AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు

Andhra Pradesh BIEAP AP Inter 1st Year Economics Study Material 3rd Lesson డిమాండ్ సిద్ధాంతాలు Textbook Questions and Answers.

AP Inter 1st Year Economics Study Material 3rd Lesson డిమాండ్ సిద్ధాంతాలు

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
డిమాండ్ సూత్రాన్ని వివరించి, దాని మినహాయింపులను వ్రాయండి.
జవాబు:
అర్ధశాస్త్రంలో డిమాండ్ భావనకు చాలా ప్రాధాన్యత ఉన్నది. ఒక వస్తువును కొనాలనే కోరికతోపాటు కొనే శక్తి, కొనాలన్న ఆసక్తి ఉన్నప్పుడు మాత్రమే వస్తువుకు డిమాండ్ ఏర్పడుతుంది. కనుక డిమాండ్ను ఈ క్రింది విధముగా నిర్వచించవచ్చు. “ఒక నిర్ణీత కాలంలో, నిర్ణీతమైన ధర వద్ద కొనుగోలుకు సిద్ధంగా ఉన్న వస్తు పరిమాణాన్ని ఆ వస్తువుకు లేదా సేవకు ఉన్న డిమాండ్” అని బెన్హామ్ పేర్కొన్నాడు.

ఒక వస్తువుకున్న డిమాండ్ ముఖ్యంగా ఈ క్రింది అంశాలపై ఆధారపడి ఉండును.

  1. వినియోగదారుల అభిరుచులు, అలవాట్లు
  2. వస్తువుల ధరలు
  3. వినియోగదారుల ఆదాయాలు
  4. ప్రత్యామ్నాయ, పూరక వస్తువుల ధరలు మొదలైనవి.

డిమాండ్ సూత్రము: డిమాండ్ సూత్రం వస్తువు ధరకు, డిమాండ్కుగల సంబంధాన్ని తెలియజేస్తుంది. “ఇతర అంశాలు స్థిరంగా ఉంటే, వస్తువు ధర పెరిగినప్పుడు డిమాండ్ తగ్గుతుంది. ధర తగ్గితే డిమాండ్ పెరుగుతుంది” అని మార్షల్ డిమాండ్ సూత్రాన్ని నిర్వచించెను. డిమాండ్ సూత్రాన్ని ఈ క్రింది విధంగా పేర్కొనవచ్చును.

Dn = f

AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు

డిమాండ్ పట్టిక
AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు 1

వినియోగదారుడు లేదా వినియోగదారులు ఒక వస్తువును వివిధ ధరల వద్ద ఏ పరిమాణంలో కొనుగోలు చేస్తారో తెలియజేస్తుంది డిమాండ్ పట్టిక.

పట్టికననుసరించి వస్తువు ధర పెరిగితే డిమాండ్ తగ్గుతుందని, ధర తగ్గితే డిమాండ్ పెరుగుతుందని తెలుస్తుంది. దీనిని ఆధారంగా చేసుకొని డిమాండ్ రేఖను గీయవచ్చును.

AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు 2

పై రేఖాపటంలో ‘X’ అక్షముపై వస్తువు డిమాండ్ పరిమాణం, ‘Y’ అక్షముపై వస్తువు ధరను చూపినాము. ‘DD’ డిమాండ్ రేఖ. డిమాండ్ రేఖ ఎడమ నుండి కుడికి క్రింది వైపుకు వాలి ఉంది. ఇది ఋణాత్మకమైన వాలు. వస్తువు ధరకు, డిమాండ్కు మధ్య విలోమ సంబంధమున్నదని ఋణాత్మకమైన వాలు తెలియజేస్తుంది.

మినహాయింపులు: డిమాండ్ సూత్రానికి కొన్ని మినహాయింపులున్నాయి. అవి:
1. గిఫెన్ వైపరీత్యం: పేద కార్మికులు రొట్టె ధర పెరిగితే మాంసముపై వెచ్చించే డబ్బును కూడా రొట్టెపై ఖర్చు చేస్తారు. అనగా రొట్టె ధర పెరిగినా డిమాండ్ తగ్గదు. ఇది పేదవాళ్ళ ఆహారం కావటమే ఇందుకు కారణము. ఈ సత్యాన్ని సర్ రాబర్ట్ గిఫెన్ అనే ఇంగ్లాండ్ దేశానికి చెందిన ఆర్థికవేత్త 19వ శతాబ్దం మధ్య భాగంలో పరిశీలించాడు. కనుక దీనిని గిఫెన్ వైపరీత్యం అంటారు. పేదవారు ముఖ్యంగా నిత్యావసర వస్తువులలో తక్కువ ధర గల వస్తువులను కొనుగోలు చేస్తారు. ఈ ప్రత్యేకమైన వస్తువులనే గిఫెన్ వస్తువులంటారు. ఉదా: రాగులు, జొన్నలు మొదలైనవి.

2. గౌరవ సూచిక వస్తువులు: గౌరవ సూచిక వస్తువుల ధర పెరిగితే డిమాండ్ పెరుగుతుంది. వీటిని కొనుగోలు చేయటం వలన సమాజంలో గౌరవము, ప్రతిష్ఠ పెరుగుతాయని భావిస్తారు. వీటి ధర తగ్గితే గౌరవం, ప్రతిష్ఠ తగ్గుతాయని భావిస్తారు. ఉదా: విలువ గల వజ్రాలు, ఆభరణాలు మొదలైనవి. ఇది డిమాండ్ సూత్రానికి వ్యతిరేకము. ఈ విషయాన్ని వెబ్లెన్ అనే అమెరికా ఆర్థికవేత్త తెలియజేసెను. అందువల్ల ఇటువంటి వస్తువులను వెబ్లెన్ వస్తువులంటారు.

3. అంచనా వ్యాపారం: ఒక వస్తువు ధర మరింత పెరగడానికి వ్యాపారస్తులు, కొనుగోలుదారులు ఆ వస్తువును ఎక్కువగా డిమాండ్ చేస్తారు. అదేవిధంగా ధర తగ్గినప్పుడు ఇంకా తగ్గుతుందని భావిస్తే కొనుగోలు తగ్గిస్తారు. దీనినే సట్టా వ్యాపారం అని కూడా అంటారు. ఉదా: షేర్లు, బాండ్లు.

4. భ్రాంతి: కొంతమంది వినియోగదారులు కొన్నిసార్లు ఎక్కువ ధర కలిగి ఉన్న వస్తువులు ఎక్కువ నాణ్యతతో కూడి ఉంటాయన్న భ్రాంతిలో ఉంటారు. అందువల్ల ధర ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్కువగా కొనుగోలు చేస్తారు. ఇటువంటి వాటి విషయంలో డిమాండ్ సూత్రం వర్తించదు.

ప్రశ్న 2.
డిమాండ్ ఫలం అంటే ఏమిటి ? డిమాండ్ను నిర్ణయించే అంశాలను వివరించండి.
జవాబు:
“ఒక నిర్ణీతమైన కాలంలో, నిర్ణీతమైన ధర వద్ద కొనుగోలుకు సిద్ధంగా ఉన్న వస్తు పరిమాణాన్ని ఆ వస్తువుకు లేదా సేవకు ఉన్న డిమాండ్” అంటారు.

ఒక వస్తువు డిమాండ్ దాని ధరపైనే కాకుండా అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా వస్తువు డిమాండ్ను ప్రభావితము చేసే అంశాలు; ప్రత్యామ్నాయ, పూరక వస్తువుల ధరలు, వినియోగదారుల ఆదాయం, వినియోగదారుల అభిరుచులు, అలవాట్లు మొదలైనవి. కనుక ఒక వస్తువు డిమాండ్ పరిమాణానికి, దీనిని నిర్ణయించే కారకాలకు మధ్యగల సంబంధాన్ని తెలియజేసేదే డిమాండ్ ఫలము. దీనిని ఈ క్రింది సమీకరణం ద్వారా చూపవచ్చు.
Dn = f (Pn, P1, P2, …. Pn-1, y, T)
Dn = n వస్తువుల డిమాండ్ పరిమాణం
Pn = n వస్తువు ధర
Pn, P1, P2, …. Pn-1 = ప్రత్యామ్నాయ పూరక వస్తువుల ధరలు
y = వినియోగదారుని ఆదాయం
T = వినియోగదారుని అభిరుచులు, అలవాట్లు మొదలైనవి.
f = ప్రమేయ సంబంధము

AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు

డిమాండ్ను నిర్ణయించే కారకాలు లేదా అంశాలు:

  1. ఆదాయంలో మార్పు: ప్రజల ఆదాయాల మార్పును బట్టి వస్తువుల డిమాండ్లో మార్పు ఏర్పడుతుంది. ప్రజల ఆదాయం పెరిగితే వస్తువులకు డిమాండ్ పెరుగుతుంది. ఆదాయాలు తగ్గితే వస్తువుల డిమాండ్ తగ్గుతుంది.
  2. అభిరుచులు, అలవాట్లలో మార్పులు: ప్రత్యామ్నాయ, పూరక వస్తువుల ధరలలో వచ్చే మార్పుల వలన వస్తువు డిమాండ్లో మార్పు వస్తుంది.
  3. ప్రత్యామ్నాయ, పూరక వస్తువుల ధరలలో మార్పులు: ప్రజల అభిరుచులలో అలవాట్లలో మార్పులవల్ల వస్తువు డిమాండ్ లో మార్పులు వస్తాయి.
  4. జనాభాలో మార్పు: జనాభా పెరుగుదల, తగ్గుదలను అనుసరించి కూడా వస్తువుల డిమాండ్లో మార్పులు వస్తాయి.
  5. వాతావరణంలో మార్పులు: వాతావరణంలో మార్పులు కూడా డిమాండ్లో మార్పులను తీసుకొని వస్తాయి. ఉదా: వేసవికాలంలో చల్లని పానీయాలకు డిమాండ్ పెరుగుతుంది.
  6. సాంకేతికాభివృద్ధి: సాంకేతికాభివృద్ధి వలన వస్తూత్పత్తి వ్యయం తగ్గి, వస్తు ధరలు తగ్గుతాయి. అందువల్ల పూర్వం కొనుగోలు చేయడానికి ఉపయోగించిన ద్రవ్య పరిమాణంలో వస్తువులను ఎక్కువగా డిమాండ్ చేయటానికి అవకాశం ఉంటుంది.
  7. ఆర్థిక స్థితిగతులు: వాణిజ్య విజృంభణ కాలంలో అన్ని వస్తువులకు డిమాండ్ పెరుగుతుంది. కానీ, ఆర్థిక మాంద్య పరిస్థితులలో అన్ని వస్తువులకు డిమాండ్ తగ్గుతుంది.
  8. ప్రభుత్వ విధానము: ప్రభుత్వ పన్నుల విధానం, రాయితీ విధానము మొదలైనవి వస్తువు ధర తగ్గితే డిమాండ్ ప్రభావితం చేయును.
  9. వస్తువు ధర: ఒక వస్తువు ధరకు, డిమాండ్కు విలోమ సంబంధం ఉన్నది. కనుక వస్తువు ధర తగ్గితే, డిమాండ్ పెరుగుతుంది. వస్తువు ధర పెరుగుటచే డిమాండ్ తగ్గుతుంది.

ప్రశ్న 3.
డిమాండ్ అంటే ఏమిటి ? వివిధ రకాల డిమాండ్లను తెలియజేయండి.
జవాబు:
అర్ధశాస్త్రంలో డిమాండ్ భావనకు చాలా ప్రాధాన్యత ఉంది. ఒక వస్తువును కొనాలనే కోరిక దానితోపాటు కొనే శక్తి ఈ రెండూ జతకూడినప్పుడే ఆ వస్తువుకు డిమాండ్ ఏర్పడుతుంది. అందువల్ల “ఒక నిర్ణీత కాలంలో, నిర్ణీతమైన ధర వద్ద కొనుగోలుకు సిద్ధంగా ఉన్న వస్తు పరిమాణాన్ని ఆ వస్తువుకు ఉన్న డిమాండ్” అంటారు.
డిమాండ్ను నిర్ణయించే కారకాలను బట్టి డిమాండ్ను మూడు రకములుగా విభజించవచ్చు.

  1. ధర డిమాండ్
  2. ఆదాయ డిమాండ్
  3. జాత్యంతర డిమాండ్.

1. ధర డిమాండ్: ఒక వస్తువు ధరకు, దాని డిమాండ్ పరిమాణానికి గల సంబంధాన్ని తెలియజేయునది ధర డిమాండ్. డిమాండ్ను ప్రభావితంచేసే ఇతర అంశాలలో మార్పులేదనే ప్రమేయంపై ఆధారపడి ధర డిమాండ్ నిర్వచించబడుతుంది. దీనిని ఈ విధంగా చూపవచ్చు.
D1 = f(Px)
డిమాండ్ పట్టిక: ఒక వస్తువును వివిధ ధరల వద్ద కొనుగోలు చేసే వస్తువు పరిమాణాలను తెలియజేయును. ఈ డిమాండ్ పట్టిక రెండు రకాలు.

  1. వైయుక్తిక డిమాండ్ పట్టిక
  2. మార్కెట్ డిమాండ్ పట్టిక

డిమాండ్ పట్టిక:
AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు 3AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు 4
పై రేఖాపటంలో ధర తగ్గితే డిమాండ్ పెరుగుతుంది. ధర పెరిగితే డిమాండ్ తగ్గుతుంది. కనుక DD రేఖ ఎడమ నుండి కుడికి క్రిందికి వాలి ఉంది. దీనిని ఋణాత్మక వాలు అంటారు. ఇది వస్తువు ధరకు, డిమాండ్కు మధ్య ఉన్న విలోమ సంబంధాన్ని తెలియజేయును.

2. ఆదాయ డిమాండ్: వినియోగదారుని ఆదాయానికి, వస్తువు డిమాండ్కు మధ్యనున్న సంబంధాన్ని ఆదాయ డిమాండ్ అంటారు. వివిధ ఆదాయాల వద్ద వస్తువు డిమాండ్ పరిమాణం ఏ విధంగా ఉందో ఆదాయ డిమాండ్ తెలియజేస్తుంది.
Dx = f(y)

AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు

ఇతర అంశాలు మారకుండా స్థిరంగా ఉన్నప్పుడు ఆదాయం పెరిగితే డిమాండ్ పెరుగుతుంది. ఆదాయం తగ్గితే డిమాండ్ తగ్గుతుంది. ధరకు, ఆదాయంకు ధనాత్మక సంబంధం ఉంది. ఆదాయ డిమాండ్ను అనుసరించి వస్తువులలో మేలురకం లేదా నాసిరకం వస్తువులుగా గుర్తించవచ్చు.

మేలురకం వస్తువులు / సాధారణ వస్తువులు:
ఆదాయం పెరిగితే మేలురకం వస్తువులు లేదా సాధారణ వస్తువుల డిమాండ్ పెరుగుతుంది.
AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు 5

పై రేఖాపటంలో ‘OX’ అక్షంపై డిమాండ్ పరిమాణంను, ‘OY’ అక్షంపై ఆదాయంను తీసుకొన్నాం. ఆదాయం ‘OY’ ఉన్నప్పుడు ‘OQ’ వస్తు పరిమాణం డిమాండ్ చేయబడింది. ఆదాయం ‘OY’ నుంచి ‘OY1‘ కు పెరిగినప్పుడు మేలురకం వస్తువుల డిమాండ్ ‘OQ’ నుంచి ‘OQ1‘ కు పెరిగింది. ‘YD’ రేఖ ధనాత్మక వాలు కలిగి ఉంటుంది.

నాసిరకం వస్తువులు: మేలురకం వస్తువులకు భిన్నంగా వినియోగదార్ల ఆదాయం పెరిగితే నాసిరకం వస్తువులకు డిమాండ్ తగ్గుతుంది.
AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు 6

పై రేఖాపటంలో ‘OX’ అక్షం మీద డిమాండ్ పరిమాణాన్ని, ‘OY’ అక్షం మీద ఆదాయంను తీసుకొన్నాం. ఆదాయం ‘OY1‘ నుంచి ‘OY’ కు పెరిగినప్పుడు డిమాండ్ పరిమాణం ‘OQ’ నుంచి ‘OQ1‘ కు తగ్గును. ‘YD’ రేఖ ఎడమ నుండి కుడికి వాలి ఉంది.

3. జాత్యంతర డిమాండ్: ప్రత్యామ్నాయ, పూరక వస్తువుల ధరలకు, ఒక వస్తువు డిమాండ్కు మధ్య ఉన్న సంబంధాన్ని జాత్యంతర డిమాండ్ అంటారు. ప్రత్యామ్నాయ, పూరక వస్తువుల ధరలలో వచ్చిన మార్పుల వల్ల ఒక వస్తువు డిమాండ్లో వచ్చే మార్పులను జాత్యంతర డిమాండ్ తెలియజేయును.
జాత్యంతర డిమాండ్ను ఈ విధంగా వ్రాయవచ్చు.
Dx = f(Py).

ప్రత్యామ్నాయ వస్తువులు: ఒక కోర్కెను తీర్చగల వివిధ వస్తువులను ప్రత్యామ్నాయ వస్తువులు అంటారు.

ఉదా: కాఫీ, టీ. ప్రత్యామ్నాయ వస్తువుల విషయంలో డిమాండ్ రేఖ ధనాత్మక సంబంధాన్ని తెలియజేయును. దీనిని ఈ క్రింది రేఖాపటం ద్వారా చూపవచ్చు.
AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు 7
పై రేఖాపటంలో కాఫీ ధర ‘OY’ నుంచి ‘OY2‘ కు పెరిగినప్పుడు టీ, డిమాండ్ ‘OQ’ నుండి ‘OQ2‘ కు పెరిగింది. ‘CD’ రేఖ ధనాత్మక వాలును కలిగి ఉంది.

AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు

పూరక వస్తువులు: ఒకే కోరికను తీర్చగల సమిష్టి వస్తువులు.
ఉదా: కారు, పెట్రోలు, వీటి విషయంలో డిమాండ్ విలోమ సంబంధాన్ని తెలియజేయును.
AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు 8

పై రేఖాపటంలో డిమాండ్ ‘OQ’ నుండి ‘OQ2‘ కు పెరిగింది. ధర ‘OP’ నుండి ‘OP’ కు తగ్గినప్పుడు ‘CD’ రేఖ ఋణాత్మక వాలు కలిగి ఉంది.

ప్రశ్న 5.
డిమాండ్ వ్యాకోచత్వ భావనను నిర్వచించి, ధర, ఆదాయ, జాత్యంతర డిమాండ్ వ్యాకోచత్వాలను వివరించండి.
జవాబు:
ఆర్థికశాస్త్రంలో “డిమాండ్ వ్యాకోచత్వం” అనే భావనకు అధిక ప్రాధాన్యత ఉంది. ధరలో వచ్చిన మార్పుకు అనుగుణంగా డిమాండ్ ఎంత మేరకు మార్పు వస్తుందో డిమాండ్ వ్యాకోచత్వ భావన తెలుపుతుంది.

శ్రీమతి జోన్ రాబిన్సన్ అభిప్రాయంలో “ధరలో వచ్చిన అనుపాతపు మార్పు స్పందనకు బదులుగా డిమాండ్ పరిమాణంలో వచ్చే అనుపాత మార్పు ప్రతిస్పందన ఏ మేరకు ఉంటుందో తెలియజేసే భావన డిమాండ్ వ్యాకోచత్వం”. డిమాండ్లో వచ్చిన అనుపాతపు మార్పు డిమాండ్ వ్యాకోచత్వం.
AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు 9

ఈ వ్యాకోచత్వ భావన మూడు రకాలు.

  1. ధర డిమాండ్ వ్యాకోచత్వం
  2. ఆదాయ డిమాండ్ వ్యాకోచత్వం
  3. జాత్యంతర డిమాండ్ వ్యాకోచత్వం

1. ధర డిమాండ్ వ్యాకోచత్వం: ఈ భావనను మార్షల్ అభివృద్ధిపరిచారు. ధర డిమాండ్ వ్యాకోచత్వం అనగా ధరలో వచ్చే అనుపాతపు మార్పు వల్ల డిమాండ్లో వచ్చే అనుపాతపు మార్పు ఎంత ఉంటుందో తెలియజేస్తుంది. వస్తువు ధరకు, డిమాండ్కు విలోమ సంబంధం ఉంటుంది. అందువల్ల ధర డిమాండ్ వ్యాకోచత్వం రుణాత్మకంగా ఉంటుంది.
AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు 10

AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు

2. ఆదాయ డిమాండ్ వ్యాకోచత్వం : ఆదాయంలో వచ్చే మార్పు వల్ల డిమాండ్ పరిమాణంలో ఏ మేరకు స్పందన వస్తుందో ఆదాయ డిమాండ్ వ్యాకోచత్వం తెలుపుతుంది. వినియోగదారుని ఆదాయం కొంత శాతం మార్పు చెందినప్పుడు, వస్తువు డిమాండ్ పరిమాణం ఎంత శాతం మార్పు చెందుతుందో ఆదాయ డిమాండ్ వ్యాకోచత్వం తెలియజేయును. ఈ ఆదాయ డిమాండ్ వ్యాకోచత్వం మేలు రకం వస్తువుల విషయంలో ధనాత్మకంగా, నాసిరకం వస్తువుల విషయంలో రుణాత్మకంగా ఉంటుంది.
AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు 11

3. జాత్యంతర వ్యాకోచ డిమాండ్: ఒక వస్తువుకున్న డిమాండ్ దాని ధరపైనే కాకుండా, దానికున్న ప్రత్యామ్నాయ, పూరక వస్తువుల ధరపైన కూడా ఆధారపడి ఉంటుంది. ప్రత్యామ్నాయ పూరక వస్తువుల ధరల్లో వచ్చే అనుపాతపు మార్పు లేదా శాతం మార్పు ఆ వస్తు డిమాండ్లో ఎంత అనుపాత మార్పు కల్గిస్తుందో జాత్యంతర డిమాండ్ వ్యాకోచత్వం తెలియజేయును. ప్రత్యామ్నాయ వస్తువులైన టీ, కాఫీల విషయంలో ధనాత్మక సంబంధాన్ని, పూరక వస్తువుల విషయాలలో రుణాత్మక సంబంధాన్ని కలిగి ఉంటాయి.
AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు 12

ప్రశ్న 6.
ధర డిమాండ్ వ్యాకోచత్వం అంటే ఏమిటి ? ధర డిమాండ్ వ్యాకోచత్వంలోని రకాలను వివరించండి. Mar, ’15
జవాబు:
ధర డిమాండ్ వ్యాకోచత్వం అనే భావనను ఆల్ఫ్రెడ్ మార్షల్ అభివృద్ధిపరిచారు. ధర డిమాండ్ వ్యాకోచత్వం అనగా ధరలో వచ్చే అనుపాతపు మార్పువల్ల డిమాండ్లో వచ్చే అనుపాత మార్పు ఎంత ఉంటుందో తెలియజేస్తుంది.
AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు 13

వ్యాకోచత్వ విలువ ఆధారంగా ధర డిమాండ్ వ్యాకోచత్వాన్ని ఐదు రకాలుగా చెప్పవచ్చు.

  1. పూర్తి వ్యాకోచ డిమాండ్ (Ep = o)
  2. పూర్తి అవ్యాకోచ డిమాండ్ (Ep = 0)
  3. ఏకత్వ వ్యాకోచ డిమాండ్ (Ep = 1)
  4. సాపేక్ష వ్యాకోచ డిమాండ్ (Ep = >1)
  5. సాపేక్ష అవ్యాకోచ డిమాండ్ (Ep = <1)

AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు

1. పూర్తి వ్యాకోచ డిమాండ్: ధరలో స్వల్ప మార్పు వచ్చినా లేదా రాకపోయినా డిమాండ్లో ఊహించలేనంతగా మార్పు కలిగితే దానిని పూర్తి వ్యాకోచ డిమాండ్ అంటారు. దీని వ్యాకోచ విలువ అనంతంగా ఉంటుంది. ఇక్కడ ‘ డిమాండ్ రేఖ ‘X’ అక్షంకు సమాంతరంగా ఉంటుంది.
AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు 13

పై రేఖాపటంలో డిమాండ్ రేఖ ‘X’ అక్షానికి సమాంతరంగా ఉంటుంది.
Ed = ∞

2. పూర్తి అవ్యాకోచ డిమాండ్: ధర పెరిగినా లేదా తగ్గినా డిమాండ్లో ఎలాంటి మార్పు రాకుంటే దానిని పూర్తి అవ్యాకోచ డిమాండ్ అంటారు. దీని విషయంలో వ్యాకోచత్వ విలువ ‘0’ గా ఉంటుంది. డిమాండ్ రేఖ ‘y’ అక్షానికి సమాంతరంగా ఉంటుంది.
AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు 15

‘DD’ రేఖ ‘Y’ అక్షానికి సమాంతరంగా ఉంది. పూర్తి అవ్యాకోచ డిమాండ్ ఉన్నప్పుడు వ్యాకోచత్వం విలువ ‘0’ కు సమానం.
∴ Ed = 0

3. ఏకత్వ వ్యాకోచ డిమాండ్: వస్తువు ధరలో వచ్చే అనుపాతపు మార్పుకు, డిమాండ్ పరిమాణంలో వచ్చే అనుపాతపు మార్పుకు సమానమైతే దానిని ఏకత్వ వ్యాకోచ డిమాండ్ అంటారు. ఇక్కడ డిమాండ్ వ్యాకోచత్వం విలువ ‘1’ కి సమానంగా ఉంటుంది. ఈ డిమాండ్ రేఖ “లంబ అతిపరావలయంగా” ఉంటుంది.
AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు 16
పై రేఖాపటంలో OQ1 = PP1 కి సమానం. అందువల్ల Ed = 1.

AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు

4. సాపేక్ష వ్యాకోచ డిమాండ్: వస్తువు ధరలో వచ్చే అనుపాతపు మార్పు కంటే డిమాండ్ పరిమాణంలో వచ్చే అనుపాతపు మార్పు ఎక్కువగా ఉంటే దానిని సాపేక్ష వ్యాకోచ డిమాండ్ అంటారు. ఇక్కడ వ్యాకోచత్వం విలువ ‘1’ కంటే ఎక్కువగా ఉంటుంది.
AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు 17
పై రేఖాపటంలో ‘DD’ రేఖ సాపేక్ష వ్యాకోచ డిమాండ్ను సూచించును. OQ1 > PP1 గా ఉంది. ఇక్కడ వ్యాకోచత్వ విలువ 1 కంటే ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ΔP కంటే ΔQ ఎక్కువగా ఉంటుంది.

5. సాపేక్ష అవ్యాకోచ డిమాండ్: వస్తువు ధరలో వచ్చిన అనుపాతపు మార్పు కంటే డిమాండ్ పరిమాణంలో వచ్చిన అనుపాత మార్పు తక్కువగా ఉంటుంది. దానిని సాపేక్ష అవ్యాకోచ డిమాండ్ అంటారు. ఇక్కడ డిమాండ్ వ్యాకోచ విలువ ‘1’ కంటే తక్కువగా ఉంటుంది.
AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు 18

‘DD’ రేఖ సాపేక్ష అవ్యాకోచ డిమాండ్ను సూచిస్తుంది. ఇక్కడ వ్యాకోచత్వ విలువ ‘1’ కంటే తక్కువగా ఉంటుంది.

ప్రశ్న 7.
ధర డిమాండ్ వ్యాకోచత్వాన్ని కొలిచే మూడు పద్ధతులను వివరించండి.
జవాబు:
డిమాండ్ సూత్రం కేవలం ధర మార్పు వల్ల డిమాండ్ దిశను తెలియజేస్తుందిగాని, డిమాండ్లో వచ్చే పరిమాణాత్మకమైన మార్పును తెలియజేయదు. ఈ మార్పును తెలియజేయటానికి “మార్షల్ డిమాండ్ వ్యాకోచత్వ భావనను అర్ధశాస్త్రంలో ప్రవేశపెట్టెను. వస్తువు ధరలో వచ్చిన మార్పు వలన డిమాండ్లో వచ్చే పరిమాణాత్మకమైన లేదా సంఖ్యాత్మకమైన మార్పును తెలియజేయునది డిమాండ్ వ్యాకోచత్వ భావన.

AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు

ధరలో వచ్చిన అనుపాతం మార్పుకు, డిమాండ్లో వచ్చిన అనుపాతం మార్పుకు మధ్యగల సంబంధాన్ని ధర డిమాండ్ వ్యాకోచత్వం అని అంటారు. వ్యాకోచత్వాన్ని ఈ క్రింది విధంగా కొలవటం జరుగుతుంది.
AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు 19

డిమాండ్ వ్యాకోచత్వము కొలిచే పద్ధతులు:
1. మొత్తం ఖర్చు పద్ధతి: వ్యాకోచత్వాన్ని కొలవటానికి మార్షల్ మొత్తం ఖర్చు పద్ధతిని ప్రవేశపెట్టాడు. ఒక వస్తువు ధరలో మార్పు వల్ల మొత్తము ఖర్చు ఏ విధంగా మారుతుందో తెలుసుకోవటం వల్ల వ్యాకోచత్వాన్ని కొలవడం జరిగింది. వస్తువు పరిమాణాన్ని ధరతో గుణిస్తే మొత్తం ఖర్చు వస్తుంది. వస్తువు ధరకు, మొత్తం ఖర్చుకు విలోమ సంబంధం ఉంటే డిమాండ్ వ్యాకోచత్వం 1 కంటే ఎక్కువ, (వ్యాకోచ డిమాండ్); అనులోమ సంబంధం ఉంటే 1 కంటే తక్కువ (అవ్యాకోచ డిమాండ్) ధర మారినప్పటికీ మొత్తం ఖర్చులో మార్పు లేకపోయినట్లయితే 1 కి సమానం (ఏకత్వ వ్యాకోచ డిమాండ్). ఈ విషయాన్ని ఈ క్రింది ఊహాజనితమైన డిమాండ్ పట్టిక ద్వారా గ్రహించవచ్చును.

డిమాండ్ పట్టిక:
AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు 20

2. బిందు వ్యాకోచ పద్ధతి: మార్షల్ రేఖాగణిత పద్ధతిలో డిమాండ్ వ్యాకోచత్వాన్ని కొలిచే పద్ధతిని తెలియచేసాడు. బిందు వ్యాకోచ పద్ధతిలో సరళంగా ఉన్న డిమాండ్ రేఖ రెండు చివరలు X మరియు Y అక్షాలను తాకునట్లుగా పొడిగించి, ఆ రేఖపై ఒక బిందువు వద్ద డిమాండ్ వ్యాకోచత్వాన్ని కొలవటం బిందు వ్యాకోచపద్ధతిలో వ్యాకోచత్వాన్ని కొలవటమంటారు. పటములో AB సరళరేఖగా ఉంది. డిమాండ్ రేఖ X, Y అక్షాలను తాకుతుంది. AB డిమాండ్ రేఖపై గల ‘P’ అనే బిందువు వద్ద వ్యాకోచత్వాన్ని ఈ క్రింద ఇవ్వబడిన సూత్రం ద్వారా గణన చేయవచ్చును.
AB డిమాండ్ రేఖపై ‘P’ బిందువు వద్ద వ్యాకోచము.
AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు 21

ఈ పద్దతిలో డిమాండ్ రేఖ పొడవును బట్టి ఆ రేఖపై ఉన్న వివిధ బిందువుల వద్ద డిమాండ్ వ్యాకోచత్వాన్ని గణన చేయవచ్చును.

డిమాండ్ రేఖ సరళరేఖ అయినప్పుడు డిమాండ్ వ్యాకోచత్వం: సరళరేఖగా ఉన్న డిమాండ్ రేఖపై ఏ బిందువు వద్దనైనా బిందు వ్యాకోచ పద్దతిని ఉపయోగించి వ్యాకోచత్వాన్ని కొలవవచ్చు.
ఉదా: AE డిమాండ్ రేఖ పొడవు 4 Cm పొడవని ఊహిద్దాం.

AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు

క్రింది రేఖాపటంలో డిమాండ్ వ్యాకోచత్వం ఈ క్రింది విధంగా ఉంటుంది.
AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు 22

డిమాండ్ రేఖ వక్ర రేఖ అయితే: డిమాండ్ రేఖ వక్రరేఖ అయితే పై సూత్రాన్ని ఉపయోగించి ఏ బిందువు వద్దనైనా స్పర్శరేఖ సహాయంతో వ్యాకోచత్వాన్ని కొలవవచ్చు.
AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు 23
పై రేఖాపటంలో DD డిమాండ్ రేఖ. AB రేఖ DD రేఖను ‘C’ బిందువు వద్ద తాకింది.
‘C’ బిందువు వద్ద వ్యాకోచం = CB/CA = 1

3. ఆర్క్ పద్ధతి: డిమాండ్ రేఖపై రెండు బిందువుల మధ్య దూరాన్ని ఆర్క్ అంటారు. డిమాండ్ రేఖపై ఏదో ఒక బిందువు వద్ద కాకుండా రెండు బిందువుల మధ్య భాగంలో ధర డిమాండ్ వ్యాకోచత్వాన్ని కొలవడానికి ‘ఆర్క్’ పద్ధతిని ఉపయోగిస్తారు.
AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు 24

ఉదా: ఒక వస్తువు ధర 4/- ఉన్నప్పుడు 300 యూనిట్లు కొనుగోలు చేయబడ్డాయి. అదే ధర 3/- తగ్గినప్పుడు 400 యూనిట్లు కొనుగోలు చేయబడ్డాయి. అప్పుడు వ్యాకోచాన్ని ఈ విధంగా కొలవవచ్చు.
AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు 25AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు 26

దీనిని ఈ క్రింది పటం ద్వారా చూపవచ్చు.

ప్రశ్న 8.
ధర డిమాండ్ వ్యాకోచత్వాన్ని నిర్ణయించే అంశాలు ఏవి?
జవాబు:
ఒక వస్తువు ధరలో మార్పు కలిగినప్పుడు ఏ మేరకు డిమాండ్లో ప్రతిస్పందన వస్తుందో తెలియచేసేదే డిమాండ్ వ్యాకోచత్వము. ధర మార్పు శాతానికి, డిమాండ్లో వచ్చే మార్పు శాతానికి మధ్యగల నిష్పత్తినే వ్యాకోచత్వంగా నిర్వచించవచ్చును. డిమాండ్ వ్యాకోచత్వము అన్ని వస్తువులకు ఒకే విధంగా ఉండదు. ధర డిమాండ్ వ్యాకోచత్వ స్వభావాన్ని లేదా స్థాయిని ఈ క్రింది అంశాలు నిర్ణయిస్తాయి.

AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు

డిమాండ్ వ్యాకోచత్వాన్ని నిర్ణయించే కారకాలు:
1. వస్తువు స్వభావము: వస్తువులలో కొన్ని అవసరాలు, మరికొన్ని సౌకర్యాలు, ఇంకొన్ని విలాసాలు ఉంటాయి. నిత్యావసర వస్తువులకు ధర పెరిగినా, డిమాండ్ తగ్గదు. కనుక వాటికి అవ్యాకోచ డిమాండ్ ఉంటుంది. ఇవి లేకపోతే మానవ మనుగడ కష్టం. సౌకర్యాలు, విలాసాలకు డిమాండ్ వ్యాకోచంగా ఉంటుంది. ఇవి లేకపోయినా ప్రజలు బ్రతకగలరు. కనుక వీటి ధర మార్పు కంటే డిమాండ్లో వచ్చే మార్పు అధికంగా ఉంటుంది.

2. ప్రత్యామ్నాయ వస్తువులు: ప్రత్యామ్నాయ వస్తువులు అధిక సంఖ్యలో ఉన్న వస్తువులకు డిమాండ్ వ్యాకోచంగా ఉంటుంది. ప్రత్యామ్నాయ వస్తువులు లేనప్పుడు డిమాండ్ అవ్యాకోచంగా ఉంటుంది.

3. కొనుగోలు వాయిదా వేయటానికి అవకాశం: కొనుగోలును వాయిదా వేయటానికి అవకాశం ఉన్న వస్తువుల విషయంలో ధర డిమాండ్ వ్యాకోచంగా ఉంటుంది. కొనుగోలును వాయిదా వేయటానికి వీలులేని వస్తువులకు డిమాండ్ అవ్యాకోచంగా ఉంటుంది.

4. బహుళ ప్రయోజనాలున్న వస్తువులు: బొగ్గు, విద్యుచ్ఛక్తి మొదలగు బహుళ ప్రయోజనాలు గల వస్తువులకు డిమాండ్ వ్యాకోచంగా ఉంటుంది. ఒకే ప్రయోజనం లేక ఉపయోగం గల వస్తువులకు డిమాండ్ అవ్యాకోచంగా ఉంటుంది.

5. కాలము: స్వల్ప కాలంలో డిమాండ్ అవ్యాకోచంగా ఉంటుంది. దీర్ఘ కాలంలో వ్యాకోచత్వం ఎక్కువగా ఉంటుంది.

6. పూరక వస్తువులు: పూరక వస్తువుల విషయంలో డిమాండ్ అవ్యాకోచంగా ఉంటుంది.

7. ధరస్థాయి: ధర స్థాయి ఎక్కువగా ఉంటే వ్యాకోచమైన డిమాండ్ ఉంటుంది. ధర స్థాయి తక్కువగా ఉంటే అవ్యాకోచమైన డిమాండ్ ఉంటుంది.

8. వినియోగదారుని బడ్జెట్లో వస్తువుకు గల ప్రాధాన్యం: వినియోగదారుని ఆదాయంలో ఒక వస్తువుపై చేసే ఖర్చు శాతం తక్కువగా ఉంటే డిమాండ్ వ్యాకోచంగా ఉంటుంది. ఆదాయంలో హెచ్చు శాతం ఖర్చు చేసే వస్తువుల విషయంలో డిమాండ్ వ్యాకోచంగా ఉంటుంది.

9. వస్తువు మన్నికపై ఆధారపడును: మన్నికగల, నిల్వ చేయటానికి వీలైన అనశ్వర వస్తువులపై చేసే డిమాండ్ అవ్యాకోచంగాను, నశ్వర వస్తువులకు డిమాండ్ వ్యాకోచంగాను ఉంటుంది.

10. పేదవారి వస్తువులు: పేదవారు వినియోగించే వస్తువులకు డిమాండ్ వ్యాకోచంగా ఉంటుంది. ఈ వస్తువుల ధరలు తగ్గినపుడు వాటికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది.

ప్రశ్న 9.
ధర డిమాండ్ ‘వ్యాకోచత్వం ప్రాముఖ్యాన్ని వివరించండి.
జవాబు:
1. ఉత్పత్తిదార్లకు: ఉత్పత్తిదార్లు వస్తువులకున్న డిమాండ్ వ్యాకోచత్వాన్ని అనుసరించి ఉత్పత్తి చేస్తారు. ఏ వస్తువులకైతే డిమాండ్ అవ్యాకోచంగా ఉంటుందో ఆ వస్తువులను ఉత్పత్తి చేస్తారు. ఎందుకంటే అటువంటి వస్తువుల ధరను పెంచి లాభం పొందగలుగుతారు.

2. సమిష్టి వస్తువుల ధర నిర్ణయం: జంటగా కొన్ని వస్తువులు ఉత్పత్తి చేయబడతాయి. ఉదా: పంచదార, మొలాసిన్, ఈ వస్తువుల విషయంలో ఒక్కొక్క వస్తువు ఉత్పత్తి వ్యయాన్ని విడదీసి చెప్పడానికి వీలుండదు. అందువల్ల ఈ వస్తువుల ధర నిర్ణయంలో డిమాండ్ వ్యాకోచంగా ఉన్న వాటికి తక్కువ ధరను, అవ్యాకోచంగా ఉన్న వాటికి ఎక్కువ ధర నిర్ణయించడం జరుగుతుంది.

3. ఏకస్వామ్యదార్లు: ఏకస్వామ్యదార్లు వస్తువుకున్న డిమాండ్ వ్యాకోచత్వం ఆధారంగా ధర నిర్ణయిస్తారు. అవ్యాకోచత్వం ఉన్న వస్తువులకు ఎక్కువ ధరను, వ్యాకోచత్వం ఎక్కువ ఉన్న వస్తువులకు తక్కువ ధరను నిర్ణయిస్తారు.

4. ప్రభుత్వం: కొన్ని వస్తువులు ప్రజాసంక్షేమాన్ని పెంపొందిస్తాయి. అందువల్ల ఈ వస్తువులకు డిమాండ్ అవ్యాకోచంగా ఉంటుంది. ఉదా: మందులు, రైలు ప్రయాణం మొదలైనవి.

5. ఆర్థిక మంత్రికి పన్నులు విధించేటప్పుడు ఆర్థిక మంత్రికి వస్తువులకున్న డిమాండ్ వ్యాకోచత్వం ఉపయోగపడుతుంది. అంతేకాక ఆర్థిక మంత్రికి కోశ విధాన రూపకల్పనలో డిమాండ్ వ్యాకోచత్వ భావన తోడ్పడుతుంది.

6. అంతర్జాతీయ వ్యాపారం అంతర్జాతీయ వ్యాపారంలో వివిధ దేశాల మధ్య వస్తువుల మారకపు రేటును నిర్ధారించేటప్పుడు వస్తువులకున్న డిమాండ్ వ్యాకోచత్వాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. ఉదా: ఏ దేశమైనా మూల్యహీనీకరణ ద్వారా ప్రయోజనం పొందాలనుకుంటే ఎగుమతి చేసే వస్తువులకు దిగుమతి చేసుకొంటున్న వస్తువులకు ధర డిమాండ్ వ్యాకోచత్వం ‘1’ కంటే ఎక్కువగా ఉండాలి.

7. పేదరికం: సంపద మాటున దాగిఉన్న పేదరికంను అర్థం చేసుకోవడానికి డిమాండ్ వ్యాకోచత్వ భావన ఉపయోగపడుతుంది.

8. వేతనాలు: శ్రామికులకున్న డిమాండ్ వ్యాకోచత్వం వారి వేతనాలను ప్రభావితం చేస్తుంది. అందువల్ల యాజమాన్యం వేతనాలను నిర్ణయించేటప్పుడు శ్రామికులకున్న డిమాండ్ వ్యాకోచత్వాన్ని పరిగణనలోకి తీసుకుంటుంది.

సంక్షిప్త సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
డిమాండ్ సూత్రాన్ని లేదా ధర-డిమాండ్ భావనను వివరించండి.
జవాబు:
అర్థశాస్త్రంలో డిమాండ్ భావనకు చాలా ప్రాధాన్యత ఉన్నది. ఒక వస్తువును కొనాలనే కోరికతోపాటు కొనేశక్తి, కొనాలన్న ఆసక్తి ఉన్నప్పుడు మాత్రమే వస్తువుకు డిమాండ్ ఏర్పడుతుంది. కనుక డిమాండ్ను ఈ క్రింది విధముగా నిర్వచించవచ్చు. “ఒక నిర్ణీత కాలంలో, నిర్ణీతమైన ధరవద్ద కొనుగోలుకు సిద్ధంగా ఉన్న వస్తువు పరిమాణాన్ని ఆ వస్తువుకు లేదా సేవకు ఉన్న డిమాండ్” అని బెన్హమ్ పేర్కొన్నాడు.

AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు

ధర డిమాండ్-డిమాండ్ సూత్రము: డిమాండ్ సూత్రం వస్తువు ధరకు, డిమాండ్కు గల సంబంధాన్ని తెలియజేస్తుంది. “ఇతర అంశాలు స్థిరముగా ఉంటే, వస్తువు ధర పెరిగినప్పుడు డిమాండ్ తగ్గుతుంది. ధర తగ్గితే డిమాండ్ పెరుగుతుంది.” అని మార్షల్ డిమాండ్ సూత్రాన్ని నిర్వచించెను. డిమాండ్ సూత్రాన్ని ఈ విధంగా పేర్కొనవచ్చును.
Dn = f[Pn]

డిమాండ్ పట్టిక:
AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు 27AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు 28

వినియోగదారుడు లేదా వినియోగదారులు ఒక వస్తువును వివిధ ధరల వద్ద ఏ పరిమాణంలో కొనుగోలు చేస్తారో తెలియజేస్తుంది డిమాండ్ పట్టిక. పట్టిక నుంచి వస్తువు ధర పెరిగితే డిమాండ్ తగ్గుతుందని ధర తగ్గితే డిమాండ్ పెరుగుతుందని తెలుస్తుంది. దీనిని ఆధారంగా చేసుకొని డిమాండ్ రేఖను గీయవచ్చును.

డిమాండ్ రేఖ: పటములో X – అక్షముపై వస్తువు డిమాండ్ పరిమాణం, Y – అక్షముపై వస్తువు ధరను చూపినాము. DD డిమాండ్ రేఖ. డిమాండ్ రేఖ ఎడమ నుండి కుడికి క్రిందివైపుకు వాలి ఉంది. ఇది ఋణాత్మకమైన వాలు. వస్తువు ధరకు, డిమాండ్కు మధ్య విలోమ సంబంధమున్నదని ఋణాత్మకమైన వాలు తెలియజేస్తుంది.

ప్రశ్న 2.
డిమాండ్ సూత్రం మినహాయింపులను వివరించండి.
జవాబు:
డిమాండ్ సూత్రం ప్రకారం వస్తు ధరకు, డిమాండ్కు విలోమ సంబంధాన్ని కలిగి ఉంటాయి. కాని కొన్ని పరిస్థితులలో ధర, డిమాండ్ అనులోమ సంబంధాన్ని కలిగి ఉంటాయి. అంటే ధర పెరిగితే డిమాండ్ పెరుగుతుంది. ధర తగ్గితే డిమాండ్ తగ్గుతుంది. ఈ పరిస్థితి డిమాండ్ సూత్రానికి మినహాయింపు.

ధర ‘OP’ ఉన్నప్పుడు ‘OQ’ వస్తు పరిమాణం డిమాండ్ చేయబడింది. ధర ‘OP’ నుంచి OP1 కు పెరగగా డిమాండ్ OQ నుంచి OQ1 కు పెరిగింది. ఈ పరిస్థితి డిమాండ్ సూత్రానికి విరుద్ధం.
AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు 29

మినహాయింపులు:
1. గిఫెన్ వైపరీత్యం: పేద కార్మికులు రొట్టె ధర పెరిగితే మాంసముపై వెచ్చించే డబ్బును కూడా రొట్టెపై ఖర్చు చేస్తారు. అనగా రొట్టె ధర పెరిగినా డిమాండ్ తగ్గదు. ఇది పేదవాళ్ళ ఆహారం కావటమే ఇందుకు కారణము. ఈ సత్యాన్ని సర్ రాబర్ట్ గిఫెన్ అనే ఇంగ్లాండ్ దేశానికి చెందిన ఆర్థికవేత్త 19వ శతాబ్దం మధ్య భాగంలో పరిశీలించాడు. కనుక దీనిని గిఫెన్ వైపరీత్యం అంటారు. పేదవారు ముఖ్యంగా నిత్యావసర వస్తువులలో తక్కువ ధర గల వస్తువులను కొనుగోలు చేస్తారు. ఈ ప్రత్యేకమైన వస్తువులనే గిఫెన్ వస్తువులంటారు. ఉదా: రాగులు, జొన్నలు మొదలైనవి.

2. గౌరవ సూచిక వస్తువులు: గౌరవ సూచిక వస్తువుల ధర పెరిగితే డిమాండ్ పెరుగుతుంది. వీటిని కొనుగోలు చేయటం వలన సమాజంలో గౌరవము, ప్రతిష్ఠ పెరుగుతాయని భావిస్తారు. వీటి ధర తగ్గితే గౌరవం, ప్రతిష్ఠ తగ్గుతాయని భావిస్తారు. ఉదా: విలువ గల వజ్రాలు, ఆభరణాలు మొదలైనవి. ఇది డిమాండ్ సూత్రానికి వ్యతిరేకము. ఈ విషయాన్ని వెబెన్ అనే అమెరికా ఆర్థికవేత్త తెలియజేసెను. అందువల్ల ఇటువంటి వస్తువులను వెబ్లెన్ వస్తువులంటారు.

3. అంచనా వ్యాపారం: ఒక వస్తువు ధర మరింత పెరగడానికి వ్యాపారస్తులు, కొనుగోలుదారులు ఆ వస్తువును ఎక్కువగా డిమాండ్ చేస్తారు. అదే విధంగా ధర తగ్గినప్పుడు ఇంకా తగ్గుతుందని భావిస్తే కొనుగోలు తగ్గిస్తారు. దీనినే సట్టా వ్యాపారం అని కూడా అంటారు. ఉదా: షేర్లు, బాండ్లు మొదలైనవి.

AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు

4. భ్రాంతి: కొంతమంది వినియోగదారులు కొన్నిసార్లు ఎక్కువ ధర కలిగి ఉన్న వస్తువులు ఎక్కువ నాణ్యతతో కూడి ఉంటాయన్న భ్రాంతిలో ఉంటారు. అందువల్ల ధర ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్కువగా కొనుగోలు చేస్తారు. ఇటువంటి వాటి విషయంలో డిమాండ్ సూత్రం వర్తించదు.

ప్రశ్న 3.
డిమాండ్ రేఖ ఎందుకని రుణాత్మక వాలు కలిగి ఉంటుంది. లేదా ఎందుకని ఎడమ నుంచి కుడికి కిందికి వాలుతుంది ?
జవాబు:
ఒక నిర్ణీత కాలంలో, నిర్ణీతమైన ధర వద్ద కొనుగోలుకు సిద్ధంగా ఉన్న వస్తువు పరిమాణాన్ని డిమాండ్ అంటారు. “ఇతర పరిస్థితులు మారకుండా స్థిరంగా ఉన్నప్పుడు ఒక నిర్ణీత కాలంలో ఒక వస్తువు ధర తగ్గితే డిమాండ్ పెరుగుతుంది. ధర పెరిగితే డిమాండ్ తగ్గుతుంది.” అని డిమాండ్ సూత్రం తెలియజేస్తుంది. దీనిని బట్టి వస్తువు థరకు, డిమాండ్కు విలోమ సంబంధం ఉందని తెలుస్తుంది. కనుక డిమాండ్ రేఖ ఎడమ నుండి కుడికి క్రిందివైపుకు వాలి ఉంటుంది. దీనికి అనేక కారణాలున్నాయి. అవి:

1. క్షీణోపాంత ప్రయోజన సిద్ధాంతం: క్షీణోపాంత ప్రయోజనాన్ని ఆధారంగా చేసుకొని డిమాండ్ సూత్రం చెప్పబడినది. వస్తువు పరిమాణం ఎక్కువైతే ఉపాంత ప్రయోజనం తగ్గుతుంది. ఉపాంత ప్రయోజనం తక్కువగా ఉంటే వినియోగదారుడు ఆ వస్తువుకు ధర చెల్లించాలనుకున్నాడు. అందువల్ల ధర తక్కువగా ఉంటే ఎక్కువగానూ, ధర ఎక్కువగా ఉంటే తక్కువగాను వస్తు పరిమాణాన్ని బట్టి డిమాండ్ చేస్తాడు.

2. ఆదాయ ప్రభావము: ఒక వస్తువు ధర పెరిగితే వినియోగదారుని వాస్తవిక ఆదాయం ధర పెరిగిన మేరకు తగ్గుతుంది. అందువల్ల వాస్తవిక ఆదాయం తగ్గినమేరకు ఆ వస్తువును తక్కువ పరిమాణంలో డిమాండ్ చేయటం జరుగుతుంది. అదేవిధంగా ఒక వస్తువు ధర తగ్గితే ధర తగ్గిన మేరకు వాస్తవిక ఆదాయం పెరిగినట్లే అవుతుంది. కనుక ఆ మేరకు డిమాండ్ పెరుగుతుంది. దీనినే డిమాండ్పై ఆదాయ ప్రభావం అంటారు. ఉదా: ఒక వస్తువుకు వినియోగదారుడు 5 రూపాయలు కేటాయిస్తే వస్తువు ధర ఒక రూపాయిగా ఉంటే 5 యూనిట్లు కొనుగోలు చేస్తాడు. వస్తువు ధర అర్థ రూపాయికి తగ్గితే 10 యూనిట్లను కొనుగోలు చేస్తారు.

3. ప్రత్యామ్నాయాల ప్రభావం రెండు వస్తువులు ప్రత్యామ్నాయ వస్తువులు అయితే ఒక వస్తువు ధర తగ్గి మరొక వస్తువు ధర స్థిరంగా ఉంటే ధర తగ్గిన వస్తువుకు ధర స్థిరంగా ఉన్న వస్తువుకు బదులుగా ప్రత్యామ్నాయం చేస్తారు. ఉదా: పెప్సి, థమ్సప్ శీతల పానీయాలు. పెప్సి ధర పెరిగితే వినియోగదార్లు దానికి ప్రత్యామ్నాయంగా థమ్సప్ కొనుగోలు చేస్తారు.

4. పాత, నూతన కొనుగోలుదార్లు: ఒక వస్తువు ధర తగ్గగానే ముందు నుంచి ఆ వస్తువును కొనుగోలు చేస్తున్న పాత వినియోగదారుల వాస్తవిక ఆదాయం పెరిగి ఎక్కువగా కొనుగోలు చేస్తారు. అంతేకాకుండా ఒక వస్తువు ధర తగ్గినప్పుడు ఆకర్షితులైన కొత్త వినియోగదార్లు ఆ వస్తువును ఎక్కువగా కొనుగోలు చేస్తారు. అందువల్ల ధర తగ్గినప్పుడు వస్తువుకు డిమాండ్ పెరుగుతుంది.

5. వస్తువుకున్న బహుళ ఉపయోగాలు: కొన్ని వస్తువులకు బహుళ ఉపయోగాలుంటాయి. మరికొన్ని వస్తువులు ఒక ప్రత్యేకమైన ఉపయోగానికి మాత్రమే వినియోగించబడతాయి. అనేక ఉపయోగాలున్న వస్తువులకు ధర తగ్గితే డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఉదా: పాలు, బొగ్గు, విద్యుచ్ఛక్తి మొదలైనవి.

ప్రశ్న 4.
ఆదాయ డిమాండ్ భావనను వివరించండి.
జవాబు:
వినియోగదారుని ఆదాయానికి, వస్తువు డిమాండ్కు మధ్యనున్న సంబంధాన్ని ఆదాయ డిమాండ్ అంటారు. వివిధ ఆదాయాల వద్ద వస్తువు డిమాండ్ పరిమాణం ఏవిధంగా ఉందో ఆదాయ డిమాండ్ తెలియజేస్తుంది.
D1 = f(y)

ఇతర అంశాలు మారకుండా స్థిరంగా ఉంటే ఆదాయం పెరిగితే డిమాండ్ పెరుగుతుంది. ఆదాయం తగ్గితే డిమాండ్ తగ్గుతుంది. ధరకు, ఆదాయంకు ధనాత్మక సంబంధం ఉంది. ఆదాయ డిమాండ్ను అనుసరించి వస్తువులలో మేలురకం లేదా నాసిరకం వస్తువులుగా గుర్తించవచ్చు.

మేలురకం వస్తువులు / సాధారణ వస్తువులు: ఆదాయం పెరిగితే మేలురకం వస్తువులు లేదా సాధారణ వస్తువుల డిమాండ్ పెరుగుతుంది.
AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు 30

ప్రక్క రేఖాపటంలో ‘OX’ అక్షంపై డిమాండ్ పరిమాణంను, ‘OY అక్షంపై ఆదాయంను తీసుకొన్నాం. ఆదాయం ‘OY’ ఉన్నప్పుడు ‘OQ’ వస్తు పరిమాణం డిమాండ్ చేయబడింది. ఆదాయం ‘OY’ నుంచి ‘OY1‘ కు పెరిగినప్పుడు మేలురకం వస్తువుల డిమాండ్ ‘OQ’ నుంచి ‘OQ1‘ కు పెరిగింది. ‘YD’ రేఖ ధనాత్మక వాలు కలిగి ఉంటుంది.

AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు

నాసిరకం వస్తువులు: మేలురకం వస్తువులకు భిన్నంగా వినియోగదార్ల ఆదాయం పెరిగితే నాసిరకం వస్తువులకు డిమాండ్ తగ్గుతుంది. ప్రక్క రేఖాపటంలో ‘OX’ అక్షం మీద డిమాండ్ పరిమాణాన్ని, ‘OY’ అక్షం మీద ఆదాయంను తీసుకొన్నాం. ఆదాయం ‘OY’ నుంచి ‘OY1‘ కు పెరిగినప్పుడు డిమాండ్ ‘OQ’ నుంచి ‘OQ1‘ కు తగ్గును. ‘YD’ రేఖ ఎడమ నుండి కుడికి వాలి ఉంది.
AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు 31

ప్రశ్న 5.
జాత్యంతర డిమాండ్ భావనను వివరించండి.
జవాబు:
ప్రత్యామ్నాయ, పూరక వస్తువుల ధరలకు, ఒక వస్తువు డిమాండ్కు మధ్య ఉన్న సంబంధాన్ని జాత్యంతర డిమాండ్ అంటారు. ప్రత్యామ్నాయ, పూరక వస్తువుల ధరలలో వచ్చిన మార్పుల వల్ల ఒక వస్తువు డిమాండ్లో వచ్చే మార్పులను జాత్యంతర డిమాండ్ తెలియజేయును.

జాత్యంతర డిమాండ్ను ఈ విధంగా వ్రాయవచ్చు.
Dx = f(Py).

ప్రత్యామ్నాయ వస్తువులు: ఒక కోర్కెను తీర్చగల వివిధ వస్తువులను ప్రత్యామ్నాయ వస్తువులు అంటారు. ఉదా: కాఫీ, టీ. ప్రత్యామ్నాయ వస్తువుల విషయంలో డిమాండ్ రేఖ ధనాత్మక సంబంధాన్ని తెలియజేయును. దీనిని రేఖాపటం ద్వారా చూపవచ్చు.
AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు 32

పై రేఖాపటంలో కాఫీ ధర ‘OY’ నుంచి ‘OY2‘ కు పెరిగినప్పుడు టీ డిమాండ్ ‘OQ’ నుండి ‘OQ2‘ కు పెరిగింది. ‘CD’ రేఖ ధనాత్మక వాలును కలిగి ఉంది.

పూరక వస్తువులు: ఒకే కోరికను తీర్చగల సమిష్టి వస్తువులు. ఉదా: కారు, పెట్రోలు, వీటి విషయంలో డిమాండ్ విలోమ సంబంధాన్ని తెలియజేయును.
AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు 33

పై రేఖాపటంలో డిమాండ్ ‘OQ’ నుండి ‘OQ2‘ కు పెరిగింది. ధర ‘OP’ నుండి ‘OP2‘ కు తగ్గినప్పుడు ‘CD’ రేఖ ఋణాత్మక వాలు కలిగి ఉంది.

ప్రశ్న 6.
డిమాండ్ నిర్ణయించే అంశాలను వివరించండి. [Mar. ’17, ’16]
జవాబు:
“ఒక నిర్ణీతమైన కాలంలో, నిర్ణీతమైన ధర వద్ద కొనుగోలుకు సిద్ధంగా ఉన్న వస్తు పరిమాణాన్ని ఆ వస్తువుకు లేదా సేవకు ఉన్న డిమాండ్” అంటారు.

AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు

డిమాండ్ను నిర్ణయించే కారకాలు లేదా అంశాలు:
1. ఆధాయంలో మార్పు: ప్రజల ఆదాయాల మార్పును బట్టి పస్తువుల డిమాండ్లో మార్పు ఏర్పడుతుంది. ప్రజల ఆదాయం పెరిగితే వస్తువులకు డిమాండ్ పెరుగుతుంది. ఆదాయాలు తగ్గితే వస్తువుల డిమాండ్ తగ్గుతుంది.

2. అభిరుచులు, అలవాట్లలో మార్పులు: ప్రత్యామ్నాయ, పూరక వస్తువుల ధరలలో వచ్చే మార్పుల వలన వస్తువు డిమాండ్ లో మార్పు వస్తుంది.

3. ప్రత్యామ్నాయ, పూరక వస్తువుల ధరలలో మార్పులు: ప్రజల అభిరుచులలో అలవాట్లలో మార్పుల వల్ల వస్తువు డిమాండ్లో మార్పులు వస్తాయి.

4. జనాభాలో మార్పు: జనాభా పెరుగుదల, తగ్గుదలను అనుసరించి కూడా వస్తువుల డిమాండ్లో మార్పులు వస్తాయి.

5. వాతావరణంలో మార్పులు: వాతావరణంలో మార్పులు కూడా డిమాండ్లో మార్పులను తీసుకొని వస్తాయి. ఉదా: వేసవికాలంలో చల్లని పానీయాలకు డిమాండ్ పెరుగుతుంది.

6. సాంకేతికాభివృద్ధి: సాంకేతికాభివృద్ధి వలన వస్తూత్పత్తి వ్యయం తగ్గి, వస్తు ధరలు తగ్గుతాయి. అందువల్ల పూర్వం కొనుగోలు చేయడానికి ఉపయోగించిన ద్రవ్య పరిమాణంలో వస్తువులను ఎక్కువగా డిమాండ్ చేయటానికి అవకాశం ఉంటుంది.

7. ఆర్థిక స్థితిగతులు: వాణిజ్య విజృంభణ కాలంలో అన్ని వస్తువులకు డిమాండ్ పెరుగుతుంది. కానీ, ఆర్థిక మాంద్య పరిస్థితులలో అన్ని వస్తువులకు డిమాండ్ తగ్గుతుంది.

8. ప్రభుత్వ విధానము: ప్రభుత్వ పన్నుల విధానం, రాయితీ విధానము మొదలైనవి వస్తువు ధర తగ్గితే డిమాండ్ ప్రభావితం చేయును.

9. వస్తువు ధర: ఒక వస్తువు ధరకు, డిమాండ్కు విలోమ సంబంధం ఉన్నది. కనుక వస్తువు ధర తగ్గితే, డిమాండ్ పెరుగుతుంది. వస్తువు ధర పెరుగుటచే డిమాండ్ తగ్గుతుంది.

ప్రశ్న 7.
డిమాండ్ వ్యాకోచత్వం అర్థాన్ని తెలిపి, నిర్వచించండి.
జవాబు:
అర్థశాస్త్రంలో డిమాండ్ వ్యాకోచత్వం అనే భావనకు విశేష ప్రాధాన్యత ఉంది. ధరలో వచ్చిన మార్పు స్పందనకు ప్రతిస్పందనగా డిమాండ్లో ఎంత మేరకు మార్పు వస్తుందో డిమాండ్ వ్యాకోచత్వ భావన తెలుపుతుంది. ఒక వస్తువు ధరలో వచ్చిన అనుపాతపు మార్పు వల్ల డిమాండ్ పరిమాణంలో వచ్చే అనుపాతపు మార్పు ఎంత ఉంటుందో డిమాండ్ వ్యాకోచత్వ భావన తెలియజేయును. అంటే ధరలో వచ్చే శాతం మార్పుకు, డిమాండ్లో వచ్చే శాతం మార్పుకు మధ్య ఉన్న సంఖ్యాత్మక సంబంధాన్ని డిమాండ్ వ్యాకోచత్వం తెలుపుతుంది. డిమాండ్ వ్యాకోచత్వం అనే భావనను కీరనీట్, మిల్ రూపొందించినప్పటికీ, మార్షల్ అభివృద్ధిపరిచారు.

మార్షల్ అభిప్రాయంలో “ధర తగ్గినప్పుడు డిమాండ్ ఎక్కువ పెరిగిందా లేదా తక్కువ పెరిగిందా, ధర పెరిగినప్పుడు డిమాండ్ తక్కువ తగ్గిందా లేదా ఎక్కువ తగ్గిందా అనే దాని ఆధారంగా మార్కెట్ డిమాండ్ వ్యాకోచత్వం ఎక్కువగాని, తక్కువగాని ఉంటుంది.”

శ్రీమతి జోన్ రాబిన్సన్ అభిప్రాయంలో “ధరలో వచ్చే అనుపాత మార్పు స్పందనకు బదులుగా డిమాండ్ పరిమాణంలో వచ్చే అనుపాతపు మార్పుకు ప్రతిస్పందన ఏ మేరకు ఉంటుందో తెలియజేసే భావన డిమాండ్ వ్యాకోచత్వం”.

AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు 34

ప్రశ్న 8.
మొత్తం ఖర్చు పద్దతి ద్వారా ధర డిమాండ్ వ్యాకోచత్వాలను ఎలా కొలుస్తారు ?
జవాబు:
ధర డిమాండ్ వ్యాకోచత్వాన్ని కొలిచే పద్ధతులలో మొత్తం ఖర్చు పద్ధతి ఒకటి. ఈ పద్ధతిలో వస్తువు ధర మార్పు వల్ల ఆ వస్తువుపై వినియోగదారుని మొత్తం ఖర్చులో వచ్చిన మార్పులను పరిశీలించడం ద్వారా డిమాండ్ వ్యాకోచత్వం కొలవబడుతుంది. వస్తువు ధరకు, మొత్తం ఖర్చుకు విలోమ సంబంధం ఉంటే డిమాండ్ వ్యాకోచత్వం ఒకటికన్నా ఎక్కువగా ఉంటే దానిని వ్యాకోచిత డిమాండ్ అంటారు. వస్తువు ధరకు, మొత్తం ఖర్చుకు అనులోమ సంబంధం ఉంటే డిమాండ్ వ్యాకోచత్వం ఒకటి కన్నా తక్కువగా ఉంటే దానిని అవ్యాకోచిత డిమాండ్ అంటారు. వస్తువు ధర మారినప్పటికీ మొత్తం ఖర్చులో మార్పు లేకపోతే డిమాండ్ వ్యాకోచత్వం ఒకటికి సమానముగా ఉంటే దానిని ఏకత్వ వ్యాకోచ డిమాండ్ అంటారు. ఈ విషయాన్ని ఈ క్రింది ఊహాజనిత డిమాండ్ పట్టిక ద్వారా గ్రహించవచ్చును.

డిమాండ్ పట్టిక:
AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు 35

పట్టికలోని విషయాన్ని క్రింది రేఖాపటం ద్వారా పరిశీలించవచ్చు.
AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు 36

పటములో Y – అక్షముపై వస్తువు ధరను, X – అక్షముపై మొత్తం ఖర్చును చూపటం జరిగింది. OP1 (60) ధర పెరిగినప్పుడు మొత్తం ఖర్చు తగ్గింది. కనుక డిమాండ్ వ్యాకోచితంగా ఉన్నది. అనగా Ep > 1. ధర OP (50) నుండి OP2 (40) కు తగ్గినపుడు మొత్తం ఖర్చులో మార్పు రాలేదు. కనుక ఏకత్వ వ్యాకోచ డిమాండ్ను సూచిస్తుంది. అనగా Ep = 1. ధర OP2(40) నుండి OP3 (30) కి తగ్గినపుడు మొత్తం ఖర్చు కూడా తగ్గింది. కనుక అవ్యాకోచ డిమాండ్ను సూచిస్తుంది. అనగా Ep < 1. డిమాండ్ రేఖ ABCD లో A నుండి B వరకు వ్యాకోచిత డిమాండ్, B నుండి C వరకు ఏకత్వ వ్యాకోచ డిమాండ్, C నుండి D వరకు అవ్యాకోచ డిమాండ్.

AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
డిమాండ్
జవాబు:
ఒక వస్తువును కొనాలనే కోరికతో పాటు కొనేశక్తి, ఆసక్తి ఉన్నప్పుడు మాత్రమే వస్తువుకు డిమాండ్ ఏర్పడుతుంది. బెన్హామ్ అభిప్రాయంలో ఒక నిర్ణీతకాలంలో, నిర్ణీతమైన ధర వద్ద కొనుగోలుకు సిద్ధంగా ఉన్న వస్తు పరిమాణాన్ని డిమాండ్గా పేర్కొనెను.

ప్రశ్న 2.
డిమాండ్ పట్టిక [Mar. ’17]
జవాబు:
వస్తువు ధరకు, వస్తువు డిమాండ్కు మధ్య ఉన్న సంబంధాన్ని తెలిపే పట్టికను డిమాండ్ పట్టిక అంటారు. ఈ డిమాండ్ పట్టిక రెండు రకాలు. 1) వైయుక్తిక డిమాండ్ పట్టిక, 2) మార్కెట్ డిమాండ్ పట్టిక.

ప్రశ్న 3.
వైయుక్తిక డిమాండ్ పట్టిక.
జవాబు:
ఒక వినియోగదారుడు ఒక వస్తువును వివిధ ధరల వద్ద ఎంతెంత పరిమాణంలో కొనుగోలు చేస్తాడో తెలియజేయునది వైయుక్తిక డిమాండ్. దానిని పట్టిక రూపంలో తెలియజేస్తే అది వైయుక్తిక డిమాండ్ పట్టిక.

ప్రశ్న 4.
మార్కెట్ డిమాండ్ పట్టిక
జవాబు:
మార్కెట్లో అనేక మంది వినియోగదారులు ఉంటారు. వారందరి డిమాండ్ పట్టికలను కలిపితే మార్కెట్ డిమాండ్ పట్టిక వస్తుంది. మార్కెట్ డిమాండ్ వివిధ వినియోగదార్లు వస్తువులను వివిధ ధరల వద్ద ఒక వస్తువును ఎంతెంత పరిమాణంలో కొనుగోలు చేస్తారో తెలియజేస్తుంది.

ప్రశ్న 5.
డిమాండ్ ఫలం [Mar. ’15]
జవాబు:
ఒక వస్తువు డిమాండ్ పరిమాణానికి, దానిని నిర్ణయించే కారకాలకు మధ్యగల సంబంధాన్ని డిమాండ్ ఫలం తెలియజేయును. డిమాండ్ ఫలాన్ని సమీకరణం ద్వారా తెలియజేయవచ్చు. Dx = f(Px, Py, Y, T).

ప్రశ్న 6.
గిఫెన్ వైపరీత్యం లేదా గిఫెన్ వస్తువులు [Mar. ’16]
జవాబు:
ధర పెరిగినప్పటికి డిమాండ్ తగ్గకపోగా, పెరగటం లేదా అదే విధంగా డిమాండ్ను కలిగి ఉండే వస్తువులను గిఫెన్ వస్తువులంటారు. నాసిరకపు వస్తువులను గిఫెన్ వస్తువులంటారు. వాటి ధర పెరిగితే ఇతర వస్తువులపై ఖర్చు తగ్గించి ఈ వస్తువులను కొనుగోలు చేస్తారు. దీనిని సర్ రాబర్ట్ గిఫెన్ అనే ఆర్థికవేత్త పరిశీలించడం వల్ల దీనిని “గిఫెన్ వైపరీత్యం” అంటారు.

ప్రశ్న 7.
అంచనా వ్యాపారం
జవాబు:
ఒక వస్తువు ధర పెరిగినప్పుడు, ఆ వస్తువు ధర భవిష్యత్తులో ఇంకా పెరుగుతుందని వ్యాపారస్తులు, కొనుగోలుదార్లు భావించినప్పుడు ఆ వస్తువును ఎక్కువగా డిమాండ్ చేస్తారు. అదే విధంగా ధర తగ్గినప్పుడు ఇంకా తగ్గుతుందని భావిస్తే కొనుగోలు తగ్గిస్తారు. దీనినే అంచనా వ్యాపారం అంటారు. ఉదా: స్టాక్ మార్కెట్లో షేర్లు.

AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు

ప్రశ్న 8.
వెబ్లెన్ వస్తువులు లేదా గౌరవ సూచిక వస్తువులు
జవాబు:
దీనిని గూర్చి చెప్పిన ఆర్థికవేత్త వెబ్లెన్. గౌరవ సూచిక వస్తువులయిన వజ్రాలు, బంగారు నగలు మొదలైనవి. కలిగి ఉండటం సమాజంలో ప్రతిష్టగా భావిస్తారు ధనికులు. వీటి ధర తగ్గితే వారి గౌరవం, ప్రతిష్ట తగ్గుతాయని కొనుగోలు తగ్గిస్తారు. కనుక ఈ వస్తువుల విషయంలో ధర తగ్గితే డిమాండ్ కూడా తగ్గును.

ప్రశ్న 9.
ధర డిమాండ్
జవాబు:
ఒక వస్తువు ధరకు, దాని డిమాండ్ పరిమాణానికి గల సంబంధాన్ని ధర డిమాండ్ అంటారు. దీనిని ఈ విధంగా తెలియజేయవచ్చు. Dn = f(Pn).

ప్రశ్న 10.
ఆదాయ డిమాండ్ [Mar. ’17]
జవాబు:
ఆదాయానికి, కొనుగోలు చేసే వస్తు పరిమాణానికి ఉన్న సంబంధాన్ని ఆదాయ డిమాండ్ పరిశీలిస్తుంది. సాధారణంగా ఆదాయం పెరిగితే డిమాండ్ పెరుగుతుంది. ఆదాయం తగ్గితే డిమాండ్ తగ్గుతుంది. ఆదాయ డిమాండ్ను బట్టి వస్తువులను మేలురకం అని, నాసిరకమని విభజించవచ్చు. ఆదాయ డిమాండ్ Dn = f(y)

ప్రశ్న 11.
జాత్యంతర డిమాండ్ [Mar. ’15]
జవాబు:
ప్రత్యామ్నాయ, పూరక వస్తువు ధరలకు, ఒక వస్తువు డిమాండ్కు ఉన్న సంబంధాన్ని జాత్యంతర డిమాండ్ అంటారు. ప్రత్యామ్నాయ, పూరక వస్తువుల ధరలలో వచ్చిన మార్పుల వల్ల ఒక వస్తువు డిమాండ్లో వచ్చే మార్పులను జాత్యంతర డిమాండ్ తెలియజేయును. Dx = f(Py).

ప్రశ్న 12.
ప్రత్యామ్నాయాలు
జవాబు:
సన్నిహిత సంబంధం ఉన్న వివిధ వస్తువులను ప్రత్యామ్నాయ వస్తువులంటారు. ఉదా: కాఫీ, టీ. ఈ వస్తువుల విషయంలో ప్రత్యామ్నాయ వస్తువు ధరలో మార్పు వస్తే, మరో వస్తువు డిమాండ్లో మార్పు వస్తుంది. కనుక ఈ వస్తువుల విషయంలో డిమాండ్ రేఖ ఎడమ నుండి కుడికి పైకి వాలి ఉంటుంది.

ప్రశ్న 13.
పూరకాలు
జవాబు:
సంయుక్త వస్తువులను పూరక వస్తువులంటారు. ఉదా: కారు, పెట్రోలు. వీటిలో ఒకటి లేకపోయినా మరొకటి ఉపయోగపడదు. పూరక సంబంధం ఉన్న వస్తువు ధర పెరిగితే, ఇతర వస్తువులకు డిమాండ్ తగ్గుతుంది. ధర తగ్గితే ఇతర వస్తువులకు డిమాండ్ పెరుగుతుంది. పూరక సంబంధం ఉన్న వస్తువుల విషయంలో డిమాండ్ రేఖ క్రిందికి వాలి
ఉంటుంది.

ప్రశ్న 14.
నాసిరకం వస్తువులు
జవాబు:
ఆదాయం పెరిగేకొలది కొన్ని రకాల వస్తువులకు డిమాండ్ తగ్గును. ఆదాయం తగ్గితే డిమాండ్ పెరుగును. ఇటువంటి వస్తువులను నాసిరకం వస్తువులంటారు. ఈ వస్తువుల విషయంలో ఆదాయానికి, వస్తువు డిమాండ్కు విలోమ సంబంధం ఉంటుంది. ఉదా: సజ్జలు, రాగులు.

ప్రశ్న 15.
డిమాండ్ వ్యాకోచత్వం
జవాబు:
ఒక వస్తువు ధరలోని మార్పులు, ఆ వస్తువు కొనుగోలు పరిమాణంలో మార్పు ఏ విధంగా ఉంటుందో తెలియజేసే దానిని డిమాండ్ వ్యాకోచత్వం అంటారు.

AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు

ప్రశ్న 16.
ధర డిమాండ్ వ్యాకోచత్వం
జవాబు:
ఒక వస్తువు ధరలోని శాతం మార్పుకు, వస్తు డిమాండ్లో కలిగే శాతం మార్పుకు మధ్య ఉన్న నిష్పత్తిని “ధర డిమాండ్ వ్యాకోచత్వం” అంటారు.
AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు 37

ప్రశ్న 17.
ఆదాయ డిమాండ్ వ్యాకోచత్వం
జవాబు:
వినియోగదారుని ఆదాయంలో వచ్చిన మార్పు శాతంకు, అతని డిమాండ్లో వచ్చిన శాతం మార్పును “ఆదాయ డిమాండ్ వ్యాకోచత్వం” అంటారు.
AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు 38

ప్రశ్న 18.
జాత్యంతర డిమాండ్ వ్యాకోచత్వం
జవాబు:
ప్రత్యామ్నాయ, పూరక వస్తువుల ధరలలో వచ్చిన శాతం మార్పుకు, డిమాండ్లో కలిగే శాతం మార్పును “జాత్యంతర డిమాండ్ వ్యాకోచత్వం” అంటారు.
AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు 39

ప్రశ్న 19.
పూర్తి వ్యాకోచ డిమాండ్
జవాబు:
ధరలో ఏ మార్పు వచ్చినా లేకున్నా డిమాండ్లో అనంతంగా మార్పు వస్తే దానిని పూర్తి వ్యాకోచ డిమాండ్ అంటారు. ఇక్కడ డిమాండ్ రేఖ ‘X’ అక్షానికి సమాంతరంగా ఉంటుంది. దీని సంఖ్యాత్మక విలువ Ep = ∞

ప్రశ్న 20.
పూర్తి అవ్యాకోచ డిమాండ్ [Mar. ’16]
జవాబు:
ధరలో ఎంత మార్పు వచ్చినా డిమాండ్లో ఏ మాత్రము మార్పు ఉండదు. దీనినే పూర్తి అవ్యాకోచ డిమాండ్ అంటారు. ఇక్కడ డిమాండ్ రేఖ Y- అక్షానికి సమాంతరంగా ఉంటుంది. దీని సంఖ్యాత్మక విలువ Ep = 0

ప్రశ్న 21.
ఏకత్వ వ్యాకోచ డిమాండ్
జవాబు:
ఒక వస్తువు ధరలో వచ్చిన అనుపాతపు మార్పు డిమాండ్ లో వచ్చిన అనుపాతపు మార్పుకు సమానమైతే దానిని ఏకత్వ వ్యాకోచ డిమాండ్ అంటారు. దీని విలువ ఒకటికి సమానము.
Ep = 1
ఇక్కడ డిమాండ్ రేఖ లంబ అతిపరావలయ ఆకారంలో ఉంటుంది.

AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు

ప్రశ్న 22.
సాపేక్ష వ్యాకోచ డిమాండ్
జవాబు:
ఒక వస్తువు ధరలో వచ్చే అనుపాతపు మార్పు కంటే డిమాండ్ పరిమాణంలో వచ్చే అనుపాతపు మార్పు ఎక్కువగా ఉంటే దానిని సాపేక్ష వ్యాకోచ డిమాండ్ అంటారు. ఇక్కడ వ్యాకోచత్వం విలువ ‘1’ కంటే ఎక్కువగా ఉంటుంది.

ప్రశ్న 23.
సాపేక్ష అవ్యాకోచ డిమాండ్
జవాబు:
వస్తువు ధరలో వచ్చిన అనుపాతపు మార్పు కంటే డిమాండ్ పరిమాణంలో వచ్చిన అనుపాతపు మార్పు తక్కువగా ఉన్నట్లయితే దీనిని సాపేక్ష అవ్యాకోచ డిమాండ్ అంటారు. ఇక్కడ డిమాండ్ వ్యాకోచత్వం విలువ ‘1’ కంటే తక్కువగా ఉంటుంది.

ప్రశ్న 24.
ఆర్క్ పద్ధతిని ఎప్పుడు ఉపయోగిస్తారు ?
జవాబు:
డిమాండ్ రేఖపై రెండు బిందువుల మధ్య దూరాన్ని ఆర్క్ అంటారు. డిమాండ్ రేఖపై ఏదో ఒక బిందువు వద్ద కాకుండా రెండు బిందువుల మధ్య భాగంలో ధర డిమాండ్ వ్యాకోచత్వాన్ని కొలవడానికి ‘ఆర్క్’ పద్ధతిని ఉపయోగిస్తారు.

ప్రశ్న 25.
డిమాండ్ వ్యాకోచత్వం ఉపయోగాలు
జవాబు:
అర్థశాస్త్రంలో డిమాండ్ వ్యాకోచత్వానికి అధిక ప్రాధాన్యత ఉంది.

  1. వ్యాపారస్తులు దీని ఆధారంగా ధర నిర్ణయం చేయడం జరుగుతుంది.
  2. కోశ విధానాన్ని రూపొందించడానికి, ఉత్పత్తి వ్యయాన్ని తెలుసుకోడానికి ఇది ఉపయోగపడుతుంది.

AP Inter 1st Year Economics Study Material Chapter 2 వినియోగదారుని ప్రవర్తనా సిద్ధాంతాలు

Andhra Pradesh BIEAP AP Inter 1st Year Economics Study Material 2nd Lesson వినియోగదారుని ప్రవర్తనా సిద్ధాంతాలు Textbook Questions and Answers.

AP Inter 1st Year Economics Study Material 2nd Lesson వినియోగదారుని ప్రవర్తనా సిద్ధాంతాలు

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
క్షీణోపాంత ప్రయోజన సూత్రాన్ని వివరించి, పరిమితులను పరిశీలించండి. [Mar. ’17, ’16, ’15]
జవాబు:
క్రమ క్షీణోపాంత ప్రయోజన సూత్రం మానవుని దైనందిన అనుభవం మీద ఆధారపడి ఉంటుంది. ప్రతి కోరికను ఒక కాల వ్యవధిలో పూర్తిగా సంతృప్తిపరచవచ్చుననే ప్రాతిపదికపై ఈ సూత్రం ఆధారపడి ఉంది. ఈ సూత్రాన్ని ప్రథమంగా 1854వ సంవత్సరంలో హెచ్. హెచ్. గాసెన్ ప్రతిపాదించాడు. దీనిని గాసెన్ ప్రథమ సూత్రంగా జీవన్స్ పేర్కొన్నాడు. మార్షల్ దీనిని అభివృద్ధిపరిచాడు.

“ఒక వ్యక్తి తనవద్దనున్న వస్తు రాశిని పెంచుతూ పోతే అదనంగా చేర్చిన యూనిట్ల నుండి లభించే అదనపు ప్రయోజనం క్రమంగా క్షీణిస్తుంది” అని క్షీణోపాంత ప్రయోజనాన్ని మార్షల్ నిర్వచించెను.

ఈ సూత్రాన్ని కొన్ని ప్రమేయాలపై ఆధారపడి రూపొందించడం జరిగింది.
ప్రమేయాలు:

  1. సిద్ధాంతం కార్డినల్ ప్రయోజన విశ్లేషణపై ఆధారపడింది. అంటే ప్రయోజనాన్ని కొలవవచ్చును, పోల్చవచ్చును.
  2. వస్తువు యూనిట్లు తగుమాత్రంగా ఉండి, మరీ చిన్న యూనిట్లుగాను, మరీ పెద్ద యూనిట్లుగాను ఉండరాదు.
  3. వినియోగించే వస్తువు వివిధ యూనిట్లు సజాతీయంగా ఉండాలి. అనగా పరిమాణం, నాణ్యత, రుచి మొదలైన విషయాలలో ఏ వ్యత్యాసం ఉండరాదు.
  4. ఒక యూనిట్ వినియోగానికి, మరొక యూనిట్ వినియోగానికి మధ్య కాలవ్యవధి ఉండకూడదు.
  5. వినియోగదారుల అభిరుచులు, అలవాట్లలో మార్పు ఉండరాదు.
  6. వినియోగదారుల ఆదాయాలు మారకూడదు.

క్షీణోపాంత ప్రయోజన సూత్ర వివరణ: ఈ సూత్రం వస్తురాశి పరిమాణానికి తృప్తి లేదా ప్రయోజనానికి మధ్యగల సంబంధాన్ని వివరిస్తుంది. ఈ సూత్రం ప్రకారం ఒక వినియోగదారుడు తన వద్ద ఉన్న వస్తురాశిని పెంచుతూ పోతుంటే అదనపు యూనిట్వల్ల లభించే అదనపు లేదా ఉపాంత ప్రయోజనం క్షీణిస్తుంది. ఈ సూత్రాన్ని ఈ క్రింది పట్టిక ద్వారా చూపించటం జరిగింది.

AP Inter 1st Year Economics Study Material Chapter 2 వినియోగదారుని ప్రవర్తనా సిద్ధాంతాలు 1

AP Inter 1st Year Economics Study Material Chapter 2 వినియోగదారుని ప్రవర్తనా సిద్ధాంతాలు

పట్టిక ప్రకారం ప్రతి అదనపు ఆపిల్ వల్ల లభించే ఉపాంత ప్రయోజనం క్షీణిస్తుంది. అంటే మొత్తం ప్రయోజనం తగ్గుతున్న రేటులో పెరగటం గమనించవచ్చు. 6వ ఆపిల్ వల్ల మొత్తం ప్రయోజనం 82 యుటిల్స్, ఉపాంత ప్రయోజనం 2 యుటిల్స్, 7వ ఆపిల్ వినియోగం వల్ల మొత్తం ప్రయోజనంలో మార్పు లేదు. అంటే మొత్తం ప్రయోజనం గరిష్టంగా ఉంది. ఉపాంత ప్రయోజనం శూన్యం 7, 8 ఆపిల్ పండ్ల నుండి మొత్తం ప్రయోజనం క్షీణించి, ఉపాంత ప్రయోజనం ఋణాత్మకమైనది. మొత్తం ప్రయోజనానికి, ఉపాంత ప్రయోజనానికి మధ్య సంబంధం ఈ క్రింది విధంగా ఉంటుంది.

  1. మొత్తం ప్రయోజనం తగ్గుతున్న రేటులో పెరిగినప్పుడు ఉపాంత ప్రయోజనం తగ్గుతుంది.
  2. మొత్తం ప్రయోజనం గరిష్టమైనపుడు ఉపాంత ప్రయోజనం శూన్యమవుతుంది.
  3. మొత్తం ప్రయోజనం తగ్గితే ఉపాంత ప్రయోజనం ఋణాత్మకమవుతుంది. దీనిని ఈ క్రింది రేఖాపటం ద్వారా వివరించవచ్చు.
    AP Inter 1st Year Economics Study Material Chapter 2 వినియోగదారుని ప్రవర్తనా సిద్ధాంతాలు 2

పట్టికను రేఖాపటంలో T.U.C. మొత్తం ప్రయోజన రేఖ M.U.C. ఉపాంత ప్రయోజన రేఖ. X – అక్షముపై ఆపిల్ పండ్ల సంఖ్యను, Y – అక్షముపై మొత్తం ప్రయోజనం, ఉపాంత ప్రయోజనం చూపించాము. వినియోగదారునికి ‘O’ యూనిట్ వద్ద మొత్తం ప్రయోజనం ‘0’ ఆపిల్స్ వినియోగం పెంచుతూ పోయిన కొద్దీ మొత్తం ప్రయోజనం తగ్గుతున్న రేటులో పెరిగింది. T.U.C. ఇదే అంశాన్ని స్పష్టం చేస్తోంది. M.U.C. క్రిందికి వాలుతున్నది. T.U.C. 7వ పండు వద్ద గరిష్టంగా ఉంది. M.U.C. X – అక్షాన్ని తాకి శూన్యమైంది. వినియోగదారుడు 7వ, 8వ పండ్లను వినియోగించటం వల్ల మొత్తం ప్రయోజనం క్షీణించింది. ఉపాంత ప్రయోజనం ఋణాత్మకమైంది.

క్షీణోపాంత ప్రయోజన సిద్ధాంతం, మినహాయింపులు: కొన్ని పరిస్థితులలో అదనపు యూనిట్ల నుంచి వచ్చే ప్రయోజనం క్రమంగా క్షీణించకపోవచ్చు. వీటినే ఈ సూత్రానికి మినహాయింపులుగా చెప్పటం జరుగుతుంది. అవి:

  1. అపూర్వ వస్తువుల విషయంలో ఈ సూత్రం వర్తించదు. ఉదా: నాణేలు, కళాత్మక వస్తువులు, తపాలా బిళ్ళలు.
  2. సామాజిక వస్తువుల వినియోగంలో ఈ సూత్రం వర్తించదు. ఉదా: ఒక పట్టణంలో టెలిఫోన్ల సంఖ్య పెరిగితే, టెలిఫోను ఉపయోగించటం వల్ల కలిగే ప్రయోజనం కూడా పెరుగుతుంది.
  3. మత్తు పదార్థాల విషయంలో ఈ సూత్రం వర్తించదు.
  4. ద్రవ్యం విషయంలో ఈ సూత్రం వర్తించదని కొందరి అభిప్రాయం.

క్షీణోపాంత ప్రయోజన సిద్దాంతం – ప్రాముఖ్యం:

  1. డిమాండ్ సూత్రానికి ఈ సూత్రం మూలాధారం.
  2. విలువ సిద్ధాంతానికి కూడా ఈ సూత్రం మూలాధారం. ఉదా: నీళ్ళకు ప్రాముఖ్యం ఎక్కువగా ఉంటుంది. నీటికి వినిమయ విలువ లేదు. వజ్రాలకు ఉపయోగితా విలువ ఏమీలేదు. కాని వాటి వినిమయ విలువ ఎక్కువగా ఉంటుంది. వీటికి సమాధానం ఈ సూత్రంలో లభ్యమవుతుంది.
  3. ఆర్థికమంత్రి పన్నుల విధానాన్ని నిర్ణయించటంలో ఈ సూత్రం చాలా ఉపయోగకారిగా ఉంటుంది. పురోగామి పన్నుల విధానానికి ఈ సూత్రం ఆధారం.
  4. వినియోగదారుని మిగులు భావన ఈ సూత్రంపైననే ఆధారపడి ఉంది.
  5. సంపద పంపిణీకి క్షీణోపాంత ప్రయోజన సూత్రం ఆధారమని చెప్పవచ్చు.
  6. వినియోగదారు, తన పరిమితమైన ఆదాయం ద్వారా ఏ విధంగా ప్రయోజనాన్ని గరిష్టం చేసుకోవచ్చునో తెలుపుతుంది.

