter 2 అభివృద్ధి భావనలు 7
పట్టికలో పేర్కొన్న అంశాలకు వివరణలు :
శిశుమరణాలు : సజీవంగా పుట్టిన ప్రతి వెయ్యిమంది పిల్లల్లో సంవత్సరం పూర్తి అయ్యేసరికి ఎంతమంది చనిపోతున్నారో తెలియచేసే సంఖ్య.
అక్షరాస్యత శాతం : ఏడు సంవత్సరాలు, అంతకుమించిన వయస్సు వాళ్లల్లో అక్షరాస్యతను తెలియచేస్తుంది.
నికర హాజరు శాతం : 6-17 సంవత్సరాల వయస్సు పిల్లల్లో బడికి హాజరవుతున్న పిల్లల శాతం.
పై సమాచారము ఆధారంగా క్రింద ఇవ్వబడిన ప్రశ్నలకు ఒక్క మాటలో సమాధానములిమ్ము.
1) శిశుమరణాల రేటు అధికంగా ఉన్న రాష్ట్రమేది?
జవాబు:
బీహార్

2) అక్షరాస్యత ఎక్కువగా కలిగి ఉన్న రాష్ట్రమేది?
జవాబు:
హిమాచల్ ప్రదేశ్

3) హిమాచల్ ప్రదేశ్ కు బీహారు నికర హాజరు శాతంలో తేడా ఎంత?
జవాబు:
90-56 = 34.

4) నికర హాజరు శాతం అనగా?
జవాబు:
6-17 సం||రాల వయస్సు పిల్లల్లో బడికి హాజరవుతున్న పిల్లల శాతం.

5) నికర హాజరు శాతం తక్కువగా ఉన్న రాష్ట్రం?
జవాబు:
బీహార్

6) పట్టికలో పేర్కొన్న అంశాల ప్రకారం మానవాభివృద్ధిలో ముందున్న రాష్ట్రమేది?
జవాబు:
హిమాచల్ ప్రదేశ్

ప్రశ్న 10.
పట్టిక : 2013 లో భారతదేశం, దాని పొరుగు దేశాలకు సంబంధించిన కొన్ని వివరాలు
AP 10th Class Social Important Questions Chapter 2 అభివృద్ధి భావనలు 2
పట్టికకు సంబంధించిన వివరాలు :

  1. మానవ అభివృద్ధి సూచికలో మొత్తం 177 దేశాలలో ఆయా దేశాల స్థానాన్ని ఇస్తుంది.
  2. వ్యక్తి జీవించే సగటు కాలం : జన్మించిన నాటి నుండి ఒక వ్యక్తి యొక్క సగటు జీవితకాలాన్ని సూచిస్తుంది.
  3. సగటున బడిలో గడిపిన కాలం : 25 సంవత్సరాల వయసు దాటిన వాళ్ళు సగటున బడిలో గడిపిన సంవత్సరాలు.
  4. పాఠశాల విద్యలో ఉండే సంవత్సరాలు : ప్రస్తుతం బడిలో పిల్లలు చేరుతున్నదాన్ని బట్టి బడి ఈడు పిల్లలు బడిలో ఎన్ని సంవత్సరాలు ఉంటారన్న అంచనా.
  5. తలసరి ఆదాయం : పోల్చటానికి వీలుగా అన్ని దేశాల తలసరి ఆదాయాన్ని అమెరికన్ డాలర్లలో లెక్కిస్తారు. ప్రతి దేశంలోనూ ప్రతి డాలరు అంతే మొత్తంలో సరుకులు, సేవలు కొనగలిగేలా దీనిని లెక్కిస్తారు.

పై సమాచారమును పరిశీలించి క్రింద ఇవ్వబడిన ప్రశ్నలకు సరియైన సమాధానములిమ్ము.
1) ప్రపంచ మానవ అభివృద్ధి సూచికలో మెరుగైన స్థానం కల్గి ఉన్న పొరుగుదేశం ఏది?
జవాబు:
శ్రీలంక

2) ఆయుః ప్రమాణ రేటు అంటే?
జవాబు:
వ్యక్తి జీవించే సగటు కాలం.

3) 2013 భారతదేశ తలసరి ఆదాయం ఎంత?
జవాబు:
3285 డాలర్లు

4) ఏ దేశంలో బడిలో గడిపిన సంవత్సరాల సగటు ఎక్కువగా ఉంది?
జవాబు:
శ్రీలంక

5) భారతకు, శ్రీలంకకు ఆయుః ప్రమాణంలో ఎన్ని సంవత్సరాల తేడా ఉంది?
జవాబు:
75.1 – 65.8 = 9.3 సం||లు,

ప్రశ్న 11.
పట్టిక : హిమాచల్ ప్రదేశ్ లో ప్రగతి
AP 10th Class Social Important Questions Chapter 2 అభివృద్ధి భావనలు 6
పై సమాచారము ఆధారంగా క్రింది ప్రశ్నలకు సరియైన సమాధానములిమ్ను.
1) (6 సంవత్సరాలు మించిన) ఆడపిల్లల్లో 5 సం||ల కంటే ఎక్కువ కాలం బడికి వెళ్లిన వారి శాతం భారతదేశంలో, హిమాచల్ ప్రదేశ్ లో 1993 నుండి 2006 వరకు ఎంతమేర పెరిగింది?
జవాబు:
12% (భారతదేశం), 21% (హిమాచల్ ప్రదేశ్)

2) (6 సంవత్సరాలు మించిన) మగపిల్లల్లో 5 సం||లు కంటే ఎక్కువకాలం బడికి వెళ్ళినవారి శాతం 2006లో భారత సగటు కంటే హిమాచల్ ప్రదేశ్ ఎంత ఎక్కువగా ఉంది?
జవాబు:
75 – 57 = 18

ప్రశ్న 12.
క్రింది పటమును పరిశీలించి ఇవ్వబడిన ప్రశ్నలకు సరియైన సమాధానమివ్వండి.
AP 10th Class Social Important Questions Chapter 2 అభివృద్ధి భావనలు 8
మానవాభివృద్ధిని సూచించు ప్రపంచ పటం
1) పటం దేనిని సూచిస్తుంది?
జవాబు:
పటం వివిధ ఖండాలలో మానవాభివృద్ధి తీరుతెన్నులను సూచిస్తుంది.

2) భారతదేశం ఏ మానవాభివృద్ధి వర్గానికి చెందింది?
జవాబు:
మధ్యస్థ వర్గానికి

3) అత్యధిక (HDI) కల్గి ఉన్న ప్రాంతాలు (దేశాలు) ఏవి?
జవాబు:
ఉత్తర అమెరికా, ఆస్ట్రేలియా, ఐరోపా, దక్షిణ అమెరికాలోని దక్షిణ ప్రాంతాలు.

4) అల్పాభివృద్ధి సూచిక కల్గిన రెండు దేశాలకు ఉదాహరణనిమ్ము.
జవాబు:
జింబాబ్వే, కెన్యా

5) అల్పాభివృద్ధి ఎక్కువగా ఏ ఖండంలో కన్పిస్తుంది?
జవాబు:
ఆఫ్రికా

10th Class Social 2nd Lesson 4 Marks Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
ఈ క్రింద ఇవ్వబడిన పట్టికను చదివి దిగువన ఉన్న ప్రశ్నలకు సమాధానము వ్రాయండి.
పట్టిక : కొన్ని రాష్ట్రాలకు సంబంధించిన కొన్ని తులనాత్మక గణాంకాలు.
a) అక్షరాస్యత శాతం అంటే ఏమిటి?
b) నికర హాజరు శాతం ఏ రాష్ట్రంలో ఎక్కువగా ఉంది?
c) హిమాచల్ ప్రదేశ్ లో అక్షరాస్యత అధికంగా ఉండటానికి గల కారణమేమి?
d) శిశుమరణాలు తక్కువగా ఉన్న రాష్ట్రం ఏది?
జవాబు:
a) ప్రతి వందమంది జనాభాకు గల అక్షరాస్యుల సంఖ్యను అక్షరాస్యతా శాతం అంటారు.
b) హిమాచల్ ప్రదేశ్
c) 1) హిమాచల్ ప్రభుత్వము, అక్కడి ప్రజలు విద్యపై ఎంతో ఆసక్తి చూపారు.
2) పాఠశాలలు తెరిచి చాలా వరకు విద్య ఉచితంగా ఉండేలా లేదా తల్లిదండ్రులకు నామమాత్రపు ఖర్చు అయ్యేలా ప్రభుత్వం చూసింది.
3) పాఠశాలలో తగినంతమంది ఉపాధ్యాయులతోపాటు తరగతి గదులు, మరుగుదొడ్లు, త్రాగునీరు వంటి కనీస సదుపాయాలు ఉండేలా చూసింది.
4) భారతదేశ రాష్ట్రాలలో ప్రభుత్వ బడ్జెట్ లో ప్రతి విద్యార్థి చదువుపై ఎక్కువ మొత్తం ఖర్చు పెడుతున్న రాష్ట్రాలలో హిమాచల్ ప్రదేశ్ ఒకటి.

d) హిమాచల్ ప్రదేశ్

ప్రశ్న 2.
క్రింది పేరాను చదివి, వ్యాఖ్యానించండి.
దేశంలో అనేక ప్రాంతాలలో మగపిల్లల చదువుతో పోలిస్తే ఆడపిల్లల చదువుకు తక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆడపిల్లలు కొన్ని తరగతులు చదువుతారు కాని పాఠశాల విద్య పూర్తి చేయరు.
జవాబు:
విద్యకు లింగ వారీగా ఇచ్చే ప్రధాన్యతని తెలియచేస్తోంది. ఇది చాలావరకు గ్రామాల్లో జరుగుతోంది. అనేక రకాల సామాజిక కారణాల వలన ఆడపిల్లల చదువులకు ఆటంకం కల్పిస్తున్నారు. పట్టణాలలో కూడా ఈ పరిస్థితి ఆర్థికంగా వెనుకబడిన వారిలోనే ఉన్నది. లేదా వలస కార్మికుల కుటుంబాలలో ఉన్నది. కాని నేడు కొంత మార్పు కనిపిస్తోంది. ఆడపిల్లల చదువుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. విద్యార్జనీ విద్యార్థుల సంఖ్య దీనిని నిరూపిస్తోంది.

ప్రశ్న 3.
క్రింది సమాచారాన్ని కమ్మీ (బార్ గ్రాఫ్) రేఖాచిత్రంలో చూపండి. మీ పరిశీలనను రాయండి.

రాష్ట్రం అక్షరాస్యత రేటు
1. పంజాబ్ 77
2. హిమాచల్ ప్రదేశ్ 84
3. బీహార్ 64

జవాబు:
AP 10th Class Social Important Questions Chapter 2 అభివృద్ధి భావనలు 3

పరిశీలన : అధిక అక్షరాస్యతను కలిగి ఉన్నది కాబట్టి హిమాచల్ ప్రదేశ్ అభివృద్ధి చెందిన రాష్ట్రంగా పరిగణించవచ్చు.

ప్రశ్న 4.
పట్టికను పరిశీలించి దిగువ ప్రశ్నలకు జవాబులు వ్రాయుము.
AP 10th Class Social Important Questions Chapter 2 అభివృద్ధి భావనలు 2
1) మానవాభివృద్ధి సూచికలో భారతదేశం కంటే అన్ని విషయాలలో మెరుగైన స్థానంలో ఉన్న దేశం ఏది?
2) మానవాభివృద్ధి సూచిక తయారీలో పరిగణనలోకి తీసుకొనబడే అంశాలు ఏవి?
3) అతి తక్కువ తలసరి ఆదాయం గల దేశాన్ని పేర్కొనండి.
4) మానవాభివృద్ధి నివేదికలో భారతదేశ స్థానం మెరుగుపడడానికి రెండు సూచనలు వ్రాయండి.
5) సగటున బడిలో గడిపిన కాలం – నిర్వచింపుము.
6) ఆయుః ప్రమాణంలో మెరుగ్గా కల దేశమేది?
7) అన్ని ప్రమాణాలలో మెరుగైన స్థానంలో కల దేశమేది?
8) మానవాభివృద్ధి సూచిక తయారీలో పరిగణనలోకి తీసుకునే అంశాలేవి?
జవాబు:

  1. శ్రీలంక
  2. తలసరి ఆదాయం , ఆయుః ప్రమాణం, సగటున బడిలో గడిపిన సం||రాలు. పాఠశాల విద్యలో ఉండే సం||రాలు.
  3. నేపాల్
  4. a) వైద్య సదుపాయాలు మెరుగుపరచాలి.
    b) నాణ్యతతో కూడిన విద్య అందించాలి.
  5. 25 సంవత్సరాలు వయసు దాటిన వాళ్ళు సగటున బడిలో గడిపిన సంవత్సరాలు.
  6. శ్రీలంక
  7. శ్రీలంక
  8. తలసరి ఆదాయం, ఆయుఃప్రమాణం, సగటున బడిలో గడిపిన సంవత్సరాలు, పాఠశాల విద్యలో ఉండే సంవత్సరాలు.

ప్రశ్న 5.
క్రింది పేరాగ్రాఫ్ చదవండి :
“దేశంలో అనేక ప్రాంతాలలో మగపిల్లలతో పోలిస్తే ఆడపిల్లలకు తక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.”
ప్రశ్న : ‘భారతదేశంలో లింగ వివక్షతపై వ్యాఖ్యానించండి.”
జవాబు:

  1. మనది పురుషాధిక్యత సమాజము.
  2. స్త్రీలలో అక్షరాస్యత శాతం తక్కువగా ఉన్నది.
  3. ఇంటి బయట పనిచేసే స్త్రీల సంఖ్య తక్కువగా ఉంది.
  4. సాంప్రదాయపరంగా సామాజిక జీవితంలో మహిళల పాత్ర తక్కువ.
  5. ఈ కారణాల వల్ల లింగ వివక్షత ఇంకా కొనసాగుతూ ఉంది.
  6. ఇది సమాజాభివృద్ధికి ఆటంకము.
  7. అబ్బాయిలను, అమ్మాయిలను సమానంగా చూడాలి.

AP 10th Class Social Important Questions Chapter 2 అభివృద్ధి భావనలు

ప్రశ్న 6.
మానవ అభివృద్ధి నివేదిక గురించి నీకు తెలిసింది వివరించుము.
జవాబు:

  1. ఆదాయస్తాయి. ముఖ్యమైనప్పటికి అభివృద్ధిని సూచించటానికి అదొక్కటే సరిపోదని గుర్తించిన తరువాత ఇతర ప్రామాణికాల గురించి ఆలోచించటం మొదలు పెడతాం.
  2. ఇటువంటి ప్రామాణికాల జాబితా చాలా పెద్దగా ఉంటే అప్పుడది అంతగా ఉపయోగపడదు. చాలా ముఖ్యమైన అంశాల చిన్న జాబితా కావాలి.
  3. కేరళ, పంజాబులను పోల్చటానికి ఉపయోగించిన ఆరోగ్యం , విద్యా సూచికలు ఎంతో ముఖ్యమైనవి.
  4. గత దశాబ్ద కాలం నుంచి అభివృద్ధికి కొలమానంగా ఆదాయంతో పాటు ఆరోగ్యం, విద్యా సూచికలను కూడా – విస్తృతంగా ఉపయోగిస్తున్నారు.
  5. ఉదాహరణకు ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (యుఎన్ డిపి) ప్రచురించిన మానవ అభివృద్ధి నివేదిక దేశాలను ఆ ప్రజల విద్యాస్థాయి, ఆరోగ్య స్థితి, తలసరి ఆదాయాలను బట్టి పోలుస్తుంది.

ప్రశ్న 7.
హిమాచల్ ప్రదేశ్ లో ‘లింగ వివక్షత’ ఏ రంగంలో తక్కువగా ఉంది? ఎందువలన?
జవాబు:

  1. లింగ వివక్షత తక్కువగా ఉండటం ఆశ్చర్యం కలిగించవచ్చు.
  2. విద్యలోనే కాకుండా దీనిని ఇతర రంగాలలోనూ చూస్తాం.
  3. ఇతర రాష్ట్రాలలో పరిస్థితికి విరుద్ధంగా హిమాచల్ ప్రదేశ్ లో పుట్టిన కొన్ని నెలల్లో చనిపోయే పిల్లల్లో మగపిల్లల కంటే ఆడపిల్లల సంఖ్య తక్కువ.
  4. దీనికి ఒక కారణం హిమాచల్ ప్రదేశ్ మహిళలు ఇంటి బయట ఉద్యోగాలు చేస్తున్నారు.
  5. బయట ఉద్యోగాలు చేసే మహిళలు స్వతంత్రంగా ఉంటారు, ఆత్మవిశ్వాసం కనబరుస్తారు.
  6. ఇంటిలో తీసుకునే నిర్ణయాలలో అంటే పిల్లల చదువు, ఆరోగ్యం, పిల్లల సంఖ్య, గృహ నిర్వహణ వంటి వాటిల్లో ఆడవాళ్ల మాటకు ప్రాధాన్యత ఉంటుంది.
  7. వాళ్ళు ఉద్యోగాల్లో ఉండటం వల్ల పెళ్లి అయిన తరువాత తమ కూతుళ్లు ఉద్యోగాలు చెయ్యాలని తల్లులు కోరుకుంటారు.
  8. కాబట్టి చదువుకు ప్రాధాన్యతను ఇవ్వటం సహజ విషయంగానూ, సామాజిక నియమంగానూ మారిపోయింది.
  9. సామాజిక జీవితంలోనూ, గ్రామ రాజకీయాలలోనూ హిమాచల్ ప్రదేశ్ మహిళల పాత్ర ఇతర రాష్ట్రాలలో కంటే ఎక్కువే.
  10. పలు గ్రామాలలో చురుకుగా పనిచేస్తున్న మహిళా మండలులు కనపడతాయి.

AP 10th Class Social Important Questions Chapter 22 పౌరులు, ప్రభుత్వాలు

These AP 10th Class Social Studies Important Questions 22nd Lesson పౌరులు, ప్రభుత్వాలు will help students prepare well for the exams.

AP Board 10th Class Social 22th Lesson Important Questions and Answers పౌరులు, ప్రభుత్వాలు

10th Class Social 22th Lesson ½ Mark Important Questions and Answers in Telugu Medium

1. సమాచార హక్కు చట్టం ఏ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది?
జవాబు:
2005 లో.

2. న్యాయ సేవల ప్రాధికార చట్టం ఏ సంవత్సరంలో చేసారు?
జవాబు:
2002 లో.

3. ఏదేని ప్రభుత్వ కార్యాలయంలో సమాచారం కావాలంటే ఎవరికి దరఖాస్తు చేయాలి?
జవాబు:
పౌర సమాచార అధికారికి (PIO)

4. లోక్ అదాలత్ ముఖ్య ప్రయోజనం ఏమిటి?
జవాబు:
సత్వర న్యాయం.

5. జిల్లా న్యాయ సేవల ప్రాధికార సంస్థకు ఛైర్మన్‌గా ఎవరు వ్యవహరిస్తారు?
జవాబు:
జిల్లా జడ్జి.

AP 10th Class Social Important Questions Chapter 22 పౌరులు, ప్రభుత్వాలు

6. న్యాయ సేవల ప్రాధికార సంస్థ ద్వారా న్యాయ సహాయం పొందాలంటే వార్షిక ఆదాయం ఎంత లోపు ఉండాలి?
జవాబు:
ఒక లక్ష రూపాయల లోపు.

7. మీ గ్రామంలో వేసిన రోడ్డుకు ఎంత ఖర్చు అయిందో తెలుసుకోవాలంటే ఎవరికి దరఖాస్తు చేయాలి?
జవాబు:
ప్రజా పనుల శాఖకు.

8. సమాచార హక్కు చట్టంలో సవరణలు / మార్పులు చేయుటకు ఎవరికి అధికారం కలదు?
జవాబు:
పార్లమెంటుకు.

9. కక్షిదారులు నేరుగా జడ్జితో సంభాషించే అవకాశం ఏ న్యాయస్థానాల్లో ఉంది?
జవాబు:
లోక్ అదాలత్ లో.

10. “కోర్టు బయట సమర్థ, ప్రత్యామ్నాయ, సృజనాత్మక వివాద పరిష్కార విధానాన్ని రూపొందించటం,” దేని యొక్క ముఖ్య ఉద్దేశ్యం?
జవాబు:
న్యా య సేవల ప్రాధికార సంస్థ.

11. మీ పాఠశాలలో పౌర సమాచార అధికారి ఎవరు?
జవాబు:
ప్రధానోపాధ్యాయులు / ప్రిన్సిపాల్.

AP 10th Class Social Important Questions Chapter 22 పౌరులు, ప్రభుత్వాలు

12. లోక్ అదాలలు ఏ వర్గాల వారికి న్యాయ సేవలు అందించేందుకు ఏర్పాటు చేయబడ్డవి?
జవాబు:
బలహీన వర్గాల.

13. సైనిక దళాల సమాచారం ….. హక్కు పరిధిలోకి రావు.
జవాబు:
సమాచార

14. PWDని విస్తరింపుము.
జవాబు:
ప్రజా పనుల శాఖ

15. ఇతరుల వ్యక్తిగత సమాచారాన్ని ……… హక్కు ద్వారా పొందలేం.
జవాబు:
సమాచార

16. ఎవరు ఇచ్చిన తీర్పులకు అప్పీలును అనుమతించరు?
జవాబు:
లోక్ అదాలనే

17. సమాన అవకాశాల ప్రాతిపదికన న్యాయాన్ని అందించేలా న్యాయవ్యవస్థని పనిచేసేలా చూడటానికి వేటిని ఏర్పాటు చేసారు?
జవాబు:
లోక్ అదాలత్.

18. న్యాయ సేవా పీఠాలు ఎవరి కోసం ఏర్పాటు చేసారు?
జవాబు:
పేద, బలహీన వర్గాలవారికోసం.

AP 10th Class Social Important Questions Chapter 22 పౌరులు, ప్రభుత్వాలు

19. సమాచారాన్ని పొందటానికి పౌరులు ఎంత రుసుము చెల్లించాల్సి ఉంది?
జవాబు:
5 – 10 రూ||

20. పురుషులు, ముసలివారు, నిరుద్యోగులు, స్త్రీలలో ఎవరు ఉచిత న్యాయ సహాయానికి అర్హులు?
జవాబు:
స్త్రీలు

21. ఏవి కోర్టుల్లో చాలా కాలం నుండి పెండింగ్ లో ఉన్న కేసులను తక్కువ కాలంలో ఎటువంటి ఖర్చు లేకుండా పరిష్కరిస్తుంది?
జవాబు:
లోక్ అదాలలు.

22. అన్ని శాఖల పౌర సమాచార అధికారులు, అప్పిలేట్ అధికారులు ఎవరికి జవాబు దారీగా ఉంటారు?
జవాబు:
రాష్ట్ర పౌర సమాచార కార్యాలయానికి,

23. సమాచార హక్కు చట్టం – 2005 ప్రకారం సమాచారం కోరుతూ దరఖాస్తులను క్రింది ఏ పద్ధతి/తుల్లో కోరాలి?
i) చేత్తో వ్రాసిన ఉత్తరం ద్వారా
ii) ఎలక్ట్రానిక్ మెయిల్ ద్వారా
iii) మౌఖికంగా చెప్పడం ద్వారా
జవాబు:
i, ii & iii

24. న్యాయ సేవల ప్రాధికార సంస్థల చట్టంకు ఏఏ సంవత్సరాల్లో సవరణ చేసారు?
జవాబు:
1994, 2002

AP 10th Class Social Important Questions Chapter 22 పౌరులు, ప్రభుత్వాలు

25. రాష్ట్ర న్యాయ సేవల ప్రాధికార సంస్థకు పాట్రన్-ఇన్- ఛీ ఎవరు ఉంటారు?
జవాబు:
ఆ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి.

26. తాలుకా న్యాయ సేవా సంఘాల అధిపతి?
జవాబు:
సీనియర్ సివిల్ జడ్జి.

27. లోక్ అదాలత్ లో ఈ వివాదాన్ని పరిష్కరించుకోలేం.
→ వైవాహిక విభేదాలు
→ గృహహింస కేసులు.
→ భరణానికి సంబంధించిన కేసులు
→ ఆర్థిక నేరానాకి సంబంధించిన కేసులు
జవాబు:
ఆర్థిక నేరానికి సంబంధించిన కేసులు.

28. క్రింది వాక్యాలను పరిగణించండి.
i) ప్రతి ప్రభుత్వ శాఖ రికార్డులను నిర్వహించి, వాటిని పౌరులకు అందుబాటులో ఉంచాలి.
ii) ప్రతి ప్రభుత్వ శాఖ స్వచ్ఛందంగానే కొన్ని వివరాలను బహిర్గతం చేయాలి.
పై వాక్యా లలో సరైనది ఏది?
A) (i) మాత్రమే
B) (ii) మాత్రమే
C) (i) మరియు (ii)
D) రెండూ కావు
జవాబు:
C (i) మరియు (ii)

29. PIOని విస్తరించండి.
జవాబు:
పౌర సమాచార అధికారి.

30. SPICని విస్తరించండి.
జవాబు:
రాష్ట్ర పౌర సమాచార కమీషనర్.

AP 10th Class Social Important Questions Chapter 22 పౌరులు, ప్రభుత్వాలు

31. CPIC ని విస్తరించండి.
జవాబు:
కేంద్ర పౌర సమాచార కమిషనర్

32. NALSA ని విస్తరించండి.
జవాబు:
జాతీయ న్యాయ సేవల ప్రాధికార సంస్థ.

33. SLSA ని విస్తరించండి.
జవాబు:
రాష్ట్ర న్యాయ సేవల ప్రాథికార సంస్థ

34. క్రింది వానిని సరిగా జతపరచండి.
i) వ్యభిచార వృత్తి నివారణ చట్టం ( ) a) 1956
ii) బాల నేరస్తుల న్యాయ చట్టం ( ) b) 1986
iii)న్యా య సేవల ప్రాధికార చట్టం ( ) c) 2002
iv)మానసిక ఆరోగ్య చట్టం ( ) d) 1987
జవాబు:
i – a, ii – b, iii – c, iv – d

10th Class Social 22th Lesson 1 Mark Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
వివాదాల పరిష్కారానికి సంబంధించి లోక్ అదాలత్ వలన కలిగే ఏవైనా రెండు ప్రయోజనాలను పేర్కొనండి.
జవాబు:

  1. ఎటువంటి కోర్టు రుసుము లేకపోవడం.
  2. వివాదాల వేగవంతమైన విచారణ.
  3. విధానంలో వెసులుబాటు.
  4. కక్షిదారులు నేరుగా న్యాయమూర్తులతో సంభాషించే అవకాశం.

ప్రశ్న 2.
లోక్ అదాలత్ యొక్క ప్రయోజనాలను తెల్పండి.
జవాబు:
i) లోక్ అదాలత్ వల్ల సత్వర, వేగవంతంగా న్యాయం అందుతుంది.
ii) లోక్ అదాలత్ వల్ల తక్కువ వ్యయంతో న్యాయం చేకూరుతుంది.

ప్రశ్న 3.
సమాచార హక్కు చట్టంను ఎవరు, ఎప్పుడు చేశారు?
జవాబు:
సమాచార హక్కు చట్టంను కేంద్రప్రభుత్వం 2005లో చేసింది.

AP 10th Class Social Important Questions Chapter 22 పౌరులు, ప్రభుత్వాలు

ప్రశ్న 4.
సమాచార హక్కు లేనపుడు ఆయా శాఖలను ఎవరు తనిఖీ చేసేవారు?
జవాబు:
ఆ శాఖలోని పై అధికారులు, లేదా మంత్రి మాత్రమే ఆ వివరాలను తీసుకొని, తనిఖీ చెయ్యగలిగి ఉండేవాళ్లు.

ప్రశ్న 5.
ప్రతి ప్రభుత్వశాఖ యొక్క కనీస బాధ్యత ఏమిటి?
జవాబు:
సమాచారా హక్కు చట్టం వల్ల ఇప్పుడు ప్రతి ప్రభుత్వ శాఖకు రికార్డులను నిర్వహించి, వాటిని అడిగిన పౌరులకు అందుబాటులో ఉంచాలి.

ప్రశ్న 6.
అన్ని శాఖల పౌర సమాచార అధికారులు, అప్పిలేట్ అధికారులు ఎవరికి బాధ్యత వహిస్తారు?
జవాబు:
అన్ని శాఖల పౌర సమాచార అధికారులు, అప్పిలేట్ అధికారులు రాష్ట్ర పౌర సమాచార కార్యాలయానికి జవాబుదారీగా ఉంటారు.

ప్రశ్న 7.
జరిమాన విధించే అధికారం ఎవరికి ఉంది?
జవాబు:
రాష్ట్ర, కేంద్ర సమాచార కమిషనర్లు సంబంధిత పౌరసమాచార అధికారికి జరిమానా విధించవచ్చు.

ప్రశ్న 8.
సమాచార హక్కు చట్టం ప్రకారం సమాచారం కొరకు దరఖాస్తు చేసుకునే వారిలో ఎవరు రుసుము చెల్లించనవసరం లేదు?
జవాబు:
సమాచారం కోరుతున్న వ్యక్తి దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న వారు రుసుము చెల్లించనవసరం లేదు.

ప్రశ్న 9.
ఏ చట్టం ప్రకారం మనదేశంలో ఉచిత న్యాయసేవలు అందిస్తున్నారు?
జవాబు:
“న్యాయసేవల ప్రాధికార సంస్థ (సవరణ) చట్టం, 2002”, ప్రకారం ఉచిత సేవలు అందిస్తున్నారు.

ప్రశ్న 10.
న్యాయ సేవా పీఠాలను ఏర్పాటుచేయుటలో ఉద్దేశం ఏమిటి?
జవాబు:
ఆర్థిక లేక ఏ ఇతర కారణాల వల్లనైనా ఏ పౌరుడికి కూడా న్యాయం లభించకుండా ఉండకూడదన్న ఉద్దేశంతో వీటిని ఏర్పాటుచేశారు.

ప్రశ్న 11.
దేని ప్రకారం లోక్ అదాలత్ లను ఏర్పాటు చేశారు?
జవాబు:
న్యాయసేవల పీఠాల చట్టం 1987ని 1994 లోనూ, తిరిగి 2002 లోనూ సవరించారు. దీని కింద లోక్ అదాలత్ లను (ప్రజాస్వామ్య పీఠాలను) ప్రతి రాష్ట్రంలోను ఏర్పాటుచేశారు.

AP 10th Class Social Important Questions Chapter 22 పౌరులు, ప్రభుత్వాలు

ప్రశ్న 12.
రాష్ట్ర న్యాయసేవల ప్రాధికార సంస్థకి అధిపతిగా ఎవరుంటారు?
జవాబు:
అధిపతిగా, ప్యాట్రన్ – ఇన్ చీఫ్ గా రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉంటారు.

10th Class Social 22th Lesson 2 Marks Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
సమాచార హక్కు చట్టం గూర్చి సంక్షిప్తంగా రాయండి.
(లేదా)
సమాచార హక్కు చట్టం ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా సుసంపన్నం చేస్తుందో వివరించండి.
జవాబు:

  1. సమాచార హక్కు చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం 2005 సంవత్సరంలో ఆమోదించింది.
  2. ప్రజా ఉద్యమాల కారణంగా, పౌరులకు హక్కులు కల్పిస్తూ రాజ్యాంగంలోని అంశాల కారణంగా ఈ చట్టం రూపొందించబడింది.
  3. రాజ్యాంగం కింద ఏర్పడిన సంస్థ మరియు పార్లమెంటు లేదా రాష్ట్ర శాసన సభల ప్రకారం ఏర్పడిన సంస్థలు ఈ చట్టంలో విధులు నిర్వహిస్తాయి.
  4. ప్రస్తుతం ఏ పౌరుడైనా ప్రభుత్వానికి సంబంధించి ఏ శాఖలోనైనా రికార్డు రూపంలో ఉండే సమాచారం కావాలని అడిగినప్పుడు ఈ శాఖలో వారు పౌరునికి తప్పనిసరిగా సమాచారం ఇవ్వవలెను.
  5. ఈ చట్టం న్యాయసహాయాన్ని కూడా ప్రజలకు అందిస్తుంది. దాని కోసం లోక్ అదాలత్ లను ఏర్పాటు చేయటం జరిగింది.
  6. సమాచార హక్కు చట్టం వలన, ప్రతి ప్రభుత్వ శాఖ కూడా వారి పనులకు సంబంధించిన విషయాలను రికార్డు రూపంలో ఉంచి ప్రజలకు మరింత జవాబుదారీగా ఉంటున్నారు.

ప్రశ్న 2.
న్యాయ సేవల సంస్థ ద్వారా ఎవరెవరు ప్రయోజనం పొందవచ్చు?
(లేదా)
ఉచిత న్యాయ సహాయాన్ని పొందడానికి ఎవరు అర్హులు?
జవాబు:
క్రింద పేర్కొన్న వ్యక్తులు న్యాయ సేవల సంస్థ ద్వారా ప్రయోజనం పొందవచ్చును.

  1. షెడ్యూల్డ్ కులాలు లేదా షెడ్యూల్డ్ జాతులకు చెందిన వ్యక్తులు.
  2. మానవ అక్రమ రవాణా బాధితులు, భిక్షాటకులు,
  3. స్త్రీలు, పిల్లలు,
  4. మతిస్థిమితం లేనివారు లేదా అంగవైకల్యం ఉన్నవారు,
  5. పెను విపత్తు, జాత్యహంకార హింస, కుల వైషమ్యాలు, వరదలు, కరువులు, భూకంపాలు, పారిశ్రామిక విపత్తులకు గురైనవారు,
  6. పారిశ్రామిక కార్మికులు,
  7. నిర్బంధంలో ఉన్న వ్యక్తులు,
  8. లక్ష రూపాయలలోపు ఆదాయం ఉన్న వ్యక్తులు.

ప్రశ్న 3.
సమాచార హక్కు చట్టం ప్రకారం సమాచారం వెల్లడిచేయడానికి గల మినహాయింపులను తెలపండి.
జవాబు:
కొంత సమాచారాన్ని ప్రభుత్వం వెల్లడి చేయకుండా ఉండే అవకాశాన్ని చట్టం కల్పించింది. ఆ అంశాలు :

  1. భారతదేశ సార్వభౌమత్వం, సమగ్రతలను ప్రభావితం చేసే సమాచారం, విదేశీ శక్తుల సందర్భంలో కీలక ఆర్థిక, శాస్త్రీయ ప్రయోజనాలు కలిగి ఉండే అంశాలు.
  2. పార్లమెంటు లేదా రాష్ట్ర శాసనసభల హక్కులకు భంగం కలిగించే సమాచారం.
  3. గోప్యంగా ఉంచుతారన్న భావనతో విదేశ ప్రభుత్వాల నుంచి అందిన సమాచారం.
  4. ఒక వ్యక్తి జీవితానికి లేదా భౌతిక భద్రతకు భంగం కలిగించే సమాచారం.
  5. (అంతిమ నిర్ణయం తీసుకోటానికి ముందు) మంత్రుల లేదా సెక్రటరీల బృందం ముందు ఉంచే క్యాబినెట్ పత్రాలు లేదా రికార్డులు.
  6. మన సైనిక దళాలు, భద్రతా సంస్థలు చాలా వరకు సమాచార కమిషన్ల పరిధిలోకి రావు.

AP 10th Class Social Important Questions Chapter 22 పౌరులు, ప్రభుత్వాలు

ప్రశ్న 4.
సమాచార హక్కు చట్టం ప్రకారం సమాచారం కొరకు దరఖాస్తు ఏ విధంగా చేయాలి?
జవాబు:
సమాచారం కావాలన్న విన్నపాన్ని చేతితో రాసిన ఉత్తరం రూపంలో కానీ, ఎలక్ట్రానిక్ మెయిల్ రూపంలో కానీ ఇవ్వవచ్చు. సమాచారాన్ని ఆ రాష్ట్ర అధికార భాషలో కానీ, లేదా ఇంగ్లీషులో కానీ, లేదా హిందీలో కానీ ఇవ్వవచ్చు. ఒకవేళ ఒక వ్యక్తి ఉత్తరం రాయలేకపోతే పౌర సమాచార అధికారి లేదా రాష్ట్ర పౌర సమాచార అధికారి వద్ద మౌఖికంగా చెప్పటం ద్వారా, కూడా దరఖాస్తు ఇవ్వవచ్చు.

ప్రశ్న 5.
సమాచారం కోరే వ్యక్తి ఎంత రుసుం చెల్లించాలి?
జవాబు:
సమాచారాన్ని పొందటానికి పౌరులు నామమాత్రమైన రుసుమును చెల్లించాల్సి ఉంటుంది. ఇది ఎక్కడి కార్యాలయం అనేదాన్ని బట్టి 5-10 రూపాయల మధ్య ఉంటుంది. సమాచారం కోరుతున్న వ్యక్తి దారిద్ర్యరేఖకు దిగువన ఉంటే అతను/ఆమె ఈ రుసుము చెల్లించనవసరం లేదు. కాబట్టి ఈ చట్టం అనేక విధాలుగా అందరికీ సమాచారం అందుబాటులో ఉండేలా చేసింది.

ప్రశ్న 6.
లోక్ అదాలలు ఏ విధంగా పనిచేస్తాయి?
జవాబు:
ఇప్పుడు వీటి ద్వారా న్యాయ కోవిదులు, అధికారులు, అనధికార ప్రముఖుల సమక్షంలో, సుహృద్భావ వాతావరణంలో, పరస్పర అంగీకారంతో తగాదాలు వివాదాలను పరిష్కరించుకోవచ్చు. ఖర్చు లేకుండా, త్వరితగతిన న్యాయం పొందటానికి ప్రజలు ఇప్పుడు లోక్ అదాలను ఉపయోగించుకుంటున్నారు. కోర్టులలో దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న కేసులను ఎటువంటి ఖర్చు లేకుండా వెంటనే పరిష్కరించుకోటానికి లోక్ అదాలత్ సహాయపడుతుంది. ఒకవేళ అప్పటికే కక్షిదారులు కోర్టు రుసుము చెల్లించి ఉంటే అది కూడా వెనక్కి ఇస్తారు.

ప్రశ్న 7.
న్యాయ సేవల ప్రాధికార సంస్థలు నిర్వర్తించే విధులు ఏవి?
జవాబు:

  1. చట్టంలో పొందుపరిచిన ప్రకారం అర్హులైన వ్యక్తులకు న్యాయ సేవలను అందించటం.
  2. లోక్ అదాలలను నిర్వహించటం.
  3. ముందస్తు నివారణ, వ్యూహాత్మక న్యాయ సహాయ కార్యక్రమాలను చేపట్టటం.
  4. న్యాయసేవల ప్రాధికార సంస్థ నిర్ణయించే ఇతర విధులను నిర్వర్తించటం.

AP 10th Class Social Important Questions Chapter 22 పౌరులు, ప్రభుత్వాలు

ప్రశ్న 8.
న్యాయసేవల ప్రాధికార సంస్థ ఉద్దేశాలు ఏమిటి?
జవాబు:

  1. సమాజంలోని బలహీన వర్గాలకు ఉచిత, సమర్ధ న్యాయసేవలను అందించటానికి న్యాయసేవ ప్రాధికార సంస్థ చట్టాన్ని చేయడం.
  2. ఆర్థిక లేక ఏ ఇతర కారణాల వల్లనైనా ఏ పౌరునికీ న్యాయం అందని పరిస్థితి లేకుండా చూడడం.
  3. సమాన అవకాశాల ప్రాతిపదికన న్యాయాన్ని అందించేలా న్యాయవ్యవస్థ పనిచేసేలా చూడటానికి లోక్ అదాలత్ లను ఏర్పాటు చెయ్యటం.
  4. కోర్టుల బయట సమర్థ, ప్రత్యామ్నాయ, సృజనాత్మక వివాద పరిష్కార విధానాన్ని రూపొందించటం.

ప్రశ్న 9.
సమాచార కమిషన్లో ప్రధాన బాధ్యులు ఎవరు?
జవాబు:

  1. ప్రతి ప్రభుత్వ శాఖలో ఒక పౌర సమాచార అధికారి ఉంటారు.
  2. అదేశాఖలో ఒక అప్పీలేట్ అధికారి ఉంటారు.
  3. అన్ని శాఖల పౌర సమాచార అధికారులు, అప్పీలేట్ అధికారులు రాష్ట్ర పౌర సమాచార కార్యాలయానికి జవాబుదారీగా ఉంటారు.
  4. దీనికి రాష్ట్ర సమాచార కమిషనర్లు ఉంటారు.
  5. ఈ సమాచార కార్యాలయాలు స్వయంప్రతిపత్తి కలిగి ఉంటాయి.

ప్రశ్న 10.
చమురు ధరలు పెరిగితే ప్రజాజీవనంపై దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది.
పై వ్యాఖ్యపై మీ అభిప్రాయం వ్రాయండి.
జవాబు:

  1. చమురు ధరలు పెరిగితే ప్రజాజీవితంపై దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది.
  2. దాని వలన నిత్యావసర వస్తువులు, కూరగాయలు, పాలు, పండ్లు తదితరాల రేట్లు పెరగడం జరుగుతుంది.
  3. మనదేశం అత్యధికంగా చమురును దిగుమతి చేసుకుంటుంది. కావున అత్యధిక మొత్తాలు ఖర్చవుతాయి.
  4. విదేశీ మారక ద్రవ్య నిల్వలు తగ్గిపోయే అవకాశం ఉంది.

ప్రశ్న 11.
ప్రజా సంక్షేమ పథకాల యొక్క ప్రయోజనాలు అర్హులైన వారికి అందడం లేదనే అభిప్రాయం ఉంది. దీనిపై మీ సలహాలు, సూచనలు వ్రాయండి.
జవాబు:

  1. ప్రజా సంక్షేమ పథకాలకు అర్హులను ఎంపిక చేయడంలో అధికార పక్షాలు, అధికారుల అవినీతి, బంధుప్రీతికి ఆస్కారం ఉండటం వలన అందరికీ ఫలాలు సరిగా అందడం లేదు.
  2. రాజకీయ పక్షపాతంకన్నా ప్రజా సంక్షేమమే పరమావధిగా ఉండాలి.
  3. పథకాలలో అవినీతి జరగనీయకుండా చూడాలి.
  4. అలాంటి వాటికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి.

10th Class Social 22th Lesson 4 Marks Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
‘సమాచార హక్కు చట్టము ప్రజాస్వామ్య స్ఫూర్తికి నిలువెత్తు దర్పణము’ – వివరించండి.
జవాబు:

  1. ప్రజాస్వామ్యానికి అన్ని విషయాలు తెలిసిన పౌరులు కావాలి.
  2. సమాచారంలో పారదర్శకత ఉండాలి.
  3. సమాచార హక్కు చట్టం ద్వారా పౌరులందరూ ఇటువంటి సమాచారాన్ని పొందగలరు.
  4. ఇది అవినీతిని అరికట్టడానికి తోడ్పడుతుంది.
  5. ప్రభుత్వాలు పౌరులకు జవాబుదారీగా ఉండేలా చేస్తుంది.
  6. గతంలో ప్రభుత్వ శాఖలు ఎన్నికైన ప్రజా ప్రతినిధులకు మాత్రమే ప్రతిస్పందించేవి.
  7. కానీ ఇప్పుడు సాధారణ పౌరులకు సైతం జవాబులు చెబుతున్నాయి.

ప్రశ్న 2.
లోక్ అదాలలు సామాన్య మానవునకు ఏ విధంగా సహకరిస్తున్నాయి? వివరించండి.
జవాబు:

  1. ఎటువంటి రుసుము చెల్లించనవసరం లేదు.
  2. వివాదాల వేగవంత విచారణ, విధానంలో వెసులుబాటు కల్పించబడ్డాయి.
  3. వాది ప్రతివాదులిరువురూ ప్రత్యక్షముగా న్యాయమూర్తితో సంభాషించవచ్చును.
  4. ఉచిత న్యాయసలహా అందజేయబడుతుంది.
  5. వివాదాల పరిష్కారములో కాలయాపన నివారించబడుతుంది.

AP 10th Class Social Important Questions Chapter 22 పౌరులు, ప్రభుత్వాలు

ప్రశ్న 3.
“సమాచార హక్కు చట్టం వల్ల ప్రభుత్వం పనిని మెరుగు పరచడం, పర్యవేక్షించడం సాధ్యమవుతుంది.” దీనితో మీరు ఏకీభవిస్తారా ? మీ సమాధానమును సమర్థించండి.
జవాబు:
సమాచార హక్కుచట్టం:

  1. అవును. ఇవ్వబడిన వ్యాఖ్యతో నేను ఏకీభవిస్తాను.
  2. సమాచార హక్కు చట్టం వల్ల ప్రభుత్వ పనిని మెరుగుపరచడం, పర్యవేక్షించడం సాధ్యమవుతుంది.
  3. పరిపాలనలో పారదర్శకత పెరుగుతుంది.
  4. ఇది లంచగొండితనాన్ని అరికట్టడానికి దోహదపడుతుంది.
  5. ప్రభుత్వాలను సాధారణ పౌరులకు, వ్యక్తులకు జవాబుదారీగా ఉండేలా చేస్తుంది.

ప్రశ్న 4.
సమాచార హక్కు చట్టం పరిధిలోకి వచ్చే ప్రభుత్వ సంస్థలేవి?
జవాబు:
సమాచార హక్కు చట్టం కిందికి వచ్చే ప్రభుత్వ సంస్థలను చట్టం ఈ కింది విధంగా గుర్తించింది.
అ) రాజ్యాంగం కింద ఏర్పడిన సంస్థ
ఆ) పార్లమెంటు, లేదా రాష్ట్ర శాసన సభల ప్రకారం ఏర్పడిన సంస్థ
ఇ) సంబంధిత ప్రభుత్వ ఆదేశాలు లేదా నోటిఫికేషన్ ద్వారా ఏర్పడిన సంస్థ. ప్రభుత్వ సంస్థ, ప్రభుత్వ నియంత్రిత సంస్థ, ప్రభుత్వం నిధులు సమకూర్చిన సంస్థలు ఈ చట్టం కిందికి వస్తాయి. ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా గణనీయ మొత్తంలో ప్రభుత్వ నిధులు అందే స్వచ్ఛంద సంస్థలు కూడా ఈ చట్టం కిందికి వస్తాయి.

ప్రశ్న 5.
దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న తమ వివాదాలను పరిష్కరించుకోదలచిన వ్యక్తులు ఎవరికి, ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి?
జవాబు:
దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న తమ వివాదాలు, తగాదాలు, కోర్టు కేసులను పరిష్కరించుకోదలచిన వ్యక్తులు తమ కేసు పూర్వపరాలు, కావలసిన పరిష్కారం, వివరిస్తూ సంబంధిత పత్రాలు మరియు తమ అర్హతను తెలియజేసే పత్రాలతో అఫిడవిట్ దాఖలు చేసి సత్వర, ఉచిత న్యాయాన్ని కోరవచ్చు.

వివిధ స్థాయిలలో ఎవరికి దరఖాస్తు చేయాలో దిగువన పేర్కొనబడినది.
జిల్లాస్థాయిలో – కార్యదర్శి, జిల్లా న్యాయసేవల ప్రాధికార సంస్థ, జిల్లా కోర్టు భవనాలు.
రాష్ట్రస్థాయిలో – సభ్యకార్యదర్శి, రాష్ట్ర న్యాయ సేవల ప్రాధికార సంస్థ, న్యాయ సేవాసదన్, సిటీ సివిల్ కోర్టు భవనాలు, హైకోర్టు భవనాలు, హైదరాబాదు – 500 066
(లేదా)
హైకోర్టులో ఉన్న కేసులలో న్యాయ సహాయం కోరే వ్యక్తులు కార్యదర్శి, హైకోర్టు న్యాయ సేవల ప్రాధికార సంస్థ, హైకోర్టు భవనాలు, హైదరాబాదు – 500 066.

ప్రశ్న 6.
లోక్ అదాలత్ వల్ల ప్రయోజనాలు ఏమిటి?
జవాబు:

  1. ఎటువంటి కోర్టు రుసుము ఉండదు. ఒకవేళ కోర్టు రుసుము అప్పటికే చెల్లించి ఉంటే లోక్ అదాలత్ కేసు పరిష్కరింపబడినప్పుడు నియమాలకు లోబడి రుసుమును తిరిగి చెల్లిస్తారు.
  2. వివాదాల వేగవంత విచారణ, విధానంలో వెలుసుబాటు అన్నవి లోక్ అదాలత్ లోని ముఖ్యమైన అంశాలు. వివాదాలను లోక్ అదాలత్ పరిష్కరించే క్రమంలో పౌర విచారణ స్మృతి సాక్షాల చట్టం వంటి వాటిల్లో పేర్కొన్న విధానాలను కచ్చితంగా పాటించాలని లేదు.
  3. తమ సలహాదారు ద్వారా వివాదంలోని కక్షిదారులు నేరుగా జడ్జితో సంభాషించవచ్చు. ఇది సాధారణ న్యాయస్థానాల్లో సాధ్యంకాదు.
  4. లోక్ అదాలత్ ఇచ్చే తీర్పును వాది, ప్రతివాదులు గౌరవించాలి. సివిల్ కోర్టు ఇచ్చే తీర్పుకి ఉండే విలువ దీనికి కూడా ఉంటుంది. వివాద అంతిమ పరిష్కారం ఆలస్యం కాకుండా ఉండటానికి దీనిపై అప్పీలును అనుమతించరు.
  5. అడ్వకేట్ల ద్వారా ఉచిత న్యాయ సలహా అందిస్తారు. కోర్టులలో కేసును వాదించటానికి అడ్వకేట్లను నియమిస్తారు. ఉచిత న్యాయ సేవలు, మద్ధతుకి అర్హులైన వ్యక్తులకు సంబంధించిన కోర్టు కేసులలో కోర్టు ఖర్చులను భరిస్తారు, తీర్పు నకళ్లను ఉచితంగా అందచేస్తారు.

ప్రశ్న 7.
AP 10th Class Social Important Questions Chapter 22 పౌరులు, ప్రభుత్వాలు 1
ఇచ్చిన వార్తా కథనాలను చదివి సమాచార హక్కు ఉపయోగం గురించి చర్చించండి.
జవాబు:
పైన ఇచ్చిన వార్తా కథనాలను పరిశీలించినట్లయితే సమాచార హక్కు చట్టం మూలంగా అనేక అక్రమాలను, అవినీతి చర్యలను అరికట్టవచ్చని తెలుస్తుంది. మరియు ఈ చట్టం మూలంగా చాలా ఉపయోగాలున్నాయని తెలుస్తుంది.

కొన్ని ఉపయోగాలు :

  1. “తానే” నగరంలో అనుమతి లేని 40,000 ఆటోలు తిరుగుతున్నట్లుగా “సమాచార హక్కుచట్టం” ప్రకారం తెలిసింది.
  2. సమాచార హక్కు చట్టం ప్రకారం సమాచార కమిషనర్ జరిమానాలను విధించినట్లుగా తెలియుచున్నది.
  3. ఇతర దేశాలలో 117 మంది భారతీయులను నిబంధనలకు వ్యతిరేకంగా ఖైదీలుగా బంధించారని సమాచార హక్కు చట్టం మూలంగా తెలుసుకోగలిగాం.
  4. సమాచారం అడిగేవారు. వారి అడ్రసులను ఇవ్వవలసిన అవసరం లేదు. కాని సమాచారం పొందడానికి కనీసం పోస్ట్బక్స్ నంబరు అయినా ఇవ్వవలయును అని ఢిల్లీ వార్తాపత్రిక తెలియచేయుచున్నది.
  5. చెన్నై కార్పొరేషనులో విద్యాపన్నుకు సంబంధించి 175 కోట్ల రూపాయలను వసూలు చేశారు, కాని గత 8 సంవత్సరాల నుండి ఆ డబ్బును ఉపయోగించలేదనే ఫిర్యాదు సమాచార హక్కు చట్టం ప్రకారం చెన్నైలో నమోదు అయ్యింది.

ఈ సమాచార హక్కు మూలంగా ఎన్నో అక్రమాలు వెలుగులోకి వచ్చాయని తెలుస్తుంది. అదే విధంగా కొన్ని రాష్ట్రాలలో ఈ చట్టం మరుగున పడిపోయిందనే వార్తలు కూడా తెలుస్తున్నాయి.

ప్రశ్న 8.
మీకిచ్చిన భారతదేశ పటంలో ఈ క్రింది ప్రాంతాలను గుర్తించుము.
1) ఢిల్లీ 2) చెన్నై 3) ముంబయి 4) కోల్ కత 5) హైదరాబాద్ 6) బెంగళూరు
AP 10th Class Social Important Questions Chapter 22 పౌరులు, ప్రభుత్వాలు 2

AP 10th Class Social Important Questions Chapter 21 సమకాలీన సామాజిక ఉద్యమాలు

These AP 10th Class Social Studies Important Questions 21th Lesson సమకాలీన సామాజిక ఉద్యమాలు will help students prepare well for the exams.

AP Board 10th Class Social 21th Lesson Important Questions and Answers సమకాలీన సామాజిక ఉద్యమాలు

10th Class Social 21th Lesson ½ Mark Important Questions and Answers in Telugu Medium

1. “నాకొక కల ఉంది ……” అన్న చారిత్రాత్మక ఉపన్యాసం చేసినది ఎవరు?
జవాబు:
మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్.