ప్రశ్న 2.
సమోపాంత ప్రయోజన సూత్రం ప్రాముఖ్యాన్ని వివరించండి.
జవాబు:
సమోపాంత ప్రయోజనానికి చాలా ఆచరణీయమైన ప్రాధాన్యత ఉంది. ఆర్థిక జీవనంలో ఈ సూత్రం అనేక విధాలుగా ఉపకరిస్తుంది.
1) వినియోగం: ప్రతి వ్యక్తి తనకున్న పరిమిత ఆదాయాన్ని వివిధ వస్తువులపై ఖర్చు చేయటం ద్వారా గరిష్ట ప్రయోజనాన్ని పొందటానికి ప్రయత్నిస్తాడు. వినియోగదారుడు తక్కువ ప్రయోజనం లభించే వస్తువుకు బదులు అధిక ప్రయోజనం లభించే వస్తువును ప్రతిస్థాపన చేసుకుంటూ తన పరిమిత ఆదాయాన్ని ఖర్చు చేస్తాడు. కనుక ఈ సూత్రం వినియోగదారుని గరిష్ట సంతృప్తి విశ్లేషణకు తోడ్పడుతుంది.

AP Inter 1st Year Economics Study Material Chapter 2 వినియోగదారుని ప్రవర్తనా సిద్ధాంతాలు

2) ఉత్పత్తి: ఉత్పత్తిదారుడు అనేక ఉత్పత్తి కారకాలను ఉత్పత్తి ప్రక్రియలో వినియోగించడం ద్వారా లాభం, గరిష్ట ప్రయోజనాన్ని పొందటానికి ప్రయత్నిస్తాడు. వివిధ ఉత్పత్తి కారకాల నుండి గరిష్ట లాభాలను పొందటానికి ఏ విధంగా ఉత్పత్తి కారకాలను ప్రతిస్థాపన చేస్తాడో ఈ సూత్రం విశ్లేషణ చేస్తుంది.

3) వినిమయం: ఒక వస్తువుకు బదులుగా మరో వస్తువు ద్రవ్యము ద్వారా వినిమయం చేయడంలో ఈ సూత్రం ఉపయోగపడుతుంది. వినిమయానికి ప్రాతిపదిక ప్రతిస్థాపన సిద్ధాంతము.

4) పంపిణీ: వివిధ ఉత్పత్తుల ఉత్పత్తి కారకాలకు వాటి ప్రతిఫలాలను పంపిణీ చేయటాన్ని వివరించే ‘ఉపాంత ఉత్పాదకతా సిద్ధాంతానికి’ ఈ సూత్రం ప్రాతిపదిక.

5) ప్రభుత్వ విత్తము: ప్రభుత్వం వివిధ కార్యక్రమాలపై ఖర్చు చేసేటప్పుడు సమాజపు ప్రయోజనం గరిష్టంగా ఉండాలని భావిస్తుంది. అందువల్ల అధిక ప్రయోజనం కోసం వృధా వ్యయాలను తగ్గించి ప్రభుత్వం వ్యయం చేస్తుంది.

ఇంతేకాకుండా ఆదాయ పునఃపంపిణీకి ఒక వ్యక్తి తన పొదుపు లేదా పెట్టుబడి వివిధ రకాల ఆస్తుల మధ్య విభజించటానికి ఒక వ్యక్తి తన కాలాన్ని పని, విశ్రాంతి మధ్య కేటాయించడానికి మొదలైన అంశాల విశ్లేషణకు ఈ సూత్రం తోడ్పడుతుంది. పన్నుల విధానానికి ఈ సూత్రం సహాయపడుతుంది.

6) ఆదాయ పునఃపంపిణీ, వ్యయ విధానం: సంపన్నులపై ఎక్కువ స్థాయిలో పన్నులు విధించి, పేదవారికి ఎక్కువ ప్రయోజనం చేకూర్చే విధంగా ప్రభుత్వం వ్యయ విధానాన్ని అనుసరిస్తోంది. సంపన్నుల ఖర్చు విధానానికి, పేదవారికి ఖర్చు విధానానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గురించి ఆదాయ పునఃపంపిణీ జరిగే విధానాన్ని, అందువలన కలిగే ఆదాయాన్ని వ్యయం చేసే పద్ధతిని ఈ సూత్రం ఆధారంగా ప్రభుత్వం తన విధానాన్ని నిర్ణయించుకొని సమాజ శ్రేయస్సును పెంపొందిస్తుంది.

7) ధరలపై ప్రభావం: ఈ సూత్రం వస్తువు ధరలపై ప్రభావం చూపుతుంది. వస్తువు కొరతగా ఉంటే ఎక్కువగా ఉంటుంది. దీనికి బదులుగా కొరతలేని వస్తువును ప్రతిస్థాపన చేయటం ద్వారా ఉపాంత ప్రయోగం- తగ్గకుండా ప్రయత్నించటం జరుగుతుంది. అందువల్ల కొరత వస్తువు ధర తగ్గుతుంది.

సమోపాంత ప్రయోజన సూత్ర ప్రాముఖ్యం:

  1. ఉద్యమదారు వివిధ ఉత్పత్తి సాధనాలకు నియమించేటప్పుడు, అన్ని ఉత్పత్తి సాధనాల నుంచి వచ్చే ఉపా ఉత్పాదకత సమానంగా ఉన్నప్పుడు మొత్తం ఉత్పత్తిని గరిష్టం చేసుకుంటాడు. అంటే కనిష్ట వ సముదాయాన్ని నిర్ణయించుకోవడానికి ఈ సూత్రం ఉపకరిస్తుంది.
  2. పంపిణీ విషయంలో కూడా ఈ సూత్రం ప్రాధాన్యం కలిగి ఉంటుంది. ఒక రకమైన వస్తువును ని వ్యక్తుల మధ్య పంపిణీ చేసినప్పుడు, అందరికీ కలిగే ఉపాంత ప్రయోజనంగా ఉంటే, పం సక్రమంగా జరిగిందని చెప్పవచ్చు.
  3. ఆదాయాన్ని వినియోగం, పొదుపు మధ్యన కేటాయించడంలో కూడా ఈత్రం ఉపకరిస్తుంది.
  4. వ్యక్తులు తమ పొదుపును లేదా సంపదను వివిధ రకాల ఆస్తుల రూపంలో ఎంతెంత ఉంచుకో నిర్ణయించుకోవడానికి ఈ సూత్రం ఉపయోగకరంగా ఉంటుంది.
  5. కుటుంబాలు తమ పరిమిత ఆదాయాన్ని వివిధ రకాల వస్తువులపై కేటాయించడం ద్వారా, తమ సంక్షేమాన్ని ఎలా గరిష్టం చేసుకుంటారో ఈ సూత్రం ద్వారా తెలుసుకోవచ్చు.

AP Inter 1st Year Economics Study Material Chapter 2 వినియోగదారుని ప్రవర్తనా సిద్ధాంతాలు

ప్రశ్న 3.
సమోపాంత ప్రయోజన సూత్రం సహాయంతో వినియోగదారుని సమతౌల్యాన్ని వివరించండి.
జవాబు:
వినియోగదారుని సమతౌల్యాన్ని వివరించే సూత్రమే సమోపాంత ప్రయోజన మాత్రము. వినియోగదార గరిష్ట సంతృప్తిని పొందడానికి తన దగ్గర ఉన్న పరిమిత ఆదాయాన్ని వివిధ వస్తువులపై ఏ విధంగా ఉపయోగిస్తాని సూత్రం వివరిస్తుంది. సమోపాంత ప్రయోజన సూత్రం ప్రకారం ఒక వినియోగదారుడు తన దగ్గరున్న ద్రవ్యాన్ని . వస్తువులపై వాటి ఉపాంత ప్రయోజనాలు సమానమయ్యే వరకు ఒకదానికి బదులుగా మరొకటి ప్రతిస్థాపన చేస్తా ఈ ప్రతిస్థాపన గరిష్ట సంతృప్తిని సాధించేవరకు సాగుతుంది. ఉపాంత ప్రయోజనాలు సమానమైనప్పుడు ప్రయోజనం గరిష్టంగా ఉంటుంది. మొత్తం ప్రయోజనం గరిష్టంగా ఉన్నప్పుడు వినియోగదారుడు సమతౌల్య ఉంటాడు.

ఈ సూత్రాన్ని ప్రప్రధమంగా 1854వ సంవత్సరంలో హెచ్. హెచ్. గాసెన్ ప్రతిపాదించాడు. దీనిని గా ద్వితీయ సూత్రంగా జీవన్స్ పేర్నొన్నాడు. దీనిని మార్షల్ అభివృద్ధిపరిచాడు.

“ఒక వ్యక్తి దగ్గర ఉన్న ఒక వస్తువుకు అనేక ఉపయోగాలున్నప్పుడు అతడు ప్రతి ఉపయోగం నుండి ఉపాంత ప్రయోజనం సమానంగా ఉండేటట్లు ఆ వస్తువును వినియోగించడం జరుగుతుంది” అని మార్షల్ ఈ సూ నిర్వచించెను.

సూత్రం వివరణ:
ఉదా: ఒక వ్యక్తి వద్ద ఉన్న వస్తువు పరిమిత ద్రవ్యం ఐదు రూపాయలు అనుకుందాం. ఆ పరిమిత ప్ర X – y అనే వస్తువులపై ఖర్చు చేయటం ద్వారా ఏ విధంగా సమతౌల్యంలో ఉన్నాడో ఈ క్రింది పట్టిక పరిశీలించవచ్చును.
x − y ధరలు ఒక యూనిట్ వస్తువు ఒక రూపాయిగా భావించాలి. ప్రతి రూపాయికి లభించే ఉపాంత ప్రయోజనాలను పట్టికలో పరిశీలించవచ్చును.
AP Inter 1st Year Economics Study Material Chapter 2 వినియోగదారుని ప్రవర్తనా సిద్ధాంతాలు 3

బ్రాకెట్లలో చూపిన అంకెలు వినియోగదారుడు 5 రూపాయలను ఏ విధంగా ఖర్చు చేశాడో తెలియజేయును. పట్టికననుసరించి x, y వస్తువుల ఉపాంత ప్రయోజన వస్తు వినియోగం పెరుగుతున్న కొద్దీ క్షీణిస్తుంది. ఒకటో రూపాయి వల్ల వచ్చే ఉపాంత ప్రయోజనం y వస్తువు కంటే x వస్తువు వల్ల ఎక్కువగా ఉంది. అందువల్ల మొదటి రూపాయితో X వస్తువును కొనుగోలు చేస్తాడు. అదే విధంగా 2వ రూపాయిని x మీద వినియోగిస్తే ఉపాంత ప్రయోజనం 20 యుటిల్స్. అదే 2వ రూపాయిని y మీద వినియోగిస్తే ఉపాంత ప్రయోజనం 21 యుటిల్స్. కనుక 2వ రూపాయిని y వస్తువుపై ఖర్చు చేస్తాడు. 3వ రూపాయిని y వస్తువు మీద ఖర్చు చేస్తే, 15 యుటిల్స్ ఉపాంత ప్రయోజనము. అదే 3వ రూపాయిని X వస్తువుపై ఖర్చు చేస్తే ఉపాంత ప్రయోజనం 20 యుటిల్స్ కనుక 3వ రూపాయితో X వస్తువు 2వ యూనిట్ను కొనుగోలు చేస్తాడు. 4వ రూపాయితో y ని కొనుగోలు చేసినా ఉపాంత ప్రయోజనం 15 యుటిల్స్. 5వ | రూపాయిని X వస్తువు 3వ యూనిట్పై ఖర్చు చేస్తే ఉపాంత ప్రయోజనం 15 యుటిల్స్. 5 రూపాయలను X వస్తువుపై ఖర్చు చేస్తే 75 యుటిల్స్ ప్రయోజనం వస్తుంది. 5 రూపాయలను y వస్తువుపై ఖర్చు చేస్తే మొత్తం ప్రయోజనం 52 యుటిల్స్. కాని పైన పేర్కొన్న విధంగా ఖర్చు చేస్తే మొత్తం ప్రయోజనం 96 యుటిల్స్ [25 + 21 + 20 + 15 + 15 = 96]. వినియోగదారుడు ఈ విధంగా 3 యూనిట్ల xని, 2 యూనిట్ల yని కొనుగోలు చేసినప్పుడు మాత్రమే వినియోగదారునికి గరిష్ట సంతృప్తి వస్తుంది. అప్పుడే తాను ఖర్చు చేసిన చివరి రూపాయివల్ల రెండు వస్తువులకు ఒకే ప్రయోజనం ద్వారా తెలియజేయవచ్చు. వస్తుంది. మరే రకంగా ఖర్చు చేసినా ప్రయోజనం గరిష్టంగా ఉండదు. దీనిని పటము ద్వారా తెలియజేయవచ్చు.
AP Inter 1st Year Economics Study Material Chapter 2 వినియోగదారుని ప్రవర్తనా సిద్ధాంతాలు 4

పై రేఖాపటములో X – అక్షముపై ద్రవ్య పరిమాణము, Y – అక్షముపై ఒక రూపాయి వల్ల వచ్చే X, Y ల ఉపాంత ప్రయోజనం సూచించటం జరిగింది. XY రేఖ X వస్తువు ప్రయోజన రేఖ (MUC], YY రేఖ Y వస్తువు ఉపాంత ప్రయోజన రేఖ [MUC]. X వస్తువుపై 3వ రూపాయి 15 యుటిల్స్ ప్రయోజనం ఇస్తుంది. Y వస్తువుపై 2వ రూపాయి 15 యుటిల్స్ ప్రయోజనం ఇస్తుంది.

వినియోగదారుడు సమతౌల్య స్థితిని నిర్ణయించుటకు ఈ క్రింది నిబంధనను సంతృప్తిపరచవలెను.
AP Inter 1st Year Economics Study Material Chapter 2 వినియోగదారుని ప్రవర్తనా సిద్ధాంతాలు 5

AP Inter 1st Year Economics Study Material Chapter 2 వినియోగదారుని ప్రవర్తనా సిద్ధాంతాలు

ప్రశ్న 4.
ఉదాసీనత వక్రరేఖల పద్ధతి ద్వారా వినియోగదారుని సమతౌల్యాన్ని వివరించండి.
జవాబు:
ఒక వినియోగదారుని అభిరుచులు, అలవాట్లు రెండు వస్తువుల ధరలు నిలకడగా ఉండి పరిమిత ఆదాయ వనరులతో వీలైనంతగా రెండు వస్తువులను గరిష్టంగా కొనుగోలు చేయగలిగినట్లయితే వినియోగదారుడు సమతౌల్యస్థితికి చేరుకున్నాడని చెప్పవచ్చు.

ఈ క్రింది ప్రమేయాలను ఆధారంగా చేసుకొని ఉదాసీనత వక్రరేఖల సహాయంతో వినియోగదారుని సమతౌల్య స్థితిని వివరించవచ్చు.

  1. వినియోగదారుడు హేతుబద్ధంగా వ్యవహరిస్తాడు.
  2. వినియోగదారుని ద్రవ్య ఆదాయంలో ఎలాంటి మార్పులు ఉండవు.
  3. వినియోగదారుడు కొనుగోలు చేయాలనుకునే వస్తువుల ధరలు మారవు.
  4. వినియోగదారుని అభిరుచులు ఉదాసీనత వక్రరేఖలు తెలుపుతాయి.

వినియోగదారుని సమతౌల్యం: వినియోగదారు పొందగోరే వస్తు సముదాయాలు, పొందగలిగిన వస్తు సముదాయాలు సమానంగా ఉన్నప్పుడు సమతౌల్యంలో ఉంటాడు. అంటే ఉదాసీనతా వక్రరేఖ, బడ్జెట్ రేఖకు స్పర్శ రేఖగా ఉన్నప్పుడు వినియోగదారు గరిష్ట సంతృప్తిని పొందుతూ సమతౌల్యంలో ఉంటాడు. ఇలాంటి పరిస్థితులలో ఉదాసీనత వక్రరేఖ వాలు, బడ్జెట్ఖ వాలు సమానంగా ఉంటాయి. వినియోగదారుని సమతౌల్యానికి ముఖ్యమైన నిబంధన MRSxy = Px/Py

వినియోగదారు సమతౌల్యాన్ని ఈ క్రింది రేఖాపటం ద్వారా వివరించవచ్చు.
AP Inter 1st Year Economics Study Material Chapter 2 వినియోగదారుని ప్రవర్తనా సిద్ధాంతాలు 6

పై రేఖాపటంలో AB బడ్జెట్ ఖ. IC0, IC1, IC2, వివిధ ఉదాసీనత వక్రరేఖలు. IC0, రేఖ AB బడ్జెట్ రేఖను C, ఎదువుల వద్ద ఖండిస్తుంది. అందువల్ల వినియోగదారు C వద్ద లేదా D వద్ద సమతౌల్యంలో ఉండడు. AB బడ్జెట్ IC0 రేఖను ఖండిస్తుంది. అంటే ఇంకా వినియోగదారుడు అధిక సంతృప్తి స్థాయిని పొందటానికి వీలు ఉంటుంది. పొందువు వద్ద IC1, రేఖ, AB బడ్జెట్ రేఖకు స్పర్శరేఖగా ఉంది. అందువల్ల ‘E’ బిందువు వద్ద IC, రేఖవాలు, రేఖ వాలు సమానం. ఈ పరిస్థితిలో MRSxy = Px/Py. అందువల్ల వినియోగదారుడు ‘E’ బిందువు వద్ద OQ -వస్తువును, OP పరిమాణంలో ‘Y’ వస్తువును కొనుగోలు చేస్తూ IC1, పై గరిష్ట సంతృప్తిని పొందుతూ సమతౌల్యంలో డు. IC1, అతని ఆదాయం కన్నా ఎక్కువ రేఖ. అందువల్ల వినియోగదారుడు IC2 రేఖ పైననే ‘E’ బిందువు వద్ద శౌల్యంలో ఉంటాడు.

ధర లేదా బడ్జెట్ రేఖను నిర్వచించండి. బడ్జెట్ రేఖలోని కదలికలను వివరించండి. వినియోగదారుని కొనుగోలు ముఖ్యంగా రెండు అంశాలపై ఆధారపడి ఉంటుంది. అవి:

  1. వినియోగదారుని ద్రవ్య ఆదాయం
  2. కొనుగోలు చేయాలనుకుంటున్న రెండు వస్తువుల ధరలు.

ఒక వినియోగదారుడు కొనుగోలు చేసే రెండు వస్తువుల ధరలు, ఆదాయాలు స్థిరంగా ఉండి, ఏ సముదాయాలలో ఎ వస్తువులను కొనుగోలు చేయగలుగుతాడో తెలియజేసే రేఖని బడ్జెట్ రేఖ లేదా ధర రేఖ అంటారు. దీనిని ఈ ఉదాహరణ ద్వారా వివరించవచ్చు. వినియోగదారుని ఆదాయం గౌ 5/-, X, Y వస్తువుల ధరలు వరుసగా కే 10.50 పై. కుందాం. దీంతో వినియోగదారుడు కొనుగోలు చేయగలిగిన రెండు వస్తువుల వివిధ సముదాయాలు ఈ క్రింది గా ఉంటాయి.
AP Inter 1st Year Economics Study Material Chapter 2 వినియోగదారుని ప్రవర్తనా సిద్ధాంతాలు 7

వినియోగదారుడు మొత్తం ఆదాయాన్ని ‘X’ పైనే ఖర్చు చేస్తే 5X వస్తువులను మాత్రమే కొనుగోలు చేయగలుగుతాడు, స్తువులను కొనుగోలు చేయలేడు. Y వస్తువు మీద పూర్తిగా ఖర్చు చేస్తే 10 ‘Y’ లను, ‘0’ ‘X’ లను పొందగలుగుతాడు. విధంగా రెండు వస్తువుల ధరలు స్థిరంగా ఉన్నప్పుడు తాను స్థిరమైన ఆదాయంతో కొనుగోలు చేయగలిగిన రెండు వుల వివిధ సముదాయాలకు సంబంధించిన బిందువులను కలిపినట్లయితే బడ్జెట్ రేఖ వస్తుంది. ఈ రేఖ వాలు వస్తువుల ధరల నిష్పత్తిని తెలుపుతుంది. దీనిని క్రింది రేఖాపటం ద్వారా చూపించవచ్చు.
AP Inter 1st Year Economics Study Material Chapter 2 వినియోగదారుని ప్రవర్తనా సిద్ధాంతాలు 8

పై రేఖాపటంలో ‘X’ వస్తువు X అక్షంపై, ‘Y’ వస్తువు Y – అక్షంపై చూపించటం జరిగింది. PL అనేది బడ్జెట్ రేఖ. ఈ రేఖ వాలు XY వస్తువుల సాపేక్ష ధరల నిష్పత్తిని తెలియజేయును. ఏ ఆదాయ పరిమితికి లోబడి వినియోగదారుడు XY లను కొనుగోలు చేస్తున్నాడో బడ్జెట్ ఖ తెలియజేయును.

AP Inter 1st Year Economics Study Material Chapter 2 వినియోగదారుని ప్రవర్తనా సిద్ధాంతాలు

1) రెండు వస్తువుల ధరలు స్థిరంగా ఉండి, వినియోగదారుని ఆదాయం మార్పు చెందితే బడ్జెట్ రేఖ స్థితిలో మార్పు వస్తుంది. ఆదాయం పెరిగితే బడ్జెట్ రేఖ పైకి కదులుతుంది. అదే విధంగా ఆదాయం తగ్గితే, బడ్జెట్ రేఖ క్రిందికి కదులుతుంది. దీనిని క్రింది రేఖాపటం ద్వారా వివరించవచ్చు.
AP Inter 1st Year Economics Study Material Chapter 2 వినియోగదారుని ప్రవర్తనా సిద్ధాంతాలు 9

పై రేఖాపటంలో A1B1 బడ్జెట్ఖ అనుకుందాం. రెండు వస్తువుల ధరలు స్థిరంగా ఉండి ఆదాయం పెరిగితే బడ్జెట్ రేఖ A2B2 పైకి కదులుతుంది. ఆదాయం తగ్గితే బడ్జెట్ రేఖ A0B0 కిందికి కదులుతుంది.

2) ఆదాయం స్థిరంగా ఉండి X వస్తువు లేదా Y వస్తువు ధరలోగాని మార్పు వస్తే బడ్జెట్లేఖ వాలులో మార్పు వస్తుంది. దీనిని ఈ రేఖాపటాల ద్వారా వివరించవచ్చు.
AP Inter 1st Year Economics Study Material Chapter 2 వినియోగదారుని ప్రవర్తనా సిద్ధాంతాలు 10
A రేఖాపటంలో వినియోగదారుని ఆదాయం, Y వస్తువు ధర స్థిరంగా ఉండి X వస్తువు ధరలో మార్పు వస్తే బడ్జెట్ రేఖలో వచ్చే మార్పులను చూపించటం జరిగింది. X వస్తువు ధర తగ్గితే బడ్జెట్ రేఖ AB గాను, X వస్తువు ధర పెరిగితే బడ్జెట్ రేఖ AB0 గాను ఉంటుంది.

B రేఖాపటంలో వినియోగదారుని ఆదాయం, X వస్తువు ధర స్థిరంగా ఉండి, Y వస్తువు ధరలో మార్పు వస్తే బడ్జెట్ రేఖలో వచ్చే మార్పులను చూపటం జరిగింది. Y వస్తువు ధర తగ్గితే బడ్జెట్ రేఖ LP1 గాను, Y వస్తువు ధర పెరిగితే బడ్జెట్ రేఖ LP2 గాను ఉంటుంది.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
కార్డినల్, ఆర్డినల్ ప్రయోజనాలను విభేదించండి.
జవాబు:
కార్డినల్ ప్రయోజన విశ్లేషణ: 18వ శతాబ్దంలో జీవాన్స్, వాల్రాస్ మొదలగువారు ప్రయోజన విశ్లేషణను అభివృద్ధిపరిచారు. ఆ తరువాత మార్షల్, క్లార్క్ మొదలగువారు దీనిని అభివృద్ధిపరిచారు. వినియోగదారుని ప్రవర్తనను అధ్యయనం చేయటానికి కార్డినల్ ప్రయోజన విశ్లేషణను రూపొందించారు. వీరు ప్రయోజనాన్ని కొలవటానికి యుటిల్స్ అనే ఊహాత్మక కొలమానాన్ని ఉపయోగించారు. వీటి ద్వారా వివిధ వస్తువుల నుండి పొందగలిగే ప్రయోజనాన్ని కొలవవచ్చు, పోల్చవచ్చును అని నవ్య సంప్రదాయ ఆర్థికవేత్తలు భావించారు. 1, 2, 3 ……అనేవి కార్డినల్ సంఖ్యలు. ఈ విధమైన విశ్లేషణ కేవలం ఒక మానసిక భావన మాత్రమే.

ఆర్డినల్ ప్రయోజన విశ్లేషణ: జె.ఆర్. హిక్స్, అలెన్ అనే ఆర్థికవేత్తలు వినియోగదారుని ప్రవర్తనను అధ్యయనం చేయుటలో ఆర్డినల్ ప్రయోజన విశ్లేషణను రూపొందించారు. ఈ విశ్లేషణ ద్వారా ప్రయోజనాన్ని సంఖ్యా రూపంలో చెప్పటం సాధ్యం కాదు. వివిధ సముదాయాల నుంచి పొందే వివిధ సంతృప్తి స్థాయిలతో పోల్చి చెప్పడం జరుగుతుంది. అనగా ఒక వస్తు సముదాయం, మరొక వస్తు సముదాయం కంటే ఎంత ఎక్కువ లేదా ఎంత తక్కువ సంతృప్తి ఇస్తుందో చెప్పటానికి వీలు ఉన్నదనే అంశంపై ఉదాసీనత వక్రరేఖలు ప్రతిపాదించటం జరిగింది. 1వ, 2వ, 3వ ఆర్డినల్ సంఖ్యలు. వీరి ఉద్దేశ్యంలో ప్రయోజనం అనేది ఒక మానసిక భావన. దానిని కొలవలేము. కేవలం దేన్ని ఎంత కావాలో, ఎంత ఇష్టపడుతున్నారో మాత్రమే చెప్పగలం. దీనిని ఆర్డినల్ ప్రయోజనం అంటారు.

AP Inter 1st Year Economics Study Material Chapter 2 వినియోగదారుని ప్రవర్తనా సిద్ధాంతాలు

ప్రశ్న 2.
ఉదాసీనత వక్రరేఖల లక్షణాలు. [Mar. ’17, ’16, ’15]
జవాబు:
వినియోగదారుడు కొనుగోలు చేసే రెండు వస్తువుల వివిధ సమ్మేళనాలను తెలియజేసే బిందువులను కలుపగా ఏర్పడే రేఖను “ఉదాసీనత వక్రరేఖ” అని అంటారు.
లక్షణాలు / ధర్మాలు:

  1. ఉదాసీనత వక్రరేఖలు ఋణాత్మక వాలు కలిగి ఉంటాయి. అనగా ఎడమ నుండి కుడికి దిగువకు వాలుతాయి.
  2. ఉదాసీనత వక్రరేఖలు X- అక్షమునుగాని, Y – అక్షమునుగాని తాకవు.
  3. ఉదాసీనత వక్రరేఖలు పరస్పరం ఖండించుకొనవు.
  4. ఇవి మూలబిందువుకు కుంభాకారంలో ఉంటాయి. దీనికి కారణం ప్రతిస్థాపనోపాంత రేటు క్షీణించటం.
  5. ఎక్కువ స్థాయిలో ఉన్న ఉదాసీనత రేఖ ఎక్కువ సంతృప్తి, తక్కువ స్థాయిలో ఉన్న రేఖ తక్కువ సంతృప్తి స్థాయిని సూచిస్తాయి.
  6. పూర్తి ప్రత్యామ్నాయ వస్తువుల విషయంలో సరళరేఖలుగానూ, పూరక వస్తువుల విషయంలో ‘L’ ఆకారంలో ఉదాసీనత వక్రరేఖలు ఉంటాయి.

ప్రశ్న 3.
ఉపాంత ప్రత్యామ్నాయ రేటు
జవాబు:
ఉదాసీనతా వక్రరేఖ విశ్లేషణలో ప్రతిస్థాపనోపాంత రేటు అత్యంత ముఖ్యమైనది. అన్ని సముదాయాలు ఒకే స్థాయిలో సంతృప్తిని ఇవ్వడం వల్ల వినియోగదారుడు ఒక వస్తువు స్థానంలో మరొక వస్తువును ఏ రేటులో ప్రతిస్థాపన చేస్తున్నాడో దానిని ప్రతిస్థాపనోపాంత రేటు అంటారు.

ఉదా: వినియోగదారుడు X, Y వస్తువులను వినియోగిస్తాడు అనుకుందాం. ఈ రెండు వస్తువులు ఒకదానికి బదులు, మరో దానికి ప్రత్యామ్నాయం చేయటానికి వీలు ఉంటుంది. దీనిని ఈ క్రింది పట్టిక ద్వారా వివరించవచ్చు.
AP Inter 1st Year Economics Study Material Chapter 2 వినియోగదారుని ప్రవర్తనా సిద్ధాంతాలు 11

పై పట్టికలో వినియోగదారునికి అందుబాటులో ఉన్న వివిధ సముదాయాలలో A నుండి F వరకు పరిశీలించగా సముదాయం Aలో వినియోగదారునికి X తక్కువగా పొందే అవకాశం ఉంది. X పరిమాణం తక్కువగా ఉండటం వల్ల వినియోగదారుడు X కోసం Y ని వదులుకోవటానికి సిద్ధంగా ఉంటాడు. ఈ విధంగా అదనంగా 1 యూనిట్ X పరిమాణం పొందటానికి 5 యూనిట్ల Y ని వదులుకోవాలి. దీనినే ఉపాంత ప్రత్యామ్నాయ రేటు అంటారు.

ప్రశ్న 4.
ఉదాసీనత పటం
జవాబు:
వివిధ సంతృప్తి స్థాయిలను తెలిపే ఉదాసీనత వక్రరేఖల సముదాయాన్ని ఉదాసీనత పటం అందురు. ‘X’ వస్తువు, ‘Y’ వస్తువు వివిధ సముదాయాలను తెలియజేసే ఉదాసీనత రేఖల సముదాయమే ఉదాసీనత పటం. ఇందులో ఒక్కొక్క IC ఒక్కొక్క రకమైన సముదాయాన్ని తెలియజేయును.
AP Inter 1st Year Economics Study Material Chapter 2 వినియోగదారుని ప్రవర్తనా సిద్ధాంతాలు 12

AP Inter 1st Year Economics Study Material Chapter 2 వినియోగదారుని ప్రవర్తనా సిద్ధాంతాలు

పై రేఖాపటంలో ‘X’ అక్షంపై X వస్తువును, Y అక్షంపై Y వస్తువును చూపటం జరిగింది. IC,, IC2, IC3 అనేవి మూడు వేరువేరు ఉదాసీనత వక్రరేఖలు. ఈ రేఖలు వివిధ ఆదాయ స్థాయిల వద్ద పొందగలిగే సంతృప్తి స్థాయిలను తెలియజేస్తాయి. ఉదాసీనత వక్రరేఖలు కుడివైపుకు జరిగే కొద్ది సంతృప్తి స్థాయిలలో పెరుగుదల సూచిస్తుంది. IC, రేఖ, అన్ని రేఖల కంటే తక్కువ స్థాయి సంతృప్తిని తెలియజేయును.

ప్రశ్న 5.
ధర రేఖ
జవాబు:
వినియోగదారుని కొనుగోలు ముఖ్యంగా రెండు అంశాలపై ఆధారపడి ఉంటుంది. అవి:

  1. వినియోగదారుని ద్రవ్య ఆదాయం.
  2. కొనుగోలు చేయాలనుకుంటున్న రెండు వస్తువుల ధరలు.

ఒక వినియోగదారుడు కొనుగోలు చేసే రెండు వస్తువుల ధరలు, ఆదాయాలు స్థిరంగా ఉండి, ఏ సముదాయాలలో రెండు వస్తువులను కొనుగోలు చేయగలుగుతాడో తెలియజేసే రేఖని బడ్జెట్ రేఖ లేదా ధర రేఖ అంటారు. దీనిని ఈ క్రింది ఉదాహరణ ద్వారా వివరించవచ్చు. వినియోగదారుని ఆదాయం 5/-, X, Y వస్తువుల ధరలు వరుసగా * 10.50 పై. అనుకుందాం. దీంతో వినియోగదారుడు కొనుగోలు చేయగలిగిన రెండు వస్తువుల వివిధ సముదాయాలు ఈ క్రింది విధంగా ఉంటాయి.
AP Inter 1st Year Economics Study Material Chapter 2 వినియోగదారుని ప్రవర్తనా సిద్ధాంతాలు 13

వినియోగదారుడు మొత్తం ఆదాయాన్ని ‘X’ పైనే ఖర్చు చేస్తే 5X వస్తువులను మాత్రమే కొనుగోలు చేయగలుగుతాడు, Y వస్తువులను కొనుగోలు చేయలేడు. Y వస్తువు మీద పూర్తిగా ఖర్చు చేస్తే 10 Y లను, ‘0’ ‘X’ లను పొందగలుగుతాడు. ఈ విధంగా రెండు వస్తువుల ధరలు స్థిరంగా ఉన్నప్పుడు తాను స్థిరమైన ఆదాయంతో కొనుగోలు చేయగలిగిన రెండు వస్తువుల వివిధ సముదాయాలకు సంబంధించిన బిందువులను కలిపినట్లయితే బడ్జెట్ రేఖ వస్తుంది. ఈ రేఖ వాలు రెండు వస్తువుల ధరల నిష్పత్తిని తెలుపుతుంది. దీనిని క్రింది రేఖాపటం ద్వారా చూపించవచ్చు.
AP Inter 1st Year Economics Study Material Chapter 2 వినియోగదారుని ప్రవర్తనా సిద్ధాంతాలు 14

పై రేఖాపటంలో ‘X’ వస్తువు X – అక్షంపై, ‘Y’ వస్తువు Y – అక్షంపై చూపించటం జరిగింది. PL అనేది బడ్జెట్ రేఖ. ఈ రేఖ వాలు XY వస్తువుల సాపేక్ష ధరల నిష్పత్తిని తెలియజేయును. ఏ ఆదాయ పరిమితికి లోబడి వినియోగదారుడు XY లను కొనుగోలు చేస్తున్నాడో బడ్జెట్ రేఖ తెలియజేయును. వినియోగదారునికి ఈ క్రింది అవకాశాలు ఉన్నాయి.

  1. వినియోగదారుడు తన వద్దనున్న 5/- ను ‘X’ వస్తువుపై ఖర్చు చేసినట్లయితే ‘5’ X వస్తువులను మాత్రమే కొనుగోలు చేయగలడు. కాని Y వస్తువును కొనలేడు.
  2. వినియోగదారుడు తన వద్ద ఉన్న 5/- లను ‘Y’ వస్తువుపై ఖర్చు చేసినట్లయితే 10 ‘Y’ వస్తువును మాత్రమే కొనుగోలు చేయగలడు. కాని ‘X’ వస్తువును కొనలేడు.
  3. వాస్తవంగా వినియోగదారుడు రెండు వస్తువులను కోరుకుంటాడు కావున రేఖాపటంలో OPL అనేది అతనికి ఉండే అవకాశం తెలియజేయును.
  4. ‘PL’ బడ్జెట్ రేఖను దాటి వినియోగదారుడు ఒక్క వస్తువును కూడా కొనుగోలు చేయలేడు.

ప్రశ్న 6.
ఉదాసీనత వక్రరేఖల ప్రమేయాలు తెల్పండి.
జవాబు:

  1. వినియోగదారుడు హేతుబద్ధంగా వ్యవహరిస్తాడు. తన పరిమిత ఆదాయంతో గరిష్ట సంతృప్తి పొందటానికి ప్రయత్నిస్తాడు.
  2. ప్రతి వినియోగదారునికి అభిరుచి తరహా ఉంటుంది.
  3. ఉపాంత ప్రతిస్థాపన రేటు క్షీణించును.
  4. ఇది ఆర్డినల్ ప్రయోజన భావన మీద ఆధారపడి ఉంది.
  5. వినియోగదారుడు మార్కెట్ ధరతో సంబంధం లేకుండా తన అభిరుచి తరహా రూపొందించుకుంటాడు. అంటే ఒకదానికంటే మరియొకటి మెరుగైన ఎంపిక.
  6. వినియోగదారుని అభిరుచులు, ప్రవర్తన స్థిరంగా ఉంటాయి.
  7. వినియోగదారుడు వివిధ వస్తు సముదాయాల మధ్య ఉదాసీనంగా ఉంటాడు.

AP Inter 1st Year Economics Study Material Chapter 2 వినియోగదారుని ప్రవర్తనా సిద్ధాంతాలు

ప్రశ్న 7.
ఉదాసీన వక్రరేఖల విశ్లేషణ ఆవశ్యకతను వివరించండి.
జవాబు:

  1. ఇది బహుళ వస్తువుల విశ్లేషణ.
  2. ఇది ఆదాయ ప్రభావం, ధర ప్రభావం, ప్రత్యామ్నాయ ప్రభావాలని విశ్లేషించును.
  3. ఉదాసీనత వక్రరేఖ విశ్లేషణ అస్థిర వాస్తవికతను కలిగి ఉండును.
  4. ద్రవ్య ఉపాంత ప్రయోజనం స్థిరం అనే ప్రమేయం లేకపోవడం వల్ల ధరలో మార్పులను పరిగణిస్తుంది.

ప్రశ్న 8.
సమోపాంత ప్రయోజన సూత్ర పరిమితులను తెల్పండి.
జవాబు:

  1. ఈ సూత్రం మన్నిక కల్గిన వస్తువుల విషయంలో వర్తించదు.
  2. విభజించుటకు వీలుకాని వస్తువుల విషయంలో ఈ సిద్ధాంతం వర్తించదు.
  3. వినియోగదారుడు ఇష్టపడే వస్తువులను మార్కెట్లో లభ్యం కాని పరిస్థితిలో ఈ సూత్రం పనిచేయదు.
  4. వ్యక్తులు సంప్రదాయాలను నెరవేర్చటానికి వ్యయం చేస్తూ ఉంటారు.
    ఉదా: వివాహం, కర్మకాండ మొదలగునవి. అటువంటి వాటి విషయాలలో ఈ సూత్రం వర్తించదు.
  5. వినియోగదారుని ఆదాయం, వస్తువుల ధరలు స్థిరంగా ఉన్నప్పుడే ఈ సూత్రం వర్తిస్తుంది.

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
కార్డినల్ ప్రయోజనం [Mar. ’17, ’15]
జవాబు:
ఆల్ఫ్రెడ్ మార్షల్ కార్డినల్ సంఖ్యా పద్ధతి ద్వారా ప్రయోజన విశ్లేషణ చేసాడు. వివిధ వస్తువుల నుంచి పొందే ప్రయోజనాలను యుటిల్స్ అనే ఊహాత్మక యూనిట్స్ ద్వారా కొలవడానికి వీలుంది అని నవ్య సంప్రదాయ ఆర్థిక వేత్తలు భావించారు. 1, 2, 3 వంటి సంఖ్యలు కార్డినల్ సంఖ్యలు.

ప్రశ్న 2.
ఉపాంత ప్రయోజనం
జవాబు:
ఒక వినియోగదారుడు అదనంగా ఒక వస్తువు యూనిట్ని వినియోగించినప్పుడు మొత్తం ప్రయోజనంలో వచ్చే మార్పును ఉపాంత ప్రయోజనం అంటారు. దీనిని ఈ క్రింది విధంగా కొలవవచ్చు.
MU = ΔTU/ΔQ
ΔTU = మొత్తం ప్రయోజనంలో మార్పు
ΔQ = వస్తు పరిమాణంలో మార్పు.

ప్రశ్న 3.
వినియోగదారుని సమతౌల్యం
జవాబు:
సమతౌల్యం అనగా ఒక నిశ్చల స్థితి. వినియోగదారుడు తన వద్దనున్న పరిమిత ద్రవ్యంతో ఎక్కువ తృప్తిని పొందటానికి ప్రయత్నిస్తాడు. ఉపయోగించే వస్తువు ఉపాంత ప్రయోజనాలు సమానమైనప్పుడు మొత్తం ప్రయోజనం గరిష్టమవుతుంది. మొత్తం ప్రయోజనం గరిష్టమైనప్పుడు వినియోగదారుడు సమతౌల్యంలో ఉంటాడు.

AP Inter 1st Year Economics Study Material Chapter 2 వినియోగదారుని ప్రవర్తనా సిద్ధాంతాలు

ప్రశ్న 4.
బడ్జెట్ రేఖ [Mar 16]
జవాబు:
ఒక వినియోగదారుడు కొనుగోలుచేసే రెండు వస్తువుల ధరలు, ఆదాయాలు స్థిరంగా ఉండి ఏ సముదాయాలలో రెండు వస్తువులను కొనుగోలు చేయగలుగుతాడో తెలియజేసే దానిని బడ్జెట్ రేఖ లేదా ధర రేఖ అని అంటారు.

ప్రశ్న 5.
సమోపాంత ప్రయోజనం
జవాబు:
వినియోగదారుడు తన దగ్గర ఉన్న పరిమిత ద్రవ్యాన్ని వివిధ వస్తువుల మీద ఖర్చు చేసినప్పుడు ప్రతి చివరి రూపాయి నుంచి అతను పొందే ఉపాంత ప్రయోజనం సమానం అయ్యేటట్లు చూసుకోవాలి. అప్పుడు వినియోగదారుడు గరిష్ట సంతృప్తి పొందుతాడు. దీనినే సమోపాంత ప్రయోజన సూత్రం అంటారు.

ప్రశ్న 6.
ఉదాసీనత వక్రరేఖ
జవాబు:
వినియోగదారుడు కొనుగోలుచేసే రెండు వస్తువుల వివిధ సమ్మేళనాలను తెలియజేసే బిందువులను కలుపగా ఏర్పడే రేఖను “ఉదాసీనత వక్రరేఖ” అని అంటారు. దీనిని ఆర్డినల్ భావనపై ప్రతిపాదించటమైనది.

ప్రశ్న 7.
ప్రతిస్థాపనోపాంత రేటు
జవాబు:
అన్ని సముదాయాలు ఒకే స్థాయిలో సంతృప్తిని ఇవ్వటం వల్ల వినియోగదారుడు ఒక వస్తువు స్థానంలో మరొక వస్తువును ఏ రేటులో ప్రతిస్థాపన చేస్తున్నాడో దానిని ప్రతిస్థాపనోపాంత రేటు అంటారు. ఈ ప్రతిస్థాపనోపాంత రేటు ఉదాసీనత రేఖ స్వభావాన్ని, వాలును నిర్ణయించును.

అదనపు ప్రశ్నలు

ప్రశ్న 8.
ఉదాసీనత వక్రరేఖ పటం
జవాబు:
వినియోగదారుని అభిరుచి తరహాను తెలియజేసే అనేక ఉదాసీనతా వక్రరేఖల సముదాయం.
AP Inter 1st Year Economics Study Material Chapter 2 వినియోగదారుని ప్రవర్తనా సిద్ధాంతాలు 15

ప్రశ్న 9.
ఉదాసీనత పట్టిక
జవాబు:
వినియోగదారుడు ఉదాసీనంగా ఉండే వివిధ వస్తు సముదాయాలను తెలియజేయునది.

ప్రశ్న 10.
ఆర్డినల్ ప్రయోజనం
జవాబు:
హిక్స్, అలెస్ అనేవారు వినియోగదారుని ప్రవర్తనను అధ్యయనం చేయుటలో ఆర్డినల్ ప్రయోజన విశ్లేషణను సమర్థించారు. ఈ విశ్లేషణ ద్వారా ప్రయోజనాన్ని సంఖ్యారూపంలో ఖచ్చితంగా చెప్పటం సాధ్యం కాదు. అయితే వివిధ సముదాయాల నుంచి పొందే వివిధ సంతృప్తి స్థాయిలతో పోల్చి చెప్పటం జరుగుతుంది. 1, 2, 3 అనేవి ఆర్డినల్ సంఖ్యలు.

ప్రశ్న 11.
ప్రయోజనం
జవాబు:
ఒక వస్తువుకు ఉండే మానవుని కోరికను తీర్చగలిగే శక్తి. ఇది నాలుగు రకాలు.

  1. ఆకార ప్రయోజనం
  2. స్థల ప్రయోజనం
  3. కాల ప్రయోజనం
  4. సేవా ప్రయోజనం

AP Inter 1st Year Economics Study Material Chapter 2 వినియోగదారుని ప్రవర్తనా సిద్ధాంతాలు

ప్రశ్న 12.
మొత్తం ప్రయోజనం
జవాబు:
ఒక వినియోగదారుడు ఒక వస్తువును వినియోగం చేసేటప్పుడు లభించే మొత్తం తృప్తిని మొత్తం ప్రయోజనం అంటారు. ఉదా: ఒక యూనిట్ వినియోగం చేసే 20 యుటిల్స్ ప్రయోజనం వచ్చింది, రెండు యూనిట్లు ఉపయోగిస్తే, 35 యుటిల్స్ వస్తే వచ్చే మొత్తం ప్రయోజనం 55 యుటిల్స్ (1 + 2 Utils).
∴ TUx = f(Qx)

AP Inter 1st Year Economics Study Material Chapter 1 పరిచయం

Andhra Pradesh BIEAP AP Inter 1st Year Economics Study Material 1st Lesson పరిచయం Textbook Questions and Answers.

AP Inter 1st Year Economics Study Material 1st Lesson పరిచయం

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
సంపద నిర్వచనం గురించి చర్చించండి.
జవాబు:
అర్థశాస్త్రానికి సంపద నిర్వచనాన్ని ఆడమస్మిత్ అనే ఆర్థికవేత్త తెలియజేసారు. ఆడమ్స్మత్ను అర్థశాస్త్ర ” పితామహుడుగా చెప్పవచ్చు. ఇతని ఉద్దేశ్యంలో అర్థశాస్త్రం సంపదను గురించి వివరించే శాస్త్రం. ఆడమస్మిత్ తన ప్రఖ్యాతి పొందిన “రాజ్యాల సంపద” అనే గ్రంథంలో అర్థశాస్త్రాన్ని “రాజ్యాల సంపద స్వభావం, కారణాల పరిశీలన” అని నిర్వచించాడు. ఆడమస్మిత్ ఉద్దేశ్యంలో మానవుని ప్రధాన కార్యకలాపము సంపదను ఆర్జించడం. అతని అనుచరులయిన జె.బి. సే, జె. యస్, సాజ్ మొదలగువారు సంపద నిర్వచనాన్ని సమర్థించారు.

సంపద నిర్వచనములోని ప్రధానాంశాలు:
ఆడమస్మిత్ సంపద నిర్వచనంలోని ప్రధానాంశాలు క్రింది విధంగా పేర్కొన్నారు.

  1. మానవుని ఆర్థిక కార్యకలాపాల ముఖ్యోద్దేశం సంపదను ఆర్జించడం.
  2. సంపద అంటే ఉత్పత్తి చేయబడిన వస్తువులు.
  3. మానవుని స్వార్థపరమైన ఆలోచన సంపదను ఎక్కువగా ఆర్జించడం.

విమర్శ: అర్థశాస్త్రం సంపదను గురించి వివరించే శాస్త్రమనే సంకుచిత భావన వల్ల ఈ నిర్వచనం విమర్శలకు గురి అయింది.
1) కార్లెల్, రస్కిన్ అర్థశాస్త్రం నిర్వరహన్ని విమర్శించాడు. వారి ఉద్దేశ్యంలో ఈ నిర్వచనం సామాన్య మానవుని కార్యకలాపాలను గురించి అధ్యయనం చేయాలిగాని, ఆర్థిక మానవుని గురించికాదు అని విమర్శించారు. దానివల్ల వారు దీనిని “దయనీయమైన” శాస్త్రంగా వర్ణించారు.

AP Inter 1st Year Economics Study Material Chapter 1 పరిచయం

2) ఆడమస్మిత్ తన నిర్వచనంలో సంపదకు అత్యధిక ప్రాధాన్యతను ఇచ్చినాడు. కాని సంపద అనేది కేవలం మానవుని కోరికను తీర్చే ఒక సాధనం మాత్రమేనని మార్షల్ విమర్శించాడు.

3) కేవలం భౌతిక వస్తువులను మాత్రమే ఆడమ్స్మిత్ సంపదగా పరిగణించారు. అభౌతిక కార్యకలాపాలైన ఉపాధ్యాయుల, వైద్యుల సేవలను పరిగణనలోనికి తీసుకోలేదు. అందువల్ల అర్థశాస్త్ర పరిధి పరిమితమై పోతుంది.

4) సంపద నిర్వచనం కేవలం ఉత్పత్తి వైపు మాత్రమే దృష్టిని కేంద్రీకరిస్తోంది. పంపిణీని నిర్లక్ష్యం చేస్తుంది.

5) స్వార్థాన్ని పెంచును: సంపద నిర్వచనంలో సంపదకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. మానవుడు స్వార్థపరుడు, కనుక స్వప్రయోజనం కోసం పనిచేస్తాడు. స్మిత్ దృష్టిలో స్వప్రయోజనానికి, సామాజిక ప్రయోజనానికి తేడా లేదు. ఈ నిర్వచనం వల్ల ఆర్థిక వ్యక్తి ఏర్పడతాడు. ఈ ఆర్థిక వ్యక్తి పూర్తిగా స్వార్థపూరితమైనవాడు.

6) ధన దేవత ఉద్భోద (Gosfel of Mammon): ఈ నిర్వచనం సంపద సృష్టికి ప్రాధాన్యతనిస్తుంది. అందువల్ల దీనిని థామస్, కార్లెల్ “ధన దేవత”గా పేర్కొన్నారు.

7) లోపభూయిష్టమైనది: వాల్రాస్ కూడా సంపద నిర్వచనాన్ని పరిశీలించి అది లోపభూయిష్టమైనదని, అశాస్త్రీయమైనదని, అసంపూర్ణమైనదని పేర్కొనెను.

8) సంకుచితమైనది ఆడమస్మిత్ తన నిర్వచనంలో సంపదకు ప్రాధాన్యత ఇచ్చాడు. కాని సంపద మానవుని కోర్కెలను సంతృప్తిపరచటానికి ఒక సాధనంగా ఉండాలి. అనగా వ్యక్తికి ప్రాధాన్యత ఇవ్వాలి కాని, సంపదకు కాదు. ఈ విషయంలో సంపద నిర్వచనం అర్థశాస్త్రాన్ని సంకుచిత దృష్టిలో వివరించింది.

ఇన్ని లోపాలున్న కారణంగానే ఎక్కువమంది ఆర్థికవేత్తలు ఈ నిర్వచనాన్ని తిరస్కరించారు.

ప్రశ్న 2.
సంక్షేమం నిర్వచనం గురించి వివరించండి.
జవాబు:
మార్షల్ అర్థశాస్త్రాన్ని “మానవుడు అతని శ్రేయస్సు గురించి చర్చించే శాస్త్రంగా” నిర్వచించారు. ఆయన నిర్వచనంలో మానవుడికి ప్రథమ స్థానాన్ని, సంపదకు ద్వితీయ స్థానాన్ని ఇచ్చారు. మార్షల్ ఉద్దేశ్యం ప్రకారం “దైనందిన కార్యకలాపాల్లో మానవ ప్రవర్తన గురించి అధ్యయనం చేసేది రాజకీయ అర్థశాస్త్రం. శ్రేయస్సును సాధించడం కోసం వ్యక్తి, సమాజం

ప్రవర్తనను గురించి అధ్యయనం చేస్తుంది. ఈ విధంగా ఒకవైపు సంపదను గురించి అధ్యయనం చేస్తూ, మరొకవైపు అధిక ప్రాధాన్యమైన మానవుని గురించి అధ్యయనం చేస్తుంది.” మార్షల్ అనుచరులైన ఏ.సి. పిగూ, ఎడ్విన్ కానస్ వంటి వారు మార్షల్ నిర్వచనాన్ని సమర్థించారు.

ముఖ్య లక్షణాలు:

  1. సంక్షేమాన్ని పెంపొందింపజేసే మానవ కార్యకలాపాలను గురించి మాత్రమే మార్షల్ నిర్వచనం పరిగణిస్తోంది.
  2. మానవునికి, మానవ శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇస్తూ సంపద అనేది మానవ సంక్షేమాన్ని పెంపొందింపజేసే సాధనంగా పేర్కొన్నాడు.
  3. ఇది కేవలం మానవుని ఆర్థిక విషయాలనే అధ్యయనం చేస్తుంది. రాజకీయ, సామాజిక, మత సంబంధమైన విషయాలతో దీనికి సంబంధం లేదు.
  4. మానవ సంక్షేమాన్ని పెంపొందింపజేయడానికి అవసరమైన భౌతిక సంపదను సముపార్జించడంలో వ్యక్తి, సమాజం ప్రవర్తనను అధ్యయనం చేస్తుంది.

విమర్శ: మార్షల్ నిర్వచనం కూడా అనేక విమర్శలకు గురైంది. ముఖ్యంగా రాబిన్స్, మార్షల్ యొక్క “శ్రేయస్సు” అనే భావనను విమర్శించాడు.

  1. అర్థశాస్త్రం సామాజిక శాస్త్రంగాని, మానవశాస్త్రం కాదు. అర్థశాస్త్ర మౌలిక సూత్రాలు మానవులందరికి వర్తిస్తాయి. అందువల్ల అర్థశాస్త్రాన్ని మానవ శాస్త్రంగానే తప్ప సామాజిక శాస్త్రంగా పరిగణించరాదు.
  2. మార్షల్ వస్తువులను భౌతిక మరియు అభౌతికమైనవిగా విభజించడం జరిగింది. కాని, తన నిర్వచనంలో అభౌతిక వస్తువులకు ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వలేదు.
  3. శ్రేయస్సును కొలవవచ్చు అనేది తీవ్రమైన అభ్యంతరంగా రాబిన్స్ విమర్శించారు. శ్రేయస్సు అనేది వ్యక్తిని బట్టి, కాలాన్ని బట్టి మారుతుంది.
  4. మానవ శ్రేయస్సును పెంపొందించే కార్యకలాపాలను మాత్రమే మార్షల్ పరిగణించాడు. అయితే మద్యం, విషంలాంటివి కూడా శ్రేయస్సును కలుగజేస్తాయి. మార్షల్ వీటిని విస్మరించాడు.

AP Inter 1st Year Economics Study Material Chapter 1 పరిచయం

ప్రశ్న 3.
సంక్షేమ నిర్వచనం కంటే రాబిన్స్ నిర్వచనం ఏ విధంగా మెరుగైనది ?
జవాబు:
శ్రేయస్సు నిర్వచనం: ఆడమస్మిత్ నిర్వచనంలోని లోపాలను మార్షల్ సరిదిద్దడానికి ప్రయత్నించాడు. మానవుడికి సంపదను ఆర్జించటమే అంతిమ ధ్యేయం కాదని, ఒక లక్ష్యాన్ని సాధించడానికి సంపద ఒక సాధనం మాత్రమేనని అన్నాడు. ఆ ఉద్దేశ్యంతో మార్షల్ మానవునికి ప్రథమ స్థానం, సంపదకు ద్వితీయ స్థానం ఇచ్చాడు. మార్షల్ ప్రకారం అర్థశాస్త్రం అనగా ఒకవైపు సంపద గురించిన చర్చ అని అంతకంటే ముఖ్యంగా మరొకవైపు మానవుని గురించిన పరిశీలనలో ఒక భాగం. అర్థశాస్త్రాన్ని మానవుని శ్రేయస్సుపై దృష్టిని కేంద్రీకరించే శాస్త్రంగా నిర్వచించెను. మార్షల్ పాటు పిగూ, ఎడ్విన్ కానన్, బెవరిడ్జి మొదలైనవారు కూడా శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని అర్థశాస్త్రాన్ని నిర్వచించారు.

శ్రేయస్సు నిర్వచనంలోని లోపాలు:

  1. అర్థశాస్త్రం సాధారణ మానవుని దైనందిన కార్యకలాపాలను పరిశీలిస్తుంది.
  2. సంఘటిత సమాజంలోని మానవుని ఆర్థిక కార్యకలాపాలను మాత్రమే అర్థశాస్త్రం పరిశీలిస్తుంది.
  3. శ్రేయస్సుకు ప్రథమ స్థానం, సంపదకు ద్వితీయ స్థానం ఇవ్వటం జరిగింది. సంపద మానవ శ్రేయస్సుకు సాధనం మాత్రమే.
  4. భౌతిక వస్తువుల ఆర్జన వినియోగాలను మాత్రమే అర్థశాస్త్రం అధ్యయనం చేస్తుంది. ఆర్థికేతర కార్యకలాపాలను అర్థశాస్త్రం అధ్యయనం చేయదు.

కొరత నిర్వచనం: మార్షల్ నిర్వచనాన్ని విమర్శించి రాబిన్స్ అర్థశాస్త్రానికి విశ్లేషణాత్మక నిర్వచనాన్ని ఇచ్చారు. ‘యాన్ ఎస్సే ఆన్ ది నేచర్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎకనామిక్ సైన్స్’ అనే గ్రంథంలో రాబిన్స్ తన నిర్వచనాన్ని తెలియజేసెను. మానవుని అపరిమితమైన కోరికలను ప్రత్యామ్నాయ ప్రయోజనాలున్న పరిమిత సాధనాలకు ఉండే సంబంధం పట్ల మానవ ప్రవర్తన అధ్యయనమే అర్థశాస్త్రం” అని నిర్వచించెను. ఈ నిర్వచనంలో మానవ జీవితానికి సంబంధించిన కొన్ని నిత్య సత్యాలు ఉన్నాయి.

1) అపరిమిత కోరికలు: మానవుని కోరికలు అపరిమితం. ఒక కోరిక తీరగానే మరొక కోరిక ఉద్భవిస్తుంది. వాటిని తీర్చుకోవడానికి మానవుడు నిరంతరం కృషి జరపటం వల్ల ఆర్ధిక కార్యకలాపాలు కొనసాగుతాయి.

2) వనరులు పరిమితం: మానవుని కోర్కెలు సంతృప్తిపరిచే సాధనాలు లేదా వనరులు పరిమితమైనవి. సాధనాలు పరిమితంగా ఉండటం వల్ల కొరత మరియు ఆర్థిక సమస్యలు ఉత్పన్నమౌతున్నాయి.

3) ప్రత్యామ్నాయ ప్రయోజనాలు: వనరులు పరిమితంగా ఉండటమే కాకుండా వాటికి ప్రత్యామ్నాయ ప్రయోజనాలు ఉన్నాయి. అనగా ఒక సాధనానికి అనేక ఉపయోగాలు ఉంటాయి.

4) ఎంపిక: సాధనాల కొరత, అపరిమితమైన కోరికల వల్ల ఎంపిక అంశం అతి ముఖ్యమైనదిగా ఉంటుంది. సాధనాల కేటాయింపులోను, కోరికల ప్రాధాన్యతను అనుసరించి సంతృప్తిపరిచే విషయంలోను ఎంపిక సమస్య ఉత్పన్నమవుతుంది.

రాబిన్స్ నిర్వచనం మార్షల్ నిర్వచనం కంటే శాస్త్రీయమైనది:
1) కార్యకలాపాలను విభజించలేదు మార్షల్ అర్థశాస్త్రంలో భౌతిక అంశాలను గూర్చి మాత్రమే వివరించాడు. కాని రాబిన్స్ భౌతిక, అభౌతిక అంశాలను రెండింటిని గూర్చి అర్థశాస్త్రంలో చర్చించాడు.

AP Inter 1st Year Economics Study Material Chapter 1 పరిచయం

2) శ్రేయస్సును విమర్శించుట మార్షల్ శ్రేయస్సు అనే పదానికి, అర్థశాస్త్రానికి ముడిపెట్టాడు. కాని రాబిన్స్ ప్రకారం, అర్థశాస్త్రానికి శ్రేయస్సుతో ఏ మాత్రం సంబంధం లేదు. కారణం అర్థశాస్త్రంలో శ్రేయస్సుకు దోహదపడని వస్తువులు ఉదాహరణకి మత్తు పానీయాలు, సిగరెట్లు, విషం మొదలగు వాటిని గూర్చి కూడా చర్చిస్తాం.

3) లక్ష్యాల మధ్య తటస్థంగా ఉండుట: రాబిన్స్ ప్రకారం అర్థశాస్త్రం లక్ష్యాల మధ్య తటస్థంగా ఉంటుంది. ఏది మంచి, ఏది చెడు అనే నిర్ణయాలను చేయదు. అందువల్ల ఇది వాస్తవిక శాస్త్రం.

4) శాస్త్రీయమైనది: రాబిన్స్ నిర్వచనం వల్ల ఆర్థిక సమస్య ఏ విధంగా ఏర్పడుతుందో తెలుసుకోవడానికి వీలైనది. రాబిన్స్ అర్థశాస్త్రాన్ని శాస్త్రీయ స్థాయికి చేర్చి, ఎంపిక శాస్త్రంగా మలిచాడు.

5) పరిధిని విస్తృతపరిచింది: ఈ నిర్వచనం అన్ని రకాల ఆర్థిక వ్యవస్థలకు వర్తిస్తుంది. “వనరుల కొరత” అనేది ఒక సార్వత్రిక సమస్య. కనుక ఈ నిర్వచనం వల్ల అర్థశాస్త్ర పరిధి కూడా విస్తరించింది.
రాబిన్స్ నిర్వచనం మార్షల్ నిర్వచనం కంటే మెరుగైనప్పటికి కొన్ని విమర్శలకు గురైనది.

విమర్శ:
1) ఈ నిర్వచనం కొరతగా ఉన్న వనరులను ఉపయోగించి గరిష్ట స్థాయిలో కోరికలను ఏ విధంగా సంతృప్తి పరుచుకోవాలో అనే విషయం మీద దృష్టి సారించలేదు. విమర్శకుల అభిప్రాయం ప్రకారం ఈ నిర్వచనంలో శ్రేయస్సు అనే భావన అంతర్గతంగా ఇమిడి ఉంది.

2) రాబిన్స్ నిర్వచనానికి మరొక విమర్శ, ఇది మారుతున్న సమాజానికి వర్తించదు. కాలం మారుతున్న కొద్ది అనేక మార్పులు వస్తాయి. కాబట్టి వనరుల కొరత అనే సమస్యను అధిగమించవచ్చు.

3) ఆధునిక అర్థశాస్త్రంలో చాలా ముఖ్యమైన జాతీయ ఆదాయం, ఉద్యోగిత వంటి స్థూల ఆర్థిక విశ్లేషణను రాబిన్స్ నిర్వచనం విస్మరించింది.

4) ఆర్థిక వృద్ధి, ఆర్థికాభివృద్ధి వంటి ఆధునిక అర్థశాస్త్రానికి సంబంధించిన ముఖ్యాంశాలను కొరత నిర్వచనంలో చర్చించలేదు.

5) శ్రీమతి జాన్ రాబిన్సన్ ఈ నిర్వచనాన్ని విమర్శించారు. ఆర్థిక వ్యవస్థలో ఉపయోగించని వనరులు ఎక్కువగా ఉన్నప్పుడు ముఖ్య సమస్య వనరుల కొరత మాత్రమే కాదని, ఉన్న వనరులను ఏ విధంగా ఉపయోగించుకోవాలనేదే ముఖ్యమని ఆమె అభిప్రాయము.

ప్రశ్న 4.
ఆచార్య సామ్యూల్సన్ వృద్ధి నిర్వచనాన్ని తెలియజేయండి.
జవాబు:
రాబిన్స్, నిర్వచనంలో నిశ్చల దృక్పధం ఉన్నదని, కాలానుగుణంగా కోరికలు, లక్ష్యాలు, వనరులు, ఎంపికలు మారుతూ ఉంటాయని సామ్యూల్సన్ అభిప్రాయం. అందువల్ల రాబిన్స్ నిర్వచనంలో ఇమిడి ఉన్న నిశ్చలత్వాన్ని తొలగించి చలనత్వాన్ని కల్పిస్తూ సామ్యూల్సన్ కొత్త నిర్వచనం ఇచ్చాడు.

నిర్వచనం: “ప్రత్యామ్నాయ ప్రయోజనాలున్న పరిమితమైన ఉత్పాదక వనరులను ప్రజలు, సమాజం ద్రవ్యంతోగాని, ద్రవ్యం లేకుండాగాని ఎంపిక చేసుకొని ఉపయోగించుకోవడం ద్వారా వస్తూత్పత్తి చేపట్టి దానిని సమాజంలోని వివిధ వర్గాల ప్రజల మధ్య వర్తమాన లేదా భవిష్యత్కాలంలో ఏ విధంగా పంపిణీ చేసుకోవడం జరుగుతుందనే విషయ పరిశీలనే అర్థశాస్త్రము.”

AP Inter 1st Year Economics Study Material Chapter 1 పరిచయం

నిర్వచనంలోని ముఖ్యాంశాలు:
1) వనరుల కొరత: రాబిన్స్ నిర్వచనంలో వలెనే సామ్యూల్సన్ కూడా వనరుల కొరత, అపరిమితమైన కోరికలు, ప్రత్యామ్నాయ ప్రయోజనాలున్న వనరులు అనే వాటినే బలపరచాడు.

2) ఆర్థిక వృద్ధి: సామ్యూల్సన్ తన నిర్వచనంలో ఆర్థికవృద్ధికి ప్రాధాన్యతయిచ్చాడు. కాలానుగుణంగా వివిధ వస్తువులను ఉత్పత్తి చేయడం, వస్తువులను వర్తమాన, భవిష్యత్కాలంలో పంపిణీ చేయడం అనే పదాలు కాల ప్రాముఖ్యాన్ని తెలుపుతాయి. ఆర్థిక వృద్ధి ప్రాముఖ్యాన్ని తెలియజేసే ప్రస్తుత వినియోగము, భవిష్యత్ వినియోగము కూడా ప్రాధాన్యతను కలిగి ఉన్నాయి.

3) చలన స్వభావం: సామ్యూల్సన్ నిర్వచనం చలనత్వం కలిగి ఉండటమే కాక విస్తృత పరిధి కలిగి ఉంది. ఎంపిక సమస్య ద్రవ్య ఆర్థిక వ్యవస్థలోనే కాకుండా వస్తుమార్పిడి సమస్యలో కూడా ఉంది.

4) ఎంపిక సమస్య: ఎంపిక సమస్య సామ్యూల్సన్ చలన దృష్టిలో పరిగణిస్తాడు. ఎంపిక వర్తమానానికే కాకుండా భవిష్యత్కాలానికి కూడా సంబంధించినది. మానవుని కోరికలు స్థిరంగా ఉండవు. అవి కాలంతోపాటు పెరుగుతూ, మారుతూ ఉంటాయి. ఈ మార్పులకు అనుగుణంగా వనరులను పెంచాలి, మార్పులను తీసుకొని రావాలి. కనుక అర్థశాస్త్రానికి చలనత్వ స్వభావం ఉంటుంది.

కనుక ఈ నిర్వచనం అధిక ప్రజాదరణ పొందింది. మిగిలిన నిర్వచనాల కంటే ఈ నిర్వచనం సమగ్రమైనది. 5. ‘సూక్ష్మ’, ‘స్థూల’ అర్థశాస్త్రాల మధ్య తేడాలను తెలియజేయండి.
జవాబు: ఆర్థిక సమస్యల విశ్లేషణకు ఆధునిక ఆర్థికవేత్తలు రెండు మార్గాలను అవలంబించారు. అవి:

  1. సూక్ష్మ అర్థశాస్త్రం
  2. స్థూల అర్థశాస్త్రం

రాగ్నార్ష్ మొదటిసారిగా 1933లో సూక్ష్మ, స్థూల అనే పదాలను అర్థశాస్త్రములో ప్రవేశపెట్టారు.
1. సూక్ష్మ అర్థశాస్త్రం: సూక్ష్మ అర్థశాస్త్రం అనేది ‘Micros’ అనే గ్రీకు పదం నుండి పుట్టింది. ‘Micro’ అంటే చిన్న అని అర్థం. సూక్ష్మ అర్థశాస్త్రం ఒక వైయుక్తిక ఆర్థిక యూనిట్ను పరిగణనలోనికి తీసుకొని దాని ప్రవర్తనను సమగ్రంగా అధ్యయనం చేస్తుంది. సూక్ష్మ అర్థశాస్త్రము ఆర్థిక వ్యవస్థలోని చిన్న చిన్న భాగాలను గూర్చి అధ్యయనం చేస్తుంది. వైయుక్తిక యూనిట్లను గూర్చి వివరంగా పరిశీలిస్తుంది. ఇవి జాతీయ ఆర్థిక వ్యవస్థలో చిన్న చిన్న భాగాలు లేదా వైయుక్తిక యూనిట్లు మాత్రమే. ఒక వినియోగదారుడు తన ప్రయోజనాన్ని ఏ విధంగా గరిష్టం చేసుకుంటాడో, ఒక సంస్థ గరిష్ట లాభాలను ఏ విధంగా పొందుతుందో సూక్ష్మ అర్థశాస్త్రము మనకు తెలుపుతుంది. వస్తువుల ఉత్పత్తి కారకాల ధరలు ఏ విధంగా నిర్ణయించబడతాయో సూక్ష్మ అర్థశాస్త్రము పరిశీలిస్తుంది. అందువలననే దీనిని ధరల సిద్ధాంతము అని కూడా పిలుస్తారు.

AP Inter 1st Year Economics Study Material Chapter 1 పరిచయం

2. స్థూల అర్థశాస్త్రం: స్థూల అర్థశాస్త్రం అనేది ‘Macros’ అనే గ్రీకు పదం నుండి వచ్చింది. ‘Macros’ అంటే పెద్ద అని అర్థం. స్థూల అర్థశాస్త్రం మొత్తం ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన అంశాలను అధ్యయనం చేస్తుంది. జాతీయాదాయం, మొత్తం వినియోగం, మొత్తం పొదుపు, మొత్తం ఉద్యోగిత మొదలైన సమిష్టి అంశాలను స్థూల అర్థశాస్త్రం అధ్యయనం చేస్తుంది..

J.M. కీన్స్ స్థూల అర్థశాస్త్రానికి ఎక్కువ ప్రాచుర్యాన్ని కల్పించారు. ఆర్థికమాంద్యం కాలంలో ఆయన రాసిన | పుస్తకం ఉద్యోగిత, వడ్డీ, ద్రవ్య సాధారణ సిద్ధాంతం ప్రచురణ తరువాత స్థూల ఆర్థిక సిద్ధాంతానికి ఎక్కువ ప్రాచుర్యం లభించింది.

స్థూల అర్థశాస్త్రాన్ని “ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతం” అని కూడా అంటారు. ఎందుకంటే ముఖ్యంగా ఆదాయం, ఉత్పత్తి, ఉద్యోగితా సిద్ధాంతాలను పరిగణనలోకి తీసుకొని వివరిస్తుంది.

సూక్ష్మ, స్థూల అర్థశాస్త్రాల మధ్య తేడాలు:
సూక్ష్మ అర్థశాస్త్రం

  1. సూక్ష్మ అర్థశాస్త్రం అనేది Micros అనే గ్రీకు పదం నుంచి ఉద్భవించింది. Micro అనగా చిన్న అని అర్థం.
  2. ఆర్థిక వ్యవస్థలో వ్యక్తిగత భాగాలను గురించి అధ్యయనం చేస్తుంది.
  3. దీనిని ధరల సిద్ధాంతం అని కూడా అంటారు.
  4. వస్తు, కారకాల మార్కెట్ ధర నిర్ణయం గురించి వివరిస్తుంది.
  5. డిమాండ్, సప్లయ్పై ఆధారపడి ధరల యంత్రాంగం ఉంటుంది.

స్థూల అర్థశాస్త్రం

  1. స్థూల అర్థశాస్త్రం అనేది Macros అనే గ్రీకు పదం నుంచి జనించింది. Macro అనగా పెద్ద అని అర్థం.
  2. ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని అధ్యయనం చేస్తుంది.
  3. ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతం అని కూడా అంటారు.
  4. జాతీయాదాయం, సమిష్టి ఉద్యోగిత, సమిష్టి పొదుపు, పెట్టుబడి సాధారణ ధరలస్థాయి, ఆర్థికాభివృద్ధి మొదలైన అంశాలను చర్చిస్తుంది.
  5. సమిష్టి డిమాండ్, సమిష్టి సప్లయ్ ప్రాతిపదికగా ఉంటుంది.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ఉచిత వస్తువులు, ఆర్థిక వస్తువుల మధ్య తేడాలు.
జవాబు:
మానవుని కోర్కెలను సంతృప్తిపరచగలిగే ఏ పదార్థాన్నైనా అర్థశాస్త్రంలో “వస్తువు” అంటారు. వస్తువులు ప్రాథమికంగా రెండు రకములు. అవి: 1) ఉచిత వస్తువులు 2) ఆర్థిక వస్తువులు
1. ఉచిత వస్తువులు: డిమాండ్ కంటే సప్లై శాశ్వతంగా ఎక్కువగా ఉండి, ధరలేని వస్తువులను ఉచిత వస్తువులంటారు. ఇవి మానవ నిర్మితాలు కాదు, ప్రకృతి ప్రసాదించినవి. వీటికి ఉపయోగిత విలువ మాత్రమే ఉంటుంది. ఉదా: గాలి, నీరు.

2. ఆర్థిక వస్తువులు: డిమాండ్ కంటే సప్లై తక్కువగా అనగా కొరతగా ఉండి ధర కలిగిన వస్తువులను ఆర్థిక వస్తువులు అంటారు. ఇవి మానవ నిర్మితాలు. వీటికి ఉత్పత్తి వ్యయం ఉంటుంది. వీటికి ఉపయోగిత విలువ, వినిమయ విలువలు ఉంటాయి.
ఉదా: ఆహారము, వస్త్రాలు, యంత్రాలు మొదలైనవి. ఇవి ఉచితంగా అనుభవించడానికి వీలుండదు.

1. ఉచిత వస్తువులు, ఆర్థిక వస్తువుల మధ్య తేడాలు.
ఉచిత వస్తువులు

  1. ఇవి ప్రకృతి బహుకరించినవి.
  2. వీటి సప్లై సమృద్ధిగా ఉంటుంది.
  3. వీటికి ధర ఉండదు.
  4. వీటికి ఉత్పత్తి వ్యయం ఉండదు.
  5. ఉపయోగిత విలువ ఉంటుంది.
  6. ఇవి జాతీయాదాయంలో చేర్చబడవు.

ఆర్థిక వస్తువులు

  1. ఇవి మానవుడిచే తయారుచేయబడినవి..
  2. డిమాండ్ కంటే సప్లై ఎప్పుడు తక్కువగా ఉంటుంది.
  3. వీటికి ధర ఉంటుంది.
  4. వీటికి ఉత్పత్తి వ్యయం ఉంటుంది.
  5. ఉపయోగిత విలువ, వినిమయ విలువ రెండూ ఉంటాయి.
  6. ఇవి జాతీయాదాయంలో చేర్చబడతాయి.

AP Inter 1st Year Economics Study Material Chapter 1 పరిచయం

ప్రశ్న 2.
కోరికల లక్షణాలు. [Mar. ’17, ‚ ’16, ’15]
జవాబు:
మానవుని కోరికలు, ఆర్థిక కార్యకలాపాలు పురోగతికి దోహదం చేస్తాయి. కోరికలు లేనిదే వినియోగం ఉండదు. ఉత్పత్తి ఉండదు, పంపిణి ఉండదు, వినిమయం ఉండదు..
కోరికలు లక్షణాలు:
1. కోరికలు అనంతాలు: మానవుల కోరికలకు ఒక పరిమితి అంటూ ఉండదు. ఒక కోరిక తీరగానే మరొక కోరిక పుట్టుకొస్తుంది. ఇవి వ్యక్తులనుబట్టి, కాలాన్నిబట్టి, నివసించే ప్రదేశాన్నిబట్టి మారుతూ ఉంటాయి.

2. ఒక కోరికను పూర్తిగా తృప్తిపరచగలగటం: మానవుడు తన కోరికలన్నింటిని పూర్తిగా సంతృప్తిపరచడం సాధ్యం కానప్పటికీ, ఒక కోరికను పూర్తిగా తృప్తి పరచటం సాధ్యమవుతుంది.
ఉదా: ఆకలిగా ఉన్న వ్యక్తి ఆహారాన్ని తీసుకోవడం ద్వారా ఆకలిని పూర్తిగా తీర్చుకోవచ్చు. అదే విధంగా ఒక కారును కొనుగోలు చేయడం ద్వారా, కారు కావాలనే కోరికను సంతృప్తిపరచవచ్చు.

3. కోరికలు పరస్పరం పోటీపడడం: కోరికలు అపరిమితంగా ఉంటాయి. కాని వాటిని తీర్చుకొనే సాధనాలు మాత్రం పరిమితంగా ఉంటాయి. అందువల్ల కోరికలను సంతృప్తిపరచుకునే ప్రాధాన్యత క్రియవలె అది పరస్పరం పోటీపడతాయి.

4. కోరికలు – పూరకాలు: ఒక కోరికను సంతృప్తిపరచుకోవడానికి అనేక వస్తువులు అవసరమవుతాయి. ఉదా: ఏదైనా మనం రాయాలి అనుకున్నప్పుడు పెన్ను, కాగితం, ఇంకు ఉన్నప్పుడే ఆ కోరిక తీరుతుంది.

5. ప్రత్యామ్నాయాలైన కోరికలు: ఒక కోరికను అనేక రకాలుగా తృప్తిపరచుకోవచ్చు.
ఉదా: ఆకలిగా ఉన్నప్పుడు భోజనం లేదా బ్రెడ్ లేదా పాలు, పండ్లు తీసుకోవడం ద్వారా ఈ కోరికను తృప్తిపరచుకోవచ్చు.

6. పునరావృత్తం: అనేక కోరికలు, ఒక సమయంలో వాటిని తృప్తిపరచినప్పుడు మళ్ళీ, మళ్ళీ పుట్టుకొస్తాయి. సాధారణంగా ఇవి కనీస అవసరాలైనా ఆహారం, నిద్ర మొదలైన కోరికల విషయంలో గమనించవచ్చు.

7. కోరికలు అలవాటుగా మారడం: ఒక కోరికను క్రమం తప్పకుండా సంతృప్తిపరచినప్పుడు అది అలవాటుగా మారుతుంది. ఈ అలవాటును మార్చుకోవడం తొందరగా సాధ్యం కాదు.

8. కోరికల ప్రాముఖ్యంలో తేడా: అన్ని కోరికల తీవ్రత ఒకే విధంగా ఉండదు. కొన్ని కోరికలను వాటి ప్రాముఖ్యతను బట్టి వెంటనే తీర్చుకోవాలని ఉంటుంది. మరికొన్నింటిని వాయిదా వేయడానికి అవకాశం ఉంటుంది.

ప్రశ్న 3.
ప్రయోజన రకాలు [Mar. ’15]
జవాబు:
మానవుల కోరికలను సంతృప్తిపరచగలిగే వస్తుసేవల శక్తిని ప్రయోజనం అంటారు. అర్థశాస్త్రంలో ప్రయోజనం అనే భావనకు చాలా ప్రాధాన్యత ఉంది.
ప్రయోజనం – రకాలు:
1. రూప ప్రయోజనం: ఒక వస్తువు ఆకారం, రంగు, పరిమాణం మొదలైనవి మార్చడం ద్వారా ఆ వస్తువుకు మానవుని కోరికను తీర్చగలిగే శక్తి పెరిగినట్లయితే దానిని రూప ప్రయోజనం అంటారు.

2. స్థల ప్రయోజనం: స్థలాన్ని మార్చడం ద్వారా కొన్ని వస్తువులకు అదనపు ప్రయోజనం చేకూరుతుంది. వస్తువులను ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి మార్చడం వల్ల ఆ వస్తువుకు స్థల ప్రయోజనం చేకూరుతుంది. ఉదా: సముద్రతీరంలో ఇసుకకు ప్రయోజనం ఉండదు. దీనిని బయటకు తీసి మార్కెట్లకు రవాణా చేయడం వల్ల స్థల ప్రయోజనం చేకూరుతుంది.

AP Inter 1st Year Economics Study Material Chapter 1 పరిచయం

3. కాల ప్రయోజనం: కాలాన్ని బట్టి కూడా వస్తువులకు ప్రయోజనం చేకూరుతుంది.
ఉదా: పంట చేతికి వచ్చిన కాలంలో ఆహార ధాన్యాలు ఎక్కువ మొత్తంలో అందుబాటులో ఉంటాయి. వ్యాపారస్తులు వీటిని నిలువచేసి, కొంతకాలం తరువాత ఈ వస్తువులను మార్కెట్లలో అమ్ముతారు. ఈ విధంగా వస్తువులను నిలవ చేయడం ద్వారా వ్యాపారస్తులు పొందే అదనపు ప్రయోజనాన్నే కాల ప్రయోజనంగా చెప్పవచ్చు.

4. సేవల ప్రయోజనం: సేవకు కూడా మానవుని కోరికలను తీర్చగలిగే శక్తి ఉంటుంది.
ఉదా: టీచర్లు, లాయర్లు, డాక్టర్లు సేవలు మొదలైన సేవలు కూడా మానవులు కోరికలను ప్రత్యక్షంగా తీర్చగలుగుతారు. అందువల్ల వీటిని సేవ ప్రయోజనాలుగా చెప్పవచ్చు.

ప్రశ్న 4.
జేకబ్ వైనర్ నిర్వచనం [Mar. ’17, ’16]
జవాబు:
అవసరాల ప్రాముఖ్యాన్ని లేదా ఆర్థిక కార్యకలాపాల ప్రాముఖ్యాన్ని ఆధారంగా చేసుకొని వ్యక్తులుగాని, సంస్థలుగాని, ప్రభుత్వన్యాయంగాని, ఆర్థిక వ్యవస్థగాని కొరతగా ఉండి ప్రత్యామ్నాయ ప్రయోజనాలున్న వనరులను పొదుపు లేదా ఆదా చేయటం ద్వారా అపరిమితమైన కోర్కెలను సంతృప్తిపరచటానికి ఎట్లా ఉపయోగించాలి అనేదే ఆర్థిక సమస్య. ఆర్థికవేత్తలు లేవనెత్తిన ప్రశ్నలను, వివిధ అంశాలను విశ్లేషణ చేయటం ద్వారా అర్థశాస్త్రాన్ని మెరుగైన విధంగా అధ్యయనం చేయటానికి వీలుంటుందని వీరి అభిప్రాయం. ఈ అభిప్రాయాలను సమర్థిస్తూ జేకబ్ వైనర్ ఈ నిర్వచనాన్ని ఇచ్చారు. జేకబ్ వైనర్ ఉద్దేశ్యం ప్రకారం “ఆర్థికవేత్తలు ప్రతిపాదించేది అర్థశాస్త్రం”.
లక్షణాలు ఏవైనా వివిధ ఆర్థిక వ్యవస్థల్లో ఆర్థికవేత్తలు కొన్ని మౌలికమైన సమస్యలను గురించి ఆందోళన కలిగి ఉంటారు.

  1. ఏ రకమైన వస్తువులను ఎంత పరిమాణంలో ఉత్పత్తి చేయాలి ?
  2. వస్తువులను ఏ విధంగా ఉత్పత్తి చేయాలి ?
  3. వస్తుసేవలను ఎవరి కోసం ఉత్పత్తి చేయాలి ?
  4. ఉత్పాదక వనరులను సమర్థవంతంగా ఎలా ఉపయోగించాలి ?
  5. అందుబాటులో ఉన్న వనరులన్ని ఉపయోగించబడుతున్నాయా ?
  6. ఒక కాలవ్యవధిలో ఆర్థిక వ్యవస్థ వృద్ధిచెందుతుందా లేదా స్థిరంగా ఉందా ?

ప్రశ్న 5.
వివిధ ఆర్థిక విచారణలను గురించి వివరించండి.
జవాబు:
ఆర్థిక సూత్రాలు, సిద్ధాంతాలు రూపొందించడంలో ఒక నిర్థిష్టమైన పద్ధతి అవలంబించబడుతుంది. పీటర్సన్ అభిప్రాయంలో “ఆర్థిక సూత్రాలను నిర్మించడంలో పరిశీలించడంలో ఉపయోగించే పద్ధతులు, మౌలికాల ప్రక్రియను పద్ధతి (Method) అని అంటారు. ఆర్థిక సంబంధమైన విచారణ చేయడానికి ఆర్థికవేత్తలు సాధారణంగా రెండు రకాలైన పద్ధతులను అవలంబిస్తారు.

  1. నిగమన పద్ధతి
  2. ఆగమన పద్ధతి

1. నిగమన పద్ధతి: సాంప్రదాయ ఆర్థికవేత్తలు ఈ పద్ధతిని ఎక్కువగా ఉపయోగించారు. దీనిని ‘పరికల్పన’ | (Hypothetical) లేదా అనిర్థిష్టక (Abstract) పద్ధతి అని కూడా అంటారు. ఇది వాస్తవాలపై కాకుండా ఒక మానసిక అభ్యాసం, తర్కం మీద ఆధారపడి ఉంటుంది. ఒక తరం నుంచి మరొక తరానికి కొన్ని నిర్థిష్టమైన ప్రమాణాలు అంగీకరించబడ్డ సూత్రాలు లేదా వాస్తవాల నుంచి తర్కం ద్వారా ఆర్థిక సిద్ధాంతాలను రూపొందించడం జరుగుతుంది. ఇందులో సాధారణ విషయాల నుంచి ఒక నిర్ధిష్ట విషయాన్ని రాబట్టడం జరుగుతుంది.

AP Inter 1st Year Economics Study Material Chapter 1 పరిచయం

ఉదా: హేతుబద్ధంగా ఆలోచిస్తే ఒక వ్యక్తి సాధారణంగా తక్కువ ధర గల వస్తువుని కొంటాడు. ఎక్కువ ధరగల వస్తువును విక్రయిస్తాడు. అయితే మార్కెట్ను గురించి సరైన పరిజ్ఞానం కలిగి ఉండాలి. నిగమన పద్ధతిలో నిర్ణయాలు చేసేటప్పుడు నాలుగు దశలు ఉంటాయి.

  1. ఒక సమస్యను ఎన్నుకోవడం
  2. ప్రమేయాలను రూపొందించడం
  3. ఒక పరికల్పనను రూపొందించడం (Hypothesis)
  4. పరికల్పన ప్రతిపాదనను పరిశీలించడం

క్షీణోపాంత ప్రయోజన సూత్రం నిగమన పద్ధతికి ఒక ఉదాహరణ.

2. ఆగమన పద్ధతి: దీనిని చారిత్రక లేదా గుణాత్మక లేదా అనుభవిక, వాస్తవ, నిర్థిష్ట పద్ధతి అని పిలుస్తారు. జర్మనీ ఆర్థికవేత్తలు దీనిని అభివృద్ధి పరిచారు. ఇది ఒక నిర్దిష్ట లేదా ప్రత్యేక అంశం నుంచి విశ్వజనీనతకు పయనిస్తుంది. ” ఇందులో వాస్తవాల వివరాల సేకరణ చేసి సమకూర్చి నేల నిర్ణయాలు చేయబడతాయి. ఉదా: మార్థస్ సిద్ధాంతం.
ఈ పద్ధతిలో నాలుగు దశలు ఉంటాయి.

  1. సమస్యను ఎన్నుకోవడం
  2. దత్తాంశాన్ని సేకరించడం
  3. పరిశీలించడం
  4. సాధారణీకరించటం

విషయాలను ఉన్నవి ఉన్నట్టుగానే వివరించడం వల్ల ఈ పద్ధతి దిగా భావించబడుతుంది.

ప్రశ్న 6.
స్థూల అర్థశాస్త్రానికి అర్థాన్ని తెలిపి, దాని పరిధి, ప్రాధాన్యతను వివరించండి ?
జవాబు:
అర్థశాస్త్రాన్ని సూక్ష్మ అర్థశాస్త్రం, స్థూల అర్థశాస్త్రమని రెండు విధాలుగా రాగ్నా 1933 సం॥లో విభజించారు. అప్పటి నుండి ఈ విభజన ప్రచారంలోకి వచ్చింది.

స్థూల అర్థశాస్త్రం వైయుక్తిక యూనిట్లను కాకుండా మొత్తం లేదా సమిష్టి యూనిట్లను మొత్తంగా పరిశీలిస్తుంది. యూనిట్ల మొత్తాన్ని స్పష్టంగా నిర్వచించి వాటి మధ్య ఉండే పరస్పర సంబంధాలను పరిశీలించడం ఈ విశ్లేషణ ముఖ్యోద్దేశము. గార్డెనర్ ఆక్లే ప్రకారం స్థూల అర్థశాస్త్రం ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన మొత్తం ఉత్పత్తి వనరుల నియామకం, జాతీయాదాయ పరిమాణం, సాధారణ ధరల స్థాయి మొదలైన వాటిని పరిశీలిస్తుంది. స్థూల అర్థశాస్త్రాన్ని ” ఆదాయ ఉద్యోగితా సిద్ధాంతము” అని కూడా ఆన్స్ ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు.

స్థూల అర్థశాస్త్ర పరిధి:
AP Inter 1st Year Economics Study Material Chapter 1 పరిచయం 1

స్థూల అర్థశాస్త్రం – ప్రాధాన్యత:

  1. ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నుల పరిశీలనకు తోడ్పడుతుంది. ఆర్థిక సమస్యలకు మూలకారణాలను కనుగొని, వాటి పరిష్కారానికి మార్గాలను సూచిస్తుంది.
  2. జాతీయోత్పత్తి స్థాయి, దాని కూర్పులను గురించి తెలుపుతుంది. తలసరి ఆదాయాలు, జీవన ప్రమాణాలు మొదలైన వాటిని విశ్లేషిస్తుంది.
  3. ఆర్థికవ్యవస్థ వృద్ధి, స్థిరత్వాల చర్చలకు తోడ్పడుతుంది. వ్యాపార చక్రాల విశ్లేషణకు సహకరిస్తుంది.
  4. పేదరికం, నిరుద్యోగితలకు కారణాలను కనుగొని వాటి పరిష్కారానికి తోడ్పడే ఆర్థికాభివృద్ధి విధానాల రూపకల్పనలో సహాయపడుతుంది.
  5. ఆర్థిక వ్యవస్థలో పొదుపు, పెట్టుబడుల ప్రాధాన్యాన్ని వివరిస్తుంది.
  6. ద్రవ్యోల్బణం, ఆర్థిక మాంద్యం కారణాలను స్పష్ట పరచటానికి సహాయపడుతుంది. అంతర్జాతీయ, జాతీయ సమస్యల పరిష్కారానికి ఈ శాస్త్రం తోడ్పడుతుంది.
  7. ఆర్థిక విధానాల కల్పనకు, ఆచరణకు ఉపయోగపడుతుంది.

ప్రశ్న 7.
సూక్ష్మ అర్థశాస్త్రం అంటే ఏమిటి ? దాని పరిధి, ప్రాధాన్యాన్ని వివరించండి.
జవాబు:
అర్థశాస్త్రాన్ని సూక్ష్మ అర్థశాస్త్రమని, స్థూల అర్థశాస్త్రమని 1933 సం॥లో రాగ్నార్ ఫ్రిష్ ప్రతిపాదించెను. సూక్ష్మ అర్థశాస్త్రం అనేది ‘Micros’ అనే గ్రీకు పదం నుండి పుట్టింది. ‘Micro’ అంటే చిన్న అని అర్థం. సూక్ష్మ అర్థశాస్త్రం ఒక వైయుక్తిక ఆర్థిక యూనిట్ను పరిగణనలోనికి తీసుకొని దాని ప్రవర్తనను సమగ్రంగా అధ్యయనం చేస్తుంది. ఇది ఆర్థిక వ్యవస్థలోని చిన్నచిన్న భాగాలను గూర్చి అధ్యయనం చేస్తుంది. వైయుక్తిక యూనిట్లను గూర్చి వివరంగా పరిశీలిస్తుంది. ఒక వినియోగదారుడు తన ప్రయోజనాన్ని ఏ విధంగా గరిష్టం చేసుకుంటాడో ? ఒక సంస్థ గరిష్ట లాభాలు ఏ విధంగా పొందుతుందో ? సూక్ష్మ అర్థశాస్త్రం తెలుపుతుంది. వస్తువుల ఉత్పత్తి కారకాల ధరలు ఏ విధంగా నిర్ణయించబడతాయో సూక్ష్మ అర్థశాస్త్రం పరిశీలిస్తుంది. అందువలనే దీనిని ధరల సిద్ధాంతం అని కూడా పిలుస్తారు.

AP Inter 1st Year Economics Study Material Chapter 1 పరిచయం

పరిధి: వైయుక్తిక యూనిట్ల పరిశీలనయే సూక్ష్మ అర్థశాస్త్రం. “సంపూర్ణ ఉద్యోగిత” అనే ప్రమేయముపై సూక్ష్మ అర్థశాస్త్ర విశ్లేషణ జరుగుతుంది. ఇది వినియోగదారులను ఉత్పత్తిదారులను విడివిడిగా వారి ప్రవర్తనను విశ్లేషించును. సూక్ష్మ అర్థశాస్త్రం ముఖ్యంగా ఏమిటి ? ఎలా ? ఎవరి కోసం ఉత్పత్తి చేయాలి ? అనే అంశాలను అధ్యయనం చేస్తుంది. వస్తువుల మార్కెట్లలో ధర నిర్ణయం, కారకాల మార్కెట్లో ధర నిర్ణయం అధ్యయనం చేస్తుంది. ఈ క్రింది చార్టు సూక్ష్మ అర్థశాస్త్ర పరిధిని వివరిస్తుంది.

సూక్ష్మ అర్థశాస్త్ర పరిధి:
AP Inter 1st Year Economics Study Material Chapter 1 పరిచయం 2

ప్రాధాన్యత:

  1. స్వేచ్ఛా మార్కెట్ ఆర్థిక వ్యవస్థలో అపరిమిత సంఖ్యలో ఉన్న వినియోగదారులు, ఉత్పత్తిదారులు మధ్య వనరులు అభిలషణీయంగా ఏ విధంగా కేటాయింపులు జరుగుతాయో సూక్ష్మ అర్థశాస్త్రం వివరిస్తుంది.
  2. ఇది వ్యక్తుల, సంస్థల సమతౌల్యాన్ని వివరిస్తుంది.
  3. ప్రభుత్వ ఆర్థిక విధానాల రూపకల్పనలో ఉపకరిస్తుంది. ఉదాహరణకు ఏకస్వామ్యాల నియంత్రణ, పరిశ్రమల సబ్సిడీ మొదలైనవి.
  4. ఆర్థిక మంత్రికి పన్ను భారంను ఏ విధంగా వినియోగదారులకు, ఉత్పత్తిదారులకు అమ్మకందారులకు పంపిణీ చేయాలో వివరిస్తుంది.
  5. ఉత్పత్తి వ్యయాలు, డిమాండ్ను అంచనా వేయడం వంటి వ్యాపార సంబంధ విషయాలను అధ్యయనం చేస్తుంది.
  6. పరిమిత సాధనాల నుండి గరిష్ట ప్రయోజనం పొందడానికి సహకరిస్తుంది.
  7. ఇది స్థూల అర్థశాస్త్రానికి ప్రతిపాదిక.

ప్రశ్న 8.
చక్రీయ ఆదాయ ప్రవాహాన్ని పటం సహాయంతో వివరించండి.
జవాబు:
ఆదాయానికి మూలం సంపద. ఆదాయం ఒక ప్రవాహం వంటిది. ఈ ప్రవాహం ఆది, అంతములేని చక్రంలాగా ఉంటుంది. చక్రం ఏ విధంగా భ్రమణం చెందుతుందో అదే విధంగా ఆదాయం కూడా భ్రమణం చెందుతుంది. చక్రీయ ఆదాయ ప్రవాహ (Circular flow of Income) స్వరూపాన్ని క్రింది పటం సహాయంతో అవగాహన చేసుకోవచ్చు.

AP Inter 1st Year Economics Study Material Chapter 1 పరిచయం 3
ద్రవ్యరూపంలో ఆదాయం (వేతనాలు, భాటకం, వడ్డీ, లాభాలు)

పైన చూపిన పటం ప్రకారం ఉత్పత్తి కారకాల మార్కెట్కు, వస్తుసేవల మార్కెట్కు మధ్య సన్నిహిత సంబంధమున్నట్లుగా అర్థమవుతుంది. కుటుంబాలు ఉత్పత్తి కారకాలను, మార్కెట్లో విక్రయిస్తాయి. వ్యాపార సంస్థలు ఉత్పత్తి కారకాలను కొనుగోలు చేస్తాయి. అందువల్ల ఉత్పత్తి కారకాలను ప్రతిఫలాలను వ్యాపార సంస్థలు ద్రవ్యరూపంలో చెల్లిస్తాయి. అనగా ఆదాయం వ్యాపార సంస్థల నుండి కుటుంబాలకు ప్రవహిస్తుంది. వ్యాపార సంస్థలు వినియోగ వస్తువులను ఉత్పత్తి చేస్తాయి. ఈ వస్తువులను కుటుంబాలు కొనుగోలు చేస్తాయి. ఈ కారణంగా కుటుంబాలు వ్యాపార సంస్థలకు ద్రవ్యరూపంలో చెల్లింపులు చేస్తాయి. అంటే ఆదాయం ఒకసారి వ్యాపార సంస్థల నుండి కుటుంబాలకు, మరొకసారి కుటుంబాల నుండి వ్యాపార సంస్థలకు ప్రవహిస్తుంది. దీనినే చక్రీయ ఆదాయ ప్రవాహం అంటారు.

ప్రశ్న 9.
వినియోగ, ఉత్పాదక వస్తువుల మధ్య ఉన్న తేడాను వివరించండి.
జవాబు:
మానవ కోరికలను సంతృప్తిపరచగలిగే ఏ పదార్థాన్నైనా అర్థశాస్త్రంలో “వస్తువు” అంటారు.
వస్తువులను రెండు రకాలుగా విభజిస్తారు. 1) ఉచిత వస్తువులు, 2) ఆర్థిక వస్తువులు.

ఆర్థిక వస్తువులను తిరిగి వినియోగ వస్తువులు, ఉత్పాదక వస్తువులని విభజిస్తారు.
1. వినియోగ వస్తువులు: మానవ కోరికలను ప్రత్యక్షంగా సంతృప్తిపరచే వస్తువులను వినియోగ వస్తువులంటారు. వీటినే ప్రథమశ్రేణి వస్తువులని కూడా అంటారు. వీటికి ప్రత్యక్ష డిమాండ్ ఉంటుంది. ఉదా: ఆహారం, వస్త్రాలు, నివసించే ఇల్లు మొదలైనవి. వినియోగ వస్తువులను రెండు రకములుగా విభజించవచ్చును. అవి,

  1. ఒకసారి ఉపయోగంతో నశించేవి
  2. కొంత కాలంపాటు ఉపయోగంలో ఉండేవి.

i) ఒకసారి ఉపయోగంతో నశించేవి: మనం తినే ఆహారం, త్రాగునీరు లేదా పానీయాలు ఒకసారి ఉపయోగంతోనే వాటి నుండి పొందే ప్రయోజనం నశిస్తుంది. సేవలన్నీ ఒకసారి ఉపయోగంతో ప్రయోజనాన్ని కోల్పోతాయి. ఉదా: విత్తనాలు, ముడిపదార్థాలు, బొగ్గు, విద్యుత్ మొదలగునవి.

ii) కొంత కాలంపాటు ఉపయోగంలో ఉండేవి: ఒకసారితోనే ప్రయోజనాన్ని పోగొట్టుకోకుండా కొంత కాలంపాటు ఉపయోగంలో ఉండి, వాటిని వినియోగించే వారికి ప్రయోజనాన్ని కలుగజేస్తాయి. ఈ వస్తువులు కొంత కాలంపాటు మన్నికను కలిగి ఉండి వినియోగదారులకు ప్రయోజనాన్ని ఇస్తాయి. వీటిని మన్నికగల వినియోగ వస్తువులంటారు. ఉదా: బల్ల, కుర్చీ, పుస్తకము, టీ.వి. మొదలైనవి.

2. ఉత్పాదక వస్తువులు: వీటినే మూలధన వస్తువులు అని కూడా అంటారు. అనగా ఉత్పత్తి చేయబడిన ఉత్పత్తి సాధనాలు. ఏ వస్తువులైతే ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొని, ఇతర వస్తువుల ఉత్పత్తికి తోడ్పడతాయో, అటువంటి వస్తువులను ఉత్పాదక లేదా మూలధన వస్తువులంటారు. ఇవి పరోక్షంగా మానవుని కోరికలను సంతృప్తిపరుస్తాయి. వీటినే ద్వితీయ శ్రేణి వస్తువులంటారు. వీటికి ఉత్పన్న లేదా పరోక్ష డిమాండ్ ఉంటుంది. ఇవి రెండు రకములు.

  1. ఒకసారి ఉపయోగంతో నశించేవి
  2. కొంత కాలంపాటు ఉపయోగంలో ఉండేవి

i) ఒకసారి ఉపయోగంతో నశించేవి: ఒకసారి వినియోగించగానే వాటి ప్రయోజనం నశిస్తుంది.
ఉదా: విత్తనాలు, ముడి పదార్థాలు, బొగ్గు, విద్యుత్ మొదలగునవి.

ii) కొంత కాలంపాటు ఉపయోగంలో ఉండేవి: కొన్ని వస్తువులు కొంత కాలం పాటు వినియోగంలో ఉంటాయి. అనగా కొంతకాలంపాటు ప్రయోజనాన్ని ఇవ్వగలుగుతాయి. వీటిని మన్నిక గల ఉత్పాదక వస్తువులు అంటారు. ఉదా: యంత్రాలు, ట్రాక్టర్, కర్మాగార భవనాలు మొదలగునవి.

వినియోగ వస్తువులకు, ఉత్పాదక వస్తువులకు మధ్యగల భేదములు:
వినియోగ వస్తువులు

  1. ఇవి ప్రత్యక్షంగా మానవ కోరికలను సంతృప్తిపరచును.
  2. వీటికి ప్రత్యక్ష డిమాండ్ ఉంటుంది.
  3. ఇవి ప్రథమశ్రేణి వస్తువులు.
  4. ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొనవు.
  5. వస్తువులను కలిగిన యజమానులకు ఆదాయాన్నివ్వవు.

ఉత్పాదక వస్తువులు

  1. ఇవి పరోక్షంగా మానవ కోరికలను సంతృప్తిపరచును.
  2. వీటికి పరోక్ష లేదా ఉత్పన్న డిమాండ్ ఉంటుంది.
  3. ఇవి ద్వితీయ శ్రేణి వస్తువులు.
  4. ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొంటాయి.
  5. వస్తువులను కలిగిన యజమానులకు ఆదాయాన్ని చేకూర్చి పెడతాయి.

AP Inter 1st Year Economics Study Material Chapter 1 పరిచయం

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ఆర్థిక వస్తువులు [Mar. ’15]
జవాబు:
డిమాండ్ కంటే సప్లై తక్కువగా అనగా కొరతగా ఉండి ధర కలిగిన వస్తువులను ఆర్థిక వస్తువులంటారు. ఉదా: ఆహారం, వస్త్రాలు, యంత్రాలు మొదలైనవి. అవకాశం ఉంటే వీటిని వ్యక్తులు ఎక్కువగా కావాలనుకుంటారు. వీటికి ఉపయోగిత విలువ, వినిమయ విలువ ఉంటాయి. ఇది మానవ నిర్మితాలు. కనుక వీటికి ఉత్పత్తి వ్యయం ఉంటుంది.

ప్రశ్న 2.
ఉత్పాదక వస్తువులు
జవాబు:
ఉత్పాదక వస్తువులనే మూలధన వస్తువులు అని కూడా అంటారు. ఇవి ఉత్పత్తి చేయబడిన ఉత్పత్తి సాధనాలు. ఏ వస్తువులైతే ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొని ఇతర వస్తువుల ఉత్పత్తికి తోడ్పడతాయో అటువంటి వస్తువులను ఉత్పాదక వస్తువులు లేదా మూలధన వస్తువులు అంటారు. ఇవి పరోక్షంగా మానవుని కోరికలను సంతృప్తిపరచును. వీటిని ద్వితీయ శ్రేణి వస్తువులంటారు.

వీటికి పరోక్ష లేదా ఉత్పన్న డిమాండ్ ఉంటుంది. ఇవి ఒకసారి ఉపయోగంలో నశించేవి, కొంతకాలంపాటు వినియోగంలో ఉండేవి అని రెండు రకములు. ఉదా: యంత్ర పరికరాలు, కర్మాగార భవనాలు మొదలైనవి.

ప్రశ్న 3.
మధ్యంతర వస్తువులు [Mar. ’17]
జవాబు:
పూర్తిగా తయారు కాకుండా ఇంకా తయారీలో ఉన్న వస్తువుల ముడిసరుకులను, అంతిమ వినియోగ వస్తువులకు మధ్యలో వివిధ దశలలో ఉన్న వస్తువులను మధ్యంతర వస్తువులు అంటారు. అంతిమ వినియోగానికి కాకుండా ఇతర వస్తువుల ఉత్పత్తి ప్రక్రియలో ఏదో ఒక దశలో, ఎక్కడో ఒకచోట ఉపయోగించే వస్తువులు మాధ్యమిక వస్తువులు. ఉదా: సిమెంటు, ఇటుకలు, స్టీలు మొదలైనవి నిర్మాణ రంగంలో మధ్యంతర వస్తువులు.

ప్రశ్న 4.
సంపద [Mar. ’16]
జవాబు:
సాధారణ పరిభాషలో సంపద అనగా కేవలం ప్రజల వద్దనున్న ద్రవ్యం. కాని అర్థశాస్త్రంలో సంపద అనగా ద్రవ్యము మాత్రమే కాకుండా ప్రయోజనం, కొరత బదిలీ చేయటానికి అవకాశం ఉండటము అనే లక్షణాలుగల ఏ వస్తువులైనా సంపదగా పరిగణిస్తారు. ఉదా: భూములు, భవనాలు మొదలైనవి.

ప్రశ్న 5.
ఆదాయం
జవాబు:
ఆదాయానికి మూలం సంపద. ఆదాయం ఒక ప్రవాహం వంటిది. ఆదాయం ఒకసారి వ్యాపార సంస్థల నుండి ఉత్పత్తి కారకాల ప్రతిఫలాల రూపంలో కుటుంబాలకు, మరొకసారి కుటుంబాల నుండి వస్తు సేవలపై వ్యయ రూపంలో వ్యాపార సంస్థలకు ప్రవహిస్తుంది. దీనిని చక్రరూప ఆదాయ ప్రవాహం అంటారు.

AP Inter 1st Year Economics Study Material Chapter 1 పరిచయం

ప్రశ్న 6.
ప్రయోజనం [Mar. ’16]
జవాబు:
వస్తుసేవలకుండే మానవ కోరికలను సంతృప్తిపరచగలిగే శక్తిని అర్థశాస్త్రంలో ప్రయోజనం అంటారు. వస్తువు అన్ని యూనిట్ల నుండి పొందే ప్రయోజనం మొత్తాన్ని మొత్తం ప్రయోజనమని, వస్తువు అదనపు యూనిట్ వలన మొత్తం ప్రయోజనానికి కలుపబడే లేదా తీసివేయబడే ప్రయోజనమును ఉపాంత ప్రయోజనమని అంటారు. ఈ భావన అర్థశాస్త్రంలో చాలా ప్రధానమైనది.

ప్రశ్న 7.
వినిమయ విలువ
జవాబు:
ఒక వస్తువును వినిమయం చేసినప్పుడు దాని బదులుగా పొందగలిగే ఇతర వస్తువులను లేదా సాధారణ ద్రవ్యాన్ని వినిమయ విలువ అని అంటారు. ఉచిత వస్తువులకు మారకం విలువ ఉండదు లేదా తక్కువగా ఉంటుంది. కొన్ని రకాల వస్తువులకు మారకం విలువ అధికంగా ఉంటుంది.

ప్రశ్న 8.
ధర
జవాబు:
ఒక వస్తువు విలువను ద్రవ్య రూపంలో చెప్పినట్లయితే దానిని ధర అంటారు.
ఉదా: ‘X’ వస్తువు 10/- వినిమయం చెందుతుంది.

ప్రశ్న 9.
ఎంపిక సమస్య
జవాబు:
సాధనాల కొరత వల్ల మానవుడు అపరిమితమైన కోరికలలో వేటిని సంతృప్తిపరుచుకోవాలి, సాధనాలను ఎట్లా కేటాయించుకోవాలి అని ఎంపిక చేసుకోవలసి ఉంటుంది. ఎంపిక సమస్యను అతి ముఖ్యమైన అర్థశాస్త్ర సమస్యగా రాబిన్స్ వివరించాడు.

ప్రశ్న 10.
ఆర్థిక కార్యకలాపాలు
జవాబు:
ఆదాయ ఆర్జన, వ్యయానికి సంబంధించిన ఆర్థిక కార్యకలాపాలు.

ప్రశ్న 11.
సూక్ష్మ అర్థశాస్త్రం
జవాబు:
సూక్ష్మ అర్థశాస్త్రం అనేది మైక్రోస్ అనే గ్రీకు పదం నుండి పుట్టింది. సూక్ష్మ అర్థశాస్త్రం ఒక వైయుక్తిక ఆర్థిక యూనిట్ను పరిగణనలోకి తీసుకొని దాని ప్రవర్తనను సమగ్రంగా అధ్యయనం చేస్తుంది. ఉత్పత్తి కారకాల ధర నిర్ణయం గురించి వివరిస్తుంది, కాబట్టి దీనిని ధరల సిద్ధాంతం అంటారు.

ప్రశ్న 12.
స్థూల అర్థశాస్త్రం
జవాబు:
స్థూల అర్థశాస్త్రం అనేది మాక్రోస్ అనే గ్రీకు పదం నుండి పుట్టింది. ఆర్థిక వ్యవస్థ మొత్తానికి సంబంధించిన అంశాలను అంటే మొత్తం ఉద్యోగిత, మొత్తం ఆదాయం మొదలగు వాటిని గూర్చి అధ్యయనం చేస్తుంది. అందుచే స్థూల అర్థశాస్త్రాన్ని ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతం అని కూడా అంటారు.

ప్రశ్న 13.
నిశ్చల ఆర్థిక విశ్లేషణ
జవాబు:
ఒకే సమయంలో లేదా ఒకే కాలానికి సంబంధించిన విలువలను తెలియజేసే రెండు చలాంకాల మధ్య ఉన్న ప్రమేయ సంబంధాన్ని నిర్ధారించడానికి చేసే విశ్లేషణ. ఉదా: సంపూర్ణ పోటీలోని సమతౌల్య ధర నిర్ణయం.

AP Inter 1st Year Economics Study Material Chapter 1 పరిచయం

ప్రశ్న 14.
చలన ఆర్థిక విశ్లేషణ
జవాబు:
ఆర్థిక చలనత్వం వేరువేరు సమయాలకు చెందిన విలువలను తెలియజేసే సంబంధిత చలాంకాల మధ్య ఉన్న సంబంధాన్ని తెలియజేస్తుంది.

ప్రశ్న 15.
నిగమన పద్ధతి
జవాబు:
తార్కిక విశ్లేషణ ద్వారా సార్వజనీనమైన ఫలితాలను వ్యక్తిగత అంశాలకు వర్తింపచేయడం.
ఉదా: క్షీణోపాంత ప్రయోజన సూత్రం.

ప్రశ్న 16.
ఆగమన పద్ధతి
జవాబు:
తార్కిక విశ్లేషణ చేయడం ద్వారా ప్రత్యేక అంశాల పరిశీలన వల్ల వచ్చిన ఫలితాలు మొత్తం అంశాలకు వర్తింప చేయడం. ఉదా: క్షీణ ప్రతిఫల సూత్రం.

AP Inter 2nd Year Economics Study Material Chapter 10 అర్థగణాంక శాస్త్రం

Andhra Pradesh BIEAP AP Inter 2nd Year Economics Study Material 10th Lesson అర్థగణాంక శాస్త్రం Textbook Questions and Answers.

AP Inter 2nd Year Economics Study Material 9th Lesson అర్థగణాంక శాస్త్రం

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
విస్తరణ ప్రయోజనాలు ఏమిటి ?
జవాబు:
శ్రేణుల యొక్క పంపిణీని తెలియజేసేది విస్తరణ.
బౌలే అభిప్రాయం ప్రకారం “అంశాల విచరణ మానమే విస్తరణ”. బ్రూక్స్ మరియు డిక్ అభిప్రాయం ప్రకారం “సగటు చుట్టూ సంఖ్య దత్తాంశపు విలువలు ఏ స్థాయిలో వ్యాపింపబడి ఉంటాయో దానిని “దత్తాంశ విస్తరణ” అంటారు.

విస్తరణ లక్షణాలు :

  1. విస్తరణ మానం సూక్ష్మంగా గుణించడానికి వీలుగా ఉండవలెను.
  2. విస్తరణ మానం నిర్దిష్టంగా నిర్వచింపబడి ఉండాలి.
  3. విస్తరణ మానం శ్రేణి పంపిణీలో ప్రతి అంశంపై ఆధారపడినదై ఉండాలి.
  4. బీజీయ ప్రస్తావనకు తగినదిగా ఉండవలెను.
  5. విస్తరణ మానంకు ప్రతిచయన సుస్థిరత్వం ఉండవలెను.
  6. విస్తరణ మానం అంత్య అంశాల ద్వారా ప్రభావితం కాకూడదు.

ప్రాముఖ్యత :

  1. సగటు విశ్వసనీయతను నిర్ధారించవచ్చును.
  2. విస్తరణ స్వభావాన్ని, కారణాలను విశ్లేషించడం.
  3. అధ్యయనం చేసిన చలరాశులలో గల విచరణత్వాన్ని అదుపులో, నియంత్రణ చేయడంలో తోడ్పడటం.
  4. ఇతర గణాంక మానాలను కొలవడానికి కొలబద్దగా సహకరించడం.

AP Inter 2nd Year Economics Study Material Chapter 10 అర్థగణాంక శాస్త్రం

ప్రశ్న 2.
విస్తరణ అనగానేమి ? వివిధ విస్తరణ మానాల పద్ధతుల గురించి వివరించండి.
జవాబు:
కేంద్రస్థానపు కొలతలైన అంకమధ్యమం, మధ్యగతం, బాహుళకం మొదలగునవి దత్తాంశానికి ప్రాతినిధ్యం వహించే అంకెలను తెలియజేస్తాయి. శ్రేణుల పంపిణీని తెలియజేసేది విస్తరణ.

బౌలే అభిప్రాయం ప్రకారం “అంశాల విచరణ మానమే విస్తరణ”.

బ్రూక్స్ మరియు డిక్ అభిప్రాయంలో “సగటు చుట్టూ సంఖ్యా దత్తాంశపు విలువలు ఏ స్థాయిలో వ్యాపింపబడి ఉంటాయో దానిని దత్తాంశ విస్తరణ” అంటారు.
విస్తరణ మానాలను ఈ క్రింది పద్ధతుల ద్వారా కొలవవచ్చు.

  1. వ్యాప్తి
  2. చతుర్థాంశపు విచలనం
  3. మధ్యమ లేదా సగటు విచలనం
  4. ప్రామాణిక విచలనం
  5. లారెంజ్ వక్రరేఖ

1) వ్యాప్తి : విస్తరణను అధ్యయనం చేయడంలో అతి సులభమైన పద్ధతి వ్యాప్తి. కెండాల్ ప్రకారం “అత్యధిక, అత్యల్ప విలువల తేడాను వ్యాప్తి” గా చెప్పవచ్చు.
ఇందులో
R = L – S
R = వ్యాప్తి
L = అత్యధిక విలువ
S = అత్యల్ప విలువ

2) చతుర్ధాంశ విచలనం : ఇచ్చిన పౌనఃపున్యం విభాజనం ఎగువ, దిగువ చతుర్థాంశాల సగటు పరమ వ్యత్యాసాన్ని చతుర్థాంశ విచలనమని అంటారు. ఈ చతుర్థాంశ విచలనము మధ్య గతమునకు అటూ, ఇటూ గల వివిధ అంశాలను అధ్యయనం చేస్తుంది. దీనిలో మొత్తం దత్తాంశాన్ని నాలుగు సమాన భాగాలుగా విభజించినట్లయితే ప్రతి భాగం 25 శాతం విలువను కల్గి ఉంటుంది, దీనితో మనం చతుర్థాంశ విచలనం మరియు మధ్యగతం విలువలను పొందవచ్చును.
AP Inter 2nd Year Economics Study Material Chapter 10 అర్థగణాంక శాస్త్రం 1

Q.D = చతుర్థాంశ విచలనం
Q3 = ఎగువ చతుర్థాంశం
Q1 = దిగువ చతుర్థాంశం

3) మధ్యమ విచలనం : క్లార్క్ అభిప్రాయంలో “విచలనం గుర్తుల్ని విస్మరిస్తూ అంక మధ్యమం నుండి గాని, మధ్యగతం నుంచి గాని, బాహుళకం నుంచి గాని విభాజనంలో వ్యాపించిన అంశాల సగటు మొత్తాన్ని సగటు విచలనం లేదా మధ్యమ విచలనం అంటారు.
AP Inter 2nd Year Economics Study Material Chapter 10 అర్థగణాంక శాస్త్రం 2
M.D = మధ్యమ విచలనం
f = పౌనఃపున్యం
N = అంశాల సంఖ్య
|D| = మాడ్యులస్

4) ప్రామాణిక విచలనం : విస్తరణ కొలమానాలలో ముఖ్యమైనది ప్రామాణిక విచలనం. దీనిని 1893వ సం॥లో కారల్ పియర్సన్ అభివృద్ధిపరిచారు. దీనిని “విచలనాల వర్గముల సగటు యొక్క వర్గమూలం” అనవచ్చు. విచలనాలను అంక మధ్యమము నుండి తీసుకొనవలసి ఉంటుంది. దీనిని గ్రీక్ అక్షరం (సిగ్మా) తో తెలియజేస్తారు.
AP Inter 2nd Year Economics Study Material Chapter 10 అర్థగణాంక శాస్త్రం 3

5) లారెంజ్ వక్రరేఖ : విస్తరణ రేఖా పద్ధతిలో అధ్యయనం చేయడాన్ని లారెంజ్ రేఖాపద్ధతి అంటారు. ఈ పద్ధతి ఆర్థిక అసమానతలను కొలవడానికి, లాభాల పంపిణీ, వేతనాల పంపిణీ మొదలైన అంశాలను అధ్యయనం చేయడానికి ఉపయోగిస్తారు.

AP Inter 2nd Year Economics Study Material Chapter 10 అర్థగణాంక శాస్త్రం

ప్రశ్న 3.
చతుర్థాంశ విచలన గుణకం గణన చేయండి.
AP Inter 2nd Year Economics Study Material Chapter 10 అర్థగణాంక శాస్త్రం 4
జవాబు:
AP Inter 2nd Year Economics Study Material Chapter 10 అర్థగణాంక శాస్త్రం 5
దిగువ చతుర్థాంశ గణన = n/4 వ అంశం
= 40/4 = 10వ అంశం
ఇది సంచిత పౌనఃపున్యంలో 13 కంటే తక్కువగా ఉంది. కనుక తరగతి అంతరం 10-20
AP Inter 2nd Year Economics Study Material Chapter 10 అర్థగణాంక శాస్త్రం 6
AP Inter 2nd Year Economics Study Material Chapter 10 అర్థగణాంక శాస్త్రం 7

ప్రశ్న 4.
కార్ల్ పియర్సన్ సహ సంబంధ గుణకంను గణన చేయండి.
AP Inter 2nd Year Economics Study Material Chapter 10 అర్థగణాంక శాస్త్రం 8
జవాబు:
AP Inter 2nd Year Economics Study Material Chapter 10 అర్థగణాంక శాస్త్రం 9
AP Inter 2nd Year Economics Study Material Chapter 10 అర్థగణాంక శాస్త్రం 10

AP Inter 2nd Year Economics Study Material Chapter 10 అర్థగణాంక శాస్త్రం

అదనపు ప్రశ్నలు

ప్రశ్న 1.
ఈ క్రింది దత్తాంశాన్ని కోటి సహసంబంధంను గణన చేయండి.
AP Inter 2nd Year Economics Study Material Chapter 10 అర్థగణాంక శాస్త్రం 11
జవాబు:
AP Inter 2nd Year Economics Study Material Chapter 10 అర్థగణాంక శాస్త్రం 12

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
మధ్యమ విచలనము, ప్రామాణిక విచలనము మరియు చతుర్థాంశ విచలనము మధ్య సంబంధాన్ని నిర్వచింపుము.
జవాబు:
ఇచ్చిన పౌనఃపున్యం విభాజనం ఎగువ, దిగువ చతుర్థాంశాల సగటు పరమ వ్యత్యాసాన్ని చతుర్థాంశ విచలనమని అంటారు. ఈ పరిస్థితులలో మొత్తం దత్తాంశాన్ని నాలుగు సమాన భాగాలుగా విభజించినట్లయితే ప్రతి భాగం 25 శాతం విలువను కల్గి ఉంటూ, చతుర్థాంశ విచలనం మరియు మధ్యగతం విలువలను పొందగలము.

మధ్యమ విచలనము : విచలనం గుర్తుల్ని విస్మరిస్తూ అంక మధ్యమం నుంచి గాని, మధ్యగతం నుంచి గాని, బాహుళకం నుంచి గాని విభాజనంలో వ్యాపించిన అంశాల సగటు మొత్తాన్ని సగటు విచలనం అని అంటారు. ప్రామాణిక విచలనం : ప్రామాణిక విచలనాన్ని విచలనాల వర్గముల సగటు యొక్క వర్గమూలమని అనవచ్చును. విచలనాలను అంక మధ్యమం నుండి తీసుకొనవలసి ఉంటుంది.

AP Inter 2nd Year Economics Study Material Chapter 10 అర్థగణాంక శాస్త్రం

ప్రశ్న 2.
క్రింది అంశాలకు ప్రామాణిక విచలనమును లెక్కకట్టండి.
5, 10, 25, 30, 50.
జవాబు:
AP Inter 2nd Year Economics Study Material Chapter 10 అర్థగణాంక శాస్త్రం 13
AP Inter 2nd Year Economics Study Material Chapter 10 అర్థగణాంక శాస్త్రం 14

ప్రశ్న 3.
లారెంజ్ వక్రరేఖను నిర్వచిస్తూ ఉపయోగించే పద్ధతిని వివరించండి.
జవాబు:
విస్తరణను రేఖాపద్ధతి ద్వారా అధ్యయనం చేయడాన్ని లారెంజ్ వక్రరేఖా పద్ధతి అంటారు. ఈ పద్ధతి ఆర్థిక అసమానతలను కొలవడానికి, లాభాల పంపిణీ, వేతనాల పంపిణీ మొదలైన అంశాలను అధ్యయనం చేయడానికి ఉపయోగిస్తారు.

ఈ క్రింది వివరాల ఆధారంగా ఒక కంపెనీలో పనిచేస్తున్న ఏ ఉద్యోగస్తుల ఆదాయంతో విచరణత్వం తక్కువగా ఉందో లారెంజ్ వక్రరేఖా పద్ధతి ఉపయోగించి తెలుసుకోవచ్చు. ఉదాహరణకు
AP Inter 2nd Year Economics Study Material Chapter 10 అర్థగణాంక శాస్త్రం 15

AP Inter 2nd Year Economics Study Material Chapter 10 అర్థగణాంక శాస్త్రం

లారెంజ్ వక్రరేఖ నిర్మాణాలకు ఈ క్రింది నియమాలు పాటించాలి.

  1. దత్తాంశంలోని చలనరాశుల విలువలను, వాటి పౌనఃపున్యాలను సంచితం చేయాలి.
  2. సంచితం చేసిన ఈ రెండు విలువలకు శాతాలను వేర్వేరుగా లెక్కించాలి.
  3. ‘X’ అక్షంపై సంచిత చేసిన పౌనఃపున్యాల సంచిత శాతాలను, Y అక్షంపై సంచితం చేసిన చలనరాశుల శాతాలను చూపాలి.
  4. చలనరాశుల సంచిత శాతాలను వ్యతిరేకంగా, పౌనఃపున్యాల సంచిత శాతాలను గుర్తించి, ఆ బిందువులను కలుపుతూ వక్రరేఖ గీయండి. ఆ రేఖను లారెంజ్ వక్రరేఖ అంటారు.
    AP Inter 2nd Year Economics Study Material Chapter 10 అర్థగణాంక శాస్త్రం 16

పై రేఖాపటంలో సమ విభజన రేఖకు (0) లారెంజ్ వక్రరేఖ దూరం ఎక్కువగా ఉంటే విచరణత్వం ఎక్కువగా ఉందని, ఆ రెండు రేఖలు చాలా సమీపంలో ఉండే విచరణత్వం చాలా తక్కువగా ఉందని చెప్పవచ్చును.

ప్రశ్న 4.
సహ సంబంధం అనగానేమి ? సహ సంబంధం ప్రాముఖ్యత తెలియజేయండి. [Mar ’16]
జవాబు:
ఒక చలరాశిలో వచ్చిన మార్పులు వేరొక చలరాశిలో ఎలాంటి మార్పులను ప్రభావితం చేస్తుందో తెలుసుకోవడానికి సహ సంబంధం ఉపయోగపడుతుంది.

A.M. ట్యిటల్ ప్రకారం “రెండు లేదా అంతకంటే ఎక్కువ చలరాశుల మధ్యగల విచరణాన్ని అధ్యయం చేయడానికి ఉపయోగపడే గణాంక పద్ధతి.

సిమ్సన్ మరియు కబ్కా ప్రకారం “రెండు లేదా అంతకంటే ఎక్కువ చలరాశుల మధ్యగల సంబంధ స్థాయిని నిర్ణయించడానికి ఉపయోగపడే గణాంక పద్ధతి సహ సంబంధం.

  1. రెండు లేదా అంతకంటే ఎక్కువ సంబంధిత అంశాలను అంచనా వేయడానికి ఉపయోగపడుతుంది.
  2. వ్యాపార ఆర్థిక రంగాలకు సంబంధించిన సహ సంబంధం ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది.
  3. ఒక చలనరాశి విలువ ఆధారంగా వేరొక చలనరాశి విలువను అంచనా వేయవచ్చును.
  4. సహ సంబంధం ద్వారా ప్రతిచయన దోషాలను కూడా కొలవవచ్చును.
  5. వ్యాపారవేత్తలకు వ్యయాలను, అమ్మకాలను, ధరను, ఇతర సంబంధిత అంశాలను అంచనా వేయడానికి ఉపయోగపడుతుంది.

ప్రశ్న 5.
సూచీ సంఖ్యల రకాలు ఎన్ని ?
జవాబు:
క్రీ.శ. 1764లో మొదటిసారిగా సూచీ సంఖ్యలను ఉపయోగించారు. ధరలలో మార్పులు అధ్యయనం చేయడం |కోసం ఉపయోగించిన సూచీసంఖ్యలు దేశంలోని ఆర్థిక పరిస్థితులు, ఉత్పత్తి కార్యకలాపాలను ప్రస్తుతం ఎక్కువగా వాడుతున్నారు.

AP Inter 2nd Year Economics Study Material Chapter 10 అర్థగణాంక శాస్త్రం

క్రోటాన్ మరియు కౌటన్ ప్రకారం “పరస్పర సంబంధం కలిగి ఉన్న చలరాశుల సముదాయ పరిమాణంలోని వ్యత్యాసాలను కొలవడానికి ఉపయోగపడే సాధనాలే సూచీ సంఖ్యలు”.

సూచీ సంఖ్యల వర్గీకరణ : ఆర్థిక వ్యాపార రంగాలలో ఉపయోగించే సూచీ సంఖ్యలను ఈ క్రింది రకాలుగా వర్గీకరించవచ్చును. అవి :

  1. ధరల సూచీ సంఖ్యలు
  2. పరిమాణ సూచీ సంఖ్యలు
  3. విలువ సూచీ సంఖ్యలు
  4. ప్రత్యేక అవసర సూచీ సంఖ్యలు

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
వ్యాప్తి. [Mar ’17, ’16]
జవాబు:
విస్తరణను అధ్యయనం చేయడంలో అతి సులభమైన పద్దతి వ్యాప్తి. కెండాల్ ప్రకారం “అత్యధిక, అత్యల్ప విలువల తేడాను వ్యాప్తి” గా పరిగణించవచ్చును.
R=L-S

ప్రశ్న 2.
మధ్యమ విచలనము.
జవాబు:
కేంద్రస్థానపు కొలతల నుంచి తీసుకున్న విచలనాల పరమ సగటుగా మధ్యమ విచలనాన్ని చెప్పవచ్చును. క్లార్క్ అభిప్రాయం ప్రకారం “విచలనం గుర్తుల్ని విస్మరిస్తూ అంక మధ్యమం నుంచి గాని, మధ్యగతం నుంచి గాని, బాహుళకం నుంచి గాని విభాజనంలో వ్యాపించిన అంశాల సగటు మొత్తాన్ని సగటు విచలనం లేదా మధ్యమ విచలనం” అంటారు.
AP Inter 2nd Year Economics Study Material Chapter 10 అర్థగణాంక శాస్త్రం 17

ప్రశ్న 3.
సహ సంబంధం. [Mar ’17]
జవాబు:
ఒక చలనరాశిలో వచ్చిన మార్పులు వేరొక చలనరాశిలో ఎలాంటి మార్పులను ప్రభావితం చేస్తుందో తెలుసుకోవడానికి ఈ సహ సంబంధం ఉపయోగపడుతుంది. ఇది మూడు రకాలు.

  1. వ్యాపనపటం పద్ధతి
  2. కార్ల్ పియర్సన్ పద్దతి
  3. స్పియర్మన్ కోటి సహ సంబంధ గుణకం.

ప్రశ్న 4.
కోటి సహ సంబంధం.
జవాబు:
1904వ సంవత్సరంలో చార్లెస్ ఎడ్వర్డ్ స్పియర్ మన్ దీనిని ప్రతిపాదించాడు. గుణాత్మక దత్తాంశంలో అంశాలను క్రమ పద్ధతిలో కోడీకృతం చేసి, ఆ చలనరాశుల మధ్య సహ సంబంధ గుణకంను కోటి సహ సంబంధ గుణకం అంటారు.

ప్రశ్న 5.
సూచీ సంఖ్యలు.
జవాబు:
1764వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా సూచీ సంఖ్యలను ఉపయోగించారు. పరస్పర సంబంధం కలిగి ఉన్న చలరాశుల సముదాయ పరిమాణంలోని వ్యత్యాసాలను కొలవడానికి ఉపయోగపడే సాధనాలే సూచీ సంఖ్యలు.

AP Inter 2nd Year Economics Study Material Chapter 10 అర్థగణాంక శాస్త్రం

ప్రశ్న 6.
లాస్పెయిర్ సూచీ సంఖ్య సూత్రం.
జవాబు:
AP Inter 2nd Year Economics Study Material Chapter 10 అర్థగణాంక శాస్త్రం 18

ప్రశ్న 7.
పాషి సూచీ సంఖ్య సూత్రం.
జవాబు:
AP Inter 2nd Year Economics Study Material Chapter 10 అర్థగణాంక శాస్త్రం 19

ప్రశ్న 8.
ఫిషర్ సూచీ సంఖ్య సూత్రం.
జవాబు:
AP Inter 2nd Year Economics Study Material Chapter 10 అర్థగణాంక శాస్త్రం 20

AP Inter 2nd Year Economics Study Material Chapter 9 ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ

Andhra Pradesh BIEAP AP Inter 2nd Year Economics Study Material 9th Lesson ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ Textbook Questions and Answers.

AP Inter 2nd Year Economics Study Material 9th Lesson ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థపై ఒక వ్యాసాన్ని వ్రాయండి.
జవాబు:
నైసర్గిక స్వరూపము: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము 12°41′ మరియు 22° ల ఉత్తర అక్షాంశ రేఖలకు మరియు 77°, 80°40′ తూర్పు రేఖాంశాల మధ్య ఏర్పడి ఉత్తరాన మహారాష్ట్ర, ఛత్తీస్ ఘడ్, తెలంగాణ మరియు ఒడిషా, తూర్పున బంగాళాఖాతము, దక్షిణాన తమిళనాడు, పడమర కర్ణాటక రాష్ట్రాలను సరిహద్దులుగా కలిగి ఉంది. గోదావరి, కృష్ణా మరియు తుంగభద్ర వంటి ప్రధాన నదులు ఈ రాష్ట్రం గుండా ప్రవహిస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము సహజ మరియు మానవ వనరులను సమృద్ధిగా కలిగి, పోటీ తత్వానికి కావల్సిన సామాజిక ఆర్థిక పరిపుష్టులను కలిగివుంది. మొత్తం 1,60,20,400 హెక్టార్ల భౌగోళిక భూభాగాన్ని కల్గిన భారతదేశంలోని 8వ పెద్ద రాష్ట్రంగా నిల్చింది. గుజరాత్ తర్వాత దేశంలో 974 కి.మీ. తీరప్రాంతము కల్గిన 2వ రాష్ట్రము ఆంధ్రప్రదేశ్. మొత్తం భూభాగంలో 21.81 శాతము అంటే 34,93,475 హెక్టార్ల అటవీ ప్రాంతాన్ని కలిగివుంది. ఆంధ్రప్రదేశ్ ఒకవైపు ఎత్తైన పర్వత ప్రాంతాలు, మైదానాలు, మరొకవైపు తీరప్రాంతము మరియు పీఠభూములతో కూడిన బహువిధ భౌతిక లక్షణాలు కల్గి ఉంది.

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ – లక్షణాలు: భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ వైశాల్యము మరియు జనాభా దృష్ట్యా పెద్ద రాష్ట్రాల్లో ఒకటిగా నిల్చింది. దేశ భూభాగములో 4.96 శాతం భూమిని కల్గిన 8వ పెద్ద రాష్ట్రంగా ఉన్నది. రాష్ట్రము 4.6 కోట్ల జనాభాతో దేశ జనాభాలో 4.10 శాతం కల్గి ఉండి, జనాభా దృష్ట్యా 10వ అతిపెద్ద రాష్ట్రంగా ఉన్నది. మొత్తం భూభాగంలో 40.95% వ్యవసాయ యోగ్య భూమి, 21.81% అడవులను కల్గివున్నది.

AP Inter 2nd Year Economics Study Material Chapter 9 ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ

1) రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి (GSDP): రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి మరియు భారతదేశ స్థూల దేశీయోత్పత్తి, వాటి వృద్ధి రేటులతోపాటు రాష్ట్ర, దేశ స్థూల ఉత్పత్తి విలువ 2004 – 05 మరియు 2013-14ల మధ్య దాదాపు రెట్టింపు అయినట్లుగా విశదమవుతున్నది. రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తిలో నిరంతర పెరుగుదల ధోరణి కనిపిస్తున్నది. 2004 – 05 లో R 1,34,767 కోట్లుగా ఉన్న రాష్ట్ర ఉత్పత్తి విలువ 2013 – 14 నాటికి 2,50,282 కోట్లుగా చేరుకొన్నది. 2011-12 తర్వాత రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి జాతీయ సగటు GDP పెరుగుదల కన్నా అధికంగా నమోదయినది. రాష్ట్ర GSDP భారతదేశ స్థూల దేశీయోత్పత్తిలో 4.36 శాతాన్ని కల్గివుంది.

2) తలసరి ఆదాయము: రాష్ట్ర తలసరి ఆదాయం, దేశ సగటు తలసరి ఆదాయం కన్నా 2, 3 సం॥లలో తప్ప మిగిలిన సంవత్సరాలలో అధికంగా నమోదు అయ్యింది. దీనిని రాష్ట్రంలో పెరుగుతున్న ప్రజల జీవన ప్రమాణానికి సూచికగా పరిగణింపవచ్చును. 2013-14 సం॥లో రాష్ట్ర, దేశ తలసరి ఆదాయాల మధ్య తేడా ? 11,417 లుగా ఉంది.

3) జనాభా వృద్ధిరేటులో పోకడలు: 2011 జనాభా లెక్కల ప్రకారం 13 జిల్లాలలోని మరియు 4.96 కోట్ల జనాభాతో ఆంధ్రప్రదేశ్ దేశంలో పదవస్థానంలో నిల్చింది. మొదటి నుండి భారతదేశ జనాభా వృద్ధి రేటు కన్నా, రాష్ట్ర జనాభా దశాబ్ద వృద్ధి రేటు తక్కువగానే నమోదవుతున్నది.
మొదటిసారి 2011 దశకంలో రాష్ట్ర వార్షిక జనాభా వృద్ధిరేటు 1% కన్నా తక్కువ (0.921)గా నమోదయింది.

4) రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తిలో రంగాల వాటా: దీనిలో వివిధ రంగాల వాటా వర్తమాన సంవత్సర ధరల ప్రకారం కాని, ఆధార సంవత్సర (2004-05) ధరల ప్రకారం కాని అనేక మార్పులకు గురవుతూ, వాటా ఆధిపత్యం వ్యవసాయం నుండి క్రమంగా సేవారంగానికి మారుతూ వస్తున్నది.

రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి 2004-05 ఆర్థిక సంవత్సరంలో కౌ 1,36,767 కోట్లుగా ఉంది. ఇందులో వ్యవసాయ రంగం R 40,232 కోట్లు సమకూర్చగా, గనులు, వస్తు తయారీ, విద్యుత్, గ్యాస్, నీటి సప్లయి మొదలగు ఉపరంగాలు కలిగిన పారిశ్రామిక రంగం 29,124 కోట్లు మరియు సేవారంగం 65,411 కోట్లను సమకూర్చడం జరిగింది. | 2013 – 14 సంవత్సర తాత్కాలిక అంచనాల ప్రకారం మొత్తం రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తిలో 2004 – 05 ఆధార సంవత్సరం ధరలలో 58,390 కోట్లు, పారిశ్రామిక రంగం కౌ 51,838 కోట్లు మరియు సేవారంగము శౌ 1,40,054 కోట్లు సమకూర్చడం జరిగింది.

5) నిరుద్యోగిత రేటు: నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్ (NSS) అనే సంస్థ ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి దేశంలో ఉద్యోగిత, నిరుద్యోగితలను అంచనా వేస్తుంది. ఇటీవలి (2011-12) సర్వే ప్రకారం నిరుద్యోగుల రేటు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్లో, దేశ సగటు కన్నా ఎక్కువగా నమోదయింది. రాష్ట్రంలో ఈ రేటు 2004 – 05 వరకు పెరిగి ఆ తర్వాత మొత్తం దేశంలో లాగానే గ్రామీణ, పట్టణ ప్రాంతంలో తగ్గుతూ వస్తున్నది.

ప్రతి వెయ్యిమంది శ్రామిక శక్తిలో నిరుద్యోగులుగా ఉన్న వారి సంఖ్యను “నిరుద్యోగిత రేటు” అంటారు. 2011 – 12 సంవత్సరానికి NSS వారు వేసిన 68వ రౌండు అంచనాల ప్రకారం గ్రామీణ ప్రాంత నిరుద్యోగిత రేటు (12%), భారత గ్రామీణ నిరుద్యోగిత రేటు (17%) కన్నా తక్కువగా ఉంది. కాని పట్టణ నిరుద్యోగితా రేటు విషయంలో రాష్ట్ర నిరుద్యోగిత రేటు (43%), దేశ సగటు కన్నా (34%) ఎక్కువగా నమోదయ్యింది.

6) పేదరికము: ఆంధ్రప్రదేశ్ వివిధ నూతన పేదరిక నిర్మూలనా పథకాలకు రూపొందించడంలో అగ్రగామిగా ఉంది. సబ్సిడీలు, మహిళా సాధికారత కోసం ఇందిర క్రాంతి పథం (IKP), పేదలకు గృహ నిర్మాణం కోసం రాజీవ్ స్వగృహ పథకం, వృద్ధాప్య పింఛన్లు, ఆరోగ్యశ్రీ వంటి వైద్య పథకాలు మొదలైనవి రాష్ట్రంలో అమలవుతున్నాయి.

ప్రశ్న 2.
రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి (GSDP) అనగానేమి ? ఆంధ్రప్రదేశ్ (SGDP) సరళిని పరిశీలించండి.
జవాబు:
భారతదేశములో ఆంధ్రప్రదేశ్ వైశాల్యము మరియు జనాభా దృష్ట్యా రాష్ట్రాల్లో ఒకటిగా నిల్చింది. దేశ భూభాగంలో 4.96 శాతం భూమిని కల్గిన 8వ పెద్ద రాష్ట్రంగా ఉన్నది. రాష్ట్రము 4.6 కోట్ల జనాభాతో దేశ జనాభాలో 4.10 శాతం కల్గివుండి జనాభా దృష్ట్యా 10వ అతిపెద్ద రాష్ట్రముగాను ఉన్నది. మొత్తం భూభాగములో 40.95 శాతం వ్యవసాయ యోగ్య భూమి, 21.81 శాతం అడవులను కల్గివున్నది.

రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి (GSDP): రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి మరియు భారతదేశ స్థూల దేశీయోత్పత్తి, వాటి వృద్ధి రేటులతోపాటు రాష్ట్ర, దేశ స్థూల ఉత్పత్తి విలువ 2004-05 మరియు 2013-14ల మధ్య దాదాపు రెట్టింపు అయినట్లుగా విశదమవుతున్నది. రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తిలో నిరంతర పెరుగుదల ధోరణి కన్పిస్తున్నది. 2004-05లో 3 1,34,767 కోట్లుగా ఉన్న రాష్ట్ర ఉత్పత్తి విలువ 2013-14 నాటికి 2,50,282 కోట్లకు చేరుకొన్నది. – 2011 – 12 తర్వాత రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి జాతీయ సగటు GDP పెరుగుదల కన్నా అధికంగా నమోదు అయినది. రాష్ట్ర GSDP భారతదేశ స్థూల దేశీయ ఉత్పత్తిలో 4.36 శాతాన్ని కల్గివున్నది.

AP Inter 2nd Year Economics Study Material Chapter 9 ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి మరియు భారతదేశ స్థూల దేశీయ ఉత్పత్తి నిలకడ (2004 – 05) ధరలలో
AP Inter 2nd Year Economics Study Material Chapter 9 ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ 1

ప్రశ్న 3.
ఆంధ్రప్రదేశ్లో జనాభా మరియు తలసరి ఆదా మీ వృజ్ఞ పోకడలను తెలపండి.
జవాబు:
రాష్ట్ర తలసరి ఆదాయం. దేశ సగటు తలసరి ఆదాయం కన్నా 2, 3 సం॥లలో తప్ప మిగతా సం॥లలో అధికంగా నమోదు అయింది. దీనిని రాష్ట్రంలో పెరుగుతున్న ప్రజల జీవన ప్రమాణ సూచికగా చెప్పవచ్చు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తలసరి ఆదాయం మరియు భారతదేశ తలసరి ఆదాయం (ప్రస్తుత ధరలలో) రూ.లలో
AP Inter 2nd Year Economics Study Material Chapter 9 ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ 2

2013 – 14 సం||లో రాష్ట్ర, దేశ తలసరి ఆదాయాల మధ్య తేడా కౌ 11,417 లుగా ఉంది. జనాభా: 2011 జనాభా లెక్కల ప్రకారం 13 జిల్లాలలోని మరియు 4.96 కోట్ల జనాభాతో ఆంధ్రప్రదేశ్ దేశంలో 10వ స్థానంలో నిలిచింది.

ఆంధ్రప్రదేశ్ మరియు భారతదేశంలో దశాబ్ద జనాభా వృద్ధిరేటు (శాతంలో)
AP Inter 2nd Year Economics Study Material Chapter 9 ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ 3

ప్రశ్న 4.
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగం ప్రాధాన్యత.
జవాబు:
వ్యవసాయ రంగం: ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయం కీలక పాత్ర పోషిస్తున్నది. మన రాష్ట్రం “Bejeweled rice bowl of India” గా ప్రసిద్ధి చెందింది. ఇప్పటికీ దాదాపు 60 శాతం జనాభా వ్యవసాయాన్నే తమ ప్రధాన వృత్తిగా భావిస్తున్నారు. రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తిలో కూడా వ్యవసాయరంగ వాటా చెప్పుకోదగ్గ స్థాయిలో ఉంది.

1) రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి (GSDP) లో వాటా: భారత ఆర్థిక వ్యవస్థలో మాదిరే రాష్ట్ర GSDPలో కూడా వ్యవసాయరంగ వాటా క్రమంగా తగ్గుతున్నప్పటికీ దాని ప్రాధాన్యత నిరర్ధకమైనదిగా భావించరాదు. 2004 – 05 మరియు 2013 – 14 సం||లలో రాష్ట్ర GSDPలో వ్యవసాయ మరియు దాని అనుబంధ రంగాల వాటాను ఇతర రంగాల వాటాను ఈ క్రింది పట్టికలో చూపబడినది.

రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తిలో వ్యవసాయ రంగం, మిగతా రంగాల వాటా (%)
AP Inter 2nd Year Economics Study Material Chapter 9 ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ 4
మూలం: ఆంధ్రప్రదేశ్ గణాంక సూచిక 2014, డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, పేజీ నెం. 233 మరియు 234.
గమనిక: సంఖ్యలు 2004-05 నిలకడ ధరలలో

పై పట్టిక మరియు చిత్రమును గమనిస్తే రాష్ట్ర GSDPలో వ్యవసాయరంగ వాటా క్రమంగా తగ్గుతూ, ఆ మేరకు సేవారంగం వాటా పెరుగుతున్నట్లు అర్థం అవుతున్నది. పారిశ్రామికరంగ వాటా, పరిశీలనలోని కాలాలలో దాదాపు స్థిరంగా కొనసాగుతున్నది. 2007వ సంవత్సరం నాటికి సేవారంగం వాటా 50 శాతం స్థాయిని దాటితే 2010-11 నాటికి వ్యవసాయరంగ వాటా 25 శాతం కన్నా దిగువకు పడిపోయింది. అయితే ఇప్పటికీ రాష్ట్ర వ్యవసాయరంగ వాటా జాతీయ వ్యవసాయం వాటా కన్నా ఎక్కువ అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇప్పటికీ కూడా రాష్ట్ర GSDPలో వ్యవసాయ రంగం 1/5 వంతు వాటాను సమకూరుస్తుంది.

2) ఉపాధి కల్పన: రాష్ట్రంలోని అత్యధిక జనాభాకు వ్యవసాయమే ప్రధాన ఉపాధి మార్గము. సగాని కన్నా ఎక్కువమంది ప్రజలు ఈ రంగంపైనే ఆధారపడి పనిచేస్తున్నారు. పారిశ్రామిక, సేవారంగాలు ఎంతగా అభివృద్ధి జరిగినా, ఉపాధి కల్పనలోను, ప్రధాన ఆదాయ వనరుగా వ్యవసాయం తన ప్రాధాన్యతను కొనసాగిస్తూ ఉన్నది.

2011 జనాభా లెక్కల ప్రకారం వ్యవసాయ రంగం అటు వ్యవసాయదారులకు, ఇటు వ్యవసాయ కూలీలకు కలిపి మొత్తం 62.36 శాతం మందికి ఉపాధి కల్పిస్తున్నది. ఇప్పటికినీ దేశం మరియు రాష్ట్రాలలో 50 శాతం కన్నా ఎక్కువ మందికి వ్యవసాయమే ప్రధాన ఉపాధి మూలం.

3) భూమిని ఉపయోగించే తీరు: ఆంధ్రప్రదేశ్ 160.20 లక్షల హెక్టార్ల మొత్తం భూభాగంతో భారతదేశంలో ఎనిమిదవ అతిపెద్ద రాష్ట్రంగా ఉంది. రాష్ట్రంలో భూమిని ఉపయోగిస్తున్న తీరు స్వల్ప మార్పులతో చాలాకాలంగా దాదాపు యధాతథంగా కొనసాగుతూ ఉంది.

AP Inter 2nd Year Economics Study Material Chapter 9 ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ

4) ఆహార మరియు ఆహారేతర పంటల క్రింద ఉన్న భూమి: రాష్ట్రంలో పండే పంటలను స్థూలంగా ఆహార మరియు ఆహారేతర పంటలుగా విభజించవచ్చు. అన్ని తృణధాన్యాలు, పప్పుదినుసులు, వంటనూనెలు మొదలైనవి ఆహారపంటల క్రిందకు వస్తే, పసుపు, ప్రత్తి, చెరకు మొదలైనవి ఆహారేతర లేక వాణిజ్య పంటల క్రిందకు వస్తాయి. మొత్తం భూభాగాన్ని ఆహార, ఆహారేతర పంటల కోసం కేటాయించిన తీరునుబట్టి ఈ ప్రాంతంలో వ్యవసాయ వాణిజ్యీకరణ ఏ మేరకు జరిగిందో అంచనా వేయవచ్చు. 2013-14 సం॥లో మొత్తం 81.28 లక్షల హెక్టార్ల వ్యవసాయ భూమిలో 54. 92 లక్షల హెక్టార్లు అంటే 67.57 శాతం భూమిని ఆహారపంటల ఉత్పత్తికి కేటాయించడం జరిగింది.
వాణిజ్య పంటలను 32 శాతం వ్యవసాయ భూమిలో పండించడం జరుగుతున్నది. 2013-14లో ఆహారేతర పంటలను 32.43 లక్షల హెక్టార్లలో పండించడం జరుగుతుంది.

5) ప్రధాన పంటల ఉత్పాదకత: సగటున ఒక హెక్టారు భూమిలో పండిన పంటను ఉత్పాదకత అంటారు. ప్రధాన పంటల ఉత్పాదకత 2010-11 మరియు 2013-14 సం॥లలో మిశ్రమ సరళిని కలిగివున్నది.
వరి ఉత్పాదకత ఒక హెక్టారుకో గరిష్టంగా నెల్లూరులోను (4,051) మరియు కర్నూలులో (3,670) ఉంది. గోధుమ ఉత్పత్తి రాష్ట్రంలో అత్యల్పంగా ఉంది.

6) నీటిపారుదల: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గోదావరి, కృష్ణ, తుంగభద్ర, పెన్న మరియు వంశధార వంటి ముఖ్యమైన నదులను ప్రసాదింపబడింది. రాష్ట్రంలో అన్ని రకాల ప్రవాహాలు, నదులు, వంకలు కలిపివున్న మొత్తం నీటి పరిమాణం | 2,746 TMC లు. కాని ఇప్పటివరకు ఉపయోగించుకుంటున్న నీరు కేవలం 1,753 TMC లు. నదులే కాకుండా రాష్ట్రంలో ఇతర కృత్రిమ సరస్సులు, రిజర్వాయర్లు కూడా త్రాగునీరు, సాగునీటి అవసరాలు తీరుస్తున్నాయి.

2013 – 14 సం||నికి మొత్తం వ్యవసాయ యోగ్యమైన భూమిలో నీటిపారుదల కలిగిన నికర భూమి 46 శాతం, 65.61 లక్షల సాగుభూమిలో 30.14 లక్షల హెక్టార్లు నీటిపారుదలను కలిగివున్నాయి. నీటిపారుదల కలిగిన నికర సాగుభూమిలో 48 శాతం కాలువలు (canals), చెరువుల ద్వారా 9 శాతం మరియు అన్ని రకాల బావుల ద్వారా 40 శాతం భూమి నీటిపారుదలను పొందినది.

ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల మూలాలు (హెక్టార్లలో)
AP Inter 2nd Year Economics Study Material Chapter 9 ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ 5
జిల్లాలను పరిశీలిస్తే 4.38 లక్షల హెక్టార్ల నీటిపారుదల గల సాగుభూమితో అంటే మొత్తం జిల్లా భూభాగంలో 14.5 శాతంతో గుంటూరు జిల్లా ప్రథమ స్థానంలో ఉంది. 3.83 లక్షల హెక్టార్ల నీటిపారుదల సాగుభూమితో పశ్చిమ గోదావరి రెండవ స్థానంలో కొనసాగుతుంది. 2013-14 సం॥కి విజయనగరం మరియు అనంతపురంలు రాష్ట్రం మొత్తం మీద అతితక్కువ నీటిపారుదల భూమిని కలిగివున్నాయి.

ఇతర అంశాలు:
రాష్ట్రంలో సగటు భూకమతము 1.6 హెక్టార్లు. మొత్తం రైతుల సంఖ్యలో ఉపాంత రైతుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. పెద్ద రైతుల విషయంలో సగటు కమత పరిమాణం ఎక్కువగా ఉంది.

సంస్థాగత పరపతిలో 70 శాతం వాణిజ్య బ్యాంకులు, 20 శాతం సహకార బ్యాంకులు మరియు 11 శాతం ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల పరపతిని అందిస్తున్నాయి.
వ్యవసాయ మార్కెటింగ్లోని లోపాలను సరిచేయడానికి “రైతుబంధు పథకం”, DAATT సెంటర్లు, కంప్యూటరీకరణ, సహకార మార్కెటింగ్ మొదలైన అనేక చర్యలు చేపట్టడం జరిగింది.

రాష్ట్రం సముద్ర ఉత్పత్తులైన చేపలు, రొయ్యలు మొదలైనవాటి ఉత్పత్తి ద్వారా 3,000 కోట్లు అంటే భారతదేశ మొత్తం సముద్ర ఉత్పత్తి విలువలో 50 శాతం ఆర్జించి పెడుతున్నది.
పట్టు పరిశ్రమలోను, పట్టు ఉత్పత్తిలోను రాష్ట్రం దేశంలోనే రెండవ స్థానంలో ఉంది.

ప్రశ్న 5.
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థలో పారిశ్రామిక రంగం ప్రాధాన్యత.
జవాబు:
పారిశ్రామిక రంగం: ఏ ఆర్థిక వ్యవస్థ వృద్ధి వేగాన్నైనా పారిశ్రామిక పాత్రనే నిర్ణయిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ రకాలైన సహజవనరులు, దక్షిణ భారతదేశంలోనే పొడవైన సముద్ర తీర ప్రాంతము, అవస్థాపన సౌకర్యాలు, కమ్యూనికేషన్లు, సాంకేతిక నిపుణులు మరియు విస్తృత మార్కెట్ అవకాశాలు సమృద్ధిగా ఉన్నాయి.

ఎ) రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తిలో పారిశ్రామికరంగ వాటా: రాష్ట్ర (GSDP) లో ఆధార సం||పు 2004 – 05 ధరల ప్రకారం వివిధ సంవత్సరాలలో పారిశ్రామికరంగ వాటాను క్రింది పట్టిక తెలుపుతుంది.

రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తిలో పరిశ్రమరంగ వాటా
AP Inter 2nd Year Economics Study Material Chapter 9 ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ 6

నిరపేక్షికంగా రాష్ట్ర GSDPలో పారిశ్రామిక రంగ వాటా క్రమంగా పెరుగుతున్నది. 2004 – 05 ఆధార సం॥లో ఈ రంగ మొత్తం విలువ 7 29,124 కోట్లు మాత్రమే ఉండగా, ఒక్క 2008-09 సంవత్సరాన్ని మినహాయిస్తే 2013 – 14 వరకు నిరంతరంగా పెరిగి ఔ 51,838 కోట్లకు చేరుకుంది. 2007-08లో 23.7 శాతం ఉన్న ఈ రంగ వాటా 2013-14 నాటికి 20.7 శాతానికి తగ్గిపోయింది.

బి) ఉపాధి అవకాశాల కల్పన: ఏ ఆర్థిక వ్యవస్థలోనైనా ఒక రంగం యొక్క వాటాను ఆ రంగంపై ఆధారపడి పనిచేస్తున్న శ్రామికుల సంఖ్యను ఒక సూచికగా భావించి చెప్పవచ్చు. దేశంలోను, రాష్ట్రంలోను మొదటి నుండి పారిశ్రామిక రంగం కల్పిస్తున్న ఉపాధి శాతములో చెప్పుకోదగ్గ మార్పులు జరగలేదు. 2011 నాటికి రాష్ట్ర, జాతీయ స్థాయిలలో పారిశ్రామిక రంగం దాదాపు 21 శాతము మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నది.

సి) పరిశ్రమలకు ప్రణాళికా కేటాయింపులు: రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధికై ప్రణాళికలలో చెప్పుకోదగ్గ కేటాయింపులే జరిగాయి. 12వ ప్రణాళికలోని మొదటి వార్షిక ప్రణాళిక 2012-13లో మొత్తం ప్రణాళిక వ్యయం 48,935 కోట్ల రూపాయలలో 784 కోట్ల రూపాయలు పరిశ్రమలు మరియు ఖనిజ రంగానికి కేటాయించారు.

AP Inter 2nd Year Economics Study Material Chapter 9 ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ

డి) పారిశ్రామిక ఉత్పత్తి సూచిక: పారిశ్రామిక ప్రగతిని కొలిచే ఒక సాధనమే పారిశ్రామిక ఉత్పత్తి సూచిక (IIP). ఒక కాలంలో జరిగిన భౌతిక పారిశ్రామిక ఉత్పత్తి, అంతకుముందు కాలం కన్నా సాపేక్షికంగా ఎంత మార్పు జరిగిందో ఇది తెలుపుతుంది. రాష్ట్ర IIP విలువ 2004-05 ఆధార సంవత్సర ఉత్పత్తి ప్రకారం ముదింపు చేయబడుతుంది. ఇ) రిజిస్టరు అయిన ఫ్యాక్టరీల సంఖ్య: వివిధ సెకన్ల ప్రకారం రిజిస్టరు అయిన పనిచేసే ఫ్యాక్టరీల సంఖ్యను చూపడం జరిగింది.

ఆంధ్రప్రదేశ్లో పని చేయుచున్న ఫ్యాక్టరీల సంఖ్య
AP Inter 2nd Year Economics Study Material Chapter 9 ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ 7
పట్టిక ప్రకారం 2m(i), 2m (ii) సెక్షన్ల ప్రకారం నమోదు అయిన ఫ్యాక్టరీల సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. 2008 – 09లో 9,972 గా ఉన్నా ఈ ఫ్యాక్టరీల సంఖ్య 2011 – 12 నాటికి 11,195కు పెరిగాయి. 2010 – 11 మరియు 2011 – 12 మధ్య ఒక సంవత్సర కాలంలో కొత్తగా 837 ఫ్యాక్టరీలు స్థాపించబడ్డాయి.

ఎఫ్) ఇతర ముఖ్యాంశాలు:

  • రాష్ట్రం నుండి వెళ్ళే పారిశ్రామిక ఎగుమతుల విలువ క్రమంగా పెరుగుతున్నది. 2012-13 సంవత్సరంలో దీని విలువ 1,29,001 కోట్ల రూపాయలు.
  • దేశంలోని మొత్తం ఖాయిలా పడ్డ పరిశ్రమలో, రాష్ట్రంలోని ఖాయిలా పరిశ్రమలు 10.2 శాతం మరియు వీటి విషయంలో రాష్ట్రం నాల్గవ స్థానంలో ఉంది.
  • ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అవస్థాపనా కార్పొరేషన్ (APIIC) రాష్ట్రంలోని స్పెషల్ ఎకనామిక్ జోన్ (SEZ) లకు నోడల్ ఏజెన్సీగా పనిచేస్తున్నది. పూర్తిస్థాయి SEZ విధానాన్ని ప్రకటించిన మొట్టమొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్.
  • మార్చి, 2014 నాటికి రాష్ట్రంలో 32 SEZలు ఉండగా అందులో 10IT రంగానికి, 6 విభిన్న వస్తువులకు, 4 ఔషధాలకు, 2 బయోటిక్, 10 రంగ ప్రాధాన్యత గల SEZలు ఉన్నాయి.

ప్రశ్న 6.
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థలో సేవారంగం ప్రాధాన్యత.
జవాబు:
సేవా మరియు అవస్థాపన రంగాలు: భారతదేశంలో వలే రాష్ట్రంలో కూడా సేవారంగం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నది. పారిశ్రామిక రంగం స్థిరంగా ఉండడం వల్ల వ్యవసాయ రంగం కోల్పోతున్న రేటులో, సేవా రంగం అభివృద్ధి సాధిస్తున్నది.

ఎ) రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తిలో వాటా: 2004-05 సంవత్సరంలో రాష్ట్ర (GSDP)లో 48.54 శాతం తోను, 2013 -14లో ఇంకా పెరిగి 55.99 శాతంలో సేవా రంగం అతి ప్రధాన వాటాదారుగా కొనసాగుతున్నది. 2004 -05 సంవత్సరంలో 3 64,411 కోట్లు, రాష్ట్ర GSDPకి సమకూర్చినది ఈ రంగమే. ఈ రంగం 2013-14 నాటికి ఏకంగా కౌ 1,40,054 కోట్లు ఆర్జించి పెట్టింది. అంటే రాష్ట్ర GSDPలో సగ భాగానికన్నా ఎక్కువ ఒక సేవారంగమే సమకూరుస్తుంది.

బి) ఉపాధి కల్పన: రాష్ట్రంలో సేవారంగం ఉపాధి కల్పనలో మూడు రంగాలలో రెండవ స్థానంలో ఉండి, దాదాపు 1/4 వంతు ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నది. రాష్ట్రంలో 24.5 శాతం శ్రామిక శక్తికి ఉపాధిని కల్పిస్తున్నది. ఇది జాతీయ సగటున 25.4 శాతానికి దాదాపు సమానము.

సి) నీటిపారుదల: ప్రస్తుత రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా సాగునీటి అభివృద్ధి, నిర్వహణ అత్యంత ప్రాధాన్యతను కలిగివుంది. రాష్ట్రం ప్రధాన నదీ వనరులైన గోదావరి, కృష్ణ, తుంగభద్ర, వంశధార వంటి ప్రముఖ నదులను కలిగి “నదుల రాష్ట్రం” గా ‘గా పిలువబడుటకు అన్ని విధాల అర్హతలు కలిగి ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో జలయజ్ఞంలో భాగంగా 52 లక్షల ఎకరాలకు నీరు అందించే లక్ష్యంతో 54 భారీ, మధ్యతరహా, ఇతర ప్రాజెక్టు నిర్మాణంలో ఉన్నాయి.

పోలవరం ప్రాజెక్ట్ ఒక బహుళార్థక సాగునీటి ప్రాజెక్ట్ గా చేపట్టబడి ఇటీవల కేంద్ర ప్రభుత్వంచే “జాతీయ ప్రాజెక్ట్ హోదా” ను పొందినది.

పట్టిసీమ ప్రాజెక్ట్ చాలా కీలకమైనది. ఎందుకంటే పోలవరం ప్రాజెక్ట్ పూర్తి అయ్యేవరకు గోదావరి నదిలోని మిగులు జలాలు 80 (tmcft) లు దాకా, పట్టిసీమ ద్వారా శ్రీశైలం నుండి రాయలసీమలోని కరువు పీడిత ప్రాంతాలకు తరలించే యోచనతో రూపొందించబడినది.

ప్రభుత్వం రాష్ట్రంలో బిందుసేద్య విధానాన్ని కూడా ప్రోత్సహిస్తున్నది. ఆంధ్రప్రదేశ్ రైతులకు బిందు సేద్య పరికరాలను సబ్సిడీ రేట్లకే అందిస్తున్నది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సూక్ష్మ నీటిపారుదల పద్దతి విషయంలో దేశంలోనే ప్రథమస్థానంలో ఉండి, ప్రస్తుతం 5.63 లక్షల హెక్టార్లలో విస్తరించి ఉంది.

AP Inter 2nd Year Economics Study Material Chapter 9 ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ

డి) విద్యుచ్ఛక్తి: 2015-16 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం విద్యుత్ సప్లయిని ప్రకటించింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 16,717 MWల విద్యుత్ ఉత్పాదక సామర్థ్యాన్ని కలిగివుంది. ఇందులో 70 శాతం థర్మల్ మరియు 21 శాతం జలవనరుల ద్వారా సాధిస్తున్నది.

సింహాద్రి STPS, దామోదరం సంజీవయ్య TPS, రాయలసీమ TPS మొదలైనవి రాష్ట్రంలోని ప్రధాన థర్మల్ విద్యుత్ కేంద్రాలు, లాంకో కొండపల్లి, స్పెక్ట్రం, కోనసీమ కంబైన్డ్ సైకిల్ విద్యుత్ సంస్థ మొదలైనవి గ్యాస్ ఇంధన ఆధారిత విద్యుత్ ప్లాంట్లు, అలాగే శ్రీశైలం, టిబి డ్యామ్, పోలవరం, పెన్నహోబిలం, సీలేరు మొదలైనవి ప్రధాన హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులు.

ఇవేకాకుండా అనంతపురం జిల్లాలోని కదిరి వద్ద అమృత్ సౌర విద్యుత్ ప్లాంట్లు, అనంతపురం జిల్లాలోనే స్థాపించబడిన రామగిరి, నర్మద పవన విద్యుత్ ప్లాంట్లు మరియు పుత్లూరు ప్లాంట్లు పవన ఆధారిత విద్యుత్ను ఉత్పత్తి చేస్తున్నాయి.

ప్రశ్న 7.
ఆంధ్రప్రదేశ్లో నీటిపారుదల వసతులను తెలపండి.
జవాబు:
నీటిపారుదల: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గోదావరి, కృష్ణ, తుంగభద్ర, పెన్న మరియు వంశధార వంటి ముఖ్యమైన నదులను ప్రసాదింపబడింది. రాష్ట్రంలో అన్ని రకాల ప్రవాహాలు, నదులు, వంకలు కలిపి మొత్తం నీటి పరిమాణం 2,746 TMC లు. కాని ఇప్పటివరకు ఉపయోగించుకుంటున్న నీరు కేవలం 1,753 TMC లు. నదులే కాకుండా రాష్ట్రంలో ఇతర కృత్రిమ సరస్సులు, రిజర్వాయర్లు కూడా త్రాగునీరు, సాగునీటి అవసరాలు తీరుస్తాయి.

2013 – 14 సంవత్సరానికి మొత్తం వ్యవసాయ యోగ్యమైన భూమిలో నీటిపారుదల కలిగిన నికర భూమి 46 శాతం. 65.61 లక్షల సాగుభూమిలో 30.14 లక్షల హెక్టార్లు నీటిపారుదలను కలిగి ఉన్నాయి. నీటిపారుదల కలిగిన నికర సాగుభూమిలో 48 శాతం కాలువలు (canals), చెరువులు ద్వారా 9 శాతం మరియు అన్ని రకాల బావుల ద్వారా 40 శాతం భూమి నీటిపారుదలను పొందినది.

ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల మూలాలు (హెక్టార్లలో)
AP Inter 2nd Year Economics Study Material Chapter 9 ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ 8

జిల్లాలను పరిశీలిస్తే, 4.38 లక్షల హెక్టార్ల నీటిపారుదల గల సాగుభూమితో అంటే మొత్తం జిల్లా భూభాగంలో 14.5 శాతంతో గుంటూరు జిల్లా ప్రథమ స్థానంలో ఉంది. 3.83 లక్షల హెక్టార్ల నీటిపారుదల సాగుభూమితో పశ్చిమ గోదావరి రెండవ స్థానంలో కొనసాగుతుంది. 2013-14 సం||కి విజయనగరం మరియు అనంతపురంలు రాష్ట్రం మొత్తం మీద అతితక్కువ నీటిపారుదల భూమిని కలిగివున్నాయి.

ఇతర అంశాలు:
రాష్ట్రంలో సగటు భూకమతము 1.6 హెక్టార్లు. మొత్తం రైతుల సంఖ్యలో ఉపాంత రైతుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. పెద్ద రైతుల విషయంలో సగటు కమత పరిమాణం ఎక్కువగా ఉంది.

సంస్థాగత పరపతిలో 70 శాతం వాణిజ్య బ్యాంకులు. 20 శాతం సహకార బ్యాంకులు మరియు 11 శాతం ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు పరపతిని అందిస్తున్నాయి.
వ్యవసాయ మార్కెటింగ్ లోని లోపాలను సరిచేయడానికి “రైతుబంధు పథకం”, DAATT సెంటర్లు, కంప్యూటరీకరణ, సహకార మార్కెటింగ్ మొదలైన అనేక చర్యలు చేపట్టడం జరిగింది.

రాష్ట్రం సముద్ర ఉత్పత్తులైన చేపలు, రొయ్యలు మొదలైనవాటి ఉత్పత్తి ద్వారా 73,000 కోట్లు అంటే భారతదేశ మొత్తం సముద్ర ఉత్పత్తి విలువలో 50 శాతం ఆర్జించి పెడుతున్నది.

పట్టు పరిశ్రమలోను, పట్టు ఉత్పత్తిలోను రాష్ట్రం దేశంలోనే రెండవ స్థానంలో ఉంది.

ప్రశ్న 8.
ఆంధ్రప్రదేశ్లోని రవాణా సౌకర్యాలను వివరింపుము.
జవాబు:
1) రైల్వేలు: ఇవి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి దోహదం చేస్తూనే, మరో ప్రక్క రాష్ట్రంలో పారిశ్రామిక మరియు పర్యాటక రంగ వృద్ధికి తోడ్పడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా దక్షిణమధ్య రైల్వే, దక్షిణ రైల్వే, తూర్పు తీర రైల్వే |అనే మూడు రైల్వే జోన్ల సేవలను పొందుతున్నది. రాష్ట్రంలో మొత్తం 444 రైల్వేస్టేషన్లు మరియు 3,355 కి.మీ. మేర నెట్వర్క్ కలిగివుంది. కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక కొత్త రైల్వే జోన్ ఏర్పాటు చేయవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వ మనవి, కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ వద్ద పరిశీలనలో ఉంది.

ప్రపంచంలోనే అత్యధిక బ్రాడ్ గేజ్ ట్రాకులు విశాఖపట్టణం నుండి అనంతగిరిని కలుపుతూ తూర్పు కనుమల గుండా సాగుతున్నాయి. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని విజయవాడ రైల్వే స్టేషన్ ప్రఖ్యాతమైనదే కాక అత్యంత రద్దీ కలిగిన రైల్వే జంక్షన్గా దేశంలోనే గుర్తింపు పొందింది.

2) రోడ్డు మార్గాలు: రోడ్లు ప్రాథమిక రవాణా వ్యవస్థలో ముఖ్యమైనవే కాకుండా అత్యంత కీలకమైన అవస్థాపన సౌకర్యము కూడా. ఆర్థిక వ్యవస్థలో రోడ్ల శాస్త్రీయమైన అభివృద్ధి అనునది ఆర్థికవృద్ధికి ఒక ప్రాథమిక అవసరమేకాక, ఆర్థిక వృద్ధిని వేగవంతం కూడా చేయగలదు. దేశంలోని వివిధ రవాణా వ్యవస్థలన్నింటిలో ఒక్క రోడ్డు మార్గాలే 80 |శాతం ప్రయాణికుల, వస్తు రవాణా అవసరాలు తీరుస్తున్నాయి.

AP Inter 2nd Year Economics Study Material Chapter 9 ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ

ఆంధ్రప్రదేశ్ 42,511 కి.మీ.ల రాష్ట్ర రహదారులు, 3,144 కి.మీ.ల జాతీయ రహదార్లు, 1,01,484 కి.మీ. జిల్లా రోడ్లను కలుపుకొని మొత్తం 1,46,954 కి.మీ. విస్తారమైన నెట్వర్క్ కలిగివుంది. రాష్ట్రంలోని రోడ్లను 1998లో స్థాపించబడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా అభివృద్ధి సంస్థ (APRDC) నే నిర్వహణ బాధ్యత కలిగివుంది.

3) పౌర విమానయానము: రాష్ట్ర ప్రభుత్వం విజయవాడ, తిరుపతి, కడప మరియు రాజమండ్రి ఎయిర్పోర్టను మెట్రోయేతర ఎయిర్పోర్టుగా ఆధునీకరించుటకు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) తో అవగాహన తాఖీదు (MOU) కుదుర్చుకున్నది. తిరుపతి ఎయిర్పోర్ట్ను అంతర్జాతీయ ప్రమాణాల అనుసారం ఆధునీకరించుటకు ఎయిర్పోర్ట్ ఆఫ్ ఇండియా (AAI) ప్రతిపాదించినది. అలాగే రాజమండ్రి ఎయిర్పోర్ట్ అభివృద్ధికి కూడా (AAI) ఒక బృహత్ ప్రణాళికను సిద్ధం చేసింది.

4) సముద్ర ఓడరేవులు: భారతదేశంలో గుజరాత్ తర్వాత 972 కి.మీ.ల సముద్రతీర ప్రాంతంతో ఆంధ్రప్రదేశ్ రెండవ స్థానంలో ఉంది. రేవులు ఎగుమతులు, దిగుమతులు, అంతర్జాతీయ వ్యాపారం, ఓడల రిపేర్లు, పర్యాటకం, చేపల వేట మరియు జల క్రీడల వంటి సముద్ర కార్యకలాపాల వృద్ధికి దోహదం చేస్తాయి. రేవులు వాణిజ్యానికి సింహద్వారము వంటివి. విశాఖపట్టణం ఓడరేవు రాష్ట్రంలో అతిపెద్దదే కాకుండా, దేశంలోనే సరుకు రవాణా విషయంలో అతిపెద్ద రేవులలో ఒకటి. విశాఖపట్టణం నుండి అండమాన్ నికోబార్ దీవులలోని పోర్ట్ బ్లెయిర్కి ప్రయాణికుల సముద్ర యాత్రా వసతి కూడా కలదు.

ప్రశ్న 9.
ఆంధ్రప్రదేశ్లోని ఆర్థిక అభివృద్ధిలో ఐ.టి. (IT) రంగ ప్రాధాన్యతను తెలుపుము.
జవాబు:
IT/సాఫ్ట్వేర్ పరిశ్రమ: సాఫ్ట్వేర్ పరిశ్రమ సమాచార సాంకేతిక రంగంలోని ప్రధాన అంశము. సాఫ్ట్వేర్ పరిశ్రమలో కంప్యూటర్ సాఫ్ట్వేరు సంబంధించిన అభివృద్ధి చేయబడే వ్యాపారం, నిర్వహణ మరియు ముద్రణ అనే అంశాలు కలిసి ఇవి ఏ వ్యాపార రూపంలోనైనా ఉండవచ్చు. ఈ రంగం 1960 మొదట్లో మొదలై 1970 దశకంలో బాగా విస్తరించింది. ఈ పరిశ్రమలో ముఖ్యంగా 5 రంగాలు ఉన్నాయి. అవి:
1. సాఫ్ట్వేర్ అవస్థాపన రంగం 2. ఉద్యమిత్వ సాఫ్ట్వేర్ 3. రక్షణాత్మక సాఫ్ట్వేర్ 4. పరిశ్రమ పరిమిత సాఫ్ట్వేర్ 5.ప్రత్యేక కంపెనీ క్లయింట్గా గల సాఫ్ట్వేర్

రాష్ట్ర విభజన తర్వాత 2014, జూన్ 2న నూతనంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడి రాష్ట్ర ఐ.టి. టర్నోవర్లో 2 శాతం మరియు కేవలము 1.8 శాతం ఉద్యోగ అవకాశాలను మాత్రమే కలిగివుంది.

ఆంధ్రప్రదేశ్ భారతదేశ హైటెక్ రాజధాని, భారత సిలికాన్ లోయగా గుర్తింపు పొందినది. కాని విభజనానంతరం వైజాగ్ నగరం ఐ.టి. సెంటర్ గా అభివృద్ధి చెందుటకు అన్ని అనుకూల అంశాలు ఉన్నాయని ప్రభుత్వం ప్రకటించింది. విశాఖపట్టణం రాష్ట్ర నూతన ఐ.టి. రాజధాని అవుతుంది.

  • ప్రతి జిల్లా కేంద్రము ఒక ఐ.టి. పార్కును కలిగివుంటుంది.
  • రాష్ట్రం మొత్తం ఎగుమతుల్లో ఐ.టి. రంగం 38.22 శాతం వాటా కలిగివుంది (ఉమ్మడి రాష్ట్రం).
  • 2013 నాటికి ఐ.టి. రంగం రాష్ట్రంలో దాదాపు 3 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించింది.
  • 2013లో ఈ రంగం మొత్తం ఎగుమతుల విలువ సుమారు 36 వేల కోట్ల రూపాయలు.
  • ఐ.టి. రంగం ప్రస్తుతం ఉన్న 36,000 కోట్ల రూపాయల స్థితి నుండి 2017 నాటికి 1,50,000 కోట్ల స్థాయికి చేరగలదని అంచనా.
  • రాష్ట్ర ప్రభుత్వం ఐ.టి. మరియు బి.టి. (IT & BT)లను సమన్వయం చేసే యోచనలో ఉంది.

AP Inter 2nd Year Economics Study Material Chapter 9 ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ

ప్రశ్న 10.
ఆంధ్రప్రదేశ్లోని వివిధ సంక్షేమ పథకాలను పరిశీలింపుము.
జవాబు:
ఆంధ్రప్రదేశ్ – సంక్షేమ పథకాలు/కార్యక్రమాలు: ఏ సంక్షేమ రాజ్య లక్ష్యమైన తన ప్రజల జీవన ప్రమాణాన్ని కొనసాగించడం లేదా ఇంకా మెరుగుపరచడమే. చాలాకాలం వరకు ఆర్థికాభివృద్ధికి వ్యవసాయ, పరిశ్రమలు ప్రధాన వాహకాలుగా ఉన్నప్పటికీ, ప్రస్తుతం మానవ వనరుల అభివృద్ధికి ఉన్న ప్రాధాన్యత వల్ల సామాజిక రంగ అవస్థాపన సౌకర్యాలైన విద్య, ఆరోగ్య సంరక్షణ, పౌష్టికాహారం, నీటి సప్లయి, గృహవసతి, సామాజిక రక్షణ వంటి వాటిని మెరుగుపరచడము ద్వారానే సాధ్యం అవుతుంది. సమాజంలో సామాజిక న్యాయం, సామాజిక సమానత్వాలు సాధించాలంటే ఈ సాంఘిక అంశాలపై ప్రభుత్వం పెట్టుబడులు పెరగాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేక సాంఘిక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూపొందించి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఈ క్రింది పట్టికలో పొందుపరచడమైనది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలుపరుస్తున్న వివిధ వర్గాల వారి సంక్షేమ పథకాలు
AP Inter 2nd Year Economics Study Material Chapter 9 ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ 9

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి (GSDP).
జవాబు:
భారతదేశములో ఆంధ్రప్రదేశ్ వైశాల్యము మరియు జనాభా దృష్ట్యా రాష్ట్రాల్లో ఒకటిగా నిల్చింది. దేశ భూభాగంలో 4.96 శాతం భూమిని కల్గిన 8వ పెద్ద రాష్ట్రంగా ఉన్నది. రాష్ట్రము 4.6 కోట్ల జనాభాతో దేశ జనాభాలో 4.10 శాతం కల్గివుండి జనాభా దృష్ట్యా 10వ అతిపెద్ద రాష్ట్రముగాను ఉన్నది. మొత్తం భూభాగములో 40.95 శాతం వ్యవసాయ యోగ్య భూమి, 21.81 శాతం అడవులను కల్గివున్నది.

రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి (GSDP): రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి మరియు భారతదేశ స్థూల దేశీయోత్పత్తి, వాటి వృద్ధి రేటులతోపాటు రాష్ట్ర, దేశ స్థూల ఉత్పత్తి విలువ 2004-05 మరియు 2013 – 14ల మధ్య దాదాపు రెట్టింపు అయినట్లుగా విశదమవుతున్నది. రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తిలో నిరంతర పెరుగుదల ధోరణి కన్పిస్తున్నది. 2004-05లో ఔ 1,34,767 కోట్లుగా ఉన్న రాష్ట్ర ఉత్పత్తి విలువ 2013-14 నాటికి 2,50,282 కోట్లకు చేరుకొన్నది. 2011 – 12 తర్వాత రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి జాతీయ సగటు GDP పెరుగుదల కన్నా అధికంగా నమోదు అయినది. రాష్ట్ర GSDP భారతదేశ స్థూల దేశీయ ఉత్పత్తిలో 4.36 శాతాన్ని కల్గివున్నది.

ప్రశ్న 2.
రాష్ట్ర తలసరి ఆదాయం.
జవాబు:
రాష్ట్ర తలసరి ఆదాయం, దేశ సగటు తలసరి ఆదాయం కన్నా 2, 3 సం॥లలో తప్ప మిగతా సం॥లలో అధికంగా నమోదు అయింది. దీనిని రాష్ట్రంలో పెరుగుతున్న ప్రజల జీవన ప్రమాణ సూచికగా చెప్పవచ్చు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తలసరి ఆదాయం మరియు భారతదేశ తలసరి ఆదాయం (ప్రస్తుత ధరలలో) రూ.లలో
AP Inter 2nd Year Economics Study Material Chapter 9 ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ 10

2013 – 14 సం||లో రాష్ట్ర, దేశ తలసరి ఆదాయాల మధ్య తేడా కౌ 11,417లుగా ఉంది.
జనాభా: 2011 జనాభా లెక్కల ప్రకారం 13 జిల్లాలలోని మరియు 4.96 కోట్ల జనాభాతో ఆంధ్రప్రదేశ్
దేశంలో 10వ స్థానంలో నిలిచింది.

ఆంధ్రప్రదేశ్ మరియు భారతదేశంలో దశాబ్ద జనాభా వృద్ధిరేటు (శాతంలో)
AP Inter 2nd Year Economics Study Material Chapter 9 ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ 11

ప్రశ్న 3.
ఆంధ్రప్రదేశ్లో వృత్తివారీ శ్రమ విభజన. [Mar ’17]
జవాబు:
ఏ ఆర్థిక వ్యవస్థలోనైనా ఆర్థికాభివృద్ధి స్థాయిని ఆ ఆర్థిక వ్యవస్థలోని వృత్తివారి శ్రమ విభజన తీరు నిర్ణయిస్తుంది. ఏ ఆర్థిక వ్యవస్థనైనా వ్యవసాయ, పారిశ్రామిక మరియు సేవా రంగాలుగా విభజించవచ్చు. జనాభాను, వారు చేసే వృత్తులు లేక పనులు ఆధారంగా విభజించడాన్ని వృత్తివారీ శ్రమ విభజన లేక వృత్తివారీ జనాభా విభజన అంటారు. వ్యవసాయదారులు, వ్యవసాయ కూలీలు కలిసి మొత్తంగా 1,43,92,736 మంది అనగా 62.36 శాతము వ్యవసాయ రంగాలలో ఉపాధి పొందుతున్నారు.