2. అనేక మంది నలవాళ్ళు వేరేజాతి అని శ్వేత జాతీయుల పాలన నుంచి స్వాతంత్ర్యం కోసం పోరాడాలని భావించినది ఎవరు?
జవాబు:
మాల్కం ఎక్స్

3. అణు కర్మాగారంలో ప్రమాదం జరిగిన ‘చెర్నోబిల్’ ఉన్న దేశం ఏది?
జవాబు:
రష్యా

4. ‘సైలెంట్ వ్యాలీ’ ఉద్యమం ఏ రాష్ట్రానికి సంబంధించినది?
జవాబు:
కేరళ.

5. మణిపూర్‌ను భారతదేశంలో ఏ సంవత్సరంలో విలీనం చేసినారు?
జవాబు:
1949.

AP 10th Class Social Important Questions Chapter 21 సమకాలీన సామాజిక ఉద్యమాలు

6. భోపాల్ గ్యాస్ దుర్ఘటనకు కారణమైన కంపెనీ ఏది?
జవాబు:
యూనియన్ కార్బైడ్ కంపెనీ.

7. యూనియన్ కార్బైడ్ కంపెనీని తర్వాత ఏ కంపెనీ కొనుగోలు చేసింది?
జవాబు:
డౌ కంపెనీ (DOW)

8. 1980లో విజ్ఞాన శాస్త్రం, పర్యావరణ కేంద్రం అన్న సంస్థను స్థాపించిన దెవరు?
జవాబు:
అనిల్ అగర్వా ల్.

9. మైటై భాషలో మైరాపైబీ అంటే అర్థం ఏమిటి?
జవాబు:
కాగడాలు పట్టుకున్నవాళ్ళు.

10. ఆంధ్రప్రదేశ్ లో సారాను ఏ సంవత్సరంలో నిషేధించారు?
జవాబు:
1993

11. ఆంధ్రప్రదేశ్ లో సంపూర్ణ మధ్యపాన నిషేధం ఏ సంవత్సరంలో విధించారు?
జవాబు:
1995.

12. మణిపూర్ లో సైనిక నిర్బంధంలో మరణించిన మహిళ ఎవరు?
జవాబు:
తంగజం మనోరమ.

13. మణిపూర్‌లో సైనిక బలాల ప్రత్యేకాధికారాల చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమమేది?
జవాబు:
మైరా పైబీ.

14. సైలెంట్ వ్యాలీలోని అరుదైన (అంతరించి పోతాయని భావించిన) జాతి కోతి ఏది?
జవాబు:
లయన్ టేల్డ్ మకాక్ (సింహపు తోక కోతి)

15. నందిగ్రాం సంఘటన (పోరాటం) ఏ రాష్ట్రంలో జరిగింది?
జవాబు:
పశ్చిమ బెంగాల్.

AP 10th Class Social Important Questions Chapter 21 సమకాలీన సామాజిక ఉద్యమాలు

16. 2012 లండన్ ఒలింపిక్స్ క్రీడలను స్పాన్సరు చేసిన ఏ కంపెనీకి వ్యతిరేకంగా సంతకాలు చేసారు?
జవాబు:
డౌ కంపెనీ. (DOW)

17. సర్దార్ సరోవర్ ఆనకట్ట నిర్మాణానికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమమేది?
జవాబు:
నర్మదా బచావో ఆందోళన్ – NBA

18. ఎవరినీ అకారణంగా అరెస్ట్ చేయకూడదు, నిర్బంధించ కూడదు, బహిష్కరించకూడదు అని ఏ మానవ హక్కుల అధికరణ చెబుతుంది?
జవాబు:
అధికరణం తొమ్మిది (9).

19. గ్రీన్ పీస్ ప్రధాన కార్యాలయం ఏ నగరంలో కలదు?
జవాబు:
ఆమ్ స్టర్డాం

20. SALT ని విస్తరింపుము.
జవాబు:
వ్యూహాత్మక ఆయుధాల పరిమితి చర్చలు

21. START ని విస్తరింపుము.
జవాబు:
వ్యూహాత్మక ఆయుధాల తగ్గింపు ఒప్పందం.

22. నయా ఉదారవాదం, ప్రపంచీకరణ ఏ సంవత్సరం నుంచి మొదలయ్యాయి?
జవాబు:
1990 నుంచి.

23. అమెరికా బలగాలను ఎదుర్కోటానికి వియత్నాం ఏ యుద్ధ పంథాని అవలంభించింది.?
జవాబు:
గొరిల్లా యుద్ధ పంథా.

AP 10th Class Social Important Questions Chapter 21 సమకాలీన సామాజిక ఉద్యమాలు

24. మణిపూర్ ఉక్కు మహిళగా పేరొందినది ఎవరు?
జవాబు:
ఇరోం షర్మిలా

25. ‘దూబగుంట’ గ్రామం ఏ జిల్లాలో కలదు?
జవాబు:
నెల్లూరు.

26. ‘నర్మదా బచావో ఆందోళన్’ దీనికి సంబంధించిన ఉద్యమం.
A) నీటి ఉద్యమం
B) ప్రకృతి సేద్య ఉద్యమం
C) పర్యావరణ ఉద్యమం
D) సామాజిక ఉద్యమం
జవాబు:
C) పర్యావరణ ఉద్యమం

27. పడవ పేరునే ఉద్యమంగా మార్చుకున్న ఉద్యమమేది?
జవాబు:
గ్రీన్, పీస్ ఉద్యమం.

28. అమెరికాలో పౌరహక్కుల ఉద్యమం తీవ్రదశకు చేరుకున్న సమయమేది?
జవాబు:
1960 లలో.

29. అమెరికాలోని నల్లజాతి వారు ఒక సంవత్సరం పాటు బస్సులను బహిష్కరించిన ప్రాంతమేది?
జవాబు:
మాంట్ గోమరి.

30. ప్రఖ్యాత వాషింగన్ ప్రదర్శన ఏ రోజున నిర్వహించారు?
జవాబు:
ఆగస్టు 28, 1963.

31. డా॥ మార్టిన్ లూథర్ కింగ్ యొక్క కల ఏమిటి?
జవాబు:
ప్రజలు చర్మ రంగు ఆధారంగా కాకుండా వ్యక్తిత్వ లక్షణాల ఆధారంగా గౌరవించబడాలి.

32. సోవియట్ రష్యాలోని (USSR) మానవ హక్కుల ఉద్యమకారులు ఎవరు?
జవాబు:
అలెగ్జాండర్ సోల్డ్ నిత్సిన్ & ఆండ్రే సఖరోలు.

33. అమెరికా వియత్నంలో యుద్ధం నుండి ఏ సంవత్సరంలో విరమించుకుంది?
జవాబు:
1975.

34. గ్రీన్‌పీస్ ఉద్యమం ఏ సంవత్సరంలో ప్రారంభమైంది?
జవాబు:
1971 లో.

AP 10th Class Social Important Questions Chapter 21 సమకాలీన సామాజిక ఉద్యమాలు

35. గ్రీన్‌పీస్ ఉద్యమం యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి?
జవాబు:
అనంత వైవిధ్యంతో కూడిన జీవాన్ని భూమి పోషించే శక్తిని కాపాడటం.

36. భోపాల్ గ్యాస్ దుర్ఘటన బాధితుల డిమాండ్/డిమాండ్లు ఏవి?
i) సరైన వైద్య సౌకర్యం
ii) అంతర్జాతీయ ప్రామాణికాల ఆధారంగా నష్ట పరిహారం
iii) యాజమాన్యాన్ని ఈ నేరానికి బాధ్యులుగా చేయటం.
iv) భవిష్యత్తులో ఇటువంటివి జరగకుండా చూడడం.
జవాబు:
i, ii, iii & iv.

37. ఏ విషయాన్ని పరిశీలించటానికి జస్టిస్ B.P. జీవన్ రెడ్డి 40 దేశాల్లో కమిటీ వేయబడింది?
జవాబు:
మణిపూర్‌లో సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని రద్దు చేసే అంశంపై.

38. NBAకు నాయకత్వం వహించింది ఎవరు?
జవాబు:
మేథా పాట్కర్.

39. సైలెంట్ వ్యాలీ ఉద్యమంలో ప్రజలను సమీకరించిన సంస్థ ఏది?
జవాబు:
KSSP (కేరళ శాస్త్ర సాహిత్య పరిషత్)

40. సైలెంట్ వ్యాలీని ఏ సంవత్సరంలో జాతీయ పార్క్ గా మార్చారు?
జవాబు:
1985.

41. సామాజిక ఉద్యమాలన్నింటిలో ఉన్న సారూష్య అంశాలు ఏవో గుర్తించి రాయండి.
i) సమానత్వం
ii) మానవ హక్కులు
iii) ప్రజాస్వామ్యం
జవాబు:
i, ii & iii

AP 10th Class Social Important Questions Chapter 21 సమకాలీన సామాజిక ఉద్యమాలు

42. అమెరికాలో నల్లజాతి అమెరికన్లు పట్ల క్రింది వానిలో ఏ విషయాలలో వివక్షత ఉండేది?
i) ఉద్యోగాలు
ii) గృహవసతి
iii) ఓటుహక్కు
జవాబు:
i, ii & iii

43. 1957 సెప్టెంబరు 4న లిటిల్ రాక్ స్కూల్ లో ప్రవేశించటానికి ప్రయత్నించిన నల్లజాతి అమ్మాయి ఎవరు?
జవాబు:
ఎలిజబెత్ ఎక్ఫోర్డ్.

44. USSR పెత్తనం నుంచి స్వేచ్ఛను కోరుకున్న దేశాలు ఏవి?
జవాబు:
హంగరీ, చెక్ స్లోవేకియా, పోలండ్.

45. USSRలో సోషలిస్టు వ్యవస్థకు అంతం పలకాలని ఉద్యమించిన నాయకులు ఎవరు?
జవాబు:
అలెగ్జాండర్ సోల్డ నిత్సిన్ మరియు ఆండ్రే సఖరోవ్.

46. అమెరికా – వియత్నాం యుద్ధంలో వియత్నాం, లావోస్, అమెరికా, కాంబోడియా దేశాల్లో ఏ దేశ పౌరులు చనిపోలేదు?
జవాబు:
అమెరికా

47. START పై అమెరికా, USSR ఎప్పుడు సంతకాలు చేసాయి?
జవాబు:
1991 లో.

48. 1971లో అమెరికా అణుపరీక్షలను ఎక్కడ చేపట్టింది?
జవాబు:
అలస్కా దగ్గర సముద్రగర్భంలో

49. ప్రస్తుతం గ్రీన్ పీస్ ఉద్యమం ఎన్ని దేశాలలో విస్తరించి ఉంది?
జవాబు:
40 దేశాలలో

50. “సుస్థిర అభివృద్ధి” అనే భావనను ముందుకు తెచ్చిన ఉద్యమం ఏది?
జవాబు:
గ్రీన్ పీస్ ఉద్యమం.

AP 10th Class Social Important Questions Chapter 21 సమకాలీన సామాజిక ఉద్యమాలు

51. భోపాల్ గ్యాస్ దుర్ఘటన ఏ సంవత్సరంలో సంభవించింది?
జవాబు:
1984 లో

52. సైలెంట్ వ్యాలీకి ఆపేరు ఎందుకు వచ్చింది?
జవాబు:
ఇక్కడ కీచురాళ్ళు లేవు అందుకే ఈ అడవి నిశబ్దంగా ఉంటుంది.

53. KSSP ని విస్తరించండి.
జవాబు:
కేరళ శాస్త్ర సాహిత్య పరిషత్.

54. మణిపూర్‌పై బ్రిటిషువారు ఎప్పుడు నియంత్రణ సాధించారు?
జవాబు:
1891లో.

55. విశ్వవ్యాప్త మానవ హక్కుల ప్రకటనలోని ఏ అధికరణ ప్రకారం ప్రతి ఒక్కరికీ సొంత దేశంతో సహా ఏ దేశాన్నైనా వీడే హక్కు తిరిగి సొంత దేశానికి చేరే హక్కు ఉంటాయి?
జవాబు:
అధికరణం 13(2)

56. APSPA ని విస్తరింపుము.
జవాబు:
(Armed Forces Special Power Act.)

57. AFSPA చట్టాన్ని ఏ సంవత్సరంలో చేసారు?
జవాబు:
1958 లో.

AP 10th Class Social Important Questions Chapter 21 సమకాలీన సామాజిక ఉద్యమాలు

58. క్రింది వానిని సరిగా జతపరచండి.
i) సైలెంట్ వ్యా లీ ఉద్యమం ( ) a) మధ్య ప్రదేశ్
ii) మైరా పైబీ ( ) b) ఉత్తరాఖండ్
iii)చిప్కో ( ) c) మణిపూర్
iv) నర్మదా బచావో ( ) d) కేరళ
జవాబు:
i – d, ii – c, iii – b, iv – a

59. సైలెంట్ వ్యాలీ ఉద్యమం, నర్మదా బచావో ఆందోళన్, మైరా పై బీ, గ్రీన్ పీస్ ఉద్యమాల్లో పర్యావరణ ఉద్యమం కానిది ఏది?
జవాబు:
మైరా పైబీ ఉద్యమం.

60. క్రింది వానిని సరిగా జతపరచండి.
i) మేథాపాట్కర్ ( ) a) నర్మదాబచావో
ii) మార్టిన్ లూథర్ కింగ్ (b) అమెరికాలో పౌరహక్కుల ఉద్యమం
iii)ఆండ్రే సఖరోవ్ ( c) USSR లో మానవ హక్కుల ఉద్యమం
iv) ఇరోం షర్మిలా ( ) d) మణిపూర్ లో మానవ హక్కుల
జవాబు:
i – a, ii – b, iii – c, iv – d

61. సర్దార్ సరోవర్ ఆనకట్ట నిర్మించబడిన రాష్ట్రం ఏది?
జవాబు:
గుజరాత్.

62. ఏ ఉద్దేశ్యంతో మైరాపైబీ ఉద్యమం మొదలయ్యింది?
జవాబు:
1970 ల కాలంలో, తాగి బజారుల్లో గొడవ చెయ్య కుండా నివారించటానికి

63. ఏ సంవత్సరంలో అమెరికాలోని బస్సులలో వివక్షతను న్యాయస్థానాలు నిషేధించాయి?
జవాబు:
1956 లో.

AP 10th Class Social Important Questions Chapter 21 సమకాలీన సామాజిక ఉద్యమాలు

64. సూర్యుని హానికర (అతి నీలలోహిత) కిరణాలను అడ్డుకునే వాతావరణంలోని పొర ఏది?
జవాబు:
ఓజోను పొర.

65. ఈశాన్య ప్రాంత మానవ హక్కుల పరిరక్షణను అధ్యయనం చేయటానికి నియమించిన కమిటీ ఏది?
జవాబు:
B.P. జీవన్ రెడ్డి కమిటి.

క్రింద నీయబడిన పటమును పరిశీలించి ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
AP 10th Class Social Important Questions Chapter 21 సమకాలీన సామాజిక ఉద్యమాలు 3
66. పటంలో సారా వ్యతిరేక ఉద్యమం జరిగిన రాష్ట్రాన్ని సూచించే సంఖ్య ఏది?
జవాబు:
1

67. పటంలో చిప్కో వ్యతిరేక ఉద్యమం జరిగిన రాష్ట్రాన్ని సూచించే సంఖ్య ఏది?
జవాబు:
4

68. పటంలో సైలెంట్ వ్యాలీ ఉద్యమం జరిగిన రాష్ట్రాన్ని సూచించే సంఖ్య ఏది?
జవాబు:
2

69. పటంలో మైరా పైజీ ఉద్యమం జరిగిన రాష్ట్రాన్ని సూచించే సంఖ్య ఏది?
జవాబు:
5

70. పటంలో నర్మదాబచావో ఉద్యమం జరిగిన రాష్ట్రాన్ని సూచించే సంఖ్య ఏది?
జవాబు:
3

71. చిప్కో ఉద్యమం ఏ రాష్ట్రంలో జరిగింది?
జవాబు:
ఉత్తరాఖండ్.

72. సైలెంట్ వ్యాలీ ఉద్యమం ఏ రాష్ట్రంలో జరిగింది?
జవాబు:
కేరళ.

AP 10th Class Social Important Questions Chapter 21 సమకాలీన సామాజిక ఉద్యమాలు

73. సారా వ్యతిరేక ఉద్యమం ఏ రాష్ట్రంలో జరిగింది?
జవాబు:
ఆంధ్రప్రదేశ్.

10th Class Social 21th Lesson 1 Mark Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
మీకీయబడిన భారతదేశ రాజకీయ పటంలో కింది సామాజిక ఉద్యమాలు జరిగిన ఏదేని ఒక్కొక్క రాష్ట్రాన్ని గుర్తించండి.
A) నర్మదా బచావో ఆందోళన్
B) చిప్కో ఉద్యమం
జవాబు:
AP 10th Class Social Important Questions Chapter 21 సమకాలీన సామాజిక ఉద్యమాలు 1

ప్రశ్న 2.
క్రింది పటమును చదివి, ప్రశ్నకు సమాధానము ఇవ్వండి.
AP 10th Class Social Important Questions Chapter 21 సమకాలీన సామాజిక ఉద్యమాలు 2
ప్రశ్న : ఇందిరా సాగర్ ప్రాజెక్టు ఏ నదిపై ఏ రాష్ట్రంలో కలదు?
జవాబు:
ఇందిరా సాగర్ ప్రాజెక్టు నర్మదానదిపై, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కలదు.
(లేదా)

ప్రశ్న 3.
పై పటాన్ని పరిశీలించి దిగువ ప్రశ్నలకు జవాబులు వ్రాయండి.
i) నర్మదా నది యొక్క ప్రవాహ దిశ ఏది?
జవాబు:
తూర్పు నుండి పడమర

ii) నర్మదా నదిపై ఆనకట్టలు కట్టడానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేయడానికి కారణాలు :
జవాబు:
ప్రజలు నిర్వాసితులు కావడం
సారవంతమైన భూభాగం కోల్పోవడం
అడవులు, పొలాలు, ప్రజలు, జంతువులు నివసించే ప్రాంతాలు మునిగిపోవడం.

ప్రశ్న 4.
‘నర్మదా బచావో’ ఉద్యమంతో ముడిపడి ఉన్న రెండు ఉద్యమాల పేర్లు తెలపండి.
జవాబు:
‘నర్మదా బచావో’ ఉద్యమంతో ముడిపడి ఉన్న రెండు ఉద్యమాలు :

  1. మూలవాసీ ప్రజల ఉద్యమము.
  2. నయా ఉదారవాద విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమము.

ప్రశ్న 5.
ఉద్యమాలలో ముఖ్యమైన ఉద్యమం ఏది?
జవాబు:
ఉద్యమాలలో అత్యంత ముఖ్యమైనది అమెరికాలోని పౌరహక్కుల ఉద్యమం.

ప్రశ్న 6.
‘పౌరనిరాకరణ’ అనగానేమి?
జవాబు:
వివక్షత కూడిన చట్టాలను శాంతియుతంగా ఉల్లంఘించటం.

AP 10th Class Social Important Questions Chapter 21 సమకాలీన సామాజిక ఉద్యమాలు

ప్రశ్న 7.
యుఎస్ఎస్ఆర్ లో మానవ హక్కుల ఉద్యమ నాయకులు ఎవరు?
జవాబు:
ప్రఖ్యాత రచయిత అలెగ్జాండర్ సోల్ నిత్సిన్, అణుశాస్త్రవేత్త ఆండ్రే సఖరోన్లు యుఎస్ఎస్ఆర్ లోని మానవ హక్కుల ఉద్యమ నాయకులు.

ప్రశ్న 8.
గోర్బచేవ్ ఎవరు?
జవాబు:
యుఎస్ఎస్ఆర్ అధ్యక్షుడు గోర్బచేవ్. ఈయన ప్రజలకు మరింత స్వేచ్ఛను కల్పించటానికి గ్లాస్ నోస్తే అన్న సంస్కరణల ప్రక్రియను ఆరంభించాడు.

ప్రశ్న 9.
రెండవ ప్రపంచ యుద్ధకాలంలో అమెరికా ఏ దేశం మీద అణుబాంబులను వేసింది?
జవాబు:
1945 ఆగష్టులో “జపాన్లోని హిరోషిమా, నాగసాకిల” పై అమెరికా అణుబాంబులను వేసింది.

ప్రశ్న 10.
వియత్నాం యుద్ధంలో అమెరికా వాడిన ఆయుధాలేమిటి?
జవాబు:
రసాయనిక ఆయుధాలు, నాపాలం బాంబులు వంటి కొత్త ఆయుధాలను అమెరికా కనిపెట్టి గ్రామాలను సమూలంగా నాశనం చేసింది.

ప్రశ్న 11.
ఆయుధ పోటీలో ప్రధాన దేశాలేవి?
జవాబు:
ఆయుధ పోటీలో ప్రధాన దేశాలు 2. అవి :

  1. అమెరికా
  2. యుఎస్ఎస్ఆర్ (రష్యా).

ప్రశ్న 12.
చరిత్రలో అత్యంత సంక్లిష్టమైన ఆయుధ నియంత్రణ ఏది?
జవాబు:
START (ఎసీఏఆర్) స్ట్రాటెజిక్ ఆర్మ్ రిడక్షన్ ట్రీటి వ్యూహాత్మక ఆయుధాల తగ్గింపు ఒప్పందం.

ప్రశ్న 13.
ప్రజలు ఈ మధ్య దేనివల్ల ముప్పును ఎదుర్కొంటున్నారు?
జవాబు:
గత కొద్ది దశాబ్దాలలో వాణిజ్య రైతులు, గనుల తవ్వకం సంస్థలు, ఆనకట్టల పథకాలు వంటి వాటి నుంచి గిరిజనులు, నిర్వాసితులైన ప్రజలు ముప్పును ఎదుర్కొంటున్నారు.

ప్రశ్న 14.
గ్రీన్‌పీస్ అంటే ఏమిటి? ఇది ఎక్కడుంది?
జవాబు:
గ్రీన్ పీస్ అనేది ఒక అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ. ఈ ఉద్యమం 40 దేశాలలో విస్తరించి ఉంది. దీని ప్రధాన కార్యాలయం ఆమ్ స్టర్ డాం (హాలెండ్)లో ఉంది.

ప్రశ్న 15.
భోపాల్ దుర్ఘటన దేనికి సంబంధించినది?
జవాబు:
భోపాల్ లో యూనియన్ కార్బైడ్ కంపెనీ (ఔ) నుంచి ఒక రాత్రి విషవాయువు వెలువడింది. దీనివల్ల వేలాది మంది చనిపోయారు, దాని ప్రభావం వల్ల ఇప్పటికీ వేలాదిమంది బాధపడుతున్నారు. ఈ దుర్ఘటన 1984లో జరిగింది.

AP 10th Class Social Important Questions Chapter 21 సమకాలీన సామాజిక ఉద్యమాలు

ప్రశ్న 16.
పర్యావరణ ఉద్యమాలు ప్రధానంగా దేనికి సంబంధించినవి?
జవాబు:
ఈ పర్యావరణ ఉద్యమాలు ప్రధానంగా అడవుల రక్షణ కోసం ఆరంభమయ్యాయి.

ప్రశ్న 17.
కొన్ని బహుళార్థసాధక ఆనకట్టల పేర్లు తెలుపుము.
జవాబు:

  1. భాక్రానంగల్
  2. హీరాకుడ్
  3. నాగార్జునసాగర్

ప్రశ్న 18.
సారా వ్యతిరేకత ఎక్కడ ప్రారంభమైంది?
జవాబు:
ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా, దూబగుంట గ్రామంలో ఈ ‘సారా వ్యతిరేక’ ఉద్యమం ప్రారంభమైంది.

ప్రశ్న 19.
సారా నిషేధం, సంపూర్ణ మద్యపాన నిషేధం ఎప్పుడు జరిగాయి?
జవాబు:
1993 అక్టోబరులో సారాని అధికారికంగా నిషేధించారు. 1995లో సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని విధించారు.

ప్రశ్న 20.
‘మైరా పైబీ ఉద్యమం’ యొక్క ఆరోపణలు ఏమిటి?
జవాబు:
సాయుధ దళాల ప్రత్యేక చట్టం దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపణలున్నాయి.

ప్రశ్న 21.
మైరా పైబీ ఉద్యమకారులు నిరసనను ఏవిధంగా తెలియజేస్తున్నారు?
జవాబు:
గ్రామాలు, పట్టణాలలోని వార్డులలోని మహిళలు రోజూ పహారాలో పాల్గొంటారు. కాపలా కాస్తారు.

ప్రశ్న 22.
సారా వ్యతిరేక ఉద్యమంలో మహిళలు సమాజంలోని ఎవరిని ఎదుర్కొన్నారు?
జవాబు:
సమాజంలో అత్యంత పేదలైన వర్గానికి చెందిన మహిళలు ధనబలం, కండబలంతో పాటు రాజకీయ అండదండలున్న సారాయి తయారీదారులు, అమ్మకందారులను ఎదుర్కోగలిగారు.

10th Class Social 21th Lesson 2 Marks Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
పర్యావరణ ప్రాముఖ్యతను తెల్పుతూ ఒక కరపత్రంను తయారు చేయండి.
జవాబు:

భూమి మనుగడకు పర్యావరణమే ప్రధానం

భూమిపై ప్రతీ ప్రాణి తన అవసరాలను పర్యావరణం నుంచే తీర్చుకుంటుంది. పర్యావరణం క్షీణించితే మానవ మనుగడ, భూమి మనుగడ ప్రశ్నార్థకమవుతుంది.

నేల, నీరు, గాలి, కాలుష్యాలు పర్యావరణానికి పెద్ద గాయాలు. వీటి మూలంగా సహజ వనరులను నష్టపోతున్నాము. దురదృష్టవశాత్తు ఇవన్నీ మానవ తప్పిదాలే. భవిష్యత్తులో ఇవే గనుక ఇదే విధంగా కొనసాగితే విశ్వంలో మన మనుగడే ప్రశ్నార్థకం అవుతుంది.

కాబట్టి, మానవులారా ! ప్రకృతిని గాయపరచికాక, ప్రకృతికి అనుగుణంగా జీవించండి. ప్రకృతో రక్షతి రక్షిత :
ప్రతుల సంఖ్య : 1000
ప్రచురణ కర్త : పర్యావరణ పరిరక్షణ సమితి, ……………..

ప్రశ్న 2.
అమెరికాలో పౌరహక్కుల ఉద్యమానికి గల కారణాలేమిటి?
(లేదా)
నల్లజాతి అమెరికన్లు 1960లో పౌరహక్కుల ఉద్యమం ఎందుకు చేయవలసి వచ్చింది.
(లేదా)
అమెరికా పౌరహక్కుల ఉద్యమంను ఎవరు, ఎందుకొరకు చేశారు?
జవాబు:
ఉద్యమాల్లో అత్యంత ముఖ్యమైనది అమెరికాలోని పౌరహక్కుల ఉద్యమం. పాఠశాలల్లో, బస్సులలో బహిరంగ ప్రదేశాలలో నల్లజాతి వాళ్లను వేరుగా ఉంచటానికి, ఉద్యోగాలలో, గృహ వసతిలో, ఓటు హక్కులో సైతం వాళ్లపట్ల వివక్షత చూపటానికి వ్యతిరేకంగా ఆఫ్రో-అమెరికన్లు లేదా నల్లజాతి అమెరికన్లు సమానత్వానికి చేపట్టిన పోరాటం ఇది.

AP 10th Class Social Important Questions Chapter 21 సమకాలీన సామాజిక ఉద్యమాలు

ప్రశ్న 3.
పర్యావరణ పరిరక్షణకు సంబంధించి రెండు నినాదాలు రూపొందించండి. రణ పరిరక్షణకు సంబందించి రెండు నినాదాలు రూపొందించండి.
జవాబు:

  1. భూమి. కాలుష్యం – మన మనుగడకు ముప్పు.
  2. వృక్షో రక్షతి రక్షితః

ప్రశ్న 4.
ఈ క్రింది పేరాను చదివి మీ అభిప్రాయం వ్రాయండి.
“పౌరహక్కుల ఉద్యమంలో నల్లజాతి మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అయితే ఈ ఉద్యమంలోనూ పురుషుల ఆధిపత్యం ఉందని, తమని ఎవరూ పట్టించుకోవటం లేదని వాళ్ళు భావించసాగారు. ప్రఖ్యాత వాషింగ్టన్ ప్రదర్శనలో ఒక్క మహిళను కూడా మాట్లాడనివ్వలేదు. మహిళల సమానత్వం కోసం మహిళలు పోరాడాలని వాళ్ళు భావించసాగారు.”
జవాబు:
ప్రపంచవ్యాప్తంగా స్త్రీలందరూ ద్వితీయశ్రేణి పౌరులుగా పరిగణించబడుతున్నారు. ఈయబడిన పేరా మరోసారి ఇదే అంశాన్ని తెలియచేస్తోంది. గృహపరమైన అంశాల నుండి దేశ రాజకీయాల వరకు మహిళలు వెనుకంజలోనే ఉన్నారు. సాధారణంగా వారు ఎన్ని పోరాటాలు సల్పినా శతాబ్దాల తరబడి వారి పరిస్థితి అలానే ఉన్నది. మానవ హక్కుల గురించి అనునిత్యం పాఠాలు చెప్పే అమెరికాలో పరిస్థితే ఇలా ఉంటే మిగతా దేశాల్లో ఎలా ఉందో ఊహించుకోవచ్చు. విద్య, వృత్తి, ఉద్యోగాలలో మాత్రం మహిళలు ముందంజలో ఉన్నారని చెప్పుకోవచ్చు. రాజకీయాలలో మాత్రం తండ్రి లేదా భర్త లాంటి పురుషులు ఆ రంగంలో ఉంటేనే మహిళలు ఆ రంగంలో ఎదగగలుగుతున్నారు. గ్రామీణ స్థాయిలో మహిళల కోసం రిజర్వు చేయబడిన స్థానాలలో వారు నామమాత్రపు నాయకులుగా ఉంటే వారి భర్తలు అధికారాన్ని ఉపయోగిస్తున్నారు.
కాబట్టి ఈ పోరాటాలు పురుషులు కాక మహిళలే ముందుకొచ్చి చేయాలి. వారే వారికి ప్రత్యేక వేదికలను ఏర్పాటు చేసుకోవాలి. అపుడే మహిళలు ముందంజ వేయగలుగుతారు.

ప్రశ్న 5.
‘సారా నిషేధం’ సమస్యను పరిష్కరించడానికి, నీవైతే ఏం చేసియుండేవాడివి?
జవాబు:

  • ప్రజలలో అవగాహనను కల్పించడం
  • సారా నిషేధ చట్టాన్ని సక్రమంగా అమలుపరచడం
  • గ్రామ సంఘాలను ఏర్పరచడం
  • మహిళలను ఉద్యమంలో పాల్గొనేలా చేయడం వంటి కార్యక్రమాలు నిర్వహించేవాడిని.

ప్రశ్న 6.
గత కొన్ని దశాబ్దాలుగా కాలుష్యం రోజు రోజుకీ ఎందుకు పెరిగిపోతోంది?
జవాబు:
గత కొన్ని దశాబ్దాలుగా కాలుష్యం పెరిగిపోవటానికి గల కారణాలు :

  • పరిశ్రమలు పెరగడం
  • వాహనాల సంఖ్య పెరగడం
  • రసాయనిక ఎరువులు, క్రిమి సంహారక మందుల వాడకం పెరగడం
  • అడవుల నరికివేత

ప్రశ్న 7.
భోపాల్ గ్యాస్ బాధితుల నాలుగు ముఖ్యమైన కోరికలేవి?
జవాబు:
భోపాల్ గ్యాస్ బాధితుల ముఖ్యమైన కోరికలు:

  • ప్రభావితులైన వారికి సరైన వైద్య సౌకర్యం,
  • అంతర్జాతీయ ప్రామాణికాల ఆధారంగా నష్ట పరిహారం
  • బహుళజాతి కంపెనీ యాజమాన్యాన్ని నేరానికి బాధ్యులుగా చేయడం
  • భవిష్యత్తులో ఇటువంటి దుర్ఘటనలు జరగకుండా చూడటం.

ప్రశ్న 8.
క్రింది పటాన్ని పరిశీలించి దిగువ ప్రశ్నలకు జవాబులు వ్రాయండి.
AP 10th Class Social Important Questions Chapter 21 సమకాలీన సామాజిక ఉద్యమాలు 2
i) సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్ ఏ రాష్ట్రంలో నిర్మించబడింది?
జవాబు:
గుజరాత్

ii) నర్మదా నదిపై కట్టే ఆనకట్టలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం ఏది?
జవాబు:
నర్మదా బచావో ఆందోళన్

iii) నర్మదా నది జన్మస్థానం ఏది?
జవాబు:
అమర్ కంఠక్.

iv) నర్మదా నది పరివాహక ప్రాంతంలోని ఏవేని రెండు జలవిద్యుత్ కేంద్రాల పేర్లు రాయండి.
జవాబు:
సర్దార్ సరోవర్, ఇందిరాసాగర్, ఓంకారేశ్వర్.

ప్రశ్న 9.
భోపాల్ గ్యాస్ దుర్ఘటన వల్ల కలిగిన నష్టాలను రాయండి.
జవాబు:
భోపాల్ గ్యాస్ దురటన వల్ల కలిగిన నష్టాలు :

  1. వేలాదిమంది మరణాలు
  2. ప్రజలు నిరాశ్రయులు కావడం
  3. ఇప్పటికీ ఆ ప్రభావం కనిపించడం
  4. పర్యావరణం దెబ్బతినడం.

ప్రశ్న 10.
మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ ప్రసిద్ధ ఉపన్యాసం “నాకొక కల ఉంది” యొక్క సందర్భం గురించి రాయండి.
జవాబు:
ఉద్యమాలలో అమెరికాలోని పౌరహక్కుల ఉద్యమం చాలా ముఖ్యమైనది. ఈ ఉద్యమాన్ని డా॥ మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ డా|| కింగ్ ముందుకు నడిపించారు. అయితే ఈ ఉద్యమమనేది “పౌర నిరాకరణ” ధ్యేయంగా నడిచింది. (వివక్షతతో కూడిన చట్టాలను శాంతియుతంగా ఉల్లంఘించటం). డా॥ కింగ్ అమెరికా సమాజంపై ఉంచిన ఆదర్శాలు. పాఠశాలల్లో, బస్సుల్లో, బహిరంగ ప్రదేశాలలో నల్లజాతి వారిని వేరుగా ఉంచడానికి, ఉద్యోగాలలో, గుహవసతిలో, ఓటు హక్కులలో నల్లవారిని వివక్షతతో చూడకుండా వీరికి కూడా తెల్లవారితో సమానంగా హక్కులు కల్పించాలి. ఒక సంవత్సరం పాటు డా|| కింగ్ అధ్యక్షతన మాంటగోయెరిలో నల్లజాతీయులు బస్సులను బహిష్కరించారు. ఈయన పౌరహక్కుల చట్టాన్ని చేయాల్సిందిగా కోరారు. ఉపాధి కల్పనకు కార్యక్రమాలు పూర్తి న్యాయమైన ఉపాధి, మంచి గృహవసతి, ఓటు హక్కు, శ్వేజాతి, “నల్లజాతి పిల్లలు కలిసి చదువుకునే సమ్మిళిత విద్యా సదుపాయాలు కావాలని కోరాడు. మనుషులను శరీర రంగును బట్టి కాకుండా వాళ్ల వ్యక్తిత్వ లక్షణాలను బట్టి అంచనావేసే దేశంగా అమెరికా మారాలని డా||కింగ్ తన ఉపన్యాసంలో తెలియచేశాడు.

AP 10th Class Social Important Questions Chapter 21 సమకాలీన సామాజిక ఉద్యమాలు

ప్రశ్న 11.
వియత్నాం యుద్ధంలో ఎంత పౌరనష్టం జరిగింది?
జవాబు:
వియత్నాం యుద్ధంలో వియత్నాంకి చెందిన 8,00,000 సైనికులు, 30,00,000 పౌరులే కాకుండా అధిక సంఖ్యలో కంబోడియన్లు, లావోషియన్లు చనిపోయారు. అమెరికాకి ఎటువంటి పౌరనష్టం జరగలేదు. కానీ చాలా పెద్ద సంఖ్యలో సైనికులు చనిపోయారు, అంతకంటే అధిక సంఖ్యలో వికలాంగులయ్యారు.

ప్రశ్న 12.
ఆయుధ పోటీ ఏ విధంగా జరిగింది?
జవాబు:
వియత్నాం యుద్ధం ముగిసిన తరువాత మరిన్ని దేశాలు అణ్వాయుధాల నిల్వలలో ఒకదానితో ఒకటి పోటీ పడటంతో అణ్వాయుధ పోటీ తీవ్రరూపం దాల్చింది. ఈ ఆయుధాలను ఉత్పత్తిచేసే కంపెనీలు (వీటిని సైనిక పారిశ్రామిక కంపెనీలంటారు), ప్రభుత్వాలు సాధారణ ప్రజలలో యుద్ధ భయాన్ని కలిగించి, అణ్వాయుధాల మీద డబ్బును మరింతగా ఖర్చు పెట్టటానికి మద్దతు పొందేవి.

ప్రశ్న 13.
ఏ ఒప్పందంతో ఆయుధ నియంత్రణ జరిగింది?
జవాబు:
1991లో వ్యూహాత్మక ఆయుధాల తగ్గింపు ఒప్పందం (స్ట్రాటెజిక్ ఆర్ట్స్ రిడక్షన్ ట్రీటి – ఎఎఆర్డ్) మీద సంతకాలు చేశారు. చరిత్రలో అత్యంత పెద్ద, సంక్లిష్టమైన ఆయుధ నియంత్రణ ఒప్పందం ఇది. 2001లో ఇది అమలు అయినప్పుడు అప్పటికున్న అన్ని వ్యూహాత్మక అణ్వాయుధాలలో 80 శాతాన్ని తొలగించారు.

ప్రశ్న 14.
గ్రామీణ ప్రాంతాలలో ప్రజలు నిర్వాసితులు కావడానికి కారణాలేమిటి?
జవాబు:
ఖనిజాలు, అరుదైన మొక్కలు, ప్రాణులు, నీళ్లు వంటి విలువైన వనరులను పెద్ద పెద్ద కంపెనీలు గ్రామీణ ప్రాంతాల్లో కనుక్కోవటంతో తరతరాలుగా ఉంటున్న ప్రాంతాల నుంచి గిరిజనులు, రైతులు తొలగింపబడుతున్నారు.

ప్రశ్న 15.
గ్రీన్ పీస్ ఉద్యమం ఎలా మొదలైంది?
జవాబు:
అలస్కా దగ్గర సముద్ర గర్భంలో అమెరికా 1971లో చేపట్టిన అణు పరీక్షలకు వ్యతిరేకంగా, ఈ ఉద్యమం మొదలయ్యింది. నిరసన తెలియచెయ్యటానికి స్వచ్ఛంద కార్యకర్తలు చిన్న పడవలో ప్రయోగ ప్రదేశానికి బయలుదేరారు. ఈ పడవ పేరు గ్రీన్ పీస్’, చివరికి ఇది ఆ ఉద్యమం పేరుగా మారింది.

ప్రశ్న 16.
గ్రీన్ పీస్ ఉద్యమం ముఖ్య ఉద్దేశాలేమిటి?
జవాబు:
వాతావరణ మార్పుపై పలు దేశాలలో, గ్రీన్ పీస్ ఉద్యమం చేపట్టింది. “అనంత వైవిధ్యతతో కూడిన జీవాన్ని భూమి పోషించే శక్తిని కాపాడటం” దాని ఉద్దేశం. కాలక్రమంలో ఈ ఉద్యమం ‘సుస్థిర అభివృద్ధి’ అన్న భావనను ముందుకు తెచ్చింది. అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందని దేశాల ప్రజలందరికీ న్యాయంగా ఉండే, పర్యావరణ రీత్యా దీర్ఘకాలం మనగలిగే అభివృద్ధిని అది కోరుకుంటోంది.

ప్రశ్న 17.
భోపాల్ గ్యాస్ దుర్ఘటనకు సంబంధించిన ఉద్యమకారుల కోరికలేమిటి?
జవాబు:
ప్రభావితులైన వాళ్లకి సరైన వైద్య సౌకర్యం; ఆ కంపెనీ బహుళజాతి కంపెనీ కాబట్టి అంతర్జాతీయ ప్రామాణికాల ఆధారంగా నష్ట పరిహారం; బహుళజాతి కంపెనీ యాజమాన్యాన్ని ఈ నేరానికి బాధ్యులుగా చెయ్యటం; చివరిగా భవిష్యత్తులో ఇటువంటి దుర్ఘటనలు జరగకుండా చూడటం.

ప్రశ్న 18.
“నర్మదా బచావో” ఉద్యమంలో నిర్వాసితులైన ప్రజల కోరికలేమిటి?
జవాబు:
ఈ పథకం వల్ల నిర్వాసితులయ్యే ప్రజలు కేవలం భూములున్న వాళ్లకే కాకుండా, అక్కడ ఉంటున్న వాళ్లందరికీ న్యాయమైన నష్టపరిహారం చెల్లించాలని కోరసాగారు. అంతేకాకుండా ఆనకట్ట వల్ల ముంపునకు గురైన అడవులకు బదులుగా అటవీ పెంపకాన్ని చేపట్టాలని, భూమి కోల్పోయిన వాళ్లకి బదులుగా భూమి ఇవ్వాలని, సరైన పునరావాసం కల్పించాలని కోరసాగారు.

ప్రశ్న1 9.
భారత పర్యావరణ కేంద్రం ఎప్పుడు ఏర్పడింది? దాని ముఖ్య ఉద్దేశాలేమిటి?
జవాబు:
1980లో విజ్ఞానశాస్త్రం, పర్యావరణ కేంద్రం (సెంటర్ ఫర్ సైన్స్ & ఎన్విరాన్మెంట్) అన్నదానిని అనిల్ అగర్వాల్ స్థాపించాడు. భారతదేశంలోని అభివృద్ధి, పర్యావరణ అంశాలపై అధ్యయనం చేసి వాటి పట్ల అవగాహన కలిగేలా చెయ్యటం దీని ఉద్దేశం.

AP 10th Class Social Important Questions Chapter 21 సమకాలీన సామాజిక ఉద్యమాలు

ప్రశ్న 20.
సాయుధ దళాల ప్రత్యేక చట్టంలోని ముఖ్యాంశాలేమిటి?
జవాబు:
భారతదేశంలో విలీనం కావటానికి వ్యతిరేకించిన వాళ్లను నియంత్రించటానికి భారత ప్రభుత్వం సైన్యాన్ని పంపించింది. శాంతి, భద్రతలను నెలకొల్పటానికి చేసిన చట్టాలలో ఒకటి సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం, 1958. దేశవిద్రోహ చర్యలలో పాల్గొంటున్నారన్న అనుమానం వస్తే ఆ వ్యక్తిని అరెస్టు చెయ్యటానికి, లేదా కాల్చి చంపటానికి భద్రతా సిబ్బందికి ఈ చట్టం అధికారాన్ని ఇస్తుంది.

ప్రశ్న 21.
సాయుధ దళాల ప్రత్యేక చట్టం మీద ఉన్న ఆరోపణలేమిటి?
జవాబు:
ఈ చట్టంలోని అంశాలు దుర్వినియోగమయ్యాయని, అమాయకులైన వ్యక్తులు తరచు వేధింపులు, హింసకి గురయ్యారని, చంపబడ్డారని ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా సాయుధ దళాలు మహిళలను దోపిడీ, అత్యాచారాలకు గురిచేశాయన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. దేశ విద్రోహ చర్యలలో పాల్గొంటున్నారన్న అనుమానంతో తమ కొడుకులను, భర్తలను నిర్బంధించి, హింసిస్తారన్న భయం కూడా మహిళలుగా, తల్లులుగా వీళ్లకు ఉండేది. తల్లులు, కూతుళ్లు స్వయంగా లైంగిక అత్యాచారానికి గురవుతున్నారు. ఇలా అత్యాచారానికి గురైన కొంతమంది మహిళలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.

ప్రశ్న 22.
మీకిచ్చిన ప్రపంచపటంలో ఈ క్రింది వాటిని గుర్తించండి.

  1. అలస్కా
  2. గ్రీన్లాండ్
  3. ఇంగ్లాండ్
  4. క్యూబా
  5. చిలీ
  6. బ్రెజిల్
  7. కాంగో
  8. ఈజిప్టు
  9. దక్షిణాఫ్రికా
  10. రష్యా
  11. చైనా
  12. ఇండోనేషియా
  13. న్యూజిలాండ్

AP 10th Class Social Important Questions Chapter 21 సమకాలీన సామాజిక ఉద్యమాలు 5

ప్రశ్న 23.
ఆనకట్టలు, పరిశ్రమలు వంటి నిర్మాణాల వల్ల రైతులకు, గిరిజనులకు కలిగే ఇబ్బందులను వ్రాయండి.
జవాబు:

  1. ఖనిజాలు, అరుదైన మొక్కలు, ప్రాణులు, నీళ్ళు వంటి విలువైన వనరులను పెద్ద పెద్ద కంపెనీలు గ్రామీణ ప్రాంతాల్లో కనుక్కోవడంతో తరతరాలుగా ఉంటున్న ప్రాంతాల నుంచి గిరిజనులు, రైతులు తొలగింపబడుతున్నారు.
  2. దీంతో ప్రజలు కొత్త ప్రాంతాలలో చెల్లాచెదురై గిరిజన సంస్కృతి విధ్వంసమవుతోంది.
  3. రైతులు తమ వ్యవసాయ భూములు, జీవనాధారాలకు దూరమవుతున్నారు.
  4. ఈ ప్రక్రియల వల్ల ప్రకృతి వనరులకు తీవ్ర ముప్పు ఏర్పడటంతో పర్యావరణ ఉద్యమాలు చేపట్టారు.

ప్రశ్న 24.
“అంటరానితనం నిషేధం వల్ల సామాజిక సమానత్వం సాధించవచ్చు” దీనిపై మీ స్పందనలు తెలియజేయండి.
జవాబు:

  1. అంటరానితనం నిషేధించడం ద్వారా సమానత్వాన్ని సాధించవచ్చు.
  2. అంటరానితనం తొలగాలంటే కులవివక్షను రూపుమాపాలి.
  3. రాజ్యాంగంలోని 17వ అధికరణం ద్వారా అంటరానితనాన్ని నిషేధించి దానికి చట్టబద్ధత కలుగజేసింది.
  4. ప్రభుత్వాలు సదరు చట్టాల్ని నిజస్పూర్తితో అమలుపరచాలి.
  5. ప్రజలు అందరూ సమానమని గుర్తెరిగి అంటరానితనాన్ని రూపుమాపగలరు.

ప్రశ్న 25.
బహుళార్థక సాధక ఆనకట్టల వల్ల దేశానికి లాభమా, నష్టమా? మీ అభిప్రాయాన్ని సమర్ధించండి.
జవాబు:

  1. బహుళార్థ సాధక ఆనకట్టల వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుందని ప్రజలు నమ్నారు.
  2. అయితే వాటి నిర్మాణాలకు విపరీతమైన ధనవ్యయం కావడం, అనుకున్న మేర విద్యుత్ ఉత్పాదన, జలాల అందుబాటు, సాగునీటి సరఫరా చేయలేకపోవడం వల్ల ప్రజలు విశ్వాసాన్ని కోల్పోయారు.
  3. వాటి వలన లక్షలమంది ప్రజలు నిర్వాసితులవడం, లక్షల ఎకరాల అటవీ, సాగుభూములు పోవడం, ప్రత్యామ్నాయంగా అందించడానికి ప్రభుత్వ భూములు చాలినన్ని లేకపోవడం, నష్టపరిహారం ప్రభుత్వాలు సరిగా అందించకపోవడం, అరుదైన వృక్ష, జంతురాశులు అంతరించిపోవడం వంటి అనేక సమస్యలు వస్తున్నాయి.
  4. అయినప్పటికీ ఈ పథకాల నిర్మాణం తప్పనిసరి అవుతోంది.

AP 10th Class Social Important Questions Chapter 21 సమకాలీన సామాజిక ఉద్యమాలు

ప్రశ్న 26.
పౌరహక్కుల ఉద్యమకారుల కోరికలేమిటి?
జవాబు:
పౌరహక్కుల చట్టాన్ని చేయాల్సిందిగా కోరారు. ఉపాధి కల్పనకు కార్యక్రమాలు, పూర్తి న్యాయమైన ఉపాధి, మంచి గృహవసతి, ఓటు హక్కు శ్వేతజాతి, నల్లజాతి పిల్లలు కలిసి చదువుకునే సమ్మిళిత విద్యాసదుపాయాలు వంటివి వీళ్ల ప్రధాన కోరికలు.

10th Class Social 21th Lesson 4 Marks Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
సామాజిక ఉద్యమాల మౌలిక అంశాలేమిటి?
జవాబు:

  1. న్యాయం, ప్రజాస్వామ్యం, పౌర హక్కులను కాపాడటం
  2. సంస్కృతిని కాపాడుకోవడం
  3. సామాజిక నిర్మాణం, విలువల పరిరక్షణ,
  4. ప్రజల ఆరోగ్యం , ప్రాణ రక్షణ
  5. సాంఘిక సమానత్వ సాధన
  6. మద్యపానము, మత్తు పదార్థాల నుండి రక్షణ పొందుట
  7. పర్యావరణ పరిరక్షణ
  8. పంట పొలాలను పరిరక్షించుకోవడం

ప్రశ్న 2.
క్రింది పట్టికను పరిశీలించి, విశ్లేషిస్తూ ఒక పేరాను వ్రాయుము.
AP 10th Class Social Important Questions Chapter 21 సమకాలీన సామాజిక ఉద్యమాలు 4
జవాబు:

  1. పై పట్టిక మనకు కార్బన్ డైయాక్సెడ్ ఉద్గారాల విడుదలలో దేశాల ర్యాంకింగ్ మరియు ఎన్ని మిలియన్ మెట్రిక్ టన్నులను విడుదల చేస్తున్నాయో తెలియజేస్తుంది.
  2. మొత్తంగా గమనించినట్లయితే ఎక్కువగా తలసరి కార్బన్ డైయాక్సెడ్ ఉదారాలను విడుదల చేసేది అమెరికా.
  3. మొత్తంగా చైనా ఉన్నట్లయినా, తలసరిలో అమెరికానే ఎక్కువ ఉద్గారాలను విడుదల చేస్తుంది.
  4. ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే కార్బన్ డైయాక్సెడ్ ఉద్గారాల విడుదలలో భారతదేశం 4వ స్థానాన్ని ఆక్రమించినప్పటికీ తలసరి విడుదలలో అన్ని దేశాల కన్న తక్కువ స్థాయిలో విడుదల చేస్తుంది.
  5. దానిని బట్టి మనం గమనించే విషయం ఏమిటంటే భారతదేశం శక్తి వినియోగంలో చాలా వెనుకబడి ఉంది. అంతేకాకుండా పర్యావరణాన్ని కాలుష్యం చేయడంలో కూడా వెనుకస్థానంలో ఉన్నది.
  6. ఇలా ప్రతిదేశం కాలుష్యాన్ని పెంచుతూపోతే చివరకు మానవ జీవనం భూమి మీద అంతరించిపోతుంది. ముప్పు వాటిల్లుతుంది. మన వినాశనాన్ని మనమే కోరుకుంటున్నాం. కావున ప్రతిదేశం వారు విడుదల చేసే కర్బన సమ్మేళనాల శాతాన్ని తగ్గించుకొని ప్రత్యామ్నాయ మరియు భద్రతాపరమైన చర్యలు తీసుకోవాలి.

ప్రశ్న 3.
సామాజిక ఉద్యమాల మౌలిక అంశాల విశిష్టతను ప్రశంసిస్తూ ఒక వ్యాసం రాయండి.
జవాబు:
సామాజిక ఉద్యమాలలో సాధారణ ప్రజలు ప్రత్యక్షంగా పాల్గొనటం వలన అనుకూలత ఏర్పడి ఉద్యమం బలపడుతుంది. ఈ ఉద్యమాలు న్యాయం, ప్రజాస్వామ్యం పౌర హక్కులు అనే అంశాలతో సమ్మిళతమై ఉంటాయి. పర్యావరణం, మానవ హక్కులు అనే సరిహద్దులను చెరిపేస్తే ప్రజలకు నష్టపరిహారం, పునరావాసం కలిగించే దిశగా ఉద్యమాలు ఉంటాయి. — ఈ ఉద్యమాలు అహింసాయుత పద్ధతులలో కొనసాగుతూ ప్రజల స్వేచ్ఛపూరిత భావనలకు అవకాశం కల్పిస్తుంది. ఈ ఉద్యమాలు సాధారణంగా రాజకీయ పార్టీలకు దూరంగా ఉండి ఒక ఆశయం కోసం పనిచేస్తాయి. కొన్ని సందర్భాలలో తమపై రుద్దిన మార్పులను రాజకీయ వ్యవస్థలు సరిచేయలేనప్పుడు వాళ్ళ ఆశయ సాధనం కోసం ఉద్యమిస్తాయి. ఈ ఉద్యమాలు ఏ ఒక్కరి ప్రయోజనం కోసం కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరి ఆశయ సాధన కోసం చేయడం జరుగుతుంది.
ఉదా :
1) గ్రీన్‌పీస్ ఉద్యమం,
2) పౌర హక్కులు,
3) మైరా పైబీ మొ||వి.