AP Inter 2nd Year Economics Study Material Chapter 9 ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ

అదే విధంగా గృహ పరిశ్రమలలో పనిచేసే శ్రామికులు 6,62,608 మంది అంటే మొత్తం శ్రామిక సంఖ్యలో కేవలం 2.87 శాతము ఉన్నారు. పారిశ్రామిక మరియు సేవా రంగాల కార్యకలాపాలు పరస్పరం పూరకంగా ఉంటాయి కాబట్టి ఈ రెండు రంగాలలో మొత్తం 80,25,620 మంది కార్మికులు పనిచేస్తున్నారు. అంటే మొత్తం కార్మిక సంఖ్యలో
ఇది 34.77 శాతము.

ఇప్పటికీ వ్యవసాయ రంగంపై ఆధారపడుతున్న కార్మిక సంఖ్య ఎక్కువగా ఉంది. సేవారంగం రెండవ స్థానాన్ని కలిగి, వ్యవసాయ రంగం తర్వాత అత్యధిక సంఖ్యలో ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నది. ద్వితీయ లేక పారిశ్రామికరంగ వాటా రాష్ట్రంలో సంవత్సరాలుగా స్థిరంగా కొనసాగుతున్నది.

ప్రశ్న 4.
రాష్ట్రంలోని పర్యావరణ పరిరక్షణ అంశాలు. [Mar ’17]
జవాబు:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మంచి పర్యావరణ పరిస్థితులను కలిగి ఉంది. దీని కోస్తా తీర ప్రాంతము పొడవు దృష్ట్యా భారతదేశంలోనే రెండవది మరియు దక్షిణ భారత రాష్ట్రాలలో మొదటిది. ఇందులోని జీవ వైవిధ్యం, విభిన్నమైన జీవ జాతులను కలిగి దేశంలోనే ఒక ప్రత్యేకతను సంపాదించుకొన్నది. ఈ అమూల్య పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం తీసుకొంటున్న చర్యలు:
1) పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు: సామాజిక అటవీ నిర్వహణ (CFM), జాతీయ నదుల పరిరక్షణ ప్రణాళికా కార్యక్రమం (NRCP) మరియు జాతీయ వృక్ష సంరక్షణ కార్యక్రమము (NAP) మొదలైన కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నది.

2) చెట్టు – నీరు కార్యక్రమము: 2015లో రాష్ట్ర ప్రభుత్వం వృక్ష సంరక్షణ మరియు నీటి పరిరక్షణ కోసం ‘నీరు – చెట్టు’ పథకాన్ని అన్ని జిల్లాలో ఆరంభించెను. ప్రభుత్వం మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టి, కనీసం 90 శాతం మొక్కలు బ్రతికేటట్లు పలు చర్యలను తీసుకోవడం జరుగుతుంది.

3) సాంప్రదాయేతర శక్తి: ఆంధ్రప్రదేశ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీ వారు రాష్ట్రంలో సోలార్ మరియు పవన విద్యుత్ శక్తి మూలాలను వృద్ధి చెయ్యడం ద్వారా దేశంలోనే రాష్ట్రాన్ని ఒక పెద్ద “గ్రీన్ ఎనర్జి కారిడార్” గా మార్చుటకు నిర్ణయించిరి.

4) వన మహోత్సవం: 2013లో అటవీశాఖ వారు “రెండు మిలియన్ల మొక్కలను నాటే ఉద్దేశ్యంతో 64వ వన మహోత్సవాలను నిర్వహించారు. ఈ ఉత్సవములు అదే సమయంలో జిల్లా కేంద్రాలలోను జరుపుకున్నారు. సామాజిక అటవీ కార్యక్రమంలో ఇది ఒక భాగము.

5) వన్యమృగ సంరక్షణ: మొక్కలు, వృక్షాలు, జంతువులు మరియు పర్యావరణ వ్యవస్థలతో కూడిన జీవ వైవిధ్యాన్ని పరిరక్షించుటకు ప్రభుత్వం 13 వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు మరియు 3 జాతీయ పార్కులతో సహా 16 ప్రాంతాలను వన్యప్రాణి రక్షిత ప్రాంతాలుగా ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ జీవ వైవిధ్య సంరక్షణ సొసైటి (BIOSAP)ని ఏర్పాటు చేసి రాష్ట్రంలోని అన్ని వన్యప్రాణి సంరక్షణ కేంద్రాల బాగోగులు చూసే బాధ్యతను అప్పగించారు. శ్రీశైలం జీవావరణ రిజర్వుని గుర్తించి నిర్వహిస్తున్నారు. స్థానిక కమిటీలతో పాటు ప్రభుత్వ కమిటీలు కూడా జీవావరణ నిర్వహణ ప్రణాళిక అంతిమ ఆమోదం కోసం కృషి చేస్తున్నాయి.

6) ప్రాజెక్ట్ టైగర్: మన జాతీయ జంతువు అయిన పులుల సంఖ్య పెంచే లక్ష్యంతో ప్రాజెక్ట్ టైగర్ అనే కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. కర్నూలు, ప్రకాశం మరియు గుంటూరు జిల్లాలో విస్తరింపబడిన నాగార్జున సాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వు (NSTR) 50 కన్నా ఎక్కువ పులులకు నివాస స్థానంగా ఉంది.

7) పర్యావరణ విద్య: ప్రజలను ప్రకృతి పరిరక్షణపై జాగృతం చేయడానికి రాష్ట్రంలోని చాలా వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు, నేషనల్ పార్కుల వద్ద ప్రదర్శనశాలలు, వ్రాయబడిన బోర్డుల ప్రదర్శన, మిని ఆడిటోరియంలు మరియు లైబ్రరీల ద్వారా పర్యావరణ విద్యపై అవగాహన పెంచుతున్నారు.

ప్రశ్న 5.
ఆంధ్రప్రదేశ్లో పర్యాటక రంగ ప్రాధాన్యత. [Mar ’16]
జవాబు:
ఆంధ్రప్రదేశ్ “భారతదేశ కోహినూర్” గా మరియు పర్యాటకం విషయంలో దేశంలోనే గమ్యస్థాన రాష్ట్రంగా నిలిచింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గొప్ప రాజవంశాలకు, పవిత్ర దేవాలయాలకు, లోహపూత బొమ్మలు, నేతపని వస్తువులు, అమూల్య పాండిత్యము, కూచిపూడి నాట్యం వంటి మహోన్నత కళలకు గుర్తింపు పొందినది. రాష్ట్రం దాదాపు 300 పర్యాటక ప్రాంతాలలో అసంఖ్యాకంగా దేశీయ, విదేశీ పర్యాటకులను ఆదర్శిస్తుంది.

ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ (APTDC) అనునది రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధికి తోడ్పడుతున్న ప్రభుత్వ ఏజెన్సీ సంస్థ. ఇది పర్యాటకంలో అవస్థాపనా సౌకర్యాల కల్పన మరియు వస్తువులను సృష్టిస్తుంది. ఈ డిపార్ట్మెంట్ రాష్ట్ర ఘన చరిత్ర మరియు గత స్మృతులను సూచించే విధంగా సాంస్కృతిక, వారసత్వ, ప్రకృతి, సాహస, ఆరోగ్య మరియు గ్రామీణ పర్యాటకాల ప్రత్యేక ప్యాకేజీలను రూపొందిస్తుంది.

AP Inter 2nd Year Economics Study Material Chapter 9 ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ

పర్యాటకాన్ని ఆర్థికాభివృద్ధి ఇంజనుగా, ఆంధ్రప్రదేశ్ విజన్ -2020 భావిస్తున్నది. “ప్రపంచాన్ని ఆంధ్రప్రదేశ్కు తీసుకురావటం, ఆంధ్రప్రదేశ్ను ప్రపంచానికి తీసుకుపోవడం” అనే లక్ష్యాన్ని పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు మొదలు పెట్టింది. 2010లో నూతన పర్యాటక విధానాన్ని ప్రకటించింది. రాష్ట్రాన్ని పర్యాటక హిత గమ్యస్థానంగా మార్చుటకు చర్యలు మొదలు పెట్టిరి.

  1. తీర్ధయాత్ర పర్యాటకం
  2. వైద్య పర్యాటకం
  3. బుద్ధిస్ట్ పర్యాటకం
  4. సముద్ర తీర పర్యాటకం
  5. వ్యవసాయ పర్యాటకం
  6. పర్యావరణ పర్యాటకం
  7. విశ్రాంత పర్యాటకం.

రాష్ట్రంలోని పర్యాటక కేంద్రాలు దేశీయ, విదేశీ పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. అత్యధిక మంది దేశీయ, విదేశీ పర్యాటకులను ఏడుకొండలపై వెలసిన ప్రసిద్ధ వైష్ణవాలయం తిరుమలను కలిగి ఉన్న చిత్తూరు జిల్లా ఆకర్షించగలిగింది. దీని తర్వాత స్థానంలో ప్రసిద్ధ జ్యోతిర్లింగముతో పాటు, ఒకానొక శక్తి పీఠము కూడా అయిన శ్రీశైలం కారణంగా కర్నూలు జిల్లాను పర్యాటకులు ఎక్కువగా సందర్శిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నం, తిరుపతిలు ప్రధాన మరియు కర్నూలు, విజయవాడలు ద్వితీయ పర్యాటక గమ్యాలుగా గుర్తింపబడినవి.
అలాగే రాష్ట్రం నదీపర్యాటక కేంద్రాలను కూడా అభివృద్ధి చేస్తున్నది. ఉదాహరణకు గోదావరి నుండి పాపికొండల వరకు గోదావరి నదిపై నౌకా విహార కేంద్రం అయిన హరిత. ప్రస్తుతం ఐ.టి. రంగం మాదిరే పర్యాటక రంగం కూడా రాష్ట్ర ఖజానాకు ప్రధాన ఆదాయ వనరుగా మారింది.

ప్రశ్న 6.
ఆంధ్రప్రదేశ్ యొక్క జనాభా లక్షణాలు. [Mar ’16]
జవాబు:
జనాభా: ఆంధ్రప్రదేశ్ 4.96 కోట్ల మొత్తం జనాభాతో, దేశ జనాభాలో 4.1 శాతంగా ఉండి జనాభా రీత్యా 10వ అత్యధిక జనాభా కల్గిన రాష్ట్రంగా ఉంది.
2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో జనాభా వృద్ధిరేటు 2011 నాటికి 11.89 శాతం నుండి 9.21 శాతానికి తగ్గినది.
మరో వైపు అదే కాలానికి దేశ జనాభా 4.3 రెట్లు పెరిగింది. దీనిని బట్టి దేశంలో కన్నా రాష్ట్రంలో జనాభా వృద్ధి వేగంగా తగ్గుతున్నట్లు అర్థం అవుతున్నది.

జనసాంద్రత: ఒక చదరపు కిలోమీటరు భూభాగంలో నివసించే సగటు ప్రజల సంఖ్యను జనసాంద్రత అనవచ్చు. జనసాంద్రత = ఆ ప్రాంత జనాభా / ప్రాంత భూభాగం చదరపు కిలోమీటర్లలో.

కాబట్టి రాష్ట్ర సౌభాగ్యం లేక పేదరికానికి జనసాంద్రత ఒక సూచికగా పనిచేస్తుంది.

కాని 1971 తర్వాత జాతీయ సగటు జనసాంద్రత కన్నా తక్కువ స్థాయిని రాష్ట్రం నమోదు చేస్తున్నది. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర జనసాంద్రత 1 చ.కిమీ. కు 304 మంది ఉండగా, దేశం మొత్తంలో 382 చ.కి.మీ.కు జనసాంద్రత ఉంది.

రాష్ట్రంలోని జిల్లాలను పరిశీలిస్తే కృష్ణాజిల్లా అత్యధికంగా 518 మందితోను, పశ్చిమ గోదావరి 470 మందితోను మొదటి రెండు స్థానాలలో నిలిచాయి.

పురుష నిష్పత్తి: భారతదేశంలో లాగానే ఆంధ్రప్రదేశ్లో కూడా జనాభా సరళి పురుష జనాభాకు అనుకూలంగా ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో ప్రతి 1000 మంది పురుషులకు 997 మంది స్త్రీలు ఉన్నారు.

AP Inter 2nd Year Economics Study Material Chapter 9 ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ

శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయగోదావరి మరియు కృష్ణా జిల్లాలలో పురుషుల సంఖ్య కన్నా స్త్రీల సంఖ్య ఎక్కువ. విజయనగరం జిల్లాలో ప్రతి 1000 పురుషులకు అత్యధికంగా 1019 మంది స్త్రీలు ఉన్నారు. రాష్ట్రం మొత్తం మీద 13 జిల్లాలలో అనంతపురం జిల్లాలో అతి తక్కువ స్త్రీ, పురుష నిష్పత్తి ప్రతి 1000 పురుషులకు కేవలం 977 మంది స్త్రీలు ఉన్నారు.

వయసు ఆధారిత జనాభా: ఒక దేశంలో కాని, ప్రాంతంలో కాని మొత్తం జనాభాలో పనిచేయగల శ్రామిక శక్తిని ఇది తెలియజేస్తుంది. వయస్సు ఆధారంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనాభాను మూడు తరగతులగా విభజించవచ్చు. అవి 0-14, 15-59 మరియు 60 సంవత్సరాలు మరియు ఆపైన వయస్సు ఉన్న వారి తరగతి. జననరేట్లు అధికంగా ఉండడం, శిశు మరణాల రేటు గణనీయంగా తగ్గడం వల్ల బాలల శాతం ఎక్కువగా ఉంటుంది.

గ్రామీణ – పట్టణ జనాభా: గ్రామీణ పట్టణ జనాభా అధ్యయనము జనాభా యొక్క జీవన సరళిని ప్రతిబింబిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో కూడా భారతదేశంలో మాదిరి అధిక జనాభా గ్రామాలలోనే నివసిస్తున్నది.

2011 అంచనాల ప్రకారం విశాఖపట్నం అత్యధిక పట్టణ జనాభా 47.45 శాతము కలిగి ఉంది. కృష్ణాజిల్లా 40.81 శాతంతో రెండవ స్థానంలో ఉంది.

అక్షరాస్యత: అక్షరాస్యత ప్రజల యొక్క చదవగల, వ్రాయగల నైపుణ్యం. ఇది ఒక మంచి విద్యా వ్యవస్థకు కావలసిన కనీస అవసరం. ఒక ఆర్థిక వ్యవస్థలో అభివృద్ధి వేగానికి, అక్షరాస్యత స్థాయికి ధనాత్మక సంబంధం ఉన్నట్లు గుర్తింపబడినది.

ఆంధ్రప్రదేశ్ అటు స్త్రీ అక్షరాస్యతలోను, పురుష అక్షరాస్యతలోను, ఇటు మొత్తం అక్షరాస్యత రేటులో భారత అక్షరాస్యత రేటు కన్నా వెనుకబడి ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర అక్షరాస్యత రేటు 67.41. ఇందులో 74.83 శాతం పురుష అక్షరాస్యత కాగా, 60.01 శాతం స్త్రీ అక్షరాస్యత. అంటే జాతీయ అక్షరాస్యత రేటుకన్నా రాష్ట్ర అక్షరాస్యత 5.58 శాతం ఎక్కువ.

ప్రశ్న 7.
రాష్ట్రంలోని వివిధ వర్గాల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు.
జవాబు:
ఆంధ్రప్రదేశ్ సంక్షేమ పథకాలు/కార్యక్రమాలు: ఏ సంక్షేమ రాజ్య లక్ష్యమైన తన ప్రజల జీవన ప్రమాణాన్ని కొనసాగించడం లేదా ఇంకా మెరుగుపరచడమే. చాలాకాలం వరకు ఆర్థికాభివృద్ధికి వ్యవసాయ, పరిశ్రమలు ప్రధాన వాహకాలుగా ఉన్నప్పటికీ, ప్రస్తుతం మానవ వనరుల అభివృద్ధికి ఉన్న ప్రాధాన్యత వల్ల సామాజిక రంగ అవస్థాపన సౌకర్యాలైన విద్య, ఆరోగ్య సంరక్షణ, పౌష్టికాహారం, నీటి సప్లయి, గృహవసతి, సామాజిక రక్షణ వంటి వాటిని మెరుగుపరచడము ద్వారానే సాధ్యం అవుతుంది. సమాజంలో సామాజిక న్యాయం, సామాజిక సమానత్వాలు సాధించాలంటే ఈ సాంఘిక అంశాలపై ప్రభుత్వం పెట్టుబడులు పెరగాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేక సాంఘిక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నది.

AP Inter 2nd Year Economics Study Material Chapter 9 ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
SGDP
జవాబు:
ఒక సంవత్సర కాలంలో రాష్ట్ర భౌగోళిక ఎల్లల్లో ఆర్థిక కార్యకలాపాల వల్ల ఉత్పత్తి అయిన మొత్తం వస్తు సేవల అంతిమ విలువను రాష్ట్ర స్థూల అంతర్గత ఆదాయం అంటారు. రాష్ట్ర స్థూల అంతర్గత ఆదాయాన్ని ‘రాష్ట్ర ఆదాయం’ గా కూడా పేర్కొనవచ్చు. దీనిని రాష్ట్ర ఆర్థిక గణాంకశాఖ అంచనా వేస్తుంది. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థలోని

  1. ప్రాథమిక రంగం.
  2. పారిశ్రామిక రంగం.
  3. సేవారంగం నుంచి రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి లభిస్తుంది.

ప్రశ్న 2.
ఆంధ్రప్రదేశ్ జనసాంద్రత.
జవాబు:
ఒక చదరపు కిలోమీటరు భూభాగంలో నివసించే సగటు ప్రజల సంఖ్యను జనసాంద్రత అనవచ్చు. జనసాంద్రత = ఆ ప్రాంత జనాభా / ప్రాంత భూభాగం చ.కిమీ.లలో.
రాష్ట్ర సౌభాగ్యం లేక పేదరికానికి జనసాంద్రత ఒక సూచికగా పనిచేయును.

ప్రశ్న 3.
ఆంధ్రప్రదేశ్ అక్షరాస్యత.
జవాబు:
అక్షరాస్యత అనగా ప్రజల యొక్క చదవగల, వ్రాయగల నైపుణ్యం. ఒక ఆర్థికవ్యవస్థ అభివృద్ధి వేగానికి, అక్షరాస్యత స్థాయికి ధనాత్మక సంబంధం ఉన్నట్లు గుర్తింపబడింది. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర అక్షరాస్యత 67.11%. ఇందులో పురుష అక్షరాస్యత 74.83% మరియు స్త్రీ అక్షరాస్యత 60.01%.

ప్రశ్న 4.
ప్రాజెక్ట్ టైగర్. [Mar ’16]
జవాబు:
మన జాతీయ జంతువు అయిన పులుల సంఖ్య పెంచే లక్ష్యంతో ప్రాజెక్ట్ టైగర్ అనే కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. కర్నూలు, ప్రకాశం మరియు గుంటూరు జిల్లాలలో విస్తరింపబడిన నాగార్జున సాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వు (NSTR) 50 కన్నా ఎక్కువ పులులకు నివాస స్థానంగా ఉంది.

ప్రశ్న 5.
సర్వశిక్ష అభియాన్.
జవాబు:
రాష్ట్రంలో 6 సంవత్సరాల నుండి 14 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు అందరికీ ఉపయోగపడే విధంగా ప్రాథమిక విద్యను కల్పించడానికి 2001-02లో సర్వశిక్ష అభియాన్ పధకాన్ని ప్రవేశపెట్టారు. సామాజిక నిర్వహణ పాఠశాలల ద్వారా సాంఘీక ప్రాంతీయ లింగపరమైన వ్యత్యాసాన్ని తగ్గించడం కోసం సర్వశిక్ష అభియాన్ కృషి చేస్తుంది. ప్రస్తుతం దీని పేరు “రాజీవ్ విద్యామిషన్” గా మార్చారు.

ప్రశ్న 6.
ఏదేని సంక్షేమ పథకం.
జవాబు:
A.P. ప్రభుత్వం అనేక సాంఘిక సంక్షేమ పధకాలు అమలు చేస్తున్నది. అవి: మహిళల కోసం జననీ సురక్ష యోజన, వెనుకబడిన తరగతులకు బి.సి. వసతి గృహాలు, మైనారిటీలకు ఉర్దూ అకాడమీ, గిరిజనులకు ఐ.టి.డి.ఎ., యువతకు TRYSEM పథకం మొదలగునవి.

ప్రశ్న 7.
పర్యావరణ పర్యాటకం. [Mar ’17]
జవాబు:
ఆంధ్రప్రదేశ్ ప్రధాన పర్యావరణ పర్యాటక బిందువుగా కూడా ఉంది. మారేడుమిల్లు; నేలపట్టు; మాయందూర్; తలకోన, ఎత్తిపోతలు మొదలగునవి ప్రముఖ పర్యావరణ పర్యాటక కేంద్రాలు.

ప్రశ్న 8.
ఆంధ్రప్రదేశ్లో పౌర విమానయానం.
జవాబు:
రాష్ట్రంలో ప్రాంతాల మధ్య మెరుగైన అనుసంధానం కోసం మరియు ఆర్థికాభివృద్ధిని వేగతరం చేసే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం “ప్రాంతీయ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు ప్రతిపాదన తయారు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం విజయవాడ, తిరుపతి, కడప మరియు రాజమండ్రి ఎయిర్పోర్టులను మెట్రోయేతర ఎయిర్పోర్టులుగా ఆధునికరించుటలో ఎయిర్పోర్టు అధారిటీ ఆఫ్ ఇండియా (AAI) తో తాఖీదు కుదుర్చుకుంది.

AP Inter 2nd Year Economics Study Material Chapter 9 ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ

ప్రశ్న 9.
ఆంధ్రప్రదేశ్లో రోడ్డుమార్గాలు.
జవాబు:
రోడ్లు ప్రాథమిక రవాణా వ్యవస్థలో ముఖ్యమైనవే కాకుండా అత్యంత కీలకమైన అవస్థాపనా సౌకర్యం ఆంధ్రప్రదేశ్లో 42,511 కి.మీ.లలో రాష్ట్ర రహదార్లు 3,144 కి.మీ.ల, జాతీయ రహదార్లు 1,01,484 కి.మీ.లలో జిల్లాలను కలుపుకొని 1,46,954 కి.మీ. విస్తారమైన నెట్వర్క్ కలిగి ఉంది. దీనిని రాష్ట్ర రోడ్డు రవాణా అభివృద్ధి సంస్థనే నిర్వహణ బాధ్యత కల్గి ఉంటుంది.

ప్రశ్న 10.
ఆంధ్రప్రదేశ్లో నౌకా కేంద్రాలు. [Mar ’17, ’16]
జవాబు:
సముద్ర తీర ప్రాంతాలలో ఆంధ్రప్రదేశ్ రెండవ స్థానంలో ఉంది. విశాఖ ఓడరేవు రాష్ట్రంలో అతిపెద్దదే కాకుండా | అండమాన్ నికోబార్ దీవులలోని పోర్టబ్లెయిర్కు ప్రయాణికుల సముద్ర యాత్రా వసతి కూడా కలదు. కృష్ణపట్నం, గంగవరం, కాకినాడ రేవులు రాష్ట్రంలోని ప్రధాన ఓడరేవులు.

AP Inter 2nd Year Economics Study Material Chapter 8 పర్యావరణం మరియు సుస్థిర ఆర్థికాభివృద్ధి

Andhra Pradesh BIEAP AP Inter 2nd Year Economics Study Material 8th Lesson పర్యావరణం మరియు సుస్థిర ఆర్థికాభివృద్ధి Textbook Questions and Answers.

AP Inter 2nd Year Economics Study Material 8th Lesson పర్యావరణం మరియు సుస్థిర ఆర్థికాభివృద్ధి

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
‘పర్యావరణం’ అంటే ఏమిటో నిర్వచించి, పర్యావరణం యొక్క అనుఘటకాలను గురించి వివరించండి.
జవాబు:
ఎన్విరాన్మెంట్ (పర్యావరణం) అన్న ఆంగ్లపదాన్ని “ఎన్విరానర్” అనే ఫ్రెంచిపదం నుంచి గ్రహించడం జరిగింది. “ఎన్విరాన్” అంటే “చుట్టూ ఉన్న” అని అర్థం. మన చుట్టూ ఆవరించి ఉన్న ప్రతి విషయాన్ని సమిష్టిగా పర్యావరణం (ఎన్విరాన్మెంట్) అని పిలువవచ్చు.

జీవరాశిని ప్రభావితం చేస్తూ వున్న సజీవ, భౌతిక మూలపదార్థాల కలయికనే ‘పర్యావరణం’ అని చెప్పవచ్చు. పర్యావరణం-భావనలు:1969లో అమెరికా జాతీయ పర్యావరణ విధాన చట్టం (National Einvironmental Policy Act (NEPA) ప్రకారం పర్యావరణం భౌతిక, సాంఘిక, సాంస్కృతిక, ఆర్థిక మరియు సౌందర్యపరమైన పర్యావరణాలుగా విభజింపబడి ఉంటుంది. రావ్ మరియు ఊటెన్లు పర్యావరణాన్ని నాలుగు విధాలుగా అర్థం చేసుకోవచ్చు అని చెప్పారు.

1) భౌతిక పర్యావరణం:ఇది భౌతిక, రసాయన మరియు జీవ అంశాలైన భూమి, వాతావరణం, వృక్షసంపద, వన్యమృగాలు, చుట్టుప్రక్కల ఉన్న భూమి మరియు దాని స్వభావము, అవస్థాపనా సౌకర్యాలు, గాలి మరియు శబ్ద కాలుష్యస్థాయి మొదలైన వాటిని కలిగి ఉంటుంది.

2) సాంఘీక పర్యావరణం: ఇందులో జనాభా మరియు జనసాంద్రత, సామాజిక కూర్పు, మతపరమైన, విద్యాపరమైన, సామాజిక సౌకర్యాలు అంటే పాఠశాలలు, ఉద్యానవనాలు, వైద్యశాలలు, వినోదాత్మక మరియు సాంస్కృతిక సౌకర్యాలు వంటి అనేక అంశాలు అంతర్భాగమై ఉంటాయి.

3) ఆర్థిక పర్యావరణం:ఆర్థికాంశాలైన ఉద్యోగిత, నిరుద్యోగం, ఆదాయవనరులు, ఉత్పత్తి కారకాల లభ్యత, డిమాండులో మార్పులు, పేదరిక స్థాయి మొదలైనవి ఇందులో ఉంటాయి.

4) మనోహరమైన పర్యావరణం: ఇందులో చారిత్రాత్మక, పురావస్తు, శిల్పసంపదకు సంబంధించిన ప్రదేశాలు, ప్రకృతి దృశ్యాలు, సుందర ప్రదేశాలు ఉంటాయి. ప్రజలు వీటిని చూసి ఆహ్లాదం పొందుతారు.

పర్యావరణంలో అనుఘటకాలు వైవిధ్యమైనవే గాక ఒకదాని మీద మరొకటి ఆధారపడి పరస్పరం ప్రభావితం చేస్తూ, ప్రభావితమవుతూ ఉంటాయి. కాబట్టి పర్యావరణం అనేది ఒక సంపూర్ణమైన అన్ని శాఖలు కలిసిన విజ్ఞానశాస్త్ర అధ్యయనమని చెప్పవచ్చు.

పర్యావరణం – అనుఘటాలు:మన చుట్టూ పర్యావరణం జీవ, నిర్జీవ అనుఘటాలను, వాటి పరస్పర ఆధారిత పరస్పర ప్రభావితాలను కలిగి ఉంది. ఈ విషయాలన్నింటి అధ్యయనాన్నే ‘జీవావరణ శాస్త్రం’ అంటారు.

AP Inter 2nd Year Economics Study Material Chapter 8 పర్యావరణం మరియు సుస్థిర ఆర్థికాభివృద్ధి

1) జీవావరణ వ్యవస్థ (Eco system):ఇంగ్లాడుకు చెందిన ఎ.జి. ట్రాన్సీ అనే జీవావరణ శాస్త్రవేత్త 1935లో మొదటిసారి ‘జీవావరణం’ అనే పదాన్ని ఉపయోగించెను. జీవావరణం అనునది ఒక నిర్ధిష్ట మరియు గుర్తించదగిన భూమి యొక్క భాగము అంటే అడవులు, గడ్డిమైదానాలు, ఎడారులు, తీరప్రాంతాలు మొదలైనవి అని అర్థం. పర్యావరణంలోని వృక్షాలు మరియు జంతువులతో కూడిన జీవపర భాగాలతో పాటు నిర్జీవ భాగాలన్నింటినీ కలిపి ‘జీవావరణం’ అనవచ్చు. ఇది ఆ ప్రాంతంలోని మొక్కలు, వృక్షాలు, జంతువులు, చేపలు, సూక్ష్మజీవులు, నీరు, నేల మరియు మానవులందరి కలయిక, ఇటువంటి జీవావరణంలో కూడా ‘వృద్ధి-క్షయం’ అనే సూత్రం వర్తించి జీవ, నిర్జీవకాలు సృష్టింపబడి తిరిగి నశింపజేయబడుతూ ఒక విధమైన సంతులిత స్థితి నిర్వహింపబడుతుంది. దీనినే ‘జీవావరణ స్థిరత్వం’ అని అంటారు.

2) జీవ వైవిధ్యం (Biodiversity):జీవవైవిధ్యం అన్న పదం 1986లో అమెరికా శాస్త్రవేత వాల్టర్ రోసెన్ ప్రతిపాదించారు. భూమి జీవరాశులకు నిలయం. జీవరాశులు రకరకాల రంగులు, ఆకారాలు, ఆకృతులు, నిర్మాణాలను కలిగి ఉంటాయి. జన్యువులు, పర్యావరణం మరియు ఆవరణ వ్యవస్థలు కలిసి జీవరాశుల్లో ఉండే వైవిధ్యానికి, సంక్లిష్టతకు కారణమవుతున్నాయి.

జీవవైవిధ్యానికి ప్రత్యక్షంగానూ, పరోక్షంగాను అనేక ప్రయోజనాలుంటాయి. ప్రత్యక్షంగా ‘జీవ వైవిధ్యం’ మనకు ప్రాణాన్ని కాపాడే మందులు, ఆహారం, హార్మోన్లు, ఎంజైములు, పరిశ్రమలకు కావలసిన ముడి పదార్థాలు, అలంకరణకు పనికి వచ్చే తీగలు, మొక్కలు, మొదలైన వాటిని అందిస్తుంది.

జీవ వైవిధ్యం పరోక్షంగా కూడా ప్రయోజనాలను కలిగిస్తుంది. కర్బన స్థాయిని స్థిరపరచడం పరపరాగ సంపర్కం, జన్యు ప్రవాహం, నీటి వలయాలను నిర్వహించడం, భూగర్భజలాలను తిరిగి నింపడం, నేలను రూపొందించడం, పోషక వలయాలను స్థిరీకరించడం, కాలుష్యాలను విలీనం చేసుకోవడం, వాతావరణాన్ని క్రమపరచడం, సహజ పర్యావరణం అందించే రససౌందర్య, మానసోల్లాసాన్ని సంరక్షించడం మొదలయిన ఎన్నో రకాల పరోక్ష ప్రయోజనాలు మనకు జీవ వైవిధ్యం వల్ల లభిస్తాయి.

3) గ్రీన్ హౌస్ ప్రభావం:భూగ్రహంపై ఉన్న వాతావరణం కార్బన్ డై ఆక్సైడ్, నీటి ఆవిరి మరియు మీథైన్ వంటి కొన్ని రకాల వాయువులు ఎక్కువైన కారణంగా సూర్యుని నుండి విడుదల అయ్యే రేడియేషన్ని తమ ద్వారా లోపలికి రానిస్తాయి. కాని తిరిగి ఆ రేడియేటడ్ ఉష్ణాన్ని అట్టి పెట్టుకొని భూ ఉపరితలం నుండి బయటికి పోనివ్వవు. ఈ ప్రక్రియ వల్ల భూ ఉపరితలము ఉష్ణవికిరణాన్ని గ్రీన్ హౌస్ వాయువుల సహాయంతో గ్రహించి అన్ని’ దిశలకు వ్యాపింపచేస్తుంది. అలా కొంతభాగం తిరిగి భూమి వైపుకు, వాతావరణ దిగువ పొరలకు చేర్చబడి ఫలితంగా సగటు ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ఇటువంటి గ్రీన్ హౌస్ వల్ల ఉష్ణపెరగడం, వాతావరణం మార్పులు, ఋతుపవన గమనం మరియు వాటి సామర్థ్యం మొదలైనవి జరుగుతాయి.

4) భూమి వేడెక్కుట (Global Warming):హరితగృహ వాయులైన కార్బన్ డై ఆక్సైడ్ వాటి వల్ల భూ ఉపరితల ఉష్ణోగ్రత రోజురోజుకి పెరుగుతుంది. ఈ కార్బన్ డై ఆక్సైడ్ ముఖ్యంగా శిలాజ ఇంధనాలు మండించుట ద్వారా, అడవుల నరికివేత వల్ల ఎక్కువగా వెలువడుతుంది. దీని ప్రభావంతో ఉష్ణం గ్రహింపబడి తిరిగి భూమి నుండి పరావర్తనం చెందకుండా భూమిపైనే ఉండిపోతుంది. దీని వల్ల గత శతాబ్దం నుంచి భూ వాతావరణ ఉష్ణోగ్రత 1.1°F పెరిగింది మరియు సముద్ర మట్టము కూడా కొన్ని ఇంచుల దాకా పెరిగింది. భూమి వేడెక్కడం వల్ల వచ్చే దీర్ఘకాల ఫలితాల్లో ముఖ్యమైనవి ధృవ ప్రాంతపు మంచు కరగడం, తద్వారా సముద్ర మట్టాలు పెరిగి, తీర ప్రాంతాలు ముంపుకు గురికావడం, కొన్ని రకాల జీవులు నశించి జీవ సమతుల్యం దెబ్బతినడం, ఉష్ణ ప్రాంతాలకు తుఫాన్లు రావడం మొదలగునవి జరుగుతాయి.

5) ఆమ్ల వర్షాలు (Acid Rain):ఆమ్ల వర్షం అనగా వాతావరణంలోని నైట్రిక్, సల్ఫ్యూరికామ్లాలు ఉండవల్సిన స్థాయి కంటే ఎక్కువగా ఉండి తద్వారా పడే రసాయనిక వర్షాలే. ఇవి వృక్షజాలము తగ్గిపోవుటచే సహజ కారణాల వల్ల మరియు సల్ఫ్యూరిక్ డై ఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్లను ఎక్కువగా విడుదల చేసే వాహనాలు వాడటం వంటి మానవ చర్యల వల్ల ఏర్పడుతాయి. ఆమ్ల వర్షాలు మొక్కల పెరుగుదలను అడ్డుకొని అవి చనిపోయేలా చేస్తాయి. కాబట్టి ఆమ్ల వర్షాల వల్ల వ్యవసాయం, అడవులు దెబ్బతింటాయి. అంతేగాక నీటిలో జీవించే జీవరాశులకు హానికరంగా మారుతాయి. శిల్పాలు, భవనాలు, వాహనాలు, పైపులు, కేబుల్ వైర్లు కూడా దీనికి ప్రభావితమవుతాయి. ఆమ్ల వర్షాల వల్ల సున్నితంగా వుండే సున్నపురాయి, ఇసుకరాయి కట్టడాలు తీవ్రంగా దెబ్బతింటాయి.

AP Inter 2nd Year Economics Study Material Chapter 8 పర్యావరణం మరియు సుస్థిర ఆర్థికాభివృద్ధి

6) ఓజోన్ పొర క్షీణత:స్ట్రాటో ఆవరణంలో ఓజోన్ 03 తగ్గిపోవుటను ఓజోన్ క్షీణత అంటారు. ఈ ప్రాంతంలో హానికర క్లోరైన్ మరియు బ్రోమైన్ సంబంధ మూలాలు పెరగడం వల్ల ఓజోన్ క్షీణించడం లేక మందం తగ్గడం లేక రంధ్రాలు ఏర్పడడం జరగుతుంది. పర్యావరణ కాలుష్యం వల్ల ఓజోన్ పొర కృశించి, రంధ్రాలు ఏర్పడతాయి.

ప్రశ్న 2.
ఆర్థిక వ్యవస్థకు, పర్యావరణానికి మధ్యగల సంబంధాన్ని వివరించండి.
జవాబు:
జీవరాశిని ప్రభావితం చేస్తూ, ఉన్న సజీవ, భౌతిక మూల పదార్థాల కలయికనే పర్యావరణం అని చెప్పవచ్చు. పర్యావరణం ఆర్థిక వ్యవస్థకు అవసరమైన ముడిసరుకులను సరఫరా చేయడమే కాక ఆర్థిక వ్యవస్థనుండి ఉత్పన్నమయ్యే వ్యర్థపదార్థాలను తనలో విలీనం చేసుకుంటుంది.

ఆర్థిక వ్యవస్థ అనగా నిరంతరం పెరిగిపోయే కోర్కెలను సంతృప్తి పరచడానికి అవసరమయ్యే వస్తు సముదాయాన్ని అందుబాటులో ఉన్న పరిమిత వనరుల సహాయంతో ఉత్పత్తి చేయటానికి రూపొందించుకున్న సముచితమైన సంవిధానాన్ని ఆర్థిక వ్యవస్థగా చెప్పవచ్చు.

పర్యావరణం ఒక వైపు ఆర్థిక వ్యవస్థకు అవసరమైన ముడి పదార్థాలు సప్లయి చేయడమే కాకుండా మరో వైపు ఆర్థిక వ్యవస్థ విడుదల చేసే వ్యర్థాలను సంగ్రహిస్తుంది. ఆధునిక కాలంలో ఆర్థిక కార్యకలాపాలు నిర్లక్ష్యంగా దోపిడి తత్వంతో పెరిగిపోయి పర్యావరణ సామర్థ్యాన్ని, అది సప్లయి చేయగల వనరులను ప్రభాతం చేయును. అలాగే వ్యర్థాలను సంగ్రహించగల పర్యావరణ సామర్థ్యాన్ని కూడా తగ్గిస్తుంది. 1966లో బ్రిటీష్ ఆర్థికవేత్త ఇ. బిల్లింగ్ పర్యావరణ వనరులను విపరీతంగా వాడుకోవడం ఎంతో ప్రమాదకరమని హెచ్చరించారు.

ఆయన ఉద్దేశ్యంలో “ఈ ప్రపంచం పరిమిత జీవనాధార వనరులు కల్గిన ఒక పాత్ర వంటిది. కాబట్టి మానవాళి వనరుల వినియోగాన్ని గరిష్టంకాకుండా ఎంత కనిష్టం చేసుకుంటే అంత మంచిది. ఆర్థిక కార్యాకలాపాలు పర్యావరణంపై ఒత్తిడి ఎలా కలిగిస్తాయో ఈ క్రింది పటం తెలియజేయును.

పర్యావరణం మరియు ఆర్థిక కార్యకలాపాలు
AP Inter 2nd Year Economics Study Material Chapter 8 పర్యావరణం మరియు సుస్థిర ఆర్థికాభివృద్ధి 1
పై పటంలో పర్యావరణ సహజ వనరులను వివిధ ఆర్థిక రంగాలైన వ్యవసాయ పారిశ్రామిక మరియు సేవారంగాలకు వనరులను ముడి పదార్థాల రూపంలో పంపిణీ చేస్తుంది. ఈ రంగాలు వనరులు ఉపయోగించుకొని వస్తు సేవలను ఉత్పత్తి చేస్తున్నాయి. వస్తు సేవల ఉత్పత్తి పర్యావరణ పరిమాణాన్ని తగ్గిస్తుంది. ఉత్పత్తి పెరిగినప్పుడు పర్యావరణ భౌతిక ఉపయోగం పెరిగి, పర్యావరణ పరిమాణం తగ్గుతూ వస్తుంది. మరోవైపు ఆర్థిక కార్యకాలాపాలు పర్యావరణంలోకి వ్యర్థ పదార్థాలను మరియు వివిధ రూపాలలోని కాలుష్యాన్ని వదలుతున్నాయి. ఇది పర్యావరణ నాణ్యతను దెబ్బతీస్తుంది. ఇది పర్యావరణం యొక్క కాలుష్యాన్ని గ్రహించే శక్తిని కోల్పోయేలా చేస్తుంది.

AP Inter 2nd Year Economics Study Material Chapter 8 పర్యావరణం మరియు సుస్థిర ఆర్థికాభివృద్ధి

ప్రశ్న 3.
గాలి కాలుష్యం అంటే ఏమిటి ? అందుకు గల కారణాలు, ఫలితాలు తెల్పండి.
జవాబు:
కాలుష్యం – రకాలు:పర్యావరణానికున్న స్వాభావిక లక్షణాల్లో భౌతికంగా, రసాయనికంగా లేదా జీవపరమైన అవాంఛనీయ పరిమాణాలు కలిగితే దాన్ని కాలుష్యం అంటారు. పర్యావరణంలోని కాలుష్యం వివిధ రకాలుగా ఉంటుంది. వాటిలో వాయు, జల, నేల, శబ్ద, ఘనవ్యర్థ పదార్థాల, ఉష్ణకాలుష్యాలు ప్రధానమైనవి.

గాలిలో ఇతర కాలుష్యకారక పదార్థాల గాఢత ఎక్కువైపోయి మానవుని శ్రేయస్సును, జీవకోటికి మరియు వివిధ రూపాలలో వున్న ఆస్తులపై ప్రతికూల ప్రభావం చూపడాన్ని ‘వాయు లేక గాలి కాలుష్యం’ అంటారు.

1) వాయు కాలుష్యం:మన చుట్టూ ఉన్న వాతావరణంలో ఎన్నో రకాలైన వాయువులు ఆక్సిజన్, హైడ్రోజన్, కార్బన్ డై ఆక్సైడ్, నైట్రోజన్ మొదలయినవి ఆవరించి ఉంటాయి. భూమి చుట్టూ ఉన్న వాతావరణం ఇలాంటి వాయువుల కలయికతో ఏర్పడి, ఉమ్మడిగా వీటన్నంటిని కలిపి ‘వాయువు’ (గాలి) అని సామాన్య అర్థంగా పిలుస్తుంటారు. బరువు దృష్ట్యా చూస్తే మానవుడు రోజు తీసుకొనే పదార్థాల్లో 80% వరకు గాలి ఉంటుంది. మనుషులు సగటున ఒకరోజుకు 2200 సార్లు శ్వాసిస్తూ ఒక రోజులో సుమారు 16 నుంచి 20 కి.గ్రాల గాలిని పీల్చుకుంటూ ఉంటారు. అన్ని జీవరాశుల శ్వాసక్రియ ఈ వాయువు మీదనే ఆధారపడి ఉంటుంది. కాని మానవుని వివిధ కార్యకాలాపాల వల్ల గాలి కాలుష్యం కాబడి, అందులోని వివిధ వాయువుల సహజసిద్ధమైన కూర్పు భంగము చేయడుతుంది. కాలుష్యం వల్ల ప్రాణికోటికి అవసరమైన ప్రాణవాయువు తగ్గిపోయి, హానికారక బొగ్గుపులుసు వాయువు (కార్బన్ డై ఆక్సైడ్) మరియు నత్రజని (నైట్రోజన్) స్థాయిలు పెరిగిపోతాయి.

వాయు కాలుష్యం కారణాలు:ప్రస్తుత అంచనాల ప్రకారం సగటున ఒక సంవత్సరానికి 2 బిలియన్ టన్నుల వాయు కాలుష్య కారకాలు విడుదలవుతున్నాయి.
1) వాయు కాలుష్యం సహజమైన, మానవ నిర్మితమైన ఆధారాల వల్ల జరుగుతూ ఉంటుంది.

2) వంట చెరుకును కాల్చడం, శిలాజ ఇంధనాలను వాడడం, పారిశ్రామికీకరణ, పంటలసాగు, వాహన విసర్జకాలు, న్యూక్లియర్ పరీక్షలు, అడవులు నాశనమైపోవడం, గనుల తవ్వకం, విద్యుత్పత్తి, శీతలీకరణ పరిశ్రమలు మొదలగునవి వాయు కాలుష్యానికి ముఖ్య కారణాలు.

వాయు కాలుష్యం ప్రభావాలు:వాయు కాలుష్యం ప్రజలను, మొక్కలను, జంతువులను, జలచరాలను, ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. మానవుల ఆరోగ్యాన్ని తారుమారు చేస్తుంది. చెట్ల, మొక్కల ఆకులను పాడుచేస్తుంది. కిరణజన్య సంయోగక్రియ సరిగ్గా జరగనీయదు. మొక్క వృద్ధిని అడ్డుకుంటుంది. చారిత్రాత్మక కట్టడాలను వర్ణవిహీనం చేస్తుంది. ఇండ్లు, కార్లులాంటి వాటికుండే వెలుపలి రంగులు పేలవంగా తయారుచేస్తుంది. సహజమైన అందాలను కలిగిన ప్రదేశాల స్వచ్ఛతను, నాణ్యతను క్షీణింపచేస్తుంది.

ఉదా:ప్రసిద్ధ కట్టడం తాజ్మహల్ తెల్లటి పాలరాయి 1998లో పసుపు రంగులోకి మారడం ప్రారంభించింది. ఈ మార్పు ప్రమాదస్థాయిని కూడా మించిపోయింది. వాయుకాలుష్యం స్ట్రాటోస్పియరు, శీతోష్ణస్థితిని తారుమారు చేసి భూతాపానికి ఆమ్ల వర్షాలకు, ఓజోన్ పొర క్షీణతకు, ఉష్ణోగ్రతలు పెరుగుదలకు కరువులు రావడానికి, మొక్కల, పంటల క్రిమికీటకాల, పశువుల స్వాభావిక లక్షణాలు మారిపోవడానికి, అతినీలలోహిత కిరణ ధార్మికతకు కారణమవుతూ ఉంటుంది.

ప్రశ్న 4.
నీటి కాలుష్యానికి కారణాలు, దాని ప్రభావాలను తెలపండి.
జవాబు:
నీటి కాలుష్యం:నీటిని ‘నీలి బంగారం’ అంటారు. జీవరాశులకు గాలి, ఎండ, ఎంత అత్యవసరమో నీరు కూడా అంతే అవసరం. మానవుని శరీర బరువులో 70 శాతం నీరు ఉంటుంది. భూమి ఉపరితంలో 80 శాతం వరకు నీరు ఆక్రమించి ఉంది. భూమి మీద ఉండే నీటిలో 97 శాతం “కు సముద్రాల్లో ఉంటుంది. మిగతా 3 శాతం మాత్రమే స్వచ్ఛమైన నీరు. అందులో 2.997 శాతం మంచు డ్డ డ లో ఉంది. మిగతా 0.003 శాతం చాలా కొద్ది పరిమాణంలో మాత్రమే మానవాళి ఉపయోగానికి లభిస్తోంది. కాబట్టి నీరు అత్యంత విలువైన వనరుగా పరిగణించబడుతోంది. నీరు లేకపోతే ఈ భూమి మీద అసలు జీవమే ఉండదు. సెలయేళ్ళు, సరస్సులు, చెరువులు, నదులు, సముద్రాలు, ఆనకట్టలు, జలధారల్లో నిల్వచేసిన నీరు మొదలైనవి ఉపరితల నీటి వనరులు. భూమి లోపల ఇంకిపోయిన బావులు, గొట్టపు బావుల ద్వారా లభించే నీటిని భూగర్భజలం అంటారు. ఆర్థిక కార్యకలాపాల్లోని ప్రతిదశలో నీరు చాలా అవసరం.

AP Inter 2nd Year Economics Study Material Chapter 8 పర్యావరణం మరియు సుస్థిర ఆర్థికాభివృద్ధి

కొన్ని పదార్థాలు గాని, కారకాలు గాని, నీటిలో ఎక్కువగా చేరిపోయి, నీటి యొక్క స్వచ్ఛతను తగ్గించివేసి దానిని ఆరోగ్యానికి హానికరంగాను, వాడుకోవడానికి కూడా పనికి రాకుండా మార్చివేస్తాయి. దానినే నీటి కాలుష్యంగా చెప్పవచ్చు. మానవ ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతుండటంతో, నీరు వినియోగానికి కూడా పనికిరానంతగా కలుషితమవుతుంది. నీరు నాణ్యతను కోల్పోయి, వ్యవసాయానికేకాక, త్రాగటానికి కూడా పనికిరాకుండా పోతుంది. ఆర్థిక కార్యకాలాపాలు విస్తరించడంతో ఉపరితంలో ఉన్న నీరే కాకుండా భూగర్భ జలం కూడా కలుషితమౌతుంది.

నీటి కాలుష్యం – కారణాలు:గృహాలలో వ్యర్థాలు, మానవ వ్యర్థాలు, మేటవేయడం, పారిశ్రామిక వ్యర్థాలు, రసాయనిక ఎరువులు, క్రిమిసంహారకాలు, ప్రమాదవశాత్తు సముద్రంలో చిందిపోయే నూనెలు, విషపూరితమైన లోహాల మూలకాలు, గనుల తవ్వకం వల్ల వచ్చే వ్యర్థాలు, మొదలగు వాటి వల్ల నీరు కలుషితమవుతుంది.

నీటి కాలుష్యం – ప్రభావాలు :

  1. నీటి నుంచి పుట్టే వ్యాధులను వ్యాపింపచేస్తుంది. తద్వారా వైద్యఖర్చుల రూపంలో అధిక ఆర్థిక భారం మోపుతుంది.
  2. త్రాగు నీటి స్వచ్ఛతను క్షీణింపచేస్తుంది. ఆర్థిక కార్యకలాపాల్లో ప్రత్యక్షంగా ఉపయోగించడానికి కూడా పనికిరాకుండా పోతుంది.
  3. సముద్ర ఉత్పత్తులు కలుషితమై తినడానికి వీలులేని ప్రమాదకరమైనవిగా మార్చేస్తుంది. తద్వారా ఎగుమతులు తగ్గి, విదేశీ మారక ద్రవ్యం కూడా తగ్గుతుంది.
  4. నీటిలోని ఆక్సిజన్ని తగ్గిస్తుంది. అది సముద్ర వాతావరణంలోని ఉష్ణోగ్రత మార్పునకు దారి తీసి, నీటిలో జీవించే జీవుల పునరుత్పత్తి తద్వారా దేశ సముద్ర ఉత్పాదక విలువను ప్రభావితం చేస్తుంది.
  5. మానవులు పనిచేసే రోజులు అనారోగ్యం వల్ల తగ్గిపోతాయి. తద్వారా ఉత్పత్తి కార్యక్రమాలు తగ్గిపోతాయి.

ప్రశ్న 5.
‘ధ్వని కాలుష్యం’ అంటే ఏమిటో నిర్వచించి, అది పర్యావరణ స్వచ్ఛతను ఎలా కలుషితం చేస్తుందో వివరించండి.
జవాబు:
ధ్వని కాలుష్యం కారకాలు:ధ్వని కాలుష్యం (ఇంట, బయటా) ఉంటుంది. గృహోపకరణాల వాడకం వల్ల, లౌడ్ స్పీకర్ల వాడకం, గడియారం అలారం, శబ్దాల వల్ల ఊపిరి పీల్చడం, మాట్లాడటం, శబ్దాలు మొదలైనవి ఇంటిలోపల ధ్వనులకు ఆధారాలు. బయటి ధ్వని కాలుష్యం ముఖ్యంగా థర్మల్ ప్లాంటు, గనుల త్రవ్వకం, విమానాశ్రయాలు, వివిధ రవాణా సాధనాల ద్వారా ఏర్పడుతుంది.

ధ్వని కాలుష్యం – ప్రభావాలు:ధ్వని కాలుష్యం పర్యావరణ స్వచ్చతను భూమిమీద జీవించే ప్రాణులను ప్రభావితం చేస్తుంది. ధ్వని కాలుష్యం అనేక ప్రభావాలకు దారితీస్తుంది. అందులో ముఖ్యమైనవి.

  1. సంగీతం, భాషణల యొక్క తియ్యదనం, ఇంపు నశించిపోతుంది.
  2. వార్తా ప్రసార శ్రవణాన్ని అడ్డుకుంటుంది.
  3. తాత్కాలికంగా కాని, శాశ్వతంగా కాని వినికిడి శక్తిని కోల్పోయే ప్రమాదం వుంది.
  4. మానవుని శరీరంలోని వివిధ వ్యవస్థలు చేసే పనులకు అడ్డుపడుతుంది. నరాలపై ఒత్తిడి పెరగడం, నిద్రలేకుండా పోవడం, జీర్ణక్రియలు సరిగా లేకపోడం, రక్తపోటులాంటి అనారోగ్య పరిస్థితులు ధ్వని కాలుష్యం వల్ల కలుగుతాయి.
  5. నాడి సక్రమంగా కొట్టుకోకపోవడానికి లేదా వేగంగా కొట్టుకోవడానికి, రక్తంలో కొవ్వు శాతం పెరగడానికి కారణమవుతుంది.
  6. గర్భస్థ శిశువులకు సరిచేయలేనటువంటి ప్రమాదాలను కలుగచేస్తుంది.

AP Inter 2nd Year Economics Study Material Chapter 8 పర్యావరణం మరియు సుస్థిర ఆర్థికాభివృద్ధి

ప్రశ్న 6.
పర్యావరణ క్షీణతకు గల ఆర్థిక కారణాలు ఏవి ?
జవాబు:
ఆర్థికాభివృద్ధి, పర్యావరణ క్షీణత లేదా కాలుష్యం ఒకే దిశలో పయనిస్తాయి. విచక్షణారహితంగా, సహజ వనరులను అతిగా ఉపయోగించడం వల్ల భౌతిక పర్యావరణం క్షీణిస్తుంది. పర్యావరణ క్షీణత ప్రభావాలను మనం అనేక విధాలుగా చూడవచ్చు. కాలష్యాల దుష్ఫలితాలను క్రింద వివరించడం జరిగింది.

1) మానవ ఆరోగ్యంపై ప్రభావాలు:పర్యావరణ క్షీణత, మానవ ఆరోగ్యంపై తీవ్రంగా ప్రభావం చూపుతున్నందున, శ్రామికలు తమ పనులకు హాజరు కాలేకపోతున్నారు. అనారోగ్య కారణాలు, శ్రామికుల సామర్థ్యాన్ని తగ్గించగా అది | అల్ప ఉత్పాదకతకు దారితీస్తుంది.

ఎ) వాయు కాలుష్యం:వాయు కాలుష్యకారకాలైన కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్లు, హైడ్రోకార్బన్లు, కణరూపద్రవ్యం మొదలైనవి శ్వాసకోశం ద్వారా మానవశరీరంలోకి నేరుగా ప్రవేశించి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. ఉబ్బసం, ఊపిరితిత్తుల క్యాన్సర్, చర్మానికి చిరాకును కలిగించి బాధపెట్టే అలర్జీ మొదలైన వ్యాధులకు వాయు కాలుష్యమే
కారణం.

బి) నీటి కాలుష్యం:వ్యాధులను వ్యాపింపచేసే సాధనాలలో అతి ముఖ్యమైనది నీరు. వివిధ వ్యాధులను కలిగించే వైరస్, బ్యాక్టీరియా, ప్రోటోజోవాలాంటి సూక్ష్మక్రిములు నీటి ద్వారానే వ్యాపిస్తాయి. ఈ సూక్ష్మక్రిముల వల్ల విరోచనాలు, టైఫాయిడ్, కలరా, కామెర్లులాంటి వ్యాధులు సంక్రమిస్తాయి.

సి) ధ్వని కాలుష్యం:ధ్వని కాలుష్యం ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. పెద్దశబ్దాలు నిద్రాభంగాన్ని కలిగించి, ఆరోగ్యం మీద ప్రభావాలను కలిగిస్తాయి. ధ్వని కాలుష్యం వల్ల వినికిడి దెబ్బ తినడం, పనిపాటల్లో, సంభాషణలో అంతరాయాన్ని, ఏకాంతానికి భంగం, నిద్రాభంగాన్ని బాధను లేదా చిరాకును కలిగిస్తుంది. అలాగే ఏకాగ్రతకు భంగం కలిగించడం, రక్తపోటు, గుండెవేగం పెరగడంలను కలుగ చేస్తుంది.

2) వ్యవసాయంపై ప్రభావం:పర్యావరణ క్షీణత వల్ల వ్యవసాయరంగం దెబ్బతింటుంది. వ్యవసాయ ఉత్పాదకత, వ్యవసాయ ఉత్పత్తుల నాణ్యత తగ్గిపోతాయి.

ఎ) వాయు కాలుష్యం:వాయు కాలుష్యకారకాలైన సల్ఫర్-డై-ఆక్సైడ్ వదిలే పొగలు మొక్కలను దెబ్బతీస్తాయి. ముఖ్యంగా మొక్కలలోని లెట్యూస్, బార్లీ, వైట్ – ఫైన్ మొదలైనవి ఈ పొగల వల్ల తీవ్రంగా ప్రభావితం అవుతాయి. సాధారణంగా వాయుకాలుష్యం మొక్కల ఆకులను దెబ్బతీస్తుంది. మొక్కల ఆకులలోని పత్రహరితాన్ని కోల్పోయి అవి పసుపు పచ్చగా మారతాయి. ఈ విధంగా వ్యవసాయ ఉత్పత్తిని వాయుకాలుష్యం తగ్గిస్తుంది. వాతావరణంలో మార్పులకు వాయుకాలుష్యం కారణమని అనేక సూచికలు తెలియచేస్తున్నాయి. ఆమ్లవర్షాలకు కారణం వాయు కాలుష్యమే. వాతావరణంలో మార్పులు, ఆమ్ల వర్షాలు వ్యవసాయ ఉత్పత్తిని తగ్గిస్తాయి.

బి) నీటి కాలుష్యం:నీటి కాలుష్యం వ్యవసాయభూముల ఉత్పాదకతను అధికంగా దెబ్బతీస్తుంది. కలుషిత నీటిలో నిర్జీవ లవణాలు, ముఖ్యంగా క్లోరైడ్ ఉంటుంది. ఈ నీరు పంట పొలాలలోకి ఇంకి ఆవిరైపోతే లవణాలు మాగాణి భూమిలో కేంద్రీకృతం అవుతాయి. ఈ విధంగా లవణాలు భూమిలో పేరుకుపోయి కేంద్రీకృతమై, భూసారం తగ్గి, సాగుభూమి బీడుబారిపోతుంది.

సి) నేల కాలుష్యం:నేలకోత, లవణీకరణ, ఎడారీకరణ మొదలైనవి భూమి నాణ్యత, సాగుభూమి పరిమాణాన్ని తగ్గిస్తాయి. గనుల నిర్వహణ కూడా పంటపొలాలను తగ్గించి భూమికోతకు కారణమవుతున్నది. కావున భూకాలుష్యం పంటపొలాల విస్తీర్ణాన్ని తగ్గించడంతో పాటు వ్యవసాయ ఉత్పత్తిని తగ్గిస్తుంది.

3) పరిశ్రమలపై ప్రభావాలు:పర్యావరణ కాలుష్యం పారిశ్రామిక ఉత్తత్త్పిని తగ్గిస్తుంది. పారిశ్రామిక ఉత్పత్తుల నాణ్యత కూడా దీని వల్ల క్షీణిస్తుంది.

ఎ) వాయు కాలుష్యం:భవనాలు, కార్లు, వస్త్రాలు, మొదలైనవి గాలిలోని వ్యర్థపరమాణువుల వల్ల ప్రభావితం అవుతున్నాయి. సల్ఫర్ ఆక్సైడ్లు భవనాల తయారీలో ఉపయోగపడు పాలరాయి, సున్నపురాళ్ల క్షీణతకు కారణం అవుతున్నాయి. సల్ఫర్ ఆక్సైడ్ ప్రభావం వల్ల వస్త్రాలు, తోళ్లు, స్టీలు మొదలైనవి దెబ్బతింటున్నాయి. నైట్రోజన్ ఆక్సైడ్ సున్నితమైన రంగులను వెలసిపోయేటట్లు చేస్తుంది. వాయు కాలుష్యం పరిశ్రమల, యంత్రాల తరుగుదలకు కారణమవటంతో పాటు, పారిశ్రామిక ఉత్పత్తుల నాణ్యతను తగ్గిస్తుంది.

బి) నీటి కాలుష్యం:కలుషితమైన నీరు, పరిశ్రమలకు తక్కువగా ఉపయోగకరంగా ఉంటుంది. భిన్న పరిశ్రమలలో ఉపయోగపడే నీటి నాణ్యత భిన్నరకాలుగా ఉంటుంది. చల్లటి నీటిలో సాధారణంగా తక్కువ శుభ్రత కలిగి ఉంటాయి. అవసరం లేని వేడిమి, పదార్థాలని తీసివేసే గుణం వున్న నీరు పరిశ్రమలకు ఉపయుక్తం కాదు. కలుషిత నీటి వల్ల పరిశ్రమలలో వ్యయాలు ఎక్కువగా అవుతాయి. నీటిని శుద్ధిచేయటం, దెబ్బతిన్న యంత్ర సామాగ్రిని బాగుచేయటం, పారిశ్రామిక ప్రక్రియలో సర్దుబాటు వల్ల పరిశ్రమల వ్యయాలు పెరుగుతాయి.

సి) నేల కాలుష్యం:ఖనిజాలు, ఖనిజనూనెలు భూమిలో అంతర్భాగాలు. వీటిని ఉపయోగిస్తే అవి శాశ్వతంగా కోల్పోవడం జరుగుతుంది. శక్తిని ఉత్పత్తి చేయటానికి బొగ్గు, పెట్రోలియం ఉత్పత్తులను ఉపయోగిస్తారు. వివిధ ఖనిజాలను పరిశ్రమల్లో ముడి పదార్థాలుగా ఉపయోగించటం జరుగుతుంది. విచక్షణా రహితంగా ఈ వనరులను ఉపయోగిస్తే, ఇవి హరించుకుపోయి పారిశ్రామిక అభివృద్ధిని తగ్గిస్తాయి.

4) పశుసంపదపై ప్రభావాలు:పర్యావరణ కాలుష్యం పశు పక్ష్యాదుల ఆరోగ్యంపై దుష్ప్రభావాలను కల్గిస్తుంది. పశుపక్ష్య సంబంధమైన ఉత్పత్తులు కూడా తగ్గుతాయి. పశు ఆరోగ్యానికి అతి ప్రమాదకరమైన కాలుష్యకం ఫ్లోరైడ్ పాడి పశువులు ఫ్లోరైడ్ వల్ల అతిగా ప్రభావితమై, పాల ఉత్పత్తులు తగ్గిస్తాయి. ఫ్లోరైడ్ వల్ల వచ్చే ‘ఫ్లోరోసిస్’ అనే వ్యాధి వల్ల పళ్లు, ఎముకలు ప్రభావితమై అవిటి అవడం జరుగుతుంది.

5) సముద్ర ఆహార పదార్థాలపై ప్రభావం:నీటి కాలుష్యం మత్స్యవనరుల మీద వ్యతిరేక ప్రభావం చూపుతుంది. నీటిని కలుషితం చేసే విషపదార్థాలు నీటిలో ఆక్సిజన్ పరిమాణం తగ్గించడం వల్ల నీటి ఉష్ణోగ్రతలో మార్పులు వచ్చి చేపల పునరుత్పత్తిని దెబ్బతీయటమే కాకుండా అవి కలుషితమై భుజించడానికి కూడా పనికిరాకుండా చేస్తుంది.

6) ఇతర ప్రభావాలు:పై ఆర్థిక ప్రభావాలే కాకుండా, ఇతర పదార్థాలు కూడా పర్యావరణ క్షీణత వల్ల ఏర్పడతాయి. ఇది జీవవైవిధ్యాన్ని తగ్గిస్తుంది. జీవవైవిధ్యంలోని విభిన్న జంతువులు జీవరాశులు, మొక్కలు ప్రభావితం చేయబడి, వాటి మధ్య అంతర్గత సంబంధాలు దెబ్బతింటాయి. ఈ కారణాల వల్ల పరస్పర ఆధారమైన, సున్నితమైన ఆహార గొలుసులోని బంధం తెగిపోవచ్చు లేదా బలహీనం కావచ్చు.

AP Inter 2nd Year Economics Study Material Chapter 8 పర్యావరణం మరియు సుస్థిర ఆర్థికాభివృద్ధి

ప్రశ్న 7.
పర్యావరణ కాలుష్యానికి దారితీసిన కారకాలు ఏమిటి ?
జవాబు:
పర్యావరణ క్షీణత, వాతావరణం కాలుష్యం కన్నా కొద్దిగా భిన్నమైనవి. పర్యావరణ నాణ్యత తగ్గడాన్ని క్షీణత అంటాము. కాని ప్రకృతి కొన్ని హానికారక మూలకాలతో కాలుష్యం అవడాన్ని కాలుష్యం అనవచ్చు. పర్యావరణ మార్పులు ఆర్థికాభివృద్ధి, జనాభా వృద్ధి, నగరీకరణ, సాంద్ర వ్యవసాయం పద్ధతులు, విద్యుత్ వాడకం పెరగడం మరియు రవాణా వంటి అనేక కారణాల వల్ల ఏర్పడవచ్చు. పర్యావరణ క్షీణతకు ప్రాధమిక కారకాలను క్రింది విధంగా చర్చించవచ్చు.

1) సాంఘీక కారణాలు:పర్యావరణ క్షీణతకు కారణమైన సాంఘిక కారణాలను సంక్షిప్తంగా క్రింద వివరించడం జరిగింది.

ఎ) జనాభా:ఆర్థికాభివృద్ధి జరగాలంలే జనాభాయే మూలం. అయితే, ఒక హద్దు దాటి పెరిగితే పర్యావరణ క్షీణతకు కూడా జనాభాయే ముఖ్య కారణమవుతుంది. కాబట్టి పెరుగుతున్న జనాభా జీవ సహాయం వ్యవస్థల మధ్య సంబంధాన్ని స్థిరీకరించాలి. లేకుంటే అభివృద్ధి కార్యక్రమాలు, నవకల్పనలు, సత్ఫలితాలను ఇవ్వలేవు.
ప్రపంచ భూభాగంలో 2.4% ఉన్న భారతదేశం ప్రపంచ జనాభాలో 17% జనాభాను పోషిస్తుంది. ప్రస్తుత భారత జనాభా పెరుగుదల రేటు 1.77 (2011 జనగణన). ఈ రేటు భారతదేశం ఎదుర్కొనే జనాభా సమస్యను సూచిస్తుంది. కాబట్టి జనాభా, పర్యావరణ సంబంధాలను దృష్టిలో ఉంచుకొని జనాభా నియంత్రణకు ఉధృత చర్యలను (Vigourous Drive) చేపట్టవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.

బి) పేదరికం:పర్యావరణ క్షీణతకు పేదరికం కారణం మరియు ఫలితం కూడా అని చెప్పవచ్చు. పేదరికానికి, పర్యావరణానికి ఉన్న చక్రరూప సంబంధం అతి క్లిష్టమైన దృగ్విషయం. అసమానతలు, వనరుల క్షీణతని పెంపొందిస్తాయి. ఎందుకంటే ధనికుల కంటే పేదలు ఎక్కువగా సహజ వనరులపై ఆధారపడతారు. కాబట్టి సహజ వనరలు తగ్గుతాయి. పేదవారికి ఇతర వనరుల ద్వారా సరైన ఫలితాలు పొందే అవకాశం లేదు. దేశంలో రంగరాజన్ కమిటీ ప్రకారం 29.5 శాతం మరియు సురేష్ టెండూల్కర్ కమిటీ ప్రకారం 21.9% (2011-12)గా పేదరిక శాతాన్ని అంచనా వేశారు. కానీ నిరపేక్ష పేదరిక పరిమాణం అంటే దారిద్య్ర రేఖకు దిగువన నివసించే వారి మొత్తం సంఖ్య నెమ్మదిగా తగ్గుతూ వస్తోంది.

2) నగరీకరణ (Urbanization):గ్రామాలలో లాభసాటి ఉద్యోగవకాశాలు లేనందువల్ల పేదకుటుంబాలు పట్టణాలకు తరలి వెళ్ళడం జరుగుతోంది. అందువల్ల జీవావరణంపై ఒత్తిడి పెరుగుతుంది. మెగా సిటీలు లేదా పెద్ద నగరాలు పెరగటంతో పాటు మురికివాడలు కూడా విస్తృతమవుతాయి. 2001 జనగణన ప్రకారం 28.6 కోట్ల ప్రజలు నగరాల్లో నివసిస్తున్నారు. శాతంలో చెప్పాలంటే 27.8% మంది అన్నమాట. అదే 2011 జనగణన ప్రకారం 37.7 కోట్లకు (30%) పెరిగారు. ఈ విధమైన శీఘ్ర ప్రణాళికా రహిత పట్టణాలు పెరుగుదల, పట్టణాల పర్యావరణ ల క్షీణతకు దారితీస్తుంది.

3) ఆర్థిక అంశాలు (Economic Factors):పర్యావరణ క్షీణతకు చాలా వరకు మార్కెట్ వైఫల్యమే కారణం, అంటే పర్యావరణ వస్తు, సేవలకు సంబంధించి మార్కెట్ లేకపోవటమే లేదా మార్కెట్ సమర్థవంతంగా పనిచేయలేకపోవటమే కారణంగా చెప్పవచ్చు. ప్రైవేటు, సాంఘిక వ్యయాల (Social costs or benefits) వల్ల వినియోగం, ఉత్పత్తుల్లో బహిర్గత ప్రభావాలు ఏర్పడి పర్యావరణ క్షీణతకు కారణమవుతున్నాయి. మార్కెట్ వైఫల్యానికి స్పష్టంగా నిర్వచించని ఆస్తి హక్కు ఒక కారణం. అంతేకాకుండా ధరల నియంత్రణ, సబ్సిడీల వల్ల మార్కెట్ వక్రీకరణ ఫలితంగా సాధించవలసిన పర్యావరణ లక్ష్యాలను పెంచుతున్నాయి.

తత్ఫలితంగా సహజ వనరులు (ఖనిజ నూనెలు, ఖనిజాలు) తగ్గిపోవడం, నీరు, గాలి, భూమి, కలుషితమవటం ఫలితంగా ఆరోగ్యం దెబ్బతినడంతో పాటు జీవావరణ వ్యవస్థ నాణ్యత తగ్గిపోతుంది.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
వివిధ పర్యావరణ భావనలను వివరించండి.
జవాబు:
1969లో అమెరికా జాతీయ పర్యావరణ విధాన చట్టం (National Environmental Policy Act (NEPA) ప్రకారం పర్యావరణ భౌతిక, సాంఘిక, సాంస్కృతిక, ఆర్థిక మరియు సౌందర్యపరమైన పర్యావరణాలుగా విభజింపబడి ఉంటుంది. రావ్’ మరియు ఊటెన్లు పర్యావరణాన్ని నాలుగు విధాలుగా అర్థం చేసుకోవచ్చు అని చెప్పారు.

1) భౌతిక పర్యావరణం:ఇది భౌతిక, రసాయన మరియు జీవ అంశాలైన భూమి, వాతావరణము, వృక్షసంపద, వన్యమృగాలు, చుట్టప్రక్కల వున్న భూమి మరియు దాని స్వభావము, అవస్థాపనా సౌకర్యాలు, గాలి మరియు శబ్ద కాలుష్య స్థాయి మొదలైన వాటిని కలిగి ఉంటుంది.

2) సాంఘిక పర్యావరణము:ఇందులో జనాభా మరియు జనసాంద్రత, సామాజిక కూర్పు, మతపరమైన, విద్యాపరమైన, సామాజిక సౌకర్యాలు అంటే పాఠశాలలు, ఉద్యానవనాలు, వైద్యశాలలు, వినోదాత్మక మరియు సాంస్కృతిక సౌకర్యాలు వంటి అనేక అంశాలు అంతర్భాగమై అంటాయి.

AP Inter 2nd Year Economics Study Material Chapter 8 పర్యావరణం మరియు సుస్థిర ఆర్థికాభివృద్ధి

3) ఆర్థిక పర్యావరణం:ఆర్థికాంశాలైన ఉద్యోగిత, నిరుద్యోగం, ఆదాయవనరులు, ఉత్పత్తి కారకాల లభ్యత, డిమాండులో మార్పులు, పేదరికస్థాయి మొదలైన అంశాలు ఇందులో ఉంటాయి.

4) మనోహరమైన పర్యావరణం:ఇందులో చారిత్రాత్మక, పురావస్తు, శిల్ప సంపదకు సంబంధించిన ప్రదేశాలు, ప్రకృతి దృశ్యాలు, సుందర ప్రదేశాలు ఉంటాయి. ప్రజలు వీటిని చూసి ఆహ్లాదం పొందుతారు.

పర్యావరణంలో అనుఘటకాలు వైవిధ్యమానమై గాక ఒకదాని మీద మరొకటి ఆధారపడి పరస్పరం ప్రభావితం చేస్తూ, ప్రభావితమవుతూ ఉంటాయి. కాబట్టి పర్యావరణం అనేది ఒక సంపూర్ణమైన అన్ని శాఖలు కలిసిన విజ్ఞానశాస్త్ర అధ్యయనమని చెప్పవచ్చు.

ప్రశ్న 2.
నేల లేక భూమి కాలుష్యం.
జవాబు:
భూపటలంలోని పై పొరలను ‘నేల’ లేదా ‘మృత్తిక’ అంటారు. రాళ్ళు నిరంతరం భౌతిక, రసాయనిక, జీవ శైధిల్యానికి గురవుతూ ఉండడం వల్ల నేల ఏర్పడింది. ప్రకృతి మానవునికిచ్చిన వరమే నేల నేల ప్రాణంతో ఉన్న (సజీవ) వనరు.

నేల నాణ్యత కొన్ని ప్రతికూల మార్పులకు గురి అయి అందులోని సహజ మూలకాల కూర్పు తారుమారు కావడం తద్వారా భూమి ఉత్పాదకత తగ్గడమే “నేల కాలుష్యమని” నిర్వచించవచ్చు.

నేల కాలుష్యానికి కారణాలు:నేల కాలుష్యం అనేది మృత్తికా క్రమక్షయ వల్ల ఏర్పడుతుంది. మృత్తికా క్రమక్షయం అనేది నేల ఉపరితలంలోని సారవంతమైన పొరలు కోతకు గురిచేసి, భూమి నిస్సారంగా మార్చడం వల్ల జరుగుతుంది. ఇది అడవుల నరికివేత, విస్తృత వ్యవసాయం వల్ల, గనుల త్రవ్వకం మొదలగు వాటి వల్ల ఏర్పడుతుంది. అదే విధంగా నేల కోతకు ఎడారీకరణ కూడా కారణమే. దీని వల్ల నేల జీవంలేకుండా ఇసుక సముద్రంగా తయారవుతుంది. ఎడారీకరణ అనేది పశువులను ఎక్కువగా మేపడం వల్ల తక్కువ సారం కలిగిన నేలలనే ఎక్కువగా ఉపయోగించడం వల్ల, క్షారీకరణ, లవణీకరణ మొదలగు వాటి వల్ల ఏర్పడుతుంది.

అధికంగా రసాయనిక ఎరువుల, క్రిమిసంహారక మందుల వాడకం వల్ల వివిధ రసాయనాలు, ఆమ్లాలు, క్షారాలు, భూమిలోకి చొచ్చుకుపోయి భూమికి ఉండే సహజ రసాయనిక ధర్మాలు మార్పుచెంది మొక్కలు, పంటల నాశనానికి దారితీస్తుంది. వ్యర్థపదార్థాలతో భూమిని నింపటం వల్ల కూడా నేల క్షీణతకు ..రవుతుంది.

ప్రశ్న 3.
సహజ వనరుల రకాలు, ఉదాహరణలతో వ్రాయుము. [Mar ’16]
జవాబు:
భూమి వనరుల నిలయం. వనరులు ప్రకృతి ప్రసాదిం వరాలు. వనరులను మనం ఉత్పత్తి ప్రక్రియలో ఉపయోగించుకుంటాం.

సహజ వనరుల విభజన:సహజ వనరులను వాటి పరిమాణాన్ని బట్టి, నూర్పుచెందే గుణాలను బట్టి, వాటిని తిరిగి వాడుకొనే విధానాన్ని బట్టి విభజించవచ్చు. కాని సాధారణంగా రెండు రకాలుగా విభజించి పరిశీలించడం సౌకర్యంగా ఉంటుంది.
AP Inter 2nd Year Economics Study Material Chapter 8 పర్యావరణం మరియు సుస్థిర ఆర్థికాభివృద్ధి 2

1) పునరావృతం అయ్యే వనరులు:ఎలాంటి తరుగుదల లేకుండా ఎన్నిసార్లు ఉపయోగించుకున్నా క్షీణించని వనరులను పునరావృతమయ్యే వనరులు అంటారు. అవి తరిగిపోవు. స్వల్పకాలంలోనే ఆ వనరులు తమంతట తామే పునరుత్పత్తి చేసుకొనే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. వాటి నిల్వలు స్థిరంగా ఉండక పెరుగుతూ, తరుగుతూ ఉంటాయి. వీటినే “సాంప్రదాయేతర వనరులు” అని కూడా అంటారు. ఉదాహరణకు గాలి, సౌరశక్తి, సముద్రపు అలలు, భూగర్భ ఉష్ణవనరులు (Geo-Thermal) మొదలగునవి.

2) పునరావృతం కాని వనరులు:వాడుకొంటూ పోతే తరిగిపోయేటటువంటి సహజ వనరులను ‘పునరావృతం కాని వనరులు అంటారు. వీటిని సాంప్రదాయ వనరులు అంటారు. ఈ వనరులను మనం పునరుత్పత్తి చేయలేము. ఒక్కసారి ఈ వనరులు తరిగిపోతే, అవి వాడుకోవడానికి అందుబాటులో ఉండవు. ఇటువంటి వనరులను ఎంతగా వినియోగిస్తూపోతామో, రాబోయే తరాల వారికి ఇది అంత కొరతగా మారిపోతుంది.
ఉదాహరణకు బంగారం, వెండి, రాగి, శిలాజ ఇంధనాలు, నూనెలు మొదలైనవి.

AP Inter 2nd Year Economics Study Material Chapter 8 పర్యావరణం మరియు సుస్థిర ఆర్థికాభివృద్ధి

ప్రశ్న 4.
కాలుష్యం అంటే ఏమిటి ? కాలుష్యాన్ని ఎన్ని తరగతులుగా విభజించవచ్చో వ్రాయండి.
జవాబు:
పర్యావరణానికున్న స్వాభావిక లక్షణాలల్లో భౌతికంగా, రసాయనికంగా లేదా జీవపరమైన అవాంఛనీయ పరిణామాలు కలిగితే దాన్ని కాలుష్యం అంటారు. కాలుష్యం వల్ల ఘన, ద్రవ, వాయు పదార్థాల్లో స్వచ్ఛత తగ్గిపోయి ఉపయోగించుకోవడానికి పనికిరాకుండా పోతాయి. పర్యావరణంలోని కాలుష్యం వివిధ రకాలుగా ఉంటుంది. వాటిలో వాయు, జల, నేల, శబ్ద, ఘన వ్యర్థ పదార్థాల, ఉష్ణ కాలుష్యాలు ప్రధానమైనవి. ఇతర కాలుష్యకారకాలు ధర్మల్ కాలుష్యం, రేడియో ఆక్టివ్ కాలుష్యం మొదలగునవి.

1) వాయు కాలుష్యం:గాలిలో ఇతర కాలుష్య కారక పదార్థాల గాఢత ఎక్కువైపోయి మానవుని శ్రేయస్సును, జీవకోటికి మరియు వివిధ రూపాలలో ఉన్న ఆస్తులపై ప్రతికూల ప్రభావం చూపడాన్ని వాయు లేక గాలి కాలుష్యం అంటారు. వాయు కాలుష్యం సహజమైన, మానవ నిర్మితమైన ఆధారాల వల్ల జరగుతూ ఉంటుంది. వంటచెరకు కాల్చడం, పారిశ్రామీకరణ, న్యూక్లియర్ పరీక్షలు, అడవులు నరికి వేయడం మొదలగునవి గాలి కాలుష్యానికి ముఖ్యకారణాలు.

2) నీటి కాలుష్యం:కొన్ని పదార్థాలుగాని, కారకాలుగాని నీటిలో ఎక్కువగా చేరిపోయి నీటి యొక్క స్వచ్ఛతను తగ్గించివేసి దానిని ఆరోగ్యానికి హానికరంగాను, వాడుకోవడానికి కూడా పనికి రాకుండా మార్చివేస్తాయి. దానినే నీటి కాలుష్యంగా చెప్పవచ్చు. గృహాల్లోని వ్యర్థాలు, మానవ వ్యర్థాలు, పారిశ్రామిక వ్యర్థాలు, మొదలైనవి నీటి కాలుష్యంకు
కారణాలు.

3) నేల కాలుష్యం:నేల నాణ్యత కొన్ని ప్రతికూల మార్పులకు గురి అయి అందులోని సహజ మూలకాల కూర్పు తారుమారు కావడం ద్వారా భూమి ఉత్పాదకత తగ్గడమే నేల కాలుష్యం. రసాయనిక ఎరువుల వాడకం, ఆమ్లాలు, క్షారాలు భూమిలోనికి చొచ్చుకొనిపోవడం, మొదలైనవి నేలకాలుష్యానికి కారకాలు.

4) శబ్ద కాలుష్యం:ఏ ధ్వనులైతే 125 డెసిబెల్స్ పీడనం కంటే ఎక్కువగా ఉండి పర్యావరణంలో హానికరమైన ప్రభావాలను ఉత్పన్నం చేసి, మానవుల ఆరోగ్యానికి ప్రమాదకరంగా పరిణమిస్తాయో వాటిని ‘ధ్వని కాలుష్యం’ అంటారు. గృహోపకరణాల వాడకం, లౌడ్ స్పీకర్ల వాడకం, థర్మల్ పవర్ ప్లాంటు, గనుల త్రవ్వకం మొదలగునవి కారకాలు.

5) ఘన వ్యర్థ పదార్థాల కాలుష్యం:ఘన వ్యర్థ పదార్థాల్లో గృహ సంబంధింత వ్యర్థాలు, జంతువుల మృతకళేబరాలు, పరిశ్రమలు, వ్యవసాయ సంబంధిత వ్యర్థాలు, ఎలక్ట్రానిక్ వ్యర్థాలు, వైద్య సంబంధ వ్యర్థాలు ఉంటాయి. ప్లాస్టిక్ ఘన వ్యర్థ పదార్థాల కంటే ఎలక్ట్రానిక్ వ్యర్థ పదార్థాలు చాలా ప్రమాదకరంగా పరిణమిస్తున్నాయి.

6) ఉష్ణ కాలుష్యం:సమీపంలో ఉన్న కాలువలు, సరస్సులు, చెరువులు, నదుల్లోకి వేడి నీటిని విడుదల చేసిన ఫలితంగా వచ్చే కాలుష్యాన్ని ఉష్ణ కాలుష్యంగా చెప్పవచ్చు. న్యూక్లియర్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, శుద్ధి కర్మాగారాలు, కాగితం పరిశ్రమలు, సిమెంట్ పరిశ్రమలు మొదలగునవి ఉష్ణ కాలుష్యానికి కారణమవుతున్నాయి.

ప్రశ్న 5.
‘సుస్థిరత్వం’ అంటే అర్థం ఏమిటి ? సుస్థిరమైన అభివృద్ధిలోని అనుఘటకాలను గురించి వివరించండి.
జవాబు:
సుస్థిరత్వం భాగాలు:“సుస్థిరమైన అభివృద్ధి” అన్న భావనలో మూడు ముఖ్యమైన భాగాలుంటాయి. అవి ఆర్థిక, సాంఘిక, పర్యావరణమనే మూడు భాగాలు. ఇవన్నీ ఒక దానితో ఒకటి సంబంధం కలిగిన స్వతంత్రమైన అనుఘటకాలు. సుస్థిరమైన అభివృద్ధిని సాధించాలంటే ఈ మూడు అనుఘటకాల మధ్య సమతూకాన్ని సాధించవలసి వుంటుంది. ఇలాంటి సమతూకాన్ని సాధించడం ఎలాగో పటంలో చూపడం జరిగింది.
AP Inter 2nd Year Economics Study Material Chapter 8 పర్యావరణం మరియు సుస్థిర ఆర్థికాభివృద్ధి 3

ఆర్థిక సంబంధమైన అంశాలు:మానవ నిర్మితమైన మూలధనం, మానవ మూలధనం, సహజ మూలధనం వంటి మౌలికమైన విలువలను సమాజాలు రక్షించుకుంటూ, అభిలషనీయ పరిమాణంలో ఆదాయ ప్రవాహాన్ని పెంపొందిచుకోవలసి వుంటుందని ఆర్ధికభావనలో కొనసాగించగలిగే అభివృద్ధి తెలియజేస్తుంది.

సామాజిక సంబంధమైన అంశాలు:సామాజిక పరమైన సుస్థిరత న్యాయం, సమానత్వం అనే రెండు సూత్రాలపై నిర్మితమైంది. అభివృద్ధిపథం కొనసాగాలంటే సంపద, వనరులు అవకాశాలు సమానంగా పంపిణీ జరగాలి. పౌరులందరికీ ! కనీస ప్రమాణంలో భద్రత, మానవ హక్కులు, సామాజిక ప్రయోజనాలైన ఆహారం, ఆరోగ్యం, విద్య, స్వయం అభివృద్ధికి అవకాశాలు చేకు చాలి.

పర్యావరణ సంబంధమైన అంశాలు:పర్యావరణ భావనలో కొనసాగించగలగడం అనేది వనరులను సుస్థిరంగా ఉపయోగించడం, సమర్థవంతంగా వృథాలను ఇముడ్చుకునే విధిని నిర్వర్తించడం, సహజ మూలధనాన్ని రక్షించుకోవడం, ఈ మూడు విధులను సమర్ధవంతంగా అంతరాయం లేకుండా నిర్వహించగలిగితే జీవావరణ వ్యవస్థలో స్థిరత్వం సాధించవచ్చు.

ప్రశ్న 6.
మానవ ఆరోగ్యంపై కాలుష్య ప్రభావాన్ని చర్చించండి.
జవాబు:
1) మానవ ఆరోగ్యంపై ప్రభావాలు:పర్యావరణ క్షీణత, మానవ ఆరోగ్యంపై తీవ్రంగా ప్రభావం చూపుతున్నందున, శ్రామికులు తమ పనులకు హాజరు కాలేకపోతున్నారు. అనారోగ్య కారణాలు, శ్రామికుల సామర్థ్యాన్ని తగ్గించగా, అది అల్ప ఉత్పాదకతకు దారి తీస్తుంది.

ఎ) వాయు కాలుష్యం (Air Pollution):వాయు కాలుష్యకారకాలైన కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్లు, హైడ్రోకార్బన్లు, కణరూపద్రవ్యం మొదలైనవి శ్వాసకోశం ద్వారా మానవ శరీరంలోకి నేరుగా ప్రవేశించి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. ఉబ్బసం (Bronchitis), ఊపిరితిత్తుల క్యాన్సర్, కళ్ళకి, చర్యానికి చిరాకును కలిగించే బాధపెట్టే అలర్జీ (Eye Irritation, Skin Irritation) మొదలైన వ్యాధులకు వాయు కాలుష్యమే కారణం.

AP Inter 2nd Year Economics Study Material Chapter 8 పర్యావరణం మరియు సుస్థిర ఆర్థికాభివృద్ధి

బి) నీటి కాలుష్యం (Water Pollution):వ్యాధులను వ్యాపింపచేసే (transmission) సాధనాలలో అతి ముఖ్యమైనది నీరు, వివిధ వ్యాధులను కలిగించే వైరస్, బాక్టీరియా, ప్రోటోజోవాలాంటి సూక్ష్మక్రిములు, నీటి ద్వారానే వ్యాపిస్తాయి. ఈ సూక్ష్మక్రిముల వల్ల విరోచనాలు, టైఫాయిడ్, కలరా, కామెర్లు వంటి వ్యాధులు సంక్రమిస్తాయి. –

సి) ధ్వని కాలుష్యం (Sound Pollution):ధ్వని కాలుష్యం ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. పెద్ద శబ్దాలు నిద్రాభంగాన్ని కలిగించి, ఆరోగ్యం మీద ప్రభావాలను కలిగిస్తాయి. ధ్వని కాలుష్యం వల్ల వినికిడి దెబ్బతినడం, పనిపాటల్లో, సంభాషణలో అంతరాయాన్ని, ఏకాంతానికి భంగం, నిద్రాభంగాన్ని బాధను లేదా చిరాకును కలిగిస్తుంది. అలాగే ఏకాగ్రతకు భంగం కలిగించడం, రక్తపోటు, గుండె వేగం పెరగడంలను కలుగచేస్తుంది.

ప్రశ్న 7.
అడవుల పరిరక్షణకు కావలసిన జాగ్రత్తలు. [Mar ’17]
జవాబు:
అడవులను ‘కర్బన శోషణాగారాలని’ (carbon sinks), ‘ప్రకృతి సౌందర్యాల ఖజానాలని’ అంటారు. వాటికున్న ప్రాధాన్యాన్ని గమనించి, వాటిని సంరక్షించుకోవడం అత్యంత ఆవశ్యకం, అడవులను క్రింది చర్యల ద్వారా సంరక్షించుకోవచ్చు.

  1. పేదల ఇళ్ళు కట్టుకోవడానికిగాను అటవీ భూములను కేటాయించడం మానుకోవాలి.
  2. సామాజిక అటవీ కార్యక్రమాల క్రింద కొన్ని ప్రత్యేక ప్రాంతాలను అభివృద్ధి చేయాలి.
  3. వృథాగా ఉన్న భూముల్లో మొక్కలు నాటడం జరగాలి.
  4. అడవులు మంటలపాలు కాకుండా (ముఖ్యంగా వేసవి కాలంలో) సంరక్షించుకోవాలి.
  5. అడవులు తరిగిపోయిన ప్రదేశాలను గుర్తించి, ఆ ప్రాంతాల్లో చెట్లను నాటి తరిగిపోయిన అడవిని చేయాలి.
  6. సంయుక్త అటవీ యాజమాన్య, సంఘాలను స్థాపించడం చాలా అవసరం.
  7. పశువులను మేపడం, చట్టవిరుద్ధంగా చెట్లను నరికివేయడం మొదలైనవి అనుమతించకూడదు.
  8. అటవీ సంరక్షణ చర్యల్లో స్థానిక ప్రజలను కలుపుకొని, వారిని భాగస్వామ్యులను చేయాలి.