ప్రశ్న 4.
మైరా పైబీ ఉద్యమం గూర్చి వివరించండి.
జవాబు:
మైటీ భాషలో మైరాపైబీ అంటే కాగడాలు పట్టుకున్న వాళ్ళు అని అర్థం.

1970ల చివరి కాలంలో త్రాగి బజారుల్లో గొడవ చెయ్యకుండా నివారించడానికి మైరాపైబీ ఉద్యమం మొదలైంది.

సైనిక చర్యల వలన మానవహక్కులు దెబ్బ తింటున్నాయనే భావనతో ఈ ఉద్యమం అనుసంధానం అయినది. రాత్రిళ్ళు బజారులలో మైరాపైబీ పహరా కాయటం మొదలు పెట్టింది. గ్రామాలు, పట్టణాలలోని వార్డుల్లోని మహిళలు రోజూ ఈ పహరాలో పాల్గొనేవారు. అయితే వాళ్ళ చేతులలో ఆయుధాలు కాకుండా కర్రకు గుడ్డ చుట్టి కిరోసితో తడిపి వెలిగించిన కాగడాలు ఉండేవి. ప్రజాశాంతికి భంగం, ముప్పు వాటిల్లకుండా మహిళా బృందాలు ప్రతి రాత్రి, ప్రతి వారులో, ప్రతి కూడలిలో కూర్చుంటాయి. ఉద్రిక్తతలు తీవ్రంగా ఉన్న ప్రాంతంలో పెద్ద సంఖ్యలో మహిళలు కాపలా కాసేవారు. సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని రద్దు చెయ్యాలని కూడా మైరా పైబీ ఉద్యమం కోరుతుంది. వీరికి సహకారంగా ఇరోం షర్మిల అనే మహిళ 14 సం|| రాల నుండి గృహనిర్బంధంలో నిరాహారదీక్ష చేస్తుంది. ఈ ఉద్యమం మణిపూర్ రాష్ట్రానికి సంబంధించింది.

AP 10th Class Social Important Questions Chapter 21 సమకాలీన సామాజిక ఉద్యమాలు

ప్రశ్న 5.
అట్టడుగు వర్గాలకు చెందిన ప్రజల జీవితాలను ప్రపంచీకరణ, నయా ఉదారవాద విధానాలు ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాయో వివరించండి.
జవాబు:

  1. గిరిజనులు, పేద రైతులు, భూమి లేని కార్మికులు, మహిళలు, అవ్యవస్థీకృత రంగంలో పనిచేస్తున్న వాళ్ళు అందరి కంటే ఎక్కువగా నష్టపోయారు.
  2. వీళ్ళకు మంచి చదువు, నైపుణ్యాలు వంటివి అందుబాటులో లేవు.
  3. అందువలన మంచి జీతాలు వచ్చే ఉద్యోగాలు కానీ, చట్టబద్ధమైన, రాజ్యాంగబద్ధమైన పరిహారాలు కానీ వీళ్ళకు అందుబాటులో లేవు.
  4. గనుల త్రవ్వకం, ఆనకట్టల పథకాల వంటి వాటివల్ల అనేకమంది గిరిజనులు, రైతులు నిర్వాసితులు అవుతున్నారు.

ప్రశ్న 6.
ప్రాజెక్టుల నిర్మాణం వల్ల కలిగే ప్రయోజనాలను, ప్రజలు ఎదుర్కొనే సమస్వలను వివరించండి.
జవాబు:
ప్రాజెక్టుల నిర్మాణం వల్ల కలిగే ప్రయోజనాలు, సమస్యలు:
ప్రయోజనాలు :

  1. పెద్ద మొత్తంలో నీటి నిల్వ
  2. సాగునీరు
  3. విద్యుదుత్పత్తి
  4. వరదల నియంత్రణ
  5. కరవు నియంత్రణ

సమస్యలు :

  1. సారవంతమైన భూములు కోల్పోవడం
  2. అడవులు ముంపునకు గురికావడం
  3. జంతుజాలం నశించడం
  4. ప్రజలు నిర్వాసితులు కావడం
  5. ఖర్చు అధికం

ప్రశ్న 7.
బహుళార్థ సాధక పథకాల నిర్మాణం వల్ల కలిగే లాభనష్టాలను బేరీజు వేయండి.
జవాబు:
లాభాలు :

  1. పెద్దమొత్తంలో నీటిని నిల్వచేయడం.
  2. వ్యవసాయాభివృద్ధి.
  3. పెద్దమొత్తంలో విద్యుదుత్పత్తి చేయడం.
  4. వరదలు, కరువులను నియంత్రించడం.
  5. ఈ అసమానతలు సాధ్యమైనంత తొందరగా పరిష్కరింపబడాలి.

నష్టాలు:

  1. స్థానిక ప్రజలు నిర్వాసితులవుతారు.
  2. నిర్వాసితులందరికీ సరైన పునరావాసం కల్పించడం కష్టతరం, నిజానికి అసాధ్యం.
  3. జీవవైవిధ్యం దెబ్బతింటుంది.
  4. ఆశించిన స్థాయిలో నీటి నిల్వ, విద్యుదుత్పత్తి జరగలేదు.

ప్రశ్న 8.
ఈ క్రింది పేరాను చదివి, మీ అభిప్రాయం రాయండి.

1990ల నుంచి ప్రపంచీకరణ’, ‘నయా ఉదారవాదం’ అన్న పేర్లతో సంభవిస్తున్న ప్రపంచ వ్యాప్త ఆర్థిక, రాజకీయ మార్పుల వల్ల ఎటువంటి సదుపాయాలు లేని ప్రజల జీవితాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. గిరిజన ప్రజలు, పేద రైతులు, భూమి లేని కార్మికులు, మహిళలు, అవ్యవస్థీకృత రంగంలో పనిచేస్తున్న పట్టణ పేదలు, పారిశ్రామిక కార్మికులు అందరి కంటే తీవ్రంగా ప్రభావితమయ్యారు. ఇటువంటి ప్రజలలో ఎక్కువ మందికి పాఠశాల చదువు, సరైన పోషకాహారం, వైద్యం అందుబాటులో లేదు.
జవాబు:
ఈ పేరాగ్రాఫ్ ప్రపంచీకరణ యొక్క పరిణామాలను గురించి వివరిస్తోంది. అది ప్రధానంగా పేద ప్రజలను, గిరిజనులను ప్రభావితం చేస్తోంది. మరియు అవ్యవస్థీకృత రంగంలో పనిచేసేవారిపై కూడా ప్రపంచీకరణ ప్రభావం ఉంది. నిరక్షరాస్యులు మరియు పోషకాహార లోపంతో బాధపడేవారు తీవ్రంగా ప్రభావితమవుతున్నారు.

సాంకేతిక ప్రగతి కారణంగా అనేక రకాల యంత్రాలు కనుగొనబడ్డాయి. అభివృద్ధి చెందిన సాంకేతికత అన్ని రంగాలను ప్రభావితం చేస్తోంది. వ్యవసాయంలో కంబైన్డ్ హార్వెస్టర్లు, నూర్పిడి యంత్రాలు (ధైషర్లు) ఉపయోగిస్తున్నారు. టాకరు మరియు టాన్‌ ప్లాంటేషన్ యంత్రాలను వినియోగిస్తున్నారు. కనుక కూలీలు తమ జీవనోపాధిని కోల్పోతున్నారు. రైల్వేలు, ఆనకట్టల వల్ల గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారు. రైల్వేల విస్తరణ పనులు చేపట్టినప్పుడు పట్టాల క్రింద పరచడానికి గాను అనేక చెట్లు నరకబడతాయి. కావున అటవీ ప్రాంత నివాసితులు తరలింపు సమస్యను ఎదుర్కొంటారు. నీటి పారుదల సౌకర్యాలు పెంచడానికి ప్రభుత్వం ఆనకట్టల నిర్మాణానికి ఉద్దేశించినపుడు వాటిని అడవుల సమీపంలోనే నిర్మించడం తప్పనిసరి. ఈ పరిస్థితి గిరిజనుల తరలింపు సమస్యకు కారణమవుతుంది. గిరిజనులలో చాలామంది నిరక్షరాస్యులు. వారు తేనె, గింజలు, విత్తనాలు సేకరించడం వంటి తమ జీవనోపాధులను కోల్పోతారు. పట్టణాలు, నగరాల, పొలిమేరల సమీపంలో పారిశ్రామిక వాడలు కూడా పెరిగాయి. ఇది కాలుష్యానికి దారితీస్తుంది. కంప్యూటర్లు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజి, టెలికమ్యూనికేషన్, రవాణా సౌకర్యాలు పెరిగాయి మరియు పేద ప్రజలు, గిరిజనులపై దీని ప్రభావం పడుతోంది.

ప్రభుత్వానికి నా సూచన ఏమిటంటే ప్రజల సంక్షేమంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. మరియు వారి పునరావాసం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వారికి సకాలంలో తగిన నష్టపరిహారం చెల్లించాలి. అధికారులు కూడా సంబంధిత చట్టాలను సరిగా అమలుచేయాలి.

AP 10th Class Social Important Questions Chapter 21 సమకాలీన సామాజిక ఉద్యమాలు

ప్రశ్న 9.
“వియత్నాం యుద్ధంలో అమెరికా చాలా క్రూరంగా ప్రవర్తించింది.” వ్యాఖ్యానించండి.
జవాబు:
వియత్నాం యుద్ధంలో అమెరికా చాలా క్రూరంగా ప్రవర్తించింది :

  1. వియత్నాంపై యుద్ధంలో అమెరికా చాలా క్రూరంగా ప్రవర్తించింది.
  2. ఏజెంట్ ఆరంజ్ వంటి రసాయన ఆయుధాలను ఉపయోగించడం ఈ క్రూరత్వానికి సరియైన ఉదాహరణ.
  3. ఏజెంట్ ఆరంజ్ అనేది మొక్కలను చంపే ఒక విషరసాయనం.
  4. దాదాపు 11 మిలియన్ గాలన్ల ఈ రసాయనాన్ని అమెరికా విమానాలు వియత్నాంపై చల్లాయి.
  5. అడవులను, పొలాలను నాశనం చేయడం ద్వారా వియత్నామీయులను తేలికగా చంపవచ్చని భావించారు.
  6. ఈనాటికి కూడా వియత్నాంలో ప్రజలపై ఈ రసాయన ప్రభావం ఉంది.
  7. పిల్లలలో మెదడు దెబ్బతినడానికి, క్యాన్సర్ వ్యాధికి ఇది కారణమవుతున్నది.
  8. రెండవ ప్రపంచయుద్ధంలో వాడిన మొత్తం బాంబుల బరువు కంటే వియత్నాం యుద్ధంలో అమెరికా వాడిన బాంబుల బరువే ఎక్కువ.

ప్రశ్న 10.
ప్రస్తుత ప్రపంచంలో గ్రీన్ పీస్ వంటి పర్యావరణ ఉద్యమాల ప్రాముఖ్యతను వివరించండి.
జవాబు:

  1. అలాస్కా దగ్గర సముద్ర గర్భంలో అమెరికా 1971లో చేపట్టిన అణు పరీక్షలకు వ్యతిరేకంగా ఈ ఉద్యమం మొదలయ్యింది.
  2. నిరసన తెలియచెయ్యటానికి స్వచ్ఛంద కార్యకర్తలు చిన్న పడవలో ప్రయోగ ప్రదేశానికి బయలుదేరారు. ఈ పడవ పేరు ‘గ్రీన్‌పీస్’, చివరికి ఇది ఆ ఉద్యమం పేరుగా మారింది.
  3. ప్రస్తుతం ఈ ఉద్యమం నలభై దేశాలలో విస్తరించి ఉంది. దీని ప్రధాన కార్యాలయం ఆమ్ స్టడాం (హాలండ్)లో ఉంది. ఇది ముఖ్యమైన అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థలలో ఒకటి.
  4. సూర్యుని హానికర కిరణాలను అడ్డుకునే వాతావరణంలోని ఓజోను పొర కాలుష్యం వల్ల దెబ్బ తింటోందని గత కొద్ది దశాబ్దాలలో శాస్త్రజ్ఞులు గుర్తించారు. కాలుష్యం వల్ల భూమి సగటు ఉష్ణోగ్రతలు క్రమేపీ పెరుగుతున్నాయి.
  5. దీని కారణంగా ధ్రువ ప్రాంతాల వద్ద ఉండే మంచు టోపీలు (పెద్ద మొత్తంలో గడ్డకట్టిన నీళ్లు) కరుగుతున్నాయి. ఈ మంచు కరిగి సముద్రాలలో చేరటం వల్ల మహా సముద్రాలు, సముద్రాల నీటిమట్టం పెరిగి ప్రపంచమంతటా తీరప్రాంతాలు ముంపునకు గురవుతాయి.
  6. సముద్ర తీరం వెంట బంగ్లాదేశ్, శ్రీలంక, మారిషస్, భారతదేశం, ఇండోనేసియా వంటి దేశాలలో అధిక సంఖ్యలో ఉంటున్న ప్రజలు వరదలు, ముంపు వంటి తీవ్ర సమస్యలతో ప్రభావితమౌతారు.
  7. ప్రపంచం వేడెక్కటం వల్ల, వర్షపాతంలో తేడాల వల్ల (అకాల వర్షాలు, అధిక వర్షాలు, కరవులు), పంటలు నష్టపోవటం వల్ల తీర ప్రాంతానికి దూరంగా ఉన్న ప్రజలు కూడా ప్రభావితమౌతారు.
  8. ఇంకో మాటల్లో చెప్పాలంటే ప్రపంచవ్యాప్త వాతావరణ మార్పు వల్ల వ్యవసాయాధారిత ప్రజలు, దేశాలు ప్రధానంగా ప్రభావితమౌతాయి.
  9. వాతావరణ మార్పుపై పలు దేశాలలో గ్రీన్ పీస్ ఉద్యమం చేపట్టింది. “అనంత వైవిధ్యతతో కూడిన జీవాన్ని భూమి పోషించే శక్తిని కాపాడటం” దాని ఉద్దేశం. కాలక్రమంలో ఈ ఉద్యమం ‘సుస్థిర అభివృద్ధి’ అన్న భావనను ముందుకు తెచ్చింది.
  10. మానవుని కారణంగా పెరిగిపోతున్న భూగోళం వేడక్కడంను నివారించాలంటే ఇలాంటి ఉద్యమాలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ప్రశ్న 11.
యుఎస్ఎస్ఆర్ లో మానవ హక్కుల ఉద్యమం ఆవిర్భవించడానికి కారణాలేమిటి?
జవాబు:
ఆ రోజుల్లో యుఎస్ఎస్ఆర్ లోనూ, దాని ప్రభావంలో ఉన్న తూర్పు యూరపు దేశాలలోనూ స్వేచ్ఛాపూరిత బహుళ పార్టీ ఎన్నికలను, సెన్సారులేని స్వేచ్ఛాపూరిత పత్రికలు, ప్రసార సాధనాలను, చివరికి సాధారణ ప్రజల స్వేచ్ఛాపూరిత భావ ప్రకటన, కదలికలు వంటి వాటిని అనుమతించలేదు. ఈ ప్రభుత్వాలు తమను కూలదోసే కుట్రల గురించి నిత్యమూ భయపడుతూ ఉండి ప్రజల అన్ని కార్యకలాపాలపై నియంత్రణ, నిఘా ఉంచేవి. ఇటువంటి నియంత్రణల వల్ల విసిగిపోయిన ప్రజలు భావప్రకటన, కదలికలకు స్వేచ్ఛ, స్వేచ్ఛాపూరిత పత్రికలు వంటి మానవ హక్కుల కోసం యుఎస్ఎస్ఆర్ లోని పలు ప్రాంతాల్లోనూ, తూర్పు యూరపులోనూ పలు ఉద్యమాలు చేపట్టారు.

ప్రశ్న 12.
వియత్నాం యుద్ధం మూలంగా అమెరికాకు వ్యతిరేకంగా వియత్నాం ప్రజలు చేపట్టిన ఉద్యమం ప్రపంచ వ్యాప్తంగా ఏ విధంగా స్ఫూర్తిని ఇచ్చింది?
జవాబు:
అమెరికాకు ఏ మాత్రం ప్రమాదకరం కాని అమాయకమైన ప్రజలపై బాంబులు వెయ్యడం ఎంతవరకు న్యాయం అని 1970ల ఆరంభంలో వియత్నాం నుంచి తిరిగి వస్తున్న అమెరికా సైనికులలో సందేహం పెరగసాగింది. అదే సమయంలో ఎక్కడో ఉన్న వియత్నాంలో యుద్ధానికి తమ పిల్లలని పంపించటానికి ఇష్టపడని అమెరికన్ల సంఖ్య కూడా పెరుగుతూ వచ్చింది. దాంతో వియత్నాం యుద్ధానికి వ్యతిరేకంగా అమెరికా అంతటా ప్రజా నిరసనలు ఉప్పొంగాయి. దీని వల్ల అంతిమంగా అమెరికా 1975లో యుద్ధాన్ని ఆపేసి వియత్నాం నుంచి బయటకు వచ్చేసింది. అమెరికాకు వ్యతిరేకంగా వియత్నాం ప్రజలు చేపట్టిన ఉద్యమం విజయం కావటం ప్రపంచ వ్యాప్తంగా శాంతి ఉద్యమాలకు స్ఫూర్తిని ఇచ్చింది.

ప్రశ్న 13.
భూగోళం వేడెక్కడం మూలంగా జరిగే అనర్థాలేమిటి?
జవాబు:
సూర్యుని హానికర కిరణాలను అడ్డుకునే వాతావరణంలోని ఓజోను పొర కాలుష్యం వల్ల దెబ్బతింటోందని గత కొద్ది దశాబ్దాలలో శాస్త్రజ్ఞులు గుర్తించారు. కాలుష్యం వల్ల భూమి సగటు ఉష్ణోగ్రతలు క్రమేపీ పెరుగుతున్నాయి. దీని కారణంగా ధ్రువ ప్రాంతాల వద్ద ఉండే మంచు టోపీలు (పెద్ద మొత్తంలో గడ్డకట్టిన నీళ్లు) కరుగుతున్నాయి. ఈ మంచు కరిగి సముద్రాలలో చేరటం వల్ల మహా సముద్రాలు, సముద్రాల నీటిమట్టం పెరిగి ప్రపంచమంతటా తీరప్రాంతాలు ముంపునకు గురవుతాయి. సముద్ర తీరం వెంట బంగ్లాదేశ్, శ్రీలంక, మారిషస్, భారతదేశం, ఇండోనేషియా వంటి దేశాలలో అధిక సంఖ్యలో ఉంటున్న ప్రజలు వఠదలు, ముంపు వంటి తీవ్ర సమస్యలతో ప్రభావితమవుతారు. ప్రపంచం వేడెక్కటం వల్ల, వర్షపాతంలో తేడాల వల్ల (అకాల వర్షాలు, అధిక వర్షాలు, కరవులు), పంటలు నష్టపోవటం వల్ల తీర ప్రాంతానికి దూరంగా ఉన్న ప్రజలు కూడా ప్రభావితమవుతారు. ఇంకా చెప్పాలంటే ప్రపంచవ్యాప్త వాతావరణ మార్పు వల్ల వ్యవసాయాధారిత ప్రజలు, దేశాలు ప్రధానంగా ప్రభావితమవుతాయి.

ప్రశ్న 14.
అభివృద్ధి స్వభావం గురించి ఆలోచింపచేయటంలో “నర్మదా బచావో” ఉద్యమం ఏ విధంగా విజయం సాధించింది?
జవాబు:
సర్దార్ సరోవర్ ఆనకట్ట నిర్మాణాన్ని ఆపటంలో నర్మదా బచావో ఆందోళన విఫలమైనప్పటికీ అందరూ అభివృద్ధి స్వభావం గురించి ఆలోచించేలా చెయ్యటంలో అది విజయం సాధించింది – అది పేదవాళ్ల ప్రయోజనాల కోసమా, లేక ధనికులు, శక్తిమంతులకోసమా అని .ఆలోచింపచేసింది. ప్రకృతిలో పెద్ద ఎత్తున జోక్యం చేసుకుంటూ కట్టే పెద్ద పెద్ద కట్టడాల ప్రయోజనాల గురించి కూడా అందరూ ఆలోచించేలా చేసింది. ఇటువంటి అభివృద్ధి కారణంగా నిర్వాసితులైన’ ప్రజలకు ” తగినంత, గౌరవప్రదమైన నష్టపరిహారం చెల్లించే దిశలో ప్రభుత్వం ఆలోచించేలా చేసింది.

AP 10th Class Social Important Questions Chapter 21 సమకాలీన సామాజిక ఉద్యమాలు

ప్రశ్న 15.
మైరా పైబీ ఉద్యమంలోని మహిళల విధులేమిటి?
జవాబు:
రాత్రుళ్లు బజారులలో మైరా పైబీ పహరా తిరగటం మొదలు పెట్టింది. గ్రామాలు, పట్టణాలలోని వార్డులోని మహిళలు రోజూ ఈ పహారాలో పాల్గొనేవాళ్లు. అయితే వీళ్ల చేతుల్లో ఎటువంటి ఆయుధాలు కాకుండా కర్రకు గుడ్డచుట్టి, కిరోసితో తడిపి వెలిగించిన కాగడాలు మాత్రమే ఉండేవి. ప్రజాశాంతికి భంగం, ముప్పు కలుగకుండా మహిళా బృందాలు ప్రతి రాత్రి, ప్రతి వార్డులో, ప్రతి కూడలిలో కూర్చుంటాయి. కొంత శాంతియుత సమయాల్లో కొంతమంది మహిళలే వంతుల ప్రకారం పహరా ఉంటారు. కానీ ఉద్రిక్తతలు తీవ్రంగా ఉన్న తరుణంలో పెద్ద సంఖ్యలో మహిళలు కాపలా ఉంటారు.

AP 10th Class Social Important Questions Chapter 19 రాజకీయ ధోరణుల ఆవిర్భావం : 1977-2000

These AP 10th Class Social Studies Important Questions 19th Lesson రాజకీయ ధోరణుల ఆవిర్భావం : 1977-2000 will help students prepare well for the exams.

AP Board 10th Class Social 19th Lesson Important Questions and Answers రాజకీయ ధోరణుల ఆవిర్భావం : 1977-2000

10th Class Social 19th Lesson ½ Mark Important Questions and Answers in Telugu Medium

1. 1977లో జరిగిన ఎన్నికలలో విజయం సాధించి జనతాపార్టీ తరపున ప్రధానమంత్రి అయిన వారు ఎవరు?
జవాబు:
మొరార్జీ దేశాయ్.

2. మొదటి కాంగ్రెసేతర ప్రధాని ఎవరు?
జవాబు:
మొరార్జీ దేశాయ్.

3. భారతదేశంలో అత్యవసర పరిస్థితి నిలుపుదల చేసిన సంవత్సరం ఏది?
జవాబు:
1977.

4. ఆపరేషన్ బ్లూస్టార్ చేపట్టినది ఎవరు?
జవాబు:
ఇందిరాగాంధీ.

5. L.K. అద్వానీచే రామజన్మభూమి రథయాత్ర ప్రారంభించ బడిన సంవత్సరం?
జవాబు:
1990.

AP 10th Class Social Important Questions Chapter 19 రాజకీయ ధోరణుల ఆవిర్భావం : 1977-2000

6. భారత రాష్ట్రపతి పదవికి ఏకగ్రీవంగా ఎన్నికై భారత ఆరవ రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసినది ఎవరు?
జవాబు:
నీలం సంజీవరెడ్డి.

7. పంజాబ్ కి పరిమితమై నిక్కులకోసం ప్రత్యేకంగా పనిచేస్తున్న పార్టీ ఏది?
జవాబు:
శిరోమణి అకాలీదళ్ (SAD)

8. 1970లలో అసోంలో వచ్చిన సామాజిక ఉద్యమానికి నాయకత్వం వహించిన వారు?
జవాబు:
అఖిల అసోం విద్యార్థి సంఘం.

9. పంజాబులో తీవ్రవాద సిక్కుల బృందానికి నాయకత్వం వహించింది ఎవరు?
జవాబు:
బింద్రేన్ వాలా.

10. శ్రీలంకతో శాంతి ప్రక్రియలకు శ్రీకారం చుట్టిన మనదేశ ప్రధాని ఎవరు?
జవాబు:
రాజీవ్ గాంధీ.

11. 1989లోని మొదటి సంకీర్ణ ప్రభుత్వం తరపున ప్రధాన మంత్రి పదవిని చేపట్టినదెవరు?
(లేదా)
మొదటి సంకీర్ణ ప్రభుత్వం ఎవరి నేతృత్వంలో ఏర్పడింది?
జవాబు:
వి.పి. సింగ్

12. 1991 మే 21న రాజీవ్ గాంధీని పెరంబూర్‌లో హత్య గావించిన తీవ్రవాద సంస్థ ఏది?
జవాబు:
LTTE

13. ‘ఆపరేషన్ బర్గా’ను చేపట్టిన రాష్ట్రం ఏది?
జవాబు:
పశ్చిమ బెంగాల్.

14. రాష్ట్రాలలో రాష్ట్రపతి పాలన ప్రవేశ పెట్టుటకు దోహదం చేసే రాజ్యాంగ అధికరణ ఏది?
జవాబు:
356వ అధికరణ.

15. మండల్ కమీషన్ సిఫారసులను అమలు చేసిన ప్రభుత్వం ఏది?
జవాబు:
V.P. సింగ్ ప్రభుత్వం

AP 10th Class Social Important Questions Chapter 19 రాజకీయ ధోరణుల ఆవిర్భావం : 1977-2000

16. తెలుగు దేశం పార్టీ ఏర్పాటులో ప్రధాన సిద్ధాంతం ఏది?
జవాబు:
ఆంధ్రుల ఆత్మగౌరవం.

17. స్థానిక సంస్థలలో స్త్రీలకు ఎన్నోవంతు సీట్లను కేటాయించారు?
జవాబు:
1/3 వంతు.

18. రెండూ లేదా అంతకంటే ఎక్కువ రాజకీయ పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడాన్ని ఏమంటారు?
జవాబు:
సంకీర్ణ ప్రభుత్వం

19. ‘బర్మా’ ప్రస్తుత నామం ఏమిటి?
జవాబు:
మయన్మార్.

20. చండిఘర్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా కాక తమ రాష్ట్రానికి చెందాలని కోరిన రాష్ట్రం ఏది?
జవాబు:
పంజాబు.

21. 1986 ఏప్రిల్ లో ఎక్కడ జరిగిన సమావేశంలో ఖలిస్తాను స్వతంత్ర దేశంగా ప్రకటించారు?
జవాబు:
అకల్ తఖ్త్

22. 1977 సాధారణ ఎన్నికల తర్వాత పశ్చిమ బెంగాల్ లో అధికారంలోకి వచ్చిన పార్టీ ఏది?
జవాబు:
CPI(M)

23. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా గ్రామస్థాయిలో స్థానిక స్వపరిపాలన పెట్టబడింది?
జవాబు:
73వ

24. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా పట్టణ స్థాయిలో స్థానిక స్వపరిపాలన పెట్టబడింది?
జవాబు:
74 వ.

AP 10th Class Social Important Questions Chapter 19 రాజకీయ ధోరణుల ఆవిర్భావం : 1977-2000

25. స్థానిక స్వపరిపాలనకు రాజ్యాంగ గుర్తింపునిస్తూ 1992 సంవత్సరంలో రాజ్యాంగ సవరణ చేసిన ప్రభుత్వం ఏది?
జవాబు:
P.V. నరసింహారావు ప్రభుత్వం

26. ‘గోల్డెన్ టెంపుల్’ ఏ మతస్థులకు పవిత్ర స్థలం?
జవాబు:
సిక్కులకు

27. AGPని విస్తరింపుము.
జవాబు:
అస్సోం గణ పరిషత్.

28. SADని విస్తరింపుము.
జవాబు:
శిరోమణి అకాలీ దళ.

29. AASUని విస్తరింపుము.
జవాబు:
అఖిల అసోం విద్యార్థి సంఘం.

30. DMK ని విస్తరింపుము.
జవాబు:
ద్రవిడ మున్నేట్ర ఖజగం.

31. BLDని విస్తరింపుము.
జవాబు:
భారతీయ లోక్ దళ్

32. NDA ని విస్తరింపుము.
జవాబు:
నేషనల్ డెమొక్రాటిక్ అలయన్స్.

33. UPA ని విస్తరింపుము.
జవాబు:
యునైటెడ్ ప్రోగ్రెస్సివ్ అలయన్స్

34. ఇందిరా గాంధీని ఏ సంవత్సరంలో హత్య గావించారు?
జవాబు:
1984లో

AP 10th Class Social Important Questions Chapter 19 రాజకీయ ధోరణుల ఆవిర్భావం : 1977-2000

35. సిక్కులు కోరిన ప్రత్యేక దేశంను ఏమంటారు?
జవాబు:
ఖలిస్తాన్.

36. వెనకబడిన తరగతులకు ఎంతశాతం రిజర్వేషన్లు కల్పించాలని మండల్ కమీషన్ సిఫారసు చేసింది?
జవాబు:
27%

37. ‘బోఫోర్సు’ కుంభకోణం ఆరోపణలను ఎదుర్కొన్న ప్రధాని ఎవరు?
జవాబు:
రాజీవ్ గాంధీ.

38. NDAకు నాయకత్వం వహిస్తున్న పార్టీ ఏది?
జవాబు:
బి.జె.పి. (BJP)

39. UPA కు నాయకత్వం వహిస్తున్న పార్టీ ఏది?
జవాబు:
కాంగ్రెస్ పార్టీ.

40. బెంగాలీ భాషలో ‘బర్గాదార్లు’ అనగా?
జవాబు:
కౌలుదార్లు.

41. ఆరవ సార్వత్రిక ఎన్నికలు ఎప్పుడు జరిగాయి?
జవాబు:
1977 మార్చిలో

42. ఆరవ లోకసభకు స్పీకర్‌గా ఎవరు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు?
జవాబు:
నీలం సంజీవరెడ్డి.

AP 10th Class Social Important Questions Chapter 19 రాజకీయ ధోరణుల ఆవిర్భావం : 1977-2000

49. ఇంతవరకు లోకసభ స్పీకర్ గా అతి తక్కువ కాలం పనిచేసింది ఎవరు?
జవాబు:
నీలం సంజీవరెడ్డి.

44. మొట్ట మొదటిసారిగా ఏకగ్రీవంగా ఎన్నికైన భారత రాష్ట్రపతి ఎవరు?
జవాబు:
నీలం సంజీవరెడ్డి.

45. నీలం సంజీవరెడ్డి రాష్ట్రపతిగా ఉన్నకాలంలో మొరార్జీ దేశాయ్, వి.పి.సింగ్, చరణ్ సింగ్, ఇందిరాగాంధీలలో ఎవరు ప్రధాన మంత్రిగా పనిచేయలేదు?
జవాబు:
వి.పి.సింగ్.

46. 1977లో తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో అధికారంలోకి వచ్చిన పార్టీ ఏది?
జవాబు:
DMK

47. BLD ప్రధానంగా ఏ రాష్ట్రంలో ఉండేది?
జవాబు:
ఉత్తర ప్రదేశ్.

AP 10th Class Social Important Questions Chapter 19 రాజకీయ ధోరణుల ఆవిర్భావం : 1977-2000

48. SAD ఏ రాష్ట్రానికి పరిమితమైన పార్టీ?
జవాబు:
పంజాబు.

49. మొరార్జీ దేశాయ్ తర్వాత ప్రధాన మంత్రి ఎవరు?
జవాబు:
చరణ్ సింగ్.

50. ఏదైన ఒక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలంటే (356 ప్రకారం) ఎవరి సిఫారసు అవసరం?
జవాబు:
ఆ రాష్ట్ర గవర్నర్.

51. కేంద్ర ప్రభుత్వం 356వ అధికరణాన్ని ప్రయోగించడానికి ఖచ్చితమైన నియమాలను ఏ తీర్పులో పేర్కొన్నారు?
జవాబు:
1994 సుప్రీంకోర్టు తీర్పులో

52. TDP ని ఎవరు స్థాపించారు?
జవాబు:
N.T. రామారావు

53. TDP ని ఎప్పుడు స్థాపించారు?
జవాబు:
1982లో

54. N.T. రామారావు ప్రభుత్వాన్ని భర్తరఫ్ చేసిన గవర్నర్ ఎవరు?
జవాబు:
రామ్ లాల్.

55. కేంద్ర ప్రభుత్వం, AASU మధ్య ఒప్పందం ఏ సంవత్సరంలో జరిగింది?
జవాబు:
1984

56. AASU కు అనుబంధంగా ఏర్పడిన పార్టీ ఏది?
జవాబు:
AGP.

57. పంజాబు రాష్ట్రం ఎప్పుడు ఏర్పడింది?
జవాబు:
1 నవంబరు, 1966 న

AP 10th Class Social Important Questions Chapter 19 రాజకీయ ధోరణుల ఆవిర్భావం : 1977-2000

58. భాక్రానంగల్ ఆనకట్ట ఏ నదిపై, ఏ రాష్ట్రంలో నిర్మించారు?
జవాబు:
సట్లెజ్ నదిపై, హిమాచల్ ప్రదేశ్ లో.

59. గోల్డెన్ టెంపుల్ ని ఆక్రమించుకున్న సిక్కు తీవ్రవాదులను ఖాళీ చేయించడానికి చేసిన ఆపరేషన్ పేరేమిటి?
జవాబు:
ఆపరేషన్ బ్లూస్టార్ (1984).

60. ఇందిరాగాంధీ తర్వాత ప్రధాని అయినది ఎవరు?
జవాబు:
రాజీవ్ గాంధీ.

61. మిజో నేషనల్ ఫ్రంట్ కి, కేంద్ర ప్రభుత్వంకి మధ్య ఎప్పుడు ఒప్పందం కుదిరింది?
జవాబు:
1986 జూన్ 30 న.

62. “పేదలకోసం ఖర్చు పెడుతున్న ప్రతిరూపాయిలో 15 పైసలు కూడా వారికి చేరటం లేదని” అన్న ప్రధాని ఎవరు?
జవాబు:
రాజీవ్ గాంధీ.

63. 1984లో జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్ల విషయంలో ఏ ప్రధానమంత్రి క్షమాపణలు చెప్పారు? ఎప్పుడు?
జవాబు:
మన్మోహన్ సింగ్, రాజ్యసభలో 2005 ఆగస్టు 11న.

64. బాబ్రీ మసీదు ఎక్కడ ఉంది?
జవాబు:
అయోధ్యలో (ఉత్తరప్రదేశ్)

65. బోఫోర్స్ శతఘ్నులను ఏ దేశం నుంచి కొన్నారు?
జవాబు:
స్వీడన్.

66. భారత రాజకీయ చరిత్రలో ఏర్పడిన మొట్టమొదటి సంకీర్ణ ప్రభుత్వమేది?
జవాబు:
నేషనల్ ఫ్రంట్.

67. భారత కమ్యూనిస్ట్ పార్టీ, భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్, రివల్యూషనరీ సోషలిస్టు పార్టీ, భారతీయ జనతాపార్టీలలో భిన్నమైనది ఏది?
జవాబు:
భారతీయ జనతా పార్టీ.

AP 10th Class Social Important Questions Chapter 19 రాజకీయ ధోరణుల ఆవిర్భావం : 1977-2000

68. 1977లో పశ్చిమ బెంగాల్ రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో గెలిచి, వామపక్ష ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన ముఖ్యమంత్రి ఎవరు?
జవాబు:
జ్యోతిబసు.

69. ఆపరేషన్ బర్గాను పశ్చిమబెంగాల్ ఎప్పుడు చేపట్టింది?
జవాబు:
1978లో

70. BSP ని విస్తరించండి.
జవాబు:
బహుజన్ సమాజ్ పార్టీ,

71. రథయాత్ర చేస్తున్న L.K. అద్వానీని ఏ రాష్ట్రంలో అరెస్ట్ చేశారు?
జవాబు:
బీహార్‌లో

72. క్రింది వానిలో సరికాని జతను గుర్తించండి?
ఎ) రామజన్మభూమి రథయాత్ర – 1990
బి) రాజీవ్ గాంధీ హత్య – 1991
సి) ఆపరేషన్ బ్లూస్టార్ – 1984
డి) ఆపరేషన్ బర్గా – 1987
జవాబు:
డి) ఆపరేషన్ బర్గా – 1987.

73. క్రింది వానిలో సరిఅయిన జతను గుర్తించి, రాయండి.
→ కాంగ్రెసు (0) – ఇందిరాగాంధీ
→ SAD – హర్యానా రాష్ట్రం
→ BLD – ఉత్తర ప్రదేశ్
→ జనసంఘ్ – జమ్ము & కాశ్మీర్
జవాబు:
BLD – ఉత్తరప్రదేశ్

74. క్రింద ఇచ్చిన వానిలో అస్సోం రాష్ట్రం యొక్క ప్రధాన వనరులు ఏవి?
టీ, కాఫీ, ముడిచమురు, ఇనుప ఖనిజము.
జవాబు:
టీ, ముడిచమురు.

AP 10th Class Social Important Questions Chapter 19 రాజకీయ ధోరణుల ఆవిర్భావం : 1977-2000

75. క్రింది వానిలో సరికాని జతను గుర్తించండి.
i) తీవ్రవాద సిక్కు బృంద నాయకుడు, – బింద్రేన్‌వాలా
ii) SAD అధ్యక్షుడు – సంత్ లాంగో వాల్
iii) AGP అధ్యక్షుడు – జ్యోతిబసు
iv) భారతదేశ ఆరవ రాష్ట్రపతి – నీలం సంజీవరెడ్డి
జవాబు:
(iii)

76. క్రింది వాటిని సరిగా జతపరచండి.
i) DMK ( ) a) తమిళనాడు
ii) SAD ( ) b) పంజాబు
iii)AGP ( ) c) అస్సోం
iv) BLD ( ) d) ఉత్తరప్రదేశ్
జవాబు:
i – a, ii – b, iii – c, iv – d

77. ఇవ్వబడిన ప్రధాన మంత్రులను సరియైన కాలక్రమంలో
i) రాజీవ్ గాంధీ
ii) V.P. సింగ్
iii) ఇందిరాగాంధీ
iv) పి.వి. నరసింహారావు
జవాబు:
iii, i, ii & iv

78. క్రింద ఇవ్వబడిన సంఘటనలను సరియైన కాల క్రమంలో అమర్చండి.
i) TDP ఆవిర్భావం
ii) శ్రీలంకతో ఒప్పందం
iii) రామ జన్మభూమి రథయాత్ర.
iv) సరళీకృత ఆర్థిక విధానాలు
జవాబు:
i, ii, iii & iv

79. ‘విధాన పక్షపాతం’ అనగా నేమి?
జవాబు:
భాగస్వామ్య మద్దతు ఉపసంహరించుకుంటుందన్న భయంతో తీవ్ర మార్పులను అమలు చేయకపోవటం.

80. భారతదేశంలో ‘టెలికం విప్లవం’ను ప్రారంభించిన ప్రధాని ఎవరు?
జవాబు:
రాజీవ్ గాంధీ.

81. క్రింది వారిలో ప్రధానమంత్రి పదవిలో అతి తక్కువ కాలం కొనసాగిన వారు ఎవరు?
ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, P.V. నరసింహారావు, V.P. సింగ్
జవాబు:
రాజీవ్ గాంధీ

82. భారతదేశంలో సరళీకృత ఆర్థిక విధానాలు ప్రవేశపెట్టిన ప్రధాని ఎవరు?
జవాబు:
P.V. నరసింహారావు

AP 10th Class Social Important Questions Chapter 19 రాజకీయ ధోరణుల ఆవిర్భావం : 1977-2000

83. సరికాని జతను ఎంచుకుని, రాయండి.
→ రామజన్మభూమి రథయాత్ర – L.K. అద్వానీ
→ రాజీవ్ గాంధీ హత్య – LTTE
→ మండల కమీషన్ – OBC లకు రిజర్వేషన్లు
→ మొదటి సంకీర్ణ ప్రభుత్వం – P.V. నరసింహారావు
జవాబు:
మొదటి సంకీర్ణ ప్రభుత్వం – P.V. నరసింహారావు

84. క్రింది సంఘటనలను సరియైన కాలక్రమంలో అమర్చండి.
i) ఆపరేషన్ బ్లూస్టార్
ii) మిజోనేషనల్ ఫ్రంట్ తో ఒప్పందం
iii) జనతాదళ్ ప్రభుత్వం ఏర్పాటు
iv) బాబ్రీ మసీదు కూల్చివేత.
జవాబు:
i, ii, iii & in

85. క్రింది వానిని సరిగా జతపరచండి.
i) సరళీకృత ఆర్థిక విధానాలు ( ) a) ఇందిరాగాంధీ
ii) టెలికం విప్లవం ( ) b) V.P. సింగ్ ఉంచండి.
iii)మండల కమీషన్ ( ) c) రాజీవ్ గాంధీ
iv) బ్యాంకుల జాతీయికరణ ( ) d) P.V. నరసింహారావు
జవాబు:
i – d, ii – c, iii – b, iv – a.

86. LTTE లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈలంలో తమిళ ఈలం అనగా?
జవాబు:
తమిళ రాజ్యం

87. క్రింది వానిని సరిగా జతపరచండి.
i) కాంగ్రెస్ పార్టీ ( ) a) ప్రాంతీయ పార్టీ
ii) భారతీయ జనతాపార్టీ ( ) b) వామపక్షం
iii) భారత కమ్యూనిస్ట్ పార్టీ ( ) c) NDA
iv) ద్రవిడ మున్నేట్ర కజగం ( ) d) UPA
జవాబు:
i – d, ii – c, iii – b, iv – a

88. సరళీకృత ఆర్థిక విధానాలలో భాగం కానిదాన్ని గుర్తించి, రాయండి.
→ రైతులకు ఇచ్చే సబ్సిడీలలో కోత మరియు సంక్షేమ పథకాల ఖర్చు తగ్గింపు
→ ఆర్థిక రంగంలోని అనేక రంగాలలో ప్రైవేటు పెట్టుబడి.
→ విదేశీ సరుకుల దిగుమతులమీద పరిమితులను తగ్గించటం.
→ భారతదేశంలో విదేశీ పెట్టుబడులపై ఆంక్షలు (పరిమితులు) విధించటం.
జవాబు:
భారతదేశంలో విదేశీ పెట్టుబడులపై ఆంక్షలు (పరిమితులు) విధించటం.

89. ‘ఓటు (హక్కు) విలువను తెలియజేయు ఒక నినాదంను రాయండి.
జవాబు:
ఓటరు చేతికి బ్రహ్మాస్త్రం – ఓటుహక్కు,
అవినీతిపరులకు ఓటు – దేశానికి చేటు.

90. ప్రస్తుత ప్రధాన ఎన్నికల కమీషనర్ ఎవరు?
జవాబు:
సునీల్ అరోరా.

91. అత్యవసర పరిస్థితి తర్వాత, ప్రజాస్వామ్యాన్ని, స్వేచ్ఛని పునరుద్ధరిస్తామనే వాగ్దానంతో అధికారంలోకి వచ్చిన పార్టీ ఏది?
జవాబు:
జనతా పార్టీ

AP 10th Class Social Important Questions Chapter 19 రాజకీయ ధోరణుల ఆవిర్భావం : 1977-2000

92. ఇందిరాగాంధీ విధానాలను వ్యతిరేకించిన కాంగ్రెసులోని సంప్రదాయవాద వర్గంతో ఏర్పాటు చేయబడిన పార్టీ ఏది?
జవాబు:
కాంగ్రెసు (ఓ)

93. ఏ సంవత్సరం చివరి నాటికి అంతిమంగా పంజాబులో శాంతి నెలకొన్నది?
జవాబు:
1990.

94. శ్రీలంక నుండి భారతదేశం తన సైన్యాన్ని వెనక్కి తీసుకున్న సంవత్సరం?
జవాబు:
1989.

95. ఏ సంవత్సరంలో షాబానో కేసులో సుప్రీంకోర్టు తీర్పును ఇచ్చింది?
జవాబు:
1985.

96. మహారాష్ట్రలోని రైతులు ఎవరి నాయకత్వంలో పోరాడుతున్నారు?
జవాబు:
శరద్ జోషి

97. ఉత్తరప్రదేశ్, హర్యానాలోని రైతులు ఎవరి నాయకత్వంలో పోరాడుతున్నారు?
జవాబు:
మహేంద్రసింగ్ తికాయత్

98. అయోధ్యలోని వివాదాస్పద మసీదును కూల్చివేసిన సంవత్సరం?
జవాబు:
1992.

99. భారతదేశ ప్రజాస్వామ్యానికి ఒక చారిత్రకమైన ఎన్నికలుగా ఏ ఎన్నికలను చెప్పవచ్చు?
జవాబు:
1977 ఎన్నికలు.

100. జాతీయస్థాయిలో కాంగ్రెసు పార్టీ ఓటమి చవిచూసిన ఎన్నికలు ఏవి ?
జవాబు:
1977 ఎన్నికలు.

101. హిందూ జాతీయవాద పార్టీగా పేరొందిన పార్టీ ఏది?
జవాబు:
జనసంఘ్.

102. పంచాయితీరాజ్ సంస్థలను క్రియాశీలకంగా మలచి పెద్ద సంఖ్యలో ప్రజలు పాలనలో భాగస్వామ్యులు అయ్యేలా ఉద్యమించారు?
జవాబు:
రాజీవ్ గాంధీ.

103. దళితుల ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ ఏది?
జవాబు:
BSP (బహుజన సమాజ్ పార్టీ)

AP 10th Class Social Important Questions Chapter 19 రాజకీయ ధోరణుల ఆవిర్భావం : 1977-2000

104. పంజాబుపై H.S. లాంగోవాలోనూ, అస్సోంపై AASU తోనూ రాజీవ్ గాంధీ ఒప్పందాలు ఏ సంవత్సరంలో చేసుకున్నారు?
జవాబు:
1985

105. అధికారంలో ఉండగా హత్యకు గురికాబడిన భారత ప్రధాని ఎవరు?
జవాబు:
ఇందిరాగాంధీ.

106. ఏ సంవత్సరం నుండి జాతీయ స్థాయిలో ఏర్పడిన ప్రభుత్వాలన్నీ సంకీర్ణ ప్రభుత్వాలే?
జవాబు:
1989 నుంచి.

107. L.K. అద్వాని రథయాత్ర 1990లో ఎక్కడ నుంచి ప్రారంభమైంది?
జవాబు:
సోమనాథ్ (గుజరాత్).

108. 1992లో ఏర్పడిన పి.వి.నరసింహారావు ప్రభుత్వం ఆర్థిక సంక్షోభాన్ని నివారించటానికి చేపట్టిన అంశం ఏది?
జవాబు:
సరళీకృత ఆర్ధిక విధానం.

109. క్రింది వానిని పరిగణించండి.
i) కేంద్రంలో గెలుపొందిన జనతాపార్టీ తన స్థానాన్ని సుస్థిర పరచుకోటానికి తొమ్మిది రాష్ట్రాలలోని కాంగ్రెసు ప్రభుత్వాలను తొలగించింది.
ii) కాంగ్రెస్ పార్టీ జాతీయస్థాయిలో ఓడిపోయింది, కాబట్టి రాష్ట్రాలలో సైతం పాలించే హక్కును కోల్పోయింది.
పై వానిలో సరైనది ఏది?
A) (i) మాత్రమే
B) (ii) మాత్రమే
C) (i) మరియు (ii)
D) రెండూ కావు
జవాబు:
A (i) మాత్రమే

110. పంజాబు ఆందోళన వేర్పాటు వాదం వైపునకు మరళటానికి ప్రధాన కారణం ఏమిటి?
జవాబు:
మతపరమైన రంగు సంతరించుకోవటం.

AP 10th Class Social Important Questions Chapter 19 రాజకీయ ధోరణుల ఆవిర్భావం : 1977-2000

111. పంజాబు ఆందోళనకు కారణమైన సిక్కులు కోరిన అంశం కానిది.
→ రాజధాని చండీఘర్ కేంద్రపాలిత ప్రాంతంగా కాక తమకే చెందాలి.
→ భాక్రానంగల్ ఆనకట్ట నుంచి నీళ్ళు ఎక్కువ కావాలి.
→ సైన్యంలోకి ఎక్కువమంది సిక్కులను తీసుకోవాలి.
→ సిక్కు మతస్థులందరికి ప్రత్యేక దేశం కావాలి.
జవాబు:
సిక్కు మతస్థులందరికి ప్రత్యేక దేశం కావాలి.

112. ఏ రాష్ట్రంలో “తమని అంతర్గత వలస ప్రాంతంగా పరిగణిస్తున్నారని”, దీనిని ఆపివేయాలని ప్రజలు చేయటం మంచి పద్ధతని భావించిన ప్రధాని ఎవరు?
జవాబు:
అస్సోం.

113. 1977 ఎన్నికలలో అన్ని ప్రధాన ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్ వ్యతిరేక వర్గంలో చేరటానికి కారణం.
జవాబు:
అత్యవసర పరిస్థితికి వ్యతిరేకంగా.

114. నీలం సంజీవరెడ్డిగారి గురించిన సరియైన వాక్యం కానిది.
→ ఈయన ఆరవ లోకసభ స్పీకరుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
→ ఈయన భారత ఆరవ రాష్ట్రపతిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
→ 1977 జులై 25న స్పీకరుగా ప్రమాణ స్వీకారం చేశారు.
→ కాంగ్రెసు పార్టీతో సహా అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయి.
జవాబు:
→ 1977 జులై 25న స్పీకరుగా ప్రమాణ స్వీకారం చేశారు.

115. “ప్రజాస్వామ్యాన్ని, స్వేచ్ఛని పునరుద్ధరిస్తామన్న వాగ్దానంతో జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది.” అయితే దీని కారణంగా ఆ పార్టీ పాలన ప్రభావితం అయ్యింది?
జవాబు:
అంతర్గత కీచులాటలు, ఫిరాయింపులు, అంతర్గత విభేదాలు

116. కాంగ్రెసేతర ప్రాంతీయ రాజకీయ పార్టీలు ఒక వేదికగా ఏర్పడ్డానికి కారణం కానటువంటి అంశం.
జవాబు:
కేంద్ర విషయాల్లో జోక్యం చేసుకోవటం.

117. రాష్ట్రపతి పాలనకు సంబంధించిన వాక్యాలను పరిశీలించి, సరియైన సమాధానము ఎంచుకోండి.
I. రాజ్యాంగంలోని 356వ అధికరణం రాష్ట్రపతి పాలన గురించి వివరిస్తుంది.
II. గవర్నరు సిఫారసు మేరకు, ప్రధానమంత్రి సలహాతో, రాష్ట్రపతి పాలన బాధ్యతను గవర్నరుకు అప్పగించవచ్చు.
III. దీనికి సంబంధించిన ఖచ్చితమైన మార్గదర్శకాలు రాజ్యాంగంలో పొందుపరిచినారు.
A) I, II & III సత్యాలు
B) II, III సత్యాలు
C) I, II & III అసత్యాలు
D) I, II సత్యాలు
జవాబు:
D) I, 11 సత్యాలు

118. ఎన్.టి.రామారావు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకం కానిది.
A) రెండు రూపాయలకు కిలో బియ్యం
B) మధ్యాహ్న భోజన పథకం
C) వృద్ధాప్య పింఛన్లు
D) మద్యపాన నిషేధం
C) వృద్ధాప్య పింఛన్లు

AP 10th Class Social Important Questions Chapter 19 రాజకీయ ధోరణుల ఆవిర్భావం : 1977-2000

119. ఎన్.టి. రామారావు (రాజకీయాలలో) తెలుగుదేశం పార్టీ స్థాపనలో, ఎన్నికల్లో విజయం సాధించటానికి దోహదం చేసిన అంశం కానిది.
→ సినీహీరోగా ఉన్న నేపథ్యం.
→ రాజకీయ అనుభవం కలిగిన నాయకత్వం.
→ రాష్ట్ర ఆత్మగౌరవం కోసం పోరాటం.
→ పేదలకు జనాకర్షక సంక్షేమ పథకాలు
జవాబు:
రాజకీయ అనుభవం కలిగిన నాయకత్వం

120. అసోం ఉద్యమానికి కారణం.
జవాబు:
బెంగాలీ అధికారుల వివక్షత
బంగ్లాదేశ్ కాందిశీకుల రాక
సాంస్కృతిక మూలాలు కోల్పోతామన్న భయం

121. సంస్కృతి, జనాభా అంశాలే కాకుండా అసోం ఉద్యమానికి సంబంధించిన ఆర్థిక కోణం / కారణం
→ ఉపాధిలో బయట ప్రజలకు ప్రాధాన్యత
→ టీ పరిశ్రమ అస్సామేతర ప్రజల చేతుల్లో ఉండటం,
→ చమురు పరిశ్రమలో స్థానికులకు ప్రాధాన్యత తక్కువగా ఇవ్వటం
→ పైవన్నీ
జవాబు:
పైవన్నీ

122. ‘అసోం’ ఉద్యమంలోని ప్రజల ప్రధాన డిమాండ్ కానిది
→ అంతర్గత వలసగా పరిగణించటం
→ ఉపాధిలో స్థానికులకు ప్రాధాన్యత ఇవ్వటం
→ వనరులను స్థానిక ప్రజల ప్రయోజనం కోసం వినియోగించటం
→ బయటివాళ్లను తొలగించటం
జవాబు:
అంతర్గత వలసగా పరిగణించటం.

123. “ఈశాన్య ప్రాంతంలో ఘర్షణలు తగ్గించి, శాంతిని నెలకొల్పటానికి ఈ ప్రాంతాలలో సాయుధ బలగాలను కేంద్ర ప్రభుత్వం పెద్దఎత్తున నియమించింది.” ఈశాన్య ప్రాంతంలో సాయుధ దళాలను ప్రయోగించటానికి కారణం కాని అంశం.
→ పొరుగు దేశాలతో సరిహద్దు ప్రాంతంగా ఉండటం
→ ఘర్షణల మతపర రంగు సంతరించుకోవడం
→ తిరుగుబాటు బృందాలు తరచు భారతదేశం నుంచి విడిపోవాలని కోరుకోవటం.
→ అల్పసంఖ్యాక వర్గాలపై తిరుగుబాటు బృందాలు హింసాత్మక దాడులకు పాల్పడటం.
జవాబు:
ఘరణలు మతపర రంగు సంతరించుకోవడం

124. క్రింది స్టేట్ మెంట్లను పరిశీలించి, సరియైన సమాధానము ఎంచుకోండి.
I. సిక్కు వేర్పాటు బృందాలు గోల్డెన్ టెంపుల్ ని ఆక్రమించుకోగా సైన్యం జోక్యం చేసుకోవలసి వచ్చింది.
II. దీనికి ప్రతిచర్యగా 1984లో ప్రధాని ఇందిరా
గాంధీని హత్య గావించారు.
A) I, II అసత్యాలు
B) I, II సత్యాలు
C) I మాత్రమే సత్యం
D) II మాత్రమే సత్యం
జవాబు:
B) I, II సత్యా లు

125. “పంజాబులో తీవ్రవాదాన్ని అణచివెయ్యటానికి ప్రభుత్వం చాలా తీవ్ర పదతులను ఉపయోగించింది. వీటిలో అనేకం పౌరుల రాజ్యాంగ హక్కులకు భంగం కలిగించాయని భావించారు.” అయితే ఈ చర్యను సమర్థించే వ్యాఖ్య.
→ హింసను హింసతోటే అణచివెయ్యాలి. కావున ఈ చర్య సమర్థనీయమే.
→ రాజ్యాంగ యంత్రాంగమే కుప్పకూలే అంచున ఉండటంతో మానవహక్కుల ఉల్లంఘన సమర్థనీయమే.
→ శాంతి, భద్రతల రక్షణలో ఏ విధంగాను పౌరహక్కుల ఉల్లంఘన జరగకూడదు.
→ ఇటువంటి చర్యలు అప్రజాస్వామిక ధోరణులు బలపడటానికి దోహదం చేస్తాయి.
జవాబు:
రాజ్యాంగ యంత్రాంగమే కుప్పకూలే అంచున ఉండటంతో మానవహక్కుల ఉల్లంఘన సమర్థనీయమే.

AP 10th Class Social Important Questions Chapter 19 రాజకీయ ధోరణుల ఆవిర్భావం : 1977-2000

126. రాజీవ్ గాంధీ పాలనలో చేపట్టిన సంస్కరణ కానిది
→ శాంతి, భద్రతలు నెలకొల్పటం
→ టెలికాం విప్లవం
→ పంచాయితీరాజ్ సంస్థలను క్రియాశీలంగా మార్చటం.
→ ఆర్థిక విధానాలు కట్టుదిట్టం చేయటం.
జవాబు:
ఆర్థిక విధానాలు కట్టుదిట్టం చేయటం.

127. ఈ క్రింది కేసును పరిశీలించి, ఇచ్చిన ప్రశ్నకు సరియైన సమాధానము ఎంచుకోండి.
I. భర్త నుంచి విడాకులు పొందిన షాబానో అనే మహిళ కేసులో సుప్రీంకోర్టు ఆమె మాజీ భర్త ఆమెకు భరణం చెల్లించాలని తీర్పు ఇచ్చింది.
II. ఈ తీర్పు ఇస్లామిక్ చట్టంలో జోక్యం చేసుకుంటోందని దీనిని అనుమతిస్తే తమ మత జీవితంలో జోక్యం మరింత పెరుగుతుందని నిరసనలు చేపట్టారు.
III. 1986లో కొత్త చట్టం ప్రకారం ముస్లిం భర్తలకు ఎటువంటి బాధ్యత లేకుండా చేసి విడాకులు పొందిన మహిళలకు మూడు నెలలపాటు ముస్లిం మత సంస్థలు భరణం ఇస్తే సరిపోతుంది.
పై కేసును పరిశీలించిన మీదట మీకు అవగత మవుతున్న అంశం.
జవాబు:
ముస్లిం మహిళల ప్రయోజనాలు కాదని మత ఛాందసవాదులకు తలఒగ్గడం జరిగింది.

128. కేంద్రంలో ఏ ఒక్క పార్టీ కూడా తనంతట తాను ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యలేకపోవడంతో జాతీయ, ప్రాంతీయ పార్టీలు కలసి ఇలాంటి ప్రభుత్వాలని ఏర్పరచాయి.
జవాబు:
సంకీర్ణ ప్రభుత్వాలు

129. వామపక్ష రాజకీయ పార్టీ కానిది.
A) CPI
B) CPM
C) ఫార్వర్డ్ బ్లాక్
D) SAD
జవాబు:
D) SAD

130. సంకీర్ణ ప్రభుత్వంలో ఏదో ఒక భాగస్వామి మద్దతు ఉపసంహరించుకుంటుదన్న భయంతో తీవ్ర మార్పులను తెచ్చే విధానాలను అమలుచేయ్యటానికి భయపడటాన్ని ఇలా అనవచ్చు.
జవాబు:
విధాన పక్షపాతం.

131. క్రింది స్టేట్మెంట్లను పరిశీలించి, సరియైన సమాధానము ఎంచుకోండి.
I. 1978 జూన్లో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ‘ఆపరేషన్ బర్గా’ చేపట్టింది.
II. భూస్వాముల పేర్లను నమోదుచేసి, వాళ్ల హక్కులను కాపాడటానికి దీనిని చేపట్టారు.
III. ఆపరేషన్ బర్గాలో చేపట్టిన చర్యల ఫలితంగా పశ్చిమ బెంగాల్ లో వ్యవసాయ ఉత్పత్తి 30% దాకా పెరిగింది.
A) I, II & III సరియైనవి
B) I, II మాత్రమే సరియైనవి
C) I, III మాత్రమే సరియైనవి
D) II, III మాత్రమే సరియైనవి
జవాబు:
C) I, III మాత్రమే సరియైనవి.

AP 10th Class Social Important Questions Chapter 19 రాజకీయ ధోరణుల ఆవిర్భావం : 1977-2000

132. క్రింది స్టేట్ మెంట్లను పరిశీలించి, సరియైన సమాధానము జ. ఆర్థిక విధానాలు కట్టుదిట్టం చేయటం ఎంచుకోండి.
I. ప్రభుత్వ ఉద్యోగాలలోను, విద్యాసదుపాయాల లోను ఇతర వెనకబడిన తరగతులకు రిజర్వేషను ఉండాలని మండల్ కమీషన్ సిఫారసు చేసింది.
II. ఈ నివేదికను నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం వెలికి తీసింది.
III. వెనకబడిన తరగతులకు విద్య, ఉద్యోగాలలో 29% రిజర్వేషన్లను అమలు చేస్తున్నట్లు వి.పి.సింగ్ ప్రభుత్వం ప్రకటించింది.
IV. ఈ ప్రకటనకు భారతదేశం అంతట హర్షం వ్యక్తపరచి ఆదరించాయి.
A) I, II, III & IV సరియైనవి.
B) I, II మాత్రమే సరియైనవి
C) I, II, III మాత్రమే సరియైనవి
D) I, II, IV మాత్రమే సరియైనవి
జవాబు:
B) I, II మాత్రమే సరియైనవి

133. ఈ క్రింది వ్యాఖ్యలను పరిశీలించి, సరియైన సమాధానము ఎంచుకోండి.
I. 73వ రాజ్యాంగ సవరణ గ్రామస్థాయిలో స్థానిక స్వపరిపాలనా ప్రభుత్వాలను కల్పించింది.
II. 74వ రాజ్యాంగ సవరణ పట్టణ, నగరాల్లో స్థానిక స్వపరిపాలనా ప్రభుత్వాలను కల్పించింది.
II. మొత్తం స్థానాల్లో 2/3 వంతు స్థానాలను స్త్రీలకు కేటాయించారు.
A) I, II & III సరియైనవి
B) I, II మాత్రమే సరియైనవి
C) II, III మాత్రమే సరియైనవి
D) I, III మాత్రమే సరియైనవి
జవాబు:
B) I, II మాత్రమే సరియైనవి

134. 1991లో భారతదేశం సరళీకృత ఆర్థిక విధానాలను అవలంభించటానికి కారణం కానిది.
→ అంతర్జాతీయ ద్రవ్యనిధి షరతులు
→ విదేశీ మారక నిల్వలు అడుగంటడం
→ తీవ్ర ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడటానికి
→ పారిశ్రామికాభివృద్ధి సాధించటానికి
జవాబు:
పారిశ్రామికాభివృద్ధి సాధించటానికి

135. ఈ క్రింది సంఘటనలను సరియైన కాలక్రమంలో ఉంచండి.
i) తెలుగుదేశం పార్టీ స్థాపన
ii) ఆపరేషన్ బ్లూస్టార్
iii) అద్వా నీ రథయాత్ర
iv) సరళీకృత ఆర్థిక విధానం
A) i, ii, iii, iv
B) i, ii, iv, iii
C) i, iii, ii, iv a
D) iv, i, ii, iii
జవాబు:
A) i, ii, iii, iv

136. క్రింది వానిలో సరియైన జత కానిది
A) మొరార్జీదేశాయ్ – మొదటి కాంగ్రెసేతర ప్రధానమంత్రి
B) వి.పి.సింగ్-మొదటి సంకీర్ణ ప్రభుత్వ ప్రధానమంత్రి
C) రాజీవ్ గాంధీ – UPA మొదటి ప్రధానమంత్రి
D) పి.వి.నరసింహారావు-సరళీకృత ఆర్ధిక విధానాలు
జవాబు:
C) రాజీవ్ గాంధీ – UPA మొదటి ప్రధానమంత్రి

క్రింది సమాచారమును పరిశీలించి, ఇచ్చిన ప్రశ్నలకు సరియైన సమాధానము ఎంచుకోండి.
AP 10th Class Social Important Questions Chapter 19 రాజకీయ ధోరణుల ఆవిర్భావం 1977-2000 1

137. మూడు సంకీర్ణ ప్రభుత్వాల్లో అధికారం పంచుకున్న పార్టీ.
జవాబు:
JKNC

138. AIADMK ఈ పార్టీ ఏ రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీ?
జవాబు:
తమిళనాడు

139. NDA సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతు మాత్రమే ఇచ్చిన పార్టీ
జవాబు:
TDP

AP 10th Class Social Important Questions Chapter 19 రాజకీయ ధోరణుల ఆవిర్భావం : 1977-2000

140. నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం పడిపోయిన సంవత్సరం
జవాబు:
1990

141. యునైటెడ్ ఫ్రంట్ సంకీర్ణ ప్రభుత్వంలో గల జాతీయ పార్టీ పేరు రాయండి.
జవాబు:
సి.పి.ఐ.

142. NDA (అలయన్స్) ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ కి చెందిన ఏ పార్టీ మద్దతును ఇచ్చింది?
జవాబు:
TDP

143. నేషనల్ ఫ్రంట్ సంకీర్ణ ప్రభుత్వంలోని ఏవైనా రెండు ప్రాంతీయ పార్టీలను పేర్కొనండి?
జవాబు:
DMK, TDP, AGP,

AP 10th Class Social Important Questions Chapter 19 రాజకీయ ధోరణుల ఆవిర్భావం : 1977-2000

144. యునైటెడ్ ఫ్రంట్ సంకీర్ణ ప్రభుత్వానికి బయటి నుండి మద్దతు నిచ్చిన పార్టీ ఏది?
జవాబు:
సి.పి.యం.

10th Class Social 19th Lesson 1 Mark Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
మీకీయబడిన భారతదేశ రాజకీయ పటంనందు ఏవేని రెండు ప్రాంతీయ పార్టీలు ప్రస్తుతం అధికారంలో గల రాష్ట్రాలను గుర్తించండి.
జవాబు:
AP 10th Class Social Important Questions Chapter 19 రాజకీయ ధోరణుల ఆవిర్భావం 1977-2000 2

ప్రశ్న 2.
‘టెలీకం విప్లవం’ దేనికి దోహదపడింది?
జవాబు:
ఉపగ్రహ సాంకేతిక విజ్ఞానంతో దేశంలో టెలిఫోనిక్ నెట్ వర్క్ వేగంగా విస్తరించటానికి ఇది దోహదపడింది. భారతదేశంలో టెలిఫోన్ విప్లవాన్ని ప్రారంభించింది రాజీవ్ గాంధీ.

ప్రశ్న 3.
సంకీర్ణ ప్రభుత్వం అనగా ఏమిటి? ఒక ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
అనేక జాతీయ, ప్రాంతీయ పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం.
ఉదా : ఎన్.డి.ఏ, యు.పి.ఏ.
(లేదా)
సంకీర్ణ ప్రభుత్వము :
ఏ ఒక్క రాజకీయ పార్టీకి స్పష్టమైన ఆధిక్యత రానప్పుడు కొన్ని పార్టీలు కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తే దానిని సంకీర్ణ ప్రభుత్వం అంటారు.

ప్రశ్న 4.
ప్రాంతీయ రాజకీయ పార్టీలకు రెండు ఉదాహరణలీయండి.
జవాబు:
ఆంధ్రప్రదేశ్ : Y.S.R.C.P
తమిళనాడు : D.M.K, AIADMK
అసోం : AGP
జమ్మూ & కాశ్మీర్ : National Conference
పంజాబ్ : శిరోమణి అకాలీదళ్ళ

ప్రశ్న 5.
ఎన్.టి. రామారావు ప్రవేశపెట్టిన ఏ సంక్షేమ పథకాలు కొన్ని మార్పులతో నేటికీ ఆంధ్రప్రదేశ్ లో కొనసాగుతున్నాయి?
(లేదా)
యన్.టి.రామారావు ప్రవేశపెట్టిన ఏవేని రెండు అంశాలను పేర్కొనండి.
జవాబు:

  1. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం.
  2. పేదలకు సబ్సిడీ ధరకు బియ్యం అందించడం.

ప్రశ్న 6.
73వ రాజ్యాంగ సవరణ గురించి రాయండి.
జవాబు:
గ్రామీణ స్థాయిలో స్థానిక స్వపరిపాలనా ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం.

AP 10th Class Social Important Questions Chapter 19 రాజకీయ ధోరణుల ఆవిర్భావం : 1977-2000

ప్రశ్న 7.
ఇవ్వబడిన సమాచారాన్ని పరిశీలించి క్రింది ప్రశ్నకు సమాధానం రాయండి.
AP 10th Class Social Important Questions Chapter 19 రాజకీయ ధోరణుల ఆవిర్భావం 1977-2000 7
యునైటెడ్ ఫ్రంట్ సంకీర్ణ ప్రభుత్వంలో గల జాతీయ పార్టీ పేరు రాయండి.
జవాబు:
సి.పి.ఐ.

ప్రశ్న 8.
రాజ్యాంగంలోని మౌలిక విలువలు ఏవి?
జవాబు:
రాజ్యాంగంలోని మౌలిక విలువలు :

  1. ప్రజాస్వామ్యం
  2. దేశ ఐక్యత
  3. సమగ్రత
  4. సామాజిక, ఆర్థిక మార్పులు.

ప్రశ్న 9.
అత్యవసర పరిస్థితిని ముగించిన సంవత్సరమేది?
జవాబు:
అత్యవసర పరిస్థితిని ముగించిన సంవత్సరం – 1977.

ప్రశ్న 10.
ఇందిరాగాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగి ఏర్పాటైన సంవత్సరం ఏది?
జవాబు:
ఇందిరాగాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగి ఏర్పాటైన సంవత్సరం-1980.

ప్రశ్న 11.
ఆపరేషన్ ‘బ్లూ స్టార్’ చేపట్టిన సంవత్సరం ఏది?
జవాబు:
ఆపరేషన్ ‘బ్లూ స్టార్’ చేపట్టిన సంవత్సరం-1984.

ప్రశ్న 12.
ఇందిరాగాంధీ హత్యకు గురైన సంవత్సరం ఏది?
జవాబు:
ఇందిరాగాంధీ హత్యకు గురైన సంవత్సరం-1984.

AP 10th Class Social Important Questions Chapter 19 రాజకీయ ధోరణుల ఆవిర్భావం : 1977-2000

ప్రశ్న 13.
భారతదేశ ప్రజాస్వామ్యానికి పరీక్షా కాలం వంటిది ఏది?
జవాబు:
భారతదేశ ప్రజాస్వామ్యానికి పరీక్షా కాలం వంటిది 1976-85.

ప్రశ్న 14.
1975-85 మధ్యకాలంలో భారతదేశ ప్రజాస్వామ్యం యొక్క ప్రాధాన్యత ఏమిటి?
జవాబు:
1975-85 మధ్యకాలంలో భారతదేశం ఏక పార్టీ ప్రజాస్వామ్యంలోకి జారిపోకుండా సమర్థవంతంగా నివారించబడింది.

ప్రశ్న 15.
1975-85 మధ్యకాలంలో భారతదేశంలో ఉద్భవించిన ఉద్యమాలు ఏవి?
జవాబు:
1975-85 మధ్యకాలంలో భారతదేశంలో ఉద్భవించిన ఉద్యమాలు పర్యావరణ ఉద్యమం, స్త్రీవాద ఉద్యమం, పౌరహక్కుల ఉద్యమం, సాహిత్య ఉద్యమం.

ప్రశ్న 16.
జనతా పార్టీగా ఏర్పడాలని నిర్ణయించిన పార్టీలు ఏవి?
జవాబు:
‘జనతా పార్టీగా ఏర్పడాలని నిర్ణయించిన పార్టీలు :

  1. కాంగ్రెస్ (ఓ)
  2. స్వతంత్ర పార్టీ
  3. భారతీయ జనసంఘ్
  4. భారతీయ లోక్ దళ్
  5. సోషలిస్టు పార్టీ.

ప్రశ్న 17.
కాంగ్రెస్ వ్యతిరేక, అత్యవసర పరిస్థితి వ్యతిరేక పార్టీలు అన్నీ ఒక తాటి కిందకు వచ్చి ఎన్నికలలో పోటీ చేయటంలో ముఖ్యపాత్ర పోషించినవారెవరు?
జవాబు:
జయప్రకాష్ నారాయణ్, ఆచార్య జె.బి. కృపలాని వంటి వారు కాంగ్రెస్ వ్యతిరేక, అత్యవసర పరిస్థితి వ్యతిరేక పార్టీలు అన్నీ ఒక తాటి కిందకు తేవడంలో ప్రధానపాత్ర పోషించారు.

ప్రశ్న 18.
భారతదేశ ప్రజాస్వామ్యానికి ఒక చారిత్రాత్మకమైన ఎన్నిక ఏది?
జవాబు:
భారతదేశ ప్రజాస్వామ్యానికి ఒక చారిత్రాత్మకమైన ఎన్నిక 1977 సాధారణ ఎన్నికలు.

ప్రశ్న 19.
జాతీయస్థాయిలో కాంగ్రెస్ పార్టీని ఓడించిన పార్టీ ఏది?
జవాబు:
జాతీయస్థాయిలో కాంగ్రెస్ పార్టీని ఓడించిన పార్టీ జనతా పార్టీ.

ప్రశ్న 20.
1977 సాధారణ ఎన్నికలలో గెలుపొందిన జనతా పార్టీ ఎన్ని రాష్ట్రాలలోని కాంగ్రెస్ ప్రభుత్వాలను తొలగించింది?
జవాబు:
1977 సాధారణ ఎన్నికలలో గెలుపొందిన జనతా పార్టీ 9 రాష్ట్రాలలోని కాంగ్రెస్ ప్రభుత్వాలను తొలగించింది.

AP 10th Class Social Important Questions Chapter 19 రాజకీయ ధోరణుల ఆవిర్భావం : 1977-2000

ప్రశ్న 21.
1977 సాధారణ ఎన్నికల తరువాత జనతా పార్టీ ఏ ఏ రాష్ట్రాలలో విజయం సాధించింది?
జవాబు:
1977 సాధారణ ఎన్నికల తరువాత జనతా పార్టీ ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, బీహార్ రాష్ట్రాలలో విజయం సాధించింది.

ప్రశ్న 22.
పంజాబ్ కి పరిమితమై సిక్కుల కోసం ప్రత్యేకంగా పనిచేస్తున్న పార్టీ ఏది?
జవాబు:
పంజాబ్ కి పరిమితమై సిక్కుల కోసం ప్రత్యేకంగా పనిచేస్తున్న పార్టీ శిరోమణి అకాలీ దళ్.

ప్రశ్న 23.
రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకు వీలు కల్పించే అధికరణం ఏది?
జవాబు:
రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకు వీలు కల్పించే అధికరణం 356.

ప్రశ్న 24.
జనతా పార్టీ అధికారంలోకి రావడానికి చేసిన వాగ్దానం ఏది?
జవాబు:
జనతా పార్టీ అధికారంలోకి రావడానికి చేసిన వాగ్దానం ప్రజాస్వామ్యాన్ని, స్వేచ్చని పునరుద్ధరిస్తామనడం.

ప్రశ్న 25.
భారతదేశంలోని విభిన్న ప్రాంతాల్లో మరింత స్వయం ప్రతిపత్తి కోసం జరిగిన మూడు ఉద్యమాలు ఏవి?
జవాబు:
భారతదేశంలోని విభిన్న ప్రాంతాల్లో మరింత స్వయం ప్రతిపత్తి కోసం జరిగిన మూడు ఉద్యమాలు

  1. ఆంధ్రప్రదేశ్
  2. అసోం
  3. పంజాబ్ ఉద్యమాలు.

ప్రశ్న 26.
ఎన్.టి. రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించింది ఎప్పుడు?
జవాబు:
ఎన్.టి. రామారావు తెలుగుదేశం పార్టీని 1982లో తన 60వ పుట్టినరోజున స్థాపించారు.

ప్రశ్న 27.
ఎ.ఎ.ఎస్.యు అనగానేమి?
జవాబు:
అఖిల అసోం విద్యార్థి సంఘం.

AP 10th Class Social Important Questions Chapter 19 రాజకీయ ధోరణుల ఆవిర్భావం : 1977-2000

ప్రశ్న 28.
టీ పరిశ్రమ ప్రధానంగా ఏ నగరంలో ఉంది?
జవాబు:
టీ పరిశ్రమ ప్రధానంగా కోల్‌కతాలో ఉంది.

ప్రశ్న 29.
అంతర్గత వలస ప్రాంతంగా దేనిని పరిగణించారు?
జవాబు:
అంతర్గత వలస ప్రాంతంగా ‘అసోం’ ను పరిగణించారు.

ప్రశ్న 30.
అసోంలోని ఆదిమ వాసులెవరు?
జవాబు:
అసోంలోని ఆదిమవాసులు బోడోలు, ఖాసీలు, మిజోల, కర్జీలు.

ప్రశ్న 31.
బర్మా ప్రస్తుతం ఏ పేరుతో పిలువబడుతోంది?
జవాబు:
బర్మా ప్రస్తుతం మయన్మార్ పేరుతో పిలువబడుతోంది.

ప్రశ్న 32.
చండీగఢ్ ను కేంద్రపాలిత ప్రాంతంగా కాక తమ రాష్ట్రానికే చెందాలని కోరినది?
జవాబు:
చండీగఢ్ ను కేంద్రపాలిత ప్రాంతంగా కాక తమ రాష్ట్రానికే చెందాలని కోరినది-పంజాబ్.

ప్రశ్న 33.
తీవ్రవాద సిక్కుల, బృందానికి నాయకుడిగా వ్యవహరించిన వారెవరు?
జవాబు:
తీవ్రవాద సిక్కుల బృందానికి నాయకుడిగా వ్యవహరించింది ‘భింద్రేన్ వాలా.

ప్రశ్న 34.
సిక్కుల పవిత్రస్థలమేది?
జవాబు:
సిక్కుల పవిత్రస్థలం గోల్డెన్ టెంపుల్.

ప్రశ్న 35.
ఖలిస్తాను స్వతంత్రదేశంగా ప్రకటించినదెప్పుడు?
జవాబు:
1986 ఏప్రిల్ లో అకల్ తఖ్ వద్ద జరిగిన సమావేశంలో ఖలిస్తానను స్వతంత్ర దేశంగా ప్రకటించారు.

ప్రశ్న 36.
రాజీవ్ గాంధీ ఏ ఏ ప్రాంతాలలో శాంతి ప్రక్రియలు మొదలుపెట్టారు?
జవాబు:
రాజీవ్ గాంధీ పంజాబ్, అసోం, మిజోరంలలో, పొరుగుదేశమైన శ్రీలంకలో కూడా శాంతి ప్రక్రియలు మొదలు పెట్టారు.

ప్రశ్న 37.
శ్రీలంక నుంచి అంతిమంగా భారతదేశం తన సైన్యాన్ని వెనక్కి తీసేసుకున్న సంవత్సరమేది?
జవాబు:
శ్రీలంక నుంచి అంతిమంగా భారతదేశం తన సైన్యాన్ని వెనక్కి తీసేసుకున్న సంవత్సరం-1989.

ప్రశ్న 38.
పేదల కోసం ఖర్చు పెడుతున్న ప్రతి రూపాయిలో 15 పైసలు కూడా అతడికి చేరటం లేదని అన్నవారెవరు?
జవాబు:
పేదల కోసం ఖర్చు పెడుతున్న ప్రతి రూపాయిలో 15 పైసలు కూడా అతడికి చేరటం లేదని అన్నవారు రాజీవ్ గాంధీ.

AP 10th Class Social Important Questions Chapter 19 రాజకీయ ధోరణుల ఆవిర్భావం : 1977-2000

ప్రశ్న 39.
సరళీకృత ఆర్థిక విధానం వైపు పయనం మొదలుపెట్టింది ఎవరు?
జవాబు:
1985లో రాజీవ్ గాంధీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మొదటి బడ్జెట్ లో అమలులో ఉన్న కొన్ని నియంత్రణలను పరిమితులను తొలగించి సరళీకృత ఆర్థిక విధానంవైపు పయనం మొదలుపెట్టారు.

ప్రశ్న 40.
భారతదేశంలో టెలికం విప్లవం అనబడుతున్న దానిని ఆరంభించినదెవరు?
జవాబు:
భారతదేశంలో టెలికం విప్లవం అనబడుతున్న దానిని ఆరంభించింది-రాజీవ్ గాంధీ.

ప్రశ్న 41.
భర్త నుంచి విడాకులు పొందిన షా బానో కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన సంవత్సరం ఏది?
జవాబు:
భర్త నుంచి విడాకులు పొందిన షా బానో కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన సంవత్సరం – 1985.

ప్రశ్న 42.
ఉత్తరప్రదేశ్, హర్యానా రైతులు దేనికోసం మహేంద్రసింగ్ తికాయత్ నేతృత్వంలో పోరాటం చేస్తున్నారు?
జవాబు:
వ్యవసాయ ఉత్పత్తులకు మెరుగైన ధరలకోసం డీజిల్, రసాయనిక ఎరువులు, విద్యుత్ వంటి ఉత్పాదకాలపై సబ్సిడీల కోసం పోరాటం చేస్తున్నారు.

ప్రశ్న 43.
ఎప్పటి నుండి జాతీయస్థాయిలో సంకీర్ణ/ మైనారిటీ ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి?
జవాబు:
1989 నుంచి జాతీయస్థాయిలో ఏర్పడిన ప్రభుత్వాలన్నీ సంకీర్ణ మైనారిటీ ప్రభుత్వాలే.

ప్రశ్న 44.
బెంగాలులో వామపక్ష ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఎవరు?
జవాబు:
బెంగాలులో వామపక్ష ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది జ్యోతిబసు.

ప్రశ్న 45.
బర్గాదార్లు అంటే ఎవరు?
జవాబు:
కౌలుదార్లను బెంగాలీలో బర్గాదార్లు అంటారు.

ప్రశ్న 46.
ఒబిసిలు అంటే ఎవరు?
జవాబు:
ఇతర వెనుకబడిన తరగతులకు చెందినవారు.

ప్రశ్న 47.
ఒబిసిలకు ఎంత శాతం రిజర్వేషన్లు కల్పించారు?
జవాబు:
సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతులకు ప్రభుత్వ ఉద్యోగాలలో 27% రిజర్వేషన్లు కల్పించారు.

ప్రశ్న 48.
హిందువుల మత అస్తిత్వం ఆధారంగా దేశాన్ని నిర్మించాలన్నది ఏ రాజకీయ పార్టీ ధోరణి?
జవాబు:
హిందువుల మత అస్తిత్వం ఆధారంగా దేశాన్ని నిర్మించాలన్న రాజకీయ ధోరణికి భారతీయ జనతాపార్టీ నేతృత్వం వహిస్తోంది.

ప్రశ్న 49.
ఎల్.కె. అద్వానీ రథయాత్ర ఎప్పుడు చేపట్టారు?
జవాబు:
ఎల్.కె. అద్వానీ రథయాత్ర 1990లో సోమనాథ్ నుంచి అయోధ్య వరకు చేపట్టారు.

ప్రశ్న 50.
వివాదాస్పద మసీదు ధ్వంసం చేయబడిన సంవత్సరమేది?
జవాబు:
వివాదాస్పద మసీదు ధ్వంసం చేయబడిన సంవత్సరం-1992.

ప్రశ్న 51.
సరళీకృత ఆర్ధిక విధానాన్ని ప్రవేశపెట్టిన ప్రభుత్వం ఏది?
జవాబు:
సరళీకృత ఆర్థిక విధానాన్ని ప్రవేశపెట్టిన ప్రభుత్వం 1992లో ఏర్పడిన పి.వి. నరసింహారావు ప్రభుత్వం.

AP 10th Class Social Important Questions Chapter 19 రాజకీయ ధోరణుల ఆవిర్భావం : 1977-2000

ప్రశ్న 52.
రాజ్యాంగంలో 356 అధికరణం యొక్క ప్రత్యేకత ఏమిటి?
జవాబు:

  1. రాజ్యాంగంలోని 356 అధికరణం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం, రాజ్యాంగం ప్రకారం రాష్ట్రాన్ని పాలించుకోలేకపోతోందని గవర్నరు అభిప్రాయపడితే రాష్ట్ర ప్రభుత్వాన్ని తొలగించమని, ఇంకా అవసరమైతే శాసన సభను రద్దు చెయ్యమని రాష్ట్రపతికి సిఫారసు చేయవచ్చు.
  2. అప్పుడు ప్రధానమంత్రి సలహాతో రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్రపతి తొలగించి పాలనా బాధ్యతలను చేపట్టమని రాష్ట్ర గవర్నరును కోరవచ్చు.

ప్రశ్న 53.
సంకీర్ణ ప్రభుత్వాలకు రెండు ఉదాహరణలు ఇవ్వండి.
జవాబు:
సంకీర్ణ ప్రభుత్వాలకు ఉదాహరణలు :

  1. కాంగ్రెస్ నేతృత్వంలోని UPA – యునైటెడ్ ప్రోగ్రెస్సివ్ అలయెన్స్.
  2. BJP నేతృత్వంలోని NDA – నేషనల్ డెమొక్రటిక్ అలయెన్స్.

ప్రశ్న 54.
AIADMK ని విస్తరింపుము.
జవాబు:
All India Anna Dravida Munnetra Kazagam
అఖిల భారత అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం

10th Class Social 19th Lesson 2 Marks Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.

1. అత్యవసర పరిస్థితి ముగింపు, మొరార్జీ దేశాయ్, చరణ్ సింగ్
కింద జనతా పార్టీ ప్రభుత్వ ఏర్పాటు
1977
2. ఇందిరాగాంధీ నేతృత్వంలో కాంగ్రెసు ప్రభుత్వ ఏర్పాటు 1980
3. T.D.P ఏర్పాటు 1982
4. ఆపరేషన్ బ్లూస్టార్, ఇందిరాగాంధీ హత్య 1984
5. రాజీవ్ గాంధీ పంజాబ్, అసోంలలో శాంతి ప్రక్రియ 1985

ప్రశ్నలు:
1) కేంద్రంలో మొట్టమొదటిసారిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెసేతర పార్టీ ఏది?
2) తెలుగుదేశం పార్టీ స్థాపకుడు ఎవరు?
జవాబు:

  1. జనతా పార్టీ
  2. నందమూరి తారక రామారావు (NTR)

ప్రశ్న 2.
2014 సాధారణ ఎన్నికలలో వివిధ రాజకీయ పార్టీలు, గెలిచిన సీట్ల సంఖ్యను సూచించే క్రింది ‘పై’ రేఖాచిత్రాన్ని పరిశీలించి రాజకీయ పార్టీల బలాబలాలను విశ్లేషించండి.
AP 10th Class Social Important Questions Chapter 19 రాజకీయ ధోరణుల ఆవిర్భావం 1977-2000 3
జవాబు:

  1. 2014 సాధారణ ఎన్నికలలో బి.జె.పి.కి 282 ఎం.పి. స్థానాలు లభించాయి.
  2. గతంలో పెద్ద పార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీ కేవలం 44 స్థానాలను మాత్రమే సాధించింది.
  3. ప్రాంతీయ పార్టీలైన ఎ.ఐ.ఎ.డి.ఎం.కె., తెలుగుదేశంలకు వరుసగా 37, 16 స్థానాలు లభించాయి.
  4. ఇతరులకు 140 స్థానాలు లభించాయి.

ప్రశ్న 3.
క్రింది సమాచారం చదవండి. సమాధానం రాయండి.

“పంజాబ్ లో తీవ్రవాదాన్ని అణచివెయ్యటానికి ప్రభుత్వం చాలా తీవ్ర పద్ధతులను ఉపయోగించింది. వీటిల్లో అనేకం పౌరుల రాజ్యాంగ హక్కులకు భంగం కలిగించాయని భావించారు. తీవ్రవాద కార్యకలాపాల వల్ల రాజ్యాంగ యంత్రాంగమే కుప్పకూలే అంచున ఉండటంతో మానవ హక్కుల, రాజ్యాంగ ఉల్లంఘన సమర్థనీయమే అని చాలామంది పరిశీలకులు భావించారు.”
పై సమాచారంపై మీ అభిప్రాయాన్ని వ్యక్తపరచండి.
జవాబు:
1. రాజ్యాంగ యంత్రాంగమే కుప్పకూలే అంచున ఉన్నప్పుడు మానవ హక్కుల, రాజ్యాంగ ఉల్లంఘన సమర్ధనీయమే అని నా అభిప్రాయం.
(లేదా)
2. కొంతమంది తీవ్రవాదుల వలన ఏర్పడే సంక్షోభం నుండి దేశాన్ని రక్షించడానికి సాధారణ పౌరులను బాధించకూడదు.

ప్రశ్న 4.
ఇచ్చిన దత్తాంశాన్ని చదివి ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
AP 10th Class Social Important Questions Chapter 19 రాజకీయ ధోరణుల ఆవిర్భావం 1977-2000 1
A) నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వాలలో అధికారాలు ఉండడానికి బయట నుండి మద్దతు ఇచ్చిన పార్టీలు ఏవి?
B) మూడు ప్రభుత్వాలలోను అధికారంలో కొనసాగిన పార్టీ ఏది?
జవాబు:
A) నేషనల్ ఫ్రంట్ కు బయట నుంచి మద్దతు ఇచ్చిన పార్టీలు :
1) సి.పి.ఎం.
2) సి.పి.ఐ.
3) బి.జె.పి.
యునైటెడ్ ఫ్రంట్ కు బయట నుంచి మద్దతు ఇచ్చిన పార్టీ సి.పి.యం.

B) జమ్మూ – కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ (JKNC)

ప్రశ్న 5.
ఇటీవలి కాలంలో ప్రాంతీయ పార్టీలు బలోపేతం కావటానికి దారితీసిన పరిస్థితులేవి?
జవాబు:

  1. జాతీయ నాయకత్వం సరిగా లేకపోవడమే ప్రధాన కారణం.
  2. ప్రాంతీయ, భాషా మతాభిమానాలు పెరిగిపోవడం.
  3. వివిధ ప్రజలకు ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహించే ప్రాంతీయ పార్టీలు ఆవిర్భవించడం.
  4. తమ ప్రాంత సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడటం కోసం కృషి చేయడం వలన.
  5. తమ ప్రాంతాన్ని బాగా అభివృద్ధి చేసుకోవాలనే కోరిక.
  6. తమకు స్వయం ప్రతిపత్తి కల్పించుకొని వారి గౌరవాన్ని కాపాడుకోవడం కోసం కృషి చేయడం వలన ప్రాంతీయ పార్టీలు బలోపేతము అయినాయి.

AP 10th Class Social Important Questions Chapter 19 రాజకీయ ధోరణుల ఆవిర్భావం : 1977-2000

ప్రశ్న 6.
ప్రస్తుత ప్రభుత్వాలు ప్రారంభించిన ప్రజా సంక్షేమ పథకాల గురించి వ్రాయుము.
జవాబు:
ప్రస్తుత ప్రభుత్వాలు ప్రారంభించిన ప్రజాసంక్షేమ పథకాలు :

  1. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం
  2. ఉపాధి హామీ పథకం
  3. వృద్ధాప్య పింఛను
  4. గృహ వసతి
  5. ప్రజాపంపిణీ వ్యవస్థ – పేదలకు రూపాయికే కిలో బియ్యం
  6. పేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంటు

ప్రశ్న 7.
ఈ క్రింది సమాచారాన్ని చదివి, క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
1980లో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వచ్చింది. వెంటనే తొమ్మిది రాష్ట్రాలలోని కాంగ్రెసేతర, జనతా ప్రభుత్వాలను రద్దుచేసి జనతా పార్టీ రీతిలోనే కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించింది. తమిళనాడు, పశ్చిమ బెంగాల్ లో మినహాయించి మిగిలిన అన్ని రాష్ట్రాలలో కాంగ్రెస్ విజయం సాధించింది.
ప్రశ్నలు :
A) 1980 కు ముందు ఏ పార్టీ అధికారంలో ఉంది?
జవాబు:
1980కి ముందు జనతాపార్టీ అధికారంలో ఉంది.

B) ఏ రెండు రాష్ట్రాలలో కాంగ్రెస్ ఓడిపోయింది?
జవాబు:
తమిళనాడు మరియు పశ్చిమ బెంగాల్ లలో కాంగ్రెస్ ఓడిపోయింది.

ప్రశ్న 8.
భారత ప్రజాస్వామ్యాన్ని అత్యవసర పరిస్థితి ఏవిధంగా వెనక్కు తీసుకుపోయింది?
జవాబు:

  1. ఐదు సంవత్సరాలకు ఒకసారి జరగవలసిన సాధారణ ఎన్నికలను వాయిదా వేశారు.
  2. ప్రాథమిక హక్కులు హరించివేయబడ్డాయి.
  3. పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగింది.
  4. రాజకీయ ప్రత్యర్థులను జైలుపాలు చేశారు.

పైన తెలిపిన అప్రజాస్వామిక చర్యల కారణంగా అత్యవసర పరిస్థితి కాలంలో ప్రజాస్వామ్యం వెనక్కి వెళ్ళిందని చెప్పవచ్చు.

ప్రశ్న 9.
ఈ క్రింది పట్టికను పరిశీలించి, ప్రశ్నలకు జవాబులు వ్రాయండి.

1. రాజీవ్ గాంధీ హత్య, పి.వి. నరసింహారావు ప్రధానమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వం 1991
2. ఆర్థిక సరళీకరణ విధానాలు 1990
3. బాబ్రీ మస్జిద్ కూల్చివేత 1992
4. దేవెగౌడ, ఐ.కె. గుజ్రాలు ప్రధానమంత్రులుగా నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం 1996
5. ఎ.బి. వాజ్ పేయి నేతృత్వంలో ఎన్.డి.ఏ. ప్రభుత్వం 1998

a) 1996 ఎన్నికలలో ఏ పార్టీ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది?
b) పై పట్టికలోని సంకీర్ణ ప్రభుత్వాలు ఏవి?
జవాబు:
a) నేషనల్ ఫ్రంట్
b) నేషనల్ ఫ్రంట్ మరియు NDA ప్రభుత్వాలు

ప్రశ్న 10.
ఈ క్రింది పట్టికను పరిశీలించి, విశ్లేషించండి.
పట్టిక : 2014 ఎన్నికలలో వివిధ పార్టీలు గెలిచిన లోకసభ స్థానాలు

రాజకీయ పార్టీ సాధించిన స్థానాలు
1. భారతీయ జనతా పార్టీ (BJP) 282
2. భారత జాతీయ కాంగ్రెస్ (INC) 45
3. తెలుగుదేశం పార్టీ (TDP) 16
4. తెలంగాణ రాష్ట్ర సమితి (TRS) 11
5. వామ పక్షాలు (CPI + CPI(M)] 10

జవాబు:
పట్టిక 2014 లోక్ సభ ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తోంది. భారతీయ జనతా పార్టీకు అత్యధిక మెజార్టీ రాగా వామపక్షాలు, మాత్రం అట్టడుగు స్థాయిలో మిగిలిపోయాయి.

ఎవరితో పొత్తు పెట్టుకోకుండానే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని కేంద్రంలో ఏర్పాటు చేయగలదు. దగ్గర దగ్గర ఐదు దశాబ్దాలు దేశాన్ని ఏలిన కాంగ్రెసు ద్వితీయ స్థానానికి, రెండంకెల స్థానానికి పడిపోయింది.

ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీ అయిన వామపక్షాల కంటే అధిక స్థానాలు గెలుచుకున్నాయి. గెలిచిన వారు వారిపై ప్రజలుంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. ఓడినవారు ఆత్మ విమర్శ చేసుకుని మళ్ళీ ఎన్నికలలో వారి ఉనికిని కాపాడుకోవాలి.

ప్రశ్న 11.
క్రింది సమాచారం ఆధారంగా దిగువ ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.

విపి సింగ్, చంద్రశేఖర్‌తో జనతాదళ్ ప్రభుత్వాల ఏర్పాటు 1989
మండల కమిషన్ సిఫారసుల అమలుకు నిర్ణయం 1989
రామజన్మభూమి రథయాత్ర 1990
రాజీవ్ గాంధీ హత్య, పివి నరసింహారావు ప్రధానమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వం 1991
ఆర్థిక సరళీకరణ విధానాలు 1990
బాబ్రీ మసీదు కూల్చివేత 1992
దేవెగౌడ, ఐకె గుజ్రాలు ప్రధానమంత్రులుగా నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం 1996
ఎబి వాజ్ పేయి నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం 1998

i) బాబ్రీ మసీదు కూల్చివేత సమయంలో గల ప్రధానమంత్రి పేరు తెలపండి.
జవాబు:
పి.వి. నరసింహారావు

ii) సంకీర్ణ ప్రభుత్వాలకు రెండు ఉదాహరణలివ్వండి.
జవాబు:

  1. జనతాదళ్ ప్రభుత్వం
  2. నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం
  3. NDA ప్రభుత్వం

AP 10th Class Social Important Questions Chapter 19 రాజకీయ ధోరణుల ఆవిర్భావం : 1977-2000

ప్రశ్న 12.
క్రింది రాజకీయ పార్టీలను “జాతీయ, ప్రాంతీయ” పార్టీలుగా వర్గీకరించండి.
బి.జె.పి., వై.యస్.ఆర్.సి.పి., టి.డి.పి., సి.పి.యమ్., సి.పి.ఐ., డి.యమ్.కె., కాంగ్రెస్-ఐ, ఎ.జి.పి.
జవాబు:

జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలు
భారతీయ జనతా పార్టీ D.M.K
కాంగ్రెస్ – (I) T.D.P
CPI A.G.P
CPM Y.S.R.C.P

ప్రశ్న 13.
క్రింది పట్టికను పరిశీలించి విశ్లేషిస్తూ ఒక పేరాగ్రాఫ్ రాయండి.
AP 10th Class Social Important Questions Chapter 19 రాజకీయ ధోరణుల ఆవిర్భావం 1977-2000 4
జవాబు:
పై పట్టిక ఏమి తెలియచేస్తుందంటే 2014 ఎన్నికలలో ముఖ్యమైన రెండు ప్రధాన పార్టీలు అయిన UPA కూటమి మరియు NDA కూటములు సాధించిన సీట్లను ఓట్ల శాతాన్ని ఇచ్చారు. 2014 ఎన్నికలలో UPA Congress కూటమి 19.31% ఓట్లు మరియు 44 లోకసభ స్థానాలను పొందింది. BJP 31% ఓట్లతో 282 స్థానాలను పొంది అతిపెద్ద పార్టీగా అవతరించినది. అది ఏమి తెలియచేస్తుందంటే స్వాతంత్ర్యానంతరం-1952 నుండి పరిపాలించిన పార్టీని కాదని BJP కి అధికారం ప్రజలు ఇచ్చారు.

దీనికి కారణం ప్రజలు మార్పును కోరుకుంటున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ లో అవినీతి రాజ్యం ఏలుతుంది. చాలామంది కాంగ్రెస్ నాయకులు కోర్టులలో అవినీతి కేసులను ఎదుర్కొంటున్నారు. ఇలాంటి తరుణంలో ప్రజలకు అవినీతి రహిత సమాజం, నూతన సంస్కరణలతో అభివృద్ధి చెందుతున్న సమాజం కావాలి. అందుకోసం వారు కొత్త పార్టీలకు అధికారం ఇవ్వడం జరిగింది. ఇకముందు రాబోయే ఎన్నికలలో ఏమి జరుగుతుందో చూద్దాం.

ప్రశ్న 14.
“సంకీర్ణ ప్రభుత్వాలు రాజకీయ అస్థిరతకు కారణమవుతున్నాయి.” – దీనిపై వ్యాఖ్యానింపుము.
జవాబు:

  1. కొన్నిసార్లు సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావలసినంత మెజారిటీ ఏ ఒక్క పార్టీకి రాదు. ఇటువంటి పరిస్థితులలో కొన్ని పార్టీలు కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పరుస్తాయి.
  2. ప్రభుత్వ విధానాలకు సంబంధించి ఈ పార్టీల మధ్య ఒక ఉమ్మడి ఒప్పందం కుదరాల్సి వస్తుంది. కానీ ఇది అంత తేలికైన పని కాదు.
  3. వేర్వేరు పార్టీలు తమ ప్రయోజనాల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాయి.
  4. ఏ పార్టీ మద్దతు ఉపసంహరించుకుంటుందో అన్న భయంతో ప్రభుత్వాలు ఏ విధానాన్ని అమలు చేయలేని స్థితి ఏర్పడుతుంది. ప్రభుత్వాలు అస్థిరాలు అవుతాయి.

ప్రశ్న 15.
‘కొన్నిసార్లు సంకీర్ణ ప్రభుత్వాల వల్ల ‘విధాన పక్షవాతం’ సంభవిస్తుంది. దీనితో ఏకీభవిస్తారా ? మీ అభిప్రాయం తెల్పండి.
జవాబు:
అవును. నేను దీనితో ఏకీభవిస్తాను. ఏదో ఒక భాగస్వామి మద్దతు ఉపసంహరించుకుంటుందన్న భయంతో తీవ్ర
మార్పులను తెచ్చే విధానాలను అమలు చెయ్యటానికి సంకీర్ణ ప్రభుత్వాలు భయపడతాయి.

ప్రశ్న 16.
భారతదేశంలో సరళీకృత ఆర్థిక విధానాలు అవలంబించడం వలన కలిగిన ఫలితాలేమిటి?
జవాబు:
భారతదేశంలో సరళీకృత ఆర్థిక విధానాలు – ఫలితాలు :

  1. విదేశీ సరుకులు భారత మార్కెట్లో ప్రవేశించాయి.
  2. చౌకగా లభించే విదేశీ ఉత్పత్తులతో పోటీపడలేక చాలా భారతీయ కర్మాగారాలు మూతపడ్డాయి.
  3. భారతీయ పారిశ్రామికవేత్తలు ప్రపంచస్థాయి తయారీదారులతో పోటీపడవలసి వచ్చింది.
  4. విదేశీ కంపెనీలు వచ్చి భారతదేశంలో సంస్థలు నెలకొల్పాయి.
  5. అనేక సబ్సిడీలకు కోతలు విధించారు.
  6. ప్రైవేటీకరణ పెరిగింది.

ప్రశ్న 17.
పంజాబ్ ఆందోళన గురించి రాయండి.
జవాబు:

  1. పంజాబ్ రాష్ట్రంలో స్వయం ప్రతిపత్తికి మరొక ఉద్యమం రూపుదిద్దుకొంది.
  2. ఇక్కడ కూడా అత్యధిక శాతం ప్రజలు మాట్లాడే భాష, మతమూ ఆధారంగా ప్రజల సమీకరణ జరిగింది.
  3. ఇక్కడ కూడా దేశాభివృద్ధిలో రాష్ట్రం పాత్రను విస్మరిస్తున్నారన్నదే పంజాబ్ ఆరోపణ.
  4. రాష్ట్రం ఏర్పడినప్పుడు తమకు అన్యాయం జరిగిందని వారు భావిస్తున్నారు.
  5. రాజధాని నగరమైన చండీగఢ్ కేంద్రపాలిత ప్రాంతంగా కాక తమ రాష్ట్రానికే చెందాలని కోరసాగారు.
  6. భాక్రానంగల్ ఆనకట్ట నుంచి ఎక్కువ నీళ్ళు కావాలని, సైన్యంలోకి ఎక్కువమంది సిక్కులను తీసుకోవాలని కూడా కోరసాగారు.

AP 10th Class Social Important Questions Chapter 19 రాజకీయ ధోరణుల ఆవిర్భావం : 1977-2000

ప్రశ్న 18.
రాజీవ్ గాంధీ చేపట్టిన శాంతి చర్యలు ఏవి?
జవాబు:
రాజీవ్ గాంధీ చేపట్టిన శాంతి చర్యలు :

  1. రాజీవ్ గాంధీ పంజాబ్, అసోం, మిజోరంలలో, పొరుగు దేశమైన శ్రీలంకలో కూడా శాంతి ప్రక్రియలు మొదలు పెట్టాడు.
  2. శ్రీలంకలో ఘర్షణ పడుతున్న ఇరుపక్షాల మధ్య శాంతి నెలకొల్పటానికి భారతదేశం తన సైన్యాన్ని పంపించింది.
  3. అయితే దీనికి అటు తమిళులు, ఇటు శ్రీలంక ప్రభుత్వమూ అంగీకరించకపోవటం వల్ల ఇదొక దుస్సాహస చర్యగా పరిణమించింది.
  4. అంతిమంగా భారతదేశం తన సైన్యాన్ని 1989లో వెనక్కి తీసేసుకుంది.

ప్రశ్న 19.
సంకీర్ణ రాజకీయాల శకం గురించి రాయుము.
జవాబు:

  1. 1990ల కాలంలో స్వాతంత్ర్యానంతర భారతదేశంలో చాలా కీలకమైన మార్పులు చోటుచేసుకున్నాయి.
  2. పోటీతో కూడిన బహుళ పార్టీ వ్యవస్థకు మార్పుతో మెజారిటీ స్థానాలు గెలిచి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే స్థితి ఏ ఒక్క పార్టీకీ లేదు.
  3. 1989 నుంచి జాతీయస్థాయిలో ఏర్పడిన ప్రభుత్వాలన్నీ సంకీర్ణ /మైనారిటీ ప్రభుత్వాలే.
  4. కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటానికి అనేక జాతీయ, ప్రాంతీయ పార్టీలు కలవవలసి వచ్చేది.
  5. దీని అర్థం అనేక పార్టీల రాజకీయ సిద్ధాంతాలను, కార్యక్రమాలను కలుపుకుని కనీస ఒప్పందాలకు రావలసివచ్చేది.

ప్రశ్న 20.
పశ్చిమ బెంగాలులో ఏర్పడిన వామపక్ష ప్రభుత్వం గురించి రాయుము.
జవాబు:

  1. వామపక్ష రాజకీయ పార్టీలైన భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ), ఫార్వర్డ్ బ్లాక్, రివల్యూషనరీ సోషలిస్టు పార్టీ, భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు (సి.పి.ఎం) వంటివి 1977లో పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ఎన్నికలలో గెలిచి సి.పి.ఎం.కి చెందిన జ్యోతిబసు నాయకత్వంలో వామపక్ష ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి.
  2. రాష్ట్రంలో అసంపూర్తిగా ఉండిపోయిన భూసంస్కరణలను పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ముందుగా చేపట్టినది.