ప్రశ్న 8.
పర్యావరణాన్ని పరిరక్షించవలసిన ఆవశ్యకత.
జవాబు:
పర్యావరణం అనేది ఉమ్మడి ఆస్తి. పర్యావరణాన్ని మానవులు, జంతువులు, మొక్కలు మరియు చెట్లు, పక్షులు, చేపలు ఇలా ప్రపంచంలోని అన్ని జీవరాశులు ఉపయోగించుకుంటున్నాయి, అనుభవిస్తున్నాయి. ప్రత్యేకంగా మానవులు తమ అత్యాశతో ఈ ఉమ్మడి వనరులను అధికంగా ఉపయోగిస్తున్నారు. తత్ఫలితంగా, పర్యావరణం బలహీనమై, తన సహజ విధులను కూడా నిర్వహించలేకపోతుంది.

కావున దాదాపు ఆర్థికవేత్తలందరూ, ఆర్థికాభివృద్ధితో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు. కానీ మనం వారి హెచ్చరికలను ప్రక్కకు పెడుతూ, పర్యావరణం దోపిడీని కొనసాగిస్తూనే ఉన్నాము. పర్యావరణాన్ని ఖచ్చితంగా కాపాడుకోవాలి. ఎందుకంటే

  1. ప్రస్తుత తరానికి మరియు రాబోయే తరాల అవసరాలు తీరేందుకు.
  2. సమాన పంపిణీ జరుగుటకు (పర్యావరణ మరియు ఆర్థిక కార్యకలాపాలు).
  3. మానవ, భౌతిక మరియు సహజ మూలధనాలను కాపాడుటకు.
  4. జీవ వైవిధ్యాన్ని మరియు దాని అంతర్భాగాలైన, జంతు, వృక్ష జాతుల నాశనాన్ని నిరోధించుటకు.
  5. సున్నితమైన జీవవ్యవస్థలు మరింత క్షీణించకుండా నిరోధించుటకు పర్యావరణ పరిరక్షణకు భారత ప్రభుత్వం, ఎన్నో న్యాయబద్ధమైన, చట్టబద్ధమైన మరియు పరిపాలనా సంబంధ ప్రయత్నాలు చేస్తోంది.

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
పర్యావరణం.
జవాబు:
పర్యావరణం “Environment” అనే ఆంగ్ల పదము ప్రాచీన ఫ్రెంచి పదము “Environ” నుండి రూపొందించబడింది. ఎన్విరాన్ అంటే ‘చుట్టూ ఉన్న’ జీవరాశిని ప్రభావితం చేస్తూ ఉన్న సజీవ, భౌతిక మూల పదార్థాల కలయికనే పర్యావరణం అంటారు. దీనిలో సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ మరియు మేధోపరమైన
అంశాలు ఉంటాయి.

వాతావరణం:భూమి మొత్తాన్ని అవరించిన ఉన్న వాయువుల సమూహం. దీనిలో నాలుగు పొరలు ఉంటాయి.

  1. ట్రోపోస్పియర్,
  2. స్ట్రాటో స్పియర్,
  3. ఐనోస్పియర్,
  4. ధర్మోస్పియర్

AP Inter 2nd Year Economics Study Material Chapter 8 పర్యావరణం మరియు సుస్థిర ఆర్థికాభివృద్ధి

ప్రశ్న 2.
ఆవరణ వ్యవస్థ. [Mar ’16]
జవాబు:
అవరణ వ్యవస్థ అనే పదాన్ని 1935 సంవత్సరములో ‘విట్రాన్ల’ ప్రతిపాదించాడు. ఒక నిర్ణీత భౌగోళిక ప్రదేశంలో ఉన్నటువంటి స్వాభావిక, భౌతికమైన పర్యావరణ కలయికను వాటి మధ్య జరిగే చర్య, ప్రతిచర్యలను కలిపి ”ఆవరణ వ్యవస్థ’ గా చెప్పవచ్చు. ఆవరణ వ్యవస్థ స్థూలంగా రెండు రకాలు 1. సహజ ఆవరణ వ్యవస్థ, 2. కృత్రిమ ఆవరణ వ్యవస్థ.

ప్రశ్న 3.
గ్రీన్ హౌస్ ప్రభావం. [Mar ’17]
జవాబు:
భూగ్రహంపై ఉన్న వాతావరణం కార్బన్ డై ఆక్సైడ్, నీటి ఆవిరి మరియు మీధైన్ వంటి కొన్ని రకాల వాయువులు ఎక్కువైన కారణంగా సూర్యుని నుండి విడుదల అయ్యే రేడియేషన్ని తమ ద్వారా లోపలికి రానిస్తాయి. కాని తిరిగి ఆ రేడియేటెడ్ ఉష్ణాన్ని అట్టిపెట్టుకొని భూ ఉపరితలం నుండి బయటకు పోనివ్వవు. దీనినే గ్రీన్ హౌస్ ప్రభావం అంటారు.

ప్రశ్న 4.
గాలి కాలుష్యం.
జవాబు:
గాలిలో ఇతర కాలుష్యకారక పదార్థాల గాఢత ఎక్కువైపోయి, మానవుని శ్రేయస్సును, జీవకోటికి మరియు వివిధ రూపాలలో ఉన్న ఆస్తులపై ప్రతికూల ప్రభావం చూపడాన్ని వాయు లేక గాలి కాలుష్యం అంటారు. ఇవి సహజమైన, మానవ నిర్మితమైన ఆధారాల వల్ల జరుగుతుంది. వంటచెరకు కాల్చడం, పారిశ్రామికీకరణ, పంటల సాగు, అడవులు నరికివేయడం మొదలగునవి వాయు కాలుష్యానికి ముఖ్య కారణాలు.

ప్రశ్న 5.
నీటి కాలుష్యం. [Mar ’17]
జవాబు:
కొన్ని పదార్థాలు గాని, కారకాలు గాని నీటిలో ఎక్కువగా చేరిపోయి నీటి యొక్క స్వచ్ఛతను తగ్గించి వేసి దానిని అరోగ్యానికి హానికరంగానూ, వాడుకోవడానికి కూడా పనికి రాకుండా మార్చి వేస్తాయి. దానినే నీటి కాలుష్యం అంటారు. |గృహాల్లోని వ్యర్థాలు, మానవ వ్యర్థాలు, పారిశ్రామిక వ్యర్థాలు మొదలైనవి నీరు కలుషితంకు కారణాలు.

ప్రశ్న 6.
ఓజోన్ పొర. [Mar ’17, ’16]
జవాబు:
సూర్యుని రేడియేషన్ వల్ల వచ్చే అతినీలలోహిత కిరణాలను అడ్డుకొని భూమి మీద మానవుని జీవనానికి అవసరమైన శక్తిని ప్రసాదించే రక్షక కవచాన్ని ఓజోన్ పొర అంటారు. క్లోరోఫ్లోరోకార్బన్స్, హాలోజన్స్ అణువులు స్టోటోస్పియర్ను చేరి ఓజోన్ ను నాశనం చేస్తాయి.

ప్రశ్న 7.
భూగోళం వేడెక్కడం (Global Warming).
జవాబు:
హరితగృహ వాయువులైన CO2, మొదలైన వాటి వల్ల భూఉపరితల ఉష్ణోగ్రత రోజురోజుకి పెరుగుతూ ఉంది.. CO2 ముఖ్యంగా శిలాజ ఇంధనాలు మండించుట ద్వారా, అడవుల నరికివేత వల్ల ఎక్కువగా వెలువడుతుంది. దీని ప్రభావంతో ఉష్ణం గ్రహింపబడి, తిరిగి భూమి నుండి పరావర్తనం చెందకుండా భూమిపైన ఉండిపోతుంది. దీనిని భూమి వేడెక్కుట అంటారు.

AP Inter 2nd Year Economics Study Material Chapter 8 పర్యావరణం మరియు సుస్థిర ఆర్థికాభివృద్ధి

ప్రశ్న 8.
సుస్థిరమైన అభివృద్ధి.
జవాబు:
సుస్థిరమైన అభివృద్ధి అనగా మనం వారసత్వంగా పొందిన నాణ్యమైన జీవనాన్ని, ఆస్తులను ఏ మాత్రం తగ్గకుండా భవిష్యత్ తరాల వారికి అందించుట. సుస్థిరమైన అభివృద్ధిలో మూడు ముఖ్యమైన అనుఘటకాలున్నాయి. అవి ఆర్థిక, సాంఘిక, పర్యావరణం అనేవి.

ప్రశ్న 9.
వ్యయ – ప్రయోజన విశ్లేషణ.
జవాబు:
పర్యావరణ వ్యయ ప్రయోజనాలు అంచనా వేయడంలో ఒక ప్రాజెక్టు యొక్క మూలధన మూల్యాంకనము మరియు తులనాత్మకత జరగాలి. ప్రతి ఆర్థిక కార్యకలాపం ప్రయోజనాలను, నష్టాలను కల్గి ఉంటుంది. ఏదైనా ప్రాజెక్టును మూల్యాంకనం చేసేటప్పుడు ఆర్థిక ప్రయోజనలతో పాటు పర్యావరణ నష్టాలు కూడా దృష్టిలో పెట్టుకోవాలి.

ప్రశ్న 10.
అటవి నాశనానికి గల కారణాలు.
జవాబు:
అడవులు ఎన్నో కారణాల వల్ల తొలగించబడుతున్నాయి. అందులో ముఖ్యమైనవి జనాభా పెరుగుదల, పేదరికం, నిరుద్యోగం, భూమి డిమాండ్ పెరగటం (ఇల్లు, వ్యవసాయం, కలపకోసం) పశువులను ఎక్కువగా మేపడం వల్ల అడవులపై ఒత్తిడి పెరుగుతుంది. ఆనకట్టల నిర్మాణం, రోడ్లు, రైల్వేల నిర్మాణం అడవుల నరికివేతకు అతి ముఖ్య కారణాలు. అడవులలో మంటలు వ్యాపించుట, పోడు వ్యవసాయం మొదలగునవి ఇతర కారణాలు.

ప్రశ్న 11.
జీవవైవిధ్యం. [Mar ’17, ’16]
జవాబు:
‘జీవవైవిధ్యం’ అనే పదాన్ని 1986 సంవత్సరంలో అమెరికా శాస్త్రవేత్త వాల్టర్ రోసెన్ మొదటిసారిగా ప్రతిపాదించాడు. జీవవైవిధ్యం ప్రత్యక్షంగాను, పరోక్షంగాను అనేక ప్రయోజనాలను కల్పిస్తుంది. జన్యుపరమైన తేడాలు, జాతులలోని వైవిధ్యం ఆవరణ వ్యవస్థలోని విచ్ఛిన్న గుణాలను అన్నింటిని కలిపి జీవవైవిధ్యం అంటారు.

ప్రశ్న 12.
ధ్వని అంటే ఏమిటి ?
జవాబు:
నియమానుసారంగా, చెవులకు ఇంపైన తియ్యనైన, వినడానికి సౌకర్యంగా ఉండే శబ్దాన్ని ‘ధ్వని’ అని అంటారు. శబ్దము, ధ్వని అని రెండు పదాలలో ఒకే అర్థంలో వాడుతున్నా శబ్దం వేరు, ధ్వని వేరు. శబ్దాలన్ని ధ్వనులు కావు. గాఢమైన, తీవ్రమైన, గట్టిదైన శబ్దాన్నే ‘ధ్వని’ అంటారు. 50 నుండి 90 డెసిబెల్స్ మధ్య గల శబ్దాన్ని ‘ధ్వని’ అంటారు. 120 డెసిబెల్స్ స్థాయిని కలిగిన ధ్వని పీడనాన్ని మానవులు సురక్షితంగా వినగలుగుతారు.

ప్రశ్న 13.
భూమి విచ్ఛేదనం.
జవాబు:
ఎప్పుడైతే భూమి భౌతికస్థితి, స్వచ్ఛత, ఉత్పాదక శక్తిలో మార్పులు సంభవిస్తాయో అప్పుడు భూమి విచ్ఛేదనానికి గురైందని చెప్పవచ్చును. అడవులు అంతరించిపోవటం, పశువులు ఎక్కువగా మేయటం పంటలను సాగుచేయటం, పారిశ్రామికీకరణ, గాలి వికోషీకరణ, నీటి వల్ల వికోషీకరణం, నీరు ఎక్కువగా నిలబడిపోవడం, భూమి క్షారవంతమైపోవడం జనాభా వత్తిడి వల్ల ఆహార ధాన్యాల ఉత్పత్తిని ఎక్కువ చేయడం మొదలైనవి భూమి విచ్ఛేదనానికి కారణమయ్యే కాలుష్య జనకాలు. భూమి ఇలా విచ్ఛేదనకు గురైతే భూమి ఉత్పాదకశక్తి, స్వచ్ఛత క్షీణించిపోతుంది.

AP Inter 2nd Year Economics Study Material Chapter 8 పర్యావరణం మరియు సుస్థిర ఆర్థికాభివృద్ధి

ప్రశ్న 14.
పర్యావరణ బహిర్గతాలు.
జవాబు:
ఒక ఆర్థిక కార్యకలాపం వల్ల ఏ మాత్రం సంబంధం లేని మూడవ వర్గం ప్రభావితం కావడాన్ని బహిర్గతాలు అంటారు. ఇటువంటి బహిర్గతాలు అనుకూలం గాని ప్రతికూలంగా కాని ఉండవచ్చు. ఉదా:ఒక ఫ్యాక్టరీ నుండి వెలువడే కాలుష్యం పరిసర పర్యావరణాన్ని దగ్గరలోని నివాసమున్న ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీయడం ప్రతికూల బహిర్గతంగా చెప్పవచ్చు. బాగా విద్యావంతులైన ప్రజలు ఉన్న ప్రాంతంలో ఫ్యాక్టరీని మొదలు పెట్టినపుడు ఉత్పాదకత పెరగడం అనుకూల బహిర్గత.

ప్రశ్న 15.
స్వచ్ఛ భారత్ అభియాన్.
జవాబు:
భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడి 2014 అక్టోబరులో 2న స్వచ్చ భారత్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించి ఇందుకోసం ఒక బహిరంగ వెబ్సైట్ను మొదలు పెట్టారు. ఈ కార్యక్రమం లక్ష్యం వచ్చే 5 సంవత్సరాలలో భారత్న పరిశుభ్ర దేశంగా మార్చడమే తద్వారా గాంధీజీ 150వ జన్మదినోత్సవాన్ని పరిశుభ్ర భారతదేశంలో ఘనంగా జరుపుకోవడం. ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం సక్రమంగా అమలు చేయగలిగితే అనేక పర్యావరణ సమస్యలను పరిష్కరించగలదు.

AP Inter 2nd Year Economics Study Material Chapter 7 ప్రణాళికలు – ఆర్ధిక సంస్కరణలు

Andhra Pradesh BIEAP AP Inter 2nd Year Economics Study Material 7th Lesson ప్రణాళికలు – ఆర్ధిక సంస్కరణలు Textbook Questions and Answers.

AP Inter 2nd Year Economics Study Material 7th Lesson ప్రణాళికలు – ఆర్ధిక సంస్కరణలు

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
‘ప్రణాళికను’ నిర్వచించి, స్థూలంగా ప్రణాళికల లక్ష్యాలను వివరించండి.
జవాబు:
ప్రణాళిక అంటే నిర్ణీత కాల వ్యవధిలో నిర్దేశించిన లక్ష్యాలను సాధించడానికి లేదా ఆర్థిక వ్యవస్థలోని కార్యకలాపాలను నిర్దేశించిన లక్ష్యాల వైపుకు ఒక క్రమంలో నడపడాన్ని ప్రణాళిక అని అంటారు. మన దేశంలో పంచవర్ష ప్రణాళికల అమలు 1951లో ప్రారంభమయ్యాయి. ఇప్పటి వరకు 11 పంచవర్ష ప్రణాళికలు పూర్తి అయి, 12వ పంచవర్ష ప్రణాళికా కాలంలో ఉన్నాయి.

ప్రణాళిక లక్ష్యాలు:
1) జాతీయాదాయ తలసరి ఆదాయాల వృద్ధి: భారత ప్రణాళికల ప్రధాన లక్ష్యం జాతీయాదాయాన్ని పెంచుట, తద్వార తలసరి ఆదాయము పెరుగుతుంది. పేదరికాన్ని నిర్మూలించి, జీవన ప్రమాణ స్థాయిని పెంచాలి. అంటే తలసరి ఆదాయం పెరగాలి. అందువలన ప్రతి ప్రణాళికలలోను వృద్ధిరేటు నిర్ణయించబడింది.

2) ఉద్యోగిత: ప్రభుత్వం, వ్యవసాయం, పారిశ్రామిక రంగాలను అభివృద్ధి పరచటం ద్వారా జాతీయాదాయం పెరుగుతుంది అని భావించి, దీనితో పాటు ఈ రెండు రంగాల అభివృద్ధి ఉద్యోగితా స్థాయిని పెంపొందిస్తుందని ప్రణాళికావేత్తలు భావించారు. నిరుద్యోగ నిర్మూలన ప్రణాళికలన్నింటిలోను ప్రధాన లక్ష్యంగా ఉంది.

3) సామ్యవాదరీతి సమాజస్థాపన: ప్రణాళికాభివృద్ధి యొక్క లక్ష్యం సామ్యవాద రీతి సమాజస్థాపన, విద్య, వృత్తి, ఉద్యోగాలలో అందరికీ సమాన అవకాశాలు లభించేటట్లు చేయుట, ఆర్థిక శక్తి కొందరి చేతిలోనే కేంద్రీకృతం కాకుండా ఆదాయం అందరి మధ్య సమానంగా పంపిణీ జరిగేటట్లు చూచుట ప్రణాళికల ముఖ్యమైన ఆశయాలు. ప్రభుత్వం ఆర్థికశక్తి కేంద్రీకరణను నియంత్రణ చేసే అధికారం కలిగి ఉంది.

AP Inter 2nd Year Economics Study Material Chapter 7 ప్రణాళికలు - ఆర్ధిక సంస్కరణలు

4) స్వావలంబన: ప్రతి ప్రణాళికలలోను “స్వయం సమృద్ధి” ప్రధాన లక్ష్యంగా ఉన్నప్పటికీ 3వ ప్రణాళికలో దీనికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వబడింది. 9వ ప్రణాళిక ఆశయమును నికర విదేశీ సహాయం ‘0’ గా ఉండేటట్లు
చూచుట.

5) ఇతర లక్ష్యాలు:

  1. ఆర్థిక అసమానతలు తగ్గించుట.
  2. పేదరికం నిర్మూలన.
  3. ధరల స్థిరీకరణ ద్వారా సుస్థిర ఆర్థిక వృద్ధిని సాధించుట.
  4. ప్రాంతీయ అసమానతలు తొలగింపు.
  5. ప్రత్యేకించి ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయంసమృద్ధికి కృషి.

ప్రశ్న 2.
పన్నెండవ’ పంచవర్ష ప్రణాళిక లక్ష్యాలను వివరించండి. [Mar ’17, ’16]
జవాబు:
భారత ప్రభుత్వం అక్టోబరు 4న, 12వ పంచవర్ష ప్రణాళిక ముసాయిదాను (2012-17)లో అంతకు ముందున్న వార్షిక సగటు వృద్ధిరేటు 9 శాతాన్ని, 8.2 శాతానికి తగ్గించి లక్ష్యాన్ని నిర్ధారించుకుంది. ఇందుకు కారణం అప్పటి ప్రపంచ వ్యాప్తం అయిన ఆర్థిక మాంద్యం. దీని ప్రకారం సాధించాల్సిన వృద్ధిరేటు 8.2 శాతం నుండి 9 శాతం వరకు ఉంటుంది. ఈ ప్రణాళిక ముఖ్య లక్ష్యం – “సత్వర, సుస్థిర మరియు మిక్కిలి సమ్మిళిత వృద్ధి”. 12వ పంచవర్ష ప్రణాళికకు అయిన మొత్తం వ్యయం, జి.డి.పిలో 37 శాతం కాగా, అంచనా వేయబడిన మొత్తం పొదుపు రేటు జి.డి.పిలో 34.2 శాతంగా ఉంది.

ముఖ్య లక్ష్యాలు: 12వ పంచవర్ష ప్రణాళిక యొక్క ప్రధాన లక్ష్యం – “సత్వర, సుస్థిర మరియు సమ్మిళిత వృద్ధి” కాగా ఇతర లక్ష్యాలను క్రింద పేర్కొనడం జరిగినది.
ఎ) ఆర్థిక వృద్ధి:

  • వాస్తవ జి.డి.పి వృద్ధి రేటు 8.0 శాతం సాధించడం.
  • సంవత్సరానికి తలసరి ఆదాయంలో వృద్ధి 6.5 శాతం సాధించడం.
  • వ్యవసాయంలో 4.0 శాతం వృద్ధి రేటు సాధించడం.
  • పారిశ్రామిక రంగంలో ఉత్పత్తి రంగంలో 10 శాతం సాంవత్సరిక వృద్ధి రేటు సాధించుట.
  • పారిశ్రామిక రంగంలో, 7.6 శాతం వృద్ధి రేటు సాధించడం.
  • సేవా రంగంలో 9.0 శాతం వృద్ధి రేటు సాధించడం.
  • ప్రతి రాష్ట్రం 11వ ప్రణాళికలో సాధించిన వృద్ధి రేటు కంటే ఎక్కువ వృద్ధి రేటును సాధించుట.

బి) పేదరికం మరియు ఉద్యోగాలు:
12వ పంచవర్ష ప్రణాళిక పూర్తయ్యే నాటికి తలసరి వినియోగం ప్రకారం గణింపబడిన, అంతకు ముందున్న స్థాయి నుండి 10 శాతం బిందువుకు పేదరికాన్ని తగ్గించడం.

  • ఈ ప్రణాళికా కాలంలో 50 మిలియన్ల ఉద్యోగావకాశాలు అసంఘటిత రంగంలో కల్పిస్తూ, అంతే సంఖ్యలో నైపుణ్యం అర్హత పత్రాలను అందించడం.

సి) విద్య:
2017 నాటికి అక్షరాస్యతను 85 శాతానికి పెంచడం.

  • 12వ పంచవర్ష ప్రణాళిక అంతానికి బడిలో గడిపే సరాసరి సంవత్సరముల సంఖ్య 7కు పెంచడం. (సర్వ శిక్షా అభయన్)
  • కళాశాలల్లో 2 మిలియన్ల సీట్లను పెంచడం ద్వారా ఉన్నత విద్య అవకాశాలు కల్పిస్తూ ఆర్థిక వ్యవస్థ అవసరాలకు తగినట్లు నైపుణ్యాలను పెంచడం (RUSA).
  • 12వ పంచవర్ష ప్రణాళిక పూర్తయ్యే నాటికి, పాఠశాలల్లో లింగ, వివక్షత, సామాజిక వివక్షతలను తొలగించడం.

డి) ఆరోగ్యం:

  • 12వ పంచవర్ష ప్రణాళిక పూర్తయ్యే నాటికి, ప్రతీ 1000 జననాలకు, శిశు మరణాల రేటును 25కు, మాతా మరణాల రేటును 1కి తగ్గించడం, అలాగే బాల్య లింగ నిష్పత్తి (0-6 సం) 950 కి పెంచడం. త్రాగునీరు, పారిశుద్ధ్య సదుపాయాలు పెంచడం ద్వారా ఆరోగ్య పరిస్థితులను మెరుగు పరచడం.
  • మొత్తం పునరుత్పత్తి రేటును ప్రణాళిక చివరి నాటికి 2.1కి తగ్గించడం.
  • 0-3 సంవత్సరముల వయసు పిల్లల్లో పోషకాహార లోపం కలిగిన వారి సంఖ్యను సగానికి తగ్గించడం.

AP Inter 2nd Year Economics Study Material Chapter 7 ప్రణాళికలు - ఆర్ధిక సంస్కరణలు

ఇ) అవస్థాపనా సౌకర్యాలు (గ్రామీణ అవస్థాపనలతో కలిపి):

  • జి.డి.పిలో శాతం పెట్టుబడిని అవస్థాపనా సౌకర్యాల కొరకు కేటాయించడం.
  • స్థూల నీటి పారుదల గల ప్రాంతాన్ని 90 మిలియన్ హెక్టార్ల నుండి 103 మిలియన్ హెక్టార్లకు పెంచడం.
  • ప్రతీ గ్రామానికి విద్యుత్తు సదుపాయాలు కల్పించడం. విద్యుత్ రవాణాలోని డ్రాపవుట్ నష్టాలను 20 శాతానికీ తగ్గించడం.
  • అన్ని గ్రామాలను, అన్ని వాతావరణాలను తట్టుకోగల రోడ్డులతో అనుసంధానించడం.
  • గ్రామీణ ప్రాంతాల్లో టెలిసాంద్రతను 70 శాతానికి పెంచడం.

ఎఫ్) పర్యావరణము – సుస్థిరత:

  • అడవులను, చెట్లను మొత్తం భూభాగంలో 33 శాతానికి పెంచుట.
  • ప్రతీ సంవత్సరం 1 మిలియన్ హెక్టార్ ప్రాంతాన్ని పచ్చదనంతో నింపడం.
  • పునరావృతమయ్యే శక్తి మూలాల నుండి ఉత్పన్నం చేసే విద్యుత్ను 30,000 మెగా వాట్లకు పెంచడం.
  • జి.డి.పిలో 2020 నాటికి, కాలుష్య కారక సాంద్రతను 2005 నాటి స్థాయి కన్నా 20 నుండి 25 శాతం కన్నా దిగువకు పరిమితం చేయడం.
  • కలుషితమైన ప్రధాన నదులను పరిశుభ్రం చేయడం.

జి) సేవలు:
ఈ ప్రణాళిక పూర్తయ్యే నాటికి 90 శాతం కుటుంబాలకు బ్యాంకింగ్ సేవలు అందేలా చేయడం. ఆధార్ను బ్యాంక్ అకౌంట్తో అనుసంధానం చేయడం ద్వారా రాయితీలు, నగదు బదిలీ నేరుగా ఉద్దేశింపబడిన వ్యక్తి అకౌంట్ను చేరే విధముగా చూడడం.

ప్రశ్న 3.
పదకొండు పంచవర్ష ప్రణాళికలలో మన దేశం సాధించిన విజయాలను, అపజయాలను సమీక్షించండి.
జవాబు:
విజయాలు: ప్రణాళికల అమలు సమయములో ఉన్న పరిస్థితులు చాలా దీనముగా ఉండేవి. కాని కొన్ని ప్రణాళికలు తమ లక్ష్యాలను చేరుకోలేక పోయినప్పటికిని అవి సాధించిన విజయాలను కొనియాడక తప్పదు. ఇందులోని కొన్ని ముఖ్యమైన విజయాలను క్రింది విధముగా పేర్కొనవచ్చును.
ఎ) జాతీయ – తలసరి ఆదాయాల్లో పెరుగుదల: మన దేశంలో ప్రణాళికల ప్రధాన లక్ష్యం మరియు తలసరి ఆదాయాల్లో పెరుగుదలను సాధించడం.

జాతీయ మొదటి పంచవర్ష ప్రణాళికా కాలంలో కౌ 1.32 లక్షల కోట్లుగా ఉన్న జాతీయాదాయము 2004-05 ఆధార సంవత్సర ధరలలో 11వ పంచవర్ష ప్రణాళికా కాలము నాటికి (2012) 47.67 లక్షల కోట్లకు చేరింది.
మరోవైపు అధిక జనాభా పెరుగుదల వల్ల వాస్తవిక తలసరి ఆదాయ వృద్ధిరేటు మందకొడిగా పెరిగింది.

బి) వ్యవసాయంలో వృద్ధి: భారత ప్రభుత్వం, 60 సంవత్సరములుగా వ్యవసాయము, దాని అనుబంధ కార్యకాలాపాలపై 23 నుండి 24 శాతం వ్యయాన్ని ఖర్చు చేసింది. ఈ భారీ వ్యయం మరియు క్రొత్త వ్యవసాయ వ్యూహము (1960) వల్ల వ్యవసాయ ఉత్పత్తి, ఉత్పాదకతలు గణనీయముగా పెరిగాయి.

భారతదేశం ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధిని సాధించింది. ఆహార ధాన్యాల ఉత్పత్తి 1950- 51లో 50.8 మి. టన్నులు కాగా, 2014 నాటికి అది 264 మి. టన్నుల రికార్డు స్థాయికి పెరిగింది. ఆహారేతర పంటలైన నూనె గింజలు, చెఱకు మరియు ప్రత్తి మొదలగు వాటి ఉత్పత్తి కూడా పెరిగింది. కానీ, పప్పు ధాన్యాల ఉత్పత్తి అనుకున్నంతగా పెరగలేదు.

AP Inter 2nd Year Economics Study Material Chapter 7 ప్రణాళికలు - ఆర్ధిక సంస్కరణలు

సి) పరిశ్రమలలో వృద్ధి: రెండవ పంచవర్ష ప్రణాళికా కాలంలోనే పారిశ్రామికాభివృద్ధికి పునాది వేయబడింది. మౌలిక మరియు మూలధన పరిశ్రమలను నెలకొల్పడం జరిగింది. 11 పంచవర్ష ప్రణాళికలలో భారత ప్రభుత్వం ఎక్కువగా పారిశ్రామికాభివృద్ధి కోసం పెట్టుబడులను పెట్టడం జరిగింది. దాదాపు 55 శాతము ప్రణాళికా వ్యయాన్ని పారిశ్రామికాభివృద్ధికి కేటాయించడం జరిగింది.

1950-51లో బొగ్గు ఉత్పత్తి 32 మిలియన్ టన్నులు ఉండగా, 2011-12 నాటికి అది 583 మిలియన్ టన్నులు పెరిగింది.

డి) అవస్థాపనా సౌకర్యాల అభివృద్ధి: ప్రణాళికల వల్ల సాధింపబడిన మరొక అద్భుత విజయం సత్వర ఆర్థికాభివృద్ధికి అత్యవసరమైన నిబంధన అయిన ఆర్థిక మరియు సామాజిక అవస్థాపనా సౌకర్యాల సృష్టి. మొదటి పంచవర్ష ప్రణాళికా కాలానికి భారతదేశ అక్షరాస్వత రేటు 18.3 శాతం ఉండగా ప్రస్తుతం అది 74 శాతానికి పెరిగింది. అందులో పురుష అక్షరాస్యత శాతం 82% కాగా, స్త్రీ అక్షరాస్యత 66%, శిశుమరణాల రేటు, మాతా మరణాలరేటు, బాల్యమరణాల రేటు తగ్గుదలను గమనించవచ్చును.

రవాణా: 1950-51 ప్రణాళిక అమలు తరువాత అన్ని మార్గాల ద్వారా రవాణా మంచి వృద్ధిని కనపరిచాయి. భారత రైల్వేల నెట్వర్క్ 1950-51లో 53,596 కి.మీ.ల నుండి ప్రస్తుతం 63,220 కి.మీకు పెరిగింది. నౌకాశ్రయాలు, విమానాశ్రయాలు కూడా వస్తు రవాణా సామర్థ్యం మరియు రాబడి వంటి అనేక అంశాలలో పెరుగుదలను ప్రదర్శించాయి. బొగ్గు, విద్యుత్, పెట్రోలియం, సహజవాయువు అనునవి ముఖ్యమైన ఇంధన వనరులు. 2004లో డెలిఫోను వినియోగదారుల సంఖ్య 76.5 మిలియన్లు ఉండగా 2014 జనవరి నాటికి 922.04 మిలియన్లకు పెరిగింది. భారీ, మధ్య మరియు చిన్న ప్రాజెక్టుల నిర్మాణం ద్వారా నీటి పారుదల వసతులు కూడా విస్తరింపబడుతున్నాయి.

ఇ) ఎగుమతులు మరియు దిగుమతుల్లో మార్పులు: 1990లో వచ్చిన నూతన ఆర్థిక సంస్కరణల వల్ల భారతదేశ దిగుమతుల్లో గొప్ప మార్పులు సంభవించాయి. మొదటి పంచవర్ష ప్రణాళికా కాలానికి భారతదేశం ఎగుమతుల విలువ’ 606 కోట్లు ఉండగా, 12వ పంచవర్ష ప్రణాళిక ప్రారంభం నాటికి కౌ 16,35,261 కోట్లకు పెరిగింది.

ఎఫ్) శాస్త్ర – సాంకేతిక పరిజ్ఞానంలో అభివృద్ధి: శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంలో అభివృద్ధి సాధించడం మరియు నిర్వహణా విభాగం, సాంకేతికాభివృద్ధి ప్రణాళికల మరొక ముఖ్యమైన విజయం. మనదేశం విదేశీ నిపుణులపై ఆధారపడడం తగ్గి, ప్రస్తుతం ప్రపంచ నలుమూలలకు కూడా నిపుణులను ఎగుమతి చేయగల దేశంగా మారింది.

జి) విద్యా వ్యవస్థ అభివృద్ధి: ప్రపంచంలోనే విద్యా వ్యవస్థ అభివృద్ధిలో భారతదేశం రెండవ పెద్ద దేశంగా అవతరించింది. విద్యా వార్షిక నివేదిక 2012 ప్రకారం 6-14 సంవత్సరముల వయస్సుగల గ్రామీణ బాల బాలికలలో 96.5 శాతం మంది పాఠశాలల్లో నమోదు చేయబడ్డారు. 2011 నాటికి మన దేశంలో 573 విశ్వవిద్యాలయాలు 33,023 కళాశాలలు ఉన్నాయి.

అపజయాలు: భారత దేశ ఆర్థిక వ్యవస్థ ఈ 65 సంవత్సరాల ప్రణాళికా శకంలో చెప్పుకోదగిన అభివృద్ధి సాధించినది. అయినప్పటికి కొన్ని బలహీనతలు, ప్రణాళికలు విఫలమవడానికి కారణాలయ్యాయి.

  1. 65 సంవత్సరాల ఆర్థికాభివృద్ధిలో పేదరికం, నిరుద్యోగం, మొదలైన సమస్యలు పరిష్కరింపబడలేదు.
  2. భూ సంస్కరణలు ప్రవేశ పెట్టి దశాబ్దాలు గడిచినా, వాస్తవిక పరిస్థితులలో భూ పంపిణీ సక్రమంగా అమలు కాలేదు.
  3. భారతదేశ పంచవర్ష ప్రణాళికల ముఖ్య లక్ష్యం అసమానతలు లేని సమసమాజాన్ని నిర్మించడం, కానీ ఇది ఇప్పటి వరకు పూర్తి కాలేదు.
  4. అందరికీ ఆరోగ్యం అనే లక్ష్యాన్ని ఇప్పటకీ చేరుకోలేక పోయాం.
  5. సంతులిత ప్రాంతీయాభివృద్ధి సాధించడంలో ప్రణాళికలు విఫలమయ్యాయి.

ప్రశ్న 4.
భారతదేశంలో ప్రాంతీయ అసమానతలకు గల కారణాలరలను వివరించండి. [Mar ’16]
జవాబు:
దేశ సమగ్రతకి, సత్వర పురోగతికి, ఆర్థికాభివృద్ధికి ప్రాంతీయ అసమానతలు అడ్డంకిగా ఉంటాయి. వివిధ ప్రాంతాల ప్రజల జీవన ప్రమాణాల్లో వ్యత్యాసాలు తొలగించేందుకు చర్యలు తీసుకోవడానికి ముందుగా, దీనికి గల అసలు కారణాలను తెలుసుకోవడం ముఖ్యం. అవి:

ఎ) భౌగోళిక కారణాలు: భౌగోళికంగా కొన్ని ప్రాంతాలు మిగతా ప్రాంతాల నుంచి వేరుపరచబడి ఉంటాయి. కొండలు, లోయల కారణంగా ఇలాంటి ప్రాంతాలు ఏర్పడవచ్చు. అలాంటి ప్రాంతాలు వెనకబడి ఉంటాయి. ఉదా: హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్లోని కొండ ప్రాంతాలు, హిమాలయ ప్రాంతాల్లోని ఉత్తర కాశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలు ముఖ్యంగా వాతావరణం, రవాణా మార్గాలు సరిగ్గా లేకపోవడం వల్ల వెనుకబడి ఉన్నాయి.

AP Inter 2nd Year Economics Study Material Chapter 7 ప్రణాళికలు - ఆర్ధిక సంస్కరణలు

బి) శీతోష్ణస్థితి పరిస్థితులు: వర్షపాతం, వాతావరణం మొదలైనవి అనుకూలంగా లేకపోవడం వల్ల కూడా కొన్ని ప్రాంతాలు ఆర్థికంగా అభివృద్ధి చెందే అవకాశాలు తక్కువ. ఇలాంటి ప్రదేశాల్లో వ్యవసాయం కానీ, పరిశ్రమలు కానీ తొందరగా అభివృద్ధి చెందలేవు.

సి) బ్రిటీషువారి పరిపాలన: చారిత్రాత్మకంగా చూస్తే భారతదేశంలో కొన్ని ప్రాంతాలు వెనుకబడి ఉండటానికి బ్రిటీషువారి పరిపాలన కూడా కొంత కారణం. పారిశ్రామిక ఉత్పత్తికి, తమ వ్యాపారానికి అనుకూలముగా ఉండి మన దేశ సంపదను తమ దేశానికి తరలించడానికి అనువుగా ఉండే ప్రాంతాలనే వారు ఎన్నుకొని అభివృద్ధి పరచడం జరిగింది. మహా నగరాలైన కలకత్తా, బొంబాయి, మద్రాసులను వ్యాపార కేంద్రాలుగా చేసుకోవడం వల్ల, భారతదేశంలో మిగిలిన ప్రాంతాలు నిర్లక్ష్యం చేయబడి వెనుకబడ్డాయి.

డి) పరిశ్రమల కేంద్రీకరణ: అభివృద్ధి చెందిన ప్రాంతాల్లోనే ప్రైవేటు రంగం నూతన పరిశ్రమలు స్థాపించడం జరుగుతుంది కారణం, అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో పరిశ్రమలకు కావలసిన అవస్థాపనా వసతులైన నైపుణ్యం గల శ్రామికులు, రవాణా మరియు మార్కెట్ సౌకర్యాలు సులభంగా లభ్యం కావడం.

ఇ) సహజ వనరుల కొరత: ప్రకృతి పరంగా కొన్ని ప్రాంతాల్లో కొన్ని వనరులు పుష్కలంగా లభించడం వల్ల ఆ ప్రాంతాలు మాత్రం వేగంగా అభివృద్ధి చెందగలుగుతున్నాయి. అలాంటి అవకాశాలు లేని ప్రాంతాలు వెనుకబడి ఉన్నాయి అని చెప్పవచ్చు.

ఎఫ్) అవస్థాపనా సౌకర్యాల కొరత: పరిశ్రమల స్థాపనకు అవర్షాలైన విద్యుచ్ఛక్తి, రోడ్లు, తంతి తపాలా సౌకర్యాలు, నీరు, విద్య, ఆరోగ్యం, సాంకేతిక శిక్షణ సౌకర్యాలు, పరపతి మొదలైనవి కొరతగా ఉన్న ప్రాంతాలు వెనుకబడి ఉంటాయి. ఈ సౌకర్యాలు లభ్యమయ్యే ప్రాంతాలు త్వరితంగా అభివృద్ధి చెందుతాయి.

ప్రశ్న 5.
ప్రాంతీయ సమానాభివృద్ధికి తీసుకోవలసిన చర్యలను వివరించండి.
జవాబు:
ప్రాంతీయ అసమానతలు అనే సమస్య బహుముఖమైనది మరియు ప్రత్యేకమైనది. కాబట్టి దానిని పూర్తిగా. తొలగించడం చాలా కష్టతరమైన పని. రెండవ పంచర్ష ప్రణాళిక కాలం నుండి ప్రాంతీయ అసమానతలను తొలగించుటకు ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నప్పటికిని ఈ దశలో ఇంకా చేయవలసింది, సాధించవలసింది చాలా ఉంది. వివిధ ప్రాంతాల్లో అసమానతలను తొలగించడానికి ఈ క్రింది చర్యలను తీసుకోవాలి.

వెనుకబడిన రాష్ట్రాలకు కేంద్రం ఆర్థిక వనరులను బదిలీ చేయడం.

  • వెనుకబడిన ప్రాంతాలలో పరిశ్రమల స్థాపనకు ప్రైవేటు రంగం ముందుకు రాదు కాబట్టి ఆ ప్రాంతాలలో ప్రభుత్వం పరిశ్రమలను స్థాపించాలి.
  • వెనుకబడిన ప్రాంతాల్లో అవసరమైన అవస్థాపనా సౌకర్యాలను కల్పించడం.
    ఉదా: విద్యుచ్ఛక్తి, తంతితపాలా, రోడ్డు, నీటి వసతి మొదలైనవి.
  • పారిశ్రామిక వికేంద్రీకరణను ప్రోత్సహించడం, ఉదాహరణకు ప్రాంతీయ ప్రణాళికలు, సూక్ష్మప్రణాళికలను సాధించవచ్చును.
  • వెనుకబడిన ప్రాంతాల్లో పారిశ్రామిక క్షేత్రాల ఏర్పాటు.
  • తరచూ క్షామాలకు, వరదలకు గురి అయ్యే ప్రాంతాల కోసం ప్రత్యేక అభివృద్ధి పధకాలు. కొండ, గిరిజన ప్రాంతాల కోసం ప్రత్యేక అభివృద్ధి పథకాలు.
  • చిన్న తరహా పరిశ్రమలను వెనుకబడిన ప్రాంతాలలో స్థాపించుటకు తగిన ప్రోత్సాహకాలను ఇవ్వడం. వెనుకబడిన ప్రాంతాల్లో పరిశ్రమల స్థాపన, అభివృద్ధి కోశపరమైన ప్రోత్సాహకాలు ఇవ్వడం. ఉదాహరణకు సబ్సిడీలు, పన్ను రాయితీలు, మొదలైనవి ప్రకటించడం.

ప్రశ్న 6.
ఆర్థికాభివృద్ధిలో అంతర్జాతీయ వ్యాపారం పాత్రను వివరించండి.
జవాబు:
అభివృద్ధి చెందుతున్న దేశాల యొక్క ఆర్థికాభివృద్ధిని సాధించుటలో అంతర్జాతీయ వాణిజ్యం చాలా ప్రముఖ పాత్రను పోషిస్తుంది.
ఎ) ఉత్పత్తి పెరుగుదల (Increases Output): అంతర్జాతీయ వ్యాపారం వల్ల లాభాలను గడించి, జాతీయ ఆదాయాన్ని, ఉత్పత్తిని పెంపొందించుకొని ఆర్థిక వృద్ధి రేటును అధికం చేసుకోవచ్చు. అంతర్జాతీయ వ్యాపారం వల్ల అధిక ఉత్పత్తి సాధించి, పేదరికపు విష వలయాన్ని ఛేదించి ఆర్థికాభివృద్ధిని సాధించుకోవచ్చు.

AP Inter 2nd Year Economics Study Material Chapter 7 ప్రణాళికలు - ఆర్ధిక సంస్కరణలు

బి) మార్కెట్ల విస్తరణ (Expands Markets): ఈ దేశాల్లో మార్కెట్ల పరిమాణం చాలా చిన్నదిగా ఉంటుంది. అంతర్జాతీయ వ్యాపారం మార్కెట్లను విస్తృత పర్చటడమేకాక, పొదుపు పెట్టుబడులను ప్రోత్సహించి వనరులను సమర్ధవంతంగా ఉపయోగించుకోవడానికి అవకాశాన్ని కల్పిపిస్తుంది.

సి) ఉపాధి పెరగడం (Increase in Employment): చాలా వరకు అభివృద్ధి చెందుతున్న దేశాలు ఒకటి లేక రెండు ముఖ్యమైన వస్తువుల ఉత్పత్తిలో ప్రత్యేకీకరణ సాధించి వాటికి ఎగుమతి చేసినట్లయితే మార్కెట్లు విస్తరిస్తాయి. అందుబాటులో ఉన్న ఉత్పాదక వనరులకు ఉపాధిని కల్పించి, వాటిని సమర్ధవంతంగా ఉపయోగించకోవచ్చు. దేశంలో పొదుపు పెట్టుబడులు పెరిగి ఉద్యోగావకాశాలు పెరుగుతాయి. ఎగుమతి రంగం విస్తరిస్తున్నప్పుడు అనేక రకాల ఉత్పత్తి కారకాల ప్రవాహం ఈ రంగంలో పెరుగుతుంది.

డి) అంతర్గత – బహిర్గత ఆదాలు (Internal & External & Economies): ఉత్పత్తి కార్యకలాపాల విస్తరణ మరియు మార్కెట్ అవకాశాలు పెరగడం వల్ల అనేక రూపాలలో అంతర్గత, బహిర్గత ఆదాలు లభ్యమవుతాయి. వీటి వల్ల ఉత్పాదక వ్యయం తగ్గుతుంది. ఇది అంతర్జాతీయ వ్యాపారం వల్ల లభించే ప్రత్యక్ష ప్రయోజనం.

ఇ) పరోక్ష ప్రయోజనాలు (Indirect benefits): అంతర్జాతీయ వ్యాపారం వల్ల మార్కెట్ల విస్తరణ జరిగి మరియు ప్రత్యేకీకరణ సాధ్యమై దేశంలో యంత్రాల పూర్తిస్థాయి ఉపయోగం నవకల్పనలకు దారితీసి శ్రామిక ఉత్పాదకత శక్తి కూడా పెరుగుతుంది. నూతన వస్తువులు అందుబాటులోకి వచ్చి వాటిని పొందుటకు ప్రజలను కష్టపడే విధముగా, పొదుపు చేసే విధముగా ప్రేరేపిస్తుంది.

ఎఫ్) ప్రాధమిక వస్తువుల ఎగుమతి మూలధన వస్తువుల దిగుమతి (Import of Capital Goods against Export of Staple Commoditeis): తక్కువ అభివృద్ధికి దోహదపడే స్వదేశీ వస్తువులను, అధిక అభివృద్ధికి దోహదపడే విదేశీ వస్తువులతో వినిమయం చేసుకోవడం వల్ల ఆర్థికాభివృద్ధి వేగవంతం అవుతుంది.

జి) విద్యాపరమైన కీలక ప్రభావాలు (Important Educative Effect): సాధారణంగా అంతర్జాతీయ వ్యాపారం విద్యపైన అనుకూల ప్రభావాన్ని చూపుతుంది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో సాంకేతిక నైపుణ్యత తక్కువగా ఉండటం వల్ల మూలధన కొరత ఏర్పడి ఆర్థికాభివృద్ధిని ఆటంక పరుస్తుంది. అంతర్జాతీయ వ్యాపారం ఈ బలహీనతను | తొలగిస్తుంది. అభివృద్ధి చెందుతున్న దేశాలు పోటీతత్వాన్ని పెంచుకోవడానికి విద్య, సాంకేతిక పరిజ్ఞానం, ఉత్పత్తి విధానాల్లో మార్పులను తీసుకురావాలి.

హెచ్) విదేశీ మూలధన దిగుమతికి ఆధారం (Basis of Importation of Foreign Capital): అభివృద్ధి చెందుతున్న దేశాలు మూలధన కొరతను కలిగి ఉంటాయి. ఒక దేశం అంతర్జాతీయ వ్యాపారంలో చురుకుగా పాల్గొనడం వల్ల ధనిక దేశాలలోని ఉపయోగింపబడని మూలధనం అభివృద్ధి చెందుతున్న దేశాలకు ప్రవహించి ఇక్కడ సమర్ధవంతంగా ఉపయోగింపబడతాయి. విదేశీ మూలధనం ఉపాధి ఆదాయం మరియు ఉత్పత్తిని పెంచడమే కాక ప్రతికూల వర్తక శేషాన్ని కల్పించడానికి, ద్రవ్యోల్బణ ఒత్తిడులను అధిగమించడానికి ఉపయోగపడుతుంది.

ప్రశ్న 7.
ప్రపంచీకరణను నిర్వచించి, భారతదేశంలో ప్రపంచీకరణకు అవసరమైన పరిస్థితులను గురించి వ్రాయుము.
జవాబు:
దేశీయ ఆర్థిక వ్యవస్థను ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో అనుసంధానం చేయడమే ప్రపంచీకరణ అంటారు. దీని వల్ల ప్రపంచ దేశాల మధ్య వస్తు సేవలు, సాంకేతిక, శ్రమ, మొదలగునవి సులభంగా ప్రవహింపబడి ప్రపంచ దేశాలన్ని అనుసంధానింపబడతాయి.

ప్రపంచీకరణకు అవసరమైన పరిస్థితులు:
1) వ్యాపార స్వేచ్ఛ: ప్రపంచీకరణ ప్రక్రియలో అవసరమైన ప్రభుత్వ నియమ నిబంధనలు ఉండరాదు. దిగుమతి నియంత్రణలు, విత్త వనరులపై నియమాలు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి మొదలైన వాటికి ప్రభుత్వం అనుకూలమైన ఆర్థిక వాతావరణాన్ని కల్పించాల్సి ఉంటుంది. ఆర్థిక సరళీకరణ చాలా ముఖ్యం.

2) అవస్థాపన సదుపాయాలు: స్వదేశీ సంస్థ ప్రపంచ స్థాయిలో అభివృద్ధి చెందటానికి కావలసిన సదుపాయాలను కల్పించవలసి ఉంది.
ఉదా: నీరు, రవాణా, విద్యుత్, ఫైనాన్స్ మొదలగునవి.

3) ప్రభుత్వ ప్రోత్సాహం: ప్రపంచీకరణ ప్రక్రియలో ప్రభుత్వ ప్రోత్సాహం అవసరమవుతుంది. ఆర్థిక సంస్కరణలు, అవస్థాపన సౌకర్యాల కల్పన, పరిశోధన మరియు అభివృద్ధి మొదలైన వాటిని ప్రభుత్వం కల్పించినప్పుడే ప్రపంచీకరణ విజయవంతం అవుతుంది.

4) వనరులు: ఒక వ్యాపార సంస్థ ప్రపంచీకరణలో అభివృద్ధి చెందటానికి దానికి కావలసిన వనరులు చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తాయి. పరపతి, సాంకేతికత, నైపుణ్యం యజమాన్యాలు, మానవ వనరులు పరిశోధన మరియు అభివృద్ధి మొదలైన వనరులు ఉన్నప్పుడు వ్యాపార సంస్థలు ప్రపంచీకరణలో అభివృద్ధి చెందుతాయి.

AP Inter 2nd Year Economics Study Material Chapter 7 ప్రణాళికలు - ఆర్ధిక సంస్కరణలు

5) పోటీతత్వం: అంతర్జాతీయ వ్యాపారంలో ఒక వ్యాపార సంస్థ విజయాన్ని, దానికి గల పోటీతత్త్వాన్ని బట్టి నిర్ణయించవచ్చు. సంస్థలు తక్కువ ధర, వ్యయం, మెరుగైన సాంకేతికం, వస్తుభిన్నత్వం మొదలైన వాటి ద్వారా చిన్న వ్యాపార సంస్థ ఎక్కువ తులనాత్మక ప్రయోజనాలతో లాభాలు పొందవచ్చు.

6) అనుసరణీయ వ్యూహాలు ప్రపంచీకరణలో వ్యాపార సంస్థలు ఎలాంటి వ్యూహాలు అనుసరిస్తే విజయాన్ని సాధిస్తాయో తెలుసుకోవలసిన అవసరం ఉంది. కాబట్టి ప్రపంచీకరణలో పాల్గొనే సంస్థలకు ప్రాపంచిక వ్యాపార వ్యూహాలపై తగిన అవగాహన అవసరం.

ప్రశ్న 8.
భారత ఆర్థిక వ్యవస్థపై ప్రపంచీకరణ ప్రభావం తెలియజేయండి.
జవాబు:
భారతదేశ ఆర్థిక వ్యవస్థపై ప్రపంచీకరణ ప్రభావం:

  • 1991లో ప్రపంచ ఎగుమతులలో భారతదేశం వాటా 0.53% వుండగా 2013 నాటికి 1.7% కు పెరిగింది.
  • విదేశీ ద్రవ్య నిధులు 1 బిలియన్ యు.యస్. డాలర్ల స్థాయి నుండి 2015, ఫిబ్రవరి అంతానికి 333 బిలియన్ యు.యస్. డాలర్లకు పెరిగాయి.
  • ఎగుమతుల ద్వారా ఆర్జించిన ద్రవ్యం, 65% మేరకు దిగుమతుల చెల్లింపులకు సరిపోవుచున్నది.
  • దేశం యొక్క కరెంటు ద్రవ్యలోటుపై నియంత్రణ సాధ్యం అవుతుంది.
  • విదేశీ రుణ పెరుగుదల రేటు సంస్కరణల ముందు కంటే బాగా తగ్గుదల చూపుతున్నది.
  • అంతర్జాతీయంగా భారతదేశంపై నమ్మకం పెరిగింది.
  • భారతదేశ వినియోగదారులు ఇప్పుడు వివిధ నాణ్యమైన వస్తువులను తక్కువ ధరలకే సొంతం చేసుకుంటున్నారు.
  • ప్రపంచీకరణ వల్ల ఉద్యోగ పరిస్థితి క్షీణించడం జరిగింది. ఉద్యోగాలవృద్ధి రేటు ప్రపంచీకరణ పూర్వఉన్న 2% నుండి 0.98%కి పడిపోయినది.
  • ప్రభుత్వంపై బహుళజాతి సంస్థలు (MNC’s) అంతర్జాతీయ ద్రవ్య సంస్థ (IMF) మరియు ప్రపంచ బ్యాంక్ (World Bank)ల ఒత్తిడి పెరగడంతో ప్రభుత్వం కొన్ని సంస్కరణలను ప్రవేశపెట్టింది. వాటి ఫలితంగా అనేక చిన్నతరహా, మధ్యతరహా పరిశ్రమలు మూతపడుచున్నవి.
  • ప్రపంచీకరణ వల్ల ప్రజల మధ్య ఆదాయ అసమానతలు అదే విధముగా ప్రాంతీయ అసమానతలు కూడా పెరుగుచున్నాయి.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ప్రణాళిక రకాలు.
జవాబు:
ఒక నిర్ణీత కాల వ్యవధిలో నిర్దేశించిన లక్ష్యాలను సాధించడానికి లేదా ఆర్థిక వ్యవస్థలోని కార్యకలాపాలను నిర్దేశించిన లక్ష్యాల వైపుకు ఒక క్రమంలో నడపడాన్ని ‘ప్రణాళిక’ అంటారు.
1) దీర్ఘదర్శి ప్రణాళిక: ఇది ఒక స్థూల ప్రణాళిక. అనగా 15 సంవత్సరాల నుండి 20 సంవత్సరాల కాలానికి దీర్ఘకాల అవసరాలను, లక్ష్యాలను దృష్టిలో ఉంచుకొని తయారుచేయబడుతుంది.

2) పంచవర్ష ప్రణాళికలు: ఇది 5 సంవత్సరాల కాలానికి రూపొందింపబడిన ప్రణాళిక. దీనిలో 5 సంవత్సరాలు పూర్తయిన తరువాత సాధించిన లక్ష్యాలను సమీక్షించడం జరుగుతుంది. ఇది దీర్ఘదర్శి ప్రణాళికలో అంతర్భాగంగా ఉంటుంది.

AP Inter 2nd Year Economics Study Material Chapter 7 ప్రణాళికలు - ఆర్ధిక సంస్కరణలు

3) వార్షిక ప్రణాళికలు: వార్షిక ప్రణాళికలు పంచవర్ష ప్రణాళికలో భాగంగా ఉంటాయి. పంచవర్ష ప్రణాళిక లక్ష్యాలు వార్షిక లక్ష్యాలుగా విభజింపబడి ప్రతి సంవత్సరానికి సంబంధించిన వార్షిక సమగ్ర ప్రణాళిక సిద్ధం చేస్తారు.

4) నిరంతర ప్రణాళికలు: ఈ ప్రణాళికలకు నిర్ణీత సమయము ఉండదు. దీనిని గున్నార్ మిర్డాల్ మొట్టమొదటి సారిగా ప్రతిపాదించారు. ప్రణాళికలు ముందు కెళ్తున్న కొద్ది, పూర్తయిన సంవత్సరాన్ని మినహాయించి రాబోయే సంవత్సరాన్ని కలుపుతూ వెళ్ళడం జరుగుతుంది. ఇవి నిరంతరం కొనసాగుతూనే ఉంటాయి. 1979 సంవత్సరము తరువాత ఈ ప్రణాళికలు ఆపివేయబడ్డాయి.

ప్రశ్న 2.
ప్రణాళికా సంఘం.
జవాబు:
1950లో ప్రణాళికా సంఘాన్ని ఏర్పాటు చేశారు. రాజ్యాంగంలోని 39వ అధికరణలోని ఆదేశిక సూత్రాల్లో భాగంగా ప్రణాళిక సంఘాన్ని స్థాపించారు. ఇది స్వతంత్ర ప్రతిపత్తి కల్గిన ప్రభుత్వానికి సలహాదారుగా పనిచేస్తుంది. దీనికి ఎలాంటి చట్టబద్ధత ఉండదు. దీని ప్రధాన కార్యాలయం “యోజనా భవన్” న్యూఢిల్లీలో ఉంది. ప్రధాన మంత్రి
సంఘానికి అధ్యక్షుడుగాను, 5గురు దీర్ఘకాలిక సభ్యులుగా నియమితులు అవుతారు. కీలక శాఖల కేబినెట్ మంత్రులు కూడా సభ్యులుగా ఉంటారు. ప్రణాళికా సంఘానికి మొట్ట మొదటి ఉపాధ్యక్షుడు శ్రీ గుల్జారీలాల్ నందా కాగా చివరి ఉపాధ్యక్షుడు శ్రీ మాంటెక్ సింగ్ అహ్లువాలియా చివరి ఉపాధ్యక్షుడు. జనవరి 1, 2015 నుండి ప్రణాళికా సంఘం “నీతి ఆయోగ్” గా రూపాంతరం చెందినది.

ప్రశ్న 3.
ప్రణాళిక సంఘం యొక్క లక్ష్యాలు. [Mar ’17]
జవాబు:
ప్రణాళిక సంఘంను 1950వ సంవత్సరంలో ఏర్పాటు చేశారు. ఇది స్వతంత్ర ప్రతిపత్తి కల్గినది. ప్రభుత్వానికి సలహాదారుగా పనిచేస్తుంది.

  1. సహజ వనరులు, మానవ వనరులు, మూలధన వనరుల లభ్యత ఎంత వరకు దేశంలో ఉన్నాయో అంచనా వేయడం.
  2. ఆశించిన దానికంటే తక్కువగా ఉన్న వనరుల పెంపుదలను పరిశోధన చేయడం.
  3. ప్రణాళికా ప్రాధాన్యతను లక్ష్యాలను నిర్ణయించడం.
  4. ఆర్థికాభివృద్ధికి ప్రతిబంధకాలుగా ఉన్న కారకాలను గుర్తించి మరియు వాటికి పరిష్కార మార్గాలు అన్వేషించుట.
  5. ప్రణాళికను విజయవంతంగా అమలు చేయడానికి అవసరమైన యంత్రాంగాన్ని నిర్ణయించడం.
  6. ప్రణాళిక అమలు వల్ల సాధించిన ప్రగతిని అంచనా వేయడం.
  7. ప్రణాళిక విజయానికి అవసరమైన మధ్యంతర సిఫారసులు చేయడం.

ప్రశ్న 4.
ఏవేని 3 ప్రణాళికా వైఫల్యాలను గురించి పేర్కొనండి.
జవాబు:

  1. 65 సంవత్సరముల ఆర్థికాభివృద్ధిలో పేదరికం, నిరుద్యోగం మొదలైన సమస్యలు పరిష్కరింపబడలేదు. 2012లో భారత ప్రభుత్వ నివేదిక ప్రకారం 21.9 శాతం జనాభా దారిద్య్రరేఖను దిగువన ఉన్నారు. 1999-2000 నాటికి 26.58 మిలియన్ల మంది నిరుద్యోగులు ఉండగా, 2009 – 10 నాటికి ఈ సంఖ్య 28.1 మిలియన్లకు పెరిగింది.
  2. భూ సంస్కరణలు ప్రవేశపెట్టి దశాబ్దాలు గడిచినా, వాస్తవిక పరిస్థితులలో భూపంపిణీ సక్రమంగా అమలు
    కాలేదు.
  3. భారతదేశ పంచవర్ష ప్రణాళికల ముఖ్య లక్ష్యం అసమానతలు లేని సమ సమాజాన్ని నిర్మించడం కాని ఇది ఇప్పటికి పూర్తి కాలేదు.
  4. “అందరికీ ఆరోగ్యం” అనే లక్ష్యాన్ని ఇప్పటికీ చేరుకోలేకపోయాం.

ప్రశ్న 5.
భారత దేశంలో ప్రాంతీయ అసమానతలకు కారణాలు. [Mar ’17]
జవాబు:
దేశ సమగ్రతకి, సత్వర పురోగతికి, ఆర్థికాభివృద్ధికి ప్రాంతీయ అసమానతలు అడ్డంకిగా ఉంటాయి. వివిధ ప్రాంతాల ప్రజల జీవన ప్రమాణాల్లో వ్యత్యాసాలు తొలగించేందుకు చర్యలు తీసుకోవడానికి ముందుగా, దీనికి గల అసలు కారణాలను తెలుసుకోవడం ముఖ్యం. అవి:
ఎ) భౌగోళిక కారణాలు: భౌగోళికంగా కొన్ని ప్రాంతాలు మిగతా ప్రాంతాల నుంచి వేరుపరచబడి ఉంటాయి. కొండలు, లోయల కారణంగా ఇలాంటి ప్రాంతాలు ఏర్పడవచ్చు. అలాంటి ప్రాంతాలు వెనకబడి ఉంటాయి. ఉదా: హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్లోని కొండ ప్రాంతాలు, హిమాలయ ప్రాంతాల్లోని ఉత్తర కాశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలు ముఖ్యంగా వాతావరణం, రవాణా మార్గాలు సరిగ్గా లేకపోవడం వల్ల వెనుకబడి ఉన్నాయి.

AP Inter 2nd Year Economics Study Material Chapter 7 ప్రణాళికలు - ఆర్ధిక సంస్కరణలు

బి) శీతోష్ణస్థితి పరిస్థితులు: వర్షపాతం, వాతావరణం మొదలైనవి అనుకూలంగా లేకపోవడం వల్ల కూడా కొన్ని ప్రాంతాలు ఆర్థికంగా అభివృద్ధి చెందే అవకాశాలు తక్కువ. ఇలాంటి ప్రదేశాల్లో వ్యవసాయం కానీ, పరిశ్రమలు కానీ తొందరగా అభివృద్ధి చెందలేవు.

సి) బ్రిటీషువారి పరిపాలన: చారిత్రాత్మకంగా చూస్తే భారతదేశంలో కొన్ని ప్రాంతాలు వెనుకబడి ఉండటానికి బ్రిటీషువారి పరిపాలన కూడా కొంత కారణం. పారిశ్రామిక ఉత్పత్తికి, తమ వ్యాపారానికి అనుకూలముగా ఉండి మన దేశ సంపదను తమ దేశానికి తరలించడానికి అనువుగా ఉండే ప్రాంతాలనే వారు ఎన్నుకొని అభివృద్ధి పరచడం జరిగింది. మహా నగరాలైన కలకత్తా, బొంబాయి, మద్రాసులను వ్యాపార కేంద్రాలుగా చేసుకోవడం వల్ల, భారతదేశంలో మిగిలిన ప్రాంతాలు నిర్లక్ష్యం చేయబడి వెనుకబడ్డాయి.

డి) పరిశ్రమల కేంద్రీకరణ: అభివృద్ధి చెందిన ప్రాంతాల్లోనే ప్రైవేటు రంగం నూతన పరిశ్రమలు స్థాపించడం జరుగుతుంది కారణం, అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో పరిశ్రమలకు కావలసిన అవస్థాపనా వసతులైన నైపుణ్యం గల శ్రామికులు, రవాణా మరియు మార్కెట్ సౌకర్యాలు సులభంగా లభ్యం కావడం.

ఇ) సహజ వనరుల కొరత: ప్రకృతి పరంగా కొన్ని ప్రాంతాల్లో కొన్ని వనరులు పుష్కలంగా లభించడం వల్ల ఆ ప్రాంతాలు మాత్రం వేగంగా అభివృద్ధి చెందగలుగుతున్నాయి. అలాంటి అవకాశాలు లేని ప్రాంతాలు వెనుకబడి ఉన్నాయి అని చెప్పవచ్చు.

ఎఫ్) అవస్థాపనా సౌకర్యాల కొరత: పరిశ్రమల స్థాపనకు అవరాలైన విద్యుచ్ఛక్తి, రోడ్లు, తంతి తపాలా సౌకర్యాలు, నీరు, విద్య, ఆరోగ్యం, సాంకేతిక శిక్షణ సౌకర్యాలు, పరపతి మొదలైనవి కొరతగా ఉన్న ప్రాంతాలు వెనుకబడి ఉంటాయి. ఈ సౌకర్యాలు లభ్యమయ్యే ప్రాంతాలు త్వరితంగా అభివృద్ధి చెందుతాయి.

ప్రశ్న 6.
ప్రైవేటీకరణ సమర్థతను తెలుపు 3 విషయాలను వివరింపుము.
జవాబు:
ప్రభుత్వ రంగంలోని ఉత్పాదక కార్యకలాపాలపై యాజమాన్య హక్కును ప్రైవేటురంగ వ్యక్తులకు పూర్తిగాగాని, పాక్షికంగా కాని బదిలి చేసే ప్రక్రియను ప్రైవేటీకరణ అంటారు..
1) సామర్థ్యం, ప్రదర్శన పెరుగుదల: ప్రైవేటు రంగం పూర్తిగా లాభార్జనతో కూడుకున్న నిర్ణయాలు చేస్తుంది. కాబట్టి వ్యాపార సంస్థల సామర్థ్యం మరియు ప్రదర్శన పెరుగుతాయి. అదిగాక ప్రైవేటు రంగం మేనేజర్లకు మార్కెట్టును సృష్టిస్తుంది. కాబట్టి నిర్వహణ నాణ్యత కూడా పెరుగుతుంది.

2) బాధ్యతను అప్పగించడం సులభం: ప్రభుత్వ రంగంలోని లోపాలకు ఎవరు కూడా బాధ్యత వహించరు. కాని ప్రైవేటు రంగంలోని ప్రతి అంశానికి బాధ్యతలను విభజించి వ్యక్తులకు అప్పచెప్పుతారు. కాబట్టి ప్రైవేటు రంగంలో ఎలాంటి పొరపాటు జరిగినా వారు సరి చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది.

3) ప్రణాళిక సాధన: ప్రైవేటు సంస్థలో అన్ని నిర్ణయాలు ముందుగానే రూపొందిస్తారు. వాటికి అనుకూలముగా ఏ అధికారి అయిన నడుచుకోవలసి వస్తుంది.

4) ప్రైవేటు రంగంలో సత్వర పరిష్కార మార్గాలు: ప్రైవేటు సంస్థలన్ని లాభర్జనపై ఆధారపడి ఉంటాయి. వీటికి తమ సంస్థలను ప్రభుత్వం తీసుకుంటుందేమోననే భయం ఉంటుంది లేదా నష్టాలు రావచ్చు అనే భయం కారణాలు వల్ల పరిష్కార మార్గాలు చాలా వేగంగా చేపడతారు.

ప్రశ్న 7.
అంతర్జాతీయ వ్యాపార పాత్ర.
జవాబు:
అభివృద్ధి చెందుతున్న దేశాల యొక్క ఆర్థికాభివృద్ధిని సాధించుటలో అంతర్జాతీయ వాణిజ్యం చాలా ప్రముఖ పాత్రను పోషిస్తుంది.
ఎ) ఉత్పత్తి పెరుగుదల (Increases Output): అంతర్జాతీయ వ్యాపారం వల్ల లాభాలను గడించి, జాతీయ ఆదాయాన్ని, ఉత్పత్తిని పెంపొందించుకొని ఆర్థిక వృద్ధి రేటును అధికం చేసుకోవచ్చు. అంతర్జాతీయ వ్యాపారం వల్ల అధిక ఉత్పత్తి సాధించి, పేదరికపు విష వలయాన్ని ఛేదించి ఆర్థికాభివృద్ధిని సాధించుకోవచ్చు.

బి) మార్కెట్ల విస్తరణ (Expands Markets): ఈ దేశాల్లో మార్కెట్ల పరిమాణం చాలా చిన్నదిగా ఉంటుంది. అంతర్జాతీయ వ్యాపారం మార్కెట్లను విస్తృత పర్చటడమేకాక, పొదుపు పెట్టుబడులను ప్రోత్సహించి వనరులను సమర్ధవంతంగా ఉపయోగించుకోవడానికి అవకాశాన్ని కల్పిపిస్తుంది.

AP Inter 2nd Year Economics Study Material Chapter 7 ప్రణాళికలు - ఆర్ధిక సంస్కరణలు

సి) ఉపాధి పెరగడం (Increase in Employment): చాలా వరకు అభివృద్ధి చెందుతున్న దేశాలు ఒకటి లేక రెండు ముఖ్యమైన వస్తువుల ఉత్పత్తిలో ప్రత్యేకీకరణ సాధించి వాటికి ఎగుమతి చేసినట్లయితే మార్కెట్లు విస్తరిస్తాయి. అందుబాటులో ఉన్న ఉత్పాదక వనరులకు ఉపాధిని కల్పించి, వాటిని సమర్ధవంతంగా ఉపయోగించకోవచ్చు. దేశంలో పొదుపు పెట్టుబడులు పెరిగి ఉద్యోగావకాశాలు పెరుగుతాయి. ఎగుమతి రంగం విస్తరిస్తున్నప్పుడు అనేక రకాల ఉత్పత్తి కారకాల ప్రవాహం ఈ రంగంలో పెరుగుతుంది.

డి) అంతర్గత బహిర్గత ఆదాలు (Internal & External & Economies): ఉత్పత్తి కార్యకలాపాల విస్తరణ మరియు మార్కెట్ అవకాశాలు పెరగడం వల్ల అనేక రూపాలలో అంతర్గత, బహిర్గత ఆదాలు లభ్యమవుతాయి. వీటి వల్ల ఉత్పాదక వ్యయం తగ్గుతుంది. ఇది అంతర్జాతీయ వ్యాపారం వల్ల లభించే ప్రత్యక్ష ప్రయోజనం.

ఇ) పరోక్ష ప్రయోజనాలు (Indirect benefits): అంతర్జాతీయ వ్యాపారం వల్ల మార్కెట్ల విస్తరణ జరిగి మరియు ప్రత్యేకీకరణ సాధ్యమై దేశంలో యంత్రాల పూర్తిస్థాయి ఉపయోగం నవకల్పనలకు దారితీసి శ్రామిక ఉత్పాదకత శక్తి కూడా పెరుగుతుంది. నూతన వస్తువులు అందుబాటులోకి వచ్చి వాటిని పొందుటకు ప్రజలను కష్టపడే విధముగా, పొదుపు చేసే విధముగా ప్రేరేపిస్తుంది.

ప్రశ్న 8.
GATT యొక్క లక్ష్యాలు.
జవాబు:
సుంకాలు, వ్యాపారంపై సాధారణ ఒప్పందం (గాట్) 1.1.1948 నుంచి అమలులోనికి వచ్చింది. ఇది 1.1.1995 వరకు కొనసాగింది. 1.1.95 నుండి ఇది WTOలో వీలినమైనది.
లక్ష్యాలు:

  1. నిష్పక్షపాతంగా అత్యంత అభిమాన దేశంను అనుసరించడం.
  2. సంప్రదింపుల ద్వారా తగాదాల పరిష్కారం.
  3. కొన్ని విషయాలలో చట్ట బద్ధత కల్పించడం.
  4. సుంకాల ద్వారానే స్వదేశీ పరిశ్రమలకు రక్షణ కల్పించడం.
  5. బహుళ ఒప్పందాల ద్వారా సుంకాలను, సుంకేతర అంశాలను సరళీకరించడం.
  6. అంతర్జాతీయ వ్యాపారాన్ని పారదర్శకంగా విచక్షణ రహితంగా అమలు చేయడం.

ప్రపంప వ్యాపారంలో సరళీకరణ ద్వారా వనరులను సంపూర్ణంగా ఉపయోగించుకొని, ఉత్పత్తి, స్థారక డిమాండ్ను క్రమంగా పెంపొందించి, సంపూర్ణ ఉద్యోగితను సాధించి, నిజ ఆదాయాన్ని ప్రజల జీవన ప్రమాణాన్ని వృద్ధి పరచి ప్రపంచ వ్యాప్తంగా వస్తు వినిమయాన్ని విస్తరించడం గాట్ లక్ష్యం.

ప్రశ్న 9.
ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO) యొక్క లక్ష్యాలు.
జవాబు:

  1. WTO ప్రధాన లక్ష్యం – జీవన ప్రమాణాన్ని పెంచడం, సంపూర్ణ ఉద్యోగిత మరియు సుస్థిర వృద్ధి, ఉత్పత్తిని విస్తరించడం, వస్తుసేవల వ్యాపారాన్ని ప్రపంచ దేశాలకు విస్తరింపచేయడం.
  2. సుస్థిరాభివృద్ధిని సాధించుటకు ప్రపంచ వనరులను అభిలషనీయముగా సద్వినియోగ పరుచుకొంటూ సుస్థిర ఆర్థికాభివృద్ధి అనే లక్ష్యానికి అనుగుణముగా వనరుల వినియోగం జరిగేటట్లు చూడడం.
  3. అంతర్జాతీయ వ్యాపారం వల్ల అభివృద్ధి చెందుతున్న, తక్కువ అభివృద్ధి చెందిన దేశాలకు రావాల్సినవి అందేలా చూడడం.
  4. సభ్యదేశాలను పరస్పర ఒప్పందాల ద్వారా అందరికి ప్రయోజనకరంగా ఉంటుందని ఒప్పించడం.
  5. ఒక సమగ్ర, నమ్మకమైన మరియు నాణ్యతతో కూడిన బహుళ పాక్షిక వర్తక వ్యవస్థను అభివృద్ధి చేయడం.

AP Inter 2nd Year Economics Study Material Chapter 7 ప్రణాళికలు - ఆర్ధిక సంస్కరణలు

ప్రశ్న 10.
గాట్ (GATT), ప్రపంచ వాణిజ్య సంస్థల (W.T.O) మధ్య భేదాలు.
జవాబు:
గాట్ (GATT)

  1. దీనికి చట్టబద్ధత లేదు.
  2. ఇది శాసనసభల ద్వారా గాని, ప్రభుత్వాల ద్వారా గాని సృష్టింపబడలేదు.
  3. ఇది ఐక్యరాజ్య సమితి ఏజెంటు కాదు.
  4. కొన్ని ఎంపిక చేయబడిన అంశాలలో బహుళ పాక్షిక ఒప్పందాలకు సంబంధించి కొన్ని నియమ నిబంధలను కలిగి ఉంది.
    ప్రత్యేక విషయాలకు ప్రత్యేక ఒప్పందాలు కలిగి ఉంటుంది. కాని సభ్యులు దానికి ఖచ్చితంగా లోబడి ఉండాల్సిన పనిలేదు. ఏ సభ్యదేశమైన ఒప్పందం బయటే ఉండిపోవచ్చు. కేవలం సంతకం చేసిన సభ్యులే అందుకు లోబడి ఉంటారు.
  5. గాట్ సభ్యదేశాల మధ్య తలెత్తే తగాదాలపై చర్చించగలదు. కాని సభ్యులు ఖచ్చితంగా తన నిర్ణయాన్ని పాటించేలా చెయ్యలేదు.
  6. ప్రపంచ వర్తక సమస్యలను చర్చించుటకు ప్రతి దశాబ్దంలో సమావేశమయ్యే ఒక వేదికగా గాట్ పని చేస్తుంది.
  7. గాట్ నియమాలు వస్తు వ్యాపారానికి మాత్రమే సంబంధించినవి కలిగి ఉంది.
  8. ఇది డైరెక్టర్ జనరల్ ద్వారా నిర్వహింపబడే ఒక చిన్న సెక్రటేరియలు మాత్రమే కలిగి ఉండేది.

ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO)

  1. ఇది చట్టబద్ధమైనది.
  2. ఇది సభ్యదేశాల శాసన సభలు ప్రభుత్వాలచే ఒక ఒప్పందం ప్రకారం ఏర్పాటు చేయబడింది.
  3. ఇది ఐక్యరాజ్య సమితిలో సహకార సంబంధాలు కలిగి ఉంటుంది.
  4. ఇందులో ఒప్పందాలు శాశ్వతమైనవి మరియు సభ్యదేశాలన్ని తప్పనిసరిగా వాటికి లోబడక తప్పదు.
    నిబంధనలను ఉల్లంఘించిన సభ్యదేశంపై ఇతర సభ్యులు క్రమ శిక్షణ చర్యలను తీసుకోవచ్చు.
  5. WTO లోని తగాదాలను పరిష్కారణ యంత్రాంగం స్వయం చాలకము, వేగవంతం మరియు అన్ని దేశాలు నిర్ణయాలకు బద్దులై ఉండాలి.
  6. ఇది పటిష్ట నియమాలతో సక్రమంగా స్థాపించ బడిన సంస్థ కాబట్టి ఒప్పంద నిర్ణయాలు కాల బద్దతను కలిగి ఉంటాయి.
  7. WTO వస్తుసేవల వాణిజ్యమేకాక మేథస్సుకు సంబంధించిన మేథోసంపత్తి హక్కులు మరియు అనేక ఒప్పందాలు కలిగి ఉంది.
  8. ఇది పెద్ద సెక్రటేరియట్ను కలిగి పెద్ద నిర్వహణ స్వరూపాన్ని కలిగి ఉంది.

ప్రశ్న 11.
ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO) విధులు.
జవాబు:
ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO) క్రింది విధులను నిర్వహిస్తుంది. [Mar ’16]

  1. ప్రపంచ వ్యాపార ఒప్పందాల అమలు, పరిపాలన మరియు కార్యాచరణలో చొరవ తీసుకుంటుంది.
  2. WTO తన సభ్యదేశాలను, వ్యాపార ఒప్పందాల్లో ఒక వేదికగా ఉపయోగపడుతుంది.
  3. వ్యాపార తగాదాలను పరిష్కరిస్తుంది.
  4. ఇది సభ్యదేశాల జాతీయ వ్యాపార విధానాలను పర్యవేక్షిస్తుంది.
  5. ఇది అభివృద్ధి చెందుతున్న దేశాలకు సాంకేతికంగా శిక్షణను, ఇతర సహాయాలను చేస్తుంది.
  6. ఇది IMF, IBRD మరియు దాని అనుబంధ సంస్థలతో శాంతియుత సహాయ సహకార సంబంధాన్ని కలిగి ఉంటుంది.

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ప్రణాళికను నిర్వచింపుము.
జవాబు:
ప్రణాళిక అంటే నిర్ణీత కాలవ్యవధిలో నిర్దేశించిన లక్ష్యాలను సాధించడానికి లేదా ఆర్థిక వ్యవస్థలోని కార్యకలాపాలను నిర్దేశించిన లక్ష్యాలవైపు ఒక క్రమంలో నడవటాన్ని ప్రణాళిక అంటారు. మన దేశంలో ప్రణాళికలు 1951వ సంవత్సరములో ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం 12వ ప్రణాళిక అమల్లో ఉంది.

AP Inter 2nd Year Economics Study Material Chapter 7 ప్రణాళికలు - ఆర్ధిక సంస్కరణలు

ప్రశ్న 2.
నిరంతర ప్రణాళిక అనగానేమి ?
జవాబు:
నిరంతర ప్రణాళికలు: దీనిని గున్నార్ మిర్డాల్ ప్రతిపాదించినాడు. ప్రణాళికలు ముందుకెళ్తున కొద్ది, పూర్తయిన సంవత్సరాన్ని మినహాయించి రాబోయే సంవత్సరాన్ని కలుపుతూ వెళ్ళడం జరుగుతుంది. కావున ఇది నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది.

ప్రశ్న 3.
ప్రణాళికా విరామము.
జవాబు:
ప్రణాళికకు, ప్రణాళికకు మధ్య గల కాలంలో విరామమును ప్రణాళికా విరామము అంటారు. 1966-69 మధ్య కాలంలో ప్రభుత్వ ప్రణాళిక విరామము ఏర్పడినది. దీనికి కారణం ఆర్థిక, రాజకీయ ఒత్తుడులు, 1990-92 మధ్య కాలం ప్రభుత్వ అనధికార సెలవుగా ప్రకటించారు.

ప్రశ్న 4.
దీర్ఘదర్శి ప్రణాళికను నిర్వచింపుము.
జవాబు:
15 సంత్సరాల నుండి 20 సంవత్సరాల కాలానికి దీర్ఘకాల అవసరాలను, లక్ష్యాలను దృష్టిలో ఉంచుకొని తయారుచేయబడే ప్రణాళికను దీర్ఘదర్శి ప్రణాళిక అంటారు. ఇది ఇక స్థూల ప్రణాళిక.

ప్రశ్న 5.
వార్షిక ప్రణాళిక అనగానేమి ? ఉదాహరణ వ్రాయుము.
జవాబు:
పంచవర్ష ప్రణాళిక లక్ష్యాలు వార్షిక లక్ష్యాలుగా విభజింపబడి ప్రతి సంవత్సరానికి సంబంధించిన వార్షిక సమగ్ర ప్రణాళికను సిద్ధం చేయడాన్ని వార్షిక ప్రణాళిక అంటారు. ఇది పంచవర్ష ప్రణాళికలో భాగముగా ఉంటాయి.

ప్రశ్న 6.
భారతదేశంలో వెనుకబడిన రాష్ట్రాలు.
జవాబు:
మధ్యప్రదేశ్, అస్సాం, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, ఒరిస్సా, బీహారు రాష్ట్రాలు వెనుకబడి ఉన్నాయి. వెనుకబడిన రాష్ట్రాలలో సగటు జీవిత కాలం, శిశు మరణాలు, స్త్రీ విద్య వంటి అంశాల్లో కూడా ఎంతో వెనుకబడ్డాయి.

ప్రశ్న 7.
ప్రాంతీయ అసమానతలను నిర్వచింపుము.
జవాబు:
దేశంలో ఒకవైపు కొన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెంది, మరో వైపు కొన్ని వెనుకబడి, ఒక రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల మధ్య ఈ రకమైన వ్యత్యాసాలు ఉండడాన్ని ప్రాంతీయ అసమానతలుగా పేర్కొనవచ్చు. ఈ విధమైన అసమానతలు ప్రకృతి సిద్ధంగా వనరుల లభ్యతలోని తేడాలు ఏర్పడినవి కావచ్చు లేదా మానవ ప్రయత్నాల ఫలితంగా ఏర్పడవచ్చు.

ప్రశ్న 8.
సమతౌల్య ప్రాంతీయాభివృద్ధి.
జవాబు:
అన్ని ప్రాంతాలను ఒకే స్థాయిలో అభివృద్ధి చేయడం సమతౌల్య ప్రాంతీయాభివృద్ధి. అభివృద్ధి ఫలితాలు దేశ ప్రజలందరికి అందచేయడానికి శ్రామిక శక్తి, సహజ వనరులను సంపూర్ణంగా వినియోగించడానికి, ప్రాంతీయ అసమానతలు తొలగించి అన్ని ప్రాంతాలు సమంగా అభివృద్ధి చేయడం చాలా ముఖ్యం.

AP Inter 2nd Year Economics Study Material Chapter 7 ప్రణాళికలు - ఆర్ధిక సంస్కరణలు

ప్రశ్న 9.
సరళీకరణ అనగానేమి ?
జవాబు:
ఉత్పత్తి కార్యకలాపాలలో ప్రైవేటు రంగానికి ప్రభుత్వ రంగంతో పాటు సమాన ప్రతిపత్తిని కల్పిస్తూ, ప్రభుత్వ పరమైన ఆంక్షలను లైసెన్సులను సరళీకృతం చేయడం ద్వారా ప్రైవేటు రంగం ప్రగతికి దోహదపడే విధానమే సరళీకరణ భారతదేశ నూతన ఆర్థిక విధానం 1991లో సరళీకరణ ప్రధానమైన అంశం.

ప్రశ్న 10.
ప్రైవేటీకరణ భావనను వివరింపుము.
జవాబు:
ప్రభుత్వ నిర్వహణలోనున్న సంస్థల యాజమాన్యాన్ని పాక్షికంగా లేదా పూర్తిగా ప్రైవేటు వ్యక్తులకు లేదా ప్రైవేటు రంగానికి అప్పగించుటను ప్రైవేటీకరణ అంటారు.

ప్రశ్న 11.
ప్రపంచీకరణను నిర్వచింపుము.
జవాబు:
దేశ ఆర్థిక వ్యవస్థను ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మిళితం చేయడమే ప్రపంచీకరణ. ఎలాంటి ప్రభుత్వ ఆటంకాలు లేకుండా వస్తు సేవలు, సాంకేతిక, మూలధనం, శ్రామికులు లేక మానవ మూలధన ప్రవాహ ప్రక్రియ ద్వారా ప్రపంచంలోని ఆర్థిక వ్యవస్థలు సంఘటితంగా ఏర్పడటాన్ని ప్రపంచీకరణ అంటారు.

ప్రశ్న 12.
TRIPs లోని అంశాలు.
జవాబు:
వ్యాపార సంబంధిత మేథో సంపత్తి హక్కులు, పేటంట్, భౌగోళిక గుర్తు లేఅవుట్లు, సమాచారం, కాపిరైట్, ట్రేడ్మార్కు మొదలైన వానికి సంబంధించినది.

ప్రశ్న 13.
ట్రిమ్స్ TRIMs భావన.
జవాబు:
వ్యాపార సంబంధిత పెట్టుబడి కొలమానములు ప్రకారం దేశంలోని అన్ని రకములైన నియమ నిబంధనలను తొలగించి విదేశీ పెట్టుబడులను స్వదేశీ పెట్టుబడులుగా పరిగణించడం ద్వారా జాతీయ భావం కల్పించడం.

ప్రశ్న 14.
M. F.N. నిబంధన. [Mar ’16]
జవాబు:
గాట్ ప్రాథమిక సూత్రాన్ని మొదటి ప్రకరణలో చేర్చారు. దీని ప్రకారం సభ్యదేశాల మధ్య విచక్షణా రహితంగా ప్రవర్తించరాదు. సభ్యదేశాలన్ని అధికార అనుకూల జాతీయత క్లాజ్ను అనుసరించటం. దీని ప్రకారం ఏదైనా ఒక సభ్య దేశానికి అనుకూలమైన తీర్మానం చేస్తే గాట్లోని అన్ని సభ్య దేశాలకు ఆ తీర్మానం వర్తిస్తుంది.

ప్రశ్న 15.
పెట్టుబడి ఉపసంహరణ.
జవాబు:
ప్రభుత్వరంగ సంస్థలలోని ఈక్విటీని ప్రైవేటు వ్యక్తులకు, ప్రజలకు పెట్టుబడుల సంస్థకు, మ్యూచవల్ ఫండ్స్క ప్రభుత్వరంగ సంస్థలలో పనిచేసే శ్రామికులకు అమ్మడమే పెట్టుబడుల ఉపసంహరణ.

ప్రశ్న 16.
గాట్ (GATT).
జవాబు:
ప్రపంచంలో 1930 దశకంలో ఏర్పడిన ఆర్థిక మాంద్యం, రెండవ ప్రపంచ యుద్ధం తరువాత అంతర్జాతీయ వ్యాపారం చాలా వేగంగా తగ్గింది. అగ్రదేశాలు సరళీకరణలో కూడిన అంతర్జాతీయ వ్యాపారం ఉండాలని భావించాయి. వాటి ఆలోచనా ఫలితంగానే సుంకాలు వ్యాపారంపై సాధారణ ఒప్పందం (GATT) ఏర్పడినది. గాట్ 1.1.1948 నుండి 1.1.1995 వరకు తన విధులు నిర్వహించింది.

ప్రశ్న 17.
ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO). [Mar ’17]
జవాబు:
ఉరుగ్వే రౌండ్ అంతిమ చట్టంపై ఏప్రిల్ 1994 సంవత్సరంలో 124 గాట్ సభ్య దేశాలు సంతకాలు చేయటం వల్ల ప్రపంచ వాణిజ్య సంస్థ ఏర్పడింది. ఇది 1.1.1995 నుండి తన విధులు నిర్వహిస్తోంది. ప్రస్తుతం 2013 వరకు దీనిలో 160 సభ్య దేశాలు ఉన్నాయి. ఇది చట్టబద్ధమైన వ్యవస్థ. ఇది ప్రపంచ వ్యాపారాన్ని, సేవలు, విదేశీ పెట్టుబడిని, మేథో సంపత్తి హక్కులను పరిరక్షించటం మొదలైన వాటిలో ముఖ్యమైన పాత్ర పోషించుచున్నది.

AP Inter 2nd Year Economics Study Material Chapter 7 ప్రణాళికలు - ఆర్ధిక సంస్కరణలు

ప్రశ్న 18.
ఉరుగ్వే రౌండ్.
జవాబు:
గాట్ సభ్యదేశాల 8వ సమావేశాన్ని ఉరుగ్వే రౌండ్గా పిలుస్తారు. గాట్ సాధారణ సమావేశాలకు విరుద్ధంగా ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశం W.T.O. ఏర్పడటానికి మార్గదర్శకమైంది.

ప్రశ్న 19.
F.D.I (విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి).
జవాబు:
విదేశాలలో పెట్టిన పెట్టుబడులపై సంపూర్ణ నియంత్రణ కలిగి ఉండటం.

AP Inter 2nd Year Economics Study Material Chapter 2 జనాభా, మానవ వనరుల అభివృద్ధి

Andhra Pradesh BIEAP AP Inter 2nd Year Economics Study Material 2nd Lesson జనాభా, మానవ వనరుల అభివృద్ధి Textbook Questions and Answers.

AP Inter 2nd Year Economics Study Material 2nd Lesson జనాభా, మానవ వనరుల అభివృద్ధి

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
జనాభా పరిణామ సిద్ధాంతం వివరించండి.
జవాబు:
ఆర్థికాభివృద్ధి మరియు జనన మరణాల రేటును బట్టి ఈ సిద్ధాంతాన్ని మూడు దశలుగా విభజించవచ్చు. ప్రతి దేశంలో ఈ క్రింది మూడు దశలను అనుసరించి జనాభా వృద్ధిరేటు ఉంటుంది.
1) మొదటి దశ: ఈ దశలో ఆర్థికంగా వెనుకబడిన వ్యవసాయ ప్రాధాన్యతగల ఆర్థిక వ్యవస్థలో జననాల రేటు, మరణాల రేటు అధికంగా ఉంటాయి. పోషకాహార లోపం, పరిశుభ్రత, వైద్య సదుపాయాలు లేకపోవడం వల్ల మరణాల రేటు అధికంగా ఉంటుంది. అంతేకాకుండా, నిరక్షరాస్యత అధికంగా ఉంటుంది. కుటుంబ నియంత్రణ పద్ధతులపై అవగాహన లోపం, బాల్య వివాహాలు, సాంఘీక మూఢనమ్మకాలు, సంప్రదాయము మొదలైన వాటివల్ల జననాల రేటు అధికంగా ఉంటుంది. ఈ దశలో అధిక జననాల రేటు, అధిక మరణాల రేటు సమానంగా ఉంటాయి. కాబట్టి జనాభా వృద్ధిరేటు అధికంగా ఉండదు. భారతదేశంలో 1921కి పూర్వము ఈ దశ ఉన్నది.