ప్రశ్న 21.
ఆపరేషన్ బర్గాను గురించి వ్రాయుము.
జవాబు:

  1. 1978 జూన్లో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కౌలుదార్ల పేర్లను నమోదుచేసి వాళ్ల హక్కును కాపాడటానికి ఆపరేషన్ బర్గాను చేపట్టింది.
  2. కౌలుదార్లను బెంగాలీలో బర్గాదార్లు అంటారు.
  3. వీళ్ళు భూస్వాముల భూములను సాగుచేస్తూ పంటలో అధికభాగం వాళ్ళకి కౌలుగా చెల్లిస్తూ ఉండేవాళ్లు.
  4. పశ్చిమ బెంగాల్ లో గ్రామీణ జనాభాలో ఈ కౌలుదార్లు అధికసంఖ్యలో ఉండేవాళ్ళు.

ప్రశ్న 22.
సరళీకృత ఆర్థిక విధానంలోని ప్రధాన అంశాలు ఏవి?
జవాబు:

  1. ప్రభుత్వ ఖర్చును బాగా తగ్గించుకోవటం, రైతులకు ఇచ్చే సబ్సిడీలలో కోత, ప్రజాసేవలు, ఆరోగ్యం వంటి వాటిల్లో కూడా ప్రభుత్వ ఖర్చును తగ్గించుకోవటం.
  2. విదేశీ సరుకుల దిగుమతుల మీద పరిమితులను, పన్నులను తగ్గించుకోవటం.
  3. భారతదేశంలో విదేశీ పెట్టుబడులపై పరిమితులను తగ్గించుకోవటం.
  4. ఆర్థిక రంగంలోని అనేక రంగాలలో ప్రైవేటు పెట్టుబడిదారులకు అవకాశం కల్పించటం.

ప్రశ్న 23.
అత్యవసర పరిస్థితిని తొలగించి ఇందిరాగాంధీ చేపట్టిన చర్యలు ఏవి?
జవాబు:

  1. 1977 జనవరిలో ఎన్నికలను ప్రకటించారు.
  2. రాజకీయ ఖైదీలందరినీ ఇందిరాగాంధీ విడుదల చేసి స్వేచ్ఛ, కదలికలు, ప్రచార ఉద్యమాలు, సమావేశాలను అనుమతించని అన్ని నియంత్రణలను, సెన్సారును తొలగించారు.

ప్రశ్న 24.
1977 సాధారణ ఎన్నికల తరువాత ఏ ఏ రాష్ట్రాలలో, ఏ ఏ కాంగ్రెసేతర ప్రభుత్వాలు ఏర్పడ్డాయి?
జవాబు:
1977 సాధారణ ఎన్నికల తరువాత ఏర్పడిన కాంగ్రెసేతర ప్రభుత్వాలు:

  1. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, బీహార్‌లో జనతాపార్టీ
  2. పశ్చిమబెంగాల్ లో సి.పి.ఐ (ఎం)
  3. తమిళనాడులో డి.ఎం.కె గెలిచాయి.

ప్రశ్న 25.
1977 సాధారణ ఎన్నికల నాటి నుండి 1980 ఎన్నికల వరకు జాతీయస్థాయిలో జరిగిన రాజకీయ పరిస్థితిని వివరింపుము.
జవాబు:

  1. 1977 సాధారణ ఎన్నికలలో ప్రజాస్వామ్యాన్ని, స్వేచ్ఛని పునరుద్ధరిస్తామన్న ‘వాగ్దానంతో జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది.
  2. అంతర్గత విభేదాల కారణంగా దాని పాలన ప్రభావితం అయ్యింది.
  3. అంతర్గత కీచులాటలకు, ఫిరాయింపులకు ఈ పాలన గుర్తుండిపోయింది.
  4. పార్టీలో అంతర్గత కుమ్ములాటల వల్ల 3 సం||రాల లోపే ప్రభుత్వం పడిపోయి 1980లో తాజా ఎన్నికల నిర్వహణకు దారితీసింది.
  5. 1980లో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వచ్చింది.

ప్రశ్న 26.
1970 లో ఏర్పడ్డ కొన్ని ప్రతిపక్ష రాజకీయ పార్టీలు ఏవి?
జవాబు:
1970 లో ఏర్పడ్డ కొన్ని ప్రతిపక్ష రాజకీయ పార్టీలు :

  1. బి.ఎల్.డి – భారతీయ లోకదళ్ – ఉత్తరప్రదేశ్
  2. కాంగ్రెస్ (ఓ) – ఇందిరాగాంధీ విధానాలను వ్యతిరేకించిన కాంగ్రెస్లోని సంప్రదాయవాద వర్గం
  3. సి.పి.ఐ (ఎం) – భారతీయ కమ్యూనిస్టు పార్టీ (మార్కిస్టు)
  4. డి.ఎం.కె – ద్రవిడ మున్నేట్ర కజగం – తమిళనాడు
  5. జనసంఘ్ – ఉత్తరాది రాష్ట్రాలకు పరిమితమైంది.
  6. ఎస్.ఎ.డి – శిరోమణి అకాలీ దళ్ – పంజాబ్.

AP 10th Class Social Important Questions Chapter 19 రాజకీయ ధోరణుల ఆవిర్భావం : 1977-2000

ప్రశ్న 27.
ఈ క్రింది వాటిని భారతదేశ పటంలో గుర్తించండి.
1) ఆంధ్రప్రదేశ్
2) అసోం
3) పంజాబ్
4) తమిళనాడు
5) పశ్చిమబెంగాల్
6) ఉత్తరప్రదేశ్
7) నాగాలాండ్
8) మిజోరం
9) బీహార్
10) గుజరాత్
11) మహారాష్ట్ర
12) అయోధ్య
జవాబు:
AP 10th Class Social Important Questions Chapter 19 రాజకీయ ధోరణుల ఆవిర్భావం 1977-2000 8

ప్రశ్న 28.
భారత రాజ్యాంగంలోని 73వ సవరణకు సంబంధించిన ముఖ్యాంశాలు ఏవి?
జవాబు:

  1. స్థానిక స్వపరిపాలనకు రాజ్యాంగ గుర్తింపునిస్తూ 1992 సంవత్సరంలో P.V. నరసింహారావు ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేసింది.
  2. 73వ రాజ్యాంగ సవరణ గ్రామస్థాయిలో స్థానిక స్వపరిపాలనా ప్రభుత్వాలను కల్పించగా, 74వ రాజ్యాంగ సవరణ ” పట్టణ, నగరాలకు వాటి స్థాయిలో ప్రభుత్వాలను సార్వత్రిక వయోజన ఓటింగ్ హక్కు ద్వారా మొదటిసారి ఎన్నుకున్నారు.
  3. మొత్తం స్థానాలలో 1/3 వంతు స్త్రీలు, SC, ST లకు కూడా కొన్ని స్థానాలు రిజర్వ్ చేశారు.
  4. స్థానిక స్వపరిపాలనకు కొన్ని విధులు, అధికారాలు రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయానికి వదిలి పెట్టారు.

ప్రశ్న 29.
73వ రాజ్యాంగ సవరణ వల్ల స్థానిక సంస్థలకు ఉపయోగముంటుందని మీరు భావిస్తున్నారా? కారణాలు తెల్పండి.
జవాబు:

  1. 73వ రాజ్యాంగ సవరణ వల్ల స్థానిక సంస్థలకు తప్పనిసరిగా ప్రయోజనం ఉంటుంది.
  2. రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాలను గౌరవిస్తూ స్థానిక స్వపరిపాలనా ప్రభుత్వాలకు ఉండే విధులు, అధికారాలను రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయానికి వదిలిపెట్టారు.
  3. కొన్ని అంశాలలో కొంతమేర స్వయంప్రతిపత్తి స్థానిక ప్రభుత్వాలకు లభించింది.

ప్రశ్న 30.
నిరక్షరాస్యత ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తుందో మీ అభిప్రాయాన్ని తెల్పండి.
జవాబు:

  1. నిరక్షరాస్యత ప్రజాస్వామ్యంపై ఋణాత్మక ప్రభావాన్ని చూపిస్తుంది.
  2. నిరక్షరాస్యులు ఓటు ప్రాధాన్యతను అర్థం చేసుకోలేరు.
  3. ఎన్నికలలోని అనుచిత ప్రవర్తనలు నిరక్షరాస్యులను కేంద్రంగా చేసుకొని జరుపబడతాయి.
  4. ప్రజాస్వామ్యం విజయవంతం కాకపోవడానికి నిరక్షరాస్యత కారణమయ్యే ప్రమాదముంది.

ప్రశ్న 31.
రాజీవ్ గాంధీ అనుసరించిన సరళీకృత ఆర్థిక విధానం దేశాభివృద్ధికి దోహదపడిందని భావిస్తున్నారా? అభిప్రాయం తెల్పండి.
జవాబు:

  1. రాజీవ్ గాంధీ అనుసరించిన సరళీకృత ఆర్థిక విధానాలు దేశాభివృద్ధికి ఖచ్చితంగా దోహదం చేశాయని నేను భావిస్తున్నాను,
  2. ఆర్థిక రంగంలో రాజీవ్ గాంధీ భిన్నమైన పంథాను అనుసరించడానికి ప్రయత్నించాడు.
  3. 1986లో అతడి ప్రభుత్వం ప్రవేశపెట్టిన మొదటి బడ్జెట్ లో అమలులో ఉన్న కొన్ని నియంత్రణలను, పరిమితులను తొలగించి సరళీకృత ఆర్థిక విధానంవైపు పయనం మొదలు పెట్టాడు.
  4. ఆ తర్వాత అవే ప్రపంచీకరణకు, ‘టెలికం విప్లవానికి బాటలు వేయడం జరిగింది.

ప్రశ్న 32.
పేజి 268లోని ఆంధ్రప్రదేశ్ శీర్షిక కింద గల “ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రులను …….. అతడు వాదించాడు.” వరకు, చదివి, దానిపై వ్యాఖ్యానించండి.
జవాబు:
ఆ కాలంలో ఎన్.టి. రామారావుగారు ఆంధ్రప్రదేశ్, భారతదేశ రాజకీయాలలో ముఖ్యమైన పాత్ర పోషించారు. ఆయన నినాదం ‘తెలుగు వారి ఆత్మగౌరవం’ నాటికీ, నేటికీ అద్భుతమైనది. అప్పటి వరకు జాతీయ రాజకీయాలలో ఉత్తరాది వారే అధిక పాత్ర పోషిస్తున్నారు. కాని తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత జాతీయ రాజకీయాలలో ప్రాంతీయ పార్టీల హవా పెరిగింది. ముఖ్యంగా టి.డి.పి.ది.

ఎన్.టి.ఆర్ ప్రవేశపెట్టిన సబ్సిడీ బియ్యం పథకం, మద్యపాన నిషేధం మొదలైనవి ఆయన ప్రభుత్వ పనితనానికి ఉదాహరణలు – గర్వకారణాలు. ఆయన పార్టీలోనే కొంత వ్యతిరేకత ఉన్నప్పటికీ ఆయన దానిని సమర్థవంతంగా అణిచివేశారు.

10th Class Social 19th Lesson 4 Marks Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
అసోం ఉద్యమం గురించి రాయండి. అసోం ఉద్యమానికి గల ప్రధాన కారణాలు రాయండి.
జవాబు:

  1. అసోంలో అస్సామీ భాషే కాకుండా బెంగాలీ భాష కూడా ఎక్కువగా మాట్లాడతారు.
  2. బ్రిటిష్ పాలన నాటి నుంచి రాష్ట్ర పరిపాలనలోని కింది, మధ్య స్థాయి ఉద్యోగాలలో బెంగాలీలు ఉండేవారు.
  3. బెంగాలీ అధికారులు తమని సమానులుగా కాకుండా రెండవ తరగతి పౌరులుగా చూస్తున్నారని అస్సోమీయులు భావించేవారు.
  4. స్వాతంత్ర్యం తరువాత కూడా బెంగాలీలు అసోంలో ఎంతోమంది స్తిరపడ్డారు. దీనికి తోడు బంగ్లాదేశ్ నుంచి కూడా ఎంతోమంది వలసవచ్చి స్థానికులను అనేక ఇబ్బందులకు గురి చేయసాగారు.
  5. దీంతో స్థానిక ప్రజలు తమ సాంస్కృతిక మూలాలు కోల్పోతామని అసంతృప్తి చెంది 1970లో సామాజిక ఉద్యమాన్ని తెచ్చారు.

AP 10th Class Social Important Questions Chapter 19 రాజకీయ ధోరణుల ఆవిర్భావం : 1977-2000

ప్రశ్న 2.
దేశ విభజన నాటి నుండి రాజకీయాలను మతము ప్రభావితం చేస్తుంది అనడానికి నిదర్శనాలు రాయండి. .
జవాబు:

  1. 1947లో జరిగిన మత మారణహోమం నుండి భారతదేశం విభజింపబడి భారతదేశం, పాకిస్థాన్ అను రెండు దేశాలుగా అవతరించాయి.
  2. దేశ విభజన తరువాత మన దేశాన్ని లౌకిక రాజ్యంగా ప్రకటించినప్పటికి దేశ రాజకీయాలను మతము అనేక విధాలుగా ప్రభావితం చేస్తుంది.
  3. పంజాబ్ లో సిక్కు మతస్థులు ప్రత్యేక ఖలిస్థాన్ కావాలని మారణ హోమం సృష్టించారు. ఇది దేశ ప్రధాని ఇందిరాగాంధీ హత్యకు దారి తీసింది.
  4. షాబానో కేసులో ముస్లిం మత ఛాందసవాద వర్గాల ఒత్తిడికి తలొగ్గి కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్రభుత్వం చట్టం చేసిందని చాలామంది భావించారు.
  5. అయోధ్యలో వివాదాస్పద కట్టడమైన బాబ్రీ మసీదు ఉన్న స్థానములో రాముడికి గుడి కట్టాలని హిందువులు ఉద్యమం మొదలు పెట్టి బాబ్రీ మసీదును కూల్చివేశారు.

ప్రశ్న 3.
టెలి కమ్యూనికేషన్ రంగం మానవ జీవనంలో నేడు అనేక మార్పులు తెచ్చింది. వాటిని వివరించండి.
జవాబు:
టెలి కమ్యూనికేషన్ రంగం మానవ జీవనంలో తెచ్చిన మార్పులు :

  1. సమయం ఆదా అవుతుంది.
  2. వేగంగా సమాచారం అందించడం జరుగుతుంది.
  3. ఆన్లైన్ సర్వీసుల విస్తరణ జరిగింది.
  4. సుఖవంతమైన / విలాసవంతమైన జీవనానికి దారులు ఏర్పడ్డాయి.
  5. ప్రజలు ఫోనులకు, ఇంటర్నెట్లకు బానిసలు (అడిక్షన్) కావడం.
  6. కూర్చొనే సమయం పెరగడం వలన ఊబకాయం రావడం జరిగింది. (ఒబేసిటి)
  7. జీవన వ్యయం పెరిగింది.
  8. ఫోనులకు అతుక్కుపోవడం వలన మానవ సంబంధాలు దెబ్బతిన్నాయి.

ప్రశ్న 4.
దిగువ అంశాన్ని చదివి ప్రశ్నలకు సమాధానములు వ్రాయుము.

పంచాయితీ రాజ్ & 73 వ సవరణ

స్థానిక స్వపరిపాలనకు రాజ్యాంగ గుర్తింపునిస్తూ 1992 వ సంవత్సరంలో పి.వి. నరసింహారావు ప్రభుత్వము రాజ్యాంగ సవరణ చేసింది. 73వ రాజ్యాంగ సవరణ గ్రామ స్థాయిలో స్థానిక స్వపరిపాలనా ప్రభుత్వాలను కల్పించగా, 74వ రాజ్యాంగ సవరణ పట్టణ, నగరాలకు వాటి స్థాయిలో ప్రభుత్వాలను సార్వత్రిక వయోజన ఓటింగ్ ద్వారా మొట్టమొదటిసారి ఎన్నుకొన్నారు. మొత్తం స్థానాలలో మూడింట ఒక వంతు (1/3 వ వంతు) స్థానాలను స్త్రీలకు కేటాయించారు. షెడ్యూలు కులాలు, షెడ్యూలు జాతులకు కూడా కొన్ని స్థానాలను రిజర్వు చేశారు. రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాలను గౌరవిస్తూ స్థానిక స్వపరిపాలనా ప్రభుత్వాలకు ఉండే విధులు, అధికారాలను రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయానికి వదిలి పెట్టారు. అందువలన దేశవ్యాప్తంగా పనిచేసే స్థానిక స్వపరిపాలనా ప్రభుత్వాల అధికారాలలో తేడాలుంటాయి.

ప్రశ్నలు :
1) స్థానిక స్వపరిపాలన అంటే ఏమిటి?
2) స్థానిక సంస్థలకు రాజ్యాంగ గుర్తింపు నిచ్చిన ప్రభుత్వమేది?
3) 73వ రాజ్యాంగ సవరణ దేనికి సంబంధించినది?
4) స్థానిక సంస్థలలో 1/3 వంతు సీట్లు మహిళలకు కేటాయించడం సమర్ధనీయమా? చర్చించండి.
జవాబు:

  1. గ్రామ, పట్టణ మరియు నగర ప్రాంతాలలో ప్రజలు స్థానికంగా ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకొని తద్వారా వారికి గల ఉమ్మడి అవసరాలను తీర్చుకొనుటనే స్థానిక స్వపరిపాలన అంటారు.
  2. పి.వి. నరసింహారావు ప్రభుత్వం లేదా కాంగ్రెస్ ప్రభుత్వం
  3. గ్రామ స్థాయిలో స్థానిక స్వపరిపాలనకు సంబంధించినది.
  4. సమర్థనీయమే. రాజకీయ సమానత్వాన్ని సాధించడంకోసం మరియు వారిని స్థానిక పాలనలో భాగస్వాములను చేయుట కొరకు స్థానిక సంస్థలలో 1/3 వంతు సీట్లు కేటాయించడం సమర్ధనీయం.

ప్రశ్న 5.
ఈ క్రింది పట్టికను చదివి, ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
పార్లమెంట్ లో వివిధ రాజకీయ పార్టీల బలబలాలు

రాజకీయ పార్టీ పేరు సంవత్సరం 1952 సంవత్సరం 1962
1. భారత జాతీయ కాంగ్రెస్ 364 361
2. కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా 16 29
3. సోషలిస్టు పార్టీ 12 12
4. కిసాన్ మజ్జూర్ పార్టీ 09
5. పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ 07
6. గణతంత్ర పరిషత్ 06
7. ఇతరులు 38 27
8. స్వతంత్ర అభ్యర్థులు 37 20
9. జనసంఘ్ 18
10. ప్రజా సోషలిస్ట్ పార్టీ 12
11. DMK 07

a) ఏ ఏ రాజకీయ పార్టీలు పార్లమెంట్ లో తమ బలాలు 1952 కంటే 1962 లో ఎక్కువ పొందినాయి?
b) 1962 నాటికి కనుమరుగైన రాజకీయ పార్టీలు ఏవి?
c) 1952 మరియు 1962లో తమ బలాన్ని కోల్పోయిన రాజకీయ పార్టీలు ఏవి?
d) 1952 కంటే 1962 నాటికి తమ సంఖ్యాబలాన్ని కోల్పోయిన రాజకీయ పార్టీలు ఏవి?
జవాబు:
a) కమ్యూనిస్టు పార్టీ
b) 1) జనసంఘ్
2) ప్రజా సోషలిస్టు పార్టీ
3) DMK

c) 1962 – 1) కిసాన్ మజ్జూర్ పార్టీ
2) పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ (1952లో ఏ పార్టీ సీట్లను కోల్పోలేదు)
3) గణతంత్ర పరిషత్

d) ఇతరులు, స్వతంత్రులు, కాంగ్రెస్

AP 10th Class Social Important Questions Chapter 19 రాజకీయ ధోరణుల ఆవిర్భావం : 1977-2000

ప్రశ్న 6.
క్రింది పేరాను చదివి, అర్థం చేసుకొని వ్యాఖ్యానించుము.

భారతదేశంలోకి స్వేచ్ఛగా విదేశీ పెట్టుబడులు, వస్తువులను అనుమతించేలా భారత ఆర్థిక విధానం బలవంతంగా సరళీకృతం చేయబడింది. ఇంకొక వైపు కొత్త సామాజిక వర్గాలు మొదటిసారిగా తమ రాజకీయ అకాంక్షలను సాధించుకోటానికి ప్రయత్నించసాగాయి. అంతేగాకుండా రాజకీయ జీవితంలో మతపర జాతీయవాదం, మతం పేరుతో రాజకీయ సమీకరణలు ముఖ్యాంశాలుగా మారాయి. వీటన్నిటి కారణంగా భారతీయ సమాజం తీవ్ర కల్లోలానికి లోనయ్యింది. ఈ మార్పులను అర్థం చేసుకొని వాటిని అనుగుణంగా మారే ప్రయత్నంలోనే ఇంకా మనం ఉన్నాం.
జవాబు:
భారతదేశాన్ని సుస్థిరంగా, సమర్థవంతంగా, వేగవంతంగా అభివృద్ధి పరచడానికి ప్రణాళికలను అమలుపరచడం జరిగినది. దానివలన ప్రభుత్వ వ్యయం కూడా విపరీతంగా పెరిగిపోయింది. దానిని అధిగమించడానికి, భారతదేశంలోకి స్వేచ్చగా విదేశీ పెటుబడులు, వస్తువులను అనుమతించేలా భారత ఆర్థిక విధానం బలవంతంగా సరళీకృతం చేయబడింది.

దానికోసం ప్రజాసేవకు అయ్యే ఖర్చు మరియు రైతులకు ఇచ్చే సబ్సిడీలలో కోత విధించడం జరిగింది. అప్పుడే అభివృద్ధి చెందుచున్న మధ్య తరగతి కులాలవారు రాజకీయ పార్టీలను ప్రారంభించడం వారి ఆకాంక్షలను నెరవేర్చుకోవాలనుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా, మతం పేరుతో రాజకీయ, సమీకరణలు చేయడం జరిగింది. వీటన్నింటి కారణంగా సమాజంలో చాలా సమస్యలు ఎదురైనాయి. రిజర్వేషన్ కూడా ఒక సమస్యే. ప్రస్తుతం మన పరిస్థితి ఏమిటంటే ప్రస్తుత సమాజంలో జరిగే మార్పులకు అనుగుణంగా మనం మారడమే.

ప్రశ్న 7.
సరళీకృత ఆర్థిక విధానాల కారణంగా భారతదేశంలోకి విదేశీ సరుకులు రావటంతో భారతీయ పారిశ్రామికవేత్తలకు ప్రపంచ ఉత్పత్తిదారులలో పోటీ పడక తప్పలేదు. దీని వల్ల విదేశీ కంపెనీలు భారతదేశంలో పరిశ్రమలను నెలకొల్పి వ్యాపారాలు మొదలు పెట్టాయి. అయితే ప్రభుత్వం ప్రజలకు ఇచ్చే సబ్సిడీలలో కోత విధించడం వల్ల చౌక విదేశీ సరుకులు వెల్లువెత్తడంతో ఇక్కడ అనేక కర్మాగారాలు మూతపడడం వల్ల సాధారణ ప్రజలు, ఎన్నో కష్టాలకు గురయ్యారు. విద్య, ఆరోగ్యం, రవాణా వంటి అనేక ప్రభుత్వ సదుపాయాల ప్రవేటీకరణకు కూడా ఇది, దారితీయటంతో ఈ సేవలు అందించే ప్రవేటు వ్యక్తులకు ప్రజలు పెద్ద మొత్తంలో డబ్బులు/రుసుం చెల్లించాల్సి వస్తోంది.
ప్రశ్న : సరళీకృత ఆర్థిక విధానాల ఫలితాలపై మీ అభిప్రాయాన్ని వ్రాయుము.
జవాబు:

  1. భారతదేశము ప్రపంచ మార్కెట్ లోకి లాగబడింది.
  2. సరళీకరణ సమాచార విప్లవానికి దారితీసింది.
  3. ప్రపంచ ఉత్పత్తిదారులతో భారతీయ వ్యాపారులు పోటీపడవలసి వచ్చింది.
  4. ప్రభుత్వం ప్రజలకు ఇచ్చే సబ్సిడీలలో కోత విధించవలసి వచ్చినందున ప్రజలకు, స్థానిక పరిశ్రమలకు తీవ్ర నష్టం వాటిల్లింది.
  5. విద్య, ఆరోగ్యము, రవాణా వంటి అనేక ప్రభుత్వ సదుపాయాల ప్రైవేటీకరణకు దారితీసింది.
  6. ప్రపంచీకరణకు మార్గం సుగమమైంది.
  7. సరళీకృత ఆర్థిక విధానాల వల్ల సంపన్న వర్గాల వారికి మాత్రమే ఎక్కువ మేలు జరిగిందని చెప్పవచ్చు.

ప్రశ్న 8.
క్రింది సమాచారాన్ని చదివి, క్రింది ప్రశ్నలకు సమాధానములు వ్రాయుము.
AP 10th Class Social Important Questions Chapter 19 రాజకీయ ధోరణుల ఆవిర్భావం 1977-2000 5
i) ఏ రాష్ట్రం నుండి జార్ఖండ్ రాష్ట్రం ఏర్పడింది?
జవాబు:
బీహార్

ii) ఉత్తరాఖండ్ రాష్ట్రం యొక్క ఒక ప్రత్యేకతను తెల్పండి.
జవాబు:
సంస్కృతం ఒక అధికార భాషగా ఉండటం.

iii) నవంబర్ 1, 2000 సంవత్సరంలో ఏర్పడిన రాష్ట్రం ఏది?
జవాబు:
ఛత్తీస్ గఢ్

iv) మధ్యప్రదేశ్ నుండి వేరుబడిన రాష్ట్రమేది?
జవాబు:
ఛత్తీస్ గఢ్

ప్రశ్న 9.
క్రింది పట్టికను పరిశీలించి, సంకీర్ణ ప్రభుత్వాల ధోరణిని విశ్లేషించండి.
AP 10th Class Social Important Questions Chapter 19 రాజకీయ ధోరణుల ఆవిర్భావం 1977-2000 6
జవాబు:

  1. పై పట్టికలో 1989వ సం||ము నుండి 2004 వరకు సంకీర్ణ ప్రభుత్వాల ధోరణి ఏ విధంగా ఉందో తెలియచేయడం జరిగినది.
  2. మూడు సంకీర్ణ ప్రభుత్వాలు మరియు వాటి పాలనా కాలం గురించి ఇవ్వబడింది.
  3. 1989 మరియు 1990 లలో జనతాదళ్, నేషనల్ ఫ్రంట్ అనే సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినది. దానిలో JD, DMK, AGP, TDP, JINC లు అధికార పార్టీలుగా మరియు CPM, CPI, BJP లు మద్దతు పార్టీలుగా ఉన్నాయి.
  4. 1996 – 1998 సం||ల మధ్యకాలంలో యునైటెడ్ ఫ్రంట్ అనే ఇంకొక సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. దానిలో JKNC. TDP. TMC, CPI, AGP, DMK, MGP లు అధికార పార్టీలుగా, CPM మద్దతుదారుగా ఉంది.
  5. 1998 – 2004 ల మధ్యకాలంలో నేషనల్ డెమోటిక్ అలయెన్స్ అనే ఇంకొక సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. , దానిలో JDU, SAD, TMC, AIADMK, JKNC, BJD, శివసేన లు అధికార పార్టీలుగా, TDP మద్దతుదారుగా ఉంది.
  6. స్వాతంత్ర్యానంతరం, 1990 సంవత్సరం నుండి మన రాజకీయాలలో చాలా గమనించదగ్గ మార్పులు వచ్చాయి.
  7. బహుళ రాజకీయ పార్టీలు వాటి మధ్య పోటీ చివరకు ఏ పార్టీకి ఎన్నికలలో ఆధిక్యం రాని పరిస్థితి ఏర్పడినది.
  8. 1989 నుండి 2004 వరకు ఎక్కువగా మనం సంకీర్ణ రాజకీయ పార్టీలు మరియు సంకీర్ణ ప్రభుత్వాలనే చూడటం జరుగుతుంది.
  9. ఇది ప్రజల యొక్క ఆలోచనను తెలియచేస్తుంది. రాజకీయ పార్టీలు బాధ్యతగా వ్యవహరించాలని తెలియచేస్తుంది.

ప్రశ్న 10.
ఈ క్రింది పేరాను చదివి, మీ అభిప్రాయం రాయండి.

20వ శతాబ్దం ముగింపులో భారతదేశం ప్రపంచ మార్కెట్ లోకి లాగబడింది. ఈ భారతదేశంలో ఒక వైపున జనాభాలోని వివిధ వర్గాల గొంతులు వినిపించే ప్రజాస్వామ్యం విలసిల్లుతోంది. ఇంకో వైపున ప్రజలను విభజించే, మతపర రాజకీయ సమీకరణల వల్ల సామాజిక శాంతికి ముప్పు పొంచి ఉంది. యాభై ఏళ్ళకు పైగా అది కాలపరీక్షకు నిలబడింది. ఎంతో కొంత స్థిర ఆర్థిక పరిస్థితిని సాధించింది. ప్రజాస్వామిక రాజకీయాలు బలంగా వేళ్లూనుకున్నాయి. తీవ్ర పేదరికాన్ని, కులాలు, మతాలు, ప్రాంతాలు, స్త్రీ-పురుషుల మధ్య తీవ్ర అసమానతల్ని ఇది ఇంకా పరిష్కరించలేదు.
జవాబు:
పైన ఇవ్వబడిన పేరాగ్రాఫ్ ప్రజలను విభజించే మరియు మతపరమైన రాజకీయాలను గురించి వర్ణించడం జరిగినది. ఇవి సామాజిక శాంతికి ముప్పును కలిగిస్తాయి. మనకు స్వాతంత్ర్యం వచ్చిన మొదటి 30 మరియు 40 సంవత్సరాల వరకు సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పడినది. ఆ తరువాతే అస్థిర ప్రభుత్వాల కాలం మొదలైనది. ప్రధాన సమస్యలైన పేదరికం, ఆర్థిక అసమానతలు మొ|| వాటిని ఇంకా పరిష్కరించలేదు.

నా అభిప్రాయములో రాజకీయాలు అనేవి ఓటు, బ్యాంకు మీద ఆధారపడి ఉన్నవి. మన దేశంలో కొన్ని సందర్భాలలో మతపరమైన గొడవలు జరిగిన సందర్భములో వాటి వెనుక కొందరు రాజకీయ నాయకుల పాత్ర కలదు. ముఖ్యమంత్రులను పదవి నుండి దింపడానికి, ఆ పార్టీకి చెందిన నాయకులే మత విద్వేషాలను రెచ్చగొట్టిన సందర్భాలు మనదేశంలో కలవు.

మన దేశంలో కుల ఆధారిత రాజకీయాలు నడుస్తాయి. ఆ ప్రాంతంలో ఏ కులంవారు ఎక్కువగా ఉంటే వారికి అక్కడ సీట్లు కేటాయించడం మరియు ఆ కులాలు గ్రూపులుగా ఏర్పడి ఎన్నికలలో అనుచిత చర్యలకు పాల్పడటం జరుగుతుంది. కొన్ని నియోజక వర్గాలలో ప్రత్యేకంగా కొన్ని మతాల వారు ప్రాతినిధ్యం వహించడం, వారి పెత్తనం చలాయించడం జరుగుచున్నది. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్య అభివృద్ధికి ఆటంకంగా తయారవుతున్నాయి.

కావున ప్రజలు, పార్టీలు రాజకీయాలలో కులం, మతం ప్రస్తావనలకు దూరంగా ఉంటే దేశం చాలా బాగా అభివృద్ధి చెందుతుంది.

AP 10th Class Social Important Questions Chapter 19 రాజకీయ ధోరణుల ఆవిర్భావం : 1977-2000

ప్రశ్న 11.
ప్రజాస్వామ్యంలో ప్రాంతీయ పార్టీ యొక్క ప్రాముఖ్యతను వివరించండి.
జవాబు:

  1. జాతీయ, ప్రాంతీయ పార్టీలతో కూడిన బహుళ పార్టీ వ్యవస్థ ప్రజాస్వామ్యాన్ని బలపరుస్తుంది.
  2. సమాఖ్య రాజ్యస్ఫూర్తిని ప్రాంతీయ పార్టీలు ప్రతిబింబిస్తాయి.
  3. ప్రాంతీయ పార్టీలు ఆయా రాష్ట్రాల సమస్యలు, అవసరాలపట్ల మంచి అవగాహన కలిగి ఉంటాయి.
  4. అవి తమ స్వీయ రాష్ట్రాల అభివృద్ధిపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తాయి.

ప్రశ్న 12.
సంకీర్ణ రాజకీయాల శకం ప్రారంభం కావడానికి గల కారణాలతో పాటు దాని ప్రభావాన్ని వివరించండి.
జవాబు:
సంకీర్ణ రాజకీయాల శకం ప్రారంభం కావడానికి గల కారణాలు :

  1. బహుళపార్టీ వ్యవస్థ
  2. ఏ పార్టీకి కావలసినంత మెజారిటీ రాకపోవడం
  3. ప్రాంతీయ పార్టీల ప్రాబల్యం పెరగడం.
  4. 1960ల తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రజల మద్దతును క్రమంగా కోల్పోవడం.

ప్రభావం :

  1. రాజకీయ స్థిరత్వం లేకపోవడం
  2. రాజకీయ సిద్ధాంతాలను వదులుకోవడం
  3. జాతి ప్రయోజనాలకన్న పార్టీ ప్రయోజనాలకు ప్రాముఖ్యత ఇవ్వడం.
  4. అత్యధిక ప్రజల మద్దతు లేకపోయినప్పటికీ అధికారంలోకి రావడం.

ప్రశ్న 13.
షాబానో కేసులో 1985లో సుప్రీం కోర్సు ఇచ్చిన తీర్పు, “అన్యాయానికి గురవుతున్న మహిళలకు జరుగుతున్న అన్యాయాలను ఇది అరికడుతుందనే” మహిళా ఉద్యమ నాయకుల వాదనను మీరు సమర్థిస్తారా? కారణాలు తెలపండి.
జవాబు:

  1. భర్త నుంచి విడాకులు పొందిన షా బానో అన్న మహిళ వేసిన కేసులో 1985లో సుప్రీంకోర్టు ఆమె మాజీ భర్త ఆమెకు భరణం చెల్లించాలని తీర్పు ఇచ్చింది.
  2. ప్రగతిశీల ముస్లిములు ఈ తీర్పును స్వాగతించారు.
  3. అయితే ఇతరులు ఈ తీర్పు ఇస్లామిక్ చట్టంలో జోక్యం చేసుకుంటోందనీ, దీనిని అనుమతిస్తే తమ మత జీవితంలో జోక్యం మరింత పెరుగుతుందని నిరసనలు చేపట్టారు.
  4. మహిళా ఉద్యమ నాయకులు, ముస్లిం సమాజంలో సంస్కరణలు కోరుకుంటున్న సభ్యులు ఏకపక్షంగా భర్తలతో విడాకులు ఇవ్వబడి అన్యాయానికి గురవుతున్న మహిళలకు జరుగుతున్న అన్యాయాలను ఇది అరికడుతుందని వాదించసాగారు.

ప్రశ్న 14.
రామ జన్మభూమి – బాబ్రీ మసీదు వివాదంపై నీ అభిప్రాయమేమిటి?
జవాబు:

  1. అయోధ్యలో వివాదాస్పద కట్టడమైన బాబ్రీ మసీదు ఉన్న స్థానంలో రాముడికి గుడి కట్టాలని కొంతమంది హిందువులు ఉద్యమం మొదలుపెట్టారు.
  2. అది రాముని జన్మస్థలం అని, అంతకుముందు అక్కడ ఉన్న గుడిని పడగొట్టి మసీదు కట్టారని వాళ్ల వాదన.
  3. బాబ్రీ మసీదు నిర్వాహకులు ఇది నిజం కాదని, ఇది ముస్లింల ప్రార్థనాస్థలమని పేర్కొన్నారు.
  4. ఈ వివాదం కొంతకాలంగా సాగుతోంది. అంతిమ నిర్ణయం తీసుకునేదాకా సంవత్సరంలో ఒక రోజు తప్పించి మసీదును మూసి ఉంచాలని ఆదేశించింది.
  5. 1986లో కోర్టు తీర్పు ఇస్తూ మసీదుని సంవత్సరం పొడవునా తెరచి ఉంచవచ్చని, హిందువులను రోజువారీ పూజలకు అనుమతించాలని ఆదేశించింది.

ప్రశ్న 15.
రాజకీయాలలో మత వినియోగం గురించి బి.జె.పి అభిప్రాయాన్ని రాయుము.
జవాబు:

  1. జనాభా సంఖ్యలో అత్యధికులు అంటే హిందువుల మత అస్తిత్వం ఆధారంగా దేశాన్ని నిర్మించాలన్న రాజకీయ ధోరణికి భారతీయ జనతా పార్టీ నేతృత్వం వహిస్తోంది.
  2. ప్రజాస్వామ్యం, లౌకికవాదం వంటివి పాశ్చాత్య భావాలని, ఇవి సరిపోవని పురాతన భారతీయ సంస్కృతి నుంచి మనం ఎంతో నేర్చుకోవాలని ఈ పార్టీ విశ్వసిస్తుంది.
  3. అయితే మత గురువులు నడిపే మతపరమైన రాజ్యా నికి బి.జె.పి వ్యతిరేకం.
  4. లౌకికరాజ్యం అల్పసంఖ్యాక వర్గాలకు మాత్రమే ప్రత్యేక సదుపాయాలు కల్పించకూడదు.
  5. దేశ ప్రజలందరిని సమదృష్టితో చూడాలని బి.జె.పి లౌకికవాద స్వరూపం చర్చను ప్రారంభించింది.

ప్రశ్న 16.
భారత ప్రజాస్వామ్యం విజయవంతం అయ్యిందని ఎలా చెప్పగలవు?
జవాబు:
భారత ప్రజాస్వామ్యం అనేక సవాళ్ళను ఎదుర్కొని నిలిచిందని, ఆ ప్రక్రియలో అది మరింత బలపడిందని చెప్పవచ్చును.
కారణాలు:

  1. క్రమం తప్పకుండా జరిగే స్వేచ్ఛాయుత, న్యాయబద్ధమైన ఎన్నికలు
  2. ఎన్నికలలో ఓటు వేసేవాళ్ల సంఖ్య క్రమంగా పెరుగుతుండటం
  3. ప్రభుత్వాల మార్పు.
  4. కొత్త గ్రూపుల సాధికారీకరణ
  5. పౌర హక్కులను కాపాడటం వంటి అంశాలు.

AP 10th Class Social Important Questions Chapter 19 రాజకీయ ధోరణుల ఆవిర్భావం : 1977-2000

ప్రశ్న 17.
కాంగ్రెస్ ఏకైక పార్టీ కాదనే వాదనను సమర్ధిస్తూ, ప్రత్యామ్నాయాలను చర్చించండి.
జవాబు:
కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఏర్పడిన ప్రత్యామ్నాయాలు :

  1. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా అన్ని ప్రధాన ప్రతిపక్ష పార్టీలు కలిసి పోటీ చెయ్యాలని నిర్ణయించాయి.
  2. కాంగ్రెస్ (ఓ), స్వతంత్ర పార్టీ, భారతీయ జనసంఘ్, భారతీయ లోకదళ్, సోషలిస్టు పార్టీలు విలీనమై జనతా పార్టీగా ఏర్పడాలని నిర్ణయించాయి.
  3. జగజ్జీవన్‌రాం వంటి ముఖ్యమైన కాంగ్రెస్ నేతలు ఆ పార్టీని వీడి కాంగ్రెస్ వ్యతిరేక వేదికతో చేరారు.
  4. ఇతర ప్రధాన ప్రతిపక్ష పార్టీ డి.ఎం.కె, ఎస్.ఎ.డి., సి.పి.ఐ (ఎం) వంటివి తమ ఉనికిని కొనసాగించాలనీ, అయితే ‘కాంగ్రెస్ వ్యతిరేక వేదికలో, జనతా పార్టీకి మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నాయి.
  5. కాంగ్రెస్ వ్యతిరేక, అత్యవసర పరిస్థితి వ్యతిరేక పార్టీలు అన్నీ ఒక తాటి కిందకు వచ్చి ఎన్నికలలో పోటీ చేయడం జయప్రకాష్ నారాయణ్, ఆచార్య జె.బి. కృపలాని వంటి సీనియర్ నాయకులు ముఖ్యపాత్ర పోషించారు.

ప్రశ్న 18.
జనాభా సంఖ్యలో అత్యధికులు అంటే హిందువుల మత అస్తిత్వ ఆధారంగా దేశాన్ని నిర్మించాలన్న రాజకీయ ధోరణికి భారతీయ జనతా పార్టీ నేతృత్వం వహిస్తోంది. ప్రజాస్వామ్యం, లౌకికవాదం వంటివి పాశ్చాత్య భావాలని, ఇవి సరిపోవని, పురాతన భారతీయ సంస్కృతి నుంచి మనం నేర్చుకోవాలని ఈ పార్టీ విశ్వసిస్తుంది. అయితే మతగురువులు నడిపే మతపరమైన రాజ్యానికి బి.జె.పి వ్యతిరేకం. లౌకికరాజ్యం అల్పసంఖ్యాక వర్గాలకు మాత్రమే ప్రత్యేక సదుపాయాలు కల్పించడం కాకుండా, దేశ ప్రజలందరినీ సమదృష్టితో చూస్తూ ఒకే పౌర చట్టాన్ని అమలు చేయాలని బి.జె.పి లౌకికవాద స్వరూపం చర్చను ప్రారంభించింది.

1980ల వరకు భారత రాజకీయాలలో ఈ ధోరణి నామమాత్రంగా ఉండేది. ఉదాహరణకు 1984 లోకసభ ఎన్నికలలో వీళ్లు రెండు సీట్లు మాత్రమే గెలిచారు. అయితే అయోధ్య అంశాన్ని – రాముడు పుట్టిన ప్రదేశమంటూ మసీదు ఉన్నచోట గుడి కట్టటానికి ఉద్యమాన్ని చేపట్టటంతో బి.జె.పికి ఆదరణ గణనీయంగా పెరిగింది. ఈ అంశాలకు మద్దతుగా బి.జె.పి నాయకుడైన ఎల్.కె. అద్వాని 1990లో సోమనాథ్ నుంచి అయోధ్య వరకు ‘రథయాత్ర’ చేపట్టాడు. ఈ లౌకికవాద రాజకీయాలు అల్పసంఖ్యాక వర్గాలను, ప్రత్యేకించి ముస్లిములను సంతృప్తి పరచటానికి ప్రయత్నించి, అధిక సంఖ్యలో ఉన్న హిందువులను నిర్లక్ష్యం చేస్తున్నాయని వాదించసాగారు. ఈ ఉద్యమ సమయంలో ప్రజలు పలుపాంత్రాలలో మతపరంగా చీలిపోయారు. పెద్ద ఎత్తున మతపరమైన అల్లర్లు చెలరేగాయి. బీహార్ లో అద్వానీని అరెస్టు చెయ్యటంతో ఈ యాత్ర ముగిసింది. దీనికి ప్రతిగా వి.పి.సింగ్ ప్రభుత్వానికి బి.జె.పి తన మద్దతును ఉపసంహరించుకుని ముందుగానే ఎన్నికలు జరిపేలా చేసింది.

శ్రీలంకకు భారతీయ సైన్యాన్ని పంపించటంలో అతని పాత్రకు ప్రతీకారంగా శ్రీలంకలోని తమిళ వేర్పాటువాద బృందమైన ఎల్‌టిటిఇ చేతిలో ఈ ఎన్నికల ప్రచారంలో రాజీవ్ గాంధీ హత్యకు గురయ్యాడు. ఆ తరువాత కురిసిన సానుభూతి వెల్లువలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అయితే లోకసభలో బి.జె.పి బలం 120కి పెరిగింది. రామాలయ ప్రచారంలో సమీకరింపబడిన పెద్దగుంపు 1992లో అయోధ్యకు చేరి మసీదును ధ్వంసం చేసింది. ఈ ఘటన తరువాత తీవ్ర నిరసనలు, మతకల్లోలాలు చెలరేగాయి. చాలా ప్రాణనష్టం జరిగింది.
“రాజకీయాలలో మత వినియోగంపై” నీ అభిప్రాయమేమిటి?
జవాబు:
దేశ విభజన సమయంలో రాజకీయ రంగం నుంచి మతాన్ని వేరుచేయటానికి కొంత ప్రయత్నం జరిగింది. అయితే ఆ , తరువాత రాజకీయాలలో మత ప్రమేయం కనిపించింది. రాజకీయ ప్రయోజనాల కోసం మతాన్ని వాడుకోవడం మొదలయ్యింది.

జనాభా సంఖ్యలో అత్యధికంగా ఉన్న హిందువుల మత ఆధారంగా దేశాన్ని నిర్మించాలని భారతీయ జనతా పార్టీ అభిప్రాయం. ప్రజాస్వామ్యం, లౌకికవాదం వంటివి పాశ్చాత్య భావాలని, పురాతన భారతీయ సంస్కృతి నుంచి మనం నేర్చుకోవాలని ఈ పార్టీ విశ్వసిస్తుంది. అయితే 1980 వరకు నామమాత్రంగా ఉన్న ఈ ధోరణి “అయోధ్య రాముడు పుట్టిన ప్రదేశమంతటా మసీదు ఉన్నచోట గుడి కట్టటానికి ఉద్యమాన్ని చేపట్టటంతో ఒక్కసారిగా బి.జె.పి.కి ఆదరణ పెరిగింది. దీనికి మద్దతుగా బి.జె.పి. నాయకుడు ఎల్.కె. అద్వాని 1990లో సోమనాథ్ నుంచి అయోధ్య వరకు “రథయాత్ర” చేశాడు. అంతేకాక లౌకికవాద రాజకీయాలు, అల్పసంఖ్యాక వర్గాలను, ప్రత్యేకించి ముస్లిములను సంతృప్తి, పరచటానికి ప్రయత్నించి, అధిక సంఖ్యలో ఉన్న హిందువులను నిర్లక్ష్యం చేస్తున్నామని వీరు వాదించారు.

ఈ అయోధ్య అంశంలో పెద్ద ఎత్తున మతపరమైన అల్లర్లు జరిగాయి. ప్రజలు చాలా ప్రాంతాలలో మతపరంగా చీలిపోయారు. చివరికి 1992లో అయోధ్యలోని మసీదును ధ్వంసం చేసారు. ఈ ఘటన తరువాత తీవ్ర నిరసనలు, మతకల్లోలాలు చెలరేగాయి. చాలా ప్రాణనష్టం కూడా జరిగింది..

ఈ విధంగా రాజకీయాలలో మతాన్ని వినియోగించి, ప్రాబల్యాన్ని పెంచుకున్నారు.

ప్రశ్న 19.
స్థానిక స్వపరిపాలనకు రాజ్యాంగ గుర్తింపునిస్తూ 1992వ సంవత్సరంలో పి.వి.నరసింహారావు ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేసింది. 73వ రాజ్యాంగ సవరణ గ్రామస్థాయిలో స్థానిక స్వపరిపాలనా ప్రభుత్వాలను కల్పించగా, 74వ రాజ్యాంగ సవరణ పట్టణ, నగరాలకు వాటి స్థాయిలో ప్రభుత్వాలను సార్వత్రిక వయోజన ఓటింగ్ ద్వారా మొట్టమొదటిసారి ఎన్నుకున్నారు. మొత్తం స్థానాలలో మూడింట ఒకవంతు (1/3వ వంతు) స్థానాలను స్త్రీలకు కేటాయించారు. షెడ్యూలు కులాలు, షెడ్యూలు జాతులకు కూడా కొన్ని స్థానాలను రిజర్వు చేసారు.
ఇచ్చిన పేరాను అధ్యయనం చేసి, ఈ క్రింది ప్రశ్నలకు సమాధానాలిమ్ము.
ఎ. రాజ్యాంగంలోని ఏ రాజ్యాంగ సవరణ స్థానిక స్వపరిపాలనకు గుర్తింపునిచ్చింది?
జవాబు:
73వ రాజ్యాంగ సవరణ స్థానిక స్వపరిపాలనకు గుర్తింపు ఇచ్చింది.

బి. పట్టణాలు, నగరాలలో ఏ రాజ్యాంగ సవరణ ప్రకారం మొదటిసారిగా సార్వత్రిక వయోజన ఓటింగ్ ద్వారా ఎన్నికలు జరిగాయి?
జవాబు:
74వ రాజ్యాంగ సవరణ ప్రకారం పట్టణాలు, నగరాలలో మొదటిసారిగా సార్వత్రిక వయోజన ఓటింగ్ ద్వారా ఎన్నికలు జరిగాయి.

సి. స్థానిక సంస్థలలో మొత్తం స్థానాలలో స్త్రీలకు ఎన్నవ వంతు కేటాయించారు?
జవాబు:
స్థానిక సంస్థలలో స్త్రీలకు 1/3వ వంతు కేటాయించారు.

ప్రశ్న 20.
ఈ కింది పట్టికను పరిశీలించి, ఈ క్రింది ప్రశ్నలకు సమాధానాలిమ్ము.
AP 10th Class Social Important Questions Chapter 19 రాజకీయ ధోరణుల ఆవిర్భావం 1977-2000 9
ఎ) టి.డి.పి. ఏ సంవత్సరంలో ఏర్పాటైనది?
జవాబు:
టి.డి.పి. 1982లో ప్రారంభమైంది.

బి) ఇందిరాగాంధీ హత్య ఏ సంవత్సరంలో జరిగింది?
జవాబు:
ఇందిరాగాంధీ హత్య 1984లో జరిగింది.

సి) ఆర్థిక సరళీకరణ విధానాలు ఎప్పుడు జరిగినవి?
జవాబు:
ఆర్థిక సరళీకరణ విధానాలు 1984లో జరిగినవి.

AP 10th Class Social Important Questions Chapter 18 స్వతంత్ర భారతదేశం (మొదటి ముప్ఫై సంవత్సరాలు-1947-1977)

These AP 10th Class Social Studies Important Questions 18th Lesson స్వతంత్ర భారతదేశం (మొదటి ముప్ఫై సంవత్సరాలు-1947-1977) will help students prepare well for the exams.

AP Board 10th Class Social 18th Lesson Important Questions and Answers స్వతంత్ర భారతదేశం (మొదటి ముప్ఫై సంవత్సరాలు-1947-1977)

10th Class Social 18th Lesson ½ Mark Important Questions and Answers in Telugu Medium

1. భారతదేశంలో ఎన్నికల నిర్వహణ బాధ్యతను ఎవరికి అప్పగించారు?
జవాబు:
ఎన్నికల సంఘానికి.

2. భారతదేశంలో మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రం ఏది?
జవాబు:
ఆంధ్రప్రదేశ్.

3. అలీన విధాన రూపశిల్పి ఎవరు?
జవాబు:
జవహర్‌లాల్ నెహ్రు.

5. మహారాష్ట్రలో, బొంబాయి మహారాష్ట్ర వాసులకే చెందాలని ఆందోళన చేసిన పార్టీ ఏది?
జవాబు:
శివసేన.

AP 10th Class Social Important Questions Chapter 18 స్వతంత్ర భారతదేశం (మొదటి ముప్ఫై సంవత్సరాలు-1947-1977)

6. నేషనల్ కాన్ఫరెన్స్ అనే ప్రాంతీయ పార్టీ ఏ రాష్ట్రానికి చెందినది?
జవాబు:
జమ్ము & కాశ్మీర్

7. జమ్ము & కాశ్మీర్ రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ ఏది?
జవాబు:
370.

8. మొదటి పంచవర్ష ప్రణాళిక ఏ రంగానికి ప్రాధాన్యత ఇచ్చింది? 4. దక్షిణాదిన ఏ రాజకీయ పార్టీ హిందీ వ్యతిరేక ఉద్యమం చేపట్టింది ? జ. DMK
జవాబు:
వ్యవసాయరంగం.

9. పంచశీల సూత్రాలను రూపొందించిన వారు ఎవరు?
జవాబు:
జవహర్‌లాల్ నెహ్రు.

10. ఏ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అంతకు ముందెన్నడూ చవిచూడని ఫలితాలను చవి చూసింది?
జవాబు:
1967 ఎన్నికలు.

11. అస్సోంలోని ఖాసి, జైంతియా, గారో గిరిజన ప్రాంతాల తో 1969లో ఏర్పడిన కొత్త రాష్ట్రమేది?
జవాబు:
మేఘాలయ.

12. 1971లో భారత్ ఎవరికోసం పాకిస్థాన్‌తో యుద్ధం చేయవలసి వచ్చింది?
జవాబు:
బంగ్లాదేశ్.

AP 10th Class Social Important Questions Chapter 18 స్వతంత్ర భారతదేశం (మొదటి ముప్ఫై సంవత్సరాలు-1947-1977)

13. 1956లో రాష్ట్రాల పునఃవ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఏర్పడిన రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాలు ఎన్ని?
జవాబు:
14 రాష్ట్రాలు, 6 కేంద్రపాలిత ప్రాంతాలు.

14. ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచటానికి చేపట్టిన విప్లవం ఏది?
జవాబు:
హరిత విప్లవం.

15. అఖిల భారత జమ్ము & కాశ్మీర్ కాన్ఫరెన్స్ కు నాయకుడు ఎవరు?
జవాబు:
షేక్ మొహ్మద్ అబ్దుల్లా.

16. ప్రజల, హక్కులకు ఏ సందర్భంలో పరిమితులు విధించబడతాయి?
జవాబు:
అత్యవసర పరిస్థితులలో

17. బంగ్లాదేశ్ విముక్తి ఉద్యమం నాయకుడు ఎవరు?
జవాబు:
ముజిబుర్ రెహ్మన్.

18. బ్రిటిషు పాలనలో కూడా క్రియాశీలకంగా ఉండి, తెలుగు మాట్లాడే ప్రజలను ఐక్యం చేసే ప్రయత్నం చేసిందెవరు?
జవాబు:
ఆంధ్ర మహాసభ.

19. ఎన్నికల సంఘం ఏ సమస్యను అధిగమించటానికి పార్టీలకూ గుర్తులు కేటాయిస్తుంది?
జవాబు:
నిరక్షరాస్యత.

20. మొదటి మూడు సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధించింది?
జవాబు:
కాంగ్రెసు.

AP 10th Class Social Important Questions Chapter 18 స్వతంత్ర భారతదేశం (మొదటి ముప్ఫై సంవత్సరాలు-1947-1977)

21. పార్లమెంట్ రాష్ట్రాల పునఃవ్యవస్థీకరణ చట్టాన్ని ఏ సంవత్సరంలో ఆమోదించింది?
జవాబు:
1956

22. ఏ తమిళ హీరోను తనకు మద్దతుగా DMK ఉపయోగించుకుంది?
జవాబు:
M. G. రామచంద్రన్ (MGR)

23. S.V.Dని విస్తరింపుము.
జవాబు:
సంయుక్త విధాయక దళ్

24. బ్యాంకుల జాతీయికరణ చేసిన ప్రధాని ఎవరు?
జవాబు:
ఇందిరాగాంధీ

25. రాజభరణాలను రద్దు చేసిన ప్రధాని ఎవరు?
జవాబు:
ఇందిరాగాంధీ.

26. 1973లో అరబ్ – ఇజ్రాయెల్ యుద్ధంతో వేటి ధరలు ఎన్నడూ లేనంతగా పెరిగాయి?
జవాబు:
ముడిచమురు ధరలు.

27. JP ఉద్యమ నాయకుడు ఎవరు?
జవాబు:
జయప్రకాష్ నారాయణ్.

28. లోక్ సభకు ఇందిరాగాంధీ ఎన్నికను ఏ కోర్టు రద్దు చేసింది?
జవాబు:
అలహాబాద్.

AP 10th Class Social Important Questions Chapter 18 స్వతంత్ర భారతదేశం (మొదటి ముప్ఫై సంవత్సరాలు-1947-1977)

29. జమ్ము కాశ్మీర్ సంస్థానానికి రాజు ఎవరు?
జవాబు:
రాజా హరిసింగ్

30. రెండవ పంచవర్ష ప్రణాళికలో ఏ రంగంకు ప్రాధాన్యత ఇచ్చారు?
జవాబు:
పారిశ్రామిక రంగంకు

31. స్విట్జర్లాండ్ లో మహిళలకు ఓటుహక్కు లభించిన సంవత్సరం ఏది?
జవాబు:
1971.

32. భారత్, పాకిస్తాన్ ల మధ్య మొదటిసారి యుద్ధం జరిగిన సంవత్సరం ఏది?
జవాబు:
1947.

33. మొట్టమొదటి రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ సంఘమును ఏ సంవత్సరంలో ఏర్పాటు చేసారు?
జవాబు:
1953.

34. స్వాతంత్రం వచ్చిన మొదటి 30 సంవత్సరములలో భారత రాజకీయ వ్యవస్థలో ఆధిపత్యం గల పార్టీ ఏది?
జవాబు:
భారత జాతీయ కాంగ్రెస్.

35. తూర్పు పాకిస్తాన్‌గా పిలువబడిన దేశం ఏది?
జవాబు:
బంగ్లాదేశ్.

AP 10th Class Social Important Questions Chapter 18 స్వతంత్ర భారతదేశం (మొదటి ముప్ఫై సంవత్సరాలు-1947-1977)

36. 1971 సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెసు నినాదం ఏమిటి?
జవాబు:
గరీబీ హఠావో.

37. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అనుసంధాన భాష ఏది?
జవాబు:
ఇంగ్లీషు.

38. హిందీ వ్యతిరేక ఉద్యమం ఏ రాష్ట్రంలో ప్రారంభమయ్యింది?
జవాబు:
తమిళనాడు.

39. ‘గరీబీ హరావో’ నినాదాన్ని ఇచ్చినది ఎవరు?
జవాబు:
ఇందిరాగాంధీ.

40. భారత దేశ అధికార భాష ఏది?
జవాబు:
హిందీ.

41. మొదటి సార్వత్రిక ఎన్నికలు ఏ సంవత్సరంలో జరిగాయి?
జవాబు:
1952.

42. భారతదేశ మొదటి ప్రధాన మంత్రి ఎవరు?
జవాబు:
జవహర్‌లాల్ నెహ్రు.

43. ప్రత్యేక తెలుగు రాష్ట్రం కోరుతూ 58 రోజులపాటు నిరాహారదీక్ష చేసినది ఎవరు?
జవాబు:
పొట్టి శ్రీరాములు.

AP 10th Class Social Important Questions Chapter 18 స్వతంత్ర భారతదేశం (మొదటి ముప్ఫై సంవత్సరాలు-1947-1977)

44. ప్రణాళిక సంఘం ఏ సంవత్సరంలో ఏర్పరిచారు?
జవాబు:
1950లో

45. భారతదేశం, చైనాతో యుద్ధం చేసిన సంవత్సరం ఏది?
జవాబు:
1962.

46. నెహ్రు చనిపోయిన సంవత్సరం?
జవాబు:
1964.

47. నెహ్రూ మరణానంతరం భారత ప్రధాని ఎవరు?
జవాబు:
లాల్ బహదూర్ శాస్త్రి.

48. విదేశాలలో మరణించిన భారత ప్రధాని ఎవరు?\
జవాబు:
లాల్ బహదూర్ శాస్త్రి.

49. లాల్ బహాదుర్ శాస్త్రి ఏ సంవత్సరంలో మరణించారు?
జవాబు:
1966.

50. హిందీని అధికార భాషగా చట్టం చేసిన సంవత్సరం?
జవాబు:
1963.

51. ఆంధ్ర రాష్ట్రం ఎప్పుడు ఏర్పడింది?
జవాబు:
1953, అక్టోబర్ 1న

AP 10th Class Social Important Questions Chapter 18 స్వతంత్ర భారతదేశం (మొదటి ముప్ఫై సంవత్సరాలు-1947-1977)

52. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎప్పుడు ఏర్పడింది?
జవాబు:
1956, నవంబర్ 1న

53. పంజాబ్ రాష్ట్రం ఎప్పుడు ఏర్పడింది?
జవాబు:
1966.

54. పంజాబ్, హర్యానా ఉమ్మడి రాజధాని నగరం ఏది?
జవాబు:
చంఢీఘర్.

55. భారత రాజ్యాంగానికి 42వ సవరణ చేసిన సంవత్సరం.
జవాబు:
1976.

56. ఫజల్ అలి, కె.ఎం. ఫణిక్కర్. హృదయనాథ్ కుంజు, జయప్రకాష్ నారాయళ్లలో మొదటి SRCలో సభ్యులు కాని వారు ఎవరు?
జవాబు:
జయప్రకాష్ నారాయణ్.

57. నెహ్రు మొగ్గుచూపిన వ్యవసాయ విధానంలో ఇమిడి యున్న అంశం కానిది.
→ భూ సంస్కరణలు
→ వ్యవసాయ సహకార సంఘాలు
→ ్థానిక స్వపరిపాలన
→ భూమిని దానంగా ఇవ్వటం.
జవాబు:
భూమిని దానంగా ఇవ్వటం.

58. క్రింది వానిని సరిగా జతపరచండి.
i) బీహార్ ( ) a) కుర్ని, కొయిరి
ii) మధ్యప్రదేశ్ ( ) b) లోథ్
iii) కర్ణాటక ( ) c) ఒక్కళి
iv) తమిళనాడు ( ) d) వెల్లాల
జవాబు:
i – a, ii – b, iii – c, iv – d

AP 10th Class Social Important Questions Chapter 18 స్వతంత్ర భారతదేశం (మొదటి ముప్ఫై సంవత్సరాలు-1947-1977)

59. క్రింది వానిని సరిగా జతపరచండి.
I. మత కల్లోలాలు జరిగిన ప్రాంతం – II.రాష్ట్రం
i) రాంచి ( ) a) బీహార్
ii) అహ్మదాబాద్ ( ) b) గుజరాత్
iii) జలగావ్ ( ) c) మహారాష్ట్ర
iv) అలీఘర్ ( ) d) ఉత్తరప్రదేశ్
జవాబు:
i – a, ii – b, iii – c, iv – d

60. ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు అన్నింటిని సమైక్య పరిచింది ఎవరు?
జవాబు:
జయప్రకాష్ నారాయణ్.

61. రాష్ట్రాల పునఃవ్యవస్థీకరణ చట్టం 1956కు సంబంధించి క్రింది వ్యాఖ్యలను పరిశీలించి సరైన వ్యాఖ్యలను ఎంచుకోండి.
i) 1953 ఆగస్ట్” SRC వేసారు.
ii) భాషా ప్రాతిపదికన రాష్ట్రాలను ఏర్పాటుచేసే అంశాన్ని పరిశీలించవలసిందిగా ఈ సంఘాన్ని కోరారు.
iii) ఈ సంఘం నివేదిక ఆధారంగా 1956లో రాష్ట్రాల పునఃవ్యవస్థీకరణ చట్టం చేసారు.
A) (i) & (ii)
B) (ii) & (iii)
C) (i) & (iii)
D) (i), (ii) & (iii).
జవాబు:
D (i), (ii) & (iii)

62. 1968 – 69లో పంజాబు ప్రజల ఆందోళనకు కారణం ఏమిటి?
జవాబు:
ఉమ్మడి రాజధాని చండీఘర్ ని తమకు ఇవ్వాలని.

63. బ్యాంకుల జాతీయికరణ, గరీబీ హఠావో, ధరల నియంత్రణ, రాజభరణాల రద్దులలో ఇందిరాగాంధీ చేపట్టిన సంస్కరణ కానిది.
జవాబు:
ధరల నియంత్రణ.

64. ఈ క్రింది సంఘటనలను కాలక్రమంలో ఉంచండి.
i) బంగ్లాదేశ్ ఏర్పడిన సంవత్సరం
ii) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు
iii)మొదటి సార్వత్రిక ఎన్నికలు
iv) హిందీ అధికార భాషా చట్టం.
జవాబు:
iii, ii, iv, i

65. ప్రస్తుతం మైసూర్ రాష్ట్రాన్ని ఎలా పిలుస్తున్నారు?
జవాబు:
కర్ణాటక.

66. అత్యవసర పరిస్థితి సమయంలో ప్రజలను అసంతృప్తికి గురిచేసిన చర్య కానిది.
→ పౌరహక్కుల ఉల్లంఘన
→ మురికివాడల తొలగింపు
→ వెట్టి చాకిరీ నిర్మూలన
→ బలవంతపు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు
జవాబు:
వెట్టిచాకిరీ నిర్మూలన.

AP 10th Class Social Important Questions Chapter 18 స్వతంత్ర భారతదేశం (మొదటి ముప్ఫై సంవత్సరాలు-1947-1977)

67. భారతదేశ స్వాతంత్ర్య అనంతర చరిత్రలో తొలి సంవత్సరాలలో దేశ నాయకత్వం ముందున్న ప్రధాన సవాల్.
ఎ) దేశ ఐక్యతను కాపాడటం
బి) దేశ సమగ్రతను కాపాడటం.
సి) సామాజిక, ఆర్థిక మార్పులను తీసుకురావడం.
డి) పైవన్నీ
జవాబు:
డి) పైవన్నీ

68. “ఒక వ్యక్తి – ఒక ఓటు మరియు ఒక ఓటు – ఒకే విలువ” అన్న నినాదాన్ని ఇచ్చింది ఎవరు?
జవాబు:
అంబేద్కర్

69. జాతీయ ఓటర్ల దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు?
జవాబు:
జనవరి 25 న.

70. ప్రచ్ఛన్న యుద్ధం ఏ దేశాల మధ్య మొదలయ్యింది?
జవాబు:
USA – USSR

71. ‘పంచశీల సూత్రాలు’ ఏయే దేశాల మధ్య ఒప్పందం అంటార?
జవాబు:
భారత్ – చైనా.

72. భారతదేశంలో అత్యవసర పరిస్థితి ఏ సంవత్సరంలో విధించారు?
జవాబు:
1975.

73. క్రింది వానిలో సరికాని జతను గుర్తించుము.
→ భారత్ × సాకిస్తాన్ యుద్ధం – 1965
→ భారత్ ×చైనా యుద్ధం – 1962
→ భారత్ ×చైనా యుద్ధం – 1968
→ భారత్ × పాకిస్తాన్ యుద్ధం – 1971
జవాబు:
భారత్ × చైనా యుద్ధం – 1968

74. 1947లో దేని ఆధారంగా దేశ విభజన జరిగింది?
జవాబు:
మతం ఆధారంగా.

75. చక్కని సంస్థాగత చట్టాన్ని ఏర్పరచడంలో భాగంగా మనదేశం ఏర్పాటు చేసుకున్న స్వతంత్ర వ్యవస్థ కానిది ఏది?
→ ఎన్నికల సంఘం
→ కంట్రోలర్ & ఆడిటర్ జనరల్
→ ప్రణాళిక సంఘం
→ న్యాయ వ్యవస్థ
జవాబు:
ప్రణాళిక సంఘం.

76. 1952లో లోకసభలోని (మొదటి లోకసభలోని) స్థానాలు ఎన్ని?
జవాబు:
489.

77. 1952 సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ గెలుచుకున్న స్థానాల శాతం ఎంత?
జవాబు:
74%.

AP 10th Class Social Important Questions Chapter 18 స్వతంత్ర భారతదేశం (మొదటి ముప్ఫై సంవత్సరాలు-1947-1977)

78. ఆంధ్ర మహాసభ (AMS) ఎప్పుడు ఏర్పడింది?
జవాబు:
1930 లో.

79. పొట్టి శ్రీరాములు ఎప్పటి నుండి, ఎప్పటి వరకు నిరాహార దీక్ష చేసారు?
జవాబు:
19 అక్టోబరు 1952 నుండి 15 డిసెంబరు 1952 వరకు.

80. ఆంధ్రరాష్ట్రం ఏర్పడక ముందు ఈ ప్రాంతం ఏ రాష్ట్రంలో భాగంగా ఉండేది?
జవాబు:
మద్రాసు రాష్ట్రంలో.

81. మొదటి పంచవర్ష ప్రణాళిక కాలం ఏది?
జవాబు:
1951 – 56.

82. జమ్ము & కాశ్మీర్ రాష్ట్రంని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించారు. ఈ విభజన ఎప్పటి నుండి అమలులోకి వచ్చింది?
జవాబు:
31 అక్టోబరు 2019 నుండి.

83. జమ్ము & కాశ్మీర్ కి సంబంధించిన ‘ఢిల్లీ’ ఒప్పందాన్ని అంగీకరించిన నాయకుడెవరు?
జవాబు:
షేక్ మొహమ్మద్ అబ్దుల్లా.

84. అవామీలీగ్ నాయకుడెవరు?
జవాబు:
షేక్ ముజిబుర్ రెహ్మాన్.

85. ప్రైవేట్ బ్యాంకుల జాతీయకరణ చేసిన సంవత్సరం.
జవాబు:
1969.

86. రాజభరణాల రద్దు చేసిన సంవత్సరం.
జవాబు:
1971.

87. మిని రాజ్యాంగం అని ఏ రాజ్యాంగ సవరణని పేర్కొంటారు?
జవాబు:
42వ సవరణని (1976)

AP 10th Class Social Important Questions Chapter 18 స్వతంత్ర భారతదేశం (మొదటి ముప్ఫై సంవత్సరాలు-1947-1977)

88. ముజిబుర్ రెహ్మాన్ మద్దతుదారులు తూర్పు పాకిస్తాన్లో చేపట్టిన ఉద్యమం ఏది ?
జవాబు:
ముక్తిబాహిని.

10th Class Social 18th Lesson 1 Mark Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
1956 లో భాషా ప్రాతిపదికన రాష్ట్రాలను ఏర్పాటు చేస్తున్నప్పుడు, గిరిజన భాషలను ఎందుకు పట్టించుకోలేదు ?
జవాబు:
గిరిజనులు దేశంలో చెల్లాచెదురుగా అక్కడక్కడ ఉన్నారు. కనుక వారికి ఒక ప్రాంతంలో రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం కుదరదు. అందువలన గిరిజన భాషలను పట్టించుకోలేదు.

ప్రశ్న 2.
నెహ్రూ ప్రవేశపెట్టిన ఏవైనా రెండు గ్రామీణ అభివృద్ధి పథకాలను రాయండి.
జవాబు:
వ్యవసాయ రంగంలోని మార్పును నెహ్రూ కేవలం ఆర్థిక అంశంగా చూడలేదు. దానిని గ్రామీణ రంగ రాజకీయ, సామాజిక, ఆర్థిక మార్పుగా పరిగణించాడు. ఇందులో మూడు ప్రధాన అంశాలు ఉన్నాయి.

  1. భూసంస్కరణలు
  2. వ్యవసాయ సహకార సంఘాలు
  3. స్థానిక స్వపరిపాలన

3 రకాల భూసంస్కరణలను ప్రతిపాదించారు.

  1. జమిందారీ వ్యవస్థ రద్దు
  2. కౌలు విధానాల సంస్కరణ
  3. భూ పరిమితి విధానాలు

ప్రశ్న 3.
ఎన్నికల సంఘం రాజకీయ పార్టీలు, అభ్యర్థులు సూచించేలా గుర్తులు కేటాయించుటకు గల ముఖ్య ఉద్దేశ్యమేమిటి ?
జవాబు:
నిరక్షరాస్యతా సమస్యను అధిగమించటానికి ఎన్నికల సంఘం రాజకీయ పార్టీలు, అభ్యర్థులను సూచించేలా రోజువారీ జీవితం నుంచి కొన్ని గుర్తులను ఉపయోగించాలనే వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చింది. ఈ పద్ధతి ఇప్పటికీ అమలులో ఉంది.

AP 10th Class Social Important Questions Chapter 18 స్వతంత్ర భారతదేశం (మొదటి ముప్ఫై సంవత్సరాలు-1947-1977)

ప్రశ్న 4.
భారతదేశంలో హరిత విప్లవం ఎందుకు తప్పనిసరి?
జవాబు:

  1. ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచడం ద్వారా పెరుగుతున్న జనాభా అవసరాలను తీర్చడం కోసం.
  2. సక్రమ నీటి నిర్వహణ పద్ధతుల కోసం భారతదేశంలో హరిత విప్లవం తప్పనిసరి.

ప్రశ్న 5.
ఏక పార్టీ విధానానికి, బహుళ పార్టీ విధానానికి గల తేడా ఏమి?
జవాబు:

  1. ఏకపార్టీ విధానం – ఒక పార్టీ ఉండడం.
  2. బహుళపార్టీ విధానం – ఎక్కువ పార్టీలు ఉండడం.

ప్రశ్న 6.
భారతదేశంలో మొదటి సాధారణ ఎన్నికల నిర్వహణలో నిరక్షరాస్యతా సమస్యను ఎన్నికల సంఘం ఏ విధంగా అధిగమించింది?
జవాబు:

  1. ఎన్నికల సంఘం రాజకీయ పార్టీలకు, అభ్యర్థులకు సూచించే కొన్ని గుర్తులను రోజువారీ జీవితం నుంచి కేటాయించింది.
  2. ప్రతి ఒక్క అభ్యర్థికి బయటవైపు వారికి కేటాయించిన గుర్తును అంటించబడిన వేరు వేరు బ్యాలెట్ పెట్టెలను ఏర్పాటు చేసింది.

ప్రశ్న 7.
స్వాతంత్ర భారత తొలి సంవత్సరములలో నాయకుల ముందున్న ప్రధాన సవాళ్ళు ఏవి?
జవాబు:

  1. దేశ ఐక్యత, సమగ్రతలను కాపాడటం.
  2. సామాజిక, ఆర్థిక మార్పులను తీసుకొనిరావడం.
  3. పేదరికం
  4. నిరుద్యోగం
  5. నిరక్షరాస్యత

ప్రశ్న 8.
స్విట్జర్లాండ్ లో మహిళలకు ఓటుహక్కు ఎప్పుడు వచ్చింది?
జవాబు:
స్విట్జర్లాండ్ లో మహిళలకు ఓటుహక్కు 1971లో వచ్చింది.

ప్రశ్న 9.
మొదటి సార్వత్రిక ఎన్నికల నిర్వహణ బాధ్యతను ఎవరికి అప్పగించారు?
జవాబు:
మొదటి సార్వత్రిక ఎన్నికలను నిర్వహించే బాధ్యతను ఎన్నికల సంఘానికి అప్పగించారు.

ప్రశ్న 10.
భారతదేశంలో మొదటి సార్వత్రిక ఎన్నికలు ఎప్పుడు జరిగాయి?
జవాబు:
భారతదేశంలో 1952 లో మొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగాయి.

ప్రశ్న 11.
భారతదేశ మొదటి ప్రధానమంత్రి ఎవరు?
జవాబు:
జవహర్‌లాల్ నెహ్రూ భారతదేశ మొదటి ప్రధానమంత్రి.

AP 10th Class Social Important Questions Chapter 18 స్వతంత్ర భారతదేశం (మొదటి ముప్ఫై సంవత్సరాలు-1947-1977)

ప్రశ్న 12.
బ్రిటిష్ కాలంలో దేశం ఏ విధంగా విభజింపబడి ఉంది?
జవాబు:
బ్రిటిష్ కాలంలో దేశం ప్రెసిడెన్సీలు (కలకత్తా, మద్రాస్, బాంబే) గాను, సెంట్రల్ ప్రావిన్సెస్, బీదర్ వంటి అనేక పెద్ద రాష్ట్రాలుగానూ విభజింపబడి ఉండేది.

ప్రశ్న 13.
మద్రాసులో ఏ ఏ భాషలు మాట్లాడే ప్రజలు ఉండేవాళ్లు?
జవాబు:
తమిళం, మళయాళం, కన్నడ, తెలుగు, గోండి, ఒడియా భాషలు మాట్లాడేవాళ్లు ఉండేవాళ్లు.

ప్రశ్న 14.
దేని ఆధారంగా దేశ విభజన జరిగింది?
జవాబు:
మతం ఆధారంగా దేశ విభజన జరిగింది.

ప్రశ్న 15.
ఆంధ్ర మహాసభ దేని కొరకు ప్రయత్నించింది?
జవాబు:
మద్రాస్ ప్రెసిడెన్సీలోని తెలుగు మాట్లాడే ప్రజలను ఒక్కతాటి కిందకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేసింది.

ప్రశ్న 16.
ఆంధ్ర మహాసభ, భాషా ప్రాతిపదిక రాష్ట్రాల కొరకు చేసిన ఉద్యమంలో ఏ పద్ధతులను ఉపయోగించింది?
జవాబు:
ఆంధ్ర మహాసభ, భాషా ప్రాతిపదిక రాష్ట్రాల కొరకు చేసిన ఉద్యమంలో విన్నపాలు, దరఖాస్తులు, వీధులలో కవాతులు, నిరాహార దీక్షలు వంటి పద్ధతులను ఉపయోగించింది.

ప్రశ్న 17.
పొట్టి శ్రీరాములు ఎవరు?
జవాబు:
ప్రత్యేక తెలుగు రాష్ట్రం కోరుతూ 58 రోజులు నిరాహారదీక్ష చేసి 1952 అక్టోబరులో చనిపోయారు.

ప్రశ్న 18.
రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సంఘాన్ని (ఎస్.ఆర్.సి) ఎప్పుడు వేశారు? ఇందులోని సభ్యులెవరు?
జవాబు:
1953 ఆగష్టులో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సంఘాన్ని వేశారు. దీనిలో ఫజల్ అలీ, కె.ఎం. ఫణిక్కర్, హృదయనాథ్ కుంజులు సభ్యులుగా ఉన్నారు.

ప్రశ్న 19.
1956 రాష్ట్రాల పున్యవస్థీకరణ చట్టం ప్రకారం భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు, ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలున్నాయి?
జవాబు:
1956లో పార్లమెంటు ఆమోదించిన రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం భారతదేశంలో 14 రాష్ట్రాలు, 6 కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పడ్డాయి.

ప్రశ్న 20.
భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు సందర్భంలో పరిగణనలోకి తీసుకోని భాషలేవి?
జవాబు:
భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు సందర్భంలో గోండి, సంథాలి లేదా ఒరావన్ వంటి గిరిజన భాషలను పరిగణనలోకి తీసుకోలేదు.

AP 10th Class Social Important Questions Chapter 18 స్వతంత్ర భారతదేశం (మొదటి ముప్ఫై సంవత్సరాలు-1947-1977)

ప్రశ్న 21.
మొదటి పంచవర్ష ప్రణాళిక ఏ అంశం మీద కేంద్రీకరించబడింది?
జవాబు:
మొదటి పంచవర్ష ప్రణాళిక వ్యవసాయం మీద కేంద్రీకరించి ఆహార ఉత్పత్తిని పెంచటానికి, రవాణా, ప్రసారాల రంగాల మెరుగుదలకు, సామాజిక సేవల కల్పనకు ప్రాధాన్యం ఇచ్చింది.

ప్రశ్న 22.
1962లో ఏ దేశంతో యుద్ధానికి తలపడవలసి వచ్చింది?
జవాబు:
1962లో మనం చైనాతో యుద్ధం చేయవలసి వచ్చింది.

ప్రశ్న 23.
1967 ఎన్నికలలో కాంగ్రెస్ పరాజయం పొందిన రాష్ట్రాలేవి?
జవాబు:
బీహార్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్, పశ్చిమ బెంగాల్, ఒరిస్సా, మద్రాస్, కేరళలో కాంగ్రెస్ పరాజయం పొందింది.

ప్రశ్న 24.
ప్రత్యేక తెలంగాణా వాదుల ఆరోపణ ఏమిటి?
జవాబు:
ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు నాయకత్వం వహించారు. “అభివృద్ధి ఫలాలు రాష్ట్రంలోని కొన్ని వర్గాలకే చెందుతున్నాయన్నది వీళ్ల ప్రధాన ఆరోపణ.

ప్రశ్న 25.
ఏ ఏ ప్రాంతాలతో ‘మేఘాలయ’ రాష్ట్రం ఏర్పడింది?
జవాబు:
1969లో అసోంలోని ఖాసి, జైంతియా, గారో గిరిజన ప్రాంతాలతో మేఘాలయ రాష్ట్రం ఏర్పడింది.

ప్రశ్న 26.
‘గరీబీ హటావో’ అని ఎవరు, ఎప్పుడు అన్నారు?
జవాబు:
1971 సార్వత్రిక ఎన్నికలలో ఇందిరాగాంధీ ఈ ‘గరీబీ హటావో’ అన్న నినాదాన్ని ఉపయోగించి ఘనవిజయం సాధించారు.

ప్రశ్న 27.
రాజ్యాంగసభ ప్రాముఖ్యతనిచ్చిన అంశాలేమిటి?
జవాబు:
రాజ్యాంగ సభ సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని, హోదా, అవకాశాలలో సమానత్వాన్ని కోరుకుంది. ‘ఆధునిక భారతదేశ నిర్మాణంలో సామాజిక, ఆర్థిక మార్పునకు అది ప్రముఖ స్థానాన్ని ఇచ్చింది.

ప్రశ్న 28.
ప్రణాళికల మూలంగా నెహ్రూ ఏమి ఆశించాడు?
జవాబు:
ప్రణాళికాబద్ధ అభివృద్ధి ద్వారా కులం, మతం, ప్రాంతం వంటి విభజన ధోరణులు తగ్గి భారతదేశం బలమైన, ఆధునిక దేశంగా ఎదుగుతుందని అతడు ఆశించాడు.

AP 10th Class Social Important Questions Chapter 18 స్వతంత్ర భారతదేశం (మొదటి ముప్ఫై సంవత్సరాలు-1947-1977)

ప్రశ్న 29.
హిందీ వ్యతిరేక ఉద్యమాన్ని ఎవరు, ఎందుకు చేశారు?
జవాబు:
1963లో అధికార భాషా చట్టాన్ని ఆమోదించినప్పుడు హిందీని మిగిలిన దేశం మీద రుద్దడానికి ఎత్తుగడగా భావించి, డి.ఎం.కె తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా హిందీకి వ్యతిరేకంగా ఉద్యమాన్ని చేపట్టింది.

ప్రశ్న 30.
క్రింది పేరాను చదివి, ప్రశ్నలకు జవాబులు రాయండి.

1970 దశాబ్దం ప్రథమాంకంలో తూర్పు పాకిస్తాన్ (ఇప్పటి బంగాదేశ్లో ఆందోళనలు చోటు చేసుకున్నాయి. పశ్చిమ పాకిస్తాన్ తమపై సవతితల్లి ప్రేమ కనపరచటంపై నిరసనలు చెలరేగాయి, తమ బెంగాలీ అస్థిత్వాన్ని చాటుకోటానికి ఉద్యమాలు మొదలయ్యాయి. సార్వత్రిక ఎన్నికలలో ముజిబుర్ రెహ్మాన్ నాయకత్వంలోని పార్టీ గెలుపొందింది. కానీ అతడిని అరెస్టు చేసి పశ్చిమ పాకిస్తాన్ కి తీసుకెళ్లారు. తూర్పు పాకిస్తాన్లో సైనిక అణచివేత కాలం మొదలయ్యింది. అక్కడ నుంచి తరలి వచ్చిన లక్షలాది కాందిశీకులకు భారతదేశం వసతి కల్పించి ఆహారాన్ని అందించాల్సి వచ్చింది. ఈలోగా బంగ్లాదేశ్ విముక్తి ఉద్యమం మొదలయ్యింది. దీంట్లో భారతదేశ సహాయాన్ని కోరారు. 1971లో భారతదేశం-పాకిస్తాన్ మధ్య యుద్ధం మొదలయ్యింది.
1) తూర్పు పాకిస్తాన్లో ఎప్పుడు ఆందోళనలు చోటు చేసుకున్నాయి.
జవాబు:
1970 దశాబ్దం ప్రమాంకంలో తూర్పు పాకిస్తాన్ (ఇప్పటి బంగ్లాదేశ్)లో ఆందోళనలు చోటు చేసుకున్నాయి.

2) సార్వత్రిక ఎన్నికలలో ఏ పార్టీ గెలుపొందింది?
జవాబు:
సార్వత్రిక ఎన్నికలలో ముజిబుర్ రెహ్మాన్ నాయకత్వంలోని పార్టీ గెలుపొందింది.

3) భారత్-పాకిస్తాన్ల మధ్య యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది?
జవాబు:
1971లో భారత్-పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగింది.

AP 10th Class Social Important Questions Chapter 18 స్వతంత్ర భారతదేశం (మొదటి ముప్ఫై సంవత్సరాలు-1947-1977)

ప్రశ్న 31.
రాజ్యాంగంలోని 370వ అధికరణ యొక్క ప్రత్యేకత ఏమి?
జవాబు:

  1. రాజ్యాంగంలోని 370వ అధికరణంలో కాశ్మీరీలు భారతదేశ పూర్తి పౌరులుగా ఉంటారని తెలుపబడింది.
  2. మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే ఆ రాష్ట్రం అధిక స్వయంప్రతిపత్తి, అధికారాలు కలిగి ఉంటుంది.
  3. రాష్ట్ర మౌలిక స్వభావాన్ని కాపాడటానికి ఉద్దేశించిన అనేక అంశాలు ఈ ఆర్టికల్ 370లో కలవు.

ప్రశ్న 32.
“ప్రాథమిక విద్యకు, ప్రజారోగ్యానికి తక్కువ ప్రాధాన్యత నివ్వడం అతిపెద్ద లోపమని నిస్సందేహంగా చెప్పవచ్చు. పై వ్యాఖ్యపై వ్యాఖ్యానించండి.
జవాబు:

  1. స్వాతంత్ర్యానంతరం మనదేశం ప్రాథమిక విద్యకు, ప్రజారోగ్యానికి తగినంత ప్రాధాన్యత ఇవ్వలేకపోయింది.
  2. అయితే దేశ అభివృద్ధికి విద్య, ప్రజారోగ్యం పెద్ద అవసరాలు
  3. కావున వాటికి తగినంత ప్రాధాన్యత ఇవ్వలేకపోవడం అతి పెద్ద లోపమని చెప్పవచ్చు.

10th Class Social 18th Lesson 2 Marks Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
భారతదేశంలో భూసంస్కరణలు ఎలా అమలు చేశారు ? అవి ప్రజలకు ఎలా ఉపయోగపడ్డాయి?
జవాబు:

  1. భారతదేశమంతటా భూసంస్కరణలను మనఃస్పూర్తిగా అమలు చేయలేదు.
  2. జమిందారీ వ్యవస్థను రద్దు చేశారు కానీ, భూమి లేని వాళ్ళకి భూపంపిణీ జరగలేదు.
  3. గ్రామీణ ప్రాంతాలలో ధనికులు, శక్తిమంతులు భూమిలోని అధిక భాగాలపై నియంత్రణ కొనసాగిస్తూనే ఉన్నారు.
  4. దళితులు ఇంకా భూమిహీనులుగానే ఉన్నారు.
  5. కానీ వెట్టిచాకిరీ నిర్మూలన, అంటరానితనం నిషేధం వల్ల ప్రయోజనం పొందారు.

ప్రశ్న 2.
హరితవిప్లవ ఫలాలు ఏవి?
జవాబు:
హరితవిప్లవం వలన కలిగిన ఫలితాలు:

  1. వ్యవసాయం క్రింద సాగుచేసే భూమి పెరిగింది.
  2. రెండు పంటల విధానం అమలులోనికి వచ్చింది.
  3. నీటిపారుదల వ్యవస్థ బాగా పురోభివృద్ధి చెందింది.
  4. హెక్టారుకి వచ్చే పంట దిగుబడి పెరిగింది.
  5. క్రిమిసంహారక మందులు అధిక దిగుబడిని ఇచ్చే వంగడాల వాడకం బాగా పెరిగింది.

AP 10th Class Social Important Questions Chapter 18 స్వతంత్ర భారతదేశం (మొదటి ముప్ఫై సంవత్సరాలు-1947-1977)

ప్రశ్న 3.
భారతదేశంలోని అన్ని భాషలు సమాన హోదా కలిగి ఉన్నాయా? ప్రతిస్పందించండి.
జవాబు:

  • భారతదేశంలోని అన్ని భాషలు సమాన హోదా కలిగిలేవు; కల్పించాలి.
  • అనేక గిరిజన (గోండు, సంథలి, ఒరావన్ మొదలైనవి), అట్టడుగు సమాజంలోని ప్రజల భాషలను … పరిగణనలోకి తీసుకోవలసిన అవసరం ఉంది.
  • రాజ్యాంగం ప్రకారం పౌరులకు తమ భాష, సంస్కృతిని రక్షించుకునే హక్కు ఉంది. భాషాపరమైన అల్ప సంఖ్యాకుల రక్షణకు చర్యలు (ప్రకరణలు) తీసుకోబడ్డాయి.
  • సమాజంలో శక్తిమంత (ఎక్కువ మంది) ప్రజానీకం మాట్లాడే భాషలను (హిందీ, తెలుగు, తమిళం, బెంగాలీ మొ||నవి) మాత్రమే పరిగణనలోకి తీసుకోవడం అభిలషనీయం కాదు.
  • అన్ని భాషలకు సమాన హోదా ఉండాలి. దీనివల్ల భాషా ఉద్యమాలు తలెత్తవు. దేశ ఐక్యత, సమగ్రతలు కాపాడబడతాయి.

ప్రశ్న 4.
రాజ్యాంగానికి చేసిన 42 వ సవరణలోని అంశాలేమిటి?
(లేదా)
42వ రాజ్యాంగ సవరణ ఉద్దేశాలు ఏమిటి?
జవాబు:
రాజ్యాంగానికి చేసిన 42 వ సవరణ అనేక మార్పులను తీసుకువచ్చింది. ఈ సవరణ ఉద్దేశాలు :

  1. ఎన్నికల వివాదాలలో న్యాయస్థానాలకు చోటు లేకుండా చెయ్యటం.
  2. రాష్ట్ర ప్రభుత్వాలతో పోలిస్తే కేంద్ర ప్రభుత్వాన్ని బలపరచటం.
  3. సామాజిక, ఆర్థిక మార్పునకు ఉద్దేశించిన చట్టాలకు న్యాయస్థానాల నుంచి సాధ్యమైనంత రక్షణను కల్పించటం. న్యాయ వ్యవస్థ పార్లమెంటుకు లోబడి ఉండేలా చేయటం.
  4. ‘లౌకిక, సామ్యవాదం’ అనే పదాలను రాజ్యాంగంలోని ప్రవేశికలో చేర్చుట జరిగింది.

ప్రశ్న 5.
దేశ అభివృద్ధికి, స్వాతంత్రానికి, స్త్రీ, పురుషులకు సమాన అవకాశాలు వాళ్ల సమాన భాగస్వామ్యం అవసరమన్న దృక్పథంతో మీరు ఏకీభవిస్తారా?
జవాబు:

  1. అవును. నేను ఈ దృక్పథంతో ఏకీభవిస్తాను.
  2. కారణమేమనగా, అన్ని రంగాలలోను స్త్రీలు సగభాగం పాలు పంచుకుంటున్నారు.

ప్రశ్న 6.
భారతదేశంలో మొదటి సాధారణ ఎన్నికల నిర్వహణలో నిరక్షరాస్యతా సమస్యను ఎన్నికల సంఘం ఏ విధంగా అధిగమించింది?
జవాబు:
నిరక్షరాస్యతా సమస్యను అధిగమించడానికి ఎన్నికల సంఘం రాజకీయ పార్టీలను, అభ్యర్థులను సూచించేలా రోజువారీ , జీవితం నుంచి కొన్ని గుర్తులను ఉపయోగించటం అన్న వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చింది. ఈ సృజనాత్మక, వినూత్న ప్రయోగం కారణంగా సుదీర్ఘ వివరణల అవసరం లేకుండా బొమ్మను గుర్తిస్తే సరిపోయింది. ఇదే విధానం ఇప్పటికీ కొనసాగుతోంది. దీనిని మరింత సులభతరం చేయడానికి మొదటి ఎన్నికలలో ప్రతి అభ్యర్థికి బయటవైపు వాళ్ల గుర్తు అంటించిన వేరు వేరు బ్యాలెట్ పెట్టెలు కేటాయించారు. తాను ఎంచుకున్న అభ్యర్థి బ్యాలెట్ పెట్టెలో ఓటరు తన ఓటును వేస్తే సరిపోతుంది.

AP 10th Class Social Important Questions Chapter 18 స్వతంత్ర భారతదేశం (మొదటి ముప్ఫై సంవత్సరాలు-1947-1977)

ప్రశ్న 7.
క్రింది పేరాను చదివి, మీ సొంత మాటలలో వ్యాఖ్యానించండి.
ప్రాథమిక విద్యకు, ప్రజారోగ్యానికి తక్కువ ప్రాధాన్యతను ఇవ్వటం పెద్ద లోపం అని నిస్సందేహంగా పేర్కొనవచ్చు. ఇది భారతదేశాన్ని చాలాకాలం పాటు పీడిస్తూ ఉంటుంది. ఇదే సమయంలో నూతన శకాన్ని ఆరంభించిన చైనా, కొరియా భారతదేశంతో పోలిస్తే ఈ రెండు అంశాల్లో ఎంతో ప్రగతిని సాధించాయి.
జవాబు:

  1. ప్రాథమిక విద్య మరియు ప్రజారోగ్యం అనేవి అత్యంత ముఖ్యమైన అంశాలు
  2. ఈ అంశాలకు ఏ దేశంలోనైనా అత్యధిక ప్రాధాన్యత ఇవ్వవలసి ఉంటుంది.
  3. దురదృష్టవశాత్తూ భారతదేశంలో ఈ రెండు రంగాలు అనుకున్నంత ప్రగతిని సాధించలేకపోయాయి.
  4. ఈ రంగాలలో ఆశించిన లక్ష్యాలను సాధించేటందుకు ప్రభుత్వాలు కీలకపాత్ర పోషించాలి.

ప్రశ్న 8.
లాల్ బహదూర్ శాస్త్రిలోని ఏ గుణాలు నీకు నచ్చాయి? ఎందుకు?
జవాబు:
లాల్ బహదూర్ శాస్త్రిలో నాకు నచ్చిన గుణాలు :

  • సమస్య పరిష్కారం
  • ప్రజాస్వామిక విలువలకు ప్రాధాన్యతనివ్వడం.
  • హిందీ వ్యతిరేక ఉద్యమాన్ని, ఆహార కొరతను ప్రజాస్వామ్య పద్ధతిలో పరిష్కరించడం

ప్రశ్న 9.
ప్రాంతీయ పార్టీకి, జాతీయ పార్టీకి గల తేడాలు రాయండి.
జవాబు:

ప్రాంతీయ పార్టీ జాతీయ పార్టీ
• రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో పోలైన ఓట్లలో 3% ఓట్లు లేదా 3 శాసన సభ స్థానాలు పొందిన పార్టీ • సాధారణ ఎన్నికల్లో కనీసం 4 రాష్ట్రాలలో పోలైన ఓట్లలో 6% చొప్పున పొందిన ఓట్లు లేదా 4 వేర్వేరు రాష్ట్రాల నుండి 11 లోకసభ సీట్లు

ప్రశ్న 10.
భారతదేశ అవుట్ లైన్ పటం గీయండి.
జవాబు:
AP 10th Class Social Important Questions Chapter 18 స్వతంత్ర భారతదేశం (మొదటి ముప్ఫై సంవత్సరాలు-1947-1977) 1

ప్రశ్న 11.
రాష్ట్రాల పునఃవ్యవస్థీకరణ చట్టం – 1956 గూర్చి రాయండి.
జవాబు:

  1. ఫజల్ అలీ అధ్యక్షతన రాష్ట్రాల పునఃవ్యవస్థీకరణ సంఘం ఏర్పాటు అయింది.
  2. భాషా ప్రాతిపదికపై రాష్ట్రాల ఏర్పాటు అంశాన్ని పరిశీలించడం జరిగింది.
  3. 14 రాష్ట్రాలు, 6 కేంద్ర పాలిత ప్రాంతాలు ఏర్పాటు చేయడం జరిగింది.
  4. ఈ చట్టంలో గిరిజన భాషలను పరిగణనలోకి తీసుకోలేదు.
  5. ఆధిపత్యం లేదా శక్తిమంత ప్రజానీకం మాట్లాడే భాషలను మాత్రమే పరిగణనలోకి తీసుకున్నారు.

ప్రశ్న 12.
ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా ఏర్పడింది?
జవాబు:
1953 ఆగష్టులో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సంఘాన్ని (ఎస్.ఆర్.సి) వేశారు. దీంట్లో ఫజల్ అలీ, కె.ఎం. ఫణిక్కర్, హృదయనాథ్ కుంజ్రులు సభ్యులుగా ఉన్నారు. భాషా ప్రాతిపదికన రాష్ట్రాలను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించవలసిందిగా ఈ సంఘాన్ని కోరారు. ఈ సంఘం ఇచ్చిన నివేదిక ఆధారంగా 1956లో పార్లమెంటు రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని ఆమోదించింది. దీని ఆధారంగా 1956, నవంబరు 1న ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది.

AP 10th Class Social Important Questions Chapter 18 స్వతంత్ర భారతదేశం (మొదటి ముప్ఫై సంవత్సరాలు-1947-1977)

ప్రశ్న 13.
భారతదేశమంతటా భూసంస్కరణలు ఏ విధంగా అమలు జరిగాయి?
జవాబు:
అయితే భారతదేశమంతటా భూసంస్కరణలు మనస్పూర్తిగా అమలు చేయలేదు. జమీందారీ వ్యవస్థను రద్దు చేశారు. కానీ, భూమి లేనివాళ్లకి భూ పంపిణీ జరగలేదు. గ్రామీణ ప్రాంతాల్లో ధనికులు, శక్తిమంతులు భూమిలోని అధిక భాగాలపై ఆధిపత్యం కొనసాగిస్తూనే ఉన్నారు. దళితులు ఇంకా భూమి హీనులుగానే ఉన్నారు.

ప్రశ్న 14.
భారతదేశ విదేశీ విధానం ఏమిటి?
జవాబు:
భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన సమయంలోనే ప్రచ్ఛన్న యుద్ధం మొదలయ్యి ప్రపంచమంతా రష్యా కూటమి (USSR) లేదా అమెరికా కూటమి (USA) గా విడిపోతోంది. జవహర్‌లాల్ నెహ్రూ ఏ శిబిరంలోనూ చేరకుండా రెండింటికీ సమదూరంలో ఉంటూ విదేశీ విధానంలో స్వతంత్రంగా వ్యవహరించసాగాడు. అదే సమయంలో స్వాతంత్ర్యం పొంది అదే విధానాన్ని కొనసాగించాలనుకుంటున్న ఇండోనేషియా, ఈజిప్టు, యుగోస్లేవియా వంటి దేశాలతో అతడు చేతులు కలిపాడు. వీళ్లంతా కలిసి అలీనోద్యమాన్ని నిర్మించారు.

ప్రశ్న 15.
పంచశీల సూత్రాలనగానేమి? వీటిని ఎవరు రూపొందించారు?
జవాబు:
పంచశీల అంటే ఐదు సూత్రాలు. ఇవేమంటే :

  1. ప్రతి రాజ్యంలోని ప్రాంతీయ సమగ్రత (Territorial integrity) నూ, సార్వభౌమత్వాన్ని, పరస్పరం గౌరవించాలి.
  2. ఒక రాజ్యంపై మరొక రాజ్యం దురాక్రమణ చేయరాదు.
  3. ఒక రాజ్యం ఆంతరంగిక వ్యవహారాల్లో మరొక రాజ్యం జోక్యం చేసుకోరాదు.
  4. రాజ్యాల పరస్పర శ్రేయస్సు, సమానత్వం ఆధారంగా స్నేహ సంబంధాలను నెలకొల్పాలి.
  5. రాజ్యాలు శాంతియుత సహజీవనాన్ని పాటించాలి.

పై సూత్రాలతో కూడిన ఒక ఒప్పందాన్ని, 28 జూన్ 1954న భారత ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ) చైనా ప్రధాని (చౌ-ఎన్-లై) (Chou-En-Lai) సంయుక్తంగా ప్రకటించి ఆమోదించారు.

ప్రశ్న 16.
హిందీ వ్యతిరేక ఉద్యమాన్ని ఏ విధంగా పరిష్కరించారు?
జవాబు:
అప్పటి ప్రధాని శాస్త్రి హిందీ అనుకూలవాదనని సమర్థించినప్పటికీ, హిందీ వ్యతిరేక శిబిరంలోని ఉద్వేగాలను శాంత పరచటానికి అనేక మినహాయింపులను ప్రకటించాడు. వీటిల్లో కొన్ని : ప్రతి రాష్ట్రానికి తన సొంత భాష కలిగి ఉండే హక్కు ఉంది, అది ప్రాంతీయ భాష కావచ్చు లేక ఇంగ్లీషు కావచ్చు. ప్రతి వ్యవహారమూ ఇంగ్లీషు అనువాదంతో ప్రాంతీయ భాషలలో ఉండవచ్చు. కేంద్రం-రాష్ట్రాల మధ్య వ్యవహార భాషగా ఇంగ్లీషు కొనసాగుతుంది. సివిల్ సర్వీసు పరీక్షలు కేవలం హిందీలోనే కాకుండా ఇంగ్లీషులో కూడా నిర్వహిస్తారు.

AP 10th Class Social Important Questions Chapter 18 స్వతంత్ర భారతదేశం (మొదటి ముప్ఫై సంవత్సరాలు-1947-1977)

ప్రశ్న 17.
1971లో బంగ్లాదేశ్ విముక్తి ఉద్యమానికి సహాయం చేసే సామర్థ్యం భారతదేశానికి ఏ విధంగా వచ్చింది?
జవాబు:
1971లో భారతదేశం-పాకిస్థాన్ మధ్య యుద్ధం మొదలయ్యింది. భారతదేశం నిర్ణయాత్మకంగా జోక్యం చేసుకుని బంగ్లాదేశ్ కు విముక్తి సాధించి, స్వతంత్ర దేశంగా ఏర్పడేలా సహాయపడింది. భారతదేశం తన సైనిక బలాన్ని పెంచుకోవటం వల్లనే కాకుండా అలీన దేశంగా తన స్థితిని నైపుణ్యంతో ఉపయోగించుకుని రెండు అగ్రరాజ్యాలు యుద్ధంలో జోక్యం చేసుకోకుండా చెయ్యటం వల్ల ఇది సాధ్యమయ్యింది.

ప్రశ్న 18.
అత్యవసర పరిస్థితి కాలంలో జరిగే మార్పులు ఏమిటి?
జవాబు:

  1. అనేక ప్రాథమిక హక్కులను నిలిపివేస్తారు.
  2. పార్లమెంట్ ఏ అంశంపైనైనా శాసనము చేయవచ్చు.
  3. కేంద్ర కార్యనిర్వాహక వర్గ సలహాల మేరకు రాష్ట్ర కార్యనిర్వాహక వర్గం పాలనను కొనసాగించవలసి ఉంటుంది.
  4. ఎటువంటి మార్పులనైనా రాష్ట్రపతి ప్రవేశపెట్టవచ్చు.

ప్రశ్న 19.
ప్రచ్ఛన్న యుద్దమనగానేమి?
జవాబు:
రెండవ ప్రపంచ యుద్ధానంతరం అమెరికా అధ్వర్యంలోని పాశ్చాత్య రాజ్యాలకు అనగా కమ్యూనిస్టేతర రాజ్యాలకు, రష్యా ఆధిపత్యంలోనున్న కమ్యూనిస్టు రాజ్యాలకు మధ్యగల పరస్పర ద్వేషం, అనుమానాలు, ఉద్రిక్తతలు ప్రచ్ఛన్న యుద్ధంగా పిలువబడ్డాయి.

ప్రశ్న 20.
భారతదేశ పటంలో ఈ క్రింది ప్రాంతాలను గుర్తించండి.
1) కలకత్తా
2) మద్రాస్
3) బాంబే
4) మహారాష్ట్ర
5) పంజాబు
6) గుజరాత్
7) కర్ణాటక
8) మైసూరు
జవాబు:
AP 10th Class Social Important Questions Chapter 18 స్వతంత్ర భారతదేశం (మొదటి ముప్ఫై సంవత్సరాలు-1947-1977) 3

ప్రశ్న 21.
అధికార వికేంద్రీకరణ అంటే ఏమిటి?
జవాబు:

  1. వివిధ స్థాయిలలో అధికారాలను పంపిణీ చేయడాన్ని అధికార వికేంద్రీకరణ అంటాం.
  2. దీనివలన ఏ స్థాయికి ఆ స్థాయిలో నిర్ణయాలు తీసుకోవడం సులభతరం అవుతుంది.
  3. అధికారాలు కేంద్రీకృతమై ఉంటే నిర్ణయాలు తీసుకోవడానికి చాలా సమయం పట్టడము మరియు వివిధ స్థాయిలలో ఫైల్స్ ఉండిపోయి తుది నిర్ణయాలకు ఇబ్బందులు ఏర్పడవచ్చు.
  4. అధికార వికేంద్రీకరణ వలన కొంతమేరకు వ్యవస్థాగత అవినీతిని అరికట్టవచ్చు.

ప్రశ్న 22.
భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు పునఃవ్యవస్థీకరణ చేయడానికి అప్పటి నాయకులకు ఉన్న అపోహలు ఏవి?
జవాబు:

  1. మతం ఆధారంగా దేశ విభజన జరగడంతో నాయకుల మనసులో భారతదేశ భద్రత, సుస్థిరత పట్ల అనుమానాలు, భయాలు కలుగసాగాయి.
  2. భాషా ప్రాతిపదికన రాష్ట్రాల్ని పునఃవ్యవస్థీకరిస్తే దేశం ముక్కలు కావడానికి ఇది దారితీస్తుందని భయపడసాగారు.
  3. కాంగ్రెస్ పార్టీ భాషాప్రాతిపదికపై సంఘటితమై ఉన్నప్పటికీ, ఆ ఆధారంగా దేశాన్ని పునఃసంఘటితం చేస్తామని మాట ఇచ్చినప్పటికీ వెంటనే పూనుకోలేదు.