2) రెండవ దశ: ఈ దశలో ఆర్థిక అభివృద్ధి కార్యకలాపాలు మెరుగుపడతాయి. తత్ఫలితంగా ప్రజల ఆదాయం పెరిగి ఆహారపు అలవాట్లు మెరుగుపడతాయి. ఆరోగ్య స్పృహ పెరగడం వల్ల ప్రాణరక్షణ ఔషధం మరియు మందుల లభ్యత వలన మరణాల రేటు తక్కువగా ఉంటుంది. మరణాల రేటు క్రమంగా క్షీణిస్తూ జననాల రేటు అదే విధంగా కొనసాగడం వలన జనాభా పెరుగుదల వేగంగా పెరుగుతుంది. దీనినే జనాభా విస్ఫోటనం అంటారు. ప్రస్తుతం భారతదేశంలో జనాభా పరిణామ సిద్ధాంతం ప్రకారం రెండవ దశలో ఉన్నది. మనదేశంలో 1921 నుంచి ఈ దశ ప్రారంభం అయినది.

AP Inter 2nd Year Economics Study Material Chapter 2 జనాభా, మానవ వనరుల అభివృద్ధి

3) మూడవ దశ: ఈ దశలో పారిశ్రామికీకరణ, ఆధునికీకరణ, నగరీకరణ, అక్షరాస్యత అభివృద్ధి చెందటం వలన జనాభా పెరుగుదల సమస్య నుంచి దేశం బయటపడుతుంది. అభివృద్ధి అధిక స్థాయిలో ఉండడం, జీవన వ్యయం పెరగడం వలన గృహసమస్యలు పెరిగి జీవన విధానం కష్టంగా మారి ప్రజలు కుటుంబ పరిమాణాన్ని తగ్గించుకోవడానికి ఇష్టపడతారు. ఈ మార్పు మొదట పట్టణ ప్రాంతాలలో మరియు అధిక ఆదాయ వర్గాలలో మొదలై క్రమంగా గ్రామాలకు విస్తరించింది. దీనివలన జనన రేటు ఒక్కసారిగా తిరోగమనం చెందుతుంది. దాని వలన జనన మరణ రేటులో సమతౌల్యత ఏర్పడుతుంది. ప్రస్తుతం అభివృద్ధి చెందిన దేశాలు ఈ దశలో ఉన్నాయి.

ప్రశ్న 2.
జనాభా పెరుగుదల వలన లాభనష్టాలను వివరించండి.
జవాబు:
ఆర్థికాభివృద్ధిలో జనాభా మరియు మానవ వనరులకు అధిక ప్రాధాన్యత ఉంది. మానవులు ఉత్పత్తికి దోహదపడే సాధనాలే కాకుండా ఆ ఉత్పత్తిని వినియోగించేది కూడా మానవులే. భారతదేశం మరియు మూడవ ప్రపంచదేశాలు జనాభా విస్ఫోటన దశలో ఉన్నాయి.
భారతదేశంలో జనాభా అంటే ఒక నిర్ణీత కాలంలో దేశంలో నివసించే ప్రజలు. జనాభా దేశాభివృద్ధికి ఎంతో అవసరం.
జనాభా వలన లాభాలు:

  1. జనాభా వస్తువుల ఉత్పత్తికారి శ్రామిక శక్తిని సమకూరుస్తుంది.
  2. జనాభా వస్తుసేవలకు మార్కెట్ను కల్పిస్తుంది.
  3. జనాభా నూతన ఆవిష్కరణలకు అవకాశం కల్పిస్తుంది.
  4. జనాభా వలన శ్రమ విభజన మరియు ప్రత్యేకీకరణ సాధ్యపడుతుంది,

నష్టాలు:

  1. జనాభా జీవన విధానం మీద ఒత్తిడిని పెంచుతుంది.
  2. అధిక జనాభా వలన నిరుద్యోగిత పెరుగుతుంది.
  3. జనాభా వలన సామాజిక అవసరాలైన ఆస్పత్రులు, పాఠశాలలు, రహదారులపై ఎక్కువ భారం పడుతుంది.
  4. అధిక జనాభా వలన వస్తువియోగం పెరుగుతుంది. పొదుపు మరియు మూలధన సంచయనము తగ్గుతుంది.
  5. జనాభా అనుత్పాధిక శ్రామికులను పెంచుతుంది.

ప్రశ్న 3.
భారతదేశంలో జనాభా పెరగడానికి గల కారణాలను తెలియజేయండి. [Mar ’16]
జవాబు:
భారతదేశంలో జననాల రేటు అధికంగా ఉన్నది. కుటుంబ నియంత్రణ పథకాలను పూర్తిగా ప్రజలు నమ్మినపుడే, జననాల రేటు తగ్గడానికి వీలుపడుతుంది. గత 50 సంవత్సరాల్లో జననాల రేటు చెప్పుకోదగ్గ స్థాయిలో తగ్గకపోవడానికి ఈ క్రింది ఆర్థిక, సాంఘిక కారణాలుగా చెప్పవచ్చు.
1) ఆర్థిక కారణాలు: ఒక దేశం యొక్క ఆర్థిక వాతావరణం ప్రజల ప్రవర్తనపై చాలా వరకు ప్రభావాన్ని కలిగి వుంటుంది. వృత్తులవారీగా జనాభా విభజన, నగరీకరణ, పేదరికం దేశంలోని జననాల రేటును ప్రభావితం చేస్తాయి.

ఎ) వ్యవసాయరంగ ప్రాధాన్యత అధికంగా ఉండడం: వ్యవసాయరంగ సంబంధిత సమాజంలో పిల్లలను ఆర్థికభారంగా పరిగణించరు. అధిక జనాభా వ్యవసాయరంగంపై ఆధారపడి వున్న దేశంలో ఉత్పత్తి కార్యకలాపాల్లో ప్రాచీన పద్ధతులను సాధారణంగా ఉపయోగిస్తారు. వ్యవసాయ ఉత్పత్తి కార్యకాలాపాల్లో శ్రామికుల అవసరం ఉంటుంది.

బి) తక్కువ నగరీకరణ మరియు గ్రామీణ ప్రాంతాల ప్రాధాన్యత: దేశంలో పారిశ్రామికీకరణం వేగవంతంగా చోటుచేసుకోకపోవడం. నగరీకరణ చాలా తక్కువగా ఉన్నది. మన దేశంలో పెరిగిన నగరీకరణ జననాల రేటు తగ్గుదలకు సంబంధించిన సాంఘిక మార్పులను తీసుకురాలేదు.

సి) పేదరికం: మన దేశంలోని పేదరికం జననాల రేటుకు దోహదం చేస్తుంది. తక్కువ ఆదాయ స్థాయి కలిగిన ప్రజలు అదనపు శిశువును పొందడం వలన వచ్చే ఆదాయం, ఆ శిశువును పెంచడానికి అయ్యే ఖర్చు కంటే అధికం అని భావిస్తారు. పేద ప్రజలకు ఇతర ఆర్థిక ఆస్తులు ఏమీ ఉండవు కాబట్టి తమ శ్రమనే ఆస్తిగా పరిగణిస్తారు. కాబట్టి అధిక కుటుంబ సభ్యులు ఉంటే అధిక ఆదాయం పొందవచ్చని భావిస్తారు.

2) సాంఘిక కారణాలు:
ఎ) వివాహం తప్పనిసరి: భారతదేశం మతపరంగా, సామాజికంగా ప్రతి వ్యక్తికి వివాహం అన్నది తప్పనిసరి. ప్రతీ తల్లి, తండ్రి తమ పిల్లలకు వివాహం చేయడం సామాజికపరమైన బాధ్యతగా స్వీకరిస్తారు. స్త్రీల అక్షరాస్యత పెరిగినప్పుడు వివాహం తప్పనిసరికాకపోవచ్చు. కాని అక్షరాస్యత తక్కువగా ఉన్న సమాజంలో ఆశించిన ఫలితం రాకపోవచ్చు.

బి) తక్కువ వయస్సులో వివాహం: మన దేశంలో తక్కువ వయస్సులో వివాహం చేసుకోవడం జననాల రేటు అధికంగా ఉన్నది అని చెప్పవచ్చు. కాని భారతదేశంలో స్త్రీల సగటు వివాహ వయస్సు 18 సంవత్సరాలు మాత్రమే ఉన్నది. కాబట్టి ప్రసూతి రేటు అధికంగా ఉండటం వల్ల జననాల రేటు అధికంగా ఉంటుంది.

AP Inter 2nd Year Economics Study Material Chapter 2 జనాభా, మానవ వనరుల అభివృద్ధి

సి) మతపరమైన సాంఘిక మూఢనమ్మకాలు: చాలామంది భారతీయుల్లో మతపరమైన, సామాజికమైన మూఢనమ్మకాల వల్ల పిల్లల్ని కనడం అనేది తమ ఆర్థిక పరిస్థితులు గౌరవం చేకూరినట్లు భావిస్తారు. హిందువుల మత సాంప్రదాయం ప్రకారం కుమారుడు కర్మకాండలు నిర్వహించవలసి ఉంటుంది. కాబట్టి ప్రతి హిందువు కుమారున్ని కోరుకుంటారు.

డి) ఉమ్మడి కుటుంబ వ్యవస్థ: భారతదేశంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఎక్కువగా ఉంటుంది. ఆధునిక సమాజంలో వైయుక్తిక కుటుంబాల ప్రాధాన్యత పెరుగుతుంది. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ, యుక్త వయసులోని భార్యభర్తలు పిల్లలను కనడాన్ని ప్రోత్సహిస్తుంది.

ఇ) తక్కువ అక్షరాస్యత: 2011 జనాభా లెక్కల ప్రకారం మనదేశంలో అక్షరాస్యత 74.04 శాతం ఉన్నది. పురుషులలో 82.14 శాతం ఉంటే, స్త్రీలలో 65.46 శాతమే అక్షరాస్యులుగా ఉన్నారు. ఇప్పటివరకు స్త్రీలలో సాధించిన ‘అక్షరాస్యత ఎక్కువ శాతం నగరాలలోనే గుర్తించడం జరిగింది. నిరక్షరాస్యత స్త్రీలలో ఎక్కువగా ఉండడం వలన జననాల రేటు అధికంగా ఉన్నది.

ప్రశ్న 4.
జనాభా పెరుగుదల నియంత్రణ చర్యలు ఏమిటి ?
జవాబు:
జనాభా పెరుగుదల నివారణ చర్యలు: జనాభా పెరుగుదల ఆర్థిక అభివృద్ధిలో ముఖ్యమైన సమస్యగా భావిస్తాము. అందువల్ల జనాభా పెరుగుదలను నియంత్రించవలసిన అవసరం ఎంతయినా ఉంది. ప్రస్తుతం జనాభా సమస్యలను పరిష్కరించడానికి మూడు రకాలైన చర్యలను తీసుకోవలసి ఉంది.
1) ఆర్థిక చర్యలు: భారతదేశంలో జనాభా ఆశించిన విధంగాకాని, తగ్గించడానికి సాధ్యం అయ్యే విధంగా కాని లేనటువంటి పెద్ద పరిణామంతో ఉంది. ఇటువంటి పరిస్థితులలో ఆర్థిక అంశాలపై దృష్టి పెట్టి, ఆర్థిక చర్యల ద్వారా ప్రస్తుత జనాభా సమస్యను పరిష్కరించవలసి ఉన్నది.

  • పారిశ్రామిక రంగాన్ని విస్తరించడం: వ్యవసాయ రంగంలో ఉపాధి పొందుతున్న కుటుంబాల కంటే పారిశ్రామిక రంగంలో ఉపాధి పొందుతున్న కుటుంబాల పరిమాణం చిన్నదిగా ఉంది. గ్రామీణ ప్రాంతాలలోని ప్రజలు వ్యవసాయ ఉత్పత్తిని పెంపొందిచినప్పటికీ, కుటుంబ కమతాల్లో పనిచేస్తూ ఉంటారు. మన దేశంలో భూకమతాలు లాభదాయకంగా లేవు కాబట్టి, వ్యవసాయదారులు జీవనాధార వ్యవసాయంను కొనసాగిస్తారు. పారిశ్రామిక రంగంలో ఉద్యోగ అవకాశం పొందటం చాలా కష్టమైన పని కాబట్టి పారిశ్రామిక రంగంలోని శ్రామికులు చిన్న కుటుంబాలకు ప్రాధాన్యత ఇస్తారు. జీవన ప్రమాణాన్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి కుటుంబ పరిమాణాన్ని నియంత్రించుకుంటారు.
  • నగరాలలో ఉద్యోగావకాశాల కల్పన: దేశంలో పారిశ్రామికీకరణ వలన నగర కేంద్రాలు పెరుగుతాయి. నగరాలలో ప్రభుత్వం ఉద్యోగ అవకాశాలను కల్పించినట్లైతే, గ్రామీణ ప్రాంతాల నుంచి నగరాలకు వలసలు పెరుగుతాయి. తత్ఫలితంగా నగరాలలో జనాభా పెరిగి పిల్లల పెంపకం, సమస్యలు ఉత్పన్నమై చిన్న కుటుంబాలకు ప్రాధాన్యతను ఇస్తారు. అందువలన పారిశ్రామికీరణకు అనుకూలమైన ఆర్థిక వాతావరణాన్ని కల్పించాల్సిన అవసరం ప్రభుత్వాలకు ఉంది.
  • ఆదాయాన్ని సమానంగా పంపిణీ చేయడం మరియు పేదరిక నిర్మూలన: పేద ప్రజలకు తమ కుటుంబ పరిమాణాలపై పెద్దగా శ్రద్ధ ఉండదు. పేద ప్రజల కనీస జీవన సదుపాయం పొందడానికి ఎప్పుడైతే ఇష్టపడతారో, అప్పుడు కుటుంబ పరిమాణంపై వారి ఆలోచనలు మారతాయి. ఇలా మార్పు వస్తే ప్రజలకు కుటుంబంపై శ్రద్ధ పెరుగుతుంది. తమ పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దాలని పరిమిత కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తారు.

2) సాంఘిక చర్యలు: జనాభా విస్ఫోటనం అనేది, ఆర్థిక సమస్యగా కంటే, సాంఘిక సమస్యగా భావిస్తాం. దీనికి అనేక రకాలైన సాంఘిక కారణాలు చెప్పుకోవచ్చు. నిరక్షరాస్యతా, మూఢనమ్మకాలు, ఆచార సాంప్రదాయాలు మొదలైన కారణాలు మనదేశంలోని జనాభా విజృంభనకు దోహదం చేస్తున్నాయి.

  •  విద్య: జననాల రేటును తగ్గించడంలో విద్య చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. వివాహం, కుటుంబ పరిమాణం, పిల్లల సంఖ్య మొదలైన వాటిని ప్రజలలో మార్పును తీసుకువస్తుంది. భారతదేశంలో ఉన్న సాంప్రదాయాలను, మూఢనమ్మకాలను విద్య మార్చి వేసి ప్రజలను కుటుంబ నియంత్రణ వైపు ప్రభావితులని చేస్తుంది. కాబట్టి గ్రామాలలో, నగరాలలో స్త్రీల అక్షరాస్యత వృద్ధిని పెంపొందించడానికి అత్యంత ప్రాధాన్యతని ఇవ్వాలి.
  • స్త్రీల హోదాను మెరుగుపరచడం: భారత రాజ్యాంగం ప్రకారం స్త్రీ, పురుషులు సమానం కాని ఆర్థికంగా, సామాజికంగా స్త్రీలకు తక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. సమాజంలో స్త్రీల గౌరవం పెంపొందించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎంతమంది పిల్లలకు జన్మనివ్వాలి అనే విషయంలో స్త్రీలకు స్వాతంత్ర్యం ఉన్నప్పుడే, జననాల సంఖ్య తగ్గించే అవకాశం ఉంటుంది.
  • కనీస వివాహ వయస్సును పెంచడం: సామాజికంగా, చట్టపరంగా, విద్యాపరంగా కనీస వివాహ వయస్సును తప్పకుండా పెంచవలసిన ఆవశ్యకత ఉంది. 1903 బాల్య వివాహ నిరోధక చట్టం ప్రకారం పురుషులకు కనీస వయస్సు 18 సంవత్సరాలు, స్త్రీలకు 15 సంవత్సరాలుగా నిర్ణయించారు. జాతీయ జనాభా విధానం 2000 సంవత్సరంలో వివాహ వయస్సును సవరించి, పురుషులకు 25 సంవత్సరాలు, స్త్రీలకు 21 సంవత్సరాలు వివాహ వయస్సుగా నిర్ధారించారు. దీని ద్వారా జనాభా వృద్ధిని నియత్రించాలి అని ఆశించారు.

AP Inter 2nd Year Economics Study Material Chapter 2 జనాభా, మానవ వనరుల అభివృద్ధి

3) కుటుంబ నియంత్రణ పథకాలు: ప్రపంచవ్యాప్తంగా జనాభా పెరుగుదలను నియంత్రించడంలో కుటుంబ నియంత్రణ పథకాల ప్రాధాన్యతను గుర్తించారు. మన దేశంలో వివాహిత స్త్రీలు 41 శాతం గర్భనిరోధకాలను ఉపయోగిస్తే చైనా దేశంలో 85 శాతం స్త్రీలు వినియోగిస్తున్నారు. కాబట్టి మనదేశంలో జననాల రేటు (26: 1000) అధికంగా
వుంది.

  • ప్రభుత్వ సమాచార పథకం: ఎలాంటి కుటుంబ నియంత్రణలను పాటించని వావాహిత జంటలకు ప్రభుత్వ సమాచార పథకం క్రింద కుటుంబ నియంత్రణ ప్రయోజనాలను తెలియచేయడం, సమాచార సాధనాలైన, సినిమా, రేడియో, పోస్టర్లు, టెలివిజన్లు, వార్తాపత్రికలు మొదలైన వాటి ద్వారా కుటుంబ నియంత్రణ ప్రాముఖ్యాన్ని ప్రచారం చేస్తుంది.
  • ప్రోత్సాహకాలు, నిరుత్సాహకాలు: కుటుంబ నియంత్రణ పాటించే ప్రజలకు ప్రభుత్వం అనేక రకాలైన పథకాల ద్వారా వివిధ రకాలైన ప్రోత్సాహకాలను కల్పిస్తుంది. నగదు బహుమతుల ద్వారా ప్రజలు ముందుకు రాకపోతే కుటుంబ నియంత్రణను పాటించని వారికి ఉద్యోగ అవకాశాలను కల్పించడం, కుటుంబ నియంత్రణను నిరాకరించిన వారికి ప్రభుత్వం కల్పించే కొన్ని సదుపాయాలను తొలగించినట్లయితే జననాల రేటు తగ్గి జనాభా పెరుగుదలను నియంత్రించవచ్చు.
  • కుటుంబ నియంత్రణ కేంద్రాలు: కుటుంబ నియంత్రణ పథకాలలో నియంత్రణ కేంద్రాల స్థాపన తప్పనిసరి, ప్రభుత్వం ఈ కేంద్రాలలో అనేక రకాలైన వైద్య సదుపాయాలను కల్పించి కుటుంబ నియంత్రణను ప్రోత్సహిస్తుంది. ఈ కేంద్రాలతో పాటు అధిక సంఖ్యలో గ్రామాల్లో, నగరాల్లో గర్భనిరోధక సాధనాల పంపిణీ కేంద్రాలను కూడా ఏర్పాటు చేసి జనాభా పెరుగుదలను నియంత్రిస్తుంది.
  • పరిశోధన: సమాచార ప్రేరణ, జనాభా పునరుత్పత్తి, ప్రసూతి రేటు నియంత్రణ మొదలైన వాటికి కుటుంబ నియంత్రణ పథకాల్లో అధిక ప్రాధాన్యత కల్పించవలసిన అవసరం ఉంది. భారత ప్రభుత్వం పరిమిత వనరులతో కుటుంబ నియంత్రణపై పరిశోధనలు చేసి గరిష్ట ప్రయోజనం పొందటానికి ప్రయత్నిస్తుంది.

ప్రశ్న 5.
జనాభా విధానం (2000)లోని ముఖ్యాంశాలు ఏవి ?
జవాబు:
జాతీయ జనాభా విధానాన్ని 6-4-1976న ప్రవేశపెట్టినంత వరకు మన దేశంలో కుటుంబ నియంత్రణ పూర్తిగా స్వచ్ఛందంగా ఉండేది. సత్వర ఆశయానికి సంబంధించిన, ఆరోగ్య అవస్థాపన సౌకర్యాలు కావాల్సిన గర్భనిరోధక అంశాలను కల్పిస్తు, ప్రాథమిక పునరుత్పత్తి, శిశు ఆరోగ్యాన్ని సంఘటిక పరచి వైద్య సేవలను కల్పించడం, దీని 2010 సంవత్సరం నాటికి మొత్తం ప్రసూతి రేటును సాధ్యమైనంత వరకు తగ్గించడం. 2045 సంవత్సరం నాటికి స్థిరమైన జనాభా వృద్ధిని సాధించడం దీర్ఘకాలిక ఆశయంగా పెట్టుకున్నారు. జాతీయ జనాభా విధానాన్ని (2000) ఈ క్రింది లక్ష్యాలతో రూపొందించారు.

  1. ప్రసూతి మరణాల రేటును 100: 100000 కు తగ్గించడం.
  2. శిశు మరణరేటును 30: 1000 కి తగ్గించడం.
  3. రోగాల బారి నుంచి రక్షించుకొనే విధంగా పిల్లల్లో వ్యాధి నిరోధకతను పెంచడం.
  4. 100 శాతం కాన్పులు వైద్యశాలలో జరిగేటట్లు చూడటం.
  5. ఎయిడ్స్, ఇతర అంటు వ్యాధుల నివారణకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచడం.
  6. ఇద్దరు పిల్లల పరిమిత కుటుంబాన్ని ప్రోత్సహించడం.
  7. సురక్షితంగా గర్భస్రావాలు జరిగేటట్లు సదుపాయాలు కల్పించడం.
  8. బాల్య వివాహ నిరోధక చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేయడం.
  9. 18 సంవత్సరాలలోపు స్త్రీలకు వివాహాలు జరగకుండా చూడటం.
  10. పేదవారిగా ఉండి, ఇద్దరు పిల్లల తరువాత కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్న వారికి ఆరోగ్య బీమా సదుపాయాలను కల్పించడం.

జాతీయ జనాభా విధానం (2000) అమలు కోసం జనాభాపై జాతీయ కమీషన్ ఏర్పాటు చేశారు. ఇది జాతీయ జనాభా విధానం పనితీరును ఎప్పటికప్పుడు పరిశీలిస్తుంది.

AP Inter 2nd Year Economics Study Material Chapter 2 జనాభా, మానవ వనరుల అభివృద్ధి

ప్రశ్న 6.
భారతదేశంలోని వృత్తుల వారీగా జనాభా విభజనను వివరించండి.
జవాబు:
ఒక దేశం జనాభా వివిధ రకాలైన వృత్తుల మధ్య విభజింపబడి ఉండటాన్ని వృత్తులవారీగా జనాభా విభజన అని అంటారు. వివిధ రకాలైన వృత్తులను మూడు రకాలుగా వర్గీకరిస్తారు. అవి:
1) ప్రాథమిక వృత్తులు: వ్యవసాయం, అడవులు, చేపల పెంపకం, జంతు సంపద, కోళ్ళ ఫారాలు, మొదలైన వాటిని ప్రాథమిక రంగంలో కలుపుతారు. ఈ రంగం ఉత్పత్తి మానవ మనుగడకు చాలా అవసరం. ఈ రంగం అధికంగా ప్రకృతిపై ఆధారపడి ఉంటుంది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని జనాభా ఎక్కువశాతం ఈ రంగంపై ఆధారపడి ఉంటుంది.

2) ద్వితీయ వృత్తులు: వస్తువు తయారీ పరిశ్రమలు, చిన్నతరహా, కుటీర పరిశ్రమలు మరియు గనులు క్వారియింగ్ మొదలైన వాటిని ద్వితీయరంగంలో కలుపుతారు మూడవ ప్రపంచ దేశాల్లో ఈ రంగం చాలా చిన్నదిగా ఉండి తక్కువ శ్రామిక శక్తికి ఉపాధిని కల్పిస్తుంది.

3) సేవా వృత్తులు: వ్యాపారం, రవాణా, కమ్యూనికేషన్లు, బ్యాంకింగ్, బీమా, విద్యా, ఆరోగ్యం, మొదలైనవి సేవారంగంలో కలుపుతారు. దేశంలోని సేవారంగం కార్యకలాపాలు, ప్రాథమిక రంగం, ద్వితీయ రంగం కార్యకలాపాలకు తోడ్పడుతాయి.

హాన్స్ సింగర్ ప్రకారం వ్యవసాయరంగంపై ఆధారపడి వున్న 85 శాతం శ్రామిక శక్తి మార్పు చెంది 15 శాతం మాత్రమే వ్యవసాయరంగంపై ఆధారపడి ఉంటే ఆర్థికాభివృద్ధి చోటుచేసుకున్నట్లు అనే అభిప్రాయపడ్డారు.

ప్రశ్న 7.
మానవ అభివృద్ధిని నిర్వచించి, దాన్ని ఏ విధంగా పెంపొందిస్తావు?
జవాబు:
మానవ వనరుల అభివృద్ధి – అర్థం: ఒక దేశం రాజకీయ, ఆర్థికాభివృద్ధికి కావాల్సిన విద్య, సామర్థ్యం, అనుభవంతో కూడుకున్న మానవులను మానవ వనరుల అభివృద్ధి అని అంటారు. మానవునిపై పెట్టుబడి పెడితే మానవ వనరులుగా అభివృద్ధి చెంది, మానవ అభివృద్ధికి ఉత్పాదక వనరులుగా ఉపయోగపడతారు.
చార్లెస్ ఘర్జ్ ఈ క్రింది ఐదు అంశాలు ఉపయోగపడతాయని తెలియచేశాడు.

  1. ఆరోగ్య సదుపాయాలు, సేవలపై వ్యయం, పెరిగితే ప్రజలు ఆయుర్థాయం, సామర్థ్యశక్తి, ఉత్సాహం పెరుగుతాయి.
  2. వలస వచ్చిన వ్యక్తులు, కుటుంబాలు మారుతున్న ఉద్యోగ అవకాశాలకు సర్దుబాటు కావలసి ఉంటుంది.
  3. ప్రాథమిక, ద్వితీయ, ఉన్నతస్థాయిలో విద్యను నిర్వహించవలసి ఉంది.
  4. సంస్థలు నిర్వహించిన వయోజన విద్య, విస్తరణ విద్య కార్యకలాపాలను వ్యవసాయరంగంలో ఏర్పాటు చేయవలిసి ఉంది.
  5. సంస్థలు ఉద్యోగస్తులకు పాత పద్ధతిలో అప్రెంటిస్ మరియు శిక్షణ కల్పించాల్సి ఉంది.

ప్రశ్న 8.
ఆర్థికాభివృద్ధిలో విద్య పాత్రను వివరించండి.
జవాబు:
1) విద్య మరియు ఆర్థికాభివృద్ధి: టొడారో, స్మిత్ ప్రకారం అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాల్లో విద్య ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుంది. అది ఏ విధంగా అనేది ఈ క్రింది అంశాలతో వివరించవచ్చు.

  • విద్యవల్ల పరిజ్ఞానం, నైపుణ్యత పెరిగి శ్రామికశక్తి యొక్క ఉత్పాదకత పెరుగుతుంది.
  • అదనంగా పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయల స్థాపనవల్ల ఉద్యోగిత పెరుగుతుంది.
  • విద్య ప్రాథమిక నైపుణ్యాలను మరియు ఆధునికంగా మెరుగైన ప్రవర్తనను అందిస్తుంది.
  •  ప్రభుత్వ సేవల్లో, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో మరియు వివిధ వృత్తుల్లో విద్యవల్ల సమర్థవంతమైన విద్యానాయకులు వస్తారు.

AP Inter 2nd Year Economics Study Material Chapter 2 జనాభా, మానవ వనరుల అభివృద్ధి

2) విద్య మరియు ఆదాయ అసమానతల తగ్గింపు: అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో విద్యకు, ఆర్థికాభివృద్ధికి దగ్గర సంబంధం ఉన్నప్పటికీ, పేదరికం, ఆదాయం అసమానతలు తగ్గించడానికి, విద్యకు గల సంబంధాన్ని చెప్పడం కష్టం. సాధారణంగా విద్య ద్వారా మానవ వనరుల సమతుల్యాన్ని పెంపొందించవచ్చు మరియు పేద ప్రజల, బలహీన వర్గాల ఆర్థికస్థోమతను కూడా మెరుగుపరచవచ్చు. పేదపిల్లలు నిరక్షరాస్యతతో కూడుకున్న ఇంటి పరిసరాలు మరియు పౌష్టికాహారలేమి, వారి మనస్సులపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. ధనవంతులైన పిల్లలు సాంఘిక సంబంధాలు, పలుకబడివల్ల సాపేక్షికంగా మెరుగైన ఉపాధి పొందుతారు.

3) విద్య గ్రామీణ అభివృద్ధి గ్రామీణాభివృద్ధిలో విద్య అనేక విధాలుగా తోడ్పడుతుంది. గ్రామీణ ప్రజల పరిజ్ఞానాన్ని పెంపొందించి అమాయకత్వాన్ని, మూఢనమ్మకాలను రూపుమాపుతుంది. వ్యవసాయదారులు విద్యావంతులైతే నూతన వ్యవసాయ సాంకేతికాలు, ఆధునిక ఉత్పత్తి పద్ధతులను త్వరగా అర్థం చేసుకోగలరు. విద్యతో ప్రజల సామర్థ్యాలను, ప్రవర్తనను మార్చుకొని కుటుంబ సౌఖ్యతను పెంపొందించడానికి ఉపయోగపడుతుంది. శ్రామికులు ఎక్కువగా ఉన్న మన దేశంలో విద్య ద్వారా ప్రజల నైపుణ్యత పేరిట కుటీర పరిశ్రమలను స్థాపించుకొని స్వయం ఉపాధి పొందుతారు.

4) విద్య మరియు కుటుంబ నియంత్రణ: ప్రజలను ఆధునికీకరణ, విప్లవాత్మక మార్పుల వైపు ఆలోచించే విధంగా విద్య తోడ్పడుతుంది. ఇది కుటుంబ పరిమాణాన్ని నియంత్రించుకొని జీవన ప్రమాణాన్ని మెరుగుపరుచుకోవడానికి సహకరిస్తుంది. కాబట్టి దీర్ఘకాలంలో విద్య, కుటుంబ సంక్షేమం పెంపొందిస్తుంది. స్త్రీలలో అక్షరాస్యత పెరగడం వల్ల వారికి ఉద్యోగ అవకాశాలు లభ్యంకావడం వల్ల ప్రసూతి రేటు తగ్గి జననాల రేటు తగ్గుతుంది. ఉద్యోగం చేస్తున్న స్త్రీలకు పోషణ కష్టం అవుతుంది. కాబట్టి పరిమిత కుటుంబాలకు ప్రాధాన్యత ఇస్తారు.

5) విద్య వలన ఇతర ప్రయోజనాలు:

  1. అధిక విద్యను అభ్యసించినవారికి ఆదాయ వనరులు పెరుగుతాయి.
  2. విద్యావంతులైన ప్రజల ఆదాయ వనరులు భావితరాల వ్యాపించడానికి ఆస్కారం ఉంటుంది.
  3. నైపుణ్యవంతమైన మానవ వనరులు ఆర్థిక వ్యవస్థను వృద్ధి చేస్తాయి.
  4. విజ్ఞాన శాస్త్రంలో, సాంకేతిక రంగంలో పరిశోధనలకు కావలసిన వాతావరణాన్ని కల్పిస్తుంది.
  5. మానవ ప్రవర్తన న్యాయబద్ధంగా మారి సంక్షేమ కార్యక్రమాల్లో స్వచ్ఛందంగా పాల్గొంటారు.

ప్రశ్న 9.
ఆర్థికాభివృద్ధిలో ఆరోగ్యం పాత్రను వివరించండి.
జవాబు:
శ్రామికుల సామర్థ్యం వారి ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది. ఆరోగ్యం సరిగ్గా లేక తరచుగా రోగాలకు గురి అవుతుంటే వారి సామర్థ్యం తక్కువగా ఉంటుంది. కాబట్టి సమర్థవంతంగా పనిచేయలేరు. శ్రామికుల ఆరోగ్యం పెరిగితే జాతీయ ఉత్పత్తి దానంతట అదే పెరుగుతుంది.

సంపూర్ణ ఆరోగ్యానికి ఈ క్రింది రెండు అంశాలు చాలా అవసరం.

  1. సంతులిత పౌష్టికాహారం
  2. వైద్యపరమైన జాగ్రత్త

60 సంవత్సరాల కృషి ఫలితం వల్ల ఆరోగ్య ప్రమాణాల పెరుగుదలలో చాలా వరకు విజయం సాధించాము. మశూచి, ప్లేగు మొదలైన వాటిని నివారించాం. మలేరియా, క్షయ, కలరా మొదలైన వ్యాధులను చాలావరకు నియంత్రిస్తున్నందువల్ల శిశుమరణాలు తగ్గుతూ ఆయుర్ధాయం పెరుగుతుంది.
12వ ప్రణాళికలో ఆరోగ్య లక్ష్యాలు 2016 – 2017.

  1. ప్రసూతి మరణ రేటును (MMR) 1,00,000 కు తగ్గించడం.
  2. శిశుమరణ రేటు (IMR)ని 1000కు 19 తగ్గించడం.
  3. మొత్తం ప్రసూతి రేటు (TFR)ని 2.1కి తగ్గించడం.
  4. పరిశుభ్రమైన త్రాగునీరు అందరికీ అందించడం.
  5. పౌష్టికాహార లోపాన్ని మూడు (3) సంవత్సరాల పిల్లల్లో 2015 నాటికి 29 శాతం, 2017 నాటికి 27%కి తగ్గించడం.
  6. స్త్రీలల్లో, బాలికల్లో రక్తహీనత (ANEMIA) 28 శాతం వరకు తగ్గించడం.
  7. స్త్రీ, పురుషుల నిష్పత్తి వయస్సును 0-6 సంవత్సరములు 914 నుండి 935 వరకు పెంచడం.

AP Inter 2nd Year Economics Study Material Chapter 2 జనాభా, మానవ వనరుల అభివృద్ధి

ప్రశ్న 10.
మానవ అభివృద్ధిని లెక్కించడంలో వివిధ సూచికలు ఏమిటి ?
జవాబు:
వర్థమాన కాలంలో స్థూల జాతీయోత్పత్తికి ప్రత్యామ్నాయంగా మానవ అభివృద్ధి సూచికను ఆధారంగా చేసుకొని ఒక దేశం ఆర్థిక అభివృద్ధిని అంచనా వేస్తున్నారు. ఐక్యరాజ్యసమితి అభివృద్ధి పథకం UNDP తయారుచేసిన మొదటి మానవ అభివృద్ధి రిపోర్టు. మహబూబ్-ఉల్-హక్ నాయకత్వంలో 1990 సంవత్సరంలో ప్రవేశపెట్టారు. దీనిని విస్తరించి దానికి సంబంధించిన అనుబంధ సూచికలను, లింగ సంబంధిత అభివృద్ధి సూచిక (GDI) లింగ అధికారికి కొలమానం (GEM) మరియు మానవ పేదరిక సూచిక (HPI) లను 1997 సంవత్సరంలో UNDP ప్రవేశపెట్టింది.

మానవ అభివృద్ధి సూచిక మూడు రకాలైన మానవ అభివృద్ధికి సంబంధించిన ప్రాథమిక సగటు అంశాలను లెక్కిస్తుంది.

  1. దీర్ఘకాలిక ఆరోగ్యవంతమైన జీవితాన్ని ఆయుర్దాయం ద్వారా అంచనా వేస్తుంది.
  2. పరిజ్ఞానాన్ని వయోజన విద్య ద్వారా అంచనా వేయించడం జరుగుతుంది.
  3. ఉన్నత జీవన ప్రమాణాన్ని, అమెరికా డాలర్లతో స్థూల దేశీయ తలసరి ఉత్పత్తి ద్వారా అంచనా వేయడం. మానవ

అభివృద్ధి సూచికకు అంచనా వేసే ముందు మూడు అంశాలతో ప్రతి దానికి ఒక దిశను నిర్ణయించి, ప్రతి సూచికకు కనీస విలువను, గరిష్ట విలువలకు కల్పిస్తారు.

ప్రతి అంశం ప్రదర్శనను 0 నుంచి 100 మధ్య విలువలను ఇచ్చి ఈ క్రింది సూత్రం ద్వారా అంచనా వేస్తారు.
AP Inter 2nd Year Economics Study Material Chapter 2 జనాభా, మానవ వనరుల అభివృద్ధి 2

కొన్ని దేశాలను ఎన్నుకొని 2014 సంవత్సరానికి మానవ అభివృద్ధి సూచికను అంచనా వేసి దేశాలను నాలుగు రకాలుగా వర్గీకరించింది.

  1. మానవ అభివృద్ధి సూచిక విలువ 0.8 కంటే అధికంగా ఉన్న వాటిని అత్యధిక మానవ అభివృద్ధి చెందిన దేశాలుగాను,
  2. మానవ అభివృద్ధి సూచిక విలువ 0.7 నుంచి 0.8 ఉన్న వాటిని అధిక మానవ అభివృద్ధి చెందిన దేశాలుగాను,
  3. మానవ అభివృద్ధి సూచిక విలువ 0.5 నుంచి 0.7 ఉన్న వాటిని మధ్యస్థ మానవ అభివృద్ధి చెందిన దేశాలుగాను,
  4. మానవ అభివృద్ధి సూచిక విలువ 0.5 కంటే తక్కువగా ఉన్న వాటిని తక్కువ మానవ అభివృద్ధి చెందిన దేశాలుగాను వర్గీకరించింది.

లింగ సంబంధిత అభివృద్ధి సూచిక:
లింగ సంబంధిత అభివృద్ధి సూచిక స్త్రీ – పురుషుల మధ్య వ్యత్యాసాన్ని అంచనా వేస్తుంది. దీనిలో మూడు అంశాలు ఇమిడి ఉన్నాయి.

  1. స్త్రీల ఆయుర్ధాయం
  2. వయోజన స్త్రీల అక్షరాస్యత, స్థూల నమోదు నిష్పత్తి
  3. స్త్రీల తలసరి ఆదాయం

లింగ సమానత్వం, అసమానతలు లేకపోతే HDI, GDI విలువలు సమానంగా ఉంటాయి. కాని లింగపరమైన అసమానతలు ఉంటే GDI విలువ HDI విలువ కంటే తక్కువ ఉంటుంది. GDI, HDI విలువల మధ్య బేధం అధికంగా ఉంటే స్త్రీ పురుషుల వ్యత్యాసం అధికంగా ఉంటుంది.

లింగసాధికార కొలమానము (GEM): మానవ అభివృద్ధి రిపోర్టు లింగసాధికారక కొలమానమును 1995 సంవత్సరంలో ప్రవేశపెట్టినది. ఆర్థిక, రాజకీయ జీవితంలో స్త్రీల యొక్క భాగస్వామ్యమును GEM తెలియజేస్తుంది. ఆర్థిక, రాజకీయ జీవితంలో స్త్రీ, పురుషుల అసమానతను, స్త్రీల సాధికారతను దీనిద్వారా అంచనా వేస్తారు. GDI |ద్వారా

లింగపరమైన అసమానతలను లెక్కిస్తే GEM ద్వారా ఈ క్రింది అంశాలను లెక్కిస్తారు.

  1. రాజకీయ, ఆర్థిక నిర్ణయాల్లో స్త్రీలు పాల్గొనడం.
  2. ఆర్థిక, రాజకీయ అంశాల్లో స్త్రీల భాగస్వామ్యం (లింగభేదం) మరియు
  3. స్త్రీల సాధికారిత.

మానవ అభివృద్ధి రిపోర్టు 75 దేశాల GEM ను అంచనా వేసింది. మొదటి నాలుగు స్థానాలను ఐరోపా దేశాలు ‘ ఆక్రమించుకున్నాయి. అవి నార్వే, స్వీడన్, ఐస్లాండ్, డెన్మార్క్ ఈ దేశాలు స్త్రీల సామర్థ్యాలను పెంపొందించడమే కాకుండా స్త్రీలకు రాజకీయ, ఆర్థిక రంగాల్లో పూర్తి అవకాశాలను కల్పిస్తాయి.

AP Inter 2nd Year Economics Study Material Chapter 2 జనాభా, మానవ వనరుల అభివృద్ధి

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ప్రపంచ జనాభా.
జవాబు: ప్రపంచ జనాభా 1830 వ సంవత్సరము నాటికి 100 కోట్లు చేరింది. అదే ప్రపంచ జనాభా ఒక శతాబ్దకాలంలో 1930 సంవత్సరము నాటికి 200 కోట్లకు చేరింది. 1960 నాటికి ప్రపంచ జనాభా 300 కోట్లకు చేరింది. 1974 నాటికి 400 కోట్లుకా, 1987లో 500 కోట్లు, 1987లో 600 కోట్లు, 1999 లో 700 కోట్లకు 2011లో చేరింది. ప్రస్తుత జనాభా 730 కోట్లు. ప్రపంచ జనాభాలో 98 శాతం అభివృద్ధి చెందుతున్న దేశాలపై ఉంటుంది.
ప్రపంచ జనాభా 1830 – 2011
AP Inter 2nd Year Economics Study Material Chapter 2 జనాభా, మానవ వనరుల అభివృద్ధి 3

ప్రశ్న 2.
ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన 10 దేశాలు.
జవాబు:
ఈ క్రింది పట్టిక ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన 10 దేశాలను చూపిస్తుంది,
AP Inter 2nd Year Economics Study Material Chapter 2 జనాభా, మానవ వనరుల అభివృద్ధి 4

ప్రశ్న 3.
భారతదేశంలో జనాభా పెరుగుదలకు కారణాలు.
జవాబు:
సమాధానం కొరకు వ్యాసరూప ప్రశ్న 3ను చూడుము.

ప్రశ్న 4.
భారతదేశంలో కుటుంబ సంక్షేమ పథకాలు. [Mar ’17]
జవాబు:
ప్రపంచవ్యాప్తంగా జనాభా పెరుగుదలను నియంత్రించడంలో కుటుంబ నియంత్రణ పథకాల ప్రాధాన్యతను గుర్తించారు. మన దేశంలో అధిక జననాల రేటును తగ్గించడానికి ప్రభుత్వం అనేక పథకాలు రూపొందించెను.

1) ప్రభుత్వ సమాచార పథకం: ఎలాంటి కుటుంబ నియంత్రణలను పాటించని వివాహిత జంటలకు ప్రభుత్వ సమాచార పథకాల క్రింద కుటుంబ నియంత్రణ ప్రయోజనాలను తెలియజేయడం, సమాచార సాధనాలైన సినిమా, రేడియో, పోస్టర్లు, టెలివిజన్లు, మొదలగువాటి ద్వారా కుటుంబ నియంత్రణ ప్రాముఖ్యాన్ని ప్రచారం చేస్తుంది.

2) ప్రోత్సాహకాలు, నిరుత్సాహకాలు: కుటుంబ నియంత్రణ పాటించే ప్రజలకు ప్రభుత్వం అనేక రకాలైన పథకాల ద్వారా వివిధ రకాలైన ప్రోత్సాహకాలను కల్పిస్తుంది. నగదు రూపంలో బహుమతులు ఇవ్వడం వల్ల కొంత మంది ప్రజలు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకుంటున్నారు. అదే విధంగా కుటుంబ నియంత్రణను నిరాకరించిన వారికి ప్రభుత్వం కల్పించే కొన్ని సదుపాయాలను తొలగించినట్లయితే జననాల రేటు తగ్గి జనాభా పెరుగుదలను నియంత్రించవచ్చు.

AP Inter 2nd Year Economics Study Material Chapter 2 జనాభా, మానవ వనరుల అభివృద్ధి

3) కుటుంబ నియంత్రణ కేంద్రాలు: కుటుంబ నియంత్రణ పథకాల్లో కుటుంబ నియంత్రణ కేంద్రాల స్థాపన తప్పనిసరి. ప్రభుత్వం ఈ కేంద్రాల్లో అనేక రకాలైన వైద్య సదుపాయాలను కల్పించి, కుటుంబ నియంత్రణను ప్రోత్సహిస్తోంది. ఈ కేంద్రాలతో పాటు అధిక సంఖ్యలో గ్రామాల్లో, నగరాల్లో, గర్భనిరోధక సాధనాల పంపిణీ కేంద్రాలను కూడా ఏర్పాటు చేసి, జనాభా పెరుగుదలను నియంత్రిస్తుంది.

4) పరిశోధన: సమాచార ప్రేరణ, జనాభా పునరుత్పత్తి, ప్రసూతి రేటు నియంత్రణ మొదలైన వాటికి కుటుంబ నియంత్రణ పథకాల్లో అధిక ప్రాధాన్యత కల్పించవలసిన అవసరం ఉంది. భారత ప్రభుత్వం పరిమిత వనరులతో కుటుంబ నియంత్రణపై పరిశోధనలు చేసి, గరిష్ట ప్రయోజనం పొందటానికి ప్రయత్నిస్తుంది.

ప్రశ్న 5.
మానవ వనరుల అభివృద్ధి ప్రాధాన్యత.
జవాబు:
ఒక దేశం రాజకీయ, ఆర్థికాభివృద్ధికి కావాల్సిన విద్య, సామర్థ్యం, అనుభవంతో కూడుకున్న మానవులను మానవ వనరుల అభివృద్ధి అంటారు. మానవునిపై పెట్టుబడి పెడితే మానవ వనరులుగా అభివృద్ధి చెంది, మానవ అభివృద్ధికి ఉత్పాదక వనరులుగా ఉపయోగపడతారు.
మానవ వనరుల అభివృద్ధి ప్రాధ్యానత:

  1. మానవ వనరుల ద్వారానే భౌతిక వనరులు సమర్థవంతంగా వినియోగించబడతాయి.
  2. మానవ వనర్లులో తక్కువ పెట్టుబడి పెట్టినట్లయితే భౌతిక వనరులు పరిమితంగా ఉపయోగించబడతాయి.
  3. ఉత్పాదక వనరులు పూర్తిగా వినియోగించుకోవడానికి సాంకేతిక నిపుణుల యొక్క అవసరం ఎంతైనా ఉంది.
  4. భౌతిక వనరులు సమర్థవంతంగా, సంపూర్ణంగా వినియోగించబడాలంటే మానవ వనరుల అభివృద్ధిలో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టవలసి ఉంది.
  5. మానవ వనరుల అభివృద్ధి, ఆర్థికాభివృద్ధి ఒకదానిపై ఒకటి ప్రభావితమై ఉంటాయి.

ప్రశ్న 6.
గ్రామీణాభివృద్ధిలో విద్య పాత్ర.
జవాబు:

  1. గ్రామీణాభివృద్ధిలో విద్య అనేక రకాలైన విధాలుగా తోడ్పడుతుంది. గ్రామీణ ప్రజల పరిజ్ఞానాన్ని పెంపొందించి, అమాయకత్వాన్ని, మూఢనమ్మకాలను రూపుమాపుతుంది.
  2. వ్యవసాయదారులు విద్యావంతులైతే నూతన వ్యవసాయ, సాంకేతికాలు, ఆధునిక ఉత్పత్తి పద్ధతులను త్వరగా అర్థం చేసుకోగలరు.
  3. విద్యతో ప్రజల సామర్థ్యాలను, ప్రవర్తనను మార్చుకొని కుటుంబ నాణ్యతను పెంపొందించడానికి
    ఉపయోగపడుతుంది.
  4. శ్రామికులు ఎక్కువగా ఉన్న మన దేశంలో విద్య ద్వారా ప్రజల నైపుణ్యత పేరిట కుటీర పరిశ్రమలను స్థాపించుకొని స్వయం ఉపాధి పొందుతారు. ఈ విధంగా ప్రచ్ఛన్న నిరుద్యోగులు గ్రామాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించుకుంటారు.
  5.  విద్యవల్ల పరిజ్ఞానం, నైపుణ్యత పెరిగి శ్రామిక శక్తి యొక్క ఉత్పాదకత పెరుగుతుంది.

ప్రశ్న 7.
భారతదేశంలో విద్యా వ్యవస్థ ఏ విధంగా ఉన్నది ?
జవాబు:
ప్రపంచంలోని అతి పెద్ద విద్యా వ్యవస్థలో భారతదేశం ఒకటి. జాతీయ విద్యా విధానం 1980లో ప్రవేశ పెట్టారు. 1992లో ఈ విధానాన్ని సవరించడం జరిగింది. ఇది ప్రాథమిక విద్యకు సంబంధించి 3 అంశాలు తెలియజేయును. జాతీయ విద్యావిధానం ప్రకారం విద్య మీద చేసిన వ్యయం స్థూల జాతీయోత్పత్తిలో 6 శాతం లక్ష్యంగా ఇది 2011 12లో 48% మాత్రమే ఉంది. మన దేశంలో విద్యపైన చేసే వ్యయాన్ని పెట్టుబడిగా పరిగణించలేము. విద్యపైన ఖర్చుచేసే 106 దేశాలలో మన భారతదేశం 86వ స్థానంలో ఉంది. విద్య యొక్క ప్రాముఖ్యతని దృష్టిలో పెట్టుకుని 11వ ప్రణాళికలో ప్రభుత్వరంగం విద్యపైన వ్యయం స్థూల దేశీయ ఉత్పత్తిలో 4% కేటాయించింది. 12వ పంచవర్ష ప్రణాళికలో మానవ వనరుల మంత్రిత్వ శాఖకు 4,53,728 కోట్లు కేటాయించారు. అందులో 3,43,028 కోట్లు పాఠశాల మరియు మాధ్యమిక విద్యాశాఖకు 1,10,700 కోట్లు ఉన్నత విద్యాశాఖకు కేటాయించారు. ప్రస్తుతం మన దేశంలో ఉన్నత విద్యను అభ్యసించగల అన్ని రకాల వసతులున్నాయి. విద్యను మానవాభివృద్ధి సాధనంగా |గుర్తించి ప్రభుత్వం ప్రాథమిక విద్యలో సంపూర్ణ అక్షరాస్యతను సాధించాలి అనే ఆశయం పెట్టుకొన్నది. అందులో భాగంగా 2010 నాటికి దేశంలో 6 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల వయస్సుగల పిల్లలకు అందరికి ఉపయోగపడే విధంగా ప్రాథమిక విద్యను కల్పించడానికి 2001, 2002 సంవత్సరంలో సర్వశిక్ష అభియాన్ పథకాన్ని ప్రవేశపెట్టారు.

AP Inter 2nd Year Economics Study Material Chapter 2 జనాభా, మానవ వనరుల అభివృద్ధి

ప్రశ్న 8.
భారతదేశంలో ఆరోగ్య కార్యక్రమాలు.
జవాబు:
జాతీయ గ్రామీణ ఆరోగ్యమిషన్ (NRHM) 2005లో గ్రామీణ ప్రాంతంలో అందుబాటులో సరసమైన మరియు నాణ్యత ఆరోగ్య సేవలు అందించడానికి ప్రారంభించబడింది.

  1. వివిధ గ్రామాలలో గుర్తింపు పొందిన సామాజిక ఆరోగ్యకార్యకర్తలను ఎంపిక చేసి వారికి ఆరోగ్య సంరక్షణలో శిక్షణ ఇస్తారు. (ASHAS)
  2. జనని సురక్ష యోజన (JSY) అనే కార్యక్రమం ప్రసూతి మరణాలు తగ్గించాలని ప్రారంభించారు. ఈ పథకం ప్రకారం 35 కోట్ల మంది మహిళలు లబ్ది పొందారు.
  3. ప్రధానమంత్రి స్వస్తీయ యోజన (PMSY) కార్యక్రమం దేశంలో ప్రాంతీయ అసమానతలు సరిదిద్ది లక్ష్యాలతో, ఆరోగ్య సంరక్షణ సేవలు అందుబాటులోకి తేవడానికి ప్రారంభించబడింది.
  4. రోగి కల్యాణ సమితిలు.
  5. గ్రామీణ వైద్య మరియు పారిశుద్ధ్య కమిటి.
  6. మొబైల్ సంచార వైద్య యూనిట్లు.
  7. ఆయుర్వేద, యునాని, సిద్ధ, హెూమియో (Ayush) సేవలు.
  8. జనని శిశు సురక్ష కార్యక్రమం తల్లి, శిశువుల ఆరోగ్య సంరక్షణ కోసం ప్రారంభించబడింది.

ప్రశ్న 9.
భౌతిక ప్రమాణ జీవన సూచిక (PQLI)
జవాబు:
భౌతిక ప్రామాణిక జీవన సూచిక అంటే ఒక వ్యక్తి యొక్క నాణ్యమైన జీవితం లేదా దేశం యొక్క శ్రేయస్సు కొలిచేందుకు ఒక ప్రయత్నం. ఇది మూడు గణాంకాలు యొక్క సగటు ప్రాథమిక అక్షరాస్యత రేటు, శిశు మరణాలు మరియు ఆయుర్దాయు, ప్రాధాన్యత విలువ 0-100 వరకు ఉంటుంది. GNP వినియోగంలో అసంతృప్తి చెందడం చేత మోరిస్ డేవిడ్ మోరిస్ 1970ల మధ్యలో ఓవర్సీస్ డెవలప్మెంట్ కౌన్సిల కోసం దీనిని అభివృద్ధి చేశారు.

సాధారణ సమస్యలు పంచుకుంటుంది. కాని అది శిశు మరణాలు మరియు ఆయుర్ధాయం మధ్య గణనీయమైన తేడా చూపడం వల్ల ఇది కూడా విమర్శించబడింది. ఐక్యరాజ్య సమితి (UNO) మానవ అభివృద్ధి సూచిక (HDI) మరింత విస్తృతంగా కొలవడానికి ఉపయోగపడే కొలమానం.
భౌతిక ప్రామాణిక సూచిక కొలవడానికి గల దశలు.

  1. అక్షరాస్యులు ఉన్న జనాభా శాతాన్ని కనుక్కోండి. (అక్షరాస్యత శాతం)
  2. శిశు మరణాల రేటు కనుగొనేందుకు (ప్రతి 1000 మంది జననాలకు) ఇండెక్స్ శిశు మరణాల రేటు (166 – శిశుమరణాల రేటు) × 0.625
  3. ఆయుర్దాయాన్ని కనుగొనేందుకు = ఆయుర్దాయ సూచిక – (ఆయుర్దాయం – 42) × 2.4
    AP Inter 2nd Year Economics Study Material Chapter 2 జనాభా, మానవ వనరుల అభివృద్ధి 5

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
జనాభా విస్పోటనం. [Mar ’17, ’16]
జవాబు:
మరణాల రేటు క్రమంగా క్షీణిస్తూ, జననాల రేటు అధికంగా కొనసాగడం వల్ల జనాభా పెరుగుదల వేగంగా పెరుగుతుంది. దీనినే జనాభా విస్ఫోటనం అంటారు. మన దేశంలో 1921 సంవత్సరము నుండి ఈ దశ ప్రారంభమైనది.

AP Inter 2nd Year Economics Study Material Chapter 2 జనాభా, మానవ వనరుల అభివృద్ధి

ప్రశ్న 2.
గొప్ప జనాభా విభజన సంవత్సరం.
జవాబు:
1921వ సంవత్సరము నుండి మన దేశం జనాభా పరిణామ సిద్ధాంతంలోని రెండవ దశలోకి ప్రవేశించింది. ఈ దశలో మరణాల రేటు తక్కువగాను, జననాల రేటు అధికంగాను ఉంది. కనుక 1921 సంవత్సరాన్ని గొప్ప జనాభా విభజన సంవత్సరం అంటారు.

ప్రశ్న 3.
శిశు మరణాల రేటు.
జవాబు:
ఒక సంవత్సరంలో 1000 మందిలో చనిపోయిన వారి నిష్పత్తి ఈ శిశుమరణాల రేటు 1951లో సంవత్సరములో ప్రతి 1000 మందికి 27.4% కాగా 2012లో ఇది 7.0%కు తగ్గింది.

ప్రశ్న 4.
ప్రసూతి మరణాల రేటు.
జవాబు:
ఒక సంవత్సర కాలంలో, ప్రసూతి సమయం ప్రతి లక్ష మంది స్త్రీలలో చనిపోయే వారి నిష్పత్తి. ఈ మరణాల రేటును 2012 నాటికి 341: 1,00,000.

ప్రశ్న 5.
జననాల రేటు.
జవాబు:
ప్రతి 1000 మంది జనాభాలో ఎంత మంది పుడుతున్నారు అనేది జనన రేటు సూచిస్తుంది.

ప్రశ్న 6.
మరణాల రేటు.
జవాబు:
ఒక సంవత్సరంలో 1000 మందిలో చనిపోయిన వారి నిష్పత్తి 1901లో వైద్య సదుపాయాలు లేకపోవడం, కరువు మొదలైన పరిస్థితుల వల్ల మరణాలరేటు 44.4గా ఉంది. ప్రస్తుతం ఇది 2012 నాటికి 7.0 గా ఉంది.

ప్రశ్న 7.
నగరీకరణ.
జవాబు:
జనసాంద్రత చదరపు కిలోమీటరుకు 400 ఉండే ప్రదేశాన్ని పట్టణము లేదా నగరముగా చెప్పవచ్చు. పారిశ్రామిక ప్రగతి సాధించడంలో నగరీకరణ, పట్టణీకరణ దోహదం చేస్తాయి. మన దేశంలో 1951వ సంవత్సరంలో నగరీకరణ కేవలం 17.3% కాగా ఇది 2001 నాటికి 27.8% మాత్రమే పెరిగింది. నగరీకరణ ఆర్ధికాభివృద్ధికి ఒక సూచిక.

ప్రశ్న 8.
ఉమ్మడి కుటుంబం.
జవాబు:
భారతదేశంలో గ్రామీణ ప్రాంతాలలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఎక్కువగా ఉంటుంది. ఉమ్మడి కుటుంబంలోని పెద్ద మొత్తం ఉమ్మడి కుటుంబ బాధ్యతను వహించి వారి అవసరాలు తీరుస్తుంటారు. ఈ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ యుక్త వయసులోని భార్య – భర్తలు పిల్లలను కనడాన్ని ప్రోత్సహిస్తుంది. ఆధునిక సమాజంలో వైయుక్తిక కుటుంబాలకు ప్రాధాన్యత పెరుగుచున్నది.

AP Inter 2nd Year Economics Study Material Chapter 2 జనాభా, మానవ వనరుల అభివృద్ధి

ప్రశ్న 9.
వృత్తుల వారీగా జనాభా విభజన.
జవాబు:
ఒక దేశ జనాభా వివిధ రకాలైన వృత్తుల మధ్య విభజింపబడి ఉండటాన్ని వృత్తుల వారీగా జనాభా విభజన అంటారు. వివిధ రకాలైన వృత్తులను మూడు రకాలుగా వర్గీకరిస్తారు. అవి 1. ప్రాథమిక రంగం, 2. ద్వితీయ రంగం, 3. సేవా రంగం. ఆర్థికాభివృద్ధి జరిగితే ఈ వృత్తుల వారి వ్యవస్థలో అనేక మార్పులు వస్తాయి. శ్రామిక శక్తి వ్యవసాయ రంగం నుండి పారిశ్రామిక, సేవారంగాలకు బదిలి అవుతాయి. 2011వ సంవత్సరంలో భారతదేశంలో ప్రాథమిక రంగంలో శ్రామిక శక్తి 48.9%, ద్వితీయరంగంలో 24.3%, తృతీయ రంగంలో 26.8% ఉంది.

ప్రశ్న 10.
ప్రాథమిక రంగం.
జవాబు:
వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ వృత్తులు, చేపల పెంపకం, కోళ్ళ పెంపకం మొదలైన వృత్తులన్నింటిని ప్రాథమిక రంగంగా పరిగణిస్తారు. దీనినే వ్యవసాయరంగమని కూడా అంటారు. మన దేశంలో జాతీయాదాయంలో ఎక్కువ భాగం ఈ రంగం నుండి ఉత్పత్తి చేయబడేది. ఆర్థికాభివృద్ధి జరిగే కొలది దీని వాటా నెమ్మదిగాను, క్రమంగాను, తగ్గుచూ, ద్వితీయ, తృతీయ రంగపు వాటాలు పెరుగుతాయి.

ప్రశ్న 11.
తృతీయ రంగం.
జవాబు:
తృతీయ రంగాన్ని సేవారంగం అని కూడా అంటారు. వ్యాపారం, వాణిజ్యం, గ్రంథాలయాలు, వైద్యశాలలు, పాఠశాలలు, రవాణా, సమాచారం మొదలైన వాటినన్నింటిని కలిపి సేవారంగం అంటారు. తృతీయ రంగం కార్యకలాపాలు, ప్రాథమిక, ద్వితీయ రంగాల కార్యకలాపాలకు తోడ్పడతాయి. అభివృద్ధి చెందిన దేశాలలో తృతీయ రంగపు వాటాలు ఎక్కువగా ఉంటాయి.

ప్రశ్న 12.
మానవ వనరుల అభివృద్ధి.
జవాబు:
ఒక దేశం రాజకీయ, ఆర్థికాభివృద్ధికి కావలసిన విద్య, సామర్థ్యం, అనుభవముతో కూడుకున్న మానవులను మానవ వనరుల అభివృద్ధి అని అంటారు. విద్య, వైద్యం సేవలు నిరంతరంగా పెరగడం వల్ల మానవ మూలధన సామర్థ్యం పెరిగినది. తత్ఫలితంగా ఉత్పత్తి పెరుగుతుంది. మానవ వనరుల అభివృద్ధి ఆర్థికాభివృద్ధి ఒక దానిపై ఒకటి | ప్రభావితమై ఉంటాయి.

AP Inter 2nd Year Economics Study Material Chapter 2 జనాభా, మానవ వనరుల అభివృద్ధి

ప్రశ్న 13.
అక్షరాస్యత రేటు.
జవాబు:
చదవటం, రాయటంలో మనిషికున్న సామర్థ్యమే అక్షరాస్యత. ప్రతి మనిషి తనకు తాను సహాయం చేసుకోవటానికి | అక్షరాస్యత సాధనంగా ఉపయోగపడుతుంది.
AP Inter 2nd Year Economics Study Material Chapter 2 జనాభా, మానవ వనరుల అభివృద్ధి 6

ప్రశ్న 14.
సర్వశిక్ష అభియాన్. [Mar ’17, ’16]
జవాబు:
విద్యను మానవాభివృద్ధి సాధనంగా గుర్తించి A.P. ప్రభుత్వం ప్రాథమిక విద్యలో సంపూర్ణ అక్షరాస్యతను సాధించాలనే | ఆశయం పెట్టుకున్నది. 2010 సంవత్సరం నాటికి రాష్ట్రంలో 6 సంవత్సరాల నుండి 14 సంవత్సరాల వయస్సుగల పిల్లలందరికి ఉపయోగపడే విధంగా ప్రాథమిక విద్యను కల్పించడానికి 2001 02లో సర్వశిక్ష అభియాన్ పథకాన్ని ప్రవేశపెట్టారు. ప్రస్తుతం దీనిని రాజీవ్ విద్యా మిషన్ గా మార్చారు.

 

ప్రశ్న 15.
జననీ సురక్షా యోజన. [Mar ’16]
జవాబు:
2005-06 సంవత్సరంలో జననీ సురక్ష యోజన (JSY) పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఇది సంస్థాపరమైన కాన్పులను ప్రోత్సహిస్తూ శిశుమరణ రేటును తగ్గించడం దీని ఆశయం.

ప్రశ్న 16.
మానవ అభివృద్ధి సూచిక.
జవాబు:
1990వ సంవత్సరంలో మహబూబ్-ఉల్-హక్ దీనిని ప్రవేశపెట్టారు. మానవ అభివృద్ధి ఆధారంగా ఒక దేశ | ఆర్థిక వృద్ధిని అంచనా వేస్తారు. 2013వ సంవత్సరంలో వచ్చిన రిపోర్టు ప్రకారం భారతదేశం 187 దేశాల్లో 136వ స్థానానికి దిగజారింది.

ప్రశ్న 17.
లింగ సంబంధిత సూచిక (GDI).
జవాబు:
ఈ సూచిక స్త్రీ, పురుషుల మధ్య వ్యత్యాసాన్ని అంచనా వేస్తుంది. దీనిలో మూడు అంశాలు ఇమిడి ఉన్నాయి. 1. స్త్రీల ఆయుర్ధాయం 2. వయోజన స్త్రీల అక్షరాస్యత 3. స్త్రీల తలసరి ఆదాయం.

ప్రశ్న 18.
లింగ సాధికారిక కొలమానం (GEM)
జవాబు:
దీనిని 1995 సంవత్సరంలో ప్రవేశపెట్టారు. ఆర్థిక, రాజకీయ జీవితంలో స్త్రీ యొక్క భాగస్వామ్యమును GEM తెలియజేయును. ఆర్థిక రాజకీయ కార్యకలాపాల్లో, స్త్రీ – పురుషుల అసమానతలు, స్త్రీల సాధికారతను దీని ద్వారా అంచనా వేస్తారు.

ప్రశ్న 19.
మానవ పేదరిక సూచిక.
జవాబు:
1997లో ఈ సూచికను ప్రవేశపెట్టారు. మానవ పేదరిక సూచిక మూడు అంశాల ద్వారా ప్రజల మెరుగైన జీవన ప్రమాణాన్ని లెక్కిస్తారు. అవి ఆయుర్ధాయం, విజ్ఞానం, జీవన ప్రమాణం.

AP Inter 2nd Year Economics Study Material Chapter 2 జనాభా, మానవ వనరుల అభివృద్ధి

ప్రశ్న 20.
మొత్తం ప్రసూతి రేటు.
జవాబు:
ఒక స్త్రీ తన పునరుత్పత్తి కాలంలో జన్మనిచ్చే మొత్తం పిల్లల సంఖ్య.

AP Inter 2nd Year Economics Study Material Chapter 1 ఆర్థికవృద్ధి – అభివృద్ధి

Andhra Pradesh BIEAP AP Inter 2nd Year Economics Study Material 1st Lesson ఆర్థికవృద్ధి – అభివృద్ధి Textbook Questions and Answers.

AP Inter 2nd Year Economics Study Material 1st Lesson ఆర్థికవృద్ధి – అభివృద్ధి

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
అభివృద్ధి చెందిన దేశాల లక్షణాలను వివరించండి.
జవాబు:
తలసరి ఆదాయం, జీవన ప్రమాణం, వనరుల లభ్యత మరియు ఉపయోగం, సాంకేతికాభివృద్ధి మొదలైన లక్షణాల ఆధారంగా ప్రపంచ దేశాలు అభివృద్ధి చెందిన దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలుగా వర్గీకరించబడ్డాయి. అభివృద్ధి చెందుతున్న దేశాలను అధిక ఆదాయ దేశాలు (High Income Countries), పారిశ్రామిక దేశాలు (Industrialised Countries), ఇతర దేశాల కంటే అభివృద్ధి చెందిన దేశాలు (Advanced Countries) గా కూడా పిలవడం జరుగుతుంది. అమెరికా, ఇంగ్లాండు (U.K.), ఫ్రాన్స్, జర్మనీ, కెనడా, జపాన్ మొదలైనవి కొన్ని అభివృద్ధి చెందిన దేశాలను ఉదాహరణలుగా చెప్పవచ్చును.

1) అధిక తలసరి ఆదాయం: ఒక సంవత్సర కాలంలో ఒక వ్యక్తి యొక్క సగటు ఆదాయాన్ని తలసరి ఆదాయం అంటారు. అధిక తలసరి ఆదాయం అభివృద్ధి చెందిన దేశాల ముఖ్య లక్షణం. 2012వ సంవత్సరంలో వినిమయ రేటు ఆధారంగా U.S.A. తలసరి G.N.I. ($ 50,120) భారతదేశం యొక్క తలసరి G.N.I. ($ 1,530) కంటే 33 రెట్లు ఎక్కువగాను మరియు కొనుగోలు శక్తి ఆధారంగా 15 రెట్లు ఎక్కువగా ఉంది. అందువల్ల అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాల తలసరి ఆదాయాలలో ఎక్కువ తేడాలు ఉన్నట్లు గమనించవచ్చు.

AP Inter 2nd Year Economics Study Material Chapter 1 ఆర్థికవృద్ధి – అభివృద్ధి

2) వ్యవసాయేతర రంగాల ప్రాధాన్యత: అభివృద్ధి చెందిన దేశాలు సహజంగా పారిశ్రామిక దేశాలై ఉంటాయి. ఈ దేశాలలో పారిశ్రామిక, సేవారంగాలు బాగా అభివృద్ధి చెంది ఉంటాయి. వ్యవసాయ రంగంతో పోల్చినపుడు ఆదాయ, ఉద్యోగ అవకాశాల కల్పనలో పారిశ్రామిక సేవారంగాల పాత్ర ఎక్కువగా ఉంటుంది. ఈ రంగాలు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొంటాయి. కాబట్టి ఈ రంగాలలో ఉత్పాదకత వ్యవసాయరంగ ఉత్పాదకత కంటే ఎక్కువగా ఉండి, ఆర్థిక వ్యవస్థ పురోభివృద్ధి చోదక శక్తిగా పనిచేస్తుంది. అమెరికాలో (U.S.A) వ్యవసాయ రంగంలో పనిచేస్తున్నవారు 1.6 శాతం, కాగా స్థూల దేశీయ ఉత్పత్తిలో వ్యవసాయ రంగం వాటా 1.3 శాతం మాత్రమే ఉంది. అదే అభివృద్ధి చెందుతున్న దేశాలు అయితే భారతదేశంలో వ్యవసాయ రంగంపై ఆధారపడినవారు 51.1 శాతం గాను, స్థూల దేశీయ ఉత్పత్తిలో వ్యవసాయ రంగం వాటా 18 శాతంగా ఉంది.

3) అధిక స్థాయిలో మూలధనం, సాంకేతిక విజ్ఞానం: మూలధన కల్పనరేటు ఎక్కువగా ఉండటం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగించడం అభివృద్ధి చెందిన దేశాల ముఖ్య లక్షణం. అభివృద్ధి చెందిన దేశాలు అధిక ఆదాయ దేశాలు కాబట్టి వారికి పొదుపు సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. ఇదే కాకుండా బ్యాంకులు, విత్తసంస్థలు సమర్థవంతంగా పనిచేస్తూ పెద్ద ఎత్తున పొదుపును సమీకరిస్తాయి. ఈ దేశాలలో మూలధన లభ్యత అధికంగా ఉండటం వల్ల అది సాంకేతిక ప్రగతికి దారితీస్తుంది.

4) తక్కువ స్థాయిలో నిరుద్యోగం: నిరుద్యోగ స్వభావం మరియు పరిమాణంలో అభివృద్ధి చెందిన దేశాలకు, అభివృద్ధి చెందుతున్న దేశాలకు మౌళికమైన భేదం ఉంది. అభివృద్ధి చెందిన దేశాలలో “సార్థక డిమాండు” కొరత నిరుద్యోగానికి కారణం అవుతుంది. ఈ దేశాలలోని నిరుద్యోగం చక్రీయ (Cyclical) మరియు సంఘృష్ట (Frictional) మైనది. భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలలో “మూలధన కొరత” వల్ల బహిర్గత మరియు ప్రచ్ఛన్న నిరుద్యోగితలు ఉంటాయి. అభివృద్ధి చెందిన దేశాలలో శ్రామిక నైపుణ్యం, శ్రామికులు గమనశీలతలు ఎక్కువగా ఉండటమే కాకుండా నిరుద్యోగిత శాతం చాలా తక్కువగా ఉంది.

5) మెరుగైన జీవన ప్రమాణం: సమర్థవంతమైన సాంఘిక భద్రతా వ్యవస్థ, కాలుష్యపరంగా ఉన్నత ప్రమాణాలు పాటించడం, రక్షిత త్రాగునీరు లభ్యత, మెరుగైన ఆరోగ్య సంరక్షణ, పారిశుద్ధ్యం మొదలైన అంశాలు అభివృద్ధి చెందిన దేశాలలో ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాన్ని కల్పిస్తాయి. ఈ దేశాలు విద్య, ఆరోగ్యం, పరిశోధన, శిక్షణ మరియు నైపుణ్యాల కల్పనలపై ఎక్కువ వ్యయం చేస్తాయి. దీనిని మానవ మూలధనం అంటారు. ఉదా: అమెరికాలో విద్య మరియు పరిశోధనల మీద స్థూల దేశీయ ఉత్పత్తిలో 6 శాతం కంటే ఎక్కువ వ్యయం చేస్తూ ఉండగా, అభివృద్ధి చెందుతున్న దేశాలు తమ స్థూల దేశీయ ఉత్పత్తిలో కేవలం 3 శాతం మాత్రమే వ్యయం చేస్తున్నాయి. భారతదేశం తన స్థూల దేశీయ ఉత్పత్తిలో విద్యపైన 2004-2005లో 3.3 శాతం వ్యయం చేయగా 2011-2012 నాటికి ఇది 4 శాతానికి పెరిగింది. మానవాభివృద్ధి సూచిక విషయంలో 2013వ సంవత్సరానికి 187 దేశాలలో నార్వే. ఆస్ట్రేలియా, స్విట్జర్లాండు దేశాలు వరుసగా మొదటి మూడు స్థానాల్లో ఉండగా, భారతదేశం 135వ స్థానంలో ఉన్నది.

ప్రశ్న 2.
భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశము – చర్చించండి.
జవాబు:
భారతదేశ ఆర్థిక వ్యవస్థలో అభివృద్ధి చెందుతున్న దేశాల లక్షణాలు గోచరిస్తాయి.

2005
1) జాతీయాదాయం పెరుగుదల: 1950 – 51 సంవత్సరంలో భారతదేశ జాతీయాదాయం, 2004 సం॥పు స్థిర ధరలలో కౌ 2,55,405 కోట్లు. 2013-14 సంవత్సరాలలో జాతీయాదాయం 49,20,183 కోట్లు. దీనిని వేగవంతమైన అభివృద్ధిగా చెప్పవచ్చు.

2) తలసరి ఆదాయం పెరుగుదల: 1950. 51 సంవత్సరంలో నికర తలసరి ఆదాయం, 2004 – 2005 సం||పు స్థిర ధరలలో కౌ 7, 114. 2013-14 సంవత్సరాలలో 39,904. సాపేక్షికంగా నికర తలసరి ఆదాయం చాలా వేగంగా పెరిగింది.

AP Inter 2nd Year Economics Study Material Chapter 1 ఆర్థికవృద్ధి – అభివృద్ధి

3) పొదుపు, మూలధన కల్పన పెరుగుదల: భారతదేశంలో 1990లో 23 శాతంగా ఉన్న స్థూల దేశీయ పొదుపు రేటు 2012 నాటికి 27.9 శాతానికి పెరిగింది. అదే కాలంలో 24 శాతంగా ఉన్న స్థూల మూలధన కల్పన రేటు 35.6 శాతానికి పెరిగింది. ఇది భారతదేశ అభివృద్ధి గతిని సూచిస్తుంది.

4) వృత్తులవారి శ్రామిక జనాభా: 2011 సంవత్సరపు లెక్కల ప్రకారం 48.9% శ్రామికులు వ్యవసాయ రంగంమీద ఆధారపడినారు. ఇది వ్యవసాయ ప్రాధాన్యతను సూచిస్తుంది. ద్వితీయ రంగం మీద ఆధారపడిన వారి | శాతం క్రమేపి పెరుగుతూ వచ్చింది. 1901లో 10.7% మరియు 2011లో 24.3% శ్రామికులు ద్వితీయ రంగం మీద ఆధారపడినారు. తృతీయ రంగం మీద ఆధారపడిన వారి శాతం 1/5 కంటే కొంచెం ఎక్కువగా ఉన్నారు.

5) స్థూల దేశీయ ఉత్పత్తిలో వ్యవసాయ రంగం వాటా: స్థూల దేశీయ ఉత్పత్తిలో వ్యవసాయ రంగం వాటా 1950-51 సం॥లో 56.5% గా ఉంది. ఈ వాటా క్రమేపి తగ్గుతూ 2013-14 నాటికి 13.9 శాతానికి చేరుకుంది. పారిశ్రామిక రంగం: పారిశ్రామిక రంగంలో 1950-51 సం॥లో వాటా జాతీయాదాయంలో 14.8 శాతం కాగా 2013-14 సం॥ నాటికి పారిశ్రామిక రంగం వాటా 26.2 శాతంగా ఉంది.

అవస్థాపన సౌకర్యాలు: రవాణా, బ్యాంకింగ్, నీటిపారుదల, విద్య, సమాచారం మొదలైన వాటిని అవస్థాపన సౌకర్యాలు అంటారు. వీటి విషయంలో భారత్ ప్రగతిని సాధించింది.
శాస్త్ర విజ్ఞానం – సాంకేతిక విజ్ఞానం: నేడు ఇండియాలో శాస్త్రవేత్తలు, వైద్యులు, ఇంజనీర్లు కల్గిన 3వ పెద్ద దేశంగా ప్రపంచంలో స్థానం సంపాదించుకున్నది. శాస్త్ర విజ్ఞానం సాంకేతిక పరిజ్ఞానము కల్గిన మానవశక్తిగా ప్రపంచంలో రెండవ దేశంగా భారతదేశం ప్రసిద్ధి చెందినది.

అయినప్పటికీ జనాభా సమస్యను ఎదుర్కొనుచున్నది. 2011వ సం॥లో 1210 మిలియన్లు ఉన్న భారత జనాభా 2015 నాటికి 1278 మిలియన్లకు పెరిగింది. మనదేశంలో ద్వితీయ, తృతీయ రంగాల అభివృద్ధి వల్ల ఉద్యోగిత పెరిగినప్పటికి నిరుద్యోగ సమస్య ఎదుర్కొనుచున్నది. మన దేశంలో ఆదాయ అసమానతలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. 2011-12 నాటికి గ్రామీణ ప్రాంతాలలో అట్టడుగు 10% ప్రజల తలసరి నెలసరి వినియోగ వ్యయం 11.5 శాతం పెరగగా 10 శాతం అధిక ధనవంతుల నెలసరి తలసరి వినియోగ వ్యయం 38 శాతం పెరిగింది. ఇదే కాలంలో పట్టణ ప్రాంతాలలో పేద, ధనికుల వినియోగ వ్యయం 17.2 శాతం మరియు 30.2 శాతం పెరిగింది. భారత ఆర్థిక వ్యవస్థలో కూడా సాంకేతిక ద్వంద్వత్వం కనిపిస్తుంది. పారిశ్రామిక రంగం అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తుండగా, వ్యవసాయ రంగం పురాతన ఉత్పత్తి పద్ధతులను అనుసరిస్తూ ఉన్నది. కనుక భారతదేశంను అభివృద్ధి చెందుతున్న దేశంగా చెప్పవచ్చు.

ప్రశ్న 3.
భారతదేశ ఆర్థిక వ్యవస్థను దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి చెందుతున్న దేశాల లక్షణాలు వివరించండి. [Mar ’17, ’16]
జవాబు:
ఐక్యరాజ్యసమితి వర్గీకరణ ప్రకారము “ఏ దేశాల వాస్తవిక తలసరి ఆదాయం, అమెరికా తలసరి ఆదాయంలో 4వ వంతు కంటే తక్కువగా ఉంటుందో వాటిని అభివృద్ధి చెందుతున్న దేశాలుగా చెప్పవచ్చు”.

భారత ప్రణాళికా సంఘం నిర్వచనం ప్రకారం “వెనుకబడిన ఆర్థిక వ్యవస్థ అంటే ఒక ప్రక్క పూర్తిగా ఉపయోగించని లేదా తక్కువ ఉపయోగించిన మానవ వనరులు, మరోప్రక్క పూర్తిగా వినియోగించని సహజ వనరులు కలిసి ఉంటాయి”.

1) తక్కువ తలసరి ఆదాయం: తలసరి ఆదాయం తక్కువ ఉండడం అనేది అభివృద్ధి చెందుతున్న దేశాల ముఖ్య లక్షణం. అభివృద్ధి చెందుతున్న దేశాలుగా పిలువబడే అల్ప, మధ్య ఆదాయ దేశాలు తలసరి ఆదాయం విషయంలో అభివృద్ధి చెందిన దేశాల కంటే బాగా వెనుకబడి ఉన్నాయి. చైనా, భారతదేశం వంటి వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల తలసరి ఆదాయం, అభివృద్ధి చెందిన దేశాల తలసరి ఆదాయంతో పోల్చినపుడు చాలా తక్కువగా ఉంది. వినిమయ రేటు ఆధారంగా భారతదేశ తలసరి GNI $ 1070 (2008) నుండి $1530 (2011), కొనుగోలు శక్తి ఆధారంగా తలసరి GNI $ 2960 నుండి $ 3840 పెరిగినప్పటికీ భారతదేశం ఇంకనూ మధ్య ఆదాయం కంటే తక్కువ ఆదాయం గల దేశాల గ్రూపులోనే ఉంది.

AP Inter 2nd Year Economics Study Material Chapter 1 ఆర్థికవృద్ధి – అభివృద్ధి

2) మూలధన కొరత: మూలధన కొరత అనేది అభివృద్ధి చెందుతున్న దేశాల ఒక లక్షణం. అప్పుడప్పుడు ఈ దేశాలను ‘మూలధన పేద” దేశాలుగా పిలుస్తారు. తక్కువ తలసరి మూలధనం, ఆర్థిక వ్యవస్థలో మూలధనం కొరతను సూచిస్తుంది. ఆర్థికాభివృద్ధిని ప్రభావితం చేసే మూలధన కల్పన రేటు ఈ దేశాలలో చాలా తక్కువగా ఉంటుంది. ఇది ఆ దేశాల స్థూల దేశీయ ఉత్పత్తిలో 15 నుండి 20 శాతం మధ్య ఉంటుంది. ఈ దేశాలలో తలసరి ఆదాయం తక్కువగా ఉండడం వలన పెట్టుబడులను ప్రేరేపించే పొదుపురేటు చాలా తక్కువగా ఉంటుంది. అంతేగాకుండా ఈ దేశాలలో ప్రోత్సాహకాలు, పొదుపును సమీకరించే సంస్థలు సమర్థవంతంగా లేనందున పొదుపు, పెట్టుబడుల స్థాయి పెరగడం లేదు.

3) జనాభా లక్షణాలు: అభివృద్ధి చెందుతున్న దేశాలు తీవ్ర జనాభా సమస్యను ఎదుర్కొంటున్నాయి. చాలా అభివృద్ధి చెందుతున్న దేశాలలో జనాభా పెరుగుదల రేటు 2 శాతముగా నమోదైంది. వైద్య సౌకర్యాలు మెరుగుపరచి మరణాల రేటు తగ్గించడంలో విజయం సాధించినప్పటికీ అదే రీతిలో జననాల రేటు తగ్గించలేకపోవడం వలన జనాభా విస్ఫోటనానికి దారితీసింది. ఈ అధిక జనాభా సహజ వనరులపైన ఒత్తిడిని పెంచి, పేదరికం, నిరుద్యోగం పెరగడానికి కారణం అయినది. అందువలన ప్రజల జీవన ప్రమాణ స్థాయి తక్కువగా ఉంటుంది.

భారతదేశం కూడా అధిక జనాభా సమస్యను ఎదుర్కొంటున్నది. 2011వ సం॥లో 1210 మిలియన్లు ఉన్న భారతదేశ జనాభా 2015 సం॥నాటికి 1278 మిలియన్లకు పెరిగింది. ఇది ప్రపంచ జనాభాలో 17.5 శాతంగా ఉంది. 4) నిరుద్యోగం: అధిక నిరుద్యోగిత అభివృద్ధి చెందుతున్న దేశాలు ఎదుర్కొంటున్న సమస్యలలో ఒకటి. ఈ దేశాలలో ఉన్న బహిర్గత నిరుద్యోగిత (Open unemployment) అభివృద్ధి చెందిన దేశాల నిరుద్యోగితతో పోల్చినపుడు చాలా రెట్లు ఎక్కువగా ఉంది. గ్రామీణ ప్రాంత ప్రజలు పట్టణాలకు వలస రావడం వల్ల పట్టణ ప్రాంతాలలో నిరుద్యోగ సమస్య తీవ్రమవుతున్నది. మందకొడిగా అభివృద్ధి చెందుతున్న పారిశ్రామిక రంగం పెరుగుతున్న శ్రామిక శక్తికి ఉద్యోగ అవకాశాలు కల్పించగలిగిన స్థితిలో లేనందున వ్యవసాయ రంగాలపై ఒత్తిడి పెరిగి ప్రచ్ఛన్న నిరుద్యోగిత (Disguised unemployment) సమస్యను ఎదుర్కొంటున్నది. భారత ఆర్థిక వ్యవస్థలో మూలధన కొరత నిరుద్యోగానికి కారణం అవుతున్నది. భారతదేశం కూడా బహిర్గత మరియు ప్రచ్ఛన్న నిరుద్యోగిత సమస్యలను ఎదుర్కొంటున్నది.

5) వ్యవసాయ రంగ ప్రాధాన్యత: హార్వే లిబెన్ ప్రకారం అభివృద్ధి చెందుతున్న దేశాలు వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థలుగా ఉంటాయి. ఈ దేశాలలో 30 నుండి 70 శాతం జనాభా వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉంటుంది. జె.కె. గాల్ బ్రెయిత్ అభిప్రాయంలో “ఒక దేశం పూర్తిగా వ్యవసాయ ఆధార దేశం అయినప్పటికీ అది వ్యవసాయ రంగంలోనే బాగా వెనుకబడి ఉంటుంది”.

అభివృద్ధి చెందుతున్న దేశాలలో శ్రమ సాంద్రతపై ఆధారపడి వ్యవసాయ రంగం అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడంలో వెనుకబడి ఉంటుంది. కాబట్టి ఈ దేశాల ఆర్థిక వ్యవస్థలోని వ్యవసాయ రంగంలో అల్ప ఉత్పాదకత ఉంటుంది. అంతేగాకుండా అధిక జనాభా ఒత్తిడి వలన ఈ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ భూమి విభజనకు మరియు విఘటనలకు గురి అవ్వడం వలన భూకమతాల పరిమాణం తగ్గుతుంది. దీని ఫలితంగా విక్రయం కాగల మిగులు స్వల్పంగా ఉండి ప్రజల ఆదాయాలు తక్కువగా ఉంటాయి. ఈ దేశాల స్థూల దేశీయ ఉత్పత్తిలో (GDP) ఈ రంగం వాటా 20 శాతం నుండి 30 శాతం వరకు ఉంటుంది.

ఆర్థిక సర్వే 2013-14 ప్రకారం, భారతదేశ వ్యవసాయ రంగంలో పనిచేయుచున్న జనాభా 54.6 శాతం ఉండగా స్థూల దేశీయ ఉత్పత్తిలో దాని వాటా 13.9 శాతంగా ఉంది.

AP Inter 2nd Year Economics Study Material Chapter 1 ఆర్థికవృద్ధి – అభివృద్ధి

6) సామూహిక పేదరికం: పేదరికం అనేది అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రత్యేక లక్షణం. అభివృద్ధి చెందుతున్న దేశాలలో సాపేక్షంగా తక్కువ తలసరి ఆదాయ స్థాయిల వద్ద అధికంగా ఉన్న ఆదాయ అసమానతలు సామూహిక పేదరికానికి దారితీస్తున్నాయి. భారతదేశం కూడా పేదరికపు సమస్యను ఎదుర్కొంటున్నది. టెండుల్కర్ కమిటీ సిఫారసు ఆధారంగా ప్రణాళికా సంఘం పేదరిక గీతను పునఃనిర్వచించింది. దీని ప్రకారం 2009-10 సం॥లో నెలసరి తలసరి వినియోగ వ్యయం గ్రామీణ ప్రాంతాలలో 673 గాను, పట్టణ ప్రాంతాలలో కే 860గా నిర్ణయించింది.

7) ఆదాయ అసమానతలు: ఆదాయ సంపదలలో అసమానతలు ఉండటం అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రత్యేక లక్షణం. భారత ఆర్థిక వ్యవస్థలో ఆదాయ అసమానతలు పెరుగుతూ ఉన్నాయనే వాస్తవాన్ని నిర్వహించిన వివిధ సర్వేలు చెబుతున్నాయి. భారత ఆర్థిక వ్యవస్థలో గడిచిన రెండు దశాబ్దాలలో ఆదాయ అసమానతలు 2 రెట్లు పెరిగాయని ఆర్థిక సహకార, అభివృద్ధి సంస్థ తెలియజేసింది.

8) తక్కువ జీవన ప్రమాణం: అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చినప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశాలలో జీవన ప్రమాణ స్థాయి చాలా తక్కువగా ఉన్నది. ప్రజల యొక్క జీవన ప్రమాణాన్ని నిజ ఆదాయం, ఆరోగ్యం, విద్యపరంగా సాధించిన వృద్ధి అనే మూడు సూచికల ఆధారంగా కొలవడం జరుగుతుంది. అభివృద్ధి చెందుతున్న దేశాలలోని ప్రజలు పోషకాహార లోపం, అధిక స్థాయి కాలుష్యం, పారిశుద్ధ్య లోపం, రక్షిత మంచినీటి కొరత మొదలగు సమస్యలతో జీవిస్తున్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాలలో ప్రజల ఆయుర్దాయం 65 సం॥ల లోపు ఉండగా అభివృద్ధి చెందిన దేశాలలో 75 సం॥ల కంటే ఎక్కువగా ఉంది.

9) సాంకేతికంగా వెనుకబాటుతనం: అభివృద్ధి చెందుతున్న దేశాలు పరిశోధన, అభివృద్ధిపై దృష్టి పెట్టకపోవడం వల్ల ఉత్పత్తి పద్ధతులలో వెనుకబడి ఉన్నాయి. అధిక మూలధనం కొరతగా ఉండటం వల్ల ఈ దేశాలు శ్రమ సాంద్రత పద్ధతులకు ప్రాధాన్యతనిస్తాయి. భారత ఆర్థిక వ్యవస్థ కూడా సాంకేతికంగా వెనుకబడి ఉంది. ఆర్థిక వ్యవస్థలో వివిధ రంగాలలో ఆధునిక, సంప్రదాయ పరిజ్ఞానం రెండు ప్రక్కప్రక్కనే ఉన్నాయి. సాంకేతిక వెనుకబాటుతనం వల్ల భారత ఆర్థిక వ్యవస్థలో ఉత్పాదకత చాలా తక్కువగా ఉంది.