ప్రశ్న 23.
“ప్రపంచంలో ముంచుకొస్తున్న కొత్త సాంకేతిక విజ్ఞానాలను ప్రత్యేకించి కంప్యూటర్లు, టెలికమ్యూనికేషన్ సాంకేతిక విజ్ఞానాన్ని భారతదేశం అవలంబించడం వల్ల అభివృద్ధిలో దూసుకుపోగలదని చెప్పవచ్చు.” వ్యాఖ్యానించండి.
జవాబు:

  1. ప్రపంచంలో ముంచుకొస్తున్న కొత్త సాంకేతిక విజ్ఞానాలను ప్రత్యేకించి కంప్యూటరు, టెలికమ్యూనికేషన్ సాంకేతిక , విజ్ఞానాన్ని భారతదేశం అవలంబించాలని రాజీవ్ గాంధీ గట్టిగా నమ్మాడు.
  2. ప్రస్తుతం భారతదేశంలో ‘టెలికాం విప్లవం’ అనబడుతున్న దానిని అతడే ఆరంభించాడు.
  3. ఉపగ్రహ సాంకేతిక విజ్ఞానంతో దేశంలో టెలిఫోనిక్ నెట్ వర్క్ వేగంగా, విస్తరించడానికి దోహదపడుతుంది.
  4. మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్, E-mail, Voicemail, Facebook, Twitter తదితరాలు అందుబాటులోకి వచ్చాయి.

AP 10th Class Social Important Questions Chapter 18 స్వతంత్ర భారతదేశం (మొదటి ముప్ఫై సంవత్సరాలు-1947-1977)

ప్రశ్న 24.
జమ్ము & కాశ్మీరు రాష్ట్రానికి ప్రత్యేకంగా స్వయంప్రతిపత్తి కల్పించడం సమర్థనీయమేనని మీరు భావిస్తున్నారా?
జవాబు:

  1. భారత సమాఖ్యలో ఇతర సంస్థానాలలాగా కాకుండా జమ్మూ & కాశ్మీరు చేరిన పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి.
  2. 1947 చివరినాటికి పాకిస్తాన్ మద్దతుతో రజాకార్ల దాడుల నేపథ్యంలో భారతదేశంలో విలీనం అయితేనే సైన్యం అందుబాటులోకి వస్తుంది.
  3. ఆ సమయంలో రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించి, అది స్వయంప్రతిపత్తితో కొనసాగడం గురించి విస్తృత చర్చలు జరిగాయి.
  4. ఈ నేపథ్యంలో ఆర్టికల్ 370తో అధిక స్వయంప్రతిపత్తి, అధికారాలు పొందడం సమర్థనీయమని అనుకుంటున్నాను.

ప్రశ్న 25.
బంగ్లాదేశ్ స్వాతంత్ర్యం పొందడానికి భారత్ సహకరించడం సమంజసమేనని భావిస్తున్నారా? వివరణ ఇవ్వండి.
జవాబు:

  1. పాకిస్తాన్ లో భాగంగా ఉన్న తూర్పు పాకిస్తాన్ పై అది సవతితల్లి ప్రేమ కనపరచడంపై నిరసనలు చెలరేగాయి.
  2. సార్వత్రిక ఎన్నికలలో గెల్చిన ముజిబుర్ రెహ్మాన్ ను అరెస్ట్ చేసి పాకిస్తాన్ తీసుకెళ్ళడంతోపాటు తూర్పు పాకిస్తాన్ లో సైనిక అణచివేతకాలం మొదలైంది.
  3. తమ బెంగాలీ అస్థిత్వాన్ని చాటుకోవడానికి ఉద్యమాలు, లక్షలాది కాందిశీకులకు భారత్ వసతి, ఆహారం అందించింది.
  4. “ముక్తి బాహిని” ఉద్యమం చేస్తూ తూర్పు పాకిస్తాన్ ప్రజలు భారత సహాయాన్ని కోరితే నిర్ణయాత్మకంగా జోక్యం చేసుకొని బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా ఏర్పడే సహాయం చేశాం.
  5. ఆ పరిస్థితులలో భారత్, తూర్పు పాకిస్తాన్ కి సహకరించడం సమంజసమేనని భావిస్తున్నాను.

ప్రశ్న 26.
స్థానిక స్వపరిపాలన వల్ల గ్రామాలు, పట్టణాలు, నగరాలు అభివృద్ధి చెందుతాయని మీరు భావిస్తున్నారా.? అభిప్రాయం తెల్పండి.
జవాబు:

  1. స్థానిక స్వపరిపాలన వలన గ్రామాలు మరియు పట్టణాలు, నగరాలు తప్పనిసరిగా అభివృద్ధి చెందుతాయి.
  2. దీనికి రాష్ట్రాల సహకారం ఎంతో అవసరం.
  3. స్థానిక సంస్థలకు అధికారాలు, విధులు, నిధులు అందజేయాల్సిన బాధ్యత రాష్ట్రాలదే.
  4. 1992లో పి.వి. నరసింహారావు ప్రభుత్వంలో 73వ రాజ్యాంగ సవరణ గ్రామాలకు, 74వ సవరణ పట్టణాలు, నగరాలకు స్థానిక స్వపరిపాలన కట్టబెట్టింది.
  5. అవినీతిలేని, ఆశ్రిత బంధుప్రీతి రహిత, ప్రజాహిత స్థానిక ప్రభుత్వాల పనితీరుతో వృద్ధిని చూడగలం.

10th Class Social 18th Lesson 4 Marks Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
క్రింది పేరాను చదివి, అర్థం చేసుకొని వ్యాఖ్యానించుము.

ఐక్యతను, దేశ సమగ్రతను కాపాడి, నిలపటంలో కూడా భారతదేశం విజయవంతమైంది. దేశంలోని అంతులేని వైవిధ్యత కారణంగా అది విచ్ఛిన్నం కావటానికి అనువైన దేశమని అందరూ భావించారు. అలా కాకపోవటం అన్నది ఇతర దేశాలకు చక్కని గుణపాఠంగా ఉపయోగపడుతుంది.
జవాబు:
భారతదేశమునకు స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్ళలో చాలా ఇబ్బందులను ఎదుర్కోవడం జరిగింది. ఇది గమనించిన వాళ్ళు అందరూ భారతదేశం విచ్చిన్నం అవుతుందని భావించారు. కాని వారిని ఆశ్చర్యపరుస్తూ భారతదేశం ఈ క్రింది విధానాల ద్వారా ఐక్యతను దేశ సమగ్రతను కాపాడటంలో విజయవంతం అయినది.

  1. భారతదేశంలో వివిధ భాషలు మాట్లాడే ప్రజలు ఉన్నారు వారి మధ్య భేదాలు రాకుండా భాషా ప్రయుక్త రాష్ట్రాలను ఏర్పాటు చేసింది.
  2. దేశంలో వివిధ మతాలవారు ఉన్నారు. ఎటువంటి మతపరమైన అల్లర్లు జరుగకుండా అన్ని మతాలకు సమాన ప్రాధాన్యతను ఇస్తూ లౌకికవాదాన్ని అనుసరిస్తున్నది.
  3. పాలకులను ఎన్నుకోవడంలో ధనిక, పేదా తేడాలు చూపించకుండా వయోజనులందరికీ ఓటుహక్కును కల్పించింది.
  4. దేశ ఆర్థికాభివృద్ధి కోసం ప్రణాళికా సంఘాన్ని నెలకొల్పాం.
  5. సమాజంలో ఆర్థికంగా, సామాజికంగా వెనకబడిన వర్గాల పట్ల నిజమైన శ్రద్ధ కనబరచడం జరిగింది.
  6. పండుగలను అందరూ కలసిమెలసి జరుపుకోవడం దేశ ఐక్యతకు ప్రధాన నిదర్శనం.

AP 10th Class Social Important Questions Chapter 18 స్వతంత్ర భారతదేశం (మొదటి ముప్ఫై సంవత్సరాలు-1947-1977)

ప్రశ్న 2.
క్రింది పాఠ్యభాగాన్ని చదివి, ప్రశ్నకు జవాబు వ్రాయండి.

దీనితో ప్రజాస్వామ్యం లేకుండా పోయింది. దేశంలో శాంతి భద్రతలకు అవసరమంటూ ప్రభుత్వం అనేక అణిచివేత చర్యలకు పాల్పండింది. అనేక ప్రాథమిక హక్కులను నిలిపివేశారు. ఏకారణం లేకుండా అరెస్టు చెయ్యటం, హింసించటం, పౌరహక్కులకు భంగం కలిగించటం వంటి అనేక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ కాలంలో ధరల నియంత్రణ, నల్ల బజారు, వెట్టి చాకిరీలకు వ్యతిరేకంగా సాగే ఉద్యమాలను ప్రజలు స్వాగతించారు. అయితే ఇదే కాలంలో చేపట్టిన మురికివాడల తొలగింపు జనాభా నియంత్రణ పేరుతో బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించటం వంటి కార్యక్రమాలు ప్రజల కోపానికి కారణమయ్యాయి. అయితే పౌరహక్కులు లేనందువల్ల ప్రజలు తమ అసంతృప్తిని వెల్లడి చేసే మార్గాలు లేకపోయాయి. దాంతో దిద్దుబాటు చర్యలు చేపట్టే అవకాశం ప్రభుత్వానికి లేకుండా పోయింది.
అత్యవసర పరిస్థితిలో ఏ విధమైన మార్పులు వచ్చాయి?
జవాబు:

  1. ప్రజాస్వామ్యం లేకుండా పోయింది.
  2. శాంతి భద్రతల అవసరమంటూ ప్రభుత్వం అనేక అణచివేత చర్యలకు పాల్పడింది.
  3. ప్రాథమిక హక్కులు నిలిపివేయబడ్డాయి.
  4. జనాభా నియంత్రణ పేరుతో బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించబడ్డాయి.
  5. పౌర హక్కులు లేనందువల్ల ప్రజలు తమ అసంతృప్తిని వెల్లడి చేసే మార్గాలు లేకపోయాయి.

ప్రశ్న 3.
క్రింది పట్టికను చదివి, క్రింది ప్రశ్నలకు సమాధానాలు వ్రాయుము.

విషయం సంబంధిత వ్యక్తి సంవత్సరాలు
1. అలీనోద్యమము నెహ్రూ 1955 – 1961
2. హరిత విప్లవం M.S. స్వామినాథన్ 1964 – 1967
3. అత్యవసర పరిస్థితి ఇందిరాగాంధీ 1975 – 1977
4. ప్రణాళికలు నెహ్రూ 1951
5. పంచశీల నెహ్రూ 1954

i) పంచశీల ఒప్పందంపై సంతకాలు చేసిన రెండు దేశాలు ఏవి?
ii) భారతదేశంలో ప్రణాళికలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి?
iii) అత్యవసర పరిస్థితిని విధించిన ప్రధానమంత్రి ఎవరు?
iv) హరిత విప్లవం అనగానేమి?
జవాబు:
i) చైనా, భారతదేశము.
ii) 1951
iii) ఇందిరా గాంధీ.
iv) అధిక దిగుబడి రకాలు, క్రిమి సంహారకాలు, మెరుగైన యాజమాన్య పద్ధతులు ఉపయోగించి ఆహార ధాన్యాల దిగుబడులను బాగా పెంచడం.

ప్రశ్న 4.
అత్యవసర పరిస్థితి కాలంలో భారతదేశం యొక్క పరిస్థితిని వర్ణించండి.
జవాబు:

  1. దేశంలో ప్రజాస్వామ్యం లేకుండా పోయింది.
  2. అనేక ప్రాథమిక హక్కులను నిలిపివేశారు.
  3. పౌరహక్కులకు భంగం వాటిల్లింది.
  4. ప్రజలు తమ అసంతృప్తిని వెల్లడి చేసే మార్గాలు సైతం లేకుండా పోయాయి.
  5. మురికివాడలు తొలగించబడ్డాయి.
  6. జనాభా నియంత్రణ పేరుతో బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయబడ్డాయి.

ప్రశ్న 5.
క్రింద ఇవ్వబడ్డ పట్టికను చదివి, ప్రశ్నలకు జవాబులు ఇవ్వండి.

అంశము వివరాలు
ఓటు హక్కు స్విట్జర్లాండ్ మహిళలు 1971లో పొందారు.
ఎన్నికల చిహ్నాలు నిరక్షరాస్యుల కొరకు.
కాంగ్రెస్ విజయం 1952, 1957, 1962 ఎన్నికలు
ఆంధ్ర మహాసభ మద్రాసు ప్రెసిడెన్సీలో తెలుగువారి ఐక్యత కోసం
రాష్ట్ర పునర్విభజన చట్టం 1956
మొదటి పంచవర్ష ప్రణాళిక వ్యవసాయం
D.M.K. తమిళనాడు

1) తొలి భాషా ప్రయుక్త రాష్ట్రం ఎప్పుడు ఏర్పడింది?
జవాబు:
1953

2) తొలి సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో ఎన్నికల సంఘం ఎదుర్కొన్న ఒక సవాలును పేర్కొనండి.
జవాబు:
నిరక్షరాస్యత

3) ఏ పంచవర్ష ప్రణాళికయందు వ్యవసాయానికి ప్రాధాన్యత యివ్వబడింది?
జవాబు:
మొదటి పంచవర్చ ప్రణాళిక

4) స్వాతంత్ర్యానంతరం మూడు తొలి దశాబ్దాలలో భారత రాజకీయాలపై ఆధిపత్యం వహించిన పార్టీ ఏది?
జవాబు:
భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ

AP 10th Class Social Important Questions Chapter 18 స్వతంత్ర భారతదేశం (మొదటి ముప్ఫై సంవత్సరాలు-1947-1977)

ప్రశ్న 6.
కింది పట్టికను పరిశీలించి, విశ్లేషించండి.
1952, 1962 ఎన్నికలలో వివిధ రాజకీయ పార్టీలు గెలుచుకున్న స్థానాలు

రాజకీయ పార్టీ 1952 1962
1. భారత జాతీయ కాంగ్రెస్ 364 361
2. భారత కమ్యూనిస్ట్ పార్టీ 16 29
3. స్వతంత్రులు 37 20
4. సోషలిస్ట్ పార్టీ 12 06
5. ఇతరులు 38 27

జవాబు:
పట్టికలో 1952, 1962 ఎన్నికలలో వివిధ రాజకీయ పార్టీలు, అవి గెలుచుకున్న స్థానాల గురించిన సమాచారం పొందుపరచబడింది.

  1. భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ 1952 ఎన్నికలలో 364 స్థానాలు సాధించగా, 1962 ఎన్నికలలో 361 స్థానాలు గెలుచుకుంది.
  2. భారత కమ్యూనిస్టు పార్టీ 1952 ఎన్నికలలో 16 స్థానాలను గెలుచుకొంది. ఈ పార్టీ 1962 ఎన్నికలలో కొంచెం పుంజుకొని 29 స్థానాలను సాధించింది.
  3. 1952 ఎన్నికలలో 37 స్థానాలను సాధించిన స్వతంత్రులు 1962 ఎన్నికలలో బలం కోల్పోయి 20 స్థానాలకే పరిమితమయ్యారు.
  4. 1952 ఎన్నికలలో 12 స్థానాలను గెలుచుకొన్న సోషలిస్టు పార్టీ 1962 ఎన్నికలలో 6 స్థానాలు మాత్రమే గెలవగలిగింది.
  5. ఇక ఇతరుల విషయానికి వస్తే వీరు 1952 ఎన్నికలలో 38 స్థానాలు పొందారు. 1962 ఎన్నికలలో వీరు సాధించిన స్థానాల సంఖ్య 27కే పరిమితమైంది.

పై పట్టిక రాజకీయ వ్యవస్థలో ఏకపార్టీ ఆధిపత్యాన్ని వెల్లడి చేస్తోంది. 1952, 1962లలో జరిగిన ఎన్నికలలో భారత జాతీయ కాంగ్రెస్ అఖండ విజయాలు సాధించింది. ఇతర పార్టీలు కాంగ్రెస్ ని సవాలు చేయగలిగే సంఖ్యలో స్థానాలను గెలుచుకోలేకపోయాయి. ఇతర ఏ పార్టీ కూడా కాంగ్రెస్ కి సమీపంలో లేదు. ఈ విధంగా పై పట్టిక అప్పటి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యాన్ని తెలియజేస్తోంది.

ప్రశ్న 7.
ప్రస్తుత పరిస్థితులలో మెరుగైన ప్రజాస్వామ్యానికి, నీతివంతమైన ప్రభుత్వం ఏర్పాటుకు తగు సూచనలు చేయండి.
జవాబు:

  1. ప్రతి ఓటరు ఓటింగ్ లో పాల్గొనాలి.
  2. నిజాయితీపరులను ఎన్నుకోవడానికి ప్రాధాన్యతకు ఇవ్వాలి.
  3. ఎన్నుకోబడిన నాయకులు ప్రభుత్వం జవాబుదారీతనం కలిగి ఉండాలి.
  4. ఎన్నికలు పారదర్శకంగా ఉండాలి.
  5. సామాజిక తనిఖీ జరగాలి.
  6. రీకాల్ పద్ధతిని అమలు చేయాలి.
  7. పార్టీ ఫిరాయింపుల చట్టంను సమర్థవంతంగా అమలు చేయాలి.
  8. అక్షరాస్యత రేటు పెంచడం ద్వారా ప్రజల్లో చైతన్యం కలిగించాలి.
  9. ప్రజాస్వామ్యం ప్రాముఖ్యతపై ప్రజలకు అవగాహన కల్పించాలి.

ప్రశ్న 8.
“స్వాతంత్ర్యానంతరం మొదటి ముప్పై సంవత్సరాలు అత్యవసర పరిస్థితితో ముగిసినప్పటికీ, లాభనష్టాల పట్టిక తయారుచేస్తే తప్పులు కంటే ఒప్పులే ఎక్కువ ఉన్నాయి.” — వ్యాఖ్యానించండి.
జవాబు:
మొదటి ముప్పై సంవత్సరాలు అత్యవసర పరిస్థితితో ముగిసినప్పటికీ, లాభనష్టాల పట్టిక తయారు చేస్తే తప్పులు కంటే ఒప్పులే ఎక్కువ ఉన్నాయి.

  1. స్థిరమైన ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పటం ఈ కాలంలో సాధించిన అత్యంత ముఖ్యమైన విషయంగా పేర్కొనవచ్చు.
  2. అదే సమయంలో స్వాతంత్ర్యం పొందిన ఇతర దేశాలతో భారతదేశాన్ని పోలిస్తే భిన్న ప్రయోజనాలు కలిగిన పార్టీలతో పోటీతో కూడిన బహుళపార్టీ వ్యవస్థ క్రమేపీ రూపొందటం అన్నది నిజమైన విజయంగా పేర్కొనాలి.
  3. ఇతర దేశాలలో లాగా కాకుండా భారతదేశంలో క్రమం తప్పకుండా, భయంలేని, స్వేచ్చాయుత వాతావరణంలో ఎన్నికలు జరగటమే కుకుండా ప్రభుత్వాలు, నాయకులు కూడా మార్పుకి లోనయ్యారు.
  4. భారత రాజ్యాంగం పౌరహక్కులను ఇవ్వటమే కాకుండా వాటిని కాపాడటానికి వ్యవస్థాగత నిర్మాణం కూడా రూపొందించింది.
  5. న్యాయ వ్యవస్థ, ఎన్నికల సంఘం, కంట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ వంటి స్వతంత్ర వ్యవస్థాగత ఏర్పాట్లతో భారతదేశం చక్కని సంస్థాగత చట్రాన్ని ఏర్పరిచింది. పాలనాధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించటం కూడా గొప్ప విజయమనే చెప్పుకోవాలి.
  6. సైనిక దళాలపై పౌర నియంత్రణను ఏర్పరచటం మరొక ముఖ్యమైన విషయం. మన పొరుగు దేశమైన పాకిస్తాన్‌తో పోలిస్తే ప్రజాస్వామిక సంస్థలలో భారతదేశం ఎంతో ముందుంది.
  7. ఐక్యతను, దేశ సమగ్రతను కాపాడి, నిలపటంలో కూడా భారతదేశం విజయవంతం అయ్యింది. దేశంలోని అంతులేని వైవిధ్యత కారణంగా అది విచ్చిన్నం కావటానికి అనువైన దేశమని అందరూ భావించారు, అలాకాకపోవటం అన్నది ఇతర దేశాలకు చక్కని గుణపాఠంగా ఉపయోగపడుతుంది.
  8. ఆర్థిక లక్ష్యాల విషయంలో ప్రణాళికా సంఘాన్ని నెలకొల్పటం, సమతుల ప్రాంతీయ అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకోవటం అన్న అంశాలు చెప్పుకోదగినవి.
  9. సమాజంలోని ఆర్థికంగా, సామాజికంగా వెనకబడిన వర్గాల పట్ల నిజమైన శ్రద్ధ కనబరిచారు.
  10. ఆహారం కోసం ఇతరులపై ఆధారపడిన స్థితి నుంచి కాలక్రమంలో ఆహార స్వయం సమృద్ధిని సాధించిన స్థితికి దేశం చేరుకుంది. ఇది పరిశ్రమలకు చక్కని పునాదిగా నిలచింది.
  11. అయితే ప్రాంతాల మధ్య సమాన అభివృద్ధి జరుగక కొన్ని ప్రాంతాలు ఇతర ప్రాంతాలకంటే ఎక్కువ అభివృద్ధి చెందాయి.
  12. అదేవిధంగా, ఉపాధి అవకాశాలు పెరగవలసినంతగా పెరగలేదు.
  13. ప్రాథమిక విద్యకి, ప్రజారోగ్యానికి తక్కువ ప్రాధాన్యతను ఇవ్వటం పెద్ద లోపమని నిస్సందేహంగా పేర్కొనవచ్చు. ఇది భారతదేశాన్ని చాలాకాలం పాటు పీడిస్తూ ఉంటుంది.
  14. కుల వ్యవస్థలోని గర్షించదగ్గ అంటరానితనం వంటి వాటిని తొలగించినప్పటికీ వివక్షత ఇంకా తీవ్రంగానే కొనసాగుతోంది. లింగ వివక్షత కూడా కొనసాగుతోంది.

ప్రశ్న 9.
క్రింది పటాన్ని పరిశీలించి ప్రశ్నలకు జవాబులు వ్రాయండి.
AP 10th Class Social Important Questions Chapter 18 స్వతంత్ర భారతదేశం (మొదటి ముప్ఫై సంవత్సరాలు-1947-1977) 2
1) పటంలో చూపబడిన అతిచిన్న ప్రాంతం ఏది?
జవాబు:
పటంలో చూపబడిన అతిచిన్న ప్రాంతం పాండిచ్చేరి.

2) మద్రాసు-మైసూరు రాష్ట్రాల మధ్య ఉన్న చిన్న రాష్ట్రం ఏది?
జవాబు:
మద్రాసు-మైసూరు రాష్ట్రాల మధ్య ఉన్న చిన్న రాష్ట్రం కూర్గ్.

3) పటంలో దక్షిణంవైపు ఉన్న రాష్ట్రం ఏది?
జవాబు:
పటంలో దక్షిణంవైపు ఉన్న రాష్ట్రం ట్రావన్ కోర్-కొచ్చిన్.

4) పటంలో తూర్పువైపు ఉన్న రాష్ట్రం ఏది?
జవాబు:
పటంలో తూర్పువైపు ఉన్న రాష్ట్రం ఆంధ్రరాష్ట్రం.

5) ఆంధ్రరాష్ట్ర సరిహద్దులను పేర్కొనండి.
జవాబు:
బంగాళాఖాతం, హైదరాబాద్, మైసూరు, తమిళనాడు.

ప్రశ్న 10.
1952, 1962 ఎన్నికలలో వివిధ రాజకీయ పార్టీలు గెలుచుకున్న స్థానాలు
AP 10th Class Social Important Questions Chapter 18 స్వతంత్ర భారతదేశం (మొదటి ముప్ఫై సంవత్సరాలు-1947-1977) 4
పై రెండు గ్రామ్లు 1952, 1962లలో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వివిధ పార్టీలు గెలుచుకున్న స్థానాలు తెలుపుతున్నాయి. వీటిని అధ్యయనం చేసి వ్యాఖ్యానించుము.
జవాబు:
1952 మరియు 1962 సంవత్సరాలలో జరిగిన ఎన్నికలలో వివిధ రాజకీయ పార్టీలు గెలుచుకున్న స్థానాలను పరిశీలించగా భారత రాజకీయ వ్యవస్థలో ఏకపార్టీ (భారత జాతీయ కాంగ్రెస్) ఆధిపత్యం స్పష్టంగా తెలియచేస్తుంది.

ఈ ఎన్నికలలో పోటీ చేసిన పార్టీలలో ఏ ఒక్క పార్టీకి కూడా ప్రతిపక్ష పార్టీగా గుర్తింపు పొందలేకపోయింది. దీనికంతటికి కారణం ఏమనగా భారతదేశంలో ద్విపార్టీ వ్యవస్థ లేకుండా బహుళ పార్టీ వ్యవస్థ అమలులో ఉండడమే. 1952లో ఎన్నికలు జరిగిన మొత్తం స్థానాలు 489, అందులో కాంగ్రెస్ పార్టీకి 364 స్థానాలు వచ్చాయి. మిగతా ప్రతిపక్ష పార్టీలన్నింటికి కలిపి 125 స్థానాలు వచ్చాయి. అనగా కాంగ్రెస్ పార్టీకి సుమారు 73 శాతం సీట్లు రాగా మిగిలిన అన్ని ప్రతిపక్ష పార్టీలన్నిటికి కలిపి 27 శాతం సీట్లు మాత్రమే వచ్చాయి.

1962 ఎన్నికలలో 494 స్థానాలకు ఎన్నికలు జరగగా కాంగ్రెస్ పార్టీ 361 స్థానాలను గెలుచుకున్నది. మిగతా ప్రతిపక్ష పార్టీలు మరియు స్వతంత్రులు కలిపి 133 స్థానాలు మాత్రమే గెలుచుకున్నాయి. అనగా కాంగ్రెస్ పార్టీకి సుమారు 70 శాతం స్థానాలు వచ్చాయి. ప్రతిపక్ష పార్టీలకు 30 శాతం స్థానాలు వచ్చాయి. పై స్లు పరిశీలించగా ఈ విషయాలు తెలియుచున్నవి.

ప్రశ్న 11.
నెహ్రూ చేపట్టిన చర్యలతో వ్యవసాయరంగంలో మార్పులు తీసుకురావచ్చుననే వాదనతో ఏకీభవిస్తారా? కారణాలు తెలియచేయండి.
జవాబు:
ఇందులో మూడు ప్రధాన అంశాలు ఉన్నాయి : భూసంస్కరణలు, వ్యవసాయ సహకార సంఘాలు, స్థానిక స్వపరిపాలన, మూడు రకాల భూ సంస్కరణలను ప్రతిపాదించారు : జమీందారీ వ్యవస్థ రద్దు, కౌలు విధానాల సంస్కరణ, భూ పరిమితి : విధానాలు. వీటన్నిటి ప్రధాన ఉద్దేశం దున్నేవానికి భూమి చెందేలా చూసి మరింత ఉత్పత్తి చేయటానికి ప్రోత్సహించటం. సహకార సంఘాల ద్వారా ఆర్థికంగా లాభసాటి పరిమాణాన్ని చేరుకోవటమే కాకుండా విత్తనాలు, ఎరువులు, రసాయనాలు వంటి విలువైన ఉత్పాదకాలను అందించాలి. స్థానిక ప్రభుత్వాలు భూ సంస్కరణలు అమలు అయ్యేలా చూసి, గ్రామ ఉమ్మడి ప్రయోజనాలకు అనుగుణంగా సహకార సంఘాలు నడిచేలా చూస్తాయి.

AP 10th Class Social Important Questions Chapter 18 స్వతంత్ర భారతదేశం (మొదటి ముప్ఫై సంవత్సరాలు-1947-1977)

ప్రశ్న 12.
1967 తరువాత వచ్చిన కొత్త ప్రభుత్వాలు భారత రాజకీయ చరిత్రలో ఒక మైలురాయి వ్యాఖ్యానించండి.
జవాబు:
భారత రాజకీయ చరిత్రలో ఈ కొత్త ప్రభుత్వాలు ఒక మైలురాయిగా ఉంటాయి. ఒక విధంగా ప్రజాస్వామిక తిరుగుబాటును ఇది సూచిస్తుంది. మధ్యస్థాయి కులాలు – ఇవి భూ సంస్కరణల వల్ల ప్రయోజనం పొంది ఆర్థికంగా లాభపడ్డాయి – మొదటిసారిగా రాజకీయ అధికారాన్ని పొందాయి. ఈ కులాలు-హర్యానా, ఉత్తరప్రదేశ్ లో జాట్, బీహార్ లో కుర్మీ, కొయిరి, మధ్యప్రదేశ్ లో లోథ్, ఈ అన్ని రాష్ట్రాలలో యాదవ్, ఆంధ్రప్రదేశ్ లో రెడ్డి, కమ్మ, కర్ణాటకలో ఒక్కళిగా, తమిళనాడులో వెల్లల. ఈ కులాలు ఆయా రాష్ట్రాలలో ఆధిపత్య కులాలుగా ఉండి జనాభా రీత్యా కూడా అధిక సంఖ్యలో ఉన్నాయి. ఇతర ఆధిపత్య (వెనకబడ్డ) కులాలు అధికారంలోకి రావటానికి డి.ఎం.కే పార్టీయే మంచి ఉదాహరణ.

AP 10th Class Social Important Questions Chapter 16 భారతదేశ జాతీయోద్యమం-దేశ విభజన, స్వాతంత్య్రం: 1939-1947

These AP 10th Class Social Studies Important Questions 16th Lesson భారతదేశ జాతీయోద్యమం-దేశ విభజన, స్వాతంత్య్రం: 1939-1947 will help students prepare well for the exams.

AP Board 10th Class Social 16th Lesson Important Questions and Answers భారతదేశ జాతీయోద్యమం-దేశ విభజన, స్వాతంత్య్రం: 1939-1947

10th Class Social 16th Lesson ½ Mark Important Questions and Answers in Telugu Medium

1. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటన్ ప్రధాని ఎవరు?
జవాబు:
విస్టన్ చర్చిల్.

2. భారత దేశ చివరి వైస్రాయ్ ఎవరు?
జవాబు:
మౌంట్ బాటెన్.

3. రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటన్‌కు మద్దతు ఇవ్వాలని నిర్ణయించిన పార్టీ ఏది?
జవాబు:
CPI (భారత కమ్యూనిస్ట్ పార్టీ)

4. బ్రిటిషు అధికారం కింద వివిధ స్థాయిలలో సర్వ సత్తాక పాలనతో సుమారుగా ఉన్న సంస్థానాలు ఎన్ని?
జవాబు:
550.

5. భారత ప్రభుత్వం రాజ భరణాలను రద్దుచేసిన సంవత్సరం?
జవాబు:
1971.

AP 10th Class Social Important Questions Chapter 16 భారతదేశ జాతీయోద్యమం-దేశ విభజన, స్వాతంత్య్రం: 1939-1947

6. గాంధీజీ చొరవతో అల్ప సంఖ్యాక వర్గాల హక్కులపై తీర్మానం చేసినది ఎవరు?
జవాబు:
కాంగ్రెసు నాయకుడు జవహర్ లాల్ నెహ్రు.

7. ‘అజాద్ హింద్ ఫౌజ్’ను స్థాపించిన వారు ఎవరు?
జవాబు:
సుభాష్ చంద్రబోస్.

8. బ్రిటిషు ప్రభుత్వ పాలనా విధానం ఏది?
జవాబు:
విభజించు – పాలించు.

9. ముస్లింలకు ప్రత్యేక నియోజక వర్గాలను కేటాయించిన సంవత్సరం?
జవాబు:
1909.

10. భారత దేశానికి స్వాతంత్ర్యం ఇవ్వటానికి సుముఖత చూపిన బ్రిటన్ పార్టీ ఏది?
జవాబు:
లేబర్ పార్టీ

11. ఎవరి నాయకత్వంలో నౌకాదళ కేంద్రీయ సమ్మె సంఘం ఏర్పడింది?
జవాబు:
M.S. ఖాన్

12. బొంబాయి రేవులోని ఏ నౌకాదళం 1946 ఫిబ్రవరి 16న నిరాహార దీక్ష చేపట్టారు?
జవాబు:
రాయల్ నౌకాదళం.

AP 10th Class Social Important Questions Chapter 16 భారతదేశ జాతీయోద్యమం-దేశ విభజన, స్వాతంత్య్రం: 1939-1947

13. ‘తెభాగ’ ఉద్యమం ఏ రాష్ట్రంలోని రైతులు చేపట్టారు?
జవాబు:
బెంగాల్.

14. మంత్రిత్రయ రాయభారం (ముగ్గురు సభ్యుల బృందం)ను ఢిల్లీకి పంపిన సంవత్సరం?
జవాబు:
1946.

15. భారతదేశాన్ని విభజించకుండా మూడంచెల సమాఖ్యను ప్రతిపాదించింది ఎవరు?
జవాబు:
క్యాబినెట్ మిషన్.

16. మొదటి స్వాతంత్ర దినోత్సవం నాడు సంబరాలు చేసుకోకుండా నిరాహార దీక్ష చేసిన ప్రముఖ నాయకుడు ఎవరు?
జవాబు:
గాంధీజీ.

17. 1937లో రాష్ట్రాలలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెసు రాష్ట్ర ప్రభుత్వాలు ఏ సంవత్సరంలో రాజీనామా చేసాయి?
జవాబు:
1939.

18. ‘తెభాగ’ ఉద్యమానికి నాయకత్వం వహించిన సంస్థ ఏది?
జవాబు:
రాష్ట్ర కిసాన్ సభ.

19. దేశ విభజనను ప్రకటించిన వైస్రాయ్ ఎవరు?
జవాబు:
మౌంట్ బాటెన్.

20. ఏ పార్టీ భారతీయులందరికి ప్రాతినిధ్యం వహించటం లేదని బ్రిటిష్ వారి భావం?
జవాబు:
కాంగ్రెస్ పార్టీ.

21. సంపూర్ణ స్వరాజ్యం కోరిన పార్టీ?
జవాబు:
కాంగ్రెస్.

22. ఉత్తర ప్రదేశ్ లోని ముస్లిం భూస్వాముల ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ ఏది?
జవాబు:
ముస్లిం లీగ్.

23. ముస్లింలీగ్ కు ఏ సంవత్సరం వరకు పెద్దగా ప్రజలకు మద్దతు లేదు?
జవాబు:
1930.

24. NWFC ని విస్తరింపుము
జవాబు:
నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్

25. RSSని విస్తరింపుము.
జవాబు:
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్.

AP 10th Class Social Important Questions Chapter 16 భారతదేశ జాతీయోద్యమం-దేశ విభజన, స్వాతంత్య్రం: 1939-1947

26. అమెరికా, యూరపులో ఏదేశం సాధించిన విజయాలు భారతీయులపై బలమైన ముద్రలు వేశాయి?
జవాబు:
జపాన్.

27. INA ను విస్తరింపుము.
జవాబు:
భారత జాతీయ సైన్యం.

28. INA ను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?
జవాబు:
1942.

29. క్విట్ ఇండియాలో గాంధీజీ ఇచ్చిన నినాదం …..?
జవాబు:
చేయి లేదా చావండి. (Do or Die)

30. ‘సారే జహాసె అచ్చా హిందుస్తాన్ హమారా’ అన్న కవిత రాసిన వ్యక్తి ఏ భాషా కవి?
జవాబు:
ఉర్దూ కవి.

31. ‘దేశ రాజధాని అయిన ఢిల్లీకి అతడు 1947, సెప్టెంబడు 9న గాని రాలేదు. వాయువ్య భారతంలో పెద్ద ఎత్తున చెలరేగిన మత ఘర్షణలతో ఆ వృద్ధ నేత అసంతృప్తితో ఉన్నాడు. ప్రజల భయాలను దూరం చెరు, దానికి అతడు ప్రయత్నించాడు.” ఈ వాక్యంలోని నేత ఎవరు?
జవాబు:
గాంధీజీ.

32. ముస్లిం లీగ్ పార్టీ నాయకుడు ఎవరు?
జవాబు:
మహ్మద్ అలీ జిన్నా.

33. ముస్లిం లీగ్ ప్రత్యక్ష కార్యాచరణ దినంగా ప్రకటించిన రోజు ఏది?
జవాబు:
1946, ఆగస్టు 16.

34. క్రింది వాక్యాలను పరిగణించండి.
i) 1937 ఎన్నికలలో మొత్తం ముస్లిం ఓట్లలో 4.4% మాత్రమే ముస్లిం లీగుకు వచ్చాయి.
ii) 1946 ఎన్నికలలో ముస్లిం నియోజక వర్గాల్లో సైతం ముస్లిం లీగు ఓడిపోయింది.
పై వాక్యా లలో సరైనది ఏది?
A) (i) మాత్రమే
B) (ii) మాత్రమే
C) (i) మరియు (ii)
D) రెండూ కావు
జవాబు:
A (i) మాత్రమే

35. ‘ఛలో ఢిల్లీ’ (ఢిల్లీ పదండి) నినాదం ఇచ్చింది ఎవరు?
జవాబు:
సుభాష్ చంద్రబోస్

36. “1930 లో ముస్లిం లీగుకు అధ్యక్షోపన్యాసం ఇస్తూ వాయవ్య ముస్లిం రాష్ట్ర ఆవశ్యకతను గురించి మాట్లాడాడు.” ఇక్కడ ఎవరు ఉపన్యాసం ఇచ్చింది?
జవాబు:
మహ్మద్ ఇక్బాల్.

37. క్రింది సమాచారంను పూరించండి.
AP 10th Class Social Important Questions Chapter 16 భారతదేశ జాతీయోద్యమం-దేశ విభజన, స్వాతంత్య్రం 1939-1947 1
జవాబు:
బెలూచిస్తాన్.

38. 1939 లో కాంగ్రెసు ప్రభుత్వాలు రాజీనామా చెయ్యటానికి కారణమేమి?
జవాబు:
భారతీయులు 2వ ప్రపంచ యుద్ధంలో పాల్గొంటున్నారని బ్రిటన్ ప్రకటించడం.

39. “భారత దేశంలో విలీనం కావలసిన ఆవశ్యకత గురించి అతడు రాచరిక కుటుంబాలతో చర్చలు మొదలు పెట్టాడు”. ఈ వాక్యంలో ప్రస్తావించబడిన ‘అతడు’ ఎవరు?
జవాబు:
సర్దార్ వల్లభాయ్ పటేల్.

AP 10th Class Social Important Questions Chapter 16 భారతదేశ జాతీయోద్యమం-దేశ విభజన, స్వాతంత్య్రం: 1939-1947

40. “సారే జహాసే అచ్ఛా హిందుస్తాన్ హమారా.” అన్నది ఎవరు?
జవాబు:
మహ్మద్ ఇక్బాల్.

41. మహ్మద్ అలీ జిన్నా క్రియాశీలకంగా పాల్గొన్న సంస్థ ఏది?
జవాబు:
ముస్లిం లీగ్.

42. క్విట్ ఇండియా ఉద్యమం ఏ సంవత్సరంలో ప్రారంభమయ్యింది?
జవాబు:
1942.

43. హైదరాబాదులో తెలంగాణ ప్రాంత రైతుల ఉద్యమానికి నాయకత్వం వహించిన పార్టీ ఏది?
జవాబు:
కమ్యూనిస్ట్ పార్టీ.

44. 1947 లో సంస్థానాల విలీనం చేసే బాధ్యతను ఎవరికి అప్పగించడం జరిగింది?
జవాబు:
సర్దార్ వల్లభాయ్ పటేల్ కు.

45. ముస్లిం లీగు ప్రత్యక్ష కార్యాచరణ దినంను ప్రకటించడానికి కారణమేమి?
జవాబు:
పాకిస్తాన్ పేరిట ప్రత్యేక జాతీయ రాజ్యము కొరకు.

46. కులం, వర్గాలను అధిగమించి, హిందువులందరినీ ఏకం చేసి సామాజిక జీవితంలో సంస్కరణలు తీసుకురావాలని ఆశించే సంఘం ఏది?
జవాబు:
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS)

47. క్విట్ ఇండియా ఉద్యమానికి ప్రధాన కారణం ఏమి?
జవాబు:
క్రిప్స్ రాయభారం విఫలం అవ్వడం.

48. ‘రాజభరణం’ దేని కోసం మంజూరు చేశారు?
జవాబు:
రాచరిక కుటుంబాల వ్యక్తిగత ఖర్చులకు.

49. ‘తెభాగ’ ఉద్యమం చేసినది ఎవరు?
జవాబు:
చిన్న, పేద రైతులు.

50. బ్రిటిషు మంత్రివర్గం ముగ్గురు సభ్యుల బృందాన్ని 1946 మార్చిలో దేనికోసం ఢిల్లీకి పంపింది?
జవాబు:
భారతదేశ స్వాతంత్ర్యానికి అనువైన రాజకీయ చట్టం చేయడానికి.

51. బ్రిటిషు వారికి వ్యతిరేకంగా మహాత్మాగాంధీ నడిపిన మూడవ పెద్ద ఉద్యమం ఏది?
జవాబు:
క్విట్ ఇండియా.

52. 1937లో జరిగిన ఎన్నికలలో కాంగ్రెసు ఎన్ని రాష్ట్రాలలో అధికారంలోకి వచ్చింది?
జవాబు:
8

AP 10th Class Social Important Questions Chapter 16 భారతదేశ జాతీయోద్యమం-దేశ విభజన, స్వాతంత్య్రం: 1939-1947

53. భారతదేశానికి స్వాతంత్ర్యం ఇచ్చినపుడు బ్రిటన్ ప్రధానమంత్రి ఎవరు?
జవాబు:
అట్లీ.

54. ముస్లింలీగు ఏ సంవత్సరంలో ఏర్పడింది?
జవాబు:
1906.

54. ముస్లింలకు ప్రత్యేక నియోజక వర్గాలను ఏర్పాటు చేసిన సంవత్సరమేది?
జవాబు:
1909.

56. క్రిప్స్ రాయభారం భారతదేశానికి వచ్చిన సంవత్సరం?
జవాబు:
1942.

57. పాకిస్థాన్ స్వాతంత్ర్యం వచ్చిన తేది?
జవాబు:
1947 ఆగస్టు 14.

58. గాంధీజీ మరణించిన తేది?
జవాబు:
1948, జనవరి 30.

59. యుద్ధ సమయంలో ఇంగ్లండు ప్రధాని అయిన చర్చిల్ ఏ పార్టీకి చెందినవాడు?
జవాబు:
కన్సర్వేటివ్.

60. కాబినెట్ మిషన్ భారతదేశానికి వచ్చిన సంవత్సరం?
జవాబు:
1946.

61. పాకిస్తాన్ లేదా పాకిస్తాన్ అన్న పేరును రూపొందించిన వారు ఎవరు?
జవాబు:
చౌదరీ రెహ్మత్ అలీ.

62. ఏ సంవత్సరం నాటికి జపాను ఆగ్నేయ ఆసియాలోకి విస్తరించ సాగింది?
జవాబు:
1941.

63. పశ్చిమంలో సతార, తూర్పున మేదినిపూర్ వంటి జిల్లాల్లో స్వతంత్ర ప్రభుత్వాలను ప్రకటించిన సోషలిస్టు నాయకుడు ఎవరు?
జవాబు:
జయప్రకాశ్ నారాయణ్.

64. INA, బ్రిటిషు వాళ్ళకు వ్యతిరేకంగా దాదాపు ఎన్ని సంవత్సరాలు యుద్ధం చేసింది?
జవాబు:
3 సంవత్సరాలు

65. సాయుధ పోరాటం సంభవించిన ఒక ప్రాంతంను తెల్పండి.
జవాబు:
తెలంగాణ, ట్రావెన్‌కోర్‌ లోని పున్నప్రా-వాయలార్

66. మౌంట్‌బాటెను ముందు భారత వైస్రాయ్ ఎవరు?
జవాబు:
వావెల్.

67. గాంధీజీని హత్య గావించింది ఎవరు?
జవాబు:
నాథూరాం గాడ్సే,

68. భారతదేశంలో కొత్త రాష్ట్రాలను ఏర్పరిచే ఈ ప్రక్రియ ఏ సంవత్సరం వరకు కొనసాగింది?
జవాబు:
1956.

AP 10th Class Social Important Questions Chapter 16 భారతదేశ జాతీయోద్యమం-దేశ విభజన, స్వాతంత్య్రం: 1939-1947

69. బ్రిటిషు పార్లమెంట్ ఆమోదించిన భారత ప్రభుత్వ చట్టం 1935 ప్రకారం రాష్ట్ర శాసన సభలకు ఓటు వేసే హక్కును ఎంత శాతంకు కేటాయించారు?
జవాబు:
12%

70. బ్రిటిషు ఇండియాలో 11 రాష్ట్రాలలో ఎన్నికలు నిర్వహించిన సంవత్సరం ఏది?
జవాబు:
1937.

71. కాంగ్రెస్ అనేక వ్యక్తిగత సత్యాగ్రహాలను ఏ సంవత్సరంలో నిర్వహించింది?
జవాబు:
1942

72. 1937 ఎన్నికలలో ముస్లింలీగుకు ఆదరణ లభించిన ప్రావిన్సులు ఏవి?
జవాబు:
బాంబే, మద్రాస్, యునైటెడ్ ప్రావిన్సెస్.

73. కాంగ్రెస్ సభ్యులు హిందూ మహాసభలో సభ్యులుగా ఉండే అవకాశాన్ని వ్యతిరేకించిన వారు ఎవరు?
జవాబు:
మౌలానా అబుల్ కలాం ఆజాద్.

AP 10th Class Social Important Questions Chapter 16 భారతదేశ జాతీయోద్యమం-దేశ విభజన, స్వాతంత్య్రం: 1939-1947

74. భారత ఉపఖండంలో ముస్లింలు అధిక సంఖ్యలో ఉన్న ప్రాంతాలలో కొంత స్వయం ప్రతిపత్తిని కోరుతూ ముస్లింలీగ్ ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టిన సంవత్సరం.
జవాబు:
1940, మార్చి 23.

75. 1946లో రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్నికలు జరగగా రాష్ట్రంలోని 569 స్థానాలలో ముస్లింలీగ్ గెల్చుకున్న స్థానాలెన్ని?
జవాబు:
442.

76. జయప్రకాష్ నారాయణ్ వంటి సోషలిస్టు సభ్యులు చురుగ్గా పాల్గొన్న ఉద్యమం ఏది?
జవాబు:
క్విట్ ఇండియా ఉద్యమం.

77. బ్రిటిషు వారికి వ్యతిరేకంగా దేశంలో పలు ప్రాంతాలలో మిల్లులు, కర్మాగారాలలో పని ఆపేసిన సంవత్సరం ఏది?
జవాబు:
1946.

78. 1947 ఆగస్టు 15న బెంగాల్ లో అల్లర్లతో అతలా కుతలమైన నోవఖలీలో శాంతిని నెలకొల్పటానికి ప్రయత్నించిన నాయకుడు ఎవరు?
జవాబు:
మహాత్మా గాంధీజీ.

79. కాశ్మీర్, హైదరాబాద్, జునాగఢ్, బెంగాలలో భారతదేశ విలీన ఒప్పందంపై సంతకాలు చేసిన సంస్థానం ఏది?
జవాబు:
బెంగాల్.

80. భారత ప్రభుత్వం భరణాన్ని గత రాచరిక కుటుంబాల బిరుదులను ఏ సంవత్సరంలో రద్దు చేసింది?
జవాబు:
1971.

81. అఖిల భారత హిందూ మహాసభ రాజకీయ కార్యక్రమాన్ని త్యజించి నిజమైన సంస్థాగత పనిమీద దృష్టి కేంద్రీకరించాలని నిర్ణయించినది ఎప్పుడు?
జవాబు:
1948 ఫిబ్రవరి 14.

AP 10th Class Social Important Questions Chapter 16 భారతదేశ జాతీయోద్యమం-దేశ విభజన, స్వాతంత్య్రం: 1939-1947

82. క్రింది ఘటనలను సరైన కాలక్రమంలో అమర్చండి.
క్రిప్స్ రాయబారం, క్విట్ ఇండియా ఉద్యమం, రాయల్ నేవి తిరుగుబాటు, ప్రత్యేక కార్యాచరణ దినం.
జవాబు:
క్రిప్స్ రాయబారం, క్విట్ ఇండియా ఉద్యమం, రాయల్ నేవి తిరుగుబాటు, ప్రత్యేక కార్యాచరణ దినం.

10th Class Social 16th Lesson 1 Mark Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
‘రెండు దేశాల సిద్ధాంతం’ అనగానేమి?
జవాబు:
రెండు దేశాల సిద్ధాంతం :
హిందూ, ముస్లిం మత ప్రాతిపదికగా దేశాన్ని విభజించడమే రెండు దేశాల సిద్ధాంతం.

ప్రశ్న 2.
హిందూ మహాసభ, ఆర్ఎస్ఎస్లు ఏ మార్పు తీసుకురావాలని ఆశించాయి?
జవాబు:
కులం, వర్గాలను అధిగమించి హిందువులందరినీ ఏకం చేసి సామాజిక జీవితంలో సంస్కరణలను తీసుకురావాలని ఈ సంఘాలు ఆశించాయి.

ప్రశ్న 3.
రాజభరణములను రద్దు చేసిన ప్రధాన మంత్రి ఎవరు?
జవాబు:
రాజభరణములను రద్దు చేసిన ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ.

ప్రశ్న 4.
1909 లో ముస్లింలకు ప్రత్యేక నియోజక వర్గాలు ఎందుకు ఏర్పాటు చేశారు?
జవాబు:
1909లో ముస్లింలకు ప్రత్యేక నియోజక వర్గాలు ఏర్పాటు చేయడానికి కారణం :
i) ప్రభుత్వంలో ముస్లింల ప్రయోజనాలను కాపాడడం కోసం.
ii) ముస్లింల సమస్యలను ప్రస్తావించడం కోసం.

AP 10th Class Social Important Questions Chapter 16 భారతదేశ జాతీయోద్యమం-దేశ విభజన, స్వాతంత్య్రం: 1939-1947

ప్రశ్న 5.
క్రింది ఉద్యమాలను సరైన కాలక్రమంలో అమర్చండి.
క్విట్ ఇండియా ఉద్యమం, వందేమాతరం ఉద్యమం, శాసనోల్లంఘన ఉద్యమం
జవాబు:
i) వందేమాతరం ఉద్యమం.
ii) శాసనోల్లంఘన ఉద్యమం.
1) క్విట్ ఇండియా ఉద్యమం.

ప్రశ్న 6.
“బ్రిటీష్ పాలకులను తరిమివెయ్యటానికి అతడు రహస్యంగా జర్మనీకి, అక్కడి నుండి జపానుకు వెళ్ళి 1942లో భారతీయ సైనికులతో ఒక సైన్యాన్ని ఏర్పాటు చేశాడు.” ఈ వాక్యంలో చర్చించబడిన జాతీయ నాయకుడు ఎవరు?
జవాబు:
సుభాష్ చంద్రబోస్.

ప్రశ్న 7.
క్విట్ ఇండియా ఉద్యమంలో గాంధీజీ ఇచ్చిన నినాదమేమి?
జవాబు:
“చెయ్యండి లేదా చావండి” (Do or Die)

ప్రశ్న 8.
ఇవ్వబడిన దేశాలను అవి ఉన్న స్థానం ఆధారంగా తూర్పు నుండి పడమరకు అమర్చండి.
భారతదేశం, జపాన్, ఇంగ్లాండు, అమెరికా.
జవాబు:
జపాన్, భారతదేశం, ఇంగ్లాండు, అమెరికా.

ప్రశ్న 9.
అక్ష రాజ్యా లనగా ఏవి?
జవాబు:
జర్మనీ, జపాన్, ఇటలీలను కలిపి “అక్ష రాజ్యా ” లంటారు.

ప్రశ్న 10.
‘రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటన్ ప్రధానమంత్రి ఎవరు?
జవాబు:
రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో కన్సర్వేటివ్ పార్టీకి చెందిన “విన్స్టన్ చర్చిల్” ప్రధానమంత్రిగా ఉన్నారు.

ప్రశ్న 11.
ఎం.ఎ. జిన్నా ఎవరు?
జవాబు:
ఎం.ఎ. జిన్నా ముస్లిం లీగు నాయకుడు.

ప్రశ్న 12.
“క్విట్ ఇండియా” ఉద్యమం ఎప్పుడు, ఎందుకు ప్రారంభమైంది?
జవాబు:
క్రిప్స్ దౌత్యం విఫలమైన తరువాత బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా గాంధీజీ 1942 ఆగస్టులో “క్విట్ ఇండియా” ఉద్యమాన్ని ప్రారంభించారు.

ప్రశ్న 13.
భారత జాతీయ సైన్యం అంటే ఏమిటి?
జవాబు:
బర్మా, మలయా దేశాలలో బ్రిటనను జపాన్ ఓడించి, కొంత మంది సైనికులను బందీలుగా తీసుకుంది. సుభాష్ చంద్రబోస్ జపాన్ వెళ్ళి ఈ బందీలను విడుదల చేయించి వారితో జాతీయ సైన్యాన్ని ఏర్పాటు చేసినాడు.

AP 10th Class Social Important Questions Chapter 16 భారతదేశ జాతీయోద్యమం-దేశ విభజన, స్వాతంత్య్రం: 1939-1947

ప్రశ్న 14.
“ప్రత్యక్ష కార్యాచరణ” దినం ఏది?జవాబు:
1946 ఆగష్టు 16ను “ప్రత్యక్ష కార్యాచరణ” దినంగా ముస్లిం లీగు ప్రకటించింది.

ప్రశ్న 15.
చివరి వైస్రాయ్ ఎవరు?
జవాబు:
“మౌంట్ బాటెన్” భారతదేశానికి చివరి వైస్రాయ్ గా 1947 ఫిబ్రవరిలో వచ్చాడు.

ప్రశ్న 16.
భారత్, పాక్ కు స్వాతంత్ర్యం ఎప్పుడు వచ్చింది?
జవాబు:
పాకిస్తాన్‌కు 1947 ఆగస్టు 14న, భారత్ కు 1947 ఆగష్టు 15న స్వాతంత్ర్యం వచ్చింది.

ప్రశ్న 17.
గాంధీజీ ఎప్పుడు మరణించాడు?
జవాబు:
గాంధీజీ 1948 జనవరి 30న మరణించాడు.

ప్రశ్న 18.
బ్రిటిష్ అధికారం క్రింద ఎన్ని సంస్థానాలున్నాయి?
జవాబు:
బ్రిటిష్ అధికారం క్రింద వివిధ స్థాయిలలో సుమారు 550 సంస్థానాలుండేవి.

ప్రశ్న 19.
రైతాంగం, ఎక్కడ సాయుధ పోరాటం చేపట్టింది?
జవాబు:
హైదరాబాదు, ట్రావన్ కోర్లలో పాలక జమీందార్లకు వ్యతిరేకంగా రైతాంగం సాయుధ పోరాటం చేపట్టింది.

ప్రశ్న 20.
సంస్థానాలను విలీనం చేసే బాధ్యతను ఎవరికి అప్పగించడమైనది?
జవాబు:
1947లో సంస్థానాలను విలీనం చేసే బాధ్యతను “సర్దార్ పటేల్” కి అప్పగించారు.

ప్రశ్న 21.
1947 ఆగష్టు 15 నాటికి భారతదేశంలో విలీనం కాని సంస్థానాలేవి?
జవాబు:
1947 ఆగష్టు 15 నాటికి భారతదేశంలో కాశ్మీర్, హైదరాబాదు, జునాగఢ్లు విలీనం కాలేదు.

ప్రశ్న 22.
రాష్ట్రాలను ఎందుకు ఏర్పరిచారు?
జవాబు:
అనేక సంస్థానాలను భారతదేశంలో విలీనం చెయ్యటం మూలంగా పరిపాలన సౌలభ్యం కోసం రాష్ట్రాలను ఏర్పరిచారు.

ప్రశ్న 23.
భారతదేశంలో కొత్త రాష్ట్రాలను ఏర్పరిచే ప్రక్రియ ఎప్పటి వరకు కొనసాగింది?
జవాబు:
భారతదేశంలో కొత్త రాష్ట్రాలను ఏర్పరిచే ఈ ప్రక్రియ 1956 వరకు కొనసాగింది.

ప్రశ్న 24.
1971 భారత ప్రభుత్వం వేటిని రద్దు చేసింది?
జవాబు:
రాచరిక భరణాన్ని, గత రాచరిక కుటుంబాల బిరుదులను రద్దు చేసింది.

ప్రశ్న 25.
1935 భారత ప్రభుత్వ చట్టం ఎంత మందికి ఓటు హక్కును ఇచ్చింది?
జవాబు:
ఈ చట్టం రాష్ట్ర శాసనసభలకు 12%, కేంద్ర సభకు 1% ప్రజలకే ఓటు హక్కును కల్పించింది.

AP 10th Class Social Important Questions Chapter 16 భారతదేశ జాతీయోద్యమం-దేశ విభజన, స్వాతంత్య్రం: 1939-1947

ప్రశ్న 26.
1937లో జరిగిన ఎన్నికలలో ఎన్ని రాష్ట్రాలలో కాంగ్రెస్ విజయం సాధించింది?
జవాబు:
1937 ఎన్నికలలో 11 రాష్ట్రాలకుగాను 8 రాష్ట్రాలలో కాంగ్రెస్ విజయం సాధించి ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది.

ప్రశ్న 27.
కాంగ్రెస్ ఏ సభలో “పూర్ణ స్వరాజ్యం ” తమ ధ్యేయంగా తీర్మానించింది?
జవాబు:
1929 లో లాహోర్‌లో జరిగిన కాంగ్రెస్ సభలో ‘పూర్ణ స్వరాజ్యం” తమ ధ్యేయంగా కాంగ్రెస్ తీర్మానించింది.

ప్రశ్న 28.
1909 లో చేసిన చట్టం మూలంగా ముస్లింలకు లభించిన ప్రయోజనం ఏమిటి?
జవాబు:
1909 శాసన సభల చట్టం మూలంగా ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలను ఏర్పాటు చేశారు.

ప్రశ్న 29.
‘పాకిస్తాన్ లేదా పాకిస్తాన్’ అనే పదం ఏ విధంగా ఏర్పడింది?
జవాబు:
కేంబ్రిడ్జ్ లోని పంజాబీ ముస్లిం అయినా “చౌదరీ రెహ్మత్ ఆలి” అనే అతను పంజాబు, ఆఫ్ఘన్, కాశ్మీరు, సింధూ, బెలుచిస్థాన్లను ఇంగ్లీషు అక్షరాలతో రూపొందించినాడు.

ప్రశ్న 30.
లౌకిక రాజ్య మనగానేమి?
జవాబు:
మతంతో సంబంధం లేకుండా పౌరులందరికీ రాజ్యం నుండి రక్షణ లభిస్తుంది, సమాన హక్కులు ఉంటాయి. మత – ప్రమేయం ఉండదు. ఈ విధానాన్ని “లౌకికత్వం” అంటారు.

ప్రశ్న 31.
భారతదేశంలో విలీనం కావడానికి మొదట అంగీకరించని మూడు స్వదేశీ రాజ్యాలేవి?
జవాబు:
భారతదేశంలో విలీనం కావడానికి మొదట అంగీకరించని మూడు సంస్థానాలు :

  1. కాశ్మీర్
  2. జునాగఢ్
  3. హైదరాబాద్.

10th Class Social 16th Lesson 2 Marks Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
గాంధీజీ హత్య ఉదంతాన్ని సంక్షిప్తంగా రాయండి.
జవాబు:

  1. 1947 ఆగస్టు 15న బెంగాల్లో అల్లర్లతో అతలాకుతలమైన నోవఖలీలో శాంతిని నెలకొల్పటానికి జాతిపిత గాంధీజీ ప్రయత్నించాడు.
  2. దేశ రాజధాని అయిన ఢిల్లీకి అతడు 1947 సెప్టెంబరు 9నగాని రాలేదు.
  3. వాయవ్య భారత్ లో పెద్ద ఎత్తున చెలరేగిన మత ఘర్షణలతో ఆ వృద్ధ నేత అసంతృప్తితో ఉన్నారు.
  4. ప్రజల భయాలను దూరం చెయ్యడానికి ప్రయత్నించారు.
  5. దేశంలోని ప్రజలలోని ఒక వర్గం భారతదేశ రాజకీయాలలో గాంధీ పాత్రతో కోపంగా ఉంది.
  6. గాంధీజీ నిర్వహిస్తున్న సర్వమత ప్రార్థన సమావేశాలను పలుమార్లు వాళ్ళు భంగపరచారు.
  7. గాంధీజీని చంపటానికి రెండు రోజుల ముందు అతడిపై జరిపిన హత్యాయత్నం విఫలమైంది.
  8. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన ఆరు నెలల లోపే 1948 జనవరి 30 సాయంత్రం సర్వమత ప్రార్ధనకు వెళుతున్న జాతిపిత మూడు బుల్లెట్లకు నేలకొరిగాడు.

ప్రశ్న 2.
మహాత్మా గాంధీలో నీకు నచ్చిన లక్షణాలు ఏవి? ఎందుకు?
జవాబు:

  1. సత్యాన్ని పాటించడం.
  2. అహింసను పాటించడం.
  3. నిరాడంబరంగా ఉండడం.
  4. త్యాగనిరతి కలిగి ఉండడం.

AP 10th Class Social Important Questions Chapter 16 భారతదేశ జాతీయోద్యమం-దేశ విభజన, స్వాతంత్య్రం: 1939-1947

ప్రశ్న 3.
‘భారతదేశం అనేక మతాల, జాతుల దేశము. అది అలాగే కొనసాగాలి.’ వ్యాఖ్యానించండి.
జవాబు:

  1. భారతదేశంలో అనేక మతాలు, జాతులు ఉన్నాయి.
  2. అయినప్పటికి ఇది ప్రజాస్వామిక లౌకిక రాజ్యం ‘గా కొనసాగుతున్నది.
  3. మతంతో సంబంధం లేకుండా పౌరులందరికీ రాజ్యం రక్షణ కల్పిస్తున్నది.
  4. పౌరులందరికీ సమాన హక్కులు ఉన్నాయి.

ప్రశ్న 4.
సుభాష్ చంద్రబోస్ ఏర్పాటు చేసిన భారత జాతీయ సైన్యం గురించి రాయండి.
జవాబు:

  1. బ్రిటన్న జపాన్ ఓడించినపుడు కొందరు భారతీయ సైనికులు జపానుకు బందీలుగా చిక్కారు.
  2. ఈ సైనికులతో సుభాష్ చంద్రబోస్ భారత జాతీయ సైన్యాన్ని ఏర్పాటు చేశాడు.
  3. తరువాత ఎంతోమంది మహిళలతో సహా ఇతర భారతీయులు కూడా ఈ సైన్యంలో చేరారు.
  4. భారత జాతీయ సైన్యం బ్రిటీషువారికి వ్యతిరేకంగా దాదాపు 3 సంవత్సరాలపాటు యుద్ధం చేసింది.
  5. అంతిమంగా భారత జాతీయ సైన్యం బ్రిటీష్ వాళ్ళ చేతుల్లో ఓడిపోయింది.

ప్రశ్న 5.
సర్దార్ పటేల్ లో నీకు నచ్చిన గుణాలు ఏవి? ఎందుకు?
జవాబు:
సర్దార్ పటేలో నాకు నచ్చిన గుణాలు

  1. దేశభక్తి
  2. అంకితభావం మరియు నిబద్ధత

ప్రశ్న 6.
దొమీనియన్ ప్రతిపత్తి అనగానేమి?
జవాబు:
బ్రిటిష్ ప్రభుత్వం, 2వ ప్రపంచ యుద్ధం తరువాత సార్వభౌమాధికారం కలిగిన రాజ్యప్రతిపత్తిని భారతదేశానికి ఇస్తామని, అందుకొరకు ఒక రాజ్యాంగాన్ని రూపొందించి, దానిని బ్రిటిష్ అమలు చేస్తుందని ప్రకటించింది. దీనినే ” డొమీనియన్ ప్రతిపత్తి” అంటారు.

ప్రశ్న 7.
అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాలు 1939లో రాజీనామా ఎందుకు చేయవలసి వచ్చింది?
జవాబు:

  1. 1939లో రెండవ ప్రపంచ యుద్ధం మొదలైంది. కాంగ్రెస్ ను సంప్రదించకుండానే భారతదేశం కూడా రెండవ ప్రపంచ యుద్ధంలో పాల్గొనాలని బ్రిటిష్ వైస్రాయి ఏకపక్ష నిర్ణయం తీసుకున్నాడు.
  2. ఈ నిర్ణయాన్ని సహజంగానే కాంగ్రెస్ వ్యతిరేకించింది.
  3. యుద్ధంలో చురుగ్గా పాల్గొనడానికి ముందే భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్ర్యం ప్రకటించాలని లేదా కనీసం ముఖ్యమైన అధికారాలను అప్పగించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.
  4. బ్రిటిష్ ప్రభుత్వం ఈ కోరికలను అంగీకరించలేదు. అందుకు నిరసనగా కాంగ్రెస్ మంత్రి వర్గాలు 1939లో రాజీనామా చేసినాయి.

ప్రశ్న 8.
హిందూ మహాసభ, ఆర్.ఎస్.ఎస్. ముఖ్య పాత్ర ఏమిటి?
జవాబు:

  1. ఈ రెండు కూడా ప్రజలను సమీకరించడానికి చురుకుగా పనిచేశాయి.
  2. కులం, వర్గాలను అధిగమించి హిందువులందరినీ ఏకం చేసి సామాజిక జీవితంలో సంస్కరణలు తీసుకురావాలని ఈ సంఘాలు ఆశించాయి.
  3. భారతదేశం అధిక సంఖ్యలో ఉన్న హిందువుల భూమి అన్న అభిప్రాయాన్ని కూడా వాళ్ళు కలిగించారు.

ప్రశ్న 9.
అమెరికా, యూరపులలో జపాన్ సాధించిన విజయాలు భారతీయులపై ఏ విధంగా ప్రభావం చూపాయి?
జవాబు:

  1. అమెరికా, యూరపులలో జపాన్ సాధించిన విజయాలు భారతీయులపై బలమైన ముద్రలు వేశాయి.
  2. జపాను ఆసియా దేశం. అది ఐరోపా వలస పాలకులను ఎదుర్కొగలిగింది. తాము కూడా బ్రిటనకు వ్యతిరేకంగా పోరాడి, గెలవగలమని భారతీయులు భావించసాగారు.
  3. ఆంగ్లేయులు ఉన్నత జాతికి చెందిన వాళ్లన్న భ్రమ బద్దలయ్యింది.

ప్రశ్న 10.
భారత జాతీయ సైన్యం ఏ విధంగా ఆవిర్భవించింది?
జవాబు:
బర్మా, మలయా దేశాలలో బ్రిటన్ తో జపాన్ యుద్ధం చేసి ఓడించినపుడు కొంతమంది బ్రిటిష్ సైనికులను జపాను బందీలుగా తీసుకున్నది. ఈ బందీలలోని భారత సైనికులను సుభాష్ చంద్రబోస్ తీసుకొని దానికి భారత జాతీయ సైన్యం అని పేరు పెట్టినాడు. బోస్, భారత జాతీయ సైన్యంను జపాన్ సైన్యంతో కలిపి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా దాదాపు మూడు సంవత్సరాలపాటు యుద్ధం చేశాడు.

AP 10th Class Social Important Questions Chapter 16 భారతదేశ జాతీయోద్యమం-దేశ విభజన, స్వాతంత్య్రం: 1939-1947

ప్రశ్న 11.
“తెభాగ” ఉద్యమం అంటే ఏమిటి?
జవాబు:
బెంగాల్లో పెద్ద భూస్వాముల నుంచి భూమిని సాగుకు తీసుకున్న చిన్న, పేద రైతులు ఆందోళన చేయసాగారు. ఆ సమయంలో కౌలుకింద తమకు సగం, లేదా అంతకంటే తక్కువ ఇస్తుండగా తమ వాటాని మూడింట రెండు వంతులకు పెంచాలని వాళ్ళు కోరారు. దీనిని “తెభాగ” ఉద్యమం అంటారు. దీనికి ఆ రాష్ట్ర కిసాన్ సభ నేతృత్వం వహించింది.

ప్రశ్న 12.
“రాచరిక భరణం” అంటే ఏమిటి?
జవాబు:
భారతదేశంలో బ్రిటిష్ పాలనలో సుమారు 550 సంస్థానాలుండేవి. ఈ సంస్థానాలను భారతదేశంలో విలీనం చేసినాక భారత ప్రభుత్వం ఆయా రాచరిక కుటుంబాలకు వ్యక్తిగత ఖర్చులకు పెన్షను మంజూరు చేశారు. దీనినే “రాచరిక భరణం” అంటారు. అయితే ఈ రాజ భరణాలను 1971లో భారత ప్రభుత్వం రద్దు చేసింది. రాచరిక బిరుదులను కూడా రద్దు చేసింది.

ప్రశ్న 13.
1935 భారత ప్రభుత్వ చట్టంలోని ముఖ్యాంశాలేమిటి?
జవాబు:
3వ రౌండ్ టేబుల్ సమావేశంలో కొనసాగిన చర్చల ఫలితంగా 1935లో చట్టం చేయబడింది.
ముఖ్యాంశాలు :

  1. ఈ చట్టం ప్రకారం భారతదేశంలో ఫెడరల్ విధానం ఏర్పాటుకు సంబంధించిన అంశాలున్నాయి.
  2. రాష్ట్రాల్లో ద్వంద్వ పాలన రద్దు అయినది.
  3. అన్ని శాఖలు మంత్రులకే అప్పగించడం జరిగింది.
  4. కాని గవర్నర్‌కు శాసన సభా తీర్మానాలను తోసి పుచ్చే అధికారం ఉండేది.

ప్రశ్న 14.
జాతీయోద్యమానికి సంబంధించిన ఈ క్రింది ప్రదేశాలను ఇవ్వబడిన భారతదేశపటంలో గుర్తించండి.
1) పంజాబ్
2) సింధు
3) కాశ్మీర్
4) బెలూచిస్తాన్
5) బెంగాల్
6) హైదరాబాద్
7) జునాగఢ్
8) అసోం
9) ఆఫ్ఘన్
జవాబు:
AP 10th Class Social Important Questions Chapter 16 భారతదేశ జాతీయోద్యమం-దేశ విభజన, స్వాతంత్య్రం 1939-1947 2

ప్రశ్న 10.
భారతదేశ పటంలో ఈ క్రింది ప్రాంతాలను గుర్తించండి.
జవాబు:

  1. ఉత్తరప్రదేశ్
  2. బాంబే
  3. మద్రాసు
  4. బెంగాల్
  5. పంజాబ్

AP 10th Class Social Important Questions Chapter 16 భారతదేశ జాతీయోద్యమం-దేశ విభజన, స్వాతంత్య్రం 1939-1947 3

ప్రశ్న 11.
మహాత్మాగాంధీలో మీకు నచ్చిన ఏవైనా నాలుగు లక్షణాలను తెలపండి.
జవాబు:

  1. గాంధీజీ స్వాతంత్ర్యోద్యమానికి పెద్ద ఎత్తున ప్రజల మద్దతు సంపాదించి పెట్టాడు.
  2. గాంధీజీ సత్యాగ్రహం, అహింస ఆయుధాలుగా స్వాతంత్ర్యం సంపాదించి పెట్టాడు.
  3. గాంధీ విభజన సందర్భంగా జరిగిన అల్లర్లలో, మరణాలు, నిర్వాసితులుగావడం పట్ల బాధతో మొదట స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకోలేదు.
  4. గాంధీజీ చొరవతో అల్పసంఖ్యాక వర్గాల హక్కులపై నెహ్రూ, కాంగ్రెస్ ఒక తీర్మానాన్ని చేయడం జరిగింది.

ప్రశ్న 12.
భారతీయులు తమ స్వాతంత్ర్య పోరాటాన్ని పక్కన పెట్టి స్వేచ్ఛాయుత ప్రపంచంపై దృష్టి కేంద్రీకరించాల్సినంతగా హిట్లర్ బలం పుంజుకుని మానవాళి స్వేచ్చకు ముప్పు కలిగించేవాడా?
జవాబు:
మొదటి ప్రపంచయుద్ధం తరువాత ఆమోదించిన రెహ్మత్ ఆలివర్సయిల్స్ సంధి షరతులు జర్మనీకి అవమానకరంగా ఉన్నాయని హిట్లర్ భావించాడు. ఇతర దేశాల ఆధీనంలో ఉన్న జర్మన్ భూభాగాలను ఏకం చేయాలని ఆశించాడు. సంధి షరతులను ఉల్లంఘించినాడు. పెద్ద దేశాలను ఎదిరించి, దూర ప్రాచ్యంలో తమకు కూడా వలసలు కావాలని ఆశించాడు. జర్మనీని చూసి అగ్రరాజ్యలు భయపడేలా చేసాడు. అయితే మన స్వాతంత్ర్య పోరాటం వదిలి స్వేచ్ఛాయుత ప్రపంచం కొరకు దృష్టి పెట్టవలసినంత అవసరం లేదు. జర్మనీకి భారత జాతీయ పోరాటం మీద సానుభూతి కూడా ఉంది.

10th Class Social 16th Lesson 4 Marks Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
దేశ విభజన సామాన్య ప్రజానీకంపై ఎలా ప్రభావితం చూపింది?
జవాబు:
దేశ విభజన సామాన్య ప్రజల జీవితాలను బాగా ప్రభావితం చేసింది.

  1. తమ ఊళ్ళు, ఇళ్ళు, పట్టణాలను విడిచి వెళ్ళవలసిరావటంతో ఒకరిపట్ల ఒకరికి కోపం, విద్వేషాలు చెలరేగాయి.
  2. మొత్తంగా 1.5 కోట్లు హిందువులు, ముస్లిములు నిర్వాసితులయ్యారు.
  3. హత్యలు, దోపిడి, దహనాలు యధేచ్ఛగా కొనసాగాయి.
  4. హిందువులు, ముస్లింలు కలిపి రెండు నుండి అయిదు లక్షల మంది చంపబడ్డారు.
  5. వాళ్ళు కాందిశీకులుగా మారారు, పునరావాస శిఖరాలలో గడిపారు.
  6. రైళ్ళలో కొత్త ఇళ్ళ అన్వేషణలో బయలుదేరారు.
  7. శాంతి, సౌభ్రాతృత్వ సందేశాలను పంచుతూ గాంధీజీ అల్లర్లకు గురైన ప్రజల శిబిరాల మధ్య ఆసుపత్రులలో గడిపాడు.
  8. గాంధీజీ చొరవతో “అల్ప సంఖ్యాక వర్గాల హక్కుల పై’ నెహ్రూ, కాంగ్రెస్ ఒక తీర్మానాన్ని చేశాయి.

AP 10th Class Social Important Questions Chapter 16 భారతదేశ జాతీయోద్యమం-దేశ విభజన, స్వాతంత్య్రం: 1939-1947

ప్రశ్న 2.
ఈ క్రింది పేరాగ్రాను చదివి వ్యాఖ్యానించండి.
బ్రిటన్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమును సంప్రదించకుండనే భారతదేశం యుద్ధంలో పాల్గొంటుందని నిర్ణయం తీసుకుంది. దీంతో కాంగ్రెస్ సతమతమైపోయింది. అనేకమంది కాంగ్రెస్ నాయకులు హిట్లర్, ముస్సోలినిని, ఫాసిజాన్ని వ్యతిరేకించారు. ఇతర స్వతంత్ర దేశాలను జయించటానికి ప్రయత్నిస్తున్న ఫాసిస్ట్ శక్తులను ఎదుర్కోవాలన్న కృత నిశ్చయంతో వాళ్ళు ఉన్నారు. భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్ర్యం ఇవ్వకుండా ఫాసిస్టులపై తమ పోరాటంలో భారతదేశం మద్దతు ఇవ్వాలని కోరుకోవటంలో అవలంబిస్తున్న ద్వంద్వ ప్రమాణాలను బ్రిటిష్ గుర్తిస్తుందని కాంగ్రెస్ ఆశించింది.

ప్రశ్న: బ్రిటిష్ వారి ద్వంద్వ ప్రమాణాలపై వ్యాఖ్యానించండి.
జవాబు:

  1. భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్ర్యం ఇవ్వకుండా ఫాసిస్టులపై తమ పోరాటంలో భారతదేశం మద్దతు ఇవ్వాలని కోరుకోవటంలో అవలంబిస్తున్న ద్వంద్వ ప్రమాణాలను బ్రిటీషు ప్రభుత్వం గుర్తిస్తుందని కాంగ్రెస్ ఆశించింది.
  2. బ్రిటిషువారు దీనిని గుర్తించారు.
  3. కానీ తాము నిర్మించిన సామ్రాజ్యాన్ని వదులుకోవటం వాళ్ళకి చాలా కష్టంగా అనిపించింది.
  4. బ్రిటిష్ సామ్రాజ్యం కింద భారతదేశానికి డొమినియన్ ప్రతిపత్తి ఇవ్వటానికి బ్రిటిష్ వాళ్ళు సంసిద్ధంగా ఉన్నారు. కానీ కాంగ్రెస్ సంపూర్ణ స్వరాజ్యం కోరింది.
  5. బ్రిటన్ దీనికి అభ్యంతరం పెట్టింది.
  6. కాంగ్రెస్ భారతీయులందరికీ ప్రాతినిధ్యం వహించటం లేదని బ్రిటన్ భావం.
  7. అనేకమంది భారతీయుల ప్రయోజనాలను కాంగ్రెస్ పట్టించుకోవడం లేదని వాటిని కాపాడాల్సిన బాధ్యత తమపైన ఉన్నదని బ్రిటన్ భావించింది.

ప్రశ్న 3.
ఈ క్రింది పేరాగ్రాను చదివి వ్యాఖ్యానించండి.

బెంగాల్లో పెద్ద భూస్వాముల నుంచి భూమికి సాగుకు తీసుకున్న చిన్న, పేద రైతులు ఆందోళన చేయసాగారు. ఆ సమయంలో కౌలు కింద తమకు సగం, లేదా అంతకంటే తక్కువ ఇస్తుండగా తమ వాటాని మూడింట రెండు వంతులకు పెంచాలని వాళ్ళు కోరారు. దీనినే ‘తేభాగ’ ఉద్యమం అంటారు. దీనికి ఆ రాష్ట్ర కిసాన్ సభ నేతృత్వం వహించింది.
ప్రశ్న: పై పేరాను చదివి చిన్న, పేద రైతుల డిమాండ్లను సమర్థిస్తావా? అయితే ఎలా? వ్యాఖ్యానించుము.
జవాబు:
అవును, నేను బెంగాల్ లోని చిన్న, సన్నకారు రైతుల ఆందోళనను సమర్థిస్తాను.

  1. బెంగాల్ ప్రజలకు కౌలు కింద తమకు సగం, లేదా అంతకంటే తక్కువ ఇస్తుండగా తమ వాటాని మూడింట రెండు వంతులకు పెంచాలని వాళ్ళు కోరారు.
  2. పంటను పండించటానికి రైతులు పెట్టుబడిని పెట్టినప్పటికీ రైతులకు సరియైన ఆదాయాన్ని యజమానులు ఇవ్వకుండా మోసం చేస్తున్నారు.
  3. పంటలు సరిగా పండకపోయినప్పటికీ రైతులు ఎక్కువ కౌలును చెల్లించవలసిరావడం మరియు వాళ్ళు చాలా ఆర్థికపరమైన సమస్యలను ఎదుర్కొనవలసి రావడంతో తీసుకున్న రుణాలను కూడా తిరిగి చెల్లించలేకపోయినాయి.

ప్రశ్న 4.
కొత్తగా ఏర్పడిన భారతదేశంలోకి వివిధ సంస్థానాలను విలీనం చేసే ప్రక్రియ ఒక సవాలుగా పరిణమించింది. చర్చించండి.
జవాబు:

  1. బ్రిటిష్ పాలకులు భారతదేశంను విడిచి వెళ్ళే సమయానికి సుమారు 550 స్వదేశీ సంస్థానాలు ఉండేవి.
  2. బ్రిటిష్ వారి పాలన అనంతరం అవి స్వాతంత్ర్యం పొందాయి.
  3. ఈ సంస్థానాలను బ్రిటిష్ వారు భారతదేశంలో విలీనమవ్వడమో లేదా పాకిస్థాన్లో విలీనమవ్వడమో లేదా స్వతంత్రంగా ఉండటమో నిర్ణయం తీసుకోవలసిందిగా కోరారు.
  4. ఈ క్రమంలో హైదరాబాద్, ట్రావెన్ కోర్స్ లో పాలక జమీందార్లకు వ్యతిరేకంగా రైతాంగం సాయుధ పోరాటం చేపట్టింది.
  5. స్వదేశీ సంస్థానాలు భారత భూభాగంలో విలీనం చేసే బాధ్యతను 1947 జులై నెలలో సర్దార్ వల్లభాయి పటేల్‌కు అప్పగించబడింది.
  6. భారతదేశంలో ఈ సంస్థానాలు విలీనం కావలసిన ఆవశ్యకత గురించి పటేల్ రాచరిక కుటుంబాలతో చర్చించారు.
  7. ఫలితంగా కాశ్మీర్, హైదరాబాద్, జునాగఢ్ లు తప్పించి మిగిలిన సంస్థానాలన్నీ భారతదేశంతో విలీన ఒప్పంద పత్రంపై సంతకం చేశాయి.
  8. స్వాతంత్ర్యం పొందిన రెండు సంవత్సరాలలోనే మిగిలిన సంస్థానాలను కూడా విలీనం చేసి సర్దార్ పటేల్ సమర్ధవంతంగా ఈ సవాలును ఎదుర్కొన్నారు.

ప్రశ్న 5.
ప్రపంచవ్యాప్తంగా అత్యధిక రాజకీయ వ్యవస్థలుగా ప్రజాస్వామ్యాలే ఉన్నాయి. ఇవి ప్రజల ఆకాంక్షలకు పూర్తి న్యాయం చేశాయా?
జవాబు:

  1. అవును. ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ప్రజల ఆకాంక్షలకు న్యాయం చేస్తాయి.
  2. ఎందుకనగా అవి ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల వలన ఏర్పడిన ప్రభుత్వాలు కనుక అవి ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తాయి.
  3. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక శాతం ప్రజలచేత ఆమోదించబడిన రాజకీయ వ్యవస్థ ప్రజాస్వామ్యము.
  4. ప్రజాస్వామ్యంలో ప్రజలు అత్యంత జాగరూకత మరియు అప్రమత్తత కలిగి ఉంటారు. కనుక వారి ఆకాంక్షలకు న్యాయం జరుగుతుంది.
  5. ప్రజల ఆకాంక్షలను ప్రభుత్వాలు నెరవేర్చని పక్షంలో ప్రజలు ఉద్యమాలు చేపడతారు.

AP 10th Class Social Important Questions Chapter 16 భారతదేశ జాతీయోద్యమం-దేశ విభజన, స్వాతంత్య్రం: 1939-1947

ప్రశ్న 6.
1935 చట్టం ఇచ్చిన అధికారాలకు భారతీయులు బ్రిటిష్ ప్రభుత్వం పట్ల కృతజ్ఞత భావం కలిగి ఉండాలా? మీ అభిప్రాయం తెలుపుము.
జవాబు:
లేదు. 1935 చట్టం ఇచ్చిన అధికారాలకు భారతీయులు బ్రిటిష్ ప్రభుత్వం పట్ల కృతజ్ఞతాభావం కలిగి ఉండవలసిన అవసరము లేదు. ఎందుకంటే

  1. భారతదేశము భారతీయులదే.
  2. మనకు స్వేచ్ఛ కోరే హక్కు ఉన్నది.
  3. మన జాతీయ నాయకులు, స్వతంత్ర్య రాజ్యస్థాపనకై తిరుగుబాటు చేయడం మొదలు పెట్టారు.
  4. అందువల్లనే బ్రిటిష్ వారు 1935 చట్టాన్ని చేశారు.

కనుక, మనము మన జాతీయవాద నాయకులు, స్వాతంత్ర్య పోరాట వీరుల పట్ల కృతజ్ఞతా భావం కలిగి ఉండాలి కానీ బ్రిటిష్ వారి పట్ల కాదు.

ప్రశ్న 7.
స్వాతంత్రం వచ్చిన తొలి సంవత్సరాలలో సామాజిక ఆర్థిక మార్పు తీసుకురావటానికి ఏ చర్యలు చేపట్టారు?
జవాబు:

  1. స్వాతంత్ర్యానంతరం 1950లో ప్రణాళికా సంఘం స్థాపించబడింది.
  2. పంచవర్ష ప్రణాళికలు 1951లో ప్రారంభం అయ్యా యి.
  3. భూ సంస్కరణలు అమలు చేయబడ్డాయి.
  4. జమిందారీ వ్యవస్థ రద్దు కాబడింది. 5) వ్యవసాయ సహకార సంఘాలను ఏర్పాటు చేశారు.
  5. కౌలుదారీ సంస్కరణలు మరియు భూపరిమితి చట్టాలు చేయబడ్డాయి.
  6. స్థానిక స్వపరిపాలన సంస్థలు ఏర్పాటు చేశారు.
  7. డ్యాంలు, పరిశ్రమల నిర్మాణం చేపట్టబడింది.

ఈ విధంగా స్వాతంత్ర్యం వచ్చిన తొలి సంవత్సరాలలో సామాజిక, ఆర్థిక మార్పు తీసుకురావడానికి పలు చర్యలు చేపట్టారు.

ప్రశ్న 8.
క్రింది ఇచ్చిన పేరాగ్రాఫును చదివి దిగువ ఇచ్చిన ప్రశ్నకు జవాబు రాయండి.
శాంతి, సౌభ్రాతృత్వం అనే సందేశాలను పంచుతూ గాంధీజీ శిబిరాలలోనూ, ఆసుపత్రులలోనూ తలదాచుకుంటున్న అల్లర్లకు గురైన ప్రజల మధ్య గడిపాడు. తను ఇంతగా కష్టపడింది. ఇటువంటి స్వేచ్ఛ, స్వరాజ్యాల కోసం కాదు. మొదటి స్వాతంత్ర్య దినోత్సవం నాడు జాతిపిత ఎటువంటి సంబరాలు చేసుకోలేదు. నిరాహారదీక్ష చేశాడు.
ప్రశ్న: నూతన దేశం పాకిస్తాన్ ఏర్పాటు కావడంతో కొత్తగా గీసిన సరిహద్దు రేఖకు ఇరువైపులా గల ప్రజలు ఎదుర్కొనవలసి వచ్చిన పరిస్థితుల గురించి వ్యాఖ్యానించండి.
జవాబు:

  1. భారత్ వైపు ఉన్న ముస్లింలలో, పాకిస్తాన్ వైపు ఉన్న హిందువులలో అభద్రత ఏర్పడింది. ఇళ్ళు, ఊళ్ళు విడిచి వెళ్ళవలసి రావడంతో ఒకరి పట్ల ఒకరికి కోపం, విద్వేషం చెలరేగాయి.
  2. 1.5 కోట్ల మంది హిందువులు, ముస్లిములు నిర్వాసితులయ్యారు. అనేకులు పునరావాస శిబిరాలలో గడిపారు.
  3. హత్యలు, దోపిడీలు, దహనాలు కొనసాగాయి. జనం రెండు నుండి ఐదు లక్షలమంది చంపబడ్డారు.
  4. స్వాతంత్ర్య దినోత్సవం నాడు అందరూ పండుగ చేసుకుంటుంటే జాతిపిత గాంధీ మాత్రం నిరాహార దీక్షలో గడిపాడు.

ప్రశ్న 9.
భారతదేశ విభజన వలన సంభవించిన పరిణామాలు వ్రాయండి.
జవాబు:
భారతదేశ విభజన వలన సంభవించిన పరిణామాలు :

  1. భారత్ వైపు ఉన్న ముస్లింలలో, పాకిస్థాన్ వైపు ఉన్న హిందువులలో అభద్రత ఏర్పడింది.
  2. ఇళ్ళు, ఊళ్ళు విడిచి వెళ్ళవలసి రావడంతో ఒకరి పట్ల ఒకరికి కోపం, విద్వేషం చెలరేగాయి.
  3. దాదాపు 1.5 కోట్ల మంది హిందువులు, ముస్లింలు నిర్వాసితులయ్యారు.
  4. అనేకులు పునరావాస శిబిరాలలో గడిపారు. 5) హత్యలు, దోపిడీలు, దహనాలు కొనసాగాయి.
  5. రెండు నుండి ఐదు లక్షల మంది జనం చంపబడ్డారు.

ప్రశ్న 10.
భారత జాతీయ సైన్యం భారత స్వాతంత్ర్యం కోసం ఎలా పోరాడిందో వివరించండి.
జవాబు:
భారతదేశ స్వాతంత్ర్యం అత్యంత ప్రాధాన్యత గల అంశమని, బ్రిటిష్ పాలకులను తరిమెయ్యటానికి జపాను వాళ్ల సహాయం తీసుకోవాలని సుభాష్ చంద్రబోస్ భావించాడు. అతడు రహస్యంగా జర్మనీకి, అక్కడినుంచి జపానుకి వెళ్లి 1942లో భారతీయ సైనికులతో ఒక సైన్యాన్ని తయారుచేశాడు. బర్మా, మలయా దేశాలలో బ్రిటన్న జపాను ఓడించినపుడు బందీలుగా తీసుకున్న బ్రిటిష్ సైన్యంలోని వాళ్ళే వీళ్లు. భారత జాతీయ సైన్యం అని పేరుపెట్టి తన సైన్యంలోకి బోస్ వీళ్లని తీసుకున్నాడు. తరువాత ఎంతోమంది మహిళలతో సహా ఇతర భారతీయులు కూడా ఈ సైన్యంలో చేరారు. అయితే బోతో గాంధీజీ ఏకీభవించలేదు, జపనీయులు భారతదేశానికి విముక్తి దాతలు కాలేరని అతడు భావించాడు. కానీ సుభాష్ తాను ఎంచుకున్న మార్గంలో ముందుకు సాగాడు. జపాను సైన్యంతో కలిసి తన సైన్యంతో బ్రిటిష్ వాళ్లకు వ్యతిరేకంగా దాదాపు మూడు సంవత్సరాలపాటు యుద్ధం చేశాడు. . సుభాష్ చంద్రబోస్ భారత జాతీయ సైన్యం బ్రిటిష్ వాళ్ల చేతుల్లో ఓటమి పాలయ్యింది. భారత జాతీయ సైన్యానికి చెందిన సైనికులను జైలుపాలు చేసి శిక్షించాలని బ్రిటిష్ పాలకులు నిర్ణయించారు.

AP 10th Class Social Important Questions Chapter 16 భారతదేశ జాతీయోద్యమం-దేశ విభజన, స్వాతంత్య్రం: 1939-1947

ప్రశ్న 11.
కింది పేరాను చదివి, మీ అభిప్రాయాన్ని రాయండి.
అమెరికా యూరప్లో జపాన్ సాధించిన విజయాలు భారతీయులపై బలమైన ముద్రలు వేసాయి. ఐరోపా వలస పాలకులు త్వరలోనే ఓడింపబడతారని అనుకోసాగారు. జపాన్ ఆసియా దేశం. అది ఐరోపా వలస పాలకులను ఎదుర్కోగలిగింది. తాము కూడా బ్రిటన్‌కు వ్యతిరేకంగా పోరాడి, గెలవగలమని భారతీయులు అనుకోసాగారు.
జవాబు:

  1. జపాన్ 1905 రష్యా-జపాన్ యుద్ధంలో శక్తివంతమైన రష్యా సామ్రాజ్యాన్ని ఓడించింది.
  2. జపాన్ తనదైన ఫాసిస్టు సిద్ధాంతాన్ని రూపొందించుకొని చైనా, కొరియా వంటి దేశాలపై సైనిక దాడులకు పాల్పడింది.
  3. రెండవ ప్రపంచ యుద్ధంలో భాగంగా 1942లో జపాన్ అమెరికా పై దాడి చేసింది.
  4. అమెరికా, యూరప్లో జపాను సాధించిన విజయాలు భారతీయులను ప్రభావితం చేశాయి.
  5. జపాను విజయాలతో భారతదేశం వంటి ఆసియా దేశాలలో జాతీయవాదం వెల్లువలా ఉప్పొంగింది.
  6. ఒక చిన్న ఆసియా దేశమైన జపాను ఐరోపా వలస పాలకులను ఎదుర్కోగలిగినట్లే తాము కూడా బ్రిటనకు వ్యతిరేకంగా పోరాడి, గెలవగలమని భారతీయులు భావించారు. ఆంగ్లేయులు ఉన్నత జాతికి చెందిన వారన్న భ్రమ బద్దలయ్యింది.
  7. ఈ విధంగా జపాను విజయాలు భారత స్వాతంత్ర్య పోరాటానికి స్ఫూర్తినిచ్చాయని చెప్పవచ్చు.

ప్రశ్న 12.
1909 భారత శాసనసభల చట్టంలోని ముఖ్యాంశాలేమిటి?
జవాబు:
I. 1) శాసనసభలను విస్తరించడమైంది.
2) ప్రతి శాసనసభలో మూడు రకాలయిన సభ్యులు ఏర్పాటు అయినారు.
A) అధికారులు
B) అనధికారులు
C) నామనిర్దేశక సభ్యులు.

3) రాష్ట్రాలలో కూడా ఇదే విధంగా మూడు రకాలయిన సభ్యులు ఉంటారు. కాని ఇక్కడ ఎన్నిక ద్వారా వచ్చేవారి సంఖ్య ఎక్కువ.

4) సభ్యులను ఎన్నుకోవడం కోసం మూడు రకాలయిన నియోజక వర్గాలు ఏర్పడినాయి.
a) సాధారణ నియోజక వర్గం
b) భూస్వాముల నియోజక వర్గం, ముస్లింల నియోజక వర్గం
C) వర్తక సంఘాలలాంటి ప్రత్యేక నియోజక వర్గాలు.

II. 5) మహమ్మదీయులకు ప్రత్యేక నియోజక వర్గాలను ఏర్పాటు చేసినారు.

III. 6) ఇంగ్లాండులోని ఇండియా కౌన్సిలులో రెండు స్థానాలు భారతీయులకు కేటాయించినారు. ఒకటి హిందువులకు, రెండవది మహమ్మదీయులకు.

ప్రశ్న 13.
1919 భారత రాజ్యాంగ చట్టమును వివరించండి.
జవాబు:
1919 భారత రాజ్యాంగ చట్టమును “మాంటేగు చేమ్సుఫర్డు సంస్కరణలు” అంటారు. ఈ చట్టంలో రెండు భాగాలున్నాయి.
I. బ్రిటన్‌లోని యంత్రాంగంలో మార్పులు చేయుట.
II. భారతదేశంలోని యంత్రాంగంలో మార్పులు చేయుట.

I. బ్రిటన్లోని యంత్రాంగంలోని మార్పులు :
a) భారత రాజ్యాంగ కార్యదర్శి (ఇండియా మంత్రి) జీతభత్యాల ఖర్చు బ్రిటిష్ ప్రభుత్వమే వహించడానికి నిర్ణయించబడింది.
b) కార్యదర్శి యొక్క అధికారాలను కొంత వరకు తగ్గించబడినాయి.
c) హై కమిషనర్ అనే ఒక కొత్త పదవి సృష్టించడమైనది. అతనిని భారత ప్రభుత్వమే నియమించి అతని ఖర్చులన్నీ భరించాలి.

II. భారత యంత్రాంగంలోని మార్పులు :
a) కేంద్ర శాసనసభలో దిగువశాఖ, ఎగువశాఖ అనే రెండు శాఖలు (Lower House and Upper House) ఏర్పడినాయి.
b) దిగువశాఖను శాసనసభ అనీ, ఎగువసభను రాజ్యసభ అనీ అంటారు.
c) ఎగువసభ కాలపరిమితి 5 సంవత్సరాలు, దిగువ సభ కాలపరిమితి 3 సంవత్సరములు.
d) ఈ చట్టం ద్వారా రాష్ట్రంలో రెండు రకాల అధికారాలు, శాఖలు అనగా రిజర్వు శాఖ, ట్రాన్స్ ఫర్డ్ శాఖలుగా విభజించబడ్డాయి.
e) ప్రాముఖ్యం లేదా వైద్యం, విద్య, వ్యవసాయం, పశుపోషణ, రిజిస్ట్రేషను, దేవాదాయాలు, పరిశ్రమాభివృద్ధి వంటి అంశాలు ట్రాన్స్ఫర్డ్ శాఖ ఆధీనంలో ఉంచబడినాయి.
f) భూమిశిస్తు, నీటి పారుదల, కార్మిక విషయాలు, వార్తా పత్రికలపై అజమాయిషి, క్షామనివారణ, శాంతి భద్రతలు వంటి కీలక అంశాలు రిజర్వ్డు శాఖ ఆధీనంలో ఉంచబడినాయి.
g) కేంద్రంలో వలెనే రాష్ట్రాలలో కూడా సాధారణ నియోజక వర్గాలు, ప్రత్యేక నియోజక వర్గాలు ఏర్పాటైనాయి.

AP 10th Class Social Important Questions Chapter 16 భారతదేశ జాతీయోద్యమం-దేశ విభజన, స్వాతంత్య్రం: 1939-1947

ప్రశ్న 14.
1937-1947 మధ్య ముస్లింల ఆలోచనలు ఎందుకు మారాయి? అవి 1946 ఎన్నికలలో ముస్లిం లీగు విజయభేరి మోగించడానికి దోహదపడినాయా?
జవాబు:
ముస్లిముల పట్ల కాంగ్రెస్ సున్నితత్వంతో స్పందించటం లేదని అనేక అంశాలను ముస్లిం లీగు ఎత్తి చూపింది. ఉదాహరణకు యునైటెడ్ ప్రావిన్స్ లో ఎక్కువ సీట్లనే గెలుచుకున్న ముస్లిం లీగుతో కలిపి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయటాన్ని కాంగ్రెస్ తిరస్కరించింది. తమ సభ్యులు ముస్లిం లీగులో సభ్యత్వం తీసుకోవటాన్ని కాంగ్రెస్ నిషేధించింది. అంతకుముందు వరకు కాంగ్రెస్ సభ్యులు హిందూ మహాసభలో కూడా సభ్యులుగా ఉండే అవకాశం ఉండేది. మౌలానా ఆజాద్ వంటి కాంగ్రెస్లోని ముస్లిం నాయకులు దీనికి అభ్యంతరం తెలిపిన తరువాత 1938లో దీనిని కూడా నిషేధించారు. ఈ విధంగా కాంగ్రెస్ మౌలికంగా హిందువుల పార్టీ అని, ముస్లిములతో అధికారాన్ని పంచుకోటానికి అది సుముఖంగా లేదన్న అభిప్రాయాన్ని ముస్లిం లీగు సృష్టించగలిగింది.

ప్రశ్న 15.
సర్ స్టాఫర్డ్ క్రిప్స్ రాయబారంలోని చర్చలు విఫలం అయినాయి అని ఏ విధంగా చెప్పగలవు?
జవాబు:
రెండవ ప్రపంచ యుద్ధానంతరం భారతదేశానికి డొమీనియన్ ప్రతిపత్తి మరియు రాజ్యాంగాన్ని రూపొందించుకోడానికి భారతదేశాన్ని అనుమతించే వాగ్దానం వంటి సంస్కరణలు క్రిప్స్ రాయబారంలో చర్చించినప్పటికి ఈ చర్చలు విఫలం అవడానికి ముఖ్య కారణాలు ఈ విధంగా ఉన్నాయి. అవి :

  1. ఏర్పాటు చేయబోయే రాజ్యాంగాన్ని తిరసరించే హక్కు సంస్థానాలకు ఇవ్వడం, దీని వల్ల కాంగ్రెస్ తిరస్కరించింది.
  2. పాకిస్తాన్ డిమాండను ఈ ప్రతిపాదన అంగీకరించలేదు. కాబట్టి ముస్లింలు కూడా దీన్ని అంగీకరించలేదు.

“దివాలా తీస్తున్న బ్యాంకు మీద ముందు రోజు తేది వేసి రాసిన చెక్కులాంటిదని” క్రిప్స్ రాయబారాన్ని గాంధీజీ తిరస్కరించడంతో ఈ చర్చలు విఫలం అయ్యాయని చెప్పవచ్చు.

ప్రశ్న 16.
“క్విట్ ఇండియా”. ఉద్యమం ఏ విధంగా విస్తరించింది?
జవాబు:

  1. 1942 ఆగస్టులో క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభమైంది.
  2. ఉద్యమ ప్రారంభంలోనే గాంధీజీని ఖైదు చేసినా యువకార్యకర్తలు దేశ వ్యాప్తంగా సమ్మెలు నిర్వహించారు.
  3. దాడులు చేసి, ఆస్తి నష్టం కలిగించారు.
  4. యువత పెద్ద సంఖ్యలో కళాశాల చదువులు వదిలి పెట్టి జైళ్ళకు వెళ్ళారు.
  5. మారుమూల గ్రామాలలోని రైతులను మేల్కొలిపారు.
  6. పోస్టాఫీసులు, రైల్వే స్టేషన్లపై దాడి జరిపారు.

పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా విప్లవం సాగింది. అయితే బ్రిటిష్ పాలకులు మరింత బల ప్రయోగంతో శక్తివంతంగా ఉద్యమాన్ని అణచివేశారు.

ప్రశ్న 17.
సంస్థానాల విలీనం ఏవిధంగా జరిగింది ? ఎవరు దీనికి నాయకత్వం వహించారు?
(లేదా )
సంస్థానాల విలీనంలో సర్దార్ వల్లభభాయ్ పటేల్ నిర్వహించిన పాత్ర గురించి వివరించండి.
జవాబు:
బ్రిటిష్ అధికారం క్రింద సుమారు 550 సంస్థానాలు ఉండేవి. ఈ సంస్థానాలను, భారతదేశంలో చేరతారో, పాకిస్తాన్లో చేరతారో, లేదా స్వతంత్రంగా ఉంటారో నిర్ణయించుకోమన్నారు. అయితే ఆయా సంస్థానాలలోని ప్రజలు ప్రజా మండల ఉద్యమాల్లో పాల్గొనటం మూలంగా ప్రజాస్వామిక హక్కులపట్ల చైతన్యం కలిగి, రాజరిక కుటుంబాల పాలన కొనసాగాలని వారికి లేదు. కాంగ్రెస్ ఈ సంస్థానాలను భారతదేశంలో విలీనం చేసే బాధ్యతను 1947లో సర్దార్ పటేల్ కి అప్పగించారు.

1947 ఆగష్టు 15 నాటికి కాశ్మీర్, హైదరాబాద్, జునాగు తప్పించి మిగిలిన సంస్థానాలన్నీ భారతదేశంలో విలీనం ఒప్పందంపై సంతకాలు చేశాయి. తరువాత రెండు సంవత్సరాలలోపు ఈ మూడు సంస్థానాలు కూడా భారతదేశంలో విలీనం అయ్యేటట్లు పటేలు చేశారు.

AP 10th Class Social Important Questions Chapter 16 భారతదేశ జాతీయోద్యమం-దేశ విభజన, స్వాతంత్య్రం: 1939-1947

ప్రశ్న 18.
హిందూ మహాసభ, ఆర్ఎస్ఎస్

ఈ సమయంలో హిందూ మహాసభ, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం (ఆర్ఎస్ఎస్) ప్రజలను సమీకరించటానికి చురుకుగా పని చేశాయి. కులం, వర్గాలను అధిగమించి హిందువులనందరినీ ఏకం చేసి సామాజిక జీవితంలో సంస్కరణలు తీసుకురావాలని ఈ సంఘాలు ఆశించాయి. భారతదేశం అధిక సంఖ్యలో ఉన్న హిందువుల భూమి అన్న అభిప్రాయాన్ని కూడా వాళ్లు కలిగించారు. ఈ సంఘాల కార్యకలాపాలతో అనేకమంది కాంగ్రెస్ వాదులు కూడా ప్రభావితమయ్యారు.
“ముస్లిం లీగు బలపడడానికి కాంగ్రెస్ వైఫల్యమే కారణం అనే విషయాన్ని నీవు అంగీకరిస్తావా? ఎందుకు? చర్చించుము.”
జవాబు:
అంగీకరిస్తాను – ఎందుకనగా ….. హిందూ మహాసభ, ఆర్ఎస్ఎస్ సంఘాలు, భారతదేశం అధిక సంఖ్యలో ఉన్న హిందువుల భూమి అన్న అభిప్రాయాన్ని కలిగించారు. ఈ సంఘాల కార్యకలాపాలతో అనేక మంది కాంగ్రెస్ వాదులు కూడా ప్రభావితమయ్యారు. అయితే తమ సభ్యులలో లౌకిక అవగాహనను పెంచటానికి కాంగ్రెస్ ఎంతో ప్రయత్నించింది. అయితే ముస్లిం లీగుకి హిందువుల ఆధిపత్యం పట్ల ఉన్న భయాలను బ్రిటన్ పెంచి పోషించింది.

చాలా ప్రాంతాలలో హిందువులు అధిక సంఖ్యలో ఉన్నారు కాబట్టి హిందువులే అన్ని సభలకు ఎన్నికవుతారని, ప్రభుత్వంలో ముస్లిముల ప్రయోజనాలను కాపాడటం కష్టమవుతుందనే ముస్లిం లీగు భయాన్ని కాంగ్రెస్ తొలగించలేక పోయింది. పై పెచ్చు ముస్లింలకు ప్రత్యేక నియోజక వర్గాలు ఏర్పాటు చేయుటకు అంగీకరించి, ముస్లిం లీగు బలపడడానికి దోహదపడింది.

1937-1947ల మధ్య ముస్లిముల పట్ల కాంగ్రెస్ సున్నితత్వంతో స్పందించటం లేదని అనేక అంశాలను ముస్లిం లీగు ఎత్తి చూపింది మరియు యునైటెడ్ ప్రావిన్స్ లో ఎక్కువ సీట్లనే గెలుచుకున్న ముస్లిం లీగుతో కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయటాన్ని కాంగ్రెస్ తిరస్కరించింది. తమ సభ్యులు ముస్లిం లీగులో సభ్యత్వం తీసుకోవటాన్ని కాంగ్రెస్ నిషేధించింది. ఆ

ఈ విధమైన కాంగ్రెస్ ప్రవర్తన మరియు పద్ధతుల మూలంగా ముస్లిం లీగు బలపడిందని, అది చివరికి దేశ విభజనకు దారితీసిందని చెప్పవచ్చు.