10) అధిక జనసాంద్రత: ఒక చదరపు కిలోమీటరుకు నివసించే సగటు జనాభాను జనసాంద్రత అంటారు. అభివృద్ధి చెందుతున్న దేశాలలో అధిక జనాభా ఉండటం వల్ల జనసాంద్రత కూడా ఎక్కువగా ఉంటుంది. అధిక జనసాంద్రత వల్ల సహజ వనరుల మీద ఒత్తిడి పెరుగుతుంది.

11) ద్వంద్వ ఆర్థిక వ్యవస్థ: అభివృద్ధి చెందుతున్న దేశాలలో ద్వంద్వ ఆర్థిక వ్యవస్థ లక్షణాలు ఉన్నాయి. ఒకే ఆర్థిక వ్యవస్థలో రెండు రంగాలు అనగా ఆధునిక రంగం మరియు సాంప్రదాయ రంగం ప్రక్కప్రక్కనే ఉండటాన్ని ద్వంద్వత్వం అంటారు. ద్వంద్వ ఆర్థిక వ్యవస్థలు మూడు రకాలు. 1. సాంకేతిక ద్వంద్వత్వం 2. సామాజిక ద్వంద్వత్వం 3. ఆర్థిక ద్వంద్వత్వం. భారత ఆర్థిక వ్యవస్థలో కూడా సాంకేతిక ద్వంద్వత్వం కనిపిస్తుంది. పారిశ్రామిక రంగం, అధునాతన, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తుండగా, వ్యవసాయ రంగం పురాతన ఉత్పత్తి పద్ధతులను అనుసరిస్తూ ఉన్నది.

12) ధరల అస్థిరత్వం: ధరల అస్థిరత్వం అభివృద్ధి చెందుతున్న దేశాల మౌళిక లక్షణం. ఈ దేశాలలో నిత్యావసర వస్తువుల కొరత వలన మరియు వినియోగం, ఉత్పత్తి మధ్య ఉండే అంతరం వల్ల ధరల అస్థిరత్వం కొనసాగుతూ ఉంటుంది.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ఆర్థికవృద్ధి, ఆర్థికాభివృద్ధి మధ్య తేడాలను వివరించండి.
జవాబు:
1960వ వరకు ఆర్థికవృద్ధి, ఆర్థికాభివృద్ధి అనే భావనలను పర్యాయపదాలుగా వాడడం జరిగింది. అయితే హిక్స్, షుంపీటర్ లాంటి ఆర్థికవేత్తలు ఈ రెండు పదాలకు వేర్వేరు అర్థాలను ఇస్తూ, వాటి మధ్య స్పష్టమైన తేడాలను సూచించారు. వారి అభిప్రాయం ప్రకారం ఆర్థికవృద్ధి అనే భావన అభివృద్ధి చెందిన దేశాల సమస్యలకు సంబంధించినది కాగా, ఆర్థికాభివృద్ధి అనే భావన అభివృద్ధి చెందిన దేశాల సమస్యలను అధ్యయనం చేస్తుంది.
ఆర్థికవృద్ధి, ఆర్థికాభివృద్ధి మధ్య తేడాలు:
ఆర్థికవృద్ధి

  1. ఆర్థికవృద్ధి ఒక దేశం యొక్క వస్తు సేవల వాస్తవిక ఉత్పత్తిలో పెరుగుదలను సూచిస్తుంది.
  2. ఆర్థికవృద్ధి అనే ప్రక్రియ ఏకముఖమైనది.
  3. ఆర్థికవృద్ధి సంకుచితమైన భావన.
  4. ఇది అభివృద్ధి చెందుతున్న దేశాలకు సంబంధించినది. ఉదా: అమెరికా, కెనడా మొదలైనవి.
  5. ప్రభుత్వ జోక్యం లేకుండా ఆర్థికవృద్ధిని సాధించ వచ్చును.
  6. ఇది ఆర్థిక వ్యవస్థలో పరిమాణాత్మక మార్పులను సూచించును.
  7. ఆర్థికవృద్ధి ఆర్థిక వ్యవస్థలో ఆదాయ సంపద పంపిణీని తెలియజేయదు.
  8. ఆర్థికవృద్ధిని మానవుని శారీరక పెరుగుదలతో పోల్చవచ్చు.
  9. దీనిని కొలవగలము.

AP Inter 2nd Year Economics Study Material Chapter 1 ఆర్థికవృద్ధి – అభివృద్ధి

ఆర్థికాభివృద్ధి

  1. ఆర్థికాభివృద్ధి అనేది ఆర్థికవృద్ధితో పాటు, సాంఘిక మరియు ఆర్థిక నిర్మాణంలో ప్రగతిశీల మార్పులను తెలియజేయును.
  2. ఆర్థికాభివృద్ధి అనే ప్రక్రియ బహుముఖమైనది.
  3. ఆర్థికాభివృద్ధి విస్తృతమైన భావన.
  4. ఇది అభివృద్ధి చెందుతున్న దేశాలకు సంబంధించినది. ఉదా: భారతదేశం, చైనా మొదలైనవి.
  5. ప్రభుత్వ జోక్యం లేకుండా ఆర్థికాభివృద్ధిని సాధించలేము.
  6. ఇది ఆర్థిక వ్యవస్థలో గుణాత్మక మార్పులను సూచించును.
  7. ఆర్ధికాభివృద్ధి ఆర్థిక వ్యవస్థలో ఆదాయ సంపద పంపిణీని తెలియజేయును.
  8. ఆర్థికాభివృద్ధిని మానవ సంపూర్ణ అభివృద్ధితో పోల్చవచ్చు.
  9. దీనిని కొలవలేము.

ప్రశ్న 2.
ఆర్థికాభివృద్ధిని నిర్ణయించే అంశాలను తెలియజేయండి.
జవాబు:
ఆర్థికాభివృద్ధి అనేది బహుముఖమైన ప్రక్రియ. సహజ వనరులు, మూలధనం, మానవ వనరులు, సాంకేతిక పరిజ్ఞానం, ప్రజల వైఖరులు, దేశంలోని రాజకీయ పరిస్థితులు వంటి అంశాలచే ఆర్థికాభివృద్ధి ప్రభావితం చేయబడుతుంది. ఆర్థికాభివృద్ధిని నిర్ణయించే అంశాలను ఈ క్రింది విధంగా 3 రకాలుగా వర్గీకరించవచ్చు.
AP Inter 2nd Year Economics Study Material Chapter 1 ఆర్థికవృద్ధి – అభివృద్ధి

I. సహజ వనరులు: ఏ దేశ అభివృద్ధి అయినా ఆ దేశంలో లభించే సహజ వనరుల మీద ఆధారపడి ఉంటుంది. జాకబ్ వైనర్, విలియం జె. భౌమాల్ మరియు డబ్ల్యూ ఎ. లూయిస్ మొదలైన ఆర్థికవేత్తలు దేశం యొక్క ఆర్థికాభివృద్ధిని నిర్ణయించడంలో సహజ వనరుల పాత్ర ముఖ్యమైనదని, వాటికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. సహజ వనరులను సక్రమంగా ఉపయోగించుకోగలిగినప్పుడే ఆర్థికాభివృద్ధి జరుగుతుంది.

II. ఆర్థిక అంశాలు:
1) మూలధన కల్పన: ఒక దేశ ఆర్థికాభివృద్ధి గతిని మూలధన కల్పన నిర్ణయిస్తుంది. ఆర్థిక మరియు సాంఘిక అవస్థాపనా సౌకర్యాల అభివృద్ధి మూలధన లభ్యత మీద ఆధారపడి ఉంటుంది. అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఆర్థికాభివృద్ధి సాధించుటకు మూలధన కొరత ముఖ్యమైన అవరోధంగా ఉంది.

2) విక్రయం కాగల మిగులు: గ్రామీణ ప్రాంతాల ప్రజల కనీస అవసరాలు తీరిన తరువాత మార్కెట్లో అమ్మకానికి లభ్యమయ్యే వ్యవసాయ రంగంలోని అదనపు ఉత్పత్తిని విక్రయం కాగల మిగులు అంటారు. ఈ విక్రయం కాగల మిగులు గ్రామీణ ప్రాంతాలలో ఆదాయాలను పెంచి తద్వారా వస్తు సేవల డిమాండ్ను ప్రేరేపిస్తుంది. ఆర్థిక వ్యవస్థలోని ఇతర రంగాల పురోగతి వ్యవసాయ రంగంలోని విక్రయం కాగల మిగులుపై ఆధారపడి ఉంటుంది.

3) విదేశీ వ్యాపారం: విదేశీ వ్యాపారం, శ్రమ విభజన, ప్రత్యేకీకరణ ద్వారా ఆర్థిక వ్యవస్థలో వస్తు సేవల ఉత్పత్తిని పెంచుతుంది. ఇది వనరుల సమర్థవంతమైన ఉపయోగానికి దారితీస్తుంది. అంతేకాకుండా విదేశీ వ్యాపారం వస్తు సేవల మార్కెట్లను విస్తృతపరచి ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి, ఉద్యోగిత పెరగడానికి దోహదపడుతుంది. అందుచేత విదేశీ వ్యాపారం ఆర్థికాభివృద్ధికి ఒక ఇంజను వంటిదని ఆర్థికవేత్తలు అభివర్ణించారు.

III. ఆర్థికేతర అంశాలు:
1) మానవ వనరులు: మానవ వనరులను ఏ దేశం సక్రమంగాను, సమర్థవంతంగాను వినియోగించుకుంటారో, ఆ దేశం త్వరితగతిన ఆర్థికాభివృద్ధిని సాధిస్తుంది.

2) సాంకేతిక ప్రగతి: సాంకేతిక ప్రగతి ఉత్పత్తి, ఉత్పాదకతలను పెంచడమే కాకుండా సామాజిక వాతావరణంలో మార్పులను తీసుకొస్తుంది. దీనివల్ల వనరులు సక్రమంగా వినియోగింపబడి ఉత్పత్తి వ్యయం తగ్గి, వివిధ రంగాలలో గరిష్ట ఉత్పత్తిని సాధించడానికి దోహదపడును.

3) సామాజిక వ్యవస్థ: ఒక దేశంలోని అభివృద్ధి ప్రక్రియలో ఆ దేశంలోని అన్ని వర్గాల ప్రజల చురుకైన భాగస్వామ్యం అవసరం. లోపభూయిష్టమైన సామాజిక నిర్మాణం వలన అభివృద్ధి ఫలాలు ధనికులకు మాత్రమే చెందుతున్నట్లు అనుభవాలు సూచిస్తున్నాయి. దీనివలన ఆదాయ అసమానతలు పెరుగుతున్నాయి.

4) అవినీతి: అభివృద్ధి చెందుతున్న దేశాలలో వివిధ స్థాయిలలో గల అదుపులేని అవినీతి అభివృద్ధి ప్రక్రియకు ఆటంకంగా తయారయ్యింది. పన్నుల ఎగవేత, ప్రభుత్వ నిధుల దుర్వినియోగం, అధికారులు కుమ్మక్కు మొదలైన అంశాలు దేశ అభివృద్ధి ప్రక్రియకు ఆటంకాలుగా ఉన్నాయి.

AP Inter 2nd Year Economics Study Material Chapter 1 ఆర్థికవృద్ధి – అభివృద్ధి

5) అభివృద్ధి చెందాలనే కోరిక: అభివృద్ధి చెందాలనే ప్రజల కోరిక ఆదేశ అభివృద్ధి ప్రక్రియను ప్రభావితం చేస్తుంది. రిచర్డ్. W. గిల్ ఉద్దేశ్యం ప్రకారం “ఆర్థికాభివృద్ధి అనేది ఒక యాంత్రికమైన ప్రక్రియ కాదు. అది మానవుని యొక్క ప్రయత్నం. ఆర్థికాభివృద్ధి దేశంలోని ప్రజల నైపుణ్యం, నాణ్యత, దృక్పధాలపై ఆధారపడి ఉంటుంది”.

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ఆర్థికవృద్ధి.
జవాబు:
ఆర్థికవృద్ధి అనేది దేశంలోని వస్తు సేవల వాస్తవిక ఉత్పత్తిలో పెరుగుదలను సూచించును. ఇది అభివృద్ధి చెందిన దేశాలకు సంబంధించినది.

ప్రశ్న 2.
ఆర్థికాభివృద్ధి.
జవాబు:
ఆర్థికాభివృద్ధి అనేది ఆర్థికవృద్ధితో పాటు సాంఘిక మరియు ఆర్థిక నిర్మాణంలో ప్రగతిశీల మార్పులను తెలియజేయును. ఇది అభివృద్ధి చెందిన దేశాలకు సంబంధించినది.

ప్రశ్న 3.
తలసరి ఆదాయం.
జవాబు:
ఒక సంవత్సర కాలంలో ఒక వ్యక్తి సగటు ఆదాయాన్ని తలసరి ఆదాయం అంటారు. ఒక దేశ జాతీయాదాయాన్ని ఆ దేశ జనాభాతో భాగించగా వచ్చే దానిని తలసరి ఆదాయం అంటారు.
తలసరి ఆదాయం = జాతీయాదాయం / దేశ జనాభా

ప్రశ్న 4.
అభివృద్ధి చెందుతున్న దేశాలకు ప్రణాళికా సంఘం ఇచ్చిన నిర్వచనం.
జవాబు:
వెనుకబడిన ఆర్థిక వ్యవస్థ అంటే ఒక ప్రక్క పూర్తిగా ఉపయోగించని లేదా తక్కువ ఉపయోగించిన మానవ వనరులు, మరో ప్రక్క పూర్తిగా వినియోగించని సహజ వనరులు కలిసి ఉంటాయి.

ప్రశ్న 5.
మానవ మూలధనం.
జవాబు:
విద్య, ఆరోగ్యం, పరిశోధన, శిక్షణ మరియు నైపుణ్యాల కల్పనపై చేసే వ్యయాన్ని మానవ మూలధనం అంటారు.

ప్రశ్న 6.
ప్రపంచ దేశాల వర్గీకరణకు ప్రపంచ బ్యాంకు ఇచ్చిన నిర్వచనం.
జవాబు:
తలసరి స్థూల జాతీయాదాయం ఆధారంగా ప్రపంచ బ్యాంకు తన ప్రపంచ అభివృద్ధి నివేదికలో ప్రపంచ దేశాలను ఈ క్రింది విధంగా వర్గీకరించినవి.

  1. తక్కువ తలసరి ఆదాయం గల దేశాలు. తలసరి GNI 1.045 డాలర్లు లేదా అంతకంటే తక్కువ తలసరి GNI ఉన్న దేశాలు.
  2. మధ్య ఆదాయం గల దేశాలు. తలసరి GNI 1.046 డాలర్లు కంటే ఎక్కువగాను, 12,746 డాలర్ల కంటే తక్కువగా ఉన్న దేశాలు.
  3. అధిక ఆదాయం గల దేశాలు. తలసరి GNI 12,747 డాలర్ల కంటే ఎక్కువగా ఉండే దేశాలు.

AP Inter 2nd Year Economics Study Material Chapter 1 ఆర్థికవృద్ధి – అభివృద్ధి

ప్రశ్న 7.
ద్వంద్వ ఆర్థిక వ్యవస్థ. [Mar ’17, ’16]
జవాబు:
బెంజిమిన్ హెగిన్స్ ద్వంద్వ ఆర్థిక వ్యవస్థ అనే భావనను ప్రవేశపెట్టారు. ఒకే ఆర్థిక వ్యవస్థలో రెండు రంగాలు అనగా ఆధునిక రంగం మరియు సంప్రదాయ రంగం ప్రక్క ప్రక్కనే ఉండటాన్ని ద్వంద్వ ఆర్థిక వ్యవస్థ అంటారు.

AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్

Andhra Pradesh BIEAP AP Inter 2nd Year Physics Study Material 5th Lesson స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్ Textbook Questions and Answers.

AP Inter 2nd Year Physics Study Material 5th Lesson స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్

అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
విద్యుత్ తీవ్రత శూన్యమైన బిందువు వద్ద విద్యుత్ పొటెన్షియల్ ఉంటుందా? ఒక ఉదాహరణనివ్వండి.
జవాబు:
అవును. విద్యుత్ తీవ్రత శూన్యమైన బిందువు వద్ద పొటెన్షియల్ ఉంటుంది.
ఉదా : 1) రెండు సజాతి ఆవేశాల మధ్య బిందువు వద్ద విద్యుత్ క్షేత్ర తీవ్రత శూన్యం. కాని పొటెన్షియల్ శూన్యం కాదు.
2) ఆవేశ గోళాకార వాహకం లోపల విద్యుత్ క్షేత్ర తీవ్రత శూన్యం. కాని పొటెన్షియల్ శూన్యం కాదు.

ప్రశ్న 2.
విద్యుత్ పొటెన్షియల్ శూన్యమైన బిందువు వద్ద విద్యుత్ తీవ్రత ఉంటుందా? ఒక ఉదాహరణనివ్వండి.
జవాబు:
అవును. పొటెన్షియల్ శూన్యం అయిన బిందువు విద్యుత్ క్షేత్ర తీవ్రత శూన్యం కావాల్సిన అవసరం లేదు. ఉదా : రెండు సమాన, వ్యతిరేక ఆవేశాల మధ్యబిందువు వద్ద పొటెన్షియల్ శూన్యం. కాని తీవ్రత శూన్యం కాదు.

ప్రశ్న 3.
సమశక్మ ఉపరితలాలంటే అర్థం ఏమిటి?
జవాబు:
ప్రతి బిందువు వద్ద ఒకే పొటెన్షియల్ విలువ కలిగిన తలంను సమశక్మ తలం అంటారు. బిందు ఆవేశంనకు ఏకీకృత గోళాలు సమశక్మ తలాలు అవుతాయి.

ప్రశ్న 4.
సమశక్మ ఉపరితలానికి విద్యుత్ క్షేత్రం ఎప్పుడూ ఎందుకు లంబంగా ఉంటుంది?
జవాబు:
సమశక్మ తలంపై ఒక బిందువు నుండి మరొక బిందువుకు ఆవేశంను జరుపుటలో జరిగిన పని శూన్యం. సమశక్మ తలం వెంట విద్యుత్ క్షేత్ర అంశం శూన్యం. కావున తలం, క్షేత్రరేఖలకు లంబంగా ఉండును.

ప్రశ్న 5.
lµF, 2µF, 3µF కెపాసిటెన్స్ గల మూడు కెపాసిటర్లను సమాంతరంగా సంధానం చేశారు.
(a) ఆవేశాల నిష్పత్తి ఏమిటి?
(b) పొటెన్షియల్ భేదాల నిష్పత్తి ఏమిటి?
జవాబు:
AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్ 1
కెపాసిటర్ లను సమాంతరంగా కలిపినప్పుడు
(a) q1 : q2 : q3 = C1V : C2V: C3V = 1µF : 2µF : 3µF
∴ q1 : q2 : q3 = 1 : 2 : 3
(b) V1 : V2 : V3 = V : V : V = 1 : 1 : 1

AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్

ప్రశ్న 6.
1µE, 2µF, 3µF కెపాసిటెన్స్ గల మూడు కెపాసిటర్లను శ్రేణిలో సంధానం చేశారు.
(a) ఆవేశాల నిష్పత్తి ఏమిటి?
(b) పొటెన్షియల్ భేదాల నిష్పత్తి ఏమిటి?
జవాబు:
AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్ 2
కెపాసిటర్లను శ్రేణిలో కలిపినప్పుడు
AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్ 3

ప్రశ్న 7.
సమాంతర పలకల కెపాసిటర్లో పలకల వైశాల్యాన్ని రెట్టింపు చేసినట్లైతే కెపాసిటెన్స్ ఏమవుతుంది?
జవాబు:
AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్ 4
∴ కెపాసిటి రెండు రెట్లు పెరుగును.

ప్రశ్న 8.
నిర్ణీత పీడనం వద్ద గాలి రోధక సత్వం 3 × 106.Vm-1. పలకల మధ్య గాలి ఉన్న సమాంతర పలకల కెపాసిటర్లో పలకల మధ్య ఎడం 1 cm ఉన్నప్పుడు 3 × 106V కు కెపాసిటర్ను ఆవేశం చెందించగలరా?
జవాబు:
గాలి రోధక సత్వం E0 = 3 × 106 Vm-1
రెండు పలకల మధ్య విద్యుత్ క్షేత్ర తీవ్రత E = \(\frac{E_0}{K}\) = 3 × 106 Vm-1 [∵ K = 1]
రెండు పలకల మధ్యదూరం, d = 1 cm = 10-2m
రెండు పలకల మధ్య విద్యుత్ పొటెన్షియల్ తేడా, V = Ed = 3 × 106 × 10-2
∴ V = 3 × 104 వోల్ట్లు
కావున కెపాసిటరు 3 × 106 వోల్ట్లకు ఆవేశపరచలేము.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
బిందు ఆవేశం వల్ల కలిగే విద్యుత్ పొటెన్షియల్కు సమాసాన్ని ఉత్పాదించండి. [TS. Mar. 16]
జవాబు:
ఒక బిందు ఆవేశం వల్ల విద్యుత్ పొటెన్షియలు సమాసము:
1) ఒక ప్రమాణ ధనావేశంను అనంత దూరం నుండి, ఒక బిందువు వద్దకు తీసుకురావటానికి జరిగిన పనిని బిందువు వద్ద విద్యుత్ పొటెన్షియల్ అంటారు.
AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్ 5
2) ఆవేశం + q ఉన్న బిందు ఆవేశం నుండి ” దూరం వద్ద ఒక బిందువు P ను భావిద్దాం. B వద్ద విద్యుత్ క్షేత్రం,
E = \(\frac{q}{4 \pi \varepsilon_0x^2}\)

3) B నుండి A కు ప్రమాణ ధనావేశంను తీసుకురావటంలో జరిగిన పని = dV = -E.dX (ఇక్కడ రుణాత్మక విలువ విద్యుత్ క్షేత్రం మరియు స్థానభ్రంశంలు వ్యతిరేక దిశలో ఉండుట సూచించును)

4) ∴ P వద్ద పొటెన్షియల్ = ప్రమాణ ధన ఆవేశంను అనంత దూరం నుండి P వద్దకు తీసుకురావటానికి జరిగిన పని.
AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్ 6

ప్రశ్న 2.
రెండు బిందు ఆవేశాలు గల వ్యవస్థ స్థిర విద్యుత్ స్థితిజశక్తి సమాసాన్ని ఉత్పాదించి, ఆవేశం యొక్క విద్యుత్ పొటెన్షియల్తో ఇది కలిగి ఉండే సంబంధాన్ని కనుక్కోండి.
జవాబు:
AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్ 7
రెండు బిందు ఆవేశాలు గల వ్యవస్థ స్థిర విద్యుత్ స్థితిజశక్తి సమాసము :

  1. రెండు బిందు ఆవేశాలు q1 మరియు q2 లు ‘r’ దూరంలో స్వేచ్ఛా యానకంలో’ వేరుచేయబడి ఉన్నాయని భావిద్దాం.
  2. ఆవేశం q1 చుట్టూ విద్యుత్ క్షేత్రం ఏర్పడును.
  3. ఆవేశం q2 ను బిందువు B వద్దకు తీసుకురావటానికి కొంత పని జరుగును.
    AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్ 8
  4. ఈ జరిగిన పని రెండు ఆవేశాల వ్యవస్థ స్థిరవిద్యుత్ స్థితిజ శక్తిరూపంలో నిల్వ ఉండును. దీని ప్రమాణము జౌల్.
    ∴ U = \(\frac{1}{4 \pi \varepsilon_0}\frac{q_1q_2}{r}\)
  5. రెండు సజాతి ఆవేశాలు అయిన ‘U’ ధనాత్మకం. రెండు సజాతి ఆవేశాలు ఒకదానికొకటి వికర్షించును. ఆవేశాలు దగ్గరకు తీసుకురావటానికి వ్యవస్థపై జరిగిన పని ధనాత్మకం.
  6. ఇదేవిధంగా రెండు విజాతి ఆవేశాలు అయిన, అవి ఆకర్షించుకుంటాయి. స్థితిజశక్తి రుణాత్మకము.

AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్

ప్రశ్న 3.
ఏకరీతి విద్యుత్ క్షేత్రంలో ఉంచిన విద్యుత్ ద్విధృవం స్థితిజశక్తికి సమాసాన్ని ఉత్పాదించండి.
జవాబు:
విద్యుత్ ద్విధృవంను ఏకరీతి విద్యుత్ క్షేత్రంలో ఉంచినపుడు స్థితిజశక్తికి సమాసము :
AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్ 9

  1. + q మరియు -q ఆవేశాలున్న విద్యుత్ ద్విధ్రువం పొడవు 2 గా భావిద్దాం.
  2. విద్యుత్ ద్విధ్రువంను E ఏకరీతి విద్యుత్ క్షేత్రంలో ఉంచామనుకుందాము. దాని అక్షం Eతో చేయు కోణం θ.
  3. ఆవేశాలపై బలం సమానం కాని వ్యతిరేక సంజ్ఞలను కలిగి ఉండును. అవి ద్విధ్రువంపై టార్క్ను ఏర్పరుచును.
    టార్క్ τ = ఒక బలం పరిమాణం (F) × లంబ దూరం (BC)
    F = qE మరియు sinθ = \(\frac{BC}{2a}\) = BC = 2a sinθ
    ∴ టార్క్ τ = qE × 2a sinθ = PE sin θ [∴ p = 2aq]
  4. ద్విధ్రువంను 4θ కోణం త్రిప్పితే, జరిగిన పని
    dw = τdθ = PE sinθ dθ
  5. ద్విధ్రువంను కోణం θ1 నుండి θ2 త్రిప్పితే,
    జరిగిన పని W= \(\int_{\theta_1}^{\theta_2}\)PE sinθ dθ = PE(cos θ1 – cos θ2)
  6. ఈ జరిగిన పని (W) ద్విధ్రువంలో నిల్వ ఉన్న శక్తి (U) కు సమానం.
    ∴ U = PE(cos θ1 – cos θ2)
  7. θ1 = 90°, θ2 = 0° అయితే U = – PE cos θ.
    సదిశ రూపంలో U = –\(\overrightarrow{P}.\overrightarrow{E}\) P.E

ప్రశ్న 4.
సమాంతర పలకల కెపాసిటర్ కెపాసిటెన్స్కు సమాసాన్ని ఉత్పాదించండి. [AP. Mar ’16; Mar. ’14]
జవాబు:
సమాంతర పలకల కెపాసిటర్ కెపాసిటెన్స్కు సమాసము:
1) P మరియు Q లు ఒక కెపాసిటర్లో రెండు సమాంతర పలకలు. అవి d దూరంలో వేరుచేయబడి ఉన్నాయి.
2) ప్రతి పలక వైశాల్యం A. P ఆవేశ పరచబడింది. Q భూమికి కలుపబడింది.
AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్ 10

ప్రశ్న 5.
ఒక బాహ్య క్షేత్రంలో విద్యుత్ రోధకాల ప్రవర్తనను వివరించండి.
జవాబు:
1) బాహ్యక్షేత్రంను, విద్యుత్ రోధకాల వెంట ప్రయోగిస్తే, విద్యుత్ క్షేత్ర దిశలో ధనావేశ కేంద్రాలు విస్థాపనం మరియు క్షేత్ర దిశకు వ్యతిరేక దిశలో రుణావేశ కేంద్రాలు విస్తాపనం ఉండును. బాహ్యక్షేత్ర దిశకు వ్యతిరేకంగా రోధక యానకం లోపల విద్యుత్ క్షేత్ర ప్రేరణ జరుగును. ఈ సందర్భంలో అణువులు ధ్రువణం చెందినవి అంటారు.
AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్ 11
2) పలకల మధ్య రోధకం ఉన్న కెపాసిటర్ను భావిద్దాం. రోధకం లోపల నికరక్షేత్రం స్వల్పము.

3) బాహ్యక్షేత్ర సత్వము E0 మరియు రోధకయానకం విద్యుత్ క్షేత్ర సత్వప్రేరణ Em. నికర క్షేత్రము జై.
E = (Eనికర) – E – E = ఇక్కడ K యానకం రోధక స్థిరాకం.

దీర్ఘ సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
విద్యుత్ పొటెన్షియల్ను నిర్వచించండి. విద్యుత్ ద్విధృవం వల్ల కలిగే విద్యుత్ పొటెన్షియల్కు సమాసాన్ని రాబట్టి, విద్యుత్ ద్విధృవం (a) అక్షీయ రేఖపై (b) మధ్య లంబరేఖ (equatorial line) పై విద్యుత్ పొటెన్షియల్లను కనుక్కోండి.
జవాబు:
విద్యుత్ పొటెన్షియల్ (V) :
ప్రమాణశోధన ఆవేశంను అనంతదూరం నుండి విద్యుత్ క్షేత్రంలోనికి తీసుకు రావడానికి జరిగిన పనిని విద్యుత్ పొటెన్షియల్ అంటారు.
AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్ 12

ద్విధ్రువం వల్ల ఒక బిందువు వద్ద పొటెన్షియలు సమాసము :
1) A మరియు B లు – q మరియు + q ఆవేశాలు 2a దూరంలో వేరుచేయబడి ఉన్నాయి.
2) విద్యుత్ ద్విధ్రువ భ్రామకం P = q × 2a. దీని దిశ AB వెంట ఉండును.
3) ‘P’ వద్ద విద్యుత్ పొటెన్షియల్ గణించాలి.
4) ‘O’ బిందువు నుండి ‘r’ దూరంలో P ఉంది. OP మరియు ABల మధ్య కోణము θ.
5) BN మ యు AM లు OP కు లంబాలు.
6) B వద్ద + q ఆవేశం వల్ల P వద్ద పొటెన్షియల్
AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్ 13
AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్ 14

ప్రశ్న 2.
కెపాసిటర్ శ్రేణి, సమాంతర సంయోగాలను వివరించండి. ప్రతి సంయోగంలోను తుల్య కెపాసిటెన్స్కు ఫార్ములాను రాబట్టండ్. [TS. Mar.’17: AP & TS. Mar.’15]
జవాబు:
శ్రేణి సంయోగము :
కెపాసిటర్ ను, ఒకదాని తరువాత మరొకదానిని కలిపే పద్ధతిని, శ్రేణి సంధానం అంటారు.
ఈ సంయోగంలో
1. ప్రతికెపాసిటర్పై ఆవేశం సమానం.
2. కెపాసిటర్ పొటెన్షియల్ తేడా సమానం కాదు.

AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్ 15

సమాంతర సంయోగము :
వేర్వేరు కెపాసిటర్ మొదటి పలకలను ఒక బిందువు వద్ద, రెండవ పలకలను మరొక బిందువు వద్ద కలిపే పద్ధతిని, సమాంతర సంయోగం అంటారు.
AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్ 16
ఈ సంయోగంలో
1. ప్రతి కెపాసిటర్పై పొటెన్షియల్ తేడా సమానం.
2. ప్రతి కెపాసిటర్పై ఆవేశం సమానం కాదు.
పటంలో చూపినట్లు C1, C2, C3 కెపాసిటీ ఉన్న కెపాసిటర్లను పొటెన్షియల్ తేడా ‘V’ ఉన్న బ్యాటరీకి కలిపినట్లు భావిద్దాం.
1వ కెపాసిటర్పై ఆవేశం Q1 = C1V
2వ కెపాసిటర్పై ఆవేశం Q2 = C2V

3వ కెపాసిటర్పై ఆవేశం Q3 = C3V
∴ మొత్తం ఆవేశం Q = Q1 + Q2 + Q3
= C1V + C2V + C3V
Q = V(C1, + C2 + C3)
\(\frac{Q}{V}\) = C1 + C2 + C3
C = C1 + C2 +C3][∵ c = \(\frac{Q}{V}\)]
‘n’ కెపాసిటర్లను సమాంతరంగా కలిపినపుడు, ప్రభావ కెపాసిటిని క్రింది విధంగా వ్రాయవచ్చును.
C = C1 + C2 + C3 + …. + Cn

AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్

ప్రశ్న 3.
కెపాసిటర్లో నిల్వ ఉండే శక్తికి సమాసాన్ని రాబట్టండి. పలకల మధ్య ప్రదేశాన్ని రోధకంతో నింపినప్పుడు నిల్వ ఉండే శక్తిని కింది సందర్భాల్లో కనుక్కోండి.
(a) ఆవేశం చెందించే బ్యాటరీని వేరు చేసినప్పుడు
(b) ఆవేశం చెందించే బ్యాటరీని వలయంలో ఉంచినప్పుడు
జవాబు:
కెపాసిటర్లో నిల్వ ఉండే శక్తికి సమాసము :
C కెపాసిటీ ఉన్న ఆవేశం లేని కెపాసిటర్ను భావిద్దాం. దాని తొలి పొటెన్షియల్ 0 (సున్నా). ఈ కెపాసిటర్ను V పొటెన్షియల్ తేడా ఉన్న బ్యాటరీకి కలిపితే, కెపాసిటర్పై తుది ఆవేశం ‘Q’.
∴ సరాసరి పొటెన్షియల్ తేడా VA = \(\frac{0+V}{2}=\frac{V}{2}\)
ఆవేశం Q ను జరపటంలో జరిగిన పని = W = VA × Q = \(\frac{VQ}{2}\)
ఈ జరిగిన పని కెపాసిటర్లో స్థిర విద్యుత్ స్థితిజశక్తి ‘U’ గా నిల్వ ఉండును.
∴ U = \(\frac{VQ}{2}\)
∴ కెపాసిటర్లో నిల్వ ఉన్న శక్తి, U = \(\frac{VQ}{2}=\frac{1}{2}\)CV² = \(\frac{Q^2}{2C}\) (∴ Q = CV)

నిల్వ ఉన్న శక్తిపై రోధకం ప్రభావము :
సందర్భం (a) : వలయం నుండి బ్యాటరీని తొలగించినప్పుడు :
కెపాసిటరు బ్యాటరీతో Q కు ఆవేశపరచి, వలయం నుండి తొలగించి, ‘K’ రోధక స్థిరాంకం ఉన్న రోధకాన్ని రెండు పలకల మధ్య ఖాళీలో ఉంచితే, పొటెన్షియల్ \(\frac{1}{K}\) రెట్లు తగ్గును. మరియు ఆవేశం స్థిరంగా ఉండును.
కెపాసిటీ ‘K’ రెట్లు పెరుగును.
AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్ 17
AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్ 18

సందర్భం (b) : వలయంనకు బ్యాటరీని కలిపినప్పుడు :
కెపాసిటర్కు బ్యాటరీ కలిపి Q కు ఆవేశపరిచామనుకుందాము. కెపాసిటర్ పలకల మధ్య K రోధక స్థిరాంకము ఉన్న రోధకంను ఉంచితే, పొటెన్షియల్ \(\frac{1}{K}\) రెట్లు తగ్గును. పలకలపై ఆవేశం, పొటెన్షియల్ తేడా తొలివిలువ V వచ్చేంతవరకు పెరుగును.
పలకలపై కొత్త ఆవేశం Q’ =KQ
AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్ 19
∴ కెపాసిటర్లో నిల్వ ఉన్న శక్తి ‘K’ రెట్లు పెరుగును.

లెక్కలు Problems

ప్రశ్న 1.
తొలుత చాలా అత్యధిక దూరంలో ఉన్న ‘m’ ద్రవ్యరాశి, +e ఆవేశం గల ఒక ప్రాథమిక కణాన్ని విరామంలో ఉన్న + Ze ఆవేశం గల భారయుత కణం వైపు v వేగంతో ప్రక్షిప్తం చేస్తారు. పతన కణం అత్యంత సామీప్యంగా పోగలిగే దూరంను కనుకొనుము.
సాధన:
ప్రాథమిక కణం ద్రవ్యరాశి = m; ఆవేశం = +e; వేగం = v.
చాలా ఎక్కువ ద్రవ్యరాశి గల కణం ఆవేశం = + Ze
ఆవేశ నిత్యత్వ నియమము ప్రకారము,
ప్రాథమిక కణాల గతిజ శక్తి = సమీప దూరం (d) వద్ద ప్రాథమిక కణం స్థిర విద్యుత్ స్థితిజ శక్తి
AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్ 20

ప్రశ్న 2.
హైడ్రోజన్ పరమాణువులో ఎలక్ట్రాను, ప్రొటాన్ 0.5 A దూరంలో కలవు. వ్యవస్థ ద్విధృవ భ్రామకంను కనుగొనుము.
సాధన:
హైడ్రోజన్ పరమాణువులో ఎలక్ట్రాన్ ఆవేశం, qe = -1.6 × 10-19C
AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్ 21
హైడ్రోజన్ పరమాణువులో ప్రోటాన్ ఆవేశం, qp = +1.6 × 10-19C
ప్రోటాను మరియు ఎలక్ట్రాన్ల మధ్య దూరము,
2a = 0.5Å = 0.5 × 10-10m
వ్యవస్థ ద్విధృవ భ్రామకం
P = 2a × qp = 0.5 × 10-10 × 1.6 × 10-19
∴ P = 8 × 10-30 cm

AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్

ప్రశ్న 3.
XOY తలంలో ఒక ఏకరీతి విద్యుత్ క్షేత్రంగా (\(40\hat{i}+30\hat{j}\)) Vm-1ని సూచించడమైంది. మూలబిందువు వద్ద విద్యుత్ పొటెన్షియల్ 200 V అయితే, (2m, 1m) నిరూపకాలు గల బిందువు వద్ద విద్యుత్ పొటెన్షియల్ను ఉరి కనుక్కోండి.
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్ 22

ప్రశ్న 4.
ఒక సమబాహు త్రిభుజం అంచు (పక్క) పొడవు L. దాని కేంద్ర బిందువు వద్ద +q ఆవేశం ఉంచారు. త్రిభుజం పరిధిపై P ఒక బిందువు. బిందువు Pకి సాధ్యమయ్యే కనిష్ఠ, గరిష్ట విద్యుత్ పొటెన్షియల్ నిష్పత్తి.
సాధన:
సమబాహు త్రిభుజ కేంద్రబిందువు వద్ద ఆవేశం =+q
AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్ 23

ప్రశ్న 5.
ABC అనేది 2 m అంచు గల ఒక సమబాహు త్రిభుజం. త్రిభుజ తలంలో 100 V/m తీవ్రత గల ఏకరీతి విద్యుత్ క్షేత్రం BCకి సమాంతరంగా కలదు. ఒకవేళ విద్యుత్ పొటెన్షియల్ A వద్ద 200 V అయితే, B, C ల వద్ద విద్యుత్ పొటెన్షియల్లు’ వరుసగా ఎంత?
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్ 24
సమబాహు త్రిభుజ భుజము పొడవు, a = 2m
E = 100V/m; VA = 200V
B మరియు C ల మధ్య బిందువు అనుకొందాము.
D వద్ద పొటెన్షియల్ = VD = 200V
పటం నుండి, VB – VD = Ed
⇒ VB – 200 = 100 × 1
∴ B వద్ద పొటెన్షియల్, VB = 200 + 100 = 300 V
మరియు VD – VC Ed
∴ C వద్ద పొటెన్షియల్ VC = 200 – 100 = 100 V

ప్రశ్న 6.
ద్విధృవ భ్రామకం P కలిగిన ఒక విద్యుత్ ద్విధృవాన్ని ఏకరీతి విద్యుత్ క్షేత్రం E లో P, Eకి సమాంతరంగా ఉండేట్లు ఉంచారు. తరువాత దాన్ని q కోణంతో భ్రమణం చెందిస్తే, జరిగిన పనిని కనుక్కోండి?
సాధన:
విద్యుత్ ద్విధృవం AB, – q మరియు + q ఆవేశాలు కలిగి ఉందని భావిద్దాం.
AB ద్విధృవ భ్రామకం = P
విద్యుత్ క్షేత్రం = E
AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్ 25

ప్రశ్న 7.
మూడు సర్వసమానమైన లోహ పలకలు, ఒక్కొక్కటి ‘A’ వైశాల్యం గలవి, ఒకదానికొకటి పటంలో చూపినట్లుగా సమాంతరంగా అమర్చారు. ‘V వోల్టుల బ్యాటరీని పటంలో చూపినట్లుగా కలిపారు. పలకల వ్యవస్థలో నిల్వ ఉండే శక్తిని కనుక్కోండి.
AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్ 26
సాధన:
ప్రతి పలక వైశాల్యం = A
రెండు పలకల మధ్యదూరం = d
సమాంతర పలకల కెపాసిటర్ కెపాసిటి C = \(\frac{\varepsilon_0A}{d}\)
పటంలో చూపినట్లు రెండు కెపాసిటర్లు సమాంతరంగా కలుపబడినవి.
రెండు కెపాసిటర్లు సమాంతరంగా కలిపినప్పుడు, ఫలిత కెపాసిటి, Cp = 2C = \(\frac{2\varepsilon_0A}{d}\)
AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్ 27

ప్రశ్న 8.
ప్రతి పలక వైశాల్యం A ఉండే నాలుగు సర్వసమానమైన లోహపు పలకలు పరస్పరం d దూరంలో వేరుచేసి పటంలో చూపినట్లు సంధానం చేయబడ్డాయి. A, B కొనల మధ్య వ్యవస్థ కెపాసిటిని కనుక్కోండి.
AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్ 28
సాధన:
కెపాసిటర్ ప్రతిపలక వైశాల్యం =A
కెపాసిటర్ రెండు పలకల మధ్యదూరం = d
ప్రతి సమాంతర పలకల కెపాసిటర్ కెపాసిటి, C = \(\frac{\varepsilon_0A}{d}\)
AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్ 29

ప్రశ్న 9.
పటంలో చూపిన వలయంలోని బ్యాటరీ V వోల్టులు కలిగి అంతర్నిరోధం లేకుండా ఉంది. మూడు కెపాసిటర్లు సమాన కెపాసిటి కలిగి ఉన్నాయి. ఏ కెపాసిటర్ అధిక ఆవేశం కలిగి ఉంటుందో కనుక్కోండి.
AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్ 30
సాధన:
ఇచ్చిన వలయం యొక్క తుల్య వలయం పటంలో చూపబడింది.
AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్ 31
శ్రేణి సంధానంలో ప్రతి కెపాసిటర్ గుండా ఆవేశం q ప్రవహిస్తుంది.
అప్పుడు q1 = q = C1 V1; q2 = q = C2V2; q3 = C3V3
∴ = q1 = q2 = q3
కావున మూడు కెపాసిటర్లు C1, C2 మరియు C3 లలో ఒకే ఆవేశం ప్రవహించును.

AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్

ప్రశ్న 10.
A, B అనే C, 2C కెపాసిటెన్స్ గల కెపాసిటర్లను సమాంతరంగా సంధానం చేసి సంయోగాన్ని V వోల్టుల బ్యాటరీకి
సంధానం చేశారు. ఆవేశం చెందించడం పూర్తవగానే, బ్యాటరీని తొలగించి K = 2 గల రోధక దిమ్మెను A పలకల మధ్య ప్రదేశం పూర్తిగా నిండేట్లుగా ప్రవేశపెట్టారు. ఆవేశాలను పంచుకొనేటప్పుడు వ్యవస్థ కోల్పోయే శక్తిని కనుక్కోండి.
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్ 32
i) సమాంతర సంయోగంతో బ్యాటరీ (ఘటం) కలిపినప్పుడు
C1 = C; C2 = 2C; V = V
Cp = C1 + C2 = 3C; q = 3CV
నిల్వ ఉన్న తొలిశక్తి
Ui = \(\frac{1}{2}\) Cp V² = \(\frac{3}{2}\) CV²
AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్ 33

ప్రశ్న 11.
నియమిత కెపాసిటి గల కెపాసిటర్ను V పొటెన్షియలు ఆవేశితం చేసినప్పుడు అది కొంత శక్తిని నిల్వ ఉంచుకుంది. దీనికి రెట్టింపు కెపాసిటి గల కెపాసిటర్ మొదటిదాని శక్తిలో సగం శక్తిని నిల్వ చేసుకోవాలంటే ఎంత పొటెన్షియలు ఆవేశిం చేయాలి?
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్ 34

అభ్యాసాలు Textual Exercises

ప్రశ్న 1.
5 × 10-8 C, – 3 × 10-8 C అనే రెండు విద్యుదావేశాలు 16 cm దూరంలో కలవు. వాటిని కలిపే రేఖపై ఏ బిందువు (ల) వద్ద పొటెన్షియల్ సున్నా అవుతుంది ? అనంతం వద్ద పొటెన్షియల్ను సున్నాగా తీసుకోండి.
సాధన:
q1 = 5 × 10-8C, q2 = -3 × 10-8C
ఆవేశం q1 = 5 × 10-8 C నుండి X దూరం వద్ద పొటెన్షియల్ శూన్యం.
∴ r1 = x × 10-2m
r2 = (16 – x) × 10-2 m
AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్ 35

ప్రశ్న 2.
భుజం పొడవు 10 cm గల ఒక క్రమ షడ్భుజి 5 µC ఆవేశం కలదు. అయితే ఆ షడ్భుజి మధ్యబిందువు వద్ద పొటెన్షియల్ను కనుక్కోండి.
సాధన:
భుజం 10cm గల ABCDEFA అష్టభుజి (hexagon) కేంద్రం పటం నుండి స్పష్టంగా OAB, OBC లు సమబాహు త్రిభుజాలు.
∴ OA = OB = OC = OD = OE = OF = r = 10 cm = 10-1m
పొటెన్షియల్ అదిశరాశి.
AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్ 36

ప్రశ్న 3.
A, B అనే రెండు బిందువుల వద్ద 2 uC, -2 uC ఆవేశాలను 6 cm దూరంలో ఉంచారు.
a) వ్యవస్థ సమ పొటెన్షియల్ ఉపరితలాన్ని గుర్తించండి.
b) ఈ ఉపరితలంపై ప్రతీ బిందువు వద్ద విద్యుత్ క్షేత్రం దిశ ఏమిటి ?
సాధన:
a) AB లంబంగా మరియు దాని మధ్య బిందువు గుండాపోవు తలంపై బిందువు వద్దనైన, శూన్య పొటెన్షియల్ ఉండును.

b) తలమునకు లంబంగా AB దిశలో ఉండును.

ప్రశ్న 4.
12cm వ్యాసార్థం గల ఒక గోళాకార వాహక ఉపరితలంపై 1.6 × 10-7C ఆవేశం ఏకరీతిగా వితరణ చెంది ఉంది. అయితే క్రింది సందర్భాల్లో విద్యుత్ క్షేత్రం ఏమిటి?
a) గోళ అంతర్భాగంలో
b) గోళానికి కాస్తంత వెలుపల
c) గోళం కేంద్రం నుంచి 18 cm దూరంలో గల బిందువు వద్ద
సాధన:
r = 12 cm = 12 × 10-2m, q = 1.6 × 10-7C.
a) గోళం లోపల, E = 0

b) గోళమునకు కొద్దిగా వెలుపల (గోళం తలంపై తీసుకుందాము)
AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్ 37

AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్

ప్రశ్న 5.
పలకల మధ్య గాలి ఉన్న ఒక సమాంతర పలకల కెపాసిటర్ కెపాసిటి 8 pF (1pF = 10-12F). అయితే, పలకల మధ్యమాన్ని సగానికి తగ్గించి, వాటి మధ్యగల ప్రదేశాన్ని రోధక స్థిరాంకం 6 గల ఒక పదార్ధంతో నింపినట్లైతే కెపాసిటెన్స్ ఎంతవుతుంది?
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్ 38

ప్రశ్న 6.
9 pF కెపాసిటెన్స్ గల 3 కెపాసిటర్లను శ్రేణీ సంధానం చేశారు.
a) ఈ సంయోగం మొత్తం కెపాసిటెన్స్ ఎంత?
b) ఈ సంయోగాన్ని 120 V బ్యాటరీకు కలిపినప్పుడు ప్రతీ కెపాసిటర్ కొనల మధ్య పొటెన్షియల్ భేదం ఎంత?
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్ 39

ప్రశ్న 7.
2 pE, 3 pE, 4 pF ల కెపాసిటెన్స్ గల 3 కెపాసిటర్లను సమాంతర సంధానం చేశారు.
a) ఈ సంయోగం మొత్తం కెపాసిటెన్స్ ఎంత?
b) ఈ సంయోగాన్ని 100 V బ్యాటరీకి కలిపినప్పుడు ప్రతీ కెపాసిటర్పై ఉండే ఆవేశాన్ని కనుక్కోండి.
సాధన:
a) Cp = 2 + 3 + 4 = 9 pF
b) ప్రతి కెపాసిటర్కు V = 100 Volt
q1 = C1 V = 2 × 100 = 200 pC
q2 = C2 V = 3 × 100 = 300 pC
q3 = C3 V = 4 × 100 = 400 pC

ప్రశ్న 8.
పలకల మధ్య గాలి ఉన్నటువంటి ఒక సమాంతర పలకల కెపాసిటర్లో ప్రతీ పలక వైశాల్యం 6 × 10-3 m². వాటి మధ్యదూరం 3 mm అయితే, ఆ కెపాసిటర్ కెపాసిటెన్స్ను కనుక్కోండి. ఈ కెపాసిటర్ను 100 Vబ్యాటరీకి కలిపినట్లయితే, కెపాసిటర్ ప్రతీ పలకపై ఆవేశం ఎంత?
సాధన:
A = 6 × 10-3 m², d = 3mm = 3 × 10-3m, C = ? V = 100 V, q = ?
AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్ 40

ప్రశ్న 9.
పైన అభ్యాసంలోని కెపాసిటర్ పలకల మధ్య 3 mm మందం కలిగిన మైకా (రోధక స్థిరాంకం = 6) ని ప్రవేశ . పెట్టినట్లయితే
a) కెపాసిటర్కు సంధానం చేసిన వోల్టేజి సరఫరాను అలాగే ఉంచినప్పుడు
b) సరఫరాను తొలగించిన తరువాత ఏమి జరుగుతుంది?
సాధన:
a) కెపాసిటి C కు పెరుగును i.e., C = KC0 = 6 × 1.77 × 10-11F
ఆవేశం q¹ కు పెరుగును. i.e., q¹ = C¹V = 6 × 1.77 × 10-11 × 10²C.

b) జనకంను తొలగించినపుడు, కొత్త కెపాసిటి C = KC0 = 6 × 1.77 × 10-11F
AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్ 41

ప్రశ్న 10.
12pF గల ఒక కెపాసిటర్ను 50V బాటరీకి సంధానం చేశారు. అయితే కెపాసిటర్లో ఎంత స్థిర విద్యుత్ శక్తి నిలువ అవుతుంది?
సాధన:
C = 12pF = 12 × 10-12E,
V = 50Volt, E = ?
E = \(\frac{1}{2}\)CV² = \(\frac{1}{2}\)(12 × 10-12)(50)²
= 1.5 × 10-8J.

ప్రశ్న 11.
200V బ్యాటరీతో 600pF కెపాసిటర్ను ఆవేశపరచారు. తరువాత దీనిని బ్యాటరీ నుంచి తొలగించి, 600 pF గల .మరొక ఆవేశరహిత కెపాసిటర్కు సంధానం చేశారు. ఈ ప్రక్రియలో ఎంతమేర స్థిర విద్యుత్ శక్తి నష్టపోతుంది?
సాధన:
C1 = C2 = 600 pF = 600 × 10-12
F = 6 × 10-10F,
V1 = 200 V, V2 = 0
AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్ 42

అదనపు అభ్యాసాలు Additional Exercises

ప్రశ్న 12.
8 mC ఆవేశం మూలబిందువు వద్ద కలదు. అయితే, P(0, 0, 3 cm) బిందువు నుంచి R(0, 6 cm, 9 cm) బిందువు మీదుగా Q(0, 4 cm, 0) బిందువుకు చిన్న ఆవేశం -2 × 10-3 C ని తీసుకొనిరావడానికి జరిగిన పనిని లెక్కించండి.
సాధన:
పటంలో చూపినట్లు మూలబిందువు వద్ద ఆవేశం q = 8mc = 8 × 10-3C
P నుండి R మీదుగా Q కు, తీసుకెళ్తున్న ఆవేశం 4% = -2 × 10-9C
OP = rp = 3 cm = 3 × 10-2 m మరియు
OQ = rQ = 4 cm = 4 × 10-2 m
స్థిరవిద్యుత్ బలాలు, నిత్యత్వ బలాలు, జరిగిన పని పదంపై ఆధారపడదు. కావున బిందువు తో సంబంధం ఉండదు.
AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్ 43

ప్రశ్న 13.
భుజం పొడవు b గల ఒక ఘనం ప్రతి శీర్షం వద్ద q ఆవేశాన్ని ఉంచారు. ఈ ఆవేశ అమరిక వల్ల ఘనం మధ్యబిందువు వద్ద పోటెన్షియల్, విద్యుత్ క్షేత్రాన్ని కనుక్కోండి.
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్ 44
ఘనం ఎనిమిది శీర్షాల వద్ద q ఆవేశం ఉన్న ఎనిమిది ఆవేశాల వల్ల కేంద్రం వద్ద పొటెన్షియల్,
AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్ 45
కేంద్రం వద్ద ఎనిమిది ఆవేశాల వల్ల విద్యుత్ క్షేత్రం శూన్యం.

AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్

ప్రశ్న 14.
రెండు చిన్న లోహపు గోళాలపై 1.5µC, 2.5µC ఆవేశాలు కలవు. అవి ఒకదానికొకటి 30 cm దూరంలో కలవు. అయితే,
a) రెండు ఆవేశాలను కలిపే రేఖ మధ్యబిందువు వద్ద
b) ఈ మధ్యబిందువు నుంచి 10cm దూరంలో, మధ్యబిందువు నుంచి పోతూ రేఖకు లంబంగా గల తలంలో పొటెన్షియల్, విద్యుత్ క్షేత్రాన్ని కనుక్కోండి.
సాధన:
q1 = 1.5μC = 1.5 × 10-6 C,
AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్ 46
AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్ 47
AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్ 48

ప్రశ్న 15.
అంతర వ్యాసార్థం r,, బాహ్య వ్యాసార్థం 1, గల గోళాకార వాహక కర్పరం Q ఆవేశాన్ని కలిగి ఉంది.
a) కర్పరం కేంద్రం వద్ద ఆ ఆవేశాన్ని ఉంచారు. కర్పరం లోపలి తలం, బాహ్య తలంపైన ఉపరితల ఆవేశ సాంద్రత ఎంత?
సాధన:
కర్పరము బయట తలంపై + Q ఆవేశం ఉండును. q ఆవేశంను కర్పరము కేంద్రము వద్ద ఉంచితే, కర్పరం లోపలి తలంపై -q ఆవేశంను వెలుపల తలంపై +q ఆవేశంను ప్రేరణ చేయును.
∴ కర్పరం లోపల తలంపై మొత్తం ఆవేశం -q మరియు వెలపలి తలంపై మొత్తం ఆవేశం (Q + q).
AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్ 49

b) కర్పరం గోళాకారంగా లేనప్పటికీ, ఏదైనా అక్రమాకార ఆకారాన్ని కలిగి ఉన్నప్పటికీ కోటరం అంతర్భాగంలో విద్యుత్ క్షేత్రం (ఎటువంటి ఆవేశాలు లేనప్పుడు) సున్నా అవుతుందా?
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్ 50
కర్పరం ఏ అక్రమ ఆకారంలో ఉన్న కోటరంలో ఆవేశం లేదు. కావున విద్యుత్ క్షేత్రం శూన్యం. కోటరం లోపల క్షేత్రరేఖ వెంట సంవృత లూప్ భాగంను మిగిలినది వెలుపల తీసుకుంటే, అప్పుడు సంవృత లూప్ వెంట శోధన ఆవేశం క్షేత్రం వెంట చేసిన పని శూన్యం. కావున ఆవేశంలేని కోటరం లోపల విద్యుత్ క్షేత్రం ఎల్లప్పుడు శూన్యం.

ప్రశ్న 16.
a)స్థిర విద్యుత్ క్షేత్ర లంబాంశం ఆవేశిత ఉపరితలం ఒకవైపు నుంచి వేరొకవైపుకు విచ్ఛిన్నంగా ఉంటుందని నిరూపించండి.
ఆ లంబాంశం (E2 – E1). \(\hat{\mathrm{n}}=\frac{\sigma}{\varepsilon_0}\) అని చూపండి.
ఇక్కడ \(\hat{n}\) ఒక బిందువు వద్ద తలానికి లంబంగా ఉండే ఏకాంక సదిశ, రా ఆ బిందువు వద్ద ఉపరితల ఆవేశ సాంద్రత ( \(\hat{n}\) దిశ 1 వైపు నుంచి 2 వైపుకు ఉంటుంది. దాన్ని బట్టి వాహకానికి కాస్తంత బయట విద్యుత్ క్షేత్రం σ \(\hat{n}\)/ε0 అని చూపండి.
b) స్థిర విద్యుత్ క్షేత్ర స్పర్శరేఖీయ అంశం (tangential component) ఆవేశిత ఉపరితలం ఒకవైపు నుంచి మరోవైపుకు అవిచ్ఛిన్నంగా ఉంటుందని నిరూపించండి.
(Hint : (a) కోసం గాస్ నియమాన్ని ఉపయోగించండి, (b) సంవృత లూప్పై స్థిర విద్యుత్ క్షేత్రం చేసిన పని శూన్యం అనే వాస్తవాన్ని ఉపయోగించండి.)
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్ 51
b) సంవృత లూప్లో స్థిరవిద్యుత్ క్షేత్రం చేయుపని శూన్యం. కావున. ఒకవైపు ఆవేశతలం నుండి మరియొక వైపు స్థిర విద్యుత్ క్షేత్రక అంశ స్పర్శరేఖ అవిచ్ఛిన్నం.

ప్రశ్న 17.
λ రేఖీయ ఆవేశ సాంద్రత కలిగిన పొడవైన ఆవేశిత స్తూపం వేరొక సహాక్ష బోలు వాహక స్తూపంతో ఆవృతం అయింది. ఈ రెండు స్తూపాల మధ్య ప్రదేశంలో విద్యుత్ క్షేత్రం ఎంత?
సాధన:
l పొడవు, a వ్యాసార్థం, λ రేఖీయ ఆవేశ సాంద్రత ఉన్న A అనే ఒక పొడవాటి స్థూపం l పొడవు, b వ్యాసార్థం ఉన్న చోట సహాక్ష స్థూపంలో అమృతం అయిందని భావిద్దాం.

A వెలుపలి తలంపై ఆవేశం q = λl ఏకరీతిగా విస్తరించి ఉన్నది. స్థూపం B పై – q ఆవేశంను ప్రేరణ చేస్తుంది. రెండు స్తూపాల మధ్య విద్యుత్ క్షేత్రం E ఏర్పడి, వెలుపలివైపుకు పనిచేయును. వ్యాసార్ధము గల సహాక్ష స్థూపాకార గాసియన్ తలంను భావిద్దాం. స్థూపాకార తలం ద్వారా విద్యుత్ అభివాహం.
AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్ 52
AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్ 53

ప్రశ్న 18.
ఒక హైడ్రోజన్ పరమాణువులో ఎలక్ట్రాన్, ప్రోటాన్లు సుమారుగా 0.53 శ్రీ దూరంలో బద్ధమై ఉన్నాయి :
a) ప్రోటాన్ నుంచి ఎలక్ట్రాన్ అనంత దూరంలో ఉన్నప్పుడు స్థితిజశక్తి సున్నాగా తీసుకొని, ఆ వ్యవస్థ స్థితిజశక్తిని eVలలో అంచనా వేయండి.
b) (a) లో పొందిన స్థితిజశక్తి పరిమాణంలో సగం, దాని కక్ష్యలో గల గతిజశక్తికి సమానం అయితే, ఎలక్ట్రాన్న స్వేచ్ఛగా చేయడానికి అవసరమైన కనిష్ఠ పని ఎంత?
c) ఎలక్ట్రాన్, ప్రోటాన్ల మధ్యదూరం 1.06 A ఉన్నప్పుడు స్థితిజశక్తిని సున్నాగా తీసుకుంటే పై లెక్కలో (a), (b) లకు సమాధానాలు ఏమిటి?
సాధన:
a) q1 = −1.6 × 10-19C;
q2 + 1.6 × 10-19C.
r = 0.53 A° = 0.53 × 10-19m
స్థితిజశక్తి = అనంతదూరం వద్ద P.E – r వద్ద P.E
AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్ 54

r1 = 1.06Å వద్ద శూన్య పొటెన్షియల్ తీసుకుంటే, వ్యవస్థ స్థితిజశక్తి
= r1 వద్ద P.E – r వద్ద P.E = 13.58 – 27.16 = – 13.58eV.
శూన్య స్థితిజశక్తిని విస్థాపనం చెందిస్తే, ఎలక్ట్రాన్ న్ను స్వేచ్ఛగా ఉంచుటకు కావాల్సిన పనిపై ఎటువంటి ప్రభావం ఉండదు. పని అదేవిధంగా, + 13.58 eVకు సమానంగా ఉండును.

AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్

ప్రశ్న 19.
ఒక H2 అణువులోని రెండు ఎలక్ట్రానులలో ఒక ఎలక్ట్రాన్ ను తీసివేస్తే హైడ్రోజన్ అణు అయాన్ H+2 వస్తుంది. H+2 అయాన్ భూస్థాయిలో రెండు ప్రోటాన్లు సుమారుగా 1.5 Å దూరంలో వేరయి ఉంటాయి. ప్రతీ ప్రోటాన్ నుంచి ఎలక్ట్రాన్ సుమారుగా 1 Å దూరంలో ఉంటుంది. వ్యవస్థ స్థితిజశక్తిని నిర్ణయించండి. శూన్య స్థితిజశక్తి ఎంపికను నిర్ధేశించండి.
సాధన:
q1 = ఎలక్ట్రాన్పై ఆవేశం (= -1.6 × 10-19C)
q2, q3 = రెండు ప్రోటాన్స్ ఆవేశాలు, ఒక్కొక్కటి = 1.6 × 10-19 C
r12 = q1 మరియు q2ల మధ్యదూరం = 1Å = 10-10m
r23 = q2 మరియు q3ల మధ్యదూరం = 1.5Å = 1.5 × 10-10m
r31 = q3 మరియు q1ల మధ్యదూరం = 1Å = 10-10m.
అనంతదూరం వద్ద శూన్య స్థితిజశక్తి తీసుకుంటే,
AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్ 55

ప్రశ్న 20.
a, b వ్యాసార్థం గల రెండు ఆవేశపూరిత వాహక గోళాలను ఒకదానికొకటి తీగతో కలిపారు. రెండు గోళాల ఉపరితలాల మీద విద్యుత్ క్షేత్రాల నిష్పత్తి ఎంత ? ఈ ఫలితాన్ని ఉపయోగించి, ఆవేశ సాంద్రత పదునైన (వాడిగా ఉన్న), మొనతేలిన వాహకపు చివరలపై వాహకపు చదునైన భాగాలపై కంటే ఎందుకు అధికంగా ఉంటుందో వివరించండి.
సాధన:
ఎక్కువ పొటెన్షియల్ గోళం నుండి తక్కువ పొటెన్షియల్ గోళం వైపు, వాని పొటెన్షియలు సమానం అయ్యేవరకు ఆవేశం ప్రవహిస్తుంది. పంచుకున్న తరువాత, రెండు గోళాలపై ఆవేశాల నిష్పత్తి
AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్ 56

ఆవేశ సాంద్రత పదునైన మొనతేలిన వాహక చివర చాలా తక్కువ వ్యాసార్థమున్న గోళం, మరియు చదునైన భాగం చాలా ఎక్కువ వ్యాసార్ధమున్న భాగం. కావున ఆవేశ సాంద్రత చదునైన భాగాలపై కంటే మొనతేలిన వాహకపు చివరలపై అధికంగా ఉంటుంది.

ప్రశ్న 21.
(0, 0, -a) (0, 0, a) బిందువుల వద్ద వరుసగా రెండు ఆవేశాలు -q, +q లు కలవు.
(a) (0, 0, z), (x, y, 0) బిందువుల వద్ద స్థిర విద్యుత్ పొటెన్షియల్ విలువ ఎంత?
(b) r/a>> 1 అయినప్పుడు మూలబిందువు నుంచి దూరం వద్ద ఉన్న బిందువు పొటెన్షియల్ మీద ఆధారపడి ఉంటుందని చూపండి.
(c) x-అక్షం దిశలో (5, 0, 0) బిందువు నుంచి (-7,0,0) బిందువుకు చిన్న శోధన ఆవేశాన్ని జరపడానికి ఎంత పని చేయాలి ? అవే బిందువుల మధ్య శోధన ఆవేశం పథం X అక్షం దిశలో లేకుంటే సమాధానం మారుతుందా?
సాధన:
(0, 0, -a) వద్ద -q మరియు (0, 0, a) వద్ద + q
i) (0,0, z) వద్ద పొటెన్షియల్
AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్ 57
ఆవేశాలున్న Z-అక్షానికి లంబంగా (x, y, 0) బిందువు వద్ద పొటెన్షియల్ శూన్యం.
AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్ 58

స్థిరవిద్యుత్ క్షేత్రం చేయుపని, రెండు బిందువులను కలుపు పథంపై ఆధారపడదు. కావున ఏ పదం వెంట అయిన జరిగిన పని అవిచ్ఛిన్నంగా శూన్యం.

ప్రశ్న 22.
పటం ఆవేశాల అమరికను చూపుతుంది. దీనిని విద్యుత్ క్వాడ్రపోల్ అంటారు. క్వాడ్రపోల్ అక్షంపై ఒక బిందువుకు, r/a >> 1 అయినప్పుడు, పొటెన్షియల్ పై ఆధారితం కావడాన్ని పొందండి. ఈ ఫలితాలను విద్యుత్ డైపోల్, విద్యుత్ ఏకధృవం (monopole) (అంటే, ఒంటరి ఆవేశం) ఫలితాలతో పోల్చండి.
AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్ 59
సాధన:
A, B, C ల వద్ద + q, – 2q మరియు + q ల వద్ద మూడు ఆవేశాల వ్యవస్థతో విద్యుత్ క్వాడ్రపోల్ ఏర్పడుతుంది.
AC = 2a, BP = r, అధ్యారోపణ సూత్రంను ఉపయోగించి ఏదైనా బిందువు P వద్ద పొటెన్షియల్.
AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్ 60
AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్ 61
విద్యుత్ ద్విధ్రువం సందర్భంలో, V ∝ \(\frac{1}{r^2}\) మరియు ఒక ఆవేశం ఉన్న సందర్భంలో, V ∝ \(\frac{1}{r}\).

ప్రశ్న 23.
ఒక విద్యుత్ సాంకేతిక నిపుణుడికి ఒక వలయంలో IkV పొటెన్షియల్ తేడాకు సమాంతరంగా 2 µF కెపాసిటర్ను కలపవలసి ఉంది. అయితే అతనికి 1µF కెపాసిటర్లు అనేక సంఖ్యలో అందుబాటులో కలవు. అవన్నీ కూడా 400 V కంటే అధికంగా తట్టుకోలేవు. కావలసిన 1kV పొటెన్షియల్ తేడాకు 2µF కెపాసిటెన్స్ పొందడానికి వీలయినంత తక్కువ సంఖ్యలో కెపాసిటర్లు అవసరమయ్యే అమరికను సూచించండి.
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్ 62
మొత్తం కెపాసిటన్స్, C = 2µF
పొటెన్షియల్ భేదం, V = 1KV = 1000 Volt
ప్రతి కెపాసిటర్ కెపాసిటీ, C, = 1µF
ప్రతి కెపాసిటర్ వెంట గరిష్ఠ పొటెన్షియల్ భేదము, V = 400 Volt
ఒక్కొక్కటి 1µF ఉన్న n కెపాసిటర్స్ శ్రేణి వరుసలో మరియు m వరుసలు సమాంతరంగా పటంలో చూపినట్లు కలుపబడినవి.
ప్రతి వరుస వెంట పొటెన్షియల్ భేదం = 1000 Volt
∴ ప్రతి కెపాసిటర్ వెంట పొటెన్షియల్ భేదం = \(\frac{1000}{n}\) = 400
∴ n = \(\frac{1000}{400}\) = 2.5
n విలువ 2.5 కు తక్కువ కాకూడదు. ∴ n = 3
1µF కెపాసిటి గల మూడు కెపాసిటర్ ను శ్రేణిలో కల్పితే, ప్రతి వరుస కెపాసిటి = 1/3
సమాంతరంగా అటువంటి m వరుసల మొత్తం కెపాసిట = \(\frac{m}{3}\)
∴ \(\frac{m}{3}\) = 2µF లేక m = 6μF
∴ మొత్తం కెపాసిటర్ల సంఖ్య = n × m = 3 × 6 = 18.
కావున 1μF కెపాసిటర్లను ఆరు సమాంతర వరుసలు కలపాలి. ప్రతి వరుస మూడు కెపాసిటర్లను శ్రేణిలో కలిగి ఉండాలి.

AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్

ప్రశ్న 24.
2Fకెపాసిటీ కలిగిన ఒక సమాంతర పలకల కెపాసిటర్ పలకల వైశాల్యం ఎంత? రెండు పలకల మధ్యదూరం 0.5cm అని ఇచ్చారు. మీ సమాధానం నుంచి ఎందుకు సాధారణ కెపాసిటర్ల వ్యాప్తి µF వ్యాప్తిలో లేదా అంతకంటే తక్కువగా ఉంటుందనే వాస్తవాన్ని గ్రహిస్తారు. అయినప్పటికీ, విద్యుత్ విశ్లేషక కెపాసిటర్లలో వాహకాల మధ్య ఎడం చాలా స్వల్పంగా ఉండటం వల్ల వాటి కెపాసిటెన్స్ చాలా అధికంగా (0.1 F) ఉంటుంది.
సాధన:
C = 2F, d = 0.5 cm = 5 × 10-3m, A = ?
AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్ 63
ఇది చాలా పెద్ద విలువ.

సాధారణ కెపాసిటర్స్ వ్యాప్తి µF లేక తక్కువ. విద్యుత్ విశ్లేష్య కెపాసిటర్ లో, డి చాలా తక్కువ. వాని కెపాసిటన్స్ (=0.1 F) చాలా ఎక్కువ.

ప్రశ్న 25.
పటంలో చూపిన జాలం తుల్య కెపాసిటెన్స్ను పొందండి. 300 V సరఫరాకు, ప్రతీ కెపాసిటర్ కొనల మధ్య ఆవేశం, వోల్టేజిని నిర్ణయించండి.
సాధన:
C2 మరియు C3 లు శ్రేణిలో ఉన్నాయి.
AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్ 64
(i) నుండి Vp – 300 – V4 = 300 – 200 = 100 V
C1 వెంట పొటెన్షియల్ భేదం V1 = Vp = 100 V
C1 పై ఆవేశం, q1 = C1V1 = 100 × 10-12 × 100 = 10-8C.
శ్రేణిలో C2 మరియు C3 వెంట పొటెన్షియల్ భేదము = 100 V
C2 పై ఆవేశం, q2 = C2V2 = 200 × 10-12 × 50 = 10-8C
C3 పై ఆవేశం, q3 = C3V3 = 200 × 10-12 × 50 = 10-8C

ప్రశ్న 26.
ఒక సమాంతర పలకల కెపాసిటర్ ప్రతి పలక వైశాల్యం 90 cm² మరియు ఆ రెండు పలకల మధ్యదూరం 2.5 mm. ఆ కెపాసిటర్ను 400 V సరఫరాకు సంధానం చేసి ఆవేశపరిచారు.
(a) కెపాసిటర్లో నిల్వ అయిన స్థిర విద్యుత్ శక్తి ఎంత?
(b) ఈ శక్తిని పలకల మధ్యస్థిర విద్యుత్ క్షేత్రంలో నిల్వ ఉన్నదిగా పరిగణించి, ఏకాంక ఘనపరిమాణానికి గల శక్తి u ని పొందండి. దీనినుంచి, u కి, పలకల మధ్య విద్యుత్ క్షేత్రం E పరిమాణానికి మధ్య సంబంధాన్ని తీసుకురండి.
సాధన:
a) A = 90 cm² 90 × 10-4m² = 9 × 10-3
d = 2.5 mm = 2.5 × 10-3m
V = 400 Volt, E¹ = ?
AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్ 65

ప్రశ్న 27.
4 µF కెపాసిటర్ను 200ల సరఫరాకు కలిపి ఆవేశపరిచారు. దానిని బ్యాటరీ నుంచి తొలగించి, మరొక 2 µF ఆవేశరహిత కెపాసిటర్కు కలిపారు. అయితే మొదటి కెపాసిటర్ నుంచి ఉష్ణం, విద్యుదయస్కాంత వికిరణ రూపంలో నష్టపోయిన స్థిర విద్యుత్ శక్తి ఎంత?
సాధన:
C1 = 4 µF = 4 × 10 F, V1 = 200 Volt.
C1 లో నిల్వ ఉన్న తొలి విద్యుత్ శక్తి,
<10-6x200x200
E1 = \(\frac{1}{2}\)C11 = \(\frac{1}{2}\) × 4 × 10-6 × 200 × 200
E1 = 8 × 10-2 జౌల్.
4 µF కెపాసిటర్ను 2 µF ఆవేశం లేని కెపాసిటర్ తో కలిపితే, రెండు ఉమ్మడి పొటెన్షియల్ పొందేవరకు ఆవేశం ప్రవహిస్తుంది.
AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్ 66
ఉష్ణం మరియు విద్యుదయస్కాంత వికిరణ రూపంలో నష్టపోయిన స్థిర విద్యుత్ శక్తి =
E1 – E2 = 8 × 10-2 – 5.33 × 10-2 = 2.67 × 10-2 జౌల్.

ప్రశ్న 28.
ఒక సమాంతర పలకల కెపాసిటర్ ప్రతి పలకపై గల బలపరిమాణం (1/2) QE అని చూపండి. ఇక్కడ Q కెపాసిటర్పై గల ఆవేశం, E పలకల మధ్య విద్యుత్ క్షేత్ర తీవ్రత పరిమాణం. దీనిలో 1/2 కారకం మూలాన్ని (origin) వివరించండి.
సాధన:
ప్రతి పలకపై F బలం ఉన్న సమాంతర పలకల కెపాసిటర్లో, వానిదూరం ∆x పెంచుటకు చేయు పని = F.∆x ఇది కెపాసిటర్ స్థితిజ శక్తిని పెంచును.
కెపాసిటర్ ఘనపరిమాణంలో పెరుగుదల = A.∆x
u = శక్తి సాంద్రత = నిల్వ శక్తి / ఘనపరిమాణం, స్థితిజశక్తిలో పెరుగుదల = U.A∆x
∴ f ∆ x = u. A∆x
AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్ 67
బలం, కారకం మూలము 1/2. వాహకం లోపల క్షేత్రం సున్నా. వెలుపల వైపు క్షేత్రం E.
క్షేత్రం సరాసరి విలువ (i.e E/2) ను, బలం ఇస్తుంది.

ప్రశ్న 29.
రెండు ఏకకేంద్ర గోళాకార వాహకాలు గల ఒక గోళాకార కెపాసిటర్ను తగిన విద్యుత్ బంధకాల ఆధారంతో ఉంచారు. అయితే గోళాకార కెపాసిటర్ కెపాసిటెన్స్, C = \(\frac{4 \pi \varepsilon_0 \mathbf{r}_1 \mathbf{r}_2}{\mathbf{r}_1-\mathbf{r}_2}\) అని చూపండి.
ఇక్కడ r1, r2 లు వరుసగా బాహ్య, అంతర గోళాల వ్యాసార్థాలు.
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్ 68
r1 వ్యాసార్ధమున్న బయట గోళం, లోపలి తలంపై +Q ఆవేశం, r2 వ్యాసార్ధమున్న లోపలిగోళం వెలుపల – Q ఆవేశంను ప్రేరణ చేస్తుంది.

పటంలో చూపినట్లు రెండు గోళాల మధ్య ఖాళీలో విద్యుత్ క్షేత్రం ఉండును. రెండు గోళాల మధ్య పొటెన్షియల్ భేదము,
AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్ 69
AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్ 70

ప్రశ్న 30.
ఒక గోళాకార కెపాసిటర్లో అంతర గోళం వ్యాసార్థం 12 cm. బాహ్య గోళ వ్యాసార్థం 13 cm. అంతర గోళానికి 2.5 µC ఆవేశం ఇచ్చారు. బాహ్య గోళాన్ని భూమికి కలిపారు. ఈ ఏకకేంద్ర గోళాల మధ్య ప్రదేశాన్ని రోధక స్థిరాంకం 32 గల ఒక ద్రవంతో నింపారు.
(a) కెపాసిటర్ కెపాసిటెన్స్ను నిర్ణయించండి.
(b) లోపలి గోళం పొటెన్షియల్ ఎంత?
(c) ఈ కెపాసిటర్ కెపాసిటెను న్ను 12 cm వ్యాసార్థం గల వియుక్త గోళం కెపాసిటెన్స్తో పోల్చండి. రెండవది చాలా తక్కువ విలువను కలిగి ఉండటాన్ని వివరించండి.
సాధన:
ra = 12 cm = 12 × 10-2 m
rb = 13 cm = 13 × 10-2 m
q = 2.5 µC = 2.5 × 10-6C, εr = 32
AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్ 71
కెపాసిటర్లో, బయట గోళం భూమికి కలుపబడింది. పొటెన్షియల్ భేదం తగ్గును మరియు కెపాసిటన్స్ పెరుగును. కావున వియుక్తగోళం కెపాసిటీ చాలా తక్కువ.

AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్

ప్రశ్న 31.
జాగ్రత్తగా సమాధానాలివ్వండి :
(a) Q1, Q2 ఆవేశాలు గల రెండు అతిపెద్ద వాహక గోళాలను ఒకదానికొకటి దగ్గరగా తీసుకొచ్చారు. వాటి మధ్య స్థిరవిద్యుత్ బలం పరిమాణం సరిగ్గా Q1 Q2/4πε0r² అవుతుందా? ఇక్కడ ” అనేది ఆ రెండింటి కేంద్రాల మధ్యదూరం.
(b) కూలుమ్ నియమం 1/r³ పై ఆధారితమైతే (1/r² కి బదులుగా) గాస్ నియమం ఇంకా నిజమవుతుందా?
(c) స్థిర విద్యుత్ క్షేత్ర ఆకృతిలో ఒక బిందువు వద్ద నిశ్చల స్థితిలో గల చిన్న శోధన ఆవేశాన్ని వదలిపెట్టారు. ఈ ఆవేశం ఆ బిందువు ద్వారా పోయే క్షేత్ర రేఖ దిశలో ప్రయాణిస్తుందా?
(d) ఒక ఎలక్ట్రాన్ పూర్తి వృత్తాకార కక్ష్యలో కేంద్రకం వల్ల కలిగే క్షేత్రం చేసిన పని ఎంత? కక్ష్య దీర్ఘవృత్తాకారమైతే ఏమవుతుంది?
(e) ఆవేశిత వాహకం ఉపరితలం ద్వారా విద్యుత్ క్షేత్రం విచ్ఛిన్నంగా ఉంటుందని మనకు తెలుసు. అక్కడ విద్యుత్ పొటెన్షియల్ కూడా విచ్ఛిన్నంగా ఉంటుందా?
(f) ఏక (ఒంటరి) వాహకానికి కెపాసిటెన్స్కు మీరు ఏమి అర్థం ఇస్తారు?
(g) నీటి రోధక స్థిరాంకం (= 80) చాలా అధికంగా, మైకా కంటే (= 6), ఎందుకు ఉంటుంది?
సాధన:
a) ఆవేశ గోళాలను దగ్గరకు తీసుకువస్తే, వానిపై ఆవేశ వితరణలు అసమరీతిగా ఉండును. కూలుమ్ నియమము వర్తించదు. కావున బలం పరిమాణంను ఈ ఫార్ములా ఖచ్చితంగా ఇవ్వదు.
b) కూలుమ్ నియమము 1/r² బదులు 1/r³ గాస్ నియమము నిజం కాదు.
c) బలరేఖ, ఆవేశ త్వరణ దిశను ఇచ్చును. విద్యుత్ బలరేఖ రేఖీయంగా ఉంటే, శోధన ఆవేశం అదేరేఖ వెంట కదులును. బలరేఖ రేఖీయంగా లేకపోతే శోధన ఆవేశం ఆ రేఖ వెంట కదలదు.
d) క్షేత్రం వల్ల, బలం కేంద్రం వైపు లేకపోతే ఎలక్ట్రాన్ బలదిశలో చలించదు. కక్ష్య వృత్తాకారంగా ఉంటే జరిగిన పని సున్నా. కక్ష్య దీర్ఘవృత్తాకారంగా ఉన్న, స్థిర విద్యుత్ బలాలు నిత్యత్వ బలాలు అయిన ఇది వాస్తవం.
e) విద్యుత్ పొటెన్షియల్ అవిచ్ఛిన్నం కాదు.
f) ఒకేఒక వాహకం కెపాసిటి, రెండవ వాహకం అనంతం అని తెలుపుతుంది.
g) నీటి అణువు సాధారణ స్థితిలో, అసౌష్టవ ఆకారం కలిగి శాశ్వత ద్విదృవభ్రామకంను ఇస్తుంది. మైకా కన్నా నీరు రోధక స్థిరాంకం అధికంగా ఉండుటకు కారణం ఇదే.

ప్రశ్న 32.
ఒక సహాక్ష స్తూపాకార కెపాసిటర్లో స్తూపాల పొడవు 15 cm, వ్యాసార్థాలు 1.5cm, 1.4 cm. బాహ్య స్తూపాన్ని భూమికి కలిపారు. లోపలి స్తూపానికి 3.5 µC ఆవేశాన్ని ఇచ్చారు. వ్యవస్థ కెపాసిటెన్స్న, లోపలి స్తూపం పొటెన్షియల్ను నిర్ణయించండి. అంత్య ప్రభావాలను (end effcts) ఉపేక్షించండి (అంటే, అంత్యాల వద్ద క్షేత్ర రేఖలు వంగడం).
సాధన :
L = 15 cm = 15 × 10-2m
ra = 1.4 cm = 1.4 × 10-2m, rb = 1.5 cm = 1.5 × 10-2m
q = 3.5 µC = 3.5 × 10-6C, C = ? V = ?
AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్ 72
AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్ 73

ప్రశ్న 33.
ఒక సమాంతర పలకల కెపాసిటర్ను రోధక స్థిరాంకం 3 గల పదార్థంతో lkV వోల్టేజి రేటింగ్తో రోధక సత్వం 107 Vm-1తో రూపకల్పన చేయవలసి ఉంది. (రోధక సత్వం అనేది ఒక పదార్థం భంజనం చెందకుండా తట్టుకోగలిగే గరిష్ఠ విద్యుత్ క్షేత్రం, అంటే పాక్షిక అయనీకరణ ద్వారా విద్యుత్ను ప్రవహింపచేయడం మొదలు పెట్టనిది) భద్రత కోసం, రోధక సత్వంలో 10% కంటే క్షేత్రం ఎక్కువ కాకుండా చూస్తాం. కెపాసిటెన్స్ 50 pF కావాలనుకొన్నప్పుడు కెపాసిటర్ పలకల వైశాల్యం కనిష్ఠంగా ఎంత ఉండాలి?
సాధన:
V = 1KV = 1000 Volt; K = εr = 3
రోధక బలం = 107 V/m
విద్యుత్ క్షేత్రం = 10% × రోధక బల
E = 10% × 107 = 10°V/m, A = ?
AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్ 74

ప్రశ్న 34.
కింది వాటికి అనురూపంగా సమపొటెన్షియల్ ఉపరితలాలను పథకాత్మకంగా వర్ణించండి.
(a) Z-దిశలో ఒక స్థిర విద్యుత్ క్షేత్రం
(b) స్థిరమైన (z అనుకోండి) దిశలోనే ఉంటూ పరిమాణంలో ఏకరీతిగా పెరిగే క్షేత్రం
(c) మూలబిందువు వద్ద ఉన్న ఒంటరి ధనావేశం
(d) పొడవైన, సమాన అంతరాలతో సమాంతరంగా ఒక తలంలో ఆవేశిత తీగలు గల ఏకరీతి తీగల చట్రం (గ్రిడ్).
సాధన:
నిర్వచనం ప్రకారం, సమశక్మ ఉపరితలంపై ఏదైన బిందువు వద్ద పొటెన్షియల్ ఒకేవిధంగా ఉండును. పైన ఇచ్చిన నాలుగు సందర్భాలు :
a) సమశక్మ ఉపరితలాలు, x y తలానికి సమాంతరంగా ఉన్న తలాలు. ఇవి సమదూరంలో ఉండును.

b) సమశక్మ ఉపరితలాలు, x y తలానికి సమాంతరంగా ఉన్న తలాలు. క్షేత్రం ఏకరీతిగా పెరిగితే, తలాల మధ్య దూరం తగ్గును.

c) మూలబిందువు కేంద్రంగా గల సమశక్మ ఉపరితలాలు గల గోళాలు.

d) సమశక్మ ఉపరితలాలు ఆకారాన్ని కలిగి ఆవర్తకంగా మారును. గ్రిడ్ నుండి దూరంగా ఉన్నప్పుడు, గ్రిడ్కు సమశక్మ ఉపరితలాల ఆకారం సమాంతరంగా ఉండును.

ప్రశ్న 35.
వాన్ డీ గ్రాఫ్ జనరేటర్లో గోళాకార లోహ కర్పరం 15 × 106 V ల ఎలక్ట్రోడ్. ఈ ఎలక్ట్రోడ్ చుట్టూతా ఉన్న వాయువు రోధక సత్వం 5 × 107 Vm-1. అవసరమైన గోళాకార’ కర్పరం కనిష్ఠ వ్యాసార్థం ఎంత? (అధిక పొటెన్షియల్ను పొందడానికి స్వల్ప ఆవేశం అవసరమైన చాలా చిన్న కర్పరం ఉపయోగించి ఒక స్థిర విద్యుత్ జనరేటర్ను ఎందుకు నిర్మించలేమో ఈ అభ్యాసం నుంచి మీరు నేర్చుకొంటారు.)
సాధన:
V = 15 × 106 Volt
రోధక సత్వం = 5 × 107 Vm-1
కనీస వ్యాసార్థం, r = ?
గరిష్ఠ విద్యుత్ క్షేత్రం, E = 10% రోధక సత్వం
AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్ 75
చాలా స్వల్ప కర్పరంను ఉపయోగిస్తే, స్థిర విద్యుత్ జనరేటరును మనం నిర్మించలేము.

ప్రశ్న 36.
వ్యాసార్ధం r1, ఆవేశం q1 గల ఒక చిన్న గోళం, వ్యాసార్థం r2 ఆవేశం q2 గల గోళాకార కర్పరంతో ఆవృతమైంది. q1 ధనాత్మకమైతే, కర్పరంపై ఉన్న ఆవేశం ఏది అయినప్పటికీ గోళం నుంచి కర్పరానికి ఆవేశం ఆవశ్యకంగా ప్రవహిస్తుందని చూపండి. (రెండూ ఒక తీగతో సంధానం చేసినప్పుడు),
సాధన:
వ్యాసార్థం r1, ఆవేశం q1 గల ఒక చిన్నగోళం, వ్యాసార్థం r2, ఆవేశం qq గల గోళాకార కర్పరంతో ఆవృతమైంది. కర్పరం బయట ఉపరితలంపై ఎల్లప్పుడు ఆవేశం (q2) ఉండును. గోళం మరియు కర్పరంను తీగతో కలిపితే ఆవేశం గోళం నుండి కర్పరంనకు, ఆవేశం q2 సంజ్ఞ మరియు పరిమాణంతో సంబంధం లేకుండా ప్రవహించును.

ప్రశ్న 37.
క్రింది వాటికి సమాధానాలివ్వండి.
(a) ఉన్నతి (ఎత్తు)తో తగ్గుతున్న విద్యుత్ క్షేత్రానికి అనురూపంగా, భూమి ఉపరితలం పరంగా వాతావరణం పైభాగం దాదాపు 400 kV వద్ద కలదు. భూమి ఉపరితలం దగ్గరగా క్షేత్రం 100 Vm-1. మన ఇంటి నుంచి బయటకు అడుగుపెట్టగానే మనకు ఎందుకు విద్యుత్ షాక్ తగలదు? (ఇల్లును ఒక స్టీల్ బోను (cage) గా ఊహించుకోండి. అందువల్ల లోపల ఎలాంటి క్షేత్రం ఉండదు.)
(b) ఒక వ్యక్తి తన ఇంటి బయట సాయంకాలం 1m² చదరపు వైశాల్యం గల పెద్ద అల్యూమినియం పలకను రెండు మీటర్ల ల ఎత్తున్న విద్యుద్బంధిత పలకపై బిగించాడు. లోహపు పలకను మరుసటి రోజు ఉదయం తాకగానే అతనికి విద్యుత్ షాక్ తగులుతుందా?
(c) భూపటంపై (globe) సగటున గాలి యొక్క స్వల్ప వాహకత్వం వల్ల వాతావరణంలో ఉత్సర్గం చెందే విద్యుత్ ప్రవాహం 1800 A అని తెలిసింది. అలాంటప్పుడు సహజంగానే వాతావరణం తనకు తానే పూర్తిగా ఉత్సర్గం చెంది విద్యుత్పరంగా ఎందుకు తటస్థం కాదు? మరోవిధంగా చెప్పాలంటే, వాతావరణాన్ని ఆవేశితంగా ఏది ఉంచుతుంది?
(d) మెరుపు వచ్చేటప్పుడు వాతావరణపు విద్యుత్ శక్తి ఏయే శక్తి రూపాలలోకి దుర్వ్యయం అవుతుంది?
(Hint : ఉపరితల ఆవేశ సాంద్రత = -10-9Cm-2 కి అనురూపంగా భూమి ఉపరితలం వద్ద అథో దిశలో దాదాపు 100 Vm-1 విద్యుత్ క్షేత్రం ఉంటుంది. దాదాపు 50 km వరకు (దీని తరువాత అది మంచి వాహకం) ఉండే వాతావరణపు స్వల్ప వాహకత్వం వల్ల ప్రతి సెకనుకు దాదాపు + 1800 C ఆవేశం మొత్తం భూమికి పంప్ అవుతుంది. అయినప్పటికీ, భూమి ఉత్సర్గం చెందదు. ఎందుకంటే, భూపటంపై నిరంతరం సంభవించే పిడుగులు, మెరుపులు భూమిపై సమాన పరిమాణంలో రుణావేశాన్ని పంపుచేస్తాయి).
సాధన:
a) మన శరీరం మరియు భూమి ఉపరితలం రెండు వాహకాలు. కావున ఈ రెండు సమశక్మ తలాలను ఏర్పరుచును. మనం ఇంట్లో నుండి బయటకు వస్తే, గాలి యధార్థ సమశక్మతలం మారును. శరీరంను, భూమిని ఒకే పొటెన్షియల్ వద్ద ఉంటే విద్యుత్ షాక్ పొందలేము.

b) అవును మనిషికి షాక్ తగులుతుంది. దీనికి కారణం వాతావరణ ఆవేశాలు నిలకడ కోల్పోతున్నప్పుడు, అల్యూమినియం పలక ఆవేశం క్రమంగా పెరుగును. అల్యూమినియం పలక, భూమి మరియు బంధకంతో కండెన్సర్ను ఏర్పరుచును. అల్యూమినియం పలక గరిష్ఠ ఆవేశంనకు చేరును. కావున మనిషి షాక్కు గురవుతాడు.

c) వాతావరణం ఆవేశంను పిడుగుల వల్ల క్రమంగా కోల్పోతుంటే గ్లోబు అన్ని వైపులా మెరుపు ఏర్పడును. ఇది కూడా గాలి స్వల్ప వాహకత్వం వల్ల ఆవేశం కోల్పోవును. రెండు వ్యతిరేక ఆవేశ ప్రక్రియలు సరాసరి, సమతుల్యతలు కలిగి వాతావరణం ఆవేశంను కలిగి ఉండునట్లు చేయును.

d) మెరిసేటప్పుడు, వాతావరణ విద్యుత్ శక్తి, కాంతి, ఉష్ణం మరియు ధ్వని రూపంలో దుర్వ్యయం అగును.

సాధించిన సమస్యలు Textual Examples

ప్రశ్న 1.
(a) 4 × 10-7C విద్యుదావేశం నుంచి 9 cm దూరంలో ఉన్న P అనే బిందువు వద్ద విద్యుత్ పొటెన్షియల్ విలువను లెక్కకట్టండి.
(b) అందువల్ల, అనంత దూరంలో ఉన్న 2×10-9C విద్యుదావేశాన్ని P అనే బిందువు వద్దకు తీసుకొనిరావడానికి చేయవలసిన పనిని లెక్కకట్టండి. ఈ విద్యుదావేశాన్ని తీసుకొనిరావడానికి చేసే పని, దానిని తీసుకొని వచ్చిన పథం మీద ఆధారపడుతుందా?
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్ 76
కాదు, చేసిన పని దాని పథం మీద ఆధారపడదు. దానికి కారణం ఏదైనా అనియత అనంత సూక్ష్మ పథాన్ని రెండు లంబ అంశాలుగా విభజించవచ్చు. ఒకటి గా వెంబడి, రెండవది కులంబంగా, రెండవ దాని వల్ల చేసిన పని శూన్యం.

AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్

ప్రశ్న 2.
3 × 10-8 C, -2 × 10-8C విద్యుదావేశాలు 15 cm ఎడంలో ఉన్నాయి. ఆ రెండు విద్యుదావేశాలను కలిపే సరళరేఖపై ఏ బిందువు వద్ద విద్యుత్ పొటెన్షియల్ విలువ సున్నా అవుతుంది? అనంత దూరం వద్ద పొటెన్షియల్ విలువ సున్నాగా తీసుకోండి.
సాధన:
ధనావేశ స్థానం వద్ద మూలబిందువు ను తీసుకోండి. రెండు ఆవేశాలను కలిపే రేఖను X-అక్షంగా తీసుకోవలసి ఉంటుంది; రుణావేశాన్ని మూలబిందువుకు కుడివైపుగా తీసుకోవలసి ఉంటుంది.
AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్ 77

X-అక్షంపై పొటెన్షియల్ శూన్యంగా ఉండే బిందువుగా P ని తీసుకోండి. X అనేది P నిరూపకం అయితే, తప్పకుండా ధనాత్మకంగా ఉండాలి. (x < 0 కు రెండు ఆవేశాల వల్ల పొటెన్షియల్ కలిసి శూన్యం అవడం సాధ్యం కాదు; X అనేది Aల మధ్య ఉన్నట్లయితే,
AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్ 78

అంటే, ధనావేశం నుంచి 9 cm, 45 cm దూరాలలో, రుణావేశం వైపు విద్యుత్ పొటెన్షియల్ శూన్యంగా ఉంటుంది. గణన చేయడానికి ఉపయోగించిన ఫార్ములాకు అవసరమైంది ఏమంటే, అనంతం వద్ద పొటెన్షియలు శూన్యంగా ఎంపిక చేసుకోవడం.

ప్రశ్న 3.
పటం(a), (b) లు ధన, రుణ బిందు విద్యుదావేశాల వల్ల కలిగే క్షేత్ర రేఖలను సూచిస్తాయి.
AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్ 79
(a) Vp ∝ VQ; VB – VA పొటెన్షియల్ తేడాల సంజ్ఞలను తెలపండి.
(b) Q, P; A, B ల మధ్య ఒక చిన్న రుణ విద్యుదావేశాన్ని ఉంచినప్పుడు, స్థితిజశక్తి తేడా సంజ్ఞలను తెలపండి.
(c) ఒక చిన్న ధనావేశాన్ని Q నుంచి P వరకు జరపడానికి క్షేత్రం చేసే పని సంజ్ఞను తెలపండి.
(d) ఒక చిన్న రుణావేశాన్ని B నుంచి A వరకు జరపడానికి బాహ్యకారకం చేసిన పని సంజ్ఞను తెలపండి.
(e) చిన్న రుణ విద్యుదావేశం B నుంచి A కు పోయేటప్పుడు దాని గతిజశక్తి పెరుగుతుందా? లేదా తగ్గుతుందా?
సాధన:
(a) V ∝ \(\frac{1}{r}\) కాబట్టి, VP > VQ. అందువల్ల, (VP – VQ) ధనాత్మకం. VA కంటే VB తక్కువ రుణాత్మకం కూడా. అందువల్ల, VB > VA లేదా (VB – VA) ధనాత్మకం.

(b) ఒక చిన్న రుణావేశం ధనావేశం వైపు ఆకర్షితమవుతుంది. రుణావేశం అధిక స్థితిజశక్తి నుంచి అల్ప స్థితిజశక్తికి చలిస్తుంది. కాబట్టి, Q, P ల మధ్య ఉన్న ఒక చిన్న రుణావేశం స్థితిజశక్తి భేదం సంజ్ఞ ధనాత్మకం. అదేవిధంగా, (P.E.) A > (P.E.)B, అందువల్ల స్థితిజశక్తి భేదం ధనాత్మకం.

(c) Q నుంచి P కి ఒక చిన్న ధనావేశాన్ని జరపడానికి విద్యుత్ క్షేత్రానికి వ్యతిరేకంగా బాహ్యకారకం పని చేయవలసి ఉంటుంది. కాబట్టి, క్షేత్రం వల్ల జరిగిన పని రుణాత్మకం.

(d) B నుంచి A కి చిన్న రుణావేశాన్ని జరపడానికి బాహ్యకారకం పని చేయవలసి ఉంటుంది. ఇది ధనాత్మకం.

(e) చిన్న రుణావేశంపై వికర్షణ బలం వల్ల, వేగం తగ్గుతుంది. కాబట్టి B నుంచి A కి పోయేటప్పుడు గతిజశక్తి తగ్గుతుంది.

ప్రశ్న 4.
(a) పటంలో చూపిన విధంగా d అంచు గల ఒక చతురస్రం మూలలు ABCD ల వద్ద +q, –q, +q, –q అనే నాలుగు విద్యుదావేశాలను అమర్చారు. (a) పటంలో చూపిన విధంగా ఈ విద్యుదావేశాలను అమర్చడానికి చేయవలసిన పనిని కనుక్కోండి. (b) నాలుగు మూలల వద్ద ఆవేశాలను అలాగే స్థిరంగా ఉంచి, చతురస్ర కేంద్రం E వద్దకు q0 అనే విద్యుదావేశాన్ని తీసుకొనిరావడానికి చేయవలసిన పని ఎంత?
AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్ 80
సాధన:
(a) చేసిన పని ఆవేశాల తుది అమరికపైనే ఆధారపడి ఉంటుంది. కాని వాటిని ఏవిధంగా కలిసి పెట్టామనేదానిపై ఆధారపడి ఉండదు. కాబట్టి ఆవేశాలను A, B, C, D ల వద్ద ఒక విధంగా పెట్టడానికి అవసరమైన పనిని లెక్కిస్తాం. మొదట + q ను A వద్దకు, తరువాత -q, + q, – qలను వరుసగా B, C, D ల వద్దకు తెచ్చామనుకొందాం. చేయవలసిన మొత్తం పనిని దశల వారిగా లెక్కకట్టవచ్చు:
(i) ఎక్కడా ఎటువంటి ఆవేశం లేనప్పుడు + q ను A వద్దకు తీసుకొనిరావడానికి చేయవలసిన పని శూన్యం. (ii) +q, A వద్ద ఉన్నప్పుడు -q ని B వద్దకు తీసుకొనిరావడానికి చేయవలసిన పని, B వద్ద ఆవేశం) × (A వద్ద గల +q వల్ల B వద్ద స్థిరవిద్యుత్ పొటెన్షియల్) = -q × \(\left(\frac{\mathrm{q}^2}{4 \pi \varepsilon_0 \mathrm{~d}}\right)=-\frac{\mathrm{q}^2}{4 \pi \varepsilon_0 \mathrm{~d}}\)
(iii) + q, A వద్ద; −q, B వద్ద ఉన్నప్పుడు + q ని C వద్దకు తీసుకొనిరావడానికి చేయవలసిన పని, (C వద్ద ఆవేశం) × (A, B ల వద్ద గల ఆవేశాల వల్ల C వద్ద పొటెన్షియల్)
AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్ 81
(iv) + q, A వద్ద; –q, B వద్ద; + q, C వద్ద ఉన్నప్పుడు -q ని D వద్దకు తీసుకొనిరావడానికి చేయవలసిన పని, (D వద్ద ఆవేశం) × (A, B, C ల వద్ద గల ఆవేశాల వల్ల D వద్ద పొటెన్షియల్)
AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్ 82

చేసిన పని ఆవేశాల అమరిక మీదనే ఆధారపడి ఉంటుంది. కాని వాటిని ఏవిధంగా సమూహపరచారన్న దానిపై కాదు. నిర్వచనం ప్రకారం, ఇది ఆవేశాల మొత్తం స్థిర విద్యుత్ శక్తి.
(విద్యార్థులు వారికి తోచినట్లుగా ఆవేశాల క్రమాన్ని తీసుకొని ఇదే పని/శక్తిని లెక్కగట్టడానికి ప్రయత్నించినప్పుడు శక్తి విలువ మారదు అని వారికివారే ఒప్పుకొంటారు.)

b) A, B, C, D ల వద్ద నాలుగు ఆవేశాలున్నప్పుడు E వద్దకు q0 ఆవేశాన్ని తీసుకొని రావడానికి చేయవలసిన అదనపు పనిని q0 × (A, B, C, D ల వద్ద గల ఆవేశాల వల్ల E వద్ద స్థిర విద్యుత్ పొటెన్షియల్). A, Cల వల్ల కలిగే పొటెన్షియల్, B, D ల వల్ల కలిగే పొటెన్షియల్ వల్ల రద్దవడంతో E వద్ద స్థిర విద్యుత్ పొటెన్షియల్ స్పష్టంగా శూన్యమవుతుంది. కాబట్టి E వద్దకు ఏదైనా ఆవేశాన్ని తీసుకొని రావడానికి ఎటువంటి పని చేయవలసిన అవసరం ఉండదు.

ప్రశ్న 5.
a) బాహ్య క్షేత్రం లేనప్పుడు 7µC, -2µC ఆవేశాలను (-9 cm, 0, 0), (9cm, 0, 0) ల వద్ద ఉంచిన వ్యవస్థ యొక్క స్థిర విద్యుత్ స్థితిజశక్తిని కనుక్కోండి.
b) ఈ రెండు విద్యుదావేశాలను ఒకదాని నుంచి మరొకదానిని అనంతంలోకి వేరుచేయడానికి చేయవలసిన పనిని లెక్కకట్టండి.
c) ఇదే ఆవేశ వ్యవస్థను E = A(1/r²); A = 9 × 105 Cm-2 అనే బాహ్యక్షేత్రంలో ఉంచామనుకోండి. అప్పుడు ఆకృతి స్థిర విద్యుత్ పొటెన్షియల్ శక్తి ఏమై ఉంటుంది?
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్ 83
(c) రెండు విద్యుదావేశాల పరస్పర అన్యోన్యచర్య శక్తి ఏ మాత్రం మారదు. దీనికి అదనంగా, రెండు ఆవేశాలు బాహ్య విద్యుత్ క్షేత్రంతో అన్యోన్య చర్య జరపడం వల్ల కలిగే శక్తి ఉంటుంది. దీనినుంచి,
AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్ 84

ప్రశ్న 6.
ఒక పదార్థపు అణువు శాశ్వత ద్విధృవ భ్రామకం పరిమాణం 10-29 Cm. తక్కువ ఉష్ణోగ్రత వద్ద 106 Vm-1 పరిమాణం కలిగిన ప్రబలమైన స్థిర విద్యుత్ క్షేత్రాన్ని అనువర్తించడం ద్వారా ఈ పదార్థం ఒక మోల్ ధృవణం చెందింది. ఇప్పుడు హఠాత్తుగా విద్యుత్ క్షేత్ర దిశను 60° కి మార్చారు. పదార్థం దాని ద్విధృవాలను కొత్త క్షేత్ర దిశలోకి తీసుకొనిరావడం వల్ల పదార్థం వల్ల విడుదలయిన ఉష్ణాన్ని అంచనావేయండి. సరళత కోసం, నమూనా (పదార్థం) 100% ధృవణం దనుకోండి.
సాధన:
ప్రతి అణువు ద్విధృవ భ్రామకం = 10-29 Cm
నార్థంలో 6 × 10-29 అణువులుంటాయి కాబట్టి, అన్ని అణువుల మొత్తం ద్విధృవ భ్రామకం,
p – × 10-29 Cm = 6 × 10-6 Cm
తొలి స్థితిజ శక్తి, Ut = -pE cos θ = 6 × 10-6 × 106 cos 0° = -6J
తుది స్థితిజశక్తి (θ = 60° అయినప్పుడు), Uf = -6 × 10-6 × 106 × cos 60° = – 3J
స్థితిజశక్తిలో మార్పు = -3J – (-6J) = 3J
కాబట్టి, స్థితిజశక్తిలో నష్టం ఉంది. పదార్థం దాని ద్విధృవాలను క్షేత్ర దిశలోకి తీసుకొనిరావడానికి ఉష్ణరూపంలో ఇంత శక్తి తప్పక ‘విడుదల కావాలి.

ప్రశ్న 7.
(a) ఒక పొడి జుట్టును దువ్విన దువ్వెన చిన్న కాగితం ముక్కలను ఆకర్షిస్తుంది. ఎందుకు?
ఒక వేళ జుట్టు తడిగా ఉంటే లేదా వర్షం పడుతున్నట్లయితే ఏమవుతుంది ? (కాగితం విద్యుత్ను వహనం చేయదని గుర్తుంచుకోండి.)
(b) సాధారణ రబ్బరు ఒక బంధకం. కాని విమానం టైర్లు, ప్రత్యేక రబ్బరుతో, స్వల్పంగా వాహకత్వం ఉండే రబ్బరుతో చేస్తారు. ఇది ఎందుకు అవసరం?
(c) సులభంగా ఉండే పదార్థాలను తీసుకొనిపోయే వాహనాలకు లోహపుతాళ్ళు ఉండి, వాహనం చలిస్తున్నప్పుడు అవి భూమిని తాకేలా ఉంటాయి. ఎందుకు?
(d) అరక్షితంగా ఉన్న అధిక సామర్థ్య విద్యుత్ తీగపై ఒక పక్షి కూర్చొని ఉన్నప్పుడు పక్షికి ఏమి జరగలేదు. భూమిపై నిల్చొన్న మనిషి అదే తీగను తాకినప్పుడు ప్రాణాంతకమైన విద్యుత్ షాక్కు గురవుతాడు. ఎందుకు?
సాధన:
(a) ఎందుకంటే ఘర్షణ వల్ల దువ్వెన ఆవేశితమవుతుంది. కాగితంలోని అణువులు ఆవేశిత దువ్వెన వల్ల ధృవితమై,. నికర ఆకర్షణ బలం కలుగుతుంది. జుట్టు తడిగా ఉన్నా లేదా వర్షం పడినా, దువ్వెన జుట్టుల మధ్య ఘర్షణ తగ్గుతుంది. దువ్వెన ఆవేశితం చెందక, చిన్న కాగితం ముక్కలను ఆకర్షించదు.

(b) ఆవేశాన్ని (ఘర్షణ వల్ల ఉత్పత్తి అయింది) భూమికి వహనం చేయడానికి, చాలా పెద్ద మొత్తంలో పోగయిన స్థిర విద్యుత్ వల్ల స్పార్క్ కలిగి, మంట రావచ్చు.

(c) (b) లో వివరించిన కారణమే.

(d) పొటెన్షియల్ తేడా ఉన్నప్పుడే విద్యుత్ ప్రవాహం ఉంటుంది.

AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్

ప్రశ్న 8.
K రోధక స్థిరాంకం గల పదార్థ దిమ్మె వైశాల్యం, సమాంతర పలకల కెపాసిటర్ పలకల వైశాల్యాన్ని కలిగి ఉంది. కాని మందం (3/4)d కలిగి ఉంది. ఇక్కడ డి పలకల మధ్య ఎడం. పలకల మధ్య రోధకాన్ని ప్రవేశపెట్టినప్పుడు కెపాసిటెన్స్ ఏ విధంగా మారుతుంది?
సాధన:
పలకల మధ్య ఎటువంటి రోధకం లేనప్పుడు విద్యుత్ క్షేత్రం E0 = V0/d అనుకోండి. పొటెన్షియల్ భేదం V0 ఇప్పుడు, రోధకాన్ని ప్రవేశపెట్టినట్లైతే, రోధకంలో విద్యుత్ క్షేత్రం E = E0/K అవుతుంది. అప్పుడు పొటెన్షియల్ భేదం.
AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్ 85 AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్ 86

ప్రశ్న 9.
పటంలో చూపినట్లు, 10 µF విలువ కలిగిన 4 కెపాసిటర్లు గల ఒక జాలం (network) ని 500 y సరఫరాకు సంధానం చేశారు. a) జాలం తుల్య కెపాసిటెన్స్, (b) ప్రతి కెపాసిటర్పై ఆవేశాన్ని కనుక్కోండి. (గమనిక: కెపాసిటర్పై ఉన్న ఆవేశం హెచ్చు పొటెన్షియల్ కలిగిన పలక మీద ఉన్న ఆవేశంతో సమానంగా ఉండి, తక్కువ పొటెన్షియల్లో ఉన్న పలకపై ఆవేశానికి సమానం, వ్యతిరేకంగా ఉంటుంది.)
AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్ 87
సాధన:
(a) ఇచ్చిన జూలంలో C1, C2, C3 లు శ్రేణి సంధానంలో ఉన్నాయి. ఈ మూడు కెపాసిటర్ ప్రభావాత్మక కెపాసిటెన్స్, C అయితే,
AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్ 88

(b) పటం నుంచి, ప్రతీ కెపాసిటర్పై (C1, C2, C3లు) ఆవేశం ఒకే విధంగా ఉంటుందని స్పష్టంగా తెలుస్తుంది. అది Q అనుకోండి. C4 పై ఆవేశం Q’ అనుకోండి. AB కొనల మధ్య పొటెన్షియల్ భేదం Q/C1, BC కొనల మధ్య Q/C2, CD కొనల మధ్య Q/C3 అవుతుంది. దీనినుంచి,
AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్ 89

AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్

ప్రశ్న 10.
(a) 900pF కెపాసిటర్ను 100 V బ్యాటరీతో ఆవేశితం చేశారు. (a) ఆ కెపాసిటర్ ఎంత స్థిర విద్యుత్ శక్తిని నిల్వ ఉంచుకొంటుంది?
(b) ఆ కెపాసిటర్ను బ్యాటరీ నుంచి వేరుచేసి, మరొక 900 pF కెపాసిటర్ తో కలిపారు. (b) వ్యవస్థలో నిల్వ ఉన్న స్థిర విద్యుత్ శక్తి ఎంత?
AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్ 90
సాధన:
(a) కెపాసిటర్పై ఆవేశం,
= CV = 900 × 10-12F × 100 V
= 9 × 10-8C
కెపాసిటర్ నిల్వ ఉంచుకొన్న శక్తి = (1/2) CV² = (1/2) QV
= (1/2) × 9 × 10-8C × 100 V
= 4.5 × 10-6J

(b) నిలకడ పరిస్థితిలో, రెండు కెపాసిటర్ల ధన పలకలు ఒకే పొటెన్షియల్ వద్ద, రుణ పలకలు ఒకే పొటెన్షియల్ వద్ద కలవు. ఉమ్మడి పొటెన్షియల్ భేదం V అనుకోండి. అప్పుడు, ప్రతి కెపాసిటర్పై ఆవేశం, Q’ = CV. ఆవేశ నిత్యత్వం వల్ల, Q’ = Q/2. ఇది V’ = V/2 అని సూచిస్తుంది. వ్యవస్థ మొత్తం శక్తి = 2 × \(\frac{1}{2}\)Q’V’ = \(\frac{1}{4}\)QV= 2.25 × 106J. అందువల్ల, (a) నుంచి (b) కి పోయేటప్పుడు ఆవేశ నష్టం లేనప్పటికీ, తుది శక్తి, తొలి శక్తిలో సగం ఉంటుంది. మిగతా శక్తి ఎక్కడికి వెళ్ళింది? వ్యవస్థ పరిస్థితి (b) కి స్థిరపడటానికి ముందు తాత్కాలిక కాలం ఉంటుంది. ఈ కాలంలో, తాత్కాలిక ప్రవాహం మొదటి కెపాసిటర్ నుంచి రెండవ దానికి ప్రవహిస్తుంది. ఈ కాలంలో శక్తి ఉష్ణ, విద్యుదయస్కాంత వికిరణ రూపాలలో నష్టపోతుంది.

AP Inter 1st Year Commerce Study Material Chapter 12 వ్యాపారంలో ప్రస్తుత ధోరణులు

Andhra Pradesh BIEAP AP Inter 1st Year Commerce Study Material 12th Lesson వ్యాపారంలో ప్రస్తుత ధోరణులు Textbook Questions and Answers.

AP Inter 1st Year Commerce Study Material 12th Lesson వ్యాపారంలో ప్రస్తుత ధోరణులు

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
e – వ్యాపారాన్ని నిర్వచించి, దాని పరిధిని వివరించండి.
జవాబు:
e – వ్యాపారము అనే పదాన్ని మొదటిసారిగా 1997లో IBM ఉపయోగించినది. దీని ప్రకారము e- వ్యాపారము అంటే “ఇంటర్నెట్ పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ ముఖ్యమైన వ్యాపార దశలను బదలాయింపు చేయడము”.

అన్ని వ్యాపార కార్యకలాపాలను, వ్యాపార పరిధిని బలపరచడానికి Information and Communication Technology (ICT) సహకారాన్ని ఇంటర్ నెట్ల ద్వారా తీసుకోవటమును e- వ్యాపారముగా నిర్వచించవచ్చును. e – వ్యాపారము ICT వినియోగదారులతో సంబంధాలు పెంపొందించుకోవడానికి కార్యకలాపాలను చేస్తుంది. e వ్యాపార పద్ధతులు వ్యాపార సంస్థల అంతర్గత, బహిర్గత వ్యవస్థల మధ్య సత్సంబంధాలను అత్యంత సమర్థవంతంగా, సరళముగా e – వ్యాపార పరిధి : e వ్యాపారాన్ని క్రింది విధముగా విభజించవచ్చు.

  • వ్యాపార సంస్థలో మాత్రమే.
  • ఒక వ్యాపార సంస్థ మరొక వ్యాపార సంస్థ మధ్య వ్యవహారాలు
  • వ్యాపార సంస్థ – వినియోగదారుని మధ్య వ్యవహారాలు
  • వినియోగదారుడు – వినియోగదారుని మధ్య వ్యవహారాలు
  • వినియోగదారుడు – వ్యాపార సంస్థ మధ్య వ్యవహారాలు

e – వాణిజ్యము పరిధి ఆన్లైన్ వ్యవహారములకు మాత్రమే పరిమితము అవుతుంది. ఆన్లైన్ ద్వారా ” వ్యవహారములు వస్తువు లేదా సర్వీసుకు సంబంధించినవై ఉంటాయి. దాదాపుగా ప్రతి వస్తువు జిమ్ పరికరాల నుంచి కంప్యూటర్ ల్యాప్టాప్ వరకు, వస్త్రాలను మొదలుకొని ఆభరణాల వరకు e – వాణిజ్య రంగంలో ఆన్లైన్ ద్వారానే కొనుగోలు చేయడం జరుగుతుంది. కేవలం వస్తువులను మాత్రమే కాకుండా సేవలను కూడా ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఉదా : న్యాయవాదులు, డాక్టర్లు తమ సేవలను ఆన్లైన్ ద్వారా అందిస్తున్నారు. రైలు, బస్సు, విమాన టిక్కెట్ల కొనుగోలు, పన్ను చెల్లింపులు ఆన్లైన్ ద్వారా చేయవచ్చు.

AP Inter 1st Year Commerce Study Material Chapter 12 వ్యాపారంలో ప్రస్తుత ధోరణులు

e – వ్యాపార పరిధి దిగువ అంశాలకు వర్తింపచేయడం జరుగుతుంది.
1) e – వాణిజ్యము : ఇంటర్నెట్ ద్వారా వ్యాపారాన్ని నిర్వహించడాన్ని e – వాణిజ్యము అంటారు. ఎలక్ట్రానిక్ వాణిజ్యాన్ని e – వాణిజ్యము అని వ్యవహరిస్తారు. ఆన్లైన్ ద్వారా వస్తువుల కొనుగోలు, అమ్మకం చేసే ప్రక్రియ దీనికి మంచి ఉదాహరణ. అంతేకాకుండా e – వాణిజ్యములో అనేక కార్యకలాపాలు కలిసి ఉంటాయి. ఏదైనా కార్యకలాపాన్ని ఎలక్ట్రానిక్ పరికరము ద్వారా నిర్వహించడాన్ని e – వాణిజ్యము అనవచ్చు.

2) e – వేలం : ఇంటర్ నెట్ సహాయముతో ప్రజలు వేలములో పాల్గొనవచ్చు. e-వేలములో పాల్గొనదలచినవారు సంబంధిత వెబ్సైట్ను సందర్శించి వేలం కోసం ప్రదర్శించిన వస్తువులను క్లిక్ చేస్తూ కొనుగోలు చేయవచ్చు. అదే విధముగా వెబ్ పేజీలలో తమ వస్తువులను ఉంచి వేలం ద్వారా వస్తువులను అమ్మకము చేయవచ్చు..

3) e – బ్యాంకింగ్ : ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ మంచి విజయవంతమైన ఆన్లైన్ వ్యాపారము. బ్యాంకింగ్ వెబ్ సైట్ను ఉపయోగిస్తూ బ్యాంకు ఖాతాదారులు తమ అకౌంట్స్ నిర్వహించుకోవడానికి, చెల్లింపుల ఆజ్ఞ ఇవ్వడానికి e – బ్యాంకింగ్ సహాయము చేస్తుంది. ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా ఖాతాదారులు బ్యాంకును సందర్శించనవసరము లేకుండా అవసరమైన నగదును ATM ద్వారా పొందవచ్చు. ఖాతా నిల్వలు తెలుసుకోవచ్చు. బిల్లులను చెల్లించవచ్చును. నగదును బదిలీ చేయవచ్చును.

4) e – మార్కెటింగ్ : ఎలక్ట్రానిక్ మార్కెటింగ్లో ఎలాంటి భౌగోళిక అడ్డంకులు లేకుండా వస్తువుల కొనుగోలుకు, అమ్మకాలకు ప్రపంచవ్యాప్తముగా మార్కెటింగ్ ఏర్పాటు చేస్తుంది. ఎలాంటి సమయ భావన లేకుండా ఖాతాదారుల డిమాండ్ను కంపెనీలు స్పందించేందుకు ‘ఇంటర్నెట్ సహాయం చేస్తుంది. దీనికి వినియోగదారులు ఉండే ప్రాంతముతో
సంబంధము లేదు.

5) e – వర్తకము : e – వర్తకాన్ని ఆన్లైన్ వర్తకమని, e – బ్రోకింగ్ అని కూడా వ్యవహరిస్తారు. ఇది స్టాక్ ఎక్స్ఛేంజ్లలో సెక్యూరిటీలను అమ్మడానికి, కొనడానికి ఉపయోగపడుతుంది.

ప్రశ్న 2.
e – వ్యాపారం యొక్క ప్రయోజనాలను వివరించండి.
జవాబు:
e – వ్యాపారము వలన వినియోగదారులకు, వ్యాపార సంస్థలకు, సమాజానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. వినియోగదారులకు కలిగే ప్రయోజనాలు :

  1. e – వ్యాపారము వలన వినియోగదారులు ఏ ప్రాంతం నుంచి అయినా, ఏ సమయంలోనైనా వ్యాపార వ్యవహారాలు నిర్వహించవచ్చు.
  2. e – వ్యాపారము వినియోగదారులకు వస్తు సేవలకు సంబంధించి, అనేక ప్రత్యామ్నాయాలు, అవకాశాలను కల్పిస్తాయి.
  3. e – వ్యాపారము ద్వారా వినియోగదారుడు అనేక ప్రాంతాలలోని మార్కెట్లలో వస్తు, సేవలను పోల్చి చూసుకోవడానికి వీలవుతుంది.
  4. e – వ్యాపారము వస్తు సేవలు త్వరగా డెలివరీ కావడానికి దోహదము చేస్తుంది.
  5. వినియోగదారుడు వస్తు సేవలకు సంబంధించి సరైన సమాచారాన్ని పూర్తి స్థాయిలో, క్షణాలలో పొందవచ్చును.
  6. వినియోగదారుడు సరైన వేలములో పాల్గొనేందుకు e -వ్యాపారము సహాయపడుతుంది.
  7. e- వ్యాపారము వినియోగదారుల మధ్య సహకారాన్ని ఏర్పరచి, ఒకరికొకరు వ్యాపార ఉపాయాలు, అనుభవాలు పంచుకునేట్లు చేస్తుంది.
  8. e – వ్యాపారము వ్యాపారం మధ్య పోటీతత్వాన్ని ఏర్పరచి, వినియోగదారులకు సరైన డిస్కౌంట్లు లభించేందుకు సహకరిస్తుంది.

AP Inter 1st Year Commerce Study Material Chapter 12 వ్యాపారంలో ప్రస్తుత ధోరణులు

వ్యాపార సంస్థకు ప్రయోజనాలు :

  1. e – వ్యాపారము వలన సంస్థలు తమ ప్రస్తుత మార్కెట్ను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలకు విస్తరింపచేసుకోవచ్చు. ఇది సంస్థ యొక్క అమ్మకాలను పెంచుతుంది.
  2. e – వ్యాపారము వలన వస్తువులను లేదా సేవలను సృష్టించడము, ప్రాసెస్ చేయడం, పంపిణీ చేయడం, స్టోరింగ్ చేయడం, ‘సమాచారాన్ని సేకరించడానికి, ఇన్వెంటరీ, ఓవర్హెడ్ ఖర్చులు తగ్గుతాయి.
  3. పెట్టుబడికి, వస్తు సేవల అమ్మకము వలన వచ్చే ఆదాయానికి మధ్య ఉన్న సమయం తగ్గుతుంది.
  4. బిజినెస్ ప్రాసెస్, రీ-ఇంజనీరింగ్లకు సహకరిస్తుంది.
  5. టెలీ కమ్యూనికేషన్ ఖర్చు తక్కువగా ఉండటం వలన ఇంటర్నెట్ విలువ ఆధారిత నెట్వర్క్ కంటే వ్యయము తక్కువగా ఉంటుంది.

సమాజానికి ప్రయోజనాలు :

  1. ఇంటినుంచే పనిచేసుకోవడానికి అవకాశము ఉండటం వలన షాపింగ్ కోసము ప్రయాణాలు తగ్గుతాయి. రోడ్లపై ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయి. దీనివలన వాయు కాలుష్యం తగ్గుతుంది. అంతేకాకుండా సమయము కూడా ఆదా అవుతుంది.
  2. వ్యాపారస్తులు తమ వస్తువులను ఇంటర్ నెట్ ద్వారా తక్కువ ధరలకు అమ్మడం వలన పేదవారికి ప్రయోజనం లభిస్తుంది.
  3. ప్రపంచ దేశాలలో, గ్రామీణ ప్రాంతాలలో ఉండే ప్రజలకు, మార్కెట్ లో లభించని’ వస్తు సేవలను e- వ్యాపారము ద్వారా పొందవచ్చు.
  4. వస్తు సేవలు తక్కువ వ్యయానికి లభించడమే కాకుండా, వాటి మన్నిక, నాణ్యత కూడా పెరుగుతుంది.

ప్రశ్న 3.
21వ శతాబ్దంలో వ్యాపార సంస్థలకు ఉన్న అవకాశాలను తెలపండి.
జవాబు:
21వ శతాబ్దంలో వ్యాపార సంస్థలకు గల అవకాశాలు :
1) సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ : LPG రూపములో ప్రవేశపెట్టబడిన ఆర్థిక సంస్కరణలు, భారతదేశములోని వ్యాపార సంస్థలకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించినది. ఈ పరిస్థితులు భారతదేశ ఆర్థిక వ్యవస్థను ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో అనుసంధానించడానికి, పూర్తి స్థాయిలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడానికి, అంతర్జాతీయ వర్తకములో పెరుగుదలకు, ఉత్పత్తి, ఉద్యోగ అవకాశాల పెరుగుదలకు, ఆంక్షలు లేని మూలధన ప్రవాహానికి దారితీసింది.

2) భారీ తరహా, విస్తరణ అవకాశాలు : 21వ శతాబ్దపు వ్యాపార సంస్థలు భారీతరహా, ఎక్కువ’ విస్తరణకు అవకాశాలు గల సంస్థల లక్షణాలు కలిగి ఉన్నవి. భారీ తరహా సంస్థ, ఉత్పత్తిలో పెరుగుదల వలన కంపెనీ ఖర్చులు తగ్గి, లాభాలు పెరుగుతాయి.

3) తలసరి ఆదాయంలో పెరుగుదల : తలసరి ఆదాయము పెరుగుదలలో మనదేశము ప్రపంచవ్యాప్తముగా నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించినది. తలసరి ఆదాయము దేశములోని ప్రజల జీవన ప్రమాణస్థాయిని తెలుపుతుంది. పెరుగుతున్న తలసరి ఆదాయము వలన దేశములో వ్యాపార అవకాశాలు పెరగడానికి అవకాశము ఉన్నది.

4) మార్కెట్ ఆర్థిక వ్యవస్థలు : భారతదేశము 125 కోట్ల జనాభాతో ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఏర్పడి ప్రపంచవ్యాప్తముగా పారిశ్రామిక, వర్తక సేవారంగాలను ఆకర్షిస్తున్నది. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో వస్తున్న మార్పులు భారతదేశ మార్కెట్ ఆదాపూర్వక మార్కెట్గా రూపొందినది. దాని ఫలితముగా దేశములోని వ్యాపార సంస్థలకు అనేక వ్యాపార అవకాశాలు లభిస్తున్నవి.

AP Inter 1st Year Commerce Study Material Chapter 12 వ్యాపారంలో ప్రస్తుత ధోరణులు

5) e – వాణిజ్యము – ప్రపంచ మార్కెట్ కు గేట్వే : ప్రపంచవ్యాప్తంగా వ్యాపార సంస్థలు e- వాణిజ్యం ప్రయోజనాలను గుర్తిస్తున్నాయి. నగదు ప్రవాహములో పెరుగుదల, ఖాతాదారులు నిలుపుదల, సేవా సంతృప్తి e – వాణిజ్యం ద్వారా లభించిన ప్రయోజనాలు.

6) సాంకేతిక పురోభివృద్ధి: 21వ శతాబ్దములో వ్యాపార సంస్థలు అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నవి. దీనివలన వ్యాపార సంస్థలు సమాజానికి అవసరమైన వస్తు సేవలను తక్కువ వ్యయానికి అందిస్తున్నవి.

7) విత్త సేవల విస్తరణ : 21వ శతాబ్దములో విత్త సేవారంగము చాలా వేగముగా పెరుగుతున్నది. బ్యాంకింగ్, భీమా, రుణ, ఈక్విటీ, ఫైనాన్సింగ్, సూక్ష్మ విత్త రంగాలు ప్రజలలో పొదుపు అలవాట్ల పెరుగుదల, భవిష్యత్ అవసరాలకు సరళమైన ఋణాలు పొందడానికి అవకాశాలు కల్పిస్తున్నవి. ఈ ఆర్థిక రంగములో కంపెనీలకు వ్యాపార విస్తరణ | అవకాశాలకు దారితీసాయి.

8) వ్యాపార ప్రక్రియ ఆటోమేషన్ : వ్యాపార ప్రక్రియ ఆటోమేషన్ అనేది వ్యయాల నియంత్రణకు ఉపయోగించే వ్యూహము. ఇది వ్యాపార ప్రక్రియలను స్వయం చలితం చేయడమే కాక అధిక సామర్థ్యాన్ని పొందడం, వ్యాపార అవసరాలకు మార్పులను ఆపాదించుకోవడం, మానవ తప్పిదాలను తగ్గించడం ద్వారా పని ప్రవాహాన్ని మెరుగుపరచడం చేస్తుంది. ‘

9) పెరుగుతున్న కలయికలు, సముపార్జనలు, విదేశీ కొలాబరేషన్లు : కలయికలు, సముపార్జనలు, నవకల్పనల అభివృద్ధి, లాభదాయకత, మార్కెట్ వాటా, కంపెనీ వాటా విలువలలో పెరుగుదలకు ఆధునిక వ్యాపార సంస్థలకు అనుకూలించే వ్యూహము. ఇదే తరహాను అనుసరించే ప్రతిఫలాలలో పెరుగుదలకు, అధిక సమర్థతకు, వ్యయాల నియంత్రణకు దోహదం చేస్తుంది.

10) అంతర్జాతీయ వ్యవస్థాపన : 21వ శతాబ్దములో అనేక సంస్థలు, వ్యాపార ప్రపంచీకరణను, తయారీ, సేవల, మూలధన వనరుల, ప్రతిభ సంపాదనకి రక్షణ వ్యూహంగా పరిగణిస్తున్నది. వినియోగదారుల అవసరాలకు సరిపడేందుకు కొత్త ఉత్పత్తులు, సేవలు సృష్టించడానికి ఒకటి కంటే ఎక్కువ దేశాలలో వ్యాపార అవకాశాలు కనుగొంటున్నాయి.

ప్రశ్న 4.
21వ శతాబ్దంలో వ్యాపార సంస్థలు ఎదుర్కొనే సవాళ్ళను తెలపండి.
జవాబు:
21వ శతాబ్దంలో వ్యాపార సంస్థలు ఈ క్రింది సవాళ్ళను ఎదుర్కోవాలి.
1) సాంకేతిక పరిజ్ఞానము సవాళ్ళు: సాంకేతిక పరిజ్ఞానములో వేగముగా వస్తున్న మార్పులు చిన్న వ్యాపార సంస్థలకు ఖర్చు, సమయము ఒక ముప్పుగా ఏర్పడినది. ఈ సంస్థలు సాంకేతిక పరిజ్ఞానములో వచ్చిన మార్పులకు అనుగుణముగా ప్లాంటు, యంత్రాలు, పరికరాలు, ఉత్పత్తి విధానాలను ఆధునీకరించుకుంటున్నాయి. లేకపోతే సంస్థలు తమ ఉనికిని కోల్పోయి, మార్కెట్ నుంచి తొలగిపోతాయి.

2) పెరుగుతున్న వినియోగదారుల అవగాహన : ఉత్పత్తులు, సేవల పట్ల వినియోగదారుల అవగాహన పెరుగుతున్నది. వినియోగదారులను ఆకర్షించేందుకు, మార్కెట్ వాటా కోల్పోకుండా నివారించేందుకు వినియోగదారుల డిమాండ్లకు స్పందించవలసిన అవసరమున్నది.

3) ప్రపంచీకరణ సవాళ్ళు : ప్రపంచీకరణ వ్యాపార వాతావరణములో మిశ్రమ సంస్కృతులు, భాషలు మొదలైన వ్యూహాత్మక సవాళ్ళకు దారితీసింది. ఫలితముగా ప్రపంచ పోటీ, వస్తు సేవల ధరలు పెరిగినవి.

4) సహజ వనరుల క్షీణత : చాలా రకములైన ఉత్పత్తి సంస్థలు సహజ వనరులు ముఖ్యంగా ముడి పదార్థాలపై ఆధారపడి ఉంటాయి. ఖనిజాలు, అడవులు, ఇంధనాలు, సారవంతమైన నేలలు మొదలైన సహజ వనరులు క్షీణించి పోవడం వలన రాబోయే కాలములో వ్యాపార సంస్థలపై దీని ప్రభావము ఉంటుంది.

AP Inter 1st Year Commerce Study Material Chapter 12 వ్యాపారంలో ప్రస్తుత ధోరణులు

5) ఆర్థిక మాంద్యము : ప్రపంచవ్యాప్తముగా అంతర్జాతీయ, ఆర్థిక, రాజకీయ వ్యవస్థ మార్పు చెందుతోంది. అమెరికా, ఐరోపాలో ప్రారంభమైన ఆర్థిక మాంద్యము ఇతర దేశాలలో పనితీరుపై ప్రభావాన్ని చూపుతోంది.

6) షర్యావరణ సవాళ్ళు : వ్యాపార సంస్థలు ఎదుర్కొంటున్న ముఖ్యమైన సవాళ్ళలో పర్యావరణ క్షీణత అతి పెద్ద సవాలు. ఆర్థిక, సాంఘిక, సామాజిక, రాజకీయ, సాంకేతిక పరిజ్ఞానానికి చెందిన పరిసరాలు వేగముగా మారుతున్నాయి.

7) సమాచార సవాళ్ళు : నిర్వహణ పరికరాలు, సాంకేతిక పరిజ్ఞానం బదిలీ చేసే ప్రక్రియలో భాగంగా ఇంటర్నెట్ ఉపయోగము, వైర్లెస్ సమాచారము, సాంకేతిక పరిజ్ఞానముతో కూడిన e – వాణిజ్యం వ్యాపార సంస్థలకు పెద్ద సవాళ్ళు. అత్యధిక ద్రవ్యోల్బణ రేటు, అధిక వడ్డీరేట్లు, తక్కువ ఆర్ధిక పెరుగుదల, నిత్యావసర వస్తువుల పెరుగుదల వ్యాపార సంస్థలను ప్రభావితం చేస్తున్నవి.

8) అవినీతి, అధికారుల అడ్డంకులు: ఈ రోజులలో అవినీతి అనేది వ్యాపార సంస్థలకు పెద్ద అడ్డంకి. దేశములో అవినీతి బాగా పాతుకొనిపోయి, రోజువారీ జీవితములో అనేక అంశాలను ప్రభావితం చేస్తున్నది.

9) పారదర్శకత, పరిపాలన : కార్పొరేటు పరిపాలన వ్యక్తుల, సంస్థల ఆసక్తులను కాపాడటానికి ఉపయోగ పడుతుంది. కార్పొరేటు సంస్థలు తీసుకునే నిర్ణయాలు, అవి పొందుపరుచుకున్న ఆసక్తులు ప్రభావాన్ని చూపుతాయి. కంపెనీల పరిపాలన, పారదర్శకత, ప్రభుత్వ నిఘా ఉంటుంది..

10) కార్పొరేటు సామాజిక బాధ్యత : CSR ఆచరణ, అమలులో అనేక సవాళ్ళను ఎదుర్కొంటోంది. CSR మన దేశములో ప్రారంభ దశలో ఉన్నది. CSR పై అవగాహన లేకపోవడం, శిక్షణ పొందిన ఉద్యోగుల తక్కువ సంఖ్య, విధాన అంశాలు, కవరేజి మొదలైన అంశాలు CSR కు అడ్డంకులు.

11) విదేశీ ద్రవ్యం మార్పిడి సమస్య: వ్యాపార సంస్థల నిర్వహణ సమస్యల విదేశీ మారకపు రేట్లలో అస్థిరత. ఇది మార్పిడిరేట్లు, ఎగుమతులు, దిగుమతులు, రాజకీయ అంశాల కారణముగా ఏర్పడినది.

12) మానవ వనరుల సవాళ్ళు : సరైన సిబ్బందిని నియమించడం, శిక్షణ ఇవ్వడం, వారిని నిలిపి ఉంచడం, HR విభాగపు నిధులు. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానము కారణముగా IT నైపుణ్యము, సమస్య పరిష్కార నైపుణ్యం, రీజనింగ్ నైపుణ్యం గల అర్హులైన సిబ్బందిని నియమించడానికి సంస్థలు సమస్యలను ఎదుర్కొంటున్నవి.

13) భద్రత సమస్యలు : e – కామర్స్, వర్చువల్ ఆఫీసు వ్యాప్తిలో ముప్పులు ఎదురవుతాయి. ఈ ముప్పులు సమాచార భద్రత, ఇంటర్నెట్ భద్రత, భౌతిక భద్రత, కంపెనీ wireless access నెట్వర్క్, చట్టాలలో గోప్యత మొదలైన రూపాలలో జరుగుతుంది.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
e – వ్యాపారం యొక్క పరిధిని వివరించండి.
జవాబు:
e – వ్యాపార పరిధి : e – వ్యాపారాన్ని క్రింది విధముగా విభజించవచ్చును.

  • ఒక వ్యాపార సంస్థలో మాత్రమే.
  • ఒక వ్యాపార సంస్థ మరొక వ్యాపార సంస్థ మధ్య వ్యవహారాలు.
  • ఒక వ్యాపార సంస్థ – వినియోగదారుని మధ్య వ్యవహారాలు
  • వినియోగదారుడు వినియోగదారుని మధ్య వ్యవహారాలు
  • వినియోగదారుడు – వ్యాపార సంస్థ మధ్య వ్యవహారాలు.

e – వ్యాపార పరిధి దిగువ అంశాలకు వర్తింపచేయడం జరుగుతుంది.
1) e – వాణిజ్యము : ఇంటర్నెట్ ద్వారా వ్యాపారాన్ని నిర్వహించడాన్ని e – వాణిజ్యము అంటారు. e వాణిజ్యానికి మంచి ఉదాహరణ ఆన్లైన్ ద్వారా వస్తువుల కొనుగోలు, అమ్మకము చేసే ప్రక్రియ.

AP Inter 1st Year Commerce Study Material Chapter 12 వ్యాపారంలో ప్రస్తుత ధోరణులు

2) e – వేలం : e – వేలములో సంబంధిత వెబ్సైటును సందర్శించి వేలంలో ప్రదర్శించిన వస్తువులను క్లిక్ చేస్తూ కొనుగోలు చేయవచ్చు. అదే విధముగా వెబ్ పేజీలో తమ వస్తువులను ఉంచి వేలం ద్వారా అమ్మకాలు చేయవచ్చు.

3) e – బ్యాంకింగ్ : ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ వెబ్సైట్ను ఉపయోగించి బ్యాంకు ఖాతాదారులు తమ అకౌంట్స్ నిర్వహించుకోవచ్చు. చెల్లింపులను చేయవచ్చు. అవసరమైన నగదును ATM ద్వారా పొందవచ్చు. ఖాతా నిల్వను – తెలుసుకోవచ్చు. నగదును బదిలీ చేయవచ్చు.

4) e – మార్కెటింగ్ : ఎలక్ట్రానిక్ మార్కెటింగ్ ఎలాంటి భౌగోళిక అడ్డంకులు లేకుండా వస్తువుల కొనుగోలుకు, అమ్మకాలకు ప్రపంచవ్యాప్తముగా మార్కెటింగ్ను ఏర్పాటు చేస్తుంది. ఖాతాదారుల డిమాండ్కు కంపెనీలు స్పందించేందుకు ఇంటర్నెట్ సహాయం చేస్తుంది.

5) e – వర్తకము : e – వర్తకాన్ని ఆన్లైన్ వర్తకము లేదా e – బ్రోకింగ్ అంటారు. ఇది స్టాక్ ఎక్స్ఛేంజ్లలో సెక్యూరిటీలను కొనడానికి, అమ్మడానికి ఉపయోగపడుతుంది.

ప్రశ్న 2.
e – వ్యాపారం వల్ల సంస్థలకు కలిగే ప్రయోజనాలు ఏవి ?
జవాబు:
e – వ్యాపారం వల్ల వ్యాపార సంస్థలకు కలిగే ప్రయోజనాలు :

  1. e – వ్యాపారము వలన సంస్థలు తమ ప్రస్తుత మార్కెట్ను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలకు విస్తరింపచేసుకోవచ్చు. ఇది సంస్థ యొక్క అమ్మకాలను పెంచుతుంది.
  2. e– వ్యాపారము వలన వస్తువులను లేదా సేవలను సృష్టించడము, ప్రాసెసింగ్ చేయడం, పంపిణీ చేయడం, స్టోరింగ్ చేయడం, సమాచారాన్ని సేకరించడానికి అయ్యే వ్యయం తగ్గుతుంది.
  3. ఇన్వెంటరీ నిల్వ చేయడానికి, ఓవర్హెడ్ ఖర్చులు తగ్గుతాయి.
  4. పెట్టుబడికి, వస్తు సేవల అమ్మకం వలన వచ్చే ఆదాయానికి మధ్య ఉన్న సమయం తగ్గుతుంది.
  5. బిజినెస్ ప్రాసెస్, రీ- ఇంజనీరింగ్లకు సహకరిస్తుంది.
  6. టెలీ కమ్యూనికేషన్ ఖర్చు తక్కువగా ఉండటం వలన ఇంటర్నెట్ విలువ ఆధారిత నెట్వర్క్ వ్యయము కంటే తక్కువగా ఉంటుంది.

ప్రశ్న 3.
e – వ్యాపారం వల్ల వినియోగదారులకు కలిగే ప్రయోజనాలు ఏవి ?
జవాబు:
e – వ్యాపారం వల్ల వినియోగదారులకు కలిగే ప్రయోజనాలు :

  1. e – వ్యాపారము వలన వినియోగదారులు ఏ ప్రాంతం నుంచి అయినా, ఏ సమయంలోనైనా వ్యాపార వ్యవహారాలు నిర్వహించవచ్చు.
  2. e – వ్యాపారము వినియోగదారులకు వస్తు సేవలకు సంబంధించి, అనేక ప్రత్యామ్నాయాలు, అవకాశాలు కల్పిస్తాయి.
  3. e – వ్యాపారము ద్వారా వినియోగదారుడు అనేక ప్రాంతాలలోని మార్కెట్లలో వస్తు సేవలను పోల్చి చూసుకోవడానికి వీలవుతుంది.
  4. e- వ్యాపారము వస్తు సేవలు త్వరగా డెలివరీ కావడానికి దోహదము చేస్తుంది.
  5. వినియోగదారుడు వస్తు సేవలకు సంబంధించి సరైన సమాచారాన్ని పూర్తి స్థాయిలో క్షణాలలో పొందవచ్చును.
  6. వినియోగదారుడు సరైన వేలములో పాల్గొనేందుకు e – వ్యాపారము సహాయపడుతుంది.
  7. e– వ్యాపారము వినియోగదారుల మధ్య సహకారాన్ని ఏర్పరచి, ఒకరికొకరు వ్యాపార ఉపాయాలు, అనుభవాలు పంచుకునేటట్లు చేస్తుంది.
  8. e- వ్యాపారము వ్యాపారం మధ్య పోటీ తత్వాన్ని ఏర్పరచి, వినియోగదారులకు సరైన డిస్కౌంట్లు లభించేందుకు సహకరిస్తుంది.

AP Inter 1st Year Commerce Study Material Chapter 12 వ్యాపారంలో ప్రస్తుత ధోరణులు

ప్రశ్న 4.
e – వ్యాపార వ్యవహారాలలో కలిగే నష్ట భయాలను తెలపండి.
జవాబు:
e – వ్యాపార వ్యవహారాలలో కలిగే నష్ట భయాలు :

  1. ఇంటర్నెట్ వాడకములో సమాచారము అనధికారికముగా మార్చివేయబడడం. అనే నష్టభయమున్నది.
  2. రహస్యముగా ఉంచవలసిన వ్యక్తిగత సమాచారము మరియు క్రెడిట్ కార్డు వివరాలు, పాస్వర్డ్ లాంటి బ్యాంకింగ్ సమాచారానికి సంబంధించిన నష్టభయాలు.
  3. e – వాణిజ్యం ద్వారా జరిగే వ్యవహారాలకు భౌతిక ఆధారాలు లేని కారణముగా చట్టబద్ధతకు సంబంధించిన నష్టభయాలు ఎక్కువ.
  4. ఎలక్ట్రానిక్ సమాచారం అందించడములో వైఫల్యం, మొత్తము వ్యాపారము ముగింపుకు దారితీసే నష్టభయాలు.
  5. నిర్వాహక వర్గం, e – వాణిజ్య వ్యవహారాలు తన అదుపులో ఉంచుకొని, సరి చూసుకొని మరియు తగిన సమాచార పద్ధతులు ఎంచుకోవడంలోని నష్ట భయాలు.
  6. వైరస్లు, హ్యాగింగ్ంటి సాంకేతికపరమైన నష్ట భయాలు.

ప్రశ్న 5.
e – వ్యాపార వ్యవహారాల వల్ల సమాజానికి కలిగే ప్రయోజనాలను తెలపండి.
జవాబు:
e – వ్యాపారము వల్ల సమాజానికి కలిగే ప్రయోజనాలు :

  1. ఇంటినుంచే పనిచేసుకోవడానికి అవకాశము ఉండటం వలన షాపింగ్ కోసము ప్రయాణాలు తగ్గుతాయి. రోడ్లపై ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయి. దీనివలన వాయు కాలుష్యం తగ్గుతుంది. అంతేకాకుండా సమయము కూడా ఆదా అవుతుంది.
  2. వ్యాపారస్తులు తమ వస్తువులను ఇంటర్ నెట్ ద్వారా తక్కువ ధరలకు అమ్మడం వలన పేదవారికి ప్రయోజనం లభిస్తుంది.
  3. ప్రపంచ దేశాలలో, గ్రామీణ ప్రాంతాలలో ఉండే ప్రజలకు, మార్కెట్ లో లభించని వస్తు సేవలను e – వ్యాపారము ద్వారా పొందవచ్చు.
  4. వస్తు సేవలు తక్కువ వ్యయానికి లభించడమే కాకుండా, వాటి మన్నిక, నాణ్యత కూడా పెరుగుతుంది.

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
e – వ్యాపారం
జవాబు:
వ్యాపారము e- వ్యాపారం అనే పదాన్ని మొదటిసారిగా 1997లో IBM ఉపయోగించినది. దీని ప్రకారము e- అంటే ‘ఇంటర్నెట్ పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ ముఖ్యమైన వ్యాపార దశలను బదలాయింపు చేయడం’. అన్ని వ్యాపార కార్యకలాపాలను, వ్యాపార పరిధిని బలపరచడానికి Information and Communication Technology సహకారాన్ని ఇంటర్నెట్ల ద్వారా తీసుకోవడం – వ్యాపారముగా నిర్వచించవచ్చు.

 

ప్రశ్న 2.
e – బ్యాంకింగ్ [T.S. Mar 15]
జవాబు:
ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ మంచి విజయవంతమైన ఆన్లైన్ వ్యాపారము. బ్యాంకింగ్ వెబ్సైట్ను ఉపయోగిస్తూ బ్యాంకు ఖాతాదారులు తమ అకౌంట్స్ నిర్వహించుకోవడానికి, చెల్లింపులు, ఆజ్ఞ ఇవ్వడానికి e-బ్యాంకింగ్ సహాయము చేస్తుంది. ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా ఖాతాదారులు బ్యాంకును సందర్శించనవసరము లేకుండా అవసరమైన నగదును | ATM ద్వారా పొందవచ్చును. ఖాతా నిల్వలు తెలుసుకోవచ్చు. బిల్లులను చెల్లించవచ్చు. నగదును బదిలీ చేయవచ్చు.

ప్రశ్న 3.
e – మార్కెటింగ్ [A.P. Mar. ’15]
జవాబు:
ఎలక్ట్రానిక్ మార్కెటింగ్లో ఎలాంటి భౌగోళిక అడ్డంకులు లేకుండా వస్తువుల కొనుగోలుకు, అమ్మకాలకు ప్రపంచ వ్యాప్తముగా మార్కెటింగ్ ఏర్పాటు చేస్తుంది. ఎలాంటి సమయ భావన లేకుండా ఖాతాదారుల డిమాండ్కు కంపెనీ స్పందించేందుకు ఇంటర్నెట్ సహాయము చేస్తుంది. దీనికి వినియోగదారుడు ఉండే ప్రాంతముతో సంబంధం లేదు.

AP Inter 1st Year Commerce Study Material Chapter 12 వ్యాపారంలో ప్రస్తుత ధోరణులు

ప్రశ్న 4.
e – వాణిజ్యం
జవాబు:
ఇంటర్నెట్ ద్వారా వ్యాపారాన్ని నిర్వహించడాన్ని e-వాణిజ్యము అంటారు. ఎలక్ట్రానిక్ వాణిజ్యమును e – వాణిజ్యం · అని వ్యవహరిస్తారు. ఆన్లైన్ ద్వారా వస్తువుల కొనుగోలు, అమ్మకం చేసే ప్రక్రియ దీనికి మంచి ఉదాహరణ. అంతేకాకుండా e-వాణిజ్యములో అనేక కార్యకలాపాలు కలిసి ఉంటాయి. ఏదైనా కార్యకలాపాన్ని ఎలక్ట్రానిక్ పరికరము ద్వారా నిర్వహించడాన్ని e- వాణిజ్యం అనవచ్చు.

ప్రశ్న 5.
e – వర్తకం
జవాబు:
e-వర్తకాన్ని ఆన్లైన్ వర్తకమని, e- బ్రోకింగ్ అని కూడా వ్యవహరిస్తారు. ఇది స్టాక్ ఎక్స్ఛేంజ్లలో సెక్యూరిటీలను అమ్మడానికి, కొనడానికి సహాయపడుతుంది.

AP Inter 1st Year Commerce Study Material Chapter 11 బహుళ జాతి సంస్థలు

Andhra Pradesh BIEAP AP Inter 1st Year Commerce Study Material 11th Lesson బహుళ జాతి సంస్థలు Textbook Questions and Answers.

AP Inter 1st Year Commerce Study Material 11th Lesson బహుళ జాతి సంస్థలు

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
బహుళజాతి సంస్థలను నిర్వచించి, వాటి లక్షణాలను వివరించండి.
జవాబు:
ఒక దేశములో నిర్వహణ కార్యాలయము ఉండి, ఇతర దేశాలలో వ్యాపార కార్యకలాపాలను నిర్వహించినట్లయితే ఆ సంస్థలను బహుళజాతీయ సంస్థలు అంటారు. ఈ బహుళజాతి సంస్థలను మల్టీనేషనల్ సంస్థలని, గ్లోబల్ సంస్థలని లేదా అంతర్జాతీయ సంస్థలని వేరు వేరు పేర్లతో పిలవబడతాయి. పెప్సీ, హుండాయి, నైక్, రీబాక్, ఎల్.జి, సామ్సంగ్ బహుళ జాతి సంస్థలకు ఉదాహరణలు.

నిర్వచనాలు: ఏదైనా సంస్థ తన ఉత్పత్తి కార్యకలాపాలను తన మాతృదేశముతోపాటు ఇతర దేశాలకు విస్తరింపజేస్తే అలాంటి సంస్థను బహుళజాతి సంస్థ అంటారు.

అంతర్జాతీయ శ్రామిక నివేదిక ప్రకారము ‘ఒక దేశములో నిర్వహణ కార్యాలయము ఉండి, అనేక ఇతర దేశాలతో వ్యాపార కార్యకలాపాలను నిర్వహించే సంస్థనే బహుళజాతి సంస్థ’ అంటారు. విదేశమారక నియంత్రణ చట్టము 1973 ప్రకారము, 1) రెండు లేదా అంతకంటే ఎక్కువ దేశాలలో తమ అనుబంధ సంస్థగాని, శాఖగాని ఉన్న సంస్థ. 2) రెండు లేదా అంతకంటే ఎక్కువ దేశాలలో తమ వ్యాపార కార్యకలాపములను కొనసాగించే. సంస్థను బహుళజాతి సంస్థ అంటారు.

బహుళజాతి సంస్థల లక్షణాలు:
1. అధిక పరిమాణము: బహుళజాతి సంస్థల ఆస్తులు, అమ్మకాలు అధిక పరిమాణము కలిగి ఉంటాయి. ఈ సంస్థల అమ్మకాల టర్నోవర్ అభివృద్ధి చెందుతున్న అనేక దేశాల స్థూల జాతీయ ఉత్పత్తి కంటే ఎక్కువగా ఉంటుంది. ఉదా: IBM నిజ ఆస్తులు 8 బిలియన్ల డాలర్ల కంటే ఎక్కువ.

2. ప్రపంచ వ్యాప్తముగా కార్యకలాపాలు: ప్రపంచములో వివిధ దేశాలలో బహుళజాతీయ సంస్థలు తమ ఉత్పత్తి, మార్కెటింగ్ కార్యకలాపాలను నిర్వహిస్తాయి. వీటికి ఎన్నో దేశాలలో బ్రాంచీలు, అనుబంధ సంస్థలు, కర్మాగారాలు, కార్యాలయాలు ఉంటాయి. ఉదా: కోకోకోలా, ఆపిల్ సంస్థలు, మన దేశానికి చెందిన ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, రెడ్డి లాబ్స్ వంటివి ప్రపంచ వ్యాప్తముగా విస్తరించినవి.

AP Inter 1st Year Commerce Study Material Chapter 11 బహుళ జాతి సంస్థలు

3. కేంద్రీకృత నియంత్రణ: వివిధ దేశాలలో ఉన్న బహుళ జాతిసంస్థల బ్రాంచీలు లేదా అనుబంధ సంస్థలు ప్రధాన కార్యాలయము యొక్క పర్యవేక్షణ, మార్గదర్శకత్వము, నియంత్రణలో పనిచేస్తాయి.

4. నిర్వహణలో నైపుణ్యము: బహుళజాతి సంస్థలు సమర్థవంతమైన మేనేజర్లను, అనుభవము ఉన్నవారి సేవలను ఉపయోగించుకుంటాయి. కాబట్టి ఈ సంస్థలు వృత్తిపరమైన ‘నిర్వహణ ద్వారా తమ కార్యకలాపములను మార్కెట్లో విజయవంతముగా నిర్వహిస్తారు.

5. అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానము: బహుళజాతి సంస్థలకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానము అందుబాటులో ఉండటము వలన వినియోగదారులకు నాణ్యమైన వస్తుసేవలను అందించటం జరుగుతుంది.

6. ప్రముఖమైన స్థానము, హోదా: బహుళజాతి సంస్థల పరిమాణము, ఆస్తులు, అమ్మకాలు, చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ సంస్థలు వ్యాపారము కొనసాగిస్తున్న దేశాలలో మార్కేట్ను నియంత్రించడమే కాక ప్రముఖమైన స్థానాన్ని, హోదాను కలిగి ఉంటాయి.

7. అంతర్జాతీయ మార్కెట్లో ప్రవేశము: బహుళజాతీయ సంస్థలకు ఉన్న మూలధనము, సాంకేతిక పరిజ్ఞానము, నైపుణ్యాల బదిలీ ద్వారా సులభముగా అంతర్జాతీయ మార్కెట్లోనికి చొచ్చుకొనిపోతాయి.

ప్రశ్న 2.
బహుళజాతి సంస్థలను నిర్వచించి, వాటి ప్రయోజనాలను వివరించండి.
జవాబు:
ఏదైనా సంస్థ తన ఉత్పత్తి కార్యకలాపాల వలన తన మాతృదేశముతో పాటు ఇతర దేశాలకు విస్తరింపజేస్తే అలాంటి సంస్థను బహుళజాతి సంస్థ అంటారు. ILO నివేదిక ప్రకారము ‘ఒక దేశములో నిర్వహణ కార్యాలయము ఉండి, అనేక ఇతర దేశాలతో కార్యకలాపాలను నిర్వహించే సంస్థనే బహుళజాతి సంస్థ’ అంటారు.
బహుళజాతి సంస్థల ప్రయోజనాలు: బహుళజాతి సంస్థల వలన అతిథి దేశాలకు ఈ క్రింది ప్రయోజనాలు కలుగుతాయి.

  1. అభివృద్ధి చెందుతున్న దేశాలలో మూలధన కొరతను తగ్గించడానికి బహుళజాతి సంస్థలు ఆయాదేశాలలో పరిశ్రమల అభివృద్ధికి అవసరమైన మూలధనాన్ని సమకూరుస్తాయి.
  2. అతిథి దేశాలలో బహుళజాతి సంస్థలు ఉద్యోగ అవకాశాలు కల్పించి, ఆకర్షణీయమైన వేతనాలు చెల్లిస్తారు. ఆదాయము పెంపుదల జరుగుతుంది.
  3. ఈ సంస్థల వలన అతిథి దేశాలు, విదేశాల నుంచి నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని పొందుతాయి.
  4. వృత్తిపరమైన నిర్వహణను చేపట్టడంవలన అతిథి దేశాలు నిర్వహణా సామర్థ్యాన్ని పెంపొందించుకోగలవు.
  5. ఎగుమతులను పెంచి దిగుమతులను తగ్గించడం ద్వారా ఆ దేశము చెల్లింపు నిల్వ స్థాయి మెరుగవుతుంది. విదేశీమారక నిల్వలలో ఆదాలను పొందడం బహుళజాతి సంస్థల ద్వారానే సాధ్యమవుతుంది.
  6. బహుళ సంస్థలు ఆయా దేశాలలో నెలకొని ఉన్న ఏకస్వామ్యాన్ని అడ్డుకోవడంవలన ఆయా దేశాలలో పనిచేసే సాంప్రదాయాలను, పని వాతావరణము సృష్టించడమే కాకుండా, వినియోగదారులకు నాణ్యమైన సేవలను అందించడానికి కూడా వీలవుతుంది.
  7. బహుళజాతి సంస్థల కార్యకలాపాలవలన అతిథి దేశాలలో వ్యాపారస్తులు, పంపిణీదారులు, వర్తక మధ్యవర్తులు తమ వ్యాపార కార్యకలాపాలను ‘ విస్తృతపరుచుకుంటాయి.
  8. బహుళజాతి సంస్థలవలన, స్వదేశీ సంస్థలు పరిశోధన, అభివృద్ధి ప్రయోజనాలను పొందుతాయి.
  9. బహుళజాతి సంస్థలు ఆయాదేశాలలో నాణ్యమైన వస్తుసేవలను అందించడం ద్వారా వినియోగదారులకు కొనుగోలుశక్తి పెరిగి జీవన ప్రమాణస్థాయి మెరుగవుతుంది.
  10. బహుళజాతి సంస్థల వలన అతిథి దేశాలు పారిశ్రామిక ఆర్థిక పురోభివృద్ధిని సాధిస్తాయి.

స్వదేశాలకు కలిగే ప్రయోజనాలు: బహుళజాతి సంస్థలవలన స్వదేశాలకు ఈ క్రింది ప్రయోజనాలు కలుగుతాయి.

  1. బహుళజాతి సంస్థలు స్వదేశములో తయారైన వస్తువులు ప్రపంచమంతటా మార్కెటింగ్ చేసి అమ్మడానికి అవకాశాలు కల్పిస్తాయి.
  2. ఈ సంస్థలు స్వదేశములోని ప్రజలకు ఉద్యోగ అవకాశాలను స్వదేశములోను, ఇతర దేశాలలో కల్పిస్తాయి.
  3. బహుళజాతి సంస్థలు ముడి సరుకు, శ్రమ, భూమి మొదలైన వనరులు పొంది, స్వదేశములో వస్తువులను తక్కువ ధరకు లభించేటట్లు చేస్తాయి.
  4. స్వదేశ కంపెనీలు ఎగుమతులను చేపట్టడానికి అవసరమైన చేయూతను బహుళజాతి సంస్థల ద్వారా పొందగలుగుతున్నాయి. దీని వలన దీర్ఘకాలములో అనుకూల చెల్లింపుల శేషాన్ని సాధించవచ్చు.
  5. ఈ సంస్థలు స్వదేశములో పారిశ్రామికాభివృద్ధిని సాధించి ఉత్పత్తులను ప్రోత్సహిస్తాయి.
  6. అతిథి దేశాల నుంచి డివిడెండు, లైసెన్స్ ఫీజు, రాయల్టీలు మొదలైనవి పొందుతాయి. కాబట్టి స్వదేశ ఆరాయము పెంచుకోవడానికి వీలు అవుతుంది.
  7. ఈ సంస్థల వలన స్వదేశములో విదేశీ సంస్కృతుల వలన వచ్చే ఆదాలు చేకూరుతాయి.

AP Inter 1st Year Commerce Study Material Chapter 11 బహుళ జాతి సంస్థలు

ప్రశ్న 3.
బహుళజాతి సంస్థలను నిర్వచించి, వాటి పరిమితులు/నష్టాలను వివరించండి.
జవాబు:
ఏదైనా సంస్థ తన ఉత్పత్తి కార్యకలాపాల వలన తన మాతృదేశముతోపాటు ఇతర దేశాలకు విస్తరింపజేస్తే అలాంటి సంస్థను బహుళజాతి సంస్థ అంటారు. ILO నివేదిక ప్రకారము “ఒక దేశములో నిర్వహణ కార్యాలయం ఉండి అనేక ఇతర దేశాలతో కార్యకలాపాలను నిర్వహించే సంస్థను బహుళ జాతీయ సంస్థ” అంటారు.
బహుళజాతి సంస్థల వలన పరిమితులు / అతిథి దేశాలకు బహుళజాతి సంస్థల వలన పరిమితులు:

  1. బహుళజాతి సంస్థలు అతిథి దేశాలలోని పెద్ద పెద్ద వ్యాపార సంస్థలతో కలసి, ఏకస్వామ్యాన్ని సృష్టించి, ఆర్థికశక్తుల కేంద్రీకరణకు దోహదపడతాయి.
  2. బహుళజాతి సంస్థలు, తమ దేశములో పాతబడిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అతిథి దేశాలకు బదిలీచేయడానికి ప్రయత్నము చేస్తాయి.
  3. బహుళజాతి సంస్థలు ఆయా దేశాల రాజకీయ వ్యవహారాలలో జోక్యం చేసుకొని, అంతర్గత సమస్యలను సృష్టించడంవలన దేశ సార్వభౌమాధికారానికి భంగం కలిగించవచ్చును.
  4. లాభాలను సంపాదించే క్రమములో, బహుళజాతి సంస్థలు అతిథి దేశములోని సహజ వనరులను విచక్షణా రహితముగా వినియోగించడమువలన ఆ దేశాలలో సహజవనరులు తగ్గి క్షీణిస్తాయి.
  5. లాభాలు, డివిడెండ్లు, రాయల్టీ చెల్లింపు రూపములో, పెద్ద మొత్తములో ద్రవ్యము విదేశాలకు ప్రవహిస్తుంది. దీనివలన ఆ దేశ విదేశ మారకములో విపరీత మార్పులు చోటుచేసుకుంటాయి.
  6. అతిథి దేశాల ఉద్దేశాలను, ప్రాముఖ్యతను బహుళజాతి సంస్థలు పట్టించుకోవు. తమకు లాభదాయకమైన యూనిట్లలో పెట్టుబడిపెడతాయి.
  7. అతిథి దేశాలతో అనుసంధానాలు ఏర్పాటు చేసుకున్నప్పుడు బహుళజాతి సంస్థలు అనేక ఆంక్షలు విధిస్తుంది.
  8. బహుళజాతి సంస్థలు ప్రజల యొక్క అలవాట్లను, కోర్కెలను, ఫ్యాషన్లను మార్చి, విదేశీ సంస్కృతిని వ్యాపింపజేస్తాయి.

స్వదేశానికి బహుళజాతి సంస్థల వలన నష్టాలు:

  1. బహుళజాతి సంస్థలు స్వదేశము నుంచి వివిధ అతిథి దేశాలకు మూలధన మార్పిడి చేయడమువలన స్వదేశములో ప్రతికూల చెల్లింపుల శేషము జరగవచ్చు.
  2. బహుళజాతి సంస్థలు పక్షపాత ధోరణి అవలంబించడం వలన స్వదేశములోని ప్రజలకు ఉద్యోగ అవకాశాలను సృష్టించలేవు.
  3. విదేశాలలో పెట్టుబడి లాభదాయకముగా ఉండటంవలన, బహుళజాతి సంస్థలు స్వదేశములో పారిశ్రామికాభివృద్ధిని నిర్లక్ష్యము చేస్తాయి.

ప్రశ్న 4.
ప్రపంచీకరణ అంటే ఏమిటి ? దాని ఆవశ్యకతను వివరించండి.
జవాబు:
ప్రపంచము స్వయం పోషక జాతీయ ఆర్థిక వ్యవస్థల నుంచి క్రమముగా పరస్పరం ఆధారపడిన సమీకృత ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దిశగా కదులుతున్నది. దీనినే ప్రపంచీకరణగా వ్యవహరించడం జరుగుతుంది. ఒక దేశ ఆర్థిక వ్యవస్థ కార్యకలాపాల పరిధిని విదేశాలకు కూడా విస్తరించే విధానమే ప్రపంచీకరణ. ఉత్పత్తి కారకాలకు ప్రపంచవ్యాప్తముగా సంపూర్ణమైన గమనశీలతను ఏర్పరచడమే ప్రపంచీకరణ. ఒకదేశ ఆర్థిక వ్యవస్థను ప్రపంచ ఆర్థికవ్యవస్థలలో అనుసంధానము చేసి ప్రపంచాన్ని ఏకైక అంతర్జాతీయ మార్కెట్గా రూపొందించడమే ప్రపంచీకరణ లక్ష్యము. దీనివలన ప్రపంచ దేశాల మధ్య దూరము తగ్గి ప్రపంచమంతా ఒక గ్రామముగా మారే అవకాశము ఉన్నది.

AP Inter 1st Year Commerce Study Material Chapter 11 బహుళ జాతి సంస్థలు

అభివృద్ధి చెందిన దేశాల ఆర్థిక శాస్త్రవేత్తలు ప్రపంచీకరణను ఈ విధముగా నిర్వచించినారు. “స్వేచ్ఛా వాణిజ్య విధానము, పెట్టుబడి, సాంకేతిక పరిజ్ఞానము, శ్రామికుల గమనశీలత”. ప్రపంచీకరణలో నాలుగు లక్షణాలు ఉన్నవి. అవి:

  1. ఆటంకాలు లేని వర్తక ప్రవాహాలు: దేశ సరిహద్దులు దాటి వస్తువుల ప్రవాహాలు స్వేచ్ఛగా జరగడానికి అనుమతులు తేలికగా లభించేటట్లుగా వర్తక అవరోధాలను తగ్గించుట.
  2. మూలధన ప్రవాహాలు: వివిధ దేశాల మధ్య మూలధనము స్వేచ్ఛగా ప్రవేశించడానికి వీలుగా వాతావరణాన్ని సృష్టించడం.
  3. సాంకేతిక విజ్ఞానాల ప్రవాహము: సాంకేతిక విద్య, విజ్ఞానము ఒక ప్రాంతము నుంచి మరొక ప్రాంతానికి, ఒక దేశము నుంచి మరొక దేశానికి స్వేచ్ఛగా ప్రవేశించడానికి అనువైన వాతావరణము.
  4. ఆటంకములేని శ్రామికుల గమనము: ప్రపంచములోని వివిధ దేశాలమధ్య శ్రామికుల స్వేచ్ఛాగమనాన్ని ప్రోత్సహించే విధముగా వాతావరణమును సృష్టించడము.

ప్రపంచీకరణలో రెండు రూపాలున్నవి. 1) మార్కెట్ను ప్రపంచీకరించడం, 2) ఉత్పత్తిని ప్రపంచీకరించడం.

మార్కెట్ను ప్రపంచీకరించడం అంటే జాతీయ మార్కెట్లను ఒక ప్రపంచ మార్కెట్ కలిపివేయడం ద్వారా వ్యాపార ఆటంకాలు తగ్గి, అంతర్జాతీయ విక్రయాలు సులభతరము అవుతాయి. వినియోగదారుల అభిరుచులు, ఇష్టాలు ఒక ప్రపంచక్రమానుసారము ఐక్యం అవుతుంది. సంస్థలు సారూప్యత గల ప్రధాన వస్తువులను ప్రపంచవ్యాప్తముగా అందిస్తూ ప్రపంచమార్కెట్కు దోహదపడతాయి.

ఉత్పత్తిని ప్రపంచీకరించడం అంటే వస్తుసేవల ఉత్పత్తి కేంద్రాలను ఉత్పత్తికారకములైన శ్రమ, భూమి, మూలధనమును ప్రపంచములోని వివిధ ప్రాంతాలకు వ్యాపింపచేయడం. కంపెనీలు వ్యయమును తగ్గించుట ద్వారా, నాణ్యతను పెంచడంద్వారా వస్తు సేవలను అందించడములో వాటి పనితీరును మెరుగుపరుచుకుంటాయి.
ప్రపంచీకరణకు రెండు కారకాలు ఉంటాయి. 1) తక్కువ వర్తక ఆటంకాలు. 2) సాంకేతికపరమైన మార్పులు. సాంకేతిక మార్పులు టెలీకమ్యూనికేషన్స్ మరియు మైక్రోప్రాసెసర్స్, ప్రపంచవ్యాప్త వెబ్, రవాణాలో పురోగతులు సంభవించినవి. రవాణా వ్యయాలను తగ్గించి, సంస్థలు తమకు ఆర్థికముగా భౌగోళికముగా, అనుకూలముగా ఉన్న ప్రాంతాలకు వ్యాప్తిచెందేలా చేశాయి. సమాచారాన్ని సేకరించడానికి, విశ్లేషించడానికి, అందించడానికి అయ్యే వ్యయాలను తగ్గించడం ద్వారా ప్రపంచవ్యాప్తమైన ఉత్పత్తి సంవిధానాన్ని సంస్థలు సమర్థవంతముగా నిర్వహించేలా చేశాయి.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
బహుళజాతి సంస్థల అర్థాన్ని వివరించండి.
జవాబు:
Multinational అనే పదము రెండు పదముల కలయిక. అవి Multi మరియు National. Multi అంటే అనేకము, బహుళ అని అర్థము. National అంటే జాతి, దేశము అని అర్ధము. కాబట్టి బహుళజాతి సంస్థలు అంటే వివిధ దేశాలలో నడపబడుతున్న లేదా నిర్వహించబడుతున్న సంస్థ అని అర్ధము. ఆ కంపెనీకి ఒక దేశము కంటే ఎక్కువ దేశాలలో ఫ్యాక్టరీలు, బ్రాంచీలు లేదా ఆఫీసులు ఉంటాయి. యునైటెడ్ నేషన్స్ కమీషన్ ప్రకారము బహుళజాతి సంస్థ అంటే నమోదుచేసిన దేశములో కాకుండా అదనముగా ఒకటి లేదా అంతకంటే ఎక్కువ దేశాలలో నిర్వహింపబడుతున్న సంస్థ అని అర్ధము.

బహుళజాతి సంస్థ అంటే కంపెనీల పరంపర లేదా కంపెనీల శ్రేణి అని అర్థము. ఈ కంపెనీలన్నీ ఏకకాలములో వివిధ దేశాలలో నిర్వహింపబడతాయి. అందువలన ఈ కంపెనీలన్నీ వివిధ దేశాల అధికార పరిధులలో పనిచేస్తాయి. కంప్యూటీకరణ మరియు కమ్యూనికేషన్లో అభ్యుదయ ఆధారముగా ఏర్పడిన రెండవ పారిశ్రామిక విప్లవము ఫలితమే బహుళజాతి సంస్థ.

AP Inter 1st Year Commerce Study Material Chapter 11 బహుళ జాతి సంస్థలు

ప్రశ్న 2.
బహుళజాతి సంస్థల లక్షణాలను పేర్కొనండి.
జవాబు:
బహుళజాతి సంస్థల లక్షణాలు:
1. అధిక పరిమాణము: బహుళజాతి సంస్థల ఆస్తులు, అమ్మకాలు, అధిక పరిమాణములో ఉంటాయి. ఈ సంస్థల అమ్మకాల టర్నోవర్ అభివృద్ధి చెందుతున్న దేశాల స్థూల జాతీయ ఉత్పత్తికంటే ఎక్కువ. ఉదా: IBM నిజ ఆస్తులు 8 బిలియన్ల డాలర్ల కంటే ఎక్కువ.

2. ప్రపంచవ్యాప్తముగా కార్యకలాపాలు ప్రపంచములో వివిధ దేశాలలో బహుళజాతి సంస్థలు తమ ఉత్పత్తి, మార్కెటింగ్ కార్యకలాపాలను నిర్వహిస్తాయి. వీటికి ఎన్నో దేశాలలో బ్రాంచీలు, అనుబంధ సంస్థలు, కర్మాగారాలు, కార్యాలయాలు ఉంటాయి. ఉదా: కోకోకోలా, ఆపిల్ సంస్థలు, ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, రెడ్డి లాబ్స్ వంటివి ప్రపంచవ్యాప్తముగా విస్తరించినవి.

3. కేంద్రీకృత నియంత్రణ: వివిధ దేశాలలో ఉన్న బహుళజాతి సంస్థల బ్రాంచీలు లేదా అనుబంధ సంస్థలు ప్రధాన కార్యాలయం యొక్క పర్యవేక్షణ, మార్గదర్శకత్వం, నియంత్రణలో పనిచేస్తాయి.

4. నిర్వహణలో నైపుణ్యము: బహుళజాతి సంస్థలు సమర్థవంతమైన మేనేజర్లు, అనుభవము కలవారి సేవలను ఉపయోగించుకుంటాయి. కాబట్టి ఈ సంస్థలు వృత్తిపరమైన నిర్వహణ ద్వారా తమ కార్యకలాపాలను మార్కెట్లో విజయవంతముగా నిర్వహిస్తాయి.

5. అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానము: బహుళజాతి సంస్థలకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానము అందుబాటులో ఉంటుంది కాబట్టి వినియోగదారులకు నాణ్యమైన వస్తుసేవలను అందించడం జరుగుతుంది. 6. ప్రముఖమైన స్థానము, హోదా: బహుళజాతి సంస్థల పరిమాణము, ఆస్తులు, అమ్మకాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వ్యాపారము కొనసాగిస్తున్న దేశాలలో మార్కెట్ను నియంత్రించడమే కాకుండా ప్రముఖమైన స్థానాన్ని, హోదాను కలిగి ఉంటాయి.

ప్రశ్న 3.
బహుళజాతి సంస్థల వల్ల అతిథి దేశానికి కలిగే ఏవైనా నాలుగు ప్రయోజనాలను వివరించండి.
జవాబు:
బహుళజాతి సంస్థల వలన అతిథి దేశానికి ప్రయోజనాలు:

  1. మూలధనము సమకూర్చడము: అభివృద్ధి చెందుతున్న దేశాలలో మూలధనము కొరతను తగ్గించడానికి బహుళజాతి సంస్థలు ఆయాదేశాల పారిశ్రామికాభివృద్ధికి అవసరమైన మూలధనాన్ని సమకూరుస్తాయి.
  2. సాంకేతిక పరిజ్ఞానము బదిలీ: బహుళజాతి సంస్థల ద్వారా సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చెందుతున్న దేశాలు సులభముగా బదిలీ చేసుకొనగలుగుతాయి.
  3. ఉద్యోగాల లభ్యత: అతిథి దేశాలలో బహుళజాతి సంస్థలు ఉద్యోగ అవకాశాలను కల్పించి, ఆకర్షణీయమైన వేతనాలను అందిస్తాయి.
  4. విదేశమారకము: ఎగుమతులను పెంచి, దిగుమతులను తగ్గించడం ద్వారా ఆ దేశము యొక్క చెల్లింపు నిల్వల స్థాయి మెరుగవుతుంది. విదేశమారకము నిల్వలలో ఆదాలను పొందడం బహుళజాతి సంస్థల ద్వారా సాధ్యమవుతుందీ.

ప్రశ్న 4.
బహుళజాతి సంస్థల వల్ల స్వదేశానికి కలిగే ఏవైనా నాలుగు ప్రయోజనాలను వివరించండి. [T.S. Mar. ’15]
జవాబు:

  1. బహుళజాతి సంస్థలు స్వదేశములో తయారైన వస్తువులు ప్రపంచమంతటా మార్కెటింగ్ చేసి అమ్మడానికి అవకాశాలను కల్పిస్తాయి.
  2. ఈ సంస్థలు స్వదేశములోని ప్రజలకు ఉద్యోగ అవకాశాలను స్వదేశములోనూ, ఇతర దేశాలలో కల్పిస్తాయి.
  3. బహుళజాతి సంస్థలు ముడిసరుకు, శ్రమ, భూమి మొదలైన వనరులను పొంది, స్వదేశములో వస్తువులను తక్కువ ధరకు లభించేటట్లు చేస్తాయి.
  4. స్వదేశ కంపెనీలు ఎగుమతులను చేపట్టడానికి అవసరమైన చేయూతను బహుళజాతి సంస్థల ద్వారా పొందగలుగుతున్నాయి. దీని వలన దీర్ఘకాలములో అనుకూల చెల్లింపుల శేషాన్ని సాధించవచ్చును.

AP Inter 1st Year Commerce Study Material Chapter 11 బహుళ జాతి సంస్థలు

ప్రశ్న 5.
బహుళజాతి సంస్థల వల్ల అతిథి దేశానికి ఉన్న నష్టాలను వివరించండి. [A.P. Mar. ’15]
జవాబు:
బహుళజాతి సంస్థల వల్ల అతిథి దేశానికి కలిగే నష్టాలు:

  1. బహుళజాతి సంస్థలు అతిథి దేశాలలో పెద్దపెద్ద వ్యాపార సంస్థలతో కలిసి, ఏకస్వామ్యాన్ని సృష్టించి, ఆర్థిక శక్తుల కేంద్రీకరణకు దోహదపడుతుంది.
  2. బహుళజాతి సంస్థలు తమ దేశములో పాతబడిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అతిథి దేశాలకు బదిలీచేయడానికి ప్రయత్నిస్తాయి.
  3. బహుళజాతి సంస్థలు ఆయాదేశాల రాజకీయ వ్యవహారాలలో జోక్యము చేసుకొని, అంతర్గత సమస్యలను సృష్టించడంవలన దేశ సార్వభౌమాధికారానికి భంగము కలిగించవచ్చు.
  4. లాభాలను సంపాదించే క్రమములో బహుళజాతి సంస్థలు అతిథి దేశములో సహజవనరులను విచక్షణా- రహితముగా వినియోగించడంవలన ఆ దేశాలలో సహజవనరులు తగ్గి క్షీణిస్తాయి.

ప్రశ్న 6.
బహుళజాతి సంస్థల వల్ల స్వదేశానికి ఉన్న నష్టాలను వివరించండి.
జవాబు:
బహుళజాతి సంస్థల వల్ల స్వదేశానికి కలిగే నష్టాలు:

  1. బహళజాతి సంస్థలు స్వదేశము నుంచి అతిథి దేశాలకు మూలధన మార్పిడి చేయడంవలన స్వదేశములో ప్రతికూల చెల్లింపుల శేషము ఏర్పడవచ్చు.
  2. బహుళజాతి సంస్థలు పక్షపాత ధోరణి అవలంబించడంవలన స్వదేశములోని ప్రజలకు ఉద్యోగ అవకాశాలు సృష్టించలేవు.
  3. విదేశాలలో పెట్టుబడి లాభదాయకముగా ఉండటమువలన బహుళజాతి సంస్థలు స్వదేశములో పారిశ్రామికాభివృద్ధిని నిర్లక్ష్యము చేస్తాయి.
  4. బహుళజాతి సంస్థలు స్వదేశములో విదేశీ సంస్కృతిని వ్యాపింపజేస్తాయి.

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ప్రపంచీకరణను నిర్వచించండి.
జవాబు:
ఒక దేశ ఆర్థిక వ్యవస్థ కార్యకలాపాల పరిధిని విదేశాలకు విస్తరింపజేయడమే ప్రపంచీకరణ. అభివృద్ధి చెందిన దేశాల ఆర్థిక శాస్త్రవేత్తలు ప్రపంచీకరణను ఈ విధముగా నిర్వచించినారు “స్వేచ్ఛా వాణిజ్య విధానము, పెట్టుబడి, సాంకేతిక పరిజ్ఞానము, శ్రామికుల గమనశీలత. ఈ నిర్వచనము ప్రకారము ప్రపంచీకరణలో నాలుగు లక్షణాలు ఉన్నవి. 1) ఆటంకాలు లేని వర్తక ప్రవాహము, 2) మూలధన ప్రవాహాలు, 3) సాంకేతిక విజ్ఞానాల ప్రవాహము, 4) ఆటంకములేని శ్రామికుల గమనశీలత.

ప్రశ్న 2.
ఎఫ్.డి.ఐ. ని నిర్వచించండి.
జవాబు:
ఒక దేశములోని (అతిథి దేశము) ఉత్పత్తులను మరొక దేశానికి (స్వదేశానికి) సంబంధించిన సంస్థ నియంత్రించడాన్ని విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి (F.D.I.) అంటారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి అనేది బహుళజాతి సంస్థల నిర్వచనాత్మక లక్షణము. స్వదేశము బయట ఉన్న వ్యాపార సంస్థ కార్యకలాపాలలో, ఏదైనా సంస్థ పెట్టుబడి పెడితే దానిని విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి జరిగినట్లుగా భావిస్తారు.

AP Inter 1st Year Commerce Study Material Chapter 11 బహుళ జాతి సంస్థలు

ప్రశ్న 3.
బహుళజాతీయ సంస్థను నిర్వచించండి.
జవాబు:
అంతర్జాతీయ శ్రామిక నివేదిక ప్రకారము ‘ఒక దేశములో నిర్వహణ కార్యాలయము ఉండి, అనేక ఇతర దేశాలతో వ్యాపార కార్యకలాపాలను నిర్వహించే సంస్థను బహుళజాతీయ సంస్థ’ అంటారు. విదేశ మారక నియంత్రణ చట్టం 1973 ప్రకారము

  1. రెండు లేదా అంతకంటే ఎక్కువ దేశాలలో తమ అనుబంధ సంస్థనుగాని, శాఖ గాని ఉన్న సంస్థ.
  2. రెండు లేదా అంతకంటే ఎక్కువ దేశాలలో తమ కార్యకలాపాలను కొనసాగించే సంస్థను బహుళజాతి అంటారు.